breaking news
Alluri Sitarama Raju
-
త్వరితగతిన వినతుల పరిష్కారం
కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు కిరసాని కిషోర్ మాట్లాడుతూ గతంలో పనిచేసిన పాడేరు ఐటీడీఏ పీవో, గిరిజన సంక్షేమశాఖ అధికారి ప్రత్యేక చొరవతో 100 మంది గిరిజన విద్యార్థులకు సూపర్ 50 బ్యాచ్లో ప్రత్యేకంగా కోచింగ్ ఇచ్చారన్నారు. ఈ ఏడాది కూడా సూపర్ ఫిఫ్టీ బ్యాచ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వారు విన్నవించారు. ఇవి కొన్ని మండలాలకే పరిమితం కాకుండా జిల్లావ్యాప్తంగా ఐటీడీఏల పరిధిలో ఉన్న 22 మండలాల్లో విద్యార్థులో సూపర్ ఫిఫ్టీ బ్యాచ్లు ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో సూపర్ ఫిఫ్టీ బ్యాచ్లో ఉతీర్ణులైన విద్యార్థులు ఉన్నత చదువులకు అస్కారం ఏర్పడందన్నారు. ఎంబిబిఎస్,సివిల్స్, త్రిబుల్ ఐటి,వివిద ఉన్నత చదువులకు వెళ్ళడానికి ఆష్కారం ఆయిందన్నారు, -
పోడు వ్యవసాయం చట్టరీత్యా నేరం
సీలేరు: పోడు వ్యవసాయం చట్టరీత్యా నేరమని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని తోకరాయి అటవీశాఖ సెక్షన్ అధికారి సతీష్ చెప్పా రు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ చోడురాయి గ్రామస్తులకు పోడు వ్యవసాయంపై ఎవరూ ప్రోత్సహించలేదన్నారు. తోకరాయి గ్రామస్తుల ఆరోపణలు అవాస్తవమన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రిజర్వ్ ఫారెస్టు పరిధిలో ఎక్కడా చెట్టు నరికినా, పోడు వ్యవసాయం చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రెండు గ్రామాల మధ్య ఉన్న అంతర్గత సమస్యలతో అటవీ అధికారులపై ఆరోపణలు చేయడం సరికాదని ఆరోపించారు. -
విలాపం
వలిసెవలిసె పూల మకరందాన్ని సేకరిస్తున్న తేనెటీగ వలిసెలపై పరిశోధనలు జరుగుతున్న చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం చింతపల్లి: వలిసె సాగు జిల్లాలో పాడేరు డివిజన్లో నూనె గింజల పంటగా గిరిజనులు సాగు చేస్తున్నారు. సంప్రదాయ విత్తనాల వినియోగం, ఆకాశపందిరి కలుపు మొక్క ప్రభావం కారణంగా దిగుబడి తగ్గింది. దీంతో నిరాశకు గురవుతున్న రైతులు ఈ సాగుపై ఆసక్తి చూపడం లేదు. ● రెండు దశాబ్దాల క్రితం 6 వేల ఎకరాలకు పైగా ఉన్న సాగు విస్తీర్ణం ఏటా గణనీయంగా తగ్గిపోతోంది. గత రెండేళ్లలో 1500 నుంచి 1600 ఎకరాలు ఉన్న సాగు విస్తీర్ణం ఇప్పుడు 1200 ఎకరాలకు తగ్గిపోయింది. కారణాలివీ.. గిరిజన రైతులు సంప్రదాయ విత్తనాలను వినియోగించడం వల్ల దిగుబడి రావడం లేదు. మరోపక్క మార్కెటింగ్ సమస్యను ఎదుర్కొంటున్నారు. తేనెటీగలు తగ్గడం కూడా దిగుబడిపై ప్రభావం చూపిస్తోంది. రాజ్మా, వరి విత్తనాలను ప్రభుత్వం రాయితీపై అందజేయడం వల్ల ఆ పంటల సాగుపై రైతులు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేకపోవడం కూడా గిరి రైతులను నిరాశ పరుస్తోంది. అనువైన రకాలు ఎత్తయిన గిరిజన ప్రాంతాల్లో సాగు చేసేందుకు అనువైన రకాలను స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు గుర్తించారు. జేఎన్ఎస్–28,30, జేఎన్ఎస్–2016, 1115, కేజీఎన్ –2 రకాలు వంద నుంచి 110 రోజుల్లో దిగుబడి వస్తుంది. జేఎన్ఎస్–6 రకం 110 రోజులు, జేఎన్ఎస్–9, ఉత్కల్ నైజర్–150 రకాలు 95 నుంచి వందరోజుల్లో దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. త్వరలో చింతపల్లి నైజర్ 1,2 విత్తనాలు ఇక్కడి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో వలిసెలపై ప్రత్యేకంగా జాతీయ ప్రాజెక్ట్ అమలు అవుతోంది.ఇక్కడ వేల రకాల విత్తనాలపై 2018 నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ ప్రాంత వాతావరణ పరిస్థితులు అనుకూలంగా చింతపల్లి నైజర్ 1,2 రకాలు ఉన్నట్టు చింతపల్లి గుర్తించారు. వీటిపై పరిశోధనలు మరో రెండేళ్లు జరిపిన అనంతరం రైతులకు పంపిణీ చేస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఏడాది ఆలస్యంగా.. ఈ ఏడాది ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తునందున సాగు ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఏటా ఆగస్టు నెలాఖరు, సెప్టెంబర్లో సాగు మొదలు పెడతారు. నవంబర్ నుంచి పూత వస్తుంది. జనవరి నాటికి దిగుబడి వస్తుంది. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు సాగు చేపట్టిన పరిస్థితులు కనిపించలేదు.చింతపల్లి ఆర్ఏఆర్ఎస్లో వలిసె సాగు పరిశోధన క్షేత్రంఅగ్రి టూరిజంలో సంకల్పించినా.. సాగు విస్తీర్ణం పెంచే చర్యల్లో భాగంగా రెండేళ్ల క్రితం చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు అగ్రిటూరిజంలో ఈ పంటను చేర్చారు. రైతులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ప్రయోజనం లేకపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే మన్యానికి శోభనిచ్చే వలిసె పూలు భవిష్యత్తులో పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితులు లేకపోలేదు. వలిసె పూల మకరందాన్ని సేకరించే తేనెటీగలు పరాగ సంపర్కంలో కీలక పాత్ర పోషిస్తాయి, ఇది పంటల దిగుబడికి మరియు కొత్త మొక్కల పెరుగుదలకు సహాయపడుతుంది. వలిసె తోటల వద్ద తేనెటీగలు చేరడం సహజమే అయినా, ఇటీవలి కాలంలో తేనెటీగల సంఖ్య తగ్గడం వల్ల దిగుబడి తగ్గి గిరిజన రైతులకు నష్టం కలిగిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. -
గంజాయి రవాణాను అరికట్టేందుకు చర్యలు
విశాఖ సిటీ: గంజాయి రవాణాను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఎస్పీలను ఆదేశించారు. శుక్రవారం రేంజ్ పరిధిలోని అల్లూరి, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలతో డీఐజీ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, వివిధ నేరాల నిరోధక చర్యలపై స్పష్టమైన మార్గదర్శకాలు చేశారు. అక్రమ గంజాయి రవాణా వ్యాపారంలో పాల్గొన్న 14 మంది నేరస్తుల ఆస్తులు రూ.10,04,89,621 స్వాధీనం చేసుకోవడాన్ని అభినందించారు. ఇప్పటి వరకు 1,119 మంది గంజాయి నేరస్తుల కదలికలపై షీట్లు తెరిచినట్లు చెప్పారు. అలాగే 51 మంది నిందితులపై పీడీ చట్టం, 80 మందిపై పీఐటీ ఎన్డీపీఎస్ చట్టం అమలుకు ప్రతిపాదనలు చేసినట్లు వెల్లడించారు. తరచూ గంజాయి రవాణా చేసే 368 మంది, అలాగే గంజాయితో పాటు ఇతర నేరాలలో పాల్గొన్న 370 మందిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. న్యాయస్థానాలు ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్లు ఆధారంగా 341 మందిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 20 కేసుల్లో డీఐజీ గోపీనాథ్ జెట్టి -
రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్లో మెరిసిన ఏకలవ్య విద్యార్థులు
● బంగారు, వెండ పతకాలు సాధించిన గిరి బాలలు ● జాతీయ స్థాయి పోటీలకు పలువురు ఎంపికరాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన ఏకలవ్య విద్యార్థులతో ప్రిన్సిపాల్,ఉపాధ్యాయులుబంగారు, వెండి పతకాలు సాధించిన వరుణ్సందేశ్, ప్రవీణ్లతో ప్రిన్సిపాల్ సుమన్ ముంచంగిపుట్టు: మండలంలోని జోలాపుట్టు పంచాయతీ లబ్బూరు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు గుంటూరులోని ఆచార్య నాగార్జన యూనివర్సిటీ క్రీడా మైదానంలో ఈ నెల 7 నుంచి 9తేదీ వరకు నిర్వహించిన 2025–26 రాష్ట్రస్థాయి 4వ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల స్పోర్ట్స్ మీట్లో సత్తాచాటారు.రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో వరణ్సందేశ్ కెప్టెన్లో పాటు సాయి, హేయసాయిలాస్, బాబూజీ, జోస్మాన్, మోహన్దాసు, మనోహర్, నవీన్కుమార్ ప్రతిభ కనబరిచి దిత్వీయ స్థానంలో నిలిచారు. అండర్ 14షార్ట్ పుట్లో ప్రవీణ్ బంగారు పతకం, అండర్ 19 డిస్కస్త్రో లో వరుణ్సందేశ్ వెండి పతకం, అండర్ 19 విభాగంలో 57 కిలోల వెయిట్ లిఫ్టింగ్లో కె.అనిత, 62 కిలోల వెయిట్ లిఫ్టింగ్లో ఎస్.శృతి బంగారు పతకాలు సాధించారు. వచ్చే నెల ఒడిశా రాష్ట్రం కటక్లో జరిగే నేషనల్ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఖోఖోలో నందు, బ్యాడ్మింటన్లో హర్ష, వాలీబాల్ అండర్ 19 విభాగంలో సిద్ధు ఎంపికయ్యారు. శుక్రవారం ఏకలవ్య ప్రిన్సిపాల్ సుమన్, పీటీలు సుమిత్,నందిని,ఉపాధ్యాయులు సత్తా చాటిన విద్యార్థులను అభినందించారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులు రాణించి,పాఠశాలకుమరింత పేరు తీసుకురావాలని ప్రిన్సిపాల్ సుమన్ పాటు ఉపాధ్యాయులు కోరారు. -
ఘనంగా వైశాఖి జాతీయ నృత్యోత్సవం ప్రారంభం
కళాభారతిలో నృత్య వైభవంమద్దిలపాలెం: కళాభారతి వేదికపై 17వ వైశాఖి జాతీయ నృత్యోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నటరాజ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవానికి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఐసీసీఆర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నాయి. ముందుగా విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి సుదగాని రవిశంకర్ నారాయణ్, జీఎస్టీ అడిషనల్ డైరెక్టర్ ఎన్. మహమ్మద్ అలీ, కళాభారతి కార్యదర్శి జి.వి.ఆర్.కె. ప్రసాద్ ముఖ్యఅతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అలరించిన నృత్య ప్రదర్శనలు తొలిరోజు ప్రదర్శనలలో భాగంగా కేరళకు చెందిన కూచిపూడి కళాకారిణి డా.పద్మిని క్రిష్ణన్ మరకత మణిమయ చేల అనే ఉత్తుకాడు వెంకట కవి కృతితో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. న్యూఢిల్లీకి చెందిన ఒడిస్సీ నృత్యకారిణి విద్యూషి కవిత ద్వివేది బృందం పంచాక్షర స్తోత్రం, ఓం నమఃశివాయ, శుద్ధ నృత్యం, గీతగోవిందంలోని అష్టపది, విష్ణు అవతారాలు వంటి ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. తెలంగాణకు చెందిన ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార గ్రహీత ఒగ్గు రవికుమార్ బృందం ప్రదర్శించిన ఒగ్గు డోలు విన్యాసం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మల్లన్న, బీరప్ప కథలతో కూడిన వారి ప్రదర్శన ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. పురస్కారాల ప్రదానం ఈ సందర్భంగా వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన కళాకారులను ప్రతిష్టాత్మక పురస్కారాలతో సత్కరించారు. అనుపమ మోహన్ (కూచిపూడి, కేరళ)కు పద్మభూషణ్ గురు డా. సరోజా వైద్యనాథన్ ఎక్స్లెన్స్ అవార్డు, డా. కె.ఆముక్తమాల్యదకు పద్మభూషణ్ గురు డా. సరోజా వైద్యనాథన్ యువ పురస్కార్ 2025, డా. పద్మిని క్రిష్ణన్ (కూచిపూడి, కేరళ)కు వైశాఖీ ఎక్స్లెన్స్ అవార్డు 2025, కవిత ద్వివేది(ఒడిస్సీ, న్యూఢిల్లీ)కి నాట్యశ్రీ అవార్డు 2025, ఒగ్గు రవికుమార్ (ఒగ్గు డోలు, తెలంగాణ)కు పద్మభూషణ్ గురు డా. సరోజా వైద్యనాథన్ యువ పురస్కార్ 2025లను ప్రదానం చేశారు. భారతీయ నృత్య సంప్రదాయాలను పరిరక్షిస్తూ, యువ కళాకారులను ప్రోత్సహించడానికి వైశాఖీ నృత్యోత్సవం ఒక గొప్ప వేదికగా నిలుస్తోందని వక్తలు ప్రశంసించారు. నిర్వాహకులు బత్తిన విక్రమ్ గౌడ్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కేరళ కూచిపూడి కళాకారిణి అనుపమ మోహన్కు వైద్యనాథన్ ఎక్స్లెన్స్ అవార్డు అందిస్తున్న నిర్వాహకులు -
భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం
రాజకీయ నాయకులు ఇచ్చిన ప్రకటన, స్టేట్మెంట్ను రాస్తున్న విలేకరులు, ఎడిటర్పై కేసులు నమోదు చేయడం సరికాదు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19(ఏ) భావ ప్రకటనకు స్వేచ్ఛ ఇచ్చింది. ఇది జర్నలిస్టులకు రక్షణ ఇస్తుంది. అలాంటిది వారిపై కేసులు నమోదు చేయడం అంటే పత్రికా స్వేచ్ఛను హరించడమే. పత్రికల్లో ప్రచురితమవుతున్న కథనాల్లో ఏమైనా లోపాలు ఉంటే ప్రభుత్వం లేదా ఇతరులు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయవచ్చు. లేదా వచ్చిన వార్తపై రిజాయిండర్ ఇవ్వాలి. అలా కాకుండా నేరుగా కేసులు నమోదు చేయడం సరైంది కాదు. ఇది పత్రికా స్వేచ్ఛపై దాడిగానే భావిస్తున్నాం. నిజాలను రాసే వారిపై ఇలా కేసులు పెట్టడం సరికాదు. ఇలాంటి చర్యలు పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కల్పించనట్టుగా భావించాల్సి ఉంటుంది. – గొడ్డేటి మాధవి, అరకు మాజీ ఎంపీ -
‘హైడ్రోపవర్ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేయాలి’
చింతపల్లి: మండలంలో గొందిపాకలు పంచాయతీ సమ్మగిరిలో ప్రభుత్వం మంజూరు చేసిన హైడ్రోపవర్ ప్రాజెక్టు అనుమతులను రద్దు చేయాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి బోనంగి చిన్నయ్యపడాల్ డిమాండ్ చేశారు. సమ్మగిరి గ్రామ గిరిజనులు తమ సంప్రదాయ ఆయుధాలతో శుక్రవారం అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో హైడ్రోపవర్ ప్రాజెక్టు కోసం రహస్య సర్వేలు చేస్తున్నప్పటి నుంచి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నామన్నారు. జిల్లాలో అనంతగిరి,అరుకువేలి,హుకుంపేటతో పాటు చింతపల్లి కొయ్యూరు మండలాల సరిహద్దు ఎర్రవరంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు లైన్ క్లియర్ చేస్తూ 459 పేజీల అనుమతిప్రతులను విడుదల చేసిందన్నారు.గిరిజన చట్టాలను, మనోభావాలను గౌరవిస్తామంటూనే తీవ్రమైన అన్యాయానికి కూట మి ప్రభుత్వం పూనుకుంటోందని విమర్శించారు.ఈ ప్రాజెక్టు నిర్మాణాల వల్ల 180 గ్రామాల ప్రజలు నిర్వాసితులయ్యే ప్రమాదం ఉందన్నారు.ఈప్రాజెక్టు నిర్మాణాలను అడ్డుకునేందుకు గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామన్నారు. సీసీఎం మండల కార్యదర్శి పాంగి ధనుంజయ్,మాజీ సర్పంచ్ బెన్నాస్వామి,నాయకులు సత్తిబాబు,సోమరాజు,వెంకటేశ్వర్లు బాలన్న తదితరులు పాల్గొన్నారు. -
దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఆందోళన
● లోయర్ సీలేరు జేఏసీ తీర్మానం చీఫ్ ఇంజినీర్ చిన్నకామేశ్వరరావుకు వినతిపత్రం ఇస్తున్న జేఏసీ నాయకులు మోతుగూడెం: దీర్ఘకాలిక సమస్యలపై ఆందోళనలు నిర్వహించాలని లోయర్ సీలేరు జేఏసీ తీర్మానించింది. ఏపీ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యచరణ సమితి పిలుపు మేరకు గురువారం లోయర్ సీలేరు జెఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈనెల 15 నుంచి 22 వరకు జరిగే ఆందోళన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని నిర్ణయించారు. ఈ మేరకు వినతి పత్రాన్ని లోయర్ సీలేరు కాంప్లెక్స్ సీఈ డి.చిన్నకామేశ్వరరావుకు శుక్రవారం అందజేశారు. స్థానిక సమస్యలపై జేఏసీ ప్రతినిధులు ఆయనతో చర్చించారు. పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో డీఈ బాలకృష్ణ, నాగశ్రీనువాస్, జేఏసీ చైర్మన్ కన్వీనర్ వేమగిరి కిరణ్, ఆనందబాబు, రామారావు రమణ, తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నాయకుడి మృతికి నివాళి
ముంచంగిపుట్టు: మండలంలో గల పెదగూడ పంచాయతీ గూడమాలిపుట్టు గ్రామానికి చెందిన గుడియా మాణిక్యం(61) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న అరకు ఎమ్మెల్యే రేగం మత్ప్యలింగం, మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, వైఎస్సార్సీపీ జిల్లా, మండల నేతలు శుక్రవారం గూడమాలిపుట్టు గ్రామానికి వెళ్లి మాణిక్యం పార్దీవదేహానికి వైఎస్సార్సీపీ పార్టీ జెండాను కప్పి, నివాళులర్పించారు. మాణిక్యం భార్య మత్యమ్మ, కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు.మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక సహాయం అందించారు.ఈ సందర్భంగా అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం, మాజీ ఎమ్మెల్యే పాల్గుణలు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పార్టీ కోసం మాణిక్యం చేసిన సేవలు మరువలేనివన్నారు. కుటుంబానికి పార్టీ నిరంతరం అండగా ఉంటుందని, ఏ కష్టం వచ్చినా తమను సంప్రదించాలని కోరారు. ప్రతి కార్యకర్తకు వైఎస్సార్సీపీ అధినేత జగనన్న తోడుగా ఉంటారని, మాణిక్యం కుటుంబ పరిస్థితిని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. అనంతరం నిర్వహించి అతిమయాత్రలో మాజీ ఎమ్మెల్యే పాల్గుణ పాల్గొని మాణిక్యం పాడెను మసాశారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పద్మారావు, సర్పంచులు రమేష్, బాబూరావు, నీలకంఠం, గంగాధర్, నరసింగరావు, ఎంపీటీసీ సభ్యుడు గణపతి, జెసీఎస్ జిల్లా కో ఆర్డినేటర్ జగబంధు, మండల పార్టీ కార్యదర్శిలు రాంప్రసాద్, సన్యాసిరావు, నేతలు జయదేవ్, మూర్తి, అప్పారావు, గాసిరావు, మత్స్యలింగం, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
గర్భిణులు, శిశువుల ఆరోగ్యమే లక్ష్యం
● ఏడీఎంహెచ్వో ప్రతాప్ పాడేరు: గర్భిణులు, శిశువుల ఆరోగ్యం పెరుగుపరచడమే లక్ష్యంగా యూ–విన్ కార్యక్రమం ద్వారా ఆన్లైన్ టీకాల నవీకరణ జరుగుతోందని ఏడీఎంహెచ్వో డాక్టర్ టి. ప్రతాప్ అన్నారు. ప్రపంచ టీకాల కార్యక్రమం(యూ–విన్) ఆన్లైన్ నవీకరణ కార్యక్రమాన్ని శుక్రవారం ఐటీడీఏలోని తన కార్యాలయంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ నీలవేణి, జిల్లా వ్యాధి నిరోధక అధికారి డాక్టర్ కమలకుమారి తదితరులతో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా యూ–విన్ పోస్టర్లను ఆవిష్కరించారు. సమాజంలో ప్రతి కుటుంబానికి సరైన సమయంలో టీకాలు అందించేలా డిజిటల్ రూపంలో అందుబాటులో తెస్తామని ఆయన పేర్కొన్నారు. జిల్లా యూ–విన్ కోఆర్డినేటర్ ప్రసన్నదత్త పాల్గొన్నారు. -
తప్పుడు ఆరోపణలు తగదు
రంపచోడవరం: కొంత మంది గిరిజనేతరులు నరసాపురం గ్రామస్తులను రెచ్చగొట్టి నిరంతరం ఆదివాసీల కోసం పాటుపడుతున్న ఆదివాసీ సంక్షేమ పరిషత్పై తప్పుడు ఆరోపణలు చేయడం తగదరి ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి కుంజా శ్రీను అన్నారు. నరసాపురం గ్రామంలో క్వారీ వల్ల నష్టపోతున్న బాధితులతో కలిసి శుక్రవారం ఆయన మాట్లాడారు. క్వారీ వల్ల నష్టపోతున్న గిరిజనులు తమను ఆశ్రయించడం వల్లే బాధితుల తరఫున ఆదివాసీ సంక్షేమ పరిషత్ నిలిచి జాతీయ ఎస్టీ కమిషన్కు కూడా ఫిర్యాదు చేసిందన్నారు. వాటాల కోసం, డబ్బులు కోసం క్వారీపై ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్న వారికి, వెనుక ఉన్న కుట్రదారులకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. గ్రామంలో కొంత మంది క్వారీ లెక్కలు చెప్పాలని అడగడంతో బినామీలు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పడం, దీనిపై వారు ఐటీడీఏ పీవో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. గ్రామం మొత్తం ఉండాల్సినటువంటి క్వారీలో వారిని కూలీలుగా మార్చి, క్వారీ నిర్వహణదారులు పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ డబ్బులు డిమాండ్ చేసినట్లు నిరూపిస్తే దేనికై నా సిద్ధమేనని సవాల్ చేశారు. నిజాల నిగ్గు తేలడమే కాకుండా కోర్టు ద్వారా బాధితులకు న్యా యం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు తీగల బాబూరావు, కోఆర్డినేటర్ పీట ప్రసాద్ పాల్గొన్నారు.ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి కుంజా శ్రీను -
అన్ని అంశాలపై అవగాహన అవసరం
పాడేరు మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీ వేణుగోపాల్ రంపచోడవరం: యువతులు అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని పాడేరు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ బి. వేణుగోపాల్ అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఉమెన్, చైల్డ్ సేఫ్టీపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థినులంతా శక్తి యాప్ను కచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. మహిళలకు ఆపద సమయంలో ఇది ఉపయోగపడుతుందన్నారు. అలాగే గుడ్, బ్యాడ్ టచ్, పోక్సో చట్టం గురించి వివరించారు. సైబర్ మోసానికి గురైతే తక్షణం పోలీసులను సంప్రదించాలని సూచించారు. అనుకోని అపద నుంచి ఎలా రక్షించుకోవాలనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీఐ సన్యాసినాయుడు, ఎస్ఐ వెంకట్రావు, ప్రిన్సిపాల్ డా. కె వసుద తదితరులు పాల్గొన్నారు. -
నలుగురు పట్టు రైతులకు అవార్డులు
కూనవరం: మండలం పరిధిలో బోరునూరు కేంద్రంగా టసార్ పట్టు సాగుచేస్తున్న నలుగురు రైతులు చదల కన్నపరెడ్డి, చిచ్చడి వీర్రాజు, చిచ్చడి కన్నమ్మ, కారం దుర్గ అవార్డులు పొందారు. అన్నయ్య జిల్లా మడకశిరలో గురువారం నిర్వహించిన ‘నా పట్టు నా అభిమానం’ కార్యక్రమంలో 30 టీమ్లు పాల్గొన్నాయి. కూనవరం మండలానికి చెందిన టీమ్ టసార్ పట్టు కాయల ఉత్పత్తిలో అధిక దుగుబడి సాధించి అవార్డును దక్కించుకుంది. వీరికి ఎంపీలు బి.కె. పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ, మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు తదితరుల చేతులమీదుగా అవార్డుల అందజేసినట్టు సెరీకల్చర్ అసిస్టెంట్ ఆఫీసర్(ఏఎస్వో) వెంకట హరికృష్ణ తెలిపారు. -
హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం
రంపచోడవరం: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అన్ని వైఫల్యాలే అని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే , వైఎస్సార్సీపీ కో–ఆర్డినేటర్ నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. దేవీపట్నం మండల ఇందుకూరుపేలో శుక్రవారం నిర్వహించిన బాబు ష్యూరిటీ..మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన ఎమర్జన్సీని తలపిస్తుందన్నారు. ఎన్నికల హామీలు అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి ప్రాంత పర్యటనల్లో తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారన్నారు. జగనన్నపై ప్రజలు చూపిస్తున్న ఆదరణను తట్టుకోలేక కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, ప్రజలు ఇది గమనిస్తున్నారని త్వరలో బుద్ధి చెబుతారన్నారు. ప్రజలకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతోందన్నారు. ప్రజల పక్షాన్న వైఎస్సార్సీపీ కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నిస్తుందన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం అమలుచేయని పథకాలు, వైఫల్యాల సమాచారంతో రూపొందించిన క్యూఆర్ కోడ్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఎంపీపీ కుంజం మురళీ, జెడ్పీటీసీ సభ్యురాలు శిరసం సత్యవతి, వైస్ ఎంపీపీ గారపాటి మురళీ, నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి -
లిక్విడ్ గంజాయితో ముగ్గురు పట్టివేత
2 లీటర్ల హాష్ ఆయిల్, మూడు బైక్లు, రూ.50 వేల నగదు స్వాధీనం లిక్విడ్ గంజాయి తరలిస్తున్న వ్యక్తులను పట్టుకున్న పెందుర్తి పోలీసులు పెందుర్తి: ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి లిక్విడ్ గంజాయి(హాష్ ఆయిల్)ను నగరానికి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పెందుర్తి పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. సరిపల్లి చెక్ పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితులు పట్టుబడ్డారు. వారి నుంచి రెండు లీటర్ల హాష్ ఆయిల్, మూడు బైక్లు, నాలుగు సెల్ఫోన్లు, రూ.50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. వివరాలివి.. అల్లూరిసీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం డొన్నలవలస గ్రామానికి చెందిన సమారిడి అర్జున్, పైనంపాడుకు చెందిన డుంబరి స్వామి, డుంబ్రిగుడ మండలం పోతంగికి చెందిన డుంబరి జోయో మూడు బైక్లపై విశాఖ నగరానికి హాష్ ఆయిల్ తరలిస్తున్నారు. సరిపల్లి చెక్పోస్టు వద్ద పెందుర్తి పోలీసులు జరిపిన తనిఖీల్లో నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎస్ఐ దేముడునాయుడు బృందం వారిని చాకచక్యంగా పట్టుకుని లిక్విడ్ గంజాయితో పాటు బైక్లు, నగదు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సీఐ కేవీ సతీష్కుమార్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోంది. -
అవగాహన కల్పిస్తున్నాం
గిరి రైతులు వలిసె సాగులో దిగుబడులు తగ్గడంపై ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితుల్లో రైతులను ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. దత్తత తీసుకున్న దుచ్చరపాలెంలో ట్రైబల్ సబ్ ప్లాన్ ద్వారా మేలు రకాల విత్తనాలు 100 కిలోలు పంపిణీ చేశాం. వీటితోపాటు ఆకాశపందిరి కలుపు మొక్క నివారణకు సూచనలిచ్చాం. ఇదే కాకుండా జల్లెడలు, టార్పాలిన్లు అందజేశాం. తేనెటీగలు మనుగుడ తగ్గడంతో కూడా ఈ పంట దిగుబడి తగ్గుతుంది. వీటి పెంపకానికి రైతులను అవగాహన కల్పిస్తున్నాం. – బయ్యపురెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త, ఆర్ఏఆర్ఎస్, చింతపల్లిరాయితీపై విత్తనాలివ్వాలి వరి, రాజ్మా విత్తనాలు మాదిరిగానే వలిసె విత్తనాలను రాయితీపై పంపిణీ చేయాలి. విత్తనాలు అందుబాటులో లేకపోవడం వల్ల సాగు చేపట్టలేకపోతున్నాం. దీనిపై ప్రభుత్వం, అధికారులు స్పందించి రాయితీపై విత్తనాల పంపిణీకి చర్యలు తీసుకోవాలి. – బౌడు కుశలవుడు, రైతు, గొందిపాకలు, చింతపల్లి మండలం -
1020 కిలోల గంజాయి పట్టివేత
● టిప్పర్లో తరలిస్తుండగా పట్టుకున్న ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ● ముగ్గురు అరెస్టు, మరో ఇద్దరి కోసం గాలింపుపాడేరు: జిల్లాలోని పెదబయలు మండలం గోమంగి శివారు ప్రాంతంలో శుక్రవారం ఒడిశా నుంచి ఏజెన్సీ మీదుగా జార్ఖండ్లోని రాంచీకు తరలిస్తున్న 1020 కిలోల ఎండు గంజాయిని అనకాపల్లి ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను అనకాపల్లి ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ మహేష్కుమార్ శుక్రవారం పాడేరులో వెల్లడించారు. పెదబయలు మండలం గోమంగి శివారు ప్రాంతంలో పెట్రోలింగ్లో భాగంగా వ్యాన్ను ఆపి తనిఖీ చేశామన్నారు. వారిని విచారించగా ఓ టిప్పర్లో భారీ ఎత్తున గంజాయి తరలిస్తున్నట్లు వెల్లడించారన్నారు. దీంతో అటువైపుగా వస్తున్న టిప్పర్ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా భారీగా గంజాయి లభ్యమైందన్నారు. వాహనాన్ని పాడేరులోని ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయానికి తరలించామన్నారు. ముప్పై గోనె సంచుల్లో నింపిన 1020 కిలోల ఎండు గంజాయిని సీజ్ చేశామన్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఒడిశాలోని కొరాపుట్ జిల్లా పొట్టంగి మండలం చందక గ్రామానికి చెందిన గెను సేతి, ముంచంగిపుట్టు మండలం లబ్బురు పంచాయతీ జప్పర్ గ్రామానికి చెందిన సీసా ముస్తాబ్, పెదబయలు ప్రాంతానికి చెందిన నీలయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. పెదబయలుకు చెందిన డ్రైవర్ వి. మోహన్, టిప్పర్ యజమాని వి.కిశోర్కుమార్ కోసం గాలిస్తున్నామని, త్వరలోనే వీరిని అరెస్ట్ చేస్తామన్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.25 లక్షలు ఉంటుందన్నారు. ఈ దాడుల్లో పాడేరు ప్రొహిబిషన్ ఆండ్ ఎకై ్సజ్ సీఐ కె.రాజారావు, ప్రొహిబిషన్ ఆండ్ ఎకై ్సజ్ ఎస్ఐ డి. గణేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ సూర్యప్రకాష్, శంకర్కుమార్, సిబ్బంది నాయుడు, రాజ్కుమార్, టాస్క్ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. -
త్వరితగతిన వినతుల పరిష్కారం
● కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశం ● పీజీఆర్ఎస్లో 134 అర్జీల స్వీకరణపాడేరు: సమస్యలపై అర్జీదారుల నుంచి స్వీకరించిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరిగతిన పరిష్కరించాలని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, డీఆర్వో పద్మలతతో కలిసి 134 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమయపాలన పాటించాలన్నారు. పీజీఆర్ఎస్లో వినతులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించి తగు సూచనలు చేశారు. అర్జీదారులు మీకోసం కాల్ సెంటర్ 1100 సేవలను అర్జీదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమ అర్జీల నమోదు చేసుకునేందుకు meekosam.ap.gov.in వెబ్సైట్ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నందు, డీఆర్డీఏ పీడీ మురళి, డీఈవో బ్రహ్మజీరావు, ఐసీడీఎస్ పీడీ ఝాన్షీరామ్ పడాల్, డీఎల్పీవో కుమార్, టీడబ్ల్యూ డీడీ పరిమళ, జిల్లా ఖజాన అధికారి ప్రసాద్బాబు, ఐటీడీఏ ఏవో హేమలత పాల్గొన్నారు. సూపర్ ఫిఫ్టీ బ్యాచ్ల ఏర్పాటుకు వినతి పాడేరు రూరల్: 2025 విద్యాసంవత్సరానికి సంబంధించి సూపర్ ఫిఫ్టీ 50 బ్యాచ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని గిరిజన విద్యార్థి సంఘం (జీఎస్యూ) ప్రతినిధులు -
పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న కూటమి ప్రభుత్వం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోంది. ప్రెస్ మీట్లో నాయకుడు ఇచ్చిన వార్తను ప్రచురిస్తే కేసులు పెట్టడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రం ఈ రాష్ట్రంలో లేదా? కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి వాస్తవాలు వెలుగులోకి తెస్తున్న సాక్షిపై వేధింపులకు పాల్పడుతోంది. రాజకీయ పార్టీ నేత ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలను రిపోర్టర్ వార్తగా రాస్తే ఎడిటర్పై కేసులు పెడతారా? భావ ప్రకటన స్వేచ్ఛను అక్రమ కేసులు, నోటీసులతో నిరోధించలేరు. రాజకీయ కక్షతో సాక్షి ఎడిటర్పై కేసులు నమోదు చేయడం సరికాదు. కూటమి పాలనలో అన్ని వర్గాలను గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి నేతలకు సరైన గుణపాఠం తప్పదు. – డాక్టర్ గుమ్మా తనూజరాణి, ఎంపీ, అరకులోయ -
బెర్రీ బోరర్పై రైతులకు అవగాహన అవసరం
రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు జి.మాడుగుల: కాఫీ తోటలను ఆశిస్తున్న బెర్రీ బోరర్ పురుగుపై రైతులకు అవగాహన అవసరమని శాస్త్రవేత్తలు, కాఫీ బోర్డు అధికారులు తెలిపారు. మండలంలో కె.కోడాపల్లి, సొలభం,గడుతూరు, గెమ్మెలి, వంజరి, పాలమామిడి, జి.మాడుగుల తదితర 17 పంచాయతీల్లో కాఫీ తోటలను శుక్రవారం శాస్త్రవేత్తలు పరిశీలించి, బెర్రీ బోరర్ పురుగుపై సర్వే నిర్వహించారు. కర్ణాటక కాఫీబోర్డు నుంచి వచ్చిన ఎస్ఎల్వో కామారెడ్డి ప్రభుగౌడ, ఈఐలు సుదీష్,స్రవంతి, ఎఫ్సీ జగదీష్ పాత్రుడు, మాలీ సీతారాం తదితరులు బెర్రీ బోర్పై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లైజన్ వర్కర్లు వెంకట్,మోహన్, బాబూరావు తదితరులు పాల్గొన్నారు. -
వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలం
రాజవొమ్మంగి: మండలంలోని లాగరాయి, కిండ్ర గ్రామాల్లో జ్వరపీడితులకు వైద్య సేవలందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. ఆయా గ్రామాల్లో గురువారం ఆమె పర్యటించి, బాధితులను పరామర్శించారు. లాగరాయిలో చికిత్స పొందుతూ మరణించిన జగజ్జనని ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. తల్లి చనిపోవడంతో అనాథగా మారిన సూర్యదీక్షిత్ (7)ను అక్కున చేర్చుకుని ఓదార్చారు. ఆ కుటుంబానికి రూ. 10వేలు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం లాగరాయి పీహెచ్సీకి వెళ్లి లాగరాయి, కిండ్ర, లబ్బర్తి గ్రామాల్లో నెలకొన్న అనారోగ్యకర పరిస్థితులకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అందిస్తున్న వైద్యంపై ఆరా తీశారు. అనంతం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కిండ్రలో దాదాపు మూడు నెలలుగా జ్వరం, కీళ్లనొప్పులతో ప్రజలు బాధపడుతుంటే ఈ ప్రాంతానికి కలెక్టర్ వచ్చే వరకు వారికి సరైన వైద్యం అందలేదని విమర్శించారు. ప్రతి ఇంటిలో ముగ్గురు,నలుగురు వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు. ఈ మూడు పంచాయతీల్లోని ప్రజలకు సత్వరం వైద్య సేవలందించాలని కోరారు. కూలి పనులకు వెళ్లే వారు మంచం పట్టడడంతో వారి పోషణ కష్టంగా మారిందని, వారిందరికీ మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరకులు అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దోమతెరలు పంపిణీ చేయాలని, రక్త నమూనాలు సేకరించి, మెరుగైన చికిత్స అందజేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సొంత పంచాయతీలోని గ్రామాల్లో ప్రజలు మూడు నెలలుగా జ్వరాలు, కీళ్ల నొప్పులతో బాధపడుతుంటే సరైన వైద్యం అందలేదనన్నారు. ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు శింగిరెడ్డి రామకృష్ణ, సర్పంచ్లు గణలక్ష్మి, సత్యనారాయణ, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి వెంకటేష్రాజు, నాయకులు కొంగర మురళీకృష్ణ, చీడి శివ, బొడ్డు వెంకటరమణ, జాన్బాబు, కామేష్, కుశరాజు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి -
గిరిజనులకు సేవ చేస్తే గుర్తింపు
రంపచోడవరం: ఏజెన్సీలో గిరిజనులకు ఉత్తమ సేవలు అందించిన ఏ అధికారికై నా ప్రజల్లో మంచి గుర్తింపు ఉంటుందని ఐటీడీఏ పీవో స్మరణ్రాజ్ అన్నారు.బదిలీపై వెళుతున్న పీవో కట్టా సింహాచలం వీడ్కోలు సభను ఐటీడీఏ సమావేశపు హాలులో గురువారం నిర్వహించారు. ఈ సభలో కట్టా సింహాచలంను నూతన పీవో గజమాలతో సన్మానించి, మాట్లాడారు. అనంతరం బదిలీపై వెళుతున్న పీవో కట్టా సింహాచలం మాట్లాడుతూ ఐటీడీఏ పీవోగా పనిచేసిన 13 నెలల్లో టీం వర్క్ ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్టు చెప్పారు. గుర్తేడును మండల కేంద్రంగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు చెప్పారు. గుర్తేడులో పోలీస్ స్టేషన్ నిర్మాణం వంటి అభివృద్ధి పనులు తన హయాంలో జరిగినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సాయిప్రశాంత్, ఏపీవో డీఎన్వీ రమణ, ఎస్డీసీ పి.అంబేడ్కర్, సబ్ డీఎఫ్వో అనుష, డీడీ రుక్మాండయ్య, ఈఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణరాజ్ -
245 కిలోల గంజాయి పట్టివేత
● పట్టుకున్న గంజాయి విలువ రూ.12.20 లక్షలు ● ఒకరు అరెస్టు, మరో ముగ్గురు పరార్ ముంచంగిపుట్టు: మండలంలోని బంగారుమెట్ట పంచాయతీ కుజభంగి జంక్షన్ వద్ద గురువారం అక్రమంగా తరలిస్తున్న 245 కిలోల గంజాయిని పట్టుకున్నట్టు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. ఒడిశా రాష్ట్రం ముసిరిగూడ గ్రామం నుంచి పాడువకు ఆటోలో గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు పక్క సమాచారం అందడంతో పోలీసులు కుజభంగి జంక్షన్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులను చూసిన వారు గంజాయి, ఆటోను వదిలి పారిపోయారు. అప్రమత్తమైన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకోగా.. ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. ఆటోను తనిఖీ చేయగా 245 కిలోల గంజాయిని గుర్తించారు. దీని విలువ రూ.12.20 లక్షలు ఉంటుందని, ముంచంగిపుట్టు మండలం కరిముఖిపుట్టు పంచాయతీ మెరకచింత గ్రామానికి చెందిన గోల్లోరి మహీంద్రా అరెస్ట్ చేశామన్నారు. నిందితుడిని సీఐ శ్రీనివాసరావు ఎదుట హాజరుపర్చి కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించామన్నారు. ఒడిశా రాష్ట్రం కోరాపుట్టు జిల్లా పాడువ బ్లాక్ అబరాడ గ్రామానికి చెందిన కిరసాని భూషణ్, మద్దిపుట్టు గ్రామానికి చెందిన నిలా కిముడు, మల్కన్గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్ పనసపుట్టు పంచాయతీ ముసిరిగూడ గ్రామానికి చెందిన సుకిరి దాము పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. నిందితుడు మహీంద్రా ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. విలాసావంతమైన జీవితం గడపాలన్న దురాశతో గంజాయి అక్రమ రవాణాలో దిగి పట్టుబడినట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. -
ఈపీడీసీఎల్ సీవోవోగా మరోసారి కింజరాపు
సాక్షి, విశాఖపట్నం : ఏపీఈపీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ అధికారి(సీవీవో)గా రిటైర్డ్ ఎస్పీ కింజరాపు వెంకట రామకృష్ణప్రసాద్ను మరోసారి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2024 ఆగస్ట్ నుంచి ఈ ఏడాది జూలై 31 వరకూ సీవీవోగా విధులు నిర్వర్తించారు. మరోసారి కాంట్రాక్టు పద్ధతిలో మరో ఏడాదిపాటు నియమిస్తున్నట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏపీఈపీడీసీఎల్ సీఎండి ఇమ్మడి పృథ్వీతేజ్ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం విజిలెన్స్ విభాగంలో సీవీవోగా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. -
ఆత్మహత్యకు యత్నించిన రైతు మృతి
అచ్యుతాపురం రూరల్: మండలంలోని చీమలాపల్లిలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన రైతు నగిరెడ్డి సత్యారావు (48) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. పోలీసులు వివరాల ప్రకారం.. సత్యారావు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించే వాడు. అతడు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో తన కుమారుడిని మద్యానికి డబ్బులడగ్గా, నిరాకరించడంతో మనస్తాపానికి గురై గత శనివారం గడ్డి మందు తాగాడు. దాంతో కుటుంబ సభ్యులు విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం వేకువజామున మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు సీఐ నమ్మి గణేష్ తెలిపారు. -
ఆటోడ్రైవర్లకు ‘బ్యాడ్జ్’ షరతు దారుణం
బీచ్రోడ్డు/మహారాణిపేట(విశాఖ) : ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించే పథకంలో బ్యాడ్జ్ తప్పనిసరి అనే నిబంధన పెట్టడం సరికాదని ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి జగదాంబ సెంటర్ మీదుగా కలెక్టరేట్ కార్యాలయం వరకు గురువారం ఆటోలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం సభలో ప్రకటించిన రూ.15వేల ఆర్థిక సహాయం పథకానికి బ్యాడ్జ్ ఉండాలనే షరతు పెట్టడం దారుణమన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం డ్రైవర్ల బ్యాడ్జ్లను, నంబర్లను రద్దు చేసిందని గుర్తు చేశారు. వాహన మిత్ర పథకాన్ని అర్హత ఉన్న డ్రైవర్లందరికీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి బహుళజాతి కంపెనీల యాప్ ఆధారిత టూవీలర్ రవాణా సేవలు ఆటో డ్రైవర్ల ఉపాధికి ముప్పుగా మారాయన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఈ సేవలను రద్దు చేసినా.. మన రాష్ట్రంలో వాటిని కొనసాగించడం వల్ల ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే టూవీలర్ యాప్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ‘సీ్త్ర శక్తి’పథకంతో తగ్గిన ఆదాయం సీ్త్ర శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల ఆటో మోటార్ కార్మికుల ఆదాయం 80 శాతం తగ్గిపోయిందని రమణ తెలిపారు. దీని వల్ల పిల్లల స్కూల్ ఫీజులు, కరెంట్ బిల్లులు, ఇంటి అద్దెలు వంటివి కట్టలేని దీనస్థితిలో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నంబర్ 21, 31ల ద్వారా భారీ జరిమానాలు విధించడం కూడా ఆర్థిక భారాన్ని పెంచుతోందన్నారు. ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పడాల గోవింద్ మాట్లాడుతూ అధిక వడ్డీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల వల్ల డ్రైవర్లు మరింత ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గ్యాస్పై 50 శాతం రాయితీ ఇవ్వాలని, పోలీస్, ఆర్టీఏ అధికారులు విధించే ఈ–చలానా కేసులను ఎత్తివేయాలని, మోటార్ కార్మికులకు భద్రతతో కూడిన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, వాహనాలకు తగిన పార్కింగ్ స్థలాలను కేటాయించాలని, ప్రమాదంలో డ్రైవర్ చనిపోతే రూ.10 లక్షలు, సహజ మరణానికి రూ.5 లక్షలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఫెడరేషన్ నాయకులు ఎన్ మధురెడ్డి, అడ్డూరి శంకర్, లండ అప్పారావు, దల్లి నాని, లంకా గోవింద్ సూరిబాబు, కెల్లా రమణ, సింహాచలం, భాషా, రాంబాబు తదితరులు పాల్గొన్నారు -
పీసా చట్టం పటిష్టంగా అమలు
● కేంద్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ రామిత్ మౌర్య ఆదేశం ● డి.గొందూరులో గ్రామసభకు హాజరు పాడేరు రూరల్: షెడ్యూల్ గిరిజన ప్రాంతాల్లో పీసా చట్టాం పట్టిష్టంగా అమలు చేయాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ రమిత్ మౌర్య ఆదేశించారు. గురువారం మండలంలోని డి.గొందూరు పంచాయతీ పీసా క్లస్టర్లో నిర్వహించిన గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. గిరిజన ప్రాంతాల్లో పీసా చట్టాం అమలుపై ఆదివాసీ ప్రజలనుంచి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతై 5వ షెడ్యూల్ గిరిజన ప్రాంతాల్లో పీసా చట్టం పటిష్టంగా అమలు చేయాలన్నారు. గిరిజన ఉత్పత్తులు, అటవీ సంపద, గిరిజన ఆదివాసీల సంప్రదాయాలు పరిరక్షించాలని ఆయన సూచించారు. ఆదివాసీల ప్రత్యేక హక్కులు చట్టాలపై అందరికి అవగహన కలిగి ఉండాలన్నారు. అన్నివర్గాల ప్రజలు చైతన్యంతోనే ఆదివాసీలు మరింత ప్రగతి సాధ్యమవుతుందన్నారు. స్వయం పరిపాలనను బలోపేతం చేయడం, అధికార వికేంద్రీకరణ వనరుల నియంత్రణ, సంస్కృతి పరిరక్షణ, మత్తు పదార్థాల నియంత్రణ, భూములు అన్యాక్రాంతం కాకుండా నిరోధించడం పీసా చట్టం పరిధిలో వస్తాయన్నారు. ముందుగా పర్యటనకు వచ్చిన బృందాన్ని వైఎస్సార్ సీపీ మండల పార్టీ అధ్యక్షుడు సీదరి రాంబాబు, పీసా కమిటీ సభ్యులు, స్థానిక ఆదివాసీలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి పీఎస్ కుమార్, డీపీవో చంద్రశేఖర్, ఎంపీడీవో తేజరతన్, సర్పంచ్లు రాంబాబు, రంజిత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆగని పశువుల అక్రమ రవాణా
● యథేచ్ఛగా మైదాన ప్రాంతాలకుతరలింపు సాక్షి,పాడేరు: ఏజెన్సీలో పశువుల అక్రమ రవాణా ఆగడం లేదు.రాత్రి సమయంలో వ్యాన్లలో మైదాన ప్రాంతాలకు భారీగా పశువులను అక్రమంగా తరలిస్తున్నారు.పాడేరు ఘాట్ రోడ్డులోని వంతాడపల్లిలోని అటవీశాఖ,తాటిపర్తి మోదకొండమ్మతల్లి గుడి వద్ద పోలీసుశాఖ చెక్పోస్టులు 24గంటలూ పనిచేస్తున్నా పశువుల అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు.గురువారం పాడేరు మండలం గుత్తులపుట్టులో వారపుసంతలో పశువుల వ్యాపారం భారీగా జరిగింది. మైదాన ప్రాంతాల్లోని కబేళా వ్యాపారులంతా ఈ సంతలో పశువులను కొనుగోలు చేసి చీకటి పడిన తరువాత వ్యాన్లలో పాడేరు ఘాట్రోడ్డు మీదుగా తరలించారు.ప్రతి రోజు ఏజెన్సీ రోడ్ల మీదుగా మైదాన ప్రాంతాల్లోని కబేళాలకు పశువులను అక్రమంగా వ్యాపారులు తరలిస్తున్నారు.పశువుల అక్రమ రవాణాను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
దసరా ఉత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ
సాక్షి,పాడేరు: జిల్లా కేంద్రం పాడేరులో ఈఏడాది దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు వేర్వేరు చోట్ల ఉత్సవ కమిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. పురాతన ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయంలో కొలువుదీరిన శ్రీరాజరాజేశ్వరి ఆలయంలో ఈ ఏడాది తొలిసారిగా దేవీ నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్ణయించి. ఇటీవల నూతన ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. ఉత్సవాల ప్రచార పోస్టర్లను ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షురాలు,పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి గురువారం ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు,రమాదేవి దంపతులు,ఆలయ అర్చకులు రామంపంతులు,ప్రధాన కార్యదర్శి ఉప్పల వెంకటరత్నం,ఉత్సవ కమిటీ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కొట్టగుళ్లి రామారావు,యాదగిరి శ్రీనివాసరావు, కొమ్మెజి వెంకటరమణ, ఉపాధ్యక్షులు శివ,ప్రభాకర్,శ్రీనివాసరావు, బొడ్డు ముకుందరావు, కొండలరావు, రాజబాబు, బాలన్న, కోశాధికారి దేశిది బాబురావు, పోతురాజు, నాగు,మూర్తి తదితరులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో పందిరిరాట పాడేరు మెయిన్రోడ్డులో రూ.10 లక్షల అంచనా వ్యయంతో దసరా ఉత్సవాలను నిర్వహించనున్నారు. గురువారం పందిరాట కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఎరువాక వెంకటరమణ, వైస్ ఎంపీపీ గంగపూజారి శివ, కమిటీ ప్రతినిధులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు శివరాత్రి నాగేశ్వరరావు, బూరెడ్డి నాగేశ్వరరావు, వెయ్యాకుల సత్యనారాయణ, పచ్చా బుజ్జి,బిక్కవోలు రవి, ఉపాధ్యక్షులు బిమ్మలపూజారి ఈశ్వరరావు,కూడి వలసంనాయుడు, కొమ్మెజి వెంకటరమణ,ప్రధాన కార్యదర్శులు యాదగిరి శ్రీను, బోనంగి వెంకటరమణ,అనుబోతుల గణేష్,కార్యదర్శులు కూడి రామునాయుడు,జ్యోతికిరణ్,శివరాత్రి సూర్యప్రకాష్ పాల్గొన్నారు. -
ఇష్టంలేని పెళ్లి చేశారని మనస్తాపం
కోటవురట్ల: ఓ యువతి ఇష్టం లేని పెళ్లి చేశారని తీవ్ర మనస్తాపం చెందింది. మనసు చంపుకొని భర్తతో కాపురం చేయలేక బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మండలంలోని ఆక్సాహేబుపేటలో గురువారం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన చల్లపల్లి లోవలక్ష్మి (24)కి ఇష్టం లేకపోయినా నాలుగు నెలల క్రితం ఆక్సాహేబుపేటకు చెందిన జోగిరాజుకు ఇచ్చి వివాహం చేశారు. అప్పటి నుంచి కలతగా ఉన్న ఆమె మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలో శబ్దం రావడంతో బంధువులు వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా ఫ్యానుకు వేలాడు తూ కొన ఊపిరితో కనిపించింది. ఆమెను ఉరి నుంచి తప్పించి హుటాహుటిన తుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. అయితే లోవలక్ష్మి భర్త జోగిరాజు చాలా మంచి వ్యక్తి అని, అర్థం చేసుకోకపోవడం వల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఎస్ఐ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గిరిజన హోంస్టేల ఏర్పాటుకు తక్షణ చర్యలు
● మేడ్ ఇన్ అరకు ఉత్పత్తుల విక్రయాలు ● కలెక్టర్ దినేష్కుమార్ పాడేరు : త్వరలో ప్రారంభం కానున్న పర్యాటక సీజన్లో గిరిజన హోంస్టేల ఏర్పాటుకు సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు. గురువారం తన క్యాంప్ కార్యాలయం నుంచి ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పర్యాటక శాఖ అధికారులతో హోం స్టేల ఏర్పాటుపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పలు సూచనలు చేశారు. పర్యాటక ప్రాంతాల్లో మేడ్ ఇన్ అరకు ఉత్పత్తులు విక్రయించటానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పర్యాటకులు గిరిజన గ్రామాల్లో రాత్రి బస చేసేందుకు అనువుగా ఉండే విధంగా హోం స్టేలను అభివృద్ధి చేయాలన్నారు. అరకువ్యాలీ, లంబసింగి, మారేడుమిల్లి, పర్యాటక ప్రాంతాల్లో హోం స్టేలను ఏర్పాటు చేయాలని సూచించారు. అరకువ్యాలీ మండలంలో 91 హోం స్టేలు, చింతపల్లి మండలంలో 30 హోం స్టేలు గుర్తించారని తెలిపారు. టూరిజం కమిటీ సమావేశం నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయా లని ఆదేశించారు. చలి ఉత్సవాలకు ముందుగానే అరకు ఆర్ట్ ఫారంలను తయా రు చేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, క్యూరేటర్ డాక్టర్ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. -
బెర్రీ బోరర్తో కాఫీ రైతుకు తీవ్ర నష్టం
డుంబ్రిగుడ: బెర్రీ బోరర్ పురుగు వల్ల తీవ్రంగా నష్టపోయిన కాఫీ రైతులకు కూటమి ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. గురువారం వారు మండలంలోని కొర్రయి పంచాయతీ గత్తరజిల్లెడ గ్రామంలో బెర్రీ బోరర్ సోకిన కాఫీ తోటలను డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు, పీజీ విద్యార్థులతో కలిసి వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ పురుగు వల్ల జరిగిన నష్టాన్ని రైతుల నుంచి స్వయంగా తెలుసుకున్నామన్నారు. కాఫీలో ఎకరాకు రూ.లక్షకు పైబడి ఆదాయం వస్తుందన్నారు. బెర్రీబోరర్ వల్ల తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం రైతులకు ఎటూ చాలదన్నారు. కిలో ఫలసాయానికి రూ.100, ఎకరాకు రూ.లక్ష చొప్పున నష్టపరిహారం చెల్లించాలన్నారు. కనీస మద్దతు ధర కల్పించి కాఫీ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జెడ్పీటీసీ శెట్టి రోషిణి, డుంబ్రిగుడ, అరకులోయ మండల పార్టీ అధ్యక్షులు పాంగి పరశురామ్, స్వాభి రామ్మూర్తి, రేగం చాణక్య, గుంటసీమ, కొల్లాపుట్టు సర్పంచ్లు గుమ్మ నాగేశ్వరరావు, పి రామ్మూర్తి, ఉమ్మడి జిల్లాల ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమ్మిడి ఆశోక్, మాజీ మార్కెట్ చైర్మన్ రాజారమేష్, మండల కార్యదర్శి మఠం శంకర్ పాల్గొన్నారు. అరకులోయ టౌన్: మండలంలోని పెదలబుడు పంచాయతీ గరడగుడలో బెర్రీబోరర్ సోకిన కాఫీ తోటలను అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి పరిశీలించారు. బెర్రీ బోరర్ పురుగు వల్ల తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం ఏమాత్రం చాలదని వారి వద్ద రైతులు వాపోయారు. కనీస మద్దతు ధర ప్రభుత్వం కల్పించేలా కృషి చేయాలని వారు విన్నవించుకున్నారు. ఎకరాకు రూ.లక్ష నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించి ఆదుకోవాలి అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి డిమాండ్ -
‘నిరసన వారం’విజయవంతం చేయండి
● ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడురావుల జగన్మోహన్రావు పిలుపు జి.మాడుగుల: ఉపాధ్యాయుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించకపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి ఈనెల 17వరకు ఏపీటీఎఫ్ తలపెట్టిన నిరసన వారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు రావుల జగన్మోహన్రావు పిలుపునిచ్చారు. మండలంలోని పెదలోచలి, గద్దెరాయి మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్నారు. పెడింగ్లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని కోరారు. వీటితోపాటు మెమో నంబరు 57ను తక్షణమే అమలు చేయాలని, 12వ పీఆర్సీ కమిషన్ను నియమించి ఐఆర్ ప్రకటించాలన్నారు. అంతేకాకుండా అన్ని రకాల బకాయిలు చెల్లించాలని, ఈహెచ్ఎస్ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని, యాప్స్ను అసెస్మెంట్ బుక్లెట్ విధానాలను రద్దు చేసి ఉపాధ్యాయులను బోధనకు పరిమితం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
స్పోర్ట్స్ మీట్లో పి.యర్రగొండ ఏకలవ్య విద్యార్థుల ప్రతిభ
వై.రామవరం: గుంటూరులో నిర్వహించిన ఏకలవ్య పాఠశాలల రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్లో పి.యర్రగొండ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ నెల 3 నుంచి 9 వరకు జరిగిన పోటీల్లో బాక్సింగ్, యోగా, వెయిట్ లిఫ్టింగ్, చెస్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో 10 బంగారు, 8 సిల్వర్, 3 బ్రాంజ్ పతకాలు సాధించినట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ భూరా రామ్ భైరవ తెలిపారు. త్వరలో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు 39 మంది ఎంపికయ్యారని ఆయన వివరించారు. ఈ సందర్భంగా వారిని గురువారం ఆయనతోపాటు పీఈటీ ప్రశాంత కృష్ణన్, ఉపాధ్యాయులు అభినందించారు. చింతపల్లి: జాతీయ క్రీడా పోటీలకు ఐదుగురు విద్యార్థినులు ఎంపికై నట్టు స్థానిక ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్ మనోజ్కుమార్ తెలిపారు. గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్లో తమ విద్యార్థులు ప్రతిభ కనబరిచారన్నారు. అండర్ 19 హ్యాండ్ బాల్లో ఎస్.యోగబాల, వాలీబాల్లో పి.మేరీ, కె.లక్ష్మీప్రసన్న, కబడ్డీలో వి.నవ్య, డిస్కస్త్రోలో పి. స్వీటీ పతకాలు సాధించారన్నారు. వీరు వచ్చే నెలలో ఒడిశాలో జరిగే జాతీయ స్థాయిలో క్రీడా పోటీల్లో పాల్గొంటారన్నారు. ఎంపికై న విద్యార్థినులకు తర్ఫీదు ఇచ్చిన పీఈటీలు తులసి, రాజేశ్వరిని ఆయనతోపాటు ఉపాధ్యాయులు అభినందించారు. -
వాగు దాటితేనే రేషన్ దక్కేది!
● అవస్థలు పడిన దొరగూడ గిరిజనులు ముంచంగిపుట్టు: రేషన్ సరకులు తెచ్చుకునేందుకు మంలంలోని లక్ష్మీపురం పంచాయతీ దొరగూడ గిరిజనులు గురువారం అష్టకష్టాలు పడ్డారు. ప్రాణాలకు తెగించి ఉధృతంగా ప్రవహిస్తున్న ఉబ్బెంగుల వాగును దాటుకుని ఆరు కిలోమీటర్ల కాలినడకన పంచాయతీ కేంద్రం లక్షీపురంలోని జీసీసీ డిపోకు చేరుకున్నారు. రేషన్ సరకులు తీసుకుని మళ్లీ అలాగే అవస్థలు పడుతూ దొరగూడ వెళ్లారు. ఉబ్బెంగుల వాగుపై వంతెన నిర్మించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని వైఎస్సార్సీపీ నేత సాధురాం, దొరగూడ గిరిజనులు ఈ సందర్భంగా కోరారు. -
పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రపు హక్కు లేదా..?
రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది. మొదటి నుంచి కూటమి ప్రభుత్వం వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’పై వేధింపులకు పాల్పడుతోంది. ఒక రాజకీయ పార్టీ నేత ప్రెస్మీట్లో మాట్లాడిన మాటలను రిపోర్టర్ వార్తగా రాస్తే ఎడిటర్పై కేసు పెడతారా? మీడియా గొంతును నులిమేస్తారా? రాష్ట్రంలో ప్రతికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రపు హక్కు లేదా..? అక్షరాన్ని, భావ ప్రకటనా స్వేచ్ఛను నోటీసులు, అక్రమ కేసులతో నిరోధించలేరు. రాజకీయ కక్షలు కార్పణ్యాలతో పత్రిక ఎడిటర్పై కేసుల నమోదు ఏమాత్రం సరికాదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి డబ్బా కొట్టే పచ్చ మీడియా మాత్రమే ఉండాలా? మీ అవినీతి, అక్రమాలను ఎత్తిచూపించే ఏ మీడియా ఉండకూడదా.. అయినా మీకెందుకంత ఉలికిపాటు. – గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి -
ప్రెస్మీట్ కవర్ చేస్తే కేసులు పెడతారా..!
రాజకీయ పార్టీల నాయకుల స్టేట్మెంట్లు పత్రికలో పబ్లిష్ చేస్తే రిపోర్టర్లు, ఎడిటర్పై కేసులు పెడతారా..? రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రపు హక్కు లేదా..? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామనే విషయాన్ని మరచిపోకూడదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)ఎ ప్రకారం జర్నలిస్టుల హక్కులకు రక్షణ ఉంది. ప్రజల పక్షాన గళమెత్తుతున్న ’సాక్షి’ గొంతు నులిమే చర్య ఇది. ఏదైనా సమస్య ఉంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయాలి. రిజాండర్ ఇవ్వాలి. కానీ పత్రికలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. ఇలాంటి సంస్కృతికి బీజం నాటడం భవిష్యత్తులో నిజాన్ని అణగదొక్కినట్లే అవుతుంది. – బూడి ముత్యాలనాయుడు, మాజీ డిప్యూటీ సీఎం -
మాచ్ఖండ్లో విద్యుత్ఉత్పాదన పునరుద్ధరణ
● 2,4 జనరేటర్లకు మరమ్మతులు ● వినియోగంలోకి తెచ్చిన అధికారులు ముంచంగిపుట్టు: మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో రెండు రోజులుగా నిలిచిపోయిన ఉత్పాదన గురువారం సాయంత్రం నుంచి మొదలైంది. సాంకేతిక లోపం వల్ల 11 కేవీ బుష్ కాలిపోవడంతో ఉత్ప త్తి నిలిచిపోయింది. మరమ్మతులు చేపట్టి 4వ నంబరు జనరేటర్ను వినియోగంలోకి తీసుకువచ్చి 23 మెగావాట్ల ఉత్పత్తిని పునరుద్ధరించారు. అనంతరం రాత్రి ఏడు గంటల సమయంలో రెండో నంబరు జనరేటర్ను వినియోగంలో తెచ్చి 17 మెగావాట్లు ఉత్పత్తి పునురుద్ధరించారు. మాచ్ఖండ్ ప్రాజెక్టులో ప్రస్తుతం 40 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని, మిగిలిన జనరేటర్లను వినియోగంలోకి తెచ్చేందుకు సిబ్బంది, అధికారులు ప్రాజెక్ట్ ఎస్ఈ ఏవీ సుబ్రమణ్యేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రమిస్తున్నారు. గత రెండు రోజులుగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో ఏపీ జెన్కోకు భారీగా నష్టం కలిగింది.గంటకు 97 మెగావాట్లు చొప్పన 48గంటల ఉత్పత్తికి అవకాశం లేకుండా పోయింది. -
జోలాపుట్టు, డుడుమ కళకళ
● ఇరు రాష్ట్రాల సరిహద్దులో భారీ వర్షాలు ● పూర్తిస్థాయికి చేరిన నీటిమట్టాలు ముంచంగిపుట్టు: మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరు అందించే డుడుమ,జోలాపుట్టు జలాశయాల్లో నీటిమట్టాలు పూర్తిస్థాయిలో ఉన్నాయి. డుడుమ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 2590 అడుగులు కాగా గురువారం నాటికి 2,580.60 అడుగులుగా నమోదు అయింది.జోలాపుట్టు జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 2750 అడుగులు కాగా గురువారం నాటికి 2748.10 అడుగులు ఉన్నట్టు సిబ్బంది తెలిపారు.జలాశయాల్లో పూర్తిస్థాయి నీటి నిల్వలు ఉండడంతో ఈ ఏడాది విద్యుత్ ఉత్పిత్తికి నీటి సమస్య లేదని ప్రాజెక్టు అధికార వర్గాలు తెలిపాయి. -
సమస్యల షాక్ !
