Alluri Sitarama Raju
-
అడవే ఆసుపత్రి అయింది.. రోడ్డు లేక గర్భిణి ప్రసవం
అల్లూరి సీతారామరాజు జిల్లా : సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో పురిటి నొప్పులు వచ్చిన ఓ గర్భిణిని డోలీలో ఆస్పత్రికి తరలిస్తుండగా అడవిలోనే ప్రసవించింది. మండలంలో పెదలోచలి పంచాయతీ మారుమూల ఇందుగుల గ్రామానికి రోడ్డు సదుపాయం లేదు. గ్రామానికి చెందిన సీదరి దేవికి సోమవారం సాయంత్రం పురిటి నొప్పులు వచ్చాయి. గ్రామానికి అంబులెన్స్ వచ్చే అవకాశం లేదు. గ్రామం నుంచి తారు రోడ్డు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను కొంత దూరం మండుటెండలో గొడుగు నీడలో నడిపించి, మరికొంత దూరం డోలీలో మోస్తూ కొండలు, గుట్టలు, గెడ్డలను అష్టకష్టాలు పడి దాటిస్తూ రోడ్డుకు తీసుకెళుతుండగా మార్గమధ్యలో అడవిలో నొప్పులు ఎక్కువై మగశిశువుకు జన్మనిచ్చింది. అక్కడి నుంచి 108 వాహనానికి దేవి భర్త రంగారావు సమాచారం అందించారు. దీంతో ఈదులగరువు గ్రామం వద్ద ఉన్న రోడ్డు వరకూ బాలింతను, శిశువును తీసుకొచ్చి అంబులెన్స్లో జి.మాడుగుల పీహెచ్సీకి తరలించారు. బాలింతకు, శిశువుకు వైద్యసేవలందించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఎస్పీ కార్యాలయానికి 54 అర్జీలు
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 54 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చట్టపరిధిలో సమస్యలను వారం రోజుల్లో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నా రు. భూ సమస్యలు, చీటింగ్, ఆర్థిక నేరాలు, ఉద్యోగుల పేరుతో మోసాలు, అధిక వడ్డీ ఆశచూపి నగదు కాజేయడం, ఆన్లైన్ మోసాలకు, భార్యాభర్తల మధ్య కలహాలు, వేధింపులకు సంబంధించిన అర్జీ లు వచ్చాయన్నారు. కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ జీఆర్ఆర్ మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
అర్జీదారులకు వ్యయ ప్రయాసలు
తుమ్మపాల: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు జిల్లాలో పలు మండలాల నుంచి అర్జీదారులు తరలివచ్చారు. తమ సమస్యలు పరిష్కారం కోసం వృద్ధులు, వికలాంగులతో పాటు సాధారణ ప్రజలు వ్యయ ప్రయాసలతో కలెక్టరేట్కు చేరుకుని తమ సమస్యలను అధికారుల వద్ద మొర పెట్టుకుంటున్నారు. జిల్లా అఽధికారులను కలవాలంటే గంటల పాటు నిరీక్షించాల్సి వస్తుందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి నుంచి రెండు కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోందని, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అర్జీదారులు వాపోతున్నారు. ఎండల తీవ్రత కలెక్టరేట్ ప్రాంగణంలో ఎటువంటి నీడ సౌకర్యాలు లేకపోవడంతో చెట్ల కిందే సేదతీరుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వేసవిలో సౌకర్యాలు మొరుగుపరచాలని కోరుతున్నారు. అర్జీలు పునరావృతం అయితే అధికారులదే బాధ్యత... ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, పునరావృతం కాని విధంగా నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సమావేశ మందిరం, వీసీ హాలులో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో ఆమెతో పాటు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, ఎస్డీసీ సుబ్బలక్ష్మి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు పునరావృతం అయితే సంబంధిత శాఖ జిల్లా అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వివిధ సమస్యలపై పీజీఆర్ఎ్స్– 109 అర్జీలు, రెవెన్యూ క్లినిక్ కు 164 వినతులు మొత్తం 273 అర్జీలు నమోదైనట్టు తెలిపారు. -
10 ఎకరాల సరుగుడు తోట దగ్ధం
రూ. 10 లక్షల ఆస్తి నష్టం రావికమతం: మండలంలోని టి.అర్జాపురం సమీపంలో సోమవారం పదెకరాల సరుగుడు తోట అగ్నికి ఆహుతైంది. గ్రామానికి చెందిన రైతులు మడగల శ్రీను, మరిశా హేమంత్ కుమార్, మరిశా అప్పారావు, బాలరాజు, అప్పలకొండ, అద్దిపల్లి రాము, మడగల అప్పారావు, కంఠం రెడ్డి వెంకటరమణ, ఉల్గింగల రాములకు చెందిన పదెకరాల సరుగుడు తోట కాలి బూడిదైంది. దీని నష్టం విలువ రూ. 10 లక్షల ఉంటుందని అంచనా. ఈ సంఘటన ఎలా జరిగిందో తెలియదని, అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని రైతులు వాపోతున్నారు. -
పాండవుల చెరువు ఆక్రమణలు తొలగించాలి
మాడుగుల రూరల్: మాడుగుల పాండవుల చెరువు ఆక్రమణలను తొలగించి అభివృద్ధి చెయ్యాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు డి. వెంకన్న, మండల కార్యదర్శి ఇరటా నర్సింహమూర్తి, జిల్లా కార్యవర్గ సభ్యుడు బి.టి. దొర డిమాండ్ చేశారు. సోమవారం వారు ఇక్కడ చెరువును పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ మాడుగుల మోదమాంబ ఆలయం సమీపంలో సర్వే నంబరు 258లో 11 ఎకరాల 60 సెంట్లు చెరువు గర్భం కలిగిన పాండవుల చెరువులో సగ భాగం ఆక్రమణలు ఉన్నాయని, వాటిని తొలగించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. కూటమి నాయకులు కోట్లాది రూపాయల విలువ చేసే చెరువును కబ్జా చేసి, దాని నుంచి తప్పించుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే సహకారంతో మానస సరోవరం పేరు తో నాబార్డు నిధులు రూ. 50 లక్షలతో కొంత మేర అభివృద్ధి చేయడానికి చూస్తున్నారని ఆరో పించారు. దీనిపై సోమవారం కలెక్టరుకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ సమస్యకు సంబంధించి తహసీల్దారు, అధికారులు జోక్యం చేసుకోవా లన్నారు. సమస్యను పరిష్కరించకపోతే స్థానికులతో కలిసి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. -
గడ్డి మందు తాగి ఇద్దరు మృతి
నాతవరం: మండలంలో వెదురుపల్లి గ్రామానికి చెందిన లగుడు సన్యాసియ్య అలియాస్ ముసలియ్య (55) మద్యం మత్తులో గడ్డి మందు సేవించి మృతి చెందాడు. నాతవరం ఎస్ఐ వై.తారకేశ్వరరావు వివరాల ప్రకారం.. వ్యవసాయం పనులు చేసుకుంటూ జీవనం సాగించే సన్యాసియ్య ఆదివారం ఉదయం నుంచే మద్యం సేవిస్తున్నాడు. ఎప్పటి మాదిరిగానే పనులు చూసుకుని సాయంత్రం పొలంవద్ద పాకలో దాచుకున్న మద్యం బాటిల్ తాగేందుకు వెళ్లాడు. మద్యం బాటిల్ పక్కనే ఉన్న గడ్డి మందు బాటిల్ తాగేసాడు. తాగిన కొద్ది సేపటికే అపస్మారక స్థితికి చేరడంతో గమనించిన కుటుంబీకులు వెంటనే నర్సీపట్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. కుటుంబ సభ్యులు సోమవారం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసారు. ఈ సంఘటనపై కేను నమోదు చేసి మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలకు వివాహమైంది. అచ్యుతాపురం రూరల్: మండలంలో తిమ్మరాజుపేట గ్రామానికి చెందిన అయినేల్లు పోతురాజు (51) గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనారోగ్య సమస్యలు తాళలేక కుటుంబానికి భారం కాకూడదని మనస్థాపంతో ఈ నెల 18న గడ్డి మంది తాగారు. కుటుంబ సభ్యులు అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించగా అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్లో చేర్పించారు. ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందారు. భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
లారీ ఢీకొని ఉపాధి కూలీ మృతి
మరో ఇద్దరికి గాయాలునక్కపల్లి: కుటుంబాన్ని పోషించుకునేందుకు ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే నక్కపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ముగ్గురు మహిళా కూలీలు సోమవారం ఉదయం ఉపాధి పనులకు వెళ్తున్నా రు. జాతీయ రహ దారి పక్కన ఉన్న అప్రోచ్ రోడ్డుపై నడిచి వెళ్తున్న వీరిని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా తుని నుంచి విశాఖ వైపు వెళ్తున్న లారీ నిర్లక్ష్యంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో బద్దా సత్యవతి (45)కి తీవ్ర గాయాలై నక్కపల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. చిన్న నూకమ్మ, ఏనుగుపల్లి సత్యవతిలకు తీవ్రగాయాలవడంతో ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. బాధితులను వైస్ ఎంపీపీ వీసం నానాజీ, టీడీపీ ఇన్చార్జి వెంకటేష్, కోసూరు శ్రీను, శంకర్, వీసంరాజు తదితరులు పరామర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ మురళి తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్న నూకమ్మ, ఏనుగుపల్లి సత్యవతి -
చోరీల కేసులో నిందితుల అరెస్టు
106.34 గ్రాముల బంగారం, 148.30 గ్రాముల వెండి స్వాధీనంఅనకాపల్లి: తాళాలు వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న గాజువాక మండలం వడ్లపూడి కణితి ఆర్.హెచ్.కాలనీకి చెందిన కాండ్రేగుల తోకనాథవీరసాయి శ్రీనివాస్, మేరీలను మండలంలో తుమ్మపాల పంచాయతీ ఏలేరు కాలువ వద్ద పట్టుకున్నామని డీఎస్పీ ఎం.శ్రావణి తెలిపారు. తమ కార్యాలయంలో సోమవారం ఆమె వివరాలు వెల్లడించారు. శ్రీనివాస్, మేరీల వద్ద నుంచి 106.340 గ్రాముల బంగారం, 148.30 గ్రాముల వెండి, రూ.3,500, రెండు సెల్ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులిద్దరూ ఈ నెల 22న పట్టణంలో గాంధీనగరం 1వ వీధిలో తాళం వేసి ఉన్న గృహంలో చోరీకి పాల్పడారని తెలిపారు. అదేరోజు పిసినికాడలో చోరీకి పాల్పడినట్లు తెలిపారు. గతంలో వీరిద్దరిపై విశాఖ, దువ్వాడ పోలీస్ స్టేషన్లో రెండు గంజాయి కేసులు, కోట్లాట కేసులు, చోడవరంలో పోలీస్ స్టేషన్లో కేసులు నమోదై ఉన్నాయన్నారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ సీఐ జి.ప్రేమ్కుమార్, క్రైం ఎస్ఐ అల్లు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఇరిగేషన్ వర్క్ ఇన్స్పెక్టర్ల జిల్లా నూతన కార్యవర్గం
నాతవరం: ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న వర్కుఇన్స్పెక్టర్ల సంఘం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికలు తాండవ డివిజన్ పరిధిలో గల కోటనందూరు సెక్షన్ కార్యాలయంలో సోమవారం జరిగాయి. రాష్ట్ర అద్యక్షుడు పోతురాజు ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి, జిల్లా నూతన అధ్యక్షుడిగా బి.వి.నాగేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా ఎస్.అప్పారావు, ఉపాధ్యక్షులుగా కె.బంగ్రారాజు, కె.సూరి అప్పారావు, కార్యదర్శిగా బి.సత్యనారాయణ, ఇతర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు ఎన్నికల అధికారి ఎస్.సుబ్బరాజు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికై న జిల్లా కార్యవర్గ సంఘం సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి అప్పారావు మాట్లాడుతూ వర్క్ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. -
భూ వివాదంలో అధికారులు న్యాయం చేయడం లేదు...
–నానేపల్లి మాణిక్యం నక్కపల్లి స్టీల్ప్లాంట్ నిర్మాణం కోసం సేకరించిన భూమిలో వారసత్వంగా వచ్చిన భూమిని నా సోదరులు నాకు తెలియకుండా ఇతరులకు విక్రయించేసారని, విచారణ చేసి న్యాయం చేయాలని కాళ్లరిగేలా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోతుందని నక్కపల్లి మండలం దోణివాని లక్ష్మీపురం గ్రామానికి చెందిన నానేపల్లి మాణిక్యం పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. వారసత్వ హక్కుగా తనకు వాటాగా వచ్చే భూమిపై నష్టపరిహారం పొందేలా అధికారులు విచారణ చేపట్టి న్యాయం చేయాలని ప్రాథేయపడినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని, భూముల్లో జరుగుతున్న రీసర్వే ఆపుతానని చెప్పిన నక్కపల్లి ఎమ్మార్వో కూడా ఇప్పుడు దాటవేస్తున్నారని, తన వద్ద భూ భూమి కాగితాలు లాక్కుని తిరిగి ఇవ్వకుండా నానా బాధలు పెడుతున్నారని వాపోయాడు. -
అంబేడ్కర్ విగ్రహ ధ్వంసంపై ఫిర్యాదు
అనకాపల్లి: స్థానిక గవరపాలెం అంబేడ్కర్ నగర్లో ఈనెల 25న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి దండ జ్ఞానదీప్, దళిత సంఘాల జిల్లా నాయకుడు ఎస్.నూకరాజు సోమవారం పట్టణ సీఐ జి.ప్రేమ్కుమార్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ ఎడమ నేత్రాన్ని శనివారం రాత్రి సుమారుగా 11.30 నుంచి 2 గంటల మధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని, దోషుల్ని తక్షణమే అరెస్టుచేసి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. -
కుళాయిల్లో కలుషిత నీరు..
చోడవరంలో తాగునీటికి కటకటచోడవరం: అసలే వేసవి.. ఎండలు మండిపోయి జనం దాహం..దాహం అంటున్న సమయంలో కుళాయిల ద్వారా మురుగునీరు సరఫరా కావడం ప్రజలకు మరింత ఇబ్బందులకు గురిచేసింది. పట్టణంలో పలు ప్రాంతాల్లో కుళాయిలు ద్వారా కలుషిత నీరు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యడ్లవీధి, గునిశెట్టివారి వీధి, పిల్లావారితోట, దుడ్డువీధి, చిన్నబజార్, వ్యాపారవీధి ప్రాంతాల్లో కుళాయిల ద్వారా సోమవారం కలుషిత నీరు వచ్చింది. పట్టణంలో బోర్ల ద్వారా ఉప్పునీరే వస్తుండడంతో అందరూ కుళాయిల మంచినీటిపైనే ఆధారపడే పరిస్థితి. 30వేల మంది ప్రజలు ఉన్న పంచాయతీల్లో తరుచూ అంతరాయం ఏర్పడడం, కలుషిత నీరు సరఫరా అవ్వడం జరుగుతుంది. పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టనట్టు వ్యవహరించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమౌతోంది. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాల్సిందే..
అనకాపల్లి: రాష్ట్రంలో మహిళలు తలదించుకునే విధంగా తన పత్రికలో అనుచిత రాతలు రాసిన ఏబీఎన్ అధినేత రాధాకృష్ణపై సీఎం చంద్రబాబునాయుడు చర్యలు తీసుకోవడంలో ఎందుకు వెనుకాడుతున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోని పోలీస్ స్టేషన్లలో వైఎస్సార్సీపీ శ్రేణులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికి ఇంతవరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. ఈ మేరకు స్థానిక ఎస్పీ కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ మోహన్రావుకు సోమవారం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పరిశీలకుల ఆధ్వర్యంలో ఆయన లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బొడ్డేడ మాట్లాడుతూ రాధాకృష్ణ తన పత్రికలో ఇస్టానుషారంగా రాతలు రాస్తున్నప్పటికీ సీఎం చంద్రబాబునాయుడుకు చీమకుట్టినట్లుగా లేదన్నారు. ఇంతవరకూ చర్యలు తీసుకోకుండా మహిళల మనోభావాలు దెబ్బతీస్తున్నారని విమర్శించారు. దిగువ స్థాయి స్థాయి పోలీసులు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశామన్నారు. ఎస్పీ కార్యాలయంలో న్యాయం జరగని పక్షంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. యలమంచిని నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ విప్ కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ ఏబీఎన్ రాధాకృష్ణ రాష్ట్రంలో చెల్లెళ్లను కూడా భార్యలు కింద భావిస్తారని చెప్పడం సిగ్గుచేటన్నారు. హిందూ ధర్మంలో మహిళలను ఎంతో గొప్పగా పూజిస్తారని, అటువంటి వారిని కించపరిచే విధంగా తన పత్రికల్లో రాయడం గర్హనీయమన్నారు. మాజీ ఎంపీ బీవీ సత్యవతి మాట్లాడుతూ మహిళల పట్ల, వైఎస్సార్సీపీ నాయకత్వం పట్ల, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెనుక నడిచే వారిపై అవమానపరిచే విధంగా రాతలు చేయడం దారుణమన్నారు. తెలుగుజాతి గౌరవించేలా మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి, ఎన్టీ రామారావు పాలన చేస్తే, నేటి పాలనలో మహిళలను కించపరిచే విధంగా ఏబీఎన్ రాధాకృష్ణతో తమ పత్రికలో రాయించడం సిగ్గుచేటన్నారు. పార్లమెంట్ సాక్షిగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చర్యలు చేపడుతుంటే, రాష్ట్రంలో వారిని అవమానించిన రాధాకృష్ణ బేషరతుగా క్షమాపణలు చెప్పేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు నిర్లక్ష్య వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ మాట్లాడుతూ రాధాకృష్ణకు తన ఇంట్లోనూ మహిళలు ఉన్నారన్న ఇంగిత జ్ఞానం లేదా అని ప్రశ్నించారు. దాన్ని మరచి తన పత్రికల్లో మహిళలను కించపరిచే విధంగా రాయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. మహిళలను దైవంగా భావించే దేశంలో వారిని అవమానించడం క్షమించరాని నేరమన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లి, నర్సీపట్నం నియోజకవర్గాల సమన్వయకర్తలు మలసాల భరత్కుమార్, పెట్ల ఉమాశంకర్ గణేష్, నియోజకవర్గ పరిశీలకులు పైలా శ్రీనివాసరావు, గండి రవికుమార్, వీసం రామకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ, పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, ఎంపీపీ గొర్లి సూరిబాబు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, పరవాడ జెడ్పీటీసీ పి.సన్యాసిరాజు, రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.గోవింద్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, సీనియర్ నాయకులు మళ్ల బుల్లిబాబు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ను ఢీకొట్టిన ద్విచక్ర వాహనం
చోడవరం: విధులకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మోటారు సైకిలిస్టు దుర్మరణం చెందాడు. తల్లిదండ్రులకు ఏకై క ఆధారమైన కుమారుడు మృతి చెందడంతో వారు బోరున విలపించారు. మండలంలోని బీఎన్రోడ్డుపై గజపతినగరం దగ్గర సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారెన్స్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి మృతి చెందాడు. మాడుగుల మండలం వంటర్లపాలెం గ్రామానికి చెందిన లెక్కల శ్రీనివాసు (28) అచ్యుతాపురం వద్ద లారెన్స్ కంపెనీలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. పనిచేస్తున్న కంపెనీ తన స్వగ్రామానికి దూరంగా ఉండటంతో అనకాపల్లి మండలం అల్లిఖానుడుపాలెంలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ రోజూ డ్యూటీకి వెళుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో శనివారం రాత్రి డ్యూటీ నుంచి తన స్వగ్రామమైన వంటర్లపాలెం వెళ్లి అక్కడ తల్లిదండ్రులతో గడిపి సోమవారం యధావిధిగా పనికి వెళ్లేందుకు తన మోటారు సైకిల్పై అచ్యుతాపురం బయలుదేరాడు. చోడవరం –అనకాపల్లి రోడ్డులో చోడవరం మండలం గజపతినగరం సమీపంలో తన ముందు ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న శ్రీనివాసు మోటారు సైకిల్ అదుపు తప్పి ట్రాక్టర్ను ఢీకొట్టాడు. దీనితో అతనికి తీవ్ర గాయాలు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. తన కన్నకొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని తెలియడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. తమకు దిక్కెవరంటూ వారి ఆవేదన అందర్నీ కలిచివేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ జోగారావు తెలిపారు. మృతిదేహాన్ని పోస్టుమార్టంకు తరలించామన్నారు. -
ఇంధనం గగనం
జిల్లా వ్యాప్తంగా ఇంధన కొరతతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ బంక్ మూతపడుతుందో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. కొన్ని బంకుల్లో నిల్వలు అంతంతమాత్రంగా ఉండడంతో పెట్రోల్, డీజిల్ కోసం వాటి వద్ద బారులు తీరుతున్నారు. పెట్రోలు కొరత వల్ల తమ జీవనోపాధికి ఆటంకం కలుగుతోందని ఆటో, జీపు డ్రైవర్లు గగ్గోలుపెడుతున్నారు. ● పెట్రోల్, డీజిల్ కొరతతో అవస్థలు ● బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు ● నరకం చూస్తున్న వాహనచోదకులు ట్రావెల్ సర్వీసులకు ఇబ్బందులు పాడేరులోని పలు బంకులలో డీజిల్ కొరతతో వాహన చోదకులతో పాటు ట్రావెల్ సర్వీసు నిర్వాహకులకు ఇబ్బందులు పడుతున్నారు. ఆయిల్ లేకపోవడంతో వాహనాలు నిలివేయవలసి వస్తోంది. దీంతో ఉపాధికి ఆటంకం ఏర్పడుతోంది. డీజిల్ నిల్వలు లేక పలు బంకులు తరచూ మూతబడుతున్నాయి.అన్ని బంకుల్లో పూర్తిస్థాయిలో ఆయిల్ నిల్వలు ఉండేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – ఎం.దేముళ్లనాయుడు, కారు డ్రైవర్, పాడేరు పాడేరులో మూతబడినపాతపెట్రోల్ బంక్ ●సాక్షి,పాడేరు: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం జిల్లాపై పడింది.ఇంధన కష్టాలు మొదలయ్యాయి. జిల్లాలో గత కొద్దిరోజుల నుంచి చమురుకు కొరత ఏర్పడినా సోమవారం ఉదయం నుంచి దొరకడం గగనమైంది. పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడం కలవరం రేపింది. స్టాకు ఉన్న బంకులకు వాహనదారులు పోటెత్తారు. చమురు నిల్వలు ఉన్నాయని జిల్లా యంత్రాంగం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. డిమాండ్ నేపథ్యంలో కొన్ని బంకులు కోటా విధానాన్ని అమలు చేస్తున్నారు. జిల్లా కేంద్రం పాడేరులో పెట్రోల్ బంకులను ఒక రోజు తెరిస్తే, రెండు రోజులు మూసివేసే పరిస్థితి ఉండడంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. పాడేరులోని మూడు ప్రధాన బంకుల్లో సోమవారం ఉదయం నుంచి డీజిల్ అమ్మకాలు నిలిపివేశారు. పాడేరులో ప్రధాన బంక్ అయిన ఓండ్రు బొజ్జయ్య బంక్లో పెట్రోలు,డీజిల్ రెండూ లేకపోవడంతో వినియోగదారులు ఆందో ళన చెందారు. జిల్లాలో కొన్నిచోట్ల పెట్రోల్ అరకొరగా లభిస్తుండడంతో వాహన చోదకులు ఆయా బంకులకు క్యూకట్టారు. మన్యంలో ఆయిల్ వినియోగం అధికమే జిల్లా వ్యాప్తంగా హెచ్పీ సంస్థకు చెందిన బంకులు 16, బీపీ 3, ఐవోసీ 3 బంకులు ఉన్నాయి.పాడేరులో మాత్రం పలు కంపెనీలకు చెందిన ఆరు బంకులు ఉన్నప్పటికీ ఆయిల్ కొరతతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.ప్రతి బంకులో రోజుకు రెండు వేల లీటర్ల పెట్రోలు, ఐదు వేల లీటర్ల డీజిల్ విక్రయిస్తారు.అయితే ఆయిల్కు డిమాండ్ నెలకొన్నప్పటి నుంచి కంపెనీల నుంచి సరఫరా తగ్గింది. అభివృద్ధి పనులకు ఆటంకం డీజిల్ కొరతతో మన్యంలోని రోడ్లు,ఇతర అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతోంది. ప్రస్తుతం పాడేరులో జాతీయ రహదారి పనులతో పాటు ఏజెన్సీలో మారుమూల గ్రామాల్లో మట్టిరోడ్ల పనులు జరుగుతున్నాయి. లారీలు, యంత్రాలకు ప్రతిరోజు పెద్ద మొత్తంలో డీజిల్ అవసరం ఉంటుంది. డీజిల్ కొరతతో యంత్రాలతో చేస్తున్న పనులన్నీ నిలిచిపోతున్నాయని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. కార్లు,జీపులు,ఇతర ట్రావెల్ సర్వీసులకు ఇబ్బంది ఏర్పడుతోంది. పూర్తిస్థాయిలో అన్ని బంకులలోను ఆయిల్ నిల్వలు ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని పెట్రో,డీజిల్ వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. -
భానుడి భగభగ
సాక్షి,పాడేరు: చల్లటి వాతావరణానికి పేరొందిన జిల్లాలో ఈ ఏడాది ఎండలు మండుతున్నాయి. గత కొద్ది రోజుల నుంచి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొయ్యూరులో 38.5 డిగ్రీలు, అరకులోయలో 38.7, పాడేరులో 37, జి.మాడుగులలో 36.4, అనంతగిరిలో 35.1, చింతపల్లిలో 34, పెదబయలులో 33.3, ముంచంగిపుట్టులో 33.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు సోమవారం నమోదయ్యాయి. ఉదయం 9గంటల నుంచే ఎండ విజృంభించింది. మధ్యాహ్నం సమయంలో అధిక ఎండతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడ్డారు.మండల కేంద్రాలు,వారపుసంతల్లో చిరువ్యాపారులతో పాటు గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.జిల్లా కేంద్రం పాడేరులో సాయంత్రం వరకు రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. -
ఘనంగా ముగిసినమారెమ్మ తల్లి ఉత్సవాలు
సీలేరు: మారెమ్మ తల్లి ఉత్సవాలు సోమవారంతో ఘనంగా ముగిశాయి.అమ్మవారి ఉత్సవ మూర్తిని ఊరేగించి, చల్లనీటి కార్యక్రమాన్ని నిర్వహించి, గ్రామాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. తల్లి గరగను అర్చకులు దామోదర శర్మ, కమిటీ సభ్యులు, మాలలు ధరించిన భవానీల ఆధ్వర్యంలో రిజర్వాయర్లో నిమజ్జనం చేశారు. అనంతరం మారెమ్మ మాలాధారణ భక్తులు దీక్ష విరమించారు. మంగళవారం 10 గంటలకు వరకు అమ్మవారి దర్శనాలు కల్పించి, తలుపులను మూసివేస్తారు. బుధవారం ఉదయం ఆలయాన్ని శుద్ధిచేసి అమ్మవారికి అర్చకులు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మారు పూజ చేపట్టి మళ్లీ ఉత్సవాలు వరకు యథావిధిగా పూజలు జరుపుతారు. -
అల్లూరి పార్కు అభివృద్ధికి ప్రతిపాదనలు
టీడబ్ల్యూ ఈఈ డేవిడ్ రాజు కొయ్యూరు: రాజేంద్రపాలెంలోని అల్లూరి స్మారక పార్కు అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుందని గిరిజన సంక్షేమశాఖ ఇంజినీరింగ్ విభాగం ఈఈ డేవిడ్ రాజు తెలిపారు. జేఈ శ్రీవిద్యతో కలిసి రాజేంద్రపాలెంలో అల్లూరి పార్కును ఆయన సోమవారం సందర్శించారు అల్లూరి విగ్రహం ఉన్న భవనాన్ని, మొత్తం ప్రాంగణాన్ని పరిశీలించారు.పర్యాటలను ఆకర్షించే విధంగా పార్కు అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేస్తామని చెప్పారు.అనంతరం ఆయన కొయ్యూరు బాలుర ఆశ్రమ పాఠశాల–1లో నిర్మిస్తున్న భవనాన్ని, సిబ్బంది క్వార్టర్ల పనులను పరిశీలించారు.కాంట్రాక్టర్కు పలు సూచనలు చేశారు. -
ఏబీఎన్ రాధాకృష్ణను అరెస్టు చేయాలి
ఎస్పీ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరాజు,మత్స్యలింగం,జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, అరకు పరిశీలకులు సత్యారావు,పార్టీ నేతలు అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరాజు,మత్స్యలింగం, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, మాజీ ఎమ్మెల్యేభాగ్యలక్ష్మి, వైఎస్సార్సీపీ అరకు పరిశీలకుడు సత్యారావు,పార్టీ నేతలు సాక్షి,పాడేరు: వైఎస్సార్సీపీ నేతల కుటుంబాలతో పాటు రాష్ట్రంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి, కించపరిచేటట్టు తప్పుడు రాతలు రాసిన ఏబీఎన్,ఆంఽధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు.రాధాకృష్ణపై గతంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదులు చేసినా ఇంతవరకు అరెస్టు చేయకపోవడాన్ని వైఎస్సార్సీపీ నేతలు నిరసించారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జెడ్పీచైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, వైఎస్సార్సీపీ అరకు పరిశీలకులు ఏడువాక సత్యారావు,పాడేరు,అరకు నియోజకవర్గాల నేతలతో కలిసి ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు సోమవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లా అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డికి వినతిపత్రం అందజేసి, ఏబీఎన్ రాధకృష్ణపై తక్షణమే కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని కోరారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డితో పాటు వైఎస్సార్సీపీ నేతల కుటుంబాలు,మహిళలపై రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను వారంతా ఏఎస్పీకి వివరించారు.ఈ సందర్భంగా పాడేరు ఎమ్మెల్యే మాట్లాడుతూ రాధాకృష్ణ మహిళల పట్ల తప్పుడు వ్యాఖ్యలు చేసినట్టు అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ పోలీసులు స్పందించకపోవడం దారుణమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రాధాకృష్ణను ఈకేసుల నుంచి కాపాడే ప్రయత్నం చేయడం సిగ్గు చేటని చెప్పారు. ఈ నెల 9న వైఎస్సార్సీపీ నేతలు పాడేరు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. ఉమ్మడి విశాఖ జెడ్పీచైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర,అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు,మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి,అరకు పరిశీలకులు ఏడువాక సత్యారావు మాట్లాడుతూ మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా తప్పుడు వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు,మహిళలు ఆందోళనలు చేసి, ఫిర్యాదులు చేసినా పట్టనట్టు వ్యవహరించడం పోలీసుశాఖకు తగదన్నారు. ప్రభుత్వానికి,టీడీపీ నేతలు,వారి అనుకూల శక్తులకు తలొగ్గి పోలీస్ శాఖ పనిచేయడం దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అనంతగిరి ఎంపీపీ తెడబారికి మిఽథుల,అరకులోయ వైస్ ఎంపీపీ కిల్లో రామన్న, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ,యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెడబారికి సురేష్కుమార్, మహిళా విభాగం పాడేరు అధ్యక్షురాలు కిల్లో ఉర్వశిరాణి,పలు మండలాల అధ్యక్షులు కొర్రా సూర్యనారాయణ,పాంగి పరశురామ్,మజ్జి చంద్రుబాబు,పాంగి అనీల్కుమార్,చింతలవీఽధి ఎంపీటీసీ గిడ్డి విజయలక్ష్మి,అనంతగిరి మాజీ ఎంపీపీ శెట్టి నీలవేణి,ఎస్టీసెల్ మాజీ జిల్లా అధ్యక్షుడు కమ్మిడి అశోక్,పాడేరు పీఏసీఎస్ మాజీ అధ్యక్షురాలు లకే రామసత్యవతి, ఎస్టీసెల్ అరకులోయ మండల అధ్యక్షుడు పాంగి నగేష్,పార్టీ సీనియర్ నాయకులు నరసింహమూర్తి,గండేరు చిన సత్యం, కమ్మిడి విజయదశమి,మినుములూరు మాజీ సర్పంచ్ మినుముల కన్నాపాత్రుడు తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు డిమాండ్ -
తల లేని మృతదేహం లభ్యం
అనంతగిరి(అరకులోయటౌన్): అనంతగిరి మండలం కాశీపట్నం సమీపంలో తల లేని మృతదేహం లభించింది. గోస్తనీ నది ఒడ్డున తుప్పల్లో ఉన్న మృతదేహాన్ని అటుగా వెళ్తున్న వ్యక్తులు గుర్తించారు.ఈ వార్త స్థానికంగా కలకలం రేపింది. తలను నరికి ఎవరు తీసుకువెళ్లారు?, మరణించిన వ్యక్తి స్థానికుడా? పర్యాటకుడా ? అని స్థానికులు చర్చించుకుంటున్నారు. అరకులోయ సీఐ ఎల్.హిమగిరి మాట్లాడుతూ గోస్తనీ నది ఒడ్డున పురుషుడి తల లేని మృదేహం లభించినట్టు చెప్పారు. సుమారు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య మృతుడి వయస్సు ఉంటుందని, ఎత్తు 5 అడుగుల 6 అంగులాలు ఉండవచ్చన్నారు. కుడి చేతిపై అమ్మ, నాన్న అనే టాటు ఉందని, శరీరంపై దుస్తులు లేవన్నారు. మృతదేహాన్ని శవపంచనామ కోసం అరకు ఏరియా ఆస్పత్రికి తరలించామని, అనంతగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని సీఐ హిమగిరి తెలిపారు. -
విదేశీ కూరగాయల సాగుకుడ్వాక్రా సభ్యులకు ప్రోత్సాహం
● వెయ్యి ఎకరాల్లో సాగుకు ప్రణాళిక ● 3వేల మందికి శిక్షణ ఇచ్చేందుకు చర్యలు ● సెర్స్ అడిషనల్ సీఈవో శ్రీరాములు నాయుడు చింతపల్లి: విదేశీ కూరగాయలు పండించే గిరిజన ప్రాంతంలో డ్వాక్రా సంఘాల సభ్యులకు ప్రోత్సాహం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సెర్ఫ్ అదనపు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీరాములునాయుడు తెలిపారు. మండలంలోని బలభద్రం,తాజంగి కోరుకొండ,చౌడుపల్లి గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించి మహిళా రైతులు సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో విదేశీ కూరగాయల పంటలకు వాతావరణం అనుకూలంగా ఉండడంతో గతంలో 150 ఎకరాల్లో పలు రకాలు పంటలు సాగుకు సంబంధించి 3వందల మంది డ్వాక్రా సభ్యులు శిక్షణ ఇచ్చినట్టు చెప్పారు. ఈ ఏడాది వెయ్యి ఎకరాల్లో సాగు చేపట్టడానికి 3వేల మంది రైతులకు శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ చేపట్టినట్టు తెలిపారు. విదేశీ పంటలైన జుకినీ,బ్రకోలి,కలర్ కాలీఫ్లవర్,చెర్రి టమాటా,సాలరీ కొత్తిమీర,వెక్యూస్ ఆకుకూర,చైనీస్ క్యాబేజీతో పాటు 30 రకాలు పంటల సాగుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ మురళీ, సెర్ఫ్ లైవ్లీ హుడ్ డైరెక్టర్ శ్రీనివాస్,అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ నాగేశ్వరరావు,ఏపీఎం శ్రీనివాసరావు,వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. -
నిల్వలున్నా నో స్టాక్ బోర్డులు పెట్టడం సరికాదు
● పాడేరు, అరకు ఎమ్మెల్యేలువిశ్వేశ్వరరాజు, మత్స్యలింగం పాడేరు : జిల్లా వ్యాప్తంగా ఉద్దేశపూర్వకంగానే పెట్రోల్, డీజిల్ కొరత సృష్టిస్తున్నారని పాడేరు, అరకు ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి సోమవారం జిల్లా కేంద్రం పాడేరులోని పలు పెట్రోల్ బంకులను వారు తనిఖీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్, డీజిల్ కొరత సృష్టిస్తూ వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీలు ఈ వ్యవహరంపై ప్రశ్నిస్తుంటే ఒక్క ఇండెంట్ కూడా పెండింగ్లో లేకుండా సరఫరా చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం అసత్యం చెబుతోందన్నారు. నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలుపూర్తి కాగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతారని ప్రచారం జరుగుతుండడంతో డీలర్లు స్టాక్ నిల్వ చేస్తున్నారన్నారు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసినా కనీసం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో 4,510 పెట్రోల్ బంకులు ఉంటే 70 శాతం బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గాడి సత్యనారాయణ, వైస్ ఎంపీపీలు కుడుముల సత్యనారాయణ, వెంకటరమణ, వైఎస్సార్సీపీ నాయకులు కోటిబాబు నాయుడు, కన్నాపాత్రుడు, బంగర్రాజు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలో 60 కుటుంబాల చేరిక
అరకులోయటౌన్: మండలంలోని పెదలబుడు మేజర్ పంచాయతీ కేంద్రంతో పాటు కరసాలిగుడ, గరడగుడ గ్రామాల్లోని తెలుగుదేశం, ఇతర పార్టీలకు చెందిన 60 కుటుంబాల వారు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సమక్షంలో సోమవారం వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు మురళీ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణిక్య పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ అరాచకపాలనకు ప్రజలు విసిగెత్తిపోయి వైఎస్సార్సీపీలో చేరుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి, చేయూత, రైతు భరోసా, ఆరోగ్య శ్రీ తదితర పథకాలను పక్కాగా అమలు చేసినట్టు చెప్పారు. చంద్రబాబు పాలనలో వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో రూ.కోట్లు వెచ్చించి రహదారులు నిర్మిస్తున్నామని చెబుతున్నప్పటికీ పినకోట, పెదకోట, డుంబ్రిగుడ మండలం పెదపాడులో డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేసిన రోడ్లకే దిక్కులేకుండా పోయిందన్నారు.పెదపాడు పాఠశాల అత్యధునికంగా నిర్మిసామని హామీ ఇచ్చి పట్టించుకోవడం మానేశారని చెప్పారు.అంతకు ముందు ఎమ్మెల్యేతోపాటు పార్టీ నాయకులకు గ్రామ గిరిజనులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు కమిడి అశోక్కుమార్, నియోజకవర్గ బూత్ కమిటీ ఇన్చార్జి పాంగి విజయ్, అరకులోయ, డుంబ్రిగుడ మండల అధ్యక్షులు రామ్మూర్తి, పాంగి పరశురాం, మండల పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాంగినాగేశ్వరరావు, వైస్ ఎంపీపీ కిల్లో రామన్న, మండల యువజన విభాగం అధ్యక్షుడు బోయి కిరణ్ కుమార్, నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు. -
బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు
కలెక్టర్ నిశాంతి హెచ్చరికసాక్షి,పాడేరు: జిల్లాలోని అన్ని బంకులను నిరంతరం పర్యవేక్షిస్తామని, పెట్రోలు, డీజిల్ సమృద్ధిగానే ఉన్నాయని కలెక్టర్ టి.నిశాంతి తెలిపారు. ఎస్పీ అమిత్బర్దర్తో కలిసి ఆమె స్థానిక ఐవోసీ ఆయిల్ బంకును సోమవారం తనిఖీ చేశారు.ఆయిల్ నిల్వలపై బంకు నిర్వాహకులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పెట్రోలు,డీజిల్ కొరత లేదన్నారు.జిల్లాలోని 22 బంకులను తనిఖీ చేసేందుకు రెవెన్యూ,పోలీసు,పౌరసరఫరాలు,తూనికలు కొలతల విభాగాలతో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కృత్రిమ కొరత సృష్టించినా, బ్లాక్ మార్కెట్కు తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని, ఎక్కడైనా ఇంధన కొరత,ఇతర ఇబ్బందులు తలెత్తినా టోల్ ఫ్రీ నంబర్ 08935293448కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.కాగా కలెక్టర్ నిశాంతి తనిఖీ చేసిన కొద్ది సేపటికే తలారిసింగి ఐవోసీ బంకులో డీజిల్ నిల్వలు నిండుకున్నాయి.సాయంత్రం అనంతరం సోమవారం రాత్రి ఎస్పీ అమిత్బర్దర్తో కలిసి కలెక్టర్ విలేకరుల సమావేశం నిర్వహించారు.జిల్లాలోని పెట్రోల్,డిజిల్ కొరతపై ప్రతిరోజు పర్యవేక్షణ ఉంటుందని,ఆయిల్ బంక్ల నిర్వహకులకు తగిన ఆదేశాలు ఇచ్చామన్నారు.టాస్క్పోర్స్ బృందాలను అప్రమత్తం చేశామన్నారు.ప్రస్తుతానికి జిల్లాలోని అన్ని బంక్లలో 125 కిలోలీటర్ల పెట్రోల్,127కిలోలీటర్ల డిజిల్ నిల్వలు ఉన్నాయన్నారు. -
