breaking news
Alluri Sitarama Raju
-
స్థానిక ఎన్నికల్లో ఎంబీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి
తుమ్మపాల : రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంబీసీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయించి సామాజిక న్యాయం కల్పించాలని జిల్లా యాత సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెంకే మారేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, 139 కులాలకు చెందిన బీసీ రిజర్వేషన్లు కేవలం 10 శాతం ఉన్నత బీసీ కులాలకు చెందిన వారే రాజకీయ లబ్ధి పొందుతున్నారని అన్నారు. న్యాయవాది ఐఆర్ గంగాధర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంబీసీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయించాలన్నారు. జిల్లాప్రధాన కార్యదర్శి గుత్తుర్తి అప్పారావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు పిల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఎంబీసీలకు రాజకీయ ప్రాధాన్యం లేక పోవడం వల్ల ధనిక వర్గాలకు చెందిన రాజకీయ నాయకులు బానిసలుగా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ రిజర్వేషన్లు కొందరికే కాదని అందరికీ చెందాలని రాంబిల్లి మండల యాత సంక్షేమ సంఘం అధ్యక్షుడు రంగాల నాగరాజు అన్నారు. సీపీఐ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి జనార్ధన్ మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం ఎంబీసీలు చేస్తున్న న్యాయమైన పోరాటానికి తమ పార్టీ మద్దతిస్తుందని అన్నారు. ఐలాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.ఎస్.అజయ్కుమార్ మాట్లాడుతూ ఎంబీసీల సామాజిక న్యాయ పోరాటం న్యాయబద్ధమైనదని అన్నారు. ఎంబీసీల న్యాయమైన రాజకీయ డిమాండ్ ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చి, ఎస్సీలకు అందించే అన్ని సంక్షేమ పథకాలు, సౌకర్యాలు అందించాలని కోరుతూ కలెక్టరేట్లో డీఆర్వో సత్యనారాయణరావుకు జిల్లా నాయకులు వినతిపత్రం అందించారు. కులవృత్తి చేసుకుంటూ నేటికీ గ్రామాల్లో ఒకటి రెండు కుటుంబాలుగా ఉన్న తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని, తమకు కూడా ఎస్సీ హోదా కల్పించడం ద్వారా ప్రభుత్వం అందించే అన్ని సౌకర్యాలు పొందగలమన్నారు. ప్రభుత్వం స్పందించి రజకులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సాధన కమిటీ కోకన్వీనర్ చల్లపల్లి రామ కోటేశ్వరరావు, అడ్డూర్ శంకర్, పొట్నూరు తిరుపతయ్య, సూదికొండ రమణ హనుమంతరావు, రజక సంఘ నాయకులు పాల్గొన్నారు. -
వరినారు ముదిరిపోయింది
వర్షాలు లేక వరినాట్లు వేసే పరిస్థితి లేకపోయింది. వరినారు కళ్లముందే ముదిరిపోతోంది. ఈ ఏడాది మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఖరీఫ్ పంటల సాగుకు నీటి సమస్య ఏర్పడింది. ఏం చేయాలో తెలియడం లేదు. – డి.కనకరాజు, గిరిజన రైతు, చింతలపూడి, కొయ్యూరు మండలం 70 ఎకరాల్లో వరినాట్లు పడలేదు ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురవకపోవడంతో భూములు బీడులుగా మారాయి. రెండో దుక్కి పనులకు వర్షం కరువైంది. వరినాట్లకు సమయం కూడా మించిపోయింది. ఇప్పుడు వర్షాలు కురిసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. 70 ఎకరాల్లో వరినాట్లు పడలేదు. – పాంగి అప్పారావు, గిరిజన రైతు, ఉర్రాడ తిండి గింజలకు ఇబ్బందులు తప్పవు వర్షాలు లేక ఖరీఫ్లో వరి సాగుకు దూరమయ్యాం. వేసిన నారంతా నిరుపయోగంగా మారింది. ఈ ఏడాది తిండి గింజలకు ఇబ్బందులు తప్పవు. – డప్పోడి రాజులమ్మ, వర్తనాపల్లి, పాడేరు మండలం -
ఎలుగుబంటి హల్చల్
ముంచంగిపుట్టు: ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మూడు రోజులుగా ఎలుగుబంటి హల్చల్ చేస్తోంది. కొండ ప్రాంతంలో పనులు చేస్తున్న సమయంలో ఒనకఢిల్లీ రైతులకు సోమవారం ఎలుగుబంటి కనిపించింది. దీంతో అప్రమత్తమైన స్థానికులు ఎలుగుబంటి గ్రామంలోకి రాకుండా అటవీ ప్రాంతం వైపు తరిమివేశారు. మూడు రోజులుగా మాచ్ఖండ్ ప్రాజెక్టు వెళ్లే మార్గం తదితర ప్రాంతాల్లో ఎలుగుబంటి సంచరిస్తోంది. జనారణ్యంలోకి వచ్చిన ఎలుగుబంటి ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమంలో పలువురు పోస్టులు పెట్టారు. అప్రమత్తంగా ఉండాలి సరిహద్దులో ఎలుగుబంటి సంచారంపై ఫారెస్ట్ అధికారులు స్పందించారు. ఫారెస్ట్ రేంజర్ ఎం.మురళీకృష్ణ తన సిబ్బందితో సోమవారం వనుగుమ్మ పంచాయతీలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఎలుగుబంటి సంచరించే ప్రాంతాల గురించి ఆరా తీశారు. ప్రజలకు ఎలుగుబంటి కనిపిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. బయటకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, గుంపుగా మాత్రమే వెళ్లాలని, ఎలుగుబంటి మళ్లీ కనిపిస్తే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు నారాయణపడాల్, వెంకటరాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
కొత్తకోట వైద్యాధికారి –2 గైర్హాజరుపై విచారణ
రావికమతం: కొత్తకోట పీహెచ్సీ వైద్యాధికారి –2 ఉదయ్కుమార్పై పలు ఫిర్యాదులు రావడంతో జిల్లా ఇమ్యూనిజేషన్ అధికారి చంద్రశేఖర్ దేవ్ సోమవారం విచారణ చేపట్టారు. ఇక్కడ పీహెచ్సీలో పని చేస్తున్న ఉదయ్కుమార్ తరుచూ విధులకు గైర్హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో పీహెచ్సీని సందర్శించి సిబ్బందిని తీరా తీశారు. వైద్య సేవలు, సిబ్బంది పనితీరుపై రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యాధికారి –2పై నివేదిక డీఎంహెచ్వోకు అందజేస్తామని, ప్రఽస్తుతం రెండో వైద్యాధికారిగా రవితేజ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం ఎంపీటీసీ పూడి దేవా, నాయకులు కోట గోవిందరావు, కోట సత్యనారాయణ, వెల్లంకి ఈశ్వరరావు పలు సమస్యలుపై వినతి పత్రం అందజేశారు. పీహెచ్సీలో రాత్రిళ్లు డాక్టర్ ఉండాలని, 108 అందుబాటులో ఉండాలని, ఆస్పత్రికి మెయిన్ గేటు ఏర్పాటు చేయాలని, తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా టీబీ, హెచ్ఐవీ అధికారి కె. స్వప్న, వైద్యులు మోహిని సురేఖ, రవితేజ, సిబ్బంది పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపిక
సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికై న విద్యార్థులు పాయకరావుపేట : గత నెల 30న మాకవరపాలెంలో జరిగిన సాఫ్ట్బాల్ ఎంపికల ప్రక్రియలో శ్రీ ప్రకాష్ విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సబ్ జూనియర్స్ అండర్ – 14 బాలుర విభాగంలో బి.సార్ధక్ , డి.నంద కిషోర్ బాలికల విభాగంలో వి.గీతా ప్రవస్తి, కె.రాఘ వర్షిణి అనకాపల్లి తరపున సెప్టెంబరు 12 నుండి 14 వరకు విజయనగరం జిల్లా బొబ్బిలిలో రాష్ట్ర స్ధాయి పోటీలకు ఎంపికై నట్టు శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ ప్రధానోపాధ్యాయుడు డి.వి.శ్రీనివాస్ తెలిపారు. ఎంపికై న విద్యార్థులను విద్యాసంస్థల అధినేత సిహెచ్.వి.కె నరసింహారావు, సంయుక్త కార్యదర్శి విజయ్ ప్రకాష్, సీనియర్ ప్రిన్సిపాల్ ఎం.వి.వి.ఎస్ మూర్తి, కోచ్ విజయ్ అభినందించారు. ఫుట్బాల్ చాంపియన్ విశాఖ మైలవరం: ఏపీ ఎఫ్ఏ సీనియర్ మెన్– 2026 ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ చాంపియన్షిప్ సోమవారం ముగిసింది. విశాఖపట్నం జట్టు చాంపియన్షిప్ దక్కించుకోగా, తిరుపతి జట్టు రన్నరప్, విజయనగరం జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఫైనల్లో తిరుపతిపై విశాఖపట్నం 2–1తో విజయం సాధించింది. జిల్లా స్థాయి ప్రతిభను జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ఏపీఎఫ్ఏ లక్ష్యమని ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, విశాఖపట్నం జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కోటగిరి శ్రీధర్ తెలిపారు. రేపు నల్లగొండలో వైఎస్సార్ వర్ధంతి కొయ్యూరు: మండలంలోని నల్లగొండలో సె ప్టెంబర్ 2న దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి నిర్వహించనున్నట్టు వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బి. అప్పారావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నల్లగొండలో రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారన్నారు. అక్కడ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. -
గంజాయి కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు
చోడవరం: గంజాయి కేసులో ఇద్దరు నిందితులకు పదేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ. లక్ష చొప్పున జరిమానా విధిస్తూ చోడవరం 9వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించిందని జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ తెలిపారు. వివరాల్లోకి వెళితే... 2016లో దేవరాపల్లి శివారులో గంజాయి అక్రమ రవాణా చేస్తుండగా అప్పటి ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇనస్పెక్టర్ సిహెచ్.వి.ప్రసాద్ తన సిబ్బందితో తనిఖీలు చేస్తుండగా అటుగా వెళుతున్న టాటా ఇండికా కారులో గంజాయి ఉన్నట్టు గుర్తించారు. కారును తనిఖీ చేయగా అందులో 144కేజీల గంజాయిని పట్టుకున్నారు. కారుతో పాటు గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఈ కేసు చోడవరం 9వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎం.హరినారాయణ వాదనలు విని, నిందితులు దేవరాపల్లికి చెందిన అతవ అచ్యుతరావు, తమిళనాడుకు చెందిన ఒచ్చు విజయ్కుమార్ పై నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారు చేశారు. ఒక్కొక్కరికి 10యేళ్లు కఠిన కారాగార శిక్ష, రూ. లక్ష జరిమానా చెల్లించాలని, జరిమానా చెల్లించలేని పక్షంలో మరో ఏడాదిపాటు సాధారణ జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి హరినారాయణ తీర్పు చెప్పినట్టు సుధీర్ తెలిపారు. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చీపురపల్లి సూర్యనారాయణ అన్ని వివరాలు కోర్టుకు అందించడంతో నేరం రుజువైందని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో నేరస్తునికి శిక్ష పడేలా అన్ని సాక్షాధారాలు సేకరించిన వారందర్నీ ఆయన అభినందించారు. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి
రావికమతం : గాజువాక సమీపంలో చినగంట్యాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రావికమతం గ్రామానికి చెందిన వృద్ధురాలు కంచిపాటి బంగారమ్మ (62) మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. సోమవారం ఉదయం మనుమరాలు, భర్తతో కలిసి స్కూటీపై ముగ్గురు వెళ్తుండగా అయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో బంగారమ్మ మృతి చెందగా, మిగిలిన ఇద్దరూ గాయపడినట్టు ఆమె బంధువులు తెలిపారు. రావికమతం గ్రామానికి బంగారమ్మ గాజువాకలో ఉంటున్న మనవరాలు ఇంటికి ఆదివారం వెళ్లింది. సోమవారం ఇంటికి వస్తానని చెప్పడంతో ఆమె రాకకోసం కుమార్తె బంధువులు ఎదురు చూస్తున్నారు. బంగారమ్మ రావికమతంలో చాలా కాలం నుంచి కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుంది. గాజువాక నుంచి రావికమతం రావడానికి మనవరాలు, భర్తతో స్కూటీపై వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రమాదవార్త తెలిసి స్వగ్రామంలో కుమార్తె, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. -
ఎన్టీఆర్ ఆస్పత్రిలో ఓపీ లైన్లు కిటకిట
అనకాపల్లి టౌన్ : అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో ఔట్ పేషెంట్ విభాగానికి వస్తున్న రోగుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుంది. దీంతో భారీ క్యూలైన్లు ఏర్పడుతున్నాయి. ఇక్కడకు ప్రతిరోజూ సుమారు 650 నుంచి 700 మంది వరకు ఔట్ పేషెంట్లు వస్తున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఓపీ మధ్యాహ్నం 12 గంటల వరకు రద్దీ కొనసాగుతుంది. దీంతో క్యూలైన్లు బారులు తీరుతున్నాయి. పెరిగిన రద్దీకి తగ్గట్టుగా ఓపి కౌంటర్లు లేకపోవడంతో పేషంట్లతో వచ్చిన వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సోమవారం 11.30 గంటల సమయంలో ఓపి కౌంటర్ల వద్ద తోపులాట, కొద్దిపాటి ఘర్షణ వాతావరణం నెలకొంది. సెక్యూరిటీ సిబ్బంది సర్ది చెప్పడంతో గొడవ సద్దు మనిగింది. జిల్లా కేంద్రంలో ప్రధాన ఆసుపత్రిగా ఉండడంతో చుట్టపక్కల గ్రామాల నుంచి, స్ధానికులు అధిక సంఖ్యలో ప్రజలు వైద్యం కోసం వస్తున్నారు.అయితే పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా ఓపీ కౌంటర్లను పెంచాల్సిన అవసరం ఉంది. -
అధికారుల పనితీరు మెరుగుపడాలి
సాక్షి, పాడేరు: జిల్లాలో అధికారుల పనితీరు మెరుగుపడాలని, కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని కలెక్టర్ టి.నిశాంతి ఆదేశించారు. ఇటీవల సీఎం చంద్రబాబు గన్నెల గ్రామంలో పర్యటించి ఐవీఆర్ఎస్ కాల్స్, పీపీపీ పనితీరు సమీక్షలో కొంతమంది అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి వాటి అమలుకు అధికారులు కృషి చేయాలన్నారు. ప్రజల్లో ప్రభుత్వ యంత్రాంగంపై ఉన్న ప్రతికూల అభిప్రాయాన్ని తొలగించాలన్నారు. ప్రతిరోజు ఉద యం 11 గంటలకు సిబ్బంది హాజరు తనకు అందజేయాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని, హెచ్డీఎస్ నిధులు సద్వినియోగం చేయాలన్నారు. సీఎం చంద్రబాబునాయుడు మళ్లీ జిల్లాకు వచ్చే సమయానికి అధికారులంతా తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో జేసీ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా సవరణ పెండింగ్ పనులు పూర్తి ఓటర్ల జాబితా సవరణ పెండింగ్ పనుల పూర్తికి అధికారులంతా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నిశాంతి ఆదేశించారు. ఎన్నికల విభాగం అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి నోటీసులు జారీ, క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ సెప్టెంబర్ 28వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 3న ప్రచురిస్తామని చెప్పారు. పాడేరు, అరకులోయ నియోజకవర్గాల్లో పెండింగ్ పనులన్నింటిని గడువులోగా పూర్తి చేయాలన్నారు. అధిక సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉన్న అరకులోయ మండలంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న విచారణలు, నోటీసుల జారీ ప్రక్రియను రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని, నిర్ణీత గడువులోగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తికాని పక్షంలో తగిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. 3,303 పెండింగ్ ఇళ్ల గ్రౌండింగ్ వేగవంతం జిల్లాలోని పీఎం జన్మన్ పథకంలో పెండింగ్లో ఉన్న 3,303 ఇళ్ల గ్రౌండింగ్ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ నిశాంతి గృహనిర్మాణ సంస్థ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పీఎం జన్మన్ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. -
ఉద్యోగుల డిమాండ్లు తక్షణం పరిష్కరించాలి
ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు సత్తి నాగేశ్వరరెడ్డి మహారాణిపేట: ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న ఐదు డీఏలు, ఐఆర్ వెంటనే మంజూరు చేయాలని, 12వ పీఆర్సీ కమిషన్ను తక్షణం నియమించాలని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు సత్తి నాగేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పీజీఆర్ఎస్లో డీఆర్వో ఎం.విశ్వేశ్వరనాయుడుకు ఉద్యమ కార్యాచరణపై లేఖ అందజేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల జీతాలను సవరించాల్సి ఉండగా పీఆర్సీ కమిటీ ఏర్పాటులో 37 నెలలు జాప్యం జరిగిందన్నారు. మరో 23 నెలల్లో 12వ పీఆర్సీ కాలపరిమితి ముగియనున్నందున వెంటనే కమిటీని నియమించాలని కోరారు. పెన్షనర్లకు తగ్గించిన 3 శాతం క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను పునరుద్ధరించాలని, ఉద్యోగుల 26 ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. బొప్పరాజుపై ఆరోపణలు ఖండన ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్న ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లుపై ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని నాగేశ్వరరెడ్డి తెలిపారు. -
సంచార జాతుల సంక్షేమానికి కృషి
అనకాపల్లి: దేశంలో సంచార జాతులను మోదీ ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వం ద్వారా రుణాలను అందజేయడం జరుగుతుందని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రొంగలి గోపిశ్రీనివాస్, శ్రీనివాసరావు అన్నారు. స్థానిక రావుగోపాలరావు కళాక్షేత్రంలో సంచార జాతుల విముక్తి దివస్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. సంచార జాతులను 1952 ఆగస్టు 31న భారత దేశం గుర్తించడం జరిగిందన్నారు. సంచార జాతులకు ఒక ప్రదేశం ఉండదని, భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ వస్తున్నట్టు ఆయన చెప్పారు. 1871లో బ్రిటిష్ ప్రభుత్వం వారు సంచార జాతులవారిని జైల్లో పెట్టడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాల పాలనలో సంచార జాతులను పట్టించుకోలేదన్నారు. సంచార జాతకు ప్రత్యేక సంక్షేమాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్పేయి పాలనలో సంచార జాతులను గుర్తించి వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. స్వశక్తితో అభివృద్ధి చేందుకు బీజేపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిల్లా రమాకుమారి, చొక్కాకుల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
వాన కరువాయె.. సాగు బరువాయె
సాక్షి, పాడేరు: అధిక వర్షాలతో నిత్యం పచ్చగా ఉండే మన్యం పరిస్థితి ఈ ఏడాది భిన్నంగా ఉంది. ఎల్ నినో ప్రభావంతో వరుణుడు ముఖం చాటేయడంతో చాలా ప్రాంతాల్లో తగినంత వర్షాలు కురవ లేదు. జిల్లాలోని 11 మండలాల పరిధిలో ఖరీఫ్ సీజన్లో వరితో పాటు ఇతర చిరుధాన్యాలు, వాణిజ్య పంటలు, కూరగాయలు సాగు చేస్తారు. సాగునీటి వనరులు లేకపోవడంతో గిరిజన రైతులంతా వర్షాధారంతోనే పంటలు పండిస్తారు. జిల్లాలో గత ఏడాది 41,608 హెక్టార్లలో వరి సాగు చేయగా, ఈ ఏడాది సుమారు 50 శాతంలో మాత్రమే వరి నాట్లు పడినట్లు తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం 75 శాతం భూముల్లో నాట్లు పూర్తయ్యాయని చెబుతున్నారు. 6,941 హెక్టార్లలో వరినాట్లు కరువు జిల్లాలో ఆగస్టు నెలాఖరు నాటికి 100 శాతం వరినాట్లు పూర్తయ్యేవి. ఈ ఏడాది మాత్రం ఇప్పటివరకు 34,667 హెక్టార్లలో మాత్రమే వరినాట్లు పడినట్లు అధికారుల లెక్కల ప్రకారం తెలుస్తోంది. ఇంకా 6,941 హెక్టార్లలో నాట్లు పడాల్సి ఉంది. వరినారు ముదిరిపోవడంతో నాట్లు వేసే పరిస్థితి కనిపించడం లేదని గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో అధిక వర్షాలతో 95 శాతం వరకు వరినాట్లు పూర్తవగా... అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడ, హుకుంపేట, పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జి.కె.వీధి మండలాల్లో 85 శాతం పడ్డాయి. కొయ్యూ రు మండలంలో 60 శాతం భూముల్లో వరినాట్లు పడలేదు. తగ్గిన వర్షపాతం అధిక వర్షాలకు పేరొందిన మన్యంలో ఈ ఏడాది జూన్ నెల నుంచే వర్షాలు ముఖం చాటేశాయి. ఎల్ నినో ప్రభావంతో తగినంతగా వర్షాలు కురవలేదు. జూన్ నెలలో 154 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 73 మిల్లీమీటర్లు, జూలై నెలలో 286 మిల్లీమీటర్లకు గాను 184, ఆగసులో 685 మిల్లీమీటర్లకు గాను కేవలం 379 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో సాగునీటి ఇబ్బందులు ఏర్పడ్డాయి. మున్ముందు వర్షాలు కురవని పక్షంలో ఇంతవరకు పూర్తిచేసిన 34,667 హెక్టార్ల వరినాట్లకు కూడా ఇబ్బందికర పరిస్థితులు తప్పవని గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. వరినాట్లు పడని హుకుంపేట మండలం ఉర్రాడలో పొలాలు -
ఎస్ అంటేనే పాస్!
విశాఖ విద్య: ఆంధ్రా యూనివర్సిటీ విద్యా విధానంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. బలవంతంగా ఫీజుల వసూళ్లు.. హాస్టల్ మెస్లలో పురుగుల భోజనాలు.. ఆస్పత్రిలో వసతుల లేమి.. ఇలా వరుస వివాదాలు చుట్టుముట్టిన సమయంలో తాజాగా మరో అంశం ఏయూలో కలకలం రేపుతోంది. ఏయూలో పెత్తందారీ పోకడలతో విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. పలు విభాగాల్లో కొందరు అధ్యాపకుల వ్యవహారశైలి వివాదాస్పదంగా మారుతోంది. తమ మాటకు ఎదురుచెప్పినా, అడుగులకు మడుగులొత్తకపోయినా విద్యార్థులపై కక్షగట్టి ప్రాక్టికల్స్లో ఫెయిల్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ఒక దళిత విద్యార్థిని అకారణంగా ఫెయిల్ చేసిన వైనం ఎస్సీ కమిషన్కు చేరడంతో వర్సిటీలో పరీక్షల నిర్వహణ లోపభూయిష్టంగా సాగుతోందనే విమర్శలు బలపడుతున్నాయి. ప్రశ్నించినందుకే ప్రాక్టికల్స్లో ఫెయిల్? ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ఎంపీఈడీ చదువుతున్న కె.ఏసుబాబు అనే దళిత విద్యార్థికి ప్రాక్టికల్స్లో అన్యాయం జరిగిందని బాధితుడు ఎస్సీ కమిషన్ను ఆశ్రయించాడు. గతంలో వర్సిటీలో నిర్వహించిన క్రీడా పోటీల్లో ప్రైవేటు కళాశాలల వారికి కాకుండా ఏయూ విద్యార్థులకే ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేయడమే తాను చేసిన నేరమైందని ఏసుబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. క్రమం తప్పకుండా తరగతులకు హాజరవుతూ అన్ని పోటీల్లో పాల్గొన్న తనను కావాలనే ఫెయిల్ చేశారని, అసలు తరగతులకే రానివారిని ఉత్తీర్ణులను చేశారని ఫిర్యాదులో ఆరోపించాడు. విభాగంలోని టీచర్ డైరీ, హ్యాండ్బుక్ పరిశీలిస్తే తరగతుల నిర్వహణలోని డొల్లతనం, తనకు జరిగిన అన్యాయం బయటపడతాయని చెబుతున్నాడు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ బాధితుడికి న్యాయం చేయాలని వైస్ ఛాన్సలర్ ఆచార్య జీపీ రాజశేఖర్ను ఆదేశించారు. దీనిపై వీసీ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ నేతృత్వంలో అంతర్గత విచారణ ప్రారంభమైంది. వివాదాల నిలయంగా మారిన విభాగం ఏయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం తరచూ అక్రమాలు, వివాదాలకు కేంద్రంగా మారుతోందని విద్యార్థి వర్గాలు మండిపడుతున్నాయి. గతంలో పలు విభాగాల్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న ఓ మహిళా ప్రొఫెసర్కు ఇక్కడ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం వల్లే పరిస్థితులు దిగజారాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఎస్సీ కమిషన్కు ఇచ్చిన ఫిర్యాదులో బాధితుడు ఫిజికల్ డైరెక్టర్ విజయ్ మోహన్ పేరును సైతం ప్రస్తావించగా, ఆయన పదవీ విరమణ పొందడంతో విచారణ ఎంతవరకు నిష్పక్షపాతంగా సాగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిర్లక్ష్యం రాజ్యమేలుతున్న ఈ విభాగంలో పేద విద్యార్థులకు న్యాయం జరగాలంటే వర్సిటీ యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యార్థులు కోరుతున్నారు. -
గిరిజనులంటే అంత అలుసా..
ఆదివాసీ బిడ్డల ఆత్మఘోష పాలకులకు వినిపించడం లేదా? మారికవలస గురుకులం తరలింపుపై మిన్నంటిన ఆగ్రహం పాఠశాల గేటు ఎదుట ఉదయం నుంచి రాత్రి వరకు భారీ ధర్నా వైఎస్సార్సీపీ, గిరిజన, విద్యార్థి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన రాత్రి గేటు ఎదుటే పడుకొని నిరసన కొనసాగింపు మధురవాడ: ఆదివాసీ బిడ్డల ఆవేదన, ఆత్మఘోష ప్రభుత్వానికి వినిపించడం లేదా? మారికవలస గిరిజన గురుకుల ఇంగ్లిష్ మీడియం పాఠశాలను ఇక్కడే కొనసాగిస్తామని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు ఆందోళన విరమించేది లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి తేల్చిచెప్పారు. పాఠశాలను తరలించడంపై సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు సాగిన ఆందోళనతో మారికవలసలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చిరుజల్లులు కురుస్తున్నా లెక్కచేయకుండా విద్యార్థుల తల్లిదండ్రులు, వైఎస్సార్సీపీ నాయకులు, గిరిజన, విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు పాఠశాల ప్రధాన గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. రాత్రి కూడా అక్కడే పడుకొని ఆందోళన కొనసాగించారు. చంద్రబాబు పర్యటనకు ముందు రోజు మారికవలస బాలుర ఇంగ్లిష్ మీడియం పాఠశాలను అక్కడే కొనసాగిస్తామని, ఇతర ప్రాంతాలకు తల్లిదండ్రుల అనుమతి లేకుండా తరలించిన విద్యార్థులను తిరిగి తీసుకొస్తామని ఐటీడీఏ పీవో, ఎస్పీ హామీ ఇచ్చి.. మాట తప్పారని ఆరోపించారు. పాడేరు నుంచి పాఠశాలకు తీసుకొచ్చిన 37 మంది విద్యార్థులను ఇక్కడ అనాథల్లా వదిలేశారని, ఇతర ప్రాంతాలకు తరలించిన తమ పిల్లల పరిస్థితి, ఆచూకీ కూడా తెలియడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనకారులను కలిసేందుకు వచ్చిన ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం, గిరిజన సంఘాల నేతలను హౌస్ అరెస్ట్ చేయడాన్ని నాయకులు తీవ్రంగా ఖండించారు. గురుకుల కార్యదర్శితో చర్చలకు రావాలని భీమిలి ఆర్డీవో సంగీత్మాధుర్, ఏసీపీలు అప్పలరాజు, వెంకటరావు ఆహ్వానించినా ఆందోళనకారులు అంగీకరించలేదు. గతంలో ఇచ్చిన హామీనే అమలు చేయలేదని, మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. అధికారులే గేటు వద్దకు వచ్చి తమతో మాట్లాడాలని డిమాండ్ చేశారు. విద్యా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. మురుగునీరు మళ్లించారు? ఆందోళన కొనసాగుతున్న సమయంలో తమను రెచ్చగొట్టేలా అధికారులు వ్యవహరించారని నాయకులు ఆరోపించారు. ఆందోళనకారులు కూర్చున్న పాఠశాల గేటు వైపు టాయిలెట్ల నుంచి మురుగునీటిని మళ్లించారని, దీంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కవ్వింపు చర్యేనని మండిపడ్డారు. అలాగే రాత్రి గేటు బయట పడుకునేందుకు దుప్పట్లు, చాపలు, ఇతర సామగ్రిని తీసుకొస్తున్న వాహనాన్ని పీఎం పాలెం పోలీసులు స్టేషన్కు తరలించారని పేర్కొన్నారు. జీవో 69 రద్దు చేయాలి మారికవలస గురుకుల పాఠశాల తరలింపునకు కారణమైన 69వ నంబర్ జీవోను వెంటనే రద్దు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా విద్యార్థులను బలవంతంగా తరలించి వారి హక్కులకు భంగం కలిగించిన గురుకుల అధికారులు, ఇతర బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం జీవీఎంసీ ఫ్లోర్ మాజీ లీడర్ డాక్టర్ బి.గంగారావు, కాంగ్రెస్ అరకు ఇన్చార్జి గంగాధర్ స్వామి తదితరులు ఆందోళనకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, జీసీసీ మాజీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, వైఎస్సార్సీపీ ఐటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపు సుబ్రహ్మణ్యం, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తెడబారికి సురేష్కుమార్, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ రాజేశ్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అజయ్, ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థి నేత పి.ప్రగతి పాల్గొన్నారు. పాఠశాలను ఎలా మూసేస్తారు? పీపీపీ ఒప్పందంతో నడుస్తున్న పాఠశాలను మూసివేసి ఇప్పుడు మళ్లీ విద్యార్థులను వెనక్కి తీసుకొస్తామంటున్నారు. ఇప్పటికే పిల్లల మనసులను గాయపరిచారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వెంటనే స్పందించాలి. బాలికల పాఠశాలలోకి బాలురను ఎలా పంపిస్తారు? –కె.విజయగౌరి, పీడీఎఫ్ నేత విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి విద్యార్థులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం కనీసం స్పందించలేదు. చేతకాకపోతే మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి. సీఓఈకి స్థలాలు చాలా ఉన్నాయి. 90 పైసలకే స్థలాలు ఇచ్చేస్తున్నారు. అలాంటప్పుడు గిరిజన విద్యార్థుల హాస్టల్కు స్థలం లేదా? – పి.ప్రగతి, ఆంధ్రా యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ నేత -
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు తీర్చండి
తుమ్మపాల : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ అనకాపల్లి జిల్లా ఏపీ జేఏసీ అమరావతి నాయకులు సోమవారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఆగస్టు 28న విజయవాడలో జరిగిన రాష్ట్ర సదస్సు నిర్ణయం మేరకు ఈ ఉద్యమ కార్యాచరణ లేఖను అందజేసినట్టు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా శాఖ చైర్మన్ ఎస్.ఎస్.వి.ఎస్ నాయుడు మాట్లాడుతూ ఇప్పటికే 37 నెలలు ఆలస్యమైన 12వ పీఆర్సీ కమిషన్న్ను వెంటనే నియమించాలని, తాత్కాలిక భృతి (ఐఆర్) ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 5 డీఏలను విడుదల చేయడంతో పాటు పెన్షనర్లకు తగ్గించిన 3 శాతం క్వాంటమ్ ఆఫ్ పెన్షనన్ను పునరుద్ధరించాలని కోరారు. ఉద్యోగుల 26 ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని, గత 8 ఏళ్ల బకాయిలను పే–స్లిప్పుల్లో నమోదు చేయాలన్నారు. ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లుపై కొందరు చేస్తున్న వ్యక్తిగత, రాజకీయ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం స్పందించి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఏసీ అమరావతి అనకాపల్లి జిల్లా జనరల్ సెక్రెటరీ డి.లోవరాజు, రెవెన్యూ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ శ్రీరామ్ మూర్తి, ఏపీ పీటీడీ జిల్లా అధ్యక్షులు డీఎన్ మూర్తి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్. శంకర రావు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి డి. దొరబాబు, ఏపీవీఆర్ఓఎస్ అసోషియేషన్ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, జిల్లా ఏపీవీఆర్ఓ అధ్యక్షులు ఏ. శశి, ఏపీ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి శేఖర్, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం నుంచి ఎం.ఎన్.ఎన్ సూరి శివ, ఏపీ ఫిజికల్ చాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్, ఏపీ జేఏసీ అమరావతి సంఘాలు, డివిజన్ స్థాయి అధ్యక్షులు, కార్యదర్శులు, ఇతర ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
మొక్కల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే చర్యలు
చింతపల్లి: ఉపాధి హామీ పథకంలో గిరిజన రైతులకు ఉచితంగా అందజేస్తున్న సిల్వర్ఓక్ మొక్కల పంపిణీలో సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్.వెంకటరావు హెచ్చరించారు. మండలంలోని లోతుగెడ్డ పంచాయతీ పరిధిలో గల చెరపల్లిలో సిల్వర్ మొక్కలు పంపిణీ చేసి, ఒక్కొక్క రైతు నుంచి రూ. 2 వందలు వసూలు చేయడంతో గ్రామానికి చెందిన నిరుద్యోగుల సంఘం కో కన్వీనర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏపీడీ, ఏపీవో రాంప్రసాద్తో కలసి గిరిజన సంఘం మండల కార్యదర్శి సాగిన చిరంజీవి గ్రామస్తుల ఆధ్వర్యంలో విచారణ నిర్వహించారు. ఉపాధి సిబ్బంది అక్రమ వసూలకు పాల్పడినట్లు తేలడంతో వసూలు చేసిన సొమ్మును గ్రామ పెద్దల సమక్షంలో గిరిజన రైతులకు అందజేశారు.ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా గిరిజన రైతులను అందేవిధంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ విశ్వనాథం, రఘుపతి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
పాడుతా తీయగా విజేతలకు బహుమతులు
అనకాపల్లి: స్థానిక గవరపాలెం సంతోషిమాత అమ్మవారి ఆలయం వద్ద పాడుతూ తీయగా పాటల పోటీలు ఆదివారం రాత్రి ముగిసాయి. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి సుమారుగా 50మంది సింగర్స్ వచ్చి పాటలు పాడారు. న్యాయనిర్ణేతలుగా సంగీత దర్శకుడు ఇంద్రగంటి లక్ష్మీశ్రీనివాస్, ప్రముఖ అధ్యాత్మిక విద్యావేత్త, ప్రవచన కర్త, నంది అవార్డు గ్రహీత అల్లాడ బాలసౌజన్యకుమారి వ్యవహరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పాటలు మానసిక ఉత్సాహానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ బహుమతి ప్రియగీతకు (అనకాపల్లి)రూ.5వేలు, ద్వితీయ బహుమతి నిత్యప్రియ(కశింకోట)రూ.3వేలు, తృతీయ బహుమతి డి.జగదీశ్వరి(నాగులాపల్లి)రూ.2వేలు, కన్సొలేషన్ బహుమతులుగా ఐదుగురికి రూ.వేయి చొప్పన నగదు, అమ్మవారి చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మారిశెట్టి భాస్కరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
కనీస వసతులుకల్పించకుంటే ఉద్యమం
● ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వంతల కృష్ణ పాడేరు రూరల్: జిల్లా వ్యాప్తంగా ఉ న్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు తక్షణమే సొంత భవనాలు నిర్మించి, మౌలిక వసతులు కల్పించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వంతల కృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అవసరమైన తరగతి గదులు, ఇతర మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సీలేరు, డుంబ్రిగుడ, అనంతగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కనీస వసతులు కరువయ్యాయని తెలిపారు. సరిపడా తరగతి గదులు లేక విద్యార్థుల చదువు అస్తవ్యస్తంగా మారిందన్నారు. జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపులను పూర్తిస్థాయిలో అందుబాటు లోకి తీసుకురావాలని, అలాగే మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. విద్యార్థుల కనీస సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ అద్వాన పరిస్థితులు దాపురించాయని విమర్శించారు. ఇప్పటికై నా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి భవనాల నిర్మాణాలు చేపట్టాలని, లేనిపక్షంలో విద్యార్థులను సమీకరించి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యుడు గెమ్మెలి బుజ్జి పాల్గొన్నారు. -
అధికారం.. ‘నారాయణ’మయం
● మంత్రి బస్సుల్లో ఆత్మగౌరవ గర్జనకు ● టీడీపీ నేతల పర్యవేక్షణలో టీచర్ల తరలింపు సాక్షి, పాడేరు: విశాఖపట్నంలో నిర్వహించిన ‘ఆత్మగౌరవ గర్జన’ ర్యాలీకి జిల్లా నుంచి డీఎస్సీ ఉపాధ్యాయుల తరలింపు ప్రక్రియను ప్రభుత్వ యంత్రాంగం, అధికార టీడీపీ నేతలు ఉమ్మడిగా పర్యవేక్షించారు. మంత్రికి చెందిన ‘నారాయణ’ విద్యాసంస్థల బస్సులను జిల్లాకు అధిక సంఖ్యలో పంపించగా, ఆ వాహనాల్లోనే విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులను విశాఖకు తరలించారు. జిల్లాలోని 11 మండలాలకు ప్రత్యేకంగా నారాయణ బస్సులను అందుబాటులో ఉంచారు. డిప్యూటీ డీఈవో చెల్లయ్యతో పాటు ఆయా మండలాల ఎంఈవోలు తమ పరిధిలోని ఉపాధ్యాయులను దగ్గరుండి బస్సుల్లో ఎక్కించారు. ప్రయాణంలో వారికి ఫలహారాలు కూడా పంపిణీ చేశారు. అరకులోయలో టీచర్ల బస్సులను అరకు టీడీపీ ఇన్చార్జి సియారి దొన్నుదొర ప్రారంభించారు. ఇక జిల్లా కేంద్రమైన పాడేరులోని జూనియర్ కళాశాల మైదానంలో టీడీపీ సీనియర్ నేత, జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, పాడేరు పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జ్ డప్పోడి బుజ్జిలు ఉదయం 7 గంటలకే చేరుకుని తరలింపు ప్రక్రియను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. బస్సులు విశాఖకు బయలుదేరే వరకు వారు అక్కడే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 400 మందికి పైగా ఉపాధ్యాయులను ఈ కార్యక్రమానికి తరలించారు. అయితే, విద్యాశాఖ అధికారులు ప్రత్యక్షంగా రాజకీయ నేతలతో కలిసి ఉపాధ్యాయుల తరలింపు ప్రక్రియలో భాగస్వాములు కావడంపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
జగన్ పథకాలకు పేర్లు మార్చడమే సంజీవనా?
