Alluri Sitarama Raju
-
జీసీసీ డివిజనల్ మేనేజర్గా వెంకటేశ్వర్లు
చింతపల్లి: స్థానిక గిరిజన సహకార సంస్థ డివిజన్ మేనేజర్గా బుక్కా వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. పాడేరులో సీనియర్ అసిస్టెంట్ క్యాడర్లో బ్రాంచ్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ,డివిజన్ మేనేజర్గా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు.ఆయనకు డివిజన్ జీసీసీ అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి, స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జీసీసీ సేవలను ఆదివాసీలకు అందుబాటులోకి తీసుకురావడంతో పాటు సంస్థ పురోభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జీసీసీ కొయ్యూరు మేనేజర్ ఎస్.విజయకుమార్, అకౌంటెంట్ గసాడి మల్లేశ్వరరావు, గ్యాస్ అకౌంటెంట్ రమణమూర్తి,పెట్రోల్ బంక్ సూపరింటెండెంట్ రామకృష్ణ తదతరులు పాల్గొన్నారు. చింతపల్లిలో ఇప్పటి వరకూ డీఎంగా విధులు నిర్వహించిన పి.దేవరాజ్కు చింతూరు బదిలీ అయింది. -
కొనసాగుతున్న సీహెచ్వోల దీక్షలు
పాడేరు : తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం పాడేరు ఐటీడీఏ ఎదుట కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ చేపడుతున్న రిలే దీక్షలు సోమవారంతో 22వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దీక్ష శిబిరం నుంచి సినిమాహాల్ సెంటర్ మీదుగా పాత బస్టాండ్ వరకు సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆరేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి రెగ్యులర్ చేయాలని, ఈపీఎఫ్ను పునరుద్ధరించాలని, క్లీనిక్ల అద్దె బకాయిలు చెల్లించాలని ఎఫ్ఆర్ఎస్ నుండి సీహెచ్ఓలకు మినహాయింపు ఇవ్వాలని, ఇంక్రిమెంట్స్, ట్రాన్స్ఫర్, ఎక్స్గ్రేషియా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏపీఎంసీఏ జిల్లా అద్యక్షురాలు దుర్గాభవాని మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోరుతూ విధులను బహిష్కరించి 22రోజుల పాటు రిలే దీక్షలు, వివిధ రకాలుగా శాంతియుత ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమన్నారు. ఈనెల 20న జరిగే కేబినెట్ సమావేశంలో తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఏపీఎంసీఏ జిల్లా కార్యదర్శి పవన్ కళ్యాణ్, నాయకులు వి.రాము, ఎం. హరిణి మౌనిక, కె. బాలకృష్ణ, సుశీల, తదితరులు పాల్గొన్నారు. -
ఈపీడీసీఎల్ సీఎండీ పేరుతో ఫేక్ వాట్సాప్!
సాక్షి, విశాఖపట్నం: ‘నేను ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఫృథ్వీతేజ్ ఇమ్మడి. మీ విద్యుత్ కనెక్షన్ల విషయంలో గందరగోళం ఉంది. కాబట్టి.. మీపై యాక్షన్ తీసుకుంటాను..’ అంటూ ఓ ఫేక్ నంబర్తో కొందరు వినియోగదారులకు వాట్సాప్ల్లో మెసేజ్లు వెళ్లాయి. మరికొందరికి తొలుత హాయ్.. అని మెసేజ్పెట్టిన తర్వాత రిప్లయ్ ఇస్తుంటే.. అర్జెంట్గా లక్ష రూపాయిలు కావాలంటూ మెసేజ్లు చేస్తున్నారు. వాట్సాప్ డిస్ప్లే పిక్చర్(డీపీ)లో సీఎండీ ఫృథ్వీతేజ్ ఇమ్మడి ఫొటో ఉండటంతో.. కొందరు అధికారులకు అనుమానం వచ్చి స్వయంగా సీఎండీకి కాల్ చేసి చెప్పారు. వెంటనే ఆయన అప్రమత్తమయ్యారు. 9702068556 అనే నంబర్ నుంచి పలువురికి వాట్సాప్ ద్వారా మెసేజ్లు చేస్తున్నట్లు గుర్తించారు. ఇది స్పామ్ నంబర్ అనీ.. ఈ నంబర్తో వచ్చే మెసేజ్లకు ఎవరూ స్పందించొద్దంటూ సీఎండీ ఫృథ్వీతేజ్ అందరికీ విజ్ఞప్తి చేశారు. తన పేరుతో మెసేజ్లు చేస్తున్న సైబర్ నేరగాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సీఎండీ తెలిపారు. -
2వ ఆప్షన్పై నిర్వాసితుల అభ్యంతరం
కూనవరం: పోలవరం నిర్వాసితుల అభిప్రాయ సేకరణకు రెవెన్యూ అధికారులు సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ఆర్అండ్ఆర్ అవగాన సమావేశం అర్ధంతరంగా ముగిసింది. నిర్వాసితుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఇచ్చిన అఫిడవిట్లో 2వ ఆప్షన్పై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇంటినిర్మాణ వ్యయం కేవలం రూ.2,85,000 గా నిర్ణయించడాన్ని వారు వ్యతిరేకించారు. ఈ సొమ్ముతో ఇంటి నిర్మాణం సాధ్యం కాదన్నారు. ఈవిషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లి న్యాయం చేయాలని కోరతామని తెలిపారు. గిరిజనుల మాదిరిగానే తమ కూడా ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని గిరిజనేతరులు కోరారు. లేదా ఇంటి నిర్మాణ వ్యయాన్ని రూ.ఐదు లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈవిషయంపై చింతూరు ఐటీడీఏ పీవోను కలిసి తమ సమస్యను తెలిపిన తరువాతే అఫిడివిట్లో సంతకాలు చేస్తామని, అప్పటి వరకు సంతకాలు చేసేదిలేదని స్పష్టం చేశారు. అంతేగాక తమకు కేటాయించనున్న పునరావాస కాలనీ స్థలాలను స్వయంగా చూడాలని, అప్పుడే తమ అభిప్రాయం వెల్లడిస్తామని నిర్వాసితులు తెలిపారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ కె.శ్రీనివాసరావు, వీఆర్వో వెంకన్న, సర్పంచ్ మల్లంపల్లి హేమంత్, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
సమ్మెతో చావో రేవో తేల్చుకుందాం..
ఉక్కునగరం: స్టీల్ప్లాంట్ యాజమాన్యం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మంగళవారం జరగనున్న సమ్మెతో చావో రేవో తేల్చుకుందామని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్సేన్ పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం స్మృత్యంజలి పార్కు వద్ద జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేటీకరణ నుంచి కాపాడుకోవడం కార్మికుల జీవన్మరణ సమస్యగా ఉందన్నారు. ప్లాంట్ ఉద్యమం ఒంటరి కాదని దీనికి దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలు మద్దతు ఇస్తున్నాయన్నారు. కార్మికవర్గం మరింత ఐక్యంగా ప్రభుత్వ, యాజమాన్యాల నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా మరింత పోరాటాలు చేయాల్సి ఉందన్నారు. స్టీల్ ఇంటక్ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం, యాజమాన్యం నిర్భందాలకు వ్యతిరేకంగా జరిగే సమ్మె విజయవంతం చేయాలన్నారు. స్టీల్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ మాట్లాడుతూ యాజమాన్యం అనుసరిస్తున్న నిర్లక్ష్య విధానాలకు స్వస్తి పలకాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు, కార్పొరేటర్ గంగారావు, జిల్లా సీఐటీయూ నాయకులు జగ్గునాయుడు, ఆర్.ఎస్.వి.కుమార్, కె.ఎం.శ్రీనివాస్, నాయకులు వై.టి.దాస్, గణపతిరెడ్డి, కె.ఎస్.ఎన్.రావు, కె.సత్యనారాయణ, నమ్మి రమణ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్సేన్ నేడు స్టీల్ప్లాంట్ పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె -
స్పెషల్ డీఎస్సీతోనే పోస్టులు భర్తీ చేయాలి
అరకులోయటౌన్: ఆదివాసీలకు నూరుశాతం రిజర్వేషన్ తీర్మానం చేసి, ఏజెన్సీలో స్పెషల్ డీఎస్సీ ప్రకటించి, ఉపాధ్యాయుల పోస్టులన్నీ గిరిజన అభ్యర్థులచే భర్తీ చేసేలా బిల్లు ప్రకటించాలని స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ జిల్లా కో–కన్వీనర్ పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని గిరిజన సంఘం భవనంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 19న రైల్రోకోకు కమిటీ పిలుపు నివ్వడంతో ప్రభుత్వం స్పందించి కలెక్టర్ దినేష్ కుమార్, ఇన్చార్జి పీవో అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్లతో చర్చించి, ప్రభుత్వం నివేదిక కోరిందన్నారు. త్వరలో జరగనున్న రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ నుంచి షెడ్యూల్ ఏరియా ఆదివాసీ ఉపాధ్యాయ పోస్టులను మినహాయించి, స్పెషల్ డీఎస్సీ ద్వారా భర్తీ చేసే విధంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలకు ఇచ్చిన హామి నెరవేర్చడంలో కాలయాపన చేయకుండా కీలక ప్రకటన చేయాలని, లేని పక్షంలో ఆదివాసీలు పోరాటానికి సన్నద్ధమవుతామని హెచ్చరించారు. నేతలు మోహన్, జాన్బాబు, అశోక్, జగన్నాథం, నానిబాబు పాల్గొన్నారు. రంపచోడవరం: గిరిజన అభ్యర్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివాసీ జెఏసీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు కంగాల శ్రీనివాస్ అధ్యక్షత వహించిన రిలే దీక్షకు మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు తృప్తి జోగారావు మద్దతులు తెలుపుతూ మాట్లాడారు. గిరిజన సలహా మండలి ఏర్పాటు షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాలకు నియమాకాల చట్టం ప్రకటించాలని జీవో నంబర్–3కి చట్ట బద్దత కల్పిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమలు చేయాలన్నారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ట్రైకార్ రుణాలు మంజూరు చేయాలని, షెడ్యూల్ ప్రాంత ఆదివాసీల సంక్షేమం కోసం కృషి ఎమ్మెల్యేల అందర్ని గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. స్పందనలో ఆదివాసీ నాయకులు ఐటీడీఏ పీవోను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. పెదగెద్దాడ సర్పంచ్ వడగల ప్రసాద్బాబు, పోడియం పండుదొర, చవలం శుభకృష్ణదొర, పండా పవన్కుమార్దొర, మడకం వరప్రసాద్, రాంబాబు, తెల్లం శేఖర్ పాల్గొన్నారు. చింతూరు: షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టాన్ని ప్రకటించడంతో పాటు ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ఆదివాసీ జేఏసీ మండల కార్యదర్శి కాక సీతారామయ్య డిమాండ్ చేసారు. ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక ఐటీడీఏ ఎదుట నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల్లో భాగంగా సోమవారం ఆయన మాట్లాడుతూ మెగా డీఎస్సీ నుంచి ఏజెన్సీ ఆదివాసీ పోస్టులను మినహాయించి ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. జీవో నెం–3కు చట్టబధ్థత కల్పించాలని, వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను స్థానిక ఆదివాసీలతోనే భర్తీచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఐటీడీఏల ద్వారా ఆదివాసీ నిరుద్యోగ యువతకు ట్రైకార్ రుణాలు మంజూరు చేయాలని, ఆదివాసీ చట్టాలు, హక్కులను పకడ్బందీగా అమలు చేయాలని, జీవో నెం3పై స్పష్టమైన హామీ వచ్చేవరకు నిరాహార దీక్షలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ డివిజన్ ఛైర్మన్ జల్లి నరేష్, ఆత్రం ఉదయ్, మడకం లక్ష్మణ్, మడివి శైలు, భవానీ, రాధ, సంగీత, లక్ష్మీదేవి, గౌతమి , తరుణ్, పవన్ పాల్గొన్నారు. స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ, ఆదివాసీ జేఏసీ నాయకుల డిమాండ్ రిలే దీక్షలకు వివిధ సంఘాల మద్దతు -
దశాబ్దాల కల.. నెరవేరుతున్న వేళ
ముమ్మరంగా సర్వే.. సీలేరు నుంచి దారకొండ సబ్ స్టేషన్కు రిజర్వ్ ఫారెస్ట్ ద్వారా 33 కేవీ లైన్ వేసేందుకు ట్రాన్స్కో సీఎండీ రూ.4 కోట్లు మంజూరు చేశారు. దీంతో డిఫరెన్షియల్ జియోలాజికల్ పొజిషన్ సిస్టమ్ (డీజీపీఎస్) ద్వారా సర్వే చేసున్నారు. తొమ్మిది కిలోమీటర్ల అటవీ మార్గం గుండా విద్యుత్ లైన్లను వేసి అంతరాయం లేకుండా గిరిజన గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు సర్వే జరుపుతున్నారు. అటవీ శాఖ నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని ట్రాన్స్కో ఏఈఈ కె.ఎస్. రాంబాబు తెలిపారు. ● గిరి గ్రామాలకు తీరనున్న విద్యుత్ సమస్య ● సీలేరు నుంచి దారకొండకు విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు ● రిజర్వ్ ఫారెస్టులో డీజీపీఎస్ సర్వే ● రూ.4 కోట్లు విడుదల చేసిన ట్రాన్స్కో సీఎండీ ● హర్షం వ్యక్తం చేస్తున్న గిరిజనులు సీలేరు: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు వందల గ్రామాల అడవిబిడ్డల ఏళ్ల నాటి కల ఫలించనుంది. సీలేరు జల విద్యుత్ కేంద్రం నుంచి ఆ గ్రామాలకు విద్యుత్ సరఫరా చేయనుండడంతో వారి కష్టాలు తీరనున్నాయి. దుప్పులవాడ,దారకొండ,గుమ్మిరేవుల,అమ్మవారిదారకొండ తదితర పంచాయతీల పరిధిలో సుమారు 500 గ్రామాల గిరిజనులు ఏక తాటిపైకి వచ్చి సీలేరు జలవిద్యుత్ కేంద్రం నుంచి కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 40 ఏళ్లుగా ధర్నాలు, బంద్లు, వంటావార్పులతో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సీలేరు నుంచి విద్యుత్ సరఫరా చేస్తామని ట్రాన్స్కో ప్రకటించింది.దీంతో ఆయా గ్రామ గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇలా.. సీలేరు జలవిద్యుత్ కేంఽద్రంలో ఉత్పత్తి అయిన విద్యుత్ 220 కేవీ లైన్ల ద్వారా గాజువాక సబ్స్టేషన్కు వెళ్లి అక్కడనుంచి నర్సీపట్నం, చింతపల్లి, గూడెం మీదుగా దారకొండ సబ్స్టేషన్కు చేరుకుని అక్కడనుంచి గిరిజన గ్రామాలకు సరఫరా అవుతోంది. ఈ క్రమంలో చిన్నపాటి గాలులు వీచినా.. వర్షాలు పడినా విద్యుత్ లైన్లపై చెట్ల కొమ్మలు పడి సరఫరా నిలిచిపోతోంది. విద్యుత్ సరఫరా ఎప్పుడు వస్తుందో తెలియక చీకట్లోనే మగ్గిపోవలసి వస్తోంది. ఈ బాధలు భరించలేక ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనలు చేపట్టారు. సీలేరు విద్యుత్ కేంద్రం పక్కనే ఉన్న తమ గ్రామాలకు సీలేరు నుంచి విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేశారు. వారి పోరాటం ఇన్నాళ్లకు ఫలిస్తోంది. ఎంసీఆర్ని పేల్చివేసి... సీలేరు జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి అయిన విద్యుత్ను ఇక్కడ గిరిజనులకు ఇవ్వకుండా వారి ఇళ్లపై నుంచి లైన్ల ద్వారా మైదాన ప్రాంతాలకు, కంపెనీలకు తరలిస్తున్నారని, ఇది తగదని, తక్షణమే ఈ ప్రాంత గిరిజన గ్రామాలకు సీలేరు నుంచి విద్యుత్ సరఫరా చేయాలని గతంలో మావోయిస్టులు డిమాండ్ చేశారు. స్పందించనందుకు నిరసనగా 2007 సంవత్సరం డిసెంబరు 24న సీలేరు జల విద్యుత్ కేంద్రంలో ఎంసీఆర్ని మావోయిస్టులు పేల్చివేశారు. అప్పుడు కొన్ని గ్రామాలకు విద్యుత్ను సరఫరా ఇచ్చి అధికారులు చేతులు దులుపుకొన్నారు. గత ఏడాది ఇదే విషయంపై ఈ ప్రాంత నాయకులు ధర్నాకు సిద్ధమవుతుండడంతో అప్పటి కలెక్టరు సుమిత్కుమార్ వారితో చర్చలు జరిపి ట్రాన్స్కో సీఎండీకి విషయాన్ని తెలియజేశారు.దీంతో గిరిజన గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు ప్రారంభించారు. మా కోరిక నెరవేరుతోంది సీలేరు ప్రాజెక్టు నుంచి విద్యుత్ సరఫరాచేయాలన్న డిమాండ్ ఇన్నాళ్లకు నెరవేరుతోంది. చిన్నపాటి గాలివీచినా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో చీకట్లో మగ్గిపోతున్నాం. దారకొండ సబ్స్టేషన్ నుంచి గ్రామాలకు నేరుగా నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉంది. దీంతో విద్యుత్ కష్టాలు తీరుతాయి. – రాజు, సర్పంచ్, దారకొండ త్వరలోనే ప్రారంభిస్తాం సీలేరు నుంచి దారకొండకు 33 కేవీ లైను ద్వారా విద్యుత్ సరఫరా చేసేందుకు అనుమతులు వచ్చాయి. ప్రస్తుతం సర్వే జరుగుతోంది.అటవీ శాఖ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. –కె.ఎస్.రాంబాబు, ఏఈఈ, చింతపల్లి -
జైల్లో పటిష్ట రక్షణ చర్యలు
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. ఖైదీల కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాల సంఖ్యను పెంచుతున్నట్లు జైలు సూపరింటెండెంట్ ఎం.మహేష్బాబు తెలిపారు. గతంలో 9 సీసీ కెమెరాలు ఉండగా, ప్రస్తుతం అదనంగా 32 కెమెరాలు ఏర్పాటు చేయడంతో 41 కెమెరాలు పనిచేస్తున్నాయి. జైలు విస్తీర్ణం దృష్ట్యా మరో 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న కెమెరాల ఫుటేజీలను నిరంతరం పరిశీలిస్తూ ఖైదీల ప్రవర్తనను గమనిస్తున్నామని, ఇటీవల ఒక ఖైదీ షేవింగ్ కిట్ దాచడం సీసీ కెమెరాల ద్వారా గుర్తించి స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు. జైలులో పూర్తిస్థాయి రక్షణ చర్యలు ఏర్పాటు చేస్తామని సూపరింటెండెంట్ పేర్కొన్నారు. -
పెంటకోట తీరంలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు
పాయకరావుపేట: పెంటకోట తీరంలో సోమవారం సాయంత్రం సముద్ర స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వచ్చి ఇలా గల్లంతు కావడంతో పట్టణంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఎస్ఐ జె.పురుషోత్తం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాయకరావుపేట పట్టణం పాత హరిజనవాడకు చెందిన గంపల తరీష్(17) ఐటీఐ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈయన స్నేహితుడు రాజవొమ్మంగి(కాకినాడ జిల్లా)కి చెందిన పిల్లి అభిలాష్(19) హైదరాబాద్లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇద్దరూ పట్టణంలోని బంధువుల ఇంట్లో సోమవారం జరిగిన శుభకార్యానికి హాజరయ్యారు. అనంతరం సాయంత్రం 5 గంటల సమయంలో పెంటకోట సముద్ర తీరానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. స్నానం చేస్తుండగా అభిలాష్ సముద్రంలో మునిగిపోతుండగా.. తరీష్ గమనించాడు. స్నేహితుడిని రక్షించే ప్రయత్నంలో తరీష్ కూడా గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న మైరెన్ పోలీసులు, స్థానిక పోలీసులు, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి అయినా విద్యార్థుల ఆచూకీ తెలియరాలేదు. మంగళవారం ఉదయం మళ్లీ గాలింపు చేపడతామని ఎస్ఐ తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ దళాలతో కూడా గాలింపు చర్యలు చేపడతామన్నారు. ఇద్దరు విద్యార్ధులు శుభకార్యానికి వచ్చి, సరదాగా సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతు అవ్వడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
స్టీల్ప్లాంట్ సమ్మెకు వైఎస్సార్ సీపీ మద్దతు
పెదగంట్యాడ: అఖిల పక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 20న చేపట్టనున్న స్టీల్ప్లాంట్ పర్మినెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు వైఎస్సార్ సీపీ మద్దతు ఉంటుందని మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తెలిపారు. స్థానిక బీసీ రోడ్డులోని టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎన్నో పోరాటాలు, ఎంతో మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న స్టీల్ప్లాంట్ను ప్రైవేటుపరం కాకుండా అడ్డుకుంటామన్నారు. నిర్వాసితుల నుంచి 26 వేల ఎకరాల భూమిని తీసుకుని కేవలం 16,500 మందికి ఆర్ కార్డులు ఇచ్చి అందులో కేవలం 8 వేల మందికి ఉపాధి కల్పించారని గుర్తు చేశారు. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే వరకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కూటమి నాయకులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరిపి స్టీల్ప్లాంట్ను ప్రైవేటుపరం కాకుండా కాపాడాలని కోరారు. నిర్వాసిత కాంట్రాక్ట్ కార్మికులను విధుల నుంచి తొలగిస్తున్నారు.. ఉద్యోగులను వీఆర్ఎస్ పేరుతో ఇంటికి పంపేస్తున్నారని.. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి, నాయకులు మార్టుపూడి పరదేశి, పల్లా చినతల్లి, ధర్మాల శ్రీను, కోమటి శ్రీనివాసరావు, మంత్రి శంకర్నారాయణ, బొడ్డ గోవింద్, సిరట్ల శ్రీనివాస్ గౌడ్, చిత్రాడ వెంకటరమణ, మద్దాల అప్పారావు, డీవీ రమణారెడ్డి, లోకనాథం తదితరులు పాల్గొన్నారు. -
మహానాడు సాక్షిగా బయటపడిన వర్గ విభేదాలు
పాడేరు : అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన పాడేరులో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి మహానాడు సాక్షిగా పార్టీలో నెలకొన్న వర్గవిభేదాలు మరోసారి బయటపడ్డాయి. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ముఖ్య నాయకులు, పలువురు కార్యకర్తలు గైర్హాజయ్యారు. మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకురాలు మత్స్యరాస మణికుమారి, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ వంజంగి కాంతమ్మ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ కిల్లు రమేష్నాయుడు, రాష్ట్ర కార్యదర్శి, పాడేరు సర్పంచ్ సోదరుడు కొట్టగుళ్లి సుబ్బారావు తదితర నాయకులు ముఖం చాటేశారు. నాయకుల మధ్య విభేదాలు ఇలాగే కొనసాగితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పరిస్థితి ఏమిటని కార్యకర్తలు మాట్లాడుకోవడం కనిపించింది. ఆ పార్టీ సీనియర్ నాయకులు చల్లంగి లక్ష్మణరావు, బొర్రా నాగరాజు మాట్లాడుతూ పార్టీ కోసం పని చేసిన తమలాంటి నాయకులకు నామినేటేడ్ పోస్టుల భర్తీలో తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఈ విషయంపై పార్టీ అధిష్టానం దృష్టి సారించాలని కోరారు. ముఖ్య అతిథిగా హాజరైన మహానాడు పరిశీలకులు హర్షవర్ధన్ మాట్లాడుతూ పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ఉండాలన్నారు. పనిచేయని అధికారులు, ఉద్యోగులను కార్యకర్తలు గట్టిగా నిలదీయాలని తెలిపారు. అనంతరం జీవో నంబర్ 3 పునరుద్ధరణతో పాటు పలు తీర్మానాలు చేశారు. మహానాడు ఆ పార్టీ కేడర్లో ఏ మాత్రం జోష్ నింపలేదు. కార్యక్రమాలను తూతూ మంత్రంగా ముగించారు. ముఖం చాటేసిన నియోజకవర్గ ముఖ్య నేతలు తూతూమంత్రంగా ముగిసిన కార్యక్రమాలు పార్టీ నేతల మధ్య సమన్వయం లేదని కార్యకర్తల అసంతృప్తి -
గ్రామాల్లో రహదారులు నిర్మించండి
రంపచోడవరం: రంపచోడవరం మండలం గుంజుగూడెం గ్రామంలోని రహదారులు, కల్వర్టులు నిర్మించాలని, ఆర్అండ్బీ రోడ్డు నుంచి తమ గ్రామం వరకు 200 మీటర్లు సీసీ రోడ్డు నిర్మించాలని మడిచర్ల సర్పంచ్ చిలకల విజయశాంతి, సత్యనారాయణ, కడబాల నూకయ్యలు ఐటీడీఏ స్పందన కార్యక్రమంలో పీవోకు అర్జీలు అందజేశారు. రంపచోడవరం ఐటీడీఏ సమావేశపు హాలులో సోమవారం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. మారేడుమిల్లి మండలం పుల్లంగి పంచాయతీ పరిధిలో కొండపోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని గిరిజనులు కోరారు. పట్టాలు లేకపోవడం వలన అటవీ శాఖ వారు పోడు వ్యవసాయం చేసుకొనివ్వడం లేదని సర్పంచ్ జార్జ్బాబు, అందాల మంగిరెడ్డి, సోమిరెడ్డిలు పీవోకు అర్జీ అందజేశారు. పుల్లంగి, గుండ్రాతి గ్రామాల్లో సెల్ టవర్ ఏర్పాటు చేయాలని కోరారు. అద్దరివలస నుంచి పుల్లంగి వరకు రోడ్డు నిర్మించాలని కోరారు. రాజవొమ్మంగి మండలం డి.మల్లవరం నుండి కిండ్రా వరకు కిలోమీటరన్నర రోడ్డు పనులు ప్రారంభించి మధ్యలో నిలిపి వేశారని , పనులు ప్రారంభించాలని ప్రవీణ్కుమార్, అచ్చిరాజు తదితరులు కోరారు. అడ్డతీగల మండలం అనిగేరు గ్రామంలో రేషన్ కార్డు, పోడు పట్టా మంజూరు చేయాలని రెడ్డి రాజ్యలక్ష్మి, మడక నాగేశ్వరరావు అర్జీ అందజేశారు. చెరుకుంపాలెం పంచాయతీలో సంజీవ్నగర్ గంగలమ్మ గుడి నిర్మాణానికి అటవీ అభ్యంతరాలు తొలగించాలని మడకం సత్యనారాయణ, చేప లక్ష్మి, కడబాల వెంటకలక్ష్మి గిరిజనులు కోరారు. ఈ వారం స్పందనకు 42 అర్జీలు అందినట్లు పీవో కట్టా సింహాచలం తెలిపారు. ఏపీవో జనరల్ డీఎన్వీ రమణ, డీడీ రుక్మాండయ్య, సీడీపీవో సంధ్యారాణి, ఎంపీడీవో శ్రీనివాసదొర, తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ స్పందనలో రోడ్డు నిర్మాణాలపై వెల్లువెత్తిన అర్జీలు -
కారుచీకట్లో సేవలు.. రోగుల వెతలు
● జిల్లా ఆస్పత్రిలో అందుబాటులో లేని జనరేటర్లు ● సెల్ఫోన్ లైట్ల వెలుతురులో చికిత్సలు ● పట్టించుకోని అధికారులుపాడేరు : జిల్లా వాసులకే కాకుండా ఒడిశా సరిహద్దు గ్రామాల ప్రజలకు పెద్ద దిక్కుగా ఉన్న పాడేరు జిల్లా ఆస్పత్రిలో సమస్యలు వెంటాడుతున్నాయి. జిల్లా ఆస్పత్రిలో కరెంట్ పోతే కారు చీకట్లు కమ్ముకుంటున్నాయి. జిల్లా ఆస్పత్రిలో ప్రతి రోజు సుమారు 500 మందికి పైగా ఓపీకి రోగులు వస్తుంటారు. మరో 200 మంది ఇన్పేషేంట్ రోగులుగా వైద్య చికిత్సలు పొందుతుంటారు. దీంతో జిల్లా ఆస్పత్రి ప్రతిరోజు నిత్యం రద్దీగా ఉంటోంది. ఇంతా రద్దీగా ఉండే ఆస్పత్రిలో విద్యుత్ సమస్య ఎదురవుతోంది. ఏజెన్సీలో స్థానిక వాతవరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రతిరోజు ఈదురుగాలులు, వర్షం పడుతూ ఉంటోంది. ఈ సమయంలో విద్యుత్ నిలిచిపోతుంది. జిల్లా ఆస్పత్రిలో జనరేటర్లు ఉన్నా అవి పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. దీంతో చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఒక్కోక్కసారి గంటకు పైగా ఆస్పత్రిలో క్యాజువల్టీ మినహా అన్ని విభాగాల్లో చీకట్లు అలముకుంటున్నాయి. ఆ సమయాల్లో రోగుల కష్టాలు వర్ణనాతీతం. తప్పనిసరి పరిస్థితుల్లో రోగుల బందువుల సెల్ఫోన్ల వెలుతురులోనే వైద్య సేవలు కల్పించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. వార్డుల్లో రోగులు బంధువులు కొవ్వత్తులు తెచ్చుకొని వెలిగించే పరిస్థితులు ఉన్నాయి. అత్యవసరమైన ఆపరేషన్ థియేటర్లో కూడా చీకట్లు కమ్ముకుంటున్నాయి. విద్యుత్ సరఫరా వల్ల నీటి సరఫరా నిలిచిపోతుంది. నిత్యం రోగులు అవస్థలు పడుతున్నాజిల్లా ఆస్పత్రి యంత్రాంగం కనీసం పట్టించుకోవడం లేదని రోగులు, బంధువులు ఆరోపిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలి
చింతపల్లి: జాతీయ రహదారిలో ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలని స్థానిక ఏఎస్పీ నవ జ్యోతిమిశ్రా అన్నారు. ఆయన సోమవారం జాతీ య రహదారి నిర్మాణ ఇంజినీరింగ్ అధికారులు, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారిలో తప్పని సరిగా ప్రమాద ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు, సోలార్ బ్లింకింగ్ లైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ వినోద్బాబు,జాతీయ రహదారి ఏఈఈ తిలక్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏజెన్సీలో వాహనచోదకులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లే అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. దీంతో ఎక్కువ మంది మరణిస్తున్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. ప్రధానంగా ఆటోలు, జీపులతో పాటు సర్వీసు వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, మితిమీరిన వేగంతో ప్రయాణించడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించడంతో పాటు అన్ని రికార్డులను కలిగి ఉండాలని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా -
అంతర్రాష్ట్ర రోడ్డుకు పోలీస్శాఖ మరమ్మతులు
గూడెంకొత్తవీధి: ఆర్అండ్బీ అధికారులు పట్టించుకోకపోయినా ప్రయాణికుల అవస్థలు గమనించిన పోలీసు శాఖ పాడైన రహదారికి మరమ్మతులు చేసేందుకు ముందుకు వచ్చింది. చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా ఆధ్వర్యంలో పోలీసులు అంతర్రాష్ట్ర రహదారిలో ఆర్వీ నగర్ నుంచి లంకపాకల వరకు పలు చోట్ల పెద్ద పెద్ద గోతులను పూడుస్తున్నారు. రోడ్డు మరమ్మతు పనులను ఏఎస్పీ సోమవారం పరిశీలించారు. త్వరితగతిన పనులను పూర్తి చేయించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట గూడెం సీఐ వరప్రసాద్, ఎస్ఐ అప్పలసూరి ఉన్నారు. పనులను పరిశీలించిన చింతపల్లి ఏఎస్పీ -
విస్తృతంగా వాహన తనిఖీలు
వై.రామవరం: మండలంలోని లోతట్టు, సరిహద్దు ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారుల్లో సోమవారం సీఐ బి.నరసింహమూర్తి ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలున్నాయన్న సమాచారం, మరోపక్క ఒడిశా సరిహద్దు ప్రాంతం నుంచి గంజాయి రవాణా అవుతోందన్న సమాచారం మేరకు స్థానిక ఎస్ఐ బి.రామకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. రికార్డులు సక్రమంగా లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు,అపరిచితులపై నిఘా ఉంచారు. ఈ తనిఖీల్లో సీఆర్పీఎఫ్ పోలీసులు,స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. -
పెళ్లికి వెళుతూ ఇద్దరు యువకుల దుర్మరణం
పెదబయలు : స్నేహితుడి పెళ్లికి ద్విచక్ర వాహనంపై వేగంగా వెళుతూ చెట్టును ఢీకొట్టి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు మృత్యువాత పడిన ఘటన మండలంలో జరిగింది. స్థానిక ఎస్ఐ కె.రమణ, బంధువులు అందించిన వివరాల ప్రకారం పెదబయలు మండలం సీతగుంట పంచాయతీ రోగుల గ్రామానికి చెందిన బొండా మనోజ్కుమార్ (21), ఇదే పంచాయతీ రోగులపేట గ్రామానికి చెందిన జర్సింగి కార్తీక్ (28) వరుసకు బావ,బావ మరుదులు. సోమవారం ముంచంగిపుట్టు మండలం ముక్కిపుట్టు గ్రామంలో స్నేహితుడి పెళ్లికి బైక్పై వెళుతూ పెదబయలు మండలం అడుగులపుట్టు పంచాయతీ కొత్తాపుట్టు వద్ద రెయ్యలగెడ్డ వంతెన సమీపంలో మలుపు వద్ద రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొన్నారు. ఈ దుర్ఘటనలో బొండా మనోజ్కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, కొనఊపిరితో ఉన్న జర్సింగి కార్తీక్ను ముంచంగిపుట్టు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మనోజ్కుమార్ డిగ్రీ వరకు చదువుకుని గ్రామంలో ఖాళీగా ఉండగా, జర్సింగి కార్తీక్ పెదబయలు మండల పర్రెడ గ్రామ సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. మనోజ్కుమార్కు తల్లి చనిపోయింది, తండ్రి మాత్రమే ఉన్నారు. కార్తీక్ తండ్రి పోలీసు శాఖలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించిన కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కలచివేశాయి. రోగుల, రోగులపేట గ్రామాల్లో విషాదం రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందడంతో రెండు గ్రామాలో విషాదం అలుముకుంది. మృతదేహాలను ముంచంగిపుట్టు ఏరియా ఆస్పత్రిలో ఉంచారు. మంగళవారం పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించనున్నట్టు ఎస్ఐ తెలిపారు. మలుపు వద్ద వేగంగా వెళ్లడం వల్ల ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులను సీతగుంట, పర్రెడ గ్రామ పంచాయతీ సర్పంచ్ పలాసి మాధవరావు, పర్రెడ గ్రామ సచివాలయ సిబ్బంది పరామర్శించారు. కొత్తాపుట్టు గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం బైక్ చెట్టును ఢీకొని అక్కడికక్కడే ఒకరు మృతి మృతులిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు -
రోగులపట్ల నిర్లక్ష్యం వహిస్తే క్రిమినల్ కేసులు
పాడేరు : స్థానిక జిల్లా ఆస్పత్రి నుంచి కేజీహెచ్కు, మైదాన ప్రాంతంలోని ఇతర ఆస్పత్రులకు రోగులను రిఫరల్ చేయడంలోను, వారిని ఆస్పత్రులకు తరలించడంలో నిర్లక్ష్యం వహించి, వారి మరణానికి కారణమైతే వైద్యులు, అంబులెన్స్ డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ దినేష్కుమార్ హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీవో అభిషేక్ గౌడ, డీఎంహెచ్వో డాక్టర్ జమల్బాషాతో కలిసి ఆయన సోమవారం జిల్లా ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి సమావేశ మందిరంలో వైద్యులు, వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగుల మరణాలు తగ్గించేలా, రిఫరల్ కేసులు తగ్గే విధంగా వైద్యులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రోగి పూర్తి డేటాను అందుబాటులో ఉంచాలని సూచించారు. రోగి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. కేస్ షీట్లో రోగి వివరాలు, చికిత్స వివరాలు సమగ్రంగా పొందుపర్చాలని తెలిపారు. ప్రతి 15రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడకు సూచించారు. ఆస్పత్రిలో మరమ్మతులకు గురైన అంబులెన్స్లను బాగు చేయించి, తక్షణం అందుబాటులో ఉంచాలన్నారు. డీఎంహెచ్వో, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ఆస్పత్రి సూపరింటెండెంట్ సమన్వయంతో పని చేయాలన్నారు. మాతాశిశు విభాగం సందర్శన ఆస్పత్రిలోని మాతాశిశు విభాగాన్ని కలెక్టర్ దినేష్కుమార్ సందర్శించారు. చిన్న పిల్లల వార్డులో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వార్డులో మలేరియా జ్వరంతో బాధపడుతున్న చిన్నారి సూకూరు మహాలక్ష్మికి రక్తం తక్కువగా ఉన్నప్పటికీ వైద్య సిబ్బంది పట్టించుకోవడం లేదని తండ్రి బాబురావు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. తక్షణమే అవసరమైన రక్తం ఎక్కించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ జమల్బాషా, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలత, జిల్లా ఆస్పత్రి సూపరింటెండ్ డాక్టర్ విశ్వమిత్ర, డిప్యూటీ సూపరింటెండెంట్, గైనికాలజిస్ట్ హెడ్, ప్రొఫెసర్ డాక్టర్ టి.నర్శింగరావు, ఆర్ఎంవో డాక్టర్ వెంకట్, జనరల్ మెడిసిన్ హెడ్ ప్రొఫెసర్ సురేష్, రెడ్క్రాస్ సొసైటీ ప్రతినిధి పల్టాసింగి సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ దినేష్కుమార్ -
‘108’ నిర్లక్ష్యంతో మానసిక దివ్యాంగుడు మృతి
జి.మాడుగుల: 108 కాల్ సెంటర్ సిబ్బంది నిర్లక్ష్యంతో మండలంలో లువ్వాసింగి పంచాయతీ కేంద్రానికి చెందిన సూరిబాబు(55) అనే దివ్యాంగుడు మృతి చెందినట్టు గ్రామస్తులు, బంధువులు ఆరోపించారు. వివరాలు ఇలా ఉన్నాయి. సూరిబాబు మానసిక దివ్యాంగుడు. మరొకరి సాయం లేనిదే ఏ పనీ చేయలేడు. ప్రభుత్వం అందజేస్తున్న పింఛన్పై ఆధారపడి జీవిస్తున్నాడు. శనివారం ఉదయం నుంచి సూరిబాబు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో ఆయన అల్లుడు ఆదినారాయణ 108 వాహనానికి 10.30 గంటలకు ఫోన్ చేశారు. వాహనం అందుబాటులో లేదని, ప్రైవేటు వాహనంలో ఆస్పత్రికి తరలించాలని కాల్సెంటర్ సిబ్బంది సమాధానం చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సూరిబాబును ప్రైవేట్ వాహనంలో ఆస్పత్రికి తరలించే అవకాశం లేకపోవడంతో సాయంత్రం 4.30గంటల వరకు 108వాహనం కోసం వేచి చూశారు. ప్రయోజనం లేకపోవడంతో మరోకసారి 108వాహనానికి ఫోన్ చేశారు. అయితే ఆ సమయంలో సూరిబాబు మృతిచెందాడని ఆయన అల్లుడు ఆదినారాయణ తెలిపారు. మృతి చెందిన సమాచారానికి 108 సిబ్బందికి తెలియజేయడంతో అప్పుడు స్పందించి సమీపంలో గల ఆస్పత్రి నుంచి అంబులెన్స్ను పంపించారని ఆయన చెప్పారు. సూరిబాబు మృతికి 108 కాల్ సెంటర్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. సకాలంలో వాహనం పంపి ఉంటే సూరిబాబు బతికేవాడని వారు తెలిపారు.సాయంత్రం వరకూ నిరీక్షించినాఅంబులెన్స్ రాలేదని బంధువుల ఆరోపణ -
డ్రాఫ్ట్ ఆర్అండ్ఆర్ కోసం ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి
ఆర్అండ్ఆర్ అధికారి అపూర్వభరత్ చింతూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్రాధాన్యతా క్రమంలో చేర్చిన 32 గ్రామాల్లో నిర్వాసితుల జాబితాలకు సంబంధించి గ్రామసభలు పూర్తయ్యాయని తదుపరి డ్రాఫ్ట్ ఆర్అండ్ఆర్ నిమిత్తం ప్రతిఒక్కరూ తగిన ధ్రువీకరణపత్రాలు సమర్పించాలని ఆర్అండ్ఆర్ అధికారి, ఐటీడీఏ పీవో అపూర్వభరత్ తెలిపారు. శనివారం రాత్రి స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఆయన చింతూరుకు చెందిన పీడీఎఫ్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ పరిహారంతో పాటు పునరావాసం కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. పునరావాసంలో భాగంగా గిరిజనులకు రంపచోడవరం డివిజన్లో, గిరిజనేతరులకు ఏలూరు జిల్లా తాడ్వాయి, తూర్పు గోదావరి జిల్లా గోకవరం ప్రాంతాల్లో కాలనీల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. గిరిజనేతరులకు సంబంధించి ఎవరైనా పునరావాస ప్రాంతంలో ఇల్లు, స్థలం వద్దనుకుంటే వారికి వన్టైం సెటిల్మెంట్ కింద ప్రభుత్వం సూచించిన నగదు అందచేస్తామని, ఇల్లు నిర్మించుకోలేని వారికి ఇళ్లను నిర్మించి ఇస్తామని పీవో తెలిపారు. దీనికి సంబంధించి గిరిజనేతర నిర్వాసితుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు త్వరలోనే సర్వే చేపడతామన్నారు. సర్వేలో వెలిబుచ్చిన అభిప్రాయాల ఆధారంగా వారికి పునరావాసం కల్పిస్తామని ఆయన తెలిపారు. పెండింగ్లో ఉన్న, జాబితాలో లేని నిర్వాసితులకు సంబంధించి ధ్రువీకరణపత్రాలు అందజేస్తే వాటిని పరిశీలించి తదుపరి గ్రామసభ నాటికి వారిని అర్హుల జాబితాలో చేర్చడం జరుగుతుందని పీవో తెలిపారు. -
స్థానికులకు ఉద్యోగాలివ్వడం లేదు...