ఆంధ్రా– ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రం ఆధునికీరణ పదేళ్లుగా ప్రతిపాదనలకు పరిమితం అయ్యాయి. పురాతన యంత్రాలు కావడంతో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. మరమ్మతులకు రూ.కోట్లు వెచ్చించి సరిచేయాల్సి వస్తోంది. ఇలా భారీగా నష్టం జరుగుతున్నా ఇరు రాష్ట్రాల అధికారుల్లో కదలిక లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యంత్రాల మొరాయింపుతో నిలుస్తున్న విద్యుత్ ఉత్పాదనవినియోగంలో లేని జనరేటర్లు మాచ్ఖండ్కుముంచంగిపుట్టు: ఆంధ్రా– ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో తరచూ తలెత్తుతున్న సాంకేతిక లోపాలు విద్యుత్ ఉత్పాదనపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఎప్పుడు ఉత్పత్తి నిలిచిపోతుందో తెలియని దుస్థితి నెలకొంది. గతంలో జలాశయాల్లో నీటి సమస్యతో ఉత్పాదన నిత్యం నిత్యం ఆటంకం కలుగుతూ ఉండేది. ఈ ఏడాది ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్ట్కు కీలకమైన జోలాపుట్టు, డుడుమ జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టాలతో కళకళలాడుతున్నాయి. ఏడాదికి సరిపడే నీరు జలాశయాల్లో ఉండడంతో నీటి సమస్య తీరినట్లు అయింది. ● మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం అతి పురాతనమైనది కావడంతో విద్యుత్ ఉత్పాదనకు ఆటంకాలు కలుగుతున్నాయి. ఈ కేంద్రంలో ఆరు జనరేటర్ల సాయంతో 120 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. 2023లో ఆగస్టు,సెప్టెంబర్,అక్టోబర్ నెలల్లో మాత్రమే పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి జరిగింది. అప్పటి నుంచి నేటి వరకు తరచూ నెలకొంటున్న సాంకేతిక సమస్యల వల్ల పూర్తిస్థాయిలో జరిగిన సందర్భాలు లేవు. మరమ్మతులకు ఏటా రూ.కోటు్ల 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం ఉన్న జలవిద్యుత్ కేంద్రంలో జనరేటర్లకు కాలం చెల్లడంతో తరుచూ మొరాయిస్తున్నాయి. వీటి మరమ్మతుల కు ఏటా రూ.కోట్లు ఖర్చువుతున్నాయి. ప్రతి జలవిద్యుత్ కేంద్రంలో జనరేటర్లు 25 ఏళ్లు వరకు పని చేస్తాయి. కాని ఇక్కడ జనరేటర్లు 60 ఏళ్లు సేవలందించడం వల్ల మరమ్మతులకు గురవుతున్నాయి. ఐదు నెలల్లో నాలుగు సార్లుఆధునికీకరణ ఒప్పందాలకు పరిమితం ఉత్పాదన పెంపునకు కృషి డుడుమ, జోలాపుట్టు జలాశయాల్లో ప్రస్తుతం ఏడాదికి అవసరమైన నీటి నిల్వలు ఉండడం విద్యుత్ ఉత్పాదన పెంపునకు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం 97 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. అన్ని జనరేటర్ల వినియోగంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి మరికొన్ని రోజుల్లో జరిగే అవకాశం ఉంది. సాంకేతిక లోపాలను వెంటనే సరి చేస్తున్నాం.రూ.500 కోట్లతో ఆధునికీకరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. – ఏవీ సుబ్రమణ్యేశ్వరరావు, ఎస్ఈ, మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రం మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం ఆధునికీకరణకు ఇరు రాష్ట్రాలు పదేళ్ల క్రితం రూ. 500 కోట్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ప్రస్తుతం ఉన్న 120 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని 150 మెగా వాట్లకు పెంచాలని నిర్ణయించాయి. చేపట్టాల్సిన పనులకు సంబంధించి నివేదిక బాధ్యతను 2022లో టాటా ఇంజినీరింగ్ కన్సల్టెన్సీకి ఏపీ జెన్కో అధికారవర్గాలు అప్పగించాయి. సుమారు 14 మందితో కూడిన బృందం మూడు దఫాలు మాచ్ఖండ్ ప్రాజెక్టు, డుడుమ, జోలాపుట్టు జలాశయాలను పరిశీలించింది. జనరేటర్లు, టర్బైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, స్విచ్ యార్డులు, భవనాల స్థితిగతులు, వాటికి ఆయువు (ఎనాలసిస్) పరీక్షలు నిర్వహించింది. దీనిపై పూర్తి స్థాయి నివేదికను ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు 2024లోనే బృందం అందజేసింది. అప్పటినుంచి ఏమాత్రం కదలికలేదు. -
అనంతగిరిలో అత్యధిక వర్షపాతం
● 65.8 ఎంఎం నమోదు ● అత్యల్పంగా డుంబ్రిగుడలో 1.2 ఎంఎం సాక్షి,పాడేరు: మన్యంలో రోజూ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధాన గెడ్డలు,వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జి.మాడుగుల మండలంలోని కుంబిడిసింగి రోడ్డులో మత్స్యగెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో గిరిజనులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో గురువారం అనంతగిరిలో అనంతగిరిలో అత్యధికంగా 65.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జి.మాడుగులలో 35.6, దేవీపట్నంలో 24.8, ముంచంగిపుట్టులో 24.6, అరకులోయలో 14.6, గంగవరంలో 14.5, కొయ్యూరులో 14, వై.రామవరంలో 9.4, పాడేరులో 6.8, అడ్డతీగలలో 3.2, రాజవొమ్మంగిలో 10.2, వీఆర్పురంలో 4.6, కూనవరంలో 4.2, చింతూరులో 3.6, పెదబయలులో 3, ఎటపాకలో 1.6, రంపచోడవరంలో 1.2, డుంబ్రిగుడలో 1.2 వర్షపాతం నమోదైంది. మరోపక్క పాడేరు పరిసర ప్రాంతాల్లో ఉదయం 8గంటల వరకు మంచు దట్టంగా కురుస్తోంది. -
సికనాపల్లి రంగురాళ్ల క్వారీ వద్ద ప్రత్యేక నిఘా
● 24 గంటలు సిబ్బంది గస్తీ ● డీఎఫ్వో వైవీ నర్సింహరావు చింతపల్లి: పెదవలస రేంజ్ పరిధిలోని సికనాపల్లి రంగురాళ్ల క్వారీ వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసినట్టు డీఎఫ్వో వైవీ నర్సింహరావు తెలిపారు. గురువారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సికనాపల్లి రంగురాళ్ల క్వారీలో తవ్వకాలకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు సిబ్బందిని అప్రమత్తం చేసి 24 గంటలు గస్తీ ఏర్పాటు చేశామని తెలిపారు. సిగనాపల్లి అటవీ ప్రాంతంలో సుమారు కిలోమీటరు ఎత్తయిన కొండపై ఈ క్వారీ ఉండడంతో తమ సిబ్బంది దాడులు నిర్వహించడం కష్టంగా ఉందన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో 20 మంది సిబ్బందితో పహారా ఏర్పాటుచేశామన్నారు. క్వారీ సమీప గ్రామాల ప్రజలకు తవ్వకాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. క్వారీలో తవ్వకాలను ప్రోత్సహించి, వ్యాపారం చేసే వారి జాబితాను తయారు చేసి, వారికి కౌన్సెలింగ్ ఇస్తామన్నారు. కొంతమందిని బైండోవర్ చేస్తామన్నారు. క్వారీ వద్ద దాడుల నిర్వహణకు పోలీసు, సీఆర్పీఎఫ్ బలగాలు అవసరమని ఏఎస్పీకి లేఖ రాశామన్నారు. క్వారీ పరిసరాలను పూర్తి నిషేధిత ప్రాంతంగా ప్రకటించినట్టు చెప్పారు. పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో ఏ ఒక్కరు సంచరించినా కేసులు నమోదు చేస్తామన్నారు. గుర్రాలగొంది, మేడూరు, సత్యవరం, గురుగూడెం క్వారీ ప్రాంతాల్లో సిబ్బందితో నిఘా ఏర్పాటుచేశామని ఆయన తెలిపారు. -
వ్యవసాయ డిప్లమో కోర్సులకు 15న స్పాట్ కౌన్సెలింగ్
● ఏడీఆర్ డాక్టర్ అళ్ల అప్పలస్వామిచింతపల్లి: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలలో చేరేందుకు అసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 15న స్పాట్ కౌన్సెలింగ్కు హాజరు కావాలని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోగల పాలిటెక్నిక్ కళాశాలల్లో వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానం, సేంద్రియ వ్యవసాయం, వ్యవసాయ ఇంజినీరింగ్ డిప్లమో కోర్సుల్లో ప్రవేశాలకు చివరి అవకాశం కల్పిస్తూ రిజిస్ట్రార్ నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. యూనివర్సిటీ వెబ్సైట్లో ఆన్లైన్ చేసుకున్న వారితో పాటు ఇప్పటి వరకూ రిజస్ట్రేషన్ చేసుకోని అభ్యర్థులు కూడా ఈ కౌన్సెలింగ్లో పాల్గొనవచ్చని ఆయన వివరించారు. తమ సేంద్రియ పాలిటెక్నిక్లో చేరేందుకు అల్లూరి, పరిసర జిల్లాల్లో ఆసక్తిగల విద్యార్థులు అన్ని ధ్రువపత్రాలతో ఈనెల 15వ తేదీన జరిగే స్పాట్ కౌన్సెలింగ్కు హాజరు కావాలని ఆయన సూచించారు. గుంటూరు లాం ఫాం వ్యవసాయ పరిశోధన స్థానం కృష్ణా ఆడిటోరియంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలు వరకు స్పాట్ కౌన్సెలింగ్ జరుగుతుందని ఏడీఆర్ తెలిపారు. -
పత్రికా స్వేచ్ఛకు భంగం
జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం సరికాదు. పత్రికల్లో ప్రచురితమైన వార్తలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయవచ్చు లేదా పరువు నష్టం దావా వేయవచ్చు. అంతేగానీ పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి తీవ్రమైన నష్టం. గతంలో ఎప్పుడూ కూడా ఈ విధంగా జర్నలిస్టులపై కేసులు నమోదు చేయలేదు. ఈ విధమైన వైఖరి వల్ల జర్నలిస్టులు సరైన వార్తలు పాఠకులకు అందించలేరు. వాస్తవాలను రాయడానికి, నిజానిజాలు వెల్లడించడానికి వెనుకంజ వేసే ప్రమాదం ఉంది. జర్నలిస్టుల స్వేచ్ఛకు ఇబ్బందులు కలగకుండా తగిన విధంగా ఆలోచన చేయాలి. – గంట్ల శ్రీనుబాబు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి -
అసంపూర్తి భవనంలోనే పాఠశాల
● తక్షణం పూర్తి చేయాలని విద్యార్థుల డిమాండ్ జి.మాడుగుల: మండలంలోని వంతాల పంచాయతీ రాసపనుకు గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు భవనం లేకపోవడంతో విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. 2022లో ఇక్కడ పాఠశాల భవన నిర్మాణానికి నాడు–నేడు రెండో విడతలో రూ.13,71,700 మంజూరైంది. ఈ నిధుల్లో రూ.7,75, 715 విడుదల అయింది. వీటిలో రూ.7,74,530ను భవన నిర్మాణానికి వెచ్చించారు. శ్లాబ్ స్థాయి వరకు పనులు జరిగాయి. మిగతా నిధులు మంజూరు కానుందున పనులు అప్పటినుంచి నిలిచిపోయాయి. అయితే భవన వసతి లేనందున పాఠశాలను అసంపూర్తి భవనంలోనే నిర్వహిస్తున్నారు. ఇక్కడ 32 మంది విద్యార్థులు చదువుతున్నారు. రికార్డులు, రిజిస్టర్లు, మధ్యాహ్న భోజనం సామగ్రి భద్రపరచుకునేందుకు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి తక్షణ పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తిచేయాలని విద్యార్థులు బుధవారం డిమాండ్ చేశారు. దీనిపై ఎంఈవో బాబూరావు పడాల్ను వివరణ కోరగా నిధులు విడుదల అయిన వెంటనే పనులు పూర్తి చేస్తామని తెలిపారు. -
ప్రయాణం.. భయం భయం
● అధ్వానంగా అంతర్రాష్ట్ర రహదారి ● గోతులతో ప్రయాణికులు సతమతం ● నిలిచిపోయిన పనులు ● పట్టించుకోని అధికారులు సీలేరు: పర్యాటక కేంద్రంతో పాటు జలవిద్యుత్ కేంద్రాలతో ఎంతో పేరొందింది సీలేరు... ప్రకృతి అందాలకు నిలయంగా మారింది. వేలాది పర్యాటకులతో నిత్యం ఈ ప్రాంతం కిటకిటలాడుతోంది.. జాలువారుతున్న జలపాతాలు, పచ్చని అడవులు..ఆహ్లాదకరమైన వాతావరణం.. దట్టమైన అడమి మార్గం మీదుగా సాగే అంతర్రాష్ర్ట్ర రహదారి ప్రయాణం అందరికీ ఓ మధురానుభూతిగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ ఘాట్ రోడ్డు ప్రయాణం దుర్భరంగా మారింది. పెద్ద పెద్ద గోతులతో, రాళ్లు తేలిన ఈ రహదారి దారుణంగా ఉంది. అడుగుకొక గొయ్యితో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. ఇక్కడ ఆర్.వి.నగర్ నుంచి పాలగెడ్డ వరకు ఉన్న 80 కిలోమీటర్ల రహదారి పూర్తిగా ధ్వంసమైంది.పెద్ద పెద్ద గోతులతో రాకపోకలకు అంతరాయం మారింది. గోతులమయం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో గోతులు లేని రహదారులు నిర్మిస్తామని హామీలు ఇచ్చారు. నేటికీ ఏడాది పైబడినా నేటి వరకు కూటమి ప్రభుత్వం మన్య ప్రాంతంపై దృష్టి సారించలేదు. సీలేరు మీదుగా సాగే అంతర్రాష్ట్ర రహదారిపై ఒక్క గోతును కూడా పూడ్చలేదని పలువురు స్థానికులు ఎద్దేవా చేస్తున్నారు. పలుమార్లు అధికారులకు వినతులిచ్చాన ఫలితం లేకుండా పోయిందని చెబుతున్నారు. మన రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న తెలంగాణ, ఒడిశా, చత్తీస్ఘడ్ ప్రాంతాల్లో ఉన్న ప్రయాణికులు సీలేరు మీదుగా విశాఖపట్నం, అరకు, రాజమండ్రి వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి. రోజుకు వందల్లో వాహనాలు ఈ రహదారి మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. గోతులమయంగా ఉన్న ఈ రహదారిపై ప్రయాణానికి ఆందోళన చెందుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ నెలలో ఈ ప్రాంతంలో విపత్తు వచ్చి రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. నెల రోజులు రాకపోకలు స్తంభించాయి. అప్పట్లో గిరిజన మంత్రి ఇక్కడ పర్యటించి, తక్షణమే సీలేరు రోడ్డు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నేటికీ ఏడాదైన పనులు ప్రారంభించలేదు. అధికారుల నిర్లక్ష్యం సీలేరు రోడ్డుకి రూ.22 కోట్లు మంజూరైనట్టు ఆర్అండ్బీ ఇంజినీరింగ్ చీఫ్ శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా ఆర్.వి.నగర్ నుంచి పాలగెడ్డ వరకు నాలుగు టెండర్లు కేటాయించారు. అందులో దారాలమ్మ తల్లి గుడి నుంచి చల్లని శిల్ప వరకు రూ.6 కోట్లతో పనులు జరిగినట్టు అధికారులు తెలిపారు. కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిపివేసినట్టు పలువురు చెబుతున్నారు. పనుల్లో జరుగుతున్న జాప్యం..మిగిలిన నిధులు తదితర విషయాలపై ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు పలుమార్లు అధికారులను ప్రశ్నిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అధికారులు నిర్లక్ష్యం వలన ఏడాదైనా పనులు జరగడం లేదంటున్నారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల గత్యంతరం లేక అధ్వానంగా ఉన్న అంతర్రాష్ట్ర రహదారిపై ప్రజలు రాకపోకలు సాగించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ప్రారంభిస్తాం ఆర్.వి.నగర్ నుంచి పాలుగడ్డ వరకు రహదారిలో పాడైన చోట్ల పనులు త్వరలో ప్రారంభిస్తామని, ఇందుకు రెండు రోజుల్లో సర్వే చేస్తామని ఆర్అండ్బీ ఈఈ బాలసుందర్ బాబు చెప్పారు. రహదారి నిర్మాణానికి మంజూరైన నిధులతోనే పనులు చేపట్టి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రయాణం దారుణం సీలేరు నుంచి ఆర్.వి.నగర్ వరుకు ఉన్న రహదారిపై ప్రయాణం చేయలేకపోతున్నాం. పెద్ద పెద్ద గోతులతో నిండి ఉన్న ఈ దారిపై ప్రయాణం దారుణంగా మారింది. బస్సులో కూర్చొని ప్రయాణం చేయలేకపోతున్నాం. ప్రయాణం అనంతరం ఒళ్లంతా నొప్పులతో సతమతమవుతున్నాం. ఉన్నతాధికారులు స్పందించి రహదారి కష్టాలు తీర్చాలి. సీలేరు ఘాట్ రోడ్డును అభివృద్ధి చేయాలి. – బుజ్జి, వైఎస్సార్సీపీ నాయకుడు, సీలేరు పనుల్లో జాప్యం ఎందుకు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గోతులు లేని రోడ్లు చేస్తామని ప్రకటనలు గుప్పించింది. ఏడాదైనా ఒక్క అభివృద్ధి పనిచేయలేదు. గతేడాది సెప్టెంబర్లో ఈ ప్రాంతంలో భారీ విపత్తుతో రోడ్డు కోతకు గురైంది. రోడ్డు కోసం రూ.23 కోట్ల నిధులు మంజూరు చేసినట్టు అఽధికారి ప్రకటించారు.ఏడాదైనా ఒక్క గోయ్యిని పూడ్చలేదు. నిధులు ఏమయ్యాయో, పనుల్లో ఎందుకు జాప్యం చేస్తున్నారో చెప్పాలి. – మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్యే, పాడేరుత్వరగా రోడ్డు నిర్మించాలి ప్రభుత్వం తక్షణమే స్పందించి సీలేరు మీదుగా వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిని బాగు చేయాలి.లేనిపక్షంలో గ్రామస్తులంతా కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్న ఇప్పటివరకు రహదారుల్లో కనీసం గోతులు కూడా పూడ్చలేదు. ఈ మార్గంలో ప్రయాణానికి రోగులు, గర్భిణులు నరకయాతన అనుభవిస్తున్నారు. – కారే శ్రీనివాసు, జిల్లా డీసీసీ అధ్యక్షుడు -
జ్వరంతో చికిత్స పొందుతూ మహిళ మృతి
రాజవొమ్మంగి: మండలంలోని లాగరాయి గ్రామంలో జ్వరంతో బాధపడుతున్న కొంతం జగజ్జనని (30) కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఈమె గత నెల 30న జ్వరానికి చికిత్స నిమిత్తం లాగరాయి పీహెచ్సీకి వెళ్లింది. తగ్గకపోవడంతో ఏలేశ్వరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. అక్కడ ఆమెకు డెంగ్యూ జ్వరం అని రక్త పరీక్షల్లో తేలింది. చికిత్సకు ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో ఆమె మూడు రోజుల క్రితం కాకినాడ జీజీహెచ్లో అడ్మిట్ అయిందని ఆమె బంధువు బాబ్జి తెలిపారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్టు ఆయన వివరించారు. ఈమెకు బాబు (7) ఉన్నాడు. ఉపాధి కోసం నాలుగేళ్ల క్రితం వలస వెళ్లిన భర్త ఇప్పటికీ తిరిగి రాలేదు. ఈ నేపథ్యంలో ఆమె మరణం చిన్నారికి దిక్కు లేకుండా చేసింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అధ్వానంగా పారిశుధ్యం ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు లాగరాయి, లబ్బర్తి, కిండ్ర గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా మారింది. మురుగు, దోమలతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. దీంతో ప్రజలు జ్వరం, కీళ్ల నొప్పులతో మంచాన పడ్డారు. గత రెండు నెలల్లో ఈ ప్రాంతానికి చెందిన 12 మందికి లాగరాయి పీహెచ్సీ ద్వారా రక్త నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపగా ఇద్దరికి చికెన్గున్యా నిర్థారణ అయింది. జ్వర పీడితులు పెరగడంపై ప్రత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. దీనిపై స్పందించిన కలెక్టర్ దినేష్కుమార్ ఈనెల 9న ఈ ప్రాంతానికి వచ్చి సమీక్షించారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్యం లోపించడంపై పంచాయతీ సిబ్బందిపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటామని, జ్వరాలు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో జగజ్జనని మరణించడం ఆయా గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. లోతట్టు గ్రామాలు మాత్రమే కాకుండా రంపచోడవరం ఎమ్మెల్యే పంచాయతీ కిండ్ర తదితర గ్రామాల్లో జ్వరాలతో మంచం పట్టిన రోగులకు ముందుగానే వైద్యం అందించి ఉంటే ఈ పరిస్థితి నెలకొనేది కాదని పలువురు పేర్కొంటున్నారు. కొనసాగుతున్న ప్రత్యేక వైద్య శిబిరాలు లాగరాయి, కిండ్ర గ్రామాల్లో మూడు రోజులుగా ప్రత్యేక వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. మరోవైపు బుధవారం కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల వైద్యులు కిండ్రలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటుచేశారు. రోగాలకు కారణాలను పరిశీలిస్తున్నారు. దీనిలో భాగంగా 22 మందికి రక్త నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ కోసం ల్యాబ్కు పంపారు. రంగరాయ వైద్య కళాశాలకు చెందిన వైద్య నిపుణులు పి. శ్రీనివాస్, సత్యనారాయణ, సత్య చంద్రిక (మైక్రో బయోలజీ), హరీష్, పావని, ఏడీఎంఅండ్హెచ్వో డేవిడ్ పాల్ సేవలందించారు. తల్లి ప్రేమకు దూరమైన కుమారుడుమృతి చెందినజగజ్జనని (ఫైల్) -
రోడ్డు ప్రమాదంలోఇద్దరికి తీవ్ర గాయాలు
హుకుంపేట: మండలంలోని అరకు–పాడేరు జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. పాలేం గ్రామాని చెందిన కుర్రా నర్సింగరావు, ఆయన భార్య పాడేరు నుంచి హుకుంపేట వైపు ద్విచక్ర వాహనంపై వస్తుండగా తడిగిరి గ్రామానికి చెందిన పూజారి సుబ్బారావు,అరిసెల గిరిబాబు అనే ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై అతివేగంతో వెనుకవైపు నుంచి దూసుకొచ్చి దంపతులు ప్రయాణిస్తున్న బైక్ను ఢీ కొన్నారు. ఈ ప్రమాదంలో నర్సింగరావు, ఆయన భార్యకు స్వల్పగాయాలు కాగా, సుబ్బారావు,గిరిబాలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్లో స్థానిక పీహెచ్సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. -
కోతకు గురైన కల్వర్టు
ముంచంగిపుట్టు: మండలంలో గిరిజన గ్రామాల్లో వర్షం భీభత్సం సృష్టించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తుండటంతో మాకవరం పంచాయితీ అరబీరు గ్రామానికి వెళ్లే మార్గంలో రోడ్డుపైకి మట్టిదిబ్బలు కొట్టుకొని వచ్చాయి. దీంతో అరబీరు నుంచి లబడపుట్టు గ్రామాల మధ్య బుధవారం ఉదయం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డుపై మట్టి దిబ్బలను వైఎస్సార్సీపీ నేతలు వంతాల దామోదరం, వలమంగి జీనబంధు, ఈవోపీఆర్డీ చిన్నాన్న ఆధ్వర్యంలో తొలగించారు. దీంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి.మాకవరం పంచాయతీ మొక్కపుట్టు గ్రామానికి వెళ్లే మార్గంలో కల్వర్టు వరదనీటి ఉధృతికి కోతకు గురైంది. దీంతో రాకపోకలకు గ్రామ గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదనీటి ప్రవాహనికి మాకవరం, దొడిపుట్టు, వనుగుమ్మ, కరిముఖిపుట్టు పంచాయతీల్లో పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. -
మోసపూరిత హామీలతో అరాచక పాలన
రంపచోడవరం: కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో ప్రజలను మోసం చేసిందని అందుకే వారి తరుపున ప్రజల గొంతుకై వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. మారేడుమిల్లిలో బుధవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల వద్దకు పాలన తీసుకురావడం కోసం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన సంస్కరణలు తీసుకువస్తే .. చంద్రబాబు నాయుడు వాటి ధ్వంసం చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో మోసపూరిత హామీలతో గద్దినెక్కిన కూటమి పార్టీ ఎటువంటి పథకాలు అమలుచేయకుండా నాయకులు కథలు చెబుతున్నారని విమర్శించారు. ప్రజాపాలనను విస్మరించి, ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు పెట్టేందుకు కూటమి ప్రభుత్వం దృష్టిసారిస్తోందన్నారు. అరాచక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రజల తరపున పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఎంపీపీ సార్ల లలితకుమారి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ సత్తి సత్యనారాయణరెడ్డి, సర్పంచ్ జాకబ్, వైస్ ఎంపీపీ లక్కొండ రవికుమార్, లత,ఎంపీటీసీ గొర్లె అనిల్, కోఆప్షన్ సభ్యుడు గురుకు ధర్మరాజు, నాయకులు గంగరాజు, వీరబాబు, దూడ స్మిత్ పాల్గొన్నారు. -
కాఫీ రైతులను ఆదుకోండి
అరకులోయ టౌన్ : బెర్రీ బోరర్ వల్ల నష్టపోతున్న కాఫీ రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నివారణ చర్యలతోపాటు తక్షణ నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు. చినలబుడు పంచాయతీ పకనకుడిలో బుధవారం జరిగిన ఆదివాసీ కాఫీ రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వందల ఎకరాల్లో బెర్రీ బోరర్ ఆశించడం వల్ల కాఫీ రైతులు తీవ్ర నష్టపోతారన్నారు. కాఫీ పంటకు ఎకరాకు రూ.లక్ష నష్టపరిహారం చెల్లించాలని, కిలో పచ్చి కాఫీ కాయలకు రూ.200 చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. పురుగు నివారణకు ఉపాధి హామీ నుంచి ప్రత్యేక నిధులు కేటాయించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. పాడేరు ఏజేన్సీలో గిరిరైతులు పండిస్తున్న కాఫీని టాటా, నాంది, టెక్నో, మాక్స్, కాఫీ హౌస్ తదితర ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు రూ.కోట్లలో వ్యాపారం చేస్తున్నాయని, బెర్రీ బోరర్ వల్ల కాఫీ తోటలకు తీవ్ర నష్టం జరుగుతున్నా వారు పట్టించుకోవడం లేదన్నారు. కాఫీ కొనుగోలుకు ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన అనుమతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘ నాయకులు కిల్లో మొద్దు, ముసిరి మల్లన్న, రాజు, కాఫీ రైతులు ఒనాది, ప్రతాప్, దొన్ను, డొంబు, అర్జున్, సింహాద్రి, గురుమూర్తి, చంద్రయ్య, రఘునాథ్, తదితరులు పాల్గొన్నారు.ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ -
రామరాజుపాలెంలోహైవే టోల్గేట్ ఏర్పాటు
కొయ్యూరు: మండలంలోని పెదమాకవరం పంచాయతీ రామరాజుపాలెం వద్ద జాతీయ రహదారి 516ఈ టోల్ గేటు సిద్ధమైంది. సిబ్బంది ఉండేందుకు అవసరమైన భవనాలు నిర్మిస్తున్నారు. వంద కిలోమీటర్లకు ఒక టోల్ గేటు ఏర్పాటుచేస్తారు. ఈ మార్గం కొయ్యూరు నుంచి గూడెంకొత్తవీధి మండలం రంపుల, పెదవలస మీదుగా చింతపల్లి వెళ్తుంది. అక్కడ నుంచి లోతుగెడ్డ జంక్షన్ నుంచి లమ్మసింగి, తాజంగి మీదుగా జి.మాడుగుల, పాడేరు, అరకు మీదుగా విజయనగరం వెళ్తుంది. రామరాజుపాలెం నుంచి విజయవాడ దాదాపుగా 257 కిలోమీటర్ల దూరం ఉన్నట్టుగా హైవే అధికారులు బోర్డులో పేర్కొన్నారు. చింతాలమ్మ ఘాట్ రోడ్డులో రహదారి పూర్తయింది. రంపుల రహదారిలో పూర్తి కావస్తుంది. లమ్మసింగి, జి.మాడుగుల రహదారిలో పనులు పూర్తి కావాల్సి ఉంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. -
చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో గర్భిణులకు శస్త్ర చికిత్సలు
చింతపల్లి: స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఏడాదిన్నర తరువాత మళ్లీ గర్భిణులకు శస్త్రచికిత్సలు నిర్వహించడం ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ఆస్పత్రిలో గర్భిణులకు సిజేరియన్లను అప్పటి రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యుడు, సీ్త్ర వైద్యనిపుణులు డాక్టర్ నర్సింగరావు ఆధ్వర్యంలో తొలిసారిగా ప్రారంభించారు. ఈ సిజేరియన్లు ఆరు నెలల పాటు కొనసాగాయి.అనంతరం వైద్యనిణులు బదిలీపై వెళ్లి పోవడంతో పూర్తిగా నిలచిపోయాయి.దీంతో ప్రసవానికి ఇబ్బందులు తలెత్తితే 50,60 కిలో మీటర్ల దూరంలో ఉన్న నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి,పాడేరు జిల్లా ఆస్పత్రికి గర్భిణులను తరలించాల్సి వచ్చేది. ప్రస్తుతం చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో సీ్త్రవైద్య నిపుణులతో పాటు మత్తువైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారు. దీంతో పాటు ఇటీవలే ఆపరేషన్ థియేటర్ను అన్ని సౌకర్యాలతో ఆధునికీకరించారు.ఈ నేపథ్యంలో బుధవారం మండలంలో చౌడుపల్లి పంచాయతీ పరిధి బైలుకించంగి(రత్నగిరి కాలనీ)కి చెందిన కుడుములు ఝాన్సీరాణి ప్రసవానికి ఆస్పత్రిలో చేరింది. కాన్పు కష్టతరంగా మారి, ఆమెకు శస్త్ర చికిత్స అవసరమైంది. దీంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలవేణి ఆధ్వర్యంలో సీ్త్ర వైద్యనిపుణులు వాసవి,శ్రీలత,మత్తు వైద్య నిపుణులు సాహితీలు శస్త్రచికిత్స చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్య సిబ్బంది తెలిపారు. ఇకపై చెవి,ముక్కు,గొంతుతో పాటు ఎముకలకు సంబంధించిన శస్త్ర చికిత్సలను కూడా ఆస్పత్రిలోనే నిర్వహించనున్నట్టు సూపరింటెండెంట్ నీలవేణి తెలిపారు. ఆస్పత్రిలో గర్భిణులకు మళ్లీ శస్త్ర చికిత్సలు ప్రారంభించడంతో మైదాన ప్రాంతానికి వెళ్లే ఇబ్బందులు తప్పాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రోగులకు అందుబాటులోవైద్య సిబ్బంది
● డీఎంహెచ్వో విశ్వేశ్వరనాయుడు ఆదేశం అరకులోయ టౌన్: పీహెచ్సీల్లో అత్యవసర వైద్యం అందించేందుకు 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉండాలని డీఎంహెచ్వో డాక్టర్ విశ్వేశ్వరనాయుడు ఆదేశించారు. బుధవారం అరకులోయ, అనంతగిరి మండలాల్లోని అనంతగిరి, సుంకరమెట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. పీహెచ్సీల్లో రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. సుఖ ప్రసవాల వివరాలను వైద్యాధికారుల నుంచి తెలుసుకున్నారు. ఆస్పత్రుల్లో నమోదైన మలేరియా కేసులు, వారికి అందిస్తు న్న వైద్యం గురించి ఆరా తీశారు. ఎపిడమిక్ సీజన్లో వైద్య సిబ్బంది గ్రామ స్ధాయిలో సందర్శించి సకాలంలో రోగులకు వైద్య సేవలందించాలని సూచించారు. ఆస్పత్రిలో ఉన్న మందుల నిల్వలు, వార్డులను తనిఖీ చేశారు. అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని వైద్యాధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కె. కమల కుమారి, జిల్లా కార్యాలయ విస్తరణాధికారులు ఎం. సంజీవ్ పాత్రుడు, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం
పాడేరు : మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బి. కాంతారావు ఆదేశించారు. ఏజెన్సీ పర్యటనలో భాగంగా బుధవారం మండలంలోని ఎంకే వీధి అంగన్వాడీ కేంద్రాన్ని ఆయ న తనిఖీ చేశారు. రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తగు చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ పీడీ ఝాన్షీరామ్ పడాల్కు సూచించారు. పాత పాడేరులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పట్టీల్లో తప్పులను గుర్తించారు. పాఠశాల హెచ్ఎంకు మెమో జారీ చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీరావును ఆదేశించారు. మండల స్థాయి ఐసీడీఎస్ స్టాక్ పాయింట్ను పరిశీలించారు. సుండ్రుపుట్టు జీసీసీ డీఆర్ డిపోను తనిఖీ చేశారు. స్టాక్ను పరిశీలించారు. రికార్డులో పొందుపర్చిన స్టాక్తో పాటు ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిల్వలను సరి చూశారు. వేయింగ్ మిషన్ లైసెన్స్ను పరిశీలించారు. రేషన్ కార్డుదారులకు సకాలంలో అన్ని రకాల సరుకులు అందజేయాలని ఆదేశించారు. ఆయన వెంట సివిల్ సఫ్లై డీఎస్వో మోహన్రావు, సీఎస్డీటీ ప్రశాంత్, డీఈవో బ్రహ్మాజీరావు, పుడ్ సేప్టీ అధికారి గ్రీష్మ, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ అనురాధ, ఎంఈవో సరస్వతిదేవి, లైజనింగ్ అధికారి బాకా తేజ తదితరులు ఉన్నారు. రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు కాంతారావు ఆదేశం ఎంకే వీధి అంగన్వాడీ కేంద్రంలో రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడంపై ఆగ్రహం -
చెక్పోస్టు లేక..
మోతుగూడెం వద్ద ఏపీ జెన్కో ఆధ్వర్యంలో చెక్పోస్టును తొలగించడం వల్ల జలవిద్యుత్ కేంద్రాల మెటీరియల్కు రక్షణ కరువైంది. ఇక్కడ పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం నిర్మించిన సమయంలో ఏర్పాటైన దీనిని 2019లో జెన్కో అధికారులు తీసేశారు. మోతుగూడెం, పొల్లూరు ఉద్యోగుల నివాస సముదాయాల్లో పైపులు, డిస్ట్రిబ్యూషన్, పవర్ హౌస్కు సంబంధించిన యంత్ర పరికరాలు వివిధ స్టోర్స్లో భద్రపరుస్తారు. నిత్యం విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్లే బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాలు ఈ మార్గంలో తిరుగుతాయి. జల విద్యుత్ కేంద్రానికి సంబంధించిన యంత్ర పరికరాలు చోరీకి గురి కాకుండా మోతుగూడెం చెక్పోస్టు వద్ద ఏపీ జెన్ సెక్యూరిటీ విభాగం సిబ్బంది వాహనాలను నిలిపి తనిఖీ చేసేవారు. ఈ నేపథ్యంలో 2019లో ఈ చెక్పోస్టును తీసేయడం వల్ల జలవిద్యుత్కేంద్రాల మెటీరియల్కు రక్షణ లేకుండా పోయింది. సుమారు ఏడు నెలల క్రితం అప్పర్ సీలేరు హెచ్టీ స్టోర్స్లో విలువైన రాగి వైర్లు మాయమైనట్టు ప్రచారం జరిగింది. మోతుగూడెంలో జెన్కో సిబ్బంది నివాసాల ప్రాంగణంలో డిస్ట్రిబ్యూషన్కు సంబంధించి పనికిరాని ఐరన్ మెటీరియల్న తీసుకుపోతున్న కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించిన సందర్భాలు ఉన్నాయి. -
ఆధ్యాత్మికతతో ప్రశాంత జీవనం
అడ్డతీగల: ఆలయాల్లో నిత్య ధూప ధీప నైవేద్యాలు జరగాలని షణ్ముక పీఠాధిపతి స్కంద స్వామీజీ అన్నారు. అడ్డతీగలలోని పవనగిరి క్షేత్రంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో రంపచోడవరం డివిజన్లోని 70 గ్రామాలకు షణ్ముకపీఠం తరఫున ఆలయ అర్చకులకు పూజా ద్రవ్యాలను ఉచితంగా అందజేశారు. ఈ సందర్బంగా ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన అర్చకులకు పూజాద్రవ్యాల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా స్కంద స్వామీజీ మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కాపాడాలని, ఆధ్యాత్మిక జీవనాన్ని అలవర్చుకోవాలని కోరారు. పవనగిరి క్షేత్రం వ్యవస్థాపకులు తణుకు వెంకటరామయ్య సూచనల మేరకు పూజాద్రవ్యాలను అందజేశామన్నారు. తణుకు వెంకటరామయ్య, విజయలక్ష్మి దంపతులు, షణ్ముక పీఠం సభ్యులు పాల్గొన్నారు. -
సాక్షి ఎడిటర్పై వేధింపులు సరికాదు
సాక్షి కార్యాలయంపై పోలీసులు దాడులు చేయడం, తాజాగా ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డిపై పలు సెక్షన్ల కింద కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేయడం కక్ష సాధింపులో ఓ భాగమే. ప్రెస్ కాన్ఫరెన్స్లో ఓ నేత మాట్లాడిన విషయాలను వార్తగా ప్రచురించడంపై కూడా కేసు పెట్టడం, నోటీసుల పేరిట వేధించడం సబబు కాదు. భారత రాజ్యాంగం జర్నలిస్టులకు కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేసే ప్రయ త్నం చేయడం అప్రజాస్వామికం. అన్యాయాన్ని, అవినీతిని, ప్రజా సమస్యలను తన కలంతో వెలికితీయడమే జర్నలిస్టుల వృత్తి. అలాంటి పత్రికా స్వాతంత్య్రాన్ని, జర్నలిస్టుల కలాన్ని పోలీసు కేసులతో నియంత్రించాలని చూస్తే అది చాలా పెద్ద పొరపాటు అవుతుంది. ఏదైనా వార్త అవాస్తవమని భావిస్తే, దానికి ప్రభుత్వం వివరణ కోరాలి. కానీ కేసులు నమోదు చేయడం సరైంది కాదు. – సీహెచ్బీఎల్ స్వామి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి, అనకాపల్లి జిల్లా -
సెక్యూరిటీ నో..!
