breaking news
Alluri Sitarama Raju
-
పాడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
పెదబయలు: గిరిజన పాడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కోరారు. మంగళవారం మండలంలోని లక్ష్మీపేట పంచాయతీ కోదువలస గ్రామాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలలో కురిసిన భారీ వర్షాలకు పిడుగుపడి గ్రామంలో 10 మంది గిరిజన రైతులకు చెందిన 20 పశువులు మృతి చెందాయని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులపై ఉందన్నారు. ఆ పది మంది రైతులకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయం అందించారు. పిడుగుపడి మృతి చెందిన 17 దుక్కి టెద్దులు, మూడు ఆవులకు రూ. 5,15,000 నష్టపరిహారం చెల్లింపునకు కలెక్టర్కు ప్రతిపాదనలు పంపినట్టు ఈ సందర్భంగా పెదబయలు పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ కిశోర్ ఎమ్మెల్యేకు తెలిపారు. అనంతరం గ్రామంలో ఇంటింటినీ ఎమ్మెల్యే సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి తారురోడ్డు నిర్మించాలని, బోర్వెల్ మంజూరు చేయాలని, సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మించాలని, పీఎం జన్మన్ పథకంలో మంజూరైన ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరారు. అనంతరం ఎమ్మెల్యే గ్రామంలో ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో డీటీ రంగారావు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మజ్జి చంద్రబాబు, పంచాయతీ నాయకులు వల్లంగి కాశీప్రసాద్, కాకరి నూకరాజు, బత్తిరి మాణిక్యం, వంతాల రాందాసు, కొర్ర నాగేశ్వరరావు, పొనాయి గంగారాజు, కిముడు రాంబాబు, నరంజీ కేశవరావు, రామారావు, వంశీ, రాంప్రసాద్, మాజీ ఎంపీటీసీ పొయిభ కృష్ణారావు, గుల్లేలు ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఎవరికీ లేని నిబంధనలు ఉపాధ్యాయులకేనా..?
రాష్ట్రంలో ఏ శాఖలో ఉద్యోగులకు లేని నిబంధనలు ఒక్క ఉపాధ్యాయులకే ఎందుకు పెడుతున్నారో అర్థంకావడంలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధ్యాయులపై ప్రయోగాలు చేస్తున్నాయి. ఉపాధ్యాయులు అవసరాలు పట్టించుకోకుండా, సమస్యలు పరిష్కరించకుండా వదిలేశాయి. ఇలాంటి నిబంధనలు మాత్రం మాపై రుద్దడం మంచిదికాదు. మరో వారంలో టెట్ పరీక్ష కోసం నోటిఫికేషన్ కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. దవాబ్దాలుగా ఇన్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు మళ్లీ ప్రత్యేకంగా అర్హత పరీక్ష నిర్వహించడంపై ఉపాధ్యాయ సంఘాలు ఖండిస్తున్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సరైన నిర్ణయం ఇంతవరకు ప్రకటించకపోవడం బాధాకరం. –టి.ఆర్ అంబేడ్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్ -
మానవ హక్కులపై అవగాహన కలిగి ఉండాలి
అడ్డతీగల : మానవ హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ సౌత్ ఇండియా జోనల్ ప్రెసిడెంట్ చల్లా రమేష్ అన్నారు. మంగళవారం స్థానిక ఆదివాసీ భవనంలో కమిషన్ రంపచోడవరం నియోజకవర్గ ఇన్చార్జ్ కోదండ వాసవి అధ్యక్షతన గిరిజనులకు అవగాహన సదస్సు నిర్వహించారు. గిరిజన సీ్త్రలు తమ హక్కులు తాము తెలుసుకోవాలన్నారు. ప్రత్యేక చట్టాల ద్వారా గిరిజనులకు అనేక హక్కులు సంక్రమించాయని వాటిని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎవరి హక్కులకు విఘాతం కలిగినా ప్రయోజనాలకు భంగం ఏర్పడినా తమను సంప్రదించాలని కోదండ వాసవి అన్నారు.యువతీ యువకులు మానవ హక్కులపై మరింత అవగాహన పెంపొందించుకుని గిరిజన ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని కమీషన్ సౌత్ ఇండియా మెడికల్ సెల్ జోనల్ ప్రెశిడెంట్ ఆవాల వీరమోహన్ అన్నారు. కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర నాయకులు బళ్లా మోహన్, జలారి వీరభద్రరావు, తమదాల కృష్ణారెడ్డి, పాల్గొన్నారు. -
జీతం బకాయి కోసం కుటుంబ సమేతంగా ఆందోళన
● 29 మాసాలుగా వేతనం చెల్లించని పంచాయతీ కార్యాలయం ● కుటుంబ సమేతంగా ఆందోళనకు దిగిన విశ్రాంత ఉద్యోగి వెంకటరత్నంమాడుగుల రూరల్: కె.జె.పురం గ్రామ పంచాయతీ కార్యాలంలో గతంలో పని చేసిన కాలానికి జీతం ఇవ్వని కారణంగా పంచాయతీ కార్యాలయం వద్ద కుటుంబ సభ్యులతో మంగళవారం అందోళన చేపట్టారు. మాడుగుల గ్రామానికి చెందిన బోండా వెంకటరత్నానికి ఆమె భర్త మరణాంతరం స్పౌజ్ కోటాలో ఉద్యోగం వచ్చింది. వెంకటరత్నం భర్త ఆనందరావు గతంలో మాడుగుల గ్రామ పంచాయతీ కార్యాలయంలో బిల్లు కలెక్టరుగా పని చేసేవారు. 1998 సెప్టెంబరులో ఆయన మృతి చెందడంతో వెంకటరత్నానికి ఆఫీసు వాచ్వుమెన్గా ఉద్యోగం ఇచ్చారు. ఈమె కె.జె.పురం గ్రామ పంచాయతీలో 2019 డిసెంబరు 30న ఉద్యోగ విరమణ చేశారు. పంచాయతీ నిధుల కొరతతో 29 మాసాల జీతం ఆమెకు చెల్లించలేదు. సుమారు రూ. 9 లక్షలు పంచాయతీ నుంచి రావలసి ఉంది. ఈ జీతం గురించి ఉద్యోగ విరమణ చేసినప్పటి నుంచి పంచాయతీ కార్యాలయం చుట్టు తిరిగినా ఫలితం లేకపోయింది. బకాయి చెల్లించాలని అమె మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి అందోళన చేపట్టారు. ఆ సమయంలో పంచాయతీ జూనియర్ సహాయకులు, బిల్లు కలెక్టర్ వున్నారు. పంచాయతీ కార్యదర్శి చింతలూరులో జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో ఉన్నారు. పంచాయతీ కార్యదర్శి నవీన్దొరతో అమె ఫోన్లో మాట్లాడారు. 5 మాసాలకు సంబంధించిన జీతాల ప్రతిపాదన పెడతామని ఫోన్లో హామీ ఇవ్వడంతో ఆమె ఆందోళన విరమించారు. -
ఉపాధ్యాయులకు ‘టెట్’ టెన్షన్
ఆరిలోవ: దశాబ్దాలుగా ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయులను టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఉత్తీర్ణత అంశం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. 2010 సంవత్సరం కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులు కూడా తప్పనిసరిగా టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా అమలు కావాల్సిన పరిస్థితి నెలకొనడంతో, రాష్ట్రంలోని ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర సందిగ్ధంలో పడ్డాయి. విద్యా హక్కు చట్టం–2010 ప్రకారం ఉపాధ్యాయ నియామకానికి టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. అయితే, ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు మేరకు, 2010 కంటే ముందు వివిధ డీఎస్సీల ద్వారా ఉద్యోగాలు పొందిన వేలాది మంది కూడా టెట్ రాయాల్సి రావడంపై వారు ఆవేదన చెందుతున్నారు. డీఎస్సీ కోసం చదివి ఉద్యోగం సాధించిన మేము ఇప్పుడు మళ్లీ అర్హత పరీక్ష రాయడమేమిటి? అంటూ ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ఈ తీర్పు ప్రభావం విశాఖ ఉమ్మడి జిల్లాలో భారీగా ఉంది. ఇక్కడ ప్రభుత్వ యాజమాన్యాలలో సుమారు 17,000 మంది ఉపాధ్యాయులు, ప్రైవేట్ పాఠశాలల్లో మరో 12,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రైవేట్ టీచర్లు కూడా ఈ తీర్పు ప్రకారం టెట్ ఉత్తీర్ణులు కావాల్సిందే. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, ఇన్ సర్వీస్లో ఉన్నవారు టెట్లో ఉత్తీర్ణులు కాకపోతే ఉద్యోగానికి ఇబ్బంది తప్పదు. ఉద్యోగ విరమణకు ఐదేళ్ల లోపు సర్వీస్ ఉన్నవారికి మినహాయింపు ఇచ్చారు. అంతకంటే ఎక్కువ సర్వీస్ ఉన్నవారు తప్పనిసరిగా ఆగస్టు 31, 2027 లోపు టెట్ పరీక్ష ఉత్తీర్ణులు కావాలి. పదోన్నతి కావాలనుకునేవారు కూడా తప్పనిసరిగా టెట్ రాయాల్సి ఉంటుంది. రెండేళ్ల లోపు టెట్ పాస్ కాకపోతే ఉద్యోగం వదులుకోవాల్సి ఉంటుందని తీర్పులో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి ఈ కీలక సమయంలో రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం టెట్ అంశంపై ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో ఉపాధ్యాయుల్లో సందిగ్ధత మరింత పెరిగింది. మరోవైపు, టెట్ పరీక్షపై వారంలో నోటిఫికేషన్ విడుదల కానుందనే వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. దశాబ్దాల సర్వీస్ ఉన్నవారికి పరీక్ష రాయడం, అర్హత సాధించడం తీవ్ర సమస్యగా మారింది. అందువల్ల, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత వ్యవహారంలో మినహాయింపు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన ప్రకటన చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. -
వెనుకబడిన విద్యార్థులను తీర్చిదిద్దాలి
గంగవరం : విద్యార్థులు అందరూ తప్పనిసరిగా చదవడం, రాయడం, చ తుర్విధ ప్రక్రియలు వచ్చేటట్లుగా ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదు ఇవ్వాలని టీఏఆర్ఎల్ ఉపాధ్యాయ శిక్షణ రాష్ట్ర పరిశీలకులు కల్పనా శైలు ఉపాధ్యాయులకు సూచించారు. స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. మూడో తరగతి నుండి పదో తరగతి వరకు చదివే విద్యార్థులు అందరికీ సబ్జెక్టు పరంగా మంచి నైపుణ్యాన్ని పెంపొందించాలన్నారు. శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని, నేర్చుకున్న విషయాలు పాఠశాల స్థాయికి చేరాలన్నారు. రంపచోడవరం ఏజన్సీ డివిజన్లో జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాల గురించి ఏజెన్సీ డీఈఓ మల్లేశ్వరరావు ఆమెకు వివరించారు. అన్ని మండలాల్లో విజయవంతంగా శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఏజెన్సీ డీఈఓ పేర్కొన్నారు. రాజవొమ్మంగి ఎంఈఓ సత్యనారాయణ, ఉపాధ్యాయ శిక్షణ కోఆర్డినేటర్ సతీష్ , ప్రధానోపాధ్యాయులు వరలక్ష్మి, శ్రీరాములు, సత్యనారాయణ, డీఆర్పీలు రఘుబాబు, దామోదర్, వెంకన్నదొర, రామంచద్రారెడ్డి, సీఆర్పీలు వరప్రసాద్, భాస్కర్ పాల్గొన్నారు. -
హైడ్రో పవర్ రద్దుకు బస్కీ పంచాయతీ తీర్మానం
అరకులోయటౌన్ : మండలంలోని బస్కీ పంచాయతీలో మంగళవారం జరిగిన గ్రామ సభలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని సర్పంచ్ పాడి రమేష్ అధ్యక్షతన మంగళవారం బస్కీ గ్రామ పంచాయతీలో జరిగిన పాలక వర్గంతోపాటు పంచాయతీ ప్రజలు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మండల వైస్ ఎంపీపీ కిల్లో రామన్న మాట్లాడారు. గత కొన్ని నెలలుగా రగులుతున్న హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణ పనులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ప్రకటించారని, దానిని శాశ్వతంగా నిలిపి వేయాలని, జీఓ నెంబర్ 13, 51 రద్దు చేయాలని రామన్న డిమాండ్ చేశారు. అనంతరం ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, గుగ్గుడు పీసా కమిటీ కార్యదర్శి పొద్దు బాలదేవ్ విలేకరులతో మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో 5వ షెడ్యూల్లో ఆదివాసీల హక్కులు, చట్టాలను ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం నవయుగ కంపెనీకి చిట్టంవలస హైడ్రోపవర్ ప్రాజెక్టు ఎగువ డ్యాం కోసం 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి జీఓలు తీసుకువచ్చి బస్కీ పంచాయతీ గిర్లిగుడ, ఇరుకుగుడ మధ్యలో 177 అడుగుల ఎత్తులో డ్యాం నిర్మాణం కోసం ఎలా అనుమతులు ఇస్తారని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీ తీర్మానం, పీసా కమిటీ తీర్మానం లేకుండా దొడ్డి దారిలో వచ్చి సరిహద్దు దిమ్మలు ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీఓలు వెంటనే రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శివకుమార్, హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ బురిడి దశరథ్, మాజీ సర్పంచ్ కామరాజు, మాజీ ఎంపీటీసీ నూకరాజు, గిరిజనులు పాల్గొన్నారు. -
మేలైన యాజమాన్యంతోఅధిక దిగుబడి
చింతపల్లి: గిరి రైతులు పసుపు, మిరియం పంటల్లో మేలైన యాజమాన్య పద్ధతులను పాటిస్తే మంచి దిగుబడులు సాదించవచ్చని జాతీయ సుగంధ ద్రవ్యాల బోర్డు మాస్టర్ ట్రైనర్ బి.శ్యాంసుందర్రెడ్డి సూచించారు. మంగళవారం ఎర్రబొమ్మలు పంచాయతీ సాడెకులో గిరిజన్ వికాస్ స్వచ్ఛంద సంస్థ, గంటన్నదొర రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయ రైతులు తీసుకోవలలసిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు శాసీ్త్రయ పద్ధతులను పాటిస్తే పసుపు, మిరియంలో నాణ్యమైన దిగుబడులతో పాటు మార్కెటింగ్ అవకాశం ఉంటుందన్నారు. కాఫీలో బెర్రీబోరర్ కీటకం, కోత దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,మార్కెట్ సదుపాయాలను గంటన్నదొర ఎఫ్పీవో సభ్యుడ సతీష్ కుమార్ వివరించారు.ఈ కార్యక్రమంలో మాతోట, గంటన్నదొర ఎఫ్పీవో సీఈవోలు వి.చిన్నారావు,లోవరాజు పాల్గొన్నారు. -
ఘనంగా వాల్మీకి జయంతి
పాడేరు : మానవాళికి రామాయణం వంటి మహోత్తర గ్రంథాన్ని అందించిన మహానుభావుడు వాల్మీకి మహర్షి అని.. నాటి సమాజాభివృద్ధికి ఆయన చేసిన మేలు మరువలేనిదని కలెక్టర్ దినేష్కుమార్, ఐటీడీఏ పీవో తిరుమణ శ్రీపూజ అన్నారు. వాల్మీకి మహర్షీ జయంతి వేడుకలను మంగళవారం కలెక్టరేట్, ఐటీడీఏలో ఘనంగా నిర్వహించారు. ఆయా చోట్ల జిల్లా కలెక్టర్ దినేష్కుమార్, ఐటీడీఏ పీవో తిరుమణ శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, డీఆర్వో పద్మలత తదితరులు వాల్మీకి మహర్షి చిత్రపటాలకు పూలమామలు వేసి నివాళులు అర్పించారు. ఆయన తన రచనలతో సమాజంలో ఉన్న అసమానతలను తొలగించే ప్రయత్నం చేశారన్నారు. చెడును విడిచిపెట్టి మంచిని స్వీకరించడం ద్వారా మనుషులు రుషులవుతారని నిరుపించిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కలిగిస్తుందన్నారు. ఎస్డీసీ లోకేశ్వరరావు, ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, ఐటీడీఏ ఏవో హేమలత పాల్గొన్నారు.రంపచోడవరం : ప్రపంచంలోనే వాల్మీకి రామాయణం గొప్ప కావ్యమని అందుకు ప్రతి వ్యక్తి రామాయణం చదవాలని రంపచోడవరం ఐటీడీఏ ఏపీఓ జనరల్ డి.ఎన్.వి.రమణ అన్నారు. మంగళవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశపు హాలులో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో, సిబ్బందితో వాల్మీకి జయంతి సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి ఐటీడీఏ ఏపీఓ జనరల్ రమణ, అడిషనల్ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ డేవిడ్, ఎస్ఓ టి. మార్తమ్మ పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. ● వాల్మీకి పేటలో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యురాలు గొర్లె సునీత, మాజీ సర్పంచ్ నిరంజనీదేవి పాల్గొన్నారు. రంప గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యురాలు గొర్లె సునీత చక్రవర్తి, సర్పంచ్ మంగా బొజ్జయ్య వాల్మీకి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ● మారేడుమిల్లిలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు జరిగాయి. మండల వాల్మీకి అధ్యక్షుడు గొర్లె అనుదీప్ కుమార్, మాజీ ఎంపీటీసీ గొర్లె అనిల్ ప్రసాద్ (బాబీ), మండల వాల్మీకి కమిటీ దూడ సువర్ణ కర్ణ కుమార్, లక్కొండ పాల్ బుజ్జి, లక్కొండ దావీదు, దూడ బ్రహ్మాజీ, గడుతూరి కిషోర్ కుమార్, సువర్ణ రాజు, పరామయ్య పాల్గొన్నారు. -
గోమంగి గురుకుల ప్రిన్సిపాల్, ఏటీడబ్ల్యూవోను సస్పెండ్ చేయాలి
పెదబయలు: మండలంలో మారుమూల గోమంగి మినీ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపాల్, ఏటీడబ్ల్యూవోను సస్పెండ్ చేయాలని గిరిజన సంక్షేమ శాఖ డీడీ, గురుకులం సెల్ అధికారులకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సూచించారు. ఆ పాఠశాలను ఆయన మంగళవారం సందర్శించారు. పాఠశాలలో 207 మందికి గాను కేవలం 13 మంది విద్యార్థినులు ఉండడంతో ప్రిన్సిపాల్ వసంతకుమారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వచ్చారని తెలిసి పలు వురు విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ప్రిన్సిపాల్ తీరుపై ఫిర్యాదు చేశారు. విద్యార్థినులను కర్రతో కొట్టిన ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకునే వరకూ విద్యార్థినులను పాఠశాలకు పంపబోమని ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు తెలిపారు. గత నెల 19 తేదీన 7వ తరగతి చదువుతున్న 18 మంది విద్యార్థినులను ప్రిన్సిపాల్ కర్రతో కొట్టారని, ఈ ఘటనకు నిరసనగా పాఠశాల ఎదుట పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తే, స్థానిక అధికారులు విచారణ జరిపినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు చెప్పారు. దీంతో ఎమ్మెల్యే ఏటీడబ్ల్యూవో స్వర్ణలతతో మాట్లాడి జరిగిన ఘటనపై ఆరా తీశారు. విద్యార్థినులు పాఠశాలకు రాకుంటే మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఆమెను ప్రశ్నించారు. అనంతరం గిరిజన సంక్షేమ శాఖ డీడీ, గురుకులం సెల్ అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రిన్సిపాల్, ఏటీడబ్ల్యూవోలను సస్పెండ్ చేయాలని సూచించారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. అనంతరం పాఠశాల రికార్డులు, హాజరుపట్టికలు పరిశీలించారు. సక్రమంగా లేకపోవడాన్ని గమనించారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ జి.రంగారావు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మజ్జి చంద్రుబాబు, సర్పంచ్లు, ఎంపీటీసీలు కృష్ణారావు, సత్తిబాబు, అప్పారావు, ధనలక్ష్మి, నాగరాజు, వెంకటరావు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం -
క్రమశిక్షణతో కూడిన విద్య అవసరం
● కలెక్టర్ దినేష్కుమార్ పాడేరు : గిరిజన విద్యార్థులు ప్రాథమిక విద్య దశ నుంచి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి నిర్దేశించుకున్న లక్ష్యా న్ని సాధిందేలా తగిన తర్ఫీదు పొందాలని కలెక్టర్ దినేష్కుమార్ సూచించారు. మండలంలోని గుత్తులపుట్టు గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో సూపర్ ఫిఫ్టీ (టెన్త్) మూడో బ్యాచ్ శిక్షణ తరగతులను మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిష్ణాతులైన ఉపాధ్యాయులతో ఐటీడీఏ అందిస్తున్న ఈ ప్రత్యేక శిక్షణ తరగతులను టెన్త్ విద్యార్థులు పూర్తిగా సద్వినియోగం చేసుకుని టాపర్లుగా నిలవాలన్నారు. టెన్త్ పబ్లిక్ పరీక్షలకు ఇంకా ఆరు నెలలు మాత్రమే మిగిలి ఉందని ఇప్పటి నుంచి ప్రత్యేక ప్రణాళికతో చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, టీడబ్ల్యూ డీడీ పరిమళ, ఏటీడబ్ల్యూవో, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
టెట్పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
ఇన్సర్వీస్ ఉపాధ్యాయులను టెట్ పరీక్షలకు మినహాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఐదు సంవత్సరాలు పైబడి సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా రెండేళ్లలో టెట్ పరీక్ష నుంచి అర్హత సాధించాలని, లేదంటే ఉద్యోగం నుంచి తప్పుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేయడంతో ఉపాధ్యాయ వర్గాలు ఆందోళనకు గురవుతున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 2010 అక్టోబరు 23 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులంతా కచ్చితంగా టెట్ అర్హత పరీక్ష ఉత్తీర్ణులు కావాల్సి ఉందన్నారు. దీనివల్ల ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కొందరు ఉపాధ్యాయులు పదోన్నతలను, మరికొందరు పూర్తిగా ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది. రెవెన్యూ, పోలీస్, వైద్యలు తదితర వృత్తుల్లో ఉన్నవారికి, ఉన్నతాధికారులకు లేని ఇన్ సర్వీస్ అర్హత ఉపాధ్యాయులకు మాత్రమే వర్తింపజేయడాన్ని తీవరంగా ఖండిస్తున్నాం. –ఇమంది పైడిరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ -
మంచు కొండల్లో విడిది..
లంబసింగిలో నిర్మించనున్న జియోడెసిక్ డోమ్ రిసార్టుల నమూనాడోమ్ రిసార్టుల నిర్మాణం చేపట్టనున్న లంబసింగిలోని కొండ ప్రాంతంసాక్షి, విశాఖపట్నం: ఒక పర్యాటక ప్రాంతానికి వెళ్లినప్పుడు హోటల్లో బస చేయడం సాధారణం. ఎంత విలాసవంతమైన హోటల్ అయినా అది నాలుగు గోడల మధ్యే ఉంటుంది. కానీ.. ఒక ఊహా ప్రపంచంలో ఉన్నట్లు.. ప్రకృతి మన చుట్టూ ఆవరించినట్లు.. విశాలమైన మంచంపై పడుకుని కళ్లు తెరిస్తే.. ఆ ఊహాలోకం మన చెంతనే ఉన్నట్లు అనిపిస్తే.. ఆ అనుభూతే వేరు కదా! అలాంటి అద్భుత అనుభవాన్ని అందించేందుకు అందాల లంబసింగిలో సరికొత్త పర్యాటక రిసార్టులు రాబోతున్నాయి. వీటినే ‘జియోడెసిక్ డోమ్ రిసార్టులు’ అంటారు. వీటి నిర్మాణానికి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) టెండర్లను ఆహ్వానించింది. లంబసింగిలో కొత్త ఆకర్షణ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని లంబసింగిలో ఏపీటీడీసీకి ఇప్పటికే రిసార్టులు ఉన్నాయి. వాటి పక్కనే ఈ సరికొత్త జియోడెసిక్ డోమ్ గ్లాంపింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని సంస్థ భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న కాటేజీలు, రెస్టారెంట్కు అదనంగా ఈ డోమ్ రిసార్టులను ఏర్పాటు చేస్తే.. ఈ ప్రాంత పర్యాటక ఆకర్షణ మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఊటీని తలపించే శీతల వాతావరణం, చుట్టూ అల్లుకునే దట్టమైన పొగమంచుకు లంబసింగి ప్రసిద్ధి చెందింది. ఏటా ఇక్కడికి వచ్చే సందర్శకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, వారికి సరికొత్త వసతి అనుభవాన్ని అందించేందుకు ఏపీటీడీసీ శ్రీకారం చుట్టింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ డోమ్ రెస్టారెంట్ నిర్మించాలని ప్రణాళికలు రూపొందించగా.. ప్రస్తుత అధికారులు ఆ ప్రాజెక్టుకు మెరుగులు దిద్ది, పూర్తి స్థాయి డోమ్ రిసార్టులు తీసుకురావాలని నిర్ణయించారు. రూ. 5.33 కోట్లు.. 15 డోమ్ యూనిట్లు.. ప్రకృతిని వీక్షించడానికి, ఆస్వాదించడానికి వీలుగా.. పర్యాటకుల ఏకాంతానికి భంగం కలగకుండా కొండ ప్రాంతంలో ఈ జియోడెసిక్ డోమ్ రిసార్టులు ఏర్పాటు కానున్నాయి. రూ.5.33 కోట్ల వ్యయంతో మొత్తం 15 డోమ్ రిసార్టులను నిర్మించనున్నారు. ఇందుకోసం ఏపీటీడీసీ ఆర్ఎఫ్పీ(రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) ఆహ్వానించింది. జియోడెసిక్, పుట్టగొడుగు ఆకారపు డోమ్లతో పాటు, అథారిటీ ఆమోదించిన మరికొన్ని విభిన్న నమూనాల్లో రిసార్టులను నిర్మిస్తారు. వీటికి రెయిలింగ్ సపోర్ట్తో కూడిన బేస్మెంట్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంజనీరింగ్ డిజైన్ (ఫీడ్) ఆధారంగా.. పర్యావరణానికి హాని కలగని రీతిలో.. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించాలన్నది ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ప్రస్తుత కాటేజీలకు ఆనుకుని ఉన్న ఖాళీ ప్రదేశంలో, అలాగే రిసార్ట్ నిర్మాణాల పైన ఉన్న ఎత్తైన ప్రదేశంలో వీటిని నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఒక్కో డోమ్ యూనిట్ 750 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడే 100 చదరపు అడుగుల విస్తీర్ణంలో పిల్లల కోసం ఆటస్థలం కూడా నిర్మించనున్నారు. సందర్శకులు విహరించేందుకు ఆరు సీట్ల ఈవీ బగ్గీలు రెండు అందుబాటులో ఉంచుతారు. ప్రతి డోమ్లో 7/6 బెడ్, రాకింగ్ చైర్, 3/3 సైడ్ టేబుళ్లు, వార్డ్రోబ్, లగేజ్ ర్యాక్, డ్రెస్సింగ్ టేబుల్, నాలుగు కుర్చీలతో కూడిన కాఫీ టేబుల్ వంటి సౌకర్యాలు కల్పిస్తారు. మూడు నెలల్లో నిర్మాణం పూర్తి లంబసింగికి దేశ, విదేశాల నుంచి పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించేందుకు డోమ్ రిసార్టుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లను ఆహ్వానించాం. కాంట్రాక్టు ఖరారైన మూడు నెలల్లోనే ప్రాజెక్టు పూర్తి చేయాలని నిబంధన విధించాం. భూమికి సంబంధించిన అనుమతుల నుంచి నిర్మాణం పూర్తి చేసి, వినియోగానికి సిద్ధంగా ఉన్న స్థితిలో అప్పగించే వరకు పూర్తి బాధ్యత ఎంపికై న కాంట్రాక్టర్దే. ఇవి అందుబాటులోకి వస్తే ఏజెన్సీలో మరింతగా పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. – జీవీబీ జగదీష్, ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ లంబసింగిలో 15 డోమ్ రిసార్టులు రూ.5.33 కోట్లతో ప్రణాళికలు నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించిన ఏపీటీడీసీ మూడు నెలల్లో ప్రాజెక్టు పూర్తికి చర్యలు గత ప్రభుత్వ హయాంలో డోమ్ రెస్టారెంట్ ఏర్పాటుకు ప్రణాళికలు వాటిని మార్పు చేసి రిసార్టులుగా డిజైన్ చేసిన అధికారులు -
డీఎంహెచ్వోగాకృష్ణమూర్తి నాయక్
పాడేరు : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ డి. కృష్ణమూర్తి నాయక్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన గుంటూరు డీసీఎం రోరమ్ జీఎంసీలో పనిచేస్తున్న ఈయనను పదోన్నతిపై నియమించింది. ఇక్కడ ఇప్పటవరకు ఇన్చార్జి డీఎంహెచ్వోగా డాక్టర్ విశ్వేశ్వరనాయుడు పనిచేశారు. విశాఖపట్నం డీసీఎస్ రోమ్, ఏఎంసీలో పనిచేస్తున్న డాక్టర్ ఎన్. ప్రసాద్ నాయక్ను పాడేరు ఏడీఎంహెచ్వోగా, రాజమహేంద్రవరంలో డిప్యూటీ డీఎంహెచ్వో పనిచేస్తున్న డాక్టర్ పిల్లి సరితను రంపచోడవరం ఏడీఎంహెచ్వోగా నియమించింది. -
నదిలో పడి వ్యక్తి మృతి
ఎటపాక: ప్రమాదవశాత్తూ గోదావరి నదిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం మండలంలోని తోటపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నక్క ప్రసాద్(49) మంగళవారం ఉదయం పశువులు మేపేందుకు సమీపంలోని గోదావరి నది వద్దకు వెళ్లాడు. అయితే గోదావరి నదిలో కలిసే తోటపల్లి వాగు ప్రాంతంలో అవతలి ఒడ్డుకు గేదె వెళ్లింది. దానిని తోలుకొచ్చేందుకు నదిలో దిగే క్రమంలో కాలుజారి నీటిలో పడ్డాడు. ఊబిలో కూరుకుపోయి మృతి చెందాడు. దీనిని గమనించిన పరిసర ప్రాంతాల వారు నీటిలో గాలించి బయటకు తీశారు. అప్పటికే మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఆశా కార్యకర్తలకునియామక పత్రాలు
చింతూరు: స్థానిక డివిజన్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమితులైన ఆశా కార్యకర్తలకు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ మంగళవారం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ డివిజన్లో ఖాళీగా ఉన్న 27 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ఆగస్టులో కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. ఈ ప్రక్రియ ద్వారా ఎంపికై న అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తామన్నారు. డివిజన్లో మరో 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి భర్తీకి కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. ఎంపికై న కార్యకర్తలు తమ బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తించాలని సూచించారు. గ్రామాల్లో ఆరో గ్య చైతన్యం పెంపొందించేందుకు కృషి చేయాలని పీవో ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో డాక్టర్ పుల్లయ్య పాల్గొన్నారు. -
జగన్ పర్యటనకు తరలి వెళ్లాలి
● మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లిభాగ్యలక్ష్మి పిలుపు కొయ్యూరు: అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో ఈనెల 9న జరగనున్న వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి పర్యటనకు పార్టీ శ్రేణులు తరలివెళ్లి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి పిలుపునిచ్చారు. మంగళవారం ఆమె కొయ్యూరులో జెడ్పీటీసీ లు వారా నూకరాజు, ఎం.వెంకటలక్ష్మి, ఎంపీపీలు బడుగు రమేష్, అనుషాతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పార్టీకి చెందిన వివిధ అనుబంధ సంఘాల నేతలు, మాజీ డైరెక్టర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు తరలి రావాలని ఆ మె కోరారు. జెట్పీటీసీలు జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య, జానకమ్మ, పార్టీ మాజీ మండల అధ్యక్షుడు జల్లి బాబులు, సర్పంచ్లు వెంకటలక్ష్మి, రీమెల శ్రీను పాల్గొన్నారు. -
సవాల్ విసిరిన అమాత్యులకే చెమటలు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మొత్తం 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాలు చేపట్టింది. వీటిలో అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో కూడా కాలేజీ నిర్మాణంలో ఉంది. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలని కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది. మెడికల్ కాలేజీల నిర్మాణమే జరగలేదని హోంమంత్రి వంగలపూడి అనిత, కాలేజీకి అనుమతి ఉంటే చూపించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సవాల్ విసిరారు. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే నిర్మాణం పూర్తయిన ఐదు కాలేజీలతో పాటు నిర్మాణంలో ఉన్న 12 కాలేజీల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. వైద్య కళాశాలలే లేవని బుకాయించే ప్రయత్నం చేసిన కూటమి ప్రభుత్వం బండారం బట్టబయలైంది. ఇంతలో మాకవరపాలెంలో ఉన్న మెడికల్ కాలేజీ సందర్శనకు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈ నెల 9వ తేదీన రానున్నారు. దీంతో మెడికల్ కాలేజీలపై సవాల్ విసిరిన అమాత్యులకు చెమటలు పడుతున్నాయి. జగన్ పర్యటనతో కూటమి ప్రభుత్వం అబద్దాలు బయటపడతాయన్న ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. -
ఆంక్షలు విధించినా ఆగేది లేదు!
