breaking news
Alluri Sitarama Raju
-
నిత్యావసర సరకుల కోసం వాగు దాటాల్సిందే
● దొరగూడ గ్రామ గిరిజనుల అవస్థలు ముంచంగిపుట్టు: వర్షాకాలం వచ్చిందంటే మారుమూల గ్రామాల గిరిజనుల అవస్థలు వర్ణనాతీతం. ఉధృతంగా ప్రవహించే వాగులు, గెడ్డలు దాటితేనే వారి జీవనం ముందుకు సాగేది. దొరగూడ గ్రామ గిరిజనుల పరిస్థితి ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఇంట్లో నిత్యావసర వస్తువులు లేకపోవడంతో వాటి కోసం శుక్రవారం ఆరు కిలోమీటర్లు కాలినడకన వెళ్లారు. అక్కడి నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న బిరిగూడ, ఉబ్బెంగుల వాగులు దాటుకుని లక్ష్మీపురం వచ్చారు. సరకులు కొనుక్కొన్న వారు తిరుగు ప్రయాణంలో అవే సమస్యలు ఎదుర్కొన్నారు. గ్రామానికి మంజూరైన రోడ్డు, కల్వర్టులు నిర్మిస్తే తమకు ఈ కష్టాలు తీరుతాయని గ్రామానికి చెందిన లక్ష్మణ్, డొబ్రు, గాసి, సుక్రి, లక్ష్మి తెలిపారు. ఐదు కిలోల గంజాయి స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్?అడ్డతీగల: మండలంలోని పాపంపేట వద్ద శుక్రవారం ఐదు కిలోల గంజాయితో కాకినాడకు చెందిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా వీరు పట్టుబడినట్టు తెలిసింది. ఒడిశా నుంచి కాకినాడ ప్రాంతానికి ఈ గంజాయిని తరలిస్తూ పోలీసులకు చిక్కినట్టుగా చెబుతున్నారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టుగా సమాచారం. -
ఐదేళ్లుగా..అసంపూర్తిగా..
సౌకర్యాల్లేక ఇబ్బందులు డుంబ్రిగుడ ఏకలవ్య పాఠశాలను గత కొన్నేళ్లుగా అరకు డిగ్రీ కళాశాలలోని ఓ భవనంలో నిర్వహిస్తున్నారు. ఇరుకు గదుల్లో నిర్వహించడం వల్ల పూర్తిస్థాయి సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వీలైనంత త్వరగా డుంబ్రిగుడలోని భవనాలను పూర్తి చేసి తరలిస్తే బాగుంటుంది. – గొల్లోరి లైకోన్, విద్యార్థిని తండ్రి, సంతవలస, పోతంగి పంచాయతీ, డుంబ్రిగుడ మండలం చాలీచాలని వసతితో కాలక్షేపం కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి. కొత్తభవనాలు అందుబాటులోకి రానందున విద్యార్థులు, సిబ్బంది చాలీచాలని వసతి మధ్య కాలం గడుపుతున్నారు. సుమారు 18 నెలల్లో పూర్తికావాల్సినవి ఐదేళ్లు దాటుతున్నా అందుబాటులోకి రాకపోవడం బాధాకరం. – పాంగి జీవన్ కృష్ణ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి త్వరలో బిల్లు బకాయిల చెల్లింపు ఇటీవల జిల్లాకు ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారుల బృందం డుంబ్రిగుడలో భవన నిర్మాణ పనులను పరిశీలించింది. డుంబ్రిగుడలో మిగతా పది శాతం పనులు పూర్తికాకపోవడానికి కారణాలు తెలుసుకుంది. రూ.2.80 కోట్ల బిల్లు బకాయిలు త్వరలో చెల్లిస్తారు. లబ్బూరులో భవనాలను ఈనెల 9న ప్రారంభిస్తాం. – వేణుగోపాల్, ఈఈ, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ, అరకులోయ అరకులోయ టౌన్: గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు ఏజెన్సీలో ఏర్పాటుచేసిన ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలు వసతి సమస్యను ఎదుర్కొంటున్నాయి. శాశ్వత భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం బిల్లుల చెల్లింపు జాప్యం చేస్తోంది. దీనివల్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. సుమారు 18 నెలల్లో పూర్తికావాల్సిన భవనాలు ఐదేళ్లయినా కొన్నిచోట్ల జరుగుతూనే ఉన్నాయి. పర్యవేక్షణ లేక.. కేంద్ర ప్రభుత్వం పాడేరు డివిజన్లో పది, రంపచోడవరం డివిజన్ పరిధిలో ఆరు ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలను 2019లో మంజూరు చేసింది. ఒకొక్కదానికి రూ.12 కోట్లు కేటాయించింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో భవన నిర్మాణాలకు స్థలాలు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో నిర్మాణ పనులు చురుగ్గా ప్రారంభమయ్యాయి. ఏడాది కాలంగా పనులు చురుగ్గా సాగడం లేదు. కూటమి ప్రభుత్వ పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ● అరకులోయ మండలం మజ్జివలసలో పాఠశాల భవన నిర్మాణ పనులు 90 శాతం మేర పూర్తయ్యాయి. కాంట్రాక్టర్కు రూ.కోటి మేర బిల్లు చెల్లించాల్సి ఉంది. దీంతో చివరి దశలో పనులు నిలిచిపోయాయి. డుంబ్రిగుడలో 90 శాతం పనులు పూర్తికాగా రూ.2.80లక్షలు బిల్లు చెల్లించాల్సి ఉన్నందున చివరి దశలో పనులు ముందుకు సాగడం లేదు. కొయ్యారు, రంపచోడవరం, అడ్డతీగలలో 90 శాతం పనులు పూర్తయ్యాయి. బిల్లులు సకాలంలో మంజూరు అవుతున్నప్పటికీ కాంట్రాక్టర్లు పనులు చురుగ్గా చేయడం లేదని తెలుస్తోంది. ముంచంగిపుట్టు మండలం లబ్బూరులో పాఠశాల భవనాలు పూర్తయ్యాయి. ప్రహరీ నిర్మించాల్సి ఉంది. బిల్లులు చెల్లించకపోవడంతో ప్రారంభంలో జాప్యం జరుగుతోంది. అనంతగిరి (పాతకోట), జి.మాడుగుల, హుకుంపేటలో భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. సొంత భవనాల్లేక.. ఏకలవ్య పాఠశాలలకు సొంత భవనాలు అందుబాటులోకి రానందున విద్యార్థులు, ఉపాధ్యాయులు వసతి సమస్యను ఎదుర్కొంటున్నారు. అరకులోయ మండలంలోని మజ్జి వలస పాఠశాలను అరకులోయ గురుకుల బాలికల కళాశాల ఆవరణలో నిర్వహిస్తున్నారు. డుంబ్రిగుడ పాఠశాలను అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో, కొయ్యూరు పాఠశాలను చింతపల్లి వైటీసీలో, అనంతగిరి పాఠశాలను అరకులోయ వైటీసీలో, రంపచోడవరం పాఠశాలను మారేడుమిల్లిలో, ముంచంగిపుట్టు పాఠశాలను పెదబయలులో నిర్వహిస్తున్నారు. జిల్లాలోని పెదబయలు, చింతపల్లి, చింతూరు, మారేడుమిల్లి, రాజవొమ్మంగి, వై.రామవరంలో మాత్రమే కొత్త భవనాల్లో పాఠశాలలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులు చాలాచోట్ల కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం భవనాలు మంజూరు చేసినా పనులు చురుగ్గా సాగడం లేదు. సుమారు 18 నెలల్లో పూర్తి కావాల్సిన నిర్మాణ పనులు ఐదేళ్లు దాటుతున్నా ఇంకా జరుగుతూనే ఉండటం గమనార్హం. నత్తనడకన ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలల భవన నిర్మాణాలు బిల్లుల చెల్లింపులో జాప్యమే కారణం సొంత భవనాలు లేక వసతి సమస్య ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, సిబ్బంది కూటమి ప్రభుత్వ పర్యవేక్షణ లోపమే కారణమని విమర్శలు -
ప్రజల పక్షాన నిలిచేది జగన్ ఒక్కరే
● ఒక వైపు మొనగాడు.. మరో వైపు మోసగాళ్లు ● వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ● బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ పేరిట నూతన కార్యక్రమానికి శ్రీకారం ● క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ డౌన్లోడ్ ● పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు అధ్యక్షతన విసృతస్థాయి సమావేశం పాడేరు: రాష్ట్రంలో ప్రస్తుతం మోసగాళ్లంతా ఒకవైపు ఉంటే మొనగాడైన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఒక్కరే ప్రజల పక్షాన ఉంటూ వారికి అండగా నిలుస్తున్నారని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలోని వీఆర్ కల్యాణ మండపంలో శుక్రవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ, క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో డౌన్లోడ్కు సంబంధించి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి జయంతి రోజున వైఎస్సార్సీపీ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాపీకొట్టిన కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఏ ఒక్క పథకాన్ని సక్రమంగా అమలు చేయలేకపోయిందన్నారు. గత ప్రభుత్వం వ్యవసాయ సీజన్ సమయంలో ఏడాదికి సుమారు 53 లక్షల మందికి రైతు భరోసా అమలు చేసి మేలు చేస్తే కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో పైసా కూడా రైతులకు మిగతా 8వ పేజీలో -
అల్లూరి స్ఫూర్తితో జిల్లా అభివృద్ధి
సాక్షి,పాడేరు: భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో జిల్లా అభివృద్ధికి కృషిచేస్తున్నామని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ అన్నారు. జయంతి సందర్భంగా కలెక్టరేట్లో స్వర్గీయ అల్లూరి చిత్రపటానికి కలెక్టర్తో పాటు జేసీ డాక్టర్ అభిషేక్గౌడ, ఇతర అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంతో పాటు,గిరిజనుల పక్షాన అలుపెరగని పోరాటాలు చేసి, ఉద్యమంలోనే ప్రాణాలు విడిచిన మహనీయుడు అల్లూరి పేరుతో జిల్లా ఏర్పాటు కావడం సంతోషంగా ఉందన్నారు. అల్లూరి పోరాటం,జీవిత చరిత్రపై భావితరాల పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. కళాకారుడు వడ్డే భాస్కరరావు అల్లూరి చరిత్రపై గీతాలు ఆలపించారు. వీరందరినీ కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో సబ్కలెక్టర్ సౌర్యమన్పటేల్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, డీఆర్వో పద్మలత, డ్వామా పీడీ విద్యాసాగర్, ఎంపీపీ రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ ఘన నివాళి : స్వాతంత్య్ర పోరాట యోధుడు అల్లూరి విగ్రహానికి ఎస్పీ అమిత్ బర్దర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎస్పీ కార్యాలయంలో అల్లూరి విగ్రహం వద్ద వేడుక నిర్వహించారు. స్వాతంత్య్ర పోరాటంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు అల్లూరి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సహబాజ్ అహ్మద్, ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, సంజీవరావు, రాము, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. చింతపల్లి: స్థానిక ఆర్ఏఆర్ఎస్లో అల్లూరి జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.బాల హుస్సేన్రెడ్డి, శాస్త్రవేత్తలు డాక్టర్ డి వెంకటేష్బాబు,ఽబీఎన్ సందీప్ నాయక్ తదితరులు నివాళులర్పించారు. కలెక్టర్ దినేష్కుమార్ ఘనంగా జయంతి -
ఆర్టీసీ ఉద్యోగులపై సవతి తల్లి ప్రేమ
పాడేరు రూరల్: ఆర్టీసీ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సంఘ జిల్లా కార్యదర్శి చందు విమర్శించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం స్థానిక ఆర్టీసీ డిపో వద్ద భోజన విరామ సమయంలో ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న పదోన్నతులను అమలు చేయకుండా కాలయాపన చేస్తుండ టం సరికాదన్నారు. పదోన్నతుల కోసం ఎదురు చూస్తూ వందల సంఖ్యలో ఉద్యోగులు పదవీ విరమణ పొంది తీవ్ర నష్టపోతున్నరన్నారు. 12వ పీఆర్సీ 2023 జూన్ నుంచి అమలు జరగాల్సి ఉండ గా ఇంతవరకు దీనికి సంబంధించిన కమిషన్ ఏర్పాటుచేయలేదని ఆరోపించారు. వెంటనే కమిషన్ వేసి ఐఆర్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎలక్ట్రికల్ బస్సులకు ఆర్టీసీ ఉద్యోగులు వ్యతిరేకం కాదని వాటిని ఆర్టీసీ సంస్థ కొనుగోలు చేసి నడపాలన్నారు. ఉద్యోగులకు నెల వారీ రూ.225 కోత విధిస్తున్నా హెల్త్ స్కీమ్ వర్తించ డం లేదన్నారు. సక్రమంగా వైద్యం అందక ఇప్పటి వరకు 350 మంది ఉద్యోగులు వివిధ వ్యాధుల బారిన పడి మృతి చెందారన్నారు. పెండింగ్లో ఉన్న డీఏను తక్షణం చెల్లించాలన్నారు. ఉచిత బస్సు స్కీమ్ విజయవంతం కావాలంటే 2,500 బస్సులు అవసరం ఉండగా 10వేల మంది సిబ్బందిని నియమించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్ర మంలో ఉద్యోగుల సంఘ ప్రతినిధులు వీహెచ్రావు, కేవీనాయుడు, విజయ్, నాగ్రేంద్ర, వీవీఆర్ మూర్తి, ఎంవీ బాబు, కుమారి, పూర్ణమ్మ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆ సంఘ జిల్లా కార్యదర్శి చందు విమర్శ -
తూర్పు తీరంలో పగడపు దిబ్బలు
● అంతర్జాతీయంగా అధికారిక గుర్తింపు ● ఎన్విరాన్మెంటల్ సైన్స్ అర్కైవ్స్లో ప్రచురణ ● చింతపల్లిలో అత్యధిక పగడపు దిబ్బలున్నట్టు గుర్తింపు ● పూడిమడక వద్ద పగడపు దిబ్బలను తరలించేందుకు అవకాశం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : విశాఖ తీరంలోని పూడిమడక, రిషికొండ, మంగమారిపేట, చింతపల్లి (విజయనగరం జిల్లా) వద్ద అరుదైన పగడపు దిబ్బలు ఉన్నాయని అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అర్కైవ్స్లో ప్రచురితమైన ‘డైవర్సిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కోరల్ కమ్యూనిటీ ఫ్రం విశాఖపట్నం కోస్ట్, ఏపీ’ అనే ఆర్టికల్లో ఈ విషయం స్పష్టమైంది. జూలై 1న ప్రచురితమైన ఈ నివేదిక, ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరం కూడా పగడపు దిబ్బలకు నెలవుగా ఉందని తేటతెల్లం చేసింది. తద్వారా ఇప్పటివరకు పగడపు దిబ్బలు ఉన్నాయని పేర్కొంటూ వచ్చిన నివేదికలకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించిందని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) చేసిన సర్వేలో పాల్గొన్న లివిన్ అడ్వెంచర్స్ ఫౌండర్ బలరాం ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటివరకు పగడపు దిబ్బలు భారతదేశంలో లక్షద్వీప్, అండమాన్–నికోబార్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, గల్ఫ్ ఆఫ్ కచ్లకే పరిమితమని భావించేవారు. ఇందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్లోని తూర్పు తీరం కూడా పగడపు దిబ్బలకు నెలవుగా ఉందని అంతర్జాతీయ తేటతెల్లమయ్యింది. 2019 నుంచి 2023 వరకు...! వాస్తవానికి పగడపు దిబ్బల ఉనికి కోసం డేటాను సేకరించేందుకు, పరిశోధన చేసేందుకు 2019 నుంచి 2023 వరకు విజయనగరం జిల్లాలోని చింతపల్లి నుంచి పూడిమడక వరకూ సర్వే చేశారు. మొత్తం 15 ప్రదేశాల్లో ఈ అధ్యయనం సాగింది. ఈ అధ్యయన నివేదికలు పలుమార్లు వెలువరించారు. అయితే అంతర్జాతీయ గుర్తింపు లభించడం ఇదే మొదటిసారి. తద్వారా ఆంధ్రా తీరం సముద్ర జీవ వైవిధ్యానికి నెలవుగా ఉందని అధికారికంగా గుర్తింపు లభించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చింతపల్లి నుంచి పూడిమడక వరకు 15 ప్రదేశాల్లో జరిపిన అధ్యయనం సందర్భంగా సాగరగర్భంలో 30 మీటర్ల లోతుల వరకు అన్వేషణ సాగించారు. స్థానిక స్కూబా డైవింగ్ సంస్థ లివిన్ అడ్వెంచర్స్తో కూడిన నలుగురు శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయనాన్ని చేపట్టింది. పొరిటిడే, అగారిసిడె, డెండ్రోఫిలిడే వంటి అరుదైన పగడపు దిబ్బలున్నట్టు గుర్తించారు. వాస్తవానికి చింతపల్లి వద్ద 12 రకాల పగడపు దిబ్బలు, రిషికొండ వద్ద 6, పూడిమడక వద్ద 5, మంగమారిపేట వద్ద 3 రకాల పగడపు దిబ్బలు ఉన్నట్టు గుర్తించారు. చింతపల్లి వద్ద ఎక్కువగా పగడపు దిబ్బలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, పూడిమడక వద్ద ఉన్న పగడపు దిబ్బల్లో కొంతభాగం తీసి మరో చోటికి తరలించి పెంచేందుకూ అవకాశం ఉందని తేలింది. యాంటీ క్యాన్సర్ మందుల తయారికీ...! సముద్ర గర్భంలో ఉండే ఈ పగడపు దిబ్బల వలన సముద్ర పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగకరంగా ఉందనే అభిప్రాయం ఉంది. పగడాల ద్వారా వచ్చే కాల్షియం కార్బోనేట్ వల్ల ఇవి ఏర్పడతాయి. వీటిలో కొన్ని పోషకాలు ఉంటాయి. ఈ పగడపు దిబ్బల ద్వారా సముద్రంలో ఉండే జీవరాశులు మరింతగా పెరిగేందుకు దోహదం చేస్తాయనేది శాస్త్రవేత్తల అభిప్రాయం. అంతేకాకుండా ఈ పగడపు దిబ్బలను యాంటీ బయోటిక్స్, యాంటీ క్యాన్సర్ వంటి మెడిసిన్ తయారీలోనూ ఉపయోగిస్తారని తెలుస్తోంది. అంతేకాకుండా సముద్రతీరం కోతకు గురికాకుండా సహజసిద్ధంగా ఇవి కాపాడతాయని కూడా అధ్యయనాల్లో తేలింది. మరోవైపు అలల తీవ్రతను కూడా తగ్గించేందుకు ఇవి దోహదం చేస్తాయి. ఈ నేపథ్యంలో వీటి పగడపు దిబ్బలను చూసేందుకు స్కూబా డైవింగ్, స్నోర్కింగ్ ద్వారా టూరిజం అభివృద్దికి కూడా దోహదం చేస్తాయి. అంతర్జాతీయంగా తొలిసారి గుర్తింపు మన సముద్ర తీరంలో పగడపు దిబ్బలు ఉన్నట్టు గతంలో మేం జీఎస్ఐతో కలిపి జరిపిన అధ్యయనంలో తేలింది. అయితే, ఈ అధ్యయనానికి తొలిసారిగా ఈ నెల 1వ తేదీన ప్రచురణ ద్వారా అంతర్జాతీయ గుర్తింపు లభించింది. పగడపు దిబ్బల ద్వారా మత్స్యసంపదకు ఎంతో ఉపయోగం. కాలుష్యం బారిన పడకుండా వీటిని కాపాడుకోవాల్సిన అవసరం మాత్రం ఎంతో ఉంది. – బలరాం, లివిన్ అడ్వెంచర్స్, ఫౌండర్ ● -
అల్లూరి ఆశయ సాధనకు పాటుపడాలి
మునగపాక: మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడా లని అరకు ఎంపీ జి.తనూజరాణి పిలుపునిచ్చారు. అల్లూరి జయంతిలో భాగంగా శుక్రవారం స్థానిక బొడ్డేడ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన అల్లూరి చిత్రపటానికి వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్ తో కలిసి ఆమె పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన అల్లూరి పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకమన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం అల్లూరి చూపిన పోరాట ప్రతిభ మార్గదర్శకం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు దిమ్మల అప్పారావు, బొడ్డేడ శ్రీనివాసరావు, భీశెట్టి గంగప్పలనాయుడు, మాజీ వైస్ ఎంపీపీ దొడ్డి వరహా సత్యనారాయణ, పార్టీ నేతలు దాసరి అప్పారావు, నరాలశెట్టి సూర్యనారాయణ, పిన్నమ రాజు రవీంద్రరాజు, ఆడారి రమణబాబు, జేసీబీ వెంకట్, కన్నుంనాయుడు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అరకు ఎంపీ తనూజరాణి పిలుపు -
పోలీసు భవనాలకు రాజకీయ గ్రహణం
● నిర్మించి నెలలు గడుస్తున్నా ప్రారంభోత్సవానికి నోచుకోని వైనం ● హోంమంత్రి, అసెంబ్లీ స్పీకరు మధ్య సమన్వయలోపమే కారణం? నాతవరం: పోలీసుస్టేషనన్లకు నూతనంగా నిర్మించిన అదనపు భవనాల ప్రారంభోత్సవానికి రాజకీయ గ్రహణం వెంటాడుతోంది. నాతవరం పోలీసుస్టేషన్కు నూతన భవన నిర్మాణం పనులు పూర్తి చేసి గత డిసెంబరులోనే ప్రారంభించడానికి పోలీసు అధికారులు ఏర్పాట్లు చేశారు. గొలుగొండ మండలంలో కృష్ణదేవిపేట, గొలుగొండ పోలీసుస్టేషన్లకు రెండు చోట్ల అదనపు భవనాలు నిర్మించినా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. నియోజకవర్గంలో నాతవరం, గొలుగొండ మండలాల్లో పోలీసుస్టేషన్లకు నిర్మించిన అదనపు భవనాలు మార్చి నెలలోనే ప్రారంభించేందుకు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా స్వయంగా భవనాలను పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో రాష్ట్ర హోంమంత్రి అనిత ఇతర ఉన్నతాధికారులతో ఈ భవనాల ప్రారంభోత్సవం ఉంటుందని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని క్షేత్ర స్థాయి అధికారులను ఆదేశించారు. ఈ దిశగా మూడు పర్యాయాలు ఎస్ఐ సిహెచ్.భీమరాజు, రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినా ఆఖరు సమయంలో ప్రారంభోత్సవాలు వాయిదా పడిన సందర్భాలు ఉన్నాయి. రాష్ట్ర పోలీసుశాఖ ఆధ్వర్యంలో అదనపు భవనాల నిర్మాణాలు చేపట్టారు. ఆయా భవనాల ప్రారంభోత్సవాలకు హోంమంత్రి వంగలపూడి అనిత విచ్చేస్తారని అంటున్నారు. నాతవరం, గొలుగొండ మండలాలు అసెంబ్లీ స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. ఆయన ఆహ్వనం మేరకే హోంమంత్రి తన నియోజకవర్గంలో పోలీసు స్టేషన్ అదనపు భవనాల ప్రారంభోత్సవానికి విచ్చేయాల్సి ఉంది. అయితే స్పీకర్, హోంమంత్రి మధ్య సమన్వయ లోపం కారణంగా భవనాలు ప్రారంభోత్సవంలో జాప్యం జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. పోలీసుస్టేషన్లకు అదనపు భవన నిర్మాణాలకు 2018లో అప్పటి ప్రభుత్వం రూ.2.50 కోట్లు చొప్పున మంజూరు చేసింది. భవనాల పనులు ప్రారంభించాక కరోనా కారణంగా చాలా కాలంగా పనులు నిలిపివేశారు. నిర్మాణ టెండరు దక్కించుకున్న కాంట్రాక్టరు టీడీపీ నేత కావడంతో గత ప్రభుత్వంలో పనులు పూర్తి చేస్తేవె వైఎస్సార్సీపీకి మంచి పేరు వస్తుందన్న అక్కసుతో జాప్యం చేశాడు. ప్రస్తుతం భవనాల నిర్మాణం పూర్తయినా రాజకీయ గ్రహణం చోటు చేసుకుంది. దీంతో నెలల తరబడి నూతన భవనాలు ప్రారంభోత్సవాలకు నోచుకోలేదు. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న, నాతవరం, గొలుగొండ మండలాల పర్యటనకు తరుచూ విచ్చేస్తున్నారు. నెలల తరబడి అలంకార ప్రాయంగా కళ్ల ముందే కన్పిస్తున్నా ఆ భవనాల ప్రారంభోత్సవం వైపు కన్నెత్తి చూడలేదు. ఈ విషయంపై నాతవరం ఎస్ఐ సిహెచ్.భీమరాజును వివరణ కోరగా మూడుసార్లు భవనం ప్రారంభోత్సవాలకు కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. అనివార్య కారణాల వల్ల ఆఖరు సమయంలో రద్దయ్యాయన్నారు. రూ.కోట్ల వ్యయంతో నాతవరం, గొలుగొండ, కేడీపేట స్టేషన్లకు అదనపు భవనాలు -
పార్టీలకతీతంగా జెడ్పీ నిధుల కేటాయింపు
● మంజూరైన పనులను 6 నెలల్లోగా పూర్తి చేయాలి ● జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర కోటవురట్ల: గ్రామాల అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా జెడ్పీ నిధులు కేటాయిస్తున్నట్టు జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయాన్ని ఆమె గురువారం సందర్శించారు. స్థానికంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఎంపీడీవో చంద్రశేఖర్ను అడిగి తెలుసుకున్నారు. జెడ్పీ నిధుల వినియోగం, డ్రైనేజీ నిర్మాణాలు, ప్రారంభించని పనుల గురించి ఆరా తీశారు. నిధులు మంజూరైన పనులను 6 నెలల్లోగా పూర్తి చేయాలని సూచించారు. చేపట్టే పనులపై తప్పనిసరిగా తీర్మానం చేయాలన్నారు. అనంతరం మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లాలో డ్రైనేజీల నిర్మాణాల కోసం ప్రతి జెడ్పీటీసీకి రూ.20 కోట్లు కేటాయించామని తెలిపారు. కోటవురట్ల మండలానికి జెడ్పీటీసీ నిధులు కాకుండా అదనంగా తన నిధులు రూ.20 లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు. వీటితో అవసరమైన చోట డ్రైనేజీలు నిర్మించారని తెలిపారు. కిలోమీటరు పొడవున్న బీటీ రోడ్డు శిథిలమైందని, నిధులు కేటాయించాలని వైస్ ఎంపీపీ ఆర్ఎస్ సీతారామరాజు తన దృష్టికి తీసుకొచ్చారని, దానికి నిధులు మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. జనరల్ ఫండ్ బిల్లులు నిలిపివేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు జనరల్ ఫండ్ బిల్లులు నిలిపివేశారని తెలిపారు. ఇలా సుమారు రూ.10 కోట్ల నిధులకు సంబంధించిన బిల్లులు ఆగిపోయాయని తెలిపారు. దీని వల్ల జనరల్ ఫండ్ నిధులు ఇవ్వాలంటే భయమేస్తోందని, పనులు చేసినవారు ఇబ్బంది పడతారని అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రం ప్రభుత్వం పంచాయతీలకు విడుదల చేసిన మరుక్షణం కూటమి ప్రభుత్వం వాటిని వెనక్కి లాగేసుకుని తల్లికి వందనం డబ్బులు జమ చేసిందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు, వైస్ ఎంపీపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి ఆర్ఎస్ సీతారామరాజు, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు కిల్లాడ శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ జిల్లా బీసీ సెల్ మాజీ చైర్మన్ పైల రమేష్, ఎంపీటీసీ పెట్ల రాంబాబు, పరవాడ జెడ్పీటీసీ పి.ఎస్.రాజు పాల్గొన్నారు. -
ఇక్కడ రూ.10..
మన్యంలో పైనాపిల్ రైతులు ధరలేక ఉసూరు మంటున్నారు. వర్షాల వల్ల వ్యాపారులు రావడం లేదు. అరకొరగా వచ్చిన వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ ఒక పైనాపిల్ సైజును బట్టి సగటున రూ.10 వరకు ధర చెల్లిస్తున్నారు. మైదాన ప్రాంతాలకు తరలించి మూడింటిని రూ.90 నుంచి రూ.100కు విక్రయించి ఆదాయం పొందుతున్నారు. వ్యాపారుల పరిస్థితి లాభసాటిగా ఉండగా ఆరుగాలం కష్టపడి పండించిన గిరి రైతులు మాత్రం పెట్టుబడి రాక నష్టాలు పాలవుతున్నారు. అక్కడ రూ.30ధర పతనంతో పైనాపిల్ రైతు ఉసూరుసాక్షి,పాడేరు: మన్యంలో పైనాపిల్ రైతుకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తుండటంతో వ్యాపారులు రాకపోవడంతో రైతులు మార్కెటింగ్ సమస్య ఎదుర్కొంటున్నారు. దీనివల్ల ధర కూడా పతనమైంది. మరోపక్క పంటను కోయకుండా వదిలేయడంతో వర్షాలకు కాయలు కుళ్లిపోతుండటంతో గిరి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. దిగుబడి బాగున్నా.. ఏజెన్సీలోని పాడేరు, అనంతగిరి, హుకుంపేట, డుంబ్రిగుడ, చింతపల్లి మండలాల్లోని పలు గ్రామాల పరిధిలో 610 ఎకరాల విస్తీర్ణంలో పైనాపిల్ను సాగు చేస్తున్నారు. కొండపోడు, మెట్ట భూముల్లో సేంద్రియ విధానంలో పండించడం వల్ల రుచిలో నంబర్ వన్గా నిలుస్తున్నాయి. జూన్ నుంచి ఆగస్టు నెలాఖరు వరకు పంట దిగుబడి ఉంటుంది. ఈ ఏడాది దిగుబడి ఆశాజనకంగా ఉన్నా గిట్టుబాటు ధర లేకపోవడంతో గిరిజన రైతులు ఉసూరుమంటున్నారు. ఈ ఏడాది దారుణంగా.. ఎన్నడూలేనివిధంగా ఈ ఏడాది పైనాపిల్ ధరలను వ్యాపారులు పతనం చేశారు. గత నెల సీజన్ ప్రారంభంలో ఒకొక్క కాయను రూ.20నుంచి రూ.25 ధరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ ఏడాది ధరను బాగా తగ్గించేశారు. గత పది రోజుల నుంచి సైజునుబట్టి రూ.5 నుంచి రూ.13కు కొనుగోలు చేస్తుండటంతో గిరి రైతులు ఆవేదన చెందుతున్నారు. సమీపంలోని అనకాపల్లి జిల్లా వి.మాడుగుల సంతకు నేరుగా తీసుకువెళ్లినా అక్కడ వ్యాపారులు కూడా తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారని వారు వాపోతున్నారు. ముందుకురాని వ్యాపారులు : పైనాపిల్ సీజన్ ప్రారంభమైనప్పటికీ వ్యాపారుల రాక తగ్గింది. గతంలో తుని, రాజమండ్రి, విజయవాడ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు నేరుగా రైతుల వద్దకు వచ్చేవారు. ఈ ఏడాది వ్యాపారుల నుంచి డిమాండ్ కూడా తగ్గింది.దీంతోపాటు వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో పైనాపిల్ను కొనుగోలు చేసేవారు కరువయ్యారని గిరి రైతులు వాపోతున్నారు. ● పైనాపిల్ సాగుకు పేరొందిన వంట్లమామిడి, సలుగు, దేవాపురం, ఐనాడ పంచాయతీల పరిధిలోని గిరిజనులకు ఏటా ఈ పంట ద్వారా ఎకరాకు రూ.2 లక్షల వరకు ఆదాయం వచ్చేది. ఈ ఏడాది కనీసం రూ.లక్ష కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. తీవ్ర నష్టం కలిగిస్తున్న వర్షాలు ఏకధాటిగా కురుస్తుండటంతో కానరాని వ్యాపారులు మార్కెటింగ్ లేక నష్టపోతున్న గిరి రైతులు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వినతి వ్యాపారుల వద్దకు తీసుకెళ్లినా తక్కువ ధరే.. అనకాపల్లి జిల్లా వి.మాడుగుల సంతలో కూడా పైనాపిల్కు తక్కువ ధరే లభిస్తోంది. వ్యాపారులు రూ.12కు మించి కొనుగోలు చేయడం లేదు. గత ఏడాది రూ.20కి అమ్ముకున్నాం. ఈ ఏడాది మాత్రం గిట్టుబాటు ధర కరువైంది. ప్రభుత్వం స్పందించి రైతుబజార్లకు తరలించి అమ్ముకునేలా ఏర్పాట్లు చేయాలి. – కిముడుబోయిన శ్రీరాములు, పైనాపిల్ రైతు, కందులపాలెం, పాడేరు మండలం ఐటీడీఏ మార్కెటింగ్ చేయాలి ఈఏడాది పైనాపిల్కు గిట్టుబాటు ధరలు కరువయ్యాయి. చిన్న కాయను రూ.5కు కొంటున్నారు. మైదాన ప్రాంతాల వ్యాపారులు గ్రామాలకు రావడం లేదు. మైదాన ప్రాంతాలకు రైతులు పైనాపిల్ను తరలించి అమ్ముకునే విధంగా ఐటీడీఏ మార్కెటింగ్కు సహకరించాలి. ఇలా చేయగలిగితే నష్టాల నుంచి బయటపడగలుగుతాం. – కిల్లు కృష్ణ, గిరిజన రైతు, పులుసుమామిడి, పాడేరు మండలం -
వరద నీటితో శబరి కళకళ
చింతూరు: నిన్నటివరకు ఇసుక తిన్నెలతో కనిపించిన శబరినది ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో జలకళ సంతరించుకుంది. మంగళవారం నుంచి కురుస్తున్న భారీవర్షాల కారణంగా ఒడిశా, ఛత్తీస్గఢ్తో పాటు సీలేరు నది ద్వారా వస్తున్న వరదనీరు చేరడంతో గురువారం ప్రవాహం పెరిగింది. చీకటివాగు ఎగపోటుకు గురై పొలాల్లోకి ఎగదన్నింది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదనీటితో సోకిలేరువాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. శబరినది మరింత పెరిగితే సోకిలేరు వాగు వరదనీరు చింతూరు, వీఆర్పురం రహదారిపై ప్రవహించే అవకాశముంది. పొల్లూరులోని టెగ్రిస్ జలపాతం పరవళ్లు తొక్కుతోంది. శబరినదిలో కొత్తనీరు చేరడంతో విరివిగా చేపలు వలలకు చిక్కి జాలర్ల పంట పండుతోంది. గురువారం చింతూరులో 12 నుండి 15 కిలోల బరువు కలిగిన చేపలను రెండు నుంచి 3 క్వింటాళ్ల వరకు విక్రయించారు. -
విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదు
● బాధ్యతగా పనిచేయకుంటే చర్యలు ● కలెక్టర్ దినేష్కుమార్ హెచ్చరిక సాక్షి,పాడేరు: గిరిజన విద్యార్థుల ఆరోగ్యం, వైద్యసేవల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సంభందిత అధికారులు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ హెచ్చరించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో గిరిజన సంక్షేమ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల మృతికి ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కాకూడదన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, మందులు అందుబాటులో ఉన్నప్పటికీ విద్యార్థుల మరణాలు సంభవించడం బాధాకరమన్నారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఆశ్రమ పాఠశాలల్లో స్కూల్ హెల్త్ కార్యక్రమాన్ని పక్కాగా అమలుజేయాలన్నారు. విద్యార్థుల హెల్త్ రికార్డులపై ఉపాధ్యాయులు,వైద్యాధికారులకు అవగాహన ఉండడం లేదంటూ ఆసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని ఆశ్రమ పాఠశాలల్లో వైద్యశిబిరాలు నిర్వహించేందుకు సూక్ష్మ ప్రణాళికలు రుపొందించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరీక్షల నివేదికలను ప్రతి నెలా పంపాలన్నారు. క్లాస్ టీచర్, వైద్యాధికారి, సూపర్వైజర్లు ఆర్బీఎస్కే పుస్తకంలో సంతకం చేయని పక్షంలో షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మానటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. గోమంగి మినీ గురుగులంతో పాటు ఇతర పాఠశాలల్లో సికిల్సెల్ ఎనీమియా పరీక్షలపై కలెక్టర్ ఆరా తీశారు. అన్ని పాఠశాలల్లో సిక్ రూమ్లు ఏర్పాటుతో పాటు సికిల్సెల్ ఎనీమియా కేసులకు అదనపు పౌష్టికాహారం అందజేయాలన్నారు. కీటక జనిత మలేరియా,డెంగ్యూ, చికెన్గున్యా వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. రెండవ విడత దోమల నివారణ మందు పిచికారి పనులను వచ్చేనెల 31వరకు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో సబ్కలెక్టర్ సౌర్యమన్పటేల్, రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం, డీఎంహెచ్వో డాక్టర్ విశ్వేశ్వరనాయుడు, జిల్లా మలేరియాశాఖ అధికారి తులసి, డీఈవో బ్రహ్మాజీరావు, ఇన్చార్జి డీడీ రజని,డీసీహెచ్ఎస్ డాక్టర్ లక్ష్మి పాల్గొన్నారు. వచ్చే నెలాఖరు నాటికి హోంస్టేల నిర్మాణం వచ్చే నెలాఖరునాటికి జిల్లాలో హోంస్టేల నిర్మాణాలను పూర్తి చేయాలని కలెక్టర్ దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి టూరిజం కమిటీ ప్రతినిధులు,ఎంపీడీవోలతో నిర్వహించిన వీడియో సమావేశంలో ఆయన మాట్లాడారు. హోంస్టేల కోసం గుర్తించిన గృహాల్లో కనీస వసతులు కల్పించాలన్నారు.పర్యాటకులకు వసతితో పాటు అల్పాహారం.భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు.హోం స్టే ప్యాకేజీలు అందించేందుకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఇంజినీరింగ్ అధికారులు, పోలీసులతో మండలస్థాయి టూరిజం కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.పర్యాటక ప్రాంతాలలో ప్లాస్టిక్ వస్తువులు,బాటిళ్లు,కవర్లను నియంత్రించాలని ఆదేశించారు. రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ, జిల్లా పర్యాటక అఽధికారి దాసు, డీఆర్డీఏ పీడీ మురళీ, డీఎల్పీవో కుమార్, సీపీవో ప్రసాద్, ఏపీఎఫ్డీసీ డీఎం కృష్ణబాబు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు. -
పౌష్టికాహారంసద్వినియోగం చేసుకోండి
● అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ హుకుంపేట: అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం అందిస్తున్న పౌష్టిక ఆహారాన్ని గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని అసిస్టెంట్ కలెక్టర్ కె. సాహిత్ సూచించారు. గురువారం ఆయన మండలంలోని కులుపాడు,గడుగుపల్లి అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. పౌష్టికాహార పంపిణీ వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో బాలచంద్రమణిదేవి, సిబ్బంది పాల్గొన్నారు. -
తగ్గని వర్షాలు.. పొంగిన గెడ్డలు
సాక్షి,పాడేరు: జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఐదు రోజుల నుంచి కుండపోత వానతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది.గురువారం కూడా పాడేరుతో పాటు సమీప ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. పాడేరు మండలం గుత్తులపుట్టు,జి.మాడుగుల మండలం బొయితిలి సంతకు వెళ్లే గిరిజనులు వర్షంతో అవస్థలు పడ్డారు. జోలాపుట్టు జలాశయానికి నీరందించే మత్స్యగెడ్డ, రాళ్లగెడ్డ, చాపరాయి, కురిడి గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి.హుకుంపేట మండలంలోని చీడిపుట్టు రోడ్డులో రాళ్లగెడ్డ కాజ్వే మీదుగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.గెడ్డ ప్రమాదకరంగా ఉన్నప్పటికి గిరిజనులు ప్రాణాలకు తెగించి గెడ్డను దాటుతున్నారు. జిల్లాలో 620.4 ఎంఎం వర్షపాతం నమోదు జిల్లా వ్యాప్తంగా గురువారం 620.4మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంచంగిపుట్టులో80.2, హుకుంపేటలో 46.8, పెదబయలులో 41.2, మారేడుమిల్లిలో 39.4, జి.మాడుగులలో 37.4, వై.రామవరంలో 36.4, చింతూరులో 34.6, అరకులోయలో 32.6, అడ్డతీగలలో 30.8, చింతపల్లిలో 28.4, గంగవరంలో 26.6, కూనవరంలో 25.4, దేవీపట్నంలో 24.6, రాజవొమ్మంగిలో 24.2, వీఆర్పురంలో 22.2, డుంబ్రిగుడలో 20.8, ఎటపాకలో 18.4, రంపచోడవరంలో 18.2, కొయ్యూరులో 16.2, అనంతగిరిలో 9.2, జీకేవీధిలో 4.2, పాడేరులో 2.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని కలెక్టరేట్ అధికారవర్గాలు తెలిపాయి. ముంపులో ఇల్లుపాడేరు మండలం చింతలవీధి జంక్షన్లో కిల్లో డొమై అనే గిరిజన మహిళకు చెందిన ఇల్లు ముంపునకు గురైంది. గురువారం ఇంటిలోకి వరదనీరు ప్రవహించడంతో ఆందోళనకు గురయ్యారు. జాతీయ రహదారి నిర్మాణంతో దిగువున ఉన్న నివాసాలన్నీ వర్షం పడినప్పుడల్లా ముంపు సమస్యను ఎదుర్కొంటున్నాయి. డ్రైనేజీలు నిర్మించకపోవడం వల్ల ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. రాకపోకలకు ఇబ్బందులు ముంచంగిపుట్టు: మండలంలోని మారుమూల బుంగాపుట్టు, రంగబయలు, వనుగుమ్మ, భూసిపుట్టు, కుమడ, దొడిపుట్టు పంచాయతీల్లో వాగులు,గెడ్డలు పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కించాయిపుట్టు పంచాయతీ వర్కుగుమ్మి వాగు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాల గిరిజనులు రెండు గంటల పాటు నిరీక్షించిన అనంతరం అతికష్టం మీద వాగును దాటారు.కుమడ గ్రామ సమీపంలో కల్వర్టుపై నుంచి వరదనీరు భారీగా పారింది. వనుగుమ్మ పంచాయతీ తర్లగూడ వద్ద కల్వర్టుపై వరదనీరు ప్రవహించడంతో గ్రామ గిరిజనులు రాకపోకలు సాగించేందుకు గిరిజనులు ఇబ్బందులు పడ్డారు. లక్ష్మీపురం పంచాయతీ కర్లపొదర్, దొడిపుట్టు పంచాయతీ బిడిచంపా వద్ద వాగులు ఉధృతంగా ప్రవహించడంతో గిరిజనులు గ్రామాలకు పరిమితం అయ్యారు. రంగబయలు పంచాయతీ జోడిగుమ్మలో కొర్ర పూయు అనే గిరిజనుడి ఇల్లు వర్షానికి స్వల్పంగా దెబ్బతింది.పెదబయలు: మండలంలోని జామిగుడ, గిన్నెలకోట, మత్ప్యగెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. పెదకోడాపల్లి పరదానిపుట్టు సమీపంలోని వంతెనను తాకుతూ ప్రవహిస్తున్నాయి. కిముడుపల్లి పంచాయతీ గేదెగెడ్డ కాజ్వేపై నీరు ప్రవహించడంతో గురువారం ఉదయం మూడు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి. జామిగుడ పంచాయతీలో పలు గ్రామాల ప్రజలు పొంగి ప్రవహిస్తున్న గెడ్డను దాటేందుకు అవస్థలు పడుతున్నారు. జి.మాడుగుల: మండలంలోని కుంబిడిసింగికి వెళ్లే రోడ్డు మార్గంతోపాటు గడుతూరు పంచాయతీలోని వసమామిడి మార్గంలో గెడ్డలు పొంగి ప్రవహించడం వల్ల మారుమూల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తపల్లి జలపాతం, సొలభం పంచాయతీ ఎగకంఠవరం సమీపంలోని అక్కా చెల్లెళ్ల గుమ్మి జలపాతం, కుంబిడిసింగి–పెదలోచలి పంచాయతీల్లో గుర్రాయి వద్ద గల రాళ్లగెడ్డ జలపాతం వరదనీటితో ప్రవాహం ప్రమాదకరంగా మారింది. -
మృత్యు మలుపు