మహనీయులను మరిచారు
విశాఖ సిటీ: విశ్వకళలకు నిలయమై, విశ్వవ్యాప్త ఖ్యాతిని గడించిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శతజయంతి ఉత్సవాల వేళ చోటుచేసుకున్న పరిణామాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. వర్సిటీ 100వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అధికార యంత్రాంగం ప్రదర్శించిన నిర్లక్ష్య ధోరణి ఆచార్యులు, ఉద్యోగులు, విద్యార్థులలో తీవ్ర అసంతృప్తిని నింపింది. అసలే ఉత్సవ వేడుకను 26 నుంచి 27కు మార్చడంపై ఉన్న అశాంతికి తోడు, దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీని తుంగలో తొక్కడం విమర్శలకు తావిస్తోంది. గౌరవించుకోరా? ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆవిర్భావానికి, అభివృద్ధికి బాటలు వేసిన మహనీయులను గౌరవించుకోవడం ఈ ప్రాంగణంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. వ్యవస్థాపకుడు డాక్టర్ సీఆర్ రెడ్డి నుంచి మొదలుకొని, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, డాక్టర్ వీఎస్ కృష్ణ, రాజా విక్రమ్ దేవ్ వర్మ వంటి ప్రముఖుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడం ద్వారా వర్సిటీ గతాన్ని స్మరించుకునేవారు. గతంలో వీసీలు, ఉన్నతాధికారులు అందరూ కలిసి ఈ నివాళుల ర్పించే కార్యక్రమాన్ని అత్యంత గౌరవప్రదంగా నిర్వహించేవారు. అయితే, ప్రస్తుత వీసీ ఆచార్య రాజశేఖర్, రెక్టార్, రిజిస్రార్లు ఈ సంప్రదాయానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం అధికారుల చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తోంది. వారి ఖ్యాతి మరిచారా..? ఏయూ మనుగడకు కారణమైన ఆ మహనీయుల త్యాగాలను, సేవలని ప్రస్తుత పాలకవర్గం విస్మరించింది. వర్సిటీ కోసం వందల ఎకరాల భూమిని దానం చేసిన రాజా విక్రమ్ దేవ్ వర్మ, ప్రత్యేక వర్సిటీ కోసం పోరాడిన సర్ సీఆర్ రెడ్డి, విశ్వవిద్యాలయ ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన రెండో వీసీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ వంటి వారి విగ్రహాలు వ్యవస్థాపక దినోత్సవం నాడు వెలవెలబోవడం నగర వాసులను సైతం ఆశ్చర్యపరిచింది. కేవలం వర్సిటీ వ్యవస్థాపకులే కాకుండా, ఆవిర్భావంలో కీలకంగా వ్యవహరించిన డాక్టర్ పరశురామ్ పాత్రో, డాక్టర్ సత్యదానందమూర్తి వంటి మహనీయులతో పాటు మహాత్మా జ్యోతిరావు పూలే, మహాత్మా గాంధీ, బాబు జగజ్జీవన్రామ్, సర్ ఆర్థర్ కాటన్ వంటి గొప్ప వ్యక్తుల విగ్రహాల వద్ద కూడా కనీస నివాళులు అర్పించకపోవడంపై వర్సిటీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ఉన్నతాధికారుల బాధ్యతారహితమైన ప్రవర్తన ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రతిష్టను, సంస్కృతిని మంటగలుపుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
న్యాయదేవత విగ్రహ ఆవిష్కరణ
మద్దిలపాలెం (విశాఖ): డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన న్యాయదేవత విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఏయూ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. న్యాయ ప్రక్రియలో జాప్యం జరిగితే ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజలకు ఉన్న విశ్వాసం దెబ్బతింటుందని హెచ్చరించారు. కోర్టుల్లో భారీగా పేరుకుపోయిన కేసుల సంఖ్యను తగ్గించాలని, వేగవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.సీతా మాణిక్యం మాట్లాడుతూ.. తక్షణ న్యాయం కొన్ని సందర్భాల్లో సాధ్యం కానప్పటికీ, విచారణలో సుదీర్ఘ జాప్యాలు ఉండకూడదని అభిప్రాయపడ్డారు. న్యాయపరమైన భాష సంక్లిష్టంగా ఉండకూడదని, సామాన్యులకు కూడా సులభంగా అర్థమయ్యేలా సరళంగా ఉండాలని వక్తలు పేర్కొన్నారు. ప్రొఫెసర్ కేశవరావు, ప్రొఫెసర్ ఎ.రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. -
ప్రముఖ రచయిత్రి శారదాపూర్ణ కన్నుమూత
సీతంపేట (విశాఖ): ప్రముఖ రచయిత్రి, గాయని, అమెరికాలో తెలుగు భాషా సంస్కృతులకు అపారమైన సేవలందిస్తున్న డాక్టర్ శొంఠి శారదాపూర్ణ శనివారం సాయంత్రం అమెరికాలో కన్నుమూశారు. విశాఖపట్నానికి చెందిన ఆమె కళాభారతి శంకర శాస్త్రి మనుమరాలు. శారదాపూర్ణ ఏయూలో తెలుగులో పీహెచ్డీ, సంస్కృతంలో ఎం.ఎ, పీహెచ్డీ పట్టాలు పొందారు. అన్నమాచార్య కీర్తనలపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన ఆమె.. చికాగో నగరంలో సప్న అనే సంస్థను స్థాపించి అన్నమయ్య కీర్తనలకు విదేశాల్లో బహుళ ప్రాచుర్యం కల్పించారు. అలాగే చికాగో వేద విద్యా పరిషత్తును కూడా స్థాపించారు. భాషారత్న, మహతి పురస్కారం, రాయప్రోలు సుబ్బారావు సాహితీ అవార్డు, తానా పురస్కారం వంటి మరెన్నో గౌరవాలను ఆమె అందుకున్నారు. ఆమె ప్రతీచి, శరద్ధృతి, శరన్నిక్వాణం, శరఝరి, మేఘదూతం, నీతి సాహస్రి వంటి గ్రంథాలను రచించడమే కాక, బ్రాహ్మి అనే పత్రికను కూడా నడిపారు. శారదాపూర్ణ మృతి పట్ల నగరానికి చెందిన ప్రముఖ రచయిత డాక్టర్ డి.వి.సూర్యారావు, పలువురు సాహితీవేత్తలు తమ గాఢ సంతాపం ప్రకటించారు. ఆమె మరణం సాహితీ, సంగీత లోకానికి తీరని లోటని వారు పేర్కొన్నారు. -
వందేళ్ల ఏయూ వైభవం
ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష మద్దిలపాలెం (విశాఖ): ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రత్యేక అతిథిగా హాజరుకానుండటంతో వేడుకలకు విశేష ప్రాధాన్యత ఏర్పడింది. వేదిక ప్రాంగణంలో సుమారు 25 వేల మంది కూర్చునేందుకు వీలుగా మూడు భారీ జర్మన్ టెంట్లతో పాటు ప్రత్యేక గ్యాలరీలను సిద్ధం చేశారు. విద్యార్థుల కోసం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాంస్కృతిక ప్రదర్శనలు ప్రారంభం కానుండగా, సాయంత్రం 4 గంటల నుంచి జరిగే కార్యక్రమంలో ప్రధాన సభలో ఉపరాష్ట్రపతి, సచిన్ టెండూల్కర్, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం ఏయూ భవిష్యత్ ప్రగతికి సంబంధించిన అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరుగుతాయి. సభకు హాజరయ్యే విద్యార్థులు, అతిథుల సౌకర్యార్థం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రతి గ్యాలరీ వద్ద మంచినీటి సదుపాయంతో పాటు భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. భద్రతా తనిఖీలలో భాగంగా మెటల్ డిటెక్టర్లను వినియోగిస్తున్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన పాస్ ఉన్నవారికే లోపలికి అనుమతి ఉంటుంది. విద్యార్థులందరూ మధ్యాహ్నం 2 గంటల కల్లా ప్రాంగణానికి చేరుకోవాలని ఏయూ వీసీ ఆచార్య జీపీ. రాజశేఖర్ ఆదేశించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చేందుకు వీలుగా కూర్మన్నపాలెం, పెందుర్తి, సింహాచలం, తగరపువలస, భీమిలి మార్గాల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక ఉచిత ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. సంబంధిత పాస్లను చూపించి ఈ బస్సు సదుపాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఏయూ యాజమాన్యం సూచించింది. నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అల్లిపురం: ఏయూ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల నేపథ్యంలో సోమవారం నగరంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా మూడో పట్టణ పోలీస్ స్టేషన్ జంక్షన్ నుంచి మద్దిలపాలెం ఆర్చ్ వరకు రాత్రి 10 గంటల వరకు సాధారణ వాహనాలకు అనుమతి ఉండదు. శ్రీకాకుళం, విజయనగరం నుంచి అనకాపల్లి వైపు వెళ్లే భారీ వాహనాలు ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మార్గాల ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. వీవీఐపీల పర్యటనల సమయంలో జంక్షన్ల వద్ద ట్రాఫిక్ నిలుపుదల చేసే అవకాశం ఉన్నందున, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కోరారు. సభకు వచ్చే విద్యార్థులు, అతిథుల వాహనాల కోసం ఏయూ ప్రాంగణంలో పది ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించారు. విద్యార్థులు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు ధరించాలని, మొబైల్ ఫోన్లు తప్ప ఇతర వస్తువులను తీసుకురావద్దని పోలీసులు సూచించారు. వేడుకలు ముగిసిన తర్వాత కూడా వచ్చిన మార్గాల్లోనే తిరుగు ప్రయాణం చేయాలని, ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులకు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఏయూ శతాబ్ది ముగింపు వేడుకల ఏర్పాట్లపై కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, వీసీ జీపీ రాజశేఖర్తో కలిసి కమాండ్ కంట్రోల్ రూమ్లో సమీక్షించారు. కార్యక్రమాల షెడ్యూల్ను నిమిషాల వారీగా అమలు చేయాలని, సాంస్కృతిక కార్యక్రమాలు ఆటంకం లేకుండా జరగాలని ఆదేశించారు. అతిథులు, విద్యార్థులకు తాగునీరు, స్నాక్స్, పారిశుధ్యం, పార్కింగ్ సదుపాయాలు పక్కాగా ఉండాలని సూచించారు. వీవీఐపీల భద్రతకు అంబులెన్సులు, హెల్ప్ డెస్క్లు సిద్ధం చేయాలని ఆదేశించిన కలెక్టర్, అంతకుముందు ఏయూ ప్రాంగణం, తర్లువాడలోని ఏర్పాట్లను సీపీ శంఖబ్రత బాగ్చి, సీఎం కార్యక్రమాల నిర్వహణ సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి పరిశీలించారు. -
అంగరంగ వైభవంగా మారెమ్మ జాతర
భారీగా తరలివచ్చిన భక్తజనంసీలేరు: డప్పు వాయిద్యాలు, బాణసంచాలు, పసుపు కుంకుమలు, ధూపదీప నైవేద్యాల మధ్య స్థానిక గ్రామ దేవత మారెమ్మ తల్లి ప్రధాన పండుగ ఆదివారం అంగరంగ వైభవంగా ముగిసింది. ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో 1950 ప్రాంతంలో జలవిద్యుత్ కేంద్రాల నిర్మాణ సమయంలో తమిళనాడు నుంచి వచ్చిన కూలీలు కొండల మధ్య గుంటవాడ రిజర్వాయర్కు ఎదురుగా అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి నేటి వరకు ఏటా విద్యుత్ కాంతుల వెలుగుల మధ్య అమ్మవారి జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తులతో కిక్కిరిసిన సీలేరు ఈ నెల 14న ప్రారంభమైన జాతర ఆదివారంతో ముగిసింది. తెల్లవారుజాము ఆరు గంటల నుంచే భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకున్నారు. ఎండ తీవ్రతను సైతం లెక్కచేయకుండా రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో సీలేరు గ్రామం కిక్కిరిసిపోయింది. ఆలయ అర్చకులు దామోదర శర్మ, డొంకాయి శ్రీను నేతృత్వంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. మాలధారణ చేసిన భవానీ భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ● విశాఖపట్నానికి చెందిన పోలీస్ అధికారి కె. నాగరాజు–విజయ దంపతులు సుమారు 3వేల మందికి మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించి మొక్కు చెల్లించుకున్నారు. పండుగకు వచ్చిన భక్తుల సౌకర్యార్థం మూడు చోట్ల మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. కానుకల సమర్పణ తమిళనాడుకు చెందిన వర్ష అనే భక్తురాలు అమ్మవారికి అడుగున్నర ఎత్తు గల దీపపు కుందిని బహూకరించగా, వానపల్లి జయమ్మ అనే భక్తురాలు వెండి సామ గ్రిని అందజేశారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఆల య కమిటీ సభ్యులు అమ్మవారి ఫొటోలను పంపిణీ చేశారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి తదితర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఎస్ఐ యాసీన్ ఆధ్వర్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహించారు. -
పీలాపై తెలుగు తమ్ముళ్ల అసమ్మతి
● అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ ● సీనియర్ నాయకులను పట్టించుకోవడంలేదంటూ ఇష్టాగోష్టిలో ఆగ్రహం తుమ్మపాల (అనకాపల్లి): ‘పార్టీలో సీనియర్ నాయకులను పట్టించుకోవడం లేదు. ఇదేమిటని ప్రశ్నించిన వారిని వేధిస్తున్నారు. ఒంటెత్తు పోకడలకు పోయి పార్టీని మరింత నిర్వీర్యం చేస్తున్నారు..’ అంటూ నియోజకవర్గ ఇన్చార్జి పీలా గోవింద సత్యనారాయణపై అనకాపల్లి టీడీపీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్చార్జి పదవి నుంచి తక్షణమే తొలగించాలంటూ పలువురు సీనియర్ నాయకులు డిమాండ్ చేశారు. మండలంలో తుమ్మపాల వాటర్హౌస్ మామిడితోటలో టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు కొణతాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన టీడీపీ సీనియర్ నాయకులు ఇష్టాగోష్టి సమావేశంలో పీలా గోవిందపై తీరుపై అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు బోడి వెంకటరావు మాట్లాడుతూ పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు ప్రతిపక్షంలో ఉన్నప్పటికంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పీలా గోవింద్ స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని, కార్యకర్తలను అసలు పట్టించుకోవడం లేదన్నారు. పార్టీ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పీలాను తక్షణమే మార్చాలని డిమాండ్ చేశారు. మాజీ మండల అధ్యక్షుడు కొణతాల శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రూపులు సృష్టించి నియోజకవర్గంలో పార్టీని సర్వనాశనం చేస్తున్నారని, పార్టీ క్యాడర్ను కాపాడుకోవాలంటే తక్షణమే పీలాను మార్చాలని డిమాండ్ చేశారు. ఆయన్ను ఇన్చార్జిగా కొనసాగిస్తే పార్టీని భూస్థాపితం చేయడం ఖాయమన్నారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. పార్టీ పేరు చెప్పుకుని వ్యాపారాలు చేసుకోవడమే లక్ష్యంగా పీలా పనిచేస్తున్నారన్నారు. పార్టీ అధిష్టానం సరైన నిర్ణయం తీసుకోకుంటే త్వరలో చలో అమరావతి– సేవ్ టీడీపీ నినాదంతో ఐదు బస్సుల్లో విజయవాడ వెళ్లి చంద్రబాబు, లోకేష్లకు ఇక్కడి పరిస్థితి తెలియజేస్తామని చెప్పారు. వేటజంగాలపాలెం మాజీ సర్పంచ్ పూడి చిన్నారావు మాట్లాడుతూ పార్టీ అధికారంలో ఉండి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, నాయకులు, కార్యకర్తలను పీలా చిన్నచూపు చూస్తున్నారని చెప్పారు. సీనియర్ నాయకులకు కనీస విలువ కూడా ఇవ్వడం లేదని వాపోయారు. సీనియర్ నాయకులు గూడాల సత్యనారాయణ ముదిరాజ్ మాట్లాడుతూ పార్టీ పీలా దురాగతాలు, నియోజకవర్గంలో పార్టీ అనిశ్చితిపై అధినేత చంద్రబాబు, లోకేష్ దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ మండల అధ్యక్షుడు గొర్లి శ్రీనివాసరావు, నాయకులు మల్ల శివ నారాయణ, సారిపల్లి శ్రీనివాసరావు, తేలపు గోవిందరావు, కోడి నాగేశ్వరరావు, పట్నాల బుజ్జి పాల్గొన్నారు. -
108 అంబులెన్స్లోసుఖ ప్రసవం
డుంబ్రిగుడ: మండలంలోని గుంటసీమ పంచాయతీ జోగిపుట్టు గ్రామానికి చెందిన కొర్ర బృంద అనే గిరిజన మహిళ ఆదివారం ఉదయం 108 అంబులెన్స్లో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని 108 సిబ్బంది ఈఎంటీ అప్పలరాజు, పైలట్ శ్యామ్సుందర్లు వెల్లడించారు. జోగిపుట్టు గ్రామానికి చెందిన బృందకు పురిటి నొప్పులు రావడంతో, ఆమె భర్త రాజబాబు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సిబ్బంది తక్షణమే గ్రామానికి చేరుకుని, బాధితురాలిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువయ్యాయి. పరిస్థితిని గమనించిన సిబ్బంది, స్థానిక ఆశా కార్యకర్త సహకారంతో అంబులెన్స్లోనే సురక్షితంగా ప్రసవం చేశారు. మారుమూల ప్రాంతాల్లో ఆపత్కాలంలో అండగా నిలిచి, పురుడు పోసిన 108 సిబ్బందిని, ఆశా కార్యకర్తను గిరిజనులు ప్రత్యేకంగా అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. -
ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి
అరకు ఎంపీ గుమ్మా తనూజరాణిముంచంగిపుట్టు: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకుని సత్యం, ధర్మ మార్గాల్లో నడవాలని అరకు పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ గుమ్మా తనూజరాణి అన్నారు. మండలంలోని సుజనకోట గ్రామ పంచాయతీ కేంద్రంలో శ్రీశ్రీ గంగమ్మ తల్లి ఆలయ పునఃప్రారంభోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు ఉదయం నుంచి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు హోమం జరిపించి, ఆలయంపై బంగారు గోపురాన్ని ప్రతిష్టించారు. ఈ సందర్భంగా అరకు ఎంపీ దంపతులు డాక్టర్ గుమ్మా తనూజరాణి, వినయ్, అరకు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కేంద్ర కార్యవర్గ సభ్యుడు చెట్టి పాల్గుణ, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మక అకాడమీ చైర్మన్ వంపూరి గంగులయ్య, స్థానిక ఎంపీటీసీ దంపతులు సుబ్బలక్ష్మి, దామోదరం, వైస్ ఎంపీపీ భాగ్యవతి తదితరులు గంగమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు ఎంపీ దంపతులకు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. అభివృద్ధికి ఎంపీ హామీ ఆలయం చుట్టూ ఎంపీ నిధులతో ప్రహరీ గోడ నిర్మించాలని కమిటీ సభ్యులు కోరగా, ఎంపీ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం, ప్రార్థనకు కేటాయించడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఇది ఒత్తిడిని తగ్గించి, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుందని ఎంపీ పేర్కొన్నారు. సుజనకోట గంగమ్మ తల్లి ఆలయం ఎంతో సుందరంగా ఉందని, ఎంపీ నిధులతో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆమె హామీ ఇచ్చారు. అనంతరం ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులు కిముడు రామారావు, ప్రధాన కార్యదర్శి సమరెడ్డి కృష్ణబాలుడు, కోశాధికారి మండి పద్మరాజు ఆధ్వర్యంలో అన్నసమారాధన నిర్వహించారు. సుమారు రెండు వేల మంది భక్తులు పాల్గొని ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు, మాజీ సర్పంచులు, సరిహద్దు గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
పరిమితంగానే పెట్రోల్, డీజిల్ పంపిణీ
చింతపల్లి: ప్రస్తుతం నెలకొన్న ఇంధన కొరత నేపథ్యంలో వాహనదారులకు పెట్రోల్, డీజిల్ను పరిమితంగానే పంపిణీ చేయాలని చింతపల్లి బ్రాంచ్ మేనేజర్ ఎస్. సుగుణాఽథం సూచించారు. ఆదివారం ఆయన స్థానిక పెట్రోల్ బంకును సందర్శించి, రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్ నిల్వలు మరియు వినియోగదారులకు అందుతున్న సరఫరా పరిస్థితులను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్థానిక బంకు ద్వారా ప్రతిరోజూ 3.5 లక్షల నుండి 5 లక్షల రూపాయల వరకు ఇంధన విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే, ప్రస్తుతం విశాఖ హెచ్పీసీఎల్ నుంచి ఆయిల్ ట్యాంకర్లు క్రమబద్ధంగా వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు. గతంలో నగదు లేదా చెక్కు చెల్లించిన వెంటనే ట్యాంకర్లు వచ్చేవని, ఇంధన కొరత కారణంగా ఇప్పుడు సరఫరాలో జాప్యం జరుగుతోందని వివరించారు. అందరికీ అందాలనే ఈ నిర్ణయం.. అందుబాటులో ఉన్న ఇంధనాన్ని వాహనదారులందరికీ ఇబ్బంది లేకుండా పంపిణీ చేయాలనే ఉద్దేశంతోనే పరిమిత సరఫరా నిబంధన విధిస్తున్నట్లు ఆయన తెలిపారు. పెద్ద వాహనాలకు సైతం మితంగానే ఇంధనం నింపాలని సిబ్బందిని ఆదేశించారు. గతంలో బయట వ్యక్తులకు కెన్ల ద్వారా అధిక మొత్తంలో డీజిల్, పెట్రోల్ పంపిణీ చేసేవారని, ఇకపై వారికి కూడా పరిమితంగానే ఇవ్వాలని స్పష్టం చేశారు. వినియోగదారుల పట్ల సిబ్బంది మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. జీసీసీ చింతపల్లి బ్రాంచ్ మేనేజర్ సుగుణాథం -
గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కరాటే విద్యార్థుల ప్రతిభ
చింతపల్లి: హైదరాబాద్లో నిర్వహించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పాండు కరాటే అకాడమీ విద్యార్థులు పాల్గొని రికార్డు సృష్టించినట్లు చీఫ్ ఇన్స్ట్రక్టర్ బాకురు పాండురాజు తెలిపారు. ఈ నెల 26న హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో భారీ స్థాయిలో కరాటే ప్రదర్శన జరిగింది. గిన్నీస్ రికార్డు ప్రయత్నంలో భాగంగా నిర్వహించిన ఈ ప్రదర్శనలో జిల్లా నుంచి ఎం. దీప్తిక (పాడేరు), హర్షిణి (పాడేరు), పి. మేరి (చింతపల్లి), యు. కామేశ్వరరావు (జి. మాడుగుల) పాల్గొన్నారని పాండురాజు వివరించారు. ఈ రికార్డు కార్యక్రమంలో ఆరేళ్ల చిన్నారుల నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకు సుమారు రెండు వేల మంది పాల్గొన్నారన్నారు. యునైటెడ్ కింగ్డమ్ (లండన్) నుంచి వచ్చిన ప్రతినిధులు ఈ ప్రదర్శనను పరిశీలించి, రికార్డును ధ్రువీకరిస్తూ సర్టిఫికెట్లు అందజేశారని తెలిపారు. గిరిజన ప్రాంతం నుంచి వెళ్లి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. -
కాఫీ కూలీలకు నేరుగా వేతనాలు
చింతపల్లి: ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ కాఫీ తోటల్లో పనిచేస్తున్న గిరిజన కూలీలకు ఆన్లైన్ ద్వారా వేతనాలు చెల్లించడం వల్ల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి నేరుగా (నగదు రూపంలో) వేతనాలు చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ గెమ్మిలి మోహనరావు డిమాండ్ చేశారు. చింతపల్లి, గూడెం కొత్తవీధి మండలాల పరిధిలోని కాఫీ తోటల్లో పనిచేస్తున్న కూలీలకు వేతనాలు ఆన్లైన్లో జమ కావడంతో సమయానికి చేతికందక ఇబ్బంది పడుతున్నారు.మారుమూల ప్రాంతాల్లోని ఆదివాసీ కూలీలకు ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలపై కనీస అవగాహన లేకపోవడంతో, తమ కష్టార్జితాన్ని పొందేందుకు నానా అవస్థలు పడుతున్నారు.అటవీ గ్రామాల్లో నివసించే వీరికి బ్యాంకులు అందుబాటులో లేవు. కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఏటీఎంలు లేదా బ్యాంకు మిత్రల వద్దకు వెళ్తే, అక్కడ తరచూ సర్వర్ సమస్యలు ఎదురవుతున్నాయి. దీనివల్ల రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఈ తోటల్లో పనిచేసే మహిళలు, యువత, నిరుద్యోగులు రోజువారీ కూలీపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వేతనాలు సకాలంలో అందకపోవడం వల్ల కుటుంబ అవసరాలు తీరక వారు ఆర్థికంగా కుంగిపోతున్నారని మోహనరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల వల్ల కూలీలు కాఫీ తోటల పనులకు దూరమయ్యే ప్రమాదం ఉందని హె చ్చరించారు. ఏపీఎఫ్డీసీ అధికారు లు స్పందించి నేరుగా వేతనాలు చెల్లించే ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘ ప్రతినిధి మోహనరావు డిమాండ్ -
నూకాంబిక ఆలయానికి పోటెత్తిన భక్తులు
అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పు స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కొంతమంది భక్తులు అమ్మవారి ఆలయ వద్ద వంటకాలు తయారుచేసి, నైవేద్యంగా సమర్పించి, భోజనాలు చేశారు. పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు భక్తులకు ప్రసాదం, మజ్జిగ, తాగునీరు పంపిణీ చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్ సదుపాయాలు కల్పించారు. ఆలయం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ, ట్రాఫిక్ సీఐలు జి.ప్రేమ్కుమార్, ఎం.వెంకటనారాయణ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
సింహగిరిపై రెండో విడత చందనం అరగదీత ప్రారంభం
సింహాచలం (విశాఖ) : సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఆదివారం నుంచి రెండో విడత చందనం అరగదీత కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. వచ్చే నెల 1న వైశాఖ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి సమర్పించే మూడు మణుగుల (సుమారు 125 కిలోలు) చందనాన్ని సిద్ధం చేసేందుకు ఈ ప్రక్రియను చేపట్టారు. ఉదయం అర్చకులు చందనం చెక్కలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం, సిబ్బంది అరగదీతను ప్రారంభించారు. మొదటి రోజు 48 కిలోల చందనాన్ని అరగదీశారు. మరో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. రేపటి నుంచి చందనం విక్రయాలు మంగళవారం నుంచి సింహగిరిపై భక్తులకు చందనం విక్రయించనున్నట్లు సింహాచలం దేవస్థానం ఈఓ జె. వెంకటరావు తెలిపారు. ఆలయ ప్రసాదాల విక్రయశాలలో ఉదయం 8 గంటల నుంచి ఇవి అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. చందనం కొనుగోలు చేయాలనుకునే భక్తులు తమ అధార్కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ఒక్కొక్కరికి ఒక ప్యాకెట్ చొప్పున రూ.10కి విక్రయించడం జరుగుతుందన్నారు. -
సామాజిక, మేధో ప్రగతికి వేదిక ఏయూ
మద్దిలపాలెం (విశాఖ): సామాజిక, మేధో ప్రగతికి ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా నిలిచిందని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అన్నారు. ఎన్నో తరాలను తీర్చిదిద్దిన ఘనత ఈ విశ్వవిద్యాలయానికే సొంతమని, దేశంలోనే నంబర్ 1 వర్సిటీగా ఏయూ ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఏయూ శతాబ్ది వేడుకల్లో భాగంగా, వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం నిర్వహించిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. విశాఖతోనూ, ఏయూతోనూ తనకు ఎంతో భావోద్వేగ అనుబంధం ఉందన్నారు. ఉన్నత విద్యా వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం సమూల మార్పులు చేపడుతోందని, విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తెచ్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. అంతకుముందు వర్సిటీ వ్యవస్థాపక ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ మాట్లాడుతూ.. యూనివర్సిటీ ఫస్ట్ అనే నినాదంతో అందరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఏయూ అలుమ్ని అసోసియేషన్ అధ్యక్షుడు కె.వి.వి.రావు మాట్లాడుతూ.. ఏయూలో విద్యను అభ్యసించడం పూర్వజన్మ సుకృతమన్నారు. అనంతరం జైపూర్ రాజవంశీయులు మయూఖ కుమారి దేవి, పాలకమండలి సభ్యులను ఘనంగా సత్కరించారు. ప్రతిభ కనబరిచిన ఆచార్యులకు ఫ్యాకల్టీ ఎక్సలెన్స్ అవార్డులు, అలుమ్ని అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, ప్రిన్సిపాల్స్, డీన్లు, ఉద్యోగులకు జ్ఞాపికలను అందజేసి సత్కరించారు. వివిధ అంశాల్లో విశేష ప్రతిభ చూపిన వారికి పురస్కారాలను అందజేశారు. హెచ్ఆర్డీ కార్యదర్శి కోన శశిధర్ -
భవిష్యత్ తరాల కోసం ‘కాల స్మృతి గుళిక’
మద్దిలపాలెం (విశాఖ): ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా భవిష్యత్ తరాలకు నేటి చరిత్రను అందించే లక్ష్యంతో.. పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ‘కాల స్మృతి గుళిక’ను ఏర్పాటు చేశారు. వందేళ్ల వేడుకల సందర్భంగా విశ్వవిద్యాలయానికి సంబంధించిన అనేక చారిత్రక అంశాలను దీనిలో భద్రపరిచామని, వీటిని 50 ఏళ్ల తర్వాత తెరిచి చూసేలా ప్రణాళిక రూపొందించామని ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్, ఏయూ అలుమ్ని అసోసియేషన్ అధ్యక్షులు కె.వి.వి.రావు తెలిపారు. ఈ కాల స్మృతి గుళికను శతాబ్ది ఉద్యానవనంలో ప్రత్యేకంగా భద్రపరుస్తున్నట్లు వారు పేర్కొన్నారు. అనంతరం పరిపాలన భవనం ఎదురుగా ఏర్పాటు చేసిన చారిత్రక చాయాచిత్రాల ప్రాంగణాన్ని వారు సందర్శించారు. కార్యక్రమంలో ఏయూ రెక్టర్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, క్యాంపస్ కళాశాలల ప్రిన్సిపాల్స్, డీన్లు, తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటక భాగ్యం
పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించడంతో పట్టణ ప్రాంతాల్లో దైనందిన జీవితంతో విసుగెత్తిపోయిన ప్రజలు కాస్త ఉపశమనం కోసం ప్రకృతి వైపు అడుగులు వేస్తున్నారు. అలాంటి వారి కోసం ప్రకృతి మాత ఆహ్వానం పలుకుతోంది. ఎటు చూసినా పచ్చని కొండలు, జలజలపారే జలపాతాలు, వేసవిలోనూ ఊరటనిచ్చే చల్లటి గాలులు మన్యం ప్రత్యేకత. ఆ విశేషాలు మీకోసం. గిరి సోయగం..ముంచంగిపుట్టు/డుంబ్రిగుడ: మన్యం పేరు వింటేనే అంతులేని ప్రకృతి అందాలు, పచ్చని కొండకోనలు కళ్లముందు కదలాడుతుంటాయి. ఎటుచూసినా పరవళ్లు తొక్కే జలపాతాలు, నిశ్చలంగా అలరారే జలాశయాలు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచుతున్నాయి. తూర్పు కనుమల్లో దట్టమైన అడవుల మధ్య సాగే ప్రయాణం, మంచు దుప్పటి కప్పుకున్న కొండలు మనసును మైమరపిస్తాయి. చింతపల్లి నుంచి పాడేరు వరకు, అరకులోయ నుంచి జోలాపుట్టు వరకు ప్రతి అడుగులోనూ ప్రకృతి తన వింతలను పరిచయం చేస్తుంది. కాలుష్యానికి దూరంగా, స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తూ సేదతీరాలనుకునే వారికి ఈ ప్రాంతం ఒక స్వర్గధామంలా కనిపిస్తుంది. పరవళ్లు తొక్కుతున్న డుడుమ జలపాతం జాలువారుతున్న జలపాతాలు అకట్టుకుంటున్న ప్రకృతి అందాలు ఎటుచూసినా చల్లని గాలులు సరికొత్త అనుభూతిని పంచుతున్నపర్యాటక ప్రాంతాలు -
కాఫీ తోటల్లో 749 కిలోల గంజాయి స్వాదీనం
నాడు: రాష్ట్రం గంజాయిమయంగా మారింది. నేను అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో గంజాయి బ్యాచ్పై ఉక్కుపాదం మోపుతా. – 2024, మే 10న ఏలూరులో ఎన్నికల ప్రచారంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబునేడు: అల్లూరి జిల్లాలో 749 కిలోల గంజాయి లభ్యంపాడేరు: ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే గంజాయిని పూర్తిగా అరికడతామని చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. కానీ, అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా నిత్యం రాష్ట్రంలో గంజాయి సరఫరా అవుతూనే ఉంది. తాజాగా, అల్లూరి జిల్లాలో 749 కిలోల గంజాయి పట్టుబడింది. ముంచంగిపుట్టు మండలం పనసపుట్టు పంచాయతీ సంగవలస గ్రామ శివారు కొండ ప్రాంతంలో ఈ నెల 24న రాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు.కొండ మధ్యలో ఉన్న కాఫీ తోటల్లో భారీ గంజాయి నిల్వల కేంద్రాన్ని గుర్తించారు. కాఫీ తోటల పొదల మధ్యన 39 గన్నీ బ్యాగుల్లో నింపిన గంజాయి మూటలను బయటకు తీశారు. వాటికి తూకం వేయగా 749 కిలోలుగా తేలింది. దీని విలువ రూ.37,45,000 ఉంటుందని ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. స్మగ్లర్లు, సరఫరాదారులు, రవాణాదారులు అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు. -
కేజీహెచ్లో గిరిజన బాలింతకు చేదు అనుభవం
మహారాణిపేట: విశాఖలోని కింగ్ జార్జ్ ఆస్పత్రి (కేజీహెచ్)లో గిరిజన బాలింతకు చేదు అనుభవం ఎదురైంది. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం మత్స్యపురం గ్రామానికి చెందిన సుమిత్ర డెలివరీ కోసం ఈ నెల 19న కేజీహెచ్లో గైనిక్ వార్డులో చేరింది. అదే రోజు పాపకు జన్మనిచ్చింది. శనివారం డిశ్చార్జి అయ్యింది. శుక్రవారం నుంచి తమ ఇంటికి వెళ్లడానికి తల్లీ బిడ్డ వాహనం ఇవ్వాలని గిరిజన దంపతులు కేజీహెచ్లో ఆర్ఎంవోను కోరారు.ఒక రోజు ఆస్పత్రిలో ఉంటే వాహనం ఇస్తామని వారు చెప్పారు. అయితే శనివారం ఉదయం మాత్రం తమ దగ్గర వాహన సదుపాయం లేదని చెప్పడంతో చేసేందేం లేక మండుటెండులో కేజీహెచ్ నుంచి గిరిజన దంపతులు ఆర్టీసీ కాంప్లెక్స్కు వెళ్లారు. అక్కడి నుంచి బస్సులో మత్స్యపురానికి రోజుల పసిబిడ్డతో బయలుదేరారు.కాగా, తాము వాహనం ఇస్తామని చెప్పినా వారు వినకుండా వెళ్లిపోయారని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి తెలిపారు. వాహనానికి సాంకేతిక సమస్య వచ్చిందని, దాని వల్ల ఒక రోజు ఉండాలని కోరామని కానీ వినలేదని ఈ విషయాన్ని లిఖిత పూర్వకంగా రాసిఇచ్చారని చెప్పారు. -
నేటి నుంచి రెండో విడత చందనం అరగదీత
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో ఆదివారం నుంచి రెండో విడత చందనం అరగదీత ప్రక్రియ ప్రారంభం కానుంది. వచ్చే నెల 1వ తేదీన వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకుని, ఆ రోజు స్వామికి సమర్పించేందుకు మూడు మణుగుల పచ్చి చందనాన్ని(సుమారు 125 కిలోలు) సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు శనివారం చందనం చెక్కలను అరగదీతకు వీలుగా ముక్కలుగా కోశారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో జె.వెంకటరావు, ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు, ఇన్చార్జి డీఈ హరి, సిబ్బంది సాంబ తదితరులు పాల్గొన్నారు. కాగా.. ఏడాదిలో స్వామి వారికి చందనోత్సవం రోజు రాత్రి, వైశాఖ పౌర్ణమి, జ్యేష్ట పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో ఉదయం వేళల్లో మూడు మణుగుల చందనాన్ని సమర్పిస్తామని అర్చకులు తెలిపారు. ఇప్పటికే చందనోత్సవం సందర్భంగా తొలి విడత చందన సమర్పణ పూర్తయిందని, రెండో విడతగా వచ్చే నెల 1న స్వామికి చందనం అలంకరిస్తామని వారు వివరించారు. -
ఏయూ ప్రత్యేకత.. కళాప్రపూర్ణ
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల వేళ, ఆ సరస్వతీక్షేత్రం అందించిన అత్యున్నత పురస్కారాల చరిత్రను నెమరువేసుకోవడం ఎంతో గర్వకారణం. సాధారణంగా విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ఇవ్వడం పరిపాటే అయినా, ఏయూ ప్రదానం చేసే కళాప్రపూర్ణ పురస్కారానికి దేశంలో మరే వర్సిటీకి లేని ప్రత్యేకత ఉంది. కళలు, సాహిత్యం, చలనచిత్ర రంగాలను ప్రోత్సహించే దిశగా నాటి ఉపకులపతి సర్ సి.ఆర్.రెడ్డి ఈ అరుదైన పురస్కారానికి శ్రీకారం చుట్టారు. 1927 డిసెంబర్ 5న జరిగిన తొలి స్నాతకోత్సవంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తొలి గౌరవ డాక్టరేట్ అందుకోగా, విశ్రాంత సంస్కృత ఆచార్యులు వేదం వెంకటరాయ శాస్త్రి తొలి కళాప్రపూర్ణను స్వీకరించారు. ఆ మరుసటి ఏడాదే నోబెల్ గ్రహీత సి.వి.రామన్కు గౌరవ డాక్టరేట్ అందించడం ఏయూ ఘనతను చాటుతుంది. ఆ తర్వాత కాలంలో ఎంతోమంది ఉద్దండులకు ఈ పురస్కారం వరించింది. గిడుగు రామమూర్తి, గుర్రం జాషువా, కాశీనాథుని నాగేశ్వరరావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, సి.నారాయణరెడ్డి, బోయి భీమన్న వంటి సాహిత్య దిగ్గజాలను ఏయూ సత్కరించింది. అలాగే ఎన్టీఆర్, ఏఎన్నార్, భానుమతి, కృష్ణ, చిరంజీవి లాంటి సినీ శిఖరాలు, మంగళంపల్లి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి సంగీత సామ్రాట్లు, బాపు, దాసరి నారాయణరావు వంటి దర్శకులు కళాప్రపూర్ణ అందుకున్న వారిలో ఉన్నారు. 1978లో జరిగిన 50వ స్నాతకోత్సవంలో ఒకే సారి 15 మంది ప్రముఖులకు ఈ పురస్కారాలు అందించడం విశేషం. సాహిత్య, కళా రంగాలకే పరిమితం కాకుండా క్రీడా రంగాన్ని సైతం ప్రోత్సహిస్తూ 1988లో సునీల్ గవాస్కర్కు, 1990లో సి.ఎస్.నాయుడుకు ఏయూ క్రీడా ప్రపూర్ణ అందజేసింది. ఇక ఏయూ స్నాతకోత్సవాలకు విచ్చేసిన ముఖ్య అతిథుల జాబితా కూడా అంతే ఘనమైనది. సర్వేపల్లి రాధాకృష్ణన్, సి.వి.రామన్, సరోజిని నాయుడు, ఇందిరాగాంధీ, దలైలామా, ఎ.పి.జె అబ్దుల్ కలాం, నీలం సంజీవరెడ్డి లాంటి దేశ, విదేశీ ప్రముఖులు వర్సిటీ వేదికను అలంకరించారు. 1993లో మదర్ థెరిసాకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ సైతం ఏయూను సందర్శించి ప్రత్యేక ప్రసంగం చేశారు. నూరేళ్ల పండుగ చేసుకుంటున్న ఆంధ్రవిశ్వవిద్యాలయం, ఇలా ఎందరో మహానుభావులను సత్కరించి తన కీర్తి కిరీటంలో అరుదైన మణిమాణిక్యాలను పొందుపరుచుకుందని చెప్పవచ్చు.మహానుభావులను వరించిన పురస్కారం -
గిట్టుబాటు.!
