breaking news
Alluri Sitarama Raju
-
ఏజెన్సీలో రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక నిధులు
జి.మాడుగుల: జిల్లాలోని గిరిజన గ్రామాలకు ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇచ్చి ప్రత్యేక నిధులు కేటాయించాలని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు కోరారు. మండలంలోని గెమ్మెలి పంచాయతీ చీమలపాడు గ్రామంలో రూ.1.60 కోట్లతో తారురోడ్డు నిర్మాణ పనులను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తాను విజయం సాధిస్తే గెమ్మెలి రోడ్డు నుంచి చీమలపాడు వరకు రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని ఇచ్చిన మాట ప్రకారం పనులు చేపట్టామన్నారు. ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి రహదారులు కీలక ప్రాత పోషిస్తాయని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు రవాణాలో సౌలభ్యం కలుగుతుందని ఆయన తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో పక్కాలు రోడ్లు నోచుకోకపోవడంతో ప్రజలు రోడ్డు, రవాణా కష్టాలు పడుతున్నారని ఆయన అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించి మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వం, అధికారులు కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ కుడుముల సత్యనారాయణ, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు నుర్మని మత్స్యకొండం నాయుడు, సర్పంచ్ సీదరి కొండబాబు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంజరి సీతారాంనాయుడు, వైఎస్సార్సీపీ నేతలు సిర్మా పండన్న, బంగార్రాజు, నీలమ్మ, వలసయ్య, చిట్టిబాబు, మన్మథరావు, లక్ష్మినాయుడు, బాలయ్యపడాల్, గంగరాజు, మర్రి బాలరాజు, కోటిబాబు, బొనంగి బాలయ్య పడాల్, శంకరరావు, సత్తిబాబు, ఆశీర్వాదం, బాలు, కొండబాబు, మాజీ సర్పంచ్ పండుదొర, కూర్మారావు, పీఆర్ఏఈ మాణిక్యం, సీడీపీవో బాలచంద్రమణిదేవి, ఉపాధి హామీ పథకం ఏపీవో కొండబాబు పాల్గొన్నారు.మంజూరు చేయాలని పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు విజ్ఞప్తి -
సమావేశంలో వెల్లువెత్తిన సమస్యలు
● అధికారుల గైర్హాజరుపై సభ్యుల ధ్వజం అడ్డతీగల: సమావేశాల్లో చర్చించిన అంశాలు పరిష్కరించడంలో అధికారులు చొరవ చూపకపోవడంపై అడ్డతీగల సర్వ సభ్య సమావేశంలో సభ్యులు ధ్వజమెత్తారు. మండల సర్వసభ్య సమావేశం శనివారంఎంపీపీ బొడ్డపాటి రాఘవ అధ్యక్షతన శనివారం జరిగింది. గ్రామాల్లో ప్రజలెదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు చెబుతున్నా అధికారులు వాటిని పెడచెవిన పెడ్తున్నారన్నారు. రోడ్ల పనులకు అనుమతులు ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని డీఈ నాగరాజుని సభ్యులు నిలదీశారు. మ్యూటేషన్లు జరగక రైతులకు పథకాలు అందడం లేదన్నారు. మిట్టపాలెంలో డీఆర్ డిపో ఏర్పాటుచేయాలని, గ్రామాల్లో లోఓల్టేజీ సమస్య పరష్కరించాలని సభ్యులు సమస్యలను ప్రస్తావించారు. ఎకై ్సజ్ శాఖ తరఫున హెచ్సీ సమావేశానికి వచ్చి ఎకై ్సజ్ శాఖ కేసులను వివరించారు. ఎంపీడీవో కుమార్ మాట్లాడుతూ ప్రతి శాఖకు చెందిన అధికారులు సమావేశానికి హాజరు కావాలని సూచించారు. జెడ్పీటీసీ సభ్యుడు మద్దాల వీర్రాజు, తహసీల్దార్ దొరకయ్య, వైస్ ఎంపీపీ బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. గంగవరం: మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి అధ్యక్షతన శనివారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచ్లు, ఎంపీటీసీలకు రెండేన్నరేళ్లుగా గౌరవ వేతనం మంజూరు చేయడంలేదని సభ్యులు ధ్వజమెత్తారు. జెడ్పీటీసీ బేబీ రత్నం మాట్లాడుతూ మండలం అభివృద్ధికి ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలన్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులకు గౌరవ వేతనాలు చెల్లించిక పోవడం అన్యాయమని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎంపీడీవో లక్ష్మణరావు సభ్యులను కోరగా సభ్యులు శాంతించారు. ఆయా శాఖల అధికారులు ప్రగతిని సమావేశంలో వివరించారు. అనంతరం ఉత్తమ సేవలందించిన 17 మంది సర్పంచ్లను సన్మానించారు. వైస్ ఎంపీపీలు రామతులసి , గంగాదేవి, ఎంపీటీసీ సభ్యులు ఆదినారాయణ, కనకలక్ష్మి, పద్మావతి, వెంకటలక్ష్మి కోఆప్షన్ సభ్యుడు ప్రభాకర్, ఎంపీడీవో లక్ష్మణరావు, వైద్యాధికారి భావన, ఏవో విశ్వనాథ్ , ఎంఈవో మల్లేశ్వరరావు, ఏపీఓ ప్రకాష్ , ఏపీఎం అప్పలకొండ , డిప్యూటీ ఎంపిడీవోలు నరసింగరావు, గోపి, సర్పంచ్లు, కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చింతూరు: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సవలం అమల అధ్యక్షతన శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు చిచ్చడి మురళీ మాట్లాడుతూ గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా అధికారులు చూడాలని కోరారు. పాడైన అంగన్వాడీ భవనాలకు మరమ్మతు చేయాలని, రైతులకు సకాలంలో విత్తనాలు సరఫరా చేయాలని, ప్రొటోకాల్ పాటించి ప్రజాప్రతినిధులను గౌరవించాలని సూచించారు. వైస్ ఎంపీపీ యడమ అర్జున్, తహసీల్దార్ హుస్సేన్, ఎంపీడీవో శ్రీనివాసదొర, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు పాల్గొన్నారు. -
చిన్నారి మృతిపై గిరిజనుల ఆందోళన
చింతపల్లి: వైద్యం వికటించడంతోనే రెండు నెలల శిశువు మృతి చెందాడని ఆరోపించారు. దీనిలో భాగంగా శనివారం స్థానిక ఏరియా ఆస్పత్రి వద్ద బాధిత తల్లిదండ్రులతో వారు ఆందోళన నిర్వహించారు. వివరాలిలా ఉన్నాయి. గత డిసెంబర్ డిసెంబర 31న మండలంలోని చౌడుపల్లి పంచాయతీ చెదలపాడు గ్రామానికి చెందిన తాంబెలి చిట్టిబాబు, రాజేశ్వరి దంపతుల రెండునెలల బాబు అస్వస్థతకు గురయ్యాడు. అతనిని తల్లిదండ్రులు అదే రోజు స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువచ్చారు. చిన్నపిల్లల వైద్యురాలు సూచనల మేరకు వైద్యసిబ్బంది చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా మారడంతో శిశవును నర్సీపట్నం ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే రెండునెలల బాబు మరణించాడు. ఈఘనటకు చింతపల్లి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమేనని బాధిత చిన్నారి తల్లిదండ్రులు, పలువురు గిరిజన సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆందోళనకారులతో డీసీహెచ్ఎస్ నీలవేణి మాట్లాడారు. సంఘటనపై విచారణ చేపట్టి కమిషనర్కు నివేదిస్తామన్నారు. దీంతో వారు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాబూరావు, మాజీ డీసీసీ అధ్యక్షుడు వంతల సుబ్బారావు, చిరంజీవి, సాగిన కృష్ణపడాల్ బాలరాజు పాల్గొన్నారు. చింతపల్లి ఏరియా ఆస్పత్రి వైద్యులనిర్లక్ష్యమేనని ఆవేదన విచారణ చేపడతామని డీసీహెచ్ఎస్ నీలవేణి హామీ శాంతించిన ఆందోళనకారులు -
గిరిజనులకు అప్పన్న చిత్రపటాలు, దుస్తుల అందజేత
సింహాచలం: అల్లూరి జిల్లాలో శ్రీనృసింహ దీక్ష చేపట్టిన పలువురు భక్తులకుి సింహాచలంలోని సింహాద్రి మఠం తరఫున శనివారం శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి చిత్రపటాలు, దుప్పట్లు, తువ్వాళ్లు గురుస్వామి కశిరెడ్డి సురేంద్రస్వామి అందజేశారు. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టులోని బంగారు మెట్ట దరి సరియాపల్లి, పెదబయలు మండలం గలగండ పంచాయతీ సిరసపల్లి గ్రామంలో వీటిని అందజేశారు. సింహాచలం దేవస్థానం సౌజన్యంతో పూజా విధానం పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా స్వామివారి పూజ చేసి, భక్తి గీతాలు ఆలపించారు. -
సమస్యలు పరిష్కరించాలని వినతి
చింతూరు: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎంఎంయూ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 104 ఉద్యోగులు శనివారం చింతూరులో పోలవరం జిల్లా డీఎంహెచ్వో డాక్టర్ సరిత, చింతూరు డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో డాక్టర్ పుల్లయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ తమపై యాజమాన్యం వేధింపులు, షోకాజ్ నోటీసులు, సస్పెండ్ వంటి చర్యలను నిలుపుదల చేయాలన్నారు. రద్దుచేసిన 15 క్యాజువల్ సెలవులను తక్షణమే పునరుద్ధరించాలని, ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు అదనపు సిబ్బందిని నియమించాలని, తొలగించిన బఫర్ సిబ్బందిని పునరుద్ధరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షుడు కోట్ల పవన్కుమార్, గుయ్యం నవీన్కుమార్, అల్లి మనోహర్ పాల్గొన్నారు. -
యూనియన్ బ్యాంక్లో నో క్యాష్
● రాజవొమ్మంగిలో వెనక్కి పంపేస్తున్నబ్యాంకు అధికారులు ● ఆవేదన వ్యక్తం చేస్తున్న పెన్షనర్లు రాజవొమ్మంగి: స్థానిక యూనియన్ బ్యాంక్ అధికారు ల తీరుపై రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ తీసుకోవడం కోసం శనివారం బ్యాంకుకు వెళ్లిన వృద్ధులకు నగదు లేదు అంటూ అధికారులు సమాధానం ఇచ్చి వెనక్కి పంపేయడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణవర్మ మాట్లాడుతూ, బ్యాంకు పరిధిలో వంద మందికి పైగా పెన్షనర్లు ఉన్నారని తెలిపారు. దాదాపు ఏడాది కాలంగా బ్యాంకు సిబ్బంది నగదు లేదనే సాకుతో తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బ్యాంకుకు వచ్చే వారిలో మెజారిటీ పెన్షనర్లు 80 ఏళ్లు పైబడిన వారే. లోతట్టు గ్రామాల నుండి ఎంతో శ్రమకోర్చి, ప్రయాణ ఖర్చులు భరించి బ్యాంకుకు వస్తే, నగదు లేదనడం వల్ల వారు శారీరకంగా, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కృష్ణవర్మ పేర్కొన్నారు.పెన్షనర్ల పట్ల బ్యాంకు అధికారులు ప్రదర్శిస్తున్న ఉదాసీన వైఖరిపై రీజినల్ మేనేజర్కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఉన్నతాధికారు లు వెంటనే స్పందించి, పెన్షనర్లకు సకాలంలో నగదు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
వ్యసనాలకు దూరంగా ఉండాలి
● చింతూరు ఏఎస్పీ బొడ్డు హేమంత్ చింతూరు: మత్తుకు బానిసైన యువత తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారని, యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని చింతూరు ఏఎస్పీ బొడ్డు హేమంత్ అన్నారు. అభ్యుదయం కార్యక్రమంలో భాగంగా స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక ఒడిశా జంక్షన్ నుంచి చింతూరు మెయిన్రోడ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ఏజెన్సీలో గంజాయి నిర్మూలనకు పోలీసులు కృషి చేస్తున్నారని, దీనికి ప్రజల సహకారం కూడా కావాలని కోరారు. గంజాయి అక్రమ రవాణా చేసినా, విక్రయించినా కఠినచర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మాదక ద్రవ్యాల కారణంగా ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయని, యువత వాటి జోలికిపోకుండా తమ భవిష్యత్తును సుగమం చేసుకోవాలని ఏఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ గోపాలకృష్ణ, ఎస్ఐ రమేష్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రత్నమాణిక్యం పాల్గొన్నారు. -
విద్యార్థుల ఆరోగ్యంపై అలసత్వం వహిస్తే చర్యలు
● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అరకులోయ టౌన్: విద్యార్థుల ఆరోగ్యంపై అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం హెచ్చరించారు. శనివారం ఆయన స్థానిక పీటీజీ బాలుర కళాశాల, బాలికల పాఠశాలను సందర్శించారు. కళాశాలలో ఆనారోగ్యంతో బాధపడుతూ రక్త పరీక్షలు చేయించుకుంటున్న విద్యార్థుల ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. నాణ్యమైన విద్య, మెనూ ప్రకారం భోజనం అందుతుందా.. లేదా అని ప్రశ్నించారు. రికార్డులు పరిశీలించిన ఎమ్మెల్యే మెనూ ప్రకారం వండి వడ్డిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. పాఠశాలలో రుచికరంగా భోజనం లేకపోవడాన్ని గుర్తించిన ఎమ్మెల్యే తగు సూచనలు చేశారు. పాఠశాలలో ప్రహరి సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. పాఠశాలకు ప్రహరి నిర్మించి, పాఠశాల స్థలం కబ్జాకు గురికాకుండా చూడాలని సూచించారు. టెన్త్ విద్యార్థులకు యూనిఫారం అందించారు. మహిళా ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
ఆశా కార్యకర్త చొరవతో ఆస్పత్రికి రోగి తరలింపు
సీలేరు: దుప్పులవాడ పంచాయతీ వలసపల్లికి చెందిన కిముడు సోమర అనే వృద్ధుడు వారం రోజులుగా తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు. స్థానిక ఆశా కార్యకర్త ఇచ్చిన మాత్రలు వాడినప్పటికీ ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో శనివారం అతని ఆరోగ్య పరిస్థితి విషమించింది. వెంటనే ఆశా కార్యకర్త అంబులెన్స్కు సమాచారం అందించింది. గ్రామానికి వెళ్లే మార్గం సరిగ్గా లేకపోవడంతో అతనిని గ్రామస్తులు, బంధువులు మోసుకుంటూ గెడ్డను దాటించి అంబులెన్సులో ఎక్కించారు. అక్కడి నుంచి సీలేరు పీహెచ్సీకి తీసుకువచ్చారు. సోమరకు వైద్య పరీక్షలు నిర్వహించగా మలేరియా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. రక్తహీనత ఎక్కువగా ఉండటం, దానికి తోడు దగ్గు, ఆయాసం తీవ్రంగా ఉండటంతో ఆయనకు టీబీ ఉండవచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం చింతపల్లి ఆస్పత్రికి తరలించామని వైద్యాధికారి నారాయణరావు తెలిపారు. -
జీవన సత్య పట్టుదల అందరికీ ఆదర్శం
● అథ్లెట్గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటా ● అరకు ఎంపీ తనూజరాణి ● రూ.10 వేల ఆర్థిక సాయం అందజేత పాడేరు: నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఆదివాసీ బాలిక జీవన సత్య పట్టుదల అందరికీ ఆదర్శమని, భవిష్యత్తులో దేశం గర్వించదగ్గ అథ్లెట్గా ఆమెను మార్చే బాధ్యత తీసుకుంటానని అరకు ఎంపీ తనూజరాణి హామీ ఇచ్చారు. ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన 10కే మారథాన్లో రన్నరప్గా నిలిచి సంచలనం సృష్టించిన ఆమెను శనివారం పాడేరులోని తన నివాసంలో ఎంపీ ప్రత్యేకంగా అభినందించారు. అరకువ్యాలీలోని శారదానికేతన్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న ఆమె ప్రతిభను కొనియాడారు. ఆమెకు తక్షణ అవసరాల కోసం తన సొంత నిధులు రూ.10 వేల నగదు అందజేశారు. ఆమెను ఉత్తమ క్రీడాకారిణిగా తీర్చిదిద్దేందుకు ఒక మంచి క్రీడా అకాడమీలో చేర్పించి, నాణ్యమైన శిక్షణ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. దీంతో కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెట్టి వినయ్, అడ్డుమండ సర్పంచ్ గుమ్మా శ్యాం సుందర్, రూఢకోట సర్పంచ్ కాతరి సురేష్కుమార్, నేతలు ఎల్బీ కిరణ్, బాలకృష్ణ, ప్రకాశ్, విజయ్ పాల్గొన్నారు. -
కొనసాగుతున్న చలిగాలులు
● ముంచంగిపుట్టులో 8.1 డిగ్రీల నమోదు చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా చలిగాలులు కొనసాగుతున్నాయి. శనివారం ముంచంగిపుట్టులో 8.1 డిగ్రీలు, జి మాడుగులలో 8.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ● పాడేరు డివిజన్ పరిధి అరకువ్యాలీలో 9.4 డిగ్రీలు, హుకుంపేట, పెదబయలులో 10.9 డిగ్రీలు, పాడేరులో 11.7 డిగ్రీలు, చింతపల్లిలో 13.2 డిగ్రీలు, కొయ్యూరులో 14.7 డిగ్రీలు, అనంతగిరిలో 15.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు ఏడీఆర్ పేర్కొన్నారు. పోలవరరం జిల్లాలో పోలవరం జిల్లాలో రంపచోడవరం డివిజన్ మారేడుమిల్లిలో 12.5 డిగ్రీలు, వై.రామవరంలో 13.1 డిగ్రీలు, రంపచోడవరంలో 16.0 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 16.5 డిగ్రీలు, అడ్డతీగలలో17.4 డిగ్రీలు, చింతూరు డివిజన్ పరిధి చింతూరులో 16.8 డిగ్రీలు, ఎటపాకలో 17.6 డిగ్రీలు నమోదు అయినట్లు ఏడీఆర్ వెల్లడించారు. రాజవొమ్మంగి: మండల ప్రజలు చలితీవ్రతకు వణికిపోతున్నారు. ఉదయం 10 గంటల వరకు మంచు తెరలు వీడటం లేదు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. జి.మాడుగుల: మండలంలో చలితీవ్రత కొనసాగుతోంది. పాడేరు–జి.మాడుగుల, చింతపల్లి రోడ్డు, నుర్మతి, సోలభం, కుంబిడిసింగి, లువ్వాసింగి రోడ్లలో శనివారం ఉదయం 9 గంటల వరకు మంచు తెరలు అలుముకున్నాయి. దీంతో రాకపోకలు సాగించేందుకు వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. -
నెలలు నిండకుండానే ప్రసవం
● అరకిలో బరువుతో శిశువు జననం ● మెరుగైన వైద్యం కోసం చింతపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలింపు ● చేరుకుమల్లులో ఘటన సీలేరు: నెలలు నిండకుండానే ఓ గర్భిణి ప్రసవించగా.. పుట్టిన బిడ్డ కేవలం అర కేజీ (500 గ్రాములు) మాత్రమే ఉండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన గూడెంకొత్తవీధి మండలం, ధారకొండ పంచాయతీ పరిధిలోని చేరుకుమల్లులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అల్లంకి రవి, రత్నం దంపతులు ఉపాధి కోసం ఏడాది క్రితం హైదరాబాద్లోని ఒక రొయ్యల ఫ్యాక్టరీకి వెళ్లారు. అ క్కడ గర్భం దాల్చిన రత్నం, ఎటువంటి వైద్య పరీక్షలు చేయించుకోకుండా, మందులు వాడకుండా నిర్లక్ష్యంగా ఉంది. గత నెల 27న వారు తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు. ఆరో నెల గర్భంతో ఉన్న రత్నానికి సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా నొప్పులు రావడంతో ఇంట్లోనే ప్రసవించింది. పుట్టిన శిశువు అత్యల్ప బరువుతో పాటు, అవయవ లోపంతో ఉండటాన్ని చూసి కుటుంబ సభ్యులు భయాందోళన కు లోనయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఆశా కార్యకర్త వెంటనే ఏఎన్ఎంకు సమాచారం అందించారు. వా రు హుటాహుటిన బాధితుల ఇంటికి చేరుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంత రం తల్లీబిడ్డను ధారకొండ ఆసు పత్రికి తరలించారు. వైద్యాధికారి డాక్టర్ బాబ్జి శిశువు పరిస్థితిని పరిశీలించారు. మెరుగైన వైద్యం అందించడం కోసం శనివారం చింతపల్లి ప్రభు త్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డ వైద్యు ల పర్యవేక్షణలో ఉన్నారు. గర్భధారణ సమయంలో క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, పౌష్టికాహారం తీసుకోవడం ఎంత అవసరమో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. -
క్రమశిక్షణతో మెలగాలి
● సబ్ కలెక్టర్ సాహిత్, డీఎస్పీ సాయిప్రశాంత్ రంపచోడవరం: యువత మంచి క్రమశిక్షణతో మంచి లక్ష్యాలను నిర్ధేశించుకుని వాటిని సాధించేందుకు కష్టపడాలని సబ్ కలెక్టర్ సాహిత్, రంపచోడవరం సాయిప్రశాంత్ సూచించారు. అభ్యుదయం కార్యక్రమంలో భాగంగా స్థానిక అంబేద్కర్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పీఎంఆర్సీ వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఏజెన్సీలో ఎక్కడా గంజాయి లేకుండా పోలీసుశాఖ చర్యలు చేపట్టిందని, అక్కడక్కడ జరుగుతున్న రవాణాపై కూడా ప్రత్యేకదృష్టి పెట్టి అడ్డుకట్ట వేస్తున్నామని డీఎస్పీ పేర్కొన్నారు. డ్రగ్స్, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పాఠశాలలు, కళాశాలల్లో యువతకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బాలాజీ, సీఐ సన్యాసినాయుడు, ఎస్ఐ వెంకట్రావు పాల్గొన్నారు. -
తాళపత్రాలకు నవ వైభవం
అక్షర సేద్యంలో ‘క్షీర సాగర్’ మథనం తాటాకుపై లిఖించిన గోవింద నామాలు సవాళ్లను అధిగమించి సాధించిన అమృతం క్షీర సాగరాన్ని మథిస్తే అమృతం లభించినట్లుగానే, తన మనసును మథించిన క్షీర సాగర్.. తాటాకుపై అక్షరాలను లిఖించే విధానాన్ని నేటి కాలానికి అనుగుణంగా మార్చారు. పూర్వం తాటాకుపై ఘంటంతో రాసేవారు. ఆ విద్య తెలిసిన వారు ఇప్పుడు కరువవడంతో, ఆయన ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషించారు. ఢిల్లీలో జరిగిన ప్రింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక లేజర్ మిషన్ను చూసిన ఆయనకు అద్భుతమైన ఆలోచన వచ్చింది. నేమ్ బోర్డుల తయారీకి వాడే ఆ యంత్రాన్ని తాటాకుపై అక్షరాల ముద్రణకు వీలుగా మార్పులు చేశారు. ఎన్నో ప్రయోగాల తర్వాత అత్యంత స్పష్టంగా అక్షరాలను ముద్రించడంలో విజయం సాధించారు. ప్రాచీనతకు ఆధునికత మేళవించి.... విజయనగరం జిల్లా ఎల్.కోట పరిసరాల నుంచి సేకరించిన తాటాకులను శుభ్రం చేసి, నిర్ణీత కొలతల్లో కత్తిరిస్తారు. వాటిపై లేజర్ సాయంతో ఆధ్యాత్మిక స్తోత్రాలు, శ్లోకాలు, దేవతా రూపాలను ముద్రిస్తారు. ఈ తాళపత్రాలు ఏళ్ల తరబడి పాడవకుండా పసుపు, ప్రత్యేకమైన కోటింగ్ వేస్తారు. వీటిని చూడగానే పాతకాలపు జ్ఞాపకాలు గుర్తుకు రావడమే కాకుండా, చదవడానికి ఎంతో సులువుగా ఉంటున్నాయి. హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామం, గాయత్రి మంత్రం వంటి వాటిని తాళపత్రాల రూపంలో సిద్ధం చేసి అపురూప బహుమతులుగా అందిస్తున్నారు. ప్రధాని చేతుల మీదుగా అవార్డు... ప్రధాని చేతుల మీదుగా ‘శ్రమ శ్రీ’ క్షీర సాగర్ ప్రతిభ కేవలం ఈ కళకే పరిమితం కాలేదు. గతంలో నేవల్ డాక్యార్డ్లో పనిచేసిన ఆయన.. వృత్తి పట్ల చూపిన అంకితభావానికి 2003లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పాయ్ చేతుల మీదుగా ‘శ్రమ శ్రీ’ అవార్డును అందుకున్నారు. అలాగే నావికాదళ అధికారుల నుంచి అనేక ప్రశంసలు పొందారు. సాహస యాత్రలు, ట్రెక్కింగ్, సైక్లింగ్ వంటి అభిరుచులతో పాటు అనేక రక్తదాన శిబిరాలు నిర్వహించి సామాజిక బాధ్యతను చాటు కున్నారు. తాటాకుపై ఆహ్వాన పత్రిక మార్పు తన ఇంటి నుంచే మొదలవ్వాలని భావించిన సాగర్, తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రాలను తాటాకుపైనే ముద్రించి అతిథులను ఆశ్చర్యపరిచారు. పెళ్లికి వచ్చిన వారికి మొక్కలను బహుమతిగా ఇచ్చి ప్రకృతిపై తనకు న్న ప్రేమను చాటుకున్నారు. చివరికి తన పదవీ విరమణ రోజున కూడా 500 పండ్ల మొక్కలను పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణలో తనవంతు పాత్ర పోషించారు. కనుమరుగవుతున్న తాళపత్ర కళను నేటి తరానికి చేరువ చేస్తూ, ప్రకృతిని ప్రేమిస్తూ ఆయన సాగిస్తున్న ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం. నేటి డిజిటల్ యుగంలో అక్షరం కాగితంపై నుంచి తెరపైకి మారిపోయింది. పుస్తకం కంటే స్మార్ట్ఫోనే ప్రాణప్రదంగా మారిన ఈ కాలంలో మన పూర్వీకుల అపార జ్ఞాన నిధులైన తాళపత్రాల (తాటాకు గ్రంథాలు) గురించి నేటి తరానికి అసలు అవగాహనే లేదు. అపారమైన వారసత్వ సంపదగా విరాజిల్లిన ఈ తాళపత్ర కళ కనుమరుగవుతున్న తరుణంలో, దానికి ఆధునిక సొబగులు అద్ది పునర్జీవం పోస్తున్నారు విశాఖకు చెందిన కేశవరాజు క్షీర సాగర్. ప్రకృతిపై మమకారం, సంస్కృతిపై గౌరవం ఆయన్ని ఈ వినూత్న మార్గంలో నడిపించాయి. –ఏయూక్యాంపస్ నేటి తరానికి తెలియజేయాలని.. శతాబ్దాలుగా మన దేశంలో ఉన్న తాళపత్రాలు నేటి తరానికి తెలియజేయాలనే ప్రయత్నించా. మన సంస్కృతి, ప్రకృతితో ముడిపడిన మన జీవన విధానం నేటి యువతకు పరిచయం చేస్తున్నా.. భవిష్యత్తులో అనేక గ్రంథాలను తాళపత్రాలపై ముద్రించాలనే ఆలోచన ఉంది. మరుగున పడిపోతున్న కళను సంరక్షించడం, ఆధునికతను దానికి జోడించే చిన్న ప్రయత్నం చేస్తున్నా. ఎంతో ఓపికతో సమయం తీసుకుని వీటిని సిద్ధం చేయాల్సి ఉంటుంది. మా కుటుంబలో జరిగే అన్ని శుభకార్యాలకు తాటాకుతో చేసిన ఆహ్వానాలు అందిస్తున్నాం. వీటిని తీసుకున్నవారు కూడా ఎంతో జాగ్రత్తగా భద్రపరచుకుంటున్నారు. –కె. క్షీర సాగర్, అక్కయ్యపాలెం -
పర్యాటక సౌరభం
మన్యం ప్రాంతం పర్యాటకుల సందడితో కళకళలాడుతోంది. ముఖ్యంగా డిసెంబర్ నెలలో పర్యాటకుల రాక గణనీయంగా పెరగడంతో పర్యాటక శాఖ, పాడేరు ఐటీడీఏకు భారీ ఆదాయం సమకూరింది. ప్రకృతి అందాలను వీక్షించేందుకు సందర్శకులు పోటెత్తడంతో స్థానిక పర్యాటక కేంద్రాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఈ రికార్డు స్థాయి రాకతో అటు ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాకుండా, ఇటు స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడి మన్యం ఆర్థికంగా పుంజుకుంటోంది. బొర్రా గుహలకు భారీగా తరలివస్తున్న సందర్శకులుకలిసొచ్చిన 2025పర్యాటకుల రద్దీ బాగున్నప్పటికీ, గత ఏడాదితో పోలిస్తే ఆదాయంలో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. 2024 ఏప్రిల్ – డిసెంబర్ మధ్య రూ. 4,86,66,977 ఆదాయం వచ్చింది. 2025లో అదే సమయానికి రూ. 4,50,15,050 వచ్చింది. అయితే గతేడాది కంటే ఈ ఏడాది రూ.36,51,920 ఆదాయం తగ్గింది. తుపాను ప్రభావం వల్ల సుమారు 52,170 మంది వరకు సందర్శకుల సంఖ్య తగ్గింది. – గౌరీశంకర్, మేనేజర్, బొర్రా గుహలు రోజుకు రూ.వెయ్యి ఆదాయం మాడగడ నుంచి సన్రైజ్ వ్యూపాయింట్ వరకు ప్రతీ రోజు ఆటోలో పర్యాటకులకు తీసుకువెళ్లి తీసుకువస్తుంటా. తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు పర్యాటకులను తీసుకువెళ్తుంటా. ఆయిల్ ఖర్చులు పోగా రోజుకు రూ.వెయ్యి వరకు ఆదాయం వస్తుంది. – మాదల బారికి గెన్ను, ఆటో డ్రైవర్, మాడగడ, అరకులోయఅరకులోయ టౌన్: మంచు దుప్పటి కప్పుకున్న అరకు ప్రాంత అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. 2025 ముగింపు వేళ అరకు, అనంతగిరి, డుంబ్రిగుడ మండలాల్లోని పర్యాటక కేంద్రాలు జనసందోహంతో కిటకిటలాడాయి. అక్టోబర్లో తుపా ను ప్రభావంతో కాస్త వెనుకబడిన పర్యాటకం, నవంబర్, డిసెంబర్ నెలల్లో పుంజుకుని పర్యాటక శాఖకు, పాడేరు ఐటీడీఏకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఒక్క నెలలోనే రూ. 2.35 కోట్లు.. గత ఏడాది డిసెంబర్ ఒకటి నుంచి 31 వరకు సుమారు 3,76,296 మంది పర్యాటకులు మన్యంలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. వీరి ద్వారా ప్రవేశ రుసుం రూపంలో రూ. 2,35,91,610 ఆదాయం సమకూరింది. ఇందులో సింహభాగం బొర్రా గుహల నుంచి రావడం విశేషం. ఆదాయ వివరాలు: బొర్రా గుహలను 1,78,571 మంది సందర్శించగా రూ. 1.25 కోట్లు సమకూరింది. గిరిజన మ్యూజియాన్ని 1,08,044 మంది సందర్శించగా రూ. 64.75 లక్షల ఆదాయం వచ్చింది. చాపరాయి జలవిహారిని 54,561 మంది సందర్శించగా రూ. 20.29 లక్షలు సమకూరింది. పద్మాపురం గార్డెన్ను 35,120 మంది సందర్శించారు. రూ. 30.86 లక్షల ఆదాయం వచ్చింది. ఉపాధికి కేరాఫ్ అడ్రస్ ‘మాడగడ’ ఈ ఏడాది అరకులోయ మండలంలోని మాడగడ సన్రైజ్ వ్యూ పాయింట్ పర్యాటకుల హాట్ స్పాట్గా మారింది. ఇక్కడ సుమారు 300 గిరిజన కుటుంబాలు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నాయి. పర్యాటకులకు గిరిజన సంప్రదాయ దుస్తులు అలంకరించడం, థింసా నృత్యాలు, స్థానిక తినుబండారాల విక్రయాల ద్వారా మహిళలు, యువత మంచి ఆదాయం గడిస్తున్నారు. అరకు పర్యాటకానికి కాసుల పంట పెరుగుతున్న తాకిడి ఒక్క డిసెంబర్ నెలలోనే 3,76,296 మంది సందర్శన రూ.2,35,91,610 ఆదాయం -
మోసం!