● ప్రమాదకరంగా కప్పకొండ మలుపు ● పెరుగుతున్న యాక్సిడెంట్లు ● ఆందోళనలో స్థానికులు వై.రామవరం: మండలంలోని ప్రధాన మార్గంలో పలుచోట్ల ఉన్న మలుపులు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని పనసలపాలెం, చవిటిదిబ్బల గ్రామాల మధ్య ఉన్న కప్పకొండ టర్నింగువద్ద వాహనాలపై ప్రయాణించేదుకు మండలవాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మలుపు వద్ద ఎన్నో వాహనాలు ఢీకొని దశాబ్ధాలుగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మలుపు వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు ప్రమాదాల బారిన పడి మృత్యువాతకు గురువుతున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణంలో సరైన విధంగా డిజైన్ చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నట్టు పలువురు చెబుతున్నారు. ఈ మలుపును ఆనుకొని ఉన్న ఎత్తుగా ఉన్న గుట్టను తొలగించి, నేరుగా రోడ్డు నిర్మించి ఉంటే ప్రమాదాలకు తావు ఉండేది కాదన్నారు. ఇది అధికారుల నిర్లక్ష్యమేనని విమర్శిస్తున్నారు. అతివేగమే కారణం అంతేకాకుండా ఈ మలుపు వద్ద జరిగిన ఎన్నో ప్రమాదాల మృత్యువాతలు వెలుగులోకి రాలేదు. ఇంత జరుగుతున్న ఇంజనీరింగు అధికారులు ఈ మలుపును సరిచేయడంలో విఫలమైనట్టు మండల వాసులు విమర్శిస్తున్నారు. ఓ వైపు పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రతీ గ్రామంలోను అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ యువత అతివేగంగా ఈ మలుపు వద్ద వాహనాలు నడుపుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రధాన రహదారిలోని ప్రతీ ప్రమాదకరమైన టర్నింగులోను హెచ్చరిక బోర్డులు, డ్రమ్ములు ఏర్పాటుచేసినప్పటికీ వాహనచోదకుల నిర్లక్ష్యం, వేగం కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికై నా ఆర్అండ్బీ ఇంజినీరింగు అధికారులు స్పందించి, ఈ మలుపు వద్దు ఉన్న చిన్నకొండను తొలగించి ప్రమాదాల జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ప్రమాదాలను అరికట్టాలి ఈ మార్గంలో మలుపు లేకుండా రోడ్డు నిర్మించడంలో అప్పటి ఇంజనీరింగు అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. ఫలితంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందంచి ఈ మార్గంలో ఉన్న చిన్నకొండను (గుట్ట ను) తొలగించి రోడ్డు నిర్మించి ప్రమాదాలను అరికట్టాలి. – కడబాల ఆనందరావు, ఎంపీపీ అధికారులు స్పందించాలి ఈ ప్రమాదకర మలుపు వద్ద దశాబ్దాలుగా జరుగుతున్న ప్రమాదాల్లో అనేక మంది మృతి చెందుతున్నారు. దీన్ని అరికట్టడానికి తక్షణమే ఇంజనీరింగు అధికారులు చర్యలు తీసుకోవాలి.ఈ మేరకు ఈ ప్రాంతంలో మార్పులు చేసి రహదారి నిర్మించాలి. – వీరమళ్ళ సుబ్బలక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు, వై.రామవరం ప్రమాదాలవీ... ● ఈ మలుపు వద్ద సుమారు 30 ఏళ్ల క్రితం విధి నిర్వహణలో వై.రామవరం నుంచి అడ్డతీగల వెళ్తున్న సత్యనారాయణ అనే పోలీసు కానిస్టేబుల్ బైక్ ప్రమాదంలో మృతి చెందారు. ● 20 ఏళ్ల క్రితం మండలంలోని చవిటిదిబ్బలు గ్రామానికి చెందిన గొర్లె కృపానంద మృతి చెందారు. ● పదేళ్ల క్రితం పులుసుమామిడి గ్రామానికి చెందిన బ్రహ్మం అనే వ్యక్తి ఈ మలుపు వద్ద బైక్ అదుపు తప్పిన ప్రమాదంలో మృతి చెందారు. ● ఈ ఏడాది జూన్21న స్థానిక వీఆర్ఓ కాంతమ్మ భర్త చోడే సీతారామయ్య మృతి చెందారు. ● జూన్ 28న కిచ్చల రామకృష్ణారెడ్డి, పల్లాల శ్రీనివాసురెడ్డిలు మృతి చెందారు. – జూన్ 25న పల్లాల నాగిరెడ్డి అనే వ్యక్తి ఈ మలుపు వద్ద బైక్తో ఆర్టీసీ బస్సు కింద పడి, చికిత్స పొందుతూ మృతి చెందారు.చర్యలు తీసుకుంటాం రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతీ గ్రామంలోను అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ప్రతి మలుపు వద్ద హెచ్చరిక బోర్డులు, వేగాన్ని అదుపుచేయడానికి స్పీడ్ స్టాపర్లు ఏర్పాటు చేశాం. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. – బి రామకృష్ణ, ఎస్ఐ, వై.రామవరం -
5 నుంచి తుది విడత చందనం అరగదీత
సింహాచలం: సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఈ నెల 5 నుంచి తుది(4వ) విడత చందనం అరగదీతను ప్రారంభించేందుకు దేవస్థానం వైదిక, అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు బుధవారం చందనం చెక్కలను అరగదీతకు అనువుగా ఉద్యోగి సాంబ ముక్కలుగా కోశారు. ఆలయ ఏఈవో ఆనంద్కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ నెల 10న ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని ఆ రోజు స్వామికి తుది విడతగా మూడు మణుగుల(సుమారు 125 కిలోలు) పచ్చి చందనం సమర్పిస్తారు. ఆ చందనాన్ని సమకూర్చేందుకు అరగదీతను చేపట్టనున్నారు. ఏడాదిలో స్వామికి నాలుగుసార్లు మూడు మణుగుల చొప్పున చందనాన్ని సమర్పిస్తారు. చందనోత్సవం రోజు, వైశాఖ పౌర్ణమి, జ్యేష్ట పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో ఈ చందన సమర్పణ ఉంటుంది. -
ఉపాధి ఈసీ తీరుపైవిచారణ
రాజవొమ్మంగి: స్థానిక ఉపాధి హామీ కార్యాలయంలో ఇంజనీరింగ్ కన్సల్టెంట్ (ఈసీ) రాజాబాబుపై అందిన ఫిర్యాదు మేరకు బుధవారం అధికారులు విచారణ చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. రెండు నెలల క్రితం ఉపాధి ఈసీగా విధుల్లో చేరిన రాజబాబు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు మహిళ ఉపాధి మేట్లు, వేతనదారులు స్థానిక ఎంపీపీ గోము వెంకటలక్ష్మికి ఫిర్యాదు చేశారు. దీంతో పాటు ఉపాధి పనులకు సంబంధించి మస్తర్లలో అవకతవకలను పలువురు వేతనదారులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఎంపీపీ వెంకటలక్ష్మి ఇటీవల ఉపాధి ఈసీని తమ వద్దకు పిలిచి ప్రశ్నించారు. అయితే ఆయన దురుసుగా ప్రవర్తించారు. దీనిపై ఉపాధి మేట్లు, సిబ్బంది, వేతనదారులు, ఎంపీపీ వెంకటలక్ష్మి కలసి ఉపాధి ప్రాజెక్టు డైరెక్టర్ ( పీడీ)కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీడీ (ఎఫ్ఏసీ) సీతయ్య, మరో అధికారి బాలకృష్ణ బుధవారం వారి సమక్షంలో విచారణ చేపట్టారు. ఈ విచారణకు వచ్చిన ఈసీ రాజాబాబు సహకరించలేదని చెప్పారు. దీనిపై పూర్తి నివేదికను ఉపాధి పీడీకు అందజేస్తామని ఏపీడీ తెలిపారు. స్థానిక ఎంపీడీవో యాదగిరీశ్వరరావు ఉన్నారు. -
క్షయ నివారణకు ప్రత్యేక చర్యలు
చింతపల్లి: జిల్లాలో కుష్టు, క్షయ వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ప్రోగ్రాం మేనేజ్మెంట్ అఽధికారి మరియు క్షయ,కుష్టు నియంత్రణ అధికారి డాక్టర్ ఎం.కిరణ్ కుమార్ అన్నారు. మండలంలో గల లోతుగెడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పీహెచ్సీలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలను వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. రికార్డులను తనిఖీ చేశారు. ప్రతి కాంట్రాక్ట్ను పరిక్షించి సక్రమంగా చికిత్స చేయాలన్నారు. మండల టీబీ యూనిట్ ఎస్టీఎస్లు గుర్తించిన క్షయ రోగులను సందర్శించి సకాలంలో మందులు పంపిణీ చేయాలని,ఏదైనా సమస్యలు ఉంటే టిబి యూనిట్కు తెలియజేయాలని సూచించారు. పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ జానకి, శివప్రసాద్, ఫార్మసిస్టు సుధారాణి, ఎస్టిఎస్ ప్రసాద్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
‘మాచ్ఖండ్’ గ్రామాల్లో నిలిచిన విద్యుత్ సరఫరా
ముంచంగిపుట్టు: ఆంధ్రా ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం పరిధిలోని గ్రామాల్లో మంగళవారం అర్ధరాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రాజెక్టులో లోకల్ ట్రాన్స్ఫార్మర్కు చెందిన కేబుల్ వైర్లు కాలిపోవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మాచ్ఖండ్, ఒనకఢిల్లీ, జోలాపుట్టు క్యాంప్లతోపాటు సమీప గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తాగునీటి సరఫరా, బీఎస్ఎన్ఎల్ సెల్ సేవలపై ప్రభావం చూపింది. దీంతో అయా గ్రామాల గిరిజనులు, ప్రాజెక్ట్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న విద్యుత్శాఖ అధికారులు బుధవారం ఉదయం నుంచి మరమ్మతులు చేపట్టి సాయంత్రానికి పూర్తి చేసి సరఫరాను పునరుద్ధరించారు. ఇలావుండగా మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదనకు ఎటువంటి ఆటంకం కలగలేదని, ఐదు జనరేటర్ల సాయంతో 97 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోందని ప్రాజెక్టు ఈఈ జనరేషన్ బి.గోవిందరాజులు తెలిపారు. -
ప్రజల్లోకి చంద్రబాబు మోసాలు
అరకులోయ టౌన్: చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా జిల్లా కేంద్రం పాడేరులో ఈనెల 4న నిర్వహించనున్న వైఎస్సార్సీపీ జిల్లాస్థాయి విస్తృత సమావేశానికి నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు తరలిరావాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో ఆరు మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ, ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, జిల్లా పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్ పాల్గొంటారన్నారు. సీఎం చంద్రబాబుఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్లో కేవలం ఒక్క తల్లికి వందనం మాత్రమే అమలు చేసి సగం మంది తల్లుల ఖాతాల్లో మాత్రమే నగదు జమ చేశారన్నారు. మిగిలిన వాటిని అమలు చేయకుండా మభ్యపెడుతున్నారన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయడంలో భాగంగానే ఈ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు కమిడి అశోక్, జెడ్పీటీసీలు శెట్టి రోషిణి, చటారి జానకమ్మ, ఎంపీపీలు శెట్టి నీలవేణి, బాక ఈశ్వరి, సర్పంచ్లు పూర్ణిమ, సుబ్బారావు, మండల పార్టీ అధ్యక్షులు స్వాభి రామూర్తి, కొర్రా సూర్యనారాయణ, పాంగి పరశురామ్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బత్తిరి రవి ప్రసాద్, గణపతి, ఎంపీటీసీ దురియా ఆనంద్, ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఆర్బీ స్వామి, మేధావి వర్గం జిల్లా అధ్యక్షువు రాజారమేష్, కల్చరల్ విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు బంగురు శాంతి, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన సత్యం, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు యాసిన్, ప్రచార కమిటీ అధ్యక్షుడు వి. కొండలరావు, మండల కార్యదర్శి కిల్లో దొన్ను పాల్గొన్నారు. తీసుకెళ్లడమే లక్ష్యం రేపు పాడేరులో పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు అధ్యక్షతన జరిగే సమావేశానికి తరలిరావాలి అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపు -
రేషన్ కష్టాలు ప్రారంభం
సాక్షి,పాడేరు: కూటమి ప్రభుత్వం ఎండీయూ వాహనాల వ్యవస్థ రద్దుతో గిరిజనులు రేషన్ సరుకులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మారుమూల గ్రామాల్లో ఈ పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. పాడేరు మండలం మారుమూల దేవాపురం డిపో పరిధిలోని అన్ని గ్రామాలు 2 నుంచి 5కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. పులుసుమామిడి గ్రామానికి చెందిన గిరిజనులు బుధవారం రెండున్నర కిలోమీటర్ల దూరంలోని దేవాపురానికి వర్షంలో వెళ్లి రేషన్ బియ్యం పొందారు.కొందరు రూ.50ఖర్చు పెట్టి ఆటోలను ఆశ్రయించగా, కొందరు కాలినడకన ఇబ్బందులు పడుతూనే పులుసుమామిడి గ్రామానికి చేరుకున్నారు. వంట్లమామిడి పంచాయతీ పూలబంద డీఆర్ డిపో రెండు రోజులుగా తెరచుకోకపోవడంతో గిరిజనులకు ఈ నెల నిత్యావసరాలు అందలేదు. -
పీఈ సెట్లో అరకు విద్యార్థుల ప్రతిభ
● సాయి శ్రీనివాస్కు 2వ ర్యాంక్ అరకులోయ టౌన్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2022–2025వ సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసి ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో ముగ్గురు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కె. భరత్ కుమార్ నాయక్ తెలిపారు. ఇటీవల నాగార్జున విశ్వ విద్యాలయం విడుదల చేసిన పీఈసెట్ ఫలితాల్లో కళాశాలకు చెందిన ఆర్.సాయి శ్రీనివాస్ 2, ఎస్. అప్పలరాజు 111, జి. మధుబాబు 129వ ర్యాంక్లు సాధించారన్నారు. ఉత్తమ ర్యాంక్ సాధించిన విద్యార్థులను ఆయనతోపాటు సిబ్బంది అభినందించారు. -
త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు
చింతపల్లి: గిరిజనులు జన్మన్ పథకంలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిని పూర్తి చేసుకోవాలని జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ సి.బాబు అన్నారు. మండలంలో చిన్నగెడ్డ గ్రామంలో ఆయన బుధవారం పర్యటించారు. గ్రామంలోని పీఎం జన్మన్ ఇళ్ల లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలానికి 4,307 ఇళ్లు మంజూరైనట్టు చెప్పారు. ఇందులో 1,440 ఇళ్లు పునాది స్థాయిలోను, రూఫ్ లెవిల్లో 1,141ఇల్లు, శ్లాబ్ స్థాయిలో 117 ఉండగా, 1504 వరకు ఇంకా ప్రారంభాల్సి ఉందన్నారు. ఇల్లు త్వరితంగా పూర్తి చేసుకున్నట్లయితే స్థాయిని బట్టి జియో ట్యాగింగ్ చేసి బిల్లు మంజూరు చేస్తామన్నారు.బిల్లులు చెల్లించేందుకు నిధులు కొరత లేదన్నారు. పునాదికి రూ.70వేలు, రూఫ్ స్థాయికి రూ.90వేలు, శ్లాబ్ లెవిల్కి రూ.40వేల బిల్లును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడంతో పాటు అదనంగా మరో రూ.లక్ష చెల్లిస్తామన్నారు. చింతపల్లి, జీకే వీధి మండలాల ఏఈలు రమణబాబు, సూరిబాబు సిబ్బంది ఉన్నారు. -
ఇది పాఠశాలే.. నమ్మండి
ముంచంగిపుట్టు: మండలంలో మాకవరం పంచాయతీ లబుడుపుట్టు జీపీఎస్ పాఠశాల పశువుల పాకను తలపిస్తోంది. ఇక్కడ 32 మంది విద్యార్థులు చదువుతున్నారు. పక్కా భవనం లేకపోవడంతో గతేడాది వారి తల్లిదండ్రులు చందాలు వేసుకుని తాత్కాలికంగా రేకుల షెడ్డును నిర్మించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పూర్తిగా దెబ్బతింది. గతంలో ఇక్కడ పని చేసిన ఉపాధ్యాయుడు బదిలీపై వెళ్లిపోయారు.ఒడియా వలంటీర్తో ప్రస్తుతం పాఠశాల నడుస్తోంది. జిల్లా అధికారులు స్పందించి పాఠశాలకు పక్కా భవనం నిర్మించి, ఉపాధ్యాయుడిని నియమించాలని మాకవరం సర్పంచ్ గంగాధర్, గిరిజన సంఘం మండల అధ్యక్షుడు ఎంఎం శ్రీను, స్థానిక గిరిజనులు కోరుతున్నారు. ఈ విషయాన్ని ఎంఈవో–1 కృష్ణమూర్తి దృష్టికి తీసుకువెళ్లగా స్కూల్ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. వర్షాలకు పాడైన రేకుల షెడ్డు ఉపాధ్యాయుడు లేకపోవడంతో వలంటీరే దిక్కు -
కత్తితో బెదిరించి రాజవొమ్మంగిలో చోరీ
రాజవొమ్మంగి: సినీపక్కీలో కత్తితో బెదిరించి నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన ఘటన రాజవొమ్మంగిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. స్థానిక ఎంకే రైస్ మిల్లు ఎదురుగా ఉన్న ఇంట్లో రత్నకుమారితో పాటు కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. అందరు నిద్రలో ఉండగా దొంగ కిటికీలో నుంచి ఇంట్లోకి చొరబడ్డాడు. చప్పుడు కావడంతో రత్నకుమారి మెలకువ వచ్చి చూడగా కత్తి చూపించి బెదిరించాడు. బీరువాలోని రూ.70 వేలు నగదు, 40 గ్రాముల బంగారు ఆభరణాలు పట్టుకుపోయాడని బాధితురాలు తెలిపారు. సమాచారం అందుకున్న సీఐ సన్యాసినాయుడు, ఎస్ఐ నరసింహమూర్తి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పాడేరు నుంచి వచ్చిన క్లూస్టీం నిపుణులు ఇంట్లో వేలిముద్రలు సేకరించారు. తన కుమార్తె వివాహం కోసం కూడబెట్టిన సొమ్ము దోచుకుపోయాడని బాధితురాలు రత్నకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి బయట ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు చెందిన వైర్లను దొంగ ముందే కట్ చేసి, చోరీకి పాల్పడడం గమనార్హం. -
సమస్యలు పరిష్కరించాలని వినతి
కూనవరం: కాంట్రాక్టర్ల సౌలభ్యం కోసం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయాన్ని పెంచుకుంటూ పోతున్న ప్రభుత్వం, పోలవరం ముంపుతో సర్వం కోల్పోతున్న నిర్వాసితుల నష్ట పరిహారం మాత్రం పెంచడం లేదని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మేకల నాగేశ్వరరావు అన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మండల కేంద్రంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కె.శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతీ నిర్వాసితుడికి సంపూర్ణ న్యాయం చేస్తామని నమ్మబలికి అధికారం చేపట్టాక ప్రజలను గందరగోళంలో ముంచిందన్నారు. కాకిలెక్కల కాంటూరుతో సంబంధం లేకుండా మండలంలో మొత్తం గ్రామాలు యూనిట్గా తీసుకొని కుటుంబానికి రూ.15 లక్షలు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, ఇంటి నిర్మాణానికి రూ. 5లక్షలు చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాయకులు బొర్రయ్య, సీతారామయ్య, నాగమణి, శ్రీనివాసరావు, ఈశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
విధుల పట్ల అలసత్వం వద్దు
జి.మాడుగుల: వైద్యాధికారులు, సిబ్బంది విధులపట్ల అలసత్వం వహించకుండా ప్రజలకు అందుబాటు ఉండి వైద్య సేవలు అందించాలని.. లేకుంటే చర్యలు తప్పవని డీఎంహెచ్వో డాక్టర్ తమర్భ విశ్వేశ్వరనాయుడు హెచ్చరించారు. బుధవారం ఆయన స్థానిక పీహెచ్సీనీ తనిఖీ చేశారు. ఓపీ రిజిస్టర్, రికార్డులు, మందుల నిల్వలను పరిశీలించారు. మలేరియా కేసులు, సుఖ ప్రసవాలు వివరాలను వైద్యుల నుంచి తెలుసుకున్నారు. ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, ఎంఎల్హెచ్పీలు విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పీహెచ్సీ పరిధిలోని పాఠశాలలు, ఆశ్రమ వసతి గృహాల్లో తరచూ వైద్యశిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. వైద్యాధికారి డాక్టర్ బి.కిశోర్, యూడీసీ సకల నాగేశ్వరరావు పాల్గొన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు డీఎంహెచ్వో విశ్వేశ్వరనాయుడు హెచ్చరిక -
ఏజెన్సీలో విద్యావ్యవస్థను కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. పాఠశాలలు తెరిచి దాదాపుగా పదిహేడు రోజులు గడుస్తున్నా పూర్తిస్థాయిలో ఉపాధ్యాయుల నియామకంపై దృష్టి సారించలేదు. ఇందుకు రంపచడోవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రత్యక్ష ఉదాహరణ. ఇక్కడ 272 మంది విద్య
రంపచోడవరం: ఏజెన్సీ ప్రధాన కేంద్రం రంపచోడవరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. ఐటీడీఏకు కూతవేటు దూరంలో ఉన్న ఈ పాఠశాలను పట్టించుకోకపోవడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు 272 మంది విద్యార్థులు ఉన్నారు. పూర్తిస్థాయిలో సబ్జెక్ట్ టీచర్లు లేకపోవడంతో చదువులు ఎలా సాగుతాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రు్లు ఆందోళన చెందుతున్నారు. కీలకమైన ఆ రెండు సబ్జెక్ట్లకు.. ఉన్నత పాఠశాలలో 22 మంది ఉపాధ్యాయులకు ఐదుగురు ఉపాధ్యాయులు, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్, ఫిజికల్ డైరెక్టర్ మాత్రమే ఉన్నారు. తెలుగు రెండు పోస్టులు, హిందీ రెండు, లెక్కలు రెండు, ఫిజికల్ సైన్సు రెండు, బయాలజీ రెండు, ఇంగ్లీషు ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఐదుగురు ఉపాధ్యాయుల్లో తెలుగు, హిందీ టీచర్లకు ఇటీవల బదిలీ కాగా వీరు కూడా ఇక్కడ డిప్యూటేషన్పై పనిచేస్తున్నారు. కొద్దిరోజుల్లో వీరు కూడా తిరిగి వెళ్లిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఈ ఇద్దరు ఆరు నుంచి టెన్త్ వరకు బోధిస్తున్నారు. అలాగే ఇంగ్లీషు, సోషల్ టీచర్లు ఇద్దరు పిరియడ్లు సర్దుబాటు చేసుకుని తరగతులు నిర్వహిస్తున్నారు. ● పాఠశాల తెరిచిన నాటి నుంచి విద్యార్థులకు ఫిజికల్ సైన్సు, బయాలాజీ సబ్జెక్టుల బోధన ప్రారంభం కాలేదు.కీలకమైన లెక్కలు సబ్జెక్టు చెప్పే వారు లేరు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులకు లెక్కలు, ఫిజికల్ సైన్సు ఇప్పటి నుంచే బోధిస్తేనే పరీక్షలు నాటికి సిద్ధమవుతారు. ఖాళీ తరగతుల బాధ్యత స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్, ఫిజికల్ డైరెక్టర్ చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో డీఎస్సీ ఫలితాలు విడుదలైన తరువాతైనా పోస్టులు భర్తీ అవుతాయో లేదో అనేది వేచి చూడాల్సిందే. టెన్త్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కనీసం సబ్జె క్టు టీచర్లను డిప్యూటేషన్పై నియమిస్తే బాగుంటుందని తల్లిదండ్రులు కోరుతున్నారు. మ్యాథ్స్తోపాటు సైన్స్ ఉపాధ్యాయులు కరువు 272 మంది విద్యార్థులకు ఐదుగురు మాత్రమే టీచర్లు రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 15 సబ్జెక్ట్ టీచర్ పోస్టుల ఖాళీ బోధన సాగక విద్యార్థులు, తల్లిదండ్రుల ఆవేదన దృష్టి పెట్టని విద్యాశాఖ అధికారులు పూరిగుడిసెల్లో ఆరు పాఠశాలలు జెడ్పీటీసీ పండా వెంకటలక్ష్మి ఆవేదన రంపచోడవరం మండలంలో ఇమ్మడివరం, పందిరిమామిడి, గోగుమిల్లి, దిరిసినపల్లి, బీరంపల్లి, చెరువుపాలెం గ్రామాల్లో పూరిగుడిసెల్లో పాఠశాలలు నిర్వహిస్తున్నారని స్థానిక జెడ్పీటీసీ పండా వెంకటలక్ష్మి బుధవారం కాకినాడలో జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జెడ్పీ సమావేశంలో అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆరు పాఠశాలలకు ఒక్కో పాఠశాలకు రూ. 40 లక్షలు నిధులు మంజూరు కాగా భవనాలు 90శాతం పూర్తి చేశారు. ఇంకా టైల్స్, తలుపులు, వంటి చిన్న చిన్న పనులు ఉన్నాయి. వాటిని పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని మూడు జిల్లా పరిషత్ సమావేశాల్లో కోరిన అధికారులు పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలకు ఐటీడీఏ నుంచి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం ఈ దిశగా తీసుకున్న చర్యలు కానరావడం లేదు. వర్షాలు కారణంగా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న పూరిగుడిసెల్లో తరగతులు నిర్వహిస్తున్నారు.లెక్కల పాఠాలు ఎప్పుడు చెబుతారో.. పాఠాల తెరిచిన నాటి నుంచి లెక్కలు, సైన్సు పాఠాలు చెప్పడం లేదు. ఇలా అయితే మా చదువులు ఎలా ముందుకు సాగుతాయి. ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి పాఠాలు బోధించాలి. పదో తరగతిలో మంచి మార్కులు సాధించాలంటే ఇప్పటి నుంచి పాఠ్యాంశాలపై పట్టుసాధించాలి. ఉపాధ్యాయులు లేకుండా ఏం చేయలేం. – లక్ష్మీకాంత్రెడ్డి, టెన్త్ విద్యార్థి పట్టించుకోని అధికారులు పాఠశాల తెరిచి ఇప్పటికి 17 రోజులు గడుస్తోంది. సబ్జెక్టు టీచర్లు లేకపోవడంతో పాఠాలు జరగడం లేదు. బాగా చదువుకోవాలంటే ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాలి. ఇటువంటి వాతావరణం తమ పాఠశాలలో లేదు. త్వరగా టీచర్లను నియమించాలని విద్యాశాఖ అధికారులను కోరుతున్నా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదు. – వి హేమనాగశ్రీ, టెన్త్ విద్యార్థిని -
లోతట్టు ప్రాంతాలు జలమయం
అన్నవరం బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్న వరదనీరు సాక్షి,పాడేరు: జిల్లాలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురుగాలుల వల్ల ఘాట్ మార్గాల్లో ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాడేరులో ఉదయం నుంచి రాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉంది. ఖరీఫ్ వ్యవసాయానికి అనుకూలమని గిరిజన రైతులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 836 ఎంఎం వర్షపాతం నమోదైంది. కూనవరంలో అత్యధికంగా 87.8 ఎంఎం, రంపచోడవరంలో 82.6, అడ్డతీగలలో 80.2, ఎటపాకలో 72.4, ముంచంగిపుట్టులో 68.4, మారేడుమిల్లిలో 63.2, గంగవరంలో 48.6, చింతూరులో 45.8,హుకుంపేటలో 42.4, జి.మాడుగులలో 40.8, రాజవొమ్మంగిలో 26.2, అరకులోయలో 25.8, వీఆర్పురంలో 24.8, అనంతగిరిలో 21.6, పాడేరులో 20.4, వై.రామవరంలో 20.2, దేవీపట్నంలో 18.4, పెదబయలులో 17.6, చింతపల్లిలో 12.8, కొయ్యూరులో 10.2, డుంబ్రిగుడలో 3.4, జీకేవీధిలో 2.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నీటమునిగిన పొలాలు ముంచంగిపుట్టు: మండలంలోని లక్ష్మీపురంలో వారపు సంత వర్షం కారణంగా వెలబెలబోయింది. వాగులు, గెడ్డలు పొంగడంతో మారుమూల గ్రామాల గిరిజనులు రాలేదు. మాకవరం, జోలాపుట్టు, దొడిపుట్టు, కర్రిముఖిపుట్టు, పనసపుట్టు పంచాయతీల్లో పంట పొలాలు నీటమునిగాయి. జర్జుల పంచాయతీ పెద్దతమ్మిగులలో వర్షానికి కిల్లో బిస్సు అనే గిరిజనుడి ఇంటి పైకప్పు రేకులు పెనుగాలులకు ఎగిరిపోయాయి. అడ్డతీగల: మండలంలోని మల్లవరం మామిళ్లు వద్ద ఆర్అండ్బీ రోడ్డుకి అడ్డంగా బుధవారం తెల్లవారుజామున భారీ చెట్టు కూలిపోయింది. దీంతో అడ్డతీగల– వై.రామవరం రోడ్డులో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర సేవలందించే 108 వాహనం నిలిచిపోయింది. గ్రామస్తులు శ్రమించి సాయంత్రానికల్లా చెట్టును తొలగించడంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి. విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో రాయపల్లి,వై.రామవరం ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కూలిన ఇంటిగోడ గూడెంకొత్తవీధి: ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని దేవరాపల్లి పంచాయతీ మంగళపాలెంకు చెందిన మర్రి కామేశ్వరరావుకు చెందిన ఇంటి గోడ కూలిపోయింది. అధికారులు ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరింది. జి.మాడుగుల: మండలంలో గత మూడు రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలో మత్స్యపురం–కుంబిడిసింగి రోడ్డు మార్గంలోని అండంగిసింగి వద్ద, కుంబిడిసింగి సమీపంలో గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో వాహన రాకపోకలు స్తంభించాయి. ఎనిమిది గ్రామాల ప్రజలు సమస్యలు ఎదుర్కొన్నారు. ఉధృతంగా చాపరాయి గెడ్డ డుంబ్రిగుడ: కుండపోత వానకు చాపరాయి జలపాతం పొంగి ప్రవహిస్తోంది. కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశాల మేరకు చాపరాయి జలవిహారి సందర్శనను నిలిపివేశారు. గెడ్డ ఉధృతంగా ప్రవహించడం వల్ల పెద్దపాడు, కోసంగి, చంపాపట్టి, ఊయాలగుడ, శీలంగొంది తదితర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గెడ్డ దాటే మార్గం లేకపోవడంతో తిండిగింజలకు ఇబ్బందులు పడుతున్నామని ఆయా ప్రాంతాల గిరిజనులు ఫోన్లో తెలిపారు. 40 గ్రామాలకు నిలిచిన రాకపోకలు వీఆర్పురం: వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అన్నవరం వాగు పొంగడంతో వరదనీరు బ్రిడ్జిపై నుంచి ప్రవహించింది. దీంతో ఈ మార్గంలో సుమారు 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగును ఎవరూ దాటకుండా బ్రిడ్జి వద్ద ఎస్ఐ సంతోష్కుమార్ సిబ్బందిని కాపలా ఉంచారు. ఎడతెరిపి లేకుండా వర్షాలకు పొంగిన గెడ్డలు, వాగులు ఈదురుగాలులతో ఇబ్బందులు జిల్లాలో 836 ఎంఎం వర్షపాతం నమోదు -
కదంతొక్కిన పోలవరం నిర్వాసితులు
రంపచోడవరం: తమ సమస్యలు పరిష్కరించాలని దేవీపట్నం మండలంలోని పోలవరం నిర్వాసితులు డిమాండ్ చేశారు. బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్సెంటర్ మీదుగా ఐటీడీఏ వరకు ర్యాలీ నిర్వహించారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. అనంతరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలాన్ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం ప్రాంతీయ కమిటీ కన్వీనర్ వాణిశ్రీ, కార్యదర్శి కంభం శాంతిరాజు మాట్లా డుతూ పోలవరం నిర్వాసితులకు చెందిన చిన్నారిగండి కాలనీ, మూలపాడు కాలనీ, తాళ్లూరు, మడిపల్లి కచ్చులూరు,కొండమొదలు, తెలిపేరు, మెట్టగూడెం కాలనీల్లో తక్షణమే మంచినీటి సమ స్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులను కాలనీలకు తరలించిన అధికారులు ఆ తరువాత పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి గండి కాలనీ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. భూ నష్టపరిహారం పూర్తిగా చెల్లించడమే కాకుండా రీసర్వే చేసి 18 ఏళ్లు నిండిన యువతకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలన్నారు. నిర్వాసితులకు 200 రోజుల మేర ఉపాధి పని దినాలు కల్పించాలన్నారు. కాలనీల్లో అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఏర్పాటు చేయాలన్నారు.డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సోమరాజు, వీరభద్రారెడ్డి, సత్తిబాబు, నాగిరెడ్డి, కొమరం కృష్ణ, మడి గంగరాజు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ రంపచోడవరం ఐటీడీఏ ఎదుట ఖాళీ బిందెలతో ప్రదర్శన -
ఆషాఢం.. వైవిధ్యం
ఆదివాసీ గిరిజన గూడేలు భిన్నమైన సంస్కృతులు, విభిన్నమైన సంప్రదాయాలు, ఆచారాలకు నిలయాలు. ఏటా ఈ గ్రామాల్లో నిర్వహించే ఆషాఢ మాస పండగకు ఎంతో ప్రత్యేకత ఉంది. పంటలు బాగా పండాలని, అందరూ బాగుండాలని.. ఎటువంటి అరిష్టం దరిదాపులకు రాకుండా ఉండాలని వేడుకుంటూ గ్రామ పొలిమేరల్లో శంకుదేవుడికి పూజలు చేస్తూ పూర్వీకుల ఆచార వ్యవహారాలను కొనసాగిస్తున్నారు. ముంచంగిపుట్టు: అల్లూరి జిల్లాలోని గిరిజన గ్రామాల్లో ఆదివాసీలు సంస్కృతీ సంప్రదాయాలకు ఎంతో విలువనిస్తారు. తూచ తప్పకుండా పాటిస్తారు. పూర్వీకులు చూపించిన దిశ నిర్దేశాన్ని నేటికీ ఆచరిస్తున్నారు. ఇదే కోవకు చెందినది ఆషాఢమాస పండగ. పూరీ జగన్నాథుని రథయాత్ర ముగిసిన తరువాత గ్రామపెద్దలు పండగ తేదీ నిర్ణయిస్తారు. ఈ ప్రకారం గ్రామాల్లో పండగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.అరిష్టాల నుంచి గట్టెక్కి.. ఆదివాసీ తండాల్లో పూర్వం అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యేవి. ముఖ్యంగా జూన్, జూలై నెలల్లో రైతులు పంటలు వేసుకునే సమయంలో దుక్కిటెద్దులు, పెంపుడు జంతువులు, అందరికీ ఆరోగ్య సమస్యలు ఎదురయ్యేవి. ఈ మాసంలో అరిష్టాలు ఎక్కువై ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు సంభవించేవి. వీటి నుంచి బయటపడేందుకు ఆషాడ మాసంలో ఊరి పొలిమేర వద్ద మేక, కోడిని బలిదానం చేసి ప్రత్యేక పూజలు చేసేవారు. అప్పటి నుంచి అన్నీ నష్టాలు తొలగిపోతూ రావడంతో సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తున్నారు. తరాలు మారినా పూర్వీకుల ఆచార వ్యవహారాలను ఆచరిస్తున్నారు. ఏటా ఈ పండగ చేయడం వల్లే తమకు ఎంతో మేలు జరుగుతోందని ఆదివాసీలు చెబుతున్నారు. గ్రామ పొలిమేరలో.. గిరిజన గ్రామాల్లో పొలిమేరలోని రహదారి పక్కన ఆవు పేడతో అలికి శుద్ధి చేస్తారు. నాలుగు కర్ర పుల్లలతో పందిరి ఏర్పాటు చేసి శంకుదేవుడిని ప్రతిష్టిస్తారు. మామిడి ఆకులతో తోరణాలు కట్టి పందిరి కింద అరటి మొక్కను పాతుతారు. సాగుకు ఉపయోగించే కొత్త విత్తనాలను పందిరిపై చల్లుతారు. అలాగే మట్టితో కుండలు, ప్రమిదలు తయారు చేసి వాటిలో వత్తులు పెట్టి దీపం వెలిగిస్తారు. మట్టితో తయారుచేసి రెండు ఎద్దుల విగ్రహాలకు చెక్క, కర్రతో సిద్ధం చేసిన రెండు చక్రాల బండిని అమర్చుతారు. దీనిని పందిరి ఉత్తర దిక్కుకు పెడతారు. ఇళ్ల వద్ద పనికిరాని పాత తట్టలు, బుట్టలు, చేటలు, చీపుళ్లను తీసుకు వచ్చి దిష్టి తీస్తారు. ధూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తారు. అనంతరం కోడి లేక మేకను బలి ఇస్తారు. మాంసాన్ని గ్రామంలో ప్రతి ఇంటికి కొద్ది కొద్దిగా పంచుతారు. ఇలా చేయడం వల్ల గ్రామంలో ఎటువంటి అరిష్టాలు ఎదురు కావని, పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా జరుగుతాయని ఆదివాసీ గిరిజనుల నమ్మకం. ప్రస్తుతం గ్రామాల్లో పండగ ప్రారంభం కావడంతో సందడి నెలకొంది.దోషాలు పోతాయని మా నమ్మకం గ్రామాల్లో ఎటువంటి అరిష్టాలు కలగకుండా ఉండేందుకు ఆషాఢ మాస పండుగను ఏటా జరుపుకుంటున్నాం. జగన్నాథుని రథయాత్ర మొదలైన వారంలో ఈ పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. గ్రామ పొలిమేర వద్ద శంకుదేవుడికి పూజలు చేయడం వల్ల అన్ని దోషాలు పోయి మంచి జరుగుతుంది. – బొరిబొరి లచ్చన్న, గిరిజన రైతు, బొడిపుట్టు, ముంచంగిపుట్టు మండలంపూర్వీకుల నుంచి నిర్వహిస్తున్నాం పూర్వీకులు ఆచరించిన సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తున్నాం. నాటి తరం నుంచి నేటి తరం వరకు ఈ ఆషాఢమాస పండగను జరుపుకుంటున్నాం. వ్యవసాయానికి, ఆరోగ్యానికి, గ్రామానికి ఎటువంటి నష్టం జరగకుండా ఈ పండగ నిర్వహిస్తున్నాం. – రెయ్యల మత్స్యరావు, గిరిజన రైతు,బొడిపుట్టు, ముంచంగిపుట్టు మండలం -
ఆశ్రమ విద్యార్థిని ఆకస్మిక మృతి
జి.మాడుగుల: మండలంలోని బంధవీధి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని మర్రి లక్ష్మి మృతి చెందింది. సొలభం పంచాయతీ చరుబయలు గ్రామానికి చెందిన పీవీటీజీ తెగకు చెందిన ఈమె 8వ తరగతి చదువుతోంది. మంగళవారం ఉదయం ఆమె తరగతి గదికి వెళ్తూ అకస్మాత్తుగా కుప్పకూలి అపస్మారక స్థితికి చేరింది. దీంతో ఆమెను ఉపాధ్యాయులు, నిర్వాహకులు హుటాహుటిన పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు. ఈ సంఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేస్తున్నారు. మృతికి కారణాలను తెలుసుకున్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు పాడేరు : బందవీధి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మర్రి లక్ష్మి మృతికి గల కారణాలను వైద్యులనుంచి స్థానిక ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తెలుసుకున్నారు. ఆమె మరణ వార్తను తెలుసుకున్న ఆయన మంగళవారం జిల్లా ఆస్పత్రికి వచ్చారు. మార్చురీలోని విద్యార్థిని మృతదేహాన్ని పరిశీలించి, నివాళులర్పించారు. అక్కడి నుంచి బందవీధి ఆశ్రమ పాఠశాలకు వెళ్లారు. 8వ తరగతి విద్యార్థినులతో మాట్లాడారు. లక్ష్మి మృతికి కారణాలను తెలుసుకున్నారు. వసతి గృహంలో అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థినులకు సిక్ లీడర్ మాత్రలు ఇస్తోందని వారు వివరించారు. గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన విద్యార్థుల ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ధ్వజమెత్తారు. గత ఏడాది పదుల సంఖ్యలో విద్యార్థులు అనారోగ్యం బారిన పడి మృతి చెందినా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదన్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతి గృహాల్లో హెల్త్ వలంటీర్లను నియమిస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హామీ ఇచ్చి ఏడాది పూర్తయిందన్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల వసతి గృహాల్లో విద్యార్థులు అనారోగ్యం బారిన పడితే పట్టించుకునే నాథుడు కరువయ్యారన్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతి పాఠశాలలు, వసతి గృహాల్లో అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతి గృహాల్లో హెల్త్ వలంటీర్లను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. -
వాల్తేరు డీఆర్ఎం స్టీల్ప్లాంట్ సందర్శన
ఉక్కునగరం: వాల్తేరు డివిజన్ డీఆర్ఎం లలిత్ బోహ్రా మంగళవారం విశాఖ స్టీల్ప్లాంట్ను సందర్శించారు. రైల్వే, విశాఖ స్టీల్ప్లాంట్ల మధ్య సహృద్భావ సంబంధాల పెంపు, సరుకు రవాణా కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల సమన్వయాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఆయన రైల్వే అధికారుల బృందంతో సహా స్టీల్ప్లాంట్కు విచ్చేశారు. సమావేశంలో సరుకుల రవాణా పెంపు, రేక్ నిర్వహణలో సామ ర్థ్యం పెంచడం, ప్రణాళికాయుతంగా ఇరు సంస్థల మధ్య వాణిజ్యం అభివృద్ధి తదితర అంశాలను చర్చించారు. రేక్ రిటెన్షన్ టైమ్ తగ్గించడం, మొత్తం కార్యాచరణ పనితీరును పెంచడానికి లాజిస్టిక్స్ను మెరుగుపరచడం వంటి విషయాలపై సమావేశంలో చర్చకు వచ్చాయి. స్టీల్ప్లాంట్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) ఎ.కె.బాగ్చీతో పాటు ఉన్నత స్థాయి అధికారుల బృందంతో జరిగిన సమావేశంలో రైల్వే సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ పాల్గొన్నారు. -
వైవిధ్యం
ఆషాఢం..ముంచంగిపుట్టు: జిల్లాలోని గిరిజన గ్రామాల్లో ఆదివాసీలు సంస్కృతీ సంప్రదాయాలకు ఎంతో విలువనిస్తారు. తూచ తప్పకుండా పాటిస్తారు. పూర్వీకులు చూపించిన దిశ నిర్దేశాన్ని నేటికీ ఆచరిస్తున్నారు. ఇదే కోవకు చెందినది ఆషాఢమాస పండగ. పూరీ జగన్నాథుని రథయాత్ర ముగిసిన తరువాత గ్రామపెద్దలు పండగ తేదీ నిర్ణయిస్తారు. ఈ ప్రకారం గ్రామాల్లో పండగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అరిష్టాల నుంచి గట్టెక్కి.. ఆదివాసీ తండాల్లో పూర్వం అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యేవి. ముఖ్యంగా జూన్, జూలై నెలల్లో రైతులు పంటలు వేసుకునే సమయంలో దుక్కిటెద్దులు, పెంపుడు జంతువులు, అందరికీ ఆరోగ్య సమస్యలు ఎదురయ్యేవి. ఈ మాసంలో అరిష్టాలు ఎక్కువై ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు సంభవించేవి. వీటి నుంచి బయటపడేందుకు ఆషాడ మాసంలో ఊరి పొలిమేర వద్ద మేక, కోడిని బలిదానం చేసి ప్రత్యేక పూజలు చేసేవారు. అప్పటి నుంచి అన్నీ నష్టాలు తొలగిపోతూ రావడంతో సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తున్నారు. తరాలు మారినా పూర్వీకుల ఆచార వ్యవహారాలను ఆచరిస్తున్నారు. ఏటా ఈ పండగ చేయడం వల్లే తమకు ఎంతో మేలు జరుగుతోందని ఆదివాసీలు చెబుతున్నారు. గ్రామ పొలిమేరలో.. గిరిజన గ్రామాల్లో పొలిమేరలోని రహదారి పక్కన ఆవు పేడతో అలికి శుద్ధి చేస్తారు. నాలుగు కర్ర పుల్లలతో పందిరి ఏర్పాటు చేసి శంకుదేవుడిని ప్రతిష్టిస్తారు. మామిడి ఆకులతో తోరణాలు కట్టి పందిరి కింద అరటి మొక్కను పాతుతారు. సాగుకు ఉపయోగించే కొత్త విత్తనాలను పందిరిపై చల్లుతారు. అలాగే మట్టితో కుండలు, ప్రమిదలు తయారు చేసి వాటిలో వత్తులు పెట్టి దీపం వెలిగిస్తారు. మట్టితో తయారుచేసి రెండు ఎద్దుల విగ్రహాలకు చెక్క, కర్రతో సిద్ధం చేసిన రెండు చక్రాల బండిని అమర్చుతారు. దీనిని పందిరి ఉత్తర దిక్కుకు పెడతారు. ఇళ్ల వద్ద పనికిరాని పాత తట్టలు, బుట్టలు, చేటలు, చీపుళ్లను తీసుకు వచ్చి దిష్టి తీస్తారు. ధూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తారు. అనంతరం కోడి లేక మేకను బలి ఇస్తారు. మాంసాన్ని గ్రామంలో ప్రతి ఇంటికి కొద్ది కొద్దిగా పంచుతారు. ఇలా చేయడం వల్ల గ్రామంలో ఎటువంటి అరిష్టాలు ఎదురు కావని, పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా జరుగుతాయని ఆదివాసీ గిరిజనుల నమ్మకం. ప్రస్తుతం గ్రామాల్లో పండగ ప్రారంభం కావడంతో సందడి నెలకొంది.ఆషాఢ మాస పండుగకు ఏర్పాటు చేసిన పందిరి వద్ద పూజలు చేస్తున్న బొడిపుట్టు గిరిజనులుపూర్వీకుల నుంచి జరుపుకుంటున్నాం పూర్వీకులు ఆచరించిన సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తున్నాం. నాటి తరం నుంచి నేటి తరం వరకు ఈ ఆషాఢమాస పండగను జరుపుకుంటున్నాం. వ్యవసాయానికి, ఆరోగ్యానికి, గ్రామానికి ఎటువంటి నష్టం జరగకుండా ఈ పండగ నిర్వహిస్తున్నాం. – రెయ్యల మత్స్యరావు, గిరిజన రైతు, బొడిపుట్టు, ముంచంగిపుట్టు మండలందోషాలు పోతాయని నమ్మకం గ్రామాల్లో ఎటువంటి అరిష్టాలు కలగకుండా ఉండేందుకు ఆషాఢ మాస పండుగను ఏటా జరుపుకుంటున్నాం. జగన్నాథుని రథయాత్ర మొదలైన వారంలో ఈ పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. గ్రామ పొలిమేర వద్ద శంకుదేవుడికి పూజలు చేయడం వల్ల అన్ని దోషాలు పోయి మంచి జరుగుతుంది. – బొరిబొరి లచ్చన్న, గిరిజన రైతు, బొడిపుట్టు, ముంచంగిపుట్టు మండలం గిరిజన గూడాల్లో పండగ సందడి వ్యవసాయం కలిసిరావాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని పూజలు పూరీ జగన్నాథుని రథయాత్ర తరువాత నిర్వహణ గ్రామ పొలిమేరల్లో ఆధ్యాత్మిక వాతావరణం పూర్వీకుల నుంచి ఆనవాయితీ సంస్కృతీ సంప్రదాయాలను ప్రాధ్యాన్యమిస్తున్న ఆదివాసీ గిరిజనులు -
