Alluri Sitarama Raju
-
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి
అనకాపల్లి: పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం, జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక మెయిన్రోడ్డు జీవీఎంసీ కార్యాలయం వద్ద ఆదివారం పార్టీ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్తో నిరసన వ్యక్తం చేశారు. యుద్ధాన్ని సాకుగా చూపి చమురు ధరలను విపరీతంగా పెంచడం దుర్మార్గమన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్పై రూ.8 పెంచడంతో పా టు కమర్షియల్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధర ను భారీగా పెంచి ప్రజల నడ్డివిరిచారన్నారు. పొదుపు చర్యలు చేపట్టండి, విదేశీ ప్రయాణాలు మానేయండి, పబ్లిక్ ట్రాన్స్పోర్టు వినియోగించండి అని చెబుతున్న ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబులు విదేశీ పర్యటనలో చార్టెడ్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు వాడుతున్నారన్నారు. బయటికి మాత్రం సైకిల్ తొక్కుతూ ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు, ఆర్.శంకరరావు, గంటా శ్రీరామ్, గనిశెట్టి సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు ఆర్.రాము, వి.వి.శ్రీనివాసరావు, జి.దేముడు నాయుడు, ఎం.రాజేష్, కాళ్ల తెల్లయ్యబాబు, కె.సుభాషిణి, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆబోతు రమణకు ప్రతిష్టాత్మక అవార్డులు ప్రదానం
దేవరాపల్లి: హెల్ప్ పుల్ హ్యాండ్స్ సామాజిక వారధి స్వచ్ఛందసేవా సంస్థ వ్యవస్థాపకుడు, రైవాడ గ్రామానికి చెందిన ఆబోతు రమణ విజయవాడలో ఆదివారం ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. మాదకద్రవ్యాల రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నిర్వహించిన ‘దండి మార్చ్ 2.0’ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కోఆర్డినేటర్స్కు అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని విజయవాడలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజ సేవా రంగంలో విశిష్ట సేవలను అందిస్తున్న ఆబోతు రమణకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఘనంగా సత్కరించి పురస్కారాలను అందజేశారు. సేవా కార్యక్రమాలతో పాటు సామాజిక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న రమణను పలువురు ప్రశంసించారు. రమణ అవార్డులను అందుకోవడం పట్ల హెల్ప్ పుల్ హ్యాండ్స్ సామాజిక వారధి స్వచ్చంధ సేవా సంస్థ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. -
గుర్తు తెలియని మహిళ మృతి
మర్రిపాలెం: కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఓ గుర్తుతెలియని మహిళ (సుమారు 45 ఏళ్లు) మృతి చెందింది. జ్ఞానాపురం సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ సమీపంలోని ఫుట్పాత్పై ఆమె మృతదేహం ఉన్నట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ రవికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు. ఆమె అక్కడ భిక్షాటన చేస్తూ జీవించే మహిళగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోబోటిక్ సర్జరీతో మెరుగైన క్యాన్సర్ వైద్యం
ఎన్టీపీసీ సింహాద్రి హెడ్ అయస్కాంత్ జెనా అగనంపూడి(విశాఖ): అగనంపూడిలోని హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రి, పరిశోధనా సంస్థ 12వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ హెడ్ అయస్కాంత జెనా మాట్లాడుతూ సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఎన్టీపీసీ సహకరిస్తుందని తెలిపారు. ఆస్పత్రితో రోబోటిక్ సర్జరీ యూనిట్, 3 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఒప్పందాలు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఆస్పత్రి డైరెక్టర్ డా. ఉమేష్ మహంతశెట్టి మాట్లాడుతూ 12 ఏళ్లలో క్యాన్సర్ సంరక్షణలో సంస్థ విశేష పురోగతి సాధించిందన్నారు. ఆధునిక వైద్య సాంకేతికత, డయాగ్నస్టిక్ సదుపాయాలతో సమగ్ర చికిత్స అందిస్తున్నామని తెలిపారు. చికిత్సతో పాటు పునరావాసం, మానసిక మద్దతు కూడా సమగ్ర క్యాన్సర్ సంరక్షణలో భాగమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘ప్రేరణ’ పేరుతో క్యాన్సర్ బాధితులు, రోగం నుంచి కోలుకున్న వారు, వైద్యులు, సహాయకులతో ఒక ప్రత్యేక గ్రూప్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇది రోగుల్లో మానసిక ధైర్యం పెంపొందించేందుకు నెలవారీ సమావేశాలు నిర్వహిస్తుందని వివరించారు. అలాగే నాల్గవ వార్షిక క్యాన్సర్ కాంగ్రెస్ కూడా నిర్వహించారు. ఇందులో అంతర్జాతీయ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ శైలేష్ వి శ్రీఖండో, వైస్ అడ్మిరల్ ఆర్తి సారిన్ పాల్గొని ఆధునిక క్యాన్సర్ చికిత్స విధానాలు, రోబోటిక్ సర్జరీ, రేడియోథెరపీ వంటి అంశాలపై చర్చించారు. ఈ సదస్సుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ నుంచి సుమారు 150 మంది వైద్య నిపుణులు, పీజీ విద్యార్థులు, సీనియర్ రెసిడెంట్లు హాజరయ్యారు. -
వీఆర్పీపై సమగ్ర విచారణ జరపాలి
రోలుగుంట : కొమరవోలు అవలో జరుగుతున్న ఉపాధి పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని కూలీలు పది రోజుల క్రితం కలెక్టర్ విజయకృష్ణన్కు, పీడీకి, ఎంపీడీవోకు, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవోకు ఫిర్యాదు చేశారు. దీనిలో పనుల కెళుతున్న ఉపాధి కూలీ నుంచి వారానికి రూ.100 చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. డబ్బులిచ్చిన వారికి వారానికి ఆరు రోజుల మస్తరు, ప్రభుత్వ ఇస్తున్న కూలీ వేతనం పూర్తిగా మంజూరు చేస్తున్నారని, లేకుంటే మూడు రోజులు, నాలుగు రోజులు మస్తర్లు వేస్తున్నారన్నారు. ఈ ఫిర్యాదుపై కలెక్టర్ ఆదేశించిన విచారణ మేరకు ఈ నెల 4న ఎంపీడీవో వి.ఎస్ నాగేశ్వరరావు, ఏపీవో ఈశ్వరరావు, ఏపీడీ పని ప్రదేశానికి వెళ్లి విచారణ జరిపారు. అయితే విచారణ తీరుపై బాధిత ఉపాధి కూలీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం మళ్లీ అధికారులు పని ప్రదేశానికి ఆలస్యంగా వచ్చి విచారణ చేపట్టారు. ఈ విచారణలో కొందరు తమ వద్ద వారానికి రూ.100 ఇవ్వాలని, డబ్బులు ఇవ్వకపోతే గ్రూపు మారిపోవాలని వీఆర్పీ మొయ్యా కృష్ణ బెదిరిస్తున్నారని అధికారులకు తెలిపారు. మేట్లు వీఆర్పీకి ఇవ్వడానికి అని చెప్పి వారానికి రూ.100 ఇవ్వాలని తీసుకున్నారని మరికొందరు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. ఈ సందర్భంగా కూలీలు పని ప్రదేశం నుంచి వెళ్లిపోవడంతో విచారణ అర్ధంతరంగా నిలిచిపోయింది. దీనిపై ఫిర్యాదుదారులు అఽఽఽధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. వీఆర్పీపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, తమకు శ్రమకు తగ్గ వేతనాలు అందించాలని కోరారు. దీనిపై ఎంపీడీవోని సాక్షి సంప్రదించగా విచారణ వేగవంతం చేసి, నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామని, మేట్లు, కూలీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.కొమరవోలులో ఉపాధి కూలీల డిమాండ్ -
వడదెబ్బతో వైఎస్సార్సీపీ నాయకుడు ప్రసాదరావు మృతి
చీడికాడ: వడదెబ్బతో చీడికాడకు చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు పరువాడ ప్రసాదరావు(68)శనివారం మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. తన పింఛను దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రసాదరావు సచివాలయానికి పలుమార్లు తిరగడంతో వడదెబ్బ గురైనట్టు చెప్పారు.సాయంత్రం సచివాలయం నుంచి వచ్చి అస్వస్థతకు గురై పడిపోవడంతో సపర్యలు చేశామని చెప్పారు.శనివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఛాతీలో నొప్పివస్తోందని చెప్పడంతో గ్రామంలోని పీహెచ్సీకి తరలించామన్నారు.అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు భార్య నిర్మల తెలిపారు.ప్రసాదరావు భౌతికకాయాన్ని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ శ్రీకాకుళం,పార్వతీపురం మన్యం జిల్లాల రిజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు సందర్శించి నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఆయన వెంట ఎంపీపీ కురచా జయమ్మనారాయణరావు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు గొల్లవిల్లి రాజుబాబు, వైస్ ఎంపీపీ ధర్మిశెట్టి కొండబాబు, సీడీసీ చైర్మన్ సుంకర శ్రీనివాసరావు,చీడికాడ గ్రామశాఖ అధ్యక్షుడు పరువాడ మహేష్ తదితరులున్నారు. వీరితోపాటు పలు రాజకీయపార్టీలకు చెందిన నాయకులు నివాళులర్పించారు. -
యలమంచిలి యువకుడికి గిన్నిస్ బుక్లో స్థానం
యలమంచిలి రూరల్: యలమంచిలి కాకివానివీధికి చెందిన కె.జగదీష్ పాల్ ఎలక్ట్రానిక్ కీ బోర్డు వాయించడంలో ప్రతిభ చూపి, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం లభించింది.గత ఫిబ్రవరిలో హైదరాబాద్లో జరిగిన నాన్ స్టాప్ కీ బోర్డ్ ప్లే పోటీల్లో జగదీష్ పాల్ ప్రతిభ చూపి, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం పొందాడు. ఈ పోటీల్లో 22 దేశాలకు చెందిన సుమారు 2,000 మంది పాల్గొన్నారు. పోటీల్లో భాగంగా దక్షిణ భారత దేశ శాసీ్త్రయ సంగీత సరళి స్వరాలతో పాటు జాతీయ గీతాన్ని ఆలపిస్తూ ఎలక్ట్రానిక్ కీ బోర్డును గంట సేపు వాయించాడు.ఈ మేరకు జగదీష్ పాల్కు శనివారం పెందుర్తి ఐపీసీ చర్చిలో ధ్రువీకరణపత్రం,మెడల్ అందజేసి అభినందించారు. జగదీష్ పాల్ తండ్రి పీటర్ పట్టణంలో కాకివాని వీధిలో జేసీపీఎఫ్ చర్చి నిర్వహిస్తున్నారు. -
సైబర్ నేరాలపై అప్రమత్తత
ప్రజలతో మాట్లాడుతున్న సీఐ శ్రీనివాసరావు కొయ్యూరు: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, ఓటీపీలు, నకిలీ క్యూఆర్ కోడ్ల పట్ల జాగ్రత్త వహించాలని సీఐ బి. శ్రీనివాసరావు సూచించారు. ఆయన ఎస్ఐ కిషోర్వర్మతో కలిసి శనివారం రాత్రి కాకరపాడు వై–జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. అలాగే, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనదారులు సరైన రికార్డులు కలిగి ఉండాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని వారికి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. గూడ్స్ వాహనాలలో ప్రయాణికులను తరలిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ట్రాఫిక్ నిబంధనలను గౌరవించడంతో పాటు, మహిళల పట్ల ఎవరూ దురుసుగా ప్రవర్తించరాదని, అసభ్యకర పదజాలం వాడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని సీఐ స్పష్టం చేశారు. -
రక్షిత మంచినీటి పథకం పరిశీలన
సంపతిపురం వద్ద సమగ్ర రక్షిత నీటి పథకాన్ని పరిశీలిస్తున్న జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, బృందం కశింకోట: సమగ్ర భారీ రక్షిత మంచినీటి పథకాన్ని శనివారం జెడ్పీ సీఈవో నారాయణమూర్తి పరిశీలించారు. కశింకోటకు సమీపంలో సంపతిపురం వద్ద అధికారుల బృందంతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం ఏలేరు కాలువ నీటిని నిల్వ ఉంచే జలాశయాన్ని పరిశీలించారు. వేసవి సందర్భంగా తాగునీటికి ఇబ్బంది కలగకుండా సమర్థంగా పథకాన్ని నిర్వహించాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారి సందీప్, ఎంపీడీవో సీహెచ్. చంద్రశేఖర్రావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాస్, ఏవో ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉపకరణాల పంపిణీ
ఉపకరణాలను పంపిణీ చేస్తున్న కలెక్టర్ నిశాంతి సాక్షి,పాడేరు: పాఠశాలల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉచితంగా ఉపకరణాలను కలెక్టర్ నిశాంతి పంపిణీ చేశారు. కలెక్టరేట్లో శనివారం సమగ్రశిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పలు సమస్యలతో బాధపడుతున్న జిల్లాలోని 186 మంది ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉపకరణాలతో పాటు ప్రత్యేక సామగ్రి, విద్యాకిట్లు పంపిణీ చేశామన్నారు. దివ్యాంగ విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేక అవసరాల పిల్లలకు వైద్యశిబిరాలను నిర్వహించి, వైద్యులతో క్షుణ్ణంగా పరిశీలన జరిపిన తరువాత వారికి అవసరమయ్యే పరికరాలు, సామగ్రిని పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, గిరిజన సంక్షేమశాఖ డీడీ పరిమళ, సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు పాల్గొన్నారు. -
మోదమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
నక్కలపుట్టులో విద్యుత్ దీపాల అలంకరణలో మోదకొండమ్మతల్లి ఆలయం పాడేరు–నక్కలపుట్టు ఆర్అండ్బీ రోడ్డులో విద్యుత్ దీపాల అలంకరణ సాక్షి, పాడేరు: మోదకొండమ్మ తల్లి జన్మస్థలంగా, అమ్మవారి పాదాలు ఉన్న పవిత్ర ప్రాంతంగా భక్తులు విశ్వసించే పాడేరు ఘాట్ రోడ్డులోని పాదాల గుడి వద్ద మోదమ్మ ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆలయ నిర్వాహకులైన జన్ని కుటుంబీకులు ప్రతి మూడేళ్లకు ఒకసారి ఈ మోదకొండమ్మ తల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం అనవాయితీ. ఈ నేపథ్యంలో, ఈ ఏడాది కూడా మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాలను మోదాపల్లి ప్రాంతం నుంచి ఆదివారం ఉదయం ఊరేగింపుగా తీసుకువచ్చి ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. మంగళవారం అమ్మవారి అనుపోత్సవాన్ని, బుధవారం మధ్యాహ్నం భక్తులకు భారీ అన్నసమారాధనను నిర్వహించనున్నారు. నక్కలపుట్టులో... పాడేరుకు సమీపంలోని కిండంగి పంచాయతీ నక్కలపుట్టులోనూ మోదమ్మ ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల సందర్భంగా ప్రధాన రహదారితో పాటు అమ్మవారి ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సతకంపట్టు నుంచి వంతాడపల్లి తోటలలోని మోదమ్మ పాత ఆలయం వరకు, అలాగే పాడేరు రోడ్డులోని కొత్త ఆలయం వరకు ఘటాల ఊరేగించి ఉత్సవాలను ఊరేగిస్తారు. -
ఏపీఎల్ రన్ రణరంగం
విశాఖ స్పోర్ట్స్: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) ఐదో సీజన్కు తెరలేవనుంది. కప్ను కై వసం చేసుకునేందుకు ఏడు జట్లు సిద్ధమవగా..మంగళవారం రాత్రి వైఎస్సార్ స్టేడియం ఫ్లడ్లైట్ల వెలుతురులో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈసారి తొలిసారిగా ఏపీఎల్ మ్యాచ్లను మూడు వేదికల్లో నిర్వహించేందుకు నిర్వాహక కమిటీ ఏర్పాట్లు చేసింది. మూడు వేదికల్లో మ్యాచ్లు లీగ్ దశలో మొదటి ఫేజ్ మ్యాచ్లు విశాఖ వేదికగా ఈ నెల 14వ తేదీ వరకు జరగనున్నాయి. ఇక్కడ మొత్తం 11 మ్యాచ్లు నిర్వహిస్తారు. ఆ తర్వాత తొలిసారిగా కడప స్టేడియంలో 9 మ్యాచ్లు, మంగళగిరి స్టేడియంలో 8 మ్యాచ్లు జరగనున్నాయి. మంగళగిరి వేదికగా నాకౌట్ పోటీలు నిర్వహించి, జూన్ 30న ఈ సీజన్కు ముగింపు పలకనున్నారు. రెండో టైటిల్ ఎవరిదో? ఏపీఎల్లో ఇప్పటివరకు జరిగిన నాలుగు సీజన్లలోనూ ప్రతిసారీ కొత్త జట్టు విజేత నిలిచింది. కోస్టల్ రైడర్స్ మాత్రమే రెండుసార్లు ఫైనల్కు చేరి, 2022లో విజేతగా నిలిచింది. 2023లో రాయలసీమ కింగ్స్, 2024లో వైజాగ్ వారియర్స్ చాంపియన్లగా నిలవగా.. ప్రస్తుతం తుంగభద్ర వారియర్స్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతోంది. గత సీజన్లో వైజాగ్ వారియర్స్ను విజేతగా నిలిపిన స్థానిక స్టార్ క్రికెటర్ కేఎస్ భరత్ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడమే కాకుండా, ఈ సీజన్ ఏపీఎల్కు దూరం కావడం గమనార్హం. రూ.16.25 లక్షలతో శశికాంత్ టాప్: గత సీజన్లలో అశ్విన్ హెబ్బర్, హనుమ విహారి, నితీష్ కుమార్ రెడ్డి, అవినాష్లు అత్యధిక ధరకు అమ్ముడుపోగా.. ప్రస్తుత సీజన్లో స్థానిక ఆటగాడు కేవీ శశికాంత్ను రూ.16.25 లక్షల భారీ మొత్తానికి డిఫెండింగ్ చాంపియన్ తుంగభద్ర వారియర్స్ దక్కించుకుంది. గత సీజన్లలో గిరినాథ్, హేమంత్, అశ్విన్, హనుమ విహారి ‘మోస్ట్ వేల్యుబుల్ ప్లేయర్స్’గా నిలిచారు. గత సీజన్ రికార్డులు గత సీజన్లో అభినవ్ 269 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. హనుమ విహారి, అశ్విన్ హెబ్బర్, మహీప్ కుమార్, రషీద్ (ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్నందున అందుబాటులో లేడు) తర్వాత స్థానాల్లో నిలిచారు. సిక్సర్ల విషయానికొస్తే అశ్విన్ అత్యధికంగా 25 సిక్సర్లు, రోహిత్ 20 సిక్సర్లు బాదారు. బౌలింగ్లో సత్యనారాయణ, శశికాంత్లు చెరో 14 వికెట్లతో రాణించారు. ఈసారి వైజాగ్ వారియర్స్, రాయలసీమ కింగ్స్, ఉత్తరాంధ్ర లయన్స్, బెజవాడ టైగర్స్ వంటి 7 ఫ్రాంచైజీల మధ్య జరగబోయే ఈ పోరులో ఎవరు అత్యధిక పరుగులు, వికెట్లు సాధిస్తారో చూడాలి. -
మహిళను వేధించిన రౌడీ షీటర్కు రిమాండ్
అచ్యుతాపురం రూరల్: సోషల్ మీడియాలో అవమానకర పోస్టులు పెట్టి మహిళను కించపరిచిన రౌడీ షీటర్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్టు సీఐ చంద్రశేఖరరావు శనివారం తెలిపారు. పూడిమడక గ్రామానికి చెందిన ఎరిపల్లి కాసులు (కిరణ్) అదే గ్రామానికి చెందిన మహిళను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అవమానకర పోస్టులు పెట్టడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేసి, నిందితుడిని అరెస్టు చేసి, యలమంచిలి కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం రిమాండ్ విధించడంతో కేంద్ర కారాగారానికి తరలించినట్టు సీఐ చెప్పారు. కిరణ్పై గతంలో రాంబిల్లి, కశింకోట, అచ్యుతాపురం పోలీస్ స్టేషన్లలో 10 కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. అచ్యుతాపురం పోలీసుస్టేషన్లో కిరణ్పై రౌడీ షీట్ నమోదైంది. అనంతరం అచ్యుతాపురం సీఐ చంద్రశేఖరరావు పూడిమడక సచివాలయంలో గ్రామస్తులతో మాట్లాడుతూ మహిళలను, ఇతర వ్యక్తులను కించపరుస్తూ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
‘పెద్ది’లో గిరిజనులకు అవమానం
సాక్షి, పాడేరు : పెద్ది సినిమాలో గిరిజనులను కించపరిచే విధంగా ఉన్న ‘కొండ నా...’ అనే డైలాగ్ను వెంటనే తొలగించి దర్శకుడు బుచ్చిబాబు గిరిజనులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. శనివారం వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి టి.సురేష్కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుల్లిబాబు ఆధ్వర్యంలో పలువురు నేతలు కలెక్టర్ నిశాంతితో పాటు పోలీసు అధికారులను కలిశారు. వారు మాట్లాడుతూ..‘పెద్ది’లో గిరిజనుల మనోభావాలకు భంగం కలిగించేలా డైలాగులు పెట్టడం బాధాకరమన్నారు.ఆ వివాదాస్పద డైలాగ్ను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు, పాడేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డైలాగ్ను తొలగించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
తాండ్ర సింగారం గిరిలో మధురాహారం
మన్యం మామిడి తాండ్ర భలే రుచికొండ మామిడి పండ్లుమా ఆహార అలవాట్లలో భాగం కొండ ప్రాంతాల్లో లభించే మామిడిపండ్లతో తాండ్రను తయారు చేసుకోవడం మాకు పూర్వం నుంచి వస్తున్న ఆచారం. మా ఆహార అలవాట్లలో ఒక భాగం. పులుపు, తీపి కలగలిసిన ఈ మామిడి తాండ్రను ఈ సీజన్లో మేమంతా ఎంతో ఇష్టంగా తింటాం. ముఖ్యంగా పిల్లలు దీనిని అమితంగా ఇష్టపడతారు. ఏటా లాగే ఈ ఏడాది కూడా మామిడితాండ్రను పోసుకుని, భద్రపరుచుకుంటాం. – తాంగుల గుణావతి, చినలబుడు, అరకులోయ మండలం -
ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్ట్
నర్సీపట్నం: ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న ముఠాను నాతవరం పోలీసులు అరెస్టు చేశారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు బైక్ల చోరీల వివరాలను శనివారం వెల్లడించారు. నాతవరం ఎస్ఐ తారకేశ్వరరావు, సిబ్బంది వెదురుపల్లి జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేశారు. అదే సమయంలో బైక్పై వస్తున్న ముగ్గురు అనుమానాస్పద వ్యక్తులను సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించగా వారు పారిపోయేందుకు యత్నించారు. వారిని వెంబడించి పట్టుకుని విచారించగా నాతవరం పరిసర ప్రాంతాల్లో పలు ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసినట్టు అంగీకరించారన్నారు. నిందితులు మాతిరెడ్డి మనోజ్, కిల్లంపల్లి సుబ్రహ్మణ్యం కిరణ్, వంతల కొండలబాబును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి నాలుగు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం చేసిన వాహనాలను ఒడిశా ఏజెన్సీ సరిహద్దు ప్రాంతాల్లో విక్రయించి వచ్చిన డబ్బులతో తమ వ్యక్తిగత అవసరాలు, విలాసవంతమైన జీవనానికి అలవాటు పడినట్లు డీఎస్పీ వివరించారు. కొనుగోలు చేసి మైదాన ప్రాంతాలకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.నాలుగు బైక్లు స్వాధీనం -
జాతీయ రహదారిపై 79 కిలోల గంజాయి పట్టివేత
సబ్బవరం: మండలంలోని అనకాపల్లి–ఆనందపురం జాతీయ రహదారిపై ఉన్న మర్రిపాలెం టోల్ప్లాజా వద్ద గంజాయి తరలిస్తున్న ముఠాను సబ్బవరం పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో 79 కిలోల గంజాయితో పాటు రెండు వాహనాలు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. వివరాలను పరవాడ డీఎస్పీ బి. మోహనరావు, సబ్బవరం సీఐ జి. రామచంద్రరావుతో కలిసి శనివారం సాయంత్రం సబ్బవరం పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎస్. సుదర్శన్, అబీబీ ఖాన్, హుస్సేన్ ఖాన్.. విశాఖ చేరుకుని, అప్పటికే విశాఖ చేరుకున్న మధ్యప్రదేశ్కు చెందిన లఖన్ బేరాగి, కమల్ ప్రజాపత్లతో కలిసి ఒడిశా రాష్ట్రంలోని కంధమాల్ జిల్లా కుల్బాని ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కులాన్, కలియా అనే వ్యక్తుల వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి, రెండు వాహనాల్లో మధ్యప్రదేశ్లోని భోపాల్కు తరలించేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో సబ్బవరం పోలీసులకు అందిన సమాచారంతో సీఐ జి. రామచంద్రరావు ఆధ్వర్యంలో పోలీసులు మర్రిపాలెం టోల్ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో నిందితులను అదుపులోకి తీసుకుని, నాలుగు గోనె సంచుల్లో ఉన్న 79 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే గంజాయి రవాణాకు ఉపయోగించిన ఒక టెంపో, ఒక కారును సీజ్ చేశారు. నిందితుల వద్ద నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.3.95 లక్షలు కాగా, వాహనాలతో కలిపి మొత్తం ఆస్తుల విలువ రూ.7.75 లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో ఎస్ఐ సింహాచలం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఐదుగురు అరెస్టు -
పౌష్టికాహారంతో తల్లీబిడ్డ ఆరోగ్యం
కొయ్యూరు: గర్భిణులు, బాలింతలు బలమైన పౌష్టికాహారం తీసుకుంటేనే తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని రాజేంద్రంపాలెం వైద్యాధికారి డాక్టర్ జగదీష్ నాయక్ సూచించారు. ఇందుకోసం రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, పండ్లు తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత ద్వారా పిల్లల్లో వచ్చే ఆరోగ్య సమస్యలను, లోపాలను గుర్తించేలా శనివారం అంగన్వాడీ వర్కర్లతో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మానవుడు ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా ఆహారపు అలవాట్లు మారాలని, దీనివల్ల పలు రకాల దీర్ఘకాలిక వ్యాధులను దూరం పెట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో ధూమపానం, మద్యపానం వల్ల వచ్చే అనర్థాలను వివరించారు. అనంతరం సీడీపీవో దేవామణి మాట్లాడుతూ.. ఏఐ సహాయంతో పిల్లల్లో ఉండే శారీరక, మానసిక లోపాలను ఏ విధంగా గుర్తించవచ్చో అంగన్వాడీ కార్యకర్తలకు వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు, బీపీసీ శేఖర్ పాల్గొన్నారు. -
హెచ్డబ్ల్యూవో రత్నకుమారికి రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు
ఉత్తమ హెచ్డబ్ల్యూవో అవార్డు, సర్టిఫికెట్తో కూడా రత్నకుమారి ముంచంగిపుట్టు: స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల జూనియర్ కళాశాల వసతి గృహ నివాస అధికారి కూడా రత్నకుమారికి రాష్ట్ర స్థాయి ఉత్తమ హెచ్డబ్ల్యూవో అవార్డు లభించింది. విజయవాడలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ భార్గవి చేతుల మీదుగా అవార్డు, సర్టిఫికెట్ను అందుకున్నారు. వసతి గృహంలో విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించడం, మెరుగైన వసతులు కల్పించడంతో పాటు వారిని బాధ్యతాయుతంగా చూసుకోవడంలో రత్నకుమారి శ్రద్ధ కనబరిచారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా సర్వే నిర్వహించి, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి సేకరించిన సానుకూల ఫీడ్బ్యాక్ ఆధారంగా ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఆమెను ఏటీడబ్ల్యూవో స్వర్ణలత, తోటి హెచ్డబ్ల్యూ వోలు, ఉపాధ్యాయులు అభినందించారు. -
గ్రామీణ ఆరోగ్య సేవల్లో ఆశా కార్యకర్తల పాత్ర కీలకం
ఢిల్లీ ఎయిమ్స్ బృందం ప్రశంసలుజి.మాడుగుల: గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను ప్రజలకు చేరువ చేయడంలో ఆశా కార్యకర్తల పాత్ర అత్యంత కీలకమని న్యూఢిల్లీకి చెందిన ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) బృంద సభ్యులు దిలీప్ కుమార్, విద్యాసాగర్ తెలిపారు. మండలంలోని గడుతూరు పంచాయతీలో శుక్రవారం ‘విలేజ్ హెల్త్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్’ సమావేశం నిర్వహించారు. ఎయిమ్స్ ఆధ్వర్యంలో, ఈక్విప్ వైఎస్ కసుమ మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రామాల్లో నెలకొన్న ఆరోగ్య సమస్యలు, పారిశుధ్యం, పోషకాహార లోపాలపై సమగ్రంగా చర్చించి, వాటి నివారణకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. వ్యాధుల ముందస్తు గుర్తింపు.. : మలేరియా, డెంగ్యూ, క్షయ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించి బాధితులకు సకాలంలో వైద్యం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎయిమ్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. ముఖ్యంగా శిశు, మాతృ మరణాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వారు సూచించారు. తీవ్రమైన మరియు మధ్యస్థ పోషకాహార లోపాలతో బాధపడుతున్న పిల్లలను గుర్తించి, వారిని వెంటనే పోషకాహార పునరుద్ధరణ కేంద్రాలకు తరలించాలని తెలిపారు. ఆశా కార్యకర్తలకు ప్రత్యేక అవగాహన కల్పించి, ప్రతిరోజూ గ్రామ సందర్శనలు నిర్వహించేలా చూడాలని ఎయిమ్స్ బృందం సూచించింది. గ్రామీణ ప్రజల్లో ఆరోగ్య అవగాహన, పరిశుభ్రత, పోషకాహారంపై చైతన్యం పెంపొందించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి అచ్చంనాయుడు, ఎయిమ్స్ ప్రతినిధులు దిలీప్ కుమార్, విద్యాసాగర్, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ పేరినాయుడు, హెల్త్ అసిస్టెంట్ బాలయ్యదొర, ఏఎన్ఎం శాంతికుమారి, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యం
సాక్షి,పాడేరు: రానున్న స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయడంతో పాటు ప్రతి పంచాయతీలోను వైఎస్సార్సీపీ జెండాలు ఎగరాలని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని 26పంచాయతీల నేతలతో తన క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలంతా సమష్టిగా అన్ని పంచాయతీల్లోను వైఎస్సార్సీపీ విజయం కోసం కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామంలోను గడప గడపకు తిరిగి కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో మోసాలను గిరిజనులకు సమగ్రంగా వివరించాలన్నారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్ల కార్యక్రమాన్ని కూడా గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఓటర్ల వెరిఫికేషన్పై కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఎండగట్టాలన్నారు. అర్హులందరికీ ఓటు హక్కు ఉండే విధంగా బూల్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యమన్నారు. వైఎస్సార్సీపీ ఐడీ కార్డుల వెరిఫికేషన్ను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ నెల 12న పాడేరులో వైఎస్సార్సీపీ తలపెట్టిన నిరసన ర్యాలీని విజయవంతం చేయాలన్నారు.ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు సీదరి రాంబాబుతో పాటు అన్ని పంచాయతీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్కు 107 వినతులు
వినతులు స్వీకరిస్తున్న జేసీ తిరుమణి శ్రీపూజ సాక్షి,పాడేరు: స్థానిక ఐటీడీఏలో శుక్రవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ పలు గ్రామాల ప్రజల నుంచి 107 వినతులను స్వీకరించారు. తాగునీరు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలతో పాటు గిరిజనులు తమ వ్యక్తిగత సమస్యలు పరిష్కరించాలని జేసీని కోరారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పీజీఆర్ఎస్కు వచ్చిన వినతులను పరిశీలించి ఆయా వినతులను సకాలంలో పరిష్కరించాలని అన్నిశాఖల అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై మరింత సమాచారం, ఇతర వివరాలు తెలుసుకునేందుకు ప్రజలు 1100 కాల్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ డీడీ పరిమళ, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆశా కార్యకర్తలుగా గుర్తించండి
సాక్షి, పాడేరు: గ్రామాల్లో తోటి గిరిజనులకు వైద్య సేవలు అందిస్తూ అహర్నిశలూ శ్రమిస్తున్న తమను ఆశా కార్యకర్తలుగా గుర్తించి, వేతనాలు పెంచాలని కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం వారు స్థానిక ఐటీడీఏ కార్యాలయం ఎదుట భారీ ధర్నా చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమానికి సీఐటీయూ నాయకులు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు మాట్లా డుతూ.. గత పదేళ్లుగా జిల్లాలో 700 మంది సీహెచ్డబ్ల్యూలు తీవ్ర వెట్టిచాకిరికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా కార్యకర్తలతో సమానంగా అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ, సీహెచ్డబ్ల్యూలకు కేవలం రూ.4 వేల అరకొర వేతనం మాత్రమే చెల్లించడం దారుణమైన అన్యాయమని మండిపడ్డారు. తక్కువ వేతనంతో ఎలా బతకాలి? ఆశా కార్యకర్తలకు నెలకు రూ.10 వేల వేతనం చెల్లిస్తున్నారని, తమకు కూడా వారితో సమానంగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీహెచ్డబ్ల్యూలు ఆందోళనలు చేస్తున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. గిరిజన ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న వీరి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని ధ్వజమెత్తారు. ఉద్యమం ఉధృతం చేస్తాం: సీహెచ్డబ్ల్యూల న్యాయసమ్మతమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో సీఐటీ యూ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఐటీడీఏ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సుందర్రావు, ఆశా కార్యకర్తల సంఘ నాయకులు పద్మ, దాసమ్మ, పార్వతి, ఈశ్వరమ్మ, పెద్ద సంఖ్యలో సీహెచ్డబ్ల్యూలు పాల్గొన్నారు. -
నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడి
చింతపల్లి: గిరిజన రైతాంగం వచ్చే ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడులు సాధించాలంటే నాణ్యమైన విత్తనాలను వినియోగించడం అత్యంత కీలకమని స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానం అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్ డాక్టర్ అప్పలస్వామి అన్నారు. శుక్రవారం స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఉన్నత పర్వత శ్రేణి గిరిజన మండలాల రైతులతో విత్తన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు 80 శాతానికి పైగా మొలక శాతం కలిగిన విత్తనాలను మాత్రమే సాగుకు వినియోగించాలన్నారు. ప్రస్తుతం ఉన్న ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, అధిక ఖర్చుతో కూడిన హైబ్రిడ్ రకాల కంటే.. మధ్యకాలిక, స్వల్పకాలిక పంట రకాలను ఎంపిక చేసుకోవాలని రైతులకు సూచించారు. స్థానిక సంప్రదాయ రకాలతో అదనపు ఆదాయం మైసూర్ మల్లిక వంటి స్థానిక భూమాతృక విత్తన రకాల ప్రాముఖ్యతను ఈ సందర్భంగా డాక్టర్ అప్పలస్వామి వివరించారు. ఈ రకాలను వాడటం వల్ల జన్యు వనరుల పరిరక్షణతో పాటు, నాణ్యమైన విత్తనోత్పత్తి, విలువ ఆధారిత మార్కెటింగ్ ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. మాజీ వ్యవసాయ పరిశోధనా స్థానం సలహా మండలి సభ్యుడు పి.దేముడు మాట్లాడుతూ.. ఉన్నత శ్రేణి పర్వత ప్రాంతాల్లో సేంద్రియ వ్యవసాయానికి విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. స్థానికంగా వరి, రాగితో పాటు సంప్రదాయ పంట రకాలను పరిరక్షిస్తూ, మైదాన ప్రాంతాల్లో సేంద్రియ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ను గిరిజన రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ధ్రువీకరించిన విత్తనాలే వాడాలి వ్యవసాయ శాఖ ద్వారా ధ్రువీకరించిన విత్తనాలను వాడటం వల్ల మెరుగైన మొలక, ఏకరీతి పంట పెరుగుదల మరియు అధిక ఉత్పాదకత సాధ్యమవుతుందని సీనియర్ శాస్త్రవేత్త కె.బయ్యపురెడ్డి వివరించారు. రైతులకు బీజామృతం తయారీ, విత్తన శుద్ధి, సహజ వ్యవసాయంలో దాని ప్రాముఖ్యతను శాస్త్రవేత్త సందీప్ నాయక్ వివరించారు. బీజామృతం వినియోగం ద్వారా మొలక శాతం మెరుగుపడి, వేర్ల అభివృద్ధి చెందడమే కాకుండా మొక్కల ప్రారంభ పెరుగుదల బలంగా ఉంటుందన్నారు. మండల వ్యవసాయాఽ దికారి మధుసూదన్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ, పరిశోధనా స్థానం సంయుక్తంగా సూచించే శాసీ్త్రయ సాగు పద్ధతులను రైతులు విధిగా పాటించాలని కోరారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు ఉమామహేష్, జోగారావు, బాలహుస్సేన్రెడ్డి, వెంకటేష్, టాటా ట్రస్ట్ టెక్నికల్ ఆఫీసర్ అప్పలరాజు తదితరులు రైతులకు పలు సూచనలు, సలహాలు అందించారు. అనంతరం రైతులకు పంటల సాగు సాంకేతికతలపై కరపత్రాలను పంపిణీ చేశారు. అలాగే ఎసరాడ, ఏబులం, దుచ్చరపాలెం గ్రామ రైతులకు ఉచితంగా విత్తనాలను పంపిణీ చేశారు. -
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
ప్రజలను ముంచే ప్రభుత్వం డుంబ్రిగుడ: కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న నయవంచక పాలనకు రెండేళ్లు నిండాయని, ఇది ప్రజా సంక్షేమాన్ని కోరే మంచి ప్రభుత్వం కాదని, ప్రజలను ముంచే ప్రభుత్వమని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం మండల కేంద్రంలోని మూడు రోడ్ల జంక్షన్లో నిరసన ర్యాలీ, మానవహారం కార్యక్రమాలు నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు పాంగి పరశురామ్ అధ్యక్షతన జరిగిన ఈ నిరసన సభలో ఎమ్మెల్యే మత్స్యలింగం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క మాటను నిలబెట్టుకోకుండా హామీలన్నింటినీ తుంగలో తొక్కిందని మండిపడ్డారు. యువత, నిరుద్యోగులకు ఘోర అన్యాయం డీఎస్సీ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను సైతం రకరకాల సాకులతో ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించి, నిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటోందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు నుంచి వారం వారం లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెస్తున్న ఈ ప్రభుత్వం, పేద ప్రజలకు మాత్రం గోరంత కూడా సంక్షేమ పథకాలు అందించడం లేదని దుయ్యబట్టారు. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇదే మండలంలో పర్యటించి, అడవితల్లి బాట కార్యక్రమంలో భాగంగా గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఆ మాట చెప్పి ఏడాది కావస్తున్నా, నేటికీ ఒక్క రోడ్డు కూడా పూర్తిగా నిర్మించని దారుణమైన పరిస్థితిని మనం చూస్తున్నామని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంపీపీ బాకా ఈశ్వరి, జెడ్పీటీసీ చటారి జానకమ్మ, వైస్ ఎంపీపీ శెట్టి ఆనందరావు, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, మహిళా మండల అధ్యక్షురాలు బంగారు శాంతి, ఉమ్మడి జిల్లాల మాజీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు కమ్మిడి అశోక్, నియోజకవర్గ బూత్ కమిటీ ఇన్చార్జి పాంగి విజయ్, పార్టీ ఉపాధ్యక్షుడు రాంప్రసాద్, మండల కార్యదర్శులు మఠం శంకర్, రామునాయుడు, లీలారాణి, మహిళా నాయకురాలు బబిత, పలువురు ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, పార్టీనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఆర్టీసీ కాంప్లెక్స్లో చేతివాటం