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా, గిరిజన ప్రాంతాల్లో గృహ నిర్మాణాలపై ఇచ్చిన కీలక హామీ అమలుకు నోచుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఇళ్లకు అదనంగా రూ. లక్ష ప్రోత్సాహకం అందిస్తామని ఆయన స్వయంగా ప్రకటించారు. అయితే, నేటికీ ఆ నిధులు విడుదల కాకపోవడంతో ఏజెన్సీ ప్రాంతంలోని వేలాది మంది గిరిజనులు ఇబ్బందుల్లో కూరుకుపోయారు. సొంత నిధులు వెచ్చించి, అప్పులు చేసి పునాదులు, గోడల వరకు నిర్మించిన లబ్ధిదారులు.. ఇప్పుడు ప్రభుత్వ సాయం అందక పైకప్పులు వేయలేక ఇళ్లను మధ్యలోనే వదిలేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడంతో గిరిజన గూడాల్లో అసహనం వ్యక్తమవుతోంది.లక్షణమైనసాక్షి, పాడేరు: చంద్రబాబు ప్రభుత్వం గిరిజనులను నిలువునా వంచించింది. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన గృహ నిర్మాణాలకు అదనంగా రూ.లక్ష ప్రోత్సాహకం అందిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ నెలలు గడిచినా అమలుకు నోచుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పైసా సాయం అందకపోవడంతో ఏజెన్సీ ప్రాంతంలోని వేలాది ఇళ్ల నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. అప్పుల ఊబిలో.. కేంద్ర ప్రభుత్వం పీఎం జన్మన్ పథకం కింద ఒక్కో ఇంటికి రూ.2.39 లక్షలు, పీఎం గ్రామీణ్ కింద రూ.1.80 లక్షలు అందిస్తోంది. అయితే, ప్రస్తుతం ఉన్న ధరల దృష్ట్యా శ్లాబ్తో కూడిన పక్కా ఇళ్ల నిర్మాణానికి ఈ నిధులు ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.లక్ష ఇస్తామని ప్రకటించడంతో గిరిజనులు ఉత్సాహంగా పనులు మొదలుపెట్టారు. తీరా నిర్మాణాలు కీలక దశకు చేరుకున్నాక రాష్ట్ర సాయం అందకపోవడంతో గిరిజనులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ● పీఎం జన్మన్ గృహాలు జిల్లాలో (రంపచోడవరంతో కలిపి) 36,223 మంజూరయ్యాయి. ఇవన్నీ పీవీటీజీ గిరిజనులు నిర్మించుకుంటున్నారు. వివిధ తెగల గిరిజనులకు సంబంధించి పీఎం గ్రామీణ్ పథకంలో 17,111 ఇళ్లు మంజూరయ్యాయి. నిధుల కొరత కారణంగా వీటిలో పది వేల ఇళ్లు శ్లాబ్ దశలోనే ఆగిపోయాయి. తప్పని ఎదురుచూపులు అష్టకష్టాలు పడి అప్పులు చేసి ఇళ్లు పూర్తి చేసుకున్న వారికి కూడా ప్రభుత్వం మొండిచేయి చూపింది. 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి సుమారు 4,891 మంది గిరిజనులు ఇళ్లు పూర్తి చేసుకుని గతేడాది నవంబర్ 12న గృహ ప్రవేశాలు కూడా చేశారు. ఆర్భాటంగా పాల్గొన్న కూటమి నేతలు, అధికారులు సాయం అందిస్తామని నమ్మబలికారు. గృహ ప్రవేశాలు ముగిసి రెండు నెలలు గడుస్తున్నా, ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఖాతాల్లో జమ కాకపోవడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రకటనలకే పరిమితమైన చంద్రబాబు ప్రభుత్వం, తక్షణమే స్పందించి గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.లక్ష ప్రోత్సాహకాన్ని విడుదల చేయాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు.బురుగుచట్టులో పూర్తికాని పీఎం జన్మన్ఇంటి వద్ద గెమ్మెలి చిలకమ్మప్రభుత్వానికి నివేదిక పీఎం జన్మన్, పీఎం గ్రామీణ్ ఇళ్ల నిర్మాణాలకు సంబంధంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష సాయం వేగంగా అందేలా చర్యలు తీసుకుంటున్నాం. లబ్ధిదారుల సమగ్ర వివరాలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. నిధులు విడుదల అవ్వగానే ఆయా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రోత్సాహక సాయం జమ అయ్యేలా చర్యలు తీసుకుంటాం. లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించాలి. – బి.బాబునాయక్, ఇన్చార్జి పీడీ, గృహ నిర్మాణ సంస్థ రూ.లక్ష సాయం అందలేదు పీఎం జన్మన్ పథకంలో మంజూరైన ఇల్లుకు సంబంధించి నిర్మాణాన్ని అష్టకష్టాలు పడి పూర్తి చేశా. కేంద్ర ప్రభుత్వం రూ.2.39 లక్షల బిల్లు మంజూరు చేసినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన రూ.లక్ష సాయం అందలేదు.మా గ్రామంలో కలెక్టరే స్వయంగా వచ్చి గృహ ప్రవేశాలు జరిపారు. అయినప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన సాయం అందక ఇబ్బందులు పడుతున్నాం. – మర్రి లక్ష్మి, సప్పిపుట్టు, వంతాడపల్లి పంచాయతీ, పాడేరు మండలం ఇంటి పని ఆగిపోయింది గృహ నిర్మాణానికి కేంద్రం ఇచ్చే రూ.2.39 లక్షలు చాలడం లేదు. దాచుకున్న నగదుతో పాటు రెండు విడతలుగా అందిన రూ.1.60 లక్షలతో శ్లాబ్ వరకు నిర్మాణం పూర్తి చేశా. రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష ఇస్తే ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతుంది. ఆర్థిక ఇబ్బందులతో ఇంటి నిర్మాణం నిలిచింది. నిర్మాణం పూర్తయితేనే పీఎం జన్మన్ పథకం ఫైనల్ బిల్లు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. – మర్రి లింగేష్, జీడిపగడ, వనుగుపల్లి పంచాయతీ, పాడేరు మండలం -
అవకాశాలను అందిపుచ్చుకోవాలి
పాడేరు : గిరిజన విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకొని అనుకున్న లక్ష్యాలను సాధించాలని ఇన్చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ సూచించారు. 2025లో నిర్వహించిన ఎన్ఐటీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సీటు సాధించిన అనంతగిరి మండలం కొత్తూరు పంచాయతీ శివలింగపురం గ్రామానికి చెందిన శెట్టి అఖిల్ అనే గిరిజన విద్యార్థికి శుక్రవారం ఐటీడీఏ కార్యాలయంలోని తన ఛాంబర్లో ల్యాప్టాప్ను ఆమె అందజేశారు. గిరిజన విద్యార్థి అఖిల్ ఎన్ఐటీ పరీక్షల్లో 96 శాతం మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనబరచడం గొప్ప విషయమన్నారు. అసోం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజిలో అత్యంత డిమాండ్ ఉన్న సీఎస్ఈ విభాగంలో సీటు దక్కించుకున్నాడని చెప్పారు. గిరిజన విద్యార్థుల్లో అపారమైన ప్రతిభ దాగి ఉందని సరైన ప్రోత్సహంతోనే అది బయటపడుతుందన్నారు. ఉన్నత చదువుల్లో మెరుగ్గా రాణించి మంచి ఉద్యోగంలో స్థిరపడాలని ఆమె ఆకాక్షించారు. ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, ఏవో హేమలత పాల్గొన్నారు. ఇన్చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ఎన్ఐటీలో సీటు సాధించిన గిరిజన విద్యార్థికి అభినందన ల్యాప్టాప్ అందజేత -
ట్రూ అప్
అండ్ డౌన్ దోపిడీ కోసం..ట్రూ అప్ పేరుతో రూ.7,790.16 కోట్లు గుంజేందుకు ప్లాన్ ఏపీఈఆర్సీ పరిశీలన అనంతరం తేల్చిన లెక్కలు ● ట్రూఅప్ చార్జీలుగా వసూలు చేయాల్సింది – 0 ● ఇతర ఖర్చులు (బిల్లు బకాయిలు, రుణాలు, డిస్కౌంట్స్) రూ.3,887.28 కోట్లు ● క్యారియింగ్ కాస్ట్ రూ.2,113.24 కోట్లు ● రిటైల్ సప్లయ్ టారిఫ్ వ్యయంపై ట్రాన్స్మిషన్ లిమిటేషన్ రూ.6.49 కోట్లు ● మొత్తం ట్రూఅప్ నుంచి తొలగించాల్సిన ఖర్చులు రూ.6,007.01 కోట్లు ● 4వ కంట్రోల్ పీరియడ్లో వసూలు చేయాల్సిన ట్రూఅప్ చార్జీలు రూ.1,783.15 కోట్లు ● ప్రభుత్వమే భరించాలని చెప్పిన ట్రూ అప్ చార్జీలు రూ.1,783.15 కోట్లుసాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలైన డిస్కమ్ల ద్వారా ప్రజల నుంచి భారీగా వసూళ్ల పర్వానికి చంద్రబాబు ప్రభుత్వం వేసిన పాచిక పారలేదు. ట్రూ అప్ చార్జీల పేరుతో వినియోగదారుల నెత్తిన రూ.వేల కోట్లు వడ్డించేందుకు చేసిన ప్రయత్నాలకు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) బ్రేక్ వేసింది. ముఖ్యంగా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ వ్యవస్థ (ఏపీఈపీడీసీఎల్) కాకిలెక్కలతో జనం జేబులకు చిల్లు పెట్టాలని చూసింది. గడిచిన ఐదేళ్లకు సంబంధించిన ఖర్చుల సర్దుబాటు(ట్రూఅప్) పేరుతో వినియోగదారుల నుంచి ఏకంగా రూ.7,790.16 కోట్లు పిండుకోవాలని భావించింది. అయితే ఏపీఈఆర్సీ రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు లెక్కల బండారాన్ని బయటపెట్టింది. డిస్కమ్ల అడ్డగోలు ఖర్చులను ట్రూ అప్ పేరుతో జనంపై ఎలా రుద్దుతారని, ఇందులో రూ.6,007.01 కోట్లు అర్హతలేనివంటూ స్పష్టం చేసింది. మిగిలిన డబ్బులు కూడా ప్రభుత్వమే డిస్కమ్లకు చెల్లించాలని తెగేసి చెప్పింది. అంతా లోపభూయిష్ట లెక్కలు ఏపీఈపీడీసీఎల్ చూపిన లెక్కల్లో వసూలు కాని బాకీలు, ఇతర నిర్వహణ ఖర్చుల కింద చూపిన మొత్తమే రూ.వేల కోట్లలో ఉంది. కేవలం ఇతర ఖర్చులు, వడ్డీల పేరుతో చూపిన రూ.3,887 కోట్లను ఏపీఈఆర్సీ నిర్దాక్షిణ్యంగా తిరస్కరించింది. దీన్ని బట్టి సంస్థలో ఆర్థిక క్రమశిక్షణ ఈపీడీసీఎల్లో ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సంస్థ అసమర్థత, నిర్వహణ లోపాలకు అయిన ఖర్చుల్ని ‘ట్రూ–అప్’ పేరుతో జనం జేబులోంచి లాగేయాలని అనుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా అంచనాలకు, వాస్తవాలకు మధ్య కొంత వ్యత్యాసం ఉంటుంది. కానీ ఈపీడీసీఎల్ విషయంలో ట్రూఅప్ పేరుతో అడిగిన రూ.7,790 కోట్లకు.. ఏపీఈఆర్సీ ఆమోదించిన రూ.1,783 కోట్లకు మధ్య ఏకంగా రూ. 6,007.01 కోట్ల వ్యత్యాసం ఉండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత భారీ మొత్తంలో అనర్హమైన ఖర్చులను ట్రూ అప్ పేరుతో ఎందుకు క్లెయిమ్ చేసుకోవాలని ఈపీడీసీఎల్ భావించిందనే దానిపై ఈఆర్సీ మొట్టికాయలు వేసింది. అందులో అర్హత లేని ఖర్చులు రూ.6,007.01 కోట్లుగా గుర్తించిన ఏపీఈఆర్సీ మిగిలిన రూ.1,783.15 కోట్లు ప్రభుత్వమే చెల్లించాలని ఆదేశం ఇంతకీ ఈ తప్పుడు లెక్కల బాధ్యులెవరు? ఈపీడీసీఎల్ చూపించిన గణాంకాలు నాలుగో కంట్రోల్ పీరియడ్(సీపీ)లో ట్రూ అప్ చార్జీలు రూ.5,684.58 కోట్లు క్యారియింగ్ కాస్ట్ రూ.2113.24 కోట్లు మొత్తం రూ.7,797.82 కోట్లు గతంలో ఈఆర్సీ ఇచ్చిన ఉత్తర్వుల ద్వారా సర్దుబాటు చేసినవి రూ.7.65 కోట్లు మొత్తంగా ట్రూఅప్ పేరుతో ప్రజల నుంచి వసూలు చేయాలనుకున్నది రూ.7,790.16 కోట్లు వాతలు కప్పిపుచ్చుకునేందుకు కొత్తనాటకం! ట్రూ అప్ పేరుతో జనం నెత్తిన భారం మోపాలని అనుకున్న చంద్రబాబు ప్రభుత్వానికి ఏపీఈఆర్సీ వాతలు పెట్టింది. రూ.6,007.01 కోట్లు అర్హతలేనివని తేల్చడంతోపాటు రూ.1,783.15 కోట్లు కూడా ప్రభుత్వమే భరించాలని ఆదేశాలు జారీ చేసింది. ట్రూ అప్ పేరుతో ఏకంగా రూ.7,790 కోట్లను ప్రజల నుంచి వసూలు చేసి సంపద సృష్టించామని చెప్పాలనుకున్నా కుదరకపోవడంతో ఈ విషయం ప్రజల్లోకి వెళ్లకుండా ప్రభుత్వం కొత్త ఎత్తుగడ మొదలు పెట్టింది. ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం మొత్తం భరిస్తోందంటూ హడావుడి చేస్తోంది. దీనిపై మంత్రులు కూడా గొప్పలు చెప్పడం హాస్యాస్పదంగా మారింది. ఏపీఈఆర్సీ ఆమోదించిన రూ.1,783 కోట్ల ట్రూ అప్ చార్జీలను ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ డబ్బులు తామే చెల్లిస్తున్నామంటూ చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా.. ఆ చెల్లించేది కూడా పరోక్షంగా ప్రజల పన్నుల డబ్బు నుంచే కదా అని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. -
జూన్ నాటికి సీలేరు రోడ్డు పనులు పూర్తి
ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు పనులు రోడ్డు పనులను పరిశీలిస్తున్నఆర్అండ్బీ ఈఈ బాలసుందరబాబు సీలేరు: గూడెంకొత్తవీధి నుంచి సీలేరు మీదుగా అంతర్రాష్రాలకు వెళ్లే ధారాలమ్మ ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు జూన్ నాటికి పూర్తవుతాయని ఆర్అండ్బీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జయరాజ్ తెలిపారు. అంతర్రాష్ట్ర రహదారి దుస్థితిపై ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన ‘ప్రయాణం..భయం భయం’ కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గూడెం కొత్తవీధి మండలం ఆర్వీ నగర్ నుంచి లంకపాకల గ్రామం వరకు రూ.8.70 కోట్లు, అలాగే రైన్ గేజ్ నుంచి ధారాలమ్మ ఆలయం వరకు రూ. 2.95 కోట్లు, సీలేరు నుంచి పాలగడ్డ వరకు రూ.2 కోట్ల మేర ఎస్డీఎంఎఫ్ ద్వారా నవంబర్, 2024లో నిధులు మంజూరైనట్టు పేర్కొన్నారు. అయితే ఈ రహదారిని మూడు భాగాలుగా ఒకే కాంట్రాక్టర్ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన తెలిపారు. ఆర్వీ నగర్ నుంచి లంకపాకల గ్రామాల మధ్య అక్టోబర్లోనే పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రస్తుతం పనులు పురోగతిలో ఉన్నాయని, ఒప్పందం ప్రకారం జూన్ నెలాఖరుకు అన్ని పనులు పూర్తవుతాయని ఆయన పేర్కొన్నారు. -
సమస్యలు పరిష్కారం వేగవంతం
● ఇన్చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ● మీకోసం పీజీఆర్ఎస్కు 79 వినతులు పాడేరు : మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో స్వీకరించిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని గడువులోగా పరిష్కారం చేయాలని ఇన్చార్జి జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి పలు సమస్యలపై 79 వినతులను స్వీకరించారు. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో అధికంగా రెవెన్యూ, వైద్యారోగ్య, డీఆర్డీఏ శాఖలకు సంబంధించిన అర్జీలు అధికంగా వస్తున్నాయన్నారు. ఆయా శాఖల అధికారులు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మండల స్థాయి అధికారులు దిగువ స్థాయి సిబ్బందిని సమన్వయం చేసుకోవాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అర్జీదారులు 1100 మీకోసం కాల్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో అంబేడ్కర్, ఇంచార్జీ ఆర్డీవో లోకేశ్వరరావు, టీడబ్ల్యూ డీడీ పరిమళ, డీఆర్డీఏ పీడీ మురళి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి నంద్, డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణమూర్తి నాయక్, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు
రంపచోడవరం: స్థానిక ఐటీడీఏ పరిధిలోని గిరిజన విద్యాలయాల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నివేదికలు సమర్పించాలని ఐటీడీఏ పీవో బచ్చు స్మరణ్రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, ఏకలవ్య మోడల్ స్కూళ్ల ప్రహరీల మరమ్మతులు, కొత్త ప్రహరీల నిర్మాణం, ఆర్వో ప్లాంట్ల ఏర్పాటు, మరుగుదొడ్లు, సిక్ రూమ్ల మరమ్మతులు, రన్నింగ్ వాటర్ సదుపాయానికి సంబంధించి నివేదికలు సమర్పించాలన్నారు. విద్యార్థుల ఐడీ, ఆధార్ కార్డుల్లో తప్పులు సరిచేయించాలన్నారు. అవసరమైన చోట్ల మొబైల్ ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించేందుకు డ్రాయింగ్, క్విజ్,్ గ్రూప్ డ్యాన్సులు నిర్వహించాలన్నారు. ప్రతిభ కనబరిచిన వారికి మండలస్థాయి, తరువాత ఐటీడీఏ స్ధాయిలో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. రిప్లబిక్ డేకు ఈ పోటీల్లో ఎంపికై న విద్యార్ధులను రంపచోడవరం తీసుకురావాలన్నారు. పోటీలు ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు మాత్రమే నిర్వహించాలన్నారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మాస్ కాఫీయింగ్కు అవకాశం లేకుండా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పదో తరగతి విద్యార్థులకు పరీక్షల విధానంపై అవగాహన కల్పించాలన్నారు. అలాగే వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో ఏపీవో డీఎన్వీ రమణ, ఏజెన్సీ డీఈవో వై మల్లేశ్వరరావు, ఏటీడబ్ల్యూవోలు బి. చిన్నిబాబు, కృష్ణమోహన్, జె శంభుడు పాల్గొన్నారు.రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్రాజ్ -
జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకుఇద్దరు ఎంపిక
నర్సీపట్నం: జాతీయ స్థాయి మహిళా బాక్సింగ్ టోర్నమెంట్కు నర్సీపట్నానికి ఇద్దరు సీనియర్ మహిళలు ఎంపికయ్యారు. ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు న్యూఢిల్లీ లోని గ్రేటర్ నోయిడాలో జరిగే ఈ పోటీల్లో 75 కేజీల విభాగంలో బొంతు మౌనిక, 80 కేజీల విభాగంలో యర్రా తేజస్విని పాల్గొననున్నారు. గత నెల కాకినాడ జిల్లాలో జరిగిన 9వ రాష్ట్ర స్థాయి మహిళల బాక్సింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించారని కోచ్ అబ్బు తెలిపారు. నేషనల్ స్థాయిలో ఇద్దరు విజయాలు సాధించి నర్సీపట్నానికి పేరు ప్రఖ్యాతులు తేవాలని ఆకాంక్షించారు. నింజాస్ అకాడమీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు సతాపల్లి శ్రావణి, వెలగా నారాయణరావు, వెలగా జగన్నాథ్, శ్రీకాంత్, సురేష్ అకాడమి తరుపున ట్రాక్ సూట్లు అందజేశారు. -
వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్య
చింతూరు: మద్యం మత్తులో ఒకరు, కడుపునొప్పి తాళలేక మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు ఎస్ఐ రమేష్ కథనం మేరకు ఇలా ఉన్నాయి. మండలంలోని బొడ్రాయిగూడెంకు చెందిన శ్యామల రామయ్య(38) తీవ్రమైన కడుపునొప్పిని తాళలేక శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేనిసమయంలో పిట్టల మందు తాగాడు. భార్య లక్ష్మి సాయంత్రం ఇంటికి వచ్చి అపస్మారక స్థితిలో పడివున్న భర్తను గమనించి బంధువుల సాయంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించింది. రామయ్య ఆసుపత్రిలో చికిత్సపొందుతూ రాత్రి మృతిచెందినట్లు ఎస్ఐ తెలిపారు. మద్యం మత్తులో.. మండలంలోని సూరకుంటకు చెందిన తోడం ముద్దరాజు (16) గతనెల 30న పూటుగా మద్యం సేవించాడు. మద్యం మత్తులో ఇంట్లో ఉంచిన పురుగు మందును సేవించినట్లు ఎస్ఐ తెలిపారు. దీంతో ముద్దరాజు అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన అతని నానమ్మ తోటివారి సాయంతో ఏడుగురాళ్లపల్లి ఆసుపత్రికి తరలించింది. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యంకోసం భద్రాచలం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు ఎస్ఐ తెలిపారు. రామయ్య, ముద్దరాజు మృతదేహాలు -
ఆటో, బైక్ ఢీ– ఆరుగురికి గాయాలు
● తీవ్ర గాయాలైన నలుగురికి విశాఖ కేజీహెచ్కు తరలింపు ● స్వల్పగాయాలైన ఇద్దరికి అరకు ఏరియా ఆస్పత్రిలో చికిత్సఅరకులోయటౌన్: అరకు–విశాఖ రోడ్డులో పానిరంగిని గ్రామం వద్ద శుక్రవారం ఎదురెదురుగా వస్తున్న ఆటో–బైక్ ఢీకొన్నాయి. ఈ సంఘటనలో నలుగురికి తీవ్రగాయాలు కాగా ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. ప్రమాద సంఘటనకు సంభందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో బస్కీ పంచాయతీ దేవరాపల్లి నుంచి అరకులోయకు వస్తున్న ఆటో, అరకులోయ నుంచి విశాఖ వైపు వెళ్తున్న బైక్ ఢీ కొన్నాయి. బైక్పై వెళ్లున్న మండలంలోని రవ్వలగుడ గ్రామానికి చెందిన బురిడి జోయో(31)కు ఎడమ చెయ్యి విరిగింది. డుంబ్రిగుడ మండలం సాగర పంచాయతీ కుసుమగుడ గ్రామానికి చెందిన కొర్రా కృష్ణ(29)కు మొహాం, కుడి చెయ్యి, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న బస్కీ పంచాయతీ దేవరాపల్లికి చెందిన బాక అనిల్ కుమార్(16)కు కుడి చెవి నుంచి రక్తస్రావమవుతుంది. దేవరాపల్లికి చెందిన కిల్లో సల్మాన్(17)కు నడుముపై బలమైన గాయమైంది. అదే ఆటోలో ప్రయాణిస్తున్న అరకులోయ మండలం మాదల గ్రామానికి చెందిన పాంగి బంగార్రాజు(25)కు కుడి భుజం, తల వెనుక భాగం, బస్కీ పంచాయతీ దుంగియాపూట్కు చెందిన పాంగి హరిత(18)కు కుడికాళ్లుల, తలపై స్వల్పగాయాలైంది. తీవ్రగా యాలైన కొర్రా కృష్ణ, బి.అనిల్ కుమార్, సల్మాన్, జోయోలకు మెరుగైన వైద్యం కొసం విశా ఖ కేజిహెచ్కు తరలించినట్లు వైద్యులు గీత, బాలాజీ తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
క్రీడా విద్యార్థుల పర్యవేక్షణకు కోచ్లు, మేనేజర్ల నియామకం
పాడేరు రూరల్: జార్ఖండ్లోని రాంచీలో ఈనెల 6,7,8,9,10 తేదీల్లో జరిగే జాతీయ స్థాయి ఎస్జీఎఫ్ బాలుర, బాలికల క్రీడా పోటీల్లో క్రీడా విద్యార్థుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా నలుగురు ఉపాధ్యాయులను నియమించినట్టు ఎస్జీఎఫ్ క్రీడా జిల్లా కార్యదర్శి పాంగి సూరిబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ మత్య్సరాస భూపతిరాజు ఆర్చరీ అండర్ 17 బాలికల కోచ్గా, బి.లక్ష్మీపార్వతి మేనేజర్గా, కృష్ణసాయి బాలుర అండర్ 17 కోచ్గా, మల్లన్న బాలుర జట్టుకు మేనేజర్లుగా వ్యవహరిస్తారన్నారు. -
అంబులెన్సులకుమరమ్మతులు చేపట్టాలి
● పాడేరు ఐటీడీఏ పీవోను కోరిన అరకు ఎంపీ తనూజరాణి సాక్షి,పాడేరు: ఐటీడీఏ పరిధిలో మరమ్మతులతో మూలకు చేరిన అంబులెన్స్లను వినియోగంలోకి తెచ్చేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజను అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి కోరారు. శుక్రవారం ఆమె, భర్త చెట్టి వినయ్ శుక్రవారం పీవోను మర్యాదపూర్వకంగా కలిసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాడేరు ఐటీడీఏ పరిధిలో వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై ఎంపీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అనేక పీహెచ్సీలకు చెందిన అంబులెన్స్లు చిన్నపాటి మరమ్మతులతోను ఐటీడీఏ గ్యారేజ్లో మూలకు చేరాయన్నారు. వీటి మరమ్మతులకు ఐటీడీఏ నిధులు మంజూరు చేయాలని ఎంపీ కోరారు. -
అప్పన్నకు ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి శుక్రవారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 9.30 నుంచి నిత్యకల్యాణం జరిపారు. ఆలయ కల్యాణమండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వ క్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదిత ర ఘట్టాలతో కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఘనంగా గరుడసేవ : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి గరుడసేవ ఘనంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వెండి గరుడవాహనంపై స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వేంజేపచేశారు. అష్టోత్తరశతనామావళి పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశేష హారతులు అందించారు. -
2 కేజీల గంజాయి పట్టివేత
● ముగ్గురు నిందితుల అరెస్టు గొలుగొండ: మండలంలోని ఏటిగైరంపేట గ్రామం వద్ద రెండు కిలోల గంజాయితో నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, గొలుగొండ ఎస్ఐ రామారావు తెలిపారు. ఏజెన్సీ నుంచి రెండు కిలోల గంజాయి తరలిస్తున్నట్టు అందిన సమాచారంతో దాడి చేసి పట్టుకున్నామన్నారు. చింతపల్లి మండలానికి చెందిన నిందితులు దాసరి శ్రవంత్కుమార్(30), తుపాకుల హరీష్కుమార్(22), కొవ్యూరు సుమంత్(25)లపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. కార్యక్రమంలో గొలుగొండ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.ఘనంగా తిరువీధి సేవ నక్కపల్లి: ధనుర్మాస అధ్యయనోత్సవాల్లో భాగంగా ఉపమాకవేంకటేశ్వర స్వామివారికి శుక్రవారం గజవాహనంపై తిరువీధిసేవలు నిర్వహించారు. కొండపై మూలవిరాట్కు పంచామృతాభిషేకం, నిత్యార్చనలు పూర్తిచేశారు. అనంతరం స్వామి వారి ఉత్సవమూర్తులకు, గోదాదేవి అమ్మవారికి, వేణుగోపాల స్వామివారికి పూజలు నిర్వహించారు. శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని గజవాహనంపై, గోదాదేవి అమ్మవారిని పల్లకిలో ఉంచి తిరువీధి సేవలకు తీసుకెళ్లారు. అనంతరం గోదాదేవి సన్నిధిలో తిరుప్పావై 17వ పాశురాన్ని విన్నపం చేశారు. రాపత్తు అధ్యయనోత్సవాల్లో భాగంగా వైష్ణవ స్వామి ద్రవిడ వేదపారాయణం నిర్వహించిన అనంతరం రాత్రి తిరువీధి సేవలు నిర్వహించారు. -
లక్ష్మీపురం వైద్యాధికారి తీరుపై ఆందోళన
● మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారని ఆరోపణ ● ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్కు ఫిర్యాదు ● తక్షణం బదిలీ చేయాలని డిమాండ్ చింతూరు: మహిళా ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్న లక్ష్మీపురం పీహెచ్సీ వైద్యుడితో పాటు అతనికి సహకరిస్తున్న డీఎంహెచ్వోను ఏజెన్సీ నుంచి బదిలీ చేయాలని ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం యూనియన్ ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది స్థానిక ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుష్టి జోగారావు, సలహాదారుడు మడివి నెహ్రూ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా లక్ష్మీపురం పీహెచ్సీ వైద్యుడు మురళీకృష్ణ మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారని ఆరోపించారు. డీడీవో బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన డీఎంహెచ్వో అండతో మహిళా ఉద్యోగులను అక్రమంగా బదిలీ చేస్తున్నారని, కులాన్ని ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారని వారు ఆరోపించారు. ఆదివాసీ ఉద్యోగులను చులకన భావంతో చూడడంతో పాటు మహిళా ఉద్యోగులను అక్రమంగా వేధిస్తున్న వైద్యాధికారిని వెంటనే ఇక్కడి నుంచి పంపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు, వైద్యసిబ్బంది ఐటీడీఏ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు చంద్రమ్మ, కుమారి, సమ్మక్క, నాగమణి, జయ, రాంప్రసాద్, సీతమ్మ, శశికళ, సీతమ్మ, రాజేష్, ఉత్తర, సత్యన్నారాయణ, సుందర్, విజయ్ పాల్గొన్నారు. ఐటీడీఏ పీవో విచారణ: మహిళా ఉద్యోగుల ఫిర్యాదుపై స్పందించిన ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ పుల్లయ్యతో కలసి వారి సమక్షంలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యాధికారి మురళీకృష్ణను విచారించారు. యూనియన్ నాయకులతో పాటు మహిళా సిబ్బంది నుంచి పూర్తి వివరాలు సేకరించిన ఆయన బదిలీలు, వేధింపులపై విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటానని వారికి హామీనిచ్చారు. -
భద్రాద్రి రామయ్యకుఘనంగా రాపత్తు సేవ
ఎటపాక: ముక్కోటి వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి వారికి శుక్రవారం ఘనంగా రాపత్తు సేవ నిర్వహించారు. ఈసందర్భంగా స్వామివారిని భద్రాద్రి రామాలయం నుంచి పల్లకిపై కోలాటాలతో, రంగవల్లుల మధ్య ఊరేగింపుగా మండలంలోని పురుషోత్తపట్నం రామాలయానికి తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంటపంలో స్వామి వారికి రాపత్తు సేవ నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజాకార్యక్రమాల సందర్భంగా భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి, కుందూరు రామిరెడ్డి, రామచంద్రరావు, ఆకుల శ్రీనివాస్, రవితేజ, శ్రీనివాస్, శ్రీనివాసరెడ్డి, ఏడుకొండలురెడ్డి, జయచంద్రరెడ్డి, వెంకటయ్య పాల్గొన్నారు. -
మెరుగైన బోధన అందించాలి
ఎంఈవో కృష్ణమూర్తి ముంచంగిపుట్టు: ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని ఎంఈవో కె.కృష్ణమూర్తి అన్నారు. మండలంలోని మారుమూల చీపురుగొంది, కిముడుపుట్టు, పిట్టగెడ్డ, డెంగగూడ మండల పరిషత్, జీపీఎస్ పాఠశాలలను ఎంఈవో కృష్ణమూర్తి శుక్రవారం సందర్శించారు. వాగులు, గెడ్డలు దాటుకొని ఎంఈవో అతికష్టం మీద వెళ్లారు. విద్యార్థులతో మాట్లాడి వారి వర్క్ బుక్స్ను పరిశీలించి, తప్పలను సరిదిద్దారు.విద్యార్థులకు పాఠాలు బోధించారు. పలుప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థుల ఆన్లైన్ హాజరు తప్పని సరిగా నమోదు చేయాలని, ఆన్లైన్ పనులను సైతం వెంటనే పూర్తి చేయాలని, లెసన్ ప్లాన్, ఇయర్ ప్లాన్ డైరీలను ఖచ్చితంగా పాటించాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని, చదువులో వెనకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, బడిబయట పిల్లలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని, మధ్యాహ్న భోజనాన్ని పక్కాగా అమలు చేస్తూ నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని ఎంఈవో కృష్ణమూర్తి ఉపాధ్యాయులకు సూచించారు. -
ఆటో బోల్తా – 9 మందికి గాయాలు
కొమ్మాది : ఎండాడ జాతీయ రహదారి నుంచి రుషికొండ వెళ్లే రహదారిలో డివైడర్ను ఢీకొని ఓ ఆటో బోల్తా పడింది. పీఎం పాలెం ట్రాఫిక్ పోలీస్స్టేషన్ ఆర్ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాలు.. గురువారం సాయంత్రం మధురవాడ ప్రాంతానికి చెందిన 9 మంది కుటుంబ సభ్యులు ఆటోలో రుషికొండ బీచ్కు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటో అదుపు తప్పి డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న 9 మందికి స్వల్పగాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న పలువురు ప్రయాణికులు వారిని గమనించి సహాయక చర్యలు చేపట్టారు. ఆ సమయంలో రోడ్డులో వాహనాలు ఏమి లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అదే విధంగా గురువారం తెల్లవారుజామున భీమిలి నుంచి విశాఖ వైపుగా వెళ్తున్న ఓ కారు అతి వేగంగా వచ్చి అదుపు తప్పి తిమ్మాపురం సమీపంలో డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డివైడర్ మధ్యలో ఉన్న గ్రిల్స్ ధ్వంసం కాగా డివైడర్ మధ్యలో ఉన్న చెట్టు వాలిపోయింది. కారులో ఉన్న వారికి గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు. -
తహసీల్దార్ తీరుపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం
వై.రామవరం: పోలవరం జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక రెవెన్యూ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమానికి విచ్చేసిన తమను తహసీల్దార్ వేణుగోపాల్ ఘోరంగా అవమానపరిచారని ఎంపీపీ కడబాల ఆనందరావు ఆధ్వర్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్తో పాటు ఆర్ఐ గుడ్ల వెంకటేశ్వర్లను వారు నిలదీశారు. తమకు జరిగిన అవమానానికి సమాధానం చెప్పాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంపచోడవరంలో పోలవరం జిల్లా కార్యాలయ ప్రారంభం పురస్కరించుకుని ఇక్కడి తహసీల్దార్ కార్యాలయంలో కేక్ కటింగ్ ఏర్పాటుచేశారన్నారు. దీనికి ఉదయం 11 గంటలకు రావాలని ఆహ్వానించగా తాము 10గంటలకు వచ్చామన్నారు. ఈలోపే తహసీల్ధార్ ఈ కార్యక్రమాన్ని ముగించేసి తమను ఘోరంగా అవమానించారని ఆరోపించారు. ఆయనను ప్రశ్నించగా ఎటువంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారన్నారు. ఇలా ఆయన తమను అవమానించడం రెండోసారి అని ధ్వజమెత్తారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని రంపచోడవరం సబ్కలెక్టర్ను కోరామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కర్ర వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ ముర్ల జోగిరెడ్డి, ఎంపీటీసీ వీరమళ్ల సుబ్బలక్ష్మి, వైఎస్సార్సీపీ నేతలు వెదుళ్ల తిరుపతిరెడ్డి, వి.వీరబాబు, ఎం.నారాయణరావు, పి.తమ్మిరెడ్డి, కె.అబ్బాయి, తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానించి అవమానించారని ఆవేదన రెవెన్యూ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చర్యలు తీసుకోవాలని డిమాండ్ -
పరుగులే..
పట్టించుకోకపోయినా కార్గోలోనూ పురోగతివిశాఖ విమానాశ్రయంలో ప్రయాణికులుసాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోనే అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయమైన విశాఖపట్నం ఎయిర్పోర్టు.. ప్రయాణికుల రాకపోకల్లో ఏటా గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తోంది. 2024తో పోలిస్తే, 2025లో ప్రయాణికుల రాకపోకల్లో 9శాతం వృద్ధిని సాధించింది. అంతకుముందు 2022–23తో పోల్చితే 2023–24లో ఏకంగా 22 శాతం వృద్ధి నమోదైంది. అయితే, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు అలసత్వం, ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం కారణంగా వృద్ధి రేటులో కొంత తగ్గుదల కనిపించింది. విశాఖకు రావల్సిన అంతర్జాతీయ సర్వీసులు విజయవాడ, ఇతర రాష్ట్రాలకు తరలిపోయినా.. ఎయిర్పోర్టు అధికారులు, ఎయిర్ట్రావెల్స్ అసోసియేషన్ సమన్వయంతో విమానాశ్రయాన్ని ముందుకు నడిపించి మంచి ఫలితాలు సాధించారు. 2025లో గణనీయమైన ప్రగతి 2025లో విశాఖ విమానాశ్రయం ప్రయాణికుల రద్దీ, మౌలిక వసతులు, భద్రత, సామాజిక బాధ్యత(సీఎస్సార్) వంటి రంగాల్లో మంచి ఫలితాలను రాబట్టింది. ప్రయాణికుల రద్దీలో 9 శాతం వృద్ధి నమోదైంది. నెలకు సగటున 2 లక్షల మంది వైజాగ్ ఎయిర్పోర్టు నుంచి రాకపోకలు సాగించడం విశేషం. కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు.. ఇండిగో సంక్షోభ సమస్యను వెంటనే పరిష్కరించి ఉంటే.. ప్రయాణికుల రాకపోకల వృద్ధి మరింత పెరిగే అవకాశం ఉండేది. ఆ సమయంలో నాలుగైదు రోజుల పాటు పదుల సంఖ్యలో సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2025 జనవరి నుంచి నవంబర్ వరకు ఎయిర్పోర్టు ఘనతలివీ.. ● 2025లో సుమారు 27.55 లక్షల మంది ప్రయాణించారు. 2024లో ఈ సంఖ్య 25.21 లక్షలు ● 2025 జనవరి, నవంబర్లో రద్దీ గరిష్టంగా 2.7 లక్షలకు చేరింది. ● ప్రయాణికుల కోసం ఆధునిక బేబీ కేర్ గదులు, ప్రముఖ బ్రాండ్లకు చెందిన రిటైల్ అవుట్లెట్లను ఏర్పాటు చేశారు. ● కస్టమర్ సంతప్తి సర్వే (సీఎస్ఐ)లో 4.92/5 స్కోరు సాధించింది. ఈ స్కోరుతో జాతీయ స్థాయిలో 9వ స్థానంలో ఎయిర్పోర్టు నిలవడంగమనార్హం. అంతర్జాతీయ సర్వీసులపై రాజకీయ నిర్లక్ష్యం? అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు అన్ని అర్హతలున్నా.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వైజాగ్ ఎయిర్పోర్టుకు శాపంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. 2025 మొదట్లో దుబాయ్ విమానం వైజాగ్ రాకుండా చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకొని విజయవాడకు తరలించేసింది. తర్వాత.. కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు నిర్లక్ష్యంతో వియత్నాం విమాన సర్వీసు హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయింది. డొమెస్టిక్ సర్వీసుల విషయంలోనూ అదే నిర్లిప్తంగా ఎయిర్పోర్టు వర్గాలు వ్యవహరించారు. ఆకాశా ఎయిర్లైన్స్ వైజాగ్ నుంచి సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నా, కేంద్ర మంత్రి చొరవ లేకపోవడంతో సందిగ్ధంలో పడింది. చివరకు జూన్లో అబుదాబీకి వారానికి నాలుగు రోజుల సర్వీసు ప్రారంభమైంది. చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే సింగపూర్, అబుదాబీలతో పాటు దుబాయ్, వియత్నాం సర్వీసులు కూడా నడిచేవి. ఇప్పటికై నా కేంద్ర మంత్రి, ఎయిర్పోర్టు అధికారులు స్పందించి సర్వీసుల పెంపుపై దృష్టి సారించాలని ఎయిర్ ట్రావెల్స్ అసోసియేషన్ కోరుతోంది. 2025లో విశాఖ ఎయిర్పోర్ట్ జోరు రాజకీయ సవాళ్ల నడుమ 9 శాతం వృద్ధి విశాఖ నుంచి 27 లక్షల మంది ప్రయాణం కార్గోలోనూ రికార్డులు వైజాగ్ ఎయిర్పోర్టు కార్గో టెర్మినల్లో నవంబర్ 14న సరకు రవాణా పునఃప్రారంభమైంది. సాధారణ రోజుల్లో పౌర విమానాల్లోనూ డొమెస్టిక్ కార్గో రవాణా జరిగింది. 2025 జనవరి నుంచి నవంబర్ వరకు మొత్తం 4,902.876 మెట్రిక్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ జరిగింది. ఇందులో ఎగుమతులు 1955.369 మెట్రిక్ టన్నులు కాగా, దిగుమతులు 2947.507 మెట్రిక్ టన్నులుగా నమోదయ్యాయి. మార్చిలో అత్యధికంగా 593.195 మెట్రిక్ టన్నుల సరకు రవాణా జరిగింది. ప్రతి నెలా సగటున 340 మెట్రిక్ టన్నులకు పైగా సరకు హ్యాండ్లింగ్ జరిగింది. -
తాటాకిల్లు దగ్ధం
కూనవరం: తాటాకిల్లు దగ్ధం కాగా సుమారు రూ.5 లక్షలు పైగా ఆస్తినష్టం జరిగిన సంఘటన మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని వేములపల్లి రామారావు నివాసముంటున్న తాటాకిల్లు షార్ట్సర్క్యూట్ కారణంగా గురువారం దగ్ధమైంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో సర్వం కాలిబూడిదైనట్టు బాధితుడు తెలిపారు. ప్రమాదంలో ఇంట్లో ఉన్న రూ.40వేల నగదు, బంగారపు తాడు, రిఫ్రిజరేటర్, బీరువాలు, ఫ్యాన్లు, దుస్తులు తదితర సామగ్రి మొత్తం కాలిపోయిందని బాధితుడు రామారావు వాపోయారు. ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు రూ.3లక్షలకు పైగా నష్టం జరిగి ఉంటుందని అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న జెకె ట్రస్ట్ చైర్మన్ జమాల్ఖాన్ సంఘటన స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాకి తక్షణ సహాయం కింద రూ.5000 నగదు అందజేశారు. ఇల్లు నిర్మించుకు నేందుకు పైపులు, రేకులు అందజేస్తామని అగ్నిబాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. -
మోదమ్మ ఆలయం కిటకిట
● పోటెత్తిన భక్తజనం ● దర్శించుకున్న ఇన్చార్జి జేసీ తిరుమణి శ్రీపూజసాక్షి,పాడేరు: ఉత్తరాంఽఽధ్ర ప్రజల ఆరాధ్యదేవత పాడేరులోని మోదకొండమ్మతల్లి ఆలయానికి గురువారం భక్తుల పోటెత్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇన్చార్జి జేసీ, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు సుబ్రహ్మణ్యం లోకకల్యాణార్థం కుంకుమార్చన నిర్వహించారు. నూతన సంవత్సరంలో అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విఽశ్వేశ్వరరాజు,ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు, కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. -
పర్యాటక ప్రాంతాల్లో న్యూఇయర్ జోష్
పెదబయలు: న్యూఇయర్ సందర్భంగా జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో కిక్కిరిసిపోయాయి. గురువారం నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలోని ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా జిల్లాలోని చాపరాయి, బొర్రా గుహలు, లంబసింగి, జామిగుడ, గిన్నెలకోట పంచాయతీల సరిహద్దు ప్రాంతాల్లోని తారాబు (పిట్టలబొర్ర) జలపాతాల వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. చలితీవ్రతను సైతం లెక్కచేయకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ప్రకృతి ఒడిలో ఉత్సాహంగా గడిపారు. జలపాతాల వద్ద సెల్ఫీలు దిగుతూ, కేరింతలు కొడుతూ పర్యాటకులు కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. ఆంధ్రా, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చారు. రద్దీ దృష్ట్యా పోలీసులు, పర్యాటక శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.జి.మాడుగుల: కొత్తపల్లి జలపాతానికి గురువారం పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు బస్సులు, కార్లు వివిధ వాహనాల్లో భారీగా తరలిరావడంతో కోలాహలంగా మారింది. జలపాత ప్రాంతాల్లో బండరాళ్లపైనుంచి జాలువారే ప్రవాహంలో కేరింతల కొడుతూ గంటలు తరబడి స్నానాలు చేశారు. భారీగా తరలివచ్చిన సందర్శకులు -
పుణ్యకోటి వాహనంపైపరంధాముడు
నక్కపల్లి : ఉపమాకలో ధనుర్మాస అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గురువారం నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం తరలివచ్చారు. ఉదయం స్వామివారి మూలవిరాట్కు పంచామృతాభిషేకం నిర్వహించారు. తదుపరి కొండదిగువన స్వామివారి ఉత్సవ మూర్తులకు క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామికి, గోదాదేవి అమ్మవారిని నిత్యపూజలు అర్చనలు నిర్వహించారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. తిరుప్పావై 16వ పాశురాన్ని విన్నపం చేశారు. అనంతరం శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను పుణ్యకోటి వాహనంలోను, గోదాదేవి అమ్మవారిని పల్లకిలోను ఉంచి తిరువీధిసేవ నిర్వహించారు. భక్తులు కానుకలు, పసుపు కుంకుమలు సమర్పించుకున్నారు.కొత్తసంవత్సరం సందర్భంగా వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయం రద్దీగా మారింది. ముక్కోటి ఏకాదశి అనంతరం ఆలయంలో అధ్యయనోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా రాత్రిపూట కూడా స్వామివారికి తిరువీధి సేవలు నిర్వహిస్తారు. -
బీ1 కోచ్ లెనిన్ స్టోరేజ్ నుంచే మంటలు వ్యాప్తి
