breaking news
Alluri Sitarama Raju
-
ఆదిమ జాతి గిరిజనులపై దాడి సరికాదు
● బాధ్యులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి ● గిరిజన సంఘం డిమాండ్ చింతపల్లి: లంబసింగి జంక్షన్ (కొర్రుబయలు)లో ఆదిమ జాతి గిరిజనులపై దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడిన గిరిజనేతరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పాంగి ధనుంజయ్ డిమాండ్ చేశారు. బుధవారం డీఎల్వో సంఘ ప్రతినిధులతో కలిసి ఆయన నిరసన కార్యక్రమం చేపట్టారు. వివాదానికి కారణం లంబసింగి పంచాయతీ పరిధిలోని జలగలగెడ్డ గ్రామానికి సంబంధించి రోడ్డు నిర్మాణ విషయంలో తలెత్తిన చిన్న వివాదాన్ని, కొర్రుబయలులో వ్యాపారం చేసుకుంటున్న కొందరు గిరిజనేతరులు స్వార్థంతో పెద్దది చేస్తున్నారని ఆయన ఆరోపించారు.గిరిజనుల మధ్య విభేదాలు సృష్టిస్తూ, రాజకీయ పెత్తనంతో గిరిజన హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనేతరుల స్వార్థం కారణంగానే కొర్రుబయలు జంక్షన్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేయాలి ఈ వివాదంలో జలగలగెడ్డకు చెందిన ఆదివాసీ గిరిజనులపై ఉద్దేశపూర్వకంగానే దాడికి పాల్పడ్డారని ధనుంజయ్ ఆరోపించారు. ఈ ఘటనపై ఏఎస్పీ స్పందించి సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులైన గిరిజనేతరులపై అట్రాసిటీ కేసులు నమోదు చేసి ఆదివాసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో డీఎల్వో రాష్ట్ర కార్యదర్శి కె. వెంకయమ్మ, కాసులమ్మ, గిరిజన సంఘం మండల కార్యదర్శి సాగిన చిరంజీవి పాల్గొన్నారు. వీరితో పాటు బాధిత కుటుంబ సభ్యులు వీరన్న, కామేశ్వరరావు, సీతమ్మ తదితరులు హాజరయ్యారు. -
గిరిజనుల ఆమోదం మేరకే తవ్వకాలు
గూడెంకొత్తవీధి: మండలంలోని డొకులూరు గ్రామంలో లేటరైట్ తవ్వకాలకు సంబంధించి బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ హాజరయ్యారు. అధికారులు ముందస్తుగా సమాచారం అందించడంతో పెద్ద ఎత్తున గిరిజనులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఈ సభకు తరలివచ్చారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. డొకులూరులో లేటరైట్ ఖనిజ తవ్వకాలపై గిరిజనుల అభిప్రాయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇది తుది అనుమతుల కోసం నిర్వహించిన సభ కాదని, కేవలం గిరిజనుల ఇష్టాయిష్టాలు, వారి సమస్యలు, వారి అభిప్రాయాలను తెలుసుకోవడం కోసమేనని స్పష్టం చేశారు. గిరిజనుల ఆమోదం, అభీష్టం మేరకే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇక్కడ వెల్లడైన సూచనలు, నిరసనలను ప్రభుత్వానికి నివేదిస్తామని, గిరిజనులు ఎలాంటి అపోహలు పడాల్సిన అవసరం లేదని, వారికి అన్యాయం జరిగే పనులను ప్రభుత్వం చేపట్టదని భరోసా ఇచ్చారు. భిన్నాభిప్రాయాలు.. మిశ్రమ స్పందన డొకులూరులోని సర్వే నంబర్ వన్లో సుమారు 11.370 హెక్టార్ల పరిధిలో లేటరైట్ తవ్వకాల కోసం పాడేరుకు చెందిన రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు. ఈ తవ్వకాలపై స్థానిక గిరిజనుల నుండి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. భూములు ఉన్న కొందరు గిరిజనులు తవ్వకాలకు మద్దతు తెలిపారు.మరికొందరు తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించారు. గిరిజన సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు మైనింగ్ను పూర్తిగా ఖండించారు. మైనింగ్ వల్ల భవిష్యత్తులో పర్యావరణ సమస్యలు, నీటి ఎద్దడి తలెత్తుతాయని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సరిత, పాడేరు మైనింగ్ ఏడీ కృష్ణారావు, తహసీల్దారు అన్నాజీరావు పాల్గొన్నారు. గిరిజన సంఘాల తరఫున పెదవలస సర్పంచ్ కృష్ణవంశీ, జై భారత్ ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజుబాబు, సీపీఎం, సీపీఐ నాయకులు హాజరయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ సుధాకర్, ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ లేటరైట్ తవ్వకాలపై డొకులూరులో అభిప్రాయ సేకరణ హాజరైన గిరిజనులు, గిరిజన సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు -
పులకించిన సాగరం
● అభిమాన నీరాజనంమురిసిన మన్యం..అడ్డాకులతో తయారుచేసిన టోపీని ధరిస్తున్న జగనన్నసాక్షి, విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ పర్యటనకు విచ్చేసిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి బుధవారం పార్టీ నాయకులు, శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. జననేత రాకతో విశాఖపట్నం, అల్లూరి జిల్లాల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. మాజీ సీఎం వస్తున్నారని తెలుసుకున్న నాయకులు, కార్యకర్తలు ఉదయం 10 గంటలకే విశాఖ విమానాశ్రయానికి చేరుకుని ఎదురుచూశారు. అరకు పర్యటన ముగించుకుని తిరిగి వచ్చే వరకు అక్కడే వేచిచూశారు. అరకులోయలో జరిగిన వివాహ వేడుకకు హాజరై తిరిగి వచ్చిన జగన్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు విమానాశ్రయం నుంచి మర్రిపాలెం వరకు రోడ్లపై నిలబడ్డారు. ఆయనను చూడగానే ‘జై జగన్’ నినాదాలతో మార్మోగింది. ఓ దశలో అభిమానులు బారికేడ్లు దాటి దగ్గరగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు నియంత్రించారు. విమానాశ్రయం నుంచి కాన్వాయ్గా బయలుదేరిన జగన్కు మర్రిపాలెంలోని రాణాప్రతాప్నగర్ వరకు రోడ్డుదారిన ఇరువైపులా నిలబడి అభిమానులు పూలవర్షం కురిపించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆత్మీయ స్వాగతం పలికారు. రాణాప్రతాప్నగర్లోని వైఎస్సార్సీపీ విశాఖ దక్షిణ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ నివాసానికి చేరుకున్న సందర్భంగా అక్కడ కూడా పెద్దఎత్తున జనసమ్మర్ధం కనిపించింది. ఘనస్వాగతం పలికిన పార్టీ నేతలు అరకులోయ, విశాఖలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు, ఎంపీలు గొల్ల బాబూరావు, గుమ్మా తనూజరాణి, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, మత్స్సరాస విశ్వేశ్వరరాజు, బొడ్డేడ ప్రసాద్, మజ్జి శ్రీనివాసరావు, ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీ కుంబా రవిబాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర, మాజీ ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, కరణం ధర్మశ్రీ, తిప్పల నాగిరెడ్డి, కంబాల జోగులు, పెట్ల ఉమాశంకర్ గణేష్, అన్నంరెడ్డి అదీప్రాజ్, కె.భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ, తైనాల విజయ్కుమార్, చింతలపూడి వెంకట్రామయ్య, శోభా హైమావతి, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, దేవన్రెడ్డి, మలసాల భరత్కుమార్, మాజీ ఎంపీలు భీశెట్టి సత్యవతి, ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, ముఖ్యనేతలు కోలా గురువులు, చింతకాయల సన్యాసిపాత్రుడు, చిక్కాల రామారావు, ఏడువాక సత్యరావు, బాణాల శ్రీనివాసరావు కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, వార్డు అధ్యక్షులు పాల్గొన్నారు.మన్యం మురిసింది.. సాగరం పులకించింది. జనతరంగం ఎగసింది.. సంక్షేమ ప్రదాతకు ఆత్మీయ స్వాగతం పలికింది.. అడుగడుగునా బ్రహ్మరథం పట్టింది.. ‘సీఎం.. సీఎం.. జై జగన్’ నినాదాలతో హోరెత్తించింది. అడుగడుగునా పూలవర్షాలు, జనహారతులు, అభిమానుల కేరింతల మధ్య వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి విశాఖ జిల్లాల పర్యటన జనప్రభంజనాన్ని తలపించింది. అరకు, విశాఖ నగరంలో వెల్లువలా తరలివచ్చిన జనకెరటం అభిమాన నేతను చూసి మురిసిపోయింది. వివాహ వేడుకలే జనవేదికలుగా మారి.. జననేతకు నీరాజనాలు అర్పించిన దృశ్యాలు ఉమ్మడి విశాఖ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. జననేత జగన్ రాకతో హోరెత్తిన ఉమ్మడి విశాఖ అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహం, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ కుమారుడి రిసెప్షన్కు హాజరు అధినేత రాకతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహంపర్యటన సాగిందిలా.. ఉదయం 9.45 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి 11.20 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం హెలికాప్టర్లో అరకులోయ హెలిప్యాడ్కు చేరుకుని, తంగులుగూడ గ్రామంలోని రాధాకృష్ణ ఆలయంలో నిర్వహించిన అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడు రేగం చాణక్య–అశ్విని వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. అక్కడి నుంచి తిరిగి హెలికాప్టర్లో విశాఖ విమానాశ్రయానికి మధ్యాహ్నం 1.20 గంటలకు చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గాన మర్రిపాలెం రాణాప్రతాప్నగర్లోని వాసుపల్లి గణేష్కుమార్ నివాసానికి చేరుకుని, ఆయన కుమారుడు గోవింద్ సాకేత్–శ్రావణి వివాహ రిసెప్షన్లో పాల్గొని ఆశీస్సులు అందించారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.50 గంటలకు బయలుదేరి విశాఖ విమానాశ్రయానికి చేరుకుని, 2.40 గంటలకు విమానంలో ప్రయాణమయ్యారు. -
జగనన్నకు బ్రహ్మరథం
సాక్షి, పాడేరు: అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడు చాణక్య వివాహ వేడుకకు హాజరైన వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అరకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రాజకీయాలకు అతీతంగా, తమ కుటుంబ సభ్యుడే వస్తున్నాడన్న ఉత్సాహం మన్యం వాసుల్లో స్పష్టంగా కనిపించింది. పదవిలో ఉన్నా లేకపోయినా.. గిరిజనుల గుండెల్లో జగనన్న స్థానం సుస్థిరం అని ఈ జనసందోహం నిరూపించింది. మారుమోగిన ‘జై జగన్’ నినాదాలు బుధవారం మధ్యాహ్నం జగన్ ప్రయాణించిన హెలికాప్టర్ వజ్రాల కొండ హెలీప్యాడ్పై దిగగానే వాతావరణం ఒక్కసారిగా ఉద్వేగభరితంగా మారిపోయింది. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు ‘జై జగన్.. జై జై జగన్’ అంటూ చేసిన నినాదాలతో అరకు లోయ మారుమోగిపోయింది. తమ ప్రియతమ నేతను చూడటానికి గిరిపుత్రులు కొండలు, చెట్లపైకి ఎక్కి వేచి చూడటం ఆయనకున్న క్రేజ్కు నిదర్శనంగా నిలిచింది. మినీ పాదయాత్రను తలపించిన స్వాగతం హెలీప్యాడ్ నుంచి తంగులగూడ కల్యాణ వేదిక వరకు సాగిన జగన్ ప్రయాణం ఒక మినీ పాదయాత్రను తలపించింది. అడుగడుగునా ప్రజలు ఆయనపై ప్రేమను కురిపించారు. గిరిజన నృత్యాలు, డప్పు వాయిద్యాల మధ్య జగన్కు ఘన స్వాగతం లభించింది.రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ మేర నిలబడిన వేలాది మంది ప్రజలకు జగన్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆత్మీయ పలకరింపు వృద్ధులు, మహిళలు జగన్ను చూసి ఉద్వేగానికి లోనవ్వగా, ఆయన వారి వైపు నవ్వుతూ పలకరించడం అక్కడి వారిని కట్టిపడేసింది. నూతన వధూవరులకు ఆశీర్వాదం కల్యాణ వేదిక వద్ద ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుటుంబ సభ్యులు జగన్కు సాదర స్వాగతం పలికారు. అనంతరం నూతన వధూవరులు రేగం చాణక్య, వారి జీవిత భాగస్వామిని జగన్ ఆత్మీయంగా ఆశీర్వదించారు. పదవిలో ఉన్నా లేకపోయినా గిరిజనుల గుండెల్లో జగనన్న స్థానం సుస్థిరమని ఈ పర్యటన మరోసారి నిరూపించింది. విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), అరకు ఎంపీ గుమ్మా తనూజరాణి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, ఉమ్మడి విశాఖ జడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర,మాజీ డిప్యూటీ సీఎంలు బూడి ముత్యాలనాయుడు, పీడీక రాజన్నదొర, మాజీ ఎమ్మెల్యేలు శోభా హైమావతిదేవి,చింతలపూడి వెంకటరామయ్య,చెట్టి పాల్గుణ, మాజీ జీసీసీ చైర్పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి,జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, యువజన విభాగం నేత చెట్టి వినయ్, ఎస్టీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, ఎస్టీసెల్ ఉమ్మడి జిల్లా మాజీ నేత కమ్మిడి అశోక్,అన్ని మండలాల స్థానిక ప్రజాప్రతినిధులు,రాష్ట్ర,జిల్లా,మండల పార్టీ నాయకులు హెలీప్యాడ్ వద్ద మాజీ సీఎంకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.అభిమాననేతను చూసేందుకు నిరీక్షిస్తున్న జనంప్రియతమ నేతను చరవాణిల్లో బంధిస్తున్న అభిమానులు -
వైఎస్ జగన్ పర్యటన
నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రెండో కుమారుడు రేగం చాణుక్య వివాహ వేడుకకు, అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ కుమారుడు గోవింద్ సాకేత్ వివాహ రిసెప్షన్కు హాజరవుతారు. ఈ మేరకు పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పర్యటన వివరాలిలా.. ● ఉదయం 9.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ● ఉదయం 10.50 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ● ఉదయం 11.40 గంటలకు విశాఖ నుంచి హెలికాప్టర్లో అరకు వ్యాలీ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తంగులగూడ గ్రామంలోని రాధాకృష్ణ ఆలయం వద్దకు వెళ్తారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రెండో కుమారుడు రేగం చాణుక్య వివాహ రిసెప్షన్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. ● మధ్యాహ్నం 1.10 గంటలకు అరకు నుంచి హెలికాప్టర్లో తిరిగి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ● మధ్యాహ్నం 1.30 గంటలకు రోడ్డు మార్గాన మర్రిపాలెం రాణా ప్రతాప్నగర్కు చేరుకుంటారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ చిన్న కుమారుడు గోవింద్ సాకేత్ వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై ఆశీస్సులు అందజేస్తారు. ● మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ ఎయిర్పోర్టు నుంచి విమానంలో బయలుదేరుతారు. అరకులో ఏర్పాట్లు పూర్తి సాక్షి, పాడేరు: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం అరకులోయ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో వజ్రాలమెట్ట వద్ద హెలీప్యాడ్, అక్కడి నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న వివాహ వేదిక వద్దకు వెళ్లేందుకు తాత్కాలిక రోడ్డు పనులు పూర్తయ్యాయి. ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, మాజీ జీసీసీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి తదితర నేతలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జగన్మోహన్రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు, గిరిజనులు భారీగా తరలిరానున్నారు. అరకులోయ అంతటా ఆయనకు స్వాగతం పలుకుతూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తమ పక్షపాతి అయిన మాజీ సీఎంకు భారీ స్థాయిలో ఘన స్వాగతం పలికేందుకు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. -
ఇఫ్తార్ సహర్
బుధ గురు అరకు 6.13 5.04 పాడేరు 6.14 5.05డొకులూరు లేటరైట్ క్వారీపైనేడు ప్రజాభిప్రాయసేకరణగూడెంకొత్తవీధి: ఆంధప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మండలంలోని డొకులూరులో లేటరైట్క్వారీ తవ్వకాల తుది అనుమతులకు సంబంఽధించి బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నామని తహసీల్దారు అన్నాజీరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ ఈకార్యక్రమానికి హాజరవుతారన్నారు. లేటరైట్ తవ్వకాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు, సూచనలుఉంటే వాటిని ఈసదస్సులో పాల్గొని తమ అభిప్రాయాలను నేరుగా అధికారులకు తెలియజేయాలని కోరారు. మేథావులు, ప్రజాప్రతినిధులు, గిరిజనులు హాజరుకావాలని ఆయన కోరారు. -
అటవీ సంపదకు
చెదలుకొయ్యూరు: అటు అటవీ శాఖకు, ఇటు వ్యాపారులకు మధ్య మూడేళ్లుగా సాగుతున్న ధరల బేరం కొలిక్కి రాకపోవడంతో దాదాపు రూ. 2 కోట్ల విలువైన ‘మారుజాతి’ కలప మట్టిలో కలిసిపోతోంది. తాము నిర్ణయించిన ధరకు ఇవ్వాల్సిందేనని వ్యాపారులు, నిబంధనల ప్రకారం తగ్గించేది లేదని అటవీ శాఖ పట్టుబట్టడంతో ప్రభుత్వానికి రావలసిన ఆదాయం గంగలో కలిసే పరిస్థితి ఏర్పడింది. వివాదానికి కారణం.. : జాతీయ రహదారి 516ఈ విస్తరణలో భాగంగా చింతాలమ్మ, రంపుల ఘాట్ ప్రాంతాల్లోని రిజర్వ్ ఫారెస్ట్ చెట్లను తొలగించారు. ఈ కలపను కాకరపాడు, లోతుగెడ్డ, వెదురునగరం డిపోలకు తరలించారు. ఇందులో ఎక్కువగా సంపెంగ, తినంగి, తంగేడు వంటి మారుజాతి రకాలు ఉన్నాయి. ధరల వ్యత్యాసం.. అటవీ శాఖ అడుగుకు రూ. 550 ధర నిర్ణయించగా, నాణ్యత లేని ఈ కలపకు రూ. 250 కంటే ఎక్కువ ఇవ్వలేమని వ్యాపారులు చెబుతున్నారు. పరిమితి అధికారాల వల్లే..స్థానిక డీఎఫ్వోకు ధరకు కేవలం పది వరకు మాత్రమే తగ్గించే అధికారం ఉంది. అంతకంటే ఎక్కువ తగ్గించాలంటే ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి. క్షేత్రస్థాయిలో.. కాకరపాడు, వెదురునగరం, లోతుగెడ్డ డిపోల్లో సుమారు 1,500 క్యూబిక్ మీటర్ల కలప నిల్వ ఉంది. దీనిపై ఏడాది క్రితమే పరిస్థితిని వివరిస్తూ పీసీసీఎఫ్కు చింతపల్లి డీఎఫ్వో లేఖ రాశారు. అయినా నేటికీ ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఎండకు ఎండి, వానకు తడిసి కలప పటుత్వం కోల్పోతోంది. ఇప్పటికే చాలా వరకు కలపకు చెదలు పట్టడంతో వ్యాపారులు అసలు కొనుగోలు చేయడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. బంగారు, వేగిస వంటి నా ణ్యమైన కలప అమ్ముడవుతున్నా, మారుజాతి కల ప మాత్రం పేరుకుపోయి స్థలాన్ని ఆక్రమిస్తోంది. ● వెదురునగరం వంటి డిపోల్లో వెదురు, టేకు తప్ప ఇతర రకాల విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. అధికారులు తక్షణమే స్పందించి ప్రత్యేక ధర తగ్గింపు ఉత్తర్వులు ఇవ్వకపోతే, రూ. 2 కోట్ల విలువైన సంపద పూర్తిగా పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. మొండితనం వీడి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణ యం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటవీ శాఖ మొండితనం, వ్యాపారుల పట్టుదల వెరసి..రూ.కోట్ల విలువైన ప్రభుత్వ సంపద పనికిరాకుండా పోతోంది. నిబంధనల సాకుతో అటవీ శాఖ అధికారులు, నాణ్యత లేదంటూ వ్యాపారులు బేరసారాలకు దిగడంతో మూడేళ్లుగా సుమారు రూ. 2 కోట్ల విలువైన మారుజాతి కలప డిపోల్లోనే మట్టిపాలవుతోంది. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా సేకరించిన ఈ కలప, అధికారుల మధ్య సమన్వయ లోపం, సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం అటవీశాఖ ఆదాయంపై ప్రభావం చూపనుంది. పరిస్థితి నివేదించాం కలప పాడైపోతుందని ఇక్కడ పరిస్థితిని పీసీసీఎప్కు వివరిస్తూ లేఖ రాశం. వ్యాపారులు తగ్గించమన్నంత తగ్గించే అవకాశం లేకపోయినా కొంత వరకు తగ్గుతుంది. దీనిపై ఉన్నతాఽధికారుల నుంచి ఆదేశాలు రావాలి. తమ పరిధిలో పది శాతంకు మించి తగ్గించే అవకాశం లేదు. మరోసారి ఇక్కడ మారుజాతి కలప విక్రయం కాని వైనాన్ని వివరిస్తూ లేఖ రాస్తాం – వైవీ నర్సింగరావు, డీఎఫ్వో, చింతపల్లి -
8 నెలలకే డిప్యుటేషన్
మాకవరపాలెం: స్థానిక తహసీల్దార్ వెంకటరమణ డిప్యుటేషన్ చర్చనీయాంశమైంది. మండలంలో కొందరు టీడీపీ నేతలకు అనుకూలంగా లేకనే ఆయన్ను సాగనంపినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది జూన్ 23న మాకవరపాలెం తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టారు. కేవలం ఎనిమిది నెలలకే ఆయనకు నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయ ఏవోగా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. అక్కడ ఏవోగా పనిచేస్తున్న ముసీబ్ను ఇక్కడ తహసీల్దార్గా నియమించారు. ఆక్రమణలకు అడ్డుకట్ట వేసిన తహసీల్దార్.. తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వెంకటరమణ తనదైన శైలిలో విధులు నిర్వహించారు. తామరం రెవెన్యూలో టీడీపీ నేతలు ఆక్రమించేందుకు ప్రయత్నించిన 20 ఎకరాల గెడ్డ పోరంబోకు భూమిని స్వాధీనం చేసుకున్నారు. రామన్నపాలెం శివారు చినరాపల్లి వద్ద టీడీపీకి చెందిన వారు ఊటగెడ్డ రిజర్వాయర్ భూమిలో చేపట్టిన ఆక్రమణలనూ అడ్డుకున్నారు. అంతేకాకుండా ఇటీవల తూటిపాల వద్ద సర్పానదిని ఆనుకున్న భూమిలో ఇసుక తరలింపునకు ఏర్పాట్లు చేసే క్రమంలో జేసీబీని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. తామరంలో ప్రభుత్వ భూమికి పాసుపుస్తకాలు చేసేందుకు ఓ బ్రోకర్ ఆశచూపిన రూ.20 లక్షలను సైతం తిరస్కరించారు. ఏళ్ల తరబడి రాచపల్లి రెవెన్యూలో ఏపీఐఐసీ పేరున ఉన్న రైతుల భూముల మార్పునకు ఆయన కృషి చేశారు. ల్యాండ్ బ్యాంకు సిద్ధం చేయడంలోనూ .. మాకవరపాలెం మండలాన్ని పరిశ్రమల హబ్గా చేయాలనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాలతో తొలుత రాచపల్లి రెవెన్యూలోని సర్వే నంబరు 737లో 406 ఎకరాల రైతుల భూమిని సర్వే చేసి కంపెనీలకు అప్పగించేందుకు సిద్ధం చేశారు. పరిశ్రమల స్థాపనకు అనువుగా పైడిపాల, బూరుగుపాలెం, పాపయ్యపాలెం ప్రాంతాల పరిధిలోని మరో 4,400 ఎకరాల ల్యాండ్ బ్యాంకును సిద్ధం చేయడంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. భూ ఆక్రమణలు చేసే వారు ఏ పార్టీవారైనా కేసులు పెట్టాలన్న స్పీకర్ ఆదేశాలనూ ఆయన ముక్కుసూటిగా అమలు చేశారు. అయితే ఆర్డీవో కార్యాలయంలో పాలనా పరమైన ఇబ్బందులను అధిగమించేందుకు తహసీల్దార్ వెంకటరమణకు డిప్యుటేషన్పై ఏవోగా నియమించినట్టు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. కానీ కొందరు టీడీపీ నేతలకు అనుకూలంగా లేకపోవడంతోనే ఆయన డిప్యుటేషన్ జరిగిందని తీవ్రంగా చర్చ సాగుతోంది. ఏది ఏమైనా 8 నెలల్లోనే ఆయనను ఇక్కడ నుంచి డిప్యుటేషన్పై పంపడం మండలంలో చర్చనీయాంశంగా మారింది. -
ఏపీ జేఏసీ కో చైర్మన్గా గోపీనాథ్
గోపీనాథ్కు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలుపుతున్న పీఆర్టీయూ శాఖ ఉపాధ్యాయులు నర్సీపట్నం: ఏపీ జేఏసీ కో చైర్మన్గా పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు డి.గోపీనాథ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ నాయకులు ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన డీఏ బకాయిలు, ఐఆర్, పీఆర్సీ ప్రకటన ప్రభుత్వం వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. ఇతర సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామన్నారు. పీఆర్టీయూ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎ.వరహాలనాయుడు, జి.వి.రమేష్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కె.వి.రమణ తదితరులు పాల్గొన్నారు. -
ఇరాన్పై దాడులు ఆపాలని డిమాండ్
అనకాపల్లి టౌన్: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త దాడులను తక్షణమే ఆపేయాలని భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం జిల్లా సమితి (ఇస్కప్) డిమాండ్ చేసింది. స్థానిక శ్రామిక సదనంలో జరిగిన సమావేశంలో ప్రపంచ శాంతిని కోరుతూ యుద్ధంలో కన్నుమూసిన మానవాళికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇస్కప్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఎ. మాధవరావు మాట్లాడుతూ అమెరికా అనుసరించే సామ్రాజవాద, దురాక్రమణ చర్యల్లో భాగంగానే ప్రపంచంలో శాంతి లేకుండా పోతుందన్నారు. కేవలం ఆయిల్ నిక్షేపాల కోసమే కుంటిసాకులతో ఈ దాడులకు తెగబడ్డాయన్నారు. ఒక దేశంపై మరొక దేశం దాడి చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనన్నారు. కార్యక్రమంలో ఇస్కప్ జిల్లా నేతలు విల్లూరి పైడారావు, దాడి శివరాం, మళ్ల చక్రవర్తి, బొడ్డేడ అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. -
అక్రమంగా బాణసంచా నిల్వ చేస్తే కేసులు
రావికమతం: అనుమతులు లేకుండా బాణసంచా తయారు చేసినా, పేలుడు పదార్థాలు నిల్వ చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి హెచ్చరించారు. కాకినాడలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుళ్ల ఘటన నేపథ్యంలో రావికమతం పోలీస్ స్టేషన్ పరిధి కొమిరలో భూమి ఎంటర్ప్రైజస్ మ్యాగజైన్ను మంగళవారం ఆమె కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, రావికమతం ఎస్ఐ రఘువర్మలతో కలిసి తనిఖీ చేశారు. రికార్డులు, పరిసరాలు, సేఫ్టీ ఏర్పాట్లను పరిశీలించారు. మ్యాగజైన్కు 2030 వరకు పీఈఎస్వో లైసెన్స్ ఉన్నట్లు గుర్తించారు. ప్రజలకు, జీవాలకు ఎటువంటి ఇబ్బందులు లేవని నిర్ధారించారు. లైసెన్స్ హోల్డర్ను హ్యాండ్లింగ్ నిల్వ సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించాలని హెచ్చరించారు. -
జిల్లా జేఏసీ వైస్ చైర్మన్గా గొంది చినబ్బాయ్
గొంది చినబ్బాయ్ను సత్కరిస్తున్న జేఏసీ నాయకులు అనకాపల్లి: ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) వైస్ చైర్మన్గా గొంది చినబ్బాయ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక నర్సింగరావుపేటలో ఏపీటీఎఫ్ భవనంలో సోమవారం రాత్రి జరిగిన ఎన్నికల్లో చినబ్బాయ్లను కమిటీ సభ్యులు పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు రొంగలి అక్కునాయుడు, జిల్లా కార్యదర్శి గుత్తుల సూర్య ప్రకాష్, సీనియర్ నాయకులు రవికుమార్, నూతన్ కుమార్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మో దొంగనోట్లు!
బుచ్చెయ్యపేట : వడ్డాది వేంకటేశ్వరస్వామి కల్యాణ మహాత్సవాల్లో దొంగనోట్లు కలకలం రేపింది. కల్యాణ మహోత్సవాలు సందర్భంగా పలువురు వ్యాపారులకు దొంగనోట్లు అంటకట్టారు. వడ్డాదికి చెందిన సంగడి అప్పారావు ఐస్ క్రీంలు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. ఇతనికి వచ్చిన డబ్బుల్లో ఒకటి రూ, 200 దొంగనోటు రావడంతో ఆందోళన చెందాడు. ఇతనిలాగే కొంత మంది వ్యాపారులకు దొంగనోట్లు రాగా భయపడి వచ్చిన నోట్లును చింపి పారేశారు. గతంలో వడ్డాది సంతలో రూ, 500, 1,000, 2,000 దొంగ నోట్లు ఎక్కువగా చలామణి చేసేవారు. మరలా ఇపుడు దొంగనోట్లు చలామణి అవడంతో పలువురు వ్యాపారులు హడలిపోతున్నారు. -
గంజాయి స్మగ్లర్ల అనుమానిత స్థావరాల తనిఖీ
చోడవరం : కొన్ని చోట్ల స్థావరాలు ఏర్పాటు చేసుకొని స్మగ్లర్లు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారన్న అనుమానంతో చోడవరం పట్టణంలో పలు లాడ్జిలు, నిర్మానుష్య ప్రదేశాల్లో పాడుబడిన ఇళ్లను పోలీసులు మంగళవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని తెచ్చి చోడవరం పట్టణంలో పలు లాడ్జిలు, శివారు ప్రదేశాల్లో పాతబడిన ఇళ్లు, నిర్మానుష్య ఖాళీ ప్రదేశాల్లో దాచి ఉంచి అక్కడ నుంచి అనువైన సమయంలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారనే అనుమానంతో ఎస్ఐ జోగారావు తన సిబ్బందితో విస్తృతంగా తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో ఎటువంటి గంజాయి గాని, అనుమానితులుగా గాని వీరికి దొరకలేదు. దీనితో నిఘా మరింత పెంచుతామని ఎస్ఐ తెలిపారు. -
గణేష్కు మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి కితాబు
● పార్టీ కమిటీల డిజిటలైజేషన్లో నర్సీపట్నం టాప్ నర్సీపట్నం: వైఎస్సార్సీపీ కమిటీల నియామకంలో రాష్ట్రంలోనే నర్సీపట్నం నియోజకవర్గం ముందంజలో ఉండటంతో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ను మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మెచ్చుకున్నారు. మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగన్ను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ వివిధ విభాగాల కమిటీలను నియమించడంతోపాటు డిజిటలైజేషన్ చేసిన ప్రక్రియను పార్టీ అధినేతకు గణేష్ వివరించారు. కమిటీల నియామకంలో ముందంజలో ఉండటంతో.. ఇదే స్ఫూర్తితో పని చేయాలని అధినేత సూచించినట్లు గణేష్ తెలిపారు. నియోజకవర్గంలోని మున్సిపాలిటీ అధ్యక్షుడు ఏకా శివ, నాలుగు మండలాల అధ్యక్షులు శానాపతి వెంకటరత్నం, గొలుగొండ పాణిశాంతరావు, లగుడు నాగేశ్వరరావు పార్టీ అధినేతను కలిసిన వారులో ఉన్నారు. -
పడవ బోల్తా పడి మత్స్యకారుడి మృతి
అచ్యుత్యాపురం రూరల్: మండలంలోని పూడిమడక తీరంలో కొండపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు చోడిపల్లి దేముడు (41) మంగళవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 4.30 గంటలకు పూడిమడకకు చెందిన ఒరుపుల మసేను ఐఎన్డీ–ఏపీ–వీ3–ఎంఓ–2010 బోటుపై నలుగురు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. తీరానికి 20 మీటర్ల దూరంలో అలల తాకిడికి చోడిపల్లి దేముడు పడిపోయాడు. వెంటనే తోటి మత్స్యకారులు సముద్రంలో నుంచి బయటకు తీసినప్పటికే మృతి చెందాడు. మృతుడు భార్య రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతునికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇంటి పెద్ద దేముడు ఇక లేడన్న చేదు నిజం జీర్ణించుకోలేక కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో తీరంలో విషాద ఛాయలు అలముకున్నాయి. -
ఖాజీపాలెం గ్రామ దేవాలయాల్లో చోరీ
అచ్యుతాపురం రూరల్: మండలంలోని ఖాజీపాలెం గ్రామంలో అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో మూడు దేవాలయాలతోపాటు ఒక వ్యక్తి ఆటో చోరీకి గురయ్యాయి. సర్పంచ్ పీలా నర్సింగరావు కథనం మేరకు.. గ్రామంలో అర్ధరాత్రి దాటిన తర్వాత మోదమాంబ, దుర్గాలమ్మ, ఆంజనేయ స్వామి ఆలయాల హుండీల్లో నగదు రూ.30 వేలు గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. దాంతో పాటు అదే గ్రామానికి చెందిన బుదిరెడ్డి శ్రీను ఆటో కూడా ఎత్తుకుపోయారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా గ్రామ పెద్దలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీమ్ అధికారులు వచ్చి వేలిముద్రలు సేకరించారు. చోరీకి గురైన ఆటోను మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అనకాపల్లి హైవే పక్కన సబ్బవరం వెళ్లే మార్గంలో శంకరం దగ్గర పురుషోత్తపురానికి చెందిన వ్యక్తి గుర్తించినట్లు సర్పంచ్ తెలిపారు. -
గిరిజనుడి దారుణ హత్య
ముంచంగిపుట్టు: వివాహేతర సంబంధం ఓ గిరిజనుడి ప్రాణాలను బలిగొంది. మండల కేంద్రం ముంచంగిపుట్టులో మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గొంతుకోయడంతో ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. దీనికి సంబంధించి జి.మాడుగుల సీఐ బి.శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి: అసలేం జరిగింది? పెదబయలు మండలం, అడుగులపుట్టు పంచాయతీ, కొత్తపుట్టు గ్రామానికి చెందిన కాసులమ్మకు, గూడెంకొత్తవీధి మండలం ఆర్వీనగర్కు చెందిన కిముడు అరుణ్తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరు గత ఆరేళ్లుగా పెదబయలు మండల కేంద్రంలో నివాసం ఉంటున్నారు. అరుణ్ జీపు డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, ఏడాది క్రితం పెదబయలు మండలం అరడకోట పంచాయతీకి చెందిన కూర్తాడి నాగేశ్వరరావు (27)తో కాసులమ్మకు పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయమై అరుణ్కు, కాసులమ్మకు మధ్య తరచూ గొడవలు జరిగేవి. నాగేశ్వరరావును అరుణ్ పలుమార్లు హెచ్చరించినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా, కాసులమ్మ భర్తతో గొడవపడి నాగేశ్వరరావు వద్దే ఉంటోంది. పథకం ప్రకారమే.. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త అరుణ్, తన భార్య అన్నయ్య అయిన వంతాల నాగేశ్వరరావుతో కలిసి ఈ సమస్యపై చర్చించాడు. సోమవారం రాత్రి ముంచంగిపుట్టు మండలం ఏనుగురాయి పంచాయతీ కొండపడ హోళీ జాతరకు వీరిద్దరూ వచ్చారు. ఆ సమయంలో కాసులమ్మ, నాగేశ్వరరావుతో కలిసి ముంచంగిపుట్టు మండల కేంద్రంలో ఉన్నట్లు తెలుసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ముంచంగిపుట్టు రామాలయం సమీపంలోని వారి ఇంటికి వెళ్లిన అరుణ్, వంతాల నాగేశ్వరరావు.. తలుపు తీయమని కోరారు. తలుపు తీయగానే లోపల ఉన్న కూర్తాడి నాగేశ్వరరావుపై కత్తితో దాడి చేసి, పీక కోసి అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసుల చర్యలు కాసులమ్మ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూసేసరికి నాగేశ్వరరావు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఆస్పత్రికి తరలించే లోపే అతను మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్థానిక సీహెచ్సీకి తరలించారు. జి.మాడుగుల సీఐ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్య చేసి పరారీలో ఉన్న అరుణ్, వంతాల నాగేశ్వరరావులను 12 గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్టు చేశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని సీఐ తెలిపారు. వివాహేతర సంబంధమే కారణం వెల్లడించిన సీఐ శ్రీనివాసరావు ముంచంగిపుట్టులో ఘటన ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు -
వేడుకగా నాగవల్లి వసంతోత్సవం
బుచ్చెయ్యపేట: ఉత్తరాంధ్రలోనే ప్రసిద్ధి చెందిన వడ్డాది వేంకటేశ్వరస్వామి నాగవల్లి వసంతోత్సవం వేడుకగా జరిగింది. స్వామివారి 153వ కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు నాగవల్లి వసంతోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అఖిలాండ బ్రహ్మండకోటి గోవింద నామశరణ ఘోషతో వడ్డాది వీధులన్నీ భక్తిభావంతో పులకించాయి. చంద్ర గ్రహణం కారణంగా శ్రీదేవి, భూదేవి, వేంకటేశ్వరస్వామికి తిరువీధి వసంతోత్సవం ఆలయ పరిసర ప్రాంతాల్లోనే నిర్వహించారు. గజ, గరుడ వాహనాలపై ఉంచి నిర్వహించే తిరువీధి వసంతోత్సవం, గ్రామ ఊరేగింపును అధికారులు రద్దు చేశారు. ఆలయ పరిసర ప్రాంతంలోనే భక్తులు స్వామివారిపై వసంతోత్సవం జల్లుతూ గోవింద నామస్మరణతో తరించారు. సన్నాయి, మేళతాళాలతో డప్పులు, వాయిద్యాల నడుమ స్వామివారి తిరువీధోత్సవం మంగళవారం గిరిజాంబ కొండ ప్రాంతంలోనే జరిగింది. చంద్ర గ్రహణం కారణంగా నాగవల్లి వసంతోత్సవం ఊరేగింపు సమయాన్ని కుదించారు. వడ్డాది శారదా నదిలో వేంకటేశ్వర స్వామికి చక్రస్నానం చేయాల్సివుండగా గ్రహణం కారణంగా ఆలయం దిగువన మంచి నీటిట్యాంకు వద్ద స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఉంచి ధర్మకర్త శ్రీరామ్, ఈవో శర్మ సమక్షంలో వేదపండితులు శాస్త్రోక్తంగా చక్రస్నానం చేయించారు. స్వామి వారితో పాటు పలువురు భక్తులు స్నానాలు ఆచరించారు. ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఉత్సవ విగ్రహాలను గిరిజాంబ కొండపై ఉంచారు. గ్రహణంతో ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆలయ ప్రధాన ద్వారాలను మూసివేశారు. బుధవారం తెల్లవారు నాలుగు గంటలకు ఆలయంలో సంప్రోక్షణ పూజలు చేసిన తర్వాత భక్తులకు పునః దర్శనాలు కల్పిస్తామని ఈవో శర్మ, అర్చకులు సాధువులు, శ్రీకాంతచార్యులు తెలిపారు. -
నేత్రపర్వం... వెంకన్న చక్రతీర్థం
నక్కపల్లి: వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా ఉపమాక వెంకన్న చక్రవారి స్నానం మంగళవారం ఘనంగా జరిగింది. పౌర్ణమినాడు వేంకటేశ్వరస్వామి అత్తవారింటికి (సముద్రుడి) వెళ్లే సన్నివేశాన్ని చక్రవారి స్నానంగా పిలుస్తారు. కల్యాణం అనంతరం పౌర్ణమి నాడు ఉదయం ఆలయంలో నిత్య పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్సవ మూర్తులను ఎదురుగా ఉంచి రోలు రోకలికి పూజలు నిర్వహించారు. చూర్ణోత్సవంలో భాగంగా చూర్ణాన్ని భక్తులపై జల్లారు. కల్యాణం అనంతరం స్వామివారిని భక్తులకు అద్దంలో చూపించి దర్శనం కల్పించారు. ఏటా పౌర్ణమినాడు రాత్రిపూట జరిగే ఈ కార్యక్రమం చంద్ర గ్రహణం వల్ల మధ్యాహ్నంలోపు పూర్తి చేసి ఆలయాన్ని మూసి వేశామని ప్రధానార్చకుడు వరప్రసాదాచార్యులు తెలిపారు. రాజయ్యపేట సముద్ర తీరంలో చక్రతీర్థం.. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతుడైన వేంకటేశ్వరస్వామిని రాజాధిరాజ వాహనంపై ఉంచి రాజయ్యపేట సముద్ర తీరానికి తీసుకెళ్లి స్నానమాచరింపజేశారు. అనంతరం నూతన వస్త్రాలను అలంకరించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు సముద్రంలో స్నానం చేసేందుకు పోటీపడ్డారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి పలువురు తోడపెద్దులు, అమ్మవారి ఘటాలు (గరగలు)ను తీసుకువచ్చి సముద్ర స్నానమాచరింపచేశారు. చంద్ర గ్రహణం కావడంతో మధ్యాహ్నం ఆలయాన్ని మూసి వేశారు. సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయంలో అద్దాల మండపంలో స్వామివారికి డోలోత్సవం(అద్దపు సేవ) నిర్వహించారు. స్వామివారి గర్భాలయ ప్రవేశాన్ని శ్రీదేవీ,భూదేవీ అడ్డుకోవడం, తానెవరో వివరించి గర్భాలయ ప్రవేశ సన్నివేశాన్ని అర్చక స్వాములు కళ్లకు కట్టినట్లు వివరించారు. అర్చక స్వాములు కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, నరశింహాచార్యులు, శ్రీనివాసాచార్యులు, గోపాలా చార్యులు, సాయిఆచార్యులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. సీఐ మురళి, ఎస్ఐ సన్నిబాబుల ఆధ్వర్యలో చక్రవారీ తీర్థం వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేశారు. -
ఉన్నత విద్యకు భాష అడ్డంకి కాదు...
