breaking news
Alluri Sitarama Raju
-
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు
గంగవరం : గంగవరం, చిన్నఅడ్డపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురికి తీవ్ర గాయాలైయ్యాయి. శుక్రవారం గంగవరం– అడ్డతీగల జాతీయ రహదారిపై ఈ ప్రమాదాలు జరిగాయి. చిన్న అడ్డపల్లి వద్ద బైక్, బైక్ ఎదురు ఎదురుగా ఢీకొట్టడంతో గంగవరం గ్రామానికి చెందిన కురసం వెంకన్నదొర (35) అనే వ్యక్తికి, గంగవరం మండలం టేకుల గ్రామానికి చెంది ఒక మహిళకు తీవ్ర గాయాలైయ్యాయి. వెంకన్నదొర తలకు తీవ్ర గాయం కాగా, మహిళకు ఓ చేయి విరిగి గాయమైంది. వారిని రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు/. గంగవరం పోలీసు స్టేషన్ సమీపంలో జరిగిన మరో మైక్ ప్రమాదంలో కోరుకొండ ప్రాంతానికి చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ముగ్గురుని రంపచోడవరం ఆస్పత్రికి స్థానికులు తరలించారు. -
సారా స్వాధీనం
హుకుంపేట: గ్రామల్లో సారా విక్రయాలు, తయారీ చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సన్యాసినాయుడు,ఎకై ్సజ్ సీఐ టి.వి.వి.ఎస్.ఆచార్య చెప్పారు. మండలంలోని తీగలవలస పంచాయతీ రాతులపుట్టు గ్రామంలో ఎకై ్సజ్ శాఖ,స్థానిక పోలీస్లు సంయుక్తంగా శుక్రవారం సారా బట్టీలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 5వేల లీటర్లు సారా, పులుపు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామల్లో సారా తయారీలు, విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్ఐ సూర్యనారయణ తదితరులు పాల్గొన్నారు. -
న్యూస్రీల్
మెరుగైన వైద్యం అందించండి ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు పాడేరు: రోగులకు మెరుగైన వైద్యం అందించాలని పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు ఆదేశించారు. శుక్రవారం ఆయన స్థానిక జిల్లా ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో క్యాజువాల్టీతో పాటు వార్డుల్లోకి వెళ్లి రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్యసేవల వివరాలను తెలుసుకున్నారు. రోగులకు అందిస్తున్న పౌష్ఠికాహారంపై ఆరా తీశారు. అత్యవసర సమయాల్లో ఆస్పత్రికి వచ్చే రోగులను వైద్య సిబ్బంది సకాలంలో స్పందించి తగిన వైద్య చికిత్స అందించాలన్నారు. ఆయన వెంట జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విశ్వమిత్ర, వైఎస్సార్సీపీ వలంటీర్ల విభాగం జిల్లా అధ్యక్షుడు కొమ్మా రాంబాబు, వైఎస్సార్సీపీ నాయకుడు తెడబారికి సురేష్కుమార్ పాల్గొన్నారు. -
నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా
పాడేరు : విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయాలని ఏపీ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీతేజ్ సూచించారు. శుక్రవారం ఆయన పాడేరులో పర్యటించారు. పెదబయలు మండలం చుట్టుమెట్ట గ్రామాన్ని సందర్శించారు. పీఎం జన్మన్ పథకంలో పీవీటీజీలకు అందజేస్తున్న విద్యుత్ సౌకర్యాన్ని ఆయన లబ్ధిదారులతో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం పాడేరు విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.విద్యుత్ బిల్లుల వసూళ్లు, ప్రస్తుతం ఉన్న విద్యుత్ బకాయిలపై ఆరా తీశారు. విద్యుత్ బిల్లులు బకాయిలు త్వరగా వసూలు అయ్యేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలన్నారు. వర్షాకాలం కావడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. ఎక్కడైనా మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నప్పుడు ముందుగానే పత్రిక ప్రకటన ద్వారా వినియోగదారులకు సమాచారం ఇవ్వాలన్నారు. విద్యుత్ శాఖ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం ఆయనను అధికారులు, సిబ్బంది సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సర్కిల్ ఎస్ఈ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (టెక్నికల్) ఎల్సీహెచ్ పాత్రుడు, ఫైనాన్స్ ఆఫీసర్ ఎ. శ్యామలరావు, పాడేరు డీఈ వేణుగోపాల్, రంపచోడవరం ఈఈ గాబ్రియల్, ఎంఆర్టీ ఈఈ చెల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. ఏపీ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, ఎండీ పృథ్వీతేజ్ -
భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు
సాక్షి,పాడేరు: పట్టణంలోని ఉమానీలకంఠేశ్వరస్వామి సమేత రాజరాజేశ్వరి ఆలయంలో శుక్రవారం సాయంత్రం సాముహిక వరలక్ష్మితల్లి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఆలయ ప్రధాన అర్చకుడు రామం ఆధ్వర్యంలో రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి రమాదేవి, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఉప్పల వెంకటరత్నం, వైదేహి, ఇతర ప్రతినిధులు కొట్టగుళ్లి రామారావు, కొమ్మోజు వెంకటరమణ, సిద్దనాతి కొండలరావు, వంతిన్బ రాజబాబు, కిముడు ప్రభాకరరావు, దేశిది బాబురావు, పోతురాజు తదితరులు పాల్గొన్నారు. -
భూ సంబంధిత సమస్యల పరిష్కారమే లక్ష్యం
మహారాణిపేట : ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం కాకుండా కాపాడటం, భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అదనపు డైరెక్టర్ ఆర్.గోవిందరావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్తో కలిసి ఆయన వివిధ అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. భూముల రీ–సర్వేను వేగవంతం చేయాలని, ప్రభుత్వ, ప్రైవేటు భూముల నిర్ధారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని గోవిందరావు ఆదేశించారు. గ్రామ, మండల సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. దరఖాస్తుదారుని సమస్య పరిష్కారం కాకపోతే, కారణాలను స్పష్టంగా వివరించాలని కోరారు. అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, గతంలో ఇళ్ల స్థలం మంజూరైనప్పటికీ నిర్మాణం చేపట్టని వారికి 3 సెంట్లు మంజూరు చేయాలని తహశీల్దార్లకు సూచించారు. వివాదాలు లేని ప్రభుత్వ ఆక్రమిత భూములను క్రమబద్ధీకరించడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఇది ఒక సంక్షేమ కార్యక్రమమని ఆయన పేర్కొన్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు, భూ హక్కు పుస్తకాల జారీని వేగవంతం చేయాలని, ఎస్సీ బరియల్ గ్రౌండ్స్ కోసం స్థలాలను గుర్తించి మంజూరు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో కె. భవాని శంకర్, భీమిలి ఆర్డీవో సంగీత్ మహదుర్, ఏడీ సర్వే శాఖ కె. సూర్యారావు, మండల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
దేవమాత మహోత్సవాలు ప్రారంభం
కంచరపాలెం: జ్ఞానాపురంలోని సెయింట్ పీటర్ పునీత పేతురు ప్రధాన దేవాలయంలో శతాబ్దకాలంగా నిర్వహిస్తున్న దేవమాత మోక్షారోపణ ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ జోన్నాడ జాన్ ప్రకాష్ దివ్యబలి పూజ, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మరియమాత ఏ విధంగా ఏసుక్రీస్తుకు చిత్తానుసారంగా జీవించి లోకానికి తల్లిగా మారిందో ఆయన వివరించారు. అనంతరం పారిస్ పాస్టోరల్ కౌన్సిల్ (పీపీసీ) ఆధ్వర్యంలో పీపీసీ అధ్యక్షుడు శ్రీముసురు రాజేష్బాబు దేవమాత పతాకాన్ని ఆవిష్కరించారు. సెబాస్టియన్ కాలనీ, బిషప్ మరియదాస్ కాలనీ, మదర్థెరిస్సా కాలనీ, రావులపల్లి, వడిచర్ల, నికోలస్, డయాస్, రాసా వీధుల్లో దేవమాత తేరును భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. కార్యక్రమంలో చర్చి ఫాదర్లు ఎస్.వియల్రాజ్, వై.ప్రేమ్కుమార్, పీపీసీ సభ్యులు, గురు మండలి సలహా సంఘం సభ్యులు, అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. తేరు స్వరూపాన్ని ప్రారంభిస్తున్న ఫాదర్ జొన్నాడ జాన్ ప్రకాష్ -
వాల్తేర్ డివిజన్ రన్నింగ్ స్టాఫ్ నిరాహార దీక్ష
తాటిచెట్లపాలెం: ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు డివిజన్లో పనిచేస్తున్న రన్నింగ్ స్టాఫ్ తమ సమస్యల పరిష్కారం కోసం నిరాహారదీక్ష చేపట్టారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మర్రిపాలెం డివైడీ క్రూ లాబీ వద్ద శుక్రవారం జరిగిన ఈ నిరసనలో సిబ్బంది పలు డిమాండ్లను రైల్వే యాజమాన్యం ముందుంచారు. రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం రన్నింగ్ రూమ్లు ఏర్పాటు చేయాలని, రన్నింగ్ సిబ్బందికి కనీసం 120 కిలోమీటర్ల మైలేజీకి హామీ ఇవ్వాలని, ప్రస్తుగ్రెతం 16 గంటల పాటు విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పనివేళలను సైన్ ఇన్ నుంచి సైన్ అవుట్ వరకు 9 గంటలకు పరిమితం చేయాలని, రాత్రి షిఫ్టులు రెండు రోజులకు మించి కొనసాగించకూడదని, 36 గంటల్లోగా హోం స్టేషన్కు తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ జోనల్ ప్రెసిడెంట్ జె.సంపత్కుమార్ మాట్లాడుతూ వాల్తేరు డివిజన్ సిబ్బంది భారతీయ రైల్వేల్లో అత్యధిక ఓవర్ టైం పనిచేస్తున్నారని, అత్యధిక లోడింగ్ రికార్డు సాధించడంలో వారి కృషి కీలకమన్నారు. ఈ నేపథ్యంలోనే వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. నిరాహార దీక్ష ఫలితంగా జీఎం కమిటీ వేశారని తెలిపారు. యూనియన్ ప్రతినిధులు, అధికారులతో కూడిన కమిటీ సమావేశం తర్వాత డిమాండ్లను 10 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సాయంత్రం దీక్ష విరమించారు. కార్యక్రమంలో డివిజనల్ కోఆర్డినేటర్ టి.వి.మౌళి, యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.నరసింగరావు, డిప్యూటీ డివిజినల్ కోఆర్డినేటర్ ఎ.వెంకటరావు, అడిషనల్ జాయింట్ జనరల్ సెక్రటరీ కె.నాగేశ్వరరావు, ఇతర నాయకులు, రైల్వే కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ రవికాంత్ పాల్గొన్నారు. -
గ్రామ సమస్యలను విస్మరిస్తున్న కూటమి ప్రభుత్వం
చింతపల్లి: మండలంలో గల మారుమూల గ్రామాల సమస్యలపై కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. ఆమె శుక్రవారం మండలంలో లోతుగెడ్డ, కుడుమసారి, బలపం పంచాయతీ పరిధిలో గల గ్రామాలను ఆమె సందర్శించారు. ఈ సందర్బంగా లోతుగెడ్డ వంతెన నుంచి మూలకొత్తూరు వరకు రోడ్డు అధ్వానంగా ఉందని, ప్రభుత్వం, అధికారులు స్పందించి మరమ్మతు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాలకు ఈ రహదారి చాలా ప్రధానమన్నారు. ప్రస్తుతం రాళ్లు తేలి అధ్వానంగా ఉన్న ఈ మార్గంలో రాకపోకలకు ఆయా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రోడ్డు నిర్మాణ పనులకు చేపట్టక పోతే స్థానికులతో కలసి రహదారిపై ధర్నా కార్యక్రమాన్ని చేపడుతామని హెచ్చరించారు. ఎంపీపీ కోరాబు అనూషదేవి, జెడ్పీటీసీ పోతురాజు బాలయ్యపడాల్, వైస్ ఎంపీపీ వెంగళరావు, బలపం సర్పంచ్ రమేష్నాయుడు, ఎంపీటీసిలు మోహనరావు, సోని, నాయకులు బాబూరావు, రమణ, యెసేపు, శ్రీరాములు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
వినతులకే పరిమితం
ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తిది అరకులోయ మండలం బస్కీ పంచాయతీ బొందగూడ గ్రామం. గ్రామంలో 2011 నుంచి అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనం పూర్తి చేయాలని కోరుతూ పాడేరు ఐటీడీఏలో నిర్వహిస్తున్న మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీఓ తదితర ఉన్నతాధికారులు ఇప్పటి వరకు ఏకంగా 11 సార్లు వినతిపత్రాలను అందజేశారు. కానీ సమస్యపై కనీస స్పందన లేదు. తమ సమస్యపై అధికారులు ఏ మాత్రం కూడా స్పందించడం లేదని సమస్యలు పరిష్కారం కానీ మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించడం ఎందుకని కిల్లో రామన్న ఆవేదన వ్యక్తం చేశారు. పాడేరు: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి శుక్రవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థపై ఆర్జీదారుల్లో రోజు రోజుకు నమ్మకం సన్నగిల్లుతుంది. ఒకే సమస్యపై అనేకసార్లు అధికారులకు వినతులు అందజేస్తున్నా పరిష్కారం కావడం లేదని అర్జీదారులు వాపోతున్నారు. తాము అందజేస్తున్న ఫిర్యాదులు బుట్టదాఖలు అవుతున్నాయని ఆరోపిస్తున్నారు. శుక్రవారం ఐటీడీఏల నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, ట్రైనీ కలెక్టర్ సాహిత్, డీఆర్వో పద్మాలత వివిద ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్జీదారుల నుంచి 81 వినతులు స్వీకరించారు. ఫిర్యాదులలో కొన్ని : ● హుకుంపేట మండలం మత్య్సపురం పంచాయతీ సెంబీ గ్రామానికి చెందిన కొర్రా బొంజుబాబు, పి.చిరంజీవి బురదమామిడి నుంచి సెంబీ గ్రామం వరకు పక్కా రోడ్డు నిర్మించాలని వినతిపత్రం అందజేశారు. ● కొయ్యూరు మండలం కొమ్మిక పంచాయతీ పంచాయతీ డేగలపాలెం గ్రామానికి చెందిన డి.సత్యనారాయణ, డి.గరువులు, డి.రాంబాబు వ్యవసాయ పనుల నిమిత్తం విద్యుత్ లైన్ వేయాలని వినతిపత్రం అందజేశారు. ● చింతపల్లి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన కె.శ్రీనివాసరావు గిరిజనుల దుకాణాలు తొలగింపు సరికాదని, తక్షణమే వేరే చోట దుకాణాలు కేటయించాలని వినతిపత్రం అందజేశారు. ● హుకుంపేట మండలం తాటిపూడి పంచాయతీ నిమ్మలపాడు గ్రామానికి చెందిన రేగం రామన్న వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. అర్జీలిచ్చినా పరిష్కారం కాని సమస్యలపై గిరిజనుల ధ్వజం మీ కోసం కార్యక్రమంపై ప్రజల్లో సన్నగిల్లుతున్న నమ్మకం అధికారులు పట్టించుకోవడం లేదు మాది జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ మద్దివీధి గ్రామం. మా గ్రామంలో నేటి వరకు కనీస సీసీ రోడ్లు, డ్రైనేజీలు లేవు. వర్షకాలంలో గ్రామంలోని వీధులన్ని చిత్తడిగా మారుతున్నాయి. పారిశుద్య సమస్య తలేత్తుతుంది. గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించాలని మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో ఇప్పటి వరకు ఈ ఏడాది కాలంలో ఏడుసార్లు అధికారులకు వినతులు అందజేశాను. కానీ తమ సమస్యపై అతిగతి లేదు. – జి. రఘునాఽథ్, మద్దివీధి గ్రామం. విన్నవించుకున్నా ఫలితం లేదు మాది హుకుంపేట మండలం తాడేపుట్టు గ్రామం. మాది నిరుపేద కుటుంబం. నేటికి సొంత నివాస స్థలం లేదు. ఇంటి స్థలం కేటాయించాలని పాడేరు ఐటీడీఏలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ఏడాది కాలంలో మూడుసార్లు ఫిర్యాదు చేశాను. కానీ అధికారులు ఒక్కసారి కూడా స్పందించలేదు. ఈ కార్యక్రమంపై తనకు నమ్మకం లేదు. – మర్రి బాబూరావు, తాడేపుట్టు, హుకుంపేట మండలం. -
ఉపాధ్యాయుల్లేని పాఠశాల
● కొమ్ములువాడలో రెండు నెలలుగా మూత ● ఆందోళనకు దిగిన విద్యార్థుల తల్లిదండ్రులు సీలేరు: గూడెంకొత్తవీధి మండలం దుప్పులవాడ పంచాయతీ కొమ్ములువాడలో రెండు నెలలుగా పాఠశాల తెరచుకోలేదు. ఇక్కడ ఒకటి నుంచి 5వ తరగతి వరకు 40 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులకు బదిలీ అయింది. వారి స్థానంలో ఎవరినీ నియమించకపోవడంతో పాఠశాల మూతపడి ఉంటోంది. దీనివల్ల తమ పిల్లల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. తక్షణమే పాఠశాల తెరిపించేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
అంగన్వాడీ కేంద్రాలకు ట్యాబ్లు ఇవ్వాలి
కొయ్యూరు: అంగన్వాడీ కేంద్రాలకు ట్యాబ్లు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన రాజేంద్రపాలెంలో నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. వర్కర్ల వేతనాన్ని నెలకు రూ.26 వేలకు పెంచాలని కోరారు. మినీ కేంద్రాలను ప్రధాన సెంటర్లుగా మారుస్తూ వెంటనే జీవో ఇవ్వాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లను తిరిగి సీడీపీవోలకు ఇచ్చేయ్యాలని వర్కర్లకు సూచించారు.అన్ని యాప్లను కలిపి ఒక దానిలో ఉంచాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా స్పందించకపోవడం దారుణమన్నారు. -
పండుటాకులపై పగ
సాక్షి,పాడేరు: పండుటాకులు, దివ్యాంగులు పింఛను పొందేందుకు నరకం చూశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామ వలంటీర్ల ద్వారా ప్రతినెలా ఒకటో తేదీ వేకువజామున పింఛను పొందిన వీరు ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటివద్దే పింఛను పంపిణీ చేస్తామన్న కూటమి ప్రభుత్వం ఆచరణలో విఫలమైంది. శుక్రవారం గ్రామాల్లో అందరినీ ఒకచోటకు రప్పించడంతో పండుటాకులు, వితంతువులు, దివ్యాంగులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. జిల్లాలో 430 పంచాయతీల పరిధిలోని 5108 గ్రామాలు ఉండగా వీటిలో 1,23,046 మంది సామాజిక పింఛన్దారులు ఉన్నారు. సచివాలయ ఉద్యోగులు ఒకొక్కరికి నాలుగు గ్రామాల్లో పింఛను పంపిణీ బాధ్యత అప్పగించడంతో వారంతా ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో పింఛనదారులను ఒక చోటకు రప్పించి అందజేస్తున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి గ్రామాల్లో సచివాలయ ఉద్యోగులకోసం గంటల తరబడి నిరీక్షించారు. మారుమూల గ్రామాల్లో పండుటాకుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ● పాడేరు మండలంలోని వనుగుపల్లి పంచాయతీలో సామాజిక పింఛన్దారులు తొలిరోజు పింఛన్ పొందేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.గంటల తరబడి రోడ్లపై నిరీక్షించారు.దివ్యాంగులు కూడా ఇబ్బందులు పడే రోడ్డుకు చేరుకున్నారు. ● తామరాపల్లి గ్రామంలో ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నరకయాతన పడ్డారు. – మారుమూల చీడిపాలెంలోని వృద్ధులు, దివ్యాంగుడు సుమారు రెండు గంటల పాటు కొండల్లో నడిచి బంగారుమెట్టకు చేరుకున్నారు. మధ్యాహ్నం 12.30గంటలకు పింఛన్సొమ్ము పొంది మళ్లీ అవస్థలు పడుతూ గ్రామానికి కాలినడకన చేరుకున్నారు. ఇలా ప్రతినెలా ఇబ్బందులు ఉన్నా కూటమి ప్రభుత్వం మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. పింఛను పొందేందుకు అష్టకష్టాలు ఊరందరికీ ఒకేచోట పంపిణీ ఉదయం 8గంటల నుంచి సచివాలయ సిబ్బందికోసం సడిగాపులు ఇబ్బందులు పడిన దివ్యాంగులు, వితంతువులు -
తల్లిపాలు శిశువుకు శ్రేయస్కరం
పాడేరు : తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరమని, బిడ్డ ఎదుగుదలకు సంజీవనిగా పనిచేస్తుందని జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీవో అభిషేక్ గౌడ అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా శుక్రవారం ఐటీడీఏ కార్యాలయంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల పోస్టర్లను సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, ట్రైనీ కలెక్టర్ సాహిత్, డీఆర్వో పద్మలత, డీఎంహెచ్వో డాక్టర్ విశ్వేశ్వరనాయుడు, ఐసీడీఎస్ పీడీ ఝాన్షీలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పుట్టిన గంటలోపే బిడ్డకు తల్లిపాలు తప్పనిసరిగా తాగించాలన్నారు. ముర్రు పాలు బిడ్డకు మొదటి టీకా అన్నారు. తల్లి పాలలో ప్రొటీన్లు, ఫ్యాటీ యాసిడ్స్, లాక్టోజ్, విటమిన్లు, ఇమ్యునోగ్లోబులిన్ బిడ్డ యొక్క సంపూర్ణ ఎదుగుదలకు, రోగ నిరోధక శక్తి పెంపునకు తోడ్పడుతుందన్నారు. బిడ్డకు తల్లి పాలు పట్టించడం ద్వారా తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుందన్నారు. బిడ్డకు పాలు పట్టే విధానం, జాగ్రత్తలు, చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. -
బాబు పాలనలో మోసం గ్యారంటీ
అరకులోయటౌన్: బాబు పాలనలో గిరిజనులకు మోసం గ్యారంటీగా జరుగుతుందని, అభివృద్ధి చేస్తామని ఎన్నికల ముందు హామీలు గుప్పించి, అధికార పీఠంలో కూర్చున్న తరువాత వాటి అమలుకు కుంటి సాకులు చెడబుతున్నారని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మండలంలోని చినలబుడు పంచాయతీ మంజగుడ గ్రామంలో ఎమ్మెల్యే మత్స్యలింగం శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు జగనన్న ప్రభుత్వ పాలనలో కరోన కష్టకాలంలో కూడా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఇంటింటికి వలంటీర్ల వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను అందించారన్నారు. చంద్రబాబు ఏడాది పాలనలో సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. మహిళలకు ఉచిత బస్సు, ఆడ బిడ్డ నిధి కింద ప్రతీ నెల రూ.1500, రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా రూ. 20వేలు, నిరుద్యోగులకు నెలకు నిరుద్యోగ భృతి రూ.3వేలు, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పి వాటిని అమలు చేయకుండా కుంటి సాకులు చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అరాచక, రెడ్బుక్ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో బుద్ధి చెబుతారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు మోసాలను గ్రామస్తులకు వివరించాలన్నారు. బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమంపై గిరిజనులకు అవగాహాన కల్పించి, క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయంచి బాబు మోసాలను వీడియో రూపంలో వివరించారు. పార్టీ పంచాయతీ కమిటీ ఎన్నికను ఆయన పర్యవేక్షించారు. కమిటీ వివరాలు చినలబుడు పంచాయతీ కమిటీ అధ్యక్షుడిగా గొల్లోరి లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శులుగా పాంగి కుమోన్, గొల్లోరి జగన్నాథం, నరసింగరావు, కిల్లో రఘురామ్, ఇరగాయి పంచాయతీ అధ్యక్షుడిగా మాదాల రామారావు, ప్రధాన కార్యదర్శులుగా గడబంటు భాస్కర్రావు, బురిడి విజయ్కుమార్, రాజ్కుమార్, తామల అప్పారావు, కార్యదర్శులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, సర్పంచ్ పెట్టెలి సుస్మిత, ఎంపీటీసీ సభ్యులు గరం సీత, దురియా ఆనంద్కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు స్వాభి రామ్మూర్తి, ఉపాధ్యక్షుడు పల్టాసింగ్ విజయ్కుమార్, బూత్ కమిటి ఇంచార్జీ పాంగి విజయ్, నియోజకవర్గం గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు సుక్రయ్య, ఉప సర్పంచ్ హరి, వార్డు సభ్యులు వీరన్న, సోమన్న, సీనియర్ నాయకుడు గరం పూర్ణ తదితరులు పాల్గొన్నారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం -
బరితెగింపు
ఆంధ్రా– ఒడిశా సరిహద్దులో దుండగులు పేట్రేగిపోతున్నారు. ఇంటి వద్ద ఉన్న బైక్లను అపహరిస్తున్నారు. దారికాసి తుపాకులు, కత్తులతో బెదిరించి చోరీలకు పాల్పడుతున్నారు. మారుమూల ప్రాంతాల్లో నిఘా వ్యవస్థ లేకపోవడాన్ని ఆసరాగా తీసుకుని చెలరేగిపోతున్నారు. గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న గ్రామసచివాలయ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సరిహద్దు గ్రామాల గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో పేట్రేగిపోతున్న దుండగులు2024 ఆగస్టు 23న ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రెయ్యిల పురుషోత్తంను కత్తులు, తుపాకులతో బెదిరించి బైక్ పట్టుకుపోయారు. వనగుమ్మి సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న అతను ఇంటికి వెళ్తుండగా బరడ పంచాయతీ డెనుజోలా ఘాట్లో మాస్క్లు ధరించిన ముగ్గురు వ్యక్తులు అడ్డగించారు. 2024 మార్చి 11 అర్ధరాత్రి ముంచంగిపుట్టు మండలం మాకవరంలో పాంగి సతీష్ ఇంటిపై ఒడిశాకు చెందిన దుండుగులు మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న వారిని తుపాకులు, కత్తులతో బెదిరించారు. వాళ్లతో బీరువా తాళాలు తీయించి రూ.2.10లక్షల నగదు, నాలుగున్నర తులాల బంగారం పట్టుకుపోయారు. ముంచంగిపుట్టు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో నిఘా వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం దుండగులకు కలిసివస్తోంది. ఒడిశా రాష్ట్రం నుంచి ఆంధ్రాలోకి మూడు మార్గాల్లో ప్రవేశించవచ్చు. జోలాపుట్టు, డుడుమ జలాశయాలపై ఉన్న మార్గాలతో పాటు పెదబయలులో ఒడిశాను ఆనుకుని నిర్మించిన వంతెన మార్గాన్ని దుండగులు ఎంచుకుంటున్నారు. ● పెదబయలు వంతెనపై ఎటువంటి గేట్లు లేకపోవడం, తనిఖీలు చేయకపోవడం చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఆస్కారం ఏర్పడుతోంది.ఆంధ్రా పరిఽధిలో నేరాలకు పాల్పడిన దుండగులు ఒడిశాలోకి వెళ్లిపోతున్నారు. వీరివద్ద మారణాయుధాలు ఉన్నందున అడ్డుకునేందుకు గిరిజనులు సాహసించలేకపోతున్నారు. ● జోలాపుట్టు, డుడుమ జలాశయాలపై ఉన్న మార్గాల్లో గేట్లు ఉన్నప్పటికీ తనిఖీలు జరగడం లేదు. ఇక్కడి సెక్యూరిటీ గార్డులు పట్టించుకోకపోవడంతో ఆంధ్రాలోకి వాహనాలు ఎంతో సులువుగా వచ్చేస్తున్నాయి. జలాశయాల వద్దకు వచ్చే వాహనాల వివరాలను సైతం రికార్డుల్లో నమోదు చేయడం లేదు. ఇక్కడ సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల సరిహద్దు గ్రామాల్లో దొంగతనాలు చేసి సునాయాశంగా ఒడిశాలోకి పారిపోతున్నారు. ఆంధ్రా నుంచి ఒడిశాలోకి వెళ్లిపోతే వారిని పట్టుకోవడం పోలీసులకు కష్టతరంగా మారుతోంది. అందువల్ల దుండగులు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ● ముంచంగిపుట్టు మండలంలోని బంగారుమెట్ట పంచాయతీ రాయిపల్లి గ్రామ సమీపంలో గురువారం సాయంత్రం వెల్ఫేర్ అసిస్టెంట్ను కత్తులు, తుపాకులతో బెదిరించారు. బ్యాంకునుంచి అతను తీసుకువస్తున్న సుమారు రూ.10 లక్షల పింఛను సొమ్మును లాక్కొని ఒడిశావైపు వెళ్లిపోవడం తెలిసిందే. ఇలాంటి నేరాలకు తరచూ పాల్పడుతున్నారు. ● 2024 జూన్,జూలై నెలల్లో ముంచంగిపుట్టులో ఇంటి వద్ద ఉన్న నాలుగు బైక్లను అపహరించి ఒడిశా వైపు వెళ్లిపోయారు. 2022లో ఐదు నెలల వ్యవధిలో ముంచంగిపుట్టు,పెదబయలు మండలాల్లో 21 బైకులు దొంగతనానికి గురయ్యాయి. వీటిలో కొన్నింటిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఒడిశాకు చెందిన కొంతమంది నిందితులను అరెస్టు చేశారు. ● 2024లో తరచూ దుండగులు చోరీలకు పాల్పడుతుండటంతో సరిహద్దులో ఆంధ్రా గ్రామాల ప్రజలు రాత్రివేళల్లో గస్తీ కాసేవారు. దీంతో కొన్నాళ్లపాటు తగ్గుముఖం పట్టాయి. పథకం ప్రకారం రెక్కీ.. మండలంలోని బంగారుమెట్ట పంచాయతీ రాయిపల్లి గ్రామ సమీపంలో గురువారం సాయంత్రం పింఛను సొమ్ము లాక్కొని పరారైన దుండగులు ముందుగానే రెక్కీ నిర్వహించారు. సీసీ పుటేజీల ఆధారంగా ఈ విషయం నిర్థారణ అయింది. ముంచంగిపుట్టు మండలంలో 6,152 పింఛన్దారులు ఉన్నారు. వీరికి పింఛను పంపిణీకి సంబంధించి రూ.2,61,71,000 అవసరం. పెదబయలు మండలంలో 6004 మంది పింఛనుదారులకు రూ.2,55,05,000 ఇవ్వాల్సి ఉంది. ఈ సొమ్మును ఆయా మండలాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సచివాలయ ఉద్యోగులు పెదబయలులోని ఎస్బీఐ నుంచి తీసుకువెళ్తుంటారు. ముంచంగిపుట్టులో ఎస్బీఐ ఉన్నప్పటికీ పెద్దగా టర్నోవర్ లేనందున పింఛను సొమ్ము డ్రా చేసే అవకాశం లేదు. దీనిని గమనించిన దుండగులు పథకం ప్రకారం దారికాసి తుపాకులు, కత్తులతో బెదిరించి పింఛను సొమ్మును పట్టుకుపోయారు. ఇళ్ల వద్ద బైక్ల అపహరణ కత్తులు, తుపాకులతో బెదిరించి దారి దోపిడీలు కొరవడిన నిఘా వ్యవస్థ సునాయాసంగా తప్పించుకుంటున్న వైనం భయాందోళనకు గురవుతున్న ఉద్యోగులు, ప్రజలు తనిఖీలు ముమ్మరం ఆంధ్ర ఒడిశా సరిహద్దులో రాకపోకలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. తనిఖీలు ముమ్మరం చేస్తున్నాం.రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం.రాత్రి 11గంటల తరువాత అత్యవసర పనుల మినహా, ఎవరు తిరిగినా చర్యలు తీసుకుంటాం.కొన్ని జంక్షన్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. అనుమానాస్పదంగా ఎవరు తిరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. – బి.శ్రీనివాసరావు, సీఐ, జి.మాడుగుల సర్కిల్ -
84.42 శాతం మేర పింఛన్ల పంపిణీ
సాక్షి,పాడేరు: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రానికి 84.42 శాతం మేర సామాజిక పింఛన్ల పంపిణీ చేశారు. జిల్లాలో 1,23,046 మంది పింఛనుదారులు ఉండగా, తొలిరోజు 1,03,875 మందికి పంపిణీ చేశారు. కొత్తగా మంజూరైన 1824మంది వితంతువుల పింఛన్ల పంపిణీని జాయింట్ కలెక్టర్ డాక్టర్ అభిషేక్గౌడ మినుములూరులో ప్రారంభించారు. పలువురి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సామాజిక పింఛన్ సొమ్మును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రత్నకుమారి, సర్పంచ్ లంకేల చిట్టమ్మ, వెలుగు ఏపీడీ మురళీ, వీఆర్వో సంధ్య పాల్గొన్నారు. -
ఏయూలో తికమక పాలన
● మూడు విభాగాలకు నూతన హెచ్వోడీలు ● జర్నలిజం విభాగాధిపతిగా పొలిటికల్ సైన్స్ ఆచార్యుడు ● థియేటర్ ఆర్ట్స్ హెచ్వోడీగా ఫైన్ ఆర్ట్స్ ప్రొఫెసర్ ● ఇద్దరూ సంబంధం లేని విభాగాలకు అధిపతులు మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పాలన పక్కదారి పడుతోంది. సంబంధం లేని విభాగాలకు చెందిన ఆచార్యులను హెచ్వోడీలుగా నియమించడం చర్చనీయాంశమైంది. జర్నలిజంలో ఉన్న ముగ్గురు ప్రొఫెసర్లను కాదని ఇతర విభాగానికి చెందిన ఆచార్యుడిని విభాగాధిపతిగా చేయడం హాట్ టాపిక్గా మారింది. ఏయూలో తీసుకుంటున్న తికమక నిర్ణయాలు కారణంగా పాలన గాడి తప్పుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గురువారం ఏయూలో మూడు విభాగాలకు హెచ్వోడీలను నియమించారు. ఇందులో హిందీకి అదే విభాగానికి చెందిన ప్రొఫెసర్ను హెచ్వోడీగా పెట్టారు. మిగిలిన రెండు విభాగాలకు సంబంధం లేని వారిని హెచ్వోడీగా నియమించారు. జర్నలిజం విభాగాధిపతిగా పొలిటికల్ సైన్స్ ఆచార్యుడు పి.ప్రేమానందంకు అవకాశం కల్పించారు. వాస్తవానికి జర్నలిజం విభాగానికి ముగ్గురు సీనియర్ ఫ్యాకల్టీలు ఉన్నారు. వీరిలో ఒకరిని హెచ్వోడీగా నియమించే అవకాశముంది. కానీ వీరిని పక్కనపెట్టి పొలిటికల్ సైన్స్కు చెందిన హెచ్వోడీని నియమించడం గమనార్హం. అలాగే థియేటర్ ఆర్ట్స్ విభాగాధిపతిగా ఫైన్ ఆర్ట్స్ హెచ్వోడీ డి.సింహాచలంను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిద్దరూ తమ సొంత విభాగాలకు హెచ్వోడీలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక విభాగంలో విభాగాధిపతిగా పనిచేస్తున్న వారిని మరో విభాగానికి హెచ్వోడీగా నియమించడం కూడా వివాదాస్పదమవుతోంది. అతిథి అధ్యాపకుల నియామకాలకు ఇంటర్వ్యూలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హడావుడిగా ఈ నియామకాలు జరగడం వెనుక ఆంతర్యం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇది అనుచిత లబ్ధి చేయడానికా? లేదా అణిచివేయడానికా అని అతిథి అధ్యాపకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ప్రిన్సిపాల్ థియేటర్ ఆర్ట్స్, జర్నలిజానికి ఇన్చార్జ్ హెచ్వోడీగా వ్యవహరిస్తున్నారు. పనిభారం పెరిగిపోవడంతో పాటు వివిధ విభాగాలకు హెచ్వోడీలుగా బాధ్యతలు నిర్వహించడం ఆయనకు తలకు మించిన భారంగా మారింది. వర్సిటీ అధికారుల నుంచి కూడా సహకారం అంతంత మాత్రంగానే ఉండడంతో ప్రిన్సిపాల్ ఈ బాధ్యతల నుంచి తప్పుకోవాలనే ఉద్దేశంతో హెచ్వోడీల నియామకం జరిగిందని మరో వాదన వినిపిస్తోంది. -
అప్పన్న కొండపై రూ.10 వేలతో పెళ్లి
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో వివాహాల నిమిత్తం డెకరేషన్ మండపాల నిర్వహణ బహిరంగవేలం ప్రక్రియను నిలుపుదల చేసినట్టు ఈవో వి.త్రినాథరావు ప్రకటించారు. ఎవరైనా ఆలయం పరిధిలో పెళ్లి చేసుకోవాలనుకుంటూ దేవస్థానానికి రూ.10 వేలు చెల్లించి, దేవస్థానం సూచించిన ప్రదేశాల్లో వివాహాలు చేసుకోవచ్చన్నారు. బయటి వ్యక్తులు/సంస్థల ద్వారా డెకరేషన్ మండపాలు, విద్యుద్దీపాలంకరణ జరిపించుకోవచ్చని పేర్కొన్నారు. వివాహ బృందాల నుంచి మండపాల కాంట్రాక్టర్ అధిక ధరలు వసూలు చేస్తుండటంతో భక్తులకు లబ్ధి చేకూర్చేందుకు డెకరేషన్ మండపాల లీజ్ విధానాన్ని నిలిపేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు ఉన్న డెకరేషన్ మండపాల నిర్వహణ కాంట్రాక్ట్ జూలై 31తో ముగిసిందన్నారు. కొండపై ఒకే సమయంలో గజపతి సత్రంలో రెండు వివాహాలకు, పాదాలమ్మ–బంగారమ్మ ఆలయాల వద్ద ఉన్న పార్కింగ్ స్థలంలో మూడు, లోవతోట వద్ద మూడు వివాహాలకు అనుమతి ఉంటుందన్నారు. భక్తులకు అసౌకర్యం లేకుండా కార్యనిర్వహణాధికారి అనుమతితో ఆయన సూచించిన ప్రదేశాల్లో కూడా వివాహాలు చేసుకోవచ్చన్నారు. వివాహం ముగిసిన మూడు గంటల్లోపు ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుందన్నారు. దేవస్థానానికి చెల్లించే రూ.10 వేలుకు అదనంగా రూ.5 వేలు అడ్వాన్స్ కింద చెల్లించాలని పేర్కొన్నారు. శానిటేషన్ నిర్వహణకు రూ.2 వేలు, విద్యుత్ అదనపు లోడ్ ఆధారంగా కొంత మొత్తం మినహాయించుకుని మిగిలిన మొత్తం వాపసు చేయనున్నట్లు వెల్లడించారు. భారీ స్థాయిలో విద్యుద్దీపాలంకరణ చేసుకునేవారు ప్రత్యేకంగా జనరేటర్ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
చింతపల్లి: విద్యార్థులకు నాణ్యమైన భోజనంతోపాటు ఆరోగ్యకర వాతావరణం ఉండేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ సీహెచ్ ఝాన్సీరామ్ అన్నారు. గురువారం రాత్రి ఆమె స్థానికంగ ఉన్న గిరిజన బాలసదనాన్ని సందర్శించారు. విద్యార్థుల గదులు, వంటశాల, సామగ్రి, స్టోర్ రూమ్ను పరిశీలించారు. అనంతరం రికార్డులను తనిఖీ చేశారు. విద్యార్థులతో కొంతసేపు ముచ్చటించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనను తిలకించారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. విద్యలో రాణించేలా ఆశ్రమంలో స్టడీ హవర్ ఏర్పాటు చేయాలన్నారు. బాలసదనంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీడీపీవో శ్రీదేవిని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీవో సద్దు, కౌన్సిలర్ జాహ్నవి, సూపర్వైజర్ జయభారతి, ఇన్చార్జ్ విజయలక్ష్మి, అకౌంటెంట్ వసంత పాల్గొన్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ఝాన్సీరామ్ ఆదేశం చింతపల్లిలో బాలసదనం సందర్శన విద్యార్థులతో కలిసి భోజనం -
పెళ్లయిన రెండు నెలలకే..