యలమంచిలి రూరల్ : యలమంచిలి రైల్వేస్టేషన్ వద్ద టాటా నగర్–ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలులో జరిగిన అగ్ని ప్రమాదానికి కారణాలను వెలికితీసేందుకు దక్షిణ మధ్య రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవి నిర్వహిస్తున్న విచారణ గురువారం రెండోరోజూ కొనసాగింది. గత నెల 29వ తేదీ అర్ధరాత్రి 12.50 గంటల సమయంలో రైలు అనకాపల్లి జిల్లా యలమంచిలి రైల్వేస్టేషన్లో అగ్నిప్రమాదానికి గురైంది. రైలులో బీ1, ఎం2 భోగీల్లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి ఒకరు సజీవ దహనమైన సంగతి విదితమే. రైలు యలమంచిలి రైల్వేస్టేషన్ ఒకటో నెంబరు ప్లాట్ఫాంపై ఆగినపుడు మంటలు వ్యాపించడంతో 157 మంది ప్రయాణికులు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీనిపై ఉలిక్కిపడ్డ రైల్వేశాఖ ప్రమాదానికి మూల కారణాలను తెలుసుకునేందుకు వివిధ కోణాల్లో శోధిస్తోంది. విజయవాడ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్(ఈటీటీసీ)లో బుధ, గురువారాల్లో సేఫ్టీ కమిషనర్ చేస్తున్న విచారణలో ప్రమాదానికి సంబంధించి పలు కీలక విషయాలు రాబట్టినట్టు తెలుస్తోంది. విచారణలో భాగంగా యలమంచిలి, నర్శింగబిల్లి రైల్వేస్టేషన్లలో ఆ సమయంలో పనిచేస్తున్న వివిధ హోదాల్లో పనిచేస్తున్న రైల్వే సిబ్బందిని విజయవాడకు పిలిపించారు. అందుబాటులో ఉన్న కొందరు ప్రయాణికులను కూడా ప్రశ్నించి రాతపూర్వకంగా వివరాలు రాబట్టినట్టు సమాచారం. రైలు బీ1 బోగీలో లెనిన్ స్టోరేజ్ నుంచే మంటలు వ్యాప్తి చెందినట్టు ఇప్పటికే అధికారులు నిర్థారణకు వచ్చారు. అక్కడ్నుంచి ఒక్కసారిగా మంటలు ఎలా వ్యాప్తి చెందాయన్నది అంతు చిక్కడంలేదు. మానవ తప్పిదమా? సాంకేతిక కారణం వల్ల ప్రమాదం సంభవించిందా అన్నది తేల్చేందుకు ఎం1 బోగీలో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదికలు పూర్తయితే ప్రమాద కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా రైళ్లలో సగటున ఏడాదికి 8 అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. బ్రేక్ బైండింగ్, షార్ట్ సర్క్యూట్ వంటి సాంకేతిక లోపాలతో రైళ్లలో అగ్ని ప్రమాదాలు జరిగితే రైల్వేశాఖ నిపుణులు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. టాటా నగర్–ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలులో ప్యానెల్ బోర్డులు సురక్షితంగా ఉన్నట్టు ఇప్పటికే రైల్వేశాఖ ప్రకటించింది. ఇక మండే స్వభావం కలిగిన ప్రమాదకర వస్తువులేవైనా రైలులో ఉన్నాయా?లేక ధూమపానం కారణంగా మంటలు చెలరేగాయా?అన్నది తెలియాల్సి ఉంది. -
ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాతగ్గని చలి తీవ్రత
● దట్టంగా పొగమంచు ● పెదబయలులో 12.6 డిగ్రీల నమోదు చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ నుంచి పెరుగుతున్నప్పటికీ చలి, మంచు ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. వారం రోజులుగా ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ శీతల గాలులు విజృంభిస్తున్నాయి. దీంతో మన్యం వాసులు వణికి పోతున్నారు. గురువారం పెదబయలులో 12.6 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 12.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ● పాడేరు డివిజన్ పరిధి జి.మాడుగులలో 13.0 డిగ్రీలు, అరకువ్యాలీలో 13.2 డిగ్రీలు, పాడేరులో 13.5 డిగ్రీలు, హుకుంపేటలో 14.2 డిగ్రీలు, చింతపల్లిలో 15.5 డిగ్రీలు, కొయ్యూరులో 15.7 డిగ్రీలు నమోదు అయినట్టు ఆయన తెలిపారు. చలితీవ్రత నుంచి రక్షణ పొందేందుకు ఉన్ని దుస్తులను ఆశ్రయిస్తున్నారు. మంట కాగుతూ ఉపశమనం పొందుతున్నారు. ఉదయం వేళల్లో పది గంటల వరకు మంచు తెరలు వీడటం లేదు. రహదారులను మంచు తెరలు కమ్మేయడం వల్ల వాహనచోదకులు ఇబ్బందులు పడుతూ హెడ్లైట్ల వెలుగులో రాకపోకలు సాగిస్తున్నారు. పెదబయలు: మండలంలో చలి, మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. గురువారం ఉదయం 10 గంటల వరకు మంచు తెరలు దట్టంగా కమ్మేశాయి. -
ఉసిరి.. ఉసూరు
ధర లేక గిరి రైతులకు కష్టాలు పాడేరు: ఏజెన్సీ అడవుల్లో ప్రకృతి సిద్ధంగా లభించే ఉసిరి కాయలకు జాతీయ స్థాయిలో విపరీతమైన డిమాండ్ ఉంది. ఆయుర్వేద మందుల తయారీ నుంచి ఫార్మా కంపెనీల వరకు అందరికీ ఇక్కడి ఉసిరి కావాలి. కానీ, ప్రాణాలకు తెగించి వీటిని సేకరించే గిరిజన రైతులకు మాత్రం కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదు. అటవీ సంపదపై ఆధారపడిన గిరిజనుల ఆర్థిక పరిస్థితి దళారుల చేతుల్లో, తక్కువ మద్దతు ధరల వల్ల కుదేలవుతోంది. అడవుల్లో ఉసిరి సిరి పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, అరకులోయ, మారేడుమిల్లి వంటి దాదాపు 12 మండలాల్లో ఉసిరి చెట్లు విస్తారంగా ఉన్నాయి. 20 ఏళ్ల క్రితం వన సంరక్షణ సమితుల ద్వారా నాటించిన మొక్కలు ఇప్పుడు ఫలసాయాన్ని ఇస్తున్నాయి. ప్రతి ఏటా నవంబర్ నుంచి జనవరి వరకు గిరిజనులు ఈ కాయలను సేకరిస్తారు. వీటిని వేడినీటిలో ఉడకబెట్టి, ఎండలో ఆరబెట్టి ఉసిరిపప్పుగా తయారు చేసి మార్కెట్కు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. పెరిగిన డిమాండ్.. పెరగని ధరలు తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, ఒడిశా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోని ఫార్మా కంపెనీలు ఈ ఉసిరి కోసం ఎదురుచూస్తుంటాయి. జాతీయ మార్కెట్లో ఉసిరిపప్పు ధర కిలో రూ. 150 నుంచి రూ. 200 వరకు పలుకుతోంది. కానీ, క్షేత్రస్థాయిలో గిరిజన సహకార సంస్థ, దళారీలు మాత్రం కేవలం రూ. 90 కే కొనుగోలు చేస్తున్నారు. ● గత మూడేళ్లుగా అడవుల్లో కాపు తగ్గడంతో దిగుబడి ఆశాజనకంగా లేదు. ● గిరిజన సహకార సంస్థ గత ఏడాది 10.35 టన్నుల ఉసిరి పప్పును సేకరించింది. దీంతో చిత్తూరులో ’అమ్లా కాండీ’ తయారు చేసి భారీ లాభాలు గడిస్తోంది. ● దళారి వ్యాపారులు కూడా మరో పది టన్నుల ఉసరిపప్పనుతక్కువ ధరకు కొని బయట మార్కెట్లో ఎక్కువకు అమ్ముకుంటూ వ్యాపారులు లాభపడ్డారు.గిట్టుబాటు కావడం లేదు వన్యప్రాణుల భయం ఉన్నా ప్రాణాలకు తెగించి అడవుల్లో ఉసిరి కాయలు సేకరిస్తాం. ఉడకబెట్టి, ఎండబెట్టి పప్పు చేసేందుకు ఎంతో శ్రమ పడతాం. కానీ కిలో రూ. 90 కంటే ఎక్కువ రావడం లేదు. కనీసం మా కష్టానికి తగ్గ కూలి కూడా మిగలడం లేదు. – పాంగి భీమేష్, గిరిజన రైతు, డల్లాపల్లి కొనుగోలు ధర పెంచాలి మార్కెట్లో డిమాండ్ ఉన్నా రైతులకు మాత్రం అన్యాయ మే జరుగుతోంది. గిరిజన సహకార సంస్థ వెంటనే స్పందించి కొనుగోలు ధరను పెంచాలి. ఫార్మా కంపెనీలు, దళారులు కూడా గిరిజనులను నష్టపరచకుండా మద్దతు ధర ఇవ్వాలి. – సుడిపల్లి రామానాయుడు, గిరిజన రైతు, డొంకినవలస. జాతీయ మార్కెట్లో కిలో పప్పు రూ.150 నుంచి రూ.200 స్థానికంగా చెల్లించేది మాత్రం రూ.90 అడుగడుగునా దోపిడీ గిట్టుబాటు ధర చెల్లించని గిరిజన సహకార సంస్థ -
సిటు మహాసభలు జయప్రదం చేయండి
పరవాడ: విశాఖపట్నంలో ఈ నెల 4న సిటు ఆధ్వర్యంలో జరిగే 18వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని సిటు రాష్ట్ర కార్యదర్శి జి.కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఛలో విశాఖ ర్యాలీని పరవాడ ఫార్మాసిటీలో గురువారం నిర్వహించారు. అనంతరం కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆ రోజు జరిగే మహాసభలకు అన్ని రాష్ట్రాల నుంచి 2 వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా చర్చించి భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కానున్నట్లు పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా విధానాలను అమలు చేస్తున్నారని, ఇప్పటి వరకు ఉన్న హక్కులను కాలరాస్తున్నారని ఆక్షేపించారు. ర్యాలీలో సిటు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి సత్యనారాయణ, కె.రమణ, ముసిలినాయుడు, శేషు, అప్పలరాజు, సత్తిబాబు పాల్గొన్నారు. -
వెంకన్నకు నవనీత సేవ
పెందుర్తి: స్థానిక వేంకటాద్రిపై కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం తిరుప్పావై సేవాకాలం శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో 17వ పాశుర విన్నపం చేశారు. అనంతరం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని స్వామివారికి నవనీత సేవ ఘనంగా జరిపారు. వేకువజామున తిరుప్పావై పారాయణం, సుప్రభాత సేవ చేశారు. అనంతరం 27 కిలోల వెన్నతో స్వామికి అలంకరణ చేశారు. ఆలయ ప్రధాన పురోహితుడు రామానుజాచార్యులు ఆధ్వర్యంలో విశేష అర్చనలు జరిగాయి. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు దంపతులు, మేయర్ పీలా శ్రీనివాసరావు దంపతులు, ఎన్ఆర్ఐ భక్తులు చీమలపాటి మూర్తి కుటుంబ సభ్యులు, దాదాపు 5 వేల మంది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. ఈవో నీలిమ పర్యవేక్షణలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రసాద వితరణ చేపట్టారు. కొండ దిగువ నుంచి భక్తులకు ఉచిత రవాణా సదుపాయం కల్పించారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 4న వేంకటాద్రిపై సుదర్శన హోమం నిర్వహించనున్నారు. -
● ప్రాణాలతో చెలగాటం
గిరిజన ప్రాంతాల్లో ప్రైవేటు జీపులు నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులను ఇష్టానుసారంగా ఎక్కించుకొని ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. పరిమితికి మించి ఎక్కించడమే కాకుండా అధిక చార్జీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సొలభం, వంజరి వంటి ప్రమాదకర ఘాట్ రోడ్లలో మలుపుల వద్ద వాహనం నియంత్రణ తప్పే ప్రమాదం ఉంది. నిబంధనల ప్రకారం వైట్ బోర్డు (సొంత వాహనాలు) గల వాటిని కమర్షియల్ ప్రయోజనాలకు వినియోగించడం చట్ట విరుద్ధం. అయినప్పటికీ రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – జి.మాడుగుల -
ప్రకృతి ఒడిలో మణిహారాలు
● అభివృద్ధి, చేస్తే అద్భుత క్షేత్రాలు ● పట్టించుకోని పాలకులు కొయ్యూరు: ప్రకృతి ప్రేమికులను పరవశింపజేసే జలపాతాలు.. మదిని దోచే కొండకోనలు.. మండలంలో పర్యాటక సంపదకు కొదవలేదు. కానీ, అధికారుల నిర్లక్ష్యం, కనీస సౌకర్యాల లేమి ఆ అందాలను ఆస్వాదించాలనుకునే వారికి శాపంగా మారుతున్నాయి. ఇక్కడి నాలుగు ప్రధాన జలపాతాలు అభివృద్ధికి నోచుకోక వెలవెలబోతున్నాయి. అందమున్నా.. అడుగులేయడం కష్టమే! చింతవానిపాలెం సమీపంలోని ఇసుకలమడుగు జలపాతం చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. అంతటి అద్భుత దృశ్యాలను చూడాలంటే పర్యాటకులు సాహసమే చేయాలి. దాదాపు ఒక కిలోమీటరుకు పైగా కాలినడకన, కొండలు ఎక్కుతూ దిగుతూ వెళ్లడం వృద్ధులు, పిల్లలకు నరకంగా మారుతోంది. పర్యాటక శాఖ ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఈ ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది. మృత్యుఘోష వినిపిస్తున్నా.. గత 30 ఏళ్లుగా పర్యాటకులను ఆకర్షిస్తున్న గాదేగుమ్మి జలపాతం దగ్గర విషాద ఛాయలు కూడా ఎక్కువే. ఈ జలపాతం వద్ద ప్రమాదవశాత్తు జారి పడి ఇప్పటివరకు 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం చూసి వెళ్లేందుకు వస్తే, తిరిగి రాని లోకాలకు వెళ్తున్న పర్యాటకుల ఉదంతాలు చూస్తుంటే.. ఇది పర్యాటక కేంద్రమా లేక మృత్యుకూపమా అన్న సందేహం కలగక మానదు. ● మృతుల కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చిన ఈ జలపాతం దగ్గర, పర్యాటక శాఖ కనీసం భద్ర తా చర్యలు కూడా చేపట్టకపోవడం గమనార్హం. ఇక్కడ అరకొర సౌకర్యాలు కల్పించినా, అవి ఏమాత్రం సరిపోవు. భద్రతను పర్యవేక్షిస్తూ పర్యాటకుల కోసం అదనపు భవనాలు, రక్షణ గోడలు నిర్మించాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. మౌలిక వసతులకు దూరం..సాకులపాలెం బూదరాళ్ల పంచాయతీ సాకులపాలెం సమీపంలోని జలపాతానికి పర్యాటకుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. అయితే అక్కడ అందుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు లేవు. కనీసం కూర్చునేందుకు నీడ, తాగడానికి నీరు వంటి ప్రాథమిక వసతులు కూడా లేనందున పర్యాటకులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. దారి లేని జలపాతం : రామరాజుపాలెం నుంచి గాంకొండ వెళ్లే మార్గంలో మరో అద్భుతమైన జలపాతం దాగి ఉంది. అయితే అక్కడికి చేరుకోవడం అంటే ఆకాశాన్ని అందుకోవడమే అన్న ట్టుంది పరిస్థితి. సరైన రహదారి లేక, కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి రావడంతో పర్యాటకులు వెనుకంజ వేస్తున్నారు. మౌలిక వసతులు కల్పిస్తాం జలపాతాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తాం. కించవానిపాలెం జలాశయాన్ని కూడా అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఉంది. దీనిపై పూర్తి పరిశీలన అనంతరం చేపట్టబోయే పనుల వివరాలు వెల్లడిస్తాం – తిరుమణి శ్రీపూజ, పీవో, పాడేరు ఐటీడీఏ -
వణికిస్తున్న శీతల గాలులు
● ముంచంగిపుట్టులో 8.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగినప్పటికీ చలి, మంచు తీవ్రత కొనసాగుతోంది. బుధవారం ముంచంగిపుట్టు 8.4 డిగ్రీలు, జి.మాడుగులలో 8.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ● పాడేరు డివిజన్ పరిధి పెదబయలులో 10.0 డిగ్రీలు, అరకువ్యాలీలో 10.8 డిగ్రీలు, డుంబ్రిగుడలో 12.1 డిగ్రీలు, చింతపల్లిలో 12.5 డిగ్రీలు, హుకుంపేటలో 12.7 డిగ్రీలు, పాడేరులో 12.9 డిగ్రీలు, కొయ్యూరులో 15.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు ఏడీఆర్ పేర్కొన్నారు. గత వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతల్లో స్వల్పంగా మార్పులు చోటుచేసుకుంటున్నా సాయంత్రం అయ్యేసరికి శీతల గాలులు కొనసాగుతున్నాయి. ఉదయం పది గంటల వరకు మంచు దట్టంగా కురిసింది. రహదారులను మంచు తెరలు కమ్మేశాయి. వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు. -
పోరాటాలతోనే ఆదివాసీలకు న్యాయం
చింతూరు: పోరాటాల ఫలితంగానే ఆదివాసీ యువతకు విద్య, ఉద్యోగ రంగాల్లో సరైన న్యాయం దక్కుతుందని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బంగారు వెంకటేశ్వర్లు అన్నారు. పరిషత్ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం చింతూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఏర్పాటు రోజునే తమసంఘం ఆవిర్భావ దినోత్సవం జరగడం సంతోషంగా ఉందన్నారు. జీవో నంబర్లు 3, 267తో పాటు ఉద్యోగులకు పదోన్నతులు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలపై నిరంతర పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఆదివాసీ యువత పరిషత్ అడుగుజాడల్లో నడుస్తూ సమస్యల పరిష్కారానికి పాటుపడాలని ఆయన కోరారు. నూతనంగా ఏర్పడిన పోలవరం జిల్లా పరిధిలోకి పోలవరం ముంపు ప్రాంతాలైన వేలేరుపాడు, కుక్కునూరు, బుట్టాయిగూడెం, టి.నరసాపురం, జీలుగుమిల్లి, కన్నాపురం మండలాలను కలపాలని ఆయన డిమాండ్ చేశా రు. తద్వారా ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించే ఆస్కారముటుందని ఆయన పే ర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరిషత్ నాయకులు పూనెం చిన్నవీరభద్రం, కుంజా శ్రీను, పొడియం లక్ష్మణరావు, శంకురమ్మ, ప్రసాద్, భ్రహ్మయ్య, రమణారెడ్డి, రవి, నాగేశ్వరరావు పాల్గొన్నారు.ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బంగారు వెంకటేశ్వర్లు -
గిరిజనుల ముంగిటకే పాలన
రంపచోడవరం: ఏజెన్సీలో ప్రజలకు వివిధ రకాలైన సేవలు అందించేందుకు రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు జరిగిందని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ అన్నారు. రంపచోడవరం యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటీసీ)లో కలెక్టర్ నూతన కార్యాలయాన్ని ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి, ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి, ట్రైకార్ చైర్మన్ బి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్చార్రిజ కలెక్టర్ దినేష్కుమార్ మాట్లాడుతూ ఏజెన్సీలో వెనుకబడిన ప్రాంతంగా రంపచోడవరం నియోజకవర్గాన్ని గుర్తించి 12 మండలాలకు వివిధ రకాలైన సేవలు సకాలంలో అందించే విధంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అల్లూరి జిల్లాలోని పాడేరు రావాలంటే సుమారు 250 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేదని, రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటుతో ఇబ్బందులు తొలిగాయన్నారు. వైటీసీ, పీఎంఆర్సీ నుంచి సేవలందించేలా రెండు భవనాలు ప్రస్తుతం ఉపయోగిస్తున్నామన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయం యాథావిధిగా పనిచేస్తుందన్నారు. గుర్తేడు మండలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ప్రాంత గిరిజనులకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. వెయ్యి కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. పీవీటీజీ గిరిజనుల అభివృద్ధికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయన్నారు. అల్లూరి జిల్లాలో 1570 సెల్ టవర్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. జులై నెలాఖరుకు పూర్తి స్ధాయిలో నెట్వర్క్ అందుతుందన్నారు. ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి మాట్లాడుతూ నూతన జిల్లా ఏర్పాటుతో గిరిజనులకు మెరుగైన సేవలు అందుతాయన్నారు. జిల్లాను అభివృద్ధిపఽథంలో నడిపించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ సాయిప్రశాంత్, ఎస్డీసీ అంబేద్కర్, జెడ్పీటీసీ పండా వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ కొమ్మిశెట్టి బాలకృష్ణ, సర్పంచ్ మంగా బొజ్జయ్య, తదితరులు పాల్గొన్నారు. రంపచోడవరం కేంద్రంగా ’పోలవరం’ జిల్లా ఆవిర్భావం కలెక్టర్ దినేష్కుమార్ యూత్ ట్రైనింగ్ సెంటర్లో కలెక్టర్ కార్యాలయ ప్రారంభం -
ఉపాధ్యాయులు రాకుంటే చదువులెలా?
ముంచంగిపుట్టు: ఉపాధ్యాయులు పాఠశాలకు రాకపోతే మా పిల్లల చదువులు ఎలా కొనసాగుతున్నాయని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని ఏనుగురాయి పంచాయతీ జంగంసరియా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు బుధవారం రోజున ఉపాధ్యాయులు రాలేదు. పాఠశాలకు తాళాలు వేసి ఉండటంతో గ్రామ గిరిజనులు ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయుల తీరుపై పాఠశాల ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఎం.మోహన్రావు, తల్లిదండ్రులు మాట్లాడుతూ పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నా ఒక్కరు కూడా రాలేదన్నారు. దీంతో విద్యార్థులు పాఠశాలకు వచ్చి, వెళ్లిపోవాల్సిన పరిస్థితి నెలకొందని ధ్వజమెత్తారు. ఒకేసారి ఇద్దరు ఉపాధ్యాయులు సెలవు పెడితే పాఠశాల మూసుకోవాల్సిన దుస్థితి ఉందని, మండల విద్యాశాఖ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం పాఠశాల తెరిచేలా చర్యలు తీసుకోవాలని, లేకుంటే మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. దీనిపై ఎంఈవోను వివరణ కోరగా పాఠశాల ఉపాధ్యాయులు సెలవులో ఉన్నందున మరొక పాఠశాల నుంంచి ఉపాధ్యాయుడిని పంపించామన్నారు. ఆయన పాఠశాలకు వెళ్లడంలో కొంత ఆలస్యం అయిందని ఆయన పేర్కొన్నారు. జంగంసరియాలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన పాఠశాల మూతపడి ఉండటంపై ధ్వజం సమస్య పరిష్కరించకుంటే ఎంఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తాం గ్రామ గిరిజనుల హెచ్చరిక -
నూతనోత్సాహం
నిన్నటి జ్ఞాపకాలకు వీడ్కోలు పలుకుతూ.. ఆశల పల్లకిలో 2026కు స్వాగతం పలుకుతూ.. మన్యం గుండెల్లో నూతనోత్సాహం ఉప్పొంగింది. కేక్, మిఠాయిల తీపి.. గులాబీల పరిమళం.. మెరిసే అలంకరణలు.. మురిసే చిరునవ్వులు.. వీధులన్నీ పండుగ సంబరంలో మునిగిపోయాయి. కష్టాలన్నీ కరిగిపోవాలని.. సుఖశాంతులు చేకూరాలని.. అందరి ఆకాంక్షలు ఒక్కటై.. ఆశావహ దృక్పథంతో.. గిరిజన ప్రాంతమంతా నూతన కాంతులతో విరాజిల్లింది. న్యూ ఇయర్ వేడుకలతో సందడిమత్స్యగెడ్డ ఒడ్డున న్యూఇయర్ వేడుకల్లో పర్యాటకులుసాక్షి,పాడేరు: న్యూ ఇయర్ వేడుకలతో జిల్లావ్యాప్తంగా ముందస్తు సందడి నెలకొంది. జిల్లా కేంద్రమైన పాడేరులో న్యూ ఇయర్ కేక్లు భారీగా అమ్ముడుపోయాయి. పండ్ల దుకాణాల వద్ద సందడి నెలకొంది. గులాబీలు, పూల బొక్కేల కొనుగోళ్లు భారీగా జరిగాయి. మార్కెట్లో న్యూఇయర్ జోష్ నెలకొంది. ● బుధవారం అర్ధరాత్రి నుంచే ప్రార్థనా మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి. క్రైస్తవ కుటుంబాలు, యువత, రాజకీయ ప్రముఖులు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొని కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. పాడేరులోని సెయింట్ ఆన్స్ చర్చితో పాటు అన్ని చర్చిల్లో అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రా ర్థనలు నిర్వ హించారు. దైవ సేవకు లు లోక కల్యాణం కో రుతూ యేసుక్రీస్తుకు ప్రత్యేక ఆరాధనలు చేశా రు. క్రైస్తవ కుటుంబాలు ప్రార్థనల్లో పాల్గొన్నారు.కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆకట్టుకున్న ‘ధాన్యపు’ ముగ్గు కొత్త ఏడాది వేడుకల్లో భా గంగా నివాసాలు, దుకాణాల వద్ద మ హిళలు, యువతులు రంగురంగుల ముగ్గులు వేసి సందడి చేశారు. పాత బస్టాండ్ సమీపంలోని బూరెడ్డి డిపార్ట్మెంటల్ స్టోర్ ఎదుట బూరెడ్డి గాయత్రి వివిధ రకాల పప్పు ధాన్యాలతో వేసిన ముగ్గు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వినూత్న ముగ్గును అటుగా వెళ్లే బాటసారులు ఆసక్తిగా తిలకించారు. ● అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి, ఆమె భర్త చెట్టి వినయ్ మరియు అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ కలిసి కేక్ కట్ చేసి 2026కు స్వాగతం పలికారు. సుఖ సంతోషాలు నింపాలని వారు ఆకాక్షించారు. ముంచంగిపుట్టు: మండలంలో నూతన సంవత్సర వేడుకల సందడి నెలకొంది. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు మిళితమైన ఈ వేడుకలు ప్రత్యేకంగా నిర్వహించారు. యువత చలిమంటలు, పాటలతో 2026కు ఘనంగా స్వాగతం పలికారు. థింసా నృత్యాలతో గ్రామాలు కళకళలాడాయి. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయడంతో పండగ వాతావరణం నెలకొంది. కొత్త ఏడాది అందరికీ మంచి జరగాలని చర్చిల్లో క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. -
అసాంఘిక కార్యకలాపాలకు ఆస్కారం ఇవ్వొద్దు
● చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా గూడెంకొత్తవీధి: నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి పండగల నేపథ్యంలో గిరిజన గ్రామాల్లో ఎక్కడా కోడిపందాలు, పేకాటలు వంటి అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యక్రమాలకు ఆస్కారం ఇవ్వకుండా పోలీసులు తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చింతపల్లి ఏఎస్పీ నవజ్యోత్ మిశ్రా అన్నారు. గూడెంకొత్తవీధి పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాలను ఆయన బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు సీఐ సుధాకర్, ఎస్ఐ సురేష్లు మర్యాదపూర్వకంగా పూలమొక్కలతో స్వాగతం పలికారు. అనంతరం స్టేషన్లో నమోదైన కేసులు, భద్రతాపరంగా తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో మంచి ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని అభినందించి రివార్డులను అందజేశారు. -
దేశ రక్షణ కోసం మరో స్వాతంత్య్ర పోరాటం అవసరం
సినీ దర్శకుడు, నటుడు, రచయిత బాబ్జీ ఏయూక్యాంపస్ : దేశాన్ని కాపాడుకోవడానికి మరో స్వాతంత్య్ర సమరం సాగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు, రచయిత బాబ్జీ పేర్కొన్నారు. ‘సిటూ’ జాతీయ మహాసభలు సందర్భంగా జరుగుతున్న శ్రామిక ఉత్సవ్ ఐదో రోజు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశాఖ ఉక్కు సహా.. దేశంలోని అన్ని వనరులనూ ఇద్దరు గుజరాతీలు అమ్మకానికి పెట్టగా.. ఇద్దరు గుజరాతీలు కొనుక్కుంటున్నారుని అన్నారు. దేశ రక్షణకు పిలుపు ఇస్తే భగత్ సింగ్లా ఉరికంబం ఎక్కడానికై నా తాను సిద్ధమేనని.. తాను ప్రజానాట్యమండలి బిడ్డనని.. ఎర్ర సినిమా తీయాలనే.. సినీ రంగాన్ని ప్రక్షాళన చేయడానికే సినీ రంగంలోకి వెళ్లానని తెలిపారు. అత్యంత శక్తిమంతమైన మాధ్యమం సినిమా రంగాన్ని కూడా ప్రజాసంఘంగా గుర్తించాలని ఆకాక్షించారు. ప్రత్యేక అతిథి ప్రొఫెసర్ కె.ఎస్.చలం మాట్లాడుతూ అదానీ, అంబానీలు దేశీయ పెట్టుబడిదారులు మాత్రమే కాదని, వారు అంతర్జాతీయ పెట్టుబడిదారులని వివరించారు. కార్మిక ధర్మనీతి–2025 చట్టం మనుధర్మ ప్రాతిపదికన చేసినట్లు పాలకవర్గమే ప్రకటించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. సమస్యలపై పోరాటాలు మరింత క్రియాశీలకంగా సాగాలని ఆకాంక్షించారు. సిటూ రాష్ట్ర నాయకురాలు సుబ్బరావమ్మ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తరచూ అభివృద్ధి సంక్షేమం, అచ్ఛేదిన్ అంటుంటాయంటూ.. సంపద అతి కొద్ది మంది వద్దే ఉండటమేనా అచ్ఛేదిన్ అని ప్రశ్నించారు. అంగన్వాడీ, ఆశ సిబ్బందిని కార్మికులుగా గుర్తించాలని అంతర్జాతీయ కార్మిక సంఘం సిఫార్సులనూ పట్టించుకోని ప్రభుత్వ తీరును ఖండించారు. తొలుత సిటు రాష్ట్ర నాయకులు కె.అజయ్కుమార్ స్వాగతం పలికారు. సభలో శ్రామిక ఉత్సవ్ కన్వీనర్ రమాప్రభ తదితరులు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం లభ్యం
పెదబయలు: మండలంలోని సీతగుంట పంచాయతీ లకేయిపుట్టు గ్రామ సమీపంలో ఏకలవ్య రెసిడెన్సియల్ పాఠశాల సమీపంలో మత్స్యగెడ్డలో గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం బుధవారం లభ్యమయ్యింది.స్థానికుల సమాచారం మేరకు స్థానిక ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూ అధికారుల సహాయంతో మృతదేహాన్ని పోలీసు సిబ్బంది గెడ్డ నుంచి బయటకు తీశారు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్ఐ వెంకటేష్ మాట్లాడుతూ వృద్ధురాలి వయస్సు 60 నుంచి 65 ఏళ్ల వయస్సు ఉంటుందన్నారు. మృతదేహాన్ని తరలించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గెడ్డ నుంచి ప్రధాన రోడ్డు వరకు పెదబయలు సివిల్ కానిస్టేబుల్ వెంకట్, ఏపీఎస్పీ కానిస్టేబుల్ మనోహర్నాయుడు, సివిల్ హెడ్ కానిస్టేబుల్ నారాయణలు సుమారు కిలోమీటర్ వరకు మోసుకొచ్చి , మానవత్వాన్ని చాటుకున్నారన్నారు. అక్కడ నుంచి అంబులెన్స్లో పెదబయలు పీహెచ్సీకి తరలించినట్టు తెలిపారు. పోలీసు సేవలను అభినందనించారు. అయితే వృద్ధురాలి మృతదేహం ఆచూకీ తెలియలేదని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వెంకటేష్ చెప్పారు. మృతదేహం తరలింపులో సర్పంచ్ పలాసి మాధవరావు, ఎంపీటీసీ సభ్యుడు బొంజుబాబు, రెవెన్యూ సిబ్బంది సుందర్దేవ్, తదితరులున్నారు.మృతదేహాన్ని బయటకు తీసి మోసుకొచ్చిన పోలీసులు -
నూతన సంవత్సర వేళ విషాదం
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు యువకుల మృతిఅచ్యుతాపురం రూరల్ : మునగపాక మండలం పల్లవాని వీధికి చెందిన మొల్లి రాము (25) కొండకర్ల కూడలికి సమీపంలో బస్సు బైక్ డీకొన్న ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుదవారం ఇంటి నుండి బయలుదేరి సోలార్ పరిశ్రమకు విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగా మార్గమధ్యలో కొండకర్ల కూడలి సమీపంలోకి వచ్చే సరికి కార్మికులను తీసుకువెల్తున్న లారస్ పరిశ్రమ బస్సు, బైక్ డీకొన్న దుర్ఘటనలో మొల్లి రాము అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి తల్లిదండ్రులు, ఒక తమ్ముడు ఉన్నట్లు పోలీసుల సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ చంధ్రశేఖర్ రావు, ఎస్ఐ వెంకటరావు తెలిపారు. మృతుని కుటుంబాన్ని పరిశ్రమ, బస్సు యాజమాన్యం ఆదుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రొంగలి రాము డిమాండ్ చేసారు. మునగపాకలో విషాదం మునగపాక: కుటుంబానికి అందివస్తున్నాడనుకుంటున్న కన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడాన్ని తల్లితండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. నూతన సంవత్సర వేడుకలను స్నేహితులతో కలిసి బుధవారం రాత్రి ఘనంగా జరుపుకొందామని భావించిన ఆ యువకున్ని బస్సు మింగేసింది. దీంతో మునగపాకలో విషాదం అలముకుంది. వివరాలివి. మునగపాకకు చెందిన మొల్లి నాయుడు, వెంకటి దంపతులకు ఇద్దరు కుమారులు, నాయుడు కూలి పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ సాగిస్తున్నారు. నాయుడు పెద్దకుమారుడు రాము కొంతకాలంగా అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబానికి చేయూతగా ఉంటున్నాడు. అందరితో సఖ్యతగా ఉండే రాము బుధవారం మధ్యాహ్నం షిప్టునకు తన బైక్పై మునగపాక నుంచి బయలుదేరి వెళుతుండగా అచ్యుతాపురం మండలం కొండకర్ల సమీపంలో ప్రధాన రహదారిపై బస్సు ఢీకొని అక్కడి కక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాము తల్లితండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఉదయం అందరితో సరదాగా గడిపిన కొడుకు అర్ధంతరంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడన్న సమాచారం తెలియడంతో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు అంతా సిద్దమవుతున్న తరుణంలో ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. కొంపల్లి వద్ద బస్సును తప్పించబోయి... దేవరాపల్లి : దేవరాపల్లి నుంచి విశాఖపట్నం వెళ్లే రోడ్డులో కుంపల్లి కూడలి సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని కేఎంపాలెంకు చెందిన యువకుడు చౌడువాడ దేముడునాయుడు (26) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న అదే గ్రామానికి చెందిన గంధం మహేష్ తీవ్ర గాయాలపాలయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. కృష్ణారాయుడుపేట జంక్షన్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న 12డి బస్సు కుంపల్లి కూడలి చేరుకునే సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు యువకులు బస్సును తప్పించబోయి ప్రమాదవశాత్తూ రోడ్డుపై పడ్డారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న దేముడునాయుడు తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మరణించాడు. తీవ్ర గాయాలతో బయటపడిన గంధం మహేష్ను కె.కోటపాడు సీహెచ్సీకి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజిహెచ్కు తరలించారు. కాగా కేంపాలెంకు చెందిన సముద్రంనాయుడు, రమణమ్మ దంపతుల రెండో కుమారుడు దేముడునాయుడు ఇంటర్ పూర్తి చేసి తల్లిదండ్రులతో పాటు అన్నయ్య జగ్గారావుకు వ్యవసాయ పనుల్లో చేదోడుగా ఉండేవాడు. స్నేహితుడితో బయటకు వెళ్లి వస్తానని చెప్పి బుధవారం ఉదయం ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరి వెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కొంత సమయం తర్వాత తమ కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడన్న విషాద వార్త తెలియడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కె.ఎం.పాలెంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. దేముడునాయుడు మృతి పట్ల సర్పంచ్ గంధం రామకృష్ణ సంతాపం తెలిపారు. -
పక్కాగా వంద రోజులప్రణాళిక అమలు
● జిల్లా విద్యాశాఖ అధికారిరామకృష్ణారావు ఆదేశం డుంబ్రిగుడ: పదో తరగతి పరీక్షల్లో లక్ష్యసాధనకు ఉపాధ్యాయులు పక్కగా వంద రోజుల ప్రణాళిక అమలుకు కృషి చేయాలని జిల్లావిద్యాశాఖాధికారి రామకృష్ణారావు ఆదేశించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కస్తూ ర్బా గాంధీ గురుకుల బాలికల విద్యాలయాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. యాక్షన్ అమలుతీరును పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. మండల విద్యాశాఖ అధికారులు శెట్టి సుందర్రావు, జి గెన్ను పాల్గొన్నారు. -
విద్యార్థుల ఉజ్వల భవితకు కృషి
చింతపల్లి: నేటి తరంలో విద్యార్థుల భావి భవిష్యత్ను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా అన్నారు. చింతపల్లి సబ్ డివిజనల్ పోలీసు అధికారి కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో పీఆర్టీయూ డైరీ, క్యాలెండర్ను జిల్లా అధ్యక్షుడు యువి గిరితో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా మాట్లాడుతూ ఉపాధ్యాయుల బోధనపైనే చిన్నారుల భవిష్యత్ ఆధారపడి ఉంటుందన్నారు. విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్నారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గిరి మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. నాయకులు మత్స్యలింగం, సత్తిబాబు, అప్పారావు, శామ్యూల్, గిరిజారాణి, కృష్ణకుమారి, మంగకుమారి, దామోదర్ పాల్గొన్నారు. డుంబ్రిగుడ/పాడేరు రూరల్: డుంబ్రిగుడ, పాడేరు ప్రాంతాల్లో బుధవారం పీఆర్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో డైరీ, క్యాలెండర్ల ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమాల్లో డుంబ్రిగుడలో ఎంఈవోలు శెట్టి సుందరరావు, జి.గెన్ను, ఎంపీడీవో ప్రేమ్సాగర్, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పలరాజు, జిల్లా అధ్యక్షుడు రఘునాథ్, పాడేరులో ఏపీటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు డి.బాబురావు, వివిధ ఉపాధ్యాయ సంఘం నాయకులు జగన్మోహనరావు, శ్యాంసుందరం, పోతురాజు, కై లాసం, సోమినాయుడు, ధనుంజయ్ కన్నయ్య, బాలకృష్ణ, రాజారావు తదితరులు పాల్గొన్నారు.ఏఎస్సీ నవజ్యోతి మిశ్రా -
బెల్టు షాపులకు విచ్చలవిడిగా మద్యం సరఫరా
పాడేరు రూరల్: నూతన సంవత్సర వేడుకలో భాగంగా పాడేరు కేంద్రంగా ఉన్న వైన్ షాపుల నుంచి మద్యం బాటిళ్లను ఆటోలు, వివిధ వాహనాల్లో బుధవారం భారీగా తరలించారు. పోలీసుల ఆంక్షలతో ఇబ్బందులు వస్తాయనే నేపంతోనే ముందస్తుగా వైన్ షాపుల నిర్వాహకులు పాడేరు, సమీప గ్రామాల్లోని బెల్టుషాపులకు మద్యం తరలించినట్టు పలువురు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలతో పాటు సంక్రాంతి పండుగ నేపథ్యంలో గ్రామాల్లోని బెల్టుషాపుల్లో మద్యం అమ్మకాలు జోరుగా జరగనున్నట్టు తెలిపారు. ఎమ్మార్పీ కంటే అదనపు ధరలకు మద్యం అమ్మకాలు సాగుతున్నాయన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో మద్యం వ్యాపారులు విచ్చలవిడిగా బెల్టు దుకాణాల ద్వారా అమ్మకాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసు, ఎకై ్సజ్ ఉన్నతాధికారులు స్పందించి బెల్టు దుకాణాలపై అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. -
లేబర్ కోడ్లతో బానిసత్వంలోకి కార్మికవర్గం
● ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మెలో పాల్గొనండి ● ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ పిలుపు సీతంపేట: కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్ల అమలుతో భారతీయ కార్మిక వర్గం బ్రిటిష్ కాలం నాటి బానిసలుగా మారే ప్రమాదం ఉందని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల చట్టబద్ధ హక్కుల రక్షణ కోసం ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ‘లేబర్ కోడ్లు– భారతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రభావం’అనే అంశంపై బుధవారం ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీలో జరిగిన సదస్సులో ఆమె మాట్లాడారు. స్వాతంత్య్ర పోరాటంలో అగ్రభాగాన నిలిచిన భారతీయ కార్మిక వర్గం, దేశానికి స్వాతంత్య్రం రాకముందే 8 గంటల పనిదినం, యూనియన్ పెట్టుకునే హక్కు, వేతన చట్టం, బోనస్ చట్టం, పారిశ్రామిక వివాదాల చట్టం వంటివి పోరాడి సాధించుకుందని గుర్తు చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వాటన్నింటినీ రద్దు చేసి, లేబర్ కోడ్ల రూపంలోకి మార్చి కార్మికులను కార్పొరేట్లకు తాకట్టు పెడుతోందని విమర్శించారు. కొత్త వేతన కోడ్ ద్వారా గతంలో ఉన్న వేతన బోర్డులకు కాలం చెల్లినట్టేనని, జీతాలు ఎగ్గొట్టే యజమానులను నిలదీసే అధికారం లేబర్ కమిషనర్కు లేకుండా చేశారని ఆమె మండిపడ్డారు. సోషల్ సెక్యూరిటీ కోడ్ వల్ల కార్మికులు సాధించుకున్న సంక్షేమ బోర్డులు రద్దయ్యాయని, 40 శాతం కార్మిక వర్గాన్ని ఈఎస్ఐ, పీఎఫ్ పథకాలకు దూరం చేశారని వివరించారు. సమ్మె చేయాలంటే 50 శాతం మంది ఆమోదం ఉండాలని, 60 రోజుల ముందే నోటీసు ఇవ్వాలని నిబంధనలు పెట్టడం దారుణమన్నారు. దేశ సంపదను సృష్టించిన విశాఖ స్టీల్ ప్లాంట్, విమానయానం, బొగ్గు, చమురు, విద్యుత్ వంటి కీలక రంగాలన్నింటినీ అదానీ వంటి కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. దీని వల్ల దేశం మళ్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన నాటి పరిస్థితుల్లోకి, కార్మికులు బానిసత్వంలోకి నెట్టివేయబడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభు త్వ రంగాన్ని కాపాడుకోవడానికి జరిగే సార్వత్రిక సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎస్.జె. అచ్యుతరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్మిక సంఘం నాయకులు బి.సి.హెచ్. మసేన్, డి.ఆదినారాయణ, పడాల రమణ, మన్మథరావు, బూసి వెంకటరావు, కె.సత్యాంజనేయ, వామన మూర్తి, చంద్రశేఖర్, కాశిరెడ్డి సత్యనారాయణ, పడాల గోవింద్, షేక్ మౌలాలి పాల్గొన్నారు. -
ఇబ్బందులను తొలగించాలి
మారుమూల గ్రామాల గిరిజనులకు అత్యవసర వైద్యసేవలు అందుబాటులోకి తేవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఈ దిశగా చర్యలు చేపట్టి వైద్యసేవల పరంగా ఇబ్బందులను తొలగించాలి. అన్ని రకాల వైద్యసేవలను గిరిజనులకు చేరువ చేయాలి. –బందం శ్రీదేవి, ఎంపీపీ, రంపచోడవరం గడువులోగా పూర్తి చేయాలి రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బలోపేతం అయ్యాయి. దీనిలో భాగంగానే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టింది. పనులు గడువులోగా పూర్తి చేస్తే గిరిజనులకు ఆధునిక వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. –పండా రామకృష్ణదొర, వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు, రంపచోడవరం -
ఆపరేషన్ కగార్తోమావోయిస్టులు తగ్గుముఖం
కొయ్యూరు: ఆపరేషన్ కగార్తో మావోయిస్టుల సంఖ్య చాలా వరకు తగ్గిపోయిందని చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా తెలిపారు. మంగళవారం ఆయన కొయ్యూరు,మంప స్టేషన్లను తనిఖీ చేశారు. రికార్డులను పరశీలించారు. సీఐ శ్రీనివాసరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో కూడా మావోయిస్టులు కదలికలు తగ్గాయన్నారు. గంజాయి సాగు పూర్తిగా నిలిచిపోయిందన్నారు. గిరిజనులు అవగాహన పెంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టారన్నారు. ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా రవాణా అవుతున్న గంజాయిని చాలా వరకు తగ్గించామని చెప్పారు. ఇప్పటికీ గంజాయిపై పూర్తిగా నిఘా ఉంచామని తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా సహించబోమని ఆయన హెచ్చరించారు. శాంత్రి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ను పెంచుతున్నామన్నారు. దీనిలో బాగంగా గ్రామాలను సందర్శించి అక్కడ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. సంక్రాంతి సందర్భంగా ఎవరు పేకాట, కోడిపందాలకు పాల్పడినా చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. ప్రజలకు సత్వరమే న్యాయం అందేలా చేస్తామన్నారు. జాతీయ రహదారి 516ఈలో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, వీటి నివారణకు వీలుగా ఆయా గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. పశువులను రోడ్లపై ఉంచరాదని సూచించారు. సంతలు, నిర్దేశించిన గ్రామాల్లో వాలీబాల్ పోటీలను నిర్వహించి గిరిజన యువతలో క్రీడా స్ఫూర్తి నింపేందుకు కృషి చేస్తామన్నారు. త్వరలో కొయ్యూరులో డైవింగ్లైసెన్స్ మేళాను నిర్వహిస్తామన్నారు.ఆర్టీవోతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో కొయ్యూరు, మంప ఎస్ఐలు కిషోర్వర్మ, ఎస్. శ్రీనివాస్ పాల్గొన్నారు -
కూల్చివేతలు గిరిజనులకేనా?