భూములు, ఇల్లు కోల్పోయిన నిర్వాసితులకు, స్థానికులకు, మత్స్యకారులకు చట్ట ప్రకారం ఉపాధి కల్పించాలి. ఏయే పరిశ్రమల్లో స్థానికులకు ఎంత మందికి ఉపాధి కల్పించారో పరిశ్రమ బయట బోర్డు పెట్టాలి. పరిశ్రమలోపల ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించట్లేదు. ప్రతి 6 నెలలకు ఒకసారి సేఫ్టీ ఆడిట్ చేయాల్సి ఉన్నా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికై నా పరిశ్రమల యాజమాన్యాలు కార్మికుల అభ్యున్నతికి పాటు పడేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. –రొంగలి రాము, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు -
కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి
పెదబయలు: ప్రతి ఒక్కరికీ చూపు ఎంతో ముఖ్యమని, అందువల్ల కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. స్థానిక గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల–1లో డాక్టర్ దుడ్డు సత్యనారాయణ,పాఠశాల హెచ్ఎం నాగేశ్వరరావు,విశాఖపట్నం శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ గతంలో 90 ఏళ్ల వయసు వచ్చే వరకూ కళ్లద్దాలు అవసరం లేకుండా చూసేవారని చెప్పారు. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా కళ్లద్దాల అవసరం ఏర్పడుతోందన్నారు. ఈ శిబిరానికి 250 మంది హాజరు కాగా, 25 మందికి కంటి ఆపరేషన్ల చేయాలని, 30 మందికి కంటి అద్దాలు అవసరమని గుర్తించినట్టు శంకర్ ఫౌండేషన్ మేనేజర్ చంద్రశేఖర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొర్రా రాజుబాబు, ఎంపీటీసీ బొంజుబాబు, మఠం సత్యనారాయణ పడాల్, పీహెచ్ బాలకృష్ణ పాల్గొన్నారు.ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర -
‘స్థానికులకు’ ఉపాధి కలేనా..!
అచ్యుతాపురం రూరల్ : పరిశ్రమలకు గ్రామాల్లో భూములు సేకరించినప్పుడు నిర్వాసితులకు ఆర్.కార్డులు ఇస్తామని, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలల్లో శిక్షణ ఇచ్చి స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పిస్తామని అప్పటి కలెక్టర్ సమక్షంలో అగ్రిమెంటు చేసుకున్నారు. కానీ నేటికీ అమలు కాలేదని కార్మిక సంఘాల నాయకులంటున్నారు. మత్స్యకార గ్రామాల యువతీ యువకులను పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పించట్లేదని వాపోతున్నారు. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్ధాల కారణంగా మత్స్య సంపద కోల్పోయి, స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో అవకాశాలు లేక మత్స్యకార యువకుల జీవనం చాలా దుర్భరంగా మారింది. వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి రైతుల నుంచి వేలాది ఎకరాలు తీసుకుని నామ మాత్రంగా పరిశ్రమలు నెలకొల్పి, రాయితీలు పొందాక కుంటి సాకులతో అర్ధంతరంగా మూసేస్తున్నారు. దీంతో రెక్కాడితే గానీ డొక్కాడని ఎందరో నిరు పేద కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఇక నడుస్తున్న పరిశ్రమలూ కార్మికులకు చాలీచాలని వేతనాలు ఇస్తున్నాయి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కనీస వేతనం పెంచాల్సి ఉన్నప్పటికీ, గత 15 సంవత్సరాలుగా వేతనాలు పెంచలేదని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రస్తుత ధరలకు అనుగుణంగా కనీసవేతనం రూ.26వేలు ఎక్కడా అమలు కావట్లేదని కార్మికులు వాపోతున్నారు. సెజ్లో భూములు కోల్పోయిన నిర్వాసితులు తమ జీవితాలు బాగుపడతాయన్న ఆలోచనతో వేల ఎకరాలు సెజ్ పరిశ్రమలకు ధారపోశారు. భవిష్యత్తులో తమ పిల్లల జీవితాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా సంతోషంగా గడిచిపోతుందని అనుకున్న రైతుల ఆశలు అడియాసలయ్యాయి. స్థానికంగా పరిశ్రమలు వస్తే విద్యార్హతను అనుసరించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయనుకున్న నిర్వాసితుల కల కలగానే మిగిలింది. ప్రస్తుతమున్న పరిశ్రమల్లో స్థానికేతరులకు తప్ప స్థానికంగా ఉన్న నిర్వాసిత రైతుల పిల్లలకు ఉద్యోగ,ఉపాధి కల్పనలో పరిశ్రమల యాజమాన్యాలు చొరవ చూపించట్లేదు. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో 560 ఎకరాల్లో భూమిని సేకరించారు.వీటిలో ఇప్పటివరకూ 208 పరిశ్రమలు ఏర్పాటు చేశారు. ఈ రెండు మండలాల్లో 27 గ్రామాలకు చెందిన 5,600 నిర్వాసిత కుటుంబాలను దిబ్బపాలెం, వెదురవాడ ఆర్ అండ్ ఆర్కాలనీలకు తరలించారు. నిర్వాసుతులందరూ కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ గ్రామాల్లో ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 2000 మంది మహిళలకు ఉపాధి కల్పించారు. నిర్వాసితులకు దక్కని ఉపాధి అవకాశాలు అర్ధంతరంగా మూతపడుతున్న పరిశ్రమలు రోడ్డున పడుతున్న కార్మికులు భద్రతా ప్రమాణాలు పాటించని పరిశ్రమ యాజమాన్యాలు విధుల్లో ఉన్న కార్మికులకు చాలీ చాలని వేతనాలు -
పరిశ్రమల కోసం భూములు కోల్పోయాం..
మాది దుప్పితూరు గ్రామం. నేను అచ్యుతాపురం నుంచి విశాఖలో గల ఒక ప్రైవేట్ పరిశ్రమలో పని చేసుకునేందుకు సుమారు 100 కిలో మీటర్ల దూరం రాకపోకలు చేస్తున్నాను. బ్రాండిక్స్ పరిశ్రమలో మా భూములు కోల్పోయాం. కంపెనీ వారు వెయ్యి ఎకరాల స్థలం ఏడాదికి కేవలం వెయ్యి రూపాయలు లీజుకి ప్రభుత్వం నుంచి తీసుకుని, 60 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి నేటికీ కల్పించలేదు. నా లాంటి అర్హత కలిగిన ఎందరో యువకులు సుదూర ప్రాంతాలకు వలస వెళ్లి పనులు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం చొరవతో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నాను. –మాడెం అజయ్, స్థానిక యువకుడు -
గిరిజన గ్రామాల్లో వెలుగులే లక్ష్యం
● అరకు ఎంపీ తనూజరాణి ● ఎంపీ నిధులు రూ.13.94 లక్షలతో ఎల్ఈడీ వీధి దీపాల పంపిణీ డుంబ్రిగుడ: గిరిజన గ్రామాల్లో వెలుగులు నింపడమే ప్రధాన లక్ష్యమని అరకు ఎంపీ గుమ్మ తనూజరాణి అన్నారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యలయ సమావేశ మందిరంలో ఎంపీడీవో ప్రేమ్సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎల్ఈడీ వీధి దీపాల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన ఎంపీ నిధులతో మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో సుమారు రూ.13.94 లక్షల వ్యయంతో 256 ఎల్ఈడీ బల్బులను ఏర్పాటుచేశామన్నారు. నియోజకవర్గంలోని గ్రామాలకు రూ.40 లక్షలతో అందజేస్తున్నామన్నారు. తన విజయానికి మండలంలోని ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు ఎంతో కష్టపడ్డారన్నారు. ప్రజా ప్రతినిధులను భాగస్వామలు చేసి పంచాయతీలకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాకా ఈశ్వరి, జెడ్పీటీసీ జానకమ్మ, వైస్ ఎంపీపీలు శెట్టి ఆనందరావు, పి లలిత, మండల ప్రత్యేకాధికారి నందు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఇలావుండగా అంతకుముందు స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంతో కలిసి ఎంపీ తనూజరాణి అరకులోయ మండల పరిషత్ కార్యాలయంలో ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేశారు. అభివృద్ధికి ఎంపీ నిధులు తోడ్పాటు అవుతాయని ఎమ్మెల్యే మత్స్యలింగం పేర్కొన్నారు. -
ఉద్యోగాలు లేక మత్స్యవేటకు...
పరిశ్రమల వ్యర్థ రసాయనాల కారణంగా సముద్రం కాలుష్యం అవడంతో మత్స్య సంపద కోల్పోతున్నాం. యువకులకు స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పించకపోవడంతో, అలవాటు లేని యువకులు కొంత మంది జీవనోపాధి కోసం మత్స్య వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకోగా, పిల్లలు స్థిరపడలేకపోవడం వారిని ఎంతో బాధిస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టి మత్స్యకార యువకులకు స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరుతున్నాను. –ఉమ్మిడి జగన్, పూడిమడక మత్స్యకార నాయకుడు -
రత్నంపేటలో పాలకేంద్రం ప్రారంభం
కొయ్యూరు: మండలంలోని రత్నంపేటలో మహిళా డెయిరీ సహకార సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోనే మొదటి పాల కేంద్రాన్ని జిల్లా పశువైద్యాధికారి నర్సింహులు, పశుసంవర్థక శాఖ ఏడీ చంద్రశేఖర్ ప్రారంభించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలను వారు అభినందించారు. గ్రామంలో 45 మంది మహిళలు సంఘంగా ఏర్పడి పాలకేంద్రం ఏర్పాటుచేయడం ఆనందంగా ఉందన్నారు. ఇందుకు ఏహెచ్ఏ నగేష్, సర్పంచ్ పాటి రత్నం ఎంతో కృషి చేశారన్నారు. పశువైద్యాధికారులు రాజేష్ కుమార్, ప్రసన్న కుమార్, దుర్గాప్రసాద్, విశాఖడెయిరీ సూపర్వైజర్ ఎం.జగదీష్ పాల్గొన్నారు. ఇలావుండగా మండలంలోని ఆడాకుల, ఆర్.కొత్తూరు, కంఠారంలో కూడా త్వరలో పాల కేంద్రాల ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కోఆపరేటివ్ బ్యాంకులో మహిళా రైతులతో ఖాతాలు ఏర్పాటుచేయడంతోపాటు అవసరమైన రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. మహిళా డెయిరీ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు -
పెండింగ్ పరిహారం చెల్లింపునకు సత్వర చర్యలు
సాక్షి,పాడేరు: జాతీయ రహదారికి భూములు కేటాయించిన వారికి పెండింగ్ పరిహారం చెల్లింపులకు సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి రెవెన్యూ, టూరిజం, జాతీయ రహదారి అథారిటీ అధికారులతో జాతీయ రహదారుల నిర్మాణం, పరిహారం చెల్లింపులపై వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారి నిర్మాణంలో జాతీయ రహదారికి అనుబంధంగా ఉన్న రహదారులు, తాగునీటి పథకాలు, నీటి పారుదల వనరుల మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని సూచించారు. పాడేరు, లగిశపల్లి, కొయ్యూరు జాతీయ రహదారి నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలపై కలెక్టర్ సమీక్షించి, సమగ్ర వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ అభిషేక్గౌడ, సబ్కలెక్టర్ సౌర్యమన్పటేల్, జాతీయ రహదారి విభాగం అధికారులు గుల్షన్కుమార్, రవిశేఖర్,తహసీల్దార్లు పాల్గొన్నారు. కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశం -
అటవీ అభివృద్ధికి చర్యలు
అటవీశాఖ (విశాఖ) కన్జర్వేటర్ బీఎం మొయిద్దీన్ దివాన్ సాక్షి,పాడేరు: జిల్లాలో అటవీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని అటవీశాఖ విశాఖ కన్జర్వేటర్ బీఎం మొయిద్దీన్ దివాన్ తెలిపారు. శనివారం ఆయన పాడేరు అటవీ డివిజన్లో పర్యటించారు. అటవీ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. ముందుగా పాడేరు డివిజన్ అటవీశాఖ కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్రలో భాగంగా ఆయన పలు రకాల మొక్కలను నాటారు. అనంతరం పాడేరు, జి.మాడుగుల అటవీ రేంజి పరిధిలో జరుగుతున్న ప్లాంటేషన్ పనులను తనిఖీ చేశారు. ప్లాంటేషన్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అటవీ అభివృద్ధితో పాటు అటవీ సంరక్షణకు అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పాడేరు డీఎఫ్వో పీవీసందీప్రెడ్డి, రేంజి అధికారులు లావణ్య, ఆర్.అప్పలనాయుడు, వెంకయ్యచౌదరి, రాజేశ్వరరావు, సూపరింటెండెంట్ విజయ్కుమార్ పాల్గొన్నారు. -
వాతావరణ సమతుల్యతకు కృషి
సాక్షి,పాడేరు: వాతావరణ సమతుల్యతకు ప్రతిఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ పిలుపునిచ్చారు.స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా శనివారం ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీట్ హీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. పక్షులకు ఏర్పాటు చేసిన నీరు,ఆహార తొట్టెలను ఆయన పరిశీలించారు. ట్యాంకుల్లో తాగునీటి వనరుల క్లోరినేషన్, రూఫ్రైన్, హార్వెస్టింగ్ కట్టడాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్డబ్ల్యూఎస్ ఈఈ జవహర్కుమార్, ఇతర అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ వేసవిలో ప్రతి గ్రామంలోను పశువులు, పక్షిజాతుల సంరక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. స్వచ్ఛభారత్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మానవహారంలో అధికారులు, ఉద్యోగులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు.అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్లో ఆరోగ్యరథాన్ని ప్రారంభించారు. ఆరోగ్య రథం ద్వారా అందిస్తున్న వైద్యసేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే పాతబస్టాండ్లో చలివేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఇక్కడ మహిళలు, ఉద్యోగులతో స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్రపై ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో సబ్కలెక్టర్ సౌర్యమన్పటేల్, డీపీవో లవరాజు, డీఎల్పీవో కుమార్, డీఎంహెచ్వో డాక్టర్ జమాల్బాషా, తహసీల్ధార్ త్రినాథరావునాయుడు పాల్గొన్నారు. కలెక్టరేట్లో... కలెక్టరేట్లో స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ డాక్టర్ అభిషేక్గౌడ నిర్వహించారు. కలెక్టరేట్లోని అన్ని విభాగాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు జరిగాయి. అధికారులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు కలెక్టరేట్ భవనంపై పక్షులకు తాగునీరు, ఆహారంగా గింజలను డీఆర్వో పద్మలత అందుబాటులోకి తెచ్చారు.సమాచార పౌరసంబంధాలశాఖ కార్యాలయంలో కూడా నిర్వహించారు. డీపీఆర్వో గోవిందరాజులు, డివిజనల్ పీఆర్వో పండు రాములు చలివేంద్రాన్ని ప్రారంభించారు.భవనంపై పక్షులకు తాగునీరు, ఆహార గింజల తొట్టెలను ఏర్పాటు చేశారు.స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో కలెక్టర్ దినేష్కుమార్ పిలుపు -
మత్స్యగెడ్డ నుంచి భారీగా ఇసుక తరలిపోతోంది. రేయింబవళ్లు అక్రమంగా తవ్వి తరలిస్తూ భారీగా కాసులు ఆర్జిస్తున్నారు. మరోపక్క లోతైన తవ్వకాల వల్ల గెడ్డ పొడవునా ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. అయినప్పటికీ అధికారుల నుంచి స్పందన కరువైందన్న ఆరోపణలు వినవస్తున్నాయి
సాక్షి,పాడేరు: ఏజెన్సీలో ఇసుక అక్రమ వ్యాపారం భారీగా జరుగుతోంది. ఏజెన్సీలో అధికారికంగా రీచ్లు లేకపోవడంతో స్థానికంగా ఉన్న గెడ్డలు, వాగుల నుంచి ఇసుకను సేకరిస్తారు. ఏజెన్సీలో ప్రధానంగా మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతంలో ఇసుక అఽధికంగా లభ్యమవుతోంది. జి.మాడుగుల, పాడేరు, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో మత్స్యగెడ్డ విస్తరించింది. ఈ గెడ్డ పొడవునా ఎక్కడికక్కడ అనధికారికంగా ఇసుక క్వారీలు వెలిశాయి. ఇసుకకు మన్యంలో ఉన్న డిమాండ్తో ట్రాక్టర్లు, టిప్పర్ లారీలు, వ్యాన్ల అపరేటర్లంతా భారీగా ఇసుకను తరలిస్తూ కాసులు ఆర్జిస్తున్నారు. మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతాల్లో కూలీలను ఏర్పాటు చేసుకుని, రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుకను సేకరిస్తున్నారు. ● జి.మాడుగుల మండలంలోని బందవీధి శివారు చాకిరేవు, బొడ్డాపుట్టు, సింధుగుల ప్రాంతాలతో పాటు పాడేరు మండలం ఇరడాపల్లి, జి.ముంచంగిపుట్టు, పెదబయలు మండలం కోడాపల్లి కాజ్వే, గంపరాయి బ్రిడ్జి, చుట్టిమెట్ట, మంగబంద, హుకుంపేట మండలం కామయ్యపేట తదితర ప్రాంతాల్లోని మత్స్యగెడ్డలో ఇసుక అక్రమ తవ్వకాలు భారీగా జరుగుతున్నాయి. మృత్యుకుహరంగా.. మత్స్యగెడ్డలో లోతుగా ఇసుక తవ్వకాలు జరపడం వల్ల మృత్యుకుహరంగా మారింది. లోతుగా గొయ్యిలు ఏర్పడటం వల్ల ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ● ట్రాక్టర్లు, వ్యాన్లు, టిప్పర్లు, లారీల ద్వారా ప్రతిరోజు రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతోంది. మూడు టన్నుల ఇసుక దగ్గరగా అయితే రూ.6 వేలు, దూరం పెరిగితే రూ.10వేలు, మరింత దూరం పెరిగితే మాత్రం అధిక ధరకు వాహనాల అపరేటర్లు విక్రయిస్తున్నారు. ● మత్స్యగెడ్డ నుంచి భారీగా ఇసుక తరలిపోతున్నప్పటికీ రెవెన్యూ, పోలీసు అధికారులు నామమాత్రంగా దాడులు చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రం పాడేరుతో పాటు జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల నుంచి రవాణా అవుతున్న ఇసుక అంతా మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతంలో అక్రమంగా సేకరించినదే. అయినప్పటికీ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయకపోవడం ఇసుక వ్యాపారులకు కాసులు కురిపిస్తోంది. రాత్రి, పగలు తేడా లేకుండా యథేచ్ఛగా తవ్వకాలు భారీ స్థాయిలో తరలించి అధిక ధరలకు విక్రయం లోతైన గోతులతో పొంచి ఉన్న ప్రమాదాలు మొక్కుబడిగా అధికారుల దాడులు తవ్వకాలకు అడ్డుకట్ట వేస్తాం మత్స్యగెడ్డ పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసేలా పోలీసు, రెవెన్యూశాఖల అధికారులకు తగిన ఆదేశాలిస్తాం. – ఏఎస్ దినేష్కుమార్, కలెక్టర్, పాడేరు -
టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత లక్ష్యం
● సర్వ శిక్షా అభియాన్ జిల్లా అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ స్వామినాయుడు సాక్షి,పాడేరు: జిల్లాలోని అన్ని కేజీబీవీల్లో టెన్త్ ఫెయిలైన విద్యార్థినిలకు నూరుశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని సర్వ శిక్ష అభియాన్ జిల్లా అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ స్వామినాయుడు తెలిపారు. శనివారం ఆయన అరకులోయలోని యండపల్లివలస కేజీబీవీలో టెన్త్ విద్యార్థినులకు అమలుజేస్తున్న ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన సాక్షితో మాట్లాడుతూ జిల్లాలోని 19 కేజీబీవీ పాఠశాలల పరిధిలో టెన్త్ తప్పిన విద్యార్థినులకు రంపచోడవరం, చింతూరు, చింతపల్లి, హుకుంపేట, అరకులోయ కేజీబీవీల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులంతా టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక బోధన కార్యక్రమాలతో పాటు రోజువారి పరీక్షలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. -
ప్రత్యేక డీఎస్సీ నిర్వహించేలా చర్యలు
పాడేరు : ప్రభుత్వం ఏజెన్సీకి ప్రత్యేక డీఎస్సీ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘం, స్పెషల్ డీఎస్సీ సాధన సమితి, విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం, ఆదివాసీ జేఏసీ ప్రతినిధులు కోరారు. శనివారం వారితో స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ఐటీడీఏ ఇన్చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ అత్యవసర సమావేశం నిర్వహించారు. వారి డిమాండ్లను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తామంతా గిరిజన సంక్షేమం కోసం మాత్రమే విధులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రత్యేక డీఎస్సీపై గిరిజన సంఘాలు ఇచ్చిన వినతిపత్రాలను ప్రభుత్వానికి పంపించామన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందన్నారు. పాడేరు అడిషనల్ ఎస్పీ ధీరజ్ మాట్లాడుతూ గిరిజన యువత తమ హక్కుల కోసం పోరాడుతున్నారన్నారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలతో నిరాశ చెందకుండా మళ్లీ కోర్టును ఆశ్రయించి పునరుద్ధరించుకోవచ్చన్నారు. సాధారణ పౌరులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతియుతంగా మాత్రమే ఉద్యమాలు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాడేరు డీఎస్పీ షేక్ షహబాజ్ అహ్మద్, పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రైల్రోకోను విజయవంతం చేయండి ముంచంగిపుట్టు: ఏజెన్సీకి ప్రత్యేక డీఎస్సీ తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19న నిర్వహించే అరకు రైల్ రోకోను విజయవంతం చేయాలని ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ సాధన సమితి జిల్లా కోకన్వీనర్లు రెయ్యల నాగభూషణ్, వెంగడ జగన్ పిలుపునిచ్చారు. శనివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీలో ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. గిరిజన ప్రాంతంలో నూరుశాతం ఉద్యోగాలు గిరిజనులకే చెందాలని, అరకులో చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
12 బాలల సంరక్షణ కేంద్రాలకు గుర్తింపు
పాడేరు : జిల్లాలో 12 బాలల సంరక్షణ కేంద్రాలను గుర్తించినట్లు కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. బాలల సంక్షేమం, సంస్కరణలు, వీధి బాలల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాలల సంరక్షణ కేంద్రాల నిర్వహణకు రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం కోసం సుమారు 16 సంరక్షణ కేంద్రాల ప్రతినిధులు ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా మహిళ, శిశు సంక్షేమ శాఖ పీడీ సూర్యలక్ష్మి, జువైనల్ ప్రొబేషన్ అధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నిర్వహణకు అనువుగా ఉన్న 12 బాలల సంరక్షణ కేంద్రాలను గుర్తించారు. ఈ మేరకు వారికి ధ్రువీకరణ పత్రాలను కలెక్టర్ దినేష్కుమార్ అందజేశారు. -
పోస్టులు తక్కువ.. పోటీ ఎక్కువ!