● రద్దీనే ఆసరాగా దొంగతనాలు ● మహిళలు, వృద్ధులే ప్రధాన లక్ష్యం ● పెరుగుతున్న నగదు, సెల్ఫోన్ చోరీలు ● గస్తీ పెంచాలని ప్రయాణికుల విజ్ఞప్తి అనకాపల్లి టౌన్: పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్లో దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. మహిళలు, వృద్ధులే లక్ష్యంగా చేసుకుని బంగారు ఆభరణాలు, నగదు, సెల్ఫోన్లను తస్కరిస్తున్నారు. సాధారణ ప్రయాణికుల వలే కలిసిపోయి బస్సు ఎక్కి, దిగే సందర్భంలో ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రత్యేకించి ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో దొంగలు తమ చేతికి పని చెబుతున్నారు. కాంప్లెక్స్ పరిసరాలలో పోలీసులు కనిపించకపోవడంతో వీరి పని సులువవుతోంది. రూరల్ జిల్లాకు ప్రధాన కేంద్రమైన అనకాపల్లికి ఎక్కువగా చోడవరం, మాడుగుల, బుచ్చెయ్యపేట, నర్సీపట్నం, యలమంచిలి, మునగపాక తదితర మండలాల నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. వీరిలో ఎక్కువగా పల్లె జనం కావడంతో దొంగలు వీరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తమ పనిని సులువుగా కానిచ్చేస్తున్నారు. ఇక్కడ కాంప్లెక్స్లో సీసీ కెమెరాలు తగినన్ని లేకపోవడంతో దొంగలు తెలివిగా వస్తువులను అపహరించి తప్పించుకుంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత వ్యక్తులనే లక్ష్యంగా చేసుకుని ఈ దొంగతనాలు జరుగుతున్నాయి. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.. ● ఈ నెల 3న చోడవరం మండలం జుత్తాడ గ్రామానికి చెందిన ఒక ప్రయాణికురాలు అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేటలో తన తల్లి దగ్గరకు వెళ్లడానికి అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్లో రాంబిల్లి బస్సు ఎక్కింది. స్థానిక బైపాస్ దగ్గరకు రాగానే తన బ్యాగ్లో నగదు చూడగా, అందులో రూ.80 వేలు మాయమయ్యాయి. ● జనవరిలో ఇదే ఆర్టీసీ కాంప్లెక్స్లో బస్సు ఎక్కుతున్న వృద్ధురాలి నుంచి గుర్తుతెలియని వ్యక్తులు తులం బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ● గతేడాది డిసెంబర్లో ఇదే ఆర్టీసీ కాంప్లెక్స్లో ప్రయాణికురాలి మెడలో నుంచి నాలుగు తులాల బంగారు వస్తువులను కాజేశారు. పోలీస్ నిఘా ఏర్పాటు చేయాలి కాంప్లెక్స్లో సివిల్ దుస్తులలో పోలీస్ నిఘా ఏర్పాటు చేయాలి. కాంప్లెక్స్కు ఎక్కువగా వివిధ గ్రామాల నుంచి ప్రయాణికులు వస్తుంటారు. వారికి అమాయక మాటలు చెప్పి దొంగలు తమ పని కానిచేస్తున్నారు. సీసీ కెమెరాలు ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలి. – మద్దాల భాను, అనకాపల్లి సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు కాంప్లెక్స్లో పోలీసు శాఖ ఏర్పాటు చేసిన ఆరు సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆర్టీసీ శాఖ ఆధ్వర్యంలో మరో ఐదు ఏర్పాటు చేయడానికి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. ఇన్గేట్, యలమంచిలి, చోడవరం బస్సులు ఎక్కే దగ్గర కూడా తగినన్ని కెమెరాలు ఏర్పాటు చేస్తాం. ప్రయాణికులు అపరిచిత వ్యక్తులతో మాట్లాడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. – వి. ప్రవీణ, జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ చోరులకు అడ్డాగా మారింది. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికుల రద్దీనే ఆసరాగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా ఆర్టీసీ బస్సులు ఎక్కి దిగే సమయాల్లో సులువుగా తమ పని కానిచ్చేస్తున్నారు. ఇక్కడ పోలీసుల గస్తీ లేకపోవడం, పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల చోరులు తప్పించుకుంటున్నారు. -
ఊపిరితిత్తుల క్యాన్సర్కు కేజీహెచ్లో క్లినికల్ ట్రయల్స్
● రూ.68 లక్షల విలువైన వైద్యం ఉచితంగా ● ఏడాది పాటు ఇమ్యూనోథెరపీ, పరీక్షలు ● ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా డాక్టర్ శిల్పా మహారాణిపేట: ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్న పేద రోగులకు కేజీహెచ్ ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది. ఊపిరితిత్తుల క్యాన్సర్పై జాతీయ స్థాయిలో జరుగుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు కేజీహెచ్ ఎంపికై ంది. ఈ ట్రయల్స్కు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా కేజీహెచ్ మెడికల్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ కె.శిల్పా వ్యవహరించనున్నారు. రూ.68 లక్షల విలువైన వైద్యం.. ఉచితంగా! ఈ క్లినికల్ ట్రయల్స్ ద్వారా రోగులకు ఎంతో మేలు చేకూరనుందని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి తెలిపారు. 18 నుంచి 65 ఏళ్ల లోపు వయస్సు ఉండి, ఏ దశ (స్టేజ్)లోనైనా ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిన రోగులకు ఈ ట్రయల్స్ ద్వారా ఏడాది పాటు పూర్తిగా ఉచితంగా వైద్యం అందిస్తారని వెల్లడించారు. సాధారణంగా ఇచ్చే కీమోథెరపితో పాటు, ఎంతో ఖరీదైన ‘ఇమ్యునోథెరపీ’ని కూడా క్లినికల్ ట్రయల్ ద్వారా ఏడాది పాటు ఉచితంగా అందజేయనున్నట్లు వివరించారు. ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో క్యాన్సర్కు ఇంతటి అత్యాధునిక వైద్యం ఉచితంగా లభించడం ఇదే ప్రథమమన్నారు. ఒక్కో సైకిల్కు సుమారు రూ.4 లక్షల విలువ చేసే ఇమ్యునోథెరపీ మందును.. ప్రతి మూడు వారాలకు ఒకసారి చొప్పున, ఏడాదికి మొత్తం 17 సార్లు పూర్తిగా ఉచితంగా ఇస్తామని స్పష్టం చేశారు. బాధితులు సద్వినియోగం చేసుకోవాలి క్యాన్సర్ రోగులకు ఆర్థిక భారం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని కేజీహెచ్లో ఉచితంగా అందిస్తున్నామని మెడికల్ ఆంకాలజీ హెచ్వోడీ డాక్టర్ కె.శిల్పా తెలిపారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితులు, వారి కుటుంబ సభ్యులు అధైర్యపడకుండా కేజీహెచ్ ఆంకాలజీ విభాగాన్ని సంప్రదించి, ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
పర్యావరణ పరిరక్షణతోనే భవిత
జిల్లా కలెక్టర్ నిశాంతిసాక్షి,పాడేరు: పర్యావరణ పరిరక్షణతోనే ప్రజల భవిత ఆధారపడి ఉందని కలెక్టర్ టి.నిశాంతి అన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఏపీఆర్ పాఠశాల, వైద్య కళాశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్తో పాటు అధికారులు, విద్యార్థులు పలు రకాల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలితో పాటు పచ్చని పరిసరాలను అందించేందుకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలన్నారు. మనకు జన్మనిచ్చిన అమ్మపేరుతో ప్రతి ఒక్కరు మొక్కలను నాటి తల్లులపై ప్రేమతో పాటు భూమాతను కాపాడుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. డీఎఫ్వో ఉమామహేశ్వరి, జానపద కళలు, సృజనాత్మక అకాడమి చైర్మన్ వంపూరి గంగులయ్య, డ్వామా పీడీ విద్యాసాగర్, గిరిజన సంక్షేమ డీడీ పరిమళ, డీపీవో చంద్రశేఖర్, సర్వశిక్ష ఏపీసీ స్వామినాయుడు, గురుకులం ఓఎస్డీ మూర్తి, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీ, డీఎల్పీవో కుమార్, వైద్య కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ చంద్రమోహన్, ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మీకుమారి పాల్గొన్నారు. ప్రకృతిని కాపాడుకుందాం.. జేసీ తిరుమణి శ్రీపూజ డుంబ్రిగుడ: మొక్కలు నాటి ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకుందామని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం అరకు పైనరీలో శాంతినగర్ వీఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అరకు రేంజ్ డీఎఫ్వో ఉమామహేశ్వరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ ప్లాస్టిక్ను నిర్మూలించి కాలుష్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. మానవాళికి లభించిన విలువైన సంపద ఏదైనా ఉందంటే పర్యావరణమేనని.. దానిని భావితరాలకు భద్రంగా అందించాల్సి బాధ్యత మనందరిపై ఉందన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రహిత అడ్డాకుల దొనలను ఆమె పరిశీలించారు. ఈకార్యక్రమంలో అరకు రేంజ్ ఫారెస్ట్ అధికారి బి.కోటేశ్వరరావు, ఫారెస్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పెద్దేరులోకి దూసుకుపోయిన 108 అంబులెన్స్
బుచ్చెయ్యపేట: మండలంలోని వడ్డాది మేజర్ పంచాయతీలో 108 అంబులెన్స్కు పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం రాత్రి వడ్డాది నుంచి బుచ్చెయ్యపేట వైపు వెళ్తున్న ఈ వాహనం పెద్దేరు నదిపై డైవర్షన్ రోడ్డులో డౌన్ నుంచి అప్ ఎక్కేటప్పుడు ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి డౌన్లోకి జారుకుంది. ఈ క్రమంలో డ్రైవర్ బ్రేక్ వేసినా పట్టకపోవడంతో దిగువ పెద్దేరు నదిలోకి దూసుకుపోయింది. అంబులెన్స్ సగ భాగం డైవర్షన్ రోడ్డుపైన, సగ భాగం పెద్దేరు నదిలో గాల్లో వేలాడుతూ ఉండిపోయింది. ఆ సమయంలో అంబులెన్స్లో రోగులెవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అంబులెన్స్ వెనుక వాహనాలు, పాదచారులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అత్యవసర పరిస్థితిలో రోగులను ఆస్పత్రికి తరలించే 108 అంబులెన్స్కు బ్రేక్లు పట్టకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కండీషన్ లేని 108 వాహనాల వల్ల ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని వాపోతున్నారు. తప్పిన ప్రమాదం -
యువకుడిని కాపాడిన లైఫ్గార్డులు
యువకుడిని కాపాడిన పోలీసులు, లైఫ్గార్డులుమహారాణిపేట: కెరటాల ఉధృతికి సముద్రంలో కొట్టుకుపోతున్న ఓ యువకుడిని పోలీసులు, స్విమ్మర్లు కాపాడారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం రాజపురం గ్రామానికి చెందిన ఎం.మణికంఠ మిలటరీ పరీక్షలు రాయడానికి ఇటీవల విశాఖకు వచ్చాడు. శుక్రవారం గోకుల్ పార్క్ వద్ద తీరంలో స్నానం చేస్తుండగా, ఒక్కసారిగా వచ్చిన అలల ఉధృతికి సముద్రంలోకి కొట్టుకుపోయాడు. గమనించిన కానిస్టేబుల్ భాస్కరరావు, లైఫ్గార్డులు రవివర్మ, కళ్యాణ్ వెంటనే అప్రమత్తమై మణికంఠను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి, అతని తమ్ముడు వరుణ్కు అప్పగించినట్లు మైరెన్ ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. -
అడవుల పెంపకంలో సీడ్ బాల్స్ కీలకం
ముంచంగిపుట్టు: సులభమైన పద్ధతిలో అటవీ విస్తీర్ణాన్ని పెంచడానికి, జీవవైవిధ్యాన్ని కాపాడటానికి సీడ్ బాల్స్ ఎంతగానో ఉపయోగపడతాయని ముంచంగిపుట్టు ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎం.మురళీకృష్ణ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో గిరిజన రైతులకు, ప్లాంటేషన్ మేసీ్త్రలకు సీడ్ బాల్స్ తయారీపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవు పేడ, కట్టె పొయ్యి బూడిద, సేంద్రియ ఎర్రమట్టి, జీవామృత ద్రావణాలను ఉపయోగించి రైతుల చేత స్వయంగా సీడ్ బాల్స్ను తయారు చేయించారు. ఈ సందర్భంగా రేంజర్ మురళీకృష్ణ మాట్లాడుతూ.. సీడ్ బాల్స్ పద్ధతి ద్వారా స్థానిక అటవీ విత్తనాలను నాటడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ముఖ్యంగా జాఫ్రా, నల్లమద్ది, తెల్లమద్ది, చింత, అడ్డ, నేరేడు వంటి వృక్ష జాతుల విత్తనాలను సీడ్ బాల్స్గా మార్చి భూముల్లో వేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు. ఈ పద్ధతి వల్ల విత్తనాలను పక్షులు, కీటకాల బారి నుంచి రక్షించవచ్చన్నారు. ఎటువంటి ప్రత్యేక సంరక్షణ, నీటి సదుపాయం లేకపోయినా.. వర్షం పడగానే ఇవి మొలకెత్తి ఏపుగా వృక్షాలుగా పెరుగుతాయన్నారు. అందువల్ల గిరిజన రైతులంతా ఈ సాంకేతికతపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆయన కోరారు. అనంతరం పనసపుట్టు ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో అటవీశాఖ ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థినులతో కలిసి ఫారెస్ట్ అధికారులు మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ అధికారి సీహెచ్.నారాయణపడాల్, ఫారెస్ట్ బీట్ అధికారులు వెంకటరాజు, శ్రీను, స్థానిక గిరిజన నాయకులు, రైతులు, ప్లాంటేషన్ మేస్త్రిలు పాల్గొన్నారు. ఫారెస్ట్ రేంజర్ మురళీకృష్ణ -
సూపర్ మోసం
పాడేరు అంబేడ్కర్ సెంటర్లో నిరసన ర్యాలీలో ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, వైఎస్సార్సీపీ నేతలు సాక్షి, పాడేరు: సార్వత్రిక ఎన్నికల ముందు సూపర్ సిక్స్తోపాటు అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు, వాటిని అమలు చేయకుండా పేద ప్రజలను వంచించారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రమైన పాడేరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పాత బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి ఈ నిరసన ర్యాలీ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చేసిన మోసాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పాడేరు పురవీధులు హోరెత్తాయి. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నేతలు తీవ్రంగా ఖండించారు. అనంతరం, సూపర్ సిక్స్ హామీల కరపత్రాలు, వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన బాండ్లను ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మితో కలిసి దహనం చేశారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు వెనక్కి తగ్గకుండా నిరసనను కొనసాగించారు. చంద్రబాబుది వంచన పాలన సూపర్ సిక్స్తో పాటు ఎన్నో ఆశలు చూపి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, తీరా పీఠం ఎక్కాక ప్రజలకు వంచన పాలన అందించడం దారుణమని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలంతా నోటికి వచ్చినట్టు అడ్డగోలు హామీలు ఇచ్చారని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, ఉచిత గ్యాస్, ఇంటింటికీ ఉద్యోగం, నిరుద్యోగ భృతి, రైతు భరోసా, వలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణ.. వంటి అబద్ధపు హామీలతో ప్రజలను నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, 2029 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలంతా ఈ కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. కూటమి పాలనలో నరకం: మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు నరకం చూస్తున్నారని వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. అమలుకాని హామీలను ఇచ్చి సీఎం చంద్రబాబు ప్రజలను ఘోరంగా మోసం చేశారని మండిపడ్డారు. ప్రజల కష్టాలను, సమస్యలను పక్కనబెట్టి చంద్రబాబు నిరంకుశంగా పాలిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని ఆమె పేర్కొన్నారు. మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు సీదరి రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్నదొర, నియోజకవర్గ ఎస్టీసెల్ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కిల్లో ఉర్వశిరాణి, ఎంపీటీసీ లకే రామకృష్ణపాత్రుడు, మాజీ పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జి లకే రామసత్యవతి, యువజన విభాగం అధ్యక్షుడు గల్లెలి లింగమూర్తి, మాజీ సర్పంచ్లు, సీనియర్ నాయకులు వంతాల రాంబాబు, లక్ష్మణరావు, బొంజుబాబు, నాగరాజు, కన్నాపాత్రుడు, కోటిబాబునాయుడు, గంగరాజు, సుదర్శన్, నరేష్, రాజేష్ పాల్గొన్నారు. అబద్ధపు హామీలతో వంచన రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా గుణపాఠం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు కూటమి పాలనకు వ్యతిరేకంగా నిరసన హోరెత్తిన నినాదాలు మేనిఫెస్టో ప్రతుల దహనం ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసనకు విశేష స్పందన -
విద్యుత్షాక్తో పాడి గేదెలు మృతి
నాతవరం: విద్యుత్ వైర్లు తెగిపడడంతో షాక్కు గురై రెండు పాడిగేదెలు మృతిచెందాయి. మండలంలో రాజుపేట అగ్రహం గ్రామానికి చెందిన రెడ్డి నాయుడు శుక్రవారం ఉదయం తన మకాం నుంచి పశువులను మేతకు పొలంలోకి తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో విద్యుత్ వైర్లు ఆకస్మాత్తుగా తెగి ముందుగా వెళ్తున్న రెండు పాడి గేదెలపై పడడంతో షాక్కు గురై అవి అక్కడికక్కడే మృతిచెందాయి. కొంత దూరంలో నడుస్తున్న రైతు రెడ్డి నాయుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈచుట్టు పక్కల వారు గమనించి సంఘటన స్థలానికి చేరుకుని రైతు నాయుడుకు ధైర్యం చెప్పడంతో పాటు నాతవరం విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని నేలపై పడి ఉన్న విద్యుత్ వైర్లను తొలగించారు.అందిన సమాచారం మేరకు పశువైద్యాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మృతిచెందిన రెండు గేదెలను పరిశీలించారు. వీటి విలువ రూ.2లక్షలుంటుందని అంచనా. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
కశింకోట: మండలంలోని ఉగ్గినపాలెం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. సీఐ అల్లు స్వామినాయుడు అందించిన వివరాల ప్రకారం... అనకాపల్లి నుంచి తాళ్లపాలెం వైపు వెళుతున్న బైక్ను ఉగ్గినపాలెం వద్ద వెనుకగా వ్యాన్ వచ్చి ఢీకొంది. దీంతో బైక్ నడుపుతున్న తాళ్లపాలెం శివారు బంగారయ్యపేటకు చెందిన అందపు నాగదుర్గ (18) తీవ్రంగా గాయపడ్డాడు. బైక్ నుజ్జు అయింది. విషయం తెలుసుకున్న మిత్రుడు సింగంపల్లి శేఖర్ సంఘటనా స్థలానికి చేరుకొని నాగదుర్గను అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.వైద్యులు పరీక్షించి మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు నిర్థారించారు. తల్లి లోవలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎస్ఐ బి.సతీష్ దర్యాప్తు చేపట్టారని సీఐ తెలిపారు..ప్రమాదానికి కారణమైన వ్యాన్, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. -
సహకార సంఘం మాజీ అధ్యక్షుడు ఆత్మహత్య
మాడుగుల రూరల్: స్థానిక సహకార సంఘం మాజీ అధ్యక్షుడు, టీడీపీ మాడుగల పట్టణ మాజీ అధ్యక్షుడు శ్రీనాధు మధు(52) గురువారం అర్ధరాత్రి మాడుగులలో తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పిప్పలమోడి వ్యాపారంలో నష్టం రావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్ట ఆయన బంధువులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ జి. నారాయణరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు ఎస్ఐ చెప్పారు. మధు మృతి పట్ల స్థానిక వ్యాపారులు, రాజకీయనాయకులు, ప్రజా ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. మధుకు భార్య, కుమారై, కుమారుడు ఉన్నారు. -
మెనూ ప్రకారం రుచికరమైన భోజనం
దేవరాపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని మధ్యాహ్న భోజన పథకం జిల్లా కోఆర్డినేటర్ ప్రసాద్, పాయకరావుపేట ఎంఈవో గాంధీ నిర్వాహకులకు సూచించారు. మండలంలోని 53 ప్రభుత్వ పాఠశాలల్లోని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు ఎంఈవో–2 వి. ఉషారాణి ఆధ్వర్యంలో శుక్రవారం ఒక్క రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాణ్యత లోపించకుండా మెనూ ప్రకారం సకాలంలో రుచికరమైన భోజనం అందించాలని ఆదేశించారు. భోజనం తయారీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలను కుక్, హెల్పర్లకు వివరించారు. అనంతరం వంటలను తయారీ చేయించి రుచి చూశారు. కార్యక్రమంలో సీఆర్పీలు రమణ తదితర స్థానిక ఎంఈవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
విశాఖ–ఇచ్ఛాపురం సెక్షన్లో జీఎం తనిఖీలు
విశాఖ–ఇచ్ఛాపురం సెక్షన్లో తనిఖీలు నిర్వహిస్తున్న సౌత్ కోస్ట్రైల్వే జిఎం సందీప్మాధుర్ తాటిచెట్లపాలెం: సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ గురువారం విశాఖ– ఇచ్ఛాపురం సెక్షన్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలను ఆయన పరిశీలించారు. అమృత్ భారత్ పథకం కింద ఎంపికై న సింహాచలం రైల్వే స్టేషన్తో పాటు కొత్తవలస, శ్రీకాకుళం రోడ్, నౌపడ, పలాస స్టేషన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించిన ఆయన.. నిర్దేశిత సమయానికి పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఇచ్ఛాపురం– విశాఖ మధ్య విండో ట్రైలింగ్ ఇన్స్పెక్షన్ ద్వారా రైల్వే ట్రాక్స్, సిగ్నలింగ్ వ్యవస్థ, బ్రిడ్జిలను పరిశీలించి, ప్రజా సంఘాల ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ పర్యటనలో ప్రిన్సిపాల్ చీఫ్ ఇంజనీర్ బి.ఎస్.కె. రాజ్కుమార్, పీసీఎస్టీఈ ఓబీ సురేష్కుమార్, పీసీవోఎం వినీత్కుమార్, సీఏవో అంకుష్ గుప్తా, డీఆర్ఎం లలిత్ బోహ్రా తదితరులు పాల్గొన్నారు. -
నిర్ణీత సమయానికే బయోమెట్రిక్ హాజరు
కె.కోటపాడు: నిర్ణీత సమయానికల్లా ఉద్యోగులు బయోమెట్రిక్ హాజరు వేయాలని అనకాపల్లి జిల్లా స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు అధికారి బి.వి.సత్యనారాయణ తెలిపారు. కె.కోటపాడు గ్రామ సచివాలయాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందితో సమావేశమై మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది కార్యాలయ పని నిమిత్తం బయటకు వెళ్లే సమయంలో తప్పకుండా మూమెంట్ రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. వివిధ సేవల పట్ల ప్రభుత్వం ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటుందని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం అమలు చేయనున్న దృష్ట్యా ఇప్పటికే వెల్ఫేర్ అసిస్టెంట్లకు వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వివరాలను శుక్రవారంలోగా నమోదు చేయాలని తెలిపారు. 0–6 ఏళ్ల వయస్సు విద్యార్థుల ఆధార్ వివరాలను యాప్లో నమోదు చేయడంతోపాటు అక్షరాంధ్ర రెండో విడత కార్యక్రమం వెలుగు సిబ్బందితో సమన్వయం చేసుకుని విజయవంతం చేయాలన్నారు. గ్రామంలో ఇంకా మిగలిన సిటిజన్ ఈకేవైసీని పూర్తి చేయడంతోపాటు వాట్సాప్ గవర్నన్స్–మన మిత్ర యాప్పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ యాప్ ద్వారా 540పైగా సేవలను పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఎస్.జి.ఎస్.డబ్ల్యూ మండల అధికారి సౌజన్య, కె.కోటపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శి టి.శ్రీను సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
దేవరాపల్లి : అప్పులబాధతో దేవరాపల్లికి చెందిన యువ రైతు పోతల సత్తిబాబు (26) ఆత్మహత్యకు పాల్పడ్డారని ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దేవరాపల్లి రాయాలయం వీధికి చెందిన సత్తిబాబు వ్యవసాయం చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వ్యవసాయం చేసేందుకు అప్పులు చేశాడు. చేసిన అప్పులు తీర్చలేక ఈ నెల 2న మంగళవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో కొల్లివానిపాలెంలోని తన కల్లంలోకి వెళ్లి గడ్డి ముందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఫోన్ ద్వారా తన భార్య మణికి చెప్పాడు. వెంటనే ఆమె తమ బంధువులను తీసుకొని కల్లంలోకి వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న తన భర్తను దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధమ చికిత్స చేయించి అనంతరం కె.కోటపాడు కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి విశాఖ కేజిహెచ్కు తరలించారు. కేజిహెచ్లో చికిత్స పొందుతూ తన భర్త సత్తిబాబు గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మరణించినట్టు మృతుడి భార్య మణి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిందన్నారు. సత్తిబాబుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. -
గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్టు
నర్సీపట్నం: కారులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులను గురువారం నర్సీపట్నం రూరల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ అందించిన వివరాలు.. డీఎస్పీ శ్రీనివాసరావుకు వచ్చిన సమాచారం మేరకు రూరల్ ఎస్సై రాజారావు, సిబ్బంది గబ్బాడ సమీపంలో మాటు వేశారు. చింతపల్లి వైపు నుంచి వస్తున్న కారును ఆపి తనిఖీ చేయగా, 26 కిలోల గంజాయి లభ్యమైంది. పాత నేరస్తుడైన విశాఖ నగరంలోని అల్లిపురానికి చెందిన బోధ శ్రీను(40), గంజాయి రవాణాకు సహకరించిన చింతపల్లి మండలం బలపం పంచాయతీకి చెందిన బిరుబోజు రమణమూర్తి(29), తిమురు గణేష్ కుమార్(26)లను అరెస్టు చేశారు. గంజాయి రవాణాకు ప్రేరేపించిన మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడు. ముగ్గురు నిందితుల నుంచి మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఒడిశాలోని చిత్రకొండ వద్ద కొనుగోలు చేసి విశాఖపట్నం తరలిస్తున్నట్టు సీఐ తెలిపారు. నిందితుడు శ్రీను గంజాయి పొట్లాలు కట్టి ఒక్కొక్కటి రూ.200కు అల్లిపురం, ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో విక్రయిస్తాడని తెలిపారు. మత్తు చాకెట్లు కూడా విక్రయిస్తాడన్నారు. ఇతనిపై విశాఖపట్నంలో నాలుగు కేసులు ఉన్నాయన్నా రు. పట్టుబడిన గంజాయి, స్వాధీనం చేసుకున్న కారు విలువ రూ.23 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. -
సిటీ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సమగ్ర సమీక్ష
డాబాగార్డెన్స్: సిటీ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధే ధ్యేయంగా నగర పరిధిలోని పలు ప్రాజెక్టులపై జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో జరిగిన ఈ సమావేశంలో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి అభిజిత్రేతో కూడిన ముగ్గురు సభ్యుల బృందం పాల్గొంది. ఈ సందర్భంగా కమిషనర్ కేతన్గార్గ్ జీవీఎంసీ పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద చేపట్టిన ప్రాజెక్టులతో పాటు ఇతర ప్రతిపాదిత ప్రాజెక్ట్ల వివరాలను వారికి వివరించారు. విశాఖ ఎకనామిక్ రీజన్ అభివృద్ధిలో భాగంగా నగర భౌగోళిక పరిస్థితులు, అవసరాలపై వరల్డ్బ్యాంక్ ప్రతినిధుల బృందానికి పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కమిషనర్ సమగ్రంగా వివరించారు. నగరంలో నీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థ, రోడ్ల విస్తరణ, మొబిలిటీ కారిడార్స్, రోడ్డు కనెక్టివిటీ పెంపుదల, హౌసింగ్, మురికివాడల అభివృద్ధి తదితర మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన ప్రాజెక్టుల రూపకల్పనపై ఈ ప్రజంటేషన్లో చర్చించారు. ఈ ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాల అధ్యయనంలో భాగంగా శుక్రవారం వరల్డ్ బ్యాంకు ప్రతినిధుల బృందం నగరంలోని పలు ప్రాంతాలలో క్షేత్రస్థాయి పర్యటన చేసి పరిశీలించనుందని కమిషనర్ తెలిపారు. సమీక్షా సమావేశంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ ఎస్.ఎస్. వర్మ, ప్రధాన ఇంజినీరు పీవీవీ సత్యనారాయణరాజు, పర్యవేక్షక ఇంజినీరు ఏడుకొండలు, అడ్వైజర్ కేవీఎన్ రవి, స్మార్ట్సిటీ కార్పొరేషన్ మేనేజర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
50 గ్యాస్ సిలిండర్ల కోసం వాగ్వాదం
గ్యాస్ సిలిండర్లు కోసం గుమికూడిన వినియోగదారులు మాడుగుల రూరల్: మండలంలో భారత్ గ్యాస్ వినియోగదారులు మూడు మాసాలుగా గ్యాస్ కష్టాలతో సతమతమవుతున్నారు. మాడుగులలో వెంకట సీతారామ గ్యాస్ ఏజెన్సీ లైసెన్సుదారుడు పుట్టా వెంకట మురళీకృష్ణ ఏడాది క్రితం మృతి చెందారు. ఈయన రెండో కుమారుడు ప్రసన్నరాజు ఈ ఏజెన్సీని కొన్ని నెలల వరకు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఏజెన్సీని రద్దు చేసి స్థానిక గోదాం గ్యాస్ వినియోగదారులను జిల్లాలో మాకవరపాలెం, దేవరాపల్లి, అల్లూరు జిల్లాలో పాడేరు గ్యాస్ ఏజెన్సీలకు సర్దుబాటు చేశారు. అప్పటి నుంచి వినియోగదారులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. వినియోగదారులు ఏ ఏజెన్సీ పరిధిలోకి వస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. తాజాగా మాకవరపాలెం నుంచి భారత్ గ్యాస్ ఏజెన్సీ వాహనంతో గురువారం 50 గ్యాస్ సిలిండర్లను ఒమ్మలి చెరకు కాటా వద్దకు తెచ్చారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి 150 మంది ఖాళీ సిలిండర్లతో వచ్చి గంటల కొద్దీ నిరీక్షించారు. ఈ క్రమంలో ఏజెన్సీ సిబ్బందితో వినియోగదారులు వాగ్వాదానికి దిగారు. 50 మందికి ఓ.టి.పి ప్రకారం సిలిండర్లు అందజేసి, మిగిలిన వారికి రెండు రోజుల్లో ఇస్తామని సర్ది చెప్పారు. దాంతో నిరాశతో ఇంటిముఖం పట్టారు. హెచ్పీ గ్యాస్ సక్రమంగా అందిస్తున్నారని, భారత్ గ్యాస్ సిలిండర్లు అందటం లేదని వాపోయారు. -
వణికించిన గాలివాన
నర్సీపట్నం: మున్సిపాలిటీ పరిధిలో గురువారం సాయంత్రం 4.30 గంటల వరకు భానుడి ఉగ్రరూపం చూపించగా, ఆ తర్వాత 5 గంటలకు ఉన్నపళంగా వరుణుడు గాలివాన రూపంలో విరుచుకుపడ్డాడు. పెదబొడ్డేపల్లి రామాలయం ఆవరణలో భారీ వృక్షం నేల కూలింది. పెదబొడ్డేపల్లి, సుబ్బరాయుడుపాలెం వద్ద చెట్లు కూలగా, నాలుగు విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. విశాఖ వెళ్లే మెయిన్రోడ్డుపై చెట్లు పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మెరుపులు, ఉరుములకు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న టౌన్ సీఐ గపూర్, ఎస్సై రమేష్, సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మెయిన్ రోడ్డుపై పడిన చెట్లను జేసీబీ సహాయంతో తొలగింపజేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. విద్యుత్ సిబ్బంది సత్వరమే సరఫరా పునరుద్ధణకు చర్యలు చేపట్టారు. వర్షం కంటే బలమైన గాలులు వీయడంతో చెట్లు నేల కూలాయి. -
స్నేహంలో మేటి..ర్యాంకుల్లో పోటీ
కోటవురట్ల: ముగ్గురు స్నేహితురాళ్లు చదువులోనూ తగ్గేదేలే అంటున్నారు. స్నేహమేరా జీవితం అంటూనే పోటీ పరీక్షల్లోనూ తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఒకరిపై ఒకరు పోటీ పడుతూ అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థినులు ఏపీ పీజీసెట్, ఏపీ ఈడీసెట్లలో మంచి ర్యాంకులు సాధించి తమ స్నేహబంధానికి గొప్పగా నిర్వచనం చెప్పారు. ఇంటర్లో మంచి స్నేహితురాళ్లుగా పేరొందిన ముత్తుర్తి అక్షయ, పెదపల్లి మరియమ్మ, అరసాడ సరిత చదువులోనూ ప్రతిభ చాటేవారు. జూనియర్ కళాశాలను వీడినా స్నేహాన్ని వదులుకోలేక ముగ్గురూ ఒకే కళాశాలలో డిగ్రీలో చేరారు. పోటీ పరీక్షలకు ముగ్గురు పోటీపడి చదివి మంచి ర్యాంకులు సాధించారు. అక్షయ ఏపీ పీజీసెట్లో 13వ ర్యాంకు, ఏపీ ఈడీసెట్లో 712వ ర్యాంకు సాధించింది. మరియమ్మ ఏపీ పీజీసెట్లో 15వ ర్యాంకు, ఏపీ ఈడీసెట్లో 193వ ర్యాంకు, సరిత ఏపీ పీజీసెట్లో 122వ ర్యాంకు, ఏపీ ఈడీసెట్లో 1,755వ ర్యాంకు సాధించారు. దాంతో అధ్యాపకులు, సహచరులు, తల్లిదండ్రులు వారికి అభినందనలు తెలిపారు. -
చిట్టియ్యపాలెంలో యువకుడికి పాముకాటు
బుచ్చెయ్యపేట : మండలంలో గల చిట్టియ్యపాలెం గ్రామంలో ఓ యువకుడు పాము కాటుకు గురయ్యాడు. గురువారం ఉదయం గ్రామానికి చెందిన ముచ్చకర్ల గణేష్ గ్రామంలో జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న తన ఇంటికి వెళ్లాడు. ఇంట్లో పని చేస్తుండగా గణేష్ను పాము కాటు వేసింది. దీంతో కుటుంబ సభ్యులు దగ్గరలో ఉన్న తురకలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఉదయం 7 గంటల సమయంలో వైద్యాధికార్లు లేకపోవడంతో గణేష్ను అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గణేష్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇటీవల 15 రోజుల కిందట చినమదీనకు చెందిన 30 ఏళ్ల యువకుడు నాగరాజును పాము కాటు వేయగా ఆయన్ని ప్రైవేటు వైద్యుని దగ్గరకు తీసుకెళ్లగా సకాలంలో వైద్య సేవలు అందక మృతి చెందాడు. -
రోడ్డు విస్తరణలో నిబంధనలకు పాతర
మాకవరపాలెం: రోడ్డు విస్తరణ పనుల్లో నిబంధనలు పాటించడం లేదు. పర్యవేక్షణ లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఉందని స్థానికులు విమర్శిస్తున్నారు. మండలంలోని రాచపల్లి జంక్షన్ నుంచి కోటవురట్ల మండలం చౌడువాడ వరకు ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో రూ.3 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణంతోపాటు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం 12 అడుగులు వెడల్పుతో ఉన్న ఈ రోడ్డును రెండు వైపులా 3 అడుగుల చొప్పున విస్తరించి 18 అడుగులకు పెంచనున్నారు. ఈ నేపథ్యంలో మొదటగా చౌడువాడ సమీపం నుంచి రోడ్డుకు ఒకవైపు చేపట్టిన మూడడుగులు విస్తరణ పనులు గురువారం నాటికి జి.కోడూరు గ్రామం వరకు చేరుకున్నాయి. కిందన రెండు అడుగలే... ప్రస్తుతం మూడడుగుల విస్తరణలో భాగంగా మట్టిని తొలగించి మెటల్ వేసుకుంటూ వస్తున్నారు. ఈ మూడడుగుల వెడల్పుతో మీద నుంచి కింద వరకు మట్టిని తొలగించాలి. కానీ కిందకు వెళ్లే సరికి రెండు అడుగులే ఉంటుంది. ఇక లోతు అడుగున్నర మేర మట్టిని తొలగిస్తున్నారు. మూడడుగుల వెడల్పున తీయాల్సిన మట్టిని కిందకు వెళ్లేసరికి రెండడుగులే తీయడంపై స్థానికులు అభ్యంతరం తెలుపుతున్నారు. ఈ రోడ్డు పనులపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఇష్టానుసారంగా చేసుకుపోతున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై ఇప్పటివరకు ఆర్అండ్బీ ఏఈగా పనిచేసిన నారాయణరెడ్డిని సంప్రదించగా తాను డీఈ పదోన్నతిపై బదిలీ అయినట్టు తెలిపారు. మూడడుగులు కచ్చితంగా మట్టిని తొలగించాల్సిందేనన్నారు. తన స్థానంలో నర్సీపట్నం ఏఈ నాయుడుకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారని తెలిపారు. -
డేటా సెంటర్లతో పర్యావరణానికి ముప్పు
తాటిచెట్లపాలెం: గూగుల్ డేటా సెంటర్ల వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు పొంచివుందని ఢిల్లీ సైన్స్ ఫోరం ఫౌండర్, ఆలిండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ జాతీయ నాయకులు డి.రఘునందన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు వీటిని వ్యతిరేకిస్తుంటే, మన దేశంలో ప్రభుత్వాలే ఆహ్వానించడం ప్రమాదకరమన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గురువారం దొండపర్తిలోని ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ సెమినార్ హాల్లో ‘డేటా సెంటర్లు –విశాఖ పర్యావరణంపై ప్రభావం’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య వక్తగా విచ్చేసిన రఘునందన్ మాట్లాడుతూ.. అమెరికా, ఐరోపా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజల వ్యతిరేకత వల్లే ఇవి ఏర్పాటు కాలేదన్నారు. వీటి వల్ల భారీగా నీరు, విద్యుత్ వినియోగంతో పాటు రేడియేషన్ సమస్యలు ఉత్పన్నమవుతాయని పేర్కొన్నారు. అలాగే మన డేటాపై విదేశీ నియంత్రణ ఉండి, పారదర్శకత ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం వాస్తవాలను మభ్యపెడుతూ 1 గిగాకు బదులు మూడు ప్రాంతాల్లో సుమారు 2.5 గిగా డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తోందని ఆరోపించారు. విశాఖలోని సింహాచలం, ఆనందపురం వంటి నివాస ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవన్నారు. వీటిపై విద్యార్థులు, మేధావులు, ప్రజాసంఘాల సహకారంతో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కోశాధికారి జి.మురళీధర్, రాష్ట్ర కార్యదర్శి జి.గిరిధర్, హెల్త్ సబ్ కమిటీ రాష్ట్ర కో–కన్వీనర్ డాక్టర్ ఎం.రమేష్కుమార్, ఎన్.చంద్రశేఖర్, మానవ హక్కుల వేదిక అధ్యక్షులు వీఎస్ కృష్ణ, ప్రతినిధులు త్రినాథరావు, కామేశ్వర్రావు, జీవీ రమణ, పెద్ద సంఖ్యలో పర్యావరణవేత్తలు పాల్గొన్నారు. -
దుండగుల కోసం ఆరు ప్రత్యేక బృందాలు
నక్కపల్లి : ఉపమాక ఆలయంలో చోరీ చేసిన దుండగులను పట్టుకోవడానికి ఆరు ప్రత్యేక బృందాలను నియమించినట్టు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆయన ఉపమాక వెంకన్న ఆలయాన్ని సందర్శించి మరోసారి సీసీ కెమెరాలు పరిశీలించారు. ముసుగు ధరించిన ఇద్దరు దొంగలు వెనుక నుంచి ఏ విధంగా ప్రవేశించారనే దానిపై మరోసారి ఆరా తీశారు. దర్యాప్తు కోసం ఆరు ప్రత్యేక బృందాలను నియమించడం జరిగిందన్నారు. బుధవారం వేకువ జామున వరకు దొంగతనం జరిగిన ఆలయ పరిసరాలను రికార్డయిన దృశ్యాలను సీసీ పుటేజీల్లో పరిశీలిస్తున్నామన్నారు. ఆలయ పరిసరాల్లో ఏ సెల్ టవర్ నుంచి మొబైల్ఫోన్లు వాడారు, కొత్త నెంబర్లు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఉపమాక ఆలయం, నక్కపల్లి హైవే జంక్షన్ సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామన్నారు. నిందితులు ఆలయం వెనుక బంగారం వెండి ఆభరణాల మూటను ఎందుకు వదిలేశారు? దొంగతనానికి ఏమార్గంలో వచ్చారు, ఏదైనా వాహనం ఉపయోగించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తామన్నారు. ఆయన వెంట సీఐలు మురళి, రామకృష్ణ తదితరులు ఉన్నారు. -
సహజసిద్ధ కాఫీ సాగుతో అంతర్జాతీయ గుర్తింపు
సాక్షి,పాడేరు: సహజసిద్ధ కాఫీ సాగుతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా కలెక్టర్ టి.నిశాంతి తెలిపారు. డోకులూరులో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కాఫీ సహజ వ్యవసాయ సమన్వయ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఏజెన్సీలో పండే కాఫీకి ప్రపంచవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు ఉందన్నారు. రసాయన ఎరువులు, పురుగు మందులు లేకుండా సహజ పద్ధతిలో పండించే కాఫీని అంతర్జాతీయ మార్కెట్లో నేచురల్ కాఫీగా, ఆర్గానిక్ బ్రాండ్గా బలంగా ప్రమోట్ చేయడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. వివిధ దేశాల మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా, అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలను అందుకోవడానికి కాఫీ రైతులంతా సిద్ధంగా ఉండాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సంప్రదాయ పద్ధతులతో పాటు ఆన్లైన్ ద్వారా కాఫీ గింజలకు డిజిటల్ మార్కెటింగ్ను ప్రోత్సహించి, రైతులకు మెరుగైన మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. బయ్యర్–సెల్లర్ సమావేశాలతో పాటు కాఫీ సాగు, ప్రాసెసింగ్, నాణ్యతా ప్రమాణాలపై రైతులకు మరింత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్వైఎస్ఎస్ ఈడీ టి.బాబురావునాయుడు, డీపీఎం భాస్కరరావు, జిల్లా వ్యవసాయాధికారి నందు, డీఆర్డీఏ పీడీ మురళీ, ఏపీఎంఐపీ పీడీ రహీం తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ నిశాంతి -
అదృశ్యమైన వ్యక్తి శవమై..