ముంచంగిపుట్టు: మండల కేంద్రంలో అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. గిరిజనుడికి ఒక న్యాయం, గిరిజనేతరుడికి మరో న్యాయమా అంటూ స్థానికులు విమర్శించారు. వివరాలిలా ఉన్నాయి. స్థానిక రెవెన్యూ కార్యాలయం సమీపంలోని ప్రభుత్వ భూమిలో గిరిజనుడి కట్టడం అక్రమం అని మంగళవారం రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అదే వ్యక్తి గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఎల్పీసీని చూపించినప్పటికీ, అధికారులు లెక్కచేయకుండా గునపాలతో కట్టడాన్ని తొలగించడం గమనార్హం. తహసీల్దార్ భాస్కరఅప్పారావు ఆదేశాల మేరకు ఆర్ఐ భాస్కర్, వీఆర్వో రమేష్ అక్రమ కట్టడంపై చర్యలు తీసుకున్నారు. ఇదే క్రమంలో మండల కేంద్రంలో మధు అనే గిరిజనేతరుడు కూడా ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం చేపడుతున్నా, అధికారులు కనీసం ఒక్క ఇటుకను కూడా తొలగించలేదు. దీనివల్ల అధికారుల తీరుపై పక్షపాత ఆరోపణలు వస్తున్నాయి. గిరిజన ప్రాంతంలో అన్ని హక్కులు ఉన్న గిరిజనులకు తీవ్ర అన్యాయం చేస్తూ, గిరిజన ప్రాంతంలో ఎటువంటి హక్కులు లేని గిరిజనేతరుడికి ప్రభుత్వ భూమిలో నిర్మించడంపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సరికాదని పలువురు విమర్శిస్తున్నారు. దీనిపై తహసీల్దార్ను వివరణ కోరగా రెవెన్యూశాఖకు చెందిన భూమిలో గిరిజనుడు అక్రమంగా నిర్మించడం వల్ల చర్యలు తీసుకున్నామన్నారు. గిరిజనేతరుడికి నోటీసులు జారీ చేసి, తగు చర్యలు తీసుకుంటామన్నారు. దీనికి హెడింగ్ కావాలి -
రంపచోడవరం వైటీసీలో కలెక్టర్ కార్యాలయం
●కొత్త జిల్లాలో పాలనకు ఏర్పాట్లురంపచోడవరంలో కలెక్టరేట్ ఏర్పాటుచేయనున్న యూత్ ట్రైనింగ్ సెంటర్ రంపచోడవరం: రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు చేసిన పోలవరం జిల్లాలో పాలనకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. స్థానిక యూత్ ట్రైనింగ్ సెంటర్లో (వైటీసీ)లో కలెక్టరేట్ ఏర్పాటు చేస్తున్నట్లు మంగళవారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని బుధవారం రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి, ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్, ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి ప్రారంభించనున్నారు. అలాగే పరిపాలనలో ముఖ్యమైన ఎస్పీ, జాయింట్ కలెక్టర్ వంటి కీలకమైన పోస్టులను బుధవారం సాయంత్రంలోగా ప్రకటించే అవకాశం ఉంది. కొత్త సంవత్సరం జనవరి ఒకటి నుంచి కొత్త జిల్లాలో పరిపాలన ప్రారంభం కానుంది. -
నీలాకాశంలో రెండో చందమామ
రాజవొమ్మంగి: చూడగానే.. అప్పుడే పౌర్ణమి వచ్చేసిందా?.. అని ఆశ్చర్యపోక తప్పదు. నింగిలో ఆ గుండ్రటి ఆకారం, ఆ వెలుగు చూస్తే ఎవరైనా పొరబడాల్సిందే. కానీ అది నిజమైన చందమామ కాదు.. నూతన సంవత్సర వేడుకల కోసం రాజవొమ్మంగిలో ఆకాశంలో కొలువుదీరిన ’కృత్రిమ జాబిల్లి’. కొత్త ఏడాదికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పాలనుకున్న ఓ ఔత్సాహికుడు వినూత్నంగా ఆలోచించారు. సుమారు రూ. 30 వేల ఖర్చుతో భారీ హైడ్రోజన్ బెలూన్ను సిద్ధం చేశారు. మంగళవారం రాత్రి దీనిని గాలిలోకి ఎగురవేయగా, చీకటి ఆకాశంలో అది పసుపు రంగులో చందమామలా మెరుస్తూ చూపరులను కట్టిపడేసింది. గ్రామస్తులంతా ఆసక్తిగా ఈ ’హైడ్రోజన్ వెన్నెల’ను తిలకించారు. కేవలం వేడుక కోసమే కాకుండా, విభిన్నంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇంత ఖర్చు చేసి ఈ బెలూన్ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు స్థానికంగా వైరల్ అవుతున్నాయి. -
వణికిస్తున్న కనిష్ట ఉష్ణోగ్రతలు
చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. చలి తీవ్రతకు మన్యం వాసులు వణికిపోతున్నారు. మంచు ప్రభావం ఎక్కువగానే ఉంది. మంగళవారం జి.మాడుగులలో 7.0 డిగ్రీలు, అరకువ్యాలీలో 7.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ●పాడేరు డివిజన్ పరిధి ముంచంగిపుట్టులో 7.8 డిగ్రీలు, డుంబ్రిగుడలో 8.2 డిగ్రీలు, చింతపల్లిలో 10.8 డిగ్రీలు, పాడేరులో 11.3 డిగ్రీలు, కొయ్యూరులో 13.0 డిగ్రీలు నమోదు అయ్యాయని ఆయన తెలిపారు. రంపచోడవరం డివిజన్ వై.రామవరంలో 11.2 డిగ్రీలు, మారేడుమిల్లిలో 14.0 డిగ్రీలు, రంపచోడవరంలో 14.0 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 14.9 డిగ్రీలు, అడ్డతీగలలో 15.7 డిగ్రీలు, చింతూరు డివిజన్ ఎటపాక, చింతూరులో 15.3 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు ఏడీఆర్ పేర్కొన్నారు. ఉష్ణోగ్రతల్లో మార్పులు స్వల్పంగా ఉన్నప్పటికీ శీతల గాలుల ప్రభావం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఉదయం 10 గంటల వరకు మంచు కురుస్తూనే ఉంది. మంచు తెరలు కమ్మేయడం వల్ల వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. -
రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషదేవిపై ఫిర్యాదు
వై.రామవరం: తమ నాయకుడు, ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ్ భాస్కర్ (అనంత బాబు) ప్రాణాలకు ముప్పుతెచ్చే వ్యాఖ్యలు చేసిన రంపచోడవరం ఎమ్మెల్యే (టీడీపీ) మిరియాల శిరీషదేవిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక పోలీసుస్టేషన్లో ఎస్ఐ పృథ్వీయాదవ్కు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఈనెల 23వ తేదీన ఎమ్మెల్యే శిరీషదేవి రంపచోడవరంలో నిర్వహించిన ప్రెస్మీట్లో తమ నాయకుడు ఎమ్మెల్సీ అనంతబాబుపై ఉద్దేశపూర్వకంగా ఏకవచనంతో నానా మాటలు అన్నారన్నారు. ఒక ఎమ్మెల్సీ అనికూడా చూడకుండా అనంతబాబు ఇంటికి జనాన్ని పంపించి కొట్టిపారేయిస్తాననడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడి, అనంతబాబు ప్రాణాలకు ముప్పువచ్చే విధంగా ఆమె ప్రవర్తించారని వారు ఆరోపించారు. ఇలా ఈ ఒక్కసారే కాకుండా అనేక సార్లు భయభ్రాంతులను చేసేలా మాట్లాడారన్నారు. నియోజకవర్గంలో శాంతి భద్రతలకు ముప్పువాటిల్లే విధంగా ఎమ్మెల్యే శిరీషదేవి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే శిరీషదేవిపై భారతీయ న్యాయ -
ప్రసూతి నిరీక్షణ కేంద్రాలను పూర్తి చేయండి
పెదబయలు: ప్రసూతి నిరీక్షణ (బర్త్ వెయిటింగ్) కేంద్రాల సేవలు అందుబాటులోకి తేవాలని అరకు ఎంపీ గుమ్మా తనూజరాణి సూచించారు. మంగళవారం ఆమె మండలంలోని మారుమూల రూడకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రోగులకు అందుతున్న సేవల వివరాలను తెలుసుకున్నారు. సిబ్బందితో మాట్లాడారు. పీహెచ్సీలో రోజు వారీ ఓపీ వివరాలు, ఎక్కువగాఏ వ్యాధికి సంబంధించి రోగులు వస్తున్నారని ఆమె ఆరా తీశారు. క్షయ రోగులు ఎక్కువగా ఉన్నందున నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. పీహెచ్సీ పరిఽధిలో ఉన్న 120 మంది ఆశా కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తే వారితో మాట్లాడి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పాత అంబులెన్సు వాహనంతో ఇబ్బందులు పడుతున్నందున ఇటీవల ఎంపీ నిధులతో కొత్త వాహనం సమకూర్చామన్నారు. పీహెచ్సీలో ల్యాబ్, అన్ని గదులను ఆమె పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన బర్త్ వెయింటింగ్ హాల్, సిబ్బంది కార్టర్ల నిర్మాణం 90 శాతం పూర్తయినందున మిగతా 10శాతం పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని గిరిజన సంక్షేమ ఈఈని కోరారు. వైద్య సేవలకు సంబంధించి ఎటువంటి సమస్యలున్నా తమ దృష్టికి తేవాలన్నారు. గత ప్రభుత్వం వైద్యానికి పెద్ద పీట వేసిందని, ప్రస్తుతం అందుకు విరుద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాతారి సురేష్కుమార్. ఎంపీటీసీ వంటారి సంగీత, మాజీ ఎంపీటీసీ జాంబవతి, మాజీ సర్పంచ్ సుబ్రమణ్యం పాల్గొన్నారు. -
అథ్లెటిక్స్ పోటీల్లో పీడీ ప్రతిభ
● బంగారు పతకం సాధన ఎటపాక: కరీంనగర్లో ఈనెల 27,28 తేదీల్లో జరిగిన 12 మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో మండలంలోని నల్లకుంట గిరిజన ఆశ్రమ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నాగిరెడ్డి బంగారు పతకం సాధించారు. తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో 45 నుంచి 50 ఏళ్ల వయసు విభాగం షాట్పుట్ విభాగంలో ఆయన ప్రతిభ కనబరిచారు. వంద మీటర్ల పరుగు పందెం, జావెలన్ త్రోలో సిల్వర్ పతకాలు సాధించారు. వచ్చే ఏడాది జనవరి 30 నుంచి ఫిబ్రవరి 2 వరకు రాజస్థాన్లో జరిగే జాతీయస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నా ఆయనను సహచర ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు అభినందించారు. -
ఆశ్రమ విద్యార్థిని మృతిపై విచారణ
విద్యార్థులతో మాట్లాడుతున్న ఏడీఎంహెచ్వో ప్రతాప్ సీలేరు: స్థానిక బాలికల ఆశ్రమ పాఠశాలలో పాంగి నందిని మృతిపై అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ ప్రతాప్ విచారణ చేపట్టారు. మంగళవారం ఆయన పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. శుభత్ర పాటిస్తే ఎటువంటి వ్యాధులు దరిచేరవన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. విద్యార్థిని మృతిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే ఏజెన్సీలో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో వైద్య సిబ్బందిని నియమించేలా సంబంధిత అధికారులు హామీ ఇచ్చారని చెప్పారు. ఇకపై ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా రక్తపరీక్షలు చేపట్టేలా సంబంధిత వైద్యులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. సికిల్ సెల్ ప్రోగ్రాం ఆఫీసర్ బాబ్జి మాట్లాడుతూ రక్తహీనతను ప్రతి ఒక్కరూ మంచి ఆహారంతో దూరం చేయవచ్చన్నారు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న రాగిజావ, చక్కీలు ఎంతో మేలు చేస్తాయన్నారు. వైద్యాధికారి నారాయణరావు, హెల్త్ సూపర్వైజర్ త్రినాథ్, వార్డెన్ శకుంతల పాల్గొన్నారు. -
ఎప్పుడు?
రంపచోడవరంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు గడువులోగా పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఏజెన్సీ ప్రాంతంలో ఆధునిక వైద్యం అందుబాటులోకి వస్తుందని ఆశించిన 11 మండలాల ప్రజలను చురుగ్గా సాగకపోవడం నిరాశపరుస్తోంది. మెరుగైన వైద్యం కోసం వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాలకు వెళ్లలేక, ఇటు స్థానికంగా సదుపాయాలు లేక గిరిపుత్రులు అల్లాడిపోతున్నారు. సూపర్ వైద్యంరంపచోడవరం: గిరిజనులు అత్యవసర వైద్యం కోసం రాజమహేంద్రవరం, కాకినాడ వెళ్లాల్సి వచ్చేది. కొన్ని సందర్భాల్లో అక్కడికి వెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మారేడుమిల్లి మండలం చాపరాయి వచ్చినప్పుడు వైద్యసేవల సమస్యను గిరిజనుల నుంచి ఆయన నేరుగా తెలుసుకున్నారు. అధికారం చేపట్టిన వెంటనే రంపచోడవరంలో మల్టీపర్పస్ సూపర్ సెష్పాలిటీ ఆస్పత్రిని మంజూరు చేశారు. రూ.50 కోట్లతో రూ. 150 పడకల సామర్థ్యం గల దీనికి 2023లో అప్పటి ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత ఉదయ్భాస్కర్ శంకుస్థాపన చేశారు. అప్పటిలో నిధుల కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో పనులు శరవేగంగా ప్రారంభమయ్యాయి. ఇవి వచ్చే ఏడాది మే నెలాఖరుకు పూర్తి కావాల్సి ఉంది. అయితే సుమారు ఐదు నెలలు మాత్రమే గడువు ఉంది. శంకుస్థాపన చేసిన నాటి నుంచి ఇప్పటివరకు 50 శాతం మేర పనులు మాత్రమే జరిగాయి. మిగతా పనులు సకాలంలో పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే అత్యవసర వైద్యానికి ఇబ్బంది ఉండదని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. దీనిపై వైద్యవిధాన పరిషత్ డీసీహెచ్ఎస్ నీలవేణిని వివరణ కోరగా రంపచోడవరంలో సూపర్ సెష్పాలిటీ ఆసుపత్రి నిర్మాణం గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వంద పడకలకు స్థాయి పెంచినా.. రంపచోడవరం ఏరియా ఆస్పత్రిని 2014–19 మధ్య అప్పటి అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం వంద పడకల ఆస్పత్రిగా స్థాయి పెంచింది. అయినప్పటికీ ఎటువంటి వసతులు కల్పించలేదు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వంద పడకల వసతులతోపాటు తల్లీపిల్లల కోసం ప్రత్యేకంగా భవనం నిర్మించింది. మారుమూల గ్రామాల గిరిజనులకు వైద్యసేవలు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో పీహెచ్సీలను మంజూరు చేసింది. రంపచోడవరంలో నత్తనడకను తలపిస్తున్న మల్టీపర్పస్ సూపర్ సెష్పాలిటీ ఆస్పత్రి నిర్మాణం -
17 నిమిషాల పోరాటం
సీలేరు: స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యాధికారులు తమ అసాధారణ ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తితో ఒక పసికందు ప్రాణాన్ని కాపాడారు. మృత్యువుతో పోరాడుతున్న శిశువుకు పునర్జన్మ ప్రసాదించి ’వైద్యో నారాయణో హరి’ అని నిరూపించారు. వివరాలిలా ఉన్నాయి. గూడెంకొత్తవీధి మండలం దుప్పులవాడ పంచాయతీ రాళ్లగెడ్డ గ్రామానికి చెందిన కిలో రమేష్ భార్య భగవతి ప్రసవం కోసం స్థానిక పీహెచ్సీలో చేరారు. సోమవారం ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆ సమయంలో వైద్యాధికారులు బాబ్జి, నారాయణరావు ఇతర సిబ్బందితో కలిసి విధుల్లో ఉన్నారు. శిశువు జన్మించిన వెంటనే ఊపిరి అందకపోవడంతో పరిస్థితి విషమించింది. గుండె నుంచి ఇతర అవయవాలకు రక్త ప్రసరణ నిలిచిపోవడంతో శిశువు శరీరం మొత్తం నలుపు రంగులోకి మారిపోయింది. పసికందు కనీసం ఏడవకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే వైద్యాధికారులు బాబ్జి, నారాయణరావు ఏమాత్రం అధైర్యపడకుండా వెంటనే రంగంలోకి దిగారు. సుమారు 17 నిమిషాల పాటు నిరంతరాయంగా శిశువు కాళ్లు, వీపు, గుండైపె తడుతూ రక్త ప్రసరణ జరిగేలా శ్రమించారు. వారి నిరంతర శ్రమ ఫలించి, శిశువు ఒంటి రంగు మారి ఒక్కసారిగా ఏడవడం ప్రారంభించింది. దీంతో అప్పటివరకు ఉత్కంఠగా ఉన్న ఆసుపత్రి వాతావరణంలో ఆనందం నెలకొంది. శిశువు కొంత ఉమ్మనీరు తాగడంతో, మెరుగైన చికిత్స కోసం పాపను చింతపల్లి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మంగళవారం నాటికి పసికందు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యాధికారి బాబ్జి ధ్రువీకరించారు. తమ బిడ్డను ప్రాణాపాయం నుంచి కాపాడిన వైద్యులకు తల్లిదండ్రులు మరియు స్థానికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. -
బ్లైండ్ క్రికెటర్ కరుణకుమారికి ఘన సత్కారం
మంచు కొండల్లో వేడివేడి విందు ●హరితా రిసార్ట్లో ప్రత్యేక వంటకాలు చింతపల్లి: ప్రముఖ పర్యాటక కేంద్రం లంబసింగిలోని పర్యాటకశాఖ హరితా రిసార్ట్లో నూతన ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకుని ప్రత్యేక వంటకాలను ఏర్పాటు చేస్తున్నట్లు రిసార్ట్ మేనేజర్ ఎస్. అప్పలనాయుడు తెలిపారు. ఇక్కడి వచ్చే పర్యాటకులకు ఈ ఏడాది ప్రత్యేకంగా కోడికూర, రాగి సంగటి, కుండ బిర్యాని (వెజ్, నాన్వెజ్) తయారు చేస్తున్నట్లు తెలిపారు. నిప్పుల కుంపటి తెచ్చిన ముప్పు గూడెంకొత్తవీధి: చలి నుంచి ఉపశమనం కోసం వారు వేసుకున్న నిప్పుల కుంపటి, ఆ దంపతుల ప్రాణాల మీదకు తెచ్చింది. తలుపులు మూసి నిద్రించడంతో విషవాయువు పీల్చి అస్వస్థతకు గురైన ఘటన సోమవారం రాత్రి నక్కలమెట్ట గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని నక్కలమెట్ట గ్రామానికి చెందిన కొర్రా రాంబాబు (50), కొర్రా లక్ష్మి (45) దంపతులు సోమవారం రాత్రి చలి ఎక్కువగా ఉండటంతో ఇంట్లో నిప్పుల కుంపటి పెట్టుకున్నారు. గది చిన్నది కావడంతో పాటు, చలి గాలి రాకుండా తలుపులు, కిటికీలు పూర్తిగా మూసివేసి నిద్రపోయారు. మంట నుంచి వెలువడిన బొగ్గు పులుసు వాయువు గది నిండా వ్యాపించడంతో, ఆక్సిజన్ అందక వారు నిద్రలోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం ఎంతకీ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు లోపలికి వెళ్లి చూడగా, ఇద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే వీరిని స్థానిక పీహెచ్సీకి తీసుకువచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
పెండింగ్ మ్యుటేషన్లు పూర్తి చేయండి
పాడేరు : జిల్లాలో పెండింగ్లో ఉన్న మ్యుటేషన్లు, రీసర్వే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇన్చార్జి జేసీ, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ ఆదేశించారు. ఐటీడీఏలోని తన చాంబర్ నుంచి మంగళవారం జిల్లా రెవెన్యూ అధికారులు, మండల రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న భూ సంబందిత సర్వేలపై ప్రతి రోజు సమీక్ష నిర్వహిస్తామన్నారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న మ్యుటేషన్లు, రీసర్వే సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తేవాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. జిల్లాలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ శతశాతం పూర్తి చేయాలన్నారు. స్మార్ట్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల నమోదు, తొలగింపు సమగ్ర సమాచారంతో చేపట్టాలన్నారు. పీఎం జన్మన్ పథకంలో నిర్మిస్తున్న గృహాల పనులు వేగవంతం చేయాలన్నారు. జీవో నంబరు 23ప్రకారం లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు గుర్తించాలన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. -
కమనీయం.. ఉత్తరద్వార దర్శనం
● హరినామస్మరణతో మార్మోగిన ఆలయాలు ● భక్తి శ్రద్ధలతో ముక్కోటి ఏకాదశి పూజలు వైకుంఠ ఏకాదశి సందర్భంగా హరి నామస్మరణతో వైష్ణవాలయాలు మార్మోగాయి. ఉత్తరద్వారం గుండా ఆ వైకుంఠనాథుని దర్శించుకునేందకు మంగళవారం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. వణికించే చలిని సైతం లెక్కచేయకుండా తెల్లవారుజామునే జిల్లాలో పలు ఆయాలకు భక్తులు పోటెత్తారు. స్వామిని దర్శించుకుని తరంచారు. అలౌకికానందంతో తన్మయుల్యారు . సాక్షి,పాడేరు: జిల్లా కేంద్రం పాడేరులోని గిరి కై లాస క్షేత్రంలోని వైభవ వేంకటేశ్వరస్వామితో పాటు సుండ్రుపుట్టులోని వేంకటేశ్వరస్వామి, వెంకటగిరి మెట్టపై కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి,అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణంలోని వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైభవ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు అనంతరం మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి,డాక్టర్ నరసింగరావుతో పాటు ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు కొట్టగుళ్లి రమాదేవి, కాత్యాయని, వెంకటరత్నం, వైదేహి తదితరులు భగవద్గీత పుస్తకాలు, ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. వెంకటగిరి మెట్టపై భారీ అన్నసమరాధనను నిర్వహించారు.అరకులోయలోని పురాతన వేంకటేశ్వరస్వామి ఆలయంలోను ముక్కోటి ఏకాదశని ఘనంగా నిర్వహించారు. రంపచోడవరంలోరంపచోడవరం : ఐ.పోలవరం గోవిందగిరిపై తిరుమల తిరుపతి దేవస్థానం వారి వేంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఐటీడీఏ పీవో స్మరణ్ రాజ్, ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డి సతీసమేతంగా పాల్గొని పూజలు జరిపారు. ఆలయ అర్చకులు పార్థుస్వామి, మణికంఠస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం, గోకవరం తదితర సదూర ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలివచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో వైకుంఠద్వారంనుంచి స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారి సేవకులు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఆలయ అధికారులు రూపు సాయి, గోవింద గిరి శ్రీవారి సేవా బృందం సమన్వయ కర్త నల్లమిల్లి వేంకటరామారెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. చింతపల్లి: మండలంలోని పలు ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించా రు. అంతర్ల అనాదీశ్వర ఆలయంలో శివానంద మాతాజీ, అర్చకులు వినోద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బౌడ, వంగసార, శివాలయాలతో పాటు గొందిపాకలు,తాజంగి,చింతపల్లి రామాలయాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాలకు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అంతర్ల శివాలయంలో లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు 24 గంటల పాటు ప్రత్యేక భజన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ భజన కార్యక్రమంలో మండలంలో గల 10 భజన బృందాలు పాల్గొన్నాయి.ఆలయంలో పూజలు నిర్వహించిన భక్తులకు అన్నసమారాధన జరిపి, ప్రసాదాలను పంపిణీ చేశారు. అడ్డతీగల: ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. అడ్డతీగలలోని పవనగిరి క్షేత్రంలో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు. పాత రామాలయంలో ఏకాహం అడ్డతీగలలోని పాత రామాలయంలో కొలువైన సీతారామచంద్రస్వామి వార్లను వివిధ రకాల పుష్పాలు,తులసి మాలలతో అలంకరించి పూజాధికాలు నిర్వహించారు.అనంతరం సీతారామాలయంలో ఉదయం 6 గంటల నుంచి ఏకాహం ప్రారంభించారు. జి.మాడుగుల: సింగర్భ పంచాయతీ గొడ్డుబూసులు గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యుడు ఐసరంగి రామకృష్ణ,దేవుళ్ళునాయుడు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.స్థానిక రామాలయం, గాంధీనగరం గ్రామంలో పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం, మత్స్య మాడుగులమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రముఖ్ రీమెలి అప్పలరాజు, ధర్మ రక్ష దివస్ స్వామి సచ్చానంద లక్ష్మణ్ స్వామిజీ తదితరులు పాల్గొన్నారు. సీలేరు: ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని సీలేరు, దారకొండలలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీలేరులోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వారం గుండా స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం అన్నసమారాధన నిర్వహించారు.స్థానిక రామాలయం ఆలయంలో ఆకాశదీప పూజలను నిర్వహించి కుంకుమ పూజలు కోలాటం. దారకొండలో స్వామివారిని పల్లకిలో ఊరేగించారు. రాజవొమ్మంగి: స్థానిక కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులకు ఉత్తరద్వార దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం లక్ష తులసి పూజ, ప్రసాదవితరణ జరిపారు. -
ప్రొటోకాల్పై గరంగరం
మహారాణిపేట(విశాఖ): ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రొటోకాల్ అమలుపై పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులకు ఆహ్వానం లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశం వేడీవేడిగా సాగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు గైర్హాజరు కావడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ఎం.ఎన్.హరేందిర ప్రసాద్(విశాఖ), విజయ కృష్ణన్(అనకాపల్లి), దినేష్ కుమార్(ఏఎస్ఆర్ జిల్లా), సీఈవో నారాయణమూర్తి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులకు గౌరవం లేదా? మండలాల పరిధిలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు స్థానిక ప్రజాప్రతినిధులను పిలవడం లేదని, వారిని గౌరవించాల్సిన అవసరం లేదా అని పలువురు సభ్యులు సూరిబాబు(ఎంపీపీ, అనకాపల్లి), ఈర్లె అనురాధ(జెడ్పీటీసీ), సన్యాసిరాజు, నాగమణి, ఉమాదేవి, కర్రి సత్యం, దొండా రాంబాబు తదితరులు ప్రశ్నించారు. గత వైఎస్సార్సీపీ హయాంలో ప్రొటోకాల్ పక్కాగా ఉండేదని, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి స్థానిక ప్రజాప్రతినిధులను గౌరవించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల అనకాపల్లి జిల్లా కొత్తూరులో వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులను ఆహ్వానించలేదని అనకాపల్లి ఎంపీపీ సూరిబాబు ఆరోపించారు. ఈ విషయంపై అధికారులను అడిగినా సరైన సమాధానం చెప్పలేదని మండిపడ్డారు. కె.కోటపాడు జెడ్పీటీసీ ఈర్లె అనురాధ మాట్లాడుతూ ఇటీవల తన మండలంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఆహ్వానించలేదన్నారు. ప్రశ్నిస్తే గంట ముందుగా ఫోన్ చేసి రావాలని పిలుస్తున్నారని, ఇదెక్కడి ప్రొటోకాల్ అమలు చేయడమో అర్థం కావడం లేదని మండిపడ్డారు. ఒకసారి ప్రశ్నిస్తే, రెండోసారి పొరపాటు చేయకూడదని, కానీ ఇక్కడ అధికారులు పదేపదే తప్పులు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర ఆదేశించారు. ప్రొటోకాల్ పాటించని ఎంపీడీవోలకు నోటీసులు జారీ చేస్తామని సీఈవో నారాయణమూర్తి తెలిపారు. పింఛన్ల ఏరివేత ఆపండి ఉమ్మడి విశాఖ జిల్లాలో పింఛన్ల ఏరివేత ప్రక్రియను తక్షణం నిలిపివేయాలని, ఈ ఏరివేతలో అర్హులకు అన్యాయం జరుగుతోందని పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన దివ్యాంగుల పింఛన్లు తొలగిస్తున్నారని గొలుగొండ ఎంపీపీ నాగమణి ఆరోపించారు. బుచ్చయ్యపేట జెడ్పీటీసీ దొండపూడి రాంబాబు మాట్లాడుతూ అనర్హులకు పింఛన్లు ఇస్తున్నారని, అర్హులకు తొలగిస్తున్నారని మండిపడ్డారు. పింఛన్ల విషయంలో దివ్యాంగులను ఇబ్బంది పెట్టడం తగదని జెడ్పీటీసీ ఈర్లె అనురాధా కోరారు. పల్లె రోడ్ల దుస్థితిపై సర్వత్రా గగ్గోలు ఉమ్మడి జిల్లాలో పలు గ్రామాల్లో రోడ్ల దుస్థితిపై ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. వడ్డాది, చోడవరం, రోలుగుంట, నర్సీపట్నం, గొలుగొండ, తదితర మండలాల్లోని గ్రామాల్లో రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయని మాడుగుల ఎంపీపీ తాళ్లపూడి వెంకట రాజారామ్ వివరించారు. ఈ మార్గాల్లో ప్రయాణించడం గగనంగా మారిందని వాపోయారు. రోడ్ల పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని రాజారామ్ అధికారులను ప్రశ్నించారు. దేవరాపల్లి మండలంలో కూడా రోడ్లు అధ్వానంగా ఉన్నాయని జెడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యం అన్నారు. కోటవురట్ల మండలంలో కూడా రోడ్లు గుంతలమయంగా తయారయ్యాయని జెడ్పీటీసీ సభ్యురాలు ఉమాదేవి తెలిపారు. సీపీఎం నాయకుడు అప్పలరాజును విడుదల చేయాలి సీపీఎం నాయకుడు అప్పలరాజుపై పెట్టిన పీడీ కేసును ఎత్తి వేయాలని పలువురు సభ్యులు కోరారు. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అప్పలరాజుపై పీడీ యాక్టు నమోదు చేయడం దారుణమని అనంతగిరి జెడ్పీటీసీ డి.గంగరాజు అన్నారు. ఆయనకు మద్దతుగా పలువురు వైఎస్సార్సీపీ సభ్యులు, నక్కపల్లి జెడ్పీటీసీ గోసల కుశలమ్మ, పైలా సన్యాసిరాజు, సోము సత్యనారాయణ, లాలం రాంబాబు తదితరులు మాట్లాడారు. బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాలుష్యంపై ఆందోళన పరవాడలో వివిధ పరిశ్రమల కారణంగా కాలుష్యం సమస్య అధికంగా ఉందని జెడ్పీటీసీ పైలా సన్యాసిరాజు అన్నారు. పలు లారీలు ఓవర్ లోడుతో వెళ్తుండడంతో రోడ్లు ఛిద్రమయ్యాయని చెప్పారు. అయినా కాలుష్య నివారణ అధికారులు, ఆర్టీవో, పోలీసు అధికారులు చోద్యం చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. అచ్యుతాపురంలో కూడా కాలుష్య సమస్య అధికంగా ఉందన్నారు. లంకెలపాలెం జంక్షన్లో కాలుష్యం కారణంగా కనీసం 10 నిమిషాలు కూడా నిలబడలేని పరిస్థితి నెలకొందని వాపోయారు. ప్రజాప్రతినిధుల బినామీలే లారీల కాంట్రాక్టులను దక్కించుకోవడంతో అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారని సన్యాసిరాజు ఆరోపించారు. పలు ప్రాంతాల నుంచి మట్టి అక్రమ తరలింపుపై గనుల శాఖ అధికారులు సమాధానం చెప్పాలని మాడుగుల ఎంపీపీ తాళ్లపూడి వెంకట రాజారామ్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మూడు జిల్లాల అధికారులు, ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి, కె.రాజ్కుమార్, పరిపాలనాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.మౌనం పాటిస్తున్న జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, చిత్రంలో కలెక్టర్లు హరేందిర ప్రసాద్, విజయ కృష్ణన్, దినేష్కుమార్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కొయ్యూరు జెడ్పీటీసీ సభ్యుడు వి.నూకరాజు మృతికి సంతాపసూచకంగా రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పలువురు సభ్యులు మాట్లాడుతూ నూకరాజు సేవలను కొనియాడారు. ప్రొటోకాల్ అమలుపై జెడ్పీ చైర్పర్సన్ సుభ్రద, కలెక్టర్ల ఎదుట ఆందోళన వ్యక్తం చేస్తున్న జెడ్పీటీసీలు, ఎంపీపీలు మండలాల్లో అభివృద్ధి పనులకు ఆహ్వానం లేకపోవడంపై జెడ్పీటీసీల ఆగ్రహం బల్క్ డ్రగ్ పార్క్కు వ్యతిరేకంగా నినాదాలు వాడీవేడిగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఎమ్మెల్యేలు, ఎంపీలు గైర్హాజరుపై గుసగుసలు -
విద్యార్థుల మరణాలు ప్రభుత్వానికి పట్టవా?
