breaking news
International
-
ఆదర్శాలతో అవతరించి...ఎన్నో విజయాలు సాధించి
రెండవ ప్రపంచ యుద్ధం వల్ల ప్రపంచం తీవ్ర అశాంతిని అనుభవించింది. దీంతో శాశ్వతమైన శాంతి కోసం ప్రపంచ దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకుని, 1945 అక్టోబర్ 24న 51 దేశాలు కలిసి ‘ఐక్యరాజ్యసమితి చార్టర్’ (United Nations Charter) ను అమల్లోకి తెచ్చాయి. ఆ తరువాత అనేక దేశాలు ఐక్యరాజ్య సమితిలో చేరాయి. అంతర్జాతీయ శాంతిని కాపాడడం, దేశాల మధ్య స్నేహ పూర్వక సంబంధాలను పెంపొందిస్తూ, అంతర్జాతీయ సహకారాన్ని సాధించడం, మానవ హక్కులను పరిరక్షించడం, సుస్థిరాభివృద్ధిని సాధించడం, యుద్ధాలను నివారించడం ఐక్యరాజ్యసమితి (యూఎన్ఓ) ప్రధాన లక్ష్యాలుగా చెప్పవచ్చు. సాధించిన విజయాలుయుద్ధాలు, అంతర్గత ఘర్షణలు చోటు చేసుకున్న ప్రాంతాల్లో ఐక్యరాజ్యసమితి శాంతిస్థాపన కోసం బలగాలను పంపి, వివాదాలను పరిష్కరించడంలో ప్రధాన పాత్ర పోషించింది. ఉదాహరణకు, కొరియా, కాంగో, లెబనాన్, సూడాన్, సిరియా వంటి దేశాల్లో ఐక్యరాజ్యసమితి బలగాలు శాంతిస్థాపనకు ఎంతగానో కృషి చేశాయి. 1948లో ‘మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన‘ ను ఆమోదించడం ఈ సంస్థ గొప్ప విజయంగా చెప్పవచ్చు. అదేవిధంగా, ‘ప్యారిస్ ఒప్పందం’, ‘క్యోటో ఒప్పందం’ వంటి వాతావరణ మార్పుల నియంత్రణ కోసం చేపట్టిన కార్యక్రమాలు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో విజయవంతమయ్యాయి. కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్, జీవవైవిధ్యం పరిరక్షణ వంటి అనేక అంశాల్లో అంతర్జాతీయ చర్చలకు ఐక్యరాజ్యసమితి ఒక వేదికగా మారింది. యూఎన్డీపీ, యునెస్కో, యునిసెఫ్ వంటి ఉపసంస్థల ద్వారా, పేదరిక నిర్మూలన, విద్యా విస్తరణ, ఆరోగ్య సంరక్షణలో అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా పోలియో, మలేరియా, టీబీ వంటి వ్యాధుల నిర్మూలనలో యూఎన్ఓ విజయవంతమైంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక, సాంకేతిక సహాయం అందించడం ద్వారా ప్రపంచంలో సమానాభివృద్ధి, సామాజిక శ్రేయస్సు కోసం యూఎన్ఓ కృషి చేస్తోంది. ‘సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్’ (ఎస్డీజీల) ద్వారా 2030 నాటికి ప్రపంచ అభివృద్ధికి లక్ష్యాలను నిర్ధారించింది. శరణార్థుల సమస్యలపై మరింత దృష్టి పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా మహిళా సాధికారత, సమాన హక్కులు, విద్య, ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడం ప్రత్యేక లక్ష్యంగా గుర్తించి ఆ దిశలో కృషి చేసింది. దేశాల మధ్య అణు ఆయుధాల పరిమితులు, అణుసమర పరికరాల నియంత్రణలో ఐక్యరాజ్యసమితి కీలక పాలకురాలిగా నిలిచింది. ప్రపంచ ఆహార కార్యక్రమం ద్వారా కోట్లాది ప్రజలకు ఆహారం అందిస్తోంది. అనేక విజయాలు సాధించిన మాట నిజమే కానీ ఇప్పుడు ఐరాసను ఎందుకు స్థాపించారో ఆ లక్ష్యాల సాధనలో విఫలమవుతున్నట్లు స్పష్టమవుతోంది. అంతర్జాతీయ రాజకీయాల్లో విభజనల ఫలితంగా ఈ పరిస్థితి చోటుచేసుకుంది. ముఖ్యంగా అమెరికా పెత్తనం ఎక్కువవ్వడం, నిధుల్లో ఆ దేశం కోత విధించడం వంటి కారణాలు ఐరాసను డమ్మీగా మార్చేస్తున్నాయి. ప్రపంచ శాంతిని కాపాడడంలో చిన్న, పెద్ద దేశాలు అనే తేడా లేకుండా వ్యవహరించాలి. లేకపోతే, మనం ఎదుర్కొంటున్న యుద్ధాలు మరింత తీవ్రతరమవుతాయి. ఫలితంగా ప్రపంచం అశాంతిమయం అవుతుంది. VIDEO | Delhi: EAM S. Jaishankar, speaking at an event on the UN’s 80th anniversary at Jawaharlal Nehru Bhawan, says, "Even today, we are regrettably witnessing multiple conflicts. The Global South, in particular, has felt this pain. The 80th anniversary is a significant… pic.twitter.com/qWuexBYrL4— Press Trust of India (@PTI_News) October 24, 2025– డా. బి. లావణ్య, రాజనీతిశాస్త్ర విభాగం, కాకతీయ యూనివర్సిటీ -
మళ్ళీ పాతరోజుల్లోకి యువత
కాలం వెనక్కి నడుస్తున్నట్లుంది... డెబ్బై.. ఎనభైల్లో మాదిరి బతకడం ఇప్పుడు ఫ్యాషన్ అయింది.. మట్టి కుండల్లో వంట చేయడం.. చెట్లు చేమల్లో తిరగడం.. వాగుల్లో స్నానం చేయడం.. మజ్జిగన్నం.. ఉల్లిపాయ.. రాగిసంకటి.. నాటు కోడి కూరా.. నాటు పుట్టగొడుగులు.. అమ్మమ్మ ఊళ్లోకి వెళ్లి నాలుగురోజులు ఉండడం.. ఇవన్నీ మళ్ళీ కొత్తగా మొదలయ్యాయి..యువత కూడా వాటిని బాగానే ఆదరిస్తోంది.. చిరంజీవి.. నాగార్జున సినిమాలు రీ రిలీజ్ చేయడం.. అమ్మాయిలు.. పట్టు పరికిణీలు వేసుకోవడం.. వాలు జాడలు.. వెండిపట్టీలు.. ఇవన్నీ మళ్ళీ ట్రేండింగ్ అయ్యాయి.. ఇదేమాదిరి. కుర్రాళ్ళు కూడా పంచె లాల్చీ వేసుకోవడం.. బుర్ర మీసాలు పెంచడం.. కిర్రు చెప్పులు వేయడం.. ఊళ్ళో పందిరి కింద వెన్నెల్లో మంచం వేసి అమ్మమ్మ..తాతయ్యతో కబుర్లు చెప్పుకోవడం..కోడి పందాలు..ఊళ్ళోని పిల్లలతో గోళీలాట.. ఇవన్నీ మళ్ళీ ట్రెండింగ్ అయ్యాయి.దీంతోబాటు కొంతమంది ఓల్డ్ ఫ్యాషన్ ను అవలంబిస్తూ ఎన్టీఆర్ ఏఎన్నార్ మాదిరి బెల్ బాటమ్ ఫ్యాంట్లు వేయడం.. వాణిశ్రీ లెక్క సిగ ముడి వేయడం..ఇవి కూడా ట్రెండింగ్ ఉండేది కొన్నాళ్ళు. The striped underwear that our grandfather and great-grandfather wore is now internationally branded and priced between 2,500 and 11,000 rupees.🤔🤔🤨🤨 pic.twitter.com/V2Cs1DYEd9— Aviator Anil Chopra (@Chopsyturvey) October 23, 2025 అయితే ఇప్పుడు ఏకంగా మన తాతలు కాలంలో వేసుకునే గళ్ళ నిక్కర్ ఇప్పుడు అతి పెద్ద ట్రెండ్ అయి కూర్చుంది. పాతిక ముప్పై ఏళ్ల క్రితం ప్యాంట్లు.. పంచెకట్టు లోపల గళ్ళ నిక్కర్లు వేసుకునేవాళ్ళు..దానికి ఒక లాడా కూడా ఉండేది..దాన్ని లాగితే సులువుగా నిక్కర్ విప్పేసుకోవచ్చు..పైగా ఖద్దరు వస్త్రం కాబట్టి శరీరానికి సౌకర్యంగా ఉంటుంది.. చెమట పీల్చుతుంది.. వ్యవసాయ పనుల్లోనూ..నిద్ర పోయేటపుడు కూడా హాయిగా ఉండేది. ఇప్పుడు మళ్లీ ఆ నిక్కర్లు ఆన్లైన్ లో అమ్మకానికి పెట్టారు. హెచ్ అండ్ ఎం అనే కార్పొరేట్ బ్రాండింగ్ స్టోర్లో ఈ చెడ్డీలు అమ్మకానికి ఉంచారని వాటి ధర మాత్రం రూ.2500 నుంచి రూ.11,000 వరకు ఉందంటూ ఏవియేటర్ అనిల్ చోప్రా అనే ఆయన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో పోటోలు వీడియోలు పోస్ట్ చేశారు. మా తాతయ్య కాలంలో వేసుకునే గళ్ళ చెడ్డీలు మళ్ళీ వచ్చాయి కానీ ధర బాగా ఎక్కువే ఉంది అంటూ ఆయన చేసిన పోస్ట్ విపరీతంగా వైరల్ అయింది.వాస్తవానికి ఆ చెడ్డి మహా అయితే ఓ రెండు వందలు ఉండచ్చు కానీ దాన్ని ఈ కార్పొరేట్ సంస్థలు బ్రాండింగ్ చేసి ఏకంగా రూ.11,000 వరకు పెట్టి విక్రయిస్తుండగా యూత్ కూడా అంతే క్రేజీతో కొంటున్నారు. కొత్త ఒక వింత..పాత ఒక రోత అని అనుకుంటాం కానీ ఇప్పుడు పాత బంగారానికే డిమాండ్ ఎక్కువ..దానిపైనే మోజు పెరుగుతోందని అర్థం అవుతోంది.సిమ్మాదిరప్పన్న -
పాకిస్తాన్కు మరో షాక్.. ఆప్ఘన్ ఎఫెక్ట్తో కిలో టమాటా ఎంతంటే?
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా పాక్కు ఊహించని షాక్లు తగులుతున్నాయ్. ఇరు దేశాల మధ్య దాడుల కారణంగా అక్టోబర్ 11 నుంచి సరిహద్దులను మూసివేశారు. దీంతో పాకిస్తాన్ ప్రజలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఘర్షణల కారణంగా నిత్యవసరాలపై దీని ప్రభావం పడింది. పాక్లో టమాటా ధరలు ఐదు రెట్లు పెరిగి ఏకంగా కిలో టమాటాల ధర (Tomato Prices) 600లకు చేరింది.పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్ బోర్డర్ మూసివేత వల్ల ఇరుదేశాల్లో పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, ఔషధాలు, గోధుమలు, బియ్యం, చక్కెర, మాంసం, పాల ఉత్పత్తులు వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఘర్షణలకు ముందుతో పోలిస్తే పాక్లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పాక్లో ప్రస్తుతం కిలో టమాటాల ధర (Tomato Prices) 600 పాకిస్థానీ రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. అఫ్గాన్ నుంచి అధికంగా దిగుమతి చేసుకునే ఆపిల్ ధరలు కూడా భారీగా పెరిగినట్లు సమాచారం. ఇక, గురువారం టమాట ధర ఎనిమిది వందలకు సైతం చేరినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. breaking news 1KG tomato price 800 RS in Pakistan pic.twitter.com/ZQfgKSNdwl— M.Shaheedyar (rh) ⏺ (@Shaheedyar0313) October 22, 2025ఇదిలా ఉండగా.. సాధారణంగా పాక్-ఆప్ఘన్ సరిహద్దు నుంచి ఏటా ఇరుదేశాల మధ్య 2.3 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. ఇరుదేశాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో బోర్డర్లలో వాణిజ్య, రవాణా సదుపాయాలు పూర్తిగా నిలిపివేశామని కాబుల్లోని పాక్-అఫ్గాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధిపతి ఖాన్ జాన్ అలోకోజాయ్ వెల్లడించారు. దీనివల్ల రోజుకు ఇరువైపులా దాదాపు 1 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.8 కోట్లు) నష్టం వాటిల్లుతుందన్నారు. ఆప్ఘన్ నుంచి పాక్కు సరఫరా చేసే దాదాపు 5 కంటైనర్ల కురగాయలు పాడైనట్లు తెలిపారు. సరిహద్దుకు ఇరువైపులా దాదాపు 5వేల కంటైనర్లు నిలిచిపోయాయని పాకిస్థాన్లోని ప్రధాన టోర్ఖామ్ సరిహద్దు క్రాసింగ్ వద్ద ఉన్న ఓ అధికారి పేర్కొన్నట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఒక్కసారిగా నిత్యవసర వస్తువుల ధరలు పెరగడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. -
గోల్డెన్ వీసా యువకుడి హఠాన్మరణం
చిన్న వయసులో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా దుబాయ్లో భారతీయ విద్యార్థి (Indian Student) ఒకరు గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యాడు. దీపావళి వేడుకల్లో ఉండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో అతడు మరణించినట్టు స్థానిక మీడియా 'గల్ఫ్ న్యూస్' వెల్లడించింది. మృతుడు కేరళకు చెందిన వైష్ణవ్ కృష్ణకుమార్ (18)గా గుర్తించారు. దుబాయ్లోని మిడిల్సెక్స్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం బీబీఏ మార్కెటింగ్ చదువుతున్నాడు. అతడికి యూఏఈ గోల్డెన్ వీసా (Golden Visa) ఉందని సమాచారం.దుబాయ్ ఇంటర్నేషనల్ అకడమిక్ సిటీలో మంగళవారం జరిగిన దీపావళి వేడుకల్లో వైష్ణవ్ పాల్గొన్నాడు. సంబరాల్లో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు గుండెపోటు కారణంగా మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. అయితే వైష్ణవ్కు ఎటువంటి గుండె సమస్యలు లేవని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. దుబాయ్ పోలీస్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ తదుపరి దర్యాప్తు జరుపుతోందని చెప్పారు.వైష్ణవ్ మృతదేహాన్ని కేరళకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని అతడి తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు తాను చూసుకుంటున్నట్టు దుబాయ్లోని వైష్ణవ్ బంధువు నితీశ్ 'ఖలీజ్ టైమ్స్'తో చెప్పారు. శుక్రవారం నాటికి వైష్ణవ్ మృతదేహం కేరళకు చేరుకుంటుందని భావిస్తున్నారు.రెండేళ్ల క్రితం స్వస్థలానికి..అలప్పుజ జిల్లా చెన్నితల పంచాయతిలోని కరాజ్మా ప్రాంతానికి చెందిన వైష్ణవ్ కుటుంబంలో దుబాయ్లో సెటిలయింది. వైష్ణవ్ తండ్రి కృష్ణకుమార్ 20 ఏళ్లుపైగా దుబాయ్లోని ఉద్యోగం చేస్తున్నారు. వైష్ణవ్, అతడి చెల్లెలు దుబాయ్లోనే పుట్టిపెరిగారని వారి బంధువు గోపి కర్ణవర్ తెలిపారు. అలప్పుజలో ఆయన పీటీఐతో మాట్లాడుతూ.. వైష్ణవ్ చాలా తెలివైన కుర్రాడని చెప్పారు. వైష్ణవ్ కుటుంబం చాలా అరుదుగా స్వస్థలానికి వస్తుందని, రెండేళ్ల క్రితం వారు కొత్తగా నిర్మించిన ఇంటి గృహప్రవేశ వేడుక కోసం చివరిసారిగా ఇక్కడికి వచ్చారని వెల్లడించారు. చదవండి: ఇంటికో బెంజ్, బీఎండబ్ల్యూ.. కానీ పక్కా పల్లెటూరు!సంతాప ప్రకటనవైష్ణవ్ కృష్ణకుమార్ మరణం పట్ల మిడిల్సెక్స్ యూనివర్సిటీ సంతాపం తెలిపింది. చిన్న వయసులోనే అతడు చనిపోవడం ఎంతో కలచివేసిందని సంతాప ప్రకటనలో పేర్కొంది. వైష్ణవ్ చదువుకున్న జెమ్స్ అవర్ ఓన్ ఇండియన్ స్కూల్ కూడా సంతాపం ప్రకటించింది. వైష్ణవ్ ప్రతిభావంతుడైన విద్యార్థి అని కొనియాడింది. వైష్ణవ్ మరణంతో అతడి తండ్రి కృష్ణకుమార్, తల్లి విధు, చెల్లెలు వృష్టి విషాదంలో మునిగిపోయారు. -
పాకిస్తాన్లో ఎస్పీ ఆత్మహత్య.. భారత్ ఏజెంట్? ఆపరేషన్ సిందూర్లో సాయం?
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. సీనియర్ పోలీసు అధికారి గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అయితే, ఒక ఫోన్ కాల్ అందుకున్న కాసేపటికే ఆయన ఆత్మహత్య చేసుకోవడం మిస్టరీగా మారింది. మరోవైపు.. సదరు అధికారి భారత్ ఏజెంట్ అని.. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆయనే భారత్కు సాయం చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.వివరాల ప్రకారం.. ఇస్లామాబాద్లోని ఐ-9 ప్రాంతంలో ఉన్న ఎస్పీ కార్యాలయంలో అదీల్ అక్బర్ ఎస్పీగా పని చేస్తున్నారు. ఇండస్ట్రియల్ ఏరియా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రతీరోజులాగే విధులకు వెళ్లిన అక్బర్.. గురువారం కూడా స్టేషన్కు వెళ్లారు. ఇంతలో ఆయనకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అది మాట్లాడిన కాసేపటికే.. ఆయన ఆవేశంతో ఊగిపోతూ తన గన్మెన్ వద్ద నుంచి తుపాకీని లాక్కుని ఛాతీలోకి కాల్చుకున్నారు. దీంతో, షాకైన గన్మెన్ వెంటనే తేరుకుని.. అదీల్ను స్థానిక ఆస్పత్రికి తరలించాడు. అయితే చికిత్స పొందుతూ ఎస్పీ ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆయనకు చివరగా ఫోన్ చేసింది ఎవరు, ఆయనతో ఏం మాట్లాడారు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాల్ రికార్డింగ్లు, మొబైల్ డేటాను విశ్లేషిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.SP City of Islamabad Police Adeel Akbar was an agent of IndiaHe shot himself today .His inputs were very helpful during Op Sindoor.Thank you Adeel bhai , you have been a great help. pic.twitter.com/XZhcZTKZmn— Akshit Singh 🇮🇳 (@IndianSinghh) October 23, 2025ఇక, అదీల్ అక్బర్ సియాల్కోట్ జిల్లాలోని కమోంకి ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈయన గతంలో బలూచిస్థాన్లో కూడా సేవలు అందించారు. అయితే, ఎస్పీ అదీల్ అక్బర్ ఆత్మహత్య తర్వాత సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇస్లామాబాద్ ఎస్పీ అదీల్ అక్బర్ భారతదేశ ఏజెంట్ అని వార్తలు బయటకు వచ్చాయి. అంతేకాకుండా.. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో అదీల్ అక్బర్.. మన సైన్యానికి ఇన్పుట్స్ ఇచ్చారని.. అవి మనకు సాయం చేశాయనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా, ఈ విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. -
హెచ్-1బీ వీసాలు.. వైట్హౌస్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: అమెరికాలో హెచ్-1బీ వీసాల(H-1B Visa) అంశంలో వైట్హౌస్ సంచలన ప్రకటన చేసింది. హెచ్-1బీ వీసా వ్యవస్థల్లో మోసాలు జరుగుతున్నాయని వైట్హౌస్(White House) ప్రెస్ సెక్రటరీ కరోలీనా లివిట్(Karoline Leavitt) తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో కోర్టులో పోరాడేందుకు తాము సిద్దంగా ఉన్నట్టు స్పష్టం చేశారు.హెచ్-1బీ వీసాల(H-1B Visa) ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా.. కోర్టుల్లో పలు పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో పిటిషన్ల వ్యవహారమై తాజాగా వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలీనా లివిట్ స్పందించారు. ఈ సందర్భంగా లివిట్ మాట్లాడుతూ..‘అమెరికాలో చాలాకాలంగా హెచ్-1బీ వీసా వ్యవస్థలో మోసాలు జరుగుతున్నాయి. అమెరికన్ల వేతనాలను హెచ్-1బీ వీసాలు తగ్గించేస్తున్నాయి. కాబట్టి ట్రంప్ ఈ వ్యవస్థను మెరుగుపరచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యలు చట్టబద్ధమైనవి. అయితే, ట్రంప్ నిర్ణయంపై కొందరు కోర్టులను ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై కోర్టులో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం. అమెరికన్ కార్మికులకు అవకాశాలు అందడంతో పాటు వీసా వ్యవస్థను బలోపేతం చేయడమే అధ్యక్షుడు ట్రంప్ తొలి ప్రాధాన్యం. దీనిపై కోర్టులో పోరాడేందుకు సిద్ధం. వీసా ఫీజుపెంపుపై కోర్టుల్లో వచ్చిన పిటిషన్లను ఎదుర్కొంటాం’ అని కామెంట్స్ చేశారు.#WATCH | Washington, DC | On H-1B visas, White House Press Secretary Karoline Leavitt says, "The administration will fight these lawsuits in court. The president's main priority has always been to put American workers first and to strengthen our visa system. For far too long, the… pic.twitter.com/9WLktOOaqd— ANI (@ANI) October 23, 2025హెచ్-1బీపై ట్రంప్ నిర్ణయాన్ని అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. పలు ఉద్యోగ సంఘాలు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఈ క్రమంలో ట్రంప్ నిర్ణయం కాంగ్రెస్ తీసుకొచ్చిన సంక్లిష్టమైన వీసా వ్యవస్థను ఇది దెబ్బతీస్తోందని ఆ గ్రూప్ ఆందోళన వ్యక్తంచేసింది. హెచ్-1బీపై ఆధారపడిన వ్యాపారులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోందని తన వ్యాజ్యంలో వాదించింది. ఫీజు రాయితీలు..ఇదిలా ఉండగా.. హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లకు(దాదాపు రూ. 88 లక్షలు) పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నెలరోజుల తర్వాత ఫీజును ఎలా చెల్లించాలో, ఈ ఫీజు నుంచి ఎవరికి మినహాయింపు లభిస్తుందో వివరాలు వెల్లడించింది. అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) ఫీజు పేమెంట్ పోర్టల్ను ప్రవేశపెడుతూ ఫీజు చెల్లించినట్లు రసీదు సమర్పించిన దరఖాస్తుదారులు మాత్రమే తదుపరి అడుగులు వేయాలని, అయితే కొందరు స్టూడెంట్ వీసాదారులకు మాత్రం ఫీజు రాయితీ ఉంటుందని తెలిపింది.ఎఫ్-1 వీసాలపై ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు, ఎల్-1 వీసాలపై ఉన్న ప్రొఫెషనల్స్తో సహా ప్రస్తుత వీసాదారులు హెచ్-1బీ హోదా కోసం దరఖాస్తు చేసినపుడు లక్ష డాలర్లను చెల్లించవలసిన అవసరం లేదని యూఎస్సీఐఎస్ వెల్లడించింది. అమెరికా వెలుపల ఉన్న వ్యక్తులు దాఖలు చేసే దరఖాస్తులకు మాత్రం కొత్త ఫీజు వర్తిస్తుందని గ్రీన్ అండ్ స్పీగెల్కు చెందిన డాన్ బెర్గెర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఫోర్బ్స్ తెలిపింది. అమెరికాను వీడి ఉండి ప్రస్తుత హెచ్-1బీ వీసాపై దేశంలోకి తిరిగి ప్రవేశించడం కోసం మళ్లీ దరఖాస్తు చేసుకునే వారికి కొత్త ఫీజు వర్తిస్తుందని యూఎస్సీఐఎస్ తెలిపింది. హోదా మార్పు లేదా స్టే పొడిగింపునకు దరఖాస్తుదారు అర్హుడు కాదని తాము నిర్ధారిస్తే కంపెనీ యజమాని ఫీజును చెల్లించాల్సిన అవసరం ఉంటుందని యూఎస్సీఐఎస్ పేర్కొంది. -
దోమలు.. ఐస్ల్యాండ్కు అరుదెంచిన వేళ..