సాక్షి, విశాఖపట్నం : నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో మెడికల్ కళాశాల భవనాలను పరిశీలించడానికి ఈనెల 9వ తేదీన వస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని అడ్డుకోవడానికి ప్రభుత్వం కుట్రచేస్తోందని వైఎస్సార్ సీపీ అనకాపల్లి, విశాఖ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, కేకే రాజు మండిపడ్డారు. ఎన్ని ఆంక్షలు విధించినా వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఆగేది లేదని స్పష్టం చేశారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం వారు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు భద్రత కల్పించాలని ఐదు రోజుల క్రితమే అనకాపల్లి ఎస్పీ, విశాఖ సీపీని కోరామని, ఇప్పటివరకూ కాలయాపన చేసిన వారు జాతీయ రహదారిపై రోడ్డు మార్గంలో వెళ్లడానికి అనుమతి లేదని ఇప్పుడు చెబుతున్నారన్నారు. విశాఖ నుంచి మాకవరపాలేనికి జాతీయ రహదారి కాకుండా ప్రత్యామ్నాయ రోడ్డు చూపించాలని అడుగుతున్నామన్నారు. అయినా పర్యటనకు తాము అనుమతి కోరలేదని.. సెక్యూరిటీ కల్పించాలని మాత్రమే అడిగామని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతగా ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు వస్తున్నప్పుడు మీ పర్మిషన్ ఎవరికి కావాలంటూ ధ్వజమెత్తారు. తమ నాయకుడు రోడ్డు మార్గానే నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్తారని, ఎవరు అడ్డుకుంటారో చూస్తామన్నారు. పోలీసులు, ప్రభుత్వం భద్రత కల్పించకపోతే వైఎస్సార్సీపీ కార్యకర్తలే భద్రత కల్పిస్తారని అన్నారు. గతంలో వైఎస్ జగన్ పలు పర్యటనల్లో హెలికాప్టర్కు అనుమతి ఇవ్వలేదని.. ఇప్పుడు హెలికాప్టర్ మీదే రావాలంటున్నారంటే.. తనతో పాటు రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్ సీపీ శ్రేణులకు, అభిమానులకు అనుమానం వస్తోందన్నారు. వాతావరణ పరిస్థితులు కూడా సవ్యంగా లేని సమయంలో పదే పదే హెలిప్యాడ్ అనుమతి కోరండి అని చెబుతుంటే, ఇందులో ఏమైనా కుట్ర కోణం ఉందేమోనని అనుమానం ఉందని అభిప్రాయపడ్డారు. తమిళనాడులో జరిగిన సంఘటనను బూచిగా చూపించి అనుమతి ఇవ్వలేమనడం సరికాదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు 65 వేల మంది జనాలు వస్తారని పోలీసులు చెబుతుండడం చూస్తుంటే ప్రభుత్వంపై వ్యతిరేకత అర్థమవుతోందన్నారు. చంద్రబాబు పర్యటనను ఆపేస్తారా? గతంలో చంద్రబాబు ప్రచార పిచ్చికి గోదావరి పుష్కరాల్లో 29 మంది, కందుకూరిలో 9 మంది చనిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. 2027లో మళ్లీ గోదావరి పుష్కరాలు ఉన్నాయని, పుష్కరాల సమయంలో చంద్రబాబు పర్యటనను ఆపేస్తారా? అని ప్రశ్నించారు. అయ్యన్నపాత్రుడి నోటికి తాళాలేసేందుకు.. కళ్లు బైర్లు కమ్మి సవాల్ విసిరిన స్పీకర్ అయ్యన్న లాంటి వారి నోటికి తాళాలు వేసేందుకు, ఆయన అసత్య ప్రచారాలకు చెక్ పెట్టి.. మెడికల్ కాలేజీపై వాస్తవాలను తెలియజేసేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 9న మాకవరపాలెం వస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య, విశాఖ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు పాల్గొన్నారు. -
గిరిజనులకు అన్యాయం జరిగితే యుద్ధమే
అరకులోయ టౌన్: గిరిజనులకు అన్యాయం జరిగినా, వారి భూముల జోలికొచ్చినా రాష్ట్రంలో పెద్ద యుద్ధమే జరుగుతుందని సీఐటీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు హెచ్చరించారు. స్ధానిక టీటీడీ కల్యాణ మండపంలో సీఐటీయూ జిల్లాస్థాయి రెండో మహా సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏజెన్సీలోని అటవీ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసి, గిరిజనులకు అన్యాయం చేస్తే ప్రభుత్వానికి గిరిజనుల నుంచి తిరుగుబాటు తప్పదన్నారు. హైడ్రోపవర్ ప్రాజెక్టు తీసుసుకురావడం, టూరిజం యూనిట్లను ప్రైవేట్ పరం చేసి గిరిజనులను బానిసలుగా చేయడమే అన్నారు. టూరిజం ప్రైవేట్పరం చేస్తే ఈ ప్రాంతం నాశనం అవుతుందన్నారు. వీటిపై జీవనం సాగిస్తున్న గిరిజన ఉద్యోగులకు అన్యాయం చేయవద్దన్నారు. వీరందరికి కార్మిక చట్టం ప్రకారం వేతనం ఇవ్వడం లేదన్నారు. 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయకుండా తప్పుడు విధానంలో టూరిజం యూనిట్లను ప్రైవేట్ పరం చేస్తే తిరుగుబాటు తప్పదన్నారు. సీహెచ్డబ్ల్యూలుగా గత కొన్నేళ్ల నుంచి పనిచేస్తూ రిటైర్ అవుతున్నారన్నారు. వీరిని ఆశా వర్కర్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. గురుకులంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు గత కొన్నేళ్లుగా రెగ్యులర్ చేయాలని పోరాడినప్పటికీ సుప్రీం కోర్టు ఆదేశాలు అమలు చేయడం లేనద్నారు. 230 రోజులు పనిచేసిన కార్మికులకు పర్మినెంట్ చేయాలని చట్టం చెబుతున్నప్పటికీ వాటిని అమలు చేయకపోవడంపై ఉద్యోగుల తిరుగుబాటు తప్పదన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బోనంగి చిన్నయ్య పడాల్, వి. ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు హెచ్చరిక -
అంగన్వాడీ సిబ్బంది సాంకేతికంగా బలోపేతం
పాడేరు : అంగన్వాడీ సిబ్బందికి తరచూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి వారిని సాంకేతికంగా బలోపేతం చేయాలని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమంపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళా శక్తి కేంద్రాలు, మహిళ పోలీసులను ఉపయోగించుకొని అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం, పిల్లల మానసిక ప్రవర్తన ఆధారంగా గ్రేడింగ్ చేయాలని సూచించారు. అంగన్వాడీ సెంటర్లలోని పిల్లలకు మంచి పౌష్టికాహారం అందించాలని, కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. బలహీనంగా ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సీడీపీవోలు, సూపర్వైజర్లు తరచూ అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆధార్ కార్డులు లేని పిల్లలను సర్పంచ్ల సహకారంతో ఆధార్ క్యాంపులు నిర్వహించి ఆధార్ జనరేట్ చేయాలన్నారు. పోషణ్ ట్రాకర్ యాప్లలో అంగన్వాడ కేంద్రానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలన్నారు. సిగ్నల్ కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశం -
ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోండి
● చింతపల్లి జూనియర్ కళాశాలప్రిన్సిపాల్ విజయభారతి చింతపల్లి: స్థానిక డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఈ నెల 10వ తేదీలోగా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్పీసీఎల్) అందజేస్తున్న ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.విజయభారతి కోరారు. ఇందుకు మొదటి, ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు కళాశాల అధ్యాపకులు రవీంద్ర నాయక్, జగదీష్బాబులను సంప్రదించాలని ఆమె కోరారు. -
10వేల ఎకరాల్లో కొత్త కాఫీ తోటలు
మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ పాడేరు: గిరిజనులు సాగు చేస్తున్న కాఫీ తోటలను ఆశించిన బెర్రీబోరర్ పురుగు నిర్మూలనకు కాఫీ లైజన్ వర్కర్లు చేసిన కృషి అభినందనీయమని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో కాఫీ బోర్డు అధికారులు, లైజన్ వర్కర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల్లో గిరిజనులు సాగు చేస్తున్న అన్ని కాఫీ తోటలను పునరుద్ధరించాలని ఆదేశించారు. 2026–27 సంవత్సరంలో పది వేల ఎకరాల్లో కొత్తగా కాఫీ తోటల సాగు, 15వేల పాత కాఫీ తోటల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏజెన్సీలో 38 ప్రాథమిక నర్సరీ కేంద్రాలను గుర్తించామని చెప్పారు. వాటి ద్వారా రైతులు స్వీలర్ వోక్, కాఫీ మొక్కలను సరఫరా చేస్తామన్నారు. నవంబర్ నెల నుంచి మాక్స్ సంస్థ ద్వారా కాఫీ పండ్ల సేకరణకు కాఫీ లైజన్ వర్కర్లు కృషి చేయాలన్నారు. సమావేశంలో ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, కాఫీ ఏడీ బొంజుబాబు, లైజన్ వర్కర్లు పాల్గొన్నారు. -
● పెరుగుతున్న జ్వర పీడితులు
ముంచంగిపుట్టు: గిరిజన గ్రామాల్లో చాపకింద నీరులా జ్వరాలు విజృంభిస్తున్నాయి. స్థానిక సీహెచ్సీకి రోజూ జ్వరబాధితులు క్యూ కడుతున్నారు. సీహెచ్సీలో ఆగస్టు నెలలో 3,070 మంది రోగులు వైద్య సేవలు పొందగా, వీరిలో 1,796 మంది జ్వరాలతో బాధపడుతున్న వారు ఉన్నారు.సెప్టెంబర్ నెలలో 3,756 మంది వైద్య సేవలు పొందగా 2,123 మంది జ్వర పీడితులున్నారు. ఈ నెలలో ఆరు రోజుల్లోనే 206 మంది జ్వరపీడితులు వైద్య సేవలు పొందారు.రోజు రోజుకు జ్వర పీడితులు పెరుగుతూ ఉండడం గ్రామాల్లో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా వైద్య శిబిరాలు విస్తృతంగా జరిగేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. కిలగాడ,లబ్బూరు పీహెచ్సీలతో పాటు ముంచంగిపుట్టు సీహెచ్సీలో వైద్యులు,సిబ్బంది కొరత ఉండడంతో రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందని పరిస్థితి నెలకొంది. -
వై.ఎస్.జగన్తో అరకు ఎంపీ కుటుంబం భేటీ
వైఎస్సార్సీపీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డితో అరకు ఎంపీ తనూజరాణి, చెట్టి వినయ్, అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ సాక్షి,పాడేరు: వైఎస్సార్సీపీ అధ్యక్షులు,మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి,ఆమె భర్త చెట్టి వినయ్,అరకు మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీఈసీ మెంబర్ చెట్టి పాల్గుణ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.అమరావతిలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో వారంతా అధినేతను కలిసి జిల్లాలోని వైఎస్సార్సీపీ కార్యక్రమాలను వివరించారు. -
మేఘాల కొండను ఎకో టూరిజంగా అభివృద్ధి చేస్తాం
పాడేరు ఫారెస్ట్ రెంజ్ అధికారి ప్రేమ పాడేరు రూరల్: వంజంగి మేఘాలయ కొండను ఎకోటూరిజంగా మరింత అభివృద్ధి చేస్తామని పాడేరు ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎ.ప్రేమ తెలిపా రు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడు తూ ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తింపుపొందిన వంజంగి మేఘాల కొండను మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యే క దృష్టి సారించినట్టు చెప్పారు. సమీపగ్రామాల గిరిజనుల భాగస్వామ్యంతో వనసంరక్షణ సమి తి (వీఎస్ఎస్) ద్వారా మేఘాల కొండ అభివృద్ధి, నిర్వహణ పనులు చేపట్టనున్నట్టు చెప్పారు. తద్వారా అడవిని మరింత పరిరక్షించడమే కాకుండా, స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశా లు, ఆదాయం పెంచే విధంగా అటవీశాఖ ప్రత్యేక కృషిచేస్తోందన్నారు. ఎకో టూరిజం ప్రాజెక్టుపై వంజంగి, దొడ్డిపల్లి, ఇసంపాల, కొత్తవలస, పోతురాజుమెట్ట ప్రజలకు అభ్యంతరాలు ఉంటే ఈనెల 8లోగా పాడేరు ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలపై 10న చర్చిస్తామన్నారు. మేఘాల కొండ అభివృద్ధికి ప్రజలందరూసహకరించాలని కోరారు. -
స్వచ్ఛత లక్ష్యాల సాధనలో ప్రజల భాగస్వామ్యం అవసరం
కలెక్టర్ దినేష్కుమార్పాడేరు: స్వచ్ఛ భారత్ మిషన్ స్ఫూర్తితో పరిశుభ్రతను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర అవార్డులను అందజేస్తున్నట్టు కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. పట్టణంలోని వీఆర్ పంక్షన్ హాల్లో సోమవారం స్వచ్ఛాంధ్ర అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛత లక్ష్యాలను సాధించడంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు, వ్యర్థాల నిర్వహణలో ఉత్తమ పద్ధతులను అవలభించేలా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు దృష్టిసారించాలన్నారు. ప్రతి పంచాయతీలోని పారిశుధ్య కార్మికులకు బీమా చేయించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను సమర్థంగా నిర్వహించడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ, ఇంకుడు గుంతల నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా ఘన, ద్రవ వ్యర్థాల నిర్వాహణ, బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత, ప్లాస్టిక్ నిషేధం తదితర వాటిపై కృషి చేసిన 38 ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలకు స్వచ్ఛాంధ్ర అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్కుమార్, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్ వంపూరి గంగులయ్య, పాడేరు, జి.మాడుగు, చింతపల్లి, జీకే వీధి ఎంపీపీలు, పలువురు సర్పంచ్లు, ఎంపీడీవోలు, పారిశుధ్య కార్మికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
భవిష్యత్ తరాలకు క్లీన్ ఎనర్జీ ఆవిష్కరణలు
సాక్షి, విశాఖపట్నం: అత్యాధునిక, తక్కువ ఖర్చుతో ఇంధన సామర్థ్యాల అమలుపై దృష్టిసారించిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్)కు సహకారం అందించేందుకు ఏపీఈపీడీసీఎల్ ముందుకు వచ్చింది. విశాఖలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో డిస్కమ్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి, ఈఈఎస్ఎల్ సీఈవో అఖిలేష్ కుమార్ దీక్షిత్తో కలిసి సీనియర్ అధికారులు సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్ వినియోగదారుల సేవలను మెరుగుపరచడం, స్థిరమైన ఆర్థిక వృద్ధినిప్రోత్సహించడం, భూతాపాన్ని తగ్గించడం లక్ష్యంగా ప్రపంచ స్థాయి క్లీన్ ఎనర్జీ టెక్నాలజీలను అమలు చేసేందుకు అవసరమైన రోడ్మ్యాప్ రూపొందించే అంశంపై చర్చించారు. ఇందులో భాగంగా ఈఈఎస్ఎల్తో భాగస్వామ్యం ద్వారా విద్యుత్ విని యోగదారుల కోసం ఇ–రిటైల్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టిన దేశంలో మొట్టమొదటి డిస్కంగా ఈపీడీసీఎల్ నిలిచినట్లు ఈఈఎస్ఎల్ సీఈవో అఖిలేష్కుమార్ ప్రకటించారు. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ వినియోగదారులు డిస్కం పోర్టల్ ద్వారా నేరుగా స్టార్–రేటెడ్, ఇంధన–సమర్థవంతమైన ఉపకరణా లను పోటీ ధరలకు కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తున్నట్లు తెలిపారు.ఈపీడీసీఎల్ జాతీయ ఈ–మొబిలిటీ కార్యక్రమం ద్వారా కర్బన ఉద్గారాలు నియంత్రణ, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోలార్ రూఫ్టాప్, గ్రౌండ్–మౌంటెడ్ ప్రాజెక్ట్లు నిర్వహణతో విద్యుత్ ఉత్పత్తి, వికేంద్రీకృత సౌర పీవీ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు, స్మార్ట్ మీటర్ నేషనల్ ప్రోగ్రామ్, ఇంధన సామర్థ్య ఉపకరణాలు వినియోగంపై విస్త్రృత స్థాయి అవగాహన కల్పిస్తున్నట్లు సీఎండీ ఫృథ్వీతేజ్ వెల్లడించారు. ఇంధన సామర్థ్య నిర్వహణ అమలులో ఈపీడీసీఎల్ పనితీరును గుర్తించిన ఈఈఎస్ఎల్ -
అంతర్రాష్ట్ర రహదారి నిర్మాణానికి నిధులు
చింతపల్లి: గూడెం కొత్తవీధి మండలం ఆర్.వి.నగర్–పాలగెడ్డ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.18 కోట్లు నిధులు విడుదల చేసినట్టు ఆర్అండ్వీ ఏఈఈ బి.జయరాజు తెలిపారు.ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు.30 కిలోమీటర్లు అంతర్రాష్ట్ర రహదారి నిర్మాణానికి రూ.30 కోట్లు నిధులు మంజూరైనట్టు చెప్పారు. ఈ నెలాఖరు నుంచి నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు.ఇప్పటికే సీలేరు ప్రాంతంలో పనులు ప్రారంభించామని, ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో రాకపోకలకు అంతరాయం కలగకుండా గోతులు పూడ్చి కార్యక్రమాన్ని చేపడతామన్నారు. నవంబర్ నుంచి వర్షాలు తగ్గు ముఖం పడతాయని అప్పటి నుంచి పూర్తిస్థాయి నిర్మాణ పనులను వేగవంతం చేస్తామన్నారు. -
తాగునీటి సమస్యపై గ్రామస్తుల ఆందోళన
ముంచంగిపుట్టు: మండలంలోని మారుమూల భూసిపుట్టు పంచాయతీ కేంద్రంలో నిర్మించిన రక్షిత తాగునీటి పథకానికి చెందిన ట్యాంక్ ప్రారంభించక ముందే పాడైయింది. ట్యాంక్కు రంధ్రం ఏర్పడి నీరు వృథాగా పొతుంది. దీంతో సోమవారం భూసిపుట్టు గ్రామ గిరిజనులు దెబ్బతిన్న ట్యాంకు వద్ద ఆందోళనకు దిగారు.పాడైన ట్యాంక్కు మరమ్మతులు చేయాలని, నీటి పథకం ప్రారంభించాలని, నీటి కష్టాలు తీర్చాలని పలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు కంచం మిన్నారావు, వంతాల బొంజుబాబు, గ్రామస్తులు జలంధర్,సాధురాంలు మాట్లాడుతూ భూసిపుట్టులో రూ.10లక్షలతో నిర్మించిన ఆర్వో ప్లాంట్ మూడు సంవత్సరాలుగా ప్రారంభించకుండా, నిరుపయోగంగా ఉంచారని, నీటి సరఫరా కోసం నిర్మించిన ట్యాంక్ నాణ్యత లోపంతో రంధ్రం ఏర్పడిందని, అనేకసార్లు ఆర్వో ప్లాంట్ను వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను కోరినా పట్టించుకోలేదన్నార.తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తక్షణమే నీటి కష్టాలు తీర్చాలని, లేనిపక్షంలో మండల కేంద్రంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. -
రహదారుల సమస్యలపై వినతులు
రంపచోడవరం: వై రామవరం మండలం దారగెడ్డ గ్రామంలో 300 మీటర్లు రెండు సీసీ రోడ్ల నిర్మాణం, కమ్యూనిటీ హాలు ఏర్పాటు చేయాలని పీసా ఉపాధ్యక్షుడు గోరగాలి లక్ష్మణరావు, దూడ కుశరాజులు ఐటీడీఏ పీవో స్మరణ్రాజ్కు సోమవారం అర్జీ అందజేశారు. ఐటీడీఏ సమావేశపు హాలులో పీవో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ వారం 63 అర్జీలు వచ్చినట్లు పీవో తెలిపారు. దేవీపట్నం మండలం పోలవరం ముంపునకు గురైన ఇందుకూరు–2 ఆర్అండ్ఆర్ కాలనీలో సత్యసాయి తాగునీటిని ఏర్పాటు చేయాలని, మూడు కిలోమీటర్లు వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేయాలని, శ్మశానవాటిక, ప్రహరీ ఏర్పాటు చేయాలని, దహన సంస్కారాలకు ఐరన్ దొడ్డి ఏర్పాటు చేయాలని తోకల కృష్ణ, తోకల పొట్టయయ, వీరచంద్రరెడ్డి తదితరులు కోరారు. సీహెచ్ గంగవరం నుంచి మునకలగెడ్డ గ్రామానికి మూడు కిలోమీటర్లు రోడ్డు నిర్మించాలని కోసు అచ్చిబాబు తదితరులు అర్జీ అందజేశారు.వై రామవరం ఎగువ ప్రాంతంలోని పాలగెడ్డ గ్రామం నుండి బొడ్డగండి గ్రామం వరకు 15 కిలోమీటర్లు సీసీ రహదారి ఏర్పాటు చేయాలని, 12 గ్రామాలకు సంబంధించిన లింక్ రోడ్లు నిర్మించాలని గిరిజనులు కోట అబ్బాయిరెడ్డి, నైని లచ్చిరెడ్డిలు అర్జీ అందజేశారు. రంపచోడవరం మండలం సోకులుగూడెం గ్రామంలోని 21 మంది గిరిజనులకు ఆధార్ కార్డులు మంజూరు చేయాలని, చెలకవీధి నుంచి కాకవాడ వరకు మూడు కిలోమీటర్లు రోడ్డు పనులు ప్రారంభించాలని సర్పంచ్ కొమరం పండుదొర , ఎంపీటీసీ నర్రి పాపారావు ఆర్జీ అందజేశారు. ఏపీవో డీఎన్వీ రమణ, ఎస్డీసీ పీ అంబేడ్కర్, ఏపీడీ శ్రీనివాస్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యాధుల పంజా
● జిల్లా ఆస్పత్రికి రోగుల రద్దీ ● ఒక్కరోజే 639 మందికి వైద్య పరీక్షలుసాక్షి,పాడేరు: జిల్లాపై వ్యాధులు దాడి చేస్తున్నాయి. వర్షాలు కురుస్తుండడంతో వీటి తీవ్రత పెరిగింది. విషజ్వరాలు వణికిస్తున్నాయి. ఊళ్లకు ఊళ్లు మంచం పడుతున్నాయి. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా జ్వరపీడితులు కనిపిస్తున్నారు. జిల్లా కేంద్రం పాడేరులోని జిల్లా సర్వజన ఆస్పత్రికి ఇటీవల రోగుల తాకిడి అధికమైంది. పీహెచ్సీల నుంచి జిల్లా ఆస్పత్రికి రిఫరల్ కేసులు అధికంగా వస్తున్నాయి. రోజువారీ ఓపీ 600 దాటుతోంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 639 మంది రోగులకు డాక్టర్లు వైద్యపరీక్షలు నిర్వహించారు.వీరిలో జ్వరపీడితులు అధికంగా ఉన్నారు.తీవ్ర జ్వరంతో బాధపడుతున్న 22మంది ఇన్పెషంట్లుగా చేరారు. అన్ని వార్డుల్లో మొత్తం 270 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. వణుకుతున్న పల్లెలు జిల్లాలో రోజూ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో మార్పులు,తాగునీటి వనరుల కలుషితం, పారిశుధ్యలోపం, దోమల వ్యాప్తి వంటి కారణాలతో జ్వరాలు విజృంభిస్తుండడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. టైఫాయిడ్,వైరల్ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి.జిల్లాలోని 64 పీహెచ్సీలు, అరకులోయ, రంపచోడవరం ప్రాంతీయ ఆస్పత్రులు, ముంచంగిపుట్టు, చింతపల్లి, చింతూరు, అడ్డతీగల, కూనవరం కమ్యూనిటీ హెల్త్సెంటర్లలోను జ్వరాల కేసులు నమోదవుతున్నాయి. మలేరియా కేసుల సంఖ్య పెరుగుతోంది.అలాగే ప్రైవేట్ ఆస్పత్రులు,ఆర్ఎంపీ వైద్యులను కూడా జ్వరపీడితులు ఆశ్రయిస్తున్నారు. 400 దాటిన ఓపీ అరకులోయటౌన్: నియోజకవర్గంలో వ్యాధులు వ్యా పిస్తున్నాయి. దీంతో కొద్ది రోజులుగా స్థానిక ఏరి యా ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. గతంలో 300 నుంచి 350 వరకూ ఉండే రోజువారీ ఓపీ ఇప్పుడు 400 దాటుతోంది. జ్వర పీడితులు అధికంగా వస్తున్నారు. గత నెలలో 28 మలేరియా, ఐదు డెంగ్యూ, 270 టైఫాయిడ్, 595 వైరల్ ఫీవర్ కేసులు నమోదైనట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్ రాము తెలిపారు. కూనవరం: మండలంలో వ్యాధులు వ్యాపిస్తున్నాయి. కోతులగుట్ట సీహెచ్సీకి జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్తో బాధపడుతున్న వారు అధికంగా వస్తున్నారు. ప్రతి రోజు 120 నుంచి 130 పైగా ఓపీ ఉంటున్నట్లు సీహెచ్సీ సూపరింటెండెంట్ డాక్టర్ మహేష్ బాబు తెలిపారు. సోమవారం 125మంది అవుట్ పేషంట్లు చికిత్సపొందారు. -
ఎకో టూరిజం ప్రాజెక్టు రద్దు కోరుతూ రేంజర్ కార్యాలయం ముట్టడి
అరకులోయటౌన్: మండలంలోని మాడగడ సన్రైజ్ వ్యూపాయింట్ వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టు ఏర్పాటును అటవీ శాఖ అధికారులు విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ మాడగడ పంచాయతీ ప్రజలు సోమవారం అరకులోయలోని రేంజర్ కార్యాలయాన్ని ముట్టడించి, నిరసన వ్యక్తం చేశారు. మాడగడ సన్రైజ్ వ్యూపాయింట్ను తమ నుంచి లాక్కొని, అటవీశాఖ ఆధీనంలోకి మారుస్తామనడం సరికాదన్నారు. గిరిజన చట్టాలను ఉల్లంఘించి, అటవీశాఖ అధికారులు ఏ రకంగా వ్యూపాయింట్ను స్వాధీనం చేసుకుని, నిర్వహిస్తారని వారు ప్రశ్నించారు. వ్యూపాయింట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 300కు పైగా కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయని, ఆ కుటుంబాల పొట్ట కొట్టేందుకు అటవీశాఖ పూనుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాడగడ సన్రైజ్ వ్యూపాయింట్ వెలుగులోకి తెచ్చేందుకు మాడగడ ఆటో యూనియన్తోపాటు అరకులోయ వాయు పుత్ర మోటర్ యూనియన్ ఎంతో శ్రమించిందని చెప్పారు. అనతికాలంలో ప్రాచు ర్యం పొందిన వ్యూపాయింట్ అభివృద్ధి చెంది, వేలాది మంది పర్యాటకులు ఇక్కడకు వస్తుంటే, ఆదాయాన్ని తమ సొంతం చేసుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వం.. అటవీశాఖ ద్వారా ఇబ్బందులకు గురిచేస్తోందని వారు వాపోయారు. ఇప్పటికైనా ఎకో టూరిజం ప్రాజెక్టును విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీసా కమిటీ మాడగడ అధ్యక్షుడు మండియకేడి బాలరాజు, పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు. -
సద్దుమణిగిన గ్రామాల సరిహద్దు వివాదం
సీలేరు: గూడెం కొత్తవీధి మండలం తోకరాయి, చోడిరాయి గ్రామస్తులు ఇకపై గొడవలు చేయమంటూ రెండు పంచాయతీలకు చెందిన ప్రజాప్రతినిధులు సమక్షంలో ఒప్పంద పత్రాన్ని సీలేరు ఎస్ఐ రవీంద్రకు సోమవారం అందజేశారు. తోకరాయి, చోడిరాయి గ్రామాల మధ్య సరిహద్దు వివాదం జరుగుతున్న నేపథ్యంలో సీలేరు ఎస్ఐ రవీంద్ర సూచనల మేరకు గుమ్మిరేవుల, దారకొండ పంచాయతీలకు చెందిన ప్రజాప్రతినిధులు, పెద్దలు, ఆయా గ్రామాలకు చెందిన గిరిజనులు సమావేశమై ఒక అవగాహనకు వచ్చి సీలేరు ఎస్ఐకు ఒప్పంద పత్రాన్ని అందజేశారు. ఇందులో భాగంగా తోకరాయి సరిహద్దుకు ఆనుకుని ఉన్న అటవీప్రాంతంలో చోడిరాయి గ్రామస్తులు సాగుచేసుకుంటున్న భూములకు ఎవరికై తే ఆర్వోఎఫ్ఆర్ పట్టాలున్నాయో వారు యథావిధిగా సాగుచేసుకోవడానికి, మిగిలిన ప్రాంతంలో సాగుచేసుకుంటున్న చోడిరాయి గ్రామస్తులకు అటవీశాఖ అధికారులు నుంచి లిఖిత పూర్వక ఆదేశాలు వచ్చేవరకూ సాగుచేయకుండా ఉండటానికి నిర్ణయించారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న అటవీప్రాంతంలో తోకరాయి గ్రామస్తులు చెట్లు నరకకుండా ఉండటానికి అంగీకరించినట్టు ఎస్ఐ రవీంద్రకు గ్రామపెద్దలు, సర్పంచ్లు, ఎంపీటీసీ వివరించారు. ఇకపై ఎవ్వరూ గొడవపడొద్దుని ఎస్ఐ రవీంద్ర ఆయా గ్రామస్తులకు సూచించారు. -
వెనుకబడిన కులాల అభ్యున్నతికి కులగణన చేపట్టాలి
అల్లిపురం : సమాజంలో వెనుకబడిన కులాల అభ్యున్నతికి కులగణన చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. జనగణనలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగణనలో కులగణన కోసం క్షేత్రస్థాయి నుంచి ఒత్తిడి తీసుకురావాలన్నారు. అవసరమైతే చలో అమరావతికి సిద్ధం కావాలని కోరారు. తెలంగాణలో కులగణన నిర్వహించారని చెప్పారు. రాష్ట్రంలో 143 బీసీ కులాలు ఉంటే 10–12 కులాలకు చెందినవారు మాత్రమే అభివృద్ధి చెందారన్నారు. మిగిలిన కులాలవారు ఇంకా వెనుకబడి ఉన్నారని తెలిపారు. బంగారు కుటుంబాల పేరుతో పేదలను దత్తత తీసుకోవాలని ప్రభుత్వం ధనికులను కోరుతోందని, వారి దయాదాక్షిణ్యాలపై పేదలు బతకాలా? అని ప్రశ్నించారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు, ప్రధాన కార్యదర్శి ఎర్ని శ్రీనివాసరావు, నగరాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జగపిళ్ల అప్పలరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్కేఎస్వీ కుమార్, యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు అక్కరమాని వెంకటరావు, ఉత్తరాంధ్ర బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎస్.సుధాకర్, బీసీ సంఘం రాష్ట్ర కన్వీనర్ కట్టా మల్లేశ్వరరావు, వాడబలిజ సంక్షేమ సంఘం నాయకుడు వాసుపల్లి జానకీరాం, బీసీ సంఘం నాయకురాలు డాక్టర్ బీసీఎస్ కల్యాణ్, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఎం.పైడిరాజు, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సీపీఐ కార్యదర్శులతో పాటు పలువురు బీసీ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ -
డివైడర్ను ఢీకొని యువకుడి మృతి
బీచ్రోడ్డు: దసరా పండుగ సందర్భంగా కొనుగోలు చేసిన కొత్త ద్విచక్రవాహనం ఓ యువకుడికి శాపంగా మారింది. బైక్ కొనుగోలు చేసిన నాలుగు రోజులకే జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాణిపేట నివాసి సీరందాస్ హరీష్ (19) దుర్మరణం పాలయ్యాడు. మూడో పట్టణ ట్రాఫిక్ పోలీసులు ఈ వివరాలను అందించారు. పోలీసుల వివరాల ప్రకారం..హరీష్ ఆదివారం అర్ధరాత్రి తన స్నేహితుడు వినయ్తో కలిసి రూ. 2.80 లక్షల విలువైన యమహా ద్విచక్రవాహనంపై టిఫిన్ చేయడానికి కాంప్లెక్స్కు వెళ్లాడు. టిఫిన్ ముగిసిన తర్వాత తిరిగి వస్తుండగా, దత్త ఐల్యాండ్ మలుపు వద్ద బైక్ అతివేగం కారణంగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న హరీష్కు తీవ్ర గాయాలు తగిలాయి. వెంటనే అతడిని 108 అంబులెన్స్లో కేజీహెచ్కు తరలించారు. సోమవారం ఉదయం 5.30 గంటలకు చికిత్స పొందుతూ మృతి చెందాడు. వెనకాల కూర్చున్న వినయ్కు స్వల్ప గాయాలయ్యాయి. తీరని విషాదం.. తండ్రి శ్రీనివాసరావుతో గొడవపడి మరీ దసరాకు బైక్ కొనిపించుకున్నాడు. కొడుకు మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ట్రాఫిక్ సీఐ అమ్మినాయుడు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్ మార్చరీకి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
పోర్టు అడుగులు
వడివడిగాసాక్షి, విశాఖపట్నం : ఈస్ట్కోస్ట్ గేట్ వే ఆఫ్ ఇండియాగా నౌకాయానంలో అంతర్జాతీయంగా ఎదుగుతున్న విశాఖపట్నం పోర్టు అథారిటీ నేటితో 92 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఏటికేడూ ప్రగతి పథంలో పయనిస్తూ.. నిర్వహణ సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటూ దేశంలోని మేజర్ పోర్టులతో పోటీ పడుతూ సరికొత్త వ్యూహాల్ని అనుసరిస్తోంది. పెట్టుబడుల ప్రవాహం.. పెరుగుతున్న సామర్థ్యానికి అనుగుణంగా విస్తరణ పనులతో పోర్టు వచ్చే ఆవిర్భావ దినోత్సవానికి సరికొత్త సొబగులద్దుకోనుంది. మౌలిక వసతుల కల్పనతో పాటు జెట్టీల విస్తరణ, కంటైనర్ టెర్మినల్ విస్తరణ, రవాణా, అనుసంధాన ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతుండటంతో.. విశాఖ పోర్టు ప్రపంచ వాణిజ్య కేంద్రానికి చిరునామాగా మారనుంది. ఈ ఏడాది స్వచ్ఛతా అవార్డుల్లో దేశంలో ప్రథమ స్థానం సాధించింది. తొలి పాసింజర్ షిప్ జలదుర్గతో.. 1927లో విశాఖపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 1933 అక్టోబర్ 7న పోర్టు నుంచి సరకు రవాణాని ప్రారంభించింది. సింథియా స్టీమ్ నేవిగేషన్ కంపెనీ తొలి పాసింజర్ షిప్ జలదుర్గని విశాఖ పోర్టుకు తీసుకొచ్చింది. అప్పటి వైస్రాయ్, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ విల్లింగ్ డన్ నౌకాశ్రయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. విశాఖపట్నం హార్బర్ను సుందరంగా తీర్చిదిద్దడంలో ఇంజనీర్లు డబ్ల్యూసీ యాష్, ఓబీ రాటెన్బరీలు ముఖ్య భూమిక పోషించారు. పోర్టుకు సమీపంలోనే స్టీల్ప్లాంట్, సెయిల్, ఎన్టీపీసీ, నాల్కో, ఎన్ఎండీసీ, హిందూస్థాన్ షిప్యార్డు, కోరమాండల్ ఫెర్టిలైజర్స్, హెచ్పీసీఎల్ వంటి భారీ పరిశ్రమలున్నాయి. పోర్టులో ప్రధానంగా స్టీల్, పవర్, మైనింగ్, పెట్రోలియం, ఎరువులు తదితర సరుకుల్ని నిర్వహిస్తోంది. దేశంలోనే అత్యంత లోతైన కంటైనర్ టెర్మినల్ పోర్టులోనే ఉండటం విశేషం. సరికొత్త సంస్కరణలు గ్రీన్ పోర్టుగా తీర్చిదిద్దేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే 10 మెగావాట్ల సోలార్ పవర్ప్లాంట్ని ఏర్పాటు చేసి.. పోర్టుకు అవసరమైన విద్యుత్మొత్తాన్ని సొంతంగా ఉత్పత్తి చేసుకుంటోంది. రూఫ్టాప్ సోలార్ ద్వారా మరో 190 కిలోవాట్ల విద్యుత్ని ఉత్పత్తి చేస్తోంది. 2055–26 నాటికి 30 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా అధికారులు నిర్దేశించుకున్నారు. ● ప్రధాన మంత్రి మత్య్స సంపద యోజన కింద రూ.150 కోట్లతో ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులు ప్రారంభించింది. త్వరలోనే పనులు పూర్తి కానున్నాయి. ● 845 మీటర్ల పొడవు, 16 మీటర్ల సహజ సిద్దమైన లోతును కలిగి విశాఖ కంటైనర్ టెర్మినల్ కంటైనర్ ట్రాఫిక్ కు ముఖ ద్వారంలా ఉంది. ఏపీ, తెలంగాణా, చత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర జార్ఖండ్, మధ్యప్రదేశ్ , పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు విశాఖ కంటైనర్ టెర్మినల్ గేట్ వేగా వ్యవహరిస్తోంది. ● మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రపంచ స్థాయి ట్రక్ పార్కింగ్ టెర్మినల్ను 666 వాహనాల పార్కింగ్ సామర్ధ్యంతో నిర్మించింది. 84,000 టన్నుల సరుకును నిల్వ ఉంచే విధంగా కవర్డ్ స్టోరేజ్ షెడ్ నిర్మాణాలు, యార్డు నిర్మాణం పూర్తి చేసింది. ● పోర్టులోని కార్యకలాపాల్ని యాంత్రీకరించే ప్రక్రియ జోరందుకుంది. రూ.655 కోట్లతో ఈక్యూ–7, వెస్ట్ క్యూ–7, 8 బెర్త్ లను యాంత్రీకరించే పనులు పీపీపీ పద్ధతిలో చేపడుతున్నారు. ● రూ.800 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, సీఎన్జీ బంకరింగ్ స్టేషన్ నెలకొల్పేందుకు హెచ్పీసీఎల్, ఐఓసీతో ఎంవోయూ కుదుర్చుకుంది. ● రూ.276 కోట్లతో ఆయిల్ రిఫైనరీ బెర్త్–2 నిర్మాణం, అడ్వాన్స్డ్ ఫైర్ఫైటింగ్ ఫెసిలిటీ, ఆర్ఎఫ్ఐడీ గేట్ మేనేజ్మెంట్ సిస్టమ్, మోడ్రన్ పోర్టు ఆపరేటింగ్ సిస్టమ్ని ప్రారంభించారు. ● ఇటీవలే ఏడు దేశాలకు ఆతిథ్యమిస్తూ బిమ్స్టెక్–2025 కాంక్లేవ్ని విజయవంతంగా వీపీఏ నిర్వహించింది. -
మెరుగైన బోధనకు కృషి చేయాలి
కలెక్టర్ దినేష్కుమార్ పాడేరు: విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని, అందుకు తమ బోధనాభ్యసన స్థాయిలను పెంచుకోవాలని కలెక్టర్ దినేష్కుమార్ అన్నారు. పట్టణంలోని శ్రీకృష్ణాపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన టీచింగ్ అట్ రైట్ లెవెల్ శిక్షణ శిబిరాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమాలు అన్ని మండలాల్లో ఏర్పాటు చేశామన్నారు. రెండు విడతలుగా ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మొదటి విడత శిక్షణ తరగతులు ఈనెల 6నుంచి 8వ తేదీవరకు, రెండో విడత శిక్షణ కార్యక్రమాలు 9నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు. మొదటి విడతలో 3,111 మంది ఉపాధ్యాయులు, రెండో విడతలో 3,098 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ కోసం 128 మంది రీసోర్స్ పర్సన్లు, రాష్ట్ర స్థాయి నుంచి 80 మంది ఎస్ఆర్పీలను నియమించినట్టు చెప్పారు. శిక్షణ కార్యక్రమాలను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు, సమగ్ర శిక్ష అదనపు సమన్వయకర్త స్వామి నాయుడు, ఎంఈవోలు, క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు, డీఆర్పీలు, సమగ్ర శిక్ష సిబ్బంది, సీఆర్పీలు పాల్గొన్నారు. -
ఉత్తమ ఫలితాలు రాకుంటే ఉపేక్షించం
● జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీరావు ● శిక్షణ తరగతులకు గైర్హాజరైన 11మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులుముంచంగిపుట్టు: పదో తరగతి పరీక్షల ఫలితాలు ఈ ఏడాది పూర్తిగా నిరాశపరిచాయని,వచ్చే ఏడాది ఉత్తమ ఫలితాలు రాకపోతే ఉపేక్షించేది లేదని, ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీరావు అన్నారు. స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల–1లో ఉపాధ్యాయులకు సోమవారం టీచింగ్ ఎట్ రీడింగ్ లెవల్ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి.ఈ తరగతులను డీఈవో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఆశించిన విద్యాప్రమాణాలను రాబట్టాలన్నారు. పలు సర్వేల్లో విద్యార్థులకు కనీస సామర్థ్యం లేనట్లుగా తేలడంతో కలెక్టర్ దినేష్కుమార్ ప్రత్యేక చొరవతో ఈ ఏడాది రెండో దఫా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు బాగా వెనకబడిన విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను మెరుగు పరిచేందుకు కృషి చేయాలని చెప్పారు. ఈ ఏడాది టెన్త్లో కేవలం 47 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారని, వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షల్లో 80శాతానికి పైగా ఫలితాలు వచ్చే విధంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. ఉత్తమ ఫలితాల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. పది పరీక్షలు కట్టుదిట్టమైన భద్రత నడుమ జరుగుతాయని,వారాంతపు సమీక్షలు ఉంటాయని తెలిపారు. శిక్షణ తరగతులకు 11 మంది ఉపాధ్యాయులు హాజరు కాకపోవడంతో వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎంఈవో కృష్ణమూర్తిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంఈవో త్రినాథ్,రిసోర్స్ పర్సన్ హరిబాబు,క్లస్టర్ రిసోర్స్ మానటరింగ్ టీచర్లు అనిల్,గౌరిశంకర్,సూర్యనారాయణ,సురేష్,ఈశ్వర్,భాస్కర్ పాల్గొన్నారు. పెదబయలు: విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి పి.బ్రహ్మాజీరావు అన్నారు. పెదబయలు స్కూల్ కాంప్లెక్స్ భవనంలో సోమవారం నిర్వహించిన ఉపాధ్యాయులు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. జిల్లా ఇన్చార్జ్ రఘు,ఎంపీడీవో ఎల్. పూర్ణయ్య,ఎంఈవో కె. కృష్ణమూర్తి, కాంప్లెక్స్ హెచ్ఎంలు పి.తిరుపతిరావు,గోపాలరావు, గంగాభవాని,అప్పారావు,దేముడు తదితరులు పాల్గొన్నారు. -