సీలేరు: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో సంభవిస్తున్న విద్యార్థుల వరుస మరణాలు ప్రభుత్వానికి పట్టవా? అని డీఎల్వో రాష్ట్ర అధ్యక్షుడు కొర్ర మార్క్ రాజ్. జిల్లా ముఖ్య కార్యదర్శి మనోజ్ కుమార్ ప్రశ్నించారు. తరచూ విద్యార్థులు మరణిస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నారు. మంగళవారం వారు మాట్లాడారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే సీలేరు బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి చెందిందని ఆరోపించారు. ఆశ్రమ పాఠశాలల్లో పర్యవేక్షణ అధికారులు లేకపోవడం దారుణమన్నారు. సీలేరు పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఎక్కడికి వెళ్లిపోయారో ఐటీడీఏ పీవో సమాధానం చెప్పాలి డిమాండ్ చేశారు. 270 మంది ఉన్న పాఠశాలలో కేవలం ఒకే ఒక్క వంట మనిషి ఉండటం, ఒక వైద్య సిబ్బంది కూడా లేకపోవడం దారుణమన్నారు. పర్యవేక్షణ లేకే అవాంఛనీయ ఘటనలు గూడెంకొత్తవీధి: సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ సంక్షేమ ఆశ్రమాల్లో అనేక అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని గూడెంకొత్తవీధి మండలం గాలికొండ పంచాయతీ ఎంపీటీసీ అంపురంగి బుజ్జిబాబు అన్నారు . మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గూడెంకొత్తవీధి మండలంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, కళాశాలల్లో వేలాది మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారన్నారు. వీరి బాగోగులు, ఇబ్బందులపై సరైన పర్యవేక్షణ ఉండటం లేదన్నారు. ఇటీవల కాలంలో గూడెంకొత్తవీధి మండలంలోని పలు పాఠశాలల్లో అనేక ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పారు. గతంలో మండలానికి సహాయ గిరిజన సంక్షేమాధికారి ఉండేవారని, ఆ పోస్టును ప్రభుత్వం రద్దుచేసిందని చెప్పారు. చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాలను ఒకే అఽధికారి పర్యవేక్షించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. తక్షణమే గూడెంకొత్తవీధి మండలానికి ఏటీడబ్ల్యూవోను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. -
వించ్ ప్రయాణం అమోఘం
ముంచంగిపుట్టు: మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి వెళ్లే వించ్ ప్రయాణం అమోఘమని ఒడిశా జలవిద్యుత్శాఖ ఆర్థిక సంచాలకుడు ప్రణబ్కుమార్ అన్నారు. ఆంధ్రా ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. వించ్లో ప్రాజెక్ట్కు చేరుకున్నారు. మధురానుభూతి పొందారు. వించ్ వివరాలను ప్రాజెక్టు అధికారుల నుంచి తెలుసుకున్నారు. విద్యుత్ కేంద్రంలో జనరేటర్ల పనితీరు, విద్యుత్ ఉత్పత్తి వివరాలపై ఆరా తీశారు. శతశాతం విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండడంపై ఆయన ప్రాజెక్టు అధికారులను,సిబ్బందిని అభినందించారు. పలు రికార్డులను పరిశీలించారు. స్థానిక ఉద్యోగులు, సిబ్బంది సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు,సౌకర్యాలు కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు ఈఈ గోవిందరాజులు, ఓహెచ్పీసీ జీఎం నిర్మల్కుమార్ ,మాచ్ఖండ్ ఈఈ సివిల్ కురేషిప్రధాన్, డిప్యూటీ ఈఈలు చంద్ర ఓబుల్రెడ్డి, వెంకటమధు,చిరంజీవి పాల్గొన్నారు. -
మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పటల్లో అత్యాధునిక టోమోథెరపీ సేవలు
ఎంవీపీకాలనీ: క్యాన్సర్ చికిత్సలో రాష్ట్రంలో తొలిసారి అత్యాధునిక టోమోథెరపీ వైద్యసేవలను ఎంవీపీ కాలనీలోని మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అందుబాటులోకి తెచ్చింది. మంగళవారం హాస్పటల్లో జరిగిన కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీభరత్ హాస్పటల్ ఎండీ డాక్టర్ వున్నా మురళీకృష్ణతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ క్యాన్సర్ రోగులకు ఉపశమనం కలిగించే విధంగా మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పటల్ ఏపీలో తొలిసారి అత్యాధునిక టోమోథెరపీ సాంకేతిక అందుబాటులోకి తేవడం హర్షణీయమన్నారు. దీని ద్వారా మెరుగైన వైద్యసేవలు క్యాన్సర్ రోగులకు అందించడం సాధ్యమవుతుందన్నారు. హాస్పటల్ ఎండీ మురళీకృష్ణ మాట్లాడుతూ రూ.32 కోట్లు విలువైన ఈ యూనిట్ కొనుగోలుతో మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పటల్ దేశంలో లెవల్ 3 కేటగిరి హాస్పటల్స్గా గుర్తింపు తెచ్చుకుందన్నారు. ఈ సాంకేతికత ద్వారా క్యాన్సర్ ట్యూమర్ను అత్యంత కచ్చితత్వంతో గుర్తించి నిమిషాల వ్యవధిలో చికిత్స అందించవచ్చన్నారు.కార్యక్రమంలో పలువురు హాస్పటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రక్తదానంతో ప్రాణదానం
సాక్షి, పాడేరు: హుకుంపేట, పాడేరు మండలాల సహాయ గిరిజన సంక్షేమ అధికారి(ఏటీడబ్ల్యువో) రక్తదానం చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. రెడ్క్రాస్ సొసైటీ సోమవారం హుకుంపేట మండల కేంద్రంలో రక్తదాన శిబిరం నిర్వహించింది. ఈ శిబిరానికి స్వచ్ఛందంగా హాజరైన ఏటీడబ్ల్యూవో అఖిల రెండవ సారి రక్తదానం చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్తదాన శిబిరాలకు యువతి, యువకులంతా ముందుకు వచ్చి తోటి మనుషులకు ప్రాణదాతలు కావాలన్నారు. గిరిజన ప్రాంతాల్లోను గర్భిణులు, బాలింతలు, సికిల్సెల్ ఎనిమియా కేసులకు రక్తం అవసరాలు అఽధికమయ్యాయని, ఈ మేరకు రెడ్క్రాస్ సొసైటీ నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలను యువత పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ శిబిరంలో 8 మంది రక్తదానం చేశారు. రెడ్క్రాస్ సొసైటీ ప్రతినిధులు గంగరాజు, వెంకట్, న్యాయవాది తమర్భ ప్రసాద్నాయుడు సిబ్బంది పాల్గొన్నారు. -
ఉత్తర ద్వార దర్శనానికి వేళాయె
సింహాచలం: ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్తరద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ ఉత్తర రాజగోపురంలో మంగళవారం ఉదయం 5.30 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వైకుంఠనారాయణుడిగా శ్రీదేవి, భూదేవి సమేతుడై దర్శనమివ్వనున్నాడు. సుమారు 50 వేల మంది భక్తులు ఈసారి స్వామి దర్శనానికి వస్తారని అంచనా వేశారు. ఉచిత దర్శనం క్యూతోపాటు రూ.100, రూ..300 దర్శన క్యూలు, రూ.500 ప్రత్యేక దర్శన క్యూ, ప్రోటోకాల్ వీఐపీల క్యూలు ఏర్పాటు చేశారు. ఉత్తరరాజగోపురం ఎదురుగా భక్తులు క్యూల్లో నడుస్తూనే 15 నిమిషాలపాటు స్వామిని దర్శించుకునే ఏర్పాటు చేశారు. అలాగే ఉత్తరద్వారం దర్శనం కాగానే నేరుగా ఆలయంలోకి వెళ్లి నీలాద్రిగుమ్మం నుంచి మూలవిరాట్ దర్శనం చేసుకునేలా క్యూలు రూపొందించారు. ఆలయ రాజగోపురం, ఉత్తర రాజగోపురం, ఆలయ ప్రాంగణాలకు విద్యుద్దీపకాంతులు చేకూర్చారు. భారీ ఎత్తున పుష్పాలంకరణ చేశారు. ఉదయం 4 గంటల నుంచి సింహగిరికి ఆర్టీసీ, దేవస్థానం బస్సులు ప్రారంభమవుతాయి. సుమారు లక్ష లడ్డూల ప్రసాదాన్ని విక్రయానికి సిద్ధం చేశారు. సింహగిరిపైన, కొండదిగువ కలిపి మొత్తం ఆరుచోట్ల మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. 190 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు విధులు నిర్వర్తిస్తారని గోపాలపట్నం సీఐ ఎల్.ఎస్.నాయుడు తెలిపారు. నేటి నుంచి రాత్రి 7 గంటల వరకే దర్శనాలు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనాలు మంగళవారం నుంచి జనవరి 9వ తేదీ వరకు రాత్రి 7 గంటల వరకు మాత్రమే లభిస్తాయని అధికారులు తెలిపారు. ఆలయంలో జరిగే రాపత్తు ఉత్సవాల సందర్భంగా ఈ మార్పు చేసినట్టు పేర్కొన్నారు. దర్శన వివరాలు ఉదయం 5.30 నుంచి 11 గంటల వరకు ఉత్తరద్వార దర్శనాలు ముగిసినా.. మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు మూలవిరాట్ దర్శనాలు ఉంటాయి. -
సీఐటీయూ మహాసభలను విజయవంతం చేయాలి
చింతపల్లిలో ప్రచారం చేస్తున్న సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నయ్యపడాల్ చింతపల్లి: విశాఖనగరంలో ఈనెల 31 నుంచి జనవరి 4వరకూ జరిగే సీఐటీయూ అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నయ్యపడాల్ కోరారు. మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం చింతపల్లిలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మహాసభలకు దేశం నలుమూలలు నుంచి కార్మిక సంఘాల నాయకులు, ప్రముఖ సినీ నటులు, రచయితలు, కళాకారులు హాజరుకానున్నారన్నారు. ఇప్పటికే మహాసభలు ప్రాంగణంలో శ్రామిక ఉత్సవ పేరుతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వెంకటగిరి, ధనుంజయ్, చిరంజీవి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
450 మందికి వైద్య పరీక్షలు
డుంబ్రిగుడ: మండలంలోని కొర్ర పంచాయతీ కేంద్రంలో భారత మానవ హక్కుల సంరక్షణ సంస్ధ (హెచ్ఆర్సీ) చైర్మన్ రాజన్ప్రసాద్ రావు ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కంటి పరీక్షలు, బీపీ, షుగర్ తనిఖీలు నిర్వహించి వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా 42 మంది కంటి పరీక్షలు చేసుకోగా 15 మందిని మెరుగైన చికిత్సలు, సర్జరీ కోసం సిఫార్సులు చేశారు. కొర్ర పంచాయతీతో పాటు సమీప గ్రామాల నుంచి సుమారు 450 మందికి వైద్య పరీక్షలు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ట్రెడ్స్, ఆశ ఫౌండేషన్ ఎన్జీవోల సహకారంతో చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వృద్దులకు రగ్గులు, దుస్తులు పంపిణీ చేశారు. ట్రెడ్స్ సంస్ధ డైరెక్టర్ వెంకటరావు, ఆవ ఫౌండేష్ సీఈవో ప్రసాద్రావు, సీఐఎస్ రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఐషత, సంధ్య, నిర్మలదేవి, తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు
● ఎమ్మెల్యే శిరీషపై పోలీసులకు వైఎస్సార్సీపీ నాయకుల ఫిర్యాదు ● రాజవొమ్మంగిలో ఫిర్యాదు స్వీకరించని పోలీసులు ఎటపాక , వి.ఆర్.పురం, కూనవరం పోలీసుస్టేషన్లలో ఫిర్యాదుచేస్తున్న వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఎటపాక/కూనవరం/వి.ఆర్.పురం/గంగవరం/రాజవొమ్మంగి: ఎమ్మెల్సీ అనంతబాబుపై రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి చేసిన అనుచిత వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ అనంతబాబుపై తప్పుడు ఆరోపణులు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్యే శీరిషాపై ఎటపాక, వి.ఆర్.పురం, కూనవరం, గంగవరం, రాజవొమ్మంగి తదితర మండలాల్లోని పోలీసు స్టేషన్లలో వైఎస్సార్సీపీ నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పార్టీ ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ నియోజక ప్రజలకు అండగా నిలిచి, వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్సీపై అసత్య ప్రచారాలు మానుకుని ప్రజాసంక్షేమం కోసం పాటుపడాలని హితవు పలికారు. ఇకపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎటపాకలో పార్టీ మండల అధ్యక్షుడు ఆకుల వెంకటరామారావు,రాష్ట్ర కార్యదర్శి కురినాల వెంకట్,ఎంపీటీసీలు వెంకట్రామిరెడ్డి,అంజలి,నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు దామెర్ల రేవతి,మండల అధ్యక్షురాలు నాగలక్ష్మి, అవులూరి సత్యనారాయణ, తోట శశికుమార్, దయాకర్, నవీన్బాబు, కోటి, సర్పంచ్ నాగమణి, కన్నా, రాజశేఖర్, మణి, స్వరూప తదితరులున్నారు. వి.ఆర్.పురంలోని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన వారిలో వైఎస్సార్సీపీ నాయకులు, ఆర్టీఐ జిల్లా అధ్యక్షుడు బోడ్డు సత్యనారాయణ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చిక్కాల బాలకృష్ణ, పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చీమల కాంతారావు, ఆర్టీఐ ప్రతినిధి జయరాజు, నరేష్, రమేష్ సత్య తదితరులున్నారు. కూనవరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన వారిలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆలూరి కోటేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యురాలు గుజ్జా విజయ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆవుల మరియాదాస్, ఎస్టీ సెల్ రాష్ట్ర కమిటీ సభ్యులు గుజ్జాబాబు, మాజీ డైరెక్టర్ దీకొండ గంగాధర్, నియోజవర్గ రైతు సంఘం అధ్యక్షుడు నోముల కొండలరావు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి అరవా దివాకర్, మహిళా ఉపాధ్యక్షురాలు కొమ్మాని సునీత, ఇంటి పూర్ణానందం, సర్పంచ్లు నూపా వెంకన్నబాబు, నిరోషా, మడకం పూర్ణ, నోముల సత్యనారాయణ, సత్తిపండు, మధు, లక్ష్మణ్, వీర్రాజు తదితరులున్నారు. గంగవరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదుచేసిన వారిలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు యెజ్జు వెంకటేశ్వరరావు , మండల ఇన్చార్జి సీహెచ్.రఘునాఽథ్, ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ కె.రామతులసి, కె.గంగాదేవి , ఎంపీటీసీ సభ్యులు కనకలక్ష్మి, వెంకటలక్ష్మి, సర్పంచ్లు కామరాజుదొర, మరిడమ్మ, వెంకటేశ్వర్లుదొర, నాయకులు శివ , బాబి, రామకృష్ణ, జగదీష్, సతీష్, శ్రీను తదితరులున్నారు. రాజవొమ్మంగిలో వైఎస్సార్సీపీ నాయకుల ఫిర్యాదును స్థానిక పోలీసులు స్వీకరించలేదని మండల పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి రామకృష్ణ, పార్టీ రాష్ట్ర యూత్ కార్యదర్శి కొంగర మురళి కృష్ణ చెప్పారు. -
సమస్యలపై వెల్లువెత్తిన వినతులు
రంపచోడవరం: రంపచోడవరం మండలం సీమగండి నుంచి వేములకొండ గ్రామం వరకు సుమారు 20 కిలోమీటర్లు మేర రోడ్డు ఆధ్వానంగా ఉండడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు సోమవారం పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. కొంత మేర ఘాట్రోడ్డు ఉండడం ఎటువంటి రక్షణ చర్యలు లేకపోవడంతో ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నామని కుర్ల అబ్బాయిరెడ్డి, కొండ్ల శ్రీదేవి, కుర్ల మోహర్వాణిలు తెలిపారు. రంపచోడవరం ఐటీడీఏ సమావేశపు హాలులో పీవో స్మరణ్రాజ్, సబ్ కలెక్టర్ సాహిత్లతో కలిసి పీజీఆర్ఎస్లో గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ వారం 78 అర్జీలు వచ్చినట్టు తెలిపారు. మారేడుమిల్లి మండలం కుట్రవాడ నుంచి పాములేరు వరకు ఐదు కిలోమీటర్లు బీటీ రోడ్డు నిర్మించాలని పాములేరు సర్పంచ్ రమాదేవి, సార్ల మంగిరెడ్డి, పల్లాల పండురెడ్డి తదితరులు అర్జీ అందజేశారు. పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురైన పెదబీంపల్లి –2 ఆర్అండ్ఆర్ కాలనీలైన మడపల్లి, పెనికిలపాడు, మంటూరు గ్రామాలకు ఒక పంచాయతీగా ఏర్పాటు చేయాలని సర్పంచ్ తోకల నాగరత్నం, ముర్ల సూర్యకుమారి కోరారు. దేవీపట్నం మండలం వెలగపల్లి నుండి దోనలంక మీదుగా పీహెచ్ గంగవరం,పెద్దనూతులు గ్రామాలకు లింకు రోడ్డు ఏర్పాటు చేయాలని సర్పంచ్ కె.శివారెడ్డి కోరారు. చింతలపూడి పంచాయతీ పెరికవలస రోడ్డు ఫారెస్టు క్లియరెన్స్ మంజూరు చేసి రోడ్డు నిర్మించాలని, వేటుకూరు–చింతలపూడి వరకు 15 కిలోమీటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. సిడిమెట్ల వరకు 8 కిలోమీటర్లు రోడ్డు, బొడ్డగుంట, చింతకొయ్య గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణం చేయాలని గిరిజనులు కోరారు. ఏపీవో డీఎన్వీ రమణ, తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
ప్రమాణం చేస్తున్న నూతన కార్యవర్గ ప్రతినిధులు సాక్షి, పాడేరు: జిల్లా కేంద్రంలోని గిరిజన ఉద్యోగుల సంఘం భవనంలో అఖిల భారత్ గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నిక సోమవారం ప్రశాంతంగా జరిగింది. జిల్లా ఎన్నికల కమిషన్ చైర్మన్ పలాసి కృష్ణారావు, వైస్ చైర్మన్ జి.వి.వి.ప్రసాద్, ఎన్నికల అధికారులు టి.నాగేశ్వరరావు, జంపరంగి ప్రసాద్,కిల్లు గంగన్నపడాల్, కుడుముల కాంతారావు పర్యవేక్షణలో జరిగిన ఈ ఎన్నికలో కమిటీ జిల్లా అధ్యక్షుడిగా మాసాడ ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా ముఖీ శేషాద్రి, మహిళా విభాగం కార్యదర్శిగా శెట్టి శాంతకుమారి, కోశాధికారిగా వి.కొండలరావు,ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎం.ప్రసాదరావు,జోన్–1 అరకు ఉపాధ్యక్షుడిగా ఎస్.జి.దొర, సంయుక్త కార్యదర్శిగా నందో, కార్యవర్గ సభ్యులుగా ఆనందరావు,కొర్రా అమర్నాధ్,కొర్రా రమేష్, జోన్–2 పాడేరు ఉపాధ్యక్షుడిగా రేగం అనిల్కుమార్, సంయుక్త కార్యదర్శిగా కూడా ఈశ్వరరావు, కార్యవర్గ సభ్యులుగా రామచంద్రరాజు, యువరాజు, మహేష్, జోన్–3 పెదబయలు ఉపాధ్యక్షుడిగా బాలకృష్ణ, సంయుక్త కార్యదర్శిగా తిరుపతిరావు, కార్యవర్గ సభ్యులుగా కమలకుమారి, లింగన్న, జోన్–4 చింతపల్లి ఉపాధ్యక్షుడిగా శివప్రసాద్, సంయుక్త కార్యదర్శిగా సతీష్కుమార్, కార్యవర్గ సభ్యులుగా స్వామినాథం, మల్లేశ్వరరావు, సింహచలంలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఉద్యోగల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జిల్లా నూతన కార్యవర్గంతో ఎన్నికల అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. గిరిజన గ్రామాలపై చలి పంజా ముంచంగిపుట్టు: మండలంలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది. గిరిజన గ్రామాలపై చలి పంజా విసురుతుంది. సోమవారం చలి తీవ్రత అధికమైంది. పనులకు వేళ్లే కూలీలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు గజగజ వణుకుతూ వెళ్లారు. సాయంత్రం 4 గంటల నుంచి మొదలైన చలి, ఉదయం 9 గంటల వరకు ఉంటుంది. చలి నుంచి ఉపశమం పోందేందుకు గ్రామాల్లో చలి మంటలు వేసుకుంటున్నారు. విపరీతంగా కురుస్తున్న మంచు వల్ల హెడ్లైట్ వెలుతురులో వాహనచోదకులు రాకపోకలు సాగిస్తున్నారు. -
అందని సేవలు.. తప్పని తిప్పలు
● సంత రోజున వైద్య సేవలు కరువు ● రోగులకు అవస్థలుపెదబయలు: మండలం కేంద్రంలోని 24 గంటల ప్రభుత్వ ఆస్పత్రిలో సంత రోజు ఓపీ చూడడానికి వైద్యులు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. పెదబయలు పీహెచ్సీలో రోజూ ఓపి 100 మందిలోపు ఉంటుంది. అయితే ఇక్కడ సంత సోమవారం కావడంతో స్థానికులతో పాటు పరిసర గ్రామాల నుంచి ప్రజలు వైద్య సేవల కోసం ఆస్పత్రికి వస్తుంటారు. ఈ కారణంగా సోమవారం ఓపీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ రోజు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సుదూరం నుంచి వచ్చిన రోగులు నానా అవస్థలు పడుతున్నారు. సోమవారం ఆస్పత్రిలో ఇద్దరు వైద్యులు ఉన్నా డాక్టర్ సత్యశ్రీ సెలవు పెట్టడం, మరో వైద్యుడు డాక్టర్ నిఖిల్ కిలగాడ పీహెచ్సీకి వెళ్లడంతో ఆస్పత్రిలో ఓపిని కిందస్థాయి సిబ్బంది చూశారు. అలాగే డెలీవరికి సంబంధించి కూడా గర్భిణులు ఆస్పత్రిలో చేరారు. తప్పనిసరిగా ఒక వైద్యులు సెలవు పెడితే ఓపీ చూడడానికి మరో వైద్యులను ఉన్నతాధికారులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఆ దిశగా దృష్టి సారించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిస్థాయిలో ఇద్దరు వైద్యులు ఒకరూ ఆస్పత్రిలో సేవలందిస్తుంటే మరొకరు గ్రామాల్లో వైద్య శిబిరాల ద్వారా రోగులకు సేవలందించేవారని చెబుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఓపి చూడడానికి ఎవ్వరు లేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి రోజు ఓపీకి వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని, వారపు సంత రోజులో తప్పనిసరిగా వైద్యులు ఆస్పత్రిలో ఉండేలా చూడాలని కోరుతున్నారు. ఆస్పత్రికి ఇద్దరు వైద్యులను నియమించాలని కోరుతున్నారు. ఈ విషయంపై వైద్యాధికారి సత్యశ్రీని వివరణ కోరగా తనకు ఆరోగ్యం బాగాలేక సెలవు పెట్టడం జరిగిందని, కింద స్థాయి సిబ్బంది ఓపీ చూస్తున్నారని వెల్లడించారు. -
కురిడి ఫ్లైఓవర్పై నీలినీడలు
● రెండేళ్లుగా ప్రకటనలకే పరిమితం ● భూముల సమస్యలంటున్న రైల్వేశాఖ ● కేకే లైన్లో రోజూ 30 రైళ్ల రాకపోకలు ● రైల్వే గేటు పడితే అవస్థలే ● 108,అంబులెన్స్ సర్వీసులకు ఆటంకం ● జాతీయ రహదారితో పెరిగిన వాహనాల రద్దీసాక్షి, పాడేరు: కొత్తవలస–కిరండోల్ రైల్వే లైన్లోని కురిడి ఫ్లై ఓవర్ నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇది రెండేళ్లుగా ప్రకటనలకే పరిమితమైంది.అరకులోయ నుంచి పాడేరు మీదుగా రాజమండ్రికి వెళ్లే జాతీయ రహదారిలో ఉన్న కురిడి రైల్వే గేటు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి రైల్వేశాఖ, జాతీయ రహదారుల విభాగం రూ.7కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించాయి. జాతీయ రహదారి నిర్మాణం పూర్తయినప్పటికీ కురిడి రైల్వేగేటు వద్ద ఇరువైపులా రోడ్డు విస్తరణ, బ్రిడ్జి నిర్మాణ పనులు మాత్రం చేపట్టలేదు. దీంతో పాత రోడ్డు మీదుగా రైల్వే ట్రాక్ను దాటుతూ వాహనాలు రాకపోకలు సాగుతున్నాయి. పెరిగిన వాహనాల రద్దీ విజయనగరం నుంచి రాజమండ్రి వరకు రెండు వరుసల జాతీయ రహదారి నిర్మించడంతో వాహనాల రద్దీ ఇటీవల అధికమైంది. పర్యాటక సీజన్ కావడంతో గత రెండు నెలల నుంచి వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది.అలాగే పాడేరు నుంచి అరకులోయ ప్రాంతాలకు ఇదే ప్రధాన రహదారి కావడంతో ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాలు అధికంగానే రాకపోకలు సాగిస్తున్నాయి. రోజుకు సుమారు 500 వాహనాలు ఈ జాతీయ రహదారిలో నడుస్తున్నాయి. గేటు పడితే నరకయాతనే.. డుంబ్రిగుడ మండల పరిధిలో ఉన్న కురిడి రైల్వేగేటు పడితే వాహనచోదకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్తవలస–కిరండోల్ రైల్వే లైన్లో కురిడి ట్రాక్పై ప్రతి రోజు ఎక్స్ప్రెస్, పాసింజర్, సరకు రవాణా చేసే గూడ్స్ రైళ్లు 30 వరకూ నడుస్తున్నాయి. పగలు,రాత్రి ఈ ట్రాక్పై రైళ్ల రద్దీ అధికంగా ఉంటుంది. రైళ్లు రాకపోకలు సాగించే సమయంలో కురిడి వద్ద గేటు పడితే ఇరువైపులా వాహనాలు నిలిచిపోతున్నాయి. రైళ్లు వెళ్లే వరకు ఆర్టీసీ బస్సులతో పాటు అన్ని వాహనాలు చాలా సమయం నిరీక్షించాల్సి వస్తోంది. రోగులను 108, అంబులెన్స్లలో అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించే సమయంలో గేటు పడితే రోగులతో పాటు బంధువులు నరకయాతన పడుతున్నారు. డుంబ్రిగుడ ప్రాంత అత్యవసర రోగులను పాడేరులోని జిల్లా ఆస్పత్రికి తరలించేందుకు ఇదే ప్రధాన రహదారి. రైళ్లు వెళ్లిపోయే వరకు అన్ని వాహనాలు నిలిచిపోతుండడంతో ప్రయాణానికి ఆలస్యమవుతుండడంతో వాహన చోదకులు, పర్యాటకులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. భూముల సమస్యకు పరిష్కారమెప్పుడో? కురిడి రైల్వేగేటులో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి భూ సమస్య ఏర్పడిందని సమాచారం. రెవెన్యూ, రైల్వే, అటవీశాఖలకు చెందిన భూములు సిద్ధంగా ఉన్నాయి. అయితే వంతెన నిర్మించే ప్రాంతంలో గిరిజన రైతుల భూములు అధికంగా ఉండడంతో కొంత వివాదం నెలకొందని తెలిసింది. ఈ సాకుచూపి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేపట్టడడంలో జాతీయ రహదారులు, రైల్వేశాఖ అధికారులు జాప్యం చేస్తుండడం సమంజసం కాదని, అన్ని సమస్యలు పరిష్కరించి పనులు ప్రారంభించాలని వాహన చోదకులు డిమాండ్ చేస్తున్నారు.ఫ్లైఓవర్ నిర్మించాల్సిన కురిడి రైల్వేగేటు వద్ద నిలిచిన వాహనాలు -
‘ఆర్గానిక్’ పరిశ్రమల ఏర్పాటుకు చొరవ
కలెక్టర్ దినేష్కుమార్పాడేరు: జిల్లాలో ఆర్గానిక్ ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటుకు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ దినే ష్కుమార్ సూచించారు. సోమవారం తన చాంబర్ను నుంచి పలు శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయ పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాలో 250 ఎకరాలను ప్రభుత్వం కేటాయించినట్టు చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తే భూమి కేటాయిస్తామన్నారు. ఆసక్తి గల పారిశ్రామిక వేత్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పర్యాటక ప్రాంతాలైన అరకు, పాడేరు, మారేడుమిల్లి తదితర చోట్ల క్యార్వ్యాన్లు, రిసార్ట్స్, కాటేజీలు, క్రీడా పార్క్ల నిర్మాణాలకు భూసేకరణ చేపట్టి, గ్రామ సభల తీర్మానాల ద్వారా గ్రామ పంచాయతీల నుంచి ఆమోదం తీసుకుని సంబంధిత యాజమన్యాలకు అప్పగించాలన్నారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు మంజూరు చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. చింతపల్లి, గంగవరంలలో ఎంఎస్ఎం పార్కులు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. మౌలిక వసతుల కల్పన వేగవంతం చేయాలన్నారు. విద్యార్థులు, స్వయం సహాయక సంఘాలకు నైపుణ్య శిక్షణ, వర్క్షాపు నిర్వహించాలని, ఉదయం పోర్టల్లో శిక్షణ పొందిన వారి సమాచారం పొందుపరచాలని ఆదేశించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంలో భాగంగా శిక్షణ పొందిన అభ్యర్థులు ఉపాధి పొందేందుకు రుణాల మంజూరు ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో వర్చువల్గా జీసీసీ ఎండీ కల్పనా కుమారి, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పీవోలు స్మరణ్రాజ్, శుభం నొక్వాల్, పాడేరు ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రమణరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నంద్, లీడ్ బ్యాంకు మేనేజర్ మాతునాయుడు తదితరులు పాల్గొన్నారు. -
గేటు పడితే ఇబ్బందే
అరకులోయ–పాడేరు ప్రధాన రహదారిలో కురిడి వద్ద రైల్వేగేటు పడితే రైలు వెళ్లేవరకు నిరీక్షించడం ఇబ్బందిగా ఉంది. గూడ్స్ రైళ్లకు వ్యాగిన్లు అధికంగా ఉండడంతో రైలు వెళ్లడం ఆలస్యమవుతోంది. ఈ ట్రాక్పై రైళ్లు ఎక్కువుగా నడుస్తుండడంతో అత్యవసర సమయంలో స్థానికులమంతా ఇబ్బందులు పడుతున్నారు. – పాంగి జీనబందు, వాహన చోదకుడు, కొర్రాయి పంచాయతీ డుంబ్రిగుడ మండలం ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభించాలి జాతీయ రహదారి కావడంతో అరకులోయ–పాడేరు ప్రాంతాల మధ్య వాహనాల రాకపోకలు అధికమయ్యాయి. కురిడి రైల్వేగేటు పడితే ఇరువైపులా వాహనాలు నిలిచిపోతున్నాయి. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాలకు ఇబ్బందిగా మారింది, ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి. – ముఖీ సాంబ, మోటార్ యూనియన్ నాయకుడు, అరకులోయ -
ఈవీఎంల గోదాముల తనిఖీ
గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్ దినేష్కుమార్ పాడేరు: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఈవీఎంలను భద్రపరిచిన గోదాములను పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ దినేష్కుమార్ సోమవారం తనిఖీ చేశారు. ఈవీఎం గోదాముల గదుల సీల్ ఓపెన్ చేయించి, ఈవీఎంలను భద్రపరిచిన బాక్సులను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, ప్రధాన ద్వారాలకు ఉన్న సీళ్ల ను పరిశీలించారు. ఈవీఎంల గోదాంలో భద్రతా చర్యలపై అక్కడి అధికారులు, పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం నెలవారీ తనిఖీల రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్వో అంబేడ్కర్, వైఎస్సార్సీపీ ప్రతినిధి బుటారీ వెంకటరావు, టీడీపీ ప్రతినిధి రాజేష్, బీజేపీ ప్రతినిధి కె.ఆర్.రావు, ఎన్నికల సూపరింటెండెంట్ లక్ష్మణరావు, పాడేరు, అరకు, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
పెరిగిన రోడ్డు ప్రమాదాలు.. అదుపులో నేరాలు
● ఈ ఏడాది నేర సమీక్ష వివరాలు వెల్లడించిన ఎస్పీ అమిత్బర్దర్ పాడేరు: గత ఏడాదితో పోలీస్తే ఈ ఏడాది జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, హత్యాయత్నం కేసుల సంఖ్య పెరిగింది.గత ఏడాది 164 రోడ్డు ప్రమాదాలు జరగా, ఈ ఏడాది 176 ప్రమాదాలు జరిగాయి. పోలీస్ శాఖ తీసుకున్న చర్యల కారణంగా మిగతా నేరాలు అదుపులోకి వచ్చాయని, వివిధ విభాగాల్లో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ రేట్ 34 శాతం తగ్గిందని ఎస్పీ అమిత్బర్దర్ తెలిపారు. శాంతిభద్రతలు పూర్తిస్థాయిలో అదుపులో ఉన్నాయని ఆయన చెప్పారు. వార్షిక నేర సమీక్ష వివరాలను స్థానిక జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గత ఏడాది 2,304 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 1,502 కేసులు నమోదైనట్టు చెప్పారు. ● జిల్లాను గంజాయి రహితంగా మార్చినట్టు ఆయన చెప్పారు. గత ఏడాది 316 గంజాయి కేసులు నమోదు కాగా, ఈ ఏడాది నమోదైన 135 కేసుల్లో 14,484 కిలోల గంజాయి, 35.61 లీటర్ల హషీష్ ఆయిల్ స్వాధీనం చేసుకుని, 358 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపామని చెప్పారు. రూ.4.41 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని, 11 కేసుల్లో శిక్షలు ఖరారైనట్టు ఆయన చెప్పారు. ఆరుగురు అంతరాష్ట్ర మోస్ట్ వాంటెడ్ గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించామన్నారు. మొత్తం మీద 56శాతం గంజాయి కేసులు తగ్గాయన్నారు. ● జిల్లాలో మావోయిస్టు కార్యకలపాలను పూర్తిగా నిర్మూలించామన్నారు. ఈ ఏడాది 18 మంది మావోయిస్టులు మృతి చెందారని, వీరిలో కేంద్ర, రాష్ట్ర, డివిజన్ కమిటీలు, ఏవోబీ క్యాడర్కు చెందిన కీలక మావోయిస్టులు హతమయ్యారన్నారు. తొమ్మిది మంది మావోయిస్టులను అరెస్టు చేశామని, మరో 49 మంది జిల్లాలో స్వచ్ఛందంగా లొంగిపోయారని చెప్పారు. ఐదు చోట్ల మావోయిస్టుల డంప్లను స్వాధీనం చేసుకున్నామని, మావోయిస్టు పార్టీలో నియామకాలు పూర్తిగా నిలిచిపోయాయని తెలిపారు. ● జిల్లాలో కొత్తగా నిర్మిస్తున్న హైవే కారణంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య కాస్త పెరిగిందన్నారు. మోతుగూడెం ప్రాంతంలో జరిగిన బస్సు యాక్సిడెంట్తో పాటు మరికొన్ని -
కొత్త జిల్లా
ఒకే ఒక్క నియోజకవర్గంతోరంపచోడవరం: ఒకే ఒక నియోజకవర్గంతో రంపచోడవరం జిల్లా ఏర్పడింది. రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు సోమవారం ఆమోదం తెలిపింది. రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లతో 12 మండలాలను కలిపి కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2022 సంవత్సరంలో పాడేరు, అరకు, రంపచోడవరం నియో జకవర్గాలను కలిపి కొత్తగా అల్లూరి సీతారామరాజు జిల్లాను ఏర్పాటు చేశారు. తాజాగా అల్లూరి జిల్లా నుంచి రంపచోడవరం నియోజకవర్గాన్ని వేరుచేసి, ఒక్క నియోజకవర్గంతోనే కొత్తగా రంపచోడవరం జిల్లాను ఏర్పాటు చేశారు. దీంతో అల్లూరి జిల్లాలో 11 మండాలుంటాయి. 12 మండలాలు.. రెండు రెవెన్యూ డివిజన్లు రంపచోడవరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఉన్న 11 మండలాలున్నాయి. కొత్తగా గుర్తేడు మండలాన్ని ఏర్పాటుచేస్తున్నారు. దీంతో 12 మండలాలు, రెండు రెవెన్యూ డివిజన్లతో కొత్త జిల్లా ఏర్పాటవుతోంది. రంపచోడవరం రెవెన్యూ డివిజన్లో ఎనిమిది మండలాలు.. రంపచోడవరం, వై.రామవరం, మారేడుమిల్లి,దేవీపట్నం,గంగవరం,రాజవొమ్మంగి, అడ్డతీ గల, కొత్తగా ఏర్పాటు చేస్తున్న గుర్తేడు ఉండగా, చింతూరు రెవెన్యూ డివిజన్లో నాలుగు మండలాలు చింతూరు, వీఆర్ పురం, కూనవరం, ఎటపాక ఉన్నాయి. రంపచోడవరం, చింతూరుల్లో ఐటీడీఏలున్నాయి. కొత్త మండలం ఏర్పాటు వై.రామవరం మండలంలో ఎగువ ప్రాంతంలో ఉన్న ఐదు పంచాయతీలను కలిపి కొత్తగా గుర్తేడు మండలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రంపచోడవరం నియోజవర్గంలో 3,49,799 మంది జనాభా ఉన్నా రు. అలాగే 2,55,313 మంది ఓటర్లు ఉన్నారు. రంపచోడవరం రెవెన్యూ డివిజన్లో 120, చింతూరు రెవెన్యూ డివిజన్లో 69 కలిపి మొత్తం 189 పంచాయతీలు, 827 రెవెన్యూగ్రామాలున్నాయి. రంపచోడవరం రెవెన్యూ డివిజన్ భౌగోళికంగా 4433.38 స్క్వేర్ కిలోమీటర్లు, చింతూరు రెవెన్యూ డివిజన్ 2095.14 స్క్వేర్ కిలోమీటర్లు విస్తరించి ఉంది. అపారమైన ఖనిజ సంపద ఇక్కడ అపారమైన ఖనిజ సంపద ఉంది.రంపచోడవరం డివిజన్లో మెటల్, పాలరాయి, గ్రావెల్ క్వారీలు ఉన్నాయి.రంపచోడవరం, గంగవరం మండలాల్లో పాలరాయి, నల్లరాయి మెటల్ క్వారీలు ఉన్నాయి. అడ్డతీగల మండలంలో ఎక్కువగా మెట ల్ క్వారీలు ఉన్నాయి. చింతూరు ప్రాంతంలో క్వార్జ్ నిక్షేపాలు, ఎటపాక మండలంలో ఇసుక రీచ్ ఉంది. పాపికొండలుప్రముఖ పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి పొందిన పాపికొండలు జిల్లాలోనే ఉన్నాయి. ఏటా వేలాది మంది పర్యాటకులు ఈప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. దేవీపట్నం మండలం గండిపోశమ్మ ఆలయం వద్ద ఒకటి, వీఆర్పురం మండలంలో ఒకటి పర్యాటక బోటు పా యింట్లు ఉన్నాయి. మారేడుమిల్లి ప్రాంతంలో పర్యాటకులకు అతిథ్యం ఇచ్చేందుకు అనేక పర్యాటక వసతి గృహాలు, గుడిసె హిల్ స్టేషన్ ఉన్నాయి. పొల్లూరు వద్ద వాటర్ పాల్స్, రంప జలపాతం ఉన్నాయి. ● ఇక్కడే పాపికొండలు నేషనల్ పార్కు 1,05,690.32 హెక్టార్లుల్లో విస్తరించి ఉంది. జాతీయ ప్రాజెక్టు పోలవరం విద్యుత్ కేంద్రం జిల్లాలోనే పోశ మ్మ గండి సమీపంలోని నిర్మాణం జరుగుతోంది. నాలుగు ఇరిగేషన్ ప్రాజెక్టులు కొత్త జిల్లాలో నాలుగు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నా యి. రంపచోడవరం మండలంలో ముసురుమిల్లి, భూపతిపాలెంలలో, గంగవరం మండలంలో సూరంపాలెం, అడ్డతీగల మండలంలో మద్దిగెడ్డలో రిజర్వా యర్లు ఉన్నాయి. వీటి ద్వారా గిరిజన రైతులకు పుష్కలంగా సాగునీరు అందుతోంది. జిల్లాలో వరి, మొక్క జొన్న,పత్తి, అరటి, జీడిమామిడి, పొగాకు పంటలను ఎక్కువగా పండిస్తారు. మారేడుమిల్లిలో మాత్రమే రబ్బరు, కాఫీ, జాఫ్రా, నిమ్మ సాగుచేస్తున్నారు. 54,344 హెక్టార్లలో వివిధపంటలు సాగవుతున్నాయి ● చింతూరు మండలంలోని పొల్లూరు, వై రామవరం మండలంలోని డొంకరాయిలో రెండు జలవిద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. ● కొండరెడ్డి, కోయదొర, కొండకమ్మరి, వాల్మీకి, కొండకాపు తెగుల గిరిజనులు ఇక్కడ అధికంగా ఉన్నారు. వీరిలో కోయదొరలు, కొండరెడ్డి జనాభా ఎక్కుగా ఉంది.రంపచోడవరం వ్యూజిల్లా వివరాలు విస్తీర్ణం : 6528.52 స్క్వేర్ కిలోమీటర్లు అడవుల విస్తీర్ణం: 53,771.85 హెక్టార్లు పంట భూములు : 54,344 హెక్టార్లు జనాభా : 3,49,799 మంది ఓటర్లు : 2,55,313 మంది ఐటీడీఏలు : రెండు (రంపచోడవరం, చింతూరు) డివిజన్లు : రెండు (రంపచోడవరం, చింతూరు) మండలాలు : 12 (కొత్తగా ఏర్పాటైన గుర్తేడుతో) పంచాయతీలు : 189 గ్రామాలు : 827 జిల్లా పరిధిలో రెండు ఐటీడీఏలు, 12 మండలాలు కొత్తగా గుర్తేడు మండలం ఏర్పాటు కొండలు, అడవులతో విస్తరించిన రంపచోడవరం జిల్లా -