సదస్సులో మాట్లాడుతున్న సత్యనారాయణ మాకవరపాలెం : తెలుగు మీడియంలోనూ ఉన్నత విద్యను అభ్యసించవచ్చని ఉత్తరప్రదేశ్ మాజీ డీఐజీ, కోటవురట్ల మండలం పాములవాకకు చెందిన కిల్లాడ సత్యనారాయణ అన్నారు. మాకవరపాలెం, బూరుగుపాలెం ఉన్నత పాఠశాలల్లో సోమవారం విద్యార్థులకు ఉన్నత విద్యపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాషను కాపాడుకోవాలన్నారు. మాతృభాషను గౌరవిస్తూ ఇతర భాషలను నేర్చుకోవాలన్నారు. తెలుగులో చదివినా ఐఏఎస్, ఐపీఎస్లు కావొచ్చన్నారు. పదో తరగతిలో అధిక మార్కులు సాధించిన విద్యార్థులను వారు అభ్యసించే ఏ చదువులకై నా తానే నిధులు సమకూరుస్తానన్నారు. ఇప్పటి నుంచే భవిష్యత్లో ఏం చేయాలో నిర్ణయించుకోవాలని విద్యార్థులకు సూచించారు. క్యోతీరావుపూలే ఆల్ ఇండియా ఓబీసీ చైర్మన్ పోతల ప్రసాద్, మండల ఏపీటీఎఫ్ అధ్యక్షుడు ఎన్.శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ మాకవరపాలెం మండలం నుంచే స్వచ్ఛంద కార్యక్రమాలు ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్న సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
త్రుటిలో తప్పిన ప్రాణాపాయం
రావికమతం: సచివాలయ ఉద్యోగికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. మండలంలో గర్నికం గ్రామానికి చెఽందిన సచివాలయ ఉద్యోగి మౌనిక బుచ్చెయ్యపేట మండలం పెదపూడి సచివాలయంలో ఏఎన్ఎంగా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం విధులకు స్కూటీపై వెళ్తుండగా, రావికమతం –గుడ్డిప ఆర్ఈసీ రోడ్డులో గుడివాడ జంక్షన్ వద్ద బస్సు చక్రాల కిందకు దూసుకుపోయింది. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించేందుకు బస్సు ఆగి ఉండటంతో స్కూటీతో సహా బస్సు చక్రాల కిందకు దూసుకెళ్లినా ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ఆటోకు, బస్సుకు మధ్య స్కూటీ ఇరుక్కుని నుజ్జు నుజ్జయింది. ఈ ప్రమాదంలో ఆమె చెయ్యి విరిగింది. వెంటనే అనకాపల్లిలో ఆస్పత్రికి తరలించారు. ఏఎస్ఐ రమణ ఘటనా స్థలాన్ని పరిశీలీంచారు. -
వడ్డాది వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక అలంకరణ
బుచ్చెయ్యపేట : ప్రసిద్ధి చెందిన వడ్డాది వేంకటేశ్వరస్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. వడ్డాది వెంకన్న ఉత్సవాలపై భక్తుల విమర్శలు కల్యాణ వేడుకల ఏర్పాట్లలో వైఫల్యాలపై సోమవారం సాక్షి కథనానికి అధికారులు స్పందించారు. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి వేంకటేశ్వరస్వామి 153వ కల్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా సాధారణ అలంకరణతోనే స్వామివారి దర్శనాలు కల్పించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై దేవస్ధానం అధికారులు సోమవారం శ్రీదేవి,భూదేవి,స్వామి వారి విగ్రహాలను పుష్ఫాలతో ప్రత్యేకంగా అలంకరించారు. గిరిజాంబ కొండపైన ఉన్న స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరణ చేసి దర్శనాలు కల్పించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. కల్యాణ వేడుకల్లో భాగంగా ప్రత్యేకమైన స్వామి వారి నాగవల్లి వసంతోత్సవం, తిరువీధి ఉత్సవం,చక్రస్నానం మంగళవారం జరగనుంది. ఆలయ ధర్మకర్త దొండా కన్నబాబు, ఈవో శర్మ, దేవాదాయశాఖ సిబ్బంది నాగవల్లి వసంతోత్సవం ఏర్పాట్లపై ఆలయంలో చర్చించారు. చంద్రగ్రహణం తగలక ముందే స్వామి వారి నాగవల్లి వసంతోత్సవం పూర్తి చేయాలని నిర్ణయించారు. -
లారీ ఢీకొని ఉపాధ్యాయుడు దుర్మరణం
ప్రమాదస్థలాన్ని పరిశీలిస్తున్న యలమంచిలి రూరల్ ఎస్ఐ ఉపేంద్ర యలమంచిలి రూరల్: రేగుపాలెంలో 16వ నెంబరు జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు కన్నం కృష్ణారావు(58) దుర్మరణం చెందారు. మండలంలోని జంపపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తూ పట్టణంలోని సిగ్నేచర్ అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో పులపర్తిలో పొలంలో వ్యవసాయ పనులు చూసుకుని తిరిగి ఇంటికి తన ద్విచక్రవాహనంపై వస్తుండగా, తుని నుంచి అనకాపల్లి వైపు వెళ్తున్న ఏపీ31బీజీ8398 నంబరు లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. అతడి శరీరంపై నుంచి లారీ చక్రాలు వెళ్లిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శరీరభాగాలు నుజ్జయ్యాయి. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా, వేగంగా వాహనాన్ని నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మృతుడి సోదరుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచామని రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర తెలిపారు. ఎంఈవో సూర్యప్రకాష్, ఉపాధ్యాయ సంఘాల నేతలు, సహచర ఉపాధ్యాయులు సంతాపం ప్రకటించారు. -
జగనన్న కాలనీ స్థలం దురాక్రమణ
యలమంచిలి రూరల్ : కూటమి ప్రభుత్వంలో భూ అక్రమాలకు అధికార టీడీపీ నాయకులే దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారు. ఓటు బ్యాంకు పెంచుకోవడమే లక్ష్యంగా అడ్డగోలు వ్యవహారాలకు అండగా నిలబడుతున్నారు. యలమంచిలి మున్సిపాలిటీ పరిధి కొక్కిరాపల్లి రెల్లి కాలనీ సమీపంలో పోలవరం ఎడమ ప్రధాన కాల్వ పక్కన జగనన్న కాలనీకి కేటాయించిన స్థలం దురాక్రమణ వ్యవహారమే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. వివరాలివి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కొక్కిరాపల్లి రెవెన్యూ సర్వే నెంబర్లు 458/1,458/2,461/1,498/1లో సుమారు 14 ఎకరాల్లో జగనన్న లేఅవుట్ ఏర్పాటు చేశారు. యలమంచిలి పట్టణానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ఇక్కడ నివాస గృహాల నిర్మాణం కోసం ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఈ లేఅవుట్లో సుమారు 15 సెంట్ల స్థలాన్ని కొక్కిరాపల్లికి చెందిన ఒక కుటుంబం ఆక్రమించుకుంది. ఆక్రమిత స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా కాంక్రీట్ ఫ్లోరింగ్తో భారీ షెడ్ నిర్మించుకున్నారు. షెడ్లో సీమ పందుల పెంపకాన్ని చేపట్టారు. పందుల పెంపకం కోసం షెడ్కు ఎదురుగా సెప్టిక్ ట్యాంక్ సైతం నిర్మించారు. దీంతో ఈ ప్రాంతంలో విపరీతమైన దుర్గంధం వస్తోంది. భవిష్యత్తులో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకుంటే ఇక్కట్లు తప్పవు. ఆక్రమణకు టీడీపీ కౌన్సిలర్ అండ జగనన్న కాలనీలో స్థలం ఆక్రమించుకుని భారీ షెడ్ నిర్మించిన అడ్డగోలు వ్యవహారానికి కొక్కిరాపల్లి వార్డు టీడీపీ కౌన్సిలర్ అండగా ఉన్నారన్న ఆరోపణలున్నాయి. టీడీపీ నేత ప్రోత్సాహంతోనే ప్రభుత్వ స్థలంలో దర్జాగా షెడ్ నిర్మించుకున్నామని ఆక్రమణదారులు సైతం బహిరంగంగానే చెబుతున్నారు. షెడ్ నిర్మాణానికి రూ.10 లక్షలు ఖర్చయిందని, మాకేమీ ఇబ్బంది లేదని ఆక్రమణదారులు ధీమా చూపుతున్నారు. ఇదంతా తమ కళ్ల ముందే జరుగుతున్నా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వీఆర్వో, సచివాలయ సిబ్బంది, ఇతర యంత్రాంగం ఆక్రమణకు ప్రోత్సాహం అందించడం పట్ల పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారపార్టీ నాయకుడే అండగా ఉండడంతో ప్రస్తుతం నిర్మించిన భారీ షెడ్ పక్కనే మరొకటి కట్టడానికి వీలుగా ఇసుక, మెటల్ సిద్ధం చేశారు. ఆక్రమిత స్థలం చుట్టూ కంచె వేసుకోవడానికి సైతం చూస్తున్నారు. భవిష్యత్తులో జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం పూర్తయితే ఇక్కడ నివసించే వారికి విపరీతమైన కంపు, దోమలు, ఈగల బెడద తీవ్రం కానుందన్న అభిప్రాయాలు లబ్ధిదారుల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇలాంటి ఆక్రమణను చూస్తూ ఊరుకుంటే మరికొంత మంది దురాక్రమణకు తెగబడే అవకాశం ఉందని, తమకు కేటాయించిన స్థలాలు ఆక్రమణకు గురికాకుండా అధికారులు చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
సోలార్ ప్రాజెక్టుకు భూములిచ్చేది లేదు
● బైలపూడి, ఎ.అగ్రహారం గ్రామాల రైతులు తహసీల్దార్కు వినతి పత్రం అందించి మాట్లాడుతున్న రైతులు చీడికాడ: పూర్వం నుంచి సాగులో ఉన్న భూములను సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుకు ఇవ్వబోమని మండలంలోని బైలపూడి, ఎ. అగ్రహారం చిన్న, సన్నకారు రైతులు స్పష్టం చేశారు. సోమవారం పీజీఆర్ఎస్లో తహసీల్దార్ కిషోర్ లింకన్కు వినతి పత్రం అందించారు. బైలపూడికి చెందిన జి.రమేష్, అగ్రహారానికి చెందిన సలాది గంగశేషులుతోపాటు 50 మంది రైతులు మాట్లాడుతూ తమ సాగులో ఉన్న భూములకు ప్రభుత్వం డీ పట్టాలు అందించిందన్నారు. ఆ భూముల్లో వేరుశనగ, అపరాలు, కందులు, పామాయిల్ పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఆ భూములను సోలార్ ప్లాంట్కు అందిస్తే జీవనోపాధి దెబ్బతింటుందన్నారు. ప్లాంట్ వల్ల విడుదలయ్యే రేడియేషన్తో తమ గ్రామాల్లో ప్రజలు, చిన్నపిల్లలకు, పశువులకు తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా తమ భూములను ఇచ్చేది లేదన్నారు. -
రైవాడ కాలువలో ప్రమాదవశాత్తూ పడి వ్యక్తి మృతి
కె.కోటపాడు : మండలంలో పాతవలస గ్రామానికి చెందిన తవినేని దేముడుబాబు(40) ఆదివారం రాత్రి కె.సంతపాలెం వద్ద రైవాడ కాలువలో ప్రమాదవశాత్తూ పడి మృతి చెందాడు. దేముడుబాబు భార్య బంగారమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఫిర్యాదు మేరకు కె.కోటపాడు ఎస్ఐ ఆర్.ధనుంజయ్ తెలిపిన వివరాలివి. పాతవలస గ్రామానికి చెందిన తవినేని దేముడుబాబుతో పాటు ఆయన మేనల్లుడు కిల్లి వెంకటరావు కె.సంతపాలెం రైవాడ కాలువకు సమీపంలో కాల కృత్యాలను తీర్చుకునేందుకు ఆదివారం వెళ్లారు. కాలువకు కొంత దూరంలో మేనల్లుడు వెంకటరావు ఉండిపోగా, కాలకృత్యాలకని వెళ్లిన దేముడుబాబు సమయం గడుస్తున్నా రాకపోవడంతో వెంకటరావు అతని ఆచూకీ కోసం వెతికాడు. కాలువ వెంబడి వెతగ్గా కొంత దూరంలో కాలువలో దేముడుబాబును గుర్తించి బయటకు తీశాడు. అప్పటికే దేముడుబాబు మృతిచెంది ఉన్నాడు. మృతుడికి భార్య, కుమారుడితో పాటు అనారోగ్యంతో ఉన్న తల్లి ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న దేముడుబాబు మృతితో కుటుంబ సభ్యులతో రోధన స్థానికులను కంటతడి పెట్టించింది. దేముడుబాబు మృతదేహానికి పోస్టుమార్టం పనులను పూర్తి చేసి సోమవారం కుటుంబ సభ్యులకు అందించారు. -
ప్రతి అర్జీకి గడువులోగా పరిష్కారం
తుమ్మపాల: పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లకు వచ్చే సమస్యలను అధికారులు వ్యక్తిగతంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అర్జీదారుల సంతృప్తి చెందేలా పరిష్కరించాలని వివిధ శాఖల జిల్లా అధికారులను కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం–1, 2లో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ఆమెతోపాటు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్, మండల, గ్రామ స్థాయిలలో నిర్వహించే పీజీఆర్ఎస్కు సంబంధిత అధికారులు హాజరై ఆయా స్థాయిలోనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా అర్జీలు రీఓపెన్ కాకుండా నివారించవచ్చని తెలిపారు. ప్రతి శాఖ అధికారి అర్జీల పరిష్కార పరిస్థితిని రోజూ పర్యవేక్షణ చేయాలని, గడువు లోపల చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ వారం పీజీఆర్ఎస్లో–128, రెవెన్యూ క్లినిక్లో–173, మొత్తం 301 అర్జీలు నమోదయ్యాయి. కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్లు మనోరమ, రమామణి, సీపీవో జి.రామారావు, పలు శాఖల పీడీలు కె సరోజిని, శచీదేవి, సూర్యలక్ష్మి, శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు. నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రైతుల డిమాండ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు తక్షణమే నష్టపరిహారం మంజూరు చేయాలని, లేనిచో నిషేధిత జాబితా నుంచి తొలగించి క్రయవిక్రయాలకు అనుమతించాలంటూ అనకాపల్లి మండలం తుమ్మపాల, సత్యనారాయణపురం, మూలపేట గ్రామాల రైతులు కలెక్టరేట్ గేటు వద్ద నిరసన చేపట్టారు. అనంతరం పీజీఆర్ఎస్లో కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ప్రాజెక్టులో భాగంగా ఐదేళ్ల క్రితం గెజిట్ విడుదల చేసి రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చారని వాపోయారు. అప్పటి నుంచి ఎటువంటి క్రయవిక్రయాలు చేసుకోలేక కుటుంబ అవసరాలు తీర్చుకోలేని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి 2013 భూ పరిహార చట్టం కింద మార్కెట్ విలువకు నాలుగు రెట్లు పరిహారం ఇవ్వాలని, ఐదేళ్లుగా సాగు చేయకుండా నిలిపివేయడంతో ఉపాధి కోల్పోయామని, ఈ కాలానికి పరిహారం కూడా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రైతు నాయకులు పీలా మురళీ, సిహెచ్.పార్థసారథి, పి.వి.గంగునాయుడు, కోటేశ్వరరావు, ఆదినారాయణ, రైతులు పాల్గొన్నారు. అధికార పార్టీ నేతల భూ ఆక్రమణపై దళితుల నిరసన ఏళ్ల తరబడి సాగులో ఉన్న గ్రామకంఠం భూమిని అధికార పార్టీ నాయకులు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని పాయకరావుపేట మండలం మంగవరం గ్రామానికి చెందిన దళితులు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. సర్వే నంబరు 127లో 8.40 ఎకరాల గ్రామకంఠం భూమిని తామంతా సాగు చేసుకుంటు జీవిస్తున్నామని, పట్టాలు, పాసుపుస్తకాలు మంజూరు చేయాలంటూ ఏళ్ల తరబడి అధికారులకు అర్జీలు చేస్తున్నా న్యాయం చేలేదని వాపోయారు. ఇప్పుడు అధికార పార్టీ నేతలు భూమిని ఇతరుల పేర్లతో రిజిస్ట్రేషన్లు చేసి ఆక్రమించేందుకు చూస్తున్నారన్నారు. తాము అడ్డుకుంటే బైండోవర్ చేసి భూమిలోకి రాకుండా చేస్తున్నారని, న్యాయం చేయాలంటు డిమాండ్ చేశారు. భూమిని సాగుచేస్తున్న తమకు హక్కు పట్టాలు మంజూరు చేయడంతోపాటు అధికార పార్టీ నాయకుల నుంచి రక్షణ కల్పించాలని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. -
ఎస్పీ కార్యాలయానికి 40 అర్జీలు
అర్జీదారు సమస్య తెలుసుకుంటున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 40 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా పలువురు నుంచి అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వారం భూతగాదాలు–30, కుటుంబ కలహాలు–2, ఇతర విభాగాలకు చెందినవి–8 అర్జీలు వచ్చాయన్నారు. అర్జీదారులు సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించాలని కిందస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు పాల్గొన్నారు. -
చింత పండుకు గిరాకీ
మాడుగుల వారపు సంతలో ఎదురు చూస్తున్న గిరి రైతులు మాడుగుల: స్థానిక వారపు సంతలో చింత పండుకు గిరాకీ పెరిగింది. పాడేరు, చింతపల్లి, దేవాపురం గిరి ప్రాంతాల నుంచి శివరాత్రికి ముమ్మురంగా చింత పండు వచ్చేది. ఈ ఏడాది శివరాత్రి దాటిపోయినా సరే అరకొరగా కొత్త చింతపండు రావడంతో డిమాండ్ పెరిగిపోయింది. 40 కిలోల కావిడి చింతపండు రూ. 4 వేల నుంచి రూ.4,500 వరకు ధర పలికింది. గత ఏడాది ఇదే కావిడి రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు ధర ఉండేది. ప్రస్తుతం చింతపండు ఆలస్యంగా రావడంతో ధరలు పెరిగిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే తీవ్ర నష్టాలు
దేవరాపల్లి: ప్రభుత్వ మద్దతు ధర ప్రకటించకపోవడంతో ఏటా జీడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి. వెంకన్న, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.టి. దొర ఆవేదన వ్యక్తం చేశారు. జీడి పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మండలంలోని చింతలపూడి సచివాలయం వద్ద గిరిజన రైతులతో కలిసి ఆందోళన చేపట్టారు. అనంతరం సచివాలయ అధికారులకు డిమాండ్ల కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వెంకన్న, దొర మాట్లాడుతూ వరి, చెరకు, పత్తి, పామాయిల్ మాదిరిగా జీడి పంటకు మద్దతు ధర ప్రకటించకపోవడం అన్యాయమన్నారు. జీడికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి కేజీకి రూ. 200 చొప్పున మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. స్థిరంగా ధర లేక పోవడంతో దళారుల చేతుల్లో మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి సైతం రాక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ధ్వజమెత్తారు. జీడి పంట విస్తరణకు ప్రత్యేక దృష్టి సారించి ఇతర దేశాల నుంచి జీడి దిగుమతులను నిలుపుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎం. ఎర్రునాయుడు, జె. ఈశ్వరరావు, దాయిరి ఈశ్వరరావు, గమ్మెల శ్రీను, చిన్నారావు, సావు రాము, పోయిరి రాము, ఇరట ఈశ్వరరావు, పాంగి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. -
మధ్యాహ్న భోజన పథకానికి నిండుకున్న బియ్యం
కశింకోట: స్థానిక జెడ్పీ బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి బియ్యం నిండుకున్నాయి. దీంతో పక్కన అప్పుగా తెచ్చి భోజనం వండి వడ్డించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా 1వ తేదీకి మండలంలోని ఉగ్గినపాలెం వద్ద పౌర సరఫరాల శాఖ గిడ్డంగి నుంచి ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల సంఖ్య మేరకు బియ్యాన్ని నేరుగా సరఫరా చేస్తున్నారు. ఈ నెల ఇప్పటి వరకు రాలేదు. గత నెలలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో మధ్యాహ్న భోజన పథకానికి బియ్యం లేక పక్కనున్న సమగ్ర బాలికల వసతి గృహం నుంచి అప్పుగా తెచ్చి వండి పెట్టాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 600 మంది బాలికలు పాఠశాలలో చదువుతున్నారు. వీరికి సంఖ్య ఆధారంగా బియ్యం సరఫరా చేస్తుండటంతో అవి నెలాఖరుకు అయిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. దీని దృష్ట్యా అధికారులు సకాలంలో బియ్యం పాఠశాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మంగళవారానికి బియ్యాన్ని సరఫరా చేస్తామని గిడ్డంగి అధికారులను సంప్రదించగా తెలిపారని హెచ్ఎం ఎంఎస్ స్వర్ణకుమారి, ఇన్చార్జి హెచ్ఎం శశికళ తెలిపారు. -
మాజీ సీఎం జగన్ పర్యటన విజయవంతం చేయాలి
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు సాక్షి,పాడేరు: వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈనెల 4వతేదీ బుధవారం అరకులోయ పర్యటించనున్నట్టు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తెలిపారు. వై.ఎస్.జగన్ పర్యటనను విజయంతం చేయాలని ఆయన కోరారు. అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం రెండవ కుమారుడు, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య వివాహానికి మాజీ సీఎం హాజరవుతున్నారని తెలిపారు.జిల్లాలోని వైఎస్సార్సీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు,కార్యకర్తలు,మహిళలు,పార్టీ అభిమానులు ఉదయం 9గంటలకు అరకులోయకు చేరుకుని మాజీ సీఎం జగన్మోహనరెడ్డికి ఘన స్వాగతం పలకాలని ఆయన తెలిపారు. -
ఇంజరి పంచాయతీలో మూగజీవాల మృత్యువాత
పెదబయలు: పాడి పశువుల సంరక్షణకు రూ.కోట్ల ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గిరిజన గ్రామాల్లో పాడి పశువులకు వైద్యం,వ్యాధి నిరోధక టీకాలు అందని ద్రాక్షగానే మిగిలాయి. సకాలంలో వైద్యం అందక రెండు వారాల వ్యవధిలో ఆరు గ్రామాల్లో 60కి పైబడి పశువులు మృత్యువాత పడ్డాయి. మండలంలోని మారుమూల ఇంజరి పంచాయతీలోని తల్లాబు,గిండెలి,సరియవీధి, మూలలోవ,కన్సులమెట్ట,భూసులగుమ్మి గ్రామాల్లో ముక్కు నుంచి నీరు, నోటి నుంచి నురగ కారుస్తూ 60 మూగజీవాలు మరణించాయి. తల్లాబులో 30 పశువులు, మిగిలిన గ్రామాల్లో మరో 30 పశువులు మృతి చెందినట్టు రైతులు తెలిపారు. గ్రామ సమీపంలో పశువులు ఎక్కడిపడితే అక్కడ చనిపోతుండడంతో మట్టిలో పూడ్చడానికి ఆయా గ్రామస్తులు నానా అవస్థలు పడుతున్నారు. కన్నెత్తి చూడని పశువైద్య సిబ్బంది ఇంజరి పంచాయతీలోని ఆరు గ్రామాల్లో ఏడాది కాలంగా పశువులు, గొర్రెలు, మేకలకు ఎలాంటి వ్యాఽధి నిరోధక టీకాలు,నట్టల నివారణ మందు అందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువైద్య సిబ్బంది తమ గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదని వాపోయారు. ప్రభుత్వం,సంబంధిత అధికారులు స్పందించి గ్రామాల్లో పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలందించాలని వారు కోరుతున్నారు. నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి రెండు వారాల వ్యవధిలో 60 పశువులు మృత్యువాత పడి, తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు తెలిపారు. పరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని వారు కోరారు. ఈ విషయంపై ఇంజరి వెటర్నరీ అసిస్టెంట్ బుచ్చిరాజును వివరణ కోరగా గత ఆగస్టులో ఇంజరికి పంచాయతీకి బదిలీపై వచ్చానని, పంచాయతీలో 43 గ్రామాలకు గాను ఏడు గ్రామాల్లో పశువులు,గొర్రెలు,మేకలకు వ్యాధి నిరోధక టీకాలు వేశామని, మిగిలిన గ్రామాల్లో టీకాలు వేయలేదని చెప్పారు. పెన్షన్ పంపిణీ తదితర పనుల వత్తిడి కారణంగా మిగతా గ్రామాల్లో టీకాలు వేయలేకపోయినట్టు తెలిపారు. స్థానిక పశుసంవర్థక శాఖ ఏడీ కిశోర్ వద్ద ప్రస్తావించగా మండలంలోని 23 గ్రామ పంచాయతీల్లో అన్ని గ్రామాల్లో పశువులకు వ్యాక్సిన్ వేసినట్టు చెప్పారు. పశువైద్యంపై అధికారులు పొంతన లేని విధంగా చెప్పడం ఇక్కడ పరిస్థితికి అద్దంపడుతోంది. -
జీసీసీ రూటు సపరేటు
పాచ్మెంట్ కాఫీ గింజలుజీసీసీ కాఫీ వ్యాపారం నుంచి తప్పుకోవడంతో దళారులదే ఇష్టారాజ్యంగా మారింది. మార్కెట్లో పోటీ లేకపోవడంతో దళారులు కాఫీ కొనుగోలు ధరలను భారీగా తగ్గించేశారు.కిలో పాచ్మెంట్ను రూ.390, చెర్రీ రకాన్ని కిలో 200ధరతో కొనుగోలు చేస్తుండడంతో గిరిజన రైతులు నష్టపోతున్నారు. గిరిజన రైతుల వద్ద కాఫీ గింజల నిల్వలు అధికంగా ఉండడంతో వారు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. కాఫీ గింజలను జీసీసీ కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సాక్షి,పాడేరు: జిల్లాలో గిరిజన రైతులు సేంద్రియ పద్ధతిలో సాగుచేసే కాఫీ పంట నాణ్యతలో ప్రపంచంలోనే నంబర్–1లో నిలుస్తుంది. ఇంత ప్రాధాన్యత గల మన్యం కాఫీ గింజలను వ్యాపారులు ఏటా పోటాపోటీగా కొనుగోలు చేస్తారు. జిల్లాలో 11 మండలాల పరిధిలో 1.60 లక్షల ఎకరాల్లోని కాఫీ తోటల ద్వారా ప్రతీ సంవత్సరం 17వేల టన్నుల వరకు కాఫీ గింజలను గిరిజన రైతులు ఉత్పత్తి చేసి, విక్రయిస్తున్నారు. ఈఏడాది జీసీసీ మధ్యలోనే కాఫీ గింజల కొనుగోలును నిలిపివేయడం, మరోవైపు దళారీలు ధరలు పతనం చేయడంతో కాఫీ రైతులు భారీగా నష్టపోతున్నారు.జీసీసీ చైర్మన్ కిడారి సర్వేశ్వరరావుకు కూడా స్థానిక గిరిజనుడే అయినప్పటికీ కాఫీ కొనుగోళ్ల విషయంలో రైతులకు న్యాయం జరగడం లేదు. ధరలు తగ్గాయన్న నెపంతో... సీజన్ చివరి వరకు గిట్టుబాటు ధరతో కాఫీ గింజలను జీసీసీ కొనుగోలు చేస్తుందని ఆశపడిన కాఫీ రైతులకు నిరాశే మిగిలింది. పాచ్మెంట్ కాఫీ గింజలను కిలో రూ.450, చెర్రీ రకం కిలో రూ.270 ధరతో జీసీసీ కొనుగోలు ప్రారంభించింది.అయితే బెంగళూరు కాఫీ మార్కెట్లో కాఫీ ధరలు తగ్గాయనే నెపంతో 20రోజుల నుంచి కాఫీ కొనుగోలును జీసీసీ నిలిపివేసింది. టార్గెట్ పూర్తవకుండానే కాఫీ గింజల కొనుగోలును నిలిపివేయడంతో గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు.సీజన్ మధ్యలో కొనుగోలు నిలిపివేసి తమను జీసీసీ మోసం చేసిందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళారుల తో నష్టం -
పతనమవుతున్న పసుపు, పిప్పళ్ల ధరలు
పెదబయలు: జిల్లాలో గిరిజన రైతులు అధికంగా పండించే పసుపు, పిప్పళ్ల ధరలు వారపు సంత మార్కెట్లో పతనమవుతున్నాయి. సోమవారం పెదబయలు వారపు సంతలో పిప్పళ్లను కిలో రూ.290 నుంచి రూ.300 ధరతో వ్యాపారులు కొనుగోలు చేశారు.ఇదే సీజన్ ప్రారంభంలో రూ.330 నుంచి రూ.350 ధరతో కొనుగోలు చేశా రు. పసుపును సీజన్ ప్రారంభంలో కిలో రూ.138 నుంచి రూ.140 వరకు ధరతో కొనుగోలు చేయగా ఈ వారం రూ.128 నుంచి రూ.132ధరతో సంత మార్కెట్లో కొనుగోలు చేశారు. ఓవరల్గా సీజన్ ప్రారంభంతో పోలిస్తే పిప్పళ్లకు కిలోకు రూ.50 వరకు తగ్గితే, పసుపునకు రూ.8 నుంచి 10 వరకు ధర తగ్గింది. కిలో పిప్పళ్ల నలకను రూ.65 నుంచి రూ.70 ధరతో కొనుగోలు చేశారు. -
కొనుగోలు నిలిపివేయడం అన్యాయం
జీసీసీ సంస్థ సీజన్ చివరి వరకు మార్కెట్లో పోటీలో ఉంటే గిరిజన రైతుల కాఫీ పంటకు అధిక ధరలు లభిస్తాయి. అర్ధంతరంగా కొనుగోలును నిలిపివేయడంతో రైతులంతా తీవ్రంగా నష్టపోతున్నారు.తక్కువ ధరతో దళారులకు విక్రయించవలసిన పరిస్థితి ఏర్పడింది. రైతుల వద్ద కాఫీ గింజల నిల్వలు పేరుకుపోయాయి. –పాలికి లక్కు, కాఫీ రైతుల సంక్షేమ సంఘం నేత, పాడేరు కాఫీ రైతులను ఆదుకోవాలి జీసీసీ వెంటనే కాఫీ గింజల కొనుగోలు ప్రారంభించాలి. సంతల్లో వ్యాపారులు తక్కువ ధరతో కాఫీ గింజలను కొనుగోలు చేస్తున్నారు.వ్యాపారులంతా సిండికేట్గా మారారు.మరో వైపు తూకంలోను తేడాలు ఉండడంతో మోసపోతున్నాం.ప్రభుత్వం కాఫీ రైతులను ఆదుకోవాలి. –కె.బాలన్న, కాఫీ రైతు, మెరకచింత, పెదబయలు మండలం తాత్కాలికంగా నిలిపివేత సంస్థ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాఫీ గింజల కొనుగోలును తాత్కాలికంగా నిలిపివేశాం. బెంగళూరు మార్కెట్లో కాఫీ ధరలు తగ్గినప్పటికీ జీసీసీ గిట్టుబాటు ధరలతోనే ఇంతవరకు కొనుగోలు చేసింది.జీసీసీ యాజమాన్యం తగిన ఆదేశాలిస్తే మళ్లీ కాఫీ గింజలను కొంటాం. –మురళీకృష్ణ, జీసీసీ ఇన్చార్జి డీఎం, పాడేరు -
క్రీడలతో శారీరక దారుఢ్యం
డీఎస్పీ అభిషేక్ అరకులోయటౌన్: క్రీడలు యువతలో శారీరక దృఢత్వం పెంపొందించటంతో పాటు మానసికోల్లాసం కలిగిస్తాయని పాడేరు డీఎస్పీ ఆర్.అభిషేక్ అన్నారు. హోలీ సందర్భంగా మాడగడ పంచాయతీ కేంద్రంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తే ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. చెడు వ్యసనాలకు బానిస కాకుండా సత్ ప్రవర్తనతో మెలగాలని సూచించారు. గంజాయి, సారా, ఇతర మత్తు పదార్ధాల జోలికి పోవద్దన్నారు. అనంతరం గిరి మహిళలతో కలిసి థింసా నృత్యం చేస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో అరకులోయ సీఐ ఎల్.హిమగిరి, ఎస్ఐ గోపాలరావు, పీసా కమిటీ ఉపాధ్యక్షుడు మండియకేడి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
వైద్య సేవల్లో నిర్లక్ష్యం తగదు
పాడేరు: వైద్యసేవల్లో నిర్లక్ష్యం తగదని, ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్య సిబ్బంది సకాలంలో మెరుగైన చికిత్స అందించాలని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు సూచించారు. స్థానిక జిల్లా ఆస్పత్రిని సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి, అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలపై ఆరా తీశారు. ఆస్పత్రి తనిఖీ కోసం ఎమ్మెల్యే వచ్చిన తన వెంట వార్డుల్లోకి ప్రొటోకాల్ ప్రకారం వైద్యులు రాకపోవడంపై మండిపడ్డారు. సమాచారం తెలుసుకున్న జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు ఆస్పత్రికి చేరుకుని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుతో చర్చించారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఎందుకు నిర్వహించడం లేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. 15రోజుల్లో సమావేశం నిర్వహించాలని ఆయన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావుకు సూచించారు. ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ నాయకులు సిర్మా పండన్న, ఎం.కూర్మరాజు తదితరులున్నారు.పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు -
6 నుంచి దారాలమ్మ తల్లి ఉత్సవాలు
సీలేరు: గిరిజనుల కులదేవత, ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పూజలందుకుంటున్న దారకొండ దారాలమ్మ అమ్మవారి జాతరను ఈ నెల 6 తేదీ నుంచి నిర్వహించేందుకు నిర్ణయించారు. ప్రతి ఏటా అమావాస్యకు 10 రోజుల ముందు జాతర నిర్వహించడం అనవాయితీ. సోమవారం భక్తుల సమక్షంలో ఆలయ కమిటీ సభ్యులు, దేవదాయశాఖ అధికారులు ఉత్సవాల తేదీలను ఖరారు చేశారు. 6వ తేదీ ఉదయం 9.39 గంటలకు ఉత్సవ రాట వేయనన్నారు. అదే రోజు ఉదయం 11.06 గంటలకు గరగలు తీస్తారు. 15వ తేదీన కలశస్థాపన, 16వతేదీన అమ్మ వారి చిన్నజాగరణ, 17న పెద్దజాగరణ, 18న అమ్మవారి పెద్ద పండగ నిర్వహించాలని నిర్ణయించారు. పండగ అనంతరం అదే రోజు అమ్మవారి ఆలయ తలుపులు మూసివేసి మరుసటి రోజు గురువారం ఉదయం 7.24 నిమిషాలకు తిరిగి తెరిచి,యథావిధిగా భక్తులకు దర్శనం కల్పిస్తారు.జాతరను భారీ ఎత్తున నిర్వహించాలని, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సోమవారం జాతరకు సంబంధించిన వాల్ పోస్టర్ను అధికారులు ఆలయ కమిటీ సభ్యులు పంపిణీ చేపట్టారు.దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిత్యం భోజన సదుపాయం కల్పించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. 18న ప్రధాన పండగ -
నేడు తాజంగిలో హోలీ మహోత్సవం
చింతపల్లి: మండలంలోని తాజంగిలో హోలీ ఉత్సవాలను మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేసింది. ఇక్కడ ప్రతి సంవత్సరం హోలీ ఉత్సవాలను ఘనంగా మూడురోజుల పాటు నిర్వహిస్తారు. ఐదు దశాబ్దాల క్రితం జోలాపుట్ డ్యాం నిర్మాణంలో భాగంగా నిర్వాసితులైన వారికి అప్పటి ప్రభుత్వం తాజంగిలో ఆశ్రయం కల్పించింది. అప్పటి నుంచి ఆ కుటుంబీకులు మూడేళ్లకు ఒకసారి రామడోలీ ఉత్సవంతో పాటు ప్రతి సంవత్సరం హోలీ పండగను ఘనంగా నిర్వహిస్తున్నారు. వలస వచ్చిన ఒడియా సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటాయి. 60 అడుగుల టవర్ ప్రత్యేక ఆకర్షణ తాజంగి బీటాలైన్లో జరిగే హోలీ పండగకు ఒక ప్రత్యేకత ఉంది. ఉత్సవం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన 60 అడుగుల టవర్(కర్రల నిచ్చెన) ఆకట్టుకుంటుంది. ఒడిశా సరిహద్దు నుంచి వలస వచ్చిన 50 కుటుంబాల వారు అనాదిగా ఈ పండగను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. హోలీకి ముందు రెండు రోజుల ముందు నుంచి కొంత మంది యువకులు నిష్టగా ఉపవాసం ఉంటారు. కర్రల నిచ్చెన కోసం 60 అడుగుల ఎత్తు ఉండే చెట్టును కొట్టి అడవి నుంచి గ్రామానికి తీసుకువస్తారు.ఆ పెద్ద చెట్టుకు రాధా కృష్ణుల ఆలయం సమీపంలో భక్తి శ్రద్దలతో పూజలు చేసి,నిలబెడతారు. దాని చుట్టూ హోలీ ముందు రోజు సాయంత్రం కర్రలతో 60 అడుగుల మేర నిచ్చెనలా ఏర్పాటు చేసి, పైన జెండా కడతారు.మరుసటి రోజు తెల్లవారు జామున ఆ కర్రల నిచ్చెనకు పూజా కార్యక్రమాలు పూర్తి చేసి దహనం చేస్తారు. ఈ సందర్భంగా 60 అడుగుల పైన కట్టిన జెండా ఎటువైపు పడితే ఆ ప్రాంతంలో వర్షాలు పడి,పాడి పంటలు వృద్ధి చెందుతాయని నమ్మకం. ఆ జెండాను పట్టుకున్న వ్యక్తికి నగదు బహుమతి ఇవ్వడంతో పాటు రాధాకృష్ణుని ఆలయంలో గ్రామ పెద్దల సమక్షంలో సన్మానిస్తారు. ఈ ఉత్సవ కార్యక్రమానికి తాజంగి గ్రామం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కొండపడలో ... ముంచంగిపుట్టు: మండలంలోని ఏనుగురాయి పంచాయతీ కొండపడలో ప్రతి ఏటా విభిన్నంగా హోలీ పండగను నిర్వహిస్తారు. అందులో భాగంగా మంగళవారం కర్రలు కాల్చే ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. సుమారు 30 అడుగుల వరకు కట్టెలను పేర్చి, హోలీ రోజు తెల్లవారుజామున కాలుస్తారు. అలా కాల్చడం వల్ల గ్రామానికి సర్వదోషాలు పోయి,మంచి జరుగుతుందని గిరిజనుల నమ్మకం. ఈ ఉత్సవాన్ని చూసేందుకు చుట్టూ పక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో గిరిజనులు వస్తారు.దార్రెల పంచాయతీ కేంద్రంలో సైతం హోలీ పండగను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.ఏర్పాట్లు చేసిన ఉత్సవ కమిటీకొండపడలో ఉత్సవానికి ఏర్పాట్లు చేస్తున్న గిరిజనులు 60 అడుగుల(టవర్) కర్రల నిచ్చెన -
నష్ట పరిహారం ఇవ్వడం లేదు...