గెడ్డలో పడి ఆటోడ్రైవర్ మృతి
కంచరపాలెం: బహిర్భూమికి వెళ్లిన ఆటోడ్రైవర్ నలందనగర్ ప్రధాన గెడ్డ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. రెస్క్యూ(జీవీఎంసీ, ఫైర్, పోలీస్) బృందం సుమారు 8 గంటలు శ్రమించినప్పటికీ.. ఫలితం లేకపోయింది. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, అధికారులు తెలిపిన వివరాలివి.. జీవీఎంసీ 54వ వార్డు ఐటీఐ జంక్షన్ పరిధిలోని నలందనగర్లో నివాసముంటున్న కట్ట వడ్డీకాసులు(48) ఆటో డ్రైవర్. తన భార్య రుక్మిణితో కలిసి స్క్రాప్ వ్యాపారం కూడా చేస్తుంటాడు. మంగళవారం ఉదయం సుమారు 6.30 గంటల ప్రాంతంలో నలందనగర్ జాతీయ రహదారి వంతెన కింద గెడ్డ పక్కకు బహిర్భూమికి వెళ్లాడు. తెల్లవారుజాము నుంచి కుండపోతగా వర్షం పడుతుండటంతో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. ఈ క్రమంలో ఆయన గెడ్డలోకి జారిపడ్డాడు. ఈ క్రమంలో వడ్డీకాసులు గట్టిగా కేకలు వేయడంతో.. భార్య రుక్మిణి వెంటనే అక్కడకు చేరుకుని తన చున్నీని అందించి కాపాడే ప్రయత్నం చేసింది. అయితే నీటి ప్రవాహానికి వడ్డీకాసులు కొట్టుకుపోయి వంతెన కింద గెడ్డలో చిక్కుకుపోయాడు. సహాయక చర్యలు.. మృతదేహం వెలికితీత సమాచారం అందుకున్న జీవీఎంసీ, ఫైర్, పోలీస్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జీవీఎంసీ జోన్–5 కమిషనర్ బొడ్డేపల్లి రాము పర్యవేక్షణలో మూడు క్రేన్లు, పొక్లెయిన్ల సహాయంతో వడ్డీకాసులును రక్షించేందుకు ప్రయత్నాలు చేశారు. సుమారు 8 గంటలు శ్రమించినప్పటికీ.. వడ్డీకాసులు ప్రాణాలు కాపాడలేకపోయారు. చివరికి రెస్క్యూ బృందం ఆయన మృతదేహాన్ని వెలికి తీసింది. కంచరపాలెం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. సీఐ చంద్రశేఖర్ నేతృత్వంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జోనల్ కమిషనర్ రాము దగ్గరుండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కళ్లముందే తన భర్త కాలువలో గల్లంతవడంతో భార్య రుక్మిణి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 8 గంటలు శ్రమించిన రెస్క్యూ బృందం -
జూలో ఎన్క్లోజర్ల పునరుద్ధరణకు చర్యలు
ఆరిలోవ : ఇందిరాగాంధీ జా పార్కులో అవసరమైన ఎన్క్లోజర్లు పునరుద్ధరణకు నివేదిక సిద్ధం చేయాలని జూ అధికారులకు రాష్ట్ర అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రాహుల్ పాండే సూచించారు. జూ పార్కును మంగళవారం ఆయన సందర్శించారు. విశాఖ సీఎఫ్ మహ్మద్ దివాన్ మైదీన్, జూ క్యూరేటర్ జి.మంగమ్మ, అధికారులతో కలసి ఆయన జూలో ఎన్క్లోజర్లు, వన్యప్రాణులను పరిశీలించారు. ఇటీవల జూలో నిర్మించిన కొత్త ఎన్క్లోజర్లు, మరమ్మతులు చేపట్టిన ఎన్క్లోజర్లను పరిశీలించి వాటి కోసం ఎంత నిధుల ఖర్చుచేశారు.. సీఎస్ఆర్ నిధులు ఏఏ సంస్థలు నుంచి వచ్చాయి.. తదితర వాటిపై ఆరా తీశారు. ఇటీవల పునరుద్ధరించిన సీతాకోక చిలుకల పార్కు, కొత్తగా నిర్మించిన అడవి కుక్కల పునరుత్పత్తి కేంద్రం అదనపు విభాగాన్ని పరిశీలించారు. వన్యప్రాణులు ఆరోగ్యం, వాటికి అందిస్తున్న వైద్య సేవలు, ఆహారంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన జూ అధికారులతో మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న రాబందుల ఎన్క్లోజరు పనులు వేగవంతం చేయాలని సూచించారు. అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని రాబోయే ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలన్నారు. ప్రతి విభాగంలో అవసరమైన ఎన్క్లోజర్ల పునరుద్ధరణ, సీఎస్ఆర్ నిధుల ద్వారా మరమ్మతులు, సుందరీకరణ చేపట్టడానికి నివేదిక తయారు చేయాలన్నారు. వాటితో పాటు జూలో అక్వేరియం, స్లాత్బేర్, రెడ్నెక్డ్ వాల్లబీ, అడవి పిల్లుల ఎన్క్లోజర్ను పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్శనలో జూ అసిస్టెంట్ క్యూరేటర్ గోపి, జూ వైద్యుడు డాక్టర్ భాను, సిబ్బంది పాల్గొన్నారు.రాష్ట్ర అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రాహుల్ పాండే -
ఘనంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు జన్మదిన వేడుకలు
పాడేరు : స్థానిక ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు జన్మదిన వేడుకలను మంగళవారం పాడేరులో వైఎస్సార్సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి మంగ్లన్నదొర, వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, తదితరులు బర్త్డే కేక్ను కట్ చేశారు. అనంతరం జిల్లా ఆస్పత్రిలో రోగులు, గర్భిణులు, బాలింతలకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. చింతపల్లి: స్థానిక ముత్యాలమ్మ ఆలయ ప్రాంగణంలో పాడేరు శాసన సభ్యుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ కోరాబు అనూషదేవి,జెడ్పీటీసీ పోతురాజు బాలయ్యపడాల్,సర్పంచ్ దురియా పుష్పలత,మాజీ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జల్లి హలియారాణి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్చేసి ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మంచి మనస్సుతో విశ్వేశ్వరరాజు అందరి మన్ననలు పొందారని చెప్పారు.పార్టీ ప్రా రంభం నుంచి అనేక పదవులు అలంకరించి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదిర్శి జల్లి సుధాకర్, ఎంపీటీసీలు నాగలక్ష్మి, జయలక్ష్మి, కో ఆప్షన్ సభ్యుడు నాజర్వలీ, మాజీ ఎంపీపీ బూసరి కృష్ణారావు, పార్టీ నాయకులు సాగిన గంగన్నపడాల్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. జీకే వీధిలో.. గూడెంకొత్తవీధి: పాడేరు ఎమ్మెల్యే ఎం.విశ్వేశ్వరరాజు జన్మదిన వేడుకలను మంగళవారం వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు కంకిపాటి గిరి ప్రసాద్, ఎంపీపీ బోయిన కుమారి ఆధ్వర్యంలో మండలకేంద్రం జీకే వీధిలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు.ఎమ్మెల్యే ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలకు మరింత సేవ చేయా లని వారంతా ఆకాంక్షించారు. పార్టీ మాజీ మండల అధ్యక్షుడు బొబ్బిలి లక్ష్మణ్,దామణాపల్లి సర్పంచ్ రామకృష్ణ, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, ప్రధాన కార్యదర్శి అచ్యుత్ రాజు,యువజన విబాగం అధ్యక్షుడు గబ్బాడి శేఖర్, లంబసింగి నరేశ్, అరకు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు రేగం శివకుమార్ పాల్గొన్నారు. -
విద్యుత్ వినియోగదారులకు ‘హైవోల్టేజీ’ షాక్
ముంచంగిపుట్టు: మండల కేంద్రంలో ముంచంగిపుట్టులో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల వినియోగదారులకు తీవ్ర నష్టం వాటిల్లింది. హైవోల్టేజీ కారణంగా గృహోపకరాలు, పరికరాలు దగ్ధమయ్యాయి. మంగళవారం హైవోల్టేజి సరఫరా కావడంతో పూర్ణ ఇంటర్నెట్ షాప్లో కంప్యూటర్, జెరాక్స్ మెషీన్ కాలిపోయాయి. సుమారు రూ.30 వేల వరకు నష్టం జరిగిందని యజమాని పూర్ణారావు తెలిపారు. ప్రెస్ మార్ట్ షాప్లో రెండు ప్రీజ్లు, ఇన్వెర్టర్ కాలిపోయాయి. రుత్విక ఫ్యాన్సీ దుకాణంలో ఇంటర్నెట్ మోడమ్, నాలుగు బల్బులు దెబ్బతిన్నాయి. లక్ష్మి, శంకరారావు ఇళ్లల్లో కుక్కర్, ఫ్యాన్, నాలుగు విద్యుత్ బిల్లులు కాలిపోయాయి. పలు చోట్ల స్విచ్ బోర్డుల్లో మంటలు రావడంతో కాలిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న విద్యుత్శాఖ అధికారులు మంగళవారం సాయంత్రం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేపట్టి సమస్య పరిష్కరించారు. వారం రోజులవుతున్నా.. స్థానిక ఇంజినీరింగ్ కార్యాలయం సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద న్యూట్రల్ వైర్ మరమ్మతులకు గురవడంతో వారం రోజులుగా మండల కేంద్రంలో హైవోల్టేజీ నెలకొంది. విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి సమస్య తీసుకువెళ్లినా పట్టించుకోలేదని పలువురు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించడంలో నిర్లక్ష్యం వల్ల తాము నష్టపోవాల్సి వచ్చిందని వారు ధ్వజమెత్తుతున్నారు. పలుచోట్ల విలువైన గృహోపకరణాలు, పరికరాలు, మెషీన్లు దగ్ధం అధికారులు సకాలంలో స్పందించకపోవడం వల్లే నష్టం పలువురు బాధితుల ఆవేదన -
విస్తారంగా వర్షాలు
గెడ్డలు, వాగుల్లో వరద ఉధృతిసాక్షి,పాడేరు: జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానతో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంగళవారం వేకువజాము నుంచి రాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉంది. మరో వైపు ఈదురుగాలులు విజృంభిస్తున్నాయి. వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మత్స్యగెడ్డ, రాళ్లగెడ్డ, దిగుడుపుట్టు, కురిడి గెడ్డల ప్రవాహం ప్రమాదకరంగా మారింది. గెడ్డ అవతల గ్రామాల గిరిజనులను రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తం చేసింది. 329.2 ఎంఎం వర్షపాతం నమోదు జిల్లా వ్యాప్తంగా మంగళవారం 329.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంచంగిపుట్టులో 62.8, కూనవరంలో 22.2, పెదబయలులో 20.6, మారేడుమిల్లిలో 19.2, జి.మాడుగులలో 19.2, వీఆర్పురంలో 16.4, అడ్డతీగలలో 16, గంగవరంలో 14.8, చింతూరులో 14.6, హుకుంపేటలో 14.6, పాడేరులో 13.2, ఎటపాకలో 12.8, వై.రామవరంలో 12.2, అరకులోయలో 11.8, అనంతగిరిలో 10.8, డుంబ్రిగుడలో 10.2, రాజవొమ్మంగిలో 9.6, రంపచోడవరంలో 9.4, దేవీపట్నంలో 7.8, చింతపల్లిలో 5.6, కొయ్యూరులో 3, జీకేవీధిలో 2.4 ఎంఎం వర్షపాతం నమోదైంది. -
ఆదివాసీ చట్టాల అమలుకు ఉద్యమం
● ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను ● యువత ముందుకు రావాలని పిలుపు చింతూరు: ఆదివాసీ చట్టాల అమలు, హక్కుల సాధనకు యువత ఉద్యమించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను అన్నారు. మంగళవారం చింతూరులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అక్రమ కట్టడాలు కూల్చేవరకు ఉద్య మం ఆగదని హెచ్చరించారు. రాజ్యాంగం ఆదివాసీలకు కల్పించిన చట్టాలు, హక్కులు దక్కాలంటే యువత మేలుకోవాలని, గ్రామస్థాయి నుంచి ఉద్యమానికి నాంది పలకాలని కోరారు. అక్రమ కట్టడాల వ్యవహారంలో న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించి అధికారులు సొంత నిర్ణయాలు అమలు చేస్తున్నారని, గిరిజనేతరులకు మద్దతు ఇస్తూ ఏజెన్సీ చట్టాలను అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. అధికారులు అక్రమ కట్టడాల కూల్చివేతను త్వరితగతిన పూర్తిచేయాలని లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన తెలిపారు. -
84.69 శాతం మేరపింఛన్ల పంపిణీ
సాక్షి,పాడేరు: జిల్లాలో మంగళవారం సాయంత్రానికి 84.69 శాతం మేరక సామాజిక పింఛన్లను పంపిణీ చేసినట్టు కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. పాడేరు మండలం లగిశపల్లి పంచాయతీ ఉగ్గంగొయ్యి పీవీటీజీ గ్రామంలో పింఛన్ల పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1,21,659మంది సామాజిక పింఛన్దారులకు రూ.51కోట్ల 13లక్షల 96వేల 500 ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. జిల్లాలో పింఛన్ల పంపినీలో ఈనెలలో అన్ని మండలాల కన్నా మారేడుమిల్లి టాప్లో ఉందన్నారు. 1904 మంది పింఛనుదారుల్లో తొలిరోజు 99శాతం పంపిణీ చేశారని కలెక్టర్ పేర్కొన్నారు. -
రాజీమార్గమే శ్రేయస్కరం
విశాఖ లీగల్: రాజీ మార్గమే రాజమార్గమని జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు అన్నారు. ఈ నెల 5న జరగనున్న మెగా లోక్ అదాలత్ సందర్భంగా.. న్యాయమూర్తి బ్యాంకు, చిట్ఫండ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాజీపడటానికి వీలున్న అన్ని కేసులను పరిష్కరించే దిశగా కృషి చేయాలని వారికి సూచించారు. బ్యాంకుల్లో పెండింగ్లో ఉన్న చెక్ బౌన్స్ కేసుల్లో ఇరువర్గాలు రాజీ చేసుకోవడానికి ముందుకు రావాలని కోరారు. చిట్ఫండ్ కంపెనీలు కూడా తమ పరిధిలో సాధ్యమైనంత మేరకు ఇరువర్గాలు రాజీ కుదుర్చుకోవాలని న్యాయమూర్తి సూచించారు. -
రైతుల ఆదాయం పెంపే లక్ష్యం
● వీడియో కాన్ఫరెన్స్లోకలెక్టర్ దినేష్కుమార్ సాక్షి,పాడేరు: అధిక దిగుబడులతో రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ప్రోత్సహించాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ ఆదేశించారు. వ్యవసాయ, అనుబంధశాఖల అధికారులతో మంగళవారం కలెక్టరేట్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్లో వ్యవసాయ పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు సకాలంలో విత్తనాలు పంపిణీ చేయాలని, వ్యవసాయానుబంధ రంగాల్లో 15శాతం వృద్ధి సాఽధించాలన్నారు. రైతులకు పంట రుణాలు పంపిణీ చేయడమే కాకుండా రిజర్వాయర్లలో చేపపిల్లల పెంపకానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కాఫీ రైతులు పార్చిమెంట్ కాఫీ గింజలు తయారీకి ప్రణాళికలు రూపొందించాలని, బేబీ పల్పర్ యూనిట్లు, మిరియాల శుద్ధి యంత్రాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జీడితోటల విస్తరణతో పాటు వై.రామవరం మండలంలో అవకాడో పండ్లతోటలు పెంచాలని సూచించారు. 40 హెక్టార్లలో పసుపు, కూరగాయల సాగు చేపట్టాలని సూచించారు. జిల్లాలో రెండు వేల ఎకరాల్లో సూక్ష్మ సాగునీటి సదుపాయాలు లక్ష్యంగా నిర్దేశించామని వెల్లడించారు. ఈనెల 10వతేదీ నాటికి పశువులకు వ్యాక్సినేషన్, గొర్రెలు, మేకలకు డీవార్మింగ్ పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జేసీ డాక్టర్ అభిషేక్గౌడ, రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి నందు పాల్గొన్నారు. -
వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు
సబ్బవరం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం దేవీపురంలోని సహస్రాక్షి రాజరాజేశ్వరీదేవి క్షేత్రంలో వారాహి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు మంగళవారం అమ్మవారికి చిత్ర కంకణ అలంకారం సర్వాంగ సుందరంగా జరిపారు. అమ్మవారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. సాయంత్రం వారాహి యంత్ర సిరిజ్యోతి పూజ, రాత్రి శ్రీరుద్ర సహిత–శ్రీవారాహి హోమం నిర్వహించారు. ఈ హోమం ద్వారా కొత్త వ్యాపారాలు, ప్రాజెక్టుల్లో విజయాలు కలుగడంతోపాటు, కర్మ దోషాలు, ప్రతికూలతలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. బుధవారం రాత్రికి ఖడ్గమాల సహిత వారాహి హోమం నిర్వహించనున్నట్లు గురుమాత అన్నపూర్ణమ్మ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి క్షీరాభిషేకం, షోడశోపచార సహిత కుంకుమ పూజలు జరిపారు. మధ్యాహ్నం అమ్మవారి సన్నిధిలో గురుమాత చేతుల మీదుగా అన్నసమారాధన చేశారు. -
గిరి ప్రదక్షిణకు పకడ్బందీ ఏర్పాట్లు
● 32 కి.మీ.పరిధిలో లైట్లు, సీసీ కెమెరాలు, వైద్య శిబిరాలు ● 132 పాయింట్లలో తాగునీటి సదుపాయం ● స్నానఘట్టం వద్ద గజ ఈతగాళ్లు, హైమాస్ లైట్ల ఏర్పాటు ● కలెక్టర్ హరేందిర ప్రసాద్ వెల్లడి మహారాణిపేట: శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించనున్న సింహాచలం గిరి ప్రదక్షిణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పోలీస్, రెవెన్యూ, దేవస్థానం, ఇతర శాఖల అధికారులతో ఆయన గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 9న తెల్లవారుజాము నుంచి 10వ తేదీ సాయంత్రం వరకు కొండదిగువ తొలిపావంచా వద్ద భక్తుల రద్దీని, ట్రాఫిక్ను నియంత్రించడానికి పోలీస్ బందోబస్తు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్యూలు, రద్దీ ప్రదేశాల వద్ద తోపులాటలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. సౌకర్యాలు, వైద్య సేవలు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున 32 కిలోమీటర్ల మేర 132 పాయింట్లలో తాగునీటి సౌకర్యం, 400 మరుగుదొడ్లు, పారిశుధ్యంతో పాటు రద్దీ ప్రదేశాల్లో లైటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అవసరమైన అంబులెన్సులు, 32 వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని, ప్రతి శిబిరం వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో పాటు ఒక వైద్యుడు, ఏఎన్ఎం లేదా ఆశ కార్యకర్తను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. భక్తులు ప్రదక్షిణ చేసే మార్గంలో, రద్దీ ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండాలని, అవసరమైన మేరకు జనరేటర్లను సిద్ధం చేసుకోవాలని ఈపీడీసీఎల్ అధికారులను సూచించారు. ముందుజాగ్రత్త చర్యగా 9, 10 తేదీల్లో మద్యం దుకాణాలను మూసివేయాలని ఎకై ్సజ్ శాఖ అధికారులకు సూచించారు. భక్తుల సౌకర్యార్థం అవసరమైన బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచనలు చేశారు. సింహగిరిపై అగ్నిమాపక యంత్రం, ఫైర్ నియంత్రణ పరికరాలతో పాటు అదనపు సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. విద్యుత్ తీగలు వేలాడకుండా చూసుకోవాలని, గిరి ప్రదక్షిణ జరిగే దారిలో వాహనాలు అడ్డదిడ్డంగా నిలపకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. భక్తులకు సాంకేతిక సాయం అత్యవసర సమయాల్లో ప్రత్యేక యాప్ ద్వారా సహాయం అందించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అలాగే ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించి ‘అస్త్రం’యాప్ ద్వారా సహాయం పొందవచ్చని సీపీ శంఖబ్రత బాగ్చి సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వాలని సీపీ ఆదేశించారు. పటిష్టమైన బారికేడింగ్ ఏర్పాటు చేయాలని, హనుమంతువాక, ఇసుకతోట జంక్షన్ల వద్ద తాత్కాలిక వంతెనలు నిర్మించాలని సీపీ సూచించారు. స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసే కౌంటర్లు భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో డీసీపీలు అజిత, మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, సింహాచలం ఈవో త్రినాథరావు, డీఆర్వో భవానీ శంకర్, జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణమూర్తి, భీమిలి ఆర్డీవో సంగీత్ మాథుర్, రెవెన్యూ, దేవస్థానం, జీవీఎంసీ, పోలీస్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. జీవీఎంసీ కమిషనర్ సమీక్ష సింహాచలం: సింహాచలం గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్.. దేవస్థానం అధికారులతో కలిసి మంగళవారం ప్రదక్షిణ మార్గాన్ని పరిశీలించారు. సింహాచలంలోని కొండదిగువ తొలిపావంచా, అడవి వరం జంక్షన్, ముడసర్లోవ, విశాలాక్షినగర్, తెన్నేటి పార్క్, లుంబినీ పార్క్ బీచ్, వెంకోజీపాలెం, సీతమ్మధార, నరసింహనగర్, మాధవధారలోని మాధవస్వామి ఆలయం, హైవే, ఎన్ఎస్టీఎల్, లక్ష్మీనగర్, గోపాలపట్నం మీధుగా తిరిగి సింహాచలం చేరుకునే గిరి ప్రదక్షిణ మార్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. భక్తుల కోసం ప్రదక్షిణ మార్గంలో తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానాల గదులు, తాగునీటి పాయింట్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిరంతర పారిశుధ్య పర్యవేక్షణకు సిబ్బందిని, డస్ట్బిన్లను అందుబాటులో ఉంచాలన్నారు. రాత్రి వేళలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా చీకటి ప్రదేశాల్లో వీధి దీపాలు, ముఖ్య కూడళ్లలో సూచిక బోర్డులు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. మార్గమధ్యలో అసంపూర్తిగా ఉన్న రోడ్ల పనులను వెంటనే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జీవీఎంసీ, దేవస్థానం అధికారులు సమన్వయంతో ఈ ఏర్పాట్లను పూర్తి చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. దేవస్థానం ఈవో త్రినాథరావు, ఈఈ రమణ, జోనల్ కమిషన్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన సింహాచలం: గిరి ప్రదక్షిణకు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం కలెక్టర్ హరేందిర ప్రసాద్.. నగర సీపీ శంఖబ్రత బాగ్చి, జేసీ మయూర్ అశోక్, సింహాచలం ఈవో త్రినాథరావుతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. గిరి ప్రదక్షిణ జరిగే అప్పుఘర్, వెంకోజీపాలెం, సీతమ్మధార, మాధవదార, మురళీనగర్, ప్రహ్లాదపురం, కుమారి కల్యాణమండపం మీదుగా సింహాచలంలోని తొలిపావంచా వరకు ఆయన సందర్శించి.. ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు. సింహాచలం తొలిపావంచా వద్ద భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. -
ఆర్అండ్ఆర్ ఇచ్చి తరలించండి
కూనవరం: ఏటా సంభవించే వరదల వల్ల ఎన్నో విధాలుగా నష్టపోతున్నామని, ఆర్అండ్ఆర్ ప్యాకే జీ ఇచ్చి తరలిస్తే ఈ బాధలు ఉండవని సర్పంచ్లు, పలు పార్టీల నేతలు విన్నవించారు. స్థానిక సినిమాల్లో చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన వరద సమీక్ష సమావేశంలో పలువురు మాట్లాడుతూ పునరావాస కేంద్రాల్లో మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, విద్యుత్ అంతరాయం లేకుండా సోలార్ లైట్లు ఉపయోగించాలని, అత్యవసర రోడ్లు బాగు చేయాలని, అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచాలని వారు కోరారు. ఈసందర్భంగా పీవో మాట్లాడుతూ ఈ నెల 30నాటికి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫేజ్ 1బీ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ డ్రాఫ్ట్ అవార్డ్ నోటిఫికేషన్ పూర్తి చేస్తామన్నారు. గోదావరి వరదల సమాచారం ఎప్పటికప్పుడు ప్రతిఒక్కరికీ తెలిసేలా యాప్ రూపొందించామని చెప్పారు. ఏ సమస్య అయినా ఆ యాప్ ద్వారా తెలియజేయాలని సూచించారు. వరదల సమయంలో పై అంతస్తు లేని లాంచీలను ఉపయోగించాలని కోరారు. వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రజాప్రతినిధులు ఇచ్చిన సలహాలు, సూచనలను మినిట్లో నమోదు చేయించారు. ఈ సమావేశంలో ఎంపీపీ పాయం రంగమ్మ, సర్పంచ్ మల్లంపల్లి హేమంత్, డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో డాక్టర్ పుల్లయ్య, తహసీల్దార్ కె. శ్రీనివాసరావు, ఎంపీడీవో రామాంజనేయ ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ జేఈ భానుప్రకాష్, సివిల్సప్లై ఆఫీసర్, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. ముందస్తుగా ప్రణాళికలతో ఆదుకోండి వీఆర్పురం: ముంపు ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు కోరారు. మంగళవారం రేఖపల్లిలో మండల పరిషత్ ప్రాంగణంలో తహసీల్దార్ సరస్వతి అధ్యక్షతన గోదావరి వరదలపై నిర్వహించిన సమీక్షలో చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. బఫర్ స్టాక్, నిత్యావసర సరకులు అందుబాటులో ఉంచడమే కాకుండా పడవలు, కిరోసిన్, డీజిల్ను సిద్ధం చేయాలని వారు కోరారు. వీఆర్పురం బీసీ కాలనీ నుంచి రేఖపల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టి, కల్వర్టుల ఎత్తు పెంచితే పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు అనుకూలంగా ఉంటుందన్నారు. వరద పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో గుడారాలు వేసుకునేందుకు రైతులు అనుమతి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ వరద సహాయ కేంద్రాల్లో ఉన్న వారికి అటవీ అధికారులతో మాట్లాడి అటవీ ప్రాంతంలో తాగునీటి బోర్లు, మరుగుదొడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. సెల్ ఫోన్ టవర్లు అందుబాటులోకి వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం లక్ష్మి, జెడ్పీటీసీ వాళ్ల రంగరెడ్డి, సర్పంచ్లు పులి సంతోష్ కుమార్, సోడె నరసమ్మ, పిట్టా రామారావు, వడ్డనపు శారద, ఎంపీటీసీలు పునెం ప్రదీప్ కుమార్, బంధం విజయలక్ష్మి, డీఎంహెచ్వో పుల్లయ్య, ఎస్ఐ సంతోష్ కుమార్ పాల్గొన్నారు. అందుబాటులో లేకుంటే చర్యలు వరదల సమయంలో అధికారులు ప్రజలకు అందుబాటులో లేకపోతే చర్యలు తప్పవని ఐటీడీఏ పీవో అపూర్వభరత్ హెచ్చరించారు. ముంపునకు గురయ్యే గ్రామాలను మంగళవారం ఆయన పరిశీలించారు. దీనిలో భాగంగా శ్రీరామగిరి, వడ్డెగూడెం, చింతరేగిపల్లి, రాజుపేట, రామవరం గ్రామాలను సందర్శించారు. అధికారులకు సూచనలు చేశారు.చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్కు వరద బాధితుల వినతి -
మనవడిని అమ్మేసిన తాత
తాటిచెట్లపాలెం(విశాఖపట్నం): కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని తండ్రి, తన కుమార్తెకు పుట్టిన మగబిడ్డను ఆమెకు తెలియకుండానే దత్తత ఇచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు నేరుగా పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. అరకు ప్రాంతానికి చెందిన పెట్టెల దివ్య (23) అదే ప్రాంతానికి చెందిన జాన్బాబును ప్రేమించి వివాహం చేసుకుంది. దివ్య తండ్రి పి. శుక్రకు ఈ వివాహం మొదటి నుంచి ఇష్టం లేదు. వారిద్దరినీ విడదీయడానికి అతను పలు ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలో దివ్య, జాన్బాబు మధ్య మనస్పర్థలు రావడంతో వారు విడివిడిగా ఉంటున్నారు. ఈ సమయంలో దివ్య గర్భవతి కావడంతో, ప్రసవం కోసం ఆమె తండ్రి శుక్ర విశాఖలోని కై లాసపురం ప్రాంతానికి తీసుకువచ్చి, అద్దె ఇంట్లో ఉంచాడు. దివ్యకు కేజీహెచ్లో మగబిడ్డ జన్మించాడు. బిడ్డకు పచ్చకామెర్లు ఉన్నాయని, అనారోగ్యంగా ఉన్నాడని, వైద్యం చేయించాలని చెప్పి, దివ్యతో పలు పత్రాలపై సంతకాలు చేయించాడు. అనంతరం తల్లికి తెలియకుండా ఆ బిడ్డను దత్తత పేరుతో విక్రయించాడు. రెండు నెలలు గడిచినా బిడ్డ ఆచూకీ తెలియకపోవడంతో దివ్య తన తండ్రిని నిలదీసింది. సరైన సమాధానం రాకపోవడంతో, దివ్య మొదట కంచరపాలెం పోలీస్స్టేషన్లో, ఆపై నేరుగా పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేసింది. కమిషనర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టి బిడ్డ ఆచూకీని కనుగొన్నాయి. బిడ్డను మొదట ఆర్అండ్బీ వద్ద గల శిశుగృహకు అప్పగించారు. సోమవారం పోలీసుల సమక్షంలో ఆ బిడ్డను తల్లిదండ్రులైన దివ్య, జాన్బాబులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. -
పోలీసు ఉద్యోగం ఒత్తిడితో కూడుకున్నది
అనకాపల్లి: పోలీసు ఉద్యోగం ఒత్తిడితో కూడుకున్నదైనా, సమాజ రక్షణ కోసం చూపిన నిబద్ధత, సమర్థత, సేవా భావం ప్రశంసనీయమని ఎస్పీ తుహిన్సిన్హా అన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన పోలీస్ సిబ్బందిని సోమవారం తన కార్యాలయంలో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ పోలీస్ శాఖలో 35 సంవత్సరాలుగా వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తూ విశిష్ట సేవలందించారన్నారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలన్నారు. ఏదైనా సహా యం అవసరమైతే జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. అనంతరం పదవీ విరమణ పొందిన ఎలమంచిలి రూరల్ అదనపు ఎస్ఐ ననేపల్లి సత్యనారాయణ, సీసీఎస్ ఎస్ఐ నట్టి సత్యనారాయణ, అనకాపల్లి ట్రాఫిక్ అదనపు ఎస్ఐ షేక్ రషీద్, పీసీఎస్ ఎస్ఐ షేక్ మదీనా వల్లి, డీసీఆర్బీ ఏఎస్ఐ జి.అర్జునరావు, పరవాడ ఏ్ఎస్ఐ బి.ఎ. నాయుడులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు, ఎ.ఓ.ఎ.రామ్కుమార్, సీఐలు ఎస్.లక్ష్మణమూర్తి, బెండి వెంకటరావు, ఎస్.బాల సూర్యారావు, టి.లక్ష్మి, కె.అప్పలనాయుడు, బి.రామకృష్ణ, ఎస్ఐ బి.సురేష్బాబు, పి.రమేష్, పి.కామేశ్వరరావు, ఎస్.శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ తుహిన్సిన్హా -
డిజిటల్ అసిస్టెంట్ల పడిగాపులు
● ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ సాయంత్రానికి.. ● కూటమి నేతల సిఫార్సుల కారణంగానే ఆలస్యం ● ఉద్యోగుల ఆగ్రహం, ఆందోళన మహారాణిపేట: ఉమ్మడి విశాఖ జిల్లాలోని పంచాయతీరాజ్ డిజిటల్ అసిస్టెంట్ల (గ్రేడ్–6) బదిలీల కౌన్సెలింగ్ సోమవారం తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఉదయం 9 గంటల నుంచి డీపీవో కార్యాలయం డిజిటల్ అసిస్టెంట్లు చేరుకున్నారు. 11 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా సాయంత్రం 6 గంటలకు ప్రక్రియ ప్రారంభించారు. భోజనం లేకుండా పడిగాపులు కాయడంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రజాప్రతినిధుల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన సిఫార్సు లేఖలే బదిలీల కౌన్సెలింగ్ జాప్యానికి కారణమని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కోరిన పోస్టింగ్లు, ఇతర వ్యవహారాలపై అధికారులు సాయంత్రం వరకు చర్చలు జరపడం వల్ల కౌన్సెలింగ్ ఆలస్యమైంది. పోస్టుల ఖాళీల జాబితాను బయట పెట్టకుండానే కౌన్సెలింగ్ చేపట్టడంపై పారదర్శకత లేదని అసిస్టెంట్లు ఆరోపించారు. పైరవీలకు పెద్దపీట? మొత్తం 549 మంది డిజిటల్ అసిస్టెంట్లలో 95 శాతం మంది ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నవారే. స్థాన చలనం తప్పదని తెలియడంతో, తమకు నచ్చిన స్థానాల కోసం పోటీ పడ్డారు. డీపీఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మొదట దివ్యాంగులు, స్పౌస్ కేసులు, అనారోగ్యంతో ఉన్నవారికి పోస్టింగ్లు కేటాయించారు. అయితే, ఆ తర్వాత జరిగిన జనరల్ బదిలీల్లో కూటమి ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకే బదిలీలు జరిగాయని ఆరోపణలు వినిపించాయి. మంగళవారం పెన్షన్ల పంపిణీకి కూడా ఈ అసిస్టెంట్లను వినియోగించే కసరత్తు జరుగుతోంది. బదిలీల్లో పైరవీలకు పెద్దపీట వేశారని ఆరోపణలు రావడంతో, కొందరు అసిస్టెంట్లు నిరసన వ్యక్తం చేస్తూ, తమకు సరైన పోస్టింగ్ కావాలని డిమాండ్ చేశారు. అగ్రికల్చర్ అసిస్టెంట్ల బదిలీలపై విమర్శలు మధురవాడ: జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఇటీవల జరిగిన సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ బదిలీల కౌన్సెలింగ్పై విమర్శలు వెల్లువెత్తాయి. శని, సోమవారాల్లో జరిగిన ఈ కౌన్సెలింగ్లో కూటమి ఎమ్మెల్యేలు, నాయకుల సిఫార్సులకే ప్రాధాన్యత ఇచ్చారని పలువురు ఆరోపించారు. ప్రిఫరెన్షియల్ కోటా, సీనియారిటీ, కోర్టు మార్గదర్శకాలను పక్కన పెట్టి, అస్తవ్యస్తంగా బదిలీలు చేశారని ఉద్యోగులు వాపోతున్నారు. రేషనలైజేషన్ పేరుతో ఐదేళ్లు నిండని, శారీరక సవాళ్లు ఎదుర్కొంటున్న ఉద్యోగులను కూడా కౌన్సెలింగ్కు పిలిచి ఇబ్బందులకు గురిచేశారని, వారికి సరైన అవకాశం లభించలేదని చెబుతున్నారు. న్యాయం జరగనివారు కోర్టును ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. -
180 కిలోల గంజాయి స్వాధీనం
రంపచోడవరం: దేవీపట్నం మండలం ఇందుకూరుపేట సమీపంలో ఆటోలో తరలిస్తున్న 180 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ త్రినాథ్, ఎకై ్సజ్ సీఐ శ్రీధర్, ఎస్ఐ పైడేశ్వరరావు తెలిపారు. గంజాయి రవాణాకు వినియోగించిన ఆటోను సీజ్ చేసి, ఇద్దరిని అరెస్టు చేసినట్టు వారు చెప్పారు. సారా బట్టీపై దాడి– ఒకరి అరెస్టు రాజవొమ్మంగి: మండలంలోని కిండ్ర సమీప రక్షిత అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న సారా బట్టీపై సోమవారం దాడి చేసి, ఒకరిని అరెస్టు చేసినట్టు రాజవొమ్మంగి ఎస్ఐ నరసింహలలమూర్తి తెలిపారు. సారా బట్టీని, వంద లీటర్ల బెల్లం పులుపును ధ్వంసం చేశామని చెప్పారు. బట్టీ నిర్వహిస్తున్న వ్యక్తి నుంచి ఆరు లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్టు ఎస్ఐ చెప్పారు. -
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్
● ఒక్కనామినేషనే దాఖలు కావడంతో ఎన్నిక లాంఛనమే ● తండ్రి వారసత్వంతో రాష్ట్ర బీజేపీలో చెరగని ముద్రఎంవీపీకాలనీ: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పోకల వంశీ నాగేంద్ర మాధవ్ (పీవీఎన్ మాధవ్) నియామకం దాదాపు ఖరారైంది. కొన్ని రోజులుగా అధ్యక్ష పదవిపై నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర బీజేపీ ముఖ్య నాయకులతో పాటు కేంద్ర పెద్దల మద్దతు పీవీఎన్ మాధవ్కు పుష్కలంగా ఉండటంతో ఆయన ఎన్నిక లాంఛనంగా మారింది. రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నికలకు సంబంధించి సోమవారం ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడమే ఇందుకు స్పష్టమైన నిదర్శనం. పార్టీ ఎన్నికల పరిశీలకుడు పీసీ మోహన్, ఎన్నికల అధికారి పాక వెంకట సత్యనారాయణలకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మతో పాటు విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరశురామరాజు తదితరులు మాధవ్ నామినేషన్ పత్రాలను అందజేశారు. దీంతో ఆయన ఎన్నిక లాంఛనం కాగా, మంగళవారం అధికారిక ప్రకటన వెలువడనుంది. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని... పీవీఎన్ మాధవ్.. రాష్ట్రంలో బీజేపీ అగ్ర నాయకుల్లో ఒకరిగా నిలిచిన దివంగత పీవీ చలపతిరావు తనయుడు. బీజేపీ ఆవిర్భవించిన తొలినాళ్లలో పీవీ చలపతిరావు రాష్ట్ర పార్టీ ముఖ్య నాయకుల్లో ఒకరుగా విశేష సేవలందించారు. ఆంధ్ర ఉద్యమంతో పాటు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో చురుకుగా పాల్గొన్నారు. 1945లోనే ఆర్ఎస్ఎస్లో చేరి, 1974, 1980లో ఎమ్మెల్సీగా సేవలు అందించి 87వ ఏట మరణించారు. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న పీవీఎన్ మాధవ్, తండ్రి బాటలోనే పయనించి ఆర్ఎస్ఎస్లో సభ్యుడయ్యారు. తొలి నుంచి బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషించారు. విశాఖలో అనేక బీజేపీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి అగ్ర నాయకుల మన్ననలు అందుకున్నారు. ఆర్ఎస్ఎస్, బీజేవైఎంలో (భారతీయ జనతా యువ మోర్చా) పలు కీలక పదవులు నిర్వహించారు. 2017లో విశాఖ నుంచి శాసనమండలికి (ఎమ్మెల్సీగా) ఎన్నికై పార్టీకి విలువైన సేవలు అందించారు. శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గత కొన్నేళ్లుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక దాదాపు ఖరారైనందున విశాఖలోని బీజేపీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
గురుకుల కళాశాల స్థలం కోసం వినతి
వై.రామవరం: మండలంలోని పి.యర్రగొండ గురుకుల బాలికల జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి స్థలం మంజూరు చేయాలని కోరుతూ ఐటీడీఏ పీవో కట్టా సింహాచలానికి ఎంపీపీ కడబాల ఆనందరావు, జెడ్పీటీసీ సభ్యురాలు కర్ర వెంకటలక్ష్మీల ఆధ్వర్యంలో స్థానికులు సోమ వారం వినతిపత్రాన్ని అందజేశారు. మండలంలోని చవిటిదిబ్బలు గ్రామంలో ఖాళీగా ఉన్న భూమిని కళాశాల కోసం కేటాయించమని వినతిలో కోరారు. దీనిపై పీవో స్పందించి, సదరు స్థలాన్ని పరిశీలించి, అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటే కళాశాల కోసం కేటాయించమని తహసీల్దార్ పి.వేణుగోపాల్కు లేఖలో ఆదేశించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో కట్టా సింహాచలంనకు ఎంపీపీ కడబాల ఆనందరావు, జెడ్పీటీసీ సభ్యురాలు కర్ర వెంకటలక్ష్మి తదితరులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
హైడ్రోపవర్ ప్రాజెక్టును రద్దు చేయాలి
పాడేరు రూరల్: అదానీ కంపెనీకు ప్రభుత్వం అప్పగించిన పెద్దకోట హైడ్రోపవర్ ప్రాజెక్టు రద్దు చేయా లని ఈ మేరకు విడుదల చేసి జీవో నంబర్ 51ను ఉపసంహరించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స డిమాండ్ చేశారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో అనంతగిరి మండలం పెద్దకోట వద్ద ఏర్పాటుచేయనున్న హైడ్రో పవర్ ప్రాజెక్టును అదానీ కంపెనీకు అప్ప గించిన్నట్టు జీవో నంబర్ 51ని జారీ చేయడం కూటమి ప్రభుత్వం నిరంకుశపాలనకు అద్దం పట్టే విధంగా ఉందన్నారు. పెద్దకోట ప్రాజెక్టు సామర్థ్యం 1800 ఎండబ్ల్యూకు పెంచడమే కాకుండ స్థానిక వాగు నుంచి 16.547 ఎంసీఎంల నీటిని తరలించడానికి కూడా అనుమతులు ఇవ్వడం దారుణమన్నారు. పెద్దకోట ప్రాంతం రాజ్యాంగం 5వ షెడ్యుల్ కింద గుర్తించిన ప్రాంతమని సర్వ హక్కు లు ఆదివాసీలకే ఉందనేది ప్రభుత్వం గుర్తించాలన్నారు. కూటమి ప్రభుత్వం ఇటువంటి ఏకపక్ష నిర్ణయాలతో అనుమతులు ఇవ్వడం చట్టారీత్య నేరమన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజనులకు ప్రత్యేకమైన చట్టాలు 1/70, పీసా చట్టాలు ఉన్నాయని, వీటిని ఉల్లంఘించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామసభల అనుమతులతోనే తీర్మాణం చేయాల్సి ఉందన్నారు, ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం చట్టాల ఉల్లంఘిండచమే అవుతుందన్నారు, అక్రమంగా జాఈ చేసిన జీవో నంబర్ 51ని తక్షణం రద్దు చేసి కూటమి ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు, లేని పక్షంలో ఆదివాసీలతో ఉద్యమం తీవ్రం చేస్తామని ఆయన హెచ్చరించారు. -
ఇలాగైతే రాకపోకలు ఎలా?