న్యూఢిల్లీ: మశకం. దీనికి దోమ అని మరో పేరు కూడా ఉంది. భారత్లో ఏ వీధిలో ఏ మూలన చూసినా వేలాదిగా కనిపించి కసితీరా కాటువేసే ఈ దోమలు ఇప్పటిదాకా ఐస్ల్యాండ్లో లేవు. ఐస్ల్యాండ్ దేశ చరిత్రలో తొలిసారిగా దోమలను చూశామని గతవారం ఓ వ్యక్తి వెల్లడించడంతో దేశంలో ఒక్కసారిగా కలకలం రేగింది. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు ఇప్పటిదాకా ఐస్లాండ్ వాసుల దరిచేరలేదు. ఇకపై తమ దేశంలోనూ దోమలు తిష్టవేస్తే వాటి ద్వారా సంక్రమించే వ్యాధులు ఉరవడి తప్పదని స్థానికులు భయపడిపోతున్నారు. సాధారణంగా యూరప్ ఉత్తర ప్రాంతాల దాకా ఈ దోమలు ఉంటాయిగానీ ఐస్ల్యాండ్లో లేవు. దోమలను తమ ఇంట్లో గుర్తించామని గత వారం ఒక వ్యక్తి ప్రకటించారు. సంబంధిత దోమల ఫొటో లను తీసి స్థానిక పారిశుద్ధ్య విభాగ అధి కారులకు పంపించారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వాటిని క్యూలిసెటా యాన్వలాలా జాతి దోమలుగా గుర్తించారు. ఎక్కడి నుంచి వచ్చాయి?ఈ అంశంపై నేషనల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐస్ల్యాండ్లో కీటక విభాగ నిపుణుడు డాక్టర్ మ్యాథియస్ ఆల్ఫ్రెడ్సన్ మాట్లాడారు. ‘‘ విదేశాల నుంచి వచ్చిన సరకు రవాణా లేదా వాణిజ్య నౌకలు లేదా షిప్పింగ్ కంటైనర్ల కారణంగా ఈ దోమలు ఐస్ల్యాండ్లోకి వచ్చి ఉంటాయి. క్యూలిసెటా దోమలు కాస్తంత చల్లని ప్రాంతాల్లోనూ మనగలవు. వాతావరణ మార్పులు, భూతాపోన్నతి వంటి దారుణ పరిస్థితులు కారణంగా ఐస్ల్యాండ్ సైతం వేడెక్కుతుంది. దీంతో ఇక్కడ తిష్టవేసిన వేడి వాతావరణమే, వాతావరణంలో అధిక తేమ, ఆర్థ్రత, వర్షభావ పరిస్థితులు సైతం కొత్తగా దోమ ఈ దేశంలో మనుగడ సాగించడానికి కారణం అయి ఉండొచ్చు’’ అని ఆయన విశ్లేషించారు.ఎవరు కనిపెట్టారు?ఐస్ల్యాండ్లోని కిడాఫెల్ అనే గ్రామంలో ద్రాక్షతోట పండించే బిజోర్న్ హజాల్ట్సన్కు కొత్తతరహా కీటకాలను పరిశీలించడమంటే ఎంతో ఇష్టం. గత ఆరేళ్లుగా తన తోటలో అధికమైన చిమ్మట పురుగులను త్వరగా పట్టుకునేందుకు ఒక వస్త్రానికి తీపి, రెడ్వైన్ల మిశ్రమాన్ని పూసి ఆ వస్త్రంలో చిక్కుకుపోయే పురుగులను గమనించడం ఓ వ్యాపకంగా పెట్టుకున్నాడు. అక్టోబర్ 16వ తేదీన కొత్త రకం కీటకం కనిపించడంతో అది ఖచ్చితంగా దోమ అని భావించి వాటిని వెంటనే కీటక నిపుణుడు మ్యాథియస్కు పంపించారు. విషయం తెల్సి ఆశ్చర్యానికి గురైన ఆయన వెంటనే బిజోర్న్ ఇంటికి చేరుకుని అక్కడ దోమల జాడను గుర్తించారు. కొన్నింటిని తీసుకెళ్లి అధ్యయనం చేసి వాటిని క్యూలిసెటా యాన్వలాలా రకం దోమలుగా గుర్తించారు. ఆడ, మగ దోమలనూ విస్తరిస్తున్నట్లు నిర్ధారించారు. ఈసారి ఐస్ల్యాండ్లో వసంతకాలంలో విపరీతంగా ఎండ కాయడంతో దోమల సంతతి పెరిగిందని ఆయన విశ్లేషించారు. -
ట్రంప్ నోట మళ్లీ చమురు మాట
వాషింగ్టన్: రష్యా నుంచి భారత్ చౌకగా ముడి చమురు కొనుగోలు చేస్తుండడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్ ఇస్తున్న డబ్బులతోనే ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగిస్తోందని ఆయన మండిపడుతున్నారు. ఈ కొనుగోళ్లను ఆపేయాల్సిందేనని అంటున్నారు. అదే విషయం మరోసారి స్పష్టంచేశారు. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను నిలిపివేయడానికి భారత్ అంగీకరించిందని చెప్పారు. ఈ ఏడాది ఆఖరు నాటికి ఆ దిగుమతులు దాదాపు సున్నాకు పడిపోతాయని పేర్కొన్నారు. అంటే కొనుగోళ్లు పూర్తిగా ఆగిపోతాయని పరోక్షంగా తేల్చిచెప్పారు. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందన్నారు. రష్యా నుంచి ముడి చమురు కొనకుండా చైనాను ఒప్పించడానికి ప్రయతి్నస్తానని ట్రంప్ తెలిపారు. భారత్ బాటలో చైనా కూడా నడిస్తే బాగుంటుందని సూచించారు. ఆయన బుధవారం వైట్హౌస్లో మీడియాతో మాట్లాడారు. ‘‘భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నిన్ననే ఫోన్లో మాట్లాడాను. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేయడానికి భారత్ అంగీకరించింది. అయితే, హఠాత్తుగా ఆపేయలేరు కాబట్టి కొంత సమయం పడుతుంది. ఈ ఏడాది ఆఖరు నాటికి ఈ కొనుగోళ్లు పూర్తిగా ఆగిపోతాయి. భారత్ గొప్ప నిర్ణయాలు తీసుకుంటుంది’’అని ఉద్ఘాటించారు. రష్యా చమురు విషయంలో ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. భారత్, చైనాలు రష్యాకు ఇచ్చే డబ్బులు ఆగిపోతే ఉక్రెయిన్లో యుద్ధం ఆగుతుందని ఆయన తరచుగా చెబుతున్నారు. ఈ యుద్ధానికి ఆ రెండు దేశాలే ఆర్థిక వనరులు సమకూరుస్తున్నాయని మండిపడుతున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు బంద్ చేస్తామని ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ ఇటీవల వెల్లడించారు. అయితే, ఈ విషయాన్ని భారత్ ఖండించింది. మోదీ అలాంటి హామీ ఏదీ ఇవ్వలేదని తేల్చిచెప్పింది. తమ అవసరాల కోసమే రష్యా నుంచి చమురు కొంటున్నామని, ఇందులో మరో ఉద్దేశం లేదని వెల్లడించింది. తన మాట లెక్కచేయనందుకు భారతదేశ ఉత్పత్తులపై డొనాల్డ్ ట్రంప్ ఏకంగా 50 శాతం టారిఫ్లు విధించిన సంగతి తెలిసిందే. త్వరలో చైనా అధినేత షీ జిన్పింగ్తో సమావేశం కాబోతున్నానని, ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ముగించడానికి చేపట్టాల్సిన చర్యలపై ఆయనతో చర్చిస్తానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అది చమురు గానీ, ఇంధనం గానీ, ఇంకేదైనా గానీ రకరకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయన్నారు. తన ప్రతిపాదనల పట్ల జిన్పింగ్ సానుకూలంగా స్పందిస్తారన్న నమ్మకం ఉందని వివరించారు. -
అమెరికాలో ట్రక్కు బీభత్సం.. భారతీయుడి అరెస్ట్
కాలిఫోర్నియా: అమెరికాలో ఓ భారతీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ముగ్గురు మృతికి కారణమయ్యాడంటూ జశన్ప్రీత్ సింగ్ (21) అనే యవకుడిని అదుపులోకి తీసుకున్నారు. అమెరికా వార్తా కథనాల ప్రకారం.. అతడు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాడని.. డ్రగ్స్ మత్తులో ఉన్నట్లు వెల్లడైంది.2022 మార్చిలో సింగ్.. అమెరికా దక్షిణ సరిహద్దును అక్రమంగా దాటినట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని బోర్డర్ పెట్రోల్(Border Patrol) ఏజెంట్లు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద చట్టబద్ధమైన ప్రతాలు లేవని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది. అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఆల్టర్నేటివ్ టు డిటెన్షన్’ విధానం కారణంగా కొన్ని రోజుల్లోనే అతడు జైలు నుంచి విడుదలయ్యాడు.కాలిఫోర్నియాలో జరిగిన ట్రక్కు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో జశన్ప్రీత్ సింగ్ కూడా గాయపడ్డాడు. ట్రక్ నడుపుతోన్న సమయంలో డ్రగ్స్ మత్తులో ఉన్న అతడు.. ట్రాఫిక్లో కూడా బ్రేక్స్ వేయలేదని పోలీసు అధికారులు తెలిపారు. అక్రమ వలసదారులైన ట్రక్ డ్రైవర్లు అమెరికాలో ప్రమాదాలకు కారణమవుతున్న ఘటనల్లో ఇది తాజాది. గత ఆగస్టులోనూ ఇదే తరహా ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 2018లో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన హర్జిందర్ సింగ్ ఆ ఘటనకు కారకుడు. 🚨 SHOCKING: ICE sources confirm Jashanpreet Singh, the semi-truck driver behind the deadly DUI crash on CA’s I-10 freeway, is an Indian illegal alien caught & released by the Biden admin at the border in March 2022. Police say Singh was speeding, under the influence, and never… pic.twitter.com/bc1n5vEC9p— Svilen Georgiev (@siscostwo) October 23, 2025 -
‘మేమేం చేయాలో..నువ్వు చెప్పడం ఏంటి?’
ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ ఏం చేయాలో ట్రంప్ చెప్పడం ఏంటని ఆయన ప్రశ్నించారు.ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. ‘భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపుతోంది’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను శశి థరూర్ ఖండించారు. ట్రంప్ అసత్యమైన, ఆధారాలు లేని వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. భారత్ ఇప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని, అది అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా జరుగుతోందని స్పష్టం చేశారు.భారత్ తన జాతీయ ప్రయోజనాల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటుందని, అమెరికా అధ్యక్షుడు భారత్ తరఫున నిర్ణయాలు ప్రకటించడం అనవసరమని థరూర్ అన్నారు. ఇది భారత స్వతంత్రతను, విదేశాంగ విధానాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన విమర్శించారు.విదేశాంగ వ్యవహారాల్లో అనుభవం కలిగిన నేతగా, శశి థరూర్ మాట్లాడుతూ ..భారత్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే దేశం. ఇతర దేశాల నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. కానీ భారత్ తరఫున నిర్ణయాలు ప్రకటించడం అనైతికం’అని అన్నారు. -
టేకాఫ్ అవుతూ కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్
కారాకస్: వెనెజులాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ విమానం టేకాఫ్(Venezuela plane crash) అవుతూ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి.వివరాల ప్రకారం.. వెనెజులాలోని టాచిరాలోని పరమిల్లో ఎయిర్పోర్ట్లో విమానం టేకాఫ్ అయ్యింది. విమానం రన్వే నుంచి ఎగరగానే ఒక్కసారిగా గింగిరాలు తిరుగుతూ కిందపడిపోయింది. అనంతరం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి సంబంధించిన షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.Ongoing: a PA-31 crashed in San Cristóbal (Venezuela), all 2 aboard died. Aircraft registration was YV1443 (Via pro_plane_pilot) pic.twitter.com/7Vjul7DDgw— Air Safety #OTD by Francisco Cunha (@OnDisasters) October 22, 2025 -
Russia: హైదరాబాదీని రక్షించే ప్రయత్నాల్లో కేంద్రం
ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం రష్యా వెళ్లిన భారతీయులు.. బలవంతంగా సైన్యంలో చేరి ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అలా హైదరాబాద్(తెలంగాణ)కు చెందిన ఓ వ్యక్తి చిక్కుకుపోగా.. అతన్ని రక్షించాలంటూ భాదిత కుటుంబం కేంద్రాన్ని ఆశ్రయించింది. దీంతో కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.హైదరాబాద్కు చెందిన మహమ్మద్ అహ్మద్(37) ఈ ఏడాది ఏప్రిల్లో రష్యాకు వెళ్లాడు. ఓ నిర్మాణ సంస్థలో భాగంగా పని ఉందంటూ ఏజెంట్ నమ్మబలికి అతన్ని అక్కడికి పంపించాడు. అయితే నెలపాటు అహ్మద్ ఏపని లేకుండా ఖాళీగా ఉన్నాడు. అడిగితే.. రేపో మాపో పని చెబుతామంటూ నిర్వాహకులు చెప్పసాగారు. ఈలోపు.. అహ్మద్లా ఇతర దేశాల నుంచి వచ్చిన మొత్తం 30 మందిని జమ చేసి ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతానికి తరలించారు. అక్కడ బలవంతంగా వాళ్లకు ఆయుధ శిక్షణ ఇప్పించి.. యుద్ధంలోకి దింపారు. వాహనంలో తరలిస్తున్న క్రమంలో ఇదే అదనుగా అహ్మద్ దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో అతని కాలికి గాయం కావడంతో రష్యా సైన్యానికి చిక్కాడు. యుద్ధం చేయాల్సిందేనని, లేకుంటే తామే చంపేసి డ్రోన్ దాడుల్లో చనిపోయినట్లు చిత్రీకరిస్తామని బెదిరించారు. దీంతో గత్యంతరం లేక రష్యా తరఫున ఉక్రెయిన్ యుద్ధంలో అహ్మద్ పాల్గొంటున్నాడు. అయితే తన దగ్గర ఉన్న ఫోన్తో జరిగిందంతా ఓ సెల్ఫీ వీడియోగా తీసి భార్య అఫ్షా బేగంకు పంపాడు. అందులో.. తాను ఎదుర్కొన్న పరిస్థితులన్నీ వివరించాడు. Russia mein phanse Hyderabad ke Mohammad Ahmad aur Haryana wa Rajasthan ke Anoop Kumar, Manoj Kumar aur Sumit Kumar ko jald se jald Bharat wapas laane ke liye AIMIM Party ki musalsal koshish. pic.twitter.com/U2dg1OJuez— Asaduddin Owaisi (@asadowaisi) October 22, 2025నాతో పాటు ఉన్న 26 మంది మేం యుద్ధంలో పాల్గొనమని చెప్పాం. అందులో నలుగురు భారతీయులు ఉన్నారు. వాళ్లు నా మెడపై తుపాకీ పెట్టి.. యుద్ధం చేస్తావా? చస్తావా? అని బెదిరించారు. నా కాలికి గాయమైనా కనికరించకుండా హింసించారు. ఇప్పటికే 17 మంది మరణించారు. అందులో ఓ భారతీయుడు కూడా ఉన్నాడు. ఉద్యోగాల పేరిట బలవంతంగా ఈ నరకంలోకి మమ్మల్ని లాగారు. ఎట్టిపరిస్థితుల్లో మమ్మల్ని ఇక్కడకు పంపిన ఏజెంట్ను(ముంబైకి చెందిన కన్సల్టెన్సీ) వదలొద్దు అని అహ్మద్ ఆ వీడియోలో చెప్పాడు.ఈ వీడియో ఆధారంగా అహ్మద్ భార్య అఫ్షా బేగం కేంద్ర విదేశాంగ శాఖకు ఓ లేఖ రాసింది. తన భర్త తమ కుటుంబానికి ఆధారమని, ఆయన్ని రక్షించాలని విదేశాంగ మంత్రి జై శంకర్ను ఉద్దేశిస్తూ వేడుకుంది. మరోవైపు.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని సైతం కలిసి సాయం చేయాలని కోరింది. దీంతో.. ఆయన అహ్మద్ను వెనక్కి రప్పించాలంటూ కేంద్రానికి, రష్యాలోని భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు. అహ్మద్ భార్య, హైదరాబాద్ ఎంపీ ఒవైసీ విజ్ఞప్తులతో కేంద్రం కదిలింది. అహ్మద్ గురించి వివరాలు సేకరించి విడిపించే ప్రయత్నం చేస్తామని మాస్కోలోని భారత రాయబార సిబ్బంది తడు మాము(Tadu Mamu) హామీ ఇచ్చారు. భారత విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం.. రష్యా ఆర్మీలో 27 మంది భారతీయులు చిక్కుకుపోయారని, వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నామని, వాళ్ల కుటుంబాలతో నిరంతరంగా సంప్రదింపులు జరుపుతున్నామని చెబుతోంది. -
పాక్ ఆర్మీ చీఫ్ మునీర్కు బిగ్ షాక్.. మగాడివైతే యుద్ధం చేయ్ అంటూ తాలిబన్లు..
ఇస్లామాబాద్: దాయాది పాకిస్తాన్కు మరో బిగ్ షాక్ తగిలింది. పాక్కు చెందిన ఉగ్రవాద సంస్థ తెహ్రీకే తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ)కు చెందిన కమాండర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ను టార్గెట్ చేసి చాలెంజ్ విసిరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మునీర్కు నిజంగా దమ్ముంటే.. మగాడైతే తమను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. అలాగే, పాక్ సైన్యంలోని ఉన్నతాధికారులకు సైతం సవాల్ చేశారు. ఈ మేరకు విడుదల చేసిన వరుస వీడియోలు పాకిస్తాన్ సైనిక నాయకత్వాన్ని తీవ్ర ఇరకాటంలోకి నెట్టాయి.తెహ్రీకే తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) సంస్థ కమాండర్ కాజిమ్ వీడియోలో మాట్లాడుతూ నేరుగా ఆర్మీ చీఫ్ను ఉద్దేశించి సవాలు విసిరాడు. ఇందులో..‘మాతో పోరాటం చేయడానికి పాకిస్తాన్ సైన్యం ఎందుకు?. వారికి బదులుగా పాక్ సైన్యంలోని ఉన్నతాధికారులు యుద్ధభూమికి రావాలి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్కు నిజంగా దమ్ముంటే.. మాగాడే అయితే మమ్మల్ని ఎదుర్కోవాలి. అతను నిజంగా తల్లి పాలే తాగి ఉంటే మాతో యుద్ధం చేయ్ అని సవాల్ విసిరారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో అతడి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇదే సమయంలో అక్టోబర్ 8న కేపీ ప్రావిన్స్లో టీటీపీ జరిపిన దాడి దృశ్యాలు విడుదల చేసింది. TTP has released exclusive footage from its assault on Jogi military fort in Dogar, Kurram, showcasing seized Pak Army vehicles, weapons & ammunition.Among those leading the attack was top commander Kazim.Pak Army's monsters turn their guns on them. #FailedStatePakistan@kscs58 pic.twitter.com/9UW17xWQvJ— Rashtriya Rifles (@DeltaRR2000) October 23, 2025ఇక, ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పాకిస్తాన్ ప్రభుత్వం, ఈ నెల 21న కమాండర్ కాజిమ్ ఆచూకీ తెలిపిన వారికి 10 కోట్ల పాకిస్తానీ రూపాయల (పీకేఆర్) రివార్డును ప్రకటించింది. అయితే, అక్టోబర్ 8న ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కుర్రంలో టీటీపీ.. పాకిస్తాన్ ఆర్మీపై దాడులు చేసింది. ఈ దాడిలో 22 మంది పాక్ సైనికులు చనిపోయారని టీటీపీ పేర్కొంది. ఈ దాడిలో భాగంగా తాము స్వాధీనం చేసుకున్న మందుగుండు సామగ్రి, వాహనాలను చూపించింది. మరోవైపు, టీటీపీ దాడిలో 11 మంది సైనికులు మరణించారని పాక్ సైన్యం అంగీకరించింది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంతో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్ ప్రభుత్వాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆఫ్ఘన్ భూభాగం నుంచి పనిచేస్తున్న టీటీపీ వంటి సాయుధ గ్రూపులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఈ ఒప్పందం నిలుస్తుందని పాకిస్తాన్ స్పష్టం చేసింది. అయినప్పటికీ, టీటీపీ దాడులు ఏమాత్రం తగ్గలేదు. 🚨 Alert:The #KPK government has placed a ₹10 crore Bounty on banned TTP commander Kazim from Kurram.He is wanted for attacks on Lt. Col. Junaid Arif, Major Tayyab Rahat, a military convoy to Parachinar, Shia passengers, and an assassination attempt on DC Kurram Javedullah pic.twitter.com/gSBuUzt7nj— Eye (@Eye59763563) October 21, 2025పాక్లో టీటీపీ దడ..తెహ్రీక్ ఏ తాలిబాన్ (TTP) ఉగ్రవాద సంస్థ అనేది పాకిస్తాన్ పెంచిన పెరటి మొక్క. ఇది అనేక తాలిబాన్ వర్గాల కలయికతో ఏర్పడిన ఉగ్రవాద సంస్థ. 2007లో బజావుర్, స్వాట్, ఖైబర్ ప్రాంతాల నుంచి పుట్టుకొచ్చిన ఈ వర్గాలు ఒక్కటై పాకిస్తాన్లోని మిలిటరీ, రాజకీయ వ్యవస్థలపై దాడులు ప్రారంభించాయి. దీని వెనుక అల్ఖైదా ప్రత్యక్ష మద్దతు ఉండటమే కాకుండా, ఒసామా బిన్ లాడెన్ చుట్టూ ఉన్న నెట్వర్క్ ఆరంభంలో దీనిని ప్రభావితం చేసింది. ఆఫ్గాన్ తాలిబాన్, తెహ్రీకే తాలిబాన్ పాక్ మధ్య భావజాల సమానత ఉన్నా, లక్ష్యాలు వేరు. ఆఫ్గాన్ తాలిబాన్ ప్రధానంగా తమ దేశంతోపాటు పాకిస్తాన్లో ఇస్లామిక్ పాలనను స్థాపించడమే లక్ష్యంగా పెట్టుకుంది. టీటీపీ పాకిస్తాన్లో సైనిక వ్యవస్థను కూల్చి దాని స్థానంలో ఇస్లామిక్ శరియా పాలనను తీసుకురావాలని భావిస్తోంది. ఇద్దరి మధ్య మతాధార సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, పాకిస్తాన్–ఆఫ్గాన్ సంబంధాలు దిగజారడంతో సంబంధాలు తాజాగా మరింత క్లిష్టంగా మారాయి.టీటీపీ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో పెద్దఎత్తున ఉగ్రదాడులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో టీటీపీ ఉగ్రవాద స్థావరాలన్నీ ఆప్ఘనిస్థాన్లోనే ఉన్నాయని పాక్ ఆరోపించింది. ఇటీవలే కాబూల్ నగరంపై పాక్ సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ ఘటన తర్వాత అక్టోబరు 11న పాక్, ఆఫ్గన్ బార్డర్లో సైనిక ఘర్షణ పెరిగింది. తాలిబన్ల దాడుల్లో పెద్దసంఖ్యలో పాక్ సైనికులు చనిపోయారు. సరిగ్గా ఇదే సమయంలో ఆప్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీ భారత్లో పర్యటించడం గమనార్హం. -
ఇజ్రాయెల్ను మేమే రక్షించుకుంటాం.. అమెరికాపై ఆధారపడం: నెతన్యాహు
జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశం(ఇజ్రాయెల్) అమెరికా రక్షిత ప్రాంతం కాదని, ఎలాంటి ముప్పు ఎదురైనా ఇజ్రాయెల్ స్వయంగా ఎదుర్కుంటుందని ఆయన స్పష్టంగా తెలిపారు. ఇజ్రాయెల్ భద్రతను కాపాడేది ఇజ్రాయెల్ మాత్రమే. మేము ఇతర దేశాలపై ఆధారపడలేం అంటూ వ్యాఖ్యలు చేశారు.గాజా కాల్పుల విరమణ ఒప్పందం పురోగతిపై చర్చించేందుకు బుధవారం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో నెతన్యాహు సమావేశమయ్యారు. వాన్స్–నెతన్యాహు సమావేశంలో గాజా పరిస్థితి, హమాస్ కార్యకలాపాలు, యుద్ధానంతర పునరావాసం, అంతర్జాతీయ సాయంపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలో నెతన్యాహు మాట్లాడారు. గాజాలో అంతర్జాతీయ దళాలను మోహరిస్తే భవిష్యత్తులో ఆ ప్రాంతం నుంచి ఉద్భవించే భద్రతా ముప్పులకు ఇజ్రాయెల్ సమాధానం చెప్పే అవకాశాలు తగ్గిపోతాయని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ భద్రతను కాపాడేది ఇజ్రాయెల్ మాత్రమే. మేము ఇతర దేశాలపై ఆధారపడలేం అని స్పష్టం చేశారు. గాజా యుద్ధం తరువాత భవిష్యత్తు పరిపాలనపై అంతర్జాతీయ వర్గాలు వివిధ ప్రతిపాదనలు చేస్తుండగా నెతన్యాహు వ్యాఖ్యలు కీలకంగా మారాయి.అంతకుముందు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, నెతన్యాహు కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేడీ వాన్స్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్, అమెరికా ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. హమాస్ను నిరాయుధీకరణ చేయడం, ఆ సంస్థ ఇకపై ఇజ్రాయెల్కు ముప్పుగా మారకుండా చూసుకోవడం, గాజాను పునర్నిర్మించడం వంటి అంశాలు సులభం కావు. కానీ మేము ఆశావహ దృక్పథంతో ముందుకు వెళ్తున్నాం’ అని చెప్పుకొచ్చారు.సమగ్ర పరిష్కారమే అవసరంగాజా సంక్షోభం తగ్గించాలంటే రాజకీయ స్థాయిలో సమగ్ర పరిష్కారం అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. హమాస్ నిరాయుధీకరణతో పాటు పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వకపోతే మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. నెతన్యాహు, వాన్స్ సమావేశం అనంతరం ఇరుదేశాల ప్రతినిధులు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో..ఇజ్రాయెల్ భద్రతా హక్కును అమెరికా గౌరవిస్తుంది. గాజాలో మానవతా సాయం అందించడంలో ఇరుదేశాలు కలిసి పని చేస్తాయని పేర్కొన్నారు. గాజా యుద్ధం తగ్గుముఖం పట్టినా, రాజకీయ స్థాయిలో ఒప్పందాలు సాఫీగా సాగకపోవడం అంతర్జాతీయ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరిస్థితుల్లో నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు గాజా భవిష్యత్తుపై కొత్త చర్చలకు దారితీశాయి. -
రష్యా అణు విన్యాసాలు
మాస్కో: ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ముగించే విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ మధ్య హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో జరగాల్సిన భేటీ అనూహ్యంగా రద్దయ్యింది. ఈ సమావేశం ఎప్పుడు జరుగుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అసలు జరుగు తుందో లేదో కూడా తెలియడం లేదు. ట్రంప్ను కలుసుకోవడానికి పుతిన్ ఇష్టపడడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో పుతిన్ బుధవారం రష్యా వ్యూహాత్మక అణు దళాల విన్యాసాలను పర్యవేక్షించడం గమనార్హం. ఈ విషయాన్ని పుతిన్ టీవీలో ప్రకటించారు. అలాగే ఆయన రష్యా సైనికాధికారులను ఉద్దేశించి ఆన్లైన్లో మాట్లాడారు. న్యూక్లియర్ డ్రిల్స్లో భూఉపరితలం, సముద్రం, గగనతలానికి సంబంధించిన దళాలు పాల్గొన్నట్లు తెలిపారు. ఈ విన్యాసాల్లో భాగంగా ఖండాంతర బాలిస్టిక్ మిస్సైళ్లు, గగనతల క్రూయిజ్ మిస్సైళ్లను ప్రాక్టికల్గా ప్రయోగించినట్లు రష్యా అధికార వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. పుతిన్ స్వయంగా పర్య వేక్షించారని పేర్కొన్నాయి. వ్యూహాత్మక అణు జలాంతర్గామి బ్రియాన్స్క్, టీయూ 095 ఎంఎస్ వ్యూహాత్మక బాంబర్లు సైతం ఇందులో పాల్గొన్నట్లు తెలిపాయి. పుతిన్, ట్రంప్ భేటీపై ప్రస్తుతానికి తమ కు ఎలాంటి సమాచారం లేదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ స్పష్టంచేశారు. పుతిన్తో సమావేశంపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ప్రకటించారు. మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మధ్య జరగాల్సిన సమావేశం కూడా నిరవధికంగా వాయిదా పడడం గమనార్హం. -
చోరీకి గురైన వజ్రాభరణాల విలువ రూ.900 కోట్లు !