సంక్షేమ బోర్డులో పేర్లు నమోదు చేయించుకున్న ప్రతి వ్యక్తికి ప్రభుత్వం నుంచి సహాయం అందజేయాలి. లేబర్ కార్డు తీసుకునే సమయంలో ప్రభుత్వం రూ.60 కట్టించుకుని రశీదు ఇస్తుంది. ప్రమాదాలు జరిగినప్పుడు పట్టించుకోవడం లేదు. భవన నిర్మాణ రంగంలో ఎక్కువగా మహిళలే పనులు చేస్తారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా వారు నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నారు. సంక్షేమ బోర్డుకు నిధులిచ్చి కార్మికులను ప్రభుత్వాలే ఆదుకోవాలి. –మారేడుపూడి సత్యనారాయణ, మేస్త్రి, మూలపేట గ్రామం -
క్యాన్సర్ రహిత సమాజమే లక్ష్యం
వైభవంగా ఏఆర్వోఐ గోల్డెన్ జూబ్లీ బీచ్ వాక్ ఏయూక్యాంపస్ (విశాఖ): అసోసియేషన్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్స్ ఆఫ్ ఇండియా గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా విశాఖ బీచ్రోడ్డులో క్యాన్సర్ అవగాహన వాక్ నిర్వహించారు. ‘50 ఏళ్లుగా స్వస్థత – క్యాన్సర్ రహిత రేపటి దిశగా’ అనే నినాదంతో కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ వరకు ఈ ర్యాలీ సాగింది. సుమారు 100 మంది రేడియేషన్ ఆంకాలజిస్టులు, మెడికల్ ఫిజిసిస్టులు, రేడియేషన్ టెక్నాలజిస్టులు ఇందులో పాల్గొని, రేడియేషన్ థెరపీపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ బి.రవి శంకర్ మాట్లాడుతూ.. క్యాన్సర్ను సకాలంలో గుర్తించడంపై అవగాహన పెంచడం తమ ఉద్దేశమని తెలిపారు. ఏఆర్వోఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సేనాపతి మాట్లాడుతూ.. దేశంలో ఆంకాలజీ ప్రమాణాలను మెరుగుపరచడంలో సంస్థ అందిస్తున్న 50 ఏళ్ల సేవలను గుర్తుచేసుకున్నారు. చికిత్సలో కీలక పాత్ర పోషించే మెడికల్ ఫిజిసిస్టులు, రేడియేషన్ టెక్నాలజిస్టుల సేవలను ప్రజలకు పరిచయం చేయడం ఈ వాక్ ప్రత్యేకత అని ఆయన వివరించారు. రోగులకు మరింత సురక్షితమైన, సమర్థవంతమైన చికిత్స అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏపీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.సుజాత, కార్యదర్శి డాక్టర్ పీబీ ఆనంద రావు, సదస్సు కార్యదర్శి డాక్టర్ వి.దివ్య సౌజన్య తదితరులు పాల్గొన్నారు. -
తీరంలో ఫ్లాష్మాబ్
ఏయూక్యాంపస్ (విశాఖ): ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థులు విశాఖ సాగర తీరాన సందడి చేశారు. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు ఏయూ ఇనుస్ట్రుమెంటేషన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘స్పైక్స్–26’ సాంకేతిక మరియు మేధో ఉత్సవాల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం బీచ్రోడ్డులోని వైఎంసిఏ వద్ద విద్యార్థులు ఫ్లాష్మాబ్ నిర్వహించారు. ప్రముఖ సినీ గీతాలకు విద్యార్థులు ఉత్సాహంగా నృత్యం చేస్తూ పర్యాటకులను, స్థానికులను విశేషంగా అలరించారు. ఈ ప్రదర్శన ద్వారా రాబోయే జాతీయ స్థాయి సాంకేతిక ఉత్సవంపై అవగాహన కల్పించారు. -
వాగులోకి దూసుకెళ్లిన బైక్
సీలేరు: చింతపల్లి మండలం ఆసరాడ గ్రామానికి చెందిన కొందరు యువకులు ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. తమ సోదరి పెళ్లి శుభలేఖలు పంచేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన తీరు.. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఆసరాడ గ్రామానికి చెందిన నర్సింగ్ (36), కార్తీక్ (30), బాలరాజు (25) ఆదివారం జి. కొత్తూరు గ్రామంలోని తమ బంధువులకు పెళ్లి కార్డులు ఇచ్చి తిరిగి బయలుదేరారు. వీరితో పాటు జి. కొత్తూరుకు చెందిన ప్రకాష్ అనే మరో యువకుడు కూడా అదే బైక్పై ఎక్కాడు. ఇలా నలుగురు ఒకే బైక్పై కొంగపాకల వైపు వెళ్తుండగా, రోడ్డు సరిగా లేకపోవడంతో ప్రమాదం జరిగింది. రోడ్డుపై పైకి తేలి ఉన్న రాళ్లపైకి బైక్ చక్రం ఎక్కడంతో అదుపుతప్పి పక్కనే ఉన్న వాగులోకి దూసుకుపోయింది. ఆసుపత్రికి తరలింపు.. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే దారకొండ ఆసుపత్రికి ఫోన్ చేయడంతో, 108 అంబులెన్స్ అక్కడకు చేరుకుంది. క్షతగాత్రులను దారకొండ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే, నలుగురిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం వారిని చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అదుపుతప్పడంతో ప్రమాదం నలుగురికి తీవ్రగాయాలు ముగ్గురి పరిస్థితి విషమం మెరుగైన వైద్యం కోసం చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలింపు సంఘటన స్థలంలో ప్రమాదానికి గురైన బైక్, తీవ్రంగా గాయపడిన యువకులు -
రహదారి నిర్మాణం నాణ్యత పరిశీలన
ఆర్వీ నగర్, గూడెంకొత్తవీధి రహదారి పనులను తనిఖీ చేస్తున్న క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులు గూడెంకొత్తవీధి: మండలంలోని ఆర్వీనగర్ నుంచి గూడెంకొత్తవీధి మీదుగా సీలేరు వరకూ నిర్మిస్తున్న రహదారి నిర్మాణాలను ఆదివారం క్వాలిటీ కంట్రోల్ విభాగానికి చెందిన అధికారులు తనిఖీలు నిర్వహించారు. క్వాలిటీ కంట్రోల్ విభాగం ఎస్ఈ సూర్యనారాయణ, ఈఈ శ్రీనివాస్నాయక్, డీఈ వేణుగోపాల్లు ఈ తనిఖీలు చేపట్టారు. వారి వెంట ఆర్అండ్బీ ఈఈ శ్రీనివాస్, జేఈలు భరత్, జయరాజ్ ఉన్నారు. -
అతివేగం.. అంతిమ ప్రయాణం
● మితిమీరిన వేగంతో నడపడం వల్లే ప్రమాదాలు ● మద్యం మత్తు కూడా కారణం ● కన్నవారికి, కుటుంబాలకు గుండెకోత కొయ్యూరు జాతీయ రహదారిపై మృత్యువు విలయతాండవం కొయ్యూరు: జాతీయ రహదారి 516ఈ మృత్యుదారిగా మారుతోంది. రహదారి విస్తరణ జరిగిన తర్వాత వాహనదారులు, ముఖ్యంగా యువత మితిమీరిన వేగంతో బైక్లు నడుపుతూ మలుపుల వద్ద అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. హెల్మెట్ ధరించకపోవడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీనికి తోడు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ఎదుటివారి ప్రాణాలను బలితీసుకుంటున్నారు. కన్నవారికి, కుటుంబ సభ్యులకు గుండెకోత మిగిలిస్తున్నారు. ● గతంలో విడుదలైన లాన్సెట్ నివేదిక ప్రకారం.. అత్యధిక రహదారి ప్రమాదాలకు మానవ తప్పిదాలే ప్రధాన కారణం. పోలీసులు నిత్యం అవగాహన కల్పిస్తున్నా, వాహనదారులు నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు.చాలా మంది యువకులు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు.మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల నియంత్రణ కోల్పోయి ఇతరులను ఢీకొంటున్నారు. రోడ్లపై పశువుల సంచారం.. రాత్రి వేళల్లో నడింపాలెం నుంచి చింతాలమ్మ ఘాట్ వరకు రోడ్లపై గేదెలు, ఇతర పశువులు ఉండటం వల్ల వేగంగా వచ్చే వాహనదారులు వాటిని గుర్తించలేక ప్రమాదాలకు గురవుతున్నారు. ● 2024 సెప్టెంబర్ 29: రావణాపల్లి సమీపంలో తప్పుడు మార్గంలో వచ్చిన కారు బైక్ను ఢీకొన్న ఘటనలో యాదిగిరి రాజుబాబు, అంబటి అప్పన్నస్వామి మృతి చెందారు. ● 2025 సెప్టెంబర్ 25: సింగవరానికి చెందిన పాంగి అఖిల్ పిట్టాచలం సమీపంలో డివైడర్ను ఢీకొట్టి ప్రాణాలు కోల్పోయాడు. ● 2026 జనవరి 17: రామరాజుపాలెం వంతెన వద్ద జరిగిన బైక్ ప్రమాదంలో సాగిన రాంబాబు మృతి చెందాడు. ● 2026 ఫిబ్రవరి 26: స్కూటీపై వెళ్తున్న పాస్టర్ మోషే చింతలపూడి సమీపంలో ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆచరణలో లేని ‘రోడ్డు భద్రత’ ప్రమాణాలు ఇటీవల కొయ్యూరు ఎస్ఐ కిషోర్ వర్మ భీమవరం చెక్పోస్టు వద్ద యువతతో ‘రోడ్డు భద్రతా ప్రమాణం’ చేయించారు. హెల్మెట్ ధరిస్తామని వారు హామీ ఇచ్చినా, ఆచరణలో మాత్రం మార్పు రావడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.చింతాలమ్మ ఘాట్ మలుపులో వీఆర్వో బైక్ను ఢీ కొట్టిన కారు -
విశాఖ డెయిరీ అవినీతిపైనివేదికను బహిర్గతం చేయాలి
ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకన్న డిమాండ్ దేవరాపల్లి: విశాఖ డెయిరీ అవినీతి, అక్రమాలపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు 2024 నవంబర్లో జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో వేసిన సభా కమిటీ నివేదికను తక్షణమే బహిర్గతం చేయాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.వెంకన్న డిమాండ్ చేశారు. దేవరాపల్లిలో ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. సభా కమిటీ వేసి ఏడాదిన్నర దాటిన డెయిరీ యాజమాన్యం ఒత్తిళ్లకు తలొగ్గి దర్యాప్తు నివేదిక బయటపెట్టలేదని విమర్శించారు. సభా కమిటీకే చట్టబద్ధత లేనప్పుడు ఎవరి మెప్పు కోసం కమిటీ వేశారని ప్రశ్నించారు. విశాఖ డెయిరీ యాజమాన్యం పాడి రైతులతో పాటు ఉద్యోగులను, కార్మికులను కష్టార్జితాన్ని దోచుకుంటోందని ఆరోపించారు. స్పీకర్ అయ్యన్న వేసిన సభా కమిటీ దర్యాప్తునకు అతీగతీ లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి సభా కమిటీ నివేదికను బహిర్గతం చేసి, డెయిరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఉపమాకలో ఘనంగా సదస్యం
స్వామివారిపై పాట ఆవిష్కరణ నక్కపల్లి: వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉపమాక వేంకటేశ్వర స్వామి ఆలయంలో సదస్యం(పండిత సభ) ఘనంగా జరిగింది.ముందుగా స్వామివారికి నిత్యారాధనలు, బాలభోగనివేదన, రాజభోగనివేదన కార్యక్రమం నిర్వహించారు. సుదర్శన పెరుమాళ్లను పల్లకిలో ఉంచి తిరువీధి సేవలునిర్వహించారు.అనంతరం వేదపండితులను ఘనంగా సత్కరించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను పుణ్యకోటివాహనంలో ఉంచి తిరువీధి సేవలు జరిపారు. ఆలయంలో డోలు ఆర్టిస్ట్ సింహాచలం స్వరకల్పనలో ప్రముఖ వేదపండితురాలు డాక్టర్ వేదాల గాయత్రీదేవి రచించిన రావోయి ఉపమాక దేవాపర అనే పాటను ఆవిష్కరించారు. ఈ పాటకు ప్రముఖ ఆర్కెస్ట్రా నిర్వాహకులు ఉప్పలపు గురుమూర్తి కుమారులు శ్రీనివాస్, శివ తమ వాయిద్యసహకారం అందించారు. రచయిత్రి డాక్టర్ గాయత్రీదేవిని పీఏసీఎస్ చైర్మన్కొప్పిశెట్టి బుజ్జి,దేవస్థానం ఇన్స్పెక్టర్ కూర్మేశ్వరరావు తదితరులు సత్కరించారు. ఈకార్యక్రమంలో తాలూకా బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు డి.వి.రామారావు, శ్రీపాద ప్రణవ్రామ్, గోపాలాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
మారుమూల గ్రామాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు
● సత్యసాయి భక్తులు, వైద్యులు రంగరావు, పద్మలతాదేవి దంపతులు ● చిన గంగవరంలో మంచినీటి పథకం ప్రారంభంసీలేరు: గూడెం కొత్తవీధి మండలం, ధారకొండ పంచాయతీ పరిధిలోని చిన గంగవరం గ్రామంలో భగవాన్ శ్రీ సత్యసాయి ప్రేమామృత ధార మంచినీటి పథకాన్ని ఆదివారం ఘనంగా ప్రారంభించారు. విజయవాడకు చెందిన సత్యసాయి భక్తులు, వైద్యులు రంగరావు, పద్మలతాదేవి దంపతులు కొత్తగా నిర్మించిన మంచినీటి కుళాయిలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మారుమూల గిరిజన ప్రాంతాల్లో సత్యసాయి ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే పలు గ్రామాల నుంచి మంచినీటి పథకాల కోసం విన్నపాలు వచ్చాయని, ఆయా గ్రామాలను పరిశీలించి త్వరలోనే మరిన్ని కుళాయిలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మంచినీటి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా గ్రామస్తులు, భక్తుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు.భజనలు, సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను అలరించాయి. భక్తులకు, గ్రామస్తులకు రగ్గులు, విభూది ప్రసాదం మరియు బాబా చిత్రపటాలను పంపిణీ చేశారు. మారుమూల గ్రామాల్లో పరిశుద్ధమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో సత్యసాయి ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని సీపీఐ మండల కార్యదర్శి కవర్ల భగవాన్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి ట్రస్ట్ జిల్లా కో–ఆర్డినేటర్ కేవీఎన్ మూర్తి, సమితి కన్వీనర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా అంతరిక్ష అవగాహన వారోత్సవాలు
విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న సిబ్బంది పాడేరు రూరల్: పాడేరు మండలం లోచలిపుట్టు, శ్రీకృష్ణపురం పాఠశాలల్లో అంతరిక్ష అవగాహన వారోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. సైన్స్ ఫర్ బెటర్ సొసైటీ, ఆశాజ్యోతి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. సుమారు 600 మంది విద్యార్థులకు సంస్థ ప్రతినిధులు, స్థానిక ఉపాధ్యాయులు సైన్స్ అంశాలతో పాటు క్రమశిక్షణ, ప్రవర్తనపై అవగాహన కల్పించారు. సైన్స్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు సీహెచ్. జగదీష్ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి టెలిస్కోప్ వినియోగం, దాని పనితీరుపై కనీస అవగాహన కలిగి ఉండాలని సూచించారు.విద్యార్థులు అన్ని రంగాల్లో నైపుణ్యం పెంపొందించుకున్నప్పుడే ప్రయోగాత్మక పనులపై ఆసక్తి పెరుగుతుందని, చదువుతో పాటు ఇతర అంశాలపై అవగాహన ఉంటేనే లక్ష్యాలను సాధించగలరని ఆయన పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి చిన్నతనం నుంచి శాసీ్త్రయ దృక్పథాన్ని అలవరుచుకోవాలి. ఇలాంటి అవగాహన తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరా రు. ఈ కార్యక్రమంలో సైన్స్ అధికారి కె.జె. రామా రావు, వివిధ సంస్థల ప్రతినిధులు, ఉపాధ్యా య సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
జీడి రైతుల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి
దేవరాపల్లి: జీడి రైతుల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి, మద్దతు ధర కల్పించాలని నాన్ షెడ్యూల్ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.టి. దొర డిమాండ్ చేశారు. చింతలపూడి పంచాయతీ శివారు సమ్మెదలో జీడి రైతులతో కలిసి ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అసెంబ్లీలో చర్చించి, కేజీ జీడి పిక్కలకు రూ. 200 చొప్పున మద్దతు ధర ప్రకటించాలని కోరారు. జీడి పంటలను రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నినదించారు. జీడి పిక్కలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించకపోడంతో దళారీ వ్యాపారుల బారిన పడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర దేశాల నుంచి జీడిపిక్కల దిగుమతులను తక్షణమే నిలుపుదల చేయాలని కోరారు. జీడి పంటకు మార్కెట్ సౌకర్యం కల్పించి, నిలకడగా మద్దతు ధర ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు. జీడి పంటను ఈ క్రాప్లో నమోదు చేసి, జీడి రైతులకు పంట రుణాలు మంజూరు చేయాలని కోరారు. జీడికి మద్దతు ధర కల్పించకుంటే జీడి రైతులతో కలిసి సోమవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని దొర స్పష్టం చేశారు. కార్యక్రమంలో కొరతం పైడితల్లి, గతుం రాము, దొమ్మంగి చంద్రమౌళి, దొమ్మంగి చిన మూలనాయుడు, చికుముకల పూలయ్యనాయుడు పాల్గొన్నారు. -
ఆస్పత్రి పనులపై విజిలెన్స్ విచారణకు ఆదేశం
నర్సీపట్నం: ఏరియా ఆసుపత్రి అభివృద్ధి పనులపై తక్షణమే విజిలెన్స్ విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులను స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. ఏరియా ఆసుపత్రిని ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాబార్డ్ కింద మంజూరైన రూ.40 లక్షలతో జరుగుతున్న మరమ్మతులు, రంగుల పనులను ఆయన పరిశీలించారు. పనుల్లో నాణ్యత లోపించడంతో సంబంధిత కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజిలెన్స్ అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. పనుల్లో ఎటువంటి అవకతవకలు జరిగినా అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పీకర్ హెచ్చరించారు. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్ లక్ష్మీనారాయణను బ్లాక్ లిస్టులో పెట్టాలని సంబంధిత అధికారులను స్పీకర్ ఆదేశించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ సుధాశారదకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట కౌన్సిలర్ సిహెచ్.పద్మావతి ఉన్నారు. -
మహాలక్ష్మికి విశేష పూజలు
శ్రీలక్ష్మీ హవనంలో పాల్గొన్న భక్తులుపెందుర్తి: స్థానిక వేంకటాద్రిపై జరుగుతున్న ఫాల్గుణ మాస ఉత్సవాల్లో భాగంగా మహాలక్ష్మీ అమ్మవారికి ఆదివారం విశేష పూజలు జరిపారు. పంచామృతాలతో అమ్మవారిని అభిషేకించారు. శ్రీలక్ష్మీ హవవాన్ని నిర్వహించి పూర్ణాహుతిని శాస్త్రోక్తంగా జరిపారు. శ్రీసూక్త పారాయణం విశేషంగా పఠించారు. పెద్ద ఎత్తున భక్తులు కార్యక్రమాల్లో పాల్గొని, అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ప్రసాదాన్ని అర్చకులు అందజేశారు. ప్రధానార్చకుడు రామానుజాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. -
టీసీఎల్ విజేత టాలీవుడ్ సెలబ్రిటీ ఎలెవన్
విశాఖస్పోర్ట్స్: నగరంలో నిర్వహించిన తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్(టీసీఎల్) ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో టాలీవుడ్ సెలబ్రిటీ ఎలెవన్ ఘనవిజయం సాధించి ట్రోఫీని కై వసం చేసుకుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగిన ఈ క్రీడా సంబరాల్లో అటు వెండితెర తారలు, ఇటు బుల్లితెర సెలబ్రిటీలు జట్లుగా విడిపోయి తలపడ్డారు. తరుణ్, శ్రీకాంత్ వంటి అగ్ర నటులు అభిమానులను ఆహ్వానించడం, ప్రవేశం ఉచితం కావడంతో పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. ఉత్కంఠగా ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరిగిన టైటిల్ పోరులో టాస్ గెలిచిన ఎన్ఎం స్పేసెస్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు దినేష్ (52), పవన్ (52) అర్ధ సెంచరీలతో రాణించి, రెండో వికెట్కు 69 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టాలీవుడ్ బౌలర్లలో వినయ్, తమన్, సాంబా, దేవా తలో వికెట్ తీశారు. 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టాలీవుడ్ సెలబ్రిటీ ఎలెవన్ ఓపెనర్లు సుధీర్ బాబు (35), నిఖిల్ (21) ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. మధ్యలో అశ్విన్ (44) బౌండరీలతో విరుచుకుపడగా, ఓంకార్ (23) సింగిల్స్తో స్కోరు బోర్డును పరిగెత్తించాడు. చివరి 4 ఓవర్లలో 40 పరుగులు చేయాల్సిన దశలో సాంబా (30), వినయ్ (6) నిలకడగా ఆడి మరో 4 బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు. ప్రత్యర్థి బౌలర్లలో శరత్, కల్కి రెండేసి వికెట్లు తీసినా ఫలితం లేకపోయింది. తొలుత జరిగిన మ్యాచ్లో పోలీస్ వారియర్స్ 18 ఓవర్లలో 9 వికెట్లకు 162 పరుగులు చేయగా, ఎన్ఎం స్పేసెస్ జట్టు 12.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. భరత్ (58), కిరీటి (48) రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగారు. 10 ఓవర్ల పాటు జరిగిన మరో మ్యాచ్లో టీవీ కింగ్స్ 3 వికెట్లకు 140 పరుగులు చేసింది. అభిషేక్ (74) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన టీవీ టైగర్స్ 8 వికెట్ల నష్టానికి 98 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. బౌలింగ్లో నరేష్ 4 వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బతీశాడు. విజేతలకు నిర్వాహకులు ట్రోఫీని అందజేశారు. తారల సందడితో వైఎస్సార్ స్టేడియం కోలాహలంగా మారింది. -
టెన్త్ విద్యార్థులకు టాలెంట్ టెస్ట్
టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్న గిరిజన సంఘ మండల కార్యదర్శి చిరంజీవి చింతపల్లి: భారత విద్యార్థి సమాఖ్యఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర, బాలికల పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు మోడల్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి వంతల పూరిస్థాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్షకు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ పరీక్షకు చింతపల్లి మండలం నుంచి 169 మంది, గూడెం కొత్తవీధి మండలం నుంచి 155 మంది విద్యార్థులు హాజరయ్యారు. స్థానిక గిరిజన సంఘం మండల కార్యదర్శి ఈ పరీక్షా ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పోటీలో ప్రతిభ కనబరిచి అత్యున్నత మార్కులు సాధించిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా వరుసగా రూ. 5వేలు, రూ. 3వేలు, రూ. 2 వేలు నగదు పురస్కారాలను అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రామకృష్ణ, పూర్ణ, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యూటీ చెల్లించాలి
నర్సీపట్నం: ఆర్టీసీలో రిటైర్ అవుతున్న ఉద్యోగులకు గ్రాట్యూటీ, లీవుల డబ్బులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఆర్టీసీ ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చేశారు. నర్సీపట్నం డిపోలో పని చేస్తూ రిటైర్ అయిన ఈయూ సీనియర్ నాయకుడు జోనల్ జాయింట్ సెక్రటరీ వై.రాము పదవీ విరమణ కార్యక్రమానికి ఆయన విచ్చేశారు. రాము దంపతులను యూనియన్ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దామోదరరావు మాట్లాడుతూ ఆర్టీసీ కార్పొరేషన్గా ఉన్నప్పుడు రిటైర్ అయిన రోజే గ్రాట్యూటీ, లీవుల డబ్బులతో పాటు అన్ని సెటిల్మెంట్లు చేసేవారన్నారు. 2024 డిసెంబర్ వరకు రిటైరైన వారిలో 2024 ఏప్రిల్ వరకు మాత్రమే చెల్లించారన్నారు. తరువాత చెల్లింపులు లేవన్నారు. రిటైర్ అవుతున్న ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ధీరజ్. ఈయు ఉద్యోగులు పాల్గొన్నారు. -
రికార్డుల్లేని వాహనాలు స్వాధీనం
పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు సీలేరు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతాల్లో సరైన పత్రాలు లేని వాహనాలు నడిపినా లేదా దాచి ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని సీలేరు ఎస్ఐ యాసీన్ హెచ్చరించారు. ఆదివారం గ్రామాల్లోని పలు వీధుల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు, రికార్డులు లేని ఏడు బైకులను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరిహద్దు దాటే ప్రతి వాహనదారుడు తమ వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. సరైన పత్రాలు లేని పక్షంలో వాహనాలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. ఇటీవల సరిహద్దు ప్రాంతాల్లో వాహన దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో, జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్వాధీనం చేసుకున్న బైకులకు సంబంధించిన అసలు పత్రాలను చూపిస్తే, తిరిగి వాహనాలను అప్పగిస్తామని ఎస్ఐ వెల్లడించారు. -
ఆదుకునే చిత్తశుద్ధి ఏదీ...
జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి అనకాపల్లి పట్టణానికి భవన నిర్మాణ కార్మికులు వస్తారు. ఎండ, వాన లెక్క చేయకుండా పనులు నిమిత్తం రాకపోకలు సాగిస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులకు పనిచేసే ప్రాంతాల్లో ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతాయి. కార్మికులకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది మృత్యువాత పడగా మరికొందరు క్షతగాత్రులుగా మిగిలిపోతున్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి, ప్రభుత్వమే కొంత నిధిని ఇవ్వాలి. –అప్పలనాయుడు, ఊడేరు గ్రామం, అనకాపల్లి మండలం -
డార్క్ కామెడీతో ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’
డాబాగార్డెన్స్ (విశాఖ): శివాజీ, లయ జంటగా నటించిన నూతన చిత్రం ‘సంప్రదాయని సుద్దిని సుద్దపూసని’ ఈ నెల 6న రిలీజ్ కానుంది. ఆదివారం నగరంలో జరిగిన ప్రెస్ మీట్లో చిత్ర విశేషాలను యూనిట్ పంచుకుంది. ఈ సందర్భంగా హీరో శివాజీ మాట్లాడుతూ.. ‘ఇది అద్భుతమైన డార్క్ కామెడీ చిత్రం. మా హిట్ పెయిర్ మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుంది. సినిమా ఆఖరి 45 నిమిషాలు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. రోహన్ అద్భుతంగా నటించాడు. కుటుంబం కోసం సినిమాలు చేస్తూనే, ప్రజల కోసం పోరాడుతాను. విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలి. మహిళల వస్త్రధారణపై గతంలో నేను చేసిన వ్యాఖ్యలు కేవలం నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే.’అని తెలిపారు. హీరోయిన్ లయ మాట్లాడుతూ.. ‘మా తాతగారి ఊరు విశాఖ కావడంతో ఇక్కడితో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఇందులో నా పాత్ర పేరు ఉత్తర. భర్తపై చూపించే అతిప్రేమ తెచ్చిపెట్టే చిక్కుల చుట్టూ ఈ కథ వినోదాత్మకంగా సాగుతుంది. అన్ని వర్గాల వారు ఎంజాయ్ చేసే చిత్రమిది.’అని తెలిపారు. -
రైతులకు అన్యాయం జరిగింది
కాఫీ దీర్ఘకాలిక పంట దానినుంచి వచ్చే ఆదాయంతోనే చాలా గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కాఫీ, మిరియాలు, పైనాపిల్, పసుపు, అల్లం, వరి వంటి పంటలను సాగు చేసే భూములను రైతులు కోల్పోయారు. నష్టపరిహారం పూర్తిస్థాయిలో నేటికీ గిరిజన రైతులకు అందలేదు. జాతీయ రహదారి నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదు. కానీ రైతులకు జరిగిన నష్టానికి తగిన ప్రతిఫలమైన పరిహారం ఇవ్వకుండా పనులు చేపట్టడం సరికాదు. రైతుల పరిస్థితిని గమనించి వారిని ప్రభుత్వం తగినవిధంగా ఆదుకోవాలి. – కంకిపాటి గిరిప్రసాద్, రంపుల పరిహారం అందలేదుజాతీయ రహదారి నిర్మాణం కారణంగా విలువైన మూడు సెంట్ల భూమిని కోల్పోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించి నేటికీ పరిహారం ఇవ్వలేదు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా. రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు. ఇటు పంటలు పండక ఉన్న భూమిని కోల్పోయి జీవనాధారానికి దూరమయ్యా. అయినప్పటికీ ప్రభుత్వం, జిల్లా అధికారులు తమలాంటి బాధితులను పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా పూర్తిస్థాయిలో దృష్టి సారించి అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. – లోత సన్యాసిరావు, రంపుల, గూడెంకొత్తవీధి మండలం -
నిధులిస్తే ఒట్టు!
పేరుకే సంక్షేమ బోర్డు... భవన నిర్మాణ కార్మికులపై కూటమి నిర్లక్ష్యం ● కార్మికులు దాచుకున్న నగదు ఎక్కడో..? ● సమస్యలపై స్పందించని ప్రభుత్వం అనకాపల్లి: సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని బోర్డును ఏర్పాటు చేశారు. నేటికీ ఒక్కరూపాయి కూడా బోర్డుకు ఇవ్వలేదు. మరి సంక్షేమ బోర్డు ఎందుకు ఏర్పాటు చేశారో అర్థం కావడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్న సంక్షేమ బోర్డులో నిధులు ఏమయ్యాయోనని ప్రశ్నిస్తున్నారు. భవన నిర్మాణ కార్మికుల భద్రత, సంక్షేమం కోసం 1996లో అప్పటి ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేశారు. మొదట్లో ఈ పథకం భవన నిర్మాణ కార్మికులకు మాత్రమే ఉద్దేశించేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో అనేక మంది కులవృత్తుల వారిని ప్రభుత్వాలు చోటు కల్పించాయి. ఉపాధి కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, చిన్నపాటి దుకాణాల్లో మెకానిక్లు, మరికొంత మంది వృత్తిదారులను సభ్యత్వం చేయిస్తున్నారు. బోర్డును ఏర్పాటు చేసి, నిధులు లేకుండా చేయడంతో కార్మికులకు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సభ్యత్వం నమోదు చేతివృత్తులదారులు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకునేందుకు రెండు ఫొటోలు, ఆధార్ కార్డు జెరాక్స్, రేషన్ కార్డు, బ్యాంకు అకౌంట్ పాస్ బుక్ జెరాక్స్ కాపీలతో పాటు కార్మికుడిపై ఆధారపడి జీవించే వారి ఆధార్ కార్డు జెరాక్స్లు కార్మికశాఖ అధికారులకు అందజేయాలని, కార్మికశాఖ అధికారులు ఆన్లైన్ల్లో లబ్ధిదారులని పూర్తి వివరాలను నమోదు చేస్తారు. కార్మికశాఖ నుంచి ఒకసారి తీసుకున్న కార్డు 5 సంవత్సరాల వరకూ పనిచేస్తుంది. ప్రతి కార్మికుని నుంచి ఐదు సంవత్సరాల సభ్యత్వం కోసం రూ.60 బ్యాంక్లో ప్రభుత్వానికి చెల్లిస్తారు. గతంలో లేబరు కార్డు ఉన్న వ్యక్తులు మరలా రెన్యూవల్ చేసుకోవాలి. రూ.100 కోట్ల హామీ అమలేదీ... 2014లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో సంక్షేమ బోర్డుకు మంగళం పాడారు. కార్మికుల పోరాటాల కారణంగా కొత్తగా గత ఏడాది సంక్షేమ బోర్డును పునరుద్ధరించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాదిన్నర పూర్తి అవుతున్నా ఒక్క రూపాయి కూడా సంక్షేమ బోర్డు నుంచి లేబర్కార్డు తీసుకున్న కార్మికులకు చెల్లించలేదు. కార్మికులకు ప్రమాదాలు, మృత్యువాత పడినప్పుడు, ప్రమాదంలో అంగవైకల్యం ఏర్పడినా ఆర్థిక సాయం ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంక్షేమ బోర్డుకు రూ.100 కోట్లు ఇస్తామని ఇచ్చిన హామీ నేటికీ అమలు చేయలేదు. బోర్డుకు చైర్మన్ను నియమించారు. కార్మిక సంఘాలతో పూర్తిస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయలేదు. -
వడ్డాది వెంకన్న ఉత్సవాలపై భక్తులు విమర్శలు
బుచ్చెయ్యపేట: ప్రసిద్ధి చెందిన వడ్డాది వెంకటేశ్వరస్వామి కల్యాణ మహాత్సవాలపై భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు. 150 ఏళ్లపైగా చరిత్ర గల వడ్డాది వేంకటేశ్వరస్వామి ఉత్సవాలు సక్రమంగా నిర్వహించకపోవడంపై పలు గ్రామాల భక్తులు మండిపడుతున్నారు. ప్రతి ఏటా ఐదు రోజుల పాటు కమనీయంగా నిర్వహించే స్వామి కల్యాణ వేడుకలను కనులార చూద్దామని రాష్టం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఈసారి జరుగుతున్న 153 కల్యాణ మహోత్సవాల్లో సరైన సదుపాయాలు కల్పించకపోవడంపై అధికారులు,పాలకుల తీరుపై మండిపడుతున్నారు. కల్యాణ వేడుకలు నిర్వహణపై పాలకులు, అధికారులు పెద్దగా ప్రచారాలు చేయలేదు. దీంతో ఈసారి ఉత్సవాలకు భక్తుల రద్దీ బాగా తగ్గిపోయింది. దేవున్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్న భక్తులకు దేవస్ధానం తరపున ఎటువంటి ప్రసాదాలు అందించడం లేదు. కల్యాణ మహోత్సవాల రోజుల్లో కూడా శ్రీదేవి,భూదేవి,వేంకటేశ్వరస్వామి విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరణ చేయకపోగా, సాధారణ అలంకరణతోనే భక్తులకు చూపించడంపై పలువురు మండిపడుతున్నారు. వేడుక రోజుల్లో కూడా లాకర్లో స్వామి వారి ఆభరణాలు ఉన్న తీసుకొచ్చి అలంకరణ చేయకపోవడంపై భక్తులు మండి పడుతున్నారు. వేంకటేశ్వరస్వామి ఆలయం దిగువన సుమారు కోటి రూపాయలతో కల్యాణ మండపం కడతామని చెప్పినా నిర్మాణానికి పునాది లేదు. చిన్నచిన్న గ్రామాల్లో కల్యాణ మండపాలు కట్టినా మేజర్ పంచాయతీ వడ్డాదిలో కల్యాణ మండపం కట్టకపోవడంపై ఎమ్మెల్యే, ఎంపీ,గ్రామంలో ఉన్న కూటమి నేతల తీరుపై భక్తులు, ప్రజలు విమర్శిస్తున్నారు. ఆలయం పక్కనే కాపు సంఘం మండపాన్ని సగం నిర్మించి అసంపూర్తిగా వదిలేయడంపైనా మండి పడుతున్నారు. గతంలో వేంకటేశ్వరస్వామి కల్యాణం జరిగే ఐదు రోజులు వడ్డాది రోడ్లు జనంతో రద్దీతో తీవ్ర ట్రాఫిక్తో ఉండేవి. కానీ నేడు ఉత్సవాల్లో సందడే కరువైంది. గతంలో కల్యాణం జరిగే ఐదు రోజులు భక్తులకు వినోదం కలిగేలా ఆలయం దిగువన, వడ్డాది నాలుగు రోడ్ల జంక్షన్లో వేరువేరుగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. కానీ నేడు తెరపై సినిమాలు వేసే స్థాయికి దిగిపోయారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త దొండా కన్నబాబుకు ఆరోగ్యం బాగుండకపోవడంతో ఉత్సవాలు ఏర్పాటుకు ఆలయ పాలక మండలి సభ్యులను నియమిస్తామని మూడేళ్లుగా చెబుతున్నా నేటికీ ఎమ్మెల్యే రాజు చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్తులు ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా ప్రసిద్ధి చెందిన వడ్డాది వేంకటేశ్వరస్వామి ఆలయ కీర్తి చరిత్ర పెరిగేలా అధికారులు, పాలకులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని పలు గ్రామాల భక్తులు కోరుతున్నారు. -
చందనోత్సవం ఏర్పాట్లలో జాప్యం వద్దు
సింహాచలం: సింహగిరిపై ఏప్రిల్ 20న జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం ఈవో జె.వెంకటరావు తెలిపారు. ఆదివారం ఆయన ఇంజినీరింగ్ అధికారులతో కలిసి సింహగిరిపై సాగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం క్యూలు, మంచినీటి వసతి, బారికేడ్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఈ నెల చివరి నాటికి పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇటీవలే జరిగిన సమావేశంలో కాంట్రాక్టర్లు ఇచ్చిన హామీ మేరకు పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. తనిఖీల్లో ఈఈలు రామకృష్ణ, రాంబాబు, డీఈ హరి, ఏఈ రవిరాజు పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఒకరి మృతి
ఇద్దరికి గాయాలు కొయ్యూరు: జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. డివైడర్ను ఢీకొట్టిన బైక్: యువకుడి దుర్మరణం వలసంపేటకు చెందిన చదల సతీష్ (25) గాదేగుమ్మి నుంచి రామరాజుపాలెం వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. ప్రయాణంలో బైక్ అదుపు తప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సతీష్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘాట్ రోడ్డులో కారు–బైక్ ఢీ: వీఆర్వోకు గాయాలు చింతాలమ్మ ఘాట్ రోడ్డులో జరిగిన మరో ప్రమాదంలో రాజేంద్రపాలెం వీఆర్వో సత్యనారాయణ, ఆయన కుమారుడు రవికిరణ్ గాయపడ్డారు. ఆదివారం విధుల్లో భాగంగా కుమారుడితో కలిసి రాజేంద్రపాలెం వెళ్లిన సత్యనారాయణ, తిరిగి వస్తుండగా ఘాట్ రోడ్డు మలుపు వద్ద ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చిన ఒక కారు వీరి బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులిద్దరికీ కాళ్లు, చేతులు, తల భాగాల్లో గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 వాహనంలో వారిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంతులేని వ్యఽథ
మన్యం ప్రాంత రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని భావించిన ‘516–ఈ’ జాతీయ రహదారి పనులు ప్రస్తుతం గందరగోళంలో పడ్డాయి. గడువు ముగిసినా అడుగు ముందుకు పడని వైనం, కొండచరియల విరుపులతో ప్రమాదకరంగా మారిన ప్రయాణం, భూములు కోల్పోయి నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్న గిరిజన రైతుల ఆవేదన.. వెరసి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు గూడెంకొత్తవీధి మండలంలో ఒక ప్రహసనంలా మారింది. అధికారుల నిర్లక్ష్యం, సాంకేతిక అడ్డంకుల నడుమ మన్యం మకుటం ముళ్ల బాటగా మారుతోంది. అభివృద్ధి బాటలో.. ప్రహసనంలా ‘516–ఈ’ జాతీయ రహదారి పనులు ● గడువు ముగిసినా ముందుకు పడని అడుగు ● నష్టపరిహారం అందక గిరిజన రైతుల వేదన ● క్లిష్టంగా రంపుల ఘాట్రోడ్డులో విస్తరణ పనులు ● విరిగి పడుతున్న కొండచరియలు ● ప్రమాదకరంగా ప్రయాణం గూడెంకొత్తవీధి: మన్య ప్రాంతానికే మకుటాయమానంగా నిలుస్తుందని భావించిన 516–ఈ జాతీయ రహదారి నిర్మాణం గూడెంకొత్తవీధి మండలంలో ప్రస్తుతం ఒక ప్రహసనంగా మారింది. గతేడాది డిసెంబరు నాటికే పూర్తి కావాల్సిన ఈ రహదారి, అనేక అడ్డంకులు.. అవరోధాల వల్ల అడుగు ముందుకు పడటం లేదు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే మన్యం రూపురేఖలు మారి, రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని స్థానికులు ఆశించినా, అది నేటికీ ఒక కొలిక్కి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రంపుల ఘాట్ రోడ్డులో సవాళ్లు రంపుల ఘాట్ రోడ్డులో రహదారి విస్తరణ పనులు అత్యంత క్లిష్టంగా మారాయి. అత్యంత ఇరుకై న ఈ మార్గాన్ని విస్తరించేందుకు కొండలను తవ్వారు. అయితే, వర్షాల సమయంలో కొండచరియలు విరిగిపడుతుండటంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. నష్టపరిహారంపై గిరిజనుల ఆవేదన రహదారి నిర్మాణం కోసం పలు గ్రామాలకు చెందిన గిరిజన రైతులు తమ పంట భూములు, కాఫీ తోటలు మరియు ఇంటి స్థలాలను కోల్పోయారు. నిబంధనల ప్రకారం అందరికీ తగిన నష్టపరిహారం చెల్లిస్తామని అధికారులు ప్రకటించినప్పటికీ, అది నేటికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదు. కేవలం కొద్దిమందికి మాత్రమే అరకొరగా పరిహారం అందిందని, తమకు అన్యాయం జరిగిందని రైతులు వాపోతున్నారు. మరోవైపు, రహదారి పనుల వల్ల సాగునీటి కాలువలు పూడిపోవడంతో సాగు, తాగునీటి సరఫరా ప్రశ్నార్థకంగా మారింది. ప్రాజెక్టు వివరాలిలా.. రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం వరకు సుమారు 209 కిలోమీటర్ల మేర ఈ జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా రూ. 4 వేల కోట్లు కేటాయించింది. మొత్తం ఆరు ప్యాకేజీలుగా ఈ పనులు చేపట్టారు. ● రాజమహేంద్రవరం – రంపచోడవరం: 44 కిలోమీటర్లు ● రంపచోడవరం – కాకరపాడు (కొయ్యూరు మండలం): 74 కిలోమీటర్లు ● కాకరపాడు – పాడేరు (చాపరాతిపాలెం, లంబసింగి మీదుగా): 133 కిలోమీటర్లు ● పాడేరు – బల్తుగుడ (అరకులోయ): 49 కిలోమీటర్లు ● బల్తుగుడ – బౌడార: 43 కిలోమీటర్లు ● బౌడార – విజయనగరం: 27 కిలోమీటర్లు కొనసాగుతున్న అడ్డంకులు రంపుల మార్గంలో పెదవలస, చాపరాతిపాలెం తదితర గ్రామాల రైతులు తమకు పరిహారం అందే వరకు పనులు సాగనివ్వబోమని గతంలో ఆందోళనలు చేపట్టారు. పాడేరు సబ్ కలెక్టరు వారితో చర్చలు జరిపి ఒప్పించడంతో పనులు ప్రారంభమైనప్పటికీ, క్షేత్రస్థాయిలో సమస్యలు అలాగే ఉన్నాయి. వీటికి తోడు, సీలేరు నుంచి విశాఖపట్నం వెళ్లే భారీ విద్యుత్ టవర్లు రహదారికి అడ్డంగా ఉన్నాయి. వీటిని తొలగించాలంటే విద్యుత్ శాఖ అనుమతులు అవసరం. ఇలాంటి అనేక సాంకేతిక, పరిపాలనాపరమైన అడ్డంకుల వల్ల ప్రాజెక్టు ఆలస్యమవుతోంది. తమ భూములు కోల్పోయి, పరిహారం అందక, సాగునీరు లేక అల్లాడుతున్న తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని గిరిజన రైతులు కోరుతున్నారు. -
ఏపీ జెన్కో ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక సాయం
సీలేరు: ఏపీ జెన్కోలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఇటీవల మృతి చెందిన కె. భవానీ శంకర్ కుటుంబానికి గాజువాక విద్యుత్ ఉద్యోగుల సహకార సొసైటీ తరఫున ఆదివారం తక్షణ ఆర్థిక సాయం అందజేశారు. సొసైటీ డైరెక్టర్ వై. సత్తిబాబు చేతుల మీదుగా రూ. 10 వేల నగదును భవానీ శంకర్ భార్య ఉమామహేశ్వరికి అందజేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సత్తిబాబు మాట్లాడుతూ.. భవానీ శంకర్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సొసైటీ నుంచి అందాల్సిన ఇతర ప్రయోజనాలు కూడా సకాలంలో అందేలా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెన్కో కార్మిక సంఘ నాయకులు జి. శివప్రసాద్, పాండురంగ, జోగారావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
చింతపల్లిలో ఔషధ సిరి!
చింతపల్లి అంటే కేవలం చలికాలపు విడిది మాత్రమే కాదు.. అరుదైన ఆరోగ్య ప్రదాయినుల నిలయం కూడా. తూర్పు కనుమల్లో లభించే సుమారు 500 రకాల ఔషధ మూలికల్లో, ఇప్పటికే 200 రకాలను చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానంలో శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా పెంచుతున్నారు. మారుతున్న జీవనశైలిలో ఆయుర్వేదానికి పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని, వందలాది మూలికలను మదర్ ప్లాంట్లుగా సంరక్షిస్తూ, చింతపల్లిని ఒక విత్తనోత్పత్తి కేంద్రంగా మార్చేందుకు శాస్త్రవేత్తలు అడుగులు వేస్తున్నారు.చింతపల్లి: ప్రకృతి ప్రసాదించిన వర ప్రసాదాలు.. తూర్పు కనుమల గుండెల్లో దాగి ఉన్న అద్భుత మూలికలు ఇప్పుడు అల్లూరి జిల్లా చింతపల్లిలో కొలువుదీరాయి. మారుతున్న కాలంతో పాటు భారతీయ ప్రకృతి వైద్యానికి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఔషధ మొక్కల పెంపకం, వీటి సంరక్షణలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. మదర్ ప్లాంట్ల సంరక్షణ.. విత్తనోత్పత్తి కేంద్రంగా ముందడుగు వేస్తోంది. తూర్పు కనుమల్లో సుమారు 500 రకాల ఔషధ మూలికలు ఉండగా, ప్రస్తుతం చింతపల్లి పరిశోధనా స్థానంలో 200 రకాలను ప్రత్యేక క్షేత్రంలో సంరక్షిస్తున్నారు. వీటిని మదర్ ప్లాంట్లుగా భావిస్తూ, భవిష్యత్తులో ఈ కేంద్రాన్ని ఔషధ మొక్కల విత్తనోత్పత్తి కేంద్రంగా మార్చేందుకు శాస్త్రవేత్తలు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పర్యాటకులు సైతం ఈ క్షేత్రాన్ని సందర్శించి ఇక్కడి మొక్కల విశిష్టతను ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఏ మొక్క.. ఏ వ్యాధికి?.. ఈ క్షేత్రంలోని ప్రతి మొక్కకూ ఒక ప్రత్యేకత ఉంది. వేరు, ఆకు, కాండం, బెరడు ఇలా ప్రతి భాగం ఏదో ఒక వ్యాధి నివారణకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. కొన్ని ముఖ్యమైన మొక్కల ఉపయోగాలు నేల ఉసిరి: రక్తపోటు, అధిక వేడిమిని తగ్గిస్తుంది. బియ్యం కడిగిన నీటితో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అశ్వగంధ: యవ్వన శక్తిని పెంచుతుంది. అధిక బరువు, పొట్ట తగ్గడానికి, చర్మ వ్యాధుల నివారణకు మేలు చేస్తుంది. కలబంద: ముఖ సౌందర్యం, చుండ్రు, మధుమేహం, రక్తమొలల నివారణలో కీలకం. వస: గొంతు సంబంధిత వ్యాధులు, నత్తి మాటలు తగ్గడానికి మరియు చిన్న పిల్లలు త్వరగా మాట్లాడడానికి సహకరిస్తుంది. శతావరి: కిడ్నీలో రాళ్లు, ఇతర మూత్రపిండ సమస్యలు, కామెర్ల నివారణకు దీని దుంపలు అద్భుతంగా పనిచేస్తాయి. సర్పగంధి: రక్త ప్రసరణను నియంత్రిస్తుంది. తేనెతో కలిపి తీసుకుంటే తలనొప్పి, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పాషాణబేరి: గుండె జబ్బులు, ఉబ్బసం, ఊబకాయం, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. మానవాళి ఆరంభం నుంచి మూలికా వైద్యమే మూలాధారంగా ఉంది. చిన్న చిన్న వ్యాధులను ప్రకృతి సిద్ధమైన ఔషధాలతో నయం చేసుకోవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఈ వారసత్వాన్ని కాపాడటమే కాకుండా, రైతులు, సామాన్యులకు వీటిపై చింతపల్లి శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తున్నారు.ప్రత్యేక ప్రాజెక్టుమంజూరుకు కృషిపరిశోధనా స్థానంలో ఔష ధ మొక్కల పెంపకానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. ఇక్కడికి వచ్చే పర్యాటకులు, సందర్శకులు ఔషధ మొక్కలను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ మొక్కలను మదర్ ప్లాంట్లుగా సంరక్షిస్తున్నందున, సందర్శకులకు వీటిని పంపిణీ చేయడం సాధ్యపడటం లేదు. భవిష్యత్తులో చింతపల్లి కేంద్రంగా ‘ఔషధ మొక్కల విత్తనోత్పత్తి కేంద్రం’ ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఈ కేంద్రం ఏర్పాటుకు ఒక ప్రత్యేక ప్రాజెక్టును మంజూరు చేస్తే ఈ ప్రాంతానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిస్తున్నాం. – డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి,ఏడీఆర్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, చింతపల్లి -
ప్రజాప్రతినిధులంటే గౌరవం లేదా...
నాతవరం: నిబంధనలు ఉల్లఘించి ప్రోటోకాల్ పాటించకుండా రాజకీయ పార్టీల మధ్య వివాదాలు సృష్టిస్తున్న ఎంపీడీవో శ్రీనివాస్ తీరుపై ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సభ్యులు సర్పంచులు మూకుమ్మడిగా ఆందోళనకు దిగారు. మండల కేంద్రంలో శనివారం ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి , వైస్ ఎంపీపీ పైల సునీల్, జెడ్పీటీసీ సభ్యులు కాపారపు అప్పలనర్స ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీకి చెందిన 16 మంది ఎంపీటీసీ సభ్యులు, 26 మంది పంచాయతీ సర్పంచులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీడీవో వ్యవహారశైలి కారణంగా నాతవరం ిపీహెచ్సీ ప్రాంగణంలో ఆట స్థలం వివాదం చోటు చేసుకుందన్నారు. ఎంపీపీ జెడ్పీటీసీ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా సర్పంచ్ తీర్మానం లేకుండా ఏకపక్ష నిర్ణయంతో రూ.4 లక్షల నిధులతో ఆట స్ధలం పనులు ప్రారంభించి మధ్యలో నిలిచిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. లింగంపేటలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం విషయంలో కూడా ఎంపీడీవో శ్రీనివాస్ సర్పంచులకు తెలియకుండా ఏక పక్ష నిర్ణయంతో భూమి పూజ చేసి గ్రామంలో వివాదానికి కారణమయ్యారన్నారు. మండల వ్యాప్తంగా ఏ పంచాయతీలోనైనా ప్రభుత్వ నిధులతో చేసే అభివృద్ధి పనులకు సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా పదవులు లేని కూటమి నేతలతో పనులకు భూమి పూజ వంటి పనులు ఎంపీడీవో స్వయంగా చేయించడం జరుగుతుందన్నారు. మండలంలో 31 గ్రామ పంచాయతీలకు 26 గ్రామ పంచాయతీ సర్పంచులు వైఎస్సార్సీపీకి మద్దతుదారులే ఉన్నారన్నారు. కానీ పదవులు లేని కూటమి నేతలతో ఎంపీడీవో అభివృద్ధి పనులకు భూమి పూజలు చేయించి తమను అగౌరవ పరిచే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారుగా రూ. 22 లక్షలు మార్చి 10లోపు ఖర్చు చేయాలని కలెక్టరు ఆదేశించారన్నారు. ఆయా నిధులతో పనులు చేసేందుకు గతంలో ఎంపీపీ లక్ష్మణమూర్తి స్వయంగా ప్రతిపాదనలు పంపించగా ఆ ఫైల్పై ఎంపీడీవో సంతకం చేయకుండా జాప్యం చేస్తున్నారన్నారు. ఎంపీడీవో తీరుపై కలెక్టరుకు ఫిర్యాదు చేస్తామన్నారు. అప్పటికీ మార్పు రాకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాటం చేస్తామన్నారు. వైఎస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు లగుడు నాగేఽశ్వరరావు అద్యక్షతన జరిగిన సమావేశంలో చర్చించి తీర్మానించామని, మాజీ గణేష్తో మండల నాయకులు చర్చించి తదుపరి కార్యచరణ ప్రకటిస్తామన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గన్నవరం పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు గొర్లె వరహాలబాబు, వైస్ ఎంపీపీ పైల సునీల్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కరక అప్పలరాజు, మంకు సాంబమూర్తి, వేమల సూరిబాబు, అడిగర్ల నాయుడు, కార్పొరేషన్ రాష్ట్ర మాజీ డైరెక్టర్లు శిరుసుపల్లి నర్సింగరావు, పైల పోతురాజు, సర్పంచుల సంఘం మండల శాఖ అధ్యక్షుడు మిరపల వెంకటరమణ, పార్టీ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు ఇనపసప్పల పుష్ప, ఎంపీటీసీ సంఘం నాయకుడు తమరాన సత్యనారాయణ, మండల యూత్ అధ్యక్షుడు బండారు నాయుడు, సర్పంచులు గొలగాని రాణి, గుడపర్తి అచ్చియ్యనాయుడు, లగుడు నాగేశ్వరరావు, ఇట్టంశెట్టి శ్రీను, పాతాళ అప్పారావు, పార్టీ పెన్షనర్లు మండల శాఖ అధ్యక్షుడు సబ్బవరపు వెంకునాయుడు పాల్గొన్నారు. -
రిటైర్డ్ హోంగార్డుకు రూ. 4.06 లక్షల ఆర్థిక సాయం
పదవీ విరమణ పొందిన హోంగార్డుకు ఆర్థిక సాయం అందజేస్తున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి: విశేష సేవలందించి పదవీ విరమణ చేసిన హోంగార్డు రాజారావుకు తోటి సిబ్బంది రూ.4.06 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో కమ్యూనికేషన్ విభాగంలో హోంగార్డుగా విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన రాజరావుకు శనివారం ఎస్పీ తుహిన్ సిన్హా ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయ పరిపాలన అధికారి సీహెచ్.తిలక్ బాబు, జూనియర్ అసిస్టెంట్ రమేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
పుచ్చకాయలకు భలే గిరాకీ!