● ప్రధాన రహదారి మధ్యలో గుట్టలుగా మెటీరియల్ ● వాహనచోదకుల అవస్థలు ● చోద్యం చూస్తున్న అధికారులు అరకులోయటౌన్: విశాఖ – అరకు ప్రధాన రహదారి అరకులోయలో రోడ్డు మధ్యలో ఇసుక, నల్ల రాయి చిప్స్ నిల్వ చేయడంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరకులోయలోని పోర్టు అతిథి గృహం ఎదురుగా ఉన్న రోడ్డు డ్రైనేడీ నిర్మాణం కోసం తీసుకువచ్చిన మెటిరియల్ గత వారం రోజులుగా రోడ్డుపై విడిచిపెట్టారు. డ్రైనేజీ నిర్మాణం చేయకపోవడం, రోడ్డు మధ్యలో మెటీరియల్ వేసి ఉంచడంతో వాహనచోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ స్పందించి రోడ్డు మధ్యలో వేసి మెటీరియల్ తొలగించాలని వాహనచోదకులు, స్థానికులు కోరుతున్నారు. -
గిరి ప్రదక్షిణ భక్తులకు సౌకర్యాలు కల్పించండి
డాబాగార్డెన్స్: ఈ నెల 9న జరగనున్న సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, వారికి అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు కల్పించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ను సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి. త్రినాథరావు అభ్యర్థించారు. జీవీఎంసీ కమిషనర్ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తాగునీరు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, బీచ్లో స్నానపు గదులు, మరుగుదొడ్లు, రోడ్ల అభివృద్ధి వంటి ఏర్పాట్లు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ను శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు వేదమంత్రాలతో ఆశీర్వదించి, స్వామి ప్రసాదం, చందనం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్, అర్చకులు పాల్గొన్నారు. -
తహసీల్దార్ నర్సమ్మ సేవలు మరువలేనివి
ముంచంగిపుట్టు: మండల తహసీల్దార్ ఆర్.వి.ఎస్.ఎల్.నర్సమ్మ సేవలు మరువలేనివని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. మండల కేంద్రంలో స్థానిక కల్యాణ మండపంలో తహసీల్దార్ నర్సమ్మ పదవీ విరమణ సన్మాన సభ ను సోమవారం రెవెన్యూ శాఖ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ తహసీల్దార్ నర్సమ్మ విశేషమైన సేవలందించారన్నారు. ప్రతి ఒక్కరు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని, రెవెన్యూ శాఖలో కిందస్థాయి ఉద్యోగి నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు ఆమె అందరి మన్ననలు పొందారని కొనియాడారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి, వృత్తినే ధైవంగా భావించి, గిరిజనులకు రెవెన్యూ శాఖ పరంగా ఉత్తమ సేవలు అందించారని, పదవీ విరమణ అనంతరం జీవితం సుఖసంతోషాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. కార్యక్రమంలో భాగంగా ఉద్యోగ విరమణ పొందిన తహసీల్దార్ నర్సమ్మ, వెంకటరమణ దంపతులకు జ్ఞాపికలు అందజేసి, శాలువాతో జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, మూర్తి దంపతులు, హుకుంపేట, పెదబయలు మండలాల తహసీల్దార్లు కృష్ణారావు, రంగారావు, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ పార్టీల నేతలు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు.ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర -
ఇంజినీరింగ్ పనులు వేగవంతం
కలెక్టర్ దినేష్కుమార్ సాక్షి,పాడేరు: జిల్లాలో ఇంజినీరింగ్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు.సోమవారం ఆయన కలెక్టరేట్ నుంచి గిరిజన సంక్షేమశాఖ,ఆర్అండ్బీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు,అంగన్వాడీ భవనాలు, పీఎం జన్మన్ పథకంలో మంజూరు చేసిన పనులు, సీసీడీపీ పనుల పురోగతిపై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏకలవ్య పాఠశాలల భవనాలు జులై 15నాటికి అప్పగించని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ బచ్చింత–పాలమామిడి రోడ్డు పనులకు రూ.2.50 కోట్ల బిల్లులు చెల్లించారని, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో గోకుల షెడ్ల నిర్మాణాలను మ్యాపింగ్ చేయాలని సూచించారు. ఆసక్తి గల మహిళలకు సీ్త్రనిధి పథకం కింద పశువులను మంజూరు చేస్తామని తెలిపారు.అంగన్వాడీ భవనాలకు నిధుల కొరతలేదని, పనులు పూర్తి చేయాలన్నారు. పీఎం జన్మన్ పనులు వేగవంతం చేయాలని తెలిపారు. 2021లో మంజూరైన పనులు ఇంత వరకు పూర్తికాక పోతే ఇంజినీరింగ్ అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు పూర్తిచేయని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీచేస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో జేసీ డాక్టర్ అభిషేక్గౌడ, రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం,అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్,పలు ఇంజినీరింగ్శాఖల ఈఈలు వేణుగోపాల్, బాలసుందరబాబు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన గిరిజనులు
● రహదారి నిర్మించాలని ఆందోళన ● సీపీఎం నాయకుడు రామారావుతో పాటు పలువురి అరెస్టుఅడ్డతీగల: మండలంలో జె.అన్నవరం,గొంటు వానిపాలెం, ఏలేశ్వరం రోడ్డు నిర్మించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం పెద్ద ఎత్తున గిరిజనులు రాస్తారోకో చేశారు. గిరిజన సంఘం అధ్యక్షుడు లోతా రామారావు ఆధ్వర్యంలో గొంటువానిపాలెం, రమణయ్యపేట రహదా రిపై ఆందోళన చేశారు. రహదారిపై ఉన్న బురదలో గంటల తరబడి నిలబడి నిరసన వ్యక్తం చేశారు. దీంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిపిపోయాయి. ప్రయాణికులు కూడా ఆందోళనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా లోతా రామారావు మాట్లాడుతూ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని ప్రకటించి, అట్టహాసంగా కొబ్బరి కాయలు కొట్టి చేతులు దుపులుకొన్నారన్నారు. రహదారి నిర్మాణానికి కూటమి నేతలు చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. అడుగడుగునా గోతులు పడడంతో రోడ్డు అధ్వానంగా ఉందని, తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆందోళనకారణంగా వాహనాలు నిలిచిపోవడంతో అడ్డతీగల పోలీసులు అక్కడకు చేరుకుని గిరిజనులతో చర్చించారు.రహదారిపై వాహనాలు అడ్డుకోవడం నేరమని, వెంటనే ఆందోళన విరమించాలని కోరారు. రహదారి నిర్మాణంపై స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబడడంతో పోలీసులు లోతా రామారావు, ఇతర నాయకులను అరెస్టు చేశారు. రెండు రోజుల్లో సంబంధిత అధికారులతో చర్చించి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సీఐ రవికుమార్ హామీ ఇవ్వడంతో గిరిజనులు ఆందోళన విరమించారు. -
ప్రారంభానికి సిద్ధంగా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం
చింతపల్లి: మండల కేంద్రం చింతపల్లిలో నిర్మించిన కలెక్టర్ క్యాంప్ కార్యాలయ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లాను ఏర్పాటు చేశారు. చింతపల్లిలో కలెక్టర్ క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో చింతపల్లి నుంచి చౌడుపల్లికి వెళ్లే మార్గంలో స్థానిక గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలకు ఎదురుగా ఉన్న డైయిరీ ఫారంలో స్థలాన్ని కేటాయించారు. రూ.కోటి వ్యయంతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. చింతపల్లి,జీకే వీధి, కొయ్యూరు మండలాల ప్రజలకు కలెక్టర్ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్న క్యాంప్ కార్యాలయ భవనం పనులు పూర్తి కావచ్చాయి. -
ఈదురుగాలులు, భారీ వర్షం
అరకులోయ టౌన్/ముంచంగిపుట్టు/పాడేరు రూరల్/చింతపల్లి : విశాఖ–అరకు ప్రధాన రహదారిపై సోమవారం సాయంత్రం సిల్వర్ ఓక్ చెట్టు కూలింది. దీంతో కొంత సేపు ట్రాఫిక్ జామ్ అయింది. స్థానికులు, వాహనచోదకులు చెట్టును తొలగించారు. ● పాడేరు మండలంలో సలుగు పంచాయతీ పూలబంద, కత్తి గ్రామల మధ్య ప్రధాన రహదారిపై భారీ చెట్టు విరిగి పడింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ● ముంచంగిపుట్టు మండలంలో ఈదురు గాలు లతో కూడిన భారీ వర్షం పడింది. వరదనీరు పంట పొలాల్లోకి చేరింది. రంగబయలు, లక్ష్మీపురం, బుంగాపుట్టు,బూసిపుట్టు పంచాయతీల్లో వాగులు,గెడ్డలు వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈదురు గాలుల కారణంగా మండలంలోని బరడ పంచాయతీ హంసబంద సమీపంలో భారీ చెట్టు రోడ్డుపై కూలింది. దీంతో బరడ,లక్ష్మీపురం పంచాయతీలకు రాకపోకలకు మూడు గంటల పాటు నిలిచిపోయాయి. ఉపాధ్యాయులు, ఉద్యోగులు పంచాయతీ కేంద్రాలకు,పాఠశాలలకు వెళ్లేందుకు అవస్థలు పడ్డారు.రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును స్థానికులు తీవ్రంగా శ్రమించి తొలగించారు. ముసురు వాతావరణంతో మండల కేంద్రంలో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలుల కారణంగా తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. విద్యుత్శాఖ అధికారులు,సిబ్బంది తీవ్రంగా శ్రమించి విద్యుత్ సరఫరాను ఎప్పటికప్పుడు పునరుద్ధరిస్తున్నారు. ● చింతపల్లి– లంబసింగి జాతీయ రహదారిపై పెద్దగెడ్డ–రౌరింతా గ్రామాల మధ్య చెట్లు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నర్సీపట్నం, చింతపల్లి రహదారిలో అరగంటపాటు పలు వాహనాలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండంతో జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లు నేల కూలుతున్నాయి. జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, గెడ్డలు పొంగిప్రవహిస్తున్నాయి. పలు చోట్ల రోడ్లపై చెట్లు కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పొంగి ప్రవహిస్తున్న వాగులు,గెడ్డలు పలు ప్రాంతాల్లో కూలిన చెట్లు రాకపోకలకు అంతరాయం ఇక్కట్లకు గురైన ప్రయాణికులు -
పీవీటీజీల జీవితాల మెరుగే పీఎం జన్మన్ లక్ష్యం
కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ సెక్షన్ అధికారి ఆదిత్య గోషైన్ డుంబ్రిగుడ/హుకుంపేట: పీవీటీజీల జీవితాలను మెరుగుపరచడమే ప్రధాన మంత్రి జన్మన్ మిషన్ లక్ష్యమని కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ సెక్షన్ అధికారి ఆదిత్య గోషైన్ అన్నారు. డుంబ్రిగుడ, హుకుంపేట మండలాల్లో సోమవారం ఆయన పర్యటించారు. డుంబ్రిగుడ మండలం అరమ పంచాయతీ గొలంబో పీవీటీజీ గ్రామంలో జోరు వానలో ఆయన పర్యటించి, గ్రామస్తుల సమస్యలు తెలుసుకున్నారు. రూ. 60 లక్షలతో నిర్మిస్తున్న సామాజిక భవనాన్ని పరిశీలించి, పీవీటీజీ తెగల జీవన విధానం, రేషన్ కార్డులు, వివిధ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డుల మంజూరు, 104 సేవలు, వైద్య శిబిరాల నిర్వహణ తదితర వివరాలు తెలుసుకున్నారు. అయితే 104 సేవలు అందలేదని, వైద్య శిబిరం ఏర్పాటు చేయలేదని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు సమకూర్చడంతో పాటు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. గ్రామంలో మరో 16 కుటుంబాలకు జన్మన్ గృహాలు మంజూరు చేయాలని, బీఎస్ఎన్ఎల్ సేవలు కల్పించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.అనంతరం కొర్రాయి పంచాయతీ అంజోడలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కిల్లోగుడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని సందర్శించారు. హుకుంపేట మండలం తడిగిరిలో జరిగిన పీఎం జుగా కార్యక్రమంలో ఆదిత్య గోషైన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభు త్వం పథకాలపై గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వరరావు, పీఎంయూ అధికారి రాజేష్, ఎంపీడీవో ప్రేమ్సాగర్, ఇన్చార్జ్ తహసీల్దార్ ముజీబ్, గిరిజన సంక్షేమ శాఖ ఏఈ అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. -
● పాడేరులో రోడ్డుకిరువైపులా ఆక్రమణల తొలగింపుపై మీనమేషాలు ● నాలుగు వారాలుగా నిలిచిన ప్రక్రియ ● వివిధ కారణాలతో వాయిదా ● కూటమి నేతల తీరుపై విమర్శలు ● ఆందోళనకు సిద్ధమవుతున్న ప్రజాసంఘాలు
పాడేరు : జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో ప్రధానరోడ్డుకు ఇరువైపులా ఆక్రమణల తొలగింపులో తాత్సారం జరగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానరోడ్ల పక్కన ఆక్రమణలను ఎనిమిది వారాల్లోగా తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం తెలిసిందే. ఈ మేరకు సంబంధిత అధికారులకు కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశాలిచ్చారు. ముందస్తుగా నోటీసులు జారీ చేసి కాస్త గడువు ఇచ్చిన తరువాత ఆక్రమణలు తొలగించాలని సూచించారు. ఈనేపథ్యంలో ఐదు వారాల క్రితం ప్రతి శనివారం ఆక్రమణలు తొలగిస్తామని, ఈ ప్రక్రియ ఏకధాటిగా ఎనిమిది వారాలు కొనసాగిస్తామని కలెక్టర్ ప్రకటించారు. ఈ మేరకు శనివారం రోజున పాడేరు పట్టణంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం చుట్టారు. ఆ తరువాత శనివారం నుంచి జిల్లా కేంద్రమైన పాడేరులో ఆక్రమణల తొలగింపు జరగడం లేదు. కోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణల తొలగింపునకు మరో మూడు వారాలు మాత్రమే గడువు మిగిలి ఉంది. కూటమి నేతల ఒత్తిడితోనే.. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో ప్రధాన రహదారుల పక్కన ఆక్రమణలను తొలగింపును టీడీపీ సహా కూటమి నేతలు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ప్రస్తుతం ఉన్న రహదారి మధ్య నుంచి ఒక వైపు 50 అడుగుల చొప్పున మొత్తంగా వంద అడుగుల మేర ఆక్రమణలు తొలగించాల్సి ఉంది. ఇదే జరిగితే పాడేరు పట్టణంలో టీడీపీకి చెందిన మాజీ మంత్రి మత్య్సరాస మణికుమారి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొట్టగుళ్లి సుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇంచార్జీ గిడ్డి ఈశ్వరి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్రం టూరిజం డైరెక్టర్ కిల్లు రమేష్నాయుడు, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్కుమార్కు చెందిన షాపులు కొంతమేర తొలగించాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ఒక వైపు 50 అడుగుల చొప్పున కాకుండా 35 అడుగుల మేర తొలగించాలని కలెక్టర్పై కూటమి నేతలు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ కారణంతోనే నాలుగు వారాలనుంచి ఆక్రమణల తొలగింపు ప్రకియను అధికారులు వివిధ కారణాలతో వాయిదా వేస్తూ వస్తున్నారనే అభిప్రాయం అన్నివర్గాల ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. జఠిలంగా ట్రాఫిక్ జిల్లా కేంద్రం కావడంతో పాడేరు పట్టణంలో ప్రతిరోజు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటోంది. నిత్యం వీఐపీల తాకిడి, అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. వ్యాపార, వాణిజ్య అవసరాల కోసం వందలాది సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో పాటు వివిధ అవసరాల నిమిత్తం నలుమూలల నుంచి జిల్లా కేంద్రానికి రావడం వల్ల రద్దీ పెరుగుతోంది. అందుకు అనుగుణంగా పట్టణంలో ఎక్కడా కూడా పార్కింగ్ స్థలాలు లేవు. దీంతో వాహనాలన్నీ రోడ్లపైనే నిలపాల్సిన పరిస్థితి. రోడ్లు కూడా ఇరుకుగా ఉండటంతో ప్రతిరోజు ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. దీంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. అత్యవసర సమయాల్లో 108 వాహనాలు, అంబులెన్స్లు, ఇతర అత్యవసర వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకొని సకాలంలో ఆస్పత్రులకు చేరుకోలేని పరిిస్థితి ఉంది. కోర్టు ఆదేశాలు బేఖాతర్కోర్టు ఆదేశాల మేరకుఆక్రమణలు తొలగించాల్సిందే జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంతో పాటు మండల కేంద్రాల్లో రోజు,రోజుకు ఆక్రమణలు పెచ్చుమీరుతున్నాయి. కోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణల తొలగింపు ప్రక్రియ యుద్ధప్రాతిపదికన తొలగించాలి. నిత్యం ట్రాఫిక్ సమస్యతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వివిధ కారణాలు చూపి నాలుగు వారాలుగా ఆక్రమణల తొలగింపు నిలిపివేశారు. ఆక్రమణల తొలగింపును టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే ఆపివేయాలని చూస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. కోర్టు ఆదేశాల మేరకు పాడేరు పట్టణంలో వంద అడుగుల మేర ఆక్రమణలు తొలగించి రహదారిని విస్తరించాలి. లేని పక్షంలో స్థానికులతో కలిసి వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. – మత్య్సరాస విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు పదేళ్లుగా పోరాటం పాడేరు పట్టణంతో పాటు ఐదవ షెడ్యూల్ ప్రాంతమైన ఏజెన్సీలోని అన్ని మండల కేంద్రాల్లో ఆక్రమణలు, అక్రమ కట్టడాలు రోజు,రోజుకు పెరిగిపోతున్నాయి. ఆక్రమణలను తొలగించాలని తామంతా గత పదేళ్లుగా పోరాటాలు చేస్తున్నాం. కోర్టు ఆదేశాలు కూడా ధిక్కరించి ఆక్రమణల తొలగింపు ఆపేందుకు కుటిల కుట్రలను టీడీపీ నేతలు మానుకోవాలి. జిల్లా ఉన్నతాధికారులు వారి ఒత్తిళ్లకు లొంగకుండా మెజారిటీ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని కోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణలు తొలగించి ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలి. ఆక్రమణల తొలగించకపోతే ఆదివాసీ, గిరిజన, ప్రజా సంఘాలంతా కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. – కూడా రాధాకృష్ణ, గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి, ఆదివాసీ, ప్రజా సంఘాల ఐక్యవేదిక నేత, పాడేరు -
వైభవం.. వరదపాయస సేవ
సింహాచలం: సింహగిరిపై వైకుంఠవాసుడి సన్నిధిలో ఆదివారం వరదపాయసం సేవ విశేషంగా నిర్వహించారు. దేశంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఏటా సింహగిరిపై ఉన్న వైకుంఠవాసుడి మెట్టపై కొలువుదీరిన వైకుఠవాసుడి సన్నిధిలో పాయసం వండి, సమీపంలో ఉన్న పొర్లు బండపై నుంచి జారవిడవడం ఆచారంగా వస్తోంది. దీనినే వరదపాయసం సేవగా పేర్కొంటారు. అప్పన్న ఆలయ అర్చకులు ఉదయం 8 నుంచి పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి పూజలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతుడై కొలువుదీరిన వైకుంఠవాసుడి సన్నిధిలో విష్వక్సేణపూజ, పుణ్యాహవచనం, పంచకలశ ఆవాహనం, పంచకలశ స్నపనం, విశేష ఆరాధన ఘనంగా జరిపారు. విరాట్పర్వ పారాయణం చేశారు. అనంతరం అక్కడే వండిన పాయసాన్ని స్వామికి నివేదించి, సమీపంలో ఉన్న పొర్లు బండపై జారవిడిచారు. భక్తులు పొర్లు బండపై నుంచి జారే పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధాన అర్చకుడు కరి సీతారామాచార్యులు, అర్చకులు, పారాయణదారులు, వేదపండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానం ఈవో వి.త్రినాథరావు పాల్గొన్నారు. వైకుంఠవాసుడికి విశేషంగా అభిషేకాలు విరాట్పర్వ పారాయణం, పాయసం నివేదన -
సాగర తీరాన సైకిల్పై సవారీ
ఏయూక్యాంపస్: ఆదివారం వచ్చిందంటే చాలు సాగర తీరాన బీచ్ రోడ్డు చిన్నారులు, యువత, వృద్ధులు ఇలా అన్ని వయసుల నగరవాసులతో నిండిపోతుంది. ఎవరికి వారు తమకు నచ్చిన వ్యాయామం, వాకింగ్, సైక్లింగ్ వంటివి చేస్తుంటారు. ఆదివారం ఉదయం బీచ్ రోడ్డులో పలువురు యువత, చిన్నారులు సైకిల్ తొక్కుతూ సందడి చేశారు. ఉదయం 7 గంటల వరకు వాహనాల నిషేధం ఉండటంతో చిన్నారులు స్వేచ్ఛగా బీచ్ రోడ్డులో సైకిల్పై సవారీ చేసే అవకాశం లభించింది. వీరు వైఎంసీఏ నుంచి ఆర్.కె.బీచ్ వరకు విరామం లేకుండా సైకిల్ తొక్కుతూ స్నేహితులతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ గడిపారు. -
లోతట్టు ప్రాంతాలు జలమయం
హుకుంపేట: మండలంలో ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో లోట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మండల కేంద్రం నుంచి అడ్డుమండ ప్రధాన రహదారిలో చీడిపుట్టు వద్ద వంతెన పైనుంచి వరద నీరు పొంగి ప్రవహించింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. అడ్డుమండ, జీకేమండ పంచాయతీల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. డుంబ్రిగుడ: మండలంలోని శనివారం రాత్రి నుంచి చినుకులతో ప్రారంభమైన వర్షం ఆదివారం ఉదయం 4 గంటల నుంచి 9 గంటల వరకు ఏకధాటిగా కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. డ్రైనేజీల్లో భారీగా వరదనీరు చేరింది. వర్షాలు అనుకూలంగా ఉండటంతో రైతులు ఖరీఫ్ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఉధృతంగా చాపరాయి గెడ్డ ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చాపరాయి గెడ్డ పొంగింది. దీంతో పర్యాటకులు గెడ్డలో దిగేందుకు సాహసించలేదు. ముఖద్వారం వద్ద నుంచి వీక్షించి వెళ్లిపోయారు. అంతర్ రాష్ట్ర రహదారిలో కూలిన చెట్టుగూడెంకొత్తవీధి: భారీ వర్షాలకు అంతర్ రాష్ట్ర రహదారిలో ఆర్వీనగర్–గూడెంకొత్తవీధి మధ్యలో ఆదివారం ఉదయం భారీ వృక్షం కూలిపోయింది. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ అప్పలసూరి జేసీబీతో చెట్టును పక్కకు తొలగించారు. కూలీలతో చెట్ల కొమ్మలను నరికించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేశారు.డుంబ్రిగుడ ప్రాంతంలోని డ్రైనేజీలో చేరిన వరద నీరు -
మళ్లీ సముద్రంలో సందడే సందడి
● వైఎస్సార్సీపీ హయాంలో ప్రారంభమైన కార్డేలియా క్రూయిజ్ యాత్ర ● విశాఖ నుంచి జూలై 2, 9, 16 తేదీల్లో మూడు సర్వీసులు ● చైన్నె–విశాఖపట్నం–పుదుచ్చేరి–చైన్నె మధ్య సర్వీసు ● ఇప్పటికే ఆన్లైన్లో ప్రారంభమైన టికెట్ల విక్రయాలువిశాఖ సిటీ : సాగర విహార ప్రపంచానికి విశాఖ మరోసారి స్వాగతం పలుకుతోంది. సముద్ర జలాల్లో తేలియాడే అద్భుత సౌధం మళ్లీ నగరానికి వచ్చేస్తోంది. అలలపై ఆహ్లాదకర ప్రయాణాన్ని అందించనుంది. విలాసవంతమైన సముద్ర విహార నౌకను చైన్నె–విశాఖపట్నం–పుదుచ్చేరి–చైన్నెల మధ్య నడపడానికి కార్డేలియా క్రూయిజ్ సంస్థ మళ్లీ ముందుకొచ్చింది. విశాఖ నుంచి జూలై 2, 9, 16 తేదీల్లో మూడు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. 2022 జూన్లో ఇదే సంస్థ విశాఖ నుంచి క్రూయిజ్ నౌకను నడిపింది. ఈ నౌకలో విహరించేందుకు విశాఖ ప్రజలే కాకుండా చుట్టు పక్కల రాష్ట్రాల పర్యాటకులు పోటీ పడ్డారు. దీంతో 85 శాతం మేర ఆక్యుపెన్సీతో ఆ ఏడాది సెప్టెంబర్ వరకు నడిచింది. ఈసారి విశాఖ పోర్టులో కొత్తగా నిర్మించిన ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ నుంచి ఈ విహార నౌక రాకపోకలు సాగించనుంది. ఇప్పటికే ఆన్లైన్లో టికెట్ల విక్రయాలను సైతం ప్రారంభించింది. లగ్జరీ విహార యాత్ర ఆరంభం ఇలా.. సెవెన్ స్టార్ హోటల్కు మించి విలాసవంతమైన నౌకలో విహారం.. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా 24 గంటలు వినోదం.. విభిన్న వంటకాలతో రుచికరమైన ఆహారం.. ఆరోగ్యానికి జిమ్, ఫిట్నెస్ సెంటర్ల సౌకర్యం.. స్విమ్మింగ్ పూల్స్లో జలకాలాటలు.. రాక్ కై ్లంబింగ్ విన్యాసాలు.. ఆహ్లాదపరిచే డ్యాన్స్ షోలు.. అబ్బురపరిచే మ్యాజిక్ ప్రదర్శనలు.. సినిమా థియేటర్లు.. ఇలా ఎటువంటి ఒత్తిడి లేకుండా.. సమయం తెలియకుండా 24/7 ఎంజాయ్ చేసే లగ్జరీ విహార యాత్ర విశాఖ నుంచి ప్రారంభమవుతోంది. ఈ క్రూయిజ్ నౌక జూన్ 30న చైన్నెలో బయలుదేరి జూలై 2వ తేదీ ఉదయం విశాఖకు వస్తుంది. అదే రోజు సాయంత్రం ఇక్కడ నుంచి బయలుదేరి 4వ తేదీన పుదుచ్చేరికి చేరుకుంటుంది. మళ్లీ అదే రోజు అక్కడి నుంచి బయలుదేరి 5వ తేదీన చైన్నె వెళుతుంది. దీంతో ఒక ట్రిప్పు పూర్తవుతుంది. ఆ తరువాత జూలై 7న చైన్నెలో మరో ట్రిప్పు ప్రారంభమై.. 9వ తేదీన విశాఖకు చేరుకుని.. మళ్లీ ఇక్కడి నుంచి బయలుదేరి 12వ తేదీన చైన్నెలో ముగుస్తుంది. మూడో ట్రిప్పు జూలై 14న చైన్నెలో మొదలై 16వ తేదీకి విశాఖకు చేరుకుంది. తిరిగి అదే రోజు ఇక్కడి నుంచి ప్రారంభమై 19వ తేదీన చైన్నెలో ముగుస్తుంది. -
పీఎం జన్మన్ అమలు సంతృప్తికరం
పాడేరు : జిల్లా ఏజెన్సీలో ఆదివాసీల కోసం ప్రవేశపెట్టిన పీఎం జన్మన్ పథకాల అమలు సంతృప్తికరంగా ఉందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సెక్షన్ అధికారి ఆదిత్య గోషైన్ అన్నారు. ఆదివారం ఆయన మండలంలోని మోదాపల్లి, వనుగుపల్లి, వంతాడపల్లి పంచాయతీల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. మోదాపల్లిలో ఆదివాసీలు సాగు చేస్తున్న కాఫీ, మిరియాల తోటలను పరిశీలించారు. కాఫీ, మిరియాల సాగు ద్వారా ఏడాదికి వచ్చే ఆదాయ వివరాలను రైతుల నుంచి తెలుసుకున్నారు. కాఫీ, మిరియాల సాగు ద్వారా ఎకరాకు ఏడాదికి రూ.లక్ష ఆదాయం సమకూరుతుందని గిరిజన రైతులు వివరించారు. వనుగుపల్లి పంచాయతీ మారుమూల ముంతమామిడిలో రూ.60లక్షలతో నిర్మిస్తున్న బహుళ ప్రయోజక భవన నిర్మాణాలను పరిశీలించారు. వంతాడపల్లి సప్పిపుట్టు గ్రామంలో పీవీటీజీలు నిర్మిస్తున్న పీఎం జన్మన్ గృహాలను పశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేసుకోవాలని వారికి సూచించారు. నిర్మాణాలు పూర్తి చేసిన వాటికి బిల్లులు అందాయా లేదా అని తెలుసుకున్నారు. ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాలు, ఆయూష్మాన్ భారత్ కార్డుల జారీ, పీఎం జన్మన్ గృహాల మంజూరు తదితర వాటిపై అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, గిరిజన సంక్షేమ శాఖ ఏఈ దుర్గాప్రసాద్, ట్రైకార్ అసిస్టెంట్ సీతారామయ్య, పీఎంయూ అధికారి రాజేష్ పాల్గొన్నారు. కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ సెక్షన్ అధికారి ఆదిత్య గోషైన్ మోదాపల్లి, వనుగుపల్లి, వంతాడపల్లి పంచాయతీల్లో పర్యటన -
సర్వేయర్ల ఆందోళన
● బదిలీల్లో సిఫార్సులకు పెద్దపీట వేశారని ఆవేదన మహారాణిపేట(విశాఖ) : సచివాలయ సర్వేయర్లు గ్రేడ్–2 బదిలీల్లోనూ కూటమి ఎమ్మెల్యేల సిఫార్సులకు పెద్దపీట వేశారంటూ సర్వేయర్లు ఆందోళనకు దిగారు. ఆదివారం కలెక్టరేట్ ఆవరణలోని జిల్లా సర్వే విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సర్వే డిపార్టుమెంటులో ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారికి ఆదివారం బదిలీ కౌన్సెలింగ్ చేపట్టారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 354 మంది బదిలీ కౌన్సెలింగ్ కోసం వచ్చారు. సర్వే అసిస్టెంట్ డైరెక్టర్లు సూర్యరావు(విశాఖ), గోపాలరావు(అనకాపల్లి) బదిలీ కౌన్సెలింగ్ చేపట్టారు. బదిలీల్లో పైరవీలకు పెద్ద పీట వేస్తున్నారని, సిఫార్సుల వల్ల తాము నష్టపోతున్నామని, జాబితా ప్రకారం బదిలీలు చేయడం లేదని సర్వేయర్లు ఆందోళనకు దిగారు. కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల వల్ల నిజాయితీపరులకు అన్యాయం జరుగు తుందని ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం తప్పనిసరి
విశాఖ విద్య: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు అన్నారు. జిల్లా యూటీఎఫ్ కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు దాసరి నాగేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం ఏఎన్ఏడీలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జీవో 19 ద్వారా 9 రకాల పాఠశాలలు ఏర్పాటు చేశారని తెలిపారు. దీని వల్ల కొన్ని పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 9,652 మోడల్ ప్రాథమిక పాఠశాలలు, 1,552 ఉన్నత పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలను అప్గ్రేడ్ చేసిన 779 ఉన్నత పాఠశాలలు, 5 వేల ఫౌండేషన్ పాఠశాలలు, 19 వేల బేసిక్ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు. ఫౌండేషన్, బేసిక్ ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారే ప్రమాదం ఉందని, వీటిని బలమైన పాఠశాలలుగా మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలల పనివేళల్లో బోధనేతర పనులు, శిక్షణ తరగతులు లేకుండా చూడాలని కోరారు. అదే విధంగా ఆర్థిక బకాయిలు చెల్లించాలని, పీఆర్సీ కమిషన్ నియమించి, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, డీఏలను చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి టి.ఆర్.అంబేడ్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు జూలై 5వ తేదీ వరకు డ్రైవ్ చేపట్టాలని, ఇందులో యూటీఎఫ్ కేడర్ పాల్గొనాలని కోరారు. కనీసం మండల స్థాయిలో 10 మంది పిల్లలను, జిల్లా స్థాయిలో 20 మంది పిల్లలను చేర్పించిన వారికి అభినందన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో జిల్లా సహాధ్యక్షులు ఎన్.ప్రభాకర్, రొంగలి ఉమాదేవి, కోశాధికారి కె.రాంబాబు, జిల్లా పూర్వ ప్రధాన కార్యదర్శి టి.అప్పారావు, జిల్లా కార్యదర్శులు చుక్క సత్యం, రిజ్వాన్, రియాజ్, సీనియర్ నాయకులు బి.జనార్ధన్తో పాటు వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు -
విద్యుదాఘాతంతోయువకుడి మృతి
చింతూరు: వాటర్ హీటర్ తీస్తున్న క్రమంలో విద్యుత్షాక్కు గురై యువకుడు మృతిచెందిన సంఘటన చింతూరు మండలం వంకగూడెంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మడివి కృష్ణ(24) స్నానం చేసేందుకు ఇంటి వెనుకభాగంలో బకెట్లోని నీటిలో వాటర్హీటర్ ఉంచాడు. నీరు వేడెక్కిన అనంతరం దానిని తీసేక్రమంలో విద్యుత్షాక్ తగలడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా జ్వరంతో ఇంట్లో పడుకునివున్న అతని తల్లి రాత్రి ఈ విషయాన్ని గమనించలేదు. ఆదివారం ఉదయం ఇంటి వెనుక చూడగా హీటర్ చేతితో పట్టుకుని నిర్జీవంగా పడిఉన్న కన్నకొడుకుని చూసి తీవ్రంగా రోదించింది. -
ఘనంగా వారాహినవరాత్రి ఉత్సవాలు
సబ్బవరం (అనకాపల్లి): ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం దేవీపురంలోని సహస్రాక్షి రాజరాజేశ్వరీదేవి క్షేత్రంలో వారాహి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు ఆదివారం శ్రీమేరు మొదటి అంతస్తులో కొలువైన ఉత్సవమూర్తి వారాహి అమ్మవారికి క్షీరాభిషేకం, షోడశోపచార సహిత కుంకుమ పూజలు నిర్వహించారు. వారాహిమాత యంత్ర ముద్రిత బహు కాసులు, నూతన వస్త్రాల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మాతను పల్లకీలో ఆశీనురాలిని చేసి నవవర్ణ పుష్పాలతో ఆలంకరించి ఉరేగించారు. మేళ తాళాలతో ఆహూతులైన అనేకమంది భక్తులు, అమృత కన్యా గురుకులం విద్యార్థినులు కోలాటాలతో సందడి చేశారు. రాత్రికి తిరస్కరణీ వారాహి హోమం జరిపారు. ఈ హోమం ద్వారా మాయా భ్రాంతుల తొలగింపుతోపాటు, ప్రతికూల శక్తుల నుంచి రక్షణ కలుగుతుందన్నారు. మధ్యాహ్నం గురుమాత అన్నపూర్ణమ్మ చేతుల మీదుగా అన్నసమారాధన జరిపారు. -
ఆదాయం,ఉపాధి.. గోవిందా..