అరకులోయ టౌన్: రాష్ట్రంలో గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలకు కేవలం పేర్లు మార్చి కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం అరకులోయలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గన్నెల గ్రామంలో సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన ‘సంజీవని’ కార్యక్రమం కొత్తదేమీ కాదని, జగనన్న ప్రభుత్వంలో తెచ్చిన ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్, ఆరోగ్య సురక్ష పథకాలకే రంగులు, పేర్లు మార్చి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. అమ్మ ఒడి, వసతి దీవెన వంటి పథకాల పేర్లు మార్చడం తప్ప, సూపర్ సిక్స్లో కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలేవీ లేవన్నారు. నాడు–నేడు ద్వారా వైఎస్సార్సీపీ హయాంలో పాఠశాల రూపురేఖలు మారిస్తే, నేడు బడుల్లో కనీస వసతులు కూడా కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు సృష్టించని సంపదను ఇప్పుడు సృష్టిస్తాననడం హాస్యాస్పదమని, గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు, విక్రయాలే ఆ సంపదా అని ప్రశ్నించారు. అధికారిక వేదికపై మతం గురించి ప్రస్తావించడం సీఎం స్థాయికి తగదని, వ్యక్తిగత విశ్వాసాలను ఓట్ల కోసం రాజకీయం చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. పూట గడవని గిరిజనులకు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని సలహాలిస్తున్న చంద్రబాబు, విలాసవంతమైన జీవితం గడుపుతూ తానెందుకు ఒక్కరితోనే ఆగిపోయారో చెప్పాలన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలవుతున్నా ఒక్క కొత్త పింఛన్ మంజూరు చేయకపోగా, ఉన్న పింఛన్లను కోత పెట్టారని ఎద్దేవా చేశారు. గ్రామాలకు నిధులు విడుదల చేయకుండా అభివృద్ధి జరగలేదని అధికారులపై కేకలు వేస్తే లాభం లేదని, అది పాలనా వైఫల్యమే అవుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్ కుమార్, ఎంపీటీసీ దురియా ఆనంద్ కుమార్, డుంబ్రిగుడ మండల పార్టీ అధ్యక్షుడు పాంగి పరశురామ్, ఉపాధ్యక్షుడు పల్టాసింగి విజయ్ కుమార్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాంగి నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్లు గుమ్మా నాగేశ్వరరావు, సాగెని నాగరాజు, యూత్ కమిటీ అధ్యక్షుడు బోయి కిరణ్ కుమార్, బూత్ కమిటీ ఇన్చార్జ్ కొర్రా అర్జున్, నాయకులు బీబీ కామేశ్వరరావు, జన్ని నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. మీరు ఒక్కరితో ఆగిపోయి..గిరిజనులకు సలహాలా? పేర్లు మార్చడమే కూటమిప్రభుత్వ మార్కా? అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ధ్వజం కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై నిప్పులు -
చంద్రబాబు పర్యటనతో ఒరిగింది శూన్యం
పాడేరు: ముఖ్యమంత్రి చంద్రబాబు అరకు పర్యటన వల్ల ప్రజాధనం దుర్వినియోగం కావడం తప్ప స్థానిక గిరిజనులకు ఒరిగేదేమీ లేదని వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ధ్వజమెత్తారు. ఆదివారం పాడేరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన హక్కులు, చట్టాల పరిరక్షణ, జీవో నంబర్ 3 పునరుద్ధరణ, మారికవలస గిరిజన గురుకులం కొనసాగింపు వంటి కీలక అంశాలపై ఏమాత్రం స్పష్టత ఇవ్వకుండా సీఎం బాబు గిరిజనులను మోసం చేసే ప్రయత్నం చేశారన్నారు. ‘ప్రజా వేదిక’ ద్వారా సీఎం వివిధ శాఖల నివేదికలను బహిర్గతం చేస్తూ అధికారులు సరిగా పనిచేయడం లేదని నిలదీయడం కేవలం గిరిజనుల మెప్పు కోసమేనని విమర్శించారు. కూటమి ప్రభుత్వ రెండున్నరేళ్ల పాలనలో గిరిజన ప్రాంతాలకు ఏం అభివృద్ధి చేయలేదని, తమ ప్రభుత్వం విఫలమైందని సీఎం బాబు పరోక్షంగా ఒప్పుకున్నారన్నారు. ఏజెన్సీలో హౌసింగ్, మైనింగ్, ఉపాధి హామీ వంటి కీలక శాఖల నివేదికలను బహిర్గతం చేసేందుకు ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేసిందో చెప్పాలన్నారు. ఆ శాఖల్లో అంతులేని అవినీతి, అక్రమాలు జరిగాయని, అవి బయటకు వస్తే అ డ్డంగా దొరికిపోతామనే భయంతోనే దాచిపెట్టారని ఆ రోపించారు. ఏజె న్సీ గ్రామాల్లో వీధి దీపాలు, రక్షిత మంచి నీరు, డ్రైనే జీ వ్యవస్థ అద్వాన్నంగా ఉన్నాయని, రెవెన్యూ సహా పలు శాఖల్లో అవినీతి రాజ్యమేలుతోందని తాము మొదటి నుంచీ చెబుతున్న విషయమేనని, ఇప్పుడు సీఎం కొత్తగా తెలుసుకున్నట్లు నటిస్తున్నారన్నారు. 1/70 చట్టంపై మౌనమెందుకు? గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు గిరిజనేతరులు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల తరఫున ఎందుకు ఇంప్లీడ్ పిటిషన్ వేయలేదని ప్రశ్నించారు. ఈ అంశంపై సీఎం ఎందుకు నోరు విప్పలేదన్నారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే గిరిజన విద్యార్థులకు ఐఐటీ, నీట్, జేఈఈ శిక్షణ ఇప్పించామని.. ఇప్పుడు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ పేరుతో కొత్తగా వింతలు సృష్టిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఏజెన్సీలో కూటమి ఉనికి కాపాడుకోవడానికే ఈ పర్యటన అని బాలరాజు స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు -
మద్యం మత్తు.. కారు బీభత్సం
● అదుపుతప్పి ఢీకొట్టడంతోఐదు వాహనాలు ధ్వంసం ● నలుగురిపై కేసు నమోదు చింతపల్లి : మద్యం మత్తులో కారుతో అతివేగంగా వస్తూ బీభత్సం సృష్టించి ఒక కారు, నాలుగు ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేసిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. చింతపల్లి సమీపంలోని అంతర్ల ’టీ టైం’ పాయింట్ వద్ద జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు గూడెంకొత్తవీధి మండలంలోని ధారాలమ్మ తల్లిని దర్శించుకుని కారులో తిరిగి వస్తున్నారు. వారు పూర్తిగా మద్యం సేవించి, కారును విపరీతమైన వేగంతో నడుపుతూ చింతపల్లి సమీపంలోని అంతర్ల స్మశానవాటిక వద్ద ఉన్న ’టీ టైం’ బోర్డు పోల్ను ఢీకొట్టారు. అంతటితో ఆగకుండా అక్కడ నిలిపి ఉంచిన వాహనాలపైకి కారు దూసుకెళ్లి బలంగా ఢీకొట్టడంతో నామగిరి వరప్రసాద్, చప్పట్ల వాసు, సాగిన నాగార్జున, వంతల వెంకటరావు, పప్పు సత్తిబాబులకు చెందిన ద్విచక్ర వాహనాలతో పాటు మరో కారు నుజ్జునుజ్జయ్యాయి. అదే సమయంలో పక్కనే ఉన్న వాటర్ సర్వీసింగ్ సెంటర్ నుంచి తన వాహనంతో బయటకు వస్తున్న ఉగ్గిన రమేష్ను కూడా కారు ఢీకొట్టడంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో పలువురు ఉన్నప్పటికీ ఎవరికీ గాయాలు కానందున స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన సమయంలో కారును పాయకరావుపేట మండలానికి చెందిన పడాల సాయి సమరన్న దొర నడుపుతుండగా, కారులో మామిడి రాజేష్, డీఏ కిరణ్తో పాటు మొత్తం నలుగురు ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని, మద్యం మత్తులో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
ఆర్తనాదం
అంతులేని అడవి తల్లి ఒడిలో స్వేచ్ఛగా బతకాల్సిన ఆ గిరి పుత్రుల జీవితాల్లో విధిఎందుకింత దారుణంగా ఆడుకుంటోంది? మాట రాక, చూపు దక్కక, నడవలేక.. కన్నవారికి భారంగా మారామనే భావనతో నాలుగు గోడల మధ్యే నరకం అనుభవిస్తున్న ఆ పసిహృదయాల తప్పేంటి? పింఛన్ పొందే అర్హత ఉన్నా.. ‘సదరం’ సర్టిఫికేట్ అనే కాగితపు ముక్క లేక, మైదాన ప్రాంతాలకు రాలేక అడవిలోనే మగ్గిపోతున్నఆ అభాగ్యుల పరిస్థితి చూస్తే రాతి గుండె కూడా కరగాల్సిందే!అభాగ్యులసీలేరు: ప్రపంచానికి దూరంగా, పచ్చని అరణ్యంలో స్వేచ్ఛగా బతకాల్సిన ఆ గిరి పుత్రుల జీవితాల్లో విధి దారుణంగా ఆడుకుంటోంది. కడుపున పుట్టిన చిన్నారుల భవిష్యత్తు అంధకార బంధురమవుతున్నా, వారి ఆవేదనను ఆలకించే నాథుడే కరువయ్యాడు. తోటి పిల్లలతో ఆడుకోవాలన్నా, బడికి వెళ్లాలన్నా పుట్టుకతో వచ్చిన అంగవైకల్యం వారిని ఇళ్లకే పరిమితం చేస్తోంది. విధి చేసిన గాయానికి తోడు అధికారుల నిర్లక్ష్యం తోడవడంతో, పింఛన్ పొందే అర్హత ఉన్నా ‘సదరం’ సర్టిఫికేట్ లేక పసిమొగ్గలు నరకం అనుభవిస్తున్నారు. జీవితమంతా చీకటే... గూడెంకొత్తవీధి మండలం, సీలేరు పంచాయతీ పరిధిలోని సరిహద్దు గ్రామం చంద్రుపల్లికి చెందిన కిలో పొదలం, పను దంపతుల దయనీయ స్థితి వర్ణనాతీతం. వీరి రెండో కుమారుడు జానకిరామ్ (18) పుట్టుకతోనే అంధుడు. మాటలు రావు, చెవులూ వినబడవు. కన్నతల్లిదండ్రుల రూపం ఎలా ఉంటుందో కూడా తెలియని స్థితి. గతంలో చలికాలంలో మంట కాగుతూ ప్రమాదవశాత్తు నిప్పుల్లో పడడంతో ఒక చెయ్యి పూర్తిగా కాలిపోయింది. 18 ఏళ్లుగా నాలుగు గోడల మధ్యే నరకం అనుభవిస్తున్న ఈ అభాగ్యుడికి నేటికీ పింఛన్ అందడం లేదు. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ తల్లిదండ్రులు కొడుకు అవస్థలు చూడలేక కన్నీరుమున్నీరవుతున్నారు. ఎనిమిదేళ్లుగా ఎదురుచూపులు... సీలేరు పంచాయతీ చింతపల్లి క్యాంప్కు చెందిన కిలో గణేష్ (13) తొమ్మిదేళ్ల కిందట జరిగిన ప్రమాదంలో కుడిచేయి కాలిపోయి వంకర తిరిగిపోయింది. తీవ్ర అంగవైకల్యంతో బాధపడుతున్న గణేష్, తోటి పిల్లల వద్ద అవమానాలు భరిస్తూనే చదువుకుంటున్నాడు. పింఛన్కు అర్హత ఉన్నప్పటికీ సదరం సర్టిఫికేట్ పొందేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరగలేక అధికారులు కరుణిస్తారని ఎదురుచూస్తున్నట్లు తండ్రి జగ్గు, తల్లి తిరుపతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనాథగా మారిన కుమారి కుటుంబం... పార్వతీనగర్ గ్రామానికి చెందిన కుర్ర కుమారి అనే గిరిజన మహిళ పరిస్థితి మరింత దయనీయం. ఇటీవలే భర్త అసురు అనారోగ్యంతో కన్నుమూయడంతో ముగ్గురు పిల్లల భారం ఆమైపె పడింది. పెద్ద కుమారుడు అజయ్ (12) పుట్టుకతోనే మానసిక దివ్యాంగుడు. ఒక చెయ్యి కూడా సరిగా పనిచేయదు. బాబుకు పింఛన్ మంజూరు చేయాలని రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది. సదరం సెంటిమెంట్... ఎవరికి శాపం? సదరం సర్టిఫికేట్ కోసం విశాఖపట్నం లేదా పాడేరు వెళ్లాల్సి రావడంతో, ఆర్థిక స్థోమత లేక, ప్రత్యేక వాహనాలు సమకూర్చుకోలేక తల్లిదండ్రులు మైదాన ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారు. ప్రభుత్వం, అధికారులు నిబంధనలను పక్కనపెట్టి మానవతా దృక్పథంతో స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక వైద్య బృందాలను మారుమూల గ్రామాలకు పంపి, నేరుగా సర్టిఫికేట్లు అందజేసి, ఈ అభాగ్యులకు పింఛన్లు మంజూరు చేయాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు. విధి వంచించిన గిరి పుత్రులు అర్హత ఉన్నా అందని పింఛన్లు గగనంగా సదరం ధ్రువపత్రం మైదాన ప్రాంతానికి రాలేకఅడవిలోన నరకం పట్టించుకోని పాలకులు అధికారుల అలసత్వానికి సజీవ సాక్ష్యం -
విదేశీ కల.. కేటుగాళ్ల ఎర!
విశాఖ విద్య: చేతిలో డిగ్రీ ఉంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న తపనా ఉంది. అదే వారి బలహీనతగా మారుతోంది. భవిష్యత్తుపై వారికున్న ఆశ కొందరి కేటుగాళ్లకు ఆసరాగా మారుతోంది. విదేశీ ఉద్యోగాలు, వర్క్ వీసాల ముసుగులో మోసగాళ్లు యువతకు వల విసురుతున్నారు. రూ.లక్షలు కాజేస్తూ.. వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారు. ఆగ్నేయాసియా దేశాల్లో బానిస బతుకులు మొదలుకొని.. ద్వారకానగర్ కేంద్రంగా సాగుతున్న ‘ఫ్లైయింగ్ బోర్డర్స్’ తరహా హైటెక్ మోసాల దాకా విశాఖలో విదేశీ ఉద్యోగ రాకెట్ కోరలు చాస్తోంది. లక్షల్లో జీతాలు, విలాసవంతమైన జీవితం దక్కుతుందని నమ్మి యువత కేటుగాళ్ల వలలో పడుతోంది. కష్టపడి కూడబెట్టిన సొమ్మంతా సమర్పించుకున్న తర్వాత లబోదిబోమంటూ బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే రాజకీయ ఒత్తిళ్లు, కొన్ని సందర్భాల్లో అధికారుల ఉదాసీనత వల్ల బాధితులకు న్యాయం జరగడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. విశాఖ కేంద్రంగా సైబర్ స్లేవరీ రాకెట్ గతంలో విశాఖ కేంద్రంగా నడిచిన ఆగ్నేయాసియా సైబర్ స్లేవరీ రాకెట్ తీవ్ర సంచలనం సృష్టించింది. విశాఖ యువతను సింగపూర్, థాయిలాండ్, మలేషియా వంటి దేశాల్లో డేటా ఎంట్రీ, రిసెప్షనిస్ట్, హోటల్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి తీసుకెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక కంబోడియా, థాయిలాండ్, మయన్మార్లలోని రహస్య ప్రాంతాలకు తరలించి పాస్పోర్టులు లాక్కున్నారు. వారిని బానిసలుగా మార్చి భారతీయులపైనే బిట్కాయిన్, ఫెడెక్స్, స్టాక్ మార్కెట్ సైబర్ మోసాలు చేయాలని చిత్రహింసలకు గురిచేశారు. విశాఖ పోలీసుల ప్రత్యేక చొరవ, హెల్ప్లైన్ ద్వారా గత ఏడాది కాలంలో సుమారు 87 మందికి పైగా బాధితులను రక్షించి స్వదేశానికి తీసుకొచ్చారు. నకిలీ ఆఫర్ లెటర్లతో ఐటీ మోసాలు కొందరు కేటుగాళ్లు నకిలీ కన్సల్టెన్సీలు ఏర్పాటు చేసి, ప్రముఖ ఐటీ కంపెనీల పేరిట నకిలీ ఆఫర్ లెటర్లను సృష్టించి మోసగిస్తున్నారు. విదేశీ ప్రాజెక్టుల్లో ఉద్యోగాల పేరుతో రిజిస్ట్రేషన్, ట్రైనింగ్ ఫీజుల కింద రూ.లక్షలు వసూలు చేసి బోర్డు తిప్పేస్తున్నారు. గతంలో ‘వునాతి టెక్నాలజీస్’ అనే సంస్థపై విశాఖ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి పలువురిని అరెస్ట్ చేశారు. ‘ఫ్లై బై నైట్’ అనే సంస్థ సైతం ఇదే తరహా మోసాలకు పాల్పడి నిరుద్యోగులను నిండా ముంచింది. ‘ఫ్లైయింగ్ బోర్డర్స్’ ఘరానా మోసం ఇటీవలే ద్వారకానగర్లో ‘ఫ్లైయింగ్ బోర్డర్స్’ కన్సల్టెన్సీ నిరుద్యోగులను భారీగా ముంచేసింది. గతేడాది మార్చిలో ప్రారంభమైన ఈ సంస్థకు ముసునూరి సౌజన్య మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఏడాది కాలంలోనే విదేశీ ఉద్యోగాలు, వర్క్ వీసాల పేరుతో నిరుద్యోగుల నుంచి భారీగా నగదు వసూలు చేశారు. బాధితులకు వీసాలు రాకపోగా, ఇచ్చిన డబ్బు తిరిగి రాక రోడ్డున పడ్డారు. హైదరాబాద్లోనూ ఈ సంస్థపై పలు ఆర్థిక నేరాల కేసులు ఉన్నాయి. నిందితురాలు సౌజన్యను అరెస్ట్ చేసే క్రమంలో ఎన్టీఆర్ జిల్లా పెనమలూరులోని ఆమె నివాసంలో పలు కీలక డాక్యుమెంట్లు, ఒప్పంద పత్రాలు, బంగారం, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే కేసు దర్యాప్తు ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంపై బాధితులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ‘జరిగిందేదో జరిగింది.. సెటిల్మెంట్ చేసుకోండి’ అంటూ మధ్యవర్తులు రంగంలోకి దిగి బాధితులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ద్వారకానగర్లో పుట్టగొడుగుల్లా కన్సల్టెన్సీలు విశాఖ ద్వారకానగర్లోని రెండో, మూడో లైన్లలో కన్సల్టెన్సీలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. యూకే, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్ లాంటి దేశాలను లక్ష్యంగా చేసుకుని.. ఇంగ్లిష్ రాకపోయినా ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బురిడీ కొట్టిస్తున్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న నకిలీ కన్సల్టెన్సీలపై పోలీస్ యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
అనకాపల్లి: వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్పర్సన్ జయలక్ష్మి డిమాండ్ చేశారు. స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి కాంట్రాక్టు ఉద్యోగులు ఆదివారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అనంతర ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్నర్సలు, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసీ ఉద్యోగులు పాల్గొన్నారు. -
ధరలు తగ్గించాలని మహిళల ధర్నా
అనకాపల్లి: నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, పెంచిన ధరలను తగ్గించి బడుగు, బలహీన వర్గాల కుటుంబాలను ఆదుకోవాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి బుగిడి నూకఅప్పారావు డిమాండ్ చేశారు. స్థానిక గవరపాలెం పార్కుసెంటర్ వద్ద నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం మహిళలతో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు నెలల్లో 25 కిలోల బియ్యం ధర రూ.1,370 నుంచి ప్రస్తుతం రూ.1,770 పెరగడం దారుణమన్నారు. వంట నూనెలు, పప్పులు, అపరాలు, ఇతర కిరాణా సరుకుల ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆయన తెలిపారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో నిత్యావసరాల ధరలను తగ్గిస్తామని చెప్పిన కూటమి నాయకులు అధికారం చేపట్టిన తరువాత ధరలు విపరీతంగా పెరిగినా పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. నిత్యావసర ధరలను తగ్గించే వరకూ పోరాటాలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళలు కాండ్రేగుల సన్నమ్మడు, బొడ్డేడ లక్ష్మి, భాగ్యలక్ష్మి, మాధవి, బి.సింహాచలం, కె.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నతాధికారులు ఆదేశించినా..
అందని సదరం ధ్రువపత్రం గూడెం కొత్తవీధి మండలం గుమ్మరేవుల పంచాయతీ, పరమ సింగవరం గ్రామానికి చెందిన గిరిజన యువకుడు రాజు ఐదేళ్ల వయసులోనే పోలియో బారినపడి మంచానికే పరిమితమయ్యాడు. ఈ అభాగ్యుడి దయనీయ స్థితిపై సాక్షిలో ప్రచురితమైన కథనానికి వైద్య శాఖ ఉన్నతాధికారులు (అమరావతి) తక్షణమే స్పందించారు. రాజుకు వెంటనే సదరం సర్టిఫికేట్ మంజూరు చేయాలని చింతపల్లి ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు. ఇదంతా జరిగి రోజులు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారలేదు. సదరం సర్టిఫికెట్ కోసం స్లాట్ బుకింగ్ చేయాలంటే బాధితుడు స్వయంగా సచివాలయానికి రావాలని అధికారులు చెబుతున్నారు. పరమ సింగవరం నుంచి బయటకు రావాలంటే బాధితుడిని డోలీపై మోస్తూ సుమారు 10 కిలోమీటర్ల మేర నడవాల్సిందే. ఈ దివ్యాంగ యువకుడిని అంత దూరం డోలీలో మోసుకొచ్చే పరిస్థితి లేకపోవడంతో ఇప్పటివరకు స్లాట్ బుకింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోకుండా, నిబంధనల పేరుతో కాలయాపన చేస్తుండటంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించినా క్షేత్రస్థాయి సిబ్బంది అలసత్వం వహించడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆరోపిస్తున్నారు. అధికారులు స్వయంగా గ్రామానికి వచ్చి లేదా ప్రత్యేక సదుపాయం కల్పించి రాజుకు సదరం సర్టిఫికేట్ అందేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. -
చికిత్స పొందుతూ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
తగరపువలస: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కేజీహెచ్లో చికిత్స పొందుతున్న ఇంజినీరింగ్ విద్యార్థి ఆదివారం మృతి చెందాడు. భీమిలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలివెన్నుకు చెందిన కంఠమణి తరుణ్కుమార్ (19) సంగివలసలోని అనిట్స్ కళాశాలలో రెండో సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్నాడు. గత శనివారం పార్ట్టైమ్ ఉద్యోగం ముగించుకుని బైక్పై తగరపువలస వైపు బయలుదేరగా.. రాత్రి 9 గంటల సమయంలో తాళ్లవలస సర్వీస్ రోడ్డులో ఎదురుగా కారులో వస్తున్న సంగివలస ఎన్ఆర్ఐ ఆస్పత్రి వైద్యుడు వెంకటేష్ కారు ఢీకొట్టింది. దీంతో తరుణ్కుమార్ తలకు, ఎడమ కాలు, కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. స్పృహ కోల్పోయిన అతడిని స్నేహితులు సంగివలస ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 6 గంటలకు మరణించాడు. మృతుడి తల్లి సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జన్మన్ ఇళ్ల నిర్మాణం వేగవంతం
చింతపల్లి: పీఎం జన్మన్ పథకం కింద ఆదివాసీ గిరిజనులకు మంజూరైన పక్కా ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసుకోవాలని గృహనిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.బాబునాయక్ సూచించారు. ఆదివారం ఆయన ప్రత్యేక అధికారి శ్రీనివాసరావుతో కలిసి తాజంగి పంచాయతీలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా తాజంగిలో నూతనంగా నిర్మించనున్న ఇంటికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా జన్మన్ పథకం కింద మంజూరైన ఇళ్లలో ఇంకా 3,303 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదని తెలిపారు. ఆ నిర్మాణాలను వేగవంతం చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించగా, ఇప్పటివరకు 1,610 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయన్నారు. లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డుతో పాటు బ్యాంకు లేదా పోస్టాఫీస్ ఖాతా వివరాలను సచివాలయ కార్యాలయ సిబ్బందికి అందజేయాలని కోరారు. గృహ నిర్మాణాలకు సంబంధించి నిధుల కొరత ఏమాత్రం లేదని, నిర్మాణం పూర్తయిన దశలను బట్టి బిల్లుల చెల్లింపులు వెంటనే జరుగుతాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఈ అరుణకుమారి, వర్క్ ఇన్స్పెక్టర్ రమణబాబు, రాజారావు పాల్గొన్నారు. గృహనిర్మాణ శాఖ పీడీ బాబునాయక్ -
కాలువలో కాంక్రీట్ వాల్ నిర్మించొద్దు
ఎస్.రాయవరం: ఉప్పరాపల్లి పైడితల్లమ్మ కాలువలో దిగువ రైతులకు సాగునీరు వెళ్లకుండా చేపట్టిన కాంక్రీట్ వాల్ నిర్మాణాన్ని ఆయకట్టు రైతులు ఆదివా రం అడ్డుకున్నారు. 3,600 ఎకరాలకు సాగునీరందించే కాలువలో పూర్తి స్థాయిలో పూడికతీత పనులు చేపట్టకపోగా, ఇప్పుడు టీడీపీ మండలాధ్యక్షుడు ప్రోద్బలంతో ఇరిగేషన్ అధికారులు కాంక్రీట్ వాల్ నిర్మించడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిద్దరి ప్రయోజనాల కోసం వందలాది మంది రైతుల భూములకు సాగునీరు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఏఈ భాను స్పందిస్తూ కాలువలో కాంక్రీట్ వాల్ వేయడం వల్ల ఏ ఒక్కరికీ ఇబ్బందులు ఉండవని, రైతులు అడ్డుకుంటే పనులు ఆపేస్తామన్నారు. ఇరిగేషన్ మెయింటెనెన్స్ గ్రాంట్ రూ. 9 లక్షలతో పనులు చేపడుతున్నామన్నారు. -
సత్యసాయి సేవా సంస్థల సేవలు విస్తృతం
అనకాపల్లి: సత్యసాయి సేవా సంస్థల సేవలు మరింత విస్తృతం చేయాలని ఆ సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.లక్ష్మణరావు పిలుపునిచ్చారు. స్థానిక గవరపాలెం గౌరీగ్రంథాలయం ఆవరణలో జిల్లా సత్య సేవా సంస్థల జిల్లా కన్వీనర్లతో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సత్యసాయి 101వ జయంతి సందర్భంగా ఈ ఏడాది భారీగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి సమితి పరిధిలో మొక్కలను నాటాలన్నారు. నారాయణ సేవ, మెడికల్ క్యాంపులు, దుప్పట్లు పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ ఏడాది నవంబర్ 23వ తేదీన సాయిబాబా శత జయంతి నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సమితి జిల్లా అధ్యక్షుడు కసిరెడ్డి అప్పలనాయుడు, ప్రతినిధులు కామరాజు, మూర్తి, గౌరీ, విద్యా, బీవీపీ మహేశ్వరి, భారతి తదితరులు పాల్గొన్నారు. -
కళ్లలో కసి.. మనసులో మమత
కొమ్మాది: కళ్లలో కసి.. మాటల్లో గాంభీర్యం.. తెరపై కనిపిస్తే ప్రత్యర్థులకు భయం పుట్టించే విలన్ పాత్రలు. కానీ నిజ జీవితంలో మాత్రం సున్నితమైన మనసున్న కళాకారుడు. తన నటనతో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సహా పలు భాషల్లో ప్రతినాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశాఖవాసి సీనియర్ నటుడు సత్యప్రకాశ్. విశాఖ తిమ్మాపురంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ‘సాక్షి’తో తన సినీ ప్రయాణం, విశాఖతో అనుబంధం, కుమారుడి సినీ భవిష్యత్పై తన కలలను పంచుకున్నారు. అక్కయ్యపాలెం నుంచి వెండితెర వరకు.. అక్కయ్యపాలెంలో పుట్టిన సత్యప్రకాశ్కు చిన్ననాటి నుంచే నటనపై ఆసక్తి ఉండేది. సినీ రంగంలో అడుగులు వేస్తున్న సమయంలో దర్శకుడు రవిరాజా పినిశెట్టి అవకాశం ఇచ్చారని, తనను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన వారిలో మెగాస్టార్ చిరంజీవి పాత్ర కూడా మరువలేనిదని ఆయన గుర్తు చేసుకున్నారు. ‘పోలీస్ స్టోరీ’తో మొదలైన విలన్ ప్రయాణం విలన్గా తన సినీ ప్రస్థానం ‘పోలీస్ స్టోరీ’ చిత్రంతో ప్రారంభమైందని సత్యప్రకాశ్ తెలిపారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా సాగిన ఆయన ప్రయాణంలో ఇప్పటివరకు 700కు పైగా సినిమాల్లో నటించారు. ‘సరిపోదా శనివారం’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి చిత్రాల్లోనూ కనిపించిన ఆయన.. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’, ‘ఫౌజి’, నాని నటిస్తున్న ‘ప్యారడైజ్’ సినిమాలతో పాటు మరో 14 చిత్రాల్లో నటిస్తున్నారు. అవార్డుల కంటే చిరు ఇచ్చిన కారు ప్రత్యేకం సుదీర్ఘ సినీ జీవితంలో ఎన్నో అవార్డులు, సన్మానాలు అందుకున్నప్పటికీ.. మెగాస్టార్ చిరంజీవి తనకు ఇచ్చిన బహుమతిని మాత్రం ఎప్పటికీ మరిచిపోలేనని సత్యప్రకాశ్ చెప్పారు. ‘బిగ్బాస్ సినిమా సమయంలో చిరంజీవి నాకు ఇచ్చిన కారు నా జీవితంలో ప్రత్యేక జ్ఞాపకం’ అని ఆయన భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు. వైజాగ్.. నా అదృష్టం విశాఖవాసిగా పుట్టడం నా అదృష్టం. ఇక్కడి ప్రజలు సినిమాలను మాత్రమే కాదు.. కళాకారులను కూడా తమ కుటుంబ సభ్యుల్లా ఆదరిస్తారు. ప్రకృతి అందాలతో విశాఖ ఓ అద్భుతమైన సినిమా వేదిక అని సత్యప్రకాశ్ అన్నారు. తక్కువ ఖర్చుతో అత్యద్భుతమైన విజువల్స్ అందించగల సామర్థ్యం విశాఖకు ఉందని, మరిన్ని చిత్రాల షూటింగ్లు ఇక్కడ జరగాలని ఆకాంక్షించారు. విలన్గా పేరు.. తండ్రిగా మాత్రం హీరో కావాలి తాను ఎన్నో చిత్రాల్లో ప్రతినాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, తన కుమారుడు నటరాజ్ను హీరోగా చూడాలన్నదే తన కోరిక అని సత్యప్రకాశ్ తెలిపారు. ఇప్పటికే కన్నడంలో ‘మనసు మల్లిగె’, ‘ఉగ్రావతార’, తెలుగులో ‘ఉల్లాలా ఉల్లాలా’, ‘అమ్మదీవెన’ వంటి చిత్రాల్లో నటరాజ్ హీరోగా నటించారు. సెప్టెంబర్ 4న ‘ధర్మస్థల నియోజకవర్గం’ నటరాజ్ హీరోగా నటించిన ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రం సెప్టెంబర్ 4న విడుదల కానుందని సత్యప్రకాశ్ తెలిపారు. ఈ చిత్రంలో సాయికుమార్, సుమన్ వంటి ప్రముఖ నటులు నటిస్తున్నారని, ఇది తన కుమారుడి కెరీర్లో కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.తెలుగు ప్రేక్షకుల ఆశీస్సులు నటరాజ్కు అందాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. -
ఓటీ సర్వీసులను రెస్టాఫ్గా మార్చాలని డిమాండ్
అనకాపల్లి: నర్సీపట్నం, అనకాపల్లి డిపోల్లో అన్ని ఓటీ సర్వీసులను రెస్టాఫ్గా మార్చి ప్రయాణికులకు బస్సు సౌకర్యం మెరుగుపరచాలని నేషనల్ మజ్ధూర్ యూనిటీ అసోసియేషన్ రీజనల్ కార్యదర్శి పి.సుధాకర్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక డిపో వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ సర్క్యులర్ 1/2019కు విరుద్ధంగా విధుల నుంచి తొలగించిన డ్రైవర్ ఇ.రమణను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, నర్సీపట్నం–విశాఖ నైట్ సర్వీసులకు డ్యూటీ అవర్స్ తగ్గించాలని, స్టాఫ్ రెస్ట్రూమ్ సౌకర్యం మెరుగుపరచాలన్నారు. అర్హులైన మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్లు ఇవ్వాలని, ఉద్యోగులకు లీవు పొజీషన్ మెరుగుపరచాలని, గ్యారేజీలో కార్మికులకు నాణ్యమైన టూల్స్, సరిపడా స్పేర్పార్ట్స్ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి జి.శంకరరావు, రీజనల్ అధ్యక్షుడు రాజు, తదితరులు పాల్గొన్నారు. -
దమ్ముంటే డీఎస్సీపై సీబీఐ విచారణకు ఆదేశించాలి
బీచ్రోడ్డు(విశాఖ): రాష్ట్రంలో డీఎస్సీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అంతా ఓ బూటకమని, నిరుద్యోగ యువతను ప్రభుత్వం నట్టేట ముంచుతోందని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ఆరోపించారు. ‘మ్యాప్స్’ (మెగా డీఎస్సీ ఆత్మగౌరవ పోరాట సమితి) ఆధ్వ ర్యంలో ఆదివారం నిర్వహించిన సభ మంత్రి నారా లోకేష్ సొంత ప్రచారం కోసం ఏర్పాటు చేసిన కపట నాటకమని విమర్శించారు. ఈ ప్రచార సభ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగాల ఎంపిక పారదర్శకంగా జరిగితే నారాయణ, శ్రీచైతన్య, బెహరా వంటి ప్రైవేట్ విద్యా సంస్థల బస్సుల్లో జనాలను తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. దీని వెనుక స్థానిక డీఈవోలు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. డీఎస్సీతోపాటు స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలు, అవకతవకల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే విశాఖలో ఇలాంటి సభలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సీబీఐ విచారణను తప్పించుకునేందుకే ఈకార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. దమ్ముంటే తక్షణ మే సీబీఐ విచారణకు ఆదేశించి నారా లోకేష్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని, లేనిపక్షంలో మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
ఓటు హక్కు ప్రతిఒక్కరి బాధ్యత
● నమోదు తప్పనిసరి ● జేసీ తిరుమణి శ్రీపూజ పాడేరు: ఓటు హక్కు కలిగి ఉండటం ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత అని, 18 ఏళ్లు నిండిన యువతీ యువకులందరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ (జేసీ) తిరుమణి శ్రీపూజ సూచించారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఓటు హక్కు నమోదుపై అవగాహన సదస్సు నిర్వహించారు. 18 ఏళ్లు పూర్తయిన పలువురు యువతీ యువకులకు జేసీ స్వయంగా దగ్గరుండి ఆన్లైన్లో ఓటు నమోదు ప్రక్రియ పూర్తి చేయించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. బాధ్యతగల యువత ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొంది, ఎన్నికల సమయంలో సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోవడానికి తమ విలువైన ఓటును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఇంటి నుంచే నమోదు.. 18 ఏళ్లు నిండిన యువత, విద్యార్థులు తమ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి ’ఓటర్ హెల్ప్లైన్’ యాప్ డౌన్లోడ్ చేసుకుని లేదా ఓటర్స్.ఈసీఐ.జీవోవీ.ఇన్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఇంటి వద్ద నుంచే దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఫారమ్–6 తో పాటు పాస్పోర్ట్ సైజు ఫోటో, ఆధార్ కార్డ్ లేదా 10వ తరగతి సర్టిఫికేట్ను జతచేయాల్సి ఉంటుందన్నారు. అన్ని కళాశాలల్లో అర్హులైన విద్యార్థులందరినీ ఓటర్లుగా నమోదు చేసేందుకు బీఎల్వోలు, కళాశాల యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మణమూర్తి, రెవెన్యూ ఆర్ఐ నల్లన్న, బిఎల్ఓలు రవికుమార్, లీలాప్రసాద్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులకు అభినందన
నాతవరం: మండలానికి చెందిన నలుగురు విద్యార్థులు సాఫ్ట్బాల్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం ఆనందంగా నాతవరం ఎస్ఐ వై.తారకేశ్వరరావు అన్నారు.నాతవరం స్కూల్లో ఆదివారం రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులను ఎన్ఆర్ఐ సతీష్, స్థానిక గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు అభినందించారు, ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ నాతవరం హైస్కూల్లో చదువుతున్న అఖిల, గ్రేస్ బాలికల విభాగం నుంచి, జస్వంత్, సింహాద్రి బాలుర విభాగం నుంచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారన్నారు. ఎన్ఆర్ఐ సతీష్ మాట్లాడుతూ విద్యాతోపాటు చదువు ముఖ్యమన్నారు. -
జీతాలు చెల్లించే వరకూ రిలే దీక్షలు
కశింకోట: ఆర్ఈసీఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న కశింకోటలో పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపక సిబ్బంది సెలవు రోజు ఆదివారం కూడా రిలే దీక్షలు నిర్వహించారు. గత నెల నుంచి తమకు నిలిపి వేసిన జీతాలు తక్షణమే ఏపీఈపీడీసీఎల్ అధికారులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ దీక్షలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్షలు నాల్గో రోజుకి చేరాయి. ఈ సందర్భంగా తమ జీతాలు చెల్లించి, తమకు ఇవ్వాల్సిన సౌకర్యాలు అమలు చేసే వరకు ఆందోళన విరమించేది లేదని, మరింత తీవ్రతరం చేస్తామని పాలిటెక్నిక్ అధ్యాపక సిబ్బంది యూనియన్ అధ్యక్షుడు శరగడం హేమంత్ కార్యదర్శి బి. నగేష్ ఈ సందర్భంగా హెచ్చరించారు. అసోసియేట్ ప్రిన్సిపాల్ కె. శివ, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. -
‘అనకాపల్లిని కరువు జిల్లాగా ప్రకటించాలి’
ఎస్.రాయవరం: వచ్చే నెల 2న జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి చందబాబునాయుడు అనకాపల్లిని కరువు జిల్లాగా ప్రకటించాలని ఏపీ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మండలంలోని రామయ్యపట్నంలో రైతు సంఘం నాయకులు పర్యటించి పొలాలను పరిశీలించారు. ఖరీఫ్లో నారుమడులు సైతం వర్షాభావం కారణంగా ఎండిపోయాయని వాపోయారు. ఈ ఏడాది రైతులు సాగు చేసే పరిస్థితి లేదన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేష్, రైతు సంఘ నాయకులు ఆర్. అప్పలకొండ, శివ, గోవిందు, దొరబాబు, ఆర్.నాగు తదితరులు పాల్గొన్నారు. -
గురువుకు అ‘పూర్వ’ సత్కారం
కోటవురట్ల: విద్యా బుద్ధులు నేర్పి, క్రమశిక్షణను అలవరిచి తమ ఉన్నతికి కారణమైన గురువును పూర్వ విద్యార్థులు అపూర్వ రీతిలో సత్కరించి తమ గురుభక్తిని, ఆత్మీయతను చాటుకున్నారు. రాట్నాలపాలెంలో 1988లో ఎంపీపీ స్కూల్ ప్రారంభం కాగా, ఆ పాఠశాలకు పత్రి ప్రసాదరావు అదే సంవత్సరంలో ఉపాధ్యాయుడిగా చేరారు. అప్పటి నుంచి 2001 వరకు అదే పాఠశాలలో ప్రాథమిక విద్యను అందించారు. ఆ సమయంలో అక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు ప్రస్తుతం వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరపడి ఉన్నత జీవితాలను అనుభవిస్తున్నారు. తమ ఉన్నతికి కారణమైన ప్రసాదరావు మాస్టారును మేళతాళాలతో పాఠశాలలోకి సాదరంగా తీసుకెళ్లి ఘనంగా సత్కరించారు. గురువు పాదాలకు ప్రణమిల్లి ఆశీర్వాదాలు తీసుకున్నారు. శిష్యుల ప్రేమానురాగాలకు భావోద్వేగానికి గురైన ప్రసాదరావు ఆనందభాష్పాలతో దీవించారు. ఈ అపూర్వ ఘటన గురు శిష్యుల బంధానికి తార్కాణంగా నేటి తరం విద్యార్థులకు మార్గదర్శంగా నిలిచింది. -
పశువుల షెడ్డు కాదు.. పాఠశాల
ముంచంగిపుట్టు: చూడగానే పశువుల పాక అనుకుంటే పొరపడినట్టే.. ఇది గిరిజన విద్యార్థులు చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాల దుస్థితి. ముంచంగిపుట్టు మండలం పెదగూడ పంచాయతీ గూడమాలిపుట్టు ఎంపీపీ పాఠశాలలో ప్రస్తుతం 33 మంది విద్యార్థులు చదువుతున్నారు. పక్కా భవనం లేకపోవడంతో గ్రామస్తులు, తల్లిదండ్రులు నిర్మించిన చిన్న రేకుల షెడ్డులోనే తరగతులు నిర్వహిస్తున్నారు. సరైన గోడలు లేకపోవడంతో వెదురుతో తడికలు అల్లి, వాటికి పాత చీరలను అడ్డంగా కట్టారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పైకప్పు పూర్తిగా కారిపోతుండగా, గోడలు లేకపోవడంతో గాలి, ఈదురుగాలులు నేరుగా లోపలికి వస్తున్నాయి. ఇలా అవస్థలు పడుతూనే ఆ చిన్నారులు చదువు కొనసాగిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ’నాడు–నేడు’ రెండో విడత కింద నిధులు మంజూరై పాఠశాల నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యా యి. భవన నిర్మాణానికి పునాది కోసం గోతులు తవ్వారు. అయితే, ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయా. ఇప్పటికై నా ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాల భవన నిర్మాణ సమస్యను పరిష్కరించాలని పెదగూడ మాజీ సర్పంచ్ మండి బాబురావుతో పాటు గూడమాలిపుట్టు గ్రామ గిరిజనులు కోరుతున్నారు. -
సిల్వర్ ఓక్ మొక్కల పంపిణీలో అక్రమాలు
చింతపల్లి: ప్రభుత్వ ద్వారా పంపిణీ అవుతున్న సిల్వర్ ఓక్ మొక్కలను పక్క గ్రామాల వారికి సొమ్ముకు అమ్ముకోకుండా, తమ గ్రామస్తులకే అందేలా చర్యలు తీసుకోవాలని బెన్నవరం పంచాయతీ కట్టువీధి గ్రామస్తులు కోరారు. ఈ మేరకు శనివారం వారు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కట్టువీధి గ్రామస్తులు విలేకరులతో మాట్లాడుతూ.. తమ గ్రామానికి 21 మందికి సిల్వర్ ఓక్ మొక్కలు మంజూరు కాగా, కేవలం ఇద్దరికి మాత్రమే ఇచ్చి మిగతా వాటిని పక్క గ్రామాలైన కొత్తవలస, పోతురాజుగున్నల రైతులకు ఒక్కో మొక్కకు రూ. 500 చొప్పున అమ్ముకున్నారని ఆరోపించారు. మా గ్రామానికి రావలసిన మొక్కలను పక్క గ్రామస్తులకు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తే సిబ్బంది దురుసుగా సమాధానం ఇస్తూ, ‘ఏం చేసుకుంటారో చేసుకోండి‘ అని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అంతేకాకుండా, గత నెల రోజులుగా గ్రామంలో ఉపాధి హామీ పని చేసినా, సంబంధిత టెక్నికల్ అసిస్టెంట్ కావాలనే తాత్సారం చేస్తూ వేతనాలు జనరేట్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. ఈ సమస్యపై ఇప్పటికే పలుమార్లు ఉపాధి అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో నేడు మండల అధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తమ గ్రామానికి రావాల్సిన సిల్వర్ ఓక్ మొక్కలను పంపిణీ చేయడంతో పాటు, నిలిచిపోయిన వేతనాలను ఇప్పించాలని వెలగ కృష్ణ, గెమ్మిలి జోసఫ్, మామిడి లక్ష్మణ్, సూకూరు యూసఫ్, సూకూరు చిన్నబ్బాయి, కొర్రా బాలకృష్ణ తదితరులు డిమాండ్ చేశారు. -
సినిమా రాజధానిగా విశాఖ
కొమ్మాది: భవిష్యత్తులో విశాఖ సినిమా రాజధానిగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొ రేషన్ చైర్మన్ భరత్ భూషణ్, ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తెలిపారు. తిమ్మాపురంలోని వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో శనివారం నిర్వహించిన ‘సినీ సెలిబ్రిటీ గాలా ఫిల్మ్ అవార్డ్స్– 2026’కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా మాట్లాడారు. విశాఖ ఇప్పటికే గూగుల్, ఐటీ రంగాల్లో ముందంజలో ఉందని, త్వరలోనే సిని మా రంగంలో కూడా కీలక కేంద్రంగా మారుతుందన్నారు. సినిమా షూటింగ్స్కు అనుకూలంగా మౌలిక సదుపాయాలు ఏర్పా టు చేయడంతో పా టు డబ్బింగ్ స్టూడియోలు, ఎడిటింగ్ సౌకర్యాలు వంటి అవసరమైన అన్ని వనరులను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. త్వరలోనే ప్రతిష్టాత్మక నంది అవార్డులను కూడా విశాఖలో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా టాలెంట్ వేవ్ స్టూడియోస్ లోగోను ఆవిష్కరించారు. నటీనటులు హెబ్బా పటేల్, శ్రీ సత్య ప్రకా శ్, కాశీ విశ్వనాథ్, షణ్ముక్, సేతురామ్ పాల్గొన్నారు. -
పాయకరావుపేటను కరువు నియోజకవర్గంగా ప్రకటించాలి