ఏజెన్సీ ప్రాంతాల్లో పండించే అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర దక్కక గిరిజన రైతులు దళారుల చేతిలో నష్టపోతున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ దళారులు భారీ లాభాలు పొందుతుంటే.. రైతులు మాత్రం పెట్టుబడి కూడా రాని పరిస్థితిలో అప్పులపాలవుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంతో పాటు పాడేరు ఐటీడీఏ కూడా కనీస మద్దతు ధరల కల్పనపై దృష్టి సారించడం లేదు. గిరిజనులకు అండగా నిలవాల్సిన జీసీసీ కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తోంది.దళారులకేసాక్షి, పాడేరు: గిరిజనులు సాగు చేసే వ్యవసాయ, వాణిజ్య పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించకపోవడంతో దళారీ వ్యవస్థ రాజ్యమేలుతోంది. రిటైల్గా రాష్ట్ర, జాతీయ స్థాయిలో అధిక ధరలు పలికే గిరిజన ఉత్పత్తులకు సంతల్లో రైతుల నుంచి కొనుగోలు చేసే సమయంలో మాత్రం వ్యాపారులు కనీస గిట్టుబాటు ధరలు అమలు చేయడం లేదు. గ్రామాలతో పాటు అన్ని వారపు సంతల్లోను స్థానిక, మైదాన ప్రాంతాలకు చెందిన వ్యాపారులదే రాజ్యం. ఇప్పటికే కాఫీ గింజల అమ్మకాలతో నష్టపోయిన గిరిజన రైతులకు.. పసుపు, పిప్పలమోడి, మిరియాల పంటల అమ్మకాల్లోను అన్యాయమే జరుగుతుంది. ధరలు తగ్గించి.. నిలువునా మోసం కాఫీ గింజల సీజన్ చివరిలో జీసీసీ కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులంతా సిండికేట్ అయి కిలో రూ.400 నుంచి రూ.450 చొప్పున తక్కువ ధరకు కొనుగోలు చేశారు. ఇలా కిలోకు రూ.50 నుంచి రూ.100 వరకు రైతులు నష్టపోయారు. సీజన్ చివరిలో సుమారు 2 వేల టన్నుల వరకు నిల్వల ఉండిపోవడంతో గిరిజన రైతులకు నష్టాలు తప్పలేదు. అంతర పంటలకూ దక్కని మద్దతు అంతర పంటగా సాగు చేస్తున్న పసుపు, పిప్పలమోడి పంటలకు కూడా గిట్టుబాటు ధరలు కరువయ్యాయి. సుమారు 40 వేల ఎకరాల విస్తీర్ణంలో పసుపు, పిప్పలమోడి పంటలు సాగవుతున్నాయి. ఈ రెండు పంటల ద్వారా అన్ని ఖర్చులు పోను ఎకరానికి రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. అయితే గతేడాది కన్నా పసుపు, పిప్పలమోడి ధరలు ప్రస్తుతం తగ్గించేశారు. కిలో పసుపును రూ.130, పిప్పలమోడిని రూ.230 చొప్పున కొనుగోలు చేస్తుండడంతో రైతులు భారీగా నష్టాలు చవిచూస్తున్నారు. మిరియాలకు కూడా ఐటీడీఏ గిట్టుబాటు ధర కల్పించలేక పోయింది. మిరియాలకు జాతీయ స్థాయిలో కిలో రూ.1000 పైగా ధర పలుకుతున్నా.. వ్యాపారులు మాత్రం కిలో రూ.650 చొప్పున కొనుగోలు చేసి గిరిజన రైతులను మోసం చేస్తున్నారు. ఏజెన్సీలో లక్ష ఎకరాల కాఫీ తోటల్లో అంతర పంటగా మిరియాలు సాగవుతున్నాయి. ముంచంగిపుట్టు, పెదబయలు, హుకుంపేట, గుత్తులపుట్టు, జి.మాడుగుల, కించుమండ, అన్నవరం, అరకు, సుంకరమెట్ట వంటి పెద్ద సంతల్లో వ్యాపారం భారీగా జరుగుతున్నా వ్యాపారులకు మాత్రమే కలిసొస్తోంది. కష్టపడి సాగు చేసిన గిరిజన రైతులకు మాత్రం గిట్టుబాటు ధరలు రావడం లేదు. శనివారం హుకుంపేట సంతలో భారీగా వ్యాపారాలు జరిగినప్పటికి వ్యాపారులంతా సిండికేట్గానే తయారై ధరలు తగ్గించి కొనుగోలు చేశారు. గిరిజన ఉత్పత్తులకు మద్దతు ధరల కరువు కనీస ధరల కల్పనలో ఐటీడీఏ విఫలం జీసీసీ కూడా పట్టించుకోని వైనం ఇప్పటికే కాఫీ అమ్మకాల్లో రైతులకు భారీ నష్టం మిరియాలు, పసుపు, పిప్పలమోడి ధరలూ పతనం కాఫీ, మిరియాలకు మద్దతు కరువు ఈ ఏడాది కాఫీ, మిరియాల పంటలకు సంతల్లో గిట్టుబాటు ధరలు కరువయ్యాయి. పంట దిగుబడులు తగ్గడంతో ధరలు పెరుగుతాయని ఆశపడ్డాం. జీసీసీ చివరిలో కాఫీ గింజలు కొనుగోలు చేయకపోవడంతో కిలో రూ.430 చొప్పున తక్కువ ధరకు అమ్ముకున్నాను. మిరియాల గింజలకు బయట మార్కెట్లో డిమాండ్ ఉన్నా కూడా కిలో రూ.600 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు. – పాంగి కోటేశ్వరరావు, కాఫీ రైతు, వల్లాపురం, పాడేరు మండలం ప్రభుత్వానికి పట్టని రైతుల నష్టాలు ఏజెన్సీలో గిరిజన రైతులు సాగు చేస్తున్న వ్యవసాయ, వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధరల కల్పనలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. సంతల్లో వ్యాపారులు తక్కువ ధరలకు కొనుగోలు చేస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర, జాతీయ స్థాయి మార్కెట్లలో ధరలకు అనుగుణంగా ఏజెన్సీలో పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం, ఐటీడీఏలపై ఉంది. జీసీసీ కూడా అన్ని పంటలను కొనుగోలు చేయాలి. – పాలికి లక్కు, రైతు సంఘం నేత, గుర్రగరువు, పాడేరు మండలం పసుపు, పిప్పలమోడి ధరలు పతనం రెండేళ్ల క్రితం పసుపు, పిప్పలమోడికి గిట్టుబాటు ధరలు ఉండేవి. కిలో పసుపును రూ.160 చొప్పున అమ్మిన నేను ఈ ఏడాది కిలో రూ.130కు అమ్ముకుని నష్టపోయాను. పిప్పలమోడికి ధరలు పతనం చేశారు. పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడింది. – సుర్ర చిట్టిబాబు, పసుపు రైతు, కరకపుట్టు, పాడేరు మండలం -
రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీలకు 32 మంది ఎంపిక
ఎంపికై న క్రీడాకారులతో పీఈటీలు,అసోసియేషన్ సభ్యులు మాకవరపాలెం: రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీలకు 32 మంది ఎంపికయ్యారని బేస్బాల్ అసోసియేషన్ చైర్మన్ అక్షజ్కృష్ణ తెలిపారు. స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు వివిధ మండలాల నుంచి 14 ఏళ్లలోపు వయస్సున్న 70 మంది హాజరయ్యారు. ఎంపిక పోటీల్లో 16 మంది బాలురు, 16 మంది బాలికలు ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారంతా వచ్చే నెల 5, 6, 7 తేదీల్లో కర్నూలులో జరిగే రాష్ట్రస్థాయి బేస్బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం శ్రీను, పీఈటీ రవి పాల్గొన్నారు. -
రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
అనకాపల్లి: మండలంలోని కొత్తూరు గ్రామ సమీపంలో విజయవాడ –విశాఖ రైల్వేలైన్లో గుర్తుతెలియని రైలు ఢీకొని సుమారుగా 35 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి శనివారం మృతి చెందాడు. స్థానికులు, రైల్వే గ్యాంగ్మేన్ ఇచ్చిన సమాచారం మేరకు దువ్వాడ జీఆర్పీ ఎస్ఐ కె.టి.ఆర్.లక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలిచారు. మృతుడు ఎరుపురంగు హాఫ్ హ్యాండ్స్ టీ షర్ట్, నేవీ బ్లూ రంగు ఫ్యాంటు ధరించి ఉన్నాడని, ఎడమచేతి బొటనవేలు దగ్గర ఆర్.కె. అనే టాటూ ఉందని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. సమాచారం తెలిసిన వారు సెల్నంబర్. 7382058996ను సంప్రదించాలని ఎస్ఐ చెప్పారు. -
కార్మికుల అరెస్టు అన్యాయం
నర్సీపట్నం: న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని శాంతియుత నిరసన తలపెడితే సీఐటీయు, పయనీర్ కంపెనీ కార్మికులను అరెస్ట్ చేయడం అన్యాయమని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు జి.కోటేశ్వరరావు పేర్కొన్నారు. అరెస్ట్ను నిరసిస్తూ శుక్రవారం పట్టణంలో సీఐటీయూ నాయకులు ధర్నా నిర్వహించారు. కార్మికుల పక్షాన పోరాడుతున్న సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి రుత్తల శంకరరావు, అడిగర్లరాజుతో పాటు ముగ్గురు కార్మికులను అరెస్టు చేయడం పోలీసులకు తగదన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా యాజమాన్యం పోలీసులను ఉపయోగించి కార్మికులను భయభ్రాంతులకు గురి చేసి, బలవంతంగా లొంగదీసుకునే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. కార్మికులకు అండగా నిలిచిన సీఐటీయు నాయకత్వాన్ని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తక్షణమే జిల్లా లేబర్ కమిషనర్ జోక్యం చేసుకుని కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేకుంటే జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఈ.చిరంజీవి, ఎస్.వి.నాయుడు, ఎస్.నాగ రమణ, ముఠాకార్మిక సంఘం నాయకులు రాము పాల్గొన్నారు. మాడుగుల రూరల్: జిల్లాలో మాకవరపాలెంలో పయనీర్ (రస్ఆల్ కై మా , ఆన్రాక్ అల్యూమినియం కంపెనీ)లో పనిచేస్తున్న కార్మికులు నాలుగు రోజులుగా వేతనాలు పెంచాలని కోరుతూ అందోళన చేస్తుండగా, వారికి మద్దతు పలికిన కార్మిక నేతలను అరెస్టు చేయడం అన్యాయమని ప్రజా సంఘాలు నాయకులు మండిపడ్డారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వెంకన్న, గిరిజన సంఘం నాన్ షెడ్యూల్ ఏరియా జిల్లా కార్యదర్సి ఇరటా నర్సింహమూర్తి, కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.టి.దొర కలిసి స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఆందోళన చేస్తున్న కార్మికులకు మద్దతు ఇవ్వడానికి వెళ్లిన సీఐటీయూ జిల్లా కార్యదర్సి ఆర్. శంకరావు, సీఐటీయు రాష్ట కమిటీ సభ్యులు జి. కోటీశ్వరరావు, ఎ.రాజాను అరెస్టు చేయడం అన్యాయమన్నారు.ఆన్రాక్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు పలు పర్యాయాలు అందోళన చేసినా సరే ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అరెస్టు చేసిన నాయకులను జిల్లాలో అనేక పోలీసుస్టేషన్లకు తిప్పి, చివరకు గొలుగొండ పోలీసుస్టేషన్లో ఉంచడం కంపెనీ యాజమాన్యానికి పోలీసులు కొమ్ము కాస్తున్నారనడానికి నిదర్శనమన్నారు. -
నీరుగారిన ఆశయం.!
కొయ్యూరు: వేసవిలో పశువుల దాహం తీర్చేందుకు ఏర్పాటు చేసిన పశువుల నీటి తొట్టెలు నీరు లేక నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. అధికారులు పశువుల తొట్టెలను గతేడాది నిర్మాణం చేపట్టారు. అంత వరకు బాగానే ఉంది. కానీ వాటిలో నీరు మాత్రం వేయించడం లేదు. ఫలితంగా ఆశయం నీరుగారిపోతోంది. భానుడు ప్రతాపంతో ఎండలు గట్టిగానే కాస్తున్నాయి. మేతకు వెళ్లిన పశువులు తాగునీటి కోసం అల్లాడిపోతున్నాయి. కాలువలు ఉన్న చోట్ల కొంత వరకు పర్వాలేదు. అవి లేని చోట్ల దాహంతో ఉండాల్సి వస్తుంది. పంచాయతీకి ఒక నీటి తొట్టెను కిందటి సంవత్సరం నిర్మాణం చేశారు. ఇందుకు ఒక్కో తొట్టె కోసం రూ.32 వేల వరకు ఖర్చు చేశారు. మొత్తం 27 తొట్టెలను నిర్మించారు. వేసవిలో రెండు నెలల పాటు రోజూ తొట్టెల్లో నీటిని పోయాలి. నీరు అందుబాటుగా ఉన్న ప్రాంతాల్లోనే వీటి నిర్మాణం చేపట్టారు. వీటికి నీటి సరఫరా చేసే బాధ్యతను ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు అప్పగించారు. దీనిపై పర్యవేక్షణ లోపించడంతో తొట్టెల్లోకి నీరు సరఫరా కావడం లేదు. నీరు ఉంటే పశువులతో పాటు పక్షులు, కోతులు లాంటివి దాహం తీర్చుకునే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల ఊట కాలువలు కూడా ఎండలకు ఎండిపోయే స్థితికి చేరాయి. దీంతో నీటి కొరత ఎక్కువైంది. దీనిని దృష్టిలో ఉంచుకుని తొట్టెల్లో తాగునీరు సరఫరా చేయాలి. దీనిపై ఉపాధి హామీ ఏపీడీ సీతయ్యను సంప్రదించగా.. తొట్టెల్లోకి నీటిని సరఫరా చేసే బాధ్యతను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తీసుకోవాలని చెప్పారు. దాహం తీర్చని పశువుల నీటి తొట్టెలు గతేడాది తొట్టెలు నిర్మించి వదిలేసిన వైనం ఎండలకు దాహంతో అల్లాడుతున్న పశువులు -
ప్రజల భాగస్వామ్యంతో మలేరియా నియంత్రణ
తుమ్మపాల: ప్రభుత్వం మలేరియా నియంత్రణ కోసం ఇంటింటి పర్యటనలు, రక్త నమూనాల సేకరణ, సత్వర చికిత్స, దోమల లార్వా నియంత్రణ చర్యలపై చేస్తున్న అవగాహన కార్యక్రమాలతో పాటు ప్రజల భాగస్వామ్యంతో మలేరియా నియంత్రణ సాధ్యమని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖా అధికారి డాక్టర్ ఎం.హైమవతి, డీఎంహెచ్ఓ కె.వరహాలదొర అన్నారు. తుమ్మపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం నిర్వహించిన ప్రపంచ మలేరియా దినోత్సవంలో 2026 సంవత్సరానికి మలేరియా నిర్మూలన దిశగా ‘ఇప్పుడు మనం సాధించగలం, ఇప్పుడు మనం తప్పక సాధించాలి...’ అనే థీమ్తో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలేరియా అనేది దోమల ద్వారా వ్యాపించే ఒక ప్రాణాంతక వ్యాధి అని, సరైన జాగ్రత్తలు తీసుకుంటే పూర్తిగా నివారించవచ్చన్నారు. జ్వరం, వణుకు, తలనొప్పి, అలసట, వాంతులు, చెమటలు పట్టడం వంటివి మలేరియా లక్షణాలని, వాటి నివారణకు ఇళ్లు, పరిసరాల్లో నీరు నిల్వ కాకుండా చూడాలన్నారు. దోమల పెరుగుదలను నివారించడానికి ప్రతి వారం డ్రైడే పాటించాలని, దోమ తెరలు ఉపయోగించాలని, అవసరమైన చోట్ల కీటకనాశక మందులు పిచికారీ చేయాలన్నారు. జ్వరం వచ్చిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకొని, వైద్యుల సూచన మేరకు పూర్తి చికిత్స తీసుకోవాలని అన్నారు. మలేరియా నిర్మూలనపై వైద్య సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. -
ప్రాణం తీసిన నిద్రమత్తు
● ఆగివున్న లారీని ఢీకొన్న వ్యాన్ ● కుమార్తె మృతి ● డ్రైవర్, భార్య, మరో కుమార్తెకు గాయాలు అనకాపల్లి: తండ్రి నిద్రమత్తు కుమార్తె ప్రాణాలు బలిగొంది... అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు ఎంతో సరదాగా కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరిన ఆ బాలిక అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. అనకాపల్లి జాతీయరహదారిలో నాగుపలాపల్లి జంక్షన్ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక మృతి చెందగా, ఆ బాలిక తల్లి,తండ్రి, సోదరి గాయపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. ట్రాఫిక్ ఎస్ఐ జి.సత్యనారాయణ తెలిపిన మేరకు వివరాలు... రావులపాలెంలో రుద్రసాయి ప్రసాద్(డ్రైవర్) వ్యాన్లో అరటిపళ్లు లోడు చేసుకుని బొబ్బిలి వెళ్లేందుకు శుక్రవారం సాయంత్రం బయలుదేరాడు. పనిలోపనిగా రాజంలోగల తన అత్తవారింటి వద్ద దింపేందుకు తన స్వగ్రామం కాకినాడ జిల్లా అనపర్తిలో తన భార్య రుద్రగీత, పెద్ద కుమార్తె నాగ తనూజ(09), చిన్న కుమార్తె నాగ చైతన్య అజ్యశ్రీలను వ్యాన్లో ఎక్కించుకున్నాడు. శనివారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో వ్యాన్ డ్రైవర్ ప్రసాద్కు ముఖం కడుగుకోవాలని కశింకోట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెచ్సీ నీరు అందజేశారు. అనంతరం తాళ్లపాలెం జంక్షన్ వద్ద వ్యాన్ కొంతసేపు ఆపారు. అక్కడి నుంచి బయలుదేరి కొంతదూరం ప్రయాణించిన తరువాత డ్రైవర్ ప్రసాద్కు నిద్ర వస్తుండడంతో కశింకోట వద్ద వ్యాన్ను ఆపి, టీ తాగి బయలుదేరారు. అనకాపల్లి జాతీయ రహదారి నాగులాపల్లి జంక్షన్ వద్దకు వచ్చేసరికి డ్రైవర్ ప్రసాద్ నిద్రమత్తులోకి జారుకున్నాడు. ఆ మత్తులో అక్కడ అగి ఉన్న లారీ వెనుక భాగాన ఢీ కొట్టడంతో వ్యాన్లో ప్రయాణిస్తున్న పెద్దకుమార్తె నాగతనూజ(9) అక్కడికక్కడే మృతిచెందినట్టు ఎస్ఐ చెప్పారు. డ్రైవర్ ప్రసాద్, భార్య గీత, చిన్నకుమార్తె నాగచైతన్య అజశ్రీలు స్వల్పగాయాలతో బయటపడ్డారని, గీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించినట్టు ఎస్ఐ చెప్పారు. -
వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలి
● జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ● పెట్రోల్ బంకు, గ్యాస్ గొడౌన్ల తనిఖీ డుంబ్రిగుడ/హుకుంపేట: గిరిజన ప్రాంతాల్లోని వినియోగదారులకు మెరుగైన సేవలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ఆదేశించారు. శనివారం హుకుంపేట, డుంబ్రిగుడ మండలాల పరిధిలోని జీసీసీ పెట్రోల్ బంకు, గ్యాస్ గొడౌన్ల్ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెట్రోల్ బంకు స్టాక్ రికార్డులను పరిశీలించారు. గ్యాస్ గొడౌన్ల్లో ఉన్న సిలిండర్ల నిల్వలు, రికార్డులను స్వయంగా తనిఖీ చేశారు. స్టాక్ వివరాల్లో ఎటువంటి వ్యత్యాసాలు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్ల పంపిణీలో ఎటువంటి జాప్యం జరగకూడదని, పెట్రోల్ బంకుల వద్ద వినియోగదారులకు అవసరమైన కనీస సదుపాయాలు కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీల్లో జిల్లా పౌర సరఫరాల అధికారి వి.మోహన్, ఏఎస్వో ప్రశాంత్, మండల డిప్యూటీ తహసీల్దార్, తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటకులకు ఆహ్లాదకర వాతావరణం లక్ష్యం
● ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ ● డుంబ్రిగుడ మండలంలో ఆకస్మిక పర్యటన డుంబ్రిగుడ: పర్యాటక కేంద్రం చాపరాయిలో పర్యాటకులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడమే లక్ష్యంగా పని చేద్దామని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్యవర్మ అన్నారు. డుంబ్రిగుడ మండలంలో శనివారం ఆయన ఆకస్మికంగా పర్యటించారు. తహసీల్దార్ కార్యాలయంలోని రెవెన్యూపరమైన సేవలపై ఆరా తీశారు. సమీపంలో వెలుగు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిరు ధాన్యాల కేంద్రం(మిల్లెట్స్హబ్)ను సందర్శించారు. వ్యాపార లావాదేవీలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చాపరాయి పరిసర ప్రాంతాలను సందర్శించి పర్యాటకులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. రోజు వారీగా వచ్చే ఆదాయంతో పాటు రికార్డులను తనిఖీ చేశారు. పర్యాటకుల సౌకర్యార్థం అదనంగా రెండేసీ చొప్పున మరుగుదొడ్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను పీవో ఆదేశించారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో 2021–22 మధ్య కాలంలో తలపెట్టి అసంపూర్తిగా మిగిలిన శివాలయాన్ని పూర్తి చేయాలని స్థానికులు పీవోకు విన్నవించుకున్నారు. ఈ మేరకు పీవో ఆ దేవాలయాన్ని పరిశీలించి పూర్తి చేయించేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీ డీఏ పీటీజీ విభాగం ఏపీవో వెంకటేశ్వరరావు, గిరిజన సంక్షేమ శాఖ ఇన్చార్జి డీఈ అభిషేక్, తహసీల్దార్ త్రివేణి, చాపరాయి సిబ్బంది పాల్గొన్నారు. -
స్వీయ గణనపై ఉత్సాహంగా 5కే రన్
సాక్షి, పాడేరు: భారత ప్రభుత్వం తలపెట్టిన స్వీయ గణనపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంగా జిల్లా కేంద్రం పాడేరులో శనివారం ఉదయం చేపట్టిన 5కే రన్ ఉత్సాహంగా సాగింది. డాక్టర్ అంబేడ్కర్ సెంటర్లో ఈ రన్ను కలెక్టర్ టి.నిశాంతి ప్రారంభించారు. అక్కడ నుంచి ప్రభుత్వ మెడికల్ కళాశాల వరకు, తిరిగి అంబేడ్కర్ సెంటర్ వరకు 5 కిలోమీటర్ల పరుగు విజయవంతంగా నిర్వహించారు. కలెక్టర్తో పాటు జేసీ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్మవర్మ, అన్ని శాఖల అధికారులు, మెడికల్ కళాశాల, నర్సింగ్ విద్యార్థులు ఈ రన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వీయ జనగణన ప్రక్రియను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎవరి సహాయం లేకుండానే ప్రజలు తమ మొబైల్ ఫోన్ల ద్వారా సులభంగా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రశ్నలన్నీ సరళంగానే ఉంటాయన్నారు. అనంతరం 5కే రన్లో విజేతలుగా నిలిచిన వి.రాజు(వైద్య ఉద్యోగి) వి.రిషి(ప్రభుత్వ డిగ్రీ కళాశాల,) వెంకట్(ప్రభుత్వ డిగ్రీ కళాశాల), కె.ప్రణీత్, యోగిలను కలెక్టర్ అభినందించి బహుమతులు అందజేశారు. -
కారు ఢీకొని హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం
అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖలో విషాదంసబ్బవరం: విధి నిర్వహణ కోసం బయలుదేరిన హెడ్ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సబ్బవరం మండలంలో జరిగిన ఈ ఘటన అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖలో విషాదాన్ని నింపింది. వివరాలివి..అనకాపల్లి జిల్లా స్పెషల్ బ్రాంచ్లో పని చేస్తూ, పరవాడ పోలీస్స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ కె.పి.ఆర్.వి.ఎన్. ప్రసాద్ శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే వారాంతపు నివేదికల సమర్పణ కోసం ఆయన సుజాతనగర్ నుంచి అనకాపల్లికి తన ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. సబ్బవరం మండలం ఇరువాడ వద్ద ఆనందపురం–అనకాపల్లి జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా, వెనుకనే అతి వేగంగా వచ్చిన ఒక కారు ఆయన వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందారు. 2000 బ్యాచ్కు చెందిన ప్రసాద్ తన వృత్తి జీవితాన్ని విశాఖపట్నం సిటీ పరిధిలో కానిస్టేబుల్గా ప్రారంభించారు. ఆ తర్వాత 2 టౌన్, 4 టౌన్ శాంతి భద్రతల విభాగాలతో పాటు హార్బర్, స్టీల్ ప్లాంట్, పెందుర్తి ట్రాఫిక్ విభాగాల్లో పనిచేశారు. ఎంవీపీ కాలనీ క్రైమ్ విభాగంలో, సిటీ స్పెషల్ బ్రాంచ్లోనూ ఆయన సేవలు అందించారు. జిల్లాల పునర్విభజన అనంతరం అనకాపల్లి జిల్లాకు కేటాయించడంతో.. ఆయన పరవాడ పరిధిలో సమర్థవంతంగా పనిచేస్తున్నారని సహచర సిబ్బంది తెలిపారు. క్షేత్రస్థాయిలో ముందస్తు సమాచారాన్ని సేకరించడంలో ఆయనకు ఉన్న నేర్పును ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పోలీస్ శాఖ దిగ్భ్రాంతి హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ మృతి పట్ల అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పోలీస్ శాఖ తరపున ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇటీవల ప్రసాద్ కుమారుడు చదువులో ప్రతిభ కనబరిచినందుకు ఎస్పీ చేతుల మీదుగానే పురస్కారం అందుకోవడం ఆ కుటుంబంలో ఎంతో ఆనందాన్ని నింపింది. అయితే ఆ సంతోషం మరువక ముందే ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం పోలీస్ వర్గాల్లో తీవ్ర వేదనను మిగిల్చింది. సబ్బవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హజ్ యాత్రికులకు సౌకర్యాలు కల్పించాలి
మహారాణిపేట: ఆంధ్రప్రదేశ్ నుంచి మదీనాకు వెళ్లిన 333 మంది హజ్ యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ హజ్ డైరెక్టర్ మహ్మద్ ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 18, 19 తేదీలలో మదీనాకు చేరుకున్న యాత్రికులకు నాలుగు రోజులైనా లగేజ్ అందకపోవడంతో సమస్యలు ఏర్పడ్డాయని తెలిపారు. ప్రత్యేకంగా బీపీ, షుగర్ వంటి వ్యాధులతో బాధపడుతున్న యాత్రికుల మందులు లగేజ్లోనే ఉండిపోవడంతో ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. కొంతమంది యాత్రికులు అదే ఎహెరామ్ దుస్తులతో పలుదినాలుగా కొనసాగాల్సి వస్తోందని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం హజ్ యాత్రికుల లగేజ్ను ప్రత్యేక విమానాల ద్వారా సమయానికి పంపించే విధానం ఉన్నప్పటికీ, ఈసారి నిర్లక్ష్యం కారణంగా ఆలస్యం జరిగిందని విమర్శించారు. ప్రస్తుతం లగేజ్ గన్నవరం ఎంబార్కేషన్ పాయింట్ వద్దే నిలిచిపోయిందని తెలిపారు. కేంద్ర హజ్ కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మదీనాలో ఉన్న యాత్రికులకు వైద్య సేవలు అందించడంతో పాటు వారి లగేజ్ను త్వరితగతిన చేరేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ నేత, మాజీ హజ్ డైరెక్టర్ మహ్మద్ ఇమ్రాన్ -
ప్రశాంతంగా పాలిసెట్
సాక్షి, పాడేరు: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం శనివారం నిర్వహించిన పాలిసెట్–2026 పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పాడేరులో ఆరు, చింతపల్లిలో ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెంటర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, తలారిసింగి గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాల, కుమ్మరిపుట్టు ఏపీఆర్ పాఠశాల, ఏపీఆర్ కళాశాల, శ్రీకృష్ణాపురం గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాల, చింతపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 1692 మంది విద్యార్థులు హాల్ టికెట్లు పొందగా.. 1343మంది విద్యార్థులు పరీక్ష రాశారు. 349 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పాడేరులోని పలు పరీక్ష కేంద్రాలను జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ తనిఖీ చేశారు. పాలిసెట్ జిల్లా పరిశీలకుడు డాక్టర్ బి.ఆర్.ఎస్.గంగస్వామి, జిల్లా సమన్వయకర్త, పాడేరు పాలిటెక్నిక్ నోడల్ ప్రిన్సిపాల్ హరిబాబు, పాడేరు పట్టణ పరిశీలకుడు కె.రాజు ఆయా పరీక్ష కేంద్రాలను సందర్శించి, పర్యవేక్షించారు. -
నేడు పాలిసెట్కు ఏర్పాట్లు పూర్తి
● జిల్లా వ్యాప్తంగా ఏడు పరీక్షా కేంద్రాలు సాక్షి,పాడేరు: సాంకేతిక విద్యాశాఖ నిర్వహిస్తున్న పాలిసెట్–2026కు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పాడేరులోని ఆరు పరీక్షా కేంద్రాలు, చింతపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఒక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏడు పరీక్షా కేంద్రాలకు సంబంధించి 1680 మంది విద్యార్థులకు హాల్టికెట్లు జారీ చేసామని పాలిసెట్ జిల్లా సమన్వయకర్త, పాడేరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నోడల్ ప్రిన్సిపాల్ ఎం.హరిబాబు తెలిపారు. పాడేరులోని ఆరు కేంద్రాలకు సంబంధించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెంటర్లో 249 మంది, ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్లో 240 మంది, తలారిసింగి గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాలలో 225 మంది, కుమ్మరిపుట్టు ఏపీఆర్ పాఠశాలలో 224 మంది, ఏపీఆర్ కళాశాల సెంటర్లో 240 మంది, శ్రీకృష్ణాపురం గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాల సెంటర్లో 228 మంది, చింతపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 274మంది విద్యార్థుఽలు పాలిసెట్ పరీక్ష రాయనున్నారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని, విద్యార్థులంతా ఉదయం 9గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. పాలిసెట్ జిల్లా పరిశీలకుడు డాక్టర్ బీఆర్ఎస్ గంగస్వామి, జిల్లా సమన్వయకర్త హరిబాబు, పాడేరు పట్టణ పరిశీలకుడు కె.రాజు శుక్రవారం తనిఖీలు జరిపి ఏర్పాట్లను పరిశీలించారు.144సెక్షన్తో పాటు పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ఉపాధి కూలీల ‘ముఖ గుర్తింపు’ సమస్యలు పరిష్కారం
కొయ్యూరు: ఉపాధి హామీ కూలీల మస్టర్ల నమోదులో ఎదురవుతున్న ముఖ గుర్తింపు సమస్యలను పరిష్కరించినట్లు చింతపల్లి క్లస్టర్ ఏపీడీ సీతయ్య తెలిపారు. శుక్రవారం కొయ్యూరు ఏపీవో కార్యాలయంలో వీఆర్పీలు, టీసీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.కూలీల ఫొటోలను రోజుకు రెండుసార్లు తీయాలి. మొదటి ఫొటోకు, రెండో ఫోటోకు మధ్య కనీసం 4 గంటల వ్యవధి ఉండాలన్నారు. ఉదయం 6 గంటలకు తీసే ఫొటోలు వ్యక్తిగతంగా ఉండాలని, ఆ తర్వాత తీసేవి గ్రూపు పొటోలుగా ఉండాలని సూచించారు. సాంకేతిక సమస్యల పరిష్కారంపై అరకు క్లస్టర్ నిపుణులు పవన్ కుమార్ ద్వారా సిబ్బందికి ప్రత్యేక అవగాహన కల్పించారు. ఇకపై పొటోలు తీసేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని స్పష్టం చేశారు. వ్యక్తిగత పనుల కంటే సామాజిక ఆస్తుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ఎక్కువ పనులు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో 46 వేల మంది కూలీలు పని చేస్తున్నారని, త్వరలోనే ఈ సంఖ్య లక్షకు చేరుతుందని తెలిపారు. కూలీల వేతనాలు కూడా త్వరలోనే వారి ఖాతాల్లో జమ అవుతాయని పేర్కొన్నారు.ఎన్ఎంఎంఎస్ యాప్లో ఫొటోల అప్లోడ్ విషయంలో కొయ్యూరు వెనుకబడి ఉందని సీతయ్య అసహనం వ్యక్తం చేశారు. గుర్తించిన పనుల ఫొటోలను శనివారం మధ్యాహ్నం లోపు అప్లోడ్ చేయకుంటే, నేరుగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏపీవో అప్పలరాజు, ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.చింతపల్లి క్లస్టర్ ఏపీడీ సీతయ్య -
రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు
● చింతపల్లి ఏడీఆర్ అప్పలస్వామి చింతపల్లి: జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ఈ నెల 25 నుంచి 29 వరకూ ఐదు రోజులు పాటు జిల్లా పరిధిలో వాతావరణ వివరాలను ఆయన వెల్లడించారు. ఈ ఐదు రోజులు పాటు చింతపల్లి, పాడేరు,అరకు డివిజన్ల పరిధిలో వర్షపాతం 0.1 నుంచి 6.2 మిల్లీ మీటర్లు నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. గరిష్ణ ఉష్ణోగ్రతలు 35.7 డిగ్రీల నుంచి 35.9 డిగ్రీల మధ్య, కనిష్ణ ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల నుంచి 18.5 డిగ్రీలు మధ్య ఉండవచ్చునన్నారు. గాలిలో తేమ శాతం ఉదయం వేళల్లో 73 నుంచి 81 శాతం మధ్యాహ్న సమయాల్లో 40 నుంచి 60 శాతం మధ్యలో ఉంటుందన్నారు. గాలి గంటకు ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్లు వేగంతో వీచే సూచనలు ఉన్నాయన్నారు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందన్నారు .రైతులు పంటల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని ఏడీఆర్ తెలిపారు. -
రెండు నెలల్లో మూడు సార్లు తిరిగాను
మాది జి.మాడుగుల మండలం మారుమూల గ్రామమైన కులుపాడు. గత రెండు నెలలుగా గ్యాస్ సిలిండర్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను. ఐటీడీఏ గ్యాస్ వ్యాన్ మా గ్రామానికి రాకపోవడంతో, పాడేరు ఐటీడీఏ గ్యాస్ ఏజెన్సీ ద్వారా ఫోన్లో బుక్ చేశా. సిలిండర్ కోసం ఈ రెండు నెలల కాలంలో మూడుసార్లు ఖాళీ బండతో పాడేరు గ్యాస్ గోడౌన్ చుట్టూ తిరిగా. ఇప్పటికీ ఓటీపీ రాకపోవడంతో గ్యాస్ పొందలేకపోతున్నా. దీనివల్ల జీపు రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. – ఉగ్రంగి పద్మ, గిరిజన మహిళ, కులుపాడు, జి.మాడుగుల మండలం -
గంజాయి నిందితుడికి పదేళ్ల జైలు, జరిమానా
పాడేరు: గంజాయి రవాణా కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి చోడవరం కోర్టు పదేళ్ల జైలు, రూ. లక్ష జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ మేరకు జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి ఆర్. గౌరీశ్వరరావు వివరాలను మీడియాకు వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి. 2014 సంవత్సరంలో పాడేరు ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 360 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఐషర్ వ్యాన్ను అధికారులు పట్టుకున్నారు. రాజమండ్రికి చెందిన నాయుడు శ్రీనివాస్ (30) అనే వ్యక్తిని ఏ2 నిందితుడిగా గుర్తించి అప్పట్లోనే రిమాండ్కు తరలించారు. అప్పటి ఎకై ్సజ్ ఎస్ఐలు డి. గంగాధర్, ఎం. జ్ఞానేశ్వరి పక్కా ఆధారాలతో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ప్రస్తుత ఇన్స్పెక్టర్ ఆచారి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి.హెచ్. సూర్యనారాయణ ఫోరెన్సిక్ నివేదికలు, సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును విచారించిన చోడవరం 9వ అదనపు కోర్టు న్యాయమూర్తి ఎం. హరినారాయణ, నిందితుడిపై నేరం రుజువు కావడంతో పదేళ్ల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తూ తుది తీర్పు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎకై ్సజ్ అధికారి గౌరీశ్వరరావు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామని, కఠిన శిక్షలు పడేలా రాజీలేని పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి గౌరీశ్వరరావు -
గడువులోగా సమస్యలను పరిష్కరించండి
● కలెక్టర్ నిశాంతి ఆదేశం ● పీజీఆర్ఎస్లో 84 వినతుల స్వీకరణపాడేరు: పీజీఆర్ఎస్కు వచ్చే వినతులను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ నిషాంతి అధికారులను ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం, మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ నిషాంతి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి పలు సమస్యలపై జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ, ఇంచార్జీ డీఆర్వో లోకేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నీలకంఠేశ్వరరావులతో కలిసి 84 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమస్యలపై ప్రజల నుంచి స్వీకరించిన వినతులను సంబంధిత శాఖలకు పంపించి ఎంత గడువులోగా పరిష్కారిస్తారో అర్జీదారుడికి తెలియజేయాలన్నారు. ప్రతి శుక్రవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్కు జిల్లా అధికారులంతా సమగ్ర సమాచారంతో తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. హాజరు కాని అధికారులు కారణం చూపిస్తూ ముందుగా అనుమతి పొందాలన్నారు. మండల స్థాయిల్లో ఎంపీడీవో కార్యాలయాల వద్ద ప్రతి సోమవారం, గ్రామ స్థాయిల్లో గ్రామ సచివాలయాల వద్ద ప్రతి రోజు సమస్యలపై అర్జీలు స్వీకరించాలని ఆదేశించారు. గ్రామ, మండల స్థాయిల్లో పరిష్కారం కాని అర్జీలు జిల్లా స్థాయి అధికారుల వద్దకు తీసుకువచ్చి పరిష్కరించాలన్నారు. అర్జీదారులు మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాల్ సెంటర్కు ఫోన్ చేసి సమస్య ఎంత వరకు పరిష్కారమైందో తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూ డీడీ పరిమళ, హౌసింగ్ పీడీ బాబు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నందు, డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణమూర్తి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి మోహన్, ఐసీడీఎస్ పీడీ ఝాన్షీరామ్ పడాల్, ఎల్డీఎం మాతునాయుడు తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ దందా