డుంబ్రిగుడ: పోతంగి పంచాయతీ పరిధిలోని ప్రముఖ పర్యాటక కేంద్రం చాపరాయి జలవిహారిని పాడేరు ఐటీడీఏ పరిధిలోకి చేర్చడంతో ఉపాధి అవకాశాలు కోల్పోయామని స్థానిక యువత ఆవేదన చెందుతున్నారు. 2009 నుంచి 2023 వరకు చాపరాయి జలవిహారికి పర్యాటకుల సందర్శన ద్వారా వచ్చే ఆదాయం టెండర్ విధానంలో పంచాయతీకి సమకూరేది. దీంతో పంచాయతీ పరిధిలోని 15 మంది యువత ఉపాధి పొందేవారు. ఈనేపథ్యంలో 2022–23లో చాపరాయి జలవిహారిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, 10 మంది స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని ఇందుకు పంచాయతీ తీర్మానం కావాలని అప్పటి ఐటీడీఏ పీవో అభిషేక్ కోరినట్టు పోతంగి పంచాయితీ సర్పంచ్ వంతాల వెంకటరావు తెలిపారు. ఈ మేరకు తీర్మానం చేయడంతో చాపరాయి జలపాతాన్ని అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఐటీడీఏ పరిధిలో చేర్చిందని ఆయన వివరించారు. పీవో హామీ మేరకు పోతంగి పంచాయతీకి చెందిన పది మంది యువకులకు ఉపాధి కల్పించాల్సి ఉంది. అయితే వీరిలో ఐదుగురికి మాత్రమే ఐటీడీఏ అవకాశం ఇచ్చింది. కొల్లాపుట్టులో ఐటీడీఏ ఎకో టూరిజంకు చెందిన మరో ఏడుగురిని అధికారులు నియమించారని సర్పంచ్ తెలిపారు. దీనివల్ల స్థానిక యువత ఉపాధి అవకాశాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో తమ పంచాయతీకి చెందిన యువతను మాత్రమే చాపరాయి జలవిహారి వద్ద నియమించి ఉపాధి కల్పించడమే కాకుండా వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని పంచాయతీకి కేటాయించాలని ఆయన కోరారు. ఇదే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. న్యాయం చేయకుంటే చాపరాయి జలవిహారికి తాళాలు వేసి పంచాయతీ ద్వారా టెండరు విధానం అమలయ్యేలా తీర్మానం చేస్తామని సర్పంచ్ హెచ్చరించారు. చాపరాయి జలవిహారిని ఐటీడీఏ పరిధిలో చేర్చడం వల్ల నష్టపోయాం సర్పంచ్ వెంకటరావు ఆవేదన అన్ని ఉద్యోగాల్లో స్థానిక యువతను నియమించాలి లేకుంటే గేట్లకు తాళాలు వేస్తామని హెచ్చరిక -
క్రూయిజ్లో సదుపాయాలు
● కార్డేలియా ఎంప్రెస్ క్రూయిజ్ నౌక ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది. ● మొత్తం 11 అంతస్తులతో ఉండే ఈ క్రూయిజ్ మొదటి ఫ్లోర్లో ఇంజిన్, రెండో ఫ్లోర్లో కార్గో ఉంటుంది. ● మూడో ఫ్లోర్ నుంచి పాసింజర్ లాంజ్ మొదలవుతుంది. ● అక్కడి నుంచి ఎలివేటర్ ద్వారా పదో అంతస్తు వరకు చేరుకోవచ్చు. ● పదో ఫ్లోర్లో డెక్ లాంటి పెద్ద టెరరస్ ఉంటుంది. ● 11వ అంతస్తులో ఉండే ప్రత్యేక సెటప్ ద్వారా సూర్యోదయం, సూర్యాస్తమయాలను వీక్షించడం మధురానుభూతిని కలిగిస్తుంది. ● లగ్జరీ సూట్(8వ ఫ్లోర్) మినహా మిగిలిన అన్ని రకాల రూమ్స్ దాదాపుగా అన్ని ఫ్లోర్లలో ఉంటాయి. ● ఫుడ్కోర్టులు, మూడు స్పెషాలిటీ రెస్టారెంట్లు, 5 బార్లు, స్పా, సెలూన్ అందుబాటులో ఉన్నాయి. ● చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఫన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేకంగా ఈ నౌకలో కార్డేలియా కిడ్స్ అకాడమీ పేరుతో విశాల ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ● జిమ్, ఫిట్నెస్ సెంటర్, స్విమ్మింగ్ పూల్, కేసినో, డ్యాన్సులు, కామెడీ, మ్యాజిక్ షోల కోసం ఆడిటోరియం, కొత్త సినిమాలను వీక్షించడానికి థియేటర్, నైట్ క్లబ్, 24 గంటల సూపర్ మార్కెట్, ల్రైబరీ ఇలా క్షణం కూడా బోర్ కొట్టకుండా అనేక సదుపాయాలు, సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ● డీజే ఎంటర్టైన్మెంట్, లైవ్ బ్యాండ్ను ఎంజాయ్ చేయవచ్చు. ● అడ్వెంచర్ యాక్టివిటీస్, షాపింగ్మాల్స్, లైవ్ షోలు కూడా అలరిస్తాయి. ● టికెట్ తీసుకున్న ప్రతీ ఒక్కరికీ క్యాసినోలో ఎంట్రీ ఉచితం. ● లిక్కర్, ఇతర సర్వీసులకు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. క్యాసినో ఆడాలంటే.. రాష్ట్రంలో క్యాసినో ఆడేందుకు ప్రభుత్వం అనుమతి లేదు. ఇందుకు కొంత సమయం వేచి ఉండాల్సిందే. నౌక ప్రయాణం ప్రారంభమై 20 మైళ్లు వెళ్లిన తరువాత క్యాసినో ఆడేందుకు అవకాశం ఉంటుంది. -
ఇంజినీరింగ్ అసిస్టెంట్ల పడిగాపులు
మహారాణిపేట : బదిలీల కౌన్సెలింగ్ కోసం ఆదివారం ఉదయాన్నే జిల్లా పరిషత్ కార్యాలయానికి చేరుకున్న సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు సాయంత్రం వరకు పడిగాపులు పడ్డారు. తిండితిప్పలు లేకుండా జిల్లా పరిషత్ ఆవరణలో గట్లు మీద, ఖాళీ ప్రాంతాల్లో నిరీక్షించారు. కౌన్సెలింగ్కు ఎప్పుడు పిలుస్తారా అని ఎదురుచూశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 442 మంది ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఉన్నారు. ఇందులో 95 శాతం మంది ఐదేళ్లు సర్వీసు పూర్తయిన వారు ఉన్నారు. పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజినీర్ కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధికారులు ఆదివారం జిల్లా పరిషత్ కార్యాలయంలో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఉదయాన్నే కౌన్సెలింగ్ కేంద్రానికి చేరుకోగా సాయంత్రం వరకు పిలవలేదు. అసలు ఏమి జరుగుతుందో తెలియక ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఆందోళన చెందారు. కూటమి ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు పెద్ద సంఖ్యలో రావడంతో పంచాయతీరాజ్ ఎస్ఈ కె.శ్రీనివాసరావు, ఇతర ఇంజినీరింగ్ అధికారులు తర్జనభర్జన పడినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు అడిగిన పోస్టింగ్లు, ఇతర వ్యవహారాల వల్ల కౌన్సెలింగ్ జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. ఖాళీల జాబితా చివరి నిమిషం వరకు బయట పెట్టకపోవడంపై ఆందోళన వ్యక్తమైంది. కాగా సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ రాత్రి వరకు కొనసాగింది. తొలుత దివ్యాంగులు, స్పౌజ్, అనారోగ్య పీడితులకు కౌన్సెలింగ్ చేపట్టారు. ఆ తర్వాత కూటమి ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు బదిలీలు నిర్వహించారన్న ఆరోపణలు వచ్చాయి. కార్యదర్శుల కౌన్సెలింగ్లో గందరగోళం డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన వార్డు సంక్షేమ కార్యదర్శుల బదిలీ కౌన్సెలింగ్ ప్రక్రియ గందరగోళంగా మారింది. జీవీఎంసీ పరిధిలో 473 మంది కార్యదర్శులున్నారు. ఐదేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్నవారిని బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా యూసీడీ పథకం సంచాకులు పి.ఎం.సత్యవేణి ఆధ్వర్యంలో కార్యదర్శుల బదిలీ కౌన్సెలింగ్ ఆదివారం నిర్వహించారు. ప్రతి కార్యదర్శి మూడు ఆప్షన్లు ఇస్తే.. అందులో ఒకటి ఎంపిక చేసి పోస్టింగ్ ఇస్తామని అధికారులు తెలిపారు. ఒకే ఆప్షన్ ఇస్తే కౌన్సెలింగ్ ప్రక్రియ సులభతరమవుతుందని కార్యదర్శులు అడగడంతో అధికారులు ససేమిరా అన్నారు. కార్యదర్శులు పట్టువిడవలేదు. దీంతో అధికారులు, కార్యదర్శుల మధ్య గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యేలు, మంత్రులు సిఫార్సు లేఖలు తీసుకువచ్చిన వారికి అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారని కార్యదర్శులు ఆరోపిస్తున్నారు. సాయంత్రం వరకు ప్రారంభంకాని బదిలీల కౌన్సెలింగ్ భారీగా సిఫార్సు లేఖలు..పైరవీలకే పెద్దపీట -
ప్రకృతి సేద్యం.. లాభసాటి వ్యవసాయం
ప్రీ మాన్సూన్ షోయింగ్ సాగును పరిశీలిస్తున్న వ్యవసాయ అధికారులు ప్రకృతి సాగుపై అవగాహన జిల్లాలో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడంపై ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు, ప్రకృతి వ్యవసాయ అధికారులు నెల రోజులుగా అవగాహన కల్పిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో వివిధ రకాల పంటలను ఎక్కువగా నాతవరం మండలంలోని చిన గొలగొండపేట, పెద గొలుగొండపేట, ఎస్.బి.పట్నం, పి.కొత్తగూడెం, సరుగుడు, సుందరకోట, కె.వి.శరభవరం గ్రామాల్లో సాగు చేస్తున్నారు. గొలుగొండ, రోలుగుంట, రావికమతం, బుచ్చెయ్యపేట, చోడవరం, దేవరాపల్లి, చీడికాడ, కోటవురట్ల, పాయకరావుపేట, అనకాపల్లి, కశింకోట మండలాల్లో కూడా సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు.సాక్షి, అనకాపల్లి: రసాయనాలు విరివిగా వాడటంతో భూసారం క్షీణించడం.. పంటల దిగుబడి తగ్గిపోవడం.. రైతు నష్టాలపాలై దిగులు చెందడం కనిపిస్తోంది. ఇది వినియోగదారుల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో రైతులు ముందుగానే చీడపీడల నుంచి తమ పంటను కాపాడుకునే విధంగా వారిని ప్రకృతి సేద్యం వైపు మళ్లించే ప్రయత్నం జరుగుతోంది. ఈమేరకు ప్రకృతి వ్యవసాయ విభాగం సిబ్బంది, ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేసే విధానం, విత్తనశుద్ధి గురించి వివరిస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడని పంట విత్తనాలు, దేశవాళీ విత్తనాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 24 మండలాల్లో 165 గ్రామ పంచాయతీల్లో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం విస్తృతం చేస్తున్నారు. బీజామృతంతో ఎంతో మేలు ప్రకృతి వ్యవసాయంలో విత్తనాల ఎంపిక ఎంతో ముఖ్యమైన ప్రక్రియ. దేశవాళీ విత్తనాలను సేకరించి, వాటిని శుద్ధి చేసి విత్తుకున్నప్పుడే చీడపీడల బెడద లేకుండా పంట దిగుబడి బాగుంటుంది. తెగుళ్ల బెడద నుంచి పంటను రక్షించుకునేందుకు విత్తే సమయంలోనే బీజామృతంతో శుద్ధి చేసుకోవాలి. భూమి నుంచి సంక్రమించే తెగుళ్లను నిరోధించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆవు మూత్రం, పేడ, పొడి సున్నం, పొలం గట్టు మీద మట్టి లేదా దోసెడు పుట్టమన్నుతో బీజామృతాన్ని తయారు చేస్తారు. విత్తనాలను ప్లాస్టిక్ కాగితంపై పోసి తగినంత బీజామృతం పోసి కలపాలి. విత్తనాలకు బీజామృతం బాగా పట్టిన తర్వాత కొద్దిసేపు నీడన ఆరబెట్టుకొని విత్తుకోవచ్చు. నారును, మొక్కలను కూడా బీజామృతంలో ముంచి నాటుకోవచ్చు. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ సాగు ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) విధానంలో తొలకరి చినుకులు పడక ముందే సాగు ప్రక్రియను ప్రారంభిస్తారు. వివిధ రకాల పంటలను (నవధాన్యాలు, ఇతర విత్తనాలు) కలిపి విత్తుతారు. పచ్చిరొట్ట, ధాన్యపుజాతి, పప్పుజాతి, నూనెజాతి, సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతి ఇలా 30 రకాల విత్తనాలు వేయడం ద్వారా భూమి సారవంతంగా తయారవుతుంది. ఈ పీఎండీఎస్ అవశేషాలను భూమిలో కలియదున్నడం వల్ల రసాయనిక ఎరువులైన డీఏపీలో ఉన్న అన్ని రకాల పోషకాలు అందుతాయి. దీని ద్వారా వానపాములు అభివృద్ధి చెంది భూమి గుల్లబారుతోంది. ప్రకృతి వ్యవసాయంలో పండించే ధాన్యంతో భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా ఉంటాయి. జిల్లాలో 52 వేల ఎకరాల్లో సాగు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ఇప్పటికే 47 వేల ఎకరాల వరకు చేశారు. ఈ నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో పీఎండీఎస్ పూర్తికానుంది. ‘బీజామృతం’తో విత్తనశుద్ధి ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ సాగుతో నేల సారవంతం రైతుకు అధిక దిగుబడి.. వినియోగదారులకు ఆరోగ్యం సేంద్రియ వ్యవసాయం పెంపునకు అధికారుల ప్రయత్నం సేంద్రియ పద్ధతితో అందరికీ మేలు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం వల్ల వినియోగదారుల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. ఎరువులు, పురుగు మందులు వేసి పండించే పంటల కారణంగా క్యాన్సర్కు గురవుతున్నారు. ఈ ఏడాది ప్రకృతి వ్యవసాయ సాగు పెంచాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయంలో పీఎండీఎఫ్ (ప్రీ మాన్సూన్ షోయింగ్) విత్తనాలతో మొదటి దశ ప్రారంభించాం. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసే ముందు భూమి ఎండిపోకుండా, భూసారం పెరిగేలా నవధాన్యాలను విత్తుతారు. దీంతో రైతుకు లాభసాటిగా వ్యవసాయం ఉంటుంది. ఈ ఏడాదిలో ప్రకృతి వ్యవసాయం విస్తృతం చేసేందుకు కృషి చేస్తున్నాం. – లచ్చన్న, జిల్లా ప్రకృతి వ్యవసాయాధికారి -
మాచ్ఖండ్ మిలమిల
ఆంధ్రా ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్జలవిద్యుత్ కేంద్రం పూర్తిస్థాయి ఉత్పాదన దిశగా అడుగులు వేస్తోంది. ప్రాజెక్ట్ సిబ్బంది రేయింబవళ్లు పనిచేస్తూ ఆరు యూనిట్లలో ఐదింటిని వినియోగంలోకి తెచ్చారు. మిగతా యూనిట్లో కూడా విద్యుత్ ఉత్పత్తి చేపట్టేలాఇరు రాష్ట్రాల అధికారులు శ్రమిస్తున్నారు. ముంచంగిపుట్టు: మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో ఉత్పాదన గాడిలో పడుతోంది. కొంతకాలంగా తరచూ జనరేటర్లు మొరాయిస్తుండటంతో ప్రాజెక్టు ఉద్యోగులు అవస్థలు పడుతూ వచ్చారు. మరోపక్క నీటి సమస్య కూడా ఉత్పాదనకు ఆటంకం కలిగించింది. ఇప్పుడు ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ప్రాజెక్ట్ జలాశయాల నీటిమట్టాలు కూడా మెరుగుపడుతున్నాయి. అధికారులు, సిబ్బంది రేయింబళ్లు శ్రమించి ప్రాజెక్ట్లోని ఆరు యూనిట్లలో ఐదింటిని వినియోగంలోకి తెచ్చారు. ప్రస్తుతం 1,2,3,5,6 జనరేటర్ యూనిట్ల ద్వారా 97 మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. నాలుగో నంబరు జనరేటర్కు మరమ్మతులు జరుగుతున్నాయి. దీనిని కూడా వినియోగంలోకి తెచ్చేందుకు కృషి జరుగుతోందని ప్రాజెక్ట్ అధికారవర్గాలు తెలిపాయి. ఆరు జనరేటర్లు పనిచేస్తే 120 మెగావాట్ల మేర ఉత్పాదన జరుగుతుందని పేర్కొన్నాయి. జనరేటర్లు మరమ్మతుల కారణంగా దాదాపుగా 15 ఏళ్లుగా విద్యుత్ ఉత్పాదన కుంటుపడింది. 2023 ఆగస్టులో మాత్రమే ప్రాజెక్ట్లోని ఆరు జనరేటర్లు పనిచేయడం వల్ల పూర్తిస్థాయిలో 120 మెగా వాట్ల విద్యుత్ ఉత్పాదన సాధ్యమైంది. అప్పటిలో రెండు నెలల మాత్రమే పూర్తిగా జనరేటర్లు పనిచేశాయి. ఆ తరువాత నుంచి మొరాయింపుతో ఉత్పాదన తగ్గిపోయింది. కొద్ది నెలల క్రితం వరకు 68 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి జరిగేది. అధికా రులు సిబ్బంది కృషి వల్ల 97 మెగావాట్లకు చేరింది. జలాశయాల్లోకి వరద నీరుమాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరు అందించే డుడుమ,జోలాపుట్టు జలాశయాల్లో నీటిమట్టాలు పెరుగుతున్నాయి. ఆంధ్రా , ఒడిశా సరిహద్దు గ్రామాల్లో నెల రోజలుగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో రెండు జలాశయాల్లో భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. » డుడుమ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 2,590 అడుగులు కాగా బుధవారం నాటికి 2,579 అడుగులుగా నమోదు అయింది. » జోలాపుట్టు జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 2,750 అడుగులు కాగా మంగళవారం నాటికి 2,725 అడుగులుగా నమోదు అయింది. గత ఏడాది ఇదే రోజు 2,697 అడుగుల మేర నీరు ఉంది.మాచ్ఖండ్ ప్రాజెక్ట్ వివరాలుమొత్తం యూనిట్లు : 6 పనిచేస్తున్నవి : 5 మొత్తం సామర్థ్యం : 120 మెగావాట్లు ప్రస్తుత ఉత్పాదన : 97 మెగావాట్లు కొద్దిరోజుల్లో పూర్తిస్థాయి ఉత్పాదన డుడుమ, జోలాపుట్టు జలాశయాల్లో గతంలో నీటి నిల్వలు తక్కువగా ఉండడంతో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం నీటి నిల్వలు పెరుగుతున్నందున విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నీరు అందుబాటులో ఉంది. నాలుగో నంబరు జనరేటర్ను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కొద్దిరోజుల్లో పూర్తిస్థాయి ఉత్పాదనకు ఆస్కారం ఉంది. – ఏవీ సుబ్రమణ్యేశ్వరరావు, ఎస్ఈ,మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం -
ప్రాణాలకు తెగిస్తేనే పాఠాలు
గుండె తరుక్కుపోయే కఠిన వాస్తవం.. చదువు కోసం చిన్నారులు ప్రాణాలకు తెగించి చేస్తున్న ప్రమాదకర ప్రయాణం.. పడవపై రైవాడ జలాశయం దాటి, కొండలు గుట్టల్లో నడిచి, పొరుగు జిల్లా పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న బాలల సాహస కృత్యం.. వారి దీనావస్థ కఠిన హృదయులను సైతం కదిలిస్తుంది.. గిరిజన ప్రాంతంలో పుట్టిన పాపానికి ఆ అడవి బిడ్డలు పడుతున్న కష్టం పగవారికి కూడా వద్దనిపిస్తుంది. దేవరాపల్లి: రైవాడ జలాశయానికి ఆవల.. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పరిధిలోని గిరిజన ప్రాంతం ఉంది. పినకోట పంచాయతీ శివారు సొలబొంగు గ్రామానికి చెందిన బాలలు చదువు కోసం ప్రాణాలకు తెగించి, అక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. రహదారి, పాఠశాల లేకపోవడంతో ఈ గ్రామానికి చెందిన 12 మంది విద్యార్థులు అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండల పరిధిలోని తామరబ్బ ఎంపీయూపీ పాఠశాలకు పడవపైన, కాలినడకన వచ్చి చదువుకుంటున్నారు. సొలబొంగు నుంచి తామరబ్బకు చేరుకోవాలంటే రెండు మార్గాలు. వీరభద్రపేట మీదుగా పొలాల గట్లపై జారు బురదలో సుమారు 5 కిలోమీటర్ల మేర కాలినడకన చేరుకోవాలి. వర్షం పడితే ఈ మార్గంలో రాకపోకలు సాగించడం కష్టం. దీనికి ప్రత్యామ్నాయంగా సొలబొంగు నుంచి నాటు పడవపై రైవాడ జలాశయంలో సుమారు 3 కిలోమీటర్ల మేర ప్రయాణించి, దేవరాపల్లి మండల పరిధిలోని లోవ ముకుందపురం గ్రామానికి చేరుకొని.. అక్కడి నుంచి మళ్లీ ఒక కిలోమీటరు మేర చెట్లు, పుట్టల గుండా కర్రలు చేత పట్టుకొని ప్రయాణించి తామరబ్బ పాఠశాలకు చేరుకోవాలి. ప్రస్తుతం వర్షాలు కురవడంతో విద్యార్థులు పడవపైనే పాఠశాలకు రాకపోకలు సాగిస్తున్నారు. వారు తిరిగి ఇంటికి చేరుకునే వరకు తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. ప్రమాదమని తెలిసినా గత్యంతరం లేని పరిస్థితుల్లో పాఠశాలకు పంపిస్తున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరభద్రపేట రోడ్డు నిర్మాణ పనులను అసంపూర్తిగా నిలిపివేయడంతో తమకు మరిన్ని కష్టాలు వెంటాడుతున్నాయని సొలబొంగు గ్రామస్తులు వాపోతున్నారు. ఈ గ్రామంలో 16 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. సుమారు 70 మంది వరకు జనాభా ఉన్నారు. ప్రస్తుతం 12 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గ్రామస్తులు సైతం నిత్యావసర సరకుల కోసం పడవపైన, లేదా వీరభద్రపేట మీదుగా తామరబ్బ వైపునకు చేరుకోవాల్సిన పరిస్థితి. ఈ గ్రామానికి చెందిన గర్భిణులు ఆసుపత్రికి చేరుకోవాలంటే సుమారు 15 కిలోమీటర్ల దూరంలోని దేవరాపల్లి ఆసుపత్రే దిక్కు. దారీ తెన్నూ లేదు మా గ్రామానికి దారీ తెన్నూ లేదు. మా గ్రామంలో బడి లేక పిల్లల్ని దేవరాపల్లి మండలంలోని తామరబ్బ స్కూల్కు పంపిస్తున్నాం. నా కుమార్తె అంజలి 4వ తరగతి చదువుతోంది. సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు పొలాల గట్ల మీదుగా తుప్పలు, డొంకలను దాటుకుంటూ నడిచి వెళ్తున్నారు. వర్షం కురిస్తే కాలినడక మార్గం బురదమయంగా మారుతుంది. ప్రభుత్వం స్పందించి మా పిల్లలు పడుతున్న కష్టాలను తీర్చాలి. – దిప్పల దేముడుబాబు, విద్యార్థిని తండ్రి, సొలబొంగు ప్రభుత్వం స్పందించాలి మాకు ఎలాగూ చదువు లేదు.. మా పిల్లలనైనా చదివించాలని ఆశ పడుతున్నాం. నా కూతురు శివజ్యోతి ఒకటో తరగతి చదువుతోంది. ప్రస్తుత వర్షాలకు వీరభద్రపేట మార్గం అడుగు తీసి అడుగు వేయలేని విధంగా బురదమయంగా మారింది. ప్రమాదమని తెలిసినా తప్పని పరిస్థితుల్లో నాటు పడవలపై పిల్లలను లోవ ముకుందపురం వరకు పంపిస్తున్నాం. ప్రభుత్వం స్పందించి మా గ్రామానికి బడి, రోడ్డు సౌకర్యం కల్పించి ఆదుకోవాలి. –గమ్మెల రాజు, విద్యార్థిని తండ్రి, సొలబొంగు -
కొమ్మింగి ఘాట్లో ఆటో బోల్తా
చింతపల్లి: మండలంలోని కొమ్మింగి ఘాట్ రోడ్డులో ప్రయాణికులతో వస్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం కొమ్మింగి నుంచి ప్రయాణికులతో బయలుదేరిన చింతపల్లి బయలు దేరిన ఆటో మార్గం మధ్యలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సమయంలో ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణికుల్లో నలుగురికి తీవ్రంగా, మరో నలుగురికి స్వల్పంగా గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకురావడంతో అత్యవసవర వైద్యం అందించారు. తీవ్ర గాయాలైన కుడుముల దేవమ్మ, పాంగి చంద్రమ్మ, పాంగి పెద్దమ్మ, పాంగి జానికమ్మను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నలుగురికి తీవ్ర గాయాలు నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలింపు -
ఆక్రమణల తొలగింపులో తాత్సారం
పాడేరు : జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంతో పాటు ఏజెన్సీలోని మండల కేంద్రాల్లో ఆక్రమణల తొలగింపులో కోర్టు తీర్పును అమలు చేయకుండా జిల్లా అధికారులు తాత్సారం చేస్తున్నారని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆక్రమణలను ఎనిమిది వారాల్లో తొలగించాలన్న కోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదన్నారు.ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని, దీని వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి కుంటిసాకులు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఐదో షెడ్యూల్ ప్రాంతమైన ఏజెన్సీలో రోజురోజుకు అక్రమ కట్టడాలు, నిర్మాణాలు పెచ్చుమీరుతున్నా అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. పాడేరు పట్టణంలో ఆక్రమణల తొలగింపు చేపడితే టీడీపీ నేతలకు చెందిన దుకాణాలకు కొంతమేర నష్టం జరుగుతుందని భావించిన జిల్లా ఉన్నతాధికారులు మెజారిటీ ప్రజల నిర్ణయాన్ని, కోర్టు ఆదేశాలకు అమలు చేయకుండా వారికి అండగా నిలవడం సరికాదన్నారు. మొదటి శనివారం అక్రమణల తొలగింపు అని హడావుడి చేసిన జిల్లా ఉన్నతాధికారులు కేవలం 12 దుకాణాలను మాత్రమే తొలగించి మిగిలినవి ఎందుకు తొలగించడం లేదన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రతి శనివారం ఆక్రమణలను తొలగిస్తామని చెప్పిన కలెక్టర్ ఆ తర్వాత ఎందుకు ఆక్రమణల తొలగింపు ప్రక్రియను నిలిపివేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆక్రమణలు పెచ్చుమీరిన కారణంగా రోడ్డు ఇరుకుగా ట్రాఫిక్ జామ్ ఎక్కువవుతోందన్నారు. పట్టణంలో ఎక్కడా కూడా పార్కింగ్ స్థలాలు లేవన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఆక్రమణల తొలగింపునకు మరో మూడు వారాలే గడువు ఉందన్నారు. ఈ వ్యవహారంపై కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని ఆక్రమణల తొలగింపు ప్రక్రియను కొనసాగించి పట్టణ రహదారి విస్తరణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో స్థానిక గిరిజనులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గడం బాధాకరం కోర్టు ఆదేశాలు పాటించకపోవడం అన్యాయం ఇప్పటికై నా స్పందించకుంటే గిరిజనులతో ఉద్యమం పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు హెచ్చరిక -
విదేశాలలో పూర్వ విద్యార్థుల సంఘాలు
మద్దిలపాలెం: విదేశాలలో ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఏయూ ఉపకులపతి ఆచార్య జీపీ రాజశేఖర్ ప్రకటించారు. శనివారం బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్), ఆంధ్ర విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన ‘ఎగ్జిట్ ఎంగేజ్మెంట్ ఈవినింగ్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విదేశీ విద్యార్థులతో ఏయూ ప్రయాణం విశ్వవిద్యాలయానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిందని అన్నారు. ఏయూ పూర్వ విద్యార్థులుగా విదేశాల్లో విశ్వవిద్యాలయం ఖ్యాతిని పెంచే విధంగా పనిచేయాలని ఆయన సూచించారు. విదేశీ విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఐసీసీఆర్ స్కాలర్షిప్ విభాగం డైరెక్టర్ సంజీవ్ వేది మాట్లాడుతూ, ఏయూలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న విదేశీ విద్యార్థులు తమతో పాటు భారతీయతను తీసుకువెళుతున్నారని అన్నారు. ఐసీసీఆర్ అందించే స్కాలర్షిప్ల గురించి ఇతర దేశాల్లోని విద్యార్థులకు వివరించి, మరింత మందికి ఉపయోగపడాలని సూచించారు. ఏయూ అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల విభాగం డీన్, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్.ధనుంజయరావు మాట్లాడుతూ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 59 దేశాల నుంచి 1,100 మందికి పైగా విదేశీ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నా రని తెలిపారు. వారికి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు ఏయూతో తమ అనుబంధాన్ని, విశాఖ నగరం, తెలుగు ప్రజల అభిమానాన్ని గుర్తు చేసుకుంటూ తమ అనుభూతులను పంచుకున్నారు. అనంతరం వారికి అల్యూమ్ని కార్డులు అందజేశారు. వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు తమ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు తమ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఐసీసీఆర్ జోనల్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్, అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల విభాగం అసోసియేట్ డీన్ ఆచార్య ఎన్.ఎం. యుగంధర్ ప్రిన్సిపాల్స్ ఆచార్య ఏ. నరసింహారావు, ఎంవీఆర్ రాజు, జి. గిరిజ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఏయూకు అంతర్జాతీయంగా గుర్తింపు మౌలిక వసతులను అభివృద్ధి చేస్తాం ఎగ్జిట్ ఎంగేజ్మెంట్ ఈవినింగ్ కార్యక్రమంలో ఏయూ వీసీ రాజశేఖర్ -
చంద్రబాబు అబద్ధపు వాగ్దానాలతో ప్రజలకు కష్టాలు
ఎటపాక: అధికారంలో రావాలనే కాంక్షతో చంద్రబాబు, పవన్కళ్యాణ్ ఇచ్చిన అబద్ధపు వాగ్దానాలతో ప్రజలు కష్టాలు పడుతున్నారని ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి నాగులపల్లి ధనలక్ష్మి విమర్శించారు. శనివారం మండలంలోని పురుషోత్తపట్నంలో జరిగిన పార్టీ మండల కార్యకర్తల సమావేశానికి వారు హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో గెలవాలనే తపనతో ప్రమాణాలు చేస్తూ పథకాల ఆశ చూపి ఇంటింటికి బాండు పత్రాలు పంచి మోసం చేశారన్నారు. ఏడాది కాలంగా సంక్షేమం, అభివృద్ధి లేకుండా చేసి ప్రజలను కష్టాల పాల్జేశారని విమర్శించారు. ఆడబిడ్డ నిధి, మహిళలకు ఏడాది సాయం, రైతన్నలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నేటికి అమలు చేయలేదన్నారు. తల్లికి వందనం సవాలక్ష నిబంధనలు పెట్టి పూర్తిస్థాయిలో ఇవ్వలేదన్నారు. ఏడాది పాలనలో ఇంత ప్రజావ్యతిరేకత మూటకట్టుకున్న ప్రభుత్వం ఇప్పటివరకు ఏదీ లేదన్నారు. అబద్ధపు హామీలు, తప్పుడు మాటలు చెప్పే నైజం జగన్ది కాదన్నారు. పార్టీ కోసం కార్యకర్తలు ఎంతో కృషి చేశారని వారికి ఏకష్టమొచ్చినా అండగా ఉంటామని కార్యకర్తల జోలికి అధికార పార్టీ నేతలు వస్తే చూస్తూ ఊరుకోమని అనంతబాబు హెచ్చరించారు. రానున్న రోజుల్లో పార్టీ మరింత పటిష్టతకు కృషిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాక కామేశ్వరి, ఎంపీటీసీలు గొంగడి వెంకట్రామిరెడ్డి, అంజలి, వెంకటరమణ, కమల, సర్పంచ్లు, ఇంగిలపు బేబి, గుండి సీతాలక్ష్మి, రాంబాబు, ఆదినారాయణ, కృష్ణ, పార్టీ మండల అధ్యక్షుడు ఆకుల వెంకటరామారావు, పార్టీ ప్రతినిధులు దామెర్ల రేవతి, కురినాల వెంకట్, మంత్రిప్రగడ నర్సింహరావు, ఆవుల మరియాదాసు, కృష్ణబాబు, మోసం కన్న, నవీన్, రాము, నాగేశ్వరావు, జయచంద్రారెడ్డి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి విమర్శ -
బడి కష్టాలపై కదలిక
దేవరాపల్లి: అనంతగిరి మండల పరిధిలోని పినకోట పంచాయతీ శివారు సొలబొంగి గిరిజన విద్యార్థులు చదువుల కోసం పడుతున్న ఇబ్బందులపై అధికారుల్లో కదలిక వచ్చింది. పడవలపై, బురద రోడ్డులో ప్రమాదకర ప్రయాణం చేస్తూ చదువులు సాగించడంపై సాక్షిలో ‘ప్రాణాలకు తెగిస్తేనే పాఠాలు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. చిన్నారులు, వారి తల్లిదండ్రులు చేతులు జోడించి వేడుకుంటున్న చిత్రం కూడా సాక్షి ప్రధాన సంచికలో ప్రచురితమైంది. ఈ కథనాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. అక్కడి పరిస్థితిని స్వయంగా పరిశీలించి స్థానిక విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. వారి ఆదేశాలతో అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి జి.అప్పారావునాయుడు, అల్లూరి జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు కోఆర్డినేటర్ లెఫ్టినెంట్ డా.వి.స్వామినాయుడు, రెండు జిల్లాలకు చెందిన అధికారులతో కూడిన బృందం శనివారం అటవీ ప్రాంతం గుండా బురదమయంగా మారిన రహదారి, పొలాల గట్ల మీదుగా 5 కిలోమీటర్ల దూరం నడిచి అతి కష్టం మీద సొలబొంగి గ్రామానికి చేరుకుంది. దూరదూరంగా ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని 13 మంది విద్యార్థులు అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తామరబ్బ ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతుండగా మరో నలుగురు అర్ధంతరంగా చదువు మానేసినట్లు గుర్తించారు. ఈ వివరాలను అక్కడి నుండే అల్లూరి జిల్లా కలెక్టర్కు సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు తెలియజేశారు. పరిష్కారానికి తక్షణ నిర్ణయాలు అల్లూరి కలెక్టర్ ఆదేశాలతో ఒకటి, రెండు తరగతులు చదువుతున్న 8 మంది అక్కడే చదువుకునే విధంగా ఎన్ఆర్ఎస్టీసీ (నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్) ఏర్పాటు చేసి విద్యా వలంటీర్ ద్వారా విద్యాబోధన అందిస్తామని ఏపీసీ తెలిపారు. అలాగే 3 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న ఐదుగురు విద్యార్థులతోపాటు బడి మానేసిన నలుగురు విద్యార్థులను పినకోట, జీనబాడులోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ సంక్షేమ పాఠశాలలో చేర్పించనున్నట్లు తెలిపారు. వీరభద్రపేట నుంచి సొలబంగి వరకు తాత్కాలికంగా పొక్లెయిన్తో మట్టి రహదారి చదును చేసే పనులను గిరిజన సంక్షేమ శాఖ ఈఈ వేణుగోపాల్, ఏఈఈ గణేష్ దగ్గరుండి చేపట్టారు. అంతకు ముందు దేవరాపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తామరబ్బ యూపీ స్కూల్ను సందర్శించారు. వీరి వెంట అనంతగిరి మండల ఏటీడబ్ల్యూవో కె.వెంకటరమణ, ఎంఈవో కె.బాలాజీ, దేవరాపల్లి మండల ఎంఈవోలు సిహెచ్.ఉమ, వి.ఉషారాణి, తామరబ్బ, పినకోట సర్పంచ్లు టోకురి రామకృష్ణ, ఎస్.గణేష్ ఉన్నారు. మానవత్వం చాటిన డీఈవో సొలబొంగి మారుమూల గిరిజన గ్రామంలో పర్యటించిన అనకాపల్లి డీఈవో జి.అప్పారావునాయుడు మానవత్వం చాటారు. సొలబొంగి గ్రామంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన గమ్మెల రమణను దత్తత తీసుకున్నారు. ఉన్నత చదువులకు తాను అండగా నిలుస్తానని భరోసా కల్పించారు. సొలబొంగి గ్రామాన్ని సందర్శించిన అల్లూరి, అనకాపల్లి జిల్లాల అధికారులు ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తున్న విద్యార్థుల కష్టాలపై సాక్షి కథనాలకు స్పందన విద్యాశాఖ మంత్రి ఆదేశంతో ఐదు కి.మీ. కాలినడకన చేరుకున్న అధికారులు ఒకటి, రెండు తరగతి విద్యార్థులకు ఎన్ఆర్ఎస్టీసీ ద్వారా విద్యాబోధనకు ఆదేశాలు 3–5 తరగతుల విద్యార్థులను, బడిమానేసిన వారిని ఆశ్రమ పాఠశాలల్లో చేర్పించేందుకు నిర్ణయం సొలబొంగికి పొక్లెయిన్తో తాత్కాలిక రహదారి చదును పనులు ప్రారంభం -
ఉదయాన్నే పారిశుధ్య పర్యవేక్షణ సరికాదు
పాడేరు : గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రతి రోజు ఉదయం 6గంటలకు గ్రామాలకు వెళ్లి పారిశుధ్య పనులు పర్యవేక్షించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని ఏపీ పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ ప్రతినిధులు హెచ్చరించారు. ఈ మేరకు శనివారం జిల్లావ్యాప్తంగా పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శులంతా రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ విధులను బహిష్కరించారు. వీరంతా కలెక్టరేట్కు వచ్చారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో డీఆర్వో పద్మలతను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం ఆరు గంటలకు గ్రామాలకు వెళ్లి చెత్త సేకరణ, క్లోరినేషన్ ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలని చెప్పడం సరైన నిర్ణయం కాదన్నారు. తామంతా చిత్తశుద్ధితో విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం కానీ ఇలాంటి చెత్త పనులు అప్పగిస్తే తాము విధులు నిర్వహించలేమన్నారు. పని భారంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందన్నారు. కుటుంబ సభ్యులు, పిల్లలతో గడిపే సమయం మాకు ఇవ్వరా అని ప్రశ్నించారు. ఇప్పటికే చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్న తమకు అదనపు పనులు అప్పగిస్తే ఎలా పని చేసేదని ప్రశ్నించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. గ్రామాలకు 6 గంటలకు వెళ్లాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం ఏపీ పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ ప్రతినిధుల హెచ్చరిక సర్కారు తీరుని నిరసిస్తూ విధుల బహిష్కరణ డీఆర్వో పద్మలతకు వినతిపత్రం అందజేత -
పయనమెలా?