నక్కపల్లి: పాయకరావుపేట నియోజకవర్గంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నాలుగు మండలాలను కరువు ప్రాంతంగా ప్రకటించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తీవ్రంగా నష్టపోతున్న రైతులను తక్షణమే ఆదుకోవడంతోపాటు వారి రుణాలను రీషెడ్యూల్ చేయాలని కోరారు. నక్కపల్లిలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పంట ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి ఆర్థిక సహాయం అందించాలని కోరారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలవరం ఎడమ కాలువ పనులకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. అప్పట్లోనే 50 శాతం కాలువ పనులు పూర్తయ్యాయని తెలిపారు. అనంతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో మరో 25 శాతం పనులు జరిగాయన్నారు. పోలవరం ఎడమ కాలువకు వైఎస్సార్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. పశువులకు అవసరమైన పశుగ్రాసాన్ని ఉచితంగా లేదా సబ్సిడీపై ప్రభుత్వం అందించాలని కోరారు. పాయకరావుపేట నియోజకవర్గ రైతుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు అయినంపూడి మాణిరాజు, గొర్ల గోవిందరావు, వెలగ ఈశ్వరరావు, సూరకాసుల గోవిందు, తల్లా భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ -
కృష్ణదేవిపేట పీహెచ్సీలోనే టీకాల బాక్సులు నిల్వ చేయాలి
కొయ్యూరు: దూరభారాన్ని దృష్టిలో ఉంచుకుని కొయ్యూరు మండలంలోని 12 పంచాయతీలకు సంబంధించిన టీకాల బాక్సులను అనకాపల్లి జిల్లా కృష్ణదేవిపేట ఆసుపత్రిలోనే నిల్వ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీజేపీ నేతలు శనివారం ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. జిల్లాలు వేరు కాకముందు రావణాపల్లి, అంతాడ, నల్లగొండ, బంగారంపేట, కినపర్తి, రత్నంపేట, పెదమాకవరం, నడింపాలెం, బట్టపనుకుల, శరభన్నపాలెం తదితర పంచాయతీలు కృష్ణాదేవిపేట ఆసుపత్రి పరిధిలో ఉండేవని తెలిపారు. ఆ ప్రాంతం దగ్గరగా ఉండటంతో వైద్య సిబ్బంది అక్కడే టీకాలను నిల్వ చేసుకుని తీసుకువెళ్లేవారన్నారు. అయితే, జిల్లాలు వేరైన తర్వాత ఈ 12 పంచాయతీలను రాజేంద్రపాలెం ఆసుపత్రిలో విలీనం చేయడంతో దూరం బాగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కృష్ణదేవిపేటలోనే టీకాలను నిల్వ చేసుకునేందుకు సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని నేతలు కోరారు. దీనిపై ఎస్టీ కమిషన్ చైర్మన్ స్పందించి తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు మండల బీజేపీ అధ్యక్షుడు శివకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అరిమెల రాజు, జనజాతీయ సురక్ష మంచ్ రాష్ట్ర అధ్యక్షుడు డీవీడీ ప్రసాద్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
దిగొచ్చిన ప్రభుత్వం
మధురవాడ: అర్ధరాత్రి బలవంతంగా వివిధ ప్రాంతాలకు తరలించిన 9, 10 తరగతులకు చెందిన కొంతమంది విద్యార్థులు శనివారం మారికవలసలోని గురుకులానికి తిరిగి వచ్చారు. ఇక్కడ ఉన్న ఏపీ గిరిజన గురుకుల సంక్షేమ ఇంగ్లీష్ మీడియం స్కూల్ను ప్రభుత్వం సీవోఈగా మార్చాలని నిర్ణయించడంతో రెండు రోజుల క్రితం ఈ పాఠశాలకు చెందిన 480 మంది విద్యార్థులను అధికార యంత్రాంగం అర్ధరాత్రి పోలీసు పహారా మధ్య బలవంతంగా తరలించింది. ఈ క్రమంలో అధికారులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, వైఎస్సార్ సీపీ, ప్రజా సంఘాలు ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టాయి. ఇక్కడి నుంచి వెళ్లిన విద్యార్థులు తమ ఇళ్లకు, ఇతర గురుకులాలకు వెళ్లకుండా మారికవలస గురుకుల ఇంగ్లీష్ మీడియం స్కూల్ను అక్కడే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాలతో కలిసి పాడేరు ఐటీడీఏ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగొచ్చింది. మారికవలస గురుకుల ఇంగ్లిష్ మీడియం స్కూల్ను అక్కడే కొనసాగిస్తామని అధికారులు ప్రకటించారు. అనంతరం అక్కడ నుంచి 37 మంది విద్యార్థులను తిరిగి పంపించారు. అంతా అయోమయం ప్రజా సంఘాలు, వైఎస్సార్సీపీ ఆందోళనలకు తలొగ్గి 37 మంది విద్యార్థులను వెనక్కి పంపించారు. అయితే మారికవలసలో సీవోఈ పేరుతో సుమారు 270 మంది వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఒకటి రెండు రోజుల్లో మరో 300 మంది బాలికలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇక్కడ భవనాలకు మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎవరు ఎక్కడ ఉంటారు? అనే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. హైస్కూల్ బాలుర వసతి, చదువుకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని తెలుస్తోంది. -
కైరళీలో ఘనంగా ఓనం
● ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ● అబ్బురపరిచిన పులి వేషధారణలు దేవరాపల్లి: ఓనం వేడుకలను స్థానిక కై రళీ ఇంగ్లిష్మీడియం హైస్కూల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. స్కూల్ కరస్పాండెంట్ ఎం.కె.దినేష్, ప్రిన్సిపాల్ లిస్సీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో స్థానిక విద్యార్థులు, కేరళ మహిళా ఉపాధ్యాయులు కేరళ సంప్రదాయ దుస్తులు ధరించి ఆటపాటలతో సందడి చేశారు. విద్యార్థులు చేసిన నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. విద్యాలయ ప్రాంగణంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థుల మహాబలి రాజు, పులి వేషధారణలు, పులికలి టైగర్స్ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్అవార్డుతో మరింత గుర్తింపు
● కలెక్టర్ నిశాంతిపాఠశాలలకు అవార్డులు అందజేస్తున్న కలెక్టర్ నిశాంతి పాడేరు రూరల్: స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ అవార్డులు ప్రతిభ కనబరిచిన పాఠశాలలకు మరింత గుర్తింపు తెస్తాయని జిల్లా కలెక్టర్ నిశాంతి తెలిపారు. శనివారం తలారిసింగి బాలుర పాఠశాల ఆవరణలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ అవార్డుల ప్రదానోత్సవ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంతి మాట్లాడుతూ... అవార్డులకు ఎంపికై న ఐదు పాఠశాలలకు మరింత ప్రోత్సాహం, ప్రత్యేక గుర్తింపు లభిస్తాయని చెప్పారు. మొదటి స్థానం 95 మార్కులతో అరకులోయ క్రీడా పాఠశాల, రెండో స్థానం 71 మార్కులతో గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల, గుత్తులపుట్టు (పాడేరు), మూడో స్థానం 33 మార్కులతో బాలుర పాఠశాల, తలారిసింగి (పాడేరు), నాల్గో స్థానం 26 మార్కులతో గిరిజన సంక్షేమ పాఠశాల, బాకురు (హుకుంపేట), ఐదో స్థానం: 25 మార్కులతో గిరిజన సంక్షేమ పాఠశాల, నుర్మతి (జి.మాడుగుల) సాధించాయి. అనంతరం ఆయా పాఠశాలల యాజమాన్యాలకు ఆమె బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి భానుమూర్తిరాజు, ఎస్జీఎఫ్ జిల్లా సెక్రెటరీ పాంగి సూరిబాబు, పీడీలు భూపతిరాజు, సింహచలం, మన్మథరావు, శివప్రసాద్, మురళి, కృష్ణకుమారి, రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. -
యువత ఆధ్వర్యంలో గ్రంథాలయం
● నేడు చౌడుపల్లిలో ప్రారంభం ● ఏర్పాట్లు పూర్తి చౌడుపల్లిలో రప్రారంభానికి సిద్ధం చేసిన గ్రంథాలయ భవనం చింతపల్లి: చౌడుపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయ భవనాన్ని నేడు ప్రారంభించనున్నారు. స్థానిక యువత, గ్రామస్తుల సహకారంతో పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలోని పాత పంచాయతీ భవనంతో పాటు నిరుపయోగంగా ఉన్న డీఆర్డీఏ భవనాన్ని విద్యార్థులు, నిరుద్యోగుల సౌకర్యార్థం గ్రంథాలయంగా తీర్చిదిద్దారు. ఈ గ్రంథాలయానికి అవసరమైన అన్ని సౌకర్యాలను గ్రామస్తుల సహకారంతో సమకూర్చారు. గ్రామ పెద్దల సమక్షంలో నేడు ఈ గ్రంథాలయాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రామంలోని విద్యార్థులు, యువత, ఉద్యోగులందరూ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరు కావాలని గ్రంథాలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు. -
వినూత్న ప్రాజెక్టుతో ఆకట్టుకున్న నాగజ్యోతి
రోలుగుంట: విద్యార్థుల అభ్యసనాన్ని మరింత సులభతరం, ఆసక్తికరం ఫలప్రదం చేసేందుకు ఆంగ్ల టీచర్ పీవీఎం నాగజ్యోతి రూపొందించిన ప్రాజెక్టు ప్రశంసలు అందుకుంది. ప్రభుత్వ సి.ఎస్.ఇ(కమిషనర్ ఆఫ్ స్కూలు ఎడ్యుకేషన్) తమీమ్ అన్సారీ ఆమె అధ్యయనాన్ని అభినందించారు. ఈ సందర్భంగా టుర్కూ యూనివర్సిటీ వైస్ రెక్టార్ మాయ పితోలా ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ డెవలప్మెంటు సర్టిఫికెటు ప్రదానం చేశారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల టీచర్గా పనిచేస్తున్న నాగజ్యోతి ఏపీ పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఫిన్లాండు విద్యా అధ్యయనం పర్యటనకు వెళ్లిన విషయం విదితమే. అక్కడ వర్సిటీలో గత నెల 17 నుంచి పది రోజుల పాటు నిర్వహించిన శిక్షణ ఈ నెల 27వ తేదీతో విజయవంతంగా పూర్తి చేసుకుంది.ఫిన్లాండ్లో విద్యా వ్యవస్థపై సమగ్ర అధ్యయనం -
ఉద్యమం తీవ్రతరం
అధికారులు మాటతప్పితే పాడేరు రూరల్: జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో ఇచ్చిన మాట తప్పితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి. అప్పలనర్స హెచ్చరించారు. మారికవలస గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ గత నెల రోజులుగా చేపట్టిన నిరసన దీక్షలు, ఆందోళనలను శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవో ఇచ్చిన హామీ మేరకు విరమించినట్లు ఆయన శనివారం తెలిపారు. అనంతరం పీవో సమక్షంలో వివిధ పాఠశాలల విద్యార్థులను తిరిగి మారికవలస పాఠశాలలో చేర్పించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లా కలెక్టర్, పీవో తమ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, వారిపై ఉన్న నమ్మకంతోనే తాము ఆందోళన విరమించామని తెలిపారు. అయితే, సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల ప్రకారం విద్యార్థులను మళ్లీ పాఠశాల నుంచి పంపించేస్తారనే వార్తలు నిజమైతే మాత్రం ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చుతుందని హెచ్చరించారు. ఐక్య ఉద్యమంతోనే స్పందించిన అధికారులు అధికారులు ఇచ్చిన హామీలతోనే ఆందోళన విరమించి విద్యార్థులను తిరిగి పాఠశాలలో చేర్పించామని, ఒకవేళ అధికారులు గానీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం గానీ మాట మార్చితే ఉద్యమం తారాస్థాయికి చేరుతుందని స్పష్టం చేశారు. అధికారుల హామీతో ఆందోళనలు విరమించిన విద్యార్థుల తల్లిదండ్రులు, గిరిజన సంఘం, విద్యార్థి, మహిళా సంఘాల నాయకులు ఐటీడీఏ ముఖద్వారం వద్ద సమావేశమై థింసా నృత్యాలతో సంబరాలు చేసుకున్నారు. ఐక్య పోరాటంతోనే సమస్యకు పరిష్కారం లభించిందని ప్రజాసంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, హెచ్ఆర్ఎఫ్ రాష్ట్ర చైర్మన్ శోభ (చిన్ని), ఆదివాసీ మహిళా సంఘం నేత హైమవతి, ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ నాయకుడు వైకుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు చిన్నారావు, నాయకులు కొత్తయ్య, భీమరాజు, భాను, విమల తదితరులు పాల్గొన్నారు. -
మద్యం మత్తులో కారుతో ఢీ
● కౌలు రైతు మృతి,మరో ముగ్గురికి గాయాలు ● రేవుపోలవరం రోడ్డులో ఘటన ఎస్.రాయవరం: మద్యం సేవించి కారు నడిపిన వ్యక్తి వెనుక నుంచి సైకిల్, స్కూటీని ఢీకొట్టడంతో కౌలు రైతు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ సంఘటన రేవుపోలవరం రోడ్డులో శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ రమేష్, స్థానికుల కథనం మేరకు.. మండలంలోని గుర్రాజుపేట సమీపంలో రేవుపోలవరం రోడ్డులో సైకిల్పై వస్తున్న కౌలు రైతు పెంకి మన్నియ్య(65)ను, స్కూటీపై వస్తున్న మరో ముగ్గురిని రేవుపోలవరం నుంచి అడ్డురో డ్డు వైపు వస్తున్న కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దాంతో మన్నియ్య అక్కడికక్కడే మృతి చెందగా, స్కూటీపై వస్తు న్న ముగ్గురికి గాయాలయ్యా యి. మృతుడు మన్నియ్యది నక్కపల్లి మండలం పెదతీనార్ల గ్రా మంగా పోలీసు లు గుర్తించారు. గుడివాడలో కొబ్బరి తోట కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. పొలం పనులు చూసుకుని రాత్రి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమా దానికి గురయ్యా డు. గుడివాడ శివారు లక్ష్మీపతిరాజుపేట గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు స్కూటీపై వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదానికి కారణమైన వారు కారు వదిలి పరారయ్యినట్టు ఎస్ఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
అమ్మానాన్నకు ఏం చెప్పాలిరా?
గండేపల్లి/మాడుగుల రూరల్: స్నేహితులను మించిన అన్నదమ్ముల అనుబంధం వారిది. అప్పటివరకు కలిసే ఉన్న వారి బంధంపై విధికి కన్ను కుట్టిందేమో.. ప్రమాద రూపంలో వెంటాడి విడదీసింది. దైవ దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా జరిగిన ప్రమాదంలో కళ్లముందే తమ్ముడు మృతిచెందడంతో అన్న పడిన వేదన వర్ణనాతీతం. ఇరవై రెండేళ్లు కలిసే ఉన్నాం కదరా.. నన్నొంటరిని చేసి వెళ్లిపోయావా తమ్ముడు.. అంటూ తోడబుట్టిన తమ్ముడి కోసం అన్న పడుతున్న వేదన చూపరులను కన్నీళ్లు పెట్టించింది. ఈ ప్రమాదంలో మణికట్టు తెగిపడి తానూ తీవ్ర గాయాలపాలైనప్పటికీ.. ఆ నొప్పిని భరిస్తూనే.. ‘నీకోసం అడిగితే.. అమ్మ నాన్నకు ఏం సమాధానం చెప్పాలిరా..’ అంటూ ఆ అన్న భోరున విలపించిన తీరు చూసి అంబులెన్స్ సిబ్బంది కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన కాకినాడ జిల్లా గండేపల్లి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం అవురువాడ పంచాయతీ శివారు కాగిత గ్రామానికి చెందిన రబ్బా రమణ కుటుంబం కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. రమణకు ఒక కుమార్తె, రబ్బా నవీన్, రబ్బా ప్రసాద్ (22) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. అన్నదమ్ములు ఇద్దరూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాడపల్లిలో కొలువైన వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు బైక్పై గత ఆరు వారాలుగా ప్రతి శనివారం వచ్చి వెళుతున్నారు. ఏడో వారమైన ఈ శనివారం కూడా వాడపల్లికి వచ్చిన వీరు దర్శనానంతరం స్వగ్రామానికి బయలుదేరారు. సాయంత్రానికి మండలంలోని మురారి గ్రామంలో గల బ్యాంక్ ఆఫ్ బరోడా సమీపంలోకి వచ్చేసరికి ఇసుక లోడుతో ముందు వెళుతున్న టిప్పర్ లారీని తప్పించే ప్రయత్నంలో బైక్ హ్యాండిల్ లారీకి తగిలి అదుపుతప్పి వెనుక చక్రాల కింద పడిపోయారు. ఈ ఘటనలో ప్రసాద్ నడుము భాగం పైనుంచి లారీ దూసుకుపోవడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. నవీన్ కుడి చెయ్యి లారీ చక్రాల కింద చిక్కుకుని మణికట్టు వరకు తెగిపడింది. స్థానికుల సహాయంతో 108 అంబులెన్స్లో క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జీజీహెచ్కు తరలించారు. ప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జెడ్ రాగంపేట సీహెచ్సీకి తరలించారు. ప్రమాద స్థలం వద్దకు చేరుకున్న రోడ్డు సేఫ్టీ పోలీస్, హైవే సేఫ్టీ సిబ్బంది ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ యూవీ శివనాగబాబు తెలిపారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే మండల వైఎస్సార్సీపీ యూత్ అధ్యక్షుడు తంటపురెడ్డి బన్నీ, కాగిత గ్రామస్తులు సంఘటనా స్థలానికి వెళ్లారు. చేతికి అందివచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లి దండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. నన్నొంటరిని చేశావా తమ్ముడూ? 22 ఏళ్లు కలిసే ఉన్నాం కదరా! తీవ్రంగా గాయపడినా.. కళ్లముందే తమ్ముడి మృతిని తట్టుకోలేక అన్న ఆక్రోశం బైక్ అదుపుతప్పిన ఘటనలోతమ్ముడు మృతి మణికట్టు వరకు తెగిపడినఅన్న కుడి చెయ్యి దైవదర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా ఘటన -
అమరావతి చాంపియన్షిప్ పోటీల్లో నర్సీపట్నంక్రీడాకారులకు పతకాలు
నర్సీపట్నం: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ ఇండోర్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన అమరావతి చాంపియన్షిప్ క్రీడా పోటీల్లో నర్సీపట్నం క్రీడాకారులు పలు పతకాలు సాధించారు. బాక్సింగ్లో చక్రాంతి రోహిణి, సకిరెడ్డి హరిణి, బొంతు మౌనిక, లగుడు సమంత గోల్డ్ మెడల్స్ సాధించారు. యర్రా తేజస్విని, కోడూరు కుసుమ సిల్వర్ మెడల్స్ పొందారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్పీకర్ సీహెచ్.అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. నర్సీపట్నం క్రీడాకారులను స్పీకర్ ప్రత్యేకంగా అభినందించారని శాప్ కోచ్ అబ్బు తెలిపారు. -
షాట్పుట్ పోటీల్లో సీలేరు క్రీడాకారిణి ప్రతిభ
● రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంమొదటి స్థానం సాధించిన సీలేరు విద్యార్థిని దాక్షిత సీలేరు: మారుమూల ప్రాంతాల్లో చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించగలమని సీలేరు విద్యార్థులు మరోసారి నిరూపించారు. మైదాన ప్రాంత క్రీడాకారులతో పోటీపడి మొదటి స్థానాలు సాధిస్తూ పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తున్నారు. ఇందులో భాగంగానే రాజాంలో జరిగిన అండర్–14 బాలికల విభాగం షాట్పుట్ పోటీల్లో సీలేరు ఏపీ జెన్కో డీఏవీ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న బి. దాక్షిత ప్రథమ స్థానం సాధించి గోల్డ్ మెడల్ కై వసం చేసుకుంది. ఈ విషయాన్ని పాఠశాల పీఈటీ కమలాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఘనత సాధించిన విద్యార్థిని దాక్షితను, పీఈటీ కమలాకర్ను పాఠశాల ఎల్ఎంసీ చైర్మన్, జెన్కో సూపరింటెండెంట్ ఇంజనీర్ జాకీర్ హుస్సేన్, లీగల్ ఆఫీసర్ ప్రసాద్, ప్రిన్సిపల్ బి. నాగేంద్ర అభినందించారు. -
వైఎస్సార్సీపీ పోరాటంతో దిగొచ్చిన కూటమి సర్కార్
సాక్షి, అల్లూరి జిల్లా: విద్యార్థుల తల్లిదండ్రులు, వైఎస్సార్సీపీ పోరాటంతో కూటమి ప్రభుత్వం దిగొచ్చింది. మారికవలస గురుకుల పాఠశాలను యథాతధంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది మారికవలస గురుకుల పాఠశాలను యథాతధంగా కొనసాగించాలని.. లేదంటే నేడు సీఎం చంద్రబాబు అరకు పర్యటనను అడ్డుకుంటామని విద్యార్థుల తల్లిదండ్రులు, వైఎస్సారర్సీపీ హెచ్చరించింది. తల్లిదండ్రులు, వైఎస్సార్సీపీ పోరాటంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మారికవలస స్కూల్ యథాతదంగా కొనసాగించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది.విద్యార్థులు తల్లిదండ్రులకు హామీ ఇచ్చిన అధికారులు.. అల్లూరి జిల్లా నుంచి మారికవలసకు బస్సుల్లో విద్యార్థలను తరలించారు. మారికవలస స్కూల్ యథావిధిగా కొనసాగించాలని గత కొన్ని రోజులుగా విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. విద్యార్థులు తల్లిదండ్రుల పోరాటానికి వైఎస్సార్సీపీ అండగా నిలిచింది.వైఎస్ జగన్ హెచ్చరికలతో..అమరావతి: పంటల బీమా పథకం ద్వారా పెండింగ్లో ఉన్న రాష్ట్ర వాటా ప్రీమియం సబ్సిడీ చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరికలతో సర్కారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్బీవై) ద్వారా పెండింగ్ ప్రీమియం బకాయిలు రూ.500 కోట్లు విడుదలకు పరిపాలనా అనుమతి మంజూరు చేస్తూ శుక్రవారం వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ జీవోఆర్టీ నంబర్ 821ను జారీ చేశారు.ఇదీ చదవండి: సంక్షోభంలో కృష్ణా బేసిన్కరువు కాటేస్తున్నవేళ చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించు కోకుండా కుంభకర్ణుడి నిద్రలో ఉందంటూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కారు ఆఘమేఘాల మీద పెండింగ్ ప్రీమియం బకాయిల కోసం నిధులు విడుదల చేయడం చర్చనీయాంశమైంది. -
న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి
యలమంచిలి రూరల్: న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యలమంచిలిలో శుక్రవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. తెలంగాణ, రాజస్తాన్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు అమలు చేస్తున్నాయని, మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించిన చట్టం చేయాలని వారంతా కోరారు. స్థానిక న్యాయస్థానాల ప్రాంగణం ఎదుట నిర్వహించిన ఈ నిరసనలో పాల్గొన్న న్యాయవాదులు మాట్లాడుతూ తమ డిమాండ్ సాధన కోసం వచ్చే సోమవారం కూడా విధులు బహిష్కరించనున్నట్టు తెలిపారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను అమలు చేయాలని నినాదాలు చేశారు. స్థానిక న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కొన్ని సివిల్ కేసులకు సంబంధించి పోలీసు,రెవెన్యూ అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఆసరాగా చేసుకుని పాల్పడుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు తీర్మానించారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదుల ద్వారా సమాంతర కేసులు నడుపుతున్నారని పోలీసు,రెవెన్యూ అధికారులపై న్యాయవాదులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇకపై అలాంటి అక్రమాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.యలమంచిలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అధ్యక్షుడు పి.వి. రమణ,కూనిశెట్టి శ్రీను,నగిరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
స్లాష్ పరీక్షల పరిశీలన
కొయ్యూరు: మండలంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి విద్యార్థి సాధన పరీక్ష (స్లాష్)ను జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి శశికుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రాజేంద్రపాలెం బాలికల పాఠశాల, కొయ్యూరు ప్రభుత్వోన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల మరియు గంగవరం ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించి పరీక్షా తీరును పర్యవేక్షించారు. తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టులలో విద్యార్థుల అభ్యాసన స్థాయిలు, ప్రతిభ ఏ విధంగా ఉందనే అంశంపై ఈ పరీక్షను నిర్వహించారు. పారదర్శకత కోసం ఒక పాఠశాల ఉపాధ్యాయుడిని మరో పాఠశాలకు పరిశీలకుడిగా (బ్లాక్ అబ్జర్వర్గా) నియమించారు. విద్యార్థుల సమాధాన పత్రాలను నేరుగా రాష్ట్ర రాజధానికి పంపి, అక్కడ మూల్యాంకనం (కరెక్షన్) చేసి ప్రతిభను నిర్ధారిస్తారు. ఈ పరీక్షల్లో తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులను గుర్తించి, వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కొయ్యూరు మండల పరిధిలోని మొత్తం 9 పాఠశాలల్లో ఈ పరీక్ష విజయవంతంగా నిర్వహించినట్లు ఎంఈవో సింహాచలం.. ఏసీ శశికుమార్కు వివరించారు. -
ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించాలి
● మామూళ్ల మత్తులో రెవెన్యూ అధికారులు ● సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వెంకన్న ఆగ్రహం దేవరాపల్లి: మండలంలోని చింతలపూడి, సమ్మెద గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించి స్వాధీనం చేసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దేవరాపల్లిలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతలపూడి రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ, గిరిజనుల భూములను పట్టణ ప్రాంతానికి చెందిన పెత్తందారులు దర్జాగా కబ్జా చేస్తున్నారని విమర్శించారు. రెవెన్యూ అధికారులు ఆక్రమణదారుల నుంచి వచ్చే ముడుపులకు ఆశపడి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎటువంటి అనుమతులు, హక్కు పత్రాలు లేకుండానే 30 ఎకరాలకు పైగా ప్రభుత్వ, బంజరు భూములను, డీ–పట్టా భూములను ఆక్రమించి సాగు చేస్తున్నారని ఆరోపించారు. వాలా బు, గరిశింగి పంచాయతీల పరిధిలో సైతం విచ్చలవిడిగా ప్రభుత్వ భూములను చెరబడుతున్నారని విమర్శించారు. దళిత, గిరిజనులకు ప్రభుత్వం కేటాయించిన బంజరు భూములు అన్యాక్రాంతమవుతున్నా చోద్యం చూడటం దారుణమన్నారు. ఆక్రమించిన అసైన్డ్ భూములకు రెవెన్యూ అధికారులు ఫారం–3 ఇచ్చి బోర్లు వేయిస్తున్నారన్నారు. ఈ ఆక్రమణలపై పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. ఫిర్యాదుదారునికి తప్పుడు ఎండార్స్మెంట్ ఇచ్చి సమస్యను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి ఎక్కడా చూడలేదన్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూములను రక్షించాలని, లేకుంటే తామే ఎర్ర జెండాలు పాతి ఆ భూములను పేదలకు పంపిణీ చేస్తామని హెచ్చరించారు. -
భక్తిశ్రద్ధలతో సామూహిక వరలక్ష్మీ వ్రతం
హామీలు.. పర్యటనలు.. మళ్లీ హామీలేనా? గతంలో మన్యంలో పర్యటించిన సందర్భంగా గిరిజనులకు ఇచ్చిన హామీల్లో కీలకమైనవి ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవో నంబర్ 3 పునరుద్ధరణ నుంచి ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ వలంటీర్ల నియామకం వరకు.. వంజంగిలో ఇద్దరు గిరిజన మహిళలకు ఇచ్చిన హామీల వరకూ ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత హామీలకు పరిష్కారం చూపకుండానే సీఎం చంద్రబాబు మరోసారి శనివారం మన్యంలో పర్యటిస్తున్న నేపథ్యంలో అమలుకాని హామీల అంశం చర్చనీయాంశమైంది. మళ్లీ జిల్లాకు.. హామీల బాబుసాక్షి, పాడేరు: ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మన్యంలో పర్యటించనున్నారు. అరకులోయ మండలం గన్నెల ప్రాంతానికి శనివారం ఆయన రానున్న నేపథ్యంలో.. గతంలో గిరిజనులకు ఇచ్చిన హామీల అమలుపై చర్చ మొదలైంది. ఇప్పటికే రెండుసార్లు జిల్లాలో పర్యటించిన సీఎం పలు హామీలు ఇచ్చినా.. వాటిలో అనేకం ఇంకా కార్యరూపం దాల్చలేదని గిరిజన సంఘాలు, బాధితులు చెబుతున్నారు. హామీలు ఇచ్చి.. అమలుకు నోచుకోకుండానే మరోసారి పర్యటనకు వస్తున్నారు.. అంటూ వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అరకు సభలో హామీలు 2024 జనవరి 20న అరకు సభలో అప్పటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు గిరిజనులకు పలు హామీలు ఇచ్చారు. వారికి వందశాతం ఉద్యోగాల కల్పనకు సంబంధించిన జీవో నంబర్3ను తానే తీసుకొచ్చానని, అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని పునరుద్ధరిస్తామని.. సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయ జీవో తీసుకొస్తామని ప్రకటించారు. అలాగే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ వలంటీర్లను నియమిస్తామని హామీ ఇచ్చారు. ●కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నప్పటికీ జీవో నంబర్ 3 పునరుద్ధరణ జరగలేదని గిరిజన సంఘాలు పేర్కొంటున్నాయి. ప్రత్యామ్నాయ జీవోపైనా స్పష్టత రాలేదని చెబుతున్నాయి. మెగా డీఎస్సీకి ముందు వందశాతం ఉద్యోగాల కోసం గిరిజన అభ్యర్థులు, ఆదివాసీ ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శిస్తున్నాయి. ఆశ్రమ పాఠశాలల్లో వైద్య సేవలపై ఆందోళన గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ వలంటీర్ల నియామకం చేపట్టకపోవడంతో విద్యార్థులకు అత్యవసర వైద్య సేవలు అందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తల్లిదండ్రులు, ఆదివాసీ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ రెండేళ్లలో అనారోగ్య సమస్యలతో 11 మంది గిరిజన విద్యార్థులు మృతిచెందారని వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ వలంటీర్ల నియామకంపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మణికి అందని సాయం అదే గ్రామానికి చెందిన మరో ఆదివాసీ మహిళ కొమరం మణితోనూ సీఎం మాట్లాడారు. భర్త, ముగ్గురు పిల్లలతో సొంత ఇల్లు కూడా లేని ఆమె పరిస్థితిని తెలుసుకున్న చంద్రబాబు.. కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించడంతోపాటు మణి చేస్తున్న టైలరింగ్ వృత్తికి అనుగుణంగా దుకాణం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అక్కడే ఉన్న అధికారులకు బాధ్యతలు అప్పగించారు.సీఎం హామీతో తమ కుటుంబ పరిస్థితులు మారుతాయని ఆశించినా.. ఏడాది గడిచినా ఇప్పటివరకు ఎలాంటి సహాయం అందలేదని మణి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంజంగి మహిళలకూ ఎదురుచూపులే గత ఏడాది ఆగస్టు 9న పాడేరు మండలం వంజంగిలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. ఇద్దరు పేద గిరిజన మహిళలకు పలు హామీలు ఇచ్చారు. వ్యవసాయ కూలీ వంతాల కొండమ్మ ఇంటికి వెళ్లి ఆమె యోగక్షేమాలు తెలుసుకున్న సీఎం.. ఆమెకు పక్కా ఇల్లు నిర్మించడంతోపాటు పాడేరులో కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకునేందుకు దుకాణ నిర్మాణం చేపట్టి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.అయితే ఏడాది గడిచినా తనకు ఇల్లు, దుకాణ నిర్మాణం జరగలేదని కొండమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు మంజూరైందని అధికారులు చెబుతున్నా.. ఇప్పటివరకు మంజూరు పత్రం కూడా అందలేదని ఆమె పేర్కొంటున్నారు. ఈసారి ఏం హామీ ఇస్తారో? ఇలా అరకు సభ నుంచి వంజంగి వరకు గిరిజనులకు ఇచ్చిన పలు హామీలు ఇంకా అమలు కాలేదని ఆదివాసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మరోసారి మన్యంలో పర్యటించనుండటంతో గత హామీలపై ఏం చెబుతారో అనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. -
సీలేరులో యూట్యూబర్ల సందడి
సీలేరు: మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ’ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ విజయపథంలో దూసుకుపోతోంది. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో, ఇందులో షూటింగ్ జరుపుకున్న సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ ప్రాంతాలు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్లో నిలిచాయి. దాదాపు 30 రోజుల పాటు సీలేరు, పొల్లూరు, డొంకరాయి ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరగడంతో ఇక్కడి అందాలు తెరపై సరికొత్తగా ఆవిష్కృతమయ్యాయి. ’పుష్ప’ సినిమా తర్వాత ఆ స్థాయిలో సీలేరు అందాలు ఈ చిత్రంలో కనిపించడంతో యూట్యూబర్లు, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు ఈ ప్రాంతాలకు క్యూ కడుతున్నారు. సినిమాలోని సన్నివేశాలు చిత్రీకరించిన ప్రాంతాలను డ్రోన్ కెమెరాలతో షూట్ చేసి, చిత్రంలోని పాటలను జోడించి ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుండటంతో వాటికి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. స్థానికులు సైతం ఆ వీడియోలను వాట్సాప్ స్టేటస్లుగా పెట్టుకుంటూ వైరల్ చేస్తున్నారు. సినిమా విడుదలైనప్పటి నుంచి పక్క రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రేక్షకులు, పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చి షూటింగ్ లొకేషన్లలో ఫొటోలు దిగుతున్నారు. గుంటవాడ జలాశయం, మారెమ్మ తల్లి ఆలయం, ఘాట్ రోడ్డు, సీలేరు మార్కెట్, ఇంటెక్స్ డ్యామ్, డొంకరాయి హైస్కూల్, పొల్లూరు జలపాతాలు పర్యాటక ప్రాంతాలుగా కళకళలాడుతున్నాయి. -
సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు
మాట్లాడుతున్న సీజీఆర్ఎస్ చైర్మన్,రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి సత్యనారాయణ చింతపల్లి: మన్యంలో విద్యుత్ వినియోగదారుల సమస్యలను న్యాయస్థానం ద్వారా పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీజీఆర్ఎస్ చైర్మన్, విశ్రాంత జిల్లా జడ్జి డాక్టర్ బి. సత్యనారాయణ అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వినియోగదారుల నుంచి మొత్తం 17 ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విశ్రాంత న్యాయమూర్తి మాట్లాడుతూ.. భారత విద్యుత్ చట్టం–2003 ప్రకారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో 2005లో ఈ ఫోరమ్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా వినియోగదారులు తమ సమస్యలపై 1912 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉందన్నారు. స్థానికంగా విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొనే సమస్యలపై నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు. లైన్ల మరమ్మతులు, ట్రాన్స్ఫార్మర్ల మార్పు, కాలిపోయిన మీటర్లు, వోల్టేజీ హెచ్చుతగ్గులు తదితర సమస్యలకు న్యాయస్థానం ద్వారా సత్వర పరిష్కారం లభిస్తుందన్నారు. విద్యుత్ సరఫరాలో లోపాల వల్ల నష్టపోయిన బాధితులకు తగిన నష్టపరిహారం చెల్లించేలా న్యాయస్థానం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 606 ఫిర్యాదులు రాగా, వాటిలో 446 సమస్యలను పరిష్కరించామని, బాధితులకు నష్టపరిహారంగా రూ. 22.16 లక్షలు చెల్లించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంస్థ టెక్నికల్ సభ్యుడు రాజబాబు, ఆర్థిక సభ్యుడు సుబ్బారావు, పాడేరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎల్. పాత్రుడు, ఏడీ సన్నీరాంబాబుతో పాటు చింతపల్లి,గూడెంకొత్తవీధి, కొయ్యూరు, జి.మాడుగుల ఏఈఈలు ఎంవీ రమణ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు మార్జిన్ ధ్వంసం.. అధికారులు మౌనం
● నక్కపల్లికి నీరు తరలింపునకు నాతవరంలో రోడ్డు ధ్వంసం ● స్పీకర్, కలెక్టర్ భూమిపూజ చేసినచోటే వంగిన సిమెంట్ రోడ్డు నాతవరం: కోట్లాది రూపాయలతో నిర్మించిన రోడ్డు, తాగునీటి పైపులైనును కళ్ల ముందే పొక్లెయిన్తో ధ్వంసం చేస్తున్నా ఏమీ చేయలేని పరిస్ధితి నెలకొంది. మండలంలో నర్సీపట్నం – తుని మధ్య ఆర్అండ్బీ రోడ్డు, శృంగవరం నుంచి కాకినాడ జిల్లా సరిహద్దు వరకు తారురోడ్డు నిర్మాణంతోపాటు మధ్య వెదుళ్లుగెడ్డపై వంతెన నిర్మించేందుకు గత ప్రభుత్వం రూ. 14 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను అప్పటి టీడీపీకి చెందిన కాంట్రాక్టర్ తీవ్ర జాప్యం చేయడంతో ఎన్నికలు వచ్చేశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయా రోడ్డు విస్తరణ పనులు చేసేందుకు 2024 నవంబరులో స్పీకర్ అయ్యన్నపాత్రుడు, కలెక్టర్ విజయకృష్ణన్ స్వయంగా భూమిపూజ చేశారు. శృంగవరం నుంచి జిల్లా సరిహద్దు వరకు తారురోడ్డు నిర్మించారు. రోడ్డు మధ్యలో వెదుళ్లుగెడ్డపై వంతెన ఇంకా నిర్మించలేదు. మన్యపురట్ల జంక్షన్ హెచ్పీసీఎల్ పాయింటు వద్ద అర్అండ్బీ రోడ్డు 300 మీటర్లు పల్లంగా ఉండడంతో అక్కడ తారురోడ్డుకు బదులు పటిష్టంగా ఉండేందుకు సిమెంట్ రోడ్డు నిర్మించారు. కుంగిపోయిన రోడ్డు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నక్కపల్లి మండలంలో పలు పరిశ్రమలకు నీరు అవసరం నిమిత్తం ఏలేరు కాలువలో నీటిని తరలించేందుకు పైపులైను పనులు చేపట్టారు. నాతవరం మండలం ఎ.శరభవరం వద్ద ఏలేరు కాలువలో నీటిని పైపుల ద్వారా తరలించేందుకు ఆర్అండ్బీ రోడ్డు మార్జిన్ అనుకుని పొక్లెయిన్తో కాలువ తీస్తున్నారు. నాతవరం మండలం కాకినాడ జిల్లా కోటనందూరు తుని మండలాల మీదుగా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలానికి పైపులైను 60 కిలోమీటర్లు మేర కాలువ తీస్తున్నారు. ఆయా పనులు ఏపీఐఐసీ ఆధ్వర్యంలో రూ.350 కోట్లతో ఈ ప్రాజెక్టు పనులు చేస్తున్నారు. ఇటీవల కొత్తగా వేసిన తారురోడ్డు, సిమెంట్ రోడ్డు మార్జిన్ లోతుగా తవ్వేయడంతో రోడ్డు బీటలు వేసి దెబ్బతింది. హెచ్పీసీఎల్ పాయింట్ వద్ద కొత్తగా వేసిన సిమెంట్ రోడ్డు అడుగుభాగంలో పైపుల ఏర్పాటుకు లోతుగా తవ్వేయడంతో రోడ్డు కుంగిపోయింది. మిగతా ప్రాంతంలో తారురోడ్డు మార్జిన్లో లోతుగా తవ్వేసి పైపులు వేశాక మొక్కుబడిగా మట్టివేసి కప్పేయడంతో వర్షాలు వచ్చినపుడల్లా వాహనాలు కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో ఫైలట్ ప్రాజక్టు ద్వారా 18 గ్రామాలకు తాగునీరు అందించేందుకు గతంలో తాండవ నదిలో సంపు నిర్మించి పైపులైను ద్వారా ప్రజలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. అప్పట్లో పైపులైను కోసం తారురోడ్డు మార్జిన్లో కాలువలు తీసి పైపులు వేశారు. ఆ పైపులు ఉన్న ప్రదేశం నుంచి నక్కపల్లి మండలానికి ఏలేరు కాలువలో నీటిని తరలించేందుకు పెద్ద కాలువలు తీస్తున్నారు. కాలువ తీసేటప్పుడు తాగునీటి పైపులైను ధ్వంసం కావడంతో ప్రజలకు తాగునీటి సరఫరాకు తరుచూ అంతరాయం ఏర్పడుతోంది. దీనివల్ల ప్రజలకు ఆర్డబ్ల్యూఎస్ అధికారుల మధ్య నీటి కోసం వివాదం జరుగుతుంది. కళ్లముందే సిమెంట్ రోడ్డు కుంగిపోయినా, తారురోడ్డు శిథిలమైనా తాగునీటి పైపులైను ధ్వంసం చేసినా పెద్ద ప్రాజెక్టు పనులు కావడంతో సంబంధిత శాఖ అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. స్పీకర్ ఆదేశాలు బేఖాతర్ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈనెల 11న నాతవరం నుంచి తాండవ మధ్య కొత్తగా నిర్మించిన తారురోడ్డు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ రోజు ఆయన మాట్లాడుతూ తారురోడ్డుపై దమ్ము ట్రాక్టర్లు తిరిగినా, రోడ్డును పాడు చేసినా వెంటనే కేసులు పెట్టాలని పోలీసులు, ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. తమ పార్టీకి చెందిన దమ్ము ట్రాక్టర్లు రోడ్డుపై తిరిగినా కేసు పెట్టాలన్నారు. చమ్మచింత వద్ద పొలాలకు సాగునీరు కోసం తాండవ రోడ్డు మార్జిన్ను దొరబాబు తవ్వడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఇపుడు నర్సీపట్నం – తుని మధ్య ఆర్అండ్బీ రోడ్డు మార్జిన్ తవ్వేయడంతో రోడ్డు కుంగిపోయి బీటలు వేస్తున్నా అధికారులు పట్టనట్టు ఉండిపోయారని పలువురు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై ఆర్అండ్బీ జేఈ నాయుడుబాబును సంప్రదించగా శిథిలమైన రోడ్డు మరలా వారితోనే బాగు చేయించుతామన్నారు. ఆర్డబ్ల్యూఎస్ డీఈ జయరాం మాట్లాడుతూ పైపులైను ఇష్టం వచ్చినట్టు తవ్వేయడంతో తరుచూ తాగునీటికి అంతరాయం ఏర్పడుతుందన్నారు. తమ సిబ్బంది వాటిని బాగుచేయడానికి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. -
తెనుగుపూడి గురుకుల ఇంటర్ విద్యార్థి అదృశ్యం
దేవరాపల్లి: మండలంలోని తెనుగుపూడి డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ గురుకుల విద్యాలయానికి చెందిన ఇంటర్ ఫస్టియ ర్ విద్యార్థి కదిరి ప్రవీణ్ అదృశ్యమైనట్టు తండ్రి లోవరాజు, విద్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ వివరాల ప్ర కారం.. కశింకోట మండలం తేగాడ గ్రామానికి చెందిన ప్రవీణ్ ఈ నెల 24వ తేదీ రాత్రి 7.15 గంటలకు విద్యాలయం నుంచి అదృశ్యమైనట్లు హౌస్ టీచర్ లెక్కల అర్జునరావు విద్యార్థి తండ్రికి ఫోన్లో తెలియజేశారు. అదేరోజు రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ప్రవీణ్ తన తండ్రికి వేరే వ్యక్తి ఫోన్ నుంచి చేసి రాత్రి స్నేహితుడి ఇంట్లో ఉంటానని, మరుసటి రోజు ఇంటికి లేదా హాస్టల్కు తిరిగి వస్తానని తెలిపినట్లు ఫిర్యా దులో పేర్కొన్నారు. సదరు విద్యార్థి ఇటు హాస్టల్కు అటు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పాఠశా ల సిబ్బంది పరిసర ప్రాంతాల్లో గాలించిన ఆచూకీ లభించలేదు. అనకాపల్లి రైల్వేస్టేషన్ నుంచి విజ యవాడ వైపు వెళ్లే రైలులో ప్రయాణించినట్లు సమాచారం లభించింది. విద్యార్థి ఆచూకీ ఎవరికై నా లభిస్తే సమాచారం అందించాలని ఎస్ఐ కోరారు. -