విశాఖ విద్య: మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగిసింది. చాలా కాలం తర్వాత వెలువడిన నోటిఫికేషన్ కావడంతో ఉపాధ్యాయ పోస్టు సాధించేందుకు అభ్యర్థులు భారీగా పోటీ పడుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని అన్ని మేనేజ్మెంట్లలో 1,139 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 15 వరకు ఇచ్చిన గడువు మేరకు ఉమ్మడి విశాఖ జిల్లాలో 29,779 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి ఎలాగైనా కొలువు సాధించాలనే లక్ష్యంతో ప్రిపరేషన్లో ఉన్న అభ్యర్థులు వేర్వేరు సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ లెక్కన జిల్లా నుంచి మొత్తంగా 49,658 దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ సారి డీఎస్సీకి పోటీ తీవ్రంగానే ఉందని తేలడంతో అభ్యర్థులు ప్రిపరేషన్లో నిమగ్నమయ్యారు. సమయం తక్కువ.. ఒత్తిడి ఎక్కువ డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి జూలై 6 వరకు జరగనున్నాయి. మరో 20 రోజుల్లో పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదే ఇప్పుడు డీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్న అభ్యర్థులకు టెన్షన్ కలిగిస్తోంది. సమయం పెంచి, అందరికీ ఒకే రోజు పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రేయింబవళ్లు పుస్తకాలతో అభ్యర్థులు కుస్తీ పడుతున్నారు. భర్తీ కానున్న పోస్టులు ఇవే.. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీ, మున్సిపల్ మేనేజ్మెంట్ పరిధిలోని పాఠశాలల్లో 734 (ఓపెన్ 290 + ఇతర కేటగిరీల మొత్తం 444) పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అదే విధంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలల్లో 400 పోస్టులు ప్రకటించారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని జువనైల్ హోమ్లో 5 ఖాళీలు కలుపుకుని మొత్తంగా ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో 1,139 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇవి కాకుండా జోనల్ స్థాయిలో ఏపీ రెసిడెన్షియల్/మోడల్ స్కూల్స్/సోషల్ వెల్ఫేర్/బీసీ వెల్ఫేర్/ట్రైబల్ వెల్ఫేర్(గురుకులాలు) పరిధిలోని విద్యాలయాల్లో జోనల్ ప్రాతిపదికన 400 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పోటీ ఇలా.. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రాతిపదికన ఉపాధ్యాయ పో స్టుల భర్తీ జరగనుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూ రి సీతారామరాజు జిల్లాల్లోని వి ద్యాలయా ల్లో సబ్జెక్టుల వారీగా ఉన్న ఖాళీలు, రోస్టర్ వారీగా అందిన దరఖాస్తులు ఇలా ఉన్నాయి.కేటగిరీ వచ్చిన దరఖాస్తులు ఓసీ 1,626 బీసీ–ఏ 1,940 బీసీ–బీ 2,563 బీసీ–సీ 198 బీసీ–డీ 8,330 బీసీ–ఈ 423 ఎస్సీ–1 479 ఎస్సీ–2 876 ఎస్సీ–3 2,821 ఎస్టీ 10,523 ఈడబ్ల్యూఎస్ 890 (వీటితో పాటు పీహెచ్ కేటగిరీలకు దరఖాస్తులకు వచ్చాయి) ఉపాధ్యాయ కొలువుకు దరఖాస్తుల వెల్లువ 1,139 పోస్టులకు 49 వేలకు పైగా దరఖాస్తులు దరఖాస్తులు వివరాలు మొత్తం అభ్యర్థులు 29,779 సబ్జెక్టుల వారీగా అందినవి 49,658 పురుషులు 11,773 మహిళలు 18,006 -
ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
● ఇంటర్ బోర్డు అధికారి భీమశంకర్ పాడేరు రూరల్: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఇంటర్ బోర్డు అధికారి భీమశంకర్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో మొదటి సంవత్సరం జనరల్ కోర్సులో 3075 మంది విద్యార్థుల్లో 416 మంది, ఒకేషనల్ కోర్సుల్లో 515 మందిలో 154 మంది పరీక్షలకు హాజరు కాలేదన్నారు. ద్వితీయ సంవత్సరం జనరల్ కోర్సులో1564 మందికి 112 మంది, ఒకేషనల్ కోర్సులకు సంబంధించి 143 మందిలో 70 మంది పరీక్షలు రాయలేదని పేర్కొన్నారు. ఎటువంటి మాస్కాపీయింగ్కు తావులేకుండా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
విత్తన యాతన
ఖరీఫ్ రైతుల్లో విత్తన యాతననెలకొంది. జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విత్తన పంపిణీపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడకపోవడంతో దిగులు చెందుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఖరీఫ్లో ఇప్పటికే విత్తనాలు సరఫరా చేయగా కూటమి ప్రభుత్వంలో ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందని గిరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి,పాడేరు: ఖరీఫ్ రైతులు ప్రభుత్వం ఏటా పంపిణీ చేసే విత్తనాలకోసం ఆశతో ఎదురుచూస్తున్నారు. మైదాన ప్రాంతంతో పోలిస్తే ఏజెన్సీలో రెండు నెలలు ముందుగానే ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. రైతులు ముందస్తుగానే ఏర్పాట్లు చేసుకుంటారు. వీరి అవసరాలను గుర్తించిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందుకు తగ్గట్టుగానే విత్తనాలు సరఫరా చేయడంతో గిరి రైతులు ఉత్సాహంగా ఖరీఫ్ పనులకు ఉపక్రమించేవారు. విత్తన పంపిణీపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో నారుమడుల తయారీకి సిద్ధపడలేకపోతున్నారు. ● ఖరీఫ్లో జిల్లాలో 56,792 ఎకరాల్లో గిరి రైతులు వరిని సాగు చేస్తుంటారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో గిరిజన రైతుకు ఏటా 90 శాతం రాయితీపై వరి విత్తనాలు పంపిణీ చేసింది. రైతులకు ఇబ్బంది లేకుండా ఫిబ్రవరిలోనే ఏపీ సీడ్స్ వద్ద కొనుగోలు చేసి మే నెల నాటికి పంపిణీ పూర్తి చేసేది. కూటమి ప్రభుత్వం విత్తన పంపిణీ ఊసెత్తకపోవడంతో గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్చిలోనే నివేదిక జిల్లా వ్యాప్తంగా 28వేల క్వింటాళ్ల వరి విత్తనాలు ఖరీఫ్కు అవసరమని మార్చి నెలలోనే వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అధికశాతం గిరిజన రైతాంగం ఏటా వ్యవసాయశాఖ రాయితీపై పంపిణీ చేసే విత్తనాలపైనే ఆధారపడుతుంటారు. అయితే విత్తనాల పంపిణీపై కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గిరిజన రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ● జిల్లావ్యాప్తంగా కొద్దిరోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ముందస్తుగా ఖరీఫ్ వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం నారుమడులు సిద్ధం చేసుకునేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్న తరుణంలో ప్రభుత్వం ఇప్పటివరకు విత్తనాలు సరఫరా చేయకపోవడంతో రైతులను నిరాశకు గురి చేస్తోంది. 90 శాతం రాయితీపై పంపిణీ చేస్తుందా లేదా అనేదానిపై కూడా రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
అరకు ఎంపీ, మాజీ ఎమ్మెల్యే పాల్గుణ ఔదార్యం
డుంబ్రిగుడ: మండలానికి చెందిన కొర్ర, కించుమండల ఎంపీటీసీ గుజ్జెల విజయ అత్తమామలు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, గుజ్జెల చిరంజీవి తల్లిదండ్రులు గత వారం రోజుల నుంచి అనారోగ్యంతో అరకులోయ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అరకులోయ ఎంపీ గుమ్మ తనూజరాణి, మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణలు ఫోన్ ద్వారా వారి యోగక్షేమలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులను సంప్రదించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. వారు బాధితులకు రూ.10 వేలు ఆర్ధిక సహాయం అందించినట్లు చిరంజీవి దంపతులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం చికిత్స పొందుతున్న రామరావు, పుణ్యవతిలకు డిశ్చార్జ్ చేసి స్వగ్రామం కొర్ర తరలించారు. -
నీళ్ల ట్యాంకర్ బోల్తా.. డ్రైవర్ మృతి
ముంచంగిపుట్టు: నీళ్ల ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ బిరిగూడ గ్రామ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ జె.రామకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సంగంవలసకు చెందిన అల్లంగి బిమేష్(21) శుక్రవారం బిరిగూడ వంతెన పనుల నిమిత్తం నీటిని ట్యాంకర్తో తీసుకెళ్తున్నాడు. ఆ సమయంలో ట్యాంకర్ బ్రేకులు ఫెయిలై ఒక్కసారిగా బోల్తా పడింది. ట్యాంకర్ కింద డ్రైవర్ బిమేష్ పడిపోయాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే బిమేష్ ట్యాంకర్ కింద నలిగిపోయి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. స్థానిక సర్పంచ్ త్రినాథ్, వైఎస్సార్సీపీ మండల నేత సాధురాం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఇటీవలే బిమేష్కు పెళ్లి అయింది. ఇంతలోనే ప్రమాదంలో చనిపోవడంతో సంగంవలస గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడి భార్య దొయిమెత్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
చదువులు తిరోగమనం
● అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు మంగళం ● ఉమ్మడి విశాఖ జిల్లాలో 82 రద్దు ● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ● అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా 52 మూత ● దూరం కానున్న హైస్కూల్ చదువులు ● గ్రామాల్లో డ్రాపౌట్ కానున్న విద్యార్థులు గ్రామీణ విద్యకు విఘాతం కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించనుంది. అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారు. గతంలో దూరం ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది ఐదో తరగతి తర్వాత చదువు మానేసేవారు. అందుకే గత ప్రభుత్వాలు ప్రాథమికోన్నత పాఠశాలలను అందుబాటులోకి తెచ్చాయి. కానీ, ప్రస్తుత నిర్ణయంతో గ్రామీణ విద్యార్థులకు హైస్కూల్ చదువులు మళ్లీ దూరమయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపౌట్లు పెరిగే అవకాశం ఉందని విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ విద్య: కూటమి ప్రభుత్వం విద్యారంగంపై ప్రయోగాల పేరుతో పాఠశాలలను మూసివేసేందుకు సిద్ధమవుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొమ్మిది రకాల పాఠశాలల పేరుతో పాఠశాల విద్య పునర్నిర్మాణం చేపట్టడం గ్రామీణ ప్రాంత విద్యార్థులను చదువుకు దూరం చేసే చర్యగా ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాఠశాలలను అప్గ్రేడ్ చేయడం సాధారణంగా జరిగే ప్రక్రియ కాగా, ప్రస్తుత ప్రభుత్వం పాఠశాలలను డీగ్రేడ్ చేస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలను మూసివేయడం ద్వారా ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలకు లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని విద్యారంగ నిపుణులు అంటున్నారు. విద్యాశాఖ చరిత్రలో ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడూ చూడలేదని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో 82 స్కూళ్ల రద్దు ఉమ్మడి విశాఖ జిల్లాలో 82 ప్రాథమికోన్నత పాఠశాలలను (యూపీఎస్) రద్దు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ జిల్లాలో 3, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 27, అనకాపల్లి జిల్లాలో అత్యధికంగా 52 పాఠశాలలు రద్దు కానున్నాయి. ఇకపై ఈ పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలుగా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రద్దు చేసిన యూపీఎస్లలోని 6, 7, 8 తరగతుల విద్యార్థులను సమీప ఉన్నత పాఠశాలలకు తరలించాలని ఆదేశిస్తూ, దీనికి సంబంధించిన మ్యాపింగ్ను కూడా పూర్తి చేశారు. ఈ విధానం 2025–26 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుందని జిల్లా విద్యాశాఖాధికారులు తెలిపారు. ఉపాధ్యాయుల్లో అసంతృప్తి జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 3, 4, 5 తరగతులను సమీప హైస్కూళ్లలో విలీనం చేసి, ప్రైమరీ తరగతులకు స్కూల్ అసిస్టెంట్లతో బోధన ఏర్పాటు చేసింది. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందింది. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రాథమికోన్నత పాఠశాలలు రద్దు చేయడంతో 6, 7, 8 తరగతులను సమీప హైస్కూళ్లకు తరలిస్తున్నారు. ఫలితంగా, ఆ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు (స్కూల్ అసిస్టెంట్లు) వేరే చోటుకు బదిలీ కావలసి వస్తోంది. పాఠశాలల పునర్నిర్మాణం వల్ల ఉపాధ్యాయ పోస్టులకు కోత పడుతోంది. యూపీఎస్లు రద్దు చేయడంతో స్కూల్ అసిస్టెంట్లు వేర్వేరు హైస్కూళ్లకు బదిలీ కానున్నారు. ఈ పరిణామాలతో ఉపాధ్యాయులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని కూటమి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రింతాడ విద్యార్థులు చింతపల్లి హైస్కూల్కు..అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం రింతాడ ప్రాథమికోన్నత పాఠశాలలో 6, 7, 8 తరగతుల్లో చదువుతున్న 32 మంది విద్యార్థులున్న పాఠశాలను ప్రభుత్వం రద్దు చేసింది. వీరిని 6 కిలోమీటర్ల దూరంలోని చింతపల్లి హైస్కూల్కు తరలించాలని ఆదేశించింది. అలాగే యర్రబొమ్మలు యూపీఎస్ను రద్దు చేసి, అక్కడి విద్యార్థులను కూడా చింతపల్లి హైస్కూల్కు తరలించాలని ఆదేశాల్లో పేర్కొంది. యర్రబొమ్మలకు చింతపల్లి పాఠశాల 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు తమ పిల్లలను అంత దూరం పాఠశాలలకు పంపిస్తారా అనేది సందేహాస్పదంగా మారింది. దీనివల్ల గిరిజన గూడేల్లోని పిల్లలు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉంది. -
‘స్పెషల్ డీఎస్సీ సాధన’కు 19న రైల్రోకో
పాడేరు : గిరిజన ప్రాంతంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి స్పెషల్ డీఎస్సీ సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల 19న అరకువ్యాలీలో రైల్రోకో నిర్వహిస్తున్నట్టు స్పెషల్ డీఎస్సీ సాధన సమితి జిల్లా చైర్మన్ కుడుముల కాంతారావు వెల్లడించారు. శుక్రవారం పట్టణంలోని మోదకొండమ్మ తల్లి ఇండోర్ ఆడిటోరియంలో నిర్వహించిన సాధన సమితి ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. రైల్ రోకోలో భాగంగా కేకే లైన్లో గూడ్స్లతో సహా అన్ని సర్వీసులను అడ్డుకుంటామన్నారు. గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి. అప్పలనర్స మాట్లాడుతూ మెగా డీఎస్సీలో ఆదివాసీలకు షెడ్యూల్డ్ ప్రాంతంలో శతశాతం పోస్టులు కేటాయిస్తూ ఈనెల 15 నాటికి ఉత్తరు్ువ్ల జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు. సీఎం చంద్రబాబు కేవలం తన ప్రకటనలతోనే సరిపెట్టారన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలైతే ఆరు శాతం అంటే రాష్ట్రంలో కేవలం 980 పోస్టులు మాత్రమే గిరిజనులకు దక్కుతుందని ఆ మాత్రం కూడా అవగాహన లేని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి 2030 పోస్టులు గిరిజనులకు దక్కుతుందని అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలైతే గిరిజనులు సుమారు 3వేల ఉపాధ్యాయ పోస్టులను కోల్పోతారన్నారు. ఈనెల 20న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో స్పెషల్ డీఎస్సీపై ప్రకటన చేయాలన్నారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. అనంతరం ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా చైర్మన్గా కుడుముల కాంతారావు, కన్వీనర్గా సాగిన ధర్మన్న పడాల్, మహిళ విభాగం జిల్లా చైర్పర్సన్గా కాంగు సుభశర్మ, జిల్లా మహిళ విభాగం కన్వీనర్గా కవడం కాసులమ్మ, మేధావుల ఫోరం చైర్మన్గా వల్ల వెంకటరమణ, కన్వీనర్గా రావుల జగన్మోహన్, విద్యార్థి విభాగం కన్వీనర్గా కె. రాజశేఖర్, డీఎస్సీ అభ్యర్థుల కమిటీ కన్వీనర్గా రొబ్బా ప్రశాంత్ కుమార్తోపాటు కోకన్వీనర్లు, సలహాదారులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి రంపచోడవరం: ఏజెన్సీ ప్రాంతానికి ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు కంగాల శ్రీనివాసుదొర డిమాండ్ చేశారు. స్థానిక ఐటీడీఏ ఎదుట రిలే నిరాహార దీక్షలు శుక్రవారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమానికి ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ అధ్యక్షత వహించారు. దీక్షల్లో కొమరం సూర్య చంద్ర, మట్ట కృష్ణారెడ్డి, వెంకన్న దొర, సత్యనారాయణరెడ్డి, అంజిరెడ్డి పాల్గొన్నారు. కేకే లైన్లో అన్ని సర్వీసులను అడ్డుకుంటాం 20న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ప్రకటన చేయకుంటే ఉద్యమం ఉధృతం స్పెషల్ డీఎస్సీ సాధన సమితి జిల్లా చైర్మన్ కాంతారావు హెచ్చరిక -
జల్జీవన్ మిషన్తో నాణ్యమైన తాగునీటి సరఫరా
సాక్షి,పాడేరు: జిల్లాలో ఇంటింటికి కుళాయిల ద్వారా నాణ్యమైన తాగునీటి సరఫరా జలజీవన్ మిషన్ లక్ష్యమని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో నిర్వహించిన జిల్లా తాగునీరు, పారిశుధ్య కమిటీ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 4,970 గ్రామాలకు గాను ఇప్పటివరకు 1340 గ్రామాల్లో ఇంటింటికి కుళాయిలు ద్వారా తాగునీరు అందిస్తున్నామన్నారు. మిగిలిన గ్రామాల్లో కూడా శతశాతం లక్ష్యాలు సాధించాలన్నారు. జిల్లాలో 2.40 లక్షల గృహాలు ఉండగా, 1.22లక్షల గృహాలకు తాగునీరు అందుతుందన్నారు. మిగిలిన 1.18లక్షల గృహాలకు నీరందించేలా జల్జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలని సూచించారు. తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులు నిర్ణీత సమయానికి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్లిస్ట్లో పెట్టాలని ఆదేశించారు. జల్జీవన్ మిషన్లో జిల్లాకు రూ.626కోట్లు మంజూరు చేయగా, ఇప్పటి వరకు రూ.144కోట్లు ఖర్చు జరిగిందన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల విషయంలో పెదబయలు, ముంచంగిపుట్టు మండలాలు వెనుకంజలో ఉన్నాయన్నారు.అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి 17శాతం కేంద్రాలకు రన్నింగ్ వాటర్, మరుగుదొడ్ల నిర్మాణాల పనులు పెండింగ్లో ఉన్నాయన్నారు. వీటిని కూడా సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఈఈ కె.జవహర్కుమార్, కమిటీ సభ్యులు డీఈవో బ్రహ్మజీరావు, డీఎంహెచ్వో డాక్టర్ జమాల్బాషా, ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ ఎస్తేరు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్బీఎస్.నందు, డీఆర్డీఏ ఏపీడీ లాలం సీతయ్య, డీపీఆర్వో గోవిందరాజులు పాల్గొన్నారు.కలెక్టర్ దినేష్కుమార్ -
భారీ వర్షానికి పెంకుటిళ్లు నేలమట్టం
పిడుగుపాటుకు పశువులు మృతిడుంబ్రిగుడ: మండలంలోని కొర్ర పంచాయితీ గొందివలసలో శుక్రవారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి తామర్ల చినపొట్టన్న, గెమ్మెలి వెంకటరావులకు చెందిన రెండు పెంకుటిళ్లు ధ్వంసమయ్యాయి. తిండి గింజలు, దుస్తులు తడిసిపోవడంతో రెండు కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ప్రభుత్వం, అధికారులు స్పందించి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. చీడిపుట్లులో.. హుకుంపేట: మండలంలోని చీడిపుట్లు గ్రామంలో పిడుగుపాటుకు గురై తొమ్మిది దుక్కి పశువులు మృతి చెందాయి. శుక్రవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులు, పిడుగులతో భారీ వర్షం కురిసింది. రేగం సూరిబాబు, గేగం బోడయ్య, కొర్ర ఖరుజరమ్, రేగం బశ్వేశ్వరరావుకు చెందిన తొమ్మిది దుక్కిపశువులు మృతి చెందాయి. ఈఘటనలో సుమారు రూ.1.20 లక్షల నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని వారు కోరారు. రేగడిపాలెంలో.. వై.రామవరం: మండలంలోని రేగడిపాలెంలో గురువారం చింతచెట్టుపై పిడుగుపడటంతో అక్కడే ఉన్న ఐదు ఆవులు మృతిచెందాయి. గ్రామానికి చెందిన వెదుళ్ల చంద్రారెడ్డికి చెందిన 2, రాకోట వెంకటరెడ్డికి చెందిన ఒకటి, వెదుళ్ల బుల్లబ్బాయిరెడ్డికి చెందిన ఒకటి రోలిపల్లి సూరిబాబుకు చెందిన ఒక ఆవు మృతి చెందినట్లు సర్పంచ్ వెదుళ్ల సత్యన్నారాయణరెడ్డి తెలిపారు. మేలుజాతి ఆవులు కావడంతో సుమారు రూ.3లక్షల మేర ఆర్థిక నష్టం జరిగిందని ఆయన వివరించారు. -
చలివేంద్రాలు ఏర్పాటు చేయండి
పాడేరు : అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో గ్రామాల్లో విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి పలు సమస్యలపై ఆయనతోపాటు ఐటీడీఏ ఇన్చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, డీఆర్వో పద్మలత 75 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారపు సంతల్లో ఆశీలు వేలం పాడుకున్న కాంట్రాక్టర్లతో షేడ్ నెట్లు ఏర్పాటు చేయించాలని సూచించారు. వర్షపు నీటిని సంరక్షించాలని డ్వామా పీడీని ఆదేశించారు. రోడ్డుకు ఇరువైపులతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, తదితర చోట్ల మొక్కలు నాటాలన్నారు. వేసవి దృష్ట్యా వారపు సంతల్లో వైద్య శిభిరాలు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సూర్యఘర్ సోలార్ విద్యుత్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించి సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాలని ఆశాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి నెల మూడో శనివారం కచ్చితంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేయాలన్నారు. అనంతరం జాతీయ డెంగ్యూ దినోత్సవం ఫ్లెక్సీని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమలో డీఎంహెచ్వో డాక్టర్ జమాల్బాషా, గిరిజన సంక్షేమ శాఖ ఇన్చార్జి డీడీ రజనీ, ఐటీడీఏ ఏవో హేమలత, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ జవహర్బాబు పాల్గొన్నారు. కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశం మీకోసంలో 75 వినతుల స్వీకరణ -
ప్రకృతి అందాలు ఎంతో అద్భుతం
● సినీ నటుడు నాగినీడు డుంబ్రిగుడ: మన్యంలో ప్రకృతి అందాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని సినీ నటుడు నాగినీడు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని అంజోడ సిల్క్ఫారం అరకు పైనరీని సందర్శించారు. మంచు తెరల్లో పైన్, యూకలిప్టస్ చెట్ల అందాలను తిలకించారు. సమీపంలోని శాంతినగరంలో గ్రామస్తులతో కొంతసేపు ముచ్చటించారు. పిల్లలతో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇక్కడ వాతావరణం మాదిరిగానే ప్రజలు కల్మషం లేకుండా ఎంతో ఆప్యాయతతో ఆదరిస్తున్నారన్నారు. -
పెళ్లి బృందం కారు బోల్తా
నక్కపల్లి: నక్కపల్లికి సమీపంలో 16 వ నంబర్ హైవేపై సారిపల్లి పాలెం వద్ద నూతన దంపతులు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ఘటనలో నూతన దంపతులతో సహా ఆరుగురికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. కశింకోట మండలం నూతగుంటపాలెం గ్రామానికి చెందిన యామిని, వినయ్లకు గురువారం వివాహం జరిగింది. శుక్రవారం అన్నవరంలో సత్యదేవుని వ్రతం చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా సారిపల్లి పాలెం సమీపంలో బస్సును తప్పించబోయి వీరు ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీ కొంది. ఈ ఘటనలో నూతన దంపతులు యామిని, వినయ్లతోపాటు వైష్టవి, ఆశ, వీరబాబు, రోషిణిలకు గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి, ప్రాథమిక చికిత్స అందించారు. ప్రమాదం పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. నవ దంపతులతో సహా ఆరుగురికి గాయాలు -
మన్యంలో విభిన్న వాతావరణం
ఉదయం మంచు.. మధ్యాహ్నం ఎండ, సాయంత్రం వాన సాక్షి,పాడేరు/డుంబ్రిగుడ : గత 45 రోజులుగా మన్యంలో విభిన్న వాతావరణాన్ని జిల్లా ప్రజలు ఆస్వాదిసున్నారు. తెల్లవారు నుంచి ఉదయం 8 గంటల వరకు దట్టంగా పొగమంచు, సూర్యోదయం అయిన తరువాత మధ్యాహ్నం ఒంటిగంట వరకు అధిక ఎండతో సతమతమవుతున్నారు. మధ్యాహ్నం 3 గంటల తరువాత ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయి. సాయంత్రం 4గంటల తరువాత ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తోంది. శుక్రవారం కూడా పాడేరుతో పాటు డుంబ్రిగుడ తదితర ప్రాంతాల్లో ఇదే వాతావరణం నెలకొంది. -
రిమాండ్ ఖైదీ కుటుంబానికి ఆర్థిక సాయం
సాక్షి,పాడేరు: గంజాయి కేసులో చిత్తూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటూ మృతిచెందిన సరమండ ప్రవీణ్కుమార్(26) కుటుంబానికి ప్రభుత్వం రూ.5లక్షల ఆర్థిక సాయం మంజూరు చేసింది. జి.మాడుగుల మండలం గడుతూరు పంచాయతీ రాళ్లపుట్టు గ్రామానికి చెందిన ప్రవీణ్కుమార్ గంజాయి కేసులో పట్టుబడ్డాడు. రిమాండ్లో ఉన్న అతను మృతి చెందడంతో బాఽధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని జాతీయ మానవ హక్కుల సంఘం సిఫార్సు చేసింది. ఈ మేరకు రూ.5లక్షల ఆర్థిక సాయం చెక్కును మృతుడు కుటుంబానికి శుక్రవారం ఐటీడీఏలో కలెక్టర్ అందజేశారు. -
19 నుంచి ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు
సాక్షి,పాడేరు: ఈనెల 19 నుంచి 28 వరకు ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో వేసవి శిక్షణ తరగతుల ప్రచార పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 7,837మంది విద్యార్థులు 46 కేంద్రాల్లో రాసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో 163(2) బీఎన్ఎస్ఎస్–2023 సెక్షన్ అమలుకు ఉత్తర్వులు జారీ చేశామని చెప్పారు. ఈ సెక్షన్ ప్రకారం పరీక్షా కేంద్రానికి సమీపంలో ఐదుగురు లేక అంతకన్నా ఎక్కువ మంది గుమిగుడి ఉండకూడదని తెలిపారు. కర్రలు, పేలుడు వస్తువులు, ఇతర ఆయుధాలు, రాళ్లు తీసుకుని రావడం నిషేధం అన్నారు. ఐదు,ఆరు తరగతి విద్యార్థులకు కమాల్ క్యాంపులు పేరిట ప్రథమ ఫౌండేషన్ నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 46 కేంద్రాల్లో పరీక్ష రాయనున్న 7837 మంది విద్యార్థులు కలెక్టర్ దినేష్కుమార్ -
ఆపరేషన్ సిందూర్ భారతీయుల మనోభావాలకు ప్రతీక
రంపచోడవరం: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతి చర్యగా ఆపరేషన్ సిందూర్తో భారత్ సత్తా చాటిన నేపథ్యంలో శుక్రవారం రంపచోడవరంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ చోళ్ల బొజ్జిరెడ్డి మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ కోట్లాది మంది భారతీయుల మనోభావాలకు ప్రతీక అన్నారు. ఇదీ సైన్యం సాధించిన ఘన విజయమన్నారు. ఈ సందర్భంగా మాజీ సైనిక ఉద్యోగి గోవిందరావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఈక బుల్లికొండలదొర, కారం సీతారామన్నదొర, గుడ్ల అంక శ్రీనివాసరెడ్డి, కేఎల్ ఎన్ గురుప్రసాద్, కుంజం వెంకటేశ్వర్లుదొర, కంగల శ్రీనివాసరావు, గౌస్ మొహిద్దిన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి రంపచోడవరంలో ఘనంగా తిరంగా ర్యాలీ -
అయ్యవార్లకు తిప్పలు
● మెడికల్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం ● అసోసియేషన్ ఫిర్యాదుతో తేరుకున్న కేజీహెచ్ వైద్యులు ● హడావుడిగా డీఈవో కార్యాలయానికి అందజేత ● ఉమ్మడి విశాఖ జిల్లాలో 1,200 మంది పీహెచ్ టీచర్లు ● వీరిలో 442 మంది వైకల్యంపై నిశిత పరిశీలన విశాఖ విద్య: జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు తీవ్ర కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం జారీ చేసిన బదిలీల చట్టం మేరకు ఖాళీల గుర్తింపు ఒక కొలిక్కి వచ్చింది. పాఠశాలల పునర్నిర్మాణంపై ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఆందోళనలకు పిలుపునిచ్చినా.. బదిలీలు చేపట్టేలా విద్యాశాఖాధికారులు అంతా సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాధాన్యతల పాయింట్లు కేటాయింపునకు సంబంధిత ఉపాధ్యాయులు నమోదు చేసుకోవాలని డీఈవో కార్యాలయ అధికారులు ప్రత్యేక గూగుల్ ఫాంను విడుదల చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, దివ్యాంగ ఉపాధ్యాయులు వెంటనే ఈ ఫాం పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే జిల్లా స్థాయి ప్రత్యేక శిబిరానికి హాజరైనా.. నేటికి కూడా మెడికల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా గూగుల్ ఫాం పూర్తి చేయాలని ఆదేశించడంతో అయ్యవార్లకు తిప్పలు తప్పడం లేదు. వైకల్యం నిజమేనా? బదిలీల సందర్భంగా ప్రాధాన్యత కోరుతున్న ఉపాధ్యాయులు గతంలో సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్లు చెల్లవని ప్రభుత్వం స్పష్టం చేసింది. వాటి కోసం మళ్లీ వైద్యుల ముందు హాజరుకావాల్సిందేనని ఆదేశించింది. ఉమ్మడి జిల్లాలో 1,200 మంది వరకు ప్రాధాన్యత పాయింట్లు పొందే ఉపాధ్యాయులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 56 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నట్లు గతంలో సమర్పించిన సర్టిఫికెట్లలో వాస్తవమెంత అనేది తేల్చాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా మెడికల్ బోర్డు ముందు 442 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. సర్టిఫికెట్ల జారీ కోసం కొంతమంది ఉపాధ్యాయులు వైద్యులను మేనేజ్ చేశారని ప్రచారం సాగుతోంది. 20 రోజులు గడిచినా అందని సర్టిఫికెట్లు జిల్లా స్థాయి మెడికల్ బోర్డు ముందు హాజరై 20 రోజులు గడుస్తున్నా.. వైకల్య ధ్రువీకరణ పత్రాలు(మెడికల్ సర్టిఫికెట్లు) అందకపోవడంపై కొంతమంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇదే విషయమై అపస్ సంఘం జిల్లా నాయకులు శుక్రవారం కేజీహెచ్ సూపరింటెండెంట్కు వినతి పత్రం అందజేశారు. దీంతో తేరుకున్న కేజీహెచ్ పాలనాధికారులు ఆయా విభాగాల్లో ఉన్న సర్టిఫికెట్లు సేకరించి, హుటాహుటిన డీఈవో కార్యాలయానికి పంపించారు. ఎంఈవోలకు పంపించాం కేజీహెచ్ నుంచి శుక్రవారం మెడికల్ సర్టిఫికెట్లు అందాయి. వాటిని అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా డీఈవోలకు వెంటనే పంపించాం. విశాఖ జిల్లాకు సంబంధించి ఎంఈవోల ద్వారా సంబంధిత ఉపాధ్యాయులకు అందించాలని ఆదేశించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బదిలీలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశాం. – ఎన్.ప్రేమ్ కుమార్, నోడల్ అధికారి, ఉమ్మడి విశాఖ జిల్లా దివ్యాంగులకు న్యాయం చేయాలి దివ్యాంగుల చట్టాన్ని ప్రభుత్వం విస్మరించింది. దీనిపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్టు తీర్పుకు అనుగుణంగా బదిలీల్లో ప్రాధాన్యం కల్పించి దివ్యాంగ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి. –ఏ.శ్రీనివాసరావు, వికలాంగుల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి, విశాఖపట్నం -
గతుకుల రోడ్డుపై ఆటో బోల్తా
ఎస్.రాయవరం: మండలంలోని నీలాద్రిపురం సమీపంలో అడ్డురోడ్డు – నర్సీపట్నం ఆర్అండ్బీ రోడ్డుపై గురువారం ఆటో బోల్తా పడి డ్రైవర్ మృతి చెందాడు. ఎస్ఐ విభీషణరావు వివరాల ప్రకారం.. తిమ్మాపురం గ్రామానికి చెందిన శానాపతి లక్ష్మీవరప్రసాద్(32) భార్యాపిల్లలతో తన స్వగ్రామం నుంచి చినగుమ్ములూరు వెళ్తుండగా, రోడ్డుపై గతుకులు కారణంగా ఆటో బోల్తా పడింది. ఈ క్రమంలో ఆటో కింద పడిపోయిన లక్ష్మీవరప్రసాద్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అడ్డురోడ్డు సన్షైన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యం పొందుతూ మృతి చెందినట్టు ఎస్ఐ తెలిపారు. మృతడు నాలుగేళ్లుగా తిమ్మాపురం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెంలో నివాసం ఉంటూ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చినగుమ్ములూరులో వివాహానికి వెళ్లేందుకు వచ్చి ఈ ప్రమాదానికి గురయ్యాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు. డ్రైవర్ మృతి -
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు
అధికారులతో విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ సమీక్ష మహారాణిపేట(విశాఖ): జూన్ 21న విశాఖ వేదికగా జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టరేట్ మీటింగ్ హాల్లో అధికారులతో గురువారం ఆయన సమీక్షించారు. జూన్ 21న ఉదయం 6 నుంచి 8 మధ్య 45 నిమిషాలు పాటు కార్యక్రమం జరగనుందన్నారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన ప్రాంతాల్లో సుమారు 2.5 లక్షల మంది భాగస్వామ్యమయ్యేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రముఖులు ఆర్కే బీచ్ రోడ్ లేదా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే ప్రధాన వేడుకల్లో భాగస్వామ్యం అవుతారని, దానికి సంబంధించిన ఏర్పాట్లు పక్కాగా చేయాలని నిర్దేశించారు. ప్రత్యామ్నాయ వేదికలుగా ఏయూ కన్వెన్షన్ హాలు, మద్దిలపాలెం కాకతీయ ఫంక్షన్ హాల్ లేదా స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలను గుర్తించి తగు ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు, క్రీడాకారులకు, ప్రధాన వేదికల వద్ద భాగస్వామ్యం అయ్యే వారికి ముందస్తు శిక్షణ అందించాలన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, డీసీపీ మేరీ ప్రశాంతి, జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీశంకర్, ఏడీసీపీ రాజ్ కమల్, ప్రత్యేకాధికారులు సత్తిబాబు, సుధాసాగర్, శేషశైలజ, మధుసూదన్ రావు, డీఈవో ప్రేమకుమార్, ఆర్ఐవో, ఇతర విభాగాల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
కూటమి మాస్టర్ ప్లాన్
విశాఖ సిటీ: కూటమి ‘మాస్టర్’ ప్లాన్ వేస్తోంది. తమ వారికి లబ్ధి చేకూరేలా బృహత్తర ప్రణాళికలో సవరణలకు సిద్ధమైంది. ప్రజాప్రతినిధుల ప్రయోజనాలకు పెద్ద పీట వేసేందుకు అడుగులు వేస్తోంది. చెల్లికి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ.. అన్నట్లు.. 2021లో పూర్తయిన విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(వీఎంఆర్డీఏ) బృహత్తర ప్రణాళిక–2041 పునఃపరిశీలన చేపట్టాలని నిర్ణయించింది. గతంలో అశాసీ్త్రయంగా మాస్టర్ప్లాన్ రూపొందించారన్న నెపంతో అయిపోయిన పెళ్లికి మళ్లీ బాజాలు వాయించడానికి పూనుకుంది. కేవలం కూటమి నేతల స్థిరాస్తి వ్యాపారాలకు మేలు జరిగేలా మార్పులు, చేర్పులకు ఈ నెల 22 నుంచి మళ్లీ మాస్టర్ ప్లాన్పై అభ్యంతరాల స్వీకరణ ప్రారంభించనుంది. 2021లోనే మాస్టర్ ప్లాన్ పూర్తి వీఎంఆర్డీఏ పరిధిలో ప్రజల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో బృహత్తర ప్రణాళిక–2041కు ఆమోద ముద్ర వేసింది. వాస్తవానికి 2011లో ఈ ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. ఏళ్లు గడిచినా అది పూర్తి కాకపోవడంతో 2016లో ప్రైవేట్ కన్సల్టెంట్ సంస్థ లీ అసోసియేట్స్కు రూ.10 కోట్లకు ఆ బాధ్యతను అప్పగించారు. అయినప్పటికీ 2019కి కూడా అది పూర్తి కాలేదు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాస్టర్ప్లాన్పై దృష్టి సారించింది. మాస్టర్ ప్లాన్ రూపకల్పన సమయంలో వీఎంఆర్డీఏ పరిధిలో 46 మండలాలు, 1,312 గ్రామాలున్నాయి. ప్రణాళికను రూపొందించేందుకు విశాఖపట్నంలోని 5 వర్గాలు, 45 రెవెన్యూ, 55 మత్స్యకార గ్రామాలు, 13 వార్డులను పరిగణనలోకి తీసుకొని.. సలహాలు, సూచనలు ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా వివరాలు సేకరించారు. అలాగే విజయనగరం జిల్లాలోని 48 రెవెన్యూ, 19 మత్స్యకార గ్రామాలు, 5 వార్డులు, రెండు వర్గాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందుకోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ, అభ్యంతరాల స్వీకరణలో మొత్తంగా 17,460 అభ్యంతరాలు, సలహాలు వచ్చాయి. వీఎంఆర్డీఏ, రెవెన్యూ, ఇతర సంబంధిత విభాగాల అధికారులతో సంయుక్త తనిఖీలు, సందర్శనలు నిర్వహించి వాటిన్నింటినీ పరిశీలించారు. మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా.. ఆ ప్రాంత భౌగోళిక స్థితిగతులను అనుసరించి విభిన్న కోణాల్లో ఆలోచన చేసి ముసాయిదా మాస్టర్ప్లాన్ను సిద్ధం చేశారు. దానికి ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో 2021 నవంబర్ 8న వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్–2041కు అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ప్రజాప్రతినిధులకు లబ్ధి చేకూరేలా? ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులకు లబ్ధి చేకూర్చాలన్న ఆలోచనతోనే వీఎంఆర్డీఏ బృహత్తర ప్రణాళిక–2041 పునః పరిశీలనకు సిద్ధమవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాల పేరుతో కూటమి నాయకులు సూచించిన మార్పులు, చేర్పులకే పెద్ద పీట వేయాలన్న నిర్ణయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా వారు సూచించిన అంశాలను పరిగణనలోకి తీసుకోవడానికి ఈ ప్రక్రియను చేపడుతున్నట్లు సమాచారం. వీరి స్థిరాస్తి వ్యాపారాలు, వ్యక్తిగత ఆస్తుల విలువ పెంచుకునేందుకు మాస్టర్ ప్లాన్ రహదారుల ప్రణాళికలను మార్పులు చేసుకోడానికి సిద్ధమవుతున్నట్లు కూటమిలో చర్చ జరుగుతోంది. ప్రధానంగా మధురవాడ నుంచి ఆనందపురం మధ్యలోను అలాగే అనకాపల్లిలో పలు చోట్ల మార్పులు, చేర్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మాస్టర్ ప్లాన్ మొత్తంగా మార్పు చేసే అవకాశం లేదని అధికారులు తేల్చి చెబుతున్నారు. కేవలం వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి శాసీ్త్రయంగా ఉన్న వాటిని మాత్రమే మార్పులు, చేస్తామని స్పష్టం చేస్తున్నారు. మళ్లీ అభ్యంతరాల స్వీకరణ వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్పై ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టీడీపీ నాయకులు ఆరోపణలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్లాన్లో మార్పులు చేస్తామని అప్పుడే ప్రకటించారు. అన్నట్లుగానే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మాస్టర్ ప్లాన్–2041ను సమ్రంగా సమీక్షించాలని నిర్ణయించింది. నాలుగు నెలల్లో కొత్త మాస్టర్ప్లాన్ను తీసుకువస్తామని అమాత్యులు సైతం ప్రకటించారు. ఇందుకు అనుగుణంగానే బృహత్తర ప్రణాళికను పునః పరిశీలనకు తేదీని ఖరారు చేశారు. ఈ నెల 22 నుంచి జూన్ 21వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించాలని నిర్ణయించారు. వీఎంఆర్డీఏ పరిధిలో ఉన్న ప్రజలు, భాగస్వాములు, సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించనున్నారు. మాస్టర్ ప్లాన్–2041లో ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే స్వయంగా గానీ, పోస్టు లేదా ఆన్లైన్ ద్వారా కూడా తెలపవచ్చని వీఎంఆర్డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ ప్రకటించారు. ప్రజలందరూ మొబైల్ ద్వారా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. వీఎంఆర్డీఏ బృహత్తర ప్రణాళిక–2041 పునఃపరిశీలన షురూ.. ఈ నెల 22 నుంచి జూన్ 21 వరకు మళ్లీ అభ్యంతరాల స్వీకరణ ఇందులో ప్రజాప్రతినిధులప్రయోజనాలకు పెద్దపీట వారి స్థిరాస్తి వ్యాపారాలకు అనుగుణంగా సవరణలకు ప్లాన్ నేతలు చెప్పినట్లే మార్పులు చేయాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు? -