జెన్ కో..మోతుగూడెంలో అసిస్టెంట్ సెక్యూరిటీ అధికారి కార్యాలయంసీలేరు కాంప్లెక్స్లో రక్షణ వ్యవస్థపై పర్యవేక్షణ కరువు మోతుగూడెం: సీలేరు కాంప్లెక్స్లో కీలకమైన అసిస్టెంట్ సెక్యూరిటీ అధికారి పోస్టు గత 20 నెలలుగా ఖాళీగా ఉంది. పొల్లూరులో ఏపీ జెన్కో సెంట్రల్ స్టోర్కు ఏటా వివిధ కంపెనీల నుంచి రూ.కోట్ల విలువైన విడి పరికరాలు సరఫరా జరుగుతుంది. ఇక్కడి నుంచి మాచ్ఖండ్, సీలేరు, డొంకరాయి, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రాలకు వీటిని పంపిస్తుంటారు. పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఐదు, ఆరు యూనిట్లకు సంబంధించి రూ.కోట్ల విలువైన యంత్ర పరికరాలు ఇదే స్టోర్లో భద్రపరుస్తున్నారు. జలవిద్యుత్ కేంద్రాలకు సంబంధించి పలు విభాగాల అధికారులు ఈ స్టోర్ నుంచి విడి పార్టులను తీసుకువెళ్తుంటారు. ● పొల్లూరు, డొంకరాయి, సీలేరు విద్యుత్ కేంద్రాలకు సంబంధించి పొల్లూరులో ఉన్న హెవీ ట్రాన్స్పోర్ట్ (హెచ్టీ) స్టోర్స్లో పాత యంత్రాలు ఉన్నాయి. పొల్లూరు ఐదు, ఆరు యూనిట్లలో ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన సిమెంటు, ఐరన్తో పాటు ఇతర సివిల్ పనులకు సంబంధించిన రూ.కోట్ల విలువైన మెటీరియల్ పొల్లూరు చెక్పోస్టు నుంచి పవర్ హౌస్కు వెళ్తుంది. ఎంతో కీలకమైన ఈ వ్యవస్థలను అసిస్టెంట్ సెక్యూరిటీ అధికారి పర్యవేక్షిస్తుంటారు. ఇలాంటి కీలకమైన పోస్టును భర్తీ చేయాలని స్థానిక అధికారులు ఉన్నతాధికారులకు కొంతకాలంగా లేఖలు రాసినా ఏపీ జెన్కో నుంచి స్పందన లేదు. సిబ్బంది ఉద్యోగ విరమణతో.. ఏపీ జెన్కోకు సొంత సెక్యూరిటీ విభాగంలో పనిచేసిన సిబ్బంది 2019లో రిటైర్ కావడంతో ఏపీ జెన్కో యాజమాన్యం రాష్ట్రవాప్తంగా సుమారు 60 మంది సెక్యూరిటీ గార్డులను నియమించింది. వీరిలో 13 మందిని సీలేరు కాంప్లెక్స్లో జలవిద్యుత్ కేంద్రాలకు శాశ్వత ప్రాతిపదికన కేటాయించింది. ఎటూ చాలకపోవడంతో మాజీ సైనికోద్యోగులు 13 మందిని నియమించి, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రానికి ఏడుగురు, డొంకరాయికి నలుగురు, అప్పర్ సీలేరుకు ముగ్గురిని కేటాయించింది. ఈ మూడు జలవిద్యుత్ కేంద్రాలకు కీలకమైన డీఎస్పీ క్యాడర్ స్థాయి అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టును హెడ్ కానిస్టేబుల్ స్థాయి వారిని ఇన్చార్జిగా నియమించి చేతులు దులుపుకుంటోందని పలువురు ఆరోపిస్తున్నారు. జలవిద్యుత్ కేంద్రాల ఆస్తుల పరిరక్షణలో ఎంతో కీలకమైన అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టును శాశ్వత ప్రాతిపదికన నియమించడమే కాకుండా మోతుగూడెంలో ఏపీ జెన్కో చెక్పోస్టును పునరుద్ధరించాలని పలువురు కోరుతున్నారు. వీళ్లే కాకుండా కాకినాడ జిల్లాతో పాటు పాడేరు నుంచి ఈ మూడు జల విద్యుత్ కేంద్రాలకు పోలీస్ శాఖ నుంచి డిప్యూటేషన్పై 42 మంది హోంగార్డులను రక్షణకు ఉపయోగిస్తున్నారు.ఏటా జలవిద్యుత్ కేంద్రాల ద్వారా రూ.కోట్లలో ఆదాయం ఆర్జిస్తున్న ఏపీ జెన్కో యాజమాన్యం కీలకమైన సెక్యూరిటీ విభాగాన్ని నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీలేరు జలవిద్యుత్ కాంప్లెక్సులో కీలకమైన అసిస్టెంట్ సెక్యూరిటీ అధికారి పోస్టును శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయకపోవడం, మోతుగూడెంలో చెక్పోస్టును పునరుద్ధరించకపోవడం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. శాశ్వత ప్రాతిపదికన భర్తీకాని అసిస్టెంట్ సెక్యూరిటీ అధికారి పోస్టు స్థాయిలేని సిబ్బందితో నిర్వహణ లేఖలు రాసినా పట్టించుకోని ఏపీ జెన్కో ఉన్నతాధికారులు మోతుగూడెంలో చెక్పోస్టును పునరుద్ధరించని యంత్రాంగం -
రేషన్ పొందేందుకు అవస్థలు
● ప్రమాదకరంగా ప్రవహిస్తున్న గెడ్డను దాటిన గిరిజనులు జి.మాడుగుల: మండలంలో కుంబిడిసింగి పంచాయతీలో పలు గ్రామాల్లో బుధవారం కురిసిన భారీ వర్షానికి గెడ్డలు, వాగులు పొంగి ప్రవహించాయి. గెడ్డరాయి గెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో ఈ మార్గంలో కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి. అడ్డంగిసింగిలోని డీఆర్డిపో నుంచి రేషన్ సరకులు తెచ్చుకునేందుకు కుంబిడిసింగి, రాయగెడ్డ తదితర గ్రామాల గిరిజనులు రేషన్ తెచ్చుకునేందుకు అవస్థలు పడ్డారు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న గెడ్డను చేతి కర్రలు పట్టుకుని ఒకరికొకరు సాయంతో ఒడ్డుకు చేరారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి బ్రిడ్జిల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. డీఆర్ డిపో నుంచి రేషన్ సరకులు తెచ్చుకునేందుకు అవస్థలు పడ్డారు. -
దివ్యాంగుల పింఛన్లు రద్దు చేయవద్దు
● జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర ● పంచాయతీరాజ్ అధికారుల తీరుపై జెడ్పీటీసీ సభ్యుల అసంతృప్తి మహారాణిపేట (విశాఖ): దివ్యాంగుల పింఛన్ల రీ వెరిఫికేషన్ చేసినప్పటికీ.. అర్హులైన వారందరికీ పింఛన్లు కొనసాగించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర సూచించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం ఆమె అధ్యక్షతన పలు స్థాయీ సంఘాల సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా పలువురు జెడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతూ 40 శాతం లోపు వైకల్యం ఉందంటూ దివ్యాంగులకు నోటీసులు ఇచ్చి, సదరం సర్టిఫికెట్లను మళ్లీ వెరిఫికేషన్ చేస్తుండటంతో వారు ఆందోళన చెందుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దివ్యాంగుల పింఛన్ల విషయంలో పలు రకాలుగా వేధిస్తున్నారని, దీని వల్ల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన చైర్పర్సన్.. దివ్యాంగుల పింఛన్లను రద్దు చేయవద్దన్నారు. ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలని, పంచాయతీల్లో ఆదాయం పెంచేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా.. అనకాపల్లి జిల్లా, పరవాడ మండలంలోని పంచాయతీరాజ్ అధికారుల పనితీరుపై జెడ్పీటీసీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జేఈపై చర్యలు తీసుకోవాలి పరవాడలో ఇప్పటికే సీసీ రోడ్లు ఉన్న చోట మళ్లీ కొత్త రోడ్ల కోసం ప్రతిపాదనలు చేయడం, వాటికి ఆమోదం తెలిపిన తర్వాత పనులు నిలుపుదల చేయడంపై పరవాడ జెడ్పీటీసీ సభ్యుడు పైలా సన్యాసిరాజు అభ్యంతరం తెలిపారు. ఈ విధంగా తప్పుడు ప్రతిపాదనలు చేసిన జేఈపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ, కేజీహెచ్ సేవలపై చర్చ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణికి ఫోన్ చేస్తే స్పందించడం లేదని కె.కోటపాడు జెడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధ ఆరోపించారు. తాము సొంత పనుల కోసం ఫోన్ చేయమని, పేద రోగులకు వైద్యం కోసమే ఫోన్ చేస్తామని, అయినా అధికారి స్పందించకపోవడం దారుణమన్నారు. ఆరోగ్యశ్రీ పథకం సక్రమంగా అమలు కావడం లేదని, కార్పొరేట్ ఆస్పత్రుల్లో పేద రోగులకు వైద్య సేవలు అందేలా చూడాలని పలువురు జెడ్పీటీసీ సభ్యులు కోరారు. దీనిపై విశాఖ జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ అప్పారావు స్పందిస్తూ.. ఆరోగ్యశ్రీ కింద 3,000కు పైగా ప్రొసీజర్లకు చికిత్స అందిస్తున్నామని, కార్డు ఉన్న వారందరికీ సేవలు అందుతున్నాయని తెలిపారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ ఐ.వాణి మాట్లాడుతూ ఆసుపత్రిలో పూర్తి స్థాయి క్యాన్సర్ చికిత్స, గుండె ఆపరేషన్లు జరుగుతున్నాయని, వెంటిలేటర్లు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, వసతి సమస్యలు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదని అనంతగిరి జెడ్పీటీసీ సభ్యులు గంగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో టీచర్ల కొరత తీవ్రంగా ఉందని, వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన విద్యాశాఖ అధికారులు.. త్వరలోనే ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు. పీఎం–సూర్య ఘర్పై అవగాహన విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం 1912 నంబర్కు ఫోన్ చేస్తే.. 4 గంటల్లోపు సమస్యను పరిష్కరిస్తామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. పీఎం–సూర్య ఘర్ పథకం ద్వారా ప్రజలు విద్యుత్ బిల్లుల భారం నుంచి ఉపశమనం పొందవచ్చన్నారు. జెడ్పీ సీఈవో పి. నారాయణమూర్తి, మూడు జిల్లాల అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
చింతూరు డీఎఫ్వోగా రవీంద్రనాథ్రెడ్డి
చింతూరు: స్థానిక అటవీ డివిజన్ డీఎఫ్వోగా డి.రవీంద్రనాధ్రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో కాకినాడ, సత్యసాయి జిల్లాల్లో డీఎఫ్వోగా పనిచేసిన ఆయన ప్రస్తుతం డెహ్రాడూన్లో శిక్షణ పూర్తి చేసుకుని చింతూరు డీఎఫ్వోగా నియమితులయ్యారు. కాగా ప్రస్తుతం చింతూరు డీఎఫ్వోగా విధులు నిర్వహిస్తున్న బబిత కూడా శిక్షణలో ఉన్నారు. మరోవైపు వైల్డ్లైఫ్ శిక్షణ పూర్తి చేసుకున్న ఐఎఫ్ఎస్ అధికారి శివకుమార్ గంగాల్ను చింతూరు అటవీ డివిజన్లోని లక్కవరం రేంజ్ సబ్ డీఎఫ్వోగా ప్రభుత్వం నియమించింది. -
రోగులకు సత్వర వైద్యం అందించాలి
● కలెక్టర్ దినేష్కుమార్ ● అడ్డతీగల సీహెచ్సీ తనిఖీఅడ్డతీగల: ఆస్పత్రికి వచ్చిన రోగులకు వెంటనే వైద్య సేవలు అందజేయాలని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ ఆదేశించారు. మంగళవారం ఆయన స్థానిక సీహెచ్సీని తనిఖీ చేశారు. దీనిలో భాగంగా ఆస్పత్రిలోని అన్ని విభాగాల వార్డులను పరిశీలించారు. ప్రతి రోగుకి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయాలని సిబ్బందికి సూచించారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్న గర్భిణుల వివరాలను తెలుసుకున్నారు. వారికి అందిస్తున్న ఆహారంపై ఆరా తీశారు. బర్త్వెయిటింగ్ రూమ్లో ఎవ్వరూ లేకపోవడంపై ఆయన వైద్యులను ప్రశ్నించారు. ఆక్సిజన్ సదుపాయం లేనందున రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశామని వైద్యులు బదులిచ్చారు. ఎప్పటికప్పుడు వివిధ వ్యాధులకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆస్పత్రి పరిసరాల్లో పారిశుధ్య కార్యక్రమాలు క్రమం తప్పకుండా రోజూ నిర్వహించాలని ఆదేశించారు. రంపచోడవరం సబ్కలెక్టర్ శుభం నొఖ్వాల్,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అంబేద్కర్, అడిషినల్ డీఎంహెచ్వో డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. పారిశుధ్య లోపం వల్లే రోగాలు రాజవొమ్మంగి: రోగాలకు -
రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలి
సాక్షి,పాడేరు: రైతుల సమస్యలను కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి డిమాండ్ చేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఢిల్లీలో ఉన్న ఆమె మంగళవారం సాక్షితో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో రైతులంతా సంతోషంగా ఉన్నారన్నారు. రైతు భరోసాతో పాటు అనేక రైతు సంక్షేమ పథకాలను అప్పటి సీఎంజగన్మోహన్రెడ్డి సమర్ధవంతంగా అమలుజేశారన్నారు. గిరిజన రైతులకు కూడా ఎంతో మేలు జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు అన్ని విధాల అన్యాయమే జరుగుతుందన్నారు. గతేడాది అన్నదాత సుఖీభవను కూటమి ప్రభుత్వం అమలుజేయకపోవడంతో రైతులంతా ఆర్ధికంగా నష్టపోయారని, ఈఏడాది అమలుజేసిన అర్హులు అనేకమందికి అన్యాయం జరిగిందన్నారు. యూరియాకు డిమాండ్ ఉన్నప్పటికీ సకాలంలో రైతులకు అందుబాటులో తేలేదని, గిరిజన ప్రాంతాల్లో ప్రైవేట్ డీలర్ల వద్ద అధిక ధరలకు రైతులు కొనుగోలు చేసి ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారన్నారు. అన్ని రైతు సేవా కేంద్రాలలో యూరియాను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచి గిరిజన రైతులకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. -
చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
గంగవరం: చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకమైన తర్ఫీదు ఇవ్వాలని, అకాడమిక్ క్యాలెండర్ ప్రకారంగా బోధన జరగాలని ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను సూచించారు. మండలంలోని పాతరామవరం, పెద్దగార్లపాడు పాఠశాలలను ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును పరిశీలించారు. ఉపాధ్యాయులు విద్యార్థులు తప్పనిసరిగా లీవ్ హాజరు, ఆన్లైన్ హాజరు వేయవలెనని సూచించారు. విద్యార్థుల నోట్ పుస్తకాలు, వర్క్ బుక్లను పరిశీలించి సూచనలు చేశారు. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం రుచి చూసి , ఆహారం మెనూ ప్రకారంగా రుచికరంగా వండారన్నారు. పాఠశాల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. హెచ్ఎం శ్రీనివాసరావు తదితరులున్నారు. -
సీలేరులో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు
● తలెత్తిన సాంకేతిక లోపంసీలేరు: విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్లే ఆర్టీసీ బస్సు సాంకేతిక లోపం వల్ల సీలేరులో నిలిచిపోయింది. విశాఖపట్నంలో మంగళవారం ఉదయం ఐదు గంటలకు బయలుదేరిన ఈ బస్సు సీలేరు వచ్చేసరికి సాంకేతిక లోపం వల్ల స్టీరింగ్ పట్టేయడంతో కదల్లేదు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నర్సీపట్నం నుంచి సీలేరు మధ్యాహ్నం 3 గంటలకు వచ్చిన బస్సును భద్రాచలం మళ్లించి అందులో ప్రయాణికులను పంపించారు. పదిరోజులకు ఒకసారి ఇలాంటి పరిస్థితిని ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. ఘాట్రోడ్డుకు తగ్గట్టుగా కండీషన్లో లేని బస్సులను నడపడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గోడును ఆర్టీసీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై వారు ధ్వజమెత్తుతున్నారు. -
కూటమి ప్రభుత్వం మోసాలను ప్రజలకు వివరించాలి
● ఎమ్మెల్సీ అనంతబాబు, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ● చింతూరులో బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమానికి విశేష స్పందనచింతూరు: బాబు ష్యూరిటీ పేరుతో ఎన్నికలకు ముందు ఎన్నో హామీలిచ్చి గద్దెనెక్కాక వాటిని విస్మరించిన కూటమి ప్రభుత్వం మోసాలను కార్యకర్తలంతా గ్రామస్థాయిలో ప్రజలకు వివరించాలని ఎమ్మెల్సీ అనంత ఉదయ్భాస్కర్, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే, రంపచోడవరం నియోజకవర్గ ఇన్చార్జి నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. చింతూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆడబిడ్డ నిధి, నిరుద్యోగభృతి వంటి పథకాలను అమలు చేయకుండానే అన్ని పథకాలను ఇచ్చేశామంటూ కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కులం, మతం, పార్టీలకు అతీతంగా పథకాలు అందించామని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అర్హులైన వారికి కూడా పథకాలు తొలగిస్తోందన్నారు. నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో అమ్మఒడి పథకం ద్వారి ఇంటికొకరి చొప్పున 60 లక్షల మంది తల్లులకు సొమ్ములు అందజేశారని, కూటమి ప్రభుత్వం మాత్రం తల్లికి వందనం పేరుతో లబ్ధిదారుల సంఖ్యను కుదించిందన్నారు. ఏజెన్సీలో పోడు భూములకు కొండపోడు పట్టాలిచ్చిన ఘనత జగనన్న ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కూటమి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతం పెండింగ్లో ఉన్న కొండపోడు పట్టాలను గిరిజనులకు మంజారు చేయించాలని డిమాండ్ చేశారు. పోలవరం పరిహారం ఇవ్వకుండా సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారని, ధ్రువపత్రాల కోసం నిర్వాసితులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఆరోపించారు. ప్రతి నిర్వాసితుడికి న్యాయం జరిగేవరకు వైఎస్సార్సీపీ వారికి అండగా ఉంటుందని, నిర్వాసితులెవరూ ఆందోళన చెందవద్దని వారు తెలిపారు. మోసపూరిత హామీలతో గద్దెక్కిన కూటమి నాయకులు నియోజకవర్గంలో అభివృద్ధిని విస్మరించి దోచుకోవడం, దాచుకోవడంలో బిజీగా మారారని వారు విమర్శించారు. వైఎస్సార్సీపీకి చెందిన ప్రజా ప్రతినిధుల విషయంలో ప్రొటోకాల్ పాటించని అధికారులను నిలదీయాలని, గ్రామాల్లో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి అధికారులు, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు సూచించారు. అర్హతవున్నా ప్రభుత్వ పథకాలు ఇవ్వకుండా అన్యాయంగా వేధించేవారిని ఉపేక్షించబోమని వారు హెచ్చరించారు. పథకాలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలపై వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలకు తెలియజేయాలని సూచించారు. కూటమి నాయకులను గ్రామస్తులు నిలదీసేలా చేయాలని కార్యకర్తలకు సూచించారు. జెడ్పీటీసీ చిచ్చడి మురళి, ఎంపీపీ సవలం అమల, వైస్ ఎంపీపీలు మేడేపల్లి సుధాకర్, యడమ అర్జున్, కో–ఆప్షన్ సభ్యుడు ఎండీ జిక్రియా, నాయకులు కోట్ల కృష్ణ, బాబూరావు, రాంప్రసాద్, మురళి, ఖాదర్షరీఫ్, సీతారామయ్య, సాయి, రాంబాబు, రాజు, మహేష్, మోతుగూడెం నాయకులు పేపకాయల శ్రీను, శివరామకృష్ణ, మీనా సుజాత, వేగి రాజా తదితరులు పాల్గొన్నారు. -
వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
● నిర్లక్ష్యం చేస్తే చర్యలు ● డీఎంహెచ్వో విశ్వేశ్వరనాయుడు ● రాజేంద్రపాలెం ఆస్పత్రి తనిఖీకొయ్యూరు: ఎపిడమిక్ సమయంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్వో విశ్వేశ్వరనాయుడు హెచ్చరించారు. మంగళవారం ఆయన రాజేంద్రపాలెం పీహెచ్సీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందితో సమావేశమయ్యారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతపై గిరిజనులకు అవగాహన కల్పించాలని కోరారు. పరిశుభ్రత పాటించడం వల్ల దోమల ప్రభావం తగ్గించవచ్చన్నారు. వర్షాకాలంలో మరగబెట్టిన నీటిని తాగేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పాఠశాలల్లో విధిగా వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వైద్యాధికారి స్నేహలత, సీహెచ్వోఎల్ ప్రశాంత్, హెచ్వీలు పాల్గొన్నారు. -
అరకొర యూరియా కేటాయింపుపై ఆగ్రహం
సీలేరు: గిరిజన రైతులకు యూరియా అందక ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది ఇదే నెలలో గూడెంకొత్తవీధి మండలానికి 58 టన్నుల యూరియా ఇవ్వగా ఈ ఏడాది 12 టన్నులు కేటాయించింది. వీటిలో 267 బస్తాలు రావడంతో మండల కేంద్రానికి 90, ధారకొండ రైతు సేవా కేంద్రానికి 177 బస్తాలు అందించారు. ఈ విషయం తెలుసుకున్న ధారకొండ, గుమ్మరేవులు, దుప్పులవాడ పంచాయతీలకు చెందిన సుమారు 750 మంది రైతులు మంగళవారం ఇక్కడికి చేరుకున్నారు. మండుటెండలో గంటల తరబడి నిరీక్షించారు. పంపిణీ చేసేందుకు మధ్యాహ్నం రెండు గంటలకు ఏవో గిరిబాబు వచ్చారు. అందరికీ పంపిణీ చేసేందుకు పూర్తిస్థాయిలో లేకపోవడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. అందరికీ ఇవ్వాల్సిందేనని వారు పట్టుబట్టారు. రెండో విడత వచ్చినప్పుడు మిగతా వారికి వచ్చేందుకు ఏవో, సర్పంచ్ రాజు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే అందరికీ ఇవ్వాల్సిందేనని రైతులు స్పష్టం చేయడంతో రెండో విడత వచ్చిన ఎరువులతో కలిపి మొత్తం అందరికీ అందజేస్తామన్నారు. దీంతో రైతులు నిరాశతో వెనుదిరిగారు. ఎస్ఐ రవీంద్ర గొడవ జరగకుండా చర్యలు చేపట్టారు.అందరికీ పంపిణీ చేయాలని ధారకొండలో గిరిజన రైతుల డిమాండ్ -
షార్ట్ సర్క్యూట్తో బైక్ దగ్ధం
జి.మాడుగుల: మండలంలోని సొలభం వెళ్లే మార్గంలో ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత పాఠశాల–2 సమీపంలో షార్ట్ సర్క్యూట్ వల్ల బైక్ దగ్ధమైంది. మండంలోని వంజరి పంచాయతీ కొత్తూరుపాడు గ్రామానికి చెందిన కొర్రా కల్యాణం మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత పాఠశాలలో చదువుతున్న కుమారుడు యోహాన్ వద్దకు తమ్ముడి బైక్పై బయలుదేరాడు. ఆశ్రమ పాఠశాలకు సమీపంలోకి వచ్చేసరికి సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే పక్కకు తీసిన వెంటనే ఒక్కసారిగా బైక్లో మంటల వ్యాపించినట్టు కల్యాణం తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బైక్ వద్దకు వచ్చి మంటలు ఆర్పారు. అయితే అప్పటికే బైక్ దగ్ధమైంది. ఈ సమయంలో ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. -
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కదంతొక్కిన గిరి రైతులు
కూటమి ప్రభుత్వ పాలనలో రైతులకు జరుగుతున్న అన్యాయం, యూరియా పంపిణీలో నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ రైతుల పక్షాన వైఎస్సార్సీపీ మంగళవారం పాడేరు, చింతూరులో చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమం విజయవంతమైంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు, రైతులు భారీగా తరలివచ్చారు. పాడేరు, అరకులోయ నియోజకవర్గాలకు సంబంధించి పోలీసు యంత్రాంగం ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకున్నప్పటికీ వారంతా జిల్లా కేంద్రం పాడేరుకు చేరుకున్నారు. అనంతగిరి, అరకులోయ, హుకుంపేట మండలాల నేతలను అరకు, పాడేరు మార్గంలో పలు చోట్ల పోలీసులు అడ్డగించారు. చింతపల్లి, జి.మాడుగుల మండలాల్లో పలుచోట్ల కొయ్యూరు మండల నేతలను అడ్డుకున్నారు. అయినప్పటికీ అన్నదాత పోరు విజయవంతమైంది. ● అడుగడుగునా కూటమి సర్కారు అడ్డంకులు ● వైఎస్సార్సీపీ నేతలను నియత్రించేందుకు ప్రయత్నించిన పోలీసులు ● పాడేరు, చింతూరుల్లో భారీగా నిరసన ర్యాలీలు ● రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు పాడేరు/సాక్షి, పాడేరు : రాష్ట్రంలో యూరియా, ఎరువుల బ్లాక్మార్కెట్పై వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం పాడేరులో నిర్వహించిన అన్నదాత పోరుకు విశేష స్పందన లభించింది. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు అనేక అడ్డంకులు సృష్టించారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో పాడేరు ఎస్ఐ సురేష్ నోటీసులు పట్టుకొని ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఆయనకు నోటీసు ఇచ్చే ప్రయత్నం చేశారు. అనారోగ్యం కారణంగా ఆయన విశ్రాంతి తీసుకోవడంతో పోలీసులు వెనుదిరిగారు. పాడేరు, అరకు నియోజక వర్గాలలోని11 మండలాల్లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి పాడేరులో అన్నదాత పోరు కార్యక్రమానికి వస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులు, స్వచ్ఛందంగా తరలివస్తున్న రైతులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ కొంతమంది రైతులు, వైఎస్సార్సీపీ శ్రేణులు వారి నుంచి ఎలాగోలా తప్పించుకుని పాడేరు చేరుకున్నారు. దీంతో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్థానిక క్యాంప్ కార్యాలయం నుంచి సినిమా హాల్ సెంటర్, పాత బస్టాండ్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయం బయట సీఐ దీనబంధు ఆద్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లేందుకు కుదరదని చెప్పడంతో పోలీసులు, వైఎస్సార్సీపీ శ్రేణులకు మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటుచేసుకుంది. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో కార్యాలయం ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. సుమారు గంటసేపు ధర్నా చేశారు. సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ అందుబాటులో లేకపోవడంతో సబ్ కలెక్టర్ కార్యాలయం ఏవో అప్పలస్వామికి రైతు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అన్నదాతకు దగా : పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు రాష్ట్రంలో రైతాంగాన్ని కూటమి ప్రభుత్వం దగా చేస్తోందని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు ధ్వజమెత్తారు. ప్రభుత్వ తీరుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ౖరెతు సంక్షేమం విస్మరణ: అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం విమర్శించారు. ఏజెన్సీలో గిరిజన రైతులకు ఎక్కడ కూడా యూరియా, ఎరువులను సరఫరా చేయడం లేదన్నారు. వైఎస్సార్సీపీ రైతు పక్షపాతి: మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉండి రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని పాడేరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. పూర్థిస్థాయిలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి ఖరీఫ్ సీజన్కు ముందుగానే రాయితీపై విత్తనాలు యూరియా, ఎరువులను సక్రమంగా సరఫరా చేసిందన్నారు. వ్యవసాయ రంగం నిర్వీర్యం: మాజీ ఎమ్మెల్యే పాల్గుణ రైతులంటే చంద్రబాబుకు ఏ మాత్రం కూడా గిట్టదని అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ విమర్శించారు. రైతుల బాగు కోసం ఆయన ఏనాడు ఆలోచన చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం హయాంలో వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యం అవుతోందన్నారు. రైతుల పక్షాన వారు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్సార్సీపీ అండగా ఉంటూ పోరాటాలు చేస్తుందన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం: ఎమ్మెల్సీ అనంత ఉదయ్భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి చింతూరు: ఎరువులు లేక అల్లాడుతున్న రైతన్నలకు న్యాయం జరిగేవరకు వారి పక్షాన నిరంతర పోరాటం చేస్తామని ఎమ్మెల్సీ అనంత ఉదయ్భాస్కర్, మాజీ ఎమ్మెల్యే, రంపచోడవరం నియోజకవర్గ ఇంఛార్జ్ నాగులపల్లి ధనలక్ష్మి హెచ్చరించారు. ఎరువుల సమస్యపై మంగళవారం చింతూరులో అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ఎర్రంపేటలో రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి ఐటీడీఏ వరకు ర్యాలీ నిర్వహించారు. రైతులకు సకాలంలో ఎరువులు సరఫరా చేయాలని, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని వారు నినాదాలు చేశారు. అనంతరం ఐటీడీఏ ఏపీవో జగన్నాథరావుకు వారు వినతిపత్రం అందచేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ సీజన్ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ ముందుగానే వ్యవసాయశాఖ అధికారులతో చర్చించి రైతులకు ఎంతమేర ఎరువులు, విత్తనాలు కావాలో సమగ్రంగా తెలుసుకునే వారన్నారు. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందేవని, తమ ప్రభుత్వ హయాంలో ఏనాడూ రైతులు ఇన్ని ఇబ్బందులు పడలేదని వారు తెలిపారు. దళారుల బెడదలేకుండా ఎరువులు బ్లాక్మార్కెట్కు తరలిపోకుండా నిర్దిష్టమైన ప్రణాళికతో రైతులను తమ ప్రభుత్వం ఆదుకుందని వారు పేర్కొన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు సొమ్ములు నేరుగా రైతుల ఖాతాల్లో జమయ్యేవని వారు తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రైతులు ఎరువులు, విత్తనాలు, గిట్టుబాటు ధరల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొందని, కేసులతో వైఎస్సార్సీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేయడంపై ఉన్న శ్రద్ధ రైతులను ఆదుకోవడంపై చూపడం లేదని వారు విమర్శించారు. రైతుల గొంతుకగా నిలిచి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ద్వారా అన్నదాతకు న్యాయం జరిగేలా చూస్తామని వారు భోరాస ఇచ్చారు. జెడ్పీటీసీలు చిచ్చడి మురళి, గుజ్జా విజయ, ఎంపీపీ సవలం అమల, వైస్ ఎంపీపీలు మేడేపల్లి సుధాకర్, యడమ అర్జున్, పార్టీ మండల కన్వీనర్ యగుమంటి రామలింగారెడ్డి, నాయకులు తోట రాజేశ్వరరావు, మద్దాల వీర్రాజు, జల్లిపల్లి రామన్నదొర, కోట్ల కృష్ణ, ఎండీ జిక్రియా, మాదిరెడ్డి సత్తిబాబు, చిక్కాల బాలు, ఆవుల మరియాదాసు, పార్టీకి చెందిన ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు పాల్గొన్నారు.హోరెత్తిన అన్నదాత పోరుతీవ్రంగా నష్టపోయాం కూటమి ప్రభుత్వంలో తీవ్రంగా నష్టపోయాం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సకాలంలో విత్తనాలు, ఎరువులు అందేవి. ప్రస్తుత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. – పి.శోభన్బాబు, రైతు, కండ్రుం పంచాయతీ, డుంబ్రిగుడ మండలంరైతులకు చేసింది శూన్యం ఏడాదిన్నర కూటమి ప్రభుత్వ పాలనలో రైతులకు చేసింది శూన్యం. ఒక్క రైతుకు కూడా వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు ఇవ్వలేదు. రైతులను ప్రభుత్వం దగా చేస్తోంది. – టి.రామారావు, కుంతర్ల, పెదబయలు మండలంఆర్బీకేలు నిర్వీర్యం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. రైతులకు రాయితీపై రుణాలు, ఎరువులు ఇవ్వకుండా మోసం చేసింది. – ఎం. అప్పారావు, బాబుసాల, ముంచంగిపుట్టు మండలంగిట్టుబాటు ధరలు కరువు గిరి రైతులు సాగు చేస్తున్న పంటలకు గిట్టుధరలు లేకపోవడంతో నష్ట పోతున్నాం. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఎరువులు సకాలంలో ఇవ్వలేకపోయింది. –తిమోతి, పెదవలస, గూడెంకొత్తవీధి మండలం -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
చింతూరు: మండలంలోని చట్టిలో జాతీయ రహదారి–30పై మంగళవారం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఛత్తీస్గఢ్కు చెందిన సవలం రమేష్(25) అనే యువకుడు మృతి చెందాడు. సుక్మా జిల్లా పందిగూడకు చెందిన రమేష్ తన స్నేహితుడితో కలసి బైక్పై చట్టి గ్రామం నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న క్రమంలో మారేడుమిల్లి వద్ద ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో రమేష్ అక్కడికక్కడే మృతిచెందగా మారేడుమిల్లి మండలం సున్నంపాడుకు చెందిన మడకం శ్రీను, చింతూరు మండలం బలిమెలకు చెందిన ముచ్చిక కోనయ్యకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రమేష్ తెలిపారు. -
సమస్యలపై కలెక్టర్కు వినతులు
రంపచోడవరం: ఏజెన్సీలో అక్రమ కట్టడాల నిర్మాణాలను అరికట్టాలను కోరుతూ ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మంగళవారం రంపచోడవరంలో కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. గిరిజనేతరులకు జారీ చేసిన విద్యుత్ మీటర్లను స్వాధీనం చేసుకోవాలన్నారు. అక్రమ కట్టడాలు తొలగించిన చోట గిరిజనేతరులు గుడారాలు వేసి వ్యాపారాలు చేస్తున్నారని వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏజెన్సీ చట్టాలకు లోబడి పనిచేయని అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ను కలిసి వారిలో ప్రసాద్ కడబాల కాసులమ్మ, తీగల రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. రాజవొమ్మంగి: మండలంలోని కిర్రాబు వద్ద చిన్నేరుపై ఆనకట్ట నిర్మించాలని కోరుతూ ఆదివాసీ సంక్షేమ సంఘం నాయకులు బాలకృష్ణ, సూరిబాబు, నాగరాజు తదితరులు రాజవొమ్మంగి వచ్చిన కలెక్టర్ దినేష్కుమార్ను మర్యాదగా కలిసి మంగళవారం వినతిపత్రం అందజేశారు. గతంలో ఐటీడీఏ పీవోగా దినేష్కుమార్ ఉండేవారని గుర్తు చేశారు. చాలా కాలంగా కిర్రాబులో చిన్నేరుపై ఆనకట్ట లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇక్కడ ఆనకట్ట నిర్మాణంతో ఐదు పంచాయతీల్లోని వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని వినతిలో తెలిపారు. చిన్నేరు ద్వారా విలువైన జలాలు దిగువకు వృథాగా పోతున్నాయని వాటిని, సాగు భూములకు అందేలా చూడాలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, ఆనకట్ట కోసం ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని హామీ ఇచ్చినట్టు ఆదివాసీ సంఘం నాయకులు తెలిపారు. -
మావోయిస్టు లొంగుబాటు
వివరాలు వెల్లడించిన ఎస్పీ అమిత్బర్దర్ పాడేరు: ఏసీఎం క్యాడర్కు చెందిన ఓ మావోయిస్టు ఎస్పీ అమిత్ బర్దర్ ఎదుట మంగళవారం స్వచ్ఛందంగా లొంగిపోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ తన కార్యాలయంలో వెల్లడించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాకు చెందిన ఏరియా కమిటీ సభ్యుడు దిరిదో దేవ (34) అనే మావోయిస్టు 2011లో (14వ ఏట) మావోయిస్టు పార్టీలో చేరాడు. అంచెంలంచెలుగా ఎదుగుతూ ఏసీఎం క్యాడర్కు చేరుకున్నాడు. ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీలో శిక్షకునిగా పని చేస్తూ కొంటా ఏరియా కమిటీ సబ్యుడిగా కొనసాగుతున్నాడు. గెరిల్లా యుద్ధంలో నిష్ణాతుడని ఎస్పీ తెలిపారు. రెండు హత్య ఘటనలు, 13 ఎదురు కాల్పుల ఘటనల్లో పాల్గొన్నట్టు ఆయన వివరించారు. ఇటీవల కాలంలో మావోయిస్టు సిద్ధాంతాలు విసుగు చెందాడు. పార్టీకి ఆదరణ లేకపోవడం, ప్రజల్లో పార్టీ పూర్తిగా పట్టు కోల్పోవడం, ఇటీవల కాలంలో తన తమ్ముడు బైక్ ప్రమాదంలో మృతి చెందడం, తదితర కారణాలతో లొంగిపోయినట్టు ఎస్పీ వివరించారు. అతనికి ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రాయితీలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇంకా ఎవరైనా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి అనుకుంటే నేరుగా పోలీసు శాఖను సంప్రదించాలని ఆయన కోరారు. -
రోగులకు సత్వర వైద్యం అందించాలి
పారిశుధ్యలోపమే కారణమని కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ అన్నారు. మంగళవారం ఆయన లాగరాయి, లబ్బర్తి, కిండ్రలో నిర్వహించిన వైద్యశిబిరాలను ఆయన సందర్శించారు. అనంతరం లాగరాయి పీహెచ్సీని పరిశీలించారు. ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో రెండు చికెన్ గున్యా కేసులు నమోదు అయినట్టు వైద్యాధికారులు శిరీష్, డేవిడ్ కలెక్టర్కు వివరించారు. ప్రస్తుతం మరో 12 మంది జ్వరపీడితులకు రక్త నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించామని తెలిపారు. రోగ నిర్ధారణ అనంతరం ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. లాగరాయి, లబ్బర్తి, కిండ్ర గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ ఎక్కడ చూసినా పారిశుధ్యం అధ్వానంగా ఉందన్నారు. పరిస్థితి మెరుగుపడాలని గ్రామసచివాలయ కార్యదర్శులను ఆదేశించారు. దోమల నివారణ చర్యలు ముమ్మరం చేయాలని మలేరియా సిబ్బందికి సూచించారు. జ్వరపీడితులు పడుతున్న ఇబ్బందులను ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, లాగరాయి సర్పంచ్ మిరియాల గణలక్ష్మి, ఎంపీటీసీ పెద్దిరాజు కలెక్టర్కు వివరించారు. సబ్ కలెక్టర్ శుభం నొఖ్వాల్, డీఎంహెచ్వో విశ్వేశ్వరనాయుడు, ఏడీఎంహెచ్వో డేవిడ్, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీవో యాదగిరీశ్వరరావు, గిరిజన సంక్షేమశాఖ డీ గౌతమి పాల్గొన్నారు. గంగవరం: గిరిజన రైతులు ఎరువుల కోసం అధైర్య పడొద్దని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని కొత్తాడ రైతు సేవా కేంద్రంలో ఎరువుల నిల్వలను పరిశీలించిన ఆయన మాట్లాడారు. గిరిజన రైతులందరికీ ఎరువులు అందుబాటులో ఉండేలా తగు చర్యలు తీసుకున్నామన్నారు. రైతు సేవా కేంద్రాలు, సొసైటీల ద్వారా యూరియా పంపినీ చేస్తామన్నారు. రూ.2 వేల విలువైన యూరియా బస్తాను గిరిజన రైతులకు రూ.267కు అందిస్తున్నట్టు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా 193 మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటివరకు రైతులకు సరఫరా చేశామన్నారు. అనంతరం నెల్లిపూడిలో ఆయన పర్యటించారు. సుమారు 3500 ఎకరాల భూమి ముకాస భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు ఎరువులు, విత్తనాలు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం నొఖ్వాల్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అంబేద్కర్, తహసీల్దార్ సిహెచ్ శ్రీనివాసరావు, మండల వ్యవసాయాధికారి కింటుకూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
పోలవరం నిర్వాసితులకు 4 వేల ఎకరాలు
ఆదేశించారు. పీఎంఆర్సీ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, ఆర్అండ్ఆర్ కాలనీల నిర్మాణంపై సబ్ కలెక్టర్ శుభం నొఖ్వాల్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజక్టు ముంపునకు గురైన చింతూరు డివిజన్లోని నిర్వాసితులకోసం రాజవొమ్మంగి, అడ్డతీగల, గంగవరం మండలాల్లో సుమారు 4వేల ఎకరాల భూమి గుర్తించాలన్నారు. ప్రభుత్వ భూమి, గిరిజనేతరుల భూమి,గిరిజనులకు సంబంధించిన భూములను గుర్తించాలని సూచించారు. పదిహేను రోజుల్లో ఈ ప్రక్రియ తహసీల్దార్లు పూర్తి చేయాలని సూచించారు. అడ్డతీగల, గంగవరం మండలాల్లో గుర్తించిన భూమి వివరాలు తెలుసుకున్నారు. గిరిజన, గిరిజనేతరుల నుంచి సేకరించే భూమి ఎటువంటి ఎల్టీఆర్పీ కేసులుగాని, భూ తగదాలు లేని భూములను గుర్తించాలన్నారు. కాలనీలకు దగ్గరల్లో భూమికి భూమి ఇచ్చేందుకు అనుకూలంగా ఉండేలా చూడాలన్నారు. కాలనీల ఏర్పాటుకు నిర్వాసితులకు ఆస్పత్రులు, పాఠశాలలు, సంతలు, మార్కెట్లు, బస్సు సౌకర్యం ఎంత దూరంలో ఉన్నాయో ముందుగా నిర్వాసితులకు తెలియజేయలన్నారు. భూమిని గుర్తించిన తరువాత నిర్వాసితులు చూపించడం జరుగుతుందన్నారు. నిర్వాసితుల కోసం నిర్మించే కాలనీల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు శ్రీనివాసరావు, ఎన్ దొర, బాలాజీ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మేలైన యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు
చింతపల్లి: గిరిజన రైతులు పసుపుసాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాదించవచ్చని స్పైస్ బోర్డు సీనియర్ ఫీల్డ్ అధికారి బొడ్డు కళ్యాణి అన్నారు. తాజంగి పంచాయతీ పరిధిలోని పినపాడు గ్రామంలో ’పసుపు సాగులో నూతన యాజమాన్య పద్ధతులు, నాణ్యత ప్రమాణాల మెరగు అంశంపై ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతులు పసుపు పంటలో విత్తన శుద్ధి చేసుకొని సాగు చేయాలని, దీంతో తెగుళ్లను నివారించవచ్చన్నారు. ఎతైన బెడ్లపై పంటను సాగుతో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. పసుపు ఉడకపెట్టే యంత్రాలు, వాష్ స్పైషర్ పాలిష్ యంత్రాలను 75 శాతం రాయితీపై అందజేస్తున్నట్టు తెలిపారు. రైతు ఉత్పత్తిదారులు సంఘాలు, ఎఫ్పీవోలకు 90 శాతం సబ్సిడీపై ఈ యంత్రాలను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. రైతులు ఆయా పథకాలు పొందేందుకు ఆధార్, కుల, ఆదాయ, బ్యాంకు అకౌంట్ ధ్రువపత్రాలతో స్పైస్ బోర్డు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వెంకటేష్బాబు, టాటా ట్రస్టు నిపుణుడు డాక్టర్ అప్పారావు, ఎఫ్పీవో సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
రహదారి కోసం ఎమ్మెల్యేకు వినతి
చింతపల్లి: మండలంలో లోతుగెడ్డ వంతెన నుంచి కోరుకొండ వరకూ పూర్తి స్థాయి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని బలపం సర్పంచ్ కొర్రా రమేష్నాయుడు కోరారు. పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజును క్యాంప్ కార్యాలయంలో పంచాయతీ నాయకులు మర్యాదగా కలిశారు. ఈ సందర్భంగా పంచాయతీలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా లోతుగెడ్డ వంతెన నుంచి మూలకోత్తూరు వరకూ ఉన్న రోడ్డు దెబ్బతిందని, గోతులతో నిండి ఉండడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామన్నారు. బలపం పంచాయితీతో పాటు లోతుగెడ్డ, కుడుముసారి పంచాయతీల్లో సుమారు 60 గ్రామాలకు ఈ రహదారే ప్రధానం ఉందన్నారు. చినుకు పడితే ఈ రహదారి మీదుగా రాకపోకలకు నానా అవస్థలు పడాల్సి వస్తోందని చెప్పారు. రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పినట్టు వారు తెలిపారు. గెమ్మిలి మోహన్రావు, కోటిబాబు, బాలకృష్ణ, శ్రీనివాసరావు, బుజ్జిబాబు, నీలకంఠం తదితరలు పాల్గొన్నారు. -
గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు
రాజవొమ్మంగి: మండంలోని లాగరాయి పీహెచ్సీ పరిధిలోని లాగరాయి, లబ్బర్తి, కిండ్ర గ్రామాల్లో కొద్ది రోజులుగా జ్వరాలతో సతమతుమవుతున్నారు. ఇందులో భాగంగా మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఎటువంటి వైద్య సేవలందక రోగులు నానా అవస్థలు పడుతున్నారు. రంపచోడవరం ఎమ్మెల్యే సొంత పంచాయతీ అయిన కిండ్రలో ఇంటింటా జ్వరాలతో గ్రా మస్తులు మంచాన పడ్డారు.అధికారులు పట్టించుకోవడం లేదని, రోగులు వాపోతున్నారు. ఈ సమస్యను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ‘సాక్షి’లో ఈనెల 8న ‘జ్వరాలతో సతమతం’ శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీనిపై అధికారులు స్పందించారు. గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. సుమారు 100 మంది జ్వరపీడితులకు చికిత్స అందజేశారు. 12 మందికి రక్తపూతలు సేకరించి ల్యాబ్కు పంపారు. ఇంటింటికి వెళ్లి ఆరా తీసిన ఏడీఎంహెచ్వో డేవిడ్ గ్రామాల్లో జ్వరపీడితుల సమస్యపై పలు పత్రికల్లో కథనం ప్రచురించడంతో రంపచోడవరం ఏడీఎంహెచ్వో డేవిడ్ స్పందించారు. ఆయన సోమవారం హుటాహుటిన లబ్బర్తి, లాగరాయి, కిండ్ర గ్రామాలకు వచ్చి పరిస్థితిని అంచనా వేశారు. జ్వరపీడితులను కలిసి, ఇబ్బందులను అడిగి తెలుసుకొన్నారు. ప్రస్తుతం ఫీవర్ సర్వే జరుగుతోందని, రిపోర్టుల ఆధారంగా రాష్ట్ర స్థాయి వైద్యనిపుణులు ఈ ప్రాంతానికి వస్తారని, పూర్తిస్థాయిలో వైద్య సేవలందిస్తామని ఆందోళన చెందవద్దన్నారు. మరోవైపు ఈ ప్రాంతంలో రెండు నెలల క్రిందట ఇదే సమస్య వచ్చిందని, ఫీవర్ సర్వే జరిపి 12 మందికి రక్త పరీక్షలు చేయగా ఇరువురికి చికున్గున్యా ఉన్నట్టు అప్పట్లో నిరార్థణ అయినట్టు చెప్పారు.ప్రస్తుతం విస్తృతంగా ఫీవర్సర్వే జరుగుతుందని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. గ్రామాల్లో దోమల నివారణ మందు పిచికారీ జరుగుతుందని, అందరూ ఇంటా బయట స్ప్రేయింగ్ చేయించుకోవాలని సూచించారు. ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, సర్పంచ్లు గణలక్ష్మి, సత్యవతి, మెడికల్ ఆఫీసర్లు శివప్రసాద్రెడ్డి, ఎస్తేరు రాణి, సతీష్, శరత్చంద్ర పాల్గొన్నారు. జ్వరాలపై కలెక్టర్ స్పందన లాగరాయి పీహెచ్సీ పరిధిలోని లాగరాయి, లబ్బర్తి, కిండ్ర గ్రామాల్లో ప్రబలతున్న జ్వరాలపై ‘సాక్షి’లో వచ్చిన కథనానికి కలెక్టర్ దినేష్కుమార్ స్పందించారు. ఆయా గ్రామాల్లో వెంటనే ప్రత్యేక వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలని డీఎంహెచ్ఓ విశ్వేశ్వరరావు నాయుడును ఆదేశించారు. దీంతో ఆయా గ్రామాల్లో సోమవారం వైద్య శిబిరాలు నిర్వహించి, పలువురు నుంచి రక్త నమూనాలు సేకరించినట్టు ఏడీఎంహెచ్వో విలేకరులతో చెప్పారు. రక్త నమూనాలను ల్యాబ్కు పంపి వ్యాధి నిర్ధారణను బట్టి తగిన చికిత్స అందజేస్తామని వెల్లడించారు. తీవ్రమైన జ్వరం ,ఇతర అనారోగ్య సమస్యలున్న వారు సమీపంలోని సీహెచ్సీలకు వెళ్లాలని, తక్షణమే చికిత్స అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుతం ఆందోళన చెందాల్సినది లేదని, కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నట్టు డీఎంఅండ్హెచ్ఓ తెలిపారు. -
నిత్యావసరాలు కూడా సరిగా అందలేదు
వీఆర్ పురం: వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి సోమవారం పర్యటించారు. చింతరేవుపల్లి, గుండుగూడెం, పత్తిపాక, రేఖపల్లి, ఒడ్డుగూడెం, ఒడ్డుగూడెం కాలనీ, రాజుపేట గ్రామాల్లో వరద బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అనంతబాబు మాట్లాడుతూ నెల రోజుల వ్యవధిలో ప్రమాదస్థాయి దాటి మూడుసార్లు గోదావరి వరదలు వస్తే కూటమి ప్రభుత్వం బాధితులను పట్టించుకోలేదన్నారు. తమ ప్రభుత్వంలో నిత్యావసరాలు, బియ్యం, బరకాలు రెండేసిసార్లు వరద బాధితులకు అందజేశామన్నారు. తమకు నిత్యావసర సరకులు అందలేదని బాధితులు ఈ సందర్భంగా వాపోయారు. ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమం రేఖపల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మాదిరెడ్డి సత్తిబాబు ఇంటి వద్ద సోమవారం జరిగింది. ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులను, నిరుద్యోగులను, మహిళలను మోసం చేసిందన్నారు. అమ్మ ఒడి, రైతు భరోసా, నిరుద్యోగ భృతి ఎక్కడ అని ప్రశ్నించారు. సచివాలయ ఉద్యోగుల బదిలీకి 1.50 లక్షల లంచం తీసుకుంటున్నారన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో రైతులకు యూరియా బస్తాలు కూడా దొరకడం లేదన్నారు. పోలవరం నిర్వాసితుల పొలాల్లో జెండాలు పాతటం సరికాదన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి, నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించేవరకు ఎవరు భూములు వారే సాగు చేసుకోవచ్చని చట్టంలో ఉందన్నారు. పార్టీ మండల కన్వీనర్ మాదిరెడ్డి సత్తిబాబు, సర్పంచ్లు పిట్టా రామారావు, వడ్డాణపు శారద నరసమ్మ, వైస్ ఎంపీపీ ముత్యాల భవాని, ఎంపీటీసీ బంధం విజయలక్ష్మి, కూనవరం జెడ్పీటీసీ గుజ్జా విజయ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆవుల మరియదాసు తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ నడుపుతుండగా ఫిట్స్
యువకుడు మృతి కొయ్యూరు: ట్రాక్టర్ నడుపుతుండగా ఫిట్స్ రావడంతో ప్రమాదానికి లోనై యువకు డు మృతి చెందాడు. కొ య్యూరు ఎస్ఐ కిషోర్వర్మ సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. రేవళ్లు పంచాయతీ నిమ్మలపాలేనికి చెందిన చుండ్రు సింహాచలం (21) ఆదివారం సురేంద్రపాలెంలో ఉంటున్న తన చిన్నా న్న చుండ్రు కృష్ణారావు ఇంటికి వెళ్లి పొలం దు న్నేందుకు ట్రాక్టర్ కావాలని తీసుకెళ్లాడు. ట్రాక్టర్ తీసుకువస్తున్న సమయంలో కొయ్యూరు శివారులో సింహాచలానికి ఫిట్స్ వచ్చాయి. దీంతో అ తను నడుపుతున్న ట్రాక్టర్ తాటిచెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో సింహాచలం మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
కలెక్టర్తో ఐటీడీఏ పీవోలు భేటీ
సాక్షి,పాడేరు: కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ను పాడేరు, రంపచోడవరం ఐటీడీఏ కొత్త పీవోలు తిరుమణి శ్రీపూజ, స్మరణ్రాజ్లు సోమవారం కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కలెక్టర్కు పుష్పగుచ్ఛాలు, పూలమొక్కలను అందజేసి తమ ఆత్మీయతను చాటుకున్నారు. కలెక్టర్తో వారు కొద్దిసేపు భేటీ అయ్యారు. పాడేరు, రంపచోడవరం ఐటీడీఏల పరిధిలో గిరిజనాభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ పీవోలను ఆదేశించి, అభినందనలు తెలిపారు. కలెక్టర్ దినేష్కుమార్కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న పాడేరు, రంపచోడవరం ఐటీడీఏ పీవోలు తిరుమణి శ్రీపూజ, స్మరణ్రాజ్ -
తెరుచుకోని సుండ్రుపుట్టు రైతు సేవా కేంద్రం
యూరియా, రాజ్మా విత్తనాల కోసం రైతుల పడిగాపులు ఎవరూ రాకపోవడంతో నిరాశతో వెనుదిరిగిన రైతులు పాడేరు: మండలంలోని సుండ్రుపుట్టు రైతు సేవా కేంద్రం వద్ద గిరిజన రైతులు యూరియా, రాజ్మా చిక్కుళ్ల విత్తనాల కోసం పడిగాపులు కాశారు. సోమవారం పాడేరు, హుకుంపేట మండలాల నుంచి రైతులు ఉదయం 9 గంటలకు ఈ కేంద్రానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు రైతు సేవా కేంద్రం తెరవలేదు. అగ్రికల్చర్ అసిస్టెంట్ కోసం రైతులు గంటల తరబడి ఎదురుచూశారు. విషయం తెలుసుకున్న పాత పాడేరు రైతు సేవా కేంద్రం అగ్రికల్చర్ అసిస్టెంట్ అక్కడికి వచ్చారు. సిబ్బంది ఎవరూ లేరని, రైతు సదస్సు కోసం ఇరడాపల్లి వెళ్లారని, పైగా స్టాక్ కూడా అందుబాటులో లేదని ఆమె చెప్పారు. దీంతో రైతులు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 కి.మీ. నుంచి యూరియా కోసం వచ్చాను నేను ఈ ఏడాది ఖరీఫ్లో వరి, రాజ్మా సాగు చేస్తున్నాను. యూరియా అవసరమై హుకుంపేట మండలంలో అన్ని రైతు సేవా కేంద్రాల్లో తిరిగాను. ఎక్కడకు వెళ్లినా స్టాక్ లేదన్నారు. పాడేరు పట్టణంలోని సుండ్రుపుట్టు రైతు సేవా కేంద్రంలో యూరియా ఉందనే సమాచారంతో వచ్చాను. మధ్యాహ్నం 12 గంటలైనా రైతు సేవా కేంద్రం తెరవలేదు. పైగా ఇక్కడ కూడా స్టాక్ లేదంటున్నారు. –పాంగి సుబ్బారావు, బంగారుబుడ్డి గ్రామం, జర్రకొండ గ్రామం, హుకుంపేట మండలం రాజ్మా చిక్కుళ్ల కోసం రెండుసార్లు తిరిగాను సబ్సిడీపై రాజ్మా చిక్కుళ్ల కోసం రైతు సేవా కేంద్రానికి రెండుసార్లు తిరిగాను. మొదటిసారి విత్తనాలు రాలేదన్నారు. దీంతో సోమవారం మళ్లీ సుండ్రుపుట్టు రైతు సేవా కేంద్రానికి వచ్చాను. మధ్యాహ్నం 12 గంటలైనా రైతు సేవా కేంద్రం తెరవలేదు. చివరిగా విత్తనాలు ఇస్తారో ఇవ్వరో తెలియని పరిస్థితి ఉంది. అధికారులు స్పందించి సబ్సిడీపై రాజ్మా విత్తనాలు అందేలా చూడాలి. –వంతాల సావిత్రమ్మ, గిరిజన రైతు, లోచలిపుట్టు గ్రామం, పాడేరు మండలం -
యూరియాఏదయా..!