కట్టెల పొయ్యిని వదిలి గ్యాస్ వైపు మళ్లిన గిరిజనానికి ఇప్పుడు గ్యాస్ గండం పట్టుకుంది. నెలకు రావాల్సిన కోటాలో సగం కూడా రాకపోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో వంటలు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఒకవైపు 60 రోజుల వెయిటింగ్.. మరోవైపు బ్లాక్ మార్కెట్లో మూడు వేల ధర.. జిల్లాలో గ్యాస్ సిలిండర్ సామాన్యుడికి గగనమైపోతోంది.సాక్షి, పాడేరు: జిల్లాలో వంట గ్యాస్ కొరత తీవ్రరూపం దాల్చింది. సరఫరాలో అంతరాయం కలగడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడిందని సాకు చూపుతూ కంపెనీలు సరఫరాను భారీగా తగ్గించడంతో ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతటా ఇదే పరిస్థితి జిల్లా కేంద్రమైన పాడేరులోని ఐటీడీఏ ఇండేన్ గ్యాస్ ఏజెన్సీతో పాటు జిల్లాలోని మొత్తం 17 ఏజెన్సీల్లో కొరత అధికంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 1.10 లక్షల కుటుంబాలు గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్నాయి. నిబంధనల ప్రకారం ప్రతినెల 78 వేల సిలిండర్లు సరఫరా కావాల్సి ఉండగా, గత రెండు నెలలుగా కంపెనీలు సరఫరాను సగానికి పైగా తగ్గించాయి. ఓటీపీ విధానాన్ని సాకుగా చూపి నెలకు 30 వేలకు మించి సిలిండర్లు పంపకపోవడంతో వినియోగదారులు అల్లాడిపోతున్నారు. గ్యాస్ బండ కోసం తప్పని నిరీక్షణ గ్యాస్ బుక్ చేసుకున్న తరువాత అది చేతికి అందడానికి 60 రోజులకు పైగా సమయం పడుతోంది. ఓటీపీలు సకాలంలో రాకపోవడం, ఏజెన్సీల వద్ద సరైన సమాచారం లేకపోవడంతో ప్రజలు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. ఫలితం లేక ఖాళీ సిలిండర్లను తిరిగి ఇళ్లకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామాలనుంచి మండల కేంద్రాలకు సిలిండర్లు తీసుకురావడానికి రవాణా ఖర్చులు కూడా భారంగా మారుతున్నాయి. కట్టెల పొయ్యే దిక్కు.. గడిచిన పదేళ్లలో సుమారు 80 శాతం గిరిజన కుటుంబాలు గ్యాస్ వినియోగానికి అలవాటు పడ్డాయి. ప్రస్తుతం గ్యాస్ అందకపోవడంతో మళ్లీ కట్టెల పొయ్యిలను ఆశ్రయించాల్సి వస్తోందని గిరిజనులు వాపోతున్నారు. పట్టించుకోని అధికారులు సాధారణ సరఫరా నిలిచిపోవడంతో ఇదే అదునుగా భావించిన కొందరు అక్రమార్కులు బ్లాక్ మార్కెట్లో భారీ ధరలకు విక్రయిస్తున్నారు. గృహ అవసరాలకు వాడే సిలిండర్ను డిమాండ్ను బట్టి రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు అమ్ముతున్నారు. జిల్లా కేంద్రంలో అక్రమ విక్రయాలు బహిరంగంగా జరుగుతున్నా, పౌరసరఫరాల శాఖ అధికారులు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేధిస్తున్న సిలిండర్ల కొరత సగానికి తగ్గిన సరఫరా బుక్ చేసిన తరువాత 60 రోజులు వేచి ఉండాల్సిందే బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు విక్రయాలు రూ.2,500 నుంచి రూ.3వేలకు అమ్మకం అల్లాడుతున్న వినియోగదారులు -
స్వయం గణనను ప్రోత్సహించాలి
మాట్లాడుతున్న కలెక్టర్ నిషాంతి, సమావేశానికి హాజరైన అధికారులు పాడేరు: జనగణనలో భాగంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగి నిర్దేశించిన పోర్టల్లో తప్పనిసరిగా స్వయం గణన చేసుకోవాలని కలెక్టర్ నిషాంతి ఆదేశించారు. శుక్రవారం ఐటీడీఏలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. స్వయం గణన ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేలా జిల్లా, మండల స్థాయి అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది అందరూ యుద్ధప్రాతిపదికన తమ స్వయం గణనతో పాటు, కుటుంబ సభ్యుల వివరాలను కూడా విధిగా నమోదు చేయాలన్నారు. స్వయం జనగణనను ప్రోత్సహించేందుకు వివిధ స్థాయిల్లో 15 రోజుల పాటు విస్తృత అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. స్వయం గణనపై ప్రజలు, ఉద్యోగుల్లో అవగాహన కల్పించేందుకు శనివారం జిల్లా కేంద్రమైన పాడేరులో 5కే వాక్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పాడేరు పాత బస్టాండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం నుంచి సినిమా హాల్ సెంటర్, ఆర్టీసీ కాంప్లెక్స్, తలారిసింగి జంక్షన్ మీదుగా ప్రభుత్వ వైద్య కళాశాల వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, స్వయం సహాయక బృందాలు, మేధావులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ వాకథాన్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేస్తారన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు బాధ్యతలు స్వీకరించిన జిల్లా అధికారులు.. నోడల్ అధికారి, ముఖ్య ప్రణాళిక అధికారితో నిరంతరం సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ, ఇన్చార్జి డీఆర్వో లోకేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నీలకంఠేశ్వరరావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.కలెక్టర్ నిశాంతి -
వైభవంగా మారెమ్మ తల్లి జాతర
సీలేరు: సీలేరు గ్రామ దేవత మారెమ్మ తల్లి 54వ జాతర మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఈ నెల 14న ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో భాగంగా గత 10 రోజులుగా ఆలయంలో వివిధ రకాల ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారి ఆలయంలో అర్చకులు దామోదర్ శర్మ ఆధ్వర్యంలో ముగ్గురు దంపతులతో కలిసి దేవి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సీలేరు బాలికల ఆశ్రమ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు నాగ శకుంతల నేతృత్వంలో ఆలయంలో పెద్ద ఎత్తున మహిళలతో కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. శనివారం ఉత్సవ మూర్తిని సీలేరు పురవీధుల్లో వైభవంగా ఊరేగించనున్నారు. ఆదివారం జరగనున్న అమ్మవారి ప్రధాన జాతర కోసం ఆలయ కమిటీ సభ్యులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతర సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుండటంతో శుక్రవారం నుండే ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రత్యేక బస్సులు సీలేరు గ్రామ దేవత మారెమ్మ తల్లి ప్రధాన జాతర మహోత్సవాలు పురస్కరించుకుని, విశాఖపట్నం డిపో నుంచి సీలేరుకు రెండు రోజుల పాటు ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు విశాఖ ఆర్టీసీ డీఎం మాధురి ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం అమ్మవారి ఊరేగింపు, ఆదివారం ప్రధాన పండుగ జరగనున్నాయి. ఈ సందర్భంగా విశాఖపట్నం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున, వారికి రవాణా ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి, రాత్రి 11.30 గంటలకు సీలేరు చేరుకుంటుంది. తిరిగి ఆదివారం, సోమవారం ఉదయం 6:30 గంటలకు ఈ బస్సులు సీలేరు నుంచి విశాఖపట్నానికి బయలుదేరుతాయి. ఈ ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని భక్తులు, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.ఆలయంలో హోమాలు, కుంకుమార్చనలు -
ఫిబ్రవరి 26న బుక్ చేసినా ఫలితం లేదు
గ్యాస్ సిలిండర్ అవసరం నిమిత్తం ఫిబ్రవరి 26వ తేదీన పాడేరు ఏజెన్సీ ద్వారా బుకింగ్ చేశాను. రెండు నెలలు కావస్తున్నా ఇంకా ఓటీపీ రాకపోవడం దారుణం. గ్యాస్ సిలిండర్ల సరఫరా లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. గిరిజన ప్రాంతాలకు గ్యాస్ లారీలను తక్కువగా పంపిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం అన్యాయం. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి, ప్రతి నెల సకాలంలో గ్యాస్ అందేలా చర్యలు తీసుకోవాలి. – కొండపల్లి సోమన్నదొర, వినియోగదారుడు, పాడేరు -
అడవి మనకు తల్లి వంటిది
చింతపల్లి: మన్యంలో అడవి మనకు తల్లి వంటిదని, దానిని అన్ని విధాలా కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. మల్లికార్జునరావు అన్నారు. శుక్రవారం మండలంలోని లంబసింగి పంచాయతీ పరిధిలోని నూతిబందలో సిఫా ట్రస్ట్ ఆధ్వర్యంలో, ప్రజల సహకారంతో నిర్మించిన చెక్ డ్యాంను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆదివాసీలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. అడవుల్లోని అన్ని రకాల వృక్ష జాతులను మనమే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మనకున్న జలవనరులను రక్షించుకున్నప్పుడే భావితరాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని, అడవుల పరిరక్షణ మరియు ఆదివాసీల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. చింతపల్లి డీఎఫ్వో నరసింహారావు మాట్లాడుతూ, తరతరాలుగా ఆదివాసీలు అడవులనే జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్నారని, వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత ఈ మన్యపు బిడ్డలపైనే ఉందని అన్నారు. అడవులను నాశనం చేస్తే భవిష్యత్తులో తాగునీటి ఎద్దడి ఏర్పడటమే కాకుండా, జలవనరులు అంతరించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ రాజు మాట్లాడుతూ.. నూతిబందలో నిర్మించిన ఈ చెక్ డ్యాం ద్వారా సుమారు 150 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. సిఫా ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆదివాసీలకు ఎంతో మేలు చేకూరుస్తున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి రత్నం, ఫారెస్ట్ రేంజ్ అధికారి అప్పారావు, ఎన్జీవో ప్రతినిధి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వ సలహాదారు మల్లికార్జునరావు -
భార్య గొంతు కోసి భర్త హత్యాయత్నం
చింతపల్లి: భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదాల కారణంగా, భర్త తన భార్య గొంతు కోసి హత్యాయత్నం చేసిన ఘటన చింతపల్లి మండలం వాంగెడ్డ గ్రామంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చౌడుపల్లి పంచాయతీ పరిధిలోని వాంగెడ్డ గ్రామానికి చెందిన కొర్రా భాగ్యశ్రీకి, జి.మాడుగుల మండలం సింగర్బ పంచాయతీ ఊబలగరువు గ్రామానికి చెందిన పాంగి పాపినాయుడుతో 2024లో వివాహం జరిగింది. పెళ్లయిన కొంతకాలానికే దంపతుల మధ్య మనస్పర్థలు మొదలై, తరచూ గొడవలు జరుగుతుండేవి. వీరి మధ్య గొడవలను గ్రామ పెద్దలు పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఇద్దరికీ నచ్చజెప్పి భాగ్యశ్రీని భర్త వద్దకు పంపించారు. అయినప్పటికీ భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో, వారం క్రితం భాగ్యశ్రీ తన పుట్టింటికి (వాంగెడ్డ) వచ్చేసింది. రెండు రోజుల క్రితం భార్య వద్దకు వచ్చిన పాపినాయుడు, గురువారం తెల్లవారుజామున మళ్లీ గొడవ పడ్డాడు. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయి భాగ్యశ్రీ గొంతు కోసి చంపడానికి ప్రయత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. దీంతో భర్త అక్కడి నుండి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన భాగ్యశ్రీని వెంటనే చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల నుంచి ఇంకా ఎటువంటి ఫిర్యాదు అందలేదని, అందుకే కేసు నమోదు చేయలేదని ఎస్ఐ వీరబాబు వెల్లడించారు. -
విధి నిర్వహణలో పారదర్శకత అవసరం
అల్లిపురం(విశాఖ): నగర పోలీస్ అధికారులు, సిబ్బంది విధులను పారదర్శకంగా నిర్వహించాలని పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి సూచించారు. విధుల్లో చట్టవ్యతిరేక చర్యలు, అధికార దుర్వినియోగం లేదా అవినీతి చోటుచేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శుక్రవారం పోలీస్ కమిషనరేట్లో నిర్వహించిన క్రైమ్ రివ్యూ సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. ప్రతి స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లపై నిఘా చర్యలను పరిశీలించారు. ఇటీవల నమోదు చేసిన ఎన్డీపీఎస్ కేసులను సమీక్షిస్తూ, నగరం గుండా గంజాయి రవాణా పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించారు. స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు, ఆలస్యానికి కారణాలు తెలుసుకుని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. కోర్టు తీర్పులు వచ్చిన కేసులపై కూడా సమీక్ష నిర్వహించారు. ప్రతి స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, నిర్మానుష్య, సమస్యాత్మక ప్రాంతాల్లో విజిబుల్ పోలీసింగ్, పికెటింగ్, అవసరమైతే డికాయ్ టీంలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈవ్ టీజింగ్, ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్ వంటి సమస్యలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైన వాహనాలు, సిబ్బంది గురించి తెలియజేయాలని సూచించారు. పొక్సో కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. నగరంలో నేరాల రేటు తగ్గేందుకు రాత్రిపూట నిఘాను మరింత బలోపేతం చేయాలని సూచించారు. సైబర్ క్రైమ్పై అవగాహన కార్యక్రమాలు పెంచాలని, ఆధునిక సాఫ్ట్వేర్ వినియోగాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వేధింపులు లేదా మిస్సింగ్ కేసులలో ఆలస్యం లేకుండా స్పందించాలని సూచించారు. కోర్టుల్లో కేసులు ఆలస్యం కాకుండా చూసి, కన్విక్షన్ రేటు పెరగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. లోక్ అదాలత్లో మరిన్ని కేసులు పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో డీసీపీలు వి.ఎన్.మణికంఠ చందోలు, డి.మేరీ ప్రశాంతి, డీసీపీ (క్రైమ్స్) లతా మాధురి, ఏడీసీపీలు, ఏసీపీలు, ఎస్హెచ్ఓలు తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాలే దేశాభివృద్ధికి పునాది
● గ్రామీణ నాయకత్వంలో మహిళలదే కీలక పాత్ర ● జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర మహారాణిపేట(విశాఖ): స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా గ్రామీణ నాయకత్వంలో వారి పాత్ర గణనీయంగా పెరిగిందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె. సుభద్ర అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 33వ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు బలమైన చట్టబద్ధత లభించిందని, 1993 నుంచి గ్రామీణ స్వపరిపాలన బలోపేతం అవుతోందన్నారు. గ్రామాలే దేశాభివృద్ధికి పునాది అని, నిర్ణయాధికారాల్లో మహిళల పాత్ర మరింత పెరగాలని ఆకాంక్షించారు. సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్థాయిలో సేవలు ప్రజలకు మరింత చేరువయ్యాయని ఆమె ఉద్ఘాటించారు. జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి మాట్లాడుతూ.. పంచాయతీలకు 29 అంశాలపై అధికారాలు కల్పిస్తూ అధికార వికేంద్రీకరణకు ప్రాధాన్యమిచ్చారని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని, 16వ ఆర్థిక సంఘం ద్వారా గ్రామ పంచాయతీలకు మరిన్ని నిధులు అందనున్నాయని వివరించారు. ‘స్వర్ణ పంచాయత్’పోర్టల్ ద్వారా పన్నుల వసూళ్లను ఆన్లైన్ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారు. డీపీవో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థల్లో పంచాయతీరాజ్ ఒకటని, వికసిత భారత్ లక్ష్య సాధనలో ఇది కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. డిప్యూటీ సీఈవో రాజ్కుమార్ మాట్లాడుతూ పారదర్శకతతో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 50 మంది ఉద్యోగులకు జెడ్పీ చైర్పర్సన్ ప్రశంసా పత్రాలను అందజేసి సత్కరించారు. -
244 మంది పోలీసులకు రివార్డులు
అల్లిపురం(విశాఖ): మార్చిలో వివిధ కేసుల పరిష్కారంలో విశేష ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందికి నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి రివార్డులు అందజేశారు. శుక్రవారం కమిషనరేట్లో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం, చోరీకి గురైన సొత్తును రికవరీ చేయడం, కీలక నిందితులను అరెస్టు చేయడంలో సిబ్బంది చూపిన చొరవ అభినందనీయమన్నారు. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పేరు మోసిన నేరస్తులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన వారిని ప్రత్యేకంగా ప్రశంసించారు. రివార్డులు పొందిన వారిలో హోంగార్డు నుంచి సీఐ స్థాయి వరకు 244 మంది వరకు ఉన్నారు. అందరూ ఇదే స్ఫూర్తితో పనిచేసి, నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని కమిషనర్ సూచించారు. -
బీసీలపై చంద్రబాబుది సవతి తల్లి ప్రేమ
నక్కపల్లి: బీసీలపై సీఎం చంద్రబాబునాయుడిది సవతి తల్లి ప్రేమ అని వైఎస్సార్సీపీ జిల్లాప్రధాన కార్యదర్శి శీరం నర్సింహమూర్తి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గొర్ల నర్సింహమూర్తి అన్నారు. గురువారం వారు నక్కపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ 50 ఏళ్లు నిండిన బీసీలందరికీ పింఛన్ ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, ఆయన మాటలు నమ్మి బీసీలంతా ఓటేశారని చెప్పారు. గెలిచి రెండేళ్లపూర్తవుతున్నప్పటికీ ఒక్క బీసీకి కొత్తగా పింఛన్ ఇవ్వలేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కొత్తగా ఒక్క వృధ్యాప్య, వితంతు పింఛన్ కూడా ఇవ్వలేదన్నారు.కేవలం అధికారంలోకి రావడం కోసమే సూపర్సిక్స్ పేరుతో బూటకపు హామీలు ఇచ్చారని ఆరోపించారు. బీసీలపై మొదటినుంచి చంద్రబాబు వివక్ష చూపుతున్నారని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకోసం వాడుకున్నారని చెప్పారు. రెడ్బుక్ పేరుతో బీసీలు, ఎస్సీలపై రాజకీయ దాడులు, కేసులు పెట్టి వేధించడం చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ హయాంలోనే బీసీలకు సముచిత స్థానం లభించినట్టు చెప్పారు. బీసీలను డిప్యూటీ ముఖ్యమంత్రులను చేసిన ఘనత జగన్ మోహన్రెడ్డిదేనని తెలిపారు. జగనన్న ప్రభుత్వంలోనే 50 బీసీ ఉపకులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి పలువురు నాయకులకు చైర్మన్, డైరెక్టర్ పదవుల్లో నియమించి, రాజరకీయంగా తగిన ప్రాధాన్యత కల్పించారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ల సదుపాయం కల్పించి పోటీ చేసే అవకాశం కల్పించిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు.బీసీలంటే వెనుకబడినతరగతుల వారు కాదు, పార్టీకి బ్యాక్బోన్ లాంటివారని గుర్తించిన నాయకుడు జగన్మోహన్రెడ్డి అని అన్నారు. కూటమిప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 50 ఏళ్లు వయసు నిండిన వారికి పింఛన్లు ఇవ్వాలన్నారు. ఈనెల 26న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అనంతపురంలో రాష్ట్రస్థాయి బీసీల సదస్సు జరుగుతుందని బీసీసెల్ అధ్యక్షుడు నర్సింహమూర్తి తెలిపారు. ప్రభుత్వం బీసీలపై చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేసేందుకు ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నట్టు చెప్పారు. బీసీలంతా హాజరై ఈ సదస్సును విజయవంతం చేయాలని కోరారు. జిల్లా పార్టీ ప్రధాన కారదర్శి, బీసీ సెల్ అధ్యక్షపదవులను నక్కపల్లి మండలానికి కేటాయించేందుకు కృషి చేసిన మాజీ మంత్రి అమర్ నాథ్, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ కన్నబాబు, సమన్వయకర్త కంబాల జోగులు,పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్లకు కృతజ్ఙతలు తెలిపారు. ఈసమావేశంలో వైఎస్సార్ిసీసీ రాష్ట్రప్రచార విభాగం సహాయ కార్యదర్శి లొడగల చంద్రరావు, రాష్ట్ర బూత్ విభాగం సహాయకార్యదర్శి గొర్ల బాబూరావు, మండల ప్రధాన కార్యదర్శి ఎరిపల్లి నాగేశు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు యలమంలిచి తాతబాబు, నాయకులు ప్రసాదుల శ్రీను, సూరిసత్తిబాబు, పల్లాచినబ్బాయి తదితరులు పాల్గొన్నారు. -
శరీర సౌష్టవ పోటీలు ప్రారంభం
విశాఖ స్పోర్ట్స్: అఖిల భారత మేజర్ పోర్టుల బాడీ బిల్డింగ్, వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీలు సాలిగ్రామపురంలోని సాగరమాల కన్వెన్షన్ సెంటర్లో గురువారం ప్రారంభమయ్యాయి. విశాఖ పోర్టు అథారిటీ(వీపీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలను డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని అపరంజి కొరాటి ప్రారంభించారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో రాణించాలని పిలుపునిచ్చారు. ఈ పోటీల్లో విశాఖపట్నంతో పాటు చైన్నె, ముంబయి, జవహర్లాల్ నెహ్రూ, దీన్దయాల్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టుల జట్లు పాల్గొంటున్నాయి. -
ఫలించని పయనీర్ కార్మికుల చర్చలు
మాకవరపాలెం: పయనీర్ పరిశ్రమ కార్మికులతో యాజమాన్య ప్రతినిధులు జరిపిన చర్చలు ఫలించలేదు. దీంతో వరుసగా మూడో రోజు కార్మికులు తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఆందోళన కొనసాగించారు. మండలంలోని రాచపల్లి వద్ద పయనీర్ పరిశ్రమలో పనిచేస్తున్న వందలాది మంది కార్మికులు పలు సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం రాచపల్లి, జి.కోడూరు, రామన్నపాలెం గ్రామాలకు చెందిన నాయకులు ముందుగా కార్మికులకు ఆందోళన విరమించాలని సర్ది చేప్పే ప్రయత్నం చేశారు. అయినా వారంతా ఏ మాత్రం తగ్గకుండా యాజమాన్య ప్రతినిధులు వచ్చి తమ డిమాండ్లను పరిష్కరిస్తామని లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని కోరారు. కంపెనీకి భూ సేకరణ సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి, ఇతర ప్రాంతాల వారికి యాజమాన్యం ఉద్యోగాలు ఇస్తోందన్నారు. తమకు మద్దతుగా నిలవకుండా కంపెనీకి అనుకూలంగా మాట్లాడటం ఏంటని ఒక దశలో నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పయినీర్ యాజమాన్య ప్రతినిధులైన ఎల్.ఎస్.రావు, తదితరులు కార్మికుల వద్దకు చేరుకుని మాట్లాడారు. ఆందోళన విరమించి పనుల్లో చేరాలన్నారు. డిమాండ్లను ఇప్పటికిప్పుడు పరిష్కరించే అవకాశం లేదన్నారు. ఇవన్నీ కంపెనీ పెద్దలకు తెలియజేస్తామన్నారు. ఈ నేపథ్యంలో చర్చలు ఫలించ లేదు. మూడో రోజు ఆందోళనకు సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు జి.కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శులు శంకర్రావు, రాజు, డివిజన్ నాయకుడు చిరంజీవి మద్దతుగా పాల్గొన్నారు. పరిశ్రమ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్ఐ దామోదర్నాయుడు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
దిబ్బిడిలో సరుగుడు తోట దగ్ధం
బుచ్చెయ్యపేట: మండలంలోని దిబ్బిడి గ్రామంలో గురువారం సాయంత్రం సరుగుడు తోట కాలిపోయింది. సుమారు లక్ష రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. ఇక్కడ జగ్గరాజు చెరువు దగ్గరలో గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకు నిప్పు పెట్టారు. ఈ క్రమంలో గాలికి అగ్గి రవ్వలు ఎగసిపడి పక్కనే ఉన్న గంప పైడిరాజుకు చెందిన సరుగుడు తోటలో మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో అరెకర పొలంలో సరుగుడు తోట మొత్తం కాలిపోయింది. మూడున్నరేళ్ల క్రితం వేసిన పంట చేతికంది వచ్చే సమయంలో కాలిపోవడంతో బాధిత రైతు లబోదిబోమన్నాడు. నిరుపేదనైన తనకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నాడు. -
చోడవరంలో వైఎస్సార్సీపీ కార్యాలయం ప్రారంభం నేడు
● హాజరు కానున్న బొత్స, కన్నబాబు ప్రారంభానికి సిద్ధమైన చోడవరం వైఎస్సార్సీపీ కార్యాలయం చోడవరం: వైఎస్సార్సీపీ చోడవరం నియోజకవర్గం ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. చోడవరం పట్టణానికి అతి సమీపంలో ఈ కార్యాలయాన్ని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నిర్మించారు. పార్టీ కార్యాలయంతోపాటు ఆయన నివాసం ఉండేందుకు సొంతిల్లు కూడా ఇదే ప్రదేశంలో నిర్మించుకున్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు అమర్నాథ్ గృహ ప్రవేశం చేస్తారు. అనంతరం వైఎస్సార్సీపీ నియోజవర్గ కార్యాలయాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ, విశాఖ, విజయనగరం జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ప్రారంభిస్తారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, సమన్వయకర్తలు, పార్టీ పరిశీలకులు, నియోజకవర్గ నాయకులందరూ పాల్గొననున్నారు. -
2.0
విశాఖ రైల్వేస్టేషన్సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోనే అత్యంత రద్దీగా ఉండే విశాఖపట్నం రైల్వేస్టేషన్ రూపురేఖలు మారిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టేషన్ పునర్నిర్మాణ ప్రాజెక్టు ఊపందుకుంది. తూర్పు, పశ్చిమ ప్రాంతాల వైపు 60 ఎకరాల విస్తీర్ణంలో, సుమారు రూ.1000 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులు ప్రయాణికులకు విమానాశ్రయ స్థాయి అనుభూతిని అందించడమే లక్ష్యంగా సాగుతున్నాయి. ప్రస్తుతం స్టేషన్ ఉత్తర, దక్షిణ దిశలైన జ్ఞానాపురం వైపు, అలాగే ప్రధాన ప్రవేశ ద్వారం భారీ ఎత్తున నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గతంలో ప్రధాన కార్యాలయం, రిజర్వేషన్ కౌంటర్లు, వెయిటింగ్ హాళ్లు ఉన్న భవనాల స్థానంలో బహుళ అంతస్తుల అత్యాధునిక నిర్మాణాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఒక్కోటి 5 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంతో రెండు ప్రధాన భవనాలను నిర్మిస్తున్నారు. ప్రారంభంలో పనులు కొంత ఆలస్యమైనప్పటికీ.. ప్రస్తుతం మాత్రం వేగంగా పుంజుకున్నాయి. అసలు ఎటువైపు ఏం అభివృద్ధి జరుగుతోందో ఓసారి పరిశీలిద్దాం.. రాజ ప్రాసాదంలా ముఖద్వారం రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనుల్లో భాగంగా స్టేషన్ ముఖద్వారం సరికొత్త రూపు సంతరించుకోనుంది. దీనికి సంబంధించిన డిజైన్ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. నూతన నిర్మాణ పనులకు వీలుగా ప్రయాణికుల రిజర్వేషన్ కేంద్రాన్ని పాత ప్రదేశం నుంచి గేట్–3 వద్ద గల జనరల్ టికెట్ కౌంటర్ ప్రాంగణానికి మార్చారు. పోస్టల్ కార్యాలయం పక్కన ఉన్న పార్కింగ్ స్థలాన్ని ఖాళీ చేయించి, కొత్త రోడ్లు, గేట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జిగేల్మనేలా జ్ఞానాపురం అభివృద్ధి పనులన్నీ ప్రస్తుతం జ్ఞానాపురం వైపు వేగంగా సాగుతున్నాయి. కీలకమైన భవనాల నిర్మాణం, కొత్త ప్లాట్ఫాంలు, విశాలమైన పార్కింగ్ సౌకర్యాలతో ఈ ప్రాంతం కొత్త రూపు సంతరించుకోనుంది. ఇందుకోసం జ్ఞానాపురం వైపు ఉన్న ఖాళీ స్థలాలను చదును చేస్తూ, అంతర్గత రహదారులు, ఫుట్పాత్లను నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రధాన భవన నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతుండగా.. ముఖ్యంగా జీ+3 అంతస్తులతో ఒక భారీ భవనాన్ని నిర్మిస్తున్నారు. విశాలంగా పార్కింగ్ సౌకర్యం స్టేషన్కు వచ్చే ప్రయాణికుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, దానికి అనుగుణంగా పార్కింగ్ సౌమర్థ్యాన్ని పెంచుతున్నారు. స్టేషన్ ప్రధాన ద్వారం వైపు 300 ద్విచక్ర వాహనాలు, 160 కార్లు నిలుపుదలకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. జ్ఞానాపురం వైపు ప్రయాణికుల కోసం మరింత విశాలంగా 1,500 ద్విచక్ర వాహనాలు, 250 కార్ల సామర్థ్యంతో పార్కింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ముంపు సమస్యకు స్వస్తి స్టేషన్ విస్తరణకు ప్రధాన అడ్డంకిగా ఉన్న ఎర్రిగెడ్డ కాలువను సుమారు 13.5 మీటర్ల వెడల్పుతో అధికారులు విజయవంతంగా దారి మళ్లించారు. దీని వల్ల స్టేషన్లో పార్శిల్ కేంద్రం, ఇతర అవసరాల కోసం అదనపు స్థలం అందుబాటులోకి వచ్చింది. ఈ మార్పుతో స్టేషన్కు ముంపు సమస్య కూడా శాశ్వతంగా తొలగిపోయింది. 50 ఏళ్ల భవిష్యత్తు ప్రణాళిక రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఈ స్టేషన్ను కేవలం రైళ్లు వచ్చి వెళ్లే ప్రాంతంగానే కాకుండా, నగరానికే తలమానికంగా నిలిచే ఒక భారీ వాణిజ్య, రవాణా కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాల్లో రైల్వే కార్యాలయాలతో పాటు.. అత్యాధునిక వెయిటింగ్ హాల్స్, విశ్రాంతి గదులు, విశాలమైన వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ పనులన్నీ పూర్తయితే, విశాఖపట్నం రైల్వే స్టేషన్ దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రధాన రవాణా కేంద్రంగా అవతరించి, నగర కీర్తిని దశదిశలా చాటుతుంది. – లలిత్ బోహ్రా, వాల్తేరు డీఆర్ఎం చురుగ్గా విశాఖపట్నం రైల్వే స్టేషన్ విస్తరణ ప్రస్తుతం ఉన్న 8 ప్లాట్ఫాంలను 14కు పెంచేలా పనులు టెర్మినల్స్ మాదిరిగా ఫ్లాట్ఫాంల నిర్మాణం ఎర్రి గెడ్డ మురుగు కాలువ దారి మళ్లింపు.. 1.50లక్షల చదరపు అడుగుల పార్కింగ్ 60కి పైగా లిఫ్ట్లు, 50 వరకు ఎస్కలేటర్ల ఏర్పాటు 75 వేల మంది సామర్థ్యంతో.. ప్రస్తుతం విశాఖ నుంచి నిత్యం 110 నుంచి 130 రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా, అందులో దాదాపు 40 రైళ్లు ఇక్కడి నుంచే బయలుదేరుతున్నాయి. భవిష్యత్తులో ఈ సంఖ్య 50 నుంచి 75 శాతం మేర పెరిగే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా ప్లాట్ఫాంలను టెర్మినల్ తరహాలో 650 నుంచి 1000 మీటర్ల పొడవుతో నిర్మిస్తున్నారు. దీని వల్ల 24 కోచ్లకు పైగా ఉన్న సుదీర్ఘ రైళ్లను కూడా సులభంగా నిలిపే వీలుంటుంది. ప్రస్తుతం రోజుకు 45 వేల నుంచి 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా, ఆధునికీకరణ పనులు పూర్తయితే ఆ సామర్థ్యం 75 వేల నుంచి 90 వేల వరకు పెరగనుంది. 6 కొత్త ప్లాట్ఫాంలతో.. ప్రస్తుతం రైల్వే స్టేషన్లో 8 ప్లాట్ఫాంలు ఉండగా, తొలుత మరో రెండింటిని మాత్రమే ఏర్పాటు చేయాలని భావించారు. అయితే, పెరుగుతున్న రైళ్ల రద్దీతో పాటు విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు కానున్న నేపథ్యంలో, అదనపు ప్లాట్ఫాంల ఆవశ్యకతను గుర్తించిన అధికారులు వీటి సంఖ్యను 14కు పెంచారు. ఈ ప్లాట్ఫాంలు అందుబాటులోకి వస్తే.. అవుటర్లో ప్లాట్ఫాం కోసం రైళ్లు నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. అలాగే, బైపాస్ మీదుగా రైళ్లను దారి మళ్లించే ఇబ్బందులు కూడా తప్పుతాయి. భారీ ఎయిర్ కాన్కోర్స్ ప్రత్యేక ఆకర్షణ ఈ పునర్నిర్మాణ ప్రాజెక్టులో ప్రధాన ఆకర్షణగా భారీ ఎయిర్ కాన్కోర్స్ నిలవనుంది. 72 మీటర్ల వెడల్పు, 220 మీటర్ల పొడవుతో దీనిని నిర్మిస్తున్నారు. స్టేషన్ ప్లాట్ఫాంల పైభాగంలో, సహజ సిద్ధమైన కాంతి ప్రసరించేలా దీనిని తీర్చిదిద్దుతున్నారు. ఇది స్టేషన్కు రెండు వైపులా ఉన్న ప్లాట్ఫాంలను అనుసంధానిస్తుంది. ఇక్కడ 600 మంది ప్రయాణికులు కూర్చునే వీలుండటంతో పాటు 20 వాణిజ్య దుకాణాలు కూడా రాబోతున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం మొత్తం 60 లిఫ్ట్లు, 50 ఎస్కలేటర్లు, 28 ర్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. -
ప్రతి గ్రామంలో శివాలయం ఉండాలి
మాట్లాడుతున్న స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిజీ పాయకరావుపేట: గ్రామ పరిధిలో గ్రామ దేవత ఆలయం, గ్రామంలో శివాలయం ఎంతో ముఖ్యమని విశాఖ శారదా పిఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిజీ అన్నారు. మండలంలోని కుమారపురం గ్రామంలో కుమార ఉమారామలింగేశ్వర స్వామి నూతన విగ్రహ ప్రతిష్టా మహాకుంభాభిషేక మహోత్సవానికి ఆయన హాజరయ్యారు. శివాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం సభలో గ్రామ దేవత, శివాలయం ఆలయాల విశిష్టతపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సప్తగిరి హేచరీస్ చైర్మన్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు, నాయకులు నీలాపు మహేష్రెడ్డి, బాలకృష్ణారెడ్డి, చిరంజీవిరెడ్డి, వెంకటరెడ్డి పెరుమాళ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
గ్రహణం
కూటమి ప్రభుత్వంలో గిరిజనాభివృద్ధి గాలికి వదిలేశారు. సమస్యల పరిష్కారానికి వేదిక కావాల్సిన పాడేరు ఐటీడీఏ పాలకవర్గ సమావేశం ఏడాది కాలంగా నిర్వహించకపోవడంపై ఏజెన్సీలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం మూడు నెలలకు ఒకసారి జరగాల్సిన సమావేశం, గతేడాది ఏప్రిల్ నుంచి మోక్షానికి నోచుకోలేదు. ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు నిలదీస్తారనే భయంతోనే ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, ఫలితంగా మన్యం అభివృద్ధి కుంటుపడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గిరిజనాభివృద్ధికిసాక్షి, పాడేరు: గిరిజనాభివృద్ధి కార్యక్రమాల అమలులో అధికార కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. గిరిజనుల సమస్యలపై చర్చించాల్సిన అత్యంత కీలకమైన పాడేరు ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైందని గిరిజన సంఘాలు, ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం మూడు నెలలకు ఒకసారి నిర్వహించాల్సిన ఈ సమావేశం, ఏడాది కాలంగా జరగకపోవడం గమనార్హం. ● గత ఏడాది ఏప్రిల్ 21వ తేదీన 74వ ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. అయితే ఆ సమావేశం కేవలం మొక్కుబడిగా సాగిందనే విమర్శలు ఉన్నాయి. అప్పట్లో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ, సీపీఎంకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్సీలు, ఇతర ప్రతినిధులు గిరిజన సమస్యలపై ఏకరువు పెట్టారు. ముఖ్యంగా గిరిజనులకు నూరు శాతం ఉద్యోగాల కల్పనకు సంబంధించిన జీవో నంబరు 3 పునరుద్ధరణపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణిని నిలదీశారు. ఆ సమయంలో జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న ఆమె ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. సరిగ్గా అదే సమయంలో పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరావుకు ఛాతీనొప్పి రావడంతో సమావేశాన్ని అర్ధంతరంగా ముగించారు. ఆ తర్వాత ఏడాది గడుస్తున్నా మళ్లీ సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవు. ప్రతిపక్షాల బలమే కారణమా? ఐటీడీఏ పాలకవర్గంలో మెజారిజీ ప్రజాప్రతినిధులు ప్రతిపక్షాలకు చెందిన వారు కావడమే ఈ జాప్యానికి కారణమని ప్రచారం జరుగుతోంది. అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజరాణి, విశాఖ జడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరావు, రేగం మత్స్యలింగం, ఎమ్మెల్సీ కుంభా రవిబాబుతో పాటు తొమ్మిది మంది ఎంపీపీలు, తొమ్మిది మంది జెడ్పీటీసీలు వైఎస్సార్సీపీకి చెందినవారు. అనంతగిరి జడ్పీటీసీ సీపీఎం ప్రతినిధిగా ఉన్నారు. సమావేశం నిర్వహిస్తే వీరంతా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తారనే భయంతోనే కూటమి ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని చర్చ జరుగుతోంది. గిరిజన సంక్షేమం గాలికే.. పాడేరు ఐటీడీఏ పరిధిలో గిరిజనాభివృద్ధి కుంటుపడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవో నంబరు 3 వివాదం.. జీవో నంబరు 3 పునరుద్ధరణపై స్పష్టత లేకపోవడంతో గిరిజన అభ్యర్థులు డీఎస్సీలో ఉద్యోగాలు కోల్పోయారు. మళ్లీ కొత్త నోటిఫికేషన్లు వస్తున్న తరుణంలో ఐటీడీఏ తీర్మానం అవసరమున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మౌలిక వసతులు: మారుమూల గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నాయి. వ్యవసాయం, అనుబంధ రంగాల్లోనూ అభివృద్ధి శూన్యమని విమర్శలు వస్తున్నాయి. పరిష్కారం చూపని పీజీఆర్ఎస్ ప్రతి శుక్రవారం నిర్వహించే పీజీఆర్ఎస్లో గిరిజనులు విన్నవిస్తున్న వ్యక్తిగత, గ్రామ సమస్యలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఏడాది కాలంలో నాలుగుసార్లు నిర్వహించాల్సిన సమావేశాన్ని ఒక్కసారి కూడా నిర్వహించకపోవడంపై గిరిజన ప్రాంత ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి వెంటనే ఐటీడీఏ పాలకవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏడాదిగా నోచుకోనిఐటీడీఏ పాలకవర్గ సమావేశం గతేడాది ఏప్రిల్ 21 తర్వాత మళ్లీ నిర్వహించని వైనం కూటమి ప్రభుత్వానికి ప్రతిపక్ష భయం మెజారిటీ ప్రజాప్రతినిధులు వైఎస్సార్సీపీ వారు కావడమే జాప్యానికి కారణం జీవో నంబరు 3, రోడ్లు, తాగునీటి సమస్యలపై నిలదీస్తారనే సర్కారు వెనకడుగు తక్షణమే సమీక్ష నిర్వహించాలని గిరిజన సంఘాల డిమాండ్ వెంటనే నిర్వహించాలి ఐటీడీఏ పాలకవర్గ సమావేశాన్ని ఏడాదిగా నిర్వహించకపోవడం దారుణం. గిరిజన గ్రామాల్లో అనేక సమస్యలతో గిరిజనులు సతమతమవుతున్నారు. గిరిజన సంక్షేమ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో జరగడం లేదు. గిరిజనులకు న్యాయం చేయాలంటే పాడేరు పాలకవర్గ సమావేశాన్ని వెంటనే నిర్వహించాల్సిందే. – రేగం మత్స్యలింగం, ఎమ్మెల్యే, అరకులోయసమస్యలపై నిర్లక్ష్యం తగదు ఐటీడీఏ పాలకవర్గ సమావేశాల ద్వారా గిరిజనుల సమస్యలు పరిష్కారమవుతాయి. గ్రామస్థాయిలో గిరిజనులు ఎదుర్కొనే అన్ని సమస్యలను సభ్యులంతా పాలకవర్గ సమావేశం దృష్టికి తీసుకువస్తారు. ఏడాది నుంచి పాలకవర్గ సమావేశం పెట్టకపోవడంతో గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. గిరిజన సమస్యలపై కూటమి ప్రభుత్వం, గిరిజన మంత్రికి నిర్లక్ష్యం తగదు. – మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్యే, పాడేరు -