మొక్కలకు రాఖీ.. పర్యావరణానికి రక్ష
మాకవరపాలెం: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండగ జరుపుకొంటారు. అయితే మండలంలోని తూటిపాల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు వినూత్నంగా శుక్రవారం విద్యార్థులతో మొక్కలకు రాఖీలు కట్టించారు. వృక్షాలను సంరక్షిస్తే అవి మనకు రక్షణగా నిలుస్తాయని హెచ్ఎం భీమారావు, ఉపాధ్యాయుడు రాము చెప్పారు. విద్యార్థులకు చిన్నవయసు నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంలో భాగంగా మొక్కలకు రాఖీలు కట్టించామని తెలిపారు. అనకాపల్లి: జీవీఎంసీ విలీన గ్రామమైన ఎరుకువానిపాలెం ఎంపీయూసీ స్కూల్ ఆవరణలో చెట్లకు శుక్రవారం విద్యార్థులు రాఖీలు కట్టారు. చెట్లను సోదరులుగా భావించి రక్షించాలని ఈ సందర్భంగా నినాదాలు చేశారు. అనంతరం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొణతాల ఫణిభూషన్ శ్రీధర్ మాట్లాడుతూ ప్రకృతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం కె.పి.బి.శ్రీధర్, ఉపాధ్యాయులు జయశ్రీరాణి, సుజాత, ఉమ, కృష్ణారావు, మూర్తి, ఎస్ఎంసీ చైర్మన్ అరిగా శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన విద్యార్థుల జీవితాలతో కూటమి వ్యాపారం
పాడేరు: గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం వ్యాపారం చేయాలని చూస్తోందని.. స్వలాభం కోసం ప్రైవేటు విద్యాసంస్థలకు అప్పగించేందుకే ఎంతో చరిత్ర కలిగిన మారికవలస గిరిజన గురుకుల విద్యాలయాన్ని అర్ధంతరంగా ఎత్తివేశారని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి మండిపడ్డారు. ఐటీడీఏ వద్ద గత మూడు రోజులుగా ఏకధాటిగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనకు శుక్రవారం ఆమె హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమను తరలించే ప్రక్రియలో అధికారులు, పోలీసులు వ్యవహరించిన తీరును, బెదిరింపులను ఎంపీకి వివరించి కన్నీటిపర్యంతమయ్యారు. వారిని ఓదార్చిన ఎంపీ మాట్లాడుతూ.. ’సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్’ పేరుతో గిరిజన విద్యార్థులను ఇతర పాఠశాలలకు ఆకస్మికంగా తరలించే హక్కు ఎవరిచ్చ??ంటూ ప్రశ్నించారు. విద్యాసంస్థలను బలోపేతం చేసి నాణ్యమైన విద్యనందించాల్సింది పోయి, ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. మారికవలస విద్యాలయాన్ని యథావిధిగా కొనసాగించాలని, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్కు వేరే భవనాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆమె జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవోలతో ఫోన్లో మాట్లాడి మారికవలస పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని కోరారు. అభంశుభం తెలియని అమాయక గిరిజన విద్యార్థులను పోలీసుల చేత భయభ్రాంతులకు గురిచేసిన అధికారుల తీరును జాతీయ బాలల హక్కుల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెట్టి వినయ్, పార్టీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు శ్యాముల్, జిల్లా విద్యార్థి విభాగం కార్యదర్శి కొమ్మ అనంత పద్మనాభం, పార్టీ సోషల్ మీడియా ప్రతినిధి రంజిత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అసంపూర్తిగా వదిలేసిన రోడ్డుకు గిరిజనుల శ్రమదానం
రావికమతం: చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు పల్లెపండుగ–అడవితల్లి బాట పేరిట ప్రారంభించి అసంపూర్తిగా వదిలేసిన రోడ్డు పనులకు గిరిజనులే శ్రమదానం చేసి బాగు చేసుకున్నారు. చీమలపాడు పంచాయతీ శివారు కొండ శిఖర గ్రామం నేరేడు బంద పీవీటీజీ కొండ గిరిజనులు జెడ్.జోగుంపేట నుంచి మూడు కిలోమీటర్ల మేర శుక్రవారం రోడ్డు అభివృద్ధి చేశారు. జోగుంపేట నుంచి నేరేడుబంద వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం రూ.2.50 కోట్ల నిధులతో పల్లెపండుగ–అడవితల్లి బాట కార్యక్రమం పేరిట 2024 డిసెంబరులో చోడవరం ఎమ్మెల్యే ప్రారంభించారు. కొంత మేరకు రోడ్డు పనులు ప్రారంభించి మధ్యలో వదిలేశారు. అనంతరం వేసిన మట్టి కొట్టుకుపోయి గోతులమయంగా మారింది. దీంతో ఈ మార్గంలో వెళ్లాలంటే గిరిజనులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో నేరేడు బంద గిరిజన యువకులు, మహిళలు తమ గ్రామానికి బైక్ వెళ్లడానికి వీలుగా శ్రమదానం చేసి మూడు కిలోమీటర్లు వరకు గోతులను పూడ్చి రోడ్డు చదును వేశారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు కే గోవిందరావు మాట్లాడుతూ ప్రభుత్వం తవ్వి వదిలేసిన రోడ్డు పనులు పూర్తి చేయాలని, లేకపోతే కలెక్టర్ కార్యాలయం వద్ద వినూత్నంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు. -
ట్రగ్స్కు నో చెబితేనే ఆరోగ్యమైన భవిష్యత్
అరకులోయ టౌన్: ‘డ్రగ్స్కు నో చెప్పండి.. ఆరోగ్యకరమైన భవిష్యత్కు బాటలు వేయండి’ అని విశాఖ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) గోపీనాథ్ జెట్టి పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని బట్టివలస పంచాయతీ నందివలస గ్రామంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై గిరిజనులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నిర్మూలనలో పోలీసులతో పాటు ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. గ్రామాల్లో డ్రగ్స్కు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక దుష్పరిణామాలపై గ్రామస్తులకు వివరించారు. ముఖ్యంగా యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా తామంతా మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, ఇతరులకు కూడా ఆపై అవగాహన కల్పిస్తామని గ్రామస్తుల చేత ఐజీ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అ మిత్ బర్దర్, పోలీస్ సిబ్బంది, బట్టివలస, నందివలస గ్రామాల గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
మారికవలసలోనే గురుకులం కొనసాగించాలి
పాడేరు: విశాఖపట్నం జిల్లా మారికవలస గిరిజన గురుకుల పాఠశాలను అక్కడే యథావిధిగా పునరుద్ధరించి గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని, లేనిపక్షంలో గిరిజన సమాజంతో కలిసి పెద్దఎత్తున ఉద్యమిస్తామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం పాడేరులోని తన క్యాంపు కార్యాలయంలో అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనుజారాణి, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మితో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ.. అల్లూరి జిల్లాలో ఎప్పుడూ వైఎస్సార్సీపీ హవానే ఉంటుందనే కక్షతో కూటమి ప్రభుత్వం, మంత్రి సంధ్యారాణి గిరిజన వర్గాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. తల్లిదండ్రులకు కనీస సమాచారం ఇవ్వకుండా, పోలీసులను అడ్డంపెట్టి విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసి వేరే చోటుకు తరలించారని మండిపడ్డారు. విద్యార్థులు ఎక్కడ ఉన్నారో తల్లిదండ్రులకు అంతుబట్టడం లేదని, ఇలాంటి కక్షసాధింపు చర్యలకు గిరిజన సమాజం తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు. అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన మారికవలస విద్యాలయాన్ని విద్యా సంవత్సరం మధ్యలో, అకస్మాత్తుగా ఎత్తివేయడం దారుణమన్నారు. కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే ప్రభుత్వం ఈ దుర్మార్గానికి పాల్పడుతోందని ఆరోపించారు. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు మాట్లాడుతూ.. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటు చేసిన ఈ గురుకులాన్ని అర్ధంతరంగా ఎత్తివేసే హక్కు కూటమి ప్రభుత్వానికి ఎవరిచ్చారన్నారు. నేడు అరకు వస్తున్న సీఎం చంద్రబాబు ఈ వ్యవహారంపై స్పందించి, పాఠశాలను యథావిధిగా కొనసాగించేలా ప్రకటించకపోతే అందరినీ కలుపుకొని మహోద్యమం చేపడతామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. గిరిజనులు ప్రయోజకులు కాకూడదనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కుట్ర పన్నుతోందని విమర్శించారు. గిరిజన హక్కులు, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి భవిష్యత్లో పుట్టగతులు ఉండవని జోస్యం చెప్పారు. వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, సలుగు ఎంపీటీసీ చిప్పాడ మీనా, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు గంగరాజు, మాజీ సర్పంచ్ పాంగి నాగరాజు పాల్గొన్నారు. గిరిజన విద్యార్థుల జీవితాలతో కూటమి వ్యాపారం -
విద్యార్థుల జీవితాలతో చెలగాటం : విశ్వేశ్వరరాజు
పాడేరు: రాష్ట్రంలో గిరిజన సమాజంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు విమర్శించారు. గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీడీఏ కార్యాలయం ఎదుట శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న గిరిజన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాల చరిత్ర కలిగిన మారికవలస గిరిజన గురుకుల విద్యాలయాన్ని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ పేరుతో కార్పొరేట్ విద్యా సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం ఏకపక్షంగా ఎత్తివేసిందని ఆరోపించారు. ఐటీడీఏ పీవోతో పాటు ఇతర అధికారులు రాత్రికి రాత్రే పోలీసులతో కలిసి విద్యార్థులను బెదిరించి, ట్రంక్ పెట్టెలు, సామానుతో బయటకు పంపించడం దుర్మార్గ చర్య అని విమర్శించారు. ఇలాంటి చర్యలకు గిరిజన సమాజం తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. పాఠశాలను యథావిధిగా కొనసాగించ లేనిపక్షంలో భారీ స్థాయిలో ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. -
రేవ్ పార్టీ.. దర్యాప్తు డర్టీ..!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖపట్నం శివార్లలోని ‘హ్యాపీ నేచర్ రిసార్ట్స్’లో జరిగిన రేవ్ పార్టీలో కత్తిపోట్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అధికార పార్టీ నేతల మధ్య జరిగిన ఈ వివాదాన్ని కప్పిపుచ్చేందుకు సాక్షాత్తూ పోలీసులే తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు తీవ్రమవుతున్నాయి. ఘటనా స్థలంలో కళ్లెదుటే ఆధారాలు కనిపిస్తున్నా.. వాటిని స్వాధీనం చేసుకోవడంలో ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం ప్రదర్శించడం పోలీసుల తీరుపై అనేక అనుమానాలకు తావిస్తోంది. ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తూ.. కేసును నీరుగార్చి, అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలను రక్షించేందుకు కింది స్థాయి సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. పోలీసుల వైఫల్యం? తెల్లవారుజామున సుమారు 4:18 గంటల ప్రాంతంలోనే పార్టీలో ఘర్షణ జరిగి, గాయపడిన వ్యక్తి ఆసుపత్రికి వెళ్లినప్పటికీ.. పోలీసుల దర్యాప్తు మధ్యాహ్నం 3 గంటల వరకు ముందుకు సాగలేదు. కనీసం క్రైమ్ సీన్ను స్వాధీనం చేసుకోవడంలోనూ పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలంలో సుమారు 40కి పైగా ఖాళీ, సగం తాగిన మద్యం సీసాలు పడి ఉన్నా వాటిని వెంటనే స్వాధీనం చేసుకోలేదు. ఈ జాప్యాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు నేతలు ఆధారాలన్నింటినీ అక్కడి నుంచి మాయం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేసు నమోదు కాకముందే ఘటనా స్థలంలో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు పరోక్షంగా అవకాశం కల్పించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో కేవలం 6 బాటిళ్లు మాత్రమే దొరికినట్టు ఎకై ్సజ్ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు రిసార్ట్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. బయటకు రాని సీసీటీవీ ఫుటేజీ! ఈ రేవ్ పార్టీలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారన్న సమాచారం ఉన్న నేపథ్యంలో, ఆ కోణాన్ని దాచిపెట్టేందుకు సీసీటీవీ ఫుటేజీల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా హత్యాయత్నం జరిగిన సమయానికి సంబంధించిన ఫుటేజీని మాత్రమే పోలీసులు తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం పార్టీకి సంబంధించిన పూర్తి ఫుటేజీని సేకరించి ఉంటే అందులో పాల్గొన్న వారి వివరాలు, అసలు విషయాలన్నీ వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని స్థానికంగా చర్చ నడుస్తోంది. కానీ అలా పూర్తిస్థాయి ఫుటేజీ తీసుకోకపోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లభ్యమైన ప్రాథమిక దృశ్యాల్లో.. దాడికి పాల్పడిన వ్యక్తి ఒంటిపై దుస్తులు లేకుండా ఉన్నాడని, అలాగే పెద్ద సంఖ్యలో యువతులు కూడా అక్కడ కనిపించారని సమాచారం. అసలు అక్కడికి కత్తి ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? అన్న అంశాలపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పార్టీకి ఎవరెవరు వచ్చారు? లోపల ఏం జరిగింది? అన్న కీలక విషయాలు నమోదైన సీసీ కెమెరాల ఫుటేజీని తక్షణమే సీజ్ చేయకుండా కాలయాపన చేశారనే విమర్శలు ఉన్నాయి. సాధారణంగా చిన్న చోరీల వ్యవహారాల్లోనూ హడావుడి చేసే పోలీసులు.. ఇంత పెద్ద ఘటన జరిగినా కనీసం మీడియాకు పూర్తి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం.ఆ విదేశీ మద్యం తెచ్చిందెవరు? ఈ రేవ్ పార్టీలో స్థానిక మద్యంతో పాటు విదేశీ మద్యం కూడా భారీగా పారినట్లు తెలుస్తోంది. పదుల సంఖ్యలో మద్యం బాటిళ్లు ఉన్నట్లు ఆధారాలు కనిపిస్తున్నా, పోలీసులు మాత్రం తక్కువ బాటిళ్లు ఉన్నట్లు చెబుతున్నారు. అసలు ఈ విదేశీ మద్యం అక్కడికి ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? అన్న కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేయడం లేదని సమాచారం. ఒక విద్యార్థి విభాగం (టీఎన్ఎస్ఎఫ్) నాయకుడే ఈ విదేశీ మద్యాన్ని సరఫరా చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నా.. ఆ దిశగా పూర్తిస్థాయి విచారణ చేపట్టకపోవడం పోలీసుల పక్షపాత వైఖరికి అద్దం పడుతోంది. -
సావిత్రీ బాయి పూలే విగ్రహావిష్కరణ
కె.కోటపాడు: మహిళల హక్కుల కోసం పోరాటం చేయడం తమ సామాజిక బాధ్యతగా సావిత్రీ బాయిపూలే, జ్యోతిరావ్ పూలేలు విశ్వసించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి జి.జి.ఎస్.నాగేశ్వరరావు అన్నారు. పాతవలస జెడ్పీ హైస్కూల్లో హిందీ ఉపాధ్యాయురాలు సుజాతతో పాటు ఆమె భర్త నాగేశ్వరరావులు సావిత్రీబాయి పూలే విగ్రహాన్ని వారి సొంత నగదుతో ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖాధికారి నాగేశ్వరరావు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే అని విద్యార్థులకు తెలిపారు. భారతీయ సంఘ సంస్కర్తగాను, ఉపాధ్యాయినిగా, రచయిత్రిగా ఆమె సేవలు అందించారని కొనియాడారు. కార్యక్రమంలో ఎంఈవోలు కె.సత్యనారాయణ, డి.వి.డి.ప్రసాద్, హెచ్ఎం.నాగేశ్వరరావు, ఉపాధ్యాయుడు ఈశ్వరరావు పాల్గొన్నారు. -
సిద్ధమవుతున్న గణనాథులు
బుచ్చెయ్యపేట: హిందూ సంప్రదాయం ప్రకారం తొలి పూజ చేసేది వినాయకుడికే.. హిందువులు ఏ కార్యం తలపెట్టినా విఘ్నాలు తొలగించే గణనాథుడినే వేడుకుంటారు. ఇందుకోసం గణపతి విగ్రహాలు సిద్ధమవుతున్నాయి. రంగురంగుల అలంకరణలతో వివిధ రూపాల్లో ఆకర్షణీయంగా వీటిని శిల్పికళాకారులు తీర్చిదిద్దుతున్నారు. అడుగు నుంచి 15 అడుగుల ఎత్తు వరకు తయారు చేస్తున్నారు. వచ్చే నెల 14వ తేదీన వినాయక చవితి సందర్భంగా ఉత్సవ కమిటీలు సైతం గ్రామాల్లో అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నాయి. పలు రూపాల్లో విగ్రహాలు మేజర్ పంచాయతీ వడ్డాది, బుచ్చెయ్యపేట, సీతయ్యపేట, విజయరామరాజుపేట, రాజాం తదితర గ్రామాల్లో వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. వీటి తయారీతో స్థానికంగా పలువురి కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. విజయ వినాయక, లంబోదర వినాయక, బుద్ధి వినాయక, పంచముఖ వినాయక, పార్వతీపరమేశ్వర్ల సన్నిధి వినాయక, ఊయలలో ఊగుతున్న వినాయక, శ్వేత నాగు బంధ వినాయక, గోవుపై ఊరేగుతున్న వినాయక వంటి పలు ఆకారాల్లో తయారు చేస్తున్నారు. మట్టితోపాటు కొబ్బరి పీచు, అట్టలు, ఇతర ముడి సరుకులతో వినాయక విగ్రహాలు తయారవుతున్నాయి. ఒక్కో విగ్రహాన్ని పరిమాణం బట్టి రూ. 100 నుంచి రూ.25 వేల వరకు అమ్మకాలకు సిద్ధం చేస్తున్నారు. వినాయ విగ్రహాలు తయారీతో శిల్పి కళాకారుల కుటుంబాలతోపాటు మరో 15 మంది కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. వినాయక చవితి నుంచి దసరా ఉత్సవాల వరకు వీరికి చేతినిండా పని దొరుకుతుంది. తయారవుతున్న కాల సర్ప వినాయక విగ్రహంఆకట్టుకుంటున్న విజయ వినాయక విగ్రహంరంగులతో ఆకట్టుకుంటున్నపంచముఖ వినాయక విగ్రహంవినాయక విగ్రహాల తయారీ 15 అడుగుల ఎత్తు వరకు సిద్ధం వివిధ ఆకృతుల్లో ముస్తాబు చేతినిండా పని విగ్రహాల తయారీపై ఆధార పడి జీవిస్తున్నాం. మా కుటుంబాలతోపాటు మరో 15 మంది కుటుంబీకులకు ఉపా ధి కల్పిస్తున్నాం. ఈ ఏడాది విగ్రహాల తయారీకి ముడిసరుకు ధరలు పెరిగాయి. 15 అడుగుల విగ్రహాలు వరకు తయారు చేశాం. పలు గ్రామాల నుంచి వస్తున్న ఆర్డర్లు మేరకు పలు ఆకారాల్లో వినాయక విగ్రహాలను తయారు చేసి అమ్మకాలకు అందుబాటులో ఉంచాం. –కె లోవరాజు, విగ్రహాల తయారుదారుడు, వడ్డాది -
జిల్లా కోర్టును సందర్శించిన విదేశీ ప్రతినిధులు
విశాఖ లీగల్: కెన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక మార్పిడి కార్యక్రమంలో భాగంగా జపాన్, బెల్జియం, అమెరికా దేశాలకు చెందిన అంతర్జాతీయ ఇంటర్న్స్ భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి, జీవన విధానంపై అవగాహన పొందేందుకు భారత్ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు జిల్లా కోర్టుతో పాటు న్యాయవాదుల చాంబర్లను సందర్శించారు. ఈ సందర్భంగా భారత న్యాయ వ్యవస్థ, కోర్టుల పనితీరు, న్యాయ ప్రక్రియలు, న్యాయవాదుల విధుల గురించి వివరాలు తెలుసుకున్నారు. భారతీయ న్యాయ వ్యవస్థ ఆచరణాత్మక విధానాన్ని, కోర్టు కార్యకలాపాలను ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం లభించడం ఎంతో ఉపయోగకరంగా ఉందని వారు తెలిపారు.సాంస్కృతిక మార్పిడి ద్వారా విదేశీ యువతకు భారతీయ సంప్రదాయాలు, న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించడంతో పాటు, అంతర్జాతీయ స్థాయిలో పరస్పర అవగాహన, స్నేహ సంబంధాలను బలోపేతం చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సన్నీ యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ గాలి రామిరెడ్డి, సీనియర్ మెంబర్ యు. శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈ. సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
భగ్గుమన్నగిరిపుత్రులు
● మారికవలస పాఠశాల ఎత్తివేతపై ఆగ్రహం ● రెండో రోజూ ఐటీడీఏ ఎదుట నిరసన ● పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ ● చంద్రబాబు ప్రభుత్వ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రుల మండిపాటు గిరిజన విద్యార్థులసంక్షేమానికే ప్రాధాన్యం కలెక్టర్ నిశాంతి పాడేరు: మారికవలస స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్లో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు ఆధునిక సౌకర్యాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని కలెక్టర్ నిశాంతి స్పష్టం చేశారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. మారికవలస పాఠశాల వ్యవహారంపై గురువారం ఐటీడీఏ కార్యాలయంలో విలేకరులతో కలెక్టర్ మాట్లాడుతూ మారికవలస పాఠశాలను సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా అభివృద్ధి చేసి ప్రస్తుతం 360 మంది విద్యార్థులకు విద్యా, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. 5 నుంచి 8వ తరగతి వరకు ఉన్న 225 మంది విద్యార్థులను పేరెంట్స్–టీచర్స్ సమావేశాలు నిర్వహించి తల్లిదండ్రులకు పూర్తి వివరాలు తెలియజేశామన్నారు. 9, 10వ తరగతులకు చెందిన 135 మంది విద్యార్థులను కృష్ణాపురం, జి.మాడుగుల, సబ్బవరం, గుమ్మకోట, పెదబయలు, దేవరాపల్లి, కొయ్యూరు తదితర స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్లలో కొనసాగించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ మాట్లాడుతూ భవిష్యత్లో ఈ పాఠశాలలో 600 మంది విద్యార్థులు చేరే అవకాశముందన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థుల ఆందోళనను అర్థం చేసుకుంటున్నామని, మారికవలస బా య్స్ పాఠశాలలోనే విద్య కొనసాగించాలని తల్లిదండ్రులు కోరుకుంటే, ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పా రు. జిల్లా అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) శృతి పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా మెరుగైన విద్యను అందిస్తున్న చదువుల గుడిని దూరం చేయడంపై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రాత్రికి రాత్రి పాఠశాలను ఖాళీ చేయించి నేరస్తుల మాదిరి విద్యార్థులను బస్సుల్లో కర్కశంగా తరలించిన చంద్రబాబు ప్రభుత్వ తీరుపై గిరిజనం మండిపడింది. మారికవలస గిరిజన గురుకుల విద్యాలయం ఎత్తివేతపై ఆగ్రహం వ్యక్తమైంది. పాఠశాలను యథావిధిగా కొనసాగించాల్సిందేనని బుధవారం పాడేరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఐటీడీఏ ప్రధాన గేటు వద్ద బైటాయించి నిరసనకు దిగారు. రాత్రి వేళ జరిగిన చర్చలు ఫలించకపోవడంతో అక్కడే రాత్రంతా ఆందోళన కొనసాగించారు. గురువారం కూడా వివిధ గిరిజన, ఆదివాసీ హక్కుల సంఘాల నాయకులు చేరడంతో నిరసన మరింత ఉధృతంగా సాగింది. -
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గోవాడ సుగర్స్ నిర్వీర్యం
దేవరాపల్లి: కూటమి ప్రభుత్వ హయాంలోనే గోవాడ సుగర్ ఫ్యాక్టరీని పూర్తిగా నిర్వీర్యం చేసి మూతపడే స్థాయికి తీసుకువచ్చారని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. వెంకన్న విమర్శించారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని చెరకు రైతులు, కార్మికుల బకాయి రూ. 38 కోట్లు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. దేవరాపల్లిలో గురువారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. చెరకు రైతు, కార్మికుల బకాయిలను తక్షణమే చెల్లించి సంక్షోభంలో ఉన్న రైతాంగాన్ని ఆదుకోన్ని ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరారు. చోడవరం, మాడుగుల, నర్సీపట్నం మూడు నియోజకవర్గాల రైతులు, ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండున్నర లక్షల మంది గోవాడ సుగర్ ఫ్యాక్టరీపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో అత్యధికంగా ఉన్న రైతులు, కూలీలు ఉన్నారని వీరికి తీవ్ర ద్రోహం చేసిందన్నారు. రైతులు పూర్తిగా చెరకు పంట పండించే కోల్పోయే విధంగా చేసిందన్నారు. ఒక వైపు ఫ్యాక్టరీ మూసివేయగా మరో వైపు ఈ ఏడాది వర్షాలు కురవక పోవడంతో రైతులు సంక్షోభంలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి సుగర్ ఫ్యాక్టరీకి చెరుకు సరఫరా చేసిన రైతులకు నేటికీ బిల్లులు చెల్లించక పోవడంతో అప్పులు ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఈ ప్రాంత రైతాంగం చెరకు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతాంగాన్ని ఆదుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. బకాయిల కోసం రైతులు, కార్మికులు సంక్రాంతి పూట 23 రోజులు ఆఖిల పక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తే చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు స్పందించి బకాయి చెల్లింపునకు స్పష్టమైన హామీ ఇచ్చి దీక్ష విరమింప చేశారన్నారు. అనంతరం ఇద్దరు ఎమ్మెల్యేలు ముఖం చాటేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది వ్యవసాయం పూర్తిగా దెబ్బతిందని, సంక్షోభంలో ఉన్న రైతులు, కూలీలను ఆదుకొని, కరువు సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి...
అనకాపల్లి: విజయనగరం జిల్లా పూసపాటిరేగకు చెందిన విశాలాంద్ర విలేకరి పి.గోవిందుపై ఈనెల 19న జరిగిన హత్యాయత్యాన్ని ఖండిస్తూ, నిందితుడు గుడివాడ కృష్ణను తక్షణమే అరెస్టు చేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు భీమరశెట్టి వెంకటేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబులు అన్నారు. స్థానిక నెహ్రూచౌక్ వద్ద ఏపీడబ్ల్యూజేఎఫ్, సీపీఐ ఆధ్వర్యంలో ఽగురువారం ధర్నా చేసి, మండలంలో కొత్తూరు పంచాయతీ పరిదిలో ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో షేక్ ఆయిషాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూ అక్రమాలపై వార్తలను ప్రచురించినందుకే జర్నలిస్టు గోవిందుపై దాడి చేయడం అన్నాయమన్నారు. దాడికి సంబంధించిన వీడియో, ఫొటో ఆధారాలు ఉన్నప్పటికీ నిందితుడు గుడివాడ కృష్ణపై అక్కడ పోలీసులు నేటి వరకూ చర్యలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు అజయ్, బి.కొండలరావు, సీహెచ్.శశికుమార్, కాండ్రేగుల మోహన్బాబు తదితరులు పాల్గొన్నారు. -
కూటమి పాలనలో గిరిజన విద్యా వ్యవస్థ నిర్వీర్యం
పాడేరు: కూటమి ప్రభుత్వ హయాంలో గిరిజన విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు పసుపులేటి బాలరాజు విమర్శించారు. మారికవలస గిరిజన గురుకుల విద్యాలయం ఎత్తివేతకు నిరసనగా ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులను గురువారం సాయంత్రం ఆయన పరామర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో గిరిజన విద్యార్థుల ప్రాథమిక విద్యకు ప్రధాన ఆధారంగా ఉన్న మారికవలస గురుకులాన్ని విద్యా సంవత్సర మధ్యలో అర్ధంతరంగా ఎత్తివేయడం దారుణమన్నారు. అక్కడే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలనుకుంటే, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలతో నిర్మించిన అదనపు భవనాలను వినియోగించుకోవాలన్నారు. గిరిజనుల అభ్యున్నతిపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోందన్నారు. మారికవలస గిరిజన గురుకులాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. -
సీఎం చంద్రబాబుగన్నెల పర్యటన రేపు
సాక్షి, పాడేరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం అరకులోయ మండలం గన్నెల ప్రాంతంలో పర్యటించనున్నట్లు కలెక్టర్ టి. నిశాంతి తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్లో ఆమె అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం గన్నెల ప్రాంతంలో ప్రత్యక్షంగా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శనివారం ఉదయం హెలికాప్టర్లో సీఎం గన్నెలకు చేరుకుంటారని చెప్పారు. ఆ తరువాత ఆర్.కె.నగర్ గ్రామాన్ని సందర్శించి ‘సంజీవని’కార్యక్రమం లబ్ధిదారులతో ముఖాముఖీ నిర్వహించనున్నారని తెలిపారు. అనంతరం గన్నెల గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో సీఎం పాల్గొని వివిధ విభాగాల స్టాళ్లను సందర్శిస్తారని వివరించారు. -
ఏయూ భూతర్పణం!
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన రూ.వేల కోట్ల విలువైన ఆస్తులు క్రమంగా కరిగిపోతున్నాయి. నగర నడిబొడ్డున ఉన్న భూములు ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. వర్సిటీ భవిష్యత్ అవసరాలు, విద్యార్థుల ప్రయోజనాల కోసం పూర్వీకులు ఇచ్చిన విలువైన భూములను ప్రజా ప్రయోజనాల సాకుతో పలు సంస్థలకు బదలాయింపులు జరిగిపోతున్నాయి. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం మరోసారి ‘భూ’తర్పణం చేసేందుకు సిద్ధమైపోయింది. ఇప్పటి వరకు ఇచ్చిన భూములకే సరైన పరిహారం రాకపోగా.. మళ్లీ భూములను కట్టబెట్టడంపై ఉద్యోగ వర్గాలు తప్పుబడుతున్నాయి. ఏయూ భూములు చేజారిపోతుండటంపై విశ్వవిద్యాలయ అధ్యాపకులు, ఉద్యోగ సంఘాలు, పూర్వ విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ హయాంలో వరుస కేటాయింపులు ● 1991లో త్రీటౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని 2 ఎకరాల ఏయూ భూమిని రైతుబజార్ కోసం, మరో ఎకరాన్ని జీవీఎంసీ వినియోగానికి కేటాయించారు. ఆ భూమిలో టెన్నిస్ గ్రౌండ్ ఏర్పాటు చేసినప్పటికీ విశ్వవిద్యాలయానికి ఎటువంటి పరిహారం అందలేదు. ● 1999లో మధురవాడలో అందుబాటులో ఉన్న సుమారు 85 ఎకరాల్లో 81 ఎకరాలను పేదల గృహ నిర్మాణ కార్యకలాపాల కోసం జీవీఎంసీకి అప్పగించారు. ఈ భూమికి కూడా విశ్వవిద్యాలయానికి ఎలాంటి పరిహారం చెల్లించలేదు. ● 2001లో హనుమంతవాక జంక్షన్ వద్ద జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సుమారు 9 ఎకరాల్లో 4 ఎకరాలను జాతీయ రహదారి సంస్థకు ఇచ్చారు. ఈ భూమికి కూడా ఏయూకు పరిహారం శూన్యం. ● 2018లో సుమారు 1.5 ఎకరాల విలువైన బీచ్ ప్రాంత భూమిని వాణిజ్య కార్యకలాపాల కోసం వుడాకు కేటాయించారు. ఇప్పటివరకు దీనివల్ల విశ్వవిద్యాలయానికి ఎలాంటి ఆర్థిక ప్రయోజనం అందలేదని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. మరో కేటాయింపునకు రంగం సిద్ధం ఇప్పటికే విలువైన భూములు కోల్పోయిన ఏయూకు మరోసారి భూ నష్టం జరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. యోగా సెంటర్ భూమిని ఆయుష్ ఆసుపత్రికి, సిరిపురం సమీపంలోని భూమిని, హనుమంతవాక జంక్షన్ వద్ద మరో ఎకరం భూమిని జీవీఎంసీకి అప్పగించేందుకు ఏయూ వైస్చాన్సలర్ ఆచార్య జి.పి.రాజశేఖర్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలు అమలైతే విశ్వవిద్యాలయానికి మరింత విలువైన భూమి దూరమయ్యే అవకాశం ఉందని ఏయూ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ సంస్థలకు కేటాయిస్తున్నప్పటికీ.. అందుకు తగిన విధంగా ఏయూకు పరిహారం అందకపోవడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రూ.7 కోట్ల మున్సిపల్ పన్ను వివాదం ఒకవైపు విలువైన భూములను జీవీఎంసీ ఉచితంగా తీసుకుంటుంటే, మరోవైపు అదే జీవీఎంసీకి ఏయూ నిధుల నుంచి ఏకంగా రూ.7 కోట్ల ఆస్తి పన్ను చెల్లించడం వివాదాస్పదంగా మారింది. గతంలో పన్ను మినహాయింపు కోసం గవర్నర్కు లేఖలు రాసి ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రక్రియ కొలిక్కి రాకముందే హడావుడిగా రూ.7 కోట్లు చెల్లించడాన్ని అప్పటి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ధనుంజయరావు తీవ్రంగా వ్యతిరేకించారని, వర్సిటీ ప్రయోజనాలకు గండికొట్టే నిర్ణయాలను వ్యతిరేకించినందుకే ఆయన రాజీనామా చేయాల్సి వచ్చిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పరిరక్షించకపోతే భవిష్యత్తు శూన్యం వర్సిటీ భూములు ఎవరి సొంత ఆస్తి కాదని, భవిష్యత్ తరాల విద్యార్థుల కోసమేనని అధ్యాపకులు స్పష్టం చేస్తున్నారు. ఒకవైపు ప్రైవేటు వర్సిటీలకు ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేస్తూ భూములు కేటాయిస్తుంటే, ప్రఖ్యాత ప్రభుత్వ విశ్వవిద్యాలయమైన ఏయూ ఆస్తులను ఇష్టారాజ్యంగా పప్పుబెల్లాల్లా పంచడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ప్రస్తుత బదలాయింపు ప్రతిపాదనలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
గిరిజన ఓటర్ల హక్కులకు భంగం కలిగిస్తే సహించం
అరకులోయ టౌన్: అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో గిరిజన ఓటర్ల హక్కులకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం స్పష్టం చేశారు. గురువారం తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అరకులోయ మండలంలోని బూత్ నంబర్లు 213 నుంచి 271 వరకు, అలాగే 107 నుంచి 163 వరకు ఉన్న పోలింగ్ కేంద్రాల పరిధిలో అనుమానాస్పదంగా వందల సంఖ్యలో ఓటర్ల నమోదు జరిగినట్లు తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఒకే ఫొటోతో రెండు ఓట్లు నమోదు కావడం, మరణించిన వారి పేర్లు ఇంకా జాబితాలో కొనసాగడం, ఒకే వ్యక్తి పేరుతో రెండు వేర్వేరు బూత్లలో ఓట్లు ఉండటం వంటి తీవ్ర లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి, నకిలీ ఓటర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి అరకులోయ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల తహసీల్దార్లు, డీటీలకు లిఖితపూర్వకంగా లేఖలు పంపినట్లు తెలిపారు. బీఎల్వోలు ప్రతి ఇంటికి వెళ్లి సమగ్రంగా విచారణ జరపాలని, అర్హులైన నిజమైన ఓటర్లను తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనుమానాస్పదంగా ఉన్న వారికి నోటీసులు జారీ చేసి, ఆధారాలు సమర్పించుకునే అవకాశం కల్పించాలని అన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం నకిలీ ఓటర్లుగా నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే ఓటు హక్కును తొలగించాలని ఆయన స్పష్టం చేశారు. దొంగ ఓట్లకు అడ్డుకట్ట వేస్తూ, 100 శాతం పారదర్శకతతో ఓటర్ల జాబితా రూపొందించాలని ఎన్నికల అధికారులను ఎమ్మెల్యే మత్స్యలింగం కోరారు. -
వడ్డాది వెంకన్న ఆలయ ట్రస్ట్బోర్డు ప్రమాణ స్వీకారం
బుచ్చెయ్యపేట: వడ్డాది వేంకటేశ్వరస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల రాష్ట్ర దేవదాయశాఖ వేంకటేశ్వరస్వామి ఆలయానికి 20 ఏళ్ల తరవాత కమిటీ సభ్యులను నియమించింది. కొత్తగా నియమితులైన సభ్యులతో గురువారం దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ వసంతకుమార్ ట్రస్ట్ బోర్డు సభ్యులతో ప్రమాణం చేయించారు. వేంకటేశ్వరస్వామి సన్నిధిలోనే ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త దొండా కన్నబాబుతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఎన్నికై న సయ్యపురెడ్డి సత్యనారాయణ మూర్తి,(నవీన్), ఎస్.లక్ష్మీనారాయణ, పి.రాధ, ఎస్. మహాలక్ష్మి, అప్పలనరస, కె.లక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. ఈవో శర్మ, నాయకులు దొండా గిరిబాబు, శ్రీరామూర్తి, రమేష్, పేరమ్మ, వాసు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
జోరుగా రాఖీల విక్రయాలు
సాక్షి, పాడేరు: శ్రావణమాసం మూడో శుక్రవారం, పవిత్ర రక్షాబంధన్ సందర్భంగా గురువారం పాడేరు మార్కెట్ కళకళలాడింది. పట్టణంలోని మెయిన్ రోడ్, పాత బస్టాండ్, సినిమా హాల్ సెంటర్ ప్రాంతాల్లో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి రాఖీలు విక్రయాలు చేపట్టారు. దీంతో ఈ ప్రాంతాలు కొనుగోలుదారులతో కిక్కిరిశాయి. ముఖ్యంగా యువతులు రాఖీలు కొనుగోలు చేయడానికి భారీగా తరలివచ్చారు. బంగారు దుకాణాల్లో వెండి రాఖీలకు ప్రత్యేక ఆదరణ కనిపించింది. మరో వైపు శ్రావణ మాసం మూడో శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతానికి అవసరమైన పూజా సామగ్రి కొనుగోలుకు మహిళలు మార్కెట్కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పూలు, పండ్ల విక్రయాలు కూడా గణనీయంగా పెరిగి వ్యాపారులకు మంచి ఆదాయం అందింది. -
సమ్మెదలో ప్రభుత్వ భూముల దురాక్రమణ
దేవరాపల్లి: మండలంలోని చింతలపూడి పంచాయతీ సమ్మెద రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ప్రభుత్వ భూముల్లో పాగా వేసి దర్జాగా అక్రమిస్తున్నారు. సుమారు 30 ఎకరాలకు పైగా ప్రభుత్వ, బంజరు భూములను ఎటువంటి అనుమతుల పత్రాలు లేకుండానే సాగు చేస్తున్నారు. కొందరు బయట వ్యక్తులు సిండికేట్గా ఏర్పడి దౌర్జన్యంగా దురాక్రమణకు తెగబడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన రెవెన్యూ అధికారులు చోద్యం చూడడంపై పలు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రెవెన్యూ అధికారులకు భారీ మొత్తంలో మామూళ్లు ముట్టడంతోనే అటుగా కన్నెత్తి చూడడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమణలపై బాధిత రైతులు కొందరు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.ఇదిలా ఉండగా సమ్మెద రెవెన్యూ పరిధిలో బంజరు భూములకు 2005లో అప్పటి ప్రభుత్వం దళితులకు, గిరిజనులకు పట్టాలు మంజూరు చేసింది. వీరిలో కొందరు సాగు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారుల అండదండలతో ఈ ప్రాంతానికి సంబంధం లేని బయట వ్యక్తులు ఆక్రమించి దర్జాగా సాగు చేస్తున్నారు. భూ హక్కుదారులకు రక్షణ కల్పించాల్సిన రెవెన్యూ అధికారులు అక్రమణదారులకు కొమ్ము కాస్తూ మాట్లాడుతున్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆక్రమణలపై రెవెన్యూ, పోలీస్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పరిష్కరించకుండా ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం చేస్తున్నారని, ప్రస్తుతం చేపడుతున్న రీసర్వేలో ఆక్రమణదారులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి అక్రమణదారుల నుంచి తమ భూములకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. -
స్థానిక ఎన్నికల్లో ‘కూటమి’కి వణుకు పుట్టించాలి
గూడెంకొత్తవీధి: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి వణుకు పుట్టించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే ఎం.విశ్వేశ్వరరాజు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇందు కోసం మనందరి అజెండా వైఎస్సార్సీపీ జెండాగా ఉండాలని సూచించారు. గూడెంలో పార్టీ మండల అధ్యక్షుడు కంకిపాటి గిరి ప్రసాద్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని అన్ని పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాలో మాత్రమే కనిపిస్తోందని, క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులు చేయడం లేదని విమర్శించారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు అబద్ధపు ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను బహిర్గతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు కాకపోవడం, 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్న హామీ నెరవేర్చకపోవడం, నిరుద్యోగ భృతి అమలు కాలేదని ఆయన గుర్తుచేశారు. స్థానిక ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో కమిటీ సూచనలకు ప్రాధాన్యం ఇస్తామని, గెలుపు అవకాశాలున్న అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోయిన కుమారి, రాష్ట్ర పంచాయతీరాజ్ సంయుక్త కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు వసుపరి తిమోతి, వైస్ ఎంపీపీ లోతా దేవుడు, కోశాధికారి కుందేరి రామకృష్ణ, ఎంపీటీసీ కొర్రా రాజులమ్మ, మండల ఉపాధ్యక్షులు అరుణ్ కుమార్, రీమెలి బాలకృష్ణ, మాజీ జడ్పీటీసీ సభ్యులు మత్స్య రాజు, వాణిజ్య విభాగం అధ్యక్షుడు పనసల రాజేష్, యువజన విభాగం అధ్యక్షుడు లంబసింగి రమేష్, రైతు విభాగం అధ్యక్షుడు కంకిపాటి రామారావు, మండల ప్రధాన కార్యదర్శి బుజ్జిబాబు, పలువురు ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు. మనందరి అజెండా వైఎస్సార్సీపీ జెండాగా మారాలి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలనుఎండగట్టాలి గూడెం కార్యకర్తల సమావేశంలో పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు -
ఖాళీ బిందెల గోడు వినండి...