పని గంటల పెంపు దుర్మార్గం
అరకులోయటౌన్: పని గంటలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్. నర్సింగరావు అన్నారు. జిల్లా సీఐటీయూ రెండవ మహా సభలను సోమవారం అరకులోయలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న నర్సింగరావు మాట్లాడుతూ కార్మికులకు తక్కువ జీతాలు చెల్లించి, ఎక్కువ పనిచేయించుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం యోచిస్తోందన్నారు. కా ర్మిక వర్గాన్ని అణచివేయాలని, దేశ సంపదను అదానీ వంటి వారికి కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఉన్న బాక్సైట్లో పాడేరు ఏజెన్సీలో 30 శాతం ఉందన్నారు. మోదీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసేందుకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. స్టీల్ప్లాంట్ను ప్రైవేట్ పరం చేస్తే గిరిజన, దళిత ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర నాయకులు ఆర్.శంకర్రావు, జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్, ఎస్.బి.పోతురాజు, కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు, అనంతగిరి జెడ్పీటీసీ దీసరి గంగరాజు, అంగన్వాడీ కార్యకర్తల సంఘం జిల్లా నాయకురాలు కె. భాగ్య తదితరులు పాల్గొన్నారు.మాట్లాడుతున్న సీహెచ్ నర్సింగరావుసీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు -
విధి నిర్వహణలో నిర్లక్ష్యం సహించేది లేదు
చింతపల్లి: వైద్య సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని జిల్లా వైద్య ఆరోగశాఖాధికారి డాక్టర్ టి.విశ్వేశ్వరనాయుడు అన్నారు. మండలంలోని లోతుగెడ్డ, తాజంగి, లంబసింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా ఆరోగ్య కేంద్రా ల్లో రికార్డులను, మందుల నిల్వలను పరిశీలించారు. వార్డులను తనిఖీచేసి, రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలన్నారు.సిబ్బంది సమయ పాలన పాటించాలని, విధిగా ఉదయం, సాయంత్రం ముఖ హాజరు వేయాలని సూచించారు.ఆరోగ్య కేంద్రాల నుంచి వచ్చే రిఫరల్ కేసులు, అంబులెన్సుల నిర్వహణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి బి.లక్ష్మణ్,ఫార్మసీ అధికారి ఎస్. సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్వో విశ్వేశ్వరనాయుడు -
శిక్షణను సద్వినియోగం చేసుకోండి
గంగవరం: శిక్షణ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని ఏజెన్సీ డీఈవో వై.మల్లేశ్వరరావు అన్నారు. స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. మూడో తరగతి నుంచి పదవ తరగతి వరకు తెలుగు, ఇంగ్లిషు, గణితం లెక్కలు బోధించే ఉపాధ్యాయులందరికీ మూడు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మొదటి విడతగా 85 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. డీఆర్పీలు దామోదర్ రావు, వెంకన్న దొర, రఘుబాబు దొర, రామచంద్ర రెడ్డి తదితరులు ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. ప్రధానోపాధ్యాయులు వరలక్ష్మి, ఆర్.వి.వి సత్యనారాయణ శ్రీరాములు, సీఆర్పీలు వరప్రసాద్ , భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
బామ్మ, మనవడ్ని కట్టేసి భారీ చోరీ
సమయం: ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట స్థలం: విశాఖపట్నం, రెడ్డి కంచరపాలెం, ఇందిరానగర్–5 ఏం జరిగింది : ఇంట్లోవాళ్లను తాళ్లతో కట్టేసి భారీ చోరీ మర్రిపాలెం: ఆనంద్రెడ్డి ఇల్లు గాఢ నిద్రలో ఉంది. రైల్వే కాంట్రాక్టర్ అయిన ఆనంద్రెడ్డి హైదరాబాద్లో ఉన్నారు. ఇంట్లో కేవలం ఆయన తల్లి ఎల్లమ్మ (65), కుమారుడు కృష్ణకాంత్రెడ్డి (18) మాత్రమే ఉన్నారు. జాతీయ రహదారి సమీపంలో ఉన్నప్పటికీ, ఆ సమయంలో ప్రాంతం నిశ్శబ్దంగా ఉంది. ముగ్గురు గుర్తుతెలియని దుండగులు..ముఖాలకు మాస్కులు వేసుకుని పక్కా ప్రణాళికతో ఇంటి వెనుక తలుపుల వద్దకు చేరుకున్నారు. క్షణాల్లో వారు తలుపులు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. దుండగులు నేరుగా నిద్రిస్తున్న బామ్మ, మనవడి గదిలోకి వెళ్లారు. దుండగులను చూసి తేరుకునేలోపే బామ్మ, మనవడ్ని ప్లాస్టిక్ తాడుతో చేతులు, కాళ్లు గట్టిగా కట్టేశారు. అరుపులు వినిపించకుండా ఉండేందుకు నోటికి ప్లాస్టిక్ టేప్లను చుట్టేశారు. ఊపిరి ఆడటానికి కష్టం అవుతున్నా, భయం వారికి మాట రాకుండా చేసింది. నిస్సహాయంగా కళ్ల ముందు జరుగుతున్న దోపిడీని వారు వీక్షించాల్సి వచ్చింది. బాధితులను బంధించిన తర్వాత, దొంగలు ఇంట్లో వెతకడం ప్రారంభించారు. ఎల్లమ్మ మెడలోని బంగారు ఆభరణాలు తెంచుకున్నారు. కృష్ణకాంత్రెడ్డి చేతికి ఉన్న డైమండ్ రింగ్ లాక్కున్నారు. బీరువాను పగలగొట్టి, అందులో దాచిన పది తులాల బంగారం వస్తువులు, రూ. 3 లక్షలు చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత.. దుండగులు తమ దొంగిలించిన వస్తువులను బ్యాగుల్లో సర్దుకున్నారు. అంతటితో ఆగకుండా ఇంటి యజమాని ఆనంద్రెడ్డికి చెందిన మహేంద్ర ఎక్స్యూవీ కారుతో పరారయ్యారు. సోమవారం ఉదయం స్థానికుల సహాయంతో విడిపించుకున్న ఎల్లమ్మ, కృష్ణకాంత్రెడ్డి హుటాహుటిన కంచరపాలెం క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెస్ట్ క్రైమ్ సీఐ చంద్రమౌళి కేసు నమోదు చేసి, వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సీఐ చంద్రమౌళి, ఫోరెన్సిక్ టీమ్ ఇంటి వెనుక తలుపుల వద్ద పగిలిన భాగాలను, లోపల చెల్లాచెదురైన బీరువాను పరిశీలించారు. దొంగల కోసం వెస్ట్ క్రైమ్ సీఐ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. దుండగులు తీసుకువెళ్లిన మహేంద్ర ఎక్స్యూవీ కారు నంబర్తో నగరంలోని అన్ని అవుట్పోస్టులకు సమాచారం అందించారు. కారు మారిక వలస వద్ద విడిచిపెట్టి పరారైనట్టు పోలీసులు గుర్తించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సీఐ చంద్రమౌళి తెలిపారు. -
డ్రగ్స్ అనర్థాలపై అవగాహన
అన్నవరంలో ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్న ఈగల్ టీం పోలీసులు చింతపల్లి: ఆటో డ్రైవర్లు మత్తు పదార్ధాల అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలని ఈగల్ టీమ్ ఇన్స్పెక్టర్ నాగార్జున అన్నారు. మండలంలోని అన్నవరం వారపు సంతలో ఆటో డ్రైవర్లకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా ఈగల్ టీమ్ ఇన్స్పెక్టర్ నాగార్జున మాట్లాడుతూ మత్తు పదార్ధాలు జీవితాలను నాశనం చేస్తాయని, వాటికి దూరంగా ఉండాలన్నారు. ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు మత్తు పదార్దాలు రవాణాకు ఎక్కువగా ఆటోలనే ఉపయోగిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆటోడ్రైవర్లు కూడా మత్తు పదార్దాల అక్రమ రవాణాపై సామాజిక బాధ్యతగా భావించి పూర్తిగా నిర్మూలించాలని సూచించారు. ప్రజాప్రతినిదులు, ఆటో యూనియన్ నాయకులు తదితరలు పాల్గొన్నారు. -
విద్యుత్ ఉద్యమంపై కూటమి కుట్ర
సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ కాంట్రాక్ట్, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ప్రధాన డిమాండ్తో దశలవారీగా సమ్మె నిర్వహిస్తున్న జేఏసీ కార్యచరణ పై కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. విద్యుత్ ఉద్యోగులు కార్మికుల సంఘాల మధ్య చిచ్చుపెట్టేలా తమ అనుబంధ అసోసియేషన్ తెలుగునాడు ని పావుగా వినియోగించుకుంటోంది. గత నెల చివరివారం నుంచి ఆందోళనలు నిర్వహిస్తున్న చీమకుట్టినట్టైనా స్పందించని ప్రభుత్వం ఇప్పుడు జేఏసీ ఉద్యమాన్ని అణిచివేసేందుకు అడ్డగోలు చర్యలకు సిద్ధమవుతోంది. మరోవైపు ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా అక్టోబర్ 15 నుంచి తమ ఆందోళన తీవ్రతరం చేస్తామని జేఏసీ హెచ్చరించింది. విద్యుత్ రంగములో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల, ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్స్ ను పరిష్కరించుకుంటే అక్టోబర్ 15 వ తేదీ తర్వాత నిరవధిక సమ్మెకు వెళ్తామని ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ మరోసారి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. సోమవారం ఏపీ ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించేందుకు అన్ని ఉద్యోగ సంఘాలు సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉద్యోగ సంఘాల మధ్య చిచ్చుపెట్టి ఉద్యమాన్ని అణిచివేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పొందుతుంది. టీడీపీ అనుబంధ సంస్థ తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం ని అడ్డం పెట్టుకొని ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు ఎత్తుగడలు వేస్తోంది. డిస్కౌంట్ లో పనిచేస్తున్న దాదాపు అందరూ ఉద్యోగులు కార్మికుల సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం జేఏసీ ఉద్యమ కార్యచరణ చేపడుతుంటే తాము మాత్రం ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉంటామంటూ ఉద్యమంలో పాల్గొంటూ తెలుగు నాడు సంఘం ప్రకటన చేయడం వెనక ప్రభుత్వం ఉందనేది స్పష్టమవుతుంది. అనుబంధ సంస్థ వైఖరి బట్టి కూటమి ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి పూర్తి వ్యతిరేకమని మరోసారి బట్టబయలైంది. పలుమార్లు ప్రభుత్వం, ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం వల్లే దశల వారి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జేఏసీ నేతలు పునరుద్ధాటించారు. ప్రభుత్వ అనుబంధ ఉద్యోగ సంఘాలు కార్మిక సంఘాలు ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా డిమాండ్లు నెరవేరేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 14న వర్క్ టు రూల్ పాటిస్తామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లో సుమారు 27 వేల మంది కాంట్రాక్టు కార్మికులు చాల తక్కువ వేతనాలకు పనిచేస్తున్నరనీ వారిని పెర్మనెంట్ చేయాలనీ డిమాండ్ చేస్తుంటే... తెలుగు నాడు విద్యుత్ కార్మిక సంఘం మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం చూస్తే ప్రభుత్వం డిమాండ్లు నెరవేర్చేందుకు నెట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేటట్లుగా కనిపించడం లేదని సుస్పష్టమౌతోంది. ఎన్నికల సమయాల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక విద్యుత్ కార్మికులను విస్మరించడం తగదని జేఏసీ చెబుతోంది. విద్యుత్ ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ డిమాండ్లేవీ పరిష్కరించకుండా ఉద్యమాన్ని నీరుగారిచేందుకు ప్రభుత్వం శాయశక్తుల కుయుక్తులు పన్నుతూ ఆందోళన కార్యక్రమాలను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినా.. వాటిని తిప్పికొట్టేందుకు జేఏసీ దూకుడుగా వ్యవహరిస్తోంది. -
‘ఎకో టూరిజం’ ప్రతిపాదన విరమించాలి
అరకులోయ టౌన్: మాడగడ సన్రైజ్ వ్యూ పాయింట్ వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టు ప్రతిపాదనను అటవీశాఖ విరమించాలని మాడగడ పంచాయతీ ప్రజలు విన్నవించారు. ఆదివారం సన్రైజ్ వ్యూపాయింట్ వద్ద పంచాయతీ పరిధిలోని వివిధ రంగాల కళాకారులు, ఉపాధి పొందుతున్న వారు శాంతియుతంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యూపాయింట్ స్థలం అటవీశాఖకు చెందినది కాదన్నారు. మాడగడ గ్రామానికి చెందిన నలుగురు గిరిజన రైతులకు 12 ఎకరాల మేర గతంలో డిఫారం పట్టాలు ఇచ్చిఉన్నారని పీసీ కమిటీ కార్యదర్శి బి.సుమన్, మోటార్ యూనియన్ ప్రతినిధులు రామకృష్ణ, డి.చిన్నబాబు తెలిపారు. ఆ స్థలంపై డీఫారం రైతులకు సర్వ హక్కులు ఉన్నప్పుడు అటవీశాఖ అధికారులు ఇబ్బందులకు గురిచేయడంలో ఆంతర్యమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. కర్రలతో ఏర్పాటు చేసిన ఊయల, థింసా నృత్యం వద్ద ఏర్పాటు చేసిన పందిరి రాటలను ఏ రకంగా తొలగిస్తారని ప్రశ్నించారు. సన్రైజ్ వ్యూపాయింట్పై నాలుగేళ్లుగా ఆధారపడి జీవనం సాగిస్తున్న ఆదివాసీలను ఉన్నట్టుండి ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. వ్యూపాయింట్పై ఆధారపడి జీవనం సాగిస్తున్న తమ పొట్ట కొట్టడం అన్యాయమన్నారు. గత మూడేళ్లలో మాడగడ వ్యూపాయింట్ అభివృద్ధిని అటవీశాఖ ఎందుకు పట్టించుకోలేదని వారు ధ్వజమెత్తారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు మాడగడ వ్యూపాయింట్ జోలికి రావద్దని విన్నవించారు.మాడగడ సన్ రైజ్ వ్యూపాయింట్పరిసర గ్రామాల ప్రజల విన్నపం -
మన్యంలో వీకెండ్ జోష్
ముంచంగిపుట్టు: ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని డుడుమ జలపాతానికి పర్యాటకుల తాకిడి నెలకొంది. విశాఖపట్నం. విజయవాడ,హైదరాబాద్,విజయనగరం తదితర ప్రాంతాలతో పాటు ఒడిశా నుంచి భారీగా తరలిరావడంతో సందడి నెలకొంది. డుడుమ జలపాతం, వ్యూపాయింట్, మాచ్ఖండ్ ప్రాజెక్టు ప్రాంతాలను సందర్శించారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకుని సందడి చేశారు. డుంబ్రిగుడ: పమ్రుఖ పర్యాటక కేంద్రం చాపరాయి జలపాతానికి ఆదివారం పర్యాటకులు భారీగా తరలివచ్చారు. జలపాతం అందాలను తిలకించారు. గిరిజన వస్త్రధారణలో అలరించారు. ఫొటోలు తీసుకుని సందడి చేశారు. అనంతరం అరకు పైనరీని సందర్శించారు. చింతపల్లి: ఆంధ్రా కశ్మీరు లంబసింగికి ఆదివారం పర్యాటకులు అంతంతమాత్రంగానే వచ్చారు. చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద ప్రకృతి అందాలను తిలకించారు. ఫొటోలు తీసుకుని ఉత్సాహంగా గడిపారు. -
సమ్మోహనభరితం.. నృత్యవిన్యాసం
మద్దిలపాలెం: ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి, బంగారు పతక విజేత అరుణ పరమేశ్ స్థాపించిన సంయుక్త మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ 8వ వార్షికోత్సవం ఆదివారం కళాభారతి ఆడిటోరియంలో వైభవంగా జరిగింది. ఈ వేడుకలో 60 మందికి పైగా శిష్యులు కూచిపూడి నృత్య విన్యాసాలతో అద్భుత ప్రదర్శన ఇచ్చి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గణబాబు మాట్లాడుతూ.. భారతీయ శాసీ్త్రయ కళల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఉద్యోగ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా తరహాలో.. కల్చరల్ కోటాను ప్రవేశపెట్టే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాలనే ఆలోచనను వ్యక్తం చేశారు. కూచిపూడి నాట్య నిపుణురాలు సూదగాని గీతా నారాయణ్ చిన్నారులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ‘బ్రహ్మాంజలి’, ‘భో శంభో’, ‘వాలపుల సోలపుల’వంటి నృత్యరూపకాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఐసీసీఆర్ సౌత్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్, ఎన్ఎండీఏ ప్రిన్సిపాల్ కె.వి.లక్ష్మి, తేజశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
అప్పన్న సన్నిధిలో నిత్య కల్యాణాల రికార్డు
ఆశా కార్యకర్తల నియామకంపై సమగ్ర విచారణ ● అర్హులకు న్యాయం చేయాలి ● ఏపీ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా రాధాకృష్ణ డిమాండ్ పాడేరు : జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్తల నియామకంలో అన్ని అర్హతలు ఉన్న వారికే పోస్టులను కేటాయించాలని ఏపీ గిరిజన సమాఖ్యా జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా రాధాకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. దరఖాస్తు చేసుకున్న ఆశా కార్యకర్తల అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన లేకుండా గతంలో పనిచేసి రిటైర్ అయిన ఆశా కార్యకర్తల కుటుంబాలకు చెందిన వ్యక్తులను ఎలా నియమిస్తారని ఆయన ప్రశ్నించారు. మెరిట్తో సంబంధం లేనప్పుడు నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేస్తున్నారన్నారు. ఆశా కార్యకర్తల నియామకాల్లో పలు అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. దీనిపై కలెక్టర్, ఐటీడీఏ పీవోలు సమగ్ర విచారణ జరిపి అర్హులు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. లేనిపక్షంలో అర్హత ఉండి ఉద్యోగం రాని అభ్యర్థులతో ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు.యువకులను రక్షించిన లైఫ్గార్డ్స్ ఏయూక్యాంపస్: ఆర్కే బీచ్ సమీపంలో ఆదివారం సాయంత్రం సముద్రంలో మునిగిపోతున్న ఇద్దరు యువకులను పోలీసులు, లైఫ్గార్డులు రక్షించారు. మింది ప్రాంతానికి చెందిన ఐదుగురు యువకులు బీచ్కు వచ్చి సముద్ర స్నానం చేస్తుండగా.. వారిలో కిలారి సిద్ధు, అకిరి చరణ్ తేజ అలల్లో చిక్కుకున్నారు. వెంటనే స్పందించిన మైరెన్ పోలీసుల సమాచారంతో జీవీఎంసీ లైఫ్గార్డులు పోలిరాజు, అచ్చన్న రంగంలోకి దిగారు. యువకులిద్దరినీ రక్షించి ఒడ్డుకు చేర్చారు. సిద్ధు ఆరోగ్యం నిలకడగా ఉండగా.. చరణ్ తేజకు ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు.సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆల యంలో ఆదివారం రికార్డు స్థాయిలో నిత్యకల్యాణా లు, స్వర్ణపుష్పార్చన సేవలు వైభవంగా జరిగాయి. చైన్నెకి చెందిన కించిత్కారం ధర్మ సంస్థాపనమ్ ఆధ్వర్యంలో ఏకంగా 125 నిత్యకల్యాణాలు, 125 స్వర్ణ పుష్పార్చనలు నిర్వహించారు. తమిళనాడు నుంచి వచ్చిన ఆ సంస్థకు చెందిన 125 మంది ఉభయదాతలు ఈ సేవల్లో పాల్గొన్నారు. వీరికి అదనంగా మరో 13 మంది ఉభయదాతలు కూడా నిత్యకల్యాణంలో పాల్గొనడంతో.. మొత్తం 138 నిత్య కల్యాణాలు జరిగాయి. ఉభయదాతలతో ఆలయ కల్యాణమండపం కిక్కిరిసిపోయింది. తొలుత ఉదయం 7 గంటల నుంచి స్వర్ణ పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉభయదాతలను కల్యాణ మండపంలో కూర్చోబెట్టారు. స్వామి వారి ఉత్సవమూర్తులను శేషతల్పంపై అధిష్టింపజేసి.. 108 స్వర్ణ సంపెంగలతో అష్టోత్తరశతనామావళి సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశేషంగా హారతి అందించారు. ఉదయం 9.30 గంటల నుంచి నిత్యకల్యాణం నిర్వహించారు. విష్వక్సేన పూ జ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్ర బెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో ఈ కల్యాణాన్ని శాస్త్రోక్తంగా పూర్తిచేశారు. అలాగే సాయంత్రం గరుడసేవ నిర్వహించారు. స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని గరుడ వాహనంపై అధిష్టింపజేశారు. సింహగిరి మాడ వీధిలో స్వామికి పెద్ద ఎత్తున తిరువీధి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమాలను స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యు లు, కరి సీతారామాచార్యులు, ఇతర అర్చకులు పర్యవేక్షించారు. కించిత్కారం ధర్మ సంస్థాపనమ్ నిర్వాహకులు యు.వి.కృష్ణన్ స్వామి సేవల్లో పాల్గొన్నారు. స్వామి సేవలో తరించిన తమిళనాడు భక్తులు 125 నిత్య కల్యాణాలు, 125 స్వర్ణపుష్పార్చనలు 108 స్వర్ణ సంపెంగలతో అష్టోత్తరశతనామావళి 138 మంది ఉభయదాతల భాగస్వామ్యం -
నూతన ఉపాధ్యాయులకు ఇండక్షన్ శిక్షణ
సబ్బవరం : దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో ‘మెగా డీఎస్సీ – 2025’ ద్వారా నూతనంగా ఎంపికై న ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం ఇండక్షన్ శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన సుమారు 400 మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు వారం రోజుల పాటు రెసిడెన్షియల్ పద్ధతిలో శిక్షణ ఇస్తున్నట్లు అనకాపల్లి జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు తెలిపారు. శిక్షణలో భాగంగా ఆదివారం ఉపాధ్యాయులకు యోగా, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. శిక్షణ సమర్థవంతంగా జరిగేందుకు పర్యవేక్షక కమిటీలు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
ప్రకృతి ఆధారిత వ్యవసాయంతో ఆర్థికాభివృద్ధి
● రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్కుమార్ పాడేరు : ప్రకృతి ఆధారిత వ్యవసాయం ద్వారా ఆర్థికాభివృద్ధితోపాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని ఆర్ధికాభివృద్ధితో పాటు పర్యవరణ పరిరక్షణకు దోహాద పడుతుందని రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్కుమార్ సూచించారు. మండలంలోని బర్సింగిలో ఆదివారం కలెక్టర్ దినేష్కుమార్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజతో కలిసి ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. గిరిజనులు ప్రకృతి విధానంలో సాగు చేస్తున్న కాఫీ, పసుపు, కూరగాయ పంటలను పరిశీలించారు. మహిళా సంఘాల సభ్యుల నుంచి జీవామృతం, ఘన జీవామృతం, వేప కషాయం తయారీ విధానాన్ని తెలుసుకున్నారు. -
విత్తన బంతులతో వెల్లివిరిసే పచ్చదనం
అనకాపల్లి: నేటి విత్తనాలే రేపటి మహా వృక్షాలని జిల్లా అటవీశాఖ అధికారి ఎం.సోమసుందర్ పేర్కొన్నారు. స్థానిక సత్యనారాయణస్వామి దేవస్ధానం కొండపై నుంచి విత్తన బంతులు విసిరే కార్యక్రమం పట్టణ గ్రీన్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంచడానికి విత్తన బంతులు విసిరే కార్యక్రమం ప్రభావంతమైన పద్ధతని, ముఖ్యంగా కొండ ప్రాంతాలలో చాలా ఉపయోగాలు ఉంటాయన్నారు. భావితరాలకు పర్యావరణపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణస్వామి దేవస్థానం చైర్మన్ అప్పికొండ గణేష్, క్లబ్ వ్యవస్ధాపక అధ్యక్షుడు కొణతాల ఫణిభూషణ్ శ్రీధర్ మాస్టారు, విశ్రాంత అటవీశాఖాధికారి బీరా వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పాల నురగల పరవళ్లు
అల్లూరి మన్యం పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేవి జలపాతాలు. ఈ ఏడాది అధిక వర్షాలకు పొంగి పొర్లుతున్నాయి. పచ్చని కొండల నడుమ జలజలా పారుతూ సవ్వడి చేస్తున్నాయి. ప్రకృతి ప్రేమికుల మదిని దోచేస్తున్నాయి. దివి నుంచి భువికి జాలు వారుతున్నట్టుగా ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మన్యంలో ప్రారంభం కానున్న పర్యాటక సీజన్కు రా..రమ్మని స్వాగతిస్తున్నాయి. ● పొంగి పొర్లుతూ.. జాలువారుతూ.. ● కనువిందు చేస్తున్న జలపాతాలు ● పచ్చని కొండలమధ్య నుంచి పాల పొంగును తలపిస్తూ పర్యాటక సీజన్కు స్వాగతం అరకులోయ టౌన్: జిల్లాలో వందల అడుగుల ఎత్తు నుంచి లోయలోకి పరవళ్లు తొక్కుతూ పాలనురగను తలపిస్తూ జాలువారుతున్న జలపాతాలను చూసేందుకు రెండు కళ్లు చాలడం లేదు. వీటిని తిలకించేంఉదకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భారీగా పర్యాటకులు తరలివస్తుంటారు. జలపాతాలు, మేఘాలను తాకే కొండలు, పాడేరు అరకు లంబసింగిలోని ఆహ్లాదం పంచే పర్యాటక ప్రాంతాలను సందర్శించి తనివితీరా ఆస్వాదిస్తారు. అద్భుతం.. కటికి జలపాతం అనంతగిరి మండలంలోని బొర్రా గుహలకు ఐదు కిలోమీటర్ల దూరంలో కటికి జలపాతం ఉంది. దీని ప్రత్యేకతను మాటల్లో -
సమరభేరి
ఉత్తరాంధ్ర సమస్యలపై ● కూటమి సర్కారు వైఫల్యాలపై ఉద్యమించనున్న వైఎస్సార్సీపీ ● ఉత్తరాంధ్ర విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నేతల తీర్మానం ● ఏడు అంశాలపై ప్రజలకు న్యాయం జరిగే వరకు రాజీలేని పోరాటం ● 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించనున్న వైఎస్ జగన్ ● విశాఖ ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గంలో భీమబోయినపాలెం చేరుకోనున్న మాజీ సీఎం ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై 7 తీర్మానాలు సభాధ్యక్షత వహించిన కురసాల కన్నబాబు పార్టీ నేతల నుంచి ముఖ్యమైన సూచనలు, సలహాలు తీసుకున్నారు. అనంతరం ఉత్తరాంధ్ర ప్రాంతంలోని 7 ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్సార్ సీపీ తీర్మానాలు చేసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పెట్టి వైద్య విద్యను మరింత మందికి అందుబాటులోకి తేవాలన్న సత్సంకల్పానికి కూటమి నేతలు తూట్లు పొడిచారు. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుపై ప్రై‘వేటు’ వేస్తున్నారు. బల్క్డ్రగ్ పార్కుతో మత్స్యకారుల నుంచి ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని గిరిజనుల వరకు అనేక విషయాల్లో అన్యాయం చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ ఉత్తరాంధ్ర రైతులకు తీరని ద్రోహం తలపెట్టారు. ఇలా వివిధ వర్గాల ప్రజల బతుకులను దుర్భరం చేస్తున్న కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్సార్సీపీ సమరభేరి మోగించింది. ఆదివారం జరిగిన ఉత్తరాంధ్ర స్థాయి విస్తృత సమావేశంలో ఏడు అంశాలపై తీర్మానాలు చేసింది. సమావేశంలో ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, ఎంపీలు గొల్ల బాబూరావు, తనూజరాణి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, మాజీ స్పీకర్ తమ్మినేని, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్, బూడి ముత్యాలనాయుడు, అమర్నాథ్, పుష్పశ్రీవాణి, రాజన్న దొర, పార్టీ జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, మజ్జి శ్రీనివాసరావు, పరీక్షిత్ రాజు, పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబూరావు, మాజీ ఎంపీ బెల్లాన, మాజీ ఎమ్మెల్యేలు ధర్మశ్రీ, కోలగట్లసాక్షి, విశాఖపట్నం: దిక్కులేని ప్రజల గొంతుకై .. వారి తరపున పోరాటానికి సిద్ధమై.. వాయిస్ ఫర్ ది వాయిస్లెస్గా నిలుస్తూ.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ కూటమి సర్కారుకు అల్టిమేటం ఇచ్చింది. ప్రభుత్వం తప్పులు, వైఫల్యాలను ఇకపై ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర సమరశంఖం పూరించాలని నిర్ణయించినట్టు పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఆదివారం ఆనందపురంలోని పెద్దిపాలెంలో ని చెన్నాస్ కన్వెన్షన్ హాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. తొలుత మహానేత వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి సమావేశం ప్రారంభించారు. ఈ సమా వేశంలో కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంచి పేరొస్తుందనే భయంతో ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా 17 మెడికల్ కాలేజీలు మొదలుపెట్టి 7 కాలేజీలను పూర్తి చేశారని, వాటిని కూడా ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు తన వారి చేతుల్లో పెట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేయాలని వైఎస్సార్ సీపీ నిర్ణయించిందన్నారు. ఉత్తరాంధ్ర నుంచే సమరశంఖం పూరించేందుకు ఈ నెల 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సందర్శించనున్నారని చెప్పారు. అక్కడే ప్రజలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడతారని వివరించారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎంలు బూడి ముత్యాలనాయుడు, ధర్మాన కృష్ణదాస్, పుష్ప శ్రీవాణి, ఎమ్మెల్సీలు నర్తు రామారావు, సురేష్బాబు, కుంభా రవిబాబు, పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యేలు రేగం మత్స్యలింగం, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, జెడ్పీ చైర్పర్సన్లు జె.సుభద్ర, పిరియా విజయ, పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, పార్లమెంట్ సమన్వయకర్తలు బొడ్డేడ ప్రసాద్, బెల్లాన చంద్రశేఖర్, పార్లమెంట్ పరిశీలకులు కదిరి బాబూరావు, శోభా హైమావతి, సూర్యానారాయణ రాజు, మాజీ ఎంపీలు భీశెట్టి వెంకటసత్యవతి, గొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్ర స్వామి, కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్ గణేష్, అన్నంరెడ్డి అదీప్రాజ్, కన్నబాబు రాజు, తిప్పల నాగిరెడ్డి, గొర్లె కిరణ్కుమార్, తైనాల విజయ్కుమార్, చింతలపూడి వెంకట్రామయ్య, తిప్పల గురుమూర్తిరెడ్డి, చెట్టి ఫాల్గుణ, పిరియా సాయిరాజు, విశ్వసరాయి కళావతి, కె.భాగ్యలక్ష్మి, చెంగల వెంకట్రావ్, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, మలసాల భరత్కుమార్, పేరాడ తిలక్, చింతాడ రవికుమార్, రాష్ట్ర కార్యదర్శులు లక్ష్మణరావు, కరిమి రాజేశ్వరరావు, సాడి శాంప్రసాద్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు చింతకాయల సన్యాసిపాత్రుడు, చిక్కాల రామారావు, పైల శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర మహి ళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు జాన్ వెస్లీ, సీఈసీ సభ్యులు కోలా గురువులు, కాయల వెంకటరెడ్డి, ఎస్ఈసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటే, మనం చేసే ప్రతీ కార్యక్రమం ప్రజల్లోకి వెళుతుందన్నారు. పెండింగ్లో ఉన్న జిల్లా, మండల కమిటీలను, గ్రామ ఇన్చార్జిల నియామకాలను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ‘స్వాతంత్య్రం అనంతరం ఉత్తరాంధ్రకు మేలు చేసిన ముఖ్యమంత్రులు వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే. మూలపేట పోర్టు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు వైఎస్సార్ సీపీ హయాంలోనే వచ్చాయి. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, దొరికిన ప్రతీ అంశాన్ని మనం ప్రశ్నించాలి. స్థానిక అంశాలపై దృష్టి సారించాలి. యువ నాయకత్వం పార్టీ బలోపేతానికి కృషి చేసి, నాయకులుగా ఎదగాలి.’అని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వరుదు కల్యాణి మాట్లాడుతూ స్థానిక కమిటీల్లో మహిళలకు సమన్వయకర్తలు ప్రాధాన్యమివ్వాలని కోరారు. స్థానిక సమస్యలపై విస్తృతంగా పోరాటం చేయాలని మహిళలకు పిలుపునిచ్చారు. అరకు ఎంపీ తనూజరాణి మాట్లాడుతూ..ప్రతీ నియోజకవర్గంలో సమన్వయకర్త సమక్షంలో నియోజకవర్గ స్థాయి సమస్యలపై సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. వాటిని పరిష్కరించే వరకూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేలా పోరాటం చేయాలని సూచించారు. ప్రభుత్వ భూముల కేటాయింపుపై.. లులూ వంటి సంస్థలకు కారుచౌకగా భూములు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఉన్న విలువైన భూములను కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు కూటమి ప్రభుత్వం కట్టబెడుతోంది. వైఎస్సార్ సీపీ హయాంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో అభివృద్ధి పనులకు, ట్రైబల్ ఇన్స్టిట్యూట్ కోసం భూసేకరణ చేపట్టాం. దానిపై చాలా దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు లులూ వంటి అడ్రస్ లేని కార్పొరేట్ సంస్థలకు ఖరీదైన భూములను అప్పగిస్తున్నారు.’అని అన్నారు. చిరు వ్యాపారుల తొలగింపునకు వ్యతిరేకంగా.. జీవీఎంసీ పరిధిలో 42 వేల మంది చిరు వ్యాపారుల షాపులను, ఫుడ్కోర్టులను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్కుమార్, మళ్ల విజయప్రసాద్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం చిరువ్యాపారుల కుటుంబాలను రోడ్డున పడేసింది. హాకర్లకు ఏయూ స్థలంలో వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పిస్తామని మభ్యపెడుతున్నారు. దీన్ని వైఎస్సార్ సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. వ్యాపారులకు న్యాయం జరిగేదాకా పోరాడుతాం.’ అని అన్నారు. మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి, మళ్ల మాట్లాడుతూ.. ‘ చిరు వ్యాపారుల దుకాణాలను కూల్చేసి కూటమి ప్రభుత్వం వారి పొట్టకొట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలున్నప్పటికీ క్రూరంగా వ్యవహరించారు. పార్టీ ఆదేశాల మేరకు ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం.’ అని అన్నారు. -
సన్నిహితుడే చంపేశాడు
గూడెంకొత్తవీధి: జిల్లాలోని అడ్డతీగల మండలం డి.కొత్తూరు గ్రామానికి చెందిన వ్యాపారి బొదిరెడ్డి వెంకటేశులు అలియాస్ కొత్తూరు వెంకటేశులు దారుణ హత్యకు గురయ్యారు. కొయ్యూరు సమీపంలోని బోదరాళ్ల ఘాట్ రోడ్డు అటవీ ప్రాంతంలో మూడు రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. డి.కొత్తూరు గ్రామంలో నివాసం ఉంటున్న మృతుడు బొద్దిరెడ్డి వెంకటేశులు సీజనల్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. సన్నిహితంగా ఉంటున్న ఏలేశ్వరంలోని గొల్లలమెట్ట ప్రాంతానికి చెందిన రాజా రమేష్, స్నేహితులు అతనిని కారులో విశాఖపట్నం జిల్లాలోని దసరా ఉత్సవాలకు తీసుకువెళ్లారు. అప్పటినుంచి వెంకటేశులు ఇంటికి రాకపోవడంతో బంధువులు ఏలేశ్వరం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలావుండగా మృతుడు వెంకటేశులు వద్ద రూ.15 లక్షల విలువైన బంగారంతో పాటు భారీగా నగదు కూడా ఉంది. దీనిపై ఆశపడిన సన్నిహితుడు రాజా రమేష్ ఈనెల రెండవ తేదీ దసరా పండగ రోజున కొయ్యూరు సమీప అటవీప్రాంతంలోని బొంతువలస ప్రాంతంలో అతనిని హతమార్చి మృతదేహాన్ని అక్కడ తుప్పల్లో వదిలి పరారయ్యాడు. ఈ ఘటన జరిగిన దగ్గర నుంచి ఆందోళనకు గురైన రాజారమేష్ గంగవరం మండలం మోహనాపురం నుంచి వస్తూ అడ్డతీగల మండలం వేటమామిడి వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కొంతమంది అతనిని అడ్డతీగల ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ విషయం ఏలేశ్వరం పోలీసు విచారణలో వెల్లడైనట్టు తెలిసింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. బంగారం, నగదుకు ఆశపడి వ్యాపారి దారుణ హత్య బొంతువలస ప్రాంతంలో మృతదేహం వదిలి పరారీ హత్యకేసు నుంచి తప్పించుకునేందుకు నిందితుడు ఆత్మహత్యాయత్నం -
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా..
రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. ‘విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో చాలా సార్లు ప్రశ్నించాను. స్టీల్ప్లాంట్కు నిధులు ఇచ్చామని కేంద్ర మంత్రులు చెబుతున్నా.. ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగానే కేంద్రం వైఖరి ఉందన్నారు. ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్ను కాపాడతామని హామీ ఇచ్చిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇప్పుడు మౌనంగా ఉన్నారు. స్టీల్ప్లాంట్ కాపాడుకునేందుకు మనమంతా ఏకతాటిపై వచ్చి పోరాడాలి’ అని తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి విశాఖ పార్లమెంట్ సమన్వయకర్త బొత్స ఝాన్సీ, గాజువాక సమన్వయకర్త దేవన్రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ మాట్లాడుతూ విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడిన స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరిస్తామంటే వైఎస్సార్ సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. దేవన్రెడ్డి మాట్లాడుతూ.. ‘ఒక వైపు విశాఖ స్టీల్ప్లాంట్లో 34 విభాగాలను ప్రైవేటీకరిస్తున్నారు. మరో వైపు నుంచి వీఆర్ఎస్కు వెళ్లని ఉద్యోగులను బెదిరిస్తున్నారు. దీనిపై నియోజకవర్గ స్థాయిలో పోరాటం చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ఉత్తరాంధ్ర స్థాయిలో భారీగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.’ అని అభిప్రాయపడ్డారు. -
సాగునీటి ప్రాజెక్టులపై..