● హాట్ కేకుల్లా కొనుగోలు ముంచంగిపుట్టు: వేసవి కాలం ప్రారంభం కావడంతో ముంచంగిపుట్టు మండల కేంద్రంలో శనివారం జరిగిన వారపు సంతలో పుచ్చకాయలకు భారీ గిరాకీ ఏర్పడింది. ఎండల తీవ్రత పెరుగుతుండటంతో, వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు సంతకు వచ్చిన ప్రజలు పుచ్చకాయల కొనుగోలుకు ఎగబడ్డారు. ఒడిశా రాష్ట్రంలోని నందపూరు, లంతాపుట్టు ప్రాంతాల నుంచి వ్యాపారులు వ్యాన్ల నిండా పుచ్చకాయలను తీసుకువచ్చారు. ఎండల ప్రభావం వల్ల మధ్యాహ్నం అయ్యేసరికి ఈ కాయలన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. కాయ సైజును బట్టి ఒక్కో పుచ్చకాయ ధర రూ.60 నుంచి రూ. 100 వరకు పలికింది. ధర కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఎండల ధాటికి తట్టుకునేందుకు వినియోగదారులు ధరను లెక్కచేయకుండా వీటిని కొనుగోలు చేశారు. -
గరిమండలో పోలీసులకార్డెన్ సెర్చ్
కొయ్యూరు: మండలంలోని బూదరాళ్ల పంచాయతీ గరిమండ గ్రామంలో శుక్రవారం రాత్రి పోలీసులు చుట్టుముట్టి తనిఖీలు (కార్డెన్ సెర్చ్ ) నిర్వహించారు. ఒకప్పుడు ఈ గ్రామం గంజాయి సాగుకు, అమ్మకాలకు ప్రధాన కేంద్రంగా ఉండేది. వ్యాపారులు సైతం ఇక్కడి నుంచే గంజాయిని కొనుగోలు చేసేవారు. ఈ నేపథ్యంలో, గంజాయి ప్రభావిత గ్రామాల జాబితాలో గరిమండ ఉండటంతో.. సీఐ బి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంప ఎస్ఐ సీదరి శ్రీనివాస్, ఏపీఎస్పీ పోలీసులు కలిసి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు.గంజాయి నిల్వలు ఉండవచ్చన్న అనుమానంతో గ్రామంలోని ప్రతి ఇల్లు సోదా చేశారు. సరైన పత్రాలు లేని నాలుగు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రతి ఇంట్లోని కుటుంబ సభ్యుల వివరాలను సేకరించడంతో పాటు, గ్రామానికి సంబంధం లేని వ్యక్తుల వివరాలను నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ విలేకరులతో మాట్లాడుతూ.. గంజాయి సాగు చేసినా, రవాణా చేసినా, నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి తరలించేందుకు వచ్చే వ్యక్తులకు ఆశ్రయం కల్పించినా వారిని నేరస్తులుగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. గ్రామంపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, గిరిజనులు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు. -
శతశాతం ఉత్తీర్ణత సాధించాలి
విద్యార్థుల పఠన సామర్ధ్యాన్ని పరిశీలిస్తున్న జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారిత అధికారిమంగవేణి నర్సీపట్నం: ఇంటర్మీడియేట్లో శతశాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్ధులు కష్టపడి చదవాలని జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి జి.మంగవేణి విద్యార్ధులకు సూచించారు. నర్సీపట్నంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ కళాశాల బాలుర వసతి గృహం–2ను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టడీ అవర్స్ను పరిశీలించారు. పరీక్షలు ఎలా రాస్తున్నారని విద్యార్ధులను ఆరా తీసారు. కష్టపడి చదివి శతశాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యార్ధులకు సూచించారు. విద్యార్ధులకు తయారు చేసిన భోజనాన్ని పరిశీలించారు. విద్యార్ధులతో కలిసి భోజనం చేశారు. -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన పాస్టర్ మృతి
కొయ్యూరు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చీడిపాలెం పంచాయతీ సింగవరం గ్రామానికి చెందిన బోండ్ల వెంకటరావు (మోషే పాస్టర్) శనివారం తెల్లవారుజామున విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన గురువారం రాత్రి అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేట నుంచి తన స్వగ్రామానికి స్కూటీపై బయలుదేరారు. చింతలపూడి దాటిన తర్వాత ఆయన ప్రయాణిస్తున్న స్కూటీ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే స్పందించి 108 వాహనంలో ఆయనను తొలుత రాజేంద్రపాలెం, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం తరలించారు. పరిస్థితి విషమించడంతో విశాఖపట్నం కేజీహెచ్కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఆయన మరణించారు. వెంకటరావుకు భార్య, పిల్లలు ఉన్నారు. ఆయ న భార్య రెండు కిడ్నీలు పాడైపోవడంతో, ఆయ నే స్వయంగా ఆమె ను డయాలసిస్కు తీసుకెళ్తూ అన్నీ తానై చూసుకునేవారు. ఇప్పుడు కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో అగాధమైన వేదనలో మునిగిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్.ఐ కిషోర్ వర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏదో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని బాధితులు అనుమానం వ్యక్తం చేయడంతో, పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. సింగవరంలో విషాదం -
ఇంటి పన్నుల వసూలుకు ప్రత్యేక చర్యలు
చింతపల్లి: మండల కేంద్రంలో దీర్ఘకాలంగా బకాయి ఉన్న ఇంటి పన్నుల వసూలు కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి కె. చంద్రశేఖర్ తెలిపారు. శనివారం ఆయన చింతపల్లిలోని గిరిజన సహకార సంస్థ డివిజనల్ మేనేజర్ను కలిసి, పన్ను చెల్లింపునకు సంబంధించిన నోటీసులను అందజేశారు. మేజర్ పంచాయతీ పరిధిలోని గృహ వినియోగదారులతో పాటు, వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయాలు కూడా భారీగా పన్ను బకాయిలు పడ్డాయని ఆయన పేర్కొన్నారు.ఈ బకాయిలను త్వరితగతిన వసూలు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పన్నుల రూపంలో వచ్చే ఆదాయంతోనే పంచాయతీ పరిధిలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. ప్రభుత్వ కార్యాలయాల అధికారులు తమ పరిధిలోని బకాయిలను వెంటనే చెల్లించి, పంచాయతీ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు. -
వీధి కుక్కల దాడిలో మూడు లేగదూడలు మృతి
చోడవరం:చోడవరం పట్టణ శివారు ద్వారకానగర్లో శనివారం వీధి కుక్కలు దాడి చేయడంతో పాడి రైతులు జోగా శ్రీను, జోగా తలుపులకు చెందిన మూడు లేగదూడలు మృతి చెందాయి. నెలరోజుల కిందట కూడా ఇదే తరహాలో కుక్కలు దాడిచేసి ఒక గేదెపెయ్యిని చంపాయి. ఇటీవల చోడవరం పట్టణంతోపాటు అన్ని గ్రామాల్లోనూ వీధికుక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇవి గుంపులుగుంపులుగా వీధుల్లో తిరుగుతూ స్వైర విహారం చేస్తుండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. మృతిచెందిన లేగదూడలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి సీతారామస్వామి పరిశీలించారు. వీధికుక్కలను నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. పంచాయతీ ఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
జిల్లాలో 86.94శాతంపింఛన్ల పంపిణీ
● కలెక్టర్ దినేష్కుమార్ సాక్షి,పాడేరు: జిల్లాలోని అర్హులందరికీ ఇంటి వద్దే సామాజిక పింఛన్ సొమ్ము పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ తెలిపారు. మండలంలోని ఆదివాసీ గ్రామమైన మోదాపల్లిలో శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీని ప్రారంభించారు. ఇళ్లవద్దకు వెళ్లి ఆయన పింఛనుదారులకు నగదు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పింఛన్ల పంపిణీని పారదర్శకంగా చేపడుతున్నామన్నారు. జిల్లాలో తొలిరోజు 86.94 శాతం మేర పింఛన్ల పంపిణీ పూర్తి చేశామన్నారు.ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ మురళీ, పలుఽశాఖల అధికారులు పాల్గొన్నారు. -
వేడెక్కుతున్న అరకువేలీ
● 12.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు చింతపల్లి: జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంచు తీవ్రత కొనసాగుతోంది. శనివారం అరకువేలీలో 12.1 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 13.9 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అదికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. జిల్లాలో పెదబయలులో 15.5 డిగ్రీలు, చింతపల్లిలో 16.5 డిగ్రీలు, జి.మాడుగులలో 17.1 డిగ్రీలు, అనంతగరిలో 18.8 డిగ్రీలు, కొయ్యూరులో 18.9 డిగ్రీలు నమోదు అయినట్లు ఆయన పేర్కొన్నారు. -
ప్రత్యేక ప్రాజెక్టుమంజూరుకు కృషి
చింతపల్లి: ప్రకృతి ప్రసాదించిన వర ప్రసాదాలు.. తూర్పు కనుమల గుండెల్లో దాగి ఉన్న అద్భుత మూలికలు ఇప్పుడు చింతపల్లిలో కొలువుదీరాయి. మారుతున్న కాలంతో పాటు భారతీయ ప్రకృతి వైద్యానికి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఔషధ మొక్కల పెంపకం, వీటి సంరక్షణలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. మదర్ ప్లాంట్ల సంరక్షణ.. విత్తనోత్పత్తి కేంద్రంగా ముందడుగు వేస్తోంది. తూర్పు కనుమల్లో సుమారు 500 రకాల ఔషధ మూలికలు ఉండగా, ప్రస్తుతం చింతపల్లి పరిశోధనా స్థానంలో 200 రకాలను ప్రత్యేక క్షేత్రంలో సంరక్షిస్తున్నారు. వీటిని మదర్ ప్లాంట్లుగా భావిస్తూ, భవిష్యత్తులో ఈ కేంద్రాన్ని ఔషధ మొక్కల విత్తనోత్పత్తి కేంద్రంగా మార్చేందుకు శాస్త్రవేత్తలు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. పర్యాటకులు సైతం ఈ క్షేత్రాన్ని సందర్శించి ఇక్కడి మొక్కల విశిష్టతను ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఏ మొక్క.. ఏ వ్యాధికి?.. ఈ క్షేత్రంలోని ప్రతి మొక్కకూ ఒక ప్రత్యేకత ఉంది. వేరు, ఆకు, కాండం, బెరడు ఇలా ప్రతి భాగం ఏదో ఒక వ్యాధి నివారణకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. కొన్ని ముఖ్యమైన మొక్కల ఉపయోగాలు ● నేల ఉసిరి: రక్తపోటు, అధిక వేడిమిని తగ్గిస్తుంది. బియ్యం కడిగిన నీటితో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ● అశ్వగంధ: యవ్వన శక్తిని పెంచుతుంది. అధిక బరువు, పొట్ట తగ్గడానికి, చర్మ వ్యాధుల నివారణకు మేలు చేస్తుంది. ● కలబంద: ముఖ సౌందర్యం, చుండ్రు, మధుమేహం, రక్తమొలల నివారణలో కీలకం. ● వస: గొంతు సంబంధిత వ్యాధులు, నత్తి మాటలు తగ్గడానికి మరియు చిన్న పిల్లలు త్వరగా మాట్లాడడానికి సహకరిస్తుంది. ● శతావరి: కిడ్నీలో రాళ్లు, ఇతర మూత్రపిండ సమస్యలు, కామెర్ల నివారణకు దీని దుంపలు అద్భుతంగా పనిచేస్తాయి. ● సర్పగంధి: రక్త ప్రసరణను నియంత్రిస్తుంది. తేనెతో కలిపి తీసుకుంటే తలనొప్పి, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ● పాషాణబేరి: గుండె జబ్బులు, ఉబ్బసం, ఊబకాయం, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. మానవాళి ఆరంభం నుంచి మూలికా వైద్యమే మూలాధారంగా ఉంది. చిన్న చిన్న వ్యాధులను ప్రకృతి సిద్ధమైన ఔషధాలతో నయం చేసుకోవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. ఈ వారసత్వాన్ని కాపాడటమే కాకుండా, రైతులు, సామాన్యులకు వీటిపై చింతపల్లి శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తున్నారు. పరిశోధనా స్థానంలో ఔష ధ మొక్కల పెంపకానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. ఇక్కడికి వచ్చే పర్యాటకులు, సందర్శకులు ఔషధ మొక్కలను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ప్రస్తుతం ఈ మొక్కలను మదర్ ప్లాంట్లుగా సంరక్షిస్తున్నందున, సందర్శకులకు వీటిని పంపిణీ చేయడం సాధ్యపడటం లేదు. భవిష్యత్తులో చింతపల్లి కేంద్రంగా ‘ఔషధ మొక్కల విత్తనోత్పత్తి కేంద్రం’ ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఈ కేంద్రం ఏర్పాటుకు ఒక ప్రత్యేక ప్రాజెక్టును మంజూరు చేస్తే ఈ ప్రాంతానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిస్తున్నాం. – డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి, ఏడీఆర్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, చింతపల్లి -
అక్రమణలు తొలగింపునకు ప్రత్యేక చర్యలు
పాడేరు రూరల్: పట్టణంలో ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు అక్రమణల తొలగింపుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పాడేరు మేజర్ పంచాయతీ ఈవో రమేష్ తెలిపారు. శనివారం పట్టణంలోని పాత బస్టాండ్, కింద బజార్, సాయిబాబా గుడి ఏరియా, సినిమా హాల్ సెంటర్ వంటి ప్రధాన కూడళ్లలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న అక్రమణలను అధికారులు తొలగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు వివరించారు. జిల్లా కేంద్రం కావడంతో రోజురోజుకూ జనసంచారం పెరుగుతోందని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. పట్టణంలో రోడ్డుకు ఇరువైపులా ఎక్కడ అక్రమ దుకాణాలు ఉన్నా వాటిని తొలగిస్తామని స్పష్టం చేశారు. వ్యాపారులు తమ సముదాయాల ముందు గుడారాలు వేయకుండా జాగ్రత్త వహించాలని, అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రక్రియకు సహకరించాలని ఆయన కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.పాడేరు పంచాయతీ ఈవో రమేష్ -
మెడికల్, ఫార్మా మాఫియా దోపిడీని అరికట్టాలి
తుమ్మపాల: మెడికల్, ఫార్మా మాఫియా దోపిడీని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని సీపీఐ జిల్లా నాయకులు కోరారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావుకు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు మాట్లాడుతూ మెడికల్ మాఫియా నాసిరకం మందులను అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజలను నిలువ దోపిడీ చేస్తోందన్నారు. అద్దె సర్టిఫికెట్లతో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మెడికల్ షాపులపై తనిఖీలు నిర్వహించి, చర్యలు తీసుకోవడంలో డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు, ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న మెడికల్, ఫార్మా మాఫియాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే వరకు సీసీఐ పెద్ద ఎత్తున పోరాటం చేస్తోందని చెప్పారు. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఏటా రూ.300 కోట్లకు పైగా స్టైఫండ్ ఎగవేస్తున్నారని తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, పీపీపీ విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.వి.రమణ, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సన్యాసిరావు, జి.ఫణీంద్ర కుమార్, రాధాకష్ణ, మండల కార్యదర్శి వియ్యపురాజు, సీపీఐ నాయకుడు ఈశ్వరరావు పాల్గొన్నారు. -
ఏపీఐఐసీ భూముల్లో మట్టి, గ్రావెల్ తవ్వకాలు
మాకవరపాలెం: ఏపీఐఐసీ భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు అడ్డూఅదుపూ లేకుండా సాగుతున్నాయి. మండలంలోని రాచపల్లి రెవెన్యూ పరిధిలో ఏపీఐఐసీకి చెందిన 290 ఎకరాల భూమి ఉంది. అయితే రామన్నపాలెం శివారు వెంకయ్యపాలెం వద్ద ఈ భూముల్లో వారం రోజులుగా రాత్రివేళల్లో మట్టి, గ్రామవెల్ను పొక్లెయిన్లతో తవ్వి తరలించుకుపోతున్నారు. అయినా సంబంధిత అధికారులు ఈ తవ్వకాలను అడ్డుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ నుంచి తరలిస్తున్న మట్టి, గ్రావెల్ను సమీప గ్రామాల్లోని భూములు, వివిధ నిర్మాణాలు చేపట్టే స్థలాలను కప్పివేసేందుకు తరలిస్తున్నారు. రాత్రి వేళల్లో అయితే ఎవరూ పట్టించుకోరనే ఉద్ధేశ్యంతో మట్టి మాఫియా ఇష్టానుసారం తవ్వకాలు చేస్తున్నారు. మట్టి, గ్రావెల్ తవ్వకాలతో ఈ ప్రాంతంలో భారీ ఎత్తున ఏర్పడిన గోతుల్లో రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి నీరు చేరి ప్రమాదకరంగా మారాయి. ఇటుగా గడ్డి మేసేందుకు వచ్చే పశువులు ఏమాత్రం ఇందులో పడినా మృత్యువాత పడతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతం నుంచి గ్రావెల్ తరలిస్తున్న వారిపై కేసులు పెట్టారు. ప్రస్తుతం ఎవరూ పట్టించుకోకపోవడంతో దర్జాగా తవ్వకాలు చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రభుత్వానికి చెందిన ఈ ఏపీఐఐసీ భూముల్లో జరుగుతున్న మట్టి తవ్వకాలను అడ్డుకోవడంతో పాటు మట్టిని తరలించేవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
వైద్య కళాశాల పనులు వేగవంతం చేయాలి
సాక్షి, పాడేరు: జిల్లా కేంద్రమైన పాడేరులోని వైద్య కళాశాల, ఆస్పత్రి భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన వైద్య కళాశాల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడేరు వైద్య కళాశాల నిర్మాణం గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో ఒక చారిత్రాత్మక మైలురాయి అని పేర్కొన్నారు. సుమారు రూ.500 కోట్లతో, 35 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ నిర్మాణ పనులు ఇప్పటికీ 70 శాతం మాత్రమే పూర్తి కావడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. పనులు నత్తనడకన సాగడం వల్ల అటు రోగులు, ఇటు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ముఖ్యంగా హాస్టళ్లు, ఆస్పత్రి భవనాలు అసంపూర్తిగా ఉండటం బాధాకరమన్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి ఎన్ఎంసీ 100 సీట్లు పెంచుతున్నట్లు ప్రకటించినప్పటికీ, మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ఆ నిర్ణయం కాగితాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెండింగ్లో ఉన్న నిర్మాణ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. యుద్ధప్రతిపాదికన పనులు పూర్తి చేసి, వచ్చే విద్యా సంవత్సరం నాటికి 150 సీట్లతో కళాశాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు లోకనాథం, సురేంద్ర, అప్పలనరస, రామారావు, బాలదేవ్, వరహాలబాబు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్ -
జనగణనపై ప్రజలకుఅవగాహన కల్పించాలి
● కలెక్టర్ దినేష్కుమార్ సాక్షి,పాడేరు: జిల్లాలో జనగణనపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లో జనగణన సర్వే బృందాల అధికారులు, సిబ్బందికి శనివారం నిర్వహిస్తున్న రెండవ రోజు శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పదేళ్లకు ఓ సారి జరిగే అతిపెద్ద సామాజిక సర్వేను పారదర్శకంగా చేపట్టాలన్నారు. జనాభా లెక్కల ఆధారంగానే ప్రభుత్వ విధానాలు, బడ్జెట్ కేటాయింపులు, నియోజకవర్గాల పునర్విభజన, విద్యా,ఉపాఽధి ప్రణాళికలకు ప్రాథమిక డేటా అందిస్తుందన్నారు. 33 ఆంశాలపై ఎన్యుమేటర్లంతా ఇంటింటా తిరిగి ఆయా కుటుంబాల సమాచారం సేకరిస్తారన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, ఇన్చార్జి డీఆర్వో అంబేద్కర్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ప్రసాద్, డీపీవో చంద్రశేఖర్, డీఈవో రామకృష్ణారావు, ఇన్చార్జి డీఎఫ్వో ఉమామహేశ్వరి పాల్గొన్నారు. -
జీడి పిక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి..
ఆందోళన చేస్తున్న జీడి రైతులు కోటవురట్ల: జీడి పిక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ డిమాండ్ చేశారు. యండపల్లిలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జీడి రైతులు శనివారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. సత్యనారాయణ మాట్లాడుతూ గత నాలుగేళ్లు పంట సరిగ్గా లేక, సరైన గిట్టుబాటు ధర లేక ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. అసెంబ్లీలో చర్చించి జీడి పిక్కలకు కిలోకు రూ.200 మద్దతు ధర ఇచ్చి రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. జీడి పిక్కల వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి పప్పును భారీ ధరకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం మార్కెట్లో 80 కిలోల జీడిపిక్కల బస్తాకు రూ.8000 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే జీడి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రోలుగుంట: జీడి పిక్కల సమస్యపై అసెంబ్లీలో చర్చించాలంటూ శనివారం సాయంత్రం రత్నంపేట గ్రామంలో ఫారెస్ట్ భూమి సాగు రైతులు ఆందోళన చేశారు. కిలో జీడిపిక్కలకి రూ.200 ధర నిర్ణయించాలని డిమాండు చేశారు. జీడి పిక్కలు 80 కిలోల బస్తాకి రూ.18 వేలు మద్దతు ధర ఇవ్వాలన్నారు. జీడిపిక్కల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. జీడిపంటల సాగు విస్తీర్ణంపై గతంలో ఇచ్చిన రాయితీలు పునరుద్ధరించాలన్నారు. జీడిపిక్కలు, పండ్లు ప్రాసె సింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. తమ సమస్య పరిస్కారంపై స్పందించకుంటే తహసీల్దార్ కార్యాలయం వద్ద వంటా –వార్పు కార్యక్రమం చేపడతామని గెమ్మిలి చందర్రావు, చిన్నబ్బాయి, జీడిమామిడి గిరిజన సంఘం నాయకులు తెలిపారు. -
గిరిజనులంటే జగన్కు ప్రత్యేక అభిమానం
అరకులోయ టౌన్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి గిరిజనులంటే ప్రత్యేక అభిమానం అని పార్టీ చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ అన్నారు. అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తనయుడు, వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు రేగం చాణక్య వివాహ వేడుకకు వచ్చే నెల 4వ తేదీ బుధవారం ఆయన అరకులోయ రానున్నారు. ఈ సందర్భంగా శనివారం అరకులోయ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేగం మత్స్యలింగం అధ్యక్షతన ఆరు మండలాల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భవించిన 15 ఏళ్లలో గిరిజన ప్రాంతంలో ఒక శుభకార్యానికి జగనన్న రావడం ఇదే మొదటిసారి అని, అందుకే ఆ రోజు ఉదయం 9.30 గంటలకే కార్యకర్తలందరూ ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం హెలీప్యాడ్, వివాహ వేడుక ప్రదేశాలను పరిశీలించి, భద్రతా ఏర్పాట్లపై ఎస్ఐ గోపాలరావుకు పలు సూచనలు చేశారు. అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి, ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు, ఉమ్మడి విశాఖ జిల్లా చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, పార్టీ అరకు పార్లమెంట్ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్, అరకు, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడు ఏరువాక సత్యారావు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు శోభా హైమావతి దేవి, కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, ఉమ్మడి విశాఖజిల్లా మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, రాష్ట్ర ఎస్టీ సెల్ సంయుక్త కార్యదర్శి నర్సింహమూర్తి, అనంతగిరి ఎంపీపీ టి.మిథుల, ఆరు మందలాల పార్టీ అధ్యక్షులు స్వాభి రామూర్తి, పాంగి పరశురామ్, సూర్యానారాయణ, అనిల్, చంద్రుబాబు, పద్మారెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షులు పల్లాసింగి విజయ్కుమార్. జి.ప్రకాష్, ఆరు మండలాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. 4న అరకు ఎమ్మెల్యే కుమారుడు చాణక్య వివాహానికి హాజరు ఘన స్వాగతం పలకాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు గుడివాడ అమర్నాథ్ పిలుపు హెలీప్యాడ్, వివాహ వేడుక ప్రాంతాల పరిశీలన భద్రతా ఏర్పాట్లపై పోలీసులకు సూచనలు -
పెట్రోల్ బంకుల్లో జోరుగా ఆయిల్ కల్తీ
చోడవరం : అసలే ఆకాశాన్నంటిన ధర...ఆపై ఆయిల్ కల్తీ. నిఘా అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పెట్రోల్ బంకుల్లో కల్తీ యథేచ్ఛగా జరుగుతోంది. ఇంధనం కల్తీ కారణంగా రూ.వేలు, లక్షలు పెట్టి కొనుగోలుచేసిన వాహనాలు మెకానిక్ షెడ్లకు చేరుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఆమాంతంగా ఆకాశాన్నంటడంతో వాహనాలపై హాయిగా తిరగడమే అందరికీ భారంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయిల్ కల్తీ కూడా జరగుతుండడంతో మరమ్మతులకు గురైన వాహనాలకు పెట్టుబడులు పెట్టలేక వాహనచోదకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో సుమారు 100కు పైగా పెట్రోల్, డీజిల్ బంకులు ఉన్నాయి. చోడవరం పరిసరాల్లోనే 15 బంకులు ఉన్నాయి. వీటిలో ఆయిల్ కల్తీ ఎక్కువగా జరుగుతుంది. పెట్రోల్, డీజిల్లో ఇథనాల్, ఇతర క్రూడాయిల్ కల్తీకి పాల్పడుతున్నారు. ఆయిల్ కల్తీతోపాటు కొన్ని బంకుల్లో భూమిలో ఉంచిన స్టోరేజ్ ఆయిల్ ట్యాంకర్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడం వల్ల వర్షపునీరు పెట్రోల్, డీజిల్ ట్యాంకుల్లో చేరి ఆయిల్లో కలిసిపోతుండగా ఆ కల్తీ ఆయిల్నే వాహనాలకు వేస్తున్నారు. ఇటీవల పెట్రోల్ బంకుల్లో ఈ తరహా కల్తీతో అనేక వాహనాలు మరమ్మతులతో మూలకు చేరాయి. చోడవరం, వెంకన్నపాలెం, వడ్డాది, రావికమతం, మాడుగుల, అనకాపల్లి, సబ్బవరం, యలమంచిలి, తాళ్లపాలెం, నర్సీపట్నం, పెందుర్తి ప్రాంతాల్లో బంకుల్లో ఆయిల్ కల్తీ జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. బంకులను ఎప్పటికప్పుడు పరిశీలించి, తనిఖీలు చేయాల్సిన విజిలెన్స్, రెవిన్యూ,కొలతలు–తూనికలు, పౌరసరఫరాల శాఖాధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలు వ్యక్తమౌతున్నాయి. ఇటీవల కాలంలో ఈ శాఖల తనిఖీలు మొక్కుబడిగానే ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనిఖీలు లేకపోవడం వల్ల పెట్రోల్ బంకుల యజమానులు ఇష్టారాజ్యంగా ఆయిల్ కల్తీలకు, కొలతల్లో మోసాలకు పాల్పడుతున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కల్తీ ఆయిల్ వల్ల వాహనాల ఇంజిన్ స్ట్రక్ అయిపోయి మరమ్మతులతో వస్తున్నాయి. ఆయిల్ సాంద్రత (డెన్సిటీ)లో తేడాలు ఉండడం వల్ల కల్తీ ఆయిల్తో ఇంజన్లు దెబ్బతింటున్నాయి. కొలతల్లో భారీ మోసాలు చేస్తున్నారు. ముందుగా ఆయిల్ పంపింగ్ చేసే మిషన్ల వద్ద పాయింట్ల రీడింగ్లో ఎడ్జిస్టింగ్ చేస్తున్నారు. అసలే లీటర్ పెట్రోల్ ధర రూ.108.41 ఉండగా డీజిల్ ధర రూ. 98 ఉంది. ఇంత ఎక్కువగా ధరలు పెరిగిపోయిన పరిస్థితుల్లో రీడింగ్లో మోసాలు, ఆయిల్లో కల్తీలతో రూ.వేలకువేలు పోసి కొన్న వాహనాలు అర్ధంతరంగా మూలకు చేరడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమౌతుంది. తక్షణం పెట్రోల్ బంకుల్లో ఆయిల్ కల్తీ, కొలతల్లో మోసాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని, కల్తీని అరికట్టాలని వాహదారులు కోరుతున్నారు. -
మార్చి 2న పంచదార్లకు జూపూడి రాక
రాంబిల్లి(అచ్యుతాపురం): రాంబిల్లి మండలంలోని పంచదార్లకు మాజీ ఎంఎల్సీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రానున్నారు. పంచదార్లకు చెందిన దళితుల డీ పట్టా భూముల్ని రెవెన్యూ అఽధికారులు రికార్డు పరంగా స్వాధీనం చేసుకుంటూ ఉత్తర్వులు జారీ చేయడంతో బాధిత దళిత రైతు కుటుంబాలకు చెందిన వారు 26 రోజుల నుంచి ధర్నా నిర్వహిస్తున్నారు. ఎటువంటి పరిహారం ఇవ్వకుండా, దళిత రైతు కుటుంబాలకు చెందిన వారి సమ్మతి లేకుండా భూముల్ని స్వాధీనం చేసుకోవడంలో కుట్ర దాగి ఉందని ఆరోపిస్తూ దళిత రైతులు ఆగ్రహంతో ఉన్నారు. వీరి నిరసనను రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం, కూటమి నేతలు కనీసం సంఘీభావం ప్రకటించకపోవడంతో వైఎస్సార్సీపీ నేతలు, దళిత సంఘాలు నిరసనకు అండగా నిలిచాయి. పంచదార్ల రైతులకు మరింత మద్దతు ప్రకటించి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు మాజీ ఎంఎల్సీ జూపూడి ప్రభాకర్ విచ్చేయనున్నారని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఐడీ బాబు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. -
కమనీయం కన్యావరుణ సంవాదం
● మంత్రముగ్దులను చేసిన ఎదురు సన్నాహ మహోత్సవం ● నేత్ర పర్వంగా వెంకన్న ధ్వజారోహణం ● ఘనంగా రథోత్సవంనక్కపల్లి: ఉపమాక వెంకన్న కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన కన్యావరుణసంవాదం (ఎదురు సన్నాహ మహోత్సవం) వేలాది మంది భక్తులను మంత్ర ముగ్ధులను చేసింది.ఉపమాక సింహాద్రాచార్యులు ఇంటివద్ద జరిగిన ఈ కార్యక్రమానికి భారీగా భక్తులు తరలివచ్చారు. వైకుంఠనాథుని తిరుకల్యాణోత్సవాల్లో భాగంగా తెల్లవారు జామున 2 గంటలకు గరుడాద్రిపై షడ్భుజాలతో అశ్వారూఢుడై వెలసిన మూలవిరాట్కు పంచామృతాలతో అభిషేకం, తొలిపూజ నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. తదుపరి స్వర్ణాభరణాలతో అలంకరించిన శ్రీదేవి,భూదేవి సమేత వేంకటేశ్వర స్వామిని పెద్దపల్లకిలో ఉపమాక మాడవీధుల్లో తిరువీధిసేవ నిర్వహించారు.స్వామివారి కల్యాణానికి భక్తులతోపాటు అష్టదిక్పాలకులను ఆహ్వానించారు. భక్తులు కానుకలు మొక్కుబడులు సమర్పించుకున్నారు. తిరువీధి సేవ అనంతరం ఆలయంలో ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఆలయప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాద్, అర్చక స్వాములు సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు, శేషాచార్యులు వేదమంత్రోచ్చారణల మధ్య నిర్వహించారు. ధ్వజపటాన్ని ఎగురు వేస్తూ అష్టదిక్పాలకులు, దేవతలను స్వామివారి కల్యాణానికి ఆహ్వానించారు. ధ్వజారోహణతో కల్యాణోత్సవాలు లాంఛనంగా ప్రారంభమైనట్టు అర్చక స్వాములు తెలిపారు.ి అనంతరం బేరీ పూజ, ద్రవిడ వేద ప్రభంద పారాయణం నిర్వహించారు. బాలభోగ, రాజభోగనివేదనలు, తీర్థగోష్టి, ప్రసాద నివేదన, వినియోగం వంటి కార్యాక్రమాలు జరిగాయి. క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామిని,విశాఖ నుంచి తెచ్చిన ఆభరణాలను స్వామివారి ఉత్సవమూర్తులకు అలంకరించి ధ్వజస్తంభం ఎదురుగా ఉన్న అద్దాల మండపంలో ఉంచి భక్తులకు దర్శనం కల్పించారు. నేత్రపర్వంగా ఎదురు సన్నాహమహోత్సవం కల్యాణోత్సవంలో భాగంగా సోమవారం రాత్రి ఎదురుసన్నాహమహోత్సవం జరిగింది. దీనినే కన్యావాద సంవాదం( పెళ్లిమాటల తంతుగాపేర్కొంటారు). వేంకటేశ్వరస్వామిని గరుడ వాహనంపైన, ఉభయదేవేరులను సప్పరం వాహనంపై ఉంచి చిన్నవీధి, పెద్దవీధులలో ఊరేగించారు. ఉపమాక సింహాద్రాచార్యులు ఇంటివద్ద స్వామివారిని, ఉభయనాంచారులను ఎదురెదురుగా ఉంచి పెళ్లిమాటలు, కట్నకానుకల కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్రాంత తెలుగు పండిట్, అభినవ మొల్ల డాక్టర్ గొట్టుముక్కల గాయత్రీదేవి స్వామివారి, అమ్మవార్ల గుణగణాలను, కీర్తిప్రతిష్టలను వివరించిన సన్నివేశం భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ సన్నివేశాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఉపమాక వీధులు కిక్కిరిసిపోయాయి. కల్యాణం వరకు ఉండలేని భక్తుల ఈ పెళ్లిమాటలతంతును వినడానికి ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఎదురుసన్నాహ మహోత్సవం అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతుడైన వెంకటేశ్వరస్వామిరిని రథంపై ఉంచి తిరువీధుల్లో రథోత్సవం నిర్వహించారు. -
ఏయూలో అరాచక శక్తులను అరికట్టండి
కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న ప్రజా సంఘాల, వామపక్ష పార్టీల నాయకులుమహారాణిపేట: ఆంధ్రా యూనివర్సిటీలో మత వైషమ్యాలు సృష్టించి, విద్యార్థులపై దాడులకు పాల్పడిన ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేపీ శక్తులను తక్షణమే అరెస్టు చేయాలని వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించి, ఏయూలోని విద్యార్థి, కార్మిక, దళిత సంఘాల జెండాలను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ధర్నాను ఉద్దేశించి సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. రెహ్మన్, సీపీఐఎంఎల్ (న్యూ డెమోక్రసీ) కార్యదర్శి కె.వెంకటేశ్వర్లు, ప్రజాపోరు కార్యదర్శి మహిత మాట్లాడారు. విద్యపై ఏకాగ్రత వహించాల్సిన విశ్వవిద్యాలయంలో మత విద్వేషాలు రగిల్చి, విద్యార్థినిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులతో నీచమైన ప్రచారం చేస్తున్నారని వారు మండిపడ్డారు. ఏయూ ఎప్పుడూ మత సామరస్యానికి, విద్యా వికాసానికి నిలయమని, అటువంటి చోట అరాచకాలు సృష్టించడం దారుణమని ధ్వజమెత్తారు. అధికార గర్వంతో చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడుతున్న దుండగులపై పోలీసులు ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం వెనుక ప్రభుత్వం ఉద్దేశం ఏమిటని వారు ప్రశ్నించారు. రాజ్యాంగం, చట్టాలు వీరికి వర్తించవా? చంద్రబాబు ప్రభుత్వం వీరికి మినహాయింపు ఇచ్చిందా? అని నిలదీశారు. నిందితులను అరెస్టు చేయకపోతే ప్రభుత్వం అరాచకాలను ప్రోత్సహిస్తుందనే భావన ప్రజల్లో కలుగుతుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని, ఏయూలో ప్రశాంత వాతావరణాన్ని పునరుద్ధరించాలని నేతలు డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో సీపీఎం నాయకులు బి.గంగారావు, ఆర్.కె.ఎస్.వి.కుమార్, పి.మణి, వి.కృష్ణారావు, పి.పైడిరాజు, బి.రమణి, క్షేత్రపాల్, వనజ, చంద్రశేఖర్; సీపీఐఎంఎల్ (న్యూ డెమోక్రసీ) నాయకులు నిర్మల, వెంకటలక్ష్మి తదితరులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. -
పాముకాటుతో బాలుడి మృతిపై సమగ్ర విచారణ
కశింకోట : ఇటీవల పాము కాటుతో మృతి చెందిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని తాళ్లపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పాము కాటుకు గురైన బాలుడు కిరణ్ను తీసుకురాగా సిబ్బంది వైద్యం అందించకపోవడం వల్లే మృతి చెందాడని ఆరోపిస్తూ మోసయ్యపేటకు చెందిన తాతయ్య కొర్ని నాయుడు, అమ్మమ్మ గోవిందమ్మ ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ విషయమై పీహెచ్సీని శుక్రవారం సందర్శించి విచారణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీహెచ్సీలో అత్యవసరమైన సేవలందించడానికి పాము, కుక్క కాటు వాక్సిన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఒకవేళ వాక్సిన్ కొరత ఉంటే సబ్బవరం స్టాల్ నుంచి అందిస్తారన్నారు. అత్యవసరమైన వాక్సిన్ ప్రతి పీహెచ్సీల్లో అందుబాటులో ఉంటుందన్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు కూడా పీహెచ్సీలో 24 గంటలు సేవలందిస్తున్నామన్నారు. అలాగే జాతీయ రహదారికి దగ్గరలో ఉన్న ఈ పీహెచ్సీలో కూడా సేవలందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇద్దరు వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సిబ్బంది కొరత కూడా లేకుండా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రోగుల పట్ల సిబ్బంది సంయమనంగా వ్యవహరించాలని, అసభ్యకరంగా, దురుసుగా మాట్లాడితే సహించబోమన్నారు. ఎవరైనా ఈ విషయమై ఫిర్యాదు చేస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మరోసారి కలసి కిరణ్ మృతికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయనకు వినతి పత్రం అందజేశారు. -
బాడీబిల్డింగ్లో కానిస్టేబుల్ సత్తా.. ఎస్పీ అభినందన
ఆరిలోవ(విశాఖ తూర్పు): బాడీబిల్డింగ్ పోటీల్లో రజత పతకం సాధించిన కానిస్టేబుల్ జి.శ్రీనివాసరావును అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అభినందించారు. ఇటీవల విశాఖ సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రంలో జరిగిన తొమ్మిదో మిస్టర్ ఆంధ్ర బాడీబిల్డింగ్ చాంపియన్షిప్–2026లో మాస్టర్స్ కేటగిరీలో అనకాపల్లి జిల్లాకు చెందిన కానిస్టేబుల్ జి.శ్రీనివాసరావు రజత పతకం సాధించారు. 2009 బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం కై లాసగిరి ఆర్మ్డ్ రిజర్వ్డ్ విభాగంలో పనిచేస్తూ జిల్లా పోలీస్ జిమ్ ట్రైనర్గా అధికారులు, సిబ్బందికి తర్ఫీదు ఇస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కై లాసగిరి ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీస్ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రీనివాసరావును ఎస్పీ సిన్హా సత్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ శ్రీనివాసరావు ఇంతవరకు 25 సార్లు మిస్టర్ ఆంధ్రగా నిలిచినట్లు తెలిపారు. 2013లో మిస్టర్ సౌత్ ఇండియా గోల్డ్ మెడల్ సాధించారన్నారు. వృత్తిపరమైన బాధ్యతలు నిర్వహస్తూ క్రీడలపై అంకితభావం కనబరచడం అభినందనీయమన్నారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు, ఎస్బీ డీఎస్పీ జి.ఆర్.ఆర్.మోహన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణారావు, మన్మధరావు, రమణమూర్తి, సంజీవిరావు తదితరులు పాల్గొన్నారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
అనకాపల్లి: జీవీఎంసీ విలీనగ్రామైన కొప్పాక బ్రిడ్జి సమీపంలో సుమారు 45 నుంచి 50 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని శుక్రవారం గుర్తించినట్లు పట్టణ సీఐ జి.ప్రేమ్ కుమార్ తెలిపారు. కొప్పాక గ్రామ ఇన్చార్జ్ వీఆర్వో యాదల అప్పారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. సుమారు 5 నుంచి 7 రోజుల క్రితం మృతిచెంది ఉంటాడని, మృతుడు శరీరంపై ఎటువంటి గాయాలు లేవని, శరీరంబాగా కుళ్లిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉందని తెలిపారు. మృతదేహాన్ని అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఖనం చేసినట్టు సీఐ చెప్పారు. -
ఎస్పీ సంపర్క్కు 10 మంది పోలీసులు వినతి
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో హోంగార్డు నుంచి కానిస్టేబుల్ వరకూ శుక్రవారం ఎస్పీ సంపర్క్ కార్యక్రమాన్ని శుక్రవారం చేపట్టారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది సెల్ నంబర్.9346912011 నంబరకు 10 మంది పోలీస్ సిబ్బంది ఉదయం 11 నుంచి 12 గంటల వరకూ అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావుకు ఫోన్ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ 10 మంది పోలీసులు వారి వ్యక్తిగత, కుటుంబ, వృత్తిపరమైన సమస్యలు తెలియజేయడం జరిగిందన్నారు. సిబ్బంది సర్వీస్ పరమైన పోస్టింగ్స్, బదిలీలు, సెలవులు విషయంలో మాట్లాడడం జరిగిందన్నారు. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు 10 మంది పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం ఏవో తిలక్బాబు, సూపరింటెండెంట్లు గిరి, బీమాబాయి, ప్రేయర్ సన్, ఎస్ఐ ప్రసాద్ పాల్గొన్నారు. -
ఘనంగా వెంకన్న కల్యాణం
● భారీగా తరలివచ్చిన భక్తులు ● గోవింద నామస్మరణతో మార్మోగిన గిరిజాంబ కొండ బుచ్చెయ్యపేట: అశేష భక్తుల గోవింద నామస్మరణ, మంగళవాయిద్యాల నడుమ ప్రసిద్ధి చెందిన వడ్డాది వేంకటేశ్వరస్వామి 153వ కల్యాణ మహాత్సవాలు శుక్రవారం రాత్రి అంగరంగవైభవంగా జరిగాయి. గురువారం రాత్రి అంకురార్పణ,ధ్వజారోహణ చేసి దొంగపెండ్లి నిర్వహించారు. శుక్రవారం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త దొండా కన్నబాబు కుటుంబ సభ్యులకు తొలిదర్శనం కల్పించారు. కల్యాణోత్సవాల సందర్భంగా గోవింద నామ స్మరణతో వడ్డాది గిరిజాంబ కొండ మార్మోగింది. తెల్లవారు జాము మూడు గంటల నుంచి రాష్టం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు వేంకటేశ్వరస్వామి తొలి దర్శనం కోసం ఆలయం వద్ద బారులు తీరారు. మెట్ల మార్గం,కొండ ముందు,వెనక ఉన్న సిమ్మెంట్ రోడ్డు మార్గం నుంచి భక్తులు తరలివెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. రాత్రి గిరిజాంబ కొండపై ఆలయ మండపంలో స్వామి వారి కల్యాణంను వేడుకగా నిర్వహించారు. వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని దగ్గర నుంచి చూసిన భక్తులు పులకించిపోయారు. తిరువీధి ఉత్సవంలో స్వామి వారి పల్లకి మోయడానికి పలువురు పోటీపడ్డారు. అనకాపల్లి డీఎస్పీ శ్రావణి,కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, బుచ్చెయ్యపేట, రావికమతం,కొత్తకోట,రోలుగుంట ఎస్ఐలు పలు శాఖల అధికార్లు స్వామివారిని దర్శించుకోగా దేవస్ధానం ఈవో శర్మ దగ్గరుండి పూజా కార్యక్రమాలు చేయించి ప్రసాదాలు అందించారు. ఆలయ ధర్మకర్త దొండా కన్నబాబు ఆరోగ్యం సహకరించకపోవడంతో అతని అన్న కుమారుడు శ్రీరామ్తో వేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని నిర్వహించారు. -