రోలుగుంట: ఫ్లోరైడు గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో రోలుగుంట ఎస్సీ కాలనీలో ఖాళీ బిందెలతో మహిళలు బుధవారం ధర్నా చేశారు. ఈ ధర్నాకు సారధ్యం వహించిన సీపీఎం నాయకుడు కె.గోవింద మాట్లాడుతూ మండలంలోని కె.నాయుడుపాలెం, నిండుగొండ, ఎన్.కొత్తూరు తదితర ఫ్లోరైడు గ్రామాల్లో తాగునీరందక జనం ఎన్నో ఇక్కట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తెలిపిన వివరాలివి. ఆయా గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి 2004లో రూ.3.50 కోట్లతో భారీ ప్రాజెక్టు నిర్మించారు. రోలుగుంటలో లక్ష లీటర్ల సామర్ధ్యం గల ట్యాంకు నిర్మించి జానకీరాంపురంలో ఏటిలో నీటిని శుద్ధి చేసి బాధిత గ్రామాలకు సరఫరా చేసేవారు. ఏటిలో ఇసుక మాఫియా కారణంగా నీటిమట్టం అడుగంటి పోయి తాగునీరందని పరిస్థితి ఏర్పడింది. జల్జీవన్ మిషన్ పథకం ద్వారా 2020–21లో రూ.6 కోట్లు మంజూరు చేశారు. పనులు జరగాల్సి ఉండగా కూటమి ప్రభుత్వం వచ్చి వాటిని రద్దు చేసింది. అయితే అధికారులు ఆ నిధులతో పనులు జరపాలని ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామంటున్నారు. జల్జీవన్ మిషన్ పథకం కింద 50 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరందిస్తామని కోతలు కోసిన కూటమి నాయకులు చుక్కనీరు అందించకపోవడం బాధాకరమని తెలిపారు. తాము భూములు అడగడం లేదు, రుణాలు అడగడం లేదు.. తాగునీరవ్వండి మహాప్రభో అంటూ ఈ ధర్నాలో మహిళలు తమ గోడు వినిపించారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరించకుంటే తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున మహిళలతో పాటు సీపీఎం నాయకులు కె.గోవింద, వి.నూకరత్నం, వి.శ్రీదేవి పాల్గొన్నారు. -
‘పిల్లలు చేసిన తప్పేంటి?’: ఎమ్మెల్సీ రవిబాబు
విద్యార్థుల తరలింపు విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు పాఠశాలకు చేరుకుని పిల్లలతో మాట్లాడారు. అనంతరం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వేళ పిల్లలను భయభ్రాంతులకు గురిచేసి తరలించడం అమానుషమన్నారు. ‘ఆ పసిబిడ్డలు చేసిన తప్పేంటి? వారి చదువులు, భవిష్యత్తుతో ఇలా ఆడుకోవడం సరికాదు’ అని మండిపడ్డారు. సీవోఈ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, శాశ్వత భవన నిర్మాణం పూర్తయ్యే వరకు అద్దె భవనంలో దాన్ని నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న మారికవలస గురుకులాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. -
జిల్లా దస్తావేజు లేఖర్ల నూతన కార్యవర్గం
అనకాపల్లి/చోడవరం: జిల్లా దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం అధ్యక్షునిగా వడ్డాది రమేష్(చోడవరం) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలో కొత్తూరు పంచాయతీ శారదానగర్ శ్రీనివాస ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగిన ఎన్నికల్లో జిల్లా గౌరవాధ్యక్షునిగా సున్నం చిదంబరస్వామి(నర్సీపట్నం), ప్రధాన కార్యదర్శి బొగ్గారపు వెంకట గున్నాజీరావు(అనకాపల్లి), ఉపాధ్యక్షులుగా డి.ఎస్.వి.జె.ఎన్.మురళీకృష్ణ (నక్కపల్లి), సహాయ కార్యదర్శిగా రనరం సన్యాసినాయుడు(నర్సీపట్నం), కోశాధికారిగా ఆర్లే ఉమామహేశ్వరరావు(యలమంచిలి), ఆర్గనైజింగ్ కార్యదర్శిగా శేఖర్మంత్రి శ్రీనివాసరావు (సబ్బవరం) కార్యవర్గ సభ్యులుగా కోట్ని గణేష్, సూదికొండ మాణిక్యాలరావు, ఒమ్మిడిపాటి వరప్రసాద్, జూరెడ్డి శ్రీరామూర్తి, బొబ్బిలి సన్యాసినాయుడుతో పాటు మరో తొమ్మిది మంది ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెనుమాక వెంకట సుబ్బారావు, రాష్ట్ర కార్యదర్శి గాదె రవికుమార్, రాష్ట్ర కోశాధికారి అవ్వారు సత్యనారాయణ వ్యవహరించారు. ఈ సందర్బంగా వడ్డాది రమేష్ మాట్లాడుతూ పై కమిటీ రెండు సంవత్సరాలు ఉంటుందన్నారు. జిల్లాలో దస్తావేజుల లేఖరులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేస్తామన్నారు. -
పెళ్లికి వెళ్తూ అనంత లోకాలకు..
ఆనందపురం/డెంకాడ: సింహాచలంలో జరిగే స్నేహితుడి పెళ్లి వేడుకలో పాల్గొనాలని ఉదయాన్నే సంతోషంగా బయలుదేరారు. పెళ్లి సందడి చూసి, ఆనందంగా తిరిగి రావాలని అనుకున్నారు. కానీ కొన్ని క్షణాల్లోనే ఆ ప్రయాణం విషాదంగా మారింది. కారు లారీని ఢీకొనడంతో సంతోషంగా సాగాల్సిన ప్రయాణం ఓ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. విజయనగరం జిల్లా డెంకాడ మండలం బొడ్డవలస గ్రామానికి చెందిన కోన రవికిశోర్ (37) సీఆర్పీఎఫ్ జవాన్. బంధువులతో కలిసి సింహాచలంలో జరిగే స్నేహితుడు శంకర్ వివాహ వేడుకకు కారులో బయలుదేరారు. గురువారం ఉదయం ఆనందపురం నుంచి పెందుర్తి వైపు వెళ్తుండగా గంభీరం పంచాయతీ పరిధిలోని దుక్కవానిపాలెం టోల్గేట్ సమీపంలో కారు అదుపుతప్పింది. డివైడర్పైకి ఎక్కిన కారు, అవతలి వైపు నుంచి వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. డ్రైవింగ్ చేస్తున్న రవికిశోర్కు తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. క్షణం ముందు వరకు కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి వేడుకకు బయలుదేరిన ఆయన.. అదే ప్రయాణంలో విగతజీవిగా మారడం అందరినీ కలచివేసింది. కారులో ఉన్న రౌతు వరాలమ్మ, కోన వరాలమ్మ, రౌతు దుర్గ, కురుముంజి వరలక్ష్మి, బంటుపల్లి లక్ష్మి గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రవికిశోర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. పెళ్లి ఇంటికి చేరాల్సిన వేళ విషాద వార్త చేరడంతో ఇరు కుటుంబాల్లో కన్నీటి పర్యంతమైంది. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లి కళ్లెదుటే... జమ్ముకశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్న కోన కిశోర్ బుధవారం సింహాచలంలో జరిగే స్నేహితుడి పెళ్లికోసం స్వగ్రామమైన బొడ్డవలసకు మంగళవారం వచ్చాడు. బొడ్డవలసకు చెందిన శంకర్ పెళ్లికోసం పేరంటాళ్లను తీసుకుని బుధవారం కారులో బయలుదేరి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. కారులో తల్లి కోన వరహాలు కూడా ఉంది. తల్లి కళ్లెదుటే కొడుకు ప్రాణాలు విడవడంతో కన్నీటిపర్యంతమైంది. వరహాలకు కూడా స్పల్పగాయాలయ్యాయి. భార్య, ఇద్దరు ఆడ పిల్లలు మృతుడికి భార్య భాగ్యశ్రీ, కుమార్తెలు రిషితశ్రీ (3వ తరగతి), గాత్వికశ్రీ (ఎల్కేజీ)లు ఉన్నారు. తల్లిదండ్రులు కోన చిదంబరం, వరహాలకు ఇద్దరు కుమార్తెలు, రవికిశోర్ ఒక్కడే కుమారుడు. కుటుంబానికి మృతుడి జీతమే ఆధారం. ప్రమాదంలో ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో కుటుంబంలో అంతులేని విషాదం అలుముకుంది. రవికిశోర్ మృతదేహానికి పోలీస్ లాంచనాలతో బొడ్డవలసలో అంత్యక్రియలు నిర్వహించారు. సీఆర్పీఎఫ్ జవాన్ కోన రవికిశోర్(ఫైల్) మృతుడుకోన రవికిశోర్ -
చదువుల గూడు చెదిరింది
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరిట మారికవలస గురుకులంలో కర్కశత్వం అర్ధరాత్రి 480 మంది విద్యార్థుల బలవంతపు తరలింపు ‘సారూ.. మమ్మల్ని ఇక్కడే చదువుకోనివ్వండి’ అంటూ కన్నీళ్లతో వేడుకోలు ‘మా పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు?’ అంటూ తల్లిదండ్రుల ఆవేదన ప్రభుత్వ తీరుపై భగ్గుమన్న గిరిజన సంఘాలు, వైఎస్సార్సీపీ నేతలుఇది రాతిగుండెల ప్రభుత్వం మా దగ్గర ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన ఈ ప్రభుత్వానికి మా పేద పిల్లల కష్టాలు కనిపించడం లేదా? ఇది పూర్తిగా గుడ్డి ప్రభుత్వం. రాత్రి ఒంటి గంటకు ఫోన్ చేసి అర్జెంటుగా స్కూల్కి రమ్మంటే 125 కిలోమీటర్ల దూరం నుంచి అంత అర్ధరాత్రి ఎలా రాగలం? నేను అరకు గన్నెల పంచాయతీ తడక నుంచి వచ్చాను. మా పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు. ఇక్కడే చదవనివ్వాలి. – నరాజి పద్మ, విద్యార్థి తల్లి మా ఉసురు కూటమికి తగులుతుంది అర్ధరాత్రి వేళ ఫోన్ చేసి రమ్మన్నారు. ఈ బడి బాగుంటుందని కడుపు కట్టుకుని మా పిల్లలను చేర్పించాం. తీరా చూస్తే విద్యా సంవత్సరం మధ్యలో ఎక్కడికో తరిమేస్తున్నారు. మా పిల్లల భవిష్యత్తు, చదువు ఏమైపోవాలి? రాత్రంతా మమ్మల్ని మానసిక క్షోభకు గురిచేశారు. మా ఏడుపు, మా ఉసురు వాళ్లకు తగులుతుంది. మంత్రి స్వయంగా ఇక్కడే ఉంచుతామని మాటిచ్చి ఇప్పుడు ఎటుపోయారు? – ఎన్ని వెంకటలక్ష్మి, విద్యార్థి తల్లి, పాడేరు గిరిజనులంటే అంత చులకనా? భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి మా గిరిజన వేషధారణలు, మా సంస్కృతి సంప్రదాయాలను ప్రచారానికి వాడుకున్నారు. అప్పుడు గుర్తొచ్చిన మేము.. ఇప్పుడు అవసరం లేదా? గిరిజన బిడ్డలంటే పాలకులకు ఇంత చులకనా? మారికవలసలో నాణ్యమైన విద్య దొరుకుతుందని ఆశపడితే ఉన్న ఫళంగా గెంటేస్తున్నారు. ఇంత కర్కశంగా వ్యవహరించడం దుర్మార్గం. – కిల్లో సహదేవ్, విద్యార్థి తండ్రి మధురవాడ: రాత్రి 10 గంటలు.. చుట్టూ చిమ్మచీకటి. గురుకుల వసతి గృహంలో రేపటి పాఠాల గురించి కలలు కంటూ నిద్రిస్తున్న గిరిజన బిడ్డలకు ఒక్కసారిగా బూట్ల చప్పుళ్లు, అధికారుల గద్దింపులు వినిపించాయి. ‘తెల్లారేసరికి స్కూల్ ఖాళీ చేయాలి.. బ్యాగులు సర్దుకోండి’ అంటూ హుకుం జారీ చేశారు. నిద్రమత్తులోనే పుస్తకాలు, బట్టలు బ్యాగుల్లో సర్దుకున్న విద్యార్థులు.. ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమన్నారు. ‘సారూ.. మమ్మల్ని ఇక్కడే చదువుకోనివ్వండి’ అంటూ కొందరు చేతులు జోడించి వేడుకున్నా ఫలితం లేకపోయింది. అర్ధరాత్రి దాటిన తర్వాత కొండకోనల్లో ఉన్న తల్లిదండ్రులకు ఫోన్లు చేసి ‘మీ పిల్లలను తరలిస్తున్నాం.. వెంటనే రండి’ అని సమాచారం ఇచ్చారు. వారు విశాఖ చేరుకునేలోపే 480 మంది విద్యార్థులను పోలీసుల పహారా మధ్య బస్సుల్లో ఎక్కించి సబ్బవరం, శ్రీకృష్ణాపురం, దేవరాపల్లి, పార్వతీపురం ప్రాంతాలకు తరలించారు. దీంతో మారికవలస–తిమ్మాపురం రోడ్డులోని గురుకుల ప్రాంగణం విద్యార్థుల ఆర్తనాదాలు, తల్లిదండ్రుల రోదనతో దద్దరిల్లింది. చదువు కోసం దూరం నుంచి వచ్చిన బిడ్డలు అరకు, పాడేరు, కొయ్యూరు, చింతపల్లి తదితర ఏజెన్సీ ప్రాంతాల కొండకోనల నుంచి వచ్చిన 480 మంది గిరిజన విద్యార్థులు మారికవలస గురుకులంలో చదువుకుంటున్నారు. మెరుగైన విద్య అందుతుందన్న ఆశతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడ చేర్పించారు. అయితే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) ఏర్పాటు కోసం ఈ పాఠశాలను ఖాళీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ పిల్లల చదువులపై అనిశ్చితి నెలకొంది. విద్యార్థులను ఇతర పాఠశాలలకు తరలించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత కొద్దిరోజులుగా తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు, వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళనలు చేస్తున్నారు. పాఠశాలను ఇక్కడే కొనసాగించాలని, సీవోఈకి ప్రత్యామ్నాయ భవనం చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన పేరెంట్స్ సమావేశంలోనూ ఇదే విషయాన్ని తల్లిదండ్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే వారి అభ్యంతరాలను పక్కనపెట్టి మంగళవారం అర్ధరాత్రి అధికారులు, పోలీసులు పాఠశాలకు చేరుకోవడం తీవ్ర కలకలం రేపింది. అర్ధరాత్రి ‘ఆపరేషన్’ రాత్రివేళ పాఠశాలకు చేరుకున్న అధికారులు, పోలీసులు గేట్లు మూసివేసి విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేశారు. బ్యాగులు సర్దుకోవాలని హుకుం జారీ చేశారు. నిద్రపోతున్న బిడ్డలను లేపి.. పుస్తకాలు, బట్టలు సర్దించి.. తెల్లారేలోగా పాఠశాలను ఖాళీ చేయించారు. ఒంటిగంట దాటిన తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లోని తల్లిదండ్రులకు ఫోన్లు చేసి పిల్లలను తరలిస్తున్నట్టు చెప్పారు. అప్పటికే రాత్రి కావడంతో దూర ప్రాంతాల నుంచి బయలుదేరడం తల్లిదండ్రులకు సాధ్యం కాలేదు. కొందరు అర్ధరాత్రే వాహనాల కోసం పరుగులు తీశారు. మరికొందరు ‘మా పిల్లల్ని మాకు చూపించండి.. మేమే వచ్చి తీసుకెళ్తాం’ అంటూ అధికారులను వేడుకున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ అంతలోనే ప్రత్యేక బస్సులు సిద్ధమయ్యాయి. పోలీసుల పహారా మధ్య విద్యార్థులను బస్సుల్లోకి ఎక్కించి సబ్బవరం, శ్రీకృష్ణాపురం, దేవరాపల్లి, పార్వతీపురం తదితర ప్రాంతాలకు తరలించారు. బిడ్డల కన్నీళ్లు.. తల్లిదండ్రుల ఆర్తనాదాలు.. పోలీసుల పహారా.. అధికారుల హడావుడి.. వెరసి ఆ రాత్రి మారికవలస గురుకుల ప్రాంగణం ఓ విషాద దృశ్యాన్ని తలపించింది. తల్లిదండ్రుల్లో ఆందోళన పెంచి పెద్దచేసి మంచి చదువు అందించాలన్న ఆశతో కొండకోనల నుంచి వందల కిలోమీటర్ల దూరం పంపిన పిల్లలను అర్ధరాత్రి హడావుడిగా తరలించడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీవోఈ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, అయితే విద్యార్థుల చదువుకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గిరిజన, ప్రజాసంఘాలు, వైఎస్సార్సీపీ శ్రేణులు కూడా అధికారుల తీరుపై మండిపడ్డాయి. ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ, సాంఘిక సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సునీల్కుమార్ రాజా, సోషల్ వెల్ఫేర్ డీడీ రామకృష్ణ, డీఎస్టీడబ్ల్యూవో సురేష్ల పర్యవేక్షణలో తరలింపు జరిగినట్లు సమాచారం. అమరావతిని ముట్టడిస్తాం.. విద్యా సంవత్సరం మధ్యలో విద్యార్థులను ఇలా రోడ్డున పడేయడం దారుణం. మొన్నటి పేరెంట్స్ మీటింగ్లో ప్రిన్సిపల్ సెక్రటరీ సమక్షంలో పిల్లలను ఇక్కడే ఉంచుతామని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే సహించేది లేదు. అవసరమైతే అమరావతి వరకు వెళ్లి సర్కారు మెడలు వంచుతాం. – పూజారి గోవిందరావు, పీసా ఉపాధ్యక్షుడు -
సరుగుడు...నష్టాలకు విరుగుడు
చోడవరం: ఈ ఏడాది సరుగుడు సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గతంలో మెట్ట ప్రాంతాలకే పరిమితమైన సరుగుడు సాగు ఇప్పుడు నదీ పరివాహక ప్రాంతాల్లోను, పల్లపు ప్రాంతాల్లోనూ అధికంగా సాగు చేస్తున్నారు. వ్యవసాయ పెట్టుబడులు పెరిగిపోవడంతో ఈ ఏడాది వరి, చెరకు సాగు తగ్గింది. వీటి స్థానంలో తక్కువ ఖర్చుతో సాగయ్యే సరుగుడు వేసేందుకు రైతులు ఎక్కువగా మొగ్గు చేపుతున్నారు. దీనితో సరుగుడు నారుకు విపరీతమైన గిరాకీ పెరిగింది. చోడవరం నియోజకవర్గంలో ప్రధాన పంటలు వరి, చెరకు. ఈ రెండు పంటలు సాధారణ విస్తీర్ణం ఏటా 21వేల 500 ఎకరాల్లో వరి, 30వేల ఎకరాల్లో చెరకు సాగు జరుగుతుంది. సరుగుడు సాగు 6వేల ఎకరాల్లో జరిగేది. అయితే ఈ ఏడాది సరుగుడు సాగు ఏకంగా 10వేల ఎకరాలకు పైబడి జరుగుతుందని అంచనా వేస్తున్నారు. సకాలంలో వర్షాలు పడకపోవడం, మరో పక్క వరి నారు ముడుగులు ఆశించిన స్థాయిలో నీరు, నారు లేకపోవడంతో ఆదిలోనే వరి సాగుకి నారు సమస్య ఉత్పన్నమైంది. అంతేకాకుండా సబ్సిడీపై అందాల్సిన డీఏపీ ఎరువును ప్రభుత్వం అనుకున్నంతగా అందించలేకపోయింది. వీటికితోడు దమ్ములు, ఉడుపులకు యంత్రాలు, ట్రాక్టర్లు, కూలీలకు అయ్యే ఖర్చు నాట్లు సమయంలోనే ఎకరాకి రూ.15 నుంచి 20 వేలకు ఖర్చవుతుండడంతో పెట్టుబడి పెట్టలేని పరిస్థితిలో రైతులు ఉన్నారు. ఈ రెండు పంటలకు ఈ ఏడాది పెట్టుబడులు భారీగా పెరిగాయి. మరో పక్క గోవాడ సుగర్ ఫ్యాక్టరీ రెండేళ్లుగా క్రషింగ్ చేయకుండా మూసివేయడంతో ప్రత్యామ్నాయ పంటలపై రైతులు ఆసక్తి చూపారు. ఈ పరిస్థితుల్లో పెద్దగా ఖర్చులేకుండా ఒకసారి ఉడిస్తే 4,5 యేళ్లు ఎటువంటి పెట్టుబడి లేకుండా ఒకేసారి మొత్తంలో డబ్బులు వచ్చే వాణిజ్య పంట అయిన సరుగుడుపై ఈ ఏడాది రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. జోరుగా సరుగుడు నారు వేసే పనిలో నిమగ్నమయ్యారు. సరుగుడు సాగు చేసేవారు సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో నారు కొరత ఏర్పడింది. ఒక్కో మొక్క 80 పైసలు నుంచి రూపాయి ఉండగా ఇప్పుడు డిమాండ్ను బట్టి రూపాయి 20 పైసలకు అమ్ముతున్నారు. అయినా నారుకోసం దూర ప్రాంతాలకు వెళ్లి మరీ తెచ్చి రైతులు సాగు చేస్తున్నారు. అయితే ఆహార పంటలైన వరి, చెరకు సాగు తగ్గడంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. -
విద్యార్థుల భవిషత్తుతో చెలగాటం బాధాకరం
అరకు ఎంపీ తనుజారాణిపాడేరు రూరల్: గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడడం బాధాకరమని అరకు ఎంపీ తనుజారాణి అన్నారు. బుధవారం ఆమె స్థానిక విలేకరులతో ఫోన్లో మాట్లాడారు. విశాఖపట్నం మారికవలస గురుకుల పాఠశాల నుంచి విద్యార్థులను బలవంతంగా వివిధ పాఠశాలలకు తరలించడం గిరిజనుల పట్ల కక్షసాధింపు చర్యేనని చెప్పారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించవలసిన ప్రభుత్వం కార్పొరేట్ శక్తులను పెంచిపోషిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన పేద విద్యార్థులు అనే చిన్నచూపుతోనే వారికి ఇష్టంలేకపోయినా తరలించారని, ఇదే మీ పిల్లలైతే ఈవిధంగానే చేస్తారా అని ప్రశ్నించారు. తెలవారుజాము నుంచే విద్యార్థులను తరలించే తీరు చూస్తే ఆవేదన కలిగిందన్నారు. నేరస్తుల పట్ల కూడా ఎవరూ ఈ విధంగా వ్యవహరించరని చెప్పారు. కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ఏవిధంగా తరలిస్తారని మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, గుడులుగోపురాలపై కూడా కూటమి ప్రభుత్వ పాలకుల కన్ను పడిందన్నారు. ఇప్పటికై నా తప్పు తెలుసుకుని ఆదివాసీ విద్యార్థులను మారికవలస పాఠశాలలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ఎంపీ చెప్పారు. -
వరాహనృసింహునికి నిత్యకల్యాణం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి బుధవారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 9.30 నుంచి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ బేడామండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణం జరిపారు. ఉభయ దాతలకు కల్యాణ అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రంలను అందించారు. ఘనంగా గరుడ సేవ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి గరుడ సేవ ఘనంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వెండి గరుడ వాహనంపై వేంజేపచేశారు. అష్టోత్తర శతనామావళి పూజ జరిపారు. భక్తులను గరుడ వాహనం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. విశేష హారతులు అందించారు. -
విశాఖలో ‘నవ్య’ శకం!
సాక్షి, విశాఖపట్నం: బుక్ చేసిన గ్యాస్ సిలిండర్ ఎప్పుడొస్తుందో అని ఎదురుచూస్తున్నారా.? సిలిండర్ మోసుకురావాలంటే అలిసిపోతున్నారా.? ఇకపై మీకు సమస్య లేదు. ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నట్లు సిలిండర్ ఆర్డర్ పెట్టేసుకుంటే.. నిమిషాల వ్యవధిలో మీ ఇంట్లో వాలిపోతుంది. ఒక చోటు నుంచి మరో చోటికి సులువుగా, శ్రమ లేకుండా తీసుకెళ్లేలా మీ చేతిలో ఒదిగిపోతుంది. అదే.. హిందూస్థాన్ పెట్రోలియం(హెచ్పీ) తీసుకొచ్చిన ‘నవ్య’మైన సిలిండర్. ఇప్పటికే బెంగళూరు, విజయవాడల్లో అందుబాటులోకి వచ్చిన ఈ సిలిండర్ను తాజాగా విశాఖ మార్కెట్లోకి కూడా ప్రవేశపెట్టారు. శివాజీపాలెంలోని రఘురాం గ్యాస్ ఏజెన్సీ వద్ద బుధవారం హెచ్పీ కంపెనీ ప్రతినిధులు 10 కిలోల కాంపోజిట్ సిలిండర్ ‘హెచ్పీ నవ్య’ను లాంఛనంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఏమిటీ ‘నవ్య’ ప్రత్యేకతలు.? నవ్య సిలిండర్ పాలిమర్తో తయారు చేశారు. బరువు తక్కువ, భద్రత ఎక్కువ అన్న సూత్రంతో రూపొందిన ఈ సిలిండర్ ఈ జనరేషన్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అని హెచ్పీసీఎల్ వర్గాలు చెబుతున్నాయి. సాంప్రదాయ ఇనుప సిలిండర్లతో పోలిస్తే ఈ కొత్త కాంపోజిట్ సిలిండర్ అత్యంత తేలికగా ఉండటమే కాకుండా అనేక ఆధునిక వసతులను కలిగి ఉందంటున్నారు. గ్యాస్ ఎంత ఉందో చూసుకోవచ్చు! గ్యాస్ ఉందా లేదా అనే టెన్షన్ని కూడా ఈ కొత్త సిలిండర్ లేకుండా చేస్తుంది. పాలిమర్ సిలిండర్లో మధ్యలో ఫైబర్గ్లాస్ సాంకేతికతను ఏర్పాటు చేశారు. అందుకే ఇది పాక్షికంగా పారదర్శకంగా ఉంటుంది. లోపల గ్యాస్ ఎంత ఉందనేది ఎప్పటికప్పుడు మనం చూసుకునే వెసులుబాటు ఉన్న ఒక స్మార్ట్ కాంపోజిట్ సిలిండర్ ఇది. దీంతో రీఫిల్ బుకింగ్ సమయాన్ని ముందుగానే అంచనా వేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఫైబర్గ్లాస్ మెటీరియల్తో రూపుదిద్దుకోవడం వల్ల తుప్పు పట్టే సమస్య ఉండదు. ప్రమాదాల బారిన పడకుండా అత్యున్నత భద్రతా ప్రమాణాలతో, పేలుడు సంభవించని రీతిలో దీనిని రూపొందించారు. 10 కేజీల సిలిండర్ ఇది 10 కిలోల సిలిండర్. అపార్టుమెంట్లు, చిన్న కుటుంబాలు, ఉద్యోగులు, విద్యార్థులతో పాటుగా అదనపు గ్యాస్ కనెక్షన్ కావాలనుకునేవారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సిలిండర్ ధర ప్రాంతాన్ని అనుసరించి, మొదటిసారి కనెక్షన్ తీసుకున్నప్పుడు రూ.4,900 నుంచి రూ.5,002 వరకూ ఉంటుందని హెచ్పీ అధికారులు చెబుతున్నారు. తొలిసారి కొనుగోలు చేసినప్పుడు మాత్రం గుర్తింపు కార్డు, డాక్యుమెంటేషన్ ప్రక్రియ ఉంటుంది. తర్వాత ఇక సులువే. దీని రీఫిల్ ధర రూ.1,600 నుంచి రూ.1,700 వరకూ ఉంటుంది. విశాఖ మార్కెట్లోకి ‘హెచ్పీ నవ్య’ మద్దిలపాలెం: హెచ్పీసీఎల్ రిఫైనరీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అభిషేక్ త్రివేది, ఎల్పీజీ చీఫ్ జనరల్ మేనేజర్ దేబేష్ పురోహిత్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మహేందర్ సింగ్ చేతుల మీదుగా ‘హెచ్పీ నవ్య’ను శివాజీపాలెంలో గల రఘురాం గ్యాస్ ఏజెన్నీ వద్ద బుధవారం మార్కెట్లోకి లాంఛనంగా ప్రవేశపెట్టారు. అనంతరం సేల్స్ ఆఫీసర్ ప్రతాప్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఎన్డీ సేల్స్) ఆశీష్ సింఘాల్ మాట్లాడుతూ వినియోగదారులకు మరింత భద్రతతో పాటు సులభమైన వినియోగాన్ని అందించడమే లక్ష్యంగా ఈ ఆధునిక సిలిండర్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీజీఎం(ఎల్పీజీ సేల్స్) ఆర్.ఉమాపతి, చీఫ్ మేనేజర్ (కమర్షియల్) బి.వి.వి.రాజు తదితరులు పాల్గొన్నారు. -
బతుకులు
విద్యుత్ కాంతులు పంచుతున్న ఆ కార్మికుల బతుకుల్లో వెలుగుకానరావడం లేదు. ఏళ్ల తరబడి గొడ్డుచాకిరీ చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు చాలీచాలని వేతనాలతో జీవితాలు వెల్లదీయవలసి వస్తోంది. చుట్టూ ప్రమాదాలు మోహరించి ఉన్నా కుటుంబ పోషణకోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వెట్టిచాకిరీ చేస్తున్న వారిని కూటమి ప్రభుత్వం, ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెలుగులు లేని● గేటు వద్ద సామూహికంగా భోజనాలు ● సోషల్మీడియాలో వీడియోలనుచూసి కన్నీరుపెట్టుకున్న తల్లిదండ్రులు ఐటీడీఏ ముట్టడి మారికవలస నుంచి విద్యార్థుల తరలింపునకు వ్యతిరేకంగా ఆందోళనపాడేరు రూరల్: ‘మా పిల్లల భవిష్యత్తును నాశనం చేయకండి.. చదువులో రాణించి మా బతుకులు మారుస్తారని దూరాభారమైనా పంపిస్తే ఇప్పుడు కనికరం లేకుండా వేరే ప్రాంతానికి తరలించడంతో వారికి నాణ్యమైన చదువు అందదు’ అంటూ గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మా బిడ్డలను మారికవలస గురుకులంలోనే చదువుకోనివ్వండి అంటూ ప్రాధేయపడుతూ పాడేరు ఐటీడీఏ కార్యాలయాన్ని బుధవారం ముట్టడించారు. విశాఖపట్నంలోని మారికవలస గురుకులం నుంచి గిరిజన విద్యార్థులను తరలించడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. నిరంకుశ పాలనలో భాగంగా పాడేరు ఐటీడీఏ పీవో, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్, జిల్లా యంత్రాంగంతో పాటు వివిధ శాఖల అధికారులు మారికవలస పాఠశాలలో రాత్రి బసచేసి తెల్లవారుజామున విద్యార్థులను కర్కశంగా వివిధ పాఠశాలలకు తరలించడం బాధాకరమన్నారు. కనీసం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా నేరస్తులను తరలించినట్లుగా బస్సుల్లో తరలించడం తగదన్నారు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు మారికవలస పాఠశాలలో ఉన్న పిల్లలను తక్షణం ప్రభుత్వం బలవంతంగా తరలించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పాఠశాల నుంచి ఖైదీలను తరలించినట్లు విద్యార్థులను బస్సుల్లో తీసుకెళ్లిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ వీడియోలను చూసి వారు తల్లడిల్లిపోయారు. గుండెలు బాదుకుని విలపించారు. అభంశుభం తెలియని విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు తల్లిదండ్రులు విశాఖ వెళ్లి తమ పిల్లలను పాడేరు తీసుకొచ్చారు. పాడేరు ప్రధాన రోడ్డుపై సాయంత్రం ర్యాలీ నిర్వహించి ఐటీడీఏ గేటు వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. కలెక్టర్, పీవో, డీడీ తక్షణం సమాధానం చెప్పాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడే సామూహికంగా భోజననాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, నాయకులు పార్వతి, రమేష్నాయుడు, వెంకటరాజు, శ్రీను, పుష్పవతి, పుణ్యవతి, మహిళా సంఘం నాయకురాలు చిన్ని పాల్గొన్నారు. సీలేరు: రాష్ట్రానికి వెలుగులు పంచే విద్యుత్ కేంద్రాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మి కుల బతుకులు దయనీయంగా మారుతున్నాయి. చాలీచాలని జీతాలతో కు టుంబాలు సైతం గడవని పరిస్థితి నెలకొంది. ఏళ్ల తరబడి జెన్కోనే నమ్ముకుని పనిచేస్తున్న వారిని ఉన్నతాధికారులు, కూటమి ప్రభు త్వం పట్టించుకోవడం లేదు. వారి శ్రమను దోపిడీ చేస్తూ, కష్టానికి తగిన వేతనం ఇవ్వడం లేదు. ఏపీ జెన్కో సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ పరిధిలో 323 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో మోతుగూడెంలో 210 మంది, డొంకరాయిలో 60 మంది, సీలేరులో 53 మంది దశాబ్దాలుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి కేవలం 22 వేల చొప్పున చెల్లిస్తున్నారు. ప్రమోషన్ అవకాశం, సరైన ఇంక్రిమెంట్, ఈఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత, పెన్షన్ తదితర సౌకర్యాలు లేకుండా ఏళ్ల తరబడి వెట్టిచాకిరీ చేస్తున్నారు. 35 ఏళ్లుగా రాత్రీపగలు తేడా లేకుండా ప్రమాదకర పనులు చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టర్ వ్యవస్థను రద్దుచేయాలని, తమను సంస్థలో విలీనం చేయాలని, జెన్కో నేరుగా జీతాలు ఇవ్వాలని, తెలంగాణ తరహాలో వేతనాలు చెల్లించాలని ఏళ్ల తరబడి కోరుతున్నా ఆలకించే నాథుడే కరవయ్యాడు. హామీలు గుప్పించి... ఆనక మరిచి ఎన్నికల సమయంలో కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పిన కూటమి నాయకులు హామీలు గుప్పించి, వారిలో ఆశలు రేకెత్తించారు. తీరా గెలిచిన తరువాత ఆ మాటే మరిచిపోయారు. అధికారం చేపట్టి రెండేళ్లవుతున్నా ఆ ఊసే ఎత్తడం లేదు. ప్రస్తుతం విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య పెరుగుతూ వారే కీలకంగా మారినప్పటికీ వారికి వేతనాలు ఎక్కడవేసిన గొంగలి అన్న చందంగా ఉన్నాయి. దీంతో కుటుంబాన్ని పోషించలేక, పిల్లలకు మంచి చదువులు చెప్పించలేక సతమతమవుతున్నారు. ప్రమాదకర పనులు ఏపీ జెన్కో సీలేరు విద్యుత్ కాంప్లెక్స్లో కాంట్రాక్ట్ కార్మికులతో ప్రమాదకర పనులు చేయిస్తున్నారు. అన్స్కిల్డ్ కేటగిరీలో చేరిన వీరికి సరైన శిక్షణ ఇవ్వకుండా పనులు అప్పగిస్తున్నారు. దీంతో వారి ప్రాణాలకు భద్రత కరవైంది. విధి నిర్వహణలో కాంట్రాక్ట్ కార్మికులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. పొరుగు రాష్ట్రంలో.. పొరుగు రాష్ట్రం తెలంగాణ కార్మికులకు రూ. 48 వేలు జీతం చెల్లిస్తుండగా మన రాష్ట్రంలో అదే కార్మికులకు 22,000 జీతం ఇస్తున్నారు. కష్టపడి పనిచేసే కార్మికులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చకుండా నిబంధనల పేరుతో మరింత ఇబ్బందులకు గురి చేస్తోందని పలు యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆందోళనలు చేసినా... దశాబ్దాలుగా జెన్కోలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులను సంస్థలో విలీనం చేయాలని లేదా, సంస్థే నేరుగా తెలంగాణ తరహాలో జీతాలు చెల్లించాలని పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు చేసి, వినతి పత్రాలు అందజేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాంట్రాక్ట్ కార్మికులే అధికం గతంలో జెన్కోలో పర్మినెంట్ ఉద్యోగులు సంఖ్య అధికంగా ఉండేది. ఉద్యోగుల పదవీ విరమణ, మరణించడం, కొత్త నియామకాలు లేకపోవడంతో వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం సీలేరు కాంప్లెక్స్పరిధిలోని మూడు ప్రాజెక్టుల్లో సుమారు 250 మంది పర్మినెంట్ ఉద్యోగులు పనిచేస్తుండగా కాంట్రాక్ట్ కార్మికులు 323 మంది పనిచేస్తున్నారు. అధికంగా కాంట్రాక్ట్ కార్మికులే ఉన్నా వారి సంక్షేమం గురించి పట్టించుకునే వారే లేరు. ఇప్పటికై నా తమను పర్మినెంట్ చేయాలని, సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని కాంట్రాక్ట్ కార్మికులు కోరుతున్నారుప్రధాన డిమాండ్లు.. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను భేషరతుగా పర్మినెంట్ చేయాలి. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. గ్రాట్యుటీ రూ.20 లక్షలు, ప్రమాద బీమా రూ.కోటి ప్రతి కార్మికుడికి అమలు చేయాలి. తెలంగాణ రాష్ట్రం తరహాలో కనీస వేతనం రూ.48 వేలు చెల్లించాలి. జీవో.167 ప్రకారం పనిచేస్తున్న కార్మికులకు జీవో నంబర్ 129 ప్రకారం వేతనాలు చెల్లించాలి. కాంట్రాక్టర్లు ప్రతి నెల ఒప్పందం ప్రకారం 7 వ తేదీ లోపు వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. దుర్భరంగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల జీవితాలు చాలీచాలని జీతాలతో అవస్థలు ప్రమాదకర పనులు చేయిస్తున్నా పట్టని ఉన్నతాధికారులు ఎన్నికల హామీని విస్మరించిన కూటమి ప్రభుత్వం భారంగా కుటుంబ పోషణ జీతం సరిపోక ఇబ్బందులు పడుతున్నాం సీలేరులో గత 20 ఏళ్లుగా కాంట్రాక్టు కార్మికుడిగా పారిశుధ్యం విభాగంలో పనిచేస్తున్నాను. జీతం సరిపోక కుటుంబ పోషణ ఇబ్బందిగా మారుతోంది. కనీస సదుపాయాలు కల్పించడంతో పాటు వేతనాలు పెంచాలి. – అప్పలరాజు, జెన్ కో కార్మికుడు సీలేరు జీతం చాలక ఇబ్బందులు నేను సీలేరు ఏపీ జెన్కోలో 15 సంవత్సరాలుగా కాంటాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం రూ.22 వేలు చేతికి వస్తోంది. దీంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉంది. ప్రస్తుతం నిత్యావసర సరుకులు ధరలు, ఇతర ఖర్చులు, పిల్లల చదువుల ఖర్చులు పెరిగిపోవడంతో అప్పులు చేయాల్సి వస్తోంది. చాలా సంవత్సరాలుగా ఇదే జీతంతో పని చేస్తున్నాను. ప్రభుత్వం స్పందించి జీతం పెంచాలి. – బాపిరాజు, కాంట్రక్ట్ కార్మికుడు, సీలేరు తెలంగాణ తరహాలోసదుపాయాలు కల్పించాలి మన రాష్ట్రంలో జెన్ కో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను కూటమి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. తెలంగాణ తరహాలో అన్ని సదుపాయాలు కల్పిస్తూ రూ.48 వేల జీతాన్ని అమలు చేయాలి. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తాం. – బి.లక్ష్మణరావు, సీఐటీయూ బ్రాంచ్ అధ్యక్షుడు -
రెండు చోరీ కేసుల్లో నలుగురి అరెస్ట్
పెందుర్తి: సబ్బవరం–షీలానగర్ రోడ్డు పనులకు వినియోగించే ఐరన్, కేబుల్ వైర్లను దొంగిలించిన నలుగురు వ్యక్తులను పెందుర్తి పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.4.5 లక్షల విలువైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పెందుర్తి క్రైం పోలీస్ స్టేషన్లో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయా వివరాలను క్రైం ఏసీపీ ఎ.వెంకటరావు వెల్లడించారు. సబ్బవరం–షీలానగర్ రోడ్డు పనుల నిమిత్తం పెందుర్తి మండలం నందవరపువానిపాలెం సమీపంలో ఐవోసీఎల్ సంస్థ ఐరన్, కేబుల్ వైర్లను నిల్వచేసింది. ఈ నెల 8న సైట్ ఇన్చార్జి తోట సునీల్రాజ్ సామగ్రి సరిచూడగా అందులో దాదాపు రూ.3 లక్షల విలువైన ఐరన్, కేబుల్ వైర్లు చోరీకి గురైనట్లు గుర్తించారు. ● గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి అనుసంధానంగా నిర్మిస్తున్న సబ్బవరం–షీలానగర్ రోడ్డు నిర్మాణ పనుల నిమిత్తం జేపీ కన్స్ట్రక్షన్స్ సంస్థ నరవ వద్ద సెంటరింగ్ ప్లేట్లు, యూ జాకీలు, బేస్ జాకీలు భద్రపరిచింది. గత నెల 10న సైట్ సెక్యూరిటీ సూపర్వైజర్ వంకా శివశంకర్ సామగ్రి పరిశీలించగా రూ.1.50 విలువైన సామాగ్రి చోరీకి గురైనట్లు గుర్తించారు. ఆయా చోరీల విషయంలో ఫిర్యాదులు అందుకున్న పెందుర్తి క్రైం విభాగం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నగరంలోని కొబ్బరితోట(స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కుప్పిలి)కి చెందిన అలపాన రెడ్డి(29), పూర్ణామార్కెట్ కల్లు పాకల(స్వస్థలం శ్రీకాకుళం జిల్లా లోపెంట)కు చెందిన నాయన అసిరిబాబు(30), పూర్ణామార్కెట్ ప్రసాద్ గార్డెన్స్(స్వస్థలం శ్రీకాకుళం జిల్లా వెంకయ్యపేట)కు చెందిన దల్లి గోవింద్(29), 104 ఏరియాకు చెందిన పరపటి సంతోష్కుమార్(31) ఆయా చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. నిందితులను బుధవారం నగరంలో మాటు వేసి పట్టుకున్నట్లు ఏసీపీ వెల్లడించారు. వారిని నుంచి చోరీ సొత్తును రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. ఆయా కేసుల్లో ప్రతిభ కనబరిచిన వెస్ట్ జోన్ క్రైం సీఐ బి.తిరుమలరావు, పెందుర్తి క్రైం ఎస్ఐ డి.సూరిబాబు, ఏఎస్ఐ కె.శ్రీనివాసరావు, హెచ్సీ వి.పేరయ్యనాయుడు, పీసీలు బి.దేముడునాయుడు, ఎల్.తాతారావులను ఉన్నతాధికారులు అభినందించారు. -