పాడేరు: గ్రామస్తులతో కలిసి తిరుపతి దైవదర్శనానికి వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమై, చివరకు పలాసలో రైల్వే ట్రాక్ పక్కన అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. మృతుడి జేబులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా లభించిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. పాడేరు మండలం వంతాడపల్లి పంచాయతీ కోట్లగరువు గ్రామానికి చెందిన సివేరి బాబురావు (39) అనే గిరిజన యువకుడు ఈ నెల 2న కొంతమంది గ్రామస్తులతో కలిసి తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్లాడు. అయితే, దర్శనం అనంతరం ఆయన అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. తిరుగు ప్రయాణంలో బాబురావు కనిపించకపోవడంతో గ్రామస్తులు ఆయన లేకుండానే ఊరికి చేరుకున్నారు. బాబురావు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే గురువారం పలాస రైల్వే పోలీసుల నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ కాల్ వచ్చింది. సివేరి బాబురావు మృతదేహం పలాస రైల్వే ట్రాక్ పక్కన పడి ఉందని పోలీసులు సమాచారం అందించారు. బాబురావు ప్రయాణిస్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడ్డాడా, లేక రైలు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడా, లేదా ఎవరైనా హత్య చేసి ట్రాక్పై పడేశారా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై పలాస రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాబురావు మృతితో కోట్లగరువు గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. పలాసలో రైల్వేట్రాక్ పక్కన మృతదేహం గుర్తించిన రైల్వే పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అనుమానాస్పద స్థితిలో మృతిగాకేసు దర్యాప్తు కోట్లగరువులో విషాదచాయలు -
చిన్నారులకు స్వచ్ఛమైన ఆహారం
● కలెక్టర్ నిశాంతి ఆదేశం సాక్షి,పాడేరు: అంగన్వాడీ కేంద్రాల్లో కిచెన్ గార్డెన్ల ద్వారా సేంద్రియ విధానంలో ఆకుకూరలు,కూరగాయలు సాగు చేసి చిన్నారులకు స్వచ్ఛమైన ఆహారం వండిపెట్టాలని కలెక్టర్ టి.నిశాంతి ఆదేశించారు. గురువారం డోకులూరు అంగన్వాడీ కేంద్రంలో కిచెన్గార్డెన్ను ఆమె ప్రారంభించారు. కూరగాయలు, ఆకుకూరల విత్తనాలను ఆమె జల్లారు. చిన్నారుల యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఐసీడీఎస్ పీడీ ఝాన్సీరామ్పడాల్, సీడీపీవో శారద, సూపర్వైజర్లు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. -
గిరిజనాభివృద్ధిలో ఆదర్శం
● పాడేరు ఐటీడీఏకు జాతీయస్థాయిలో ఉత్తమ పురస్కారం ● ఢిల్లీలో అందుకున్న పీవో ఆదిత్యవర్మ పాడేరు: గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో పాడేరు ఐటీడీఏకు సరికొత్త జాతీయ అవార్డు వరించింది. రాష్ట్రంలోని అన్ని ఐటీడీఏల కంటే పాడేరు ఐటీడీఏ అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను ఈ జాతీయ స్థాయి ఉత్తమ పురస్కారానికి ఎంపికై ంది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నీతి ఆయోగ్ చైర్మన్ డాక్టర్ అశోక్కుమార్, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి చేతుల మీదుగా ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఏపీవో ఎం. వెంకటేశ్వరరావు గురువారం ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ చైర్మన్ మాట్లాడుతూ.. గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పన కోసం పాడేరు ఐటీడీఏ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. సమష్టి కృషికి దక్కిన గౌరవం: పీవో ఆదిత్య వర్మ పాడేరు ఐటీడీఏకు ఇంతటి ప్రతిష్టాత్మక పురస్కారం లభించడం పట్ల పీవో ఆదిత్య వర్మ హర్షం వ్యక్తం చేశారు. ఐటీడీఏలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమష్టి కృషి, అంకితాభావానికి దక్కిన గౌరవం ఇది అని ఆయన పేర్కొన్నారు. రానున్న కాలంలోనూ ఉన్నతాధికారుల మార్గదర్శకాలతో గిరిజనాభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని, గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి మరింతగా పాటుపడతామని పీవో స్పష్టం చేశారు. -
మండుతున్న మన్యం
ఒకవైపు కరిగిపోతున్న అడవులు.. మరోవైపు పెట్రోల్, గ్యాస్, బొగ్గు వంటి ఇంధనాల మితిమీరిన వాడకం.. ఫలితంగా పెరిగిపోతున్న భూతాపం నేడు మానవ జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తోంది. ఒకప్పుడు మానవుడికి ప్రాణమిత్రుడిగా ఉన్న ప్రకృతి.. నేడు శత్రువుగా మారిపోతోంది. దీని ప్రభావంతో ఏటా ప్రకృతి వైపరీత్యాలు కోరలు చాస్తున్నాయి. అతివృష్టి లేదా అనావృష్టి రూపంలో మానవ మనుగడను శాసిస్తున్నాయి. పెట్రోల్ బంక్లో నిరంతర సేవలు ● జీసీసీ బ్రాంచ్ మేనేజర్ సుగునాథం చింతపల్లి: స్థానికంగా ఉన్న గిరిజన సహకార సంస్థ బంక్లో 24 గంటలూ పెట్రోల్, డీజిల్ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు బ్రాంచ్ మేనేజర్ సల్లంగి సుగునాథం తెలిపారు. గురువారం ఆయన స్థానిక పెట్రోల్ బంక్ను పరిశీలించారు. ఈ సందర్భంగా వినియోగదారులకు రోజంతా నిరంతరాయంగా సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం బంక్లో మూడు షిఫ్ట్లలో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. అయితే, కొన్ని సందర్భాల్లో అర్ధరాత్రి వేళల్లో మందుబాబులు వచ్చి సిబ్బందిని ఇబ్బంది పెడుతుండటంతో రాత్రి సమయం దాటిన తర్వాత బంక్ను మూసివేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇకపై అటువంటి ఇబ్బందులు లేకుండా 24 గంటలూ బంక్ సేవలు అందుబాటులో ఉంటాయని, వినియోగదారులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు.అదేవిధంగా చింతపల్లి డివిజన్ పరిధిలోని మూడు మండలాలకు గ్యాస్ కొరత లేదని బీఎం స్పష్టం చేశారు. ఆయా మండలాల్లో వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకున్న వెంటనే, ఓటీపీ విధానం ద్వారా ఇంటింటికీ సిలిండర్లు సరఫరా చేస్తున్నట్లు వివరించారు. డివిజన్ పరిధిలో పెట్రోల్, డీజిల్, గ్యాస్కు సంబంధించి ఎటువంటి కొరత లేదని ఆయన స్పష్టం చేశారు.కొయ్యూరు: సముద్ర మట్టానికి సుమారు రెండు వేల నుంచి మూడు వేల అడుగుల ఎత్తులో ఉన్నందున జిల్లాలో వాతావరణం సాధారణంగా ఎంతో ఆహ్లాదకరంగా, విభిన్నంగా ఉంటుంది. ఇక్కడి కొండలు 25 నుంచి 40 డిగ్రీల ఏటవాలుగా ఉంటాయి. ఏటా సగటున 1,200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. కానీ, గత ఐదేళ్లుగా భూతాపం ప్రభావంతో ఇక్కడి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. దీనివల్ల వ్యవసాయ పంటల దిగుబడి ఇప్పటికే 10 నుంచి 15 శాతం వరకు పడిపోయింది. భవిష్యత్తులో ఈ దిగుబడులు మరింత ఘోరంగా తగ్గే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీగా అంతరించిన అడవి.. అడవులు దట్టంగా ఉంటేనే వాతావరణంలో సమతుల్యత ఉంటుంది. అవి తగ్గేకొద్దీ ఉష్ణోగ్రతలు కోరలు చాస్తాయి. వస్తే ముంచెత్తే వరదలు, లేదంటే ఎండబెట్టే కరవు.. ఇదీ ప్రస్తుత పరిస్థితి. గత నాలుగు సంవత్సరాలలోనే అల్లూరి జిల్లా పరిధిలో దాదాపు వంద కిలోమీటర్లకు పైగా అటవీ ప్రాంతం అంతరించిపోయింది. పోడు వ్యవసాయం పేరిట చెట్లను నరికి తగలబెట్టడం, జాతీయ రహదారి విస్తరణలో భాగంగా వందలాది ఏళ్ల నాటి పెద్ద పెద్ద చెట్లను యథేచ్ఛగా నరికేయడం..వంటి కారణాల వల్లే ఇప్పుడు మన్యంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. పెరుగుతున్న పిడుగుల మరణాలు సాధారణంగా ఏప్రిల్ లేదా మే నెలల్లో కురిసే ముందస్తు వర్షాల సమయంలో పిడుగులు పడుతుంటాయి. ముఖ్యంగా ఏ రోజు ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదవుతుందో, ఆ రోజు సాయంత్రానికి కారుమేఘాలు కమ్మి పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది మే నెలలో పడిన పిడుగుల ధాటికి ఎంతో మంది మనుషులతో పాటు మూగజీవాలు సైతం ప్రాణాలు కోల్పోయాయి. సకల జీవరాశికి ఊపిరి పోసే చెట్ల ఉసురు తీస్తున్నందుకే.. ప్రకృతి ఇలా పిడుగుల రూపంలో పగబడుతోంది. పచ్చదనం చిగురిస్తేనే జీవన ప్రయాణం బోడి గుట్టలుగా మారిపోతున్న అడవులను తిరిగి పచ్చదనంతో నింపితేనే పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలకు అడ్డుకట్ట వేయగలం. భూతాపం బారి నుంచి కొంతవరకై నా ఉపశమనం పొందాలంటే అడవుల పునరుద్ధరణ ఒక్కటే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. అటవీ శాఖతో పాటు ప్రభుత్వం రకరకాల శాఖలను సమన్వయం చేసుకుంటూ రైతులకు, స్థానికులకు పెద్ద ఎత్తున పండ్ల మొక్కలను, నీడను ఇచ్చే చెట్లను పంపిణీ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలి. ఇందుకు తగ్గట్టుగా ప్రజల్లో చైతన్యం తేవాల్సిన అవసరం ఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.పాడేరు డివిజన్: 1.97 లక్షల హెక్టార్లు చింతపల్లి డివిజన్: 1.96 లక్షల హెక్టార్లు కొండల ఏటవాలు: 25 నుంచి 40 డిగ్రీలు నమోదయ్యే వర్షపాతం: 1200 ఎంఎం గత ఏడాది నమోదైంది : 1473 ఎంఎంపర్యావరణ పరిరక్షణలో కీలకపాత్ర పోషించే చెట్లే లేనప్పుడు వర్షాలు ఎలా వస్తాయనేది ఇప్పుడు మిగిలిన అతిపెద్ద ప్రశ్నార్థకం. అడవులు అంతరిస్తే ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, పిడుగుపాటు ప్రమాదాలు ఎక్కువవుతాయి, భూగర్భ జలాల ఊటలు ఎండిపోతాయి. నేడు మన్యం ప్రాంతం కూడా ఇదే రీతిలో వేడెక్కుతోంది. జిల్లాలో ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి ఎండలు నమోదు కావడం దీనికి నిదర్శనం. సృష్టిలో మనుషులు పిలిస్తే రానిది.. చెట్లు పిలిస్తే వచ్చేది వర్షం ఒక్కటే..ప్రకృతిని మనం కాపాడితే.. ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది అనే సత్యాన్ని గ్రహించి ఇప్పటికై నా అడవుల రక్షణకు నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అడవి పెంపునకు కార్యాచరణ చెట్ల నరకివేతను అరికట్టడంలో ప్రజలను దీనిలో బాగస్వామ్యం చేయాలి. పచ్చదనం పెంపొందించేందుకు విరివిగా మొక్కలను నాటా లి. ఇందులో భాగంగా సీడ్ బాల్స్ సేకరిస్తున్నాం. రాష్ట్రంలోని అటవీప్రాంతంలో జిల్లాకు సంబంధించి 23 శాతం ఉంది. దీనిని వచ్చే ఏడాదికి 30 శాతానికి పెంచేలా కార్యాచరణ రూపొందించాం. – వైవీ నర్సింగరావు, డీఎఫ్వో, చింతపల్లి పెరుగుతున్న భూతాపం విచ్చలవిడిగా అడవుల నరికివేత గణనీయంగా తగ్గిపోతున్న విస్తీర్ణం మానవ మనుగడపై తీవ్ర ప్రభావం తగ్గుముఖం పడుతున్న వర్షపాతం 10 నుంచి 15 శాతం వరకు తగ్గిపోతున్న పంటల దిగుబడి వెంటాడుతున్న అతివృష్టి, అనావృష్టి నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవంపచ్చదనమే శ్రీరామరక్ష భూతాపం తగ్గితేనే ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. సాధ్యమైనంత వరకు చెట్లను పెంచాలి. పచ్చదనం బాగా ఉంటేనే వాతావరణ సమతుల్యత బాగుంటుంది. తగ్గిపోతున్న అటవీ విస్తీర్ణాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఫలసాయం ఇచ్చే మొక్కలను రైతులకు సరఫరా చేయాలి. ఎరువుల వినియోగానికి స్వస్తి పలికి సేంద్రియ సాగుపై దృష్టి పెట్టాలి. – అప్పలస్వామి, ఏడీఆర్, ఆర్ఏఆర్ఎస్, చింతపల్లి -
మోసాల మయం
రెండేళ్ల పాలనజిల్లా వ్యాప్తంగా కదంతొక్కిన వైఎస్సార్ సీపీ శ్రేణులుశుక్రవారం శ్రీ 5 శ్రీ జూన్ శ్రీ 2026● ఎన్నికల హామీలు నెరవేర్చని కూటమి ప్రభుత్వం ● ప్రశ్నిస్తే వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు, దాడులు ● సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు వెన్నుపోటు ● డీఎస్సీలో అక్రమాలతో విద్యావంతులతో చెలగాటం ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మండిపాటు ● వచ్చే ఎన్నికల్లో ప్రజాగ్రహం తప్పదని హెచ్చరిక ● ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసనకు విశేష స్పందన జి.మాడుగుల: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతూ దాడులకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు, గురువారం మండల కేంద్రంలో ఆయన ఆధ్వర్యంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిగా నెరవేర్చారని గుర్తుచేశారు. కానీ చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా రూ.3వేల నిరుద్యోగ భృతి, తల్లికి వందనం కింద రూ.15వేలు, రైతులకు రూ.20వేలు ఇస్తామని చెప్పి ప్రజలను వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు రూ.1,500 ఇస్తామన్న హామీలను అటకెక్కించారని, పెన్షన్ల ఎత్తివేత, డీఎస్సీ అక్రమాలతో విద్యావంతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు: మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పాడేరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. చంద్రబాబు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అని విమర్శించారు. జగన్ అందించిన సంక్షేమాన్ని మించి పథకాలు ఇస్తామని ఊకదంప్పుడు ప్రసంగాలు చేసి, ఈ రెండేళ్లలో ఆడబిడ్డ నిధి కింద మహిళలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కూటమి మోసాలను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పోలీసుల అడ్డగింతపై ఎమ్మెల్యే ఆగ్రహం నిరసనలో భాగంగా కూటమి ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టో, బాండ్ ప్రతులను దహనం చేసేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రయత్నించగా.. సీఐ లక్ష్మణరావు ఆధ్వర్యంలోని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మేనిఫెస్టో ప్రతులను చించి గాలిలోకి ఎగురవేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ శ్రేణులు చేసిన నినాదాలతో జి.మాడుగుల జంక్షన్ హోరెత్తింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్టీసెల్ అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, వైస్ ఎంపీపీ కె.సత్యనారాయణ, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు నుర్మాని మత్స్యకొండంనాయుడు, మాజీ ఎంపీపీ మత్స్యరాస వెంకటగంగరాజు (బుజ్జి), వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంజరి సీతారామరాజు, వైఎస్సార్సీపీ సంయుక్త కార్యదర్శి డాక్టర్ తెడబరికి సురేష్కుమార్, జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్కుమార్, ఎంపీటీసీలు మత్స్యరాస విజయకుమారి, గబ్బాడి సన్యాసిదొర, పాంగి లక్ష్మి, చిన్నారావు, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గబ్బాడి శేఖర్, క్రిస్టియన్ మైనారిటీ విభాగం సంయుక్త కార్యదర్శి అంద్రయ్య, తాజామాజీ సర్పంచ్లు ఐసర హనుమంతరావు, రామకృష్ణ, సీదరి కొండబాబు, లసంగి మాలన్న, పెద్దబాలన్న, వైఎస్సార్సీపీ నేతలు పాంగి చిట్టిబాబు, వలసయ్య, మన్మథరావు, సోమలింగం, మత్స్యకొండబాబు, ఈశ్వరరావు, బాలయ్యపడాల్, శ్రీనివాసనాయుడు, కూర్మరాజు, సోంబాబు, కొండబాబు, వివిధ అనుబంధ విభాగాల పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాడేరు ఆర్డీవోగా భుజంగరావు సాక్షి,పాడేరు: పాడేరు ఆర్డీవోగా ఎం.భుజంగరావును నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూశాఖలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న ఆయనకు ఆర్డీవోగా పదోన్నతి కల్పించి పాడేరులో పోస్టింగ్ ఇచ్చింది. పాడేరు సబ్కలెక్టర్/ఆర్డీవో పోస్టు గత కొద్ది నెలలుగా ఖాళీగా ఉంది. ఇన్చార్జి సబ్కలెక్టర్గా ఐటీడీఏ పీపీవో ఆదిత్యవర్మ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.ప్రభుత్వం పాడేరు ఆర్డీవో పోస్టును ఎట్టకేలకు భర్తీ చేసింది.శిక్షణతో ఉన్నత విద్యాబోధన చింతపల్లి: ఉన్నత విద్యాబోధన అందించేందుకు ఏర్పాటుచేసిన శిక్షణ తరగతులను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈవో, కోర్స్ డైరెక్టర్ పనసల ప్రసాద్ సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు ప్రాథమిక అక్షరాస్యత సంఖ్యాజ్ఞానంపై గురువారం నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమంలో శిక్షకులు దేపూరి శశికుమార్,యూవీ గిరి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో తుగ్లక్ పాలన
అరకులోయ టౌన్ (పాడేరు రూరల్): రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతోందని అరకు ఎమ్మెల్యే రేగం మత్య్సలింగం తెలిపారు. నియోజకవర్గ కేంద్రం అరకులోయలో ఎమ్మెల్యే రేగం ఆధ్వర్యంలో గురువారం చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద రాస్తారోకో నిర్వహించి మేనిఫెస్టో పత్రాలను కాల్చి నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిరంకుశ పాలనను అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల హమీలను అమలు చేయడంలో చేతకాని ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగాన్ని మాత్రం సమర్థవంతంగా నిర్వహిస్తోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా సూపర్ సిక్స్ అమలులో పూర్తి విఫలమైందన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత మొదలైందన్నారు. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వానికి మనుగడ లేకుండా పోతుందన్నారు. ఇప్పటికై నా ప్రజలకు ఇచ్చిన హమీలు అమలు చేసి చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు రేగం చాణక్య, ఎస్టీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, మండల పార్టీ అధ్యక్షులు రామ్మూర్తి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నర్సింగరావు, అరకు నియోజకవర్గ బూత్ కమిటీ ఇన్చార్జి పాంగి విజయ్కుమార్, ఎంపీటీసీ సభ్యుడు డి.ఆనంద్కుమార్, పార్టీ సీనియర్ నాయకులు కమిడి అశోక్, ప్రకాష్, జగన్కుమార్, ఎల్బీ కిరణ్కుమార్, శివ, సోమేశ్వరి పాల్గొన్నారు.మేనిఫెస్టో ప్రతులను తగులబెడుతున్న ఎమ్మెల్యే మత్స్యలింగం, పార్టీ శ్రేణులుఅరకులో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో రాస్తారోకోఅరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం విమర్శ -
రోగుల ప్రాణాలతో చెలగాటం
● అంబులెన్సు దుస్థితిపై మండిపడ్డ అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం ● అదనంగా అంబులెన్సులుఏర్పాటు చేయాలని డిమాండ్ సాక్షి,పాడేరు: గిరిజన ప్రాంతాల్లోని పాడేరుతో పాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో అదనంగా అంబులెన్స్లు ఏర్పాటు చేసేలా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. డుంబ్రిగుడ మండలంలో బైక్ ప్రమాదంలో గాయపడి పాడేరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన యువకులను బుధవారం ఆయన పరామర్శించారు. ఆస్పత్రి నుంచి కేజీహెచ్కు రిఫర్ చేసిన రోగులను కూడా ఎమ్మెల్యే పరామర్శించారు. ఒకే అంబులెన్స్లో అధికమంది రోగులను కేజీహెచ్కు తరలిస్తున్న పరిస్థితిని చూసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాల్లో గాయపడిన బాధితులతో పాటు వివిధ వ్యాధులతో బాధపడేవారిని ఒకచోట ఉంచి విశాఖ తీసుకువెళ్లడం మంచిది కాదని రోగులకు అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని ఆయన వైద్యులను నిలదీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో పేదల ఆరోగ్యానికి రక్షణ కరువైందన్నారు. అధిక సంఖ్యలోని రోగులతో ఘాట్ ప్రాంతాల్లో అంబులెన్స్లు ప్రయాణించడం కూడా ప్రమాదకరమన్నారు.రోడ్డు ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్పత్రులలో పూర్తిస్థాయిలో అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉండడం దారుణమన్నారు.గిరిజనుల వైద్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అన్ని ఆస్పత్రులలోను అదనంగా అంబులెన్స్లు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాగర ఎంపీటీసీ వంతాల దేవదాసు తదితరులు పాల్గొన్నారు. -
కన్నవారికి కడుపుకోత
ఆ తల్లుల కడుపుకోతకు అంతులేకుండా పోయింది.. రెక్కలొచ్చి కుటుంబానికి ఆసరాగా నిలుస్తారనుకున్న ఇద్దరు యువకులు విగతజీవులుగా పడి ఉండటం చూసి ఆ గ్రామం తల్లడిల్లిపోయింది. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు నవ యువకులను బలితీసుకుంది, మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ విషాద ఘటన తీవ్ర శోకాన్ని నింపింది. ● మరొకరి పరిస్థితి విషమం ● కండ్రుమ్ నూతన వంతెన వద్ద ఘటన ● బస్ షెల్టర్ను ఢీకొనడంతో ప్రమాదం ● మృతులు కోసొంగుడ వాసులు డుంబ్రిగుడ: మండలంలోని సాగర పంచాయతీ కోసొంగుడ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు పొరుగు రాష్ట్రమైన ఒడిశాలోని చట్టువా గ్రామానికి వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి సొంత ఊరువస్తుండగా, కండ్రుమ్ నూతన వంతెన సమీపంలో ఉన్న బస్సు షెల్టర్ను వారి మోటార్ సైకిల్ వేగంగా ఢీకొట్టిందని ఎస్ఐ సురేష్ తెలిపారు. ఈ ఘటనలో చెడ్డ శేషుప్రవీణ్ (21) అనే యువకుడు తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ప్రమాద తీవ్రతకు రోడ్డుపై పడి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న మరో యువకుడు డిప్పల తాజేశ్వరరావు(20)ను స్థానికులు 108 వాహనంలో అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి చేరుకునే లోపే అతడు కూడా కన్నుమూశాడు. కాగా, వంతాల అరవింద్(22) అనే మరో యువకుడు ఊపిరితో కొట్టుమిట్టాడుతుండటంతో పరిస్థితి విషమంగా భావించి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్కు తరలించినట్టు ఎస్ఐ తెలిపారు. మృతులిద్దరిది ఒకే గ్రామం.. చేతికంది వచ్చిన ఇద్దరు యువకులు ఒకే ప్రమాదంలో మృత్యువాత పడటంతో కోసొంగుడ గ్రామంలో ఒక్కసారిగా చీకట్లు ముసిరాయి. మృతుల తల్లిదండ్రులు, బంధువుల ఏడుపులు, ఆర్తనాదాలతో ఆసుపత్రి పరిసరాలు మిన్నంటాయి. మృతదేహాలను చూసి గ్రామస్తులంతా కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. హెల్మెట్ ధరించండి.. వేగం తగ్గించండి.. పోలీసుల హృదయ విదారక విన్నపం రోడ్డు ప్రమాదాల నివారణకు తాము ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, హెల్మెట్ లేని వారికి జరిమానాలు విధిస్తున్నా యువతలో మార్పు రావడం లేదని ఎస్ఐ సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మితిమీరిన వేగంతో ప్రయాణించి, క్షణకాలం అజాగ్రత్తతో కన్నవారికి కడుపుకోత మిగల్చవద్దని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని ఆయన యువత, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి జి.మాడుగుల: లంబసింగి–జి.మాడుగుల జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పనుల కోసం నీటిని తరలిస్తున్న వాటర్ ట్యాంక్ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదబయలు మండలం లింగేరిపుట్టు గ్రామానికి చెందిన డ్రైవర్ పాంగి ిసిద్ధు, జాతీయ రహదారి నిర్మాణ పనుల నిమిత్తం బుధవారం వంజరి పరిసరాల్లోని పారుగెడ్డ నుంచి వాటర్ ట్యాంకర్లో నీటిని నింపుకుని బయలుదేరాడు. మార్గమధ్యంలో ట్రాక్టర్ అకస్మాత్తుగా అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ కింద పడిపోయిన సిద్ధుకు తీవ్ర గాయాలవ్వడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు అందాల్సి ఉంది.బస్ షెల్టర్ను బైక్ ఢీకొని ఇద్దరు యువకుల దుర్మరణం -
మండల సమావేశానికి అధికారుల డుమ్మా
● ఆగ్రహానికి గురైన చింతపల్లిఎంపీపీ కోరాబు అనూషదేవి ● కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని ఎంపీపీకి సూచన చింతపల్లి: మండల సర్వసభ్య సమావేశానికి హాజరుకాని అధికారులపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని ఎంపీపీ కోరాబు అనూషదేవి హెచ్చరించారు. బుధవారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దారు శంకర్రావు మాట్లాడుతూ మండలంలో భూ రీసర్వే కార్యక్రమం వేగంగా జరుగుతోందని, ఈ నెలలో 11 గ్రామాల్లో 780 నూతన భూమి పట్టాలను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అలాగే మరో 43 గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అనంతరం ఎంఈవో ప్రసాద్ మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల్లో పాఠశాల భవనాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయడానికి తగిన చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఈ ఏడాది నుంచి ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల సర్దుబాటు కార్యక్రమాన్ని రెండు విభాగాలుగా చేపడుతున్నామని ఏటీడబ్ల్యూవో జయనాగలక్ష్మి తెలిపారు. గైర్హాజర్ అయిన అధికారులపై ఆగ్రహం ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే ఈ కీలక సమావేశానికి కొన్ని శాఖల మండల అధికారులు హాజరు కాకపోవడంపై ఎంపీపీ అనూషదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే ప్రజా సమస్యలు పరిష్కారం, అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రతి శాఖ అధికారి ప్రజాప్రతినిధులను గౌరవించాల్సిన బాధ్యత ఉందన్నారు. అయితే కొంతమంది అధికారులు ఆ విషయాన్ని విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండల సమావేశానికి కచ్చితంగా హాజరు కావాలని ముందే సమాచారం అందించినప్పటికీ.. నిర్లక్ష్యంగా వ్యవహరించి గైర్హాజరైన పీహెచ్సీ అధికారులు, పంచాయతీరాజ్, గృహనిర్మాణ, జీసీసీ, ఆర్టీసీ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని, దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని ఎంపీడీవోకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు శారద, వెంగళరావు, మండల వ్యవసాయాధికారి టి.మధుసూదనరావు, ఏపీఎం శ్రీనివాసరావు, పీఆర్ జేఈ బాలకిషోర్, సీడీపీవో శ్రీదేవి, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. -
పలుగు, పార చేతపట్టి..
● కుమిడికుంటి గ్రామస్తులు శ్రమదానం ● రహదారికి సొంతంగా మరమ్మతులు డుంబ్రిగుడ: ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారకపోవడంతో.. ఆ గిరిజన గ్రామస్తులు ఎవరికోసమో ఎదురుచూడకుండా తామే పారలు, గడ్డపారలు చేతబట్టారు. మండలంలోని కొల్లాపుట్టు పంచాయతీ పరిధిలో ఉన్న కుమిడికుంటి గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో, గ్రామస్తులంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బుధవారం శ్రమదానంతో రహదారికి మరమ్మతులు చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా నరకప్రాయంగా మారిన ఈ దారిని శ్రమదానంతో మెరుగుపరచుకున్నారు. నిధులున్నా పూర్తికాని పనులు ఈ రోడ్డు నిర్మాణానికి 2016–17 ఆర్థిక సంవత్సరంలోనే నిధులు మంజూరయ్యాయి. అయితే, అధికారులు, కాంట్రాక్టర్ల ఉదాసీనత వల్ల పనులు పూర్తిస్థాయిలో జరగలేదు. కేవలం కొంతమేర మాత్రమే పనులు చేసి, మధ్యలో మట్టి పోసి పనులను నిలిపివేశారని గ్రామస్తులు ఆరోపించారు. పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగి వినతులు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో విసిగిపోయిన గిరిజనులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ● గతంలో అరకొరగా వేసిన రోడ్డు కాస్తా భారీ వర్షాల కారణంగా పూర్తిగా దెబ్బతింది. గుంతలమయంగా మారిన ఈ దారిలో రాకపోకలు సాగించడం ప్రాణసంకటంగా మారింది. ముఖ్యంగా రోడ్డు మలుపుల వద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉండటంతో, గ్రామస్తులే స్వయంగా పెద్ద పెద్ద బండరాళ్లను తెచ్చి, పేర్చి రక్షణ గోడను నిర్మించారు. వర్షపు నీటికి రోడ్డు మరింత దెబ్బతినకుండా ఉండేందుకు నీరు పోయేలా కాలువలను కూడా ఏర్పాటుచేశారు. ఈ శ్రమదాన కార్యక్రమంలో గ్రామ పెద్దలు వంతాల సీతారాం, చిన్నయ్య, దాసు, పీసా కమిటీ కార్యదర్శి, సుల్, శాంతి తదితరులు ముందుండి గ్రామస్తులను నడిపించారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కుమిడికుంటి గ్రామానికి శాశ్వత, నాణ్యమైన రహదారి సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
● కలెక్టర్ నిశాంతి ● హుకుంపేటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ ● 160 అర్జీల స్వీకరణ హుకుంపేట (డుంబ్రిగుడ): ప్రజా సమస్యల పరిష్కారంలో, విధి నిర్వహణలో అధికారులు ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ నిశాంతి హెచ్చరించారు.. బుధవారం హుకుంపేటలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్, జేసీ తిరుమణి శ్రీపూజ హాజరై ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 160 అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను వారి వద్దకే వెళ్లి తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. రహదారి నిర్మాణాలకు ప్రాధాన్యం సమస్యల వినతుల్లో ప్రధానంగా రోడ్లు, తాగునీరు, విద్యుత్ సమస్యలపైనే ఎక్కువ వినతులు వచ్చాయి. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ.. 100 కంటే ఎక్కువ జనాభా ఉన్న పీవీటీజీ గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు రూ. 400 కోట్ల విలువైన రహదారి పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని, ప్రాధాన్యత క్రమాన్ని బట్టి నిధుల కేటాయింపు జరుగుతుందన్నారు. తాగునీటి సమస్యపై ప్రత్యేక నిధులు: మండలవ్యాప్తంగా తాగునీటి సమస్యల పరిష్కారానికి ఆర్డబ్ల్యూఎస్ శాఖ సమగ్ర ప్రణాళికతో సిద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు. ఏ గ్రామంలోనైనా తాగునీటి సమస్య ఉంటే.. తక్షణమే ఎంపీడీవో, జెడ్పీ సీఈవోలతో మాట్లాడి మండల నిధులు లేదా జల్ జీవన్ మిషన్ ద్వారా తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక రెవెన్యూ, సివిల్ వివాదాలను స్థానిక తహసీల్దార్ పర్యవేక్షించాలని, అవసరమైన చోట పోలీస్ శాఖ సహకారం తీసుకోవాలని సూచించారు. ఈ వేదికలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
క్లాప్ మిత్రల వెట్టిచాకిరి
సాక్షి, పాడేరు: గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ కోసం నిరంతరం అష్టకష్టాలు పడుతున్న క్లాప్ మిత్రలు వెట్టిచాకిరికి గురవుతున్నారు. ఊరి చెత్తనంతా ఊడుస్తున్న ఈ శ్రామికులకు ఇచ్చే అరకొర వేతనం రూ.6వేలు కూడా నెలనెలా అందకపోవడంతో వారి కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఉదయం నిద్ర లేచింది మొదలు క్లాప్ మిత్రలు పారిశుధ్య పనుల్లోనే నిమగ్నమవుతున్నారు. వీధులను శుభ్రం చేయడంతో పాటు, ఇంటింటికీ రిక్షాతో తిరుగుతూ తడి, పొడి చెత్తను సేకరిస్తూ ఎంతో శ్రమిస్తున్నారు. నాలుగు నెలలుగా కరువైన వేతనాలు జిల్లాలోని 11 మండలాల పరిధిలోని 244 పంచాయతీల్లో మొత్తం 532 మంది క్లాప్ మిత్రలు పనిచేస్తున్నారు. వీరికి ప్రతి నెలా వేతనాలు అందించడంలో పంచాయతీ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. సుమారు 70 శాతం పంచాయతీల్లో నాలుగు నెలలుగా, మిగిలిన పంచాయతీల్లో రెండు నుంచి మూడు నెలల వరకు వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. జీతాల కోసం పంచాయతీ ప్రత్యేక అధికారులు, కార్యదర్శులను క్లాప్ మిత్రలు వేడుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. 15వ ఆర్థిక సంఘ నిధులు పుష్కలం.. కానీ! ప్రస్తుతం అన్ని పంచాయతీల్లోనూ 15వ ఆర్థిక సంఘ నిధులు పుష్కలంగా ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఈ నిధులను పారిశుధ్య పనులకు, ఆయా పనులు చేసే క్లాప్ మిత్రలు, ఇతర కార్మికుల వేతనాల చెల్లింపులకే అధిక ప్రాధాన్యతగా ఉపయోగించాలి. అయితే, ఇటీవల అన్ని పంచాయతీలకు ప్రత్యేక అధికారులు నియమితులైనప్పటికీ, క్లాప్ మిత్రల పెండింగ్ వేతనాల చెల్లింపునకు మాత్రం న్యాయం చేయలేకపోతున్నారు. గత సంక్రాంతి పండగ సమయంలో చివరిసారిగా వేతనాలు తీసుకున్నామని, ఆ తర్వాత నుంచి ఇంతవరకు పైసా కూడా చెల్లించలేదని పలువురు క్లాప్ మిత్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోదమ్మ పండగలో శ్రమ దోపిడీ.. పాడేరు మోదకొండమ్మజాతర సందర్భంగా ఐదు రోజుల పాటు పారిశుధ్య పనుల కోసం అనేక గ్రామాల నుంచి వచ్చిన క్లాప్ మిత్రలు ఎంతో శ్రమించారు. పండగ రోజుల్లో వారి చేత అదనపు పనులు చేయించుకుని, కేవలం భోజనాలు పెట్టి చేతులు దులుపుకున్నారే తప్ప.. కనీస అదనపు కూలి కూడా చెల్లించకపోవడంతో వారంతా ఉసూరుమంటున్నారు. జాతర సందర్భంగా పాడేరు పట్టణమంతటా పేరుకుపోయిన చెత్తను తొలగించి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశారు. పండగ విజయవంతం కావడంలో క్లాప్ మిత్రల శ్రమ ఎంతో ఉన్నప్పటికీ, వారి ఐదు రోజుల వెట్టిచాకిరికి కనీస కూలి సొమ్ము కూడా అధికార యంత్రాంగం ఇవ్వకపోవడంపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
గిరిజనుడి ఇల్లు అక్రమమా?