ఒడిశా నుంచి తెచ్చుకుంటున్నాం రైతు సేవా కేంద్రాల్లో యూరియా అందుబాటులో లేదు. దీంతో ఒడిశాలోని మల్కన్గిరి, చిత్రకొండ ప్రాంతాల నుంచి తెచ్చుకోవాల్సి వస్తోంది. రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో ఉంచాలని మండల వ్యవసాయాధికారి, సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోయింది. –ఇంతెంగి చిట్టిబాబు, రైతు, గుంజివాడ, జామిగుడ పంచాయతీ పెదబయలు మండలంసాక్షి, పాడేరు/అరకులోయ టౌన్: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి గిరి రైతులను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఎరువులు దొరక్క పోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని వారు ధ్వజమెత్తుతున్నారు. జిల్లాలోని 352 గ్రామ సచివాలయాల పరిధిలో రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో వీటిలో పుష్కలంగా ఎరువులు అందుబాటులో ఉండేవి. ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామనే నెపంతో వీటిలో కొన్నింటికి మాత్రమే యూరియా సరఫరా చేసి, మిగతా వాటిని నిలిపివేసింది. జిల్లాలోని ప్రైవేట్ డీలర్ల ద్వారా ఎరువుల అమ్మకాలను ప్రోత్సహించింది. దీనిని ఆసరాగా తీసుకుని ధరలు పెంచి విక్రయిస్తున్నారు. అందినంత దోచుకుంటున్నారు. కాకి లెక్కలు.. జిల్లాలో 56 వేల హెక్టార్లలో వరి సాగవుతోంది. వీటిలో 30 శాతం ప్రకృతి విధానంలో సాగు చేస్తుండగా, మిగిలిన 70 శాతం పైరుకు సుమారు వెయ్యి టన్నుల వరకు యూరియా అవసరం. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ యూరియా అమ్మకాలను ప్రైవేట్ డీలర్లకు అప్పగించింది. వారు ఇప్పటివరకు సుమారు 400 టన్నులు విక్రయించినట్టు చెబుతున్నా.. రైతులకు అందింది తక్కువేనన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా అధిక ధరలకు విక్రయించారన్న ఆరోపణలు లేకపోలేదు. ● యూరియాను రైతు సేవా కేంద్రాల ద్వారా విక్రయించాలని రైతులు డిమాండ్ చేస్తున్నా కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అరకొరగా యూరియాను రెండు రోజుల నుంచి అందుబాటులో ఉంచారు. ప్రస్తుత పరిస్థితుల్లో సుమారు రెండు వేల ట న్నుల వరకు యూరియా అవసరం ఉంది. అయితే జిల్లాలోని 14 మండలాల పరిధిలో కేవలం 22 రైతు సేవా కేంద్రాలతోపాటు అరకులోయ, చింతపల్లి, రాజవొమ్మంగి, గంగవరం, వై.రామవరం, ఎటపాక మండలాల్లోని ఆరు ప్రైవేట్ డీలర్ల వద్ద 365 టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయి. ఇవి ఎటూ చాలకపోవడంతో గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. ● మండలానికి రెండు, మూడు రైతు సేవా కేంద్రాలకే యూరియా సరఫరాను పరిమితం చేయడంతో ప్రభుత్వం తీరు పట్ల మిగతా ప్రాంత రైతులు కుతకుతలాడుతున్నారు. అందుబాటులో లేక గిరి రైతుల ఇబ్బందులు ప్రకృతి వ్యవసాయం సాకుతో తగ్గించిన సరఫరా రైతు సేవా కేంద్రాల్లో అరకొరగా పంపిణీ మరోపక్క ప్రైవేట్ డీలర్ల దోపిడీ ఒడిశా నుంచి అధిక ధరలకు తెచ్చుకుంటున్న సరిహద్దు ప్రాంతాల రైతులు సగానికి పైగా కొరత జిల్లాలో వరి, ఉద్యానవన పంటలు సుమారు 3 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. వీటికి సుమారు 5,200 టన్నుల యూరియా అవసరం. ఇప్పటి వరకు ప్రభుత్వం డీలర్లు, వ్యవసాయ పరిపతి సంఘాలు, 16 రైతు సేవా కేంద్రాల ద్వారా కేవలం 2,664 టన్నుల యూరియా మాత్రమే పంపిణీ చేశారు. -
దాడి ఘటనపై ఏఎస్పీ విచారణ
ఎటపాక: మండలంలోని గౌరిదేవిపేట గ్రామంలో ఈనెల 6న జరిగిన దాడి ఘటనపై చింతూరు ఏఎస్పీ పంకజ్కుమార్ మీన సోమవారం గ్రామంలో పర్యటించి, విచారణ జరిపారు. గ్రామానికి చెందిన గవ్వల వెంకటేష్ తనపై అదే గ్రామానికి చెందిన సాయిబాబు దుర్బాషలాడి దాడి చేసి గాయపర్చారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటి కేసుగా నమోదు చేశారు. ఈ క్రమంలో ఏఎస్పీ బాధితుడితో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. అదే విధంగా దాడి సమయంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులను కూడా విచారించి వారి సాక్ష్యాలను నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏఎస్పీ వెంట సీఐ కన్నపరాజు, ఎస్ఐ అప్పలరాజు ఉన్నారు. -
గంజాయి స్వాధీనం– ఇద్దరు అరెస్టు
చింతపలి: ఏజెన్సీ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి తరలిస్తున్న రూ.6 లక్షలు విలువైన గంజాయితో పాటు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు ఎస్ఐ వీరబాబు తెలిపారు. ఎస్ఐ అందించిన వివరాలిలా ఉన్నాయి. సీఐ వినోద్బాబు అందించిన ముందస్తు సమాచారం మేరకు సోమవారం తెల్లవారుజామున కోరుకొండ– అన్నవరం జంక్షన్ సమీపంలో లోతుగెడ్డ వంతెన వద్ద వాహనాలు తనిఖీ చే సినట్లు తెలిపారు. ఈ క్రమంలో రోళ్లగెడ్డ గ్రామం నుంచి మైదాన ప్రాంతానికి సంచులతో తరలిస్తున్న 105 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.6 లక్షలు ఉంటుందన్నారు. గంజాయితో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్టె చేసి రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్టు ఎస్ఐ తెలిపారు. రైల్వేస్టేషన్లో గంజాయి స్వాధీనం తాటిచెట్లపాలెం: విశాఖపట్నం రైల్వే స్టేషన్లో అక్రమంగా తరలిస్తున్న 23 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రైల్వే స్టేషన్లోని సోమవారం తనిఖీల్లో హుగ్లీ కు చెందిన కుమార్రామ్, బిహార్కు చెందిన దిలీప్సింగ్ అదుపులోకి తీసుకుని, 23 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. -
పెండింగ్ నిర్మాణ పనులపై నివేదికలు
అధికారులకు కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశం సాక్షి, పాడేరు: పెండింగ్లో ఉన్న మార్కెటింగ్ శాఖ ఎంపీఎఫ్సీ గిడ్డంగుల నిర్మాణ పనులపై నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీవోలు, పలు శాఖల అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు 42 ఎంపీఎఫ్సీ గిడ్డంగులు మంజూరయ్యాయని, నేటికీ పూర్తికాని 16 భవనాల నిర్మాణ పురోగతి, త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన సదుపాయాలపై వెంటనే నివేదిక అందజేయాలన్నారు. ఈ సమావేశంలో పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీవోలు తిరుమణి శ్రీపూజ, స్మరణ్రాజ్, అపూర్వభరత్, డీసీవో ఎం.వి.రామకృష్ణరాజు, మార్కెటింగ్ శాఖ డీఈ, ఏఈఈలు పాల్గొన్నారు. -
ఐటీడీఏ పీవోగా శ్రీపూజ బాధ్యతల స్వీకరణ
పాడేరు: పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ నూతన ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీపూజ సోమవారం ఉదయం తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం దొంగపండి గ్రామానికి చెందిన శ్రీపూజ తన రెండో ప్రయత్నంలోనే సివిల్స్లో ఆలిండియా 62వ ర్యాంకు సాధించి, ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. ఇటీవల ఆమెను రాష్ట్ర ప్రభుత్వం పాడేరు ఐటీడీఏకు పూర్తి స్థాయి పీవోగా నియమించింది. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో పనిచేయడం, మన్యవాసులకు సేవ చేయడం తృప్తినిస్తుందన్నారు. గిరిజన ప్రాంత అభివృద్ధికి, గిరిజనుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతి కార్యక్రమం అర్హులకు అందేలా కృషి చేస్తానన్నారు. ఆమెకు ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, ఐటీడీఏ పరిపాలనాధికారి హేమలత, డీఆర్డీఏ పీడీ మురళి, పలువురు ఐటీడీఏ అధికారులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె కలెక్టర్ దినేష్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మోదకొండమ్మ తల్లికి పూజలు ఐటీడీఏ పీవోగా నియమితులైన శ్రీపూజ సోమవారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి పాడేరు శ్రీమోదకొండమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. పీవోను ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబు నాయుడు, ఆలయ కమిటీ ప్రతినిధులు డీపీ రాంబాబు, సతీష్, రామకృష్ణ, చంద్రమోహన్, ఈశ్వర్రావు, హరిబాబులు దుశ్శాలువాలతో సన్మానించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. -
రత్నంపేట వంతెన పై వరద నీటి ఉధృతి
ఐదు పంచాయతీలకు నిలిచిన రాకపోకలుకొయ్యూరు: పాడైన రత్నంపేట వంతెన నుంచి వరదనీరు ప్రవహించడంతో మండలంలోని ఐదు పంచాయతీలకు రాకపోకలు నిలిచిపోయాయి. సోమవారం కురిసిన వర్షానికి కాలువ ఉధృతంగా ప్రవహించింది. పాడి–రత్నంపేట మధ్య వంతెన పూర్తిగా పాడైంది. వంతెన శ్లాబ్ సగానికిపైగా పోయింది. దీంతో వరద నీటిని దాటుకుని రావడం కష్టంగా మారింది. తాజాగా సోమవారం కురిసిన వర్షానికి కాలువ ఉధృతంగా రావడంతో రెండు వైపుల రాకపోకలు ఆగాయి. వివిధ పనుల కోసం గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటకు బాలారం, కంఠారం, బకులూరు, ఆడాకుల పంచాయతీలకు చెందిన వారు వెళతారు. సోమవారం కృష్ణాదేవిపేట సంత కావడంతో ఎక్కువమంది వచ్చారు. తీరా మధ్యాహ్నానికి వరదనీరు పోటెత్తడంతో రాకపోకలు ఆగాయి. పాలకులు కనీసం పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నామని, వినతులు ఇచ్చినా స్పందన రావడం లేదన్నారు. -
అంగన్వాడీ కేంద్రం ప్రారంభం
అనంతగిరి (అరకులోయ టౌన్): నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. ఆయ న సోమవారం మండల కేంద్రంలో పర్యటించి అంగన్వాడీ భవనం ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి, రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనంతగిరి–1 అంగన్వాడీ కేంద్రం నిర్మాణానికి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ద్వారా నిధులు కేటాయించినప్పటికీ నిర్మాణాన్ని పూర్తి చేయకపోవడంతో ఎంపీపీ శెట్టి నీలవేణి ప్రత్యేక శ్రద్ధతో రూ.7.50 లక్షలు, జెడ్పీటీసీ దీసరి గంగరాజు రూ.2 లక్షల జెడ్పీ నిధులు కేటాయించి అంగన్వాడీ భవనం పూర్తి చేయడానికి చొరవ తీసుకోవడం అభినందనీయమన్నారు. హాస్టల్ కొత్త భవనం నిర్మించాలని వినతి జూనియర్ కాలేజీ విద్యార్థుల వసతి గృహం శిథిలావస్థకు చేరిందని వచ్చిన వార్తలకు స్పందించిన ఎమ్మె ల్యే కళాశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో తలదాచుకోలేని విధంగా మారిందని విద్యార్థులు ఆవేదన వ్య క్తం చేశారు. నూతన వసతి గృహ భవనం నిర్మించా లని ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించారు. తా త్కాలికంగా వేరే భవనంలో వస తి గృహం నిర్వహించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఆయన వెంట ఎంపీపీ శెట్టి నీలవేణి, జెడ్పీటీసీ దీసరి గంగరాజు, పార్టీ మండల అధ్యక్షుడు కొర్రా సూర్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ దూరు గంగన్న దొర, సర్పంచ్లు సోమల రూతు, సన్యాసిరావు పాల్గొన్నారు. -
ఫిషరీస్ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
నర్సీపట్నం: బి.ఆర్.ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రమేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. స్పాట్ కౌన్సెలింగ్ ఈనెల 11వ తేదీ వరకు జరుగుతుందన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారన్నారు. ఆసక్తిగల విద్యార్థులు మరిన్ని వివరాల కోసం 8247371907 ఫోన్ నంబర్ను సంప్రదించాలన్నారు. విద్యుత్ షాక్తోజూనియర్ లైన్మన్ మృతి ఎటపాక: విద్యుత్ లైన్లు సరిచేస్తుండగా షాక్కు గురై జూనియర్ లైన్మన్ మృతి చెందాడు. ఆదివారం వెంకటరెడ్డిపేట గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గుండాల గ్రామసచివాలయంలో ముర్రం నాగార్జున (35) జూనియర్ లైన్మన్గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం వెంకటరెడ్డిపేట గ్రామంలో రైస్ మిల్ వద్ద వేపచెట్టు కొమ్మ విరిగి పడటంతో విద్యుత్ వైర్లు దెబ్బతిన్నాయి. వీటిని సరిచేసేందుకు లైన్మన్ శంకర్ జూనియర్ లైన్మన్ నాగార్జున, మరో ఇద్దరు సిబ్బందిని తీసుకుని అక్కడకు వచ్చారు. ముందుగా వీధిలోని ఓ డీబీ నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆ తరువాత లైన్లను సరిచేస్తున్న క్రమంలో నాగార్జున పట్టుకున్న వైరుకు విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురై అపస్మారక స్థితికి చేరాడు. వెంటనే అతనిని ఆటోలో భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు అందుబాటు లో లేకపోవడంతో ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే నాగార్జున మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మండలంలోని బొజ్జిగుప్ప గ్రామానికి చెందిన మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పూర్తిస్థాయిలో సరఫరా నిలిపి వేయకపోవడమే వల్ల నిండు ప్రాణం బలికావడానికి కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. -
మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీ ప్రదర్శన
విశాఖ స్పోర్ట్స్ : మహిళల క్రికెట్ ప్రపంచకప్కు తొలిసారిగా ఆతిథ్యం ఇవ్వనున్న విశాఖలో ఆదివారం విజేతలకు అందించే ట్రోఫీని ప్రదర్శించారు. ప్రస్తుతం వైఎస్సార్ స్టేడియంలో జరుగుతున్న మహిళల క్రికెట్ లీగ్ సందర్భంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి సానా సతీష్ మాట్లాడుతూ భవిష్యత్తులో మిథాలీ రాజ్ మెంటార్గా వ్యవహరించే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ద్వారా గ్రామీణ పాఠశాల స్థాయి క్రీడాకారిణులకు అంతర్జాతీయ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ప్రపంచకప్లోని ఐదు మ్యాచ్లకు విశాఖ వేదిక కానుంది. -
బెర్రీ బోరర్ ఆశించిన కాఫీ తోటల పరిశీలన
అరకులోయ టౌన్ : మండలంలోని చినలబుడు పంచాయతీ పరిధిలో రైతులు సాగు చేస్తున్న కాఫీ తోటలను ఆదివారం ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పరిశీలించారు. గిరిరైతులతో కలిసి బెర్రీబోరర్ పురుగు ఆశించిన కాఫీ పిందెలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీలు ఆర్థిక ఎదుగుదలకు కాఫీ, మిరియం పంటలు ప్రధానమన్నారు. కాఫీ పండ్లకు బోర్రీబోరర్ పురుగు సోకడంతో గిరి రైతులు తీవ్ర నష్టపోతారన్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ప్రభుత్వం మద్దతు ధర కల్పించాలన్నారు. కాఫీ రైతులకు వైఎస్సార్సీసీ అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు స్వాభి రామ్మూర్తి, అరకు బూత్ కమిటీ ఇన్చార్జులు పాంగి విజయ్ కుమార్, బోయి కిరణ్ కుమార్, వైఎస్సార్సీపీ పంచాయతీ కమిటీ అధ్యక్షుడు లొక్కోయి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలనిఅరకు ఎమ్మెల్యే మత్స్యలింగం డిమాండ్ -
మద్యం మత్తులోయువకుడి హల్చల్
● సెల్ టవర్ ఎక్కి హంగామా పాడేరు : మద్యం మత్తులో ఓ గిరిజన యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. చివరగా పోలీసులు రంగ ప్రవేశం చేసి నచ్చజెప్పడంతో కిందకు దిగాడు. మండలంలోని మినుములూరు గ్రామానికి చెందిన ఎల్. కిరణ్ అనే యువకుడు పూటుగా మద్యం సేవించి ఆదివారం మధ్యాహ్నం గ్రామంలోని ఓ సెల్ టవర్ ఎక్కాడు. తాను ఇష్టపడిన ఓ మహిళ దూరం పెట్టడంతో నిరాశకు లోనయ్యానని, వెంటనే ఆమె తనతో మాట్లాడాలని భీష్మించి కూర్చున్నాడు. దీంతో గ్రామస్తులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన వారు అగ్నిమాపక శకటంతో అక్కడికి చేరుకున్నారు. ఆ యువకుడికి నచ్చజెప్పారు. ఇంతలో వర్షం కురుస్తుండటంతో యువకుడు సెల్ టవర్ నుంచి దిగిపోయాడు. అతడికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ చేసి ఇంటికి పంపించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
కేజీహెచ్కు జబ్బు
మహారాణిపేట: ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్ సమస్యలకు నిలయంగా మారింది. వ్యాధి నయం చేసుకుందామని వచ్చే రోగులు.. ఇక్కడి అస్తవ్యస్త పరిస్థితులతో మరింత అనారోగ్యానికి గురవుతున్నారు. ఓపీ టికెట్ కోసం నిరీక్షణతో మొదలయ్యే ఈ నరకం.. వార్డులో చేరిన తర్వాత కూడా కొనసాగుతూనే ఉంది. పెరిగిన రోగుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు పెంచకపోగా.. ఉన్నవి కూడా కనీస స్థాయిలో లేకపోవడంతో పేదలకు వైద్యం అందని ద్రాక్షలా మారింది. ఓపీ నుంచి వార్డు వరకు అవస్థలే ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాల నుంచి రోగులు ఇక్కడికి వస్తుంటారు. ప్రతిరోజూ 1,500 నుంచి 2,200 మంది వరకు ఓపీ నమోదవుతోంది. 300 నుంచి 600 మంది ఇన్–పేషెంట్లుగా చేరుతుంటారు. అయితే 1,187 పడకలున్న ఈ ఆస్పత్రిలో రోగుల ప్రవేశం నుంచే కష్టాలు మొదలవుతాయి. ఓపీ టికెట్టు కోసం గంటలకొద్దీ క్యూలో నిలబడాలి. ఆ తర్వాత వైద్యుడిని కలవడానికి మరో గంటకు పైగా నిరీక్షించక తప్పదు. క్యాజువాలిటీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి, చిన్నపిల్లల వార్డులతో సహా ప్రతి విభాగంలోనూ రోగుల బారులు తీరిన దృశ్యాలు సర్వసాధారణం. వైద్యుల కొరత ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. మందుల కొరతతో మరో గండం గతంలో 30 రోజులకు సరిపడా మందులు ఇచ్చే చోట.. నేడు కేవలం వారానికి సరిపడా మందులతోనే సరిపెడుతున్నారు. దీంతో రోగులు ప్రతి వారం మందుల కోసం గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సి వస్తోంది. ఫార్మసీ కౌంటర్లలో మొత్తం 600 రకాల మందులు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 500 రకాలే అందుబాటులో ఉన్నాయి. వైద్యులు రాసిన చీటీలో ఆరు మందులుంటే.. మూడు మాత్రమే ఇచ్చి మిగతావి బయట కొనుక్కోవాలని సిబ్బంది చెబుతున్నారు. ఉచిత వైద్యం కోసం వచ్చే పేదలకు ఇది పెను భారంగా మారింది. కొరవడిన పర్యవేక్షణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆస్పత్రిలో పర్యవేక్షణ పూర్తిగా లోపించిందని, వైద్య సేవలు క్షీణించాయని రోగులు ఆరోపిస్తున్నారు. గతంలో అందిన స్థాయిలో కూడా ఇప్పుడు సేవలు అందడం లేదని, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దుస్థితి దాపురించిందని వాపోతున్నారు. ప్రజారోగ్యానికి భరోసా ఇవ్వాల్సిన ఆస్పత్రే ఇలా రోగగ్రస్తంగా మారడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కేజీహెచ్లో ప్రస్తుతం ఉన్న సమస్యలను పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరుగుదొడ్లలో ట్యాప్లు లేని కుళాయిలు, తలుపుల్లేని మరుగుదొడ్లు పారిశుధ్యం అస్తవ్యస్తం ఆస్పత్రిలోని చాలా వార్డులు అపరిశుభ్రతకు అడ్డాగా మారాయి. ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోయిన చెత్తతో దుర్గంధం వెదజల్లుతోంది. ఇక మరుగుదొడ్ల పరిస్థితి మరింత అధ్వానం. చాలా కుళాయిలకు ట్యాప్లు లేకపోవడంతో నీరు నిరంతరం వృధాగా పోతోంది. దీంతో రోగులు, వారి సహాయకులు వాటర్ బాటిళ్లతో వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. కొన్నిచోట్ల రోగులు కుక్కలతో కలిసి ఉండాల్సిన దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. పర్యవేక్షణ లోపం కారణంగా పారిశుధ్య వ్యవస్థ పూర్తిగా పడకేసింది. పనిచేయని పరికరాలు కేజీహెచ్లో వైద్య పరికరాల లభ్యత కూడా పెద్ద సమస్యగా మారింది. రోగులను ల్యాబ్కు, సీటీ స్కాన్, ఎక్స్రే వంటి పరీక్షలకు తీసుకెళ్లడానికి వీల్చైర్లు, స్ట్రెచర్లు అందుబాటులో ఉండటం లేదు. దీంతో రోగుల బంధువులే వారిని మోసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఆస్పత్రిలోని 217 ఏసీలకు గాను 90 మరమ్మతులకు గురయ్యాయి. కీలకమైన ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ (ఏబీజీ) పరీక్షలకు అవసరమైన రీజెంట్స్ లిక్విడ్ లేకపోవడంతో గత కొద్ది రోజులుగా 16 మిషన్లు మూలనపడ్డాయి. దీంతో కిడ్నీ, ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 26 కిపైగా విభాగాలున్నాయి. పెరుగుతున్న రోగులు సంఖ్యకు అనుగుణంగా వార్డులు, పడకల సంఖ్య పెంచాల్సి ఉండగా ఆ దిశగా ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. -
విశాఖ జూలో కూనల కనువిందు
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో వన్యప్రాణుల సంతానోత్పత్తి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మూడు నెలల కిందట పలు జంతువులు, పక్షులు పిల్లలకు జన్మనివ్వగా, తాజాగా మరికొన్ని వన్యప్రాణులకు పిల్లలు పుట్టాయి. ఇటీవల జూలో రెండు చౌసింగాలు (ఒక మగ, ఒక ఆడ), ఒక మగ కృష్ణ జింక పిల్ల, రెండు బ్లూ గోల్డ్ మకావ్ పక్షులు జన్మించాయని జూ క్యూరేటర్ జి. మంగమ్మ ఆదివారం తెలిపారు. తల్లీపిల్లలు అన్నీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం చౌసింగా, కృష్ణ జింక పిల్లలు వాటి ఎన్క్లోజర్లలో తల్లుల చెంత ఉత్సాహంగా ఆడుకుంటూ సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. -
మారని తలరాత
హామీల మోత..చట్రాపల్లిలో ప్రకృతి విధ్వంసానికి నేటికి ఏడాది● దయనీయ స్థితిలో బాధిత కుటుంబాలు ● నోచుకోని మోడల్ కాలనీ నిర్మాణం, ప్రత్యామ్నాయ భూముల కేటాయింపు ● సర్వేలతో సరిపెడుతున్న కూటమి ప్రభుత్వం ● తోకరాయి, కమ్మరితోట బాధితుల్లో నిరాశ సీలేరు: గతేడాది ఇదేరోజు వరద బీభత్సంలో ఇళ్లు కొట్టుకుపోయి కట్టుబట్టలతో మిగిలిన చట్రాపల్లి బాధిత గిరిజనులకు ప్రభుత్వ సాయం హామీలకు పరిమితమైంది. ఇప్పటికీ ఆరోజు తలచుకుంటే వారి వెన్నులో వణుకు పుడుతోంది. మన్యంలో ఎన్నడూ లేని విధంగా వచ్చిన భారీ ప్రళయం చట్రాపల్లితోపాటు తోకరాయి ,కమ్మరితోట గిరిజన గ్రామాలకు తీవ్ర నష్టం మిగిల్చింది. రెక్కల కష్టంతో కట్టుకున్న ఇళ్లు, పెంచుకున్న ఆవులు, మేకలు, విలువైన భూములు తుడుచు పెట్టుకుపోయాయి. వరద బీభత్సం వయనాడ్ తరహా విలయాన్ని తలపించింది. మళ్లీ అలాంటి ప్రళయం సంభవిస్తే మా పరిస్థితి ఏంటని ఆయా గ్రామాల గిరిజనులు వాపోతున్నారు. విరుచుకు పడటంతో.. భారీ తుపాను కారణంగా గత ఏడాది సెప్టెంబరు 8వ తేదీ అర్ధరాత్రి సంభవించిన వరద ప్రళయానికి చట్రాపల్లి గ్రామంలో ఇళ్లపై కొండచరియలు విరిగి పడ్డాయి. ఒకే కుటుంబానికి చెందిన కొర్రా కుమారి మృతి చెందగా సుమిత్ర, సుబ్బారావు, పండన్న కాళ్లు చేతులు విరిగిపోయాయి. అప్పటిలో మృతురాలి కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా అందజేసింది. బాధితులకు ఇళ్లు నిర్మించి, భూమి కేటాయించి పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించలేదు. పడిపోయిన ఇళ్లలోనే ఉంటూ బాధిత కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ● వరద బీభత్సానికి నిరాశ్రయులైన బాధితులు చట్రాపల్లిలో 37, ధారకొండ పంచాయతీ తోకరాయిలో 62 మంది ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీరికి ఇళ్లు నిర్మిస్తామని ఇచ్చిన హామీ స్థల పరిశీలనకు పరిమితమైంది. కమ్మరితోటలో పంట భూముల్లో ఇసుక, మట్టి మేటలు వేయడంతో సాగుకు అవకాశం లేకుండా పోయింది. పేరుకుపోయిన మట్టిని తొలగిస్తామని ఇచ్చిన హామీ కూడా నెరవేర్చక గ్రామ గిరిజనులే మట్టిని తొలగించుకున్నారు. ● బీభత్సం సృష్టించిన వరద మండలాన్ని సర్వనాశనం చేసింది. మండల కేంద్రం నుంచి సీలేరు సమీప వలసగెడ్డ వరకు రోడ్లపై కొండచరియలు విరిగిపడటంతో చెట్లు కూలి వంతెనలు కొట్టుకుపోయాయి. దీంతోపాటు అంతర రాష్ట్ర రహదారిలో 45 రోజులపాటు రాకపోకలు నిలిచిపోయాయి. పరిశీలనకు వచ్చిన రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పునరావాసంతో పాటు సీలేరు రోడ్డును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ అదే గోతుల రహదారిలో ప్రయాణాలు సాగుతున్నాయి. సర్వేలతో ఏడాది.. ● చట్రాపల్లి, తోకరాయి గ్రామాల్లో వరదకు పాడైన ఇళ్లకు బదులుగా మోడల్ కాలనీలు నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఏడాది అయినా అమలుకు నోచుకోలేదు. జిల్లా అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించినా ఏమాత్రం కదలిక లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ● కొండచరియల బీభత్సానికి సాగు భూముల్లో ఇసుక, మట్టి దిబ్బలు పేరుకుపోయాయి. వ్యవసాయానికి పనికిరాకుండా పోయాయి. సర్వే చేసిన అధికారులు పంటనష్టం మాత్రమే అరకొరగా ఇచ్చారు. ప్రత్యామ్నాయంగా భూములిస్తామన్న హామీ నెరవేరలేదు.అర్ధరాత్రి సమయంలో సంభవించిన ఊహించని ఉత్పాతానికి అతలాకుతలమైన గూడెంకొత్తవీధి మండలం గాలికొండ పంచాయతీ చట్రాపల్లిలో పరిస్థితులు ఈ ఘటన జరిగి ఏడాది అవుతున్నా మెరుగుపడలేదు. కొండచరియలు విరిగి పడటంతో చట్రాపల్లి, తోకరాయిలో ఇళ్లకు నష్టం వాటిల్లింది. ఆయా గ్రామాలతోపాటు కమ్మరితోటలో సాగు భూములు ధ్వంస మయ్యాయి. మోడల్ కాలనీ నిర్మిస్తామమని, దెబ్బతిన్న పంట భూములకు ప్రత్యామ్నాయంగా భూములు కేటాయిస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. కలెక్టర్కు నివేదించాం గతేడాది సంభవించిన వరద బీభత్సానికి చట్రాపల్లిలో 37, తోకరాయిలో 62 కుటుంబాలకు ఇళ్లు నిర్మించేందుకు కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశాల మేరకు స్థల పరిశీలన చేశాం. వరద ధాటికి కొన్ని ఇళ్లు కూలిపోయాయి. మరికొన్నింటిని మట్టి దిబ్బలు కప్పేశాయి. మళ్లీ ఆ గ్రామాలకు వరద వచ్చే అవకాశాలు ఉన్నందున వాటిని పూర్తిగా ఖాళీ చేయించి వేరేచోట మోడల్ కాలనీ తరహాలో నిర్మాణానికి భూమిని పరిశీలించి కలెక్టర్కు నివేదించాం. త్వరలో ఇళ్ల నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకుంటాం. –అన్నాజీరావు, తహసీల్దార్, గూడెంకొత్తవీధి నిలదీసినా స్పందించలేదు గత ఏడాది తుపానుకు కొట్టుకుపోయిన గ్రామాలకు ఇప్పటివరకు ప్రభు త్వం ఏ హామీని నెరవేర్చలేదు. ఇళ్లు కట్టిస్తామని సర్వే చేస్తున్నారు తప్ప న్యాయం జరగడం లేదు. పాడేరులో ఇటీవల జరిగిన పాలక మండలి సమావేశంలో నిలదీసినా అధికారులు స్పందించలేదు. – విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్యే, పాడేరుప్రత్యామ్నాయం చూపించాలి మూడు గ్రామాల్లో పంట భూములు నాశనమ య్యాయి. ఇప్పటివరకు అధికారులు ప్రత్యామ్నాయంగా భూమిని కల్పించలేదు. ఒక పక్క ఇళ్లు లేక మరోపక్క ఆర్థికంగా నష్టం జరిగింది. అయినా ప్రభుత్వం, అధికారుల నుంచి స్పందన కరువైంది. – రాజు, సర్పంచ్, ధారకొండ -
యూరియా కొరతపై పోరాటం
● రైతుల పక్షాన వైఎస్సార్సీపీ ● ఈనెల 9న నిరసన ర్యాలీ ● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ● విజయవంతం చేయాలని పిలుపు అరకులోయ టౌన్: యూరియా కొరతపై వైఎస్సార్సీపీ రైతుల పక్షాన పోరాడుతుందని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో అన్నదాత పోరు పోస్టర్ను ఆయన పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం యూరియా పంపిణీ చేయకపోవడంతో రైతులు బ్లాక్ మార్కెట్లో బస్తా రూ.200 నుంచి రూ.300 వరకు అధిక ధర వెచ్చించి కొనుగోలు చేసి ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. దీనిపై అన్నదాత పోరు పేరిట రైతులతో కలిసి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈనెల 9న కలెక్టరేట్, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల వద్ద నిరసన తెలిపి వినతిపత్రం ఇస్తామన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలలు గడుస్తున్నా కూటమి ప్రభుత్వం రైతులకు యూరియా, డీఏపీ తదితర ఎరువులు సరఫరా చేయడంలో విఫలమైందన్నారు. దీంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్రెడ్డి రైతులకు ఆర్బీకేల ద్వారా సకాలంలో ఎరువులు పంపిణీ చేశారన్నారు. కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు సక్రమంగా అందించడం లేదన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి రైతులకు యూరియా ఇతర ఎరువులు రాయితీపై పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం రైతాంగానికి చేసిన మోసాన్ని ప్రజలకు వివరించేందుకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి అధికారులకు సబ్ కలెక్టర్, కలెక్టర్కు వినతి పత్రాలు ఇస్తామన్నారు. రైతులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున విచ్చేసి విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శెట్టి రోషిణి, వైస్ ఎంపీపీ కిల్లో రామన్న, పార్టీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈనెల 9వ తేదీ మంగళవారం అధ్యక్షుడు స్వాభి రామూర్తి, మండల ఉపాధ్యక్షుడు పల్టాసింగి విజయ్ కుమార్, గుడివాడ ప్రకాష్, ఉమ్మడి విశాఖ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, మండల కార్యదర్శి సోనియా, పార్టీ నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు గెడ్గం నర్సింగరావు పాల్గొన్నారు. -
సింహాచలంపై మెట్లమార్గం పునరుద్ధరణ పనులు ప్రారంభం
సింహాచలం: గత చందనోత్సవం రోజున గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన ప్రదేశంలో సింహాచలం దేవస్థానం అధికారులు మెట్లమార్గం పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ప్రసాద్ పథకం పనుల్లో భాగంగా నిర్మించిన గోడ కూలి ప్రమాదం జరగడంతో అప్పటి నుండి ఈ మెట్ల మార్గాన్ని మూసివేశారు. గతంలో ఉన్న ప్రణాళికకు విరుద్ధంగా మెట్ల మార్గాన్ని నిర్మించడంతోనే ప్రమాదం జరిగిందని వైదిక వర్గాలు అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 2న జరగనున్న విజయదశమి ఉత్సవంలో భాగంగా స్వామివారిని పల్లకిలో కొండ దిగువకు తీసుకెళ్లేందుకు వీలుగా ఈ మెట్ల నిర్మాణం అత్యవసరమని అధికారులు భావించారు. పర్యాటక శాఖ నుంచి స్పందన లేకపోవడంతో, దేవస్థానం సొంతంగా రూ.18 లక్షల వ్యయంతో పనులకు టెండర్ పిలిచి, గడిచిన రెండు రోజుల క్రితం పనులను ప్రారంభించారు. ప్రమాదం జరిగిన చోట గతంలో ఉన్న విధంగానే పకడ్బందీగా మెట్ల మార్గాన్ని నిర్మించి, విజయదశమి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని దేవస్థానం అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. -
సందడిగా సండేస్ ఆన్ సైకిల్స్
తాటిచెట్లపాలెం: ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా, ఈస్ట్కోస్ట్రైల్వేలోని వాల్తేర్ డివిజన్లో ‘సండేస్ ఆన్ సైకిల్స్’ అనే కొత్త కార్యక్రమాన్ని డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్బోహ్రా ప్రారంభించారు. ప్రతిరోజూ అరగంట వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ సందర్భంగా డీఆర్ఎం, రైల్వే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు డీఆర్ఎం నివాసం నుంచి డివిజన్ కార్యాలయం వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముందు, ఈస్ట్కోస్ట్రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు జ్యోత్స్నా బోహ్రా ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం జరిగింది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయని డీఆర్ఎం తెలిపారు. యోగా, జుంబా, స్కిప్పింగ్ రోప్ వంటి కార్యక్రమాలను కూడా ఇందులో భాగం చేశారు. స్పోర్ట్స్ ఆఫీసర్ యం. హరనాథ్ , జనరల్ సెక్రటరీ ఎన్. ఉష ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. -
అధికలోడుతో వెళ్తున్న టిప్పర్లు పట్టివేత
రూ.1.82 లక్షలు జరిమానా విధింపునక్కపల్లి: నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడు వేయడమే కాకుండా టోల్ఫీజును ఎగ్గొట్టేందుకు దొడ్డిదారిలో వెళ్తున్న టిప్పర్లపై ఆదివారం పోలీసులు దాడులు చేశారు. మూడు టిప్పర్లను పట్టుకుని రవాణా శాఖ అధికారులకు అప్పగించడంతో వారు ఈ మూడు లారీలకు భారీగా జరిమానా విధించారు. వివరాల్లోకి వెళ్తే పరవాడ నుంచి కాకినాడ, రాజమండ్రి నుంచి రాంబిల్లి వైపు పెద్ద పెద్ద బండరాళ్లు, ఫైయాష్, ఇసుక లోడుతో ఇటీవల కాలంలో నిత్యం వందల సంఖ్యలో టిప్పర్లు తిరుగుతున్నాయి. ఒక్కో టిప్పర్లో నిబంధనల ప్రకారం 40 టన్నులకు మించి లోడు వేయరాదు. కానీ ఈ ట్రిప్పర్లు 60 నుంచి 70 టన్నుల బరువుతో రాకపోకలు సాగిస్తున్నాయి. వేంపాడు టోల్ప్లాజా వద్ద వీటి బరువు పరిశీలించి అధిక ఫీజు వసూలు చేస్తున్నారు. టిప్పర్ యజమానులు టోల్ఫీజును ఎగ్గొట్లేందుకు దొడ్డిదారిని ఎంచుకున్నారు. నక్కపల్లి, ఉపమాక, చందనాడ, అమలాపురం మీదుగా వేంపాడు జాతీయ రహదారిని చేరుకుని అక్కడ నుంచి తమ గమ్యస్థానాలకు వెళ్తున్నాయి. రాజమండ్రి వైపు నుంచే వెళ్లే వాహనాలు కూడా వేంపాడు, అమలాపురం, చందనాడ, నర్సాపురం, ఉపమాక మీదుగా నక్కపల్లి చేరుకుని రాంబిల్లి వెళ్తున్నాయి. ఆదివారం ఉదయం మూడు టిప్పర్లు అధిక లోడుతో ఉపమాక మీదుగా వేంపాడు వెళ్తుండగా సీఐ కుమార స్వామి, ఎస్ఐ సన్నిబాబు దాడులు చేసి ఉపమాక వద్ద టిప్పర్లను పట్టుకున్నారు. పరిమితికి మించి లోడు వేసినట్టు గుర్తించి కేసులు నమోదు చేశారు. తదుపరి చర్యల నిమిత్తం నర్సీపట్నం ఎంవీఐకి పంపించగా మూడు లారీల్లో ఒకదానికి రూ.52 వేలు, రెండోదానికి రూ.58 వేలు, మూడో టిప్పర్కు రూ.72వేలు వెరసి మూడు టిప్పర్లకు రూ.1.82 లక్షలు పెనాల్టీ విధించినట్టు సిఐ కుమారస్వామి తెలిపారు. -
గ్రామాల్లో జ్వరాలతో సతమతం
● మోకాళ్లనొప్పులతో బాధపడుతున్న గిరిజనం ● పెరుగుతున్న బాధితుల సంఖ్య ● పట్టించుకోని అధికారులు రాజవొమ్మంగి: మండలంలోని లాగరాయి పీహెచ్సీ పరిధిలోని లాగరాయి, లబ్బర్తి, కిండ్ర గ్రామాల్లో పలువురు జ్వరాలు. మోకాళ్లనొప్పులతో బాధపడుతున్నారు. నెల రోజులుగా ఈ సమస్యతో పీహెచ్సీకు వచ్చే వారి సంఖ్య పెరగడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఈ తరహాలో ఎప్పుడూ తాము అనారోగ్యం పాలు కాలేదని పలువురు రోగులు చెబుతున్నారు. పీహెచ్సీలో ట్యాబ్లెట్స్ మాత్రమే ఇస్తున్నారని, ఇందుకు సంబంధించి వైద్యులు రక్త పరీక్షలకు కూడా సిఫార్సు చేయడం లేదని చెబుతున్నారు. అధికారులు ఈ అంశంపై దృష్టి సారించి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి సరైన వైద్యం అందజేయాలని కోరుతున్నారు. ఆదివారం పీహెచ్సీకు 25 మంది జ్వరపీడితులు జ్వరాల సమస్య లాగరాయి, కిండ్ర గ్రామాల్లో అధికంగా ఉంది. ఇంటికీ ఒకరు ఇద్దరు జ్వరాలతో బాధపడుతున్నారు. ఆదివారం లాగరాయి పీహెచ్సీకు 25 మంది జ్వరాలతో చికిత్స కోసం రావడం గమనార్హం. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి రాజవొమ్మంగి మండలం లాగరాయి పీహెచ్సీ పరిధిలో జ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. ఈ సమస్యను ఇటీవల మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు దృష్టికి తీసుకొని వెళ్లాం. ఆయన సంభందిత అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి, తక్షణ వైద్య సేవలందించాలి. – గోము వెంకటలక్ష్మి, ఎంపీపీ, రాజవొమ్మంగి -
జైలు అధికారుల నిర్లక్ష్యం వల్లే..
అనకాపల్లి టౌన్: చోడవరం సబ్ జైలులో డ్యూటీలో ఉన్న అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రిమాండ్ ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నారని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలు.. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం టోకూరు పంచాయతీ కార్యదర్శి నక్కా రవికుమార్ (30), అనకాపల్లి జిల్లా మాడుగులలో ఓ చోరీ కేసులో నిందితుడైన బెజవాడ రాము (26) చోడవరం సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. రవికుమార్, రాములకు బెయిల్ మంజూరైనప్పటికీ జామీను దొరకకపోవడం వల్ల జైలు నుంచి విడుదల కాలేదు. వీరిద్దరూ శారదా బ్యారక్లో ఉన్న మరో ఖైదీ ఏక స్వామితో సన్నిహితంగా మెలిగేవారు. ఆయన గతంలో హత్యాయత్నం తదితర కేసులలో నిందితుడు. ‘మీకు ఎప్పటికీ జామీను దొరకదు, పది సంవత్సరాల జైలు శిక్ష తప్పద’ని భయపెట్టి జైలు నుంచి తప్పించుకోవాలని ప్రేరేపించాడు. జైలు సిబ్బంది వయసు మీరినవారని, అనారోగ్యంతో బాధపడుతున్నారని, వారిలో కేవలం కానిస్టేబుల్ నానాజీ మాత్రమే అప్రమత్తంగా ఉంటాడని చెప్పి, నానాజీ లేని సమయంలో తప్పించుకోవాలని సూచించాడు. హెడ్ వార్డర్ వీర్రాజు రికార్డులు రాయడంలో, వంటగది పనుల్లో రవికుమార్ను ఉపయోగించుకునేవారు. బ్యారక్ గేటు తాళం వేయకుండా ఆయన నిర్లక్ష్యంగా ఉండడం నిందితులు గమనించారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వంటగదిలో ఇనుప సుత్తిని తీసుకొని, శుక్రవారం హెడ్ వార్డర్ వీర్రాజుపై దాడి చేశారు. ఇతర సిబ్బందిని గార్డు గదిలో బంధించి ఏఎస్ఐ కృష్ణమూర్తి దగ్గర ఉన్న ప్రధాన గేటు తాళాలు లాక్కొని తప్పించుకున్నారు. వీరు కొత్తూరు జంక్షన్, శివాలయం ఆర్చ్, పీఎస్ పేట మార్గంలో వెళ్లి బస్సులో విశాఖ చేరుకున్నారు. పోలీసులకు దొరక్కుండా మరింత దూరం పారిపోవాలని పథకం వేసుకున్నారు. అందుకు అవసరమైన సొమ్ము సంపాదించడానికి దొంగతనం చేయాలనుకున్నారు. రిమాండ్ ఖైదీలు తప్పించుకున్న వెంటనే అప్రమత్తమైన పోలీసు అధికారులు లుకౌట్ నోటీసులు జారీ చేసి వాట్సప్ గ్రూప్లు, పత్రికల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. సీసీ ఫుటేజి సహాయంతో వారు విశాఖపట్నం వచ్చినట్లు గుర్తించారు. విశాఖ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్లు, అనకాపల్లి జిల్లా పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి విస్తృతంగా గాలించి, శనివారం రామ్నగర్ గొల్లలపాలెం ఎస్బీఐ బ్యాంక్ సమీపంలో ఖైదీలు రవికుమార్, రాములను పట్టుకున్నారు. జామీను భారం తగ్గించమని న్యాయస్థానాన్ని కోరేందుకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సహాయం కోసం తాను పెట్టుకున్న అర్జీని హెడ్ వార్డర్ వీర్రాజు తొక్కి పెట్టారని, ఆ కోపంతో తాను ఆయనపై సుత్తితో దాడి చేశానని నిందితుడు రవికుమార్ వెల్లడించినట్టు ఎస్పీ చెప్పారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎం.శ్రావణి, చోడవరం ఎస్ఐ బి.కార్తీక్, జిల్లా సబ్ జైల్ ఇన్చార్జ్ ఆఫీసర్ డి.రాజు, తదితరులు పాల్గొన్నారు. -
సంఘటిత పోరాటాలకు కార్మికులంతా సిద్ధం కావాలి
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావుచోడవరం: సంఘటిత పోరాటాలకు కార్మికులంతా సిద్ధంగా ఉండాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.వి. నాగేశ్వరరావు పిలుపిచ్చారు. సెంట్రల్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సిఐటియూ)13వ జిల్లా మహాసభలు చోడవరంలో రెండ్రోజులుగా జరుగుతున్నాయి. ఈ మహాసభలు ఆదివారం ముగిశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల చట్టాలపై అనుసరిస్తున్న వైఖరి, కార్మికుల ఉద్యమాలపై ఈ సభల్లో చర్చించారు. ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్మిక వర్గాలపై తీవ్ర దాడులకు పాల్పడుతున్నాయని, దీనిని అంతా తిప్పి కొట్టాలన్నారు. భవిష్యత్ ఉద్యమాలు మరింత తీవ్ర తరం చేయాలన్నారు. ఇప్పటికే పనిగంటలు పెంచుతూ కేంద్ర కేబినేట్ నిర్ణయం తీసుకోవడం, కాంట్రాక్టు కార్మికులను అప్కాస్ రద్దు చేసి ఏజెన్సీలకు అప్పగించాలని నిర్ణయం తీసుకోవడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికులపై దాడిని ఎక్కుపెట్టిందన్నారు. అనకాపల్లి జిల్లాలో పారిశ్రామిక కార్మికుల సమస్యలపై మరింత ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఫార్మా, ఎస్ఈజెడ్లలో కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేవని ప్రమాదాల నివారణలకు యజమాన్యాలు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లాలో కార్మికులకు అండగా సీఐటీయూ ఎప్పుడూ నిలుస్తుందన్నారు. స్టీల్ప్లాంట్ ఉద్యమానికి సీఐటీయూ తన వంతు భాగస్వామ్యం అందించిందన్నారు. భవిష్యత్ పోరాటాలకు కార్మికులంతా సిద్ధంగా ఉండాలని ఈ మహాజనసభలో తీర్మానించారు. 28 తీర్మానాలతో కార్యదర్శి నివేదికను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కార్యక్రమంలో సీఐటీయు నాయకులు లోకనాథం, జి. కోటేశ్వరరావు, ఆర్. శంకరరావు, వి.వి.శ్రీనివాసరావు, ఎ.రాజు, గూనూరు వరలక్ష్మి, ఎస్.వి.నాయుడు, గనిశెట్టి సత్యనారాయణ, ప్రేమ చంద్రశేఖర్, పాల్గొన్నారు. -