నైతిక విలువలు పెంపొందేలా విద్యాభ్యాసం
మురళీనగర్(విశాఖ ఉత్తర): విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించుకునేలా విద్యాభ్యాసం జరగాలని అనకాపల్లి జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ కె.ఇందిరాభారతి అన్నారు. విశాఖలోని కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఫార్మసీ విద్యార్థుల ఫ్రెషర్స్ డే, వీడ్కోలు సమావేశం ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకటరమణ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫార్మసీ విభాగం వైద్య రంగంలో కీలకంగా వ్యవహరిస్తోందన్నారు. వెంకటరమణ మాట్లాడుతూ ఫార్మసీ విద్యార్థులు వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకునే విధంగా ప్రయోగాత్మక అధ్యయనంపై దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి, ఫార్మసీ కాలేజీ పూర్వ విద్యార్థి ఇందిరాభారతిని ఘనంగా సత్కరించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఫార్మసీ విభాగాధిపతి జె.గోవిందరావు, జనరల్ సెక్షన్ హెడ్ డాక్టర్ పీఎం బాషా, ఎలక్ట్రికల్ విభాగం హెడ్ డాక్టర్ ఎం.నారాయణ, విద్యార్థి సలహాదారు ఎస్.వి.రమణ పాల్గొన్నారు. -
జీడి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
దేవరాపల్లి: జీడి పంటకు మద్దతు ధర కల్పించి, రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నాన్ షెడ్యూల్ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.టి. దొర డిమాండ్ చేశారు. మండలంలోని చింతలపూడి పంచాయతీ శివారు బోడిగరువులో స్థానిక జీడి రైతులతో కలిసి శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీడి పిక్కలకు మద్దతు ధర లేక రైతులు పడుతున్న కష్ట, నష్టాలను అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. కిలో రూ. 200 చొప్పున మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇతర దేశాల నుంచి జీడిపిక్కల దిగుమతులను తక్షణమే నిలుపుదల చేయాలని కోరారు. ప్రభుత్వం మద్దతు ధర కల్పించక పోవడంతో దళారీ వ్యాపారుల బారిన పడి తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీడి పంటకు మద్దతు ధరతో పాటు మార్కెట్ సౌకర్యం కల్పించి, జీడి రైతుల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలన్నారు. జీడికి మద్దతు ధర కల్పించకుంటే జీడి రైతులతో కలిసి జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని దొర తెలిపారు. ఈ కార్యక్రమంలో పోయిరి రాము, దేవుడు, పోయిరి దారప్ప, కొనుసు రవీంద్ర, సీవేరి అప్పారావు తదితర గిరిజన జీడి రైతులు పాల్గొన్నారు. -
పాత కక్షలతో యువకుడి హత్య
మాడుగుల రూరల్: పాత కక్షలతో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మండలంలోని గాదిరాయి జంక్షన్ వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ జి. నారాయణరావు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో జంపెన గ్రామానికి చెందిన పెచ్చేటి ఉపేంద్ర(27) గురువారం రాత్రి జంపెన నుంచి కింతలి వెళ్తుండగా, మార్గ మధ్యలో గాదిరాయి విద్యుత్ ఉపకేంద్రం వద్ద మూడు రోడ్ల కూడలిలో గుర్తుతెలియని వ్యక్తులు ఇనుప రాడ్లతో తలపై తీవ్రంగా కొట్టారు. దీంతో ఉపేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు.స్థానికుల సమాచారం మేరకు మాడుగుల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహానికి పంచనామా జరిపి, పోస్టుమారానికి అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని శుక్రవారం మధ్యాహ్నం అనకాపల్లి డీస్పీ ఎం.శ్రావణి, కె.కోటపాడు సీఐ కె.కృష్ణతో పాటు క్లూస్ టీమ్ సభ్యులు సందర్శించారు. మృతుడికి వివాహం కాలేదు. తల్లిదండ్రులున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ జి.నారాయణరావు మాట్లాడుతూ పాతకక్షల కారణంగా ఈ హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
కదంతొక్కిన ఆదివాసీలు
● పీఎం జన్మన్ ఇళ్ల నిర్మాణ బిల్లులు చెల్లించాలని పాడేరులో భారీ నిరసన పాడేరు ఐటీడీఏ ఎదుట ధర్నా చేస్తున్న సీపీఎం,గిరిజన సంఘ నేతలు, ఆదివాసీలు హౌసింగ్ పీడీకి వినతిపత్రం ఇస్తున్న శ్రీనివాసరావు తదితరులుసాక్షి, పాడేరు: జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న పీఎం జన్మన్ పథకం ఇళ్ల నిర్మాణ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీలు కదం తొక్కారు. గిరిజన సంఘం, సీపీఎం నేతల ఆధ్వర్యంలో శుక్రవారం పాడేరు పట్టణంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిపై ఆదివాసీలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మోదకొండమ్మ తల్లి ఆలయం వద్ద ప్రారంభమైన ఈ భారీ ర్యాలీ ప్రధాన వీధుల గుండా ఐటీడీఏ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం ఐటీడీఏ ఎదుట చేపట్టిన మహా ధర్నా ఉధృతంగా సాగింది.కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ప్రకటించిన రూ. లక్షను వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. జన్మన్ 2.0 పథకం రెండో విడతలో అర్హులైన ఆదివాసీలందరికీ కొత్త ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. ఆందోళన ఉధృతం చేస్తాం తమ బిల్లుల సమస్యను వెంటనే పరిష్కరించని పక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. అనంతరం హౌసింగ్ పీడీ బాబు నాయక్కు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు కె. లోకనాథం, పి. అప్పలనరసయ్య, సాగిన ధర్మన్న పడాల్, కిల్లో సురేంద్ర, బాలదేవ్, పాలికి లక్కు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారం కోరుతూ ఉపాధ్యాయుల ధర్నా
సాక్షి, పాడేరు: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 12వ పీఆర్సీ కమిషన్ను నియమించాలని, అలాగే ఉద్యోగులకు 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రావుల జగన్మోహన్రావు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. పాడేరు, జి.మాడుగుల, పెదబయలు, హుకుంపేట మండలాలకు చెందిన ఉపాధ్యాయ సంఘ నేతలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్మోహనరావు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై మాట్లాడారు. ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుంచి మినహాయించి, కేవలం విద్యాబోధనకే పరిమితం చేయాలని కోరారు. ఉన్నత పాఠశాలల్లో ప్రాథమిక తరగతులను విలీనం చేయకుండా, 6 నుంచి 10వ తరగతి వరకు మాత్రమే కొనసాగించాలని, ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్, తెలుగు మీడియం రెండింటినీ అందుబాటులో ఉంచాలని, ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలన్నారు. జీవో నంబరు3ను తక్షణమే పునరుద్ధరించి, 100 శాతం ఉపాధ్యాయ పోస్టులను గిరిజనులతోనే భర్తీ చేయాలని కోరారు. ధర్నా అనంతరం ఉపాధ్యాయ నేతలు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అధికారులకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా నేతలు శ్యాంసుందరం, శెట్టి శాంతకుమారి, మోదకొండ, సింహాచలం నాయుడు, ధనుంజయ్, సోమినాయుడు, సత్యారావు, బాబూరావు, తిరుపతిరావు, కై లాసం తదితరులు పాల్గొన్నారు. 12వ పీఆర్సీ నియమించి, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ పాడేరు ఐటీడీఏ ఎదుట ఆందోళన టీచర్లను బోధనకే పరిమితం చేయాలి ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రావుల జగన్మోహన్రావు డిమాండ్ -
ఏపీఆర్ సెట్లోజి.మాడుగుల ప్రిన్సిపాల్ ప్రతిభ
● పారయ్యకు రాష్ట్రస్థాయిలో ఆరో ర్యాంక్ జి.మాడుగుల: రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాల్లో ఖాళీ గా ఉన్న పీహెచ్డీ సీట్ల భర్తీకి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఏపీ ఆర్ సెట్ ఫలితాల్లో స్థానిక ఏపీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ యండమూరి పారయ్య ప్రతిభ చాటారు. ఆయన రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. 2025 నవంబర్లో రాత పరీక్ష, 2026 ఫిబ్రవరిలో మౌఖిక పరీక్ష నిర్వహించగా తుది ఫలితాలను గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పారయ్య మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యంలో శాసీ్త్రయ విజ్ఞానం అనే అంశంపై పరిశోధన చేయాలనే ఆసక్తితో తాను ఈ పరీక్ష రాసినట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు సాధించి కళాశాలకు పేరు తెచ్చిన ప్రిన్సిపాల్ పారయ్యను కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, విద్యాశాఖ అధికారులు అభినందించారు. -
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
పాడేరు రూరల్: పరిసరాల పరిశుభ్రత అనేది కేవలం అధికారుల పని మాత్రమే కాదని, అది ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా పంచాయతీ అధికారి కొండపల్లి చంద్రశేఖర్ అన్నారు. ప్లాస్టిక్ నిషేధానికి ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. శుక్రవారం పాడేరు పట్టణంలో నిర్వహించిన ప్రత్యేక పారిశుధ్య పనులను ఆయన పర్యవేక్షించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని, వ్యర్థాలను పంచాయతీ కార్మికులతో కలిసి తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని కీలక అంశాలను వెల్లడించారు. పట్టణంలోని వ్యాపారస్తులు, ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా స్వస్తి పలకాలని సూచించారు. పంచాయతీ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. వారపు సంతలు, వ్యాపార సముదాయాల్లో పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ వస్తువులు విక్రయించినా, వినియోగించినా రూ. 5వేల నుంచి రూ. 10 వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మన వీధులు, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్మించుకోవచ్చని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీవో రమేష్, పంచాయతీ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు. జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ -
అసెంబ్లీని సందర్శించిన రిషివ్యాలీ విద్యార్థులు
అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్ధులు, ఉపాధ్యాయులతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం : ఏపీ అసెంబ్లీ విజ్ఞాన యాత్రలో భాగంగా నర్సీపట్నం రిషీ వ్యాలీ స్కూల్కు చెందిన 120 మంది గురువారం అసెంబ్లీని సందర్శించారు. విద్యార్థులతో స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు ముచ్చటించారు. చట్టసభల పనితీరు, ప్రజాస్వామ్య విలువలపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించే దిశగా అసెంబ్లీ విజ్ఞాన యాత్ర కొనసాగుతుందన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని, మాతృభాషను మరువొద్దు అని స్పీకర్ విద్యార్థులకు సూచించారు. ఈ సందర్శనలో స్కూల్ నిర్వాహకులు అక్కంరెడ్డి కార్తీకేయ, కౌశిక్ పాల్గొన్నారు. -
వడ్డాది వెంకన్న కల్యాణోత్సవాలకు వేళాయె..
బుచ్చెయ్యపేట: ఉత్తరాంధ్రలోనే ప్రసిద్ధి చెందిన వడ్డాది వేంకటేశ్వరస్వామి 153వ కల్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి గిరిజాంబ కొండ ముస్తాబైంది. శుక్రవారం నుంచి మార్చి 4వ తేదీ వరకు జరిగే స్వామివారి కల్యాణ వేడుకలు తిలకించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. వీరి సౌకర్యార్థం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 150 మందికిపైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయంలో దిగువ క్యూలైన్లు, మంచినీటి సదుపాయం, వైద్య సేవలు, తదితర ఏర్పాట్లు చేశారు. ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలకు, మెట్లు మార్గం, కళావేదిక తదితర ప్రాంతాల్లో రంగులు వేసి మిరుమిట్లు గొలుపే భారీ విద్యుత్ లైటింగ్ సెట్టింగ్లను కిలోమీటర్లు పొడవున ఏర్పాటు చేశారు. శ్రీదేవి, భూదేవితో వేంకటేశ్వరస్వామి కల్యాణానికి మండపాన్ని అందంగా తీర్చిదిద్దారు. ధ్వజ స్తంభం వద్ద, ఆలయంలోను, ఉత్సవ విగ్రహాల వద్ద భక్తులు తొక్కుసలాటలు లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది కల్యాణ మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అధికారులు, నాయకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తొలి రోజు రాత్రి 9 గంటలకు స్వామివారికి తిరుకల్యాణ మహోత్సవం జరగనుంది.ఆలయ చరిత్ర..42 ఏళ్ల క్రితం వడ్డాదికి నారాయణభజీ అనే స్వామి భిక్షాటనకు వచ్చి వడ్డాది పుణ్యక్షేత్రంగా భాసిల్లుతుందని చెప్పి వెళ్లిపోయాడు. కొద్ది రోజుల్లోనే విజయరామరాజుపేటలో కాళ్ల పాకల వద్ద రైతులు నేలబావి తవ్వుతుండగా శ్రీదేవి, భూదేవి, వేంకటేశ్వరస్వామి విగ్రహాలు బయటపడ్డాయి. అప్పటి గ్రామ పెద్ద దొండా భగవంతులయ్య ఆధ్వర్యంలో గిరిజాంబ కొండపై ఏర్పాటు చేసి ఆలయం నిర్మించారు. నిత్య ధూప, దీప నైవేద్యాలకు 58 ఎకరాల భూమిని ఆయన దానం చేశారు. అప్పటి నుంచి వారి కుటుంబ సభ్యులు ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు.కల్యాణ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలుస్వామివారి కల్యాణ మహోత్సవాలు జరిగే ఐదు రోజులు వడ్డాది కొండ దిగువ దేవస్థానం వారు, వడ్డాది నాల్గు రోడ్ల జంక్షన్లో వర్తక సంఘం ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు అందించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.వడ్డాది ఇలా చేరుకోవాలి..స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రతి అరగంటకు నర్సీపట్నం, చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ల నుంచి బస్సు సదుపాయం కలదు. విశాఖపట్నం, అనకాపల్లి, పాడేరు నుంచి వడ్డాదికి ఆర్టీసీ బస్సు సదుపాయం ఉంది. మెట్ల మార్గంతోపాటు కొండపైకి వాహనాల ద్వారా వెళ్లి స్వామివారిని దర్శించుకోవచ్చు. -
రైతే భగీరథుడు
కొండంత పట్టుదలతో గిరి రైతు విజయంవిధి వెక్కిరించినా.. వనరులు సహకరించకపోయినా ఆ రైతు వెనకడుగు వేయలేదు. ఆకాశం నుంచి వాన కురవకపోయినా, కాలువ నుంచి నీరు రాకపోయినా.. వృథాగా పోతున్న నీటి చుక్కనే తన పొలానికి ప్రాణధారగా మార్చుకున్నాడు. పెదబయలు మండలానికి చెందిన గొలిసింగి సింహాచలం అనే రైతు, ఆధునిక భగీరథుడిలా మారి పైపుల ద్వారా నీటిని మళ్లించి సాగు చేపట్టి సాటి రైతులకు స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. కల్వర్టు నుంచి వచ్చే వృథానీటిని తరలించేందుకు అమర్చిన పైపులు వృథా నీటిని పైరుకు ప్రాణధారగా మార్చుకున్న రైతు సింహాచలం పెదబయలు: సాధారణంగా సాగునీరు అందకపోతే ఏ రైతు అయినా నిరాశతో సాగు విరమించుకుంటాడు. కానీ మండలానికి చెందిన ఆ రైతు మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ఆలోచించాడు. వృథాగా పోతున్న నీటిని ఒడిసి పట్టి, తన పొలానికి ప్రాణం పోశాడు. వివరాల్లోకి వెళ్తే.. గుల్లేలు పంచాయతీ చీమకొండ గ్రామానికి చెందిన గొలిసింగి సింహాచలం అనే రైతుకు ఎకరంన్నర పొలం ఉంది. ఖరీఫ్లో వరి పండించిన ఆయన, రబీలోనూ సాగు చేయాలని సంకల్పించారు. అయితే, పొలానికి నీరు అందే మార్గం లేకపోవడంతో సాగు ప్రశ్నార్థకంగా మారింది. వేుధస్సుకు పదును.. పైపులతో సాగు చుట్టూ నీరున్నా తన పొలానికి రావడం లేదని ఆయన కుంగిపోలేదు. తన మేధస్సుకు పదును పెట్టి, కొంత దూరంలో ఉన్న గెడ్డ కల్వర్టు నుంచి వృథాగా పోతున్న నీటిని గమనించారు. సుమారు 100 మీటర్ల పొడవైన ప్లాస్టిక్ పైపులను సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు.కల్వర్టు నుంచి తన పొలం వరకు ఆ పైపుల ద్వారా నీటిని మళ్లించారు.ప్రస్తుతం ఆ నీటితోనే తన ఎకరంన్నర పొలంలో వరి నాట్లు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరు వృథాగా పోతుంటే చూడలేకపోయాను. అందుకే పైపుల ద్వారా నీటిని తెచ్చుకున్నాను అని తన ఆవేదనను, ఆనందాన్ని పంచుకున్నారు. అయితే, ఇక్కడ శాశ్వత పరిష్కారం కోసం ఒక చెక్ డ్యామ్ నిర్మించాలని సింహాచలంతో పాటు గ్రామ రైతులు కోరుతున్నారు. చిన్నపాటి సాయం అందిస్తే మరిన్ని ఎకరాలకు సాగునీరు అందుతుందని వారు ఆశిస్తున్నారు.అధికారులు స్పందించి అక్కడ చెక్ డ్యామ్ నిర్మిస్తే, సింహాచలం లాంటి ఎంతోమంది రైతుల కష్టం ఫలిస్తుంది. కేవలం పైపులతోనే పంట పండిస్తున్న ఈ రైతు పట్టుదల అందరికీ స్ఫూర్తిదాయకం. పైపుల ద్వారా పొలానికి మళ్లించిన వృథా నీరువృథా నీటితో చేపట్టిన వరి సాగు -
డుంబ్రిగుడ చేరినఆల్ ఇండియా సైకిల్ యాత్ర
డుంబ్రిగుడ: భారతదేశ పర్యటనలో భాగంగా ఆల్ ఇండియా సైకిల్ యాత్ర సాగిస్తున్న ముగ్గురు యువకులు గురువారం డుంబ్రిగుడ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై కొద్దిసేపు సేదతీరారు. ఆంధ్రప్రదేశ్లోని కడపకు చెందిన మనోజ్, తెలంగాణలోని మహబూబ్నగర్కు చెందిన విక్రమ్, బిహార్కు చెందిన బిక్కూ పటేల్ కలిసి ఈ సాహస యాత్రను చేపట్టారు.గత 16 రోజుల క్రితం హైదరాబాద్లో ఈ యాత్రను ప్రారంభించారు. విజయవాడ, రాజమండ్రి, తుని, నర్సీపట్నం, పాడేరు మీదుగా ప్రయాణిస్తూ ప్రస్తుతం అరకులోయ చేరుకున్నారు. దేశవ్యాప్తంగా పర్యటించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ యాత్ర పూర్తి చేయడానికి మరో 45 రోజుల సమయం పడుతుందని యాత్రికులు తెలిపారు. స్థానిక ప్రజలు కలిసి వారి సాహసాన్ని అభినందించారు. -
టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
చింతపల్లి: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణమే 12వ పీఆర్సీ కమిటీని నియమించాలని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బౌడు గంగరాజు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం చింతపల్లి మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, ఎస్జీటీలకు పీఎస్ హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్లకు ప్రమోషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. చైల్డ్కేర్ లీవ్ నిబంధనల్లో డిపెండెంట్ క్లాజ్ను తొలగించాలని, ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సరెండర్ లీవు బకాయిలను వెంటనే చెల్లించి, యాప్ల భారాన్ని తగ్గించాలని వారు కోరారు. అనంతరం వారు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దారుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా నేతలు దేపూరి శనికుమార్, ప్రసాద్ దొర, నాగేశ్వరరావు, గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు లోచలి రామకృష్ణ, గెమ్మిలి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బౌడు గంగరాజు డిమాండ్ -
పీఎం జన్మన్ ఇళ్ల బకాయిలు చెల్లించాలి
ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్చింతపల్లి: పీఎం జన్మన్ పథకం కింద ఆదివాసీలకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని గిరిజన సంఘం మండల కార్యదర్శి సాగిన చిరంజీవి డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని బలపం, కుడుముసారి పంచాయతీల పరిధిలో గల రాళ్లగెడ్డ, కప్పలు, గుంజివీధి, కొత్తూరు, నిమ్మపాడు, కోటగున్నలు, కోటగున్నలు కాలనీ గ్రామాల్లో గిరిజనులతో కలిసి ఆయన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బకాయిల సాధన కోసం ఈనెల 27న పాడేరులో చేపట్టే భారీ ధర్నా కార్యక్రమంలో గిరిజనులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొర్రా సుబ్బారావు, రమేష్, కోటేశ్వరరావు, రామారావు తదితరులు పాల్గొన్నారు. పాడేరు రూరల్: పీఎం జన్మన్ పథకం కింద నిర్మించుకున్న ఇళ్లకు సంబంధించి బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. గురువారం గుత్తులపుట్టు సంతలో ఈ మేరకు కరపత్రాలు పంపిణీ చేసి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘం మండల కార్యదర్శి చిట్టిబాబు మాట్లాడుతూ.. గిరిజనులు అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకుంటే, ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా నెలల తరబడి ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. ఎన్నికల హామీలు అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని మండిపడ్డారు. బకాయిలు వెంటనే చెల్లించకుంటే భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు వెంకటరమణ, సుబ్బారావు, లబ్ధిదారులు పాల్గొన్నారు. -
అక్రమ గ్రావెల్ క్వారీపై విచారణ
అందలాపల్లి కొండపై విచారణ చేస్తున్న మైన్స్ అధికారులు అచ్యుతాపురం రూరల్: మండలంలోని కొండకర్ల పంచాయతీ అందలాపల్లి గ్రామ సర్వే నంబరు 136/2లో అనధికార గ్రావెల్ క్వారీని గురువారం మైన్స్ అధికారులు తనిఖీ చేశారు. దీనిపై ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదు మేరకు అచ్యుతాపురం – అనకాపల్లి రోడ్డుకు అవసరమైన గ్రావెల్ తరలించేందుకు బీవీఎస్ఆర్ సంస్థ ఇక్కడ క్వారీని లీజుకు తీసుకుంది. ఇదే అవకాశం చేసుకుని సదరు సంస్థకు కేటాయించిన 4.2 హెక్టార్లకు మించి ఇష్టానుసారంగా మైనింగ్ చేస్తోంది. అక్రమంగా వివిధ నిర్మాణ సముదాయాలకు అమ్మకాలు చేస్తోంది. దీనికితోడు రాత్రిళ్లు భీకర శబ్దాలతో కొండను పేల్చడంతో గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఈ వ్యవహారంపై కొండకర్ల పంచాయతీకి చెందిన గ్రామ పెద్ద కోట్ని అప్పల శివ నూకరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మైన్స్ అధికారులు విచారణ చేపట్టి నివేదిక తీసుకున్నారు. -
మెరుగైన విద్య, వైద్యంతోనే గిరిజనాభివృద్ధి
డుంబ్రిగుడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. అటవీ హక్కులు, భూమి హక్కుల పరిరక్షణతో పాటు మెరుగైన విద్య, వైద్యం అందించినప్పుడే గిరిజనాభివృద్ధి సాధ్యమని జాతీయ మానవహక్కుల కమిషన్ ప్రత్యేక పర్యవేక్షకుడు హేమంత్ కుమార్ అన్నారు. గురువారం మండలంలోని సాగర పంచాయతీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనులతో ముఖాముఖిగా మాట్లాడి, వారికి అందుతున్న సదుపాయాలు, మౌలిక వసతుల మెరుగుదలపై చర్చించారు. గ్రామస్తులు తమ సమస్యలను నేరుగా కమిటీ సభ్యులకు వివరించారు. అనంతరం, గిరిజనుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, భవిష్యత్తులో మరింత సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సాగర పంచాయితీ ఎంపీటీసీ, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు వంతల దేవదాసు, ఐటీడీఏ పాడేరు కాఫీ ప్రాజెక్ట్ అధికారి (ఏడీ) బొంజునాయుడు, అటవీ రేంజ్ అధికారులు పాల్గొన్నారు.జాతీయ మానవహక్కుల కమిషన్ ప్రత్యేక పర్యవేక్షకుడు హేమంత్ కుమార్ -
రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో జిల్లా క్రీడాకారులప్రతిభ
కశింకోట : రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలో జిల్లాకు చెందిన ముగ్గురు క్రీడాకారులు వేర్వేరు విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించడం అభినందనీయమని కన్నూరుపాలేనికి చెందిన ప్రగతి చెస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు డి.ఎస్ గాయత్రిదేవి, చెస్ సీనియర్ నేషనల్ ఆర్బిటర్ డి.వి.సుధీర్కుమార్ అన్నారు. ఇటీవల తిరుపతిలో స్పోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( ఎస్ఎఎపి) ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి చదరంగం పోటీలు జరగ్గా తమ అసోిసియేషన్ ప్రోత్సాహంతో వెళ్లిన జిల్లాలోని ఎస్.రాయవరానికి చెందిన శ్రావ్యశ్రీ (15 ఏళ్లలోపు విభాగం)లో ప్రథమ స్థానంలో నిలిచిందని, ఇదే గ్రామానికి చెందిన భీమరశెట్టి సహస్ర (13 ఏళ్ల లోపు విభాగం), అనకాపల్లికి చెందిన వెంకటేశ్వరరావు (17 ఏళ్ల లోపు విభాగం) తృతీయ స్థానం సాధించారన్నారు. వీరిలో ఫిడే రేటింగ్ సాధించిన శ్రావ్యశ్రీ త్వరలో నాగాలాండ్లో జరగనున్న జాతీయ టీం ఛాంపియన్షిప్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. -
ఆలయాల ఆదాయ వనరుల పెంపునకు ప్రణాళిక
నాతవరం: దేవాలయాలకు ఆదాయ వనరులు పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని యలమంచిలి దేవాదాయ ధర్మదాయ శాఖ ఇన్స్పెక్టరు డి. ఉమాదేవి తెలిపారు. నాతవరంలో గంగాదేవి నూకాలమ్మ దేవస్థానానికి చెందిన 13 ఎకరాల వ్యవసాయ భూములకు కౌలు వేలం పాట గురువారం స్థానిక రామాలయం వద్ద నిర్వహించారు. వేలంలో 11 మంది పాల్గొని రూ.5 వేల చొప్పున డిపాజిట్ చేశారు. గతేడాది ఈ భూములకు రూ.70 వేలు వేలం పాడగా, ఈ ఏడాది రూ.1. 48 లక్షలకు గ్రామానికి చెందిన గవిరెడ్డి అప్పల సత్యనారాయణ దక్కించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రూ. 25 లక్షలలోపు ఆదాయం ఉన్న ఆలయాలను సీ కేటగిరీలోకి ప్రభుత్వం మార్చిందన్నారు. తమ పరిధిలో ధూప, దీప నైవేద్యం కోసం 70 ఆలయాలకు ప్రతి నెలా రూ.10 వేల చొప్పున తమ శాఖ ద్వారా చెల్లిస్తుందన్నారు. మెట్ట భూములు ఆరేళ్ల వరకు కౌలుకు ఇస్తున్నామన్నారు. నర్సీపట్నం మండలంలో 70 ఎకరాలు సోలార్ ప్లాంటుకు ఇచ్చామన్నారు. సాగుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదని, దీనివల్ల ఆదాయం రాకుండా భూములనీ నిరుపయోగంగా ఉన్నాయన్నారు. దానిని దృష్టిలో పెట్టుకుని కౌలు వేలం పాట పెంచామని, కమిషనర్ నుంచి ప్రత్యేకంగా అనుమతులు పొందాలన్నారు. గతంతో పోల్చుకుంటే ప్రజల్లో భక్తిభావం పెరిగిందన్నారు. ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో నర్సీపట్నం డివిజన్కు చెందిన దేవాదాయ ధర్మదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ అధికారి ఈ.సాంబశివరావు, సూపర్వైజరు రామకృష్ణ, నాతవరం గంగాదేవి నూకాలమ్మ ఆలయ కమిటీ సభ్యులు ధనాజీ, గ్రామపెద్దలు పాల్గొన్నారు. -
పారా బ్యాడ్మింటన్ పోటీల్లో పతకాలు
అనకాపల్లి టౌన్/రావికమతం : విజయనగరంలో రెండు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి 7వ పారా బ్యాడ్మింటన్ పోటీల్లో అనకాపల్లి జిల్లా రావికమతం మండలానికి చెందిన దివ్యాంగ విద్యార్థులు విజయ కేతనం ఎగురవేశారు. అనకాపల్లి జిల్లాకు చెందిన దివ్యాంగ విద్యార్థులు సింగిల్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ వీల్ చైర్, డ్వార్ఫిజం పారా బ్యాడ్మింటన్ కేటగిరిలలో పాల్గొని అద్భుత ప్రతిభ కనబరిచారు. రావికమతం మండలం, తోటకూరపాలెం గ్రామానికి చెందిన గూనురు ఆదిలక్ష్మి (వీల్ చైర్ కేటగిరిలో) 2 గోల్డ్ మెడల్స్, మరుపాక గ్రామం రౌతు తనుష్ ఒక గోల్డ్ మెడల్, టి. అర్జాపురం గ్రామానికి చెందిన రాజాన మానస (షార్ట్ స్టేచర్ కేటగిరిలో) ఒక గోల్డ్ మెడల్, ఒక రజత పతకం, ఎల్.ఎన్.పురం గ్రామానికి చెందిన నిమ్మి హేమ దుర్గ (షార్ట్ స్టేచర్ కేటగిరిలో) గోల్డ్ మెడల్, కొత్తకోట గ్రామానికి చెందిన వెల్లంకి (లోకేష్ షార్ట్ స్టేచర్ కేటగిరిలో) 2 కాంస్య పతకాలు సాధించారు. ఈ విద్యార్థులను సమగ్ర శిక్ష సహిత విద్య సమన్వయకర్త బి.రామకృష్ణ నాయుడు అభినందించారు. -
నగరవనం సందర్శించిన సీసీఎఫ్
నగరవనంను సందర్శించిన సీసీఎఫ్ బి.ఎం.దివాన్ మైదీన్ నర్సీపట్నం : ఆరిలోవ అటవీ ప్రాంతంలో నిర్మితమవుతున్న నగరవనాన్ని సీసీఎఫ్ బి.ఎం.దివాన్ మైదీన్, డీఎఫ్వో ఎం.శామ్యూల్తో కలిసి గురువారం సందర్శించారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు అటవీశాఖ వారు సుమారు రూ.1.60 కోట్లతో నగర వనంను తయారు చేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న నగరవనం పనులను సీసీఎఫ్ పరిశీలించారు. నిర్దేశించిన సమయానికి పనులు పూర్తయ్యేలా చూడాలని రేంజర్ రాజేష్ను ఆదేశించారు. పర్యాటకులను ఆకట్టుకునేలా నగరవనం తయారు చేయాలని సూచించారు. వనంలో ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ట్రైనీ డీఎఫ్వో చిదానంద, ఎఫ్ఎస్వో రామాంజులు, బీట్ సిబ్బంది ఉన్నారు. -
శాస్త్రీయ పద్ధతుల్లో సాగుతోనే అధిక దిగుబడులు
చింతపల్లి: గిరిజన రైతులు సుగంధ ద్రవ్య పంటలను కేవలం వాణిజ్య సరళిలో కాకుండా శాసీ్త్రయ పద్ధతుల్లో సాగు చేయాలని, అప్పుడే అధిక దిగుబడులతో పాటు మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి అన్నారు. గురువారం స్థానిక పరిశోధనా స్థానంలో స్పైసెస్ బోర్డు 39వ వార్షికోత్సవం సందర్భంగా సీనియర్ ఫీల్డ్ అధికారిణి బొడ్డు కళ్యాణి అధ్యక్షతన గిరిజన రైతులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ అప్పలస్వామి మాట్లాడుతూ.. మన్యంలోని పర్వత శ్రేణులు, ఇక్కడి వాతావరణం మిరియాలు, అల్లం, పసుపు వంటి సుగంధ ద్రవ్య పంటల సాగుకు ఎంతో అనుకూలమన్నారు.రైతులు పండించిన ఉత్పత్తులను నేరుగా అమ్మకుండా యంత్రాల ద్వారా గ్రేడింగ్, పాలిషింగ్ చేయడం వల్ల మార్కెట్లో మంచి ధర వస్తుందని సూచించారు. స్పైస్ బోర్డు సీనియర్ ఫీల్డ్ అధికారిణి కల్యాణి మాట్లాడుతూ గిరిజన రైతులకు 75 శాతం, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు 90 శాతం రాయితీపై యంత్రాలను అందజేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మిరియాలు, పసుపు, అల్లం కోసం బ్రాయిలర్, గ్రేడింగ్, పాలిషింగ్, డ్రైయింగ్, కటింగ్ యంత్రాలు, చింతపండు పొట్టు తీసేందుకు, పిక్కలు వేరు చేసేందుకు ప్రత్యేక యంత్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇవన్నీ విద్యుత్ సౌకర్యంతో పనిచేస్తాయని, రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం మేడూరు గ్రామానికి చెందిన రైతు కె. లక్ష్మణరావుకు చింతపండు ప్రాసెసింగ్ యంత్రాన్ని పంపిణీ చేశారు. శాస్త్రవేత్త సందీప్ నాయక్, అధిక సంఖ్యలో గిరిజన రైతులు పాల్గొన్నారు. -
షార్ట్ సర్క్యూట్తో స్కూటీ దగ్ధం
నర్సీపట్నం: ఆర్టీసీ కాంప్లెక్స్ ఇన్గేట్ ప్రాంతంలో గురువారం రాత్రి షార్ట్ సర్క్యూట్తో స్కూటీ దగ్ధమైంది. పట్టణంలోని అయ్యన్నకాలనీకి చెందిన జి.నానాజీ తన స్కూటీపై కాంప్లెక్స్కు వస్తున్నాడు. ఇక్కడ ఇన్గేట్ నుంచి వస్తుండగా స్కూటీ నుంచి మంటలు వ్యాపించాయి. అతడు భయంతో దాన్ని పార్కు చేసి పరుగులు తీశాడు. ప్రయాణికులు, స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న ఫైర్ ఆఫీసర్ అప్పలస్వామి, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
8న గురుకులం ప్రవేశ పరీక్ష
దేవరాపల్లి: డాక్టరు బీఆర్. అంబేడ్కర్ గురుకుల విద్యాలయంలో 2026–2027 విద్యా సంవత్సరానికి గాను 6, 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీ సీట్లు భర్తీ కోసం ప్రవేశ పరీక్షను మార్చి 8న నిర్వహిస్తున్నట్లు తెనుగుపూడి గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ ఎస్.విక్టర్పాల్ తెలిపారు. మార్చి 2న జరగాల్సిన ఈ ప్రవేశ పరీక్ష తేదీని మార్పు చేస్తూ ఉమ్మడి విశాఖ గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయకర్త జి. గ్రేస్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. మార్చి 8న 6, 7 తరగతులకు ఉదయం 10 నుంచి 11:30 గంటలకు వరకు, 8, 9, 10 తరగతులకు మధ్యాహ్నం 2 నుంచి 3:30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్నారు. మరిన్ని వివరాలకు హెల్ప్లైన్ 0891–2799641 సంప్రదించాలని కోరారు. -
ఆదర్శ పాఠశాలలు పిలుస్తున్నాయి
నర్సీపట్నం: ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశానికి గాను ఏపీ మోడల్ స్కూల్స్ విద్యా సంస్థ వారు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు, ఎయిడెడ్, ప్రభుత్వ విద్యా సంస్థల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే ఆరు నుంచి 12వ తరగతి వరకు మంచి విద్యను అభ్యసించవచ్చు. క్రమశిక్షణతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటూ చదువుకునే వెసులుబాటు ఉంటుంది. అందుకే ఆదర్శ పాఠశాలలకు ఏటా పోటీ పెరుగుతోంది. జిల్లాలో నర్సీపట్నం, కశింకోట, రావికమతం, మునగపాక, చీడికాడ మండలాల్లో ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో ఒక్కోచోట వంద సీట్ల భర్తీకి గాను ఏటా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సీటు పొందేందుకు ఏటా వందల మంది విద్యార్థులు పోటీ పడతారు. అందులో అత్యధిక మార్కులు సాధించే వారికే సీటు లభ్యం అవుతుంది. అందుకే ఇప్పటి నుంచే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు దృష్టి పెడితే సీటు సాధించడం సులభమవుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అధునాతన సౌకర్యాలు.. పట్టణానికి దూరంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. అత్యాధునిక ల్యాబ్ సౌకర్యాలు, విశాలమైన గదులు, కంప్యూటర్ ల్యాబ్తో పాటు భౌతిక, జీవశాస్త్రం ల్యాబ్లు అందుబాటులో ఉన్నాయి. ఆవరణలో విశాలమైన క్రీడా మైదానం ఉంది. ఏటా విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొని బహుమతులు సాధిస్తున్నారు. యోగాలో విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులతో బోధన అందిస్తున్నారు. ఆదర్శ పాఠశాలల్లో సీటు సాధిస్తే ఉచిత విద్యతోపాటు వసతి, దుస్తులు, పుస్తకాలు, బ్యాగులు అన్ని ప్రభుత్వం నుంచే అందిస్తారు. మార్చి 31 వరకు గడువు.. ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశానికి గాను ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 12వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుంది. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు www.cre.ap.gov.in, www.apmr.apcfrr.i n అనే వెబ్సైట్ల ద్వారా సమర్పించాలి. ఏప్రిల్ 12 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. -
తప్పుడు తూకాలతోమోసం చేస్తే కఠిన చర్యలు
● లీగల్ మెట్రాలజీ అధికారి రాజేష్ పాడేరు రూరల్: తప్పుడు తూకాలతో గిరిజనులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ కె. రాజేష్ హెచ్చరించారు. గురువారం గుత్తులపుట్టు వారపు సంతలో అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి మొత్తం 14 కేసులు నమోదు చేశారు.యంత్రాలలో లొసుగులను ఉపయోగించి గిరిజనులను మోసం చేస్తున్న వారిపై 6 కేసులు, తూనిక యంత్రాలపై ప్రభుత్వ ముద్రలు లేకుండా ఉపయోగిస్తున్న వ్యాపారులపై 5 కేసులు నమోదు చేశారు. వాటర్ బాటిళ్లను గరిష్ట ధర కంటే ఎక్కువకు విక్రయిస్తున్న వారిపై మూడు కేసులు నమోదు చేశారు. తనిఖీల్లో అధికారులు దామోదర్, అనురాధ, సిబ్బంది పాల్గొన్నారు. -
కుక్కల దాడిలో అరుదైన చిరుతపిల్లి మృతి
మర్రివాడలో అటవీ శాఖ అధికారుల విచారణకొయ్యూరు: అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్న ఒక అరుదైన చిరుత పిల్లి మృతిపై పెదవలస ఇన్చార్జి రేంజర్ ప్రశాంతి కుమారి గురువారం మర్రివాడలో విచారణ చేపట్టారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. బుధవారం సుమారు రెండేళ్ల వయసున్న ఒక చిరుత పిల్లిని కొన్ని కుక్కలు తరుముకుంటూ వచ్చాయి. భయంతో పరుగులు తీసిన ఆ పిల్లి, ఎదురుగా ఉన్న ఒక వ్యక్తిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది.ఆ వ్యక్తి భయంతో గ్రామస్తులకు తాను ’చిరుతపులి’ని చూశానని చెప్పాడు. అదే సమయంలో కుక్కల బారి నుంచి తప్పించుకోవడానికి ఆ చిరుత పిల్లి నేరుగా గ్రామంలోకి ప్రవేశించింది.గ్రామస్తులు దానిని బంధించగా, కొద్దిసేపటికే అది ప్రాణాలు విడిచింది. తొలుత దానిని బయట పారేయాలని భావించినా, తర్వాత ఒక చెట్టు కొమ్మపై ఉంచి అటవీ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పెదవలస రేంజర్ ప్రశాంతి కుమారి మర్రివాడ చేరుకుని విచారణ నిర్వహించారు. పిల్లి శరీరంపై ఉన్న గాయాలను బట్టి అది కుక్కల దాడిలోనే మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.చనిపోయిన పిల్లి గోళ్ల గట్టితనం, ఇతర లక్షణాలను బట్టి దాని వయసు రెండేళ్లు ఉండవచ్చు. ఇవి సాధారణంగా 12 ఏళ్ల వరకు జీవిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఎస్ఎస్ఓ శ్రీరాములు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అంతరించి పోతున్న జాతుల జాబితాలో.. పశుసంవర్థక శాఖ వైద్యాధికారి కె. రాజేష్ కుమార్ మాట్లాడుతూ.. ఇది అత్యంత అరుదైన ప్రాణి అని, అందుకే దీనిని అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేర్చారని తెలిపారు. ఇవి సాధారణంగా బ్రెజిల్, జపాన్ వంటి దేశాల్లో కనిపిస్తాయని, మనుషులకు కంటపడకుండా చాలా రహస్యంగా జీవిస్తాయని పేర్కొన్నారు. గతంలో 2016లో కాట్రగెడ్డ సమీపంలో కూడా ఇటువంటి చిరుత పిల్లి కనిపించినట్లు ఆయన గుర్తు చేశారు.గాయపడి మృతి చెందిన చిరుతపిల్లిస్థానికులు బంధించిన చిరుతపిల్లి -
ఉపాధ్యాయ సమస్యలపై ఏపీటీఎఫ్ ధర్నా
చోడవరంలో ధర్నా చేస్తున్న ఏపీటీఎఫ్ ఉపాధ్యాయులు చోడవరం: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలంటూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేశారు. చోడవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద మెయిన్రోడ్డు పక్కన ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి చోడవరం తాలూకా పరిధిలో ఉన్న చోడవరం, బుచ్చెయ్యపేట, చీడికాడ, మాడుగుల, రావికమతం, కె.కోటపాడు మండలాలకు చెందిన ఏపీటీఎఫ్ సంఘం ఉపాధ్యాయులంతా ఈ ధర్నాలో పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని, 12వ పీఆర్సీ వెంటనే అమలు చేయాలని, పీఆర్సీ కమిషన్ను నియమించే వరకూ 30 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని, ఐఆర్ ప్రకటించాలని, రావలసిన అన్ని రకాల బకాయిలు వెంటనే చెల్లించాలని, ఈహెచ్ఎస్ పరిమితిని రూ. 25లక్షలకు పెంచాలని, బోధనేతర పనులు చెప్పే విధానాలను రద్దు చేసి ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని వారు డిమాండ్ చేశారు. 2009 కి ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకూ ఉపాధ్యాయులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చలేదని ఏపీటీఎఫ్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమరాన త్రినాఽథరావు అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికి దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షుడు మోసూరి మహాలక్ష్మినాయుడు, జిల్లా కార్యదర్శి ఎ. ప్రసాదరావు, రాష్ట్ర కౌన్సిల్ విజయలక్ష్మి, శ్యాంకుమార్, మండల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఆర్. చిరంజీవి, కె. మల్లేశ్వరరావు, గౌరవ అధ్యక్షుడు గొల్లు శ్రీనువాసరావు పాల్గొన్నారు. -
సొంతింటి కల.. అప్పులతో విలవిల!