విత్తన బంతులతో పచ్చదనం గిరిజనుడు నిర్మిస్తున్న ఇంటివద్ద అధికారులు ఏర్పాటుచేసిన హెచ్చరిక బోర్డును చూపిస్తున్న కిల్లో సురేంద్ర, గిరిజన సంఘ నేతలు హుకుంపేట (డుంబ్రిగుడ): హుకుంపేట మండల కేంద్రంలో సర్వహక్కులు కలిగిన గిరిజనుడు కంబ శ్రీను స్వయం ఉపాధి కోసం నిర్మించుకుంటున్న కట్టడాన్ని అక్రమమంటూ రెవెన్యూ అధికారులు నిలిపివేయడం, అక్కడ హెచ్చరిక బోర్డు పెట్టడంపై ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర తీవ్రంగా మండిపడ్డారు. గిరిజన సంఘం మండల కార్యదర్శి టి.కృష్ణారావు, నాయకుడు వి.లక్ష్మణరావుతో కలిసి ఆయన మంగళవారం వివాదాస్పద స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కిల్లో సురేంద్ర విలేకరులతో మాట్లాడుతూ.. గిరిజనుడు ఇల్లు కట్టుకుంటే చట్టవిరుద్ధమా?.. గిరిజనేతరులు కడితే చట్టబద్ధమా? అని అధికారులను నిలదీశారు. స్థానిక అధికారుల అలసత్వం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు విపరీతంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇది ముమ్మాటికి 1/70 చట్టాన్ని ఉల్లంఘించడమేనన్నారు. గిరిజనేతరులైన షేక్ వహీద్, లంకా శ్రీను, భాస్కర్, కాకినాడ విజయ, మోదమాంబ తదితరులు చేపడుతున్న నిర్మాణాలను ఎందుకు అడ్డుకోలేదో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే గిరిజనేతరుల అక్రమ ఆక్రమణలపై విచారణ జరిపి, వారిపై ఎల్టీఆర్ కేసులు నమోదు చేయాలని, గిరిజనుడి నిర్మాణానికి సహకరించాలని వారు కోరారు. -
అధినేతను కలిసిన అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.అప్పన్నకు ఆర్జిత సేవలు సింహాచలం: శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామికి మంగళవారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 9.30 గంటల నుంచి నిత్య కల్యాణం శాస్త్రోక్తంగా జరిపారు. ఆలయ కల్యాణ మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను అధిష్టింపజేశారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్ర బెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణం కమనీయంగా సాగింది. పీజీ సెట్లో మర్రిపాలెం విద్యార్థినుల ప్రతిభ కొయ్యూరు: ఇటీవల ప్రకటించిన పీజీసెట్ ఫలితాల్లో మర్రిపాలెం మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు మంచి ర్యాంకులను సాధించారని ప్రిన్సిపాల్ కె.సుధ మంగళవారం తెలిపారు. ఆంగ్ల విభాగంలో బత్తుల చోదన 200, గణితంలో మాసాడ లావణ్య 267, మువ్వల మాధవి 504, కిలో మైత్రి 537, అర్ధశాస్త్రంలో దోని చింతల్లి 270 ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా వారిని అభినందించారు. -
అడవితల్లి బాట తప్పింది
ఆర్భాటంగా బోర్డులు.. అంగుళం కదలని పనులు రహదారి లేక పీఎం జనమన్ ఇళ్ల సామగ్రి మోసుకెళ్తున్న గిరిజనం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ హడావుడికే పరిమితంఅడవితల్లి బాట బోర్డుకే పరిమితమైన అమలగుడ రోడ్డు డుంబ్రిగుడ: మండలంలోని రహదారుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. కూటమి పాలనలో గిరిజన గ్రామాల సమస్యలు పట్టించుకునే వారే కరువయ్యారు. మండలంలోని గసభ పంచాయతీ కుసుమకెంద, కండ్రుమ్ పంచాయతీ కుక్కుడబెడ్డ, పోతంగి పంచాయతీ అమలగుడ, తూటంగి పంచాయతీలోని జర్రాయి నుంచి బుడ్డింగి గ్రామానికి వెళ్లే రహదారులు ప్రస్తుతం పూర్తిగా అధ్వానంగా మారి చెరువులను తలపిస్తున్నాయి. ●తూటంగి పంచాయతీ బుడ్డింగి రహదారి నిర్మాణానికి ప్రభుత్వం అరకొరగా రూ. 1.50 లక్షలు మంజూరు చేసినా.. వాస్తవానికి నిధుల విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు ప్రారంభించకుండానే ఉడాయించాడు. దీంతో విసుగు చెందిన గిరిజన గ్రామస్తులు.. ఊళ్లోకి కనీసం అత్యవసర పరిస్థితుల్లో ద్విచక్ర వాహనాలైనా వెళ్లేందుకు వీలుగా తమ సొంత ఖర్చులతో, శ్రమదానంతో ఒక చిన్న మట్టి దారిని ఏర్పాటు చేసుకున్నారు. అయితే, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఆ మట్టి దారి కూడా పూర్తిగా కొట్టుకుపోయి కొండవాగులా మారింది. ప్రస్తుతం ఆ గ్రామానికి బైక్పై కూడా వెళ్లలేని ఘోర దుస్థితి ఏర్పడిందని గిరిజనులు కన్నీరుమున్నీరవుతున్నారు. జన్మన్ ఇళ్లకు తప్పని తిప్పలు మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం జన్మన్ పథకం కింద ఆయా గ్రామాల్లో నిర్మిస్తున్న గృహాలకు సైతం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం శాపంగా మారింది. ఇళ్లు మంజూరైనా.. వాటిని నిర్మించుకునేందుకు అవసరమైన ఇటుకలు, సిమెంట్, ఐరన్ వంటి సామగ్రిని గ్రామాల్లోకి తరలించేందుకు రహదారి సౌకర్యం లేకపోవడంతో గిరిజనులు తమ నెత్తిన, భుజాలపై మోసుకుంటూ కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోంది. నిత్యం కాలినడకన మండల కేంద్రానికి రాకపోకలు సాగిస్తూ గిరిజన మహిళలు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. ఈ రోడ్లు ఎప్పటికి పూర్తవుతాయో.. కనీసం ఆటోలు, ద్విచక్ర వాహనాలు తమ గ్రామాలకు ఎప్పుడు వస్తాయో తెలియక గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. వీటితో పాటు అమలగుడలో రోడ్డుతో పాటు వంతెన అత్యవసరంగా నిర్మించాల్సి ఉంది. ఇప్పటికై నా పాలకుల ప్రచార ఆర్భాటాలు పక్కన పెట్టి, అధికారులు, కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని నిలిచిపోయిన రోడ్డు పనులను పునఃప్రారంభించాలని, త్వరితగతిన నిధులు విడుదల చేసి పనులు పూర్తిచేయాలని గిరిజనులు కోరుతున్నారు. బుడ్డింగి రహదారికి ప్రభుత్వం కేటాయించింది కేవలం రూ. 1.50 లక్షలు. ఆ నిధులు కూడా విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు వదిలేసి ఉడాయించాడు. విసుగు చెంది గిరిజనులు తమ సొంత ఖర్చులతో, శ్రమదానంతో మట్టిదారి చేసుకుంటే.. ప్రస్తుత వర్షాలకు అది కొట్టుకుపోయి కొండవాగులా మారింది. కనీసం బైక్ కూడా వెళ్లలేని ఘోర దుస్థితిపై మన్యం కన్నీరుమున్నీరవుతోంది.రెండు నెలల్లో రోడ్లు పూర్తి చేస్తామని పెద్దపాడులో డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేసి ఏడాది దాటినా అతీగతీ లేదు. గసభ పంచాయతీ కుసుమకెంద రోడ్డును కేవలం మూడు కిలోమీటర్లు మట్టి పోసి గాలికొదిలేశారు. వర్షాలకు ఆ దారి కాస్తా బురదమయంగా మారి చెరువులను తలపిస్తోంది. అత్యవసర వైద్యానికి వెళ్లాలన్నా ఆటోలు కూడా రాని పరిస్థితి నెలకొంది. అద్భుతంగా మార్చేయడం అంటే ఇదేనా? గత ఏడాది ఏప్రిల్లో గిరిజన ప్రాంతంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మన్యంలోని రోడ్లను అద్భుతంగా మార్చేస్తామంటూ ‘అడవితల్లి బాట’ అనే సరికొత్త ప్రచార అస్త్రాన్ని వదిలారు. ఇందులో భాగంగా మండలంలో ట్రైబల్ వెల్ఫేర్, పంచాయతీ రాజ్, ఉపాధి హామీ ద్వారా సుమారు 15 రోడ్లు మంజూరైనట్లు నేతలు ఊదరగొట్టారు. పోతంగి పంచాయతీ అమలగుడ, కండ్రుమ్ పంచాయతీలోని కుక్కుడబెడ్డ, శిరసగుడ గ్రామాలకు రోడ్లు వేస్తున్నట్లు అట్టహాసంగా అడవితల్లి బాట బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. కానీ, బోర్డులు పెట్టి నెలలు గడుస్తున్నా పనులు మాత్రం అంగుళం కూడా ముందుకు పడలేదు. బడ్జెట్ కేటాయింపులు లేకుండా కేవలం ప్రచారం కోసమే బోర్డులు పెట్టించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం రోడ్ల ముఖం చూడని గిరిజనులకు.. అధికార పార్టీ పాలకుల వైఫల్యానికి సాక్ష్యాలుగా ఆ ప్రభుత్వ బోర్డులు వెక్కిరిస్తూ దర్శనమిస్తున్నాయి. ఇక గసభ పంచాయతీ కుసుమకెంద రోడ్డును కేవలం మూడు కిలోమీటర్ల మేర మట్టి పోసి అలాగే వదిలేయడంతో వర్షానికి అదంతా బురదమయంగా మారింది. ‘కూటమి’ నిర్లక్ష్యానికి నిదర్శనం గత ఏప్రిల్ నెలలో మండలంలోని పెద్దపాడు గ్రామాన్ని సందర్శించిన ఉపముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ గిరిజన ప్రాంత రోడ్లకు శంకుస్థాపన చేశారు. రెండు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ ఏడాది దాటినా పనులు ప్రారంభం కాలేదు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం – పాంగి పరశురామ్, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు, డుంబ్రిగుడ అస్తవ్యస్తంగా పనులు స్వర్ణయిగుడ నుంచి కుక్కుడబెడ్డ వరకు రోడ్డు పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. అడవితల్లి బాట పథకం కింద అధికారులు గత ఏడాది బోర్డులు మాత్రమే వేశారు కానీ క్షేత్రస్థాయిలో పనులు మాత్రం ముందుకు సాగలేదు. వర్షాలు ప్రారంభం కావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. – కొర్ర రాజారావు, స్వర్ణయిగుడ, కండ్రుమ్ పంచాయతీ, డుంబ్రిగుడ మండలం -
అర్హుల ఓటు పోనివ్వద్దు
పాడేరు: ఓటరు హక్కులను కాపాడటం, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో పక్కాగా ఉండేలా చూడటమే ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు అన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మంగళవారం పట్టణంలోని వీఆర్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల వైఎస్సార్సీపీ బీఎల్ఏలకు (బూత్ లెవెల్ ఏజెంట్లు) ఎస్ఐఆర్పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) కార్యక్రమం ప్రస్తుతం అత్యంత కీలకమైందని పేర్కొ న్నారు. దీన్ని చంద్రబాబు తనకు అనుకూలంగా మలుచుకుని, వైఎస్సార్సీపీకి సానుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా బీఎల్ఏలు క్షేత్రస్థాయిలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. జాబితా నుంచి అర్హులైన వారి ఓట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగిపోకుండా చూడాలని, అదే సమయంలో అనర్హులు, నకిలీ ఓటర్లు జాబితాలోకి చేరకుండా అడ్డుకోవాల్సిన పూర్తి బాధ్యత బీఎల్ఏలపైనే ఉందని విశ్వేశ్వరరాజు స్పష్టం చేశారు. శక్తివంచన లేకుండా పనిచేయాలి: అరకు పరిశీలకుడు వెంకటరామయ్య వైఎస్సార్సీపీ అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు చింతలపూడి వెంకటరామయ్య మాట్లాడుతూ గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అత్యధిక మంది ఓట్లు వేసినప్పటికీ కూటమి పార్ట్టీల కుట్రలు, కుతంత్రాలు, ఇతర కొన్ని తప్పిదాల కారణంగా ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్నారు. ఇరవై ఏళ్లకు ఒకసారి చేపట్టే సర్ కార్యక్రమం అత్యంత కీలకమన్నారు. పార్టీకి చెందిన బీఎల్ఏలు అప్రమత్తంగా లేకపోతే వైఎస్సార్సీపీ సానుకూల ఓట్లు తొలగిపోయి నకిలీ, అర్హత లేని వ్యక్తుల ఓట్లు ఓటర్ల జాబితాలో చేరే ప్రమాదం ఉందన్నారు. ఇందుకు ఉత్తరప్రదేశ్లో తొలగించిన 2.89 కోట్ల ఓట్లు, పశ్చిమ బెంగాల్లో 92లక్షలు, తమిళనాడులో 74లక్షల ఓట్లే నిదర్శమన్నారు. వైఎస్సార్సీపీకి ఓటర్ల సవరణ కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకమన్నారు. బీఎల్ఏలు క్షేత్రస్థాయిలో శక్తివంచన లేకుండా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. అప్రమత్తత అవసరం జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ మాట్లాడుతూ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీకి చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు అత్యంత ప్రాముఖ్యంగా తీసుకోవాలన్నారు. అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేసి వైఎస్సార్సీపీ సానుకూల ఓట్లను దగ్గరుండే తొలగించే కుట్రకు తెరతీసే అవకాశం ఉందన్నారు. తమ అనుకూల ఓట్లను కాపాడుకోవాలన్నా త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలవాలన్నా క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ ఏజెంట్ల పనితీరుపై ఆధారపడి ఉందన్నారు. ఇది చాలా కీలకమైన సమయమన్నారు. అప్రమత్తంగా ఉండి ఓటర్ల సవరణ చేపట్టాలన్నారు. ప్రతి బూత్ పరిధిలో ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను నిశితంగా పరిశీలించి వాటిని గుర్తించి సరిదిద్దే కార్యక్రమం చేయాలన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ సెంట్రల్ ఆఫీస్నుంచి వచ్చిన శిక్షకులు గణేష్, సతీష్ సర్ కార్యక్రమానికి సంబంధించిన విధివిధానాలు, ఎన్యూమరేషన్ ఫారాలు నింపే విధానం, కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, మరణించిన, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా నివాసం ఉన్న వారి వివరాలను నవీకరణ వంటి అంశాలపై బీఎల్ఏలకు అవగాహన కల్పించారు. అంతకు ముందు వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు అనే కార్యక్రమానికి సంబంధించిన వైఎస్సార్సీపీ ఈనెల 4 నుంచి 12 వరకు చేపట్టనున్న నిరసన కార్యక్రమాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడు ఏడువాక సత్యారావు, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెడబారికి సురేష్కుమార్, జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్కుమార్, మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్నదొర, మహిళ విబాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జైతీ రాజులమ్మ, రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బూసరి కృష్ణారావు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గాడి సత్యనారాయణ, ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్, నియోజకవర్గ మహిళ విభాగం అధ్యక్షురాలు కిల్లో ఊర్వశిరాణి, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, చింతపల్లి, గూడెంకొత్తవీధి ఎంపీపీలు కొరాబు అనూషాదేవి, బోయిన కుమారి, ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు రాంబాబు, మత్య్సకొండం నాయుడు, గుణబాబు, గిరిప్రసాద్, అప్పారావు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, బీఎల్ఏలు, పార్టీ తాజా మాజీ సర్పంచ్లు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. -
అగ్ని ప్రమాదాల నివారణకు వాటర్మిస్ట్
సీలేరు: సీలేరు కాంప్లెక్స్ పరిధిలోని అన్ని జలవిద్యుత్ కేంద్రాల్లో అగ్నిప్రమాదాల నివారణకు త్వరలోనే వాటర్ మిస్ట్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ జెన్కో చీఫ్ ఇంజనీర్ (సీఈ) కేవీ రాజారావు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇటీవల మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా శ్రీశైలం తరహాలోనే ఇక్కడ కూడా వాటర్ మిస్ట్ ఏర్పాటుకు హైడల్ డైరెక్టర్, టెక్నికల్ టీమ్ అనుమతి ఇచ్చారని చెప్పారు. మాచ్ఖండ్లో యుద్ధప్రాతిపదికన పనులు మాచ్ఖండ్ ప్రమాదంలో 3, 4 నంబర్ యూనిట్లతో పాటు మెయిన్ కంట్రోల్ రూమ్లోని ప్యానల్ బోర్డులు దెబ్బతిన్నాయని సీఈ వివరించారు. వీటికి అవసరమైన సామగ్రిని సేకరిస్తున్నామని, ఆంధ్రా–ఒడిశా ఇంజనీర్లు సంయుక్తంగా శ్రమిస్తున్నారని తెలిపారు. నెల రోజుల్లో రెండు యూనిట్లను, మరో రెండు నెలల్లో మిగిలిన వాటిని అందుబాటులోకి తెస్తామన్నారు. రోజుకు 8 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి రాష్ట్ర విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా సీలేరు, పొల్లూరు కేంద్రాల నుంచి ప్రస్తుతం రోజుకు 8 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు సీఈ పేర్కొన్నారు. డొంకరాయి మినీ జలవిద్యుత్ కేంద్రంలో ఓవరాలింగ్ పనులు పూర్తయ్యాయని, వారంలో ఉత్పత్తి ప్రారంభమవుతుందని చెప్పారు. అలాగే పొల్లూరు రెండో దశలో నిర్మిస్తున్న 5, 6 యూనిట్లను ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తెచ్చేలా పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ సమావేశంలో ఎస్ఈలు జాకీర్ హుస్సేన్, సీతారామ్, ఈఈలు బాలకృష్ణ, టి.అప్పలనాయుడు పాల్గొన్నారు. -
పట్టాలెక్కిన జోన్ ఆకాంక్ష
వేసవి సెలవుల్లో అడ్మిషన్లు కొయ్యూరు: వేసవి సెలవులు పూర్తి కాకుండానే ఐదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులను ఆరో తరగతిలో చేర్చాలని ఆదేశాలు రావడంతో ఆ మేరకు ఎంఈవోలు చర్యలు తీసుకుంటున్నారు. ఏకలవ్యతో పాటు మరికొన్ని పాఠశాలల్లో సెలవుల్లో ఆడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. గతంలో వేసవి సెలవులకు ముందే ఉపాధ్యాయులు..పై తరగతులకు వెళ్లే విద్యార్థుల జాబితా తయారు చేసేవారు. ప్రాథమిక పాఠశాలల్లో ఐదో తరగతి పూర్తి చేసిన వారిని సెలువుల అనంతరం ఆరో తరగతిలో ఆడ్మిట్ చేసేవారు. ఇప్పుడు సెలవుల్లోనే అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఉపాధ్యాయులు కచ్చితంగా పాఠశాలలకు వెళ్లి ఆరోతరగతిలో జాయిన్ అయ్యే వారికి రికార్డ్షీట్లను ఇవ్వాల్సి ఉంటుంది. విద్యార్థులను ఆరో తరగతిలో జాయిన్ చేసుకోడానికి ఉన్నత పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు కూడా అందుబాటులో ఉండాలి. ఈ మేరకు సమాచారం ఇస్తున్నట్టు ఎంఈవో సింహాచలం తెలిపారు. అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులను రప్పించి ఆ పత్రాలను జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు సాక్షి, విశాఖపట్నం: భారతీయ రైల్వే వ్యవస్థలో 18వ జోన్గా విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు సోమవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. వీఎంఆర్డీఏ డెక్ భవనంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కార్యాలయంలో జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ కార్యకలాపాలను నిరాడంబరంగా ప్రారంభించారు. రైల్వే శాఖ రూపొందించిన జోన్ అధికారిక మ్యాప్(సిస్టమ్ మ్యాప్)ని విడుదల చేశారు. దేశ రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన నెట్వర్క్గా రూపుదిద్దుకున్న ఈ జోన్.. ఏకంగా నాలుగు రాష్ట్రాల పరిధిలో విస్తరించి తన భౌగోళిక, వ్యూహాత్మక ప్రాధాన్యతను చాటుకుంది. మొత్తం 3,532 కిలోమీటర్ల సువిశాల విస్తీర్ణం(రూట్ నెట్వర్క్), 6,455 కిలోమీటర్ల భారీ రైల్వే ట్రాక్లైన్తో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక జోన్లలో ఒకటిగా అవతరించింది. పూర్తి స్థాయి జోనల్ కార్యకలాపాలు మొదలయ్యేసరికి మరో నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉందని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. భద్రతకే ప్రథమ ప్రాధాన్యం : అనంతరం జీఎం ప్రిన్సిపల్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, నాలుగు డివిజన్ల డీఆర్ఎంలతో కలిసి మొట్టమొదటి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా డివిజన్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన, భవిష్యత్తు కార్యాచరణపై అధికారులతో జీఎం సుదీర్ఘంగా చర్చించారు. కొత్త జోన్లో విలీనమవుతున్న తమ డివిజన్ల గురించి ఆయా డీఆర్ఎంలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆస్తుల నిర్వహణ, మానవ వనరుల నిర్వహణ, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలపై సమావేశంలో కూలంకషంగా చర్చించారు. ఈ సమీక్షలో విశాఖపట్నం డీఆర్ఎం లలిత్ బోహ్రా, విజయవాడ డీఆర్ఎం మోహిత్ సోనాకియా, గుంటూరు డీఆర్ఎం సుదేష్ణసేన్, గుంతకల్లు డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తాతో పాటు వివిధ శాఖల హెచ్వోడీలు, అధికారులు పాల్గొన్నారు.హెచ్పీసీఎల్ ఈడీగా అభిషేక్ త్రివేది మల్కాపురం(విశాఖ): హిందుస్థాన్ పెట్రోలి యం కార్పొరేషన్ లిమిటెడ్ విశాఖ రిఫైనరీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అభిషేక్ త్రివేది సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఈడీగా పనిచేసిన రమేష్ కృష్ణన్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో అభిషేక్ త్రివేది నియమితులయ్యారు. అభిషేక్ త్రివేదికి చమురు, సహజవాయువు రంగంలో విశేష అనుభవం ఉంది. సంస్థ కు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఆయన కు శుభాకాంక్షలు తెలిపారు.ఈఎస్ఐసీ మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు సీతంపేట(విశాఖ): ఈఎస్ఐసీ మెడికల్ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ఇన్సూర్డ్ పర్సన్స్ (ఐపీఎస్) పిల్లలకు ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎం.రామారావు ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన కార్మికుల పిల్లలు నీట్ (యూజీ)–2026 పరీక్షకు హాజరై, ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరని ఆయన పేర్కొన్నారు. అర్హత సాధించిన అభ్యర్థులు ఈఎస్ఐసీ ద్వారా జారీ చేసే ‘వార్డ్ ఆఫ్ ఇన్సూర్డ్ పర్సన్’ సర్టిఫికేట్ను కచ్చితంగా పొందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 20 ఈఎస్ఐసీ మెడికల్ కళాశాలల్లో మొత్తం 695 ఎంబీబీఎస్ సీట్లు, 28 బీడీఎస్ సీట్లు, 60 బీఎస్సీ నర్సింగ్ సీట్లను ఐపీఎస్ పిల్లల కోసం కేటాయించినట్లు వివరించారు. అర్హులైన అభ్యర్థులు ఐపీ సర్టిఫికెట్ కోసం ఈఎస్ఐసీ అధికారిక వెబ్సైట్ www.esic.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సర్టిఫికేట్ పొందిన విద్యార్థులు డీజీహెచ్ఎస్ లేదా ఎంసీసీ వెబ్సైట్ ఠీఠీఠీ. ఝఛిఛి. ుఽజీఛి. జీుఽ ద్వారా నిర్వహించే ఆన్లైన్ కౌన్సెలింగ్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. అయితే, 2025, సెప్టెంబర్ 30 నాటికి ఈఎస్ఐసీ సభ్యత్వం కలిగి ఉన్న కార్మికుల పిల్లలకు మాత్రమే ఈ ప్రవేశాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.జోన్కు సంబంధించిన వివరాలిలా..రాష్ట్రాల వారీగా రూట్/ రన్నింగ్ ట్రాక్ వివరాలివీ రాష్ట్రం రూట్ (కిమీ.లో) రన్నింగ్ ట్రాక్ (కిమీ.లో) ఆంధ్రప్రదేశ్ 3453.007 6278.686 కర్ణాటక 47.030 94.060 తెలంగాణ 25.510 75.830 తమిళనాడు 6.860 6.860 మొత్తం 3532.407 6455.436 డివిజన్ల వారీగా రూట్/రన్నింగ్ ట్రాక్ వివరాలివీ డివిజన్ రూట్ (కిమీ.లో) రన్నింగ్ ట్రాక్ (కిమీ.లో) విశాఖపట్నం 460.767 979.546 విజయవాడ 1111.114 2409.051 గుంటూరు 613.711 883.504 గుంతకల్లు 1346.815 2183.335 మొత్తం 3532.407 6455.436 నిరాడంబరంగా ప్రారంభించిన జోన్ జీఎం సందీప్ మాథుర్ జోన్ అధికారిక మ్యాప్ విడుదల 3,532 కిమీ విస్తీర్ణం.. 6,455 కిమీ రైల్వే లైన్ నాలుగు రాష్ట్రాల పరిధిలో విస్తరించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది : జీఎం సందీప్ మాథుర్ -
మెగా మోసం
మంగళవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 2026దగా డీఎస్సీ..అనర్హులకు టీచర్ పోస్టులు ఇవ్వడం దారుణం మంత్రి లోకేష్ను బర్తరఫ్ చేయాలి సీబీఐతో విచారణ జరపాలి కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున ఆందోళన న్యాయం జరగని పక్షంలో ఆందోళనలు ఉధృతం వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగం నేతల హెచ్చరికదగా డీఎస్సీపై సాగుతున్న పోరు సమర భేరిగా మార్మోగింది. నిరసన నినాదాలు దిక్కులు పిక్కటిల్లేలా ప్రతిధ్వనించాయి. అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అర్హులైన ఎస్టీ నాయక్లకు కులధ్రువీకరణ పత్రాలు జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ సాక్షి,పాడేరు:జిల్లాలోని అర్హులైన ఎస్టీ నాయక్ సామాజిక వర్గానికి నిబంధనలను ప్రకారం కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో 8,883 ఎస్టీ నాయక్ కుటుంబాలు నివసిస్తున్నాయని పేర్కొన్నారు.ఈ సామాజిక వర్గానికి చెందిన వారు అవసరమైన అన్ని ఆధారాలు, వివరాలతో తమ పరిధిలోని గ్రామ సచివాలయాల ద్వారా సంబంధిత మండల తహసీల్దార్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సచివాలయం,తహసీల్దార్స్థాయి పరిశీలన అనంతరం సబ్కలెక్టర్ తుది ఆమోదంతో ధ్రువీకరణ పత్రాలు జారీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం జూన్లో మొదట విడతలో పాఠశాల,కళాశాల విద్యార్థులు,కొత్తగా ఉద్యోగాల కోసం నమోదు చేసుకునే నిరుద్యోగులకు, జూలైలో మిగిలిన కుటుంబ సభ్యులకు కుల ధ్రువీకరణ పత్రాల పంపిణీ జారీ చేస్తామని తెలిపారు. ఎస్టీ నాయక్ సామాజిక వర్గం ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. సాక్షి,పాడేరు: టీచర్ పోస్టులను అమ్ముకుని అర్హులకు అన్యాయం చేసిన మంత్రి లోకేష్ను బర్తరఫ్ చేసి,డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగం నేతలు డిమాండ్ చేశారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ విద్యార్థి,యువజన విభాగాల ఆధ్వర్యంలో సోమవారం పాడేరు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. డీఎస్సీ నిర్వహణ, ఫలితాల విడుదల, ఉపాధ్యాయ పోస్టులకు అభ్యర్థుల ఎంపికలో అవకతకలు జరిగాయని, మెరిట్ అభ్యర్థులకు తీవ్ర నష్టంవాటిల్లిందని యువజన విభాగం నేతలు, ఉద్యోగార్థులు ఆరోపించారు. మంత్రి లోకేష్ను మంత్రి వర్గం నుంచి తొలగించాలని,డీఎస్సీలో అక్రమాలపై విచారణ చేయాలనే నినాదాలతో హోరెత్తించారు. ఆందోళన కార్యక్రమం అనంతరం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు,అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం,యువజన,విద్యార్థి విభాగం నేతలు కలెక్టర్ నిశాంతిని కలిపి డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య,జిల్లా అధ్యక్షుడు గబ్బాడ శేఖర్,విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు లోచలి వరప్రసాద్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి నాగభూషణం.వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కూడా సురేష్కుమార్, జిల్లా నేతలు శెట్టి అప్పాలు,కమ్మిడి అశోక్,గండేరు చినసత్యం,కూడా సుబ్రహ్మణ్యం,గొడ్డేటి మహేష్,సందాడి కొండబాబు, పల్టాసింగి విజయ్కుమార్,అరకులోయ ఎంపీటీసీ దురియా ఆనంద్కుమార్, మాజీ వైస్ ఎంపీపీ కుడుముల సత్యనారాయణ, మాజీ సర్పంచ్ సీదరి సాంబ,యువజన,విద్యార్థి విభాగం రాష్ట్ర,జిల్లా నాయ కులు అచ్యుత్, సాగర్,యేషన్, వీరన్నపడాల్, అన్ని మండలాల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.కలెక్టరేట్లో పాడేరు,అరకులోయ ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు,రేగం మత్స్యలింగం,యువజన,విద్యార్థి విభాగం నాయకులుకలెక్టర్కు వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు,రేగం మత్స్యలింగం,యువజన,విద్యార్థి విభాగం నాయకులుబుడతలవేనం రహదారిని బాగుచేయాలి 6 నుంచి ఇంటర్మీడియెట్ తరగతులు జి.మాడుగుల: గురుకుల కళాశాలలో ప్రవేశాలు పొందిన ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఈనెల 6వ తేదీ నుంచి తరగతులు నిర్వహించనున్నట్టు గురుకుల కన్వీనర్ యండమూరి పారయ్య తెలిపారు. ముందుగా ఈనెల 1న హాజరుకావాలని తెలియజేసినప్పటికీ ఇంటర్మీయెట్ బోర్డు ఆదేశానుసారం 6న కళాశాలలు పునఃప్రారంభమవుతాయన్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులతో పాటు ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఆరోజు నుంచే హాజరుకావాలని ఆయన సూచించారు.నిరుద్యోగుల జీవితాలతో ఆటలా చంద్రబాబు ప్రభుత్వం డీఎస్సీలో అవినీతి అక్రమాలకు పాల్పడి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడింది.రూ.15 లక్షల నుంచి రూ.20లక్షలకు టీచర్ పోస్టులు అమ్ముకున్న మంత్రి లోకేష్పై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు మంత్రి పదవి నుంచి వెంటనే తొలగించాలి.అన్యాయానికి గురైన నిరుద్యోగులకు ఉపాధ్యాయ పోస్టులిచ్చి న్యాయం చేయాలి. – గబ్బాడ శేఖర్, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ యువజన విభాగం అర్హులకు అన్యాయం చంద్రబాబు ప్రభుత్వం డీఎస్సీలో అక్రమాలకు పాల్పడి అర్హులైన వారికి అన్యాయం చేసింది.మెగా డీఎస్సీలో టీచర్ పోస్టులను అమ్ముకున్న కూటమి ప్రభుత్వం,మంత్రి నారా లోకేష్లపై సీబీఐతో విచారణ జరపాలి.గిరిజన ప్రాంతాల్లోని టీచర్ పోస్టులను అమ్ముకున్నారనే ఆందోళన కూడా గిరిజన అభ్యర్థుల్లో నెలకొంది. – లోచలి వరప్రసాద్, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగంవిచారణ జరపాలి ఉపాధ్యాయ పోస్టులను అమ్ముకున్న చంద్రబాబు ప్రభుత్వం,మంత్రి లోకేష్ అక్రమాలపై వెంటనే న్యాయ విచారణ జరపాలి.స్పోర్ట్స్తో పాటు పలు కోటాల కింద అనర్హులకు ఉపాధ్యాయ పోస్టులను రూ.లక్షల్లో అమ్ముకోవడం అన్యాయం.డీఎస్సీలో అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి. లోకేష్ను మంత్రి పదవి నుంచి తొలగించే వరకు తమ పోరాటం కొనసాగుతుంది. – మజ్జి నాగభూషణం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం -
జిల్లాకు 9,800 క్వింటాళ్ల వరి విత్తనాలు
● 90 శాతం సబ్సిడీపై పంపిణీకి ఏర్పాట్లు ● జిల్లా వ్యవసాయాధికారి నందు సాక్షి,పాడేరు: జిల్లాకు 9,800 క్వింటాళ్ల వరి విత్తనాలను ప్రభుత్వం కేటాయించిందని,ఇప్పటి వరకు 3,352 క్వింటాళ్ల విత్తనాలను తొలి విడతలో అందుబాటులోకి తెచ్చామని జిల్లా వ్యవసాయాధికారి ఎస్.బి.ఎస్.నందు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.‘గిరి రైతుకు విత్తన కష్టం’ శీర్షికన సాక్షి దినపత్రికలో ప్రచురించిన కథనానికి ఆయన స్పందించారు.ఈ ఏడాది కూడా 90శాతం సబ్సిడీపై గిరిజన రైతులకు విత్తనాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. 2026 ఖరీఫ్ సీజన్కు సంబంధించి మార్చి నెలలోనే జిల్లాకు 13,000 క్వింటాళ్ల విత్తనాలు కేటాయించాలని వ్యవసాయశాఖ డైరెక్టర్కు కలెక్టర్ లేఖ పంపారని ఆయన తెలిపారు.సాధారణ సాగుకు సంబంధించి 48శాతం విస్తీర్ణంలోని వ్యవసాయ భూములకు విత్తనాలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.మిగిలిన విస్తీర్ణంలోని భూములకు కొంత వరకు రైతులు ప్రైవేట్ డీలర్ల వద్ద విత్తనాలను కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. 2022 నుంచి జిల్లాలో 90శాతం సబ్సిడీ విత్తనాల పంపిణీ కార్యక్రమం జరుగుతోందని, ఈఏడాది కూడా సబ్సిడీ విత్తనాలను గిరిజన రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
పెట్రోల్, డీజిల్.. నోస్టాక్
ముంచంగిపుట్టు :మండలంలో పెట్రోల్,డీజిల్ లేకపోవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.గత కొన్ని రోజులుగా డీజిల్,పెట్రోల్ అరకొరగా ఉండేది.సోమవారం మండలంలోని లుంగాపుట్టు,దశరిపుట్టు, బాపన్నపుట్టు గ్రామాల వద్ద ఉన్న మూడు బంకుల వద్ద పెట్రోల్,డీజిల్ పూర్తిగా లేకుండా పోయింది.దీంతో బంక్లకు వెళ్లిన వాహనదారులు చేసేదిలేక ఇంటి బాట పడుతున్నారు.ప్రయాణాల్లో ఉండే వాహనదారుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది.మూడు పెట్రోల్ బంకుల వద్ద ప్రసుత్తం డీజిల్,పెట్రోల్ లేదంటూ బోర్డులు పెట్టారు. దీంతో అత్యవసర పనులు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ప్రభుత్వం,అధికారులు స్పందించి పెట్రోల్,డీజిల్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. -
డీఎస్సీలో అక్రమాలపై పోరాటం ఉధృతం
ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరాజు,మత్స్యలింగం మాట్లాడుతున్న పాడేరు, అరకులోయ ఎమ్మెల్యేలు సాక్షి,పాడేరు: మెగా డీఎస్సీ పేరుతో టీచర్ పోస్టులను రూ.లక్షలకు అమ్ముకుని అవినీతి,అక్రమాలకు పాల్పడిన మంత్రి లోకేష్,ఇతర బాధ్యులపై సీబీఐతో విచారణ జరిపించాలని పాడేరు,అరకులోయ ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు(వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు),రేగం మత్స్యలింగంలు డిమాండ్ చేశారు.సోమవారం వారు ‘సాక్షి’తో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అర్హులైన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. మెగా డీఎస్సీలో అక్రమాలు వెలుగు చూస్తుంటే సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్,ఇతర ప్రభుత్వ పెద్దలు సమర్ధించుకోవడం దారుణమన్నారు.టీచర్ పోస్టులను అమ్ముకున్న లోకేష్ను మంత్రి పదవి నుంచి తొలగించి సమగ్ర విచారణ జరిపేంత వరకు వైఎస్సార్సీపీ పోరాటం ఉధృతం చేస్తుందని చెప్పారు. అన్యాయానికి గురైన అభ్యర్థుల పక్షాన న్యాయ పోరాటం చేస్తామన్నారు. సమస్య కలెక్టర్కు పట్టదా... రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ టీచర్ పోస్టుల భర్తీలో అవినీతి అక్రమాలు జరిగాయని,న్యాయ విచారణ జరపాలని కలెక్టర్ నిశాంతికి వినతిపత్రం అందిస్తే సరిగా స్పందించకపోవడం అన్యాయమని ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు.డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సమగ్రంగా వివరించాలని తాము ప్రయత్నిస్తుండగా పట్టించుకోకుండా కలెక్టర్ చాంబర్లోకి వెళ్లిపోయారన్నారు. గిరిజన ఎమ్మెల్యేలంటే కలెక్టర్కు చిన్నచూపు తగదన్నారు.సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే అన్ని వర్గాల ప్రజలు,ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్తో పాటు అధికారులకు ఉందని వారు చెప్పారు. -
విమ్స్ డైరెక్టర్గా డాక్టర్ మన్మథరావు బాధ్యతల స్వీకరణ
ఆరిలోవ(విశాఖ): విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్) నూతన డైరెక్టర్గా డాక్టర్ వి. మన్మథరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డైరెక్టర్గా విధులు నిర్వహించిన డాక్టర్ కె.రాంబాబును తిరిగి కేజీహెచ్లోని తన విభాగానికి బదిలీ చేయగా, ఆయన స్థానంలో కేజీహెచ్ సర్జరీ విభాగాధిపతిగా పనిచేస్తున్న డాక్టర్ మన్మథరావును ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం విమ్స్ పరిపాలనాధికారులు, వైద్యులు, సిబ్బంది డాక్టర్ మన్మథరావుకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విమ్స్ను మరింత అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. విమ్స్ అభివృద్ధికి సంబంధించి మాజీ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు ఇప్పటికే ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్న ఆయన, వాటి అమలుకు ప్రత్యేకంగా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ మనోజ్, డాక్టర్ శిరీషతో పాటు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సామాజిక పింఛన్ల పంపిణీ
పాడేరు పాతబస్టాండ్ వద్ద సామాజిక పింఛన్ సొమ్మును పంపిణీ చేస్తున్న కలెక్టర్ నిశాంతి సాక్షి,పాడేరు: ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీని కలెక్టర్ టి.నిశాంతి సోమవారం పాడేరు పాతబస్టాండ్లో ప్రారంభించారు.పలువురు పింఛన్దారులకు జూన్ నెలకు సంబంధించిన పింఛన్ సొమ్మును కలెక్టర్ అందజేశారు.ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ మురళీ,మాజీ ఉప సర్పంచ్ బూరెడ్డి రామునాయుడు,సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లాలోని 11 మండలాల్లో తొలిరోజు సాయంత్రం నాటికి 90.2శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేశాఈమని డీఆర్డీఏ పీడీ మురళీ తెలిపారు. -
ప్రకృతి ఒడిలోపర్యాటకుల సందడి
డుంబ్రిగుడ: మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలైన చాపరాయి జలపాతం, అరకు ఫైనరీ వద్ద ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. గత మూడు వారాలుగా ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో మైదాన ప్రాంత వాసులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు చల్లదనం కోసం ఏజెన్సీ బాట పట్టారు. ఈ క్రమంలో పర్యాటకులంతా చాపరాయి జలపాతంలో స్నానాలు చేస్తూ, ఎత్తయిన పైన్ చెట్ల నీడన సేదతీరుతూ ఆహ్లాదంగా గడిపారు. మరికొందరు పర్యాటకులు గిరిజన సంప్రదాయ వస్త్రాలను ధరించి, స్థానిక గిరిజనులతో కలిసి ఉత్సాహంగా థింసా నృత్యాలు చేస్తూ ఫొటోలు దిగారు. వేసవితాపం నుంచి ఉపశమనం పొందేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఈ పర్యాటక ప్రాంతాలన్నీ సందడిగా మారాయి. -
కళ్ల ముందే కబ్జా
తగరపువలస: భీమిలి మండలం తాళ్లవలస పంచాయతీ పరిధిలోని చిన్నిపేట సర్వే నంబర్ 67లో ఉన్న సుమారు 18 సెంట్ల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.కోటి విలువైన ఈ స్థలాన్ని మూడు రోజులుగా జేసీబీతో చదును చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు వీఆర్వో దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని, పైగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గతంలో ఇదే ప్రభుత్వ భూమిలో దళిత కుటుంబాలు నివాసాల కోసం పాకలు వేసుకునేందుకు ప్రయత్నించగా స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమైందని గ్రామస్తులు గుర్తుచేస్తున్నారు. అనంతరం అక్కడ సాయిబాబా ఆలయం, సామాజిక భవనాలు నిర్మించారని, ఆలయ పూజారి పేరుతో నిర్మించిన ఇంటిని ప్రస్తుతం ఇతరులకు అద్దెకు ఇచ్చినట్లు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మిగిలిన భూమిని వాటాలుగా పంచుకునేందుకు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఇదే ప్రాంతంలో రజక సామాజిక వర్గానికి చెందిన ఓ పేద మహిళ ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నప్పటికీ, ఆమెకు 60 గజాల స్థలం కేటాయించడంలో మాత్రం అధికారులు ముందుకు రావడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ వ్యవహారంపై వీఆర్వో రిజ్వాన్ను వివరణ కోరగా.. ఫెన్సింగ్ విషయం తన దృష్టికి రాలేదని తెలిపారు. వీఆర్ఏను పంపించి స్థలాన్ని పరిశీలించి, నివేదికను భీమిలి తహసీల్దార్కు అందజేస్తానని చెప్పారు. వీఆర్వోకు తెలియదట..! -
హోంగార్డుపై దాడి కేసులో నలుగురికి రిమాండ్
పరవాడ: లంకెలపాలెం మరిడిమాంబ ఆలయం వద్ద మే 29న రాత్రి గస్తీ విధుల్లో ఉన్న హోంగార్డుపై దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించినట్లు పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలిపారు. రిమాండ్కు తరలించిన నిందితుల్లో రాజ్సింగ్(కాకినాడ), అనిల్సింగ్(పీఎం పాలెం), సిరసపల్లికి చెందిన రాజ్కుమార్సింగ్, జితేంద్రసింగ్లు ఉన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దాడి ఘటన వివరాలను సీఐ వెల్లడించారు. ఆ రోజు రాత్రి 11.45 గంటల సమయంలో పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న కె.వెంకటరావు, కానిస్టేబుల్ జి.భాస్కరరావు ఇరువురూ కలిసి లంకెలపాలెం మరిడిమాంబ ఆలయం వద్ద పాన్షాపుల వద్ద రాత్రి గస్తీలో ఉన్నారు. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు ఇన్నోవా కారులో వచ్చి అక్కడ ఆగారు. రోడ్డుపై ఆపిన కారు ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తుందన్న ఉద్దేశంతో విధి నిర్వహణలో భాగంగా హోంగార్డు వెంకటరావు కారు ఫోటో తీసి వారిని అక్కడి నుంచి వెళ్లాలని కోరారు. నిందితులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాజ్సింగ్ తన కారులో ఉన్న కత్తితో హోంగార్డు వెంకటరావుపై దాడి చేసి తల, చేయిపై నరికాడు. ఈ దాడిలో హోంగార్డు తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. అగనంపూడి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. హోంగార్డు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన నలుగురిని మే 30న లంకెలపాలెం ఐవోసీ పెట్రోల్ బంకు వద్ద అరెస్టు చేసి అనకాపల్లి న్యాయస్థానంలో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారని సీఐ తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 9.30 నుంచి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉభయ దాతలకు కల్యాణ అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రంలను అందించారు. ఘనంగా గరుడసేవ : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి గరుడసేవ ఘనంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వెండి గరుడవాహనంపై స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వేంజేపచేశారు. అష్టోత్తర శతనామావళి పూజ శాస్త్రోక్తంగా జరిపారు. విశేష హారతులు అందజేశారు. -
నేడు రైల్వే జోన్ సాకారం