పారిస్: కేవలం 250 సెకన్లలోపే ఫ్రాన్స్ రా జ వజ్రాభరణాలను దొంగలు కాజేసిన ఉదంతంలో ఆయా ఆభరణాల మార్కెట్ విలువను ఫ్రాన్స్ అధికారులు మొదటి సారిగా వెల్లడించారు. అక్టోబర్ 19వ తేదీ న పారిస్లోని ప్రపంచ ప్రఖ్యాత లౌరీ మ్యూజియంలో నెపోలియన్ రాజుల కా లంనాటి అపురూపమైన వజ్రాభరణాలు చోరీకి గురైన విషయం తెల్సిందే. దీనిపై 100 మంది పోలీసు, ఇంటెలిజెన్స్ అధి కారులు సమగ్రస్థాయిలో కేసు దర్యాప్తు మొదలెట్టిన విషయం తెల్సిందే. చోరీ తర్వాత కనిపించకుండా పోయిన వజ్రా భరణాల వివరాలను పారిస్ ప్రాసిక్యూ టర్ లారే బెకావూ వెల్లడించారు. ‘‘పచ్చ లు, వజ్రాలు పొదిగిన హారం, చెవిదిద్దు లు, 1,354 వజ్రాలు, 56 మరకతమణు లు, పుష్యరాగం పొదిగిన రెండు స్వర్ణ కిరీటాలు, కురులను ఒక దగ్గరకు చేర్చే రెండు పెద్ద పిన్నులు, నీలమణులు, ము త్యాలు, 2,000 వజ్రాలు పొదిగిన నెక్లెస్, మరో పెద్ద ఆభరణాన్ని దొంగలు పట్టుకు పోయారు. ఈ ఆభరణాల్లోని నీలమణు లు, వజ్రాలు, బంగారం విడి విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం దాదాపు రూ.900 కోట్లు ఉండొచ్చు. ఫ్రాన్స్ ప్రాచీన ఘన వారసత్వం, రాజరిక హోదా, అరు దైన డిజైన్ వంటివి సైతం లెక్కిస్తే వీటి విలువను ఊహించలేం’’ అని అధికారి బెకావూ వ్యాఖ్యానించారు. చోరీ జరిగిన తర్వాత ఎట్టకేలకు బుధవారం మ్యూజి యంను సందర్శకుల కోసం తెరచారు. అయితే చోరీకి గురైన అపోలో గ్యాలరీలోకి మాత్రం ఎవరినీ అనుమతించట్లేరు. అయి తే చోరీకి గురైన ఆభరణాల ఆచూకీ కను గొనడం అసాధ్యమని నిపుణులు అంచనావేస్తున్నారు. ‘‘ఇలాంటి చోరీలు చేసే చోరశిఖామణులు అత్యంత తెలివిగా వ్యవ హరిస్తారు. చోర తర్వాత నకిలీ పాస్పోర్ట్ తో దేశం దాటేస్తారు. చోరీ చేసిన నగలను ముక్కలు చేసి వాటిలోని బంగారం, వజ్రా లు, విలువైన రత్నాలను విడివిడిగా వేర్వే రు వ్యక్తులకు అమ్మేస్తారు. దీంతో అసలు నగ కోసం వెతికే దర్యాప్తు అధికారులకు అవి ఎప్పటికీ దొరకవు’’ అని చోరీ కేసుల ఇన్వెస్టిగేటర్, లాయర్ అయిన క్రిస్టఫర్ ఏ మ్యారినెల్లో అభిప్రాయపడ్డారు. -
మీకు అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండవు
న్యూఢిల్లీ: భారతీయ న్యాయస్థానాల్లో తన కేసు విచారణ సవ్యంగా సాగదని, జుగుప్సాకర జైలు గదిలో రోగాలబారిన పడతానంటూ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ చేసిన వాదనలను బెల్జియం కోర్టు కొట్టేసింది. భారత్కు అప్పగించాక కేసు విచారణలో ఎలాంటి అన్యాయం జరగదని, ముంబైలో మీ కోసం ప్రత్యేకంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కారాగార సెల్ నిర్మించారని ఆంట్వెర్ప్లోని అప్పీళ్ల కోర్టు వెల్లడించింది. తనను భారత్కు అప్పగించడమనేది పూర్తిగా రాజకీయ ప్రేరేపితం అంటూ ఛోక్సీ చేసిన వాదనలనూ కోర్టు తోసిపుచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.13,000 కోట్ల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన కేసులో నేరస్థుడు ఛోక్సీని భారతీయ, అంతర్జాతీయ చట్టాల ప్రకారం భారత్కు అప్పగించడం సబబేనంటూ గతేడాది ఆంట్వెర్ప్ జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎలాంటి తప్పు కనిపించట్లేదని అప్పీళ్ల కోర్టు వ్యాఖ్యానించింది. ఛోక్సీని తమకు అప్పగించాలంటూ ముంబై ప్రత్యేక కోర్టు 2018 మే, 2021 జూన్లో ఇచ్చిన ఉత్తుర్వులను అమలుచేయొచ్చని కోర్టు అభిప్రాయపడింది. ఈ సందర్భంగా ఛోక్సీని ఉద్దేశిస్తూ కోర్టు పలు వ్యాఖ్యలుచేసింది. ‘‘ మిమ్మల్ని భారతీయ ప్రభుత్వాధికారులకు అప్పగిస్తే ముంబై జైలులో అమానవీయంగా చిత్రహింసకు గురిచేస్తారన్న వాదనల్లో ఆధారాలు లేవు. భారత్లో మీకు న్యాయం లభించదన్న వాదనల్లో పస లేదు. ఆంటిక్వా, బార్బుడా నుంచి భారతీయ దర్యాప్తు సంస్థ అధికారులు కిడ్నాప్ చేశారన్న వాదనలకు ఎలాంటి ఆధారం లేదు. డొమినికా దేశంలో హింసించారన్న వాదన ఉత్తిదే అని మాకు అర్థమైంది. కేసుల విచారణలో భారతీయ న్యాయమూర్తులకు స్వతంత్రత లేదని, అందుకే మీ హక్కులు ఉల్లంఘనకు గురవుతాయన్న వాదనలకు బలం చేకూర్చే డాక్యుమెంట్లు ఏవీ లేవు. అందుకే మిమ్మల్ని తిరిగి భారత్కు అప్పగించడానికి మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.ముంబై జైలులో చక్కటి సౌకర్యాలున్నాయిఈ సందర్భంగా భారతీయ దర్యాప్తు అధికారులు అందించిన వివరాలను కోర్టు గుర్తుచేసింది. ‘‘ముంబైలోని ఆర్థర్ రోడ్ కారాగారంలో మిమ్మల్ని ఉంచుతారు. 12వ నంబర్ బ్యారక్లో మీ కోసం ప్రత్యేకంగా రెండు గదులు నిర్మించారు. బ్యారక్ విస్తీర్ణం ఏకంగా 46 చదరపు మీటర్లు. విడిగా మీ కోసం టాయిలెట్ కట్టారు. ధారాళంగా స్వచ్ఛమైన గాలి, వెలుతురు రావడానికి మూడు పెద్దపెద్ద కిటికీలు పెట్టారు. పైన ఐదు వెంటిలేటర్లు నిర్మించారు. మూడు ఫ్యాన్లు, ఆరు పెద్ద ట్యూబ్లైట్లు బిగించారు. వార్తలు, ఎంటర్టైన్మెంట్ ఛానళ్లు చూసేందుకు ప్రత్యేకంగా కొత్త టీవీ అమర్చారు. ఈ గదుల్లోకి రావడానికి వెడల్పాటి కారిడార్ను కట్టారు. అనారోగ్యం, కేసు విచారణ కాకుండా ఇతర కారణాలతో మిమ్మల్ని బయటకు తీసుకెళ్లబోరు. దర్యాప్తు సంస్థల పరిధిలో కాకుండా మిమ్మల్ని జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంచుతారు’’ అని బెల్జియం కోర్టు వ్యాఖ్యానించింది. రూ.13,000 కోట్ల కుంభకోణంలో చోక్సీ ఒక్కడే రూ.6,400 కోట్లమేర మోసానికి పాల్పడినట్లు సీబీఐ తన ఛార్జ్షీట్లో పేర్కొనడం తెల్సిందే. -
రష్యా ముడి చమురుకు కత్తెర
వాషింగ్టన్: భారతీయులతోపాటు భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. భారత్, అమెరికాల మధ్య చాలా మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం త్వరగా ముగిసిపోవాలని మోదీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని తెలిపారు. వైట్హౌస్ ఓవల్ ఆఫీసులో మంగళవారం రాత్రి జరిగిన దీపావళి వేడుకల్లో ట్రంప్ పాల్గొన్నారు. సంప్రదాయ చమురు దీపాన్ని స్వయంగా వెలిగించారు. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పలువురు భారత్–అమెరికన్ వ్యాపారవేత్తలు, ప్రముఖులు హాజరయ్యారు. రష్యా నుంచి భారత ప్రభుత్వం అధికంగా ముడిచమురు కొనుగోలు చేయబోదని ట్రంప్ స్పష్టం చేశారు. రష్యా చమురు విషయంలో ఆయన తన అభిప్రాయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలును పూర్తిగా ఆపేస్తామంటూ భారత ప్రధాని మోదీ హామీ ఇచ్చారని ఇటీవల ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, పరిమితంగానే కొనుగోలు చేస్తుందంటూ తాజాగా వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీపావళి వేడుకల్లో ఆహా్వనితులను ఉద్దేశించి ఆయన కొద్దిసేపు ప్రసంగించారు. ట్రంప్ ఏం చెప్పారంటే... ఎక్కువగా వాణిజ్యంపైనే చర్చ ‘‘మీ ప్రధానమంత్రి మోదీతో ఇప్పుడే మాట్లాడాను. మా మధ్య చక్కటి సంభాషణ జరిగింది. వాణిజ్యం సహా చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఎక్కువగా వాణిజ్యంపైనే చర్చ జరిగింది. ఎందుకంటే ఆ అంశంపై మోదీకి ఎక్కువ ఆసక్తి ఉంది. మోదీ నిజంగా గొప్ప వ్యక్తి. ఆయన నాకు చాలాఏళ్లుగా మంచి మిత్రుడు. మేమిద్దరం ఎంతో స్నేహంగా ఉంటాం. భారత్–పాకిస్తాన్ సంబంధాలపైనా మోదీతో చర్చించాను. పాకిస్తాన్తో యుద్ధాలు వద్దన్న అభిప్రాయం మా సంభాషణలో వ్యక్తమైంది. భారత్, పాకిస్తాన్లతో అమెరికాకు ఎలాంటి యుద్ధాలు, విభేదాలు లేకపోవడం సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు. కీలక ఒప్పందాలపై కలిసి పని చేస్తున్నాంవైట్హౌస్ వేడుకల అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. భారతీయులను ఎంతగానో అభిమానిస్తున్నానని చెప్పారు. మోదీతో ఫోన్లో మాట్లాడానని, ఆయనతో తనకు చక్కటి సంబంధాలు ఉన్నాయని పునరుద్ఘాటించారు. రష్యా నుంచి భారత్ అధికంగా(టూ మచ్) ముడి చమురు కొనుగోలు చేయబోదని ఉద్ఘాటించారు. కొన్ని కీలక ఒప్పందాలపై భారత్, అమెరికా కలిసి పని చేస్తున్నాయని వివరించారు. తనలాగే మోదీ కూడా ఉక్రెయిన్–రష్యా యుద్ధం త్వరగా ముగిసిపోవడాన్ని కళ్లారా చూడాలని కోరుకుంటున్నారని చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు భారత్ భారీగా కత్తెర వేస్తుందని తాను భావిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు చాలావరకు తగ్గిపోవడం తథ్యమని అన్నారు. ముడిచమురు దిగుమతుల తగ్గింపు ప్రక్రియ చాలాకాలం కొనసాగుతుందని స్పష్టంచేశారు. మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ పురోగతికి భారత్–అమెరికన్ వ్యాపారవేత్తలు ఎంతగానో తోడ్పాడు అందిస్తున్నాయని ప్రశంసించారు. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలకు భారత్–అమెరికన్లు సారథ్యం వహిస్తున్నారని, వాటిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. అదే మనకు దారిదీపం వైట్హౌస్లో దీపావళి పండుగకు అడోబ్ సంస్థ సీఈఓ శంతను నారాయణ్, మైక్రాన్ టెక్నాలజీ సీఈఓ సంజయ్ మోహ్రోత్రా, ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ, అమెరికాలో భారత రాయబారి వినయ్మోహన్ క్వాత్రా, ఎఫ్బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ దీపావళి సందేశాన్ని విడుదల చేశారు. ‘‘చీకటిపై వెలుగు విజయానికి, అజ్ఞానంపై జ్ఞానం విజయానికి, చెడుపై మంచి విజయానికి ప్రతీకగా దీపం వెలిగిస్తున్నాం. దీపావళి సమయంలో ప్రాచీన గాథలను గుర్తుచేసుకోవాలి. శత్రువులు పరాజయం పాలైన, అవరోధాలు తొలగిపోయిన, సామాన్యులకు విముక్తి లభించిన గాథలను మనం తెలుసుకోవాలి. నిండుగా వెలుగులు విరజిమ్ముతున్న దీపం మనకు దారి చూపిస్తుంది. జ్ఞానమార్గంలో నడవాలని, శ్రద్ధతో పనిచేయాలని, మనకు లభించే ఆశీస్సులకు కృతజ్ఞతలు తెలియజేయాలని బోధిస్తుంది’’ అని ట్రంప్ వివరించారు. మోదీకి ట్రంప్ దీపావళి శుభాకాంక్షలు న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి, దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు ఫోన్ చేసి మాట్లాడి, దీపావళి శుభాకాంక్షలు చెప్పినందుకు డొనాల్డ్ ట్రంప్కు ప్రధాని మోదీ ‘ఎక్స్’లో కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికాలు కలిసికట్టుగా పనిచేయాలని, ప్రపంచాన్ని వెలిగిస్తూనే ఉండాలని ఈ సందర్భంగా మోదీ ఆకాంక్షించారు. ఉగ్రవాదం ఎక్కడ ఏ రూపంలో ఉన్నాసరే వ్యతిరేకించాల్సిందేనని తేలి్చచెప్పారు. ఉగ్రవాదంపై భారత్, అమెరికాలు ఉమ్మడిగా పోరాటం చేయాలన్నారు. ఇదిలా ఉండగా, ట్రంప్, మోదీ సంభాషణలో పాకిస్తాన్ ప్రస్తావన రాలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. -
హెయిర్ స్టైల్నే కాదు చరిత్రనే మార్చేసింది!