జూలై 5న జాతీయ లోక్ అదాలత్
విశాఖ లీగల్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలోని అన్ని న్యాయస్థానాల్లో జూలై 5వ తేదీన జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు తెలిపారు. ఈనెల 10న జరగాల్సిన ఈ అదాలత్ వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. న్యాయ స్థానాల్లో ఉన్న పెండింగ్ కేసులు, సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్ట పరిహారాల కేసులు, సెక్షన్ 138 నిరాధరణకు గురైన చెక్కులు కేసులు, బ్యాంకు, మనీ రికవరీ కేసులు, ల్యాండ్ అక్విజిషన్ కేసులు, కార్మిక, కుటుంబ తగాదాలు (విడాకులు కేసులు కాకుండా), పారిశ్రామిక వివాదాలు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు విశాఖలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, న్యాయ సేవా సదన్లో లేదా 0891–2560414, 2575046 ఫోన్ నెంబర్లలో, మండల న్యాయ సేవా సంఘాల్లో సంప్రదించాలన్నారు. రాష్ట్ర, జాతీయ క్రెడాయ్ కమిటీల్లో విశాఖకు పెద్దపీట విశాఖ సిటీ: విశాఖకు చెందిన పలువురు ప్రముఖులు రియల్ ఎస్టేట్ డెవలపర్ల సంఘాల సమాఖ్య(క్రెడాయ్)లో రాష్ట్ర, జాతీయ స్థాయి కీలక పదవులకు ఎంపికయ్యారు. ఈ నియామకాలతో విశాఖ ఖ్యాతి జాతీయ స్థాయిలో మరింత పెరిగిందని క్రెడాయ్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ నూతన కార్యవర్గం కొలువుదీరింది. రాష్ట్ర అధ్యక్షుడిగా బయన శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీగా కె.ఎస్.ఆర్.కె.రాజు బాధ్యతలు స్వీకరించారు. మరో కార్యక్రమంలో.. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ సమక్షంలో క్రెడాయ్ జాతీయ స్థాయి పదవుల్లోనూ విశాఖ ప్రతినిధులు స్థానం సంపాదించారు. నేషనల్ ఎమర్జింగ్ సిటీస్ కన్వీనర్గా బొప్పన రాజా శ్రీనివాస్, సివిల్ ఏవియేషన్ కో–కన్వీనర్గా అశోక్కుమార్ ఎరడాల, క్రెడాయ్ యూత్ వింగ్ (సౌత్) జాయింట్ సెక్రటరీగా గొంప కార్తీక్ నియమితులయ్యారు. -
రెగ్యులర్ vs ఎయిడెడ్
విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీలో ఆధిపత్య పోరు మళ్లీ రాజుకుంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వర్సిటీలోని కొంతమంది ఆచార్యులు విద్యార్థులకు పాఠాలు చెప్పడం మానేసి, పాలనలో పెత్తనం కోసం ఆరాటపడుతున్నారు. రాష్ట్రంలోని వేర్వేరు ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల నుంచి ఫారిన్ సర్వీసుపై ఏయూకు వచ్చిన అధ్యాపకుల పట్ల వర్సిటీలోని ఓ వర్గం వ్యవహరిస్తున్న తీరు ఇందుకు నిదర్శనం. 1000 మందికి పైగా అధ్యాపకులు ఉండాల్సిన ఏయూలో ప్రస్తుతం 140 మంది మాత్రమే రెగ్యులర్ ప్రాతిపదికన పని చేస్తున్నారు. దీంతో కాంట్రాక్టు, అతిథి అధ్యాపకులతోనే కాలేజీల్లో పాఠాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమ సేవలను వినియోగించుకోవాల్సింది పోయి.. తామేదో పరాయి దేశం నుంచి వచ్చినట్లుగా, వెళ్లిపోండంటూ కొంతమంది కావాలని రాద్ధాంతం చేస్తున్నారని ఎయిడెడ్ అధ్యాపకులు మదన పడుతున్నారు. క్యాంపస్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, డీన్లలతో మంగళవారం జరిగిన వైస్ చాన్సలర్ సమీక్షలోనూ ఓ వర్గం ఇదే అంశంపై పట్టుబట్టడం.. ఇప్పుడు వర్సిటీలో హాట్ టాపిక్గా మారింది. రెగ్యులర్ అధ్యాపకుల కొరతతో మల్లగుల్లాలు ఏయూలో రెగ్యులర్ అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో 2023 జూన్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎయిడెడ్ కాలేజీల నుంచి ఫారిన్ సర్వీసు కింద 80 మంది అధ్యాపకులను తీసుకున్నారు. వర్సిటీ పాలక మండలి ఆమోదంతో నిర్ణయం తీసుకున్నందున ఉన్నత విద్యామండలి అధికారులు సైతం ఇందుకు అనుమతించారు. కాగా.. ఎయిడెడ్ అధ్యాపకుల రాకను ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది నచ్చక దాదాపు 40 మంది వెనక్కి వెళ్లిపోయారు. మిగిలిన వారిలో ఒకరు మృతి చెందగా, మరొకరు ఇటీవలే మాతృ సంస్థకు వెళ్లారు. ప్రస్తుతం 38 మంది ఎయిడెడ్ నుంచి వచ్చిన అధ్యాపకులు పనిచేస్తున్నారు. క్యాంపస్ కాలేజీల్లోని ఆయా విభాగాల్లో తరగతుల నిర్వహణలో వీరంతా కీలకంగా పనిచేస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఆధిపత్య పోరు ఎయిడెడ్ అధ్యాపకులను వెనక్కి పంపించేయాలని ఓ వర్గం పట్టు వైస్ చాన్సలర్ సమీక్షలోనూ ఇదే చర్చ పాఠాలు పక్కన పెట్టి.. పెత్తనంపై ఆరాటం ఏయూలో అధ్యాపకుల తీరుపై విమర్శలు తెరపైకి హయ్యర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ లేఖ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎయిడెడ్ అధ్యాపకులను వెనక్కి పంపించేలా ఓ వర్గం ఒత్తిడిచేస్తూనే ఉంది. కానీ ఫారిన్ సర్వీసుపై వచ్చినందున 2026 జూన్ వరకు వారికి ఇక్కడ పనిచేసే అవకాశం ఉంది. వర్సిటీనే వేతనాలు చెల్లిస్తున్నందున, వారి సేవలను కొనసాగించాలనుకుంటున్నారా లేదా అంటూ మార్చిలో హయ్యర్ ఎడ్యుకేషన్ డైరక్టర్ ఇక్కడి అధికారులకు లేఖ రాశారు. వందేళ్ల ఉత్సవాలు నిర్వహిస్తున్న తరుణంలో వారి విషయంలో నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం కావాలని వర్సిటీ అధికారులు ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిసింది. ఇదే అదునుగా భావించిన వర్సిటీలోని ఓ వర్గం ఎయిడెడ్ అధ్యాపకులను వెనక్కి పంపించేయాల్సిందేనని ప్రస్తుత వైస్ చాన్సలర్పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. వారి వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని సామాజిక మాధ్యమాల వేదికగా నిరసన గళం వినిపిస్తున్నారు. ఖాళీల భర్తీ ఇప్పట్లో లేనట్లేనా? రాష్ట్రంలోని ఆంధ్ర కేసరి యూనివర్సిటీలో టీచింగ్ 10 మంది, నాన్ టీచింగ్ 20 మంది అవసరం ఉందని, ఆన్ డ్యూటీ బేసిస్/ఫారిన్ సర్వీసు కింద పనిచేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని కాలేజీ ఎడ్యుకేషన్ డైరక్టర్ నారాయణ భరత్ గుప్తా ఈ నెల 8న సర్క్యులర్ జారీ చేశారు. ఇది తమకు కొంత ఊరటనిచ్చే విషయమేనని ఏయూలో ఫారిన్ సర్వీసు కింద పనిచేస్తున్న ఎయిడెడ్ అధ్యాపకులు అంటున్నారు. అయితే ఆయా యూనివర్సిటీలు 2025–26 విద్యా సంవత్సరానికి తమ అవసరాల మేరకు తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలని సూచించడం బట్టి, ఇప్పట్లో ప్రభుత్వం రెగ్యులర్ ఖాళీల భర్తీపై దృష్టి సారించే ఆలోచనలో లేదని తెలుస్తోంది. -
ప్రాజెక్టుల వేగవంతంపై ప్రత్యేక దృష్టి
సాక్షి, విశాఖపట్నం: తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్ సేవలందిస్తామని సంస్థ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టి.వనజ అన్నారు. ఇటీవలే డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఆమె.. డిస్కమ్ పరిధిలోని పలు సర్కిళ్లలో పర్యటించి, ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ’సాక్షి’తో మాట్లాడుతూ విద్యుత్ సంస్థల్లోని అన్ని విభాగాల్లో 37 ఏళ్ల పాటు సేవలందించిన అనుభవం తనకుందన్నారు. ప్రస్తుతం ఈపీడీసీఎల్లో జరుగుతున్న పనులపై సమగ్రంగా అధ్యయనం చేస్తున్నానని, చేపట్టిన పనులన్నీ చురుగ్గా సాగుతున్నాయని వెల్లడించారు. నగర పరిధిలో రెండో దశలో భాగంగా రూ.909 కోట్ల వ్యయంతో 1,876 కిలోమీటర్ల మేర భూగర్భ విద్యుత్ వ్యవస్థ పనులు జరుగుతున్నాయని, ఇప్పటివరకు 120 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఆర్ఎంఈఎస్, డీటీఆర్స్ మొదలైన వాటిపై కసరత్తు జరుగుతోందని, ఆగస్ట్ 15 నాటికి పనులు పూర్తి చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అయితే తవ్వకాల కోసం జీవీఎంసీ నుంచి అనుమతులు, ఫారెస్ట్ క్లియరెన్స్ల కారణంగా కొంత జాప్యం జరుగుతోందన్నారు. సమయం తక్కువగా ఉన్నందున పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల విభజన పనులపై సమీక్ష నిర్వహించామని, ఫీడర్ బైఫరకేషన్ పనుల్లో ప్యాకేజీ–1 గత నెలాఖరు చివరి నాటికి 27 శాతం పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను పూర్తి చేసేందుకు సర్కిళ్ల వారీగా లక్ష్యాలను నిర్దేశించామన్నారు. ఇండోర్, అవుట్డోర్ సబ్స్టేషన్ల ఏర్పాటుపైనా ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. రాబోయే వర్షాకాలంలో పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉన్నందున.. ముందుగానే పనుల వేగాన్ని పెంచాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘పీఎం జుగా’(ప్రధాన్ మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్) పథకం కింద ఎస్టీ గ్రామాలకు విద్యుత్ వెలుగులు అందించేందుకు కృషి చేస్తున్నామని డైరెక్టర్ వనజ వివరించారు. ఆగస్ట్ 15 నాటికి రెండో దశ భూగర్భ విద్యుత్ పూర్తి చేస్తాం ఈపీడీసీఎల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ వనజ -
నిరంతర విద్యుత్ సరఫరాయే లక్ష్యం
సాక్షి, విశాఖపట్నం: ఈపీడీసీఎల్ పరిధిలోని అన్ని సర్కిళ్లలో నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని ఈపీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ టీవీ సూర్యప్రకాష్ అన్నారు. ఇటీవల డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించిన ఆయన.. డిస్కమ్ పరిధిలోని వివిధ సర్కిళ్లలో సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రాజెక్టుల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ’సాక్షి’తో మాట్లాడుతూ విద్యుత్ శాఖలో వివిధ హోదాల్లో 35 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉందన్నారు. 2021లో పదవీ విరమణ చేసినప్పటికీ, ప్రస్తుతం డైరెక్టర్గా తిరిగి బాధ్యతలు చేపట్టినట్లు సూర్యప్రకాష్ తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టినట్లు వెల్లడించారు. సర్కిళ్ల వారీగా వినియోగదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, సరఫరాలో లోపాలపై నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఈ నివేదికల ఆధారంగా అవసరమైన మార్పులు చేసి, నిరంతరాయ విద్యుత్ సరఫరాకు చర్యలు చేపడతామన్నారు. రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ను అందించేందుకు కృషి చేస్తామని, గ్రామీణ ప్రాంతాలకు 24 గంటలూ మూడు ఫేజుల విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల తరచూ జరుగుతున్న విద్యుత్ ప్రమాదాలను అరికట్టేందుకు, ఉన్నతాధికారుల సూచనల మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో విద్యుత్ కోటా కంటే డిమాండ్ ఎక్కువగా ఉందని, రోజూ 18 నుంచి 19 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోందన్నారు. గాలి, వర్షాల కారణంగా వైర్లు తెగిపడటం, స్తంభాలు కూలిపోవడం వంటి అత్యవసర పరిస్థితులు మినహా, మిగతా సమయాల్లో ఈపీడీసీఎల్ పరిధిలో అంతరాయాలు లేకుండా సరఫరా చేస్తున్నట్లు వివరించారు. నైరుతి రుతుపవనాలు త్వరగా ప్రవేశించే అవకాశం ఉన్నందున.. వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు ఇప్పటికే ప్రారంభించామన్నారు. ప్రతి లైన్ను క్షుణ్ణంగా పరిశీలించి, లోపాలను సరిదిద్దుతున్నామని.. వర్షాకాలంలో సరఫరాలో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రణాళికలు అమలు చేస్తామని సూర్యప్రకాష్ వివరించారు. ఈపీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ సూర్యప్రకాష్ -
మలేరియా పట్ల అప్రమత్తత అవసరం
● డీఎంవో తులసి చింతపల్లి: ఆదివాసీ గ్రామాల్లో గిరిజనులు మలేరియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అదికారి తులసి అన్నారు. గురువారం ఆమె కిటుముల శివారు నిమ్మలపాలెం గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో మలేరియా పాజిటివ్ కేసు నమోదైన ఇంటిని, రోగిని పరిశీలించారు. దోమల వల్ల వచ్చే వ్యాదులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించారు. జ్వరం వచ్చిన వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలన్నారు. రక్త పరీక్ష కిట్లు ఆశా కార్యకర్తలు వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు. మలేరియా వ్యాధి పట్ల నిర్లక్ష్యం తగదన్నారు. ముందుగా గుర్తించిన గ్రామాల్లో దోమల నివారణ మందు పిచికారి చేపడుతున్నామని, ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో మందు పిచికారి చేయుంచుకోవాలన్నారు. జూన్ 15 వరకూ జిల్లా వ్యాప్తంగా పిచికారి కొనసాగుతుందన్నారు. సబ్ యూనిట్ అదికారులు బుక్కా చిట్టిబాబు, సత్యనారాయణ, ఏఎంవో యుగంధర్ పాల్గొన్నారు. -
ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి
చింతూరు: గిరిజన సమస్యల పరిష్కారం కోసం తక్షణమే ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ను ఏర్పాటు చేయాలని ఆదివాసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం కోరుతూ చింతూరు డివిజన్ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఐటీడీఏ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఏజెన్సీలో ఉద్యోగ నియామకాల కోసం చట్టం చేయాలని, మెగా డీఎస్సీలో ఏజన్సీ పోస్టులను మినహాయించి ప్రత్యేక ఏజెన్సీ డీఎస్సీ నిర్వహించి స్థానిక ఆదివాసీ యువతతో పోస్టులను భర్తీచేయాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఉద్యోగాలన్నీ స్థానిక ఆదివాసీలతోనే భర్తీ చేయాలనే డిమాండ్ల సాధన కోసం రాష్ట్రం వ్యాప్తంగా అన్ని ఐటీడీఏ వద్ద రిలే నిరాహార దీక్షలను చేపట్టినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సెంట్రల్ కమిటీ నాయకుడు మడివి నెహూర, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర నాయకుడు పూసం శ్రీను, తుష్టి జోగారావు, సోడె నారాయణ, కాక రాజు, కుంజా అనిల్, జల్లి నరేష్, మల్లయ్య, రాంప్రసాద్, ముత్తయ్య, రామారావు, రాజశేఖర్, రవి, లావణ్య, శివ పాల్గొన్నారు. -
విశాఖ వెళ్లేందుకు నరకయాతన
● ప్రత్యేక సర్వీసులు నిలిపివేయడంతో ఇబ్బందులు సాక్షి,పాడేరు: పాడేరు నుంచి చోడవరం, విశాఖపట్నం ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు గురువారం నరకయాతన పడ్డారు. మోదకొండమ్మ జాతర సందర్భంగా మైదాన ప్రాంతాలకు నడిపిన 18 ప్రత్యేక సర్వీసులు బుధవారం రాత్రితో నిలిపివేశారు. గురువారం ఉదయం నుంచి పాడేరు–విశాఖ మధ్య రెగ్యులర్ బస్ సర్వీసులు నడిచాయి. పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్లో ప్రయాణికుల రద్దీ అధికమైంది. విశాఖ వెళ్లే బస్సు సర్వీసులు కిక్కిరిసిపోయాయి. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ పాడేరు డిపో యాజమాన్యం మైదాన ప్రాంతాలకు అదనంగా బస్సు సర్వీసులు నడపకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఏజెన్సీలో విస్తారంగా వర్షాలు
సాక్షి,పాడేరు: ఏజెన్సీలో వర్షాలు కొనసాగుతున్నాయి.గురువారం మధ్యాహ్నం నుంచి పాడేరుతో పాటు అనేక ప్రాంతాలలో విస్తారంగా వర్షం కురిసింది.పాడేరు పట్టణం.సమీప ప్రాంతాలలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎకదాటిగా కురిసిన కుండపోత వర్షంతో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాలు ఖరీఫ్తోపాటు, రబీ పంటలకు మేలు చేస్తాయని జిల్లా వ్యవసాయాఽధికారి ఎస్బీఎస్ నందు తెలిపారు. రోడ్డుకు అడ్డంగా కూలిన వృక్షం అడ్డతీగల: మండలంలో గురువారం వీచిన ఈదురుగాలులకు అడ్డతీగల–వై.రామవరం మార్గంలో వెదురునగరం వద్ద భారీ వృక్షం కూలింది. దీంతో సుమారు రెండు గంటల పాటు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు, స్థానికులు ఎట్టకేలకు భారీ వృక్షాన్ని రోడ్డుకు అడ్డంగా లేకుండా తొలగించారు. ముంచంగిపుట్టు: మండల కేంద్రంలో గురువారం మధ్యాహ్నం ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై వరదనీరు భారీగా ప్రవహించింది. సంతబయలు, ఇందిరాకాలనీల్లో వరదనీరు ఇళ్లముందు నిలిచిపోయింది. పెనుగాలులు జీడిమామిడికి నష్టం కలిగించాయి. రాజవొమ్మంగి: మండలంలో గురువారం ఈదురుగాలులు, ఉరుములతో భారీ వర్షం కురిసింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం చల్లబడటంతో వేసవి తాపం నుంచి ఉపశమనం పొందారు. -
మ్యూజియం నిర్మాణ పనులు వేగవంతం
గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి ఎంఎం నాయక్ ఆదేశం చింతపల్లి: తాజంగిలో చేపట్టిన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఎంఎం నాయక్ ఆదేశించారు. గురువారం ఆయన పాడేరు ఐటీడీఏ ఇన్చార్జి పీవో, జేసీ డాక్టర్ అభిషేక్ గౌడతో కలిసి మ్యూజియం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నిర్మాణ పనులు జాప్యానికి కారణమైన కాంట్రాక్టర్ను తొలగించి టెండర్లను రద్దు చేశామన్నారు. ప్రస్తుతం రెండో విడత టెండర్లు ప్రక్రియ పూర్తి అయిందన్నారు. టెండర్లు పొందిన కాంట్రాక్టర్లతో సకాలంలో నిర్మాణ పనులను పూర్తిచేసేలా ఇంజనీరింగ్ అదికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పనులను నవంబర్ నాటికి పూర్తిచేసి పర్యాటకులకు అందుబాటులోకి తేవాలని సూచించారు. ఈ మ్యూజియం నిర్మాణానికి 22 ఎకరాలు కేటాయించగా 11 ఎకరాల్లో నిర్మాణ పనులు చేపడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ నిర్మాణ పనులకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రూ.35 కోట్లు కేటాయించగా ఇప్పటివరకు రూ.3 ఖర్చు చేయడం జరిగిందన్నారు. వీటికి నిధుల కొరత లేదన్నారు. ఈ మ్యూజియం ప్రారంభానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారన్నారు. అనంతరం రాజుబందలో నిర్మించిన మల్టీపర్పస్ కేంద్ర భవనంతోపాటు గిరిజనులు నిర్మించుకుంటున్న పక్కా ఇళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ చీఫ్ ఇంజనీర్ ఎస్.శ్రీనివాసు, పాడేరు ఈఈ డేవిడ్ రాజు, డీఈ రఘునాథ్ పాల్గొన్నారు. -
రూ.400 కోట్లతో440 ప్రాజెక్టులు
● నాబార్డు డీడీఎం గౌరీశంకర్ చింతపల్లి: జిల్లాలో నాబార్డు ద్వారా రూ.400 కోట్లతో 440 ప్రాజెక్టులు చేపడుతున్నట్టు నాబార్డు జిల్లా అభివృద్ధి మేనేజర్ (డీడీఎం) వి.గౌరీశంకర్ తెలిపారు. గురువారం చింతపల్లి, జీకేవీధి మండలాల్లో పర్యటించిన ఆయన మన్యసీమ, గిరిజన్ వికాస్ ప్రాంతీయ కార్యాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారితో సమావేశమైన ఆయన మాట్లాడుతూ జిల్లాలో గిరిజన రైతాంగం ఆర్థికాభివృద్ధి సాధనకు ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహిస్తామన్నారు. దీనిలో భాగంగా ఏడు ప్రాజెక్ట్లు అమలు చేస్తున్నామన్నారు. రైతులకు ఆదాయాన్నిచ్చే ఐదు వేల ఎకరాలకు అవసరమైన పండ్ల మొక్కల పెంపకాన్ని ఆర్థికంగా చేయూత అందిస్తామన్నారు. గిరిజన యవత సంఘాలుగా ఏర్పడి ముందుకు వస్తే వారి ఆర్థికాబివృద్ధికి నాబార్డు సాయం అందిస్తుందన్నారు. ఈ కార్య క్రమంలో మన్యసీమ, సుగుణ, మాతోట సీఈవోలు శ్రీనివాసరావు, రాజేష్, చిన్నారావు,సిబ్బంది పాల్గొన్నారు. -
నాటుసారాను నిర్మూలించాల్సిందే
రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలంరంపచోడవరం: ఏజెన్సీలో నాటుసారా నిర్మూలించే బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని స్థానిక ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. గురువారం ఆయన మారేడుమిల్లి పీహెచ్సీ, మండల పరిషత్ కార్యాలయంతోపాటు ఏపీఆర్ బాలుర పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో నాటుసారా తాగడం వల్ల అనేక మంది అనారోగ్యం బారిన పడి చనిపోతున్నారని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో నాటుసారా తయారీ, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఈమేరకు రెవెన్యూ, ఎకై ్సజ్ శాఖలకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. పీహెచ్సీల్లో సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మారేడుమిల్లి పీహెచ్సీలో ఓపీకి వచ్చే రోగులు, గర్భిణులు, బాలింతల వివరాలను వైద్యుల నుంచి తెలుసుకున్నారు. టెన్త్ తప్పిన విద్యార్థులకు ఏపీఆర్లో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ విశ్వనాథ్, తహసీల్దార్ బాలాజీ, వైద్యాధికారి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నిష్ఫలం
మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో ఆశించిన స్థాయిలో ఉత్పాదన జరగడం లేదు. గతేడాది కన్నా నీటి నిల్వలు మెరుగ్గా ఉన్నా జనరేటర్లు తరచూ మరమ్మతులకు గురవడంతో లక్ష్యం మేరకు ఉత్పత్తి చేయలేకపోతోంది. ఆరింటిలో నాలుగు మాత్రమే పనిచేస్తున్నాయి. పాత యంత్రాలు కావడంతో ఎప్పుడు మొరాయిస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. నీళ్లున్నాజనరేటర్లు : 6 ఉత్పాదన: 120 మెగావాట్లు పనిస్తున్నవి: 4 ఉత్పత్తి: 80 మెగావాట్లు ముంచంగిపుట్టు: మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరు అందించే ప్రధాన డుడుమ, జోలాపుట్టు జలాశయాల్లో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నా వినియోగించుకోవడంలో ఆంధ్రా–ఒడిశా అధికారులు పూర్తిగా విఫలం అవుతున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. జోలాపుట్టు, డుడుమ జలాశయాల్లో నీటి నిల్వలు నిలకడగా ఉన్నాయి. గత కొద్ది నెలలుగా ఏజెన్సీలో చెదురుమదురుగా కురిసిన వర్షాలకు వరద నీరు అధికంగా వచ్చి చేరింది. దీంతో నీటి మట్టం క్రమేపీ పెరిగింది. జోలాపుట్టు జలాశయ నీటి మట్టం 2750 అడుగులు కాగా గురువారం నాటికి 2730.55 అడుగులుగా నమోదయింది. గత ఏడాది ఇదే రోజుకు 2697.95 అడుగులు నీటి నిల్వ ఉంది. డుడుమ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 2590 అడుగులు కాగా ప్రస్తుతం 2575 అడుగులుగా ఉంది. మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం దిగువున ఉన్న డుడుమ జలాశయానికి రెండు గేట్లు ఎత్తి వెయ్యి క్యూసెక్కుల నీటిని రెండు రోజులుగా విడుదల చేస్తున్నారు. మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో ఏడాది పొడవునా విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నీరు అందుబాటులో ఉందని జలాశయ అధికారులు చెబుతున్నారు. 120కు 80 మెగావాట్లు మాత్రమే ఉత్పాదన మాచ్ఖండ్లో ఆరు యూనిట్లతో 120 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంది. నాలుగు యూనిట్లలో 80 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. రెండు యూనిట్లు మరమ్మతుల్లోనే ఉన్నాయి. ఈ జలవిద్యుత్ కేంద్రంలో గత కొన్నేళ్లుగా జనరేటర్ల మరమ్మతులకు గురవుతుండటం వల్ల పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసిన పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి. ఆరు జనరేటర్ల సాయంతో 120 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయాలి. వీటిలో 2,3,5,6 జనరేటర్లు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. 1,4 నంబరు జనరేటర్లు మరమ్మతుల దశలో ఉన్నాయి. ● జలవిద్యుత్ కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో కూలింగ్ వాటర్ పంపుల్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఐదు జనరేటర్లలో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు. మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తేవడంతో ప్రస్తుతం 80 మెగావాట్లు ఉత్పత్తి జరుగుతోంది. మరమ్మతుల వైపే మొగ్గు? ప్రాజెక్టు అధికారులు పాతబడిపోయిన జనరేటర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం లేదు. వీరు మరమ్మతులవైపే మొగ్గుచూపుతున్నారన్న విమర్శలున్నాయి. మరమ్మతుల వల్ల నిధులు వృధా తప్ప జలవిద్యుత్ కేంద్రానికి ఎటువంటి ఉపయోగం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు జనరేటర్లు మరమ్మతులకు పరిమితం అవడం వల్ల పూర్తిస్థాయిలో ఉత్పాదన సాధ్యం కావడం లేదు. ఇప్పటికై నా జలవిద్యుత్ కేంద్రం ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పాదనపై దృష్టి సారించాలని సరిహద్దు ప్రాంతీయులు కోరుతున్నారు.మాచ్ఖండ్ సామర్థ్యం నిండుగా డుడుమ, జోలాపుట్టు జలాశయాలు తరచూ మరమ్మతుల్లో జనరేటర్లు ఆరింటిలో నాలుగు మాత్రమే వినియోగం మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో మెరుగుపడని ఉత్పాదన ప్రాజెక్ట్ సాధారణ నీటిమట్టం (అడుగుల్లో) ప్రస్తుతం జోలాపుట్టు 2,750 2730 డుడుమ 2590 2575 పూర్తిస్థాయి ఉత్పాదనకు చర్యలు మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పాదనకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం మరమ్మతులకు గురైన 1,4 నంబరర్ల జనరేటర్లను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రాజెక్టు అధికారులు, సిబ్బంది నిరంతరం పని చేస్తున్నారు. డుడుమ, జోలాపుట్టు జలాశయాల్లో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నిల్వలు ఉన్నందున నీటి సమస్య లేదు. – ఏవీ సుబ్రమణ్యేశ్యరరావు, ఎస్ఈ, మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం -
మెరుగైన వైద్యం అందించాలి
చింతూరు: ఎంతో నమ్మకంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డీసీహెచ్ఎస్ డాక్టర్ లక్ష్మి ఆదేశించారు. గురువారం ఆమె స్థానిక ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీచేశారు. ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్యసేవలను ఆమె తెలుసుకున్నారు. రోగుల వార్డులు, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ, డయాలసిస్ సెంటర్, చిన్నపిల్లల వైద్య విభాగాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆస్పత్రిలో అధునాతన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని, రోగులకు నాణ్యతతో కూడిన వైద్యసేవలు అందించాలని సూచించారు. అన్నిరకాల మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, వైద్యసిబ్బంది సమయపాలన పాటిస్తూ వైద్యసేవలు మెరుగు పరచాలని ఆమె ఆదేశించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు సకాలంలో పరీక్షలు నిర్వహించి వ్యాధి మూలాలను కనుగొని దానికి తదనుగుణంగా త్వరితగతిన వైద్యసేవలు అందించాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎంవీ.కోటిరెడ్డి, వైద్యులు పాల్గొన్నారు.డీసీహెచ్ఎస్ డాక్టర్ లక్ష్మి -
ఏజెన్సీ డీఎస్సీ వెంటనే ప్రకటించాలి
సాక్షి,పాడేరు: మెగా డీఎస్సీ నుంచి ఏజెన్సీ టీచర్ పోస్టులను మినహాయించి, ఈనెల 20న జరిగే క్యాబినేట్ సమావేశంలో ఏజెన్సీ డీఎస్సీని ప్రకటించాలని గిరిజన డీఎస్సీ సాధన కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. బుధవారం కమిటీ ప్రతినిధులు పి.అప్పలనరసయ్య, కిల్లో సురేంద్ర, సమిరెడ్డి మాణిక్యం, కుడుముల కాంతారావు మాట్లాడుతూ అడ్వకేట్ జనరల్ ఫైనల్ లీగల్ ఒపీనియన్ ఇచ్చినప్పటికీ నూరుశాతం టీచర్ పోస్టుల్లో ఎస్టీలకు రిజర్వేషన్ ఉత్తర్వులు జారీ చేయకుండా జాప్యం చేయడం సరికాదన్నారు. ఏజెన్సీలో నూరుశాతం టీచర్ పోస్టులను కేటాయిస్తూ ఈ నెల 15వ తేదీ నాటికి ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా క్యాబినేట్ సమావేశంలోను తగిన నిర్ణయం తీసుకుని గిరిజనులకు న్యాయం చేసేలా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. నూరుశాతం ఉద్యోగ, ఉపాధ్యాయ జీవో తెచ్చింది మేమే, ఇచ్చేది మేమే అంటూ కూటమి ప్రభుత్వం ఆదివాసీల మనోభావాలతో చెలగాటం ఆడటం సరికాదన్నారు. గిరిజన డీఎస్సీ సాధన కమిటీ భవిష్యత్ ఉద్యమాల కార్యాచరణకు సంబంధించి ఈనెల 16న పాడేరులో రాష్ట్రస్థాయి ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ సమావేశం నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్సీ సాధన కమిటీ నాయకులు సలీం, కూడా రాధాకృష్ణ, కోటి, జయప్రసాద్, వంతాల నాగేశ్వరరావు, ధర్మన్నపడాల్, బాలదేవ్, భాను పాల్గొన్నారు. గిరిజన డీఎస్సీ సాధన కమిటీ డిమాండ్ భవిష్యత్తు కార్యాచరణపై పాడేరులో రేపు రాష్ట్రస్థాయి సమావేశం -
త్వరితగతిన సమస్యలపరిష్కారానికి చర్యలు
● ఐటీడీఏ ఏపీవో జగన్నాథరావు చింతూరు: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఐటీడీఏ ఏపీవో జగన్నాథరావు సూచించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ సమస్యలకు సంబంధించి 73 అర్జీలు వచ్చినట్లు ఆయన తెలిపారు. వీటిలో పోలవరం ఆర్అండ్ఆర్కు సంబంధించి 48, భూ సమస్యలకు సంబంధించి 7 దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. వాటిని సంబంధిత అధికారులు పరిశీలించి క్షేత్రస్థాయిలో వివరాలు తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించాలని ఏపీవో సూచించారు. ఈ కార్యక్రమంలో పోలవరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆదివాసీలకు న్యాయం జరిగే వరకు ధర్మ పోరాటం
సాక్షి,పాడేరు: గిరిజన డీఎస్సీతో నూరుశాతం గిరిజనులకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రత్యేక నోటిఫికేషన్, గిరిజన సలహా మండలి ఏర్పాటుపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఐటీడీఏల ఎదుట రిలే దీక్షలతో ధర్మపోరాటం చేస్తామని,ఆదివాసీ జేఏసీ నేతలు తెలిపారు. బుధవారం స్థానిక ఐటీడీఏ ఎదుట జేఏసీ నేతలు రిలే దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావుదొర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఖి శేషాద్రి మాట్లాడుతూ ఏజెన్సీలో నూరుశాతం ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని, సీఎం చంద్రబాబు హమీ ఇవ్వడాన్ని తామంతా స్వాగతిస్తున్నామన్నారు. ఆదివాసీలకు న్యాయం చేయడానికి కూటమి ప్రభుత్వం తక్షణమే గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేసి, గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగ నియామక చట్టం చేయాలని, ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. మెగా డీఎస్సీ–2025లో ప్రకటించిన ఏజెన్సీ పోస్టులను నోటిఫికేషన్ నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ప్రత్యేక చట్టాలు,హక్కులు ఉన్నాయని,వాటిని పరిగణనలోకి తీసుకోకుండా సాధారణ చట్టాలు అమలుజేస్తే ఆదివాసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.తమ డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు శాంతియుతమైన ధర్మపోరాటం సాగిస్తామని వారు స్పష్టం చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గిరిజన ప్రాంతాల నుంచి ప్రభుత్వానికి వినతిపత్రాలు పంపడంతో పాటు,అన్ని ఐటీడీఏల వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆదివాసీ జేఏసీ ప్రతినిధులు బోయపల్లి సింహాచలం, మినుముల ప్రసాద్, పలాసి తిరుపతిరావు, కిరసాని కిషోర్, తామర సురేష్, నాగరాజు, సోంబాబు, సురేష్, శంకర్,అనిల్ పాల్గొన్నారు. గిరిజన సలహా మండలిని వెంటనే ఏర్పాటు చేయాలి గిరిజన డీఎస్సీకి ప్రత్యేక నోటిఫికేషన్ ప్రకటించాలి ఆదివాసీ జేఏసీ నేతల డిమాండ్ -
రూ.200 వ్యయం
బియ్యం ఉచితం..గతేడాది అక్టోబర్లో రేషన్ పంపిణీ చేస్తున్న ఎండీయూ వాహన సిబ్బంది (ఫైల్)కొయ్యూరు: మంప పంచాయతీ.. దీని పరిధిలో ఆర్.దొడ్డవరం, గంగవరం, టిటోరాళ్ల గ్రామాలు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ మూడు గ్రామాల పరిధిలో దాదాపుగా వందమంది కార్డుదారులు ఉన్నారు. వీరంతా రేషన్ పొందేందుకు మంప డీఆర్ డిపోకు వెళ్లాలి. దగ్గరమార్గం ఉన్నా రెండు పెద్ద కొండలు ఎక్కి దిగాలి. వర్షాకాలంలో ఈ మార్గంలో వెళ్లి రావడం సాధ్యం కాదు. అత్యంత మారుమూల ప్రాంతం కావడంతో ఆ గ్రామాలకు బస్సు సౌకర్యం కూడా లేదు. దీంతో వీరంతా వీరవరం, దుచ్చర్తి, దాకోడు, బందమామిళ్ల మీదుగా 50 కిలోమీటర్ల దూరంలోని మంప డిపోకు వచ్చి రేషన్ తీసుకువెళ్తున్నారు. ఇందుకు రవాణా చార్జీలు రెండు పక్కలా సుమారు రూ.150 వరకు ఖర్చవుతోంది. రేషన్ తెచ్చుకునేందుకు ఒక రోజు కేటాయించాలి. మంపలో సరియైన హోటళ్లు లేకపోవడంతో టిఫిన్ తిని రోజంతా అర్ధాకలితో ఉంటున్నారు. ఆర్.దొడ్డవరంలో డీఆర్ డిపో ఏర్పాటుచేస్తే అవస్థలు తప్పుతాయని ప్రాధేయపడుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎంకు వినతిపత్రం ఇచ్చినా.. ఇదే సమస్యపై గతేడాది అక్టోబర్లో సీపీఐ నేతలు అమరావతి వెళ్లి సీఎం చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చారు. దీంతో నవంబర్లో ఎండీయూ వాహనం ఆయా గ్రామాలకు వెళ్లి రేషన్ పంపిణీ చేసింది. ఆ తరువాత నుంచి పరిస్థితి మళ్లీ మామూలే. సీఎం ఆదేశాలను మండల స్థాయి అధికారులు పట్టించుకోలేదు. అప్పటి నుంచి 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించి రేషన్ తెచ్చుకుంటున్నారు. డీజిల్ ఖర్చులిస్తే మీ గ్రామాలకు రేషన్ తెచ్చి ఇస్తామని ఎండీయూ నిర్వాహకులు చెబుతున్నారని వారు వాపోతున్నారు. ఇలాంటి గ్రామాలెన్నో.. ● మఠం భీమవరం పంచాయతీలో పెదలంక కొత్తూరు, బుగ్గిరాయి, పుట్టకోట, కాకుల మామిడి, జ్యోతుల మామిడి గ్రామాల గిరిజనులు దాదాపు 20 కిలోమీటర్ల దూరంలోని పలకజీడి డీఆర్డిపోకు వచ్చి రేషన్ తీసుకోవాలి. ఈ మార్గంలో ప్రైవేట్ వాహనాలు తిరిగే అవకాశం లేనందున కాలినడకే శరణ్యం. ● యూ.చీడిపాలెం పంచాయతీలో మర్రిపాకల, జెర్రిగంది, గంగవరం, నీలవరం, తీగలమెట్ట, ఎర్రగొంద గ్రామాల గిరిజనులు దాదాపు 15 కిలోమీటర్ల దూరంలోని యూ.చీడిపాలెం డీఆర్ డిపోకు రావాలి. సరియైన రహదారి సౌకర్యం లేనందున వర్షాకాలంలో వీరు రేషన్ పొందే పరిస్థితి ఉండదు. చర్యలు తీసుకుంటాం ఆర్.దొడ్డవరం గ్రామానికి దివ్యాంగుల కోటాలో డీఆర్ సబ్డిపో మంజూరైంది. అయితే ఆర్హత లేని వారు దీనికి దరఖాస్తు చేయడంతో పోస్టు భర్తీ చేయలేదు. డీలర్ల నియామకాలు జరిగితే వెంటనే అక్కడ ఒకరిని నియమించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. – ప్రశాంత్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్, పౌరసరఫరాల శాఖ, కొయ్యూరు సబ్ డిపో ఏర్పాటుతో మేలు సబ్డిపో ఏర్పాటు చేసే అధికారం, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖలకు మాత్రమే ఉంది. సబ్డిపో ఏర్పాటుకు వారు చర్యలు తీసుకుంటే ఆర్.దొడ్డవరం, గంగవరం, టిటోరాళ్ల గ్రామాల గిరిజనులకు ఏదొకవిధంగా రేషన్ పంపిణీ చేస్తాం. రేషన్ తెచ్చుకునేందుకు ఆయా గ్రామాల గిరిజనులు చాలా అవస్థలు పడాల్సి వస్తోంది. – విజయకుమార్, బీఎం, జీసీసీ, కొయ్యూరు -