నాడు వైఎస్సార్సీపీ పోరాటం.. సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల ఆకాంక్ష విశాఖ రైల్వే జోన్.. అది కేవలం ఒక కార్యాలయం కాదు. ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. రాష్ట్ర విభజన తర్వాత తీవ్రంగా నష్టపోయిన నవ్యాంధ్రకు విభజన చట్టం కల్పించిన ఒకే ఒక్క ఊరట రైల్వే జోన్. కానీ, చంద్రబాబు ప్రభుత్వ ప్యాకేజీ దాసోహం.. స్వార్థ రాజకీయాల మధ్య ఆ ఆశల దీపం కొడిగట్టిపోయిన వేళ.. పట్టువదలని విక్రమార్కుడిలా వైఎస్సార్సీపీ చేసిన రాజీలేని పోరాటమే ఇన్నాళ్లకు ఆ కలను సాకారం చేసింది. అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీ ఏ స్వలాభం కోసం ఢిల్లీ పెద్దల ముందు సాగిలపడితే.. ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ మాత్రం ప్రజల పక్షాన నిలబడి అలుపెరగని ఉద్యమం చేసింది. లాఠీ దెబ్బలు తిన్నా, అక్రమ కేసులు బనాయించినా వెనక్కి తగ్గకుండా కేంద్రం మెడలు వంచి ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’ను సాధించిన ఆ పోరాట ప్రస్థానం ఉత్తరాంధ్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది. ప్రజాక్షేత్రంలో వైఎస్సార్సీపీ గర్జన అధికారంలో ఉన్న టీడీపీ.. జోన్ ఊసెత్తకపోయినా.. వైఎస్సార్సీపీ మాత్రం ప్రతిపక్ష హోదాలో ప్రజల గొంతుకగా మారింది. అప్పటి ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో జోన్ సాధనే లక్ష్యంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ఊరు, వాడల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టాయి. అందులో భాగంగా 2016 మార్చిలో విశాఖలోని డీఆర్ఎం కార్యాలయాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు దిగ్బంధించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కళ్లు తెరిపించేలా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వినతిపత్రాలు సమర్పించాయి. అయినా పాలకుల్లో చలనం లేకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశాయి. ఆమరణ దీక్షలు.. నిరసన ప్రదర్శనలు! జోన్ ఆవశ్యకతను ఢిల్లీకి వినిపించేలా 2016 ఏప్రిల్ 14న అప్పటి వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ప్రజల నుంచి ఈ దీక్షకు అనూహ్య స్పందన లభించినా.. అప్పటి టీడీపీ ప్రభుత్వం మాత్రం దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసి.. అక్రమ కేసులు బనాయించింది. ఇటీవలే ఆ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. అక్కడితో ఆగకుండా.. గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఎప్పుడు కుదిరితే అప్పుడు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. 2018 ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో విశాఖ జోన్కు మొండిచేయి చూపడంతో వైఎస్సార్సీపీ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బడ్జెట్ ప్రసంగం ముగిసిన కొద్ది గంటల్లోనే విశాఖ వీధుల్లోకి వచ్చిన పార్టీ శ్రేణులు భారీ నిరసన ర్యాలీలు, సభలు నిర్వహించి కేంద్రం తీరును ఎండగట్టాయి. ‘రైల్ రోకో’తో ఉద్యమం తీవ్రస్థాయికి.! ఉద్యమంలో అత్యంత కీలకమైన ఘట్టం 2018 ఏప్రిల్ 11 నాటి ‘రైల్ రోకో’. కేంద్రం హామీని తుంగలో తొక్కడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఏకంగా విశాఖ రైల్వేస్టేషన్లోకి చొచ్చుకెళ్లి రైళ్ల రాకపోకలను స్తంభింపజేశారు. ట్రాక్ల మీద బైఠాయించి నిరసన తెలిపారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్సీపీ శ్రేణుల పోరాటాల్ని అణిచివేసేందుకు పోలీసులను ప్రయోగించింది. లాఠీ చార్జీలు చేయించింది. ఆందోళనకారులపై అక్రమ కేసులు బనాయించింది. అయినప్పటికీ వైఎస్సార్సీపీ నేతలు వెనక్కి తగ్గలేదు. జోన్ సాధించే వరకు విశ్రమించబోమని మరింత గట్టిగా నినదించారు. ఈ రైల్ రోకో ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పోరాటానికి తలొగ్గిన కేంద్రం..! రైల్వే జోన్ పోరాటాన్ని చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో అణిచివేస్తున్నా.. కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నా.. వైఎస్సార్సీపీ, వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు ఏకతాటిపైకి వచ్చి చేసిన ఈ నిరంతర పోరాటం ఎట్టకేలకు ఫలించింది. విశాఖ వీధుల్లో రగిలిన ఈ ఉద్యమ సెగ ఢిల్లీకి చేరింది. ఎట్టకేలకు వైఎస్సార్సీపీ చేసిన ప్రజా పోరాటానికి తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం.. 2019 ఎన్నికల ముందు విశాఖ కేంద్రంగా ‘సౌత్ కోస్ట్ రైల్వే జోన్’ ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. పోరాటం చేయాల్సిన అధికార టీడీపీ రాజీపడినా.. స్వప్రయోజనాల కోసం మౌనం వహించినా.. ‘పవర్’లో లేకపోయినా.. అలుపెరగని పోరాటం చేస్తే.. దశాబ్దాల కలను కూడా ఎలా సాధించవచ్చో వైఎస్సార్సీపీ నిరూపించింది. ఈ రోజు విశాఖ రైల్వే జోన్ సాకారమైందంటే.. అది ప్రస్తుత పాలకుల వల్ల కాదు.. వైఎస్సార్సీపీ, వామపక్ష నాయకులు, కార్యకర్తలకు రోడ్ల మీద పడ్డ లాఠీ దెబ్బలు, ఎదుర్కొన్న కేసుల ఫలితమే అని దక్షిణ కోస్తా రైల్వే జోన్ చరిత్ర ఎప్పటికీ చెబుతూనే ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. -
కనులపండువగా తిరువీధి ఊరేగింపు
జి.మాడుగుల: మండలంలోని గాంధీనగర్ కై లాసగిరి క్షేత్ర ఆవరణలో వెలిసిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ నాల్గువ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. భీమిలి సద్గురు సేవాశ్రమం, శ్రీహనుమ సేవాశ్రమం సాయిరాం స్వామీజీ (యోగరాజు) ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పంచముఖ ఆంజనేయ స్వామి పల్లకీ తిరువీధి ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు ఆలయంలో జల, క్షీర, పంచామృతాభిషేకాలు, సహస్రనామ పూజలు, రామనామ సంకీర్తన, శ్రీహనుమ, రామ భజనలు నిర్వహించారు. అలాగే భక్తి గాన సుధ, సర్వదేవతా రాగసుధ, శృతిలయ భజన వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కై లాసగిరి క్షేత్రం మారుమోగింది. ఆకట్టుకున్న వేషధారణలు..కోలాటం వివిధ మండలాల నుంచి తరలివచ్చిన భజన బృందాల కోలాటం, తప్పెటగుళ్ల ప్రదర్శనలు భక్తిరసాన్ని పంచాయి. గాంధీనగర్లోని ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ తిరువీధి యాత్ర పురవీధుల గుండా రామాలయం, పాకలపాటి గురుదేవుల ఆలయం వరకు సాగింది. ఊరేగింపులో చిన్నారులు వేసిన శ్రీరామ, లక్ష్మణ, ఆంజనేయ స్వాముల వేషధారణలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వార్షికోత్సవ వేడుకలకు విచ్చేసిన భక్తులకు సాయిరాం స్వామీజీ పలు పూజా వస్తువులను పంపిణీ చేశారు. అనంతరం భక్తులకు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ జరిగింది. ప్రముఖుల హాజరు ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో మాజీ మంత్రి మత్స్యరాస బాలరాజు, శ్రీ పాకలపాటి గురుదేవుల భక్తుల సంఘం అధ్యక్షుడు మత్స్యరాస మత్స్యరాజు, సర్పంచ్ కిముడు రాంబాబు పాల్గొన్నారు. వారితో పాటు సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా పరియోజన ప్రముఖ్ ఎం. మత్స్యరాజు, శ్రీ షిరిడీ సాయి ఆలయ ధర్మకర్త కిముడు వెంకటరమణ, విశ్వహిందూ పరిషత్ జిల్లా ధర్మప్రచార ప్రముఖ్ రీమలి అప్పలరాజు, వార్షికోత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు నీలకంఠం, రామానందం, భీమశంకర్ నాయుడు, ఎ. శ్రీను, భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఘనంగా పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవం భక్తి రసాన్ని పంచిన సాంస్కృతిక ప్రదర్శనలు కై లాసగిరిపై ఆధ్యాత్మిక సందడి -
ఎలుగుబంటి పట్ల అప్రమత్తత అవసరం
ముంచంగిపుట్టు: ఎలుగుబంటి సంచరించే ప్రాంతాల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పాడేరు డివిజన్ ఫారెస్టు అధికారి కె.ఉమామహేశ్వరి సూచించారు. మండలంలోని పనససుట్టు,బరడ , జోలాపుట్టు పంచాయతీల్లోని కడుతుల, ధూలిపుట్టు, పొలిపుట్టు, మొంజాపుట్టు, బొండ్రుగూడ గ్రామాల్లో ఆదివారం అటవీశాఖ అధికారులు పర్యటించారు. ఎలుగుబంటి సంచరించే ప్రదేశాలపై ఆరా తీశారు. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవహగాన కల్పించారు. మామిడి, జీడి, పనస పంటల సీజన్ కావడంతో ఎలుగుబంటి జన సంచారంలోకి వచ్చిందని, రాత్రి, ఉదయం వేళల్లో బయటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా పాడేరు డివిజన్ ఫారెస్టు అధికారి ఉమామహేశ్వరి మాట్లాడుతూ ఎలుగుబంటి సంచరించిన కొండ, అటవీ ప్రాంతాలకు వెళ్లకూడదన్నారు. గ్రామాల్లో పనస, మామిడి, జీడి పండ్లు ఇంటి బయట ఉంచకూడదన్నారు. ఎక్కువ మంది కలిసి మాత్రమే బయటకు వెళ్లాలన్నారు. ఎలుగబంటి కనిపిస్తే రెండు చేతులుపైకి ఎత్తి గట్టిగా అరుస్తూ వెనక్కి వెళ్లాలని, వీలైనంత వరకు గుంపులుగా ప్రజలు తిరగాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ముంచంగిపుట్టు ఫారెస్టు రేంజర్ ఎం.మురళీకృష్ణ, ఫారెస్టు అధికారులు శ్రీను, రామారావు తదితరులు పాల్గొన్నారు. పాడేరు డివిజన్ ఫారెస్టు అధికారి ఉమామహేశ్వరి కడుతుల, ధూలిపుట్టు, పొలిపుట్టు, మొంజాపుట్టు, బొండ్రుగూడ గ్రామాల్లో పర్యటన -
అంబరాన్నంటిన సత్తెమ్మతల్లి పండగ
సింహాచలం: అడవివరం గ్రామ పొలిమేర దేవత సత్తెమ్మ(మరిడమ్మ) పండగ మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. దుష్ట శక్తులు గ్రామంలోకి రాకుండా గ్రామ పొలిమేరలో కాపలా కాచే దేవతగా విరాజిల్లుతున్న సత్తెమ్మకు రెండేళ్లకోసారి నిర్వహించే ఈ పండగను ఈ ఏడాది కూడా అత్యంత ఘనంగా నిర్వహించారు. తన అక్కచెల్లెళ్ల వద్దకు పొలిమేర నుంచి గ్రామంలోకి విచ్చేసిన సత్తెమ్మని మళ్లీ పొలిమేరకు సాగనంపే కార్యక్రమాన్ని గ్రామస్తులు సందడిగా నిర్వహించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన గ్రామస్తులు, మహిళలతో అడవివరం నుంచి శ్రీనివాసనగర్ సమీపంలో ఉన్న సత్తెమ్మ ఆలయం వరకు ఉన్న రెండు కిలోమీటర్ల ప్రధాన రహదారి భక్తజన జాతరగా మారింది. మిట్ట మధ్యాహ్నం మండుటెండను సైతం లెక్క చేయకుండా గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అడవివరంలోని గాంధీనగర్లో ఉన్న పైడితల్లి అమ్మవారి సతకంపట్టు వద్దకు గ్రామస్తులు, మహిళలు పసుపు కుంకుమలు, చీరలు, అమృత కలశాలతో చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అమ్మవారి చెక్కబొమ్మను పూజారి వంశీయులు శిరస్సుపై పెట్టుకుని బయలుదేరారు. దుష్ట శక్తులు అమ్మవారిని వెనక్కు నెట్టకుండా కర్రలు, ఈటెలతో వలయాన్ని ఏర్పాటు చేస్తూ గ్రామస్తులు, పసుపు, కుంకుమలు, చీరలను శిరస్సుపై పెట్టుకుని మహిళలు అమ్మవారిని అనుసరించారు. దారిపొడవునా గ్రామస్తులు తమ ఇళ్ల ముందు పసుపు నీళ్లతో సత్తెమ్మ చెక్కబొమ్మకు అభిషేకాలు చేశారు. పాత గోశాల సమీపంలో ఉన్న పొలిమేర వద్దకు రాగానే సత్తెమ్మను మూడు సార్లు ప్రదక్షిణ చేయించారు. అమ్మవారి వెనుకే భక్తులు, మహిళలు ప్రదక్షిణ చేశారు. అక్కడి నుంచి అమ్మవారిని తీసుకెళ్లి గ్రామ పొలిమేరలో ఉన్న ఆలయంలో అధిష్టింపజేశారు. అమ్మవారి పూజారి వంశీయుడు లండ వెంకటరమణ, ఆలయ గౌరవాధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, అధ్యక్షుడు పి.వెంకటరావు ఏర్పాట్లు చేశారు. కర్రి అప్పలస్వామి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కర్రి అప్పలస్వామి దారిపొడవునా భక్తులకు మంచినీరు, కూల్ డ్రింక్స్ అందజేశారు. -
ఏపీపీటీఏ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్గా శ్రీనివాస్
కశింకోట: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (ఏపీపీటీఏ) రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్గా కశింకోటకు చెందిన కొత్తపల్లి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండేళ్ల పదవీ కాలానికి గాను సంఘం ఎన్నికలు విజయవాడలో జరిగాయి. తనపై నమ్మకంతో ఉన్నత బాధ్యతను అప్పగించినందుకు ఆయన కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం మరింత శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.జిల్లా సంఘంలో పలు పదవులు నిర్వహిస్తూ ఉపాధ్యాయుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్కు తాజాగా ఉన్నత పదవి లభించడం పట్ల ఏపీపీటీఏ అనకాపల్లి జిల్లా శాఖ అధ్యక్షుడు బోయిన చిన్నారావు, ప్రధాన కార్యదర్శి చల్లా నాగేశ్వరావు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
వైఎస్సార్సీపీ బీఎల్ఏలకు సర్పై రేపు అవగాహన సదస్సు
● ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు. పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు పాడేరు : వైఎస్సార్సీపీ అదిష్టానం ఆదేశాల మేరకు ఈనెల రెండో తేదీన పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ బూత్ లెవెల్ ఏజెంట్లకు సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని మండలాల బూత్ లెవెల్ ఏజెంట్లు, పార్టీ మండల అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీలో వివిధ పదవుల్లో ఉన్న నాయకులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన కోరారు. -
వైఎస్సార్సీపీ మహిళా విభాగం సమావేశానికి జిల్లా నేతల హాజరు
పాడేరు : తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి, పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పార్టీ రాష్ట్ర మహిళా విభాగం సమావేశానికి జిల్లాకు చెందిన మహిళా నేతలు హాజరయ్యారు. రెండేళ్ల చంద్రబాబు పాలనలో మహిళలకు వెన్నుపోటుపై నిర్వహించిన సదస్సులో ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్, వైఎస్సార్సీపీ మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు జల్లిపల్లి సుభద్ర, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షురాలు, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, పాడేరు, అరకు నియోజకవర్గాల మహిళా విభాగం అధ్యక్షులు కిలో ఊర్వశిరాణి, సమిడ వెంకటపూర్ణిమ, జిల్లా మహిళా విభాగం నేతలు లకే రామసత్యవతి, గంజాయి సూర్యకళ, గంజాయి సుశీల, కె. సింహాచలం తదితర మహిళ నేతలు పాల్గొన్నారు. -
ముగిసిన జిల్లా ఔత్సాహిక క్రికెటర్ల శిక్షణ
మాట్లాడుతున్న జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు విశాఖ స్పోర్ట్స్ : జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి క్రికెట్ శిక్షణా శిబిరాలు ఆదివారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమం వైఎస్సార్ స్టేడియంలో నిర్వహించారు. జిల్లాలోని వైఎస్సార్ స్టేడియం, స్టీల్ప్లాంట్ స్టేడియం, జింక్ గ్రౌండ్, ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం వేదికలుగా శిబిరాలు నిర్వహించారు. అండర్–10 నుంచి అండర్–16 వరకు బాలురతో పాటు 50 మంది బాలికలు శిక్షణ పొందారు. శిబిరాల్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో నైపుణ్యాలను మెరుగుపరుచుకునేలా కోచ్లు శిక్షణ అందించారు. ముగింపు సందర్భంగా శిక్షణార్థుల మధ్య పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన అండర్–14, అండర్–16 క్రీడాకారులను ‘ప్రాబబుల్స్’గా ఎంపిక చేసి, భవిష్యత్తులో జిల్లా జట్ల ఎంపికలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడు జి.ఎస్. వర్మ, కార్యదర్శి పార్థసారథి, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
దేవస్థానంలో ఉద్యోగంభగవంతుడి వరం
సింహాచలం: దేవస్థానంలో ఉద్యోగం చేయడం భగవంతుడు ఇచ్చిన వరంలా భావించాలని సింహాచలం దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు తెలిపారు. దేవస్థానంలో 42 ఏళ్లపాటు బార్బర్గా పనిచేసి ఆదివారం ఉద్యోగ విరమణ చేసిన అడివివరపు కృష్ణ దంపతులను ఘనంగా సత్కరించారు. సింహగిరిపై కల్యాణమండపంలో జరిగిన కార్యక్రమంలో కృష్ణ దంపతులకు స్వామివారి చిత్రపటం, పుష్పగుచ్ఛం అందించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దేవస్థానంలో ఉద్యోగం రావడం ఒక వరమని, భగవంతుడికి, భక్తులకు అంకితభావంతో సేవలందించాలని ఉద్యోగులకు సూచించారు. 42 ఏళ్లపాటు స్వామి సేవలో తరించిన కృష్ణ అదృష్టవంతుడని కొనియాడారు. కార్యక్రమంలో దేవస్థానం ఏఈవో పిల్లా శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ జీవీవీఎస్కే ప్రసాద్, పీఆర్వో అప్పలనాయుడు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
పర్యాటక ప్రాంతాలు కిటకిట
రుషికొండ బీచ్లో పర్యాటకుల తాకిడి కొమ్మాది: ఉదయం నుండి సాయంత్రం వరకు భానుడి ప్రతాపానికి నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. ఉక్కపోతతలో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.దీంతో నగరవాసులందరూ సాయంత్రం అయ్యే సరికి సాగరతీరాన్ని ఆశ్రయించారు. పర్యాటక ప్రాంతాల్లో సందడి కనిపించింది. రుషికొండ బీచ్కు పెద్ద ఎత్తున పర్యాటకులు చేరుకున్నారు. బీచ్లో స్నానాలు చేస్తూ ఉపశమనం పొందారు. సమీపంలో ఉన్న చిల్డ్రన్స్ పార్కులో చిన్నారులు ఆటపాటలతో గడిపారు. అదే విధంగా గుడ్లవానిపాలెం బీచ్, సాగర్నగర్ బీచ్, తొట్లకొండ బీచ్, రామానాయుడు ఫిల్మిం స్టూడియో, ఎర్రమట్టి దిబ్బలు, భీమిలి బీచ్, మంగమారిపేట బీచ్ ప్రాంతాల్లో పర్యాటకుల సందడి నెలకొంది. చిన్నారులు, పెద్దలు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిపారు. -
పండగకు వస్తానని.. తిరిగిరాని లోకాలకు
● ఎండాడ వద్ద రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి ● మృతుడు దేవరాపల్లి మండలం పెదనందిపల్లి వాసి దేవరాపల్లి/కొమ్మాది: పండగకు ఆదివారం వస్తానని చెప్పి...భార్య, పిల్లల్ని చీడికాడ మండలం మంచాలలోని ఆమె పుట్టింటికి శనివారం పంపించాడు. గంటల వ్యవధిలోనే జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆదివారం తెల్లవార జామున భర్త మరణ వార్తను ఫోన్ ద్వారా తెలుసుకున్న భార్య ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి. దేవరాపల్లి మండలం పెదనందిపల్లి శివారు సత్యనారాయణపురం కాలనీకి చెందిన పెనుగంటి నరసింహమూర్తి (34) ఆటో నడుపుకొంటూ జీవిస్తున్నాడు.విశాఖలోని ఎండాడ సమీపంలోని ఓ వ్యక్తికి సంబంధించిన ఫర్నిచర్ను ఆటోలో ఎక్కించుకుని శనివారం రాత్రి బయలుదేరాడు. అదే సమయంలో కాశీ వెళ్తున్న కొందర్ని అదే ఆటోలో ఎక్కించుకుని రైల్వే స్టేషన్లో దించాడు. అక్కడి నుంచి ఆదివారం వేకువజామున 3.30 గంటల ప్రాంతంలో ఎండాడ వెళ్తుండగా ఎండాడ జంక్షన్ వద్ద సిరిగుడినగర్ వెళ్లేందుకు ఆటో యూటర్న్ తీసుకుంటుండగా.. పీఎంపాలెం వైపు నుంచి వేగంగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై పడిన నరసింహమూర్తి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతనికి భార్య మహేశ్వరి, కుమార్తె గుణశ్రీ, కుమారుడు ఉదయ్కిరణ్ ఉన్నారు. నర్సింహమూర్తి మృతితో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. పండగకు వస్తానని మమ్మల్ని పంపించి, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయవంటూ భార్య కన్నీరు మున్నీరుగా విలపించింది. పిల్లలను ఎలా పోషించాలంటూ ఆమె రోదించిన తీరు స్థానికులను కలిచివేసింది. స్వగ్రామంలో ఆదివారం కుటంబ సభ్యులు, బంధువుల ఆశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిపారు. -
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
కొయ్యూరు: సైబర్ మోసగాళ్లు పంపే ఆశాపాత సందేశాలను నమ్మితే నిలువునా మోసపోతారని స్థానిక సీఐ బి. శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆదివారం ఆయన ఎస్ఐ కిషోర్వర్మతో కలిసి, స్థానిక వారపు సంతకు వచ్చిన గిరిజనులతో ప్రత్యేకంగా సమావేశమై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, ఓటీపీలు చెప్పాలంటూ వచ్చే సందేశాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫోన్లలో ఎవరు అడిగినా బ్యాంకు ఖాతాల వివరాలు, వ్యక్తిగత సమాచారం చెప్పకూడదని సూచించారు. అలా చెబితే ఖాతాల్లోని సొమ్మంతా క్షణాల్లో ఖాళీ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వాట్సాప్ల ద్వారా కేవైసీ అప్డేట్ లేదనో, ఆధార్ లింక్ కాలేదనో కొన్ని ఫైళ్లను, లింకులను పంపిస్తుంటారని.. వాటిని నిజమని నమ్మి క్లిక్ చేస్తే సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేస్తారని వివరించారు. గంజాయి సాగు చేస్తే చర్యలు : మన్యంలో గంజాయిని పండించినా లేదా రవాణా చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీనివాసరావు హెచ్చరించారు. అలాగే గిరిజనులు రహదారి భద్రతా నియమాలను పాటించడం ద్వారా చాలా వరకు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. వాహనదారులు మద్యం సేవించి లేదా అతివేగంగా నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని.. బైక్లపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చని సూచించారు. మహిళలపై ఎవరు అసభ్యకరంగా ప్రవర్తించినా, వేధింపులకు గురిచేసినా చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు -
మట్టిని అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లు స్వాధీనం
కశింకోటలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్లు కశింకోట: మట్టిని అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకుని మైన్స్ శాఖకు అప్పగించినట్లు సీఐ అల్లు స్వామి నాయుడు ఆదివారం తెలిపారు. కశింకోట పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో మట్టిని అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను గుర్తించామని చెప్పారు.వాటిని స్వాధీనం చేసుకుని మైన్స్ శాఖ అధికారులకు అప్పగించామన్నారు. ఆ శాఖ అధికారులు ట్రాక్టర్కు రూ.8 వేల చొప్పున జరిమానా విధించారని సీఐ తెలిపారు. -
నేటి నుంచి ముత్యాలమ్మ ఉత్సవాలు
ముంచంగిపుట్టు: మండలంలోని సుజనకోట పంచాయతీ సుజనపేట గ్రామంలో వెలసిన శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలను సోమ, మంగళవారాల్లో రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతి ఏటా ఇక్కడ అమ్మవారి ఉత్సవాలను సరిహద్దు గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ జాతరలో భాగంగా సోమవారం రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మంగళవారం భక్తులు అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకోనున్నారు. ఈ పండగను తిలకించేందుకు ఆంధ్ర–ఒడిశా సరిహద్దు గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. ఉత్సవాల నేపథ్యంలో గ్రామంలో ఆకట్టుకునేలా విద్యుత్ దీపాల అలంకరణ చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని చర్యలు తీసుకున్నారు. వాలీబాల్ టోర్నీ విజేత ‘ఏనుగురాయి’ ముత్యాలమ్మ తల్లి పండగను పురస్కరించుకుని నిర్వహించిన మండల స్థాయి వాలీబాల్ పోటీల్లో ఏనుగురాయి జట్టు విజేతగా నిలిచింది. గత వారం రోజులుగా ఈ క్రీడలు ఎంతో ఉత్సాహభరితంగా సాగాయి. ఆదివారం నిర్వహించిన హోరాహోరీ ఫైనల్ మ్యాచ్లో ఏనుగురాయి, చిప్పపుట్టు జట్లు తలపడగా.. చిప్పపుట్టుపై ఏనుగురాయి జట్టు ఘన విజయం సాధించింది. మరోవైపు మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ముంచంగిపుట్టు, బీటా జట్ల మధ్య సోమవారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. క్రీడల్లో గెలుపొందిన విజేతలకు జాతర రాత్రి సాంస్కృతిక కార్యక్రమాల వేదికపై బహుమతుల ప్రదానం చేస్తామని మాజీ సర్పంచ్ రమేష్, నిర్వాహకులు సుమన్, బొందు చిన్నారావు, త్రినాథ్ తెలిపారు.సుజనపేటలో ఘనంగా ఏర్పాట్లు -
విత్తన కష్టం
గిరి రైతుకుసాక్షి,పాడేరు: ఈ ఏడాది ఖరీఫ్ వరి సాగుకు మన్యంలో విత్తనాల కొరత ఏర్పడింది. కూటమి ప్రభుత్వం ముందస్తుగా గిరిజన రైతులకు సబ్సిడీపై వరి విత్తనాలను అందుబాటులోకి తేకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో గిరిజన రైతులంతా ఖరీఫ్ దుక్కి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే 80 శాతం భూముల్లో మొదటి దశ దుక్కులు పూర్తి కావడంతో నారుమడుల తయారీకి సిద్ధమవుతున్నారు. అయితే సరిగ్గా ఇదే సమయంలో విత్తనాల కొరత వేధిస్తోంది. జిల్లాలోని 11 మండలాల పరిధిలో దాదాపు 40 వేల హెక్టార్లలో గిరిజన రైతులు ఖరీఫ్లో వరి పంటను సాగు చేస్తారు. దీనికోసం దాదాపు 20 వేల క్వింటాళ్ల వరకు వరి విత్తనాలు అవసరం. ప్రతిపాదనకే పరిమితం జిల్లా వ్యాప్తంగా 20 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం ఉన్నప్పటికీ, వ్యవసాయ శాఖ కేవలం 13 వేల క్వింటాళ్లకే రెండు నెలల క్రితం ఇండెంట్ పెట్టినా ప్రయోజనం కనిపించడం లేదు. గిరిజన ప్రాంతం కావడంతో 90 శాతం సబ్సిడీపై రైతులకు ప్రభుత్వం వరి విత్తనాలను సకాలంలో పంపిణీ చేయాల్సి ఉంది. కానీ, గిరిజన రైతులు ఖరీఫ్ పనుల్లో వేగం పెంచినా కూటమి ప్రభుత్వం మాత్రం ఇంతవరకు మన్యానికి విత్తనాలను సరఫరా చేయలేదు. అదును దాటిపోతున్నా వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాలు పంపిణీ చేయకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగానే ఖరీఫ్ పనులు జిల్లాలో కురుస్తున్న అనుకూల వర్షాలతో రైతులు ముందస్తుగానే ఖరీఫ్ సాగు పనులకు శ్రీకారం చుట్టారు. భూములన్నీ తడిసి ముద్దవడంతో నారుమడుల తయారీకి వాతావరణం ఎంతగానో అనుకూలించింది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం వరి విత్తనాల పంపిణీ ఊసెత్తడం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే 90 శాతం సబ్సిడీపై రైతులకు సకాలంలో విత్తనాలు అందించి ఆదుకునేదని గిరిజనులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రైవేట్ దుకాణాలు, సంతల్లో కొనుగోలు ప్రభుత్వం సకాలంలో విత్తనాలు పంపిణీ చేయకపోవడంతో గిరిజన రైతులంతా ప్రైవేట్గా వరి విత్తనాలను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండల కేంద్రాల్లోని విత్తన దుకాణాలతో పాటు వారపు సంతల్లో అమ్మే పలు రకాల వరి విత్తనాలకు ప్రస్తుతం భారీ డిమాండ్ నెలకొంది. 10 కిలోల విత్తన బ్యాగును రూ. వెయ్యి నుంచి రూ. 1200 వరకు అధిక ధరలు వెచ్చించి రైతులు కొనుగోలు చేస్తున్నారు. జోరుగా అమ్మకాలు అరకు, పాడేరు, సుంకరమెట్ట, కాశీపట్నం, డముకు, కించుమండ, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు, గుత్తులపుట్టు, కుమడ, మద్దిగరువు, జి.మాడుగుల, అన్నవరం, లోతుగెడ్డ, చింతపల్లి, దారకొండ వారపు సంతల్లో విత్తనాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. నారుమడులు పోయడానికి ఇదే సరైన సమయం కావడంతో, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు అధిక ధరలకు మేలు రకం వరి వంగడాలను కొంటున్నారు. శనివారం జరిగిన వారపు సంతలోని సుమారు 10 దుకాణాల్లో విత్తన అమ్మకాలు భారీగా జరిగాయి. గిరిజన రైతులు విత్తన మూటలను తమ గ్రామాలకు మోసుకువెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. అదును వచ్చినా అందని వైనం ఇండెంట్కే పరిమితం నారుమడులు వేసే వేళ తప్పని తిప్పలు ఖరీఫ్ సాగుపై ప్రభావం ప్రైవేట్ మార్కెట్లో అధిక ధరకు కొనుక్కోవాల్సిన దుస్థితి కూటమి ప్రభుత్వం తీరుపైఅన్నదాత ఆగ్రహంప్రైవేట్ దుకాణంలోకొనుక్కున్నా.. 90శాతం సబ్సిడీపై ఖరీఫ్లో నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేస్తుందని ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. దుక్కి పనులు పూర్తి చేయడంతో నారుమడులకు విత్తన సమస్య ఏర్పడింది. పాడేరులోని ప్రైవేట్ దుకాణంలో కిలో రూ.100తో 10 కిలోల వరి విత్తనాలను కొనుగోలు చేశా. – వంతాల బొంజుబాబు, బురదపాడు, పాడేరు మండలం అదునుకు ఇవ్వకపోవడం అన్యాయం వ్యవసాయశాఖ అదునుకు వరి విత్తనాలు పంపిణీ చేయకపోవడం అన్యాయం.గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సకాలంలో విత్తనాలను ఆర్బీకే కేంద్రాల వద్ద పంపిణీ చేసేది.గత ఏడాది లాగే ఈసారి కూడా విత్తన పంపిణీ ఆలస్యం చేయడంతో మార్కెట్లో అధిక ధరలకు కొనుక్కున్నా. – కిల్లో లక్ష్మి, మహిళా రైతు, చింతగొంది, పాడేరు మండలం ముందస్తుగానే ప్రతిపాదన ఈ ఖరీఫ్లో జిల్లా వ్యాప్తంగా 90శాతం సబ్సిడీపై వరి విత్తనాల పంపిణీకి ముందస్తుగానే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ప్రభు త్వం నుంచి విత్తనాలు మూడు నాలుగు రోజుల్లో జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. అవి సరఫరా అయిన వెంటనే గిరిజన రైతులకు పంపిణీ చేసేలా తగు చర్యలు తీసుకుంటాం. రైతులు – ఎస్బీఎస్ నందు, జిల్లా వ్యవసాయాధికారి, పాడేరు -
అనకాపల్లి జిల్లా రిజిస్ట్రార్గా రత్నకుమార్
అనకాపల్లి: జిల్లా నూతన రిజిస్ట్రార్గా పి.రత్నకుమార్ నియమితులయ్యారు. ఈయన విశాఖ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆడిట్ విభాగంలో విధులు నిర్వహిస్తూ పదోన్నతపై అనకాపల్లి జిల్లా రిజిస్ట్రార్గా వచ్చారు. శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. విశాఖ జిల్లా రిజిస్ట్రార్ మన్మథరావు... ఇప్పటివరకు ఇక్కడ ఇన్చార్జి రిజిస్ట్రార్గా విధులు నిర్వహించారు. ఆయన నుంచి రత్నకుమార్ బాధ్యతలను స్వీకరించారు. జిల్లా రిజిస్ట్రార్ల సంఘం నాయకులు, సీనియర్ అధికారులు బంగారు వెంకటేశ్వరరావు, అప్పారావు, గీతాలక్ష్మి, బేగం, శ్రీనివాసరావు, శ్రీకాంత్ పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. -
మైచర్లపాలెంలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
చోడవరం: అంబేడ్కర్ ఆశయ సాధనకు అంతా కృషి చేయాలని అంబేడ్కర్ మిషన్ ఇండియా(ఏఐఎం) వ్యవస్థాపక అధ్యక్షుడు, ఐపీఎస్ సునీల్కుమార్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో మండలంలోని మైచర్లపాలెంలో నూతనంగా నిర్మించిన అంబేడ్కర్ విగ్రహాన్ని శనివారం ఆయన ఆవిష్కరించారు. గ్రామానికి వచ్చిన ఆయనకు అంబేడ్కర్ యూత్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సునీల్కుమార్ మాట్లాడుతూ అన్ని వర్గాలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించాలన్న ఆశయంతో అంబేడ్కర్ ఎంతో పనిచేశారన్నారు. మంచి క్రమశిక్షణతో యువత ముందడుగు వేస్తూ ఉన్నత ఆశయాలతో అభివృద్ధి చెందుతూ దేశ సేవలో తరించాలని కోరారు. కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు గాడి కాసు, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రతినిధి మూర్తా శ్రీనివాసరావు, మైచర్లపాలెం అంబేడ్కర్ యూత్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
గంజాయి స్వాధీనం, ఇద్దరి అరెస్టు
అనకాపల్లి: కారులో రెండు బ్యాగుల్లో 56.40 కిలోల గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్టు రూరల్ సీఐ జి.అశోక్కుమార్ శనివారం తెలిపారు. మండలంలో బవులవాడలో ఎస్ఐ ఎ.విభూషణరావు వాహనాలు తనిఖీ చేసినట్టు చెప్పారు. ఆ సమయంలో ఒడిశా రాష్ట్రం నుంచి మహారాష్ట్రకి వెళుతున్న కారును తనిఖీ చేయగా గంజాయి బయటపడినట్టు తెలిపారు. గంజాయిని స్వాధీనం చేసుకుని, ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లాకు చెందిన రాజు అంత్రు, మహారాష్ట్ర రాష్ట్రం థానే జిల్లాకు చెందిన రూపేష్ రాజు చిక్నేలను అరెస్టు చేసినట్టు చెప్పారు. వారి వద్ద నుంచి గంజాయి, నాలుగు సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.28.20 లక్షలు ఉంటుందన్నారు. నిందితులను కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. -
డీటీ సత్యనారాయణకు అరుదైన గౌరవం
గూడెంకొత్తవీధి: మండల రెవెన్యూ కార్యాలయంలో సర్వే విభాగం డిప్యూటీ తహసీల్దారుగా పనిచేస్తున్న దుమంతి సత్యనారాయణకు అరుదైన గౌరవం దక్కింది. శనివారం విశాఖపట్నంలోని ట్రైబల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ మిషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) డాక్టర్ రాణి మంథా ఆయనను ఘనంగా సత్కరించారు. గిరిజన ప్రభుత్వ ఉద్యోగిగా విధి నిర్వహణలోనే కాకుండా, సమాజంపై బాధ్యతతో నిరంతరం పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నందుకు గాను సత్యనారాయణ సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని అందజేశారు. కాగా, సామాజిక సేవలో విశేష గుర్తింపు తెచ్చుకున్న సత్యనారాయణ ఇప్పటివరకు వివిధ రంగాలలో నాలుగు రాష్ట్ర స్థాయి అవార్డులను అందుకోవడం విశేషం. ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కడంపై మండల రెవెన్యూ సిబ్బంది, పలువురు గిరిజన నేతలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. సామాజిక సేవలో విశేష సేవలకు సత్కారం -
విశ్రాంత జీవితం ప్రశాంతంగా సాగాలి
పదవీ విరమణ పొందిన పోలీస్ సిబ్బందిని సత్కరించిన ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి: విశ్రాంత జీవితం కుటుంబ సభ్యులతో కలిసి ఆరోగ్యంగా, ప్రశాంతంగా సాగాలని ఎస్పీ తుహిన్ సిన్హా ఆకాంక్షించారు. వివిధ పోలీస్ స్టేషన్లో సుదీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ పొందిన అనకాపల్లి టౌన్ ఏఎస్ఐ బి.రామ్కుమార్, పరవాడ ఏఎస్ఐ వి.త్రినాథ్రావు, ఏఆర్ హెచ్సీ ఎల్.గోవిందరావులను శనివారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఆయన శాలువాలతో సత్కరించారు. ఉమ్మడి జి ల్లాలో వీరు అందించిన సేవలు శాఖకు గర్వకారణమన్నారు. ఏఎస్పీ ఎల్.మోహనరావు పాల్గొన్నారు. -
ఆలయాల్లో చోరీ చేస్తున్న దొంగ అరెస్టు
పాయకరావుపేట: ఆలయాల్లో చోరీలకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్టు నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఆయన స్థానిక పోలీసు స్టేషన్లో శనివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పాయకరావుపేట పట్టణంలోని కడిమి వారి వీధికి చెందిన గుద్దాటి రాజు అలియాస్ చిన్న అనే వ్యక్తి చుట్టుపక్కల ఉన్న ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్టు చెప్పారు. పట్టణంలోని దుర్గానగర్ కాలనీలో గల దుర్గాలమ్మ గుడిలో 2 తులాల బంగారం, రూ.50 వేల నగదు, అరట్లకోట గ్రామ పరిధిలో ఓరుగుంటాలమ్మ, కనకదుర్గమ్మ ఆలయాల్లో రూ.5 వేల నగదు, పట్టణంలోని బృందావనంలో గల శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో రూ.1.75 లక్షల విలువ కలిగిన బంగారు ఆభరణాలు చోరీ చేసినట్టు తెలిపారు. నిందితుడు రాజుపై తుని, నర్సీపట్నం, అనకాపల్లి, అచ్యుతాపురం పోలీసు స్టేషన్ల్లో కేసులు నమోదైనట్టు చెప్పారు. రాజుపై ఇప్పటివరకు 21 కేసులు నమోదైనట్టు తెలిపారు. నిందితుని వద్ద నుంచి 2.56 తులాల బంగారం, రూ.2,520 నగదు రికవరీ చేశామన్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్టు చెప్పారు. ఎంతో కృషి చేసి కేసును చేధించిన సీఐ ఎస్.శంకరరావు, ఎస్ఐ పురుషోత్తం, హెచ్సీ వెంకట కిరణ్ను, కానిస్టేబుల్ సతీష్, నారాయణరావు, చించయ్య, మదీనాలను జిల్లా పోలీసు అధికారులు అభినందినట్టు డీఏస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు. -
రీ సర్వే పేరిట డబ్బులు వసూలు దారుణం
దేవరాపల్లి: భూముల రీ సర్వే పేరిట రైతుల నుంచి డబ్బులు వసూలు చేయడం దారుణమని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు కె.వి.రమణ విమర్శించారు. దేవరాపల్లిలో శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. పారదర్శకంగా చేపట్టాల్సిన భూముల రీ సర్వేకు కొందరు అధికారులు, అధికారుల పేరు చెప్పి కొందరు నాయకులు ఎకరానికి రూ. 2వేలు నుంచి రూ. 3 వేల వరకు వసూలు చేస్తున్నట్లు పలువురు రైతులు తమ దృష్టికి వచ్చారన్నారు. రీసర్వేను క్షేత్ర స్థాయిలో పారదర్శకంగా చేపట్టకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రీ సర్వే చేపట్టే తేదీ, సమయాన్ని భూ యజమానులు, రైతులకు లిఖిత పూర్వకంగా తెలియజేయాల్సి ఉండగా వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం అందించడంతో స్మార్ట్ ఫోన్లు లేని రైతులకు సమాచారం అందడం లేదని తెలిపారు. సమాచారం తెలియక రైతులు హాజరు కాకపోవడంతో సిబ్బంది తూతూ మంత్రంగా రీ సర్వే నిర్వహిస్తున్నారని, దీంతో రైతులకు ప్రయోజనం కంటే కొత్త చిక్కులు వస్తున్నాయన్నారు.కొందరు రెవెన్యూ సిబ్బంది అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా సర్వే చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయని చెప్పారు. రీ సర్వే పేరుతో దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తే రైతులు తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. రీ సర్వేలో జరుగుతున్న అవకతవకలపై పక్కా ఆధారాలతో జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులకు తగు న్యాయం జరిగేలా కృషి చేస్తానని రమణ తెలిపారు. -
పరిమళించిన మానవత్వం
మాకవరపాలెం: మానవత్వం పరిమళించింది. సామాజిక మాధ్యమంలో వచ్చిన చిన్న వీడియో సందేశం మానవతా మూర్తుల హృదయాలను కదలించింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి జీవచ్ఛమైన ఆటో డ్రైవరుకు ఆపన్నహస్తం అందించేలా చేసింది. రెండు వారాల్లోనే రూ.18.40 లక్షల సాయమందించి అతని కన్నీటి చెమ్మను తుడిచింది. మండలంలోని రాచపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పట్నాల శ్రీను ప్రమాదంలో గాయపడి రెండేళ్లుగా మంచానికి పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శెట్టిపాలెం గ్రామానికి చెందిన లాలం ఏసుబాబు స్థాపించిన సాయానికి 10 రూపాయలు సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీను కుటుంబం దీనస్థితిపై సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల చేశారు. భార్య, ముగ్గురు పిల్లలతో ఇబ్బందులు పడుతుండడంపై స్పందించిన దాతలు విరివిగా విరాళాలుగా అందించేందుకు ముందుకు వచ్చారు. ఇలా రెండు వారాల్లో విరాళాలుగా వచ్చిన రూ.18 లక్షల 40 వేలను శనివారం సంస్థ సభ్యులు శ్రీను కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు ఏసుబాబు మాట్లాడుతూ 2019 నుంచి ఇప్పటివరకు ఏడుగురు బాధితులకు రూ.కోటి ఆర్థిక సాయంగా అందించామన్నారు. ఏడాదికి ఒక కుటుంబానికి సాయం చేయడమే లక్ష్యంగా సంస్థ పనిచేస్తుందన్నారు. తమను నమ్మి ఆర్థిక సాయం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో హోమియోపతి వైద్యుడు శశిధర్, స్థానిక ఎలక్ట్రికల్ ఏఈ బాలకృష్ణ, మనం ట్రస్టు చైర్మన్ రమేష్, అనకాపల్లి ఏఎంఏఎల్ కళాశాల అధ్యాపకుడు హరిబాబు, 30 మంది సంస్థ సభ్యులు పాల్గొన్నారు. -
ఏపీ పీజీసెట్లో శ్రీ ప్రకాష్ విద్యార్థుల ప్రతిభ
పాయకరావుపేట: శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్థ అయిన స్పేసెస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఏపీ పీజీసెట్ – 2026లో మంచి ర్యాంకులు సాధించారని ప్రిన్సిపాల్ డాక్టరు ఎ.రామకృష్ణారెడ్డి తెలిపారు. తమ విద్యార్థులు రాష్ట్ర స్థాయి కెమిస్ట్రీ విభాగంలో ఇ.వాసు 8వ ర్యాంకు, ఎన్.నాగేశ్వరి 45వ ర్యాంకు, పి.మైథిలీ 99వ ర్యాంకు, లైఫ్ సైన్స్ విభాగంలో కె.స్నేహ 48వ ర్యాంకు, ఫిజిక్స్ విభాగంలో వై.దీప్తి 69వ ర్యాంకు, జువాలజీ విభాగంలో వై.పావని 84వ ర్యాంకు, ఎస్.లోకేశ్వరి 98వ ర్యాంకు సాధించారన్నారు. స్వయం ఉపాధి స్వావలంబన లక్ష్యాలతో సాగే తమ కళాశాలలో డిగ్రీతోపాటుగా వివిధ పోటీ పరీక్షలకు ఇస్తున్న శిక్షణతో ఈ ర్యాంకులు సాధించారని తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యా సంస్థల అధినేత సిహెచ్.వి.కె. నరసింహారావు, సంయుక్త కార్యదర్శి సిహెచ్ విజయ్ ప్రకాష్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. -
ముంచంగిపుట్టులో ఇంధన కష్టాలు
ముంచంగిపుట్టు: మండలంలో కొద్ది రోజులుగా తీవ్రమైన పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. గత మూడు రోజులుగా పెట్రోల్ బంకుల ముందు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. ఇంధన ట్యాంకర్లు వచ్చిన రెండు రోజుల్లోనే స్టాక్ అయిపోయిందని బోర్డులు పెట్టడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బంకుల నిర్వాహకులు ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో నిర్వాహకులు తమకు నచ్చినట్లుగా లీటర్ల కొద్దీ ఇంధనాన్ని అమ్ముకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మూడు బంకులు.. అన్నీ సమస్యలే! ముంచంగిపుట్టు మండల పరిధిలోని లుంగాపుట్టు, బాపన్నపుట్టు, దసరిపుట్టు వద్ద మూడు పెట్రోల్ బంకులు ఉన్నాయి. అయితే, బాపన్నపుట్టు బంకులో గత మూడు రోజులుగా పెట్రోల్ లభించడం లేదు.. ఇక డీజిల్ సరఫరా నిలిచిపోయి వారం రోజులు దాటిపోయింది. దసరిపుట్టు బంకులో అసలు ఎప్పుడు పెట్రోల్, డీజిల్ ఉంటుందో, ఎప్పుడు బోర్డులు పెడతారో తెలియని గందరగోళ పరిస్థితి నిత్యం నెలకొంటోంది. వారపు సంత రోజున చుక్కలు చూశారు! ప్రస్తుతం లుంగాపుట్టు బంకులో మాత్రమే ఇంధన సరఫరా ఉండడంతో శనివారం వాహనదారులంతా అక్కడికే క్యూ కట్టారు. దీనికి తోడు శనివారం మండల కేంద్రంలో వారపు సంత కావడంతో ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది వాహనదారులు ఒకేసారి ఈ బంకుకు చేరుకున్నారు. ఫలితంగా గంటల తరబడి ఎండలోనే నిరీక్షించాల్సి వచ్చింది. తీవ్ర ఇబ్బందులు పడుతూ ఇంధనం వేయించుకుని వెళ్లారు. ఉన్నతాధికారులు కేవలం కాగితాలకే పరిమితమై.. ఏజెన్సీలో పెట్రోల్, డీజిల్ కొరత లేదంటూ ప్రకటనలు చేయడం కాదని, క్షేత్రస్థాయిలో బంకుల్లో ఇంధనం నిరంతరం అందుబాటులో ఉండేలా పక్కా చర్యలు తీసుకోవాలని గిరిజన వాహనదారులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారుల ఇబ్బందులు -
రోడ్లు మరిచారు!