సీఎం రమేష్ అక్రమ మైనింగ్
ఆ క్వారీకి లీజుల్లేవు.. పర్యావరణ అనుమతులు అంతకంటే లేవు. ప్రభుత్వ రికార్డుల్లో మూతపడినట్లు కనిపిస్తుంది.. కానీ వాస్తవానికి అక్కడ నిత్యం వందలాది లారీలు ఖనిజాన్ని తరలించేస్తున్నాయి. కళ్లెదుటే దోపిడీ జరుగుతున్నా అధికారులు కిమ్మనడంలేదు...ఎందుకంటే దాని వెనకున్నది ఎంపీ సీఎం రమేష్ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, ‘వెంగమాంబ’ క్రషర్స్ అధినేత శ్రీనివాస్ చౌదరిలతో కూడిన మైనింగ్ మాఫియా. అనకాపల్లి జిల్లాలో ఎంపీ సీఎం రమేష్ సాగిస్తున్న దోపిడీకి అంతు లేకుండా పోతోంది. నిబంధనలను తుంగలో తొక్కుతూ రూ.వందల కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. ఈ అక్రమ మైనింగ్ వివరాలివీ.సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : అనకాపల్లి మండలం సీతానగరం గ్రామ పరిధిలోని సర్వే నంబరు 251, 190, 303లో ‘వెంగమాంబ క్రషర్స్’ పేరుతోనూ అక్రమ మైనింగ్ సాగిస్తున్నారు. వాస్తవానికి సర్వే నం. 251లో జీఎస్ఎన్ శ్రీనివాస్ పేరిట ఉన్న 4 హెక్టార్లు, 1 హెక్టారు లీజుల గడువు వరుసగా మే 2023, ఫిబ్రవరి 2022 నాటికే ముగిసిపోయాయి. అలాగే సర్వే నం.193, 303లలో సుమారు 3 హెక్టార్లలో వీవీఆర్ స్టోన్ క్రషర్స్ (వెంగమాంబ శ్రీనివాస్ చౌదరి) పేరిట ఉన్న లీజులకు సైతం ఎలాంటి అనుమతులు లేవు. గతంలో వచ్చిన అక్రమ మైనింగ్ ఫిర్యాదులతో ఈ క్వారీలు మూతపడ్డాయి. మైనింగ్ శాఖ అధికారిక రికార్డుల ప్రకారం ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరగడం లేదు. కానీ, నిబంధనలకు పాతరేసి ప్రతిరోజూ ఇక్కడ తవ్వకాలు జరిపి ఇష్టారాజ్యంగా ఖనిజాన్ని తరలించేస్తున్నారు. పథకం ప్రకారం చేతులు కలిపి... తన అక్రమ వ్యాపారాలకు రక్షణ కవచం ఏర్పాటు చేసుకునేందుకు వెంగమాంబ శ్రీనివాస్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీలో చేరి, అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన సీఎం రమేతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఎంపీకి అత్యంత సన్నిహితుడిగా మారారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉందన్న ధీమాతో ఆయన మరింతగా రెచ్చిపోతున్నారు. వెంగమాంబకు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత పీలా గోవింద్ కూడా సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కొద్ది రోజుల క్రితం స్వయంగా పీలా మాట్లాడిన ఆడియో మెసేజ్ కలకలం రేపింది. అనుమతిలేని చోట అడ్డగోలు తవ్వకాలు పాత జరిమానాలకు సంబంధించి ఒక్క పైసా కూడా చెల్లించకపోగా, మైనింగ్ శాఖ డిమాండ్æ నోటీసులు ఇచ్చినా, కోర్టుల్లో కేసులు నడుస్తున్నా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎంపీ సీఎం రమేష్ అండతో.. పర్యావరణ, మైనింగ్ అనుమతులు లేకుండానే రూ.వందల కోట్ల విలువైన ఖనిజాన్ని యథేచ్ఛగా దోచేస్తున్నారు. అనుమతి లేని చోట అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. పట్టపగలే అక్రమ మైనింగ్ నడుస్తూ రోడ్డు మెటల్, బోల్డర్లు రవాణా అవుతున్నా..ఎంపీ జోక్యం ఉండడంతో అటు మైనింగ్ శాఖ అధికారులతో పాటు రవాణా, రెవెన్యూ యంత్రాంగం కూడా అడ్డుకునే సాహసం చేయలేకపోతోంది. కళ్లెదుటే కోట్లాది రూపాయల ప్రభుత్వ సంపద దోపిడీకి గురవుతున్నా అధికారులు చేష్టలుడిగి చూస్తుండడంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.విజిలెన్స్ అధికారికి లంచం ఆఫర్!వెంగమాంబ స్టోన్ క్రషర్స్ అక్రమాల చరిత్ర ఈనాటిది కాదు. 2020లో మైన్స్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ క్వారీల్లో ఆకస్మిక తనిఖీలు జరిపారు. అనుమతులకు మించి ఏకంగా 5,68,923 క్యూబిక్ మీటర్ల ఖనిజాన్ని అక్రమంగా దోచేశారని నిర్ధారించారు. ఈ అడ్డగోలు తవ్వకాల వల్ల ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ.100 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేసి, రూ. 33 కోట్ల మేర భారీ జరిమానా విధించారు. అయితే ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం విజిలెన్స్ మైనింగ్ అధికారికి వెంగమాంబ యజమాని ఏకంగా రూ. 3 కోట్ల మేర లంచం ఇవ్వజూపారంటూ ఆరోపణలు రావడం.. కలకలం రేపింది. వందలాది లారీల్లో ఖనిజం తరలిపోతోందని స్థానికులు మొత్తుకున్నా లెక్కచేయకుండా మైనింగ్ డాన్కి సహకరించారన్న ఆరోపణలతో అప్పట్లో ముగ్గురు అధికారులపై బదిలీ వేటు కూడా పడింది.రూ.15 వేల జీతగాడు.. మైనింగ్ ఓనర్.! పంచదార్లలో మైనింగ్ లీజు తీసుకున్న విజయకుమార్ నాయుడు సీఎం రమేష్కు సమీప బంధువు, వరుసకు అల్లుడు. యర్రగొండ్లకు చెందిన విజయ్కుమార్ గతంలో సీఎం రమేష్ అన్న సురేష్ నాయుడు దగ్గర రూ.15 వేల జీతంతో పీఏగా పనిచేశారు. తర్వాత సీఎం రమేష్ పీఏగా మారారు. అనకాపల్లి రాజకీయ వ్యవహారాల్లో పీఏ విజయ్కుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. కేవలం రూ.15 వేల జీతగాడైన విజయ్కుమార్.. తక్కువ కాలంలోనే మైనింగ్ ఓనర్గా ఎలా అయ్యారనేదే ప్రశ్నార్థకంగా మారింది. తన కంపెనీ మైనింగ్ పేరుతో రిత్విక్ ప్రాజెక్టులకు గ్రావెల్ సరఫరా చేస్తున్నట్లు చూపిస్తూ రూ.కోట్లు కొల్లగొట్టేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. Godavari Pushkaralu: పది కోట్ల మంది భక్తులు వస్తారు -
కన్నీటి జలపాతాలే
ఆదమరిస్తేముంచంగిపుట్టు: జిల్లాలో కనువిందు చేసే జలపాతాలు ఎన్నో ఉన్నాయి. వర్షాకాలంలో కొండలపై నుంచి జలనిధి జాలువారుతూ మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ప్రకృతి సోయగాలు తిలకించేందుకు, జలపాతాల సవ్వడులను ఆస్వాదించేందుకు దేశ,విదేశాల నుంచి సందర్శకులు వస్తుంటారు. ఈ విహార యాత్రలు కొత్త సంవత్సరం ప్రారంభం వరకు కొనసాగుతాయి. కొత్త ప్రదేశాలను చూసి తన్మయత్వానికి లోనవ్వ డమే కాకుండా అక్కడి పరిస్థితులపై అవగాహన లేక ఈతకు దిగి ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు ఫొటోలు, సెల్ఫీల కోసం సాహసాలు చేస్తూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. వీరిలో యువతే ఎక్కువగా ఉంటున్నారు. ● ముంచంగిపుట్టు మండలంలో ఆంధ్ర,ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో ఉన్న డుడుమ జలపాతం 556 అడుగుల పైనుంచి జాలువారుతుంది. దగ్గరకు వెళ్లడమంటే కాస్త ప్రమాదంతో కూడుకున్నదే. జలపాతం వద్దకు వెళ్లాలంటే 800 మెట్లు దిగాలి. నీటి ప్రవాహం వల్ల జలపాతం కింద భాగంలో రాళ్లు కోతకు గురై సొరంగాలు ఏర్పడ్డాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లే. ఈ జలపాతం వద్ద ఇప్పటికే అనేకమంది మృత్యువాత పడ్డారు. మండలంలో తారబు, జడిగూడ,బురదగుంట,హంసబంద జలపాతాల వద్ద సైతం ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ● అనంతగిరి మండలంలో సరియా, కటికి, తాటిగూడ, డుంబ్రిగుడ మండలంలో చాపరాయి, అరకులోయలో రణజిల్లెడ, జి.మాడుగులలో కొత్తపల్లి, పెదబయలులో పిట్టలబొర్ర, తారబు, చింతపల్లిలో లంబసింగి సమీపంలో రావిమానుపాకలు, గాదిగుమ్మి వంటి పలు జలపాతాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. అయితే వీటిని చూసేందుకు వెళ్లిన వారు అజాగ్రత్త కారణంగా ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రభుత్వం,పర్యాటక శాఖ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు లెక్కచేయకుండా ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో విహారయాత్ర విషాదాన్ని మిగులుస్తోంది. కొన్ని జలపాతాల వద్ద స్థానిక గిరిజనులే ప్రహారా కాస్తూ పర్యాటకులను హెచ్చరిస్తున్నా లెక్కచేయకుండా వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు నీళ్లు అధికంగా ప్రవహిస్తున్న జలపాతాల వద్ద స్నానం చేయకూడదు. సెల్ఫీ కోసం ఎత్తైన బండ రాళ్లపై ఎక్కకూడదు. బండరాళ్లపై నిరంతరం నీళ్లు ప్రవహిస్తూ ఉండటం వల్ల అవి నాచు పట్టి జారుగా ఉంటాయి. వర్షాలు అధికంగా పడుతున్న సమయంలో జలపాతాల వద్దకు వెళ్లకపోవడమే మేలు. పర్యాటక శాఖ అధికారుల సూచనలు పాటించాలి. ఈత వస్తే తప్ప జలపాతంలో దిగడానికి సాహసించరాదు. మద్యానికి దూరంగా ఉండడం ఎంతో ఉత్తమం. జలపాతాల వద్దకు ఒంటరిగా కాకుండా గుంపులుగానే వెళ్లాలి. డుడుమ వద్ద గల్లంతైన వారి కోసం గాలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం (ఫైల్)జాగ్రత్తలు పాటించాలి జలపాతాలలో ప్రమాదాలు జరిగే ప్రదేశాల వద్ద హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వాటిని పట్టించుకోకపోవడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. జలపాతాలను సందర్శించేందుకు వెళ్లే పర్యాటకులు అన్ని జాగ్రత్తలు పాటించాలి. – ఎస్.లక్ష్మణరావు, సీఐ, జి.మాడుగుల -
కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగుల సమ్మె నోటీసు
● సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం ● జేఏసీ జిల్లా అధ్యక్షుడు రాంబాబు పాడేరు: జిల్లా వ్యాప్తంగా వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డీఎంహెచ్వో డాక్టర్ రియాజ్కు వైద్యారోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు మంగళవారం సమ్మె నోటీసు అందజేశారు. అనంతరం కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగుల సంఘం జేఏసీ జిల్లా అధ్యక్షుడు గంపరాయి రాంబాబు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ తాము సమ్మె చేయనున్నట్టు చెప్పారు. ఏజెన్సీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వైద్యారోగ్య ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, నగదు రహిత హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, సర్వీస్లో ఉన్న కాంట్రాక్ట్ హెల్త్ ఉద్యోగి మరణిస్తే పూర్తి స్థాయి ఎక్స్గ్రేషియా చెల్లించాలని, ఉద్యోగుల రెగ్యులర్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు సమాన పనికి సమాన వేతనం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఇప్పటికే పలుమార్లు శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె చేయవలసి వస్తోందన్నారు. సమస్యలు పరిష్కరించే వరకూ దశలవారీగా పోరాటం చేస్తామని చెప్పారు. ఈనెల 26, 27, 28 తేదీల్లో నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని, 29, 30 తేదీల్లో ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పారు. సెప్టెంబర్ 1, 2 తేదీల్లో ఆన్లైన్ పనులు నిలుపుదల చేస్తామని, 3, 4 తేదీల్లో ఓపీ సేవలు నిలిపివేస్తామని, 5, 6వ తేదీల్లో ఎమర్జెన్సీ సేవలు బహిష్కరిస్తామని, 7, 8 తేదీల్లో పెన్డౌన్ చేసి ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు. 9వ తేదీన కలెక్టరేట్ వద్ద రిలే దీక్షలు చేపడతామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమ్మె నోటీసు అందించిన వారిలో వైద్యారోగ్య కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం జిల్లా జేఏసీ నేతలు విజయ, వరలక్ష్మి తదితరులు ఉన్నారు. -
ఒకే పేరుతో బ్యాంకులో ఇద్దరికి ఖాతాలు
మునగపాక : ఖాతాదారుని పేరు ఒక్కటే..గాని వ్యక్తులు వేర్వేరు. ఇరువురు ఖాతాదారులు ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలో భాగంగా జరిగిన తప్పును తెలుసుకొని సర్దుకుపోయారు. అయితే సంబంధం లేని వ్యక్తి బ్యాంక్ వద్ద హల్చల్ చేయడం చర్చనీయాంశమైంది. మునగపాక గ్రామంలో శెట్టిబలిజ కాలనీకి చెందిన పోలారపు జ్యోతి 28–03–2015న నాగులాపల్లి యూనియన్ బ్యాంక్లో ఖాతా తెరిచారు. అదే ప్రాంతానికి చెందిన పోలారపు జ్యోతి పేరిట 2016లో అదేబ్యాంక్లో మరో ఖాతా తెరిచారు. అయితే వెనుక అకౌంట్ తెరిచిన జ్యోతికి 28–03–2015న ఖాతా ప్రారంభించినట్టు పుస్తకం అందజేశారు. ఇరువురిలో ఒక జ్యోతి స్థానికంగా పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నారు. సంబంధిత బ్యాంకుకు ఆమె జీతం క్రమం తప్పకుండా క్రెడిట్ అవుతూ వస్తుంది. రెండవసారి అకౌంట్ ప్రారంభించిన జ్యోతి బ్యాంక్ ఖాతాలో రెండేళ్లుగా తల్లికి వందనం పేరిట ఇద్దరు పిల్లలకు రూ.52వేలతో పాటు మరో 5వేల నగదు వెరసి రూ.57వేల నగదు ఖాతాలో ఉంది. అయితే రెండు రోజుల క్రితం జ్యోతి తన ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసినట్టు మెసేజ్ రావడంతో కంగుతిన్న ఆమె స్థానిక బ్రాంచి అధికారులను ఆశ్రయించింది. దీంతో బ్యాంక్ మేనేజర్ కలుగజేసుకొని విషయాన్ని పరిశీలించి గతంలో బ్యాంక్ అధికారుల చిన్నపాటి తప్పిదం కారణంగా పొరపాటు జరిగిందని వారికి నచ్చచెప్పారు. ఈ సమయంలో మునగపాకకు చెందిన ఒక వ్యక్తి తనకు సంబంధం లేకున్నా బ్యాంక్ వద్ద హల్చల్ చేసి బ్యాంక్ అఽధికారులను ఇబ్బందులకు గురిచేసేలా ప్రవర్తించడంతో అసహనం వ్యక్తమైంది. ఇరువురు ఖాతాదారులు జరిగిన తప్పును గుర్తించి సర్దుకుపోతుంటే సంబంధం లేని వ్యక్తి హల్చల్ చేయడం ఎంతవరకు సమంజసమని బ్యాంక్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న బ్యాంక్ అధికారులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం. -
కళాకారులను ప్రోత్సహించాలి
తుమ్మపాల : సాంస్కృతిక రంగానికి, కళాకారులకు సరైన ప్రోత్సాహం లేనందువల్ల కళా రంగం దుర్భరమైన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతుందని, కళాకారుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి సంక్షేమ పథకాలు అందించాలని ప్రజానాట్యమండలి కళా సంస్థ జిల్లా సమితి ఆధ్వర్యంలో కళాకారులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. రాష్ట్రంలో జానపద గ్రామీణ పౌరాణిక పద్మ నాటక రంగాలు కళారూపాలు ఉన్నాయని, వాటికి ప్రభుత్వం నుంచి సరైన ఆదరణ, ప్రోత్సాహం కరువైందని జిల్లా నాయకులు ఎన్.అప్పారావు, వై.ఎన్. భద్రం అన్నారు. ఆయా కళా రంగాలలో నెపుణ్యం కలిగిన కళాకారులకు గుర్తింపు లేకుండా పోయిందని, గతంలో కళాకారులకు ప్రత్యేకమైన పెన్షన్ విధానం ఉండేదని, కళాకారులకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు కావడం లేదన్నారు. సమాజాన్ని చైతన్యవంతుల్ని చేస్తూ వినోదాన్ని విజ్ఞానాన్ని పంచే కళాకారుల పరిస్థితి దుర్భరంగా తయారైందన్నారు. కళారంగాన్ని కళారూపాలను, కళాకారులను కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం సాంస్కృతిక శాఖకు ప్రతి ఏటా ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయింపుతో పాటు అర్హత కలిగి, 50 సంవత్సరాలు నిండిన ప్రతి పేద కళాకారునికి పదివేల రూపాయలు పెన్షన్, ప్రతి కళాకారుడికి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని, నెలలో కనీసం 15 రోజుల పాటు కళాకారులకు వేతనంతో కూడిన కళా ప్రదర్శనలకు అవకాశాలు కల్పించాలన్నారు. నంది నాటకోత్సవాల్లో గ్రామీణ జానపద కళారూపాల విభాగాలను పోటీల్లో చేర్చాలని, ప్రతి ఏటా తప్పనిసరిగా నంది నాటకోత్సవాలు నిర్వహించి ప్రోత్సహించాలన్నారు. ప్రతి పేద కళాకారుడికి మూడు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించాలన్నారు. ప్రభుత్వం ఏటా అందించే కళారత్న, ఉగాది పురస్కారాల ఎంపికలో పారదర్శకత నిజాయితీ ప్రదర్శించాలని అన్నారు. కళాకారులకు బస్సు, రైలులో ఉచితంగా ప్రయాణించడానికి సౌకర్యం కల్పించాలని కోరారు. -
రేపు చింతపల్లిలోమెగా జాబ్మేళా
పాడేరు : ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్ఎస్డీసీ) ఆధ్వర్యంలో ఈనెల 27న చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్టు కలెక్టర్ టి.నిశాంతి మంగళవారం తెలిపారు. జాబ్మేళాలో పది ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. టెన్త్ నుంచి పీజీ ఆపై చదువులు పూర్తి చేసుకుని ఉపాధి, ఉద్యోగం లేని నిరుద్యోగ అభ్యర్థులు అర్హులని తెలిపారు. విద్యార్హత, నైపుణ్యం అధారంగా జాబ్మేళాలో పాల్గొని ఉద్యోగావకాశాలు పొందాలని సూచించారు. అనంతరం ఆమె జాబ్మేళా పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జి. ప్రశాంత్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి
తాటిచెట్లపాలెం(విశాఖ): రైల్వే ప్రయాణికుల భద్రత, సురక్షిత ప్రయాణాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ అధికారులకు సూచించారు. జనరల్ మేనేజర్ కార్యాలయంలో జోన్ పరిధిలోని నాలుగు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు, ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల భద్రత, భద్రతా చర్యలు, నిఘా వ్యవస్థపై విస్తృతంగా సమీక్షించారు. అనంతరం ఇంజినీరింగ్ పనులు, గూడ్స్ షెడ్ల అభివృద్ధి, పార్సిల్ కార్యాలయాల సదుపాయాల విస్తరణతో పాటు ప్రస్తుతం జరుగుతున్న పలు రైల్వే అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. విధి నిర్వహణలో అప్రమత్తత, అంకితభావం ప్రదర్శించి పలు ప్రమాదాలను అరికట్టడంతో పాటు ప్రయాణికుల ప్రాణాలు, రైల్వే ఆస్తులను కాపాడడంలో విశేష సేవలందించిన నలుగురు ఉద్యోగులకు సేఫ్టీ అవార్డులు అందజేశారు. అవార్డులు అందుకున్న వారిలో విజయవాడ డివిజన్కు చెందిన తుని ట్రాక్ మెయింటెనర్ బి. వెంకటరావు, గుంటూరు డివిజన్ గుండ్లకమ్మకు చెందిన స్టేషన్ మాస్టర్ వి. వీరబ్రహ్మం, గుంతకల్ డివిజన్ వెంకటగిరికి చెందిన గేట్మన్ లలిత్ కుమార్, విశాఖ డివిజన్ సింహాచలం నార్త్కు చెందిన గూడ్స్ ట్రైన్ మేనేజర్ జై సింగ్ మీనా ఉన్నారు. వారికి జనరల్ మేనేజర్ అభినందనలు తెలిపారు. సమావేశంలో ఆయా డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు, వివిధ విభాగాల ప్రిన్సిపల్ హెడ్లు పాల్గొన్నారు.సౌత్ కోస్ట్ రైల్వే జీఎం సందీప్ మాథుర్ -
స్లాస్ సర్వేలో పారదర్శకత పాటించాలి
కశింకోట : స్లాస్ (ఎస్ఎల్ఎఎస్) సర్వేను కేవలం ఒక పరీక్షగానే కాకుండా విద్యార్థుల వాస్తవ అభ్యసన స్థాయిని తెలుసుకునే ముఖ్య విద్యా సాధనంగా చూడాలని జిల్లా విద్యా శాఖ అధికారి జి.జి.ఈ నాగేశ్వరరావు సూచించారు. కశింకోటలోని డీపీఎన్ జెడ్పీ హైస్కూల్లో జోన్ స్థాయిలో 7 మండలాలకు చెందిన ఎంపిక చేసిన 139 మంది ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్కు మంగళవారం స్లాస్ సర్వే (రాష్ట్ర స్థాయి అభ్యాసన సాధన సర్వే)పై ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా హాజరై మాట్లాడుతూ విద్యార్థులు తమ తరగతి స్థాయికి అనుగుణంగా సాధించాల్సిన అభ్యాసన ఫలితాలను ఎంతవరకు సాధించారో తెలుసుకోవడం, వారి సామర్థ్యం, అభ్యాసన లోపాలను గుర్తించడం సర్వే ప్రధాన ఉద్దేశ్యమన్నారు. సర్వే ద్వారా లభించే సమాచారాన్ని విశ్లేషించి విద్యార్థులకు అవసరమైన అబ్యాసన మెరుగుదల కార్యక్రమాలను రూపొందించేందుకు, బోధనా పద్దతులను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఉపయోగించుకోవచ్చునన్నారు. ఫీల్డ్ ఇన్విజిలేటర్లు సర్వే సమయంలో పూర్తి పారదర్శకత పాటించాలని, విద్యార్థులకు ఎలాంటి సమాధానాలను సూచించరాదని, మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఒ వి. సురేష్, డిసీసీబీ కార్యదర్శి నూకరాజు, డైట్ లెక్చరర్ సిహెచ్. శ్రీధర్, ఎ.వి. రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. వేతన బకాయిల కోసం డీఈవోకు వినతి జిల్లాలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు తమకు రెండు నెలలుగా వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంది చెందుతున్నామని, వేతనాలు చెల్లించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఈఒ జిజిఈ నాగేశ్వరరావును కోరారు. కశింకోటలోని డీపీఎన్ జెడ్పీ హైస్కూలుకు వచ్చిన సందర్భంగా మంగళవారం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సమగ్ర శిక్ష ఉద్యోగులు, సీఆర్పీలు కలిసి ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. జూన్, జులై నెలలకు సంబంధించి వేతనాలు చెల్లించలేదన్నారు. వేతనాలు సకాలంలో జమ అయ్యేలా చూడాలన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘ నాయకులు అచ్యుతకృష్ణ, శంకర్, రమణ, నూకేష్, లక్ష్మణ్, సత్యబాబు, లక్ష్మినారాయణ, రామలక్ష్మి పాల్గొన్నారు. -
రానున్న ఐదు రోజుల్లోతేలికపాటి వర్షాలు
● ఏడీఆర్ డాక్టర్ ఆదిలక్ష్మి చింతపల్లి: జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ డి.ఆదిలక్ష్మి తెలిపారు. ఈ నెల 26 నుంచి 30 వరకూ చింతపల్లి, పాడేరు, అరకు డివిజన్ల పరిధిలో 1.8 నుంచి 4.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 21.8 డిగ్రీల నుంచి 22.6 డిగ్రీల మధ్య, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22.1 డిగ్రీల నుంచి 22.3 డిగ్రీల మధ్య ఉండవచ్చన్నారు. గాలిలో తేమ ఉదయం వేళల్లో 80 నుంచి 85 శాతం, మధ్యాహ్న సమయాల్లో 87 నుంచి 88 శాతం మధ్యలో ఉంటుందన్నారు. గాలి గంటకు 6 కిలో మీటర్ల వేగంతో వీచే సూచనలు ఉన్నాయని చెప్పారు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందన్నారు. రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని ఏడీఆర్ సూచించారు. -
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
పాడేరు: జిల్లా వ్యాప్తంగా అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు సకాలంలో పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టి.నిశాంతి అధికారులను ఆదేశించారు. జిల్లాలో వ్యవసాయం, ఉద్యానవన, పశుసంవర్ధక, కాఫీ శాఖ, మత్స్యశాఖ, సెరికల్చర్, ఏపీఏంఐపీ తదితర శాఖలతో ప్రాథమిక రంగాల అభివృద్ధి, అమలులో ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాల పురోగతిపై తన చాంబర్లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారులకు, రైతులకు అందుతున్న పఽథకాలు, ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు వాటి పరిష్కార మార్గాలపై అధికారులతో చర్చించారు. ప్రాథమిక రంగాలను మరింత బలోపేతం చేసేందుకు శాఖల వారీగా కార్యాచరణ రూపొందించి క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని ఆదేశించారు. లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తూ జాప్యం లేకుండా పర్యవేక్షించాలన్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్కు సంబంధించిన అంశాలపై రైతులందరికీ అవగాహన కల్పించాలని, రైతులు స్పందించేలా క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్.బి. నంద్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కర్ణ, జిల్లా సెరికల్చర్ అధికారి రాజేంద్రప్రసాద్, కాఫీ బోర్డు ఏడీ జయంత్, పశు సంవర్ధక శాఖ అధికారి కరుణాకర్, మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు. రీసర్వే వేగవంతం రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని, పెండింగ్లో ఉన్న రెవెన్యూ సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కారించాలని కలెక్టర్ టి.నిశాంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత పారదర్శకంగా నిర్ణీత సమయంలో అందించేందుకు అధికార యంత్రాంగం సమన్వయంతో పని చేస్తుందన్నారు. జిల్లాలో 1400 గ్రామాల్లో మూడు విడతలుగా రీసర్వే చేపడుతున్నామని, రీసర్వే సమర్థంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. రెవెన్యూ రికార్డులను సక్రమంగా నిర్వహించడంతో పాటు వాటి భద్రతకు డిజిటలైజేషన్కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న భూ సంబంధిత అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కారించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, అసైన్డ్ భూముల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మ్యుటేషన్లు, ఆర్వోఆర్ ప్రక్రియలో ఎటువంటి జాప్యం లేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్వో లోకేశ్వరరావు, మండల రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.కలెక్టర్ నిశాంతి -
చిన్నారులకు ఆటపాటలతో బోధన
నర్సీపట్నం: ఆటపాటల ద్వారా చిన్నారులకు విద్య నేర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి జి.జి.ఎస్.నాగేశ్వరరావు అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. పట్టణంలోని జెడ్పీ హైస్కూల్(తురకబడి)లో జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను అంగన్వాడీ కేంద్రాల్లో సక్రమంగా అమలు చేయాలన్నారు. ఇంగ్లిష్పై ప్రత్యేక దృష్టి సారించి, చిన్నారులను ఆ దిశగా తీర్చిదిద్దాలన్నారు. పిల్లలకు సులభంగా అర్థం కావాలంటే ఆటపాటల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో సీడీపీవో జి.వి.రమణి, ఏఎంవో కెజియా, ఎంఈవో సిహెచ్.తలుపులు, రిసోర్స్పర్సన్లు కె.ఆర్.పి.ఎం.నాగేశ్వరరావు, బి.ఎస్.ఆర్.గోవింద్, కె.గణేష్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు కె.రామలక్ష్మి, పి.అప్పలనర్స పాల్గొన్నారు. -
జీవీఎంసీకి మళ్లీ విలీన గండం!
● ఎన్నికలు ఎగ్గొట్టేందుకే కూటమి సర్కారు కొత్త నాటకం? ● 79 గ్రామ పంచాయతీల విలీనం పేరిట గ్రామసభల హడావుడి ● గతంలో ఎన్నికలు ఆపేసినట్లే.. మళ్లీ పాత ఫార్ములా అమలు? అప్పుడూ బాబే.. ఇప్పుడూ బాబే..డాబాగార్డెన్స్: మహా విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికలను దీర్ఘకాలం పాటు వాయిదా వేసేందుకు కూటమి ప్రభుత్వం ’విలీన ప్రక్రియ’ పేరుతో రాజకీయ కుట్రకు తెరలేపిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. 2014–19లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇలాగే విలీన ప్రక్రియను తెరపైకి తెచ్చి, ఆపై న్యాయపరమైన వివాదాలు సృష్టించి ఏకంగా 2021 వరకు జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుకున్నారని విపక్షాలు గుర్తుచేస్తున్నాయి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నడుస్తుండగానే, అదే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా ఉంటూ అశాసీ్త్రయ పద్ధతిలో 79 గ్రామ పంచాయతీలను జీవీఎంసీలో విలీనం చేసేందుకు ప్రయత్నించడం చూస్తుంటే, ఎన్నికలు జరపకూడదనే కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది. రాత్రికి రాత్రే గ్రామసభల డ్రామా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, ప్రజాస్వామ్య నియమ నిబంధనలను పూర్తిస్థాయిలో తుంగలో తొక్కి కూటమి ప్రభుత్వం రాత్రికి రాత్రే నిర్ణయాలు తీసుకుంటోంది. నాలుగు గ్రామీణ మండలాల్లోని 79 గ్రామ పంచాయతీల విలీనం కోసం హడావుడిగా గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. కార్పొరేట్ శక్తుల ఆర్థిక ప్రయోజనాలు కాపాడేందుకు, కూటమి పార్టీల స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకే ఈ రకమైన దారుణమైన చర్యకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నిధులు, విధులు, అధికారాల వికేంద్రీకరణ ద్వారా స్థానిక సంస్థలను బలోపేతం చేయాలన్న 73, 74 రాజ్యాంగ సవరణల ఆశయాలకు ఈ చర్య కోలుకోలేని దెబ్బ. ఆలోచించే సమయం ఎక్కడ? జీవీఎంసీలో విలీనం కావాలో వద్దో తేల్చుకునే కనీస స్వేచ్ఛను కూడా ప్రజలకు ఇవ్వడం లేదు. లాభనష్టాలపై చర్చించేందుకు తగిన సమయం ఇవ్వకుండా, ఆఘమేఘాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం వెనుక ఆంతర్యమేమిటో అందరికీ అర్థమవుతూనే ఉంది. ముందస్తుగా గడువు ఇచ్చి, ప్రజాభిప్రాయ సేకరణ తేదీలను వెల్లడించాలి. విలీనం వల్ల కలిగే పరిణామాలు, లాభాలు, నష్టాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలి. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్థానిక నాయకుల అభిప్రాయాలను ప్రామాణికంగా తీసుకోవాలి. కానీ, కూటమి ప్రజాప్రతినిధులు తమ అనుయాయులతో ముందస్తుగా విలీన లేఖలు రాయించి, గ్రామసభలలో తూతూమంత్రంగా ఆమోదం పొందేందుకు డ్రామా ఆడుతున్నారని స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత విలీన ప్రాంతాల పరిస్థితి ఏంటి? గతంలో జీవీఎంసీలో విలీనం చేసిన గాజువాక, భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీలతో పాటు 32 గ్రామ పంచాయతీల పరిస్థితి ఇప్పటికీ అగమ్యగోచరంగానే ఉంది. విలీనమైన ప్రాంతాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోకపోగా, ప్రజలపై విపరీతమైన పన్నుల భారం పడింది. తాగేందుకు కనీస తాగునీరు అందించలేని దుస్థితి నెలకొంది. పారిశుధ్య కార్మికులను కూడా పూర్తి స్థాయిలో నియమించలేకపోయారు. ’పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం’ పేరుతో ప్రజల ఉమ్మడి ఆస్తులను, మౌలిక సదుపాయాలను ప్రైవేట్ శక్తులకు కట్టబెడుతున్నారు. గ్రామీణ స్వరూపానికి ముప్పు కూటమి ప్రభుత్వం జీవీఎంసీలో విలీనం చేయాలని చూస్తున్న పద్మనాభం, భీమిలి, ఆనందపురం, పెందుర్తి మండలాల్లోని 79 గ్రామ పంచాయతీలు నగరానికి అత్యంత సుదూరంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలు. ఈ విలీనం వల్ల గ్రామీణ ప్రజలు తీవ్రంగా నష్టపోనున్నారు. విలీనం పూర్తయితే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పూర్తిగా రద్దవుతుంది. గ్రామీణ ప్రాంత ప్రజలపై పట్టణ స్థాయి ఆస్తి, చెత్త, నీటి పన్నుల భారం మోపబడుతుంది. స్థానిక పాలన ప్రజలకు దూరమై, వికాసానికి బదులు వినాశనం దాపురిస్తుంది. పన్నులు నగర స్థాయిలో.. సేవలు? గ్రామ పంచాయతీ నుంచి జీవీఎంసీలోకి వస్తే ఆస్తి పన్ను, నీటి చార్జీలు, ఇతర పౌరసేవల రుసుములు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన ఉంది. పన్నులు పెరిగితే అందుకు తగ్గట్టుగా రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి సేవలు అందుతాయా? అన్నది ప్రశ్న. ఇప్పటికే విలీనమైన ప్రాంతాల్లో మౌలిక వసతుల పరిస్థితిపై సమీక్ష చేయకుండా కొత్తగా మరో 79 గ్రామ పంచయాతీలను కలపడం వల్ల జీవీఎంసీపై మరింత భారం పడుతుందన్న విమర్శలూ ఉన్నాయి. -
రీజనల్ గేమ్స్లో మెరిసిన విద్యార్థిని
కోటవురట్ల : గ్రామీణ క్రీడాకారులు అద్భుత ప్రతిభతో అబ్బురపరుస్తూ ఔరా అనిపిస్తున్నారు. మండలంలోని కె.బి.అగ్రహారం గ్రామానికి చెందిన లాలం లెహ్యాశ్రీ అండర్ 14 విభాగంలో బహుముఖ ప్రజ్ఞతో పతకాల పంట పండించింది. విభిన్న క్రీడలను ఎంచుకుని తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది. కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్(సీఐఎస్సీఈ) ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన రీజనల్ గేమ్స్, స్పోర్ట్స్లో 9 పతకాలను సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. రాజమండ్రిలోని ఓ ప్రైవేటు స్కూల్లో చదువుతున్న లాలం లెహ్యాశ్రీ స్కేటింగ్, అథ్లెటిక్స్లో రాణిస్తోంది. రీజనల్ గేమ్స్లో రోలర్ స్కేటింగ్లో 2 స్వర్ణ పతకాలు, 2 రజత పతకాలు, అథ్లెటిక్స్లో 3 రజత పతకాలు, 2 కాంస్య పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. దీంతో అక్టోబర్ 7 నుంచి 9 వరకు ముంబై, ఠాణే, మహారాష్ట్ర జరిగే జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్, అక్టోబర్ 13 నుంచి 15 వరకు హైదరాబాద్లో జరిగే జాతీయ స్థాయి అథ్లెటిక్స్లో పాల్గొననుంది. ఈ సందర్భంగా లెహ్యాశ్రీ మాట్లాడుతూ భవిష్యత్లో భారత ఒలింపిక్ జట్టుకు ప్రాతినిథ్యం వహించి మన దేశానికి స్వర్ణ పతకం అందించమే జీవిత లక్ష్యంగా పేర్కొంది. తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ మార్గదర్శకత్వం తన విజయాలకు కారణంగా తెలిపింది. జాతీయ స్థాయి పోటీలలో కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు కీర్తిని తీసుకొచ్చేలా స్వర్ణ పతకాలను సాధించాలని కె.బి.అగ్రహారం గ్రామస్తులు, మండల ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. -
వలకు చిక్కిన 20 కిలోల బంగారుపాప
అల్లూరి సీతారామరాజు జిల్లా: మండలంలో మత్స్యకారుల పంట పండుతోంది. భారీ చేపలు వలకు చిక్కుతుండడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు డుడుమ జలాశయం, మత్స్యగెడ్డలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఆంధ్ర, ఒడిశా సరిహద్దులోని డుడుమ జలాశయంలో సోమవారం 20 కిలోల చొప్పున నాలుగు చేపలు సింధిగూడ గ్రామ గిరిజనుల వలకు చిక్కాయి. సుజనకోట, దారెల, పెదగూడ, పనసపుట్టు, జోలాపుట్టు పంచాయతీల్లో మత్స్యగెడ్డ పరీవాహక గ్రామాల గిరిజన మత్స్యకారులు నాటు పడవలపై ముమ్మరంగా చేపల వేట చేస్తున్నారు. వారి వలలకు 15 కిలోల నుంచి 20 కిలోల వరకు బంగారుపాప చేపలు చిక్కుతున్నా యి. వీటిని మండల కేంద్రానికి తీసుకువచ్చిన వెంటనే కొనుగోలుదారులు దక్కించుకోవడానికి పోటీపడ్డారు. కిలో రూ. 300 నుంచి రూ. 350 వరకు విక్రయిస్తున్నారు. -
ఆత్మహత్యకు పాల్పడ్డ ఏఈ కుటుంబానికి న్యాయం చేయాలి...