సరిహద్దులో ముమ్మర తనిఖీలు
అప్రమత్తమైన పోలీసులుముంచంగిపుట్టు: మావోయిస్టుల కదలికలు అధికమయ్యాయన్న సమాచారంతో సరిహద్దు పోలీసులు అప్రమత్తమయ్యారు. మండల కేంద్రంలో సీఆర్పీఎఫ్ పోలీసులు బలగాలు పహారా కాస్తూ రాకపోకలపై నిఘాను పెంచారు. ముఖ్యంగా మారుమూల బూసిపుట్టు, బుంగాపుట్టు, రంగబయలు ప్రాంతాల నుంచి మండల కేంద్రానికి వచ్చే వాహనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ తనిఖీలు చేశారు. ప్రయాణికుల వివరాలు సేకరించి విడిచి పెట్టారు. ముంచంగిపుట్టు నుంచి జోలాపుట్టు, కుమడ, కుజభంగి మార్గాల్లో కల్వర్టులు, వంతెనలను డాగ్, బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలు చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతమైన ఒనకడిల్లీ, మాచ్ఖండ్, జోలాపుట్టు గ్రామాల్లో సైతం బీఎస్ఎఫ్ బలగాలు సరిహద్దు రాకపోకలపై నిఘా పెంచాయి. ప్రయాణికుల బ్యాగులు,లగేజీలు పరిశీలించి విడిచి పెట్టారు. అనుమానితులను ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు. స్థానిక ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోలీసులతో గస్తీ ఏర్పాటుచేశారు. -
వివాహానికి ముందే రిజిస్ట్రేషన్ తప్పనిసరి
రంపచోడవరం: ఏజెన్సీలో గిరిజన యువత వివాహానికి ముందే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ తప్పని సరిగా చేసుకోవాలని రంపచోడవరం పీవో కట్టా సింహాచలం సూచించారు. బుధవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన యువతులు పెళ్లి చేసుకునే ముందు తప్పని సరిగా వివాహ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. దీనిపై పంచాయతీస్థాయిలో అవగాహన కల్పించి రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ప్రోత్సాహించాలని కోరారు. కొంత మంది అబ్బాయిలు ఇతర గ్రామాల నుంచి వచ్చి పెళ్లి చేసుకుని కొంత కాలం తరువాత వెళ్లిపోతున్నారని, ఇసుకపట్ల గ్రామంలో ఇలాంటి సంఘటన తన దృష్టికి వచ్చిందన్నారు. ఏజెన్సీలో బాల్య వివాహాలను నిర్మూలించాలన్నారు. ప్రతి గ్రామంలో సకాలంలో ఇంటి పన్నులు కట్టించాలని సూచించారు. త్వరలో కొంత మంది ఐఏఎస్ ఽఅధికారులు గిరిజన గ్రామాల్లో పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గొంటారని, అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్డీవో కోటేశ్వరరావు, డీఎల్పీవో పద్మజ, ఏవో రమణి, ఈవోపీఆర్డీ శివకుమార్ పాల్గొన్నారు.రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం -
గర్భిణిని గెడ్డ దాటించి ఆస్పత్రికి తరలింపు
డుంబ్రిగుడ: పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడ్డారు. మండలంలోని కోసంగి గ్రామానికి చెందిన వంతల అఖిల బుధవారం ఉదయం నుంచి పురిటినొప్పులతో బాధపడుతోంది. ఈ గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు, వంతెన సౌకర్యం లేకపోవడంతో ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు సమస్యలు ఎదుర్కొన్నారు. 108 అంబులెన్సు గ్రామానికి వచ్చే అవకాశం లేకపోవడంతో సర్పంచ్ వంతల వెంకటరావు ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు గర్భిణిని గెడ్డను దాటించి ఆస్పత్రికి తరలించారు. కూటమి ప్రభుత్వం స్పందించి గ్రామానికి రోడ్డు, వంతెన మంజూరు చేయాలని గ్రామస్తులు కోరారు. -
ప్రజల భద్రతకు కొత్త దిక్సూచి
● హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్హౌసుల్లో అతిథుల వివరాల నమోదు ● నేర చరితులు, అనుమానితులుంటే ఈ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ● ప్రస్తుతం జిల్లాలో 79 చోట్ల యాప్ డౌన్లోడ్ ● దశలవారీగా పర్యాటక కేంద్రాల్లోనూ అందుబాటులోకి.. ఇలా చేస్తారు. సందర్శకుల వివరాలను ఆధార్ కార్డు ద్వారా ‘సేఫ్ స్టే’ మొబైల్ యాప్లో నమోదు చేయాలి. వారిలో నిందితులు ఎవరైనా ఉన్నట్లయితే పోలీస్ కంట్రోల్ రూమ్కు పూర్తి వివరాలు తెలుస్తాయి. తక్షణమే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు సమాచారం అందిస్తారు. అక్కడకు పోలీసులు వెళ్లి అనుమానితుల పూర్తి వివరాలు తెలుసుకుంటారు. ఇది నేరాలను నియంత్రించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మొదటి దశగా జిల్లాలో 79 హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్హౌస్లలో యాప్ను డౌన్లోడ్ చేయించారు. దశలవారీగా మిగిలిన చిన్నచిన్న హోటళ్లలోనూ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామని పోలీస్ శాఖ చెబుతోంది. అనకాపల్లి: అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచడానికి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మెరుగైన నిఘా ద్వారా పౌరులను రక్షించడానికి అనకాపల్లి పోలీసులు ‘సేఫ్ స్టే’ యాప్ను ప్రారంభించారు. హోటళ్లు, లాడ్జీలు, అతిథి గృహాలలో బస చేసే అతిథుల వివరాలను.. క్రిమినల్ వివరాల డేటాబేస్తో సరిపోల్చి నేరస్తులను గుర్తించేందుకు ఈ యాప్ ఉపయోగపడనుంది. జిల్లావ్యాప్తంగా ఉన్న లాడ్జీలు, హోటళ్లలో ఈ యాప్ను పొందుపరిచారు. అక్కడ ఎవరు చెక్ ఇన్ చేసినా వారి వివరాలను ఈ ఆన్లైన్ యాప్లో పొందుపరిచి వెంటనే పోలీసులకు పంపిస్తారు. నేరస్తులు, అనుమానాస్పద వ్యక్తులెవరైనా ఉంటే తక్షణమే పోలీసులు సులభంగా వారిని అరెస్ట్ చేసేందుకు వీలుంటుంది. ఈనెల 8 నుంచి అమల్లోకి.. నేరస్తులను నిలువరించేందుకు సాధారణంగా చెక్పోస్టుల వద్ద తనిఖీలు చేసి అనుమానముంటే అదుపులోకి తీసుకుంటారు. అదే విధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మన ప్రాంతంలో స్టే చేసే వారి వివరాలను సైతం విశ్లేషిస్తే అనుమానితులను ముందే కట్టడి చేయవచ్చు.. లేదా నేరం జరిగాక త్వరగా నిందితులను గుర్తించవచ్చు. ఈ ఆలోచన నుంచి పుట్టిందే సేఫ్ స్టే యాప్. ఈనెల 8న జిల్లా పోలీస్ శాఖ ఈ మొబైల్ యాప్ను ఆవిష్కరించింది. ఈ యాప్ను జిల్లాలోని ప్రధానమైన హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్హౌసుల్లో డౌన్లోడ్ చేయించారు. మిగతావారు కూడా ఈ యాప్ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజల భద్రత మరింత పటిష్టం చేసేందుకే.. ‘సేఫ్ స్టే‘ యాప్ ద్వారా నేరస్తులను ముందుగానే గుర్తించవచ్చు. నేరాలను తగ్గించవచ్చు. ప్రజల భద్రతకు పూర్తి భరోసా కల్పించడానికి వీలుంటుంది. ఈ యాప్ ద్వారా అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంటుంది. దశలవారీగా జిల్లాలో యాప్ డౌన్లోడ్ చేయిస్తాం. త్వరలో రెండో దశలో పూర్తిస్థాయిలో అమలు చేస్తాం. – తుహిన్ సిన్హా, ఎస్పీ ‘సేఫ్ స్టే‘ యాప్ను అందుబాటులోకి తెచ్చిన అనకాపల్లి జిల్లా పోలీసులు -
ఆటో, బైక్ ఢీ – ఒకరి మృతి
హుకుంపేట: ఆటో, బైక్ ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాడేరు–అరుకు ప్రధాన రహదారి రంగశీల గ్రామ సమీపంలో డుంబ్రిగుడ మండలం కితలంగి గ్రామానికి చెందిన తాంగుల సత్యనారాయణ(40) బైక్పై మంగళవారం పాడేరు మోదకొండమ్మ అమ్మవారి జాతరకు వెళ్తూ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టాడు. ఈ ఘటనలో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందగా, తనతో ఉన్న రంగశీల గ్రామానికి చెందిన కొర్ర బలరామ్ అనే వ్యక్తి తీవ్ర గాయలు పాలైయ్యాడు. గాయాలతో ఉన్న వ్యక్తిని పాడేరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స అనంతరం వైజాగ్ కేజీహెచ్కు మెరుగైన వైద్యం కోసం తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పొలీసులు ఘటన స్థలానికి చెరుకుని పరిశీలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ సురేష్ తెలిపారు. -
నిందితుడిని పట్టుకున్న కానిస్టేబుల్కు రివార్డు
కోటవురట్ల : కె.వెంకటాపురంలో 2010లో సంచలనంగా మారిన హత్య కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ నరేష్ను డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించి రివార్డును అందజేశారు. ఇందుకు సంబంధించి ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాలివి. పోలీసు డిపార్ట్మెంట్లో హోంగార్డుగా పనిచేస్తున్న పాంగి అప్పారావు 2010లో కె.వెంకటాపురంలో తుపాకీతో ఒకరిపై కాల్పులు జరిపాడు. ఆ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా ముద్దాయి అప్పారావుపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చి సమయం ముగిసినా సరెండర్ కాకుండా తప్పించుకు తిరుగుతుండడంతో అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేశారు. ఆంధ్రా ఒడిశా బోర్డర్లో అతని కదలికలు ఉన్నట్టు గుర్తించిన కానిస్టేబుల్ నరేష్ సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందజేశాడు. వెంటనే ఎస్ఐ రమేష్ సిబ్బంది కలిసి నిందితుడు పాంగి అప్పారావును పట్టుకుని నర్సీపట్నం కోర్టులో ప్రవేశపెట్టారు. రిమాండ్ విధించడంతో అతనిని విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన నరేష్కు డిపార్ట్మెంట్ తరపున రివార్డును అందజేశారు. నక్కపల్లి సీఐ ఎల్.రామకృష్ణ, ఎస్ఐ రమేష్ అభినందించారు. -
12 కిలోల గంజాయి స్వాధీనం
నక్కపల్లి: జాతీయరహదారిపై వేంపాడు టోల్ప్లాజా వద్ద తమిళనాడు, బెంగళూరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి నక్కపల్లి పోలీసులు 12 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సీఐ కుమార స్వామి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు టోల్ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బెంగళూరుకు చెందిన మునివెంకటప్ప అంజనప్ప, తమిళనాడుకు చెందిన కుప్పా ముత్తులు స్కూలు బ్యాగుల్లో గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించామన్నారు. అనుమానాస్పదంగా ఉన్న వీరిని పట్టుకోవడానికి ప్రయత్నించగా పారిపోతుండగా ఎస్ఐ సన్నిబాబు ఆధ్వర్యంలో సిబ్బంది వెంబడించి పట్టుకున్నారన్నారు. వారి వద్ద రూ.50 వేలు విలువగల 12 కిలోల గంజాయి లభించిందన్నారు. గంజాయి స్వాధీనం చేసుకుని ఇద్దరినీ అరె స్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు. అంజనప్పపై గతంలో హత్య కేసు నమోదయిందని, కుప్పా ముత్తపై గంజాయి కేసు నమోదైనట్టు తెలిపారు. -
సవతి ప్రేమ!
విశాఖ జోన్పై విశాఖ జోన్, రాయగడ డివిజన్ అంబ్రెల్లా వర్క్స్కి రూ.170 కోట్లు మాత్రమే.. రాయగడ డివిజన్కు ప్రత్యేకంగా రూ.110 కోట్లు కేటాయింపుకన్సాలిడేట్ బడ్జెట్లో అరకొర కేటాయింపులు డబ్లింగ్ పనులు.. కొత్త లైన్లకు నిధులు ● జోన్కు అన్యాయం చేస్తున్న రైల్వే మంత్రిత్వ శాఖ మిగిలిన విషయాల్లో కొంతమేర కేటాయింపులు చేయడం ఉపశమనం కలిగించే అంశం. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పనులకు ఈ బడ్జెట్లో కొంత మేర నిధులు కేటాయించడం శుభపరిణామం. కన్సాలిడేటెడ్ బడ్జెట్లో ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో కేటాయింపులిలా ఉన్నాయి. ● ఓర్ ఎక్స్ఛేంజ్ కాంప్లెక్స్(ఓఈసీ) నుంచి ఉత్తర సింహాచలం వరకు 5.22 కి.మీ మేర డబ్లింగ్ పనులకు రూ.81.22 కోట్లు. ● పెందుర్తి నుంచి ఉత్తర సింహాచలం మధ్యలో సింహాచలం వద్ద సర్ఫేస్ క్రాసింగ్ లేకుండా చేసేందుకు ఫ్లైఓవర్ నిర్మాణం కోసం రూ.183.65 కోట్లు ● దువ్వాడ నుంచి ఉత్తర సింహాచలం వరకు 20.543 కిలోమీటర్ల మేర 3, 4వ లైన్ల నిర్మాణం కోసం రూ.302.25 కోట్లు. ● వడ్లపూడి జంక్షన్ను అనుసంధానిస్తూ గంగవరం పోర్టు నుంచి విశాఖపట్నం స్టీల్ప్లాంట్ వరకూ టై లైన్ మాదిరిగా 12.04 కి.మీ మేర 3, 4వ లైన్ల నిర్మాణానికి రూ.154.28 కోట్లు. ● విశాఖపట్నం నుంచి గోపాలపట్నం వరకు 15.31 కి.మీ మేర థర్డ్, ఫోర్త్ లైన్ల నిర్మాణానికి రూ.159.47 కోట్లు. ● ఉత్తర సింహాచలం నుంచి గోపాలపట్నం వరకు 2.64 కి.మీ మేర థర్డ్, ఫోర్త్ లైన్ల నిర్మాణానికి రూ.129.45 కోట్లు. ● పలాస–విశాఖపట్నం–దువ్వాడ(బీ రూట్)లో ట్రాక్ పునరుద్ధరణ పనుల కోసం రూ.15 కోట్లు. ● ఉత్తర సింహాచలం నుంచి గోపాలపట్నం వరకు 2.07 కి.మీ మేర బైపాస్ డబ్లింగ్ పనులకు రూ.25.93 కోట్లు. ● విశాఖపట్నం కాంప్లెక్స్ ఏరియాలో ఆటో సిగ్నలింగ్ వ్యవస్థ కోసం రూ.43.07 కోట్లు. సాక్షి, విశాఖపట్నం : కొబ్బరికాయ కొట్టేశాం.. కార్యాలయాలు కట్టేయండి అన్నట్లుగా మారింది విశాఖ రైల్వే జోన్పై ప్రభుత్వ వైఖరి. ప్రచార ఆర్భాటం.. ఆపై శంకుస్థాపన.. భూమి చదును.. ప్రజెంటేషన్లు.. గ్రాఫిక్స్లోనే హడావుడి కనిపిస్తుందే తప్ప.. క్షేత్రస్థాయిలో మాత్రం అడుగు కూడా కదలడం లేదన్న విషయం నిధుల కేటాయింపులోనే స్పష్టమవుతోంది. 2025–26 బడ్జెట్కు అనుబంధంగా రైల్వే కేటాయింపులకు సంబంధించిన కన్సాలిడేటెడ్ బడ్జెట్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్పై సవతి ప్రేమ మాత్రమే కనిపిస్తోంది. విశాఖ రైల్వే జోన్తో పాటు దానికి అనుబంధంగా ఏర్పాటవుతున్న రాయగడ డివిజన్ అంబ్రెల్లా వర్క్స్కు కలిపి కేవలం రూ.170 కోట్లు మాత్రమే కేటాయింపులు చేయడం సర్వత్రా విస్మయానికి గురిచేస్తోంది. రాయగడ డివిజన్ పనులకు మాత్రం ప్రత్యేకంగా మరో రూ.110 కోట్లు కేటాయించడం మరింత బలాన్ని చేకూర్చుతోంది. కీలకమైన జోన్కు పప్పుబెల్లాలు ఇచ్చి.. రాయగడ డివిజన్కు మాత్రం భారీగా నిధులు అందించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూమి చదును పనులకే పరిమితం విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్కు శంకుస్థాపన జరిగి నాలుగు నెలలు.. టెండర్లు ఖరారు చేసి ఐదు నెలలు పూర్తయినా.. ఇంకా భూమి చదును పనులకే పరిమితమైంది. నిధుల మంజూరులో జాప్యం జరుగుతుండటం వల్లనే పనుల ప్రక్రియ అంతంతమాత్రంగానే సాగుతోంది. 2025–26 బడ్జెట్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు ఒక్క రూపాయి విదిలించని రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా రైల్వే కన్సాలిడేటెడ్ బడ్జెట్లోనూ మొండి చెయ్యి చూపించింది. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే..! జోన్కు శంకుస్థాపన చేసేశామంటూ పచ్చపత్రికల్లోనూ, సోషల్ మీడియాల్లోనూ భారీగా ప్రచారం చేసుకున్న కూటమి ప్రభుత్వం.. జోన్ ప్రధాన కార్యాలయాల నిర్మాణం మాత్రం తమకు అవసరం లేదన్నట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం కూడా వైజాగ్ జోన్ కార్యకలాపాలు ఇప్పట్లో ప్రారంభించకపోయినా ఫర్వాలేదన్నట్లుగా భావిస్తోంది. అందుకే దక్షిణ కోస్తా రైల్వే జోన్ను పక్కనపెట్టి రాయగడ డివిజన్ నిర్మాణానికే పెద్దపీట వేస్తూ ఉత్తరాంధ్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తోంది. అయినా కూటమి ఎంపీలు నోరు మెదపకపోవడం దురదృష్టకరం. -
మాజీ ఎమ్మెల్యే చిట్టినాయుడు భార్య మృతి
సాక్షి, పాడేరు : పాడేరు మాజీ ఎమ్మెల్యే, దివంగత కొట్టగుళ్లి చిట్టినాయుడు భార్య గంగాభవానీ (70) మంగళవారం రాత్రి కేజీహెచ్లో వైద్యసేవలు పొందుతూ మృతి చెందారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మికి గంగాభవాని మాతృమూర్తి. సమాచారం తెలుసుకున్న అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, వైఎస్సార్సీపీ నేత చెట్టి వినయ్ సంతాపం వ్యక్తం చేశారు. వారంతా పాడేరులోని గుడివాడ గ్రామానికి చేరుకుని గంగాభవానీ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి తదితరులు సంతాపం తెలిపారు. ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయులు, వర్తకులంతా గంగాభవానికి కన్నీటి వీడ్కోలు పలికారు. స్థానిక శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపారు. సంతాప సూచకంగా మధ్యాహ్నం వరకు పట్టణంలోని వర్తకులు దుకాణాలను మూసివేశారు. -
వుషు స్టేట్ టోర్నమెంట్లో 12 మెడల్స్
నర్సీపట్నం: రాష్ట్ర స్థాయి వుషు టోర్నమెంట్లో నింజాస్ అకాడమీకి చెందిన క్రీడాకారులు 12 పతకాలు సాధించారు. కర్నూల్ జిల్లా శ్రీవెంకటేశ్వర కల్యాణమండపంలో ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగిన స్టేట్ వుషు చాంపియన్షిప్ పోటీల్లో వీరు పాల్గొన్నారు. అక్షయ రాణి–సీనియర్ వుమెన్.. శ్రీరామ్ నిహాల్, పి.ప్రణీత–సబ్ జూనియర్.. వై.దివాకర్ మెన్ సీనియర్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్ సాధించారు. జి.సాయి ఉమెన్ సీనియర్, యు.రవికుమార్ సీనియర్ మెన్ విభాగంలో సిల్వర్ మెడల్స్ సాధించారు. సబ్ జూనియర్ బాయ్స్ విభాగంలో టి.జగదీష్, వై.సాత్విక్, ఎం.దుర్గాప్రసాద్, ఎం.హర్ష, ఎం.సాయి సందీప్, కె.విజయ్ కుమార్ బ్రాంజ్ మెడల్స్ సాధించారు. కోచ్ ప్రియాంక్ ఆధ్వర్యంలో క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడాకారులను మోహన్ ముత్యాల, నేషనల్ రిఫరీ వెంకటేష్ అభినందించారు. 600 మందికి పైగా పాల్గొన్న క్రీడాకారుల్లో నింజాస్ క్రీడాకారులు పోటీ పడి మెడల్స్ సాధించారన్నారు. -
ఇద్దరు బామ్మర్దులను బల్లెంతో పొడిచి చంపిన బావ
అల్లూరి సీతారామరాజు: జిల్లాలో సంచలనం సృష్టించిన బావమరుదుల హత్య కేసులో బావను సీలేరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు వివరాలను జీకే విధి సీఐ వరప్రసాద్, సీలేరు ఎస్ఐ రవీంద్ర విలేకరులకు తెలియజేశారు. నిందితుడు వంతల గెన్ను సీలేరు పంచాయతీ చింతపల్లి క్యాంపు గ్రామంలో నివాసం ఉంటున్నాడు. గ్రామంలో ఆదివారం జరిగిన బంధువు దినకర్మకు బావమరుదులు కిముడు కృష్ణ, కిముడు రాజు హాజరయ్యారు. అనంతరం ఆదివారం రాత్రి నిందితుడి ఇంట్లోనే వారంతా ఉన్నారు. అందరూ కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో గెన్ను తన తరచూ వేధిస్తున్న విషయాన్ని అన్నదమ్ములకు సోదరి(గెన్ను భార్య) చెప్పింది. దీంతో బావమరుదులు గెన్నును నిలదీశారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు గొడవ కొనసాగింది. ఆగ్రహించిన గెన్ను.. ఇంట్లో ఉన్న బల్లెంతో ముందుగా మూడో బావమరిది కిముడు రాజును పొడిచాడు. ఆయన తప్పించుకుని పారిపోయాడు. అప్పటికే ఇంట్లో ఉన్న ఆడవాళ్లు, పిల్లలు కేకలు వేయడంతో ఇంట్లో నిద్రిస్తున్న మరో బావమరిది కిముడు రాజు అడ్డుకున్నాడు. అతనిని కూడా బల్లెంతో కడుపులో పొడవడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఇంటి బయట కారులో నిద్రిస్తున్న కిముడు కృష్ణ చూసి ఇంట్లోకి పరిగెత్తి వెళ్లగా నిందితుడు దాడి చేసి హతమార్చాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడిపై 2013లో కూడా ఓ హత్య కేసు ఉందన్నారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి, రిమాండ్ తరలించామని తెలిపారు.వేదన మిగిల్చిన హత్యలుసీలేరు మేజర్ పంచాయతీ చింతపల్లి క్యాంపు గ్రామంలో ఇద్దరు అన్నదమ్ముల హత్యలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఒకే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందగా.. మరో సోదరుడు కేజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. అన్నదమ్ముల అంత్యక్రియలకు కూడా తమ్ముడు రాలేని దీన పరిస్థితి నెలకొంది. సోమవారం సాయంత్రం పోస్టుమార్టం నిమిత్తం సీలేరు నుంచి చింతపల్లికి మృతదేహాలను తరలించారు. మంగళవారం మధ్యాహ్నం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పచెప్పినట్టు ఎస్ఐ రవీందర్ తెలిపారు. మృతదేహాలకు స్వగ్రామమైన ఒడిశా రాష్ట్రం చిత్రకొండ ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించారు. సొంత కుటుంబ సభ్యులు అని కూడా చూడకుండా కిరాతకంగా చంపిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని స్పష్టం చేశారు. -
శరవేగంగా తాగునీటి ఎద్దడి నివారణ పనులు
మహారాణిపేట (విశాఖ): ఉమ్మడి విశాఖ జిల్లాలో తాగునీటి ఎద్దడిని నివారణకు ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిన రూ.31 కోట్ల నిధులతో శరవేగంగా పనులు జరుగుతున్నాయని జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర పేర్కొన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన పలు స్థాయీ సంఘాల సమావేశాల అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. జల జీవన్ మిషన్ పనులు కూడా జిల్లాలో శరవేగంగా జరుగుతున్నాయని ఆమె వివరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు చిత్తశుద్ధితో పరిష్కరించాలని సూచించినట్టు ఆమె తెలిపారు. ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పథకంలో మూడు ఇంకుడు గుంతల తవ్వకానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామాల్లో నెలకొన్న మురుగు నీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించేందుకు ఇంకుడు గుంతలు దోహదపడతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఒక్కోదానికి సుమారు రూ.74 వేల వరకు ఖర్చు అవుతుందన్నారు. సామాజిక పింఛన్ల పంపిణీపై స్పందిస్తూ, ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, ఒకవేళ ఎవరికై నా పింఛను అందకపోతే వెంటనే ఎంపీడీవోని సంప్రదించాలని ఆమె సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థలం కలిగిన రైతులు తమ భూముల్లో మొక్కలు పెంచడానికి ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించుకోవచ్చని ఆమె తెలిపారు.దోమల బెడద నివారించండి: అరకు జెడ్పీటీసీ శెట్టి రోషిణి విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో దోమల బెడద అధికంగా ఉందని, దీని నివారణకు తక్షణమే ఫాగింగ్ చేపట్టాలని అరకు జెడ్పీటీసీ శెట్టి రోషిణి కోరారు. జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం జరిగిన స్థాయీ సంఘాల సమావేశంలో ఆమె మాట్లాడారు. దోమల వల్ల మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఏజెన్సీలో 108 అంబులెన్సులు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదన్నారు. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె పేర్కొన్నారు.ఈ సమావేశాల్లో దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ అధికారులను ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి, ప్రజా సంక్షేమ పనులు, ప్రణాళికలు, ఆర్థిక సాయం, వైద్య ఆరోగ్యం తదితర అంశాలపై విస్తృత చర్చ జరిగింది. వివిధ శాఖల అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలను సభకు సమర్పించారు. సభ్యులు పలు ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యేలు రేగం మత్స్యలింగం, బండారు సత్యనారాయణమూర్తి, జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి, డిప్యూటీ సీఈవో కె.రాజ్కుమార్, మూడు జిల్లాల వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర -
జనజీవన స్రవంతిలో కలిస్తే ఉపాధి కల్పిస్తాం
సీలేరు: ఉద్యమం పేరుతో అడవిలో తిరుగుతున్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిస్తే తమ శాఖ ఆధ్వర్యంలో ఉపాధి కల్పిస్తామని చింతపల్లి ఏఎస్పీ నవ జ్యోతి మిశ్రా అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిందన్నారు. జీకే వీధి, చింతపల్లిలో మావోయిస్టులకు సహకరించే మిలీషియా లొంగుబాట్లు భారీగా జరిగాయన్నారు. ఎదురు కాల్పుల్లో కాకూరి పండన్న అలియాస్ జగన్, రమేష్ మృతి చెందడంతో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందన్నారు. ఎదురు కాల్పుల్లో తప్పించుకున్న మరికొంత మంది మావోయిస్టుల కోసం గ్రేహౌండ్ స్పెషల్ పార్టీ బలగాలతో కూంబింగ్ ఆపరేషన్ నిరంతరాయంగా కొనసాగుతోందన్నారు. మారుమూల ప్రాంతాల్లో గిరిజన గ్రామాల అభివృద్ధి, రహదారుల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు జిల్లా పోలీస్శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. జిల్లాలో గంజాయి నిర్మూలనపై కూడా ప్రత్యేక దష్టి పెట్టామన్నారు. గిరిజనులు ఎక్కడైనా రహస్యంగా గంజాయి సాగు చేసినా డ్రోన్లు ద్వారా వాటిని గుర్తించి ధ్వంసం చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జీకే వీధి సీఐ వరప్రసాద్ పాల్గొన్నారుమావోయిస్టులకు చింతపల్లి ఏఎస్పీ నవజోతిమిశ్రా సూచన -
చందనం విక్రయాల ప్రారంభం
సింహాచలం: చందనోత్సవం నాడు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిపై ఽనుంచి ఒలిచిన నిర్మాల్య చందనాన్ని మంగళవారం నుంచి విక్రయాలు ప్రారంభించారు. ఉచిత దర్శనం క్యూలో 400 మందికి, రూ.100 క్యూలో 300 మందికి, రూ. 300 క్యూలో 300 మందికి ఒక్కో ప్యాకెట్ పది రూపాయలు చొప్పున విక్రయించారు. దేవస్థానం ఏఈవో ఎన్.ఆనంద్కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటర్లో ప్రవేశానికిదరఖాస్తుల ఆహ్వానం పెదబయలు: ముంచంగిపుట్టు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ కళాశాలలో 2025–2026 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫస్టియర్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ పి.కేశవరావు తెలిపారు. ఈ ఏడాది పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని, టెన్త్ మార్కుల మెమో, ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జెరాక్స్ కాపీలతో ముంచంగిపుట్టు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ కళాశాల(పెదబయలు)లో లేదా పాడేరు గురుకులం సెల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. షెడ్యూల్ తెగల విద్యార్థులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని ఆయన వివరించారు. -
నిబంధనలకు విరుద్ధంగా పీసీ కమిటీ ఎన్నికలు
అడ్డతీగల: మండలంలోని డి.భీమవరంలో పీసా గ్రామకమిటీ ఎన్నికలు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రంపచోడవరం డివిజన్ అధ్యక్షుడు మోడిద నూకరాజు, కార్యదర్శి పీఠ ప్రసాద్ ఆరోపించారు. ఈ మేరకు స్ధానిక తహసీల్దార్ సూర్యారావుకు ఫిర్యాదు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. పీసా గ్రామసభలో గిరిజనేతరులు కేవలం అభిప్రాయాలు మాత్రమే చెప్పాలని అలాగే ఓటు ఉపయోగించుకోవాలన్నారు. కానీ ఓటింగ్ విషయంలో వారు ఒక అభ్యర్థిని నిలబెట్టి వారికి మాత్రమే ఓటు వేయాలని ఇంటింటికి వెళ్లి సీక్రెట్ ఓటింగ్ వేయించారని ఆయన వివరించారు. చట్ట ప్రకారం చేతులెత్తే విధానంలో ఎన్నికలు జరగాలన్నారు. దీనికి భిన్నంగా ఎన్నికలు జరగడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ ప్రతినిధుల ఆరోపణ తహసీల్దార్కు ఫిర్యాదు -
థియేటర్లలో నవ్వులే నవ్వులు
డాబాగార్డెన్స్ : యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం సింగిల్. ఈ నెల 9న విడుదలై మంచి స్పందన అందుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం విశాఖపట్నంలోని ఓ హోటల్లో మీడియామీట్ నిర్వహించింది. హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ సింగిల్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను అలరిస్తోందన్నారు. చిత్రంలోని సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ నవ్విస్తున్నాయని చెప్పారు. దర్శకుడు కార్తీక్ రాజు చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారని, నిర్మాతలు విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి సహకారం అందించారన్నారు. కథ సాధారణంగా ఉన్నప్పటికీ, ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే, అద్భుతమైన సంభాషణలతో సినిమా ప్రేక్షకులను కట్టిపడేస్తోందని ఆయన పేర్కొన్నారు. చిత్రంలో నటించిన కేతిక శర్మ, ఇవానా, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, విటివి గణేష్, ప్రభాస్ శ్రీను, సత్య, కల్పలత తమ పాత్రలకు ప్రాణం పోశారని శ్రీవిష్ణు అన్నారు. శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ సూపర్ : నటుడు వెన్నెల కిషోర్ మాట్లాడుతూ, సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన శ్రీవిష్ణు తన నటనతో సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడన్నారు. కామెడీ సన్నివేశాల్లో శ్రీవిష్ణు అద్భుతంగా నటించాడని తెలిపారు. దర్శకుడు కార్తీక్రాజు సినిమాలో అనేక ఆసక్తికరమైన పాత్రలు, మలుపులు పెట్టి ప్రేక్షకులను నవ్వించారని, ముఖ్యంగా సెకండాఫ్లోని ప్రేమ సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయని ఆయన తెలిపారు. విశాఖ అంటే చాలా ఇష్టం : హీరోయిన్లు కేతిక శర్మ, ఇవానా మాట్లాడుతూ విశాఖ అంటే తమకు చాలా ఇష్టమని, ఈ సినిమాలో నటించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్తో కలిసి నటించిన సన్నివేశాలు చాలా వినోదాత్మకంగా ఉన్నాయని వారు తెలిపారు. విటివి గణేష్, ప్రభాస్ శ్రీను, సత్య తమ కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారని వారు కొనియాడారు. సింగిల్.. అలరించే కామెడీ ఎంటర్టైనర్ విశాఖలో సందడి చేసిన చిత్ర యూనిట్ -
భారీగా గంజాయి స్వాధీనం
అల్లిపురం: గంజాయి అక్రమంగా తరలిస్తున్న నలుగురు వ్యక్తులను ఆనందపురం పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి 200 కేజీల గంజాయి, ఒక బొలేరో వాహనం (ఓడీ10 కే 1279), ఒక ద్విచక్ర వాహనం, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ–1 అజిత వేజెండ్ల తెలిపారు. నగర పోలీస్ కమిషనరేట్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. గంజాయి రవాణా జరుగుతోందన్న సమాచారం మేరకు ఆనందపురం పోలీసులు, సిటీ టాస్క్ఫోర్స్ పోలీసులు కలిసి బోయపాలెం, పైడా కాలేజీ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన గంజాయి స్మగ్లర్లు బొలేరో వాహనాన్ని వెనక్కు తిప్పేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని వాహనాన్ని తనిఖీ చేయగా 4 బస్తాల్లో 40 బ్రౌన్ కలర్ ప్యాకెట్లలో 200 కేజీల గంజాయి లభ్యమైంది. ఎక్కువ డబ్బు సంపాదించాలని.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరంతా గంజాయి స్మగ్లింగ్కు పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని డీసీపీ–1 అజిత వేజెండ్ల తెలిపారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పాడువ పంచాయతీ జమ్మూగూడ గ్రామం నుంచి గంజాయి సేకరించి విశాఖలో విక్రయించడానికి ప్రయత్నిస్తున్న రఘు హంతల్, నరేంద్ర పాంగీ, బినాయ్ మండల్ , రబీంద్ర కిలాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. -
జీపు బోల్తా– ఒకరు మృతి
జి.మాడుగుల: పాడేరు రోడ్డు మార్గంలో మంగళవారం మిట్టమామిడి జంక్షన్ వద్ద జీపు బోల్తా పడిన సంఘటనలో గిరిజన మహిళ మృతి చెందారు. స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ షణ్ముఖరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మోదకొండమ్మ పండగకు వెళ్లి ప్రయాణికులతో వస్తున్న జీపు మంగళవారం తెల్లవారుజామున కె.కోడాపల్లి పంచాయతీ మిట్టమామిడి జంక్షన్ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాద సంఘటనలో చింతపల్లి మండలం బయలుకించంగి పంచాయతీ పినకొత్తూరు గ్రామానికి చెందిన కొర్ర లక్ష్మి(27) తీవ్రంగా గాయపడి మృతి చెందినట్టు తెలిపారు. ఈ ప్రమాదంలో కొర్ర నందిని, పద్మకు గాయలైనట్టు చెప్పారు. గాయపడిన వారిని పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ సంఘటనపై మృతురాలి భర్త రంగారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ షణ్ముఖరావు తెలిపారు. -
ఇసుక తోడేళ్లు
ఇసుకాసురులు బరితెగిస్తున్నారు. గోదావరి నదీతీరంలో అనధికార ర్యాంపులు నిర్వహిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అడ్డుకునేందుకు వెళ్లేవారిపై దాడులు చేసేందుకు సిద్ధపడుతున్నారు. దీంతో అర్ధరాత్రి వేళ తవ్వకాలు జరిగే ప్రాంతాలకు వెళ్లేందుకు అధికారులు సాహసించలేకపోతున్నారు.గోదావరి తీరంలోఎటపాక: ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఆంధ్రా సరిహద్దు ప్రాంతం గోదావరి నది నుంచి ట్రాక్టర్లలో తెలంగాణ ప్రాంతానికి తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. అయినప్పటికీ రెవెన్యూ, పోలీసు శాఖలు పట్టనట్టు వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ● అర్ధరాత్రి వేళ పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను భద్రాచలం పట్టణానికి తరలిస్తున్నారు. ఎటపాక, చంద్రంపాలెం, కన్నాయిగూడెం, గుండాల, రాయనపేట, గోగుబాక, తోటపల్లి గ్రామాలకు సమీప గోదావరి నదిలో అనుమతులు లేకుండా ర్యాంపులు నిర్వహిస్తూ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. మండలంలోని గొమ్ముకొత్తగూడెం, గుండాల, కొల్లుగూడెంలో అధికారిక ఇసుక ర్యాంపులు మూతపడటం ఇసుక మాఫియాకు కాసుల పంటగా మారింది. ● భద్రాచలం పట్టణంలో ట్రాక్టర్ ఇసుక రూ.4 వేలకు విక్రయిస్తున్నారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఇసుక అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోంది. రాత్రివేళ విధులు నిర్వహించే అధికారులపై ఇసుక మాఫియా దాడులకు తెగపడుతోంది. దీనివల్ల కూడా అధికారులు, సిబ్బంది అక్కడికి వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. ప్రాణాలతో చెలగాటం ● ఇసుక అక్రమార్కులు రాత్రి వేళల్లో ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇసుక లోడింగ్కు యువకులు, మైనర్లను తీసుకు వస్తున్నారు. ట్రాక్టర్లు నడిపే వారిలో చాలామందికి డ్రైవింగ్ లైసెన్సులు లేనట్టు తెలుస్తోంది. తెల్లవార్లు ఇసుక వాహనాలను అతివేగంగా నడుపుతుండటం ప్రమాదాలకు దారి తీస్తోంది. ఈ నెలలో ఇప్పటివరకు ఇద్దరు మృత్యువాత పడ్డారు. జేసీబీ అదుపుతప్పడంతో.. ఎటపాక మండల కేంద్రంలో టిప్పర్లోని ఇసుకను మేడువాయి సమీపంలో అన్లోడ్ చేస్తుండగా టిప్పర్ గుంతలో దిగుబడింది. దీనిని బయటకు తీసే క్రమంలో జేసీబీ అదుపుతప్పి తగలడంతో వాహనాల యజమాని వాసు ప్రాణాలు కోల్పోయాడు.బాలుడి ప్రాణాలు బలి ● ఇసుక ట్రాక్టర్ బోల్తా ● ప్రమాదం నుంచి బయటపడిన డ్రైవర్ ఎటపాక: ఇసుక అక్రమ రవాణాకు బాలుడు బల య్యాడు.రాయనపేట సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఈఘటన చోటు చేసుకుంది. ఎటపాక గ్రా మానికి చెందిన ఓవ్యక్తి రాయనపేట సమీపంలో గోదావరి నుంచి ఇసుక తరలించేందుకు ట్రాక్టర్ పంపించాడు. ఈ క్రమంలో ఇసుకను భద్రాచలంలో అన్లోడ్ చేసి మళ్లీ లోడ్ చేసుకునేందుకు డ్రైవర్తో పాటు కోడి చరణ్ అనే బాలుడు కలిసి రాయనపేట ర్యాంపుకు వస్తున్నారు. ఈక్రమంలో గుండాల,రాయనపేట మధ్యలో జాతీయ రహదారిపై ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో బాలుడు చరణ్(16) ట్రాక్టర్ కిందపడి చనిపోగా డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. దీనిపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని సీఐ కన్నపరాజు తెలిపారు. అర్ధరాత్రి వేళ అక్రమ రవాణా ట్రాక్టర్ లోడు రూ.4 వేలకు విక్రయంర్యాంపులకు నేరుగా రహదారుల ఏర్పాటు తెలంగాణ ప్రాంతానికి యథేచ్ఛగా తరలింపు రాత్రివేళ నిఘాకు సిబ్బంది కొరత రెవెన్యూ శాఖలో పూర్తిస్థాయిలో సిబ్బంది లేక, పోలీసుల బందోబస్తు లేక రాత్రి వేళ నిఘా ఏర్పాటు చేయలేకపోతున్నాం. రాత్రి వేళల్లో వారు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నందున ఫిర్యాదులు వచ్చిన సమయాల్లో కూడా భయపడాల్సి వస్తోంది. అయినప్పటికీ ఈ ఆరు నెలల్లో ఐదు కేసులు నమోదుచేసి వాహనాలను అదుపులోకి తీసుకున్నాం. – సుబ్బారావు, తహసీల్దార్, ఎటపాకఅక్రమార్కులు రెచ్చిపోతున్నారు రాత్రి వేళ ఇసుక అక్రమ రవాణా చేస్తూ కూలీల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. దీనిని అరికట్టడంలో అధికారులు విఫలమవడంతో ఇసుక అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేకుంటే మరిన్ని ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. – ఐ.వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యుడు, సీపీఎం అడ్డుకునేందుకు వెళ్లే అధికారులకు దాడుల భయం -