రాజవొమ్మంగి: అత్తవారింటికి కోటి ఆశలతో బయలుదేరాల్సిన నవ వధువు గుండె నొప్పితో కుప్పకూలి ప్రాణాలు విడిచింది. అందరినీ కన్నీరు పెట్టించిన ఈ హృదయ విదారక ఘటన గడుఓకుర్తి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఇదే గ్రామంలో గిరిజన కుటుంబానికి చెందిన రమాదేవి (21)కు సుమారు రెండు నెలల క్రితం ప్రత్తిపాడు మండలం బాపన్నదొర గ్రామానికి చెందిన రాజుబాబుతో వివాహం అయ్యింది. ఆషాఢ మాసం ముగియడంతో ఆమెను తీసుకువెళ్లేందుకు అత్తింటి నుంచి భర్త, ఇతర కుటుంబ సభ్యులు వచ్చారు. ఇంటిల్లి పాది రమాదేవిని అత్తవారింటికి పంపించే పనిలో సందడిగా ఉన్నారు. అప్పటివరకు ఇంట్లో అందరితో కలియ తిరిగిన రమాదేవి గుండెల్లో నొప్పి అంటూ ఒక్కసారిగా కుప్పకూలి స్పృహ కోల్పోయింది. కుటుంబసభ్యుల సమాచారం మేరకు అక్కడికి వచ్చిన 108 సిబ్బంది ఆమెకు సీపీఆర్ (కార్డియోపల్మనరీ రిససిటేషన్) చేసి ప్రాణం నిలిపేందుకు ప్రయత్నించారు. ఫలితం కనిపించకపోవడంతో వెంటనే రమాదేవిని లాగరాయి పీహెచ్సీకి తరలించారు. ఆమె అప్పటికే మృతి చెందినట్టు వైద్య సిబ్బంది తెలిపారు. కార్డియాక్ అరెస్టు వల్లే ఆమె చనిపోయి ఉండవచ్చని అంటున్నారు. ఆమె ఆకస్మిక మృతితో ఇరువైపు కుటుంబ సభ్యులు, బంధువులు పుట్టెడు దుఃఖంలో మునిగి పోయారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నవ వధువు రమాదేవి హఠాన్మరణం గుండెనొప్పితో కన్నుమూత అత్తవారింటికి వెళ్లే ఏర్పాట్లలో ఉండగా ఘటన గడుఓకుర్తి గ్రామంలో విషాదం -
ముగిసిన నవోదయ టేబుల్ టెన్నిస్ పోటీలు
● ఓవరాల్ చాంపియన్స్గా కృష్ణా క్లస్టర్ క్రీడాకారిణులు ఎటపాక: జవహర్ నవోదయ విద్యాలయాల రీజనల్ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు గురువారం ముగిశాయి. జూలై 29 నుంచి 31 వరకు స్థానిక నవోదయ విద్యాలయంలో జరిగిన ఈపోటీల్లో తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రా, కేరళ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది క్లస్టర్ల నుంచి 96 మంది ఈపోటీల్లో పాల్గొన్నారు. వీటిలో ప్రతిభ కనబర్చిన 30 మంది బాల,బాలికలను ఈనెల 18,19,20 తేదీల్లో అసోంలో జరగనున్న నేషనల్ గేమ్స్కు ఎంపిక చేశారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు స్థానిక డిప్యూటీ తహసీల్దార్ నాగేశ్వరరావు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. ఓవరాల్ చాంపియన్స్గా నిలిచిన కృష్ణా క్లస్టర్ ఎటపాక విద్యార్థినులను కోచ్ బాబూరావు, పీఈటీలు నిరుపమారాణి, జగన్లను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కేటీ ప్రసాద్, పేరెంట్స్ టీచర్ కౌన్సిల్ సభ్యులు శివబాబు, భాస్కర్, ఉపాధ్యాయులు భాస్కరాచారి, గౌరీశంకర్ పాల్గొన్నారు. -
జగన్ ప్రజాదరణ చూసి కూటమిలో వణుకు
● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ● నెల్లూరు పర్యటనలో సర్కార్ ఆంక్షలపై మండిపాటు అరకులోయ టౌన్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తుంటే కూటమి ప్రభుత్వం వెన్నులో వణుకు పుడుతోందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. గురువారం తన క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్ నెల్లూరు పర్యటనలో ప్రభుత్వ ఆంక్షలపై ఆయన మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి పర్యటించిన ప్రాంతానికి జనం రాకుండా ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డుపెడుతోందన్నారు. నెల్లూరు పర్యటన సమయంలో గ్రామాల చుట్టూ జేసీబీలతో గుంతలు తీయడం, కంచెలు వేయడం వంటి చేతకాని పనులు చేయడం సిగ్గు చేటన్నారు. వేలాది మందికి నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. గతంలో ఇటువంటి పరిస్థితి లేదన్నారు. వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకోవడం ఎవరి తరం కాదన్నారు. నెల్లూరు పర్యటన సమయంలో ప్రభుత్వ తీరు ఆక్షేపణేయంగా ఉందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, అవినీతిలో కూరుకుపోయి, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు భవిష్యత్లో తప్పకుండా మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్కుమార్, అరకు బూత్ కమిటీ ఇన్చారిర్జ పాంగి విజయ్ కుమార్, యువ నాయకుడు బోయి కిరణ్ కుమార్ పాల్గొన్నారు. -
పక్కాగా మధ్యాహ్న భోజన పథకం అమలు
రంపచోడవరం: ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నిబంధనల ప్రకారం మధ్యాహ్న భోజన పథకం పక్కాగా అమలు చేయాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాలను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పీవో విద్యార్థులతో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు చెప్పే పాఠ్యాంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. విద్యతోనే ఉన్నత స్థాయికి చేరువోవచ్చన్నారు. కళాశాల మైదానంలో చెత్తచెదారం లేకుండా ఎప్పకప్పుడు శుభ్రం చేయించాలని సూచించారు. రంపచోడవరం పీవో కట్టా సింహాచలం -
తొలి మ్యాచ్లో టైటాన్స్తో తలైవాస్ ఢీ
ఈ నెల 29 నుంచి ప్రో కబడ్డీ ప్రారంభం విశాఖ స్పోర్ట్స్: ప్రో కబడ్డీ 12వ సీజన్ ఈ నెల 29న పోర్ట్ స్టేడియంలో ప్రారంభం కానుంది. రాత్రి 8 గంటలకు జరిగే ఆరంభ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ జట్టు తమిళ తలైవాస్తో తలపడనుంది. ఏడేళ్ల విరామం తర్వాత విశాఖ మరోసారి ప్రో కబడ్డీ పోటీలకు ఆతిథ్యం ఇస్తోంది. ప్రస్తుత సీజన్లో తొలి విడత మ్యాచ్లు ఇక్కడే జరగనున్నాయి. తెలుగు టైటాన్స్ తమ రెండో మ్యాచ్ను ఈ నెల 30న యూపీ యోధాస్తో ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 7న బెంగాల్ వారియర్స్తో, 10న యు ముంబాతో విశాఖ వేదికగానే తలపడనుంది. ప్రో కబడ్డీ ప్రారంభ సీజన్ను తెలుగు టైటాన్స్ విశాఖపట్నం నుంచే మొదలుపెట్టింది. ఆ తర్వాత తమ హోమ్ గ్రౌండ్ను హైదరాబాద్కు మార్చింది. మధ్యలో మూడో, ఎనిమిదో సీజన్లకు విశాఖ ఆతిథ్యం ఇచ్చింది. ఈ సీజన్లో మొత్తం 12 జట్లు రౌండ్ రాబిన్ పద్ధతిలో తలపడనున్నాయి. తొలి విడత పోటీలు విశాఖపట్నంలో జరగనుండగా, తదుపరి విడత పోటీలు జైపూర్, చైన్నె, ఢిల్లీల్లో నిర్వహించనున్నారు. లీగ్ దశ ముగిసిన తర్వాత ప్లేఆఫ్ మ్యాచ్లు జరుగుతాయి. -
వట్టిగెడ్డ రిజర్వాయర్ నీరు విడుదల
రాజవొమ్మంగి: మండలంలోని అప్పలరాజుపేట అటవీప్రాంతంలోని వట్టిగెడ్డ రిజర్వాయర్ నీటిని గురువారం నీటిసంఘం సభ్యులు పంటకాలువకు విడుదల చేశారు. ఈ ప్రాజెక్ట్పై ఆరు గ్రామాల పరిధిలోని 6 వేల ఎకరాలు ఆధారపడి ఉంది. రిజర్వాయర్ పూడికతో నిండిపోవడంతో నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. మరోవైపు వర్షాభావం కారణంగా ప్రాజెక్ట్లోకి నీరు చేరలేదు. రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టం 16 అడుగులు కాగా ప్రస్తుతం రిజర్వాయర్లో 8 అడుగుల మేర మాత్రమే నీరు ఉంది. వర్షాభావం కారణంగా వరి నాట్లు ఇంకా ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో ఆయకట్టుకు నీరు విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్లో నీరు తక్కువగా ఉన్నందున రైతులు వంతుల వారీగా నీటిని మళ్లించుకుని పొదుపుగా వాడుకోవాలని నీటి సంఘం చైర్మన్ సత్యనారాయణ కోరారు. ఎంపీటీసీ సత్యనారాయణ, మాజీ సర్పంచ్ చీడిపల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
కత్తులతో బెదిరించి పింఛన్ సొమ్ము దోపిడీ
ముంచంగిపుట్టు: కత్తులు,తుపాకులతో బెదిరించి సుమారు రూ.10 లక్షల పింఛన్ సొమ్ము ఎత్తుకు పోయిన సంఘటన కిలగాడ పంచాయతీ రాయిపల్లి సమీపంలో గురువారం సాయంత్రం జరిగింది. పెదబయలు మండలం బొండాపల్లి గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా పని చేస్తున్న కటారి మత్స్య రాజు పెదబయలు ఎస్బీఐ బ్యాంకులో పింఛన్ సొమ్ము రూ.17 లక్షల 53 వేల 200లు తీసుకొని, డిజిటల్ అసిస్టెంట్కు లక్షా 47 వేలు ఇచ్చి, మిగిలిన రూ.15 లక్షల 6 వేల 200లతో బైకుపై బయలుదేరారు. ముంచంగిపుట్టు మండలం కిలగాడ పంచాయతీ చెరువుపాకల అయిన తన సొంత గ్రామానికి వస్తుండగా రాయిపల్లి గ్రామ సమీపంలో ఇద్దరు వ్యక్తులు ముఖానికి మాస్కులు వేసుకొని స్కూటీపై వచ్చి, బైకును అడ్డగించారు. కత్తులు, తుపాకులు చూపి చంపేస్తామని బెదిరించారు. అతని వద్ద ఉన్న పింఛన్ సొమ్మును లాక్కొని పారిపోయారు. అదే సమయంలో ఆ మార్గంలో బైకుపై వస్తున్న సీతగుంట పంచాయతీ కార్యదర్శి లక్ష్మణరావు కు జరిగిన విషయాన్ని వెల్ఫేర్ అసిస్టెంట్ మత్స్యరాజు చెప్పా రు. వీరిద్దరు బైకుపై దొంగలను వెంబడించే ప్రయత్నం చేశారు. ఇద్దరు దొంగలు ఒడిశా రాష్ట్రం పాడువ వైపు పారిపోతుండగా.. బలియగూడ వద్ద వారి స్కూటీ అదుపు తప్పింది. సంఘటన స్థలంలోనే స్కూటీ, రెండు సెల్ ఫోన్లు వదిలి దొంగలు గాయాలతోనే కొండప్రాంతం వైపు పారిపోయారు. దొంగలు వదిలి వెళ్లిపోయిన ఒడిశా రిజిస్ట్రేషన్తో ఉన్న స్కూటీ, రెండు సెల్ ఫోన్లు తీసుకొని, పెదబయలు ఎంపీడీవో పూర్ణయ్య సహాయంతో బాధితుడు మత్స్యరాజు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దొంగల స్కూటీని ఎస్ఐ పరిశీలించగా డిక్కీలో రూ.5 లక్షల నగదును గుర్తించారు. మిగిలిన రూ.10 లక్షల 6 వేల 200 సొమ్మును దొంగలు తీసుకొని వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. దుండగులు పెదబయలు బ్యాంక్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన రెక్కీకి సంబంధించిన సీసీ పుటేజీని వెల్ఫేర్ అసిస్టెంట్ మత్స్యరాజు సేకరించి పోలీసులకు అందజేశారు. ఒడిశాలోని పాడువ పోలీసుల సహకారంతో ముంచంగిపుట్టు, పెదబయలు పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సుమారు రూ.10 లక్షలు పట్టుకుపోయిన దుండగులు బ్యాంక్ నుంచి వెల్ఫేర్ అసిస్టెంట్ నగదు తెస్తుండగా తుపాకులతో అడ్డగింత రాయిపల్లి సమీపంలో ఘటన -
తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత పిల్లలదే
సాక్షి,పాడేరు: వృద్ధాప్యంలో తల్లిదండ్రులను సంరక్షించాల్సిన బాధ్యత పిల్లలపైనే ఉందని అసిస్టెంట్ కలెక్టర్ కనల చిరంజీవి నాగ వెంకట సాహిత్ అన్నారు. విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్లో పలుశాఖల అఽఽధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులను తీసుకుని వారిని వదిలేయడం, జీవనాధారం లేకుండా చేయడం చట్టరీత్యా నేరమన్నారు. పట్టణ ప్రాంతాల్లో జీవనాధారం లేక యాచిస్తున్న వృద్ధుల దృశ్యాలు ఆవేదన కలిగిస్తున్నాయన్నారు. సమాజంలో సీనియర్ సిటిజన్లను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. వృద్ధులైన తల్లిదండ్రులకు కనీస అవసరాలు, వసతితో కూడిన భోజనం, వైద్యసేవలు అందించాల్సిన బాధ్యత కన్న పిల్లలదేనన్నారు. సీనియర్ సిటిజన్ల రక్షణపై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. డీఆర్వో కె.పద్మలత మాట్లాడుతూ విద్యాసంస్థల్లో తల్లిదండ్రులు, వృద్ధుల సంక్షరణపై ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు,వయో వృద్ధుల సంక్షేమశాఖ ఏడీ కవిత మాట్లాడుతూ 70 ఏళ్లు పైబడిన వృద్ధులు ప్రధాన మంత్రి వయో వందన యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయాఽధికారి నందు, డీఈవో బ్రహ్మజీరావు, సర్వేశాఖ ఏడీ దేవేంద్రుడు, జిల్లా పట్టు పరిశ్రమ అధికారి అప్పారావు, జిల్లా పరిశ్రమలశాఖ అధికారి రవిశంకర్, డ్వామా పీడీ విద్యాసాగర్, జిల్లా పంచాయతీ అఽధికారి పి.చంద్రశేఖర్, సీఐ ధీనబంధు, హెరిటేజ్ పౌండేషన్ సంస్థ ప్రతినిధి టి.రవి తదితరులు పాల్గొన్నారు. అసిస్టెంట్ కలెక్టర్ నాగ వెంకట సాహిత్ -
చట్టాలపై అవగాహన
ముంచంగిపుట్టు: విద్యార్థినులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని ఎస్ఐ జె.రామకృష్ణ అన్నారు.మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల–1లో గురువారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో విద్యార్థినులు, మహిళలుపై జరుగుతున్న నేరాలు వాటి నుంచి రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.విద్యార్థినులకు ఉపయోగపడే పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థినులు, మహిళల రక్షణ కోసం పోలీసుశాఖ నిరంతరం పని చేస్తుందని, మహిళలు వారి హక్కులు, చట్టాలను వినియోగించుకోవాలని అన్నారు. ప్రస్తుతం సైబర్ నేరాలు పెరుగుతున్నాయని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. హెచ్ఎం కోడా లక్ష్మీ, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఎటపాక: మహిళల రక్షణ ,చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఎటపాక ఎస్ఐ అప్పలరాజు అన్నారు. గురువారం డాక్టర్ పాల్రాజ్ ఇంజనీరింగ్ కాలేజిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సామాజిక మాద్యమాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మహిళల చట్టాలు, హక్కులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.మహిళల భద్రతకు ఏర్పాటు చేసిన శక్తి యాప్ను వినియోగించుకోవాలని తెలిపారు. -
అక్రమ మైనింగ్పై చర్యలు తీసుకోవాలని వినతి
రంపచోడవరం:ఏజెన్సీలో అక్రమ మెటల్, గ్రానైట్ క్వారీల త్వవకాలపై సమగ్ర విచారణ జరిపి తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను కోరారు. ఈ మేరకు గురువారం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలంకు వినతిపత్రాన్ని అందజేశారు.దీనిపై స్పందించిన పీవో రంపచోడవరం సబ్ కలెక్టర్ను విచారణ అధికారిగా నియమిస్తానని తెలిపినట్లు పెర్కొన్నారు. అనంతరం సంఘం నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కుంజా శ్రీను మాట్లాడుతూ ఏజెన్సీలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతుందని, ఖనిజ సంపద అంతా కూడా దోచుకుపోయే పరిస్దితి ఏర్పడిందన్నారు. ఏజెన్సీ చట్టాలకు విరుద్దంగా కొనసాగుతున్న మైనింగ్లపై ప్రభుత్వ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఏజెన్సీలో పీసా చట్టం నిబంధనల మేరకు సొసైటీలు ద్వారా మాత్రమే మైనింగ్ కొనసాగించాల్సి ఉందన్నారు. బినామీలు లేకుండా సొసైటీలు ద్వారా గిరిజనులే క్వారీలు చేసుకుంటే అభివృద్ది చెందవచ్చన్నారు. బాబూరావు, నూకరాజు, ప్రదీప్దొర, గంగాల అబ్బాయిదొర, పీఠ ప్రసాద్, చోడి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. గిరిజన చట్టాలు పటిష్టంగా అమలుచేయాలి గంగవరం : ఏజన్సీ ప్రాంతంలో గిరిజన చట్టాలు పటిష్టంగా అమలు చేసేందుకు ఆదివాసీలంతా ఐక్యంగా పోరాటంలో భాగస్వామ్యం కావాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ఆదివాసీ సంక్షేమ పరిషత్ సమావేశంలో కుంజ శ్రీను మాట్లాడారు. ఏజన్సీలో ఆదివాసీ చట్టాలు 1/70 చట్టం, పీసా చట్టాలు గ్రామ స్థాయిలో పటిష్ట అమలకు పీసా గ్రామ కమిటీలు కృషి చేయాలన్నారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ ప్రతినిధులు బాబూరావు, నూకరాజు, ప్రదీప్కుమార్, ప్రసాద్, అబ్బాయిదొర, ప్రసాద్దొర, ఏడుకొండలరావు, చైతన్యతేజ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ డిమాండ్ -
నాణ్యమైన విద్యనందించాలి
అనకాపల్లి: విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన విద్యను అందించాలని ఇంటర్మీడియట్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ మజ్జి ఆదినారాయణ అధ్యాపకులకు సూచించారు. గురువారం స్థానిక మెయిన్రోడ్డు ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాల ఆవరణలో జిల్లాలో వివిధ ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధ్యాపకులు ఉదయం 9లోపు, సాయంత్రం 5 గంటల తర్వాత ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా అటెండెన్స్ తప్పనిసరిగా వేయాలన్నారు. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేందుకు కృషి చేయాలన్నారు. కళాశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలన్నారు. అనంతరం ఇక్కడ కళాశాలలో తరగతుల్లోకి వెళ్లి బోధన విషయంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇంటర్మీడియట్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ మజ్జి ఆదినారాయణ -
ఆ.. టీచర్లకు కూటమి ఝలక్!
ఆరిలోవ: మండల విద్యాశాఖాధికారుల(ఎంఈవో) నియామకాల విషయంలో కూటమి ప్రభుత్వం జిల్లా పరిషత్, మున్సిపల్, కేజీబీవీ ఉపాధ్యాయులకు ఝలక్ ఇచ్చింది. కేవలం ప్రభుత్వ యాజమాన్యంలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు(హెచ్ఎంలు), స్కూల్ అసిస్టెంట్లకు మాత్రమే ఎంఈవో–1 పోస్టులకు అవకాశం కల్పిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఉమ్మడి సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించడం, తమకు అన్యాయం చేయడమేనని జెడ్పీ, మున్సిపల్ హైస్కూళ్లు, కేజీబీవీ వంటి పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్కు గండి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతి మండలంలో ఎంఈవో–1, ఎంఈవో–2 పోస్టులను ఏర్పాటు చేసింది. దీని కింద ఉమ్మడి విశాఖ జిల్లాలోని 46 మండలాల్లో 92 మంది ఎంఈవోలు నియమితులయ్యారు. ప్రస్తుత విశాఖ జిల్లా పరిధిలోని 11 మండలాల్లో 22 మంది విధుల్లో ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న హెచ్ఎంలు, సీనియర్ స్కూల్ అసిస్టెంట్లకు మాత్రమే ఎంఈవో పోస్టులకు అవకాశం కల్పించారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసి, వివరాలు సేకరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయం వల్ల జెడ్పీ, మున్సిపల్, కేజీబీవీ వంటి ఇతర యాజమాన్యాల కింద పనిచేస్తున్న అర్హులైన ఉపాధ్యాయులు పదోన్నతి అవకాశాన్ని కోల్పోతారు. 2017లో అనుసరించిన విధంగానే కామన్ సీనియార్టీ ఆధారంగా ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం జెడ్పీ, మున్సిపల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్సీ) ద్వారా నియమితులైనవారే. వారందరిలో సీనియార్టీ ప్రకారం హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు ఎంఈవో పోస్టులకు అర్హులు. అయినప్పటికీ కామన్ రూల్స్ పాటించకుండా కేవలం ప్రభుత్వ పాఠశాలల వారికే అవకాశం ఇవ్వడం ద్వారా ప్రభుత్వం తమపై వివక్ష చూపుతోందని ఇతర యాజమాన్య ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. కాగా.. ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లాలో పని చేస్తున్న ఎంఈవోలందరూ పూర్తిస్థాయి అదనపు బాధ్యతల(ఎఫ్ఏసీ) కిందనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో అన్ని యాజమాన్యాలకు చెందిన 297 ఉన్నత పాఠశాలలు ఉండగా, వాటిలో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు కేవలం 31 మాత్రమే. ఈ 31 పాఠశాలల్లోని కొద్ది మందికి మాత్రమే ఎంఈవోలుగా అవకాశం కల్పిస్తూ.. మిగిలిన 266 పాఠశాలల్లో పని చేస్తున్న వేలాది మంది ఉపాధ్యాయులను విస్మరించడం సరికాదని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. జెడ్పీ టీచర్లపై ఎందుకు వివక్ష? ప్రభుత్వ యాజమాన్యంలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు మాత్రమే ఎంఈవో–1 బాధ్యతలు అప్పగించడం సరికాదు. జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయు లపై వివక్ష చూపడమే అవుతుంది. సుమారు రెండు దశాబ్దాలుగా జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు వివక్షకు గురవుతున్నారు. గైడ్లైన్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని జూనియర్లు కూడా ఎంఈవోలు అవుతారు. సీనియర్లయిన ఉపాధ్యాయులు మాత్రం పదోన్నతి కోల్పోతారు. – పైడిరాజు, ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి, విశాఖ జిల్లా ప్రభుత్వ యాజమాన్య హైస్కూల్ హెచ్ఎం, ఎస్ఏలకు మాత్రమే ఎంఈవోలుగా అవకాశం రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ మిగిలిన యాజమాన్య టీచర్లపై వివక్ష ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం అన్ని మేనేజ్మెంట్లకు అవకాశం కల్పించాలి అన్ని మేనేజ్మెంట్లకు చెందిన ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న హెచ్ఎంలకు, సీనియర్ స్కూల్ అసిస్టెంట్లకు ఎంఈవో–1గా అవకాశం కల్పించాలి. వారిని కూడా పూర్తిస్థాయి ఎంఈవోలుగా నియమించాలి. అలాంటప్పుడే మంచి విద్యా విధానం కొనసాగుతుంది. ఎఫ్ఏసీ బాధ్యతల వల్ల సక్రమంగా విధులు నిర్వహించక సరైన విద్యా ఫలితాలు రావడం లేదు. ప్రభుత్వం పునరాలోచించాలి. – గోపీనాథ్, పీఆర్టీయూ ఉమ్మడి విశాఖ జిల్లా కన్వీనర్ సీనియార్టీ ద్వారా భర్తీ చేయాలి ఎంఈవో–1 పోస్టులను ఉమ్మడి సీనియార్టీ ద్వారా మాత్రమే భర్తీ చేయాలి. ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్ల వివరాలు మాత్రమే సేకరించడం సరికాదు. ఉమ్మడి సర్వీస్ రూల్స్కు సంబంధించిన జీవో అమలు చేయాల్సి ఉండగా.. దాన్ని పక్కనపెట్టి ప్రభుత్వ అధికారులు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకోవాలి. –టి.ఆర్.అంబేడ్కర్, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి, విశాఖ జిల్లా -
కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన
డుంబ్రిగుడ: ప్రజల ఆస్తుల్ని అమ్మి పథకాలు అమలు చేస్తారా అంటు అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మండిపడ్డారు. కించుమండ పంచాయతీ కు ఛీసుమవలస గ్రామంలో గురువారం బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు గుడు’చ్చిన హామిల్లో పింఛన్ తప్ప ఏ ఒక్క హామి నెరవేర్చలేదన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన గురించి ప్రతీ గడపగడప వెళ్లి వివరిస్తున్నామన్నారు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామిలైన సూపర్ సిక్స్ పథకాలు అమలు కాకపోవడంతో ప్రజలు ఎంత నష్టపోయరో, ప్రతీ గడపకు వెళ్లి క్యూఆర్కోడ్ స్కాన్ చేయించి చంద్రబాబు మోసాలను తెలసుకొవాలన్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో గెలుపె లక్ష్యంగా పరిచేయలన్నారు. గ్రామంలో పుట్టుకతో మూగ, చెవుడులైన ముగ్గురు అన్న, చెల్లిలో ఒకరికి పింఛన్ రాకపోవడంతో ఆరా తీశారు. వారికి పంచన్ వచ్చేల చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీపీ బాకా ఈశ్వరి, వైస్ ఎంపీపీ శెట్టి ఆనంద్రావు, కించుమండ ఎంపీటీసీ జి.విజయ, మండల పార్టీ అధ్యక్షుడు పి.పరశురామ్, ఉపాధ్యక్షుడు గణపతి, మండల కార్యదర్శి మఠం శంకర్రావు, పోతంగి వైస్ సర్పంచ్ శెట్టి జగ్గునాయుడు, మాజి జడ్పీటసీ ఎం శ్రీరాములు, నాయకులు చిరంజీవి, విజయదశమి, బబీత, కృష్ణ, కామరాజు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. పాడేరు : కూటమీ ప్రభుత్వ మోసాలు అన్ని ఇన్నీ కావని కూటమీ ప్రభుత్వ మోసాలు, వైఫల్యాలను వైఎస్సార్సీపీ కార్యకర్తలు, కార్యకర్తలు గ్రామా గ్రామాల ప్రజలకు తెలియజేయాలని వైఎస్సార్సీపీ మండల అద్యక్షుడు సీదరి రాంబాబు పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ జిల్లా అద్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు ఆదేశాల మేరకు మండలంలోని ఇరడాపల్లి పంచాయతీ కేంద్రంలో గురువారం బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటి కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీను నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు అందరు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం వైఎస్సార్సీపీ గ్రామ కమిటిను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ కమిటి అద్యక్షుడిగా ముదిలి సురేష్కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల పార్టీ ఉపాధ్యక్షుడు బసవన్నదొర, మండల యూత్ అద్యక్షుడు లింగమూర్తి, ఎంపీటీసీ సభ్యుడు సత్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు. రెండు పంచాయతీల్లో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ -
తక్షణం స్పెషల్ డీఎస్సీ ప్రకటించాలి
పాడేరు : ఎన్నికల సమయంలో అరకు సభలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని ఆదివాసీ నిరుద్యోగ సంఘ కో కన్వీనర్ కూడా రాధాకృష్ణ హెచ్చరించారు. దీనిలో భాగంగా గురువారం పట్టణంలోని ఆదివాసీ గిరిజన సంఘం కార్యాలయం నుంచి సినిమాహాల్ సెంటర్ మీదుగా భారీ ర్యాలీగా వెళ్లి జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్కుమార్ ఇంటిని ముట్టడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కిడారి లేకపోవడంతో ఆయన కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్లి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. నిరుద్యోగుల పక్షాన పోరాటం : పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు ఆదివాసీ నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు వెల్లడించారు. ఆదివాసీ నిరుద్యోగ సంఘ నాయకుల ఆధ్వర్యంలో నిరుద్యోగులు గురువారం ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఎన్నికల సమయంలో అరకు వచ్చిన చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే స్పెషల్ డీఎస్సీ ద్వార భర్తీ చేస్తామని, జీవో నంబరు 3ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఆదివాసీలను నిలువునా వంచించారన్నారు. ఆదివాసీ జీపు జాత కార్యక్రమానికి తాను అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నిరుద్యోగ సంఘ జిల్లా కన్వీనర్ సాగిన సత్యనారాయణ, ఆదివాసీ నిరుద్యోగ సంఘ నాయకులు భవాని రాణి, కృష్ణం పడాల్, శంకర్, రాజంనాయుడు,రాజు, ప్రవీణ్, విష్ణుమూర్తి, వినయ్, చలపతి పాల్గొన్నారు. చంద్రబాబు హామీలు అమలు చేయాలి లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం ఆదివాసీ నిరుద్యోగ సంఘ కో కన్వీనర్ కూడా రాధాకృష్ణ హెచ్చరిక పాడేరులో జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్కుమార్ ఇల్లు ముట్టడి ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుకు వినతిపత్రం అందజేత -
నష్టపరిహారం, ఉద్యోగం ఇవ్వాలి
● మజ్జివలస ఏకలవ్య పాఠశాల భూదాతల డిమాండ్ ● గిరిజన సంఘ నేతలతో కలిసి నిరసన అరకులోయ టౌన్:మండలంలోని బొండాం పంచాయతీ మజ్జివలస గ్రామంలో ఏకలవ్య పాఠశాల నిర్మాణానికి భూములిచ్చిన తమకు నష్టపరిహారం అందించి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని దాతలు డిమాండ్ చేశారు. గురువారం గిరిజన సంఘ నేతలతో కలిసి పాఠశాల గేటు ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడారు. 2018–19లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి 16 మంది గిరిరైతులనుంచి సుమారు 18 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించిందన్నారు. భూములు సేకరించి ఆరేళ్లు గడుస్తున్నా ఎటువంటి పరహారం చెల్లించకుండా, ఉద్యోగాలు కల్పించకుండా ఐటీడీఏ అధికారులు తాత్సారం చేస్తున్నారన్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఇవాల్సి ఉండగా ప్రభుత్వ అధికారులు మాయమాటలు చెప్పి అన్యాయం చేస్తున్నారన్నారు. ఇప్పటికై నా భూదాతలకు పరిహారం చెల్లించి, దాతలకు పాఠశాలలో ఉద్యోగాలు కల్పించాలని, లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీజీఎస్ జిల్లా కార్యదర్శి పొద్దు బాలదేవ్, మండల కార్యదర్శి జి. బుజ్జిబాబు, ఉపాధ్యక్షుడు కె. రామారావు, పీసా కమిటీ కార్యదర్శి అప్పన్న, గిరిజనులు గొల్లోరి పరశురాం, కొర్రా నాగమణి, తదితరులు పాల్గొన్నారు. -
6వ రోజుకు చేరుకున్న శ్రావణలక్ష్మి పూజలు
డాబాగార్డెన్స్: బురుజుపేటలో వెలసిన కనకమహాలక్ష్మి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీలక్ష్మి పూజలు బుధవారం నాటికి 6వ రోజుకు చేరాయి. ఉదయం 8 గంటలకు వేదమంత్రాలు, నాదస్వరాల మధ్య శ్రీలక్ష్మి పూజలు ప్రారంభించారు. ఈ పూజలో పలువురు ఉభయదాతలు పాల్గొన్నారు. పోస్టు ద్వారా వచ్చిన భక్తుల పేరిట పూజలు నిర్వహించి కుంకుమ, అమ్మవారి యంత్రం, ప్రసాదం పంపారు. పూజలో పాల్గొనదలిచే భక్తులు రూ.400 చెల్లించాలని ఆలయ ఈవో కె.శోభారాణి తెలిపారు. మరిన్ని వివరాలకు 0891–2711725, 2566514 నంబర్లలో సంప్రదించవచ్చు. కార్యక్రమంలో ఏఈవో కె. తిరుమలేశ్వరరావు, సిబ్బంది, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా టెన్నిస్ పోటీలు
ఎటపాక: స్థానిక నవోదయ విద్యాలయంలో టేబుల్ టెన్నిస్ రీజనల్ స్థాయి పోటీలు ఉత్సాహపూరిత వాతావరణంలో సాగుతున్నాయి. మంగళవారం ప్రారంభమైన ఈ పోటీల్లో కేరళ, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల నుంచి నవోదయ విద్యార్థులు వచ్చారు. ఫీల్డ్ గేమ్స్లో విభాగంలో జరుగుతున్న ఈ పోటీలకు బీదర్, కడప, ఖమ్మం, కృష్ణ, వాయినాడ్, పట్నందిట్ట, షిమోగ, తుంకూర్ క్లస్టర్ల నుంచి 48 మంది బాలురు, 48మంది బాలికలు పోటీలకు వచ్చారు. వీటిలో ప్రతిభ కనబర్చిన 15 మంది బాలురు,15 మంది బాలికలను టేబుల్టెన్నిస్ నేషనల్ గేమ్స్కు ఎంపిక చేస్తారు. వీరు ఇక్కడి జవహర్ నవోదయలో 15 రోజుల పాటు శిక్షణ పొందిన తరువాత అస్సాంలోని బిస్వనాథ్లో వచ్చేనెల 18,19,20 తేదీల్లో జరగనున్న నేషనల్గేమ్స్లో పాల్గొంటారని విద్యాలయం పీటీ జగన్ తెలిపారు. ఎనిమిది క్లస్టర్ల నుంచి విచ్చేసిన క్రీడాకారులు నేషనల్ గేమ్స్కు ఎంపిక కానున్న 30 మంది బాల బాలికలు ఇక్కడే వీరికి 15 రోజులపాటు శిక్షణ -
పర్యాటకులను కాపాడిన లైఫ్గార్డ్స్
కొమ్మాది: ప్రముఖ పర్యాటక ప్రాంతం రుషికొండ బీచ్లో స్నానం చేస్తుండగా కెరటాల ఉధృతికి కొట్టుకుపోతున్న ఇద్దరు పర్యాటకులను లైఫ్గార్డ్స్ రక్షించారు. బెంగళూరుకు చెందిన ఆరుగురు పర్యాటకులు బుధవారం బీచ్కు వచ్చారు. కాసేపు సరదాగా గడిపి, స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగారు. అలల ఉధృతి ఎక్కువగా ఉండడంతో వీరిలో మంజునాథ్, పాపైగౌడ అనే ఇద్దరు కొట్టుకుని పోతుండగా గమనించిన లైఫ్గార్డ్స్ ఎస్. నూకరాజు, ఎం. అమ్మోరు, చందు, సతీష్ అప్రమత్తమై రక్షించారు. అనంతరం వారికి మైరెన్ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. -
అక్రమాలకు పాల్పడితే చర్యలు
మహారాణిపేట: నగరంలోని ఐవీఎఫ్, సరోగసీ కేంద్రాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు ఆధ్వర్యంలో నోడల్ ఆఫీసర్ డాక్టర్ బి.ఉమావతి, జిల్లా మీడియా విస్తరణాధికారి బి.నాగేశ్వరరావు ఆయా కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. ఫెర్టీ9 ఐవీఎఫ్ సెంటర్, వైజాగ్ ఐవీఎఫ్ సెంటర్, డాక్టర్ ఆడమ్స్ ఫెర్టిలిటీ సెంటర్(పీఎంపాలెం)లను సందర్శించి రికార్డులను పరిశీలించారు. స్కానింగ్ రికార్డులను తనిఖీ చేసి, ఫారం–ఎఫ్ గురించి వారికి వివరించారు. అన్ని సరోగసీ కేంద్రాలు నియమ నిబంధనలు, ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని డీఎంహెచ్వో కేంద్రాల నిర్వాహకులకు స్పష్టం చేశారు. ఎటువంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడకూడదన్నారు. రిజిస్ట్రేషన్ లేకుండా ఐవీఎఫ్ కేంద్రాలు నిర్వహిస్తే, చర్యలు తప్పవని హెచ్చరించారు. సకాలంలో రిజిస్ట్రేషన్, రెన్యువల్ చేసుకోవడం తప్పనిసరి అని సూచించారు. సరోగసీ కేంద్రాలు, ఏఆర్టీ బ్యాంక్ ఎల్1, ఎల్2లను క్షుణ్ణంగా పరిశీలించి, సిబ్బందికి తగిన సూచనలు చేశారు. డీఎంహెచ్వో జగదీశ్వరరావు ఐవీఎఫ్, సరోగసీ కేంద్రాల్లో కొనసాగిన తనిఖీలు -
బల్క్డ్రగ్పార్క్పై ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటాం
నక్కపల్లి: మండలంలో రాజయ్యపేట సమీపంలో నిర్మించతలపెట్టిన బల్క్ డ్రగ్ పార్క్పై ప్రజాభిప్రాయ సేకరణ రద్దుచేయాలని మత్స్యకారులు, సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయణ సేకరణ నిర్వహిస్తే అడ్డుకుంటామని చెప్పారు. బల్క్ డ్రగ్పార్క్ను వ్యతిరేకిస్తూ బుధవారం రాజయ్యపేటలో ర్యాలీ నిర్వహించారు. సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు కె.లోకనాథం, జిల్లా కార్యవర్గ సభ్యులు కోటేశ్వరరావు, ఎం.అప్పలరాజు , వైఎస్సార్సీపీ నాయకుడు ఎరిపల్లి నాగేశు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యంత ప్రమాదకరమైన ఈ బల్క్ డ్రగ్పార్క్ను ప్రజలు, మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. వచ్చే నెల ఆరోతేదీన నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణను రద్దుచేయాలంటూ నినాదాలు చేశారు. కూటమిప్రభుత్వానికి ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం కంటే పారిశ్రామిక వేత్తల ప్రయోజనాలే ముఖ్యమన్నారు. కంపెనీలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని చెబుతూ రైతులనుంచి వేలాది ఎకరాలు లాక్కొంటున్నారన్నారు. కంపెనీల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని తెలిపారు. స్కిల్డవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి, శిక్షణ ఇచ్చి స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని హోంమంత్రి అనిత చెబుతున్నారని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు పునాది రాయికూడా వేయలేదని తెలిపారు. బల్క్డ్రగ్పార్క్ కోసం ఇప్పటికే రెండు వేల ఎకరాలు కేటాయించారని, అదనంగా మరో ఎనిమిది వందల ఎకరాలు కేటాయించేందుకు భూసేకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రైతులకు తెలియకుండా 6ఏ నోటీసులు జారీ చేశారని తెలిపారు. ప్రజాభిప్రాయసేకరణను అడ్డుకుని తీరుతామన్నారు.ఈ ఆందోళనలో మనబాల రాజేష్, కోదండరావు పాల్గొన్నారు. -
సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి
● చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ ఆదేశం ● ప్రజల నుంచి 57 వినతుల స్వీకరణఎటపాక: గీవెన్స్లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన మీకోసం గ్రీవెన్స్లో ఆర్అండ్ఆర్ 5, భూతగాదా 28, ఇతర సమస్యలు 24 వినతులను స్వీకరించారు. అధికారులు చోద్యం చూస్తున్నారని ఫిర్యాదుషెడ్యూల్ ఏరియాలో యథేచ్ఛగా భూబదలాయింపు జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కాక అర్జున్దొర పీవోకు ఫిర్యాదు చేశారు. 1970 తర్వాత కూడా గిరిజన ప్రాంతంలో గిరిజన, గిరిజనేతరుల మధ్య భూబదలాయింపు చట్టవిరుద్ధమని తెలిపారు. గుండాల గ్రామ పంచాయతీలో అధ్వానంగా ఉన్న రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరుతూ సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఐవీ, గ్రామశాఖ కార్యదర్శి తోట శ్రీనివాసరావు వినతిపత్రం అందజేశారు. అందని ద్రాక్షలా విద్య, వైద్యం..మండల కేంద్రం ఎటపాకలో అభివృద్ధి లేదని ఇక్కడ విద్య,వైద్యం ఉపాధి ప్రజలకు అందని ద్రాక్షలా మారాయని, పలు సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఎం నాయకులు డేగల మాధవరావు అర్జీ అందజేశారు. ఇసుక, మట్టి అక్రమ రవాణా అరికట్టాలని, ఎటపాక ప్రదాన రహదారికి మరమ్మతులు చేపట్టాలని శివ, నరేష్, శ్రీనివాస్ తదితరులు పీవోను కోరారు. ఈకార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఏషియన్ రోలర్ స్కేటింగ్లో దినేష్ సత్తా
తగరపువలస: దక్షిణ కొరియాలో ఈ నెల 29న జరిగిన 20వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ పోటీల్లో ఆనందపురం మండలం వెల్లంకి గ్రామ పంచాయతీకి చెందిన గొలగాని దినేష్ రెండు రజత పతకాలు సాధించి తన సత్తా చాటాడు. ఆర్టిస్టిక్, వ్యక్తిగత విభాగాల్లో ఈ పతకాలు సాధించడం విశేషం. 2023లో చైనాలో జరిగిన 19వ ఏషియన్ రోలర్ స్కేటింగ్లో కూడా దినేష్ రజత పతకం సాధించాడు. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో 6 బంగారు, రాష్ట్ర స్థాయిలో 15 బంగారు, జిల్లా స్థాయిలో 18 బంగారు పతకాలు సాధించి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. తల్లిదండ్రులు, కోచ్ల ప్రోత్సాహంతోనే ఈ స్థాయిలో చేరుకున్నానని దినేష్ తెలిపాడు. మధురవాడలో 10వ తరగతి చదువుతున్న దినేష్ భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించడం తన లక్ష్యమని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా దినేష్ను కోచ్లు సత్యం, చిట్టిబాబు అభినందించారు. క్షేత్రకు రజతం ఎంవీపీకాలనీ: సౌత్ కొరియాలో జరిగిన రోలర్ స్కేటింగ్ పోటీల్లో నగరానికి చెందిన శివకోటి క్షేత్ర ప్రతిభ చూపింది. ఎంవీపీ కాలనీలోని లిటిల్ ఏంజెల్స్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న క్షేత్ర ఈ పోటీల్లో రజతం సాధించింది. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం, కుటుంబ సభ్యులు క్షేత్రను అభినందించారు. ఇప్పటి వరకు క్షేత్ర 21 జాతీయ మెడల్స్తో సహా 70 పతకాలు సాధించింది. -
అయోమయం