హామీలిచ్చారు..కూటమి సర్కారుపై గిరిజనాగ్రహం శిథిలావస్థలో డోకులూరు ప్రధాన వంతెనరాళ్లు తేలిన చీడిమెట్ట జంక్షన్ రోడ్డుఎన్నికల వేళ గిరిజన పల్లెల్లో ప్రచార ఆర్భాటం చేసిన కూటమి నేతలు రాష్ట్రంలో అధికారం చేపట్టాక ముఖం చాటేయడం పరిపాటిగా మారింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా, నాడు ఇచ్చిన ఎన్నికల హామీలు నేటికీ గిరిజన ప్రాంతాల్లో అమలుకు నోచుకోలేదు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న పాడేరు రూరల్ మండల పరిధిలోని ప్రధాన రహదారులు ప్రస్తుతం అధ్వానపు బాటలకు కేరాఫ్గా మారాయి. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఇటువైపు పర్యటనలు చేస్తున్నప్పటికీ వీటి దుస్థితి మారకపోవడంపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాడేరు రూరల్: మండలంలోని డోకులూరు, బర్సింగి, గుత్తులపుట్టు, డిగొందూరు గ్రామ పంచాయతీల పరిధిలోని గిరిజన గ్రామాల్లో రహదారులు అధ్వానంగా మారాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ఎన్నికల హామీలు అమలుకు నోచుకోలేదని సమీప గ్రామాల ఆదివాసీ గిరిజనులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● గుత్తులపుట్టు పంచాయతీ చీడిమెట్ట జంక్షన్ నుంచి గడివలస మీదుగా గుత్తులపుట్టు సంతబయలు, జికొత్తూరు మీదుగా డోకులూరు వయా డి.గొందూరు వరకు రోడ్డు పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న వంతెనలు, కల్వర్టులు శిథిలావస్థకు చేరి ప్రమాదాలకు నిలయాలుగా దర్శనమిస్తున్నాయి. దీంతో పలు సందర్భాల్లో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతున్నాయి. వర్షాకాలంలో అయితే పరిస్థితి మరింత నరకప్రాయంగా మారుతుందని స్థానికులు వాపోతున్నారు. పలుమార్లు జిల్లా ఉన్నతాధికారులు ఈ రహదారి గుండా ప్రయాణించినప్పటికీ, ఇక్కడి దుస్థితిని మార్చేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని గిరిజనులు మండిపడుతున్నారు. ● జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న డోకులూరు పంచాయతీ పరిసర ప్రాంతాల మార్గం అధ్వానంగా మారినప్పటికీ, ఈ రోడ్డు గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. డోకులూరు గ్రామంలో ఇప్పటికే ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల ఉంది. దీనికి తోడు ప్రస్తుతం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఏకలవ్య మోడల్ పాఠశాల ఏర్పాటుతో ఈ మార్గంలో నిత్యం ట్రాఫిక్ రద్దీ మరింత పెరగనుంది. సరైన రోడ్డు సౌకర్యం లేకపోతే భవిష్యత్తులో విద్యార్థులు, వాహనదారులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతులు చేపడితే.. 30 గ్రామాలకు కనెక్టివిటీ.. ఈ రహదారికి మరమ్మతులు చేపడితే గిరిజనులు పాడేరు జిల్లా కేంద్రానికి వెళ్లకుండానే ఇటు పెదబయలుకు, అటు జి.మాడుగులలోని వివిధ ప్రాంతాలకు సులువుగా ప్రయాణించవచ్చు. ప్రధానంగా సంతబయలు నుంచి జికొత్తూరు, డోకులూరు మీదుగా డి.గొందూరు వరకు రోడ్డు విస్తరణ చేపట్టి, మరమ్మతులు పూర్తి చేస్తే సుమారు 30 గిరిజన గ్రామాలకు నేరుగా రవాణా సౌకర్యం కలుగుతుంది. దీంతో పాటు బైపాస్ మీదుగా జి.మాడుగుల, ఇతర సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులతో పాటు కూటమి పాలకులు ముందస్తు చర్యగా ఈ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. శిథిలావస్థలో వంతెనలు.. పొంచి ఉన్న ప్రమాదాలు ఈ మార్గంలో ఉన్న పురాతన కల్వర్టులు, వంతెనలు, సీసీ ర్యాంపులు పూర్తిగా దెబ్బతిని నిత్యం ప్రమాదాలకు సంకేతంగా మారాయి. పాలకులు పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని గిరిజన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో పాడేరు జిల్లా కేంద్రానికి డోకులూరు మీదుగానే ప్రధాన రహదారి మార్గం ఏర్పడే అవకాశం ఉన్నందున, జిల్లా యంత్రాంగం ఇప్పటికై నా ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన నిధులు మంజూరు చేయాలని వివిధ గ్రామాల ప్రజలు కోరుతున్నారు. పాడేరు ఏజెన్సీలో అధ్వానంగా రహదారులు గుత్తులపుట్టు, డోకులూరు మార్గంలో అస్తవ్యస్తంగా రోడ్లు 30 గ్రామాలకు తప్పని అవస్థలు జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోనే రోడ్ల దుస్థితి విస్తరిస్తేనే పెదబయలు, జి.మాడుగులకు సులువైన ప్రయాణం పట్టించుకోని కూటమి పాలకులు రోడ్డు విస్తరణపై ప్రత్యేక దృష్టి జిల్లా కేంద్రంతో పాటు మారుమూల ప్రాంతాల ప్రధాన రోడ్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యామ్నాయ మార్గాలను నిర్మించాలి. పాడేరు పట్టణంతో అసలు సంబంధం లేకుండానే డోకులూరు పంచాయతీ కేంద్రం.. అటు జి.మాడుగుల, ఇటు పెదబయలు వంటి వివిధ ప్రాంతాల రాకపోకలకు ప్రధాన కూడలి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఉన్నతాధికారులు ఈ రోడ్డు విస్తరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. – తమర్బ ప్రసాద్ నాయుడు, న్యాయవాది, డోకులూరు, పాడేరు ఎన్నికల హామీలు నెరవేర్చాలి గుత్తులపుట్టు సంతబయలు నుంచి డోకులూరు మీదుగా డి.గొందూరు వరకు రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలి. ఈ మార్గంలోని కల్వర్టులు, వంతెనలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం గుంపులు గుంపులుగా గిరిజన గ్రామాలకు వచ్చిన కూటమి నాయకులు.. గెలిచి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటివరకు ఈ ప్రాంతం వైపు కన్నెత్తి చూడలేదు, వారి జాడ లేదు. ఇచ్చిన ఎన్నికల హామీలను ఇప్పటికై నా వెంటనే నెరవేర్చాలి. – ఎస్. రవికుమార్, జి.కొత్తూరు, పాడేరు మండలం -
భూగర్భ జలాల పర్యవేక్షణపై క్షేత్రస్థాయి శిక్షణ
పాడేరు రూరల్: భూగర్భ జలాలు, బావుల ఏర్పాటు, వాటి పర్యవేక్షణపై మరింత నైపుణ్యం పెంచేందుకు శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయాల్లో క్షేత్రస్థాయి నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ మండలాల నుంచి సుమారు 25 మంది ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా భూగర్భ జలవనరులశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనవాసరావు మాట్లాడుతూ.. జిల్లాలో భూగర్భ జలాల బలోపేతంతో పాటు, నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షించేందుకు ఈ నైపుణ్య శిక్షణ తరగతులు ఎంతో దోహదపడతాయన్నారు. ప్రజలకు అన్ని రకాల నాణ్యమైన సేవలను అందించడమే లక్ష్యంగా సాంకేతిక మెలుకువలపై ఈ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణలో భాగంగా పీజోమీటర్ పరికరం ద్వారా భూగర్భ జలాల ఒత్తిడిని, కచ్చితమైన నీటి నిల్వలను ఏ విధంగా కొలవాలి, ఎలా పర్యవేక్షించాలనే అంశాలపై సిబ్బందికి ప్రత్యక్షంగా డెమో ద్వారా అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో బావుల ఏర్పాటుకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. శిక్షణ తరగతులకు హాజరైన ప్రతి ఒక్కరూ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని విధుల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన కోరారు. సాంకేతిక సిబ్బంది, కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.జలవనరులశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు -
ఎలక్టోరల్ మ్యాపింగ్ వంద శాతం పూర్తి కావాలి
సాక్షి,పాడేరు: జిల్లాలోని అన్ని పోలింగ్ బూత్ల పరిధిలో ఎలక్టోరల్ మ్యాపింగ్ను వంద శాతం విజయవంతం చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ టి.నిశాంతి హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బూత్ స్థాయి అధికారులకు (బీఎల్వో) పలు సామగ్రితో కూడిన ఎలక్టోరల్ మ్యాపింగ్ కిట్లను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మ్యాపింగ్ ప్రక్రియలో ఇప్పటికే అలసత్వం వహించిన పాడేరు, అరకులోయ నియోజకవర్గాల పరిధిలోని పలువురు బీఎల్వోలకు ఆయా నియోజకవర్గాల ఎన్నికల అధికారులైన జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఉత్తర్వుల మేరకు జిల్లాలోని మొత్తం 1,023 మంది బీఎల్వోలకు సరిపడా కిట్లు చేరాయని కలెక్టర్ వివరించారు. నిర్దేశిత గడువులోగా మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్వో లోకేశ్వరరావుతో పాటు ఇతర రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 7నుంచి 21వరకు యోగా ఉత్సవాలు జిల్లాలో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ టి.నిశాంతి ఆదేశించారు. ఇందుకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై శనివారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూన్ 7 నుంచి జూన్ 21 వరకు యోగా ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా గ్రామ, మండల స్థాయిలో నిర్వహించాలన్నారు. జూన్ 7న కొత్తపల్లి జలపాతం, జూన్ 8న మత్స్యగుండంలో యోగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా నోడల్ అధికారిగా ఆయూష్శాఖకు చెందిన డాక్టర్ మౌనికశ్రీ వ్యవహరిస్తారన్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఇన్చార్జి డీఆర్వో లోకేశ్వరరావు, డీఈవో రామకృష్ణారావు, గిరిజన సంక్షేమ డీడీ పరిమళ, గురుకుల ఓఎస్డీ మూర్తి, సమాచారశాఖ ఇన్చార్జి డీపీఆర్వో కె.వెంకటరావు పాల్గొన్నారు.కలెక్టర్ నిశాంతి -
వైఎస్సార్సీపీ మహిళాసదస్సుకు జిల్లా నేతలు
సాక్షి,పాడేరు: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరగనున్న ప్రతిష్టాత్మక మహిళా సదస్సుకు జిల్లాకు చెందిన ముఖ్య మహిళా నేతలు శనివారం భారీగా తరలివెళ్లారు. వీరిలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వ తమ్మ, అరకులోయ, పాడేరు నియోజకవర్గాల అధ్యక్షురాళ్లు సమిడ పూర్ణిమాదేవి, కిల్లో ఉర్వశిరాణి, హుకుంపేట వైస్ ఎంపీపీ జి. సుశీల, సూకూరు ఎంపీటీసీ కిలగాడ సింహచలం, పాడేరు మండల కార్యదర్శి లకే రామసత్యవతి, కుజ్జెలి గ్రామ కమిటీ కార్యదర్శి గంజాయి సూర్యకళ తదితరులు ఉన్నారు. -
రోడ్డు బాగు చేయాలని యువకుల నిరసన
పెదమదీనలో ప్ల కార్డులతో నిరసనకు దిగిన యువకులు బుచ్చెయ్యపేట: రోడ్డను బాగుచేయాలని డిమాండ్ చేస్తూ ఐదు గ్రామాల యువకులు శనివారం రాత్రి నిరసనకు దిగారు. గున్నెంపూడి,పెదమదీన,చినమదీన,కొండపాలెం,పిల్లవానిపాలెం గ్రామాల యువకులు పెదమదీనలో సమావేశమయ్యారు. అనంతరం రోడ్డును బాగు చేసి రవాణా సదుపాయం కల్పించాలని ప్లకార్డులతో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రోడ్డు పనులు ప్రారంభించారని, మూడేళ్లు అవుతున్న నేటికీ పూర్తి చేయలేదన్నారు. రోడ్డు గోతులతో నిండిపోవడంతో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నట్టు చెప్పారు. ముఖ్యంగా గర్భిణులు,రోగులు ఆస్పత్రికి వెళ్లడానికి నరకయాతన పడుతున్నారన్నారు. తక్షణం పెదమదీన,గున్నెంపూడి రోడ్డును బాగు చేయాలని ఐదు గ్రామాల ప్రజలు,యువకులు సోమవారం ఛలో కలెక్టరేట్కు వెళ్లాలని నిర్ణయించారు. సుమారు వెయ్యి మందితో ఈ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. తల్లికి తనయ తల కొరివి కశింకోట: ఓ కుమార్తె కన్నతల్లి రుణం తీర్చుకుంది. తన తల్లికి తల కొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన కశింకోటలో శనివారం చోటు చేసుకుంది. స్థానిక గవరపేట మేదర వీధి ప్రాంతానికి చెందిన ఆళ్ల నూకరత్నం అనారోగ్యంతో శనివారం మృతి చెందింది. భర్త చాలా కాలం క్రితం కాలం చేశారు. ఆమె ఏకై క కుమార్తె వెంకటలక్ష్మి (బేబీ) తన తల్లికి బంధు మిత్రులతోపాటు వెళ్లి స్థానిక సాధు మఠంలోని శ్మశానంలో తల కొరివి పెట్టి అంత్యక్రియలు పూర్తి చేసింది. -
మెగా డీఎస్సీ.. మహా కుంభకోణం!
● నిరసనగా కలెక్టరేట్ ముట్టడి ● నిరుద్యోగ లోకం కదలిరావాలి ● విజయవంతం చేయాలి ● వైఎస్సార్సీపీ యువజన విభాగం పిలుపు జి.మాడుగుల: కూటమి ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో భారీ ఎత్తున అవకతవకలు, కుంభకోణాలు జరిగాయని.. దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో తక్షణమే విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గబ్బాడి శేఖర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అచ్యుత్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక విలేకరులతో వారు మాట్లాడుతూ.. అధిష్టానం ఆదేశాల మేరకు జూన్ ఒకటిన పాడేరులో యువజన విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రకటించారు. నాటి ఉదయం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా వెళ్లి కలెక్టర్కు వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఈ నిరసనను పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా నియోజకవర్గాల ముఖ్య నాయ కులు, కార్యకర్తలు తప్పనిసరిగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటం! మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం లక్షలాది మంది నిరుద్యోగ యువతను వంచించి, వారి భవిష్యత్తుతో దారుణంగా చెలగాటమాడిందని వారు మండిపడ్డారు. నియామకాల్లో పారదర్శకతను తుంగలో తొక్కి, పరీక్షలు ముగిసినా మార్కుల జాబితాను బహిరంగంగా ప్రకటించకుండా కేవలం ఎంపికై న వారికే రహస్యంగా సమాచారం పంపడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. పరీక్ష రాయకుండానే ఒక అభ్యర్థి స్టేట్ ర్యాంకర్ కాలేదా? అని ప్రశ్నించారు. విషయం బయటపడగానే సదరు అభ్యర్థి వివరాలన్నీ వెబ్సైట్ నుంచి మాయం చేయడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఒక్కో పోస్టును లక్షల రూపాయలకు అమ్ముకున్నారని, క్రీడల కోటాలో నకిలీ ధ్రువపత్రాలతో అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించారు. దీనిపై హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. అక్రమాలకు పాల్పడిన బ్రోకర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం అర్హులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. -
దేవరాపల్లిలో చోరీ
దేవరాపల్లి: మండల కేంద్రం దేవరాపల్లి గుమ్మడివీధిలో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన జాగరపు పైడితల్లి ఇంటిలో ట్రంక్ పెట్టెలో భద్రపరిచిన 5 తులాలకు పైబడి బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదు చోరీకి గురయ్యాయి. స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ శనివారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పైడితల్లి ఈ నెల 24న వాడపల్లి వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్లి మరుసటి రోజు ఇంటికి వచ్చాక తన వద్ద ఉన్న డబ్బును ఇంటిమేడపై గదిలోని పెట్టెలో భద్రపరిచేందుకు వెళ్లాడు. అప్పటికే పెట్టె తెరిచి ఉండటంతో ఆందోళనకు గురైన బాధితుడు అందులో భద్రపరిచిన బంగారు అభరణాలు, డబ్బు చోరీకి గురైనట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ క్లూస్ టీమ్లను, డాగ్ స్క్వాడ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. బాధితుడు పైడితల్లి పిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
గిరి మహిళల ‘అడ్డాకు’ రోదన
దోపిడీ అన్యాయం వారం వ్యవధిలోనే అడ్డాకుల ధరలను వ్యాపారులు తగ్గించడం అన్యాయం.అష్టకష్టాలు పడి అడ్డాకులను సేకరించి అమ్మకాలు జరిపితే కావిడకు రూ.2వేలు రావడం బాధనిపించింది. గత వారం రూ.4వేలతో కొన్న వ్యాపారులు ఈవారం రూ.2వేలు తగ్గించి మోసం చేశారు. – ఏడేల అమ్మాజి,కాగిపుట్టు, హుకుంపేట మండలం సాక్షి, పాడేరు: ఘాట్ రోడ్లు, కొండ కోనల్లో అష్టకష్టాలు పడి గిరిజన మహిళలు సేకరించిన అడ్డాకులకు చివరకు అన్యాయమే మిగులుతోంది. హుకుంపేట వారపు సంతకు శనివారం భారీగా అడ్డాకులు తరలిరావడంతో, మైదాన ప్రాంతానికి చెందిన వ్యాపారులంతా అంతర్గతంగా సిండికేట్గా మారి ధరలను దారుణంగా పతనం చేశారు. గతవారంలో ఒక కావిడి (రెండు దిండ్లు) అడ్డాకులకు రూ.4వేల వరకు ధర పలకగా, ఈ వారం మాత్రం వ్యాపారులు కుమ్మకై ్క కేవలం రూ.2వేలకు కొనుగోలు చేయడంతో గిరిజన మహిళలంతా ఉసూరుమన్నారు. కాస్త చిన్న సైజు దిండ్లు అయితే రూ.వెయ్యి నుంచి రూ.1,500లకే కొల్లగొట్టారు. ఇలా సంతకు వచ్చిన గిరిజన మహిళలంతా వ్యాపారుల చేతిలో ఘోరంగా దోపిడీకి గురయ్యారు. ● శనివారం ఉదయం 6 గంటల నుంచే గిరిజన మహిళలు భారీగా అడ్డాకులను కావిళ్లపై మోసుకుంటూ హుకుంపేట సంతకు చేరుకున్నారు. సమయం గడిచేకొద్దీ 10 గంటలకై నా ధర పెరుగుతుందని ఆశగా ఎదురుచూసిన గిరిజన శ్రామికులకు నిరాశే మిగిలింది. వ్యాపారులంతా ఒకే మాటపై నిలబడి తక్కువ ధరలకే కొనుగోలు చేస్తుండడంతో, గిరిజనులు ఏమీ చేయలేకపోయారు. మారుమూల గ్రామాలకు అంత బరువున్న అడ్డాకులను తిరిగి మోసుకుపోవడం సాధ్యం కాక, చివరకు వ్యాపారులు నిర్ణయించిన తక్కువ ధరలకే అమ్ముకోవాల్సి వచ్చింది. రూ.4 లక్షల వ్యాపారం.. లాభాలన్నీ మైదానానికే! ఈ దారుణమైన ధరల పతనం మధ్యే సంతలో శనివారం సుమారు రూ.4 లక్షల వరకు అడ్డాకుల వ్యాపారం సాగింది. గిరిజన మహిళల నుంచి తక్కువ ధరలకే ఆకులను గుంజుకున్న మైదాన ప్రాంత వ్యాపారులు.. వాటిని లారీల ద్వారా మైదాన నగరాలకు తరలించి భారీగా లాభాలు గడించారు. రేయింబవళ్లు అడవుల్లో తిరిగి ఆకులు సేకరించిన గిరిజన మహిళల శ్రమ దోపిడీకి గురై, ఈ సంతలో వారికి తీవ్ర అన్యాయం జరగడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావిడి ధర రూ.4 వేల నుంచిరూ.2 వేలకే పతనం హుకుంపేట వారపు సంతలో సిండికేట్గా మారిన మైదాన వ్యాపారులు అడ్డాకుల కొనుగోళ్లలోరూ.లక్షల్లో దోపిడీ -
ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రోత్సాహం
పాడేరు: ఏజెన్సీ గిరిజన యువతలో దాగి ఉన్న అపారమైన ప్రతిభను వెలికితీసి, వారిని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు పోలీసు శాఖ నిరంతరం ప్రోత్సాహం అందిస్తుందని ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో, సార్ధ మెటల్స్ అండ్ అలయ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో పాడేరు తలార్సింగి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో నెల రోజులుగా నిర్వహించిన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం శనివారంతో ముగిసింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్పీ మాట్లాడుతూ.. గిరిజన యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా, వారిలోని క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు 120 మందికి ఉచితంగా ఈ శిక్షణ ఇచ్చామన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా ముగ్గురు నిష్ణాతులైన కోచ్లతో మెలకువలు నేర్పించామని తెలిపారు.యువత చెడు వ్యసనాలకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ చదువుతో పాటు క్రీడలపై దృష్టి సారించాలని ఎస్పీ హితవు పలికారు. క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికే కాకుండా నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవడానికి తోడ్పడతాయన్నారు. ఇకపై ప్రతి ఏటా క్రికెట్తో పాటు ఇతర క్రీడల్లోనూ పోలీసు శాఖ ద్వారా ఉచిత శిక్షణ ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అలాగే, క్రికెట్ కోచ్లను దుశ్శాలువాలతో సత్కరించి మెమోంటోలు బహూకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ అమిత్ బర్దర్ను ఎస్బీ ఇన్స్పెక్టర్ సయ్యద్ ఎలియాస్ మహమ్మద్, పాడేరు సీఐ డి.దీనబంధు, ఎస్ఐ పాపినాయుడు, జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కె.దుర్గారావు తదితరులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, తల్లిదండ్రులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.ఎస్పీ అమిత్ బర్దర్ పిలుపు -
మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ
పాడేరు: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో అనేక అక్రమాలకు పాల్పడుతూ, దగా డీఎస్సీతో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోందని వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ అక్రమాలకు నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, అనుబంధ విభాగాల రాష్ట్ర నేతలు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు పిలుపు మేరకు శుక్రవారం జిల్లా కేంద్రమైన పాడేరులోని అంబేడ్కర్ సెంటర్లో శాంతియుత నిరసన ప్రదర్శన చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. డీఎస్సీలో అక్రమాలకు పాల్పడి టీచర్ పోస్టులను అమ్ముకున్న మంత్రి లోకేష్ను తక్షణమే క్యాబినెట్ నుంచి తొలగించడంతో పాటు, ఈ స్కామ్పై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వసూళ్లు.. కూటమి ప్రభుత్వం దగా డీఎస్సీని అమలు చేసి నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు లోచలి వరప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి నాగభూషణం మండిపడ్డారు. టీచర్ పోస్టులకు ఎంపికై న అర్హులైన అభ్యర్థులను పక్కనబెట్టి.. స్పోర్ట్స్ కోటా పేరుతో అనర్హుల నుంచి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూళ్లకు పాల్పడ్డారని వారు ధ్వజమెత్తారు. ఇందులో మంత్రి లోకేష్తో పాటు ఇతర ప్రభుత్వ పెద్దల హస్తం కూడా ఉందన్నారు. నకిలీ అభ్యర్థులకు టీచర్ ఉద్యోగాలిచ్చి ఇంత పెద్ద స్కామ్కు పాల్పడిన కూటమి ప్రభుత్వానికి నిరుద్యోగులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఆన్లైన్ నుంచి అకస్మాత్తుగా తొలగించిన మెరిట్ లిస్ట్ను వెంటనే వెబ్సైట్లో పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించి, బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తెడబారిక సురేష్కుమార్, అచ్యుత్, జిల్లా అధికార ప్రతినిధి కూడ సురేష్కుమార్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గబ్బాడి శేఖర్, పెదబయలు మండల పార్టీ అధ్యక్షుడు మజ్జి చంద్రబాబు, అరకు నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు బత్తిరి చరణ్తేజ్, పలు విభాగాల నేతలు లకే సాగర్, పసుపులేటి యోషన్, వీరన్నపడాల్ పాల్గొన్నారు. అక్రమాలకు పాల్పడుతూ నిరుద్యోగుల జీవితాలతో ‘కూటమి’ ఆటలు వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగం ఆగ్రహం పాడేరు అంబేడ్కర్ సెంటర్లో నిరసన మంత్రి లోకేష్ను పదవి నుంచి తొలగించాలి సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ -
మీ కాళ్లు మొక్కుతాం.. రోడ్డు వేయండి మహాప్రభో!