వినోదాల వేదిక.. సంక్రాంతి వేడుక
కాలు దువ్వుతున్న పందెం కోళ్లు ఎడ్లు, గుర్రపు పందాలకు సిద్ధం ఖరీదైన ఆహారంతో ప్రత్యేక శిక్షణ మాడుగుల: తెలుగువారి పండగలలో సంక్రాంతి భిన్నమైనది. పాడి పంట ఇంటికి వచ్చే సమయం కావడంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. పెద్దలకు పూజలతోపాటు హరిదాసులు, డూడూ బసవన్నలను ఆదరిస్తారు. రంగ వల్లికలతో శోభ చేకూరుస్తారు. అందులో గొబ్బెమ్మలను పెట్టి పాటలు పాడతారు. కనుమ రోజున పశు సంపదకు పూజలు చేస్తారు. ధనుర్మాసం మొదలైన దగ్గర నుంచి సందడే సందడి. వీటన్నింటినీ మించిన కొసమెరుపు ఒకటుంది. భోగీ పండగ నుంచి ప్రారంభమయ్యే తీర్థాలు స్వగ్రామాలకు ఇళ్లకు చేరుకునే బస్తీ జనాలకు వినోదాన్ని పంచుతాయి. కోడి పందాలు, ఎడ్లు, గుర్రపు పరుగు పందాలు ప్రత్యేక ఆకర్షణ. ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాటిని ఆసక్తిగా వీక్షిస్తారు. తీర్థాలలో పంచదార చిలుకలు, రంగుల రాట్నాలు చిన్నారులను అలరిస్తాయి. నెల రోజుల ముందు నుంచే శిక్షణ పందెంరాయుళ్లు నెల రోజుల ముందు నుంచే ఎడ్లకు శిక్షణ అందిస్తారు. రేసు గుర్రాలకు, పందెం కోళ్లకు కూడా తర్ఫీదు అందిస్తారు. వీటికి ఖరీదైన ఆహారం అందించడంతోపాటు సకల సదుపాయాలు సమకూరుస్తారు. పండగకు రెండు వారాలకు పైగా సమయం ఉండడంతో ప్రస్తుతం పోటీలకు వాటిని సిద్ధం చేస్తున్నారు. గ్రామాల్లో ఆధ్యాత్మిక శోభ ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. గతంలో ధనుర్మాసోత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి గ్రామాల్లో వేకువజాము నుంచే హరిదాసులు పదాలు పాడుతూ సంచరించేవారు. గంగిరెద్దులను ప్రదర్శించేవారు సన్నాయి ఊదుతూ సందడి చేసేవారు. రానురాను ఆ సంప్రదాయాలకు ఆదరణ తగ్గుతోందని వారు వాపోతున్నారు.పందెంరాయుళ్లు సిద్ధం భోగి నుంచి గ్రామాల్లో గ్రామ దేవతల తీర్థాలు నెల రోజులపాటు కొనసాగుతాయి. ఈ తీర్థాలే ప్రధాన వినోదాలు. పందాలు నిర్వహించడానికి రేసు గుర్రాలతోపాటు, మైసూర్ ఎద్దులు, కోళ్లను సిద్ధం చేస్తున్నారు. ఖరీదైన తిండి పెట్టి తర్ఫీదు అందజేస్తున్నారు. పరుగు పందాలలో అలసట రాకుండా పెద్దేరులో ఈత కొట్టిస్తారు. ఈ ఏడాది కూడా ఈ ఒరవడి కొనసాగించడానికి సిద్ధం అవుతున్నారు. – బసవా రామ పరమేష్, మాడుగులసందడి లేదు మా చిన్నతనంలో ధనుర్మాసం ప్రారంభమైన నాటి నుంచి తెల్లవారక ముందే హరిదాసులు హరినామ కీర్తనలు పాడుకుంటూ గ్రామాల్లో సందడి చేసేవారు. కానీ ఇప్పుడది కరువైంది. పందెంరాయుళ్లు సంక్రాంతికి 20 రోజుల ముందు నుంచి ఎడ్లు, కోళ్లకు తర్ఫీదు అందజేస్తున్నారు. ఏడాదికొకసారి జరిగే ఈ పోటీల వలన అనేకమందికి వినోదంతోపాటు జీవనోపాధి దొరుకుతుంది. – దేవరాపల్లి శ్రీనివాసరావు, మాడుగుల -
బండరాళ్ల పేలుళ్లతోనిలిచిన ట్రాఫిక్
● అరగంటసేపు నిలిచిన వాహనాలు ● ఇబ్బందులు పడిన అన్నివర్గాల ప్రజలు జి.మాడుగుల: జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా అడ్డంగా ఉన్న బండరాళ్లను పేల్చడం ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. పాడేరు–జి.మాడుగుల రోడ్డు మార్గంలో ఆదివారం బందవీధి వెన్నెలమ్మతల్లి ఘాట్లో నిర్మాణదారులు బండరాళ్లను పేల్చారు. ముందస్తు సమాచారం లేకుండా చేపట్టడం వల్ల సుమారు 30 నిమిషాలు ట్రాఫిక్ స్తంభించింది. అరకిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోవడంతో అత్యవసర పనులపై వెళ్లే ప్రజలు, అధికారులు, రాజకీయ నేతలు, పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిర్మాణ సంస్థ అనుసరిస్తున్న విధానాలపై వారు విమర్శలు చేశారు. ఎప్పుడు పడితే అప్పుడు పేలుళ్లు జరపడం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలు
చింతూరు: పోతనపల్లి సమీపంలో ఆదివారం కారు చెట్టుకు ఘటనలో తెలంగాణలోని సారపాకకు చెందిన నలుగురికి గాయాలయ్యాయి. సారపాకకు చెందిన ఓ కుటుంబం మారేడుమిల్లి నుంచి తిరిగి వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ఘటనలో బిందు అనే మహిళకు, అక్షశ్రీ అనే చిన్నారికి తీవ్రగాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వీరికి చింతూరు ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం భద్రాచలం తరలించారు. గుర్తుతెలియని వాహనం ఽఢీకొని భార్య, భర్తలకు గాయాలు చింతపల్లి: లంబసింగి–రాజుపాకలు గ్రామాలు మధ్య జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వస్తున్న భార్యాభర్తలు గాయాలుపాలైన సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ పరిధిలో జాజలుబంద గ్రామానికి చెందిన రాజుబాబు, అతని భార్య రాణిలు కలసి చింతపల్లి మండలంలో గల రాజుపాకలు గ్రామంలో గల బంధువుల ఇంటికి శనివారం వచ్చారు. ఆదివారం సాయంత్రం స్వగ్రామానికి తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా రాజుపాకలు వంతెన వద్ద గుర్తు తెలియని కారు ఽఢీకొని ఆపకుండా వేగంగా వెళ్లిపోయింది. దీంతో వాహనం నుంచి పడిపోయి గాయపడిన వారిని స్థానికులు చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరిలించారు. మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేిసి దర్యాప్తు చేస్తున్నారు. -
విశాఖ అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకం
ఏయూక్యాంపస్ (విశాఖ): నగరంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రాబల్యం అధికంగా ఉందని, కార్మిక శక్తి ఈ నగరానికి వెన్నెముక అని వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ పేర్కొన్నారు. ఏయూ కన్వెన్షన్ సెంటర్ మైదానంలో జరుగుతున్న సీఐటీయూ ‘శ్రామిక ఉత్సవ్’ రెండో రోజు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ 1970లో ప్రారంభమైన సీఐటీయూ కార్మిక హక్కుల సాధనలో ఎన్నో విజయాలు సాధించిందని కొనియాడారు. కార్మిక సమస్యలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వం ఎల్లప్పుడూ సాను కూలంగా స్పందిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. విశాఖను పారిశ్రామికంగానే కాకుండా ఐటీ, పర్యాటక రంగాల్లోనూ అగ్రగామిగా నిలిపేందుకు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతున్నట్లు కమిషనర్ వెల్లడించారు. తర్లువాడలో గూగుల్ కార్యకలాపాలు, కాపులుప్పాడ, మధురవాడల్లో ఐటీ హబ్ల విస్తరణతో పాటు నగరాన్ని ‘అడ్వెంచర్ హబ్’గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. నగరంలోని 50 మురికివాడలను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని వివరించారు. కార్మికుల సామాజిక భద్రత, నైపుణ్యాభివృద్ధికి లేబర్ సంస్కరణలు ఎంతగానో తోడ్పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ప్రాంగణంలోని పుస్తక ప్రదర్శనను సందర్శించి, సాంస్కృతిక ప్రదర్శనలు చేసిన కళాకారులను అభినందించారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అద్యక్షుడు వి.కృష్ణయ్య, శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్ ధనలక్ష్మి, జిల్లా కన్వీనర్ మణి, శ్రామికత ఉత్సవ్ కన్వీనర్ రమాప్రభ, అల్లూరి హాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లూరి నరసింహ రాజు పాల్గొన్నారు. -
ఉత్తరద్వార దర్శనానికి సింహగిరి సిద్ధం
సింహాచలం : ఆధ్యాత్మిక క్షేత్రం సింహాచలంలో ముక్కోటి ఏకాదశి వేడుకలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం తెల్లవారుజాము నుంచే శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్తరద్వార దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని సుమారు 50 వేల మంది భక్తులు వస్తారని దేవస్థానం అంచనా వేస్తోంది. ఇందుకు సంబంధించి పోలీసు, జీవీఎంసీ, వైద్యారోగ్య, విద్యుత్ శాఖల సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం ఇన్చార్జి ఈవో ఎన్.సుజాత వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య దర్శనానికి పెద్దపీట వేస్తూ, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. వైదిక కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచే ఆలయంలో సుప్రభాత సేవ, ఆరాధన వంటి ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయి. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని వైకుంఠ నారాయణుడి అలంకారంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా పల్లకిపై వేంజేంపు చేస్తారు. తెల్లవారుజామున 5 గంటలకు ఉత్తర ద్వారం వద్ద మేలిముసుగు తొలగించి, ఆనువంశిక ధర్మకర్తలకు తొలి దర్శనం కల్పిస్తారు. ఆ తర్వాత ఉదయం 5.30 నుంచి 11 గంటల వరకు సాధారణ భక్తులందరికీ ఉత్తర ద్వార దర్శనం అందుబాటులో ఉంటుంది. ఉదయం 11 గంటల తర్వాత స్వామివారిని మాడ వీధుల్లో తిరువీధి మహోత్సవం నిర్వహిస్తారు. 5 కి.మీ. మేర క్యూ లైన్ల ఏర్పాటు దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యార్థం సుమారు ఐదు కిలోమీటర్ల మేర క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఉచిత దర్శనంతో పాటు రూ.100, రూ.300, రూ.500 ప్రత్యేక దర్శన క్యూలైన్లు అందుబాటులో ఉంటాయి. క్యూలైన్లలో మంచినీరు, మజ్జిగ, పాలు పంపిణీ చేసేందుకు ప్రత్యేక పాయింట్లను ఏర్పాటు చేశారు. ఈసారి ఆలయం లోపల నీలాద్రి గుమ్మం వద్ద నుంచే మూలవిరాట్ లఘు దర్శనం కల్పిస్తారు. వీఐపీలకు సైతం అంతరాలయంలో ఎటువంటి పూజలు ఉండవు. భద్రత కోసం అదనపు సీసీ కెమెరాలు, 190 మందికి పైగా పోలీసులతో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. నేటి సాయంత్రం 6 గంటల వరకే ప్రైవేటు వాహనాలకు అనుమతి సోమవారం సాయంత్రం 6 గంటల వరకే ప్రైవేట్ వాహనాలను కొండపైకి అనుమతిస్తారు. మంగళవారం ఉదయం 4 గంటల నుంచి ఆర్టీసీ, దేవస్థాన బస్సులు షటిల్ సర్వీసులుగా భక్తులను కొండపైకి చేరుస్తాయి. ప్రసాదాల విషయానికి వస్తే లక్ష లడ్డూలను సిద్ధం చేశారు. భక్తులందరికీ ఉచిత అన్నప్రసాద వితరణ ఉంటుంది. భక్తుల సౌకర్యార్థం ఆరు చోట్ల వైద్య శిబిరాలు, అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంచారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నిత్య కల్యాణం వంటి ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. మధ్యాహ్నం 12:30 నుంచి 3 గంటల వరకు విరామం మినహా సాయంత్రం 7 గంటల వరకు మూలవిరాట్ దర్శనం లభిస్తుంది. 29వ తేదీ సాయంత్రం వరకు ఆన్లైన్లో టికెట్ల విక్రయాలు కొనసాగుతాయి. -
సూపర్ బజార్లో గిరిజన ఉత్పత్తులు
● అందుబాటులోకి తెచ్చిన జీసీసీ కొయ్యూరు: మండలంలోని రాజేంద్రపాలెంలో గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేసిన సూపర్ బజార్లో గిరిజన ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది. గతంలో జీసీసీ ఉత్పత్తి చేసే వాటిలో కొన్ని మాత్రమే ఇక్కడ ఉండేవి. ఇప్పుడు అన్ని రకాల వస్తువులు తేవడంతో కొనుగోలుదారులు ఆశక్తి చూపుతున్నారు. అ మ్మకాలు పెరిగాయి. సబ్బులు,షాంపులతో పాటు అరకు కాఫీని విక్రయిస్తున్నారు. నిత్యా వసర వస్తువులను అందుబాటులో ఉంచారు. కొయ్యూరు సంత కళకళ కొయ్యూరు: మండలకేంద్రంలో ఆదివారం జరిగిన సంత గిరిజనులతో కళకళలాడింది.క్రిస్మస్ తర్వాత నిర్వహించిన సంత కావడంతో ఎక్కువ మంది తరలి వచ్చారు. సంక్రాంతి పండగ సమీపిస్తున్న నేపథ్యంలో వస్త్ర దుకాణాల సంఖ్య పెరిగాయి. -
తగ్గని చలి, మంచు తీవ్రత
చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగినా మంచు, చలిత్రీవత కొనసాగుతూనే ఉంది. ఆదివారం జి.మాడుగులలో 7.5 డిగ్రీలు, చింతపల్లిలో 8.0 డిగ్రీలు నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ● పాడేరు డివిజన్ పరిధి ముంచంగిపుట్టులో 8.1 డిగ్రీలు, పాడేరులో 9.2 డిగ్రీలు, పెదబయలులో 9.6 డిగ్రీలు, హుకుంపేటలో 10.0 డిగ్రీలు, అరకువ్యాలీలో 10.4 డిగ్రీలు, కొయ్యూరులో 13.0 డిగ్రీలు నమోదు అయ్యాయన్నారు. ● రంపచోడవరం డివిజన్ మారేడుమిల్లిలో 11.1 డిగ్రీలు, వై.రామవరంలో 11.4 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 13.8 డిగ్రీలు, అడ్డతీగలలో 15.0 డిగ్రీలు, రంపచోడవరంలో 15.7 డిగ్రీలు, చింతూరు డివిజన్ ఎటపాకలో 14.8 డిగ్రీలు, చింతూరులో 15.3 డిగ్రీలు నమోదు అయినట్టు ఏడీఆర్ పేర్కొన్నారు. ● ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగినా సాయంత్రం అయ్యేసరికి శీతల గాలులు ప్రభావం ఎక్కువగానే ఉంటోంది. దీనివల్ల మన్యం వాసులు ఇళ్లకు పరిమితం అవుతున్నారు. ఉదయం పది గంటల వరకు మంచు, చలి ప్రభావం ఉంటోంది. రహదారులను మంచు తెరలు కమ్మేయడం వల్ల వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. కమ్మేసిన మంచు తెరలు పెదబయలు: మండలంలో చలితో మంచు తీవ్రత ఎక్కువగా ఉంది. ఆదివారం ఉదయం 9.30 వరకు మంచు తెరలు దట్టంగా కమ్మేశాయి. పర్యాటకులు మంచు అందాలను తిలకించారు. స్థానికులు మాత్రం ఇబ్బందులు పడ్డారు.జి.మాడుగులలో 7.5 డిగ్రీల నమోదు -
రైల్వేస్టేషన్లోడీఆర్ఎం తనిఖీలు
తాటిచెట్లపాలెం: విశాఖ రైల్వే స్టేషన్లో డీఆర్ఎం లలిత్ బోహ్రా ఆదివారం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. పండగ సీజన్ కావడంతో ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో, స్టేషన్లో వారికి అందుతున్న సదుపాయాలను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ముఖ్యంగా రద్దీ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను, ప్లాట్ఫాంలపై భద్రతను సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. స్టేషన్ ప్రాంగణంలోని బుకింగ్ కార్యాలయాలు, లిఫ్ట్లు, ఎస్కలేటర్ల పనితీరును తనిఖీ చేయడంతో పాటు, ప్రయాణికులకు అందుతున్న తాగునీటి సౌకర్యం, ప్లాట్ఫాంల పరిశుభ్రతపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం స్టేషన్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం (ఆపరేషన్స్) కె. రామారావు, ఇతర రైల్వే ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వరి పంటతో ట్రాక్టర్ దగ్ధం
● రూ.1.20 లక్షల నష్టం బుచ్చెయ్యపేట: వడ్డాదిలో వరి పంటతో ఉన్న ట్రాక్టర్ దగ్ధమైంది. గ్రామానికి చెందిన బొబ్బాది రాజు తన పొలంలో సాగు చేసిన వరి చేనును నాలుగు రోజుల కిందట కోశాడు. ఆదివారం దానిని ట్రాక్టర్లో లోడ్చేసి, పాక దగ్గరకు తీకొస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో వరి పంటతో పాటు ట్రాక్టర్ తొట్టె దగ్ధమైంది. సమీపంలో ఉన్న రైతులు మంటలను ఆర్పడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ ప్రమాదంలో రాజుకు చెందిన వరి పంటతో పాటు ట్రాక్టర్ తొట్టె కాలిపోయి, రూ.1.20 లక్షల నష్టం జరిగింది. -
నేటి నుంచి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్
మురళీనగర్ (విశాఖ): కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విశాఖ ప్రాంతీయ స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ రమణ తెలిపారు. ఈ పోటీల్లో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల నుంచి సుమారు 800 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని చెప్పారు. క్రీడాకారులకు అవసరమైన అన్ని వసతులు సిద్ధం చేశామన్నారు. కాగా.. ఇండోర్ గేమ్స్(టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్)ను గోపాలపట్నం ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తామని తెలిపారు. బాలబాలికలకు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్, బాలికల విభాగంలో చెస్, ఖోఖో, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, షటిల్ బ్యాడ్మింటన్, బాలుర విభాగంలో కబడ్డీ, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, షటిల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్ తదితర పోటీలు ఫిజికల్ డైరెక్టర్ అబ్బాస్ బేగ్ పర్యవేక్షణలో జరుగుతాయని వివరించారు. -
హౌస్ఫుల్
పర్యాటకం భారీగా తరలివస్తున్న సందర్శకులుఆంధ్రా కశ్మీర్ కిటకిట● విశాఖ నగరం, మన్యానికి పోటెత్తిన పర్యాటకులు ● గతేడాదితో పోలిస్తే 25 శాతం అధికంగా రాక ● బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ నుంచి అత్యధిక పర్యాటకులు ● జనవరి రెండో వారం వరకూ నిండిపోయిన హోటళ్లు, రిసార్టులు ● గత ప్రభుత్వం చేపట్టిన టూరిజం ప్రాజెక్టులతో వెలుగుతున్న ఉమ్మడి విశాఖ కాలం మారుతోంది.. ఏడాది వీడ్కోలు పలకనుంది.. కానీ ఉమ్మడి విశాఖ అందం మాత్రం రెట్టింపవుతోంది. సముద్రపు అలల మధ్య కేరింతలు కొట్టేందుకు, మన్యం అడవుల్లో ప్రకృతిని పలకరించేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ముందెన్నడూ లేని విధంగా పర్యాటక కేంద్రాలన్నీ సందర్శకులతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా ‘హౌస్ఫుల్’ బోర్డులు కనిపిస్తున్నాయి. వాహనాల రద్దీ కారణంగా అరకు, పాడేరు ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు ఆంక్షలు విధించారు. ఉమ్మడి విశాఖ పర్యాటకంలో ఇదో కొత్త అధ్యాయంగా నిలువనుంది. ఇబ్బందులు లేకుండా చర్యలు ● ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ జీవీబీ జగదీష్ ఈ ఏడాది విశాఖకు పర్యాటకుల తాకిడి ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. ప్రతి రోజూ 50 వేల మంది కంటే ఎక్కువ మంది విశాఖలోని పర్యాటక ప్రాంతాల్ని సందర్శిస్తున్నారు. విశాఖ నగరంతో పాటు అరకు, అనంతగిరి, లంబసింగి వంటి ప్రాంతాల్లోని మా పర్యాటక శాఖకు చెందిన అన్ని హోటళ్లు, హరిత రిసార్టులు వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ముఖ్యంగా బెంగాల్, ఒడిశా రాష్ట్రాల నుంచి వచ్చే వారి సంఖ్య గణనీయంగా ఉంది. పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, వారికి మెరుగైన ఆతిథ్యం అందించేందుకు మా సిబ్బంది అదనపు సమయం పనిచేస్తూ తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఘాట్ రోడ్లలో ప్రయాణంపై ముందస్తు ఆంక్షలు అరకులోయ టౌన్: విశాఖ–అరకు ఘాట్రోడ్లో ప్రయాణించే వారంతా పోలీస్ ఆంక్షలు పాటించాలని ఎస్ఐ గోపాల్రావు సూచించారు. అరకులోయకు వచ్చే పర్యాటకులు తిరుగు ప్రయాణంలో అరకులోయ నుంచి పాడేరు మీదుగా విశాఖపట్నానికి వెళ్లాలన్నారు. విశాఖ–అరకు ఘాట్రోడ్డులో పర్యాటకుల తాకిడి పెరగడంతో గంటల తరబడి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందన్నారు. ముఖ్యంగా గాలికొండ వ్యూపాయింట్, సుంకరమెట్ట ఉడెన్ బ్రిడ్జి వద్ద వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని అరకులోయకు వచ్చే పర్యాటకులంతా తిరుగు ప్రయాణంలో పాడేరు మీదుగా వెళ్లాలని ఎస్ఐ సూచించారు. సాక్షి, విశాఖపట్నం : మారిపోతున్న క్యాలెండర్ పేజీలు.. మరువలేని జ్ఞాపకాలను పదిలపరచుకునేందుకు పర్యాటకుల పరుగులు.. వెరసి ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యాటక జాతర మొదలైంది. ఎటు చూసినా కోలాహలమే కనిపిస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అంకురార్పణ జరిగి, ఇటీవల అందుబాటులోకి వచ్చిన కై లాసగిరి ‘గ్లాస్ బ్రిడ్జి’ ఇప్పుడు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ వంతెనపై నడుస్తూ సాగరాన్ని వీక్షించేందుకు సందర్శకులు ఎగబడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అరకు, పాడేరు వంటి మన్యం ప్రాంతాల్లో కల్పించిన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులు ఇప్పుడు పర్యాటకుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేశాయి. హోటళ్లు ఫుల్.. నో వేకెన్సీ.! విపరీతమైన పర్యాటకుల రద్దీ కారణంగా నగరంలోని స్టార్ హోటళ్లు, గెస్ట్ హౌస్లు, పర్యాటక శాఖకు చెందిన హరిత రిసార్టులు ఇప్పటికే కిక్కిరిసిపోయాయి. ‘నో వేకెన్సీ’ బోర్డులు దర్శనమిస్తుండటంతో, ముందుగా రిజర్వేషన్లు చేసుకోని వారు వసతి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని లంబసింగి, అరకు వంటి ప్రాంతాల్లో సాధారణ గదులే కాదు, చివరికి బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన టెంట్లు కూడా నిండిపోయాయంటే పర్యాటకుల తాకిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 25 శాతం పెరిగిన పెరిగిన పర్యాటకంగత ఏడాదితో పోలిస్తే ఈసారి పర్యాటకుల సంఖ్యలో సుమారు 25 శాతం వృద్ధి నమోదైంది. కోవిడ్ తర్వాత విశాఖ చూస్తున్న అతిపెద్ద పర్యాటక సీజన్ ఇదేనని అధికారులు పేర్కొంటున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా జనం తరలివస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా అనంతగిరిలోని బొర్రా గుహలను ఒక్క ఆదివారమే ఏకంగా 20 వేల మంది సందర్శించడం విశేషం. జూ పార్క్, కై లాసగిరి వంటి చోట్ల ప్రవేశ టికెట్ల కోసం పర్యాటకులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.ఈ సందడి జనవరి రెండో వారంలో ముగిసే సంక్రాంతి సెలవుల వరకు కొనసాగే అవకాశం ఉంది. ● మరోవైపు మన్యం అందాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. చలిగాలుల గిలిగింతలు, దట్టమైన పొగమంచు దుప్పటిని చీల్చుకుంటూ అరకు లోయ, లంబసింగి, వంజంగి మేఘమాలల వైపు పర్యాటకులు పరుగులు తీస్తున్నారు. పాడేరు ఘాట్ రోడ్లు, కాఫీ తోటలు, చాపరాయి జలపాతాలు పర్యాటకుల రాకతో కళకళలాడుతున్నాయి. చాపరాయి జలవిహారి, జలపాతం వద్ద సందడి చేస్తున్న పర్యాటకులుచింతపల్లి: ఆంధ్రా కశ్మీరు లంబసింగికి అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఈ ప్రాంతంలో సందడి నెలకొంది. ఇక్కడి సమీపంలోని చెరువులవేనం వ్యూపాయింట్ సందర్శకులతో కిటకిటలాడింది. సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ, గిరిజనులతో థింసా నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. సాహస క్రీడలకు నెలవైన తాజంగి జలాశయ పరిసరాలు పర్యాటకుల రాకతో కళకళలాడాయి. లంబసింగి ప్రాంతంలో స్ట్రాబెర్రీ క్షేత్రాలను సందర్శించారు. పండ్లను కొనుగోలు చేశారు. తారాబుకు తాకిడి పెదబయలు: మండలంలోని తారాబు ( పిట్టల బొర్ర) జలపాతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువయ్యింది. ఆదివారం పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చి సందడి చేశారు. ఎక్కువగా ఒడిశా మీదుగా పర్యాటకులు వస్తున్నారు. వంజంగి. కొత్తపల్లి జలపాతాన్ని సందర్శించిన పర్యాటకులు జి.మద్దిగరువు మీదుగా ఇంజరి మీదుగా తారాబు జలపాతానికి వస్తున్నారు. డుంబ్రిగుడ: మండలంలోని పర్యాటక ప్రదేశాలు చాపరాయి, అరకు పైనరీ సందర్శనకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. జలపాతంలో స్నానాలు చేస్తూ సందడి చేశారు. గిరిజన వస్త్రధారణలో తళుక్కుమన్నారు. ఇదే ప్రాంతంలో హైవేపై ట్రాఫిక్ రద్దీ నెలకొంది. వెంటనే స్థానిక ఎస్ఐ సురేష్ తన సిబ్బందితో ట్రాఫిక్ను నియంత్రించారు. మురిసిన వంజంగిపాడేరు : ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వంజంగి మేఘాల కొండకు పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. వీకెండ్ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. పాడేరు, వంజంగి ప్రాంతాల్లోని హోటల్లు, రిసార్టులు, క్యాంపెయిన్ టెంట్లలో బస చేశారు. ఆదివారం తెల్లవారు జామున కొండపైకి బయలుదేరి వెళ్లారు. సూర్యోదయం అందాలను తిలకించారు. అరకు ఘాట్ మార్గం పర్యాటకులు, వాహనాలతో పూర్తిగా కిక్కిరిసి పోయింది. దీంతో పర్యాటకుల ట్రాఫిక్ను పాడేరు వైపు మళ్లించారు. -
అప్పన్నకు కూరగాయల వితరణ
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేటకు చెందిన కె.కనకమహాలక్ష్మి కూరగాయలు వితరణగా అందజేశారు. 500 కిలోల గుమ్మడి కాయలు, 200 కిలోల చింతకాయలు, 200 కిలోల క్యాబేజీ, 15 కిలోల వంకాయలు, 30 కిలోల ముల్లంగి, 50 కిలోల చిలగడ దంపలు ఆలయం వద్ద ఆదివారం అందించారు.కిరండూల్ పాసింజర్కు అదనపు కోచ్ తాటిచెట్లపాలెం (విశాఖ): ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖ–కిరండూల్–విశాఖ పాసింజర్ రైలుకు అదనపు కోచ్ను జత చేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కే. పవన్కుమార్ ఆదివారం తెలిపారు. విశాఖ నుంచి కిరండూల్ వెళ్లే రైలు (58501)కు సోమవారం నుంచి జనవరి 20వ తేదీ వరకు, అలాగే తిరుగు ప్రయాణంలో కిరండూల్ నుంచి విశాఖ వచ్చే రైలు (58502)కు మంగళవారం జనవరి 21వ తేదీ వరకు ఒక అదనపు జనరల్ కోచ్ను అందుబాటులో ఉంచుతున్నారు. -
ఫరెవర్ మిస్ ఇండియాగా నిహారిక
బీచ్రోడ్డు: రాజస్థాన్ జైపూర్లో ఇటీవల నిర్వహించిన ఫరెవర్ స్టార్ ఇండియా అవార్డ్స్ వేడుకలో నగరానికి చెందిన నిహారిక బేతనపల్లి ఫరెవర్ మిస్ ఇండియా కిరీటం కై వసం చేసుకున్నారు. విశాఖకు చేరుకున్న ఆమె ఆదివారం నగరంలోని ఒక హోటల్లో మీడియాతో మాట్లాడారు. ఫరెవర్ స్టార్ ఇండియా దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతూ.. ప్రతి ఒక్కరూ ఈ పోటీల్లో పాల్గొని రాణించేందుకు ప్రోత్సాహం అందిస్తోందన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ అందాల పోటీలో సుమారు 10,000 నామినేషన్లు రాగా.. 105 మంది ఫినాలేకు ఎంపికయ్యారని తెలిపారు. తొలుత మిస్ బెంగళూరు కిరీటం గెలుచుకుని, ఇప్పుడు జాతీయ స్థాయిలో మిస్ ఇండియా కిరీటం పొందటం ఒక కీలక మైలురాయిని ఆమె పేర్కొన్నారు. -
క్లిక్..ఆర్డర్
స్మార్ట్ షాపింగ్లో స్టైల్దే అగ్రస్థానం సాక్షి, విశాఖపట్నం: ఫంక్షన్కి వెళ్లాలి.. శారీకి మ్యాచింగ్ ఇమిటేషన్ జ్యువెలరీ లేదు.. ఏం పర్లేదు.. వెంటనే ఆర్డర్ పెట్టేయ్! కొత్త హ్యాండ్ బ్యాగ్ కొనాలి.. ఆన్లైన్లో చూసేద్దాం.. జిమ్కు వెళ్లే సమయం లేదు.. ఇంట్లోనే ఫిట్నెస్ పెంచుకోవాలి.. ఇంకేం.. వెంటనే డంబెల్స్, బార్బెల్స్, వెయిట్ ప్లేట్స్ బుక్ చేసేద్దాం.. ఇది, అది అనే తేడా లేదు.. ఏదైనా సరే.. క్లిక్ కొట్టి ఆర్డర్ పెట్టేయడమే! పది నిమిషాల్లోనే వస్తువు ఇంటి ముందు వాలిపోతుంది. ప్రస్తుతం వైజాగ్లో ఎక్కడ చూసినా.. క్లిక్ ఆర్డర్.. ఇదే ట్రెండ్ నడుస్తోంది. వంద రూపాయల పర్స్ నుంచి.. లక్ష రూపాయల గోల్డ్ కాయిన్ వరకూ.. ఏం కావాలన్నా.. ఆన్లైన్ షాపింగ్ ఉంది కదా.. అనేదే అందరి ధీమా..! ఒకప్పుడు చాక్లెట్ కావాలంటే వీధి చివర ఉన్న షాప్కి వెళ్లేవాళ్లం. పెరుగు కావాలంటే డెయిరీకి, స్వీట్ల కోసం మిఠాయి దుకాణానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు క్విక్ కామర్స్ పుణ్యమా అని, ఆర్డర్ పెట్టిన పది నిమిషాల్లోనే మనకు కావల్సిన వస్తువు ఇంటికి వచ్చేస్తోంది. అందుకే ఆన్లైన్ ఆర్డర్లకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. విశాఖ నగరంలోనూ క్విక్ డెలివరీ యాప్స్కు ఆదరణ భారీగా పెరిగిందని ప్రముఖ డెలివరీ సంస్థ ఇన్స్టామార్ట్ సర్వేలో వెల్లడైంది. 2025లో వైజాగ్ వాసులు ఫాస్టెస్ట్ డెలివరీ యాప్స్లో ఎక్కువగా ఏం ఆర్డర్ చేశారో తెలుసా.? బ్యాగ్స్, వ్యాలెట్స్..! రూ.5.84 లక్షల షాపింగ్.. ఐఫోన్లలో టాప్ క్విక్ కామర్స్లో అత్యంత ఖరీదైన ఫోన్లు కూడా ఆర్డర్ చేస్తుండటం విశేషం. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో ప్రీమియం కొనుగోళ్లలో దేశంలోనే వైజాగ్ నగరం అగ్రస్థానంలో నిలిచింది. 2025లో నగరానికి చెందిన ఒక వినియోగదారుడు రూ.లక్ష విలువైన 24 క్యారట్ల బంగారు నాణేన్ని కొనుగోలు చేశారు. ఈ ఏడాది ఓ వ్యక్తి ఇన్స్టామార్ట్లో ఏకంగా రూ.5.84 లక్షల విలువైన షాపింగ్ చేశారు. 2025లో ఒకే వ్యక్తి చేసిన అత్యధిక షాపింగ్ ఇదే కావడం విశేషం. మరికొంతమంది రూ.3.50 లక్షల మార్కును దాటారు. వైజాగ్ ప్రజలు ఆన్లైన్లో చేసే ప్రతి 10 ఆర్డర్లలో 7 వరకు పెరుగు ప్యాకెట్లే ఉంటున్నాయి. తర్వాత స్థానంలో ఐస్క్రీమ్లు, స్వీట్లు ఉన్నాయి. ఏడాది కాలంలో వీటి ఆర్డర్లలో 112 శాతం వృద్ధి కనిపించింది. సెకనుకు 4 పాల ప్యాకెట్లు దేశవ్యాప్తంగా చూస్తే.. సగటున సెకనుకు 4 పాల ప్యాకెట్లను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తుండటం గమనార్హం. ఈ గణాంకాలను బట్టి క్విక్ కామర్స్ యాప్స్ నగర జీవనాన్ని ఎంతలా ప్రభావితం చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. స్థానిక ఉత్పత్తుల నుంచి ప్రీమియం వస్తువుల వరకూ విస్తృత శ్రేణిలో అందించేందుకు ఈ–కామర్స్ ప్లాట్ఫామ్స్ పోటీపడుతున్నాయి. విశాఖ వాసులు ఇల్లు కదలకుండానే తమకు నచ్చిన వస్తువును కొనుగోలు చేస్తూ.. ‘స్మార్ట్’గా మార్ట్ని ఇంటికి రప్పించుకుంటున్నారు. ● విశాఖలో 434 శాతం పెరిగిన బ్యాగులు, వాలెట్ల విక్రయాలు ● ఐఫోన్ నుంచి గోల్డ్ కాయిన్ దాకా.. ఫాస్ట్ షాపింగ్ ● ఆన్లైన్ కొనుగోళ్లలో కిరాణేతర వస్తువులదే హవా ● ఇన్స్టామార్ట్ సర్వేలో వెల్లడి ఏం ఆర్డర్ చేస్తున్నారంటే? ఇన్స్టామార్ట్ క్విక్ కామర్స్ యాప్.. 2025లో విశాఖ నగరవాసులు కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించి పలు ఆసక్తికరమైన గణాంకాలను వెల్లడించింది. ఈ ఏడాది వైజాగ్ వాసులు కిరాణా సరుకుల కంటే కిరాణేతర సామగ్రిపైనే ఎక్కువగా దృష్టి సారించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది హ్యాండ్ బ్యాగులు, వాలెట్ల కొనుగోళ్లు 434 శాతం పెరిగాయి. క్రీడలు, ఫిట్నెస్ పరికరాల ఆర్డర్లు 374 శాతం మేర నమోదయ్యాయి. నగలు, హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ వంటి వస్తువుల కొనుగోళ్లు 249 శాతం వృద్ధి చెందాయి. ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు 161 శాతం, పిల్లల ఆటవస్తువుల కొనుగోళ్లు 166 శాతం పెరిగాయి. స్నాక్స్, చక్కెర, వాటర్ బాటిల్స్, పాల ఉత్పత్తులు, గృహోపకరణాల కొనుగోళ్లు 100 శాతం వరకు వృద్ధి చెందాయి. నిమిషాల్లో డెలివరీ ఉరుకుల పరుగుల జీవన విధానంలో అంతా ఇప్పుడు వేలికొనల పైనే నడుస్తోంది. నచ్చింది తినాలన్నా, కొనాలన్నా ఒక్క క్లిక్తో ఇంటికే తెప్పించుకుంటున్నారు. ఆర్డర్ పెడితే 10 నుంచి 15 రోజుల సమయం వేచి చూసే రోజులు పోయాయి. ఇప్పుడంతా ఇన్స్టంట్ జమానా. 15 నిమిషాల్లో డెలివరీ చేస్తామని ఒకరు, 10 నిమిషాల్లోనే తెస్తామని మరొకరు.. పోటీ పడి మరీ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. పైగా షాపుల్లో దొరకని ఆఫర్లతో వస్తువులు ఇంటికి చేరుస్తుండటంతో, శ్రమ తగ్గిందని నగరవాసులు క్విక్ కామర్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. -
సీలేరులో ఆశ్రమ విద్యార్థిని మృతి
● రక్తహీనతే కారణం ● వార్డెన్ నాగ శకుంతల వెల్లడి సీలేరు: స్థానిక ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న పాంగి నందిని (11) ఆదివారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందింది. ఆమెకు శనివారం జ్వరంగా ఉండడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లామని ఆశ్రమ పాఠశాల వార్డెన్ పి.నాగ శకుంతల తెలిపారు. అక్కడ పరీక్షించిన సిబ్బంది జ్వరం లేదని, హిమోగ్లోబిన్ 4.5 శాతం మాత్రమే ఉన్నందున రక్తం ఎక్కించేందుకు చింతపల్లి ఆస్పత్రికి తీసుకువెళ్లాలని వారు సూచించారన్నారు. వెంటనే అక్కడి నుంచి నందిని తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఈ విషయం తెలియజేశామని ఆమె పేర్కొన్నారు. ఈమేరకు ఆదివారం ఉదయం చింతపల్లి ఆస్పత్రికి తీసుకువెళ్లాల్సి ఉన్నందున పాఠశాలకు రావాలని వారికి సూచించామన్నారు. అనంతరం అక్కడి నుంచి నందినిని ఆశ్రమ పాఠశాలకు తీసుకువెళ్లిపోయామన్నారు. ఈనేపథ్యంలో ఆదివారం ఉదయం నందిని ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోవడంతో వెంటనే స్థానిక పీహెచ్సీకి తీసుకువెళ్లామని చెప్పారు. పరీక్షించిన వైద్యాధికారి నారాయణరావు అప్పటికే ఆమె మృతి చెందినట్టు చెప్పారని వార్డెన్ తెలిపారు. కుమార్తె మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు ఆశ్రమ పాఠశాలకు వచ్చారు. గుండెలవిసేలా రోదించారు. బాలిక మృతదేహాన్ని గాలికొండ పంచాయతీ గేజింగ్ గ్రామానికి అంబులెన్సులో తరలించారు. ఇలావుండగా ఆశ్రమ విద్యార్థిని నందిని మృతిపై కలెక్టర్ దినేష్కుమార్, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గాలికొండ ఎంపీటీసీ అంపురంగి బుజ్జిబాబు డిమాండ్ చేశారు. ఆమె కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియో చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
ప్రాణాలు తీసిన సరదా
కూనవరం: అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం నర్సింపేటలో ఆదివారం జరిగిన ఒక చిన్న పొరపాటు, ఒకేసారి తండ్రీకొడుకులను బలితీసుకుని ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మండలంలోని నర్సింగపేట గ్రామానికి చెందిన సింహాద్రి పాపారావు (40), కుమారుడు జశ్వంత్(14)తో కలిసి సరదాగా పెంచుకుంటున్న కోడిపుంజులను ఈత కొట్టించేందుకు పొలం వద్దకు తీసుకెళ్లారు. అక్కడి నీటికుంటలో కోళ్లను ఈత కొట్టిస్తుండగా ప్రమాదవశాత్తు కుమారుడు జశ్వంత్ కాలుజారి కుంటలో పడిపోయాడు. కళ్లముందే కొడుకు మునిగిపోతుంటే చూడలేకపోయిన తండ్రి, ఈత రాకపోయినా ప్రాణాలకు తెగించి నీటిలోకి దూకాడు. దురదృష్టవశాత్తు ఇద్దరూ ఆ నీటిలోనే ఊపిరి వదిలారు. తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకేసారి విగతజీవులుగా మారారు. ఇంటర్ చదువుతున్న కూతురు, భర్తను కోల్పోయిన భార్య.. మాకు దిక్కెవరు?.. అంటూ బోరున విలపిస్తున్న తీరు అక్కడున్న వారిని కన్నీటి పర్యంతం చేసింది. పోలీసులు మృతదేహాలను కోతులగుట్ట సీహెచ్సీకి తరలించారు. బహిర్భూమికి వెళ్లి ప్రమాదానికి గురైనట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలావుండగా జశ్వంత్ మర్రిగూడెం హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. -