జపాన్ తొలి మహిళా ప్రధానిగా సనే తకాయిచి చరిత్ర సృష్టించారు. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో... ‘అచ్చం మార్గరెట్ థాచర్ హెయిర్ స్టైయిల్లా ఉండాలి’ అని తన హెయిర్ స్టయిల్ మార్చారు. అయితే ఆమె మార్చింది కేవలం హెయిర్స్టైల్ మాత్రమే కాదు, పితృ స్వామ్య ఆధిపత్యంతో కూడిన ఎన్నో స్థిర అభిప్రాయాలను! తకాయిచి సుపరిచిత రాజకీయ జీవితం మాట ఎలా ఉన్నా, అదర్సైడ్ బహుముఖ ప్రజ్ఞావంతురాలు. సింగర్, డ్రమ్మర్, బైక్ రైడర్, కరాటే ఫైటర్, టీవీ ప్రెజెంటర్... ఒకటా రెండా!సనే తకాయిచికి మెటాలిక, ఐరన్ మెయిడెన్, బ్లాక్ సబ్బాత్ లాంటి హెవీ మెటల్ మ్యూజిక్ బ్యాండ్లు అంటే చాలా ఇష్టం. బిగ్గరగా, దూకుడుగా ధ్వనించే రాక్ స్టైల్ హెవీ మెటల్ బ్యాండ్ల సొంతం. సంగీత అభిమానిగా ఉన్న తకాయిచి కాలేజీ బ్యాండ్లో డ్రమ్ వాయించేవారు. ఆమె బ్యాండ్ వాయించడం ఎంత ఉధృతంగా ఉండేది అంటే కర్రలు తప్పనిసరిగా విరిగిపోయేవి! అందుకే బ్యాకప్గా నాలుగు జతల కర్రలను తీసుకువెళ్లేవారు. స్కూల్ రోజుల్లో గిటార్ వాయించేవారు.వయసుతో పాటు ఉత్సాహం పెరుగుతూనే ఉంది..! కళలపై ఎంత పాషన్ ఉన్నా సరే వయసుతోపాటు కొందరిలో ఉత్సాహం తగ్గిపోతుంది. అయితే తకాయిచి అలా కాదు. ఇప్పటికీ ఇంట్లో డ్రమ్స్ వాయిస్తారు. రాజకీయాలు అన్నాక ఒత్తిడి సహజం కదా! ఎప్పుడైనా మరీ ఒత్తిడికి గురైనప్పుడు డ్రమ్స్ వాయించే సమయం రెట్టింపు అవుతుంది.రాజకీయ నేపథ్యం లేదు... ధైర్యం మాత్రమే ఉంది... జపాన్లోని పితృస్వామ్య రాజకీయ వ్యవస్థలో తకాయిచి ప్రధానిగా ఎన్నికకావడం అనేది ఆశ్చర్యకరమైన, అరుదైన విజయం. ఆమె దేశభక్తి విద్యను ప్రోత్సహిస్తున్నారు. యుద్ధాలను త్యజించే విధానాలకు మద్దతు ఇచ్చారు. తన రాజకీయ సహచరులలో చాలామందిలా ఆమెకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. తండ్రి ఒక కార్ల కంపెనీలో పనిచేసేవాడు. తల్లి పోలీస్ ఆఫీసర్. రాజకీయాల్లోకి రాక ముందు తకాయిచి టీవి కామెంటేటర్గా పనిచేసేవారు. నవ్వుతూ, నవ్విస్తూ ఇంటర్వ్యూలు, టీవి కార్యక్రమాలు చేసేవారు. జపాన్ పార్లమెంట్లో మొదటిసారి అడుగు పెట్టిన కాలంలో తన జుట్టు స్టైల్ మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు ‘అచ్చం మార్గరెట్ థాచర్ హెయిర్ స్టైల్లా ఉండాలి’ అని హెయిర్ డ్రెస్సర్కు చెప్పారు.మార్గరెట్ థాచర్కు ఆమె వీరాభిమాని... ‘గుంపు వెంట పరుగెత్తడం కాదు... ఆ సమూహం నిన్ను అనుసరించేలా చేసుకోవాలి’... ఇలా థాచర్ ప్రసిద్ధ మాటలు ఎన్నో తకాయిచి నోట వినిపించేవి.బైక్ రైడింగ్కు గుడ్బై... బైక్ రైడింగ్ అంటే తకాయిచికి బోలెడు ఇష్టం. సమయం చిక్కేది కాదా? భద్రతా కారణాలా? తెలియదుగానీ 32 సంవత్సరాల వయసులో పార్లమెంట్లోకి అడుగు పెట్టిన తకాయిచి తనకు అత్యంత ప్రియమైన కవాసకి జెడ్400జీపి మోటర్ సైకిల్కు గుడ్బై చెప్పారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్డీపి)లో తనదైన ప్రత్యేకత నిలుపుకున్న తకాయిచి ఎన్నో క్యాబినెట్ ర్యాంక్ పదవుల్లో రాణించారు. పార్టీ పాలసీ రీసెర్చ్ కౌన్సిల్కు అధ్యక్షురాలిగా పనిచేశారు.భవిష్యత్ ఏమిటి? ‘ప్రధానిగా తకాయిచి ఎన్నిక పార్టీకి అదృష్టాన్ని తెస్తుందా? పార్టీని పునర్జీవింపజేస్తుందా? లేక పార్టీ క్షీణతను వేగవంతం చేస్తుందా?’ అంటూ విశ్లేషణలు చేస్తున్నారు రాజకీయ పండితులు.మహిళలకు సంబంధించి ఆమెకు ఉన్న అభిప్రాయాలు కొన్ని వివాదాస్పదం అయ్యాయి. అయితే ఎన్నికల ప్రచారంలో బేబీ సిట్టింగ్ కోసం పన్ను మినహాయింపులు, పిల్లల సంరక్షణ కోసం కార్పొరెట్ ప్రోత్సాహకాలను ప్రతిపాదించడం అనేది మహిళా–స్నేహపూర్వక విధానాల వైపు తకాయిచి అడుగులు వేస్తున్నారు అని చెప్పడానికి సంకేతం. ఒక లవ్ స్టోరీ... లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్డీపీ)లో తన రాజకీయ సహచరుడు యమమోటోను తకాయిచి వివాహం చేసుకున్నారు. అతడు ఆమెను ఎంతోకాలంగా మౌనంగా ప్రేమిస్తున్నాడు. ఇట్టి విషయాన్ని ఆమె గమనించక పోలేదు. ఒకానొక రోజు ఆయన ఫోన్ చేసి లవ్ ప్రపోజ్ చేశారు. ఆమె ఒప్పుకున్నారు. పెళ్లి జరిగింది. ‘మీకు లవ్ యూ చెప్పాలంటే ఎంతో ధైర్యం కావాలి. మీరు అంత త్వరగా ఎలా ఒప్పుకున్నారు?’ అనే ప్రశ్నకు తకాయిచి ఇలా జోక్ చేశారు... ‘నిజం చెప్పమంటారా! నేను భోజనప్రియురాలిని. మంచి రుచికరమైన భోజనం చేయకుండా ఒక్కరోజు కూడా ఉండలేను. యమమోటోని పెళ్లి చేసుకుంటే మంచి భోజనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే ధైర్యంతో ఒప్పుకున్నాను. ఎందుకంటే ఆయన ట్రైన్డ్ చెఫ్!’ రాజకీయా అభిప్రాయాలలో తేడా కారణంగా విడిపోయిన ఈ దంపతులు 2021లో తిరిగి వివాహం చేసుకున్నారు. -
వాహనాల బీభత్సం.. 63 మంది దుర్మరణం
నైరోబి: ఉగాండాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒక ప్రధాన రహదారిపై బుధవారం తెల్లవారుజామున రెండు బస్సులు ఢీకొన్నాయి. తరువాత అవి మరో నాలుగు వాహనాలను బలంగా తాకాయి. ఈ దుర్ఘటనలో 63 మంది మరణించారు. ప్రమాదంలో లెక్కలేనంతమంది గాయపడ్డారు.కిర్యాండోంగో జిల్లాలోని కంపాలా-గులు హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. ముందుగా రెండు బస్సులు ఓవర్టేకింగ్ చేస్తూ, ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సమయంలో ఆ బస్సుల డ్రైవర్లు ప్రమాదాన్ని తప్పించేందుకు ప్రయత్నించారు. దీంతో అవి ఒక ట్రక్, ల్యాండ్ క్రూయిజర్తో పాటు నాలుగు వాహనాలను నియంత్రణ కోల్పోయేలా చేయడంతో, అవి బోల్తా పడ్డాయని పోలీసులు తెలిపారు. తొలుత మృతుల సంఖ్యను 63గా ప్రకటించిన పోలీసులు ఆ సంఖ్యను 46గా సవరించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో అత్యవసర సేవలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో గాయపడిన వారిని కిర్యాండోంగో ఆస్పత్రితో పాటు సమీపంలోని ఇతర వైద్య కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. అయితే గాయపడిన వారి సంఖ్య, వారి గాయాల తీవ్రత తదితర వివరాలను వారు అందించలేదు. బాధిత కుటుంబాలకు ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసేవేని సంతాపాన్ని ప్రకటించారు. వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.గత ఏప్రిల్లో పశ్చిమ ఉగాండాలో ఒక బస్సు అదుపు తప్పి, హైవేపై బోల్తా పడటంతో 10 మంది మరణించారు. అదేవిధంగా గత ఆగస్టులో ఒక ట్రక్కు బోల్తా పడిన ఘటనలో 20 మంది మరణించారు. గత ఏడాది కంపాలా-గులు హైవేపై ఒక ట్రక్కు బోల్తా పడిన ఘటనలో 26 మంది మృతిచెందారు. రెండేళ్ల క్రితం జనవరిలో కెన్యా-ఉగాండా సరిహద్దులో జరిగిన బస్సు ప్రమాదంలో 21 మంది మృతిచెందగా, 49 మంది గాయపడ్డారు. -
మహిళలకు ఎర వేస్తున్న జైషే ఉగ్రవాద సంస్థ!
ఉగ్రవాద సంస్థ జైష్-ఏ-మహ్మద్ సంస్థ తన పంథాను మార్చుకుని మహిళలను కూడా ఉగ్రవాద కార్యకలాపాల్లోకి దించేందుకు సిద్ధమైంది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ (Jaish-e-Mohammed) కేవలం మహిళలతో జీహాదీ గ్రూప్ను తయారు చేస్తున్నది. దీంతో పాటు వసూళ్లను కూడా ముమ్మరం చేస్తోంది. మసూద్ అజార్ (Masood Azhar) సోదరి సాదియా అజార్ (Sadiya Azhar) నేతృత్వంలో ‘జమాతుల్-ముమినాత్’ పేరుతో మహిళా దళాన్ని తయారు చేస్తోంది. ఇందులో భాగంగానే మహిళలకు తుఫత్ అల్-ముమినాత్ అనే ఆన్లైన్ శిక్షణా కోర్సును ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలను ఎన్డీటీవీ నివేదించింది.జైష్ అధినేత మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ నేతృత్వంలోని 'జమాత్ ఉల్ మోమినాత్' అనే మహిళా బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కోర్సులో భాగంగా, జైష్ నాయకుల కుటుంబ సభ్యులు, వ్యవస్థాపకుడు మసూద్ అజార్, అతని కమాండర్ల బంధువులు, జిహాద్, ఇస్లాంకు సంబంధించి వారి 'విధుల' గురించి బోధిస్తారు. ఆన్లైన్లో నిర్వహించే నియామక డ్రైవ్ వచ్చే నెల నవంబర్ 8 నుండి ప్రారంభం కానుంది. ఈ 'ఉపన్యాసాలు' రోజుకు 40 నిమిషాలు ఉంటాయి. అజార్ ఇద్దరు సోదరీమణులు, సాదియా అజార్, సమైరా అజార్ నాయకత్వం వహిస్తారు. ఇందులో జమాత్ ఉల్-ముమినాత్లో చేరేలా మహిళల్ని పోత్సహిస్తాయి. గత నెలలో బహవల్పూర్లోని మర్కజ్ ఉస్మాన్ ఓ అలీలో తన చివరి బహిరంగ ప్రసంగం తర్వాత, ఈ వార్త వెలుగులోకి వచ్చింది. ఈ 'కోర్సు'లో చేరే ప్రతి మహిళ నుండి రూ. 156 వసూలు చేసి, వారిని ఆన్లైన్ సమాచార ఫారం నింపమని బలవంతం చేస్తోందట. దీంతోపాటు అజార్ తన 'విరాళాల' కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తోంది.చదవండి: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న దీపికా తనయ ‘దువా’ ఫోటోలు : అలియా రియాక్షన్కాగా ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద సంస్థగా ఐక్యరాజ్యసమితి ఎపుడో గుర్తించిన జైష్-ఎ-మొహమ్మద్, జమాత్ ఉల్-ముమినాత్ అనే మహిళా విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది. అజార్ అక్టోబర్ 8న జమాత్ మహిళా విభాగాన్ని ప్రకటించాడు. అలాగే అక్టోబర్ 19న, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో, మహిళలను సమూహంలోకి తీసుకొచ్చేలా 'దుఖ్తరన్-ఎ-ఇస్లాం' అనే కార్యక్రమం కూడా జరిగింది.ఇదీ చదవండి: ఇండోర్ మహారాణి : నీతా అంబానీ లాంగ్ నెక్లెస్ ఆ డైమండ్స్ ఎలా మోసారండీ! -
China: ఈ బుల్లెట్ ట్రైన్ ‘‘మెరుపు తీగే’.. గంటకు ఎంత వేగమంటే..
న్యూఢిల్లీ: బుల్లెట్ రైళ్ల వేగంలో చైనా మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది. చైనా తయారు చేసిన తాజా బుల్లెట్ రైలు సీఆర్ 450 ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హై స్పీడ్ రైలుగా గుర్తింపు పొందింది. ఈ రైలు ట్రయల్ రన్లోనే గంటకు 453 కి.మీ. గరిష్ట వేగాన్ని అందుకుంది.బుల్లెట్ రైలు సీఆర్ 450ను ప్రస్తుతం షాంఘై- చెంగ్డు మధ్య హై-స్పీడ్ రైలు మార్గంలో టెస్ట్ చేస్తున్నారు. ఈ రైలు వాణిజ్యపరంగా గంటకు 400 కి.మీ. వేగంతో నడిచేలా రూపొందించారు. ఇది ప్రస్తుతం సేవలలో ఉన్న సీఆర్ 400 ఫక్సింగ్ రైళ్ల కంటే 50 కి.మీ. వేగవంతమైనది. ఈ పాత మోడల్ రైళ్లు గంటకు 350 కి.మీ. వేగంతో నడుస్తాయి. సీఆర్ 450కి ముందు ఈ రైళ్లు ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంతో నడిచే రైళ్లుగా గుర్తింపు పొందాయి.సీఆర్ 450ను స్మార్ట్ డిజైన్తో రూపొందించారు. దీని నోస్ కోన్ 15 మీటర్లు. నూతన మోడల్లో ఏరోడైనమిక్ నిరోధకతను 22 శాతం మేరకు తగ్గించారు. దీంతో వేగం, ఇంధన సామర్థ్యం మరింత మెరుగుపడ్డాయి. ఈ రైలు కేవలం 4 నిమిషాల 40 సెకన్లలో 0 నుండి 350 కి.మీ./గం. వరకు వేగవంతం అవుతుంది. ట్రయల్స్ సమయంలో, రెండు సీఆర్ 450 రైళ్లు గంటకు 896 కిమీ వేగంతో పరుగులు తీశాయి. ప్రయాణ వేగంలో సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాయి. ఈ రైలును రూపొందించిన ఇంజనీర్లు స్పోర్ట్స్ కార్ల డిజైన్ ప్రేరణతో ఏరోడైనమిక్ మెరుగుదలపై ఐదేళ్లు పనిచేశారు. #China's CR450 high-speed train, the world's fastest bullet train, has set a new record by reaching a top speed of 453 km/h during testing. It can accelerate from a standstill to 350 km/h within 5 minutes! #highspeedtrain pic.twitter.com/2AtK0LFZb1— CCTV Asia Pacific (@CCTVAsiaPacific) October 22, 2025 ఇది కూడా చదవండి: మెహుల్ ఛోక్సీ అప్పగింతకు ఓకే: బెల్జియం కోర్టు -
వైట్హౌస్ను కూల్చేస్తున్న ట్రంప్
అమెరికాలోని వైట్హౌస్లో 250 మిలియన్ల (సుమారు రూ.2,000 కోట్లు) భారీ వ్యయంతో కొత్త బాల్రూమ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్ట్లో భాగంగా వైట్హౌస్ తూర్పు విభాగం (ఈస్ట్ వింగ్)ను పాక్షికంగా కూల్చివేస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్లో తన కలల ప్రాజెక్టుగా భావించే ఈ బాల్రూమ్ నిర్మాణం కోసమే ఈస్ట్ వింగ్లో కొంత భాగాన్ని కూల్చివేస్తున్నట్లు సమాచారం.ప్రస్తుతం వైట్హౌస్లో అతిపెద్ద హాల్ ‘ఈస్ట్ రూమ్’. దీనిలో సుమారు 200 మంది మాత్రమే కూర్చునే సామర్థ్యం ఉంది. స్టేట్ డిన్నర్లు, ఇతర పెద్ద ఈవెంట్లకు ఇది సరిపోవడం లేదని ట్రంప్ చాలాకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున అతిథులను, ప్రపంచ నాయకులను వైట్హౌస్లోనే సౌకర్యవంతంగా ఆహ్వానించడానికి ప్రత్యేకంగా బాల్రూమ్ అవసరమని ఆయన తెలిపారు.తాత్కాలికంగా టెంట్లలో..స్టేట్ డిన్నర్లు వంటి అతిపెద్ద కార్యక్రమాలను గత అధ్యక్షులు తరచుగా వైట్హౌస్ దక్షిణ ప్రాంగణంలో (సౌత్ లాన్లో) తాత్కాలికంగా వేసిన టెంట్లలో నిర్వహించేవారు. దీనిపై ట్రంప్ అయిష్టంగా ఉన్నారు. ట్రంప్ ప్రతిపాదించిన కొత్త, సువిశాలమైన 90,000 చదరపు అడుగుల (సుమారు 8,300 చ.మీ.) బాల్రూమ్ 1000 మంది కూర్చునే సామర్థ్యం కలిగి ఉంటుందని, అవసరమైతే భవిష్యత్తులో అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం వంటి కార్యక్రమాలకు కూడా ఇది ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం పన్ను చెల్లింపుదారుల డబ్బును ఉపయోగించడం లేదని దీన్ని ప్రైవేట్ వ్యక్తుల నుంచి సమకూర్చిన ఫండింగ్ ద్వారా పూర్తి చేస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.ఈస్ట్ వింగ్ కూల్చివేతఈ ప్రాజెక్ట్ ప్రతిపాదించిన సమయంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కొత్త బాల్రూమ్ వైట్హౌస్కు సమీపంలో ఉంటుందని, ఏమీ కూల్చివేతలు ఉండవని తెలిపారు. అయితే నిర్మాణ పనులు ప్రారంభమవగానే ఈస్ట్ వింగ్ ముఖభాగంలో కొంత భాగం కూల్చివేశారు. వైట్హౌస్ ఇచ్చిన వివరణ ప్రకారం కొత్త బాల్రూమ్ ప్రాజెక్ట్లో భాగంగా దేశ ప్రథమ మహిళ కార్యాలయం వంటి ఆఫీసులు ఉండే ఈస్ట్ వింగ్ను కూడా ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని తెలిసింది. ఈస్ట్ వింగ్ సంప్రదాయబద్ధంగా ప్రథమ మహిళ కార్యాలయాలకు, సందర్శకుల ప్రవేశానికి కేంద్రంగా ఉండేది. 1942లో ప్రపంచ యుద్ధం సమయంలో దీనికి రెండో అంతస్తు, బంకర్ కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం.ఇదీ చదవండి: అమెరికాలోని విదేశీ విద్యార్థులకు ఊరట.. H-1B వీసా ఫీజు రద్దు -
మెహుల్ ఛోక్సీ అప్పగింతకు ఓకే: బెల్జియం కోర్టు
న్యూఢిల్లీ: భారత్లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్కు వేల కోట్ల రూపాయలు ఎగవేసి, దేశం విడిచి పారిపోయిన వ్యాపారవేత్త, ఆర్థిక నేరస్తుడు మెహుల్ ఛోక్సీని దేశానికి రప్పించడంలో భారత్ విజయం సాధించింది. మెహుల్ ఛోక్సీని భారత్కు అప్పగించే విషయంలో తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని బెల్జియం కోర్టు స్పష్టం చేసింది.భారత్కు మెహుల్ ఛోక్సీని అప్పగించేందుకు ఈ మధ్యనే బెల్జియం న్యాయస్థానం ఆమోదం తెలిపింది. అయితే ఈ క్రమంలో తన అప్పగింత ఆమోదం అనేది రాజకీయ ప్రేరేపితమని, ఇది తన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని మెహుల్ ఛోక్సీ ఆరోపించారు. ఈ నేపధ్యంలో తాజాగా బెల్జియం యాంట్వెర్ప్ కోర్టు.. ఛోక్సీ ఆరోపణలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఛోక్సీ బెల్జియం పౌరుడు కాదని గుర్తుచేస్తూ, అతని అప్పగింతను సమర్థించేలా, తీవ్రమైన అభియోగాలను మెహుల్ ఛోక్సీ ఎదుర్కొంటున్నాడని పేర్కొంది. ఛోక్సీపై భారత్ మోపిన అభియోగాలను బెల్జియంలోని చట్టాల ప్రకారం కూడా నేరాలుగానే పరిగణిస్తామని కోర్టు తెలిపింది. భారతదేశ ఆదేశాల దరిమిలా, తనను ఆంటిగ్వా నుంచి కిడ్నాప్ చేశారంటూ ఛోక్సీ కొంతకాలంగా చేస్తున్న వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ఈ ఆరోపణలకు సంబంధించి తగిన ఆధారాలు లేవని స్పష్టం చేసింది.బెల్జియం కోర్టు తన తీర్పులో ఛోక్సీ అప్పగింత అనంతరం అతనిని ఉంచే జైలుకు సంబంధించి భారత్ అందించిన వివరాలను కూడా తెలిపింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి దాదాపు రూ.13 వేల కోట్ల రుణాలను మెహుల్ ఛోక్సీ ఎగవేశాడు. ఇదే కేసులో ప్రమేయం ఉన్న అతని మేనల్లుడు నీరవ్ మోదీ భారత్ విడిచి పారిపోయాడు. ఛోక్సీ.. ఆంటిగ్వా-బార్బుడాకు వెళ్లగా, నీరవ్మోదీ లండన్లో తలదాచుకున్నాడు. అంట్వర్ప్లోని న్యాయస్థానం ఈ మధ్యనే ఛోక్సీ అప్పగింతకు ఆమోదం తెలిపింది. అయితే చోక్సీ రాబోయే 15 రోజుల్లో బెల్జియం సుప్రీంకోర్టులో ఈ ఉత్తర్వుకు వ్యతిరేకంగా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)అభ్యర్థన మేరకు ఈ ఏడాది ఏప్రిల్ 11న ఆంట్వెర్ప్లో చోక్సీని అరెస్టు చేశారు. అప్పటి నుండి అతను బెల్జియంలోని ఆంట్వెర్ప్ జైలులో ఉన్నాడు. నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్ జైలులో ఉన్నాడు.ఇది కూడా చదవండి: మహిళలకు రూ. 30 వేల జీతంతో శాశ్వత ఉద్యోగం: తేజస్వీ భారీ హమీ -
ఈ మనిషికే అంత సామర్థ్యం ఉంటే.. ఖమేనీ చురకలు
కొంత గ్యాప్ తర్వాత ఇరాన్ సుప్రీం అయతొల్లా ఖమేనీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై విమర్శలు ఎక్కుపెట్టారు. అగ్రరాజ్యంలో నడుస్తున్న నో కింగ్స్ నిరసనలను(No Kings Protest) ఉద్దేశించి తన ఎక్స్ ఖాతాలో ఓ సెటైరిక్ పోస్ట్ చేశారు. అంతేకాదు.. ఇరాన్ అణుకేంద్రాలను నాశనం చేశానని ట్రంప్ కలలు కంటున్నారని ఖమేనీ అంటున్నారు.ట్రంప్ నియంతృత్వ ధోరణి, ఆ దేశంలో పెరిగిపోయిన అవినీతికి వ్యతిరేకంగా అమెరికాలో No Kings నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిని ప్రస్తావిస్తూ ఖమేనీ ఏమన్నారంటే.. ‘‘అమెరికాలో ఈ మనిషికి వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాల్లో 70 లక్షల మందికిపైగా నినాదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకునేంత సామర్థ్యమే ఉన్నప్పుడు.. అక్కడి ప్రజల ఆందోళనలు మాన్పించి ఇళ్లకు పంపొచ్చు కదా’’ అని అన్నారు.According to the reports, seven million people are chanting slogans against this individual in different states across America. If you’re that capable, calm them down, send them back to their residences, and don't interfere in the affairs of other countries! pic.twitter.com/zAkusSWdQf— Khamenei.ir (@khamenei_ir) October 21, 2025ట్రంప్ పాలన ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిందని, ఇమ్మిగ్రేషన్ తనిఖీలు, నగరాల్లో బలగాల మోహరింపు, పలు పథకాలకు ప్రభుత్వ నిధులను కత్తిరించడం లాంటి చర్యలను ఖండిస్తూ నో కింగ్స్ నిరసనలు జరిగాయి. అక్టోబర్ 18వ తేదీన అమెరికా 50 రాష్ట్రాల్లో.. 2,700 ఈవెంట్లలో లక్షల మంది పాల్గొన్నారు. అయితే దీనిని అమెరికా వ్యతిరేక ర్యాలీగా రిపబ్లికన్ పార్టీ అభివర్ణించింది. అంతేకాదు.. నిరసనకారులపై కోపం ప్రదర్శిస్తూ ఓ ఏఐతో కూడిన డీప్ఫేక్ వీడియోను ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం.ఇక.. ఇరాన్తో చర్చల పునరుద్ధరణకు ట్రంప్ చేసిన ప్రతిపాదనను తాను తిరస్కరించానని ఖమేనీ చెబుతున్నారు. ‘‘ట్రంప్ తనను తాను డీల్మేకర్ అని చెప్పుకుంటారు. కానీ, బలవంతంగానో, బెదిరింపులతోనో జరిగేది అసలు ఒప్పందమే కాదు. అది దౌర్జన్యం కిందకు వస్తుంది. అందుకే ఆ ప్రతిపాదనను తిరస్కరించా’’అని ఖమేనీ అన్నారు.ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై బాంబుల వర్షం కురిపించి నాశనం చేశామని ట్రంప్ చేసుకుంటున్న ప్రచారంపై ఖమేనీ స్పందిస్తూ..‘‘ మంచిది.. అలాగే కలలు కనమనండి’’అంటూ వ్యాఖ్యానించారాయన.ఇరాన్ అణు కార్యక్రమాలతో తమ దేశానికి ముప్పు పొంచి ఉందని చెబుతూ.. ఇజ్రాయెల్ ఇరాన్పై ఈ ఏడాది జూన్లో దాడులకు దిగింది. ఆ వెంటనే అణు ఒప్పందం వంకతో అమెరికా బలగాలు కూడా ఇజ్రాయెల్కు తోడయ్యాయి. 12 రోజులపాటు ఇరువైపుల నుంచి దాడులు, ప్రతిదాడులతో భారీ నష్టమే వాటిల్లింది. చివరకు.. ఖతార్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విమరణ ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి అమెరికాతో నేరుగా అణు చర్చలు ఉండబోవంటూ ఖమేనీ చెబుతూ వస్తున్నారు. ఇదీ చదవండి: అధ్యక్ష భవనం నుంచి ఇరుకు జైలు గదికి! -
జపాన్లో ‘ట్రంప్’ పాలన?.. వలసదారులపై ‘తకైచి’ ఉక్కుపాదం
టోక్యో: జపాన్ దేశ చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభమయ్యింది. తొలి మహిళా ప్రధానిగా 64 ఏళ్ల సనే తకైచి ఎన్నికయ్యారు. జపాన్ పార్లమెంట్ దిగువ సభలో జరిగిన ఓటింగ్లో తకైచి అనూహ్యంగా తొలి రౌండ్లోనే మెజార్టీ సాధించి, అనూహ్య విజయం దక్కించుకున్నారు. అధికారాన్ని అందుకున్న వెంటనే తకైచి తనదైన పాలనకు శ్రీకారం చుట్టారు.వలస విధానాలపై ప్రత్యేక దృష్టిఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలసదారులపై అనుసరిస్తున్న కఠిన విధానాలను తమ దేశంలోనూ అమలు చేసేందుకు జపాన్ నూతన ప్రధాని తకైచి నడుంబిగించారు. తన పరిపాలనలో కొత్తగా సామూహిక బహిష్కరణల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఇది దేశ యుద్ధానంతర చరిత్రలో అత్యంత దూకుడుగా కనిపించే వలస విధానాలలో ఒకటిగా విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధాని తకైచి ప్రమాణ స్వీకారం చేసిన దరిమిలా ఈ నూతనశాఖ ఏర్పాటుపై ప్రకటన వచ్చింది. జపాన్ సరిహద్దుల భద్రతకు ప్రాధాన్యతజపాన్లో నూతనంగా సామూహిక బహిష్కరణల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం అనేది జాతీయవాద పాలనకు బలాన్నిచ్చేదిగా ఉండనుంది. ఈ నూతన మంత్రిత్వ శాఖ.. సరైన పత్రాలు లేని విదేశీ పౌరులను, వలస చట్టాలను ఉల్లంఘించిన వారిపై దృష్టి సారించి, వారిని స్వదేశాలకు పంపే దిశగా పనిచేస్తుంది. ఈ నూతన శాఖ ఏర్పాటుపై ప్రకటన చేస్తున్నప్పుడు ప్రధాని తకైచి ‘జపాన్ సరిహద్దుల భద్రత- సమగ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఈ నూతన మంత్రిత్వ శాఖ దేశ చట్టాలను గౌరవించేలా ఉంటుంది. అలాగే ఎటువంటి రాజీ లేకుండా దీనిని అమలు చేస్తామన్నారు.ప్రతిపక్షాల నుంచి విమర్శలుకాగా ప్రధాని తకైచి తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు, పౌర హక్కుల సంఘాలు.. విదేశీ ద్వేషపూరిత చర్యగా, ప్రమాదకరమైన తిరోగమనంగా అభివర్ణించాయి. ఇది జపాన్కున్న ప్రపంచ ఖ్యాతిని దెబ్బతీస్తుందని, కీలక పరిశ్రమలలో కార్మికుల కొరతను మరింత తీవ్రతరం చేస్తుందని పలువురు హెచ్చరిస్తున్నారు. దేశంలో తగ్గిపోతున్న శ్రామిక శక్తిని నిలబెట్టేందుకు విదేశీ కార్మికులు అవసరమని జపాన్ వ్యాపార సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విధానం అంతర్జాతీయ పెట్టుబడులను నిరోధిస్తుందని, పొరుగు దేశాలతో దౌత్య సంబంధాలను దెబ్బతీస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. -
పసికందును మోసుకుంటూ గడ్డ కట్టే చలిలో..
పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లిదండ్రుల్లో కొందరు.. నిర్లక్ష్యంతో, ఏమరుపాటుతో వాళ్ల ప్రాణాలు పోవడానికి కారణమైన ఘటనలెన్నో చూశాం. అయితే ఇక్కడో జంట ప్రమాదం అని తెలిసి కూడా తమ నెలల పసికందుతో సాహసానికి సిద్ధపడింది. పోనీ అందుకు ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా? అనుకుంటే.. పప్పులో కాలేసినట్లే!.. లిథువేనియాకు చెందిన ఓ జంట.. పోలాండ్లోని మంచుతో కప్పబడిన మౌంట్ రైసీ పర్వతాన్ని అధిరోహించేందుకు సిద్ధపడింది. అయితే తమ 9 నెలల బిడ్డతో కలిసి ఎలాంటి సురక్షిత పరికరాలు లేకుండానే ముందుకు వెళ్లింది. తల్లిని ముందు భాగంలో క్యారీ చేస్తూ ఆ తల్లి పైకి ఎక్కడం ప్రారంభించింది. ఇది గమనించిన కొందరు అలా చేయొద్దని వారించినా వినలేదు. అయినా వినకుండా ఆ పేరెంట్స్ మొండిగా ముందుకు వెళ్లారు. అయితే.. కాస్త దూరం వెళ్లాక ఆ బిడ్డ తండ్రి ప్రమాదాన్ని అంచనా వేశాడు. ఆ సమయంలో క్రాంపాన్(మంచులో జారకుండా షూలకు బిగించే పరికరాలు) కోసం ఓ మౌంట్ గైడ్ను సంప్రదించాడు. బిడ్డకు ప్రమాదం అని భావించిన ఆ మౌంట్గైడ్.. వాళ్లు సర్దిచెప్పి కిందకు తీసుకొచ్చారు. ఆ బిడ్డ పరిస్థితి ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. వీడియో వైరల్ కావడంతో.. చిన్నారిని ప్రమాదంలోకి నెట్టినందుకు ప్రయత్నించిన ఆ పేరెంట్స్పై సోషల్ మీడియా తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తోంది. మౌంట్ రైసీ (Mount Rysy) అనేది పోలాండ్లోని అత్యంత ఎత్తైన పర్వతం. దీని ఎత్తు సుమారు 2,501 మీటర్లు (8,205 అడుగులు). పోలాండ్- స్లోవేకియా సరిహద్దులో ఉన్న హై టాట్రాస్ పర్వత శ్రేణిలో విస్తరించి ఉంది.“No words.” A couple climbed Poland’s highest mountain with a baby — and sparked outrageA Lithuanian couple attempted to ascend Mount Rysy while carrying their nine-month-old child, Delfi reports.Conditions were extremely dangerous. Guides and rescuers warned them repeatedly,… pic.twitter.com/jgN8l6mPEg— NEXTA (@nexta_tv) October 21, 2025 -
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. ట్రంప్నకు మోదీ థ్యాంక్యూ
రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలు.. ప్రపంచం కోసం కలిసి కట్టుగా ముందుకు సాగాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేయగా.. అందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మోదీ తన ఎక్స్ ఖాతాలో(Modi Diwali Reply To Trump) ఓ ట్వీట్ చేశారు.దీపావళి సందర్భంగా భారత ప్రధాని మోదీతో మాట్లాడినట్లు ట్రంప్(Trump Diwali Wishes) చెప్పిన సంగతి తెలిసిందే. ప్రపంచ వాణిజ్యం సహా పలు అంశాలు తమ మధ్య చర్చకు వచ్చినట్లు చెప్పారాయన. ఈ క్రమంలో థ్యాంక్యూ చెబుతూ మోదీ బుధవారం ఉదయం ఓ ట్వీట్ చేశారు.వెలుగుల పండుగ పూట(Diwali).. ఈ రెండు ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచానికి ఆశాకిరణాలు ప్రసరింపజేస్తూ ముందుకు సాగాలి. ముఖ్యంగా.. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలి అని మోదీ ట్వీట్ చేశారు.Thank you, President Trump, for your phone call and warm Diwali greetings. On this festival of lights, may our two great democracies continue to illuminate the world with hope and stand united against terrorism in all its forms.@realDonaldTrump @POTUS— Narendra Modi (@narendramodi) October 22, 2025పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ ఈ ఏడాది మే మొదటి వారంలో ఆపరేషన్ సిందూర్ను చేపట్టి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఆ సమయంలో ఇరు దేశాల ఉద్రిక్తతలను తానే ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించుకుంటూ వస్తున్నారు. అయితే కాల్పుల విరమణలో ఆయన ప్రమేయాన్ని భారత్ మాత్రం ఖండిస్తూ వస్తోంది. మరోవైపు.. పాక్ మాత్రం ట్రంప్ చెప్పిందే నిజమని, ఆయన చొరవతోనే యుద్ధం ఆగిందని, అందుకే ఆయన్ని నోబెల్ శాంతి బహుమతికి నామినేటె్ చేశామని అంటోంది. ఈ క్రమంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ‘గాజా శాంతి సదస్సు’లో ప్రసంగిస్తూ ట్రంప్ భజనకు దిగగా.. ఆ దేశ ప్రజలే ఆ వ్యవహారాన్ని భరించలేక సోషల్ మీడియాలో ట్రోల్ చేసి పడేశారు.ఇంకోవైపు,.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత్ను ఉద్దేశిస్తూ రష్యా చమురు కొనుగోళ్ల చేసే ప్రకటనల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మంగళవారం (స్థానిక కాలమానం ప్రకారం) వైట్హౌస్లో దీపావళి వేడుకలు నిర్వహించారు. ఇందులో ట్రంప్తో సహా కీలక అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భారతీయ- అమెరికన్లకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.‘భారతదేశ ప్రజలకు మా దీపావళి శుభాకాంక్షలు. భారతీయులంటే నాకు చాలా ఇష్టం. ఇరుదేశాల మధ్య కొన్ని ముఖ్యమమైన ఒప్పందాల కోసం పని చేస్తున్నాం. రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనబోదని వ్యాఖ్యానించారు. నేను ఈ రోజు మీ ప్రధానితో మాట్లాడాను. మా మధ్య గొప్ప సంభాషణ జరిగింది. అనేక విషయాల గురించి మేం మాట్లాడుకున్నాం. వాణిజ్యం గురించి చాలాసేపు చర్చించాం. ఆయనకు దానిపై చాలా ఆసక్తి ఉంది. పాకిస్థాన్తో ఘర్షణలు వద్దనే విషయంపై మేము కొంతకాలం క్రితం మాట్లాడాం. వాణిజ్యం ద్వారానే అది సాధ్యమైందనుకుంటున్నా’ అని ట్రంప్ పేర్కొనడం గమనార్హం. ఇప్పటిదాకా.. రష్యా చమురు కొనుగోళ్లను భారత్ (India) నిలిపివేసిందని, నిలిపివేయబోతోందని, నిలిపివేయకపోతే భారీ సుంకాలు తప్పవంటూ ట్రంప్ రోజుకో స్టేట్మెంట్ ఇస్తూ వచ్చారు. ఇప్పుడేమో.. భారత్ పెద్ద మొత్తంలో చమురు (Russian Oil) కొనబోదంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదీ చదవండి: దీపావళికి ఏఐతో విషెస్.. మండిపడ్డ హిందువులు -
పాకిస్తాన్కు బిగ్ షాక్.. భారత్ విషయంలో తాలిబన్ల సంచలన ప్రకటన
కాబూల్: పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్(Afghanistan) మధ్య ఉద్రికత్తలు కొనసాగుతున్న వేళ దాయాది దేశానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత్-ఆప్ఘన్ బంధంపై విమర్శలు చేస్తున్న పాకిస్తాన్కు ఆప్ఘనిస్తాన్ రక్షణమంత్రి మవ్లావీ మొహమ్మద్ యాకూబ్ ముజాహిద్(Mawlawi Mohammad Yaqoob) స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. భారత్తో తమ బంధం తమ స్వతంత్ర నిర్ణయమని, ఈ విషయంలో పాకిస్తాన్(Pakistan) వాదన అసంబద్దమైనదని అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, దాయాది పాక్కు భారీ షాక్ తగిలినట్టు అయ్యింది.ఇటీవలి కాలంలో పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణం భారత్ అంటూ పాకిస్తాన్ ఆరోపిస్తోంది. భారత్ వల్లే ఆఫ్ఘనిస్థాన్ దాడులు చేస్తోందనే వాదనపై తాజాగా ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రి మౌలావి మొహమ్మద్ యాకూబ్ ముజాహిద్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ వ్యాఖ్యలు నిరాధారం.. అశాస్త్రీయమైనది. పాక్ ఆరోపణలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆఫ్ఘనిస్థాన్ స్వతంత్ర దేశంగా భారత్తో సంబంధాలను కొనసాగిస్తుంది. అదే సమయంలో పాకిస్తాన్తో మంచి సంబంధాలను కూడా కోరుకుంటుంది.రెచ్చగొడితే మూల్యం తప్పదు..ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఎవరికీ ఉపయోగపడవు. మా విధానంలో ఆఫ్ఘన్ భూభాగాన్ని ఇతర దేశాలకు వ్యతిరేకంగా ఉపయోగించడం ఎప్పుడూ ఉండదు. పాకిస్తాన్ దోహా ఒప్పందాన్ని గౌరవించడంలో విఫలమైతే మళ్లీ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఒకవేళ పాకిస్తాన్ దాడులు జరిపితే ఆఫ్ఘనిస్థాన్ తన భూభాగాన్ని ధైర్యంగా రక్షించుకుంటుంది అని హెచ్చరికలు జారీ చేశారు. ఇదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులను ఉగ్రవాదులుగా పాకిస్తాన్ ముద్ర వేయడాన్ని కూడా ఆయన విమర్శించారు. ఈ పదానికి స్పష్టమైన నిర్వచనం లేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.ఇదిలాఉండగా.. పశ్చిమాసియాలో కీలకమైన ఆఫ్ఘనిస్థాన్తో బంధాన్ని బలోపేతం చేసుకునే దిశగా భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఫలమిస్తున్నాయి. దీంతో అక్కడి తాలిబాన్ ప్రభుత్వంలో మంత్రులు భారత్కు అనుకూలంగా స్వరం పెంచుతున్నారు. ఇప్పటికే తాలిబాన్ విదేశాంగమంత్రి భారత్లో వారం రోజుల పాటు పర్యటించి వెళ్లారు. దీంతో పొరుగుదేశం పాక్లో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్-ఆప్ఘన్ బంధంపై పాకిస్తాన్ విమర్శలకు దిగుతోంది. అలాగే, దాడులకు పాల్పడింది. దీంతో ఈ వ్యవహారంలో మళ్లీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తలదూర్చాల్సి వస్తోంది. -
దీపావళి వేడుకల్లో ట్రంప్.. మోదీపై ప్రశంసలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం (స్థానిక సమయం) వైట్ హౌస్లో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత ప్రజలకు, భారతీయ అమెరికన్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. అలాగే, దీపావళి గురించి కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.దీపావళి వేడుకల్లో పాల్గొన్న సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ..‘భారతదేశ ప్రజలకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను ఈరోజు భారత ప్రధానమంత్రి మోదీతో మాట్లాడాను. మా మధ్య గొప్ప సంభాషణ జరిగింది. మేము ప్రపంచ వాణిజ్యం గురించి మాట్లాడుకున్నాం. ఆయనకు దానిపై చాలా ఆసక్తి ఉంది. ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి.. గొప్ప స్నేహితుడు. చాలా ఏళ్లుగా మోదీతో నాకు స్నేహం ఉంది. అలాగే, పాకిస్తాన్తో యుద్ధాలు వద్దు అని మేము కొంతకాలం క్రితం మాట్లాడాం. దాంట్లో వాణిజ్యం కూడా ఉందనేది వాస్తవం. ప్రస్తుతం పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధం లేదు. అది చాలా మంచి విషయం’ అని చెప్పుకొచ్చారు.BREAKING 🚨 President Trump just lit the diyas in celebration of Diwali. The Peace President 🙏 pic.twitter.com/kpDLTMRIkf— MAGA Voice (@MAGAVoice) October 21, 2025ఇదే సమయంలో దీపావళి పండుగ ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ అధ్యక్షుడు ట్రంప్..‘చీకటిపై కాంతి విజయంలో విశ్వాసానికి చిహ్నంగా మనం దీపాన్ని వెలిగిస్తాము. ఇది అజ్ఞానంపై జ్ఞానం మరియు చెడుపై మంచి. దీపావళి సందర్భంగా ఆనందించేవారు శత్రువులను ఓడించడం, అడ్డంకులు తొలగించడం.. బందీలను విడిపించడం గురించి పురాతన కథలను గుర్తుచేసుకుంటారు. దీపం నుంచి వచ్చే జ్వాల ప్రతి ఒక్కరికీ జ్ఞాన మార్గాన్ని వెతకడం, శ్రద్ధతో పనిచేయడం, అనేక ఆశీర్వాదాలకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్పడం గుర్తు చేస్తుంది’ అని తెలిపారు.⚡ US President Trump lights a diya in the Oval Office to celebrate Diwali. pic.twitter.com/yFfSgDiEse— OSINT Updates (@OsintUpdates) October 22, 2025వైట్హౌస్లో జరిగిన వేడుకల్లో ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్, ODNI డైరెక్టర్ తులసి గబ్బర్డ్, వైట్ హౌస్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ కుష్ దేశాయ్, అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా, భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ సహా ట్రంప్ పరిపాలన నుండి అనేక మంది సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ప్రముఖ భారతీయ-అమెరికన్ వ్యాపార నాయకుల ప్రతినిధి బృందం కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.NOW — POTUS Hosts A Diwali Celebration In The Oval Office 🪔"In the spirit of Diwali, we should acknowledge all the administration is doing to boost technology innovation leading to economic growth...Mr. President, I'd like to thank you." - Business Leader pic.twitter.com/oYJcaSxmr1— Townhall.com (@townhallcom) October 21, 2025 -
అమెరికాలోనే చదివిన వారికి లక్ష డాలర్ల ఫీజులేదు
న్యూయార్క్: హెచ్–1బీ వీసా దరఖాస్తుదారులందరిపై ఏకంగా ఒకేసారి లక్ష డాలర్ల ఫీజు గుదిబండ పడేసిన ట్రంప్ సర్కార్ హఠాత్తుగా ఒక వర్గం వారికి మాత్రం భారీ లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అమెరికాలో ఉంటూ విద్యనభ్యసిస్తూ హెచ్–1బీ కోసం దరఖాస్తుచేసుకున్న విద్యార్థులు ఈ అధిక వీసా ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదని ట్రంప్ ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు సోమవారం అమెరికా సిటిజన్షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) విభాగం ఒక నోటిఫికేషన్ జారీచేసింది.ఇప్పటికే అమెరికాలోని పలు రంగాల సంస్థల్లో పనులు చేస్తున్న విదేశీయులు చేసే దరఖాస్తులకు సైతం లక్ష డాలర్ల మినహాయింపు వర్తిస్తుందని యూఎస్సీఐఎస్ ఆ ప్రకటనలో పేర్కొంది. దీంతో ఇప్పటికే అమెరికాలో చదువుకుంటున్న, అక్కడి సంస్థల్లో పనిచేస్తున్న భారతీయులకు భారీ లబ్ధిచేకూరనుంది. విదేశాల్లోని వ్యక్తులు చేసే హెచ్–1బీ వీసా దరఖాస్తులకు మాత్రం లక్ష డాలర్ల ఫీజు ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది.అమెరికాలో విద్యనభ్యసిస్తూ ఎఫ్–1వీసా ఉండి దానికి హెచ్–1బీ వీసాగా మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వాళ్లు ఈ లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. సెపె్టంబర్ 21వ తేదీ మొదలవగానే అర్ధరాత్రి 12.01 నిమిషాల తర్వాత వచ్చే ప్రతి విదేశీ హెచ్–1బీ వీసా దరఖాస్తుదారులు తప్పకుండా లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుందని గతంలోనే ట్రంప్ ప్రభుత్వం స్పష్టంచేయడం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఏఏ వర్గాల వారికి ఈ అధిక ఫీజు మినహాయింపు ఉంటుందనే దానిపై సోమవారం యూఎస్సీఐఎస్ ఈ ప్రకటనలో స్పష్టతనిచ్చింది.. హాయిగా వెళ్లిరావొచ్చు ఇప్పటికే హెచ్–1బీ వీసా ఉన్న విదేశీయులు అత్యవసర పనుల నిమిత్తం స్వదేశం లేదా విదేశాలకు వెళితే మళ్లీ తిరిగొచ్చేటప్పుడు వీసా నిబంధనలు ప్రతిబంధకంగా మారుతాయన్న భయంతో చాలా మంది ఎక్కడికి వెళ్లకుండా అమెరికా గడ్డ మీదనే ఉండిపోతున్నారు. ఇలాంటి భయాలు అక్కర్లేదని హాయిగా అమెరికా నుంచి విదేశాలకు వెళ్లిరావొచ్చని ప్రభుత్వం స్పష్టంచేసింది. ‘‘హెచ్–1బీ వీసా పొడిగింపు, హెచ్–1బీ వీసాగా మార్పు, నివాస స్థితి పొడిగింపు వంటి దరఖాస్తులు ఇంకా పరిశీలనలో ఉన్నందున ఈలోపు అంతర్జాతీయ విమానప్రయాణం చేస్తే తమ వీసా స్టేటస్కు ముప్పు వస్తుందనే భయం ఎవరికీ అక్కర్లేదు’’అని గ్రీన్ అండ్ స్పైగల్ న్యాయసేవల సంస్థ ఉన్నతాధికారి డ్యాన్ బెర్జర్ చెప్పారు. చిన్న మెలిక పెట్టిన ప్రభుత్వంఅయితే, ఇప్పటికే అమెరికాలో ఉంటూ చదువుకుంటున్న లేదా ఏదైనా ఉద్యోగం చేస్తున్న విదేశీయులు చేసే ‘హెచ్–1బీ వీసాగా మార్పు’,‘నివాస స్థితి పొడిగింపు’,‘స్టేటస్ మార్పు’వంటి అభ్యర్థనలకు వాళ్లు అనర్హులు అని తేలితే వాళ్ల నుంచి కూడా లక్ష డాలర్ల ఫీజు వసూలుచేస్తామని యూఎస్సీఐఎస్ వ్యాఖ్యానించింది. ఈ లెక్కన ఏ దరఖాస్తునైనా ఉద్దేశపూర్వకంగా అనర్హమైనదిగా ప్రకటించి లక్ష డాలర్ల రుసుం కట్టాల్సిందేనని ఇమిగ్రేషన్ విభాగం ప్రకటిస్తే సమస్య మళ్లీ మొదటికొచ్చే ప్రమాదముందని కొందరు అభిప్రాయపడుతున్నారు.కొత్తగా విదేశాల నుంచి చేసే దరఖాస్తులకే లక్ష డాలర్ల ఫీజు ఉంటుంది. ఇప్పటికే హెచ్–1బీ వీసా ఉండి, దాని రెన్యూవల్ దరఖాస్తు ఆమోదం/పెండింగ్ స్థితిలో ఉండగా స్వదేశం వెళ్లిపోయిన విదేశీయులు మళ్లీ అమెరికాలోకి విమానంలో వచ్చినా వాళ్లకు సైతం ఫీజు మినహాయింపు ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం చూస్తే.. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులు మొదట అమెరికాలోనే చదువుకోవాలనేదే ట్రంప్ ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టమవుతోంది.గత కొన్నాళ్లుగా హెచ్–1బీ వీసా దరఖాస్తుల్లో భారతీయుల హవా కొనసాగుతోంది. భారతీయులు అమెరికా ఉద్యోగాలు కొల్లగొడుతున్నారని, వీరికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంలోనే లక్ష డాలర్ల ఫీజు ట్రంప్ తీసుకొచ్చారని తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వం ప్రతి ఏటా 65,000 హెచ్–1బీ వీసాలను జారీచేస్తోంది. ఇవిగాక అమెరికాలోనే మాస్టర్స్, అంతకుమించిన ఉన్నత విద్య చదివి ఉద్యోగాలు చేయాలనుకునే వారికి అర్హతల మేరకు మరో 20,000 హెచ్–1బీ వీసాలను అందజేస్తోంది. -
పాక్ స్మగ్లర్కు 40 ఏళ్ల జైలు శిక్ష విధించిన యూఎస్ కోర్టు
ఇరాన్ నుండి యెమెన్లోని హౌతీలకు బాలిస్టిక్ క్షిపణి భాగాలను అక్రమంగా రవాణా చేసినందుకు పాకిస్తాన్ పౌరుడు ముహమ్మద్ పహ్లావన్కు అమెరికాలోని వర్జీనియా కోర్టు 40 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అరేబియా సముద్రంలో అమెరికా సైనిక ఆపరేషన్ సందర్భంగా పహ్లావన్ను అరెస్టు చేశారు. గతేదాడి అమెరికా సైనిక ఆపరేషన్ చేపట్టగా, తాజాగా పాక్ పౌరుడు పహ్లావన్కు బుక్ అయ్యాదు. హౌతీలకు బాలిస్టిక్ క్షిప;ణులన అందించే క్రమంలో పహ్లావన్ సిబ్బంది తాము మత్స్యకారులుగా నమ్మించి అధికారుల్ని బురిడీ కొట్టించారు. ఎర్ర సముద్రం, అడెన్ గల్ఫ్లోని అంతర్జాతీయ వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని, వారు గాజా ప్రజలకు మద్దతుగా వ్యవహరిస్తూ ఆయధాల ఆక్రమ రవాణా చేసేవారు. అయితే తాము హౌతీలకు ఆయుధాలు సరఫరా చేయలేదని ఇరాన్ పదే పదే ఖండిస్తూ వచ్చింది. పహ్లావాన్ పడవలో దొరికిన ఆయుధాల అక్రమ రవాణాను కోర్టు ముందుకు తీసుకొచ్చిన యూఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు.. ఆయుధ వ్యవస్థలోని అత్యంత శక్తిమంతమైన ఆయధాలుగా నిరూపణ చేశారు. దాంతో పహ్లావన్కు 40 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ యూఎస్ కోర్టు తీర్పు చెప్పింది. -
జపాన్ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టం
జపాన్ దేశపు రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. జపాన్లో తొలి మహిళా ప్రధానిగా సనాయే టాకాయిచీ (Sanae Takaichi) ఎన్నికయ్యారు. ఓ మహిళ జపాన్లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ప్రధాని పదవికి షిగేరు ఇషిబా నిన్న రాజీనామా చేశారు. ఒక ఏడాదిపాటు జపాన్ ప్రధానిగా పని చేసిన ఆయన.. క్యాబినెట్తో సహా రాజీనామా సమర్పించారు. ఈ క్రమంలోనే సనాయే టాకాయిచీని ప్రధానిగా ఎన్నుంది ఆ దేశ పార్లమెంట్. లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ (LDP)కి ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 1993లో స్వతంత్ర అభ్యర్థిగా లోయర్ హౌస్లోకి ప్రవేశించిన ఆమె.. 1996లో ఎల్డీపీలో చేరారు. షిన్జో అబే మంత్రివర్గంలో ఆమె మంత్రిగా పని చేశారు.ఈ ఎన్నికతో జపాన్ రాజకీయాల్లో మహిళలకు అవకాశాలు పెరుగుతున్నాయని, కొత్త దిశలో మార్పు వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.France: మాజీ అధ్యక్షుడి జైలు జీవితం ప్రారంభం- -
వింత ఘటన: బొద్దింకను చంపబోయి..అపార్ట్మెంట్కే నిప్పటించింది..!