ప్రమోదం.. ప్రభంజనం
ఉత్సవాల వేళ ప్రభంజనంలా తరలివచ్చిన భక్తజనం అమ్మవారి దివ్యరూపాన్ని చూసి పరవశించిపోయారు.ఉత్సవాల చివరి రోజు భారీగా తరలిరావడంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. అమ్మవారి నామసర్మణ మారుమోగింది. ఉత్సవ కమిటీ, అధికారులు అమ్మవారి ఉత్సవాల విజయవంతానికి కృషి చేశారు. సాక్షి,పాడేరు: ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్యదైవం, గిరిజనుల ఇలవేల్పు పాడేరులోని మోదకొండమ్మతల్లి గిరిజన ఉత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశా యి. ఉత్సవాల చివరిరోజు మంగళవారం ఉదయం నుంచే భక్తులు వేలాదిగా పాడేరుకు తరలివచ్చారు. అమ్మవారి విగ్రహాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, జీకేవీధి జెడ్పీటీసీ శివరత్నం దంపతులు,ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిముడు కోటిబాబునాయుడు ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని భక్తులంతా ఇంటిలో కొలువుదీర్చిన మట్టి, ఇత్తడి ఘటాలను మోదకొండమ్మ ప్రధాన ఆలయం వరకు మోసుకువచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సతకంపట్టు వద్ద మోదమ్మ ఉత్సవ విగ్రహం,పాదాలను భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. అమ్మవారికి గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేసారు. ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు మోదమ్మను దర్శించుకున్నారు. ఆయనను ఉత్సవ కమిటీ అధ్యక్షుడు,ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆలయ కమిటీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. మాజీ ఎమ్మెల్యే తిప్పలనాగిరెడ్డి, వి.మాడుగుల మాజీ ఎంపీపీ పెదబాబు అమ్మవారిని దర్శించుకున్నారు. ఘనంగా అనుపోత్సవం అమ్మవారి అనుపు ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. సతకంపట్టు వద్ద ఉత్సవ విగ్రహం, పాదాలు,ఇతర ఘటాలకు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు,శివరత్నం దంపతులు, ఇన్చార్జి కలెక్టర్, జేసీ డాక్టర్ అభిషేక్గౌడ, సబ్కలెక్టర్ సౌర్యమన్పటేల్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవ విగ్రహం, పాదాలను ఎమ్మెల్యే దంపతులు బయటకు మోసుకువచ్చి ఊరేగింపు సంబరాన్ని ప్రారంభించారు. ఉత్సవ విగ్రహాలు,పాదాలను మోసేందుకు భక్తులు పోటీపడ్డారు. ప్రత్యేక ఆకర్షణగా ప్రదర్శనలు సంబరంలో శక్తివేషాలు, రాక్షస వేషాలు, కోలాటాలు, కేరళ, తీన్మార్ డప్పు వాయిద్యాలు హోరెత్తాయి.ఽథింసా,కాంగో నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రధాన రోడ్డు నుంచి ఆలయం వరకు సంబరం అ త్యంత వైభవంగా జరిగింది. వేలాది సంఖ్యలో భక్తు లు తరలిరావడంతో రోడ్లన్నీ కిక్కిరిశాయి. ఊరేగింపు అనంతరం ఉత్సవ విగ్రహాలు, పాదాలను ప్రధాన ఆలయంలో కొలువుదీర్చారు. ఎస్పీ అమిత్బర్దర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఘనంగా ముగిసిన మోదకొండమ్మ ఉత్సవాలు అమ్మవారి నామస్మరణతో మార్మోగిన పాడేరు భారీగా తరలివచ్చిన భక్తజనం ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలుభక్తులకు భోజనాలు వడ్డిస్తున్న పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు -
ఉచిత పథకాల పేరిట ‘కూటమి’ మోసం
వీఆర్పురం: ఉచిత పథకాల పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సీహెచ్.రమణి ఆరోపించారు. ఐద్వా శిక్షణ తరగతులలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడారు. ప్రభుత్వం ఉచిత పథకాలు ఇస్తామని ప్రజలని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తరువాత గాలికి వదిలేసిందన్నారు. నిధుల కొరత పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. తల్లికి వందనం, ఫ్రీగ్యాస్, ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి రూ.3వేలు, గృహణిలకు నెలకు రూ.1500 ఇస్తానని మభ్యపెట్టి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిందన్నారు. ప్రభుత్వ విధానాలపై మహిళలంతా ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడంలో ఆదివాసీ హక్కులు, చట్టాల అమలును పాలక ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయన్నారు. ఐద్వా జిల్లా ప్రతినిధులు పద్మ, నున్నం పార్వతి, ముర్రం రంగమ్మ, వీరమ్మ, సుబ్బమ్మ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వీఆర్ పురం, కూనవరం, చింతూరు, ఎటపాక మండలాల మహిళా సంఘ ప్రతినిధులు పేర్కొన్నారు.నూరు శాతం ఫలితాల సాధన పెదబయలు: ముంంచంగిపుట్టు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో టెన్త్, ఇంటర్ ఫలితాల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ పి.కేశవరావు తెలిపారు. 2024–2025 విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్లస్–2లో 76 మంది పరీక్షలు రాస్తే 76 మంది ఉత్తీర్ణత సాధించారని, టెన్త్లో 57 మందికి 57 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. టెన్త్లో వరుసగా నాలుగేళ్ల పాటు శాతశాతం ఉత్తీర్ణత, ఇంటర్ ప్లస్–2లో రెండేళ్ల పాటు శతశాతం ఉత్తీర్ణత సాధించడం ఆనందంగా ఉందన్నారు. -
రానున్న వారం రోజుల్లో తేలిక పాటి వర్షాలు
చింతపల్లి: జిల్లాలో రానున్న వారం రోజు ల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని స్థా నిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి వెల్లడించారు. ఈ వారం రోజులు గరిష్ణ ఉష్ణోగ్రతలు 36.8 డిగ్రీల నుంచి 35 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల నుంచి 26 డిగ్రీలు మధ్య ఉండే అవకాశం ఉందన్నారు. గాలిలో తేమ శాతం ఉదయం వేళల్లో 75 నుంచి 82 శాతం మధ్యాహ్న వేళల్లో 40 నుంచి 65 శాతం మధ్య ఉండే అవకాశం ఉందన్నారు. గాలి గంటకు ఏడు కిలోమీటర్ల నుంచి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలు ఉన్నాయన్నారు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందన్నారు. పంటలు వేసుకున్న ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు.గిరిజన హక్కులు,చట్టాలను కాపాడాలి ● మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు డుంబ్రిగుడ (అరకులోయ టౌన్): గిరిజన హక్కులు, చట్టాలను కాపాడుకుంటేనే భావితరాలకు భవిష్యత్తు ఉంటుందని మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు అన్నారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. గిరిజన ప్రాంతంలో జీవో నంబర్ 3ను అమలుచేసి శతశాతం ఉద్యోగాలు గిరిజన అభ్యర్థులకు కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజన హక్కుల కోసం రాజకీయాలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతంలో పనిచేసే ఉద్యోగులు గిరిజన చట్టాలు అమలు చేసి, హక్కులు కాపాడాలని కోరారు. గిరిజన ప్రాంతంలో గంజాయి, గంజాయి లిక్విడ్ రవాణా నివారణకు అధికారులు అడ్డుకట్టవేయాలని కోరారు. -
బావమరుదులపై బల్లెంతో బావ దాడి
సీలేరు (అల్లూరి జిల్లా): ముగ్గురు బావమరుదులపై బావ బల్లెంతో దాడి చేయడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఘటన ఇది. అల్లూరి సీతారామరాజు జిల్లా, జీకే వీధి మండలం, సీలేరు మేజర్ పంచాయతీ, చింతపల్లి క్యాంపు గ్రామంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కిముడు కృష్ణ (36) కిముడు రాజు (40) కిముడు రాజు (25)అన్నదమ్ములు. వీరు ముగ్గురికీ వివాహాలు జరిగాయి. వీరికి నలుగురు, ముగ్గురు, ఇద్దరు చొప్పున పిల్లలున్నారు.బంధువు దినకార్యానికిగాను ఆదివారం చింతపల్లి క్యాంప్లో నివాసముంటున్న బావ వంతల గెన్ను ఇంటికి కుటుంబ సభ్యులతోసహా హాజరయ్యారు. బావ ఇంట్లోనే రాత్రి బస చేశారు. ఈ సమయంలో మద్యం తాగిన బావ తమ సోదరితో గొడవపడుతూ, కొడుతుండటంతో ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో మొదలైన గొడవ అర్ధరాత్రి దాటే వరకు జరుగుతూనే ఉంది.సుమారు ఒంటిగంట సమయంలో ఇంట్లో ఉన్న బల్లెంతో గెన్ను తన భార్య సోదరులను ఒకరి తర్వాత ఒకరిని కడుపులో పేగులు బయటికి వచ్చేలా పొడిచాడు. తరువాత బల్లెంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా, గాయాలతో ఉన్న రాజు అనే మరో బావ మరిదిని కుటుంబ సభ్యులు, స్థానికులు సీలేరు పీహెచ్సీకి తరలించి, మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్కు తీసుకువెళ్లారు. పోలీసులు కేసు నమోదుచేసి, విచారణ జరుపుతున్నారు.నిందితునిపై ఇప్పటికే రెండు హత్య కేసులు నిందితుడు వంతల గెన్ను అత్యంత కిరాతకుడు. ఇతనిపై ఇప్పటికే రెండు హత్య కేసులు నమోదయ్యాయి. ఎనిమిదేళ్ల కిందట ఒడిశాలో ఒకరిని కిరాతకంగా నరికి చంపిన కేసులో జైలుకు వెళ్లాడు. తర్వాత సీలేరులో బంధువుల దగ్గరికి చేరాడు. నాలుగేళ్ల కిందట ఇదే గ్రామంలో వంతల గురువు అనే వ్యక్తిని గొడ్డలితో నరకగా కేసు నమోదై, జైలుకి వెళ్లొచ్చి ప్రస్తుతం చిన్నా చితకా పనులు చేస్తున్నాడు. -
బొడ్డేడ ప్రసాద్కు సన్మానం
సాక్షి,పాడేరు: వైఎస్సార్సీపీ అరకు పార్లమెంట్ పరిశీలకులు బొడ్డెడ ప్రసాద్ సోమవారం పాడేరులో పర్యటించారు.అరకు ఎంపీ డాక్టర్ తనూజరాణి కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు,అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ,వైఎస్సార్సీసీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి చెట్టి వినయ్లు ఘన స్వాగతం పలికారు.అనంతరం దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు. పెళ్లిరోజు జరుపుకొంటున్న అరకు ఎంపీ తనూజరాణి,చెట్టి వినయ్ దంపతులకు పార్టీ పరిశీలకులు ప్రసాద్,పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజులు అభినందనలు తెలిపారు.పూలమాలలతో సత్కరించారు. -
అన్నదాతల మోములో ఆశలమోసులు
సాక్షి,పాడేరు: ఈ ఏడాది రబీలో రెండవ పంటగా గిరిజనులు సాగు చేసిన వరి పొట్టదశలో కళకళాడుతోంది. దీంతో అన్నదాతల మోములో ఆశలు మోసులెత్తుతున్నాయి. గత నెలతో పాటు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రబీ పంటకు ఎంతో మేలు చేశాయి. వేసవిలో అధిక వర్షాలు కురవడం ఇదే మొదటిసారి కావడంతో జిల్లా వ్యాప్తంగా రబీ పంటలకు సాగునీటి సమస్య లేకుండా పోయింది. ప్రస్తుతం వరిపంట ఆశాజనకంగా ఎదుగుతుండడంతో గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ రబీ సీజన్లో 2,361 హెక్టార్లలో వరిపంటను సాగు చేస్తున్నారు. తమ వద్ద ఉన్న సంప్రదాయ ఎంటీయూ 1021 విత్తనాలనే రబీ సాగుకు వినియోగించారు. తక్కువ సమయంలో అంటే 125 నుంచి 130రోజుల వ్యవధిలో పంట దిగుబడికి వస్తుంది.వర్షాలు,వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో దిగుబడులు అధికంగా ఉంటాయని జిల్లా వ్యవసాయాధికారి ఎస్.బి.ఎస్.నందు తెలిపారు. కలిసిరానున్న రబీ మేలు చేసిన వర్షాలు జిల్లాలో 2,361 హెక్టార్లలో వరి సాగు -
క్యారవాన్ టూరిజానికి స్థలాల పరిశీలన
చింతపల్లి: మండలంలోని తాజంగి,లంబసింగి జాతీయ రహదారికి సమీపంలో క్యారవాన్ టూరిజం కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రభుత్వ స్థలాలను పరిశీలించినట్టు స్థానిక తహసీల్దారు రామకృష్ణ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం తాజంగి,లంబసింగి పంచాయతీల పరిధిలో గల పలు గ్రామాల్లో ప్రభుత్వ భూమిని పరిశీలించినట్టు చెప్పారు. కేరళ ప్రాంతంలో ఈ క్యారవాన్ టూరిజానికి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. పర్యాటకుల కోసం క్యారవాన్ కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.పర్యాటకులు బస చేసేందుకు ప్రత్యేకంగా ఎటువంటి గదులు ఏర్పాటు చేయబోమని తెలిపారు.అయితే కనీస అవసరాలైన మరుగుదొడ్లు, తాగునీరు,క్యాంటీన్ సౌకర్యం కల్పించనున్నట్టు చెప్పారు. తాజంగి పంచాయతీలో ఒక స్థలం, లంబసింగి పంచాయతీ పరిధిలో గల భీమనాపల్లి గ్రామ సమీపంలో ఒక స్థలం అనుకూలంగా ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. ఈ రెండు ప్రాంతాల్లో గుర్తించిన భూములకు సంబంధించిన రైతులకు క్యారవాన్ కేంద్రాల్లో ఉపాధి కల్పిస్తామని చెప్పారు. వివరాలను కలెక్టర్కు నివేదించనున్నట్టు తహసీల్దారు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దారు చంద్రశేఖర్,వీఆర్వో సదానంద్, సిబ్బంది పాల్గొన్నారు. సుజనకోటలో.. వుుంచంగిపుట్టు: సుజనకోట పంచాయతీ కేంద్రంలో రెవెన్యూ అధికారులు క్యారవాన్ టూరిజం కేంద్రం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశాలతో తహసీల్దార్ నర్సమ్మ ఆధ్వర్యంలో సోమవారం సుజనకోటలో మత్స్యగెడ్డ ఒడ్డున గల స్థలాన్ని రెవెన్యూ,ఐటీడీఏ టూరిజం అధికారులు పరిశీలించి, వివరాలు ఉన్నతాధికారులకు పంపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రవికుమార్,వీఆర్వో భాస్కర్,సర్వేయర్లు పాల్గొన్నారు. -
మాజీ మంత్రి రజినిపై సీఐ తీరు సరికాదు
కూనవరం: కూటమి ప్రభుత్వం రెడ్బుక్ పాలన కొనసాగిస్తుందని, మహిళలను సైతం విడిచిపెట్టడం లేదని వైఎస్సార్సీపీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు ఆవుల మరియాదాస్ మండిపడ్డారు. చిలకలూరి పేట రూరల్ సీఐ సుబ్బనాయుడు ప్రభుత్వ ఉద్యోగి అన్న విషయాన్ని మర్చిపోయి పోలీస్ జులుం చూపిస్తూ మాజీ మంత్రి, బీసీ మహిళ విడదల రజినిపై ప్రవర్తించిన తీరును నిరసిస్తూ టేకులబోరు సెంటర్లో సోమవారం అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి, అనేక విధాలుగా వేధిస్తుందని ఆరోపించారు. అక్రమ కేసులుపెట్టి, చిత్రహింసలకు గురిచేస్తుందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే వారికి బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాయం రంగమ్మ, ఎంపీటీసీ కొమ్మాని అనంతలక్ష్మి, సర్పంచ్లు కారం పార్వతి, సున్నం అభిరాం, కట్టం లక్ష్మి, వైఎస్సార్ సీపీ నాయకులు డి.గంగాధర్, భరతమూర్తి, కొండలరావు, వెంకన్న, సత్యనారాయణ, మధు, పాపారావు, లక్ష్మణరావు, నర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు. -
పురోగతి లేని సచివాలయ భవనాలు.!
● మధ్యలో నిలిచిన నిర్మాణాలు ● పట్టించుకోని కూటమి ప్రభుత్వం ● నీరుగారుతున్న గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ లక్ష్యం గూడెంకొత్తవీధి: ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్న ఎంతో ముందు చూపుతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ప్రతి పంచాయతీలోనూ గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు చకచకా సాగాయి. కొన్ని చోట్ల సాంకేతిక పరమైన ఇబ్బందులు, ఇతరత్రా కారణాల వల్ల పనులు ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సచివాలయాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎక్కడి నిర్మాణాలు అక్కడే ఆగిపోయాయి. గూడెంలో సగమే పూర్తి గూడెం కొత్తవీధి మండలంలో 18 సచివాలయాల నిర్మాణాలను గత ప్రభుత్వం ప్రారంభించింది. వాటిలో ప్రస్తుతానికి 9 మాత్రమే పూర్తయ్యాయి. పేరుకు మండల కేంద్రం అయినా గూడెంకొత్తవీధిలో సచివాలయం అసంపూర్తిగానే ఉండిపోయింది. పాత పంచాయతీ భవనంలోనే సచివాలయం కొనసాగుతోంది. ఆర్వీ నగర్లోనూ ఇదే పరిస్థితి. అసంపూర్తిగా భవనం మొండిగోడలతో దర్శనమిస్తోంది. ఇక రైతు భరోసా కేంద్రాలు 18కి 10 మాత్రమే పూర్తయ్యాయి. 8 పూర్తి కావల్సి ఉంది. భవనాలున్నా వినియోగించని తీరు మండల కేంద్రంలో కొన్ని శాఖలకు సొంత భవనాలు లేకపోగా.. మరికొన్ని శాఖలకు సొంత భవనాలున్నా వాటిని వినియోగించని పరిస్థితి నెలకొంది. మండల కేంద్రంలో సహాయ గిరిజన సంక్షేమాధికారి కోసం గతంలో ఒక భవనాన్ని నిర్మించారు. ఇప్పుడు ఆ పోస్టే లేకుండా పోవడంతో ఈ భవనం నిరుపయోగంగా ఉంది. కనీసం ఇతర శాఖల అవసరాలకు అయినా ఈ భవనాన్ని వినియోగించడంలేదు. గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారుల కోసం ఇక్కడ మరో భవనం నిర్మించారు. దాన్ని కూడా ఆ శాఖ అధికారులు వినియోగించడం లేదు. దీంతో అది తుప్పల మధ్య నిరుపయోగంగా దర్శనమిస్తోంది. అసంపూర్తి భవనాలను పూర్తి చేయకపోవడంపై స్థాఽనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మధ్యలో నిలిచిపోయిన సచివాలయ భవనాలను పూర్తి చేయాలని కోరుతున్నారు. భవనాల పూర్తికి చర్యలు మండలంలో అసంపూర్తిగా దర్శనమిస్తున్న సచివాలయాలు, ఆర్బీకేల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపడుతున్నాం. గతంలో ఎన్నికల కోడ్ కారణంగా నిధులు నిలిచిపోయాయి. అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తిచేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. – జ్యోతిబాబు, పీఆర్ మండల ఇంజినీరింగ్ అధికారి -
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి
డుంబ్రిగుడ (అరకులోయ టౌన్): స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని వైఎస్సార్సీపీ అరకులోయ పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో అరకులోయలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పార్టీ పటిష్టంగా ఉందన్నారు. అరకులోయ పార్లమెంట్ పరిధిలో వైఎస్సార్ సీపీకి, వై.ఎస్. జగన్మోహన్రెడ్డికి గిరిజనులు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. పార్టీలో కష్టపడుతున్న ప్రతి ఒక్కరికీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సముచిత స్థానం కల్పించనున్నట్టు తెలిపారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. అంతకుముందు పరిశీలకుడి హోదాలో మొదటి సారి అరకులోయ వచ్చిన బొడ్డేడ ప్రసాద్కు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం దుశ్శాలువాతో సత్కరించి, స్వాగతం పలికారు. అనంతరం అరకు ఎమ్మెల్యే మత్స్యలింగంను పరిశీలకుడు ప్రసాద్ సన్మానించారు. ఈకార్యక్రమంలో అరకులోయ, డుంబ్రిగుడ జెడ్పీటీసీలు శెట్టి రోషిణి, చాటరీ జానికమ్మ, డుంబ్రిగుడ, అనంతగిరి ఎంపీపీలు శెట్టి నీలవేణి, బాకా ఈశ్వరి, రాష్ట్ర ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు పాంగి చిన్నరావు, నియోజవర్గం ఎంపీటీసీలు, సర్పంచ్లు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ అరకులోయ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్ -
బ్యాలెట్ విధానంపైనా అనాసక్తి
అడ్డతీగల: అడ్డతీగల గ్రామ పీసా కమిటీ ఎన్నిక బ్యాలెట్ విధానంలో సోమవారం నిర్వహించినా ఓట్లు వేయడానికి ఓటర్లు ఆసక్తి చూపలేదు. తరచూ కోరం లేక వాయిదా పడుతున్న నేపథ్యంలో చేతులు ఎత్తే విధానంలో కాకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని తలపెట్టారు. దీంతో సోమవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో బ్యాలెట్ విధానంలో ఎన్నిక నిర్వహించారు. అడ్డతీగల పంచాయతీలోని డొక్కపాలెం, అనిగేరు, అడ్డతీగల గ్రామాల్లో కలిపి 3 వేల మంది ఓటర్లు ఉన్నారు. అయితే సోమవారం నాటి బ్యాలెట్ విధానంలో నిర్వహించిన ఎన్నికకు 257 ఓట్లు పోలయ్యాయి. దీంతో పీసా ఎన్నికపై సందిగ్ధత తొలగలేదు. మంగళవారం ఓట్ల లెక్కింపు ఉన్నతాధికార్ల సమక్షంలో జరిపి ఉపాధ్యక్ష, కార్యదర్శుల ఎన్నికను తెలియజేస్తామని అధికారులు చెబుతున్నారు. బ్యాలెట్ బాక్స్ని ప్రత్యేక గదిలో ఉంచి తాళాలు వేసి పోలీసులకు అప్పగించారు. అడ్డతీగల గ్రామ పీసా ఎన్నికపై తొలగని సందిగ్ధత -
డుంబ్రిగుడలో భారీ వర్షం
డుంబ్రిగుడ: మండలంలో సోమవారం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భీకర శబ్దాలతో పిడుగులు పడడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. పలు చోట్ల చెట్లకొమ్ములు విరిగి పడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. డుంబ్రిగుడలోని ఓ శుభకార్యంలో ఏర్పాటు చేసిన స్వాగత బోర్డుతో పాటు టెంట్లు పడిపోయాయి. నేడు మోదమ్మ అనుపోత్సవం సాక్షి,పాడేరు: పాడేరులో మోదకొండమ్మతల్లి ఉత్సవాలు మంగళవారంతో ముగియనున్నాయి. ఉత్సవాల చివరి రోజు మోదకొండమ్మతల్లి అనుపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తెలిపారు.మధ్యాహ్నం సతకంపట్టు నుంచి మోదకొండమ్మతల్లి ఉత్సవ విగ్రహం,పాదాలు,ఘటాల ఊరేగింపు ప్రారంభమవుతుందన్నారు.సాంస్కృతిక కళాప్రదర్శనలు, నేల వేషాలు, డప్పు వాయిద్యాలతో అనుపోత్సవం జరుగుతుందన్నారు.అన్ని వర్గాల భక్తులు ఈ ఉత్సవానికి భారీగా తరలిరావాలని ఎమ్మెల్యే కోరారు. -
సీతపల్లి వాగుపై వంతెన నిర్మించాలి
రంపచోడవరం: దేవీపట్నం మండలం వెలగపల్లి–గుంపెనపల్లి గ్రామాల మధ్యలో సీతపల్లి వాగుపై వంతెన నిర్మించాలని గిరిజనులు కోరారు. ఈ మేరకు సోమవారం ఐటీడీఏ సమావేశపు హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పీవో కట్టా సింహాచలంకు వినతి పత్రం అందజేశారు. మారేడుమిల్లి మండలం వేటుకూరు–చింతలపూడి గ్రామాల మధ్య 16 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం అటవీ అభ్యంతరాలతో నిలిచిపోయిందని, ఫారెస్ట్ క్లియరెన్స్ మంజూరు చేయాలని సర్పంచ్ ఈతపల్లి మల్లేశ్వరి, సిరిమల్లిరెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రామంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించాలని కోరారు. వై.రామవరం మండలం పూతిగుంట నుంచి తోటకూర పాలెం వరకు 170 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, చింతకొయ్య ఎంపీపీ స్కూల్ నుంచి 180 మీటర్లు సీసీ రోడ్డు నిర్మాణం చేయాలని ఎంపీపీ ఆనంద్ అర్జీ అందజేశారు. రాజవొమ్మంగి మండలం కొండపల్లి రిజర్వాయర్ పూడిక తీతకు చర్యలు తీసుకోవాలని పీసా ఉపాధ్యక్షుడు వీరబోయిన బాలరాజు వినతి పత్రం అందజేశారు. రంపచోడవరం మండలం ఇసుకపట్ల గ్రామంలో 20 వేల లీటర్ల వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని విండెల రామారావు, చెదల రాజారెడ్డి కోరారు. గ్రీవెన్స్లో 30 అర్జీలు వచ్చినట్లు పీవో కట్టా సింహాచలం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో డీఎన్వీ రమణ, ఎస్డీసీ అంబేడ్కర్, డీడీ రుక్మాండయ్య, తదితరులు పాల్గొన్నారు. -
అ
ద్వితీయం... మ్మ సంబరంఆకర్షణీయంగా శక్తి, రాక్షస వేషాలు అంగరంగ వైభవంగా ఘటాల ఊరేగింపు డప్పుల దరువులు.. థింసా నృత్యాలు సాక్షి,పాడేరు: ఉత్తరాంఽధ్ర భక్తుల ఆరాధ్యదైవం పాడేరులోని మోదకొండమ్మతల్లి రాష్ట్ర గిరిజన జాతరను అంగరంగవైభవంగా నిర్వహిస్తున్నారు. జాతరలో రెండో రోజైన సోమవారం అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. సాయంత్రం సతకంపట్టు నుంచి మోదకొండమ్మతల్లి ఉత్సవ ఘటాలను పాడేరు వీధుల్లో ఘనంగా ఊరేగించి, పూజలు చేశారు. రాత్రి వరకు ఈ ఊరేగింపు కొనసాగింది. మహిళలు ఘటాలను దర్శించుకున్నారు. శక్తి,రాక్షస వేషాలు,గరగల నృత్యాలు,కేరళా బ్యాండ్, డప్పు వాయిద్యాల నడుమ ఘటాల ఊరేగింపు సాగింది. థింసా నృత్యాలతో గిరిజన యువతులు సందడి చేశారు. అనంతరం ఈ ఘటాలను సతకంపట్టు ఉత్సవ విగ్రహం వద్ద కొలువుదీర్చారు. కేజే పురం మహిళలు సతకంపట్టు స్టేజీపై ప్రదర్శించిన కోలాటం భక్తులను అలరించింది. ప్రత్యేక పూజలు సోమవారం మోదకొండమ్మతల్లి పుట్టినరోజు కావడంతో ప్రత్యేక పూజలు జరిగాయి. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి, చెట్టి వినయ్ దంపతులతో పాటు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం,ఉమ్మడి విశాఖ జెడ్పీచైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర,మూర్తి దంపతులతో పాటు అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అరకు ఎంపీ,ఎమ్మెల్యే,జెడ్పీ చైర్పర్సన్లకు ఉత్సవ,ఆలయ కమిటీ అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే ఘన స్వాగతం పలి, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దుశ్శాలువాలతో సన్మానించారు. మోదమ్మ చిత్రపటాలను,ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు కూడా సురేష్కుమార్, కొణతాల ప్రశాంత్,కూడి వలసంనాయుడు, కేజీయారాణి,కొణతాల సతీష్, బోనంగి వెంకటరమణ,సల్ల రామకృష్ణ,కాంగు చిన్ని,మోద స్వరూప,మోరి స్వర్ణ, డి.పి.రాంబాబు,రాధాకృష్ణ,చంద్రమోహన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
తప్పిపోయిన బాలిక తల్లిదండ్రుల చెంతకు
సాక్షి,పాడేరు: మోదకొండమ్మతల్లి జాతరలో తప్పిపోయిన ఐదేళ్ల బాలికను డ్రోన్,సీసీ కెమెరాల సాయంతో నిమిషాల వ్యవధిలోనే గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.కంకిపాటి వైశాలి అనే బాలిక మోదకొండమ్మతల్లి ఆలయం రోడ్డులో సోమవారం సాయంత్రం తప్పి పోయింది.బాలిక తండ్రి ఈశ్వరరావు అక్కడ విధుల్లో ఉన్న హుకుంపేట ఎస్ఐ ఎల్.సురేష్కు తెలియజేయడంతో ఆయన వెంటనే స్పందించారు.డ్రోన్,సీసీ కెమెరాల సాయంతో గాలించారు.కొంతదూరంలో నడుచుకుంటూ వెళ్తున్న ఈ బాలిక గుర్తించి, తల్లిదండ్రులకు అప్పగించారు.తప్పి పోయిన బాలికను సకాలంలో గుర్తించి,తల్లిదండ్రులకు అప్పగించిన ఎస్ఐ సురేష్ను ఎస్పీ అమిత్బర్దర్ అభినందించారు. సకాలంలో స్పందించిన హుకుంపేట ఎస్ఐ సురేష్ -
పత్రికా స్వేచ్ఛపై దాడి తగదు
హుకుంపేట: జర్నలిస్టులను వేధించడం సరికాదని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో సోదాలు చేయడం దారుణమని డాక్టర్ వైఎస్సార్, టీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తెడబారికి సురేష్కుమార్ తెలిపారు. సోమవారం మండల కేంద్రం హుకుంపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని చెప్పారు. తప్పు చేస్తే ప్రెస్ కౌన్సిల్కు, న్యాయస్థానాలకు ఫిర్యాదు చేయాలి కాని, ఇంటికి పోలీసులను పంపించడం తగదన్నారు. నిజాలు ప్రచురించే పత్రికలపై అధికారం ఉందని కక్షసాధింపు చర్యలు తగవని హెచ్చరించారు. కూటమి నాయకులు రెడ్బుక్ పాలన అమలు చేసున్నారని ఆరోపించారు. -
ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
సాక్షి,పాడేరు: జిల్లాలోని 18 కేంద్రాల్లో ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా కేంద్రం పాడేరులోని జూనియర్ కళాశాల సెంటర్తో కలిపి జిల్లా వ్యాప్తంగా 18 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ కోర్సులకు సంబంధించి 3,075మంది విద్యార్థులకు గాను 31మంది పరీక్షకు గైర్హాజరయ్యారు.ఒకేషనల్ కోర్సుల్లో 515 మందికిగాను 9 మంది పరీక్ష రాయలేదు. ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి జనరల్ కోర్సుల్లో 1,564 మందికి గాను 14 మంది గైర్హాజరయ్యారు. ఈసందర్భంగా జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి సొంటేన భీమశంకరరావు మాట్లాడుతూ అన్ని పరీక్ష కేంద్రాల్లోను సీసీ కెమెరాలతో పాటు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్టు చెప్పారు.విద్యార్థులకు తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించినట్టు తెలిపారు. రాజవొమ్మంగి : స్థానిక గిరిజన సంక్షేమ బాలికల గురుకుల జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో సోమవారం ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్టు ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం తెలిపారు. మొదటి సంవత్సరం పరీక్షలకు నలుగురు, ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి ముగ్గురు గైర్హాజరైనట్టు ఆయన చెప్పారు. -
సింహాచలం ఈవోగాసుజాత బాధ్యతల స్వీకరణ
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం ఈవో(పూర్తి అదనపు బాధ్యతలు)గా దేవదాయ శాఖ విశాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్.సుజాత ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సింహగిరికి వచ్చిన ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆమె ఆలయంలోని కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా మండపంలో ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలో ఆమె పేరిట అర్చకులు స్వామికి పూజలు నిర్వహించారు. వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆమె బాధ్యతలు స్వీకరించారు. దేవస్థానం ఈఈ రాంబాబు, ఏఈవో ఆనంద్కుమార్, సూపరింటెండెంట్ కంచెమూర్తి ఏర్పాట్లను పర్యవేక్షించారు. గతంలో పలుమార్లు దేవస్థానం ఇన్చార్జి ఈవోగా, డిప్యూటీ ఈవోగా ఆమె విధులు నిర్వర్తించారు. -
రోగులకు మెరుగైన సేవలు అందించాలి
ముంచంగిపుట్టు: ఆస్పత్రులో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సూచించారు. ఆదివారం స్థానిక సీహెచ్సీని ఆయన తనిఖీ చేశారు. వార్డుల్లోని రోగులతో మాట్లాడారు. అందుతున్న వైద్యసేవల వివరాలను తెలుసుకున్నారు. చర్మవ్యాధులతో బాధపడుతున్న రంగబయలు పంచాయితీ గొబ్బరపడకు చెందిన ఐదుగురు చిన్నారులను పరిశీలించారు. వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో చాలా మంది పరిస్థితి ఇదే విధంగా ఉందని చిన్నారుల తల్లిదండ్రులు ఎమ్మెల్యేకు తెలియజేశారు.తక్షణమే గొబ్బరపడలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పటు చేయాలని వైద్యులకు ఆయన సూచించారు.అనంతరం ఆస్పత్రిలో సమస్యలను వైద్యాధికారిణి గీతాంజలి నుంచి తెలుసుకున్నారు. మందులు,సిబ్బంది కొరత ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని,ఆస్పత్రిలో మందులు, వైద్య సిబ్బంది కొరత లేకుండా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అరబీరు జగబంధు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పాంగి పద్మారావు, మండల ప్రధాన కార్యదర్శి ముక్కి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆదేశం ముంచంగిపుట్టు సీహెచ్సీ ఆకస్మిక తనిఖీ -
ఉచిత వైద్యశిబిరానికి విశేష స్పందన
రంపచోడవరం: రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో ఆదివారం సిరిగిందలపాడులో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. రామకృష్ణ మిషన్ కార్యదర్శి పరిజ్ఞేయనందజీ మహారాజ్ రోగులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించారు. వైద్య శిబిరంలో 64 మంది రక్త పరీక్షలు నిర్వహించారు. పరమహంస యోగానంద నేత్రాలయం ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం నిర్వహించారు.45 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 15 మందికి కళ్లజోళ్లు అందజేశారు. కంటి ఆపరేషన్ల నిమిత్తం నలుగురిని వేమగిరి కంటి ఆస్పత్రికి తరలించారు. వైద్యశిబిరంలో వైద్యులు తలారి సుబ్బారావు, రాయుడు శ్రీనివాస్, దాసరి ఉమమహేష్ 200 మందికి వైద్య సేవలందించారు. క్యాంప్ ఇన్చార్జి లోకమయనందజీ మహారాజ్, క్యాంప్ కోఆర్డినేటర్ కానుమోను శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
బైక్ను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
ఎటపాక: ఎదురుగా వస్తున్న బైక్ను బస్సు ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎటపాక మండలం సీతాపురం గ్రామానికి చెందిన అల్లాడి భాస్కరరావు(62) భద్రాచలంలో గృహనిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే గత రెండు నెలల నుంచి భద్రాచలంలోని తన కుమార్తె వద్ద ఉంటూ పనులకు వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం పనిలేకపోవడంతో స్వగ్రామం సీతాపురం వచ్చాడు. ద్విచక్రవాహనంపై తిరిగి భద్రాచలం బయలుదేరాడు. ఈ క్రమంలో వెంకటరెడ్డిపేట సమీపంలో 30వ నంబర్ జాతీయ రహదారిపై భద్రాచలం నుంచి చింతూరు వైపు వస్తున్న చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బైక్ను ఎదురుగా ఢీకొంది. ఈ ప్రమాదంలో భాస్కర్రావు రహదారిపై పడటంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అప్పలరాజు తెలిపారు.ఘటన స్థలంలోనే గృహ నిర్మాణ కార్మికుడి మృతి -
కవి నూనె రమేష్కు జాతీయ యువకీర్తి పురస్కారం
వీఆర్పురం: ఏలూరులోని మహలక్ష్మి గోపాలస్వామి కల్యాణ మండపంలో ఈనెల 10, 11 తేదీల్లో నిర్వహించిన శ్రీశ్రీ కళావేదిక సాహితీ పట్టాభిషేక మహోత్సవాల్లో మన్యం కవి నూనె రమేష్కు జాతీయ యువకీర్తి ప్రతిభా పురస్కారం లభించింది. సాహితీ సంబరాల్లో ఈ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ను ప్రసిద్ధ గాయకుడు గజల్ శ్రీనివాస్, కళావేదిక అంతర్జాతీయ సీఈవో డాక్టర్ కత్తిమండ ప్రతాప్, అంతర్జాతీయ సమన్వయకర్త కొల్లి రమావతి, జాతీయ మహిళా అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం. చిట్టె లలిత, సాహితీ సంబరాల కన్వీనర్, పార్థసారధి, ఇతర రాష్ట్ర కమిటీ సభ్యులు సత్కరించారు. ఆయనను పలువురు అభినందించారు. -
ఎస్టీ కమిషన్ చైర్మన్గా బొజ్జిరెడ్డి
రంపచోడవరం: రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్గా రంపచోడవరానికి చెందిన చోళ్ల బొజ్జిరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కొండ రెడ్డి గిరిజన తెగకు చెందిన బొజ్జిరెడ్డి ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ 2009లో రంపచోడవరం నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ప్రత్యేక ఉత్తర్వులు ద్వారా తిరిగి ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించారు. పదవీ విరమణ తరువాత పూర్తి సమయాన్ని పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేశారు. ఆయన నియామకంపై బీజేపీ నాయకులు కారం సీతారామన్నదొర, ప్రసాద్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి
డుంబ్రిగుడ (అరకులోయ టౌన్): ఈనెల 20 నుంచి దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టే సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈసందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ అరకులోయ పరిధిలోని ఐటీడీఏ టూరిజం కార్మికులు గిరిజన మ్యూజియం, పద్మావతి గార్డెన్, చాపరాయి, కొత్తపల్లి జలపాతం కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారని తెలిపారు. ఈమేరకు స్థానిక మేనేజర్లకు సమ్మె నోటీసులు ఇచ్చినట్టు ఆయన వివరించారు. కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్ రద్దు చేయాలని, కార్మికులందరికీ రెగ్యులర్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కేంద్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టనున్న సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయకపోవడమే కాకుండా కనీస వేతన చట్ట ప్రకారం పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలకు నోచుకోవడం లేదన్నారు. ఈనెల 20న అన్ని యూనిట్లు మూసి వేసి విధులు బహిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వంతల రాజు, జయరాజు, రాంబాబు, రాఘవ తదితరులు పాల్గొన్నారు.సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు పిలుపు -
ఘనంగా సీతారాముల విగ్రహ ప్రతిష్ట
రాజవొమ్మంగి: మండలంలోని చికిలింత పంచాయతీ వెంకటనగరంలో ఆదివారం జరిగిన శ్రీసీతారాముల విగ్రహప్రతిష్ట మహోత్సవాన్ని పురోహితులు ఈమని సత్యన్నారాయణ, నరశింహామూర్తి వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. ముందుగా అమ్మవారి విగ్రహాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. విగ్రహ ప్రతిష్ట అనంతరం స్వామి వారిని ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోండ్ల సూరిబాబు, ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు శింగిరెడ్డి రామకృష్ణ, వైస్ ఎంపీపీ రాజేశ్వరి, కమిటీ సభ్యులు అబ్బాయిరెడ్డి, శ్రీను, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు
పాడేరు రూరల్: పట్టణంలో పలుచోట్ల నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటుచేశారు. పట్టణంలో విద్యుత్ సమస్య తలెత్తకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మోదమాంబ కాలనీ, పీఎంఆర్సీ కాలనీ, లోచలికపుట్టు, సుండ్రుపుట్టు రామాలయం కాలనీ, గోల్డెన్నగర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను జిల్లా సర్కిల్ ఎస్ఈ జి.ఎన్.ప్రసాద్, డివిజనల్ ఈఈ ఎ.వి.ఎన్.ఎం.అప్పారావు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాడేరు మోదమాంబ అమ్మవారి పండుగలో భాగంగా విద్యుత్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు కొత్తగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ శాఖ ఏఈ వెంకటరమణ, జేఈ శ్రీనివాస్,సిబ్బంధి త్రీమూర్తులు,తదితరులు పాల్గొన్నారు. -
నీ తోడే నా కనుచూపుగా...