ఉత్తరాంధ్రలో పెండింగ్లో ఉన్న వంశధార, జంఝావతి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తోటపల్లి వంటి సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. ‘వంశధార రిజర్వాయర్ నుంచి ఉద్దానం ప్రాంతానికి మంచి నీటి సరఫరా ప్రాజెక్ట్కు వైఎస్సార్ సీపీ ప్రారంభించింది. పలాస నియోజకవర్గంకు పూర్తి స్థాయిలో శుద్ధ జలం అందించాం. మిగిలిన పనులు పూర్తి చేయాలి. వైఎస్సార్ సీపీ హయాంలో మూలపేట పోర్టు పనులు 90 శాతం పూర్తయ్యాయి. 1995లో ప్రారంభమైన వంశధార ఇప్పటికీ పూర్తికాలేదు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి.’ అని అన్నారు. ఈ తీర్మానానికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. సాగు నీరు అందకపోవడంతో అనకాపల్లి జిల్లాలో చెరకు, వరి సాగు తగ్గిపోయిందన్నారు. జిల్లాలోని ఐదు షుగర్ ఫ్యాక్టరీల్లో చోడవరం ఒకటే మిగిలిందని, దానికి కూడా కాపాడుకోలేదని పరిస్థితి నెలకొందన్నారు. -
ఐటీఐలో మెరిసినగిరిజన విద్యార్థిని
ముంచంగిపుట్టు: అలిండియా ట్రేడ్ టెస్ట్–2025లో రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండీషనింగ్ కోర్సులో జాతీయస్థాయిలో మెరిసిన గిరిజన విద్యార్థిని మధులతను పలువురు అభినందించారు. మండలంలోని మాకవరం పంచాయతీ కేంద్రానికి చెందిన పాంగి డొమైలా కుమార్తె పాంగి మధులత విశాఖపట్నంలోని కంచరపాలెం ఓల్డ్ ఐటీఐలో 2024–25 విద్యా సంవత్సరంలో రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండీషనింగ్ కోర్సు చదివింది. ఈ ట్రేడ్లో 1200 మార్కులకు గాను 1194 మార్కులు సాధించి జాతీయస్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఢిల్లీలో శనివారం జరిగిన స్కిల్ కాన్వోకేషన్ సెర్మనీ–2025 వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డు, ప్రశంసాపత్రం అందుకుంది. ఈ సందర్భంగా మధులత మాట్లాడుతూ తండ్రి రామదాసు మాచవరంలో గ్రామ తలయారీగా పనిచేస్తూ చదువుకునేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించారని పేర్కొంది. తండ్రి మృతితో ఆ ఉద్యోగంలో తల్లి డొమైలా కొనసాగుతూ అన్నివిధాలుగా సహకారం అందిస్తోదన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా ఉన్నత స్థానానికి ఎదిగి నేవిల్ డాక్యార్డులో ఉద్యోగం సాధిస్తానని పేర్కొంది. ఆమెను ఈ సందర్భంగా పలువురు అభినందించారు. జాతీయస్థాయిలో ఆర్ అండ్ ఏసీ ట్రేడ్లో మొదటి ర్యాంకు సాధించిన మధులత ప్రధాని చేతులమీదుగా అవార్డు పలువురి అభినందన -
రేపటి నుంచి మండల స్థాయి క్రీడాపోటీలు
డీఈవో బ్రహ్మాజీరావుపాడేరు రూరల్: జిల్లాలో ఈ నెల 6వ తేదీనుంచి జరిగే (స్కూల్ గేమ్స్) మండల స్థాయి క్రీడా పోటీలను విజయవంతం చేయాలని డీఈవో బ్రహ్మజీరావు కోరారు. శనివారం ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 22 మండలాల్లో ఈ పోటీల నిర్వహణకు క్రీడా కోఆర్డినేటర్లను నియమించమన్నారు.మండల స్థాయిలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, షటిల్, యోగా, చెస్, అథ్లెటిక్స్లో పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తిగల క్రీడా కారులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు స్కూల్ గేమ్స్ కార్యదర్శులు పాంగి సూరిబాబును 9441105964, భవానీని 9494005843 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. -
చిరు ధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నాం
చిరు ధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నాం. విత్తనాలు పంపిణీ చేశాం. దీంతో ఈ ఏడాది మరో ఐదు వేల హెక్టార్లలో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. 2024–25లో కిలో రాగులు రూ. 42.90, 2025–26లో రూ.48.50 చొప్పున కొనుగోలు చేశాం. – ఎస్బీఎస్ నందు, జిల్లా వ్యవసాయాధికారి, పాడేరు ప్రొటీన్ ఎక్కువ గుమ్మడి, పొద్దు తిరుగుడు గింజల్లో సాధారణ బియ్యం కంటె ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటి వినియోగం వల్ల కొవ్వు ప్రభావం తగ్గుతుంది. విజయనగరం గంట స్తంభం దగ్గర దుకాణంలో కొనుగోలు చేస్తుంటాం. – జి. సురేంద్ర, ఉపాధ్యాయుడు, విజయనగరం సామ, కొర్రతో ఉప్మా సామ, కొర్ర బియ్యంతో తయారు చేసిన ఉప్మాను ఉదయం కుటుంబ సమేతంగా తీసుకుంటాం. అంతకుముందు రాగి జావ తాగుతాం. ప్రస్తుత ఆధునిక యుగంలో కూడా పూర్వీకుల మాదిరిగా వినియోగిస్తున్నాం. – డాక్టర్ దాదాజీ, పర్యాటకుడు, కాకినాడఅమ్మకాలు బాగున్నాయి మ్యూజియంలో ఏర్పాటుచేసిన స్టాల్లో అన్ని రకాల సిరిధాన్యాలతోపాటు అటవీ ఉత్పత్తులు గ్రేడింగ్ చేసి విక్రయిస్తున్నాం. బియ్యం, రాగి పిండిఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. – జన్ని రోజా, చిరు ధాన్యాల విక్రేత, అరకులోయ ఆదాయం బాగుంది గతంలో సామలు, చోడి, కొర్ర ధరలు చాలా తక్కువగా ఉండేవి.ప్రస్తుతం రాగులు కిలో రూ. 40, సామలు రూ. 34కు కొనుగోలు చేస్తున్నారు. చిరుధాన్యాల సాగు చేయడం వల్ల ఆదాయం చాలా బాగుంది. – పదాల విశ్వనాథ్, గిరిరైతు, బోసుబెడ, అరకులోయ -
బాలల భద్రత, సంరక్షణకు ప్రాధాన్యం
విశాఖ లీగల్: బాలల సంరక్షణ, భద్రత అత్యంత ప్రాధాన్య అంశాలని విశాఖ జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఆర్.సన్యాసినాయుడు అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవ ప్రాధికార సంస్థ కార్యాలయంలో విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు సంబంధించిన పోలీసు, బాలల సంరక్షణ చట్టం, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో న్యాయమూర్తి ప్రసంగించారు. బాలలకు సంబంధించి ఇటీవల నేరాల సంఖ్య పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులకు భద్రత కల్పించడం, వారి ఆరోగ్యం, సంక్షేమం కీలకంగా చూడాలన్నారు. జువనైల్ సంక్షేమ పోలీస్ యూనిట్, బాలల సంక్షేమ కమిటీ, పోక్సో చట్టం, బాలలపై జరిగే లైంగిక నేరాల తీవ్రత, ప్రత్యేక భద్రతా వ్యవస్థ వంటి కమిటీల ప్రాధాన్యం, పనితీరు, ప్రభుత్వ సంస్థల చొరవ వంటి అంశాలపై న్యాయమూర్తి మాట్లాడారు. బాలల నేరాల విషయంలో ప్రభుత్వ యంత్రాంగం, సంబంధిత సంస్థలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విశాఖ జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.వి.రామలక్ష్మి మాట్లాడుతూ చిన్నారులకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా అందుకు సంబంధించిన సంస్థలు బాధ్యత వహించి, అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. నర్సీపట్నం అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం.రోహిత్, చోడవరం అదనపు జూనియర్ సివిల్ జడ్జి బి.సూర్య కళ, విశాఖ జిల్లా ప్రొబిషన్ అధికారి జి. శ్రీధర్, బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ ఎం.ఆర్.ఎల్.రాధ, జువనైల్ జస్టిస్ బోర్డ్ సభ్యుడు పి.సూర్య భాస్కరరావు, బాలల సంక్షేమ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. -
ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు
సాక్షి, పాడేరు: జిల్లా కేంద్రం పాడేరు మెయిన్బజార్లో శరన్నవరాత్రి ఉత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. దీనిలో భాగంగా మధ్యాహ్నం ఆస్పత్రి సెంటర్లో భక్తుల సహకారంతో అన్నసమారాధన నిర్వహించారు. దుర్గమ్మ అనుపు ఉత్సవాన్ని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సిండికేట్ వెంకటరమణ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు పాడేరు పురవీధుల్లో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని తీన్మార్ డప్పు వాయిద్యాలు, థింసా,కోలాటం నృత్యాలతో ఊరేగించారు. అనంతరం స్థానిక చిలకలమామిడి గెడ్డలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గంగపూజారి శివ, ఉప సర్పంచ్ బూరెడ్డి రామునాయుడు, వర్తక సంఘ ప్రతినిధులు శివరాత్రి నాగేశ్వరరావు, బూరెడ్డి నాగేశ్వరరావు, ఇమ్మిడిశెట్టి అనిల్కుమార్, వెయ్యాకుల సత్యనారాయణ, శివరాత్రి శ్రీను, ముకుందరావు, పూసర్ల గోపి, ఉత్సవ కమిటీ ప్రతినిధులు కూడి చిట్టిబాబు, కోటపాడు శ్రీను, బోనంగి వెంకటరమణ, కూడి రాంనాయుడు, పచ్చా బుజ్జి, తాజుద్దీన్, బిక్కవోలు రవి పాల్గొన్నారు. జిల్లా కేంద్రం పాడేరులో భారీగా అన్నసమారాధన ఘనంగా అమ్మవారి ఉత్సవ విగ్రహ ఊరేగింపు చిలకలమామిడి గెడ్డలో నిమజ్జనం -
సీఐటీయూ మహాసభలపై విస్తృత ప్రచారం
చింతపల్లి: అల్లూరి జిల్లా అరకులోయలో ఈ నెల 6న నిర్వహించనున్న సీఐటీయూ బహిరంగ మహాసభను విజయవంతం చేయాలని సీటూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ కోరారు. చింతపల్లిలో ఏరియా ఆస్పత్ర, వ్యవసాయ, ఉద్యాన పరిశోధన స్థానాల్లో ఆయన శనివారం పర్యటించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు పనిగంటలు తగ్గించాలని, పనికి తగ్గ వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఏజెన్సీలో జీవో నెం–3 ను పక్కాగా అమలు చేయాలని, ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విదుదల చేయాలనే పోరాటాలు చేస్తుందన్నారు. వాటి సాధనకు సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేసేందుకు మహాసభలో కార్యచరణ రూపొందించినట్టు చెప్పారు. అరుకులోయలో జరగనున్న బహిరంగ సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరరావు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు తదితరలు హాజరుకానున్నట్టు చెప్పారు. మహాసభకు కార్మికులంతా హాజరై విజయవంతం చేయాలని కోరారు. రాజేశ్వరి, లక్ష్మి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముంచంగిపుట్టు: అరకులోయలో ఈ నెల 6,7వ తేదీల్లో జరిగే సీఐటీయూ జిల్లా 2వ మహాసభను విజయవంతం చేయాలని సీఐటీయూ మండల కార్యదర్శి కె.శంకర్రావు కోరారు. మండల కేంద్రంలో శనివారం సీఐటీయూ కార్యాలయంలో సమావేశం నిర్వహించి, ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కులు, చట్టాలు రక్షణకై సీఐటీయూ నిరంతరం పోరాటాలు చేస్తుందని, కనీస వేతనం అమలు, ఉద్యోగ భద్రత, వంటి సమస్యలపై మహసభలో చర్చించి, భవిష్యత్తు కార్యచరణను రూపొందించి, సీఐటీయూ పోరాటాలను ఉధృతం చేస్తుందన్నారు. సీఐటీయూ అన్ని శాఖాల కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని మహసభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.సభలను విజయవంతం చేయాలని నాయకుల పిలుపు -
ఆటో డ్రైవర్లకు ఆర్థిక తోడ్పాటు
పాడేరు : రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం వారికి ఆర్థిక తోడ్పాటు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని శనివారం ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 4217 మంది ఆటో డ్రైవర్లకు రూ.6కోట్ల 32లక్షల 55వేలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయిందన్నారు. అనంతరం చెక్కుల పంపిణీ చేశారు. పాత బస్టాండ్ నుంచి ఐటీడీఏ వరకు నిర్వహించిన ఆటో ర్యాలీలో ఆమెతో పాటు కలెక్టర్ దినేష్కుమార్, ఇతర అధికారులు కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. జీఎస్టీ తగ్గించడం వల్ల సామాన్యుడికి ఎంతో లబ్ధి చేకూరిందని దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాల భవనాలు లేని చోట కొత్త భవనాలు మంజూరు చేస్తున్నామని, పాడైన వాటికి మరమ్మతులు చేపడుతున్నామన్నారు. హైడ్రో పవర్ పనులు తాత్కాలికంగా నిలిపివేయండి ఏజెన్సీలో చేపడుతున్న హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణంపై గిరిజనులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని కలెక్టర్ దినేష్కుమార్ను మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదేశించారు. దీనిపై గిరిజనులతో పూర్తిగా చర్చించి వారు పూర్తిగా సమ్మతిస్తేనే ముందుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్కుమార్, సృజనాత్మకత, జానపద కళాల అకాడమి రాష్ట్ర చైర్మన్ గంగులయ్య, జిల్లా రవాణ అధికారి కేవీ ప్రకాష్ పాల్గొన్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి -
కరెంటోళ్ల నిర్లక్ష్యం!
విద్యుత్ కనెక్షన్లకు ఆధార్ సీడింగ్ అస్తవ్యస్తం సాక్షి, విశాఖపట్నం: కరెంట్ బిల్లు కట్టకపోతే.. సామాన్యుల ఇళ్లని చీకటిమయం చేసే విద్యుత్శాఖ.. తాము చేసిన తప్పుల్ని మాత్రం కప్పిపుచ్చుకోవాలని యత్నిస్తుంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 37 వేల మంది విద్యుత్ కనెక్షన్ల ఆధార్ సీడింగ్ని తప్పుగా నమోదు చేసేసింది. ఫలితంగా దాదాపు 90 శాతం మంది ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమైపోయారు. ఇటీవల వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక(సీజీఆర్ఎఫ్) చేసిన పరిశీలనల్లో.. ఏపీఈపీడీసీఎల్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్య వైఖరి బట్టబయలైంది. ఒకే ఒక్క ఆధార్ నంబర్ని ఏకంగా 500 ఇళ్లకు అనుసంధానం చేసేశారు. ఇలా.. ఒక ఆధార్ నంబర్ని 10 నుంచి 500 ఇళ్లకు సీడింగ్ చేస్తూ.. అడ్డగోలుగా వ్యవహరించారు. నెలరోజుల్లో తప్పులు సరిదిద్దాలంటూ సీజీఆర్ఎఫ్ ఈపీడీసీఎల్కు హెచ్చరిక జారీ చేసింది. 11 సర్కిళ్ల పరిధిలో 37,749 ఇళ్లకు తప్పుడు సీడింగ్.! : ఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, రాజమహేంద్రవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు సర్కిళ్ల పరిధిలోని కొందరు వినియోగదారులు సీజీఆర్ఎఫ్కు గత కొద్ది నెలలుగా ఫిర్యాదులు చేస్తున్నారు. తాము అర్హులమైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నామని.. విద్యుత్ బిల్లుల కారణంగానే జరుగుతోందని సచివాలయంలోనూ, మండల కార్యాలయాల్లో చెబుతున్నారంటూ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. దీనిపై సీజీఆర్ఎఫ్ ఆరా తీసింది. సీజీఆర్ఎఫ్ చైర్మన్ విశ్రాంత జడ్జి బి.సత్యనారాయణ అధ్యక్షతన సభ్యులు ఎస్.రాజాబాబు(టెక్నికల్), ఎస్ మురళీకృష్ణ(ఇండిపెండెంట్) క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేశారు. ఆగస్ట్ 19న తుది విచారణ పూర్తి చేశారు. మొత్తం తమ పరిశీలనలో విస్తుపోయేలా విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్య వైఖరికి అద్దంపట్టే అంశాలు బట్టబయలయ్యాయి. ఆగస్టు 19 నాటికి ఈపీడీసీఎల్ పరిధిలోని 11 సర్కిళ్లలో 37,749 విద్యుత్ కనెక్షన్లకు తప్పుగా ఆధార్ సీడింగ్ జరిగిందని తేలింది. పరిశీలన సమయంలో సర్కిళ్ల ఎస్ఈలు పాల్గొని సీడింగ్ ప్రక్రియలో లోపాలను స్పెషల్ డ్రైవ్ ద్వారా సరిదిద్దే ప్రక్రియ నిర్వహించారు. విశాఖ సర్కిల్లో రెండు ఆధార్లతో 1000 ఇళ్లకు సీడింగ్! విద్యుత్ కనెక్షన్లను ఆధార్ సీడింగ్ చేయాలంటే ఇంటింటికీ వెళ్లి ఆధార్ నంబర్ని సేకరించడం.. లేదా ఫోన్ ద్వారా సేకరణ ప్రక్రియ చేపట్టడం చేయాల్సి ఉంది. కానీ ఈపీడీసీఎల్లోని కొంతమంది సిబ్బంది తమ వద్ద ఉన్న కనెక్షన్ల ప్రకారం.. అందులో ఉన్న ఆధార్ నంబర్లను సేకరించి.. సీడింగ్ ప్రక్రియని అడ్డగోలుగా చేసేశారు. కొన్ని చోట్ల ఒకే ఆధార్ నంబర్ని 500కి పైగా విద్యుత్ కనెక్షన్లకు సీడింగ్ చేసేశారు. కొన్ని ఆధార్ నంబర్లను 10, 20, 100, 400.. ఇలా.. తమకు నచ్చినట్లుగా అనుసంధానం చేసేసి.. చేతులు దులిపేసుకున్నారు. ఫలితంగా పరిమితికి మించి విద్యుత్ వినియోగించకున్నా లబ్ధిదారులు సంక్షేమ పథకాలకు దూరమైపోయారు. కొన్ని సర్కిళ్ల పరిధిలో ఒకే ఆధార్ నంబర్తో 500 ఇళ్ల విద్యుత్ కనెక్షన్లను సీడింగ్ చేసేశారంటే.. ఎలా కళ్లుమూసుకొని పనిచేశారో అర్థం చేసుకోవచ్చు. సీజీఆర్ఎఫ్ హెచ్చరికలతో అప్రమత్తమైన విద్యుత్సిబ్బంది దిద్దుబాటు ప్రక్రియ చేపడుతున్నారు. 37,749 కనెక్షన్లలో ఇంకా 13,572 కనెక్షన్లు సరిచేయాల్సి ఉంది. నెల రోజుల వ్యవధిలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలంటూ సీజీఆర్ఎఫ్ తీర్పునిచ్చింది. ఒకే ఆధార్ని 500కిపైగా ఇళ్లకు సీడింగ్ చేసిన కేసులు – 2 ఒకే ఆధార్ని 401 నుంచి 500 ఇళ్లకు సీడింగ్ చేసిన కేసులు – 2 ఒకే ఆధార్ని 301 నుంచి 400 ఇళ్లకు సీడింగ్ చేసిన కేసులు – 5 ఒకే ఆధార్ని 201 నుంచి 300 ఇళ్లకు సీడింగ్ చేసిన కేసులు – 3 ఒకే ఆధార్ని 101 నుంచి 200 ఇళ్లకు సీడింగ్ చేసిన కేసులు – 20 ఒకే ఆధార్ని 51 నుంచి 100 ఇళ్లకు సీడింగ్ చేసిన కేసులు – 59 ఒకే ఆధార్ని 10 నుంచి 50 ఇళ్లకు సీడింగ్ చేసిన కేసులు – 3,921 మొత్తం కేసులు – 4012 ఈపీడీసీఎల్ పరిధిలో ఆధార్ సీడింగ్లో లోపాలు విశాఖపట్నం సర్కిల్లో... అల్లూరి సర్కిల్లో... ఈపీడీసీఎల్ సిబ్బంది బాధ్యతారాహిత్యం 11 సర్కిళ్ల పరిధిలో 37,749 విద్యుత్ కనెక్షన్లకు తప్పుగా ఆధార్ సీడింగ్ ఒకే ఆధార్తో 500 ఇళ్లకు అనుసంధానం విశాఖ సర్కిల్ పరిధిలోనే అత్యధికంగా 4,012 కేసులు విద్యుత్ వినియోగదారులసమస్యల పరిష్కార వేదికలో బహిర్గతం ఒకే ఆధార్ని 101 నుంచి 200 ఇళ్లకు సీడింగ్ చేసిన కేసులు 2 ఒకే ఆధార్ని 51 నుంచి 100 ఇళ్లకు సీడింగ్ చేసిన కేసులు 6 ఒకే ఆధార్ని 10 నుంచి 50 ఇళ్లకు సీడింగ్ చేసిన కేసులు 81 మొత్తం కేసులు– 89 బాధిత వినియోగదారులకు పరిహారం ఇవ్వాలి ఆధార్ సీడింగ్ తప్పిదాలను రియల్ టైమ్ సాంకేతికతతో సరిచేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సీడింగ్ సమాచారం ఎప్పటికపుడు అప్డేట్ కావడం లేదు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. ఆధార్ సీడింగ్ వల్ల నష్టపోయిన వినియోగదారులకు పరిహారం ఇవ్వాలి. ఇప్పటికే సీజీ నెం. 235/2024 కేసులో బాధితులకు నష్టపరిహారం మంజూరైంది. ఆధార్ అనుసంధానంలో పారదర్శకత తప్పనిసరిగా ఉండాలి. సీజీఆర్ఎఫ్ తీర్పు బాధ్యతరాహిత్యం.. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందికి చెంపపెట్టులాంటిది. – కాండ్రేగుల వెంకటరమణ, కన్సూమర్ ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తప్పులు సరిచేశాక నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఏపీఈపీడీసీఎల్ డేటాబేస్లో వివిధ కారణాల వల్ల కొన్ని విద్యుత్ సర్వీస్ల ఆధార్ సీడింగ్లో తప్పులు దొర్లాయి. ఆధార్ సీడింగ్ తప్పుగా జరగడం వల్ల చాలా మంది అర్హులు ప్రభుత్వ పథకాలను దక్కించుకోలేకపోయారు. నష్టపోయిన విద్యుత్ వినియోగదారులు సీజీఆర్ఎఫ్ను ఆశ్రయించి నష్టపరిహారం, న్యాయం పొందవచ్చు. ప్రతి ఒక్కరూ గోప్యత హక్కు కూడా కలిగి ఉన్న నేపథ్యంలో వినియోగదారుల అనుమతి, సంతకం లేదా వేలి ముద్ర తప్పనిసరిగా తీసుకుని ఆధార్ నెంబర్ను విద్యుత్ సర్వీస్ కనక్షన్కు అనుసంధానం చేయాలి. తప్పులు సరిచేయాలని ఆదేశించాం. సరిచేసిన తర్వాత నివేదికలు ఇవ్వాలని ఈపీడీసీఎల్ అధికారులకు స్పష్టం చేశాం. – బి.సత్యనారాయణ, విశ్రాంత జడ్జి, సీజీఆర్ఎఫ్ చైర్మన్ -
ప్రగతిపథంలో వాల్తేరు డివిజన్
తాటిచెట్లపాలెం: వాల్తేర్ డివిజన్ గత రికార్డులను అధిగమిస్తూ ప్రగతిపథంలో దూసుకుపోతోందని డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్బొహ్రా తెలిపారు. డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సంలో గడిచిన ఆరు నెలల్లో(ఏప్రిల్–సెప్టెంబరు) అధిక వృద్ధిని సాధించి, గత రికార్డులను అధిగమించినట్లు వెల్లడించారు. గతేడాది కంటే రోజువారీ లోడింగ్లో సగటున 10.78 శాతం, సరకు రవాణాలో 12.18 శాతం అధిక వృద్ధి రేటు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సరకు రవాణాలో రోజుకు సగటున 59.6 రేక్ల లోడింగ్ జరిగిందన్నారు. మొత్తంగా 39.19 మిలియన్ టన్నుల సరకు లోడింగ్ ద్వారా రూ.4841 కోట్ల ఆదాయం సమకూరిందని, గత ఏడాది ఇది కేవలం రూ.4315.56 కోట్లు మాత్రమేనని తెలిపారు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు సుమారు 1.64 కోట్ల మంది ప్రయాణికులు ఒక్క విశాఖపట్నం స్టేషన్ నుంచి రాకపోకలు సాగించారని, వీరి ద్వారా సుమారు రూ.426 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. ప్రయాణికుల భద్రతలో రాజీ పడకుండా.. రైల్వే భద్రతా దళం, గవర్నమెంట్ రైల్వే పోలీసుల సహకారంతో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సీసీ కెమెరాలు, బాడీ వోర్న్ కెమెరాలు, డ్రోన్ కెమెరాల సహాయంతో ప్రయాణికుల భద్రతను మరింత పటిష్టం చేసినట్లు డీఆర్ఎం తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖపట్నం రైల్వేస్టేషన్ మీదుగా 22 ప్రత్యేక రైళ్లు, 3,300 అదనపు కోచ్లు నడుపుతున్నట్లు చెప్పారు. ఇందులో విశాఖ నుంచి నాలుగు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వివరించారు. డివిజన్ పరిధిలో మొత్తం 15 స్టేషన్లను అమృత్భారత్ స్టేషన్ కింద ఎంపిక చేసి అభివృద్ధి చేస్తున్నామని, వీటిలో విశాఖపట్నానికి సమాంతరంగా సింహాచలం, దువ్వాడ స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. అరకు వంటి పర్యాటక స్టేషన్లు కూడా మరింత అభివృద్ధి చెందుతున్నట్లు వెల్లడించారు. సమావేశంలో సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్కుమార్, సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ తన్మయ్ ముఖోపాధ్యాయ్, సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఎ.పి.దూబే పాల్గొన్నారు.గత రికార్డులను అధిగమించినట్లు డీఆర్ఎం వెల్లడి -
గిరిజన బాలికపై గ్యాంగ్రేప్
పాడేరు: కూటమి పాలనలో బాలికలు, మహిళలకు రక్షణ లేదనటానికి ఈ దారుణ సంఘటన మరో ఉదాహరణ. అల్లూరి జిల్లా చింతపల్లి మండలంలోని ఓ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థినిపై ఇద్దరు వ్యక్తులు నాలుగు రోజులు అత్యాచారం చేశారు. ఈ దారుణంపై సెపె్టంబర్ 13న ఫిర్యాదు చేసినా చింతపల్లి పోలీసులు స్పందించలేదు. పాడేరు ఐటీడీఏలో శుక్రవారం కలెక్టర్ దినేష్ కుమార్కు బాధిత బాలిక ఫిర్యాదు చేసింది. ఆ బాలికతో పాటు గిరిజన నాయకులు బాలకృష్ణ (కాంగ్రెస్), చంటిబాబు (సీపీఐ) తదితరులు కలెక్టరును కలిసి న్యాయం చేయాలని కోరారు. బాలిక ఫిర్యాదు మేరకు.. సెపె్టంబర్ 5న లంబసింగికి చెందిన తెలిసిన మహిళ బాలికకు మాయమాటలు చెప్పి తనవెంట తీసుకెళ్లింది. కొద్దిదూరం వెళ్లాక తోటమామిడికి చెందిన యువకుడి బైక్పై వారు నర్సీపట్నం వెళ్లారు. అక్కడి నుంచి జి.మాడుగుల మండలం వంజరికి చెందిన యువకుడి కారులో వీరు ముగ్గురు విశాఖపట్నం వెళ్లారు. అక్కడ ఓ ఇంట్లో బాలికను బంధించి తోటమామిడి యువకుడు, వంజరి యువకుడు 3 రోజుల పాటు అత్యాచారం చేశారు. నాలుగో రోజు నర్సీపట్నం తీసుకొచ్చి లాడ్జిలో ఉన్నారు. అనంతరం లాడ్జి నిర్వాహకుడితో బాలికకు రూ.100 ఇప్పించి, అక్కడి నుంచి పరారయ్యారు. ఆ బాలిక సెపె్టంబర్ 12న కుటుంబ సభ్యులకు నర్సీపట్నం నుంచి ఫోన్ చేసి, జరిగిన దారుణాన్ని చెప్పడంతో తల్లిదండ్రులు సెపె్టంబర్ 13న చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ముగ్గురు వ్యక్తుల వివరాలను కూడా పోలీసులకు ఇచ్చారు. అయినా పోలీసులు రేపు, ఎల్లుండి అంటూ కాలయాపన చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని వారు కలెక్టర్ను కోరారు. అనంతరం విలేకరులకు ఈ వివరాలను వెల్లడించారు. -
మోదకొండమ్మ ఆలయంలో సినిమా షూటింగ్ ప్రారంభం
మాడుగుల: స్థానిక మోదకొండమ్మ ఆలయంలో గురువారం ప్రేమ విహారి సినిమా షూటింగ్ ప్రారంభించారు. మాదల ప్రొడక్షన్ నంబరు 2 పేరు మీద ప్రారంభించిన సినిమా తొలి షాట్కు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు శ్రీనాధు శ్రీనివాసరావు క్లాప్ కొట్టారు. చిత్రం వివరాలను యూనిట్ సభ్యులు స్థానిక విలేకరులకు తెలిపారు. పూర్తి ప్రేమకథా చిత్రమైన ఈ సినిమాలో హీరోగా మలయాళం నటుడు కన్నా, హీరోయిన్గా గెహజీ నటిస్తున్నారు. డైరెక్టరుగా అశోక్రాజు, నిర్మాతగా ప్రియ మాదల వ్యవహరిస్తున్నారు. సంగీతం ప్రియేష్ సమకూరుస్తున్నారు. చీడికాడ గ్రామానికి చెందిన గండి గోపి సపోర్టింగ్ యాక్టర్గా నటిస్తున్నారు. గండి గోపి పర్యవేక్షణలో ఈ చిత్రం షూటింగ్ జరుపుతున్నారు. షూటింగ్ ప్రారంభానికి ముందు ఆలయంలో అమ్మవారికి నటీనటులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు ఇతర కమిటీ సభ్యులు దంగేటి సూర్యారావు, దేవరాపల్లి శ్రీనివాసరావు, భీమరశెట్టి పైడియ్యనాయుడు, వేమన గోవింద, జోన్నపల్లి రమేశ్, పాలకుర్తి క్రాంతి, కొప్పోజు రాజు, ధర్మిశెట్టి సూరిబాబు, మాజీ జెడ్పీటీసీ బి.భవానీ తదితరులు పాల్గొన్నారు. -
అంతులేని కష్టం.. అపార నష్టం
పంట మొత్తం కుళ్లిపోయింది ఒంటరిగా వ్యవసాయం చేస్తున్నా. కొద్దిపాటి పొలంలో చేపట్టిన వరి పైరును వరద ముంచెత్తడంతో మొ త్తం కుళ్లిపోయింది. తిరిగి పంటవేసే ఓపిక లేదు. ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. – కురసం కాంతమ్మ, ఏజీకొడేరు, చింతూరు మండలం ప్రభుత్వం ఆదుకోవాలి ఇప్పటికే వేల రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేపట్టిన వరి పైరు వరద పాలైంది. ఇకపై పెట్టుబడి పెట్టే స్థోమతలేదు. ఈ ఏడాది తిండిగింజలు కూడా కరువయ్యే పరిస్థితి కనపడుతోంది. ప్రభుత్వం ఆదుకుంటేనే గట్టెక్కుతాం. – అగరం రామయ్య, ఏజీకొడేరు, చింతూరు మండలం ఈ ఏడాది వరుస వరదలు విలీన మండలాల రైతులను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీశాయి. జూన్లో ప్రారంభమైన వరదలు అక్టోబరు వచ్చిన ఇంకా కొనసాగుతుండడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. పంటలన్నీ ముంపు బారిన పడటంతో తీవ్రంగా నష్టపోయామని వారు ఆవేదన చెందుతున్నారు. చింతూరు: గోదావరి, శబరి నదులకు ఈ ఏడాది ఇప్పటివరకు ఎనిమిది సార్లు వచ్చిన వరదలు చింతూరు డివిజన్ పరిధిలోని రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. చింతూరు, ఎటపాక, కూనవరం, వీఆర్పురం మండలాల్లో 2 వేల ఎకరాల్లో వరి, 30 ఎకరాల్లో పత్తి పంట ముంపునకు గురైనట్టు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఎటపాక మండలంలో సుమారు 200 ఎకరాల్లో మిర్చి, వీఆర్పురం మండలంలో పొగాకు నారుమళ్లు కూడా నీటమునిగినట్టు గుర్తించారు. ● సెప్టెంబరు మూడో తేదీన వరద వచ్చి తగ్గడంతో ఇకపై వరద రాదని భావించిన నాలుగు మండలాల రైతులు వరి, పత్తి, మిరప పంటను వేశారు. చాలామంది రైతులు ఈ ఏడాది 1001, 1010, సాంబమసూరి వరి వంగడాలతో నారుమళ్లు చేపట్టారు. సెప్టెంబరు చివరికి వచ్చేసింది ఇక వరదలు రావని, మరోవైపు అదును కూడా దాటిపోతోందనే ఉద్దేశంతో చివరకు గత 20 రోజులుగా పంటలు వేశారు. ఈ తరుణంలో మహారాష్ట్ర, తెలంగాణలో కురిసిన భారీవర్షాలకు గోదావరికి భారీగా వరద రావడంతో ఎటపాక, కూనవరం, వీఆర్పురం మండలాల్లో, శబరినది ఎగపోటు గురైంది. చింతూరు మండలంలో పంటలు నీటమునిగాయి. వరదవచ్చి ఆరు రోజులపాటు పొలాల్లోనే ఉండిపోవడంతో పంటంతా కుళ్లిపోయి, పెట్టుబడంతా వరద పాలైందని రైతులు వాపోతున్నారు. మిరప, పత్తి సాగుకు ఇప్పటికే ఎకరాకు రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టామని, ప్రతి ఒక్కరు రెండెకరాల నుంచి పదెకరాల వరకు పంట వేసినట్లు రైతులు తెలిపారు. కాగా వరిపంటలకు సైతం ఇప్పటివరకు ఎకరాకు రూ.10 వేల వరకు పెట్టుబడి పెట్టామని వారు తెలిపారు. ● చింతూరు డివిజన్లో వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందడం అనుమానంగానే కనిపిస్తోంది. సాగు చేపట్టి 15 నుంచి 20 రోజులు మాత్రమే కావస్తోంది. పంటలకు నష్టపరిహారం ఇవ్వాలంటే కనీసం 30 నుంచి 45 రోజులు పంటకాలం ఉండాలని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. ప్రస్తుత వరదలకు చిన్న, సన్నకారు, గిరిజన రైతులే అధికంగా నష్టపోయారు. ఈ ఏడాది గోదావరి, శబరికి ఎనిమిది సార్లు వరదలు పంటలను ముంచెత్తడంతో కోలుకోలేని దెబ్బ ముంపులో 2 వేల ఎకరాల వరి పైరు పెట్టుబడులు కోల్పోయిన పత్తి, పొగాకు, మిర్చి రైతులు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వినతి పునరావాస ప్రాంతంలోభూమి ఇవ్వాలి రూ. వేలల్లో పెట్టుబడి పెట్టి పంటలు వేసినా వరదల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నాం. మాకు పోలవరం పునరావాస ప్రాంతంలో ప్రభుత్వం సాగు భూమి కేటాయించాలి. అక్కడికి వెళ్లి వ్యవసాయం చేసుకుంటాం. – మడివి బాలరాజు, చింతరేగుపల్లి, వీఆర్పురం మండలం పదెకరాలు మునిగిపోయింది ఎన్నో ఆశలతో ఈ ఏడాది పదెకరాల్లో మిరప పంట వేశా. ఇప్పటికే దుక్కులు, విత్తనాలు, ఎరువుల కోసం ఎకరాకు రూ.20 వేలు పెట్టుబడి పెట్టాను. వరదవచ్చి పంటంతా ముంచేసింది. కుళ్లిపోయి లక్షల్లో నష్టం వాటిల్లింది. – చల్లకోటి రాంబాబు, మిర్చి రైతు, మురుమూరు, ఎటపాక మండలం ప్రభుత్వం ఆదుకోవాలి తీవ్రంగా పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలి. దీంతోపాటు ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు ఉచితంగా విత్తనాలు సరఫరా చేయడమే కాకుండా రాయితీపై రుణాలు అందించాలి. – ధర్ముల రాజయ్య, ఏజీకొడేరు, చింతూరు మండలం వ్యవసాయం చేయలేని పరిస్థితి ఏటా సంభవిస్తున్న వస్తున్న వరదల కారణంగా వ్యవసాయం చేయలేని పరిస్థితి నెలకొంది. బ్యాక్వాటర్ ప్రభావంతో చిన్నపాటి వర్షాలకే మాకు వరద పరిస్థితులు నెలకొంటున్నాయి. పంటలను ముంచేస్తోంది. – సోడె రామారావు, గుండగూడెం, వీఆర్పురం మండలం వేద్దామంటే నారు లేదు ఇకపై వరద రాదనుకుని ఏడెకరాల్లో మిరప సాగు చేపట్టా. అనుకోకుండా వరదవచ్చి పంటను ముంచేసింది. పంటంతా కుళ్లిపోయి పనికిరాకుండా పోయింది. తిరిగి పంట వేద్దామంటే నారు దొరకని పరిస్థితి నెలకొంది. – చిలకాల రమేష్, నందిగామ, ఎటపాక మండలం ప్రాథమిక నివేదిక సిద్ధం వరదల కారణంగా పంటనష్టం వివరాలకు సంబంధించి ఇప్పటికే సిబ్బంది ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. చింతూరులో 299, కూనవరంలో 269, ఎటపాకలో 52 హెక్టార్లలో వరి, 12 హెక్టార్లలో పత్తిపంటలు దెబ్బతిన్నాయి. దీనిపై ప్రభుత్వానికి నివేదించి, తదుపరి ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటాం. – రామ్మోహనరావు, ఏడీఏ, రంపచోడవరం -
సంపూర్ణ గ్రామాభివృద్ధికి ప్రణాళికలు
కూనవరం: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆది కర్మయోగి కార్యక్రం ద్వారా 2030 నాటికి సంపూర్ణ గ్రామాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ అధికారులకు సూచించారు. గురువారం చినార్కూరులో రచ్చబండ వద్ద నిర్వహించిన గ్రామసభకు హాజరైన ఆయన పలు సూచనలు ఇచ్చారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చినార్కూరు గ్రామా భివృద్ధికి రూపొందించిన ప్రణాళికలను గ్రామ సభలో చదివి వినిపించాలని సూచించారు. కాగా రూ. 11.34 కోట్లతో ఐదేళ్లలో చేపట్టనున్న అభివృద్ధికి సంబంధించిన అంశాలను తెలియజేశారు. అదనంగా చేర్చాల్సిన సమస్యలు ఏవైనా ఉన్నాయని పీవో స్థానికుల నుంచి తెలుసుకున్నారు. ఎంపీపీ పాయం రంగమ్మ, సర్పంచ్ సున్నం అభిరామ్, ఎంపీడీవో జగన్నాథరావు, తహసీల్దార్ కె శ్రీనివాసరావు, కార్యదర్శి టీరోజ, పెసా కార్యదర్శి కుంజా అనిల్ పాల్గొన్నారు. చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ -
మృతదేహం తరలింపునకు అష్టకష్టాలు
● చింతూరు వద్ద అడ్డంకిగా వరద ● నాటు పడవపై తరలింపు చింతూరు: అనారోగ్యంతో మృతి చెందిన ఓ మహిళ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు కుటుంబసభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరద అడ్డంకిగా ఉండడంతో పడవపై మృతదేహాన్ని తరలించాల్సి వచ్చింది. గురువారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వీఆర్పురం మండలం చొప్పల్లికి చెందిన పొన్నాడ నారాయణమ్మ(47) అనారోగ్యంతో బుధవారం గుంటూరులోని ఆస్పత్రిలో మృతిచెందింది. దీంతో గురువారం ఆమె మృతదేహాన్ని చొప్పల్లి తరలించేందుకు చింతూరు తీసుకువచ్చారు. కాగా ఆ గ్రామానికి వెళ్లేందుకు మార్గమధ్యలోని జల్లివారిగూడెం, సోకిలేరు, చీకటివాగుల వరద నీరు రహదారిపై నిలిచి ఉంది. దీంతో చీకటివాగు వద్దనుంచి మృతదేహాన్ని చింతూరుకు చెందిన ఎర్రం శ్రీను మర పడవపై తరలించేందుకు సన్నాహాలు చేశారు. అదే సమయంలో పడవ ఇంజను మరమ్మతులకు గురికావడంతో పడవ యజమాని తెడ్డుసాయంతో పడవను నడుపుకుంటూ వెళ్లి మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చాడు. -
బోధన మెలకువలపై శిక్షణ
అడ్డతీగల: విద్యాబోధనలో మెలకువలపై శిక్షణలో డీఎస్సీ ఉపాధ్యాయులు అవగాహన పెంచుకోవాలని ఏజెన్సీ డీఈవో వై.మల్లేశ్వర్రావు సూచించారు. మెగా డీఎస్సీ 2025లో ఎంపికై న 198 మంది సెకెండరీ లెవెల్ ఉపాధ్యాయులకు వేటమామిడిలోని హోసన్నా పాఠశాలలో శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎంపికైన సెకెండరీ లెవెల్ టీచర్లు బయాలజీ, గణితం, ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ల్లో శిక్షణ ఇస్తారన్నారు. విద్యాశాఖలో అమలయ్యే విధి విధానాలను తప్పనిసరిగా అనుసరించి ముందుకు వెళ్లాలని ఆదేశించారు. శిక్షణలోని అంశాలను బోధనలో చూపించి మెరుగైన విద్యాప్రమాణాల పెంపునకు బాటలు వేయాలని ఏటీడీబ్ల్యూవో కృష్ణమోహన్ అన్నారు. రాజవొమ్మంగి ఎంఈవో–1 కె.సత్యనారాయణ, అడ్డతీగల ఎంఈవోలు కె.రమేష్, పి.శ్రీనివాసరావు, కోర్సు డైరెక్టర్, హోసన్నా పాఠశాల డైరెక్టర్ డానియేల్ సందీప్, ప్రిన్సిపాల్ మృధుహాసిని పాల్గొన్నారు. -
‘సీలేరు’ జలాశయాలు కళకళ