సార్వత్రిక ఎన్నికల ముందు ఆచరణసాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటి అమలులో ప్రజలను నిలువునా మోసం చేస్తూనే ఉంది. అధికారంలోకి రాగానే మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమంటూ చంద్రబాబుతో పాటు కూటమి నేతలు ఊదరగొట్టారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా ఆ ఊసెత్తలేదు. వచ్చేనెల 15 నుంచి పథకాన్ని అమలుజేస్తామని తాజాగా ప్రకటించి మహిళల్లో ఆశలు రేకెత్తించిన ప్రభుత్వం ఎటువంటి విధి విధానాలు ప్రకటించడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో పథకం అమలుపై అధికారులు, మహిళల్లో గందరగోళం నెలకొంది.ఉచిత బస్సు ప్రయాణం..నియమ నిబంధనలపై కొరవడిన స్పష్టత● ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామన్న కూటమి ప్రభుత్వం ● ఇప్పటికీ ఖరారుకాని విధి విధానాలు ● జిల్లాలో అరకొరగా ఆర్టీసీ బస్సులు ● 3.38 లక్షల మంది మహిళలు ● 60 సర్వీసులు మాత్రమే.. ● అమలులో సందిగ్ధం ● గందరగోళంలో యంత్రాంగం సాక్షి,పాడేరు: విస్తీర్ణంలో జిల్లా పెద్దదైనప్పటికీ అతితక్కువ సంఖ్యలో గల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు ఆర్టీసీకి కత్తిమీద సాములా మారనుంది. పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలు 22 మండలాల పరిధి 430 పంచాయతీల్లో సుమారు 3.8 లక్షల మంది వరకు ఉన్నారు. వీరిలో కనీసం లక్షమంది రోజువారీ ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణిస్తుంటారు. అయితే ఇంతమందికి అవసరమైన ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేవు. ● జిల్లాలో పాడేరులో మాత్రమే ఆర్టీసీ డిపో ఉంది. ఇక్కడ 47 బస్సులు ఉండగా వీటిలో 3 ఆల్ట్రా డీలక్స్, 12 ఎక్స్ప్రెస్, 32 పల్లెవెలుగు బస్సులు ఉన్నాయి. మైదాన ప్రాంతాలైన అనకాపల్లి డిపో పరిధిలో రెండు, ఎస్.కోట పరిధిలో 3, నర్సీపట్నం పరిధిలో ఐదు, ఉమ్మడి తూర్పుగోదావరి పరిధిలోని తుని డిపో నుంచి 2,గోకవరం నుంచి 5,ఏలేశ్వరం నుంచి 5 పల్లెవెలుగు బస్సులో జిల్లాలో సేవలందిస్తున్నాయి. ● మహిళల సంఖ్యకు తగ్గట్టుగా ఆర్టీసీ బస్సులు లేవు. పాడేరు నుంచి దూరంగా ఉన్న చింతూరు డివిజన్కు, డొంకరాయికి, నియోజకవర్గ కేంద్రమైన రంపచోడవరానికి ఎక్స్ప్రెస్ సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి. ఈరూట్లలో పల్లెవెలుగు బస్సులు లేకపోవడంతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం లేనట్టేనని ప్రచారం జరుగుతోంది. ● పథకం అమలుపై ప్రభుత్వం నుంచి ఇప్పటికీ స్పష్టమైన విధి విధానాలు లేవు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఉంటుందా.. కొత్త జిల్లాల పరిధిలో ఉంటుందా అనేది ఆర్టీసీ అధికారులు చెప్పలేకపోతున్నారు. పాడేరు, అరకులోయ నియోజకవర్గాలకు చెందిన మహిళల్లో ఎక్కువ మంది ఉమ్మడి విశాఖ జిల్లాలోను, రంపచోడవరం నియోజకవర్గంలోని మహిళలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రయాణం చేస్తుంటారు. ఉమ్మడి జిల్లా పరిధిలో పథకం అమలుకాకుంటే తమకు పెద్దగా ఉపయోగకరం కాదని వారు వాపోతున్నారు. అలాగే మహిళా రైతులు కూడా తమ వ్యవసాయ, అటవీ ఉత్పత్తులను మైదాన ప్రాంతాలకు తరలించేందుకు కూడా ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తారు. రోజుకు రూ.2 లక్షల నష్టం! అంతంతమాత్రంగా ఆదాయం ఉండే జిల్లా కేంద్రం పాడేరు ఆర్టీసీ డిపో ఆర్థిక పరిస్థితిపై మహిళల ఉచిత బస్సు ప్రయాణం తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ డిపో పరిధిలోని 32 పల్లెవెలుగు బస్సుల ద్వారా ప్రతి రోజు రూ.4లక్షల వరకు ఆదాయం వస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలైతే పాడేరు డిపో కనీసం రూ.2లక్షల వరకు ఆదాయం కోల్పోయే అవకాశం ఉంది. అలాగే గోకవరం, ఏలేశ్వరం, నర్సీపట్నం, ఎస్.కోట, అనకాపల్లి, తుని ఆర్టీసీ డిపోలది ఆదాయ పరంగా ఇదే పరిస్థితి. రోడ్డు, బస్సు సౌకర్యం లేని గ్రామాలు 2వేలు -
ముంచంగిపుట్టులో ముసురు
● ప్రతిరోజూ వర్షం ముంచంగిపుట్టు: మండలంలో ముసురు వీడడం లేదు. ఏకధాటిగా ప్రతి రోజూ వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముంచంగిపుట్టు నుంచి పెదబయలు, కుమడ, జోలాపుట్టు, డుడుమ వెళ్లే రహదారులు అధ్వానంగా మారాయి. చాలాచోట్ల రోడ్డుపై మట్టి నిలిచిపోవడంతో వాహన చోదకులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బుధవారం లక్ష్మీపురం పంచాయతీ కేంద్రంలో జరిగిన వారపు సంత వర్షం కారణంగా బోసిపోయింది. మారుమూల రంగబయలు, బుంగాపుట్టు, భూసిపుట్టు పంచాయతీల్లో వాగులు, గెడ్డలు వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాకపోకలకు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మత్స్యగెడ్డలోకి వరదనీరు భారీగా చేరుతోంది. -
ఉద్యోగాలకు 64 మంది ఎంపిక
అరకులోయ టౌన్: స్ధానిక ఆర్ఐటీఐలో బుధవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 64 మంది ఎంపికై నట్లు ఏపీఎస్ఎస్డీసీ డీఎస్డీవో డాక్టర్ పి. రోహిణి తెలిపారు. ఈ జాబ్ మేళాలో అపోలో ఫార్మసి, నవత రోడ్ ట్రాన్స్పోర్ట్, కేర్ ఫర్ యూ, తదితర మొత్తం 10 కంపెనీలకు చెందిన ప్రతినిధులు, 140 మంది అభ్యర్ధులు పాల్గొన్నారు. ఎంపికై న అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఎంపికై న వారికి వివిధ కేటగిరీలను బట్టి నెలకు రూ. 10వేల నుంచి రూ.20వేల వరకు జీతం ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఈవో ఎన్.కె. మనోరమ, ఆర్ఐటీఐ ప్రిన్సిపాల్ ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
వాల్తేర్ డివిజన్ మొదటి క్వార్టర్లో 12.25 శాతం వృద్ధి
● వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం లలిత్ బోహ్ర తాటిచెట్లపాలెం: వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం లలిత్ బోహ్ర బుధవారం దొండపర్తిలో గల డీఆర్ఎం కార్యాలయం సమావేశ మందిరంలో సరకు రవాణా ఖాతాదారులు, వ్యాపార భాగస్వాములతో సమావేశమయ్యారు. నూతన వ్యాపార పద్ధతులు, పరస్పర సహకారం, సరైన సరకు రవాణాలో మెరుగైన పద్ధతులు, శక్తివంతమైన సమాచార వ్యవస్థ వంటి విషయాల గురించి చర్చించారు. వాల్తేర్ డివిజన్ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇంతవరకు మొదటి క్వార్టర్లో 12.25 శాతం వృద్ధి సాధించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో వైజాగ్ సీ పోర్ట్, గంగవరం పోర్టు, సెయిల్, వేదాంత, ఐటీఎల్, బోత్ర, హెచ్ఐక్యూ సర్విస్, కేఆర్ అండ్సన్స్, భూషణ్ పవర్, ఉత్కల అల్యూమినా, నాల్కో, కాంకోర్, కోరమాండల్ ఫెర్టిలైజర్స్, ఇండియా ఫాస్పేట్ లిమిటెడ్, ఆర్సిఎల్ కంపెనీల ప్రతినిధులతో పాటు అధికారులు ముఖోపాధ్యాయ్, సందీప్, తదితరులు పాల్గొన్నారు. -
విజృంభిస్తున్న జ్వరాలు
ముంచంగిపుట్టు: స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు రోజు రోజుకు రోగుల తాకిడి పెరుగుతోంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో జ్వరాలు, దగ్గు, జలుబు బారిన పడుతున్నారు. వీరంతా పెద్ద సంఖ్యలో రావడంతో ఆరోగ్య కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. బుధవారం ఒక్కరోజే స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 200కు పైగా ఓపీ నమోదు అయింది. గత వారం రోజుల్లో మూడువేలమందికి పైగా సీహెచ్సీలో వైద్య సేవలు పొందారు. వీరిలో 366 మంది జ్వరాలతో ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోగా 50 మందికి టైఫాయిడ్, 9మందికి మలేరియా పాజిటివ్గా నిర్థారణ అయింది. వీరికి వార్డులో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. రోగుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో సీహెచ్సీలోని 30 పడకలు నిండిపోయాయి. వైద్యాధికారులు గీతాంజలి, వివేక్, ధరణి పరీక్షలు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. ఆస్పత్రి ప్రాంగణం రోగులతో నిండిపోవడంతో పాటు రక్తపరీక్షల గది ఎదుట రోగులు బారులు తీరారు. సీహెచ్సీలో 8మంది వైద్యులకు గాను కేవలం ముగ్గురు మాత్రమే ఉండడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో రోగులసంఖ్య పెరుగుతుండడంతో కిలగాడ,లబ్బూరు,రూడకోట పీహెచ్సీల పరిధిలో సిబ్బంది గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గిరిజన గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు. ముంచంగిపుట్టు పీహెచ్సీకి పెరిగిన రోగుల తాకిడి నిండిపోయిన పడకలు రక్తపరీక్షల గది వద్ద బారులు టైఫాయిడ్, మలేరియా కేసుల నమోదు వైద్యుల కొరతతో రోగుల ఇబ్బందులు -
గ్రామ విజన్ మ్యాప్లు సిద్ధం చేయండి
సాక్షి,పాడేరు: కేంద్ర ప్రభుత్వం గిరిజన అభివృద్ధికి దేశవ్యాప్తంగా ఆమలుజేస్తున్న ఆదికర్మయోగి గ్రామ విజన్కు మ్యాప్లు సిద్దం చేయాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్లో ఆదికర్మయోగి కార్యక్రమం అమలుపై పలుశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 20 లక్షల మంది గిరిజన యువతకు ఆదికర్మయోగి సేవాదాతలుగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. వికసిత్ భారత్ 2047 దృష్టితో గిరిజన గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. గ్రామస్థాయిలో నాయకత్వం, పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. వచ్చేనెల 4వతేదీ నుంచి ఆదికర్మయోగి కార్యక్రమం అమలుపై గ్రామ, మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విద్య, ఆరోగ్యం, జీవనోపాధి, అటవీ ఉత్పత్తుల వ్యాపారం తదితర ఆంశాలపై అభివృద్ధి లక్ష్యంతో శిక్షణ ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆదికర్మయోగి కార్యక్రమం అమలుకు మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇస్తారని ఆయన తెలిపారు. అనంతరం ఆదికర్మయోగి కార్యక్రమంపై కలెక్టర్,జేసీ అభిషేక్గౌడ, సబ్కలెక్టర్ సౌర్యమన్పటేల్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో కె.పద్మలత, జిల్లా మాస్టర్ ట్రైనర్లు వి.నాగశిరీష, డి.శారదాదేవి, అచ్యుత్కిరణ్, రామం, చంద్రకిరణ్, ధ్రువకుమార్, బాబు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అన్నిశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది మాదిరిగానే తలారిసింగి బాలుర ఆశ్రమ పాఠశాల మైదానంలో వేడుకలు నిర్వహించాలన్నారు. స్వాతంత్య్ర సమరయోథుల కుటుంబాలను ఆహ్వానించి ఘనంగా సత్కరించాలన్నారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలోని మూడు ఐటీడీఏల నుంచి మూడు స్టాళ్లు ఏర్పాటుచేయాలని సూచించారు. అన్నిశాఖలు అభివృద్ధిపై శకటాల ప్రదర్శన ఏర్పాటుచేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ట్రాన్స్కో అధికారులు,సురక్షిత తాగునీటికి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో జేసీ అభిషేక్గౌడ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశం జిల్లా అధికారులతో సమావేశం -
డీలర్లకు గుదిబండ
● ఎండీయూ వాహనాలను రద్దు చేయడంతో తంటా ● రేషన్ లబ్ధిదారులకే కాక డీలర్లకూ అవస్థలే ● ప్రజా వ్యతిరేకతతో వృద్ధులు, వికలాంగులకు ఇంటికే సరకులు అందిస్తామన్న సర్కారు ● రవాణా చార్జీలు చెల్లించకపోవడంతో డీలర్ల గగ్గోలు నర్సీపట్నం: ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేసేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఎండీయూ వాహనాలను కూటమి ప్రభుత్వం రద్దు చేయడంతో లబ్ధిదారులతోపాటు డీలర్లు సైతం సతమతమవుతున్నారు. ప్రజల నుంచి నిరసన వ్యక్తం కావడంతో వృద్ధులు, వికలాంగుల ఇళ్ల వద్దకే రేషన్ ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో విఫలమైంది. దీంతో భారం డీలర్లపై పడింది. ఇంటింటికీ రేషన్ సరకులు పంపిణీకి కొంత మంది డీలర్లు బైక్ వినియోగిస్తుండగా, ఆర్ధిక భారం తట్టుకోలేక మరికొంత మంది డీలర్లు కావిట్లో నిత్యావసర సరకులు పెట్టుకుని ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు అందిస్తున్నారు. ఎండీయూ వాహనాలను రద్దు చేయడంతో సంబరాలు జరుపుకున్న డీలర్లు ఇంటింటికీ రేషన్ భారంతో నరకం చూస్తున్నారు. వాహనాల తొలగింపు తమ పాలిటశాపంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. డీలర్లపై ఆర్థిక భారం జిల్లాలో మొత్తం 5,35,000 రైస్ కార్డులు ఉన్నాయి. అందులో 68 వేల మంది వృద్ధులు, వికలాంగులు ఉన్నారు. వీరికి ప్రతి నెల 25వ తేదీ నుంచి నెలాఖరులోగా ఇంటి వద్దే డీలర్లు బియ్యం, పంచదార అందించాల్సి వస్తోంది. ప్రభుత్వం రవాణా చార్జీలు ఇవ్వకపోవడంతో ఆర్థిక భారాన్ని వారే భరిస్తున్నారు. రవాణా ఖర్చులు భరించలేక కొంతమంది డీలర్లు ఐదు కేజీల చొప్పున బియ్యం సంచుల్లో ప్యాక్ చేసి, కావిట్లో తీసుకువెళ్లి లబ్ధిదారులకు అందిస్తున్నారు. ఎండీయూ వాహనాలు ఉన్నప్పుడే తమ ప్రాణం సుఖంగా ఉండేదని డీలర్లు వాపోతున్నారు. రేషన్ బియ్యం తూకం వేసేందుకు తమ సొంత ఖర్చులతో హెల్పర్ను పెట్టుకుంటున్నామని, దీని వల్ల నెలకు రూ.3 వేల వరకు ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై సీఎస్డీటీ చందన రేఖను సంప్రదించగా ఇంటింటి రేషన్ పంపిణీకి ప్రభుత్వం రవాణా చార్జీలు ఇవ్వటం లేదని, ఆ బాధ్యత డీలర్లదేనని తెలిపారు. -
‘దాట్ల’కు రావిశాస్త్రి సాహిత్య పురస్కార ప్రదానం
సీతంపేట: ప్రముఖ కవి, కథా రచయిత, దాట్ల దేవదానం రాజు(యానాం)కు రావిశాస్త్రి సాహితీ పురస్కారాన్ని ప్రధానం చేశారు. విశాఖ రసజ్ఞ వేదిక, రావిశాస్త్రి లిటరరీ ట్రస్టు సంయుక్త నిర్వహణలో ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో బుధవారం జరిగిన సభలో ముఖ్య అతిథి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ టి.రవిరాజు, విశాఖ రసజ్ఞ వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ రఘురామారావు, రావిశాస్త్రి తనయుడు ఉమా కుమార శాస్త్రి చేతుల మీదుగా దాట్ల దేవదానం రాజును సత్కరించి, పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా సభాధ్యక్షుడు రఘురామారావు మాట్లాడుతూ రావిశాస్త్రి 103వ జయంతి సందర్భంగా యానాంకు చెందిన కథా రచయిత దాట్ల దేవదానంరాజుకు పురస్కారం అందజేసినట్టు తెలిపారు. గత ఐదేళ్లుగా విశాఖరసజ్ఞ వేదిక ఆధ్వర్యంలో రావిశాస్త్రి పేరిట పురస్కారాలు అందజేస్తున్నట్టు తెలిపారు. మానవతా వాదంతో రచనలు చేసేవారిని సమాజం, ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు. మంచికి హాని, చెడుకు సాయం తలపెట్టవద్దని రావిశాస్త్రి చెప్పిన మాటలు నిత్యం గుర్తుంటాయని చెప్పారు. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం,డాక్టర్ రవిరాజు మాట్లాడుతూ దాట్ల సాహితీ ప్రతిభకు రావిశాస్త్రి పురస్కారం ఒక కొలమానంగా నిలుస్తుందన్నారు. కొత్త తరానికి రావిశాస్త్రి వంటి గొప్ప రచయితలను పరిచయం చేయడానికి ఇటువంటి పురస్కార సభలు దోహదపడతాయని తెలిపారు. దాట్ల రాసిన ఎండ్ల బండి, దీపం కింద నీడ వంటి రచనలు పాఠకుల ఆదరణ పొందాయని చెప్పారు. కవిసంధ్య సాహితీ పత్రికను నిర్వహించడమే కాక, ఎందరో యువ కవులకు దాట్ల మార్గదర్శనం చేస్తు న్నారని గుర్తుచేశారు. అనంతరం దాట్ల దేవదానం రచించిన ‘మనిషి లోపల నీడ’ పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. తొలి ప్రతిని ఆచార్య బేతవోలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ డి.వి.సూర్యారావు, ప్రయాగ సుబ్రహ్మణ్యం, పలువురు సాహితీవేత్తలు, కథా రచయితలు పాల్గొన్నారు. -
● అందుబాటులో ఉన్నది గజపతి సత్రం ఒక్కటే ● పెళ్లిళ్లు, ఉత్సవాలు, యాత్రా దినాల్లో గజపతి సత్రం ఫుల్ ● వీఐపీలకూ దొరకని వీఐపీ కాటేజీలు ● మరుగున పడ్డ డోనార్స్ కాటేజీ ప్రణాళిక
సింహాచలం: రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ఒకటి సింహగిరి పైనున్న శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం. స్వామి దర్శనానికి రోజూ వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. వీరిలో కుటుంబ సమేతంగా వచ్చే దూర ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువ. సింహగిరికి చేరుకున్నాక తాత్కాలిక బసకు గదులు దొరకడం గగనమైపోయింది. దీనికి కారణం సరిపడా కాటేజీలు సింహగిరిపై లేకపోవడమే..! సింహగిరిపై భక్తులకు సరిపడా వసతి కల్పించాలని ఇటీవల ఆలయానికి రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దృష్టికి కూడా పలువురు తీసుకెళ్లారు. గజపతి సత్రం ఒక్కటే దిక్కు సింహగిరిపై ప్రస్తుతం గజపతిసత్రం ఒక్కటే భక్తుల వసతికి అందుబాటులో ఉంది. రెండు అంతస్తుల్లో ఉన్న ఈ సత్రంలో 24 ఏసీ, 24 నాన్ ఏసీ గదులున్నాయి. జీఎస్టీతో కలిపి ఏసీ అయితే రూ.1,008, నాన్ ఏసీ అయితే రూ.560 చెల్లించాలి. శని, ఆదివారాలు, యాత్రా రోజులు, పెళ్లిళ్ల సీజన్లలో ముందుగా బుక్ చేసుకునేవి ఈ గదులే. దీంతో సామాన్య భక్తులకు గదులు లభించడం కష్టతరమవుతోంది. గంటల తరబడి నిరీక్షించినా ఫలితంలేక నిరాశగా వెనుదిరగాల్సి వస్తోందని భక్తులు తరచూ వాపోతున్నారు. వీఐపీ కాటేజీల పరిస్థితీ అంతే.. సింహగిరిపై ఉన్న వీఐపీ కాటేజీల పరిస్థితి కూడా దాదాపు అంతే. ప్రస్తుతం వీఐపీ కేటగిరీకి చెందిన ప్రహ్లాద, సింహవల్లీ, రమణారెడ్డి, అన్నపూర్ణ, వీబీసీ కాటేజీలు సింహగిరిపై ఉన్నాయి. ప్రహ్లాద కాటేజీలో మూడు సూట్ రూమ్లకు కలిపి అద్దె రూ.3,920. సింహవల్లీ, రమణారెడ్డి కాటేజీల్లో రెండేసి సూట్లు ఉండగా, ఒక్కో సూట్కు రూ.1120, అన్నపూర్ణ, వీబీసీలో రెండేసి సూట్లుండగా ఒక్కో సూట్కు రూ.2,800 చెల్లించాలి. కొంచెం ఆర్థిక స్థోమత కలిగిన వారు ఆ కాటేజీల్లో బస చేద్దామంటే సవాలక్ష నిబంధనలు సతాయిస్తాయి. ఆ సమయానికి మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు, ఉన్నతాధికారుల బస చేయకపోతే, వారి సిఫార్సుతో మరెవరూ లేకపోతే తప్ప ఆ కాటేజీలు లభించవు. మరుగున పడ్డ డోనార్స్ కాటేజీ ప్రణాళిక సింహగిరిపై సాధారణ భక్తులకు, వీఐపీలకు అందుబాటులో ఉండేలా డోనార్స్ కాటేజీ నిర్మాణానికి 2008లో ప్రణాళిక చేశారు. మైక్రోటవర్కు వెళ్లే మార్గంలో ఉన్న కొండపై వీఐపీ కాటేజీల నిర్మాణానికి అప్పటి ఈవో, ప్రస్తుత దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ సంకల్పించారు. డోనార్స్ కాటేజీ నిర్మాణానికి కొండపై కొంతమేర స్థలాన్ని చదును చేశారు. రామచంద్రమోహన్ బంధువే తొలి విరాళాన్ని అందించారు. ఒక్కో డోనార్కు ఒక్కో గది పేరు పెట్టి ఏడాదిలో నెల రోజులు వారికి ఉచితంగా ఆ గదిని ఇచ్చేందుకు నిర్ణయించారు. కానీ కొన్ని రోజులకే ఆ ప్రణాళిక మరుగున పడింది. ఉత్సవ రోజుల్లో బుకింగ్ బంద్ సింహగిరిపై జరిగే చందనోత్సవం, వార్షిక కల్యాణోత్సవం, గిరి ప్రదక్షిణ, ముక్కోటి ఏకాదశి తదితర ప్రముఖ ఉత్సవాల రోజుల్లోనైతే భక్తులు బస కోసం ఆశలు వదులుకోవాల్సిందే. ఆయా రోజుల్లో దేవస్థానమే ముందుగా గజపతిసత్రంలోని గదులను అద్దెకు కేటాయించే ప్రక్రియని నిలిపేస్తుంది. ఆ రోజుల్లో విధులకు హాజరయ్యే పలు ప్రభుత్వ సంస్థల సిబ్బందికి, ఇతరత్రా అవసరాలకు ఆ గదులను కేటాయిస్తుంది. వెనుదిరుగుతున్న పరిస్థితి నేను తరచూ భక్తుల్ని ఇక్కడికి తీసుకొస్తుంటాను. ఎక్కువగా ఒడిశా భక్తులు వస్తుంటారు. కనీసం ఒక రోజైనా సింహగిరిపై ఉండాలనుకుంటారు. బస దొరక్కపోవడంతో వెనుదిరుగుతున్నారు. యాత్రా దినాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. – చలపతి, క్యాబ్ డ్రైవర్, బుడితి, శ్రీకాకుళం జిల్లా వసతి సౌకర్యం పెంచాలి ఉత్తరాంధ్రలో ఎంతో పెద్ద క్షేత్రం అయిన సింహాచలానికి వచ్చే భక్తులకు వసతి సౌకర్యం పెంచాల్సిన బాధ్యత దేవస్థానం అధికారులపై ఉంది. ముఖ్యంగా కనీసం ఒకరోజైనా ఇక్కడ ఉండేలా వసతి సౌకర్యం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలి. – రవితేజ, పార్వతీపురం -
రోడ్ల నిర్మాణం వెంటనే పూర్తి చేస్తాం
రాజవొమ్మంగి: మండలంలో గత రెండేళ్లుగా వివిధ కారణాలతో అర్ధంతరంగా నిలచిపోయిన బీటీ రోడ్లు, కల్వర్టు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేస్తామని గిరిజన సంక్షేమ శాఖ రంపచోడవరం ఈఈ శ్రీనివాస్ తెలిపారు. రోడ్డు నిర్మాణ పనులు ఆగిపోడానికి కారణమైన అన్ని అడ్డంకులను అధిగమించి సెప్టెంబర్ మాసాంతానికి రహదారి పనులను పూర్తి చేస్తామని ఆయన ప్రజాప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఇటీవల రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలంటూ వందలాదిగా తరలి వచ్చిన ఆదివాసీలు స్థానిక మండల పరిషత్ ఎదుట వంటావార్పు చేపట్టి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం తెలిసిందే. ఆ రోజు ఆందోళన కారులకు ఇచ్చిన హామీ మేరకు అధికారులు మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు, ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు చుండ్రు లోవకుమారి, చికిలింత, కొండపల్లి సర్పంచ్లు కోండ్ల సూరిబాబు, కుంజం జగన్నాథం, సంబంధిత గ్రామపెద్దలు, రోడ్డు నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈఈ మాట్లాడుతూ మండలానికి రూ. 12.5 కోట్ల ఎంజీఎన్ఆర్జీఎస్ నిధులతో ఏడు బీటీ రోడ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు రెండు రోడ్లు మాత్రమే పూర్తి చేయగలిగామన్నారు. నిర్మాణం పూర్తయిన రోడ్లకు ఇంత వరకు రూ.4 కోట్ల మేర బిల్లులు చెల్లించగా, ఇంకా రూ. 2.5 కోట్ల మేర బిల్లుల చెల్లింపు పెండింగ్లో ఉందన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించి మిగిలిన రోడ్డు పనులు పూర్తి చేసేందుకు అన్ని రకాలుగా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించామన్నారు. రాజవొమ్మంగి నుంచి అప్పరాజుపేట మీదుగా అమ్మిరేఖల రోడ్డు, రాజవొమ్మంగి నుంచి వయ్యేడు మీదుగా బూరుగపల్లి రోడ్డు, లబ్బర్తి ఆర్అండ్బీ రహదారి నుంచి డి.మల్లవరం రోడ్డు, లబ్బర్తి నుంచి కిండ్రకాలనీ రోడ్డు, లోదొడ్డి నుంచి పాకవెల్తి రోడ్డు, జడ్డంగి నుంచి సింగంపల్లి తదితర ఏడు రోడ్ల నిర్మాణం పది రోజుల్లో మొదలు పెట్టి దశలవారీగా పూర్తి చేస్తామని ప్రజాప్రతినిధులకు ఈఈ హామీ ఇచ్చారు. నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలని గిరిజనసంఘం రాష్ట్ర అధ్యక్షులు రామారావు కోరారు. ఈ సమావేశంలో డీఈ గౌతమి తదితరులు పాల్గొన్నారు.గిరిజన సంక్షేమశాఖ ఈఈ శ్రీనివాస్ -
గిరిజనులను మోసం చేసిన ఘనత చంద్రబాబుది
పాడేరు : ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు గుప్పించి, తీరా అధికారంలోకి వచ్చాక ఒక్కటీ అమలు చేయకుండా గిరిజనులను చంద్రబాబు నాయుడు నిలువునా మోసం చేశారని వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు సీదరి రాంబాబు అన్నారు. మండలంలోని గొండెలి, కించూరు పంచాయతీల పరిధిలోని పలు గ్రామాల్లో మంగళవారం బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వ మోసాలను, వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఒక్క హామీని కూడా నెరవేర్చలేని అసమర్థ పాలనను కూటమి ప్రభుత్వం చేస్తోందని చెప్పారు. కూటమి నాయకులు గ్రామాల్లోకి వస్తే నిలదీయాలన్నారు. వైఎస్సార్సీపీ నిత్యం ప్రజల పక్షాన ఉంటూ పోరాటాలు కొనసాగిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల ఉపాధ్యక్షుడు, సర్పంచ్ వనుగు బసవన్నదొర, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి, కించూరు సర్పంచ్ వంతాల రాంబాబు, స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు పలాసి రాజేశ్వరి, పార్టీ సీనియర్ నాయకులు పలాసి కోటేశ్వరరావు, పలాసి రామారావు, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, గిరిజనులు పాల్గొన్నారు. ‘కూటమి పాలనపై ప్రజల్లో వ్యతిరేకత’ డుంబ్రిగుడ: కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా హామీలు అమలు చేయకపోవడంతో పాటు గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని వైఎస్సార్సీపీ మండల మహిళా అధ్యక్షురాలు బంగారు శాంతి, ఉపాధ్యక్షుడు ఎ.గణపతి అన్నారు. మండలంలోని అరమ పంచాయతీలో మంగళ వారం బాబూ ష్యూరిటీ– మోసం గ్యారెంటీ కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేశారని చెప్పారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ పాలనతో సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ప్రశ్నించగా, ఏ పథకాలు అందడం లేదని, తాము ఇబ్బందులు పడుతున్నా మని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరమ, కురిడి మాజీ ఎంపీటీసీలు మొద్దు, మహా దేవ్, పార్టీ మండల కార్యదర్శి మఠం శంకర్, సీనియర్ నాయకులు బాకా సింహాచలం, విజయదశమి, ఆ పంచాయతీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు. పథకాలు అందక అవస్థలుఅనంతగిరి(అరకులోయ టౌన్): కూటమి నాయకులు ఇచ్చిన హామీలు అమలు కాక, పథకాలు అందక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కొర్ర సూర్యనారాయణ, ఎంపీపీ శెట్టి నీలవేణి తెలిపారు. కివర్ల, పినకోట, పెదకోట పంచాయతీల్లో మంగళవారం బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో వైఫల్యాలను వివరించారు. అనంతరం వైఎస్సార్సీపీ గ్రామ స్థాయి కమిటీల నియమించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈకార్యక్రమంలో వైస్ ఎంపీపీ బాడం శకుంతల, మాజీ జడ్పీటీసీ దూరు గంగన్నదొర, ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. -
హైడ్రోపవర్ ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలి
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ డిమాండ్ గూడెంకొత్తవీధి: జిల్లాలో హైడ్రో పవర్ ప్రాజెక్టుల అనుమతులను రద్దుచేయాలని సీఐటీ యూ జిల్లా అద్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన జీకేవీధిలో ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన ప్రాంతంలో సర్వహక్కులు గిరిజనులకే చెందుతాయని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా గిరిజనుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయన్నారు. ఏజెన్సీలో ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టుల వల్ల జలవనరులు నాశనం కావడంతో పాటు ఎన్నో గ్రామాలు ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయన్నారు. ప్రభుత్వాలు గిరిజన చట్టాలను పూర్తిగా తుంగలో తొక్కే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. పవర్ ప్రాజెక్టుల అనుమతులు రద్దుకు గిరిజనులంతా ఏకతాటిపై పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మండల కార్యదర్శి అంపురంగి బుజ్జిబాబు, పార్టీ నాయకులు సత్యనారాయణ,కోటేశ్వరరావు,బాలయ్య తదితరులు పాల్గొన్నారు. -
అతిథి ఎంపికలో అయోమయం
● ఆగస్టు 1 నుంచి ఇంటర్వ్యూల నిర్వహణకు సన్నద్ధం ● తరగతులు జరగక విద్యార్థుల ఆందోళన ● ఏయూలో అతిథి అధ్యాపకుల భర్తీ ● రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా నోటిఫికేషన్ మద్దిలపాలెం(విశాఖ): వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఆంధ్రా యూనివర్సిటీలో అతిథి అధ్యాపకుల నియామక ప్రక్రియ గందరగోళంగా మారింది. అధికారుల సమన్వయ లోపం, అనాలోచిత నిర్ణయాలతో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా నోటిఫికేషన్ విడుదల చేయడం, ఇంటర్వ్యూల నిర్వహణలో జరుగుతున్న పరిణామాలు.. అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీని వల్ల విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా.. తరగతులు జరగక విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. నోటిఫికేషన్పై విమర్శలు : ఏయూ అధికారులు అతిథి అధ్యాపకుల నియామకాలకు సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ను విస్మరించి వెబ్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏఏ విభాగంలో ఎన్ని పోస్టులున్నాయి? వాటిలో ఏయే రిజర్వేషన్లకు ఎన్ని కేటాయించారన్న వివరాలను పొందుపరచలేదు. ఇది నియమావళికి విరుద్ధమని, ప్రస్తుతం ఏయూలో అతిథి అధ్యాపకులుగా పనిచేస్తున్న సుమారు 400 మంది భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కొందరు అభ్యర్థులు ఉన్నత విద్యామండలికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. 1,100 దరఖాస్తుల స్వీకరణ ఆదరాబాదరగా విడుదల చేసిన ఈ వెబ్ నోటిఫికేషన్కు గడువు ముగిసే నాటికి సుమారు 1,100 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఏయూలో పనిచేస్తున్న వారితో పాటు కొత్త అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. సగటున ప్రతి డిపార్ట్మెంట్కు కనీసం 10 దరఖాస్తులు అందినట్లు తెలుస్తోంది. అయితే ఇంజనీరింగ్ కళాశాలకు చాలా తక్కువ దరఖాస్తులు రాగా.. కొన్ని విభాగాలకు అసలు దరఖాస్తులే రాలేదని సమాచారం. ఆరు నెలల (సెమిస్టర్) కాలానికి రూ.45,000 వేతనంగా చెల్లిస్తుండటంతో చాలామంది దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. అందుకేనా.. వేర్వేరు ప్రాంతాల్లో.? : ఆగస్టు 1 నుంచి 4వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ, వాటి నిర్వహణపై పూర్తి గందరగోళం నెలకొంది. గతంలో ప్రిన్సిపాల్ కార్యాలయంలోనే అతిథి అధ్యాపకుల ఇంటర్వ్యూలు నిర్వహించేవారు. కానీ ఈ సారి వేర్వేరు ప్రాంగణాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మొదట ప్రిన్సిపాల్ కార్యాలయం, తర్వాత రిజిస్ట్రార్ కార్యాలయం అని ప్రచారం జరిగింది. అభ్యర్థులంతా ఒకే చోట చేరితే సమస్యలు తలెత్తవచ్చనే ఉద్దేశంతో వేర్వేరు ప్రాంతాల్లో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. రోజుకో మాట ఏయూ ఆర్ట్స్ కళాశాలలకు సంబంధించి విజయనగరం ప్యాలెస్, అంబేడ్కర్ ఆడిటోరియం, ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి జియోఫిజిక్స్, సైన్స్, లా, ఫార్మసీ కళాశాలలకు సంబంధించి అంబేడ్కర్ ఆడిటోరియంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు అభ్యర్థులకు ఈ మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు. అయితే ఎంపిక కమిటీ కూర్పుపై అధికారులు రోజుకో సమాచారం ఇస్తున్నారు. గతంలో వీసీ ఆధ్వర్యంలో సిక్స్ మెన్ కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించింది. ప్రస్తుతం ప్రిన్సిపాల్ చైర్మన్గా, హెచ్వోడీలు, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, ఎక్స్టర్నల్ సభ్యులుగా ఉంటారని ఒకసారి, ఫ్యాకల్టీ చైర్మన్, హెచ్వోడీ, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, ఎక్స్టర్నల్ సభ్యులుగా ఉంటారని మరోసారి, హెచ్వోడీ, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, ఫ్యాకల్టీతో పాటు ఎక్స్టర్నల్ ఉంటారని ఇంకోసారి ప్రచారం జరిగింది. అయితే సంబంధిత ప్రిన్సిపాల్, హెచ్వోడీలకు తెలియకుండానే కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రిన్సిపాల్ పేరుతోనే నోటిఫికేషన్ విడుదలైనందున.. ఆయన లేకుండా ఎంపిక కమిటీని ఏర్పాటు చేయడం చట్ట ప్రకారం సరైంది కాదని వర్సిటీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వందేళ్ల చరిత్రలో.. ఆంధ్ర యూనివర్సిటీలో కొత్త విద్యా సంవత్సరం జూలై మొదటి తేదీ నుంచి ప్రారంభమైంది. కానీ నెల రోజులు గడుస్తున్నా టైం టేబుల్ విడుదల కాలేదు. అధ్యాపకులు తరగతులకు వెళ్లడం లేదు. అతిథి అధ్యాపకుల నియామక ప్రక్రియ జాప్యం, ఒప్పంద అధ్యాపకులు అగ్రిమెంట్ పేరుతో తరగతులకు వెళ్లకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. వందేళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నెల రోజులుగా తరగతులు నిర్వహించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి సెమిస్టర్ సమయం ఆసన్నమవుతుండటంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.సమన్వయలోపంతోనే.. ఏయూలో వీసీ, అధికారులు సమన్వయంతో పని చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. అతిథి అధ్యాపకులందరికీ న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని అతిథి అధ్యాపకుల నియామకం పారదర్శకంగా, ఏయూ నిబంధనల ప్రకారం చేపట్టాలి. – డాక్టర్ ఎం.సురేష్ మీనన్, అధ్యక్షుడు, ఏయూ అధ్యాపకుల సంఘం -
పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలి
● జేసీ, ఐటీడీఏ ఇన్చార్జి పీవో అభిషేక్ గౌడ పాడేరు: ఆర్థిక స్థోమత కలిగిన ప్రతిఒక్కరూ పేద గిరిజన కుటుంబాలను దత్తత తీసుకోవాలని జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీవో అభిషేక్ గౌడ పిలుపునిచ్చారు. పి4 బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన పెదబయలు మండలం పొయిపల్లి పంచాయతీ సైలంకోట గ్రామానికి చెందిన జర్సింగి తెల్లన్న కుటుంబా న్ని దత్తత తీసుకున్నారు. తెల్లన్నకు భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారన్నారు. కుమార్తె రమాదేవి సూపర్ ఫిఫ్టీకు ఎంపికై ప్రస్తుతం మరికవలస కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోందన్నారు. ఆమె ఉన్నత చదువులకు తాను పూర్తి గా తోడ్పాటు అందిస్తానన్నారు. అనంతరం వారి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. -
మానవ అక్రమ రవాణా ప్రపంచ వ్యాప్త పెను సమస్య
● జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర బీచ్రోడ్డు(విశాఖ): మానవ అక్రమ రవాణా ప్రపంచవ్యాప్తంగా పెను సమస్యగా మారుతోందని, ఇది విచారకరమని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర అన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం, ఏటీఎస్ఏసీ ఇండియా సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ, ఆంధ్రప్రదేశ్ సీఐడీ, పలు సంస్థల సమన్వయంతో రూపొందించిన ‘మానవ అక్రమ రవాణా ఒక వ్యవస్థీకృత నేరం – ఈ దోపిడీని అంతం చేయండి’ పోస్టర్ను మంగళవారం సిరిపురంలోని జెడ్పీ చైర్మన్ క్యాంప్ ఆఫీసులో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానంగా అక్రమ రవాణాలో పిల్లలు, మహిళలు, పేదవారు, నిరక్షరాస్యులు బాధితులుగా మారుతుండటం బాధాకరమన్నారు. చక్కని జీవితం, ఉద్యోగం, పెళ్లి పేరు తో నమ్మించి..వారి జీవితాలను ఛిద్రం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ గొండు సీతారాం మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాతో పాటు బాలికల అక్రమ రవాణా వ్యవస్థను రూపుమాపేందుకు తమ ఫోరం ప్రభుత్వంలోని వివిధ శాఖలతో పాటు ఈఅంశంపై పోరాటాలు చేస్తున్న రాష్ట్రంలోని 16 ప్రభుత్వేతర (ఎన్జీఓ) సంస్థలతో కలిసి పనిచేస్తుందని తెలిపారు. పైడితల్లి అమ్మవారి పూజారి లండ మృతి సింహాచలం: రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలై నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అడవివరం గ్రామదేవత పైడితల్లి అమ్మవారి పూజారి, 98వ వార్డు వైఎస్సార్సీపీ నాయకుడు, అడవివరం కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ లండ వెంకటరమణ(45) మంగళవారం మృతిచెందారు. ఈ నెల 27న గుడిలోవ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటరమణ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే నగరంలోని ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. -
పశువుల పెంపకంలోనూ యాజమాన్య పద్ధతులు పాటించాలి
జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జయరాజు పాడేరు : పశువుల పెంపకంలో కూడా యాజమాన్య పద్ధతులను పాటించాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జయరాజు అన్నారు. మంగళవారం మండలంలోని లగిసపల్లి పశువుల వసతి గృహాన్ని సందర్శించారు.ఎంపిక చేసిన రైతులతో సమావేశం నిర్వహించారు. రోజుకు 30 కిలోల పచ్చిగడ్డి, రెండు కిలోల ఎండు గడ్డి, 4కిలోల దాణాను అందిస్తే పశువులు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా అధిక పాల దిగుబడులు సాధించవచ్చని చెప్పారు. ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో అందిస్తున్న పశుదాణాను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పశువుల హాస్టల్లో సరిపడా పచ్చగడ్డి పెంపకం, నీటి సదుపాయం కోసం ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిను ఎంపిక చేసి ఇవ్వాలని స్థానిక ఏపీఎంకు సూచించారు. స్థానిక పశుసంవర్ధక శాఖ ప్రాంతీయ ఆస్పత్రిలో సజ్జా గడ్డి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు స ద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యులు డాక్టర్ వేణుమాధవ్, డాక్టర్ బి. రవి, కె. సురేష్, వెలుగు ఏపీఎం చిన్నారావు, వెటర్నరీ అసిస్టెంట్ ఉమామహేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు. -
ఆర్థికంగా భారం
ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల ద్వారా ఎరువులను ఇంత వరకు పంపిణీ చేయలేదు. వరినాట్లు జోరందుకున్న సమయంలో ఎరువుల అవసరం ఎక్కువగా ఉంటుంది.వారపుసంతల్లో అధిక ధరలకు యూరియా,డీఎపీలను కొనుగోలు చేయడం భారంగా మారింది. – నాగుల మత్స్యలింగం, గిరిజన రైతు, కుంతుర్ల, పెదబయలు మండలం ఎరువు వేస్తేనే మంచి దిగుబడి సహజ ఎరువులు అందుబాటులో ఉండటం లేదు. దీనివల్ల తప్పనిసరిగా రసాయన ఎరువులపై ఆధారపడాల్సి వస్తోంది. వీటిని పైరుకు సకాలంలో వేస్తేనే మంచి దిగుబడి సాధ్యం. లేదంటే పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి ఎదురవుతుంది. ప్రభుత్వం వెంటనే సరఫరా చేయాలి. – వండ్లాబు దేముళ్లునాయుడు, రైతు, గొడ్డుబూసులు, జి.మాడుగుల మండలం సబ్సిడీపై సరఫరా చేయాలి గిరిజన ప్రాంతాల్లో గత ప్రభుత్వాలు విత్తనాలతో పాటు ఎరువులు సబ్సీడీపై అందించేవి. ప్రస్తుత ప్రభుత్వం ఎరువులు సరఫరా చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. తమ పంటలకు కావల్సిన ఎరువులు బయట మార్కెట్ల్లో కొనుగోలు చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నాం. – చిన్న మత్స్యకొండబాబు, రైతు, గడుతూరు గ్రామం, జి.మాడుగుల మండలం -
కాఫీ రైతులకుమొక్కల పంపిణీ
● పాడైన వాటి స్థానంలో నాటేందుకు చర్యలు ● ఐటీడీఏ కాఫీ విభాగం ఏడీ లకే బొంజుబాబు చింతపల్లి: పాడేరు డివిజన్ పరిధిలోని గిరిజన రైతులకు చెందిన పాత కాఫీ తోటల్లో కొత్త మొక్కలు నాటే కార్యక్రమానికి చర్యలు తీసుకుంటున్నామని ఐటీడీఏ కాఫీ విభాగం ఏడీ లకే బొంజుబాబు తెలిపారు. మంగళవారం ఆయన మండలంలోని గాదిగొయ్యి, రామనగర్ కాలనీ, బెన్నవరం, నక్కమెట్ట, సూదిమెట్ట గ్రామాల్లో కాఫీ తోటలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గిరి రైతులు సాగుచేసే పాత కాఫీ తోటల్లో పాడైన మొక్కల స్థానాల్లో కొత్త మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. డివిజన్ పరిధిలో పదివేల ఎకరాల్లో 234 నర్సరీల ద్వారా తయారు చేసిన మొక్కలను ఎకరాకు 450 చొప్పున రైతులకు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. డివిజన్ పరిధిలోని అన్ని మండలాల్లో కూడా రైతులు తోటల్లో ఈ మొక్కలు నాటే కార్యక్రమం వేగవంతం చేసేలా దిగువస్థాయి సిబ్బందిని ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవో ధర్మారాయ్, ఎఫ్సీలు విశ్వాస్బాబు, క్లస్టర్ లైజన్ వర్కర్లు చంటిబాబు, అప్పారావు పాల్గొన్నారు. -
ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఏర్పాట్లు
రంపచోడవరం: వచ్చేనెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని స్థానిక ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం కోరారు. మంగళవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో మంగళవారం ఆదివాసీ దినోత్సవం నిర్వహించేందుకు ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, గిరిజనులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ దినోత్సవం అన్ని తెగల గిరిజనులతో ఘనంగా నిర్వహించేందుకు గిరిజన సంఘాలు, ప్రతినిధులతో ముందస్తు సమా వేశం ఏర్పాటు చేశామన్నారు. ఆదివాసీ దినోత్సవ నిర్వహణకు మండలానికి రూ. 10 వేల నిధులు ఏర్పాటచేశామన్నారు. రంపచోడవరంలో జరిగే ఆదివాసీ దినోత్సవానికి హాజరయ్యే గిరిజనులకు భోజన సదుపాయం ఏర్పాటు చేస్తున్నట్టు పీవో తెలిపారు. -
జిల్లా సమగ్రాభివృద్ధిపై శ్రద్ధ పెట్టండి
సాక్షి,పాడేరు: జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యంగా అన్నిశాఖల అధికారులు శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో విద్య, వైద్యం, ఐసీడీఎస్, వ్యవసాయ, గృహనిర్మాణం, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకాంక్ష జిల్లా అభివృద్ధికి రూ.10 కోట్లు మంజూరయ్యాయని, పనితీరు డేటాను సక్రమంగా నమోదు చేస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. విద్యాసంస్థలకు తాగునీరు, విద్యుత్, అదనపు వసతి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పాఠశాలల్లో బేస్లైన్ పరీక్షలు నిర్వహించి వివరాలను సంబంధిత పోర్టల్లో నమోదు చేయాలన్నారు,. రెవెన్యూ సమస్యలపై అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు రెవెన్యూ సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదిర్శిస్తే సంభందిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దినేష్కుమార్ హెచ్చరించారు. జిల్లాలోని తహసీల్దార్లు, డీటీలు, సర్వేయర్లతో నిర్వహించిన మిగతా 8వ పేజీలోకలెక్టర్ దినేష్కుమార్ ఆదేశం -
అట్టహాసంగా ‘నవోదయ’ టేబుల్ టెన్నిస్ పోటీలు
ఎటపాక: జవహర్ నవోదయ విద్యాలయాల రీజనల్ స్థాయి టేబుల్ టెన్నిస్ క్రీడా పోటీలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులు జరిగే ఈ పోటీలకు స్థానిక నవోదయ విద్యాలయం వేదిక అయింది. వీటిని ఎంపీడీవో ప్రేమ్సాగర్, జీఎంఆర్ పాల్టెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ రామసత్యనారాయణ ప్రారంభించారు. మొదటి రోజు తెలంగాణ, ఆంధ్రా, కర్ణాటక, కేరళ రాష్ట్రాల క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా అతిథులు మాట్లాడుతూ క్రీడల ద్వారా విధ్యార్థులు మానసిక ఒత్తిడిని తగ్గించుకుని అద్భుతాలు సాధించవచ్చన్నారు.రీజనల్ స్థాయి క్రీడలు ఎటపాకలో నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. నవోదయ వైస్ ప్రిన్సిపాల్ ప్రసాద్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో జరిగిన క్లస్టర్ స్థాయి పోటీల్లో ఎటపాక విద్యార్థులు 40 మంది విజయకేతనం ఎగురువేశారన్నారు. ఈ పోటీల్లో కృష్ణా, వైఎస్సార్ కడప, ఖమ్మం, షిమోగా, తుంకూర్, పతనంతిట్ట, వయనాడ్ క్లస్టర్ల క్రీడాకారులు పాల్గొంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాస్కరచారి, లక్ష్మీప్రియ, గౌరీశంకర్, పీడీ జగన్, కోచ్ బాబు పాల్గొన్నారు. -
రూ.31.70 కోట్లతో 13 హాస్టల్ భవనాలు
సాక్షి,పాడేరు: జాతీయ విద్యా దినోత్సవం పురస్కరించుకుని జిల్లాలో రూ.31.70 కోట్లతో నిర్మించనున్న 13 హాస్టల్ భవన నిర్మాణాలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. వీటికి సంబంధించిన భవన శిలాఫలకాలను స్థానికంగా కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్న్మన్ పథకంలో వంద పడకల హాస్టళ్లు 4, 50 పడకల హాస్టళ్లు 9 కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. పాడేరు నియోజకవర్గంలో మిగతా 8వ పేజీలో వర్చువల్ విధానంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించినకలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ -
చింతూరు సీఐగా గోపాలకృష్ణ
● బాధ్యతల స్వీకరణ చింతూరు: స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్గా చిత్రాడ గోపాలకృష్ణ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. మారేడుమిల్లి సీఐగా విధులు నిర్వహిస్తున్న ఆయన ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇప్పటివరకు ఇక్కడ సీఐగా పనిచేసిన దుర్గాప్రసాద్ పాడేరు మహిళా పోలీసుస్టేషన్కు బదిలీఅయ్యారు. బాధ్యతలు చేపట్టిన సీఐ గోపాలకృష్ణను చింతూరు ఎస్ఐ రమేష్, మోతుగూడెం ఎస్ఐ సాధిఖ్, డొంకరాయి ఎస్ఐ శివకుమార్ మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. -
150 లీటర్ల సారా స్వాధీనం
హుకుంపేట: గ్రామల్లో సారా విక్రయాలు, తయారీ చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని, సారా విక్రయాలకు గిరిజనులు దూరంగా ఉండాలని సీఐ సన్యాసినాయుడు, పాడేరు ఎకై ్సజ్ సీఐ టి.వి.వి.ఎస్.ఎన్ ఆచార్యలు తెలిపారు. మండలంలోని ఉప్ప, పోసలగరువు గ్రామాల్లో స్థానిక సీఐ ఆధ్వర్యంలో సారా విక్రయాలు, తయారీ చేస్తున్నట్టు అందిన సమాచారం మేరకు స్థానిక పోలీస్ స్టేషన్, ఎకై ్సజ్ శాఖ, రెవిన్యూ శాఖ సంయుక్తంగా సోమవారం దాడులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లో నల్లబెల్లం, సుమారు 600లీటర్ల పులుపు ధ్వంసం చేసి 150 లీటర్లు సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు మండలంలోని ఈ గ్రామలతో పాటు అనేక గ్రామాల్లో సారా విక్రయాలు, తయారీ చేపడుతున్నారన్నార. ఇకపై సారా తయారీ చేపడితే సహించేదిలేదన్నారు. సారాతో ఎవరైన పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్ఐ సూర్యనారయణ, రెవెన్యూ సిబ్బంది, పోలిస్ శాఖ, ఎకై ్సజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య విధులు నిర్వహిస్తున్న క్లాప్ మిత్రలకు నెలల తరబడి వేతనాలు అందడంలేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలకు మళ్లించుకోవడంతో పారిశుధ్య కార్మికులకు వేతనాలు చెల్లించలేకపోతున్నామని
● నాలుగు నెలలుగా అందని వేతనాలు ● అర్థాకలితో అలమటిస్తున్న కార్మికులు ● నిధులు లేవంటూ చేతులెత్తేస్తున్న పంచాయతీలు ● రూ.1.80 కోట్ల వరకూ పెండింగ్ వేతనాలు సాక్షి, పాడేరు: గ్రామ పంచాయతీల్లో పరిశుభ్రత, ప్రజారోగ్యం కోసం కృషి చేస్తున్న క్లాప్ మిత్రల పరిస్థితి దయనీయంగా మారింది. గొర్రె తోక బెత్తెడు అన్న చందంగా నెలకు రూ.6 వేల వేతనంతో పనిచేస్తున్నారు. అయినప్పటికీ వీరికి ప్రభుత్వం సకాలంలో వేతనాలు చెల్లించడంలేదు. అరకొర వేతనాలు సైతం నెలల తరబడి అందకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా ఉంటోందని క్లాప్ మిత్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతన బకాయిల చెల్లింపు కోసం విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం స్పందించడంలేదని వాపోతున్నారు. జిల్లాలో 22 మండలాల పరిధిలో 352 గ్రామ సచివాలయాలకు సంబంధించి పారిశుద్ధ్య పనులు,తడి,పొడి చెత్త సేకరణకు గాను ప్రభుత్వం క్లాప్ మిత్రల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం 752 మంది క్లాప్ మిత్రలు పనిచేస్తున్నారు. వీరికి నాలుగు నెలలుగా వేతనాలు అందడంలేదు. ఈ బకాయిలు మొత్తం రూ.1.80 కోట్ల వరకూ ఉంటాయని చెబుతున్నారు. దీంతో వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈవేతనంపైనే ఆధారపడుతున్న క్లాప్ మిత్ర కుటుంబాలు కూడా అర్థాకలితో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.గౌరవ వేతనాలను పంచాయతీల నుంచి పంపిణీ చేయనప్పటికీ క్లాప్ మిత్రలు మాత్రం ఆర్థిక ఇబ్బందులు పడుతునే పారిశుధ్య పనులకు ఎంతో శ్రమిస్తున్నారు. పంచాయతీలకు నిధుల సమస్య జిల్లాలోని అన్ని పంచాయతీలకు నిధులు సమస్య అధికంగా ఉంది.పంచాయతీలకు సాధారణ నిధులు లేకపోగా, 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా వేరే పథకాలకు మళ్లిస్తున్న పరిస్థితితో పంచాయతీలు ఆర్థికంగా సతమతమవుతున్నాయి. మేజర్ పంచాయతీల పరిధిలో రెగ్యులర్ పారిశుధ్య కార్మికులకు వేతనాలు అందుతుండగా,మిగిలిన పంచాయతీల్లో అంతే కష్టపడుతున్న క్లాప్ మిత్రలకు మాత్రం గౌరవ వేతనాలు పంపిణీ కావడం లేదు.క్లాప్ మిత్ర కార్మికులకు కూడా సకాలంలో గౌరవ వేతనాలు ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉండడం దారుణమని గిరిజన ప్రజా,కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి క్లాప్ మిత్రలతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. రోజూ ఎంతో శ్రమిస్తున్న కార్మికులకు ప్రతినెలా గౌరవ వేతనాలు చెల్లించకపోవడం అన్యాయం.వారంతా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.నాలుగు నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి. –ఉమామహేశ్వరరావు, సీఐటీయూ, జిల్లా ప్రధాన కార్యదర్శి, అరకులోయ పాడేరుకు సమీపంలోని తలారిసింగి హాస్టల్ ప్రాంతంలో పారిశుధ్య పనులు నిర్వహిస్తున్న క్లాప్ మిత్రలు -
వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ ప్రధాన లక్ష్యం
సాక్షి, పాడేరు: జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ ప్రధాన లక్ష్యమని, ప్రకృతి వైపరీత్యాలపై రైతులకు ముందస్తుగానే సమాచారం అందించాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో అగ్రి స్టాక్పై జిల్లా స్థాయి కమిటీ నిర్వహణకు సంబంధించి మార్కెటింగ్, మార్క్ఫెడ్, మత్స్య, ఉద్యానవన, సెరీకల్చర్, ఇరిగేషన్, ఇన్యూరెన్స్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రోన్, మార్కెటింగ్, విలేజ్ మ్యాపింగ్, జియో ట్యాగింగ్, కిసాన్ క్రెడిట్ కార్డులపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతు సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతం చేసి, అందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో వీడియో కాన్పరెన్స్ ద్వారా జేసీ డాక్టర్ అభిషేక్గౌడ, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీవోలు సింహాచలం, అపూర్వభరత్, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. ఆగస్టు 2 నుంచి ఆకాంక్ష హాట్ సంపూర్ణత అభిమాన్ సమ్మాన్ సమారో కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 2 నుంచి ఆకాంక్ష హాట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఎ. ఎస్.దినేష్కుమార్ తెలిపారు.యాస్పిరేషన్ జిల్లాగా అల్లూరి సీతారామరాజు జిల్లాను ఎంపికవడం సంతోషంగా ఉందన్నారు.రంపచోడవరం డివిజన్లో గంగవరం, మారేడుమిల్లి, వై.రామవరంలను ఒక యాస్పిరేషన్గా గుర్తించినట్టు చెప్పారు. హెల్త్ అండ్ న్యూట్రీషన్, వ్యవసాయం,విద్య, మోడల్ స్కూల్, సోషల్ డవలప్మెంట్ వంటి ఆరు ఆంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. నీతి అయోగ్ కింద జిల్లాకు రూ.10కోట్లు ప్రోత్సాహకం ఇచ్చినట్టు చెప్పారు. కాఫీ, ఇతర ఉద్యానవన పంటలను ఒక బ్రాండ్గా తీసుకురావడంతో గిరిజన రైతులకు మంచి ఆదాయం లభిస్తుందన్నారు. ఇంజినీరింగ్ పనులు వేగవంతం జిల్లాలోని పలు ఇంజినీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ ఆదేశించారు.కలెక్టరేట్ నుంచి ఆర్అండ్బీ, గిరిజన సంక్షేమశాఖ ఇంజినీరింగ్ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ భవనాలు, బర్త్ వెయిటింగ్ హాళ్లు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు, సీసీడీపీ, పీఎం జన్మన్ పథకంలో మంజూరు చేసిన పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జేసీ డాక్టర్ అభిషేక్గౌడ,రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం, ట్రైనీ కలెక్టర్ సాహిత్, గిరిజన సంక్షేమశాఖ అరకు ఈఈ కె.వేణుగోపాల్,పంచాయతీరాజ్ ఈఈ కొండయ్యపడాల్, పీఆర్ఐ ఈఈ నరేంద్రకుమార్,పలుశాఖల డీఈఈలు రామం,రవికుమార్లు పాల్గొన్నారు. కిసాన్ డ్రోన్లను సద్వినియోగం చేసుకోవాలి కిసాన్ డ్రోన్లను గిరిజనరైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. వై.రామవరం మండలం దాలిపాడుకు చెందిన శ్రీదుర్గా భవానీ గ్రూప్ సభ్యులు, డ్రోన్ పైలట్ వెంకట శివసాయికి కిసాన్ డ్రోన్ను కలెక్టర్ పంిపిణీ చేశారు.రూ.9.80లక్షల కిసాన్ డ్రోన్ను రూ.80 శాతంసబ్సిడీపై అందుబాటులోకి తెచ్చారు. కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ -
డీఎస్సీ నుంచి ఏజెన్సీ ప్రాంత పోస్టులు మినహాయించాలి
పాడేరు: డీఎస్సీ నుంచి షెడ్యూల్డ్ ప్రాంత ఉపాధ్యా య పోస్టులను మినహాయించాలని గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనర్స డిమాండ్ చేశారు. ఆదివాసీలకు శతశాతం ఉద్యోగ రిజర్వేషన్ కల్పించి, ఆదివాసీ ప్రాంత ఉపాధ్యాయ పోస్టులను స్థానిక ఆదివాసీలతో భర్తీ చేయాలని, ఈ మేరకు టీఏసీలో తీర్మానం చేయాలన్నారు. సోమవా రం స్థానిక మోదకొండమ్మ ఆలయం ఆడిటోరియంలో స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ, ఆదివాసీ నిరుద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ తాము మన్యం వ్యాప్తంగా బంద్లు, రాస్తారోకోలు, ర్యాలీలు చేస్తే శతశాతం ఉద్యోగ రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చారని, తీరా ఇప్పుడు 49 శాతం రిజర్వేషన్లు అంటూగందరగోళం సృష్టిస్తున్నారని తెలిపారు. హామీమేరకు తక్షణమే సమస్యలు పరి ష్కారించాలని లేనిపక్షంలో భారీ ఎత్తున ఆందోళన లు నిర్వహిస్తామని చెప్పారు. గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.బాల్దేవ్,ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ సాధనకమిటీ జిల్లాకన్వీనర్ ఎస్.ధర్మన్నపడా ల్, కోకన్వీనర్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
డ్రోన్ల సాయం.. లాభసాటి సేద్యం
● తగ్గనున్న పెట్టుబడి ఖర్చు.. నీటి ఎద్దడిని తట్టుకోనున్న పైరు ● డ్రోన్ సహాయంతో వరి విత్తనాలు చల్లే పద్ధతికి శ్రీకారం ● ఆర్ఏఆర్ఎస్లో పరీక్షించిన శాస్త్రవేత్తలు ● చీడపీడల బాధ తగ్గుతుందని ఆశాభావం సాక్షి, అనకాపల్లి: వ్యవసాయం లాభసాటి కావాలంటే రైతులు యాంత్రీకరణ బాట పట్టాల్సిందే. ఇప్పటికే సాగులో దుక్కు, మందుల పిచికారీ వంటి పనులు యంత్రాల సాయంతో చేపడుతున్నారు. అలాగే డ్రోన్లతో వరి సహా అనేక పంటలపై పురుగు మందులు, ఎరువులు చల్లటం వంటి పనులు కూడా చేస్తున్నారు. తాజాగా వరి సాగులో నారుకు బదులు నేరుగా డ్రోన్ సాయంతో విత్తనాలు వెద చల్లే పద్ధతికి సోమవారం అనకాపల్లి ఆర్ఏఆర్ఎస్ పరిశోధన స్థానంలో శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మారుతి డ్రోన్ సంస్థ సాంకేతిక సహకారంతో శాస్త్రవేత్తలు డాక్టర్ రమణమూర్తి, డాక్టర్ గౌరీ, డాక్టర్ జగన్నాథరావు ఈ విధానాన్ని పరీక్షించారు. 73 శాతం విత్తనం ఆదా ఆర్ఏఆర్ఎస్లో 21 సెంట్ల పొడి నేలలో నాలుగు నిమిషాల్లో, 15 సెంట్ల తడి నెలలో 3.2 నిమిషాల్లో డ్రోన్ ద్వారా వరి విత్తనాలు వేశారు. సగటున 3.5 మీ/సె వేగంతో డ్రోన్ టెక్నాలజీతో విత్తనాలను నాటారు. ఈ పద్ధతిలో సగటున ఎకరాకు సుమారు 9 కేజీల వరి విత్తనాలు సరిపోతున్నాయి. ఇలా విత్తనాలను విత్తడానికి డ్రోన్కు ఒక ఎకరాకు 15 నిమిషాలు పడుతుంది. అయితే 21 సెంట్ల పొడి నేలలో 1.9 కేజీల విత్తనాలు చల్లడానికి మూడు నిమిషాలు పట్టింది. ఇదే సంప్రదాయ సాగు పద్ధతిలో ఎకరాలకు 30 నుంచి 35 కేజీల వరి విత్తనాలు అవసరం ఉంటుంది. డ్రోన్ ద్వారా విత్తే పద్ధతిలో 73 శాతం వరకు వరి విత్తనాలు ఆదా అవుతున్నాయి. ఈ పద్ధతిలో పాటించాల్సిన జాగ్రత్తలు నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి విత్తిన వెంటనే తడిపేందుకు తేలికపాటి నీటి డ్రిప్ ఉండాలి వరి నాటిన తర్వాత 7–10 రోజుల్లో మొలకల పరిస్థితిని పరిశీలించాలి పొలాన్ని సమతలంగా చేయడం చాలా ముఖ్యం విత్తనాలను వేసుకునే ముందే కలుపు మొక్కలను పూర్తిగా తొలగించాలి -
ప్రమాద స్థాయికి డుడుమ, జోలాపుట్టు
ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరందించే డుడుమ,జోలాపుట్టు జలాశయాల నీటి మట్టాలు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. కొన్ని రోజులుగా సరిహద్దులో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు భారీగా వరద నీరు జలాశయాల్లోకి వచ్చి చేరుతోంది. డుడుమ జలశయం నీటి మట్టం 2,590 అడుగులు కాగా సోమవారం నాటికి 2,585.90 అడుగులుగా నమోదైంది. డుడుమ జలశయ ఎగువన ఉన్న జోలాపుట్టు జలాశయ నీటి మట్టం సైతం క్రమేపి పెరుగుతోంది. జోలాపుట్టు జలాశయ పూర్తిస్థాయి నీటి మట్టం 2,750 అడుగులు కాగా సోమవారం నాటికి 2,738 అడుగులకు చేరింది.గత ఏడాది ఇదే రోజు 2,732 అడుగులు నీటి నిల్వ నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఆరు అడుగులు నీటి నిల్వ ఎక్కువగా ఉంది. జలాశయాల్లోకి వరదనీరు భారీగా చేరుతుండడంతో అప్రమత్తమైన జలాశయ సిబ్బంది నిరంతరం నీటి నిల్వలు అంచనా వేస్తున్నారు. సరిహద్దులో విస్తారంగా వర్షాలు జలాశయాల్లోకి భారీగా వరద నీరు అప్రమత్తమైన జలాశయాల అధికారులు -
ఆరోగ్య శ్రీ పై నీలినీడలు
● ఆస్పత్రులకు బిల్లులు చెల్లించని కూటమి ప్రభుత్వం ● జిల్లాలో 106 ఆస్పత్రులకు రూ.260 కోట్ల మేర బకాయిలు ● పేదలకు అందని ‘ఆరోగ్యశ్రీ’ వైద్యం మహారాణిపేట: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అమలుపై కూటమి ప్రభుత్వం ‘సవతి తల్లి ప్రేమ’ చూపుతోంది. ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రులకు కోట్ల రూపాయల బకాయిలను పెండింగ్లో పెట్టడంతో, పేద రోగులకు వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో ఆస్పత్రికి వచ్చే పేద రోగులకు వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డులు, వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ కార్డులకు వైద్యసేవలు అందించడంలో కార్పొరేట్ ఆస్పత్రులు ఆసక్తి చూపడం లేదు. పేదలపై కూటమి సర్కార్ కత్తి ఎన్నికలకు ముందు సంక్షేమ పథకాలపై హామీలిచ్చిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న పథకాలను ఎత్తేసే ప్రయత్నం చేస్తోంది. మద్యం విక్రయాలు, విద్యుత్ చార్జీల పెంపు ద్వారా ఖజానా నింపుకుంటున్న ప్రభుత్వం, దివంగత వై.ఎస్.రాజశేఖర్రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకంపై నిర్వీర్యంపై దృష్టి సారించిందని ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో పరిస్థితి జిల్లాలో 106 ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ పరిధిలో ఉన్నాయి. ఈ నెట్వర్క్ ఆస్పత్రులకు సుమారు రూ. 260 కోట్ల ప్రభుత్వం బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే పేదల ఆరోగ్యశ్రీ వైద్య సేవల్లో అంతరాయం కలుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో అద్భుతమైన సేవలు అందించిన కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు ఇప్పుడు కార్డుదారులకు సేవలు అందించడానికి వెనుకాడడంతో, లబ్ధిదారుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. కార్డుదారులందరికీ వైద్యం ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ అప్పారావు ఈ ఆరోపణలను ఖండించారు. ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న అందరికీ వైద్య సేవలు అందుతున్నాయని, ఎక్కడైనా సేవలు అందకపోతే తమను సంప్రదించాలని ఆయన కోరారు. నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం ప్రతి నెలా నిధులు విడుదల చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. -
ఏడాదికాలంగా అభివృద్ధి జరగ లేదు
సర్పంచ్, టీడీసీ నేతల ఆవేదనఎటపాక: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏడాది కాలంగా మారుమూల గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.సోమవారం టీపీ వీడు గ్రామంలో సర్పంచ్ మోసం రాజులు,పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పూరేటి వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ముందుగా రాష్ట్ర ఎస్టీ సంక్షేమ సంఘం చైర్మన్గా ఎన్నికై న ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ మండలంలో ప్రజాప్రతినిధులకు అధికారుల దగ్గర విలువ లేకుండా పోయిందని చెప్పారు. తాము ప్రజల సమస్యలు పరిష్కరించలేకపోతున్నామని వాపోయారు. ఎమ్మెల్యే శిరీషాదేవి మండలంలో పర్యటనకు వచ్చినప్పుడు కూడా తమకు గుర్తింపు ఇవ్వడంలేదన్నారు.ధనిక వర్గాల నేతల సూచనలతో పర్యటనలు చేసి కింద వర్గాల నాయకులు,కార్యకర్తలను విస్మరిస్తున్నారని ఆవేదన చెందారు.తాము దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగుతున్నామని అయిన తమకు గుర్తింపు కరువైందని చెప్పారు. టీడీపీ సీనియర్ నాయకుడు రాఘవయ్య మాట్లాడుతూ..పోలవరం నిర్వాసితుల సమస్యతో పాటు మరెన్నో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునేవారే లేరన్నారు. ఇప్పటి కై నా సీనియర్ నాయకులు,కార్యకర్తలకు,ప్రజాప్రతినిధులకు తగిన గుర్తింపు ఇవ్వాలని లేకుంటే గ్రామాల్లో ప్రజలకు సమాధానం చెప్పలేమని స్పష్టం చేశారు. ఇప్పటికే గ్రామాల్లోని నాయకులు ,కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ఈసమావేశంలో పూసం రాఘవయ్య,పూసం బాబు,రత్నాకర్,అపక రాంబాబు,చంద్రం,కుసుమరాజు శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
మరింత పటిష్టంగా.. సీబీఎస్ఈ విద్య
● ఎన్ఈపీ–2020 నిబంధనలకు అనుగుణంగా బోధన ● సీబీఎస్ఈ పాఠశాలల్లో ప్రత్యేక భద్రతా చర్యలు ● 2026 నుంచిఏటా రెండు సార్లు బోర్డు పబ్లిక్ పరీక్షలు ● నూతన మార్గదర్శకాలు జారీ చేసిన సీబీఎస్ఈ బోర్డు ఆరిలోవ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) విద్యను మరింత పటిష్టవంతం చేస్తున్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ)–2020 మేరకు సీబీఎస్ఈ పాఠశాలల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి నియమ నిబంధనలపై జిల్లాలోని సీబీఎస్సీ స్కూళ్ల యాజమాన్యాలకు బోర్డు సమాచారం అందించింది. ఈ నిబంధనల మేరకు విద్యార్థుల భద్రత కోసం ప్రతి పాఠశాలలో సీసీ కెమెరాలు తప్పనిసరి చేశారు. పాఠశాల ప్రధాన ద్వారం, క్రీడా మైదానం, కారిడార్లు, తరగతి గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. వాటిలో ఆడియో, వీడియో స్పష్టత ఉండాలి. ప్రతి తరగతి గదిలో 40 మంది విద్యార్థులు మాత్రమే ఉండాలి. మంచి గాలి, వెలుతురు వచ్చేలా తరగతి గదుల్లో సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ఏటా రెండుసార్లు పరీక్షలు నూతన విధానం ప్రకారం సీబీఎస్ఈ బోర్డు ద్వారా 2026 నుంచి పదో తరగతి పరీక్షలు రెండుసార్లు నిర్వహించనున్నారు. ఇంతవరకు ఒకసారి మాత్రమే పబ్లిక్ పరీక్షలు జరిగేవి. ఇప్పుడు విద్యార్థులు మార్కులు మెరుగు పరచుకునేందు(బెటర్మెంట్)కు అవకాశం కల్పిస్తూ రెండుసార్లు పరీక్షలు నిర్వహించే విధానాన్ని తీసుకొచ్చారు. రెండోసారి పరీక్ష రాయాలనుకునే విద్యార్థి మొదటి సారి పరీక్ష తప్పనిసరిగా రాసి ఉండాలి. ఈ విధానం వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. దీంతో పాటు పరీక్ష పేపర్లో కూడా మార్పులు తీసుకొచ్చారు. ప్రశ్నాపత్రంలో స్వల్ప, దీర్ఘ సమాధాన ప్రశ్నలను బోర్డు తగ్గించింది. ఆలోచన, నైపుణ్యం కలిగించే విశ్లేషణాత్మక, వివరణాత్మక ప్రశ్నలకు ప్రాధాన్యత ఇవ్వనుంది. దీనివల్ల భావాలను అర్ధంచేసుకునేలా విద్యార్థి తీర్చిదిద్దబడతాడని బోర్డు నమ్మకం. విశాఖ జిల్లాలో 40 సీబీఎస్ఈ పాఠశాలలున్నాయి. వాటిలో రెండు ప్రైమరీ, ఒక అప్పర్ ప్రైమరీ పాఠశాలతో పాటు 37 ఉన్నత పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో 39,517 మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలో ఆయా పాఠశాలలన్నీ తప్పనిసరిగా సీబీఎస్ఈ నూతన విధానాల మేరకు భద్రతా చర్యలు పాటించాలని బోర్డు స్పష్టం చేసింది. -
తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్కు సుస్తీ
పాడేరు: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్లకు కొత్త వాహనాలను సమకూర్చింది. నిర్వహణ బాధ్యతను అరబిందో సంస్థకు అప్పగించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో తల్లి,బిడ్డలను ఆ అంబులెన్స్లలో క్షేమంగా ఇళ్లకు తరలించేవారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వాహణ సక్రమంగా లేపోవడంతో వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. దీంతో తల్లీ,బిడ్డలను సకాలంలో ఇళ్లకు చేరలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థోమత ఉన్న వారు ప్రైవేటు వాహనాల్లో ఇళ్లకు చేరుకుంటూ ఉండగా, ఆర్థిక స్థోమత లేని పేదలు మాత్రం ప్రభుత్వ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ అంబులెన్స్ల కోసం ఎదురు చూస్తున్నారు. మూలకు చేరిన 8 వాహనాలు జిల్లాలో 33 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ అంబులెన్స్లు ఉన్నాయి. వీటిలో 8 వాహనాలు మూలకు చేరాయి. పాడేరు జిల్లా ఆస్పత్రి మాతా,శిశు విభాగానికి కేటాయించిన మూడు వాహనాలూ మరమ్మతులకు గురై మూలకు చేరాయి. దీంతో ఈ ఆస్పత్రిలో ప్రసవించిన మహిళలకు ఇళ్లకు చేరేందుకు నానా అవస్థలకు గురికావలసి వస్తోంది. జి.మాడుగుల మండలంలో రెండు వాహనాలు, ముంచంగిపుట్టు మండలంలో ఒకటి, పెదబయలులో ఉన్న ఒకటి, చింతపల్లిలో ఒకటి, జీకే వీధి ఒకటి మరమ్మతులకు గురయ్యాయయి. వీటితో పాటు ఇంజిన్ ఆయిల్, బ్యాటరీలు తరచూ మార్చపోవడంతో పలు వాహనాలు తరచూ మొరాయిస్తున్నాయి. టైర్లు అరిగిపోవడంతో పంక్చర్ అవుతున్నాయి. విషయాన్ని సంస్థ యాజమన్యానికి తెలియజేస్తున్న పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పడిగాపులు కాసిన తల్లులు జిల్లా ఆస్పత్రిలో ప్రస్తుతం ముగ్గురు తల్లులకు, బిడ్డలకు వైద్యులు డిశ్చార్జి ఇచ్చారు. కానీ జిల్లా ఆస్పత్రిలో ప్రస్తుతం ఒక్క వాహనం కూడా అందుబాటులో లేకపోవడంతో రెండు రోజుల పాటు వారు ఆస్పత్రిలోనే ఇబ్బందులు పడ్డారు. గున్నమామిడి గ్రామానికి చెందిన పాతున్లి విజయకుమారి, డేగలరాయి గ్రామానికి చెందిన ఆర్త్తి, పులిగొంది గ్రామానికి చెందిన కిల్లో వరహాలమ్మ తమ బిడ్డలతో వార్డుల్లోనే వాహనాల కోసం ఎదు రు చూశారు. ఎప్పటికీ వాహనాలుఅందుబాటు లోకి రాకపోవడంతో అవస్థలు పడుతూ ఆటోల్లో ఇళ్లకు చేరుకున్నారు. ఈ విషయమై జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విశ్వామిత్రను సంప్రదించగా తల్లీబిడ్డ ఎక్స్ప్రెక్స్లు తమ పరిధిలో ఉండవని చెప్పారు. అరబిందో యాజమాన్యం ప్రత్యేక సిబ్బందిని నియమించి, వాటిని నడుపుతోందని తెలిపారు. ఐదు నెలలుగా వేతనాలకు నోచుకోని సిబ్బంది ఈవాహనాల్లో పనిచేస్తున్న 31మంది డ్రైవర్లకు నెలకు రూ.7,870 చొప్పున వేతనం చెల్లిస్తున్నారు. ఈ మొత్తం కూడా ఐదునెలలుగా చెల్లించడం లేదు. దీంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూమ్రెంట్లు, కరెంట్ బిల్లులు కట్టుకోలేక కుటుంబ పోషణ కష్టంగా మారిందని డ్రైవర్లు తెలిపారు మరమ్మతులతో మూలకు చేరిన వాహనాలు డిశ్చార్జి ఇచ్చినా ఇళ్లకు వెళ్లలేని బాలింతలు బిడ్డలతో సహా తల్లులు ఆస్పత్రిలోనే పడిగాపులు జిల్ల్లాకు కేటాయించిన వాహనాలు 33 మరమ్మతులకు గురైనవి 8 మొత్తం డ్రైవర్లు 31 బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు పాడేరు ఐటీడీఏ పరిధిలోని 11 మండలాల్లోని ఆస్పత్రులకు కేటాయించిన తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ల్లో చాలా వాహనాలు మరమ్మతులకు గురై మూలకు చేరాయి. దీంతో బాలింతలు ఇబ్బందులకు గురవుతున్నారు. విషయాన్ని అరబిందో సంస్థకు తెలియజేసినా పట్టించుకోవడం లేదు. తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల్లో డ్రైవర్లకు బకాయి పడిన వేతనాలు వెంటనే చెల్లించాలి. వాహనాలను త్వరిగతిన అందుబాటులోకి తీసుకురావాలి. లేదంటే ఉద్యమం చేయక తప్పదు. – కూడా రాధాకృష్ణ, ఏపీ గిరిజన సమాఖ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి, పాడేరు. త్వరలో అందుబాటులోకి తెస్తాం జిల్లా వ్యాప్తంగా మరమ్మతులకు గురైన ఎనిమిది వాహనాలను త్వరలో అందుబాటులోకి తెస్తాం. వీటిలో నాలుగు వాహనాలను మూడు రోజుల్లో అందుబాటులో ఉంచుతాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంస్థకు బిల్లులు జమకాకపోవడంతో డ్రైవర్ల వేతనాలు చెల్లించడం లేదు. త్వరలో చెల్లిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. –దుర్గా ప్రసాద్, తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ జిల్లా కోఆర్డినేటర్ -
బంగారు కుటుంబాల దత్తతకు ముందుకు రావాలి
కలెక్టర్ దినేష్కుమార్ పిలుపు సాక్షి, పాడేరు: బంగారు కుటుంబాల దత్తతకు మార్గదర్శకులంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ పిలుపునిచ్చారు.సోమవారం ఆయన కలెక్టరేట్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబునాయుడు పీ–4 వినూత్న కార్యక్రమాన్ని మార్చి నెలలో ప్రారంభించారన్నారు.మార్చి 9వతేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా సర్వే నిర్వహించామని, 352 సచివాలయాల పరిధిలో 92,683 బంగారు కుటుంబాలకు సంబంధించి 3,13,041 కుటుంబ సభ్యులను గుర్తించామని చెప్పారు.గుర్తించిన కుటుంబాలకు ఆర్థికంగా,సామాజికంగా ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలన్నారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ అభిషేక్గౌడ మాట్లాడుతూ మార్గదర్శకులంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. సాంబశివ కుటుంబాన్ని కలెక్టర్ దత్తత పాడేరు మండలం ఐనాడ గ్రామానికి చెందిన గిరిజన రైతు కూలి సాంబశివ కుటుంబాన్ని కలెక్టర్ దినేష్కుమార్ దత్తత తీసుకున్నారు.ఈ కుటుంబానికి చెందిన మానస నీట్ పరీక్ష రాసిన ర్యాంకు రాకపోవడంతో నిరాశకు గురైంది.ఆమెను చదివించేందుకు తండ్రి సాంబశివ వద్ద ఆర్థికస్థోమత లేకపోవడాన్ని గుర్తించిన కలెక్టర్ దినేష్కుమార్ మానసకు చదవు చెప్పించేందుకు ముందుకురావడంతో పాటు ఈ కుటుంబాన్ని బంగారు కుటుంబంగా దత్తత తీసుకున్నారు.ఈ సందర్భంగా మానస మాట్లాడుతూ కలెక్టర్ పేద కుటుంబాన్ని దత్తత తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు.జాయింట్ కలెక్టర్ డాక్టర్ అభిషేక్గౌడ గుత్తులపుట్టు గ్రామంలోని ఓ గిరిజన కుటుంబాన్ని,సబ్కలెక్టర్ సౌర్యమన్పటేల్ పాడేరుకు చెందిన పాతిమా కుటుంబాన్ని దత్తత తీసుకున్నారు.ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ సాహిత్,ఉప కలెక్టర్ ఎం.ఎస్.లోకేశ్వరరావు, సీపీవో ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పేదలను ఆదుకునేందుకు మార్గదర్శిగా నిలవాలి చింతూరు: నిరుపేదలను ఆదుకునేందుకు ప్రతిఒక్కరూ మార్గదర్శిగా నిలవాలని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ అన్నారు. చింతూరు డివిజన్లో పీ4 కార్యక్రమం అమలు విషయంపై సోమవారం ఆయన ఐటీడీఏ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. డివిజన్లో ఈ పథకం అమలు నిమిత్తం 9,449 కుటుంబాలను గుర్తించినట్టు చెప్పారు. దీనికి సంబంధించి 46 గ్రామసభలు నిర్వహించినట్టు ఆయన తెలిపారు. రిత్విక్ కుటుంబాన్ని దత్తత తీసుకున్న పీవో పీ4 పథకంలో భాగంగా స్థానిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న మడకం రిత్విక్ అనే విద్యార్థి కుటుంబాన్ని దత్తత తీసుకున్నట్లు పీవో అపూర్వభరత్ తెలిపారు. రిత్విక్ తల్లి విజయలక్ష్మి తన క్యాంపు కార్యాలయంలో పనిచేస్తుండగా తండ్రి చిన్న కూలిపనులు చేస్తుంటాడని ఆయన తెలిపారు. రిత్విక్ ఎంతో తెలివైన విద్యార్థి అని చదువులో ఎల్లప్పుడూ ముందుంటాడని వారి పేదరికాన్ని గమనించిన తాను ఆ కుటుంబాన్ని దత్తత తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రిత్విక్ విద్యకోసం కావాల్సిన ఆర్థికసాయం అందిస్తానని వారి కుటుంబానికి అండగా వుంటానని పీవో తెలిపారు. పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలి రంపచోడవరం: జిల్లాలో బాగా పేదరికంలో ఉన్న వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసే విధంగా ఒక్కొక్క అధికారి ఒక్కో కుటుంబాన్ని దత్తత తీసుకోవాలని రంపచోడవరం పీవో కట్టా సింహాచలం అన్నారు. ఐటీడీఏ సమావేశపు హాలులో సోమవారం పీ 4 ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాలపై సోమవారం సబ్ కలెక్టర్ కెఆర్ కల్పశ్రీతో కలిసి విలేకర్లు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ప్రతి ఐఏఎస్ అధికారి ఒక్కో కుటుంబాన్ని దత్తత తీసుకోనున్నట్టు చెప్పారు. సబ్ కలెక్టర్ కల్పశ్రీ మాట్లాడుతూ పేదరికంలో ఉన్న వారిని గుర్తించి, ఆర్థికంగా బలోపేతం చేయడమే పీ–4 కార్యక్రమం లక్ష్యమన్నారు. ఎస్డీసీ పి.అంబేడ్కర్, ఏపీవో డీఎన్వీ రమణ, అధికారులు పాల్గొన్నారు. -
తల్లికి వందనం సొమ్ము జమ చేయండి
● అర్హులైనా పథకం అమలుకాలేదని నిరుపేద కుటుంబం ఆవేదన ● ఉన్నతాధికారులు స్పందించాలని వినతి ముంచంగిపుట్టు: కూటమి ప్రభుత్వం అమలుచేసే అరకొర పథకాలు సైతం అందరికీ అందడం లేదు.నీకు రూ.1500, నీకు రూ.1500 అంటూ ప్రచారం చేసిన ఏడాది తరువాత అమలు చేసిన తల్లికి వందనం పథకం కొందరికే పరిమితమైంది. ఈ పథకం అందని వారంతా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇందులో భాగంగా ముంచంగిపుట్టు మండలం మారుమూల రంగబయలు పంచాయతీ జర్రెలపోదర్ గ్రామానికి చెందిన వంతాల కళ్యాణం అనే నిరుపేద గిరిజనుడు గత నెల రోజులుగా తల్లికి వందనం కోసం తిరిగి సోమవారం ‘సాక్షి’ ముందు తన ఆవేదనను వ్యక్తం చేశాడు. తనకు ఆరుగురు పిల్లలు ఉన్నారని, వీరిలో ముగ్గురు పిల్లలు చదువుతున్నారని, పెద్ద కుమార్తె వంతాల బుజ్జిమ్మ ఇంటర్ ద్వితీయ సంవత్సరం, రెండవ కుమార్తె వంతాల అనిత 7వ తరగతి, మూడో కుమారుడు వంతాల మహేంద్ర 4వ తరగతి చదువుతున్నారని, ముగ్గురికి తల్లికి వందనం పడుతుందని ఎంతో ఆశ పడ్డానని, ఒక్కరికి కూడా పడలేదని వాపోయాడు. సచివాలయానికి పలుమార్లు తిరిగిన నాకు న్యాయం జరగలేదని, ఉన్నతాధికారులు స్పందించి తల్లికి వందనం పథకం మంజూరయ్యేటట్టు చూడాలని, నీరుపేద గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు వంతాల కళ్యాణం, వంతాల సీతలు వాపోయారు. -
ఏవోబీలో ముమ్మరంగా తనిఖీలు
ముంచంగిపుట్టు: మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలతో ఆంధ్ర ఒడిశా సరిహద్దులో పోలీసులు అప్రమత్తమయ్యారు. మండల కేంద్రం ముంచంగిపుట్టులో సోమవారం స్థానిక ఎస్ఐ జె.రామకృష్ణ ఆధ్వర్యంలో సీఆర్ఫీఎఫ్ బలగాలు,స్పెషల్ పార్టీ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.మారుమూల లక్ష్మీపురం,కుమడ,భూసిపుట్టు,రంగబయలు పంచాయతీల నుంచి వచ్చే వాహనదారులను ప్రశ్నించి వారి లగేజ్లు,బ్యాగ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.అనుమానితుల వివరాలు సేకరించి విడిచిపెట్టారు.జోలాపుట్ట,దోడిపుట్టు నైట్హాల్ట్ బస్సులను మండల కేంద్రానికే పరిమితం చేశారు.ప్రభుత్వ కార్యలయాల వద్ద రాత్రిపూట పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు గ్రామాలైన జోలాపుట్టు,మాచ్ఖండ్,ఒనకఢిల్లీ,పాడువలలోని బీఎస్ఎఫ్ బలగాలు సైతం తనఖీలు చేస్తూ సరిహద్దు రాకపోకలపై ప్రత్యేక నిఘాను ఉంచాయి.ఈ సందర్భంగా ఎస్ఐ రామకృష్ణ మాట్లాడుతూ మండల కేంద్రంలో కొత్త వ్యక్తులు,అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగాతే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.వారోత్సవాలతో ఆంధ్ర,ఒడిశా సరిహద్దులో తనిఖీలు ముమ్మరం చేశామని ఆయన తెలిపారు. విస్తృతంగా వాహన తనిఖీలు వై.రామవరం: స్థానిక బస్టాండ్ ఆవరణలో సోమ వారం ఎస్ఐ బి.రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందుజాగ్రత్త చర్యగా ఈ తనిఖీలు నిర్వహించినట్టు ఎస్ఐ తెలిపారు. వారపు సంతకు వచ్చిపోయే అన్ని వాహనాలను తనిఖీ చేశారు. వాటిలో రవాణా చేస్తున్న సామగ్రిని పరిశీలించారు. రికార్డులు సక్రమంగా లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. కొత్త వ్యక్తులపై నిఘా విధించారు. -
గంజాయి వ్యాపారులపై పోలీసుల దాడి
● కేసు నమోదు, ముగ్గురు అరెస్ట్ ● 60 కిలోల గంజాయి స్వాధీనం, ఒక ఆటో రెండు మొబైల్ ఫోన్లు సీజ్ రోలుగుంట : మండలంలో గంజాయి వ్యాపారం చేస్తున్న రూట్లలో స్థానిక ఎస్ఐ రామకృష్ణారావు సిబ్బందితో కలసి కొత్తకోట సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో దాడి చేశారు. ఈ దాడిలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి తరలించడానికి వినియోగించిన ఆటోను సీజ్ చేశారు. మూడు బస్తాల్లో ఉన్న 60 కిలోల గంజాయి, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలివి. నిందితులు అల్లూరి జిల్లా చింతపల్లి మండలం మడిమబంద గ్రామానికి చెందిన వ్యక్తుల నుంచి గంజాయి కొనుగోలు చేసి రత్నంపేటలో జీడితోటలో దాచారు. అక్కడ నుంచి ఆదివారం ఆటోలో గంజాయిని ఇతర ప్రాంతాలకు తరలిస్తూ పోలీసు దాడుల్లో పట్టుబడ్డారు. ఆటోలో ఉన్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆటోని సోదా చేసి మూడు బస్తాల్లో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో రోలుగుంట మండలం రత్నంపేట గ్రామానికి చెందిన ఊడి రమణబాబు(25) (ఇతనిపై పాత కేసు ఉంది), ఆర్లి శ్రీను(29) (ఇతనిపై నాలుగు గంజాయి కేసులు ఉన్నాయి), అల్లూరి జిల్లా చింతపల్లి మండలానికి చెంది మడిమబంద గ్రామానికి చెందిన కొర్రా సూరిబాబు(53) ఉన్నారు. నిందితులను అరెస్టు చేసి సోమవారం రిమాండుకు తరలించినట్టు ఎస్ఐ విలేకరులకు తెలిపారు. -
‘సృష్టి’ రహస్యాలెన్నో...!