ఒక్కోసారి మనం చేసే పనులు ఎంత సీరియస్గా మారుతాయో అనేందుకు ఈ ఉదంతమే ఉదాహరణ. బహుశా అందుకే కాబోలు ఏ పనైనా చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అని అంటుంటారు పెద్దలు. ఈ ఘటన వింటే..ఎంత జాగురకతో ఉండాలో కచ్చితంగా అర్థమవుతుంది. అసలేం జరిగిందంటే..దక్షిణ కొరియాలో జరిగిన ఒక వింత ఘటన ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించడమే కాదు, అందర్నీ తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. అసలు ఇలా ఎలా జరిగిందని..అనుమానాలు లేవనెత్తేలా చర్చనీయాంశమైంది. ఒక మహిళ ప్రమాదవశాత్తు భవనానికి నిప్పంటిచడంతోనే ఈ ఘటన వార్తలో నిలిచింది. కేవలం బొద్దింకను చంపేందుకు ఫ్లేమ్ త్రోవర్(మండే స్ప్రే)ని ఉపయోగించడంతోనే ఈ దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. ఆమె బొద్దింకను చంపేందుకు ఎప్పుడైతే ఫ్లేమ్ త్రోవర్ ఉపయోగించిందో..ఆ మంటలు కాస్త వంటగదిలో ఉన్న వస్తువులకు వ్యాపించి..మొత్తం 32 అపార్ట్మెంట్ల రెసిడెన్సీ మంటల్లో చిక్కుకుపోయింది. రెండు నెలల శిశువుతో అదే ఫ్లోర్లో పొరుగున ఉన్న ఒక జంట ఈ ప్రమాదంలో చిక్కుకుపోయింది. పాపం వారు తమ బిడ్డను కాపాడుకునేందుకు పక్కంటి వారికి శిశువుని అప్పగించి కిటికీ గుండా తప్పించుకోవాలనుకున్నారు. ముందు భర్త బయటకు రాగా, ఆయన్నే అనుసరిస్తు వస్తున్న చైనాకు చెందిన మహిళ పట్టు తప్పి పడిపోయింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించిన ప్రయోజనం లేకుండా పోయింది. తీవ్ర గాయలపాలై మరణించిందామె. అంతేగాదు ఈ మంటలు గ్రౌండ్ఫ్లోర్లో వాణిజ్య యూనిట్లు, అక్కడే నివాసం ఉంటన్న కొన్ని కుటుంబాలు కూడా ప్రభావితమైనట్లు అధికారులు వెల్లడించారు. అంతేగాదు ఈ ప్రమాదం కారణంగా ఎనిమిదిమందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ దుర్ఘటనకు కారణం సదరు మహిళ నిర్లక్ష్యమే అంటూ ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్టు చేయాలని భావిస్తున్నారు పోలీసులు. పాపం ఏదో బొద్దింకల బెడద వదిలించుకోబోయి..చివరికి జైలుపాలై పరిస్థితి ఎదురైంది. ఏదో చేయిబోయి..ఇంకేదో అయినట్లు పాపం ఆ మహిళ ఒక్క బొద్దింకను మట్టుబెట్టాలనుకుంటే..ఓ ప్రాణాన్ని పొట్టనుబెట్టుకోవడం, పలువులరు గాయపడటానికి దారితీసింది.(చదవండి: క్యాబ్ డ్రైవర్గా మిలటరీ వైద్యుడు..! దయచేసి అలాంటి నిర్ణయం..) -
France: మాజీ అధ్యక్షుడి జైలు జీవితం ప్రారంభం
పారిస్: అక్రమంగా భారీగా నిధులు స్వీకరించారనే ఆరోపణలకు సంబంధించి గత నెలలో జైలు శిక్ష ఖరారైన ఫ్రాన్స్ మాజీ అద్యక్షుడు నికోలస్ సర్కోజీ జైలు జీవితం ప్రారంభమైంది. 2007 ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల సమయంలో లిబియాకు చెందిన గడాఫీ నేతృత్వంలోని ప్రభుత్వ నుండి సర్కోజీ అక్రమంగా భారీగా నిధులు స్వీకరించారనే ఆరోపణల దరిమిలా నమోదైన ఈ కేసులోని కొన్ని అభియోగాలనను కొట్టివేయగా, ఒకదానిలో నికొలస్ సర్కోజీని దోషిగా నిర్థారించిన న్యాయస్థానం ఆయనకు శిక్షను ఖరారు చేసింది.సర్కోజీకి జైలు శిక్షను తప్పనిసరిగా అమలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఆ సమయంలో జైలు శిక్ష తేదీ ఖరారు చేయని కోర్టు.. అటు తర్వాత ఆ తేదీని కూడా స్పష్టం చేయడంతో సర్కోజీకి తాజాగా జైలు జీవితం అనుభవించడానికి వెళ్లారు. పారిస్లోని లా సాంటే జైలులో సర్కోజీని ఉంచారు.నికొలస్ సర్కోజీ 2007 నుంచి 2012 వరకు ఫ్రాన్స్ అధ్యక్షునిగా పనిచేశారు. అయితే అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో గడాఫీ నేతృత్వంలోని లిబియా ప్రభుత్వం నుండి వచ్చిన ఆర్థిక సాయంపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నిధులను దౌత్య సహాయంగా చెప్పకుండా స్వీకరించారని, అవి తన ఎన్నికల ప్రచారానికి ఉపయోగించినట్లు పలువురు ఆరోపించారు. అవినీతి, ప్రచారానికి అక్రమ నిధుల వినియోగం, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం తదితర ఆరోపణలు రుజువు కానప్పటికీ.. నేరపూరిత కుట్రలో సర్కోజీని న్యాయస్థానం దోషిగా ప్రకటించి, ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.ఇదీ చదవండి:చైనాకు యూఎస్ వార్నింగ్.. భయమంతా అదే -
పాకిస్థాన్లో కేజీ టమాటా రూ.700
నిత్యావసర కూరగాయల్లో ముఖ్యమైన టమాటా ధర పాకిస్థాన్లో సామాన్యుడికి అందనంత దూరంలో ఉంది. అక్కడ కిలో టమాటా ధర రూ.700 పలుకుతుందంటే ఆ దేశంలో ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గత కొద్ది నెలలుగా పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితులన్నీ కలిసి టమాటా ధరలను ఆకాశానికి చేర్చాయి. టమాటా ధరల పెరుగుదలకు ప్రధానంగా ఈ క్రింది కారణాలు దోహదపడుతున్నాయి.ప్రకృతి వైపరీత్యాలు (వరదలు, వాతావరణ మార్పులు)పాకిస్థాన్లో చుట్టూ ఉన్న సింధ్, బలూచిస్థాన్, దక్షిణ పంజాబ్ ప్రాంతాల్లో గతంలో సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా వేలాది ఎకరాల్లో టమాటా పంట నాశనమైంది. దీని ఫలితంగా దేశీయ మార్కెట్లోకి టమాటా సరఫరా గణనీయంగా తగ్గిపోయింది. వరదలు, వాతావరణ మార్పుల వల్ల రహదారులు దెబ్బతినడం, రవాణా ఆలస్యం కావడం వంటి కారణాల వల్ల కూడా పంట ఉన్న ప్రాంతాల నుంచి మార్కెట్లకు సరుకు చేరడంలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభంపాకిస్థాన్ రూపాయి విలువ(భారత రూపాయితో పోలిస్తే పాక్ రూపాయి విలువ 0.31 పైసలుగా ఉంది) ఇతర కరెన్సీలతో పోలిస్తే భారీగా పడిపోతోంది. దీనివల్ల దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశీయంగా పంట నష్టం జరగడంతో టమాటా కొరతను తీర్చడానికి పాకిస్థాన్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ వంటి దేశాల దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుంది. అయితే పాక్ రూపాయి విలువ తగ్గడం, సరిహద్దుల్లో అనిశ్చితులు పెరగడం వల్ల దిగుమతి చేసుకునే టమాటా ధరలు అధికమయ్యాయి. గతంలో టమాటాకు సరైన ధరలు లభించకపోవడం, వాతావరణ మార్పుల వల్ల తరచుగా పంట నష్టాలు వాటిల్లడం వంటి కారణాల వల్ల రైతులు పంట సాగును తగ్గించారు.సీజనల్ కొరతటమాటా ధరలు సీజన్ను బట్టి తరచుగా మారుతుంటాయి. ముఖ్యంగా రెండు ప్రధాన పంటల సీజన్ల మధ్య కొద్దిపాటి కొరత ఏర్పడటం సర్వసాధారణం. అయితే ప్రస్తుత ఆర్థిక, వాతావరణ పరిస్థితులు ఈ సాధారణ కొరతను మరింత తీవ్రతరం చేశాయి. సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు కొంతమంది వ్యాపారులు పర్యవేక్షణ లోపాన్ని ఆసరాగా తీసుకుని కృత్రిమ కొరతను సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు.ఇదీ చదవండి: ప్రమోషన్ రావాలంటే 4 చిట్కాలు.. -
Pakistan: శుభాకాంక్షలకు ‘ఏఐ’.. ప్రధానిపై నెటిజన్ల ఆగ్రహం
న్యూఢిల్లీ: పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దీపావళి సందర్భంగా హిందువులకు అందించిన శుభాకాంక్షలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విమర్శలతో విరుచుకు పడుతున్నారు. ఒకవైపు పాకిస్తాన్లోని మైనారిటీలైన హిందువులపై దాడులు జరుగుతుండగా, మరోవైపు ఈ రకంగా ఈ శుభాకాంక్షలు చెప్పడమేమిటని ప్రశ్నిస్తున్నారు. పైగా దీపావళి శుభాకాంక్షలు చెప్పేందుకు ప్రధాని షరీఫ్ ‘ఏఐ’ వినియోగించారని ఆరోపిస్తున్నారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన సోషల్ మీడియా ఖాతాలో హిందువులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి దీపావళి ఒక గుర్తు. ఈ పండుగ శాంతి, సామరస్యం, కరుణలను మనలో పెంపొందించి, ఉమ్మడి శ్రేయస్సు వైపు నడిపించాలి’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ప్రధాని షరీఫ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్లో హిందువులు ఎదుర్కొంటున్న హింసను గుర్తు చేస్తూ, ప్రధాని అందించిన ఈ సందేశానికి ఏమైనా అర్థం ఉందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. On the auspicious occasion of Diwali, I extend my heartfelt greetings to our Hindu community in Pakistan and around the world.As homes and hearts are illuminated with the light of Diwali, may this festival dispel darkness, foster harmony, and guide us all toward a future of…— Shehbaz Sharif (@CMShehbaz) October 20, 2025ఒక యూజర్ ‘అసలు పాకిస్తాన్లో హిందువులెవరైనా మిగిలి ఉన్నారా? అని ప్రశ్నించగా, మరొకరు అక్కడి బలవంతపు మతమార్పిడులు, దేవాలయాలపై దాడుల ఘటనలను ప్రస్తావించారు. ‘పహల్గామ్లో హిందువులను హత్య చేశాక ఇలా దీపావళి శుభాకాంక్షలు చెప్పడం సిగ్గుచేటంటూ మరొకరు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక యూజర్ ‘ఇది దౌత్యమా? లేక చాట్ జీపీటీ మీ ఖాతాను హ్యాక్ చేసిందా?’ అని ప్రశ్నించారు. On the auspicious occasion of Diwali, I extend my heartfelt greetings to our Hindu community in Pakistan and around the world.As homes and hearts are illuminated with the light of Diwali, may this festival dispel darkness, foster harmony, and guide us all toward a future of…— Shehbaz Sharif (@CMShehbaz) October 20, 2025 -
చైనాకు యూఎస్ వార్నింగ్.. భయమంతా అదే..
ప్రపంచ వాణిజ్య వేదికపై అమెరికా (US), చైనాల మధ్య టారిఫ్లు, వాణిజ్యపరమైన ఆంక్షల రూపంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అరుదైన అయస్కాంత లోహాల సరఫరాను అడ్డుకోవద్దని అమెరికా చైనాకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ అమెరికా విధించిన టారిఫ్లకు ప్రతిచర్యగా ఈ కీలక లోహాల ఎగుమతులను నియంత్రించాలని చైనా చూస్తోంది. ఈ అరుదైన లోహాల ఉత్పత్తి, శుద్ధి ప్రక్రియలో చైనా ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం చెలాయిస్తోంది.ప్రపంచంలోని అరుదైన ఖనిజాల తవ్వకంలో దాదాపు 70%, వాటి శుద్ధిలో 90% వరకు చైనా నియంత్రిస్తోంది. ఈ ఏకఛత్రాధిపత్యం కారణంగా ఈ లోహాలపై ఎగుమతి నియంత్రణలను విధిస్తే అమెరికాపై చైనా గణనీయమైన ప్రభావాన్ని చూపగలదు. ఈ నేపథ్యంలో చైనా తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి, టారిఫ్లను తగ్గించుకోవడానికి ఈ లోహాల నియంత్రణను ఒక ‘ట్రంప్ కార్డ్’గా ఉపయోగించుకోవాలని చూస్తోంది.అరుదైన అయస్కాంత లోహాల ఉపయోగాలుఅరుదైన అయస్కాంత లోహాల్లో ముఖ్యంగా నియోడైమియం (Neodymium), ప్రెసోడైమియం (Praseodymium), డిస్ప్రోసియం (Dysprosium) వంటి మిశ్రమాలతో తయారైన శాశ్వత అయస్కాంతాలు (Permanent Magnets) కీలకంగా ఉన్నాయి. ఇవి ఆధునిక సాంకేతికతకు, డిఫెన్స్ రంగానికి వెన్నెముకగా ఉన్నాయి. ఇవి చాలా చిన్నవిగా, తేలికగా ఉండి శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తాయి. వీటిని ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఎలక్ట్రిక్ వాహనాల మోటార్లలో, పవన విద్యుత్ టర్బైన్ల జనరేటర్లలో కీలకం. ఇవి అధిక సామర్థ్యంతో శక్తి మార్పిడిని సాధ్యం చేస్తాయి.కంప్యూటర్ హార్డ్ డిస్క్లు, స్పీకర్లు, హెడ్ఫోన్లు, స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో ఇవి తప్పనిసరి.అధునాతన ఆయుధ వ్యవస్థలైన ఫైటర్ జెట్లు, క్షిపణులు, ఇతర స్మార్ట్ బాంబులు వంటి వాటిలో ఉపయోగించే మోటార్లు, సెన్సార్లకు ఈ అయస్కాంత లోహాలు ఎంతో అవసరం. ఈ కారణం వల్లనే ఈ లోహాలను వ్యూహాత్మకంగా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు.ఎంఆర్ఐ యంత్రాలు (మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్), పేస్మేకర్లు, హియరింగ్ ఎక్విప్మెంట్లు వంటి వైద్య పరికరాల్లో వీటిని ఉపయోగిస్తారు.పవర్ టూల్స్, రోబోటిక్స్, హై-పెర్ఫార్మెన్స్ ఏసీ సర్వో మోటార్లతో సహా అనేక పారిశ్రామిక అనువర్తనాలలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.అరుదైన అయస్కాంత లోహాల వివాదం కేవలం వాణిజ్య పరమైన సమస్య కాకుండా ప్రపంచ భద్రత, సాంకేతిక ఆధిపత్యం, గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఈ లోహాలపై చైనాకున్న పట్టు దాన్ని ఒక శక్తివంతమైన భౌగోళిక రాజకీయ ఆయుధంగా మారుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా, ఇతర దేశాలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి తమ సొంత అరుదైన లోహాల సరఫరా గొలుసులను బలోపేతం చేసుకోవాలి.ఇదీ చదవండి: ఆస్తులు పంచితే బజారున పడాల్సిందే.. -
H1b Visa: విదేశీ విద్యార్థులకు భారీ ఊరట
అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. కొత్త H-1B వీసా దరఖాస్తులపై 100,000 డాలర్ల ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందని అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్(USCIS) పేర్కొంది. హెచ్1బీ ఫీజు పెంపుపై స్పష్టత ఇచ్చే క్రమంలో పలు వివరాలను వెల్లడించింది.హెచ్-1బీ ఫీజు పెంపు కేవలం అమెరికా బయట నుంచి దరఖాస్తు చేసుకొన్నవారికే వర్తిస్తుందని పేర్కొంటూ అమెరికాలో చదువుకొంటున్న విద్యార్థులకు అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ తీపి కబురు చెప్పింది. అలాగే.. ఫీజు పెంపు ప్రకటన వెలువడే సమయానికి అమెరికాలోనే ఉన్నవారికి మినహాయింపు వర్తిస్తుందని వెల్లడించింది.ఇదిలా ఉంటే.. 2025 సెప్టెంబర్ 19న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ప్రెసిడెన్షియల్ ప్రోక్లమేషన్’ విడుదల చేశారు. దీని ప్రకారం, కొత్త H-1B వీసా దరఖాస్తులపై $100,000 ఫీజు విధించబడుతుంది. ఈ ఫీజు 2025 సెప్టెంబర్ 21 నుంచి కొత్త H-1B వీసా పిటిషన్లకు వర్తించడం అమలైంది. అయితే.. USCIS అక్టోబర్ 20న ఫీజు అమలులో పారదర్శకత, మినహాయింపు విధానం, అర్హత ప్రమాణాలు గురించి వివరిస్తూ స్పష్టమైన మార్గదర్శకాలను తెలియజేసింది.మరోవైపు ఓ జాతీయ మీడియా నిర్వహించిన ఈవెంట్లో పాల్గొన్న అమెరికా ఇమ్మిగ్రేషన్ న్యాయవాది నికోల్ గునారా మాట్లాడుతూ.. F-1 (విద్యార్థి వీసా), L-1 (ఇంటర్కంపెనీ ట్రాన్స్ఫర్ వీసా) లబ్ధిదారులు ఈ భారీ ఫీజు నుంచి విముక్తి పొందారని తెలిపారు. ఇది విదేశీ విద్యార్థుల భవిష్యత్తుకు ఉపశమనం కలిగించే నిర్ణయమని అన్నారు. ఇదిలా ఉంటే.. ఈ మార్పులు అమెరికాలో ఉన్న ఉద్యోగదారులకు, అలాగే విద్యార్థులకు.. ఇమ్మిగ్రేషన్ ఖర్చులను తగ్గించేందుకు దోహదపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.భారత్ నుంచి వెళ్లే విద్యార్థులు ఎక్కువగా అమెరికాలో నుంచే H-1Bకి మారుతారు. కాబట్టి. ఈ భారీ ఫీజు వాళ్లు చెల్లించాల్సిన అవసరం ఉండదన్నమాట. -
Gaza Truce: స్వరం మార్చిన అమెరికా అధ్యక్షుడు
గాజా శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్, హమాస్లు తూట్లు పొడుస్తున్నాయి. పరస్పర ఆరోపణలతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించాడు. మంచిగా ఉండకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారాయన. హమాస్ సంస్థకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మంచిగా ఉండాలని.. లేకుంటే అంతం తప్పదని అన్నారు. సోమవారం మీడియాతో ట్రంప్ ఇలా మాట్లాడారు.. ‘‘మంచిగా ఉండాలనే హమాస్తో ఒప్పందం కుదిర్చాం. కానీ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తామంటే ఊరుకోం. హమాస్ మళ్లీ రక్తపాతం కోరుకుంటే మాత్రం వాళ్లకు అంతం తప్పదు’’ అని పేర్కొన్నారు... కాల్పుల విరమణకు కొంత అవకాశం ఇస్తాం. హింస తగ్గుతుందని ఆశిస్తున్నాం. కానీ దాడులు కొనసాగితే ప్రతిస్పందన తప్పదు. వాళ్లు కొనసాగిస్తే మేమే రంగంలోకి దిగుతాం. ఆ పరిష్కారం చాలా వేగంగా.. తీవ్రంగా ఉంటుంది. అలాగని మా సైనికులను అక్కడికి పంపించబోం. శాంతి ఒప్పందంలో సంతకాలు చేసిన ఇతర దేశాలే ఆ సంగతి చూసుకుంటాయి. ఇజ్రాయెల్ను కోరితే కేవలం రెండు నిమిషాల్లో అక్కడ వాలిపోతారు. వెళ్లి వాళ్ల అంతు చూడండి అంటే.. చూసేస్తారు. కానీ, ఇప్పటివరకు నేను అలా చెప్పలేదు. అందుకే హమాస్కు మరో అవకాశం ఇస్తున్నా’’ అని ట్రంప్ అన్నారు.2023 అక్టోబర్ 7వ తేదీన మొదలైన గాజా యుద్ధం.. రెండేళ్ల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికతో ఆగింది. హమాస్, ఇజ్రాయెల కాల్పుల విరమణకు అంగీకరించడంతో పాటు పలు షరతులకు అంగీకరించడంతో అక్టోబర్ 13వ తేదీ నుంచి గాజా శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చింది. అయితే.. అక్టోబర్ 19వ తేదీన దక్షిణ గాజా రఫాలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(Israel Defense Forces) ఇంజనీరింగ్ వాహనంపై ఓ ఆంటీ-ట్యాంక్ మిస్సైల్ దూసుకొచ్చింది. ఈ దాడిలో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. ఈ ఘటనను ఇజ్రాయెల్ తీవ్రంగా పరిగణించి వైమానిక దాడులు జరపడంతో 19 మంది పాలస్తీనీయులు మరణించారు. తొలుత ఇజ్రాయెల్ బలగాలే దాడులు జరిపాయని హమాస్, హమాసే దాడి చేసిందని ఇజ్రాయెల్ పరస్పరం ఆరోపించుకున్నాయి.ఈ నేపథ్యంలో.. శాంతి ఒప్పందానికి వచ్చిన ఢోకా ఏం లేదని, తాజా దాడితో హమాస్ నాయకత్వంతో సంబంధాలు ఉండకపోవచ్చని, అది పూర్తిగా హమాస్ రెబల్స్ పని అయ్యిండొచ్చని ట్రంప్ మొన్న అభిప్రాయపడ్డారు. అయితే.. ఇరు వర్గాల దాడుల నేపథ్యంలో.. శాంతి ప్రణాళిక అమల్లో సంగ్దిగ్దత నెలకొంది. ఈ క్రమంలో ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా. అమెరికా ప్రతినిధులు జెరెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో భేటీ కానున్నారు. సరిగ్గా.. ఈ సమయంలో ట్రంప్ మరోసారి స్వరం మార్చేసి హమాస్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.ట్రంప్ మొన్న.. గాజా శాంతి ఒప్పందానికి వచ్చిన ఢోకా ఏం లేదు. కాల్పుల విరమణ ఇంకా అమలులో ఉంది. హమాస్ నాయకత్వానికి ఈ దాడులతో సంబంధం లేకపోయి ఉండొచ్చు. రెబల్స్ గ్రూప్స్ ఈ దాడులకు పాల్పడి ఉండొచ్చు. ట్రంప్ తాజాగా.. హమాస్ మంచిగా ఉండాలి. లేకుంటే వాళ్లకు అంతు తప్పదు. ఇజ్రాయెల్కు ఒక్కమాట చెబితే.. పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. కానీ, మరో అవకాశం ఇస్తున్నా. -
దిగిరాకపోతే 155 శాతం సుంకాలు: ట్రంప్
ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ యుద్ధం కొనసాగుతోంది. రష్యా చమురును కొనడం ఆపకపోతే భారీ సుంకాలు చెల్లించాల్సి వస్తుందని ఇండియాకు ఆయన హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా చైనాపైనా ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చైనాకు అమెరికాపై అపార గౌరవం ఉందని.. అందుకే ఎక్కువ టారిఫ్లు చెల్లిస్తోందని వెటకారంగా మాట్లాడారాయన. ఈ క్రమంలో.. భారీ సుంకాల మోత తప్పదంటూ హెచ్చరికల జారీ చేశారు. తాజాగా అమెరికా ఆస్ట్రేలియాతో 8.5 బిలియన్ డాలర్ల ‘అరుదైన ఖనిజాల’ ఒప్పందం(Rare Minerals Agreement) చేసుకుంది. సోమవారం ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ వైట్హౌజ్లో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఇద్దరూ మీడియాతో మాట్లాడుతున్న టైంలో.. ట్రంప్ కీలక ప్రకటన చేశారు. చైనా-అమెరికా ఈ ఇరు దేశాలు అద్భుతమైన ఒప్పందం కుదుర్చుకోవాల్సిందేనని, అలా జరగని పక్షంలో చైనా 155 శాతం సుంకాలు చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. చైనాతో అద్భుతమైన వాణిజ్య ఒప్పందం కుదరనుందని భావిస్తున్నా. ఈ ఒప్పందం రెండు దేశాలకు మాత్రమే కాకుండా ప్రపంచానికి కూడా మంచిదై ఉంటుంది. చైనా అమెరికా పట్ల చాలా గౌరవంగా వ్యవహరిస్తోందని.. ప్రస్తుతం 55% టారిఫ్ల రూపంలో భారీగా డబ్బు చెల్లిస్తోందని పేర్కొన్నారు. నవంబర్ 1న ఒప్పందం కుదరకపోతే టారిఫ్లు 155%కి పెరిగే అవకాశం ఉంది అని హెచ్చరించారు(Trump Warn China).అక్టోబర్ 31వ తేదీ నుంచి దక్షిణ కొరియా వేదికగా ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) సమావేశం జరగనుంది. అయితే.. దీనికంటే ముందే అక్టోబర్ 29, 30 తేదీలలో ట్రంప్ అక్కడ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో భేటీ కానున్నారు. తనకు చైనా అధ్యక్షుడికి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయనన ట్రంప్.. ఇరు దేశాలకు లాభదాయకంగా ఉండే ఒప్పందం కుదిరే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు.చైనా ప్రపంచంలో అరుదైన ఖనిజాల (Rare Earth Materials) ప్రధాన సరఫరాదారు. వీటి సాయంతోనే స్మార్ట్ఫోన్లు, యుద్ధ విమానాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర ఆధునిక సాంకేతిక పరికరాల తయారు అవుతుంటాయి. అయితే.. చైనా ఈ ఎగుమతులపై నియంత్రణలు పెంచింది. దీంతో అమెరికా సహా ఇతర దేశాలకు ఈ ఖనిజాలు అందుబాటులో ఉండటం కష్టతరమయ్యే చాన్స్ ఉంది. అందుకే ట్రంప్ చైనాతో మంచి వాణిజ్య ఒప్పందం కుదిరితే, ఇలాంటి సమస్యలు తగ్గుతాయని ఆశిస్తున్నారు.ఇదీ చదవండి: అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చిన నెతన్యాహు! -
హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ భీకర దాడి
లెబనాన్లోని హిజ్బుల్లా ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఈ దాడుల్లో నబాతియే (Nabatieh) ప్రాంతంలోని కీలక ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి.ఈ దాడులపై ఐడీఎఫ్ ప్రతినిధి స్పందిస్తూ.. ఉత్తర కమాండ్ నేతత్వంలో ఐడీఎఫ్.. లెబనాన్లోని నబతియే ప్రాంతంలో హిజ్బుల్లా ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించిందని తెలిపారు. హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ లెబనాన్ అంతటా ఉగ్రవాద స్థావరాలను పునర్నిర్మించడానికి ప్రయత్నాలను కొనసాగిస్తోందని.. హిజ్బుల్లా కార్యకలాపాలు.. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయని ఐడీఎఫ్ పేర్కొంది. -
భారత్ పర్యటనకు నెతన్యాహు.. అమెరికాకు షాక్!