ఆదివాసీల అభ్యున్నతే ధ్యేయమని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాల తీరు, క్షేత్రస్థాయిలో గిరిజనులను అప్పుల ఊబిలోకి నెడుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం జన్మన్ పథకం.. అధికారుల నిర్లక్ష్యం, నిధుల విడుదలలో జాప్యం ఆదివాసీలకు శాపంగా మారింది. ఇటు కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులు నాలుగు నెలలుగా నిలిచిపోవడం, అటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష అదనపు సాయం ఊసే లేకపోవడంతో లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అప్పులు తెచ్చి పునాదులు వేసిన ఇళ్లు మధ్యలోనే ఆగిపోగా, ఇళ్లు పూర్తి చేసుకున్న వారు వడ్డీలు కట్టలేక తల్లడిల్లుతున్నారు. ఈ ఆర్థిక సంక్షోభానికి నిరసనగా ఆదివాసీ సంఘాలు నేడు చలో పాడేరు ఐటీడీఏకు పిలుపునిచ్చాయి. ఆర్థిక ఇబ్బందులుకేంద్ర ప్రభుత్వం ఫైనల్ బిల్లుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష అదనపు ప్రోత్సా హం కోసం నిరీక్షిస్తున్నాం.ఇళ్ల నిర్మాణం పూర్తయిన బిల్లులు చెల్లించకపోవడం అన్యాయం.శ్లాబ్ కూడిన ఇళ్ల నిర్మాణాలకు ఎంతో కష్టపడ్డాం. ఫైనల్ బిల్లు అందక ఇబ్బందులు పడుతున్నాం. – పాంగి కొండమ్మ, లబ్ధిదారు, మోదాపల్లి పంచాయతీ, పాడేరు మండలంసాక్షి, పాడేరు: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం జన్మన్ పథకం కింద ఆదివాసీలకు మంజూరైన ఇళ్ల నిర్మాణాలకు నిధుల కొరత ఏర్పడింది. గత నాలుగు నెలలుగా బిల్లుల చెల్లింపులు నిలిచిపోవడంతో జిల్లావ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.● జిల్లా వ్యాప్తంగా ఈ పథకం కింద మొత్తం 28,691 ఇళ్లు మంజూరు కాగా, 25,553 మంది లబ్ధిదారులు నిర్మాణాలకు ముందుకు వచ్చారు. అయితే, ఇప్పటివరకు కేవలం 3,138 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన ఇళ్లన్నీ నిధులు అందక వివిధ దశల్లో నిలిచిపోయాయి.● కేంద్ర ప్రభుత్వ వాటా: ప్రతి ఇంటికి రూ.2.80 లక్షల ప్రోత్సాహకం.● రాష్ట్ర ప్రభుత్వ వాటా: అదనంగా రూ. లక్ష ఆర్థిక సాయం. జిల్లాలో సుమారు సుమారు 10 వేల ఇళ్లకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన రూ.10 కోట్ల మేర బిల్లులు పెండింగ్లో ఉన్నాయి.ఆర్థిక ఇబ్బందుల్లో లబ్ధిదారులుఇళ్లు పూర్తి చేసుకుని గృహప్రవేశాలు చేసిన 3,138 మంది లబ్ధిదారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. లక్ష అదనపు సాయం అందలేదు. అటు కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులు, ఇటు రాష్ట్ర సాయం అందకపోవడంతో ఆదివాసీ కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. పాలకులు స్పందించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.నేడు చలో పాడేరు ఐటీడీఏపెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాలు శుక్రవారం ‘ఛలో పాడేరు ఐటీడీఏ’ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు రావాల్సిన నిధులను వెంటనే మంజూరు చేయాలని ఈ సందర్భంగా వారు ఆందోళనకు సిద్ధమయ్యారు.వేడుకుంటున్నా ఫలితం శూన్యంపీఎం జన్మన్ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. రూ.1.50 లక్షల వరకు బకాయి చెల్లించాల్సి ఉంది. బిల్లులు చెల్లించాలని అధికారులను వేడుకుంటున్నా ఫలితం లేకపోతోంది. – పాంగి చిట్టిబాబు, తీగలవలస పంచాయతీ, హుకుంపేట మండలంసమస్యలు పట్టని పాలకులుపీఎం జన్మన్ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పెండింగ్ బిల్లులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనపు ప్రోత్సాహం రూ.లక్ష చెల్లించాలని ఆదివాసీలంతా వేడుకుంటున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. శుక్రవారం ఛలో పాడేరు ఐటీడీఏ చేపట్టి ఆదివాసీల పక్షాన పోరాటం చేస్తున్నాం. – పి.బాలదేవ్, గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, అరకులోయ -
తూటిపాలలో ఇసుక తవ్వకాల అడ్డగింత
స్వాధీనం చేసుకున్న జేసీబీతో తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది మాకవరపాలెం: ఇసుక అక్రమ తవ్వకాలను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. మండలంలోని తూటిపాల శివారులో సర్పానదిని ఆనుకున్న భూముల్లో ఇసుక తవ్వకాలకు స్థానికులు గురువారం జేసీబీతో ఏర్పాట్లు చేస్తున్నారు. సమాచారం అందిన వెంటనే తహసీల్దార్ వెంకటరమణ తమ సిబ్బందితో తవ్వకాల ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఇసుక తరలింపునకు రోడ్డు వేయడంతోపాటు మడుల్లో ఇసుకపై ఉన్న మట్టిని తొలగించే పనులు చేస్తున్న జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ అధికారుల రాకతో జేసీబీ డ్రైవర్ పరారయ్యాడు. జేసీబీని స్వాధీనం చేసుకుని, ఇద్దరు వీఆర్ఏలను అక్కడే ఉంచామని తహసీల్దార్ తెలిపారు. ఆర్ఐ చక్రపాణి, వీఆర్వోలు పాల్గొన్నారు. -
ఎడారి దేశాల్లో.. మన్యం 'సుగంధాలు'
విశాఖ మన్యం గిరిజన రైతులు పండించే సేంద్రియ పంటలకు అంతర్జాతీయంగా రెక్కలొస్తున్నాయి. ఇప్పటివరకు కేవలం ఎండిన పసుపు కొమ్ములకే పరిమితమైన మార్కెట్, ఇప్పుడు సరికొత్త పుంతలు తొక్కుతోంది. గిరిజన రైతుల శ్రమను తగ్గిస్తూ, పచ్చి పసుపునే నేరుగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు కడపకు చెందిన ఓ యువ వ్యాపారి నడుం బిగించారు. దీంతో అటు రైతులకు లాభసాటి ధర, ఇటు స్థానిక గిరిజనులకు స్థానికంగా ఉపాధి లభిస్తోంది. సాధారణంగా పసుపును ఉడకబెట్టి, ఆరబెట్టి అమ్మడం గిరిజన రైతులకు పెద్ద శ్రమతో కూడుకున్న పని. కానీ, అరబ్ దేశాల్లో పచ్చి పసుపునకు ఉన్న డిమాండ్ను గమనించిన యువ వ్యాపారి నేరుగా పొలాల నుంచే పచ్చి పంటను సేకరిస్తున్నారు. హుకుంపేట మండలం కేంద్రంగా జరుగుతున్న ఈ సరికొత్త వాణిజ్యం, మన్యం పసుపు ఘాటును ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తోంది.సాక్షి, పాడేరు: అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన రైతులు సేంద్రియ పద్ధతిలో సాగు చేసే ఆర్గానిక్ పసుపు, అల్లానికి దుబాయ్తో పాటు అరబ్ దేశాల్లో భారీ డిమాండ్ నెలకొంది. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎండిన పసుపు కొమ్ములు, పసుపు పొడిని ఎక్కువగా వినియోగిస్తారు. అయితే, అరబ్ దేశాల్లో పచ్చి పసుపు వినియోగం అధికంగా ఉండటాన్ని వైఎస్సార్ కడపకు చెందిన ఒక యువ వ్యాపారి గుర్తించారు. దీంతో మన్యం గిరిజనుల నుంచి నేరుగా పచ్చి పసుపు, అల్లాన్ని కొనుగోలు చేస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ధరల వివరాలు.. పచ్చి పసుపు: ప్రస్తుతం గిరిజన రైతుల నుంచి కిలో రూ. 20 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా 8 కిలోల పచ్చి పసుపును ఉడకబెట్టి ఆరబెడితేనే ఒక కిలో ఎండు పసుపు వస్తుంది. సంతల్లో ఎండు పసుపు కిలో రూ. 135 వరకు పలుకుతోంది. పచ్చి పసుపును నేరుగా అమ్మడం వల్ల రైతులకు ఉడకబెట్టే, ఆరబెట్టే శ్రమ తగ్గడమే కాకుండా ఆర్థికంగానూ మంచి లాభం చేకూరుతోంది. అల్లం: కిలో అల్లం రూ. 35 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. దుబాయ్ మార్కెట్లో పచ్చి అల్లానికి ఉన్న విపరీతమైన డిమాండ్ గిరిజన రైతులకు వరంగా మారింది. ఎగుమతి ఇలా.. హుకుంపేట మండలం బర్మన్గూడ కేంద్రంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 15 టన్నుల పచ్చి పసుపు, 15 టన్నుల అల్లాన్ని సేకరించారు. వీటిని శుభ్రం చేసి 3 కిలోల చొప్పున ప్యాక్ చేస్తున్నారు. ఈ 30 టన్నుల నిల్వలను ముంబైలోని కోల్డ్ స్టోరేజీలకు తరలిస్తున్నారు. అక్కడ నుంచి నౌకల ద్వారా దుబాయ్కు ఎగుమతి చేస్తారు. గిరిజనులకు స్థానిక ఉపాధి : ఈ వ్యాపారం వల్ల సుమారు 60 మంది గిరిజన కూలీలకు స్థానికంగానే ఉపాధి లభిస్తోంది. సేకరించిన పంటను మట్టి లేకుండా కడిగి, ప్యాకింగ్ చేసే పనుల కోసం వీరికి రోజుకు రూ. 400 చొప్పున కూలి చెల్లిస్తున్నారు.ఏజెన్సీ అల్లం, పసుపునకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుపాడేరు ఏజెన్సీలో గిరిజనులు పండించే ఆర్గానిక్ పసుపు, అల్లానికి దుబాయ్లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. పచ్చి పసుపును నేరుగా సేకరించి ముంబై మీదుగా విదేశాలకు తరలిస్తున్నారు. దీనివల్ల రైతులకు మంచి ధర దక్కడమే కాకుండా, స్థానికంగా చాలా మంది గిరిజనులకు ఉపాధి లభిస్తోంది. గిరిజన రైతుల కష్టానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కడం విశేషం. అరబ్ దేశాల్లో భలే డిమాండ్ పచ్చి పసుపు, అల్లానికి దుబాయ్తో పాటు అరబిక్ దేశాల్లో అ«ధిక డిమాండ్ ఉంది. పచ్చి పసుపునే అక్కడ ప్ర జలు వినియోగిస్తారు. ఆర్గానిక్ అల్లానికి డిమాండ్ ఉంది. తొలిసారిగా మన్యంలో పచ్చి పసుపు, అల్లంను గిరిజన రైతులనుంచి గిట్టుబాటుకు కొనుగోలు చేస్తున్నాం. ఇకపై నిరంతరం పసుపు, అల్లం దుబాయ్కు ఎగుమతి చేస్తాం. – టి.రెడ్డి కల్యాణం, ఎండీ, డ్రై మాక్స్ ఆగ్రో ఎంటర్ప్రైజేస్, వైఎస్సార్ కడప -
సంపూర్ణత అభియాన్తో జిల్లా అభివృద్ధి
సాక్షి, పాడేరు: ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమష్టి భాగస్వామ్యంతో సంపూర్ణత అభియాన్ 2.0 ద్వారా జిల్లాను అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలుపుతామని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లాలోని అన్ని సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని వెనుకబడిన మారుమూల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా మండల, జిల్లా స్థాయి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.నీతి ఆయోగ్ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకుంటూ, అభివృద్ధి సూచీలో జిల్లాను అగ్రస్థానానికి చేర్చడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని వివరించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, నీతి ఆయోగ్ ప్రతినిధి శ్రేయ, రాష్ట్ర జానపద సృజనాత్మక అకాడమి చైర్మన్ గంగులయ్య, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి
సాక్షి, పాడేరు: తమకు నెలకు రూ. 26 వేల వేతనం పెంచడంతో పాటు ఇతర పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో మార్చి 2వ తేదీన అమరావతికి తరలివచ్చి ఆందోళన చేస్తామని జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు కూటమి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ, బుధవారం పాడేరులోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న అంగన్వాడీ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అంగన్వాడీ వర్కర్లకు రూ. 26వేలు, ఆయాలకు రూ. 20 వేల వేతనం అందించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 1,810 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలని, సిబ్బందికి తక్షణమే పదోన్నతులు కల్పించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ఖాళీగా ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్లు, ఆయాల సంఘ జిల్లా అధ్యక్షురాలు నాగమ్మ, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ మాట్లాడుతూ.. గతంలో కుప్పంలో జరిగిన అంగన్వాడీల ధర్నాలో పాల్గొన్న ప్రస్తుత సీఎం చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా వేతనాల పెంపుపై స్పందించకపోవడం అన్యాయమని వారు మండిపడ్డారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని పక్షంలో మార్చి 2న ‘ఛలో అమరావతి’ పేరుతో భారీ ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి భాగ్యలక్ష్మి, ప్రతినిధులు కళావతి, జయలక్ష్మి, మోదకొండమ్మ, రత్నకుమారి మరియు జిల్లాలోని అన్ని మండలాల అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. -
గూడెంకొత్తవీధిలో విస్తృత తనిఖీలు
మహిళతో మాట్లాడుతున్న పోలీసులు గూడెంకొత్తవీధి: మండల కేంద్రమైన గూడెంకొత్తవీధిలో బుధవారం ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా ఇతర ప్రాంతాలకు చెందిన ద్విచక్ర వాహనాలను నిలిపి, వాటి వివరాలను సేకరించారు.తనిఖీల్లో భాగంగా పోలీసులు కొన్ని గృహాలను సందర్శించి గిరిజనులతో మాట్లాడారు. గ్రామాల్లోకి కొత్త వ్యక్తులు ఎవరు వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.గంజాయి సాగు చేసినా.. రవాణాకు సహకరించినా చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని, జీవితమంతా జైలు పాలు కావాల్సి వస్తుందని హెచ్చరించారు.ప్రస్తుత కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరూ పాల్పడరాదని సూచించారు. -
వృత్తి విద్యా కోర్సులతోనే ఉజ్వల భవిష్యత్తు
● ప్రిన్సిపాల్ డాక్టర్ విజయభారతిడిగ్రీ కళాశాలలో విద్యార్థులతో మాట్లాడుతున్న ప్రిిన్సిపాల్ విజయభారతి చింతపల్లి: విద్యార్థులు చదువుకునే కాలంలోనే వృత్తి విద్యా కోర్సుల పట్ల ఆసక్తి చూపితే భవిష్యత్తులో మంచి ఉపాధి పొందే అవకాశాలు ఉంటాయని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. విజయభారతి అన్నారు. బుధవారం స్థానిక డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సర విద్యార్థినులకు బ్యూటీషియన్ కోర్సులో 15 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆధునిక సమాజ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు నూతన ఉత్సాహంతో ఇలాంటి నైపుణ్య కోర్సులను నేర్చుకోవాలని సూచించారు.ఈ శిక్షణ కార్యక్రమం పాడేరు డిగ్రీ కళాశాల, పీఎం ఉషా పథకం ఆధ్వర్యంలో జరుగుతోందని తెలిపారు. ఈ శిక్షణకు వనిత శిక్షకురాలిగా వ్యవహరిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పీఎం ఉషా కో–ఆర్డినేటర్ వి. రమణ, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసపాత్రుడు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
27న చలో ఐటీడీఏ
మేడూరులో నిరసన తెలియజేస్తున్న గిరిజన సంఘ నాయకులు చింతపల్లి: ఆదివాసీ గిరిజన కుటుంబాలకు పీఎం జన్మన్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 27న చేపట్టనున్న చలో ఐటీడీఏ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గిరిజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి సాగిన చిరంజీవి పడాల్ కోరారు. బుధవారం లోతుగెడ్డ పంచాయతీలోని మేడూరు, రామారావు పాలెం, కొలంబంద, కోటకొండ, చోడురాయి గ్రామాల్లో గిరిజనులకు కరపత్రాలను అందజేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీలకు పక్కా ఇళ్ల నిర్మాణం జరగాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గృహాలను మంజూరు చేసిందని, అయితే వాటి నిర్మాణాలకు సంబంధించిన బిల్లుల చెల్లింపులో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని విమర్శించారు. వెంటనే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న ఈ నిరసనలో గిరిజనులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు ఎం. బాబూరావు, పీసా కమిటీ కార్యదర్శి అప్పారావు, వీరబాబు, మంగురు, దాసు తదితరులు పాల్గొన్నారు. -
ఎడారి దేశాల్లో..మన్యం సుగంధాలు
విశాఖ మన్యం గిరిజన రైతులు పండించే సేంద్రియ పంటలకు అంతర్జాతీయంగా రెక్కలొస్తున్నాయి. ఇప్పటివరకు కేవలం ఎండిన పసుపు కొమ్ములకే పరిమితమైన మార్కెట్, ఇప్పుడు సరికొత్త పుంతలు తొక్కుతోంది. గిరిజన రైతుల శ్రమను తగ్గిస్తూ, పచ్చి పసుపునే నేరుగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు కడపకు చెందిన ఓ యువ వ్యాపారి నడుం బిగించారు. దీంతో అటు రైతులకు లాభసాటి ధర, ఇటు స్థానిక గిరిజనులకు స్థానికంగా ఉపాధి లభిస్తోంది. పచ్చి పసుపు. అల్లంను ఏజెన్సీ అల్లం, పసుపునకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుసాక్షి, పాడేరు: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన రైతులు సేంద్రియ పద్ధతిలో సాగు చేసే ఆర్గానిక్ పసుపు, అల్లానికి దుబాయ్తో పాటు అరబ్ దేశాల్లో భారీ డిమాండ్ నెలకొంది. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎండిన పసుపు కొమ్ములు, పసుపు పొడిని ఎక్కువగా వినియోగిస్తారు. అయితే, అరబ్ దేశాల్లో పచ్చి పసుపు వినియోగం అధికంగా ఉండటాన్ని వైఎస్సార్ కడపకు చెందిన ఒక యువ వ్యాపారి గుర్తించారు. దీంతో మన్యం గిరిజనుల నుంచి నేరుగా పచ్చి పసుపు, అల్లాన్ని కొనుగోలు చేస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ధరల వివరాలు.. పచ్చి పసుపు: ప్రస్తుతం గిరిజన రైతుల నుంచి కిలో రూ. 20 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా 8 కిలోల పచ్చి పసుపును ఉడకబెట్టి ఆరబెడితేనే ఒక కిలో ఎండు పసుపు వస్తుంది. సంతల్లో ఎండు పసుపు కిలో రూ. 135 వరకు పలుకుతోంది. పచ్చి పసుపును నేరుగా అమ్మడం వల్ల రైతులకు ఉడకబెట్టే, ఆరబెట్టే శ్రమ తగ్గడమే కాకుండా ఆర్థికంగానూ మంచి లాభం చేకూరుతోంది. అల్లం: కిలో అల్లం రూ. 35 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. దుబాయ్ మార్కెట్లో పచ్చి అల్లానికి ఉన్న విపరీతమైన డిమాండ్ గిరిజన రైతులకు వరంగా మారింది. ఎగుమతి ఇలా.. హుకుంపేట మండలం బర్మన్గూడ కేంద్రంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 15 టన్నుల పచ్చి పసుపు, 15 టన్నుల అల్లాన్ని సేకరించారు. వీటిని శుభ్రం చేసి 3 కిలోల చొప్పున ప్యాక్ చేస్తున్నారు. ఈ 30 టన్నుల నిల్వలను ముంబైలోని కోల్డ్ స్టోరేజీలకు తరలిస్తున్నారు. అక్కడ నుంచి నౌకల ద్వారా దుబాయ్కు ఎగుమతి చేస్తారు. గిరిజనులకు స్థానిక ఉపాధి : ఈ వ్యాపారం వల్ల సుమారు 60 మంది గిరిజన కూలీలకు స్థానికంగానే ఉపాధి లభిస్తోంది. సేకరించిన పంటను మట్టి లేకుండా కడిగి, ప్యాకింగ్ చేసే పనుల కోసం వీరికి రోజుకు రూ. 400 చొప్పున కూలి చెల్లిస్తున్నారు. అరబ్ దేశాల్లో భలే డిమాండ్ పచ్చి పసుపు, అల్లానికి దుబాయ్తో పాటు అరబిక్ దేశాల్లో అఽధిక డిమాండ్ ఉంది. పచ్చి పసుపునే అక్కడ ప్ర జలు వినియోగిస్తారు. ఆర్గానిక్ అల్లానికి డిమాండ్ ఉంది. తొలిసారిగా మన్యంలో పచ్చి పసుపు, అల్లంను గిరిజన రైతులనుంచి గిట్టుబాటుకు కొనుగోలు చేస్తున్నాం. ఇకపై నిరంతరం పసుపు, అల్లం దుబాయ్కు ఎగుమతి చేస్తాం. – టి.రెడ్డి కల్యాణం, ఎండీ, డ్రై మాక్స్ ఆగ్రో ఎంటర్ప్రైజేస్, వైఎస్సార్ కడప పాడేరు ఏజెన్సీలో గిరిజనులు పండించే ఆర్గానిక్ పసుపు, అల్లానికి దుబాయ్లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. పచ్చి పసుపును నేరుగా సేకరించి ముంబై మీదుగా విదేశాలకు తరలిస్తున్నారు. దీనివల్ల రైతులకు మంచి ధర దక్కడమే కాకుండా, స్థానికంగా చాలా మంది గిరిజనులకు ఉపాధి లభిస్తోంది. గిరిజన రైతుల కష్టానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కడం విశేషం. సాధారణంగా పసుపును ఉడకబెట్టి, ఆరబెట్టి అమ్మడం గిరిజన రైతులకు పెద్ద శ్రమతో కూడుకున్న పని. కానీ, అరబ్ దేశాల్లో పచ్చి పసుపునకు ఉన్న డిమాండ్ను గమనించిన యువ వ్యాపారి నేరుగా పొలాల నుంచే పచ్చి పంటను సేకరిస్తున్నారు. హుకుంపేట మండలం కేంద్రంగా జరుగుతున్న ఈ సరికొత్త వాణిజ్యం, మన్యం పసుపు ఘాటును ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తోంది. మన్యం నుంచి అరబ్ దేశాలకు ఎగుమతి చేస్తున్న వైఎస్సార్ కడపకు చెందిన వ్యాపారి గిరి రైతుల నుంచి అల్లం కిలో రూ.35, పచ్చి పసుపు కిలో రూ.20కు కొనుగోలు మూడు కిలోల చొప్పున స్థానికంగా ప్యాకింగ్ ముంబై తరలింపు అక్కడ నుంచి కంటైనర్లో దుబాయ్కు ఎగుమతి గిరిజన రైతులకు తగ్గిన శ్రమ -
●శ్వేతవర్ణపు అద్భుతం
శీతాకాలం వీడ్కోలు పలికినా... మన్యం గుండెల్లో ఆ మంచు వణుకు ఇంకా తగ్గలేదు! బుధవారం ఉదయం పాడేరు సరికొత్త లోకాన్ని తలపించింది. ఆ మంచు తెరల వెనుక... పది గంటలు దాటినా భానుడు పరదా చాటునే ఉండిపోయాడు.. తెల్లని పాలకడలిలా పరుచుకున్న ఆ పొగమంచులో... పాడేరు కనుమలు కరిగిపోయాయా అన్నట్లు కనిపించింది. ప్రయాణం... ఒక అన్వేషణ! జి.మాడుగుల, పెదబయలు, అరకు రహదారులన్నీ శ్వేత వర్ణపు మంచు పరదాలతో నిండిపోయాయి. దారులు కనిపించక, దిశలు తెలియక... వాహనాల లైట్లు వెలుగుతున్నా, ప్రకృతి వేసిన మంచు ముసుగును దాటలేక ప్రయాణికుడు పడుతున్న తపన వర్ణనాతీతం! – సాక్షి, పాడేరు -
గిరిజనుల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
సాక్షి, పాడేరు: గిరిజనుల సాగులో ఉన్న అటవీ భూములకు సాగు హక్కులు కల్పించడమే ప్రభుత్వాల ప్రధాన ధ్యేయమని జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రత్యేక పర్యవేక్షకుడు హేమంత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన పాడేరు మండలం మోదాపల్లి, జి.మాడుగుల మండలం కె.కోడాపల్లి గ్రామాల్లో పర్యటించారు. అటవీ హక్కుల చట్టం ద్వారా భూములు పొందిన గిరిజనులతో ఆయన సమావేశమయ్యారు. వారు సాగు చేస్తున్న భూములు, పండిస్తున్న పంటలు మరియు ఆదాయ వనరుల గురించి అడిగి తెలుసుకున్నారు.భూమిపై యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా గిరిజనుల సామాజిక, మానవ హక్కులను కాపాడవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.జిల్లాలో ఇప్పటివరకు 1.89 లక్షల ఎకరాల అటవీ భూములకు సంబంధించి గిరిజనులకు పట్టాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.అటవీ భూములను సద్వినియోగం చేసుకుంటూ వాణిజ్య పంటల సాగుతో గిరిజన రైతులు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రోగ్రామ్ సమన్వయకర్త ఆదినారాయణ, పాడేరు ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వర్లు, ఐటీడీఏ కాఫీ విభాగం ఇన్చార్జి ఏడీ బొంజుబాబు తదితరులు పాల్గొన్నారు. గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండింగ్ చింతపల్లి గిరిజన ప్రాంత ఉత్పత్తులకు కాఫీ తరహాలోనే అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రత్యేక పరిశీలకుడు హేమంత్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన తాజంగిలో నిర్మాణంలో ఉన్న గిరిజన మ్యూజియంను, ఐటీడీఏ ఆధ్వర్యంలోని కాఫీ ఎకో–పల్పింగ్ యూనిట్ను పరిశీలించారు. కాఫీతో పాటు మిరియాలు, పసుపు పంటలకు గ్లోబల్ బ్రాండింగ్ కల్పించాలని, ముఖ్యంగా పసుపు మార్కెటింగ్ కోసం సోషల్ మీడియాను విరివిగా ఉపయోగించుకోవాలని సూచించారు. మ్యూజియం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కాఫీ గింజల సేకరణ, పల్పింగ్, మార్కెటింగ్ ప్రక్రియలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు చెల్లిస్తున్న గిట్టుబాటు ధరలు, బోనస్లపై ఏపీవో వెంకటేశ్వర్లు వివరించారు.మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. గిరిజన ప్రాంత అభివృద్ధికి తీసుకున్న చర్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు వెంకటేశ్వరరావు, బొంజుబాబు, సీతయ్య, రాజు, మాక్స్ అధ్యక్షుడు సింహాచలం తదితరులు పాల్గొన్నారు. -
పునరావాస కాలనీలో పనులు వేగవంతం చేయాలి
నక్కపల్లి: నిర్వాసితుల కోసం ఏపీఐఐసీ ఏర్పాటు చేస్తున్న పునరావాస కాలనీలో ఇళ్ల నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. బుధవారం ఆమె జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్తో కలసి పెదబోదిగల్లంలో జరుగుతున్న పునరావాస కాలనీ పనులను పరిశీలించారు. నిర్వాసితులంతా కాలనీకి తరలి వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పిస్తే లబ్ధిదారులంతా కాలనీకి వస్తారన్నారు. ప్రారంభించిన ఇళ్లకు అవసరమైన సామగ్రి అంతా సిద్ధం చేయాలన్నారు. తాగునీరు, వాడుకనీరు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు డ్రైనేజీల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్నారు. స్టీల్ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్క్ కోసం సేకరించిన నిర్వాసిత ప్రాంతాల్లో ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించి ఖాళీ చేయించాలని సూచించారు. మూలపర్ర, పాటిమీద గ్రామాల నిర్వాసితుల కోసం చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఆమె వెంట ఆర్డీవో వి.వి.రమణ, ఏపీఐఐసీ జెడ్ఎం నర్సింగరావు, తహసీల్దార్ శ్రీను, తదితరులు ఉన్నారు. -
అతివేగం... మృత్యుపాశం
సబ్బవరం: సబ్బవరం–ఆరిపాక రోడ్డులో గాలిభీమవరం సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం రాయపుర అగ్రహారాన్ని శోకసంద్రంలో ముంచేసింది. తీర్థమహోత్సవాలకు ఆనందంగా బయలుదేరిన ముగ్గురు యువకుల ప్రయాణం క్షణాల్లోనే విషాదయాత్రగా మారింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందడంతో అతని కుటుంబం బోరున విలపిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాలివి.. రాయపుర అగ్రహారానికి చెందిన సింగంపల్లి సాయి(23), పల్ల కనకరాజు, నంబారు సందీప్ ద్విచక్రవాహనంపై సబ్బవరం వైపు వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ నడుపుతున్న సింగంపల్లి సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న పల్ల కనకరాజు, నంబారు సందీప్ తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న సీఐ జి.రామచంద్రరావు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సాయి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించగా, క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్కు తరలించారు. కనకరాజు తలకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా.. ఢీకొన్న తీవ్రతకు రెండు వాహనాలు దూరంగా ఎగిరిపడ్డాయి. ద్విచక్రవాహనం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, ఆటో సైతం తీవ్రంగా దెబ్బతిని రోడ్డు పక్కన ఒరిగిపోయింది. మితిమీరిన వేగమే కారణమా? మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. యువకుల వేగం, నిర్లక్ష్యం మూడు కుటుంబాల జీవితాలను తారుమారు చేశాయని గ్రామస్తులు వాపోతున్నారు. సాయి తండ్రి గోవిందరావు కొన్నేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటినుంచి కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న సాయి.. ఇలా ఆకస్మిక మరణం చెందడంతో ఆ కుటుంబం కన్నీటిపర్యంతమైంది. కొడుకు మరణవార్త విన్న తల్లి ఆర్తనాదాలు గ్రామస్తులు కదిలించాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు యువకులు త్వరగా కోలుకోవాలని గ్రామస్తులు ప్రార్థిస్తున్నారు. మృతుడి సోదరుడు సింగంపల్లి నరేంద్ర ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర బుధవారం సాయంత్రం ఆరిపాక జంక్షన్ నుంచి గ్రామంలోని శ్మశానవాటిక వరకూ నిర్వహించిన సాయి అంతిమయాత్రలో వందలాదిగా యువకులు, స్నేహితులు, గ్రామస్తులు పాల్గొని అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పెందుర్తి సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్రాజ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గండి రవికుమార్ తదితరులు అంతిమయాత్రలో పాల్గొని సాయి మృతదేహానికి నివాళులర్పించారు. -
9 నుంచి రిలే నిరాహార దీక్షలు
అనకాపల్లి: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రభుత్వ మహిళా వసతి గృహాలను ఏర్పాటు చేయాలని వచ్చే నెల 9 నుంచి 14వ తేదీ వరకూ విద్యార్థులతో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్టు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జి.ఫణింద్రకుమార్ తెలిపారు. బుధవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో దీక్షల గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో మహిళా హాస్టళ్ల ఏర్పాటుపై పలుమార్లు జిల్లా అధికారులకు స్థానిక ప్రజా ప్రతినిధికి విన్నవించుకున్నా ఎటువంటి స్పందన లేదన్నారు. జిల్లా కేంద్రంలో ఒకే బీసీ మహిళ వసతి గృహం ఉందని, అందులో 200 మంది విద్యార్థినులు అరకొర వసతుల మధ్య ఇబ్బందులు పడుతున్నట్టు వాపోయారు. దాంతో గ్రామీణ ప్రాంతాల విద్యార్థినులు విద్యకు దూరమవుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు జగదీష్, సింహాద్రి, మణికంఠ, రూపవతి, లిఖిత, తేజ, సుశీల, మధు తదితరులు పాల్గొన్నారు. -
జీడి పంటకు మద్దతు ధర ప్రకటించాలి
రావికమతం: జీడి పంటకు మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ మండలంలోని చీమలపాడు పంచాయతీలో ఏిపీ ఆదివాసీ గిరిజన సంఘం, ఐదో షెడ్యూల్ సాధన కమిటీ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గిరిజన రైతులు బుధవారం కల్యాణపులోవలో ఆందోళన చేపట్టారు. జీడి పిక్కలకు ప్రభుత్వం మద్దతు ధర కేజీ రూ.200 ఇవ్వాలని, రైతు సేవా కేంద్రాల ద్వారా జీడి పిక్కలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, సాగు రాయితీలు పునరుద్ధరించాలని, జీడితోటలో అంతర కృషి పరికరాలు ఉచితంగా అందించాలని కోరారు. జీడి పరిశోధన కేంద్రాలు ప్రాంతాల వారీగా ఏర్పాటు చేసి నాణ్యమైన మొక్కలు సరఫరా చేయాలన్నారు. బ్యాంక్ రుణాలు అందించాలని, జీడి పంటకు వాతావరణ బీమా అమలు చేయాలని, మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సీపీఎం కార్యవర్గ సభ్యులు కే గోవిందరావు, గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గెమ్మిల వాసు తదితరులు పాల్గొన్నారు.గిరిజన రైతుల ఆందోళన -
నోటమాట లేదు!