● ఐవీఎఫ్లో కలకలం ● పిల్లలు లేని దంపతులే లక్ష్యం ● భారీగా వసూళ్ల పర్వం ● లోపించిన వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షణ ● వివాదాలకు కేంద్రబిందువుగా మారిన ఐవీఎఫ్ సెంటర్లు మహారాణిపేట: పిల్లలు లేని దంపతులను లక్ష్యంగా చేసుకుని, సరోగసీ (అద్దె గర్భం), ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) కేంద్రాలు భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాయి. మాతృత్వపు ఆనందాన్ని అందిస్తున్న ఈ పద్ధతులను కొన్ని సంస్థలు సొమ్ము చేసుకునే మార్గంగా చూస్తూ మహిళల నుంచి అడ్డగోలుగా డబ్బు దోచుకుంటున్నాయి. గతంలో ఐవీఎఫ్ కేంద్రాలు ఇష్టానుసారం సరోగసీని ఉపయోగించుకుని డబ్బులు దండుకున్నాయని అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. నగరంలోని ‘సృష్టి ఐవీఎఫ్’ సెంటర్ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. సరోగసీ, ఐవీఎఫ్ సేవలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు రూపొందించి నియంత్రిస్తున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుంచి అనుమతులు పొంది మాత్రమే ఈ కేంద్రాలను నడపాలి. జిల్లాలో 41 ఐవీఎఫ్, 9 సరోగసీ కేంద్రాలు సహా మొత్తం 50 కేంద్రాలు పనిచేస్తున్నట్లు సమాచారం. టెస్ట్ ట్యూబ్ బేబీ సహజ పద్ధతిలో గర్భధారణ కానివారికి లేదా పురుషులలో వీర్య కణాల నాణ్యత తక్కువగా ఉన్నప్పుడు వైద్యులు ఐవీఎఫ్ పద్ధతిని సూచిస్తారు. సరోగసీ, ఐవీఎఫ్ కేంద్రాల్లో ఏఆర్టీ (అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ) బ్యాంక్, ఎల్–1, ఎల్–2 విభాగాలు ఉంటాయి. వీటి కోసం వరుసగా రూ. 50వేలు, రూ.50వేలు, రూ. 2 లక్షలు డిపాజిట్/డీడీ సమర్పించాలి. దరఖాస్తుతో పాటు సదుపాయాలు, వైద్యుల వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి సమర్పించాలి. కలెక్టర్ అధ్యక్షతన కమిటీలు కలెక్టర్ అధ్యక్షతన సరోగసీ, ఐవీఎఫ్ పర్యవేక్షణ కోసం కమిటీలు ఏర్పాటు చేశారు. వీటిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ప్రసూతి, పిల్లల వైద్య విభాగాల అధిపతులు, పోలీసు కమిషనర్, సెషన్స్ జడ్జి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రముఖ గైనకాలజిస్టులు సభ్యులుగా ఉంటారు. సరోగసీకి కలెక్టర్, ఐవీఎఫ్కు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ‘సృష్టి’ అక్రమాలు, నిబంధనల ఉల్లంఘన జిల్లా పరిషత్ సమీపంలోని ‘సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్’ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ కేంద్రం 2018 నుంచి 2023 వరకు డీఎంహెచ్వో కార్యాలయంలో నమోదైంది. ఆ తర్వాత ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే అనధికారికంగా నడుస్తోంది. డాక్టర్ నమ్రత ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కేంద్రంపై విశాఖ, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్లలో కేసులు నమోదయ్యాయి. మేనేజర్ కల్యాణికి ఇందులో కీలక పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఢిల్లీ నుంచి తీసుకొచ్చి విశాఖలో డెలివరీ గత నెలలో ఈ కేంద్రంలో డెలివరీ అయిన మగబిడ్డ విషయంలో అక్రమాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వేరే మహిళకు పుట్టిన బిడ్డను తీసుకువచ్చి సరోగసీ ద్వారా పుట్టినట్లు దంపతులను నమ్మించారు. ఢిల్లీకి చెందిన గర్భిణిని విమానంలో విశాఖకు తీసుకొచ్చి డెలివరీ చేయించారని పోలీసులు అనుమానిస్తున్నారు. డాక్టర్ నమ్రత గతంలో కోట్లాది రూపాయల దందా చేసి, ఒక బిడ్డను రూ.30 లక్షలకు విక్రయించారని పోలీసులు చెబుతున్నారు. అక్రమ వసూళ్లు, పర్యవేక్షణ లోపం నగరంలో ఐవీఎఫ్, సరోగసీ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి. కొందరు అధికారులకు లంచాలు ఇచ్చి యథేచ్ఛగా నడుపుతున్నా పట్టించుకునేవారు లేరు. ఒక కేసు నుంచి రూ. 20 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. డబ్బులు ఎక్కువగా ఉన్నవారి నుంచి వివిధ రకాల ఫీజుల పేరుతో దోచుకుంటున్నారు. వివాహం జరిగి చాలా ఏళ్లు పిల్లలు లేని తల్లుల నుంచి పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్లు చేస్తున్నారు. దీనికి ఎలాంటి బిల్లులు, లెక్కలు ఉండటం లేదు. ఈ కేంద్రాలపై వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షణ కొరవడుతోందని స్పష్టమవుతోంది. నమోదు తప్పనిసరి సరోగసీ, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) సేవలందించే కేంద్రాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అలాగే నమోదు కోసం నిర్దేశించిన రుసుములను సకాలంలో చెల్లించాలి. రుసుము చెల్లింపులో జాప్యం చేసే దరఖాస్తులను తిరస్కరిస్తాం. అనుమతులు పొందిన తర్వాత మాత్రమే సరోగసీ, ఐవీఎఫ్ ప్రక్రియలను ప్రారంభించాలి. ప్రస్తుతం దరఖాస్తు చేసుకోని ఏఆర్టీ సెంటర్లను కూడా సీజ్ చేస్తాం. అటువంటి సెంటర్లకు నోటీసులు జారీ చేసి, వారి సేవలను నిలుపుదల చేసి, ప్రీ–కాన్సెప్షన్ అండ్ ప్రీ–నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ 1994 కింద కఠిన చర్యలు తీసుకుంటాం –డాక్టర్ పి.జగదీశ్వరరావు, డీఎంహెచ్వో -
చికెన్ వ్యర్థాలు పట్టివేత
అనకాపల్లి: స్థానిక జాతీయ రహదారి డైట్ కళాశాల వద్ద పట్టణ పోలీసులు ఆదివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా విశాఖ ఉమ్మడి జిల్లా నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు 5 బోలేరో వాహనాలలో చేపల మేత, చికెన్ వ్యర్థాలు రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. విశాఖలో ఎన్ఎడీ, అక్కయ్యపాలెం, ఇతర ప్రాంతాల నుంచి వ్యర్థాలను సేకరించి తీసుకువెళుతున్నారని పోలీసులు తెలిపారు. వాహన డ్రైవర్లు బడపాటి నాగబాబు, జయమంగళ సత్యనారాయణ, బుడుమూరు బాలాసుబ్రహ్మణ్యం, మేడిశెట్టి నూకరాజు, బద్ది నాగ సత్యనారాయణలను అదుపులోనికి తీసుకుని అనకాపల్లి జోనల్ కమిషనర్ చక్రధర్కు అప్పగించారు. పట్టుకున్న వ్యర్థాలను విశాఖ కాపులుప్పాడలో డంపింగ్యార్డులో పూడ్చి, ప్రధాన కమిషనర్ ఆదేశాల మేరకు కేసులు నమోదు చేయడం జరుగుతుందని జోనల్ కమిషనర్ తెలిపారు. -
111.60 మీటర్లకు రైవాడ నీటిమట్టం
దేవరాపల్లి: ఇటీవల కురుస్తున్న వర్షాలకు రైవాడ జలాశయం నీటిమట్టం క్రమేపి పెరుగుతుంది. జలాశయం గరిష్ట నీటిమట్టం 114 మీటర్లు కాగా ప్రస్తుతం 111.60 మీటర్లకు చేరుకుంది. ప్రస్తుతం జలాశయంలోకి 200 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. జలాశయం నుంచి జీవీఎంసీ తాగునీరు నిమిత్తం 50 క్యూసెక్కుల నీరు విడుదల కొనసాగుతుంది. జలాశయంలో సమృద్ధిగా నీటి నిల్వలు ఉండడంతో నిండుకుండలా కళకళలాడుతుంది. ఈ ఏడాది ఖరీఫ్ పంటల సాగుకు నీటికి ఢోకా ఉండబోదని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. కాగా ప్రస్తుతం రైవాడ ఆయుకట్టు భూముల్లో ఖరీఫ్ వరి సాగుకు దమ్ములు ముమ్మరంగా సాగుతున్నాయి. ఖరీఫ్కు ఈ నెల 29న కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా నీటిని విడుదల చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. -
పేరుకే పంచాయతీలు
● ఏర్పడి ఆరేళ్లయినా నోచుకోని భవనాలు ● పరిపాలన సాగేదెలా అంటున్న మూడు గ్రామాల సర్పంచ్లుచింతూరు: ఆ మూడు.. పేరుకే పంచాయతీలుగా మారాయి. ఇవి ఏర్పడి ఆరేళ్లు గడుస్తున్నా నేటికీ పరిపాలనా సౌలభ్యం కల్పించక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మండలంలోని రామన్నపాలెం, గంగన్నమెట్ట, లచ్చిగూడెం పంచాయతీల ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకు మాత్రమే సర్పంచ్లుగా ఉంటున్నామని, నిధులు మంజూరు కానందున పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపట్టలేక పోతున్నామని వారు వాపోతున్నారు. సమస్యలు పరిష్కారం కానందున ప్రజలు తమను చిన్నచూపు చూస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ● మండలంలో గతంలో 15 గ్రామ పంచాయతీలు ఉండేవి. ఐదొందలు జనాభా కలిగి వందశాతం గిరిజనులు నివసిస్తున్న చిన్న గ్రామాలను కలిపి పంచాయతీలుగా ఏర్పాటు చేయాలనే నిర్ణయంతో మండలంలో మరో మూడు పంచాయతీలు ఏర్పడడంతో వీటి సంఖ్య 18కు చేరింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా 2019లో మండలంలోని తుమ్మల పంచాయతీలోని లచ్చిగూడెం, గంగన్నమెట్ట, పెదశీతనపల్లి పంచాయతీలోని రామన్నపాలెం కొత్త పంచాయతీలుగా ఏర్పడ్డాయి. గంగన్నమెట్టలో 307, వేకవారిగూడెంలో 214 మంది జనాభాతో గంగన్నమెట్ట పంచాయతీగా, లచ్చిగూడెంలో 180, వెంకట్రామాపురంలో 98, కొత్తూరులో 225 మంది జనాభాతో లచ్చిగూడెం, రామన్నపాలెంలో 400, చినశీతనపల్లిలో 152 మంది జనాభాతో రామన్నపాలెం పంచాయతీ ఏర్పడ్డాయి. పాలన సాగేదెలా? గ్రామ పంచాయతీలకు భవనాలు లేకపోవడంతో గ్రామసభలు, పాలకవర్గ, పీసా కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రచ్చబండ లేదా చెట్లకింద సమావేశాలు నిర్వహించుకోవాల్సి వస్తోందని సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవనాలు లేకపోవడంతో పంచాయతీలకు సంబంధించిన రికార్డులు భద్రపరచుకునేందుకు కార్యదర్శులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది కూడా లేకపోవడంతో కార్యదర్శి ఒక్కరే అన్ని విధులు నిర్వహించాల్సి వస్తోంది. దీంతోపాటు పంచాయతీ భవనం లేకపోవడం, కార్యదర్శి ఎప్పుడు వస్తారో తెలియక ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీలుగా ఏర్పడినా చిన్న పంచాయతీలుగానే గుర్తింపు పడడంతో నిధులు కూడా చాలా తక్కువగా వస్తున్నాయని, అవికూడా సక్రమంగా రావడం లేదని సర్పంచ్లు వాపోతున్నారు. దీంతో గ్రామాల్లో ఎలాంటి పనులు చేపట్టలేక పోతున్నామని, ఈ విషయాన్ని మండల పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
డి.యర్రవరంలో సినిమా షూటింగ్ సందడి
నాతవరం: మండలంలో డి.యర్రవరం గ్రామంలో గల నల్లకొండమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఆదివారం కొత్త సినిమా షూటింగ్ ప్రారంభించారు. డైరెక్టరు వై.ఎస్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్ర హర్షిణి మూవీస్ బ్యానర్పై ‘జాగా’ అనే తెలుగు చలన చిత్రం ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి షూటింగ్ ప్రారంభించారు. పలు సన్నివేశాలు చిత్రీకరించారు. ములగపూడి ఎం.బెన్నవరం గ్రామాల్లో గల వ్యవసాయ భూములు, జీడిమామిడి తోటల్లో ఈ చిత్రంలో సర్పంచ్ పాత్ర వ్యవసాయదారుడి రైతులు మధ్య సంభాషణకు సంబంధించి పలు దృశ్యాలను చిత్రీకరించారు. చిత్ర ప్రధాన పాత్రధారులు ముమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాయిగణేష్లపై ఆలయంలో షూటింగ్ ప్రారంభించి తర్వాత పలు ప్రదేశాల్లో సన్నివేశాలు చిత్రీకరణ జరిపారు. సినిమా షూటింగ్ చూసేందుకు చుట్టు పక్కల గ్రామాలు అధిక సంఖ్యలో రావడంతో సందడి నెలకొంది. వెంకట పవన్కుమార్, లవకుమార్, బుజ్జి తదితర చిత్ర బృందం పాల్గొన్నారు. -
ఉత్సాహంగా పారా అథ్లెటిక్స్ పోటీలు
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో ఆదివారం జరిగిన అంతర జిల్లాల పారా అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక క్రీడా స్ఫూర్తికి వేదికై ంది. జూనియర్ (19 ఏళ్ల లోపు), సబ్–జూనియర్ (17 ఏళ్ల లోపు) విభాగాల్లో దాదాపు 70 మంది దివ్యాంగ బాలబాలికలు తమ అసాధారణ ప్రతిభను ప్రదర్శించారు. ముఖ్యంగా 11–13 అంశాల పరుగు విభాగంలో సహాయకుల తోడుతో ట్రాక్లో పరుగెత్తుతూ ‘తగ్గేదేలే’ అంటూ వారు చూపిన సంకల్పం అందరినీ ఆకట్టుకుంది. ఫీల్డ్ ఈవెంట్లలో, త్రోస్ అంశాల్లో కూడా అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. బధిరులు, మేధో వైకల్యం గల బాలబాలికలు సైతం ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలలో పాలుపంచుకున్నారు. వారి ముఖాల్లో కనిపించిన ఆనందం, విజయకాంక్ష, క్రీడలపై వారికున్న నిబద్ధత నిజంగా స్ఫూర్తిదాయకం. ఈ ఎంపిక పోటీలు కేవలం ఆటలకే పరిమితం కాలేదు, తమ కలలను సాకారం చేసుకోవడానికి ప్రత్యేక అవసరాలు గల వ్యక్తులు ఎంతటి కృషి చేయగలరో నిరూపించాయి. -
యువకుడికి విద్యుదాఘాతం
● పరిస్థితి విషమం ● పాడేరులోని జిల్లా ఆస్పత్రికి తరలింపు ముంచంగిపుట్టు: మండలంలోని మారుమూల బుంగాపుట్టు పంచాయతీ రంగినిగూడ గ్రామంలో ఆదివారం రాత్రి 7గంటల సమయంలో వంతాల కొగేశ్వరరావు (19) అనే గిరిజన యువకుడు విద్యుత్ షాక్కు గురయ్యాడు. ఇంటిలో విద్యుత్ వైరు తెగిపోయి ఉండటాన్ని గమనించని యువకుడు దానిని పట్టుకోవడంతో కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ వాహనంలో స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తీసుకువచ్చారు. స్థానిక వైద్యాధికారి వివేక్ వైద్య సేవలు అందించారు.ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పాంగి పద్మారావు, మండల నేత సింహాచలం బాధితుడు కొగేశ్వరరావును పరమర్శించారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు నిమిత్తం అంబులెన్స్లో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
ఉపాధ్యాయులకు బోధనేతర పనులు వద్దు
అనకాపల్లి: ప్రభుత్వ ఉపాధ్యాయులను పి–4, కర్మయోగి యాప్ల నుంచి తొలగించి, విద్యార్థులకు బోధన వరకే పరిమితం చేయాలని బోధనేతర పనులను అప్పగించడం వల్ల విద్యా ప్రమాణాలు కుంటుపడతాయని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం యూటీఎఫ్ జిల్లా ముఖ్య నేతల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు విధులు నిర్వహించే గ్రామాల్లో కుటుంబాలను కేటాయించి, దత్తత తీసుకోమని చెప్పడం, బోధనేతర పనుల కిందికే వస్తుందన్నారు. పి–4 విధానంలో ఉపాధ్యాయులకు రెండేసి కుటుంబాలను, ప్రధానోపాధ్యాయులకు ఐదు కుటుంబాలను కేటాయించి దత్తత తీసుకోమని చెప్పడం వల్ల పనిభారం పెరిగి బోధనపై దృష్టి పెట్టలేరని అన్నారు. కర్మయోగి యాప్ ను ఉపాధ్యాయులపై బలవంతంగా రుద్దుతున్నారని, యాప్లో ఆన్లైన్ కోర్స్లో 56 వీడియోలు ప్రతి ఉపాధ్యాయుడు పూర్తి చేయాలని బలవంతం చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. జూన్ 12 నుంచి విద్యార్థులకు సరైన బోధన చేయకుండా నిర్బంధంగా ఉపాధ్యాయులతో యాప్ల నిర్వహణ చేస్తున్న విద్యాశాఖ అధికారులు తమ వైఖరిని విడనాడాలన్నారు. రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు మాట్లాడుతూ జీతంమీద ఆధారపడి జీవిస్తున్న ఉపాధ్యాయులకు 2 మాసాల నుంచి జీతాలు రాకుడా చేసిన విద్యాశాఖాధికారులు వైఖరిని మార్చుకోవాలని అన్నారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.లక్ష్మి, గొంది చిన్నబ్బాయ్, సహాధ్యక్షులు రొంగలి అక్కునాయుడు, కార్యదర్శులు పొలిమేర చంద్రరావు, రమేష్ రావు, శేషుబాబు పాల్గొన్నారు. -
రసవత్తరంగా తైక్వాండో పోటీలు
యలమంచిలి రూరల్: పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన 5వ జిల్లా స్థాయి తైక్వాండో సబ్ జూనియర్, మినీ సబ్ జూనియర్ ఛాంపియన్షిప్ పోటీలు రసవత్తరంగా జరిగాయి. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి సుమారు 100 మందికి పైగా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బాలుర విభాగంలో 12, బాలికల విభాగంలో 12 కేటగిరీల్లో నిర్వాహకులు పోటీలు నిర్వహించారు. పోటీల్లో స్పారింగ్, ఇండివిడ్యువల్ ప్యాటర్స్, పవర్ బ్రేకింగ్, సెల్ఫ్ డిఫెన్స్, స్పెషల్ టెక్నిక్స్ వంటి రకరకాల ఈవెంట్లలో క్రీడాకారుల సామర్థ్యాన్ని పరీక్షించారు. ఓ క్రీడలా కాకుండా పిల్లల్లో క్రమశిక్షణ, సమయస్ఫూర్తిని ప్రోత్సహించే విధంగా నిర్వహించిన ఈ పోటీలను పెద్ద ఎత్తున క్రీడాకారుల తల్లిదండ్రులు, స్థానిక క్రీడాకారులు వీక్షించారు. ఇలాంటి పోటీలు తైక్వాండో క్రీడ ప్రాధాన్యతను తెలియజేసేందుకు ఉపయోగపడతాయని అనకాపల్లి యూత్ తైక్వాండో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డి.హేమంత్కుమార్, డి. యశ్వంత్కుమార్ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన పోటీల్లో పలువురు క్రీడాకారులు తమ ప్రతిభను చూపి సత్తా చాటారు. పోటీల్లో బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులు త్వరలో గుంటూరులో జరగనున్న రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొంటారన్నారు. అంతకుముందు ఈ పోటీలను విశ్రాంత అధ్యాపకుడు ఆడారి పూరీ జగన్నాథం ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తైక్వాండో పోటీల వల్ల పిల్లల్లో ఆత్మరక్షణ, ఆత్మస్థయిర్యం లాంటి మానసిక ధృడత్వం పొందే అవకాశం ఉందని ఆయన అన్నారు. తైక్వాండో కేవలం మార్షల్ క్రీడే కాకుండా ఒలింపిక్ పోటీల్లో చోటు దక్కించుకుందన్నారు. 37 మందికి బంగారు పతకాలు ఇండోర్ స్టేడియంలో జరిగిన తైక్వాండో పోటీల్లో 37 మంది బంగారు, 32 మంది రజతం, మరో 20 మంది కాంస్య పతకాలు సాధించారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో బహుమతులు అందజేశారు. బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులకు అతిథులు అభినందనలు తెలిపారు. జిల్లా జూడో అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.కొండబాబు, కోచ్లు ఆలీ, మితిలేష్, మణి, మోహన్, గణేష్, భాస్కర్ పోటీలను పర్యవేక్షించారు. -
గిరిజన సంక్షేమ శాఖకు పెద్ద దిక్కు కరువు
పాడేరు: జిల్లా కేంద్రమైన పాడేరు ఐటీడీఏ కార్యాలయంలోని గిరిజన సంక్షేమ శాఖకు పెద్ద దిక్కు కరువైంది. ఇక్కడ ప్రాజెక్టు అధికారి తర్వాత అంతటి విలువ ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ (టీడబ్ల్యూ డీడీ) పోస్టుకు ఉంది. ఇంతటి ప్రాముఖ్యమైన గిరిజన సంక్షేమ ఉప సంచాలకుల పోస్టులో రాష్ట్ర ప్రభుత్వం 11 నెలలుగా ఎవరినీ నియమించకుండా గిరిజన సంక్షేమంపై వివక్ష చూపుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది ఆగస్టు నెలలో నెలలో ఇక్కడ పని చేసిన టీడబ్ల్యూ డీడీ కొండలరావును పలు అవినీతి, ఇతర ఆరోపణల నేపథ్యంలో సరెండర్ చేశారు. కానీ ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఎవరినీ నియమించలేదు. ఎనిమిదేళ్లుగా పాడేరు ఏటీడబ్ల్యూవోగా పని చేస్తున్న రజనీకు ఇన్చార్జి డీడీ బాధ్యతలు అప్పగించారు. ఆమైపె తీవ్ర స్థాయిలో ఆరోపణలు రావడంతో సాధారణ బదిలీల్లో ఆమెను మన్యం పార్వతీపురం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏటీడబ్ల్యూవోగా బదిలీ చేశారు. ఏటీడబ్ల్యూవోగా విధుల నుంచి రిలీవ్ అయినప్పటికీ ఆమెను ఇన్చార్జి డీడీగా మాత్రం కొనసాగించారు. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి తన శాఖలో పని చేస్తున్న కిందిస్థాయి ఉద్యోగి చేత కాఫీ, మిరియాల వ్యాపారం భారీ స్థాయిలో చేసినట్లు పైగా రైతులకు ఇవ్వాల్సిన బకాయి సొమ్ము ఎగనామం పెట్టారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమె ఈనెల 19న ఇన్చార్జి డీడీ పోస్టు నుంచి రిలీవ్ కాక తప్పలేదు. ఆమె స్థానంలో రెగ్యులర్ డీడీని కానీ కనీసం ఇన్చార్జి డీడీని కానీ ఇంకా ఎవరినీ నియమించలేదు. ఎంతో ప్రాధాన్యమున్నా.. టీడబ్ల్యూ డీడీ పరిధిలో 11 మండలాలు ఉన్నాయి. వీటిలో 117 వసతి గృహాలు, 32 పోస్ట్మెట్రిక్ వసతి గృహాలు, గిరిజన గురుకుల కళాశాలలు, 11 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యాలయాల పర్యవేక్షణ బాధ్యత కూడా డీడీదే. ఏటా గిరిజన ఉపకార వేతనాలు, గిరిజన సంక్షేమ వసతి గృహాల నిర్వాహణ బిల్లులు, సీఆర్టీల వేతనాలు, వసతి గృహాల్లో డైలీవేజ్, ఔట్సోర్సింగ్ వర్కర్ల వేతనాలు, డీడీ కార్యాలయ సిబ్బంది వేతనాలు, తదితర వాటికి ఏటా రూ.కోట్లలో చెల్లింపులు గిరిజన సంక్షేమ శాఖ డీడీ పోస్టు ద్వారానే జరగాలి. ఇంతటి ప్రాముఖ్యమున్నా గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకుల పోస్టుకు రాష్ట్ర ప్రభుత్వం పాడేరు ఐటీడీఏలో ఎవరినీ నియమించలేదు. రెండు నెలలుగా నోచుకోని వేతనాలు రెండు నెలలుగా సీఆర్టీసీలు, వసతి గృహా వర్కర్లు, డీడీ కార్యాలయ సిబ్బంది వేతనాలకు నోచుకోలేదు. డీడీ గానీ ఇన్చార్జి డీడీ గానీ థంబ్ వేస్తేనే సీఆర్టీలు, వసతి గృహ వర్కర్లు, డీడీ కార్యాలయ సిబ్బందికి వేతనాలు, వసతి గృహాల నిర్వాహణ బిల్లులు విడుదల అవుతాయి. జిల్లాలో 286 మంది సీఆర్టీలకు, 260 మంది డైలీవేజ్, ఔట్సోర్సింగ్ వసతి గృహ వర్కర్లు, సుమారు 10 మంది డీడీ కార్యాలయ సిబ్బందికి ప్రస్తుతం రెండు నెలల వేతనాల బకాయి ఉంది. ప్రతి నెలా డీడీ థంబ్ వేస్తేనే కానీ 556 మందికి వేతనాలు పడవు. రెండు నెలలుగా వేతనాల బిల్లులు సిద్ధం కాలేదు. ఈలోగా ఇన్చార్జి డీడీ కూడా రిలీవ్ అయిపోయారు. కొత్త డీడీని నియమించకపోవడంతో ఇంత మంది వేతనాలు పెండింగ్లో పడ్డాయి. పాడేరు ఐటీడీఏ పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వివక్ష చూపుతోందని వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, డీఎస్వో, ఏబీవీబీ వంటి విద్యార్థి సంఘాలతో పాటు ఆదివాసీ, గిరిజన సంఘాలు, దండకారణ్య లిబరేషన్ ఆర్గనైజేషన్ తదితర సంఘాలు ఆరోపిస్తున్నాయి. భర్తీకాని డిప్యూటీ డైరెక్టర్ పోస్టు కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోందని విమర్శలు ఈనెల 19న రిలీవ్ అయినప్పటికీ మరొకరికి బాధ్యతలు అప్పగించని వైనం డీడీ థంబ్తో ముడిపడి ఉన్న కార్యాలయ సిబ్బంది వేతనాలు సీఆర్టీలు, వసతి గృహాల డైలీవేజ్, ఔట్సోర్సింగ్ వర్కర్ల జీతాలపై ప్రభావం రెండు నెలలుగా కొనసాగుతున్న ఇబ్బందులు -
వెదురు ఉత్పత్తులతో పౌష్టికాహారం
సాక్షి,పాడేరు: గిరిజన ప్రాంతాల్లో వర్షాకాలంలో వెదురు ఉత్పత్తులు గిరిజనులకు పౌష్టికాహారం అందిస్తున్నాయి. అడవిని నమ్ముకుని జీవించే గిరిజనులంతా ఈ సీజన్లో వెదురు కొమ్ములు, కొక్కులను సేకరించి ఆహారంగా వండుకు తింటారు. కాలక్రమేణా మైదాన ప్రాంత వాసులకు కూడా వీటిని తినడం అలవాటైంది. జిల్లా అంతటా వెదురు వనాలు అధికంగా ఉన్నాయి. వర్షాలకు వెదురువనాల వద్ద ఏర్పడే చిగుళ్లను కొమ్ములుగా పిలుస్తుంటారు. వాటిని సేకరించి కూరగా తయారు చేసుకుని ఆహారంగా తీసుకుంటారు. ప్రస్తుతం నాలుగు కొమ్ములు రూ.50 వరకు ధర ఉంది. వెదురు పొదల వద్ద పుట్టకొక్కుల ఆకారంలో ఏర్పడే వాటిని గిరిజనులు కూరగా తయారుచేసుకుని తింటారు. ఇవి వాటా రూ.50 నుంచి రూ.100 వరకు ధర ఉంది. పోషక విలువలతో పాటు పీచు పదార్థం ఎక్కువగా ఉన్నందున ఆరోగ్యానికి మేలు చేస్తుందని గిరిజనులు చెబుతుంటారు. వెదురు కొమ్ములు కొమ్ములు, కొక్కుల సీజన్ ప్రారంభం విరివిగా అమ్మకాలు కూరగా తినేందుకు ఆసక్తి చూపుతున్న గిరిజనులు -
అప్పన్నకు విశేషంగా నిత్య కల్యాణం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఉదయం 9.30 నుంచి నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ బేడామండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను కొలువుంచారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని నిర్వహించారు. విశేషంగా గరుడసేవ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం గరుడసేవ విశేషంగా జరిగింది. ఆలయ బేడామండపంలో ఉదయం ఈ సేవను జరిపారు. -
రేపటి నుంచి టేబుల్ టెన్నిస్ రీజనల్ పోటీలు
ఎటపాక నవోదయ విద్యాలయంలో ఏర్పాట్లు పూర్తిఎటపాక: జవహర్ నవోదయ విద్యాలయాల రీజనల్ స్థాయి టేబుల్ టెన్నిస్ క్రీడా పోటీలు ఈనెల 29 నుంచి 31 వరకు జరుగనున్నాయి. ఇందుకోసం స్థానిక జవహర్ నవోదయ విద్యాలయం వేదిక కానుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేసినట్లు విద్యాలయం వైస్ ప్రిన్సిపాల్ ప్రసాద్ తెలిపారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ రీజనల్ స్థాయి పోటీలకు ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక, కేరళ, అండమాన్ నికోబార్, లక్షదీవుల జవహర్ నవోదయ విద్యాలయాల నుంచి సుమారు 90 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. విద్యాలయంలోని ఆడిటోరియంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం సాయంత్రానికి క్రీడాకారులు రానుండటంతో వారికి వసతి, భద్రత ఏర్పాట్లు కూడి చేసినట్టు వైస్ ప్రిన్సిపాల్ తెలిపారు. ఇప్పటికే ఆడిటోరియం, విద్యాలయాన్ని స్వాగత ఫ్లెక్సీలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. -
వర్షాలకు పొంగిన వాగులు
● ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డలు ● ఇళ్లకు పరిమితమైన మారుమూల గ్రామాల గిరిజనులు ముంచంగిపుట్టు: మండలంలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లక్ష్మీపురం, బుంగాపుట్టు, రంగబయలు, భూసిపుట్టు, దొడిపుట్టు పంచాయతీల్లోని మారుమూల గ్రామాల్లో కొండవాగులు పొంగాయి. వరదనీటితో గెడ్డలు ప్రమాదకరంగా మారాయి. లక్ష్మీపురం పంచాయతీ ఉబ్బెంగుల, దొరగూడ గ్రామాల చుట్టూ ఉన్న వాగులు కూడా పొంగడంతో గత మూడు రోజులుగా ఆ ప్రాంతాల గిరిజనులు గ్రావ+బీడిచెంప గ్రామ సమీపంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మాకవరం, కర్రిముఖిపుట్టు, కిలగాడ, వనుగుమ్మ, బరడ పంచాయతీల్లో వర్షపునీరు పొలాల్లోకి చేరడంతో గిరిజన రైతులు ఆవేదన చెందుతున్నారు. -
శాంతి భద్రతల పరిరక్షణలో సీఆర్పీఎఫ్ కీలకపాత్ర
ముంచంగిపుట్టు: దేశీయ భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు సీఆర్ఫీఎఫ్ జీ198 బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఎంబీ శంకరరావు అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం సీఆర్ఫీఎఫ్ 87వ రైజింగ్ డేను ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్, సామాజిక ఆరోగ్య కేంద్రం ,ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల–2లో మెగా ప్లాంటేషన్లో భాగంగా మొక్కలు నాటారు. పాఠశాలలో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా కమాండింగ్ ఆఫీసర్ శంకరరావు మాట్లాడుతూ దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి సీఆర్ఫీఎఫ్ బలగాలు నిత్యం ధైర్యం, నిబద్ధతలతో పనిచేస్తున్నాయన్నారు. దళంలో వీర సైనికులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా దేశరక్షణకు తమ శక్తిమేర కృషి చేస్తాయని అన్నారు. విద్యార్థి స్థాయి నుంచి దేశం కోసం ఆలోచన చేయాలని, మంచి పేరు తెచ్చే పౌరులుగా ఎదగాలని ఆయన కోరారు. ఈ కా ర్యక్రమంలో ఎస్ఐ జే.రామకృష్ణ, సీఆర్ఫీఎఫ్ ఎస్ఐ ఎన్.కృష్ణారావు, సీహెచ్సీ వైద్యాధికారి గీతాంజలి, వివేక్, ధరణి, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, సీఆర్ఫీఎఫ్ బలగాలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కమాండింగ్ ఆఫీసర్ ఎంబీ శంకరరావు -
ఫలం
సీజన్ ప్రారంభంలోనే సీతాఫలం ధర పతనం కావడంతో గిరి రైతులు ఉసూరుమంటున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించినా మార్కెట్ పరిస్థితులు కలిసిరావడం లేదని వారు వాపోతున్నారు. వంట్లమామిడి పండ్ల మార్కెట్లో వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ధర తగ్గించేస్తున్నారని వారు వాపోతున్నారు. కనీసం రెక్కల కష్టం కూడా మిగలడం లేదని వారు ధ్వజమెత్తుతున్నారు. దళారులకేబుట్ట రూ.500కు మించి కొనుగోలు చేయక నష్టం కొనేవారు కరువయ్యారనిగిరి రైతుల ఆవేదన సాక్షి,పాడేరు: మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న మన్యం సీతాఫలాలకు గిట్టుబాటు ధర కరువైంది. పాడేరు మండలంలోని వంట్లమామిడి, దేవాపురం, సలుగు, ఐనాడ, మోదాపల్లి, వనుగుపల్లి, జి.మాడుగుల మండలం వంతాల పంచాయతీల పరిధిలో సుమారు 500 ఎకరాల్లో గిరిజనులకు సీతాఫలం తోటలు ఉన్నాయి. ఏటా జూలై నుంచి డిసెంబర్ వరకు దిగుబడి ఉంటుంది. ప్రతి చెట్టుకు కనీసం రూ.2 వేల వరకు ఆదాయం లభిస్తుంది. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలించాయి. ముందస్తు వర్షాలు తోటలకు మేలు చేయడంతో దిగుబడి బాగుంది. సీజన్ ప్రారంభంలో ధర కాస్త ఎక్కువగానే ఉండాలి. అలాంటిది బాగా తక్కువగా ఉండ టంతో సీతాఫలం రైతులు ఆవేదన చెందుతున్నారు వ్యాపారుల ఇష్టారాజ్యం..కోల్కతా మార్కెట్కు మన్యం సీతాఫలాలను వ్యాపారులు భారీగా తరలిస్తారు. అక్కడ వ్యాపారులు స్థానిక దళారీ వ్యాపారులు సిండికేట్గా మారి సీతాఫలాల ధరలను పతనం చేస్తున్నారు. దీంతో గిరిజన రైతులు నష్టపోతున్నారు. ● పాడేరు ఘాట్లోని వంట్లమామిడి జంక్షన్ పండ్ల అమ్మకాలకు ప్రసిద్ధి. ఇక్కడకు పరిసర గ్రామాల గిరిజన రైతులు సీజన్ను బట్టి పనస, పైనాపిల్, సీతాఫలం, రామఫలం, మామిడిని తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. ప్రతిరోజు ఉదయం వేళలో మార్కెట్ జరుగుతుంది. ప్రస్తుతం సీతాఫలం సీజన్ కావడంతో పరిసర మారుమూల గ్రామాల నుంచి గిరిజనులు బుట్టలు, కావిళ్లతో కాలినడకన ఒక్కడి మార్కెట్కు మోసుకుని తీసుకువస్తున్నారు. వంట్లమామిడి మార్కెట్లో సీతాఫలాల ధర పతనం పోషకాల మెండుతో గిరాకీతీవ్రంగా నష్టపోతున్నాం సీతాఫలాలకు ధరలు లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. మైదాన ప్రాంతంతో పాటు స్థానిక వ్యాపారులంతా కొనుగోలు ధరను తగ్గించేస్తున్నారు. గతంలో బుట్ట సీతాఫలాలను రూ.700నుంచి రూ.900 ధరకు అమ్ముకునేవాళ్లం. ప్రస్తుతం ఈఏడాది రెండు బుట్టల పండ్లను రూ.600 నుంచి రూ.800 కొంటున్నారు. దీనివల్ల నష్టపోతున్నాం. – కొర్రా రత్తు, సీతాఫలం రైతు, చింతాడ, పాడేరు మండలంసీతాఫలాల్లో ఔషధ విలువలు ఎక్కువగా ఉన్నందున వీటికి గిరాకీ పెరిగింది. ఈ పండ్లలో కెరోటిన్, థయామిన్, రిబోప్లేవిన్, నియాసిన్, విటమిన్ సీ వంటి ముఖ్య పోషకాలు ఉన్నాయి. వీటి ఆకులు మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతాయి. అధిక బరువును తగ్గించడంతోపాటు జలుబు నివారణకు దోహదపడతాయి. జీర్ణక్రియ ప్రక్రియకు సీతాఫలం పండులో గుజ్జు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూర్చే సీతాఫలాలు పండించే రైతులకు మాత్రం ఆదాయాన్నివ్వలేకపోతున్నాయి. -
వణికిస్తున్న మలేరియా
రక్త పరీక్షలతో నిర్ధారణ చింతూరు మండలం గవళ్లకోటకు చెందిన ఆరేళ్ల ఆమె పేరు సోడె భానుప్రియ. గత మూడ్రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో చింతూరు ప్రభుత్వాస్పపత్రికి తీసుకొచ్చారు. అమెకు రక్త పరీక్షలు నిర్వహించగా మలేరియా జ్వరంగా నిర్థారణ అయింది. రెండ్రోజులుగా ఆస్పత్రిలోనే ఉంటూ వైద్యం పొందుతున్నట్టు ఆమె తండ్రి గంగయ్య తెలిపాడు, చింతూరు: అల్లూరి జిల్లా రంపచోడవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో మలేరియా జ్వరాలు చాపకింద నీరులా విజృంభిస్తున్నాయి. రంపచోడవరం, చింతూరు డివిజన్లలో ఈ ఏడాది ఇప్పటివరకు 1,398 మలేరియా కేసులు నమోదు అయ్యాయి. వీటిలో రంపచోడవరం డివిజన్లో 883 , చింతూరు డివిజన్లో 515 కేసులు నమోదు అయినట్టు వైద్యారోగ్యశాఖ అధికారవర్గాలు తెలిపాయి. ⇒ వాతావరణ మార్పులు, గ్రామాల్లో పారిశుధ్యం కొరవడటం తదితర కారణాల వల్ల దోమలు వృద్ధి చెంది, మలేరియాను వ్యాప్తి చేస్తున్నాయి. జ్వర పీడితులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు నిండిపోతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు గ్రామాలు చిత్తడిగా మారడం వల్ల దోమల ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. గ్రామపంచాయతీల్లో పారిశుధ్యం మెరుగుపర్చడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహిస్తునారన్న విమర్శలు ఉన్నాయి.చెత్త, చెదారంతో నిండిపోవడం, నీటి మడుగులు, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా మలేరియా దోమల లార్వా వ్యాప్తికి దోహదపడుతున్నాయి. గ్రామాల్లో దోమల నివారణకు స్ప్రేయింగ్, ఫాగింగ్, డ్రైనేజీలను శుభ్రం చేయడం, చెత్త తొలగింపు, బ్లీచింగ్ చల్లించడంలో పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నరన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విలీనంలో 151 హాట్ స్పాట్ల గుర్తింపు మలేరియా కేసులు అధికంగా నమోదయ్యేందుకు అవకాశమున్న 151 హాట్స్పాట్ కేంద్రాలను చింతూరు, కూనవరం, వీఆర్పురం, ఎటపాక మండలాల్లో గుర్తించినట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. గతేడాది రెండు కంటే ఎక్కుఇవగా మలేరియా కేసులు నమోదైన ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించినట్లు వారు తెలిపారు. ఐటీడీఏ పీవో అపూర్వభరత్ ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాలను హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించి యాంటీలార్వా, ఫాగింగ్, స్ప్రేయింగ్ వంటి కార్యక్రమాలు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. చింతూరు మండలంలో 64, వీఆర్పురం మండలంలో 39, ఎటపాక మండలంలో 21, కూనవరం మండలంలో 26 ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించారు. పీహెచ్సీల వారీగా.. చింతూరు డివిజన్లో ఈ ఏడాది పీహెచ్సీల వారీగా తులసిపాకలో 96, మోతుగూడెం 126, ఏడుగురాళ్లపల్లి 75, కూటూరు 64, రేఖపల్లి 45, జీడిగుప్ప 44, కూనవరం 27, గౌరిదేవిపేట 17, నెల్లిపాక 15, లక్ష్మీపురం ఆరు కేసులు నమోదయ్యాయి. -
అధికారులు హాజరుకాని సమావేశాలు ఎందుకు?