● వేడుకున్న కంపుమానుపాకల గ్రామస్తులు గూడెంకొత్తవీధి: మీ కాళ్లు మొక్కుతాం.. మా ఊరికి రోడ్డు బాగు చేయండి మహాప్రభో!.. అంటూ గూడెం పంచాయతీ కంపుమానుపాకల గ్రామస్తులు అధికారులను దీనంగా వేడుకున్నారు. సరైన రహదారి లేక తాము పడుతున్న నరకయాతనను వివరిస్తూ శుక్రవారం వారు రోడ్డుపైనే నిలబడి నిరసన తెలిపారు. తమ సమస్యపై ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో గ్రామస్తులంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి అధ్వానంగా మారడంతో, గ్రామస్తులంతా కలిసి శ్రమదానం ద్వారా రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన పిచ్చితుప్పలను తొలగించారు. ప్రస్తుతం ఉన్న మట్టిరోడ్డు వర్షం పడితే చాలు బురదమయంగా మారుతోందని, దీనివల్ల కనీసం నడవడానికి కూడా వీల్లేకుండా పోతోందని వారు వాపోయారు.కంపుమానుపాకల గ్రామం మీదుగానే మరో 20 గ్రామాలకు వెళ్లాల్సి ఉంటుందని, రోడ్డు సరిగా లేకపోవడం వల్ల ఆయా గ్రామాల ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.గుంతలమయమైన ఈ దారిలో ప్రయా ణిస్తూ ఇప్పటికే ఎంతోమంది ప్రమాదాల బారిన పడ్డారని గ్రామస్తులు గుర్తుచేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, తమ గ్రామాలకు శాశ్వత రహదారి సౌకర్యం కల్పించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
అర్జీదారులకు ఉచిత భోజనం
పాడేరు : జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి పాడేరు ఐటీడీఏకు వచ్చే అర్జీదారులకు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ ప్రధాన సలహాదారు (చీఫ్ పాలసీ అధికారి) గుల్జర్ నటరాజన్, కలెక్టర్ టి. నిశాంతి అన్నారు. శుక్రవారం పీజీఆర్ఎస్ ముగిసిన తర్వాత అర్జీదారులకు కలెక్టర్ నిశాంతి, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఇతర అధికారులతో కలిసి ప్రభుత్వ ప్రధాన సలహాదారు (చీఫ్ పాలసీ అధికారి) గుల్జర్ నటరాజన్ భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి సమస్యలపై వినతులు అందించేందుకు వచ్చే అర్జిదారులకు మధ్యాహ్నం పూట ఆకలి సమస్య తలెత్తకుండా భోజన పథకం ప్రారంభించామని తెలిపారు. దీనిని అర్జీదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్వ శిక్ష అభియాన్ ఏపీసీ స్వామి నాయుడు, ఐటీడీఏ ఏవో హేమలత తదితరులు పాల్గొన్నారు. -
వైద్యసేవల బలోపేతమే లక్ష్యం
● వైద్య ఆరోగ్యశాఖ మంత్రిసత్యకుమార్ యాదవ్ సాక్షి, పాడేరు: గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్య సేవలు, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శుక్రవారం ఆయన పాడేరు జిల్లా కేంద్రంలో పర్యటించి,వైద్య కళాశాల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం జిల్లా సర్వజన ఆసుపత్రిని తనిఖీ చేసి, రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. గతంతో పోలిస్తే విశాఖ కేజీహెచ్కు వెళ్లే రిఫరల్ కేసుల సంఖ్య తగ్గిందని, భవిష్యత్తులో ఒక్క రోగిని కూడా ఇతర ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం లేని విధంగా సౌకర్యాలు పెంచుతామన్నారు. అరకు పార్లమెంట్ పరిధిలో రూ.731 కోట్లతో 444 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. గిరిజనుల్లో రక్తహీనత నివారణకు చర్యలు తీసుకుంటున్నామని, సికిల్ సెల్ అనీమియా చికిత్స, పరిశోధనల కోసం కేజీహెచ్లో రూ.6 కోట్లతో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. పాడేరు వైద్య కళాశాలలో ఈ విద్యాసంవత్సరంలో అదనంగా 50 సీట్లు పెరిగాయని మంత్రి వెల్లడించారు.గిరిజనులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య బృందాలన్నీ సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కలెక్టర్ టి.నిశాంతి, జేసీ తిరుమణి శ్రీపూజ, వ్యైద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వెంకటేశ్వర్లు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణమూర్తినాయక్, స్థానిక బీజేపీ నేతలు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
సరియా విహారం.. తీరని విషాదం
● జలపాతంలో పడి ఇంజనీరింగ్ విద్యార్థి వరప్రసాద్ మృతి ● ప్రవాహంలోంచి మృతదేహాన్ని బయటకు తీసిన వలంటీర్లు సాక్షి, పాడేరు: వీకెండ్ సరదా.. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. స్నేహితులతో కలిసి ప్రకృతి అందాలను ఆస్వాదిద్దామని వెళ్లిన ఆ యువకుడు.. అనంతగిరి కొండల్లోని ప్రమాదకర సరియా జలపాతం రూపంలో మృత్యువు పొంచి ఉందని ఊహించలేకపోయాడు. విశాఖ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతూ, ఎన్నో ఆశలతో భవిష్యత్తును నిర్మించుకుంటున్న ఇండుగబిల్లి వరప్రసాద్ (19) జలపాతంలో మునిగి మృతి చెందడం అందరినీ తీవ్రంగా కలచివేసింది. క్షణంలో ముంచేసిన మృత్యువు పోలీసుల కథనం ప్రకారం.. విశాఖ నగరంలోని గోపాలపట్నం పెట్రోల్ బంక్ ప్రాంతానికి చెందిన వరప్రసాద్ తన స్నేహితులు దున్న అభిలాష్, డోలా లక్ష్మణరావులతో కలిసి శుక్రవారం బైక్పై అనంతగిరి మండలం మారుమూల ప్రాంతంలోని సరియా జలపాతానికి వచ్చాడు. ఆ పచ్చని ప్రకృతి ఒడిలో స్నేహితులంతా ఎంతో ఉత్సాహంగా గడిపారు. అయితే మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో ఒక్కసారిగా విధి వంచించింది. వరప్రసాద్ ప్రమాదవశాత్తు కాలుజారి జలపాతంలో పడిపోయాడు. చూస్తుండగానే నీటి ప్రవాహంలో మునిగి గల్లంతయ్యాడు. వలంటీర్ల శ్రమించినా.. కళ్లెదుటే స్నేహితుడు నీటిలో మునిగిపోతుంటే ఏమీ చేయలేని స్థితిలో ఆ ఇద్దరు యువకులు వేసిన కేకలు అడవిని ప్రతిధ్వనించాయి. ఆ అరుపులు విన్న స్థానిక సరియా గ్రామ వలంటీర్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా జలపాతం వద్దకు పరుగున వచ్చారు. వరప్రసాద్ను ప్రాణాలతో కాపాడుకోవాలనే తపనతో జలపాతంలో దిగి గాలింపు చేపట్టారు. సుమారు మూడు గంటల పాటు అలుపెరగకుండా శ్రమించి వరప్రసాద్ను బయటకు తీశారు. కానీ, అప్పటికే ఆ యువకుడి ఊపిరి ఆగిపోయింది. ఆ నిశ్చేతన దేహాన్ని చూసి స్నేహితులు అక్కడే కుప్పకూలిపోయారు. మృతుని తల్లిదండ్రులకు సమాచారం.. సమాచారం అందుకున్న అనంతగిరి ఎస్ఐ శంకరరావు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. విశాఖలోని మృతుని తల్లిదండ్రులకు ప్రమాదసమాచారం అందించారు. పర్యాటకులూ తస్మాత్ జాగ్రత్త! ప్రకృతి అందాలను చూడటానికి వచ్చే యువత, ఇక్కడి ప్రమాదకరమైన లోతులను అంచనా వేయలేక ప్రాణాలు కోల్పోతుండటంపై స్థానిక గిరిజనులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ‘సరియా జలపాతం చూడటానికి అందంగా ఉన్నా.. లోపల రాతి గుంటలు, నాచుతో చాలా ప్రమాదకరమైనది. పర్యాటకులు కాస్త జాగ్రత్తగా ఉండకపోతే ఈ అందాలే ప్రాణాలు తీస్తాయి’ అని స్థానికులు హెచ్చరిస్తున్నారు. -
ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి
● ఎస్పీ అమిత్ బర్దర్ ● వేసవి నేపథ్యంలో సిబ్బందికిరక్షణ కిట్ల పంపిణీ పాడేరు: వేసవి కాలంలో ఎండ తీవ్రత, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా.. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ అమిత్ బర్దర్ సూచించారు. పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సిబ్బందికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, టోపీలు, చలువ కళ్లద్దాలు, హ్యాండ్ గ్లౌజులు తదితర రక్షణ వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్లను ఎస్పీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున విధులు నిర్వహించే సమయంలో సిబ్బంది తరచుగా మంచినీరు, ఓఆర్ఎస్ ద్రావణం తాగాలని స్పష్టం చేశారు. ఎక్కువ సేపు నేరుగా ఎండలో నిలబడకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, టోపీలను తప్పనిసరిగా ధరించి ఎండ దెబ్బ తగలకుండా చూసుకోవాలని కోరారు. విధుల్లో ఉన్నప్పుడు ఎవరికై నా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ బి. అప్పలనాయుడు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ సంజీవరాజు, పాడేరు సీఐ దీనబంధు తదితరులు పాల్గొన్నారు. -
170 కిలోల గంజాయి పట్టివేత
● విలువ రూ.85 లక్షలు ● నలుగురి అరెస్టు గూడెంకొత్తవీధి: మండల కేంద్రంలో సుమారు రూ.85 లక్షల విలువైన 170 కిలోల గంజాయిని శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న నలుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. స్థానిక ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. సీలేరు నుంచి గంజాయి తరలుతుందనే ముందస్తు సమాచారంతో గూడెంకొత్తవీధిలో పాతవీధి జంక్షన్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో చింతపల్లి వైపు వెళ్తున్న ఒక కారు, బైక్ అనుమానాస్పదంగా కనిపించడంతో వాటిని ఆపి తనిఖీ చేయగా గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న చిత్తూరుకు చెందిన దామోదరం, రాజానగరానికి చెందిన సత్యనారాయణ, వెంకటేశ్వరరావుతో పాటు గూడెంకొత్తవీధికి చెందిన సిద్ధూను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చింతపల్లి సీఐ సుధాకర్ నిందితులను చింతపల్లి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది. దర్యాప్తులో భాగంగా గంజాయి రవాణాకు ఉపయోగించిన కారు, బైక్లను సీజ్ చేసినట్లు సీఐ వెల్లడించారు. -
మత్స్యగెడ్డ కన్నీరు
మత్స్యగెడ్డలో ఇసుక మాఫియా యథేచ్ఛగా దందా సాగిస్తోంది. నిబంధనలను బేఖాతరు చేస్తూ పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుకను తవ్వేస్తున్నారు. అక్రమార్కుల కాసుల కక్కుర్తికి ఇప్పటికే నలుగురు బలైనా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, పాడేరు: ఏజెన్సీలోని ప్రధాన జీవనది అయిన మత్స్యగెడ్డలో ఇసుక అక్రమ తవ్వకాలు మళ్లీ జోరందుకున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా మత్స్యగెడ్డలోని అనేక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వ్యాన్లు, టిప్పర్లు, ట్రాక్టర్ల యజమానులు, ఆపరేటర్లు ఈ ఇసుక దందాను గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారు. జి.మాడుగుల, పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల వరకు విస్తరించి ఉన్న మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతంలో సుమారు 15 వరకు అక్రమ ఇసుక క్వారీలు వెలిశాయి. దీనివల్ల ప్రతిరోజూ ఇక్కడ రూ.లక్షల విలువైన ఇసుక వ్యాపారం సాగుతోంది. ప్రస్తుతం మత్స్యగెడ్డ అంతా ఇసుక మాఫియా గుప్పిట్లోకి వెళ్లిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ● మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలు విచ్చలవిడిగా మారాయి. ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేనప్పటికీ, వాహనాల ఆపరేటర్లు స్థానిక గ్రామాల్లోని కొందరు గిరిజనులను డబ్బు ఆశ చూపి ఈ పనులకు ప్రోత్సహిస్తున్నారు. పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో జరిగే నిర్మాణాలకు ఈ మత్స్యగెడ్డ ఇసుకే ప్రధాన ఆధారంగా మారడంతో వ్యాన్ ఆపరేటర్లకు కాసుల వర్షం కురుస్తోంది. ● నిజానికి మైదాన ప్రాంతాల్లోని అధికారిక ఇసుక రీచ్ల నుంచే ఏజెన్సీకి ఇసుకను రవాణా చేసుకోవాలనే నిబంధన ఉంది. కానీ, అధికారులు ఈ నిబంధనలను పూర్తిగా గాలికొదిలేశారు. ప్రభుత్వ భవనాలతో పాటు స్థానిక ప్రజల ఇళ్ల నిర్మాణాలన్నింటికీ మత్స్యగెడ్డ ఇసుకనే వినియోగిస్తుండడంతో దీనికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకుని ఇసుక తవ్వకాలు, స్టాక్ పాయింట్ల నిర్వహణ, రవాణా, అమ్మకాలను సదరు ఆపరేటర్లు నిర్భయంగా సాగిస్తున్నారు. ● మండల కేంద్రాల మీదుగానే ఇసుక వాహనాలు అక్రమంగా రవాణా అవుతున్నా.. పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దూరాన్ని బట్టి ఒక్కో టిప్పర్ ఇసుకను రూ.10 వేల వరకు విక్రయిస్తుండడంతో అక్రమార్కులకు భారీగా లాభాలు దక్కుతున్నాయి. అలాగే గెడ్డ అవతలి వైపు ఉన్న ఒడిశా ప్రాంతానికి చెందిన వ్యాన్ ఆపరేటర్లు కూడా ఇక్కడి నుంచి ఇసుకను భారీగా తరలిస్తున్నారు. ● మత్స్యగెడ్డలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలు మరోవైపు స్థానికుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ప్రస్తుతం మత్స్యగెడ్డలో నీటి ప్రవాహం అధికంగా ఉంది. అయినప్పటికీ గిరిజనులు మెడ లోతు నీటిలో మునుగుతూ ఇసుకను సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన ఇసుకను ప్రమాదకర పరిస్థితుల్లో రవాణా చేస్తున్నారు. ఈ పనులన్నీ అత్యంత ప్రమాదకరమని తెలిసినా.. వ్యాన్ ఆపరేటర్లు కేవలం లాభాల కోసమే గిరిజనులను ప్రమాదాల్లోకి నెడుతున్నారు. ● మరోవైపు మత్స్యగెడ్డలో విచ్చలవిడిగా ఇసుకను తవ్వేస్తుండడంతో ఆయా ప్రాంతాలు లోతుగా మారుతున్నాయి. ఫలితంగా నదిలో స్నానాలకు దిగుతున్న చిన్నారులు, గిరిజనులు లోతు తెలియక ప్రమాదాల బారిన పడుతున్నారు. గత రెండు నెలల వ్యవధిలోనే మత్స్యగెడ్డలో స్నానానికి దిగి నలుగురు మృతి చెందినప్పటికీ, ఇసుక వ్యాపారులు గానీ, అధికారులు గానీ ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. ఇసుక మాఫియా గునపం పోట్లకు విలవిల రేయింబవళ్లు యథేచ్ఛగా తవ్వకాలు నిబంధనలు గాలికొదిలేసిన అక్రమార్కులు మృత్యుకుహరంగా మారిన నదీ గర్భం కాసుల కక్కుర్తికి ఇప్పటికే నలుగురు బలి నిమ్మకు నీరెత్తినట్టు అధికార యంత్రాంగం -
లక్ష్యసాధనతో ఉన్నత శిఖరాలు
● సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కృష్ణారావు ● నుర్మతి ఆశ్రమ పాఠశాల టెన్త్ టాపర్లకు ఘన సత్కారం జి.మాడుగుల: గిరిజన విద్యార్థినులు ఉన్నత విద్యతో పాటు లక్ష్యసాధనను అలవర్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని, తద్వారా తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని నుర్మతి సీఆర్పీఎఫ్ డి–198 బెటాలియన్ క్యాంప్ అసిస్టెంట్ కమాండెంట్ డి. కృష్ణారావు పిలుపునిచ్చారు. మండలంలోని నుర్మతి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో 2026 పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులను శుక్రవారం ఘనంగా సత్కరించారు. విశాఖపట్నం 198 బెటాలియన్ కమాండెంట్ రామ్ పలట్ ఆదేశాల మేరకు.. నుర్మతి క్యాంప్ అసిస్టెంట్ కమాండెంట్ కృష్ణారావు విద్యార్థినులకు శాలువాలు కప్పి, జ్ఞాపికలను అందించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన బాలికల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ఆడపిల్లలను రక్షిద్దాం – ఆడపిల్లలను చదివిద్దాం.. నినాదంతో ప్రతిభావంతులైన బాలికలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. వారి భవిష్యత్తుకు అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు. గ్రామాల్లోని ఇతర బాలికల్లోనూ చదువు పట్ల శ్రద్ధ పెంచేందుకు సీఆర్పీఎఫ్ క్యాంప్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఆశ్రమ పాఠశాల విద్యార్థినులకు దుస్తులు ఆరబెట్టుకునేందుకు వైర్ల ఏర్పాటు, పరీక్షల కోసం పెన్నుల పంపిణీ వంటి పలు సౌకర్యాలు కల్పించినట్లు వివరించారు. ఆడపిల్లలు చదువుకోవడం వల్ల కుటుంబంతో పాటు సమాజంలోనూ గొప్ప మార్పులు వస్తాయని, ఉన్నత విద్యతో మరిన్ని మంచి అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఐ లక్ష్మణరావు, ఎస్ఐ సాయిరాం పడాల్ ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థినులను ప్రత్యేకంగా అభినందించారు. 198–డీ బెటాలియన్ అధికారులు, జవాన్లతో పాటు వివిధ గ్రామాల విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
అత్త మృతికి కారణమైన కోడలు అరెస్టు
చోడవరం: అత్త మృతికి కారకురాలైన కోడల్ని అరెస్టు చేసినట్టు అనకాపల్లి డీఎస్పీ శ్రావణి తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంఽధించిన వివరాలను ఆమె వెల్లడించారు. పసలమ్మ, కొడుకు లక్ష్మణావు, కోడలు నాగమణి, మనవడుతో కలిసి మండలంలోని వెంకన్నపాలెంలో ఒకే ఇంట్లో ఉంటున్నారు. తరుచూ అత్త పసలమ్మ, కోడలు నాగమణి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఎప్పటిలాగే గురువారం కూడా ఇద్దరు మధ్య వివాదం తలెత్తింది. ఆ సమయంలో ఆవేశంతో కోడలు నాగమణి కర్రతో అత్త తలపై కొట్టి తీవ్రంగా గాయపరిచింది. గాయపడిన పసలమ్మను అనకాపల్లి ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్టు డీఎస్పీ చెప్పారు. కొడుకు లక్ష్మణరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితురాలైన నాగమణిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్టుతెలిపారు. కోర్టు రిమాండ్ విధించినట్టు డీఎస్పీ చెప్పారు. ఈ సమావేశంలో చోడవరం సీఐ అప్పలరాజు, ఎస్ఐ కార్తికేయ పాల్గొన్నారు.డీఎస్పీ శ్రావణి -
పోలీసు సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తాం
ఏఎస్పీ మోహన్రావు పోలీస్ సిబ్బంది సమస్యలను ఫోన్లో తెలుసుకుంటున్న ఏఎస్పీ మోహన్రావు అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ–సంపార్కు(ఫోన్ల్లో సమస్యలు చెప్పడం) కార్యక్రమం జరిగింది. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు, కానిస్టేబుళ్లు, హెచ్సీలు వారివారి వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలను ఫోన్లో ఏఎస్పీ ఎల్.మోహన్రావుకు విన్నవించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ఫోన్ ద్వారా 11 మంది పోలీస్ సిబ్బంది వారి సమస్యలను తెలియజేశారన్నారు. వారం రోజుల్లో వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. ప్రతి శుక్రవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకూ 93469 12011 నంబరుకు పోలీస్ సిబ్బంది సమస్యలు తెలియజేయవచ్చన్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి ఎస్పీ కార్యాలయానికి వచ్చి వివరించడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల ఫోన్ ద్వారా పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో కార్యాలయం ఏవో సిహెచ్.తిలక్ బాబు, ఆఫీస్ సూపరింటెండెంట్ ప్రతాప్ శేషయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఉద్యోగులు ఎర్రబ్యాడ్జీలతో ధర్నా
డిపో గేటు వద్ద ఎర్రబ్యాడ్జీలు ధరించి ధర్నా చేస్తున్న అసోసియేషన్ ఉద్యోగులు అనకాపల్లి: ప్రజా రవాణా శాఖ(ఆర్టీసీ) జోన్ పరిధిలో ఉద్యోగులపై ఉన్నత స్థాయి అధికారుల వేధింపులు, అక్రమ పనిష్మెంట్లు విధించడం అన్యాయమని ఏపీ పీటీడీ నేషనల్ మజ్ధూర్ యూనిటీ అసోసియేషన్ డిపో కార్యదర్శి ఏఎన్.రావు తెలిపారు. అసోసియేషన్ జోనల్ కమిటీ పిలుపు మేరకు స్థానిక డిపో గేటు వద్ద మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఎర్రబ్యాడ్జీలు ధరించి ఉద్యోగులు శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దిగువ స్థాయి శాఖ ఉద్యోగులపై ఉన్నత స్థాయి అధికారుల పనిఒత్తిడి, చిన్నచిన్న సమస్యలపై అక్రమ వేధింపులకు గురిచేయడం, విధులు నుంచి తొలగించడం వంటి చర్యలు అన్యాయమన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్.శంకరరావు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
కరెంట్ కాటుకు రెండు కుటుంబాల్లో చీకట్లు
నిర్మాణ రంగంలో కనీస నిబంధనలు పాటించని భవన యజమానులు.. విధుల్లో కనీస జాగ్రత్తలు తీసుకోని విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం ఇద్దరు నిరుపేద కార్మికుల ప్రాణాలను బలితీసుకుంది. శుక్రవారం చోటుచేసుకున్న రెండు వేర్వేరు విద్యుత్ ప్రమాదాలు రెండు కుటుంబాల్లో తీరని చీకట్లను నింపాయి. ఒక చోట నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనం ఒకరి ప్రాణం తీస్తే.. మరొక చోట లైన్మెన్ అజాగ్రత్త ఒక యువకుడిని మృత్యువాత పడేలా చేసింది. ఈ ఘోర ప్రమాదాలతో అటు గోపాలపట్నం, ఇటు ఆనందపురం పరిసర ప్రాంతాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. – గోపాలపట్నం/ఆనందపురంవిద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా.. ఆనందపురం మండలంలోని బోని గ్రామ పంచాయతీ పరిధిలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. పొలాల్లో విద్యుత్ సరఫరాలో సమస్య రావడంతో, స్థానిక లైన్మెన్ వెనుక కాళ్ల అప్పలరాజు అనే యువ ఎలక్ట్రీషియన్ వెళ్లాడు. సమస్యను పరిష్కరించేందుకు అప్పలరాజు విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా.. ఒక్కసారిగా కరెంట్ సరఫరా కావడంతో తీవ్ర విద్యుదాఘాతానికి గురయ్యాడు. స్తంభం పైనే నిశ్చేష్టంగా పడిపోయిన అప్పలరాజును స్థానికులు వెంటనే పద్మనాభం మండలం రేవిడి పీహెచ్సీకి తరలించారు. అతడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. నాలుగేళ్ల క్రితమే వివాహం మృతుడు అప్పలరాజు స్వస్థలం భీమిలి మండలం శింగనబంధ కాగా, అత్తవారు ఊరైన బోని గ్రామంలోనే ఉంటూ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితమే రమ్య అనే యువతితో ఇతనికి వివాహమైంది. చేతికొచ్చిన యువకుడు కళ్లముందే కరెంట్ షాక్తో మరణించడంతో భీమిలి, ఆనందపురం మండలాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆనందపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కిటికీ అద్దాలు బిగిస్తూ.. జీవీఎంసీ 57వ వార్డు సాకేతపురంలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ఆశవానిపాలెంకు చెందిన బొల్లా దుర్గారావు (30) అనే భవన నిర్మాణ కార్మికుడు ఓ ఇంటి నిర్మాణంలో కిటికీ అద్దాలు బిగిస్తున్నాడు. అయితే, భవనానికి అత్యంత సమీపంలోనే విద్యుత్ తీగలు ఉండటంతో, ఒక్కసారిగా విద్యుత్ షాక్కు గురై కిటికీ నుంచి కిందపడిపోయాడు. కేవలం రెండో అంతస్తు పైనుంచే పడిపోయినప్పటికీ, తల రోడ్డుకు బలంగా తగలడంతో దుర్గారావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆగని రోదనలు.. రూ. 14 లక్షల పరిహారం దుర్గారావు మరణవార్త విన్న భార్య అశ్విని, మూడేళ్లు, ఏడాది వయసున్న ఇద్దరు చిన్నారులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహంపై పడి రోదించిన తీరు స్థానికులను కన్నీరు పెట్టించింది. భవన యజమాని నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ బంధువులు, గ్రామస్థులు భవనం వద్దే మృతదేహంతో ఆందోళన చేపట్టారు. చివరకు మధ్యవర్తుల సమక్షంలో బాధిత కుటుంబానికి రూ. 13 లక్షల పరిహారం, దహన సంస్కారాలకు మరో లక్ష రూపాయలు ఇచ్చేందుకు యజమాని అంగీకరించాడు. ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం సిల్ట్ ప్లాన్ (జీ ప్లస్ 2) తీసుకున్న భవన యజమాని కనీస సెట్బ్యాక్లు వదలకుండా, విద్యుత్ లైన్లకు ఆనుకుని భవనాన్ని నిర్మించడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు మండిపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వల్లే ఇలాంటి ప్రాణాంతక పరిస్థితులు ఎదురవుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. నిర్మాణ స్థలంలో కార్మికుడు.. విద్యుత్ స్తంభంపై ఎలక్ట్రీషియన్ మృతి -
జూమ్ కాల్లో మస్తర్లు వేసిన వీఆర్పీ
నక్కపల్లి: మండలంలో రాజయ్యపేట పంచాయతీలో జాతీయ గ్రామీణ ఉపాధి పనులకు సంబంధించి మస్తర్లను వీఆర్పీ జూమ్ కాల్ ద్వారా ఇతర ప్రాంతాల్లో ఉన్నవారికి వేస్తున్నారని రాజయ్యపేట గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. రాజయ్యపేట పంచాయతీలో 15 రోజుల క్రితం ఉపాధి పనుల్లో జరిగిన అవకతవకలపై ఫిర్యాదు చేశారు. అయినప్పటికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఎంపీడీవో, ఏపీవో దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే సమగ్ర విచారణ జరిపి గ్రామంలోని ఉపాధి పనుల్లో అక్రమాలు అరికట్టి తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. జూమ్ కాల్ ద్వారా ఆన్లైన్ మస్తర్లు వేయడం, ఇరత ప్రాంతాల్లో ఉన్నవారిని గ్రామంలో ఉన్నట్టు చెప్పడం సైబర్ నేరంగా పరిగణించాలన్నారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. వెంటనే చర్యలు చేపట్టకపోతే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. దీనికి అధికారులు స్పందించి సోమవారం క్షేత్రస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నక్కపల్లి మండల అధ్యక్షుడు వెలగా సుధాకర్రావు, ప్రధాన కార్యదర్శి బొంది గురన్న, రాజయ్యపేట గ్రామ శాఖ అధ్యక్షుడు పిక్కి కోదండరావు, నాయకులు పిక్కి చిన్నారి, పిక్కి కోటి, మైలపల్లి రాము, పిక్కి కోటేశ్వరరావు, ఆధిరాజు, కోట ముసలి, బొందలను అప్పలరాజు, వాసుపల్లి నూకరాజు, పిక్కి రాజు తదితరులు పాల్గొన్నారు. చర్యలు తీసుకోవాలని రాజయ్యపేట గ్రామస్తుల ఆందోళన -
మట్టి తవ్వకాలు అడ్డగింత
ఎస్.రాయవరం: మండలంలోని కొరుప్రోలు చెరువులో గెడ్డపాలెం సమీపంలో అనుమతులు అతిక్రమించి మట్టి తవ్వకాలు చేస్తున్నారని ఉపాధి కూలీలు శుక్రవారం నిరసన తెలిపారు. ఇక్కడ మట్టి తవ్వకానికి వచ్చిన జేసీబీని అడ్డుకుని, ట్రాక్టర్లను వెనక్కి పంపారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ మాట్లాడుతూ పొలాలు కప్పుకుంటామని అనుమతులు తీసుకుని ఇరిగేషన్ అధికారుల కొలతలు, మార్కింగ్ పక్కన పెట్టి నచ్చిన చోట మట్టి తవ్వకాలు చేసి చెరువు గర్భాన్ని పాడు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పొలాలు కప్పుకోవడంతోపాటు, ఇతర వ్యాపారులకు మట్టి విక్రయిస్తున్నారని తెలిపారు. ఉపాధి కూలీలతోపాటు గ్రామస్తులు అక్కుపు జోగారావు, బద్రి నాగేశ్వరరావు, కేశవరెడ్డి కన్నయ్య, తిన్నబోతున్న అప్పారావు, నూకరాజు, కర్రి అప్పారావు, దేవ అప్పారావు, కాకర లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
సింహగిరిపై వైభవంగా స్వాతి హోమం
● రికార్డు స్థాయిలో పాల్గొన్న భక్తులు ● 603 టికెట్ల విక్రయం సింహాచలం: సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో శుక్రవారం స్వాతి నక్షత్ర హోమాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారి జన్మనక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ ఉత్తర రాజగోపురం ఎదురుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంగణంలో జరిగిన ఈ హోమంలో రికార్డు స్థాయిలో 505 మంది ఉభయదాతలు ప్రత్యక్షంగా, మరో 98 మంది భక్తులు పరోక్షంగా పాల్గొన్నారు. మొత్తం 603 టికెట్లను దేవస్థానం విక్రయించింది. ఉదయం నుంచి అర్చకులు శాస్త్రోక్తంగా హోమ క్రతువులు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులతో పాటు సుదర్శన పెరుమాళ్కు తిరువీధి నిర్వహించి అనంతరం హోమ మండపానికి తీసుకువచ్చారు. యాగశాలలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అగ్నిప్రతిష్ఠ, హోమం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పాల్గొన్న భక్తులకు ప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు. ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, అర్చకులు ఈకార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
దారిదోపిడీ కేసు ఛేదన
అగనంపూడి: వ్యక్తిని బెది రించి రూ.30 వేలు దోచుకున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు గాజువాక సౌత్ ఏసీపీ భవ్యారెడ్డి తెలిపారు. దువ్వాడ పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె కేసును సాంకేతిక పరిజ్ఞానంతో త్వరితగతిన ఛేదించామని చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం జంగం సరియా గ్రామానికి చెందిన కిల్లోల పరశురామ్ ఉపాధి కోసం లంకెలపాలేనికి వచ్చి, స్థానికంగా పనులు చేసుకుంటూ శ్రీరామ్నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 22న సాయంత్రం పరశురామ్ చెప్పులు కొనుగోలు చేసేందుకు గాజువాక వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆలిండియా రేడియో రిసీవింగ్ స్టేషన్ సమీపంలో మరుగుదొడ్డి కోసం తుప్పల్లోకి వెళ్లగా, అక్కడ ఉన్న ముగ్గురు వ్యక్తులు ఆయన చేతులు కట్టేసి ప్యాంటు జేబులో ఉన్న రూ.10 వేలు అపహరించారు. అనంతరం దాడి చేయడంతో పరశురామ్ ప్రతిఘటించలేకపోయాడు. నిందితులు ఆయన సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని ఫోన్పే ద్వారా మరో రూ.20 వేలను తమ ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. వెళ్లేప్పుడు ఆయన చేతికి ఉన్న వెండి కడియాన్ని కూడా లాక్కొని పరారయ్యారు. బాధితుడు జరిగిన విషయాన్ని తన యజమాని మోహన్కు తెలియజేయడంతో దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచి, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గుర్రం మణికంఠ, ఓ జువైనల్, దుర్గాప్రసాద్ ఈ దోపిడీకి పాల్పడినట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. నిందితుల నుంచి మొబైల్తో పాటు రూ.13,500 స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. జువైనల్పై 12 కేసులు, మణికంఠపై ఐదు కేసులు, దుర్గాప్రసాద్పై నాలుగు కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదై ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎస్ఐ సత్తిబాబు పాల్గొన్నారు. ముగ్గురు అరెస్ట్ -
భూ, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి
చోడవరం: భూ, రెవెన్యూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు కలెక్టర్ విజయ్కృష్ణన్ అన్నారు. చోడవరంలో శుక్రవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమానికి చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాల నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు వచ్చి, చాలా కాలంగా పెండింగ్లో ఉన్న భూ, రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం అర్జీలు అందజేశారు. కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొని అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో రెవెన్యూ, భూ సమస్యల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఆ సమస్యలను క్షేత్రస్థాయిలో వెంటనే పరిష్కరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. భూ పరిపాలన కమిషనర్(సీసీఎల్ఏ) నిబంధనలకు లోబడి భూ సమస్యలు పరిష్కరించనున్నట్టు ఆమె చెప్పారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను కేవలం ఒక్క నెలలోనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. భూ, రెవెన్యూకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు రెవెన్యూ కార్యాలయాల్లో పెండింగ్లో ఉండకూడదని జిల్లా అధికారులను ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో భూ సమస్యలు పరిష్కరించడం వల్ల కోర్టు కేసులు తగ్గుతాయని చెప్పారు. అంతకుముందు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో చేపట్టిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శార్యమన్ పటేల్, డీఆర్వో సత్యనారాయణ, అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డీవోలు షేక్ ఆయీషా, వి.వి. రమణ, చోడవరం తహసీల్దార్ రామారావుతోపాటు బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ విజయ కృష్ణన్ -
విషసర్పాలకే వణుకు పుట్టించే ధైర్యం.. వైల్డ్ వెంకట్
సాధారణంగా పాములంటే మనిషికి హడల్. ఆ భయంతోనే వాటిని విచక్షణా రహితంగా చంపేస్తుంటారు. అటువంటి విషపూరిత పాములను స్నేక్ కేచర్ సహాయంతో పట్టుకుని అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టడం, అవసరమైతే చికిత్సలు అందించడం చేస్తూ వాటి సంరక్షణకు పాటుపడుతున్నారు కొందరు పశువైద్యులు. సర్ప వైద్యం, వైల్డ్ లైఫ్ మెడిసినల్ విధానంలో మండలంలో పనిచేస్తున్న ముగ్గురు పశువైద్యులు వన్య ప్రాణుల సంరక్షణ మిషన్తో పాములకు రక్షకులుగా మారారు. కరుణ, ధైర్యం, అంకిత భావానికి స్ఫూర్తిదాయకంగా విష జంతువులకు హాని చేయకుండా నివారిస్తూ చికిత్సలు చేస్తున్నారు. స్నేక్ క్యాచర్ సాయంతో... మండలంలో పశువైద్యాధికారులు శివకుమార్, సుదీప్, శివప్రసాద్ సర్పవైద్యంతో వన్యప్రాణి సంరక్షణకు కృషి చేస్తున్నారు. మాడుగులకు చెందిన స్నేక్ కేచర్ వెంకట్ కింగ్ కోబ్రా వంటి హానికరమైన పాములను పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెడుతున్నారు. కింగ్ కోబ్రా అంతరించిపోతున్న జాతులలో ఒకటి. అందువల్ల అటువంటి పాములను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని వైద్యాధికారి శివకుమార్ చెబుతున్నారు. మన పరిసర ప్రాంతాల్లో కనిపిస్తే వెంటనే ఫారెస్టు అధికారికి సమాచారం అందిస్తే, వెంటనే రెస్క్యూ చేసి అటవీ ప్రాంతాల్లో విడిచిపెడతారని తెలిపారు. పాములు అనేవి పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని, పాములకు దెబ్బలు తగలితే ఆర్దోఫెడిక్స్, ఇతర అధునాతన శస్త్ర చికిత్సలు 60 వరకు రెండు సంవత్సరాల వ్యవధిలో చేపట్టామని వైద్యాధికారి శివకుమార్ పేర్కొన్నారు. ప్రత్యేక నైపుణ్యం కలిగిన పశువైద్య సర్జన్లు పెంపుడు జంతువులకు మించి తమ సేవలను ముఖ్యంగా పాములను రక్షించడానికి విస్తరించారు. భయం పోగొట్టేలా... విష జంతువుల పట్ల జనంలో భయం పొగొట్టడానికి శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించడం, పర్యావరణ సమతుల్యత గురించి అవగాహన కలి్పంచడం జరుగుతుంది. అలాగే వాటి వల్ల ప్రజలకు ఎటువంటి హాని జరగకుండా వాటి సహజ ఆవాసాలలోకి సురక్షితంగా మార్చబడతాయని వైద్యాధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా కోబ్రా రెస్క్యూ ఆపరేషన్లో చాలా సంవత్సరాల నైపుణ్యం ఉన్న మాడుగుల గ్రామానికి చెందిన పాము క్యాచర్ వైల్డ్ వెంకట్ దీనికి బలంగా మద్దతునిస్తున్నారు. సవాలుతో కూడిన రెస్క్యూ ఆపరేషన్లో పశువైద్యులకు తోడ్పాటు అందిస్తూ కీలక పాత్ర పోషిస్తున్నారు. పశువైద్యులతో సమన్వయం చేసుకుని అనేక పాములను రక్షించడంలో సహాయ పడుతున్నారు. ప్రజల్లో ఆయా విష జంతువుల పట్ల భయం పోగొడుతున్నారు. వన్య ప్రాణులను రక్షించాలి వన్య ప్రాణుల సంరక్షణ చట్టం అమలులో భాగంగా విష జంతువులను పూర్తిగా సంహరించకూడదు. ప్రజలకు ప్రాణహాని ఉందని, వీటిని సంహరిస్తున్నారు.స్నేక్ కేచర్ సహాయంతో రెండు సంవత్సరాల వ్యవధిలో 60 పాములకు శస్త్ర చికిత్సలు నిర్వహించాం. పశు వైద్యశాలల్లో ఈ చికిత్సలు నిర్వహించాం. – కె. శివకుమార్, పశువైద్యాధికారి, కింతలి వల్లాపురం, మాడుగుల మండలం స్ఫూర్తిదాయకం స్నేక్ కేచర్ వెంకట్ ఎన్నో విష జంతువులను పొలాల్లో, ఇళ్ల వద్ద చాకచక్యంగా పట్టుకుని, వాటిని సురక్షితంగా అడవిలో విడిచిపెడుతున్నారు. ఆయన సేవలు ప్రశంసనీయం. వన్యప్రాణ సంరక్షణ చట్టం ప్రకారం పశువైద్యాధికారుల సేవలు ప్రశంసనీయం. – శోలం రమేశ్, మాజీ సర్పంచ్ శంకరం గ్రామం, మాడుగుల మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా -
హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోండి
● ఎస్పీ అమిత్ బర్దర్ సాక్షి,పాడేరు: జిల్లాలోని ప్రతి ఒక్కరు బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని ఎస్పీ అమిత్బర్దర్ పిలుపునిచ్చారు. గురువారం పాతబస్టాండ్ అంబేడ్కర్ సెంటర్ వద్ద హెల్మెట్ వినియోగంపై ప్రజలకు ఎస్పీ అవగాహన కల్పించారు. అనంతరం హెల్మెట్ వినియోగంపై ప్రజలను చైతన్యపరుస్తూ బైక్ ర్యాలీని ప్రారంభించారు. హెల్మెట్ ధరించి బైక్ నడిపారు. జూనియర్ కళాశాల వరకు బైక్ ర్యాలీ ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. బైక్లు నడిపే సమయంలో ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని, తమపై అధారపడి ఉన్న కుటుంబ సభ్యు లను గుర్తు చేసుకుని బాధ్యతగా వ్యవహరించాలన్నారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు,కేసులు నమోదు,జరిమానాలు విధిస్తామని ఎస్పీ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీఐ దీనబంధు, ఎస్ఐలు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
శ్రీ కనకమహాలక్ష్మికి పంచామృతాభిషేకం
డాబాగార్డెన్స్: శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో గురువారం త్రికాల పంచామృతాభిషేకం వైభవంగా జరిగింది. గురువారం కావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయంలో నిర్వహించిన ఈ విశేష సేవలో పలువురు ఉభయదాతలు, భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజలో నేరుగా పాల్గొనాలనుకునే భక్తులు రూ.1,000 పూజా రుసుం చెల్లించాల్సి ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. దూరప్రాంతాల్లో ఉండి, ఈ ప్రత్యేక పూజను పరోక్ష పద్ధతిలో చేసుకోవాలనుకునే భక్తుల కోసం బ్యాంక్ ఖాతా సౌకర్యం కల్పించారు. ఆసక్తి గల భక్తులు టౌన్ కొత్తరోడ్డు బ్రాంచ్లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా సంఖ్య 060810011006691, ఐఎఫ్ఎస్సీ కోడ్ UBIN0806081 ద్వారా పూజా రుసుము చెల్లించి పరోక్ష సేవలను వినియోగించుకోవచ్చని సూచించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి కె.శోభారాణి, వేదపండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
అంధకారంలో జోలాపుట్టు