● దాతల దీవెనలతో ఒక్కటైన అంధ జంట ● అతిథులు రాకతో కళకళలాడిన ప్రేమ సమాజం డాబాగార్డెన్స్: ప్రేమ సమాజంలో ఆప్యాయత, అనుబంధాల మధ్య పెరిగిన యువతి శివజ్యోతికి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రాఘవేంద్రతో ఘనంగా వివాహం జరిగింది. ప్రేమ సమాజంలోని అన్నపూర్ణ ఆడిటోరియంలో ఆదివారం రాత్రి 7.05 గంటలకు అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుక.. దాతృత్వం, మానవతా విలువలకు నిదర్శనంగా నిలిచింది. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల శుభ ధ్వనులు, దాతలు, ప్రముఖుల ఆశీస్సులతో సందడి వాతావరణం నెలకొంది. పుట్టుకతోనే కంటిచూపును, తల్లిదండ్రులను కోల్పోయిన శివజ్యోతికి ప్రేమ సమాజమే కుటుంబంగా నిలిచి ఈ వేడుక జరిపించింది. డాబాగార్డెన్స్లోని ప్రేమ సమాజం అనాథాశ్రమంలో రెండు దశాబ్దాలుగా ఆశ్రయం పొందుతున్న శివజ్యోతి.. చినజీయర్ స్వామి అంధుల పాఠశాలలో ఇంటర్మీడియట్, విశాఖ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తి చేసింది. అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం సిద్ధరాంపురం గ్రామానికి చెందిన ఎనుమోలు రాఘవేంద్ర బీకాం(కంప్యూటర్) పూర్తి చేశాడు. అతనూ అంధుడే. కోయంబత్తూరులోని పీఎఫ్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. రాఘవేంద్ర తనలాగే కంటి చూపులేని అమ్మాయినే వివాహం చేసుకోవాలని కోరడంతో.. ఆయన సోదరుడు రమణ ప్రేమ సమాజం ప్రతినిధులను సంప్రదించాడు. దీంతో వారు శివజ్యోతి గురించి అతనికి చెప్పడం, ఇరు వర్గాలు అంగీకరించడంతో కల్యాణోత్సవం కమనీయంగా జరిగింది. అండగా నిలిచిన దాతలు ప్రేమ సమాజం నిర్వహించిన 114వ వివాహంగా ఇది చరిత్రలో నిలిచింది. అఖిల భారతీయ అగర్వాల్ సమ్మేళన్ ప్రతినిధులు అమిత్ లోహియా, వినిత్ లోహియా సహా ప్రేమ సమాజం అధ్యక్షుడు బుద్ధ శివాజీ, కార్యదర్శి హరి మోహన్రావు, కమిటీ ప్రతినిధులు మట్టుపల్లి హనుమంతరావు, విశ్వేశ్వరరావు, సహాయ కార్యదర్శి అప్పలరాజు, గణపతిరావు, రిటైర్డ్ ఏసీపీ దివాకర్, ఉప్పల భాస్కరరావు, స్థానిక కార్పొరేటర్ కందుల నాగరాజు వంటి పలువురు ప్రముఖులు ఈ వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. దాతృత్వ స్ఫూర్తి అడుగడుగునా కనిపించింది. ప్రేమ సమాజం కమిటీ శివజ్యోతికి అండగా నిలిచింది. ఆమె పేరిట రూ. లక్ష ఫిక్స్డ్ డిపాజిట్, ఒక తులం బంగారం(తాడు), సారె సామగ్రిని అందజేసింది. కార్యవర్గం అనుమతితో కంచర్ల అన్నపూర్ణ ఏసీ ఆడిటోరియంలో వివాహం ఘనంగా జరిగింది. అతిథులకు రాత్రి విందుతో సహా వివాహ ఖర్చులన్నీ ప్రేమ సమాజమే భరించింది. గత 14 ఏళ్లుగా ప్రేమ సమాజంలో జరిగే అనాథ బాలికల వివాహాలకు సహాయం అందిస్తున్న అఖిల భారతీయ అగర్వాల్ సమ్మేళన్, అమిత్ లోహియా, వినీత్ లోహియా నాయకత్వంలో రూ.69,500 విలువైన వస్తువులను నూతన వధూవరులకు బహూకరించారు. -
వీర జవాన్ త్యాగం మరువలేనిది
మహరాణిపేట: పాక్ దాడిలో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని దేశం మరువదని వైఎస్సార్ సీపీ నేతలు అన్నారు. ఆదివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో మురళీ నాయక్ చిత్రపటం వద్ద ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ప్రభుత్వ మాజీ విప్ కరణం ధర్మశ్రీ, సమన్వయకర్త తిప్పల దేవన్రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మురళీనాయక్ కుటుంబాన్ని ఆదుకోవాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, రవిరెడ్డి, కటుమూరి సతీష్, మొల్లి అప్పారావు, కొండా రాజీవ్ గాంధీ, బానాల శ్రీనివాసరావు, రాజన్న వెంకటరావు, కటారి అనిల్ కుమార్ రాజు, షేక్ మహ్మద్ గౌస్, ఏమండి సత్యనారాయణ, పేడాడ రమణి కుమారి, సనపల రవీంద్ర భరత్, బోని శివ రామకృష్ణ, పులగం కొండారెడ్డి, సేనాపతి అప్పారావు, రామిరెడ్డి, పీలా ప్రేమ కిరణ్ జగదీష్, దేవరకొండ మార్కండేయులు, నీలాపు కాళిదాస్రెడ్డి, కె.రామన్నపాత్రుడు, నాగేంద్ర, అప్పన్న, కొట్యడ సూర్యనారాయణ, కనక ఈశ్వరరావు, గంగా మహేష్, పీతల వాసు, బెవర మహేష్, గోబింద్ బోధాపు, శ్రీనివాస్రెడ్డి, మధుసూదన్రెడ్డి, రంభ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.మురళీ నాయక్కు వైఎస్సార్ సీపీ నేతల నివాళి -
3
శతాబ్దాలుగా.. 300 ఏళ్లు.. ఐదుగురు దాసులు ముకుందనాయక్ దాస్ (ప్రారంభకులు) రుషికేష్నాయక్ దాస్ (ముకుందనాయక్ తమ్ముడి కొడుకు) బుచ్చికిశోర్నాయక్ దాస్ (రుషికేష్నాయక్ కొడుకు) వనమాలిక్నాయక్ దాస్ (బుచ్చికిశోర్నాయక్ తమ్ముడు) లక్ష్మీకాంత్నాయక్ దాస్ (వనమాలినాయక్ కొడుకు) సింహాచలం: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి క్షేత్రంతో ఒడిశా భక్తులకు విడదీయరాని అనుబంధం ఉంది. అందులోనూ గంజాంలోని పట్టుపురం గ్రామానికి చెందిన నాయక్దాస్ కుటుంబానిది మరీ ప్రత్యేకం. మూడు వందల ఏళ్లకు పైనుంచే ఈ కుటుంబానికి చెందిన ఒకరు స్వామి సేవకు అంకితమవడం ఆనవాయితీ. ఏటా మూడు నెలలు సింహగిరిపై ఉండి స్వామి సేవతోపాటు, తమ వద్దకు వచ్చే భక్తులకు స్వామివారి విశిష్టతను, సింహాచల క్షేత్ర వైభవాన్ని చాటిచెప్తుంటారు. స్వామి సేవలో నాలుగో తరం నాలుగో తరానికి చెందిన లక్ష్మీకాంత్నాయక్దాస్ ప్రస్తుతం అప్పన్న సేవలో తరిస్తున్నారు. ఈయన తాతగారి పెదనాన్న ముకుంద నాయక్ దాస్ నుంచే స్వామికి వీరి కుటుంబం సేవలందించే కార్యక్రమం ప్రారంభమైంది. స్వామిపై ఉన్న ఎనలేని భక్తి కారణంగా అప్పట్లో ఒడిశా నుంచి ముకుంద నాయక్దాస్ సింహాచలం వచ్చేశారు. సింహగిరిపై ఓ చెట్టు క్రింద తపస్సు చేసుకుంటూ, స్వామి సేవలో తరించేవారు. కొన్నేళ్లకు కంటిచూపు మందగించడంతో తమ్ముడి కొడుకై న రుషికేష్నాయక్దాస్ ఏడేళ్ల వయస్సు నుంచే ఆయన వద్దకు చేరారు. తనకు 9 ఏళ్ల వయసులో పెదనాన్న పరమపదించడంతో ఆ బాధ్యతలను రుషికేష్ నాయక్దాస్ స్వీకరించారు. ఆయన 95 ఏళ్లపాటు స్వామి సేవలో గడిపారు. ఒడిశా భక్తుల ఆశ్రయం దాస సత్రం రుషికేష్నాయక్దాస్ 1947లో సింహగిరి క్షేత్రపాలకుడు త్రిపురాంతకస్వామి ఆలయ సమీపంలో కొంత స్థలాన్ని తీసుకుని ఒడిశా నుంచి వచ్చే భక్తుల కోసం ఆశ్రమ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆయన మృతితో ఆయన కొడుకు బుచ్చికిషోర్ నాయక్దాస్ సింహాద్రి అప్పన్న సేవకు అంకితమయ్యారు. ఆ తర్వాత ఆయన తమ్ముడైన వనమాలిక్ నాయక్దాస్ స్వామి సేవను స్వీకరించారు. ఈయన హయాంలోనే రుషికేశ్నాయక్దాస్ శ్రీకారం చుట్టిన ఆశ్రమం దాస సత్రం నిర్మాణం పూర్తయింది. 2006లో వనమాలిక్ మృతితో ఆయన కొడుకు ప్రస్తుత దాసుడు లక్ష్మీకాంత్నాయక్దాస్ స్వామి సేవకు అంకితమయ్యారు. -
అప్రమత్తంగా ఉండండి
కొమ్మాది: దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తీర ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న లైఫ్గార్డ్స్, సెక్యూరిటీ గార్డ్స్ అప్రమత్తంగా ఉండాలని మైరెన్ సీఐ శ్రీనివాసరావు సూచించారు. రుషికొండ బీచ్లో ఆదివారం ఆయన పర్యటించారు. తీరం వెంబడి అనుమానిత వ్యక్తులు కనిపించినా.. అనుమానంగా బోట్లు పయనించినా తమకు వెంటనే సమాచారం అందించాలని ఆదేశించారు. రుషికొండ బీచ్కు నిత్యం వేలాది మంది పర్యాటకులు వస్తుంటారని.. జాగరూకతతో వ్యవహరించాలన్నారు. ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలను పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. -
పెళ్లయిన మూడు రోజులకే..
● స్నేహితులతో స్నానానికి వెళ్లి నవ వరుడు దుర్మణం రావికమతం : మండలంలో టి.అర్జాపురం శివారు పాత కొట్నాబిల్లి గ్రామానికి చెందిన ఆసరి జగదీష్ (26)కు అదే గ్రామానికి చెందిన ఉమ(22)తో గిరిజన సంప్రదాయంలో ఈ నెల 8 న గురువారం రాత్రి వివాహం జరిగింది. స్నేహితులకు పెళ్లి పార్టీ ఇవ్వడానికి వెళ్లిన జగదీష్ అనుకోని రీతిలో మృత్యువాత పడ్డాడు. గ్రానైట్ క్వారీ వద్ద భారీ గొయ్యిలో ఈతకు దిగి దుర్మరణం పొందాడు. ఈ సంఘటన పాత కొట్నాబిల్లిలో చోటు చేసుకొంది. రావికమతం ఎస్ఐ రఘువర్మ తెలిపిన వివరాల మేరకు ఐదుగురు మిత్రులకు పెళ్లి పార్టీ శనివారం గ్రామానికి సమీపంలో ఉన్న క్వారీ వద్ద ఇచ్చాడు. అందరూ కలిసి మద్యం తాగారు. జగదీష్ మాత్రం తవ్వకాల వల్ల ఏర్పడిన గోతిలో ఈతకు దిగాడు. మిగిలిన స్నేహితులకు ఓపిక లేక ఒడ్డునే ఉన్నారు. జగదీష్ ఈతకు దిగి మునిగి పోయిన సంగతి స్నేహితులు గమనించలేదు. స్నేహితులకు మద్యం మత్తు వదిలాక జగదీష్ అక్కడ లేకపోవడంతో ఇంటికి వెళ్లిపోయాడని భావించి ఊర్లోకి వచ్చేశారు. శనివారం రాత్రి జగదీష్ రాకపోవడంతో బంధువుల ఇళ్ల వద్ద విచారించారు. ఆదివారం క్వారీ వద్ద గోతిలో శవమై తేలాడు. ఘటనపై మృతుడి తండ్రి సీతారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రఘువర్మ తెలిపారు. -
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
తగరపువలస: ఆనందపురం మండలం శిర్లపాలెం గ్రామానికి చెందిన కోరాడ తాతారావు(25) అనే యువకుడు మనస్తాపంతో ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్యం అలవాటు ఉన్న మృతుడికి ఆ కారణంతోనే వివాహం కాకపోవడంతో ఇటీవల తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. పశువుల కాపరిగా, వ్యవసాయ కూలీగా పని చేస్తున్న తాతారావు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంట్లో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నాడు. 1.30 సమయంలో సమీపంలోని అమ్మమ్మవారి ఇంటి వద్దకు వెళ్లి, చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. విషయం తెలుసుకున్న మృతుని బంధువులు ఆవేదనకు గురయ్యారు. ఆనందపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతునికి అమ్మానాన్న అప్పలకొండ, నారాయణ ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, ఆనందపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మాతృమూర్తులే సమాజానికి దిక్సూచి
మహారాణిపేట(విశాఖ): స్థానిక ప్రకృతి చికిత్సాలయంలో శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ, రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్, ప్రకృతి చికిత్సాలయం సంయుక్త నిర్వహణలో మాతృదినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి మాట్లాడుతూ మాతృమూర్తులు సమాజానికి దిక్సూచిలాంటివారని, పిల్లల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సింది వారేనన్నారు. ఈ సందర్శంగా దేశంలో భౌతిక శాస్త్రంలో పీహెచ్డీ పట్టా పొందిన మొదటి వనిత ఆచార్య చిలుకూరి శాంతమ్మను ఘనంగా సత్కరించారు. ఈ వయసులో కూడా విద్యార్థులను తీర్చిదిద్దుతూ, 20 మంది విద్యార్థులు డాక్టరేట్ పట్టాలు పొందడం శాంతమ్మ ఘనతకు నిదర్శనాలని కొనియాడారు. సన్మాన గ్రహీత శాంతమ్మ మాట్లాడుతూ యువత విద్యలో, క్రీడల్లో కృషిచేసి దేశానికి కీర్తి ప్రతిష్టలు తేవాలని ఆకాంక్షించారు. అనంతరం డాక్టర్ ఎస్.లక్ష్మీనారాయణ, డాక్టర్ ఎస్.శ్రీలక్ష్మి, ఏవీఎన్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సింగరాజు కృష్ణకుమారి, సింగరాజు సతీష్ కుమార్, ఏయూ విశ్రాంత ఆచార్యులు డాక్టర్ పుల్లారావు, తలాడ గిరిజ మాతృమూర్తుల త్యాగాలను, వారి గొప్పతనాన్ని వివరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రూపాకుల రవికుమార్, చొక్కాకుల రాంబాబు, పల్లా చలపతిరావు, దేవర చంద్రశేఖర్, సీహెచ్ రాజబాబు, ఎర్నింటి లక్ష్మి, ఎర్నింటి వెంకటలక్ష్మి, బొట్ట రమణమ్మ , గేదెల శ్రీహరి , రాహుల్, ఎ.రాధ తదితరులు పాల్గొన్నారు. మాతృదినోత్సవంలో ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి -
ఒడిశా దాసుల సేవల్లో కొన్ని..