రంపచోడవరం: ప్రతీ మూడు నెలలకు ఒకసారి జరిగే మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి వివిధ శాఖల అధికారులు హాజరకానప్పుడు ఎందుకు సమావేశాలని రంపచోడవరం ఎంపీపీ బంధం శ్రీదేవి అగ్రహం వ్యక్తం చేశారు. ఇన్చార్జి ఎంపీడీవో జయంతి ఆధ్వర్యంలో ఎంపీపీ బంధం శ్రీదేవి అధ్యక్షతన శనివారం సమావేశం జరిగింది. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీదేవి, జెడ్పీటీసీ సభ్యురాలు పండా వెంకటలక్ష్మిలు పాల్గొన్నారు. ముందుగా ఇన్చార్జి ఎంపీడీవో జయంతి సమావేశానికి హాజరైన వివిధ శాఖల గురించి అడిగారు. అటవీశాఖ, ఆర్అండ్బి, జీసీసీ, ఆర్టీసీ, ఫైర్, పశుసంవర్ధక శాఖ తదతర శాఖల అధికారులు హాజరు కాలేదు. దీనిపై ఎంపీపీ బంధం శ్రీదేవి మాట్లాడుతూ మండల అధికారులు ఎవరు హాజరు కానిది సమావేశాలు ఎందుకని, కొన్ని శాఖల అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఏరియా ఆస్పత్రిలో వైద్య సేవల తీరుపై ధ్వజం ఎంపీటీసీ సభ్యులు కుంజం వంశీ మాట్లాడుతూ స్ధానిక ఏరియా ఆస్పత్రిలో పనితీరు ఆధ్వాన్నంగా ఉందని, ప్రమాదంలో గాయపడిన వారికి సెక్యూరిటి సిబ్బంది కుట్లు వేస్తున్నారని సమావేశానికి హాజరైన వైద్యుడ్ని నిలదీశారు. సమావేశానికి ఆస్పత్రి సూపరింటెండెంట్ హాజరు కావాల్సి ఉండగా ఎవరో ఒకర్ని పంపించి చేతులు దులుపుకుంటున్నారని సభ్యులు అగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ సమావేశానికి ఇదే తీరుగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రసవం తరువాత ఇంటికి వెళ్లేటప్పుడు వారి నుంచి రూ.1000 వరకు ఆస్పత్రి సిబ్బంది వసూలు చేస్తున్నారని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అలాగే కొన్ని కేసులను ప్రైవేట్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నట్టు తెలిసిందన్నారు. అంబులెన్స్ సిబ్బంది రోడ్డు పక్కన ప్రసవం చేసిన కేసును ప్రస్తావించారు. ఆస్పత్రిలో వైద్యులు ఉన్నా ప్రయోజనం ఏముందని ఎద్దేవా చేశారు. ఈ విషయంపై సమావేశానికి హాజరైన డాక్టర్ సమాధానం చెప్పకపోవడంతో సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ముసురుమిల్లి, భూపతిపాలెం ప్రాజెక్టుల్లో పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ సభ్యులు తుర్రం వెంకటేశ్వర్లుదొర, వంశీలు కోరారు. దీనిపై తీర్మానం చేశారు. రంపచోడవరం ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహించిన సంవత్సరాల కాలం అవుతుందని, సమావేశం ఎందుకు నిర్వహించడం లేదని తీర్మానం చేసి జిల్లా అధికారులకు పంపించాలని నిర్ణయించారు. సీతపల్లి బాపనమ్మ ఆలయం వద్ద షెడ్లు అధిక రేట్లుకు అద్దెకు ఇస్తున్నారని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు జీడిమామిడి మొక్కలు సకాలంలో ఇవ్వాలని సభ్యులు కోరారు. వైస్ ఎంపీపీ పండా కుమారి, ఎంపీటీసీ సభ్యులు బచ్చల మంగా, సింగోజి కృష్ణకుమారి, రమణమ్మ, కో–ఆప్షన్ సభ్యులు షేక్ ఖాజావల్లీ తదితరులు పాల్గొన్నారు. సర్వసభ్య సమావేశానికి అధికారుల గైర్హాజరు సభ్యుల ఆగ్రహం స్థానిక ఏరియా ఆస్పత్రిలో అరకొర వైద్యంపై ధ్వజం పర్యాటకాభివృద్ధికి చర్యలపై తీర్మానం -
విధుల్లో నిర్లక్ష్యం తగదు
రంపచోడవరం: మారేడుమిల్లి మండలం సున్నంపాడు గ్రామ సచివాలయాన్ని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో సిబ్బంది హాజరు పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. ఆదికర్మయోగి వివరాలు నమోదు విషయంలో సిబ్బంది పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు మలేరియా బారిన పడకుండా ఉండాలంటే శానిటేషన్ కార్యక్రమాలను మెరుగుపర్చాలన్నారు. డ్రైనేజీల్లో పూడిక తీసి ఫాగింగ్ క్రమం తప్పకుండా చేయాలని ఆదేశించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సున్నంపాడులో సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించడం సంతోషంగా ఉందని కార్యదర్శి కొత్తపల్లి సత్యనారాయణను అభినందించారు. సిబ్బంది అందుబాటులో ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యం వద్దని, ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు. ఐటీడీఏ పీవో వెంట వెల్ఫేర్ అసిస్టెంట్ రెడ్డి, శ్రీలక్ష్మి తదితరులున్నారు. -
ప్రకృతి సాగుపై అవగాహన
చింతపల్లి: మన్యంలో ప్రకృతి వ్యవసాయంపై గిరిజన రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్యానవన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త శెట్టి బిందు అన్నారు. స్థానిక పరిశోధన స్థానంలో శనివారం జరిగిన ప్రకృతి వ్యవసాయం అవగాహన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఆరోగ్యకర పంటలు దిగుబడికి జీవ, ఘనామృతాలతో కూడిన ప్రకృతి వ్యవసాయం ఎంతో ఉపయోగకరమన్నారు. ఈ పంటలు సాగుకు రైతులను అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.ఏవో మధుసూదనరావు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంపై వినూత్న పద్ధతులు, ఆదాయ రీతిలో పద్ధుతులు, శ్రీవరి తదితర విధానాలను వివరించడంతో పలు సూచనలు చేశారు. ఎన్ఎఫ్ఎలు కుమార్బాబు, బాబాజీ, చింతపల్లి యూనిట్ ఇన్చార్జి మోహన్, మోనిటర్లు రాజుబాబు, వెంకట్, సింహాచలం చింతపల్లి, గూడెం కొత్తవీధి, కొయ్యూరు మండలాలు వ్యవసాయ, ఉద్యానవన సహాయకులు తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన తెగల మధ్య విబేధాలు సృష్టించడం తగదు
రంపచోడవరం: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి.బాబురావునాయుడు రాసిన పుస్తకంలో వాల్మీకి తెగను విమర్శిస్తూ రాయడంపై జిల్లా వాల్మీకి సంఘం అధ్యక్షుడు గొర్లె చిననారాయణ అగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. బాబురావు నాయుడు రాసిన పుస్తకంలో 34 గిరిజన తెగలు ఉండగా, కేవలం నాలుగు తెగలను ఉద్ధేశించి ప్రధానంగా వాల్మీకి తెగను విమర్శిస్తూ, జిల్లాలో 546 వాల్మీకి కుటుంబాలు మాత్రమే ఉన్నట్లుగా రాజకీయ కుట్రలో భాగంగా తప్పుడు లెక్కలు చూపించినట్లు ఆరోపించారు. బాధ్యత గల రిటైర్డ్ ఐఏఎస్ అదికారి అయి ఉండి వాస్తవాలు తెలుసుకోకుండా గిరిజన తెగల మధ్య విబేధాలు సృష్టించడం సరికాదన్నారు.బాబురావునాయుడు రాసిన పుస్తకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వాల్మీకి గిరిజనుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్లో ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. తెగల మధ్య విబేధాలు సృష్టించే వారిపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
మెరుగైన వైద్యం అందించాలి
రంపచోడవరం: రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం ఆదేశాల మేరకు ఏడీఎంహెచ్వో డాక్టర్ డేవిడ్ రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిని శనివారం సందర్శించారు. ఇక్కడ చికిత్స పొందుతున్న గంగవరం మండలం పిడతమామిడి పీహెచ్సీ ప్రాంతానికి చెందిన వీరలక్ష్మిని కలిసి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు అత్యవసర చికిత్స నిమిత్తం ఐటీడీఏ పీవో సింహాచలం చొరవతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. డ్యూటీ డాక్టర్తో మాట్లాడి వీరలక్ష్మికి అందిస్తున్న వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో రంపచోడవరం డివిజన్లో మారేడుమిల్లి, గెద్దాడ పీహెచ్సీల నుంచి వైద్యం కోసం వచ్చిన రోగులను పరామర్శించి వైద్య సేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. గిరిజన రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని వైద్యులకు సూచించారు. -
చోరీకి గురైన ల్యాప్టాప్లు స్వాధీనం
రంపచోడవరం: రంపచోడవరంలోని గిరిజన సంక్షేమ బాలిక ఆశ్రమ పాఠశాలలో లాప్టాప్లను చోరీ చేసిన నిందితులను అరెస్టు చేసినట్టు రంపచోడవరం డీఎస్పీ సాయిప్రశాంత్ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొంగతనాల నివారణకు పోలీసులు ముమ్మర గస్తీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కేసులో గంగవరం మండలం కొత్తాడ గ్రామానికి చెందిన కోసు అనిల్కుమార్, అతని స్నేహితుడు గడుతూరి రాజ్కుమార్లను అదుపులో తీసుకుని విచారించగా నేరం అంగీకరించారన్నారు. వారి వద్ద నుంచి 11 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అనిల్కుమార్ రంపచోడవరం బాలికల ఆశ్రమ పాఠశాలలో మూడు సంవత్సరాల నుంచి అవుట్ సోర్సింగ్ అటెండర్గా పనిచేస్తున్నాడని చెప్పారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహిరించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు. నిందితులను రిమాండ్కు పంపినట్టు చెప్పారు. ఎస్ఐ వెంకట్రావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇద్దరు నిందితులు అరెస్టు వివరాలు వెల్లడించిన డీఎస్పీ సాయిప్రశాంత్ -
ప్రభుత్వ భూమి గిరిజనులకే దక్కాలి
ఎటపాక: పోలవరం పరిహారం పొందిన ప్రభుత్వ భూములు గిరిజనులకే దక్కాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు డిమాండ్ చేశారు. శనివారం మురుమూరు,రాఘవాపురం గ్రామాల్లో భూపోరాట కమిటీ ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. పోలవరం పరిహారం పరిహారం పొందిన భూములు గిరిజనులకే చెందితాయని వాటిని గిగిరిజనులు సాగుచేసుకోవడంమే న్యాయబద్దం అన్నారు. 2007లో భూ నష్టపరిహారం పొందిన భూమిని ప్రభుత్వానికి స్వాధీన పర్చినప్పటికీ, ఆ భూములపై ఆదాయం పొందుతున్నారన్నారు. అట్టి భూములపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అవి ఎవరికి చెందుతాయనేది నిర్థారించాలన్నారు. తప్పుడు ఫిర్యాధులతో గిరిజనులను వేధించవద్దని కోరారు. ఏజెన్సీలో కౌలు వసూలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కాకా అర్జున్దొర ,నాయకులు సోందె రామారావు, పర్షిక ధర్మరాజు, సోయం వీరమ్మ తదితరులు పాల్గొన్నారు. -
సంప్రదాయ పద్ధతిలో విడిది సౌకర్యం
చింతపల్లి: జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో గల గిరిజన గ్రామాల్లో సంప్రదాయ పద్ధతిలో విడిది సౌకర్యం కల్పించడంతో పాటు గిరిజనులకు ఆర్థికాభివృద్ధి సాధించేలా పర్యాటకశాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని పర్యాటకశాఖ జిల్లా మేనేజర్ గరికన దాసు అన్నారు. శనివారం మండలంలో పర్యాటక ప్రాంతాలైన లంబసింగి,తాజంగి పంచాయతీల్లోని పలు గ్రామాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక ప్రాంతాలైన మారేడుమిల్లి, లంబసింగి, అరకు ప్రాంతాల్లో (తరువాయి 8లో) పర్యాటక సీజన్ నాటికి అందుబాటులోకి హోంస్టేలు పర్యాటకశాఖ జిల్లా మేనేజర్ దాసు -
ఆశ్రమాల్లో అవస్థలు
జిల్లాలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు,సంక్షేమ వసతి గృహాలు, కేజీబీవీలు, గురుకుల పాఠశాలల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఇంతవరకు గిరిజన వసతి గృహాల్లో సమస్యలు పరిష్కారానికి నిధులు మంజూరు చేయలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రెండవ విడత నాడు–నేడులో మంజూరు చేసిన 967 విద్యాలయాల్లో పనులను కూడా నిలిపివేసింది. పెండింగ్లో ఉన్న పనులు కూడా నిలిచిపోవడంతో గిరిజన విద్యార్థులకు పూర్తిస్థాయి సౌకర్యాలు కరువయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటుచేసిన ఆర్వో ప్లాంట్లు, సోలార్ వాటర్ గీజర్ ప్లాంట్లు నిర్వహణలోపం వల్ల చాలాచోట్ల పనిచేయడం లేదు. బెడ్స్లేక నేలపైనే పడుకోవాల్సి వస్తోంది. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన సాక్షి పరిశీలనలో పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి. గిరిజన విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించిన కూటమి ప్రభుత్వం● కనీస వసతులు లేక ఇబ్బందులు ● బెడ్స్ లేక నేలపైనే పడక ● రన్నింగ్ వాటర్ సదుపాయం లేక నిరుపయోగంగా మరుగుదొడ్లు ● పనిచేయని ఆర్వో ప్లాంట్లు, గీజర్లు ● గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల వసతి గృహాల్లో నరకం చూస్తున్న విద్యార్థులురన్నింగ్ వాటర్ లేక అవస్థలు జి.మాడుగుల మండలం గెమ్మెలి గిరిజన సంక్షేమ ఆశమ్ర పాఠశాలలో రన్నింగ్ వాటర్ సదుపాయం లేక కుళాయిలు నిరుపయోగంగా మారాయి. సుమారు మంది విద్యార్థులు ఉన్న ఈ వసతి గృహంలో కుళాయిలు పనిచేయక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నాళ్లుగా ఇదే దుస్థితి నెలకొంది.నేలపైనే పడక మండల కేంద్రమైన డుంబ్రిగుడ గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా వసతులు లేవు. ఇక్కడ 315 మంది ఆశ్రయం పొందుతున్నారు. బంకర్ బెడ్స్ పూర్తిస్థాయిలో సరఫరా లేదు. దీనివల్ల సుమారు 200 మంది విద్యార్థులు కటిక నేలపై పడుకోవాల్సి వస్తోంది. వేచి ఉండాల్సిందే.. కూనవరం మండలం కోతులగుట్ట గిరిజన సంక్షేమశాఖ బాలికల గురుకుల పాఠశాల వసతి గృహంలో 270 మంది విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. ఇక్కడ విద్యార్థినుల సంఖ్యకు తగ్గట్టుగా వసతులు లేవు. భోజన అనంతరం చేతులు కడుక్కునేందుకు తగిన సౌకర్యం లేక వేచి ఉండాల్సి వస్తోంది. పాడేరు: పాడేరు ఐటీడీఏ పరిధిలో అధ్వాన పరిస్థితులకు తలార్సింగి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల బాలుర వసతి గృహం అద్దం పడుతోంది. సుమారు 432 మంది ఉన్న ఈ వసతి గృహంలో దృశ్యాలను చూస్తే చలించకమానదు. దశాబ్దాల క్రితం నిర్మించిన వసతి గృహ భవనాలు పూర్తిగా శిథిలస్థితికి చేరాయి. గచ్చులు పూర్తిగా ఊడిపోయాయి. భవనం శ్లాబ్ పెచ్చులూడి పడుతోంది. ఏ గదికి కిటికీలు, తలుపులు లేవు. చలికాలంలో అవస్థలు వర్ణనాతీతం. పూర్తి స్థాయిలో విద్యుత్ సౌకర్యం లేదు. విద్యార్థులే కొంత సొమ్ము పోగుచేసుకుని విద్యుత్ సమస్య పరిష్కారానికి వెచ్చించారు. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా మరుగుదొడ్లు లేవు. ఉన్నవాటికి రన్నింగ్ వాటర్ సదుపాయం లేదు. దీంతో విద్యార్థుల పాట్లు అన్నీఇన్నీ కావు. కలెక్టరేట్, ఐటీడీఏ, ఏటీడబ్ల్యూవో కార్యాలయాలు పక్కనే ఉన్న విద్యార్థుల సమస్యలను పట్టించుకునేవారే కరువయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జి.మాడుగుల : మండలంలో పది ఆశ్రమ వసతి గృహాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, గిరిజన గురుకులం, మినీ గురుకులం, ఏకలవ్య, కేజీబీవీ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 4,500 మంది విద్యార్ధులు చదువుతున్నారు. జి.మాడుగుల ప్రభుత్వ జూనియర్ కళాశాల వసతి గృహంలో గదులకు కిటికీలు, తలుపులు లేవు. విద్యుత్ సమస్య ఎక్కువగా ఉంది. జీఎం కొత్తూరు, గాంధీనగరం వసతి గృహాల్లో మరుగుదొడ్లకు రన్నింగ్ వాటర్ సౌకర్యం లేక బాలికలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. విద్యార్థినులు బకెట్లతో నీటిని మోసుకుని తేవాల్సి వస్తోంది. కొక్కిరాపల్లి వసతి గృహంలో బాలికలకు అవసరమైన మరుగుదొడ్లు లేవు. ● చింతపల్లి మండలంలో పది గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, ఐదు పోస్ట్మెట్రిక్ వసతి గృహాలు, ఒక కేజీబీవీ, ఒక మినీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. సుమారు 5,500 మంది గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మండల కేంద్రంలో ఉన్న గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల వసతి గృహం మినహా మిగిలిన అన్ని వసతి గృహాలకు ప్రహరీలు లేవు. దీంతో బాలికలకు రక్షణ కరువైంది. ● లంబసింగి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల వసతి గృహంలో విద్యార్థినులు వసతి సమస్య ఎదుర్కొంటున్నారు. ఇక్కడ 250 మంది బాలికలు చదువుతుండగా పది గదులు మాత్రమే ఉన్నాయి. జాజులపాలెం బాలుర వసతి గృహంలో సోలార్ వాటర్ గీజర్లు పని చేయడం లేదు. సమస్యల తిష్ట రంపచోడవరం: ఐటీడీఏకు కూతవేటు దూరంలో ఉన్న గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో సమస్యలు తిష్టవేశాయి. ఈ పాఠశాలలో 326 మంది గిరిజన విద్యార్ధులు చదువుతున్నారు. హాస్టల్ సదుపాయం సక్రమంగా లేకపోవడంతో తరగతి గది, వసతి ఒకే చోట ఉండడంతో విద్యార్థులు సర్దుకుపోతున్నారు. డైనింగ్ హాలు సదుపాయం లేకపోవడంతో వర్షం పడినప్పుడు విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. తడుస్తూనే కంచాలు పట్టుకుని లైన్లో నిల్చోవాల్సి వస్తోంది. వంటశాల, మరుగుదొడ్ల నుంచి మురుగునీరు వెళ్లేందుకు డ్రైనేజీ సదుపాయం లేదు. దీనివల్ల పాఠశాల గోడ పక్కనే ఉన్న మురుగు కాలువ నుంచి దుర్గంధం వస్తోంది. నాడు–నేడు ఫేజ్2లో నిధులు కేటాయించకపోవడంతో అసంపూర్తిగా భవనం నిలిచిపోయింది. విద్యార్ధులు కార్పెట్లు సరఫరా చేయకపోవడంతో దుప్పట్లు వేసుకుని పడుకుంటున్నారు. ● గంగవరంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు వసతి కరువైంది. నిధుల కొరత వల్ల భవన నిర్మాణం నిలిచిపోయింది. విద్యార్థులు ఉన్న పడకలను సర్దుకోవాల్సి వస్తోంది. ● వీఆర్ పురం మండలం రేఖపల్లిలోకి కస్తూర్బా విద్యాలయంలో 251 మంది బాలికలు చదువుకుంటున్నారు. వీరికి తగ్గట్టుగా పూర్తిస్థాయిలో వసతి సౌకర్యం లేదు. పాఠశాలలో ఏఎన్ఎం సదుపాయం లేదు. నైట్ వాచ్మెన్ లేడు. కిటికీ దోమ తెరలు లేవు. నాడు–నేడులో చేపట్టిన భవన నిర్మాణం మధ్యలో నిలిచిపోయింది. ● రేఖపల్లిలోని మినీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు తగ్గట్టుగా వసతులు లేవు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు 195 మంది విద్యార్థులు చదువుతున్నారు. తరగతి గదిలోనే వీరు నిద్రిస్తున్నారు. దుప్పట్లు వేసుకుని గచ్చుపై పడుకుంటున్నారు. ● రాజవొమ్మంగిలోని బీసీ వసతి గృహంలో 62 మంది విద్యార్ధులు ఉన్నారు. మరుగుదొడ్లు లేవు. అధికారులకు ఎన్ని సార్లు చెప్పిన స్పందన లేదని వారు వాపోతున్నారు. హాస్టల్ గదులకు కిటికీలు లేకపోవడంతో చల్లగాలి, దోమలతో ఇబ్బంది పడుతున్నారు. ● కూనవరం మండలం కోతులగుట్లలోని ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ బాలికల పాఠశాలలో 720 మంది విద్యార్ధులు ఉన్నారు. ఈ పాఠశాలలో 52 మరుగుదొడ్లు ఉండగా అందులో 16 మరుగుదొడ్లు మరమ్మతులకు గురయ్యాయి. పాఠశాల ఆవరణలో ఐదు బోర్లు ఉండగా రెండు బోర్లు పనిచేయడం లేదు. విద్యార్ధులు భోజనం చేసిన తరువాత చేతులు కడుక్కొనేందుకు వాష్ రూమ్ ఒక్కటే ఉంది. ● ఎటపాక మండలం గౌరీదేవిపేట బీసీ బాలుర వసతి గృహంలో వంటిషెడ్డు లేకపోవడంతో లేపోవడంతో హాస్టల్ గదిలోనే వంటలు చేస్తున్నారు. అరకులోయ టౌన్: అరకు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు సమస్యలతో విద్యార్ధులు సతమతమవుతున్నారు. మండల కేంద్రంలో ఉన్న వసతి గృహాల్లో మినహా మారుమూల ప్రాంతాల్లో ఉన్న వసతి గృహాల్లో ముఖ్యంగా తాగునీటి సమస్య వెంటాడుతోంది. విద్యార్థులు పడుకునేందుకు బంకర్ బెడ్స్ కొన్ని వసతి గృహాల్లో మాత్రమే ఉన్నాయి. మిగిలిన చోట్ల నేలపైనే పడుకుంటున్నారు. కనీసం జంబుఖానా కూడ సరఫరా చేయకపోవడంతో చలికాలం, వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత వర్షాకాలంలో సరైన సౌకర్యాలు లేకపోవడం, కలుషిత నీటిని సేవించడం వల్ల విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. మూరు మూల ప్రాంతంలోని వసతి గృహాల్లో మెనూ ప్రకారం భోజనాలు పెట్టడంలేదని చెబుతున్నారు. ● హుకుంపేట ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఇంగ్లీషు మీడియం పాఠశాలలో భవనాలు, వసతి గృహాలు మరమ్మతుకు గురయ్యాయి. మరుగుదొడ్లు సరిపడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. బంకర్ బెడ్స్ పూర్తిస్థాయిలో లేకపోవడం వల్లవిద్యార్థులు నేలపై పడుకుంటున్నారు. ● ముంచంగిపుట్టు జెడ్పీ పాఠశాల వసతి గృహ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. సుమారు 120 మంది విద్యార్థులు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. నాడు–నేడు పథకంలో నిధులు మంజూరు అయినప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ● డుంబ్రిగుడ గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో రన్నింగ్ వాటర్ సక్రమంగా లేనందున మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉన్నాయి. డే స్కాలర్ విద్యార్థులకు వంట చేసేందుకు ఏర్పాటుచేసిన షెడ్డు నిరుపయోగంగా ఉంది. తలుపులు ఏర్పాటుచేయకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. ఐటీడీఏల వారీగా వివరాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎంతో ప్రాధాన్యం సాక్షి, పాడేరు: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గిరిజన విద్యాభివృద్ధికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది. నాడు–నేడు పథకంలో మొదట విడతగా జిల్లాలో 581 గిరిజన విద్యాలయాలను రూ.16527.07లక్షలతో అభివృద్ధి చేసింది. పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించింది. రెండవ విడతలో 2023–24కు సంబంధించి 967 గిరిజన విద్యాలయాల అభివృద్ధికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.21814.35 నిధులు మంజూరు చేసింది. ఆయా పాఠశాలల్లో పనులన్నీ చివరిదశకు చేరుకునే సమయంలో ప్రభుత్వం మారడంతో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వీటి ఊసెత్తడం లేదు. -
అల్లూరి జిల్లాలో అధ్వానంగా విద్యావ్యవస్థ
మహారాణిపేట (విశాఖ): అల్లూరి సీతారామరాజు జిల్లాలో విద్యావ్యవస్థ అమలు సక్రమంగా లేదని పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశాలు జరిగాయి. జెడ్పీ చైరపర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో డీప్యూటీ సీఈవో రాజ్కుమార్,ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంతగిరి జెడ్పీటీసీ డి.గంగరాజు, అరకు జెడ్పీటీసీ శెట్టి రోషిణి మాట్లాడుతూ అల్లూరి జిల్లాలోని పలు మండలాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో చాలామందికి చదవడం,రాయడం రాదన్నారు. దీనిని బట్టి విద్యా బోధన ఎలా ఉందోనని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏకలవ్య పాఠశాలల్లో తొమ్మిది తరగతిలో ప్రవేశానికి పరీక్ష పెడితే చదవలేక (తరువాయి 8లో) అరకు మండలంలో పరిస్థితి మరింత దారుణం జెడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన స్థాయీ సంఘ సమావేశాల్లో అరకు జెడ్పీటీసీ రోషిణి ఆవేదన -
సూపర్ క్వాలిటీ దుస్తుల తయారీకి పూర్తి సహకారం
కూనవరం: చింతూరు డివిజన్లో సూపర్ క్వాలిటీ దుస్తులు తయారు చేసేందుకు పూర్తిసహకారం అందిస్తామని గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.మల్లికార్జున్ నాయక్ తెలిపారు. పైదిగూడెంలోని పట్టు దుస్తుల శిక్షణ కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. మగ్గం ద్వారా బట్ట నేస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఒకరు ఒక చీరె నేసేందుకు (తయారు చేసేందుకు) ఎంత సమయం పడుతుందని అక్కడ పనిచేస్తున్న మహిళలను అడిగారు. రెండు రోజుల సమయం పడుతుందని వారు తెలిపారు. 2021లో గిరిజన లబ్ధిదారు లు 50 మందికి పట్టు కాయల నుంచి దారం తీయడంలో శిక్షణ ఇప్పించామని, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి తీసిన దారంతో దుస్తులు నేయడంలో శిక్షణ ఇప్పిస్తున్నామని ముఖ్య కార్యదర్శికి పీవో అపూర్వభరత్ వివరించారు. తయారైన దుస్తులకు ప్రింటింగ్, డైయింగ్, డిజైనింగ్ వర్క్స్ కొరకు మరో గోదాం ఏర్పాటు చేయడం జరుగు తుందని పీవో తెలిపారు. అనంతరం గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మల్లికార్జున్ నాయక్ ఈ శిక్షణకు సంబంధించి పీవో కు కొన్ని సూచనలు చేశారు. అనంతరం చింతూరు ఐటీడీఏ కార్యాలయంలో ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం చింతూరు మండలంలోని ఆశ్ర మ బాలికల పాఠశాలను సందర్శించారు. 8వ తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. ఏపీవో జగన్నాథరావు, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ మురళి, ఎస్ఐ లతశ్రీ, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ పుల్లయ్య, రంపచోడవరం డీడీ రుక్మాండయ్య పాల్గొన్నారు. గిరిజన సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి మల్లికార్జున్ నాయక్ -
గిరిజన హక్కులు, చట్టాలను పరిరక్షించాలి
పాడేరు : గిరిజనుల హక్కులు, చట్టాలను రక్షణ కల్పించి వాటిని పరిరక్షించి అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఆర్ఎస్ సన్యాసినాయుడు సూచించారు. పట్టణంలోని కాఫీ హౌస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, గిరిజన ప్రాంత పారా లీగల్ వలంటీర్లు, ప్యానల్ అడ్వకేట్లు, గిరిజన యువతకు శుక్రవారం న్యాయసేవలపై ఒక రోజు శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్పీ అమిత్బర్దర్, ఐటీడీఏ ఇన్చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, దామోదర సంజీవయ్య న్యాయ కళాశాల వైస్ చాన్సలర్ సూర్యప్రకాష్తో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు ఒక ప్రత్యేకత ఉందన్నారు. వాటికి కూడా భద్రత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఏ సమస్య వచ్చినా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తే సమస్యలను సునాయంగా అధిగమించవచ్చన్నారు. న్యాయ సేవలపై గిరిజనులు అవగాహన కలిగి ఉండాలన్నారు. న్యాయ సేవాధికార సంస్థ అందించే శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ మాట్లాడుతూ న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను పూర్తిగా సద్వినియోగం చేసుకుని గ్రామాల్లో గిరిజనులకు చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించాలని గిరిజన ప్రాంత పారా లీగల్ వలంటీర్లకు సూచించారు. గిరిజన ప్రాంతంలో ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఎస్పీ అమిత్బర్దర్ మాట్లాడుతూ గిరిజనుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో జ్యుడీషియల్ సిస్టం ఉందన్నారు. భారతీయ సంస్కృతిలో గిరిజన సంస్కృతి చాలా కీలకమన్నారు. సమాజంలో, సంఘంలో ఉండే ప్రతి పౌరుడితో సామరస్యంగా స్నేహభావంతో ఉండాలన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు న్యాయం కావాలంటే కూర్చొని చర్చించుకుంటే పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, దామోదర సంజీవయ్య న్యాయ విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ సూర్యప్రకాష్ అటవీ హక్కులు, స్థానిక భాషలు, గిరిజనుల హక్కులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనీ ఆర్. శ్రీనివాసరావు, డీఎంహెచ్వో డాక్టర్ విశ్వేశ్వరనాయుడు, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీభాయ్, జిల్లా కార్మిక శాఖ అధికారి సుజాత, డీఈవో బ్రహ్మాజీరావు, డ్వామా పీడీ విద్యాసాగర్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిపై బాధ్యత గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు భద్రత అవసరం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఆర్ఎస్ సన్యాసినాయుడు -
ఆస్పత్రిలో వైద్యం పొందుతున్నా
మూడు రోజులుగా జ్వరంగా వుండడంతో గ్రామంలో మందులు వేసుకున్నా. అయినప్పటికీ తగ్గకపోవడంతో గురువారం చింతూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లాను. రక్తపరీక్ష చేసి మలేరియా జ్వరంగా చెప్పారు. ఆస్పత్రిలో ఉంటూ వైద్యుల సూచన మేరకు మందులు వాడుతున్నా. – ముచ్చిక సంతోష్, సరివెల, చింతూరు మండలం మెరుగైన చికిత్స అందిస్తున్నాం వాతావరణ మార్పుల నేపథ్యంలో చింతూరు డివిజన్లో మలేరియా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు చింతూరు డివిజన్లోని 8 పీహెచ్సీల్లో 515 మలేరియా కేసులు నమోదయ్యాయి. హాట్స్పాట్ ప్రాంతాలను గుర్తించి దోమల నివారణ చర్యలు చేపడుతున్నాం. మరణాలు సంభవించకుండా మెరుగైన వైద్యం అందిస్తున్నాం. – డాక్టర్ పుల్లయ్య, డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో, చింతూరు -
వణికిస్తున్న మలేరియా
● చాపకింద నీరులా విజృంభణ ● గ్రామాల్లో కొరవడిన పారిశుధ్యం ● పెరుగుతున్న దోమల వ్యాప్తి ● ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పెరుగుతున్న జ్వర పీడితులు ● రంపచోడవరం రెవెన్యూ డివిజన్లో 1,398 కేసుల నమోదు ● విలీన మండలాల్లో 151 హాట్స్పాట్లు గుర్తింపు చింతూరు: రంపచోడవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో మలేరియా జ్వరాలు చాపకింద నీరులా విజృంభిస్తున్నాయి. రంపచోడవరం, చింతూరు డివిజన్లలో ఈ ఏడాది ఇప్పటివరకు 1,398 మలేరియా కేసులు నమోదు అయ్యాయి. వీటిలో రంపచోడవరం డివిజన్లో 883 , చింతూరు డివిజన్లో 515 కేసులు నమోదు అయినట్టు వైద్యారోగ్యశాఖ అధికారవర్గాలు తెలిపాయి. ● వాతావరణ మార్పులు, గ్రామాల్లో పారిశుధ్యం కొరవడటం తదితర కారణాల వల్ల దోమలు వృద్ధి చెంది, మలేరియాను వ్యాప్తి చేస్తున్నాయి. జ్వర పీడితులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు నిండిపోతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు గ్రామాలు చిత్తడిగా మారడం వల్ల దోమల ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. గ్రామపంచాయతీల్లో పారిశుధ్యం మెరుగుపర్చడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహిస్తునారన్న విమర్శలు ఉన్నాయి. చెత్త, చెదారంతో నిండిపోవడం, నీటి మడుగులు, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా మలేరియా దోమల లార్వా వ్యాప్తికి దోహదపడుతున్నాయి. గ్రామాల్లో దోమల నివారణకు స్ప్రేయింగ్, ఫాగింగ్, డ్రైనేజీలను శుభ్రం చేయడం, చెత్త తొలగింపు, బ్లీచింగ్ చల్లించడంలో పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నరన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విలీనంలో 151 హాట్ స్పాట్ల గుర్తింపు మలేరియా కేసులు అధికంగా నమోదయ్యేందుకు అవకాశమున్న 151 హాట్స్పాట్ కేంద్రాలను చింతూరు, కూనవరం, వీఆర్పురం, ఎటపాక మండలాల్లో గుర్తించినట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. గతేడాది రెండు కంటే ఎక్కుఇవగా మలేరియా కేసులు నమోదైన ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించినట్లు వారు తెలిపారు. ఐటీడీఏ పీవో అపూర్వభరత్ ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాలను హైరిస్క్ ప్రాంతాలుగా గుర్తించి యాంటీలార్వా, ఫాగింగ్, స్ప్రేయింగ్ వంటి కార్యక్రమాలు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. చింతూరు మండలంలో 64, వీఆర్పురం మండలంలో 39, ఎటపాక మండలంలో 21, కూనవరం మండలంలో 26 ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించారు. పీహెచ్సీల వారీగా.. చింతూరు డివిజన్లో ఈ ఏడాది పీహెచ్సీల వారీగా తులసిపాకలో 96, మోతుగూడెం 126, ఏడుగురాళ్లపల్లి 75, కూటూరు 64, రేఖపల్లి 45, జీడిగుప్ప 44, కూనవరం 27, గౌరిదేవిపేట 17, నెల్లిపాక 15, లక్ష్మీపురం ఆరు కేసులు నమోదయ్యాయి. -
మొబైల్ ఆధార్ సేవలు సద్వినియోగం
కలెక్టర్ దినేష్కుమార్ పాడేరు : మొబైల్ అధార్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, వీటిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దినేష్కుమార్ కోరారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో సిరీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో 72 ఆధార్ కిట్లు, పాఢ్యమి ఐటీ సొల్యూషన్స్ ద్వారా 150 అధార్ కిట్లను కలెక్టర్ దినేష్కుమార్ అందజేశారు. గిరిజన ప్రాంతంలో సిరీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థ తొలి గిరిజన సాఫ్ట్వేర్ సంస్థగా గుర్తింపు పొంది ప్రతి మండలం, గ్రామంలో ఆధార్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ఆధార్ అప్డేట్కు సంబంధించి సిబ్బందికి పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వాలన్నారు. అ కార్యక్రమంలో జేసీ అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, పీఎంయూ అధికారి గోపాల్, ఆధార్ కో ఆర్డినేటర్ డేవిడ్ పాల్గొన్నారు. -
నిర్మూలనకు చర్యలు చేపట్టాలి
● చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వభరత్ చింతూరు: డివిజన్లో మలేరియా నిర్మూలనకు యుద్ధప్రాతిపదికన తగిన చర్యలు చేపట్టాలని స్థానిక ఐటీడీఏ పీవో అపూర్వభరత్ ఆదేశించారు. చింతూరులో వైద్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాంటీలార్వా స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ డివిజన్ వ్యాప్తంగా గుర్తించిన 151 హాట్స్పాట్ ప్రాంతాల్లో వెంటనే యాంటీలార్వా స్ప్రేయింగ్ కార్యక్రమం నిర్వహించాలని, ఆయా ప్రాంతాల్లో పంచాయతీ సిబ్బంది ముమ్మరంగా పారిశుధ్య కార్యక్రమాలు, ఫాగింగ్ చేపట్టాలని ఆదేశించారు. యాంటీలార్వా స్ప్రేయింగ్ నిమిత్తం 8 పవర్స్ప్రేయర్లు, 45 బ్యాటరీ స్ప్రేయర్లు రప్పించామన్నారు. దోమల ద్వారా వ్యాప్తిచెందే మలేరియా, డెంగ్యూ, చికెన్గున్యా, మెదడువాపు వంటి వ్యాధుల నివారణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని పీవో సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో డాక్టర్ పుల్లయ్య, ఎంపీడీవో శ్రీనివాస్దొర, ఏఎంవో శ్రీనివాసరాజు, డాక్టర్ ఉదయ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. -
టీబీ రహిత జిల్లాగా కృిషి
పాడేరు : జిల్లాను టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా టీబీ వ్యాధి లక్షణాలు తెలిపే సెల్ఫీ స్టాండ్, ప్రచార గోడ పత్రికలను శుక్రవారం ఐటీడీఏ వద్ద ఆయన ప్రారంభించారు. ప్రజలంతా టీబీ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉంటూ అవగాహన కలిగి ఉండాలన్నారు. టీబీ రహిత భారత్కు అందరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, డీఆర్వో పద్మలత, జిల్లా టీబీ కంట్రోల్ ఆఫీసర్, డీపీఎంవో డాక్టర్ కిరణ్కుమార్, సీసీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
●వర్షం కురిస్తే వణుకే..!