జెరూసలేం: భారత్-ఇజ్రాయెల్ మధ్య దౌత్య సంబంధాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఈ ఏడాది చివరిలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భారత్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.అమెరికా ఒత్తిడిని పక్కనపెట్టి భారత్ వైపు అడుగులుచైనా, భారత్, రష్యా వంటి దేశాలపై టారిఫ్ల పేరుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు దిగుతున్నారు. హమాస్తో యుద్ధాన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్కు హెచ్చరించారు. ఆ హెచ్చరికలకు తలొగ్గి కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ముందుకు వచ్చింది. అయినప్పటికీ హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ.. ఆ సంస్థ పూర్తిగా ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోయే వరకు గాజాలో యుద్ధం ముగియదని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో, అమెరికా ఒత్తిడిని పక్కనపెట్టి భారత్తో సత్సంబంధాలను మెరుగుపరచేందుకు ఇజ్రాయెల్ ప్రధాని భారత్లో పర్యటించనున్నారంటూ పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. వ్యూహాత్మక రంగాల్లో సహకారంనెతన్యాహు పర్యటన సందర్భంగా ఇరు దేశాలు శాస్త్ర సాంకేతిక రంగం, అంతరిక్ష పరిశోధనలు, రక్షణ, వాణిజ్యం, వ్యవసాయం, నీటి నిర్వహణ వంటి కీలక రంగాల్లో భారత్తో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశముంది. ఇప్పటికే ఇజ్రాయెల్, భారత్ మధ్య రక్షణ రంగంలో అనేక ఒప్పందాలు కొనసాగుతున్నాయి. ఈ పర్యటన ద్వారా వాటిని మరింత విస్తరించే అవకాశం ఉంది.అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ పాత్రఈ పరిణామం ద్వారా భారత్ అంతర్జాతీయ రాజకీయాల్లో తన ప్రాధాన్యతను మరోసారి నిరూపించుకుంటోంది. అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల సమయంలో భారత్తో ఇజ్రాయెల్ సత్సంబంధాలను మెరుపరచడం, భారత్కు ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యతను సూచిస్తుంది.ప్రపంచ వేదికపై భారత్ తన దౌత్య నైపుణ్యాన్ని సమర్థంగా ప్రదర్శిస్తోంది. అమెరికా టారిఫ్ బెదిరింపులకు వెనక్కి తగ్గకుండా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ..అంతర్జాతీయ స్థాయిలో తన స్థానాన్ని మరింత బలపరుస్తోంది. ఇప్పటికే ఆప్తమిత్రుడిగా ఉన్న రష్యాతో చమురు కొనుగోలు ద్వారా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుచుకుంది. ఓ వైపు యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోయిన గాజా ప్రజలకు మానవతా సహాయం అందిస్తూ, మరోవైపు ఇజ్రాయెల్తో సైనిక పరమైన ఒప్పందాలు కుదుర్చుకుంటూ, సమతుల్యమైన దౌత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ విధంగా, భారత్ తన అంతర్జాతీయ సంబంధాలను వ్యూహాత్మకంగా విస్తరించుకుంటూ, ప్రపంచ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తోంది. -
మోనాలిసాతో మొదలై.. ప్రపంచంలోనే భారీ చోరీ ఏదో తెలుసా?
మిస్టరీతో కూడిన చిరునవ్వు మోనాలిసా.. లియోనార్డో డా విన్సీ చిత్రించిన 16వ శతాబ్దం నాటి అపురూపమైన పెయింటింగ్. అలాంటి దానిని వందల మంది కాపాలా కాసే చోటు నుంచి దానిని దొంగలించడం సాధ్యమేనా?.. తాజాగా ప్రపంచ ప్రసిద్ధి పొందిన లూవ్ర్ మ్యూజియంలో జరిగిన చోరీని చూస్తే.. ‘అదేం పెద్ద విషయం కాకపోవచ్చు’ అనే సందేశాన్ని ఇస్తోంది.లూవ్ర్ మ్యూజియం.. 12వ శతాబ్దంలో ఇదొక కోట. తర్వాతి కాలంలో.. ఫ్రాన్స్ రాజులు దీనిని రాజభవనంగా మార్చేశారు. అయితే.. లూయీ XIV తన రాజభవనాన్ని వెర్సైల్లెస్కు మార్చారు. అప్పటి నుంచి కళాత్మక ప్రదర్శనలు ఉంచే చోటుగా మారిపోయింది. 1793లో ఫ్రెంచ్ విప్లవం అనంతరం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. Musée du Louvre అనే పేరుతో 18వ శతాబ్దం నుంచి దీనికి అధికారిక మ్యూజియం గుర్తింపు దక్కింది. ప్రస్తుతం Louvre museum ప్రపంచంలోనే అతిపెద్ద, సుప్రసిద్ధ కళా మ్యూజియం. మెసపటోమియా, ఈజిప్టు.. అనేక నాగరికతలకు చెందిన ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తాయి. గ్రీకు, రోమన్, ఫ్రెంచ్ రాజ్యాలకు చెందిన ప్రతీకలు ఇక్కడ కొలువు దీరాయి. మోనాలిసా, వీనస్ డి మిలో, వింగ్డ్ విక్టరీ ఆఫ్ సమోత్రేస్ వంటి కళాఖండాలు లూవ్ర్కు ప్రత్యేక ఆకర్షణ. గాజు పిరమిడ్ షేపులో ఉండే మ్యూజియం ఎంట్రెన్స్ అదనపు ఆకర్షణ. ప్రముఖ ఆర్కిటెక్ట్ ఏఐ పై డిజైన్ చేసిన ఈ ద్వారం 1989లో నిర్మించబడింది. పారిస్ నగరానికి ఆధునికతను చేర్చే చిహ్నంగా.. పిరమిడ్ 21.6 మీటర్ల ఎత్తు, 673 గాజు పలకలతో రూపొందించారు. అరోజుకు సగటున 30,000 మంది సందర్శకులు.. ఏటా దాదాపు కోటి మంది దీనిని సందర్శిస్తుంటారు. అందుకే భద్రతా కూడా అదే స్థాయిలో ఉంటుంది. కానీ.. 2025 అక్టోబర్ 19న లూవ్ర్ మ్యూజియంలో భారీ దోపిడీ జరిగింది. ఫ్రెంచ్ క్రౌన్ జ్యువెల్స్ విభాగం అపోలో గ్యాలరీలో నెపోలియన్ చక్రవర్తి కాలంనాటి విలువైన ఆభరణాలను నలుగురు దుండగులు దొంగలించారు. మోటార్ స్కూటర్లపై వచ్చిన దొంగలు.. నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో మ్యూజియం లోపలికి వెనకభాగం నుంచి చొరబడి(సీన్ నది వైపు).. సరుకు రవాణా ఎలివేటర్ ద్వారా గ్యాలరీలోకి ప్రవేశించారు. కట్టర్లు ఉపయోగించి రెండు డిస్ప్లే కేసులను ధ్వంసం చేశారు. అద్దాలను పగలగొట్టి తొమ్మిది విలువైన వస్తువులను అపహరించారు. కేవలం నాలుగు నుంచి ఏడు నిమిషాల వ్యవధిలోనే ఈ హైప్రొఫైల్ చోరీ జరిగింది. 🇫🇷 - BFMTV shares the first video of the criminal who is in the process of stealing the Napolean Era jewels in the Louvre museum. https://t.co/u0aXSP6yUv pic.twitter.com/DEuYEq39R7— EuroWatcher - News for you (@EuroWatcherEUW) October 20, 2025ఫ్రాన్స్ కల్చర్ మినిస్టర్ రాచిడా దాతి ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. చోరీకి గురైన 9 వస్తువుల్లో నెపోలియన్ చక్రవర్తికి చెందిన తలపాగా.. ముత్యాల హారంతో పాటు ఫ్రాన్స్ చివరి మహారాణి యూజెనీ(నెపోలియన్-3 సతీమణి) ముత్యాల హారం కూడా ఉందని ప్రకటించారామె. అయితే.. తొమ్మిది నగల్లో.. ఒకటి అక్కడే పడిపోయిందని, దానిని తిరిగి భద్రపరిచినట్లు చెప్పారు. వీటి విలువ వెలకట్టలేనిదని తెలుస్తోంది. ఈ ఘటనపై అంతర్జాతీయ దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు.. చోరీ నేపథ్యంలో మ్యూజియాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అలాగని వరల్డ్ ఫేమస్ అయిన లూవ్ర్ చరిత్రలో ఇదే మొదటి దోపిడేం కాదు. 1911లో సుప్రిసిద్ధ మోనా లిసా చిత్రాన్ని మ్యూజియంలో పని చేసిన విన్సెంజో పెరుగ్గియా అనే ఇటాలియన్ కార్మికుడు దొంగలించాడు. అతని అరెస్ట్తో రెండు సంవత్సరాల తర్వాత అది తిరిగి లభించింది. 1976లో గుస్తావ్ కుర్బెట్ ‘ది వేవ్’ చోరీకి గురైనా.. ఇప్పటికీ దొరకలేదు. 1983లో రెండు పురాతన కవచాలను దొంగలించగా.. 40 ఏళ్ల తర్వాత తర్వాత అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. చివరగా.. 1998లో Le Chemin de Sèvres అనే పెయింటింగ్ చోరికి గురై ఆ ఆచూకీ ఇప్పటిదాకా లభ్యం కాలేదు. లె చెమిన్ చోరీ తర్వాత లూవ్ర్ మ్యూజియంలో భద్రతను భారీగా పెంచారు. అయినా కూడా ఇలా జరగడం తీవ్ర చర్చనీయాంగా మారింది. అక్కడ చోరీ జరిగితే అది అసలు దొరకదని, దొరికినా అసంపూర్తిగా ఉంటుందనే మచ్చ ఒకటి ఉంది. ఈ నేపథ్యంలో తాజా చోరీ కేసులో అయినా పురోగతి ఉంటుందేమో చూడాలి.ప్రపంచంలోనే అత్యంత విలువైన చోరీ ఏదో తెలుసా?.. అమెరికా బోస్టన్ ఇసబెల్లా స్టువర్ట్ గార్డ్నర్ మ్యూజియంలో (Isabella Stewart Gardner Museum Heist) జరిగిన చోరీ.. చరిత్రలోనే అత్యంత విలువైన కళా దొంగతనంగా గుర్తించబడింది. అప్పటి అంచనా ప్రకారం చోరీకి గురైన కళాకృతుల విలువ రూ.500 మిలియన్ డాలర్లు. ఆనాడు ఏం జరిగిందంటే.. 1990 మార్చి 18వ తేదీన ఇద్దరు వ్యక్తులు పోలీసుల వేషంలో మ్యూజియంకు వచ్చారు. డిస్టర్బెన్స్ కాల్ ఉందని చెబుతూ లోపలికి వెళ్లి.. భద్రతా సిబ్బందిని గంటపాటు బంధించి తమ పని కానిచ్చారు. మొత్తం 13 కళా వస్తువులను దొంగిలించగా.. అందులో రెంబ్రాంట్, వెర్మీర్, డెగా.. లాంటి పాపులర్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఎఫ్బీఐ, ఇంటర్పోల్ రంగంలోకి దిగినా.. దొంగల ఆచూకీని కనిపెట్టలేకపోయాయి. ఈ కేసుకు సంబంధించి 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆ మ్యూజియంలో అవి దొరకకపోతాయా? అనే ఆశతో ఖాళీ ఫ్రేమ్లను వేలాడదీయడం చూడొచ్చు. అలాగే.. అంట్వెర్ప్ డైమండ్ హైస్ట్ (2003, బెల్జియం)లో.. సుమారు 100 మిలియన్ డాలర్ల విలువైన వజ్రాలు, బంగారం దొంగిలించారు. అందుకే దీనిని ఈ శతాబ్దపు భారీ చోరీ "Heist of the Century" అని పిలుస్తారు. హ్యారీ విన్స్టన్ జువెల్ రాబరీ (2008, పారిస్).. 108 మిలియన్ డాలర్ల విలువైన ఆభరణాలు దొంగిలించబడ్డాయి. ఈ చోరీలో దొంగలు మహిళల వేషంలో వచ్చారు. ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాక్ హైస్ట్ (2003).. సద్దాం హుస్సేన్ పాలనలో 1 బిలియన్ డాలర్ల నగదు కొట్టేసినట్లు ఒక అంచనా. ఇలా.. లూవ్ర్ చోరీ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత విలువైన దొంగతనాలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.ఇదీ చదవండి: స్కాండల్స్తో రాచరికాన్ని వదులుకున్న ప్రిన్స్ -
విమాన ప్రమాదం.. అదుపుతప్పి సముద్రంలోకి దూసుకెళ్లి..
హాంకాంగ్: హాంకాంగ్లో ఘోర విమాన ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో(Hong Kong Airport) కార్గో విమానం రన్వేపై అదుపు తప్పి సముద్రంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు సిబ్బంది చనిపోయినట్టు సమాచారం.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హాంకాంగ్లో అంతర్జాతీయ విమానాశ్రయంలో(cargo Flight Accident) సోమవారం తెల్లవారుజామున 3.50 సమయంలో బోయింగ్ 747-481 మోడల్కి చెందిన కార్గో విమానం ప్రమాదానికి గురైంది. దుబాయ్ నుంచి హాంకాంగ్ చేరుకొన్న ఎమిరేట్స్ విమానం అత్యంత రద్దీగా ఉండే నార్త్ రన్వేపై దిగి అదుపుతప్పి ఓ వాహనాన్ని ఢీకొని సముద్రంలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విమానాశ్రయ గ్రౌండ్ సిబ్బంది మృతి చెందారు. విమానంలో ఉన్న నలుగురు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.New footage of the Air ACT 747 that ran off the runway at Hong Kong International Airport this morning. pic.twitter.com/3tHlBwruwu— OSINTtechnical (@Osinttechnical) October 20, 2025ప్రమాదం కారణంగా విమానం పాక్షికంగా నీటిలో మునిగిపోయింది. బోయింగ్ 737 శ్రేణికి చెందిన EK9788 విమానాన్ని ఎమిరేట్స్ నుంచి తుర్కియే సంస్థ ఏసీటీ ఎయిర్ లైన్స్ లీజుకు తీసుకొని నడుపుతోంది. ప్రమాదం జరిగిన రన్వేను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అయితే విమానాశ్రయంలోని మిగతా రెండు రన్వేలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.‼️Sortie de piste d’un Boeing 747 Cargo à Hong Kong🔸L’appareil de la compagnie turque Air Act opérait un vol depuis Dubaï pour le compte d’Emirates🔸Le Boeing était à l’atterrissage piste 07L, quand il a fait une sortie latérale de piste et a terminé sa course dans la mer… pic.twitter.com/1LRFBnzv24— Aero Gazette ✈️ (@AeroGazette) October 20, 2025 -
‘భారత్కు భారీ సుంకాల మోతే..’ ట్రంప్ తీవ్ర హెచ్చరిక!
రష్యా-భారత్ చమురు వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. చమురు కొనుగోలును భారత్ తక్షణమే ఆపకపోతే భారీ సుంకాలు విధిస్తామని హెచ్చరించారాయన. ఈ క్రమంలో మోదీకి తనకు మధ్య ఫోన్ సంభాషణేదీ జరగలేదన్న భారత విదేశాంగ శాఖ ప్రకటనపైనా ఆయన స్పందించారు. ఆదివారం రాత్రి కొందరు రిపోర్టర్ల నుంచి ఆయనకు ఈ ప్రశ్న ఎదురైంది. దానికి స్పందిస్తూ.. ‘‘ఆయన(మోదీ) రష్యాతో ఇకపై చమురు వ్యాపారం ఉండబోదని నాతో స్పష్టంగా చెప్పారు. అయినా కూడా కొనుగోళ్లు జరుపుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇది ఇలాగే కొనసాగితే భారీ సుంకాలను ఆ దేశం ఎదుర్కొనక తప్పదు’’ అని ట్రంప్ హెచ్చరించారు(Trump On India Russia Oil Trade). ఆ సమయంలో.. ‘‘ప్రధాని మోదీ మీకు మధ్య ఇటీవలి ఫోన్ సంభాషణ జరిగిందన్న తమకు తెలియదని భారత ప్రభుత్వం చెబుతోంది కదా’’ అని ఓ రిపోర్టర్ ట్రంప్ వద్ద ప్రస్తావించారు. దానికి ఆయన స్పందిస్తూ.. ‘వాళ్లు అలా చెప్పాలనుకుంటే కచ్చితంగా భారీ సుంకాలు చెల్లించాల్సి వస్తుంది. కానీ, వాళ్లు అలా చేయాలనుకోరని నేను అనుకుంటున్నా’(Trump Warn India) అని బదులిచ్చారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను గణనీయంగా తగ్గించేసిందని, రాబోయే రోజుల్లో పూర్తిగా ఆపేస్తుందని, ఈ మేరకు తన స్నేహితుడు, భారత ప్రధాని మోదీ నుంచి తనకు స్పష్టమైన హామీ లభించిందని ట్రంప్ గత బుధవారం తన ఓవెల్ ఆఫీస్లో స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఇద్దరు నేతల మధ్య అలాంటి ఫోన్ సంభాషణేది జరగలేదన్న భారత విదేశాంగ శాఖ.. ఎవరి ఒత్తిళ్లు తమపై పని చేయబోవని, దేశ ప్రజల ప్రయోజనాల మేరకే ఎలాంటి నిర్ణయం అయినా ఉంటుందని తేల్చి చెప్పింది. అయితే ఆ మరుసటిరోజు కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ సమయంలో మాట్లాడుతూ.. రష్యా చమురును భారత్ కొనుగోలు చేయబోదని, ఢిల్లీ వర్గాల నుంచి తనకు స్పష్టమైన హామీ వచ్చిందని, ఉక్రెయిన్ యుద్ధంలో ఇది కీలక అడుగు అని, ఈ ప్రభావంతో రష్యా ఆర్థిక స్థితిపై ప్రభావం పడి యుద్ధం ఆగిపోతుందని అన్నారు.ఇదిలా ఉంటే.. భారత్తో వాణిజ్య ఒప్పందాలు సజావుగా లేవని, అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు వసూలు చేస్తోందని.. పైగా రష్యాతో చమురు వాణిజ్యం జరుపుతూ పరోక్షంగా ఉక్రెయిన్ యుద్ధానికి సహకరిస్తోందంటూ ట్రంప్ సంచలన ఆరోపణలకు దిగారు. ఈ క్రమంలో సుంకాల యుద్ధానికి దిగారు. భారత్పై జులై 31వ తేదీన 25 శాతం అదనపు సుంకాన్ని(ప్రతీకార సుంకాన్ని) విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. ఆ వెంటనే రష్యా చమురు కొనుగోలు నేపథ్యంతో ఆగస్టు 6వ తేదీన మరో 25 శాతం సుంకాన్ని పెనాల్టీగా విధించారు. అలా.. ఆగష్టు 27వ తేదీ నుంచి భారత్పై అమెరికా వివధించిన 50 శాతం టారిఫ్లు అమల్లోకి వచ్చాయి. ఈ సుంకాలను భారత్ అన్యాయంగా పేర్కొంటూనే.. మరోవైపు అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ట్రంప్ తాజా హెచ్చరికలపై భారత్ ఎలా స్పందిస్తుంది.. ఈ ప్రభావం ట్రేడ్ డీల్పై పడుతుందా? అనేది చూడాలి(Trump Massive Tariff Warn To India).ఇదీ చదవండి: ట్రంప్ది ముమ్మాటికీ నిరంకుశ పాలనే! -
గాజా యుద్ధం మళ్లీ మొదటికి! ట్రంప్ ఏమన్నారంటే..