మన్యంలో ఇంధనం కొరత
సాక్షి, పాడేరు: ఏజెన్సీ ప్రాంతంలోని పలు పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత నెలకొంది. చాలా చోట్ల నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు, వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్ కొన్ని చోట్ల అరకొరగా లభిస్తున్నప్పటికీ, డీజిల్ కొరత మాత్రం తీవ్రంగా ఉంది. ● జిల్లా కేంద్రంలోని తలారిసింగి ఐవోసీ, సుండ్రుపుట్టులోని బీపీ కంపెనీ బంకులు గురువారం మూతబడ్డాయి. నిల్వలు లేకపోవడంతో యాజమాన్యాలు బోర్డులు పెట్టడంతో వాహనదారులు నిరాశతో వెనుదిరిగారు. అందుబాటులో ఉన్న మరికొన్ని బంకుల్లో కూడా నిల్వలు తక్కువగా ఉండటంతో, అందరికీ సర్దుబాటు చేసేలా పరిమితంగానే ఇంధనాన్ని సరఫరా చేస్తున్నారు. అభివృద్ధి పనులపై ప్రభావం డీజిల్ కొరత ప్రభావం మన్యంలోని అభివృద్ధి పనులపై తీవ్రంగా పడింది. పాడేరు ప్రాంతంలో జరుగుతున్న జాతీయ రహదారి పనులతో పాటు ఏజెన్సీ అంతటా రోడ్లు, వంతెనల నిర్మాణాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. లారీలు, యంత్రాల నిర్వహణకు ప్రతిరోజూ సుమారు 50 వేల లీటర్ల డీజిల్ అవసరం ఉంటుంది. ఒక్క జాతీయ రహదారి నిర్మాణ పనులకే కాంట్రాక్టర్లు రోజుకు 23 వేల లీటర్ల వరకు డీజిల్ వినియోగిస్తున్నారు. ఇంధనం లేకపోవడంతో యంత్రాలన్నీ మూలకు పడ్డాయి. సరఫరాలో జాప్యం: బంకుల యాజమాన్యాలు ఆయిల్ కంపెనీలకు ముందస్తుగానే ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరుపుతున్నప్పటికీ, కంపెనీలు సకాలంలో ఆయిల్ ట్యాంకర్లను పంపడం లేదని తెలుస్తోంది. ఈ సరఫరా లోపం కారణంగానే ఏజెన్సీలో ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పెట్రోల్ బంక్ల వద్ద నోస్టాక్ బోర్డులు -
గ్రంథాలయానికిస్టడీ మెటీరియల్ వితరణ
పాడేరు : స్థానిక జిల్లా శాఖా గ్రంఽథాలయానికి విశాఖపట్నంకు చెందిన పీబీఎల్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ప్రతినిధులు తన సీఎస్సార్ నిధుల నుంచి 40 కుర్చీలు, పోటీపరీక్షల పుస్తకాలు, కంప్యూటర్, అరమరలను గురువారం ఉచితంగా అందజేశారు. వీటిని కలెక్టర్ నిషాంతి చేతుల మీదుగా గ్రంథాలయ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిషాంతి మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఈ స్టడీ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రీడర్లు, విద్యార్థులు గ్రంథాలయానికి వచ్చి వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పీబీఎల్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ డైరెక్టర్ రాజేష్ను గ్రంధాలయాధికారి మానస, పీ4 యంగ్ ప్రొఫెషనల్ శ్రీనివాస్ తదితరులు సత్కరించారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
● జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ హెచ్చరిక ● రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశంసాక్షి,పాడేరు: ప్రజలకు రెవెన్యూ సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ హెచ్చరించారు. స్థానిక ఎస్.ఆర్.శంకరన్ ఆడిటోరియంలో జిల్లా రెవెన్యూ అఽధికారులు, తహసీల్దార్లు, డీటీలు, వీఆర్వోలతో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా అన్ని రెవెన్యూ ఆంశాలపై జేసీ సమగ్రంగా సమీక్షించారు. అధికారులు, సిబ్బందికి సంబంధించి ఐవీఆర్ఎస్లో పనితీరును తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పీజీఆర్ఎస్, భూముల మ్యూటేషన్ల పనులపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలన్నారు.జిల్లాలో రెవెన్యూ రికార్డుల స్కానింగ్,డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో లోకేశ్వరరావు, ఎస్డీసీ నీలకంఠరావు, కలెక్టరేట్ ఏవో ప్రసాద్ పాల్గొన్నారు. పర్యాటక పారిశ్రామిక ప్రాజెక్ట్లు వేగవంతం జిల్లాలోని పర్యాటక,పారిశ్రామిక ప్రాజెక్ట్ల అభివృద్ధిని వేగవంతం చేయాలని,జేసీ తిరుమణి శ్రీపూజ ఆదేశించారు.కలెక్టరేట్ సమావేశ మందిరంలో పర్యాటక ప్రాజెక్ట్లపై అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యాటక,పారిశ్రామిక ప్రాజెక్ట్ల ద్వారా స్థానిక గిరిజన యువతకు లభించే ఉపాధి అవకాశాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలన్నారు.ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల అఽధికారి రమణారావు, ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, జిల్లా పర్యాటకశాఖ అధికారి దాసు, డీఎఫ్వో ఉమామహేశ్వరి, జిల్లా ఉద్యానవన అధికారి బాలకర్ణ, గిరిజన సంక్షేమశాఖ డీడీ పరిమళ పాల్గొన్నారు. -
హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సర్వేలపై గిరిజనుల ఆగ్రహం
సాక్షి, పాడేరు: హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ప్రాంతాల్లో అధికారులు రహస్యంగా శాటిలైట్ సర్వేలు చేపట్టడం అన్యాయమని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హుకుంపేట మండలం బూర్జ పంచాయతీ చిట్టంవలస పరిధిలోని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేక కమిటీ ప్రతినిధులు, గిరిజన సంఘం నేతలు గురువారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. రహస్య సర్వేపై అభ్యంతరం ఈ నెల 17వ తేదీన సర్వే ఆఫ్ ఇండియా, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అధికారులు ఆనంద్ సాహు, వరదబోయిన గోపాలరావు బృందం రహస్యంగా సర్వే చేయడంపై నిరసనకారులు మండిపడ్డారు. హక్కుల ఉల్లంఘన గిరిజన సంఘం రాష్ట్ర నేత పి. అప్పలనర్స మాట్లాడుతూ.. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గిరిజన చట్టాలు, హక్కులను ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం 8,200 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. గ్రామసభల ఆమోదం లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టకూడదన్నారు. అధికారులు ఎవరూ అనుమతి లేకుండా గ్రామాల్లోకి రావొద్దని సూచించారు. సర్వే పనులను తక్షణమే నిలిపివేయాలి, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కలెక్టర్కు వినతి అనంతరం గిరిజనులంతా కలెక్టర్ నిశాంతిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. గతంలో కలెక్టర్ దినేష్ కుమార్ ఇచ్చిన హామీలను (ఎలాంటి సర్వేలు జరపబోమని) ఆమెకు వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ.. ప్రభుత్వ నిర్ణయం మేరకు గ్రామసభలను సంప్రదిస్తామని హామీ ఇచ్చారు. అయితే, శాటిలైట్ సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకోవడం సరికాదని ఆమె స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బూర్జ ఎంపీటీసీ హరి, పోరాట కమిటీ నాయకులు సివేరి కొండలరావు, దశరథ్, సురేష్, కృష్ణంరాజు, చిట్టిబాబు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట ఆందోళన -
అంగన్వాడీలకు అదనపు పనులు రద్దు
ముంచంగిపుట్టు: అంగన్వాడీ కార్యకర్తలకు, ఆయాలకు సెన్సస్ (జనగణన), బీఎల్వో విధులను తక్షణమే రద్దు చేయాలని అంగన్వాడీ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఈశ్వరి, గంగాభవాని డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు నిరసన తెలిపారు. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సూపర్వైజర్లకు అందజేశారు. అంగన్వాడీలకు ఇతర శాఖల పనులు అప్పగించవద్దని ప్రభుత్వం స్పష్టమైన సర్క్యులర్ జారీ చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో సెన్సస్, బీఎల్వో విధులు కేటాయించడం అన్యాయమని వారు పేర్కొన్నారు. అదనపు డ్యూటీల పేరుతో ఒత్తిడి చేస్తూ అంగన్వాడీలను మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణతో పాటు గర్భిణులకు, బాలింతలకు టేక్ హోమ్ రేషన్ పంపిణీ వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నామని, కొత్త పనులు అప్పగిస్తే సేవలపై ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల అధ్యక్షులు భీమరాజు, కార్యదర్శి శంకర్రావు, అంగన్వాడీ సంఘ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఈశ్వరి, గంగాభవాని డిమాండ్ -
జలధార, జలహారతిపై కలెక్టర్ సమీక్ష
సాక్షి,పాడేరు: జిల్లాలోని నీటి సంరక్షణ లక్ష్యంగా చేపడుతున్న జలధార జలహారతి వంద రోజుల ప్రణాళిక పనులపై కలెక్టర్ టి.నిశాంతి సమీక్షించారు. గురువారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అఽధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 326 గ్రామాల్లో భూగర్భ జలాల సంరక్షణ కట్టడాల కోసం స్థలాలను గుర్తించడం జరిగిందన్నారు. మిగిలిన గ్రామాల్లో కూడా అనువైన ప్రదేశాలను గుర్తించాలన్నారు. భవిష్యత్తులో తాగునీరు, సాగునీటి సమస్యలు లేకుండా ఉండాలంటే వందరోజుల ప్రణాళిక పనులను విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో జేసీ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డ్వామా పీడీ విద్యాసాగర్, భూగర్భ జలవనరులశాఖ అధికారి శ్రీనివాసరావు, డీఎఫ్వో ఉమామహేశ్వరి పాల్గొన్నారు. -
ఈవీఎం గోదాంల తనిఖీ
పాడేరు : నెలవారి తనిఖీల్లో భాగంగా పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న ఈవీఎంల గోదామును జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి గురువారం తనిఖీ చేశారు. ఈవీఎంల గోదాముకు వేసిన సీలును పరిశీలించారు. భద్రత ప్రమాణాలపై అక్కడ గస్తీ కాస్తున్న భద్రత దళాల నుంచి తెలుసుకున్నారు. పలు సలహాలు, సూచనలు చేశారు. సీసీ కెమెరాల పని తీరును పరిశీలించారు. అనంతరం విజిటింగ్ రిజిస్టర్లో సంతకం చేశారు. కార్యక్రమంలో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు నందు, మాణిక్యం, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా యర్రగొండమ్మ ఘటాల ఊరేగింపు
భక్తజన సంద్రమైన శరభన్నపాలెం కొయ్యూరు: కోర్కెలు తీర్చే కల్పవల్లిగా, భక్తుల నమ్మకాన్ని వమ్ము చేయని ఇలవేల్పుగా పేరుగాంచిన యర్రగొండమ్మ తల్లి ఘటాల ఊరేగింపు గురువారం రాత్రి అత్యంత వైభవంగా ప్రారంభమైంది. శరభన్నపాలెం నుంచి నడింపాలెం వరకు సాగిన ఈ శోభాయాత్రలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆకట్టుకున్న శక్తి వేషాలు : ఆలయ కమిటీ చైర్మన్ గొడ్డేటి మహేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఊరేగింపులో కళాకారులు ప్రదర్శించిన శక్తి వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తుల జయజయధ్వానాల మధ్య, మంగళవాయిద్యాల నడుమ ఘటాల ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. బట్టపనుకుల, వెలగలపాలెం, చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. నాలుగు రోజుల పాటు ఉత్సవాలు: ఈ ఉత్సవాలను మొత్తం నాలుగు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు కె.శివప్రసాద్, పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జి సుమర్ల సాంబశివరావు, కిరణ్ మాస్టర్, మాజీ సర్పంచులు కిముడు సత్యనారాయణ, ధారకొండ నారాయణమూర్తి, మాజీ వైస్ సర్పంచ్ త్రిమూర్తులు, యెర్రేసు, రమాదేవి, సువర్ణరాజు పాల్గొన్నారు. -
యువతి అదృశ్యంపైఫిర్యాదు
పెందుర్తి: తన కుమార్తె అదృశ్యమైనట్లు ఓ మహిళ పెందుర్తి పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జీవీఎంసీ 88 వార్డు కోటనరవలో నందిగం పద్మావతి.. తన కుమార్తె మౌనిక(27)తో కలిసి ఉంటోంది. బీ ఫార్మసీ పూర్తి చేసిన మౌనిక ఇంటి వద్దే ఉంటుంది. ఈ నెల 19న తల్లి పద్మావతి మార్కెట్కు వెళ్లి తిరిగి వచ్చేసరికి కుమార్తె మౌనిక ఇంటి వద్ద లేదు. ఆందో ళనకు గురైన పద్మావతి బంధువులు, స్నేహితుల వద్ద ఆరా తీసింది. అయితే తర్వా తి రోజు మౌనిక తల్లికి ఫోన్ చేసి ‘నేను చందు అనే వ్యక్తితో వెళ్లిపోతున్నాను. నా కోసం వెతకొద్దు’అని చెప్పి.. ఫోన్ ఆఫ్ చేసింది. పద్మావతి ఫిర్యాదు మేరకు సీఐ కేవీ సతీష్కుమార్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోంది. -
విద్య, వైద్యంపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు
కలెక్టర్ నిశాంతి హెచ్చరికసాక్షి,పాడేరు: అన్ని గిరిజన విద్యాలయాల్లో మెరుగైన విద్య,వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ టి.నిశాంతి హెచ్చరించారు. బుధవారం ఆమె మండలంలోని కందమామిడి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.విద్యార్థినులకు అందుతున్న విద్యా కార్యక్రమాలతో పాటు,భోజనం నాణ్యతను సమీక్షించారు.ప్రభుత్వ నిబంధనల మేరకు పౌష్టికాహారం అందించాలని, విద్యార్థినుల వైద్యంపై దృష్టి పెట్టాలని డిప్యూటీ మేట్రిన్ను ఆదేశించారు..అనంతరం విద్యార్థినులతో ముఖాముఖీ నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. అలాగే పాఠశాల హెచ్ఎం సంతకం రిజిస్టర్లో లేకపోవడంపై ఆమె స్పందించారు. దీనిపై సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.అన్ని రికార్డులతో హెచ్ఎంను కలెక్టరేట్కు హాజరుకావాలని ఆదేశించారు .ఈ కార్యక్రమంలో ఏటీడబ్ల్యూవో అఖిల, జిల్లా వ్యవసాయాఽధికారి నందు, ఆహార భద్రత అధికారి గ్రీస్మశ్రీ, సర్వేలెన్స్ అధికారి అఖిల్ పాల్గొన్నారు. మొక్కలతో పర్యావరణ పరిరక్షణ ఎర్త్డే పురష్కరించుకుని కలెక్టరేట్ ఆవరణలో బుధవారం కలెక్టర్ టి.నిశాంతి పలు రకాల మొక్కలను నాటారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్క లు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణ, సమతుల్యత, భూతాప నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. ప్రతి ఒక్కరు కనీసం ఒక్క మొక్క అయిన నాటి సంరక్షించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో లోకేశ్వరరావు, ఎస్డీసీ నీలకంఠరావు, కలెక్టరేట్ ఏవో ప్రసాదరావు, సీపీవో ప్రసాద్ పాల్గొన్నారు. -
అవకాశాలను అందిపుచ్చుకుంటూ యువతరం రాణించాలి
మద్దిలపాలెం: సంక్షోభాల నుంచి పరిష్కారాలను అన్వేషించాలని, వాటినే అవకాశాలుగా మలుచుకుంటూ యువతరం ముందుకు సాగాలని ఒడిశా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కె.హరిబాబు అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకల వారోత్సవాల్లో భాగంగా ఏయూ ఇంజినీరింగ్, మహిళా ఇంజినీరింగ్ కళాశాలలు సంయుక్తంగా బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్న కళాశాల స్థాయి వేడుకలను బుధవారం ముఖ్య అతిథిగా ఆయన ప్రారంభించి మాట్లాడారు. నషాముక్త్ క్యాంపస్లుగా విశ్వవిద్యాలయాలు నిలవాల్సిన అవసరముందన్నారు. ఈ దిశగా యువతలో చైతన్యం నింపాలని సూచించారు. విశ్వవిద్యాలయం నిరంతర ప్రగతి సాధించడం, అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడం ఎంతో ప్రధానమన్నారు. ముఖ్యంగా భారత్కు క్రూడ్ ఆయిల్, రక్షణ రంగ ఆయుధాలు, వంటనూనెలు అధికంగా దిగుమతవుతున్నాయని, వీటిని తగ్గించుకోవడం ద్వారా దేశ సంపద విదేశాలకు వెళ్లకుండా నియంత్రించడం సాధ్యపడుతుందన్నారు. తాను రాజకీయ ఓనమాలను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నేర్చుకున్నానని, నేడు తానున్న స్థితికి ఏయూనే కారణమని తెలిపారు. వందేళ్ల ఏయూ ప్రయాణాన్ని పరిశీలిస్తే జ్ఞానం, నైతిక విలువలు, సేవ అనే మూడు సూత్రాలపై సాగిందని స్పష్టమవుతోందన్నారు. బోధన వసతులు బలోపేతం చేస్తాం ఉన్నత విద్యా మండలి ఉపాధ్యక్షుడు ఆచార్య కె.మధుమూర్తి మాట్లాడుతూ విలువలతో ఎదగడం, సమాజానికి ఉపయుక్తంగా నిలవడం ఏయూను చూస్తే అర్థమవుతుందన్నారు. విశ్వవిద్యాలయాల్లో బోధన వసతులను బలోపేతం చేస్తామని, త్వరలో నియామక ప్రక్రియ చేపడతామని తెలిపారు. ఎన్టీయూ ప్రెసిడెంట్స్ చైర్ ప్రొఫెసర్ ఆచార్య ఉపద్రష్ట రామమూర్తి మాట్లాడుతూ తాను ఏయూలో చదువుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. పూర్వ విద్యార్థుల ప్రగతి విశ్వవిద్యాలయానికి స్ఫూర్తిని, ఖ్యాతిని అందిస్తాయన్నారు. విశ్వవిద్యాలయం తరఫున అతిథులను సత్కరించి జ్ఞాపికలు బహూకరించారు. ఆచార్య జి.వి.ఆర్.శ్రీనివాసరావు, ఆచార్య ఎన్.చిట్టిబాబు, ఆచార్య డి.లలిత భాస్కరి, ఆచార్య బి.ప్రజ్ఞ, ఆచార్య పి.స్వప్న తదితరులు కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. -
సీలేరులో ఇంటింటా సర్వే
సీలేరు : ఏపీ జెన్కో ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు కారణంగా సీలేరు గ్రామాన్ని నిర్వాసిత గ్రామంగా గుర్తించాలన్న డిమాండ్పై ఉన్నతాధికారులు స్పందించారు. స్థానిక జేఏసీ నాయకులు, ప్రజల విజ్ఞప్తి మేరకుకలెక్టర్, సబ్ కలెక్టర్ ఆదేశాలతో బుధవారం నుంచి గ్రామంలో రెవెన్యూ సిబ్బంది సమగ్ర సర్వేను ప్రారంభించారు.గతంలో నిర్వహించిన పబ్లిక్ హియరింగ్లో సీలేరును నిర్వాసిత గ్రామంగా గుర్తించి, స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని జేఏసీ నేతలు, ప్రజాప్రతినిధులు కోరారు. దీనిపై స్పందించిన జాయింట్ కలెక్టర్.. ప్రజల విద్యా, వృత్తి నైపుణ్యాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మొదట ఈ సర్వే నామమాత్రంగా సాగుతోందని జేఏసీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో, తహసీల్దార్ అన్నాజీరావు వెంటనే స్పందించారు. తూతూమంత్రం’గా కాకుండా ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాలని సిబ్బందిని ఆదేశించారు. వీఆర్వో దేవదానం, సర్వేయర్ మురళీకృష్ణ బుధవారం నుంచి ఇంటింటా పర్యటిస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని కలిసి విద్యార్హతలు, వృత్తిపరమైన వివరాలను నమోదు చేస్తున్నారు. సర్వే పూర్తయిన తర్వాత సమగ్ర నివేదికను జాయింట్ కలెక్టర్కు అందజేస్తామని తహసీల్దార్ తెలిపారు. సర్వే వేగంగా పూర్తి కావడానికి గ్రామ ప్రజలందరూ రెవెన్యూ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు. నిర్వాసితుల గుర్తింపుపై రెవెన్యూ కసరత్తు -
బ్రహ్మండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు వేళాయె
● రేపటి నుంచి ఉత్సవాలకు అంకురార్పణ ● ముస్తాబైన పెందుర్తి వేంకటాద్రి పెందుర్తి: బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు పెందుర్తి వేంకటాద్రి సిద్ధమైంది. శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వివాహమాడేందుకు భూమి మీద అడుగిడిన పవిత్ర రోజు వైశాఖ శుద్ధ దశమి. అందుకే అదే రోజున ఏటా బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ. వేంకటాద్రి నిర్మాణానికి కూడా వైశాఖ శుద్ధ దశమి నాడే తొలి అడుగు పడింది. ఈ క్రమంలో ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహించి వేంకటాద్రిపై వైశాఖ శద్ధ దశమి నాడే కల్యాణం నిర్వహిస్తారు. వెంకన్న దేవాలయంలో శుక్రవారం నుంచి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఐదు రోజులపాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు విష్వక్సేనపూజ, అంకురార్పణ జరుగుతుంది. రెండో రోజు శనివారం ఉదయం ధ్వజారోహణ, హోమాలు చేస్తారు. సాయంత్రం లక్ష తులసి, మల్లికా పుష్పాలతో స్వామివారికి విశేష అర్చనలు జరుగుతాయి. మూడోరోజు ఆదివారం వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా సాయంత్రం స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు. నాలుగో రోజు సోమవారం సాయంత్రం తిరువీధి ఉత్సవంలో భాగంగా స్వామివారి రథోత్సవం జరగనుంది. వేంకటాద్రి నుంచి పెందుర్తి పురవీధుల్లో స్వామివారు రథంపై ఊరేగుతూ చినముషిడివాడ సప్తగిరినగర్లోని అలివేలు మంగమ్మ సన్నిధి వరకు భక్తులకు ఆశీస్సులు అందిస్తారు. ఆఖరి రోజు మంగళవారం ఉదయం స్వామివారికి చక్రస్నానం, చక్రత్తాళ్వారులతో కలిసి దివ్య స్నానమాచరింపజేస్తారు. సాయంత్రం పుష్పయాగం, మహా పూర్ణాహుతి, ద్వాదశారాధన, స్వామివారికి విశేష అర్చనలు, ఊంజల్ సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఈవో నీలిమ వెల్లడించారు. భక్తులంతా తరలిరావాలని కోరారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వేంకటాద్రిపై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
పర్యాటకంగా అరకు పైనరీ మరింత అభివృద్ధి
అరకులోయ టౌన్/డుంబ్రిగుడ: పర్యాటక రంగంలో అరకు పైనరీ విశిష్టతను చాటేలా మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర అటవీ శాఖ పీసీసీఎఫ్ డాక్టర్ పీవీ చలపతిరావు అధికారులను ఆదేశించారు. బుధవారం అరకులోయ పర్యటనలో భాగంగా ఆయన డుంబ్రిగుడ మండలంలోని అరకు పైనరీని సందర్శించి, క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం పర్యాటక కేంద్రంగా పైనరీకి మంచి గుర్తింపు ఉందన్నారు. భవిష్యత్తులో దీనిని అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలని, పర్యాటకులకు కేవలం ఆహ్లాదాన్నే కాకుండా అటవీ సంపదపై అవగాహన కల్పించేలా విజ్ఞానదాయకమైన ప్రాజెక్టులను రూపకల్పన చేయాలని సూచించారు. పైనరీ అభివృద్ధి ద్వారా శాంతినగర్ వీఎస్ఎస్ సభ్యులతో పాటు, సమీప గ్రామాల్లోని గిరిజనులకు అధికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని అరకు రేంజ్ అధికారి బొర్రా కోటేశ్వరరావుకు సూచించారు. అనంతరం పైనరీ సమీపంలోని వీఎస్ఎస్ కొండ ప్రాంతాన్ని కూడా ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విశాఖ సర్కిల్ సీసీఎఫ్ బీఎం దివాన్ మైథన్, డీఎప్వో కె. ఉమామహేశ్వరి, విశాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్వో సునీల్, అరకు రేంజర్ బొర్రా కోటేశ్వరరావు, సెక్షన్ ఆఫీసర్ కృష్ణంనాయుడు, బీట్ ఆఫీసర్లు చంటి, పి. ఉద్దంగి, పైనరీ మేనేజర్ శేఖర్, అరకు, అనంతగిరి రేంజ్ సిబ్బంది, వీఎస్ఎస్ సభ్యులు పాల్గొన్నారు. పీసీసీఎఫ్ చలపతిరావు -
కడుతులలో తీరని దాహం
● సమస్య పరిష్కరించకుంటే మండల పరిషత్ను ముట్టడిస్తాం ● గిరిజన సంఘం హెచ్చరిక ముంచంగిపుట్టు: గిరిజన గ్రామాల్లో నీటి సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహించడం తగదని గిరిజన సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ఎం. శ్రీను, కె. నర్సయ్య హెచ్చరించారు. బుధవారం మండలంలోని పనసపుట్టు పంచాయతీ, కడుతుల గ్రామంలో పర్యటించిన వారు, అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కడుతుల గ్రామంలో నీటి ఎద్దడికి ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖ అధికారుల మధ్య నెలకొన్న సమన్వయ లోపమే ప్రధాన కారణమని విమర్శించారు. గ్రామంలో లో–వోల్టేజీ సమస్యను పరిష్కరించకపోవడం, నీటి పథకం పనులను అసంపూర్తిగా వదిలేయడం వల్ల నెలల తరబడి గిరిజనులు దాహార్తితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాడైన నీటి పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నీటి సరఫరా కోసం గ్రామంలో స్థానికులతో కలిసి గిరిజన సంఘం నేతలు ఆందోళన చేపట్టారు. వారం రోజుల్లోగా నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, లేనిపక్షంలో గ్రామస్తులందరితో కలిసి మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు అల్టిమేటం జారీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు జమున, సోన్నాయి, మున్ని, తరుణ్, దేవదాసు, కొమ్ములు, త్రినాథ్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్.రాయవరంలో ఆధ్యాత్మిక శోభ
ఎస్.రాయవరం: గురజాడ జన్మ స్థలమైన ఎస్.రాయవరం మరో ఆధ్యాత్మిక కేంద్రంగా పేరొందనుంది. కేరళ శబరిమలై, ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయాల తరహాలో ఎస్.రాయవరంలో ఏకశిల పతినెట్టంపడి(ఏకశిలతో 18 మెట్లు చెక్కి)తో ఆలయ నిర్మాణాన్ని ఆకర్షణీయంగా పూర్తి చేశారు. సుమారు 1.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయ ప్రారంభోత్సవం ఈ నెల 26న వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయ్యప్ప మాలధారణ భక్తులు ఇరుముడితో 18 మెట్లు ఎక్కి మొక్కు చెల్లించుకునే విధంగా ఏకశిలతో మెట్లు ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణ. ఆలయం ప్రారంభం రోజున అయ్యప్ప మాలధారణ భక్తులు ఇరిముడి సమర్పించే ఆచారం కోసం గ్రామంలో సుమారు 70 మంది భక్తులు మాలధారణ చేశారు. వారంతా 41 రోజులు దీక్ష పూర్తి చేసుకుంటున్నారు. జిల్లా నలుమూలల నుంచి రాజకీయ పార్టీల ప్రముఖులు, విద్యావంతులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున ప్రారంభోత్సవానికి హాజరయ్యేలా ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానాలు పంపారు. ఏకశిలతో 18 మెట్లు ప్రత్యేకం ఆలయ ధర్మకర్త ఏకశిలపై 18 మెట్లు రావాలని ప్రత్యేకంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి ఏకశిలను తీసుకువచ్చి మెట్లు చెక్కించారు. కేవలం మెట్లు ఏర్పాటుకే సుమారు రూ.9 లక్షలు ఖర్చు చేశారు. 2024 ఏప్రిల్ 19న శంకుస్థాపన చేయగా.. రెండేళ్ల వ్యవధిలో నిర్మాణం పూర్తి చేశారు. సుమారు 500 మందికి పైగా భక్తులు అయ్యప్ప ఆలయ నిర్మాణంలో విరాళాలు ఇచ్చి భాగస్వాములయ్యారు. -
దుమ్ముతో నరకం
రోడ్డుపై ప్రయాణించాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఎటుచూసినా తేలిన కంకర రాళ్లు.. వాహనం వెళ్తే చాలు ఊపిరాడకుండా కమ్మేస్తున్న దుమ్ము మేఘాలు. గమ్యం చేరుకోవడానికి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని, కళ్లల్లో దుమ్ము నింపుకుని నరకప్రాయమైన ప్రయాణం చేయాల్సి వస్తోంది. అధికారుల నిర్లక్ష్యమో, కాంట్రాక్టర్ల జాప్యమో తెలియదు కానీ, సామాన్యుడికి మాత్రం ఈ రహదారి శాపంగా మారింది. కంకరతో కష్టాలు..సీలేరు: దాదాపు మూడు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని అంతర్రాష్ట్ర రహదారి దారాలమ్మ తల్లి ఘాట్ రోడ్డు ప్రయాణం ప్రస్తుతం నిత్య నరకంగా మారింది. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా, జిల్లా కలెక్టర్లు మారుతున్నా ఈ రహదారి తలరాత మాత్రం మారడం లేదు. రోడ్డు నిర్మాణం పూర్తికాకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతూ, రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సుమారు 70 కిలోమీటర్ల మేర సాగాల్సిన ఈ రహదారి నిర్మాణానికి కాంట్రాక్టర్లు, అధికారులు కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డుపై కేవలం కంకర వేసి వదిలేయడంతో, వాహనాలు వెళ్లేటప్పుడు భారీగా దుమ్ము రేగుతోంది. ఈ కంకరలో కార్లు, ఇతర వాహనాలు కూరుకుపోతుండటంతో, వాటిని బయటకు తీసేందుకు ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. కీలక దారి అయినా.. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఈ ఘాట్ రోడ్డు ఆంధ్రప్రదేశ్ను ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో కలిపే ప్రధాన మార్గం. అంతర్రాష్ట్ర సరిహద్దులను కలిపే ఈ రహదారిలో ప్రయాణించాలంటే ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సింగిల్ రోడ్డుగా ఉన్న ఈ మార్గంలో పనులు అసంపూర్తిగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసన రాష్ట్రంలో గుంతలు లేని రహదారులు నిర్మిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఈ కీలక రహదారిని పట్టించుకోవడం లేదు. ఎస్డీఎంఎఫ్ నిధుల ద్వారా 2024 నవంబర్లో ఆర్వీ నగర్ నుంచి పాలగడ్డ వరకు మూడు భాగాలుగా పనులు మంజూరయ్యాయి. ఇవి ప్రారంభమై రెండున్నర ఏళ్లు గడుస్తున్నా, సుమారు 60 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేయడంలో ఆర్అండ్బీ అధికారులు విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. ● అర్వీనగర్ నుంచి లంకపాకల వరకు, సప్పర్ల నుంచి దారాలమ్మ తల్లి గుడి వరకు పనులు నత్తనడకన సాగుతున్నాయి. పత్రికల్లో కథనాలు వస్తున్నా, కలెక్టర్లకు విన్నవించినా అధికారుల తీరులో మార్పు రావడం లేదని స్థానికులు వాపోతున్నారు. అధ్వానంగా పాలగడ్డ రహదారి సీలేరు నుంచి పాలగడ్డ వరకు ఉన్న సుమారు 20 కిలోమీటర్ల రహదారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. భారీ గుంతల వల్ల వర్షం పడితే ఈ రోడ్డు చెరువును తలపిస్తోంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ నుంచి పర్యాటక కేంద్రాలను సందర్శించేందుకు వచ్చే పర్యాటకుల వాహనాలు ఇక్కడ పాడైపోతున్నాయి. వర్షాకాలంతో ఇబ్బందే.. మరో రెండు నెలల్లో వర్షాకాలం ప్రారంభం కానుంది. అప్పటికల్లా తారు రోడ్డు వేయకపోతే, ప్రస్తుతం వేసిన కంకర కొట్టుకుపోయి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. తక్షణమే స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.పనులు జరిగేలా తక్షణ చర్యలు గూడెం కొత్తవీధి మండలం రెండు రీచ్లలో తారు రోడ్డు పనులు తక్షణమే జరిగేలా చర్యలు తీసుకుంటాం. ఇందుకు అవసరమైన సామగ్రి ప్రస్తుతం దొరక్క పోవడం వల్ల పనులు ఆలస్యం అవుతున్నాయి. గురువారం పాడేరులో జరిగే సమావేశంలో సంబంధిత కాంట్రాక్టర్తో మాట్లాడి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరావు, ఇన్చార్జి ఈఈ, రోడ్లు భవనాలశాఖ, పాడేరు అభివృద్ధికి నోచుకోని అంతర్రాష్ట్ర రహదారి ఏపీ, ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్గడ్కు ప్రధాన మార్గం ప్రాణాలు చేతపట్టుకుని ప్రయాణం స్పందించని అధికార యంత్రాంగం -
ఇల్లు కూలి వృద్ధుడి మృతి
సీలేరు: ముప్పై ఏళ్లుగా ఆ ఇల్లే అతనికి ఆశ్రయం.. అవే గోడల మధ్య తన జీవితాన్ని వెళ్లదీశాడు. కానీ, అదే ఇల్లు అతని ప్రాణాలను బలితీసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. గూడెం కొత్తవీధి మండలం దుప్పులవాడ పంచాయతీ కేంద్రంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. ఎస్ఐ యాసీన్ తెలిపిన వివరాల ప్రకారం.. దుప్పులవాడ ఊరి చివర వంతల చెన్నయ్య (65) అనే గిరిజనుడు ఒంటరిగా నివసిస్తున్నాడు. పదేళ్ల క్రితం భార్య మరణించడంతో, అప్పటి నుంచి ఎవరూ లేక ఒంటరిగానే ఉంటున్నాడు. గ్రామస్తులు ఇచ్చే సరకులతో వండుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం అర్ధరాత్రి భారీ గాలివానకు, చెన్నయ్య నిద్రిస్తున్న పాత ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకుపోయిన ఆ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం ఉదయం గ్రామస్తులు వెళ్లి చూడగా, ఇల్లు కూలిపోయి ఉండటం గమనించారు. వెంటనే ధైర్యం చేసి పెంకులను, శిథిలాలను తొలగించగా.. చెన్నయ్య నిర్జీవంగా పడి ఉండటం చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుడికి బంధువులు ఎవరూ లేకపోవడంతో, గ్రామ వీఆర్వో ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం అంత్యక్రియల కోసం మృతదేహాన్ని గ్రామస్తులకు అప్పగించారు. -
ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతి
దేవరాపల్లి: ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి కేజీహెచ్లో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. మండలంలోని గ్రామానికి చెందిన ధర్మిశెటి శ్రీను (51) సోమవారం తన కల్లంలో గడ్డి మందుతాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆయన కుటుంబ సభ్యులు వెంటనే విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. గతంలో ఎద్దు పొడిచిందని, అప్పటి నుంచి తీవ్ర అనారోగ్య సమస్యలతో శ్రీను బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ బాధలను తట్టుకోలేక మనస్తాపంతో గడ్డి మందు తాగి ఉంటాడని వారు తెలిపారు. మృతుడి భార్య రామలక్ష్మి బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ పైడిరాజు తెలిపారు. -
క్రీడలతోనే మానసిక ఉల్లాసం
● పాడేరులో జిల్లా స్థాయి ఫుట్బాల్ జట్ల ఎంపిక ప్రారంభం పాడేరు: క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసికోల్లాసం లభిస్తుందని, విద్యార్థులు ప్రాథమిక దశ నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని పాడేరు, అరకు ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అండర్–13, 14 జిల్లా స్థాయి ఫుట్బాల్ జట్ల ఎంపికలను నిర్వహించారు. ఈ ఎంపిక ప్రక్రియను ఇరువురు ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరావు, మత్స్యలింగం హాజరై లాంఛనంగా ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.జిల్లా స్థాయిలో ఎంపికై న జట్లు రాష్ట్ర స్థాయి పోటీల్లోజిల్లాకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి ఎ. జగన్మోహన్రావు, స్కూల్ గేమ్స్ జిల్లా సెక్రటరీ పి. సూరిబాబు, స్పోర్ట్స్ అథారిటీ సిబ్బంది ఆర్. ప్రసాద్, పీఈటీలు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన
మాకవరపాలెం: తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని పయనీర్(ఆన్రాక్)అల్యూమినియం రిఫైనరీ కార్మికులు స్పష్టం చేశారు. పలు సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం రిఫైనరీ లోపల కార్మికులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. రెండో రోజు బుధవారం సుమారు 500 మందికిపైగా కార్మికులు విధులు బహిష్కరించి మెయిన్ గేటు ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ కార్మిక చట్టం మేరకు 8 గంటల పని, పనికి తగిన వేతనం, అదనపు పనిగంటలకు ఓటీ చెల్లింపు, ప్రతి ఏటా 10 శాతం ఇంక్రిమెంట్లు, కాంట్రాక్ట్ కార్మికులకు ప్రమోషన్ల కల్పన, వీక్లీ ఆఫ్లకు వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాలను యాజమాన్యం దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కొందరు కార్మికులు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ప్రభాకర్కు అందజేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామన్నారు. ఎస్ఐ దామోదర్నాయుడు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్నపయనీర్ యాజమాన్యం పయనీర్ యాజమాన్యం కార్మికుల శ్రమను దోపిడీ చేస్తోందని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు ఆరోపించారు. ఆందోళన చేస్తున్న కార్మికులను బుధవారం కలిశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ కార్మికశాఖ అధికారులు స్పందించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. -