మండలాల్లో ప్రభుత్వ భవనాల నిర్మాణం, నిర్వహణ, ప్రతిపాదనలు తదితర అంశాలను మండల పరిషత్ అధికారులు పర్యవేక్షిస్తుంటారు. ఇంతటి కీలకమైన వీరు సొంత భవనానికి మరమ్మతులు చేపట్టలేకపోతున్నారు. ముంచంగిపుట్టులో సుమారు 50 ఏళ్ల క్రితం నిర్మించిన మండల పరిషత్ భవనం శిథిలావస్థకు చేరుకుంది. కార్యాలయం ముఖద్వారం వద్ద శ్లాబ్ పెచ్చులూడిపోవడంతో రంధ్రం ఏర్పడింది. వర్షం పడినప్పుడల్లా కారిపోతుండటంతో విధులు నిర్వహించే సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఎంపీపీ సీతమ్మ, మండల ప్రజలు కోరుతున్నారు. –ముంచంగిపుట్టు -
మందులు అందుబాటులో ఉంచాలి
● రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలంరంపచోడవరం: ఏజెన్సీలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం ఆదేశించారు. మండలంలోని సీతపల్లి పీహెచ్సీని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రికి సంబంధించిన వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. సీజనల్ వ్యాధులకు మందుల ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. పీహెచ్సీ పరిధిలో గర్భిణుల వివరాలను సిబ్బంది నుంచి తెలుసుకున్నారు. ప్రస్తుతం రోగుల సంఖ్య, అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. -
మహాలక్ష్మి నమోస్తుతే
● ఘనంగా శ్రావణమాస పూజలు సాక్షి,పాడేరు: పవిత్ర శ్రావణమాసం ప్రారంభంతో తొలి శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని దేవతామూర్తుల ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. జిల్లా కేంద్రం పాడేరులోని మోదకొండమ్మతల్లి, రాజరాజేశ్వరిదేవి, కనకదుర్గమ్మతల్లి, మహాలక్ష్మి అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. సాయంత్రం కుంకుమార్చన నిర్వహించారు. భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు.అలాగే సుండ్రుపుట్టు సాయిబాబా ఆలయంలోను వరలక్ష్మిదేవి విగ్రహానికి పూజలు చేశారు.అరకులోయలోని భ్రమరాంబిక దేవి సమేత శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలోను అమ్మవారికి పూజలు చేశారు. కుంకుమార్చన జరిపారు. -
ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ
పాడేరు : ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ దినేష్కుమార్ హెచ్చరించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, డీఆర్వో పద్మలత 94 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలను సంబంధిత శాఖల అధికారులు క్షేత స్థాయి పరిశీలన జరిపి త్వరితిగతిన పరిష్కారించాలని సూచించారు. కాల్ సెంటర్ను సద్వినియోగం చేసుకోండి అర్జీదారులు మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దినేష్కుమార్ సూచించారు. అర్జీదారులు ఎప్పటికప్పుడు కాల్ సెంటర్కు ఫోన్ చేసి తమ సమస్య ఎంత వరకు పరిష్కారమైందో తెలుసుకోవచ్చన్నారు. తమ అర్జీలను నమోదు చేసుకునేందుకు MEEKOSAM.AP.GOV.IN వెబ్ సైట్ను సంప్రదించాలన్నారు. ప్రజలంతా ఈ అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు, పంచాయతీరాజ్, ఆర్ఆండ్బీ ఈఈలు కొండయ్య పడాల్, బాల సుందరబాబు, డీఎల్పీవో కుమార్, జిల్లా ఖజానా అధికారి ప్రసాద్బాబు, ఎస్టీవో కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. లేకుంటే చర్యలు కలెక్టర్ దినేష్కుమార్ హెచ్చరిక మీకోసంలో 94 వినతుల స్వీకరణ -
డీపీఆర్ ఆమోదం లేకుండా టెండర్లు.. నిధుల్లేకుండా హడావుడి
డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ సాక్షి, విశాఖపట్నం: డీపీఆర్కు ఆమోదం చెప్పలేదు.. కేంద్రం నుంచి ఒక్క రూపాయి విదిల్చలేదు.. భూ సేకరణకు కూడా అడుగు పడలేదు.. కనీసం మా వంతు సహకారం అందిస్తామన్న హామీ కూడా రాలేదు. కానీ.. కూటమి ప్రభుత్వం ప్రచారం కోసం హడావిడి ప్రారంభించేసింది. రూపాయి లేదు.. డీపీఆర్ లేదు.. కొడుకు పేరు వైజాగ్ మెట్రో అన్నట్లుగా.. ప్రజల్ని మభ్య పెట్టేందుకు వైజాగ్ మెట్రో నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది. ఫేజ్–1లో 46.23 కిమీ నిర్మించేందుకు టెండర్లు పిలిచిన ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్(ఏఎంఆర్సీ) దాదాపు రూ.6500 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఒక ఫ్లైఓవర్ నిర్మాణానికే రెండేళ్లకు పైగా సమయం పడుతుంది. కానీ.. 42 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లతో కూడిన 46.23 కిమీ మెట్రో ప్రాజెక్టు అగ్రిమెంట్ అయిన 30 నెలల్లో పూర్తి చేసెయ్యాలంటూ నిబంధనలు విధించింది. ఈ ప్రాజెక్టు కోసం వీఎంఆర్డీఏని ఆర్థికంగా బలి చేసేందుకు చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. మొదటి దశలో 46.23 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.6250 కోట్లు(జీఎస్టీ అదనం)తో టెండర్లుకు శుక్రవారం ఆహ్వానించింది. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.11,498 కోట్లు కాగా..మూడు కారిడార్లలో ఫేజ్ –1 పనుల కోసం ఈపీసీ ప్రాతిపదికన ఏఎంఆర్సీ టెండర్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ పనుల్ని మూడేళ్ల కాలపరిమితితో పూర్తి చేయాలని టెండర్ షెడ్యూలులో పేర్కొన్నారు. టెండర్ సమర్పించిన 180 రోజుల వరకూ బిడ్ వ్యాలిడిటీ ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టును మొత్తం 140.13 కి.మీ లో చేపట్టనున్నారు. తొలి దశలో 46.23 కిలోమీటర్ల మేర చేపట్టనుండగా.. ఇందులో మొత్తం 42 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్లు రానున్నాయి. ఇందులో 20.16 కి.మీ డబుల్ డెక్కర్ తరహాలో ఫ్లైఓవర్లు నిర్మిస్తారు. మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం, గాజువాక నుంచి స్టీల్ప్లాంట్ వరకూ పై వంతెనలు నిర్మిస్తారు. కొమ్మాది– స్టీల్ప్లాంట్, గురుద్వారా–పాతపోస్టాఫీసు, తాటిచెట్లపాలెం–చినవాల్తేరు కారిడార్లలో తొలి దశ కింద మెట్రోకు ప్రణాళిక చేశారు. కొమ్మాది–స్టీల్ప్లాంట్ మధ్య ఏర్పాటు చేసే 34.40 కిలోమీటర్ల కారిడార్లో డబుల్ డెక్కర్ ట్రాక్ నిర్మించనున్నారు. అలాగే మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు 15.06 కిమీ మేర రెండో కారిడార్ను నిర్మిస్తారు. గాజువాక నుంచి స్టీల్ప్లాంటు మధ్య కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. 30 నెలల్లో పూర్తి చెయ్యాలంట : ఈ నెల 28న ఏపీ ఈప్రొక్యూర్మెంట్లో టెండర్లు పెట్టనున్నారు. సెప్టెంబర్ 12న టెండర్లు ఓపెన్ చెయ్యనున్నారు. అనంతరం వడపోత తర్వాత.. టెండర్ దక్కించుకున్న సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు. ఆ తర్వాత 30 నెలల్లో మొత్తం ప్రాజెక్టు పూర్తి చెయ్యాలని షరతు విధించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక కిలోమీటర్ ఫ్లైఓవర్ పూర్తి చేసేందుకు రెండేళ్లకు పైగా సమయం పడుతుంది. కానీ.. కూటమి ప్రభుత్వం మాత్రం 46 కిమీ మెట్రో ప్రాజెక్టు రెండున్నరేళ్లలోనే పూర్తి చేసెయ్యాలని చెప్పడం చూస్తే.. ఇదంతా ప్రజల్ని మభ్యపెట్టి.. ప్రచారం కోసమేనన్నట్లుగా అర్థమవుతోంది. అదేవిధంగా.. డబుల్ డెక్కర్ నాలుగు లైన్ల ఫ్లై ఓవర్ని కూడా 24 నెలల్లో పూర్తి చేసేస్తారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఒక్క అడుగు కూడా పడకుండానే..! : ఒక ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ని కేంద్రం ఆమోదించాలి.. నిధులు చూపించిన తర్వాతే.. టెండర్లకు వెళ్తుంటారు. కానీ.. వైజాగ్ మెట్రో విషయంలో మాత్రం తిమ్మిని బమ్మి చేసేస్తున్నారు. రాష్ట్ర కేబినెట్ డీపీఆర్ని ఆమోదించి.. కేంద్రానికి పంపించింది. నెల రోజుల క్రితం కూటమి ఎంపీలు కేంద్ర మంత్రిని కలిసి.. డీపీఆర్ అమోదించాలని కోరారు. కానీ.. ఇంతవరకూ డీపీఆర్ని ఆమోదించలేదు. అంతే కాదు.. విభజన చట్టంలో భాగంగా.. మెట్రోకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. కానీ.. ఇంతవరకూ మెట్రో కోసం నిధులు మంజూరు చేస్తామని కేంద్రం ప్రకటించలేదు. రెండు ఫేజ్లలో మెట్రో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 99.75 ఎకరాల భూసేకరణ చేపట్టాలి. ఇది కూడా సర్వే జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. భూసేకరణ ప్రక్రియ మాత్రం జరగలేదు. ఇన్ని అడ్డంకులు ఉన్నా.. టెండర్లు పిలిచి.. రెండున్నరేళ్లలో పూర్తి చేసేస్తామంటూ కూటమి ప్రభుత్వం నిస్సిగ్గుగా ప్రకటించడం హాస్యాస్పదం. వీఎంఆర్డీఏపై ‘ఆర్థిక’ భారం.! : సంపద సృష్టించే పార్టీ తెలుగుదేశం పార్టీ అంటూ బాకాలు ఊదిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో అప్పుల మూటని రాష్ట్రం నెత్తిన పెట్టేశారు. ఇప్పుడు.. తన ప్రచారయావ కోసం మరోసారి వీఎంఆర్డీఏని బలి చేసేందుకు కుట్రపన్నుతున్నారు. ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న సమయంలో వీఎంఆర్డీఏ(అప్పటి వుడా) ఆస్తుల్ని విక్రయించి.. హైదరాబాద్ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టి.. విశాఖకు రిక్త హస్తాలు చూపించారు. ఇప్పుడు.. మరోసారి వీఎంఆర్డీఏపై ‘ఆర్థిక’ భారం మోపేందుకు కూటమి సర్కారు సిద్ధమైంది. అంతంత మాత్రం ఆదాయంతో కొట్టుమిట్టాడుతున్న వీఎంఆర్డీఏ నుంచి రూ.4,101 కోట్లు తీసుకోవాలని నిర్ణయించింది. వాస్తవానికి వీఎంఆర్డీఏ వార్షిక బడ్జెట్ కేవలం రూ.1000 కోట్లు మాత్రమే. ఆదాయం లేక.. తమ ప్రాజెక్టులు పూర్తి చేయడానికే నానా యాతన పడుతున్న సమయంలో.. మొత్తం ఆస్తులు అమ్మేసి.. మెట్రోకి పెట్టాలని కూటమి సర్కారు హుకుం జారీ చేసేసింది. దీంతో.. భారీ మొత్తాన్ని ఎలా భరించాలో తెలీక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేకపోయినా.. టెండర్ల పేరుతో అరచేతిలో మెట్రో చూపించేందుకు కూటమి సర్కారు సిద్ధమవడం సిగ్గు చేటని పలువురు విమర్శిస్తున్నారు. వైజాగ్ మెట్రోకి టెండర్లు ఫేజ్–1లో 46.23 కిమీకు టెండర్లు పిలిచిన ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ డీపీఆర్కు కేంద్రం ఆమోదం తెలపకుండానే టెండర్లు పిలవడంపై విమర్శలు కేంద్రం నిధులు ఇస్తుందా లేదా అనేదానిపైనా నీలినీడలు గొప్పల కోసమే కూటమి ప్రభుత్వం టెండర్ల హడావిడి వీఎంఆర్డీఏ నిధులు మెట్రోకి మళ్లించే ప్రయత్నం ఇప్పటికే ఆదాయం లేక కునారిల్లుతున్న వీఎంఆర్డీఏ తాజా నిర్ణయంతో మరింత ఆర్థిక భారం -
విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి
విశాఖ లీగల్: విశాఖలో హైకోర్టు బెంచ్ను తక్షణమే ఏర్పాటు చేయాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేష్కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల వెలుపల అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. విశాఖలో జరిగిన ధర్నాలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎస్.ఎస్. సురేష్కుమార్ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయవాదుల రక్షణ చట్టంలో మార్పులు, నూతన న్యాయస్థానాల నిర్మాణం, ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. మహిళా న్యాయవాదులకు విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని, న్యాయవాదుల మరణానంతరం ప్రయోజనాలను రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జూనియర్ న్యాయవాదులకు రూ.10వేల గౌరవ భృతిని కల్పించాలని, విశాఖపట్నంలో రైల్వే ట్రిబ్యునల్ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం న్యాయవాదుల బృందం డీఆర్వో భవానీశంకర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు ఎం.ఎన్. భగవతి, అజయ్ కుమార్, ఇందిర, శైలజ, పి.మాధురి, వేణు సుబ్రహ్మణ్యం, జి.సుశీల, వి.ఆర్.ఝాన్సీ, న్యాయవాదులు పాల్గొన్నారు. -
వైభవంగా శ్రావణలక్ష్మి పూజలు ప్రారంభం
డాబాగార్డెన్స్: ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు, విశాఖ వాసుల ఆరాధ్యదైవం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రావణమాసం పురస్కరించుకుని శ్రావణలక్ష్మి పూజలు శుక్రవారం ఘనంగా ప్రారంభమ య్యాయి. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పూజలను ప్రారంభించారు. ముందుగా గణపతి పూజ నిర్వహించి, అనంతరం అమ్మవారికి విశేష పూజలు జరిపారు. వేదమంత్రాల మధ్య, నాదస్వర సుస్వరాలతో ఉదయం 8:20 గంటలకు శ్రావణలక్ష్మి పూజలు ప్రారంభమయ్యాయి. ఈ పూజలో ఉభయదాతలు రెండు బ్యాచ్లుగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. పూజలో స్వయంగా పాల్గొన్న భక్తులకు ప్రసాదం అందజేశారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె. శోభారాణి తెలిపిన వివరాల ప్రకారం, శ్రావణ మాసం సందర్భంగా నెలరోజులు జరిగే పూజలకు అవసరమైన పూజా సామగ్రిని దేవస్థానమే సమకూరుస్తుందన్నారు. ప్రత్యేక పూజలో పాల్గొనదలచిన భక్తులు రూ.400 చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. పూజ అనంతరం ఉభయదాతలకు శోభావస్త్రంగా కండువా, జాకెట్ ముక్క, రాగి స్టాండు యంత్రం, పులిహోర, చక్కెరపొంగలి ప్రసాదం అందజేస్తామన్నారు. ప్రతి గురువారం, శుక్రవారాల్లో రెండు బ్యాచ్లుగా, ఉదయం 8 నుంచి 9 గంటల వరకు పూజలు జరుగుతాయన్నారు. ముత్యాల చీరలో కన్యకాపరమేశ్వరి డాబాగార్డెన్స్: కురుపాం మార్కెట్ సమీపంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో శుక్రవారం శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారు ముత్యాల చీర అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున 5 గంటలకు అమ్మవారి మూలవిరాట్కు శుద్ధజలం, పాలు, పెరుగు, తేనె, గంధం, పసుపు, కుంకుమ, వివిధ రకాల పండ్ల రసాలు, అలాగే 108 ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి ముత్యాల చీరతో అలంకరించి, 108 బంగారు పుష్పాలతో ప్రత్యేక నివేదన సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు సామూహిక లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఆ తర్వాత ఆస్థాన పురోహితులు ఆర్బీబీ కుమారశర్మ నేతృత్వంలో 250 మంది మహిళలతో సామూహిక కుంకుమ పూజలు జరిగాయి. కార్యక్రమంలో ఆలయ సంఘ అధ్యక్షుడు ఆరిశెట్టి దినకర్, కార్యదర్శి పెనుగొండ కామరాజు, శ్రావణమాస ఉత్సవ కార్యనిర్వాహక సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. సింహవల్లీ తాయారుకు లక్ష కుంకుమార్చన సింహాచలం: శ్రావణ శుక్రవారం సందర్భంగా సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలోని సింహవల్లీ తాయారు అమ్మవారికి లక్ష కుంకుమార్చన పూజను వైభవంగా నిర్వహించారు. సింహవల్లీ తాయారు, చతుర్బుజ తాయారు అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై అధిష్టింపజేసి, ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు లక్ష నామాలతో అమ్మవార్లకు కుంకుమ పూజ చేశారు. ఈ పూజలో పాల్గొన్న భక్తులకు శేషవస్త్రాలు, కుంకుమ ప్రసాదంగా అందజేశారు. అలాగే, సాయంత్రం అమ్మవారికి ఆలయ బేడా మండపంలో తిరువీధి సేవను వైభవంగా నిర్వహించారు. అనంతరం సహస్రనామార్చన పూజ చేపట్టారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు, ఇతర అర్చకులు, పారాయణదారులు ఈ పూజలను నిర్వహించారు. ఆలయ ఏఈవో తిరుమలేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ఉద్యోగే దొంగ
● భారీ చోరీ కేసును ఛేదించిన ద్వారకా పోలీసులు ● రూ.1,29,48,154 విలువైన చోరీ సొత్తు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన సీపీ శంఖబ్రత బాగ్చి తాటిచెట్లపాలెం: ఒక డైమండ్స్ షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పని చేస్తున్న ఉద్యోగి.. యజమాని నమ్మకాన్ని దుర్వినియోగం చేసి ఆభరణాలను దొంగిలించాడు. ద్వారకా పోలీసులు ఈ భారీ చోరీ కేసును ఛేదించి.. ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి రూ.1,29,48,154 విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి శుక్రవారం తన కార్యాలయంలో మీడియాకు వెల్లడించిన వివరాలివి. హైదరాబాద్కు చెందిన బొంగు వంశీ..అక్కడి క్రిష్ డైమండ్స్ షోరూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. ఇదే షోరూంలో ఆరు నెలల కిందట హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ముదపాక జేజి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా చేరాడు. షోరూంలో తయారైన వివిధ రకాల డైమండ్ మోడళ్లను విశాఖ తీసుకొచ్చి.. ఇక్కడి దుకాణ యజమానులకు వాటిని చూపించి ఆర్డర్లు తీసుకువెళ్తుంటారు. ఈ క్రమంలో ఈ నెల 2న క్రిష్ డైమండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ అనూప్ అగర్వాల్ 883.814 గ్రాముల 18 క్యారెట్స్ బంగారం, డైమండ్ ఆభరణాలు, 22.881 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం, డైమండ్స్ ఆభరణాలు(మొత్తం 900.692 గ్రాములు, వీటి విలువ రూ.1,29,48,154.62) ఇచ్చి.. బొంగు వంశీని, ముదపాక జేజిని విశాఖ పంపించారు. వీరు ఈ నెల 2న హైదరాబాద్లో బయలుదేరి 3న విశాఖ చేరుకున్నారు. ఎప్పటిలాగే లలితా జ్యువెలరీ ఎదురుగా ఉన్న సాయి శ్రీనివాస రెసిడెన్సీలో దిగారు. అక్కడి నుంచి నగరంలోని పలు షోరూంలలో మోడల్స్ చూపించి 3వ తేదీ రాత్రి 8.50కు హోటల్ రూమ్కు చేరుకున్నారు. ఆభరణాలతో ఉన్న బ్యాగ్ను కబోర్డులో పెట్టి నిద్రించారు. 4వ తేదీ తెల్లవారుజాము 4.30 సమయంలో వంశీని లేపి వాకింగ్కు వెళ్తున్నట్లు జేజి చెప్పగా.. బయట నుంచి గదికి తాళం వేసి వెళ్లి రమ్మని వంశీ అన్నాడు. తర్వాత నిద్రలేచి చూసేసరికి జేజి కనిపించలేదు. ఫోన్ స్విచాఫ్ వచ్చింది. కబోర్డు పరిశీలించగా అందులో ఉన్న ఆభరణాల బ్యాగు, జేజి వెంట తెచ్చుకున్న లగేజీ బ్యాగు కూడా కనిపించలేదు. ఈ విషయాన్ని వెంటనే హైదరాబాద్లోని షోరూం హెచ్ఆర్ సూరజ్కుమార్కు తెలిపాడు. హోటల్ సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలింగా ఉదయం 4.30కు వాకింగ్కు వెళ్లిన జేజి మళ్లీ 5.47కు తిరిగి వచ్చి.. రెండు బ్యాగులను తీసుకెళ్లినట్లు తేలింది. ఈ ఘటనపై ద్వారకా పోలీస్స్టేషన్లో వంశీ ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి కేసు దర్యాప్తు చేస్తున్న ద్వారకా పోలీసులు.. మొబైల్ సిగ్నల్స్ ద్వారా శుక్రవారం రైల్వేస్టేషన్ పరిసరాల్లో జేజి ఉన్నట్లు గుర్తించారు. అక్కడ అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను అనుసరించారు. పోలీసులను చూసిన వారు పారిపోయేందుకు ప్రయత్నించగా.. వెంబండించి అదుపులోకి తీసుకున్నారు. మధ్యవర్తుల సమక్షంలో వారి బ్యాగును పరిశీలించి, విచారించగా.. వారు ముదపాక జేజి, ఆకుల సత్యనారాయణగా తేలింది. బ్యాగ్లో జేజి దొంగలించిన ఆభరణాలు ఉన్నట్లు గుర్తించి..అదుపులోకి తీసుకున్నారు. ఆకుల సత్యానారయణ జేజికి పార్టనర్. జేజి దొంగలించిన ఆభరణాలను ఆయన వద్దే ఉంచాడు. దీనిపై ఇంకా విచారణ జరుగుతున్నట్లు సీపీ తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించిన ద్వారకా సీఐ(ఇన్చార్జి) సీహెచ్ ఉమాకాంత్, సీఐ డీవీ రమణ, సబ్ ఇన్స్పెక్టర్లు జె.ధర్మేంద్ర, అసిరి తాత, హెడ్ కానిస్టేబుళ్లు వెంకటరమణ, కె.టి.వి.రమే్ష్ష, కానిస్టేబుళ్లు ఎం.నాగరాజు, ఎస్.రమేష్ష్లను కమిషనర్ అభినందించారు. -
కోరాపుట్ వరకే కిరండూల్ రైళ్లు
తాటిచెట్లపాలెం: విశాఖపట్నం–కిరండూల్–విశాఖపట్నం మధ్య నడిచే ప్రయాణికుల రైళ్లు భద్రతా పనుల నిమిత్తం కోరాపుట్ వరకు మాత్రమే రాకపోకలు సాగిస్తాయని వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. ఈ నెల 26(శనివారం), 27వ తేదీల్లో విశాఖపట్నం–కిరండూల్ (18515) నైట్ ఎక్స్ప్రెస్ కోరాపుట్ వరకు మాత్రమే నడుస్తుంది. ఈ నెల 27, 28వ తేదీల్లో కిరండూల్–విశాఖపట్నం(18516) నైట్ ఎక్స్ప్రెస్ కోరాపుట్ నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటుంది. ● ఈ నెల 27, 28వ తేదీల్లో విశాఖపట్నం–కిరండూల్ (58501) పాసింజర్ కోరాపుట్ స్టేషన్ వరకు మాత్రమే నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో కిరండూల్–విశాఖపట్నం(58502) పాసింజర్ కోరాపుట్ నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ మార్పులు గమనించాలని అధికారులు సూచించారు. -
ఛాయ తగ్గని 'దేశవాళీ'
పసుపు సాగులో ఏజెన్సీ వాతావరణానికి అనువైన ఆధునిక వంగడాలు అందుబాటులో ఉన్నప్పటికీ గిరి రైతులు దేశవాళీ రకం వైపే మొగ్గు చూపుతున్నారు. అధిక దిగుబడినిచ్చే రోమా రకాన్ని శాస్త్రవేత్తలు పరిచయం చేసినా ఆసక్తి చూపడం లేదు. మెట్ట, పోడు భూముల్లో దేశవాళీ రకం సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. చింతపల్లి: అల్లూరి జిల్లా ఏజెన్సీలో గిరి రైతులకు ప్రధాన ఆదాయ వనరుల్లో కాఫీ మాదిరిగానే పసుపు సాగు కీలకం. ఏటా సాగు చేస్తున్న పంటలో కొంతమేర పసుపు దుంపను భద్రపరిచి విత్తనంగా వినియోగించడం ఆనవాయితీగా వస్తోంది. దీనివల్ల విత్తన ఖర్చు తగ్గుతోందని గిరి రైతులు చెబుతున్నారు. » పాడేరు డివిజన్ పరిధిలో సుమారు 24 వేల హెక్టార్లలో పసుపు పంటను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు పైరుకు అనుకూలంగా ఉన్నప్పటికీ తెగుళ్ల సోకే అవకాశం కూడా లేకపోలేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని ఉద్యానవన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో సాగు చేపట్టారు. పైరు ఎదుగదల బాగానే ఉంది. అయితే ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. » దేశవాళీ రకాలను కూడా ఏడాది పంటగా సాగు చేయడం వల్ల మంచి దిగుబడులు ఆదాయం పొందవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అలాకాకుండా రెండేళ్ల పంటగా సాగు చేయడం వల్ల రెండో ఏడాది గణనీయంగా దిగుబడులు తగ్గిపోతున్నాయి. పెరుగుతున్న తేమశాతంతో నష్టం వర్షాలు కురుస్తున్నందున గాలిలో తేమశాతం ఎక్కువగా ఉంటోంది. ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆకుమచ్చ, తాటాకు తెగులు సోకే ప్రమాదం ఉందని ఉద్యానవన శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సకాలంలో నివారణ చర్యలు చేపట్టకుంటే దిగుబడి నష్టపోయే పరిస్థితులు ఉంటాయని వారు హెచ్చరిస్తున్నారు. ‘రోమా’ అనుకూలమైనా.. ఏజెన్సీలో పసుపు సాగుకు ‘రోమా’ రకం అత్యంత అనుకూలమని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆదివాసీలు దేశవాళీ రకం పసుపును రెండేళ్ల పంటగా సాగుచేస్తున్నారు. అయితే రోమా రకం పసుపు కేవలం పది నెలల్లో ఎకరానికి దేశవాళీ రకం కన్నా ఎక్కువ దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రకం పసుపులో కుర్కుమిన్ అధికంగా ఉన్నందున అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని గతంలో రైతులకు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఎస్టీ ఉప ప్రణాళిక నిధులతో 250 మంది రైతులకు 20 కిలోల చొప్పున పంపిణీ చేశారు. రైతు స్థాయిలో విత్తనం ఉత్పత్తి చేసుకునేలా సహకారం అందించినా ఆశించిన ఫలితాలు రాలేదు. దేశవాళీ రకం కన్నా ఈ రకం పైరులో 25 నుంచి 35 శాతం దిగుబడి ఎక్కువగా ఉంటున్నా ఈ రకం సాగుపై ఆసక్తి కనబరచడం లేదు. మచ్చ తెగుళ్ల లక్షణాలివీ.. » మొక్కల ఆకులపై చిన్న చిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడి అవి క్రమేపీ గోధుమ రంగులోకి మారి ఎండిపోతాయి. ఈ తెగులు కింద ఆకుల నుంచి పైకి వ్యాప్తి చెందుతుంది. దీనికి ఆకుమచ్చ తెగులుగా గుర్తించి వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. నవంబర్– డిసెంబర్ నెలలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీని విషయంలో రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. » ఆకులపై అండాకారంలో పెద్ద మచ్చలు కనిపిస్తే తాటాకు మచ్చ తెగులుగా గుర్తించాలి. ఇవి ముదురు గోధుమ వర్ణంలో ఉంటాయి. ఆకు కాడపై మచ్చలు ఏర్పడటంతో ఆకు కిందకు వాలిపోతుంది. ఈదురు గాలులతో కూడిన వర్షాలు, గాలిలో తక్కువ తేమ, ఉష్ణోగ్రతలు ఈ తెగులు వ్యాప్తికి దోహదపడతాయి. సెపె్టంబర్ నుంచి ఈ తెగులు ప్రభావం పైరుపై కనిపిస్తుందని శాసŠత్రవేత్తలు సూచిస్తున్నారు. అప్రమత్తత అవసరం దేశవాళీ రకం పసుపు పైరుపై మచ్చలు కనిపించిన వెంటనే రైతులు అప్రమత్తం కావాలి. ప్రారంభంలోనే సస్యరక్షణ చేపడితే వ్యాప్తిని వెంటనే నివారించవచ్చు. ఒక శాతం బోర్డో మిశ్రమం/ ఒక లీటరు నీటికి ఒక మిల్లీలీటర్ ప్రోపికోనజోల్ లేదా 2.5 గ్రాముల మాంకోజెబ్కు 0.5 ఎంఎల్ సబ్బునీరు కలిపి 15 రోజుల వ్యవధిలో సెపె్టంబరు నుంచి 3 నుంచి 4 సార్లు పిచికారి చేయాలి. పైరు విత్తుకునే సమయంలో జాగ్రత్తలు పాటించడం వల్ల కూడా నివారించవచ్చు. ఆరోగ్యకరమైన విత్తనాన్ని ఎంచుకుని విత్తనశుద్ధి చేయడం వల్ల తెగుళ్లను నివారించవచ్చు. – శెట్టి బిందు, ప్రధాన శాస్త్రవేత్త, ఉద్యానవన పరిశోధన స్థానం, చింతపల్లి -
59 చోరీ కేసుల్లో 73 మంది అరెస్ట్
● రూ.1.06 ఓట్లు చోరీ సొత్తు స్వాధీనం ● రికవరీ మేళాలో బాధితులకు అందజేసిన సీపీ విశాఖ సిటీ: నగరంలో నేర నియంత్రణకు, నిందితుల పట్టివేతకు చేపడుతున్న చర్యలు సత్ఫలితాన్నిస్తున్నాయని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పేర్కొన్నారు. గురువారం పోలీస్ సమావేశ మందిరంలో రికవరీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జూన్ నెలలో నగరంలో 84 చోరీ కేసులు నమోదైనట్లు తెలిపారు. వీటిలో 59 కేసులను ఛేదించి, 73 మంది నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. వారి నుంచి రూ.1,06,03,665 చోరీ చొత్తును రికవరీ చేసినట్లు వెల్లడించారు. ఇందులో 1.2 కేజీల బంగారం, 427.8 గ్రాముల వెండి, రూ.5,67,300 నగదు, 3 బైక్లు, 6 ఆటోలు, 3 ల్యాప్టాప్లు, 2 యాపిల్ ఐప్యాడ్స్, రూ.93 వేలు విలువ చేసే కాపర్ వైర్ కేబుల్స్, 430 మొబైల్ ఫోన్లు ఉన్నట్లు వివరించారు. నేర నియంత్రణతో పాటు నేరస్తులను గుర్తించేందుకు నగరంలో విస్తృతంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జూన్ నెలలో 440 కెమెరాలు పెట్టామన్నారు. నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక పెట్రోలింగ్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రామ మందిరం వివాదంలో ముగ్గురిపై కేసు బీచ్ రోడ్డులో రామ మందిరం సెట్ వివాదంలో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సీతారాముల కల్యాణానికి భద్రాచలం దేవస్థానం నుంచి పూజారులను తీసుకువస్తామని తప్పుడు ప్రకటనలు చేశారన్న విషయంపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. నిర్వాహకులు మాత్రం తాము దేవస్థానం నుంచి పూజారులను తెస్తున్నట్లు చెప్పలేదని, భద్రాచలం నుంచి పూజారులను మాత్రమే తీసుకొస్తామని చెప్పినట్లు వివరించారు. దీనిపై విచారణ చేయగా భద్రాచలం దేవస్థానం నుంచి తీసుకొస్తామనే ప్రకటించిన విషయం గుర్తించినట్లు వెల్లడించారు. దీంతో వారిపై కేసులు నమోదు చేశామన్నారు. ఇతరత్రా విషయాలపై కూడా దర్యాప్తు జరుగుతోందన్నారు. అనంతరం సీపీ చేతుల మీదుగా బాధితులకు రికవరీ చేసిన సొత్తును అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ(క్రైమ్) లతా మాధురి పాల్గొన్నారు. -
ఊపందుకున్న ఏరువాక పనులు
జి.మాడుగుల: అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఏరువాక పనులు ఊపందుకున్నాయి. 17 పంచాయతీలు, 217 రెవెన్యూ గ్రామాలు, 11,245 రైతులు ఉన్నారు. మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ఈ ఖరీఫ్ సీజన్లో 8,743 హెక్టార్లుల్లో వరి పంట వేయటానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంతో గ్రామాల్లో దుక్కిటెడ్లు, యంత్రాలతో దుక్కు పనులు చేపట్టి వరి పంట సాగుకు పొలాలను సిద్ధం చేస్తున్నారు. గెడ్డలు, వాగులు, చెక్డ్యామ్లు, చెరువులు, పంటకాల్వలు కింద ఆయకట్టు భూముల్లో వరి నాట్లు వేసే పనులు గిరిజన రైతులు ముమ్మరం చేశారు. విస్తారంగా వర్షాలు కురుస్తుడడంతో సాగునీటి కష్టాలు ఉండవని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.వరి ఇతర పంటలు వేసుకోవటానికి వ్యవసాయ అధికార, సిబ్బంది సలహాలు, సూచనలు అందస్తున్నారు. దీంతో ఈ సీజన్లో అధిక పంట దిగుబడులు సాధించటానికి రైతులు దృష్టి సారించారు. మండలంలో ఆదివాసీ రైతులకు 90శాతం సబ్సీడీపై వరి విత్తనాలు, పచ్చిరొట్ట ఎరువులు(జీలుగు) పంపిణీ చేశారు. మండలంలో 100శాతం సబ్సీడీపై 315రాగి(చోళ్లు)విత్తనాల కిట్లును గిరిజన రైతులకు అందజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరితో పాటు చిరుధాన్యాలు రాగులు, కొర్రలు, సామలు పంటలకు అనుకూలమని వ్యవసాయశాఖ అధికారి, సిబ్బంది రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. -
పాడేరు ఎమ్మెల్యేకు ఘన సన్మానం
జి.మాడుగుల: వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో నూతనంగా రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీగా పాంగి అంద్రయ్యను పార్టీ అధిష్టానం నియమించింది. దీంతో పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజును గురువారం ఆయన మర్యాదపూర్వకంగా కలిసి శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ పార్టీని నమ్మకొన్న వారిని గుర్తించి పార్టీ పదవులేకారు ప్రభుత్వం వస్తే నామినేటెడ్ పదవుల కూడా వరిస్తాయన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులు రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ అభివృద్దికి కృషి చేయాలని, అలాగే మళ్లీ జగన్నన్న ముఖ్యమంత్రిగా చేయటానికి అందురూ సమిష్టిగా శ్రమించాలని ఆయన అన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు నుర్మని మత్స్యకొండంనాయుడు, క్రిస్టియన్ మైనార్టీ సెల్ నియోజకవర్గం అధ్యక్షుడు కృష్ణారావు, యూత్ అధ్యక్షుడు ప్రశాంత్, వైఎస్సార్సీపీ నాయకులు సోమలింగం, బంగార్రాజు, బాలన్న, రాధ తదితరలు పాల్గొన్నారు. -
సాష్టాంగం
వీరమల్లుకునిబంధనలను పాతరేసిన ఏయూ అధికారులు విశాఖ సిటీ: ‘హరి హర వీరమల్లు’కు ఆంధ్రా యూనివర్సిటీ ఉన్నతాధికారులు సాష్టాంగపడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమా ఫంక్షన్ కోసం నిబంధనలకు పాతరేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల మైదానాలు, ప్రాంగణాలు ప్రైవేటు సభలు, సమావేశాలకు కేటాయించకూడదన్న ప్రభుత్వ ఉత్తర్వులను బుట్టదాఖలు చేశారు. నెల కిందట బుక్ చేసుకున్న ఒక విద్యా సంస్థ వేడుకలను సైతం రద్దు చేసి మరీ ఉప ముఖ్యమంత్రి సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు అనుమతులిచ్చేశారు. ఇపుడు ఈ విషయం బయటకు పొక్కితే ఇబ్బందులు వస్తాయని వర్సిటీ ఉపకులపతి జి.పి.రాజశేఖర్ విభాగాధిపతులతో రహస్య సమావేశం నిర్వహించడం కొసమెరుపు. ఒకవైపు హాస్టళ్లలో పురుగుల అన్నం తినలేక, సౌకర్యాలు లేక విద్యార్థులు ఆందోళన బాట పడితే, వాటిని పరిష్కరించని ఏయూ పాలకులు.. రాజకీయ, సినీ పెద్దల సేవలో తరించడం వివాదాస్పదమవుతోంది. ఏయూలో రాజకీయ క్రీనీడ ఆంధ్ర విశ్వవిద్యాలయం కూటమి రాజకీయ క్రీనీడకు వేదికగా మారిపోయింది. కూటమి ప్రజాప్రతినిధుల జన్మదిన వేడుకలకు, ఆ పార్టీల కార్యక్రమాలకు కేంద్రంగా మార్చేశారు. ఎప్పటికప్పుడు కూటమి నేతల కటౌట్లు, బ్యానర్లతో యూనివర్సిటీని కప్పేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏయూలో తీసుకున్న నిర్ణయాలపై బురద జల్లే ప్రయత్నం చేశారు. వాటిపై లోతైన విచారణ చేపట్టాలని నిర్ణయిస్తూ ప్రత్యేక కమిటీని సైతం ఏర్పాటు చేశారు. నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఒక్క తప్పును కూడా నిరూపించలేకపోయారు. దీంతో ఆ కమిటీ నివేదికను పక్కనపెట్టేశారు. తాజాగా కూటమి పెద్దల సూచనలతో అధికారులు వివాదాస్పద నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతిథి ఉపాధ్యాయుల విషయంలో గతంలో ఎన్నడూ లేని విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఏళ్ల తరబడి గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న వారిని రోడ్డున పడేయాలని చూస్తున్నారు. వారి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ఏయూ అధికారులపై కూటమి నేతలు ఒత్తిడి చేస్తున్నట్లు వర్సిటీలో చర్చ జరుగుతోంది. ఆదిత్య కాలేజ్ వేడుకను రద్దు చేసి మరీ.. వాస్తవానికి ఆదిత్య కాలేజ్ 1,500 మంది ఉత్తరాంధ్ర విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో అచీవర్స్ డే నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం నెల రోజుల కిందటే ఏయూ కన్వెన్షన్ సెంటర్ను బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ‘హరి హర వీరమల్లు’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కు అదే వేదికను అడగడంతో, ఏయూ అధికారులు వెంటనే ఆదిత్య కాలేజ్ బుకింగ్ను రద్దు చేసేశారు. కేవలం రెండు రోజుల ముందే వారికి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఆదిత్య కాలేజ్ తమ వేడుకలను రద్దు చేసుకోవాల్సి వచ్చినట్లు సమాచారం. ఒక కాలేజీ కార్యక్రమాన్ని రద్దు చేసి మరీ సినిమా వేడుకకు ఏయూ కన్వెన్షన్ సెంటర్ను కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ జీవోను కాదని సినిమా ఈవెంట్కు అనుమతి బయటకు పొక్కకూడదని వీసీ రహస్య సమావేశం కూటమి ప్రభుత్వంలో దిగజారుతున్న వర్సిటీ ప్రతిష్టనిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ విద్యా సంస్థల ఆట స్థలాలు, ప్రాంగణాలను అకడమిక్ కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 29వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ప్రభుత్వ విద్యా సంస్థల ప్రాంగణాల్లో రాజకీయ, సినిమా, ఇతర సభలు, సమావేశాల నిర్వహణకు లీజుకిచ్చే అవకాశం లేదు. కానీ ఏయూ ఉన్నతాధికారులు మాత్రం ఈ ఉత్తర్వులను తుంగలో తొక్కారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణకు నిబంధనలకు విరుద్ధంగా ఏయూ కన్వెన్షన్ సెంటర్ను కేటాయించారు. ఏయూ వీసీ రహస్య సమావేశం? ఏయూ హాస్టళ్లలో అధ్వాన పరిస్థితులపై విద్యార్థులు రెండు రోజుల పాటు ఆందోళన చేశారు. పురుగుల అన్నం పెడుతున్నారని, హాస్టళ్లలో కనీస సౌకర్యాలు కల్పించడం లేదని నిరసన తెలిపారు. ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నారని, ఏయూ అధికారులు అనుసరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా వీసీ కార్యాలయాన్ని ముట్టడించారు. విద్యార్థుల సమస్యలను పట్టించుకోని ఏయూ అధికారులు.. సినిమా ఫంక్షన్ వ్యవహారంపై ప్రత్యేకంగా భేటీ అవడం చర్చనీయాంశమవుతోంది. ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా సినిమా వేడుకకు కేటాయించిన విషయం బయటకు వస్తే.. తలనొప్పులు తప్పవన్న ఆందోళన వారిలో మొదలైంది. దీనిపై ఏయూ వీసీ రాజశేఖర్ విభాగాధిపతులతో రహస్యంగా సమావేశం నిర్వహించినట్లు సమాచారం. సినిమా ఫంక్షన్కు కన్వెన్షన్ సెంటర్ను కేటాయించడంపై కోర్టుకు వెళితే ఇబ్బందులు తప్పవని ఆ సమావేశంలో ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నిబంధనల విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తగా ఉండాలని, సినిమా ఫంక్షన్ వ్యవహారంపై ఎవరూ బయట చర్చించవద్దని సూచించినట్లు ఏయూలో గుసగుసలు వినిపిస్తున్నాయి. -
ప్రాణాలకు తెగించైనా అడ్డుకుంటాం
●హైడ్రో పవర్ ప్రాజెక్టుతో మన్యవాసుల జీవితాల్లో చీకట్లు ● గిరిజనుల భూముల జోలికి వస్తే తరిమికొడతాం ● అదాని కోసమే ఏజెన్సీ గ్రామాల్లో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన ● గిరిజనులను మభ్యపెట్టి భూములను దోచుకోవాలని కుట్రలు ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శ ● చింతలపూడిలో హైడ్రో పవర్ ప్లాంట్ వ్యతిరేక సదస్సు దేవరాపల్లి: గిరిజనుల జీవితాలను చీకటిమయం చేసే అదాని హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణ పనులను స్థానిక ప్రజలు, గిరిజనులతో కలిసి ప్రాణాలకు తెగించైనా అడ్డుకొని తీరుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీలో హైడ్రో పవర్ ప్లాంట్కు వ్యతిరేకంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న అధ్యక్షతన గురువారం బహిరంగ సదస్సు జరిగింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీలో, అల్లూరి జిల్లా పెదకోట సమీపంలో దొడ్డి దారుల్లో అదాని పవర్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. తరతరాలుగా జీవిస్తున్న గిరిజనులను ఈ ప్రాంతం నుంచి వెళ్లగొట్టేందుకు పెద్ద కుట్ర జరుగుతోందన్నారు. ప్రజల మేలు కోసమే ప్రాజెక్టులు నిర్మిస్తే చట్టం ప్రకారం గ్రామ సభల ఆమోదంతోనే పనులు చేపట్టాలని, ఇలా అడ్డదారుల్లో ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. మోదీ దత్తపుత్రుడు అదాని ఎక్కడ అడుగు పెడితే అక్కడ భస్మీపటలం అవుతుందన్నారు. గిరిజనుల భూములను అదానీకి దోచి పెట్టేందుకే ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మోదీ సూచనతో గిరిజన ప్రాంతాల్లో పర్యటించారని ఆరోపించారు. నెల రోజుల్లో డోలీ మోతలు లేకుండా చేస్తానని చెప్పిన డిప్యూటీ సీఎం 13 నెలలు పూర్తయినా పట్టించుకోక పోవడం దారుణమన్నారు. జీవో నెంబర్ 51ను తక్షణమే రద్దు చేయాలి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె.లోకనాథం మాట్లాడుతూ గిరిజనుల జీవితాలను నాశనం చేసే పవర్ ప్రాజెక్టుల అనుమతులను, జీవో నెంబర్ 51ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రెండు ప్రాజెక్టులకు నీరు అందించే జీవనదులు రైవాడ జలాశయం క్యాచ్మెట్ ఏరియాలో ఉన్నాయని, దీంతో రైవాడ ఆయకట్టు భూములు బీడులుగా మారడంతో పాటు విశాఖ నగర వాసులకు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం చింతలపూడి పంచాయతీ, మారిక గ్రామాల మధ్య హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని రద్దు చేయాలని, జీవో నెంబర్ 51ను ఉపసంహరించాలని, భూములు సాగు చేస్తున్న గిరిజనులకు పట్టాలివ్వాలని సీపీఎం మండల కార్యదర్శి బి.టి.దొర తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కిల్లో సురేంద్ర, సీపీఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, పాడేరు జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స, విజయనగరం జిల్లా కార్యదర్శి టి.సూర్యనారాయణ, అనంతగిరి జెడ్పీటీసీ దీసిరి గంగరాజు, చింతల సర్పంచ్ దొమ్మంగి బోడెమ్మ, తామరబ్బ సర్పంచ్ టోకురి రామకృష్ణ, గుమ్మడపు మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