వందరోజుల ప్రణాళిక పక్కాగా అమలు
జి.మాడుగుల: పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచడమే లక్ష్యంగా రూపొందించిన వంద రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని డీఈవో రామకృష్ణారావు ఆదేశించారు. శనివారం ఆయన స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గాంధీనగరంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను శనివారం ఆయన తనిఖీ చేశారు. పదోతరగతి విద్యార్థులతో మాట్లాడారు. పాఠ్యంశాలపై అవగాహన కల్పించి సందేహాలను నివృత్తి చేశారు. గణితం,సైన్సు, ఇంగ్లీష్ సబ్జెక్టులపై విద్యార్థులను ప్రశ్నించి, సమాధానాలు రాబట్టారు. తద్వారా వారి గ్రేడ్లను పరిశీలించారు.వంద రోజుల ప్రణాళిక అమలుపై ఉపాధ్యాయుల నుంచి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రతిరోజు బోధన ప్రణాళిక, పునఃశ్చరణ తరగతులు, ప్రత్యేక కోచింగ్పై ఆరా తీశారు. విద్యార్థులకు నిర్వహిస్తున్న యూనిట్ టెస్టులు, వీక్లీ టెస్టులు, మాక్ పరీక్షల ఫలితాలను పరిశీలించారు. తక్కువ గ్రేడ్లలో ఉన్న విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యకశ్రద్ధ చూపాలని సూచించారు. అదనపు బోధన తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతీ విద్యార్థి కనీస ఫలితాతు సాధించేలా వ్యక్తిగత శ్రద్ధ అవసరమని ఆయన పేర్కొన్నారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా రోజువారీ లక్ష్యాలు నిర్దేశించుకోవాలని, పరీక్షల దృష్ట్యా సిలబస్ను సకాలంలో పూర్తి చేయడమే కాకుండా, నిరంతర మూల్యాంకనంతో విద్యార్థుల ప్రగతిని పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇవన్నీ అమలు చేస్తే పదో తరగతి ఫలితాల్లో గణనీయమైన మెరుగుదల సాధ్యపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో సీహెచ్ బాబూరావుపడాల్, ఎంఈవో–2 వెంకటరమణమూర్తి పాల్గొన్నారు.డీఈవో రామకృష్ణారావు ఆదేశం -
విభిన్న ప్రతిభావంతులకు సముచిత స్థానం
● కలెక్టర్ దినేష్కుమార్ ● ఉపకరణాల పంపిణీ పాడేరు : విభిన్న ప్రతిభావంతులకు సమాజంలో సముచిత స్థానం కల్పించాలని కలెక్టర్ దినేష్కుమార్ సూచించారు. శనివారం కలెక్టరేట్ ప్రాంగణంలో విశాఖపట్నం ఎబిలిటీ రీ హెబిలిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో పలువురు దివ్యాంగులకు వీల్చైర్లు, ఉపకరణాలు పంపిణీ చేశారు. కుమ్మరిపుట్టు గ్రామానికి చెందిన వినిత అనే రెండేళ్ల దివ్యాంగురాలు త్వరగా కోలుకునేలా పౌష్టికాహారం, ఫిజియోథెరపి అందించాలని ఆదేశించారు. శారీరక అంగ వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు జిల్లా ఆస్పత్రిలో రీహెబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. శారీరక, మానసిక ఎదుగుదల లోపంతో బాధపడుతున్న చిన్నారులకు ఫిజియోథెరపి, న్యూట్రిషన్ అందిస్తామన్నారు. రీహెబిలిటేషన్ సెంటర్ డైరెక్టర్ దిలీప్పాత్రుడు, కౌన్సిలర్ స్వప్న పాల్గొన్నారు. -
పాడేరు డీఎస్పీగా అభిషేక్
● బాధ్యతల స్వీకరణ పాడేరు : పాడేరు డీఎస్పీగా అభిషేక్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డీఎస్పీగా పని చేసిన షేక్ సహబాజ్ ఆహ్మద్ కాశీబుగ్గ డీఎస్పీగా బదిలీ అయ్యారు. గ్రేహౌండ్స్లో శిక్షణ పూర్తి చేసుకున్న అభిషేక్ ఆయన స్థానంలో నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడేరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, చిన్నారులు, మహిళలపై నేరాలు, అఘాయిత్యల జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి సాగు, రవాణాకు అడ్డుకట్ట వేసేలా ప్రణాళికపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. పాడేరు పట్టణంలో ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేకంగా దృష్టి పెడతామన్నారు. ఆయనను సీఐలు, ఎస్ఐలు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. -
సిండికేట్ సెగ
హుకుంపేట సంతలో ధరలు పతనంతో అడవిబిడ్డల ఆవేదనహుకుంపేటలో గిరిజన ఉత్పత్తుల మార్కెట్సాక్షి,పాడేరు: గిరిజన రైతులు కష్టపడి సాగు చేసిన వ్యవసాయ, వాణిజ్య పంటలకు వారపు సంతల్లో కనీస గిట్టుబాటు ధరలు లభించడం లేదు. వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ధరలు పతనం చేయడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం కాఫీ, పిప్పలమోడి, రాజ్మా రైతులు ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. గిరిజనులు వ్యవసాయ, అటవీ ఉత్పత్తుల అమ్మకాలకు వారపు సంతలకు తీసుకువస్తుంటారు. ఏజెన్సీలో గుర్తింపు పొందిన హుకుంపేట వారపు సంతలో శనివారం దళారి వ్యాపారులదే రాజ్యమైంది. ఇక్కడికి హుకుంపేట, పాడేరు, పెదబయలు, డుంబ్రిగుడ, అరకులోయ మండలాలతోపాటు సరిహద్దులోని ఒడిశా గిరిజన రైతులు కాఫీ, రాజ్మా, పిప్పలమోడిని భారీగా తీసుకువచ్చారు. అయితే వ్యాపారులంతా సిండికేట్గా ఏర్పడి గిట్టుబాటు ధర లేకుండా చేశారని గిరిజనులు వాపోయారు. వ్యాపారులంతా ఒకే ధర నిర్ణయించడంతో తీసుకువచ్చిన ఉత్పత్తులను తిరిగి ఇళ్లకు తీసుకువెళ్లలేక అమ్ముకోవాల్సి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ● బెంగళూరు మార్కెట్లో పాచ్మెంట్ కాఫీ గింజలు కిలో రూ.500 ధర ఉంది. గిరిజన సహకార సంస్థ రూ.450 ధర ప్రకటించింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ సంస్థ వారపు సంతల్లో కొనుగోలు ఏర్పాటుచేయలేదు. దీంతో వారపు సంతలకు తీసుకువచ్చిన గిరిజనులు దళారి వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. వారు నిర్ణయించిన ధర కిలో రూ.320 అమ్మాల్సి వచ్చింది. ఒక్కరోజు సుమారు రూ.50 లక్షల వరకు వ్యాపారం జరిగింది. ● పిప్పలమోడిని తీసుకువచ్చిన గిరిజన రైతులకు వ్యాపారుల సిండికేట్ దెబ్బ తప్పలేదు. గత సీజన్లో కిలో రూ.380కు కొనుగోలు చేసిన వ్యాపారులు శనివారం కిలో రూ.320కు మించి కొనుగోలు చేయలేదు. సుమారు రూ.30 లక్షల మేర వ్యాపారం జరిగింది. ● సంక్రాంతి పండగకు అదాయ వనరుగా గుర్తింపు పొందిన రాజ్మా గింజలకు కూడా ఈ సంతలో గిట్టుబాటు ధర కరువైంది. గత ఏడాది కిలో రూ.90 నుంచి రూ.100కు కొనుగోలు చేసిన వ్యాపారులు ఈ ఏడాది మాత్రం కిలో రూ.80కి మించి కొనడం లేదని గిరిజన రైతులు తెలిపారు. ఈ ఏడాది పంట దిగుబడి తక్కువగా ఉన్నందున కిలో రూ.110 వరకు ఉండవచ్చని ఆశించామని వారు తెలిపారు. సుమారు రూ.5 లక్షల మేర వ్యాపారం జరిగినా తమకు శ్రమ మాత్రమే మిగిలిందని వారు వాపోయారు. రాజ్మా దెబ్బ.. దిగుబడి తగ్గి ధర పెరుగుతుందని ఆశించిన రైతులకు, గత ఏడాది కంటే తక్కువ ధర (రూ.80) ఇచ్చి వ్యాపారులు మోసం చేశారు. జీసీసీ వైఫల్యం.. ధరలు ప్రకటించి, సంతల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం దళారులకు వరంగా మారింది. గతేడాది కన్నా తక్కువ ధర పిప్పలమోడిని గత ఏడాది కన్నా తక్కువ ధరకు వ్యాపారులు కొనుగోలు చేయడం అన్యాయం. గత సీజన్లో కిలో రూ.400కు అమ్ముకున్నా. శనివారం జరిగిన సంతలో వ్యాపారులు పోటాపోటీగా కొనుగోలు చేసినా వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ధర పెరగకుండా చేశారు. వారు నిర్ణయించిన కిలో రూ.320కు అమ్ముకోవాల్సి వచ్చింది. గిట్టుబాటు ధర చెల్లించేలా ప్రభుత్వం ఆదుకోవాలి. – గొల్లురి అప్పారావు, గిరిజన రైతు, పనసపల్లి, పాడేరు మండలం రూ.1950 నష్టపోయా డబ్బు అవసరంతో హుకుంపేట సంతలో అమ్మేందుకు కాఫీ గింజలు తీసుకువచ్చా. వ్యాపారులంతా కిలో రూ.320కు కొనుగోలు చేశా రు. ధర తక్కువగా ఉన్నా ఇంటికి తీసుకువెళ్లలేక 15 కిలోలు రూ.4,800కు అమ్ముకోవాల్సి వచ్చింది. సంతలో జీసీసీ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ఉంటే కిలో రూ.450కు అమ్మడం వల్ల రూ.6,750 ఆదాయం వచ్చేది. దీనివల్ల రూ.1,950 నష్టపోయా. – గుల్లెలి భవాని, కాఫీ రైతు, గడి కించుమండ, హుకుంపేట మండలం వ్యవసాయ, అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు కరువు ధర పెరగకుండా కట్టడి చేస్తున్న వ్యాపారులు భారీగా ఆదాయం కోల్పోతున్న గిరి రైతులు భారీగా దోపిడీతో నష్టపోతున్నా పట్టించుకోని జీసీసీ -
మన్యం మురిసె.. పర్యాటకం మెరిసే
జిల్లాలోని పర్యాటక కేంద్రాలకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. శనివారం ఒక్కరోజే బొర్రా గుహలు, వంజంగి మేఘాల కొండలు, చాపరాయి వంటి ప్రాంతాల్లో వేల సంఖ్యలో సందడి చేశారు. దీంతో హోటళ్లు, రిసార్ట్లు అన్నీ పర్యాటకులతో నిండిపోయాయి. ప్రధాన రహదారులన్నీ వాహనాల రాకపోకలతో కిక్కిరిసి పోయాయి. ● కిక్కిరిసిన సందర్శిత ప్రాంతాలు ● నిండిపోయిన హోటళ్లు, రిసార్టులు ● అటవీ, పర్యాటక శాఖలకు భారీగా ఆదాయంసాక్షి,పాడేరు: జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో సందడి నెలకొంది. రెండురోజుల నుంచి భారీగా తరలివస్తుండటంతో మన్యం మురిసిపోతోంది. శనివారం అరకులోయ, బొర్రా గుహలు, కటికి జలపాతం, చాపరాయి, వంజంగి హిల్స్, కొత్తపల్లి జలపాతం, లంబసింగి, చెరువులవేనం, సీలేరు, మోతుగూడెం, మారేడుమిల్లి ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ● బొర్రాగుహలను ఉదయం నుంచి సాయంత్రం వరకు 9 వేలమంది సందర్శించగా రూ.8 లక్షల ఆదాయం వచ్చిందని టూరిజం మేనేజర్ గౌరీశంకర్ తెలిపారు. ● పాడేరు మండలం వంజంగి హిల్స్లో పర్యాటకులు సందడి చేశారు. వంజంగి కొండలపై సూర్యోదయం, మేఘాల అందాలను వీక్షించారు. వీరి సందర్శన ద్వారా అటవీశాఖకు ఒక్కరోజే రూ.1,91,260 ఆదాయం వచ్చింది. పర్యాటకుల వాహనాలతో పాడేరు నుంచి అనంతగిరి, విశాఖపట్నం రోడ్డు, చింతపల్లి నుంచి నర్సీపట్నం రోడ్డు రద్దీగా మారాయి. అన్ని హోటళ్లు, రిసార్ట్లు, లాడ్జీలు పర్యాటకులతో నిండిపోయాయి. డుంబ్రిగుడ: అరకు పైనరీ, చాపరాయి సందర్శనకు శనివారం సందర్శకులు భారీగా తరలివచ్చారు. కుటుంబ సభ్యులతో సందడి చేశారు. చాపరాయి జలపాతంలో స్నానాలు చేస్తూ సందడి చేశారు. -
విశాఖ బీచ్.. ఫుల్ రష్
30న జెడ్పీ సర్వసభ్య సమావేశం మహారాణిపేట (విశాఖ): జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 30న జరగనుందని జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు. చైర్పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటల నుంచి జరగనున్న ఈ సమావేశాలకు జెడ్పీటీసీ, ఎంపీపీలు హాజరుకావాలని కోరా రు. అన్ని విభాగాల అధికారులు పూర్తి నివేదికలతో హాజరు కావాలన్నారు. విశాఖ: సాగరతీరం పర్యాటక శోభను సంతరించుకుంది. క్రిస్మస్, దానికి తోడు వరసగా సెలవులు రావడంతో నగరంలోని పర్యాటక ప్రాంతాలన్నీ సందడిగా మారాయి -
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
చింతపల్లి: మండలంలో సప్తగిరి, రాజుపాకల కాఫీ తోటల వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు. లంబసింగి పంచాయతీ గాదెగొయ్యి గ్రామానికి చెందిన చంటిబాబు(28) శనివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై నడిచి వెళ్తుండగా వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో అతను అక్కడక్కడే మృతి చెందాడు. భార్య చిలకమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ వీరబాబు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించామని తెలిపారు. మృతుడికి భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న చంటిబాబు అకాల మరణంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. -
విజృంభిస్తున్న శీతల గాలులు
● స్ధిరంగా కనిష్ట ఉష్ణోగ్రతలు ● జి.మాడుగులలో 5.1 డిగ్రీల నమోదు చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చలి, మంచు తీవ్రతకు స్థానికులు ఇ బ్బందులు పడుతున్నారు. శనివారం జి.మాడుగుల లో 5.1 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 6.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతులు నమోదైనట్లు స్థానిక ప్రాంతీయ వ్యవసా య పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ● పాడేరు డివిజన్ పరిధిలో చింతపల్లి 8.2 డిగ్రీలు, పెదబయలులో 9.0 డిగ్రీలు, పాడేరులో 9.9 డిగ్రీలు, అరకువ్యాలీలో 10 డిగ్రీలు, హుకుంపేటలో 10.7 డిగ్రీలు, కొయ్యూరులో 12.8 డిగ్రీలు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు. ● రంపచోడవరం డివిజన్ వై.రామవరంలో 10.6 డిగ్రీలు, మారేడుమిల్లిలో 11.0 డిగ్రీలు, రాజవొమ్మంగిలో 11.5 డిగ్రీలు, అడ్డతీగలలో 14.5 డిగ్రీలు, రంపచోడవరంలో 15.7 డిగ్రీలు, చింతూరు డివిజన్ చింతూరులో 13.9 డిగ్రీలు, ఎటపాకలో 14.7 డిగ్రీలు నమోదైనట్లు ఏడీఆర్ తెలిపారు. ● వారం రోజులగా కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతుండడంతో శీతలగాలులు విజృంభిస్తున్నాయి. సాయంత్రం మూడు గంటల నుంచి వీటి ప్రభావం ఉంటోందని స్థానికులు తెలిపారు. ఉదయం 10 గంటలు దాటే వరకు మంచు తెరలు వీడటం లేదు. దీంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. -
టెన్త్లో నూరుశాతం ఉత్తీర్ణత తప్పనిసరి
● పటిష్టంగా వందరోజుల యాక్షన్ ప్లాన్ ● కలెక్టర్ దినేష్కుమార్ పాడేరు : ప్రభుత్వ పాఠశాలలు, గిరిజన సంక్షేమ ఆశ్రమ, గురుకుల పాఠశాలలో చదువుతున్న టెన్త్ విద్యార్థులు వచ్చే ఏడాది పబ్లిక్ పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు. శనివారం తన కార్యాలయం నుంచి విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. టెన్త్ విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యాశాఖ అధికారులు వంద రోజుల యాక్షన్ ప్లాన్ తయారు చేసి పటిష్టంగా అమలు చేయాలన్నారు. యాక్షన్ ప్లాన్ అమలుతీరును పరిశీలించేందుక ఐటీడీఏల్లో ఏర్పాటు చేసిన మానటరింగ్ సిస్టం ద్వారా పీవోలు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. విద్యార్థులు చదువులో మెరుగ్గా రాణించేందుకు తరచూ పోటీ పరీక్షలు నిర్వహించాలన్నారు. చదువుల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. యాక్షన్ ప్లాన్ అమలు చేయడంలో పాఠశాల హెచ్ఎంలు, ఎంఈవోలు ముఖ్య భూమిక పోషించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యశాఖాధికారి రామకృష్ణారావు, టీడబ్ల్యూ డీడీ పరిమళ, మండల విద్యాశాఖ అధికారులు, ఏటీడబ్ల్యూవోలు పాల్గొన్నారు. -
30 నుంచి గిరిజన యవ సమ్మేళనం
ఏయూక్యాంపస్: విశాఖ వేదికగా ఈ నెల 30 నుంచి జనవరి 5వ తేదీ వరకు 17వ జాతీయ గిరిజన యువ సమ్మేళనం నిర్వహించనున్నట్లు మై భారత్ డిప్యూటీ డైరెక్టర్ జి.మహేశ్వర రావు తెలిపారు. శనివారం బీచ్రోడ్డులోని సంస్థ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం వేదికగా జరిగే ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఏపీ రాష్ట్రాలకు చెందిన 200 ఆదివాసీ యువత పాల్గొంటారన్నారు. ఆదివాసీ సంప్రదాయాలు, కళలు, ప్రదర్శిస్తారన్నారు. కేంద్ర యువజన వ్యవహారాల శాఖ, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయన్నారు. మై భారత్ రిసోర్స్ పర్సన్ ఎన్.నాగేశ్వర రావు, ఎన్ఎస్ఎస్ జాతీయ అవార్డు గ్రహీత ఆర్.లీలాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన యువతకుఉపాధి కల్పనకు చర్యలు
● జాబ్మేళాలలో 59 మందికి ఉపాధి అవకాశాలు ● ఏపీవో రమణ రుంపచోడవరం: ఏజెన్సీలో చదువుకున్న యువతకు ప్రైవేట్ సెక్టార్లలో ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నామని రంపచోడవరం ఐటీడీఏ ఏపీవో డి.ఎన్.వి.రమణ అన్నారు. రంపచోడవరం వైటీసీలో శనివారం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా కలెక్టర్ ఆదేశాల మేరకు ఐటీడీఏ పీవో స్మరణ్రాజ్ ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో మొత్తం 112 మంది అభ్యర్థులు హాజరు కాగా వీరిలో 59 మంది అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలకు ఎంపికై నట్టు ఏపీవో తెలిపారు. ఈ జాబ్ మేళాలో అపోలో ఫార్మసీ, నవత ట్రాన్స్పోర్టు, టీవీఎస్ సుందరం, ఎల్అండ్టీ, టాటా ఎలక్ట్రానిక్స్ తదితర సంస్థల్లో ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధ సంస్ధ అధికారి రోహిణి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సుకు త్రుటిలో తప్పిన ప్రమాదం
చింతూరు: మారేడుమిల్లి, చింతూరు ఘాట్రోడ్లో ఆర్టీసీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. తులసిపాక సమీపంలోని దుర్గమ్మ గుడివద్ద శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గోకవరం డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ సర్వీసు రాజమహేంద్రవరం నుంచి భద్రాచలం వెళ్లేందుకు మధ్యాహ్నం 1.50కు బయలుదేరింది. ఘాట్రోడ్లోని దుర్గమ్మ గుడి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో కల్వర్టును బస్సు ఢీకొట్టినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. కల్వర్టు వల్ల నిలిచిపోవడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. బస్సు రేడియేటర్ పగిలిపోవడంతో డ్రైవర్ బస్సును అతికష్టంతో తులసిపాక వరకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి కొంతమంది ప్రయాణికులు ఇతర వాహనాల్లో వెళ్లిపోయారు. మిగిలిన వారు తరువాత వచ్చిన బస్సులో గమ్యస్థానాలకు వెళ్లారు. ఇటీవల ఇదే ఘాట్రోడ్లో ఓ ప్రైవేటు బస్సు లోయలో పడిన ఘటనలో తొమ్మిది మృతి చెందిన నేపథ్యంలో తాజాగా జరిగిన ప్రమాదంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రాంతంలో కాకుండా ఘాట్రోడ్డులో మరో చోట జరిగి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని వారు పేర్కొన్నారు. లారీని తప్పించబోయి కల్వర్టును ఢీకొన్న బస్సు -
చలిమంటకువృద్ధురాలికి గాయాలు
రాజవొమ్మంగి: చలి నెగడు నుంచి మంటలు ఎగసి మండలంలోని అప్పలరాజుపేటకు చెందిన కేదారి అప్పయమ్మ (70) శనివారం తీవ్రంగా గాయపడింది. అప్పయమ్మ ఒంటరిగా ఓ పాకలో నివసిస్తోంది. ఆమె ఏర్పాటు చేసుకొన్న చలి మంట నుంచి అర్ధరాత్రి అగ్నికీలలు పైకి ఎగసి ఆమె శరీరంపై, దుస్తులు, మంచంపై పడి కాలిపోవడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. శనివారం తెల్లవారుజామున స్థానికులు గమనించి ఆమెకు సపర్యలు చేశారు. స్థానిక ఆశ వర్కర్ రత్నం, అంగన్వాడీ కార్యకర్త కుమారి అప్పయమ్మను 108 సహాయంతో రాజవొమ్మంగి పీహెచ్సీకు తరలించారు. డాక్టర్ శివారెడ్డి ప్రథమ చికిత్స అందజేశారు. అప్పయమ్మకు 72 శాతం కాలిన గాయాలయ్యాయని, మెరుగైన చికిత్స కోసం నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశామన్నారు. నిరుపేద గిరిజన మహిళ అయిన అప్పయమ్మను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎంపీటీసీ సభ్యుడు పెద్దిరాజు బాధితురాలిని పరామర్శించి ధైర్యం చెప్పారు. -
మూగబోయిన సెల్ సేవలు
● కండ్రుమ్, కితలంగి పంచాయతీల్లో స్తంభించిన బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ వ్యవస్థ ● సచివాలయ సేవలకు అంతరాయం డుంబ్రిగుడ: మండలంలోని కండ్రుమ్, కితలంగి పంచాయతీల్లో బీఎస్ఎన్ఎల్ సెల్ సేవలు స్తంభించాయి. దీంతో గత 20 రోజులగా సిగ్నల్ వ్యవస్థ పనిచేయక స్థానికులతో పాటు ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధ్యాయులు వారి ఉద్యోగ రీత్యా ముఖ హాజరు తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కితలంగి పంచాయతీలోని కితలంగి, కోంతుగుడలలో ఏర్పాటు చేసిన టవర్ల ద్వారా సెల్ సిగ్నల్స్ అందడం లేదని, దీంతో నానా అవస్థలు ఎదుర్కొంటున్నామని వినియోగదారులు చెబుతున్నారు. అత్యవసర సమయాల్లో సమాచారం అందించేందుకు పడుతున్న పాట్లు వర్ణనాతీతమంటున్నారు. సెల్ సిగ్నల్ కోసం సమీపంలోని కొండపై వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. ఈ విషయమై కితలంగి పంచాయతీ సర్పంచ్ వరబోయిన సుబ్బారావు శనివారం అరకులోయలో ఉన్న బీఎస్ఎన్ఎల్ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి బీఎస్ఎన్ఎల్ సేవలు పునరుద్ధరించేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
స్లో..లార్!
పీఎం సూర్యఘర్కు అంతంతమాత్రంగా స్పందనసాక్షి, విశాఖపట్నం: ఏపీఈపీడీసీఎల్ పరిధిలో పీఎం సూర్యఘర్కు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. సబ్సిడీ, రుణ సదుపాయంతో ప్రతి ఇంటికి సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అవకాశం ఉన్నా.. వినియోగదారులు ఆసక్తి చూపించడం లేదు. ఫలితంగా సోలార్ ప్లాంట్ల ఏర్పాటులో ఏపీఈపీడీసీఎల్ ఆశించిన ప్రగతిని సాధించలేకపోతోంది. మరోవైపు.. ఏదో సాధించేశామని చెప్పుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం.. సోలార్ రూఫ్టాప్లని వీలైనంత ఎక్కువగా ఏర్పాటు చేయించాలంటూ డిస్కమ్లపై పదే పదే ఒత్తిడి తీసుకొస్తోంది. దీంతో అధికారులు, ఉద్యోగులు తమ విధులను పక్కన పెట్టి.. సోలార్పైనే దృష్టిసారించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 12 శాతం లక్ష్యాన్ని కూడా చేరలేక..! ఈపీడీసీఎల్ పరిధిలో 200 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్న వారు 3 లక్షల మంది వరకు ఉండగా.. సోలార్ ప్లాంట్లను కేవలం 36 వేల మంది మాత్రమే ఇప్పటి వరకూ అమర్చుకున్నారు. కనీసం 12 శాతం కూడా లక్ష్యాన్ని సాధించలేకపోవడంతో ఉన్నతాధికారులు ఉద్యోగులపై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. ఈ పథకం ప్రకారం ఏపీఈపీడీసీఎల్ పరిధిలో మొత్తం 36 వేల గృహాలకు 114 మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. విశాఖ పరిధిలోనూ ఇదే పరిస్థితి దాపురించింది. 200 యూనిట్లు పై చిలుకు విద్యుత్ వినియోగదారులు 1.83 లక్షల మంది విశాఖలో ఉండగా 13,500 కిలోవాట్లు సామర్థ్యంతో 3,750 మంది మాత్రమే అమర్చుకున్నారు. అనకాపల్లి సర్కిల్ పరిధిలో 2,841 మందికి 8,712 కిలోవాట్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో 15 మందికి 48 కిలోవాట్ల సోలార్ ప్లాంట్లు మాత్రమే అమర్చారు. దీంతో అనుకున్న స్పందన లేకపోవడంతో కచ్చితంగా పరిధిలోకి వచ్చే వారందరినీ.. పీఎం సూర్యఘర్ పథకం లోకి మార్చాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో ఈపీడీసీఎల్ ఉద్యోగులు బేజారవుతున్నారు. విద్యుత్ సరఫరాకు సంబంధించిన అంశాల కంటే సూర్యఘర్ ఒత్తిడే ఎక్కువగా ఉంటోందని ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామనీ.. ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదని చెబుతున్నారు. సోలార్ ప్యానెల్స్ అమర్చిన తర్వాత.. పాడైతే.. దాన్ని బాగుచేసేందుకు అధిక భారం పడుతుందనీ.. అందుకే ఎవరూ పట్టించుకోవడంలేదనీ.. అయినా ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ సర్కిల్ పరిధిలో 200 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగదారులు1.83 లక్షల మంది విశాఖలో సోలార్ ప్లాంట్లు అమర్చుకున్నది3,750 (13,500 కిలోవాట్లు) అనకాపల్లి సర్కిల్ పరిధిలో 2,841 మంది (8,712 కిలోవాట్లు) అల్లూరి సర్కిల్ పరిధిలో15 మంది (48 కిలోవాట్లు)కరెంట్ అమ్మితే మీకే లాభం అని చెప్పండహో..! అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ చార్జీలు తగ్గిస్తామంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు.. ఇప్పుడు ఎఫ్పీసీసీఏ చార్జీలంటూ బిల్లు చూస్తే గుండె గుభేల్మనిపించేలా చేస్తున్నారు. సంపద సృష్టించడం తనకు తెలుసన్న ఆయన ఓవైపు విద్యుత్ బిల్లుల్ని అమాంతం పెంచేసి.. మరోవైపు.. సూర్యఘర్ ప్రాజెక్టు పేరుతో వినియోగదారుల నడ్డి విరించేందుకు యత్నిస్తున్నారు. సోలార్ రూఫ్టాప్ పెట్టుకుంటే బిల్లు కట్టకపోవడంతో పాటు కరెంటు అమ్ముకొని లాభాల్ని పొందొచ్చంటూ ప్రజల్ని మభ్యపెడుతున్నారు. 3 కిలోవాట్లు ఏర్పాటు చేసుకున్న ఇంటికి నెలకు 360 నుంచి 450 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇంటి అవసరాలకు వినియోగించుకోగా.. మిగిలిన విద్యుత్ను ఏపీఈపీడీసీఎల్కు విక్రయించుకోవచ్చనే విషయాన్ని ప్రజలకు వివరించాలంటూ ఉద్యోగుల్ని ఆదేశించారు. అయినా ప్రజలు స్పందించకపోవడంతో అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈపీడీసీఎల్ పరిధిలో సర్కిళ్లలోని జోన్లవారీగా టార్గెట్స్ విధించారు. నిర్దేశించిన సమయంలోగా టార్గెట్ పూర్తి చేయాలని ఆదేశిస్తుండటంతో.. పీఎం సూర్యఘర్ అధికారుల మెడపై కత్తిగా మారింది. టార్గెట్ పూర్తి చేయలేదని కింది స్థాయి ఉద్యోగులపై అధికారుల చిర్రుబుర్రు తలనొప్పిగా మారిందంటున్న విద్యుత్ శాఖ ఉద్యోగులు ఇప్పటివరకు డిస్కమ్ పరిధిలో 36 వేల మంది ఏర్పాటు -
దంతేవాడ వరకే కిరండూల్ పాసింజర్
తాటిచెట్లపాలెం: కె.కె.లైన్లో జరుగుతున్న ఆధునికీకరణ పనుల కారణంగా ఈ మార్గంలో నడిచే కిరండూల్ పాసింజర్ ఆయా తేదీల్లో గమ్యం కుదిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28, 29, 30, 31 జనవరి 1, 2, 4, 6, 7, 8, 10వ తేదీల్లో విశాఖపట్నం–కిరండూల్(58501)పాసింజర్ దంతేవాడ వరకు మాత్రమే నడుస్తుంది. ఈ నెల 29, 30, 31 జనవరి 1, 2, 4, 6, 7, 8, 9, 11వ తేదీల్లో కిరండూల్–విశాఖపట్నం(58502) పాసింజర్ దంతేవాడ నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ తేదీల్లో దంతేవాడ–కిరండూల్ మధ్య ఈ రైలు రాకపోకలు సాగించదు. -
మంచు ముసుగులో మన్యం
ముంచంగిపుట్టు: ఆంధ్ర ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో దట్టంగా పొగమంచు కురుస్తుంది.ఉదయం 9గంటలైనా మంచు తెరలు వీడడం లేదు. వాహనచోదకులు హెడ్లైట్ల వెలుతురులో రాకపోకలు సాగిస్తున్నారు.రోజు రోజుకు చలి తీవ్రత కూడా పెరుగుతుంది.సాయంత్రం 4గంటల నుంచి చలి మొదలవుతుంది.చలి నుంచి ఉపశమం పోందేందుకు గ్రామాల్లో గిరిజనులు చలి మంటలు వేసుకుంటున్నారు. చలి,మంచుతో అవస్థలు పడుతున్నారు. డుంబ్రిగుడ: మండలంలోని పోగమంచు దట్టంగా కురుస్తుండటంతో ఉష్ణొగ్రతల సంఖ్యకు పడిపోతున్నయి. దట్టమైన మంచుకారణంగా గిరిజనులు, విద్యార్ధులు, పర్యాటకులు ఇబ్బందులు పడుతు చలిమంటలను ఆశ్రయిస్తు చలికాస్తున్నరు. పాఠశాలలకు వెల్లే విద్యార్ధులు మంచుకు వణుకుతు పాఠశాలకు వెళ్తున్నారు. ప్రస్తుతం డుంబ్రిగుడలో అధిక పోగ మంచుతో కూరగాయాలు ఇతర పంటలు నష్టపోయే ప్రమాదం ఉందని గిరిజనులు అంటున్నారు. చలితో ఇబ్బందులు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నరు. -
పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి
అడ్డతీగల: విద్యాలయాల్లో విద్యతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని ప్రభుత్వ మానవ వనరుల విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.ఎం.నాయక్ అన్నారు.శనివారం ఆయన రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి,ఐటీడీఏ పీవో బచ్చు స్మరణ్రాజ్తో కలిసి పాఠశాలలను సందర్శించారు. గురుకుల పాఠశాల,ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలను సందర్శించి, అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు.మెనూ ప్రకారం ఆహారం ఇవ్వాలన్నారు.విద్యతో పాటు ఉపాధ్యాయులు వ్యక్తిగత,పరిసరాల పరిశుభ్రతపై ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూనే విద్యార్ధులకు అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలలో మరుగుదొడ్లు అసౌకర్యంగా ఉండడంతో వెంటనే నిధులు కేటాయించి పనులు చేయించి విద్యార్థినులకు మరుగుదొడ్లు అందుబాటులోనికి తీసుకురావాలని ఐటీడీఏ పీవో స్మరణ్రాజ్ని ఆదేశించారు. మిట్లపాలెంలో మద్యస్తంగా నిలిచిపోయిన చిన్నతరహ జలవిద్యుత్ ప్రాజెక్ట్ నిర్మిత ప్రాంతాన్ని పరిశీలించారు. వేటమామిడి జలవిద్యుత్ కేంద్రం పరిశీలించి ఉత్పత్తి,పనితీరుని అడిగి తెలుసుకున్నారు. సీహెచ్సీని పరిశీలించిన ఎస్టీ కమిషన్ చైర్మెన్ అడ్డతీగల సిహెచ్సిని రాష్ట్ర ఎస్టి కమీషన్ చైర్మెన్ సోళ్ళ బొజ్జిరెడ్డి శనివారం పరిశీలించారు.రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరాతీశారు.ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలను సూపరింటెండెంట్ పండా సతీష్ని అడిగి తెలుసుకున్నారు. రోగుల అవసరాలకు అదనపు సౌకర్యాల అవసరముంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు.గిరిజన సంక్షేమశాఖ డీడీ రుక్మాంగదయ్య, బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఎ.స్వప్నకుమారి ఇతర అధికార్లు పాల్గొన్నారు. -
నోరు అదుపులో పెట్టుకో.. ఖబడ్దార్!
రంపచోడవరం: తన వ్యక్తిగత జీవితం గురించి రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని.. ఇక ముందు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఘాటుగా హెచ్చరించారు. రంపచోడవరం నియోజకవర్గంలో ఇంత చేతకాని, దద్దమ్మ ఎమ్మెల్యే ఎవరూ లేరని విమర్శించారు. రంపచోడవరం సమీపంలోని ఐ.పోలవరంలోని ఎంపీపీ ఇంటి వద్ద గురువారం నినిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ (అనంతబాబు) మాట్లాడారు. ఇటీవల వైఎస్సార్సీపీతో పాటు వారిపై ఎమ్మెల్యే పలు విమర్శలు చేసిన నేపథ్యంలో తీవ్రంగా స్పందించారు. ప్రజలకు ఏం చేశావ్.. : రంపచోడవరం ఎమ్మెల్యే ఏడాది కాలంలోనే వాతావరణం పడటం లేదని రాజమహేంద్రవరం మకాం మార్చేసి, ప్రజలు గురించి పట్టించుకోని నీకు తమ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అసెంబ్లీలో గళం విప్పడం వల్లే పోలవరం నిర్వాసితులకు డబ్బులు వచ్చాయని చెబుతున్న నీకు ఎంత అవగాహన ఉందో అర్థమవుతుందన్నారు. 2014–19 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరికి పునరావాస ప్యాకేజీ ఇవ్వలేదన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 5,500 పీడీఎఫ్లకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పునరావాసం కల్పించామన్నారు. కాంటూరు 41లో ఉన్న విలీన మండలాల్లో గ్రామసభలు నిర్వహించి అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ద్వారా కేంద్రానికి నిధులు కోసం పంపడం జరిగిందన్నారు. ఎన్నికల సమీపించడం, కేంద్రం డబ్బులు విడుదల చేయకపోవడం జరిగిందన్నారు. ఎన్నికల తరువాత కేంద్రం డబ్బులు విడుదల చేసిందని మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ పేర్కొన్నారు. వరదల్లో కిలో బియ్యమైనా ఇవ్వగలిగావా? నీ పదవీ కాలంలో రెండుస్లారు వరదలు వస్తే ఒక్కరికై నా కేజీ బియ్యమైన ఇవ్వగలిగావా అంటూ నిలదీశారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో అన్ని రకాలుగా ఆదుకుందని గుర్తు చేశారు. జీవో నెం. 3 కోసం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ 2020లో వైఎస్సార్ సీపీ వేసిందని, కనీస అవగాహన లేని మాటలు శిరీష మాట్లాడుతుందన్నారు. గండి పోశమ్మ తల్లి ఆలయం మునిగిపోకుండా చుట్టూ నిర్మాణానికి ప్రతిపాదించడం, దీనిలో భాగంగా కర్ణాటకలోని సంగమేశ్వర ఆలయాన్ని సందర్శించడం జరిగిందన్నారు. నాటి వైఎస్సార్ సీపీ కృషి ఫలితమే నేడు నిధులు విడుదలకు కారణమన్నారు. దిగుజారుడు వ్యాఖ్యలు మానుకో.. చింతూరు ఆసుపత్రికి జీవో రాకుండా వంద పడకల ఆసుపత్రి చేశామని చెప్పడం సిగ్గుచేటన్నారు. కూటమిలో నీ పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలన్నారు. కనీసం ఒక మండల పార్టీ అధ్యక్షుడుని కూడా పెట్టుకోలేని పరిస్ధితిలో ఉన్నావని విమర్శించారు. వ్యక్తిగత విమర్శలు చేస్తూ నీ గ్రాఫ్ పెంచుకునేందుకు దిగజారుడు వ్యాఖ్యలు సరికాదన్నారు. 12 ఏళ్ల క్రితం స్టేజిలపై రికార్డింగ్ డ్యాన్సులు చేశావని, ఇప్పటి వరకు నీ వ్యక్తిగత గురించి మాట్లాడలేదన్నారు. అంబులెన్స్ సర్వీసుకు నెలకు రూ. 3 లక్షలు ఖర్చవుతుందని చెబుతున్న నీవు వీటిని ఎలా సమకూర్చావని ప్రశ్నించారు. గౌరవవేతనం కింద ఇప్పటివరకు రూ.33 లక్షలు పొందావని, మిగతా డబ్బులు నీ భర్త భాస్కర్ ఉద్యోగాల పేరుతో మోసాలు, గంజాయి వ్యాపారం చేసి సంపాదించినవా అని ధ్వజమెత్తారు. ఒకే వర్క్ను ఇద్దరికి అమ్మిన ఘనులు నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఆమె భర్త భాస్కర్ ఒక నామినేటెడ్ వర్క్ను ఇద్దరు కాంట్రాక్టర్లకు పర్సంటేజీలకు అమ్మిన ఘనులని ఎమ్మెల్సీ అనంతబాబు విమర్శించారు. నామినేటెడ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు ఎమ్మెల్యే శిరీషదేవికి మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంతబాబు హెచ్చరిక ఆమె విమర్శలపై ఘాటుగా సమాధానం -
ప్రాణం ఉండగానే జీవశ్చవంలా!
పాడేరు ఏజెన్సీలో పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. నిషేధం ఉన్నప్పటికీ, ముఠాలు సిండికేట్గా మారి మూగజీవాలను కబేళాలకు తరలిస్తున్నాయి. జిల్లా కేంద్రానికి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుత్తులపుట్టు సంత ఈ అక్రమ దందాకు ప్రధాన కేంద్రంగా మారింది. ప్రతి గురువారం జరిగే ఈ సంతలో వ్యాపారులు తిష్టవేసి, గిరిజన రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటున్నారు. రూ. 20 వేల విలువైన పశువులను సగం ధరకే కొనుగోలు చేస్తూ గిరిజనులను మోసం చేస్తున్నారు. ఒక్కో మినీ వ్యాన్లో 10కి పైగా పశువులను అత్యంత క్రూరంగా కుక్కి, పైకి లేవకుండా కట్టేసి రవాణా చేస్తున్నారు. వాటి దుస్థితి చూసి పెంచిన రైతులు సైతం కన్నీరు పెడుతున్నారు. పాడేరు నుంచి మైదాన ప్రాంతాల వరకు అనేక చెక్పోస్టులు ఉన్నప్పటికీ, ఎక్కడా తనిఖీలు జరగకపోవడం గమనార్హం. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క రోజులోనే సుమారు రూ. 30 లక్షల విలువైన పశువుల వ్యాపారం జరుగుతోంది. ఇక్కడి నుంచి విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాల్లోని కబేళాలకు అక్రమంగా తరలిస్తున్నారు. తనిఖీలు లేని చెక్పోస్టులు, అధికారుల ఉదాసీనత కారణంగా ఏజెన్సీలో పశుసంపద కబేళాల పాలవుతోందని పశు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎస్పీ అమిత్ బర్దర్ను వివరణ కోరగా కబేళాలకు పశువుల అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై తగిన ఆదేశాలిస్తామని ఆయన పేర్కొన్నారు. – సాక్షి, పాడేరు -
మమతలు విరిసిన వేళ..