చెక్కు చెదరని ఏయూ ఫ్యాకల్టీ భవనం
మద్దిలపాలెం: విశ్వవిద్యాలయం అంటే కేవలం భవనాలే కాదు.. అక్కడ బోధించే విశిష్ట ఆచార్యులు, వారు జరిపే పరిశోధనలు, వాటి ఫలితంగా సమాజ ఉపయుక్తంగా నిలిచే ఆవిష్కరణలు. నిత్యం బోధన, పరిశోధనల్లో మునిగే ఆచార్యులకు కాస్త ఆటవిడుపుగా ఉండటానికి ఆంధ్రా యూనివర్సిటీలో దశాబ్దాల కిందట ప్రత్యేకంగా ఫ్యాకల్టీ క్లబ్ను ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రానికి పూర్వం 1940లో ఏయూలో ఫ్యాకల్టీ క్లబ్కు అప్పటి వీసీ సర్ కట్టమంచి రామలింగారెడ్డి శంకుస్థాపన చేసి భవనం నిర్మించారు. రెండు అంతస్తుల్లో నిర్మించిన ఈ భవనం నేటికీ చెక్కు చెదరకుండా మనకు దర్శనమిస్తోంది. దాదాపు 85 ఏళ్ల కిందట నిర్మితమైన ఈ చారిత్రక భవనం నేటికీ ఆచార్యులకు కాస్త సేదతీరడానికి ఉపయుక్తంగా నిలుస్తోంది. చుట్టూ విశాలమైన ఖాళీ స్థలంతో పాత భవనం కనిపిస్తే.. ప్రస్తుత ఫ్యాకల్టీ భవనానికి రెండు వైపులా భారీ భవంతులు వెలిశాయి. ఫ్యాకల్టీ క్లబ్కు ఒకవైపు ఆటా భవనం, డీసీఎంఎస్ విభాగం.. మరోవైపు అంజలి గెస్ట్హౌస్, అడ్వాన్స్డ్ సైన్సెస్ భవనాలు నిర్మించారు. నాడు: 1940లో ఏయూ ఫ్యాకల్టీ భవనంనేడు: ఆంధ్రా యూనివర్సిటీ ఫ్యాకల్టీ క్లబ్ -
రామాలయ భూమిని కాపాడండి
● తహసీల్దార్కు భక్తుల విన్నపం ముంచంగిపుట్టు: మండల కేంద్రంలోని రామాలయం చుట్టూ ఉన్న భూమి అక్రమణకు గురవుతోందని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు డిమాండ్ చేశారు. బుధవారం వారంతా స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ భాస్కర అప్పారావుకు ఫిర్యాదు చేశారు. రామాలయ నిర్మాణ సమయంలో కేటాయించిన 25 సెంట్ల భూమి క్రమంగా ఆక్రమణలకు గురవుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయం చుట్టూ వెలుస్తున్న అక్రమ నిర్మాణాల వల్ల ఆలయ ప్రాంగణం కుంచించుకుపోతోందని వివరించారు.ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే ఆలయ భూమిని సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేయాలని కమిటీ సభ్యులు కోరారు.భక్తుల ఫిర్యాదుపై తహసీల్దార్ సానుకూలంగా స్పందించారు. రామాలయ భూమిపై సమగ్ర సర్వే నిర్వహించి, హద్దులను నిర్ణయిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ భూమిని లేదా ఆలయ భూమిని ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. -
వేరుశనగ సాగుతో అధిక ఆదాయం
చింతపల్లి: తక్కువ నీటి సదుపాయంతో వేరుశనగ పంటను సాగు చేసి గిరిజన రైతులు మంచి దిగుబడులు, అధిక ఆదాయం పొందవచ్చని స్థానిక వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బీవీ తిరుమలరావు అన్నారు. బుధవారం చౌడుపల్లి పంచాయతీ కేంద్రంలోని సచివాలయంలో రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.చింతపల్లి డివిజన్ పరిధిలో రెండు వే ఎకరాల్లో వేరుశనగ సాగు లక్ష్యంగా ప్రభుత్వం 1,140 క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేసింది. వీటిని మొట్టమొదటిసారిగా ఆన్లైన్ పద్ధతిలో 100 శాతం రాయితీపై పంపిణీ చేస్తున్నారు. విత్తనాలతో పాటు పంట రక్షణ కోసం 50 శాతం రాయితీపై వేపనూనెను కూడా రైతులకు అందిస్తున్నారు. గత ఏడాది సాగు చేసిన రైతులకు పంపిణీలో మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు.విత్తనాలు తీసుకున్న రైతులకు పంట కాలమంతా ఎప్పటికప్పుడు అవసరమైన యాజమాన్య పద్ధతులపై వ్యవసాయ అధికారులు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి టి. మధుసూదనరావు, వీహెచ్ఏలు శోభన్బాబు, పరమేశ్వరరావు, స్థానిక రైతులు పాల్గొన్నారు.ఏడీఏ తిరుమలరావు -
ఇనుప వ్యర్థాలతో భారతదేశ చిత్రపటం
గాజువాక: స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా జీవీఎంసీ ప్రకటించిన వేస్ట్ టు వండర్ చాంపియన్షిప్ పోటీల కోసం గాజువాకకు చెందిన మహాత్మా, మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు జాగరపు శ్రీను ఇనుప వ్యర్థాలతో భారతదేశ చిత్రపటాన్ని రూపొందించారు. బ్రాండ్ వైజాగ్లో అందరూ భాగస్వాములు కావడంలో భాగంగా ఇనుప స్క్రాప్తో అందమైన శిల్పాలను తయారు చేయాలని జీవీఎంసీ పోటీలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఫ్యాబ్రికేషన్ యూనిట్ను నిర్వహిస్తున్న శ్రీను సైకిల్ ఛైన్లు, స్క్వేర్ పైపులు, జీఐ షీట్లు, సైకిల్ క్రాంక్లు, రిమ్లు, 6ఎంఎం, 8 ఎంఎం వేస్ట్ రాడ్లు, బైక్ చైన్లు, చైన్ స్పాకెట్లు, ఆటో గేర్ బాక్స్ వ్యర్థాలను ఉపయోగించి ఈ చిత్రాన్ని తయారు చేశారు. అందులో జాతీయ జెండాతోపాటు ఎద్దు, రైతు, ఆర్మీ సోల్జర్ వంటి చిత్రాలను కూడా దానికి అనుసంధానం చేశారు. ఈ చిత్రాన్ని చూసినవారు భలే ఉందే అంటూ శ్రీనును అభినందిస్తున్నారు. -
ఘనంగా రామానుజుల తిరునక్షత్రం పూజలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో విశిష్టాద్వైత స్థాపకులు భగవత్ రామానుజుల తిరునక్షత్రం పూజలను ఘనంగా నిర్వహించా రు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను, భగవత్ రామానుజుల ఉత్సవమూర్తిని ఆలయ బేడామండపంలో హంసమూలన వేంజేపచేశారు. విశేషపూజలు నిర్వహించారు. దివ్య ప్రబంధ పారాయణాన్ని పఠించా రు. అనంతరం బేడా తిరువీధి నిర్వహించారు. స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు, అర్చకులు ఈ పూజలు నిర్వహించారు. విశిష్టాద్వైత స్థాపకులు భగవత్ రామానుజులు తిరునక్షత్ర పూజలను శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెంది కొండదిగువ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న రామానుజులు విగ్రహానికి అభిషేకం జరిపారు. విశేష పూజలు నిర్వహించారు. అర్చకుడు చిన్నా తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
సమష్టి కృషితో చందనోత్సవం విజయవంతం
సింహాచలం: సమష్టి కృషితో చందనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించామని, సింహాచలం దేవస్థానం ఉద్యోగులంతా అంకితభావంతో చందనోత్సం విధులు నిర్వర్తించి విజయవంతం కావడంలో ప్రముఖ పాత్ర పోషించారని ఈవో జె.వెంకటరావు అభినందించారు. దేవస్థానం ఉద్యోగుల అభినందన కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ చందనోత్సవం విజయవంతం కావాలని దేవస్థానంలోని ప్రతి ఉద్యోగి పట్టుదలతో పనిచేశారన్నారు. పారిశుధ్య నిర్వహణలో టాప్–3లో సింహాచలం దేవస్థానం నిలవడం గొప్ప విషయమన్నా రు. దీన్ని టాప్–1కి చేర్చాలని అభిల షించారు. ఇతర దేవస్థానాల నుంచి వచ్చిన ఉద్యోగుల సహకారం కూడా మరువలేనిదన్నారు. చందనోత్సవం స్ఫూర్తితో రానున్న జూలై 28న జరిగే గిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని కూడా విజయవంతంగా నిర్వహించేందుకు ఉద్యోగులంతా సంసిద్ధం కావాలన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులందరికీ స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో దేవస్థానం ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, డిప్యూటీ కలెక్టర్ మధులత, డిప్యూటీ ఈవో సింగం రాధ, ఈఈలు రమణ, రాంబాబు, రామకృష్ణ, ఏఈవోలు రమణమూర్తి, తిరుమలేశ్వరరావు, పిల్లా శ్రీనివాసరావు, పతం శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
రాష్ట్ర పండగగా మోదమ్మ ఉత్సవాలు
● వచ్చేనెల 17 నుంచి మూడురోజులపాటు నిర్వహణ ● కలెక్టర్ నిశాంతి వెల్లడి సాక్షి,పాడేరు: పాడేరులో మోదకొండమ్మతల్లి ఉత్సవాలను రాష్ట్ర పండగగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని కలెక్టర్ టి.నిశాంతి తెలిపారు. ఇందుకు సంబంధించి కలెక్టరేట్లో ఉత్సవ, ఆలయ కమిటీ, పలు రాజకీయ పార్టీలు, వర్తకులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పలు ప్రజాసంఘాలతో మంగళవారం ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మే 17,18,19తేదీల్లో అమ్మవారి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కలెక్టర్ సమక్షంలో మోదకొండమ్మ ఉత్సవ కమిటీ అధ్యక్షురాలిగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని ఎన్నుకున్నారు. ఉత్సవ ప్రచార పోస్టర్ను కలెక్టర్తోపాటు జేసీ తిరుమణి శ్రీపూజ, ఇతర నేతలంతా ఆవిష్కరించారు. అలాగే ఉత్సవాల నిర్వహణకు కలెక్టర్ నిశాంతి రూ.50 వేలు, జాయింట్ కలెక్టర్ శ్రీపూజ రూ.10వేలు, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి రూ.లక్ష వ్యక్తిగతంగా విరాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో లోకేశ్వరరావు, జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, ట్రైకార్ చైర్మన్ కృష్ణారావు, మోదకొండమ్మతల్లి ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు, గౌరవ అధ్యక్షులు కిల్లు గంగన్నపడాల్, పలాసి కృష్ణారావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు మఠం శాంతకుమారి, గిరిజన మోర్చా రాష్ట్ర నాయకుడు కురుసా ఉమామహేశ్వరరావు, వర్తక సంఘ నేతలు రొబ్బి శంకరరావు, శివరాత్రి నాగేశ్వరరావు, ఇమ్మిడిశెట్టి అనిల్కుమార్, బూరెడ్డి నాగేశ్వరరావు,ఆలయ కమిటీ సభ్యులు కిల్లు చంద్రమోహన్, కిల్లు రాధాకృష్ణ, డి.పీ.రంజిత్కుమార్, సల్లా రామకృష్ణ, కొణతాల సతీష్, ఏబీవీపీ నేత కొండబాబు పాల్గొన్నారు. -
ముంచంగిపుట్టు సీహెచ్సీలో వైద్యుల కొరత
● మౌలిక సదుపాయాలు కల్పించకుంటే ఆందోళన చేస్తాం ● సీపీఎం హెచ్చరిక ముంచంగిపుట్టు: మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల కొరత తీవ్రంగా ఉందని సీపీఎం మండల కార్యదర్శి కొర్రా త్రినాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సీపీఎం నాయకులు స్థానిక ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చుని రోగులు పడుతున్న ఇబ్బందులను చూసి వారు ఆవేదన చెందారు. ఆసుపత్రిలో ఇద్దరు వైద్యులు ఉండగా, ఒకరు సెలవులో ఉండటంతో ఒక్కరే సేవలందించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరిగింది, కానీ తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో వైద్యం కోసం వారు మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సి వస్తోందన్నారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య వ్యవస్థపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నేతలు విమర్శించారు.రోగుల అవస్థలను వివరిస్తూ సీపీఎం నాయకులు కలెక్టర్, ఐటీడీఏ పీవోకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేశారు. తక్షణమే పూర్తిస్థాయిలో వైద్యులను, సిబ్బందిని నియమించాలని, మందులు అందుబాటులో ఉంచాలని వారు డిమాండ్ చేశారు. -
తాగునీటి కష్టాలపై మహిళల ఆందోళన
ముంచంగిపుట్టు: మండలంలోని పనసపుట్టు పంచాయతీ, కడుతుల గ్రామంలో మంగళవారం పర్యటించిన ఎంపీడీవో ధర్మారావుకు స్థానిక మహిళలు తమ నీటి కష్టాలను ఏకరువు పెట్టారు. ఏళ్ల తరబడి తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని 110 కుటుంబాలకు చెందిన సుమారు 352 మంది ప్రజలు కేవలం ఒక్క బావిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఎండాకాలం కావడంతో గ్రావిటీ పైపులు అడుగంటిపోయి నీరు రావడం లేదని వారు ఆవేదన చెందారు.తాగునీటి కోసం ప్రతిరోజూ పడరాని పాట్లు పడుతున్నామని, అపరిశుభ్రమైన నీటిని వాడటం వల్ల తరచూ వ్యాధుల బారిన పడుతున్నామని మహిళలు వాపోయారు.గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన నీటి పథకం సైతం లోవోల్టేజీ సమస్య కారణంగా పనిచేయడం లేదని, దీనివల్ల నీటి సరఫరా నిలిచిపోయిందని ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల విజ్ఞప్తిపై స్పందించిన ఎంపీడీవో ధర్మారావు మాట్లాడుతూ.. తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి, వోల్టేజి సమస్యతో పాటు తాగునీటి ఎద్దడిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
పచ్చపాతం
● చంద్రబాబు మాట.. నీటి మూటమోదమ్మపైపాడేరు మోదకొండమ్మ తల్లి సాక్షిగా గిరిజనులకు వంచన జరిగింది. జాతీయ స్థాయి మేడారం జాతరను తలపించేలా సాగే మోదమ్మ ఉత్సవాలకు, ఆలయ అభివృద్ధికి కొండంత అండగా ఉంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం.. తీరా ఆచరణలోకి వచ్చేసరికి మొండిచేయి చూపింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేదికగా ఇచ్చిన రూ. 2 కోట్ల హామీ, తొమ్మిది నెలలు గడిచినా ‘కాగితం’ దాటలేదు. నిధులు రావు.. అనుమతులు లేవు.. పనులు ఊసే లేదు అన్నట్టుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. గిరిజనుల సెంటిమెంట్తో ముడిపడి ఉన్న ఆలయ అభివృద్ధిని కూడా రాజకీయ ప్రచారానికే పరిమితం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.సాక్షి, పాడేరు: ఉత్తరాంధ్ర భక్తుల కల్పవల్లి, గిరిజనుల ఆరాధ్యదైవం పాడేరు మోదకొండమ్మ తల్లి ఆలయ అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం నిలువునా మోసం చేసింది. జాతీయ స్థాయిలో మేడారం సమ్మక్క–సారలమ్మల వలె పేరుగాంచిన ఈ క్షేత్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల జల్లు కురిపించి, ఆ తరువాత విస్మరించడంపై గిరిజన భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వంజంగి సాక్షిగా వంచన గత ఏడాది ఆగస్టు 9వ తేదీన పాడేరు మండలం వంజంగిలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ హామీ ఇచ్చారు. మోదకొండమ్మ ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం రూ.2 కోట్లు వెచ్చిస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. ఆలయ ప్రాంగణంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పడంతో, గిరిజన భక్తులు తమ ఆరాధ్య దైవానికి మహర్దశ పడుతుందని భావించారు. టీడీపీ శ్రేణులు సైతం ఈ ప్రకటనపై విస్తృత ప్రచారం కల్పిస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ హడావుడి చేశారు. నివేదికలు సిద్ధం.. నిధులు శూన్యం సీఎం ఆదేశాలతో అప్పట్లో దేవదాయ శాఖ, పాడేరు ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఆలయ ప్రాంగణంలో సమగ్ర సర్వే నిర్వహించారు. అభివృద్ధి పనులకు సంబంధించి అంచనా నివేదికలను రూపొందించి ఐటీడీఏ ద్వారా ప్రభుత్వానికి సమర్పించారు. గత కలెక్టర్ దినేష్ కుమార్ కూడా ఈ నిధుల విడుదల కోసం పలుమార్లు నివేదికలు పంపారు. అయితే, ప్రకటన వెలువడి తొమ్మిది నెలలు గడుస్తున్నా.. నేటికీ ఒక్క పైసా నిధులు విడుదల కాలేదు. కనీసం పరిపాలన అనుమతులు కూడా మంజూరు కాకపోవడం గమనార్హం. భక్తుల ఆవేదన ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన హామీ కాబట్టి పనులు చకచకా సాగుతాయని ఆశించిన భక్తులకు నిరాశే మిగిలింది. ఒక్క అభివృద్ధి పని కూడా ప్రారంభం కాకపోవడం చూస్తుంటే చంద్రబాబు ప్రకటన కేవలం రాజకీయ స్టంట్గానే కనిపిస్తోంది.. అని ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు వాపోతున్నారు. ఆరాధ్య దైవం సాక్షిగా గిరిజనులను మోసం చేయడంపై ఏజెన్సీలో సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. పనుల అంచనాలిలా.. చంద్రబాబు ప్రకటన మేరకు గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగం అధికారులు రూ.2 కోట్ల నిధులకు సంబంధించి అంచనాలు తయారు చేశారు. మోదకొండమ్మతల్లి ఆలయం వెనుక ఉన్న కల్యాణ మండపంపై మరో అంతస్తు భవన నిర్మాణం, ఆలయ అర్చకుల నివాస గృహాలు, అన్నదానం వంటషెడ్లు,భక్తుల భోజనాలకు వసతి, మోదమ్మ ఆలయం ఎదుట ఆడిటోరియం అభివృద్ధి, అమ్మవారి ఆలయానికి చెందిన 40 సెంట్ల స్థలం చుట్టూ ప్రహరీ, గేట్లు ఏర్పాటు, భక్తులకు విశ్రాంతి సౌకర్యాలు కల్పన.ప్రచారానికే పరిమితం పాడేరు మోదకొండమ్మతల్లి ఆలయాన్ని రూ.2 కోట్లతో అభివృద్ధి చేస్తామన్న సీఎం చంద్రబాబు ప్రకటన ప్రచారానికి పరిమితమైంది. తొమ్మిది నెలలు కావస్తున్నా ఆలయ అభివృద్ధికి ఇంతవరకు పైసా కూడా ఆయన విడుదల చేయలేదు. ఈ ఏడాది మోదకొండమ్మతల్లి పండగ నాటికి ఆలయ అభివృద్ధి పనులు జరుగుతాయని అందరూ భావించారు. పాడేరు ఐటీడీఏ ద్వారా కూడా సీఎం పనులు చేపట్టలేక పోయారు. ప్రకటనకు కట్టుబడి వెంటనే నిధులు మంజూరు చేసి, పనులు ప్రారంభించాలి. –మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్యే మోదమ్మ ఆలయ కమిటీ చైర్మన్ ప్రకటనలకు పరిమితమైనపాడేరులో ఆలయ అభివృద్ధి మంజూరు కాని రూ.2 కోట్ల నిధులు తొమ్మిది నెలలు గడిచినా అందని పరిపాలన అనుమతులు ఆశగా ఎదురుచూసి నిరాశలో మునిగిన పాడేరు మోదమ్మ భక్తులు -
జేఈఈ మెయిన్స్లోఏకలవ్య విద్యార్థి ప్రతిభ
● ఎస్టీ కేటగిరీలో 6,431 ర్యాంక్ సాధన డుంబ్రిగుడ: మండలంలోని ఏకలవ్య ఆదర్శ నివాస విద్యాలయ విద్యార్థి జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ పాఠశాలలో ఇంటర్ ఎంపీసీ చదువుతున్న కిల్లో ప్రవీణ్, ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ సెషన్–2 ఫలితాల్లో సత్తా చాటాడు. పర్సంటైల్: 77.26, జాతీయ స్థాయి ర్యాంకు: 3,60,414, ఎస్టీ కేటగిరీ ర్యాంకు: 6,431 సాధించాడు. ప్రవీణ్ సాధించిన ఈ విజయం పట్ల పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుమన్ కుమార్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థిని అభినందించిన వారిలో వైస్ ప్రిన్సిపాల్ మురుగేష్, ఉపాధ్యాయ బృందం ఉన్నారు. -
ఈదురుగాలులతో భారీ వర్షం
సాక్షి, పాడేరు: ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భానుడి భగభగలతో అల్లాడిన ప్రజలకు, ఒక్కసారిగా మారిన వాతావరణం ఉపశమనాన్ని ఇచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి పాడేరుతో పాటు అరకులోయ, హుకుంపేట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గడంతో ప్రజలు చల్లదనంతో సేదదీరారు. అయితే, పాడేరు ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో ప్రజలు కొంత ఆందోళనకు గురయ్యారు. సుమారు గంటపాటు కురిసిన ఈ వర్షం ధాటికి పాడేరులో జనజీవనం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కూడా కురిసింది. అంతకుముందు, మధ్యాహ్నం వరకు జిల్లావ్యాప్తంగా తీవ్రమైన ఎండలు కాశాయి. కొయ్యూరులో అత్యధికంగా 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అనంతగిరిలో 36, అరకులోయలో 36.6, జి.మాడుగులలో 36.7, చింతపల్లిలో 34.5, ముంచంగిపుట్టులో 33.5, పెదబయలులో 33.6, హుకుంపేటలో 32.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చింతపల్లిలో వడగళ్ల వాన చింతపల్లి: మండలంలో మంగళవారం వడగళ్లతో కూ డిన వర్షం కురిసింది. ఈదురుగాలులు బలంగా వీయడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొయ్యూరులో ఈదురు గాలుల బీభత్సం కొయ్యూరు: మండలంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు, సాయంత్రం కురిసిన భారీ వర్షం ఉపశమనాన్ని ఇచ్చింది. మొదట తేలికపాటి జల్లులతో ప్రారంభమైన వాన, క్రమంగా భారీ వర్షంగా మారింది. దాదాపు అరగంట పాటు ఈదురు గాలులు బలంగా వీయడంతో పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.కొయ్యూరుతో పాటు రాజేంద్రపాలెం, నడింపాలెం, పెదమాకవరం తదితర గ్రామాల్లో వర్షం కురిసింది.గాలివాన తీవ్రత దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యగా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పిడుగులు పడే అవకాశం ఉందన్న విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తమయ్యారు. గడిచిన వారం రోజులుగా ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్న గిరిజన ప్రాంత ప్రజలు, ఈ వర్షంతో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణాన్ని చూసి సేదతీరారు. జి.మాడుగుల: మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షం వల్ల ప్రజలు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండలంలోని సంతబయలు గ్రామంలో మంగళవారం జరిగిన వారపు సంత వర్షం ధాటికి తడిసిముద్దయ్యింది. సంతలోని వస్త్ర దుకాణాలు, నిత్యావసర సరుకులు, ఫ్యాన్సీ దుకాణదారులు ఒక్కసారిగా కురిసిన వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సరుకులు తడవకుండా కాపాడుకోవడానికి వ్యాపారులు నానా అవస్థలు పడ్డారు. జి.మాడుగుల–వంజరి, తాజంగి జాతీయ రహదారి మార్గంలో ఉన్న మట్టి రోడ్డు వర్షానికి పూర్తిగా బురదమయంగా మారింది. దీనివల్ల ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జారిపడే ప్రమాదం ఉండటంతో వాహనదారులు భయం భయంగా ప్రయాణించారు. స్తంభించిన జనజీవనం డుంబ్రిగుడ: మండలంలోని డుంబ్రిగుడ, అరకువారపుసంతలో మంగళవారం భారీ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. జనజీవనం స్తంభించింది. పాడేరు–అరకు జాతీయ రహదారిలో ఎటువంటి షెల్టర్లు లేకపోవడంతో ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. -
ఆహారం వికటించి...11 మంది విద్యార్థులకు అస్వస్థత
పెదబయలు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ప్రభుత్వ విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నామని పాలకులు గొప్పలు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. పెదబయలులోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో సోమవారం రాత్రి వడ్డించిన ఆహారం వికటించి 11 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒకేసారి విద్యార్థులు వాంతులు, విరేచనాల బారిన పడడంతో పాఠశాలలో ఆందోళన నెలకొంది. ఈ పాఠశాలలో మొత్తం 280 మంది విద్యార్థులు చదువుతున్నారు. సోమవారం రాత్రి విద్యార్థులకు క్యాబేజీ, పప్పు కూరతో భోజనం వడ్డించారు. అది తిన్న విద్యార్థులకు అర్ధరాత్రి నుంచే వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. మంగళవారం ఉదయానికి పరిస్థితి విషమించడంతో విద్యార్థులు పాఠశాల ఏఎన్ఎంకు ఫిర్యాదు చేశారు. పాఠశాల సిబ్బంది వెంటనే పాఠశాల వాహనంలో విద్యార్థులను పెదబయలు పీహెచ్సీకి తరలించింది. ఏడో తరగతి విద్యార్థి పి.పుష్కల, 8వ తరగతి విద్యార్థులు డి.కనకమహాలక్ష్మి, కె.భార్గవి, బి.ఇవాంతి, 9వ తరగతి విద్యార్థులు పి.రాహుల్, ఎన్.మధుప్రియ, పి.జషీక, కె.వరహాలమ్మ, పి.మేఘన, బి.విజయవిజ్ఞాన్తోపాటు మరో విద్యార్థి అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఎన్.మధుప్రియ, కె.భార్గవి, కె.వరహాలమ్మ పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వైద్యాధికారులు ప్రత్యేక చికిత్స అందించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే పాఠశాల నిర్వహణపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెనూ అస్తవ్యస్తంగా ఉందని ఫిర్యాదు చేసినా మార్పు రావడం లేదని పేర్కొన్నారు. ఏటీడబ్ల్యూవో జన్ని జగత్రాయ్, ఎంఈవో కృష్ణమూర్తి పాఠశాలను సందర్శించారు. ఘటనపై విచారణ జరుపుతున్నారు. -
25 నుంచి రిలే నిరాహార దీక్షలు
అనకాపల్లి: ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, 12వ పీఆర్సీని ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లా ప్రధాన కార్యదర్శి యేళపోగు సుధాకర్రావు, ఏపీటీఎఫ్ 257 జిల్లా ఫ్యాప్టో చైర్మన్ బోయిన చిన్నారావు డిమాండ్ చేశారు. స్థానిక ఫ్యాప్టో కార్యాలయలో సోమవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 25, 26, 27 తేదీల్లో విజయవాడ ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపడతామన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లపై మొండి వైఖరిని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో మలిదశ పోరాటానికి ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గం చర్యలు చేపట్టిందన్నారు. 11వ పీఆర్సీ గడువు ముగిసి 33 నెలలు కావస్తున్నా 12వ పీఆర్సీ కోసం ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. కొత్త పీఆర్సీ అమలు చేసేవరకూ 30 శాతం మధ్యంతర భృతిని మే నెల నుంచి అమలు చేయాలని కోరారు. సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తదితర డిమాండ్లతో దీక్షలు చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 27న జిల్లా ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్షల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఫ్యాప్టో కార్యవర్గ సభ్యులు వి.శ్రీలక్ష్మీ, వై.శ్రీనివాసరావు, కెవిఆర్.శేషు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్పీ కార్యాలయంలో 65 అర్జీలు
పీజీఆర్ఎస్లో వృద్ధురాలి సమస్యను వింటున్న అదనపు ఎస్పీ మోహన్రావు అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 65 ఆర్జీలు వచ్చాయి. అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు ఆర్జీలు స్వీకరించి, సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరిధిలో ఉన్న సమస్యలు వారం రోజుల్లో పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, నేరాలు, ఇతర విభాగాలకు సంబంధించిన సమస్యలపై అర్జీలు వచ్చాయన్నారు. చట్టపరిధిలో సమస్యలను పరిష్కరించేందుకు దిగువస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ బి.శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
డీఆర్వోగా లోకేశ్వరరావు బాధ్యతల స్వీకరణ
మూడు పోస్టులకు ఒకే అధికారిసాక్షి,పాడేరు: జిల్లా రెవెన్యూ అధికారి(ఎఫ్ఏసీ)గా ఎం.వి.ఎస్.లోకేశ్వరరావును నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుతం ఆయన పాడేరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా,ఇన్చార్జి ఆర్డీవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డీఆర్వోగా మూడవ పోస్టులో బాధ్యతలు స్వీకరించారు.అనంతరం కలెక్టర్ టి.నిశాంతిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.డీఆర్వోగా బాధ్యతలు స్వీకరించిన లోకేశ్వర రావును కలెక్టర్ అభినందించారు. ఎస్డీసీగా,పాడేరు ఆర్డీవోగాను,డీఆర్వోగా జిల్లాలో ఉత్తమసేవలు అందించాలని ఆమె సూచించారు. -
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నిక
దేవరాపల్లి : వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నట్టు ఆ సంఘం నాయుకులు సోమవారం తెలిపారు. దేవరాపల్లిలో జరిగిన జిల్లా మహాసభలలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, రైతు సంఘం నాయుకులు ఎం. అప్పలరాజు, గండి నాయన్బాబు పర్యవేక్షణలో 21 మందితో కూడిన నూతన కమిటీని ఎన్నుకున్నామన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడిగా యం. సత్యన్నారాయణ, కార్యదర్శిగా డి.వెంకన్నను ఎన్నుకున్నారు. ఆఫీస్ బేరర్స్గా కె. గోవిందరావు, కె.భవానీ, ఇరటా నర్సింహమూర్తి, బిటి. దొర, వి. సూరిబాబును ఎన్నుకున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా కార్యదర్శిగా ఎన్నికై న వెంకన్న మాట్లాడుతూ జిల్లా మహా సభలలో తీర్మానం చేసిన తీర్మాణాలపై పోరాటం సాగించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఆయన తెలిపారు. జిల్లా మహాసభలను విజయంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. -
భక్తులకు అష్టకష్టాలు
పెందుర్తి/ఆరిలోవ: చందనోత్సవ ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వ పెద్దల మితిమీరిన జోక్యం.. అధికార యంత్రాంగం సమన్వయలోపం వెరసి వేలాది భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. రద్దీ లేని సమయంలో తీరుబడిగా ఉన్న అధికారులు.. అసలు సమయం వచ్చేసరికి ఓ దశలో పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో భక్తులు సోమవారం సాయంత్రం పడరాని పాట్లు పడ్డారు. రవాణా వ్యవస్థ పూర్తిగా అదుపు తప్పడంతో వేలాది మంది భక్తులు ఇబ్బందుల పాలయ్యారు. మెట్ల మార్గం.. ఘాట్ రోడ్లు మీదుగా కిలో మీటర్ల మేర కొండ ఎక్కి అంత్యంత గందరగోళ పరిస్థితుల్లో స్వామి దర్శనం చేసుకున్నారు. ఉదయం ప్రశాంతం.. సాయంత్రం గందరగోళం దాదాపు 2 లక్షల మంది భక్తులు చందనోత్సవం సందర్భంగా స్వామి నిజరూప దర్శనానికి వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే సోమవారం వేకువజాము నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రద్దీ ఓ మాదిరిగా ఉండడంతో ఏర్పాట్ల లోపాలు అంతగా కనిపించలేదు. కానీ సాయంత్రం 3 గంటల తరువాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రెండు మూడు గంటల వ్యవధిలో వేలాది భక్తులు కొండ దిగువకు చేరుకోవడంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోయాయి. దీంతో బస్సులు మందకోడిగా కదిలాయి. ఈ క్రమంలో పోలీసులను, ఆర్టీసీ అధికారులను పలు చోట్ల భక్తులు తీవ్రస్థాయిలో నిలదీశారు. చాలామంది భక్తులు పరిస్థితిని గమనించి మెట్ల మార్గం, ఘాట్ రోడ్లు వెంబడి ఆపసోపాలు పడుతూ నడుస్తూ క్యూలైన్లకు చేరుకున్నారు. పోలీసులందరూ వీఐపీలే.. చందనోత్సవం వేళ మరోసారి పోలీసుల తీరు విమర్శలపాలైంది. కిందిస్థాయి నుంచి అధికారుల వరకు వందలాది మంది పోలీసులు తమ కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులతో రూ.1500 క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. వారి వద్ద పాస్లు లేకపోయినా సమయం చూసుకుని పోలీస్ అధికారులు వారిని క్యూలైన్లలోకి పంపడం గమనార్హం. ఓ రకంగా చెప్పాలంటే టికెట్లు లేకపోయినా పోలీసులంతా సపరివార కుటుంబ సమేతంగా వీఐపీ హోదాలో దర్శనం చేసుకున్నారు. కాళ్లు కాలి అవస్థలు : స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులు చెప్పులు విడిచిపెట్టడంతో ఎండ తీవ్రతకు తీవ్ర అవస్థలు పడ్డారు. కేవలం కొన్నిచోట్ల మాత్రమే మ్యాట్ వేయడంతో మిగిలిన చోట్ల నడిచిన భక్తులంతా పాదాలు మంటలు పుట్టి ఇబ్బందులు పడ్డారు. అయితే భక్తుల అవస్థలు చూసి కంటితుపుడు చర్యగా జీవీఎంసీ అధికారులు ట్యాంకర్లతో నీటిని రోడ్లుపై వేసినా అవి కొన్ని నిమిషాల్లోనే ఎండకు ఆవిరైపోయాయి. మూసిన మెట్ల దారి: అర్ధరాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకు మెట్ల మార్గాన్ని మూసివేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్సుల కొరత కొండపైకి వెళ్లేందుకు కేవలం ఆర్టీసీ బస్సులే దిక్కు కావడంతో భక్తులు ఫుట్బోర్డులపై వేలాడుతూ ప్రయాణించారు. బస్సుల కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. భయంతో వెనుదిరిగాం.. సాయంత్రం అయితే దర్శనం చేసుకోవచ్చని వచ్చాం. కానీ బస్లు కదలకపోవడంతో పరిస్థితి బాలేదని గమనించాం. భయంతో ఇంటికి వెనుదిరిగాం. రవాణా వ్యవస్థ సరిగా నడపలేదు. – దొరబాబు, భక్తుడు తొలిసారి వచ్చాను.. దర్శన భాగ్యం లేదు.. తొలిసారి అప్పన్నస్వామి నిజరూప దర్శనం చేసుకుందామని వచ్చాను. కానీ బస్ ఎక్కే పరిస్థితి లేదు. బస్టాండ్లో భక్తుల నియంత్రణ కూడా లేదు. బస్లో ప్రయాణం చేసేందుకు మూడు గంటలు వేచి ఉన్నాను. కానీ కుదరకపోవడంతో స్వామి దర్శనం లేకుండానే ఇంటికి వెళ్లిపోతున్నాను. – కల్యాణి, భక్తురాలు, కూర్మన్నపాలెం -
సుగర్ ఫ్యాక్టరీలు తెరిపించాలి
అనకాపల్లి : జిల్లాలో తాండవ, ఏటి కొప్పాక, తుమ్మపాల, గోవాడ షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వాలు మూసివేయడం అన్యాయమని, ఫ్యాక్టరీలను ఆధునికీకరించి, రైతులు, ఇతర వర్గాల ప్రజలను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జిల్లా వ్యవసాయ సంఘం అధ్యక్షుడు కర్రి అప్పారావు అన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రైతాంగం ఏ పంటలు పండించాలో అర్థం కాక వేల ఎకరాల భూములు బీడుగా ఖాళీగా ఉంచడం జరుగుతుందన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నాయకులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జిల్లాలో గల షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించి, ఆధునికీకరించి నడిపిస్తామని జిల్లాలో రైతులను, కార్మికులను ఆదుకుంటామని ఇచ్చిన హామీని తక్షణమే అమలుచేయాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా నేటికీ మూత పడ్డ షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం జిల్లా రైతాంగాన్ని, కార్మికులను మోసం చేయడమే అవుతుందన్నారు. జిల్లాలో వ్యవసాయ రంగాన్ని దెబ్బ తీసే విధంగా ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజు, నాయకులు గండి నాయన బాబు, శివ, ఎస్.వి.నాయుడు, బ్రహ్మాజీ, సత్యనారాయణ, జగన్నాథం, తదితరులు పాల్గొన్నారు. -
దళితులు ఐకమత్యంగా ఉండాలి
అచ్యుతాపురం రూరల్: దళితులు ఐకమత్యంగా, మహిళలు చైతన్యవంతంగా ఉండాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రజా ప్రతినిధి మంచా నాగ మల్లేశ్వరి కోరారు. గుబ్బల నూకరాజు ఆధ్వర్యంలో మండలంలో పెదపాడు గ్రామంలో డాక్టర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు ఆదివారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆమె ఘనంగా నివాళిలర్పించారు. అనంతరం మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమాజంలో గుర్తింపు తీసుకురావడంలో అంబేడ్కర్ చేసిన కృషి మరువ లేనిదన్నారు. ముఖ్యంంగా మహిళలు చదువుకున్నట్టయితే సమాజంలో మంచి గౌరవం లభిస్తుందన్నారు. ఏదైనా సాధించాలంటే చదువు అత్యంత అవసరమన్నారు. యువత చైతన్య వంతులై ఉండాలని, నాయకుల ప్రలోభాలకు లోనవకుండా గ్రామాభివృద్ధికి కృషి చేయాలన్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులది, లేదంటే సమాజంలో నీకంటూ ఒక గుర్తింపు తీసుకువచ్చిన అంబేడ్కర్ ఫొటోని మాత్రమే మొబైల్ వాట్సాప్ డీపీలో ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో అంబేడ్కర్ భవనం అధ్యక్షుడు బొడ్డు కళ్యాణరావు, మాజీ జెడ్పీటీసీ జనపరెడ్డి శ్రీనివాసరావు, న్యాయవాది తట్టా పెంటయ్యనాయుడు, అనకాపల్లి జిల్లా డీవీఎంసీ మాజీ సభ్యుడు రేబాక మధుబాబు, వైఎస్సార్సీపీ మండల ఎస్సీ సెల్ అద్యక్షుడు తట్టా రాజు, బీలా అప్పారావు, పెదపాడు అంబేడ్కర్ సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
బాలల హక్కుల పరిరక్షణకు కృషి
బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు నాగమానస సాక్షి, పాడేరు: జిల్లాలోని అన్ని గ్రామాల్లో బాలల హక్కుల పరిరక్షణకు అధికార యంత్రాంగం కృషిచేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు డాక్టర్ పి.నాగమానస ఆదేశించారు. సోమవారం ఆమె జిల్లాలో పర్యటించారు.హుకుంపే ట కేజీబీవీని సందర్శించి విద్యార్థినులతో మాట్లా డారు. విద్యా,ఇతర మౌలిక సదుపాయాలపై సమీక్షించారు. డి.చింతలవీధి గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో ఆమె మాట్లాడారు.బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలపై గిరిజనులకు అవగాహన కల్పించారు.అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదు వు మధ్యలో మానేసిన బాలబాలికలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలన్నారు.వేసవి కాలంలో తల్లిదండ్రులంతా తమ పిల్లలను పర్యవేక్షిస్తూ ఆరోగ్యం,భద్రత, విద్యపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలన్నారు.ఈ సమావేశంలో కలెక్టర్ టి.నిశాంతి,ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయిపడాల్,పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. -
దివ్య దర్శనం
భవ్య రూపంఅప్పన్న నిజరూప దర్శనంతో పరవశించిన భక్తులు తెల్లవారుజాము 3.20 నుంచి ఉచిత, రూ.300 దర్శనం ప్రారంభంసింహాచలం : వైశాఖ శుద్ధ తదియ సందర్భంగా సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. సంవత్సరంలో ఒక్కరోజే కలిగే స్వామివారి నిజరూప దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే తరలివచ్చి భక్తిరసంలో మునిగిపోయారు. చందనపు పొరల నుంచి వెలుగుచూసిన స్వామివారిని కళ్లారా చూసిన భక్తులు ఆధ్యాత్మికానందంలో తేలిపోయారు. శాస్త్రోక్తంగా చందనం విసర్జన పాంచరాత్ర ఆగమశాస్త్ర విధానాలను అనుసరించి ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఆలయంలో వైదిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సుప్రభాతసేవ, విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రుత్విగ్వరణం, పంచకలశారాధన వంటి విశిష్ట పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వెండి బొరుగులతో స్వామివారిపై ఉన్న పన్నెండు మణుగుల చందనాన్ని శ్రద్ధగా తొలగించి, నిజరూపంలో స్వామివారిని దర్శనమిచ్చేలా తీర్చిదిద్దారు. తొలిదర్శనం అనంతరం భక్తులకు దర్శనాలు తెల్లవారుజాము 2.20 గంటలకు దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజు స్వామివారిని తొలిగా దర్శించుకున్నారు. తెల్లవారుజాము 3.20 గంటల నుంచి ఉచిత దర్శనం, రూ.300 ప్రత్యేక దర్శనం భక్తులకు కల్పించారు. రాత్రి 7 గంటలకు క్యూల ప్రవేశ ద్వారాలు మూసివేశారు. అప్పటివరకు క్యూల్లో వేచి ఉన్న భక్తులకు దర్శనాలు కల్పించారు. విశేషంగా సహస్ర ఘటాభిషేకం రాత్రి జరిగిన సహస్ర ఘటాభిషేకం ఆధ్యాత్మికోత్సాహాన్ని మరింత పెంచింది. త్రిదండి చిన జీయర్ స్వామి పర్యవేక్షణలో గంగధార నుంచి తీసుకు వచ్చిన వెయ్యి కలశాల పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం చేశారు. అదేవిధంగా 108 వెండి కలశాలతో పంచామృతాలు, ఔషధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి విశేష పూజలు చేశారు. అనంతరం తొలివిడతగా మూడు మణుగులు(సుమారు 125 కిలోలు) పచ్చి చందనాన్ని సమర్పించి స్వామి వారిని మళ్లీ నిత్యరూపంలో అలంకరించారు. అహోబిల రామానుజజీయర్, దేవనాఽఽథ్ జీయర్ స్వామి పాల్గొన్నారు. దర్శించుకున్న ప్రముఖులు: స్వామి నిజరూప దర్శనాన్ని పలువురు ప్రముఖులు చేసుకున్నారు. రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీలు శ్రీభరత్, సి.ఎం.రమేష్, కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్, విశాఖ కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, కాకినాడ కలెక్టర్ హరేందిరప్రసాద్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్భరత్, జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్, జేసీ విద్యాధరి, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ తదితరులు స్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. నీలాద్రిగుమ్మం వద్ద హడావుడిసమయం దాటినా అంతరాలయ దర్శనాలుసింహాచలం: చందనోత్సవం వేళ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయ నీలాద్రిగుమ్మం వద్ద సోమవారం తెల్లవారుజామున హడావుడి చోటుచేసుకుంది. తెల్లవారుజాము 2.20 గంటల సమయంలో తొలిదర్శనం చేసుకునేందుకు అశోక్గజపతిరాజు వచ్చేసరికే చాలామంది ఆలయ ధ్వజస్తంభం ప్రాంగణంలో ఉన్నారు. ఆయన దర్శనం చేసుకోగానే హోంమంత్రి అనిత దర్శనం చేసుకున్నారు. అప్పటికే రూ.1500 టికెట్ కల్గిన ప్రముఖులకు అంతరాలయ దర్శనం ప్రారంభించారు. ఈ తరుణంలోనే నీలాద్రిగుమ్మం వద్ద పెద్ద ఎత్తున తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఎంతకీ క్యూ ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. రూ.1500 టికెట్పై వచ్చే ప్రముఖులకు తెల్లవారుజాము 3.30 నుంచి 5 గంటల వరకు మాత్రమే అంతరాలయ దర్శనం ఉంటుందని అధికారులు ముందుగా ప్రకటించినా.. ఆ సమయం దాటినా కూడా కొందరు ప్రముఖులు రావడంతో వారికి అంతరాలయ దర్శనం కల్పించారు. విశాఖ ఎంపీ భరత్ ఉదయం 5.13 గంటల సమయంలో అంతరాలయ దర్శనానికి వెళ్లడం విశేషం. ఆ తర్వాత మరికొందరు ప్రముఖలు దర్శనం చేసుకున్న తర్వాత ఉదయం 5.40 గంటల సమయంలో అంతరాలయం దర్శనాలు నిలుపుచేశారు. నీలాద్రిగుమ్మం వద్ద నెలకొన్న హడావుడితో అప్పటికే ప్రారంభమైన ఉచిత దర్శనం, రూ.300 దర్శనం భక్తులు కొంతమేర ఇబ్బందులు పడ్డారు. నీలాద్రిగుమ్మం వద్దే ఎక్కువ మంది పోలీసులు కూడా విధులు నిర్వర్తించడంతో దేవస్థానం ఉద్యోగులు తమ ఉద్యోగ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించలేకపోయారు. మరోపక్క నీలాద్రిగుమ్మం వద్దే ఉన్న రాష్ట్ర మంత్రి ఒకరు తమవాళ్లను ఇష్టానుసారంగా దర్శనానికి పంపించడం విశేషం. పోలీసుల దర్శనాలు కూడా అధికంగా చోటుచేసుకున్నాయి. పట్టు వస్త్రాల సమర్పణ చందనోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంమంత్రి వంగలపూడి అనిత స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం తరపున డిప్యూటీ ఈవో వెంకయ్య చౌదరి కూడా పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ ఆనవాయితీ ప్రతి సంవత్సరం కొనసాగుతూ వస్తోంది. కూటమి నేతలకే ప్రోటోకాల్ దర్శనం సైడ్ లైట్స్ ఉచిత దర్శనం, రూ.300 దర్శనంల క్యూల్లోకి భక్తులు ఆదివారం రాత్రి నుంచే చేరుకున్నారు. ఉచిత దర్శనం రెండు క్యూలుగా ఏర్పాటు చేసినా నిరంతరం రెండు లైన్లు భక్తులతో రద్దీగానే ఉన్నాయి. దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ సీసీ మోనిటర్లో ఎప్పటికప్పుడు క్యూల రద్దీని గమనిస్తూ సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. మధ్యాహ్నం నుంచి క్యూల్లో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో క్యూలు పలుమార్లు ముందుకు కదల్లేదు. దేవస్థానం ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు వాహనాన్ని టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంతమేర వాగ్వాదం చోటుచేసుకుంది. సాయంత్రానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ముందుగా ప్రకటించిన విధంగా సాయంత్రం 6 గంటల నుంచే కొండపైకి బస్సులను నిలుపుదల చేశారు. రాత్రి 7 గంటలకే క్యూల ప్రవేశ ద్వారాలు మూసివేశారు. ఈసారి 1.25 లక్ష మంది స్వామిని దర్శించుకున్నట్లు అంచనా. తెల్లవారు 2.12 గంటలకు కేశఖండనశాల వద్ద 30 ఏళ్ల మహిళ స్పృహ తిరిగి పడిపోయారు. రూ.300 క్యూలైన్లో మధ్యాహ్నం 1.10 సమయంలో ఎండ తీవ్రతకు పలువురు స్పృహ కోల్పోయారు. సాక్షి, విశాఖపట్నం: వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం వేళ యంత్రాంగం వైఫల్యం భక్తులకు శాపంగా మారింది. ఏడాదికి ఒక్కసారి లభించే నిజరూప దర్శనం కోసం వచ్చిన వేలాది మంది సామాన్య భక్తులు అధికారుల అతి జాగ్రత్త, సమన్వయ లోపం కారణంగా అల్లాడిపోయారు. ఉదయం 3 నుంచి 6 గంటల వరకే ప్రోటోకాల్ దర్శనమని ప్రకటించినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. సాయంత్రం వరకు కూటమి ప్రజాప్రతినిధులు, వారి బంధుమిత్రులు, అధికారుల కుటుంబ సభ్యులే ప్రోటోకాల్ పేరుతో దర్శనాలు చేసుకున్నారు. దీనివల్ల రూ.1000, రూ.1500 టికెట్లు కొన్న భక్తులు కూడా 4 నుంచి 5 గంటల పాటు క్యూలైన్లలో వేచి చూడాల్సి వచ్చింది. -
దగ్గరోడే దొంగ
నక్కపల్లి : దగ్గరోడే దొంగయ్యాడు. చుట్టంచూపునకు వచ్చి ఇంట్లో బంగారం ఎత్తుకెళ్లాడు. విషయం తెలుసుకున్న బాధితులు తమ ఇంట్లో బంగారం చోరీ జరగడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనుమానితుడిని పట్టుకుని విచారించి అతనినుంచి చోరీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నక్కపల్లి సీఐ జె.మురళి వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో ముకుందరాజుపేట గ్రామానికి చెందిన మనబాల రమణ ఈ నెల18వ తేదీన ఇంటికి తాళం వేసి శ్రీరాంపురం వైన్షాపులో పనిచేసేందుకు వెళ్లాడు. ఇతని తల్లి రేబాకలో కూలి పనికి వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా ఇంటికి వేసిన తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లో ఉన్న బీరువా తలుపులు కూడా తెరిచి ఉన్నాయి. బీరువాలో భద్రపరిచిన సుమారు రూ.15 లక్షలు విలువైన పదితులాల బంగారు ఆభరణాలు ( చైన్లు, ఉంగరాలు, బ్రాస్లెట్లు, చెవిదుద్దులు) చోరీ అయినట్టు గుర్తించారు. రమణ వెంటనే నక్కపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీఐ మురళి ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో పాయకరావుపేట మండలం పెంటకోట గ్రామానికి చెందిన కొల్లి శ్రీను (ఫిర్యాధి బందువు) చోరీ చేసినట్టు దర్యాప్తులో వెల్లడైందని సీఐ తెలిపారు. 19వ తేదీన వేంపాడు టోల్ప్లాజా వద్ద నిందితుడు శ్రీనును అదుపులోకి తీసుకుని అతని నుంచి చోరీ చేసిన 10 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచడంతో రిమాండ్ విధించినట్టు సీఐ తెలిపారు. నిందితుడు బాధితులకు సమీప బందువు కావడం, చోరీ జరిగిన రోజు ఇతను ముకుందరాజుపేట వెళ్లడం ఇంటి వద్ద తమ బంధువులు లేకపోవడంతో చోరీకి పాల్పడినట్లు గ్రామంలో ప్రచారం జరుగుతోంది. ఇతడు చోరీ జరిగిన రోజున గ్రామంలోకి వచ్చినట్లు చుట్టుపక్కల వారిద్వారా తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతనిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు చెప్పడంతో ఆ కోణంలో విచారణ జరిపి చోరీ కేసును పోలీసులు 24 గంటల్లోనే చేధించగలిగారు. -
అర్జీదారుల అసహనం
తుమ్మపాల: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలలో ప్రజలు గంటల కొద్దీ క్యూలైన్లలోనే వేచి ఉండాల్సి వచ్చింది. రాంబిల్లిలో సీఎం మీటింగ్ పేరుతో కలెక్టర్తోపాటు జేసీ, డీఆర్వో ముఖ్య అధికారులెవ్వరు కలెక్టరేట్లో లేకుండా పోయారు. దాంతో అర్జీలు తీసుకోవడంలో జాప్యంతో అర్జీదారులు అసహనం వ్యక్తం చేశారు. మండుటెండలో సైతం దూరప్రాంతాల నుంచి ప్రయాణించి కలెక్టరేట్కు చేరుకుంటే అర్జీల విభజన, నమోదు కోసం కింద, మొదటి అంతస్తుల్లో పదేపదే గంటల పాటు నిలబెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోపక్క దొడ్డిదారుల్లో కొందరు అర్జీలను అధికారుల వద్దకు తీసుకెళ్లడంతో కలెక్టరేట్లో కేకలు, అరుపుల మోతమోగింది. పదేపదే ఫిర్యాదులు చేస్తున్న అధికారులకు రవ్వంతా కూడా జాలి చూపడం లేదని, సమస్యపై పీజీఆర్ఎస్లో పెట్టినందుకు క్షేత్రస్థాయి అఽధికారులు పగబెడుతున్నారని, సమస్యను మరింత జఠిలం చేస్తున్నారని అర్జీదారులు వాపోతున్నారు. 2024 ఏడాది నుంచి భూసమస్యపై ప్రతి నెలా అర్జీ చేస్తున్నా అఽధికారులు పట్టించుకోవడం లేదని ఎంఎల్సీ పేరుతో చాలా కాలంగా తిప్పుతున్నారని, సమస్యను పరిష్కరించకుండా అక్రమణదారులకు అండగా అధికారులు నిలుస్తున్నారన్నారు. ఇదిలా ఉండగా కలెక్టరేట్ పరిసరాల్లో అర్జీదారులకు నీడలేక చెట్లే కింద సేద తీరాల్సి వచ్చింది. పీజీఆర్ఎస్–131, రెవెన్యూ క్లినిక్ –123 అర్జీలు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లో వచ్చిన అర్జీలు నిర్ణీత సమయంలో పరిష్కరించాలని కేఆర్ఆర్సీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్.సుబ్బలక్ష్మి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్. రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలలో ఆమెతోపాటు మరో డిప్యూటి కలెక్టర్ రామమణి వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వారం పీజీఆర్ఎస్–131, రెవెన్యూ క్లినిక్–123లో మొత్తం 254 అర్జీలు నమోదయ్యాయి. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మంగవేణి, జిల్లా నైపుణ్యం అభివృద్ధి అధికారి గోవిందరావు, జిల్లా చేనేత అధికారి యశ్వంత్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. క్రిస్టియన్లోకి మారిన వారికి కుల ధ్రువీకరణ నిలిపివేయాలని నిరసన సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా దళితులుగా ఉంటూ క్రిస్టియన్లుగా మారిన వారికి ఎస్సీ, ఎస్టీ కుల ధ్రువీకరణ నిలిపివేయడంతోపాటు దళితవాడల్లో అనధికారికంగా ఏర్పాటవుతున్న చర్చిలపై చర్యలు తీసుకుని దళిత హిందువుల హక్కులను కాపాడాలంటూ హిందూ షెడ్యూల్డ్ కులాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సమితి వ్యవస్థాపకుడు బోని గణేష్, జిల్లా అధ్యక్షుడు మైలపల్లి పోతురాజు మాట్లాడుతూ దళిత వాడల్లో క్రైస్తవ మతాన్ని తీసుకొని ప్రార్థనలు చేస్తూ హిందు దళితులను అవమానిస్తూ, దాడులు చేస్తూ, తప్పుడు కేసులు పెడుతూ, భయభ్రాంతులకు గురిచేస్తున్న క్రైస్తవుల నుంచి రక్షణ కల్పించాలన్నారు. మిడిమిడి జ్ఞానంతో పాస్టర్లుగా అవతారమెత్తి అమాయక ప్రజలను మతం మారుస్తున్నందున చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అనుమతులు లేని చర్చిలను తొలగించి, రాజ్యంగం ద్వారా నిజమైన (హిందూ, బౌద్ధులు, సిక్కులు) జీవన విధానం కొనసాగుతున్న వారికి మాత్రమే రిజర్వేషన్ పొందే హక్కు కొనసాగించాలన్నారు. దళిత క్రైస్తవులకు వ్యతిరేకంగా కోర్టులు స్పష్టమైన తీర్పులు ఇస్తున్నా పట్టించుకోకుండా తహసీల్దార్లు వారికి తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడం నిలిపివేయాలన్నారు. క్రైస్తువులుగా మారిన వారిని గుర్తించి వారికిచ్చిన ఎస్సీ, ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలను తక్షణమే రద్దు చేయాలని పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందించారు. 22ఏలో చేర్చిన జిరాయితీ భూమిని తొలగించాలని వినతి ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం తప్పుగా నిషేధిత జాబితా (22ఏ)లో చేర్చిన జిరాయితీ భూమిని తొలగించి న్యాయం చేయాలంటూ గాజువాకలోని కర్ణంవానిపాలెంకు చెందిన కరణంరెడ్డి నరసింగరావు పీజీఆర్ఎస్లో వినతి అందించారు. అనకాపల్లి ఆవఖడం సర్వే నంబరు 1549/1లో 60 సెంట్లుగా ఉన్న భూమిని సర్వే నంబరు 1549లో చేర్చి నిషేధిత జాబితాలో నమోదైందన్నారు. ఈ మేరకు గతంలో ఫిర్యాదు చేయగా, ఆర్డీవో, జీవీఎంసీ జోనల్ కమిషనర్, తహసీల్దార్ జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి 1549/1గా సర్వే నివేదికను మంజూరు చేసినప్పటికి 22(ఏ) జాబితాలో నుంచి మాత్రం తొలగించలేదన్నారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో ప్రకారం విచారణ చేపట్టి న్యాయం చేయాలని అధికారులను కోరారు. పంట కాలువల్లో మురుగుపై ఫిర్యాదు చేస్తే చర్యలు శూన్యం పంట కాలువల్లో మురుగు రాకుండా చేయుటకు ఫిర్యాదు తీసుకొస్తే ఆన్లైన్లో సర్వే అధికారులకు ఎండార్స్ చేసి ముగించేశారంటూ చోడవరం మండలం జుత్తాడ గ్రామానికి చెందిన కోనేటి లక్ష్మి కలెక్టరేట్ అధికారులను ప్రశ్నించింది. జగనన్న కాలనీ గృహాల మురుగునీరు సాగునీటి కాలువలో కలిసిపోవడంతో పొలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ గత కొన్నిరోజుల క్రితం కలెక్టరేట్కు వస్తే సంబంధం లేని సర్వే శాఖకు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని ఆమె వాపోయింది. ఈ మేరకు సోమవారం మరలా పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసింది. మురుగు కారణంగా నివాసంతోపాటు పంట పొలాలు పూర్తిగా పాడవుతున్నాయని, పంచాయతీలో ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని కలెక్టరమ్మ స్పందించి న్యాయం చేయాలని కోరింది. ఫోర్జరీ పత్రాలతో దళిత ఆదివాసీల భూముల ఆక్రమణకు యత్నం ఫోర్జరీ పత్రాలతో వారసత్వ హక్కులు సృష్టించి దళిత, ఆదివాసీలు సాగు భూములను ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్న వారికి అండగా నిలిచిన తహసీల్దారు, అక్రమణదారుడు ఆర్.చంద్రశేఖర్రావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ సీపీఐఎంఎల్ లిబరేషన్, ఏపీ ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో దళిత, ఆదివాసీలు భారీ ధర్నా చేశారు. రోలుగుంట మండలం అడ్డసారం దువ్వూరి సూర్య ప్రకాశం పేరుతో భూమిలో దళిత బహుజన ఆదివాసీ పేదలు దశాబ్దాలుగా సాగు చేస్తున్నారు. సాగుదారులుగా దళితులు పేరున రెవెన్యూ రికార్డులు నమోదై ఉన్నప్పటికి వారికి న్యాయం చేయకుండా అధికారులు అక్రమణదారులతో కుమ్మక్తె యలమంచిలికి చెందిన ఓ వ్యక్తి సూర్యప్రకాశం దత్తత పుత్రిడినంటూ ఫోర్జరీ పత్రాలతో వచ్చి కోట్ల విలువ చేసే భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఈ ఘటనపై జరిగిన వివాదంలో జాయింట్ కలెక్టర్ గ్రామసభ నిర్వహించి అక్రమాలు గుర్తించారు. నేటికి వివాదం జరుగుతున్నప్పటికి సదరు భూమి రికార్డులు ఆన్లైన్లో పేర్లు మార్చి సాగులో ఉన్న దళిత, బహుజన ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
భవిత విద్యను బలోపేతం చేయాలి
అనకాపల్లి : సహిత విద్యా విభాగం ప్రత్యేక మాడ్యూల్స్ ఉపయోగించి బోధిస్తూ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు సమష్టిగా కలిసి సహిత విద్యను బలోపేతం చేయాలని జిల్లా సహిత విద్య సమన్వయకర్త బి.రామకృష్ణనాయుడు అన్నారు. జీవీఎంసీ విలీన గ్రామమైన కొప్పాక డీఈవో కార్యాలయంలో డీఈవో గిడ్డి అప్పారావునాయుడుకు సోమవారం ప్రత్యేక బోధన పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 24 మండలాల్లో పనిచేస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయులకు, ఎంఈవోలకు , భవితా కేంద్రాల పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ,దివ్యాంగ విద్యార్థులకు ఏడు రకాల ప్రత్యేక మాడ్యూల్స్ మొత్తంగా 1347 మాడ్యూల్స్ ఉన్నాయన్నారు. ప్రత్యేక మాడ్యూల్స్ ద్వారా సవర్ణాత్మక బోధనకు తోడు విద్యార్థులో సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించడమే కాక గుణాత్మకత, సాంకేతికతతో కూడిన నూతన విద్యా బోధన ద్వారా మరింత అభ్యున్నతిని సాధించేలా చేయవచ్చు అన్నారు. ప్రత్యేక మాడ్యూల్ విధానం సహిత విద్యలో మరింత ప్రగతికి దోహదపడుతుందని, నిర్దేశిత లక్ష్య సాధనకు, పిల్లల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష రాష్ట్ర పర్యవేక్షణ అధికారి బి.మహాలక్ష్మినాయుడు పాల్గొన్నారు. -
ధర్నా విజయవంతం చేయాలి
చింతపల్లి: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేసేందుకు ఉపాధ్యాయులంతా తరలిరావాలని జిల్లా పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యు.వి. గిరి కోరారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని,30 శాతం ఐఆర్ను ప్రకటించాలని, ఓపీఎస్ను అమలు చేయాలని, ఇన్సర్వీసులు ఉన్న ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని,స్కూల్ కాంప్లెక్సు హెచ్ఎంలను గ్రేడ్–1హెచ్ఎంలుగా మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కొర్రు మత్స్యలింగం, ఏపీ జేఏసీ కో కన్వీనర్ కుడుముల వెంకటరమణ,వసపరి శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. -
స్పేసెస్ డిగ్రీ కళాశాలకు పురస్కారాలు
స్పేసెస్ డిగ్రీ కళాశాల ప్రతిభకు గుర్తింపుగా అవార్డు అందిస్తున్న అతిథులు పాయకరావుపేట: స్పేసెస్ డిగ్రీ కళాశాలకు ఆంధ్రా యూనివర్సిటీ నుంచి అరుదైన గౌరవం దక్కిందని శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్ విజయ్ ప్రకాష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉత్తమ పనితీరు కనబర్చిన ఏయూ పరిధిలోని 306 కళాశాలల్లో శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్థ స్పేసెస్ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి)ను ఉత్తమ కళాశాలగా ఎంపిక చేశారన్నారు. ఈ నెల 18న విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ జి.పి. రాజశేఖర్, ఏపీ ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, విజ్ఞాన్ సంస్థల చైర్మన్ లావు రత్తయ్యల నుంచి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.రామకృష్ణారెడ్డి పురస్కారం అందుకున్నారన్నారు. స్పేసెస్ డిగ్రీ కళాశాల నుంచి ఉత్తమ కళాశాల అధ్యాపకుడిగా డాక్టర్ అరుణ్ కుమార్ త్రిపాఠి, ఉత్తమ పూర్వ విద్యార్థిగా రాజస్థాన్ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ టి.శివప్రసాద్, ఉత్తమ విద్యార్థిగా టి.శ్వేత పురస్కారాలు అందుకున్నారన్నారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల అధినేత సిహెచ్ నరసింహారావు, కళాశాల అధ్యాపక బృందం, తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
అంతర్జాతీయ మార్కెట్కు అరకు కాఫీ లీఫ్ ఉత్పత్తులు
చింతపల్లి: అంతర్జాతీయ మార్కెట్లో అరకు కాఫీ ఉత్పత్తులను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గ్రీన్ ఆయుష్ సంస్థ కృషి చేస్తోందని ఆ సంస్థ సీఈవో పులి రాజేష్ అన్నారు. పెదబరడ పంచాయతీ పరిధిలోని వంగసార గ్రామంలో థింసా ఆర్గానిక్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులతో కలిసి గిరిజన కాఫీ రైతులకు ఆదివారం అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కాఫీ గింజలతో పాటు కాఫీ లీఫ్ (ఆకులు) ఉత్పత్తి చేసేందుకు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు విజయవంతమయ్యాయని రాజేష్ తెలిపారు. ఈ ప్రాజెక్టును జిల్లా జాయింట్ కలెక్టర్ పైలెట్ ప్రాజెక్టుగా చింతపల్లి మండలానికి కేటాయించారని, ఇందుకోసం థింసా ఆర్గానిక్ ఎఫ్పీఓతో ఒప్పందం చేసుకున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు కేవలం కాఫీ గింజల ద్వారానే ఆదాయం పొందుతున్న రైతులకు, ఇకపై కాఫీ ఆకుల సేకరణ ద్వారా కూడా ఆదాయం లభిస్తుందని తెలిపారు. సుమారు 25 ఎకరాల్లో కాఫీ ఆకుల సేకరణకు చర్యలు తీసుకుంటున్నామని, కిలో ఆకులకు రూ.17.50 ధర చెల్లిస్తామని ప్రకటించారు. మొక్కలోని అదనపు కొమ్మలను తొలగిస్తూ ముదురు ఆకులను సేకరించాలని రైతులకు సూచించారు. మరో వారం రోజుల్లో ఈ సేకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో థింసా ఆర్గానిక్ సీఈవో ఆనంద్, గ్రీన్ ఆయుష్ ప్రతినిధులు బి. బుజ్జిబాబు, కనకారావు, రజాక్ తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ ఆయుష్ సంస్థ సీఈవో రాజేష్ -
శ్రీశైలం ఏఎస్ఐ కొండబాబు గుండెపోటుతో మృతి
కొయ్యూరు: శ్రీశైలంలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న మంప గ్రామానికి చెందిన వంజరి కొండబాబు (45) ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతితో మంప గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. శ్రీశైలంలో ఏఎస్ఐగా పనిచేస్తున్న కొండబాబు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం పాయకరావుపేటలో చదువుకుంటున్న తన కుమారుడిని పరామర్శించి, తిరిగి స్వగ్రామమైన మంపకు బయలుదేరారు. మార్గమధ్యలో ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారు. వెంటనే వైద్య సేవలు అందించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక నిబద్ధత కలిగిన పోలీస్ అధికారిగా గుర్తింపు పొందిన కొండబాబు అకాల మరణం పట్ల స్థానికులు, తోటి సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
ఘాట్ రోడ్డులో విరిగిన చెట్లు
● 15 గ్రామాలకు నిలిచిన రాకపోకలు గూడెం కొత్తవీధి: శనివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి కుంకుమపూడి ఘాట్ రోడ్డులో చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. దీంతో ఈ మార్గంలో ఉన్న సుమారు 15 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆదివారం అగ్రహారం వెళ్లేందుకు వచ్చిన ఒక అంబులెన్స్, రోడ్డుపై కూలిన చెట్లు తొలగించకపోవడంతో ముందుకు వెళ్లలేక వెనుదిరిగి వెళ్లిపోయింది. అత్యవసర సమయంలో వైద్య సేవలకు కూడా అంతరాయం కలుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, యుద్ధ ప్రాతిపదికన చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
శిథిలావస్థలో ఉపాధ్యాయుల క్వార్టర్లు
ముంచంగిపుట్టు: మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుల క్వార్టర్లు అత్యంత ప్రమాదకరంగా మారాయి. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ భవనాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకోవడంతో ఉపాధ్యాయులు భయం భయంగా గడుపుతున్నారు. సుమారు 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ 12 భవనాలు నిర్వహణ లేక పూర్తిగా పాడైపోయాయి. తలుపులు, కిటికీలు ఊడిపోయి దర్శనమిస్తున్నాయి. స్వల్ప వర్షానికే పైకప్పుల నుండి నీరు కారుతుండటంతో, నివాసం ఉంటున్న ఉపాధ్యాయులు పైకప్పులపై టార్పాలిన్ పట్టాలు కప్పుకొని కాలం వెళ్లదీస్తున్నారు. భవనాలు ఎప్పుడు కూలిపోతాయో తెలియని స్థితిలో ఉన్నాయని, మరికొన్ని భవనాలు ఇప్పటికే నివాస యోగ్యం కాకుండా పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వార్టర్ల దుస్థితిపై ఉపాధ్యాయులు, స్థానిక నేతలు పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. అధికారులు స్పందించి తక్షణమే ఈ 12 భవనాలకు మరమ్మతులు చేపట్టి, తమ నివాస ఇబ్బందులను తీర్చాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. భయం నీడలో గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు -
రియల్ ఘాటీ
సినిమా తరహాలో యథేచ్ఛగా అక్రమ దందా ఆంధ్రా– ఒడిశా సరిహద్దులోని మత్స్యగెడ్డ దీవులుముంచంగిపుట్టు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని మత్స్యగెడ్డ నదీ పరివాహక ప్రాంతం ఇప్పుడు గంజాయి స్మగ్లర్లకు సురక్షిత స్థావరంగా మారింది. మత్స్యగెడ్డ మధ్యలో ఉన్న దీవులు, చుట్టూ దట్టమైన అడవులు, కొండల మధ్య స్మగ్లర్లు గుట్టుచప్పుడు కాకుండా రూ.కోట్లు విలువ చేసే గంజాయి లిక్విడ్ను తయారు చేస్తున్నారు. ● ఇటీవలే విడుదలైన అనుష్క నటించిన ’ఘాటీ’ సినిమాలో గంజాయి లిక్విడ్ తయారీ ప్రక్రియను దర్శకుడు క్రిష్ ఏ విధంగా చూపించారో, సరిగ్గా అదే తరహాలో ఏవోబీ సరిహద్దుల్లోని దండకారణ్యంలో ఈ అక్రమ దందా సాగుతోంది. 1955లో నిర్మించిన జోలాపుట్టు, డుడుమ జలాశయాల కారణంగా ఒడిశాలోని 154 గ్రామాలు, ఆంధ్రాలోని 84 గ్రామాల గుండా మత్స్యగెడ్డ విస్తరించి ఉంది. ఈ ప్రవాహం మధ్యలో ఏర్పడిన దీవులను స్మగ్లర్లు తమ కార్యకలాపాలకు వేదికగా చేసుకున్నారు. రోడ్డు మార్గాల్లో పోలీసుల తనిఖీలు పెరగడంతో, స్మగ్లర్లు తమ పంథా మార్చి జలమార్గాలను ఎంచుకుంటున్నారు. రసాయన శాస్త్రవేత్తల సాయంతో.. చుట్టూ నీరు ఉండటంతో పోలీసులు సులభంగా రాలేరనే ధీమాతో స్మగ్లర్లు ఇక్కడ భారీ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. రాత్రిపూట పడవల ద్వారా గంజాయిని దీవులకు తరలించి నిల్వ చేస్తున్నారు. ఈ గంజాయి నుంచి లిక్విడ్ను వెలికితీసేందుకు కొంతమంది రసాయన శాస్త్రవేత్తల సహకారం కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అత్యాధునిక యంత్రాలు, మిక్సీలు, ప్రెజర్ కుక్కర్లు, బాట్లింగ్ యూనిట్లను కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. మూడు అంచెల నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకుని, బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఈ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. రూ.200 కోట్ల విలువైన లిక్విడ్ స్వాధీనం ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఒడిశా పోలీసులు నిర్వహించిన భారీ ఆపరేషన్లో ఈ గంజాయి మాఫియా గుట్టు రట్టయింది. కోరాపుట్ జిల్లా ఎస్పీ రోహిత్ వర్మ నేతృత్వంలో పాడువ పోలీస్ స్టేషన్ పరిధిలోని మత్స్యగెడ్డ దీవులపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఎంతో రహస్యంగా బోట్ల ద్వారా వెళ్లిన పోలీసులను చూసి స్మగ్లర్లు పడవల్లో పరారయ్యారు. అక్కడ లభించిన సుమారు 1800 లీటర్ల గంజాయి లిక్విడ్ను చూసి పోలీసులు విస్తుపోయారు. దీని విలువ సుమారు రూ.200 కోట్లు ఉంటుందని అంచనా. ఒక పూర్తి స్థాయి ఫ్యాక్టరీని తలపించేలా ఉన్న ఆ తయారీ కేంద్రాన్ని చూసి ఉన్నతాధికారులే ఆశ్చర్యపోయారు. డ్రోన్లతో గాలింపు చర్యలు స్మగ్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆంధ్ర – ఒడిశా పోలీసులు ఇప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మనుషులు వెళ్లలేని దుర్భేద్యమైన కొండ ప్రాంతాలు, మత్స్యగెడ్డ దీవులపై అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. డ్రోన్ల ద్వారా సేకరిస్తున్న ఫొటోలు, వీడియోల ఆధారంగా స్థావరాలను గుర్తించి ధ్వంసం చేస్తున్నారు. ప్రస్తుతం ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల (ఆంధ్రప్రదేశ్), పాడువ, లంతాపుట్టు, మాచ్ఖండ్ (ఒడిశా) ప్రాంతాల పోలీసులు సమన్వయంతో సరిహద్దుల్లోని గంజాయి నెట్వర్క్ను నిర్మూలించే పనిలో నిమగ్నమయ్యారు. స్మగ్లర్లను పట్టుకుంటాంఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి రవాణా, సాగు, లిక్విడ్ గంజాయి తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టాం. డ్రోన్ కెమెరాలతో పటిష్టమైన నిఘా ఏర్పాటుచేశాం. మండల కేంద్రాల్లో ఉదయం, రాత్రిపూట సైతం తనిఖీలు ముమ్మరం చేస్తున్నాం.గంజాయి స్మగ్లర్లు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నా తమకు పట్టుబడి తీరాల్సిందే. మత్స్యగెడ్డ పరివాహిక ప్రాంతాలు, దీవులపై ప్రత్యేక దృష్టి పెట్టాం. పూర్తిగా గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పని చేస్తున్నాం. – అమిత్ బర్దర్, ఎస్పీ, పాడేరు -
24న పాలిసెట్, ఏపీఆర్ఎస్ ప్రవేశ పరీక్షలు
● పకడ్బందీగా నిర్వహించాలి ● కలెక్టర్ నిషాంతి ఆదేశం పాడేరు: జిల్లా లో ఈనెల 24 న జరగనున్న పాలిసెట్, ఏపీఆర్ఎస్ ప్రవేశ పరీక్షలను పకడ్బందీగా నిర్వ హించాలని జిల్లా కలెక్టర్ టి. నిశాంతి అధికారులను ఆదేశించారు. ఆదివారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పరీక్షల నిర్వహణపై ఆమె పలు సూచనలు చేశారు.పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, ఫర్నిచర్ ఏర్పాటు చేయాలి. పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చూడటంతో పాటు, విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు ముందుగానే పరీక్షా కేంద్రాలను సందర్శించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. పరీక్షల సమయంలో కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆయా మార్గాల్లో తగినన్ని బస్సులను నడపాలని రవాణా శాఖను ఆదేశించారు.ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు, పూర్తిస్థాయి వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. మాల్ ప్రాక్టీస్కు తావులేకుండా ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించాలని, నిఘా వ్యవస్థ పటిష్టంగా ఉండేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. విధుల్లో ఉన్న అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి పరీక్షలను విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో విద్యా, ఆరోగ్య, రవాణా, రెవెన్యూ, పోలీస్ మరియు ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సింహాచలేశునినిజరూప దర్శనానికి వేళాయె