సంపత్ వినాయగర్హుండీ ఆదాయం లెక్కింపు
మహారాణిపేట: ఆశీలమెట్టలోని శ్రీ సంపత్ వినాయగర్ దేవాలయంలో వినాయక ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన హుండీ ఆదాయం లెక్కింపులో 12 రోజుల్లో రూ. 14,55,243 ఆదాయం లభించింది. ఈ లెక్కింపులో 5 గ్రాముల బంగారం, 101 గ్రాముల వెండి వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి, జిల్లా సహాయ కమిషనర్ డి.వి.వి. ప్రసాద్ తెలిపారు. అంతేకాకుండా విదేశీ కరెన్సీలైన 21 అమెరికా డాలర్లు, 4 ఒమాన్ రియల్స్, 10 కెనడా డాలర్లు, 10 యూరోలు, 10 ఇంగ్లాండ్ పౌండ్లు కూడా లభించాయి. లెక్కింపు కార్యక్రమంలో జగన్నాథ స్వామి ఆలయ ఈవో రాజగోపాల్ రెడ్డి పర్యవేక్షించగా, వేంకటేశ్వర సేవా సంఘం సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. లభించిన ఆదాయాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆశీలమెట్ట బ్రాంచ్కు అందజేశారు. -
వైద్య విద్య ప్రైవేటీకరణపై ‘విదసం’ నిరసన
సీతంపేట: ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలోకి మార్చడం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను వైద్య విద్యకు దూరం చేయడమేనని విస్తృత దళిత సంఘాల ఐక్య వేదిక (విదసం) కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం అంబేడ్కర్ భవన్లో విదసం సభ్యులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటరావు మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మెడికల్ సీట్ల రిజర్వేషన్లో 50 శాతం కోత పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన 2,400 సీట్లలో కేవలం 1,200 సీట్లు మాత్రమే కన్వీనర్ కోటా కింద ఉంటాయని, మిగిలిన సీట్లను ప్రైవేట్ యాజమాన్యాలు కోట్లకు అమ్ముకునే అవకాశం కల్పించారని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు అంతకంటే ప్రమాదకరమైన పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి మొత్తం 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం దారుణమని ఆయన ప్రశ్నించారు. ఈ విధానం వల్ల తెల్ల రేషన్ కార్డులు లేని పేద విద్యార్థులు కన్వీనర్ కోటాలో సీటు పొందినా ఏటా రూ.12 నుంచి రూ.15 లక్షలు చెల్లించాల్సి వస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఈ పీపీపీ విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. కార్యక్రమంలో విదసం ప్రతినిధులు జాజి ఓంకార్, సోడదాసి సుధాకర్, బూల భాస్కరరావు, గుడివాడ ప్రసాద్, మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘కమిటీ కుర్రాడి’కి సైమా అవార్డు
కొమ్మాది: నగరంలోని మాధవధారకు చెందిన యువ నటుడు పేడాడ సందీప్ సరోజ్ అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవాన్ని పొందాడు. దుబాయ్లో అట్టహాసంగా జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా–2025) వేడుకలో.. ‘కమిటీ కుర్రోళ్లు’చిత్రంలో కనబరిచిన అద్భుత నటనకు గానూ బెస్ట్ డెబ్యూ హీరో పురస్కారాన్ని అందుకున్నాడు. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ‘కమిటీ కుర్రోళ్లు’చిత్రం కమర్షియల్గా విజయం సాధించడంతో పాటు, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ చిత్రంలో తన సహజమైన నటనతో సందీప్ ప్రేక్షకుల మన్ననలు పొందారు. ప్రతిష్టాత్మక సైమా అవార్డుల వేడుకలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమల నుంచి ప్రముఖులు పాల్గొనగా, వారి సమక్షంలో సందీప్ ఈ అవార్డును స్వీకరించడం విశేషం. ఈ పురస్కారంపై సందీప్ సరోజ్ స్పందిస్తూ.. ‘తొలి సినిమాకే ఇంత పెద్ద గౌరవం దక్కడం నా బాధ్యతను మరింత పెంచింది. ఈ విజయం నా ఒక్కడిది కాదు. నాతో పాటు కష్టపడిన 11 మంది కుర్రాళ్లు, చిత్ర దర్శకుడు వంశీ, నిర్మాత నిహారిక, సాంకేతిక నిపుణులందరి కృషి ఫలితం ఇది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు’అని అన్నారు. సందీప్కు అవార్డు రావడం పట్ల అతని తల్లిదండ్రులు, వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, నర్సింగరావు ఆనందం వ్యక్తం చేశారు. తమ కుమారుడు సినీ రంగంలో తొలి అడుగులోనే విజయం సాధించడం గర్వంగా ఉందన్నారు. -
కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లో తీసుకువెళ్లాలి
● ‘బాబు ష్యూరిటీ..మోసం గ్యారంటీ’ సభలో మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి పిలుపు ● తరలివచ్చిన పార్టీ శ్రేణులు, గ్రామస్తులు గంగవరం : కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, అన్యాయాలు, అరాచకాలను, మోసాలను గ్రామస్థాయిలో ప్రజల్లో కి తీసుకువెళ్లాలిసిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంపచోడవరం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పిలుపు నిచ్చారు. శనివారం సాయంత్రం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయం ఆవరణలో పార్టీ మండల అధ్యక్షుడు యెజ్జు వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అరకొరగా అమలు చేసి నూరుశాతం సాధించినట్లు గొప్పలు చెప్పుకుంటుందన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో ప్రజలను మోసం చేసిందని అందుకే వారి తరపున వారి ప్రజలు గొంతుకై వైఎస్సార్సీపీ పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ ప్రజల వద్దకు పాలన తీసుకురావడం కోసం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన సంస్కరణలు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు వాటిని ధ్వంసం చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో హామీలను ఇచ్చి గద్దినెక్కిన కూటమి ప్రభుత్వం వాటిన అమలు చేయడంలో కాకమ్మ కథలు చెబుతున్నాయన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు బనాయించేందుకు శ్రద్ధ చూపిస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రజల తరపున పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఏ కార్యకర్తకు ఆపద వచ్చిన అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. జగనన్న హయాంలో అనేక సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందించడం జరిగిందని గుర్తు చేశారు. 2029లో మళ్లి మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని పార్టీ నాయకులు, కార్యకర్తలు అదైర్య పడాల్సిన అవసరం లేదని అండగా ఉంటామని హామీ ఇచ్చారన్నారు. రంపచోడవరం నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు తాతపూడి ప్రకాశరావు , జెడ్పీటీసీ సభ్యురాలు బేబిరత్నం , ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీలు గంగాదేవి, రామ తులసి, పార్టీ మండల అధ్యక్షుడు యెజ్జు వెంకటేశ్వరరావు తదితరులు ప్రసంగిస్తూ ప్రతీ గ్రామంలో చేపట్టనున్న బాబు షూర్యిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కోరారు. ఎంపీటీసీ సభ్యులు కనకలక్ష్మి, వెంకటలక్ష్మి, సర్పంచ్లు కామరాజు, మరిడమ్మ, శివ, రమణమ్మ, రామలక్ష్మి, కురసం అక్కమ్మ, పార్టీ జిల్లా కార్యదర్శి ఏడుకొండలు, పార్టీ మండల ఇన్చార్జి సీహెచ్.రఘునాఽథ్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు సూచనలు
జి.మాడుగుల: రైతులు తమ కాఫీ తోటలను బెర్రీ బోరర్ తెగుళ్ల నుంచి పంటను కాపాడుకోవాలని ఐటీడీఏ కాపీ ఫీల్డ్ ఆఫీసర్లు సీతారాం మజ్జి, జగదీష్ పాత్రుడు, సిబ్బంది వెంకట్, బాబూరావు కోరారు. మండలంలో గడుతూరు పంచాయతీ పచ్చనాపల్లి గ్రామంలో శనివారం కాఫీ రైతులకు బెర్రీ బోరర్ తెగుళ్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బెర్రీ బోరర్ తెగుళ్లు పొంచి ఉన్న ప్రమాదమని ఈ కీటకం కాఫీ పండ్లను వృత్తాకార రంధ్రం చేసి, గింజలను పూర్తిగా తొలచి తింటుందన్నారు. దీంతో పంటకు అపార నష్టం కలిగిస్తుందన్నారు. బెర్రీ బోరర్ తెగుళ్లను గమనిస్తే వెంటనే కాఫీ సిబ్బంది, కార్యాలయానికి తెలియజేయాలని వారు తెలిపారు. -
నేత్రదానంపై అపోహలను వీడాలి
పాడేరు : అన్ని దానాల కన్నా నేత్రధానం ఎంతో గొప్పదని ప్రతి ఒక్కరు నేత్రదానం చేసేందుకు ముందుకు వచ్చి అంధత్వంతో భాదపడుతున్న వారికి చూపు ప్రసాదించాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ తమర్భ విశ్వేశ్వరనాయుడు పిలుపునిచ్చారు. అందత్వ నివారణ సంస్థ ఆద్వర్యంలో 40వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా శనివారం పాడేరు పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి నుంచి మెయిన్ బజారు మీదుగా పాత బస్టాండ్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా నేత్రధానంపై ఉన్న అపోహలను తొలగించుకొని ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పాడేరు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలత, ఏడీఎంహెచ్వో డాక్టర్ ప్రతాప్, నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ అనీష్బాబు, ఏఎన్ఎం ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ శాంతికుమారి, ట్రైనింగ్ సెంటర్ విద్యార్ధులు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
రైతులకు అండగా వైఎస్సార్సీపీ
పాడేరు : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని దగా చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అద్యక్షుడు మత్య్సరాస విశ్వేశ్వరరాజు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్య్సలింగం, పాడేరు, అరకు మాజీ ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ, వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి అన్నదాత పోరు కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంఆ ఆయన మాట్లాడుతూ ఈనెల 9న ఉదయం 10 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి సినిమాహాల్ సెంటర్, పాత బస్టాండ్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు రైతులు, వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్కు రైతు సమస్యలపై వినతి పత్రం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో వైఎస్సార్సీపీ శ్రేణులతో పాటు రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.అరకు ఎమ్మెల్యే రేగం మత్య్సలింగం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. ఏజెన్సీలో గిరిజన రైతులకు ఎక్కడ కూడా యూరియా, ఎరువులు సరఫరా చేయలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉండి వారి సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. వేలాదిగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి ఖరీఫ్ సీజన్కు ముందుగానే సబ్జిడీపై విత్తనాలతో పాటు యూరియా, ఎరువులను సక్రమంగా సరఫరా చేసిందన్నారు. అరకు మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ మాట్లాడుతూ రైతులంటే చంద్రబాబుకు ఏ మాత్రం కూడా గిట్టదన్నారు. వారి బాగు కోసం ఆయన ఏనాడు ఆలోచన చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యం అయిందన్నారు. ఎదుర్కొంటున్న సమస్యలు వారికి వైఎస్సార్సీపీ అండగా ఉంటూ పోరాటాలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పాడేరు, జి. మాడుగుల మండల అద్యక్షులు సీదరి రాంబాబు, నుర్మాని మత్య్సకొండం నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్నదొర, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, సర్పంచ్లు వంతాల రాంబాబు, సోమెలి లక్ష్మణరావు, వనుగు బసవన్నదొర, వైఎస్సార్సీపీ ఐటీ విభాగం జిల్లా ప్రతినిధులు కూడా సుబ్రమణ్యం, వైఎస్సార్సీపీ క్రిస్టియన్ మైనారిటీ విభాగం ప్రతినిధి మోదా బాబూరావు పాల్గొన్నారు. కూటమి దగాకోరు విధానాలపై ఈనెల 9న పాడేరులో అన్నదాత పోరు విజయవంతం చేయాలని ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం పిలుపు పోస్టర్ల ఆవిష్కరణ -
సమస్యలు పరిష్కరించాలని ఆందోళన
పాడేరు : తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ సచివాలయ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటి ఇచ్చిన పిలుపు మేరకు శనివారం జిల్లా వ్యాప్తంగా గ్రామ సచివాలయ ఉద్యోగులు ఒకరోజు విధులను బహిష్కరించి గ్రామ సచివాలయ ఎదుట నల్ల రిబ్బన్లను ధరించి నిరసన తెలిపారు. రెండు సంవత్సరాల ప్రొబేషన్ కాలంలో రావాల్సిన రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు తక్షణమే విడుదల చేయాలని, వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లులకు ప్రమోషన్లు కల్పించాలని గ్రామ వలంటీర్ల ఇంటింటికి తిరిగి సర్వేలు లేకుండా చూడాలన్నారు. చివాలయం ఉద్యోగులందరికి సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్తో ప్రమోషన్ ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమ డిమాండ్లను సకాలంలో పరిష్కారించకపోతే భవిష్యత్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు. -
జిల్లాస్థాయి మారథన్ పోటీలు ప్రారంభం
అరకులోయటౌన్: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లాస్థాయి మారథన్ 5కె రన్ను అల్లూరి సీతారామ రాజు జిల్లా లెప్రసీ ఎయిడ్స్, టీబి అధికారి డాక్టర్ ఎం.కిరణ్ కుమార్ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు ఇంటర్నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్లో భాగంగా జిల్లా స్థాయి మారధన్ రన్ ను జిల్లా వైద్య విధ్యాధికారి విభాగం సహకారంతో జరిపార. పోటీల్లో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రన్లో పాల్గొన్న వారికి ధ్రువపత్రాలు అందజేశారు. ఈ పోటీలో పురుషులు, మహిళలలకు ప్రథమ బహుమతిగా ఒక్కొక్కరికి రూ.10వేలు, ద్వీతీయ బహుమతి పురుషులు, మహిళలకు వేర్వేరుగా రూ. 7వేలను టీబీ అధికారి డాక్టర్ కిరణ్ చేతుల మీదుగా అందజేశారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్స్పాల్ డాక్టర్ కె.భరత్ కుమార్ నాయక్, మహిళా కళాశాల ఇన్చార్జి ప్రిన్స్పాల్ పట్టాసి చలపతిరావు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ రామచందర్, క్లినికల్ సర్వీస్ ఆఫీసర్ స్పందన ప్రశాంతి, కళాశాల క్రీడా విభాగం శిక్షకులు నాగబాబు, పీడీ అప్పారావు, డాక్టర్లు ఉపేంద్ర, వసంత, 108 సిబ్బంది, ఎయిడ్స్ నియంత్రణ విభాగాల కౌన్సిలర్స్ సిబ్బంది, వివిధ స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
2,83,907 మందికి స్మార్ట్ రేషన్ కార్డులు
అరకులోయ టౌన్: జిల్లాలో 2,83,907 మందికి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమశాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. శనివారం అరకులోయ స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్తో కలిసి స్మార్ట్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వృద్ధులు, దివ్యాంగుల ఇంటి వద్దకు రేషన్ సరకులు పంపిణీ చేస్తామన్నారు. కాఫీలో బెర్రీబోరర్ సోకిన పిందెలు, ఫలసాయాన్ని పూడ్చిపెట్టేందుకు, ఇతర ప్రయోజనాల నిమిత్తం ఎకరాకు రూ.5వేలు ప్రభుత్వం అందజేస్తుందన్నారు. కిలో కాఫీకి రూ.50 నష్టపరిహారం ఇస్తామన్నారు. చినలబుడు పంచాయతీ పకనకుడిలో బెర్రీ బోరర్ ఆశించిన కాఫీ తోటలను కలెక్టర్తో కలిసి పరిశీలించారు. ఈ ప్రాంతంలో 80 ఎకరాల్లో కాఫీ తోటలకు బెర్రీబోరర్ ఆశించిందన్నారు. కలెక్టర్ ఏఎస్ దినేష్కుమార్ మాట్లాడుతూ స్మార్ట్ కార్డులు సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానమై ఉన్నందున దుర్వినియోగం చేసే అవకాశం లేదన్నారు. కార్డులోని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఏ రోజు ఎక్కడ రేషన్ పొందారనే విషయాన్ని తెలుసుకోవచ్చన్నారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, పాడేరు సబ్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్, సహాయ కలెక్టర్ సాహిత్, కాఫీ బోర్డు డీడీ రమేష్, డ్వామా ప్రాజెక్టు అధికారి డాక్టర్ విద్యాసాగర్, తహసీల్దార్ కె. కుమార స్వామి, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, వ్యవసాయ, ఉద్యాన, కాఫీ బోర్డు, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి -
వృద్ధురాలిపై కోతుల దాడి
కొయ్యూరు: మండలంలోని రాజేంద్రపాలెంలో 70 సంవత్సరాల వృద్ధురాలిపై శనివారం సాయంత్రం కోతుల గుంపు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. దీంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. రాజేంద్రపాలెంలో ఇంటి వద్ద ఉన్న పీటా నారాయణమ్మపై కోతుల గుంపు ఒక్కసారిగా దాడి చేసింది. కోతులు వీపుపై కరచి గాయపరిచాయి. కాలిపైన, చేతులపైన కూడా కరిచాయి. దీంతో ఆమె భయంతో కేకలు వేయడంతో కొందరు వచ్చి వాటిని చెదరగొట్టారు. అప్పటికే కోతులు కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇంటి బయట కూర్చుని ఉన్న తనపై ఒక్కసారిగా కోతులు వచ్చి దాడి చేశాయని చికిత్స పొందుతు న్న ఆమె తెలిపారు. ఇదిలా ఉండగా గ్రామంలో కోతుల సంఖ్య పెరగడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు రాజవొమ్మంగి విద్యార్థులు
రాజవొమ్మంగి: రాజవొమ్మంగిలోని 30 మంది ఏకలవ్య ( ఈఎంఆర్ఎస్ ) విద్యార్థులు గుంటూరులో జరగనున్న 4వ ఈఎంఆర్ఎస్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు (బాలుర విభాగం) శనివారం బయలుదేరి వెళ్లారు. గుంటూరులో 7, 8, 9 తేదీల్లో జరుగనున్న బ్యాడ్మింటన్, కబడ్డీ, వాలీబాల్ పోటీల్లో పాఠశాల విద్యార్థులు ఆడతారని ప్రిన్సిపాల్ ఎం.వి.కృష్ణారావు తెలిపారు. నేషనల్ ఎడ్యూకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (ఢిల్లీ) ఆధ్వర్యంలో ఈ గేమ్స్ జరుగుతున్నాయన్నారు. ఇక్కడ గెలిచిన క్రీడాకారులను త్వరలో జరుగనున్న నేషనల్ లెవెల్ మీట్కు ఎంపిక అవుతారన్నారు. పీఈటీ సత్యనారాయణ విద్యార్థులతో ఉన్నారు. -
విద్యుత్ షాక్తో గేదెలు మృతి
రాజవొమ్మంగి: స్థానిక ఎస్సీ కాలనీలో ట్రాన్స్ఫార్మర్ ఉన్న విద్యుత్ స్తంభం సమీపంలో మేస్తున్న రెండు గేదెలు షాక్కు గుర్తి అక్కడికక్కడే మృతి చెందాయి. స్తంభం నుంచి ఎర్త్కు విద్యుత్ సరఫరా కావడంతో ఈ సంఘటన జరిగినట్టు పలువురు చెప్పారు. గేదెలు మృతిచెందడంతో పాడిరైతు బొర్రా అప్పలరాజు బోరున విలపించారు. తాను జీవనాధారం కోల్పోయానని వాపోయారు. కాగా విద్యుత్ ఏఈ దొరబాబు, వెటర్నరీ సిబ్బంది వచ్చి వివరాలు సేకరించారు. విద్యుత్ సిబ్బంది ప్రమాదకరంగా ఉన్న వైర్లు తొలగించి సరి చేశారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి తనకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని స్థానికులు కోరారు. -
నాసిరకం మొక్కలపంపిణీపై ఆందోళన
● బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ముంచంగిపుట్టు: ఆదివాసీ రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఉపాధి హామీ డ్వామా పీడీ, అధికారులు నాసిరకం మొక్కలు సరఫరా చేస్తున్నారని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఎం.శ్రీను, గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడ రాధాకృష్ణ ఆరోపించారు. మండలంలోని ధారెల పంచాయతీ డీంగూడ గ్రామంలో ఆదివాసీ రైతులకు ఉపాధి హామీ పథకంలో అందిస్తున్న మొక్కలను శనివారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్వామా అధికారులు, మొక్కల ప్లాంటేషన్ యాజమాన్యం కుమ్మకై ్క నాసిరకం మొక్కలు రైతులకు అందించడం దారుణం అన్నారు. కాసు లకు కక్కుర్తిపడి రైతులకు ఉపయోగం లేని మొక్కలు అందిస్తున్నారని, రెండు మూడు అంగుళాల పొడవు ఉన్న మొక్కలను కింద స్థాయి ఉద్యోగులు రైతులకు ఇస్తున్నారని విమర్శించారు. సీజన్ ముగిసిపోతున్న సమయంలో మొక్కలు సరఫరా చేయడం వల్ల అవి బతికే పరిస్థితి లేదన్నారు. గిరిజన రైతులకు ఎలాంటి మొక్కలు అందించిన అడిగే వారు ఉండరని అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. నాసిరకం మొక్కలు పంపిణీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే రైతులతో ఆందోళనఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. -
చైతన్యంతో గంజాయిని తరిమికొడదాం
సీలేరు: గంజాయి పెంపకం.. రవాణాకు ఒకప్పుడు అడ్డాగా ఉన్న గిరిజన గ్రామాలు.. అదే గిరిజనులు.. ఇప్పుడు గంజాయి వద్దు అభివృద్ధి ముద్దు అన్న నినాదంతో శనివారం ధారకొండ పంచాయతీ కేంద్రంలో పెద్ద ఎత్తున ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. సీలేరు, ధారకొండ, దుప్పులువాడ, గుమ్మిరేవులు, అమ్మవారి ధారకొండ పంచాయతీలకు చెందిన గిరిజనులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన చైతన్యం కార్యక్రమంలో గూడెంకొత్తవీధి సీఐ వరప్రసాద్ మాట్లాడుతూ చైతన్యం అనే కార్యక్రమం ద్వారా గంజాయి నిర్మూలనకు గిరిజనుల సహకారం చాలా అవసరమన్నారు. ఈ ప్రాంతంలో గంజాయి పండించకుండా చేయగలిగినా.. మన జీవితాల్లో ఇంకా గంజాయి అనేది ఉందన్నారు. దీనిని ఎప్పుడైతే పూర్తిస్థాయిలో లేకుండా చేస్తామో అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి వైపు చూస్తుందన్నారు. ఈ ప్రాంతంలో పండిస్తున్న గంజాయి గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాలకు పంపించడం వల్ల అక్కడి యువకులు గంజాయి మత్తుకు బానిసై వారి జీవితాలు నాశనం అవుతున్నాయన్నారు. అలాగే పట్టుబడిన గిరిజనులు జైల్లో మగ్గుతున్నారన్నారు. గంజాయికి బదులు ఇతర పంటలు సాగు చేపడితే ప్రభుత్వం, పోలీస్ శాఖ సహకారం అందిస్తాయన్నారు. అప్పుడే ఆర్థికంగా ఎదిగి ఈ మారుమూల ప్రాంతాలు అభివృద్ధి వైపు అడుగులు పడతాయన్నారు. ఇకపై పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రతి పంచాయతీ కేంద్రంలో గ్రామసభలు నిర్వహించి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఒకప్పుడు గంజాయి పేరు మోపబడిన గ్రామాలు ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని కోరారు. ఏ సమస్య వచ్చినా పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. సీలేరు ఎస్ఐ రవీంద్ర, సీపీఐ సీనియర్ నాయకుడు విష్ణుమూర్తి, ధారకొండ సర్పంచ్ రాజు, గుమ్మరేవుల సర్పంచ్ కమలమ్మ, ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు. ధారకొండలో గిరిజనుల ర్యాలీ భారీగా తరలివచ్చిన జనం ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టండి అవసరమైన సహకారం అందిస్తాం: గూడెంకొత్తవీధి సీఐ వరప్రసాద్ -
మళ్లీ జగన్ను సీఎం చేయడమే లక్ష్యం
విశాఖ సిటీ : కూటమి ప్రభుత్వం 15 నెలల్లోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని, మళ్లీ జగన్ను ముఖ్యమంత్రి చేసుకోవడమే లక్ష్యమని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కల్యాణి పేర్కొన్నారు. శనివారం మద్దిలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో జోన్–1 మహిళ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఇందులో కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. అలాగే మహిళా విభాగాన్ని సంస్థాగతంగా పటిష్టం చేయాలని, జగన్ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోడానికి కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని తీర్మానించారు. అనంతరం ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రజలను, ముఖ్యంగా మహిళలను నిట్టనిలువుగా మోసం చేసిందని ఆరోపించారు. మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని చెప్పారు. ఎన్నికలకు ముందు అప్పటి సీఎం జగన్ కంటే ఎక్కువ మేలు చేస్తానని సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తర్వాత వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు. ఎప్పుడూ చూడని విధంగా రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారన్నారు. కేంద్రం పూర్తి స్థాయిలో యూరియాను సరఫరా చేసినప్పటికీ వాటిని టీడీపీ నేతలు బ్లాక్ మార్కెట్ తరలించారని ఆరోపించారు. ప్రజలకు రూ.81 వేల కోట్ల బకాయిలు కూటమి ప్రభుత్వం రైతులకు మొదటి ఏడాది పెట్టుబడి సాయం ఎగ్గొట్టి వెన్నుపోటు పొడిచిందన్నారు. మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 చొప్పున ఇస్తానని చెప్పి ఒక్కో మహిళకు రూ.22,500 బాకీ పడిందని తెలిపారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు కింద ఇప్పటి వరకు రూ.45 వేలు బకాయి ఉందన్నారు. 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ.4 వేల పెన్షన్ ఇవ్వకపోగా కొత్తగా ఒక్కరికి పింఛను గానీ, రేషన్ కార్డు గానీ మంజూరు చేయలేదన్నారు. పైగా రాష్ట్రంలో 3 లక్షల మంది అర్హులైన వారి పెన్షన్ తొలగించిందని వెల్లడించారు. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. ఇలా మొత్తంగా రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం రూ.81 వేలు బాకీ పడిందని వివరించారు. మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి 16 రకాల బస్సులు ఉంటే.. కేవలం 5 రకాల బస్సుల్లో ప్రయాణికులకు అవకాశం కల్పించారన్నారు. అలాగే ఉచితంగా మూడు సిలిండర్లు అని చెప్పి ఒకటి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. మెడికల్ కాలేజీలను సైతం బినామీలకు కట్టబెట్టేందుకు ప్రైవేటుపరం చేయాలని చంద్రబాబు నిర్ణయించారని ఆరోపించారు. మహిళలకు రక్షణ లేదు రాష్ట్రంలో హోం మంత్రిగా మహిళ ఉన్నప్పటికీ మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మద్యాన్ని విచ్చలవిడి చేసేసిందని విమర్శించారు. 80 వేల బెల్టుషాపులు పుట్టుకొచ్చాయని, పర్మిట్ రూమ్లకు కూడా అనుమతులు ఇచ్చేశారని తెలిపారు. మద్యం కారణంగానే మహిళలపై దాడులు పెరుగుతున్నాయని చెప్పారు. అలాగే రాష్ట్రంలో డ్రగ్స్ డోర్ డెలివరీ జరుగుతోందని, గంజాయిని హోంమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలోనే పండిస్తున్నారని వివరించారు. వీటిని అరికట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. సీఎం నుంచి ఎమ్మెల్యే ల వరకు అందరూ తమ స్వలాభం కోసం పనిచేస్తున్నారని, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. గుడిలో ఉన్న దేవుడిని వెలివేసి మళ్లీ దేవుడు రావాలని ప్రార్థిస్తున్నామని ప్రజలు బాధపడుతున్నారన్నారు. రానున్న మూడేళ్లు ప్రజల తరఫున పోరాటం చేయడానికి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి వైఎస్సార్సీపీ మహిళా విభాగం సిద్ధంగా ఉందన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, విజయనగరం డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, విశాఖ మాజీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగమణి, ఉత్తరాంధ్ర మహిళా విభాగం జోన్ ఇన్చార్జి ఈర్లె అనురాధ, కార్పొరేటర్లు, జోన్–1కు చెందిన మహిళా నాయకులు, రాష్ట్ర మహిళా విభాగం కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జిలు, నియోజకవర్గ మహిళా అధ్యక్షులు, అధిక సంఖ్యలో మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి పాలనపై 15 నెలల్లో ప్రజా వ్యతిరేకత సూపర్ సిక్స్ పేరుతో నయవంచన యూరియా కోసం రైతులు రోడ్లెక్కడం దారుణం రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం, డ్రగ్స్, గంజాయితో అఘాయిత్యాలు వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కల్యాణి -
ముంపు నుంచి తేరుకుంటున్న జన జీవనం
చింతూరు: గోదావరి, శబరి నదులు శాంతించడంతో రహదారులు ఇప్పుడిప్పుడే ముంపు నుంచి బయటపడుతున్నాయి. జనజీవనం తేరుకుంటోంది. వాగు లు ఎగుపోటుకు గురై రహదారులను ముంచెత్తడంతో 20 రోజులుగా పరివాహక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడం తెలిసిందే. కుయిగూరు, జల్లివారిగూడెం, చంద్రవంక, చీకటివాగుల ఉధృతి తగ్గుముఖం పట్టడంతో రాకపోకలు కొనసాగుతున్నాయి. సోకిలేరువాగు వరద నీరు శనివారం ఉదయం వరకు రహదారి పైనే ఉంది. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు, పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థు లు రాకపోకలు సాగించేందుకు పడవలను ఆశ్రయించారు. సాయంత్రానికి తగ్గుముఖం పట్టడంతో వరద నీటిలోంచి కాలినడకను గ్రామాలకు చేరుకుంటున్నారు. అన్నవరం వాగువద్ద కాజ్వే కొట్టుకుపోవడంతో చింతూరు, వీఆర్పురం మండలాల మధ్య రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. -
లేప్రోస్కోపీ శస్త్ర చికిత్సలు ప్రారంభం
పాడేరు : స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో లేప్రోస్కోపీ శస్త్ర చికిత్సలు ప్రారంభించామని వైద్య కళాశాల ప్రిన్సిపాల్, ఇన్చార్జి సూపరిండెండెంట్ డాక్టర్ హేమలత వెల్లడించారు. క్యాన్సర్, పేగునొప్పి, థైరాయిడ్ ఆపరేషన్లతో పాటు లేప్రోస్కోపి ద్వారా అపెండిసైటిస్ (కడుపు నొప్పి) సర్జరీలు స్థానిక జిల్లా ఆస్పత్రిలోనే నిర్వహిస్తామని ఆమె వివరించారు. ఇకపై రోగులు ఆపరేషన్ల కోసం విశాఖపట్నంలోని కేజీహెచ్, ఇతర ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. గిరిజన ప్రాంతంలో రోగులకు సకాలంలో నాణ్యమైన వైద్య చికిత్సలు అందించేందుకు తమ వైద్య బృందం సిద్ధంగా ఉందన్నారు. ఈ సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. తొలి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిన లేప్రోస్కోపీ విభాగాఽధిపతి డాక్టర్ శ్రీనివాసరావు, ఎనష్తీషియా విభాగాధిపతి డాక్డర్ సతీష్బాబు, వైద్య బృందం సభ్యులు డాక్టర్ రత్నకిషోర్, డాక్టర్ రమేష్కుమార్, డాక్టర్ విజయ్, డాక్టర్ అనూప్లను ఆమె అభినందించారు. ఇదే స్ఫూర్తితో జిల్లా ఆస్పత్రిలో మరిన్ని శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తి చేయాలని ఆమె కోరారు.మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ హేమలత -
రేషన్ దూరం.. పేదలకు భారం
సాక్షి.పాడేరు: జిల్లాలో రేషన్ సరుకులు పొందేందుకు కార్డుదారులు నరకం చూస్తున్నారు. మారుమూల గ్రామాల గిరిజనుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గిరిజనులకు ఇంటింటికి బియ్యం, ఇతర నిత్యావసరాలను ఎండీయూ వాహనాల ద్వారా పంపిణీ చేసేది. ప్రతి నెలా మొదటి వారంలోనే రేషన్కార్డుదారులు సరకులు పొందేవారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారుంలోకి వచ్చిన తరువాత పేదలకు కష్టాలు మొదలయ్యాయి. ఎండీయీ వ్యవస్థను రద్దు చేసింది. దీంతో రేషన్కార్డుదారులు దూరంగా ఉన్న డీఆర్ డిపోలకు వెళ్లాల్సి వస్తోంది. ఎండీయూ వ్యవస్థ రద్దు ప్రభావం గిరిజన ప్రాంతాలపై తీవ్రంగా ఉంది. ఈ ఏడాది జూన్ నుంచి గిరిజనులు రేషన్ బియ్యం, ఇతర నిత్యావసరాలు పొందేందుకు నరకం చూస్తున్నారు. ● జిల్లాలో ఇంటి వద్దే సరకులు పొందేందుకు అలవాటు పడిన రేషన్కార్డుదారులు కూటమి ప్రభుత్వం పుణ్యామాని సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాళ్లరిగేలా డీఆర్ డిపోల చుట్టూ తిరుగుతూ నరకం చూస్తున్నారు. ● ప్రతి డీఆర్ డిపో పరిధిలోని గ్రామాలు రెండు నుంచి ఏడు కిలోమీటర్ల దూరం వరకు ఉంటున్నాయి. అంత దూరం నుంచి గంటల తరబడి నడిచి డిపోలకు వస్తున్నారు. అక్కడ సరకులు పొందేందుకు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ● డిపోల నుంచి బియ్యం,ఇతర సామగ్రిని గ్రామాలకు మోసుకువెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రవాణా సౌకర్యాలు అంతంతమాత్రంగా ఉండడంతో మారుమూల గ్రామాల గిరిజనులు ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. లగేజీతో కలిపి ఒకొక్కరికి రూ.50 నుంచి రూ.70 రవాణా నిమిత్తం చెల్లించాల్సి వస్తోంది. ఎండీయూ వ్యవస్థను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త డిపోల ఊసెత్తని కూటమి ప్రభుత్వం జిల్లాలోని 22 మండలాల పరిధిలో 352 గ్రామసచివాలయాలకు సంభందించి 5108 గ్రామాలు ఉండగా, 671 రేషన్డిపోలు పనిచేస్తున్నాయి.గ్రామాల సంఖ్యకు తగ్గట్టుగా రేషన్డిపోలు లేకపోవడంతో గిరిజనులంతా ఇబ్బందులు పడుతున్నారు.ప్రతి డిపో పరిధిలోను 20నుంచి 30వరకు గ్రామాలు ఉంటున్నాయి,వాటిలో అధికంగా మారుమూల గ్రామాలే కావడంతో నడక ఇబ్బందులు తప్పడం లేదు.గ్రామాల సంఖ్య.మారుమూల గ్రామాలను పరిగణలోకి తీసుకుని కొత్త రేషన్డిపోల ఏర్పాటును కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గిరిజనులు మండిపడుతున్నారు. కార్డుదారులకు నరకం చూపిస్తున్న కూటమి ప్రభుత్వం డిపోల వద్ద గంటల తరబడి పడిగాపులు దూరాభారంతో ఇబ్బందులు ఎండీయూ వ్యవస్థ తొలగింపుతో కష్టాలు నాలుగు నెలలుగా ఇదే దుస్థితి ప్రతి నెలా ఇబ్బందులు ప్రభుత్వం ఎండీయూ వ్యవస్థను రద్దు చేసి చాలా అన్యాయం చేసింది. గ్రామాల నుంచి దూరంగా ఉన్న డిపోలకు కాలినడకన వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. గతంలో జగనన్న ప్రభుత్వం బియ్యం బండిని ఇంటి దగ్గరకే వంపేది. కాలినడక కష్టాలు ఉండేవి కావు. ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిలో గుత్తులపుట్టు డీఆర్ డిపోకు కాలినడకన వెళ్లి చాలా సమయం నిరీక్షించి బియ్యం తెచ్చుకునేందుకు నరకం చూస్తున్నాం. – కిల్లో జ్యోతి, కొత్తపల్లి, పాడేరు మండలం -
34 కిలోల గంజాయి స్వాధీనం
● ముగ్గురి అరెస్ట్ జి.మాడుగుల: గంజాయిని రెండు బైకులపై తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు ఎస్ఐ షణ్ముఖరావు తెలిపారు. చింతపల్లి వెళ్లే మార్గంలో జి.మాడుగుల మండలం పెదలంక రోడ్డు జంక్షన్ వద్ద శనివారం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఇదే సమయంలో బైక్లపై వచ్చిన వ్యక్తులను పరిశీలించగా 34 కిలోల గంజాయి పట్టుబడిందని ఎస్ఐ తెలిపారు. ఇద్దరు పరారీ కాగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని ఆయన వివరించారు వీరి నుంచి రెండు బైక్లు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించామని ఆయన పేర్కొన్నారు. చింతూరులో 25 కిలోలు.. చింతూరు: ఒడిశా నుంచి హైదరాబాద్కు అక్రమంగా 25 కిలోల గంజాయి తరలిస్తున్న ఒడిశాకు చెందిన సేఖ్ రాంబాబు అనే వ్యక్తిని శనివారం చింతూరు పోలీసులు అరెస్టు చేశారు. సీఐ గోపాలకృష్ణ, ఎస్ఐ రమేష్ తమ సిబ్బందితో స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా తారసపడిన అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద సంచిని తనిఖీచేయగా 25 కిలోల గంజాయి లభ్యమైనట్లు ఎస్ఐ తెలిపారు. దీని విలువ రూ 1.25 లక్షలు ఉంటుందన్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించామన్నారు. -
బెర్రీ బోరర్ను సమర్ధంగా ఎదుర్కొంటాం
● ఉద్యాన విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్ డాక్టర్ మధుమతి ● చింతపల్లి ఉద్యానవనన పరిశోధన స్థానం సందర్శన చింతపల్లి: జిల్లాలో కాఫీ తోటలకు ఆశించిన కాయతొలుచు పురుగు (బెర్రీ బోరర్)ను సమర్ధంగా ఎదుర్కొనేందుకు అన్ని విభాగాల యంత్రాంగాలు సిద్ధంగా ఉన్నాయని వెంకటరామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ రిసెర్చ్ డాక్టర్ మధుమతి అన్నారు. శనివారం ఆమె చింతపల్లి ఉద్యానవన పరిశోధన స్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అరకులోని కొందరు గిరిజన కాఫీతోటలతోపాటు చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానంలోని తోటల్లో బెర్రీ బోరర్ కనిపించిందన్నారు. ఈ పురుగు మిగతా తోటలకు ఆశించకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. దీనిలో భాగంగానే తోటల్లోని కాయలన్నింటినీ పూర్తిగా పంట కోత చేపట్టాలని ఆదేశించారు. సేకరించిన కాఫీ పిందెలను శాస్త్రవేత్తల సమక్షంలో నాశనం చేసి భూమిలో పూడ్చిపెట్టారు. రైతులు ఈ పురుగును గుర్తించిన వెంటనే సంబంధిత కాఫీ విభాగం అధికారులు, ఉద్యాన అధికారులు, శాస్త్రవేత్తలకు సమాచారం ఇవ్వాలని ఆమె సూచించారు. జిల్లాలోనూ రైతులకు లాభదాయకమైన పసుపు, అల్లం, మిరియం సాగుపై ఎప్పటికప్పుడు తమ పరిశోధనా స్థానం ద్వారా అవసరమైన సాంకేతిక సలహాలు ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఉద్యాన పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ వెంకటరత్నం, ఉద్యాన శాస్త్రవేత్తలు డాక్టర్ శివకుమార్, బిందు, సాంకేతిక అధికారులు అప్పలరాజు, ఓంకార్, ఆర్వీ నగర్ కాఫీ పరిశోధనాస్థానం జేఎల్వో నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
డీఎస్ఎన్ఎల్యూలో అకడమిక్ బ్లాక్ ప్రారంభం
సబ్బవరం: దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం(డీఎస్ఎన్ఎల్యూ)లో నూతనంగా నిర్మించిన అకడమిక్ బ్లాక్ను సుప్రీం కోర్టు న్యాయమూర్తి, విశ్వవిద్యాలయ విజిటర్ జస్టిస్ పి.శ్రీనరసింహ శుక్రవారం ప్రారంభించారు. దీంతోపాటు వర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతిపిత మహత్మాగాంఽధీ, రాజ్యాంగ పిత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, తొలి దళిత ముఖ్యమంత్రి, దామోదరం సంజీవయ్య విగ్రహాలను హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వర్సిటీ సమావేశమందిరంలో వాతావరణ మార్పులు, చట్టాలు అనే అంశంపై జస్టిస్ ఇ.వెంకటేశం స్మారక ఉపన్యాసం చేశారు. కార్యక్రమంలో గౌరవ అతిథిగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డాక్టర్ సూర్యప్రకాశరావు, ఇన్చార్జ్ రిజిస్ట్రార్ విశ్వచంద్ర మదాసీ పాల్గొన్నారు. -
ఏయూ ఆచార్యులకు అవార్డులు
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శుక్రవారం ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని పలువురు ఆచార్యులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరున బెస్ట్ అకాడమీషన్ ఆఫ్ ది ’ఇయర్ 2025 అవార్డులను అందించారు. సెనేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏయూ ఆచార్య జి.పి.రాజశేఖర్ అవార్డులను అందజేశారు. లా కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సీతామాణిక్యం, సైన్స్ కళాశాల కెమిస్ట్రీ విభాగం ఆచార్యురాలు డీవీవీ శైలజ, ఇంజినీరింగ్ కళాశాల నుంచి కంప్యూటర్ సైన్స్ ఆచార్యులు వెంకట్రావులకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఎన్. కిషోర్ బాబు, రిజిస్ట్రార్ ఆచార్య రాంబాబు, ప్రిన్సిపాల్స్ ఆచార్య ఎ.నరసింహారావు, ఆచార్య ఎం. వి. ఆర్. రాజు, ఆచార్య జి. శంకర్, ఆచార్య కె. సీతామాణిక్యం, ఆచార్య ఆర్. పద్మశ్రీ, ఆచార్య డి. నాగరాజకుమారీ ,పపలువురు డీన్లు, డైరెక్టర్లు, అధికారులు, ఆచార్యులు పాల్గొన్నారు. -
ముగిసిన పవిత్రోత్సవాలు
డాబాగార్డెన్స్ (విశాఖ): నాలుగు రోజులుగా కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న పవిత్రోత్సవాలు శుక్రవారంతో ముగిసాయి. ఈ సందర్భంగా ఉదయం 8 గంటల నుంచి విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, పవిత్ర అవరోహనం, మహా పూర్ణాహుతి, ఆశీర్వచనం జరిపారు. దేవస్థానం వేదపండితులు, అర్చకుల పర్యవేక్షణలో పవిత్రోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో కె.శోభారాణి, ఏఈవో కె.రాజేంద్రకుమార్, వేదపండితులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. రేపు ఆలయ మూసివేత.. ఈ నెల 7న చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం 1 నుంచి మరుసటి రోజు (8వ తేదీ) ఉదయం 7 గంటల వరకు ఆలయం మూసివేయనున్నట్టు ఈవో శోభారాణి తెలిపారు. అలాగే దర్శనాలు నిలిపివేయనున్నట్టు పేర్కొన్నారు. గ్రహణానంతరం సోమవారం తెల్లవారు జామున సంప్రోక్షణ నిర్వహించి, అమ్మవారికి 5 గంటల ప్రాత:కాల పంచామృతాభిషేకం అనంతరం ఉదయం 7 గంటల నుంచి దర్శనాలకు అనుమతించనున్నట్టు చెప్పారు. భక్తులు గమనించాలని ఈవో శోభారాణి కోరారు. -
కరెంట్ సమస్య.. క్షణాల్లో పసిగట్టేలా..