పొరుగు రాష్ట్రాలకుగోదావరి, శబరి వరదలకు.. ఏటా గోదావరి, శబరి వరదల సమయంలో కూడా జాతీయ రహదారులు ముంపునకు గురవుతుండటంతో సుమారు 30 గ్రామాల ప్రజలు రాకపోకల సమస్య ఎదుర్కొంటున్నారు. వరద నీరు జాతీయ రహదారులను ముంచెత్తడతో ఆంధ్రా నుంచి తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి.● పోలవరం ప్రాజెక్ట్ ముంపులో జాతీయ రహదారులు ● రాష్ట్ర రహదారుల పరిస్థితి ఇంతే ● ప్రత్యామ్నాయ మార్గాలపై స్పష్టత కరవు ● గోదావరి, శబరి వరదల సమయంలో తప్పని అవస్థలు చింతూరు: పొరుగు రాష్ట్రాలకు వెళ్లే రహదారులు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ముంపునకు గురవుతున్నా ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటుపై ఇప్పటికీ స్పష్టత లేదు. చింతూరు డివిజన్లో గ్రామాలు, రహదారులతోపాటు ప్రధానంగా పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలను కలుపుతున్న జాతీయ రహదారులు కూడా ముంపునకు గురి కానున్నాయి. ● పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 41.15 కాంటూరు లెవెల్లో చింతూరు డివిజన్లో 43 గ్రామాలు, 45.72 కాంటూరు లెవెల్లో సుమారు 190 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ● ఆంధ్రా నుంచి తెలంగాణ, ఛత్తీస్గఢ్కు వెళ్లే జాతీయ రహదారి–30తో పాటు ఆంధ్రా నుంచి ఒడిశా వెళ్లే జాతీయ రహదారి–326 ముంపునకు గురవుతోంది. ● జాతీయ రహదారి–30 ఏటా వచ్చే వరదలకు భద్రాచలం వైపు చింతూరు మండలం చట్టివద్ద, ఎటపాక మండలం నెల్లిపాక వద్ద, ఛత్తీస్గఢ్ వైపు చిడుమూరు వద్ద మునిగిపోతోంది. జాతీయ రహదారి–326 కూడా ఒడిశా వైపు చింతూరు మండలం కుయిగూరు, కల్లేరు వద్ద కూడా అదే పరిస్థితి. దీనివల్ల రోజుల తరబడి రాకపోకలు నిలిచిపోయి వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ● చింతూరు డివిజన్లో చింతూరు నుంచి వీఆర్పురం, చింతూరు మండలం చట్టి నుంచి కూనవరం, కూనవరం నుంచి ఎటపాక మండలం నెల్లిపాక మీదుగా భద్రాచలం వెళ్లే రహదారులకు ముంపు తప్పడం లేదు. వీటితోపాటు చింతూరు నుంచి చట్టి, కూనవరం నుంచి వీఆర్పురం వెళ్లే రహదారి కూడా పోలవరం ముంపునకు గురవుతున్నాయి. ● పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఆయా జాతీయ రహదారులు ముంపునకు గురైతే పొరుగు రాష్ట్రాలకు వెళ్లేందుకు తప్పనిసరిగా ప్రత్యామ్నాయ రహదారులు నిర్మించాల్సి ఉంది. జాతీయ రహదారి–30లో భద్రాచలం వైపు చింతూరు మండలం చట్టి నుంచి సింగన్నగూడెం, ఛత్తీస్గఢ్ వైపు వీరాపురం నుంచి చిడుమూరు, ఎటపాక మండలంలో నెల్లిపాక, రాయనపేట, చోడవరం ప్రాంతాల్లో పోలవరం నీరు ముంచెత్తుతోంది.పోలవరం ప్రాజెక్ట్ వల్ల మునిగిపోనున్న ఆంధ్రా నుంచి తెలంగాణ, ఛత్తీస్గఢ్కు వెళ్లే జాతీయ రహదారి–30ప్రత్యామ్నాయం ఆలోచిస్తాం జాతీయ రహదారులు ఎక్కడైనా పోలవరం ముంపునకు గురయ్యే అవకాశముంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచిస్తాం. ప్రస్తుతం ఆంధ్రా నుండి ఒడిశా వెళ్లేందుకు నిర్మిస్తున్న జాతీయ రహదారి–326 ఎత్తులో ఉండేలా నిర్మిస్తున్నాం. ఇందుకు కుయిగూరు వద్ద వంతెన నిర్మాణం చేపట్టాం. ఆంధ్రా నుంచి తెలంగాణ, ఛత్తీస్గఢ్కు వెళ్లే జాతీయ రహదారి–30 కూడా ముంపునకు గురికాకుండా 45.72 కాంటూరు లెవెల్ కంటే ఎత్తులో ప్రణాళికతో చేపడుతున్నాం. – చక్రవర్తి, ఏఈ, జాతీయ రహదారిరాకపోకలు ఎలా సాగించాలి? చింతూరు, కూనవరం మండలాల మధ్య ఉన్న మా పంచాయతీలో పలు గ్రామాలు పోలవరం ముంపులో లేవు. మా పక్కనే ఉన్న రహదారులు ముంపులో ఉంటే మేము ఇతర ప్రాంతాలకు ఎలా రాకపోకలు సాగించాలి. దీనిపై స్పష్టత ఇవ్వాలి. ముచ్చిక నాగార్జున, కుమ్మూరు సర్పంచ్, చింతూరు మండలం రహదారులు నిర్మించాలి పోలవరం పూర్తయితే అటు చింతూరు, ఇటు నెల్లిపాక వద్ద రెండువైపులా జాతీయ రహదారి మునిగిపోతోంది. జాతీయ రహదారి మధ్యలో ఉన్న మా గ్రామంతో పాటు ఇతర గ్రామాలకు ముందుగానే రహదారులు నిర్మించాలి. – భూక్యా బాబూరావు, ఉపసర్పంచ్, ఏడుగురాళ్లపల్లి, చింతూరు మండలం -
ఆక్రమిత స్థలాలను ఖాళీ చేయించాల్సిందే
కలెక్టర్ దినేష్కుమార్చింతపల్లి: మండల కేంద్రం చింతపల్లిలో ఆక్రమిత ప్రభుత్వ స్థలాలను కచ్చితంగా ఖాళీ చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు. శనివారం ఆయన స్థానిక మండల పరిషత్, తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించారు. రికార్డులను తనిఖీ చేశారు. ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాల్లో ఆక్రమిత దుకాణాలను, స్థలాలను కచ్చితంగా ఖాళీ చేయించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. మ్యూటేషన్ కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణ పరిధిలోని పాత రేకులు భవనం, కార్యాలయాన్ని ఆనుకుని ఉన్న బడ్డీలను వెంటనే తొలగించాలని తహసీల్దార్ రామకృష్ణకు సూచించారు. అంతేకాకుండా ప్రధాన రహదారి నుంచి కార్యాలయానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో చింతపల్లిలో డబుల్ రోడ్డు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఇప్పటికే మండల కేంద్రంలో స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించడం అభినందనీయమన్నారు. హనుమాన్ జంక్షన్ నుంచి పాత బస్టాండు వరకు రోడ్డుతో పాటు డివైడర్, డ్రైనేజీ, కాలినడక బాటతో కలిపి 70 అడుగుల రోడ్డు అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో ఇళ్లు కోల్పోతే బాధిత గిరిజనులు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కనాల నాగ వెంకట సతీష్, ఎంపీడీవో శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్, ఆర్ఐ కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
మత్స్యావతారంలో జగన్నాథుడు
డాబాగార్డెన్స్(విశాఖ): టర్నర్ చౌల్ట్రీలో కొలువైన జగన్నాథస్వామి శనివారం మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నగరం నుంచేకాక ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం 5 నుంచి 6 వరకు స్వామివారికి మేలుకొలుపు, నాదస్వరం కార్యక్రమాలు జరిగాయి. అనంతరం 6–7 గంటల వరకు నిత్యపూజ నిర్వహించారు. ఉదయం 7–9:30 గంటల వరకు జగన్నాథస్వామి ప్రార్థనా సంఘం ఆధ్వర్యంలో ప్రార్థనా తరంగిణి కార్యక్రమం జరిగింది. 9.30 –10:30 వరకు సామూహిక లలితా సహస్రనామ పారాయణ నిర్వహించారు. మధ్యాహ్నం 3:30 – సాయంత్రం 5 గంటల వరకు సామూహిక భగవద్గీత, విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం 6 –రాత్రి 9:30 గంటల వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జగన్నాథస్వామి ఆలయ కార్యనిర్వాహణాధికారి టి. రాజగోపాల్రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ఫెస్టివల్ ఆఫీసర్ టి. అన్నపూర్ణతో పాటు పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. -
ఉన్నతాధికారి రాకతోతెరచుకున్న గ్రంథాలయం
ముంచంగిపుట్టు: మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయం ఎట్టకేలకు తెరచుకుంది. ఐటీడీఏ క్వార్టర్ల నుంచి నూతన భవనంలోకి మార్చినప్పటి నుంచి సక్రమంగా తెరుచుకోవడం లేదు. దీంతో పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి.కుమార్రాజు స్థానిక గ్రంథాలయానికి తనిఖీ నిమిత్తం రావడంతో గ్రంథాలయం తలుపులు తెరచుకున్నాయి. రికార్డులు తనిఖీ చేసిన ఆయన పాఠకుల సంఖ్య పెంచాలని, ప్రతిఒక్కరూ గ్రంథాలయాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని స్థానిక గ్రంథాలయాధికారి సత్యవతిని ఆదేశించారు. ఎప్పుడూ మూసి ఉండే గ్రంథాలయం జిల్లా అధికారి వచ్చిన వెంటనే తెరుచుకోవడంతో ప్రతి రోజు అధికారులు తనిఖీలకు వస్తే గ్రంథాలయ సేవలు అందుబాటులో ఉంటాయని, పుస్తకాలు, దినపత్రికలు చదివేందుకు ఆస్కారం ఉంటుందని పలువురు పేర్కొన్నారు. -
గిరిజన విద్యార్థులు చదువుకు దూరం కారాదు
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయులు లేక అరకు మండలం లోతేరు పంచాయతీ పరిధిలోని వంతులగుడ, తోడుబంద, ఈడారి, దంసానివలస, బొరకాలవలస, లండిగుడ, కాగువలస, తదితర పాఠశాలలు ఇప్పటికీ తెరుచుకోలేదన్న కథనాలపై రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకరరావు స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సంబంధిత అధికారులు గిరిజన విద్యార్థులు విద్యావకాశాలు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన గ్రామాల్లోని బడి ఈడు పిల్లలందరూ విద్యను అభ్యసించేలా చూడాలన్నారు. ఆయా గ్రామాల్లో విద్యార్థుల పాఠశాల విద్యపై క్షేత్రస్థాయిలో విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని కోరారు. ఇప్పటికే పాఠశాలలు ప్రారంభమైనందున విద్యార్థులు పాఠశాలలకు వచ్చి చదువుకునేలా చూడాలన్నారు.మాట్లాడుతున్న ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ శంకరరావు -
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఆపాలి
డాబాగార్డెన్స్: విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆపాలని, ప్లాంట్కు సొంత గనులు కేటాయించడమే సరైన పరిష్కారమని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేసింది. బ్లాస్ట్ ఫర్నేస్–3 తిరిగి ఉత్పత్తి ప్రారంభించడాన్ని కమిటీ అభినందించింది. శనివారం వీజేఎఫ్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పోరాట కమిటీ చైర్మన్ సీహెచ్ నరసింగరావు, కమిటీ కో కన్వీనర్స్ డి.ఆదినారాయణ, రామచంద్రరావు, వి.శ్రీనివాసరావుతో కలిసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే సొంత గనులు ఇవ్వకుండా ప్లాంట్ను నష్టాల్లోకి నెడుతోందని ఆరోపించారు. దీనివల్ల ఏటా రూ. 4 వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. కనీసం స్టీల్ప్లాంట్ను సెయిల్లోనైనా విలీనం చేయాలని వారు కోరారు. కేంద్రం స్టీల్ప్లాంట్లోని ఉత్పత్తి విభాగాల ఆపరేషన్, మెయింటెనెన్స్ పనులను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించాలని నిర్ణయించిందని, సింటర్ ప్లాంట్, రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ విభాగాలకు జూలై 12 నాటికి టెండర్లు ఆహ్వానించిందని తెలిపారు. ఈ విధంగా మొత్తం 13 విభాగాలను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇది పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి, ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకువచ్చే ప్రయత్నమని మండిపడ్డారు. స్టీల్ప్లాంట్ ముఖద్వారం వద్ద 1583 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయని, గత మూడు నెలల్లో సుమారు 5 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను ఎటువంటి నోటీసులు లేకుండా తొలగించారని కమిటీ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది నిర్వాసితులను ఉద్యోగాల నుంచి తొలగిస్తుంటే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాజమాన్యంతో కుమ్మకై ్క మోసగిస్తున్నారని ఆరోపించారు. విశాఖ స్టీల్ప్లాంట్కు సొంత గనులు కేటాయించడమే పరిష్కారం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సీహెచ్ నరసింగరావు -
ఇళ్ల బిల్లులు తక్షణమే చెల్లించాలి
పాడేరు : పీఎం జన్మన్ ఇళ్ల నిర్మాణాల బకాయి బిల్లులు తక్షణమే చెల్లించాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. శుక్రవారం పాడేరులో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో వారు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీనిలో భాగంగా స్థానిక గిరిజన సంఘ కార్యాలయం నుంచి సినిమాహాల్ సెంటర్ మీదుగా ఐటీడీఏ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఐటీడీఏ ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి అందోళన చేపట్టారు. అధికారుల తీరుకు నిరసనగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు, సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి పి. అప్పలనర్స మాట్లాడారు. పాడేరు డివిజన్లో 18,753 మంది లబ్ధిదారులకు బకాయి పడిన రూ.25 కోట్లను తక్షణమే చెల్లించాలన్నారు. ఐటీడీఏ పరిధిలో సుమారు 34,570 ఇళ్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వాటి నిర్మాణ వ్యయాన్ని పెంచనందున లబ్ధిదారులు ఇళ్లు కట్టుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో బిల్లులు జమ అయితే గృహ నిర్మాణ శాఖలో కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇలావుండగా ఆందోళన విషయం తెలుసుకున్న డీఆర్వో పద్మలత అక్కడికు వచ్చి వారి నుంచి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆమెకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. రూ.25 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులు ప్రారంభించామని రెండు, మూడు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని ఆమె చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాల్దేవ్, నాయకులు పాలికి లక్కు, కొర్రా త్రినాఽథ్, ఎంఎం శ్రీను, హైమవతి పాల్గొన్నారు. పీఎం జన్మన్ లబ్ధిదారుల డిమాండ్ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పాడేరులో ఆందోళన ఐటీడీఏ వరకు భారీగా ర్యాలీ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన ఖాతాల్లో జమచేస్తున్నామని డీఆర్వో హామీతో ఆందోళన విరమణ -
పర్యాటకుల కారుకు ప్రమాదం
● అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిన వాహనం డుంబ్రిగుడ: మండలంలోని జాతీయ రహదారి జైపూర్ జంక్షన్ వద్ద శుక్రవారం ఉదయం పర్యాటకుల కారు ప్రమాదానికి గురైంది. తెలంగాణకు చెందిన పర్యాటకులు కారులో శుక్రవారం అరకు వచ్చారు. ఇక్కడి ప్రకృతి అందాలను తిలకించిన అనంతరం చాపరాయి జలవిహారి సందర్శనకు బయలుదేరారు. జైపూర్ జంక్షన్ వద్దకు వచ్చేసరికి కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ముందు భాగం దెబ్బతింది. కారులో ఉన్న పర్యాటకులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికులు ప్రైవేట్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. -
గిరిజన విద్యార్థులంటే చిన్నచూపు
పాడేరు : గిరిజన విద్యార్థులంటే రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా ఉన్నతాధికారులకు చిన్న చూపని అందుకే వారికి వసతి గృహాల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పట్టణంలోని తలార్సింగి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. దీనిలో భాగంగా వసతి గృహాన్ని సందర్శించారు. విద్యార్థులు ఉంటున్న ప్రతీ గదికి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. కిటికీలు, తలుపులు లేకుండా ఉండటంతో పాటు భవనాలన్నీ పూర్తిగా శిథిల దశలో ఉండటాన్ని గమనించారు. పేరుకుపోయిన చెత్త వల్ల తీవ్ర దుర్వాస రావడంపై ఆయన చలించిపోయారు. అధికారులు, ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో పరిస్థితులను చూసి తన గుండె తరుక్కుపోయిందన్నారు. ఇలాంటి చోట గిరిజన విద్యార్థులను ఎలా ఉంచుతారన్నారు. భవనాలు పూర్తిగా శిథిల దశకు చేరినందున ఏ సమయంలో కూలుతుందో తెలియక విద్యార్థులు బిక్కుబిక్కుంటూ కాలం గడుపుతున్నారన్నారు. విద్యార్థులకు ఏమైనా జరగరానిది జరిగితే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. గిరిజనులంటే సీఎం చంద్రబాబు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు ఏ మాత్రం గిట్టదన్నారు. అందుకే గిరిజన విద్యార్థులు ఇలాంటి అధ్వాన పరిస్థితుల్లో ఉండాల్సి వస్తోందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేసిందని, నాడు–నేడులో రూ.కోట్లు వెచ్చించి పాఠశాలలు, వసతి గృహాల రూపురేఖలను మార్చిందన్నారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా కోసం పైసా కూడా ఖర్చుపెట్టకుండా విద్య వ్యవస్థను నాశనం చేస్తోందన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు, ఐటీడీఏ అధికారులు స్పందించి తలార్సింగి పాఠశాల వసతి గృహంలో మౌలిక వసతులు సమకూర్చాలని డిమాండ్ చేశారు. లేకుంటే విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబుకు ఏజెన్సీలో పర్యటించే అర్హత లేదు సీఎం చంద్రబాబుకు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించే అర్హత లేదని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు పేర్కొన్నారు. అరకులో నిర్వహించిన ఎన్నికల సభలో తాము అధికారంలోకి వస్తే జీవో నంబరు 3 పునరుద్ధరిస్తామని, స్పెషల్ డీఎస్సీ ద్వారా గిరిజనులతో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని, గిరిజనాభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తామని హామీలు ఇచ్చారన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా మోసం చేశారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పాడేరులో పర్యటిస్తే స్థానిక గిరిజనులు, తమ పార్టీ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, మాజీ సర్పంచ్ మినుముల కన్నాపాత్రుడు ఉన్నారు. వసతి గృహాల్లో కనీస వసతులు కరువు తలార్సింగి టీడబ్ల్యూ బాలుర ఆశ్రమ పాఠశాలలో పరిస్థితులు దారుణం ప్రభుత్వం, అధికారుల తీరుపై పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మండిపాటు -
చింతపల్లి ఏడీగా తిరుమలరావు
● బాధ్యతల స్వీకరణ ● ఇక్కడి ఏడీకి అనకాపల్లి జిల్లా ఎలమంచిలి బదిలీ చింతపల్లి: వ్యవసాయశాఖ చింతపల్లి ఏడీగా బీవీ తిరుమలరావు నియమితులయ్యారు.ఇక్కడ ఏడీ కంఠా జాహ్నవికి అనకాపల్లి జిల్లా ఎలమంచిలి బదిలీ అయింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఏడీగా పనిచేస్తున్న తిరుమలరావును ఇక్కడ నియమించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన స్థానిక కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయనను చింతపల్లి, జీకేవీధి వ్యవసాయశాఖ అధికారులు శ్రీనివాసరావు, మధుసూదనరావు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. -
సంక్షేమ పథకాల రద్దుకు కూటమి కుట్ర
చింతపల్లి: విద్యుత్ వినియోగదారులకు డిజిటల్ మీటర్లు అమర్చి సంక్షేమ పథకాలను పూర్తి రద్దుచేసేలా రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితమైన ఆలోచన చేస్తోందని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు బోనంగి చిన్నయ్య పడాల్ ఆరోపించారు. శుక్రవారం ఆయన చౌడుపల్లి పంచాయతీ వా ముగెడ్డలో డిజిటల్ విద్యుత్ మీటర్లను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రాష్ట్రంలో కొన్ని జిల్లాలో డిజిటల్ మీటర్లు అమర్చారన్నారు. దీంతో ప్రతినెలా అధిక బిల్లులు రావడంతో వినియోగదారులు నానా ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఈ మీటర్లు అమర్చే ఆలోచన చేస్తోందన్నారు. దీనివల్ల వినియోగదారులకు ఇప్పటి వరకూ అందుతున్న 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అవకాశం లేకుండా పోతుందన్నారు.అంతే కాకుండా ఈ డిజటల్ మీటర్లు అమరికతో ఎక్కువ బిల్లులు రావడంతో ప్రభుత్వం ఇదే షాకుగా చూపి రేషన్కార్డులు, రైతు భరోసా, తల్లికి వందనం తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులను దూరం చేసేలా కుట్ర పన్నుతోందని ఆరోపించారు. గృహ వినియోగదారులు డిజటల్ విద్యుత్ మీటర్లను వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల నాయకులు సాగిన చిరంజీవి పడాల్, మజ్జి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ డిజిటల్ మీటర్లతో అధిక బిల్లులు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ దూరమయ్యే అవకాశం సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు బోనంగి చిన్నయ్య పడాల్ -
జగన్నాథుని రథయాత్రకు పోటెత్తిన భక్తజనం
ముంచంగిపుట్టు: మండలంలోని ఏనుగురాయి పంచాయతీ కొండపడలో శుక్రవారం నిర్వహించిన జగన్నాథుని రథయాత్రకు భక్తులు పోటెత్తారు. మండల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ పార్టీల నేతలు కుటుంబ సమేతంగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. ఎంపీడీవో సూర్యనారాయణమూర్తి, సర్పంచ్ నర్సింగరావు, ఎంపీటీసీ సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దార్రెల, ఏవోబీ సరిహద్దు ప్రాంతమైన ఒనకఢిల్లీ, పాడువ గ్రామాల్లో జగన్నాథుని రథయాత్ర వైభవంగా నిర్వహించారు. -
అల్లూరి జయంతి ఏర్పాట్లుపరిశీలన
గొలుగొండ: అల్లూరి పార్కులో వచ్చే నెల 4న అల్లూరి జయంతి ఘనంగా నిర్వహించేందుకు మండల స్థాయి అధికారులు సర్వం సిద్ధం చేయాలని నర్సీపట్నం ఆర్డీవో వి.వి. రమణ ఆదేశించారు. కృష్ణదేవిపేట గ్రామంలో అల్లూరి సమాధుల ప్రాంతాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారకంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాటు పక్కాగా ఉండాలని తహసీల్దార్ శ్రీనువాసరావుకు సూచించారు. ఆ రోజు రాష్ట్రంలో ముఖ్య నాయకులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. అధికారులకు అల్లూరి ఉత్సవ కమిటీ సహకారం అందించాలని కోరారు. -
వరదలను సమర్థంగా ఎదుర్కొందాం
చింతూరు: రానున్న కాలంలో చింతూరు డివిజన్లో వరదలు సంభవిస్తే సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన వరద సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వరదలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు అధికారులంతా క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉండాలని సూచించారు. వరద బాధితులకు ఆయా గ్రామాల సమీపంలోనే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని, వారిని తరలించేందుకు లాంచీలు, పడవలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వరదలను దృష్టిలో పెట్టుకుని ఐటీడీఏ, మండల, గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థల సేవలు వినియోగించుకోవాలని, పునరావాస కేంద్రాల్లో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచాలని, మలేరియా ప్రబలకుండా స్ప్రేయింగ్ చేయించాలని, వైర్లెస్ సెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వరదల సమయంలో విద్యుత్శాఖ సిబ్బంది అప్రమత్తంగా వుండాలన్నారు. ఈ సమావేశంలో చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్, రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం, అసిస్టెంట్ కలెక్టర్ నాగ వెంకటసతీష్, ఏఎస్పీ పంకజ్కుమార్ మీనా, డీఎఫ్వో బబిత, ఏపీవో జగన్నాథరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అంబేడ్కర్, జిల్లా వ్యవసాయాధికారి నందు, జిల్లా ఉద్యానశాఖ అధికారి రమేష్ పాల్గొన్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు వరదలు సంభవిస్తే బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 80 పునరావాస కేంద్రాలు, 40 బోట్లు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నాలుగు మండలాల్లో 10 స్టాక్పాయింట్లు ఏర్పాటుచేసి రహదారి మార్గంగుండా రేషన్, నిత్యావసర సరకులు తరలించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వరదల సమయంలో కూనవరం నుంచి ఏడుగురాళ్లపల్లి మీదుగా భద్రాచలం వెళ్లేలా ప్రత్యామ్నాయ రహదారులు త్వరితగతిన పూర్తిచేసేందుకు అటవీశాఖ, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ విభాగం సమన్వయంతో పనిచేయాలని సూచించినట్లు ఆయన తెలిపారు. వరదలకు ముందుగానే మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఆయా మండాలకు తరలించి ఉంచుతామన్నారు. వరదల్లో ఎలాంటి నష్టంలేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేయాలని ఆయన సూచించారు. ఆర్అండ్ఆర్ కాలనీల నిర్మాణాల కొరకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, త్వరితగతిన వాటిని నిర్మించి వచ్చే ఏడాది వరదల కంటే ముందుగానే నిర్వాసితులను కాలనీల్లోకి తరలిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.కలెక్టర్ దినేష్కుమార్ -
● విరబూసిన దాలియా
మన్యంలో దాలియా పూల సీజన్ ప్రారంభమైంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలు సాగుకు అనుకూలించాయి. ఆగస్టులో రావాల్సిన దిగుబడి నెలరోజుల ముందుగానే ప్రారంభమైందని గిరిజన రైతులు తెలిపారు. పాడేరు డివిజన్లో పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, డుంబ్రిగుడ మండలాల్లో గిరిజన రైతులు బంతితోపాటు దాలియాను సాగు చేస్తున్నారు. వివిధ రంగుల్లో పండించే ఈ రకం పూలకు మైదాన ప్రాంతంలో మంచి ఆదరణ ఉంది. బుట్ట పూలకు రూ.100 వరకు ధర పలుకుతోంది. తక్కువ విస్తీర్ణంలో వేయడం వల్ల సీజన్లో రైతులు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. మండలంలోని బరిసింగి గిరిజన రైతులు శుక్రవారం దాలియా పూలను జిల్లా కేంద్రం పాడేరు మార్కెట్కు తీసుకువచ్చి విక్రయించి మంచి ఆదాయం పొందారు. – సాక్షి, పాడేరు -
జైలులో సౌకర్యాలపై ఆరా
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారాన్ని శుక్రవారం న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి సన్యాసినాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన జైలులోని ఖైదీల బ్యారక్లను పరిశీలించారు. ఖైదీలతో నేరుగా మాట్లాడిన సన్యాసినాయుడు, వారికి కల్పిస్తున్న సౌకర్యాలు, భోజనం, వైద్య సేవలు, పరిశుభ్రత వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. జైలులో ప్రస్తుతమున్న ఖైదీల సంఖ్య, వారి ప్రవర్తన గురించి జైలు అధికారుల నుంచి సమాచారం సేకరించారు. అనంతరం కారాగారం న్యాయ సహాయ కేంద్రంలో డిమాండ్ ఖైదీలతో మాట్లాడి, వారికి అవసరమైన న్యాయ సలహాలు, సూచనలు అందించారు. కార్యక్రమంలో జైలు డిప్యూటీ సూపరింటెండెంట్లు కె. జవహార్ బాబు, సి. ప్రవీణ్ కుమార్, ఇతర జైలర్లు పాల్గొన్నారు. -
మనస్తాపంతో గృహిణి ఆత్మహత్య
● భర్త తీరే కారణమని పోలీసుల వెల్లడి ముంచంగిపుట్టు: మనస్తాపానికి గురైన ఓ గృహిణి ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి ఎస్.రామకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కుజభంగి గ్రామానికి చెందిన కిల్లో తిరుపతి, కిల్లో స్వప్న భార్యభర్తలు. ఈ నెల 26వ తేదీ గురువారం భర్త తిరుపతి వేరే మహిళలతో ఫోన్లో ఎక్కువగా మాట్లాడటాన్ని భార్య స్వప్న గమనించింది. వెంటనే అతన్ని నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మానసిక వేదనకు గురైన ఆమె ఇంట్లోని గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. వెంటనే భర్త, స్థానికులు తలుపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లే చూసేసరికి ఆమె చున్నీతో ఉరిపోసుకుని కనిపించింది. చావుబ తుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్న ఆమెను ప్రైవేట్ వాహనంలో హుటాహుటిన కిలగా డ పీహెచ్సీకి తీసుకువచ్చారు.వైద్య సేవలు పొందుతూ స్వప్న మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని స్థానిక సీహెచ్సీలో మార్చురీకి తీసుకువచ్చారు. శుక్రవారం ఉదయం ఎస్ఐ రామకృష్ణ, సిబ్బంది కుజభంగి గ్రామానికి వెళ్లి స్వప్న మృతికి గల కారణా లను భర్త తిరుపతి, కుటుంబ సభ్యులు, గ్రామస్తుల నుంచి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. స్వప్న మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కు టుంబ సభ్యులకు అప్పగించామని ఎస్ఐ తెలిపారు. -
అంతర్రాష్ట్ర రహదారి సమస్య పరిష్కరించాలి
చింతపల్లి: అంతర్రాష్ట్ర రహదారి అయిన ఆర్.వి.నగర్–పాలగెడ్డ రహదారి నిర్మాణ పనులకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు డిమాండ్ చేశారు. దారకొండ, దుప్పులువాడ, సీలేరు పంచాయతీలకు చెందిన నాయకులు ఆయనను శుక్రవారం కలిసి రోడ్డు సమస్యపై వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మండలంలోని ఆర్.వి.నగర్ నుంచి పాలగెడ్డ వరకూ ఉన్న రోడ్డు ఆధ్వానంగా ఉందని, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత ఏడాది సెప్టెంబర్లో కురిసిన వర్షాలకు ఈ మార్గంలో కొండచరియలు విరిగి పడంతో పాటు రోడ్డంతా కోతకు గురై దారుణంగా ఉందన్నారు. ఈ మార్గం మీదుగా సీలేరు, భద్రాచలం, హైదరాబాదు, మల్కన్గిరి, చిత్రకొండ వంటి సుదూర ప్రాంతాలకు రాకపోకలు సాగుతుంటాయన్నారు. రోడ్డు అద్వానంగా మారడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారని, తరచూ వాహనాలు పాడవుతున్నాయన్నారు. గతంలో వర్షాలకు సర్వం కోల్పోయిన చట్రాపల్లి గిరిజనులకు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. పూర్తిస్థాయి అదికారులు నియమించాలి జిల్లా స్థాయి నుంచి మండలస్థాయి వరకూ పూర్తిస్థాయి అధికారులు నియామకంతో గిరిజన ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందని బాలరాజు అన్నారు. ఐటిడిఎ పీవో, డిప్యూటీ డైరెక్టర్, జిల్లా వైద్యాఆరోగ్యశాఖ అధికారితో పాటు అనేక శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో పూర్తి స్థాయి అధికారుల నియమాకానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీలేరు సర్పంచ్ దుర్గో, దారకొండ, దుప్పిలవాడ మాజీ సర్పంచులు అల్లంకి రాజుబాబు, పూజారి బాబూరావు, కారే శ్రీనివాసరావు, జగత్రాయ్, రామచందర్ పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాలరాజు డిమాండ్ -
వినతుల వెల్లువ
● 144 స్వీకరణ పాడేరు : మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతులు వెల్లువెత్తాయి. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో శుక్రవారం డీఆర్వో పద్మలత, టీడబ్ల్యూ ఇంచార్జీ డీడీ రజనీ ప్రజల నుంచి 144 వినతులు స్వీకరించారు. వీటిలో ప్రధానంగా భూ సమస్యలు, ఇళ్ల మంజూరు, పాఠశాలల్లో ప్రవేశాలు, రహదారుల నిర్మాణాలు తదితర వాటిపై అధికంగా ఉన్నాయి. వీటిని సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి సకాలంలో పరిష్కారమయ్యేలా చూడాలని డీఆర్వో ఆదేశించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏవో హేమలత, ఎస్ఎంఐ ఈఈ రాజేశ్వరరావు పాల్గొన్నారు. జేసీకి సర్వేయర్ల వినతి సాక్షి,పాడేరు: సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న గ్రామ సర్వేయర్ల సమస్యలను పరిష్కరించడంతో పాటు బదిలీల్లో తగిన న్యాయం చేయాలని సర్వేయర్లు శుక్రవారం కలెక్టరేట్లో జేసీ డాక్టర్ అభిషేక్గౌడకు వినతిపత్రం అందజేశారు.ఏజెన్సీలోని అనేక ప్రాంతాలకు చెందిన గ్రామ సర్వేయర్లంతా కలెక్టరేట్కు చేరుకుని తమ సమస్యలను తెలియజేశారు. రేషనలైజేషన్, బదిలీల్లో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, విధి నిర్వహణలోను అనేక ఇబ్బందులకు గురవుతున్నామని వారంతా జేసీకి వివరించారు.ఆర్టీసీ బస్సు మొరాయింపు ప్రయాణికుల అవస్థలు పెదబయలు: ముంచంగిపుట్టు నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మండల కేంద్రం పెదబయలులో శుక్రవారం సాయంత్రం మొరాయించి నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పాడేరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్స్లేటర్ వైర్ తెగిపోవడంతో తెగిపోవడంతో నిలిచిపోయింది. దీంతో ఈ బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. గంట తరువాత వచ్చిన వేరే బస్సులో గమ్యస్థానాలకు వెళ్లారు. కండీషన్లో లేని బస్సులను తిప్పడం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి
గొలుగొండ: లింగంపేట సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదుగా ఢీకొన్న ఘటనలో ఉపాధ్యాయుడు పాంగి లక్ష్మణమూర్తి అక్కడికక్కడే మృతి చెందారు. అల్లూరి జిల్లా నడింపాలెం ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న లక్ష్మణమూర్తి నర్సీపట్నం సమీప లక్ష్మీపురంలో నివాసముంటున్నారు. శుక్రవారం ఉదయం పాఠశాలకు వెళ్తుండగా.. గొలుగొండ మండలం లింగంపేట సమీపంలో చోద్యం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బైక్పై అతివేగంగా వస్తూ ఆయనను బలంగా ఢీకొట్టారు. ఉపాధ్యాయుడు రోడ్డుపై పడి అక్కడకక్కడే దుర్మరణం చెందారు. స్వల్పంగా గాయపడిన ఇద్దరు యువకులను నర్సీపట్నం ఆస్పత్రికి తరలించారు. లక్ష్మణమూర్తి మృతదేహాన్ని గొలుగొండ ఎస్ఐ రామారావు పోస్టుమార్టుం కోసం నర్సీపట్నం తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రాణాలకు తెగిస్తేనే పాఠాలు
● నాటు పడవలో.. బురదలో కాలినడకన రాకపోకలు ● 5 కి.మీ దూరంలో ఉన్న బడికి ప్రమాదకర ప్రయాణం ● అనంతగిరి మండలం సొలబంగు బాలల అవస్థలు ● దేవరాపల్లి మండలం తామరబ్బ పాఠశాలలో చదువు ● గ్రామానికి రోడ్డు, బడి లేక చిన్నారుల ఇక్కట్లు ● పిల్లలు ఇంటికి చేరుకునే వరకు భయాందోళనలో తల్లిదండ్రులు గుండె తరుక్కుపోయే కఠిన వాస్తవం.. చదువు కోసం చిన్నారులు ప్రాణాలకు తెగించి చేస్తున్న ప్రమాదకర ప్రయాణం.. పడవపై రైవాడ జలాశయం దాటి, కొండలు గుట్టల్లో నడిచి, పొరుగు జిల్లా పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న బాలల సాహస కృత్యం.. వారి దీనావస్థ కఠిన హృదయులను సైతం కదిలిస్తుంది.. గిరిజన ప్రాంతంలో పుట్టిన పాపానికి ఆ అడవి బిడ్డలు పడుతున్న కష్టం పగవారికి కూడా వద్దనిపిస్తుంది. దేవరాపల్లి: రైవాడ జలాశయానికి ఆవల.. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పరిధిలోని గిరిజన ప్రాంతం ఉంది. పినకోట పంచాయతీ శివారు సొలబొంగు గ్రామానికి చెందిన బాలలు చదువు కోసం ప్రాణాలకు తెగించి, అక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. రహదారి, పాఠశాల లేకపోవడంతో ఈ గ్రామానికి చెందిన 12 మంది విద్యార్థులు దేవరాపల్లి మండల పరిధిలోని తామరబ్బ ఎంపీయూపీ పాఠశాలకు పడవపైన, కాలినడకన వచ్చి చదువుకుంటున్నారు. సొలబొంగు నుంచి తామరబ్బకు చేరుకోవాలంటే రెండు మార్గాలు. వీరభద్రపేట మీదుగా పొలాల గట్లపై జారు బురదలో సుమారు 5 కిలోమీటర్ల మేర కాలినడకన చేరుకోవాలి. వర్షం పడితే ఈ మార్గంలో రాకపోకలు సాగించడం కష్టం. దీనికి ప్రత్యామ్నాయంగా సొలబొంగు నుంచి నాటు పడవపై రైవాడ జలాశయంలో సుమారు 3 కిలోమీటర్ల మేర ప్రయాణించి, దేవరాపల్లి మండల పరిధిలోని లోవ ముకుందపురం గ్రామానికి చేరుకొని.. అక్కడి నుంచి మళ్లీ ఒక కిలోమీటరు మేర చెట్లు, పుట్టల గుండా కర్రలు చేత పట్టుకొని ప్రయాణించి తామరబ్బ పాఠశాలకు చేరుకోవాలి. ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురవడంతో విద్యార్థులు పడవపైనే పాఠశాలకు రాకపోకలు సాగిస్తున్నారు. వారు తిరిగి ఇంటికి చేరుకునే వరకు తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. ప్రమాదమని తెలిసినా గత్యంతరం లేని పరిస్థితుల్లో పాఠశాలకు పంపిస్తున్నామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరభద్రపేట రోడ్డు నిర్మాణ పనులను అసంపూర్తిగా నిలిపివేయడంతో తమకు మరిన్ని కష్టాలు వెంటాడుతున్నాయని సొలబొంగు గ్రామస్తులు వాపోతున్నారు. ఈ గ్రామంలో 16 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. సుమారు 70 మంది వరకు జనాభా ఉన్నారు. ప్రస్తుతం 12 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గ్రామస్తులు సైతం నిత్యావసర సరకుల కోసం పడవపైన, లేదా వీరభద్రపేట మీదుగా తామరబ్బ వైపునకు చేరుకోవాల్సిన పరిస్థితి. ఈ గ్రామానికి చెందిన గర్భిణులు ఆసుపత్రికి చేరుకోవాలంటే సుమారు 15 కిలోమీటర్ల దూరంలోని దేవరాపల్లి ఆసుపత్రే దిక్కు. దారీ తెన్నూ లేదు మా గ్రామానికి దారీ తెన్నూ లేదు. మా గ్రామంలో బడి లేక పిల్లల్ని దేవరాపల్లి మండలంలోని తామరబ్బ స్కూల్కు పంపిస్తున్నాం. నా కుమార్తె అంజలి 4వ తరగతి చదువుతోంది. సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు పొలాల గట్ల మీదుగా తుప్పలు, డొంకలను దాటుకుంటూ నడిచి వెళ్తున్నారు. వర్షం కురిస్తే కాలినడక మార్గం బురదమయంగా మారుతుంది. ప్రభుత్వం స్పందించి మా పిల్లలు పడుతున్న కష్టాలను తీర్చాలి. – దిప్పల దేముడుబాబు, విద్యార్థిని తండ్రి, సొలబొంగు ప్రభుత్వం స్పందించాలి మాకు ఎలాగూ చదువు లేదు.. మా పిల్లలనైనా చదివించాలని ఆశ పడుతున్నాం. నా కూతురు శివజ్యోతి ఒకటో తరగతి చదువుతోంది. ప్రస్తుత వర్షాలకు వీరభద్రపేట మార్గం అడుగు తీసి అడుగు వేయలేని విధంగా బురదమయంగా మారింది. ప్రమాదమని తెలిసినా తప్పని పరిస్థితుల్లో నాటు పడవలపై పిల్లలను లోవ ముకుందపురం వరకు పంపిస్తున్నాం. ప్రభుత్వం స్పందించి మా గ్రామానికి బడి, రోడ్డు సౌకర్యం కల్పించి ఆదుకోవాలి. –గమ్మెల రాజు, విద్యార్థిని తండ్రి, సొలబొంగు -
వర్షాలకు కూలిన భారీచెట్టు
● అంతర్ రాష్ట్ర రహదారిలో ఐదు గంటల పాటు నిలిచిన రాకపోకలు ● స్థానిక గిరిజనుల సహకారంతో తొలగించిన ప్రయాణికులు, సిబ్బంది సీలేరు: అంతర్ రాష్ట్ర రహదారిలో గూడెం కొత్తవీధి మండలం లంకపాకలు వద్ద భారీ చెట్టు కూలడంతో రాకపోకలు గంటల తరబడి నిలిచిపోయాయి. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రహదారి అస్తవ్యస్తంగా మారింది. శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో భారీ వృక్షం రహదారిపై కూలడంతో రాకపోకలు స్తంభించాయి. దీంతో భద్రాచలం నుంచి విశాఖపట్నం వెళ్లే రెండు బస్సులు నిలిచిపోయాయి. సమీప గిరిజన గ్రామ గిరిజనుల సహకారంతో చెట్టును తొలగించడంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి. సుమారు ఐదు గంటల పాటు కారు చీకట్లో నరకయాతన అనుభవించామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. -
మిలమిల
మాచ్ఖండ్ముంచంగిపుట్టు: మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో ఉత్పాదన గాడిలో పడుతోంది. కొంతకాలంగా తరచూ జనరేటర్లు మొరాయిస్తుండటంతో ప్రాజెక్టు ఉద్యోగులు అవస్థలు పడుతూ వచ్చారు. మరోపక్క నీటి సమస్య కూడా ఉత్పాదనకు ఆటంకం కలిగించింది. ఇప్పుడు ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ప్రాజెక్ట్ జలాశయాల నీటిమట్టాలు కూడా మెరుగుపడుతున్నాయి. అధికారులు, సిబ్బంది రేయింబళ్లు శ్రమించి ప్రాజెక్ట్లోని ఆరు యూనిట్లలో ఐదింటిని వినియోగంలోకి తెచ్చారు. ప్రస్తుతం 1,2,3,5,6 జనరేటర్ యూనిట్ల ద్వారా 97 మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. నాలుగో నంబరు జనరేటర్కు మరమ్మతులు జరుగుతున్నాయి. దీనిని కూడా వినియోగంలోకి తెచ్చేందుకు కృషి జరుగుతోందని ప్రాజెక్ట్ అధికారవర్గాలు తెలిపాయి. ఆరు జనరేటర్లు పనిచేస్తే 120 మెగావాట్ల మేర ఉత్పాదన జరుగుతుందని పేర్కొన్నాయి. ● జనరేటర్లు మరమ్మతుల కారణంగా దాదాపుగా 15 ఏళ్లుగా విద్యుత్ ఉత్పాదన కుంటుపడింది. 2023 ఆగస్టులో మాత్రమే ప్రాజెక్ట్లోని ఆరు జనరేటర్లు పనిచేయడం వల్ల పూర్తిస్థాయిలో 120 మెగా వాట్ల విద్యుత్ ఉత్పాదన సాధ్యమైంది. అప్పటిలో రెండు నెలల మాత్రమే పూర్తిగా జనరేటర్లు పనిచేశాయి. ఆ తరువాత నుంచి మొరాయింపుతో ఉత్పాదన తగ్గిపోయింది. కొద్ది నెలల క్రితం వరకు 68 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి జరిగేది. అధికా రులు సిబ్బంది కృిషి వల్ల 97 మెగావాట్లకు చేరింది. జలాశయాల్లోకి వరద నీరు మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరు అందించే డుడుమ,జోలాపుట్టు జలాశయాల్లో నీటిమట్టాలు పెరుగుతున్నాయి. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు గ్రామాల్లో నెల రోజలుగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో రెండు జలాశయాల్లో భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ● డుడుమ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 2,590 అడుగులు కాగా బుధవారం నాటికి 2,579 అడుగులుగా నమోదు అయింది. ● జోలాపుట్టు జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 2,750 అడుగులు కాగా మంగళవారం నాటికి 2,725 అడుగులుగా నమోదు అయింది. గత ఏడాది ఇదే రోజు 2,697 అడుగుల మేర నీరు ఉంది. గత ఏడాదితో పోల్చితే 28 అడుగుల మేర నీటి నిల్వ అధికంగా ఉంది. మాచ్ఖండ్ ప్రాజెక్ట్ వివరాలు మొత్తం యూనిట్లు : 6 పనిచేస్తున్నవి : 5 మొత్తం సామర్థ్యం : 120 మెగావాట్లు ప్రస్తుత ఉత్పాదన : 97 మెగావాట్లు ప్రాజెక్ట్లో మెరుగుపడుతున్న విద్యుత్ ఉత్పాదన వినియోగంలో ఐదు యూనిట్లు 97 మెగావాట్ల మేర ఉత్పత్తి మిగతా యూనిట్కు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు కొద్దిరోజుల్లో పూర్తిస్థాయి ఉత్పాదన దిశగా అడుగులు ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది సమష్టి కృషి కొద్దిరోజుల్లో పూర్తిస్థాయి ఉత్పాదన డుడుమ, జోలాపుట్టు జలాశయాల్లో గతంలో నీటి నిల్వలు తక్కువగా ఉండడంతో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం నీటి నిల్వలు పెరుగుతున్నందున విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నీరు అందుబాటులో ఉంది. నాలుగో నంబరు జనరేటర్ను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కొద్దిరోజుల్లో పూర్తిస్థాయి ఉత్పాదనకు ఆస్కారం ఉంది. – ఏవీ సుబ్రమణ్యేశ్వరరావు, ఎస్ఈ, మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం -
నేడు వెలుగులు
నాడు ప్రణాళికలు..● ఇంధన ఆదాకు రోల్ మోడల్గా ‘ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్’ భవనం ● వైఎస్సార్సీపీ హయాంలో 2023 మేలో సాగర్నగర్లో పనులు ప్రారంభం ● 50 శాతానికి పైగా ఇంధనం పొదుపయ్యేలా రూ.14 కోట్లతో భవన నిర్మాణం ● పర్యావరణ సవాళ్ల పరిష్కారం, ఇంధన డిమాండ్ తీర్చడంలో ముఖ్య భూమిక ● నేడు మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా భవనం ప్రారంభం సాగర్నగర్లో ఈసీబీసీ భవనంవిశాఖ సిటీ : వెలుతురు ప్రసరణ ఉంటుంది. సూర్యుడి వేడి నియంత్రిస్తుంది.. విద్యుత్ ఆదా అవుతుంది. పునరుత్పాదక శక్తితో నడుస్తుంది. ఇదీ ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ నిర్మించిన (ఏపీఈపీడీసీఎల్) సూపర్ ‘ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్’ (ఈసీబీసీ) భవనం ప్రత్యేకత. స్వయం సమృద్ధి విధానంలో విద్యుత్ పొదుపునకు నమూనాగా సాగర్నగర్లో నిర్మించిన ఈ భవనం దక్షిణాది నగరాలకు రోల్ మోడల్గా నిలుస్తోంది. వైఎస్సార్ సీపీ హయాంలో చేసిన ప్రణాళికలు నేడు వెలుగులు పంచుతోంది. రాష్ట్రంలోనే మొదటి సారిగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) రూపొందించిన ఈసీబీసీ నిబంధనలను అనుసరించి రూ.14 కోట్లతో భవనాన్ని నిర్మించింది. ఇది దేశంలోనే ఇతర రాష్ట్రాల్లో కమర్షియల్ భవనాలకు నమూనాగా నిలుస్తోంది. శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు 11 జిల్లాలకు విస్తరించిన ఏపీఈపీడీసీఎల్లో ఆపరేషన్ అండ్ మెయింటెనన్స్ అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు శిక్షణ కోసం ఈ అధునాతన జీ+2 భవనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ భవన నిర్వహణకు ఖర్చు లేకుండా.. తిరిగి రూ.లక్షల్లో ఆదాయార్జన చేసేలా తీర్చిదిద్దారు. ఇంధన పొదుపుపై వైఎస్సార్ సీపీ దృష్టి విద్యుత్, ఇంధన రంగాల్లో దక్షిణాది నగరాలకు ధీటుగా విశాఖను రోల్ మోడల్గా నిలిపేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ప్రధానంగా రాష్ట్రంలో భవన నిర్మాణ రంగంలో(వాణిజ్య భవనాల్లో) విద్యుత్ డిమాండ్ను తగ్గించే అంశంపై దృష్టి పెట్టింది. ఈసీబీసీ నిబంధనలకు అనుగుణంగా కమర్షియల్ భవనాల నిర్మించడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించవచ్చని భావించింది. ఈ దిశగా విశాఖలో ఏపీఈపీడీసీఎల్ శిక్షణ కేంద్ర భవనాన్ని ఈసీబీసీ నిబంధనలకు అనుగుణంగా నిర్మించాలని ఆదేశించింది. దీంతో 2023, మే నెలలో సాగర్నగర్ ప్రాంతంలో ఎకరన్నర విస్తీర్ణంలో జీ+2 భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీనికి భారత ప్రభుత్వ సంస్థ బీఈఈ రూ.5 కోట్లు ప్రోత్సాహంగా మంజూరు చేసింది. పగలు విద్యుద్దీపాల అవసరం లేకుండా, ఏసీ వినియోగానికి తక్కువ విద్యుత్ వినియోగం ఉండేలా, విద్యుత్ బిల్లుల భారం తగ్గేలా, 50 శాతం విద్యుత్ ఆదా అయ్యేలా భవన నిర్మాణాన్ని చేపట్టింది. సూపర్ ఈసీబీసీ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో విద్యుత్ శాఖ శిక్షణాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మిగిలిన అంతస్తులను ప్రైవేటు సంస్థలకు లీజులకు ఇవ్వనున్నారు. ఈ బాధ్యతలను ఇప్పటికే వీఎంఆర్డీఏకు అప్పగించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఈ భవన నిర్మాణం పూర్తయింది. శుక్రవారం రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభించేందుకు ఏపీఈపీడీసీఎల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసీబీసీ నిబంధనలకు అనుగుణంగా.. ఈసీబీసీ నిబంధనలను అనుసరించి జీ+2 భవనం ఒక్కో అంతస్తు 14,400 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించారు. ఈ భవన నిర్మాణానికి నాలుగు ప్రమాణాలను అనుసరించారు. సూర్యుని వెలుతురుని నియంత్రించేలా 24 మి.మీ మందం కలిగిన మూడు పొరల గ్లాసులను వినియోగించారు. సాధారణ భవన నిర్మాణాల కిటికీలకు ఒక్క పొర ఉండే గ్లాసులు మాత్రమే వాడతారు. కానీ సూపర్ ఈసీబీసీ నిర్మాణానికి మూడు పొరల గ్లాసులు వినియోగించడంతో భవనంలోకి వేడి తక్కువగా ప్రసరిస్తుంది. గోడలను కావిటీ వాల్స్తో కట్టారు. బయట గోడ 8 అంగుళాలు, లోపల 4 అంగుళాలు, మధ్యలో ఎయిర్ గ్యాప్ 4 అంగుళాలు మొత్తంగా 16 అంగుళాలు గోడల నిర్మాణంలో ట్రిపుల్ ఏసీ బ్రిక్స్ ఉపయోగించారు. దీంతో వేడి లోపలకు రాదు. శ్లాబు పై నుంచి వేడి కూడా రాకుండా 100 డెకింగ్ సీలింగ్ చేశారు. 50 మి.మీ. మందం రాక్ వుడ్తో శ్లాబ్కి టచ్ అవుతూ ఒక సీలింగ్ వేసి, తర్వాత ఎయిర్ గ్యాప్ ఇచ్చి ఫాల్స్ సీలింగ్ చేశారు. దీంతో శ్లాబ్ నుంచి వేడి కిందకు దిగే అవకాశం ఉండదు. విద్యుత్ ఆదా చేయడానికి ఎయిర్ కండిషన్ సిస్టం హెచ్వీఏసీ విధానాన్ని అనుసరించారు. హీట్ వెంటిలేటివ్ ఎయిర్ కండిషన్ సిస్టమ్ పద్ధతిలో సెన్సార్ ద్వారా ఆక్యుపెన్సీ బట్టీ కంప్రెషర్ ఆన్, ఆఫ్ వాల్యూం త్రో చేయడం ద్వారా విద్యుత్ ఆదా అవుతుంది. విద్యుత్ బిల్లు భారం లేకుండా పునరుత్పాదక విద్యుత్ కోసం 50 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ రూఫ్ టాప్ను నిర్మించారు. ఈసీబీసీ నిబంధనలకు అనుగుణంగా నిర్మించిన భవనాల్లో 50 శాతానికి పైగా విద్యుత్ అవుతుంది. -