● పతనమైన టమాటా ధర ● కిలో రూ.4కే వ్యాపారుల కొనుగోలు ● కంటితడి పెడుతున్న రైతులు గొలుగొండ: మార్కెట్లో టమాటా ధర పతనంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పంట పండిస్తే, కిలో రూ.4కే వ్యాపారులు కొనుగోలు చేయడంతో గగ్గోలు పెడుతున్నారు. కనీసం పెట్టిన పెట్టుబడులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ధర లేక దిగాలుగా ఉన్న రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాడిపండు పడినట్టుగా తయారైంది. మూడు రోజుల నుంచి కురుస్తున్న తేలికపాటి వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ వర్షంతో పంట పాడవుతుందని వాపోతున్నారు. 600 ఎకరాల్లో సాగు నర్సీపట్నం డివిజన్ పరిధిలో గొలుగొండ మండలంలోనే ఏటా టమాటా పంట విస్తారంగా సాగవుతోంది. తాండవ జలాశయం పరిసర ప్రాంతాలైన గొలుగొండ, సాలికమల్లవరం, వెంకటాపురం, కొత్తమల్లంపేట, అమ్మపేట పరిసర ప్రాంతాలతోపాటు వ్యవసాయ మోటార్లు ఉన్న ఏటిగైరంపేట, రిట్టవానిపాలెం, పాకలపాడు, చీడి గుమ్మల గ్రామాల్లో సుమారుగా 600 ఎకరాలకుపైగా పండిస్తున్నారు. గతే డాది డిసెంబరులో వేసిన పంట ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో కాపునకు వస్తోంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెలలో కిలో రూ.4కే ధర పలకడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ఎకరాకు రూ.30 వేల వరకు నష్టమే.. ఏటా జనవరిలో పంట కాపునకు వచ్చినప్పుడు కాస్త ధరలు తక్కువగా ఉంటాయి. గత ఏడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో వీటి ధరలు అధికంగా ఉండేవి. ఇవే ధరలు ఏప్రిల్ వరకు అనుకూలంగా ఉంటాయని భావించి అదనంగా సాగు చేశారు. అయితే ఈ నెల రెండో వారం నుంచి ధరలు పతనం కావడంతో ఎకరాకు రూ.30 వేల వరకు నష్టం వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణా సౌకర్యం లేక... గొలుగొండ మండలంలో టమాటా పంట నాణ్యమైనది కావడంతో ఇతర ప్రాంతాల వ్యాపారులు వచ్చి పొలం వద్దే కొనుగొలు చేసి వాహనాలపై తరలించుకుపోతుంటారు. ఈ ఏడాది విశాఖ, తుని, రాజమండ్రి, అనకాపల్లి, విజయవాడ నుంచి వ్యాపారులు ఇక్కడికి రావడం లేదు. పై ప్రాంతాల్లో రైతులు టమాటా సాగు చేయడంతో వీటికి డిమాండ్ లేకుండా పోయింది. దీంతో ఇక్కడ పండిన పంటను నర్సీపట్నం, కృష్ణదేవిపేట మార్కెట్కు తరలించి అమ్ముకోవాల్సి వస్తోంది. దీనివల్ల చిరు వ్యాపారులు తక్కువ ధరకు అమ్మకాలు చేయాల్సి వస్తోంది. ఒక్కొక్కసారి తీసుకెళ్లిన కాయలు అమ్మకంగాక అక్కడ దాచి మరుసటిరోజు విక్రయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక ట్రే (25 కిలోలు) రూ. 80 నుంచి రూ. 100 వరకు అమ్మకం కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. అకాల వర్షంతో మరింత నష్టం మండలంలో మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షం రైతులకు మరింతగా నష్టాన్ని మిగులుస్తోంది. తేలికపాటి వర్షం పడటంతో కాయలు పాడై కుళ్లిపోతున్నాయి. ఇలా 20 నుంచి 30 శాతం కాయలు మూడు రోజుల్లోనే పాడయ్యాయి. రోజూ సాయంత్రం అరగంట పాటు తేలికపాటి వర్షం కురుస్తుందని వాపోతున్నారు. కనీసం మార్చి మొదటి వారంలోనైనా ధరలు ఉండాలని రైతులు ఆశిస్తున్నారు. మార్కెట్లో కొనుగోలు లేక నిరీక్షణ నేను ఎకరా వరకు టమాటా సాగు చేశాను. ప్రస్తుతం కాపు విస్తారంగా ఉంది. కోసిన కాయకులు కృష్ణదేవిపేట మార్కెట్కు తరలిస్తే గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తోంది. కాయలంతా ఒకేసారి రావడంతో కొనేవారు కరువయ్యారు. తక్కువ ధరకు అమ్మలేక, వాటిని మరలా ఇంటికి తీసుకురాలేక నరకయాతన పడుతున్నాం. – పరవాడ కవి, రైతు, లింగంపేట, గొలుగొండ మండలం తీవ్రంగా నష్టపోతున్నాం ఫిబ్రవరిలో మంచి ధరలు ఉంటాయని ఉద్దేశంతో సాగు చేశాం. ఎన్నడూ లేని విధంగా ఈ నెలలోనే ధరలు పతనం కావడంతో తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. మార్కెట్లో కిలో రూ.4కే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి. – ఎస్. సూకరాజు, రైతు, గొలుగొండ -
స్పీకర్ ఇలాకాలో రెడ్బుక్ రాజ్యాంగం
నాతవరం : అసెంబ్లీ స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇలాకాలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అధికారులు అమలు చేస్తున్నారని లింగంపేట సర్పంచ్ లోకవరపు రాము అన్నారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ తమ గ్రామంలో సర్వే నంబరు 46లో 15సెంట్ల విస్తీర్ణంలో లోకవరపు అప్పలనాయుడు కుటుంబ సభ్యులు పూర్వం నుంచి నివాసం ఉంటున్నారని, ఉమ్మడి కుటుంబీకులు ఆ స్థలాన్ని వాటాలు వేసుకుని కొందరు శ్లాబు ఇళ్లు నిర్మించుకోగా, మరికొందరు ఆ స్థలంలో షెడ్లు వేసుకుని ఉంటున్నారన్నారు. వీరంతా వైఎస్సార్సీపీకి చెందిన వారు కావడంతో ఈ స్థలం గ్రామ కంఠం అంటూ కూటమి పెద్దలు కుట్ర చేశారన్నారు. ఈ స్థలంలో పంచాయతీ భవనం నిర్మిస్తామంటూ స్థానిక కూటమి నేతలు ప్రతిపాదనలు చేశారని, అధికారుల అండతో సర్పంచ్నునైన తనకు తెలియకుండా ఆ స్థలంలో పంచాయతీ నూతన భవనం నిర్మాణం చేసేందుకు రెండు నెలల క్రితం భూమి పూజ చేశారని తెలిపారు. పూర్వం నుంచి నివాసం ఉంటున్న వారి స్థలంలో భవనం నిర్మాణం చేయొద్దని, తనకు తెలియకుండా భూమి పూజ ఎలా చేస్తారని అధికారులను అడిగామన్నారు. కానీ అధికారులు సరైన సమాధానం ఇవ్వకుండా కూటమి నేతలకు వత్తాసు పలకడంతో ఈ స్థలంలో నివాసం ఉంటున్న లోకవరపు అప్పలనాయుడు, మనోజ్కుమార్ హైకోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చిందన్నారు. స్టే ఉండగా ఆ స్థలంలో ఎంపీడీవో శ్రీనివాస్ పోలీసు బందోబస్తుతో పనులు చేసేందుకు గత నెలలో సిద్ధమయ్యారని చెప్పారు. తాను బాధితులతో కలిసి ఆ స్థలంలో పనులు చేయకుండా నిలుపుదల చేశానన్నారు. దీనిపై కక్ష పెట్టుకున్న అధికారులు, కూటమి నేతలు కుమ్మకై ్క పంచాయతీ కార్యదర్శి బాబితో లోకవరపు వరహాలబాబు, యర్రాపాత్రుడు నూకరాజు, మంగ నారాయణమూర్తి తదితర వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేయించారని తెలిపారు. పోలీసులు క్షేత్ర స్థాయిలో జరిగిన విషయాలు పరిశీలించకుండా సోమవారం రాత్రి బాధితులనే నాతవరం తీసుకెళ్లిపోయారన్నారు. తప్పుడు కేసులు పెట్టి స్టేషన్కు తరలించి, ఆ స్థలంలో పోలీసులు బందోబస్తుతో మంగళవారం పనులు చేసేందుకు ఎంపీడీవో శ్రీనివాస్ తహసీల్దార్ ఓ.చందనరేఖ వచ్చారన్నారు. ఈ స్థలంలో ఎలాంటి పనులు చేయరాదని కోర్టులో స్టే ఉందని అధికారులతో వాదించామన్నారు. గ్రామసభ ఆమోదం లేకుండా, సర్పంచ్కు తెలియకుండా ఏకపక్ష నిర్ణయంతో పంచాయతీ భవనం నిర్మాణం చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై తప్పుడు కేసులు పెట్టి, భయపెట్టి కూటమి నేతలు అధికారుల అండతో ఇష్టానుసారం చేసేందుకు కుట్ర చేశారని సర్పంచ్ రాము ఆరోపించారు. టీడీపీ నేతల ఒత్తిడితో అక్రమ అరెస్ట్లు నర్సీపట్నం: టీడీపీ నాయకుల ఒత్తిడి మేరకు వైఎస్సార్సీపీ సానుభూతిపరులను అక్రమ అరెస్ట్లు చేస్తున్నారని నాతవరం మండలం, లింగంపేట సర్పంచ్ లోకవరపు రాము ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు స్టే ఇచ్చిన స్థలం విషయంలో పోలీసులు వ్యవహారించిన తీరుపై ఆర్డీవో కార్యాలయంలో సర్పంచ్, బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అనంతరం సర్పంచ్, బాధిత కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు. తాత,తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన 15 సెంట్ల భూమిని లోకవరపు వరహాలబాబు, రాజుబాబు అనుభవిస్తున్నారన్నారు. ఈ భూమిపై గ్రామ టీడీపీ నాయకుడు డి.అప్పలనాయుడు కన్నేశాడరన్నారు. ఆ భూమి గ్రామకంఠం పరిధిలో ఉందని రూ.2 లక్షలు ఇవ్వాలని అప్పలనాయుడు అనుభవదారులను డిమాండ్ చేశాడని చెప్పారు. డబ్బులు ఇవ్వకపోవడంతో ఆస్థలంలో పంచాయతీ భవనం కడతామని టీడీపీ నాయకుడు అధికారుల ద్వారా ఒత్తిడి తీసుకువచ్చారన్నారు.ఆ స్థలంలో భవనం కట్టేందుకు చేసిన తీర్మానంపై తన సంతకాలను సైతం పోర్జరీ చేశారని ఆరోపించారు. ఈ నెల 23వ తేదీ రాత్రి భోజనం చేస్తున్న మా కుటుంబ సభ్యులైన లోకవరపు నూకరాజు, లోకవరపు మంగ, లోకవరపు కొండబాబు, లోకవరపు నారాయణమూర్తి, పైల సీతారామనాగ జమీలు, లోకవరపు వరహాలబాబును పోలీసులు తీసుకెళ్లారని, ఎందుకు తీసుకువెళ్తున్నారని ఎస్ఐ తారకేశ్వరరావును ప్రశ్నించినప్పటికీ సమాధానం లేదన్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి అక్రమ అరెస్టులు చేశారన్నారు. స్థల విషయమై ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపిక
కశింకోట : రాష్ట్ర స్థాయి సైక్లింగ్ రేస్ పోటీలకు స్థానిక డీపీఎన్ జెడ్పీ హైస్కూలు 9వ తరగతి విద్యార్థి పీతల కిషోర్ ఎంపికయ్యాడు. స్పోర్ట్స్ అథారిటీ ఆప్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సైక్లింగ్ రేస్ పోటీలు మంగళవారం అనకాపల్లిలో నిర్వహించారు. ఈ పోటీలో కిషోర్ రాష్ట్ర స్థాయి పోటీకి ఎంపికై నట్టు హెచ్ఎం ఎన్.జె.వి ప్రసాద్ తెలిపారు. ఈ నెల 28, మార్చి 1వ తేదీల్లో విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొననున్నట్లు చెప్పారు. కిషోర్ ఎంపిక పట్ల ఆయనతోపాటు పీడీలు వి.ప్రభాకరరావు, పి. కమల, విద్యా కమిటీ ప్రతినిధుల నక్కా నాగమణి, దుర్గ అప్పారావు, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు. -
చందనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు
● 1.20 లక్షల మంది వస్తారని అంచనా ● విశాఖ కలెక్టర్ హరేందిర ప్రసాద్ సింహాచలం : ఏప్రిల్ 30న జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవానికి జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హరేందిరప్రసాద్ తెలిపారు. చందనోత్సవానికి సంబంధించి ఏర్పాట్లపై మంగళవారం ఆయన సింహగిరిపై దేవస్థానం ఈవో జె.వెంకటరావు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది చందనోత్సవానికి 1.20 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేసినట్టు తెలిపారు. సాధారణ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంతృప్తికర దర్శనం కల్పించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. బారికేడింగ్తో సహా అన్ని సివిల్, నిర్మాణ పనులు మార్చి 31లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. క్యూలైన్లలో సాధ్యమైనంత వరకు శాశ్వత షెల్టర్లు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. తాత్కాలిక షెల్టర్ ఏదైనా ఏర్పాటుచేస్తే ముందుగా ఆర్అండ్బీ లేదా వివిధ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ల ద్వారా సర్టిఫై చేయిస్తామన్నారు. సాధారణ భక్తులకు ఉదయం 3గంటల నుంచి రాత్రి 11గంటల వరకు దర్శనం కల్పించే ప్రణాళిక చేశామన్నారు. వీఐపీలు, వీవీఐపీలకు ఉదయం 3 నుంచి 5 గంటల వరకు మాత్రమే ప్రత్యేక టైమ్ స్లాట్లు ఉంటాయని తెలిపారు. రూ. 300, రూ. 1000, రూ. 1500 టికెట్ల దర్శనాల క్యూలు వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రారంభమవుతాయన్నారు. వారం ముందే టికెట్ల జారీ ప్రక్రియని పూర్తిచేస్తామన్నారు. టిక్కెట్లపై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తామన్నారు. బస్సుల నిర్వహణ, పికల్–డ్రాప్ పాయింట్లు, పార్కింగ్ ప్రాంతాలపై స్పష్టమైన ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఆలయ ప్రాంగణంలోకి సెల్ఫోన్లు అనుమతి ఉండదని, పోలీసులు, సేవావలంటీర్లతో నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు. అనంతరం కలెక్టర్ స్వామివారిని దర్శించుకున్నారు. -
సచివాలయ ఉద్యోగి అని నమ్మించి బంగారం చోరీ
నిందితుడి అరెస్టుఅనకాపల్లి : సచివాలయ ఉద్యోగిగా చెప్పుకుని జిల్లాలో పలు చోట్ల చోరీకి పాల్పడిన కోనసీమ జిల్లా, రాజోలు మండలం, శివకోడపాలెం గ్రామానికి చెందిన ఎల్లమెల్లి వెంకటరమణ, అలియాస్ కిషోర్, అలియాస్ అర్జునరావును అరెస్టు చేసినట్టు డీఎస్పీ ఎం. శ్రావణి అన్నారు. పట్టణ పోలీస్స్టేషన్ ఆవరణలో మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితుడు వెంకటరమణ గత ఏడాది డిసెంబర్లో అనకాపల్లి పట్టణం కర్ణాలువీధి దగ్గర సచివాలయం ఉద్యోగిని అని చెప్పి ఒక గృహాన్ని అద్దెకు కావాలని చెబుతూ పింఛన్ ఇప్పిస్తానని, ఫొటో, ఫింగర్ ప్రింట్ తీసుకోవాలని నమ్మబలికి మెడలో బంగారం తాడు ఉంటే పింఛను రాదని, ఆ బంగారాన్ని తీసివ్వమని చెప్పి ఓ మహిళను మోసగించాడని తెలిపారు. అలాగే గత ఏడాది నవంబర్లో ఎస్.రాయవరం మండలం కొరుప్రోలు గ్రామంలో కూడా ఇదే విధంగా తనను తాను సచివాలయ ఉద్యోగిగా చెబుతూ ప్రభుత్వం నుంచి కొత్త పథకం కింద కొంత నగదు వచ్చిందని, ఆ డబ్బులు ఇవ్వాలంటే ఆధార్కార్డు, ఫొటో కావాలని, మెడలో బంగారు వస్తువులు తీయించి కాజేశాడని డీఎస్పీ చెప్పారు. నిందితుడు వద్ద నుంచి చోరీ సొత్తు 33.21 గ్రాములు బంగారం తాడు, రెండు బంగారం సూత్రాలు 22.85 గ్రాములు, ఒక బంగారం నల్లపూసలు 31.70 గ్రాములు మొత్తం బంగారం సుమారుగా 87.70 గ్రాములు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చగా 14 రోజులు రిమాండ్ విధించడం జరిగిందన్నారు. నిందితుడిపై రాష్ట్రంలో పలు పోలీస్స్టేషన్లలో పాత కేసులు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ ప్రేమ్కుమార్, ఎస్ఐలు అల్లు స్వామినాయుడు, కె.సంతోష్కుమార్ పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి
కోటవురట్ల: ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.ఆశాదేవి సూచించారు. మండలంలో ఆమె మంగళవారం పర్యటించి, రామచంద్రపురం శివారు శ్రీపతిరాజు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఉద్యానవన, వ్యవసాయ అనుబంధ పంటల సాగు పరిస్థితులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంతో చీడపీడలను నివారించడంతో పాటు, అధిక దిగుబడితో ఆరోగ్యకరమైన పంటను పొందవచ్చన్నారు. అనంతరం తంగేడులోని విత్తనశుద్ధి ఫ్యాక్టరీని సందర్శించారు. నాణ్యత పరీక్షల తర్వాత మాత్రమే రైతులకు విత్తనాలు సరఫరా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రకృతి వ్యవసాయాధికారి లచ్చన్న, ఏవో సరోజిని, సిబ్బంది, ఫ్యాక్టరీ యజమాని కొరుప్రోలు శివకుమార్ పాల్గొన్నారు. -
ఉత్సాహంగా సైక్లింగ్సెలక్షన్స్ పోటీలు
అనకాపల్లి టౌన్: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాలకు మేరకు మంగళవారం నిర్వహించిన శాప్ లీగ్ సైక్లింగ్ సెలక్షన్స్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. అండర్–18 విభాగంలో పట్టణంలో సుంకరమెట్ట జంక్షన్ నుంచి దేవీపురం వరకు జరిగిన పోటీల్లో 45 మంది బాలురు, 10 మంది బాలికలు పాల్గొన్నారు. వ్యక్తిగత, మాస్టర్ విభాగంలో నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలైన వారు ఈ నెల 28 నుంచి మార్చి నెల 1వ తేదీ వరకు ఎన్టీఆర్ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి పూజారి శైలజ తెలిపారు. -
పోలీసులు నూతన దృక్పథంతో ముందుకు సాగాలి
ఆరిలోవ: మారుతున్న సాంకేతిక పరిస్థితులు, సోషల్ మీడియా ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని నూతన దృక్పథంతో పోలీసులు ముందుకు సాగాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సూచించారు. కై లాసగిరి ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీస్ మైదానంలో 15 రోజులుగా జరుగుతున్న అనకాపల్లి జిల్లా ఏఆర్ బలగాల వార్షిక డీ–మొబలైజేషన్ ముగింపు కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఏఆర్ పోలీసులు ఆయనకు సాదర స్వాగత పలికారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ అనధికారిక సమావేశాలు, అనుమతి లేని ర్యాలీలు నియంత్రించేటప్పుడు అప్రమత్తంగా మెలగాలన్నారు. చట్టపరమైన నిబంధనల మేరకు శాంతియుతంగా సమస్యలు పరిష్కరించాలన్నారు. ఇక్కడ శిక్షణలో నేర్చుకున్న ఆయుధాల వినియోగం, బాంబ్ స్క్వాడ్ , మాబ్ కంట్రోల్ నైపుణ్యాలు విధి నిర్వహణలో వెన్నుముఖంలా నిలుస్తాయని చెప్పారు. విధి నిర్వహణలో ఉండి కుటుంబ బాధ్యతలను విస్మరించకూడదన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు, ఎస్బీ డీఎస్పీ జి.ఆర్.ఆర్.మోహన్, రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణారావు, మన్మథరావు, ఆర్ఎస్ఐ ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గం
అనకాపల్లి: ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా జి.రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక నర్సింగరావుపేట అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా వి.కృష్ణ మోహన్, ఆర్థిక కార్యదర్శిగా రాజాన సన్యాసినాయుడు, సహ అధ్యక్షుడిగా వేదూరి శ్రీనివాసరావు,అదనపు ప్రధాన కార్యదర్శిగా కనిశెట్టి ఉమ, మహిళా అధ్యక్షురాలిగా మల్ల ఉమామహేశ్వరి, మహిళా ప్రధాన కార్యదర్శిగా ఎం.సూర్యకుమారి, రాష్ట్ర కౌన్సిలర్లుగా ఎం.ఉమామహేశ్వరరావు, ఎస్.సంతోష్ కుమా ర్, ఆర్.రామ్చరణ్తో పాటు ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకులుగా సి.గణేష్, ఎం. ఈశ్వరరావు, అబ్రహం సునంద వ్యవహరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ మార్చి ఒకటో తేదీన సీపీఎస్ విధానం రద్దుకోరుతూ విశాఖలో జరగబోయే సాగర ఘోష కార్యక్రమాన్ని విజయవంతం చేయాడానికి కృషి చేస్తామన్నారు. -
భూ వివాదంలో ఆరుగురి అరెస్టు
నర్సీపట్నం : గ్రామకంఠం భూమిని తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించిన విషయమై పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ తెలిపారు. నర్సీపట్నం రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరా వెల్లడించారు. నాతవరం మండలం, లింగంపేట పంచాయతీ పరిధి సర్వే నెంబర్ 46లో పంచాయతీకి చెందిన ఖాళీ గ్రామకంఠం భూమిని తప్పుడు పత్రాలని సృష్టించి రిజిస్టేషన్ చేయించినట్లు జాయింట్ ఇన్స్పెక్షన్లో రుజువైందన్నారు. ఈ భూ వివాదానికి సంబంధించి ఎల్.నూకరాజు, ఎల్.మంగ, ఎల్.కొండబాబు, ఎల్.నారాయణమూర్తి, పి.సీతారామ నాగజమీలు,ఎల్.వరహాలబాబును అరెస్ట్ చేశామని సీఐ, ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వ భూమిని కాజేసేందుకు తప్పుడు పత్రాలు సృష్టించినందునే చర్యలు తీసుకున్నామని నాతవరం తహసీల్దార్ చందనరేఖ పేర్కొన్నారు. -
‘గోవ’ పండగ... ఆనందం నిండుగా...
కె.కోటపాడు : ఆర్లి గ్రామంలో గంగాదేవి(గోవ) పండగను మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి ఐదేళ్లకు ఒక మారు గ్రామస్ధులు అమ్మవారి పండగను నిర్వహించడం ఆచారంగా వస్తుంది. పండగ పర్వదినం కావడంతో గంగాదేవి ఆమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిర్మాణం చేపట్టిన పందిరికి మొక్కులలో భాగంగా కొబ్బరి, అరటి, ద్రాక్ష పండ్లతో పాటు, నగదు, చీరలను వేలాడదీశారు. మధ్యాహ్నం పందిరికి వేలాడదీసిన వస్తువులను భక్తులు పొందేందుకు దోపిడీ కార్యక్రమం నిర్వహించగా భక్తులంతా ఉత్సాహంగా పోటీపడ్డారు. భక్తులకు లభించే వస్తువు అమ్మవారి ప్రసాదంగా భక్తులు స్వీకరిస్తారు. పండగ సందర్భంగా బంధువులు, స్నేహితుల రాకతో గ్రామమంతా సందడిగా మారింది. ఈ సందర్భంగా తప్పెటగుళ్ల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. -
జాతీయ స్థాయి రగ్బీ పోటీల్లో ఇందు ప్రతిభ
అచ్యుతాపురం రూరల్ : జాతీయ స్థాయి రగ్బీ పోటీల్లో ఎంజేపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని బి.ఇందు ఉత్తమ ప్రతిభ కనబర్చిందని పాఠశాల ఫిజకల్ డైరెక్టర్ ధర్మిరెడ్డి రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం స్థానిక విలేకర్లతో మాట్లాడారు. తమిళనాడులో గల జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం జరిగిన జాతీయ స్థాయి రగ్బీ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరపున కాంస్య పతకం సాధించడంలో ఇందు ఉత్తమ ప్రతిభ కనబర్చిందన్నారు. క్రీడాకారిణి ఇందుకి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.రాజా రత్నకుమార్, సర్పంచ్ కరెడ్ల బుల్లెమ్మ, మాజీ సర్పంచ్ కరెడ్ల సూర్యప్రకాశ్, స్కూల్ కమిటీ చైర్మన్ యు.ఉష, అధ్యాపకులు అభినందనలు తెలిపారు. -
3న అప్పన్న డోలోత్సవం
సింహాచలం: ఫాల్గుణ పౌర్ణమిని పురస్కరించు కుని మార్చి 3న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి డోలోత్సవాన్ని కొండ దిగువన ఉన్న పుష్కరిణి సత్రం ప్రాంగణంలోని ఉద్యానవన మండపంలో వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు దేవస్థానం ఈవో జె.వెంకటరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు చంద్రగ్రహణం సంభవిస్తున్న నేపథ్యంలో వైదిక కార్యక్రమాలు, ఉత్సవ నిర్వహణ సమయాల్లో మార్పు లు చేసినట్లు పేర్కొన్నారు. 3న తెల్లవారుజామున ఒంటి గంటకు సుప్రభాత సేవ, 3.30 గంటలకు బాలభోగం, ఆరాధన పూర్తిచేసి.. అనంతరం విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, చూర్ణోత్సవం నిర్వహిస్తారు. తెల్లవారుజామున 4 గంట లకు స్వామివారి ఉత్సవమూర్తులను మెట్ల మార్గం ద్వారా కొండ దిగువకు తీసుకొస్తారు. అక్కడ ఉద్యానవన మండపంలో డోలోత్సవం, వసంతోత్సవం నిర్వహిస్తారు. అనంతరం ఉద యం 6 గంటల నుంచి గ్రామ తిరువీధి నిర్వహించి, తిరిగి స్వామివారిని కొండపైకి తీసుకెళ్తారు. భక్తులందరూ ఈ ఉత్సవంలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని ఈవో కోరారు. -
నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి
కొయ్యూరు: కనీస ప్రొటోకాల్ పాటించకుండా రోడ్డు పనులు చేపట్టిన గిరిజన సంక్షేమ శాఖ డీఈ, ఏఈ లపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ బడుగు రమేష్ బాబు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మంప నుంచి గొడుగులమ్మబంద వరకు రహదారి నిర్మించాలని గత నాలుగేళ్లుగా అనేకసార్లు కలెక్టర్లకు విన్నవించామన్నారు. ప్రజాప్రతినిధుల వినతులపై స్పందించిన కలెక్టర్, ఈ పనుల కోసం రూ. 4.5 కోట్ల నిధులను మంజూరు చేశారని తెలిపారు. అయితే, పనులు ప్రారంభించే ముందు ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏవైనా అభివృద్ధి పనులు చేపట్టే ముందు విధిగా భూమి పూజ నిర్వహించడం సంప్రదాయమని, కానీ అధికారులు కనీస సమా చారం ఇవ్వకుండా ప నులు మొదలుపెట్టా రని విమర్శించారు. గొడుగులమ్మబంద గ్రామస్తులను స్వయంగా కలెక్టర్ల వద్దకు తీసుకువెళ్లి, వారి సమస్యలను వివరించడం వల్లే ఈ నిధులు మంజూరయ్యాయని ఆయన గుర్తుచేశారు. చివరికి ఈ రహదారి కోసం తీర్మానం చేసిన సర్పంచ్కు కూడా సమాచారం ఇవ్వలేదని రమేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస ప్రొటోకాల్, సంప్రదాయాలను పాటించని అధికారులపై తక్షణ మే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఎంపీపీ రమేష్ బాబు డిమాండ్