సాక్షి, విశాఖపట్నం: ఒకప్పుడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే, సమస్య ఎక్కడుందో కనుగొనడానికి సిబ్బంది క్షేత్రస్థాయిలో గంటల తరబడి శ్రమించాల్సి వచ్చేది. లోపం ఉన్న ప్రాంతాన్ని గుర్తించి, సబ్స్టేషన్కు సమాచారమిచ్చి, విద్యుత్ సరఫరా నిలిపివేసిన తర్వాత మరమ్మతులు చేసేవారు. ఈ ప్రక్రియకు గంట నుంచి రెండు గంటల సమయం పట్టేది. కానీ, ఆధునిక సాంకేతికత అందుబాటులోకి రావడంతో పరిస్థితులు మారాయి. ఇప్పుడు విద్యుత్ సరఫరాలో లోపం ఎక్కడ తలెత్తిందో క్షణాల్లోనే కంప్యూటర్ స్క్రీన్పై కనిపిస్తోంది. ఆ సమాచారంతో సంబంధిత సిబ్బంది కేవలం 5 నుంచి 30 నిమిషాల్లోనే సమస్యను పరిష్కరించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. ఇది తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) పరిధిలో అమలు చేస్తున్న సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ (స్కాడా) వ్యవస్థతో సాధ్యమవుతోంది. విశాఖపట్నం సర్కిల్ పరిధిలో ఇప్పటికే సగానికి పైగా సబ్స్టేషన్లు స్కాడాతో అనుసంధానం కావడంతో నగరవాసులకు విద్యుత్ సమస్యలు గణనీయంగా తగ్గాయి. స్కాడా అంటే.? విద్యుత్ సరఫరా వ్యవస్థను ఒకే కేంద్రం నుంచి పర్యవేక్షిస్తూ.. సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే పరిష్కరించి, సరఫరాను పునరుద్ధరించడానికి ఏర్పాటు చేసిన ఆధునిక వ్యవస్థే స్కాడా. ఇది సెన్సార్లు, రిమోట్ టెర్మినల్ యూనిట్ల ద్వారా సబ్స్టేషన్లను కంట్రోల్ సెంటర్తో అనుసంధానిస్తుంది. ఆపరేషనల్ టెక్నాలజీ ద్వారా రియల్ టైమ్ డేటాను సేకరించి, వ్యవస్థను పూర్తిస్థాయిలో నియంత్రించడానికి వీలు కల్పిస్తుంది. సాధారణంగా సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్లు చేసే పనులను స్కాడా కంట్రోల్ సెంటర్ నుంచే ఆటోమేటిక్గా, రిమోట్ సెన్సార్ల సహాయంతో నిర్వహిస్తారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో... విశాఖ నగరంలో స్కాడా ఏర్పాటుకు 2013లో ప్రతిపాదనలు రాగా, 2014లో రూ.13.16 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. 2015 నుంచి మొదలుపెడితే 28 సబ్స్టేషన్లను స్కాడా కంట్రోల్ స్టేషన్కు అనుసంధానం చేశారు. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తరవాత మరో 12 స్టేషన్లను అనుసంధానం చేయడంతో పాటు మరో 24 సబ్స్టేషన్లను స్కాడా పరిధిలోకి తీసుకొచ్చే పనులు ప్రారంభమై.. చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ సబ్స్టేషన్లలోనూ స్కాడా అమలుకానుంది. విశాఖపట్నం సర్కిల్ పరిధిలో మొత్తం 130 విద్యుత్ సబ్ స్టేషన్లు ఉండగా, ప్రస్తుతం 40 స్టేషన్లు ఈ ఆధునిక వ్యవస్థ ద్వారా పనిచేస్తున్నాయి. మరో 24 స్టేషన్లలో త్వరలోనే సేవలు మొదలుకానున్నాయి. మిగిలిన కేంద్రాలను కూడా భవిష్యత్తులో అనుసంధానించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కంట్రోల్ సెంటర్ ఎక్కడంటే..? స్కాడా పరిధిలోని అన్ని సబ్స్టేషన్లను పెదవాల్తేరులోని పోలమాంబ ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తారు. ఇది అత్యంత కీలకమైన, సాంకేతికతతో కూడిన కార్యాలయం కావడంతో దీనిని నియంత్రిత ప్రాంతంగా (నిషిద్ధ ప్రాంతం) పరిగణిస్తారు. సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి నగర విద్యుత్ వ్యవస్థను అస్తవ్యస్తం చేసే ప్రమాదం ఉన్నందున ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈపీడీసీఎల్ ప్రత్యేక నిపుణుల బృందం (ఈఈ, డీడీఈ, ఏఈ స్థాయి అధికారులతో పాటు 8 మంది షిఫ్ట్ ఇంజినీర్లు) ఈ కేంద్రాన్ని 24/7 పర్యవేక్షిస్తోంది. స్కాడాకు అనుసంధానించిన సబ్స్టేషన్ పరిధిలో ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో లోపం వస్తే, వెంటనే కంట్రోల్ రూమ్లో అలారమ్స్ మోగుతాయి. హై వోల్టేజ్, లో వోల్టేజ్ వంటి హెచ్చుతగ్గులను కూడా ఈ కేంద్రం నుంచే నియంత్రించవచ్చు. ఏ ప్రాంతానికి ఎంతసేపు విద్యుత్ సరఫరా చేశారు, ఎంతసేపు కోతలు విధించారు, లోడ్ ఎంత ఉంది వంటి సమాచారం మొత్తం రియల్ టైమ్ డేటా రూపంలో నిక్షిప్తమవుతుంది. ప్రమాదాలు తగ్గుముఖం స్కాడా కంట్రోల్ స్టేషన్ నుంచి నిరంతర పర్యవేక్షణ ఉండటంతో.. ప్రమాదాలు తగ్గుముఖం పడుతున్నాయి. విద్యుత్ సరఫరాలో నాణ్యత ఉంటోంది. స్కాడాకి అనుసంధానం చేయడం వల్ల సరఫరాలో అంతరాయాలు గుర్తించి, పునరుద్ధరించడంలో 56 శాతం వరకు సమయం ఆదా అవుతోంది. పవర్ ట్రిప్ అయితే రియల్ టైమ్లో తెలుస్తోంది. స్క్రీన్పై నుంచే వోల్టేజ్, ఇతర అంశాల్ని నిశితంగా పరిశీలించవచ్చు. ఏ చిన్న సమస్య తలెత్తినా.. పసిగట్టగలుగుతున్నాం. గతంలో ఫీడర్ మార్పు చేసేందుకు 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టేది. ఇప్పుడు 2 లేదా 3 నిమిషాల్లో ఫీడర్ని మార్పు చేయగలుగుతున్నాం. గ్రామస్థాయిలో ఫీడర్ల వరకూ స్కాడా అనుసంధానం చేసేందుకు కొంత సమయం పడుతుంది. –జి.శ్యామ్బాబు, విశాఖపట్నం సర్కిల్ ఎస్ఈ స్కాడా పరిధిలోని సబ్స్టేషన్లనుపర్యవేక్షిస్తున్న సిబ్బంది ‘స్కాడా’ అనుసంధానం -
అంగన్వాడీల్లో అక్రమాలకు అడ్డుకట్ట
● ఐసీడీఎస్ పీవో ఝాన్సీరామ్ పడాల్ సీలేరు: గర్భిణులు, బాలింతలు చిన్నపిల్లలు పోషకాహార లోపంతో ఇబ్బంది పడకుండా అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేపట్టే సరకుల సరఫరాలో అక్రమాలు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్టు మహిళ శిశు సంక్షేమ శాఖ పీడీ ఝాన్సీ రాయి పడాల్ చెప్పారు. పాడైన బాలామృతం ప్యాకెట్లు పంపిణీ విషయంపై ఆమె ఫోన్లో మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ ఇకపై అంగన్వాడీ కేంద్రాల నుంచి నేరుగా లబ్ధిదారులకు కంపెనీలో ఎలాంటి నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. కలెక్టర్ దినేష్ కుమార్ ప్రత్యేక అనుమతులతో సచివాలయంలో ఉన్న మహిళా పోలీస్ను అంగన్వాడీ కేంద్రాలకు అనుసంధానం చేస్తున్నామని ప్రతి అంగన్వాడీ కేంద్రానికి వారానికి ఒకసారి సూపర్వైజర్, మహిళా పోలీసు వెళ్లి సరకుల పంపిణీపై లబ్ధిదారులతో మాట్లాడి, స్టాకు వివరాలతో కూడిన నివేదిక అందించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ఐదు మండలాల్లో ఇబ్బందులున్న అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న వర్కర్ ప్రత్యేక సమావేశం నిర్వహించి కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు. వారు పనితీరు మార్చుకోకపోతే మూడు మెమోలు అనంతరం వారిని విధులు నుంచి తొలగించడం కూడా జరుగుతుందన్నారు. ముఖ్యంగా జీకే వీధి మండలంలో సీలేరు, దుప్పులువాడ, దారకొండ, గుమ్మరేవులు మారుమూల సరిహద్దు కేంద్రాల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని వాటిపై దృష్టి సారించినట్టు చెప్పారు. -
ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం
పాడేరు: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రం పాడేరులో శుక్రవారం ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. వారిని కలెక్టర్ దినేష్కుమార్, డీఆర్వో పద్మలత, డీఈవో బ్రహ్మాజీరావు తదితరులు సత్కరించారు. విద్యార్థులను ఉత్తమ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని వారు సూచించారు. అవార్డు గ్రహీతలు వీరే.. అరకువేలీ గిరిజన గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ ముమ్మన నాగరత్నం, అనంతగిరి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్ అల్లు సన్యాసినాయుడు, ముంచంగిపుట్టు టీడబ్ల్యూ ఆశ్రమ పాఠశాల గర్ల్స్–2 హెచ్ఎం ఎంవీఎస్ ప్రకాష్, హుకుంపేట టీడబ్ల్యూ బాయ్స్–1 హెచ్ఎం వి.బాలాజీ, కొయ్యూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ ఎ.పరిమళ, రాజవొమ్మంగి టీడబ్ల్యూ బాయ్స్ హెచ్ఎం ఎం. రాజ్దినకర్, గంగవరం మండలం టేకులవీధి టీడబ్ల్యూ బాయ్స్ హెచ్ఎం బి. నాగేశ్వరరావు, జి.మాడుగుల గిరిజన గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ జె.వేణు ప్రసాదరావు, పెదబయలు టీడబ్ల్యూ గర్ల్స్–1 హెచ్ఎం సీహెచ్ నారాయణ, అరకువేలీ ప్రభుత్వ ఆశ్రమోన్నత పాఠశాల హెచ్ఎం టి. మోహన్రావు, రంపచోడవరం గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్కే అహ్మద్ అలీషా, పాడేరు మండలం గుత్తులపుట్టు టీడబ్ల్యూ గర్ల్స్ పీడీ (స్కూల్ అసిస్టెంట్) కె.కృష్ణకుమారి, హుకుంపేట మండలం డూరువీధి హెచ్ఎం వి. శ్రీనివాసరావు, అడ్డతీగల టీడబ్ల్యూ గర్ల్స్ హింది స్కూల్ అసిస్టెంట్ కె. నాగశిరీష, ముంచంగిపుట్టు మండలం పనసపుట్టు టీడబ్ల్యూ బాలికల ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ ఎస్.వెంకటలక్ష్మి, ముంచంగిపుట్టు టీడబ్ల్యూ బాయ్స్–1 సోషల్ స్కూల్ అసిస్టెంట్ కె.ఆదినారాయణ, పాడేరు మండలం గుత్తులపుట్టు టీడబ్ల్యూ బాలికల పాఠశాల మ్యాఽథ్స్ స్కూల్ అసిస్టెంట్ డి.సుమలత, రాజవొమ్మంగి మండలం టీడబ్ల్యూ గర్ల్స్ సోషల్ స్కూల్ అసిస్టెంట్ కె.ఆర్. శాంతిపాప, రంపచోడవరం ప్రభుత్వ ఆశ్రమోన్నత పాఠశాల హిందీ స్కూల్ అసిస్టెంట్ ఎన్. పద్మావతి, పాడేరు సీఏహెచ్ పాఠశాల సోషల్ స్కూల్ అసిస్టెంట్ ఎస్. సోమయ్య, పాడేరు సీఏహెచ్ పాఠశాల బయోలజీ స్కూల్ అసిస్టెంట్ సీహెచ్. నాగరాజు పడాల్, పాడేరు మండలం కందమామిడి టీడబ్ల్యూ గర్ల్స్ హెచ్ఎం సరమండ సుశీల, ముంచంగిపుట్టు మండలం కిలగాడ ప్రభుత్వ ఆశ్రమోన్నత పాఠశాల మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ టి.భాస్కర్రావు, పెదబయలు టీడబ్ల్యూ ఆశ్రమ పాఠశాల ఫిజికల్ సైన్స్ స్కూల్ ఆసిస్టెంట్ ఎల్. అనిల్కుమార్, పెదబయలు మండలం తురకలవలస టీడబ్ల్యూ గర్ల్స్ సోషల్ స్కూల్ అసిస్టెంట్ ఆర్.సుజాత, పెదబయలు మండలం టీడబ్ల్యూ బాయ్స్ సోషల్ స్కూల్ అసిస్టెంట్ జె. రామచంద్రశేఖర్, పాడేరు సీఏహెచ్ పాఠశాల స్కూల్ అసిస్టెంట్ పీడీ పి. సింహాచలం, చింతపల్లి మండలం లంబసింగి ప్రభుత్వ ఆశ్రమోన్నత పాఠశాల మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ బి. నారాయణరావు, చింతపల్లి మండలం చౌడుపల్లి జెడ్పీ హైస్కూల్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ బి. సన్యాసిరావు, అరకువ్యాలీ ప్రభుత్వ ఆశ్రమోన్నత పాఠశాల ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ కె.మీనా, హుకుంపేట ప్రభుత్వ ఆశ్రమోన్నత పాఠశాల బయోలజీ స్కూల్ అసిస్టెంట్ కె. శాంతికుమారి, డుంబ్రిగుడ మండలం జాకరవలస ఎంపీపీ పాఠశాల ఎస్జీటీ పి. ధర్మ, అనంతగిరి మండలం చిలకలగెడ్డ ఎంపీపీ పాఠశాల ఎస్జీటీ ఎం. మల్లేశ్వరరావు, పాడేరు మండలం దబ్బాపుట్టు ఎంపీపీ పాఠశాల ఎస్జీటీ సీహెచ్. వెంకటేశ్వరస్వామీ పడాల్, పాడేరు మండలం ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఎస్జీటీ ఎం. మోదకొండమ్మ, పాడేరు మండలం ఈదులపాలెం ఎంపీపీ పాఠశాల ఎస్జీటీ ఆర్. శివప్రసాద్, ముంచంగిపుట్టు మండలం దారపల్లి ఎంపీపీ పాఠశాల ఎస్జీటీ ఎస్. అనంతరావు, ముంచంగిపుట్టు మండలం దీంగూడ ఎంపీపీ పాఠశాల ఎస్జీటీ ఆర్.పుండరి, పాడేరు మండలం వై.సోలములు, ఎంపీపీ పాఠశాల ఎస్జీటీ ఓ. మోహన్బాబు, పాడేరు మండలం ఇసుకలగొంధి ఎంపీపీ ఎస్జీటీ వి. లక్షమేశ్వరి, రాజవొమ్మంగి మండలం కొమరపురం ఎంపీపీ పాఠశాల ఎస్జీటీ ఎం. చంద్రశేఖర్ బాబు, గంగవరం మండలం బయనపల్లి ఎంపీపీ పాఠశాల ఎస్జీటీ వి. పద్మావతి, పాడేరు మండలం తలార్సింగి టీడబ్ల్యూ బాయ్స్ ఎస్జీటీ జె. అప్పన్నదొర, ముంచంగిపుట్టు మండలం రాములు ఎంపీపీ పాఠశాల ఎస్జీటీ టి. లింగన్న, పెదబయలు మండలం చుట్టుమెట్ట ఎంపీపీ పాఠశాల ఎస్జీటీ జె. సత్యనారాయణ, పెదబయలు మండలం కూతంగిపుట్టు ఎంపీపీ పాఠశాల ఎస్జీటీ కె. సంజీవరావు, పెదబయలు మండలం లింగేటి ఎంపీపీ పాఠశాల ఎస్జీటీ బి. కమలకుమారి, పెదబయలు మండలం పెద్దపుట్టు ఎంపీపీ పాఠశాల ఎస్జీటీ పి. జానకమ్మ, పెదబయలు మండలం తొరంగుల ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల ఎస్జీటీ జి. జగన్నాథం, జర్సింగి మాలంనాయుడు.బి.కమలకుమారి, పి.జానకమ్మ, గబుడు జగన్నాథం, నెల్లిపాక మండలం పురుషోత్తమపట్నం ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల ఎస్జీటీ బి. వెంకటప్రసాద్, హుకుంపేట కేజీబీవీ విద్యాలయం పీఈటీ బి. కమలకుమారి, జి.మాడుగుల మండలం టీడబ్ల్యూ ప్రైమరీ స్కూల్ ఎస్జీటీ కె. కలరావు, జి.మాడుగుల మండలం బూచుపల్లి ఎంపీపీ పాఠశాల ఎస్జీటీ యూ.ధర్మారావు, జి.మాడుగుల మండలం గొడుగుమామిడి ఎంపీపీ పాఠశాల ఎస్జీటీ డి. రామయ్య, రంపచోడవరం మండలం పెదకోరుమిల్లి ఎంపీపీ పాఠశాల ఎస్జీటీ పి. పండుదొర, రంపచోడవరం మండలం ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ ఎస్జీటీ కె. సత్యనారాయణ, రంపచోడవరం మండలం ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల ఎస్జీటీ పి. ధర్మన్నదొర, రంపచోడవరం మండలం సీహెచ్. గంగవరం ఎంపీపీ పాఠశాల ఎస్జీటీ పి.నాగేశ్వరరావు, కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం హెచ్ఎంగా పనిచేస్తున్న శెట్టి గోపాలం, కొయ్యూరు గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల–1లో సోషల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న అంబటి రాంబాబులు, గంగవరం మండలం మోహనాపురం టీచర్ సోమయ్య, అరకులోయ మండలం చొంపి ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల ఎస్జీటీ జి.కొండబాబు, అరకువ్యాలీ మండలం కుసుమగూడ ఎంపీపీ పాఠశాల ఎస్జీటీ పి.రామారావులు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాద్యాయులుగా అవార్డులను స్వీకరించారు. ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించిన ఐటీడీఏ పీవో సింహాచలం రంపచోడవరం: విద్యార్ధులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం అన్నారు. మారేడుమిల్లిలో శుక్రవారం జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో పీవో, డీడీ రుక్మాండయ్య, ఏజెన్సీ డీఈఓ వై మల్లేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా దూడ ఫీబే, నీలవేణికృష్ణ, జి సత్యనారాయణ,సీహెచ్ రమణలను సన్మానించారు. ఎంపీటీసీ సభ్యుడు గొర్లె అనిల్ కుమార్ (బాబి) తదితరులు పాల్గొన్నారు. ఘనంగా గురుపూజోత్సవం పాడేరులో గురువులను సన్మానించిన కలెక్టర్ దినేష్కుమార్ -
గండం గట్టెక్కినా.. వెన్నంటే వెతలు
గోదావరి, శబరి నదులు శాంతించినా విలీన మండలాల ప్రజలను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఎగపోటుకు గురైన వాగుల నీరు రహదారులను వీడటం లేదు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేందుకు నరకం చూస్తున్నారు. చింతూరు: గోదావరి, శబరి నదులు శాంతించినా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. చింతూరు మండలంలో శబరినది తగ్గతున్నా వాగుల నీరు ఇంకా రహదారులను వీడలేదు. దీంతో గత 20 రోజులుగా నదీ పరివాహక గ్రామాల ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. తమ గ్రామాల నుంచి వివిధ పనుల నిమిత్తం మండలకేంద్రంతో పాటు ఇతర గ్రామాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతూ పడవలపై వరదనీటిని దాటి వెళ్లాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. వరదనీరు రహదారుల పైనుంచి ఎప్పుడు తొలగుతుందో.. తమకు ఈ ఇబ్బందులు తప్పుతాయోనని వారు ఎదురుచూస్తున్నారు. ● చింతూరు మండలంలో జాతీయ రహదారి–326పై కుయిగూరు వాగుకు వరద తగ్గడంతో ఒడిశాకు రాకపోకలు కొనసాగుతున్నాయి. సోకిలేరు, జల్లివారిగూడెం, చీకటివాగుల వరద ఇంకా రహదారిపై నిలిచిఉండటంతో చింతూరు, వీఆర్పురం మండలాల మధ్యతోపాటు మండలంలోని 11 గ్రామాలకు రాకపోకలకు అవకాశం లేకుండా పోయింది తప్పని కష్టాలు చింతూరు డివిజన్లో అటవీశాఖలో ఖాళీగా ఉన్న ఆరు ఎఫ్ఎస్వో, 47 ఎఫ్బీవో పోస్టులకు సంబంధించి ఆదివారం కాకినాడలో పరీక్షలు జరగునున్నాయి. పోస్టుల కోసం నాలుగు మండలాల్లో చాలామంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో వరద అడ్డుగా ఉండటంతో కాకినాడకు వెళ్లేందుకు అభ్యర్థులు అష్టకష్టాలు పడ్డారు. తమ గ్రామాల నుంచి శనివారం బయలుదేరితే వరదల కారణంగా పరీక్షకు చేరుకుంటామో, లేదోననే ఆందోళనతో అభ్యర్థులు శుక్రవారం పడవల ద్వారా వరదనీటిని దాటి కాకినాడ వెళ్లారు. కాగా కొంతమంది మహిళలు చంటిబిడ్డలతో ఎన్నో ఇబ్బందులు పడుతూ వాహనాలు, పడవల ద్వారా వరదనీటిని దాటుతున్న దృశ్యాలు కలచివేశాయి. -
దారెల పంచాయతీ అభివృద్ధికి రూ.35 లక్షలు
ముంచంగిపుట్టు: మండలంలోని దారెల పంచాయతీ అభివృద్ధికి జెడ్పీ నుంచి రూ.35లక్షలు కేటాయిస్తామని ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. మండలంలోని దారెల పంచాయతీ కేంద్రంలో శుక్రవారం ఆమె రూ.10 లక్షలతో నిర్మించనున్న డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నాని, ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు,తాగునీరు కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. దారెల పంచాయతీలోని గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం రూ.35లక్షలు జెడ్పీ నుంచి మంజూరు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాండు,వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు పద్మారావు,నేతలు జగబంధు, మూర్తి, ఎంపీటీసీలు,సర్పంచులు,నేతలు పాల్గొన్నారు. -
నూతన విద్యావిధానంతోనే వికసిత భారత్
మద్దిలపాలెం: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ‘స్వర్ణాంధ్ర, వికసిత భారత్–2047 కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్’అనే అంశంపై సైన్స్ కాంక్లేవ్ను ఘనంగా నిర్వహించింది. ఏయూ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి, ఏయూ పూర్వ వీసీ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పద్మశ్రీ గ్రహీత, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఆచార్య సంఘమిత్ర బందోపాధ్యాయ ప్రసంగించారు. వికసిత భారత్–2047 లక్ష్యాన్ని చేరుకోవడానికి నూతన విద్యావిధానం దోహదపడుతుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సవాలని, దానిపై పూర్తి అవగాహన లేకపోతే నష్టం తప్పదని హెచ్చరించారు. విద్యార్థులు టెక్నాలజీపై పూర్తిగా ఆధారపడకుండా, బృంద చర్చల ద్వారా నూతన ఆవిష్కరణలకు కృషి చేయాలని సూచించారు. ప్రత్యేక అతిథి భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర.. వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వల్ల కలిగే విపత్తుల గురించి వివరించారు. టెక్నాలజీని ఉపయోగించి వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు గమనించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. సదస్సులో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం.. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, హైదరాబాద్తో రెండు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(హైదరాబాద్) డైరెక్టర్లు డాక్టర్ ప్రకాశ్ చౌహన్, డాక్టర్.వి.ఎం.చౌదరి, ఏపీటీసీ చైర్మన్ డాక్టర్ సిహెచ్ మోహన్రావు, ఐఐటీ హైదరాబాద్ పూర్వ సంచాలకుడు ఆచార్య జి.నరహరిశాస్త్ర, రెక్టార్ ఆచార్య కిశోర్బాబు, రిజిస్ట్రార్ కె.రాంబాబు, ప్రిన్సిపాళ్లు, డీన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. ఏయూలో ఘనంగా సైన్స్ కాంక్లేవ్ -
మరణించి నలుగురికి వెలుగునిచ్చి..
పెందుర్తి : బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందిన ఓ వ్యక్తి నేత్రాల ను దానం చేసి ఓ కుటుంబం మానవత్వం చాటుకుంది. వివరాలివి.. పెందుర్తి ఆదిత్యనగర్లో నివాసం ఉంటున్న కోరుబిల్లి శ్రీను(40) క్రేన్ ఆపరేటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గురువారం రాత్రి శ్రీను ఒక్కసారిగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు వెంటనే కేజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఈ క్రమంలో శ్రీను సమీప బంధువు శరగడం రాము(కర్రల రాము) చొరవతో కుటుంబ సభ్యులు శ్రీను నేత్రాలను దానం చేసేందుకు అంగీకరించారు. మోషిన్ ఐ బ్యాంక్ ప్రతినిధులు శ్రీను నేత్రాలను సేకరించారు. ఇటీవల కాలంలో విస్తృతంగా నేత్రదా నం చేయిస్తున్న పెందుర్తిలోని సాయి హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ స్ఫూర్తిలో తాము ఈ నేత్రదానం చేసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. -
పది వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ అన్యాయం
సాక్షి,పాడేరు: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి పేదలకు కార్పొరేట్ వైద్యం, వైద్యవిద్య లక్ష్యంగా రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తే, ప్రస్తుత సీఎం చంద్రబాబు ప్రైవేటీకరణకు అమోదం తెలపడం అన్యాయమని వైఎస్సార్సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆమె సాక్షితో మాట్లాడుతూ మొదటి దశలో పులివెందుల, మార్కాపురం, ఆదోని, రెండవ విడతలో పార్వతీపురం, పాలకొల్లు, అమలాపురం, మాకవరపాలెం తదితర పది ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ క్యాబినెట్లో తీర్మానం చేయడం సమంజసం కాదన్నారు. పేదలకు వైద్యంతో పాటు వైద్యవిద్యను దూరం చేసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. పేదల వైద్యం లక్ష్యంగా వైద్య కళాశాలల ఏర్పాటుతో గత వైఎస్సార్సీపీ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందన్నారు. వైద్యం, వైద్యవిద్యను ప్రైవేట్పరం చేస్తే పేదలంతా దోపిడీకి గురవుతారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని కూడా నిర్లక్ష్యం చేసిందన్నారు. రూ.5వేల కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదన్నారు. పేద ప్రజల వైద్యం, వైద్య విద్యకు విఘాతం కలిగించే చర్యలను కూటమి ప్రభుత్వం వీడాలని ఆమె డిమాండ్ చేశారు. పేదలకు వైద్యం, వైద్యవిద్యను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ధ్వజం -
ఉపాధ్యాయులదే గురుతర బాధ్యత
పాడేరు : విద్యార్థులను ఉత్తమమైన భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని కలెక్టర్ దినేష్కుమార్ అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పాడేరు పట్టణంలోని కాఫీ హౌస్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ న్ చిత్రపటానికి కలెక్టర్ దినేష్కుమార్, డీఆర్వో పద్మలత, డీఈవో బ్రహ్మాజీరావు, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు క్రమ శిక్షణ, నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలని సూచించారు. సమాజాభివృద్ధికి గురువే మూలమన్నారు. గురువు అనే వ్యక్తి అందరి కన్నా ఆదర్శంగా ఉండాలన్నారు. ఈ ఏడాది టెన్త్ పరీక్షల్లో జిల్లా వ్యాప్తంగా ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అనంతరం జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన 60 మంది ఉపాధ్యాయులను కలెక్టర్, డీఆర్వో పద్మలత, డీఈవో తదితరులు సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యాలయ సహాయ సంచాలకుడు బాలకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఒకరోజు ముందుగానే వెళ్తున్నా..
పరీక్ష రాసేందుకు శనివారం వెళ్లాల్సిఉన్నా వరద నీరు అడ్డంకిగా ఉండటంతో ఒకరోజు ముందుగానే కాకినాడ వెళ్లాల్సి వస్తోంది. మా గ్రామం నుంచి వాహనంపై వరద ప్రాంతానికి చేరుకుని అక్కడి నుంచి పడవపై వరద నీరు దాటి వాహనంపై చింతూరు వెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. – ముచ్చిక రుచిత, మల్లెతోట, చింతూరు మండలం వసతి ఎలాగో తెలియడం లేదు వరద కారణంగా పరీక్ష రాసేందుకు ముందుగానే వెళ్లాల్సి రావడంతో వసతి ఎలాగో అర్థం కావడంలేదు. రూములు తీసుకునేందుకు ఎక్కువ మొత్తం వెచ్చించాలి. వరదలేకుంటే ముందురోజు రాత్రికి చేరుకునేవాళ్లం. కుంజవారిగూడెం నుంచి పడవ వద్దకు వచ్చేందుకు చాల కష్టాలు పడాల్సి వచ్చింది. – తుర్రం లక్ష్మి, కుంజవారిగూడెం, వీఆర్పురం మండలం -
కాఫీ రైతుల సహకారంతో బెర్రీబోరర్ నిర్మూలన
అరకులోయ టౌన్: రైతుల సహకారంతో కాఫీతోటల్లో బెర్రీ బోరర్ను నిర్మూలించవచ్చని డ్వామా ప్రాజెక్టు అధికారి డాక్టర్ విద్యాసాగర్ అన్నారు. శుక్రవారం మండలంలోని చినలబుడు పంచాయతీ పకనకుడి గ్రామంలో బెర్రీబోరర్ బాధిత రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. చినలబుడు పంచాయతీ పరిధి పకనకుడిలో 29 ఎకరాలు, మాలివలసలో 29, మాలిశింగారంలో 7, చినలబుడులో 5, తురాయిగుడలో 2 ఎకరాల్లో బెర్రీ బోరర్ (కాయతొలుచుపురుగు) సోకిందన్నారు. కాఫీ ఫీల్డ్ పంక్షనరీ సూచనల మేరకు కాఫీ బోర్డ్ ద్వారా కిలో కాఫీకి రూ. 50 నష్ట పరిహారం అందిస్తామన్నారు. బెర్రీబోరర్ పురుగు ఆశించిన కాఫీ పంటను తొలగించి వేడి నీటిలో ఉడకబెట్టి దానిని మట్టిలో పాతి పెట్టాలని సూచించారు. పూడ్చి పెట్టడం తదితర ప్రక్రియకు సంబంధించి ఎకరానికి రూ. 5వేలు చెల్లిస్తామన్నారు. కాఫీ బోర్డు ఏడీ లకే బొంజుబాబు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి నందు పాల్గొన్నారు. వేడి నీటిలో ఉడకబెట్టి పూడ్చివేత చింతపల్లి: బెర్రీబోరర్ ఆశించిన కాఫీ తోటలో ఫలసాయాన్ని తొలగిస్తున్నట్టు స్థానిక ఉద్యానవన పరిశోధన స్థానం శాస్త్రవేత్త శెట్టి బిందు తెలిపారు. పరిశోధన స్థానం కాఫీ తోటలో బెర్రీబోరర్ సోకిన పంటను ఆర్వీ నగర్ కాఫీ పరిశోధన స్థానం జూనియర్ లైజన్ ఆఫీసర్ నాగేశ్వరరావు సూచనల మేరకు శుక్రవారం తొలగించామని ఆమె తెలిపారు. కోసిన పంటను వేడినీటిలో ఉడకబెట్టిన అనంతరం 50 సెంటీమీటర్ల గోతులు తవ్వి పూడ్చిపెట్టామని ఆమె వివరించారు. -
క్రీడా పోటీల్లో ఏకలవ్య విద్యార్థినుల ప్రతిభ
రాజవొమ్మంగి: స్థానిక ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలో ఇంటర్ చదువుతున్న సాయిహర్షిణి, దుర్గాపావని గుంటూరులో జరిగిన బాలికల విభాగం క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచారు. వీరిద్దరు జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఎంపికై నట్టు ప్రిన్సిపాల్ కృష్ణారావు తెలిపారు. సాయిహర్షిణి బ్యాడ్మింటన్ సింగిల్స్, సాయిహర్షిణి, దుర్గాపావని డబుల్స్ బ్యాడ్మింటన్ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించారు. ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 28 ఏకలవ్య పాఠశాలలు పాల్గొన్నాయని పీఈటీ మెఘారావత్ తెలిపారు. ఇలావుండగా గుంటూరులో ఈనెల 7, 8, 9 తేదీల్లో జరిగే బాలుర రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఆదే పాఠశాలకు చెందిన 30 మంది బాలురు హాజరవుతున్నారని ప్రిన్సిపాల్ కృష్ణారావు, పీఈటీ సత్యనారాయణ తెలిపారు. -
వంజంగి వ్యూపాయింట్ అభివృద్ధికి నిధులు
● పాడేరు డీఎఫ్వో సందీప్రెడ్డి ● రూ.35 లక్షలు కేటాయింపు సాక్షి,పాడేరు: వంజంగి వ్యూపాయింట్ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి అటవీశాఖ ముఖ్య సంరక్షణ అధికారి డాక్టర్ పి.వి.చలపతిరావు రూ.35 లక్షలు మంజూరు చేశారని పాడేరు డీఎఫ్వో సందీప్రెడ్డి శుక్రవారం తెలిపారు. పర్యాటక ప్రాంతం వంజంగి నిర్వహణను వేర్వేరు శాఖలు నిర్వహించేవని,అయితే అటవీశాఖ పరిధిలోకి వంజంగి నిర్వహణ బాధ్యత అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ ఆయ్యాయన్నారు. కమ్యూనిటీ ఆధారితి పర్యావరణ పర్యాటకం,వనసంక్షరణ సమితిలను భాగస్వామ్యం చేస్తూ వంజంగిని పర్యాటకంగా అటవీశాఖ అభివృద్ధి చేస్తుందన్నారు. పర్యాటక సీజన్ ప్రారంభం కానున్నందున ప్రస్తుతం విడుదలైన నిధులతో పర్యాటకులకు తక్షణ మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. తాగునీటి సదుపాయాల కల్పన, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, తనిఖీ కేంద్రం, సైన్బోర్డులు, సిమెంట్ బెంచ్లు, ప్లాస్టిక్ బిన్లు ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. -
ఎరువులు అధిక ధరలకువిక్రయిస్తే చర్యలు
● చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ చింతూరు: ఎరువులు కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా సంబంధిత వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ హెచ్చరించారు. గురువారం ఆయన చింతూరులోని ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణాల్లో కున్న స్టాక్, విక్రయించిన ఎరువులు, ధరల వివరాలను ఆయన పరిశీలించారు. ఈ పోస్ యంత్రం ద్వారా ఎరువులు విక్రయించాలని, త్వరలోనే చింతూరు మండలానికి యూరియా సరఫరా అవుతుందని రైతులు ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ గోపాలకృష్ణ, ఎస్ఐ రమేష్, వ్యవసాయాధికారి రత్నప్రభ పాల్గొన్నారు. -
కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి
పాడేరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు వీవీ జయ పిలుపునిచ్చారు. స్థానిక పీఎంఆర్సీలో గురువారం నిర్వహించిన ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ ద్వితీయ జిల్లా మహా సభలో ఆమె మాట్లాడారు. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను అడ్డుకోవాలన్నారు. ఆశా కార్యకర్తలకు కనీస వేతనం అమలు, పర్మినెంట్ చేయడం వంటిలో ఆసక్తి చూపని ప్రభుత్వాలు కార్మికులను ఇబ్బందులు పెట్టే చట్టాలను తీసుకువస్తున్నాయన్నారు. ఆశా కార్యకర్తల సంఘం ఏర్పాటుచేసిన తరువాత అనేక సమస్యలు పోరాటం ద్వారా పరిష్కరం అయ్యాయన్నారు. భవిష్యత్తులో కనీస వేతనం రూ.26 వేలకు పెంచడం, యాప్ల ద్వారా వర్క్ లోడ్ తగ్గించడం, రాజకీయ వేధింపులు అరికట్టడం, సమస్యలు పరిష్కరించాలన్న నినాదంతో భారీ ఉద్యమానికి సిద్ధం కావాలని సూచించారు. -
మేలైన యాజమాన్యంతో పసుపులో అధిక దిగుబడి
● ప్రాంతీయ ఉద్యానవన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త శెట్టి బిందు చింతపల్లి: గిరి రైతులు పసుపు సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చునని స్థానిక ప్రాంతీయ ఉద్యానవన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త శెట్టి బిందు అన్నారు. గురువారం జాతీయ పసుపు బోర్డు సౌజన్యంతో స్పైసెస్ బోర్డు ఆధ్వర్యంలో రైతులకు పసుపులో నాణ్యత మెరుగుపై నిర్వహించిన ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో ఆమె పలు సూచనలు చేశారు. స్పైసెస్ బోర్డు సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ బొడ్డు కల్యాణి సేంద్రియ సాగుకు ధ్రువపత్రం పొందే విధానం, 50 శాతం రాయితీపై అందజేసే యంత్రాల వివరాలను తెలిపారు. స్థానిక ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్త జోగారావు భూసార పరిరక్షణ ప్రాముఖ్యతలను వివరించారు. ఈ కార్యక్రమంలో టాటా ట్రస్టు సబ్జెక్టు ఎక్స్పర్ట్ అప్పలరాజు, కోఆర్డినేటర్ వాసు పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో రిటైర్డ్ ఉద్యోగి మృతి
పాడేరు : పాడేరు–పెదబయలు ప్రధాన మార్గంలో చింతలవీధి జంక్షన్ సమీపంలో అనుమానస్పద స్థితిలో కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి మృతి చెందారు. పాడేరు పట్టణంలోని సుండ్రుపుట్టు వీధికి చెందిన కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి జవ్వాది మత్య్సలింగం (62)గురువారం తమ బంధువు చనిపోవడంతో కొత్తపల్లి గ్రామానికి వెళ్లారు. కార్యక్రమం ముగించుకొని ద్విచక్ర వాహనంపై పాడేరు వస్తున్న ఆయన చింతలవీధి జంక్షన్ సమీపంలో రహదారిపై పడి ఉన్నారు. తీవ్ర గాయాలతో ఉన్న అతనిని స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మత్య్సలింగం ద్విచక్ర వాహనంపై ఎక్కడికి వెళ్లినా హెల్మెట్ ధరిస్తారని, గురువారం సంఘటన జరిగిన స్థలంలో కూడా హెల్మెట్ దూరంగా పడి ఉందని వారు వివరించారు. ఏం జరిగిందనేది అంతుచిక్కడం లేదని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో సీలేరు జెన్కో ఉద్యోగుల ప్రతిభ
● తృతీయస్థానం సాధనలో కీలకపాత్ర ● బెస్ట్ విన్నర్గా స్థానిక క్రీడాకారుడుశ్రీనివాస్ సీలేరు: తెలంగాణలోని యాదగిరిగుట్టలో జరిగిన జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో ఏపీ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ జట్టు తరఫున సీలేరు విద్యుత్ కాంప్లెక్సుకు చెందిన ఉద్యోగులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ నెల ఒకటి నుంచి గురువారం వరకు జరిగిన ఈ పోటీల్లో ఏపీ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ జట్టు తెలంగాణ జట్టుపై విజయం సాధించి తృతీయస్థానంలో నిలిచింది. సీలేరు విద్యుత్ కాంప్లెక్స్కు చెందిన ఏడీ కె.శ్రీనివాసులు కెప్టెన్గా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇదే ప్రాంతానికి చెందిన క్రీడాకారుడు కె.శ్రీనివాస్ బెస్ట్ విన్నర్గా ఎంపికయ్యారు. ఈ పోటీల్లో సీలేరు జెన్కోకు చెందిన క్రీడాకారులు శామ్యూల్, ప్రసాద్ పాల్గొన్నారని జట్టు మేనేజర్ సీహెచ్ సురేష్ తెలిపారు. -
నిరుద్యోగులను మోసగిస్తున్న రాజేష్, రవితేజలపై చర్యలు తీసుకోవాలి
పాడేరు : పశుసంవర్థక శాఖలో 1962 వెటర్నరీ డిపార్ట్మెంట్ భవ్య సంస్థలో ఉద్యోగాలు ఇస్తామని ఓఈ కిల్లారి రాజేష్, హెచ్ఆర్ రవితేజలు నిరుద్యోగులను మోసగిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడ రాధాకృష్ణ ఆరోపించారు. ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చింతపల్లి లోకేషన్లో డాక్టర్ ఉద్యోగానికి కొంత డబ్బులు ఫోన్పే, మరికొంత మంది నగదు ఇచ్చినా కూడా ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేశారని తెలిపారు. గతంలో చింతపల్లి లోకేషన్లో పైలేట్గా పని చేసిన వ్యక్తికి డబ్బులు అడగడం వల్ల ఆయన ఇవ్వకపోవడంతో ఉద్యోగం నుంచి తొలగించారని, అదే విధంగా పెదబయలు మండలం పైలెట్గా పని చేసిన వ్యక్తిని సైతం తొలగించారని అన్నారు. నిరుద్యోగులను మోసం చేస్తూ ఉద్యోగాలు ఇప్పిస్తామని వేలాది రూపాయలు వసూలు చేస్తున్న రాజేష్, రవితేజలపై ఆ సంస్థ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని, ఉద్యోగాల నుంచి తొలగించిన వారికి, మళ్లీ ఉద్యోగాలివ్వాలని డిమాండ్ చేశారు. -
కన్నీటి ఘోష
వరద పోటెత్తి.. వాగులు ముంచెత్తి..వీఆర్పురం మండలం వడ్డిగూడెం వద్ద వరదనీటిలోరాకపోకలు సాగిస్తున్న గ్రామస్తులుచింతూరు మండలంలో జాతీయ రహదారిపై చేరిన వరద నీటిలోంచి ఆంధ్రా నుంచి ఒడిశాకు రాకపోకలుచింతూరు: ఎగువన గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పట్టినా విలీన మండలాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. భద్రాచలం వద్ద గురువారం తెల్లవారుజామున 44 అడుగులకు చేరుకున్న నీటి మట్టం క్రమేపీ తగ్గుతూ 43 అడుగుల దిగువకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. భద్రాచలంలో గోదావరి తగ్గుముఖం పట్టినా ఎగపోటుకు గురై పెరిగిన శబరి నది గురువారం సాయంత్రం నుంచి నిలకడగా మారింది. చింతూరు వద్ద శబరినది నీటిమట్టం గురువారం రాత్రికి 31 అడుగులకు చేరింది. ● గోదావరి, శబరి వరదలు కారణంగా ఎటపాక, కూనవరం, వీఆర్పురం, చింతూరు మండలాల్లో గురువారం నాటికి రహదారులు ముంపులోనే ఉన్నాయి. ఈ నాలుగు మండలాల్లో సుమారు 60 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ● ఆగస్టు నుంచి ఇప్పటివరకు మూడు పర్యాయాలు వరద రావడంతో విలీన మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాలకు నలువైపులా వరదనీరు చేరి రాకపోకలు నిలిచిపోవడంతో అత్యవసర పనుల నిమిత్తం వెళ్లే ప్రజలు రవాణా సౌకర్యం లేక ఇక్కట్లకు గురవుతున్నారు. తప్పనిసరి పరిస్థితులు ఏర్పడితే వాహనాల ద్వారా వరదనీరు నిలిచిఉన్న ప్రాంతాలకు చేరుకుని అక్కడినుంచి పడవల మీదుగా వెళ్తున్నారు. వ్యాపారంపై ప్రభావం గోదావరి, శబరి వరదలు వల్ల రాకపోకలు నిలిచిపోవడంతో దాని ప్రభావం వ్యాపార రంగంపై చూపుతోంది. కొనుగోలు దారులు రాక దుకాణాలు వెలవెలబోతున్నాయి. వీఆర్పురం మండలంలో అడవివెంకన్నగూడెం, రామవరం, చింతరేగుపల్లి, కన్నాయిగూడెం, దేవిగూడెం, ఇప్పూరు, పోచవరం, శ్రీరామగిరి, సీతంపేట, వడ్డిగూడెం గ్రామాల వద్ద రహదారిపై వరదనీరు చేరడంతో 30 గ్రామాల ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు. ● శబరినది నిలకడగా ఉన్నా వాగుల నీరు ఇప్పటికీ రహదారులపైనే ఉంది. కుయిగూరువాగుకు స్వల్పంగా పెరిగింది. అంతర్రాష్ట్ర రహదారిపై నిలిచిపోయిన వదర నీటిలోంచి ఒడిశాకు వాహనాలు వెళ్తున్నాయి. ● సోకిలేరు, జల్లివారిగూడెం, చీకటివాగుల వరద ఇంకా రహదారులపై అలాగే నిలిచి ఉంది. దీంతో చింతూరు, వీఆర్పురం మండలాల మధ్య, చింతూరు మండలంలో 11 గ్రామాల్లో ప్రజలు గడపదాటని పరిస్థితి నెలకొంది. ఎటపాక: మండలంలో గురువారం ఉదయం వరకు పెరిగిన గోదావరి వరద మధ్యాహ్నం నుంచి క్రమేపీ తగ్గుముఖం పడుతోంది. వరదనీరు నందిగామ, తోటపల్లి, మురుమూరు వాగుల్లో పూర్తిగా తగ్గక పోవడంతో వ్యవసాయ పనులకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మిరప మొక్కలు వేసేందుకు కూలీలు వరదనీటిని దాటి పనులకు వెళ్లాల్సివస్తోంది. ప్రస్తుతం పూర్తిస్థాయిలో వరద తగ్గకపోవడంతో పాటు తిరిగి వరద వస్తుందేమోనని ఆందోళన చెందుతున్న రైతుల్లో వ్యవసాయ పనులు సాగుతాయా లేదా అనే సందేహం నెలకొంది. కూనవరంలో పెరుగుతున్న గోదావరి కూనవరం: భద్రాచలంలో గోదావరి నది నీటిమట్టం తగ్గుతున్నా కూనవరం మండలంలో మాత్రం గురువారం సాయంత్రం వరకు నెమ్మదిగా పెరగడం కనిపించింది. పోలిపాక వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో కూనవరం నుంచి భద్రాచలంకు రాకపోకలు నిలిచిపోయాయి. ● కొండ్రాజుపేట కాజ్వేపై వరదనీరు ఉధృతంగా ప్రవహించడంతోపాటు వెంకన్నగూడెం వద్ద రహదారిపై చేరడంతో 8 గ్రామాల ప్రజలు రాకపోకలు సమస్య ఎదుర్కొంటున్నారు. కూనవరం వద్ద గోదావరి నీటిమట్టం గురువారం రాత్రికి 42 అడుగులకు చేరుకుంది. -
కూటమి ప్రభుత్వంలో రైతాంగానికి తీవ్ర అన్యాయం
● రైతు వ్యతిరేక చర్యలపై నిరసన, ఆందోళన రేపు ● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అరకులోయ టౌన్: కూటమి ప్రభుత్వంలో రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. గురువారం తన క్యాంప్ కార్యలయంలో పార్టీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈనెల 6వ తేదీన జిల్లా, డివిజన్ కేంద్రాల్లో రైతులతో నిర్వహించే ఆందోళనలో నియోజకవర్గంలోని రైతులంతా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతీ రైతుకు అన్నదాత సుఖీభవ పేరిట రూ.20 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత నిలబెట్టుకోలేదన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీ కేంద్రాల్లో ఏర్పాటుచేసిన రైతు భరోసా కేంద్రాల ద్వారా సకాలంలో ఎరువులు పంపిణీ చేసిందన్నారు. వీటిని రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చిన కూటమి ప్రభుత్వం రైతులకు ఎరువులు అందించడంలో విఫలమైందన్నారు. ప్రస్తుత వ్యవసాయ సీజన్లో వరి, ఇతర పంటలు వేసుకున్న రైతులకు రాయితీపై యూరియా, డీఏపీ, ఇతర ఎరువులను పంపిణీ చేయకపోవడంతో ప్రైవేట్ వ్యాపారుల వద్ద అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వచ్చిందన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, మండల పార్టీ అధ్యక్షుడు స్వాభి రామూర్తి, ఎంపీటీసీ సమర్ధి శత్రుఘ్న, ఎస్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జన్ని నర్సింహమూర్తి, పార్టీ మండల ఉపాధ్యక్షులు పల్టాసింగ్ విజయ్ కుమార్, గుడివాడ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.