● నాలుగు రోజులుగా కరెంట్ కట్ ● ‘మాచ్ఖండ్’లో బ్రేకర్ పేలిపోవడంతో సమస్య ● అల్లాడుతున్న ప్రజలుముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాల సరిహద్దులోని జోలాపుట్టు పంచాయతీ కేంద్రంలో గత నాలుగు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గ్రామం అంధకారంలో మగ్గుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రాత్రి వేళల్లో చీకటి కారణంగా పాములు, ఇతర విషకీటకాలు ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఉందని గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. మాచ్ ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో 11 కేవీ బ్రేకర్ పేలిపోవడంతో ఈ విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం అక్కడ మరమ్మతులు జరుగుతున్నప్పటికీ, తిరిగి కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. వేసవి కాలం కావడంతో విద్యుత్ లేక ఫ్యాన్లు, కూలర్లు పనిచేయడం లేదు. దీంతో ఉక్కపోతకు తాళలేక వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.గ్రామంలోని చిన్న చిన్న వ్యాపారులు కరెంట్ లేక నష్టపోతున్నారు. ఫ్రిజ్లు పనిచేయకపోవడంతో పాలు, కూరగాయలు వంటి నిత్యావసర వస్తువులు కుళ్లిపోతున్నాయి. సెల్ఫోన్లలో చార్జింగ్ అయిపోవడంతో, ఫోన్లు ఆన్ చేసుకోవడానికి జోలాపుట్టు ప్రజలు సరిహద్దు దాటి ఒడిశా రాష్ట్రంలోని గ్రామాలకు వెళ్లాల్సి వస్తోంది.విద్యుత్ లేక మోటార్లు నడవకపోవడంతో కుళాయిల ద్వారా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో తాగునీటి కోసం మైళ్ల దూరం నడిచి వెళ్లాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాచ్ ఖండ్ విద్యుత్ కేంద్రం నుంచి జోలాపుట్టు ప్రాజెక్టు ప్రాంతానికి విద్యుత్ సరఫరా చేయాల్సి ఉండగా, నాలుగు రోజులుగా చీకట్లోనే ఉంచుతూ ప్రాజెక్టు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సుదీర్ఘ విద్యుత్ సమస్యపై విసిగిపోయిన జోలాపుట్టు గ్రామస్తులు గురువారం వాహనాలలో మాచ్ ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి తరలివెళ్లారు. అక్కడ ప్రాజెక్టు ఎస్ఈ సీహెచ్. అప్పాజీని కలిసి తాము పడుతున్న ఇబ్బందులను వివరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. మాచ్ ఖండ్ విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగి బ్రేకర్లు పూర్తిగా పాడైపోయాయని, ప్రస్తుతం మరమ్మతులు జరుగుతున్నాయని తెలిపారు. అయితే ఈ మరమ్మతులు పూర్తి కావడానికి కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని, అంతవరకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించడం సాధ్యం కాకపోవచ్చని ఆయన తేల్చి చెప్పారు. కలెక్టర్ స్పందించాలని వేడుకోలు మాచ్ఖండ్ నుంచి కరెంట్ రావడం ఆలస్యమయ్యేలా ఉన్నందున, కలెక్టర్ తక్షణమే ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని జోలాపుట్టు గ్రామస్తులు కోరుతున్నారు. ప్రత్యామ్నాయంగా ముంచంగిపుట్టు మండలం నుంచి జోలాపుట్టు గ్రామానికి తాత్కాలికంగా విద్యుత్ సరఫరా లైన్ ఇచ్చేలా చర్యలు తీసుకుని, తమను అంధకారం నుంచి కాపాడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. -
అత్తపై కర్రతో కోడలు దాడి
చోడవరం : అత్తపై కోడలు దాడి చేయడంతో అత్త మృతిచెందిన సంఘటన వెంకన్నపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. మండలంలోని వెంకన్నపాలెం గ్రామానికి చెందిన కరక పసలమ్మ (46), తన కోడలు కరక నాగమణి మధ్య బుధవారం చిన్నపాటి వివాదం జరిగింది. ఈ గొడవలో అత్తపై ఆవేశంతో విచక్షణారహితంగా కోడలు నాగమణి కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. తలపైన బలంగా గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావంతో గొడవ జరిగిన ప్రదేశంలో అపస్మారక స్థితిలో అత్త పసలమ్మ పడిపోయింది. దీంతో చుట్టుపక్కల వారు వెంటనే 108కి సమాచారం ఇవ్వగా తీవ్ర గాయాలతో పడి ఉన్న పసలమ్మను 108సిబ్బంది హుటాహుటిన అనకాపల్లి 100పడకల ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పసలమ్మ మృతి చెందింది. అత్తను కర్రతో కొట్టి ఆమె మృతికి కారణమైన కోడలు నాగమణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేసి నాగమణిని అరెస్టు చేసినట్టు చోడవరం సీఐ అప్పలరాజు చెప్పారు. -
ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటాలి
అరకులోయ (సాక్షి, పాడేరు): సమాజంలో ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించడంతో పాటు, బాధ్యతగా కనీసం 10 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎన్సీసీ 13వ బెటాలియన్ లెఫ్టినెంట్ కల్నల్ నీరజ్కుమార్ పిలుపునిచ్చారు. అరకులోయ ప్రాంతంలో జరుగుతున్న ట్రెక్కింగ్ క్యాంపునకు రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన ఎన్సీసీ విద్యార్థులకు ‘గ్రీన్ కై ్లమేట్ టీం’ ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం ఆధ్వర్యంలో గురువారం పర్యావరణ పరిరక్షణ అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో లెఫ్టినెంట్ కల్నల్ నీరజ్కుమార్ మాట్లాడుతూ.. యువత విద్యార్థి దశ నుంచే పర్యావరణంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. అటవీశాఖతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా పర్యావరణ పరిరక్షణకు మరింత కృషి చేయాలని కోరారు. మహావృక్షాలు మన జీవావరణ వ్యవస్థకు పునాదులని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అడవులు పుడమి తల్లికి ఊపిరితిత్తులు.. సబ్ డీఎఫ్వో శ్రీవాణి సబ్ డీఎఫ్వో కడలి శ్రీవాణి మాట్లాడుతూ.. అడవులు పుడమి తల్లికి ఊపిరితిత్తుల లాంటివని, వాటిని సంరక్షించుకోవాల్సిన కనీస బాధ్యత మానవాళిదేనని స్పష్టం చేశారు. ప్రకృతి వనరులను, జీవవైవిధ్యాన్ని కాపాడుకున్నప్పుడే భావితరాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఎన్సీసీ ప్రతినిధి రాజేంద్రన్, సీనియర్ అసిస్టెంట్ గోవిందరావు, సామాజిక వనాల ప్రతినిధి పి.రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.లెఫ్ట్నెంట్ కల్నల్ నీరజ్కుమార్ -
ఆర్టీసీ కాంప్లెక్స్లో పూర్తిస్థాయి సౌకర్యాలు
అధిక ఉష్ణోగ్రతలతో పెరిగిన విద్యుత్ వినియోగం సాక్షి, పాడేరు: గత కొద్దిరోజులుగా ఎల్నినో ప్రభావం, వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని అల్లూరి సర్కిల్ విద్యుత్ పంపిణీ సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ జీఎన్ ప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అకాల గాలులు, పిడుగులతో కూడిన వర్షాల వల్ల అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందన్నారు. తమ సర్కిల్ పరిధిలోని ఈ రెండు జిల్లాల వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడమే కాకుండా, ఎలాంటి అంతరాయాలు లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా సిబ్బంది పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే పాడేరులోని సర్కిల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్ (టెక్నికల్) ఆధ్వర్యంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. విద్యుత్ సరఫరాలో లోపాలున్నా, ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వినియోగదారులు వెంటనే కంట్రోల్ రూమ్ నంబరును సంప్రదించాలని ఎస్ఈ కోరారు. సెంట్రలైజ్డ్ టోల్ఫ్రీ నంబర్ 1912, సర్కిల్ స్థాయి కంట్రోల్ రూమ్ నంబర్లు పాడేరు డివిజన్ 9440812491 (ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్), పోలవరం జిల్లా పరిధిలో 7382585554, 9490610027(ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) 24గంటల పాటు అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు. -
హగీతం
క్తోమాడుగుల రూరల్ : సాధారణంగా పాములంటే మనిషికి హడల్. ఆ భయంతోనే వాటిని విచక్షణా రహితంగా చంపేస్తుంటారు. అటువంటి విషపూరిత పాములను స్నేక్ కేచర్ సహాయంతో పట్టుకుని అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టడం, అవసరమైతే చికిత్సలు అందించడం చేస్తూ వాటి సంరక్షణకు పాటుపడుతున్నారు కొందరు పశువైద్యులు. సర్ప వైద్యం, వైల్డ్ లైఫ్ మెడిసినల్ విధానంలో మండలంలో పనిచేస్తున్న ముగ్గురు పశువైద్యులు వన్య ప్రాణుల సంరక్షణ మిషన్తో పాములకు రక్షకులుగా మారారు. కరుణ, ధైర్యం, అంకిత భావానికి స్ఫూర్తిదాయకంగా విష జంతువులకు హాని చేయకుండా నివారిస్తూ చికిత్సలు చేస్తున్నారు. స్నేక్ క్యాచర్ సాయంతో... మండలంలో పశువైద్యాధికారులు శివకుమార్, సుదీప్, శివప్రసాద్ సర్పవైద్యంతో వన్యప్రాణి సంరక్షణకు కృషి చేస్తున్నారు. మాడుగులకు చెందిన స్నేక్ కేచర్ వెంకట్ కింగ్ కోబ్రా వంటి హానికరమైన పాములను పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెడుతున్నారు. కింగ్ కోబ్రా అంతరించిపోతున్న జాతులలో ఒకటి. అందువల్ల అటువంటి పాములను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని వైద్యాధికారి శివకుమార్ చెబుతున్నారు. మన పరిసర ప్రాంతాల్లో కనిపిస్తే వెంటనే ఫారెస్టు అధికారికి సమాచారం అందిస్తే, వెంటనే రెస్క్యూ చేసి అటవీ ప్రాంతాల్లో విడిచిపెడతారని తెలిపారు. పాములు అనేవి పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని, పాములకు దెబ్బలు తగలితే ఆర్దోఫెడిక్స్, ఇతర అధునాతన శస్త్ర చికిత్సలు 60 వరకు రెండు సంవత్సరాల వ్యవధిలో చేపట్టామని వైద్యాధికారి శివకుమార్ పేర్కొన్నారు. ప్రత్యేక నైపుణ్యం కలిగిన పశువైద్య సర్జన్లు పెంపుడు జంతువులకు మించి తమ సేవలను ముఖ్యంగా పాములను రక్షించడానికి విస్తరించారు. భయం పోగొట్టేలా... విష జంతువుల పట్ల జనంలో భయం పొగొట్టడానికి శాసీ్త్రయ పద్ధతులను ఉపయోగించడం, పర్యావరణ సమతుల్యత గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. అలాగే వాటి వల్ల ప్రజలకు ఎటువంటి హాని జరగకుండా వాటి సహజ ఆవాసాలలోకి సురక్షితంగా మార్చబడతాయని వైద్యాధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా కోబ్రా రెస్క్యూ ఆపరేషన్లో చాలా సంవత్సరాల నైపుణ్యం ఉన్న మాడుగుల గ్రామానికి చెందిన పాము క్యాచర్ వైల్డ్ వెంకట్ దీనికి బలంగా మద్దతునిస్తున్నారు. సవాలుతో కూడిన రెస్క్యూ ఆపరేషన్లో పశువైద్యులకు తోడ్పాటు అందిస్తూ కీలక పాత్ర పోషిస్తున్నారు. పశువైద్యులతో సమన్వయం చేసుకుని అనేక పాములను రక్షించడంలో సహాయ పడుతున్నారు. ప్రజల్లో ఆయా విష జంతువుల పట్ల భయం పోగొడుతున్నారు. పామును చాకచక్యంగా పట్టుకుంటున్న స్నేక్ కేచర్ వెంకట్ కె.జె.పురం పశువైద్యశాలలో పాముకు శస్త్ర చికిత్స చేస్తున్న పశువైద్యాధికారి డాక్టర్ శివకుమార్ విషప్రాణులకు ప్రాణదాతలు శస్త్ర చికిత్సలతో పాములకు రక్షణ పర్యావరణ సమతుల్యతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న వైనం సర్పవైద్యుల స్ఫూర్తిదాయక సేవలు స్ఫూర్తిదాయకం స్నేక్ కేచర్ వెంకట్ ఎన్నో విష జంతువులను పొలాల్లో, ఇళ్ల వద్ద చాకచక్యంగా పట్టుకుని, వాటిని సురక్షితంగా అడవిలో విడిచిపెడుతున్నారు. ఆయన సేవలు ప్రశంసనీయం. వన్యప్రాణ సంరక్షణ చట్టం ప్రకారం పశువైద్యాధికారుల సేవలు ప్రశంసనీయం. – శోలం రమేశ్, మాజీ సర్పంచ్ శంకరం గ్రామం, మాడుగుల మండలం వన్య ప్రాణులను రక్షించాలి వన్య ప్రాణుల సంరక్షణ చట్టం అమలులో భాగంగా విష జంతువులను పూర్తిగా సంహరించకూడదు. ప్రజలకు ప్రాణహాని ఉందని, వీటిని సంహరిస్తున్నారు.స్నేక్ కేచర్ సహాయంతో రెండు సంవత్సరాల వ్యవధిలో 60 పాములకు శస్త్ర చికిత్సలు నిర్వహించాం. పశు వైద్యశాలల్లో ఈ చికిత్సలు నిర్వహించాం. – కె. శివకుమార్, పశువైద్యాధికారి, కింతలి వల్లాపురం, మాడుగుల మండలం -
ఆకతాయిల బరితెగింపు
మన్యం ఘాట్ రోడ్డు ప్రయాణంలో ప్రమాదాల నివారణకు రక్షణ కవచాల్లా నిలిచే మలుపుల అద్దాలు (కాన్వెక్స్ మిర్రర్లు) ఇప్పుడు ఆకతాయిల చేతిలో ధ్వంసమవుతున్నాయి. జాతీయ రహదారి 516ఈ పరిధిలోని రంపుల ఘాట్ రోడ్డులో కొందరు దుండగులు అద్దాలను పగులగొడుతూ, మరికొన్ని చోట్ల మాయం చేస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కీలకమైన మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడటంతో, వాహనదారులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి దాపురించింది. ● ఘాట్ రోడ్డులో ప్రమాద నివారణఅద్దాల ధ్వంసం ● భయాందోళనలో ప్రయాణికులు గూడెంకొత్తవీధి: జాతీయ రహదారి 516ఈ పరిధిలోని రంపుల ఘాట్ రోడ్డులో ఆకతాయిలు బరితెగిస్తున్నారు. ప్రమాదాల నివారణ కోసం అధికారులు ప్రమాదకరమైన యూ–టర్న్ (మలుపుల) వద్ద ఏర్పాటు చేసిన పుటాకార (కాన్వెక్స్) అద్దాలను కొందరు దుండగులు పగులగొడుతున్నారు. మరికొన్ని చోట్ల అసలు అద్దాలు లేకుండా మాయం చేస్తుండటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రమాదాలకు దారితీస్తున్న అద్దాల మాయం రంపుల ఘాట్ రోడ్డులో అనేక ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి. ఘాట్ రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ఎదురుగా వస్తున్న వాహనం స్పష్టంగా కనిపించి, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఈ అద్దాలను ఏర్పాటు చేశారు. ఘాట్ రోడ్డు ప్రయాణంలో ఈ అద్దాలు ఎంతో కీలకంగా మారాయి. అయితే, ప్రస్తుతం కీలకమైన మలుపుల వద్ద అద్దాలు పగిలిపోవడం, కొన్నిచోట్ల పూర్తిగా మాయమవడంతో ప్రయాణికులు మలుపుల వద్ద ఎటునుంచి ఏ వాహనం వస్తుందో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రయాణికుల డిమాండ్లు: జాతీయ రహదారిపై ఉన్న ప్రభుత్వ ఆస్తులను పాడుచేస్తూ, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆకతాయిలను పోలీసులు గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదాలు జరగకముందే జాతీయ రహదారి అధికారులు స్పందించి, మాయమైన చోట్ల తక్షణమే కొత్త అద్దాలను ఏర్పాటు చేయాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
మట్టి అక్రమ తరలింపు అడ్డగింత
అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలను అడ్డుకుంటున్న గ్రామస్తులు మునగపాక: మండలంలోని పాటిపల్లి పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ చెరువు నుంచి మట్టి అక్రమ తరలింపును గురువారం రాత్రి స్థానికులు అడ్డుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఇతర ప్రాంతాలకు మట్టి తరలిస్తున్నారని తెలుసుకున్న స్థానికులు మట్టి లారీలను పట్టుకొని అడ్డగించారు. అక్రమార్కులు రాత్రుల సమయంలో మట్టిని తరలిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మట్టి తరలింపునకు సంబంధించి అధికారుల అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా గుట్టుచప్పుడు కాకుండా సమీపంలోని ఇటుక బట్టీలకు మట్టిని తరలించుకుపోతున్నారు. విషయం తెలుసుకున్న పాటిపల్లికి చెందిన పలువురు మట్టి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. మట్టి తరలింపునకు అనుమతులు ఎవరిచ్చారని లారీ డ్రైవర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చెరువులు, కాలువల్లో మట్టి అక్రమ తరలింపును నిరోధించాలని లేకుంటే ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళన చేస్తామంటూ స్థానికులు హెచ్చరించారు. -
విశాఖలో ‘విష’వలయం
సాక్షి, విశాఖపట్నం: అందమైన సాగరతీరం.. ఆహ్లాదకరమైన వాతావరణం.. అంటూ విశాఖపట్నం గురించి గొప్పగా చెప్పుకోవడం ఇక గతమేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గడిచిన కొన్ని రోజులుగా నగరం కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతుంటే.. చంద్రబాబు ప్రభుత్వం అబ్బే.. ఇదంతా వాతావరణానిదే తప్పంటూ చేతులు దులిపేసుకుంటోంది. ఈ ఏడాది నగర పరిధిలో ప్రతి 10 రోజుల్లో 7 రోజుల పాటు ప్రజలు విషవాయువులే పీల్చుతున్నారంటూ రైస్పెరర్ లివింగ్ సైన్సెస్ సంస్థ తన పరిశోధనల్లో వెల్లడించింది. మూడేళ్ల కాలంలో ఈ ప్రమాదకరమైన పరిస్థితులు క్రమంగా పెరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. పరిశ్రమలు, వాహనాల కారణంగా కాలుష్య మేఘాలు కమ్ముకుంటున్నా..ఏపీపీసీబీ అధికారులు మాత్రం నిద్ర నటిస్తున్నారు. భయపెడుతున్న గణాంకాలు..! రైస్పెరర్ లివింగ్ సైన్సెస్ సంస్థ విడుదల చేసిన తాజా గణాంకాలు విశాఖ కాలుష్య తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. 2024 నుంచి 2026 వరకు పరిశీలిస్తే, రాష్ట్రంలోనే అత్యంత కలుషితమైన ప్రాంతాల్లో జీవీఎంసీ మానిటరింగ్ స్టేషన్ వరుసగా మూడేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతుండటం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. 2026 జనవరి నుంచి ఏప్రిల్ వరకు 70.68 శాతం రోజుల్లో గాలిలోని ప్రమాదకర ధూళి కణాలు (పీఎం10) భద్రతా ప్రమాణాలను దాటేశాయి. పరిశ్రమలు, వాహనాల కాలుష్యమూ ఎక్కువే.! వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే ప్రమాదకర నైట్రోజన్ డయాకై ్సడ్ స్థాయిలు కూడా రెండేళ్ల వ్యవధిలో ఏకంగా 34 శాతం మేర పెరిగాయి. నైట్రోజన్ డయాకై ్సడ్ వార్షిక సురక్షిత పరిమితి 40 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్లు కాగా.. ఇది 2024లో 35.25గా ఉండగా.. ఈ ఏడాది ఏకంగా 47.41కి చేరుకొని ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రాష్ట్ర సగటు కంటే దారుణంగా..! రాష్ట్రం మొత్తం మీద పీఎం10 సగటు 84 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్లు ఉంటే, ఒక్క విశాఖలో 139.59గా ఉంది. నైట్రోజన్ డయాకై ్సడ్(ఎన్వో2) సగటు కేవలం 23 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్లు కాగా, విశాఖలో అది ఏకంగా రెట్టింపు కంటే ఎక్కువగా 47.41 గా నమోదైంది. వాటివల్లే ఎక్కువ కాలుష్యం.! విశాఖలో ఈ కాలుష్య విలయానికి ఏ ఒక్కటో కారణం కాదని.. సంస్థ పరిశోధనల్లో స్పష్టం చేసింది. ముఖ్యంగా విశాఖలో విస్తరించి ఉన్న పరిశ్రమలు, పోర్టులు, పెరుగుతున్న వాహన రద్దీ కలగలిసి ప్రజలకు ప్రాణసంకటంగా మారుతున్నాయి. అత్యంత జనసాంద్రత గల ప్రాంతంలోనే ఈ భారీ పరిశ్రమలుండటం, దానికి తోడు వాహనాల రద్దీ తోడవడంతో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుండటమే విశాఖ విషతుల్యం కావడానికి కారణమని గణాంకాలు చెబుతున్నాయి. ఏడాదిలో సగానికి పైగా రోజులు విషవాయువులే విశాఖ ప్రజలు ఏడాదిలో సగానికి పైగా రోజులు విషవాయువులనే పీలుస్తున్నారని మా పరిశోధనల్లో స్పష్టమైంది. కాలుష్య కారకాలైన పరిశ్రమలను జవాబుదారీ చేసేలా కఠినమైన ప్రణాళిక, అమలు అవసరం. కాలుష్య నియంత్రణకు శాసీ్త్రయ అధ్యయనాలు, నిర్దిష్టమైన పారిశ్రామిక ఉద్గార నియంత్రణ లక్ష్యాలు అత్యవసరం. కార్సినోజెనిక్ వాయువులతో పాటు గతంతో పోలిస్తే.. ధూళి కణాలు పెరగడం ఆందోళన కలిగించే అంశం. చెట్లు పెంచడమే మన ముందున్న తక్షణ కర్తవ్యం. –రోనక్ సుతారియా, రైస్పెరర్ లివింగ్ సైన్సెస్ సంస్థ సీఈవో నగరంలో కాలుష్య పరిస్థితులు పీఎం 2.5 పరిస్థితి మరింత దారుణం.! ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకుపోయే అతి సూక్ష్మ కణాల (పీఎం2.5) పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. పీఎం 2.5 సురక్షిత వార్షిక పరిమితి 40 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్లు కాగా.. ఇది 2024లో 45.14 ఉండగా.. 2025లో 51.68, 2026లో 47.66 గా నమోదైంది. -
ముచ్చటగా మూడో సంక్రాంతికి వస్తున్నాం
సింహాచలం: వెంకటేష్, కల్యాణ్రామ్ కాంబినేషన్లో తాము తీయబోయే కొత్త సినిమాతో ముచ్చటగా మూడవసారి 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని ప్రముఖ సినీ దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శుక్రవారం ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సినిమా స్క్రిప్ట్ను స్వామివారి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో అనిల్ రావిపూడి పేరిట అర్చకులు స్వామికి అష్టోత్తర శతనామావళి పూజ జరిపించి, వేద ఆశీర్వచనం అందజేశారు. ఏఈవో శ్రీనివాసరావు ఆయనకు స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలను బహూకరించారు. సంక్రాంతి సెంటిమెంట్.. రాయలసీమ బ్యాక్డ్రాప్! దర్శనానంతరం అనిల్ రావిపూడి మీడియాతో మాట్లాడారు. సంక్రాంతి పండుగ తనకు ఎంతో కలిసొచ్చే సెంటిమెంట్ అని తెలిపారు. గతంలో 2025 సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’, ఆ తర్వాత 2026లో ‘సంక్రాంతికి మన శంకరవరప్రసాద్’ సినిమాలు విడుదలై సూపర్డూప్ హిట్గా నిలిచాయని గుర్తుచేశారు. అదే జోష్తో ఈసారి కూడా 2027 సంక్రాంతి పండుగకు వరుసగా మూడోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నామన్నారు. పూర్తి కామెడీ, కుటుంబ నేపథ్యంతో పాటు రాయలసీమ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని, ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. స్క్రిప్ట్లన్నీ వైజాగ్లోనే.. తాను తీసిన తొలి చిత్రం ‘పటాస్’ నుంచి ఇప్పటివరకు అన్ని సినిమాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరించారని అనిల్ రావిపూడి కృతజ్ఞతలు తెలిపారు. తనకు విశాఖపట్నం అంటే ఎంతో ఇష్టమని, తాను తీసే ప్రతి సినిమాకు విశాఖలోనే స్క్రిప్ట్ను సిద్ధం చేసుకుంటానని వెల్లడించారు. స్వామివారి దర్శనంలో ఆయన వెంట కథా రచయిత ఎస్.కృష్ణ, సింహాచలం ప్రాంతానికి చెందిన ఇందు రమణ తదితరులు ఉన్నారు. -
దళారుల పాలు
ఒకవైపు ప్రతికూల వాతావరణం, మరోవైపు వ్యాపారుల కుమ్మక్కు కారణంగా జీడిపిక్కల ధరలు దారుణంగా పడిపోయాయి.తోటల నిర్వహణ,సస్యరక్షణ ఖర్చులు భారీగా పెరగడంతో జీడి రైతులు వరుసగా ఐదేళ్లుగానష్టాలనే చవిచూస్తున్నారు. మరోవైపు గతేడాదితో పోలిస్తే క్వింటాకు రూ.500 వరకు ధర తగ్గడంతో మొక్కజొన్న రైతుల పరిస్థితి కూడా ఘోరంగా మారింది.ఆశించిన దిగుబడులు, గిట్టుబాటు ధరలు లేక అప్పులపాలవుతున్న ఇరు పంటల రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఈ వరుస నష్టాల నేపథ్యంలో, ఇకపై జీడి పంటకు బదులుగా ఇతర ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపడమే మేలని రైతులు భావిస్తున్నారు. రెక్కల కష్టంకొయ్యూరు: దశాబ్దం కిందటి వరకు జీడి రైతుల పరిస్థితి చాలా బాగుండేది. వాతావరణం అనుకూలించడంతో పాటు పలాస నుంచి వచ్చే వ్యాపారులు గిట్టుబాటు ధరకు పంటను కొనుగోలు చేసేవారు. కానీ ప్రస్తుతం స్థానిక వ్యాపారులు ఎక్కువై, పలాస వ్యాపారులను ఇక్కడికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పథకం ప్రకారం.. చిన్న వర్షం కురిసినా పిక్కల్లో పప్పు పాడైపోతుందనే సాకుతో వ్యాపారులు తక్షణమే ధరలు తగ్గించేస్తున్నారు. సీజన్ ప్రారంభంలో 80 కిలోల బస్తా ధర రూ.11,500 పలుకగా, ఆ తర్వాత దాన్ని ఏకంగా రూ.9వేలకు పడేశారు. మళ్లీ సీజన్ ముగిసి, రైతుల వద్ద నిల్వలు ఉండవని తెలిసాక వ్యాపారులు ధరను రూ.11వేలకు పెంచారు. సాధారణంగా కిలో పిక్కలకు 300 గ్రాముల పప్పు వస్తేనే తమకు లాభాలు ఉంటాయని వ్యాపారులు లెక్కలు గడుతుంటారు. కొనుగోలు చేయని జీసీసీ.. గిరిజన ప్రాంతాల్లో కాఫీని కొనుగోలు చేస్తున్న గిరిజన సహకార సంస్థ, జీడిపిక్కలను మాత్రం కొనుగోలు చేయడం లేదు. గతంలో జీసీసీ ఎండీ ఒకరు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ అది సాకారం కాలేదు. ఈ ప్రాంతంలో దాదాపు 35 వేల ఎకరాల్లో జీడి తోటలు విస్తరించి ఉన్నా, ఒక్కటంటే ఒక్క ప్రాసెసింగ్ యూనిట్ కూడా లేదు. దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నా ఐటీడీఏ అధికారులు పట్టించుకోవడం లేదు. ఏటా నష్టాలు వస్తుండటంతో విసిగిపోయిన రైతులు జీడికి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. మొక్కజొన్న రైతుల దిగులు గత ఏడాది కిలో మొక్కజొన్నను రూ.26కు కొనుగోలు చేసిన వ్యాపారులు, ఈ ఏడాది ప్రారంభంలో కేవలం రూ.16కే కొన్నారు. ఆ తర్వాత రూపాయి పెంచి రూ.17కు కొనుగోలు చేశారు. దీనివల్ల రైతులకు నష్టాలు మరింత పెరిగాయి. పొత్తులను, పిక్కలను ఎక్కువ రోజులు ఎండబెట్టడం వల్ల పిక్కల బరువు తగ్గిపోయి నష్టపోవాల్సి వస్తోంది. మైదాన ప్రాంతాల్లో మొక్కజొన్న కండెలను వంటచెరుకుగా ఉపయోగిస్తుండగా, ఇక్కడి రైతులు మాత్రం వాటిని వృథాగా బయట పారేస్తున్నారు. ఒక వైపు ప్రతికూల వాతావరణం మరోవైపు వ్యాపారుల కుమ్మక్కు పడిపోతున్న జీడిమామిడి, మొక్కజొన్న ధరలు పెరుగుతున్న పెట్టుబడులు..తగ్గుతున్న దిగుబడులు సాగు గిట్టుబాటు కాక నష్టాలు కొనుగోలు చేయని జీసీసీ,పట్టించుకోని ఐటీడీఏ అప్పుల పాలవుతున్న అన్నదాత దోపిడీకి చెక్ పెట్టాలి స్థానికంగా జీడిమామిడి విస్తీర్ణాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా ఒక హార్టికల్చర్ అధికారిని నియమించాలి. ప్రస్తుతం మూడు మండలాలకు కలిపి ఒకరే అధికారి ఉండటంతో క్షేత్రస్థాయి పర్యవేక్షణ లోపించింది. తమకు గిట్టుబాటు ధర దక్కాలంటే ఐటీడీఏ లేదా జీసీసీ సంస్థలు దళారులతో ప్రమేయం లేకుండా నేరుగా రైతుల నుంచే జీడిపిక్కలను కొనుగోలు చేయాలి. స్థానికంగా ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి. దీనివల్ల తమ పంటను నేరుగా అక్కడే విక్రయించుకునే వీలుంటుంది. అంతేకాకుండా, వందలాది మంది స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. – డి.కనకరాజు, రైతు, చింతలపూడి, కొయ్యూరు మండలం -
ఆర్కే బీచ్లో ఇద్దరు మహిళల ఆత్మహత్యా యత్నం
ఏయూక్యాంపస్: కుటుంబ సమస్యల కారణంగా మనస్తాపానికి గురై సముద్రంలో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఇద్దరు మహిళలను జీవీఎంసీ గజ ఈతగాళ్లు, పోలీసులు సమయస్ఫూర్తితో రక్షించారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... కంచరపాలెం ప్రాంతానికి చెందిన జి. సత్యవతి, డి.లక్ష్మి అనే ఇద్దరు మహిళలు గురువారం మధ్యాహ్నం రామకృష్ణ బీచ్కు చేరుకున్నారు. కుటుంబ సమస్యలతో వేర్వేరుగా ఇక్కడికి వచ్చిన వీరిద్దరూ.. జీవితంపై విరక్తి చెంది సముద్రంలో మునిగి చనిపోవాలనే ఉద్దేశంతో లోపలికి వెళ్లారు. సముద్రం లోపలకు వారు వెళ్తుండటాన్ని గమనించిన జీవీఎంసీ గజ ఈతగాళ్లు మురళి, కిషోర్లు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రాణాలకు తెగించి సముద్రంలోకి దూకి, మునిగిపోతున్న ఆ ఇద్దరు మహిళలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అనంతరం అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు సదరు మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చి, వారి కు టుంబ సభ్యులను పిలిపించి సురక్షితంగా అప్పగించారు. సమయానికి స్పందించి ఇద్దరి ప్రాణా లు కాపాడిన గజ ఈతగాళ్లను, పోలీసులను పలువురు అభినందించారు. -
చిట్టినాయుడు కాలనీలో ఇద్దరి మృతి
గాజువాక: పాతగాజువాక చిట్టినాయుడు కాలనీకి చెందిన చీర అప్పలనాయుడు (65) గురువారం బస్టాప్ వద్ద సొమ్మసిల్లి పడిపోయి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిట్టినాయుడు కాలనీలో జరిగిన ఓ అంత్యక్రియలకు వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అనంతరం పాతగాజువాక బస్టాప్ వద్ద అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం అందింది.వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. సిబ్బంది పరిశీలనలో వడదెబ్బ కారణంగా మృతి జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు గాజువాక పోలీసులకు సమాచారం అందించగా, అధికారులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. అదేవిధంగా అదే ప్రాంతానికి చెందిన ఉరుకూటి పైడికొండ (56) డ్వాక్రా సమావేశానికి వెళ్లి తిరిగి ఆటోలో వస్తుండగా మార్గమధ్యలో సొమ్మసిల్లి పడిపోయారు. ఆమె కూడా ఎండ తీవ్రత కారణంగా మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. చీర అప్పలనాయుడు (ఫైల్) ఉరుకూటిపైడికొండ (ఫైల్) -
కేజీహెచ్ను పట్టించుకోకపోవడం సిగ్గుచేటు
మహారాణిపేట: కేజీహెచ్ని నిర్వీర్యం చేసి కార్పొరేట్ ఆసుపత్రులకు లాభం చేకూర్చేలా కూటమి ప్రభుత్వం ప్రవర్తించడం సిగ్గుచేటని సీఐటీయూ సీనియర్ నాయకుడు వై.రాజు ధ్వజమెత్తారు. కేజీహెచ్లో రోగులకు సరిపడ మందులు ఇవ్వాలని, మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావస్తున్నా కేజీహెచ్లో మందులు, మౌలిక వసతులపై దృష్టి పెట్టకపోవడం విచారకరమన్నారు. గూగుల్ లాంటి పరిశ్రమలకు రూ.వేల కోట్ల రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య ప్రదాయిని అయిన కేజీహెచ్కు నిధులు ఇవ్వకుండా దారుణమన్నారు. కేజీహెచ్లో మందుల కొరతతో పాటు వైద్యులు, నర్సులు, సిబ్బంది కొరతతో రోగులకు సరైన వైద్యం అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో అధునాతన పరికరాలు పాడైతే మరమ్మతులు కూడా చేయడం లేదన్నారు. రోగులకు సెల్ఫోన్లు లేవన్న సాకుతో ఎక్స్రేలు తీయకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కేజీహెచ్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మందులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కె.నరసింగరావు, గణేష్, రమణ, బంగారునాయుడు, రాంబాబు, సూరాడ శ్రీను, ఆటో శ్రీను, నరసింహ, ఎం.సుబ్బారావు, వై.వై.రాజు, కర్రి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
తీరానికి గుర్తు తెలియని మృతదేహం
ఎంవీపీకాలనీ: ఎంవీపీ కాలనీ 19వ వార్డు పరిధిలోని వాసవానిపాలెం తీరానికి గురువారం ఉదయం ఒక గుర్తు తెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. తీరం వెంబడి వెళ్తున్న స్థానిక మత్స్యకారులు దీన్ని గమనించి, తక్షణమే ఎంవీపీ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అయితే, ఆ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో గుర్తుపట్టడం సాధ్యం కాలేదు. అనంతరం రెడ్క్రాస్ సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. గుర్తుతెలియని మృతదేహంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉపాధి కూలీలకు శాపం ‘ముఖ హాజరు’
ముంచంగిపుట్టు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రవేశపెట్టిన ’‘ముఖ హాజరు’విధానంతో వేతనదారులు పడరాని పాట్లు పడుతున్నారని, ఈ విధానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రద్దు చేయాలని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర డిమాండ్ చేశారు. మండలంలోని ఏనుగురాయి పంచాయతీ పరిధిలో గల చోటముఖిపుట్టు, జంగంసరియా గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను గురువారం జెడ్పీ చైర్పర్సన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వేతనదారులు జెడ్పీ చైర్పర్సన్ ఎదుట తమ కష్టాలను చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఫేస్ యాప్ సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ప్రతిరోజూ గంటల తరబడి పని ప్రదేశంలోనే వేచి ఉండాల్సి వస్తోందని, దీనివల్ల కష్టపడి పనిచేసినా కనీస కూలి రావడం లేదని వాపోయారు. గ్రామాల్లో వేతనదారుల ఇబ్బందులను స్వయంగా చూసిన సుభద్ర తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంలో తెచ్చిన ఈ కొత్త మార్పులు కూలీలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయన్నారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు కేవలం ముఖ హాజరు నమోదు చేయడానికే సమయం సరిపోతోందని, ఫలితంగా రెండు మూడు గంటల పని సమయం యాప్ సమస్యల వల్లే వృథా అవుతోందని మండిపడ్డారు. తీవ్రమైన ఎండల్లో కూలీలు పనులు చేస్తున్నప్పటికీ, పని ప్రదేశాల్లో కనీసం తాగునీరు, మజ్జిగ వంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కూలీల సమస్యలను మానవతా దృక్పథంతో అర్థం చేసుకోవాలని కోరారు. తక్షణమే ఈ ఫేస్ యాప్ విధానాన్ని రద్దు చేసి, పాత పద్ధతిలోనే హాజరు నమోదు చేస్తూ ఉపాధి పనులు కల్పించాలని, వేతనదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కూలీల కష్టాలను చూసి చలించిన జెడ్పీ చైర్పర్సన్, అనంతరం ఉపాధి వేతనదారులకు ఉచితంగా గ్లూకోజ్ డ్రింక్ను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు పాంగి పద్మారావు, అరకు నియోజకవర్గం ప్రచార కమిటీ అధ్యక్షులు వి.కొండలరావు, ఎంపీటీసీ మజ్జి సుబ్బలక్ష్మి, మాజీ సర్పంచులు నరసింగరావు, రమేష్, పార్టీ మండల నాయకులు రాంప్రసాద్, అర్జున్, జె.వి.వి.ఎన్.మూర్తి, తిరుపతిరావు, ప్రసాద్, అధిక సంఖ్యలో ఉపాధి హామీ వేతనదారులు పాల్గొన్నారు.ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర ఆవేదన -
రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలి
దేవరాపల్లి: రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారులు తులసీమణి, మాధురి రైతులకు సూచించారు. మండలంలోని చిననందిపల్లి, శివరామ చేనులపాలెం, మారేపల్లి గ్రామాల్లో బుధవారం స్థానిక ఏవో ఎల్.వై. కాంతమ్మతో కలిసి వారు పర్యటించారు. ఆయా గ్రామాల్లో ఏపీసీఎన్ఎఫ్ (ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్) పద్ధతిలో సాగు చేస్తున్న పొలాలను సందర్శించారు. అధిక ఎరువుల వాడకంతో కలిగే నష్టాలను రైతులకు సమగ్రంగా వివరించారు. తొలకరి వర్షాలు కురిసిన వెంటనే జనుము, జీలుగు, పల్లి పెసర తదితర పచ్చిరొట్ట విత్తనాలను ఎకరానికి 10 కేజీలు వేసుకోవాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా అందిస్తున్న పీఎండీఎస్ కిట్స్ 12 నుంచి 15 కేజీలు ఎకరా పొలంలో వేసుకోవడం ద్వారా 35 నుంచి 45 రోజులకు 8 టన్నుల మేర ఎరువు భూమికి చేరుతుందన్నారు. ప్రస్తుతం ఎండల తీవ్రతతో భూమి నిస్సారవంతం అవుతుందన్నారు. భూసారాన్ని పెంచే పచ్చిరొట్ట ఎరువులు, పీఎండీఎస్ విత్తనాలను వేసుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు. -
జూన్ 9 నుంచి ఏపీఎల్ పోరు
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) ఐదవ సీజన్ సందడి ప్రారంభం కానుంది. వచ్చే నెల జూన్ 9వ తేదీ నుంచి ఈ టోర్నీ జరగనుంది. తొలిసారిగా ఈ పోటీలను రాష్ట్రంలోని మూడు వేర్వేరు వేదికల్లో నిర్వహించనున్నారు. ఈ ఏడాది విశాఖపట్నంతో పాటు కడప, మంగళగిరి స్టేడియాలు ఏపీఎల్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మొత్తం ఏడు ఫ్రాంచైజీ జట్లు ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో తలపడనున్నాయి. విశాఖ వేదికగా తొలి 11 మ్యాచ్లు విశాఖలోని వైఎస్సార్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మొదటి విడత మ్యాచ్లు జరగనున్నాయి. జూన్ 9 నుంచి 14వ తేదీ వరకు ఆరు రోజుల పాటు ఇక్కడ మొత్తం 11 మ్యాచ్లు నిర్వహిస్తారు. జూన్ 9న జరిగే ప్రారంభ మ్యాచ్లో సింహాద్రి వైజాగ్ లయన్స్తో కాకినాడ కింగ్స్ జట్టు తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు ఫ్లడ్లైట్ల వెలుతురులో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. కడప, మంగళగిరిలలో తదుపరి సమరం విశాఖలో ముగిసిన తర్వాత టోర్నీ కడపకు మారుతుంది. అక్కడ జూన్ 17 నుంచి 21 వరకు మొత్తం 9 మ్యాచ్లు నిర్వహిస్తారు. ఆ తర్వాత మంగళగిరి స్టేడియంలో జూన్ 24 నుంచి 27 వరకు చివరి 8 లీగ్ మ్యాచ్లు జరుగుతాయి. మంగళగిరి వేదికగానే ఎలిమినేటర్, క్వాలిఫైయర్ మ్యాచ్లతో పాటు, జూన్ 30న గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ను నిర్వహించి టోర్నీకి తెరదించుతారు. లీగ్ షెడ్యూల్ జూన్ 10 – తుంగభద్ర వారియర్స్ వర్సెస్ క్యాపిటల్ అమరావతి రాయల్స్, విజయవాడ సన్షైనర్స్ వర్సెస్ భీమవరం బుల్స్ జూన్ 11 – సింహాద్రి వైజాగ్ లయన్స్ వర్సెస్ అమరావతి రాయల్స్, భీమవరం బుల్స్ వర్సెస్ రాయల్స్ ఆఫ్ రాయలసీమ జూన్ 12 – కాకినాడ కింగ్స్ వర్సెస్ విజయవాడ సన్షైనర్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ వర్సెస్ తుంగభద్ర వారియర్స్ జూన్ 13 – భీమవరం బుల్స్ వర్సెస్ వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్ వర్సెస్ కాకినాడ కింగ్స్ జూన్ 14 – అమరావతి రాయల్స్ వర్సెస్ భీమవరం బుల్స్, విజయవాడ సన్షైనర్స్ వర్సెస్ వైజాగ్ లయన్స్. -
ఆదర్శప్రాయుడు శ్రీరాముడు
గాజువాక: మానవాళికి శ్రీరాముడి జీవితం ఎంతో ఆదర్శప్రాయమని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. బుధవారం ఆయన తుంగ్లాం గ్రామంలోని విజయరాఘవస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన సామూహిక లక్ష్మీనారాయణ పూజలో పాల్గొన్నారు. అనంతరం భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. మనిషి జీవితంలో ప్రతిరోజు అద్దం ఎంత అవసరమో, మానవ సమాజానికి శ్రీరాముని ఆదర్శాలు కూడా అంతే అవసరమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ రాముడి మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. చినజీయర్ స్వామి రాక సందర్భంగా తుంగ్లాం గ్రామస్తులు, ఆలయ కమిటీ ప్రతినిధులు భారీ ఏర్పాట్లు చేశారు. తుంగ్లాం నుంచి షీలానగర్ వరకు భక్తులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. షీలానగర్ వద్ద చినజీయర్ స్వామికి ఆలయ అర్చకులు, ప్రముఖులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి, ఆలయ కమిటీ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