వాడనర్సాపురంలో విషాద ఛాయలు
నాగార్జునసాగర్లో వేటకు వలస వెళ్లి మత్స్యకారుడు మృతి రాంబిల్లి (అచ్యుతాపురం): రాంబిల్లి మండలంలోని వాడనర్సాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన మత్స్యకారుడు చింతకాయల జగన్నాథం (42) బతుకు దెరువు కోసం తెలంగాణలోని నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్కు సమీపంలో చేపల వేట కోసం వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఆయా గ్రామస్తుల కథనం మేరకు.. సముద్రంలో మత్స్య సంపద తగ్గిపోవడంతో వాడనర్సాపురానికి చెందిన 50 కుటుంబాల వారు నాగార్జునసాగర్ వద్ద చేపల వేట కోసం వలస వెళ్తున్నారు. కొంతమంది అక్కడ నివాసం ఉండిపోగా, మరికొంత మంది ఏడాదికొకసారి కాంట్రాక్టు మీద, తాత్కాలిక నివాసం కింద వెళ్తున్నారు. గ్రామానికి చెందిన జగన్నాథం బుధవారం ఉదయం నాగార్జునసాగర్ పరిధిలో లంబాపురం కృష్ణానదిలో తన తోటి మత్స్యకారులతో కలిసి వేటకు వెళ్లారు. నదిలో చేపల కోసం వల వేయగా, అడుగున్న ఉన్న రాయికి చిక్కుకుంది. ఎంతకూ వల రాకపోవడంతో నీటిలో దిగిన జగన్నాథం బయటకు రాలేదు. దీంతో ఇతర మత్స్యకారులు నదిలోకి దిగి వెతకగా అతడు ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు గుర్తించారు. దీంతో వాడనర్సాపురానికి చెందిన మత్స్యకారులు లంబాపురం వెళ్లి అక్కడి శవపంచానామా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శుక్రవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బతుకు దెరువు కోసం వలస వెళ్లిన మత్స్యకారుని మరణంతో అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
గ్రామస్థాయి కమిటీలు అంకితభావంతో పనిచేయాలి
అరకులోయ టౌన్(అనంతగిరి): గ్రామస్థాయిలో గ్రామ కమిటీలు అంకితభావంతో బాగా పనిచేయాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మండలంలోని గుమ్మ, పెద్దబిడ్డ, లుంగపర్తి పంచాయతీల్లో గురువారం ఆయన పర్యటించారు. ఆయా గ్రామాల్లోని వైఎస్సార్సీపీ గ్రామ కమిటీల ఎన్నికను మండల పార్టీ అధ్యక్షుడు కొర్రా సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యే మత్స్యలింగం కమిటీ ఎన్నిక ప్రక్రియను సమీక్షించారు. నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. గుమ్మ, పెద్దబిడ్డ, లుంగపర్తి గ్రామ కమిటీల అధ్యక్షులుగా జాగరపు వీరన్న, శిరగం గంగునాయుడు, పుట్టబోయిన పండన్నలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ గ్రామస్థాయిలో కమిటీలు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. వైఎస్సార్సీపీ మరింత బలోపేతానికి కృషి చేయాలన్నారు. పార్టీలో నేతలు, కార్యకర్తలు కమిటీ సభ్యులు ఏకతాటిపై వచ్చి రానున్న పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎంపీపీ శెట్టి నీలవేణి, మాజీ జెడ్పీటీసీ దూరు గంగన్నదొర, ఎస్టీ సెల్ అరకు నియోజకవర్గ అధ్యక్షుడు రేగబోయిన స్వామి, పార్టీ ఉపాధ్యక్షుడు పాడి కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి మధుసూదన్, లక్ష్మణరావు, సర్పంచులు అప్పారావు, సన్యాసిరావు, రాములమ్మ, పెంటమ్మ, ఎంపీటీసీలు జయశ్రీ, మిథుల, నాయకులు లక్ష్మణ్, శ్రీను, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం -
విస్తారంగా వర్షాలు
● లోతట్టు ప్రాంతాలు జలమయం ● స్తంభించిన జన జీవనం సాక్షి,పాడేరు: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏజెన్సీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.గురువారం ఉదయం నుంచి పాడేరు,పెదబయలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మండలంలోని గుత్తులపుట్టు వారపుసంతల్లో వ్యాపారులు, గిరిజనులు ఇబ్బందులు పడ్డారు. గ్రామాలకు నిత్యావసరాలు తరలించేందుకు సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రధాన గెడ్డలు,వాగుల్లో వరద ఉధృతి నెలకొంది. సాగు భూముల్లో వర్షం నీరు చేరడంతో చెరువులను తలపించాయి. గిరి రైతులు ఉత్సాహంగా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. సీలేరు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు సీలేరు పరిసర ప్రాంతంలో గురువారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. సీలేరు, ధారకొండ ధారాలమ్మ తల్లి ఘాట్రోడ్డు దెబ్బతినడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఇప్పటికే ఘాట్రోడ్డు గోతులమయంగా మారింది. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో మారుమూల ప్రాంతాల గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, గెడ్డలు దాటేందుకు సాహసించవద్దని ఎస్ఐ రవీంద్ర సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే తమకు తెలియజేయాలని ఆయన కోరారు. ముంచంగిపుట్టులో ముసురు వాతావరణం. ముంచంగిపుట్టు: మండలంలో ముసురు వాతావరణం నెలకొంది.గురువారం ఉదయం నుంచి ఏకధాటిగా కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది.ముంచంగిపుట్టు, పెదబయలు, కుమడ, జోలాపుట్టు, డుడుమ రహదారులు చిత్తడిగా మారాయి. వర్షపు నీటికి కొన్నిచోట్ల రోడ్లపై మట్టి నిలిచిపోయింది. వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. మారుమూల రంగబయలు, లక్ష్మీపురం, బుంగాపుట్టు, భూసిపుట్టు పంచాయితీల్లో వాగులు, గెడ్డలు వరదనీటితో ఉధృతంగా ప్రవహించాయి. మత్స్యగెడ్డలో వరదనీరు భారీగా చేరింది. జి.మాడుగుల: మండలంలో గురువారం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బొయితిలి పంచాయతీ మద్దిగరువు వారపు సంతకు వచ్చిన గిరిజనులు ఇబ్బందులు పడ్డారు. పెదబయలు తదితర మండలాల నుంచి అమ్మకానికి పంట ఉత్పత్తులు తెచ్చిన గిరి రైతులు సమస్యలు ఎదుర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి పలు చోట్ల బురదమయంగా మారింది. మూడు రోజులు భారీ వర్షాలు చింతపల్లి: జిల్లాలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ వ్యవసాయ పరిశోధన స్థానం అసిస్టెట్ డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్, వాతావరణ విబాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. జిల్లాలోని పాడేరు, రంపచోడవరం, చింతూరు డివిజన్లలో ఈ మూడు రోజులపాటు ఒక మోస్తరు నుంచి బారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. గరిష్ట ఉపరితల గాలి గంటకు 40 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువగా వీస్తుందన్నారు. ఈ పరిస్థితుల్లో భారీ ఉరుములు, మెరుపుల ప్రభావం ఉంటుందన్నారు. ముఖ్యంగా వరి, అరటి, కూరగాయ పంటలు సాగు చేసే పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నీరు పోయేలా మార్గం ఏర్పాటుచేసుకోవాలని ఆయన సూచించారు. -
పెరుగుతున్న తాండవ నీటిమట్టం
370.10 అడుగులకు చేరిక నాతవరం (అనకాపల్లి): తాండవ రిజర్వాయరులో నీటిమట్టం క్రమేపీ పెరుగుతుందని ప్రాజక్టు జేఈ శ్యామ్కుమార్ తెలిపారు. గురువారం ఆయన ఇక్కడ నీటిమట్టాన్ని పరిశీలించారు. తాండవ కాలువల మరమ్మతులు, పూడికతీత పనులు వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. గురువారం సాయంత్రానికి రిజర్వాయరులో నీటిమట్టం 370.10 అడుగులకు చేరిందన్నారు. 350 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తుందన్నారు. ప్రమాదస్థాయి నీటిమట్టం 380.0 అడుగులుగా పరిగణిస్తామన్నారు. రెండు జిల్లాల్లోని 52 వేల ఎకరాల్లో ఖరీఫ్ సాగుకు నీరు సరఫరా చేయాలంటే ప్రాజెక్టులోకి మరింత నీరు చేరాలన్నారు. వచ్చే నెల 10 నుంచి 15వ తేదీలోపు ఆయకట్టుకు నీరు విడుదల చేయడానికి ఇటీవల నీటి సంఘాలు తీర్మానించాయన్నారు. ఏజెన్సీలో వర్షాలకు.. కోటవురట్ల (అనకాపల్లి): ఎగువ ఏజెన్సీలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరాహ నదిలోకి కొంచెం కొంచెంగా ప్రవాహం వస్తోంది. పాతరోడ్డు సమీపంలో వరాహ నదిలోకి సర్పానది కలియడంతో ఇక్కడ నీటి ప్రవాహం పెరుగుతోంది. గొట్టివాడ, పందూరు ప్రాంతాలలో ఉధృతి పెరిగే అవకాశం ఉండడంతో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. -
గంజాయి రవాణాకు దూరంగా ఉండండి
గిరిజనులకు చింతూరు ఏఎస్పీ పంకజ్కుమార్ మీనా సూచన మోతుగూడెం: గిరిజనులు గంజాయి సాగు, రవాణాకు దూరంగా ఉండాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని చింతూరు ఏఎస్పీ పంకజ్ కుమార్మీనా హెచ్చరించారు. వై.రామవరం మండలం బొడ్డగండి పంచాయతీ పరిధిలోని పాలగెడ్డ గ్రామాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడారు. ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని గ్రామాల నుంచి గంజాయి సరఫరా, రవాణా చేస్తున్నట్లు కచ్చితమైన సమాచారం ఉందన్నారు. ఎవరైనా గంజాయి సరఫరా చేసిన, రవాణా చేసిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఒకసారి గంజాయి కేసులో ఇరుక్కుంటే వారిపై స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి వారి కదలికలను నిరంతరం తెలుసుకుని, వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. గంజాయి కేసులో ఇరుక్కుంటే గంజాయి వ్యాపారంతో సంపాదించిన ఆస్తులను సైతం సీజ్ చేస్తామన్నారు. గంజాయి అక్రమ రవాణా గురించి సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి వారికి తగిన పారితోషకం అందిస్తామన్నారు. అనంతరం ఏఎస్పీ డొంకరాయి పోలీస్ స్టేషన్ను సందర్శించారు. మావోయిస్టులు, గంజాయి సరఫరా చేసే వారిపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సిబ్బందికి సూచించారు. డొంకరాయి ఎస్ఐ శివకుమార్కు పలు సూచనలు చేశారు. -
పోస్టుమార్టం చేయడంలో జాప్యం
వైద్యుల తీరుతో ఇబ్బందులు పడ్డామని మృతుడి కుమార్తెల ఆవేదన రంపచోడవరం: పోస్టుమార్టం చేయడంలో వైద్యులు జాప్యం చేయడం వల్ల ఇబ్బందులు పడ్డామని బాధితులు ఆరోపించారు. వివరాలిలా ఉన్నాయి. వై.రామవరం మండలం ఎర్రంరెడ్డిపాలెం గ్రామానికి చెందిన రాంబాబు (48)కు ఫిట్స్ రావడంతో అతని కుమార్తెలు ముగ్గురు అతనిని బుధవారం రాత్రి స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్థారించారు. తమ తండ్రి మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు సిద్ధమైనప్పటికీ, ఆస్పత్రి అంబులెన్సు డ్రైవర్ నిరాకరించాడని కుమార్తెలు శాంతికుమారి, దుర్గాభవాని, బాపన్నమ్మ ఆరోపించారు. దీంతో మృతదేహానికి వైద్యులు త్వరగా పోస్టుమార్టం పూర్తి చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ శేషిరెడ్డిని వివరణ కోరగా పోలీసులు నివేదిక ఇవ్వడంలో జాప్యం జరిగిందన్నారు. వచ్చిన వెంటనే పోస్టుమార్టం పూర్తి చేశామని ఆయన పేర్కొన్నారు. -
త్వరితగతిన ఏకలవ్య భవన నిర్మాణం
ముంచంగిపుట్టు: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో డాక్టర్ ఎం.అభిషేక్ గౌడ ఆదేశించారు. మండలంలోని జోలాపుట్టు పంచాయతీ లబ్బూరులో నిర్మిస్తున్న ఏకలవ్య పాఠశాలభవన నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి పనుల పురోగతిపై తెలుసుకున్నారు. ఇప్పటివరకు జరిగిన పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చేనెల15 నాటికి పనులు పూర్తి చేసి, పాఠశాలలను ప్రారంభించాలని ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వేణుగోపాల్కు ఆదేశించారు. ఏకలవ్య పాఠశాల భవనాలు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని పరిసర గ్రామాల ప్రజలు జేసీని కలిసి విన్నవించారు. అనంతరం ఆయన పెదబయలులోని ఏకలవ్య పాఠశాలను తనిఖీ చేశారు.విద్యార్థుల వసతి, కిచెన్, డైనింగ్కు సంబంధించి పలు సూచనలు చేశారు. విద్యార్థులతో మాట్లాడారు. వారి నుంచి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులకు పెట్టిన భోజన నాణ్యతను పరిశీలించారు. గురుకులం ఓఎస్డీ మూర్తి, ఎంపీడీవోలు సూర్యనారాయణమూర్తి, పూర్ణయ్య, తహసీల్దార్లు శంకరరావు, త్రినాథ్, కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్, ఏటీడబ్ల్యూవో స్వర్ణలత, ట్రైబల్ వెల్ఫేర్ ఏఈ రాయుడు, ఎంఈవో కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. పెదబయలు: మండలంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను జేసీ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ గురువారం తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడారు. వారి నుంచి సమస్యలు తెలుసుకున్నారు. క్వార్టర్స్ సదుపాయం కల్పించాలని ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు కోరారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. తరగతి గదులు, కిచెన్, డైనింగ్ హాల్ పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పూర్ణయ్య తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల 15 నాటికి పూర్తికి చర్యలు జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ ఆదేశం -
వయోవృద్ధులకు అక్షరజ్ఞానం అవసరం
ఐటీడీఏ ఇన్చార్జి పీవో, జేసీ అభిషేక్ గౌడపాడేరు: జిల్లాలో వయోజన విద్యాకార్యక్రమంలో శిక్షణ పొందే వారికి కనీస అక్షరజ్ఞానం ఉండాలని జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీవో అభిషేక్ గౌడ సూచించారు. గురువారం ఐటీడీఏలోని తన అధ్యక్షతన చాంబర్లో నిర్వహించిన ఉల్లాస్ అక్షర ఆంధ్రా కార్యక్రమ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడారు.చదవడం, రాయడం, పుస్తకాల నిర్వహణ, ఫోన్లో వచ్చే సమాచారం అర్థం చేసుకోవడం వంటి కనీస పరిజ్ఞానం ఉండాలన్నారు. అక్షర ఆంధ్రా కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. ఉల్లాస్ రెండో దశలో 85,284 మంది నిరక్షరాస్యులను చేర్చడం జరుగుతుందన్నారు. జిల్లా, మండల స్థాయి శిక్షణ తరగతులు వచ్చేనెల 8 వరకు కొనసాగుతాయని, అనంతరం బోధన ప్రారంభం అవుతుందన్నారు. డ్వాక్రా సంఘాల సభ్యులను ముందుగా చేర్చుకోవాలని సూచించారు. బోధనకు వలంటీర్లు వీరిలో చదువుకున్న వారిని వినియోగించాలని ఆదేశించారు. ఒకరు పది మందికి చదువు చెప్పేలా ఏర్పాట్లు చేయాలన్నారు. మండల స్థాయిలో విద్యాశాఖ, పంచాయతీరాజ్, ఐసీడీఎస్ శాఖలు నిత్యం పర్యవేక్షణ జరపాలన్నారు. ప్రతి రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు తరగతులు జరుగుతాయ న్నారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్యా ఉప సంచాలకులు ఎస్.ఎస్. వర్మ, జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావు, డ్వామా పీడీ విద్యా సాగర్, డీఆర్డీఏ పీడీ మురళి, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీభాయ్, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్, వయోజన విద్యా నోడల్ అధికారి గంగన్నదొర, డీపీఆర్వో బాల మాన్ సింగ్ పాల్గొన్నారు. -
రాగి సాగు.. ఇక బాగు
● గిరి రైతుల చెంతకు వేగావతి, ఇంద్రావతి రకాల కొత్త వంగడాలు ● పరిచయం చేయనున్న చింతపల్లి ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు ● క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలు ● సాగుకు అనుకూలించిన ఏజెన్సీ వాతావరణం ● పెరగనున్న సాగు విస్తీర్ణం దిగుబడి, ఆదాయం పెంపే లక్ష్యంగా కసరత్తుఇంద్రావతి రకం కంకిచింతపల్లి: చిరుధాన్యాల పంటల్లో ఒకటైన రాగి (చోడి)ని మెట్ట ప్రాంతంలో రైతులు సాగు చేస్తున్నారు. పాడేరు డివిజన్లో ఒకప్పుడు అధిక విస్తీర్ణంలో ఉండే ఈ పంట విస్తీర్ణం రానురాను తగ్గిపోతోంది. ఒకప్పుడు పాడేరు డివిజన్లో సుమారు 30 వేల హెక్టార్లకు పైగా సాగులో ఉండేది. ఇప్పుడు సుమారు 20 వేల హెక్టార్లకు తగ్గిపోయింది. దేశవాళీ రకాలను సాగు చేయడం వల్ల దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ఈ కారణంగానే సాగుపై గిరి రైతులకు ఆసక్తి తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో రాగి సాగుకు పూర్వ వైభవం తెచ్చేందుకు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా కొత్త వంగడాలను రైతులకు పరిచయం చేసేందుకు కసరత్తు మొదలుపెట్టారు. వేగావతి, ఇంద్రావతి రకాలు ఏజెన్సీ ప్రాంతానికి అనువైనవిగా పరిశోధనల్లో గుర్తించారు. ● నదుల పేర్లతో ఉన్న వేగావతి,ఇంద్రావతి రకాలను రైతులకు అందజేసేందుకు తొలిగా విజయనగరం వ్యవసాయ పరిశోధన స్థానంలో అధ్యయనం చేశారు. వీటిని అభివృద్ధి తరువాత ఈ రకాల దిగుబడులపై ఆర్ఏఆర్ఎస్లో సుమారు మూడేళ్లపాటు పరిశోధనలు చేశారు. ఇంద్రావతి రకంలో దిగుబడి ఆశాజనకంగా ఉన్నందున ఈ ప్రాంతానికి అనుకూలమని గుర్తించారు. సుమారు 115–120 రోజుల్లో పంట చేతికొస్తుంది. ఎకరాకు 14–15 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంద్రావతిలో ఫింగర్, నెక్, లీఫ్, బ్లాస్ట్, స్టెమ్, బోర్, డౌని, మిల్డ్యూ, అపిడ్స్ వంటి రోగాలు, చీడపీడలను తట్టుకునే వ్యాధినిరోధక లక్షణాలు ఉన్నాయని చెబుతున్నారు. గతేడాది పాడేరు ప్రాంతంలో పది మంది రైతుల ద్వారా ఈ రకాన్ని సాగు చేయించారు. దిగుబడి ఆశాజనకంగా ఉన్నట్టు నిర్థారణ అయింది. ఈ రకం విత్తనాలను గిరిజన ఉప ప్రణాళికలో పంపిణీ చేసేందుకు కృషి చేస్తున్నారు. ● వేగావతి రకం సుమారు 110 నుంచి 115 రోజుల్లో పంట చేతికొస్తుంది. ఎకరాకు 14 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. గోధు మచ్చ తెగులు, శిలీంధ్రం/బాక్టీరియా వల్ల ఆశించే బ్యండెడ్ బ్లైట్ను తట్టుకుంటుంది. ఈ రకం కూడా ఏజెన్సీకి అనుకూలంగా గుర్తించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంద్రావతి రకం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, ఒడిశా, పుదుచ్చేరితోపాటు ఉత్తర భారతదేశంలో కూడా మంచి దిగుబడులు వస్తున్నాయని వారు వివరించారు. వేగవతి రకం సాగు చేస్తూ గుజరాత్,మహారాష్ట్ర ప్రాంతాల్లో రైతులు మంచి ఆదాయం పొందుతున్నారని శాస్త్రవేత్తలు తెలిపారు. ● ఇంద్రావతి, వేగావతి రకాల్లో మెరుగైన పోషకాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఐరన్, కాల్షియం, జింక్ పోషకాలు అధికంగా ఉన్నట్టు వారు తెలిపారు. మార్కెట్లో రాగి ఆహార ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉన్నందున ఈ రెండు రకాల సాగు ద్వారా గిరి రైతులు మంచి ఆదాయం పొందవచ్చని వారు చెబుతున్నారు. -
నేటి నుంచిశ్రావణమాస పూజలు
డాబాగార్డెన్స్ (విశాఖ): ఉత్తరాంధ్రుల ఇలవేల్పు కనమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం నుంచి వచ్చే నెల 23 వరకు శ్రావణమాసాన్ని పురస్కరించుకుని శ్రావణలక్ష్మి ప్రత్యేక కుంకుమ పూజలు జరపనున్నారు. ఈ ప్రత్యేక పూజలో సంకల్పం, లక్ష్మీ సహస్ర నామాలు, లక్ష్మీ హోమం, అమ్మవారి దర్శనం, వేద ఆశీర్వచనం చేపట్టనున్నారు. విశిష్ట సామూహిక కుంకుమ పూజలో పాల్గొనదలిచే భక్తులు (దంపతులు) రూ.400 టికెట్ రుసుం చెల్లించాలి. పూజ అనంతరం భక్తులకు శేషవస్త్రంగా కండువా, జాకెట్టు ముక్క, పావుకేజీ పులిహోర, పావుకేజీ చక్కెర పొంగలి, శ్రీచక్రయంత్రం (రాగి)ని మహాప్రసాదంగా అందజేస్తారు. శ్రావణమాసంలో వచ్చే మూడో శుక్రవారం (ఆగస్టు 8) వరలక్ష్మీవ్రతం, 9న శ్రావణ పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అలాగే శ్రావణమాసంలో వచ్చే ఐదు శుక్రవారాలు (ఈ నెల 25, ఆగస్టు 1, 8, 15, 23) ప్రత్యేక పూజలు జరపనున్నారు. -
వాగు దాటితేనే చదువు సాగేది..
జి.మాడుగుల: మండలంలో బూసిపల్లి, నీలమెట్ట, తోకచిలక గ్రామాల విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు సాహసం చేయాల్సి వస్తోంది. ఆయా గ్రామాలకు చెందిన సుమారు 50 మంది విద్యార్థులు కృష్ణాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్నారు. వీరు ప్రతిరోజు రెండు కిలోమీటర్ల మేర కాలినడకన పాఠశాలకు వస్తుంటారు. మార్గం మధ్యలోని కొంగవాగును ప్రమాదకర పరిస్థితుల మధ్య దాటాల్సి వస్తోంది. వర్షాకాలంలో వీరిని స్కూల్కు పంపేందుకు తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం వేళలో దగ్గరుండి వాగును దాటించి అవతలి ఒడ్డుకు చేర్చుతున్నారు. స్కూల్ ముగిసిన తరువాత సాయంత్రం మళ్లీ వాగు వద్దకు వచ్చి వారిని దగ్గరుండి తీసుకువస్తున్నారు. ప్రభుత్వం అధికారులు స్పందించి కృష్ణాపురం– బూసిపల్లి గ్రామాల మధ్య రెండు కిలోమీటర్ల పొడవునా రోడ్డు నిర్మించడమే కాకుండా వాగుపై కల్వర్టు ఏర్పాటుచేసి సమస్య పరిష్కరించాలని మూడు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లోపాఠశాలకు.. బూసిపల్లి, నీలమెట్ట, తోకచిలకగ్రామ విద్యార్థుల అవస్థలు -
అప్రమత్తత అవసరం
దేశవాళీ రకం పసుపు పైరుపై మచ్చలు కనిపించిన వెంటనే రైతులు అప్రమత్తం కావాలి. ప్రారంభంలోనే సస్యరక్షణ చేపడితే వ్యాప్తిని వెంటనే నివారించవచ్చు. ఒక శాతం బోర్డో మిశ్రమం/ ఒక లీటరు నీటికి ఒక మిల్లీలీటర్ ప్రోపికోనజోల్ లేదా 2.5 గ్రాముల మాంకోజెబ్కు 0.5 ఎంఎల్ సబ్బునీరు కలిపి 15 రోజుల వ్యవధిలో సెప్టెంబరు నుంచి 3 నుంచి 4 సార్లు పిచికారి చేయాలి. పైరు విత్తుకునే సమయంలో జాగ్రత్తలు పాటించడం వల్ల కూడా నివారించవచ్చు. ఆరోగ్యకరమైన విత్తనాన్ని ఎంచుకుని విత్తనశుద్ధి చేయడం వల్ల తెగుళ్లను నివారించవచ్చు. – శెట్టి బిందు, ప్రధాన శాస్త్రవేత్త, ఉద్యానవన పరిశోధన స్థానం, చింతపల్లి -
అతిథులకు గూడు కరువు
● పాడేరులో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ గెస్ట్ హౌస్లు ● నిర్వహణలోపమే కారణం ● ప్రైవేట్ లాడ్జీలే దిక్కు సాక్షి,పాడేరు: జిల్లా కేంద్రం పాడేరులో అతిథులకు ఆతిథ్యం కరువైంది. మన్యంలో పర్యటించే వీఐపీలు, అధికార బృందాలు, వివిధ వర్గాల ప్రజలు తొలుత ప్రభుత్వ అతిథ గృహాల్లో బస చేసేందుకే ఆసక్తి చూపుతారు. అయితే జిల్లా కేంద్రం పాడేరులో మాత్రం ఆ పరిస్థితి లేదు.అతిథులకు ప్రైవేట్ లాడ్జీలే దిక్కవుతున్నాయి. పూర్వం నుంచి పాడేరులోని ఆర్అండ్బీ, అటవీశాఖ గెస్ట్ హౌస్లకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. ఈ రెండు అతిథి గృహాలకు మంచి డిమాండ్ ఉండేది. నిర్వహణ లోపం కారణంగా ఇవి మూలకు చేరాయి. ● ఒకప్పుడు కొత్తపాడేరులో మంచి ఆదరణ నెలకొన్న మెట్ట బంగ్లా అతిథి గృహం ప్రస్తుతం మందుబాబులకు నిలయంగా మారింది. మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల శిథిలావస్థకు చేరింది. కాలక్రమేణా వినియోగానికి దూరం కావడంతో రాత్రి, పగలు మందుబాబులకు నిలయంగా ఉంది. ఇక్క పరిసరాలన్నీ మద్యం సీసాలతో నిండిపోయాయి. అటవీశాఖ అధికారులు హెచ్చరించినా మందుబాబులు లక్ష్యపెట్టడం లేదు. ఎన్నో సినిమాల షూటింగ్లు జరిగిన ఈ అందమైన అతిథి గృహం రేపోమాపో కూలిపోడానికి సిద్ధంగా ఉంది. విష సర్పాలకు నిలయం అటవీశాఖ అతిథి గృహం తుప్పలు, డొంకలతో నిండిపోయింది. పాడేరు నుంచి జి.మాడుగుల వెళ్లే రోడ్డు పక్కన సౌకర్య వంతంగా అటవీశాఖ అతిథి గృహన్ని నిర్మించింది. అప్పట్లో ఇక్కడ బస చేసేందుకు వీఐపీలు అసక్తి చూపేవారు. నిధుల సమస్య కారణంగా మరమ్మతులు చేపట్టకపోవడంతో శిథిలావస్థకు చేరకుంది. ఎంతో ప్రాధాన్యత గల ఈ గెస్ట్ హౌస్ తుప్పలతో నిండి ఉండడంతో విషసర్పాలకు నిలయమైంది. కొత్త గెస్ట్ హౌస్కు ప్రతిపాదనలు ఆర్అండ్బీ పాత అతిథి గృహాన్ని పూర్తిగా తొలగించి కొత్తగా రూ.1. 60కోట్లతో నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. మందుబాబులు అక్కడకు ప్రవేశించకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. –బాలసుందరబాబు, ఆర్అండ్బీ ఈఈ, పాడేరు -
మచ్చ తెగుళ్ల లక్షణాలివీ..
● మొక్కల ఆకులపై చిన్న చిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడి అవి క్రమేపీ గోధుమ రంగులోకి మారి ఎండిపోతాయి. ఈ తెగులు కింద ఆకుల నుంచి పైకి వ్యాప్తి చెందుతుంది. దీనికి ఆకుమచ్చ తెగులుగా గుర్తించి వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. నవంబర్– డిసెంబర్ నెలలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీని విషయంలో రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ● ఆకులపై అండాకారంలో పెద్ద మచ్చలు కనిపిస్తే తాటాకు మచ్చ తెగులుగా గుర్తించాలి. ఇవి ముదురు గోధుమ వర్ణంలో ఉంటాయి. ఆకు కాడపై మచ్చలు ఏర్పడటంతో ఆకు కిందకు వాలిపోతుంది. ఈదురు గాలులతో కూడిన వర్షాలు, గాలిలో తక్కువ తేమ, ఉష్ణోగ్రతలు ఈ తెగులు వ్యాప్తికి దోహదపడతాయి. సెప్టెంబర్ నుంచి ఈ తెగులు ప్రభావం పైరుపై కనిపిస్తుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పసుపు సాగులో ఏజెన్సీ వాతావరణానికి అనువైన ఆధునిక వంగడాలు అందుబాటులో ఉన్నప్పటికీ గిరి రైతులు దేశవాళీ రకం వైపే మొగ్గు చూపుతున్నారు. అధిక దిగుబడినిచ్చే రోమా రకాన్ని శాస్త్రవేత్తలు పరిచయం చేసినా ఆసక్తి చూపడం లేదు. మెట్ట, పోడు భూముల్లో దేశవాళీ రకం సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. చింతపల్లి: ఏజెన్సీలో గిరి రైతులకు ప్రధాన ఆదాయ వనరుల్లో కాఫీ మాదిరిగానే పసుపు సాగు కీలకం. ఏటా సాగు చేస్తున్న పంటలో కొంతమేర పసుపు దుంపను భద్రపరిచి విత్తనంగా వినియోగించడం ఆనవాయితీగా వస్తోంది. దీనివల్ల విత్తన ఖర్చు తగ్గుతోందని గిరి రైతులు చెబుతున్నారు. ● పాడేరు డివిజన్ పరిధిలో సుమారు 24 వేల హెక్టార్లలో పసుపు పంటను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు పైరుకు అనుకూలంగా ఉన్నప్పటికీ తెగుళ్ల సోకే అవకాశం కూడా లేకపోలేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని ఉద్యానవన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో సాగు చేపట్టారు. పైరు ఎదుగదల బాగానే ఉంది. అయితే ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ● దేశవాళీ రకాలను కూడా ఏడాది పంటగా సాగు చేయడం వల్ల మంచి దిగుబడులు ఆదాయం పొందవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అలాకాకుండా రెండేళ్ల పంటగా సాగు చేయడం వల్ల రెండో ఏడాది గణనీయంగా దిగుబడులు తగ్గిపోతున్నాయి. -
ఆర్ఐటీఐ కౌన్సెలింగ్కు 150 మంది హాజరు
వివిధ ట్రేడ్లలో 123 మంది ప్రవేశాలు చింతపల్లి: మండల కేంద్రంలో నివాస అనుబంధ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఆర్ఐటీఐ)లో రెండవ విడత కౌన్సెలింగ్కు 150 మంది విద్యార్థులు హాజరైనట్లు ప్రిన్సిపాల్ రమణ తెలిపారు. తొలి విడతలో మిగిలిన ీ149 సీట్లకు 308 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీరిలో బుధవారం నిర్వహించిన రెండో విడత కౌన్సెలింగ్కు 150 మంది వచ్చినట్టు ఆయన వివరించారు. వీరిలో 123 మంది వివిధ ట్రేడ్లలో ప్రవేశాలు పొందారన్నారు. ఇంకా 26 సీట్లు మిగిలి ఉన్నాయన్నారు. ప్లంబర్, కార్పెంటర్ ట్రేడ్ల్లో సీట్లు ఖాళీ ఉన్నాయన్నారు. వీటి భర్తీకి గురువారం కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు. -
నిర్వాసిత రైతుల వినూత్న నిరసన
● రాత్రి సమయంలో రోడ్డెక్కిన అన్నదాతలు ● తక్షణం అదనపు భూసేకరణ నిలిపివేయాలి ● నిర్వాసిత గ్రామాల్లో కంచాలు వాయిస్తూ ఆందోళన నక్కపల్లి: పారిశ్రామికీకరణ పేరిట తమ భూములు లాక్కుంటే రోడ్డున పడతామంటూ నక్కపల్లి మండలంలోని పలు గ్రామాల రైతులు బుధవారం రాత్రి రోడ్డెక్కి నిరసన తెలిపారు. స్టీల్ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్క్ కోసం అదనపు భూసేకరణ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గరిటెలతో కంచాలు వాయిస్తూ వినూత్నంగా ఆందోళన చేశారు. మూలపర, పాటిమీద, చందనాడ, బోయపాడు, రాజయ్యపేట తదితర గ్రామాల్లో రైతులు, నిర్వాసితులు వైఎస్సార్సీపీ, సీపీఎం ఆధ్వర్యంలో రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ సీనియర్ నేత, కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు, వైఎస్సార్సీపీ జిల్లా గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడు సూరాకాసుల గోవిందు, తదితరులు మాట్లాడుతూ ఇప్పటికే కంపెనీలకు భూములు, నివాస ప్రాంతాలు త్యాగం చేసిన రైతులకు సరైన నష్ట పరిహారం ఇవ్వలేదన్నారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చి మాట తప్పిందన్నారు. నిర్వాసిత కుటుంబాల్లో మేజర్లయిన మహిళలు, పురుషులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద రూ.25 లక్షలు చెల్లించాలని గత ఏడాది నుంచి డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుండా బల్క్ డ్రగ్ పార్క్ పనులు ప్రారంభించడం తగదన్నారు. ఇప్పటికీ పట్టించుకోకపోతే ఉద్యమం ఉధృతం చేయాలని నిర్ణయించామన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సమస్య పరిష్కరించకుండా బల్క్ డ్రగ్ పార్క్ కోసం అదనంగా మరో 800 ఎకరాలు, స్టీల్ప్లాంట్ కోసం మరో 2500 ఎకరాలు సేకరించేందుకు నిర్ణయించారన్నారు. ఏపీఐఐసీ అధికారులు గుట్టుగా సర్వేలు చేసి నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు ప్రారంభించారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను అదనపు భూసేకరణను అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. హోంమంత్రి అనిత కూడా నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభిస్తామని ఎన్నికల ముందు ప్రకటించి, ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని రైతు నాయకులు ఆరోపించారు. వచ్చే నెల 6న తహసీల్దార్ కార్యాలయంలో జరిగే బల్క్ డ్రగ్ పార్క్ ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకుంటామన్నారు. పార్క్కు శంకుస్థాపన చేసిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. నిర్వాసిత గ్రామాల్లో రాత్రి కంచాలు, గరిటెలు చేతపట్టి మహిళలు, యువతీ, యువకులు, రైతులు చప్పుడు చేస్తూ వినూత్నంగా నిరసన తెలియజేశారు. అన్ని గ్రామాల్లోనే ఈ తరహా నిరసనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తళ్ల భార్గవ్, ఎంపీటీసీ తిరుపతిరావు, రైతు నాయకులు రావి అప్పారావు, తళ్ల అప్పలస్వామి, తాతారావు, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
డీపీవో చంద్రశేఖర్ హెచ్చరిక చింతపల్లి: క్షేత్ర స్థాయిలో పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని డీపీవో కేపీ చంద్రశేఖర్ హెచ్చరించారు. బుధవారం ఆయన చింతపల్లి, జీకేవీధి మండలాల పరిధి పెదబరడ, లోతుగెడ్డ జంక్షన్, రింతాడ వంచులు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్బంగా డీపీవో మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా పారిశుధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 7గంటల నుంచి 9 గంటల వరకు సంబంధిత డీఎల్పీవో, ఎంపీడీవో, కార్యదర్శులు, మహిళా పోలీసు, ఇంజినీరింగ్ అసిస్టెంట్, ఏఎన్ఎం,ఆశ కార్యకర్తలు గ్రామాల్లో పర్యటించి పారిశధ్య పనులను పరిశీలించాలని సూచించారు. ప్రతీ ఇంటి నుంచి తడి పొడి చెత్తను వేరు చేసే విధంగా అవగాహన కల్పించి, సేకరించిన చెత్తను సంపద కేంద్రాలకు తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు. అన్ని పంచాయతీల పరిధిలో ఉన్నట్టువంటి బావులు, మంచినీటి ట్యాంకుల్లో ప్రతి 15 రోజులకు ఒకసారి క్లోరినేషన్ జరిగేలా పర్యవేక్షించాలన్నారు. ప్రధాన రహదారులలో వ్యాపారాలు చేసే వర్తకులు వాడిన చెత్తను బుట్టలలో కాకుండా రోడ్లపై వేస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అదేవిదంగా గ్రామ పంచాయతీల్లో పగటి పూట వీధి దీపాలు వెలిగితే కార్యదర్శులపై చర్యలు తప్పవన్నారు. ఎంపీడీవో సీతామహలక్ష్మి, కార్యదర్శి లక్ష్మీకాంత్ పాల్గొన్నారు. -
విద్యార్థుల సామర్థ్యం మరింత మెరుగు పడాలి
పెదబయలు: విద్యార్థుల సామర్థ్యం మరింత మెరుగుపర్చాలని విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కె.విజయభాస్కరరావు ఆదేశించారు. బుధవారం ఆయన స్థానిక మండల విద్యాశాఖ కార్యాలయాన్ని సందర్శించారు. రికార్డులను పరిశీలించారు.అనంతరం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యాబోధనను, విద్యార్థుల నోట్ పుస్తకాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.టైం టేబుల్ ప్రకారం పాఠాలు బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం వారితో నిర్వహించిన సమావేశంలో పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఎంఈవో పుష్పజోసెఫ్, విద్యాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.విద్యాశాఖ ఆర్జేడీ ఆర్జేడీ విజయభాస్కరరావు -
నూరుశాతం ఉద్యోగాల జీవో వెంటనే తేవాలి
● గిరిజన అభ్యర్థులఉద్యమానికి సంపూర్ణ మద్దతు ● పార్లమెంట్ స్థాయిలో పోరాడుతా ● అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి సాక్షి, పాడేరు: గిరిజన ప్రాంతాల్లో జీవో నంబరు 3 అమలుజేస్తామని అరకు సభలో ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇచ్చిన హమీ మేరకు నూరుశాతం ఉద్యోగాల జీవోను వెంటనే తేవాలని అరకు పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ తనూజరాణి డిమాండ్ చేశారు. బుధవారం ఆమె ఫోన్లో సాక్షితో మాట్లాడుతూ జీవో నంబరు 3 పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ జీవోతో నూరుశాతం గిరిజనులకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత అంతా కూటమి ప్రభుత్వంపైనే ఉందన్నారు. మెగా డీఎస్సీ ప్రకటనకు ముందే కూటమి ప్రభుత్వం గిరిజనులకు న్యాయం చేయకుండా కాలయాపన చేయడంతో గిరిజన అభ్యర్థులు అన్యాయానికి గురయ్యారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక డీఎస్సీ కోసం వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులమంతా గిరిజన అభ్యర్థుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతునిచ్చామన్నారు. జీవో నంబరు 3 సాధన, ప్రత్యేక డీఎస్సీ కోసం భవిష్యత్తులోను వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని, పార్లమెంట్ స్థాయిలో తన పోరాటం కొనసాగుతుందని ఎంపీ స్పష్టం చేశారు. -
చిత్తడి దారులతో అవస్థలు
● బురదమయంగా రహదారి ● జారిపడి గాయాలపాలవుతున్న వాహనచోదకులు ● ఆందోళనలో గ్రామస్తులు ● పట్టించుకోని అధికారులు చింతపల్లి: మండలంలో అతి మారుమూల ఉన్న దిగజనబ–కోరుకొండ గ్రామాల మధ్య రహదారి అద్వానంగా మారింది. రాకపోకలు సాగించడానికి గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బలపం పంచాయతీ పరిధిలో గల గిరిజనులు పంచాయతీ కేంద్రంలోని కోరుకొండకు చేరుకోవడానికి అనేక అవస్థలు పడుతున్నారు.ఏ ఒక్క గ్రామానికి పూర్తిస్థాయి రోడ్డు సౌకర్యం లేక ఆయా ప్రాంతవాసులు రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోరుకొండ సచివాలయానికి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, వారపు సంతకు చేరుకోవాలంటే కాలినడకన లేకుంటే అప్పడప్పుడు ఈ మార్గంలో తిరిగే ఆటోలు జీపులే ఆధారంగా రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఈ రహదారి చిత్తడిగా మారింది. దీంతో వాహనచోదకులు జారిపడి గాయాలపాలవుతున్నారని పలువురు చెబుతున్నారు. ఆటోలు జీపులు బురదలో చిక్కుకుపోయి అటూ ఇటూ కదలక నానా అవస్థలు పడుతున్నామంటున్నారు. దిగజనబ, ఎగజనబ, గిల్లలబంద, చెరువూరుతో పాటు ఒడిశాకు సంబంధించిన అనేక గ్రామాలు గిరిజనుల ఈ మార్గం మీదుగానే ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ రహదారి అధ్వానంగా మారడంతో గిరిజనులు ఈ రహదారి మీదుగా రాకపోకలు సాగించడానికి నానా తిప్పలు పడుతున్నారు. ఆయా గ్రామాల్లో ఏఒక్కరికి ఆనారోగ్యం వచ్చినా కోరుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురావడానికి డోలి మోతలే శరణ్యమవుతుందని, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు చింతపల్లి మండల కేంద్రానికి చేరుకోవాలన్నా ఈ రహదారి ద్వారానే ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ గ్రామాలకు పూర్తిస్థాయి రోడ్డు సౌకర్యానికి నోచుకోవడం లేదని పలు గ్రామాలు గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు సౌకర్యం కల్పించే విధంగా చర్యలు చేపట్టాలిని స్థానికులు కోరుతున్నారు. -
శ్రద్ధగా చదువుకోవాలి
అరకులోయ టౌన్: విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, శ్రద్ధగా చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సూచించారు. బుధవారం మండలంలోని రవ్వలగుడ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులను పరిశీలించారు. వీరికి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. వంటశాల పరిశుభ్రంగా లేకపోవడంపై నిర్వాహకులను మందలించారు. వసతి గృహ పరిసరాలు, వంటశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనారోగ్యానికి గురైన విద్యార్థులను సిక్ రూమ్లో ఉంచాలని, వెంటనే మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాలన్నారు. జగనన్న పాలనలో నాడు–నేడు పథకాలను పాఠశాలలను తీర్చిదిద్దిన తీరు, డిజిటల్ క్లాస్ రూమ్ కాన్సెప్ట్, ఎల్ఈడీ స్క్రీన్, ఇంటర్నెట్ సదుపాయంతో విద్యార్థులకు అందిస్తున్న బోధనను చూసి ఆనందం వ్యక్తం చేశారు. హెచ్ఎం టి.నాగేశ్వరరావు, హెచ్డబ్ల్యూవో రామ్మూర్తి పాల్గొన్నారు. విద్యార్థులకు ఎమ్మెల్యే మత్స్యలింగం సూచన -
పోర్టులో ట్రైనీ ఐపీఎస్ల బృందం
సాక్షి, విశాఖపట్నం : వివిధ రాష్ట్రాలకు చెందిన 28 మంది ట్రెయినీ ఐపీఎస్ అధికారుల బృందం విశాఖపట్నం పోర్ట్ అథారిటీ(వీపీఏ)ని బుధవారం సందర్శించారు. సముద్ర భద్రత, వాణిజ్య రంగంలో ఎదురయ్యే ఆధునిక సవాళ్ల గురించి అవగాహన ఏర్పరచుకునేందుకు ఈ సందర్శన సాగించారు. పోర్టు అధికారులు బృందానికి స్వాగతం పలికారు. పోర్టులో జరుగుతున్న వివిధ కార్యకలాపాలు, అభివృద్ధి పనుల గురించి పోర్టు అధికారులు వివరించారు. అనంతరం మౌలిక సదుపాయాలు, కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం, ఆధునికీకరణ, యాంత్రీకరణ, కవర్డ్ గోదాములు, సోలార్ పవర్ ఉత్పత్తి, పరిశ్రమల కోసం ఎస్టీపీ నీటి పునర్వినియోగం, పెట్టుబడుల అవకాశాలు ఎగుమతి దిగుమతులు మొదలైన విభాగాలను ట్రైనీ ఐపీఎస్ అధికారులు సందర్శించి.. సందేహాలను అడిగి తెలుసుకున్నారు.