సీలేరు: విద్యుత్ కాంప్లెక్స్లో జలాశయాలు కళకళలాడుతున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు చేరుతుండటంతో నిండుకుండను తలపిస్తున్నాయి. ● బలిమెల జలాశయంలోకి ఇన్ఫ్లో ఎక్కువగా ఉంది. అటవీ ప్రాంతంలో వాగులు, గెడ్డల నీటితోపాటు మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం నుంచి విడుదల అవుతున్న నీరు కూడా వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1516 అడుగులు కాగా ప్రస్తుతం 1500.4 అడుగుల వద్ద ఉంది. సుమారు 2400.9 క్యూసెక్కుల వరదనీరు చేరుతుండగా రోజుకు 1960 క్యూసెక్కులు బయటకు వెళ్తోంది. ● డొంకరాయి, మోతుగూడెం జల విద్యుత్ కేంద్రాలకు నీరందించడంలో కీలకమైన గుంటవాడ జలాశయం నిండుకుండను తలపిస్తోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 1360 అడుగులు కాగా ప్రస్తుతం 1353.1 అడుగులకు పెరిగింది. 2506.6 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉంది. ● ఫోర్బే డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 930 అడుగులు కాగా ప్రస్తుతానికి 921.8 అడుగులో నీరు ఉంది. రోజుకు 3483 క్యూసెక్కుల వరదనీరు చేరుతున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో ఒక మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేంద్రప్రసాద్ తెలిపారు. మోతుగూడెం: డొంకరాయి జలాశయ నీటిమట్టం పదిరోజులుగా ప్రమాదస్థాయిలో ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1037 అడుగులు కాగా శుక్రవారం సాయంత్రానికి 1036 అడుగులకు నీరు చేరింది. దీంతో జెన్కో అధికారులు అప్రమత్తమై ఆరో నంబరు గేటు ద్వారా సుమారు 2వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.ముంచంగిపుట్టు: ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరందించే డుడుమ, జోలా పుట్టు జలాశయాల నీటి మట్టాలు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. కొద్దిరోజులుగా సరిహద్దులో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు జలాశయాల్లోకి వచ్చి చేరుతోంది. ● డుడుమ జలాశయ నీటి మట్టం 2590 అడుగులు కాగా శుక్రవారం నాటికి 2585.80 అడుగులుగా నమోదయింది. డుడుమ జలాశయ ఎగువన ఉన్న జోలాపుట్టు జలాశయ నీటి మట్టం సైతం క్రమేపీ పెరుగుతోంది. ● జోలాపుట్టు జలాశయ నీటి సామర్థ్యం 2750 అడుగులు కాగా శుక్రవారం నాటికి 2748.70 అడుగులు నీటి నిల్వ ఉంది. జలాశయాల్లోకి వరదనీరు చేరుతూ ఉండడంతో అప్రమత్తమైన జలాశయ సిబ్బంది నిరంతరం జలాశయ నీటి నిల్వలు అంచనా వేస్తున్నారు. డుడుమ జలాశయం ఒకటో నంబరు గేటును ఎత్తి పదివేల క్యూసెక్కులు దిగువనున్న బలిమెల జలాశయానికి విడుదల చేస్తున్నారు. జోలాపుట్టు జలాశయం నుంచి 8వేల క్యూసెక్కులు డుడుమ ప్రాజెక్ట్లోకి విడుదల అవుతోంది. రెండు జలాశయాలు ప్రమాదస్థాయి నుంచి సాధారణ స్థాయికి తీసుకువచ్చేలా ప్రాజెక్ట్ అధికారులు, సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.జోలాపుట్టు, డుడుమకు వరద తాకిడి మేలు చేస్తున్న వర్షాలు భారీగా చేరుతున్న వరద నీరు దిగువకు విడుదల చేస్తున్న అధికారులు ప్రాజెక్ట్ల్లో 94.3784 టీఎంసీల నిల్వలు విద్యుత్ ఉత్పత్తికి ఢోకా లేదంటున్న అధికారులు 7.5 మిలియన్ యూనిట్ల ఉత్పాదన విద్యుత్ ఉత్పత్తికి పూర్తిస్థాయిలో 94.3784 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. గ్రిడ్ ఆదేశాల మేరకు మాచ్ఖండ్, సీలేరు, డొంకరాయి, పొల్లూరులో 7.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. సీలేరు బేసిన్లోని అన్ని జలాశయాల నీటిమట్టాలు ప్రమాదస్థాయిలో ఉన్నాయి. – చంద్రశేఖర్ రెడ్డి, సీలేరు ఎస్ఈ, ఏపీ జెన్కో -
సాగుకు అవకాశం కల్పించాలని ఆదివాసీల వినతి
చింతూరు: పోలవర పరిహారం పొంది స్థానికంగా లేని గిరిజనేతరుల ఆధీనంలో ఉన్న భూముల్లో సాగుకు స్థానిక ఆదివాసీలకే అవకాశమివ్వాలని ఆదివాసీ గిరిజన సంఘ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఎటపాక, వీఆర్పురం గిరిజన సంఘం నేతలు స్థానిక ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి పులి సంతోష్ మాట్లాడుతూ ఐదవ షెడ్యూల్ ప్రాంతంలోని భూములపై ఆదివాసీలకు సర్వహక్కులు ఉన్నాయన్నారు. పరిహారం పొందిన గిరిజనేతరుల భూములపై సమగ్ర విచారణ చేపట్టి వాటిని స్థానిక ఆదివాసీలకు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సీసం సురేష్, కాక అర్జున్, రామారావు, రాజు, వీరమ్మ, బాబు పాల్గొన్నారు. -
కుప్పకూలిన పాఠశాల భవనం
● సెలవురోజు కావడంతో తప్పిన పెనుముప్పు ● భారీ వర్షానికి రెండు చోట్ల ఘటన జి.మాడుగుల: భారీ వర్షాలకు మండలంలో పాలమామిడి పంచాయతీ వనభరంగిపాడులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల(జీపీఎస్) భవనం గురువారం తెల్లవారుజామున కుప్పకూలిపోయింది. ఇక్కడ 37 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాల నిర్వహణ సమయంలో భవనం కూలితే పెద్ద ప్రమాదం సంభవించేదని, ఇది ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తుందని గ్రామస్తులు ఆందోళన చెందారు. దసరా సెలవుల కారణంగా విద్యార్థులు ఎవరూ పాఠశాలలో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చెప్పారు. వనభరంగిపాడు గ్రామంలో వర్షానికి నేలకూలిన పాఠశాల భవనాన్ని సర్పంచ్ సురభంగి రామకృష్ణ, ఎంపీటీసీ గెమ్మెలి అప్పారావు, మాజీ సర్పంచ్ భాస్కరరావు పరిశీలించారు. తక్షణమే భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సింధుపుట్టులో పాఠశాల రేకులషెడ్డు.. ముంచంగిపుట్టు: ఈదురుగాలులతో కూడిన వర్షానికి మండలంలోని జర్జుల పంచాయతీ సింధుపుట్టులో పాఠశాల నిర్వహించే రేకులషెడ్డు కూలిపోయింది. ఈ ఘటన సెలవు రోజు గురువారం సాయంత్రం జరగడం వల్ల పెనుముప్పు తప్పింది. సింధిపుట్టు జీసీపీఎస్ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలను తాత్కాలిక రేకుల షెడ్డులో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నేలమట్టమైంది. శుక్రవారం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు గుర్తించారు. వెంటనే తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు విద్యాశాఖ అధికారులకు తెలియజేశారు. సీఆర్పీ గౌరీశంకర్ సింధిపుట్టు వెళ్లి పాఠశాల పరిప్థితిని గమనించారు. ప్రస్తుతం పాఠశాల నిర్వహణపై గ్రామస్తులతో చర్చించారు. నూతన భవనానికి ప్రతిపాదనలు పంపామని సీఆర్పీ వివరించారు. తక్షణమే భవనం నిర్మించి విద్యార్థులకు వసతి సమస్య పరిష్కరించాలని ఉప సర్పంచ్ సాధురాం, స్థానికులు కోరారు. -
ఆదికర్మయోగి అభియాన్తో గ్రామాల అభివృద్ధి
వై.రామవరం: మండలంలో ఎంపిక చేసిన పంచాయతీల్లో ఆదికర్మయోగి అభియాన్ కార్యక్రమం ద్వారా అభివృద్ధి పనుల కోసం సర్వేచేసి, నివేదికలను సమర్పించే విధంగా తగినంత మంది అధికారులను, సిబ్బందిని ఏర్పాటు చేశామని, ఈప్రోగ్రాంను మండల ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని ఐటీడిఏ పీఓ స్మరణ్ రాజ్ మండల ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలోని చవిటిదిబ్బలు సచివాలయంలో ఎంపీడీవో కె.బాపన్నదొర అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో ఐటీడిఏ పీవో స్మరణ్రాజ్ తోపాటు ఎంపీపీ కడబాల ఆనందరావు, జెడ్పీటీసీ సభ్యురాలు కర్ర వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీలు ముర్ల జోగిరెడ్డి, వలాల విశ్వమ్మ, ఎంపీటీసీ వీరమళ్ళ సుబ్బలక్ష్మి, సర్పంచ్ బచ్చలి చిన్నమ్ములు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతు ఆదికర్మయోగి అభియాన్ కార్యక్రమం గురించి వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా వెనుకబడిన గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతాయన్నారు. గ్రామంలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చవిటిదిబ్బలు పీహెచ్సీను తనిఖీ చేశారు. అందుతున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని వైధ్యాధికారులకు, సిబ్బందికి సలహాలు సూచనలిచ్చారు. తోటకూరపాలెం కస్తూర్బా విద్యాలయాన్ని తనిఖీ చేశారు. ఎంతమంది ఉపాధ్యాయులు, విద్యార్థులున్న విషయంపై ఆరా తీశారు. మెనూ సక్రమంగా అమలు చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. తోటకూరపాలెం అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలు, పౌష్టికాహారం పంపిణీ తదితర విషయాలపై ఆరా తీశారు. లభ్దిదారులకు గృహ నిర్మాణపు పనులు వేగవంతం చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశించారు. తహసీల్దార్ పి.వేణుగోపాల్, ఈఈ ఐ.శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఐటీడీఏ పీవో స్మరణ్రాజ్ -
వృత్తి సవాళ్లపై అవగాహన ఉండాలి
సబ్బవరం: వృత్తిలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడంతో పాటు, విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే అంశాలపై ఉపాధ్యాయులకు పూర్తి అవగాహన ఉండాలని ఆర్జేడీ విజయభాస్కర్ శుక్రవారం తెలిపారు. సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో డీఎస్సీ–2025లో ఎంపికై న నూతన ఉపాధ్యాయులందరికీ శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. విశాఖ ఉమ్మడి జిల్లాకు చెందిన కొత్త ఉపాధ్యాయులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేయడంతో పాటు, వృత్తిపరమైన అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ 8 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్జేడీ విజయభాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ శిక్షణను ఉపాధ్యాయులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. పనిచేసే గ్రామానికి మంచి పేరు తీసుకురావడంతో పాటు, విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా విద్యాశాఖాధికారి జి. అప్పారావు నాయుడు, ఉప విద్యాశాఖాధికారి అప్పారావు, అకడమిక్ మానిటరింగ్ అధికారి కెజియా పాల్గొన్నారు. మధురవాడ: కొత్తగా విధుల్లో చేరబోతున్న ఉపాధ్యాయులు తాము పొందుతున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ ఆర్జేడీ విజయభాస్కర్ సూచించారు. మధురవాడ ఐటీ సెజ్లో డీఎస్సీ–2025 ద్వారా ఎంపికై న ఉపాధ్యాయుల కోసం 8 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ‘ఇండక్షన్ ట్రైనింగ్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని 360 మంది ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డీఈవో ప్రేమకుమార్, భీమిలి డైట్ ప్రిన్సిపాల్ ఎల్. సుధాకర్ పాల్గొన్నారు. -
వైభవం.. అప్పన్న జమ్మివేట ఉత్సవం
సింహాచలం: విజయదశమిని పురస్కరించుకుని గురువారం సాయంత్రం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి జమ్మివేట ఉత్సవం వైభవంగా జరిగింది. కొండదిగువ పూలతోటలో జరగాల్సిన ఈ ఉత్సవాన్ని వర్షం కారణంగా సింహగిరిపైనే అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామికి రామాలంకారం చేసి కల్యాణమండపంలో వేదికపై వేంజేపచేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, షోడషోపచార పూజలు, వేద పారాయణాలు, పంచశూక్త పారాయణాలు జరిపారు. నృసింహమండపంలో ఉన్న శమీ వృక్షం చెంత విశేష పూజలు నిర్వహించారు. చెట్టు నుంచి శమీ దళాలను కోసి, స్వామికి సమర్పించారు. విశేష అర్చన అనంతరం ఆలయ బేడామండపంలో స్వామికి తిరువీధి జరిపారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు, అర్చకులు పెద్దరాజు, పవన్ తదితరులు ఉత్సవాన్ని నిర్వహించారు. దేవస్థానం ఈవో వి.త్రినాథరావు, పూర్వ ఈవో సూర్యకళ ఉత్సవంలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. దేవస్థానం ఈఈ రమణ, ఆలయ ఏఈవో తిరుమలేశ్వరరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
జీఎస్టీ తగ్గింపుపై రైతులకు అవగాహన కల్పించాలి
చింతపల్లి: గిరిజన రైతులకు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా తగ్గించిన జీస్టీపై అవగాహన కల్పించాలని జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి వి.జయరాజ్ ఆదేశించారు. శుక్రవారం స్ధానిక వ్యవసాయ అగ్రిల్యాబ్లో చింతపల్లి, జీకే వీది మండలాల పశుసంవర్థకశాఖ వైద్యాధికారులు, వెటర్నరీ అసిస్టెంట్లు, సిబ్బందితో సూపర్ జీఎస్టీ– సూపర్ సేవింగ్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించి రైతులకు అవసరమైన అన్ని వస్తువులపై 12 నుంచి 5 శాతానికి జీఎస్టీ తగ్గించడంతో రైతులకు ఆర్థికంగా ఆదా అవుతుందన్నారు. పాల ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గుదలతో విశాఖ డెయిరీ ఉత్పత్తుల్లో రోజుకు రూ.20 లక్షల ఆదా అవుతుందన్నారు. పశుసంపద ఉన్న గ్రామాల్లో ఏర్పాటు చేసుకున్న బయో గ్యాస్ లబ్ధిదారులకు 18 నుంచి ఐదు శాతానికి తగ్గిందన్నారు. మందులు, ఇన్సూరెన్స్లపై పూర్తిగా జీఎస్టీ తగ్గిందన్నారు. ● జిల్లాలో సెర్ప్ ద్వారా స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ)లో ఉన్నటువంటి 5,326 మంది మహిళలకు పాడి పశువుల యూనిట్లు మంజూరు చేయనున్నట్లు జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి వి.జయరాజ్ తెలిపారు.డ్వాక్రా మహిళలకు అవసరమైన గేదెలు, ఎద్దులు, గొర్రెలు మేకలు, కోళ్లు తదితర యూనిట్లకు రుణాలు మంజూరు చేస్తామన్నారు. మహిళలు కోరుకున్న యూనిట్లకు సంబంధించి నేరుగా పశుసంవర్థకశాఖ,వెలుగు, బ్యాంకు అధికారుల సమక్షంలో మైదాన ప్రాంత మార్కెట్లో నేరుగా కొనుగోలు చేసి పంపిణీ చేస్తామన్నారు. వీరికి బ్యాంకులు తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేస్తారన్నారు. మండలాలు వారీగా లబ్ధిదారులను గుర్తించామన్నారు. వీరికి త్వరలోనే యూనిట్ల పంపిణీ చేపడతామన్నారు.ఈ కార్యక్రమంలో ఏడీ చంద్రశేఖర్, ఎంపీడీవో సీతామహాలక్ష్మి, వైద్యాదికారులు రమేష్, సౌజన్యదేవి సాలిని తదితరులు పాల్గొన్నారు.జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి జయరాజ్ -
అటవీశాఖలో అక్రమార్కులు
● పట్టుకున్న టేకు విలువ తక్కువ చూపిన సిబ్బంది ● జరిమానా తక్కువ విధించడంతో అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదు ● రంగంలోకి ఫ్లయింగ్ స్క్వాడ్.. మరో రూ.30 వేల ఫైన్ విధింపు ● అటవీశాఖలో కలకలం రేపుతున్న అవినీతి బాగోతంనర్సీపట్నం: టేకు కలప పట్టివేతలో అటవీ సిబ్బంది ధనదాహం కలకలం రేపుతోంది. నర్సీపట్నంలో అటవీ సిబ్బంది అవినీతి బాగోతం ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన విషయం అజ్ఞాత వ్యక్తి సమాచారంతో వెలుగులోకి వచ్చింది. ‘సాక్షి’కి లభించిన అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం గత నెల 17వ తేదీన కోటవురట్ల మండలం, యండపల్లి సమీపంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న టేకు కలపను రేంజర్ రాజేశ్వరరావు సమక్షంలో అటవీ సిబ్బంది పట్టుకున్నారు. దాన్ని సీజ్ చేసి రేంజ్ కార్యాలయంలో ఉన్న కలప డిపోకు తరలించారు. మిల్లులో కోసిన దుంగలకు ఒక రేటు, చెక్కుడు దుంగలకు వేరే రేటు ఉంటుంది. పట్టుబడింది మిల్లులో కోసిన దుంగలైతే రికార్డులో చెక్కుడు దుంగలుగా చూపించారు. విలువ తక్కువ చూపి రూ.79,848 మాత్రమే అపరాధ రుసుం విధించారు. నిబంధనల ప్రకారం పట్టుకున్న కలప విలువకు ఐదింతర జరిమానా విధించాలి. ఈ వ్యవహారంలో రూ.50 వేల వరకు చేతులు మారినట్టు తెలిసింది. ఇదే విషయం ఓ అజ్ఞాత వ్యక్తి రాష్ట్ర అటవీశాఖ కార్యాలయానికి ఫిర్యాదు చేశాడు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. పట్టుకున్న కలపను పరిశీలించి రూ.లక్షా 7 వేల అపరాధ రుసుం విధించారు. రూ.30 వేలకుపైగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నం జరిగింది. ప్రభుత్వానికి నివేదిక వెళ్లడంతో ఎవరిపై వేటు పడుతుందోనని అటవీ సిబ్బందిలో ఆందోళన మొదలైంది. డీఎఫ్వో శామ్యూల్ను సంప్రదించగా ఈ విషయం తన దృష్టిలో ఉందని, సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం రావాల్సి ఉందని తెలిపారు. -
50 అడుగుల రావణ దహనం
కొమ్మాది: బీచ్రోడ్డు సాగర్నగర్ ఇస్కాన్ టెంపుల్లో గురువారం విజయదశమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ముందుగా ‘రామకళామృతం, రామగానామృతం’ కీర్తనలు, ఆలాపనలు భక్తిభావంతో నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య ఆకర్షణగా సాయంత్రం 50 అడుగుల భారీ రావణ దిష్టిబొమ్మను దహనం చేసే కార్యక్రమం జరిగింది. రావణ దహనం అనంతరం నిర్వహించిన ఫైర్ క్రాకర్స్ షో , సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంపీ శ్రీ భరత్, ఇస్కాన్ అధ్యక్షులు సాంబాదాస్ ప్రభుజీ, మాతాజీ నితాయి సేవినీ తదితరులు పాల్గొన్నారు. -
తగ్గిన వరద.. కొనసాగుతున్న రాకపోకలు
చింతూరు: ఆరు రోజులపాటు విలీన మండలాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన గోదావరి, శబరినదుల వరద ఎట్టకేలకు తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భద్రాచలం వద్ద కూడా గోదావరి నీటిమట్టం ప్రమాదకర స్థాయికంటే దిగువకు చేరింది. వరదనీరు రహదారులను వీడడంతో చాలా ప్రాంతాల్లో రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. చింతూరు మండలంలో సోకిలేరువాగు వరదనీరు ఇంకా స్వల్పంగా వంతెనపై నిలిచి ఉంది. దీంతో శుక్రవారం మధ్యాహ్నం వరకు పడవపై రాకపోకలు కొనసాగగా నీరు మరింత తగ్గడంతో సాయంత్రం నుంచి కాలినడకన రాకపోకలు సాగుతున్నాయి. ఇక్కడ శనివారం ఉదయానికి పూర్తిస్థాయిలో వరదనీరు తొలగే అవకాశం ఉంది. మరోవైపు కుయిగూరువాగు వరద జాతీయ రహదారి పైనుండి పూర్తిగా తొలగడంతో ఆంధ్రా నుంచి ఒడిశాకు యధావిధిగా రాకపోకలు కొనసాగుతున్నాయి. దీంతోపాటు జల్లివారిగూడెం, చంద్రవంక, చీకటివాగుల వరదనీరు కూడా తగ్గింది. -
ముమ్మరంగా విద్యుత్ పునరుద్ధరణ పనులు
పాడేరురూరల్: అల్లూరి జిల్లా పరిధిలో జోరుగా విద్యుత్ పునరుద్ధరణ, జంగిల్ క్లియరెన్స్ పనులు ముమ్మరం చేసిన్నట్టు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి.వేణుగోపాల్ శుక్రవారం తెలిపారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, వైర్లు తెగ్గిపడి విద్యుత్కు తీవ్ర అంతరాయం కలిగిందన్నారు. ఈ నేపథ్యంలో కొయ్యూరు, జి.మాడుగుల, పెదబయలు, అనంతగిరి, అరకులోయ, పాడేరు, హుకుంపేట తదితర మండలాల్లో ఫీడర్లలో మరమ్మతు పనులు, విద్యుత్ స్తంభాలపై కూలిన చెట్ల కొమ్మలు, తెగిపడిన వైర్లు సరిచేయడం, జంగిల్ క్లియరెన్స్ తదితర పనులు ముమ్మరంగా చేపట్టామన్నారు. ఇందులో భాగంగా అవసరమైన చోట్ల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండ ముందస్తు చర్యలు తీసుకోంటున్నామన్నారు.ఎటువంటి విద్యుత్ సమస్యలు ఉన్న సమీప విద్యుత్ శాఖ అధికారులకు సమచారం ఇవ్వాలని ఆయన కోరారు. -
నూకాంబిక సేవలో కలెక్టర్లు
అనకాపల్లి: దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారిని గురువారం అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల కలెక్టర్లు విజయకృష్ణన్, ఎస్.దినేష్ కుమార్, హరిందర ప్రసాద్ దర్శించుకున్నారు. తొలుత వీరికి దేవదాయ శాఖ సహాయ కమిషనర్ కె.ఎల్.సుధారాణి, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో పూర్ణాహుతి హోమం, అవభృత స్నానం, శమీ వృక్షపూజలు చేయించారు. అమ్మవారి చిత్రపటాలను బహూకరించారు. కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ పీలా నాగశ్రీను, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
నిలిపివేసిన సర్వీసులు.. ప్రయాణికుల అగచాట్లు
సీలేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా అంతర్రాష్ట్ర ప్రయాణికులు దసరా తిరుగు ప్రయాణంలో బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దసరా సెలవులు గురువారంతో ముగిశాయి.దీంతో ఉద్యోగులు.పాఠశాల విద్యార్థులు పండగ అనంతరం శుక్రవారం పాఠశాలలు ప్రారంభించారు. గ్రామాల నుంచి తిరుగు ప్రయాణానికి సంసిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ పలు సర్వీసులను రద్దు చేయడంతో ప్రయాణకులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఇందులో భాగంగా విశాఖపట్నం నుంచి సీలేరు రావలసిన నైట్ బస్ సర్వీసును రద్దు చేశారు. దీంతో శుక్రవారం ఉదయం సీలేరు నుంచి విశాఖపట్నం వెళ్లవలసిన బస్సు లేకపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. అలాగే నర్సీపట్నం నుంచి సీలేరు రావలసిన రెండు బస్సులు కూడా శుక్రవారం రాకపోవడంతో సీలేరు బస్ స్టాండ్ వద్ద గంటలు తరబడి ప్రయాణికులు వేచి చూసి రాకపోవడంతో నిరాశతో వెనుతిరిగి వెళ్లారు. ఆర్టీసీ అధికారులపై ప్రయాణికులు మండిపడ్డారు. ప్రకటన లేకుండా బస్సులు ఎలా రద్దు చేస్తారు అని ప్రశ్నించారు. దీంతో సీలేరు నుంచి చింతపల్లి నర్సీపట్నం, డొంకరాయి మోతుగూడెం భద్రాచలం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉండగా రాత్రిపూట అంతర్రాష్ట్ర రహదారిలో తిరిగే ఒకే బస్సు సర్వీసు ఉండడం, అది కూడా ఖాళీ లేకపోవడం వారం రోజులు ముందుగానే రిజర్వేషన్ అయిపోవడంతో ప్రయాణికులు నిలబడి ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా ప్రభుత్వం, ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి బస్సులను సకాలంలో అన్ని సర్వీసులు అందుబాటులో ఉండేలా నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. మొరాయించిన బస్సు...ప్రయాణికుల పాట్లు నర్సీపట్నం నుంచి సీలేరు వస్తున్న దారలమ్మ ఘాట్రోడ్డులో బస్సు నిలిచిపోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి వేచి, గత్యంతరం లేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి గమ్యస్థానాలకు చేరుకున్నారు. బస్సులో సాంకేతిక సమస్య కారణంగా నిలిచిపోయినట్టు పలువురు తెలిపారు. ఘాట్రోడ్డు తరచూ ఆర్టీసీ బస్సులు మొరాయిస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కండీషన్లో ఉన్న బస్సులను నడపాలని కోరుతున్నారు.పట్టించుకోని ఆర్టీసీ అధికారులు -
మెట్టవలసలో సమస్యలు పరిష్కరిస్తా
● గిరిజనులకు పాడేరు ఐటీడీఏ పీవోతిరుమణి శ్రీపూజ హామీ ● కుటుంబసభ్యులతో ప్రవాహం హోంస్టే సందర్శన అనంతగిరి (అరకులోయ టౌన్): సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ హామీ ఇచ్చారు. బుధవారం ఆమె మండలంలోని లంగుపర్తి పంచాయతీ మెట్టవలసలో ప్రవాహం హోం స్టేను కుటుంబ సభ్యులతో సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు రాజుకు పీవో పలు సూచనలు చేశారు. అనంతరం మెట్టవలస గిరిజనుల సమస్యలను తెలుసుకున్న పీవో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. హోంస్టేకు సమీపంలోని పంట పొలాలు, పొంగి ప్రవహిస్తున్న వాగులను పరిశీలించారు. సహజసిద్ధ ప్రకృతి అందాలను తిలకించారు. -
జీఎస్టీ సంస్కరణలతోరైతులకు మరింత మేలు
● అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ పాడేరు రూరల్: జీఎస్టీ సంస్కరణలతో రైతులకు మరింత మేలు జరిగిందని అసిస్టెంట్ కలెక్టర్ కె.సాహిత్ తెలిపారు. బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జీఎస్టీ 2.0 పన్ను తగ్గింపుపై నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. వ్యవసాయ రంగానికి మేలు చేకుర్చేందుకు 2.0 పన్ను తగ్గింపుపై విస్తృతంగా ప్రచారం చేసి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం రైతులు, అధికారులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి, వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ రమేష్, జీఎస్టీ అధికారి శేషగిరినాయుడు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
220 కిలోల గంజాయిపట్టివేత– ముగ్గురి అరెస్టు
పాడేరు : ముందస్తు సమాచారం మేరకు పెదబయలు జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీలు చేసి, 220కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు పాడేరు డీఎస్పీ షెహబాజ్ అహ్మద్ బుధదవారం పాడేరులో విలేకరులకు వెల్లడించారు. పట్టుబడిన గంజాయి నిందితులు గతంలో గంజాయి వ్యాపారం ద్వారా సంపాదించిన అన్ని రకాల ఆస్తులను జప్తు చేశామన్నారు. పాడేరు, ఇతర ప్రాంతాల్లో ఎవరైనా వ్యక్తులకు ఇళ్లను అద్దెకు ఇచ్చే ముందు వారి పూర్వపరాలు తెలుసుకోవాలని సూచించారు. గంజాయి వ్యవహారంలో ఏ మాత్రం ప్రమేయం ఉన్నా అరెస్ట్లు తప్పవని హెచ్చరించారు. గంజాయి కేసుల్లో ప్రమేయం ఉంటే కఠిన శిక్షలు అమలు చేయడంతో పాటు గతంలో వారు సంపాదించిన అన్ని రకాల ఆస్తులు జప్తు చేయక తప్పదన్నారు. గంజాయి నిర్మూలకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. -
నీరుగారిన లక్ష్యం
● చెత్త కుప్పల్లో దర్శనమిస్తున్న మొక్కలు ● రైతులకు పంపిణీకి నోచుకోని వైనం ● చోద్యం చూస్తున్న ఉపాధి అధికారులుపాడేరు రూరల్: రైతులకు మొక్కలను పంపిణీ చేయకుండా సిబ్బంది చెత్త కుప్పల్లో పారవేస్తున్నారని, దీంతో ఉపాధి హామీ పథకం నీరుగారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని శివారు సలుగు పంచాయతీలో ఉపాధి హమీ పథం ద్వారా అర్హూలైన రైతులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన వివిధ రకాల మొక్కలను సమీప పొదల్లో పారవేస్తున్నారు. శివారు గ్రామల్లో ఇదే తంతుగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఉపాధి హామీ పథకం లక్ష్మం నీరుగారుతోందని చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఉపాధి హమీ పథకం ద్వారా రైతులకు విస్తృతంగా మొక్కల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులకు మొక్కలను పంపిణీ చేయకుండా సిబ్బంది వృథాగా పక్కన పడేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి మొక్కల పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు. -
రోడ్డెక్కిన పీహెచ్సీ వైద్యులు
ఇన్ సర్వీస్ కోటాను 30 శాతం క్లినికల్, 50శాతం నాన్ క్లినికల్ కింద డిపార్టమెంట్లో సీట్లు కల్పించాలన్నారు. గిరిజన ప్రాంత పీహెచ్సీలో పని చేస్తున్న వైద్యులకు 30శాతం బేసిక్ పే, ట్రైబల్ అలవెన్స్ కల్పించాలని , టైం బౌండ్ ప్రమోషన్ల ఇవ్వాలని, 2020 బ్యాచ్ వైద్యులకు నోషనల్ ఇంక్రిమెంట్లు కల్పించాలని కోరారు. చంద్రన్న సంచార చికిత్స అలవెన్స్లను రూ.4వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం నుంచి రాష్ట్ర రాజధాని విజయవాడలో నిరసన కార్యక్రమాలు చేపడుతామని వారు స్పష్టం చేశారు. ఎటపాక: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీహెచ్సీల వైద్యులు బుధవారం నెల్లిపాక ప్రధాన సెంటరులో ధర్నా చేశారు. ఈసందర్భంగా వారుమాట్లాడుతూ గిరిజన ప్రాంతా పీహెచ్సీల్లో పనిచేస్తున్న వారికి 30 శాతం బేసిక్ అలవెన్స్ ఇవ్వాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు నిరసన కొనసాగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో వైద్యులు ఉదయ్కుమార్రెడ్డి, నికిల్, లక్ష్మీప్రసన్న, శ్రీదేవి, రెహానా, శ్రీనివాసమూర్తి, హేమంత్, భరద్వాజ, దేవినాగ్ పాల్గొన్నారు. -
పిడుగుపాటుకు పశువులు, మేకలు మృతి
పెదబయలు: మండలంలోని లక్ష్మీపేట పంచాయతీ కోదువలసలో పిడుగుపాటుకు 20 పశువులు మృతి చెందాయి.బుధవారం కోదువలస పెద్ద చెరువు సమీపంలో పశువుల మేస్తున్నాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉరుములతో కూడిన వర్షం పడింది. ఇదే సమయంలో పిడుగుపడి 22 పశువులు అక్కడికక్కడే మృతి చెందాయని లక్ష్మీపేట సర్పంచ్ లకే అశోక్కుమార్ తెలిపారు. మృతి చెందిన వాటిలో కొర్ర బంగారయ్య, కిల్లో బాలరాజు, కిల్లో శ్రీనుబాబు, కిల్లో సత్యారావు, కిల్లో మల్లేష్, వంతాల రాంప్రసాద్, వంతాల రాజారావు, కిల్లో వెంకటరావు, కిల్లో బంగారన్న చెందిన పశువులు ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం, ఐటీడీఏ స్పందించి బాధిత రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. పిడుగుపాటుకు మృతిచెందిన పశువులకు పోస్టుమార్టం నిర్వహించి డీహెచ్వోకు నివేదించి రైతులకు సహకారం అందించేందుకు కృషి చేస్తామని పశుసంవర్థకశాఖ స్థానిక ఏడీ కిషోర్ తెలిపారు. చింతపల్లి: మండలంలోని తాజంగిలోని టిక్కరిపాడు వీధిలో తాడిపూడి లక్ష్మణరావుకు చెందిన 13 మేకలు పిడుగుపాటుకు మృతి చెందాయి. బుధవారం గ్రామానికి సమీపంలోని వాటిని మేతకు తీసుకువెళ్లాడు. ఉరుములతో కూడిన వర్షానికి అవి తాజంగిలో నిర్మాణదశలో ఉన్న గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం ఎదురుగా ఉన్న చెట్టు వద్దకు చేరుకున్నాయి. అదే సమయంలో పిడుగుపాటుకు మేకలన్నీ మృతి చెందాయి. వీటి విలువ రూ.2 లక్షలు ఉంటుందని బాధితుడు తెలిపారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఆయన కోరాడు. -
‘హైడ్రో పవర్’ అనుమతులు రద్దు చేయాల్సిందే
● వ్యతిరేక పోరాట కమిటీ డిమాండ్ ● మొర్రిగుడలో సరిహద్దు దిమ్మలను ధ్వంసం చేసిన గిరిజనులు అరకురలోయ టౌన్: గుజ్జెలి హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అరకులోయ మండలం ఇరగాయి పంచాయతీ మొర్రిగుడలో ఏర్పాటుచేసిన సరిహద్దు దిమ్మలను గిరిజనులు ధ్వంసం చేశారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి ఆదివాసీ గిరిజన సంఘం హైడ్రో పపర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ కొర్రా స్వామి ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల హక్కులు, చట్టాలకు విఘాతం కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ కన్వీనర్ కొర్రా స్వామి పాల్గొన్నారు. -
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుంటే ఉద్యమం
● ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ పాడేరు రూరల్: ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను తక్షణం రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పట్టణంలోని ఆదివాసీ ఉద్యోగ భవన్లో బుధవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లతో కూడిన కరపత్రాలను అవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆర్థిక పరమైన సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించి పరిష్కరించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు వెంకటరమణ, మహేష్, శేషగిరి, వరహలక్ష్మి, కర్రన్న పాల్గొన్నారు. -
రేపటి నుంచి పంచాయతీల్లో వర్క్షాప్
● ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ పాడేరు : పాడేరు ఐటీడీఏ పరిధిలోని 777 గ్రామాల్లో ఈ నెల 3 నుంచి 10 వరకు వర్క్ షాప్లు నిర్వహిస్తామని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ తెలిపారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో 11 మండలాల ఎంపీడీవోలతో బుదవారం ఆమె సమావేశం నిర్వహించారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ఇప్పటికే ఎంపీడీవోలకు పంపించామన్నారు. ఈ వర్క్షాప్ను సక్రమంగా పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశానికి వర్చువల్గా మోటో సెక్షన్ ఆఫీసర్ (మోటో న్యూఢిల్లీ మినిస్టర్ అఫ్ ట్రైబల్ అఫైర్స్) ఆదిత్య గోస్వామి హాజరై మాట్లాడుతూ 225 గ్రామాలకు యాక్షన్ ప్లాన్ తయారుచేసి వెబ్ పోర్టల్ను అప్లోడ్ చేయాలన్నారు. ఆది సేవా కేంద్రాలకు ప్రతి గురువారం వచ్చే వినతులను సేకరించాలన్నారు. గ్రీవెన్స్, విజిట్, స్కీం, అటెండెన్స్ రిజిస్టర్లను నిర్వహించాలన్నారు. అక్టోబర్ నుంచి ప్రత్యేకంగా గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు. విలేజ్ విజన్ మ్యాప్లను తయారు చేయాలని సూచించారు. ఐటీడీఏ ఏపీఓ వెంకటేశ్వరరావు, ఐటీడీఏ ఏఓ హేమలత, ట్రైకార్ సహాయకులు సీతారామయ్య, ఎంపీడీఓలు పాల్గొన్నారు. -
స్వయం ఉపాధితో ఆర్థికాభివృద్ధి
గంగవరం : మండలంలోని జడేరు గ్రామంలో హ్యాచిమ్గ్ హోప్ ఆక్సిలరేటింగ్ ఇన్కమ్ –బ్రిడ్జ్ టు సస్టెన్బులిటీలో భాగంగా హిపర్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆఫీసర్ లోక్నాథ్, ప్రోగ్రాం సీనియర్ ఆఫీసర్ డాక్టర్ గణేష్, నవజీవన్ ఆర్గనైజేషన్ పిసి వీరాంజనేయులు ఆధ్వర్యంలో కోడిపిల్లల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ షరీఫ్ మాట్లాడుతూ కోళ్ల పెంపకంపై అవగాహన కల్పించారు.ఆయన మాట్లాడుతూ నాటుకోళ్ల పెంపకంతో స్వయం ఉపాధి పొంది ఆర్థికాభివృద్ధి సాధించవచ్చన్నారు. నవజీవన్, హిపర్ ఇంటర్నేషనల్ సంస్థల సేవలను ఆయన కొనియాడారు. డాక్టర్ గణేష్ మాట్లాడుతూ గంగవరం, వై.రామవరం, అడ్డతీగల, రంపచోడవరం, మారేడుమిల్లి తదితర ప్రాంతాలకు చెందిన 600 మంది రైతులకు కోళ్లను పంపిణీ చేశామన్నారు. పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ షరీఫ్ మాట్లాడుతూ కుక్కకాటుకు తక్షణమే వైద్య చికిత్స పొందాలని సూచించారు. పెంపుడు కుక్కలకు టీకాలు వేయించాలన్నారు. ప్రతినిధులు లోక్నాథ్, వీరాంజనేయులు, నాగేశ్వరరావు, భవాని, ప్రశాంత్, నాగేశ్వరరావు, అప్పన్న బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఏయూ దూర విద్య..అక్రమాల అడ్డా
విశాఖ సిటీ: ఆంధ్ర విశ్వ విద్యాలయం దూర విద్యకు చెదలు పట్టింది. అధికారుల హస్తలాఘవానికి కేంద్రంగా మారిపోయింది. పరీక్షా కేంద్రాల పేరుతో అక్రమాలకు అడ్డాగా తయారైంది. ఏయూ దూర విద్య పరీక్షా కేంద్రాల వ్యవహారం ఇపుడు హాట్ టాపిక్గా మారింది. అధికారుల పర్యవేక్షణ లోపం, సిబ్బంది చేతివాటం కారణంగా ఎగ్జామినేషన్ సెంటర్లు హద్దులు దాటి ప్రైవేటు చేతికి వెళ్లిపోయాయి. ఈ ప్రైవేటు సెంటర్లు ఒక పేరుతో అనుమతి పొంది మరోచోట పరీక్షలు నిర్వహిస్తున్నా.. అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ప్రధానంగా ఈ పరీక్షల నిర్వహణపై కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అనధికార కేంద్రాలు మాస్ కాపీయింగ్కు నిలయాలుగా మారిపోయాయి. ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే దూర విద్య పరీక్షా కేంద్రాలు నిర్వహించాలని ఏయూ పాలకులు నిర్ణయం తీసుకున్నప్పటికీ.. కొన్ని లొసుగులతో ఇప్పటికీ ప్రైవేటుకే పెద్ద పీట వేస్తున్నారు. సెంటర్కు రూ.2 నుంచి రూ.5 లక్షలు ఏయూ పరీక్షా కేంద్రాలను ఇష్టానుసారంగా ప్రైవేటుకు అప్పగించేశారు. ప్రైవేటు సెంటర్లలో మాస్ కాపీయింగ్ జరిగిన సందర్భాలు అనేకమున్నాయి. అయినప్పటికీ పరిధి దాటి అనంతపురం, కర్నూలు, నంద్యాల, హైదరాబాద్లలో కూడా ప్రైవేటు విద్యా కేంద్రాలకు పరీక్షా కేంద్రాల నిర్వహణకు అనుమతులు మంజూరు చేసేశారు. ఇటువంటి సెంటర్లపై ఎన్ని ఫిర్యాదు వచ్చినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రతి సెంటర్ నుంచి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు తీసుకుని అనుమతులు మంజూరు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత వాటి పర్యవేక్షణ మాత్రం గాలికి వదిలేస్తున్నారు. ప్రైవేటు కేంద్రాలు రద్దు చేయాలని నిర్ణయించినా.. ఏయూ దూర విద్య పరీక్షల నిర్వహణపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రైవేటు పరీక్షా కేంద్రాల అనుమతులు రద్దు చేయాలని రెండేళ్ల క్రితమే ఏయూ అధికారులు నిర్ణయించారు. కేవలం ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే ఈ పరీక్షలను నిర్వహించాలని భావించారు. కానీ అధికారుల బదిలీలు.. సిబ్బంది చేతివాటం.. ప్రైవేటు మామూళ్లతో ఇప్పటి వరకు ఆ నిర్ణయాన్ని అమలు చేయలేదు. ఇప్పటికీ ఆంధ్రాలోనే కాకుండా తెలంగాణలో కూడా ఏయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పరీక్షలు ప్రైవేటు సెంటర్లలో నిర్వహిస్తూనే ఉన్నారు. గత నిర్ణయాలను మాత్రం అమలు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. ఆదాయం పోతుందన్న కారణంగానే ప్రైవేటు సెంటర్లను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మాస్ కాపీయింగ్కు కేంద్రాలుగా... ఏయూ దూర విద్య పరీక్షా కేంద్రాలుగా ఉన్న కొన్ని ప్రైవేటు సెంటర్లు అనధికారికంగా మరికొన్ని చోట్ల ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా పరీక్షా కేంద్రాలను నిర్వహించి అక్కడ విద్యార్థులతో పరీక్షలు రాయించి వాటిని అనుమతి పొందిన కేంద్రాల్లో నిర్వహించినట్లు చూపిస్తున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. గత నెల 12వ తేదీ కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఇదే తరహాలో అనధికారికంగా పరీక్షలు నిర్వహించిన ట్లు సమాచారం. మరికొంత మంది ఇతర జిల్లాల్లో అనధికారికంగా పరీక్షలు రాయించి ఉత్తరాంధ్రలో ప్రభుత్వ విద్యా సంస్థలో ఉన్న కేంద్రాల్లో పరీక్షలు రాసినట్లు చూపిస్తున్నారని, ఇందుకు దూర విద్యా విభాగం సిబ్బంది కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. -