70 కేసుల్లో 65 మంది అరెస్ట్
విశాఖ సిటీ: నగరంలో నేర నియంత్రణకు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. పోలీస్ సమావేశ మందిరంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో మేలో 82 చోరీ కేసులు నమోదైనట్లు చెప్పారు. వాటిలో 70 కేసులను ఛేదించి 65 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వారి నుంచి రూ.1,04,97,450 చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇందులో 1.04 కిలోల బంగారం, 6.06 కిలోల వెండి, రూ.9,09,900 నగదు, 14 ద్విచక్ర వాహనాలు, 392 మొబైల్ ఫోన్లు, ఒక పొక్లెయిన్, కార్, ల్యాప్టాప్, ఇతర వస్తువులను రికవరీ చేసినట్లు వివరించారు. నగరంలో నేర నియంత్రణకు, నిందితులను గుర్తించేందుకు వీలుగా మేలో 610 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. అలాగే సీసీ కెమెరాల ఏర్పాటుపై ఎప్పటికప్పుడు ప్రజలు, వ్యాపారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో పగలు, రాత్రుళ్లు ప్రత్యేక బృందాలతో పాటు డ్రోన్ల ద్వారా కూడా నిఘా పెట్టినట్లు చెప్పారు. అనంతరం రికవరీ చేసిన సొత్తును బాధితులకు అందజేశారు. సమావేశంలో డీసీపీ(క్రైం) లతా మాధురి, ఇతర అధికారులు పాల్గొన్నారు. రూ.1.04 కోట్ల చోరీ సొత్తు స్వాధీనం -
జాతీయ రహదారిపై నేలకొరిగిన భారీ వృక్షం
చింతపల్లి: చింతపల్లి మండలం రాజుపాకలు వద్ద జాతీయ రహదారిపై భారీ వృక్షం నేల కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గురువారం ఉదయం జరిగిన ఈ సంఘటనతో ఈ ప్రాంతం మీదుగా ప్రయాణించే వాహనాలు రాకపోకలకు రెండు గంటలు పాటు అంతరాయం ఏర్పడింది. పెదబరడ పంచాయతీ పరిధిలో గల రాజుపాకలు–దిగువుపాకలు గ్రామాల మధ్యలో గల జాతీయ రహదారి మధ్యలో ఈ భారీ వృక్షం కూలడంతో నర్సీపట్నం నుంచి సీలేరు, భద్రాచలం, సీలేరు ,గూడెం కొత్తవీధి తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు, జీపులు, వ్యాన్లు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే జాతీయ నిర్మాణంలో భాగంగా రోడ్డు పక్కన ఉన్నటువంటి చిన్న,చిన్న వృక్షాలతో పాటు భారీ, అతిభారీ వృక్షాలను సైతం తొలగించారు. అయినప్పటికీ చింతపల్లి నుంచి తాజంగి వరకూ రహదారికి దూరంగా మరి ఎన్నో వృక్షాలు రోడ్డుకు ఇరువైపులా ఉన్నాయి.ఇటీవల వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా ఈ ప్రాంతంలో వర్షం కురుస్తూనే ఉంది.దాంతో వేళ్లు జీవం పోవడంతో నేలకూలింది. వెంటనే స్పందించిన జాతీయ రహదారి అదికారులు రాకపోకలు సాగించే విధంగా చర్యలు చేపట్టారు. దీంత యధావిధిగా రాకపోకలు కొనసాగాయి.రెండు గంటలపాటు స్తంభించిన రాకపోకలు -
లిక్విడ్ గంజాయి పట్టివేత
పెందుర్తి: అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి విశాఖ నగరానికి తరలిస్తున్న 1.6 కిలోల లిక్విడ్ గంజాయిని టాస్క్ఫోర్స్, పెందుర్తి పోలీసులు పట్టుకున్నారు. సీఐ కె.వి.సతీష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పెదబయలుకు చెందిన గుళ్లేలి చిన్నంనాయుడు, పురుష్కారి సోమేష్, గెమ్మిలి ప్రసాదరావు, అర్బాబు మత్స్యలింగం కలిసి నగరానికి లిక్విడ్ గంజాయిని తరలిస్తున్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులు సమాచారం అందుకున్నారు. పెందుర్తి మండలం సరిపల్లి వద్ద కాపుకాసి వారిని పట్టుకుని పెందుర్తి పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తు జరుగుతోంది. -
ప్రమాదంలో గాయపడిన యువకుడి మృతి
రావికమతం : పరవాడ మండలం లంకెలపాలెం జంక్షన్ వద్ద సోమవారం రాత్రి లారీ బీభత్సం సృష్టించిన సంఘటనలో తీవ్రంగా గాయపడిన రావికమతం మండలం కొత్తకోటకు చెందిన యువకుడు సాలాపు రామ్ కుమార్ (రాంకీ), విశాఖపట్నం కేజిహెచ్లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రామ్ కుమార్(రాంకీ)కు రెండు కిడ్నీలు పనిచేయక పోవడంతో మెరుగైన వైద్యం అందించినప్పటికీ ఫలితం లేకపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. రామ్కుమార్, మరో యువకుడు తురాల శేషుతో కలిసి నర్సీపట్నం శ్రీరామ్ చిట్స్ అండ్ ఫైనాన్స్లో కొంత కాలంగా పనిచేస్తున్నారు. రికవరీ చేయడానికి బైక్పై విశాఖపట్నం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం బారిన పడ్డారు. -
సమాజానికి చేటు
మాదక ద్రవ్యాలతో● ప్రతి ఒక్కరిపై గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలన బాధ్యత ● కలెక్టర్ దినేష్కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్ ● పాడేరులో భారీగా అవగాహన ర్యాలీ పాడేరు : మాదకద్రవ్యాల వినియోగం సమాజానికి తీరని లోటని, నిషేధిత గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలన భాద్యత సమాజంలో ప్రతి ఒక్కరికి ఉందని కలెక్టర్ దినేష్కుమార్ అన్నారు. బుధవారం పట్టణంలో నషా ముక్త్ భారత్ అభియాన్ సందర్భంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన, మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్, సినిమాహాల్ సెంటర్ మీదుగా పాత బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీని స్థానిక ఐటీడీఏ వద్ద కలెక్టర్ దినేష్కుమార్, ఎస్పీ అమిత్బర్దర్ జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని ఆశ్రమ పాఠశాలలు, గిరిజన గురుకులాల విద్యార్థులు, వైద్య విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులతో భారీగా నిర్వహించారు. ఈ సందర్బంగా డ్రగ్స్ వద్దు బ్రో, మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి, విలువైన జీవితాన్ని కాపాడుకోవాలని నినాదాలు చేశారు. పాత బస్టాంద్ వద్ద నిర్వహించిన సభలో కలెక్టర్ మాట్లాడారు. సమాజానికి హాని చేసే మత్తు పదార్థాలపై ప్రజలంతా అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎవరైనా మత్తుకు బానిసైతే పాడేరు జిల్లా ఆస్పత్రిలోని డీఅడిక్షన్ కేంద్రానికి తరలించాలన్నారు. జిల్లా సమాఖ్య, మండల సమఖ్య, స్వయం సహాయక సంఘాలు, పంచాయతీ సమావేశాలు, ఆశ్రమ పాఠశాలలు, యువ గ్రూపులు, సఖీ గ్రూపులలో గంజాయి సాగు, వినియోగానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలన్నారు. ప్రతి 15రోజులకోకసారి గంజాయి సాగు, రవాణ నిర్మూలనపై చర్చ జరగాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో నషా ముక్త్ అభియాన్ ర్యాలీను విజయవంతం చేశారన్నారు. గత ఏడాది పదివేల ఎకరాల్లో గంజాయి సాగుకు ప్రత్యామ్నాయంగా వాణిజ్య పంటలను సాగు చేసేందుకు విత్తనాలు, మొక్కలను పంపిణీ చేశామన్నారు. స్మగ్లర్లు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి స్థానికులను మోసం చేస్తున్నారన్నారు. గంజాయి సమూల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఉన్నతంగా చదువుకొని ఉద్యోగాల్లో స్థిరపడి సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ధీరజ్, చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా, ఐసీడీఎస్ పీడీ ఝాన్షీభాయ్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ గౌరీశంకర్రావు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలత, డీఎంహెచ్వో డాక్టర్ విశ్వేశ్వర నాయుడు, డీఎస్పీ సహబాజ్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పాల్గొన్నారు. -
రక్త పరీక్షల ఆధారంగా వైద్యసేవలు
● ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం ఆదేశంఅడ్డతీగల: జ్వరపీడితులకు రక్త పరీక్షలు నిర్వహించి అందుకు అనుగుణంగా వైద్యం అందించాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం ఆదేశించారు. గురువారం ఆయన స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. సీజనల్ వ్యాధులకు సంబంధించి నివారణ మందులు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అడ్డతీగల, కొట్టపాలెంలోని ఆశ్రమ బాలుర పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులకు అర్థమయ్యేరీతిలో ఒకటికి రెండుసార్లు పాఠ్యాంశాలు బోధించాలని ఉపాధ్యాయులకు సూ చిం చారు. పాఠ్య, నోట్ పుస్తకాలు అందిరికీ అందిందీ లేనిది విద్యార్థులనుంచి తెలుసుకున్నారు. మెనూ పక్కాగా అమలు చేయాలని సూచించారు. వేటమామిడిలో నిర్మిస్తున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ను, భవనాలను ఆయన పరిశీలించారు. నాణ్యత పాటిస్తూ త్వరితగతిన భవన నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. -
లాగరాయి వైద్యాధికారి సస్పెన్షన్
రాజవొమ్మంగి: విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న మండలంలోని లాగరాయి పీహెచ్సీ వైద్యాధికారి నాగార్జునను రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం సస్పెండ్ చేశారు. ఈ ఆస్పత్రిలో సేవలు అధ్వానంగా మారిన నేపథ్యంలో శుక్రవారం పీవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులు కిక్కిరిసి ఉన్నప్పటికీ ఆ సమయంలో వైద్యాధికారి లేకపోవడంతో ఆయన ఆగ్రహానికి గురయ్యారు. వైద్యాధికారి విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని, రాజవొమ్మంగిలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకుంటూ పీహెచ్సీలో విధులపట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని గ్రామస్తులు పీవో దృష్టికి తీసుకువచ్చారు. వైద్యాధికారి ఆస్పత్రికి రాకపోవడంపై అక్కడి నుంచి డీఎంహెచ్వోతో పీవో ఫోన్లో మాట్లాడారు. అనంతరం వైద్యాధికారిని సస్పెండ్ చేస్తున్నట్టు వెల్లడించారు. త్వరలో మరో వైద్యుడిని నియమిస్తామని, ఆస్పత్రుల్లో మందుల కొరత లేదని పీవో తెలిపారు. ఇలావుండగా పీహెచ్సీలో సేవలు అందడం లేదంటూ ఆస్పత్రి ఎదుట రోగులు, ప్రజలు ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, లాగరాయి సర్పంచ్ మిరియాల గణలక్ష్మి బుధవారం ఆస్పత్రికి వెళ్లి వైద్యాధికారి నాగార్జునను కలిశారు. వైద్యం అందక రోగుల పడుతున్న ఇబ్బందులపై వారు ప్రశ్నించారు. దీనిపై ఆయన పొంతన లేని సమాధానం ఇస్తున్నారంటూ వారు రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించిన పీవో వైద్యాధికారిపై చర్యలు తీసుకున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యమే కారణం వెల్లడించిన రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం -
గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్టు
గొలుగొండ: ఏజెన్సీ నుంచి స్కూటీపై రెండు కిలోల గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు ఎస్ఐ రామారావు తెలిపారు. ఏజెన్సీలో చిట్టింపాడు నుంచి చింతపల్లి మండలానికి చెందిన తాంబేలు లక్ష్మి, కట్టు బంద స్కూటీపై వస్తుండగా, జోగుంపేట రోడ్డులో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా, వీరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. స్కూటీ డిక్కీలో రెండు కిలోల గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేశామన్నారు. కొయ్యూరు: ద్విచక్ర వాహనంపై రంపుల గ్రామం నుంచి నర్సీపట్నంను గంజాయిని తరలిస్తున్న రంపుల గ్రామానికి చెందిన గల్లోరి బొంజిబాబు ను పోలీసులు పట్టుకున్నారు. గురువారం మంప ఎస్ఐ కె. శంకర్రావు చీడిపాలెం జంక్షన్లో వాహనాల తనిఖీ చేపట్టారు. బూదరాళ్ల దారిలో వస్తున్న బొంజిబాబు స్కూటిని తనిఖీ చేయగా రూ.లక్షా 91 వేల విలువ చేసే 38.3 కిలోల గంజాయిని కనుగొన్నారు.దీంతో అతడిని అరెస్టు చేసి స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.ఆయన మాట్లాడుతూ ఈ దారిలో గంజాయిపై దృష్టి పెట్టామన్నారు. -
రక్తదానంతో ప్రాణదానం
పాడేరు : సమాజంలో ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యతగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలని డీఎంహెచ్వో డాక్టర్ తమర్భ విశ్వేశ్వరనాయుడు పిలుపునిచ్చారు. ఎస్బీఐ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా పాడేరు స్టేట్బ్యాంకు బ్రాంచిలో బుధవారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి డీఎంహెచ్వో డాక్టర్ విశ్వేశ్వరనాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. బ్యాంక్ ఖాతాదారులు, సిబ్బంది స్వచ్ఛందంగా తరలివచ్చి 74 యూనిట్ల రక్తదానం చేశారు. స్టేట్బ్యాంకు ఇండియా అనకాపల్లి యూనియన్ రీజనల్ సెక్రటరీ పైలా ప్రసాద్రావు తదితరులు మాట్లాడారు. రక్తదాతలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అధికారి డాక్టర్ ఎం.కిరణ్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కమల, పాడేరు ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ రవికిరణ్, శ్రీనివాసనాయుడు, పాడేరు బ్రాంచి లోకల్ యూనియన్ సెక్రటరీ డీఎంఎన్ శ్రీనివాస్, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ కార్యదర్శి గంగరాజు, ప్రతినిధులు గౌరినాయుడు, సూర్యారావు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. ఆపదలోఉన్నవారిని ఆదుకోవాలి : అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అరకులోయ టౌన్: రక్తదానం చేసి మరొక ప్రాణం కాపాడాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. గురువారం స్థానిక ఏరియా ఆస్పత్రిలో అరకు ఎస్బీఐ యూనియన్ కార్యదర్శి వంతాల అరుణ్కుమార్ ఆధ్వర్యంలో రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంకు నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వారికి రక్తం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. శిబిరం నిర్వాహకులు, రక్తదాలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత రేగం చాణక్య, ఉమ్మడి విశాఖ ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కుమ్మిడి ఆశోక్, అరకులోయ జెడ్పీటీసీ శెట్టి రోషిణి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ రాము పాల్గొన్నారు. డీఎంహెచ్వో డాక్టర్ తమర్బ విశ్వేశ్వరనాయుడు పాడేరులో 74 యూనిట్ల సేకరణ -
మన్యం అభివృద్ధిలో టెలికాం కీలకం
సాక్షి,పాడేరు: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి విద్యుత్, రహదారులతో పాటు టెలికాం కూడా కీలకమని మినిస్ట్రీ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్ అదనపు కార్యదర్శి గుల్జార్ నటరాజన్ తెలిపారు. జిల్లాలో గురువారం పర్యటించిన ఆయన పలు సెల్ టవర్లను పరిశీలించారు. కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రగతితో పాటు ఎన్జీవో ఫామ్ ఏర్పాటు సంతృప్తినిచ్చిందన్నారు.జిల్లాలో విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యానవన రంగాల్లో మంచి ప్రగతి ఉందన్నారు. ప్రజలకు కమ్యూనికేషన్ ఎంతో అవసరమన్నారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించి ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాలన్నారు. కలెక్టర్ దినేష్కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్య, వైద్యం, పీఎం జన్మన్, టూరిజం, సెల్టవర్లు, రోడ్డు తదితర అంశాల్లో ప్రగతిని వివరించారు. జిల్లాలో 1591 సెల్టవర్లు మంజూరు అయ్యాయని, 50వేలమంది గిరిజన రైతులు సేంద్రియ విధానంలో సాగు చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో జేసీ డాక్టర్ అభిషేక్గౌడ, సబ్కలెక్టర్ సౌర్యమన్పటేల్, అసిస్టెంట్ కలెక్టర్ చిరంజీవి నాగ వెంకట సాహిత్, బీఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలం, జియో డీజీఎం సత్యప్రసాద్, ఎయిర్టెల్ డీప్యూటీ డీఎం మృణాల్, డీఆర్డీఏ పీడీ మురళీ, విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్ఈ ప్రసాద్, డీఈవో పి.బ్రహ్మాజీరావు, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి, ఇన్చార్జి డీడీ రజనీ పాల్గొన్నారు. టెలీ కమ్యూనికేషన్స్ అదనపు కార్యదర్శి గుల్జార్ నటరాజన్ -
వెదురు పెంపకంతో అధిక లాభాలు
అనకాపల్లి జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సత్యనారాయణ రావికమతం(అనకాపల్లి) : డీఆర్డీఏ పీడీ అదేశాల మేరకు గురువారం రావికమతం వెలుగు కార్యాలయంలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సత్యనారాయణ,జీవనోపాదుల విభాగం మరియు ఇండస్ట్రీయల్ ఆప్ బాంబుస్ అఫ్ బెంగళూరు వారు సంయుక్తంగా మండలంలో వెదురు పంటపై అవగాహన కల్పించారు.మండలంలో వెదురు పెంపకానికి 200 మంది రైతులను గుర్తించాలని బెంగళూరుకు చెందిన ఇండస్ట్రియల్ ఆప్ బ్యాంబుస్ సంస్థ ప్రతినిధి కుసుమ కోరారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (సెర్ప్)తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు త్రిపుర రకానికి చెందిన వెదురు మొక్కలను ఉచితంగా రైతులకు అందజేస్తామన్నారు. ఈ మెక్కలు నాటాడానికి ఉపాధి హామీ పథకం నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఒక రైతు వెదురును పెంచేందుకు కనీసం 37 సెంట్లు భూమి ఉండాలన్నారు. నాటిన నాలుగు ఏళ్ల తరువాత ఎదిగిన వెదురును తమ సంస్థ కొనిగోలు చేస్తుందని వివరించారు. ఒక్కసారి నాటితే 100 సంవత్సరాలు వరకు వెదురును అమ్ముకోవచ్చుని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సత్యనారాయణ , ఏపీఎం ఈశ్వరరావు, సీసీలు, సిబ్బంది పాల్గొన్నారు. -
నిబంధనలకు తిలోదకాలు
రంపచోడవరం: స్థానిక ఐటీడీఏ పరిధిలోని సీడీపీవోల బదిలీల్లో అధికారులు నిబంధనలకు తిలోదకాలిచ్చారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్తవారు విధుల్లోకి చేరకుండానే పాతవారిని రిలీవ్ చేయడం ఇందుకు కారణమవుతోంది. ● స్థానిక ఐటీడీఏ పరిధిలో రంపచోడవరం, మారేడుమిల్లి, గంగవరం, రాజవొమ్మంగి ఐసీడీఎస్ ప్రాజెక్టుల సీడీపీవోల పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. ఇక్కడి సీడీపీవోలకు 15 రోజుల క్రితం మైదాన ప్రాంతాలకు బదిలీ అయింది. వీరిని నిబంధనల ప్రకారం కొత్తవారు వచ్చిన తరువాత రిలీవ్ చేయాలి. అలాకాకుండా వారు విధుల్లోకి చేరకుండానే సూపర్వైజర్లకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రిలీవ్ చేయడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. దీని ప్రభావం అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణపై చూపుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● రంపచోడవరం సీడీపీవో పరిధిలో రంపచోడవరం, దేవీపట్నం మండలాలకు చెందిన 150 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. రాజవొమ్మంగి సీడీపీవో పరిధిలో ఇదే మండలంలో 150, మారేడుమిల్లి సీడీపీవో పరిధిలో మారేడుమిల్లి, వై.రామవరం అప్పగర్ పార్ట్ ప్రాంతాలకు చెందిన 100 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. గంగవరం సీడీపీవో పరిధిలో ఇదే మండలంలో 55 కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో చిన్నారులకు ప్రతిరోజు పౌష్టికాహారం సక్రమంగా అందుతుందా లేదా అనేది సీడీపీవోలు పర్యవేక్షించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ పోస్టులు 15 రోజుల నుంచి ఖాళీగా ఉన్నాయి. ● సూపర్వైజర్లకు సీడీపీవోల అదనపు బాధ్యతలు అప్పగించినప్పటికీ వీరికి కూడా పనిఒత్తిడి కారణంగా పర్యవేక్షించే అవకాశాలు తక్కువే. ఏజెన్సీ ప్రాంతంలో ఒక అధికారి బదిలీ అయితే నిబంధనల ప్రకారం ఆ స్థానంలో కొత్త అధికారి వచ్చిన తరువాత రిలీవ్ చేయాలి. ఏజెన్సీ ప్రాంతం నుంచి ఒక అధికారి బదిలీ అయితే కొత్త వారు ఇక్కడకు వచ్చేందుకు సుముఖంగా ఉండరన్న కారణంగా ఈ నిబంధన అమలవుతోంది. ఆయా పోస్టులు ఖాళీగా ఉంటాయన్న కారణంతో కొత్త వారు వచ్చే వరకు వారిని ఐటీడీఏ అధికారులు రిలీవ్ చేయకుండా ఉంచేవారు. సీడీపీవోల బదిలీల్లో అధికారుల తీరుపై విమర్శలు కొత్తవారు రాకుండానే రిలీవ్ చేయడంపై ఆరోపణలు 15 రోజులుగా ఖాళీగా ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పోస్టులు ఇన్చార్జి సూపర్వైజర్లే దిక్కు! -
ముంచంగిపుట్టులో దొంగలు హల్చల్
ముంచంగిపుట్టు: మండల కేంద్రం ముంచంగిపుట్టులో బుధవారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. రెండు దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. మరో దుకాణంలో చోరీకి విఫలయత్నం చేశారు. గురువారం ఉదయం దుకాణాలు తెరిచేందుకు వచ్చిన యజమానులు వచ్చేసరికి తాళాలు పగులగొట్టి తలుపులు తెరిచి ఉన్నాయి. వస్తువులన్నీ చిందరవందగా పడిఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించారు.స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో నాగరాజుకు చెందిన కేవీఆర్ మెడికల్ అండ్ స్టేషనరీ, అప్పారావుకు చెందిన బార్బర్ దుకాణాల తాళాలు పగలగొట్టారు. వీటిలో వస్తువులు, రూ.5 వేల వరకు నగదు తీసుకొని వెళ్లిపోయారు. ఇదే ప్రాంతంలోని ప్రభాకర్ కిరాణా దుకాణంలో చోరీకి యత్నించారు. తలుపు తాళాలు పగులగొట్టినా తలుపులు తెరచుకోకపోవడంతో వెళ్లిపోయారు. చోరీ విషయాన్ని యజమానులు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఏఎస్ఐ లక్ష్మణరావు, సిబ్బంది పరిశీలించారు. బాధిత యజమానుల నుంచి వివరాలు సేకరించారు. దొంగతనాలు మళ్లీ మొదలు కావడంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. వీటిపై పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని వారు కోరుతున్నారు. రెండు దుకాణాల్లో చోరీ తాళాలు పగులగొట్టి విలువైన వస్తువులు, రూ.5వేల నగదు అపహరణ ఆందోళన చెందుతున్న స్థానికులు -
బడి ఈడు పిల్లలంతా బడిలోనే ఉండాలి
సాక్షి,పాడేరు: పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో బడిఈడు పిల్లలంతా బడుల్లోనే ఉండాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ ఆదేశించారు. పాఠశాల విద్యాఽశాఖ రూపొందించిన ఎన్రోల్మెంట్ డ్రైవ్ ప్రచార పోస్టర్లను బుధవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వచ్చేనెల 13వతేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పాఠశాలల ఎన్రోల్మెంట్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలన్నారు. గ్రామ, మండల స్థాయి కమిటీలన్నీ ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలని, బడికి దూరంగా ఉన్న డ్రాపౌట్ విద్యార్థులను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలన్నారు. తల్లిదండ్రులకు కూడా పిల్లల చదువులు, భవిష్యత్పై అవగాహన కల్పించాలన్నారు. బడిఈడు పిల్లలు బాల కార్మికులుగా ఎక్కడ పనుల్లో ఉన్నా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బడిబయట పిల్లలు లేని గ్రామాలుగా ప్రకటించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో డీఈవో పి.బ్రహ్మాజీరావు, డీఆర్డీఏ పీడీ మురళీ, సర్వశిక్ష ఏపీసీ డాక్టర్ స్వామినాయుడు, ఇన్చార్జి గిరిజన సంక్షేమశాఖ డీడీ రజనీ, సర్వశిక్ష అధికారి ప్రకాష్ పాల్గొన్నారు. రుణపరిమితి మించాలి వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణపరిమితి పెంచాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, అనుబంధ శాఖలు,బ్యాంకు అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.1145.67కోట్ల వార్షిక రుణ ప్రణాళికలను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామ సచివాలయాల వారీగా రైతులను గుర్తించి జాబితాలను సిద్ధం చేయాలని సూచించారు. వ్యవసాయానుబంధ రంగాలకు రుణాలు మంజూరు చేయాలన్నారు. గిరిజన రైతులు, వ్యాపారులు, మహిళా సంఘాలకు బ్యాంకులన్నీ పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చి శతశాతం లక్ష్యాలను సాధించాలన్నారు. అలాగే ఐటీడీఏ ఏపీవోలు, వెలుగు, గిరిజన సంక్షేమశాఖ, విద్యాఽశాఖ, ఎస్ఎంఐ, ఐసీడీఎస్ అధికారులతోను సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చిరంజీవి నాగ వెంకట సాహిత్, యూనియన్ బ్యాంకు రీజినల్ అధికారి జితేంద్రశర్మ, ఆర్బీఐ జిల్లా అధికారి నవీన్, ఎల్డీఎం మాతునాయుడు, వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులు ఎస్బీఎస్.నందు, రమేష్ కుమార్రావు పాల్గొన్నారు.కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశం -
టీచర్ను నియమించాలని ఆందోళన
ముంచంగిపుట్టు: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గిరిజన విద్యపై పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు కొర్రా త్రినాథ్ ధ్వజమెత్తారు. మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ కార్లపోదోర్ జీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు లేక మూసి ఉండడంపై విద్యార్థులు,తల్లిదండ్రులు బుధవారం గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఉపాధ్యాయుడిని నియమించి, పాఠశాల తెరించి చదువు చెప్పించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా త్రినాథ్ మాట్లాడుతూ కార్లపోదోర్ జీపీఎస్ పాఠశాలలో 26 మంది విద్యార్థులు ఉన్నారని, గత 13 రోజులుగా ఉపాధ్యాయుడు లేక పాఠశాల మూసి ఉందన్నారు.గతంలో ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయుడు బదిలీపై వెళ్లిపోయారని, ఆయన స్థానంలో మరొకరిని నియమించకపోవడం అన్యాయమన్నారు.గిరిజన ప్రాంతంలో విద్యాప్రమాణాల మెరుగుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. పాఠశాలలు పునఃప్రారంభం నాటికి ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో విద్యాశాఖ మంత్రి విఫలం అయ్యారని దుయ్యబెట్టారు. ఇప్పటికై నా పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ ప్రతినిధులు నీలకంఠం, గోపాల్, కామరాజు, శ్రీను,రాజు, లైకోన్, రాంబాబు, కోమటి, కృష్ణ, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
డ్రోన్లతో మలేరియా మందు పిచికారీ
రంపచోడవరం: ఏజెన్సీలో దోమల నివారణకు మలేరియా మందు స్ప్రేయింగ్కు డ్రోన్లతో ఉపయోగిస్తున్నట్టు స్థానిక ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం తెలిపారు. బుధవారం ఆయన సాయినగర్లో డ్రోన్లతో మలేరియా స్ప్రేయింగ్ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ పైలెట్ ప్రాజెక్టుగా రంపచోడవరం మండలంలోని రంపచోడవరం, చెరువూరు గ్రామాలను ఎంపిక చేశామన్నారు. ఒకొక్క డ్రోన్ రూ.10 లక్షలు ఉంటుందన్నారు. బ్యాటరీ ఫుల్ చార్జ్ చేస్తే రెండు కిలోమీటర్లు దూరం పిచికారీ అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంవో జ్ఞాన,ఏడీఎంహెచ్వో జి.శిరీష, డీఎల్డీవో కోటేశ్వరరావు, సర్పంచ్ మంగా బొజ్జయ్య, ఏఎంవో శ్రీనివాసరాజు, కార్యదర్శి రమేష్, సుధాప్రకాష్ పాల్గొన్నారు. మోతుగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో తొలిసారిగా దోమల మందు పిచికారీకి డ్రోన్లు ఉపయోగిస్తున్నామని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ అన్నారు. బుధవారం ఆయన స్థానిక పీహెచ్సీ పరిధిలోని దబ్బగూడెంలో డ్రోన్ల ద్వారా దోమల మందు పిచికారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఒక వినూత్న ప్రయత్నంగా డ్రోన్ల ద్వారా యాంటీ లెవెల్ ఆపరేషన్ ప్రారంభించిందన్నారు. వీటి వినియోగం వల్ల తక్కువ మందితో స్ప్రేయింగ్ పూర్తి చేయవచ్చన్నారు. లోతైన ప్రదేశాల్లో కూడా పిచికారి సాధ్యమవుతుందన్నారు. డిప్యూటీ డీఎంఅండ్హెచ్ పుల్లయ్య, డాక్టర్ ప్రజ్ఞ తదితరులు పాల్గొన్నారు.రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం -
వీడియో, ఫొటోగ్రాఫర్లసంక్షేమానికి కృషి
పాడేరు: అల్లూరి జిల్లా ఫోటో, వీడియో గ్రాఫర్స్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం పాడేరులో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా జి.ఈశ్వర్రావు(పాడేరు), ప్రధాన కార్యదర్శి కె.సాయికృష్ణ(పాడేరు), కోశాధిరిగా ఎ.ఆనంద్బాబు(పాడేరు), ఉపాధ్యక్షుడిగా జె.మనోహార్(పాడేరు), సహాయ కార్యదర్శులుగా కె.జాన్(జి.మాడుగుల), ఎస్.రాజీవ్(జి.మాడుగుల), శ్రీను(వంట్లమామిడి), ప్రసాద్(పాడేరు), గౌరవ అద్యక్షుడిగా డి.కోటేశ్వరరావులను ఎన్నుకున్నారు. వీరే కాకుండా అర్గనైజింగ్ కార్యదర్శులుగా ప్రతి మండలం నుంచి ఒకరు చొప్పున ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఈశ్వర్రావు, సాయికృష్ణ మాట్లాడుతూ ఫోటో, వీడియో గ్రాఫర్ల సంక్షేమానికి, వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తాము శక్తి వంచన లేకుందా కృషి చేస్తామన్నారు. -
హైడ్రో పవర్ ప్లాంట్కు అనుమతులను తక్షణమే రద్దు చేయాలి
దేవరాపల్లి: అనంతగిరి మండలం పెదకోట, దేవరాపల్లి మండలంలోని చింతలపూడి, మారిక గ్రామాల మధ్య హైడ్రో పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కేబినెట్ ఇచ్చిన అనుమతులను తక్షణమే రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న డిమాండ్ చేశారు. దేవరాపల్లిలో బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. అల్లూరి జిల్లా పెదకోట ఏరియాలో 1800 మెగావాట్స్, దేవరాపల్లి మండలం చింతలపూడి, వేపాడ మండలం మారిక గ్రామాల మధ్య 900 మెగా వాట్స్ సామర్థ్యంతో లూప్ పంప్డ్ స్టోరేజీ పవర్ ప్రాజెక్టులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ ప్రాంతంలోని ఆదివాసీలను, ఇతర పేద ప్రజలను వారి ఆవాసాల నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించడం అత్యంత దారుణమని చెప్పారు. చింతలపూడి, మారిక గ్రామాలను ఖాళీ చేసేందుకు అదాని ప్రతినిధులు పూనుకోవడం అన్యాయమన్నారు. వేపాడ మండలం మారిక, దేవరాపల్లి మండలం చింతలపూడిలో శారదానదిపై ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడంతో రైవాడ జలాశయం ఆయకట్టు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. విశాఖ ప్రజల తాగునీటి అవసరాలకు సైతం తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. 1/70 చట్టాన్ని, ఐదవ షెడ్యూల్ వర్తించే రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ఈ ప్రాజెక్టును అడ్డుకోకుంటే రైవాడ ఆయకట్టు భూములు బీడులుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మారిక, చింతలపూడి గ్రామాలను ఖాళీ చేయించే పనులను అదాని గ్రూపు సంస్థల ప్రతినిధులు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే మారిక గ్రామ ప్రజలు సామాజిక ఆర్థిక సర్వేను అడ్డుకున్నారని, వీరి స్ఫూర్తితో రైవాడ ఆయకట్టు రైతులు పోరాటానికి సిద్ధం కావాలన్నారు. మారిక, చింతలపూడి మధ్య హైడ్రోప్రాజెక్టు నిర్మిస్తే‘ రైవాడ’కు ముప్పు ఆయకట్టు రైతులు పోరాటానికి సిద్ధం కావాలి సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్న -
లిడార్ సర్వేకు ప్రతిపాదనలు
చింతూరు: డివిజన్లో వరద ముంపునకు గురయ్యే గ్రామాలను పోలవరం ముంపులో చేర్చే విషయంపై లిడార్ సర్వే నిమిత్తంకలెక్టర్కు ప్రతిపాదనలు పంపుతామని స్థానిక ఐటీడీఏ పీవో అపూర్వభరత్ తెలిపారు. బుధవారం ఆయన కల్లేరు గ్రామాన్ని సందర్శించారు. ఏటా వరద ముంపునకు గురవుతున్న తమ గ్రామాన్ని 41.15 కాంటూరులో చేర్చి పరిహారంతో పాటు పునరావాసం కల్పించాలని ఆయనను గ్రామస్తులు కోరారు. గ్రామంలో 268 కుటుంబాలు ఉన్నాయని, వరదల సమయంలో అనేక ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోయారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ వరద ముంపులో చేర్చాలని అనేక గ్రామాల నుంచి వినతులు వచ్చాయని, వాటిని ముంపు జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్డీసీ బాలకృష్ణారెడ్డి, తహసీల్దార్ చిరంజీవి, ఎంపీడీవో రామకృష్ణ పాల్గొన్నారు. ఐటీడీఏ పీవో అపూర్వభరత్ -
ప్రాథమిక విద్యపై నిర్లక్ష్యం
సాక్షి,పాడేరు: మండలంలో సలుగు పంచాయతీ దబ్బగరువు గ్రామంలోని గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల తెరచుకోకపోవడంతో ఇక్కడ చిన్నారులు ప్రాథమిక విద్యకు దూరమయ్యారు.ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఈనెల 12వతేదీన పాఠశాలల పునఃప్రారంభమైన నాటి నుంచి ఇంతవరకు ఉపాధ్యాయుడు రాలేదని గ్రామపెద్దలు జర్త నాగేశ్వరరావు, జర్త కొండబాబు, పెంటయ్య, భీమరాజు తెలిపారు. ఈవిషయాన్ని విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలను వెంటనే ప్రారంభించి గిరిజన చిన్నారులకు ప్రాథమిక విద్యను అందించాలని ఐటీడీఏ,గిరిజన సంక్షేమ,విద్యాశాఖ అధికారులకు దబ్బగరువు గిరిజనులు విన్నవించుకుంటున్నారు. పనసవలసలో ఉపాధ్యాయుడు రాక.. డుంబ్రిగుడ: మండలంలోని సొవ్వ పంచాయతీ పనసవలసలో పాఠశాల తెరచుకోలేదు. సుమారు 32 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలకు ఉపాధ్యాయుడు రాలేదని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల తమ పిల్లలు విద్యకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల పునః ప్రారంభమైన తరువాత మొదటి రెండు రోజులు మాత్రమే వచ్చారని, ఆ తరువాత నుంచి ఆయన జాడ లేదని వారు తెలిపారు. మండల విద్యాశాఖ అధికారి స్పందించి వెంటనే పాఠశాల తెరచుకునేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.తెరచుకోని దబ్బగరువు పాఠశాల -
సొంత మండలాలకుబదిలీ చేయాలని వినతి
సాక్షి,పాడేరు: జిల్లాలోని సచివాలయాల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఉద్యోగులను సొంత మండలాలకు బదిలీలు జరపాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్కు వారంతా విన్నవించుకున్నారు. బుధవారం వారంతా కలెక్టర్ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. రాష్ట్రంలో క్లస్టర్ మ్యాపింగ్ తరువాత రెండు క్లస్టర్లకు ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ పనిచేస్తుండడంతో పనిభారం అధికమైందని, రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతం మందికే బదిలీ చేశారన్నారు. మిగిలిన ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఏశాఖకు బదిలీ చేస్తారో తెలియక గందరగోళం నెలకొందని వారు కలెక్టర్కు నివేదించారు. ఈసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు కలెక్టర్ హమీ ఇచ్చారు. -
మెరుగైన వైద్య సేవలు అందించాలి
రాజవొమ్మంగి: రోగులకు సకాలంలో వైద్యం అందకపోవడంపై మండలంలోని లాగరాయి పీహెచ్సీ వైద్యాధికారిని స్థానిక ప్రజాప్రతినిధులు బుధవారం ప్రశ్నించారు. పీహెచ్సీ వద్ద రోగుల ధర్నా పేరిట బుధవారం ‘సాక్షి’ వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ మేరకు స్థానిక ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, సర్పంచ్ మిరియాల గణలక్ష్మి పీహెచ్సీకు వెళ్లి రోగులకు సకాలంలో వైద్యం అందకపోవడంపై వైద్యాధికారి నాగార్జునను ప్రశ్నించారు. గత మూడు రోజులుగా పీహెచ్సీలో డాక్టరు లేరని, ఇందుకు బాధ్యులు ఎవరని నిలదీశారు. మూడు రోజులుగా హాజరు పట్టీలో అటెండెన్స్ లేదని, అయితే ఈ రోజు వైద్యులు యధావిధిగా విధులకు హాజరైనట్లు సంతకాలు ఉన్నాయని, ఇదేమిటని సర్పంచ్ గణలక్ష్మి డాక్టర్ను అడిగారు. రోగులకు సకాలంలో వైద్యం అందడం లేదన్నారు. దీనిపై డాక్టర్ నాగార్జున మాట్లాడుతూ గ్రామంలో పారిశుధ్యం కొరవడిందని, ఫలితంగా మలేరియా, టైఫాయిడ్ జ్వరపీడీతుల సంఖ్య కూడా పెరిగిందన్నారు. వైద్యుని పొంతలేని సమాధానంపై ఎంపీపీ వెంకటలక్ష్మి డాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీహెచ్సీలో పరిస్థితిని ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. లోతట్టు ప్రాంతం లాగరాయి పీహెచ్సీకు మరో డాక్టర్ను నియమించాలని, పూర్తి స్థాయిలో మందులు సరఫరా చేయాలని వారు అధికారులను కోరారు.లాగరాయి పీహెచ్ని సందర్శించిన ఎంపీపీ వెంకటలక్ష్మి, సర్పంచ్ గణలక్ష్మి -
గిరిజన హక్కుల పరిరక్షణకు మరో ఉద్యమం
పాడేరు : రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో హక్కులు, చట్టాలు, అచార, వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు మరో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లకే రాజారావు పిలుపునిచ్చారు. పట్టణంలోని వీఆర్ పంక్షన్ హాల్లో ఏఐబీఎస్పీ ఆధ్వర్యంలో ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ పరంజ్యోతి అధ్యక్షతన గిరిజన ఆదివాసీ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనాభివృద్ధి, సంక్షేమం కోసం రాజ్యాంగంలో అనేక చట్టాలు పొందుపర్చారన్నారు. కానీ వాటిని అమలు చేయడంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. అటవీ హక్కుల చట్టాలు సక్రమంగా అమలు కాకపోవడంతో పాలకులు గిరిజన ప్రాంతంలో అత్యంత విలువైన బాకై ్సట్, ఇతర ఖనిజ సంపదపై కన్నేశారన్నారు. అడవి హక్కులను కార్పొరేట్ శక్తులు రాజ్యాంగ విరుద్ధంగా కబలిస్తున్నాయన్నారు. ఐదో షెడ్యూల్ ప్రాంతంలో హక్కులు, చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. కానీ పాలకులకు గిరిజనులంటే చిన్న చూపన్నారు. అందుకే గిరిజన ప్రాంత, అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారన్నరు. తమ పార్టీ గిరిజన హక్కులు, చట్టాలు, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తుందన్నారు. గిరిజనుల పక్షాన నిత్యం పోరాటం చేస్తామన్నారు.ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లకే రాజారావు -
దుఃఖీభవ
అన్నదాతఖరీఫ్లో మొదలైన కష్టాలు● పూర్తిస్థాయిలో అందుబాటులో లేని వరి విత్తనాలు ● 56,292 హెక్టార్లలో 46 వేల హెక్టార్లకు మాత్రమే సరఫరా ● ప్రచారానికే పరిమితమైన ‘అన్నదాత సుఖీభవ’ ● 1.69 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమకాని రూ.127 కోట్లు ● సాగు పెట్టుబడికోసం వడ్డీ వ్యాపారులు, బ్యాంక్ల చుట్టూ తిరుగుతున్న గిరి రైతులుసాక్షి,పాడేరు: ఖరీఫ్ సాగుకు అనుకూలంగా వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 22 మండలాల పరిధిలో ఏటా 56,292 హెక్టార్లలో ఖరీఫ్లో వరి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో సాగుకు ఉపక్రమించారు. దుక్కి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇందుకు పశువులు, ట్రాక్టర్లు, టిల్లర్లను వినియోగిస్తున్నారు. నారుమడుల తయారీ పనులు ఊపందుకున్నాయి. పూర్తిస్థాయిలో విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో దిగులు చెందుతున్నారు. జిల్లాలో సాగు విస్తీర్ణానికి తగ్గట్టుగా విత్తనాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా సాగు విస్తీర్ణం 56,292 హెక్టార్లు కాగా 46 వేల హెక్టార్లకు అవసరమైన 23,078 క్వింటాళ్ల వరి విత్తనాలను 90శాతం రాయితీపై ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. మిగతా 10,292 హెక్టార్ల విస్తీర్ణానికి విత్తనాలు ప్రశ్నార్థకంగా మారాయి. దీంతో ప్రైవేట్ మార్కెట్లో అధిక ధరలకు విత్తనాలు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అన్నదాత సుఖీభవ సాయం అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుకు ఏటా రూ.20 వేలు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం వారి ఖాతాల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా నేటికీ జమ కాలేదు. జిల్లాలో 1.69 లక్షల మంది రైతులకు రూ.127 కోట్లు ప్రభుత్వం జమచేయాల్సి ఉంది. సాయం అందక మెజారిటీ రైతులు వ్యవసాయ పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులు, బ్యాంక్ల చుట్టూ తిరుగుతున్నారు. నాలుగు బస్తాలకు.. రెండే.. కొయ్యూరు: మండలంలోని రైతులు విత్తన కొరతను ఎదుర్కొంటున్నారు. నాలుగు బస్తాల విత్తనాలు కావాల్సిన రైతులకు ఒకటి లేదా రెండు బస్తాలు ఇచ్చి సరిపెడుతున్నారు. విత్తనాలు ఉండవన్న భయంతో బుధవారం ఒకపక్క వర్షం పడుతున్నా సింగవరం రైతు సేవా కేంద్రానికి రైతులు భారీగా తరలివచ్చారు. సాగు విస్తీర్ణం మేరకు మండలానికి 839 క్వింటాళ్ల వరకు విత్తనాలు అవసరం కాగా 654 క్వింటాళ్లకు మాత్రమే అనుమతి వచ్చింది.ఇంకా 185 క్వింటాళ్ల రావలసి ఉంది. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి ప్రియాంక మాట్లాడుతూ ఈక్రాప్లో నమోదైన రైతులకు మాత్రమే విత్తనాలు వస్తున్నాయన్నారు. రెండో విడత ఇండెంట్కు సంబంధించి విత్తనాలు రావాల్సి ఉందన్నారు. రైతులు 20శాతం మేర సమకూర్చుకోవాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు.జిల్లా సమాచారం మండలాలు : 22 వరి సాధారణ విస్తీర్ణం : 56,292 సిద్ధంగా ఉన్న విత్తనాలు : 23,078 క్వింటాళ్లు కొరత : 10,292 హెకార్లు అన్నదాత సుఖీభవ రైతులు : 1.69 లక్షలు ఖాతాల్లో జమ కాని నిధులు :రూ.127కోట్లువైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే మేలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి ఏటా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందేది. కూటమి ప్రభుత్వం గత ఏడాది రైతులకు ఆర్థిక సాయం అందించలేదు. ఖరీఫ్ వ్యవసాయ పనులు ప్రారంభమైనప్పటికీ ఇంత వరకు అన్నదాత సుఖీభవ సాయం పంపిణీ ఊసేలేదు. రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. – పాంగి సన్యాసిరావు, గిరిజన రైతు, పందిదొర్లు, మోదాపల్లి పంచాయతీ, పాడేరు మండలం -
లంబసింగి అందాలు అద్భుతం
● అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి నళినీ కుమార్ శ్రీవాస్తవ చింతపల్లి: లంబసింగి అందాలు అద్భుతమని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస నళినీ కుమార్ శ్రీవాస్తవ అన్నారు. బుధవారం ఆయన లంబసింగి ప్రాంతాన్ని సందర్శించారు. ఆయనకు పాడేరు సబ్ కలక్టర్ శౌర్యమాన్ పటేల్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.లంబసింగితో పాటు చెరువులవేనం వ్యూపాయింట్, తాజంగి జలాశయాన్ని ఆయన సందర్శించారు. ఈ ప్రాంత అందాలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. ఆయన వెంట తహసీల్దారు రామకృష్ణ పాల్గొన్నారు. -
మూడో ఫర్నేసా..