సింహాచలం: సింహగిరిపై అవతరించిన ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవ వేళయింది. వైశాఖ శుద్ధ తదియని పురస్కరించుకుని స్వామివారు సోమవారం తన నిజరూప దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పించనున్నారు. ఏడాదంతా చందన రూపుడి(నిత్యరూపం)గా కనిపించే స్వామి మణుగుల చందనం నుంచి బయటకు వచ్చి, నిజరూపంతో దర్శనమివ్వనున్నాడు. అర్ధరాత్రి దాటాక ఒంటి గంట నుంచి ఆలయ అర్చకులు వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించి, స్వామివారిపై ఉన్న చందనాన్ని ఒలిచి నిజరూప భరితుడిని చేస్తారు. వేకువజాము 3 గంటలకు అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్గజపతిరాజుకు తొలి దర్శనం కల్పిస్తారు. 3.30 గంటల నుంచి భక్తులకు ఉచిత, రూ.300 దర్శనాలు ప్రారంభిస్తారు. రాత్రి 8 గంటల నుంచి సహస్రఘటాభిషేకం నిర్వహిస్తారు. సింహగిరిపై గంగధార నుంచి శ్రీవైష్ణవస్వాములు కలశాలతో తీసుకొచ్చిన నీటితో స్వామివారి నిజరూపానికి అభిషేకం నిర్వహిస్తారు. 108 వెండి కలశాలతో పంచామృతాభిషేకం, విశేష పూజల అనంతరం తొలి విడతగా మూడు మణుగుల చందనాన్ని స్వామికి సమర్పించి మరల నిత్యరూపభరితున్ని చేస్తారు. నిజరూప స్వామికి ధరింపజేసే శిరోచందనం, హృదయచందనాన్ని వైదికులు ఇప్పటికే సిద్ధం చేశారు. పటిష్ట ఏర్పాట్లు ఈసారి చందనోత్సవానికి సుమారు రెండు లక్షల మంది భక్తులు వస్తారని జిల్లా యంత్రాంగం అంచనా. ఉచిత దర్శనంతో పాటు రూ.300, రూ.1,000ఽ, రూ.1,500ల దర్శనం టికెట్ల క్యూలను పకడ్బందీగా ఏర్పాటు చేశారు. టికెట్లపై పొందుపరిచిన సమయాల(స్లాట్ల) ప్రకారం దర్శనాలకు అనుమతిస్తారు. రాత్రి 7 గంటలలోపు మాత్రమే క్యూల్లోకి భక్తులను అనుమతిస్తారు. అనంతరం క్యూల ప్రవేశ ద్వారాలు మూసివేసి అప్పటి వరకు క్యూల్లో ఉన్న భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 గంటల వరకు సింహగిరి పైకి బస్సుల్లో భక్తులను అనుమతిస్తారు. దర్శనానంతరం దక్షిణ రాజగోపురం ద్వారా బయటకు వచ్చే భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం అందిస్తారు. ఈ మేరకు 40 గ్రాముల లడ్డూలను లక్షా 50 వేలు సిద్ధం చేశారు. చందనోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, సింహాచలం దేవస్థానం ఈవో జె.వెంకటరావు ఆధ్వర్యంలో అన్ని శాఖల సమన్వయంతో జిల్లాయంత్రాంగం ఏర్పాట్లు చేసింది. నగర పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చి ఆధ్వర్యంలో 2,300 మందితో పోలీస్ బందోబస్తు, సింహగిరిపై కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. డ్రోన్ సాంకేతికను వినియోగిస్తున్నారు. భక్తులందరికీ అన్నప్రసాదం చందనోత్సవానికి వచ్చే భక్తులందరికీ అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదం అందించనున్నారు. కొండ దిగువ శ్రీకృష్ణాపురంలోని గోశాల, అడవివరం జంక్షన్, తొలిపావంచా, సింహపురికాలనీ, శ్రీనివాసనగర్లోని దేవస్థానం కల్యాణమండపాల వద్ద కేవలం లడ్డూ ప్రసాదాలు మాత్రమే విక్రయిస్తారు. ఈ మేరకు 80 గ్రాముల లడ్డూలు సుమారు లక్ష సిద్ధం చేశారు. ఏర్పాట్లు పరిశీలించిన హోంమంత్రి అనిత చందనోత్సవం ఏర్పాట్లను ఆదివారం హోంమంత్రి అనిత పరిశీలించారు. దర్శనాల క్యూలను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు సాఫీగా జరిగేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత చందనోత్సవ అనుభవాల నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఆలయం వద్ద సిద్ధంగా ఉండాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లలో ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నామని పోలీస్ అధికారులు హోంమత్రికి తెలియజేశారు. మంత్రి వెంట దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్, ఈవో జె.వెంకటరావు, డీసీపీ–2 మేరీ ప్రశాంతి తదితరులు ఉన్నారు.● సీఎం రమేష్కి 30 వరకూదర్శనం టికెట్లు ● సొంత సర్కారులోనే అవమానమంటూ ఎమ్మెల్యేల అసహనం ● తమపై మాత్రం వివక్ష అంటూకలెక్టర్పై గుర్రు సాక్షి, విశాఖపట్నం: సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం వేళ.. అధికారుల అత్యుత్సాహం అధికార పార్టీ నేతల మధ్య చిచ్చు పెట్టింది. కూటమి ప్రభుత్వ హయాంలోనే తమకు దక్కాల్సిన గౌరవం గంగలో కలిసిందంటూ తమ్ముళ్లు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ప్రోటోకాల్ను తుంగలో తొక్కి ‘అనకాపల్లి’ అతిథులకు రెడ్ కార్పెట్ పరచడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎంపీ సీఎం రమేష్ అనుచర గణం కోసం ఏకంగా 30 టికెట్లు కేటాయించి, స్థానిక ఎంపీ భరత్తో పాటు ఎమ్మెల్యేలను పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. చందనోత్సవం సమయంలో తమపై కలెక్టర్ వివక్ష చూపించారంటూ.. ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, గణబాబు వంటి సీనియర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘మా ప్రభుత్వం.. మా అప్పన్న.. కానీ మాకే దర్శనం లేదు’ అన్నట్టుగా తయారైంది పరిస్థితంటూ అనుచరుల దగ్గర వాపోతున్నారు. కలెక్టర్ కట్టబెట్టిన ఈ ‘విశిష్ట’ ప్రాధాన్యతపై ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. స్థానిక ప్రతినిధుల కంటే వలస నేతలకే విలువ ఎక్కువన్నట్లుగా ఉందని కేడర్ మండిపడుతోంది. ఎంపీ భరత్ సైతం అధికారుల తీరుపై నిప్పులు చెరుగుతుండటంతో, చందనోత్సవ ఏర్పాట్లు కాస్తా రాజకీయ రణరంగంగా మారాయి. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అనుచరగణానికి మాత్రం ఏకంగా 30 అంతరాలయ టికెట్లను ఇవ్వడం వెనుక ఉన్న మర్మమేమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మా ఇంట్లో వేడుకకు పొరుగువారికి పీట వేసి, మమ్మల్ని గేటు బయట నిలబెడతారా?’ అంటూ ఎంపీ భరత్ సహా ఎమ్మెల్యేలు కలెక్టర్ వైఖరిపై నిప్పులు చెరుగుతున్నారు. అప్పన్న సాక్షిగా ‘అంతరాలయ’ రాజకీయం ఉదయం 3.30 నుంచి ఉచిత, రూ.300 దర్శనం రాత్రి 7 గంటలకు క్యూల ప్రవేశ ద్వారాలు మూసివేత రాత్రి 8 నుంచి సహస్ర ఘటాభిషేకం, తొలి విడత చందన సమర్పణ -
సమరసత కృషితో చిన్నారులకు ఆధ్యాత్మిక వికాసం
అనకాపల్లి: నేటి పోటీ ప్రపంచంలో పిల్లలకు కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా ఆధ్యాత్మిక, నైతిక విలువలు ఎంతో అవసరమని బ్రాండిక్స్ భారతీయ భాగస్వామి దొరస్వామి అన్నారు. స్థానిక శ్రీరామ్నగర్ మాధవ సదన్లో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలవికాస్ కేంద్రాల వార్షికోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారుల్లో ఉత్తమ గుణగణాలను పెంపొందించేందుకు సమరసత సేవా ఫౌండేషన్ చేస్తున్న సామాజిక సేవల విషయంపై ఆయన వివరించారు. సాంకేతికత పెరిగిన ఈ కాలంలో మన సంస్కృతిని, సంప్రదాయాలను తర్వాతి తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లూరి విష్ణు మాట్లాడుతూ సామాజిక సమరసత సాధించడమే లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామని తెలిపారు. టీటీడీ శ్రీవాణి ట్రస్టు నిధులతో నిర్మించిన ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార కాలనీల దేవాలయాల్లో నిర్వహిస్తున్న బాలవికాస్ కేంద్రాల ద్వారా పేద వర్గాల పిల్లలకు క్రమశిక్షణ, దేశభక్తి, ధార్మిక విషయాలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, నిర్వాహకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
చింతపల్లిలో పెట్రోల్ కష్టాలు
● జాతర రద్దీతో ఖాళీ అయిన బంకులు చింతపల్లి: స్థానిక పెట్రోల్ బంకులు మూతపడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్రీ ముత్యాలమ్మ జాతర సందర్భంగా చింతపల్లికి వాహనాల రాకపోకలు ఒక్కసారిగా పెరగడంతో బంకుల్లో నిల్వలు అయిపోయాయి.చింతపల్లిలో జీసీసీ, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల ద్వారా ఇంధన సరఫరా జరుగుతుంది. ముఖ్యంగా జీసీసీ బంకులో ప్రతిరోజూ సుమారు రూ.4లక్షల నుంచి రూ.5 లక్షల వరకు విక్రయాలు సాగుతుంటాయి. అయితే ఆదివారం సాయంత్రం నుంచే పెట్రోల్, డీజిల్ నిల్వలు పూర్తిగా అయిపోవడంతో సిబ్బంది ‘నో స్టాక్’ బోర్డులు ఏర్పాటు చేశారు. జాతర కోసం వచ్చిన భక్తులు, వాహనదారులు ఇంధనం దొరక్క నానా అవస్థలు పడ్డారు. సోమవారం ఉదయానికి జీసీసీ బంకుకు పెట్రోల్ లోడ్ చేరుకుంటుందని సిబ్బంది వెల్లడించారు. -
ఆంగ్ల వ్యామోహంలో అమ్మభాషను మరువద్దు
సీతంపేట: త్రిభాషా విధానం వల్ల మాతృభాషకు ఎంతో మేలు జరుగుతుందని మాజీ రాజ్యసభ సభ్యుడు, విశ్వ హిందీ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. తెలుగుదండు ఆధ్వర్యంలో ఆదివారం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో జరిగిన ‘మాతృభాష అభివృద్ధికి మార్గమేమి?’అనే చర్చాగోష్టిలో ఆయన ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు భాషల విధానంలో మాతృభాషకు సముచిత స్థానం ఉందని, ఇది ఉత్తరాది భాషలను రుద్దడం కాదని స్పష్టం చేశారు. మాతృభాషకు మొదటి శత్రువులు తల్లిదండ్రులేనని ఆవేదన వ్యక్తం చేశారు. భాషా వికాసం ఇంటితో మొదలై, నేడు పాఠశాలల్లోనే అంతమవుతోందని పేర్కొన్నారు. ఆంగ్ల భాషా వ్యామోహంతో మాతృభాషను పక్కన పెట్టడం సరికాదన్నారు. మారుమూల ప్రాంతంలో జన్మించిన సినీ కవి సి.నారాయణరెడ్డి డిగ్రీ వరకు ఉర్దూ మాధ్యమంలో చదివినప్పటికీ, తెలుగు సినీ కవిత్వంలో కొత్త ఒరవడి సృష్టించారని గుర్తు చేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలుగు భాష వికాసం కోసం అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెఓలిపారు. తెలుగు భాష కేవలం బడి భాష మాత్రమే కాదని, అది అమ్మ ఒడి భాష అని, జాతికి గమ్యాన్ని చూపేదని పేర్కొన్నారు. ప్రముఖ వైద్యుడు, భాషా ఉద్యమకారుడు డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం కొన్ని పత్రికలు, పుస్తకాల్లో భాషా దోషాలు విపరీతంగా పెరిగిపోయాయని, ప్రస్తుత వ్యవస్థలోనూ ఈ లోపం కనిపిస్తోందని ఆవేదన చెందారు. -
నూకాంబికను దర్శించుకున్న నటి శ్రీలక్ష్మి
అనకాపల్లి: స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారిని ఆదివారం నటి శ్రీలక్ష్మి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో గవిరెడ్డి శ్రీనివాస్సారథ్యంలో తెరకెక్కిస్తున్న ‘చీన్ టపాక్ డుం డుం‘ చిత్రంలో ప్రధానమైన పాత్రలో నటించేందుకు ఇక్కడకు వచ్చినట్టు చెప్పారు. అమ్మవారిని మొదటి సారిగా దర్శించుకోవడం ఎంతోఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి నాగచైతన్య అఖిల్ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఎస్. భానుచందర్, సభ్యుడు షేక్ రియాజ్, ఆలయ కమిటీ డైరెక్టర్లు పొలిమేర ఆనంద్ కుమార్, దాడి రవికుమార్, కాండ్రేగుల రాజు తదితరులు పాల్గొన్నారు. -
వడదెబ్బ లక్షణాలు, జాగ్రత్తలు
మాడుగుల రూరల్: వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా వడదెబ్బకు గురికాకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సమయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకపోవడమే మంచిది. అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లేటప్పుడు లేత రంగులో ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. తలకు టోపీ లేదా గొడుగు వాడడం మంచిది. ఈ సందర్భంగా వడదెబ్బకు గురైన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు గురించి కె.జె.పురం పీహెచ్సీ వైద్యాధికారి ఎల్.వి.ఎస్.ఎస్. ప్రసాదుపాత్రుడు పలు సూచనలు చేశారు. వడదెబ్బ తగిలినప్పుడు చెయ్యవలిసినవి: శరీర ఉష్ణోగ్రతను తగ్గించడం, వడదెబ్బ బారిన పడిన వ్యక్తిని వెంటనే నీడలోకి లేదా ఎ.సి. ఉన్న గదిలోకి మార్చాలి. తడి గుడ్డతో శరీరాన్ని తుడిస్తూ ఫ్యాన్ కింద ఉంచాలి. వీలైతే ఐస్ ప్యాక్ మెడ, చంకలు, గజ్జల భాగంలో ఉంచితే త్వరగా వడ దెబ్బ నుంచి ఉపశమనం కలుగుతుంది. స్పృహలో ఉంటే నీళ్లు, ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్లు, లేదా మజ్జిగ తాగించాలి. ఒక వేళ బాధితుడు స్పృహ కోల్పోతే నోటి ద్వారా ఏమి ఇవ్వకూడదు. గాలి తగేలా బిగుతుగా ఉన్న దుస్తులను కొద్ది మేర సడలించాలి. వడదెబ్బ తగిలిన వ్యక్తికి విపరీతమైన జ్వరం, మూర్చ, స్పృహ తప్పడం వంటివి జరిగితే ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా ఆస్పత్రికి తరలించాలి. దాహం వెయ్యకపోయినా సరే ప్రతి గంటకు ఒక సారి నీళ్లు తాగించాలి. కోలుకుంటున్న సమయంలో కాఫీ, టీ, ఆల్కహాల్కు దూరంగా ఉంచాలి. వడదెబ్బ తగిలిన వ్యక్తికి జ్వరం వస్తే పారాసెటమెల్ లేదా ఆస్పిరెన్ వంటివి సొంతంగా వాడకూడదు. ఇవి కొన్నిసార్లు పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తాయి. కేవలం వైద్యులు సలహా మేరకు మందులు వాడాలి. వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ తగు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ సోకకుండా ఉండవచ్చు. ఏప్రిల్, మే, జూన్ మొదటివారం వరకు వేసవి ఎండల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఆరోగ్య జాగ్రతలు తీసుకోవాలని ప్రజలకు వైద్యాధికారి ప్రసాదుపాత్రుడు సూచించారు. -
ఎనిమిది మంది జూదరుల అరెస్టు
కోటవురట్ల: మండలంలోని పాములవాకలో కాయిన్ గేమ్ ఆడుతున్న ఎనిమిది మందిని ఆదివారం అరెస్టు చేసినట్టు ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. అందిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడిచేయగా ఎనిమిది కాయిన్ గేమ్ ఆడుతూ పట్టుబడినట్టు చెప్పారు. వారిని అరెస్టు చేసి, రూ.9,200 స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, పేకాట, కోడి పందాలు, కాయిన్ గేమ్ వంటి జూదాలు ఆడినా చట్టపరంగా చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. పేకాటరాయుళ్లకు అరదండాలు బుచ్చెయ్యపేట: మండలంలోని సీతయ్యపేట శివారులో తోటల వద్ద పేకాట స్థావరంపై దాడి చేసి, ఏడుగురుని అరెస్టు చేసినట్టు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.31,400 స్వాధీనం చేసికుని, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. -
సూపర్ సిక్స్ హామీల అమలులో చంద్రబాబు విఫలం
దేవరాపల్లి: పేదల పక్షాన ఎర్ర జెండా నిరంతరం రాజీలేని పోరాటం చేస్తుందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు అన్నారు. దేవరాపల్లి ఉషోదయ కాన్సెప్ట్ స్కూల్ ఆవరణలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహా సభలు జిల్లా అధ్యక్షుడు వి.సత్యనారాయణ అధ్యక్షతన ఆదివారం ఘనంగా జరిగాయి. సభా వేదిక వద్ద ముందుగా పుచ్చపల్లి సుందరయ్య, ఏచూరి సీతారాం చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో హాజరైన రైతులు, కార్మికులను ఉద్దేశించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడారు. మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి మూడు సెంట్లు స్థలం ఇస్తానని హామీ ఇచ్చి దళిత, గిరిజనుల భూములు లాక్కోవడం జరుగుతుందన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో వేలాది ఎకరాల భూములను పేద రైతుల నుంచి లాక్కోని కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టం ఎర్ర జెండా కృషితో వచ్చిందేనని, దీనిని నిర్వీర్యం చేసేందుకు పేరు మార్చి కూలీలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఉపాధి కూలీలకు ఫేస్ యాప్ను రద్దు చేయాలని, ఉపాధి హామీ పథకం పేరు మార్చాలని ఈ నెల 20న విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నట్టు తెలిపారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రాగా మారుస్తానని చంద్రబాబు డబ్బా కొడుతున్నారని, ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామ పంచాయతీల్లో ఎర్ర జెండా నాయకులు పోటీ చేయాలన్నారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. అప్పలరాజు మాట్లాడుతూ జిల్లాలో నాలుగు సుగర్ ఫ్యాక్టరీలు మూసివేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. జిల్లాలోని నాన్ షెడ్యూల్ మండలాలను ఐదో షెడ్యూల్ మార్చా లని డిమాండ్ చేస్తూ మహా సభలో తీర్మానం చేస్తున్నామని ప్రకటించారు. జీడి రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని, పోడు ఫారెస్టు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఆక్రమణలకు గురైన పేదల భూములు తిరిగి ఇవ్వాలని, ఉపాధి హామీ పట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని మహాసభలలో తీర్మానం చేశారు కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వెంకన్న, రైతు సంఘం నాయుకులు గండి నాయన్బాబు, బి.టి.దొర, ఇరటా నర్సింహమూర్తి, గోవింద, కె. భవానీ, డి.శంకర్, సిహెచ్.దేముడు, గాడి ప్రసాద్, ఎం.ఎర్రునాయుడు, జె. ఈశ్వరరావు.వి.దొంగబాబు, నండా సన్నిబాబు, కె.నాయుడు, కె.దేముడు, సిహెచ్. చినదేముడు, జన్ని దేముడు పాల్గొన్నారు. -
పైలెట్ ప్రాజెక్టుకు పొంచి ఉన్న ముప్పు
పైలెట్ ప్రాజెక్టు ప్రదేశంలో ఇసుక తవ్వకాలు నాతవరం: స్పీకర్ ఇలాకాలో కూటమి నేతలు అండతో తాండవ నదిలో ఇష్టానుసారంగా ఇసుక తోడేస్తున్నారు. పర్యవసానంగా ఇక్కడ తాగునీటి పైలెట్ ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంది. దాంతో 20 గ్రామాలకు తాగునీటి సరఫరా చేసే ఈ ప్రాజెక్టు భవితవ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మండలంలో గుమ్మడిగొండ పంచాయతీ శివారు చిక్కుడుపాలెం వద్ద తాండవ నదిలో నిర్మించిన పైలెట్ ప్రాజెక్టు పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. మండలంలో అనంత పద్మనాభపురం, ఎం.బి.పట్నం మన్యపురట్ల, గన్నవరం పంచాయతీల్లోని పలు గ్రామాల్లో ఫోరైడ్ సమస్య ఉంది. దీనిపై దృష్టి సారించిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తాండవ నదిలో ౖపైలెట్ ప్రాజెక్టు నిర్మించి పైపులైను ద్వారా పదేళ్లుగా ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు. ఈ పైలెట్ ప్రాజెక్టుపై ఆధారపడి రాజుపేట అగ్రహారం, లింగంపేట, మన్యపురట్ల, కొత్త రామచంద్రపురం, ఉప్పరగూడెం, గన్నవరం, నాయుడుపాలెం, వి.బి.అగ్రహారం, వై.బి. అగ్రహారం, మాసయ్యపేట, వై.బి.పట్నం, బుచ్చెంపేట, ఎ.శరభవరం, ఎం.బి.పట్నం తదితర గ్రామాలు ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచితంగా ఇసుక తవ్వుకోవడానికి అనుమతులు ఇచ్చారు. ఇదే అవకాశం చేసుకున్న అధికార పార్టీ నాయకులు చిక్కుడుపాలెం వద్ద తాండవ నదిలో పైలెట్ ప్రాజెక్టు సమీపంలో ఇసుక తవ్వేస్తున్నారు. ఇక్కడ పైలెట్ ప్రాజెక్టు చుట్టూ ఇసుక తవ్వకాలు చేయరాదని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు హెచ్చరించారు. వారి మాటలు బేఖాతరు చేస్తూ యథేచ్ఛగా ఇసుక తవ్వేస్తుండటంతో ప్రాజెక్టు ప్రమాదాన్ని గ్రహించిన సంబంధిత అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారుల వేసిన కంచె తొలగించి తవ్వకాలు మైనింగ్, రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు సంయుక్తంగా నదిలో ప్రాజెక్టును పరిశీలించారు. ఇసుక తవ్వకాలు ఇదే విధంగా కొనసాగితే ప్రాజెక్టుకు ప్రమాదం జరుగుతుందని నిర్ధారించారు. ప్రాజెక్టు సమీపంలో తవ్వకాలు జరగకుండా ఉండేందుకు దారిలో ప్రత్యేకంగా కంచె ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు చేయకుండా హెచ్చరికలు చేశారు. అప్పట్లో కొన్ని రోజుల పాటు ఇక్కడ తవ్వకాలు చేయకుండా మానేశారు. ఆ తర్వాత కంచెను తీసేసి మరలా తవ్వకాలు మొదలు పెట్టారు. ఉచిత ఇసుక పేరుతో కూటమి నేతలే దర్జాగా వ్యాపారం చేస్తున్నారు. ఉచిత ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లకు బ్యానర్లు మచ్చుకై నా కనిపించకపోవడం గమనార్హం. ఈ విధంగా నిబంధనలు పాటించకుండా రేయింబవళ్లు ఇసుక వ్యాపారం చేస్తున్నారు. ఈ ప్రాంతం స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇలాకాలో ఉండడంతో అధికారులు భయపడి చోద్యం చూస్తున్నారు. అధికారులు దృష్టి సారించాలి తాండవ నదిలో ఇసుక అక్రమ రవాణాపై సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. నదిలో తవ్వకాలు వల్ల పైలెట్ ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లి వేలాది మంది ప్రజలకు తాగునీటి సమస్య ఏర్పడుతుంది. అనధికార తవ్వకాలపై చర్యలు తీసుకునేందుకు భయపడితే అధికారులు ప్రజల నమ్మకం కోల్పోతారు. –ఎ.చిన్నంనాయుడు, సీపీఐ మండల కార్యదర్శి -
సెల్ సిగ్నళ్లు లేకగిరిజనుల అవస్థలు
ముంచంగిపుట్టు: మండలంలోని కించాయిపుట్టు పంచాయతీ పరిధి గుమ్మసిరగంపుట్టు, రాములు, తేనేలమామిడి, సరియాపుట్టు గ్రామాల్లో సెల్ సిగ్నళ్లు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధునిక కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పనినీ ఆన్లైన్తో ముడిపెడుతుండటంతో, సిగ్నల్ కోసం గిరిజనులు కిలోమీటర్ల మేర పరుగులు తీయాల్సి వస్తోంది. అనారోగ్యం పాలైనప్పుడు 108 అంబులెన్స్కు లేదా ఆరోగ్య కేంద్రాలకు ఫోన్ చేయాలన్నా సిగ్నల్ దొరకని పరిస్థితి నెలకొంది. పింఛన్లు, ఈ–కేవైసీ, బయోమెట్రిక్ వంటి పనుల కోసం గిరిజనులు పడరాని పాట్లు పడుతున్నారు. సిగ్నల్ లేకపోవడం వల్ల ప్రభుత్వ పథకాలను సకాలంలో పొందలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాల్లో సెల్ టవర్లు ఏర్పాటు చేయాలని గిరిజనులు ఇప్పటికే పలుమార్లు గ్రామ సభల్లో తీర్మానించి, మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. ఆదివారం గిరిజన సంఘం మండల అధ్యక్షుడు ఎం.ఎం. శ్రీను నేతృత్వంలో ఆయా గ్రామాల ప్రజలు అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే ఉన్నత అధికారులు స్పందించి సెల్ టవర్లు ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. -
తండ్రి కళ్ల ముందే కుమారుడి దుర్మరణం
రణస్థలం: రణస్థలం జాతీయ రహదారి మరోసారి రక్తసిక్తమైంది. కళ్ల ముందే కొడుకు ప్రాణాలు వదిలేస్తుంటే.. ఏమీ చేయలేక ఆ తండ్రి విలపించిన తీరు స్థానికులను కంటపడి పెట్టించింది. జేఆర్ పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి.. విశాఖలోని మాల్కాపురంలో నివాసం ఉంటున్న పంది దీనబంధు, తన కుమారుడు ప్రేమ్కుమార్(15)తో కలిసి ఆదివారం స్కూటీపై శ్రీకాకుళం వచ్చారు. అక్కడ జరిగిన డిఫెన్స్ ఎంట్రన్స్ పరీక్షకు ప్రేమ్కుమార్ హాజరయ్యాడు. పరీక్ష ముగిసిన అనంతరం ఇద్దరూ స్కూటీపై తిరిగి విశాఖపట్నం బయలుదేరారు. సాయంత్రం 4 గంటల సమయంలో రణస్థలం టౌన్ వద్దకు రాగానే, ఒక లారీని ఓవర్టేక్ చేయబోతుండగా వీరి వాహనం అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న దీనబంధు రోడ్డుకు ఒకవైపు తుళ్లిపోగా, వెనుక కూర్చున్నప్రేమ్కుమార్ మాత్రం ప్రమాదవశాత్తూ లారీ చక్రాల కిందకు పడిపోయాడు. లారీ వెనుక చక్రం తల పైనుంచి వెళ్లడంతో ప్రేమ్కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు కళ్ల ముందే చనిపోవడంతో ఆ తండ్రి గుండెలవిసేలా రోదించాడు. దీనబంధు మాల్కాపురంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. వీరి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బురద రామచంద్రాపురం పంచాయతీ శేఖరపురం. దీనబంధుకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న జేఆర్ పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రమాద స్థలంలో లారీ కింద ఉన్న మృతుడు ప్రేమ్ కుమార్, రోదిస్తున్న తండ్రి దీనబంధు -
అనుమానాస్పద స్థితిలో వృద్ధుడి మృతి
దేవరాపల్లి: మండలంలోని కొత్తూరు ముత్యాలమ్మపాలెంలో వృద్ధుడు తమరాన అప్పారావు(77) అనుమానాస్పద స్థితిలో ఆదివారం మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించిన స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కె.ఎం.పాలెం గ్రామానికి చెందిన అప్పారావు సంతానం లేకపోవడంతో మానసిక వేదనతో బాధపడుతూ మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలోనే గతంలోను రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్పట్లో కుటుంబ సభ్యులు గమనించి సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కాగా ఆదివారం తెల్లవారుజామున పొలానికి వెళ్తున్నట్లు భార్య అచ్చియ్యమ్మకు చెప్పి అప్పారావు ఇంటి నుంచి బయలుదేరాడు. పొలంలో నోటి నుంచి నురగ కారుతూ అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు గమనించి వెంటనే 108 వాహనంలో కె.కోటపాడు కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. విషపదార్థం సేవించి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎవరిపైన తమకు అనుమానం లేదని కుటుంబ సభ్యులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే సరైన వివరాలు తెలియకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ చెప్పారు. -
మృత్యువు అంచున ప్రయాణం
కొయ్యూరు/గూడెంకొత్తవీధి: చింతపల్లి ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. మృత్యువు లోయ రూపంలో నోరు తెరుచుకున్నా.. డ్రైవర్ చూపిన అసాధారణ సమయస్ఫూర్తి పది మంది ప్రాణాలను కాపాడింది. లేదంటే ఆ వ్యాన్ పాతాళంలోకి పడి ఘోర విషాదం చోటుచేసుకునేది. అసలేం జరిగిందంటే.. రాజమహేంద్రవరానికి చెందిన కొందరు వ్యాపారులు చింతపల్లిలో జరిగిన ముత్యాలమ్మ ఉత్సవాలకు కృత్రిమ పూలు, ఇతర వస్తువుల విక్రయానికి వచ్చారు. ఉత్సవాలు ముగియడంతో శనివారం ఉదయం వారు లోతుగెడ్డ జంక్షన్కు చెందిన ప్రసాద్ అనే డ్రైవర్ వ్యాన్ లో తిరిగి రాజమహేంద్రవరం బయలుదేరారు. మొ త్తం పది మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆ వ్యాన్.. బొంతువలస గ్రామ సమీపంలోని మలుపు వద్దకు రాగానే ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. డ్రైవర్ వీరోచిత నిర్ణయం లోతైన లోయలు, ప్రమాదకరమైన మలుపులు ఉన్న ఆ మార్గంలో ఒక్కసారిగా బ్రేకులు పనిచేయకపోవడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. వాహనం అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్తున్న తరుణంలో డ్రైవర్ ప్రసాద్ బెదిరిపోలేదు. లోయలోకి పడకుండా ఉండేందుకు వాహనాన్ని నియంత్రిస్తూ, పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టును బలంగా ఢీకొట్టారు. చెట్టు అడ్డుగా రావడంతో వ్యాన్ ఆగిపోయింది.. ఆ పది మంది ఊపిరి పీల్చుకున్నారు. తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు ఈ ప్రమాదంలో డ్రైవర్ పక్కన కూర్చున్న నీరజ్ యల్లమ్మ, మాధురి గుడియాలకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ ప్రసాద్ కుడి కాలుకు బలమైన దెబ్బ తగలడంతో ఆయన నడవలేని స్థితికి చేరుకున్నారు. అలాగే అర్సడు, రామ్ డిల్లి, రోజిలీలకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను రాజేంద్రపాలెం ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉన్న మాధురి, నీరజ్ యల్లమ్మ, డ్రైవర్ను మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కొయ్యూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రేక్లు ఫెయిల్ అయి అదుపుతప్పిన వాహనం డ్రైవర్ చాకచక్యంగా చెట్టును ఢీకొట్టడంతో తప్పిన పెను ప్రమాదం క్షతగాత్రులు ఆస్పత్రికి తరలింపు -
జల సంరక్షణతోనే ఉజ్వల భవిష్యత్తు
పెదబయలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా, జల సంరక్షణపై రైతులు, ప్రజలు అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ టి. నిశాంతి పిలుపునిచ్చారు. శనివారం పెదబయలు మండలం, పెదకోడాపల్లి పంచాయతీ పరిధిలోని పరదానిపుట్టు, డూరుపల్లి గ్రామాల్లో నిర్వహించిన ‘జలధార – జలహారతి’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన.. గ్రామ పొలిమేర నుంచి ప్రజలతో కలిసి కాలినడకన పర్యటించిన కలెక్టర్, స్వచ్ఛత, పరిశుభ్రత, జలవనరుల స్థితిగతులను స్వయంగా పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటారు. పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన సదస్సులో కలెక్టర్ పలు కీలక సూచనలు చేశారు. భావి తరాల కోసం భూగర్భ జలమట్టాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఇంకుడు గుంతల నిర్మాణం, వర్షపు నీటిని నిల్వ చేసే పద్ధతులను పాటించాలని సూచించారు. గ్రామం పచ్చగా, శుభ్రంగా ఉంటే దోమలు దరిచేరవన్నారు. కాలువల్లో నీరు నిల్వ ఉంటే మలేరియా వంటి వ్యాధులు ప్రబలుతాయని, అందువల్ల మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన దోమతెరలను వాడాలని, ఇళ్ల లోపల, బయట దోమల నివారణ మందులను పిచికారీ చేయించుకోవాలని సూచించారు. 18 ఏళ్లలోపు పిల్లలకు బాల్య వివాహాలు చేయకుండా వారిని ఉన్నత చదువులు చదివించాలన్నారు. ఆహారపు అలవాట్లలో భాగంగా ఆర్గానిక్ పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న కలెక్టర్, అక్కడికక్కడే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంగన్వాడీ భవనం, పాఠశాల భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేశారు. వంతెన పనులకు అనుమతి జారీ చేశారు. వెల్నెస్ సెంటర్, హాట్ బజార్, డంపింగ్ యార్డులకు విద్యుత్ సౌకర్యం లేదని గ్రామస్తులు తెలపడంతో, 15 రోజుల్లోగా కరెంట్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన వారు ఎవరైనా రేషన్ కార్డులు లేకుంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. చివరగా, డూరుపల్లి గ్రామంలో అధికారులతో కలిసి జల సంరక్షణ, స్వచ్ఛతపై గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. ఇన్చార్జ్ ఆర్డీవో లోకేశ్వరరావు, డీఎల్పీవో పీఎస్ కుమార్, డీఈవో కృష్ణారావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమళ, ఎంపీడీవో శ్యాంసుందర్, మండల అధికారులు పాల్గొన్నారు. గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న కలెక్టర్ నిశాంతిడూరుపల్లి గ్రామానికి గెడ్డదాటి వెళ్తున్న కలెక్టర్ నిశాంతి తదితరులుకలెక్టర్ నిశాంతి -
జల సంరక్షణఅందరి బాధ్యత
● జేసీ తిరుమణి శ్రీపూజ,ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ పాడేరు రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్రలో భాగంగా నిర్వహిస్తున్న జలధార – జల హారతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, పాడేరు ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ పిలుపునిచ్చారు. శనివారం పాడేరు మండలం కిండంగి పంచాయతీ సేరుబయలు పంట చెరువు వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని వారిద్దరూ కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీపూజ మాట్లాడుతూ.. జల సంరక్షణ అనేది కేవలం అధికారుల బాధ్యత మాత్రమే కాదని, అది ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టి సంరక్షించడం ద్వారా భూగర్భ జలమట్టం పెరుగుతుందని వివరించారు.గ్రామాల్లోని చెరువులను పరిరక్షించి, సాగునీరు వృథా కాకుండా చూసుకోవాలని సూచించారు.సాగునీరు సమృద్ధిగా అందుబాటులో ఉన్నప్పుడే వ్యవసాయ రంగం బలోపేతం అవుతుందని, రైతులు ఆర్థికంగా నిలదొక్కుకుంటారని ఆమె తెలిపారు. ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతతో పాటు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని కోరారు. ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టేందుకు గ్రామ స్థాయిలో ఒక ఉద్య మంలా ప్రజలను చైతన్యపరచాలని అధికారులను ఆదేశించారు.గ్రామాల్లో తడి చెత్త, పొడి చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, తద్వారా వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంపీడీవో తేజరతన్, డిప్యూటీ ఎంపీడీవో రమేష్, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ సిబ్బంది, ఉపాధి హామీ పథకం క్షేత్రస్థాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వణకాల్సిందే!
వానొస్తే.. సొంతింటి కల నెరవేరుస్తాం.. ప్రతి పేదవాడిని ఇంటి యజమానిని చేస్తామని.. ఎన్నికల వేళ కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో గుప్పించిన హామీలివి. కానీ, అధికారం చేపట్టి రెండేళ్లు గడిచినా ఆ నినాదాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. మన్యం జిల్లాలో వేల సంఖ్యలో గిరిజన కుటుంబాలు పక్కా ఇళ్ల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాయి. అధికారులు సర్వేలు చేసి చేతులు దులుపుకున్నా, పాలకుల నుంచి మాత్రం అనుమతుల ఊసే లేదు. వానొస్తే వణికిపోయే మట్టి గోడలు, గాలి వీస్తే ఎగిరిపోయే రేకుల షెడ్ల మధ్య.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న గిరిజనుల దుర్భర స్థితిలో జీవనం సాగిస్తున్నారు. సాక్షి, పాడేరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా, గిరిజన ప్రాంతాల్లో పేదలకు కొత్త ఇళ్ల మంజూరు అందని ద్రాక్షలానే మిగిలిపోయింది. పక్కా ఇళ్లు లేక, శిథిలావస్థకు చేరిన మట్టి గోడల మధ్య గిరిజనులు దుర్భర జీవనం సాగిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోకపోవడంతో గిరిజన కుటుంబాలు తీవ్ర నిరాశలో ఉన్నాయి. హామీలు ఘనం.. అమలు శూన్యం సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఇళ్లు లేని ప్రతి పేద కుటుంబానికి 2 నుంచి 3 సెంట్ల స్థలంతో పాటు, నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజన ప్రాంతాల్లో అర్హులైన ఒక్క లబ్ధిదారునికి కూడా ఇల్లు మంజూరు చేయలేదు. కనీసం ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియ కూడా అడుగు ముందుకు పడలేదు.గ్రామాల్లో ఇళ్లు లేని కుటుంబాలను గుర్తించేందుకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు 2.0 సర్వే పూర్తి చేసి ఏడాది గడిచినా, లబ్ధిదారుల నిరీక్షణ మాత్రం తప్పడం లేదు. అర్హులను గుర్తించినా.. పీఎంఏవై పథకం కింద ఇళ్లు మంజూరు చేయడమే లక్ష్యంగా, జిల్లాలోని 11 మండలాల్లో (పీవీటీజీ గిరిజనులు మినహా) ఇతర తెగలకు చెందిన 59,409 పేద గిరిజన కుటుంబాలను ప్రభుత్వం గుర్తించింది. జి.మాడుగులలో 7,640, ముంచంగిపుట్టులో 6,130, పెదబయలులో 6,013, అరకులోయలో 5,707, అనంతగిరిలో 5,609, డుంబ్రిగుడలో 5,348, గూడెంకొత్తవీధిలో 5,164, పాడేరులో 5,147, హుకుంపేటలో 4,907, చింతపల్లిలో 4,484, కొయ్యూరులో 3,259 చొప్పున మొత్తం 59,409 మంది అర్హులుగా తేలింది. వీరికి ఇంతవరకు ఇళ్ల నిర్మాణ అనుమతులు లభించలేదు. బిక్కుబిక్కుమంటూ.. జిల్లావ్యాప్తంగా వందలాది గిరిజన గ్రామాలు నేటికీ మట్టి గోడలు, పూరి గుడిసెలతోనే దర్శనమిస్తున్నాయి. ఎప్పుడు కూలుతాయో తెలియని ఆ శిథిల గృహాల్లోనే గిరిజనులు తలదాచుకుంటున్నారు. ముఖ్యంగా గాలివాన సమయాల్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడపాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చట్రాపల్లికి అన్యాయం 2024 సెప్టెంబర్ 8న సంభవించిన తుపాను బీభత్సానికి గూడెంకొత్తవీధి మండలం చట్రాపల్లిలో ఇళ్లు కోల్పోయిన గిరిజనులకు ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. బాధితుల కోసం అన్ని సౌకర్యాలతో కూడిన మోడల్ కాలనీ నిర్మిస్తామని అప్పట్లో జిల్లా ఇన్చార్జ్ మంత్రి సంధ్యారాణి, కలెక్టర్ దినేష్ కుమార్ ప్రకటించారు. కానీ నేటికీ ఆ ఊసే లేదు. ఇళ్లు పూర్తిగా ధ్వంసమైన ఆరు గిరిజన కుటుంబాలు గత్యంతరం లేక, తమకు తామే మళ్లీ మట్టి గోడలతో రేకుల షెడ్లను నిర్మించుకుని బతుకు వెళ్లదీస్తున్నాయి. తుపాను బాధితుల పట్ల కూడా ప్రభుత్వం ఇంతటి నిర్లక్ష్యం వహించడంపై స్థానికులు మండిపడుతున్నారు.ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి, సర్వేలో గుర్తించిన అర్హులకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించి, నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సొంతంగా నిర్మించుకున్నాం గతంలో వచ్చిన తుపానులో మా ఇళ్లు కొట్టుకుపోయి కట్టుబట్టలతో మిగిలాం. అప్పట్లో అధికారులు, మంత్రులు వచ్చి ఇక్కడ అన్ని సౌకర్యాలతో ‘మోడల్ కాలనీ’ నిర్మిస్తామని పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. కానీ ఆ తర్వాత మమ్మల్ని పట్టించుకున్న నాథుడే లేడు. ప్రభుత్వం నుంచి సాయం అందకపోయేసరికి, అష్టకష్టాలు పడి మళ్లీ మట్టిగోడలతో రేకుల గుడిసెలను మేమే నిర్మించుకున్నాం. పక్కా ఇళ్లు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. – జి. బలరామమూర్తి, చట్రాపల్లి, గూడెంకొత్తవీధి మండలంకూలే దశలో మట్టిగోడల ఇళ్లు పక్కా ఇళ్లు మంజూరు చేయాలని అనేకసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోతోంది. ప్రస్తుతం మేము ఉంటున్న మట్టిగోడల రేకుల గుడిసెలు ఏ క్షణాన కూలుతాయో తెలియని స్థితిలో ఉన్నాయి. వర్షాలు పడినా, గాలులు వీచినా ఇళ్లు కూలిపోతాయనే భయంతో రాత్రుళ్లు నిద్రపోవడమే మానేశాం. సర్వే చేసి ఏడాది దాటినా ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయకపోవడం మాకు జరుగుతున్న పెద్ద అన్యాయం. – చింత గంగమ్మ, బల్లగరువు, పినకోట పంచాయతీ, అనంతగిరి మండలం శిథిల గుడిసెల్లో దుర్భర జీవనం ఇళ్ల కేటాయింపు సర్వేలకు పరిమితం 59,409 మంది అర్హులను గుర్తించినా చర్యలు శూన్యం కూటమి పాలనలో గూడులేక అగచాట్లు