భూముల రీసర్వే వేగవంతం
● మంజూరైన గృహాలు త్వరితగతిన గ్రౌండింగ్ ● కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశం సాక్షి,పాడేరు: భూముల రీసర్వే, మ్యుటేషన్లు, ఆర్అండ్ఆర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ ఆదేశించారు.పలుశాఖల అధికారులతో బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వీఆర్వో, తహసీల్దార్ల లాగిన్లలో పెండింగ్లో ఉన్న భూముల సర్వే సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. జీవో నంబరు 30.23లో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పక్కాగా అమలుజేయాలన్నారు. మంజూరైన అన్ని గృహాలను గ్రౌండింగ్ చేయాలని సూచించారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులతో అర్హత ఉన్నవారిని గుర్తించి హౌసింగ్ లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు. కులధ్రువీకఱన పత్రాలను మంజూరు చేయాలని, కొత్త ఓటరు నమోదు, ఓటరు కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. అటవీశాఖ స్థలాలను రీసర్వే చేసి సమస్యలపై కమిటీ ఏర్పాటు చేసి పరిష్కరించుకోవాలని డీఆర్వోను ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ డాక్టర్ అభిషేక్గౌడ, ఐటీడీఏ పీవోలు తిరుమణి శ్రీపూజ, స్మరణ్రాజ్, అపూర్వ భరత్, రంపచోడవరం సబ్కలెక్టర్ శుభం నోక్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ చిరంజీవి వెంకట సాహిత్, డీఆర్వో పద్మలత పాల్గొన్నారు. అన్ని గ్రామాల్లో గ్రామసభలు గాంధీ జయంతి నాడు దసరా పండగ కావడంతో గ్రామసభలను -
వదలని వరద
చింతూరు మండలం ఏజీకొడేరు వద్ద నీటమునిగిన బస్షెల్టర్ చింతూరు, కంసులూరు రహదారిపై నిలిచిఉన్న వరదనీరుచింతూరు: గోదావరి, శబరి నదుల నీటిమట్టం క్రమేపీ తగ్గుతున్నా విలీన మండలాల్లో మాత్రం వరద ప్రభావం కొనసాగుతూనే ఉంది. వాగులు ఎగదన్నడంతో చింతూరు, కూనవరం, ఎటపాక, వీఆర్పురం మండలాల్లో నిలిచిపోయిన రాకపోకలు కొనసాగడం లేదు. రవాణా సౌకర్యం లేకపోవడంతో దూరప్రాంతాలకు వెళ్లే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ● భద్రాచలం వద్ద గరిష్టంగా మంగళవారం రాత్రి 50 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం క్రమేపీ తగ్గుతూ బుధవారం రాత్రికి 44 అడుగులకు చేరింది. నీటిమట్టం 48 అడుగులకంటే తగ్గడంతో బుధవారం తెల్లవారుజామున అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ● మళ్లీ తుఫాను ప్రభావంతో గురువారం నుంచి భారీవర్షాలు కురుస్తాయన్న సమాచారంతో నదీ పరివాహక గ్రామాల ప్రజల్లో మరోమారు ఆందోళన నెలకొంది. ఇప్పటికే వరుస వరదలతో రైతులు పంటలు తీవ్రంగా నష్టపోయారు. వరదల కారణంగా రహదారులు మూసుకుపోయిన గ్రామాలకు కూడా పరిహారం అందించాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. ● కూనవరం, వీఆర్పురం, చింతూరు మండలాల్లో చాలాచోట్ల రహదారులు ఇంకా జలదిగ్బంధంలోనే వున్నాయి. బుధవారం రాత్రికి కూనవరం వద్ద గోదావరి నీటిమట్టం 46 అడుగులు, చింతూరు వద్ద శబరినది నీటిమట్టం 34 అడుగులుగా ఉంది. ● చింతూరు మండలంలో శబరినది తగ్గుతున్నా వాగులనీరు ఇంకా రహదారులను వీడలేదు. కుయిగూరువాగు తగ్గకపోవడంతో బుధవారం కూడా ఆంధ్రా నుంచి ఒడిశాకు రాకపోకలు కొనసాగడం లేదు. దీంతోపాటు జల్లివారిగూడెం, సోకిలేరు, చంద్రవంక, చీకటివాగుల వరద కారణంగా చింతూరు, వీఆర్పురం మండలాల నడుమ, మండలంలోని 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు ముంపు ప్రాంతాల్లో అరకొర సౌకర్యాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం వారపు సంత, గురువారం దసరా పండగ నేపథ్యంలో చింతూరు వచ్చేందుకు సోకిలేరువాగు ఆవలనున్న గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో నర్సింగపేట వద్ద పడవ వద్దకు వచ్చారు. అధికారులు అక్కడ కేవలం ఒక్క పడవ మాత్రమే ఏర్పాటు చేయడంతో వారు ఇబ్బందులు పడ్డారు. పడవలో ఎక్కేందుకు అధికసంఖ్యలో ప్రజలు ఎగబడడంతో రద్దీ నెలకొంది. పరిమితికి మించి ఎక్కేందుకు పోటీ పడడంతో పడవ యజమానులు కూడా ఆందోళనకు గురయ్యారు. కూనవరం: శబరి, గోదావరి నదులకు బుధవారం కూనవరం వద్ద వరద పోటెత్తింది.కూనవరం – భద్రాచలం ప్రధాన రహదారిపై పోలిపాక వద్ద వరద నీరు తగ్గుముఖం పట్టకపోవడంతో రాకపోకలు కొనసాగలేదు. ఉదయ భాస్కర్ కాలనీ, గిన్నెల బజారులోని ఇళ్లల్లోకి వరదనీరు చేరింది. ఈ ప్రాంతంలోని 50 కుటుంబాలను టేకులబోరులోని గిరిజన ఆశ్రమ పాఠశాలకు తరలించినట్టు తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో జగన్నాథరావు తెలిపారు. పోలీసుస్టేషన్ మైదానం, ఆర్అండ్బీ రోడ్డుకు ఇరువైపులా వరద ప్రవాహం ముంచెత్తింది.కూనవరం– చింతూరు మార్గంలో పంద్రాజుపల్లి వద్ద వరదనీరు రోడ్డుపైకి ఎక్కడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొండ్రాజుపేట రహదారిపై వరదనీరు వారం రోజులుగా తగ్గుముఖం పట్టకపోవడంతో కొండ్రాజుపేట, వాల్ఫర్డ్పేట, శబరి కొత్తగూడెం, పూసుగూడెం, కొత్తూరు, శ్రీరామపురం, ఆంబోతులగూడెం, జిన్నెలగూడెం, బండారు గూడెం, పెదార్కూరు క్రింది గుంపు ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు అంతరాయం ఏర్పడింది.గోదావరి వరదల చరిత్రలో రికార్డ్ గోదావరి వరదల చరిత్రలో ఈ ఏడాది ఓ రికార్డుగా మిగిలిపోనుంది. 1976 నుంచి వరదల గణాంకాలను పరిశీలిస్తే ఈ ఏడాది ఇప్పటికే గోదావరికి ఎనిమిది పర్యాయాలు వరదవచ్చింది. ఈసారి వరదలు మొదటి హెచ్చరిక స్థాయి నుంచి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు కొనసాగాయి. ఈ పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవని జలవనరులశాఖ అధికారులతో పాటు ఈ ప్రాంతానికి చెందిన పాతతరం వాళ్లు అంటున్నారు. మహారాష్ట్రతో పాటు తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు ఈ ఏడాది గోదావరి వరద పెద్ద ఎత్తున రాగా పోలవరం కాపర్ డ్యాం కారణంగా విలీన మండలాలపై అధిక ప్రభావం చూపింది. ఈ ఏడాది జూన్ 12న ప్రారంభమైన వరద ప్రభావం అక్టోబరు వచ్చినా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గరిష్టంగా 51.9 అడుగులు, కనిష్టంగా 41.3 అడుగులుగా నమోదైంది. భద్రాచలం వద్ద వరద నీటిమట్టం వివరాలు తేదీ అడుగులు జూలై 12 41.30 ఆగస్టు 20 45.00 ఆగస్టు 21 51.90 ఆగస్టు 29 45.00 ఆగస్టు 31 48.00 సెప్టెంబర్ 3 43.30 సెప్టెంబర్ 27 46.60 సెప్టెంబర్ 30 50.00 గోదావరి, శబరి నదులు శాంతించినా తగ్గని ప్రభావం భద్రాచలం వద్ద 50 నుంచి 44 అడుగులకు తగ్గిన నీటిమట్టం రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించిన అధికారులు తగ్గని వాగుల ఉధృతి విలీన మండలాల్లో ముంపులోనే దారులు కొనసాగని రాకపోకలు -
బుట్ట పూలు నిన్న రూ.400.. నేడు రూ.200
సాక్షి,పాడేరు: ఏజెన్సీలో సీతమ్మ కాటుక రకం బంతిని సాగు చేసే రైతులను దసరా మార్కెట్ నిరాశ పరిచింది. దిగుబడి తగ్గినా పండగ నేపథ్యంలో ధర మరింత పెరుగుతుందని ఆశించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. గత రెండు రోజుల నుంచి పాడేరు మార్కెట్కు బంతిపూలు తక్కువగా వచ్చినప్పటికి ధర మాత్రం పెరగలేదు. మంగళవారం బుట్ట (ఐదు కిలోలు) బంతిపూలను రూ.400కు కొనుగోలు చేసిన వ్యాపారులు ఒక్క రోజు వ్యవధిలో ధరను పతనం చేశారు. బుధవారం పండగలో ధర లేకపోవడం బాధాకరం దసరా పండగ వల్ల బంతి పూల ధర అధికంగా ఉంటుందని ఆశపడ్డా. నిన్న బుట్ట రూ.400కు కొన్న వ్యాపారులు ఒక్క రోజుకే రూ.200 తగ్గించేశారు. ఒక్కసారిగా రూ.200 ఆదాయం కోల్పోయా. పండగ సమయంలో తక్కువ ధరకు అమ్మాల్సి రావడం బాధ కలిగించింది. – కె.ముత్యాలమ్మ, ఇరడాపల్లి, పాడేరు మండలం సీతమ్మ కాటుక బంతి ధర పతనం ఒక్కరోజులో రూ.200 తగ్గుదల వ్యాపారుల మాయాజాలం గిరి రైతులను నిరాశపర్చిన దసరా మార్కెట్ -
నరకం చూస్తున్నాం.. ఆదుకోండి
గోదావరి, శబరి నదుల వరద వల్ల వాగులు గ్రామాలను చుట్టుముట్టడంతో రహదారులు నీటమునిగాయి. దీంతో ప్రజలు ఐదు రోజులుగా గ్రామాలను వీడి రాలేని పరిస్థితి. ఉన్నకాడికి నిత్యావసర వస్తువులు అయిపోవడంతో తెచ్చుకోలేని దుస్థితిలో అష్టకష్టాలు పడుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందక దయనీయ స్థితిలో కాలం గడుపుతున్నారు. చింతూరు: మండలంలోని సోకిలేరు, జల్లివారిగూడెం వాగుల అవతల ఉన్న నర్సింగపేట, ముకునూరు, రామన్నపాలెం, పెదశీతనపల్లి, బొడ్రాయిగూడెం, కొండపల్లి, చినశీతనపల్లి, తిమ్మిరిగూడెం, ఏజీకొడేరు ఉలుమూరు, మల్లెతోట గ్రామాల్లో ప్రజలు దయనీయస్థితిలో జీవనం సాగిస్తున్నారు. వీరు ఏదైనా పనిమీద చింతూరు రావాలంటే అష్టకష్టాలు, వ్యయప్రయాసలు తప్పడం లేదు. ● వరదల వల్ల ఆర్థికంగా నష్టపోయారు. వరి, పత్తి, మిరప పంటలు, పొగాకు నారుమళ్లు ముంచెత్తడంతో పెట్టుబడులు దక్కని పరిస్థితి. చాలాచోట్ల పొలాలు నదులను తలపిస్తున్నాయి. ఈ ఏడాది వరుస వరదలతో ఎన్నడూలేని విధంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీఆర్పురం: గోదావరి వరదలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. శ్రీరామగిరి, గుండుగూడెం, వడ్డుగూడెం, వడ్డుగూడెం కాలనీలో ఇళ్లు, సుమారు 500 ఎకరాల్లో వరినాట్లు నీటమునిగాయి. వరదలు సంభవించిన మూడు నెలల వ్యవధిలో ఒక్కసారి మాత్రమే నిత్యావసరాలు ఇచ్చి కూటమి ప్రభుత్వం చేతులు దులుపుకుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం బియ్యం కూడా ఇవ్వలేదని వాపోతున్నారు.ఎన్నో ఇబ్బందులు పడుతున్నాంవారంక్రితం ముకునూరు నుంచి పుట్టింటికి మోతుగూడెం వెళ్లా. ఇంతలో వరద వచ్చింది. రహదారి మునిగిపోవడంతో ఆటోల్లో చుట్టూ తిరిగి కాలినడకన వరద దాటి పడవపై గ్రామానికి చేరుకున్నా. – సున్నం సుభద్ర, ముకునూరు, చింతూరు మండలం పంటంతా నాశనమైంది వరద రాదని ఊహించి రెండెకరాల్లో వరి సాగు చేపట్టా. నారుమడి, యా త, ఎరువులకు రూ.50 వేల వరకు పెట్టుబడి పెట్టా. పొలం అంతా మునిగిపోయింది. ఈ ఏడాది తిండిగింజలు కష్టమే. – సవలం రామకృష్ణ,చూటూరు, చింతూరు మండలం అధికారులు పట్టించుకోలేదు వరద నీరు చుట్టుముట్టడంతో ఐదు రోజులుగా గ్రామం నుంచి ఎటూ వెళ్లలేని పరిస్థితి. నిత్యావసర సరకులు నిండుకోవడంతో అందరం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోలేదు. – ఎండీ జబ్బార్,ఏజీకొడేరు, చింతూరు మండలం మొత్తం మునిగిపోయింది వరద రాదనే ఊహించి ఎకరా భూమిలో వరినాట్లు వేశా. ఇప్పుడొచ్చిన వచ్చిన వరద మొత్తం ముంచేసింది. ఇప్పటి వరకు ఖర్చుపెట్టిన రూ.30 వేల పెట్టుబడి మొత్తం వరదపాలైంది. – పాయం పుల్లమ్మ,చూటూరు, చింతూరు మండలం పరిహారం ఇస్తే వెళ్లిపోతాం ప్రతిఏటా వరదల సమయంలో ప్రభుత్వం మమ్మల్ని అసలు పట్టించుకోవడంలేదు. ఇప్పటికై నా త్వరితగతిన పోలవరం పరిహారం అందించి పునరావాసం కల్పిస్తే వెళ్లిపోడానికి సిద్ధంగా ఉన్నాం – అగరం సుబ్బలక్ష్మి, సర్పంచ్, ఏజీకొడేరు, చింతూరు మండలం ఆస్పత్రికి వెళ్లేందుకు అవస్థలు కాళ్లవాపు రావడంతో అత్య వసరంగా ఆస్పత్రికి వెళ్లాల్సివచ్చింది. పడవపై సోకి లేరువాగు దాటి ఆటోలో వెళ్లి చింతూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేయించుకుని ఇబ్బందులు పడుతూ తిరిగి ఇంటికి బయలుదేరా. – గాలె కన్నారావు,రామన్నపాలెం, చింతూరు మండలం వరదనీరు చుట్టుముట్టడంతో ఇళ్లకే పరిమితం కనీసం నిత్యావసరాలు తెచ్చుకోలేని దుస్థితి పట్టించుకోని అధికార యంత్రాంగం సాయం అందక ఇబ్బందులు వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల ఆవేదన కనీసం పోలవరం పరిహారమైనా ఇచ్చి తరలించాలని వేడుకోలు -
నాణ్యమైన సేవలు అందించాలి
హుకుంపేట: ఆస్పత్రిలో నిత్యం అందుబాటులో ఉంటు గిరిజనులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్వో డా.విశ్వేశ్వరనాయుడు అన్నారు. బుధవారం స్థానిక పీహెచ్సీని తనిఖీ చేశారు. దీనిలో భాగంగా రికార్డులను పరిశీలించారు. రోగులనుంచి వైద్యసేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించి గిరిజనులకు సేవలందించాలని సూచించారు. ములియపుట్టులో జరిగిన స్వస్థ్ నారి సశక్త్ పరివార్ అభియన్ ప్రత్యేక వైద్య శిబిరాన్ని పరిశీలించారు. వైద్యాధికారి శ్రావణ్కుమార్, ఆరోగ్య విస్తరణ అధికారి సింహాద్రిపాత్రుడు పాల్గొన్నారు. -
విభిన్నంగా విజయదశమి
సాక్షి,పాడేరు: ఏజెన్సీలో గిరిజనుల జీవనశైలి మాదిరిగానే వారు జరుపుకునే పండగలకు ప్రత్యేకత ఉంటుంది. కొత్తపాడేరులో దసరా పండగతో పాటు ముందురోజు ఫిరంగుల పండగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పూర్వం బ్రిటిష్ పాలనలో గిరిజన గ్రామాల్లో ముఠాదారు వ్యవస్థ ఉండేది. అప్పట్లో ఈ ప్రాంతానికి చెందిన కిల్లు మాలంనాయుడు ముఠాదారుగా ఉండేవారు. యుద్ధ సమయంలో ఉపయోగించే ఫిరంగులకు బ్రిటిష్ వారు ఇక్కడ పూజలు చేసేవారని స్థానికులు చెబుతుంటారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత వారు దేశాన్ని విడిచి వెళ్లినప్పటికీ వారు రెండు ఫిరంగులను వదిలి వెళ్లారు. వీటిని అప్పట్లో కిల్లు మాలంనాయుడు ఇంట్లోని పూజ మందిరంలో కొలువుదీర్చారు. అప్పటినుంచి వాటికి పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఆయన మరణాంతరం పూజలు చేసే ఆచారాన్ని వారసులు, స్థానికులు కొనసాగిస్తూ ఫిరంగులకు ఆయుధపూజ చేస్తున్నారు. పాత పాడేరులోని కిల్లు కుశలంనాయుడు ఇంట్లోని పూజామందిరంలో ఫిరంగులు, కత్తులకు కూడా బుధవారం ఆయుధ పూజ చేస్తారు మొగలిదుర్గ, కనకదుర్గ అమ్మవార్లు.. పాతపాడేరులో స్వయంభూగా వెలసిన మొగలిదుర్గ, కనకదుర్గమ్మకు ఎంతో విశిష్టత ఉంది. వీటికి గిరిజనులు ఆలయం నిర్మించి, దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. కిల్లు, దుర్గపూజారి, గిడ్డి, జవ్వాది, పలాసి, అల్లంగి, దేశిది కుటుంబాలకు చెందిన ఏడుగులు గిరిజన పూజారులు ప్రత్యేక పూజలు చేస్తారు. వీటికి దసరా రోజున మేకపోతును బలిస్తారు. తలభాగాన్ని రాతి విగ్రహాల ఉంచి అమ్మవార్లను కొలుస్తారు. కొత్త, పాత పాడేరులో ముందురోజు ఫిరంగుల పండగ బ్రిటిష్ వారు విడిచివెళ్లిన ఆయుధాలకు పూజ అప్పటినుంచి ఆచారాన్ని కొనసాగిస్తున్న మాలంనాయుడు, కుశలంనాయుడు వారసులు -
ఇళ్లల్లోకి నీళ్లు
● గర్జించిన గోదావరి భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ● గ్రామాల్లోకి వరద నీరు ● భద్రాచలం వద్ద 50 అడుగులకు చేరిన నీటిమట్టం ● శబరి నదికి ఎగపోటు ● ముంపులో రహదారులు ● సుమారు 100 గ్రామాలకు నిలిచిన రాకపోకలుచింతూరు: గోదావరికి వరద మంగళవారం మరింత పెరగడంతో విలీన మండలాల్లోని గ్రామాల్లోకి వరదనీరు ప్రవేశిస్తోంది. ఇప్పటికే వీఆర్పురం మండలంలో శ్రీరామగిరి, గుండువారిగూడెం, వడ్డిగూడెం, కూనవరం మండలంలో ఉదయ్భాస్కర్ కాలనీ. గిన్నెలబజారు ఇళ్లలోకి నీరుచేరింది. దీంతో బాధితులు ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ● భద్రాచలం వద్ద మంగళవారం తెల్లవారుజామున గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అప్పటినుంచి గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతూ రాత్రికి 50 అడుగులకు చేరింది. కూనవరంలో గోదావరి నీటిమట్టం 46 అడుగులకు, చింతూరు వద్ద శబరినది నీటిమట్టం 35 అడుగులకు చేరి క్రమేపీ పెరుగుతున్నాయి. ● గోదావరి, శబరినదుల వరదనీరు రహదారులపై చేరడంతో చింతూరు డివిజన్లోని నాలుగు మండలాల్లో సుమారు వంద గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు రవాణా సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా భద్రాచలం నుంచి కూనవరం, చింతూరు నుంచి వీఆర్పురం, ఆంధ్రా నుంచి ఒడిశాకు రాకపోకలు నిలిచిపోవడంతో రవాణావ్యవస్థ స్తంభించింది. వరద మరింత పెరగడంతో నాలుగు మండలాల్లో మిరప, వరి పంటలతో పాటు పొగాకు, పత్తి పంటలు, నార్లు నీటమునిగాయి. చింతూరు మండలంలో.. గోదావరి ఎగపోటు కారణంగా చింతూరు మండలంలో శబరినది మంగళవారం మరింత పెరిగింది. దీంతో పలువాగుల వరద రహదారుల పైకి మరింత చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ● కుయిగూరువాగు వరద జాతీయ రహదారి–326పై చేరడంతో ఆంధ్రా నుంచి ఒడిశాకు, మండలంలోని కుయిగూరు, కల్లేరు, మదుగూరు, సూరన్నగొంది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ● సోకిలేరు, జల్లివారిగూడెం, చీకటివాగుల వరద కారణంగా చింతూరు నుంచి వీఆర్పురం, మండలంలోని నర్సింగపేట, ముకునూరు, చూటూరు, రామన్నపాలెం, చినశీతనపల్లి, కొండపల్లి, బొడ్రాయిగూడెం, పెదశీతనపల్లి, తిమ్మిరిగూడెం, ఏజీకొడేరు, ఉలుమూరు, మల్లెతోట గ్రామాలకు కూడా రాకపోకలు స్తంభించాయి. దీంతోపాటు చంద్రవంకవాగు వల్ల కుమ్మూరుకు రాకపోకలు ఆగిపోయాయి. చింతూరు నుంచి కంసులూరు వెళ్లే రహదారిపై వరదనీరు చేరడంతో ఆ వైపుగా కూడా రాకపోకలు నిలిచిపోవడంతో ఎర్రంపేట, కారంగూడెం మీదుగా ప్రయాణం సాగిస్తున్నారు. వరదనీరు రహదారిపై చేరడంతో సోకిలేరువాగు అవతల ఉన్న గ్రామాల ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో నాటుపడవపై ప్రయాణం సాగిస్తున్నారు. కూనవరం: శబరి, గోదావరి వరద కారణంగా కూనవరం – భద్రాచలం ప్రధాన రహదారిలో పోలిపాక వద్ద మంగళవారం వరద నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. కొండ్రాజుపేట రహదారిపై ఐదో రోజు కూడా వరదనీరు కొనసాగుతోంది. కోడ్రాజుపేట – వెంకన్నగూడెం మధ్యలో కాజ్వే పైకి వరద నీరు చేరడంతో ఈ మార్గంలో రాకపోకలు బంద్ అయ్యాయి. గత ఐదురోజుల నుంచి కొండ్రాజుపేట, వాల్ఫర్డ్పేట, శబరి కొత్తగూడెం, పూసుగూడెం, కొత్తూరు, శ్రీరామపురం, ఆంబోతులగూడెం, జిన్నెలగూడెం, బండారు గూడెం, పెదార్కూరు కిందిగుంపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉదయ భాస్కర్ కాలనీ, గిన్నెల బజారులోకి వరద నీరు చేరుతుండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా 18 కుటుంబాలను టేకులబోరులో ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలలోకి తరలించారు. అర్ధరాత్రికి కూనవరం– చట్టి మార్గం ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో జగన్నాథరావు సూచించారు. వీఆర్పురం: గోదావరి, శబరి వరదల నీరు గ్రామాల్లోని ఇళ్లలోకి వచ్చేస్తోంది. శ్రీరామగిరిలో నాలుగు, గుండుగూడెంలో 2, వడ్డుగూడెంలో మూడు ఇళ్లల్లోకి నీరే రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మిగతా ఇళ్లల్లోకి కూడా నీరు వచ్చేసి పరిస్థితి కనిపిస్తోంది. మండలంలో సుమారు 500 ఎకరాల్లో వరి, పొగాకు నాట్లు నీటమునగడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వం ఆదుకోవాలి వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని సర్పంచ్ పిట్టా రామారావు, పీసా కమిటీ ఉపాధ్యక్షుడు కోటం జయరాజు ఆరోపించారు. గత మూడు నెలలుగా మూడు పంచాయతీల పరిధిలో గ్రామాలు నీటిలోనే ఉన్నా.. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదని విమర్శించారు. బాధిత కుటుంబానికి బియ్యం, నిత్యావసర సరకులతోపాటు రూ.10 వేల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు.గోదావరి వరద తీవ్ర రూపం దాలుస్తుండటంతో విలీన మండలాల ప్రజలు వణికిపోతున్నారు. భద్రాచలం వద్ద నీటిమట్టం 50 అడుగులకు చేరడంతో శబరి నది ఎగపోటుకు వాగులు ఉప్పొంగాయి. రహదారులు ముంపునకు గురికావడంతో సుమారు వంద గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లల్లోకి నీళ్లు వచ్చేస్తుండటంతో దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది -
పోటెత్తిన కొండగెడ్డలు
● చట్రాపల్లి, పెట్రాయి గ్రామాల్లోకి వరద నీరు ● ఆందోళనకు గురైన ఆయా గ్రామాల గిరిజనులు సీలేరు: గూడెం కొత్తవీధి మండలం చట్రాపల్లి, పెట్రామి గ్రామాల్లోకి కొండగెడ్డల నీరు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి కొండగెడ్డలు పోటెత్తాయి. గతేడాది సెప్టెంబర్లో ఈ రెండు గ్రామాల్లో వరద ఉధృతికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పుడు కూడా అదేస్థాయిలో వర్షం కురవడంతో ఆయా గ్రామాల గిరిజనులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి మరోచోట పునరావాసం కల్పిస్తామని గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని వారు కోరుతున్నారు. -
గోదావరి వరదలో ఆశల గల్లంతు
ఎటపాక: గోదావరి వరద మిర్చి రైతుల ఆశలు గల్లంతు చేసింది. ఎంతో వ్యవ ప్రయాసలకోర్చి చేపట్టిన సాగును ముంచెత్తింది. కోటి ఆశలతో సాగు చేపట్టిన రైతులకు గోదావరి వరద కన్నీరు మిగిల్చింది. మండలంలోవరి, పత్తి, మిరపను సుమారు 9వేల ఎకరాల్లో సాగు చేపట్టారు. ఈనేపథ్యంలో గోదావరి వరద భద్రాచలం వద్ద మంగళవారం సాయంత్రం 5గంటలకు 50 అడుగులకు చేరుకోవడంతో లోతట్టు ప్రాంతంలోని వందల ఎకరాల్లో పైరు ముంపునకు గురైంది. ఎటపాక, రాయనపేట, చోడవరం, నెల్లిపాక, తోటపల్లి, గన్నవరం, గౌరిదేవిపేట, నందిగామ, మురుమూరు గ్రామాల పరిధిలో సుమారు 180 ఎకరాల్లో మిర్చి పైరు నీటమునిగింది. తోటపల్లి, నెల్లిపాక, వీరాయిగూడెం, గొల్లగూడెం ప్రాంతాల్లో 104 ఎకరాల్లో వరి, 25 ఎకరాల్లో పత్తి పంటలు నీటమునిగినట్టుగా వ్యవసాయాధికారులు గుర్తించారు. నెల్లిపాక ప్రాంతంలో మల్చింగ్ విధానంలో సాగు చేపట్టిన మిర్చికు తీవ్ర నష్టం వాటిల్లింది. వరద నీటిలో డ్రిప్ పైపులు తేలియాడటం, మిర్చి మొక్కలు కుళ్లిపోవడాన్ని చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ● భద్రాచలం వద్ద గోదావరి వరద ఉగ్రరూపం దాల్చడంతో కూనవరం– భద్రాచలం ప్రధాన రహదారి, మురుమూరు, నందిగామ, నెల్లిపాక వద్ద రహదారి ముంపునకు గురైంది. రాయనపేట వద్ద జాతీయరహదారిపైకి వరద చేరింది. రహదారులు నీట మునగడంతో మండలంలో పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మురుమూరు, నందిగామ గ్రామాలకు తహసీల్దార్ సుబ్బారావు, ఇతర అధికారులు పడవలపై వెళ్లారు. ప్రజలను అప్రమత్తం చేశారు. మిర్చి రైతుకు కన్నీళ్లు -
అప్పన్న జమ్మివేట ఉత్సవం రేపు
సింహాచలం: విజయదశమి పర్వదినం పురస్కరించుకుని గురువారం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి జమ్మివేట ఉత్సవం వైభవంగా జరగనుంది. కొండ దిగువన ఉన్న పూలతోటలో ఈ ఉత్సవాన్ని నిర్వహించేందుకు దేవస్థానం ఈవో వి.త్రినాథరావు పర్యవేక్షణలో ఇంజినీరింగ్ అధికారులు విశేష ఏర్పాట్లు చేస్తున్నారు. పూలతోటలోని ప్రధాన మండపానికి, శ్రీకృష్ణ కొలనుకు నూతనంగా రంగులు వేశారు. పారిశుధ్య పనులు నిర్వహించడంతో పాటు, పెద్ద ఎత్తున విద్యుద్దీపాలంకరణ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గోపాలపట్నం పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. ఉత్సవం జరిగే తీరు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామికి రామాలంకారం చేసి గురువారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో సింహగిరి నుంచి మెట్ల మార్గంలో పల్లకీలో కొండ దిగువకు తీసుకొస్తారు. కొండదిగువ ఉన్న పూలతోటలోని ప్రధాన మండపంలో స్వామిని అధిష్టింపజేస్తారు. సాయంత్రం పూలతోటలోని శమీ వృక్షం చెంతన శమీ పూజ నిర్వహిస్తారు. అనంతరం ఆ శమీ దళాలను స్వామి చెంతన ఉంచి ప్రత్యేక పూజలు చేసి, జమ్మివేట ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత స్వామిని పుష్కరిణి మండపం వద్దకు తీసుకొచ్చి, అక్కడ ఉండే అశ్వవాహనంపై అధిష్టింపజేస్తారు. అనంతరం అడవివరం గ్రామంలో స్వామికి అశ్వవాహనంపై గ్రామ తిరువీధి నిర్వహిస్తారు. అర్ధరాత్రి సమయంలో స్వామిని తిరిగి కొండపైకి చేరుస్తారు. జమ్మివేట ఉత్సవాన్ని పురస్కరించుకుని గురువారం సింహగిరిపై స్వామి దర్శనాలు సాయంత్రం 6 గంటల వరకే భక్తులకు లభిస్తాయని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. ముస్తాబయిన పూలతోట రామాలంకారంలో దర్శనమివ్వనున్న శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి రేపు సాయంత్రం 6 గంటల వరకే స్వామి దర్శనాలు -
సీఈటీఏతో అదనపు ప్రయోజనాలు
ఏయూక్యాంపస్: భారత్–యూకేల మధ్య ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ)పై విశాఖ ప్రత్యేక ఆర్థిక మండలి(వీఎస్ఈజెడ్) ఆధ్వర్యంలో నోవాటెల్ హోటల్లో మంగళవారం ఔట్రీచ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీఎస్ఈజెడ్ జోనల్ డెవలప్మెంట్ కమిషనర్ శ్రీనివాస్ ముప్పాల సీఈటీఏ వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. రూల్ ఆఫ్ ఆరిజిన్, పబ్లిక్ ప్రొక్యూర్మెంట్, సేవల కోసం మార్కెట్ యాక్సెస్, వస్తువులకు సుంకం లేని యాక్సెస్ వంటి కీలక అంశాలను వివరించారు. జాయింట్ డెవలప్మెంట్ కమిషనర్ రోషిణి కోరాటి మాట్లాడుతూ ఎగుమతిదారుల్లో అవగాహన పెంచడానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ మాట్లాడుతూ భారత్–యూకే సీఈటీఏ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ఎగుమతిదారులకు లభించే ప్రత్యేక ప్రయోజనాలను వివరించారు. రాయల్బరో ఆఫ్ కెన్సింగ్టన్(లండన్) డిప్యూటీ మేయర్ అరీన్ ఉదయ్ ఆరేటి మాట్లాడుతూ భారతీయ ఎగుమతిదారులు వ్యవసాయ, ఆహార శుద్ధి రంగాల్లో నాణ్యతా ప్రమాణాలను మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. నూతన ఒప్పందం ఫలితంగా రెండు దేశాలకు మేలు జరుగుతుందని తెలిపారు. వీఎస్ఈజెడ్ డిప్యూటీ డెవలప్మెంట్ కమిషనర్ ఎ.వి.శివ ప్రసాద్రెడ్డి ‘భారతీయ ఎగుమతిదారులకు అవకాశాలు’అనే అంశంపై ప్రసంగించారు. కార్యక్రమంలో శ్రావణ్ షిప్పింగ్ మేనేజింగ్ డైరెక్టర్ జి. సాంబశివరావు, ఈపీసీఈఎస్ చైర్మన్ శ్రీకాంత్ బడిత తమ ఆలోచనలను పంచుకున్నారు. -
సబ్కలెక్టర్ ఉత్తర్వులపై రైతుల హర్షం
ఎటపాక: ప్రభుత్వ, ఇతరుల భూములు ఆక్రమించడం, స్వాధీనానికి ప్రయత్నించడం చట్టరీత్యా నేరమని సబ్కలెక్టర్ శుభంనోఖ్వాల్ ఉత్తర్వులు జారీ చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మండలంలోని నందిగామలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఇందుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. నందిగామ,మురుమూరు ప్రాంతాల్లో గతంలో పోలవరం భూనష్టపరిహారం పొందిన భూముల్లో ఇటీవల కొందరు జెండాలు ఏర్పాటు చేసి ఆక్రమణలకు పాల్పడ్డారని తెలిపారు. అయితే ఈవిషయంపై సదరు భూ యజమానులు తమకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ దినేష్కుమార్ను ఆశ్రయించారు. ఈమేరకు కలెక్టర్ ఆదేశాలతో చింతూరు సబ్కలెక్టర్ తగు ఉత్తర్వులు జారీ చేసినట్లు రైతులు తెలిపారు. 2013 భూసేకరణ చట్టప్రకారం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో నష్టపోతున్న భూములకు పరిహారం పొందిన సదరు రైతులే సాగుచేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం సేకరించిన భూముల రైతులకు అన్ని రకాల పరిహారం ఇచ్చి ఈప్రాంతం నుంచి తరలించేవరకు అట్టి భూములు పూర్వ యజమానుల స్వాధీనంలోనే ఉంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల్లోకి ఇతరులు ప్రవేశించడం, ఆక్రమించడం చట్టరీత్య నేరమని ఉత్తర్వుల్లో తెలిపారని రైతులు వివరించారు. ఈ సమావేశంలో మండల ఉపాధ్యక్షుడు దొంతు మంగేశ్వరరావు, సొసైటీ చైర్మన్ రాజేష్, రైతులు చండ్ర రఘు, పెనుబల్లి సాయిబాబు, పులుసు కొండలరావు, సీతయ్య, వెంకన్న, గొడపర్తి చిననాగయ్య, వాసు, సత్యప్రసాద్ పాల్గొన్నారు.మాట్లాడుతున్న మండల ఉపాధ్యక్షుడు మంగేశ్వరరావు -
వాణిజ్యాన్ని గాలికొదిలేశారు
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో అత్యధిక ఆదాయాన్ని అందించే రెండో డివిజన్. చంద్రబాబు పదే పదే ఆర్థిక రాజధాని నగరమని చెప్పే ప్రాంతం.. దీనికి తోడు.. కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణల అమలు కసరత్తులు.. ఇలా.. నిరంతర పనిభారం ఉన్న డివిజన్పై కూటమి ప్రభుత్వం కినుక వహిస్తోంది. అత్యంత కీలకమైన వాణిజ్య పన్నుల డివిజన్ ప్రధాన కార్యాలయంలో ప్రధాన పోస్టుల భర్తీ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మూడు నెలలుగా.. ఉన్నతాధికారుల పోస్టులు ఖాళీగా ఉండటంతో కార్యాలయంలో జాయింట్ కమిషనర్ సహా ప్రతి ఒక్కరిపైనా పనిభారం పెరిగిపోతోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు విశాఖ డివిజన్ పరిధిలోకి వస్తాయి. విశాఖ జిల్లాని మొత్తం 8 సర్కిల్స్గా విభజించి జీఎస్టీ వసూలు చేసేవారు. విశాఖ మహా నగర పరిధిలో మొత్తం 7 సర్కిల్స్, రూరల్ జిల్లాలోని మండలాలన్నీ కలిపి ఒక సర్కిల్ (అనకాపల్లి) మొత్తం 8 సర్కిల్స్ పరిధిలో 42 వేల మంది డీలర్స్ నుంచి పన్ను వసూళ్లు జరిగేవి. అయితే విశాఖ జిల్లాను మూడు జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం విభజించింది. ఈ నేపథ్యంలో డివిజన్లో ఉన్న ఎనిమిది సర్కిల్స్ని 14 సర్కిల్స్గా విభజించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మొత్తాన్ని ఒక సర్కిల్గా ఏర్పాటు చేసి దీనికి పాడేరు సర్కిల్ అని పేరుని సూచించారు. అదేవిధంగా అనకాపల్లి జిల్లాను రెండు సర్కిల్స్గా విభజించారు. ఒకటి అనకాపల్లి సర్కిల్, రెండు అచ్యుతాపురం సర్కిల్గా నామకరణం చేశారు. ఇక మిగిలిన విశాఖ జిల్లాను మొత్తం 11 సర్కిల్స్గా విభజించారు. ప్రస్తుతం జీవీఎంసీ పరిధిలో ఉన్న వార్డులతో పాటు జిల్లా పరిధిలో ఉన్న ఆనందపురం, భీమిలి మండలాల్ని కలుపుకొని విభజన చేపట్టారు. కొత్తగా భీమిలి, మాధవధార, ఎయిర్పోర్టు సర్కిల్ని ఏర్పాటు చేశారు. వీటికితోడుగా గాజువాక, సిరిపురం, కురుపాం, డాబాగార్డెన్స్, ద్వారకానగర్, సిరిపురం, చినవాల్తేరు, స్టీల్ప్లాంట్ సర్కిల్స్గా విభజించారు. ప్రస్తుతం ఉన్న గాజువాక సర్కిల్ని గాజువాక, ఎయిర్పోర్టుగా విభజించారు. ప్రతి సర్కిల్ నుంచి దాదాపు సమాన ఆదాయం వచ్చేలా సర్దుబాటు చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నంత వరకూ అధికారుల నియామకాలు సక్రమంగా నిర్వహించారు. కూటమి వచ్చిన తర్వాత డివిజన్ని గాలికొదిలేసింది. ఏడాదికి పైగా ముక్కుతూ మూలుగుతూ.. డివిజన్ విభజన సమయంలో జాయింట్ కమిషనర్ పోస్టులను రెండుగా విభజించారు. జేసీ–1గా ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2023లో జేసీ–1గా ఓ.ఆనంద్ వ్యవహరించారు. జేసీ–2గా సుధాకర్ విధులు నిర్వర్తించారు. ఆనంద్ని 2024 ఎన్నికల తర్వాత బదిలీ అయ్యారు. అప్పటి నుంచి రెగ్యులర్ జాయింట్ కమిషనర్ను నియమించలేదు. జేసీ–2గా సుధాకర్ స్థానంలో కిరణ్కుమార్ని నియమించారు. మూడు నెలల క్రితం జేసీ–2గా కిరణ్కుమార్ స్థానంలో శేషాద్రిని నియమించారు. కానీ.. జేసీ–1 నియామకం విషయంలో నిర్లక్ష్యం వహించారు. ఇప్పటి వరకూ జేసీ–1తో పాటు ఆయన విభాగంలో పనిచేసే మిగిలిన అదికారుల నియామకంపైనా కూటమి ప్రభుత్వం శీతకన్ను వేసింది. జేసీ–1తో పాటు.. డిప్యూటీ కమిషనర్–1, డిప్యూటీ కమిషనర్–2, నలుగురు అసిస్టెంట్ కమిషనర్లు(సీటీవోలు) పోస్టుల్లో విధులు నిర్వర్తించిన వారిని మూడు నెలల క్రితం బదిలీ చేసి వారి స్థానాల్ని ఇంతవరకూ భర్తీ చెయ్యలేదు. దీంతో జేసీ–1 పరిధిలో ఉన్న ఐదుగురు అధికారులు నిర్వర్తించే విధులన్నీ ఒకే అధికారిపై భారం పడింది. దీంతో వాణిజ్య పన్నుల శాఖ డివిజన్ కార్యాలయంలో ఫైళ్లు భారంగా కదులుతున్నాయి. జీఎస్టీ సంస్కరణలు వచ్చిన తర్వాత పని ఒత్తిడి మరింత పెరిగింది. దీంతో జేసీ–2తో పాటు ఇతర విభాగాల్లో ఉన్న అందరు ఉద్యోగులు నిరంతరం పనిచెయ్యాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఉద్యోగులకు వారాంతపు సెలవులు కూడా లేకుండా పనిచేస్తున్నారనీ.. వెంటనే ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చెయ్యాలని అసోసియేషన్లు ప్రభుత్వానికి పదే పదే నివేదించినా ఎలాంటి స్పందన లేదు. దీంతో.. అతి పెద్ద డివిజన్లో పనుల నిర్వహణ ఒత్తిడితో ఉద్యోగులు, అధికారులు సతమతమవుతూ అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి.. తక్షణమే అధికారుల పోస్టులు భర్తీ చెయ్యాలని వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
రైల్వే విశ్రాంత ఉద్యోగి నేత్రాలు దానం
పెందుర్తి: మరణించిన తన తండ్రి నేత్రాలను దానం చేసి ఇద్దరు కుమారులు పెద్ద మనసును చాటుకున్నారు. పెందుర్తిలోని వెలమతోటలో నివాసం ఉంటున్న రైల్వే విశ్రాంత ఉద్యోగి నేమాని భవానీశంకరం(84) మంగళవారం ఉదయం మృతి చెందారు. దీంతో సాయి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు దాడి శ్రీనివాస్ నేత్రదానం కోసం మృతుని కుటుంబాన్ని సంప్రదించారు. దీంతో తండ్రి నేత్రాలను దానం చేయడానికి కుమారులు నేమాని రాంబాబు, వంశీ అంగీకారం తెలిపారు. దీంతో ఎల్వీ ప్రసాద్ మోషిన్ ఐబ్యాంక్ ప్రతినిధి కృష్ణ.. భవానీశంకరం నేత్రాల(కార్నియా)ను సేకరించారు. తండ్రి నేత్రాలను దానం చేసి ఇద్దరు అంధులకు చూపు అందించేందుకు సహకరించిన కుమారులను పలువురు ప్రశంసించారు. -
మాదక ద్రవ్యాలతోపట్టుబడితే కఠిన చర్యలు