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు అన్నారు. ఇటీవల వార్తల్లో ప్రచారమవుతున్న ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య తీవ్ర ఆందోళనకు గురిచేస్తుందని, ఆత్మహత్యపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సాదిక్ ఖాన్పై సమగ్ర దర్యాప్తు జరిపించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయడం, నిందితుడితో పాటు సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సాదిక్ ఖాన్పై వచ్చిన మోసం, బెదిరింపులు, ఆర్థిక దోపిడీ, వ్యక్తిగత ఫొటోలు, వీడియోల దుర్వినియోగం, బలవంతపు మతమార్పిడి ఆరోపణలు, కుటుంబ సభ్యులకు హాని చేస్తామని బెదిరించిన ఆరోపణలు అంశాలను చట్టపరంగా పరిశీలించి, నేరం రుజువైతే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. -
ఎస్పీ కార్యాలయంలో 56 అర్జీలు
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 56 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా కార్యాలయంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరిధిలో ఉన్న సమస్యలు పరిష్కారానికి వారం రోజుల్లో చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. భూ తగాదాలు, ఆస్తి సంబంధిత సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, వేధింపులు, మోసపూరిత వ్యవహారాలు, ఆర్థిక నేరాలు, ఇతర ప్రభుత్వ విభాగాలకు చెందిన అర్జీలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
విశ్రాంత డీఎఫ్వో మృతికి సంతాపం
నర్సీపట్నం: జిల్లా సోషల్ ఫారెస్ట్ అధికారిగా పని చేస్తూ ఇటీవల పదవీ విరమణ పొందిన లక్ష్మణ్ సోమవారం గుండెపోటుతో విశాఖలో మృతి చెందారు. నర్సీపట్నం ఏరియాలో వివిధ హోదాల్లో ఆయన పని చేసి అందరికీ సుపరిచితులయ్యారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. స్వస్థలం విజయనగరం జిల్లా అయినప్పటికీ, కుమార్తె చదువు నిమిత్తం విశాఖలో ఉంటున్నారు. నర్సీపట్నం డీఎఫ్వోగా, రేంజర్గా సేవలు అందించారు. చింతపల్లి డీఎఫ్వో, సబ్ డీఎఫ్వోగా పని చేశారు. నూతన జిల్లాలు ఏర్పాటు అయిన తరువాత జిల్లా సోషల్ ఫారెస్ట్ అధికారిగా సేవలు అందించి గత ఏడాది జూన్లో పదవీ విరమణ పొందారు. నర్సీపట్నం, చింతపల్లి డివిజన్ల్లో పని చేసిన సిబ్బంది ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. -
ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ సక్రమంగా అమలు చేయాలి
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పథకం ప్రకారం దళితులు, గిరిజన జనాభా ప్రతిపాధికన నిధులు కేటాయించి అభివృద్ధి పథకాలు అమలు చేయాలంటూ దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద దళిత నాయకులు నిరసన చేశారు. ఎస్సీలకు 16.4, ఎస్టీలకు 5.3 శాతం నిధులు కేటాయించి ఖర్చు చేయాలని, ప్రతి నెలా నోడల్ ఏజెన్సీ సమావేశం ద్వారా పథకాన్ని సక్రమంగా ఆమలు చేయాలని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పథకం నిధులను ఇతర పథకాలకు కేటాయించకుండా శ్వేత పత్రం విడుదల చేయాలంటూ పలు డిమాండ్లపై వినతిపత్రాన్ని పీజీఆర్ఎస్ ద్వారా కలెక్టర్కు అందించారు. -
చింతపల్లిలో మూతబడిన పెట్రోల్ బంక్
చింతపల్లి: గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో మండల కేంద్రం చింతపల్లిలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్ సోమవారం మూత పడింది. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మండలంలో ఉన్న ఈ ఏకై క బంక్ ద్వారా రోజుకు రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు పెట్రోల్, డీజిల్ విక్రయిస్తారు. సోమవారం పెట్రోలు ట్యాంక్ రాకపోవడంతో బంక్ మూతపడింది. దీంతో ఈ ప్రాంతానికి వచ్చిపోయే పలువురు వాహనచోదకులు ఇబ్బందులకు గురయ్యారు. ఇటీవల తరచూ పెట్రోలు కొరత ఏర్పడుతుండడంతో ఇబ్బందులు పడుతున్నామని, ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా గిరిజన సహకార సంస్థ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు వాహనదారులు కోరారు. -
గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే పోరాటమే
● పాఠశాల తరలింపు నిర్ణయాన్నివెనక్కు తీసుకోవాలి ● తల్లిదండ్రుల కమిటీతో కలిసి ఎమ్మెల్సీ కుంభా రవిబాబు స్పష్టీకరణ ● విద్యార్థులకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్సీ మధురవాడ: గిరిజన విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే గిరిజన సమాజం తరఫున మరింత తీవ్రంగా పోరాడతామని ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు స్పష్టం చేశారు. మధురవాడ మారికవలస–తిమ్మాపురం రోడ్డులోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో 5 నుంచి 10వ తరగతి చదువుతున్న 480 మంది విద్యార్థులను ఇతర ప్రాంతాలకు తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై సోమవారం తల్లిదండ్రులతో అధికారులు సమావేశం నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ సెక్రటరీ కిషోర్బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి రవిబాబు హాజరై మాట్లాడారు. తాము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు వ్యతిరేకం కాదని, అయితే వేపగుంట సమీపంలో మూడేళ్లుగా ఖాళీగా ఉన్న యూత్ ట్రైనింగ్ సెంటర్ను వినియోగించుకోవాలని సూచించారు. లేదంటే ప్రత్యామ్నాయ భవనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. సీవోఈ ఏర్పాటు పేరుతో మైదాన ప్రాంతంలో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఏర్పాటు చేసిన పాఠశాలను మూసివేసి, 480 మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చడం సరికాదన్నారు. నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఉద్యమం తీవ్రతరం 2004లో ఆదివాసీ విద్యార్థులకు నాణ్యమైన ఇంగ్లిష్ మీడియం విద్య అందించేందుకు ఈ పాఠశాలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. అర్ధంతరంగా పాఠశాలను మూసివేసి ఇతర ప్రాంతాలకు వెళ్లాలని చెప్పడం, విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేయడం, బలవంతంగా టీసీలు ఇవ్వడం వంటి చర్యలను సహించేది లేదన్నారు. రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని, వాటిని మెరుగుపరచాల్సిన అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గిరిజన విద్యార్థుల హక్కుల కోసం గిరిజనుడిగా, ప్రజాప్రతినిధిగా ముందుండి పోరాడతానని తెలిపారు. పాఠశాలను మూసివేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం మార్చుకోకపోతే తల్లిదండ్రులు, ఆదివాసీ–గిరిజన సంఘాలతో కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులను సబ్బవరం, దేవరాపల్లి, శ్రీకృష్ణాపురం తదితర పాఠశాలలకు మార్చుకోవచ్చని అధికారులు సూచించినప్పటికీ, తమ పిల్లలను ప్రస్తుత పాఠశాలలోనే కొనసాగించాలని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. ఈ మేరకు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించారు. -
గ్యాస్ గోదాం వద్ద ఆందోళన
చింతపల్లి: సకాలంలో గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ చౌడుపల్లి హెచ్పీ గ్యాస్ గోదాం వద్ద సోమవారం వినియోగదారులు ఆందోళన చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బుక్ చేసుకున్నప్పటికీ సకాలంలో గ్యాస్ బండలను పంపిణీ చేయడంలేదని వారు ఆరోపించారు. చింతపల్లి డివిజన్ పరిధిలో గ్యాస్ బుక్ చేసుకున్న వారికి కాకుండా ఇతరులకు అధిక సొమ్ముకు విక్రయించుకుంటూ వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుక్ చేసి వారం రోజులు కావస్తున్నా గ్యాస్ లేదంటూ, రాలేదంటూ కాలయాపన చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా సంబంధిత అధికారు లు స్పందించి సకాలంలో గ్యాస్ సరఫరా అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని పలువు రు వినియోగదారులు కోరారు. -
తండ్రి మృతిపై కుమారుడి ఫిర్యాదు
కె.కోటపాడు: తామర వ్యాధి చికిత్సకు ఎ.కోడూరు గ్రామానికి వచ్చిన వ్యక్తి వైద్యం పొందుతూ మృతిచెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎ.కోడూరు ఎస్ఐ సంతోష్కుమార్ తెలిపిన వివరాలివి. మండలంలో ఆనందపురం గ్రామానికి చెందిన దుంగల ఈశ్వరరావు(55) తామర వ్యాధికి చికిత్స పొందేందుకు ఎ.కోడూరులో గల ఆర్ఎంపీ వైద్యుడు త్రినాథ్ వద్దకు సోమవారం వచ్చాడు. ఆర్ఎంపీ వైద్యుడు త్రినాథ్ ఈశ్వరరావును పరిశీలించి ఇంజక్షన్ చేశాడని, అయితే కొద్ది సేపటికి ఈశ్వరరావు మృతిచెందాడని తెలిపారు. వైద్యుడు ఇచ్చిన ఇంజక్షన్ వల్లే తన తండ్రి ఈశ్వరరావు మృతిచెందినట్టు కుమారుడు అక్కునాయుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి పోస్టుమార్టంకు తరలించామన్నారు. -
వినతులు...
ఇటుఅటుతుమ్మపాల: పీజీఆర్ఎస్ అర్జీలపై అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలని, ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం–1, 2 లలో నిర్వహించిన పీజీఅర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ఆమెతో పాటు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్, మండల, గ్రామ, వార్డు స్థాయిలలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి సంబంధిత అధికారులు హాజరై ఆయా స్థాయిలోనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శాఖ అధికారి వారి శాఖకు సంబంధించిన అర్జీల పరిష్కార పరిస్థితిని ప్రతిరోజు పర్యవేక్షణ చేసి, గడువులోపల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో దళిత కాలనీల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించి, కుల వివక్షకు అడ్డుకట్ట వేయాలని, కుల వివక్ష వ్యతిరేక పోరాటం సంఘం, ఏపి వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసిన దళితులు, సంఘాల నాయకులు కలెక్టరేట్ గేటు వరకు పాడె మోసి నిరసన తెలిపారు. కుల వివక్ష లేని సమాజం కోసం సామాజిక శంఖారావం కార్యక్రమంలో భాగంగా 71 గ్రామాలో్ల్ ప్రత్యక్షంగా సర్వేలు చేశామని, కనీస మౌలిక వసతులు కూడా సక్రమంగా అందడం లేదన్నారు. మంచినీటి సౌకర్యం లేకపోవడం, కుళాయి కనెక్షన్లు ఉన్నప్పటికీ నీరు రాకపోవడం, రోడ్లు అధ్వానంగా ఉండడం, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వంటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దళిత కాలనీల పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా ఉందన్నారు. జిల్లాలో అనేక గ్రామాల్లో దళితులకు శ్మశాన వాటికలకు స్థలాలు లేకపోవడం, ఉన్న స్మశాన స్థలాలు కబ్జాలకు గురికావడం, సామాజిక భవనాలు లేకపోవడం వంటి సమస్యలు కొనసాగున్నాయన్నారు. దళితులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వకపోవడంతో వారి భూ హక్కులు ప్రశ్నార్థకంగా మారాయని, ముఖ్యంగా ఎస్.రాయవరం మండలం సైతారుపేటలో దళితులకు క్షవరం చేయడానికి నిరాకరించడం వంటి కుల వివక్ష ఘటనలు ఇప్పటికీ చోటు చేసుకోవడం ఆందోళనకరమని, దీనిపై విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పాయకరావుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రభుత్వ స్థలంలో సుమారు 40 ఏళ్లుగా ఇళ్లు, గుడిసెలు, పాకలు వేసుకుని నివసిస్తున్న పేద కుటుంబాలను ఎటువంటి ప్రత్యామ్నాయ వసతి కల్పించకుండా పొక్లెయిన్లతో తొలగించేందుకు అధి కారులు ప్రయత్నించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. దళితుల సమస్యలపై పాడె మోసి నిరసన చేస్తున్న దళితులుకలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం అర్జీలు స్వీకరించిన కలెక్టర్, జేసీ, డీఆర్వో పలు సమస్యలపై కలెక్టరేట్ ఎదుట నిరసనలు దళిత కాలనీలపై ఇంత నిర్లక్ష్యమా... -
సాధిక్ఖాన్పై పోలీసులకు బీజేపీ నేతల ఫిర్యాదు
రావికమతం: రాజమండ్రి దగ్గర గోదావరిలో దూకి ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైన సాధిక్ ఖాన్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని సోమవారం రావికమతం పోలీసులకు మండల భారతీయ జనతా పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఏఈ నూకరాజు కుటుంబంతో సంబంధాలు ఏర్పరచుకొని స్నేహంగా ఉంటూ సభ్యుల వ్యక్తిగత ఫొటోలు,వీడియోలు తీసి , వారిని మత మార్పిడిపై ఒత్తిడి తెచ్చి, బెదిరింపు చర్యలకు పాల్పడి వారిని మానసిక క్షోభకు గురి చేసి కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైన సాధిక్ఖాన్ను అరెస్టు చేయాలని ఫిర్యాదులో కోరారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి అదేశాల మేరకు సాధిక్ఖాన్పై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గల్లా రాజేశ్వరరావు, మండల బీజేపీ అధ్యక్షుడు గుటాల చిన్న, ప్రధాన కార్యదర్శి దంట్ల సత్యనారాయణ తెలిపారు. -
కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
ముంచంగిపుట్టు: వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సీహెచ్సీ వైద్యసిబ్బంది నల్ల రిబ్బన్లు ధరించి విధులకు హాజరయ్యారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు దశలవారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు. రెగ్యులర్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు 100 శాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలని, విధి నిర్వహణలో మరణించిన వైద్య ఉద్యోగి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని, కాంట్రాక్ట్ వైద్య సిబ్బందికి ఈపీఎఫ్ వర్తింపజేయాలని, అనారోగ్యానికి గురైన ఉద్యోగికి పూర్తి జీతంతో కూడిన సెలవు మంజూరు చేయాలని వైద్య సిబ్బంది రమేష్, సింహాచలం, సురేష్, వసంత కోరారు. -
జాతీయస్థాయి రెజ్లింగ్లో కేజీబీవీ విద్యార్థినికి పతకం
మాకవరపాలెం: జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీల్లో కేజీబీవీ విద్యార్థిని కాంస్య పతకం సాధించింది. స్థానిక కేజీబీవీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కోసూరు జ్యోత్స్న ఈ నెల 21 నుంచి 23 వరకు హరిద్వార్లో గ్రాప్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొంది. ఈ పోటీల్లో ప్రతిభ చూపి కాంస్య పతకం సాధించింది. రాష్ట్రస్థాయిలో సైతం ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకం సాధించిందని పాఠశాల ఎస్వో త్రివేణి సోమవారం తెలిపారు. ఈ విద్యార్థినిని ఎస్వోతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. -
‘పబ్లిక్’ సర్వీస్
తుమ్మపాల: పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీదారులకు సోమవారం ఉచిత భోజన ఏర్పాట్లను కలెక్టర్ విజయకృష్ణన్, జేసీ శౌర్యమాన్ పటేల్ పరిశీలించి అర్జీదారులకు స్వయంగా భోజనం వడ్డించారు. రెండు నెలలుగా ప్రతి సోమవారం ఉచిత భోజన కార్యక్రమం జరుగుతున్నప్పటికీ కలెక్టరేట్ అధికారుల ఆదేశాలతో నిర్వాహకులు గత వారం అర్జీదారులు నుంచి ఒక్కో ప్లేట్ భోజనానికి రూ.5 చొప్పున వసూలు చేసిన విషయం విమర్శలకు దారి తీసింది. దీనిపై స్పందించిన కలెక్టర్ అర్జీదారులకు స్వయంగా భోజనం వడ్డించి అధికారుల తీరుపై పరోక్షంగా చురకలు అంటించారు. అన్నా క్యాంటీన్ ద్వారా అందించే ఈ పథకంలో కూడా నగదు వసూలు చేయడంపై సంబంధిత సిబ్బందిని ఆమె హెచ్చరించినట్టు తెలిసింది. కార్యక్రమంలో డీఆర్వో వై.సత్యనారాయణరావు, సూపరింటెండెంట్ విజయకుమార్ పాల్గొన్నారు. -
విచారణే అస్త్రం.. వసూళ్లే లక్ష్యం!
ఏయూలో విచారణ పేరుతో అధికారుల బరితెగింపు ‘సంతోష’ంగా తెగబడి మరీ పిండుకుంటున్న వైనం కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, చిరుద్యోగులనూ వదలని వసూళ్ల పర్వం గవర్నర్కు ఫిర్యాదు చేసేందుకు పలువురు యోచనసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఓ వైపు లాభదాయకమైన డిఫెన్స్ కోర్సులను ఎత్తివేస్తూ ప్రైవేటు సంస్థలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మరోవైపు విచారణ పేరుతో అధికారుల వసూళ్ల పర్వం హద్దులు దాటుతోందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. విభాగాల్లో తప్పులు జరిగాయని ఒప్పుకోవాలంటూ ఉద్యోగులపై ఒత్తిడి తేవడంతోపాటు.. అడిగిన మొత్తం ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్ల నుంచి ఇంజనీర్లు, చిరుద్యోగుల వరకు ఎవరినీ వదలకుండా విచారణను వసూళ్ల అస్త్రంగా మార్చుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ కాంట్రాక్టరు డబుల్ బిల్లులు తీసుకున్నారంటూ రికార్డుల్లో నమోదు చేసి, కేసులు పెడతామని బెదిరిస్తూ రూ.15 లక్షలు డిమాండ్ చేసినట్టు సమాచారం. ఇదే తరహాలో ఇంజనీర్లు, చిరుద్యోగుల నుంచి కూడా డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో ‘సంతోష’ంగా చక్రం తిప్పిన ఓ అధికారితోపాటు మరో ఉన్నతాధికారి అండదండలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై కొందరు ఆధారాలతో సహా గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. టార్గెట్లు పెట్టి మరీ..! విచారణ పేరుతో ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, ఉద్యోగులను భయపెట్టడంతోపాటు.. తమకు అనుకూలంగా వ్యవహరించకపోతే చివరి వరకు వేధిస్తామంటూ బెదిరింపులకు దిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఒక్కో వర్గానికి లక్ష్యాలు నిర్దేశించి మరీ డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. ఏయూలో పనిచేస్తున్న సుమారు 11 మంది ఇంజనీర్ల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.22 లక్షలు విచారణ పేరుతో వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. యూనివర్సిటీలో వివిధ పనులు చేపట్టే ఓ కాంట్రాక్టు సంస్థ నుంచి రూ.15 లక్షలు, ఏయూలో పలు కార్యక్రమాలు నిర్వహించే మరో సంస్థ నుంచి రూ.10 లక్షలు తీసుకున్నట్టు సమాచారం. చిన్న ఉద్యోగుల నుంచి రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు, ఉద్యోగ సంఘాల నేతల నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు డిమాండ్ చేసినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరు ఎంత ఇవ్వాలో ముందే లక్ష్యాన్ని నిర్దేశించి వసూళ్లు చేసినట్టు ఆరోపణలు రావడం గమనార్హం. త్వరలో గవర్నర్ వద్దకు! ఏయూ ప్రతిష్టను దెబ్బతీసే నిర్ణయాలతోపాటు.. ఉద్యోగులు, కాంట్రాక్టు సంస్థలపై విచారణ పేరుతో ఒత్తిళ్లు, వసూళ్ల ఆరోపణలు వర్సిటీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతున్నాయి. తమకు జీవనోపాధి కల్పిస్తున్న సంస్థను ఇష్టారాజ్యంగా బలహీనపరచడమే కాకుండా, విచారణల పేరుతో వేధింపులకు గురిచేయడం ఏమిటని పలు వురు ప్రశ్నిస్తున్నారు. విచారణ పేరుతో వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధికారిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసేందుకు కొందరు సిద్ధమవుతున్నట్టు సమాచారం. పాలకమండలి అనుమతి లేకుండా వీసీ ఏకపక్షంగా తీసుకుంటున్నారని ఆరోపిస్తున్న పలు నిర్ణయాలనూ ఫిర్యాదులో ప్రస్తావించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అంశాలన్నింటినీ నేరుగా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు.. ఫిర్యాదు ప్రతిని పంపాలని కొందరు యోచిస్తున్నట్టు సమాచారం. గవర్నర్ దీనిపై విచారణకు ఆదేశిస్తే.. విచారణ పేరుతో జరిగిన వసూళ్ల వ్యవహారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని వర్సిటీ వర్గాలు భావిస్తున్నాయి. దిగజారుతున్న ఏయూ ప్రతిష్ట! వాస్తవానికి ఏయూ ప్రతిష్టను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి వీసీ ప్రసాద్రెడ్డి కృషితో మరింత పెంచారనే అభిప్రాయం ఉంది. 2018లో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఏయూలో డిఫెన్స్ స్టడీస్ సెంటర్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ కేంద్రంలో సైనికులు, సైనికాధికారులు ఉన్నత విద్య అభ్యసించారు. వైమానిక, నౌకా, భూసేనలతోపాటు ఐఎన్ఎస్ వంటి సంస్థలతో ఏయూ ఒప్పందాలు చేసుకుంది. వేలాది మంది రక్షణశాఖ సిబ్బంది డిగ్రీ లు, పీహెచ్డీలు పూర్తి చేశారు. అగ్నివీరులకు శిక్షణ ఇచ్చేందుకు ఎంపికై న తొలి విశ్వవిద్యాలయంగానూ ఏయూ గుర్తింపు పొందింది. 7వేల మందికిపైగా సైనికులు ఇక్కడ గ్రాడ్యు యేషన్ పూర్తి చేసినట్టు వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. అలాంటి డిఫెన్స్ సెంటర్ను మూసివేయడంపై ప్రశ్న లు తలెత్తుతున్నాయి. పరిణామాల నేపథ్యంలో సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ నిరంజన్ రాజీనామా చేయగా.. సమన్వయకర్త ఉజ్వల్ వంటి నిపుణులు వర్సిటీని వీడారు. డిఫెన్స్ కోర్సులు నిలిచిపోవడంతో అడ్మిషన్లు గీతం వంటి ప్రైవేటు సంస్థలకు మళ్లేలా నిర్ణయాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో గత ప్రభు త్వ హయాంలో అవినీతి జరిగిందంటూ విచారణలు చేపట్టి.. ఆ పేరు తో వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు చర్చనీయాంశమవుతున్నాయి. ‘ఇంటిని చక్కదిద్దాల్సింది పోయి గోడలు కూల్చిన చందంగా’ ఏయూ ప్రతిష్టను కాపాడాల్సినవారే సంస్థను మరింత అప్రతిష్టపాలు చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
ఉధృతంగా గెడ్డలు
పలు గ్రామాలకు రాకపోకలు బంద్ ● వంతెనలు లేక అవస్థలు వంతెన నిర్మించాలి మండలంలోని జామిగుడ, ఇంజరి పంచాయతీల పరిధిలోని గ్రామాల ప్రజల సౌకర్యార్థం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గుంజివాడ, జామిగుడ గ్రామా ల మధ్య గెడ్డపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి, పునాది నిర్మించారు. స్థల వివాదం కారణంగా పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వంలో పనులు ప్రారంభించి, నిలిపివేశారు. అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాలి. – మజ్జి చంద్రుబాబు, వైఎస్సార్సీపీ పెదబయలుమండల అధ్యక్షుడు పెదబయలు/ముంచంగిపుట్టు: జిల్లాలో పలు ప్రాంతాల్లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల మండలాల్లో కొండవాగులు, గెడ్డలు పొంగి ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ● పెదబయలు మండలం జామిగుడ పంచాయతీ పరిధిలో జామిగుడ గెడ్డ పొంగి ప్రవహిస్తుండడంతో 10 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఇంజరి పంచాయతీలో 10 గ్రామాలు, గిన్నెలకోట పంచాయతీలో 5 గ్రామాలు, గుల్లేలు పంచాయతీలో కించూరు గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. గెడ్డ ఉధృతంగా ప్రవహించడం వల్ల జామిగుడలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి గెడ్డ అవతలి వైపు ఉన్న గుంజివాడ, తారాబు, చింతలవీధి, సరిగిగుడ, గబ్బరుమామిడి, కెందుగుడ ప్రజలతో పాటు మరో నాలుగు గ్రామాల ప్రజలు రాలేకపోయారు. ● ముంచంగిపుట్టు మండలంలో లక్ష్మీపురం, బుంగాపుట్టు, రంగబయలు, భూసిపుట్టు, దొడిపుట్టు పంచాయతీల్లో మారుమూల గ్రామాల్లో వాగులు పొంగాయి. వరదనీటితో గెడ్డలు ప్రమాదభరితంగా ఉన్నాయి. లక్ష్మీపురం పంచాయతీ ఉబ్బెంగుల, దొరగూడ గ్రామాల చుట్టూ ఉన్న వాగులు పొంగడంతో మూడు రోజులుగా రెండు గ్రామాల గిరిజనులు గ్రామాలకే పరిమితమయ్యారు. దొడిపుట్టు పంచాయతీ బీడిచెంప గ్రామ సమీపంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మాకవరం, కర్రిముఖిపుట్టు, కిలగాడ, వనుగుమ్మ, బరడ పంచాయతీల్లో వర్షపు నీరు పంట పొలాల్లోకి చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంచంగిపుట్టు నుంచి కుమడ వెళ్లే మార్గంలో భారీగా గోతులు ఉండడంతో వాహనాలు గోతుల్లో దిగిపోయి ప్రమాదాల బారిన పడుతున్నారు. స్థానికుల సహాయంతో గోతుల నుంచి వాహనాలు అతికష్టం మీద బయటకు తీయవలసి వస్తోంది. ● జి.మాడుగుల మండలంలో కిల్లంకోట వద్ద చాపగెడ్డ పొంగి ప్రవహిస్తోంది. సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అసంపూర్తిగా జామిగుడ వంతెన పెదబయలు మండలం జామిగుడ పంచాయతీ పరిధిలోని గ్రామాలతో పాటుగా ఒడిశాకు అనుసంధానం చేస్తూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి, పునాది వరకు నిర్మించారు. అనంతరం స్థల వివా దం కారణంగా పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వంలో పనులు ప్రారంభించారు. పిల్లర్ల వరకు నిర్మించి, నిలిపివేశారు. దీంతో ఈ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు గెడ్డ పొంగి ప్రవహిస్తుండడంతో అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. గ్రామాల నుంచి పంచాయతీ కేంద్రానికి రావడానికి కూడా వీలులేకుండా పోయింది. ప్రభుత్వం స్పందించి గుంజివాడ, కించూరు, తారాబు గెడ్డలపై వంతెనలు నిర్మాణం చేపట్టాలని ఈ ప్రాంత గిరిజనులు కోరుతున్నారు. -
బైక్ ప్రమాదంలో బీహార్ యువకుడి మృతి
కోటవురట్ల: అతివేగం ఓ యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది. మండలంలోని యండపల్లిలో అన్నవరం జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. బీహార్కు చెందిన మహ్మద్ సెహవాజ్, మహ్మద్ అనాష్, మహ్మద్ సాజిద్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం చింతపల్లి వచ్చారు. సోమవారం ఉదయం రేవు పోలవరం బీచ్కు ముగ్గురూ బైక్పై వెళుతుండగా అన్నవరం జంక్షన్ వద్ద మలుపులో రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ బెంచీని వేగంగా ఢీకొట్టారు. ఈ దుర్ఘటనలో బైక్ నడుపుతున్న మహ్మద్ సెహవాజ్(22) తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనుక కూర్చున్న మహ్మద్ అనాష్, మహ్మద్ సాజిద్లకు గాయాలు కావడంతో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాలిటెక్నిక్ స్పాట్ కౌన్సెలింగ్ వాయిదా
చింతపల్లి: స్థానిక ఆచార్య ఎన్జీ రంగా సేంద్రియ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 26వ తేదీన నిర్వహించాల్సిన కౌన్సెలింగ్ను ఒక రోజు వాయిదా వేసి, 27న నిర్వహించనున్నట్టు వ్యవసాయ పరిశోధన స్థానం అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ డి.ఆదిలక్ష్మి తెలిపారు. గుంటూరు లాం కళాశాలలో జరిపిన కౌన్సెలింగ్లో చింతపల్లి సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్లో ఉన్న 25 సీట్లకు గాను 12 సీట్లు భర్తీకాగా, 13 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటి భర్తీకి మొదట ఈ నెల 26న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించినప్పటికీ, ఆ రోజు సెలవు కావడంతో 27వ తేదీకి వాయిదా వేశామని చెప్పారు. ఈ విషయాన్ని అర్హత గల అభ్యర్థులు గమనించాలన్నారు.ఈ కౌన్సెలింగ్కు ఇంటర్ పాస్, ఫెయిల్ అయిన వారితో పాటు పదవ తరగతి ఉత్తీర్ణులైన ఆసక్తిగల అభ్యర్థులు హాజరుకావచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్ 9014637080 లో సంప్రదించాలని కోరారు. -
‘ఓపెన్’లో 10వ తరగతి అడ్మిషన్లు
అనంతగిరి(డుంబ్రిగుడ): మండల కేంద్రం అనంతగిరిలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల–2లో సార్వత్రిక విద్యాపీఠం దూర విద్యా కేంద్రం ద్వారా ఓఎస్ఎస్సీ 10వ తరగతి అడ్మిషన్లు జరుగుతున్నాయని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంగమ్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనివార్య కారణాల వల్ల పదవ తరగతి వరకు చదువుకోలేకపోయిన, 15 సంవత్సరాల వయసు పైబడిన వారు దూర విద్యా విధానంలో 10వ తరగతి, ఇంటర్మీడియెట్ను పూర్తి చేసుకునే సదవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం కల్పిస్తోందని చెప్పారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఓఎస్ఎస్సీ 10వ తరగతి అడ్మిషన్ల కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలి కార్యాలయంలో గానీ, ఫోన్ నంబర్ 6305971317 లో గానీ సంప్రదించాలని సూచించారు. -
ఎన్టీఆర్ ఆస్పత్రిలో నల్లబ్యాడ్జీలతో నిరసన
అనకాపల్లి: ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో ఏళ్ల తరబడి అంకితభావంతో రోగులకు సేవలు అందిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ తక్షణమే రెగ్యులర్ చేయాలని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్ట్ సిబ్బంది పట్టణశాఖ అధ్యక్షురాలు రాజేశ్వరి అన్నారు. స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి ఆవరణలో సోమవారం కాంట్రాక్టు ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకూ నిరసన చేయడం జరుగుతుందని, వేతనాలు పెంపుపై తక్షణం చర్యలు చేపట్టాలని, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కాంట్రాక్టు ఉద్యోగి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని తదితర డిమాండ్లతో నిరసన తెలియజేశారు. -
కందుల దందా
డాబాగార్డెన్స్: కనకమహాలక్ష్మి దేవస్థానం వివాదాలకు నిలయంగా మారుతోంది. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో సనాతన ధర్మ సూత్రాలను, దేవదాయ శాఖ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఆలయ ట్రస్ట్బోర్డు చైర్మన్ కందుల నాగరాజు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు తీవ్ర కలకలం రేపుతోంది. ‘ఆలయం నాదే... నే చెప్పిందే వేదం’ అనే ధోరణితో ఆయన తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు అటు పాలకమండలి సభ్యులకు, ఇటు ఆలయ అధికారులకు, చివరకు అర్చక సిబ్బందికి సైతం తీవ్ర మనస్తాపం కలిగిస్తున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కుతూ ఆయన సాగిస్తున్న వ్యవహార శైలిపై భక్తజనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే పేరుమీద.. తాజాగా మార్గశిర మాస ఉత్సవాల వేళ చైర్మన్ నాగరాజు తీసుకున్న నిర్ణయం ఆలయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. డిసెంబర్ 27న నిర్వహించ తలపెట్టిన మార్గశిర సహస్ర కలశాభిషేకం (మార్గశిర రథయాత్ర) పేరిట దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ గానీ, ప్రభుత్వం గానీ ఎటువంటి ఆమోదం తెలపకుండానే ఆయన సొంతంగా రూ.200 విలువైన టికెట్లను, కరపత్రాలను ముద్రించి విక్రయాలకు శ్రీకారం చుట్టడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. మహిళలకు ప్రత్యేక డ్రెస్ కోడ్ నిర్ణయించడమే కాకుండా, ఈ అనధికారిక కరపత్రాలపై దక్షిణ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఆలయ కార్యనిర్వహణాధికారి సుజాత పేర్లను ముద్రించడం గమనార్హం. ఎమ్మెల్యే చేతుల మీదుగానే యాత్ర ప్రారంభమవుతుందంటూ భక్తులను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆది నుంచి వివాదస్పదమే.. చైర్మన్ కందుల నాగరాజు ఏకపక్ష నిర్ణయాల పరంపర ఈనాటిది కాదు. గత జూన్ నెలలోనే ఆలయ పవిత్రతను భంగపరుస్తూ, కాళ్లకు పాదరక్షలతో దేవుని ప్రాంగణంలోకి ప్రవేశించి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ఘటన మరవకముందే ఈ కొత్త వివాదం ముసిరింది. ఆలయ కార్యనిర్వహణాధికారి సుజాతతో పాటు ఇతర సిబ్బందితో కనీస సమన్వయం లేకుండా, ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటుండటంతో ఆలయ పరిపాలన దారి తప్పింది. ప్రజాప్రతినిధి, ప్రభుత్వ అధికారులు సైతం మౌనం వహించడంతో ఛైర్మన్ వైఖరి మరింత శ్రుతిమించుతోందని పాలకమండలి సభ్యులే బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భక్తుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటూ సాగిస్తున్న ఈ అనధికారిక టికెట్ల విక్రయాలను, ఆర్థిక లావాదేవీలను వెంటనే నిలిపివేసి, దేవదాయ శాఖ ఉన్నతాధికారులు సత్వరమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వ అనుమతులు లేకుండానే.. చట్ట ప్రకారం ట్రస్ట్బోర్డు సమావేశంలో ఏదేని నిర్ణయం తీసుకున్నప్పటికీ, దానికి సంబంధించిన ప్రతిపాదనలను కార్యాలయం ద్వారా దేవదాయ శాఖ కమిషనర్కు పంపి, ప్రభుత్వ పూర్వానుమతి పొందాకే ఎలాంటి రుసుములు లేదా టికెట్లను అమలు చేయాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటివరకు ఈ నిర్ణయానికి సంబంధించిన ఎలాంటి దస్త్రాలు తమ కార్యాలయానికి రాలేదని ఆలయ సిబ్బందే స్పష్టం చేస్తుండటం చైర్మన్ అక్రమ విధానాలకు అద్దం పడుతోంది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఆర్థిక లావాదేవీలకు తెరదీయడం చట్టవిరుద్ధమని తెలిసినా, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న చైర్మన్ ఇలా వ్యవహరించడం శోచనీయం. గర్వంతో విర్ర వీగకూడదు ఆలయ వ్యవహారాల్లో ఏకపక్ష ధోరణి, అనధికారిక నిర్ణయాలు సరికావు. ట్రస్ట్ బోర్డు బాధ్యతల్లో ఉన్నవారు దేవదాయ శాఖ నిబంధనలకు లోబడి భక్తులకు సేవకులుగా మాత్రమే పనిచేయాలి తప్ప, ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అనే గర్వంతో విర్రవీగకూడదు. దేవదాయ శాఖ డీసీ హోదా కలిగిన అధికారి అధికారికంగా అనుమతించి విడుదల చేయాల్సిన సేవా టికెట్లను, ప్రభుత్వ ఆమోదం లేకుండా చైర్మన్ సొంతంగా ముద్రించి విక్రయించడం స్పష్టమైన చట్ట ఉల్లంఘన. అమ్మవారి ఆలయ ప్రతిష్టను దిగజారుస్తూ, అనధికారిక రుసుములతో భక్తులను దేవునికి దూరం చేసే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలి. ప్రభుత్వం మరియు దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి. –విజయశంకర్ ఫణీంద్ర, కో–కన్వీనర్, బీజేపీ రాష్ట్ర ధార్మిక సెల్ -
పర్యాటక ప్రాంతాల్లో ‘బ్రిక్స్’ ప్రతినిధులుసందడి
కొమ్మాది: బ్రిక్స్ దేశాల క్రీడామంత్రుల సమావేశం నేపథ్యంలో పలువురు బ్రిక్స్ ప్రతినిధులు తొట్లకొండను ఆదివారం సందర్శించారు. దీని చారిత్రక పాధాన్యతతో పాటు బౌద్ధమతంలో ఈ ప్రాంతానికి ఉన్న విశిష్టతను గైడ్ ద్వారా తెలుసుకున్నారు. నీటి తొట్టెలు, చైత్యాలు, ఆరామాలు, స్థూపాలు, మహాస్థూపం, పాకశాల, ధ్యాన కేంద్రాలను సందర్శించి, వాటి గురించి తెలుసుకున్నారు. అక్కడి నుంచి తొట్లకొండపై ఉన్న సీ వ్యూ పాయింట్ సందర్శించారు. రుషికొండ వద్ద... బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన రుషికొండ బీచ్ను బ్రిక్స్ దేశాల ప్రతినిధులు సందర్శించి అక్కడ అధికారులు ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక కళాకారులు సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. వారితో కలసి థింసా, ఇతర నృత్యాల్లో పాల్గొని, ప్రతినిధులు సందడి చేశారు. -
కేజీహెచ్లో మెడ్కో మాయాజాలం
మహారాణిపేట: డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ పథకం నిర్వహణలో నిబంధనలు కాగితాలకే పరిమితమవుతున్నాయా? కేజీహెచ్లో చోటుచేసుకున్న తాజా పరిణామం ఈ ప్రశ్నను మరోసారి తెరపైకి తెచ్చింది. క్లినికల్ స్పెషాలిటీ విభాగాలకు చెందిన వైద్యులను ఎన్టీఆర్ వైద్యసేవ ఇన్చార్జి మెడికల్ కోఆర్డినేటర్ (మెడ్కో)గా నియమించవద్దని వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) గతంలోనే స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ, వాటిని బేఖాతరు చేస్తూ న్యూరోసర్జరీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె. శివరామకృష్ణకు మెడ్కో బాధ్యతలు అప్పగించడం వివాదాస్పదంగా మారింది. ఉత్తర్వుల నేపథ్యం కేజీహెచ్కు చెందిన సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ ఏ. రాజేష్ను ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్కు డిప్యుటేషన్పై పంపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ట్రస్ట్ మెడ్కు పూర్తి బాధ్యతలను డాక్టర్ కె. శివరామకృష్ణకు అప్పగించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అత్యంత రద్దీగా ఉండే న్యూరోసర్జరీ విభాగంలో పనిచేసే వైద్యుడికి ఈ అదనపు పరిపాలనా బాధ్యత అప్పగించడంపై ఆస్పత్రి వర్గాల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డీఎంఈ ఆదేశాలు బేఖాతరు ఎన్టీఆర్ వైద్యసేవ/ఆరోగ్యశ్రీ పథకం నిర్వహణ బాధ్యతలను సీఎస్ఆర్ఎంవో, డీసీఎస్ఆర్ఎంవో, ఆర్ఎంవో వంటి పరిపాలనా వైద్యాధికారులకే అప్పగించాలని, క్లినికల్ స్పెషాలిటీ వైద్యులను వీలైనంత వరకూ ఈ బాధ్యతల నుంచి మినహాయించి వారి సేవలను పూర్తిగా రోగుల చికిత్సకే వినియోగించాలని డీఎంఈ గతంలోనే స్పష్టం చేసినట్టు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. క్లినికల్ వైద్యులు ఇన్చార్జిలుగా ఉంటే పథకం అమలులో ఎదురయ్యే సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు తలెత్తుతాయని, పరిపాలనా వ్యవహారాలతో ప్రత్యక్ష సంబంధమున్న సీఎస్ఆర్ఎంవో, డీసీఎస్ఆర్ఎంవో, ఆర్ఎంవోలే ఈ బాధ్యతలకు సరైనవారని ఆ మార్గదర్శకాల్లో పేర్కొన్నట్టు సమాచారం. అయితే వీటిని పక్కనపెట్టి న్యూరోసర్జరీ అసోసియేట్ ప్రొఫెసర్కు బాధ్యతలు కట్టబెట్టడం చర్చనీయాంశమైంది. వద్దన్నా వినకుండా అప్పగింత మెడ్కో బాధ్యతలు స్వీకరించలేనని సంబంధిత వైద్యుడు చెప్పినప్పటికీ బలవంతంగా అప్పగించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం శస్త్రచికిత్సలు, రోగుల పరీక్షలతో బిజీగా ఉండే న్యూరోసర్జరీ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వైద్యుడిపై ఇంత విస్తృత పరిపాలనా భారం మోపడం రోగుల సేవలపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. డీఎంఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్నతాధికారుల ఉద్దేశమేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డైట్ క్యాంటీన్లోనూ అదే తీరు కేజీహెచ్లో డైట్ క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలను కూడా ఆర్ఎంవో స్థాయి అధికారులకు కాకుండా పీడియాట్రిక్స్ విభాగ అధిపతి డాక్టర్ చక్రవర్తికి అప్పగించినట్టు ఆస్పత్రి వర్గాలు ఆరోపిస్తున్నాయి. క్లినికల్ బాధ్యతలు నిర్వర్తించే స్పెషలిటీ వైద్యులపై పరిపాలనా భారం మోపడం వైద్య సేవలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.ఆర్ఎంవో వ్యవస్థ ఉన్నా వినియోగించని వైనం కేజీహెచ్లో సీఎస్ఆర్ఎంవో డాక్టర్ యు. శ్రీహరి, డీసీఎస్ఆర్ఎంవో డాక్టర్ కుమార్, ఆర్ఎంవో డాక్టర్ బంగారయ్య వంటి పరిపాలనా వ్యవస్థ అందుబాటులో ఉన్నప్పటికీ, కీలక బాధ్యతల నుంచి వారిని పక్కనపెట్టడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. బాధ్యతలు నిర్వహించే అధికారులను పక్కనపెట్టి, ఉన్నతాధికారులు చెప్పినట్లు సంతకాలు పెట్టే రబ్బర్ స్టాంపుల కోసమేనా నిబంధనలను సైతం విస్మరిస్తున్నారు? అన్న ప్రశ్నలు ఆస్పత్రి వర్గాల్లో తీవ్రంగా వినిపిస్తున్నాయి. కలెక్టర్ జోక్యం చేసుకోవాలి డీఎంఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపించాలని ఆస్పత్రి వర్గాలు కోరుతున్నాయి. ఎన్టీఆర్ వైద్యసేవ నిర్వహణలో నిబంధనలు పాటిస్తున్నారా? క్లినికల్ స్పెషాలిటీ వైద్యుడికి మెడ్కో బాధ్యతలు అప్పగించడం సమంజసమేనా? అందుబాటులో ఉన్న ఆర్ఎంవో వ్యవస్థను ఎందుకు వినియోగించలేదు? అన్న ప్రశ్నలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.నిబంధనలు కేవలం సాధారణ ఉద్యోగులకే వర్తిస్తాయా, ఉన్నతాధికారులకు వర్తించవా అన్న ప్రశ్నకు కేజీహెచ్ యాజమాన్యం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