సాక్షి, పాడేరు: జిల్లా భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. గజగజ వణికించే చలిని, దట్టమైన పొగమంచును లెక్కచేయకుండా క్రైస్తవ సోదరులు భక్తిశ్రద్ధలతో క్రీస్తు జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కొండకోనల్లోని ప్రార్థనా మందిరాలు విద్యుత్ వెలుగులతో జిగేల్మన్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచే వేడుకలు మొదలయ్యాయి. ● ఏజెన్సీలోనే అత్యంత పురాతనమైన సుంకరమెట్ట చర్చితో పాటు, పాడేరులోని చారిత్రక సీబీఎం చర్చి భక్తులతో కిక్కిరిసిపోయాయి. బయట ఉష్ణోగ్రతలు పడిపోతున్నా, లోక రక్షకుని రాకను కొనియాడుతూ భక్తులు చేసిన ప్రార్థనలు ఆధ్యాత్మిక వెచ్చదనాన్ని పంచాయి. గురువారం ఉదయం పాస్టర్లు లోక కల్యాణార్థం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుక కేవలం కేక్ కటింగ్, విందులకే పరిమితం కాలేదు. పలు క్రైస్తవ కుటుంబాలు, పాస్టర్లు కలిసి పేదలకు అన్నదానం, వస్త్రదానం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టి క్రీస్తు బోధించిన ప్రేమను చాటుకున్నారు. తమ ఆనందాన్ని తోటివారితో పంచుకోవడమే నిజమైన క్రిస్మస్ అని నిరూపించారు. ● పాడేరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో భవిష్యత్ వైద్యులు పండగను వినూత్నంగా జరుపుకున్నారు. విద్యార్థులు సొంతంగా రూపొందించిన క్రిస్మస్ సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలతాదేవి విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి, వారిలో ఉత్సాహాన్ని నింపారు. చదువుతో పాటు సాటి మనుషుల పట్ల కరుణ కలిగి ఉండాలనే సందేశం అక్కడ ప్రతిధ్వనించింది. కొండ ప్రాంతాల్లో కురిసిన మంచు బిందువుల సాక్షిగా.. ఏజెన్సీ ప్రజలు శాంతి, సోదరభావంతో జరుపుకున్న ఈ క్రిస్మస్ వేడుకలు అందరిలో కొత్త ఆశలను నింపాయి. -
ఖేలో ఇండియా బాక్సింగ్ కోచ్గా కృష్ణవేణి
నర్సీపట్నం : నేషనల్ బాక్సింగ్ క్రీడాకారిణి కె.కృష్ణవేణి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఖేలో ఇండియా బాక్సింగ్ కోచ్గా ఉద్యోగం సాధించింది. బాక్సర్గా 14కు ఫైగా జాతీయస్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొంది. అంతర్జాతీయ చెస్ బాక్సింగ్లో గోల్డ్ మెడల్ సాధించింది. అలాగే 15కు పైగా రాష్ట్ర స్థాయి పోటీల్లో 10కి పైగా గోల్డ్ మెడల్స్ సాధించింది. నర్సీపట్నం ప్రభుత్వ జెడ్పీ గరల్స్ హైస్కూల్లో చదువుకుని ఆమె బాక్సింగ్ నేర్చుకుంది. తండ్రి శ్రీను కరాటే క్రీడాకారుడు కావడంతో ఆమెను బాక్సింగ్ క్రీడాకారిణిగా రాణించేందుకు ప్రోత్సహించారు. విద్యార్థి దశ నుంచి నింజాస్ అకాడమీ కోచ్ అబ్బు వద్ద బాక్సింగ్లో తర్ఫీదు పొందింది. కోచ్గా ఉద్యోగం రావడం పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అకాడమీ మెంబర్లు హర్షం వ్యక్తం చేశారు. -
● నీటి అద్దంలో.. ప్రకృతి ప్రతిబింబం
కొండల వెనుక నుంచి వచ్చే ఆ వెలుగు చారలు, నిశ్చలంగా ఉన్న నీటిపై పడి ఒక అద్భుతమైన చిత్రాన్ని గీస్తున్నాయి. ప్రకృతిలో దాగి ఉన్న అసలైన ప్రశాంతతను చూడాలంటే ఇలాంటి ప్రదేశాలకు రావాల్సిందే. పడవలు తీరానికి చేరుకున్న వేళ, ఆకాశం గులాబీ రంగును పులుముకున్న వేళ... ఈ దృశ్యం మనసులోని అలజడిని తగ్గించి, ఉత్తేజాన్ని ఇస్తుంది. బిజీ జీవితం నుంచి కాసేపు విరామం తీసుకుని, ప్రకృతితో కలిసిపోవాలనుకునే వారికి సుజనకోట పంచాయతీ కుమ్మరిపుట్టులోని మత్స్యగెడ్డ ప్రాంతం చక్కని ప్రదేశం. – ముంచంగిపుట్టు -
ఘనంగా పగల్పత్తు ఉత్సవాలు
వైభవంగా ధనుర్మాసం పూజలుసింహాచలం: సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో పగల్పత్తు ఉత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని విశేషంగా అలంకరించి బంగారుచాయ పల్లకిలో వేంజేపచేశారు. తెల్లవారుజామున ఆలయ బేడామండపంలో తిరువీధి నిర్వహించారు. షోడషోపచార పూజలు జరిపారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గోదాదేవికి ఆలయ బేడామండపంలో తిరువీధి వైభవంగా నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో 10వ పాశుర విన్నపం చేశారు. ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, అర్చకులు ఈ కార్యక్రమాలను నిర్వహించారు. -
బస్తరు బేజారు
అది అడవి తల్లి ప్రసాదించిన ఎటువంటి రసాయనాలు లేని స్వచ్ఛమైన సేంద్రియ పంట. కానీ, ఆ పంటను నమ్ముకున్న గిరిజన రైతుకు మాత్రం మిగిలేది కన్నీళ్లే. పెదబయలు ఏజెన్సీలో ప్రాణాలకుతెగించి సేకరిస్తున్న బస్తరు పిక్కల ధర అమాంతం పడిపోవడంతో గిరిజన కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ధర రూ. 300 నుంచి రూ. 80కి పడిపోవడం గిరి పుత్రుల ఆశలపై నీళ్లు చల్లింది కిలో పిక్కల ధర రూ.300 నుంచి రూ.80కు పతనంబొంగదారి గ్రామంలో సేకరించిన బస్తరు పిక్కలు వొలుస్తున్న ఓ కుటుంబంపెదబయలు: ఏజెన్సీలో గిరిజన రైతులకు నవంబర్, డిసెంబర్ మాసాలు ఆదాయాన్ని ఇచ్చే కాలం. కొండ కోనల్లో సహజసిద్ధంగా పెరిగే బస్తరు పిక్కల సేకరణే వీరి ప్రధాన వృత్తి. ఎటువంటి రసాయనాలు లేకుండా పండే ఈ సేంద్రియ పంటకు మైదాన ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఉన్నప్పటికీ, గిరి రైతుకు మాత్రం కన్నీళ్లే మిగులుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ధర అమాంతం పడిపోవడంతో గిరిజన కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. కష్టమెక్కువ.. ప్రతిఫలం తక్కువ! : బస్తరు పిక్కల సేకరణ సామాన్యమైన విషయం కాదు. నిటారుగా ఉండే కొండవాలు ప్రాంతాల్లో, ఎత్తయిన చెట్లపైకి ఎక్కి వీటిని సేకరించాలి. ఇంట్లో చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకు రోజంతా కష్టపడితే ఒక్కొక్కరు 5 నుంచి 7 కిలోల పిక్కలను మాత్రమే సేకరించి, ఒలవగలరు. ఇంత కష్టపడి మార్కెట్కు తీసుకెళ్తే, అక్కడ దళారుల దెబ్బకు రైతులు విలవిలలాడుతున్నారు. ● ధర కుప్పకూలడంతో రవాణా ఖర్చులు కూడా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల ప్రారంభంలో కిలో రూ. 300 పలికిన బస్తరు పిక్కల ధర, ప్రస్తుతం రూ. 80కు పడిపోయింది. మండల కేంద్రమైన పెదబయలు సంతలో కిలో రూ. 70 నుంచి రూ. 80 మాత్రమే ధర పలుకుతోంది. ఇక్కడ ధర లేదని ఆశతో పాడేరు వెళ్తే అక్కడ కూడా కిలో ధర రూ. 90కు మించడం లేదు. వచ్చిన ధర కాస్తా రవాణా ఖర్చులకే సరిపోతోందని, చేతికి చిల్లిగవ్వ కూడా మిగలడం లేదని రైతులు వాపోతున్నారు. ● ఇతర రాష్ట్రాల్లోనూ, మైదాన ప్రాంతాల్లోనూ ఈ బస్తరు పిక్కలకు కూరల్లో వాడకానికి విపరీతమైన గిరాకీ ఉంది. అక్కడ కిలో రూ. 300కు పైగా విక్రయిస్తున్నారు, అసలైన రైతుకు మాత్రం కనీస మద్దతు ధర దక్కడం లేదు. ప్రభుత్వం, ఐటీడీఏ జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర కల్పించకపోవడంపై గిరిజన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి సేకరించినా దక్కని ఫలితం సంతల్లో తూనికల దగ్గర జరుగుతున్న అన్యాయం ప్రభుత్వం, ఐటీడీఏ జోక్యం చేసుకొని కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ మోసాలను అరికట్టాలి గత నెలలో రూ. 300 ఉన్న ధర ఇప్పుడు రూ. 80కు పడిపోయింది. కుటుంబం అంతా కలిసి కొండల వెంబడి తిరిగినా కష్టానికి తగిన ఫలితం లేదు. సంతల్లో తూనికల్లో కూడా మోసాలు జరుగుతున్నాయి. రవాణా ఖర్చులు పోను కిలోకు రూ. 50 కూడా మిగలడం లేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలి. – కిల్లో రాంబాబు, రైతు, పందిగుంట, పెదబయలు మండలం -
మాజీ ఎమ్మెల్యే చిట్టినాయుడుకు నివాళి
సాక్షి,పాడేరు: దివంగత మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి చిట్టినాయుడు వర్ధంతిని గురువారం జిల్లా కేంద్రం పాడేరులో నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డులోని మణికంఠ కాంప్లెక్స్ వద్ద ఆయన విగ్రహానికి కుమార్తె, పాడేరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, డాక్టర్ తమర్భ నరసింగరావు దంపతులు, కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా పలు పార్టీల నేతలు తరలివచ్చారు. పేదలకు రగ్గులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తన తండ్రి చిట్టినాయుడు పాడేరుతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ఎంతో కృషి చేశారన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో బీజేపీ నాయకులు అబ్బాయిదొర, ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయ ధర్మకర్త సింహాచలం నాయుడు, అయ్యప్పస్వామి ఆలయ ధర్మకర్త సుబ్బారావు, సర్పంచ్ వెంకటరమణరాజు, గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి కుర్తాడి రామారావు, ప్రభుత్వ జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కొట్టగుళ్లి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
హైవేపై టిప్పర్ దగ్ధం
యలమంచిలి రూరల్ : షార్ట్ సర్క్యూట్తో టిప్పర్ దగ్ధమైన ఘటన యలమంచిలి మండలం పులపర్తి వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఏపీ39యూవై0459 నంబరు గల టిప్పర్ అన్నవరంలో బొగ్గు అన్లోడ్ చెసి తిరిగి విశాఖపట్నం వెళ్తుండగా పులపర్తి వద్దకు చేరుకున్న సమయంలో ఇంజన్ నుంచి పొగలు, మంటలు వస్తున్నట్టు గమనించిన డ్రైవర్ వాహనాన్ని ఆపి కిందకు దిగిపోయాడు. కొద్దిసేపటికే వాహనమంతా మంటలు వ్యాపించాయి. అగ్నికీలలు ఎగసిపడుతుండడంతో సమాచారం అందుకున్న యలమంచిలి విపత్తుల నిర్వహణ శాఖ సిబ్బంది అగ్నిమాపక శకటంతో ఘటనా స్థలానికి వెళ్లి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. హైవేపై రాకపోకలు సాగించే వాహనాలకు మంటలు వ్యాపించకుండా చేశారు. ఇంజిన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు అగ్నిమాపక కేంద్రం అధికారి రాంబాబు తెలిపారు. -
27న భీమిలిలో జాబ్ మేళా
మురళీనగర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో భీమిలి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 27న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి టి.చాముండేశ్వరరావు తెలిపారు. ఈ మేళాలో 15కు పైగా కంపెనీలు పాల్గొని 800కి పైగా ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని పేర్కొన్నారు. 10వ తరగతి నుంచి ఏదైనా డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లమా అర్హత ఉండి, ఆసక్తి గల అభ్యర్థులు https://naipunyam.ap.gov.in/లో రిజిస్ట్రేషన్ చేసుకొని అడ్మిట్ కార్డ్తో హాజరు కావాలని తెలిపారు. స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 901475 8949 ఫోన్ నంబర్ను సంప్రదించాలన్నారు. అదే రోజు భీమిలి పాలిటెక్నిక్ కళాశాల స్కిల్ హబ్లో ఐటీ సెక్టార్కి చెందిన సెక్యూరిటీ అనలిసిస్ట్ కోర్స్లో చేరడానికి ఏదైనా డిగ్రీ లేదా ఏదైనా బీటెక్ అర్హత కలిగి ఆసక్తి కలిగిన యువతీయువకులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. శిక్షణ అనంతరం వీరికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. -
వెలుగురేఖ సమైక్య
ఇద్దరు విద్యార్థులను చదివిస్తున్నా శ్రీకాకుళంలో విద్యనభ్యసించి, విశాఖపట్నంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో సత్యనారాయణ సర్ ఆర్థిక సహకారంతో బ్యాంక్ పరీక్షల్లో విజయం సాధించా. 2018లో ఐడీబీఐ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్గా ఎంపికై , ప్రస్తుతం మధురవాడ బ్రాంచ్ మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నా. నాపై చూపిన ఉదారతను స్ఫూర్తిగా తీసుకుని, ప్రస్తుతం మా ఊరిలో ఇద్దరు విద్యార్థుల పూర్తి విద్యా ఖర్చులను నేను భరిస్తున్నా. – రేగాన సింహాచలం, ఐడీబీఐ బ్యాంక్ మేనేజర్ మధురవాడ అమ్మ కష్టాన్ని చూసి ఆదుకున్నారు! ‘మాది రాజాం. మా అమ్మ ఐస్క్రీం పార్లర్లో పనిచేస్తూ మమ్మల్ని చదివించేది. సత్యనారాయణ సార్ నా ప్రతిభను గుర్తించి ఇంటర్ నుంచి సీఏ పూర్తయ్యే వరకు దాదాపు రూ.65 వేలు ఖర్చు చేసి చదివించారు. నేడు విప్రోలో చార్టెడ్ అకౌంటెంట్గా నెలకు రూ.90 వేలు సంపాదిస్తున్నా. సార్ స్ఫూర్తితో నేను కూడా ఇప్పుడు ఒక విద్యార్థిని చదివిస్తున్నా. – భవిరిశెట్టి కోటేశ్వరరావు, సీఏ, విప్రో తాటిచెట్లపాలెం: ఒక చిన్న దీపం వేల జీవితాల్లో వెలుగులు నింపగలదు. ప్రతిభ ఉండి, ఆర్థిక స్థోమత లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న పేద విద్యార్థులకు ఆసరాగా నిలుస్తోంది ’సమైక్య’ సంస్థ. విశాఖ రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో సీనియర్ డివిజనల్ ఇంజనీర్గా పనిచేస్తున్న సూరిశెట్టి సత్యనారాయణ (అనకాపల్లి జిల్లా, రాజుపేట గ్రామం) తన మిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి ఈ సేవా యజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు. ● చిన్నతనంలో తాను అనుభవించిన పేదరికం, కష్టాలే ఆయన్ని ఈ మార్గంలో నడిపించాయి. ‘చదువు ఒక్కటే తరాల తలరాతను మార్చగలదు‘ అని నమ్మే ఆయన, ఇప్పటివరకు 12 మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చారు. ఆ సంఖ్యను వందకు పెంచడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఆయన వద్ద సాయం పొందిన విద్యార్థులు ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తూ, తిరిగి మరికొంతమంది పేద విద్యార్థులను దత్తత తీసుకోవడం ఈ ’సమైక్య’ సాధించిన అసలైన విజయం. ప్రతిభావంతులకు ఆర్థిక ప్రోత్సాహం నా గత అనుభవాలు, పల్లెటూరి విద్యార్థుల కష్టాలను ప్రత్యక్షంగా చూడటం వల్లే ప్రతిభావంతులకు అండగా నిలవాలనే సంకల్పం భగవంతుడు కలిగించాడు.పేదరికం నుంచి విముక్తి , భావితరాల భవిష్యత్తును మార్చగలిగే శక్తి కేవలం విద్యకే ఉంది.ఆకలి బాధ తెలిసిన వాడికే అన్నం విలువ తెలిసినట్లు, పేద విద్యార్థులకు మనం ఇచ్చే ప్రతి రూపాయి వారి కలలకు ప్రాణం పోస్తుంది. సరైన ప్రోత్సాహం, భరోసా ఉంటే ఆ విద్యార్థులు తమ లక్ష్యాల వైపు మరింత దృఢంగా అడుగులు వేసి విజయం సాధిస్తారు. ఇదే ఆశయంతో, ప్రతిభ గల పేద విద్యార్థుల ఉన్నత చదువులకు వెన్నుముకగా నిలిచేందుకు ‘సమైక్య’ నిరంతరం కృషి చేస్తోంది. – సత్యనారాయణ, ౖరెల్వే అధికారి, విశాఖపట్నం ప్రతి అడుగులో తోడున్నారు! రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను నేడు మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఎంఈ)లో జూనియర్ ఇంజనీర్గా ఉండటానికి సత్యనారాయణ, సమైక్య టీమ్ ఇచ్చిన ప్రోత్సాహమే కారణం. పరీక్షలకు దరఖాస్తు చేయడం దగ్గర్నుంచి, ఉద్యోగంలో చేరే వరకు ప్రతి దశలో వారు నాకు మార్గనిర్దేశం చేశారు. మాలాంటి ఎంతోమంది యువతకు సమైక్య ఒక వెలుగురేఖ. –దాడి వెంకటేశ్వర స్వామి, జూనియర్ ఇంజనీర్, మిలటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ కరపత్రం నా జీవితాన్ని మార్చింది! బిటెక్ చదివే రోజుల్లో గేట్ కోచింగ్కు డబ్బుల్లేక లైబ్రరీలో చదువుకునే వాడిని. అక్కడ నోటీసు బోర్డుపై సత్యనారాయణ సార్ నంబర్ చూసి సంప్రదించా. ఆయన నన్ను కోచింగ్లో చేర్పించి, ఆర్థిక సాయంతో పాటు నిరంతరం గైడెన్స్ ఇచ్చారు. నేడు బెంగళూరులోని ఒక ప్రముఖ కంపెనీలో టెక్నికల్ డిజైనర్గా స్థిరపడ్డా. – షేక్ తాజ్ అహ్మద్, ప్యుస్ట్ గ్లోబ్ కంపెనీ పేద విద్యార్థులకు బాసట దత్తత తీసుకుని ప్రోత్సాహం రైల్వే ఉన్నతాధికారి సత్యనారాయణ ఆదర్శం కొనసాగిస్తున్న సేవాయజ్ఞం వంద మందికి ఆసరా ఇవ్వడమే లక్ష్యం -
నేటి నుంచి అమల్లోకికొత్త రైల్వే చార్జీలు
తాటిచెట్లపాలెం(విశాఖ): భారతీయ రైల్వే ప్రకటించిన సవరించిన ప్రయాణ చార్జీలు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు వాల్తేర్ డివిజన్ అధికారులు కొత్త చార్జీల వివరాలను వెల్లడించారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులపై స్వల్ప భారం పడనుండగా, నిత్యం ప్రయాణించే ఉద్యోగులు, సామాన్యులకు మాత్రం రైల్వే శాఖ ఊరటనిచ్చింది. ● సబర్బన్/సీజన్ టికెట్లకు మినహాయింపు: సబర్బన్ రైళ్లలో ప్రయాణించే వారికి, మంత్లీ సీజన్ టికెట్ కలిగిన వారికి చార్జీలలో ఎటువంటి పెంపు లేదు. ● స్వల్ప దూర ప్రయాణికులకు ఊరట: ఆర్డినరీ క్లాస్లో 215 కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారికి పాత చార్జీలే వర్తిస్తాయి. వీరిపై ఎటువంటి అదనపు భారం ఉండదు. ● ఆర్డినరీ క్లాస్: 215 కిలోమీటర్లు దాటిన ప్రయాణాలకు కిలోమీటరుకు ఒక పైసా చొప్పున పెంచారు. ● మెయిల్/ఎక్స్ప్రెస్: 215 కిలోమీటర్లు దాటిన ప్రయాణాలకు కిలోమీటరుకు 2 పైసలు చొప్పున పెంచినట్లు రైల్వే అధికారులు తెలిపారు. -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు ఆహుతి
దేవరాపల్లి : మండలంలోని ములకలాపల్లిలో ఓ ఇంటిలో గురువారం చోటుచేసుకున్న విద్యుత్ షార్టు సర్క్యూట్తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన షేక్ ఈశ్వరమ్మ ఇంటిలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు రూ. 5 లక్షల నగదు, 8 తులాల మేర బంగారు అభరణాలు, వెండి అభరణాలు, సర్ధిఫికెట్లు, ఇంటిలో ఇతర సామాగ్రి సహా అగ్నికి ఆహుతయ్యాయి. వెరసి సుమారు రూ. 25 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడంతో భారీ ఆస్తి నష్టం జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. షేక్ ఈశ్వరమ్మ కుమారుడు అప్పాసాహెబ్ ఇటీవల మెగా డీఎస్సీలో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించారు. క్రిస్మస్ సెలవు కావడంతో అప్పాసాహెబ్ బుధవారం రాత్రి ఇంటికి వచ్చాడు. అదే ఇంటిలో ఉంటున్న తన బావ, అక్క కలిసి గురువారం మాంసం దుకాణం వద్దకు వెళ్లగా, అప్పాసాహెబ్ తన పిల్లలతో కలిసి చోడవరం వెళ్లారు. దీంతో అతని తల్లి ఇంటికి తాళం వేసి పొలం పనికి వెళ్లిపోయింది. ఎవరూ లేని సమయంలో ఈశ్వరమ్మ ఇంటి నుంచి దట్టమైన పొగలు వస్తుండడాన్ని స్థానికులు గమనించి కుటుంబ సభ్యులతో పాటు చోడవరం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలు అదుపు చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బాధిత కుటుంబ సభ్యులంతా ఇంటికి చేరుకొని చూడగా అప్పటికే ఇళ్లంతా కాలి బూడిదయ్యింది. తిండిగింజలు సహా బూడిద... ఇంటి అవసరాల నిమిత్తం బ్యాంక్లో కొంత బంగారం తాకట్టు పెట్టి తెచ్చిన రూ. 2 లక్షలు, తన మేనల్లుడు రఫీ వ్యాపారం నిమిత్తం అప్పుగా తెచ్చిన మరో రూ. 2 లక్షలు, తన తల్లి దాచుకున్న రూ. లక్ష నగదు, 8 తులాల బంగారం, వెండి అభరణాలు కాలిబూడిదయ్యాయని బాధిత ఉపాధ్యాయుడు కుటుంబ సభ్యులు భోరున విలపించారు. వీటితో పాటు సర్టిఫికెట్లు, ఆధార్, రేషన్ కార్డులు, గృహోపకరణాలు సహా తిండి గింజలు ఇతర సామగ్రి పూర్తిగా కలిబూడిద కావడంతో కట్టుబట్టలతో వారంతా రోడ్డున పడ్డారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలను, ఆస్తి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి... తన కుమారుడికి ఉపాధ్యాయ ఉద్యోగం రావడంతో తన కష్టాలు గట్టెక్కాయని ఆనందపడుతున్న తరుణంలో ఇళ్లు, ఇంటిలో ఆస్తి కాలి బూడిదవ్వడంతో బాధిత షేక్ ఈశ్వరమ్మ కన్నీటి పర్యంతమయ్యింది. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడిన తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరింది. -
అనుమానమే ఉసురు తీసింది..
యలమంచిలి రూరల్ : యలమంచిలి ధర్మవరం సీపీ పేటలో భార్యను హత్య చేసిన కేసులో భర్తను గురువారం అరెస్ట్ చేసినట్టు యలమంచిలి సీఐ ధనుంజయరావు చెప్పారు. యలమంచిలి పట్టణ పోలీస్ స్టేషన్లో గురువారం రాత్రి మీడియా సమావేశంలో ఆయన వివరాలు చెప్పారు. ఆయన మాటల్లోనే..ఉత్తరప్రదేశ్ కబీర్నగర్ జిల్లా నందాపూర్ గ్రామానికి చెందిన రాకేష్(27), మాయ(32) పదేళ్ల కితం ప్రేమవివాహం చేసుకున్నారు. జీవనోపాధి నిమిత్తం పరవాడ,యలమంచిలి ప్రాంతాల్లో నివసించేవారు.ఇటీవల రెండు నెలల క్రితం యలమంచిలిలో సొంతంగా తుక్కు దుకాణం అద్దెకు తీసుకున్నారు. భార్యాభర్తలతో పాటు 4 నెలల చిన్నారి పరితో కలిసి పట్టణంలో ధర్మవరంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. భార్య తరచూ ఎవరో వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతున్నట్టు గమనించిన రాకేష్,ఆమెకు ఒకరితో వివాహేతర సంబంధం ఉన్నట్టు అనుమానపడ్డాడు.ఈ విషయమై పలుమార్లు ఆమెను మందలించాడు. నెలరోజులుగా భార్యాభర్తల మధ్య ఈ విషయంపై గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం కుమార్తె పరికి డైపర్లు అవసరమై కొని తెచ్చేందుకు తుక్కు దుకాణంలో భార్యను ఉంచి బయటకు వెళ్లాడు రాకేష్. పని పూర్తి చేసుకుని తిరిగి దుకాణం వద్దకు వచ్చేసరికి భార్య ఫోన్లో ఎవరితోనో మాట్లాడడం పసిగట్టి ఆమెను నిలదీశాడు. ఆమె ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో కోపంతో రగిలిపోయిన రాకేష్ నియంత్రణ కోల్పోయి ఆమెను గోడకు గుద్దించి, విచక్షణారహితంగా కొట్టాడు. ఆమె ప్రతిఘటించడంతో మరింత కోపంతో అక్కడున్న స్క్రూడ్రైవర్తో ఛాతీ పై పలుమార్లు పొడిచి గాయపర్చాడు. తీవ్రంగా గాయపడిన మాయ స్పృహ కోల్పోవడంతో తుక్కు దుకాణం యజమాని సాయంతో తొలుత స్థానిక కమలా ఆస్పత్రికి, అక్కడ్నుంచి యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే మాయ మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించడంతో నిందితుడు రాకేష్ జరిగిన విషయం చెప్పి పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడు స్వయంగా నేరం అంగీకరించినట్టు సీఐ తెలిపారు. మృతురాలు ఎవరితో మాట్లాడుతుందనేది నిందితుడికి కూడా తెలియదని చెబుతున్నాడని, కాల్ డేటా, ఇతర సాంకేతిక ఆధారాలతో తెలుసుకోవాల్సి ఉందన్నారు. తల్లి మృతి చెందడం, తండ్రి జైలుకు వెళ్లడంతో 4 నెలల చిన్నారిని తాత్కాలికంగా జిల్లా పిల్లల సంరక్షణ కమిటీకి అప్పగించామన్నారు.మృతురాలి బంధువులు ఉత్తరప్రదేశ్ నుంచి రావాల్సి ఉందని,వారొచ్చేవరకు మాయ మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి శవాగారంలో భధ్రపరిచామన్నారు.వీఆర్వో పిల్లి మారేశ్వర్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని,నిందితుడ్ని కోర్టులో ప్రవేశపెట్టి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. -
●భక్తులతో కిక్కిరిసిన సింహగిరి
సింహగిరి గురువారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి సాయత్రం వరకు అధిక సంఖ్యలో భక్తులు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. దర్శన క్యూలు, మాడ వీధులు, ప్రసాద విక్రయశాల, కేశఖండనశాల, ఆర్టీసీ బస్సులు, దేవస్థానం బస్సులు, అన్నప్రసాద భవనం ఎక్కడ చూసినా జనమేజనం. అధిక సంఖ్యలో ద్విచక్రవాహనాలు, కార్లు సింహగిరికి రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. లోవతోట, సింహగిరి బస్టాండ్ ఏరియా, పీఆర్వో కార్యాలయం, గజపతిసత్రం, హిల్టాప్ రోడ్డులో వాహనాల పార్కింగ్ చేసినా ట్రాఫిక్ సమస్య తీరలేదు. – సింహాచలం -
వేంకటాద్రిపై ధనుర్మాస వైభవం
పెందుర్తి: ‘మేము రాకముందే నోము నోచి దాని ఫలముగ సుఖానుభవము పొందిన తల్లీ! తలుపు తెరవకపోయిన పోదువుగాక, మాటనైనా పలుకవా! పరిమళములతో నిండిన తులసిమాలలు అలంకరించుకొనిన కిరీటముగల నారాయణుడు, ఏమీలేని మావంటివారం మంగళము పాడిననూ ‘పఱ’అను పురుషార్థమును ఒసంగెడి పుణ్యమూర్తి, ఒకనాడు కుంభకర్ణుని మృత్యువు నోటిలో పడత్రోయగా, ఆ కుంభకర్ణుడు నిద్రలో నీచే ఓడింపబడి తన సొత్తగు ఈ గాఢనిద్రను నీకు ఒసంగినాడా! ఇంత అధికమగు నిద్రమత్తు వదలని ఓ తల్లీ! మాకందరకు శిరోభూషణమైనదానా! నిద్ర నుంచి లేచి మైకము వదిలించుకొని, తేరుకుని వచ్చి తలుపు తెరువుము. నీ నోరు తెరచి మాటాడుము. ఆవరణము తొలగించి నీ దర్శనమునిమ్ము’అంటూ గోదాదేవి సన్నిధిలో 10వ పాశుర పఠనాన్ని అర్చకులు తాత్పర్య సహితంగా విన్నవించారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా స్థానిక వేంకటాద్రి క్షేత్రంలో కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో 10వ రోజు విశేష పూజలు జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకుడు మహర్తి రామానుజాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారిని మేల్కొలిపి హారతి ఇచ్చి సేవాకాలం జరిపారు. శాత్తుమురై, తిరుప్పావై పఠనం చేశారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ద్వారా ప్రవచనకర్త కలగ మురళీకృష్ణశర్మ ప్రవచనం వినిపించారు. ఈవో నీలిమ ఏర్పాట్లు పర్యవేక్షించారు. పూజల్లో పాల్గొన్న అశేష భక్త జనానికి ప్రసాద వితరణ చేశారు. -
'రబ్బరు' విప్లవం
మన్యం కొండల్లో ప్రకృతి ప్రసాదించిన చల్లని వాతావరణం ఇప్పుడు గిరిజన రైతుల పాలిట వరంగా మారుతోంది. మారేడుమిల్లి ప్రాంతం రబ్బరు సాగుకు అనుకూలంగా ఉన్నందున ఇక్కడ ఆధారిత పరిశ్రమ ఏర్పాటుకు రంపచోడవరం ఐటీడీఏ కసరత్తు మొదలుపెట్టింది. మూడు దశాబ్దాల క్రితం చిన్నగా మొదలైన ఈ రబ్బరు సాగు ప్రస్థానం, ఇప్పుడు వేల ఎకరాలకు విస్తరించడమే కాకుండా.. స్థానికంగానే వస్తువుల తయారీ పరిశ్రమ ఏర్పడే స్థాయికి చేరింది. రూ. 5 కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమతో గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదపడనుంది. రంపచోడవరం: అల్లూరి జిల్లాలో సముద్ర మట్టానికి ఎత్తులో ఉండి, చల్లని వాతావరణం కలిగిన మారేడుమిల్లి ప్రాంతం రబ్బరు సాగుకు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. ఇక్కడి వాతావరణ పరిస్థితులు రబ్బరు ఉత్పత్తికి అనుకూలంగా ఉండటంతో, గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధిని కాంక్షిస్తూ ఐటీడీఏ అధికారులు ఈ ప్రాంతంలో రబ్బరు పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 1994లో మొదలైన ప్రస్థానం.. రబ్బరు బోర్డు పర్యవేక్షణలో 1994లోనే ఇక్కడ సాగుకు పునాదులు పడ్డాయి. ఐటీడీఏ – రబ్బరు బోర్డు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టాయి. బ్లాక్ ప్లాంటేషన్–1: దేవరపల్లి గ్రామంలో 1994లో 50 హెక్టార్లలో తొలిసారిగా రబ్బరు మొక్కలు నాటారు. బ్లాక్ ప్లాంటేషన్–2 : పుజారిపాకలు, వేటుకూరు గ్రామాల్లో 1998 – 2003 మధ్య 35 మంది రైతులకు చెందిన 45 హెక్టార్లలో సాగు చేపట్టారు. బ్లాక్ ప్లాంటేషన్–3 : పందిరిమామిడి కోటలో 2009–2013 మధ్య వంద హెక్టార్లలో మొక్కలు నాటారు. మొక్కలు నాటిన మూడేళ్ల వరకు రైతులకు సాంకేతిక సహకారం అందించగా, ఆ తర్వాత రెండేళ్లకు పాల ఉత్పత్తి ప్రారంభమై రైతులకు ఆదాయం మొదలైంది. ఐటీడీఏ సహకారంతో విస్తరిస్తున్న సాగు గతంలో సాంకేతిక లోపాలతో కొన్ని మొక్కలు దెబ్బతిన్నప్పటికీ, ప్రస్తుతం గిరిజనులు ఈ సాగుపై మక్కువ చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఐటీడీఏ భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది: » రంపచోడవరం, మారేడుమిల్లి, వై.రామవరం (అప్పర్ పార్ట్) పరిధిలో 3 వేల ఎకరాల్లో సాగుకు ప్రణాళిక సిద్ధమైంది. ఈ ఏడాది వెయ్యి ఎకరాల్లో మొక్కలు నాటేందుకు రైతులను సిద్ధం చేస్తోంది. » మిగిలిన రెండేళ్లలో మరో 2వేల ఎకరాల్లో సాగు విస్తరించనున్నారు. ఈ ప్రాంతంలో రబ్బరు బోర్డు ద్వారా 2024లో 370 ఎకరాలు, 2025లో 501 ఎకరాల్లో సాగు చేపట్టారు.» ఎకరానికి 450 కిలోల వరకు రబ్బరు షీట్లు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రస్తుతం కిలో ధర రూ. 170 వరకు ఉంది రూ. 5 కోట్లతో పరిశ్రమ మారేడుమిల్లిలో పండుతున్న రబ్బరుకు స్థానికంగానే విలువల జోడింపునకు రూ. 5 కోట్ల వ్యయంతో వస్తువుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రూ. 2.50 కోట్ల నిధులు విడుదలయ్యాయి. స్థల సేకరణ ప్రక్రియ పూర్తయింది. రబ్బరు బోర్డు నుంచి డీపీఆర్ అనుమతి వచ్చిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ పరిశ్రమ అందుబాటులోకి వస్తే స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, రబ్బరు సాగుచేసే రైతులకు గిట్టుబాటు ధర లభించనుంది. ఏడాదికి రూ.8 లక్షల ఆదాయం పందిరిమామిడి కోటలో ఆరు ఎకరాల్లో 1200 రబ్బరు మొక్కలు ఉన్నాయి. ఏడాదికి రూ. 8లక్షలు వరకు ఆదాయం వస్తుంది. రబ్బరు పాల సేకరణ కోసం గ్రామంలో కొంత మందికి ఉపాధి కూడా కలి్పస్తున్నా. రబ్బరు సాగుకు మరింత ప్రోత్సాహం ఇస్తే ఇంకా రైతులు సాగు చేసేందుకు అవకాశం ఉంటుంది. – కత్తుల సోమిరెడ్డి, పందిరిమామిడి కోట స్మోక్ రూమ్లకు ప్రతిపాదనలు రబ్బరు సాగు చేసే రైతుల సంఖ్య పెరగడంతో రబ్బరు షీట్ల తయారీకి స్మోక్ రూమ్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. ఇప్పటికే ఐదు స్మోక్ రూమ్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేశారు. మూడు వేల ఎకరాల్లో రబ్బరు మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. – దేవనందం, పీహెచ్వో, రంపచోడవరంఆదాయం పెరుగుతుంది రబ్బరు ఆధారిత పరిశ్రమ ఏర్పాటుతో సాగు రైతులకు ఆదాయం పెరుగుతుంది. రబ్బరు ఆధారిత పరిశ్రమలో రైతులను భాగస్వాములను చేస్తే బాగుంటుంది. ఈ దిశగా రంపచోడవరం ఐటీడీఏ, రబ్బరు బోర్డు అధికారులు చర్యలు చేపట్టాలి. – కత్తుల రామిరెడ్డి, వేటుకూరు, మారేడుమిల్లి మండలంఆన్లైన్లో మార్కెటింగ్ రబ్బరు సాగు తొలుత దేవరపల్లిలో ప్రారంభమైంది. ఉత్పత్తి చేసిన రబ్బరును ఆన్లైన్ మార్కెట్లో ధరల వివరాలు తెలుసుకుని అమ్ముకుంటున్నాం. ఎటువంటి మోసాలకు అవకాశం లేదు. రబ్బరు బోర్డు, ఐటీడీఏ సహకారంతో మెరుగైన ఆదాయం పొందగలుగుతున్నాం. – పల్లాల సూర్యవతి, దేవరపల్లి -
నిర్వాసితులకు న్యాయం చేయాలి
చింతూరు: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించడంతో పాటు పునరావాసం కల్పించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ జాతీయ అధ్యక్షుడు దాట్ల నాగేశ్వరరావు అన్నారు. చింతూరులో ఏర్పాటుచేసిన పరిషత్ డివిజన్ కార్యాలయాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు పేరుతో ఆదివాసీలను ముంచుతున్న ప్రభుత్వాలు సరైన పరిహారం చెల్లించకుండా వారిని ఇక్కడి నుండి తరలించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. పూర్తిస్థాయిలో పరిహారం అందించిన అనంతరమే వారికి పునరావాస కేంద్రాలకు తరలించాలని, కాలనీల్లో అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి చిన్నవీరభద్రం, నాయకులు వీరయ్య, శంకురమ్మ, అంజిరెడ్డి, లక్ష్మణరావు, నాగేశ్వరరావు, రాఘవయ్య, ప్రసాద్, ముత్తయ్య, కొండయ్య పాల్గొన్నారు. -
గెలుపు ఓటములు సహజం
● డీఈవో రామకృష్ణారావు పాడేరు రూరల్: క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని డీఈవో రామకృష్ణారావు అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఈనెల 23 నుంచి ఉపాధ్యాయులకు నిర్వహించిన త్రోబాల్, క్రికెట్ పోటీలు విజయవంతంగా నిర్వహించామన్నారు. ఈ పోటీల్లో మహిళల త్రోబాల్ విభాగంలో రంపచోడవరం విన్నర్, పాడేరు డివిజన్ రన్నర్గా నిలిచారన్నారు. పురుషుల క్రికెట్ విభాగంలో విన్నర్గా పాడేరు డివిజన్, రన్నర్గా రంపచోడవరం డివిజన్ కై వసం చేసుకున్నాయన్నారు. ఎస్జీఎఫ్ జిల్లా క్రీడా కార్యదర్శి పాంగి సూరిబాబు, సీడీలు సత్యవతి, కొండబాబు, భూపతిరాజు,మహేష్బాబు పాల్గొన్నారు. -
ప్రేమ, కరుణ, ఆనందం వెల్లివిరియాలి
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అరకులోయటౌన్: అరకులోయ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం బుధవారం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని క్రైస్తవులు పవిత్రంగా జరుపుకునే క్రిస్మస్ పండుగ ప్రతీ ఒక్కరి జీవితాల్లో ప్రేమ, కరుణ, శాంతి, ఐక్యత, విలువలు వెల్లివిరియాలని ఎమ్మెల్యే కోరారు. ప్రేమ, త్యాగం, కరుణకు ప్రతీక క్రిస్మస్ వేడుక అన్నారు. క్రైస్తవ కుటుంబాల్లో ఆనందం, ఆరోగ్యం, సమృద్ధిని నింపాలని ఎమ్మెల్యే మత్స్యలింగం ఆకాంక్షించారు. -
మంచుతో సతమతం
రాజవొమ్మంగి: దాదాపు వారం రోజులుగా మండల వ్యాప్తంగా కురుస్తున్న మంచు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. రాజవొమ్మంగిలో ఉదయం 10 గంటల వరకు దట్టంగా అలముకొంటున్న మంచు వాతావరణానికి శీతల గాలులు తోడు కావడంతో ప్రజానీకం వణికి పోతున్నారు. రాత్రిళ్లు గ్రామాల్లో, అటవీప్రాంతానికి దగ్గరగా ఉండే జనావాసాల్లో ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోదవుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి చలిగాలులు వీస్తున్నాయి. ఉదయం 10 గంటల వరకు మంచు దట్టంగా కురుస్తోంది. చిన్నారులు, వృద్ధులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. విపరీతంగా మంచు కురుస్తుండడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించ వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. హెడ్లైట్ల వెలుతురులో రాకపోకలు సాగిస్తున్నారు. చలిమంటతో ఉపశమనం పొందుతున్నారు. -
రూ.కోట్లు గుల్ల.. నాణ్యత డొల్ల
రెండు నియోజకవర్గాలనే కాక రెండు జిల్లాలను కలిపే ముఖ్యమైన రహదారి అది.. రూ.24 కోట్ల ఆర్అండ్బీ నిధులతో అడ్డురోడ్డు నుంచి రామచంద్రపురం వరకు నిర్మిస్తున్నారు. అంత వ్యయం చేస్తున్న రోడ్డు నిర్మాణంలో ఏమాత్రం నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని పనులు జరిగే తీరు గమనిస్తున్న ప్రజలు పెదవి విరుస్తున్నారు. కూటమి పార్టీలకు ఇష్టుడైన కాంట్రాక్టర్కు అప్పచెప్పడం వల్లే నిధులు దుర్వినియోగమవుతున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నక్కపల్లి/ఎస్.రాయవరం: అడ్డురోడు– నర్సీపట్నం ఆర్అండ్బీ మార్గంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతాలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పనుల ప్రారంభంలోనే డొల్లతనం బయటపడుతోంది. సుమారు 13 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్డు ఎంతో ముఖ్యమైనది. పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాలను కలిపే రహదారి మాత్రమే కాక ఈ మార్గం అల్లూరి సీతారామరాజు జిల్లాకు కూడా దారి తీస్తుంది. ప్రతి రోజు వేలాదిమంది ఈ రోడ్డుపై ప్రయాణిస్తారు. ఈ రోడ్డు నిర్మాణానికి ఎనిమిది నెలల ముందు శంకుస్థాపన చేసినప్పటికీ పనులు మాత్రం ఇటీవలే ప్రారంభమయ్యాయి. రూ.24 కోట్ల ఆర్ అండ్ బీ నిధులతో నిర్మించే ఈ రోడ్డు పనుల కాంట్రాక్ట్ దక్కించుకున్న వ్యక్తి కూటమి పార్టీలకు బాగా కావాల్సిన వాడు కావడంతో పనులు ఇష్టారాజ్యంగా సాగుతున్నా పట్టించుకోవడం లేదు. అడిగే నాథులేరి? : రూ.24 కోట్లు ఖర్చు పెట్టి నిర్మిస్తున్న రోడ్డు నాలుగు కాలాల పాటు మన్నాలంటే నాణ్యత పాటించాలి. క్రషర్ నుంచి తెచ్చిన నల్లపిక్కను నీటితో పూర్తిగా శుభ్రం చేయాలి. పాతరోడ్డుపై ఉన్న చెత్తను మట్టిని పూర్తిగా శుభ్రం చేసి దానిపై నల్లపిక్క, బూడిద, లైట్గా తారు కలిపి రోడ్డుపై తడుపుతూ బాగా రోలింగ్ చేయాలి. మరోసారి రోలింగ్ చేసి తదుపరి తారు రోడ్డు నిర్మించాల్సి ఉంటుంది. బెర్మ్ల వద్ద కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నల్లపిక్క, బూడిద తారు కలిపి పటిష్టంగా రోలింగ్ చేయాలి. బెర్మ్లు పటిష్టంగా లేకపోతే రోడ్డు కోతకు గురై క్రమేపీ మొత్తం పాడయిపోతుంది. గతంలో అయితే నల్లపిక్కలో బంకమన్ను కలిపి రోడ్డుపై వేసి బాగా రోలింగ్ చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. అలా ఎవరూ చేయడం లేదు. పాత రోడ్డును అలాగే వదిలేసి దానిపై బూడిద కలిపిన పిక్కను వేసి తూతూమంత్రంగా రోలింగ్ చేస్తున్నారు. రోలింగ్ సమయంలో నీటితో తడపాలి. కానీ ఎక్కడ నీటితో తడిపిన దాఖలాలు కనిపించడం లేదు. వేసిన పిక్క వేస్తున్నట్లుగానే పైకి లేచిపోతోంది. నీటితో తడిపి రోలింగ్ చేసిన తర్వాత తారురోడ్డు వేస్తే నాణ్యంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఇలా వేయడం వల్ల తారు రోడ్డు పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు జరిగే చోట ఇంజినీరింగ్ సిబ్బంది కనిపించడం లేదు. పర్యవేక్షణ లేకపోవడం వల్ల రోడ్డు పనులు నాణ్యతాలోపంతో జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి రోజూ వందలాది వాహనాలు వెళ్లే మార్గం అడ్డురోడ్డు నుంచి నర్సీపట్నం వరకు ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. మైదాన ప్రాంతం నుంచి ఏజెన్సీకి ముఖద్వారమైన అడ్డురోడ్డు నుంచి నిత్యం వేలాది మంది వందలాది వాహనాల్లో నర్సీపట్నం రాకపోకలు సాగిస్తుంటారు. అంత ముఖ్యమైన రోడ్డయినా అధికారులు, కూటమి ప్రజాప్రతినిధులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే మాదిరిగా గునిపూడి నుంచి పెంటకోట వెళ్లు రోడ్డు వేయడం వల్ల అది నెల రోజులకే పెచ్చులు ఊడిపోయిందని ప్రజలు గుర్తు చేస్తున్నారు. నిధులు మంజూరు చేయించి చేతులు దులుపేసుకుంటే సరిపోదని, నిబంధనలు, నాణ్యత పాటిస్తున్నారో లేదో హోం మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
కట్టుకున్నవాడే కాలయముడు
యలమంచిలి రూరల్: ఒక ఊరూ.. ఒక జిల్లా కాదు..రాష్ట్రాల సరిహద్దు దాటి, తాళికట్టిన బంధాన్ని కాదని, నమ్మినవాడి వెంట వచ్చేసింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఉపాధి కోసం ఉత్తరప్రదేశ్ నుంచి 8 ఏళ్ల కిందట అనకాపల్లి జిల్లా యలమంచిలికి వచ్చారు. తానే సర్వస్వమని నమ్మిన ఇల్లాలి ఊపిరిని అనుమాన భూతంతో లాగేశాడు. తమ ఇద్దరికి పుట్టిన నాలుగు నెలల ఆడబిడ్డ మొహం కూడా చూడకుండా, అతి కిరాతంగా భార్యను కడతేర్చాడు. యలమంచిలి పట్టణం ధర్మవరం సీపీ పేటలో బుధవారం జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు,స్థానికులు తెలిపిన వివరాలివి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంత కబీర్ నగర్ జిల్లా నందలూరు గ్రామానికి చెందిన రాకేష్, మాయ దంపతులు 8 ఏళ్ల కిందట యలమంచిలి పట్టణానికి ఉపాధి కోసం వలస వచ్చారు.అంతకుముందే మాయకు వివామైంది. తన మొదటి భర్త ద్వారా 12 ఏళ్లు వయస్సున్న కాజల్ అనే కుమార్తె కూడా వుంది. కుమార్తె పుట్టిన తరువాత ఆమెకు ఉత్తరప్రదేశ్కు చెందిన రాకేశ్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. రాకేశ్ మాయను వివాహం చేసుకుని 8 ఏళ్ల కిందట ఉపాధి కోసం యలమంచిలి పట్టణానికి వచ్చారు. రాకేశ్, మాయ దంపతులు యలమంచిలిలో కాపురం వుంటూ ధర్మవరం సీపీ పేటలో ఒక తుక్కు (స్క్రాప్) దుకాణాన్ని లీజుకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇటీవల రాకేష్, మాయ దంపతులకు ఆడబిడ్డ జన్మించింది. ప్రస్తుతం ఆ చిన్నారికి నాలుగు నెలలు. గత కొంతకాలంగా భార్య మాయ తమ సొంతూరుకు చెందిన ఒక యువకుడితో ఫోన్ ద్వారా తరచూ మాట్లాడుతున్నట్టు రాకేష్ అనుమానం పెంచుకున్నాడు. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో బయటకు వెళ్లొచ్చిన రాకేష్ తన భార్య ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుండడం గమనించి ఆవేశంతో ఊగిపోయాడు. ఇద్దరి మధ్య మాటా, మాటా పెరిగింది. ఈ సమయంలో నియంత్రణ కోల్పోయిన రాకేష్, ఆవేశంలో అతి కర్కశకంగా ప్రవర్తించాడు. ఆమెను విచక్షణారహితంగా కొట్టి, అక్కడున్న స్క్రూ డ్రైవర్తో ఛాతికి, మెడకు మధ్య భాగాన పొడిచేశాడని పోలీసులు చెప్పారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను ఆటోలో స్థానిక కమలా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు అక్కడ ఆక్సిజన్ సదుపాయం లేకపోవడంతో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. యలమంచిలి సీహెచ్సీకి తీసుకెళ్లగా, అప్పటికే చనిపోయినట్టు ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. ఉత్తర ప్రదేశ్ నుంచి వారు వచ్చే వరకూ మృతదేహం పాడవ్వకుండా అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చినట్టు సీఐ ధనుంజయరావు చెప్పారు. తన భార్యను తానే హత్య చేశానని రాకేష్ అంగీకరించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వీఆర్వో పిల్లి మారేశ్వర్రావు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య ఘటనలో నాలుగు నెలల చిన్నారి అనాథగా మారింది. స్థానిక మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది పాపను సాయంత్రం వరకు సంరక్షించారు. పోలీసులు పసిబిడ్డను అనకాపల్లి ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్కు ఆ పాపను అప్పగించారు. -
అప్పన్న సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి మానవేంద్రనాథ్రాయ్
జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్కి అప్పన్న చిత్రపటం అందజేస్తున్న ఏఈవో శ్రీచరణికి అప్పన్న ప్రసాదం అందిస్తున్న ఏఇవో, కప్పస్తంభానికి మొక్కుకుంటున్న శ్రీచరణి సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని బుధవారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్.మానవేంద్రనాథ్రాయ్ దర్శించుకున్నారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో ఆయన పేరిట అర్చకులు అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వామి చిత్రపటం, ప్రసాదం, శేషవస్త్రం ఏఈవో తిరుమలేశ్వరరావు అందజేశారు. క్రికెటర్ శ్రీచరణి కూడా.. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి దర్శించుకున్నారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో ఆమె పేరిట అర్చకులు అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. -
గిరి నర్తనం.. మురిసిన విశాఖ జనం
మహారాణిపేట: పీసా మహోత్సవ్ సందర్భంగా విశాఖపట్నం పోర్టు స్టేడియంలో జరిగిన రెండు రోజుల కార్యక్రమాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి. ఉదయం నుంచి వివిధ రాష్ట్రాల గిరిజన సంప్రదాయ సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతుల్ని ఎంతగానో అలరించాయి. ఒక్కో రాష్ట్రానికి ప్రత్యేకమైన గిరిజన సంప్రదాయ నృత్య, సంగీతాలతో హోరెత్తించారు. చాలా ప్రదర్శనలకు ప్రేక్షకులు సైతం పదం కలిపారు. అనంతరం కళాకారులతో అధికారులు బృంద చిత్రా లు దిగి, జ్ఞాపికలు అందించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రన్, కబడ్డీ, ఆర్చరీ పోటీల విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. పీసా చట్టంపై అవగాహన పెంచేందుకే.. షెడ్యూల్డ్ ఏరియాస్లో పీసా చట్టం అమలుపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తున్న పీసా మహోత్సవ్ కార్యక్రమాలు విశాఖపట్నం పోర్టు స్టేడియంలో ఘనంగా జరిగాయి. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయమంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘెల్ వీడియో సందేశం ద్వారా గిరిజన హక్కుల కోసం రాజ్యాంగ మద్ధతును తెలిపారు. పీసా పోర్టల్ను ప్రారంభించారు. కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్, జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్, ఏపీ పంచాయతీరాజ్ –గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ, ఏపీ ఎస్ఈఆర్డీ కమిషనర్ రేవు ముత్యాలరాజు, ఎకనామిక్ అడ్వైజర్ విజయకుమార్ బెహరా, విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అడవి తల్లి బాట కింద చేపట్టిన అభివృద్ధి పనుల ఎగ్జిబిషన్ను తిలకించారు. అరకు కాఫీ, ఇతర ఉత్పత్తులతో కూడిన కిట్ను పంచాయతీరాజ్ సెక్రటరీ వివేక్ భరద్వాజ్కు జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్ కల్పనాకుమారి అందించారు.