● పాడేరు డీఎస్పీ షహబాజ్ అహ్మద్ డుంబ్రిగుడ: గంజాయి వంటి మాదకద్రవ్యాలతో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని పాడేరు డీఎస్పీ షెహబాజ్ అహ్మద్ హెచ్చరించారు. స్థానిక ఎస్ఐ కె.పాపినాయుడు ఆధ్వర్యంలో పోతంగి పంచాయతీ కోసంగిలో మంగళవారం గిరిజనులతో మాట్లాడారు. గంజాయితో పట్టుబడితే జైలు తప్పదని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చట్టరీత్యా నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలతోపాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. సర్పంచ్ వి.వెంకటరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
108లో ప్రసవం
ఎటపాక: పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణిని భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా 108లో ప్రసవించిన ఘటన మంగళవారం ఎటపాక మండలం గుండాల గ్రామ సమీపంలో జరిగింది. కుసుమనపల్లి గ్రామానికి చెందిన గుండి శ్యామలకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇచ్చారు. అయితే గోదావరి వరద రహదారిని ముంచెత్తడంతో తోటపల్లి నుంచి నెల్లిపాక మీదుగా భద్రాచలం వెళ్లేందుకు రహదారి లేదు. దీంతో పండువారిగూడెం నుంచి రామగోపాలపురం వెళ్లి అక్కడ నుంచి భద్రాచలం తీసుకెళ్తుండగా గుండాల గ్రామం సమీపంలో శ్యామలకు పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో వాహనాన్ని రహదారి పక్కన నిలిపి ఆశా కార్యకర్త సాయంతో ఈఎంటీ లక్ష్మణ్సింగ్, పైలట్ మహేష్ గర్భిణికి ప్రసవం చేశారు. ఆమె మగబిడ్డను ప్రసవించింది. బిడ్డ, తల్లి క్షేమంగా ఉండడంతో చికిత్స కోసం భద్రాచలం తరలించారు. -
తోడపెద్దుకు కన్నీటి వీడ్కోలు
మునగపాక: నందీశ్వరుడిగా.. సింహాద్రప్పన్నగా ఆరాధించే తోడపెద్దు సోమవారం రాత్రి కన్నుమూసింది. మునగపాకలో ఆడారి జగ్గప్పకు చెందిన ఈ తోడపెద్దు అనారోగ్యానికి గురైంది. కొద్ది రోజులుగా వైద్య సేవలందించినా ఫలితం లేకుండా పోయింది. మునగపాక ఆస్పత్రి రోడ్డు నుంచి గ్రామంలో పలు సేవ గరిడీలతో అంతిమయాత్ర నిర్వహించారు. ఈ ఊరేగింపు యాత్రలో గ్రామస్తులు గోవిందా..గోవిందా అంటూ నామస్మరణతో తోడపెద్దుకు చేతులు జోడించి దండాలు పెడుతూ కన్నీటి వీడ్కోలు పలికారు. అనంతరం నందీశ్వర కళా ప్రాంగణం దరి పాన్పు చేపట్టారు. -
కొట్టుకుపోయిన వంతెన.. నిలిచిన రాకపోకలు
కొట్టుకుపోయిన గంగవరం వంతెన సీలేరులో కురుస్తున్న వర్షంసీలేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా,జీకే విధి మండలం,దారకొండ పంచాయతీలో మంగళవారం తెల్లవారుజామున ఎడతెరిపి లేకుండా నాలుగు గంటల పాటు ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. ఆంధ్రా ఒడిశా సరిహద్దు సీలేరు అటవీ ప్రాంతం సప్పర్ల రెంగేజ్ దారులమ్మ తల్లి ఘాట్రోడ్డు ఇలా అన్ని ప్రాంతాలు భారీ వర్షంతో జలమమమయ్యాయి. పెద్ద ఎత్తున భారీ వర్షం కురవడంతో స్థానికలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దారకొండ సీలేరు ప్రాంతాల్లో రోడ్లపైకి పెద్ద ఎత్తున వర్షపు నీరు ప్రవహించింది. డ్రైనేజీలో మురుగునీరు రోడ్లపైకి రావడంతో దిగునున్న ఇళ్లల్లోకి ప్రవహించింది. కొట్టుకుపోయిన చిన్న గంగవరం వంతెన మంగళవారం తెల్లవారుజామున ఎడతెరిపి లేకుండా ఉరుములతో కురిసిన భారీ వర్షానికి సీలేరు దుప్పులవాడ గుమ్మరేవుల పంచాయతీలో పలు వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహించాయి. దారకొండ పంచాయతీ చిన్న గంగవరం గ్రామం మీద ఒడిశా వెళ్లే ప్రధాన వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఉధృతంగా వరదలు నీరు ప్రయాణించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గత సెప్టెంబర్లో ఈ వంతెన కొట్టుకుపోయి నేటికీ ఏడాదిన్నర దాటుతున్న ఆ ప్రాంత ప్రజలు కలెక్టర్. ప్రభుత్వాన్ని పలుమార్లు వంతెన నిర్మించాలని కోరిన పట్టించుకోవడం లేదు. దీంతో గిరిజనులు తాత్కాలికంగా వంతెన నిర్మించి రాకపోకలు సాగిస్తున్నారు. అయినప్పటికీ ఇలా వర్షాలు కురిసినప్పుడు ప్రతీసారి కొట్టుకుపోవడంతో నాలుగైదు రోజులు రాకపోకలు నిలిచిపోయి నిత్యావసరకులు అందక ఇబ్బందులు పడుతున్నామని పలువురు చెబుతున్నారు. భారీ వర్షానికి బ్రిడ్జీ పై నుంచి వర్షపు నీరు ప్రవహించింది. పిల్లిగడ్డ వాగు నుంచి భారీ వర్షం నీరు సీలేరు రిజర్వాయర్లోకి చేరింది. నిమ్మచెట్టు, తోకరాయి గ్రామాల్లో కూడా వరదనీరు భారీగా వచ్చినట్టు స్థానికులు తెలిపారు. దారాలమ్మ ఘాట్ రోడ్డులో కురిసిన వర్షపు కొంగపాకల. మాదిగమల్లు వంతల నుంచి వర్షపు నీరు దిగునున్న రిజర్వాయర్లోకి ప్రవహించింది. వంతెన తక్షణమే నిర్మించాలి ఆంధ్ర–ఒడిశా సరిహద్దు గిరిజనులకు ప్రధాన రహదారైన చిన్న గంగవరం వంతెన తక్షణమే నిర్మించాలని స్థానికులు, గిరిజన సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో కొట్టుకుపోయిన వంతెన ఇప్పటివరకు నిర్మించకపోవడం గిరిజన గ్రామాల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో తెలుస్తుందన్నారు. ఏడాదిగా ఈ వంతెన నిర్మించాలని కోరుతున్నా అధికారులు, ప్రభుత్వం స్పందించడం లేదంటున్నారు. అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించినప్పటికీ అనుమతులు రాకపోవడంతో ఈ ప్రాంత గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి గిరిజన సంఘం అధ్యక్షుడు పాంగి నాగేశ్వరరావు, సీపీఐ మండలం కార్యదర్శి కవర్ల భగవాన్, వార్డ్ సభ్యుడు బలరాం అధికారులకు డిమాండ్ చేస్తున్నారు. రాజవొమ్మంగిలో భారీ వర్షం రాజవొమ్మంగి: రాజవొమ్మంగి పరిసర ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో పల్లపు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. మట్టిరోడ్లు చిత్తడిగా మారడంతో ప్రజలు నానా ఇబ్బంది పడ్డారు. కాగా ఈ వర్షం వరి పంటకు మేలు చేస్తుందని రైతులు చెబుతున్నారు. మరోవైపు పంటలపై ఆశించే తెగుళ్లు,, పురుగులు ఈ వర్షం వల్ల అదుపులోకి వస్తాయని చెబుతున్నారు. ఇదిలా ఉండగా రెండు రోజులుగా మండలంలో నెలకొన్న పొడి వాతావరణానికి రైతులు తమ పొలాలకు ఎరువులు వెదజల్లే పనిలో పడ్డారు. అలాగే తెగుళ్లు పురుగు మందులు పిచికారీ చేశారు. అయితే ఉన్నట్లుండి భారీ వర్షం కువరడంతో పిండి, రసాయన మందులు కొట్టుకొని పోయాయని, దీంతో నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.రాజవొమ్మంగిలో కురుస్తున్న వర్షం భారీ వర్షానికి కోతకు గురైన గంగవరం బ్రిడ్జి అగ్రహారం బ్రిడ్జిపై నుంచి ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్న వరదనీరు నిత్యావసర సరకులు అందక గిరిజనుల అవస్థలు -
ఉద్యానవనాల పెంపకంతో మంచి ఆదాయం
చింతపల్లి: గిరిజన రైతాంగం ఉద్యానవన మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని విశాఖ పోర్టు అథారిటీ ఉద్యానవన జీఎండీ రాధిక సూచించారు. మంగళవారం విశాఖ పోర్టు అథారిటీ, విశాఖ జిల్లా నవనిర్మాణ సంస్థ స్వచ్ఛత పక్వాడా కార్యక్రమంలో భాగంగా చౌడుపల్లి పంచాయతీ పరిధిలోని వాముగెడ్డ, చీకటిమామిడి, పినకొత్తూరులో గిరిజన రైతులకు 3,500 మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గిరి రైతులకు ఉద్యానవన పంటలతో పాటు కాఫీసాగుకు అనువుగా ఉండేలా మామిడి, చింత, బాదం, నేరేడు, సీతాఫలం, సపోటా, వేప మొక్కలు అందిస్తున్నామన్నారు. వీటి పెంపకం ద్వారా గిరిజన రైతులు రానున్న రోజుల్లో మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుందన్నారు. గ్రామాల్లో మంచినీటి సౌకర్యం కల్పించేందుకు నవనిర్మాణ సంస్థ చొరవ చూపాలని ఆ సంస్థ సీనియర్ మేనేజర్ కుమార్ను గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో విశాఖ పోర్టు అథారిటీ సీనియర్ వీవీ సాంబమూర్తి, ఉద్యానవన అధికారి భాస్కర్, గిరిజన సంఘ మండల అధ్యక్షుడు సాగిన చిరంజీవి పడాల్ పాల్గొన్నారు. -
వెల్లువెత్తిన అర్జీలు
● ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గిరిజనుల ఫిర్యాదులు ● ఐటీడీఏ పీవో స్మరణ్రాజ్కు గ్రామస్తుల వినతులు రంపచోడవరం: రంపచోడవరం మండలం పెద్దగెద్దాడ పంచాయతీ పరిధిలో 25 మంది గిరిజనులకు అటవీ హక్కుల చట్టం ద్వారా పట్టాలు మంజూరు చేసిన భూమి సరిహద్దులు చూపలేదని సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గిరిజనులు ఫిర్యాదు చేశారు. రంపచోడవరం ఐటీడీఏ సమావేశపు హాలులో పీవో స్మరణ్రాజ్ గ్రీవెన్స్ నిర్వహించారు. పలు సమస్యల అర్జీలను పీవోకు అందజేశారు. ఈ వారం 82 మంది అర్జీలు అందజేసినట్లు పీవో తెలిపారు. పెద్దగెద్దాడ–చెరువుపాలెం గ్రామాల మధ్య నాలుగు కిలోమీటర్లు తారురోడ్డు నిర్మించాలని కోరారు. అలాగే 400 ఎకరాలకు సాగు నీరందించే నిమ్మల కాలువ డ్యామ్కు మరమ్మతులు చేయించాలని, డోకుల పాడు గ్రామంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్పార్మర్ మార్చాలని పీసా కమిటీ ఉపాధ్యక్షుడు కడబాల ఈశ్వరరావు, అన్నిక అప్పారావు, ఉగ్గిరాల బుల్లబ్బాయి, గంగిరెడ్డి తదితరులు కోరారు. మారేడుమిల్లి మండలం ఇవ్వంపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి పక్కా భవనం ఏర్పాటు చేయాలని రేవల జానికిరెడ్డి, పల్లాల భూపతిరెడ్డి అర్జీ అందజేశారు. వై.రామవరం మండలం చింతలపూడి పంచాయతీలోని బొడ్డగుంట కన్నెరు వారుపై వంతెన నిర్మించాలని సర్పంచ్ పల్లాల సన్యాసమ్మ అర్జీ అందజేశారు. తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉన్న రేషన్ షాపులకు డీలర్లను నియమించాలని ఎస్.సింధూ, దుర్గాదేవి, మల్లేశ్వరీలు కోరారు. 2014 నుంచి 2018 వరకు మంజూరు చేసిన గృహాల పనులు పూర్తి చేయాలని కోసు లచ్చన్నదొర పీవోకు అర్జీ అందజేశారు. ఏపీవో డి.ఎన్.వి.రమణ, ఎస్.డి.సి. పి.అంబేడ్కర్, సబ్ డీఎఫ్వో అనూష, ఏజెన్సీ డీఈవో వై.మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి ఏజెన్సీలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రంపచోడవరం ఐటీడీఏ సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయంలోకి వెళ్లి తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. దీనిపై పీవో స్మరణ్రాజ్ స్పందించి వారితో మాట్లాడారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. సమస్యలతో కూడి వినతిపత్రాన్ని పీవోకు అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రామరాజు మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 30 ఏళ్లుగా విద్యార్థులకు నాణ్యమైన వంట వండి పెడుతు వారి ఆరోగ్యాలను కాపాడుతూ రోజుకు 14 గంటలు పనిచేస్తున్నారన్నారు. -
మెరుగు పేరుతో ఘరానా మోసం
కూర్మన్నపాలెం: పాత బంగారు, వెండి ఆభరణాలకు మెరుగు పెడతామని నమ్మించి.. మహిళను మోసం చేసిన అంతర్ జిల్లా ఘరానా మోసగాడు ముదేరినవారి రమణను దువ్వాడ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 24 తులాల బంగారు ఆభరణాలను, నగదును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం సౌత్ సబ్ డివిజన్ క్రైం ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధి ప్రశాంతినగర్లో స్టీల్ప్లాంట్ జనరల్ మేనేజర్ నివాసం ఉంటున్నారు. అతని భార్య వద్దకు ఈ ఏడాది జూలై 15న ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారు. పాత బంగారు ఆభరణాలకు కొత్త మెరుపు తీసుకువస్తామని, తమ వద్ద ఉన్న నమూనాలను చూపి నమ్మించారు. వారి మాటలు విశ్వసించిన ఆమె.. తన వద్ద ఉన్న సుమారు 24 తులాల బంగారు ఆభరణాలను వారికి ఇచ్చింది. నిందితులు ఆ ఆభరణాలను ఒక మట్టి కుండలో పెట్టి, ఏదో రసాయన ద్రావణంలో ముంచినట్లు నాటకమాడారు. అనంతరం ఆ కుండకు ఒక తెల్లని వస్త్రం చుట్టి.. ‘ఈ కుండను 10 రోజుల పాటు ఇంటి ఈశాన్య దిశలో సూర్యరశ్మి తగలకుండా ఉంచి, 11వ రోజున తెరవాలి’అని చెప్పి అక్కడి నుంచి ఉడాయించారు. వారి సూచన మేరకు 11వ రోజున కుండను తెరిచి చూడగా, అందులో బంగారు ఆభరణాలకు బదులుగా కల్లు ఉప్పు ఉండటంతో బాధితురాలు తాను మోసపోయానని గ్రహించింది. కుటుంబ సభ్యుల సాయంతో ఆగస్టు 20వ తేదీన దువ్వాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో క్రైం ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటై, దర్యాప్తు ప్రారంభించాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుల కదలికలను పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో ఈ నెల 29న అనకాపల్లి జిల్లా మారేడుపూడి బస్టాప్ వద్ద ప్రధాన నిందితుడైన రమణను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రమణది అన్నమయ్య జిల్లా పాతరాయచోటి. గతంలో కూడా అతను పలు ప్రాంతాల్లో ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఏ2గా ఉన్న మారేడుపూడి గ్రామానికి చెందిన చప్పిది నూకరాజు పాత్రపై విచారణ కొనసాగుతోందని సీఐ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి బంగారు హారం–1, బంగారు నెక్లెస్లు–2, పెద్ద బంగారు గొలుసు–1, చిన్న బంగారు గొలుసులు–3, బంగారు లాకెట్లు–2, చెవి దిద్దులు–3 జతలు, బంగారు ఉంగరాలు–10, బ్రాస్లెట్–01, పాపిడి బిళ్ల–1, రూ.5300 స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన క్రైం ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. -
వెల్లివిరిసిన ఆధ్యాత్మికత
సాక్షి,పాడేరు: జిల్లా వ్యాప్తంగా దేవీ శరన్న వరాత్రి వేడుకలు వైభ వంగా జరుగు తున్నాయి. వాడవాడలా దుర్గమ్మ విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పట్టణంలోని మెయిన్రోడ్డులో కనకదుర్గమ్మ ఉ త్సవాలను సోమ వారం ప్రారంభించారు. పాత ఆస్పత్రి సెంటర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో కనకదుర్గమ్మ ప్రతిమను భక్తిశ్రద్ధలతో ప్రతిష్టించారు. మెయిన్రోడ్డు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు, మండపం సెట్ ఆకట్టుకున్నాయి.సాయంత్రం సహస్ర దీపార్చన చేశారు. అక్టోబర్ 4వతేదీ వరకు ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది.ఉత్సవాల ప్రారంభోత్సవంలో ఉత్సవ కమిటీ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఏరువాక వెంకటరమణ,కోటపాడు శ్రీను,వైస్ ఎంపీపీ గంగపూజారి శివ, ఉప సర్పంచ్ బూరెడ్డి రామునాయుడు, వర్తక సంఘం,ఉత్సవ కమిటీ ప్రతినిధులు శివరాత్రి నాగేశ్వరరావు,ఆకాశపు సోమరాజు,వెయ్యాకుల సత్యనారాయణ,పూసర్ల గోపి,పచ్చా బుజ్జి,పచ్చా రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో దుర్గమ్మకు ప్రత్యేక పూజలు ముంచంగిపుట్టు: మండలంలోని వనభసింగి పంచాయతీ కేంద్రంలో సోమవారం ఆంధ్ర వనవాసీ కళ్యాణ ఆశ్రమం ఆధ్వర్యంలో దుర్గాష్టమి –మహిళా సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. భక్తిశ్రద్దలతో దుర్గాదేవికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముంబాయికి చెందిన అఖిల భారతీయ వనవాసీ కళ్యాణ ఆశ్రమం ప్రతినిధి ఆతుల్ జోగ్ పాల్గొని మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో సంస్కృతి, సంప్రదాయాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని కొనియాడారు. గిరిజన గ్రామాల్లో తమ ఆశ్రమం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం భక్తులకు ప్రసాదం, మహిళలకు దుర్గాదేవి ఫోటో, పసుపు, కుంకుమ, అందించారు. సర్పంచ్ లక్ష్మణ్,వనవాసీ ఆశ్రమం ప్రతినిధులు, సభ్యులు ఆదినారాయణ, అచ్చమ్మ, భగత్రామ్, బాలకృష్ణ, రాజు, జగన్నాథం, బలోక్దొర పాల్గోన్నారు. సీలేరు: ఊరువాడ అంగరంగ వైభవంగా దుర్గమ్మ శరన్నవరాత్రి పూజలు ఘనంగా జరుగుతున్నాయి. 8వ రోజు దుర్గమ్మ సరస్వతి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సీలేరు, దారకొండ ప్రాంతాల్లో ఈ పూజలను ఘనంగా నిర్వహించారు. అర్చకులు దామోదర శర్మ. రామశర్మ చిన్న పిల్లలతో సరస్వతీ దేవి పూజలను చేయించారు.శివాలయం ఆలయంలో సరస్వతి దేవి రూపంలో దుర్గమ్మను ప్రత్యేకంగా అలంకరించారు. దారకొండలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఘనంగా బతుకమ్మ పండగ కొయ్యూరు: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భవానీ భక్తులు సోమవారం బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించారు. పిల్లలు బతుకమ్మ పాట లు పాడుతూ నృత్యాలు చేశారు.మహిళలు బతుకమ్మను తలపై పెట్టుకుని గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ప్రసాద్ ఇంటి సమీపంలో ఉన్న రామాలయం నుంచి బతుకమ్మను తీసుకొచ్చారు. కమిటీ సభ్యులు ఎం చక్రరావు,చిరంజీవి,నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
‘జూనియర్ అథ్లెటిక్స్’ చాంపియన్ విశాఖ
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో విశాఖ అథ్లెట్లు బి.ఇషానా, కె.ఆర్.వి.ఎం.కుమార్, బి.శైలజ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి వ్యక్తిగత చాంప్లుగా నిలిచారు. ఈ పోటీల్లో విశాఖ జిల్లా జట్టు ఓవరాల్ చాంపియన్షిప్ను కూడా కై వసం చేసుకుంది. సోమవారంతో గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో ముగిసిన ఈ పోటీలను సబ్జూనియర్ (అండర్–14, 16), యూత్ (అండర్–18), జూనియర్ (అండర్–20) బాలబాలికల విభాగాల్లో ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాల్లో నిర్వహించారు. బాలికల అండర్–14 విభాగంలో ఇషానా, అండర్–18 విభాగంలో శైలజ, బాలుర అండర్–16 విభాగంలో కుమార్ తమ విభాగాల్లో వ్యక్తిగత చాంపియన్షిప్లు సాధించారు. అలాగే విశాఖ జిల్లా జట్టు 269 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్షిప్ను గెలుచుకుంది. బాలుర చాంపియన్షిప్ను 156 పాయింట్లతో విశాఖ కై వసం చేసుకోగా, బాలికల చాంపియన్షిప్ను 113 పాయింట్లతో సాధించింది. -
గజ్జె కట్టిన డాక్టరమ్మ
ఏయూక్యాంపస్: రోగులకు వైద్యం అందించే ఓ వైద్యురాలు నృత్య కళాకారిణిగా మారి అందరి ప్రశంసలు అందుకున్నారు. డాక్టర్ జాహ్నవి ప్రసాద్ బొడ్డేపల్లి, తాను చిన్నతనం నుంచి నేర్చుకున్న కూచిపూడి నృత్యాన్ని బీచ్రోడ్డులోని కాళీమాత ఆలయ ప్రాంగణంలో ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సోమవారం సాయంత్రం ఆలయ కళావేదికపై ఆమె నిర్వహించిన కూచిపూడి నృత్య అరంగేట్రం ఎంతో ఘనంగా జరిగింది. గురువు లలిత గుప్తా వద్ద నృత్యాన్ని అభ్యసించిన జాహ్నవి, తన కళా ప్రతిభను ప్రదర్శించి అందరినీ అబ్బురపరిచారు. ఎంతో ఒత్తిడితో కూడుకున్న వైద్య వృత్తిలో ఉంటూనే, నృత్యంపై తనకున్న ఆసక్తితో సాధన చేసి ఈ స్థాయికి చేరుకోవడం అందరికీ స్ఫూర్తినిస్తుంది. -
చింతాలమ్మ ఘాట్రోడ్డులో జారిపడిన మట్టి
● వాహనాల రాకపోకలకు అంతరాయం కొయ్యూరు: కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు చింతాలమ్మ ఘాట్రోడ్డులో కొండలపై నుంచి మట్టి జారిపడింది. దీంతో సోమవారం ఉద యం నుంచి చాలా సేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్హెచ్ 516ఈ నిర్మాణంలో భాగంగా ఈరోడ్డును విస్తరించారు. అయితే ఎత్తైన కొండల వద్ద సరైన చర్యలు చేపట్టకపోవడంతో వర్షాలకు మట్టి జారిపోతోంది. రాళ్లు కూడా రోడ్డుపైకి జారిపడుతున్నాయి. మట్టి జారిపడిన సమాచారం తెలుసుకున్న ఎన్హెచ్ నిర్మా ణ సిబ్బంది పొక్లెయిన్తో దానిని తొలగించారు. -
వరద బాధితులకు అండగా ఉండాలి
కూనవరం: వరద బాధితులకు అండగా ఉండాలని, అధిక గ్రామాల ప్రజలకు నిత్యావసర కిట్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ ఏఎస్డీఎస్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్ ఉండవల్లి గాంధీబాబుకు సూచించారు. శబరి కొత్తగూడెంలో ఏఎస్డీఏస్ ఆధ్వర్యంలో సోమవారం 302 కుటుంబాలకు నిత్యావసర సరకుల కిట్లను ఐటీడీఏ పీవో శుభం నోఖ్వాల్, ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈసందర్భంగా సంస్థ డైరెక్టర్ గాంధీబాబును పీవో అభినందించారు. అనంతరం శబరి కొత్తగూడెం గ్రామస్తులతో పీవో మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి రావలసిన సదుపాయాలను నిర్వాసితులకు అందేలా చూస్తామన్నారు. వరదలపై భయం వద్దని, ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారం అందిస్తున్నామని, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉన్నారని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్కు సంబంధించి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సర్వేల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తించి, అర్హులకు ప్యాకేజీ అందజేస్తామన్నారు. అందరికీ ప్యాకేజీ అందుతుందని ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ పాయం రంగమ్మ, సర్పంచ్ కట్టం లక్ష్మి, తహసీల్దార్ కె.శ్రీనివాసరావు, ఎంపీడీవో జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు.ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ -
విశాఖ– అరకు కార్వాన్ వాహనం రెడీ
● వసతులను పరిశీలించిన విశాఖ కలెక్టర్ మహారాణిపేట(విశాఖ): పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విశాఖ నుంచి అరకు వరకు ప్రత్యేక ప్యాకేజీ రూపంలో నడపనున్న కార్వాన్ వాహనాన్ని విశాఖ కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ సోమవారం కలెక్టరేట్ వద్ద పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా పర్యాటకశా ఖ ఆర్డీ కల్యాణి, జిల్లా పర్యాటక శాఖ అధికారిణి జె.మాధవి, డివిజనల్ మేనేజర్ జగదీష్ కలిసి కలెక్టర్కు కార్వాన్ వాహనం ప్రత్యేకతలను వివరించా రు. ఈ ప్రత్యేక వాహనాన్ని త్వరలోనే లాంఛనంగా ప్రారంభించి, పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు తెలిపారు. -
పీహెచ్సీల్లో ఓపీ బంద్
వైద్యుల సమ్మెతో రోగులకు అవస్థలు సాక్షి,పాడేరు/ఎటపాక/కొయ్యూరు: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీహెచ్సీల వైద్యులు సమ్మె బాటపట్టడంతో రోగులు అవస్థలకుగురయ్యారు. ఆందోళనలో భాగంగా తొలిరోజు సోమవారం ఓపీ సేవలు నిలిపివేశారు. జీవో నంబర్ 99 ద్వారా కోత విఽధించిన ఇన్ సర్వీస్ పీజీ కోటా పునరుద్ధరణ,పదోన్నతుల కల్పన,గిరిజన అలవెన్స్, 104 సంచార చికిత్స అలవెన్స్లు అమలు చేయాలనే డిమాండ్తో ప్రభుత్వ వైద్యులు సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లాలోని 64 పీహెచ్సీల్లో సోమవారం ఓపీ సేవలు నిలిచిపోయాయి. గ్రామాల్లో సంచార వైద్యసేవలకు వైద్యులు అందుబాటులో లేరు. కొన్ని ఆస్పత్రుల్లో వైద్యుల కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. గర్భిణులు ఇబ్బందులకు గురయ్యారు. వైద్యసిబ్బంది రోగులకు వైద్యపరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. ఎటపాక మండలంలో నెల్లిపాక,గౌరిదేవిపేట,లక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోజూ సుమారు నాలుగు వందల మంది వైద్యసేవలు పొందుతారు. అయితే సోమవారం డాక్టర్లు విధులు బహిష్కరించడంతో సేవలు నిలిచిపోయాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆయా ఆస్పత్రులకు వచ్చిన రోగులకు స్టాఫ్నర్స్లే అరకొర వైద్యం అందించారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కొందరు రోగులు ఆర్ఎంపీలను ఆశ్రయించాల్సి వచ్చింది. కొయ్యూరు,బంగారంపేటలలో నిర్వహించిన వైద్య శిబిరాలకు వైద్యులు హాజరుకాకపోవడంతో రోగులు అవస్థలకు గురయ్యారు. ఈనెల 30వతేదీ మంగళవారం నుంచి వైద్యులు ఆందోళనను మరింత ఉధృతం చేయనున్నారు. జిల్లా కేంద్రం పాడేరులో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించనున్నా రు. అక్టోబర్ 1న జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించేందుకు, అక్టోబర్ 2న విజయవాడలో వైద్యుల సంఘ నేతలు రిలే దీక్షల కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. ఎంపీ డాక్టర్ తనూజరాణిని కలిసిన పీహెచ్సీ వైద్యులు పాడేరు : జిల్లాలో పలు పీహెచ్సీల్లో పనిచేస్తున్న వైద్యులు సోమవారం పాడేరులో అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణిని కలిసి తమ సమస్యలు వివరించారు. తమ ఆందోళన కార్యక్రమాల షెడ్యూల్ను ఎంపీకి తెలిపారు. తమ ఉద్యమం ప్రజలకు వ్యతిరేకం కాదని చెప్పారు. 30వ తేదీ నుంచి నిరసన ర్యాలీలు, ప్రదర్శనలతో ఉద్యమం ఉధృతం చేయనున్నట్టు, 3వ తేదీ నుంచి విజయవాడలో నిరసన కార్యక్రమాలు, నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. తమ న్యాయమైన ఉద్యమానికి మద్దతు తెలపాలని వారు కోరారు. వైద్యుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తానని వారికి ఆమె హామీ ఇచ్చారు. -
స్వస్థ్ నారీ సశక్త్ పరివార్లో496 మందికి వైద్య పరీక్షలు
జిల్లా ఆస్పత్రిలో మెగా వైద్య శిబిరం పాడేరు : స్థానిక ప్రభుత్వ జిల్లా సర్వజన ఆస్పత్రి ఆవరణలో సోమవారం స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని కలెక్టర్ దినేష్కుమార్, ఐటీడీఏ పీవో శ్రీపూజ, అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి ప్రారంభించారు. వైద్య శిబిరంలో నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్లకు సంబంధించి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. 18ఏళ్లు నిండిన యువతకు కిశోర బాలికల ఆరోగ్య పరీక్షలు, క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షల, వయోవృద్ధులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో 496 మందికి వైద్య పరీక్షలు జరిపారు. వీరిలో మెరుగైన చికిత్స కోసం 29మందిని రిఫర్ చేశారు. ఐదుగురు రోగులకు త్వరలో స్థానిక జిల్లా ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్ వంపూరి గంగులయ్య, పీఏసీఎస్ చైర్మన్ బుజ్జిబాబు, డీఎంహెచ్వో డాక్టర్ విశ్వేశ్వరనాయుడు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలత, జిల్లా ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింగరావు పాల్గొన్నారు. -
ఫేజ్–2 పనులు పునఃప్రారంభించాలి
అరకులోయ టౌన్: జిల్లాలోని వివిధ పాఠశాలల్లో ఫేజ్–2లో నిలిపివేసిన పనులు తిరిగి ప్రారంభించాలని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మండలంలోని రవ్వలగుడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలలో సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో సీఎం హామీ పనులపై జిల్లాలోని ఏటిడబ్ల్యూ, టీడబ్ల్యూ, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్, విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫేజ్–2లో చేపట్టి, అర్ధంతరంగా ఆగిపోయిన పనుల వివరాలను తెలుసుకున్నారు. ఏ ఇంజినీరింగ్ శాఖకు ఎన్ని పనులు మంజూరయ్యాయని ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫేజ్–1లో మంజూరైన పనులన్నీ సకాలంలో పూర్తయ్యాయని చెప్పారు. ఫేజ్–2లో పనుల స్థితిగతులపై ఆయా మండలాల ఏటీడబ్ల్యూవోలు, ఇంజినీరింగ్ అధికారులు సమగ్ర నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. ఫేజ్–2కి ఇన్పుట్ డేటా షీట్ తయారు చేయాలని, లేటెస్ట్ ఫొటోలు యాప్లో అప్లోడ్ చేయాలన్నారు. ఫేజ్–2లో మొదలు కాని పనులకు ప్రతిపాదనలు అక్టోబర్ 10వ తేదీలోగా పంపాలని ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులు, విద్యాశాఖ అధికారులు కలిసి తనిఖీ చేసి జిల్లాలో మండలాల వారీగా ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన టాయిలెట్స్ జాబితా తయారు చేయాలని, లేకుంటే చర్యలు తప్పవన్నారు. జిల్లాలో ఎస్ఎమ్ఐ పనుల స్థితిగతులపై ఆరా తీశారు. బేస్లైన్ శిక్షణకు తప్పక హాజరుకావాలి బేస్లైన్ శిక్షణ కార్యక్రమానికి ఉపాధ్యాయులు, ఎంఈవోలు, హెచ్ఎంలు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు. మాస్టర్ ట్రైన్స్కి బేస్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రాం పూర్తయిందన్నారు. రాబోయే కాలంలో కూడా పరీక్షల్లో ఎటువంటి అవకతవకలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. ఏ పాఠశాలలో పనితీరు బాగోలేదో ఆ పాఠశాల హెచ్ఎం, ఏటీడబ్ల్యూవో, టీచర్లపై చర్యలు తప్పవన్నారు. ఐటీడీఏల వారీగా పీఎంఆర్సీలలో అకాడమిక్ మోనిటరింగ్ సెల్ ప్రారంభిస్తామని చెప్పారు. పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీవోలు బి.స్మరణరాజ్, శుభం నోక్వాల్, సమగ్ర శిక్ష అధికారి స్వామి నాయుడు, డీఈవో పి.బ్రహ్మాజీ, టీడబ్ల్యూ, పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈలు, 22 మండలాల డీఈఈలు, ఏఈఈలు, ఎంఈవోలు, ఏటీడబ్ల్యూలు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ -
వరదలతో స్తంభించిన జనజీవనం
● పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు ● పెరుగుతున్న గోదావరి ప్రవాహం చింతూరు: వరదల కారణంగా విలీనమండలాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో గోదావరి నది ప్రవాహం నెమ్మదిగా పెరుగుతోంది. సోమవారం రాత్రికి 46.5 అడుగులకు చేరుకుంది. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశముంది. మరోవైపు మహారాష్ట్రలోని ప్రాజెక్టులతో పాటు తెలంగాణలోని శ్రీపాద ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్, సరస్వతి ప్రాజెక్టుల నుంచి భారీగా వరదనీటిని దిగువకు వదలడంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం మరింత పెరిగే అవకాశాలున్నాయి. దిగువనున్న కూనవరం, వీఆర్పురం, చింతూరు, ఎటపాక మండలాల్లో పలుచోట్ల వరదనీరు రహదారులపై ఉండడంతో సుమారు 60కి పైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నదీ పరీవాహక గ్రామాల ప్రజలు వైద్యం, నిత్యావసర సరకుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి నాటు పడవల ద్వారా వరదనీటిని దాటుతున్నారు. ఇప్పటికి ఐదుసార్లు వరద రావడంతో వ్యవసాయ పనులు సకాలంలో సాగక ఈ ఏడాది పంటలు నష్టపోయే అవకాశముందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే వరి, మిర్చి పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చింతూరు మండలంలో కుయిగూరు వాగు ఉధృతి కొంతమేర తగ్గడంతో ఆంధ్రా నుంచి ఒడిశాకు వరదనీటిలో రాకపోకలు కొనసాగుతున్నాయి. సోకిలేరు, జల్లివారిగూడెం, చీకటివాగుల వరద నీరు ఇంకా చింతూరు, వీఆర్పురం ప్రధాన రహదారిపై నిలిచి ఉండడంతో వరుసగా నాలుగో రోజుకూడా చింతూరు, వీఆర్పురం మండలాల నడుమ రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని మల్లెతోట, ఉలుమూరు, ఏజీకొడేరు, తిమ్మిరిగూడెం, కొండపల్లి, పెదశీతనపల్లి, చినశీతనపల్లి, బొడ్రాయిగూడెం, రామన్నపాలెం, నర్సింగపేట, ముకునూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలం పెదశీతనపల్లికి చెందిన శ్యామల రత్తమ్మ పాముకాటుకు గురవడంతో నాటుపడవ ద్వారా సోకిలేరువాగు దాటించి ఆటోలో చింతూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి తెలిపారు. వీఆర్పురం: పోలవరం బ్యాక్వాటర్ ప్రభావంతో మూడు నెలల వ్యవధిలో మండలంలో ఏడు పర్యా యాలు గోదావరికి వరద వచ్చింది. వరుస వర దలతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల నుంచి మండల కేంద్రానికి వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేకపోవడంతో నిత్యావసర సరుకుల కోసం ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అన్నవరం వాగుపై గల కాజ్వే కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యార్థులు, రైతులు, రోగులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. మండలంలోని శ్రీరామగిరి, తోటపల్లి, సీతంపేట, ఇప్పూరు, వడ్డిగూడెం, వడ్డిగూడెం కాలనీ, చింతరేవుపల్లి, రామవరం, రామవరంపాడు, చిన్నమట్టపల్లి, అడవి వెంకన్నగూడెం తదితర గ్రామాలకు చెందిన ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. వరినాట్లు, పొగాకు నారుమడులు నీటమునిగాయి. -
మాదకద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత
● రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్రాజ్ రంపచోడవరం: మాదకద్రవ్యాలను నిర్మూలించే బాధ్యత అందరిపై ఉందని స్థానిక ఐటీడీఏ పీవో స్మరణ్రాజ్ అన్నారు. ఐటీడీఏ సమావేశం హాలులో సోమవారం డీఎస్పీ సాయిప్రశాంత్, డీఎఫ్వో అనూష, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పీవో మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మాదకద్రవ్యాలు లేకుండా చూడాలన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ఎంపీడీవోలు, ఎస్ఐలు సమస్వయంతో ప్రతి గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నా రు. పోలీస్ శాఖ ద్వారా ఎన్ని చెక్పోస్టులు నిర్వ హిస్తున్నారు, పోలీస్,ఎకై ్సజ్ శాఖలు డ్రగ్స్కు సంబంధించి ఎన్నికేసులు నమోదు చేశారో తెలుసుకున్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ, మండల పరిషత్ పాఠశాలల్లో ఎంత మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయ్యేరో నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఐ ఎన్.సన్యాసినాయుడు, ఎకై ్సజ్ సీఐ శ్రీధర్, ఏడీఏ సావిత్రి, హెచ్వో ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి జోలికి పోవద్దు
అరకులోయ టౌన్: గంజాయి జోలికి పోవద్దని ఎస్పీ అమిత్ బర్దర్ అన్నారు. సోమవారం అరకులోయలో ఎస్పీ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 500 మందికిపైగా ఎన్సీసీ క్యాడెట్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. గంజాయి జోలికి పోవద్దు, ఖైదీలుగా మారవద్దు, సే నో టు గంజాయి అంటూ ఎన్సీసీ క్యాడెట్లు ర్యాలీలో నినదించారు. ఈ సందర్భంగా ఎస్పీ అమిత్ బర్దర్ మాట్లాడుతూ డ్రగ్స్కు అలవాటు పడకూడదని సూచించారు. గంజాయి పండించవద్దని, యువత బంగారు భవిష్యత్ను పాడు చేసుకోవద్దన్నారు. గంజాయిపై ఇప్పటికే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించినట్టు చెప్పారు. ఉపాధికి అనేక మంచి మార్గాలు ఉన్నాయన్నారు. అరకులోయ ప్రాంత సహజ, సాంస్కృతిక గొప్పతనాన్ని తెలుసుకునేందుకు ట్రెక్కింగ్ చేసేందుకు ఈ ప్రాంతానికి వచ్చిన ఎన్సీసీ క్యాడెట్లు కూడా స్థానిక గిరిజన యువతనే గైడ్లుగా నియమించుకున్నారన్నారు. ర్యాలీ అనంతరం గంజాయి వల్ల కలిగే అనర్థాల గురించి వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్సీసీ క్యాడెట్లు వారి భాషల్లో అర్థమయ్యేటట్లు వివరించారు. కార్యక్రమంలో ఆలిండియా ట్రెక్కింగ్ క్యాంప్ కమాండెంట్ నీరజ్ కుమార్, పోలీసులు పాల్గొన్నారు. ఎన్సీసీ క్యాడెట్ల ర్యాలీలో ఎస్పీ అమిత్ బర్డర్ -