ముగ్గులతో నిరసన
నేటి నుంచి జూడాల ఆందోళన తీవ్రతరంమహారాణిపేట: స్టైఫండ్ పెంపు కోసం గత 14 రోజులుగా ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యుల (జూడాలు) పట్ల ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సోమవారం నుంచి తమ నిరసనలను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే అత్యవసర సేవలను సైతం బహిష్కరించిన వైద్యులు, ఆదివారం కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట రంగురంగుల ముగ్గులు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు. జనవరి నుంచి స్టైఫండ్ పెంచుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు కేవలం 3 శాతమే ఇస్తామనడం సరికాదని, ఇతర రాష్ట్రాలతో ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు తీరేవరకు పోరాటం కొనసాగుతుందని ఏపీ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ శిరాజ్, దినకర్ సాయి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆదివారం నాటి రిలే నిరాహార దీక్షల్లో డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ జాహ్నవి, డాక్టర్ సుభాష్, డాక్టర్ విజేత తదితరులు పాల్గొన్నారు. -
కావడి కదంబం.. భక్తి రస ప్రవాహం
నగరంలోని మార్వాడీల సంప్రదాయ సిద్ధంగా ఆదివారం కావడి యాత్ర నిర్వహించారు. తమ కుటుంబాలు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, విశ్వశాంతి నెలకొనాలని కోరుతూ వీరు ప్రతి ఏడాది శ్రావణమాసంలో ఈ కావడి యాత్రను చేపడతారు. ఈసారి యాత్ర రోజు ఏకాదశి కావడంతో ఆదివారం కావడి యాత్రను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా వీరు మొదట మాధవదార శివాలయంలో శివుడిని దర్శించుకున్న అనంతరం కావిళ్లతో బయలుదేరారు. మురళీనగర్, ఊర్వశి కూడలి మీదుగా జాతీయ రహదారిపై సుమారు రెండువేల కుటుంబాలు భారీ సంఖ్యలో ఊరేగింపుగా బీచ్రోడ్డులోని జగన్నాథస్వామి ఆలయం వరకు కావడి యాత్రను కొనసాగించినట్టు మార్వాడీ యువమంచ్ అధ్యక్షుడు విష్ణు రాటేరియా తెలిపారు. అక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కావడి యాత్రతో నగరం భక్తి రస ప్రవాహంగా మారింది. – మురళీనగర్ -
అడుగంటిన రావణాపల్లి జలాశయం
గొలుగొండ: రావణాపల్లి రిజర్వాయర్ అడుగంటడంతో నర్సీపట్నం, గొలుగొండ మండలాల్లో దారు ణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆగస్టు రెండో వారంలో వరి నాట్లు పడి పచ్చగా కళకళలాడాల్సిన పొలా లు జీవం కోల్పోయి బీడువారి ఉన్నాయి. రావణాపల్లి నీటి నిల్వ సామర్థ్యం 139 ఎంసీఎఫ్టీలకు గాను, ప్రస్తుతం 49 ఎంసీఎఫ్టీలు మాత్రమే ఉంది. గొలు గొండ, నర్సీపట్నం మండలాల్లోని 2,600 ఎకరాల భూములకు ఈ జలాశయం ప్రధాన ఆధారం. ప్రతి ఏటా జులై నెలలో సాగు నీరు విడుదల చేసేవారు. ఈ ఏడాది ఆగస్టు పూర్తి కావస్తున్నా నీటి నిల్వలు లేకపోవడంతో వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. 15 సంవత్సరాల తరువాత... రావణాపల్లి జలాశయం ఎప్పుడూ నిండు కుండలా ఉండేది. జలాశయం గొలుగొండ మండలంలో ఉన్నప్పటికీ అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం తురవాడ గెడ్డ నుంచి జలాశయంలోకి నీరు వచ్చేది. తురవాడ గెడ్డ నిత్యం నీటితో కళకళలాడేది. ఏజెన్సీ ప్రాంతంలో ఏ మాత్రం వర్షం కురిసినా తురవాడ గెడ్డ పొంగి ప్రవహించి, జలాశయంలోకి నీరు చేరుతుంది. ఏజెన్సీ ప్రాంతంలో కూడా వర్షాలు కురవకపోవడంతో జలాశయం అడుగంటింది. 15 సంవత్సరాల తరువాత ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. మత్స్యకారులకు నష్టం రావణాపల్లి జలాశయంలో చేపల పెంపకం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రతి ఏటా జనవరి నుంచి జులై వరకు ఈ జలాశయంలో మత్స్యకారులు భారీగా చేపలు వేటాడి జీవనోపాధి పొందుతారు. ఈ ఏడాది జలాశయంలో నీరు లేకపోవడంతో ఇటు రైతులకు, ఇటు వందలాది మంది మత్స్యకారులకు ఇబ్బందులు గురవుతున్నారు. -
పొల్యూషన్కు సొల్యూషన్ ‘సైక్లింగ్’
ఏయూ క్యాంపస్: కాలుష్యానికి సైక్లింగ్ పరిష్కారంగా నిలుస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. బ్రిక్స్ ఫ్రెండ్షిప్ వేడుకల్లో భాగంగా సండేస్ ఆన్ సైకిల్ పేరిట బ్రిక్స్ దేశాల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని ఆదివారం ఉదయం బీచ్రోడ్డులో సైక్లింగ్ చేశారు. సైక్లింగ్ అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. సైక్లింగ్ ‘ఫిట్ ఇండియా’ఉద్యమంలో భాగమన్నారు. భారత ప్రధాని ‘సండేస్ ఆన్ సైకిల్’కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ఆదివారం దేశవ్యాప్తంగా దాదాపు 1,800 నగరాల్లో ఈ కార్యక్రమం నిర్వహించగా, 50 లక్షల మంది యువత పాల్గొన్నారని పేర్కొన్నారు. సైక్లింగ్ అద్భుతమైన వ్యాయామమని, దీనివల్ల శారీరక దృఢత్వం పెరుగుతుందన్నారు. ప్రతి ఆదివారం ప్రజలు సైక్లింగ్లో పాల్గొనాలని సూచించారు. తద్వారా కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. బీచ్రోడ్డులోని నోవాటెల్ హోటల్ నుంచి సీ హారియర్ వరకు బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, బ్రిక్స్ ప్రతినిధులు, శాప్ ఎండీ భరణి, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఆర్డీవో దిలీప్ చక్రవర్తి, క్రీడా అధికారి జూన్ గ్యాలియట్, యూడీసీ పీడీ సత్యవేణి, కేంద్ర ప్రభుత్వ అధికారులు, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. -
రుచికరం.. విభిన్నం
ఆరోగ్యానికి ఎంతో మేలు సంతలో వెదురు కొమ్ములు అమ్మకాలుముంచంగిపుట్టు: కూరగాయల్లో ఎన్నో రకాలు ఉంటాయి. కానీ, జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో లభించే కొన్ని ప్రత్యేకమైన వంటకాలు ఎంతో విభిన్నంగా ఉంటాయి. ఎప్పుడైనా వెదురు నుంచి తీసిన కూరను రుచి చూశారా? వినడానికి కొత్తగా ఉన్నప్పటికీ, గిరిజనులు మాత్రం లేత వెదురు చిగురుతో ఎంతో రుచికరమైన కూర వండుకుంటారు. దీనిని స్థానికంగా వెదురు కొమ్ములు లేదా వెదురు కంజి అని పిలుస్తారు. ప్రస్తుతం వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో, మన్యం ప్రాంతాల్లోని మండల కేంద్రాలు వారపు సంతల్లో ఈ వెదురు కంజి అమ్మకాలు హాట్ కేకుల్లా సాగుతున్నాయి. సేకరణ: అటవీ, కొండ ప్రాంతాల్లోని వెదురు బొంగుల నుంచి లేత వెదురు చిగురును సేకరించి, శుభ్రం చేసి చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. గిరిజనులు వీటిని మండల కేంద్రాలకు తెచ్చి, వాటాను బట్టి రూ.20 నుంచి రూ.50 వరకు విక్రయిస్తారు. రెండు రకాలు ● పచ్చి వెదురు కంజి.. సేకరించిన వెంటనే తాజాగా ఉన్నప్పుడు కూర వండుకోవడానికి ఉపయోగిస్తారు. ● ఎండబెట్టిన కంజి.. వీటిని ఎండబెట్టి నిల్వ చేసుకుని, ఏడాది పొడవునా ఎప్పుడైనా వండుకోవడానికి ఉపయోగిస్తారు. రుచికరమైన వంటకాలు ఈ వెదురు కంజిని మన్యం వాసులు ఎంతో ఇష్టంగా తింటారు. దీనితో వేపుడు, పచ్చడి, పులుసు వంటి రకరకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు. చిట్కా: వెదురు కంజి కూర వండే ముందు, దానిలోని సహజమైన చేదుదనం పోయేలా రెండు, మూడు సార్లు శుభ్రంగా కడగుతారు. అప్పుడే కూర అద్భుతమైన రుచిని ఇస్తుంది! ఉపయోగాలిలా.. వెదురుకంజిని బాగా ఉడకబెట్టి దాని కషయాన్ని తాగితే శరిరానికి తక్షణమే వేడి చేస్తుందని గిరిజనులు చెబుతుంటారు. మదుమేహం, కపం, మూల వ్యాధి నివారణకు ఆయుర్వేద పరంగా ఎంతో ఉప శమనం ఇస్తుంది. రక్తాన్ని శుద్ధి పరుస్తుంది. మహిళల్లో గర్భశోఖ వ్యాధులు రాకుండా అరికడుతుంది. జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. కడుపులో నులి పురుగును తొలగిస్తుంది. అలాగే గాయాలైనప్పుడు గాయం మానేందుకు వెదురు కంజిని పేస్ట్గా చేసి గాయంపై రాస్తారు. దీనికి తోడు మారుమూల గిరిజనులు పాము, తేలు కాటులకు ఔషధంగా వినియోగిస్తామని గిరిజనులు తెలిపారు. వెదురు కొమ్ములకు గిరాకీ అటవీ ప్రాంతాల్లో వెదురు నుంచి లేత చిగురు సేకరణ వారపు సంతల్లో అమ్మకాలు వేపుడు, పచ్చడి, పులుసు రుచులకు ఎంతో డిమాండ్ గిరిజనులకు ఎంతో ఇష్టమైన వంటకం వెదురు కంజివెదురు కొమ్ములను గర్భిణులకు అధికంగా వండి పెడతాం.దీనిలో ఉన్న గుణాలు వారి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి వేడిచేసినా గిరిజన ప్రాంతంలోని వాతావరణం చల్లగా ఉన్నందున పెద్దగా ఇబ్బంది ఉండదు. వెదురు కొమ్ముల కూర ఎంతో రుచికరంగా ఉంటుంది. ఈ నాలుగు నెలలు మాత్రమే వెదురు కొమ్ములు లభ్యమవుతాయి. – ఎస్.పుణ్యవతి, గృహిణి, డేగలపుట్టు, ముంచంగిపుట్టు మండలం వారపు సంతల్లో వెదురు కొమ్ముల అమ్మకాలు జోరు గా సాగుతున్నాయి. కొమ్ముల వాటా రూ.20, రూ.50కు విక్రయిస్తున్నారు. ఇప్పుడు మైదాన ప్రాంతం నుంచి వచ్చి కూడా వెదురు కొమ్ములను కొనుగోలు చేస్తున్నారు. కొమ్ములను పచ్చిగా, ఉడకబెట్టి మరీ అమ్ముతున్నాం. వారపు సంతలో కొమ్ములు తెచ్చిన కొద్దిసేపటికే అమ్ముడు పోయాయి. – ఎస్.రామారావు, కూరగాయల వ్యాపారి, నర్సిపుట్టు, ముంచంగిపుట్టు మండలం -
‘అంతర్జాతీయ డ్రాగన్ బోట్’ పోటీలకు కానిస్టేబుల్ ఎంపిక
తుమ్మపాల: ప్రతిష్టాత్మక అంతర్జాతీ య డ్రాగన్ బోట్ పోటీలకు అనకాపల్లి మండలం రొంగలివానిపాలెంకు చెందిన కానిస్టేబుల్ సూరినాయుడు ఎంపికయ్యారు. చైనా లోని హాంగ్జౌలో సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు నిర్వహించనున్న 2026 ఐసీఎఫ్ డ్రాగన్ బోట్ ప్రపంచ చాంపియన్షిప్ పోటీల్లో భారత జట్టు తరఫున ఆయన ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ మేరకు భారత కయాకింగ్ అండ్ కానోయింగ్ అసోసియేషన్ నుంచి ఏపీ డీజీపీ కార్యాలయానికి లేఖ అందినట్టు సూరినాయుడు తెలిపారు. సెప్టెంబర్ 28న భారత బృందం చైనాకు బయలుదేరి, అక్టోబర్ 4న తిరిగి వస్తుంది. సూరినాయుడు ప్రస్తుతం డీఐజీ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. సూరినాయుడు అంతర్జాతీయ పోటీలకు ఎంపిక కావడంపై పోలీసు అధికారులు, సహచరులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. -
ప్రమాదస్థాయికిడుడుమ నీటిమట్టం
● 1500 క్యూసెక్కుల విడుదల ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరందించే డుడుమ జలాశయంలో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరుకుంది. గత కొన్ని రోజులుగా సరిహద్దులో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. డుడుమ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 2590 అడుగులు కాగా, ఆదివారం నాటికి అది 2587.07 అడుగులకు చేరుకుంది. జలాశయ నీటి మట్టం క్రమేణా పెరుగుతుండటంతో అప్రమత్తమైన సిబ్బంది, 6వ నెంబర్ గేటును ఒక అడుగు పైకెత్తి 1,500 క్యూసెక్కుల నీటిని బలిమెల జలాశయానికి విడుదల చేస్తున్నారు. వర్షాలు ఇదే విధంగా కొనసాగితే జలాశయానికి ప్రమాదం తప్పదని భావించిన ప్రాజెక్టు అధికారులు మరియు సిబ్బంది, నీటి నిల్వలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రమాద స్థాయి నుంచి సాధారణ స్థాయికి తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు. -
జీతం అందక ఇబ్బందులు
● అరునెలలుగా పారిశుధ్య కార్మికుడి వెతలు సీలేరు: సీలేరు మేజర్ పంచాయతీలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న కుర్ర చింటూకు గత ఆరు నెలలుగా జీతం అందకపోవడంతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఐదేళ్ల కిందట ఒడిశా నుంచి వలస వచ్చిన అతను, భార్య, నలుగురు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. తోటి కార్మికులకు జీతాలు వస్తున్నా, తనకు మాత్రం ఆరు నెలలుగా రాకపోవడంతో కుటుంబ పోషణ భారమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనిపై గ్రామ కార్యదర్శిని వివరణ కోరగా, బ్యాంకు ఖాతాకు సంబంధించిన సాంకేతిక ఇబ్బందుల వల్ల ఆలస్యమైందని, తక్షణమే జీతం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి పెండింగ్ జీతం ఇప్పించాలని ఆయన కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు. -
రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించడంలో విఫలం
పాడేరు రూరల్: గిరిజన సహకార సంస్థ రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం, సంబంధిత శాఖ ఉన్నత అధికారులు పూర్తిగా విఫలమయ్యారని సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స విమర్శించారు. పాడేరు మొదకొండమ్మతల్లి కల్యాణ మండపంలో ఆదివారం గిరిజన రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, దశాబ్దాలుగా రేషన్ డీలర్లుగా విధులు నిర్వహిస్తున్న వారిపై ప్రభుత్వం, ఉన్నత అధికారులు సవతితల్లి ప్రేమ చూపుతున్నారని మండిపడ్డారు. చాలిచాలని వేతనాలతో డీలర్లు దుర్భర జీవితం గడపాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఏళ్లుగా పనిచేస్తున్నా కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం దారుణమన్నారు. డీలర్లపై ఈ స్థాయి వివక్ష చూపడం ప్రభుత్వానికి తగదని హితవు పలికారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేస్తున్న డీలర్ల ప్రధాన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ఉద్యమాలు మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన డీలర్లు కల్యాణ్ పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స విమర్శ -
ఏయూలో తాత్కాలికనియామకాలకు పచ్చజెండా
● గంటల లెక్కన బోధనకు రేపటి నుంచి ఇంటర్వ్యూలు విశాఖ విద్య: బోధనా సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్ర విశ్వవిద్యాలయ యంత్రాంగం ఎట్టకేలకు గంటల లెక్కన బోధించే తాత్కాలిక సిబ్బంది నియామకానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 25 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పేరిట ఆదివారం ఓ ప్రకటన విడుదలైంది. ఈ నెల 25న కంప్యూటర్ ఇంజినీరింగ్ అండ్ సిస్టమ్ ఇంజినీరింగ్, ఐటీ అండ్ సీఏ, మెటలర్జికల్ ఇంజినీరింగ్ విభాగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. 28న ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగాలకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. 29న ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్, ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీ, మైరెన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, సివిల్ ఇంజినీరింగ్, జియో ఇంజినీరింగ్ విభాగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని ఏయూ ప్రకటించింది. ఇప్పటికే సకాలంలో బోధన అందక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు ఈ తాత్కాలిక నియామకాలు ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తాయో చూడాలి. అలాగే ఇంటర్వ్యూల నిర్వహణలో పారదర్శకత పాటిస్తారా? లేదా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముమ్మరంగా వాహన తనిఖీలు డుంబ్రిగుడ: మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన చాపరాయి సమీపంలో ఆదివారం పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఎస్ఐ ఎల్. సురేష్ ఆదేశాల మేరకు ప్రత్యేక పార్టీ పోలీసులు పర్యాటక కార్లు, ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, డబ్బులకు ఆశపడి యువత గంజాయి, హ్యాష్ ఆయిల్ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. గంజాయి రవాణాను పూర్తిగా అరికట్టేందుకే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. -
కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు తగదు
పాడేరు రూరల్: ప్రభుత్వ విద్యపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలని ఆదివాసీ సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడ రాధాకృష్ణ డిమాండ్ చేశారు. విశాఖపట్నం మధురవాడ (మారికవలస)లోని గురుకుల పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ పాడేరు ఐటీడీఏ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు నిర్వహిస్తున్న నిరాహార దీక్ష ఆదివారంతో 13వ రోజుకు చేరింది. ఈ దీక్షా శిబిరాన్ని సందర్శించి మాట్లాడిన ఆయన.. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో ఉన్న గురుకుల పాఠశాలను ఎత్తివేసే కుట్రను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. ఉన్నట్లుండి మారికవలస పాఠశాలను ఎత్తివేయడం ప్రభుత్వ నిరంకుశ పాలనకు అద్దం పడుతోందని మండిపడ్డారు. 2004లో ఆదివాసీ విద్యార్థుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన ఈ ఇంగ్లీష్ మీడియం పాఠశాలను అర్ధంతరంగా రద్దు చేయడం విద్యార్థుల పట్ల కక్షసాధింపు చర్యేనని విమర్శించారు. ప్రభుత్వ విద్యను గాలికి వదిలేసి ప్రైవేట్, కార్పొరేట్ విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆరోపించారు. మొదట 5 నుంచి 8 తరగతులను తొలగిస్తున్నట్లు ప్రకటించి, ఇప్పుడు 9, 10 తరగతులను కూడా లేకుండా చేయడం ప్రభుత్వ కుట్రలో భాగమేనని ధ్వజమెత్తారు. ఆదివాసీ విద్యార్థులను చదువుకు దూరం చేయడమే లక్ష్యంగా పాలకులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ తప్పిదాల వల్లే ఈ సమస్య తలెత్తిందని, విద్యార్థులపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భవిష్యత్తులో ఉద్యమాలు మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ రాజేష్, పోరాట కమిటీ కన్వీనర్ రమే ష్నాయుడు, శ్రావణి, మత్స్యరాజు, రాజారావు, రాంబాబు, గణపతి, త్రినాథ్, శేషు పాల్గొన్నారు. ఆదివాసీ సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కూడ రాధాకృష్ణ -
ఎడతెరిపిలేని వర్షం
ముంచంగిపుట్టు: మండలంలో ఆదివారం ఈదురుగాలులతో కూడిన ఎడతెరిపిలేని భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లపై భారీగా వరదనీరు ప్రవహించింది. జర్రెల పంచాయతీ డేగలపుట్టు గ్రామానికి చెందిన గుంట గోపాల్ అనే గిరిజనుడి ఇంటిపై భారీ చింతచెట్టు, వెదురు చెట్లు ఒకేసారి పడటంతో పైకప్పు రేకులు ధ్వంసమయ్యాయి. అయితే, ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ మండల నేత నాయకం సురేష్ డేగలపుట్టు గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. జరిగిన నష్టంపై రెవెన్యూ అధికారులకు సమాచారం అందించిన ఆయన, ప్రభుత్వాన్ని తక్షణమే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. తగ్గని వర్షం.. వారపు సంతలకు ఆటంకం సీలేరు: ఏజెన్సీ, ఆంధ్రా–ఒడిశా–పోలవరం సరిహద్దు ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో గిరిజనులు ఇళ్లకే పరిమితమయ్యారు. కూలీ పనులు లేక జీవనం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సీలేరు, ధారకొండ, చిత్రకొండ ప్రాంతాల్లో జరిగిన వారపు సంతలు వర్షం వల్ల పూర్తిగా దెబ్బతిన్నాయి. గిరిజనులు తాము పండించిన కూరగాయలను విక్రయించడానికి తెచ్చినా, కొనుగోలుదారులు లేక, వర్షానికి కూరగాయలు తడిసిపోవడంతో వెనుదిరిగాల్సి వచ్చింది. పిల్లిగెడ్డ, కొంగపాకల, మాదిగమల్లు, చిన్న గంగవరం తదితర వాగులు కొండనీటితో ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. అసంపూర్తిగా నిలిచిన వంతెనల కారణంగా గిరిజన గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయి ప్రమాదకరంగా మారాయి. మైదాన ప్రాంతాల్లో ఎండలు కాయగా, ఏజెన్సీలో మాత్రం నిత్యం కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.స్తంభించిన జనజీవనం -
ప్రభుత్వాస్పత్రుల్లో.. మందుపాతర!
మహారాణిపేట: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పేద రోగుల ప్రాణాలకు భరోసా కరువైంది. ఒకవైపు జూనియర్ వైద్యుల సమ్మెతో సర్కారు వైద్యం పడకేసింది. మరోవైపు ప్రాణాధార మందుల కొరత పేద రోగులను నిలువునా దహిస్తోంది. ఉత్తరాంధ్ర ప్రజల పెద్ద దిక్కు అయిన కింగ్ జార్జ్ ఆస్పత్రి (కేజీహెచ్) మొదలుకొని నగరంలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో మందుల కొరత తీవ్ర స్థాయికి చేరింది. రోగుల ఆర్తనాదాలు వినపడుతున్నా పాలకుల్లో మాత్రం చలనం లేకుండా పోయింది. మందుల కోటాలో కోత గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పేద రోగులకు అన్ని రకాల మందులు పుష్కలంగా అందుబాటులో ఉండేవి. దాదాపు 613 రకాల ఔషధాలను నిరంతరం అందుబాటులో ఉంచి, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెల రోజులకు సరిపడా మందులను ఒకేసారి ఉచితంగా అందజేసేవారు. కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. ప్రస్తుతం కేవలం 318 రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులోనూ అత్యవసర ఔషధాలు దాదాపు నిండుకున్నాయి. నెల రోజుల కోటాను కాస్తా వారం రోజులకు కుదించేశారు. ఆ కొద్దిపాటి మందుల కోసమే గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సి వస్తోంది. ప్రాణాధార మందుల కొరత బీపీ, షుగర్, గుండెజబ్బులు, క్యాన్సర్, ఫిట్స్, మూర్ఛ వ్యాధి నివారణ మాత్రలతో పాటు ఇన్సులిన్, యాంటీబయాటిక్స్, బ్లీడింగ్ నివారణ, రక్తహీనత నివారణ మందుల నిల్వలు పూర్తిగా అడుగంటాయి. ఆక్సిజన్ పైపులు, వెంటిలేటర్ కిట్లు, ఆపరేషన్లకు వాడే సర్జికల్ దారాలు, గర్భాశయ ఇన్ఫెక్షన్ నివారణ మందులు సైతం దొరకడం లేదు. క్యాన్సర్ బాధితులకు అవసరమైన ఖరీదైన మందులు వస్తే 2–3 రోజుల్లోనే అయిపోతున్నాయి. మళ్లీ ఎప్పుడు వస్తాయో తెలియక ప్రాణాంతక వ్యాధులతో బాధపడే రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. 100 గ్లౌజులకు ఉన్నవి 10 మాత్రమే! ఆస్పత్రుల్లో ప్రాథమిక వైద్య పరికరాల కొరత మరింత దారుణంగా మారింది. కేజీహెచ్లో రోజుకు కనీసం 100 సెట్ల గ్లౌజులు అవసరం కాగా, పది సెట్లకు మించి లభించడం లేదు. ఒక్కోసారి గ్లౌజులు లేకుండానే ఆపరేషన్లు చేయాల్సిన ప్రమాదకర పరిస్థితులు దాపురిస్తున్నాయని వైద్యులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాయాలకు డ్రెస్సింగ్ చేయడానికి అవసరమైన సూదులు, కిట్లు, ఆయింట్మెంట్లు లేకపోవడంతో రోగుల కుటుంబ సభ్యులే బయట మెడికల్ స్టోర్స్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. కౌంటర్లు కిటకిట.. రోగుల విలవిల! కేజీహెచ్తో పాటు ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, ప్రభుత్వ మానసిక వైద్యశాల, ఈఎన్టీ, రాణి చంద్రమతి దేవి, టీబీ, ఐడీ ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రోజూ 3 వేల మందికి పైగా ఓపీ, ఐపీ రోగులు మందుల కౌంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. మందుల కోసం నిలబడితే ‘స్టాక్ లేదు.. విజయవాడకు ఇండెంట్ పెట్టాం.. బయట కొనుక్కోండి’ అంటూ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ వైద్యం పూర్తిగా పడకేసింది. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యం అందక.. మందులు లేక రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. నిండుకున్న మందుల స్టాక్ 613 రకాలకు అందుబాటులో ఉన్నవి 318 మాత్రమే.. బీపీ, షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్ మందుల కొరత నెల రోజుల కోటా వారం రోజులకు కుదింపు -
గంజాయి స్మగ్లర్లపై ఉక్కు పాదం
ఇద్దరు అన్నదమ్ములు జైలుకు తరలింపుకొయ్యూరు: గంజాయి తరలింపునకు పాల్పడుతూ యువతను మత్తుకు అలవాటు చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములను పీడీ చట్టం కింద అరెస్ట్ చేసి విశాఖా సెంట్రల్ జైలుకు తరలించామని సీఐ బి శ్రీనివాసరావు శవారం తెలిపారు.మర్రివాడ పంచాయతీ దొడ్డవరంకు చెందిన మాగాపు చక్రవర్తి,గంగాధర్లు అన్నదమ్ములు ఇద్దరు గంజాయిని ఇది వరకు తరలించారన్నారు.వారిపై ఇక్కడ పోలీసులు పంపిన నివేదిక ఆధారంగా కలెక్టర్ పీడీ చట్టం కింద అరెస్ట్కు ఆదేశాలు ఇచ్చారన్నారు.దీనిలో బాగంగా వారిని జైలుకు తరలించామన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నిరోధిక నిర్బంధ ఉత్తర్వులను అనుసరించిపై ఇద్దరిని జైలుకు తరలించామన్నారు. సమాజానికి, యువతకు ముప్పుగా మారిన ఇలాంటి గంజాయి స్మగ్లర్లపై మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై సైతం పీడీ చట్టాన్ని ప్రయోగిస్తామని హెచ్చరించారు.మండలంలో ఎవరైనా గంజయిని తరలించినా లేదా అక్రమంగా నిల్వ ఉంచినా నేరస్తులవుతారన్నారు.వారి జీవితాలు అంధకారమవుతాయని తెలిపారు. దీనిలో మంప ఎస్ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
సీఎం గారూ.. మాకు ఒరిగిందేమిటి?
సాక్షి, అనకాపల్లి/కె.కోటపాడు: అధికారం చేపట్టి రెండున్నరేళ్ల తరువాత కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో శనివారం జరిగిన సీఎం చంద్రబాబు పర్యటనతో స్థానిక ప్రజలకు, జిల్లా వాసులకు ఒరిగేందేమి లేదు. స్థానిక సమస్యల పరిష్కారంపై ఎటువంటి ప్రకటన లేదు. అభివృద్ధి పనులకు నిధులపై హామీ లేదు. అయితే ప్రభుత్వ వైఫల్యాలను మాత్రం అధికారులపై నెట్టే ప్రయత్నం కనిపించిందని ప్రజలు చెబుతున్నారు. ‘సీఎం గారూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు? మా రోడ్లు ఎప్పుడు బాగుపడతాయి? మా సమస్యలకు పరిష్కారం ఎప్పుడొస్తుంది?’అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారులే బాధ్యులు : ప్రజల సమస్యలకు పరిష్కారం, అభివృద్ధి పనులపై స్పష్టమైన హామీ ఇవ్వడం కంటే ప్రభుత్వ శాఖల పనితీరుపై విమర్శలు చేయడానికే చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివిధ డిపార్ట్మెంట్ల పనితీరు సరిగా లేదంటూ అధికారులపై రుబాబు ప్రదర్శించారు. ప్రభుత్వమే తగిన నిధులు విడుదల చేయకపోతే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అధికారులు ఎలా అమలు చేస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిధుల కొరత, ప్రభుత్వ వైఫల్యాలను పక్కనపెట్టి అధికారుల పనితీరుపై నెపం మోపే ప్రయత్నం చేశారని స్థానికులు విమర్శిస్తున్నారు. సూపర్ సిక్స్లో అరకొరగా అమలు చేసిన అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, సీ్త్ర శక్తి పథకంలో లోపాలను అధికారులపై నెట్టే యత్నం చేశారు. అంతేకాకుండా వివిధ విభాగాల వారీగా జిల్లా అధికారుల పనితీరును బహిరంగ సభలో సీఎం ప్రశ్నించారు. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, మైనింగ్ శాఖ, పురపాలక శాఖ అధికారుల పురోగతి బాలేదంటూ రుబాబు చేశారు. ప్రభుత్వమే తగిన నిధులివ్వకపోతే అధికారులు సైతం ఏమి చేస్తారంటూ ప్రజలు మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను అధికారులపై రుద్దేందుకే ఈ సభ నిర్వహించినట్టుగా ఉందని జనం గుసగుసలాడుకోవడం కనిపించింది. రోడ్లు బాలేదంటూ నిరసన : సీఎం సభలో ప్రజల నుంచే అసంతృప్తి వ్యక్తమైంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత నుంచి రోడ్లు అద్దంలా మెరిసిపోతున్నాయంటూ చంద్రబాబు చెబుతూ.. అర్అండ్బీ, పంచాయతీ రాజ్ ఎస్ఈను పిలవగా.. రోడ్లు బాగోలేదంటూ పలువురు ప్రజలు చేతులూపుతూ నిరసన తెలిపారు. దీంతో రోడ్ల అభివృద్ధికి నిధులు విడుదల చేస్తే మీరు సరిగ్గా ఎందుకు వేయలేదంటూ ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్ ఇంజినీర్లపై సీఎం రుసరుసలాడారు. ఒక వైపు ప్రజలు సమస్యలను గుర్తు చేస్తుంటే.. మరోవైపు చంద్రబాబు ప్రసంగం కొనసాగుతున్న సమయంలోనే సభలో నుంచి పలువురు వెళ్లిపోవడంతో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. గంట ఆలస్యంగా పర్యటన : సీఎం చంద్రబాబు పర్యటన గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ముందుగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకు హెలికాప్టర్ ద్వారా ఎ.కోడూరు చేరుకోవాల్సి ఉంది. పలు గ్రామాల నుంచి డ్వాక్రా మహిళలను ఎ.కోడూరుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఒక వైపు చిరుజల్లులు పడుతున్నా.. బయటకు వెళ్లకుండా వారిని సభలోనే బలవంతంగా నిలిపివేశారు. చంద్రబాబు ప్రసంగం ప్రారంభమైన కొద్ది సేపటికే మహిళలు, ప్రజలు వెనుదిరగడం ప్రారంభించారు. సీఎం ప్రసంగం పూర్తయినంత వరకూ ఉండాలని టీడీపీ నాయకులు కోరుతున్నా ఎవరూ వినిపించుకోకపోవడం విశేషం.సీఎం చంద్రబాబు పర్యటన జిల్లా వాసులకు మళ్లీ నిరాశే మిగిల్చింది. కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో శనివారం నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’కార్యక్రమంలో ఎప్పటిలాగే చంద్రబాబు డాబూ..డూబూ అంటూ సాగింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండున్నరేళ్లు కావస్తుండడంతో ఎన్నికలకు ముందు కె.కోటపాడు వేదికగా ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా సీఎం ఏమైనా ప్రకటన చేస్తారని, స్థానిక సమస్యల పరిష్కారంపై స్పష్టత ఇస్తారని ఆశించిన ప్రజలకు భంగపాటే ఎదురైంది. ఎన్నికల హామీల ప్రస్తావనకే చోటు లేకపోవడంతో ‘సీఎం గారూ.. మా సమస్యల పరిష్కారం ఎప్పుడో?’అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను అధికారులపై నెట్టే యత్నం చేయడంతో అంతా విస్తుపోయారు. -
ప్రభుత్వ వైద్య కళాశాలలో మౌలిక వసతులు కల్పిస్తాం
పాడేరు : స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రణాళికబద్ధంగా మౌలిక వసతులు కల్పిస్తామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వీరపాండ్యన్ తెలిపారు. శనివారం ఆయన స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించారు. కళాశాల తరగతి గదులను, ఇతర బ్లాకులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాలని, మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. జీజీహెచ్, ఎంసీహెచ్ ఆస్పత్రులను వైద్య కళాశాల పరిధిలోని తరలించే ప్రక్రియను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అనంతరం ఆయన స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిని తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, రోగులకు అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. సకాలంలో రక్త పరీక్షలు చేసి ఇవ్వాలన్నారు. ఆస్పత్రిలో సెక్యూరిటీ, శానిటేషన్ సేవలను పరిశీలించారు. అవసరమైతే వారి సంఖ్యను పెంచాలని అధికారులను ఆదేశించారు. వైద్య సేవల్లో ఎటువంటి ఇబ్బందులకు తావు లేకుండా రోగులకు సమర్ధవంతంగా అందించాలని సూచించారు. ఆయన వెంట కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, జిల్లా ఆస్పత్రి సూపరిండెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, వైద్యులు ఉన్నారు.రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వీరపాండ్యన్ -
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
పాడేరు: పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ రోజురోజుకూ బలపడుతోంది. నియోజకవర్గంలోని ఆ పార్టీ నాయకత్వంపై నమ్మకంతో ఇతర పార్టీల నుంచి చేరికలు అధికమవుతున్నాయి. ఇప్పటికే చాలామంది రిటైర్డ్ అధికారులు, ఉద్యోగులు, ఇతర పార్టీలకు చెందిన కీలక నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. ఈ క్రమంలో శనివారం మండలంలోని గుత్తులపుట్టు, వంట్లమామిడి పంచాయతీలకు చెందిన సుమారు 100 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు సమక్షంలో పార్టీలో చేరారు. వంట్లమామిడికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు, పీసా కమిటీ అధ్యక్షులు వంతాల చిట్టిబాబు, మాజీ వార్డు సభ్యులు ఉల్లి రామారావు, అల్లంగి చిన్న పోతురాజు, పీసా కమిటీ అధ్యక్షులు బోయిని రాంబాబు, నాయకులు మాదెల నూకరాజు, వంతాల కోటేశ్వరరావు, సీదరి సత్తిబాబు, వంతాల కళ్యాణ్ తదితరులు ఉన్నారు. అలాగే గుత్తులపుట్టు పంచాయతీకి చెందిన సింహాచలం, అర్జున్, త్రినాథ్, వెంకట్, నాగరాజు, కొండమ్మ, చిన్నయ్య, శ్రీను, కుమారి, పండన్న, కొండలరావు తదితరులు వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు పార్టీలోకి వచ్చిన వారందరికీ సాదరంగా ఆహ్వానం పలికారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరాజు సమక్షంలో చేరిన టీడీపీ నేతలు -
జూడాల సమస్యలను విస్మరించిన ప్రభుత్వం
● ఈఎన్టీ సీనియర్ రెసిడెంట్డాక్టర్ వైదేహి విమర్శ ● పాడేరులో నాలుగో రోజుకు చేరిన నిరసన పాడేరు రూరల్: జూనియర్ వైద్యుల సమస్యలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఈఎన్టీ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ వైదేహి విమర్శించారు.స్థానిక ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో జూనియర్ వైద్యులు నిర్వహిస్తున్న నిరసనలు శనివారం నాటికి నాలుగో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ వైద్యులు చేపడుతున్న నిరసనలు రోజురోజుకూ తీవ్రతరం అవుతున్నాయని, సంబంధిత శాఖా మంత్రి ఈ అంశంపై సానుకూలంగా స్పందించాలని కోరారు. ప్రభుత్వం, ఉన్నత అధికారుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వస్తుండటంతో కొంతమంది జూనియర్ వైద్యులు తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తాత్కాలికంగా విధుల్లో చేరారని, అయినప్పటికీ తాము జిల్లా ఆసుపత్రిలో నిరసనను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇప్పటికై నా పెరిగిన ధరలకు అనుగుణంగా వైద్యుల స్టయిఫండ్ను పెంచాలని డిమాండ్ చేశారు. జూనియర్ వైద్యుల ఐక్యతను దెబ్బతీయడానికే ప్రభుత్వం దొంగదారిలో ప్రైవేట్ వైద్యులను రంగంలోకి దించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ వైద్యానికి తూట్లు పొడిచేందుకు కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారని, ఇప్పటికే ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు భారీగా రాయితీలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి జూనియర్ వైద్యుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. -
వంట కష్టాలు!
గ్యాస్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో కొయ్యూరు మండలంలోని ఆశ్రమ పాఠశాలల్లో వంట కష్టాలు మొదలయ్యాయి. విద్యార్థులకు భోజనం వండాల్సిన సిబ్బంది గ్యాస్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి.. సరఫరా కాకపోతే కట్టెల పొయ్యినే ఆశ్రయించాల్సిన దుస్థితి. అవసరానికి తగ్గ సిలిండర్లు అందకపోవడం, కొన్ని పాఠశాలలకు నెలల తరబడి గ్యాస్ రాకపోవడంతో సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది.ఆశ్రమ పాఠశాలల్లోకొయ్యూరు: ఆశ్రమ పాఠశాలల్లో గ్యాస్ కొరత వంట సిబ్బందికి తలబొప్పి కట్టిస్తోంది. వారానికి అవసరమైన గ్యాస్ సిలిండర్లలో సగం కూడా అందకపోవడంతో పలు పాఠశాలల్లో కట్టెల పొయ్యిపైనే వంట చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొన్ని ఆశ్రమ పాఠశాలలకు నెలల తరబడి గ్యాస్ సరఫరా కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కొయ్యూరు మండలంలోని ఆశ్రమ పాఠశాలలకు చింతపల్లి జీసీసీ నుంచి హెచ్పీ గ్యాస్ సరఫరా అవుతోంది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి వారానికి 6 నుంచి 8 సిలిండర్లు అవసరం కాగా, ప్రస్తుతం రెండింటికి మించి ఇవ్వడం లేదని వార్డెన్లు చెబుతున్నారు. నడింపాలెం, శరభన్నపాలెం ఆశ్రమ పాఠశాలలకు నెలల తరబడి గ్యాస్ సరఫరా కావడం లేదని పేర్కొంటున్నారు. వర్షం వస్తే.. కట్టెలతో మరింత కష్టం! గ్యాస్ అందకపోవడంతో వంట చెరకు వినియోగించాల్సి వస్తోంది. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో ఎండిన కట్టెలు కొంతమేర దొరుకుతున్నా.. వర్షాలు కురిస్తే తడిసిన కట్టెలతో వంట చేయడం మరింత ఇబ్బందికరంగా మారుతుందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా ఆశ్రమ పాఠశాలల్లో వంట సిబ్బంది వృద్ధులు కావడంతో కట్టెల పొయ్యిపై గంటల తరబడి వంట చేయడం వారికి మరింత భారంగా మారుతోంది. జీసీసీ సరఫరాపై అసంతృప్తి.. మరో ఏజెన్సీకి మార్పు? ఇతర గ్యాస్ ఏజెన్సీలు సరఫరా చేస్తున్నప్పటికీ జీసీసీ నుంచి హెచ్పీ గ్యాస్ సక్రమంగా అందడం లేదని అధికారులు, వార్డెన్లు చెబుతున్నారు. గతంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా జరిగేదని, గత కొన్ని నెలలుగా పరిస్థితి మారిందని పేర్కొంటున్నారు. దీంతో గిరిజన సంక్షేమ శాఖాధికారులు మరో గ్యాస్ ఏజెన్సీకి సరఫరాను మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏటీడబ్ల్యూవో క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. వార్డెన్లు నిబంధనల ప్రకారం అవసరమైన గ్యాస్ కోసం ముందుగానే ఫారం పూర్తి చేసి గ్యాస్ పర్యవేక్షకునికి అందించాలని సూచించారు.గ్యాస్ కొరతతో అవస్థలు వినియోగంలో సగం కూడా అందనిసిలిండర్లు వారానికి రెండుకు మించిఇవ్వడం లేదంటున్న వార్డెన్లు జీసీసీ ఏజెన్సీ సరఫరాపై అసంతృప్తి మరో ఏజెన్సీకి మార్చే యోచనలో గిరిజన సంక్షేమశాఖ అధికారులు