ముడిసరకు లేకుండానే స్టీల్ప్లాంట్లోని బ్లాక్ ఫర్నేస్–3గాజువాక : గతంలో ఒకసారి బీఎఫ్–3ని ప్రారంభించినా, కేవలం రెండు నెలలకే ముడిసరకు కొరత కారణంగా మూసివేయాల్సి వచ్చింది. ఆ అనుభవాల దృష్ట్యా తగినన్ని ముడిసరకు నిల్వలు లేకుండానే మళ్లీ ఫర్నేస్ను ప్రారంభించాలని తాజాగా నిర్ణయించడంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.11,440 కోట్లను బ్యాంకుల అప్పులు తీర్చడానికే వినియోగించి స్టీల్ ఉత్పత్తికి అవసరమైన ముడి సరకు సమకూర్చలేదు. స్టీల్ప్లాంట్ లాంటి ఇంటిగ్రేటెడ్ పరిశ్రమలో కనీసం 45 రోజులకు సరిపడా ముడి సరకు నిల్వలు ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మూడు నెలలకు సరిపడా ముడి సరకును సమకూర్చిన తర్వాతే బీఎఫ్–3ను ప్రారంభిస్తామని గతంలో స్టీల్ జాయింట్ సెక్రటరీ ప్రకటించారు. కానీ ప్రస్తుతం ప్లాంట్కు అవసరమైన ముడిసరకు అందుబాటులో లేదని కంపెనీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫర్నేస్ను ప్రారంభిస్తే ప్లాంట్ నష్టాల బారిన పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూలింగ్ ప్లేట్ల సమస్య..అదనపు భారం గతంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా బీఎఫ్–3ని ప్రారంభించి, ఆ తర్వాత మూసివేశారు. ఈ కారణంగా ఫర్నేస్లోని కీలకమైన కూలింగ్ ప్లేట్లు దెబ్బతిన్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీని వల్ల కూడా స్టీల్ ఉత్పత్తిలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన ఈ ప్లేట్ల కోసం ప్లాంట్ యాజమాన్యం అదనంగా ఖర్చు చేసింది. ఇతర దేశాల నుంచి కూలింగ్ ప్లేట్లు ఇక్కడికి చేరాలంటే సుమారు రెండు నెలల సమయం పడుతుంది. కానీ అత్యవసరంగా వాయు రవాణా ద్వారా తెప్పించడం వల్ల ప్లాంట్పై అదనపు ఆర్థిక భారం పడిందని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. గతంలో జరిగిన అనుభవం నుంచి పాఠాన్ని తీసుకోని ప్రభుత్వం బీఎఫ్–3ని పున:ప్రారంభించాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు చెబుతున్నారు. మూడో బ్లాస్ట్ ఫర్నేస్ చుట్టూ సందేహాలు సరిపడినంత ముడిసరకు లేదంటున్న కంపెనీవర్గాలు సింటర్, బ్యాటరీల సామర్థ్యం సరిపోదంటున్న ఉద్యోగులు స్టీల్ను రోల్ చేయగలిగే సామర్థ్యంపైనా అనుమానాలు కంపెనీపై ఆర్థికభారం పెరుగుతుందంటున్న కార్మికవర్గం విశాఖ స్టీల్ప్లాంట్లో మూడో బ్లాస్ట్ ఫర్నేస్(బీఎఫ్–3)ను ఈ నెల 27న పునఃప్రారంభించేందుకు దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్టీల్ప్లాంట్ను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా బీఎఫ్–3ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అటు యాజమాన్యం, ఇటు ప్రభుత్వ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. బీఎఫ్–3ని ప్రారంభించాలనుకోవడం మంచి విషయమే.. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయంపై పరిశ్రమ వర్గాల్లో అనేక అనుమానాలు, ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇప్పుడీ విషయం చర్చనీయాంశంగా మారింది. సామర్థ్యంపై సందేహాలు సింటర్ ప్లాంట్ బీఎఫ్–3 సమర్థంగా పని చేయాలంటే సింటర్ ప్లాంట్లో తగినంత సింటర్ అందుబాటులో ఉండాలి. ఇక్కడ ప్రస్తుతం మూడు మిషన్లు అందుబాటులో ఉన్నాయి. మూడో బ్లాస్ట్ ఫర్నేస్ సమర్థంగా పని చేయాలంటే అదనంగా మరో సింటర్ మిషన్ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న మిషన్లను పూర్తిస్థాయిలో వాడితే మూడు మిషన్లు సరిపోతాయని యాజమాన్యం చెబుతోంది. అయితే ఏ చిన్నపాటి సాంకేతిక సమస్య వచ్చినా ఉత్పత్తిని ఆపుకోవాల్సి వస్తుందని, అందువల్ల నాలుగో సింటర్ మిషన్ అవసరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కోక్ ఒవెన్ కోక్ ఒవెన్ విభాగంలో ఆరో బ్యాటరీని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇది లేకపోవడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగి నష్టాలు వస్తాయని అంచనా. ప్రస్తుతం దీన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కానందున, దీని నిర్వహణను ప్రైవేట్కు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పెల్లెట్స్ ఉత్పత్తిలో కీలకమైన పెల్లెట్లను బయట నుంచి కొనుగోలు చేస్తున్నారు. దీని వల్ల ఒక్కో టన్ను ఉత్పత్తికి రూ.4,000 అధిక ఖర్చు అవుతోందని లెక్కలు చెబుతున్నాయి. ఇది కూడా ప్లాంట్పై అదనపు భారమే. రోలింగ్ మిల్స్ ప్రస్తుతం ప్లాంట్లో 5.5 మిలియన్ టన్నుల స్టీల్ను మాత్రమే రోల్ చేయగలిగే సామర్థ్యం ఉంది. బీఎఫ్–3 ప్రారంభమైతే ఉత్పత్తి 7.5 మిలియన్ టన్నులకు చేరుతుంది. ఆ అదనపు స్టీల్ను రోల్ చేసే సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుందనే ప్రశ్నకు సమాధానం లేదు. ఇన్ని సవాళ్ల మధ్య బీఎఫ్–3ని పునఃప్రారంభించి, దాన్ని సమర్థంగా నిర్వహించగల సత్తా యాజమాన్యానికి ఉందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా, ప్లాంట్కు అవసరమైన సొంత గనులను కేటాయించాలని నిపుణులు, కార్మికులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. లేదా సెయిల్లో ఈ ప్లాంట్ను విలీనం చేస్తే కొంతమేరకై నా పరిష్కారం లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు. -
రాజేంద్రపాలెం రాంరాం
కొయ్యూరు: మండల కేంద్రంలోని రాజేంద్రపాలెం పీహెచ్సీకి వైద్యులు రావడానికి ఆసక్తి చూపడం లేదు. ఇటీవల జరిగిన కౌన్సెలింగ్లో ఒక్కరు కూడా రాజేంద్రపాలెం కోరుకోలేదు. ఇక్కడి వైద్యాధికారి సంపత్బాబుకు విశాఖ సమీపంలోని ఆస్పత్రికి బదిలీ అయింది. ఆయన స్థానంలో ఎవరిని నియమించలేదు. ప్రస్తుతం యూ.చీడిపాలెం పీహెచ్సీ వైద్యాధికారి హేమంత్ డిప్యూటేషన్పై రాజేంద్రపాలెం ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. అయితే యూ.చీడిపాలెంలో పనిచేస్తున్న మరో వైద్యాధికారి జయప్రకాశ్కు బదిలీ అయింది. దీంతో డిప్యూటేషన్లో ఉన్న హేమంత్ యూ.చీడిపాలెం వెళ్లాల్సి ఉంటుంది. ఇదే జరిగితే రాజేంద్రపాలెం పీహెచ్సీకి వైద్యుల కొరత ఉంటుంది. దీనిపై పాడేరు ఏడీఎంహెచ్వో డాక్టర్ ప్రతాప్ను వివరణ కోరగా త్వరలో కొత్త వైద్యుల నియామకానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వీరిలో వచ్చే వారిని రాజేంద్రపాలెం పీహెచ్సీకి కేటాయిం,చి, వైద్యుల కొరత లేకుండా చూస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక్కడి పీహెచ్సీని కోరుకోని వైద్యులు రోగులకు తప్పని ఇబ్బందులు -
చెట్లు అక్రమ నరికివేతపై ఆందోళన
డుంబ్రిగుడ: మండలంలోని సాగర పంచాయతీ కిల్లోగుడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉన్న నీలగిరి, సిల్వర్ చెట్లు అక్రమంగా తొలగించడంపై పాఠశాల విద్యా కమిటీ సభ్యులు, గ్రామస్తులు తీవ్రంగా ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్య కమిటీ చైర్మన్ టి.సూర్యనారాయణ, వైస్చైర్మన్ కె.అప్పలనాయుడు మాట్లాడుతూ కమిటీ తీర్మాణం లేకుండా, గ్రామసభ ఏర్పాటు చేయుండా ఏకపక్షంగా చెట్లు తొలగించడం చాలా దారుణమన్నారు. తీర్మాణం లేకుండా చెట్లు తొలగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తొలగించిన చెట్లకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. విద్యా కమిటీ సభ్యులు గౌరమ్మ, సుశీల, మొత్తి, ఝన్సీరాణి, పరశురాం, మోహన్రావు, సద్దు, బుద్దు గ్రామస్తులు పాల్గొన్నారు. -
త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలి
● చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ ఆదేశం చింతూరు: సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఐటీడీఏ పీవో అపూర్వభరత్ ఆదేశించారు. బుధవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన నాలుగు మండలాలకు చెందిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ వివిధ సమస్యలకు సంబంధించి 71 అర్జీలు రాగా, వాటిలో ఆర్అండ్ఆర్ సమస్యలపై 31 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఆర్అండ్ఆర్ సమస్యలను పోలవరం కార్యాలయ అధికారులు పరిశీలించి పరిష్కారం చూపాలని పీవో ఆదేశించారు. -
సబ్ కలెక్టర్ హామీతో దీక్ష విరమణ
రంపచోడవరం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు భూమి, సంపూర్ణ పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ రంపచోడవరం ఐటీడీఏ ఎదుట కొండమొదలు సర్పంచ్ వేట్ల విజయ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షను సబ్ కలెక్టర్ హామీతో మంగళవారం విరమించారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని సోమవారం ఈ దీక్ష ప్రారంభించారు. రెండో దీక్షలో రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సింహాద్రి ఝూన్సీ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసతులల సమస్యలు పరిష్కరించాలని గిరిజనులు పోరాడుతున్నా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కల్పశ్రీతో గిరిజన సంఘం నాయకులు చర్చలు జరిపారు. నెల రోజుల్లో కత్తెనపల్లి గ్రామస్తుల,మిగిలిన వారి ఆర్అండ్ఆర్ సమస్యలు పరిష్కారిస్తామని, 2017లో ప్రభుత్వ అధికారులతో కుదిరిన ఒప్పందం ప్రకారం సేకరించిన 169 ఎకరాలు భూమిని అప్పగిస్తామని, నేలదోనెలపాడు ఆర్అండ్ఆర్ కాలనీని ప్రత్యేక పంచాయతీగా ప్రకటిస్తామన సబ్ కలెక్టర్ హామీ ఇవ్వడంతో సర్పంచ్ దీక్ష విరమించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు ఐనారపు సూర్యనారాయణరావు, ఆర్పీవై నాయకుడు పిట్టా వరప్రసాద్, హ్యూమన్ రైట్స్ వాచ్ అధ్యక్షుడు బాలు అక్కిస, ఏఐకేఎంఎస్ నాయకుల రమణ, జోగమ్మ తదితరులు పాల్గొన్నారు. -
శివ.. శివా..
అచ్యుతాపురం రూరల్: రాంబిల్లి మండలం పంచదార్ల పంచాయతీలోని ఓ మారుమూల గ్రామమైన ధారపాలెం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రముఖమైనది. చారిత్రక ప్రాధాన్యమున్న పంచదార్ల శివాలయంలో రాతి కట్టడాలను పరిరక్షించేందుకు ఈ క్షేత్రాన్ని పురావస్తు శాఖకు అప్పగించారు. అయితే నాటి శిల్ప సంపదను గానీ, ఆలయ పవిత్రతను గానీ కాపాడే చర్యలేవీ కానరాక ఈ ఆలయం రోజురోజుకూ కునారిల్లిపోతోంది. అడుగడుగునా అపరిశుభ్రత తాండవిస్తోంది. సరైన మౌలిక సదుపాయాలు లేక భక్తుల అవస్థలు వర్ణనాతీతం. పంచదార్లలో పుణ్య స్నానం ఆచరించాక మహిళలు దుస్తులు మార్చుకునేందుకు కూడా సరైన గదుల్లేక ఇబ్బందులకు గురవుతున్నారు. మరుగుదొడ్లు లేకపోవడంతో పుణ్యక్షేత్రం పరిసరాలు మల విసర్జనలతో అపవిత్రమవుతున్నాయి. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆలయాల సమీపంలో మద్యం సీసాలు కనిపిస్తున్నాయి. -
మెగా ఆధార్ శిబిరానికి విశేష స్పందన
మరణించి.. మరో ఇద్దరికి వెలుగునిచ్చి.. చింతూరు: కొండరెడ్ల కోసం ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా ఆధార్ శిబిరానికి విశేష స్పందన లభిస్తున్నట్లు చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ మంగళవారం తెలిపారు. ప్రతి కొండరెడ్లకు ఆధార్కార్డు కల్పించడమే లక్ష్యంగా ఈ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా మంగళవారం 70 మంది ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని చింతూరు, ఎటపాక, కూనవరం, వీఆర్పురం మండలాల్లోని గ్రామాలకు చెందిన కొండరెడ్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
ఆటో బోల్తా – 12 మందికి గాయాలు
డుంబ్రిగుడ: మండలంలోని కురిడి పంచాయతీ పెద్దవంతెన వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ఓ ఆటో బోల్తాపడి 12 మంది గాయపడ్డారు.డుంబ్రిగుడ మండలం అరమ పంచాయతీ సంతవలస గ్రామంలోని మూడు కుటుంబాలకు చెందిన విద్యార్థులు అరకులోయలో వివిధ పాఠశాలల్లో చదువుతున్నారు. వారిని పాఠశాలల్లో దిగపెట్టేందుకు విద్యార్థులతో పాటు కుటుంబ సభ్యులు ఆటోలో బయలుదేరారు. పెద్దవంతెన వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో 12 మంది గాయపడ్డారు. వారిని స్థానికుల సాయంతో ఆటోలో అరకులోయ ఏరియా ఆస్పత్రికి తరలించారు. 108 వాహనం రావడం లేటు కావడంతో ఆటోలో తరలించవలసి వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. -
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు
తాటిచెట్లపాలెం(విశాఖ): డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ(డీఆర్యూసీసీ) 2025 తొలి సమావేశం మంగళవారం దొండపర్తిలో గల డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో జరిగింది. డీఆర్ఎం కార్యాలయం వద్ద గల కాన్ఫరెన్స్ హాల్లో డీఆర్ఎం లలిత్బోరా అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, పరిశ్రమల ప్రతినిధులు, కల్చరల్ అసోసియేషన్, ప్రయాణికుల అసోసియేషన్ ప్రతినిధులు, నామినేటెడ్ సభ్యులు మొత్తం 11 మంది ఈ సమావేశంలో పాల్గొని ప్రయాణికుల సౌకర్యాలు, సమస్యల గురించి చర్చించారు. పలు స్టేషన్ల్లో దివ్యాంగులకు మెరుగైన సదుపాయాలు, ప్రత్యేక రైళ్లు నడపాలని, రైళ్లు ఫ్రీక్వెన్సీ మరింత పెంచాలని, అదనపు ప్లాట్ఫారాలను నిర్మించాలని ప్రతినిధులు కోరారు. వీటికి స్పందించిన డీఆర్ఎం ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలను అందించడంలో భారతీయ రైల్వే నిరంతర కృషి చేస్తుందని తెలిపారు. -
ఏయూలో ఆస్ట్రేలియా కార్నర్?
మద్దిలపాలెం(విశాఖ): యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు చెందిన ప్రతినిధుల బృందం మంగళవారం ఆంధ్ర యూనివర్సిటీని సందర్శించింది. ఈ సందర్భంగా ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్తో వారు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కలిసి ఇంజనీరింగ్ కోర్సులను సంయుక్తంగా నిర్వహించడంపై ప్రాథమిక చర్చలు జరిపారు. అదేవిధంగా ఏయూ ప్రాంగణంలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా కార్నర్ ఏర్పాటు చేసే దిశగా కూడా చర్చలు సాగాయి. సంయుక్త కోర్సుల నిర్వహణకు అవసరమైన విధివిధానాలు, నియమావళిని రూపొందించిన తర్వాత మరోసారి చర్చలు జరపాలని ఇరువర్గాలు నిర్ణయించాయి. ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్.ధనుంజయ్ రావు, యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా గ్లోబల్ గ్రోత్ అండ్ అడ్వకసీ విభాగం డైరెక్టర్ నషీద్ చౌదరి, గ్లోబల్ ఎంగేజ్మెంట్ మేనేజర్ బ్రోడెరిక్ మైకోప్, ఏయూ ఆర్ అండ్ డి విభాగం డీన్ ఆచార్య వి. వల్లికుమారి, ఆచార్య డి.లలిత భాస్కర్ పాల్గొన్నారు. మోదమ్మను దర్శించుకున్నమాజీ మంత్రి అమర్నాఽథ్ సాక్షి,పాడేరు: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం మోదకొండమ్మతల్లి పాదాలు గుడిని వైఎస్సార్సీపీ చోడవరం నియోజకవర్గ ఇన్చార్జి,మాజీ మంత్రి గుడివాడ అమర్నాఽథ్ మంగళవారం దర్శించుకున్నారు.మోదమ్మకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.ఈ సందర్భంగా అమర్నాథ్ను అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి,చెట్టి వినయ్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిసారు.ఈ కార్యక్రమంలో పెదబయలు మాజీ ఎంపీపీలు జర్సింగి సూర్యనారాయణ,సల్లంగి ఉమామహేశ్వరరావు, రూడకోట సర్పంచ్ కాతారి సురేష్లు పాల్గొన్నారు. -
ఎవరికీ పట్టని ఆలయ రక్షణ
దేవాలయంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తున్నప్పటికీ, ఆలయ కట్టడాలు మాత్రం దయనీయ పరిస్థితిలో ఉన్నాయి. ఆలయ శిల్ప కళానైపుణ్యం కనుమరుగవుతున్నా పట్టించుకునేవారు లేరు. ఆలయ స్తంభాలపై చెక్కిన శిలా శాసనాలపై తెలుపు సున్నం వేయడంతో అవన్నీ కనుమరుగు అయిపోతున్నాయి. ప్రాచీన ఆలయాల అభివృద్ధి పేరుతో శిథిలావస్థకు చేర్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ అనవసరంగా గ్రావెల్ తవ్వకాలు జరిపి ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా చర్యలు చేపడుతున్నారు. అభివృద్ధి పేరిట తలపెట్టిన కార్యాచరణ అర్థంతరంగా ఆగిపోవడంతో గ్రావెల్ మట్టి ధార నీటిలో పడి ధార నీరు కలుషితమవుతోంది. ఈ పరిస్థితి భక్తులను తీవ్ర వేదనకు గురి చేస్తోంది. పురావస్తు శాఖ అనుమతితోనే తవ్వకాలు ధార ప్రదేశంలో ప్రహరీ గోడ కూలిపోకుండా భక్తులకు అసౌకర్యం కలగకుండా తగు చర్యలు చేపట్టామని ఆలయ కార్యనిర్వహణాధికారి తేజ తెలిపారు. పురావస్తు శాఖ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన వివరణ ఇచ్చారు. తాను కొత్తగా బాధ్యతలు తీసుకున్నానని సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. శిలా శాసనాలపై తెలుపు సున్నం.. శిథిలమైన ప్రాచీన శిల్ప కళ -
గ్రామ సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
పాడేరు : గ్రామ సచివాలయాల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, సొంత మండలాల్లో పని చేసుకునే వెసులుబాటు కల్పించాలని, జీవో నంబర్ 5ను తక్షణమే సవరించి, బదిలీల ప్రక్రియ చేపట్టాలని గ్రామ సచివాలయాల ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు లకే నానీ పాత్రుడు డిమాండ్ చేశారు. మండలంలోని గ్రామ సచివాలయాల ఉద్యోగులు మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట ప్లకార్డులు ప్రదర్శించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడైనా పని చేసుకునే వీలు కల్పించాలని, అంతర్ జిల్లాల బదిలీలకు కూడా అవకాశం ఇవ్వాలన్నారు. నోషనల్ ఇంక్రిమెంట్లు, సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కలేక్టరేట్లో డీఆర్వో పద్మలతకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు పూజరి సత్యవతి, కార్యదర్శి చంద్రశేఖర్, నాయకులు ఉమా మహేష్, కిశోర్, దేవేష్, రవికుమార్, రాజేష్, రామకృష్ణ, కొండబాబు, మహేష్, చాణక్య, సత్యనారాయణ, కృష్ణ, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ముంచంగిపుట్టు: గ్రామ సచివాలయాల ఉద్యోగులకు సొంత మండలాల్లో పని చేసుకునే వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేస్తూ 18 గ్రామ సచివాలయాల ఉద్యోగులు మండల కేంద్రం ముంచంగిపుట్టులోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ప్లకార్డులతో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీడీవో సూర్యనారాయణమూర్తికి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల గ్రామ సచివాలయాల ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కొమ్ము సాయికుమార్, పాంగి మనోజ్కుమార్ మాట్లాడుతూ ఆరు సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న సచివాలయ ఉద్యోగులకు పదోన్నతి ఇచ్చిన తరువాతే బదిలీ చేయాలన్నారు. డుంబ్రిగుడ: ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న గ్రామ సచివాలయ ఉద్యోగులకు పదోన్నతి కల్పించిన తరువాతనే బదిలీ చేయాలని కోరుతూ మంగళవారం సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు స్థానిక ఎంపీడీవో ప్రేమ్సాగర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం మండల అధ్యక్షుడు శెట్టి త్రినాథరావు మాట్లాడుతూ సొంత మండలంలోనే తమను బదిలీ చేయాలని, జీవో నంబర్ 5ని రద్దు చేయాలని కోరారు. -
ధ్వజస్తంభంపై లేని శ్రద్ధ.. తవ్వకాలపై ఎందుకో?
పంచదార్ల క్షేత్రానికి ప్రధాన ఆలయమైన శ్రీ ఉమాధర్మలింగేశ్వర స్వామి ఆలయం ఎదురున ధ్వజ స్తంభంపైన ఉండే శిఖరభాగం ఎప్పుడో హుద్హుద్ సమయంలో కూలిపోయింది. ధ్వజస్తంభం పూర్తిగా పాడైపోయినా నేటికీ పునఃప్రతిష్ట జరగలేదు. కానీ అభివృద్ధి పేరుతో వారికి నచ్చిన చోట జేసీబీలతో తవ్వకాలు జరుపుతున్నారు. ప్రాచీన శిల్పసంపదను కాపాడాల్సిన చోట పొక్లెయిన్తో పెకిలించవచ్చా అని ఆలోచించేవారే లేరు. పంచదార్ల పరిసర ప్రాంతాల్లో గుప్త నిధుల తవ్వకాలు జరిగితే స్థానికుల ఒత్తిడి మేరకు అధికారులు నిలిపివేయించినట్లు తెలుస్తోంది. ధార నీరు పూర్తిగా కలుషితమైపోతుంది. వర్షపు నీటికి గుంతల్లో నీరు చేరితే ఆ బురద నీటితోనే స్నానాలు చేస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది మంచి నీరుగా తాగేందుకు, వంటలు చేసుకునేందుకు ఉపయోగించలేకపోతున్నారు. ఏవైనా మూగ జీవాలు చూసుకోకుండా తవ్వకాలు చేసిన గోతుల్లో పడినట్లైతే ధార ప్రదేశం పూర్తిగా దుర్గంధభరితమైపోతుంది. పవిత్రమైన ధార అపవిత్రమై భక్తులకు అసౌకర్యం ఏర్పడే అవకాశం ఉంది. కానీ పట్టించుకునే వారెవరు? -
మహిళా భక్తుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు
నేను ఎప్పటికప్పుడు ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయానికి వస్తుంటాను. ఇక్కడ ధారలో స్నానాలు చేసిన అనంతరం దుస్తులు మార్చుకోవడానికి సరైన గదులు లేక ఇబ్బంది పడుతున్నాము. ఎక్కడెక్కడి నుంచో వస్తున్న భక్తులు కూడా అదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. మహిళలకు మరుగుదొడ్ల సదుపాయం కూడా లేదు. దూరాభారం నుండి వచ్చే భక్తులకు కనీస మౌలిక వసతులు కల్పన లేకపోవడంతో చెప్పుకోలేని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. –గుడివాడ లక్ష్మి, శివ భక్తురాలు, కశింకోట గ్రామం -
ఉపాధ్యాయులు లేక...చదువులు సాగక
అరకులోయటౌన్: పాఠశాలలు పునః ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా ఉపాధ్యాయులను నియమించకపోవడంతో మండలంలోని పలు పాఠశాల విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. మండలంలోని బస్కీ పంచాయతీ బొండగుడ, కొంత్రాయిగుడ, మర్రిగుడ, బొండాం పంచాయతీ రంగిని వలసతోపాటు మరో 29 పాఠశాలల్లో ఇప్పటి వరకు ఉపాధ్యాయులను నియమించలేదు. తమ పాఠశాలకు ఉపాధ్యాయుడిని నియమించాలని కోరుతూ బొండగుడ పాఠశాల విద్యార్థులు చేతులు జోడించి వేడుకున్నారు. మండలంలో 33 పాఠశాలల్లో ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లారని ఎంఈవో త్రినాథరావు తెలిపారు. ఉపాధ్యాయులు లేని విషయం డీడీ, డీఈవోల దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. త్వరలో సీఆర్టీలు లేదా వలంటీర్లను నియమిస్తారని చెప్పారు. వీరిని నియమించే వరకు గతంలో పని చేసిన ఉపాధ్యాయులే వస్తారని తెలిపారు. డుంబ్రిగుడ: మండలంలోని సాగర పంచాయతీ ముగిరిగుడ,అడపవలస, కొర్రాయి పెద్దపాడు తదితర గ్రామాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరు. దీంతో ఆయా గ్రామాల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. ముగిరిగుడ పాఠశాలలో సుమారు 30 మంది పీవీటీజీ ఆదివాసీ విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయుడు బదిలీ కావడంతో ఈనెల 12వ తేదీ నుంచి తరగతులు జరగడం లేదని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర తెలిపారు. మంగళవారం ఆయన ఆపాఠశాలను పరిశీలించారు. అధికారులు స్పందించి మాతృభాష విద్యావలంటీర్లు, సీఆర్టీలను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ, ముగిరిగుడ గ్రామస్తులు పాల్గొన్నారు.జిల్లాలో పాఠశాలలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. సకాలంలో ఉపాధ్యాయులను నియమించకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటోంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభమైనా చాలా చోట్ల తరగతులు జరగడం లేదు. విద్యార్థులు రోజూ బడికి వచ్చి, ఖాళీగా కూర్చొని వెళ్లిపోతున్నారు.దీంతో తమ పిల్లలు చదువుకు దూరమవుతున్నారని తల్లిదండ్రులువాపోతున్నారు. -
రెవెన్యూ ఫిర్యాదులపైప్రత్యేక దృష్టి
● డీఆర్వో పద్మలత సాక్షి,పాడేరు: రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని డీఆర్వో కె.పద్మలత ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ నుంచి 22 మండలాల తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.భూముల రీసర్వే,మీకోసం ఫిర్యాదుల పరిష్కారం,నీటి పన్నులు,గృహనిర్మాణాలపై సమీక్షించారు.ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ మారేడుమిల్లి,కొయ్యూరు, జీకే వీధి మండలాల్లో భూముల రీసర్వే సక్రమంగా జరగడం లేదని,ఆ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మ్యుటేషన్లు చేసే ముందు ఆయా గ్రామాల్లోని ప్రజలకు సమాచారం అందించి గ్రామసభలు నిర్వహించాలని తెలిపారు.ఈ సమావేశంలో సర్వేశాఖ ఏడీ దేవేంద్రుడు పాల్గొన్నారు. -
సంపద కేంద్రాలనుసద్వినియోగం చేసుకోవాలి
చింతపల్లి: చెత్తనుంచి సంపద తయారు చేసే కేంద్రాలను సద్వినియోగం చేసుకుని ఆదాయాన్ని సమకూర్చుకోవాలని పాడేరు డివిజనల్ పంచాయతీ అధికారి కుమార్ అన్నారు. మండలంలోని కొత్తపాలెం పంచాయతీ కేంద్రంలో గల వర్మీ కంపోస్టు యూనిట్ను ఆయన మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచాయతీలోని అన్ని గృహ సముదాయాల నుంచి తడి, పొడి చెత్తను క్రమం తప్పకుండా సేకరించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ఐవీఆర్ఎస్ సర్వే జరుగుతున్నందున సచివాలయ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు,సర్పంచ్ వనగల. సోమరత్నం,ఈవోపీఆర్డీ లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
కొలువుల్లేవు
క్యాంపస్లో ఈ అమ్మాయి పేరు రేపాక ఈశ్వరి. 2022–23 విద్యా సంవత్సరంలో ఏయూలో సీఎస్ పూర్తి చేసిన ఈ అమ్మాయికి అట్లాసియన్ కంపెనీలో రూ.84.5 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. ఆఫర్ లెటర్ను అప్పటి ఏయూ వీసీ ప్రసాదరెడ్డి అందించారు. ఆ ఏడాది ఈ అమ్మాయికే కాదు 1,001 మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో ఆఫర్ లెటర్స్ అందించారు. ఆంధ్రా యూనివర్సిటీలో నారాయణ (పేరు మార్చాం) అనే విద్యార్థి 2024–25 విద్యా సంవత్సరంలో బీటెక్ (సీఎస్) పూర్తి చేశాడు. ప్రముఖ కంపెనీలేవీ ప్లేస్మెంట్స్ కోసం రాకపోవడంతో గాయత్రీ కాలేజీలో జరిగే ఆఫ్–క్యాంపస్ సెలక్షన్స్కు వెళ్లి టీసీఎస్లో ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఈ విధంగా ఒక్క నారాయణే కాదు 20 మంది ఏయూ విద్యార్థులు ఉద్యోగాలు పొందారు.