సారా తయారీపై ఉమ్మడి రాష్ట్రాల ఎకై ్సజ్ దాడులు
పెదబయలు : ఆంధ్ర ఒడిశా సరిహద్దు ఓండ్రుగెడ్డ, సుడుబ్ గ్రామాల్లో దాడులు చేసి 5500 లీటర్ల బెల్లం ఊటతో పాటుగా 500 లీటర్ల నాటు సారా ధ్వంసం చేసినట్టు పాడేరు ఎకై ్సజ్ సీఐ ఆచారి తెలిపారు. విజయవాడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ ఆదేశాల మేరకు సోమవారం ఆంధ్ర ఒడిశా ఎకై ్సజ్ అధికారుల సహాయంతో దాడులు చేయడం జరిగిందనిన్నారు. ఇక్కడ తయారు చేసిన సారా ఆంధ్ర సరిహద్దు ప్రాంతానికి ఎక్కువగా రవాణా చేస్తున్నారని, పెదబయలు, హుకుంపేట, పాడేరు ప్రాంతాలకు వివిధ మార్గాల ద్వారా రవాణా అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో పాడేరు ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐలు హిరన్, లక్ష్మీ, గణేష్, వీర్రాజు, ఒడిశా ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ అన్నపూర్ణ రతి , నాయక్ సిబ్బంది పాల్గొన్నారు. ఒడిశాలో 5500 లీటర్ల బెల్లం ఊట, 500 లీటర్ల నాటు సారా ధ్వంసం సారా తయారీ, రవాణా చేస్తే కఠిన చర్యలు పాడేరు ఎన్ఫోర్స్మెంట్ సీఐ ఆచారి -
రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి
చింతపల్లి: మండలంలో చౌడుపల్లి సమీపంలో సోమ వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంటర్మీడియెట్ విద్యార్థి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో కుడుముసారి పంచాయతీ కోటగున్నలు గ్రామానికి చెందిన మర్రి సాగర్ (21)చింతపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం ఉదయం చింతపల్లి వచ్చి పనులు చూసుకుని తిరిగి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళుతుండగా చౌడుపల్లి సమీపంలో గల వంతెన వద్ద వాహనం జారి పోయి ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన సాగర్ను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
ఒక సార్.. ఇద్దరు బాస్లు
● వాల్తేరు డివిజన్లో ఇద్దరు జీఎంల హడావుడి ● దక్షిణ కోస్తా జోన్ జీఎం సందీప్ మాధుర్ వరుస రివ్యూలు ● అదే సమయంలో ఈస్ట్ కోస్ట్ జోన్ జీఎం పరమేశ్వర్ పర్యటనలు ● గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతోనే తలపోటు ● ముంబై బదిలీ కోసం డీఆర్ఎం ప్రయత్నాలు ముమ్మరం కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా ఉంది.. వాల్తేరు డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్(డీఆర్ఎం) పరిస్థితి. ఒక సార్కి ఇద్దరు బాస్లు ఉండడంతో ఎటు వెళ్లాలో.. ఏం చేయాలో.. తెలియక అయోమయంలోనూ.. అదే సమయంలో ఒత్తిడికి గురవు తున్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్కు జీఎంని ప్రకటించిన కేంద్రం.. ఇంకా గెజిట్ విడుదల చేయకపోవడంతో ఎవరికి వారే అన్న చందంగా మారింది. ఇద్దరు జీఎంల మధ్య నలిగిపోతున్న డీఆర్ఎం.. ఇదేం బాధరా భగవంతుడా అనుకుంటూ బదిలీ కోసం పాట్లు పడుతున్నారు. సాక్షి, విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించి ఆరేళ్లు దాటినా, క్షేత్రస్థాయిలో మాత్రం ‘మూడడుగులు ముందుకు, ఆరడుగులు వెనక్కి’ అన్నట్లుగా ఉంది. కేంద్ర, రాష్ట్ర రాజకీయాలు, రైల్వే బోర్డు నిర్లక్ష్యం కారణంగా కార్యకలాపాలు మొదలు కాలేదు. మూడు నెలల క్రితం దక్షిణ కోస్తా రైల్వే జోన్ జీఎంగా నియమితులైన సందీప్ మాధుర్ నెల రోజులుగా విశాఖలోనే ఉంటూ, గెస్ట్ హౌస్ నుంచి కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నారు. ముడసర్లోవ ప్రధాన కార్యాలయ పనులు పర్యవేక్షిస్తూ, డీఆర్ఎం లలిత్ బోరాతో కలిసి సమీక్షలు, పర్యటనలు చేస్తున్నారు. అయితే జోన్ ఏర్పాటు కాగితాలకే పరిమితం కావడంతో డీఆర్ఎంపై ఒత్తిడి మొదలైంది. నాకొద్దు బాబోయ్.! ఒక సార్ రివ్యూలు చేస్తూ బయలుదేరితే, మరొక సార్ ఫోన్లో ఏర్పాట్లు చేయమని ఆదేశాలు జారీ చేస్తారు. ప్రస్తుతం వాల్తేరు డీఆర్ఎం లలిత్ బోరా, డివిజనల్ అధికారుల పరిస్థితి ఇదే. ఒకవైపు దక్షిణ కోస్తా రైల్వే జోన్ కొత్త జీఎం, మరోవైపు ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎం కలిసి డీఆర్ఎంతో చెడుగుడు ఆడుకుంటున్నారు. ముందు రోజు ఉదయం నుంచి రాత్రి వరకూ కొత్త జీఎం రివ్యూలతో, ఆ తర్వాత రోజు ప్రస్తుత జీఎం పర్యటనలతో డీఆర్ఎం క్షణం తీరిక లేకుండా ఇద్దరి మధ్య నలిగిపోతున్నారు. ఇటీవల ఒక జీఎం పర్యటనలో ఉన్న సమయంలోనే, మరో జీఎం ఫోన్ చేసి లైన్లు పరిశీలించేందుకు వస్తున్నానని, ఏర్పాట్లు చేయాలని హుకుం జారీ చేశారు. సమీక్షలు కూడా ఇరు జీఎంలు పోటాపోటీగా నిర్వహిస్తుండటంతో, వారికి సమాధానం ఇవ్వడంలోనూ, ఏర్పాట్లలోనూ అధికారులు ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. దీంతో అధికారుల్లో కొందరు తమ ఉద్యోగాలపై విరక్తి చెందుతూ తలలు పట్టుకుంటున్నారు. ఇక డీఆర్ఎం లలిత్ బోరా పరిస్థితి అయితే చెప్పాల్సిన పనిలేదు. కుటుంబంతో గడిపే తీరిక కూడా ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వాల్తేరులో పనిచేయడం కంటే, ఇతర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ పెట్టుకోవడం మంచిదంటూ తోటి అధికారుల వద్ద వాపోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆయన ముంబైకి బదిలీ చేయాలంటూ రైల్వే బోర్డును కోరినట్లు సమాచారం. గెజిట్ లేకపోవడమే అసలు సమస్య వాల్తేరు డివిజన్లో నెలకొన్న మొత్తం ‘తలపోటు’ వ్యవహారానికి ప్రధాన కారణం.. జోన్కు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాకపోవడమే అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గెజిట్ వస్తేనే సందీప్ మాధుర్ జోన్కు అసలైన జనరల్ మేనేజర్గా వ్యవహరించగలరు.. అప్పుడు కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. గెజిట్తో పాటు కార్యాచరణ ప్రకటించిన తర్వాతే.. జీఎంతో పాటు అసిస్టెంట్ జీఎం, 10 విభాగాలు, వాటి ప్రిన్సిపల్ హెచ్వోడీలు, సిబ్బంది సహా మొత్తంగా దాదాపు 180 మంది అధికారుల నియామకం పూర్తవుతుంది. వీరి నియామకం తర్వాతే జోన్ ఆపరేషన్స్ మొదలయ్యే అవకాశం ఉంది. అధికారుల నియామకాలు ఒక్కొక్కటిగా జరుగుతున్నా, గెజిట్ రాకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని వాల్తేరు అధికారులు వాపోతున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, దసరాకు కూడా జోన్ ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. అడకత్తెరలో పోకచెక్కలా వాల్తేరు డీఆర్ఎం లలిత్ బోరా పరిస్థితిచురుగ్గా తాత్కాలిక కార్యాలయం పనులు వీఎంఆర్డీఏ ‘ది డెక్’లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ కావడంతో పనులు చురుగ్గా సాగుతున్నాయి. కొత్త జోన్కు ఇప్పటికే ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ (పీసీఎంఏ), ఎలక్ట్రికల్ విభాగంలో హెచ్ఏజీ అధికారి (హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్)తో సహా మరో ఇద్దరి నియామకాలు పూర్తయ్యాయి. వీలైనంత త్వరగా టెంపరరీ ఆఫీస్ను అందుబాటులోకి తెస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, ఈ కార్యాలయంలో విధులు ప్రారంభించాలన్నా గెజిట్ విడుదల తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నారు. దీంతో గెజిట్ ఎప్పుడొస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఇది నా సంస్థానమంటూ..! దక్షిణకోస్తా రైల్వే జోన్కు కొత్త జీఎంను నియమించినా గెజిట్ విడుదల చేయకపోవడంతో భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోనే వాల్తేరు డివిజన్ కొనసాగుతోంది. జీఎం సందీప్ మాధుర్ జోన్ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరిస్తుండగా.. ఈస్ట్కోస్ట్ రైల్వే జీఎం పరమేశ్వరన్ ఫంక్వాలా కూడా హడావుడి మొదలుపెట్టారు. ఇంకా గెజిట్ రాకపోవడంతో వాల్తేరు డివిజన్కు తానే జీఎంనంటూ వరుస పర్యటనలతో హడావుడి చేస్తున్నారు. -
అసత్య ఆరోపణలు తగవు
గంగవరం: టీడీపీ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు ధ్వజమెత్తారు. ఈ మేరకు మండల కేంద్రంలోని వైఎస్సార్సీపీ నాయకుల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు తాతపూడి ప్రకాశ్ , వైస్ ఎంపీపీ గంగాదేవి , సర్పంచ్ కామరాజు దొర తదితరులు విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు యెజ్జు వెంకటేశ్వరరావుపై టీడీపీ మండల అధ్యక్షుడు పాము అర్జున తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇది మానుకోవాలని హెచ్చరించారు. అనంతరం వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు యెజ్జు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పైబడినా ప్రజా సంక్షేమాన్ని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిందని, అరాచక పాలన సాగిస్తోందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తూ, తప్పుడు ప్రచారాలను చేస్తోందన్నారు. కూటని ప్రభుత్వం నిరంకుశ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో బుద్ధి చెబుతారన్నారు. వైస్ ఎంపీపీ గంగాదేవి, సర్పంచ్లు కామరాజు దొర, కె.లక్ష్మి , నేషం మరిడమ్మ, నాయకులు సతీష్, టి.శ్రీను, ఎం.శ్రీను, వీరబాబు, సత్తిబాబు, బాబ్జి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా నిలుస్తాం
రంపచోడవరం: వైఎస్సార్సీపీ ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటుందని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు మండల కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో డిజిటల్ బుక్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ నాయకులకు, కార్యకర్తలుకు ఎటువంటి బెదిరింపులు, వేధింపులు ఎదుర్కొన్న డిజిటల్ బుక్లో ఆ వివరాలు పొందుపరచాలన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ కష్టపడి పనిచేయాలన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఎంపీపీ బందం శ్రీదేవి, జెడ్పీటీసీ సభ్యురాలు పండా వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ కొమ్మిశెట్టి బాలకృష్ణ, సర్పంచ్ మంగా బొజ్జయ్య, ఎంపీటీసీ సభ్యుడు వంశీ కుంజం, ఉలవల లక్ష్మి, పార్టీ ఎస్టీ సెల్ కన్వీనర్ పండా రామకృష్ణదొర, మండల పార్టీ కన్వీనర్ జల్లేపల్లి రామన్నదొర, ఉప సర్పంచ్ వి.ఎం.కన్నబాబు, చితుకులయ్యరెడ్డి, బొబ్బా శేఖర్, రత్నరాజు, కారుకోడి పూజ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి -
కదం తొక్కిన ఆదివాసీలు
ఎటపాక: చట్టబద్ధత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఆదివాసీలు చేపట్టిన ధర్మయుద్ధం బహిరంగ సభ విజయవంతమైంది. ఈ సభకు ఆంధ్రా, తెలంగాణ నుంచి వేలాది మంది గిరిజనులు తరలిరావడంతో భద్రాచలం పట్టణం ఆదివాసీలతో కిక్కిరిసిపోయింది. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయ, ఆటపాటలతో భారీ ర్యాలీ చేసి కాలేజీ మైదానంలో సభ నిర్వహించారు. కొన్ని దశాబ్దాలుగా అక్రమంగా ఆదివాసీల రిజర్వేషన్లు అనుభవిస్తూ విద్య, ఉద్యోగ రాజకీయ ఫలాలను దొడ్డిదారుల్లో లంబాడీలు దోచుకుంటున్నారని నేతలు ఆరోపించారు. పాలక ప్రభుత్వాలు ఆదివాసీలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. లంబాడీలను ఎస్టీల జాబితా నుంచి తొలగించే వరకు ఆదివాసీల ఉద్యమం సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. సభకు ఆంధ్రా నుంచి భారీగా తరలివచ్చిన కార్యకర్తలకు ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను కృతజ్ణతలు తెలిపారు. -
రహదారిపై పశువులు.. పెరుగుతున్న ప్రమాదాలు
వాహనచోదకులకు తప్పని పాట్లు చింతపల్లి: చింతపల్లిలో జాతీయ రహదారిపై అడ్డంగా పడుకుని పశువులే స్పీడుబ్రేకర్లుగా మారుతున్నాయి. ప్రస్తుతం గూడెం కొత్తవీధి మండలం రొంపులు నుంచి లంబసింగి వరకూ 516 జాతీయ రహదారి నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చింది.ఈ రహదారిపై ప్రతిరోజు అధిక సంఖ్యలో ద్విచక్రవాహనాలు, ఆటోలు, జీపులు, వ్యాన్లతో పాటు బస్సులు పెద్ద వాహనాలు తిరుగుతున్నాయి. నిత్యం పశువులు రోడ్డుకు అడ్డంగా ఉండడంతో వాటిని తప్పించబోయి అనేకమంది వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్న ప్రమాదాల నుంచి ప్రాణాప్రాయ పరిస్థితుల వరకు చోటుచేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ పరిస్తితి చింతపల్లి మండల కేంద్రంలోనే కాకుండా గూడెంకొత్తవీధి మండలం రొంపులు ఘాట్ రోడ్డు మొదలుకుని చాపరాతి పాలెం, పెదవలస, రింతాడ, పెంటపాడు, రింతాడ, లోతుగెడ్డ జంక్షన్ రాజుపాకలు, లంబసింగి వరకూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకున్న పరిస్థితి లేదని పలువురు వాహనచోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారులపై పశువులు తిష్టవేయడంతో ప్రమాదాల బారినపడుతున్న వాహనచోదకుల సంఖ్య నానాటికీ పెరుగుతోందని ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలు ఉన్న ప్రాంతాల్లో ఈ పశువులు మకాం ఎక్కువగా ఉండడంతో ఎప్పుడు ఏ విద్యార్థికి ఏం జరుగుతుందోనని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి రోడ్లుపై పశువులను విచ్చలవిడిగా విడిచిపెట్టే పశు యజమానులపై చర్యలు తీసుకుని ప్రమాదాలను నివారించాలని పలువురు కోరుతున్నారు. -
వైభవంగా దేవీ శరన్నవరాత్రులు
చింతపల్లి: మండలంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ ఆదివారం మహా చండీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మండల కేంద్రంలో హైస్కూల్ జంక్షన్, అనాదీశ్వర ఆలయంతో పాటు బైలుకించంగి రోడ్డువీధి, రత్నగిరి కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గమ్మతల్లి మండపాల్లో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.చింతపల్లిలో జగన్ పంతులు కుంకుమ పూజలు, అబిషేకాలు జరిపించారు. గంగవరం : మండల కేంద్రంలోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆదివారం అమ్మవారికి కుంకు పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. మోతుగూడెం: దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా పొల్లూరులోని దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తులు రమేష్, రమాదేవి భవానీ దంపతులు అమ్మవారికి సారె వితరణ చేశారు. గ్రామస్తులు ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుని సారేను సమర్పించారు. అర్చకుడు అయినవిల్లి కుమారస్వామి శర్మ అమ్మవారికి అలంకరణ చేసి పూజా కార్యక్రమం నిర్వహించారు. -
మత్స్యగెడ్డలో గల్లంతైన గిరిజనుడి మృతదేహం లభ్యం
ముంచంగిపుట్టు: మండలంలో వనుగుమ్మ పంచాయతీ దొమినిపుట్టు గ్రామ సమీపంలో మత్స్యగెడ్డలో గల్లంతైన కిల్లో నర్సింగ్(28) అనే గిరిజనుడి మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. చేపల వేటకు వెళ్లిన నర్సింగ్ ఈ నెల 10న గల్లంతైన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు కుటుంబ సభ్యులు, స్థానిక గిరిజనులు నాటు పడవలపై గాలించారు. అనంతరం విశాఖకు చెందిన ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెండు రోజులు విస్తృతంగా రెండు కిలో మీటర్ల మేర గాలించాయి. ఫలితం లేకపోవడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. 18రోజుల తరువాత ఆదివారం గిరిజనుడి మృతదేహం లభ్యమైంది. మేకల కాపర్లకు గెడ్డలో మృతదేహం తెలుతూ కనిపించింది. దిమినిపుట్టు గ్రామస్తులకు తెలియజేయడంతో వారు చూసి నర్సింగ్ మృతదేహంగా గుర్తించారు. రెవెన్యూ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఆర్ఐలు రవికుమార్,భాస్కర్లు,వీఆర్వో విజయలక్ష్మీ,మండల వైఎస్సార్సీపీ నేతలు దేవా,నీలకంఠం,రాజేంద్ర,సీఐటీయూ నేత శంకర్రావు మత్స్యగెడ్డ నుంచి నర్సింగ్ మృతదేహానికి బయటకు తీశారు.మృతదేహం గుర్తు పట్టలేని విధంగా ఉంది.పోస్టుమార్టం అనంతరం దహన సంస్కారాలు పూర్తి చేశారు. -
సమ్మోహనం కూచిపూడి నృత్య విన్యాసం
120 మందితో కూచిపూడి నృత్యంమద్దిలపాలెం: కళాభారతి ఆడిటోరియంలో ఆదివారం నగరానికి చెందిన సిద్దేంద్ర యోగి కళానిలయం గురు సత్యభాను నృత్య కళాశాల వార్షికోత్సవం వైభవంగా జరిగింది.ఈ వేడుకలో కూచిపూడి నృత్య విన్యాసం సమ్మోహన భరితంగా సాగింది. కళానిలయం వ్యవస్థాపకురాలు సత్యభాను ఆధ్వర్యంలో 120 మంది నృత్య కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సెంచూరియన్ యూనివర్సిటీ చాన్సలర్ ఆచార్య జి.ఎస్.ఎన్. రాజు మాట్లాడుతూ... ప్రతి విద్యార్థి విద్యతో పాటు సంప్రదాయ కళలను నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. లెండి ఇంజినీరింగ్ కాలేజీ చైర్మన్ పి. మధుసూదన రావు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం కళాశాలల్లో శాసీ్త్రయ కళల గురువులను నామినేట్ చేసేందుకు ఇటీవల జీవో కూడా విడుదల చేసిందని, ఇది విద్యార్థులకు సంప్రదాయ నృత్యాలు అభ్యసించడానికి వీలు కల్పిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో డా. శ్రీధర్ మిత్ర, కన్నం నాయుడు, కూచిపూడి కళాక్షేత్ర ప్రిన్సిపల్ గురు హరి రామమూర్తి, గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయికి దూరంగా ఉండాలి
ఎస్పీ అమిత్ బర్దర్ ముంచంగిపుట్టు: గంజాయికి దూరంగా ఉంటే గిరిజనుల భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని ఎస్పీ అమిత్ బర్దర్ అన్నారు. మండలంలోని అత్యంత మారుమూల లక్ష్మీపురం పంచాయతీ సుత్తిగూడ, బిరిగూడ గ్రామాల్లో ఆయన ఆదివారం పర్యటించారు. మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ మారుమూల గ్రామాల్లో పర్యటించడం ప్రాధాన్యత సంచరించుకుంది. కాలినడక గ్రామాలకు చేరుకుని, గిరిజనుల జీవన విధా నం, స్థితిగతులను పరిశీలించారు. విద్యార్థులకు స్టడీమెటీరియల్,పెన్నులు,పెన్సిల్స్,స్వీట్లు పంపిణీ చేశారు. పలువురు పిల్లలతో పుస్తక పఠనం చేయించారు. విద్యార్థులు చక్కగా చదవడంతో వారిని అభినందించారు. సుత్తిగూడలో పాఠశాలకు పక్కా భవనం లేక తమ పిల్లలు చదువుకునేందుకు అవస్థలు పడుతున్నారని,పక్కా భవనం నిర్మించే విధంగా చూడాలని,గ్రామంలో సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని ,తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని,లక్ష్మీపురం పంచాయతీ కేంద్రానికి ఆర్టీసీ బస్సు సర్వీసు నడిపేలా చూడాలని గ్రామస్తులు కోరారు. తన దివ్యాంగ కుమారుడికి పింఛన్ మంజూరు చేయాలని ఎన్నిసార్లు దరఖాస్తులు చేసినా మంజూరు కాలేదని ఓ మహిళ ఎస్పీ ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు కల్పించాలని పలువురు కోరారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాడేరు డీఎస్పీ ఎస్కె.సాబాజ్ అహ్మద్, జి.మాడుగుల సీఐ శ్రీనివాసరావు,లక్ష్మీపురం సర్పంచ్ కె.త్రినాఽథ్,పాడేరు,పెదబయలు ఎస్ఐలు సురేష్,రమణలు పాల్గొన్నారు. -
కలువ పూల కోసం వెళ్లి తిరిగిరాని లోకానికి
చెరువులో మునిగి యువకుడి మృతి డుంబ్రిగుడ: కలువ పూల కోసం చెరవులో దిగి ఓ గిరిజన యువకుడు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. అరమ పంచాయతీ డుంబ్రివలస గ్రామానికి చెందిన పాంగి సంజీవరావు(21) అనే యువకుడు కలువ పూల కోసం గ్రామానికి సమీపంలోని నందివలస చెరువులో ఆదివారం దిగి, ఊబిలో చిక్కుకుపోయి ఊపిరాడక మృతి చెందాడు. సంజీవరావు ఎప్పటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. చెరువు గట్టు మీద యువకుడి దుస్తులు కనిపించడంతో దానిలో గాలింపు చర్యలు చేపట్టి, ఊబిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు. ఒక్కగానఒక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. డుంబ్రివలసలో విషాదఛాయలు అలుముకున్నాయి. డుంబ్రిగుడ పోలీసులు కేసు నమోదు చేసి నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి అరకులోయ ఆస్పత్రికి తరలించారు. -
అక్రమ కేసులకు మూల్యం చెల్లించక తప్పదు
● ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ● డిజిటల్ బుక్, క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ అరకులోయటౌన్: వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, కూటమి నాయకులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వివిధ పదవుల్లో ఉన్న పార్టీ నాయకులతో కలిసి డిజిటల్ బుక్, క్యూఆర్ కోడ్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపించి వేధిస్తోందని చెప్పారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే డిజిటల్బుక్ ఆధారంగా చట్టబద్ధంగా బుద్ధి చెబుతామన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కూటమి నాయకులు అక్రమ కేసులు పెట్టినా, దాడులు జరిపినా డిజిటల్ బుక్లో నమోదు చేయాలని సూచించారు. ప్రతీ చర్యకు ప్రతి చర్య ఉంటుందన్నారు, అధికార మదంతో అక్రమ కేసులు పెట్టిన కూటమి నాయకులు, పోలీసులు ఎక్కడన్నా చట్ట పరంగా శిక్ష విధించి, జైలుకు పంపించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరకులోయ, డుంబ్రిగుడ జెడ్పీటీసీలు శెట్టి రోషిణి, చటారి జానకమ్మ, అనంతగిరి ఎంపీపీ శెట్టి నీలవేణి, ఎంపీటీసీలు దురియా ఆనంద్ కుమార్, శత్రుఘ్న, స్వాభి రామచందర్, వైస్ ఎంపీపీలు కిల్లో రామన్న, శెట్టి ఆనంద్, సర్పంచ్లు రాధిక, గుమ్మా నాగేశ్వరరావు, దురియా భాస్కర్రావు, పాగి అప్పారావు, సెంబి సన్యాసిరావు, పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, యువజన నాయకుడు రేగం చాణిక్య, డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గండేరు సత్యం, మండల పార్టీ అధ్యక్షులు రామూర్తి, పరశురాం, కొర్రా సూర్యనారాయణ, పార్టీ ఉపాధ్యక్షులు ధనరాజు, జి.ప్రకాష్, ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు కమిడి అశోక్, పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ సంయుక్త కార్యదర్శి నరసింహమూర్తి, గ్రీవెన్స్ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు సందడి కొండబాబు, కల్చరల్ వింగ్ నియోజకవర్గ అధ్యక్షురాలు బంగురు శాంతి, మాజీ ఉప సర్పంచ్ నాగేశ్వరరావు, నాయకులు ఎల్.బి. కిరణ్, ఒలేసి కుమార్, కామేశ్వరరావు, సుందర్రావు,చందు,మదీన పాల్గొన్నారు. -
ఇండోర్ స్టేడియంకు మోక్షం
పాడేరు: జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో గల ఇండోర్ స్టేడియానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. పట్టణంలోని తలార్సింగి పాఠశాల వద్ద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఇండోర్ స్టేడియాన్ని 35 ఏళ్ల కిందట నిర్మించారు. పాడేరు పట్టణంలోని క్రీడాకారులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఎంతో మంది క్రీడాకారులకు ఈ స్టేడియం ఎంతగానో ఉపయోగపడింది. ఈ స్టేడియంలో తర్ఫీదు పొందిన ఎంతోమంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని విజయం సాధించారు. అంతటి ప్రాముఖ్యమున్న స్టేడియం మరమ్మతులకు గురైంది. ఈ విషయం తెలుసుకున్న అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజ రాణి స్పందించారు. తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ.20 లక్షలు కేటాయించారు. ఆదివారం ఇండోర్ స్టేడియం ఆధునికీకరణ పనులకు పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజుతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తనూజరాణి మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించి, త్వరితగతిన పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెట్టి వినయ్, చింతలవీధి ఎంపీటీసీ సభ్యురాలు గిడ్డి విజయలక్ష్మి, పెదబయలు జెడ్పీటీసీ కూడా బొంజుబాబు, పెదబయలు మాజీ ఎంపీపీ సల్లంగి ఉమామహేశ్వరరావు, పెదబయలు మండల సర్పంచ్ల ఫోరం అద్యక్షుడు కాతరి సురేష్కుమార్, వైఎస్సార్సీపీ యువనేత కొర్రా అంబేడ్కర్, వైఎస్సార్సీపీ శ్రేణులు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
బస్ సర్వీసు పునరుద్ధరణ
సీలేరు: విశాఖపట్నం నుంచి సీలేరు మీదుగా నడిచే అంతర్ రాష్ట్ర నైట్సర్వీసు బస్సును పునరుద్ధరించినట్టు విశాఖపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ మాధురి తెలిపారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ మావోయిస్టుల ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా వారం రోజుల పాటు నిలిపివేసిన బస్సును ఆదివారం నుంచి మళ్లీ నడుపుతున్నట్టు ఆమె తెలిపారు. ప్రతిరోజు విశాఖపట్నంలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి రెండు గంటలకు సీలేరు, మరుసటి రోజు ఉదయం 6 గంటలకు భద్రాచలం చేరుకుంటుందని చెప్పారు. అదే బస్సు సాయంత్రం 6 గంటలకు భద్రాచలంలో బయలుదేరి రాత్రి 11 గంటలకు సీలేరు, మరుసటి రోజు ఉదయం 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందన్నారు. సీలేరు నైట్ హాల్ట్తో సహా అన్ని బస్సులను నడుపుతున్నామని ఆమె తెలిపారు. -
బొంగదారి జలపాతం అభివృద్ధికి చర్యలు
కలెక్టర్ దినేష్కుమార్ పెదబయలు: మండలంలోని అరడకోట పంచా యతీ బొంగదారి జలపాతం అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన కిలో మీటరు దూరం కాలినడకన వెళ్లి జలపాతాన్ని సందర్శించారు. అనంతరం బొంగదారి పాఠశాల ఆవరణలో గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి సీసీ రోడ్డు, డ్రైనేజీలు, చెక్ డ్యాం మంజూరు చేయాలని, జలపాతం వద్దకు వెళ్లేందుకు రోడ్డు, కల్వర్టు నిర్మించాలని వైస్ ఎంపీ పీ రాజుబాబు, గ్రామస్తులు కోరారు. స్పందించి న కలెక్టర్ అన్ని పనులకు అంచనాలు తయారు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రత్యేక ప్రణాళిక ద్వారా సిల్వర్ ఓక్, కాఫీ, పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎల్. పూర్ణయ్య, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
గోదారి దోబూచులాట
తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన వరద ముంపులో పలు రహదారులు అవస్థలు పడుతున్న విలీన మండలాల ప్రజలు చింతూరు: గోదావరి వరద తగ్గుతూ...పెరుగుతూ దోబూచులాడుతోంది. తగ్గినట్లే తగ్గి, తెల్లారే సరికి మళ్లీ పెరగడంతో విలీన మండలాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత కొన్నాళ్ల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుండండంతో జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. ఆదివారం ఉదయం భద్రాచలం వద్ద 42.1 అడుగులకు తగ్గిన గోదావరి నీటిమట్టం తిరిగి ఏడు గంటల నుంచి క్రమంగా పెరుగుతూ 43 అడుగులు దాటడంతో అధికారులు మరోమారు మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేశారు. ఆదివారం రాత్రి గోదావరి నీటిమట్టం 43.3 అడుగులకు చేరుకుంది. తెలంగాణలోని ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల జరిగితే గోదావరి ప్రవాహం మరింత పెరిగే అవకాశముంది. వరద మళ్లీ పెరుగుతుండడంతో కూనవరం, వీఆర్పురం, ఎటపాక, చింతూరు మండలాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నాలుగు మండలాల్లో పలు రహదారులు ముంపులో ఉండడంతో సుమారు 70 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలంలో కుయిగూరువాగు వరద నీరు జాతీయ రహదారి పై నిలిచి ఉండడంతో ఆంధ్రా నుంచి ఒడిశాకు రాకపోకలు నిలిచిపోయాయి. స్వల్పంగా తగ్గిన శబరినది చింతూరు మండలంలో శబరినది వరద నెమ్మదిగా తగ్గుతోంది. శనివారం రాత్రికి 35 అడుగులకు చేరుకున్న శబరినది నీటిమట్టం క్రమేపీ తగ్గుతూ ఆదివారం రాత్రికి 31.5 అడుగులకు చేరింది. కాగా రహదారులపై వరదనీరు ఇంకా నిలిచి ఉండడంతో పలు ప్రాంతాలకు రాకపోకలు కొనసాగడంలేదు. సోకిలేరు, జల్లివారిగూడెం, చీకటివాగుల వరద కారణంగా చింతూరు, వీఆర్పురం మండలాల నడుమ వరుసగా మూడోరోజు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే రహదారిలో చింతూరు మండలం నర్సింగపేట, ముకునూరు, రామన్నపాలెం, చినశీతనపల్లి, బొడ్రాయిగూడెం, కొండపల్లి, పెదశీతనపల్లి, తిమ్మిరిగూడెం, ఏజీకొడేరు, ఉలుమూరు, మల్లెతోట గ్రామాలకు రాకపోకలు కొనసాగడంలేదు. కుయిగూరువాగు వరద కారణంగా కల్లేరు, మదుగూరు, సూరన్నగొంది, కుయిగూరు గ్రామాలకు సైతం రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో నాటు పడవలపై ప్రయాణిస్తున్నారు. మండలంలో ముంపునకు గురైన వరిపంట కుళ్లిపోయే అవకాశముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ముంపులో కొండ్రాజుపేట రహదారి కూనవరం: భద్రాచలంలో గోదావరి వరద తగ్గుముఖం పట్టడంతో ఆదివారం ఉదయం నుంచి కూనవరం టు భద్రాచలం మార్గంలో పోలిపాక వద్ద రూట్ క్లీరైంది. దీంతో వాహనాల రాకపోకలు సాగాయి. కొండ్రాజుపేట రహదారి మూడవ రోజు కూడా వరద ముంపులోనే ఉంది. ఆదివారం సాయంత్రం నుంచి భద్రాచలం వద్ద గోదావరి వరద మళ్లీ పెరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వరద నీరు తగ్గుతూ పెరుగుతుండడంతో భద్రాచలం టు కూనవరానికి రూటు ప్రయాణానికి అనువుగా ఉన్నదీ లేనిది తెలియక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. మిర్చి రైతులకు తీవ్ర నష్టం ఎటపాక: గోదావరి వరద కారణంగా నాలుగు రోజులుగా మిర్చి తోటల్లో నీరు నిలువ ఉండడంతో మొక్కలు కుళ్లిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండలంలో 850 ఎకరాల్లో మిర్చి సాగుచేస్తున్నారు. నందిగామ,తోటపల్లి,నెల్లిపాక,మురుమూరు వాగుల పరీవాహక ప్రాంతాల్లో సుమారు వంద ఎకరాల్లో పంట నీటి మునిగింది. దీంతో రూ.25 లక్షల వరకూ నష్టం జరిగింది. వరద ముంపు ఇలానే మరికొన్ని రోజులు కొనసాగితే అదును దాటి పోయి, మరోసారి మిర్చి నారు వేసే అవకాశం లేకుండా పోతుంది. ఈఏడాది రబీ ప్రారంభంలోనే అన్నదాతను వరద కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. వరద కారణంగా నష్టపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. -
ప్రకృతి ఒడిలో పరవశం
చింతపల్లి: జిల్లాలో పర్యాటక ప్రాంతాలు ఆదివారం సందర్శకులతో కళకళలాడాయి. కొండలు, కోనలు, జలపాతాలు, మంచు సోయగాలను చూస్తూ పరవశించిపోయారు. సెలవు దినం కావడంతో మైదాన ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చి ప్రకృతి ఒడిలో మైమరిచారు. ఆంధ్రా కశ్మీర్ లంబసింగి, చాపరాయి జలపాతానికి పోటెత్తారు. లంబసింగి సమీపంలో ఉన్న చెరువులువేనం వ్యూపాయింట్ వద్ద పాలసముద్రాన్ని తలపించే మంచు అందాలను తెల్లవారుజామున ఆస్వాదించి, సెల్ఫీలు తీసుకున్నారు. తాజంగి జలాశయం వద్ద జిప్లైనర్ ఎక్కి ఆనందంలో తేలియాడారు. ఈ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. డుంబ్రిగుడ: చాపరాయి జలపాతం వద్ద పర్యాటకులు సందడి చేశారు. ఏటా సెప్టెంబర్ నుంచి అధిక సంఖ్యలో టూరిస్టులు ఇక్కడికి భారీగా వస్తారు. ఈప్రాంతంలో జైపూర్ జంక్షన్, రైల్వే గేటు, కురిడి, పంతలచింత, ఆంత్రిగుడతో పాటు అరకు పీనరీలలో దారి పొడుగున వలిసె అందాలు కనువిందు చేస్తాయి. పర్యాటక ప్రాంతాలకు భారీగా తరలివచ్చిన సందర్శకులు -
దుర్గమ్మకు ప్రత్యేక పూజలు
● భవానీ మాలధారులతో కిక్కిరిసిన ఆలయం ● భక్తిశ్రద్ధలతో దుర్గమ్మ సారే ఊరేగింపు సీలేరు: దుర్గమ్మ తల్లి శరన్ననరాత్రుల్లో భాగంగా వాడవాడలా భకిశ్రద్ధలతో పూజలు జరుగుతున్నాయి. మహాలక్ష్మీ దేవి అలంకరణతో అమ్మవారికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధారకొండ దారాలమ్మ ఆలయంలో శనివారం పెద్ద ఎత్తున భవానీ మాలధారులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ధారకొండ గ్రామంలో మహిళలు అమ్మవారి సారె ఊరేగించి అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మండపంలో కుంకుమ పూజలను అర్చకుడు రామశర్మ నిర్వహించారు. సీలేరులో అమ్మవారికి లక్ష్మీ పూజను దామోదరం నిర్వహించారు. శివాలయం మారెమ్మ తల్లి, వనదుర్గ, ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. చింతపల్లి: శవన్నవరాత్రులు సందర్భంగా శనివారం శ్రీ లలిత త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. మండల కేంద్రం హైస్కూల్ జంక్షన్లో ఏర్పాటు చేసిన దుర్గమ్మను జెడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య పడాల్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచి చింతపల్లి కేంద్రంలో ఆనాదీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. -
మెడికల్ కాలేజీలప్రైవేటీకరణ తగదు
డుంబ్రిగుడ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని అల్లూరి జిల్లా వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మురళీమోహన్ పట్నాయి అన్నారు. అరకులో ఆయన మాట్లాడుతూ పేద గిరిజన విద్యార్థుల ఉన్నత ప్రగతికి మెడికల్ కళాశాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాడేరులో ఏర్పాటు చేశారన్నారు. ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు సాగించడం సరికాదన్నారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం పూనుకుంటే న్యాయ, ప్రజాపోరాటం సాగిస్తామన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరనాయుడు, ఎంపీ తనూజరాణి, ఎమ్మెల్యే మత్స్యలింగంతో కలిసి సంయుక్త పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. -
సంతకు పండగ శోభ
ముంచంగిపుట్టు: గిరిజన గ్రామాల్లోని వారపు సంతల్లో దసరా సందడి నెలకొంది. ముంచంగిపుట్టు మండల కేంద్రంలో శనివారం జరిగిన వారపు సంతకు వివిధ గ్రామాల కొనుగోలుదారులతో కిటకిటలాడింది. పండగ సమీపించడంతో మారుమూల గిరి గ్రామాల నుంచి అధిక సంఖ్యలో గిరిజనులు సంతకు తరలివచ్చారు. వారికి అవసరమైన నిత్యావసర సరకులు, పండగ సామాన్లను కొనుగోలు చేశారు. పూలు, పండ్లు, కొబ్బరికాయల అమ్మకాలు భారీగా జరిగాయి. తరలివచ్చిన గిరిజనం ముంచంగిపుట్టు వారపు సంతలో దసరాతో మేకలు, నాటుకోళ్లుకు మంచి గిరాకీ ఏర్పడింది. మేకలను, కోళ్లును కొనుగోలు చేసేందుకు భారీ సంఖ్యలో జనం తరలి వచ్చారు. దీంతో వాటి ధరలు అమాతం పెరిగిపోయాయి. ధరతో సంబంధం లేకుండా కొనుగోలుకు గిరిజనులు పోటీపడ్డారు. నాటుకోడి సైజును బట్టి రూ.500 నుంచి రూ.3000 వరకు ధర పలికింది. ఒక్కో మేక రూ.5000 నుంచి రూ.15 వేలకు పైగా ధరకు అమ్ముడయ్యాయి. పండుగ సంత వ్యాపారం బాగుందని అమ్మకందారులు హర్షం వ్యక్తం చేశారు.మేకలు, నాటుకోళ్లకు గిరాకీ