● ఒడిశాలోని తమ స్వగృహంలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి పీఠాన్ని ఏర్పాటు చేసుకుని సింహాచల క్షేత్రంలో జరిగే నిత్య పూజాది కార్యక్రమాలన్నీ ఆచరిస్తుంటారు. ● సింహాచలం క్షేత్రంలో లక్ష్మీకాంత్నాయక్దాస్ ఉన్న మూడు నెలల్లో స్వామికి ఆర్జిత సేవలను వైభవంగా నిర్వహిస్తారు. ఆశ్రమంలో ఏటా నృసింహ హోమాన్ని నిర్వహిస్తుంటారు. ● దాసుడి దగ్గర తమకున్న మానసిక, ఆరోగ్య రుగ్మతలు చెప్పుకుంటే అవి ఖచ్చితంగా నయమవుతాయని ఒడిశా భక్తుల విశ్వాసం. దానికనుగుణంగానే సింహగిరిపై ఉన్న దాస సదనంలో తమను ఆశ్రయించేవారికి దాసుడు వైద్య సేవలందిస్తారు. ● స్వామికి అంతరాలయంలో ప్రతి రోజు పూజ అనంతరం దాసుడు భక్తులకు తులసి ప్రసాదాన్ని, గంగమ్మతల్లి సన్నిధిలో దీపం వెలగించిన నూనును ఇస్తారు. ఆ తులసి ప్రసాదం తిన్నా, నూనెను శరీరానికి, తలకు పట్టించుకున్నా రోగాలు నయమవుతాయని ఒడిశా భక్తుల విశ్వాసం. ● 2008లో సింహగిరి దివ్యక్షేత్రం పనుల్లో భాగంగా దాస సత్రాన్ని దేవస్థానం తొలగించింది. ప్రత్యామ్నాయంగా జఠల్సాధు మఠానికి వెళ్లే దారిలో కొండపై స్థలాన్ని ఇవ్వడంతో అక్కడే లక్ష్మీకాంత్నాయక్దాస్ సత్రాన్ని నిర్మించారు. ఆ సత్రంలోనే ఈ మూడు మాసాలూ బసచేస్తుంటారు. -
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి
కంచరపాలెం: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని సీపీఐ రాష్ట్ర సమితి సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జె.వి.సత్యనారాయణమూర్తి ఆరోపించారు. రాష్ట్రంలో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై రోజురోజుకూ ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్నారు. సీపీఐ విశాఖ జిల్లా మహాసభల సందర్భంగా కంచరపాలెం మెట్టు నేతాజీ కూడలి నుంచి పాత ఐటీఐ జంక్షన్ వరకు శనివారం పెద్ద ఎత్తున ప్రజా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. కేంద్రంలో మూడోసారి అధికారంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం 2014లో ఇచ్చిన హామీలనే ఇంకా అమలు చేయలేదన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల కల్పన, నల్లధనాన్ని వెలికితీసి ప్రజలకు పంచుతామన్న హామీలను నెరవేర్చలేదన్నారు. సూపర్ సిక్స్ పథకాల పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడని ప్రశ్నించారు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఎప్పుడిస్తారన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో పేదలు ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు అందిస్తే.. సచివాలయ కార్యదర్శుల ద్వారా టీడీపీ నేతలు దరఖాస్తుదారులను బెదిరించారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను రైతాంగ పోరాటం స్ఫూర్తితో తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వానికి అమరావతి తప్ప మరొకటి కనిపించడం లేదని విమర్శించారు. గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం, విజయవాడలో రైల్వేస్టేషన్ ఉండగా.. అమరావతిలో మరో విమానాశ్రయం అవసరమేముందని ప్రశ్నించారు. నెల రోజుల కిందట రిజిస్టర్ అయిన సంస్థకు విశాఖలో 99పైసలకు భూములు కేటాయించడం దారుణమన్నారు. విశాఖలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వానికి భూములు కనిపించడం లేదని మండిపడ్డారు. సభలో జిల్లా నాయకులు ఎం.పైడిరాజు, మానం ఆంజనేయు లు, ఎ.జె.స్టాలిన్, సిహెచ్ రాఘవేంద్రరావు, డి.ఆదినారాయణ, పి.చంద్రశేఖర్, ఎం.మన్మధరావు, జి.రాంబాబు, కె.సత్యాంజనేయ, కె.సత్యనారాయణ, రెహమాన్, శ్రీనివాసరావు, క్షేత్రపాల్, నాయుడు, నాగభూషణం, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అమరావతి తప్ప మరొకటి కనిపించడం లేదు సీపీఐ రాష్ట్ర సమితి సహాయ కార్యదర్శులు -
14వ పోప్గా లియో నియామకంపై హర్షం
డాబాగార్డెన్స్: రోమన్ క్యాథలిక్ మిషన్కు 267వ జగద్గురువుగా, పరిశుద్ధ 14వ పోప్గా లియో నియామకంపై విశాఖ అగ్రపీఠాధిపతి డాక్టర్ ఉడుముల బాల హర్షం వ్యక్తం చేశారు. సెయింట్ ఆంథోనీ చర్చి ప్రాంగణం, ఆర్చి బిషప్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉడుముల బాల మాట్లాడారు. పోప్ ఫ్రాన్సిస్ ఇటీవల దైవ సన్నిధికి చేరిన నేపథ్యంలో వాటికన్ అధిపతిగా, పునీత పేతురు వారసుడిగా లియో నియమితులయ్యారన్నారు. నూతనంగా ఎన్నికై న పోప్కు విశాఖ అగ్రపీఠం తరఫున శుభాకాంక్షలు తెలిపారు. లియో 2015లో పీఠాధిపతిగా, 2023లో కార్డినల్గా వ్యవహరించారన్నారు. నూతన పోప్ భారత్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని, ఆయన పాలనలో భారత్ను దర్శిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అన్ని చర్చిల్లో వారం రోజుల పాటు దేవునికి కృతజ్ఞత బలిపూజలు అర్పిస్తున్నట్లు వెల్లడించారు. ఫాదర్స్ బాలశౌరీ, జాన్ ప్రకాష్, కె.జయరాజు, రవితేజ పాల్గొన్నారు. -
చల్లని తల్లి మోదకొండమ్మ
సాక్షి,పాడేరు: ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్యదైవం, గిరిజనుల ఇలవేల్పు పాడేరులోని మోదకొండమ్మతల్లి ఉత్సవాలు ఈనెల 11వతేదీ నుంచి 13వతేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో కమిటీల ప్రతినిధులు శ్రమించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. కలెక్టర్ దినేష్కుమార్, జాయింట్ కలెక్టర్ అభిషేక్గౌడ అధ్యక్షతన అన్నిశాఖల అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ● అమ్మవారి ఉత్సవాల సందర్భంగా పాడేరు పట్టణమంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు. అన్ని రోడ్లను కలుపుకుని ఐదు కిలోమీటర్ల వరకు ఇరువైపులా లైటింగ్ ఏర్పాటుచేశారు. ప్రధాన జంక్షన్లలో దేవతా మూర్తుల విద్యుత్ దీపాల కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ● మోదకొండమ్మతల్లి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. మోదకొండమ్మతల్లి మూలవిరాట్ విగ్రహాన్ని బంగారు అభరణాలతో అలంకరించారు. రూ.2లక్షల వ్యయంతో పూల అలంకరణ చేపట్టారు. మెయిన్రోడ్డులోని సతకంపట్టు వద్ద మండపాన్ని అందంగా తీర్చిదిద్దారు. ● ఆదివారం ఉదయం 5గంటలకు అమ్మవారి ఆలయంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు,పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఇతర అధికారులు తొలిపూజలు చేస్తారు. అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలు, ఇత్తడి ఘటాలను ఆలయం నుంచి తోడ్కోని మెయిన్రోడ్డు వరకు ఉరేగిస్తారు. ఘటాలను నెత్తిన పెట్టుకుని భక్తిశ్రద్ధలతో సతకంపట్టు వరకు మోయడం ఉత్సవాల ప్రారంభంలో ప్రధాన ఘట్టం. అమ్మవారి పాదాలు, ఇత్తడి ఘటాలను గుడివాడ మహిళలు శనివారం శుద్ధి చేశారు. ● ఉత్సవాల సందర్భంగా ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు,ఇతర సిబ్బంది మొత్తం వెయ్యి మందితో ఎస్పీ అమిత్ బర్దర్ బందోబస్తు ఏర్పాటుచేశారు. బందోబస్తుకు సంబంధించి పోలీసు అధికారులు, సిబ్బందితో ఏఎస్పీ అడ్మిన్ ధీరజ్ శనివారం సాయంత్రం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటుచేశారు. ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు: జేసీ అభిషేక్ గౌడమోదకొండమ్మతల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసిందని జాయింట్ కలెక్టర్, ఇన్చార్జి ఐటీడీఏ పీవో డాక్టర్ అభిషేక్గౌడ తెలిపారు. శనివారం సాయంత్రం స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ప్రైవేట్ సంస్థలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఆయన పరిశీలించారు. జెయింట్ వీల్, ఇతర వినోద కార్యక్రమాలకు సంబంధించి భద్రతా చర్యలను అఽధికారులతో సమీక్షించారు. అలాగే మోదకొండమ్మతల్లి ఆలయం, మెయిన్రోడ్డులోని సతకంపట్టు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. సబ్కలెక్టర్ సౌర్యమన్పటేల్, ఆర్అండ్బీ ఈఈ బాలసుందరబాబు, డీఎల్పీవో కుమార్ పాల్గొన్నారు. బందోబస్తుపై ఎస్పీ సమీక్ష ఉత్సవాల మూడు రోజులు పాడేరు పట్టణంలో పోలీసుశాఖ ఏర్పాటు చేసిన భారీ బందోబస్తు, ఇతర తనిఖీలు, సీసీ,డ్రోన్ కెమెరాల నిఘాపైె ఎస్పీ అమిత్బర్దర్ ఽశనివారం సమీక్షించారు. మోదకొండమ్మతల్లి ఆలయం, శతకంపట్టు ప్రాంతాలను ఆయన సందర్శించారు. భద్రత ఏర్పాట్ల వివరాలను ఏఎస్పీ (అడ్మిన్) ధీరజ్ తదితర అధికారుల నుంచి తెలుసుకున్నారు. నేటి నుంచి పాడేరులో ఉత్సవాలు పట్టణమంతా విద్యుత్ దీపాలతో అలంకరణ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు -
అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు
● చింతపల్లి రేంజ్ అధికారి అప్పారావు చింతపల్లి: స్థానిక రేంజ్ పరిధిలోని అటవీ ప్రాంతంలో అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రేంజ్ అధికారి అప్పారావు తెలిపారు. అటవీశాఖ డివిజన్ అధికారి వైవీ నరసింహరావు ఆదేశాల మేరకు సికనాపల్లి, గుర్రాలగొంది క్వారీల్లో అక్రమ తవ్వకాలను అరికట్టడంలో భాగంగా డిప్యూటీ రేంజ్ అధికారి వెంకటరామరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్నారు.అటవీ సంపద తరలిపోకుండా ఉండేందుకు ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్సును ఏర్పాటుచేశామన్నారు. -
వంద కిలోల గంజాయి పట్టివేత
ముంచంగిపుట్టు: మండలంలోని బంగారుమెట్ట పంచాయతీ కుజభంగి జంక్షన్ వద్ద శనివారం సాయంత్రం అక్రమంగా తరలిస్తున్న 100కిలోల గంజాయిని పట్టుకున్నట్టు ఎస్ఐ జె.రామకృష్ణ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు పోలీసు సిబ్బందితో కుజభంగి జంక్షన్ వద్ద శనివారం సాయంత్రం 5గంటలకు తనిఖీలు చేస్తుండగా పట్టుబడిందన్నారు. ఒడిశా వైపు నుంచి కారులో వస్తున్న ఐదుగురు వ్యక్తులు తమ సిబ్బందిని చూసి పారిపోవడానికి ప్రయత్నించారన్నారు. వెంటనే వీరిలో ముగ్గురు పట్టుకోగా, మిగతా ఇద్దరు పరారీ అయినట్టు చెప్పారు. కారును తనిఖీ చేయగా గంజాయి బస్తాలతో పట్టుబడిందన్నారు. పట్టుబడిన ముగ్గురిని రిమాండ్కు తరలించామన్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.5 లక్షలు ఉంటుందన్నారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన రవి మున్నాలాల్ జైస్వాల్, స్వప్నిల్ జయప్రకాష్, మండలంలోని బరడ గ్రామానికి చెందిన కిలో లక్ష్మణ్దాసులుగా గుర్తించామని ఎస్ఐ తెలిపారు. పరారైన వారు జిల్లాకు చెందిన సీసా బిస్నాద్, కిలో రవికుమార్గా గుర్తించామని చెప్పారు. వీరిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. తనిఖీల్లో ఏఎస్ఐ తిరుపతిరావు, పంచాయతీ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ● విలువ రూ.5 లక్షలు ● ముగ్గురు అరెస్టు, ఇద్దరు పరారీ -
శతశాతం ఉత్తీర్ణతసాధించేలా చర్యలు
● చింతపల్లి ఏటీడబ్ల్యూవో జయనాగలక్ష్మి చింతపల్లి: టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల్లో గిరిజన విద్యార్థులు ఽశతశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని చింతపల్లి ఏటీడబ్ల్యూవో జయనాగలక్ష్మి అన్నారు. టెన్త్ తప్పిన విద్యార్థులకు స్థానిక గిరిజన సంక్షమ బాలబాలికల ఆశ్రమోన్నత పాఠశాలల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ తరగతులను శనివారం ఏటీడబ్ల్యూవో పరిశీలించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో వేర్వేరుగా మాట్లాడి పలు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు కొండలరావు, పండన్న, పలువురు టీచర్లు పాల్గొన్నారు. -
సాక్షి ఎడిటర్పై కక్ష సాధింపు సరికాదు
అరకులోయ టౌన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతోందని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర విమర్శించారు. శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో అనేక సమస్యలను వెలికితీసి పత్రికల్లో ప్రస్తావిస్తారని, వాటి పరిష్కారానికి ప్రశ్నిస్తారని, ప్రజల పక్షాన పోరాడుతున్న సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డికి ఎటువంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండా కక్షతో ఇంట్లో సోదాలు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చడంపై ప్రశ్నించే వారిని, సోషల్ మీడియా ప్రతినిధులను అక్రమంగా అరెస్టు చేయడం భావ్యం కాదన్నారు. ఎన్నికల సమయంలో జీవో నంబరు 3ను పునరుద్ధరించి, ప్రత్యేక డీఎస్సీ ద్వారా గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామన్న చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత మెగా డీఎస్సీలో గిరిజన అభ్యర్థులకు కేవలం 24 పోస్టులు మాత్రమే కేటాయించారన్నారు. గిరిజనేతరులకు 724 పోస్టులా అని ప్రశ్నించారు. గిరిజన స్పెషల్ డీఎస్సీకి ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతంలో శతశాతం ఉద్యోగ, ఉపాధ్యాయ నియామక చట్టం తీసుకువచ్చి, గిరిజన అభ్యర్థుల ద్వారా భర్తీ చేయాలని కూటమి ప్రభుత్వాన్ని ఆయన కోరారు. రాష్ట్రంలో మంచి పరిపాలన అందించాలని, అమ్మ ఒడి, రైతు భరోసా, ఉచిత బస్సు సర్వీసు తదితర హామీలు నెరవేర్చాలని ఆయన కోరారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర విమర్శ -
కలపకు శాపం
కుదరని బేరం..కాకరపాడు డిపోలో కలపను పరిశీలిస్తున్న డీఎఫ్వో నరసింగరావు, (ఇన్సెట్) చెదకు పాడవుతున్న కలపకొయ్యూరు: మండలంలో అటవీశాఖకు చెందిన కాకరపాడు కలప డిపోలో ప్రస్తుతం 900 సీఎంటీ మేర కలప ఉంది. అంచనా ప్రకారం దీని విలువ రూ.కోటిన్నర మేర ఉంటుంది. జాతీయ రహదారి 516ఈ ఏర్పాటుతో చింతాలమ్మ ఘాట్రోడ్డులో నరికిన చెట్లను తీసుకువచ్చి ఇక్కడ నిల్వ చేశారు. అక్కడ ఎక్కువగా మారుజాతి మొక్కలున్నాయి. వీటిలో కొన్ని విలువ లేనివి కావడంతో వ్యాపారులు కొనుగోలుకు ముందుకు రావడం లేదు.రెండేళ్లుగా కలప అలాగే ఉండడంతో కొంత వరకు పాడైపోయింది. మిగతాది కూడా పాడై చెదలు పట్టే పరిస్థితి నెలకొంది. వేగిస, బండారు రకాల లాంటి కలపను మాత్రమే వ్యాపారు లు వేలంలో పాడు కుని తీసుకెళ్తున్నారు. మిగతా కలప ఉండిపోతోంది. అటవీశాఖ ధర రూ.550.. వ్యాపారుల ధర రూ.400 వేలం పాటకు వచ్చే కలప వ్యాపారులు అడుగుకు రూ.400 ఇస్తామని చెబుతు న్నారు. దీనికి అటవీ శాఖ అంగీకరించడం లేదు. తమ శాఖ నిర్ణయించిన ధర ప్రకారం అడుగుకు రూ.550 చెల్లించాలని అటవీ అధికారులు చెబుతున్నారు. దీంతో బేరం కుదరక వ్యాపారులు వెనక్కి వెళ్లిపోతున్నారు. ఇటు వ్యాపారులు అడుగుతున్న దానికి అటు అటవీ శాఖ చెబుతున్న దానికి మధ్య వ్యత్యాసం అడుగుకు రూ.150 ఉంది. రానున్నది వర్షాకాలం కావడంతో కలప విక్రయంలో జాప్యం జరిగితే పూర్తిగా పాడైపోయే ప్రమాదం ఉంది.కాకరపాడు డిపోలోఅడుగుకు రూ.400ఇస్తామంటున్న వ్యాపారులు రూ.550 చెల్లించాలంటున్న అటవీశాఖ ఉన్నతాధికారులకు లేఖ కలపను తక్కువ ధరకు వ్యాపారులు అడుగుతున్నారు. అలా తగ్గించి ఇవ్వడం తమ పరిధిలోది కాదు. వారు అడిగే ధరకు తాము చెబుతున్న దానికి మధ్య అడుగుకు రూ.150 వరకు వ్యత్యాసం ఉంది. ధర తగ్గించాలని వ్యాపారులు అడుగుతుండటంపై ఉన్నతాధికారులకు లేఖ రాస్తున్నాం. ధర తగ్గిస్తే చాలా వరకు కలప విక్రయం జరుగుతుంది. లేకుంటే కలప పాడైపోయే ప్రమాదం ఉంది. త్వరలో అధికారులు తీసుకునే నిర్ణయాన్ని తదుపరి చర్యలు తీసుకుంటాం. – నరసింగరావు, డీఎఫ్వో, చింతపల్లి విక్రయంలో జాప్యం వల్ల చెదలు పట్టే అవకాశం రూ.కోటిన్నర ఆదాయంపై ప్రభావం అటవీశాఖ ఉన్నతాధికారుల దృష్టికి సమస్య -
ఘనంగా ఉత్సవ మూర్తుల ఊరేగింపు
● అరకులో ముగిసిన వెంకన్నకల్యాణోత్సవాలు అరకులోయ టౌన్: ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయలో గత మూడు రోజులుగా నిర్వహించిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా సాయంత్రం ఐదు గంటల నుంచి స్వామి వారి ఉత్సవ మూర్తుల ఊరేగింపు అత్యంత ఘనంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, గిరిజన థింసా నృత్యాల నడుమ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నుంచి ప్రధాన రహదారి, యండపల్లివలస మీదుగా అరకు సంత బయలు వరకు సాగింది. ఈ సందర్బంగా ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుడు బాల గణేష్, ఆలయ, ఉత్సవ కమిటీ చైర్మన్లు దాసుబాబు, సివేరి బాలకృష్ణ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సింగరావు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు కాపుగంటి కృష్ణారావు, అప్పలరామ్, చందూ, సత్యనారాయణ, లకే బొంజుబాబు, రంగరాజు పాల్గొన్నారు. -
దార్రెల మహిళల ఔదార్యం
ముంచంగిపుట్టు: వేసవిలో మండుటెండలో పయనించే బాటసారుల దాహార్తి తీర్చేందుకు ఆ గ్రామ మహిళలు తమ వంతు సాయమందించేందుకు ముందుకొచ్చారు. తమ సొంత నిధులతో మజ్జిగ, నిమ్మరసం అందించి ఔదార్యం చాటుతున్నారు. ముంచంగిపుట్టు నుంచి పెదబయలు వెళ్లే మార్గంలో కిలగాడ జంక్షన్ వద్ద ప్రయాణికులకు వేసవి కాలం నాలుగు నెలల పాటు చల్లటి మజ్జిగ, నిమ్మరసం ఉచితంగా అందిస్తున్నారు. దార్రెల పంచాయతీ కేంద్రానికి చెందిన గిరిజన మహిళలు. ప్రతి శనివారం 30 మంది స్థానిక గిరిజన మహిళలు సొంత డబ్బులతో మజ్జిగ, నిమ్మరసం తయారు చేసుకుని కిలగాడ జంక్షన్ వద్ద సిద్ధంగా ఉంటున్నారు. ముంచంగిపుట్టు, పెదబయలు నుంచి వచ్చే బస్సులు, ఆటోలు, జీపులు, ద్విచక్రవాహనాలను ఆపి మజ్జిగ, నిమ్మరసాన్ని ఉచితంగా అందిస్తూ ప్రయాణికుల దాహం తీరుస్తున్నారు. దార్రెల మహిళలు చేస్తున్న సేవలపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయా మహిళలను ఎస్ఐ రామకృష్ణ అభినందించారు. శనివారం రోజు ముంచంగిపుట్టు వారపు సంత కావడం ఆ రోజు అధిక శాతం మంది ప్రయాణికులు ఈ మార్గం మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. ఈ మేరకు ప్రయాణికుల దాహం తీర్చాలనే ఉద్దేశంతో చందా రూపంలో డబ్బులు వేసుకొని, ప్రతి ఏడాది వేసవిలో తమ వంతు సేవా కార్యక్రమం చేస్తున్నామని దార్రెల గ్రామానికి చెందిన మహిళలు శాంతమ్మ, రత్నమ్మ, నీలమ్మ, పుష్పవతి, లక్ష్మీ, శ్రీదేవి, మచ్చులమ్మ, వెంకటలక్ష్మి, మీనాక్షి, దుర్గాదేవి,విజయలక్ష్మి, తిరుమలమ్మ, నీలమలు తెలిపారు. బాటసారుల దాహార్తి తీరుస్తున్న స్థానికులు ఉచితంగా మజ్జిగ, నిమ్మరసం అందజేత -
విచ్చలవిడిగా మద్యం బెల్టు షాపులు
రంపచోడవరం: రంపచోడవరం డివిజన్ పరిధిలోని కొన్ని మండలాల్లో పీసా గ్రామ సభ తీర్మానాలు లేకుండా మద్యం షాపులు నడుస్తున్నాయని ఆదివాసీ సంఘాల కూటమి ప్రతినిధులు, ఆదివాసీ చైతన్య వేదిక అధ్యక్షుడు వెదుళ్ల లచ్చిరెడ్డి, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు తీగల బాబురావు ఆరోపించారు. ఈ మేరకు శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. విచ్చలవిడిగా మద్యం బెల్టు దుకాణాలు ఏర్పాటు చేసినా పోలీస్, ఎకై ్సజ్ శాఖలు పట్టించుకోవడం లేదన్నారు. ఏజెన్సీలో పేదలు కూలికి వెళ్తే రోజుకు రూ.300 వస్తుందని, వాటిని మద్యానికి ఖర్చు చేస్తున్నారన్నారు. బెల్టు షాపుల నిర్వహణకు మద్యం వ్యాపారులు, పోలీసు, ఎకై ్సజ్ అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. రంపచోడవరం డీఎస్పీ స్పందించి ఏజెన్సీలో బెల్టు షాపులు లేకుండా నిరోధించాలని కోరారు. కొన్ని చోట్ల బెల్టు షాపుల నుంచి మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసులు కూడా పెట్టలేదన్నారు. బెల్టు షాపుల్లో విక్రయించే మద్యం ఏ షాపుల నుంచి వస్తుందో విచారణ జరిపి వాటి అనుమతులు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. మండలస్థాయిలో పోలీసు అధికారుల సహకారంతో నిర్వహణ పీసా గ్రామ సభ తీర్మానం లేకుండా గ్రామాల్లో దుకాణాల ఏర్పాటు ఆదివాసీ సంఘాల ప్రతినిధులు విమర్శ -
బెల్ట్షాపుపై పోలీసుల దాడి
కూనవరం: కూల్డ్రింక్ షాపు ముసుగులో బెల్ట్షాప్ (మద్యం) నిర్వహిస్తున్న దుకాణంపై పోలీసులు దాడి చేసిన సంఘటన మండల పరిధిలోని భీమవరం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.ఎస్: లతాశ్రీ అందించిన వివరాల ప్రకారం భీమవరం గ్రామంలో బావినేని ప్రేమ్కుమార్ దుకాణంలో అక్రమంగా మద్యం నిల్వలు ఉన్నట్టు సమాచారం రావడంతో షాపుపై తన సిబ్బందితో దాడి చేశారు. ఈ సందర్భంగా 97–బీర్లు, 180 ఎం.ఎల్.– 40 బ్రాందీ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వాటిని అక్రమంగా విక్రయిస్తున్న బావినేని ప్రేమ్కుమార్పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
పది మందికి ఉచిత కంటి ఆపరేషన్లు
రాజవొమ్మంగి: మండలంలోని గడుఓకుర్తి, బూసులపాలెం, అనంతగిరి గ్రామాల్లో కంటి శస్త్రచికిత్సలు అసరమైన పదిమంది వృద్ధులను గుర్తించినట్టు రాజవొమ్మంగి పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ సుష్మ చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల కేంద్రంలో పుష్పగిరి కంటి ఆస్పత్రి(విజయనగరం) సౌజన్యంతో శనివారం కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించినట్టు చెప్పారు. శిబిరంలో వైద్య పరీక్షలు చేసి, కంటి ఆపరేషన్లు అవసరమైన వారిని గుర్తించి, విజయనగరంలోని పుష్పగిరి ఆస్పత్రికి తరలించామన్నారు. ఉచితంగా శస్త్రచికిత్సలు చేయిస్తున్నామని, రోగులకు ఉచిత భోజన, వసతి సదుపాయం కల్పిస్తున్నట్టు చెప్పారు. ఆప్తాలమిక్ అసిస్టెంట్ రమణ, ఆశ వర్కర్ సుభద్ర, వెంకటలక్ష్మి, సత్యవతి, చంటమ్మ తదితర పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు. -
ఉద్యాన పంటల సాగుతో రైతులకు రెట్టింపు ఆదాయం
చింతపల్లి: గిరిజన రైతులు వ్యవసాయ పంటలకు దీటుగా ఉద్యాన పంటలను సాగుచేయడం వల్ల మంచి ఆదాయం పొందవచ్చని చింతపల్లి మండల ఉద్యాన అధికారి కంటా బాలకర్ణ అన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ, ఆర్ఏఆర్ఎస్ మార్టేరు, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో శనివారం చింతపల్లి మండలం రాజుపాకలు వద్ద రైతులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. మార్టేరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ తేజేశ్వరరావు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో సారవంతమైన భూములున్నాయన్నారు. ఈ భూముల్లో సేంద్రియ విధానంలో అన్ని రకాల పంటలను పండించడంతో పాటు సుస్థిర సమగ్ర వ్యవసాయ విధానాలను ఆచరించాలని కోరారు. రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. వ్యవసాయ విధానాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. పెదబరడ మాజీ సర్పంచ్ బోయిన సత్యనారాయణ, లంబసింగి ఆర్గానిక్ ఎఫ్ఫీఓ డైరెక్టర్లు సరోజ, ఇందిర తదితరులు పాల్గొన్నారు. పలు గ్రామాలకు చెందిన రైతులు హాజరయ్యారు. -
వీర జవాన్ మురళీనాయక్కు ఘన నివాళి
పాడేరు రూరల్: పాకిస్తాన్తో యుద్ధంలో భాగంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ సింధూరులో మరణించిన వీర జవాన్ మురళీనాయక్కు పలుచోట్ల ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శాంతకుమారి ఆధ్వర్యంలో శనివారం జరిగిన కార్యక్రమంలో వీర జవాన్ మురళీనాయక్ మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశం కోసం పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోరాటం చేస్తు వీరమరణం పొందడం దేశానికి తీరనిలోటు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కాంక్షిస్తూ, రెండు నిమిషాలు మౌనం పాటించారు. నాయకులు పాంగి రాజారావు, ఉమామహేశ్వరావు, గోపాలపాత్రుడు, కొండబాబు, సత్యవతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి పాడేరులో మోదకొండమ్మ తల్లి ఉత్సవాలు
సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ఈ నెల 11వతేదీ నుంచి 3 రోజుల పాటు ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, గిరిజనుల ఇలవేల్పు మోదకొండమ్మ తల్లి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉత్సవాలు రాష్ట్ర గిరిజన జాతరగా గుర్తింపు పొందాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని సమ్మక్క, సారలమ్మ వనదేవతల గిరిజన జాతర తరువాత పాడేరు మోదకొండమ్మ జాతర రెండవ గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందింది.రాష్ట్ర విభజన అనంతరం మోదకొండమ్మ తల్లి ఉత్సవాలను రాష్ట్ర గిరిజన జాతరగా ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మోదకొండమ్మతల్లి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, పాడేరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, కమిటీ ప్రతినిధులు చర్యలు తీసుకున్నారు. పట్టణాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
మాకవరపాలెం: అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మాకవరపాలేనికి చెందిన లంక గణేష్(26) ఆరేళ్ల క్రితం తూటిపాలకు చెందిన శీరంరెడ్డి సుధారాణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. గణేష్ హోటల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వారం రోజులుగా గణేష్ అత్తగారిల్లు అయిన తూటిపాలలోనే ఉంటున్నాడు. గురువారం మాకవరపాలెం వచ్చి మళ్లీ సాయంత్రం తూటిపాల వెళ్లాడు. శుక్రవారం ఉదయం సమీప జీడితోటలో ఉరివేసుకుని మరణించి కనిపించాడు. స్థానికులు అందించిన సమాచారంతో ఎస్ఐ దామోదర్నాయుడు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మృతుడి తల్లి నూకరత్నం ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడికి భార్య, ఐదేళ్ల ఏళ్ల కుమారుడు ఉన్నారు. -
ప్రజాప్రతినిధుల తీర్మానాల మేరకే అభివృద్ధి పనులు
ఎమ్మెల్సీ అనంతబాబుఅడ్డతీగల: స్ధానిక ప్రజాప్రతినిధుల తీర్మానాల మేరకే అభివృద్ధి పనులు చేపట్టాలని ఎమ్మెల్సీ అనంత బాబు అన్నారు. అడ్డతీగల మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ బొడ్డపాటి రాఘవ అధ్యక్షతన శుక్రవారం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అనంతబాబు మాట్లాడుతూ మండల పరిషత్ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు ఎంపీటీసీలు, సర్పంచ్ల తీర్మాణాలు చేయడం అవసరమన్నారు. అధికారులు ప్రతి పథంకంలోనూ కేటాయించిన నిధులు చేపట్టాల్సిన పనులు గురించి ప్రజాప్రతినిధులకు వివరించి ప్రజల అభీష్టం మేరకు వారు తీర్మానించిన విధంగానే పనులు చేపట్టాలన్నారు. ప్రోటోకాల్ను తప్పక పాటించాలన్నారు. ఉపాధి హామీ పథకం పనులు చేపట్టిన గ్రామసభలో ప్రజాప్రతినిధుల నిర్ణయానికే ప్రాధాన్యమన్నారు. గ్రామాల్లో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినపుడు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు స్థానికంగా ఎటువంటి పనులు చేపట్టినా తగిన సమాచారం ఇవ్వడం లేదని సభ్యులు అధికారుల వైఖరిని తప్పుపట్టారు. శాఖాపరంగా చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను ఆయా శాఖల అధికారులు వివరించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ఆమోదించారు. 15 వ ఆర్ధిక సంఘం నిధులతో చేపట్టనున్న పనులను ప్రతిపాదించారు. ఎంపీడీవో కె.ఆర్.విజయ, జెడ్పీటీసీ సభ్యుడు మద్దాల వీర్రాజు, వైస్ ఎంపీపీ కరణం వీర వెంకట సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
అడ్డొచ్చింది.. కూల్చేశాం
పెందుర్తి: పెందుర్తి నియోజకవర్గంలో అధికార కూటమి నాయకుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. మండలంలోని గొరపల్లిలో పాత మంచినీటి పథకం ట్యాంక్ను జనసేన, టీడీపీ నాయకులు రాత్రికి రాత్రే కూల్చేశారు. తమ సొంత అవసరాలకు ఈ ట్యాంక్ అడ్డు వస్తుందన్న కారణంతో, పంచాయతీ, మండల పరిషత్ అధికారుల అనుమతి లేకుండా దౌర్జన్యకాండకు దిగారు. సొంత నిధులతో జేసీబీని సమకూర్చి ట్యాంక్ను కూలగొట్టారు. అర్ధరాత్రి వరకు ఆ శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నించారు. ఇదెక్కడి దౌర్జన్యం? సాధారణంగా పంచాయతీ పరిధిలో ఉన్న ఏ పాత భవనం, మంచినీటి పథకం, ఇతర ప్రభుత్వ నిర్మాణాలను కూలగొట్టాలంటే నిబంధనల ప్రకారం పంచాయతీ తీర్మానం తప్పనిసరి. అదే సమయంలో మండల పరిషత్ అనుమతి కూడా ఉండాలి. కానీ, ఇటీవల కాలంలో నియోజకవర్గంలో ఆ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. రెండు నెలల క్రితం జెర్రిపోతులపాలెంలో కల్యాణ మండపం నిర్మించడానికి ఏకంగా అంగన్వాడీ కేంద్రం భవనాన్నే కూల్చేయడానికి కూటమి నాయకులు ప్రయత్నించారు. తాజాగా గొరపల్లిలో స్థానిక జనసేన, టీడీపీ కార్యకర్తలు దగ్గరుండి మరీ మంచినీటి పథకం ట్యాంక్ను కూల్చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఇన్ఛార్జ్ ఎంపీడీవో కొల్లి వెంకట్రావును వివరణ కోరగా, గొరపల్లిలో మంచినీటి పథకం ట్యాంక్ కూల్చివేతకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. పంచాయతీ నుంచి సదరు ట్యాంక్ కూల్చివేతకు ప్రతిపాదన లేదని సర్పంచ్ గొరపల్లి శ్రీను తెలిపారు. పెచ్చుమీరుతున్న కూటమి నేతల ఆగడాలు మంచినీటి ట్యాంక్ కూల్చివేత -
భారత సైనికులకు మద్దతుగా సంఘీభావ యాత్ర
విశాఖ లీగల్ : భారత సైనికుల వీరోచిత పోరాటానికి సంఘీభావంగా విశాఖ న్యాయవాదులు ప్రదర్శన నిర్వహించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కోర్టు ప్రధాన గేట్ నుంచి జగదాంబ వరకు ప్రదర్శన నిర్వహించారు. అఖిల భారత న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ సంఘీభావ ప్రదర్శన అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.రామాంజనేయులు మాట్లాడుతూ భారత సైన్యం శత్రుసేనపై చేస్తున్న పోరాటానికి తాము జాతీయ స్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నూకల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నరేంద్ర మోదీ నాయకత్వంలో జరుగుతున్న సింధూర పోరాటానికి న్యాయవాదులందరూ సంఘీభావం ప్రకటించారన్నారు. కార్యక్రమంలో వందలాదిగా న్యాయవాదులు పాల్గొన్నారు. అలాగే కోర్టు ప్రధాన గేటు దగ్గర ప్లకార్డులను ప్రదర్శించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రామాంజనేయరావు, వెంకటేశ్వరరావు, అల్లు సురేష్, మణి, భవాని, శ్రీధర్, చిట్టిబాబు, శ్రీరామ్ముర్తి, ఆనందరెడ్డి, ఎస్.వి.రమణ, తదితరులు పాల్గొన్నారు. -
ఎన్ఎంయూ కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి
ఎంవీపీకాలనీ : వాల్తేర్ ఆర్టీసీ డిపో ఎన్ఎంయూ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు ఆ సంస్థ డిపో చైర్మన్ బండి రవి తెలిపారు. గురువారం రాత్రి డిపో ఆవరణలో ఉన్న తమ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఫర్నిచర్, కార్యాలయ ప్రాంగణాన్ని ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కార్యాలయం సిబ్బంది వచ్చి చూడగా పరిసరాలు చిందరవందరగా ఉండటంతో కుర్చీలు, ఇతర ఫర్నీచర్ వస్తువులు ధ్వంసమై ఉన్నాయన్నారు. ఫ్లెక్సీని సైతం చించేశారన్నారు. ఈ ఘటనపై ఎంవీపీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఎన్ఎంయూ డిపో యాజమాన్యంపై అక్కసుతోనే ఈ దాడికి పాల్పడినట్లు సంస్థ డిపో కార్యదర్శి వసంతరావు పేర్కొన్నారు. -
హెచ్ఎస్ఎల్కుప్రతిష్టాత్మక అవార్డు
విశాఖ సిటీ : హిందూస్తా న్ షిప్యా ర్డ్ లిమిటెడ్(హెచ్ఎస్ఎల్) డిజిటల్ దిశగా అడుగులు వేయడంలో అత్యుత్తమ ప్రతిభకు మరోసారి గుర్తింపు లభించింది. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన 10వ పీఎస్యూ అవార్డుల ప్రదానోత్సవంలో హెచ్ఎస్ఎల్కు అవార్డు దక్కింది. సంస్థలో ఐటీ అప్లికేషన్లు, సంస్కరణలను విజయవంతంగా అమలు చేసినందుకు గాను ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ అవార్డును సంస్థ డైరెక్టర్(కార్పొరేట్ ప్లానింగ్ అండ్ పర్సనల్) కమడోర్ రాకేష్ ప్రసాద్ అందుకున్నారు. -
చెరువు గర్భంలో రోడ్డు తొలగింపు
రోలుగుంట: క్వారీ నుంచి రాయి తరలింపు కోసం మండలంలోని రాజన్నపేట పొలాలకు సాగునీరు అందిస్తున్న చెరువు గర్భంలో నిర్మించిన రహదారిని రోలుగుంట తహసీల్దార్ ఎస్.నాగమ్మ శుక్రవారం తొలగించారు. వివరాలిలా ఉన్నాయి. రాజన్నపేట గ్రామానికి చెందిన పొలాలకు 57/2 సర్వే నంబరులోని భూపతి చెరువు నుంచి సాగునీరు అందుతుంది. గతేడాది రాజమండ్రికి చెందిన ఓ వ్యక్తి సమీపంలోని కొండ ప్రాంతంలో క్వారీ నిర్వహణకు అనుమతి పొందారు. అక్కడి నుంచి రాయిని తరలించడానికి మార్గం లేక చెరువు గర్భంలో రహదారి ఏర్పాటు చేసుకొని యథేచ్ఛగా లారీలతో రాయి తరలింపునకు శ్రీకారం చుట్టాడు. భారీ బండ రాళ్లను రాంబల్లి మండలంలో తలపెట్టిన నేవల్ బేస్ నిర్మాణ పనులకు తరలిస్తున్నారు. దీంతో ఇక్కడ రైతులు తమ భూములకు జరుగుతున్న నష్టాన్ని నిర్వాహకుడికి పలు దఫాలు మొరపెట్టుకున్నారు. చెరువును ఆక్రమించి రోడ్డు వేయడం తగదని అడ్డగించినా ఫలితం లేదు. దీంతో ప్రజా ప్రతినిధులు, కలెక్టర్, నర్సీపట్నం ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయంలో సైతం రైతులు ఫిర్యాదు చేశారు. ఆర్డీవో రమణ ఈ ప్రాంతాన్ని గత వారం తహసీల్దార్ నాగమ్మతో కలిసి సందర్శించి వాస్తవాలపై విచారణ చేపట్టారు. ఈ మేరకు ఇక్కడ చెరువును ఆక్రమించి ఏర్పాటు చేసిన రహదారిని తొలగించి, క్వారీ నిర్వహణలో నిబంధనలు పాటించాలని నోటీసులు జారీ చేశారు. దీనిలో భాగంగా శుక్రవారం మండల సర్వేయర్ నాయుడు, ఆర్.రామమూర్తి, వీర్వో శ్రీనివాస్తో కలిసి క్వారీ వద్దకు వెళ్లారు. చెరువు గర్భాన్ని ఆక్రమించి మెటల్, రాతి బుగ్గితో ఏర్పాటు చేసిన రోడ్డును పొక్లెయిన్తో తొలగించి, ట్రెంచ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగానే క్వారీ నిర్వహణ ఉండాలని, లేకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్వారీ నిర్వహణలో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు రోలుగుంట తహసీల్దార్ నాగమ్మ హెచ్చరిక -
కుక్క దాడిలో ఉపాధి కూలీకి గాయాలు
చీడికాడ: మండలంలోని జె.బి.పురంలో పిచ్చికుక్క దాడిలో ఓ ఉపాధి కూలీకి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన రామిశెట్టి దేముడమ్మ ఓ చెరువులో ఉపాధి పనులు చేస్తుండగా అటుగా వచ్చిన పిచ్చికుక్క దాడి చేసింది. దేముడమ్మ చేతులు, కాళ్లపై విచక్షణా రహితంగా గాయపరిచింది. పక్కనే ఉన్న తోటి కూలీలు కుక్కను తరమడంతో ప్రమాదం తప్పింది. బాధితురాలిని కుటుంబ సభ్యులు పెదగోగాడ పీహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్స అందించారు. వైద్యుల సలహా మేరకు చోడవరం సీహెచ్సీ మెరుగైన వైద్యం కోసం తరలించినట్లు సర్పంచ్ గొల్లవిల్లి చిన్నమ్మలు, వైస్ ఎంపీపీ ధర్మిశెట్టి స్వాతి కొండబాబు తెలిపారు. -
ఏవోబీలో పోలీసుల మోహరింపు
సాక్షి,పాడేరు: దేశవ్యాప్తంగా పాకిస్తాన్, భారత్ల మధ్య యుద్దవాతావరణంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా, దండకారణ్యంలో మాత్రం మావోయిస్టు పార్టీ అణిచివేత లక్ష్యంగా కేంద్ర పోలీసు బలగాలు గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యాయి. మావోయిస్టులపై ముప్పేట దాడులు విస్తృతమయ్యాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆపరేషన్ కగార్లో కేంద్ర పోలీసు బలగాలన్నీ నిమగ్నమై మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కూంబింగ్ను కొనసాగుతోంది. ఇదే పరిస్థితి ఏవోబీలోను నెలకొంది. అల్లూరి సీతారామరాజు జిల్లాకు సరిహద్దులో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అటవీ ప్రాంతాలు ఉన్నాయి. జిల్లాలోని అడవులన్నీ కలిసి ఉన్న ఈ ప్రాంతాన్ని దండకారణ్యంగా పిలుస్తుంటారు. ఈ దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ నిర్వీర్యం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను ఆమలుజేస్తుంది నిరంతరం గాలింపు ఛత్తీస్గఢ్–తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల్లో పోలీసులు–మావోయిస్టుల మద్య ఎదురుకాల్పుల ఘటనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 22 మంది మావోయిస్టులు మృతిచెందగా, అల్లూరి జిల్లా పరిధిలోని వై.రామవరం మండలం అటవీ ప్రాంతంలో ఇద్దరు కీలక మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.అయితే మరి కొంతమంది మావోయిస్టులు దండకారణ్యంలో మకాం వేసినట్టు సమాచారంతో కేంద్ర పోలీసు నిఘా వ్యవస్థ ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిఽశా రాష్ట్రాల పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. పోలీసు బలగాల బూటు చప్పుళ్లతో దండకారణ్య అటవీ ప్రాంతాలు హోరెత్తుతున్నాయి. ఏవోబీ వ్యాప్తంగా కూంబింగ్ వై.రామవరం మండలంలో రెండు రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ కాకూరి పండన్న అలియాస్ జగన్, డీసీఎం రమేష్లు మరణించారు. అయితే మరి కొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నారనే అనుమానంతో పోలీసు బలగాలు రంపచోడవరం, చింతపల్లి పోలీసు సబ్డివిజన్ పరిధిలో గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి. అలాగే మరోవైపు చింతూరు ప్రాంతంలోని పోలీసు బలగాలు సరిహద్దులోని ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల అడవుల్లో గాలింపు చర్యలు చేపడుతున్నాయి. పాడేరు పోలీసు సబ్డివిజన్కు సంబంధించి జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ, అరకులోయ ప్రాంతాల్లోను పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. సరిహద్దులోని ఒడిశా అటవీ ప్రాంతాల్లో పోలీసు బలగాలు నిరంతరం సంచరిస్తున్నాయి. మరోవైపు ఒడిశా పోలీసు బలగాలు కూడా జిల్లాలోని పోలీసు యంత్రాంగానికి సహకరిస్తున్నాయి. గాజర్ల రవి, అరుణక్కలే టార్గెట్ ఏవోబీలో మావోయిస్టు పార్టీకి చెందిన కీలకనేతలు గాజర్ల రవి, అలియాస్ ఉదయ్, అరుణక్కలు టార్గెట్గా ఏవోబీలో పోలీసు బలగాలు గాలింపు చర్యలను విస్తృతం చేసినట్టు తెలుస్తుంది. ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన కాకూరి పండన్న, రమేష్ల కిట్బ్యాగ్లు, ఇతర సామగ్రి ద్వారా ఏవోబీలో సంచరిస్తున్న మావోయిస్టు కీలకనేతల సమాచారం కూడా లభ్యమైనట్టు నిఘా వర్గాల భోగట్టా. ఏవోబీ వ్యాప్తంగా మావోయిస్టు ఉద్యమాలకు గాజర్ల రవి,అరుణక్క,కాకూరి పండన్న అలియాస్ జగన్లు కీలకంగా ఉన్నారు. కీలక నేతలను టార్గెట్గా చేసుకుని మావోయిస్టు పార్టీని ఏవోబీలో పూర్తిగా అణిచివేత లక్ష్యంగా కూంబింగ్ అపరేషన్ జరుగుతోంది. -
వాటర్ స్పోర్ట్స్ వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
కొమ్మాది: రుషికొండ బీచ్లో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో కెనాయింగ్ అండ్ కయాకింగ్ అసోసియేషన్ పర్యవేక్షణలో శుక్రవారం వాటర్ స్పోర్ట్స్ వేసవి శిక్షణ శిబిరం ప్రారంభమైంది. శాప్ చైర్మన్ రవినాయుడు ఈ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. విశాఖను వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధికి వేదికగా మారుస్తామన్నారు. ఇందుకోసం అత్యుత్తమ క్రీడా వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకొని, అంతర్జాతీయస్థాయిలో రాణించాలని క్రీడాకారులకు సూచించారు. కార్యక్రమంలో కెనాయింగ్, కయాకింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బలరామనాయుడు తదితరులు పాల్గొన్నారు.