గాజా సంక్షోభం మళ్లీ మొదటికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాల్పుల విమరణ ఒప్పందం కుదిరినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన దాడుల్లో.. ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు, 97 మంది పాలస్తీనీయులు మరణించారు. శాంతి ఒప్పందం ఉల్లంఘనపై ఇరు దేశాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో.. తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఆదివారం రాత్రి మార్-ఎ-లాగో నుంచి వాషింగ్టన్కు తిరుగు ప్రయాణం అవుతుండగా.. ఓ రిపోర్టర్ గాజా తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రశ్నించారు. గాజా కాల్పుల విరమణ ఒప్పందం ఇంకా అమల్లో ఉందని భావిస్తున్నారా? అనే అడగ్గా.. ఆయన ‘అవును’ అనే సమాధానం ఇవ్వడం కొసమెరుపు. ‘‘గాజా శాంతి ఒప్పందానికి వచ్చిన ఢోకా ఏం లేదు. మేము హమాస్తో పరిస్థితి చాలా శాంతియుతంగా ఉండేలా చూసుకోవాలనుకుంటున్నాం. కానీ, మీకు తెలుసు కదా.. వాళ్లు కొంచెం అతి చేస్తున్నారు. కొన్ని చోట్ల కాల్పులకు దిగుతున్నారు. అయితే.. ఆ దాడులకు హమాస్ నాయకత్వానికి సంబంధం లేదేమో అనిపిస్తోంది. బహుశా రెబల్స్ ఈ తరహా ఘటనలకు పాల్పడుతున్నారేమో. అయినా సరే.. ఈ వ్యవహారాన్ని పరిష్కరిస్తాం. అందుకోసం కఠినంగా అయినా వ్యవహరిస్తాం’’ అని ట్రంప్ సున్నితంగా హెచ్చరికలు జారీ చేశారు.ఏం జరిగిందంటే.. దక్షిణ గాజాలోని రఫా (Rafah) వద్ద ఇజ్రాయెల్ రక్షణ బలగాలపై హమాస్ దాడి జరిపింది. ఈ దాడిలో ఇద్దరు సైనికులు చనిపోయారు. ప్రతిగా ఇజ్రాయెల్ బలగాలు జరిపిన వైమానిక దాడుల్లో 19 మంది పాలస్తీనీయులు మరణించారు.ఇజ్రాయెల్ యాక్షన్.. అక్టోబర్ 19వ తేదీన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(Israel Defense Forces) ఇంజనీరింగ్ వాహనంపై ఓ ఆంటీ-ట్యాంక్ మిస్సైల్ దూసుకొచ్చింది. ఈ దాడిలో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. ఈ ఘటనను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా పరిగణించారు. ఇది హమాస్ పనేనని, కాల్పుల విరమణ ఒప్పందానికి స్పష్టమైన ఉల్లంఘనగా పేర్కొంటూ.. గాజాకు మానవతా సాయం ఆపేశారు. అంతేకాదు.. ప్రతిదాడులతో ప్రతీకారం తీర్చుకోవాలని సైన్యాన్ని ఆదేశించారు.దీంతో.. గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ బలగాలు దాడులు జరిపాయి. ఈ తాజా దాడుల్లో 19 మంది పాలస్తీనయులు మరణించారు. హమాస్ ఏమందంటే.. ఇదిలా ఉంటే రఫా దాడికి హమాస్.. రక్షణాత్మక చర్యలుగా చెబుతోంది. ఇజ్రాయెల్ బలగాలే తమపై ముందుగా దాడులు చేశాయని, ప్రతిగానే తామూ దాడులు చేయాల్సి వచ్చిందని చెబుతోంది. దీంతో ఇరు దేశాలు శాంతి ఒప్పందానికి తూట్లు పొడిచినట్లైంది. ఈ పరస్పర ఆరోపణలు.. గాజాలో శాంతి స్థితిని మరింత సంక్లిష్టంగా మార్చేసే పరిస్థితి నెలకొంది. అయితే.. ఈ దాడులతో గాజా శాంతి ఒప్పందానికి వచ్చిన నష్టమేమీ లేదని ట్రంప్ అంటున్నారు. ఇదీ చదవండి: నువ్వేం రాజువి కాదయ్యా బాబూ! -
నువ్వో డ్రగ్ డీలర్
పామ్ బీచ్(అమెరికా): అగ్రరాజ్యాధినేతననే అహంకారంతో తనకు నచ్చని ప్రతి దేశంపై ఆంక్షలు, నిషేధాజ్ఞల కొరడా ఝళిపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఈసారి కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోను లక్ష్యంగా చేసుకున్నారు. కొలంబియాలో తయారైన మాదకద్రవ్యాలు అమెరికాలోకి పోటెత్తుతున్నాయని, ఇందుకు గుస్తావోనే కారణమని ఆయనపై అంతెత్తున లేచారు. ఈ మేరకు ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఆదివారం ఒక పోస్ట్ చేశారు. ‘‘గుస్తావో ఒక పెద్ద అక్రమ మాదకద్రవ్యాల డీలర్. పేరు ప్రఖ్యాతలు లేని, అసలు ప్రాముఖ్యతే లేని రాజకీయనేత. కొలంబియా డ్రగ్స్ దందాను వెంటనే ఆపేయాలి. లేదంటే మిమ్మల్ని బాధపెడుతూ మేమే బలవంతంగా ఆపుతాం. కొలంబియా వ్యాప్తంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమ స్థాయిలో మాదకద్రవ్యాల తయారీని గుస్తావో పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. దేశీయంగా డ్రగ్స్ను ఆయన అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. అమెరికా నుంచి భారీస్థాయిలో నగదు సబ్సిడీలు, వెసులుబాట్లు పొందుతూ కూడా గుస్తావో డ్రగ్స్ ఉరవడికి అమెరికాలోకి రాకుండా ఆపలేకపోతున్నారు. ఇది నిజంగా అమెరికాను మోసంచేయడమే. ఇకపై కొలంబియాకు అమెరికా చేసే సాయం ఆపేస్తా’’అని ట్రంప్ హెచ్చరించారు. -
అమ్మాయిలకు విద్య..అందని ద్రాక్షే!
న్యూఢిల్లీ: అమ్మాయిలకు అన్యాయం జరిగినప్పుడల్లా వినిపించే ఒకే ఒక మాట లింగసమానత్వం. దశాబ్దాలుగా లింగసమానత్వం కోసం ప్రపంచదేశాలు పోరాడుతున్నా ఏదో ఒక రంగంలో లింగఅసమానతలు పెచ్చరిల్లుతున్నాయి. వీటికితోడు అమ్మాయిలు పాఠశాల విద్యకు దూరమవుతున్న ధోరణిలో ఏమాత్రం మార్పురావట్లేదని తాజాగా యునెస్కో ప్రపంచ విద్యా పర్యవేక్షణ(జెమ్) బృంద పరిశోధనలో తేలింది. విద్యసహా అన్ని రంగాల్లో లింగసమానత్వ సాధనే ధ్యేయంగా 1995లో చేసిన బీజింగ్ డిక్లరేషన్ ఇంకా లక్ష్యాన్ని చేరుకోలేదని యునెస్కో ఆవేదన వ్యక్తంచేసింది. దశాబ్దాలుగా కోట్లాది మంది అమ్మాయిలు ఇంకా కనీసం పాఠశాల విద్యకు కూడా నోచుకోవట్లేదని యునెస్కో జెమ్ బృందం వెల్లడించింది. మారని పరిస్థితి‘‘1995 ఏడాది నుంచి చూస్తే నేటి ఆధునిక ప్రపంచంలో విద్యావ్యవస్థలో లింగసమానత్వ సాధనకు కృషి అధికమైంది. ఇప్పుడు ప్రాథమిక, దిగువ, ఎగువ మాధ్యమిక పాఠశాలల్లో బాలురతో సమానంగా బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. మూడు దశాబ్దాల క్రితంతో పోలిస్తే ఇప్పుడు అన్ని దేశాల్లో 9.1 కోట్ల మంది అమ్మాయిలు ప్రాథమిక విద్య చదువుతున్నారు. కానీ మాధ్యమిక విద్య విషయానికి వచ్చేసరికి ఏకంగా 13.3 కోట్ల మంది అమ్మాయిలు పాఠశాలకు దూరంగా ఉండిపోతున్నారు. ఈ వైరుధ్యం అంతటా ఒకేలా లేదు. ప్రాంతాల వారీగా చూస్తే మధ్యాసియా, దక్షిణాసియా దేశాల్లో బాలికలు విద్యలో రాణిస్తుండగా సహారా ఆఫ్రికా ప్రాంతంలో బాలికలకు పాఠశాల విద్య అనేది అందని ద్రాక్షలా మిగిలిపోతోంది’’అని జెమ్ బృంద సభ్యులు ఒకరు మీడియాతో చెప్పారు. లాటిన్ అమెరికాలో మరోలా.. ‘‘ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, వేలాది పాలినేసియా, మైక్రోనేసియా, మెలనేసియా దీవుల సమాహారమైన ‘ఓషేనియా’లో గతంలో విద్యలో లింగసమానత్వం ఉండేది. ఇప్పుడది కరువైంది. ఇక లాటిన్ అమెరికా, కరేబియన్ దీవుల్లో మాధ్యమిక విద్యలో అబ్బాయిల కంటే అమ్మాయిలే అధికంగా రాణిస్తుండటం విశేషం. అయితే గినియా, మాలీ లాంటి దేశాల్లో పరిస్థితి అమ్మాయిల విషయంలో అధ్వాన్నంగా ఉంది. కొన్ని పాఠశాలల్లో అసలు విద్యారి్థనులే లేరు. కడు పేదరికం, బాల్య వివాహాలు, సౌకర్యాల లేమి, అనారోగ్యం వంటి కారణాలతో అమ్మాయిలకు పాఠశాల విద్య అనేది సుదూర స్వప్నంగా మారింది’’అని జెమ్ బృందసభ్యుడు వెల్లడించారు. మహిళా టీచర్ల ప్రాతినిథ్యం పెరగాలి విద్యలో నాయకత్వ స్థాయిలో మహిళల ప్రాతినిథ్యం సైతం తక్కువగా ఉంటోంది. పురుష టీచర్లతో పోలిస్తే మహిళా టీచర్ల సంఖ్య సైతం చాలా తక్కువగా ఉంది. ఉన్నత విద్యలో ఇంకా మహిళా టీచర్ల సంఖ్య 30 శాతమే. ఇలాంటి వ్యవస్థాగత అసమానతలు సైతం విద్యలో సమానత్వ సాధనకు ప్రతిబంధకాలుగా పరిణమిస్తున్నాయి. బాలికలు, అమ్మాయిల విద్యావకాశాలు మెరుగుపడేలా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తూ ప్రపంచం సంస్కరణపథంలో దూసుకుపోవాలని బీజింగ్ డిక్లరేషన్ చాటుతోంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్,మ్యాథమేటిక్స్(స్టెమ్) కోర్సు ల్లో అమ్మాయిల ప్రాతినిథ్యం పెరగాలని ఆనాడు ప్రపంచదేశాలు ఆకాంక్షించాయి. బాలికావిద్య అనేది కేవలం వాళ్ల హక్కు కాదు. అది మహిళల, చిన్నారుల, సమాజ భవిష్యత్తు. నాటి బాసలను నిలబెట్టుకున్ననాడే భవిష్యత్తుకు భరోసా ఉంటుంది’’అని నివేదిక హెచ్చరించింది. నెరవేరని ఆశయాలు, ఆకాంక్షలు ‘‘ప్రపంచవ్యాప్తంగా పాఠశాల్లో అమ్మాయిల చేరికలు అధికంగా ఉండాలని, ఆమేరకు అన్ని దేశప్రభుత్వాలు కృషిచేయాలని బీజింగ్ డిక్లరేషన్ ఉద్ఘాటించింది. కానీ ఆ లక్ష్యం ఇంకా నెరవేరలేదు. పాఠశాలల్లో లైంగిక విద్య సైతం ఖచి్చతంగా బోధించాలి. లేదంటే అదే లైంగిక అంశాలను చిన్నారులు పాఠశాల విద్యకు ఆవల తప్పుడు కోణంలో తెల్సుకుంటారు. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ వంటి అంశాలను చిన్నారులకు ప్రపంచంలో మూడింట రెండొంతుల దేశాల్లో ప్రాథమిక స్థాయిలోనే నేర్పించాలి. మాధ్యమిక విద్య స్థాయిలో నాలుగింట మూడొంతుల దేశాల్లో నేర్పించాలి’’అని నివేదిక అభిప్రాయపడింది. -
గాజాకు సాయం సరఫరా ఆపేశాం: ఇజ్రాయెల్
టెల్ అవీవ్: గాజాలోకి మానవతా సాయం సరఫరాను నిలిపివేసినట్లు ఇజ్రాయెల్ భద్రతాధికారి ఒకరు ఆదివారం తెలిపారు. తదుపరి ప్రకటన వెలువడే వరకు అనుమ తించబోమన్నారు. హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడి నట్లు ఆరోపించిన ఇజ్రాయెల్, అనంతరం ఈ మేరకు ప్రకటన చేయడం గమనార్హం. అమెరికా సారథ్యంలో రెండేళ్ల యుద్ధానికి ముగింపు పలుకుతూ కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం కనీసం వారంపాటు కూడా మానవతా సాయం సరఫరా కొనసాగకమునుపే ఈ పరిణా మం చోటుచేసుకుంది. ఆదివారం తమ బలగాలపైకి హమాస్ శ్రేణులు కాల్పులకు పాల్పడ్డాయంటూ ఇజ్రాయెల్ గాజాలోని పలుప్రాంతాలపై దాడులకు దిగింది. పాలస్తీనియన్ల కోసం ఆహారం, మందులు, దుప్పట్లు, టెంట్లు తదితర అత్యవసరాలను తీసుకువస్తున్న ట్రక్కులు ఈజిప్టు నుంచి రఫా క్రాసింగ్ ద్వారా గాజాలోకి ప్రవేశిస్తుండటం తెలిసిందే. -
పాక్, అఫ్గాన్ కాల్పుల విరమణ
ఇస్లామాబాద్: పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య శాంతి దిశగా ముందడుగు పడింది. తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఇరుపక్షాలు ఆదివారం అంగీకారానికి వచ్చాయి. రెండు దేశాల మధ్య సుదీర్ఘకాలం శాంతియుత పరిస్థితులు, స్థిరత్వం నెలకొనేలా చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. పాక్–అఫ్గాన్ సరిహద్దుల్లో కొన్ని రోజులుగా దాడులు, కాల్పులు, ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇరుదేశాల్లో పలువురు సైనికులు, సామాన్య ప్రజలు, ఉగ్రవాదులు మరణించారు. కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్, అఫ్గాన్ రక్షణ మంత్రి ముల్లా యాకూబ్ మధ్య ఖతార్ రాజధాని దోహాలో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ చర్చల కోసం ఖతార్, తుర్కియే దేశాలు చొరవ తీసుకున్నాయి. కాల్పులు వెంటనే ఆపేయాలని పాక్, అఫ్గాన్ అంగీకారానికి వచి్చనట్లు ఖతార్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. అలాగే రాబోయే రోజుల్లో తరచుగా సమావేశం కావాలని, శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని, భద్రత, స్థిరత్వానికి కట్టుబడి ఉండాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నట్లు తెలియజేసింది. -
రష్యా గ్యాస్ ప్లాంట్పై ఉక్రెయిన్ డ్రోన్ దాడి
కీవ్: కజఖ్స్తాన్ సరిహద్దుల్లో ఉన్న రష్యాకు చెందిన గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్పై శనివారం రాత్రి ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసింది. భారీ పేలుళ్లు సంభవించడంతోపాటు పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో, ప్లాంట్ను మూసివేసినట్లు రష్యా, కజకిస్తాన్ అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని గాజ్ప్రోమ్ సంస్థకు చెందిన ఒరెన్బర్గ్ ప్లాంట్లో కజఖ్స్తాన్ నుంచి వచ్చే గ్యాస్ను ప్రాసెసింగ్ చేస్తారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఒరెన్బర్గ్ ప్లాంట్ వార్షిక సామర్థ్యం 45 బిలియన్ క్యూబిక్ మీటర్లు. డ్రోన్ దాడి కారణంగా ఈ ప్లాంట్లోని వర్క్షాప్ తీవ్రంగా దెబ్బతిందని అధికారులు తెలిపారు. ప్లాంట్లో తాత్కాలికంగా గ్యాస్ ప్రాసెసింగ్ను నిలిపివేశామన్నారు. రష్యా తమపై సాగిస్తున్న యుద్ధానికి ఇంధన వనరులే కీలకమని భావిస్తున్న ఉక్రెయిన్ తరచూ ఆయిల్, గ్యాస్ రిఫైనరీలపై డ్రోన్ దాడులకు తెగబడుతోంది. మరో డ్రోన్ దాడితో ఒరెన్బర్గ్ సమీపంలో నొవొకుయి బషెవ్స్క్ ఆయిల్ రిఫైనరీ ప్రధాన శుద్ధి విభాగం దెబ్బతిందని ఉక్రెయిన్ ప్రకటించింది. ఇలా ఉండగా, రష్యా ఆధునీకరించిన గ్లైడ్ బాంబును ఖర్కీవ్లోని లొజావా నగరంపై శనివారం మధ్యాహ్నం ప్రయోగించిందని వెల్లడించింది. యూఎంపీబీ–5 ఆర్ అని పిలిచే రాకెట్ అమర్చిన ఈ రకం బాంబులు 130 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించిన తర్వాత సంభవించే పేలుడుతో తీవ్ర విధ్వంసం సంభవిస్తుంది. -
ట్రంప్ రాజు కాదు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా జనం తిరుగుబాటు ప్రారంభించారు. ‘నో కింగ్స్’ పేరిట శనివారం దేశవ్యాప్తంగా వేర్వేరు నగరాల్లో నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించారు. లక్షల మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ట్రంప్కు వ్యతిరేకంగా గళమెత్తారు. ట్రంప్ రాజు కాదని, ఇక్కడ రాజులెవరూ లేరని, నిరంకుశ పరిపాలన ఆపాలని పెద్ద ఎత్తున నినదించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. దేశాన్ని నాశనం చేయొద్దని డిమాండ్ చేశారు. నియంతృత్వ పరిపాలనను ప్రతిఘటించడం, నిరసన తెలపడమే అసలైన దేశభక్తి అని ప్రజలు తేల్చిచెప్పారు. న్యూయార్క్లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్తోపాటు బోస్టన్, అట్లాంటా, షికాగో తదితర నగరాల్లో నిరసనకారులు కదం తొక్కారు. వాషింగ్టన్, లాస్ ఏంజెలెస్ సహా వివిధ నగరాల్లో వేలాది ప్రదర్శనలు జరిగాయి. ట్రంప్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ జనం వీధుల్లోకి వచ్చారు. గాలితో నింపిన దుస్తుల్లాంటివి ధరించారు. అమెరికా రాజ్యాంగ ప్రవేశికను ముద్రించిన బ్యానర్లపై సంతకాలు చేశారు. తాము ముమ్మాటికీ అసలైన ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నామని తేల్చిచెప్పారు. నియంతగా మారుతున్న ట్రంప్ నిరసన ప్రదర్శనలపై అధికార రిపబ్లికన్ పార్టీ అభ్యంతరం వ్యక్తంచేసింది. అవన్నీ ‘అమెరికాను ద్వేషించే’ ర్యాలీలు అంటూ ఆరోపించింది. ట్రంప్ మద్దతుదారులు సైతం ఈ ర్యాలీలను తప్పుపట్టారు. ట్రంప్కు వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచి్చన తర్వాత ఆయనకు వ్యతిరేకంగా జనం సామూహికంగా నిరసన తెలపడం ఇది మూడోసారి కావడం గమనార్హం. కొన్నిరోజుల క్రితం అమెరికాలో షట్టౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ సేవలు, ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రంప్ నిర్వాకం వల్లే తమకు ఈ కష్టాలు వచ్చాయని వారు మండిపడ్డారు. అమెరికా కాంగ్రెస్ నిర్ణయాలను తప్పుపట్టారు. నిరంకుశ అధికారం చెల్లబోదని తేల్చిచెప్పారు. ట్రంప్ విధానాలు తమకు ఎంతమాత్రం నచ్చడం లేదని ఇరాక్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికురాలు షాన్ హోవార్డ్ చెప్పారు. తాను గతంలో ఎన్నడూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనలేదని, ఇదే మొదటిసారి అని తెలిపారు. ట్రంప్ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ముందుకెళ్తోందని, వలసదారులను అక్రమంగా నిర్బంధించడం ఏమిటని మండిపడ్డారు. ప్రధాన నగరాల్లో సైన్యాన్ని మోహరించడం సరైంది కాదన్నారు. ఇదంతా ‘అన్–అమెరికన్’ అని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యం ధ్వంసమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. తమ అధ్యక్షుడు ట్రంప్ నియంతగా మారిపోతున్నారని మరో నిరసనకారుడు ధ్వజమెత్తారు. ఇదిలా ఉండగా, నిరసన కార్యక్రమాల విషయంలో ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలియజేశారు. జెట్ విమానంలో ‘కింగ్ ట్రంప్’ తనకు వ్యతిరేకంగా దేశమంతటా నిరసన కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ట్రంప్ గోల్ఫ్ ఆడుతూ ఉల్లాసంగా గడిపారు. ‘నో కింగ్స్’ నినాదాన్ని హేళన చేస్తూ కింగ్ ట్రంప్ పేరిట ఒక కృత్రిమ మేధ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇందులో కిరీటం ధరించిన ట్రంప్ జెట్ విమానంలో కూర్చొని దూసుకెళ్తున్నారు. బాంబుల తరహాలో ఈ విమానం బురదను చిమ్ముతోంది. ఆ బురదంతా అమెరికాలో నగరాల్లోని నిరసనకారులను కమ్మేస్తోంది. ట్రంప్ తనను తాను బలమైన రాజుగా పరోక్షంగా ప్రకటించుకున్నారు. నిరసన ర్యాలీలను లెక్కచేయబోనని, బురదతో సన్మానిస్తానని సంకేతాలు పంపించారు. -
ఫ్రాన్స్లో భారీ చోరీ
పారిస్: ఫ్రెంచ్ ్రౖఫైస్ దుంపల వేపుడును తినాలన్నా ఏడెనిమిది నిమిషాలు పడుతుంది. అంతకంటే తక్కువగా అంటే కేవలం నాలుగు నిమిషాల్లోనే చోరశిఖామణులు వెలకట్టలేని చారిత్రక వజ్రాభరణాలను దొంగలించిన ఉదంతం ఫ్రాన్స్లో జరిగింది. పారిస్ నగరంలో ప్రపంచ ప్రఖ్యాత లౌరీ మ్యూజియంలో ఆదివారం ఉదయం భారీ చోరీ చోటుచేసుకుంది. నెపోలియన్ చక్రవర్తి, రాణి సేకరించిన అరుదైన, పురాతన వజ్రాభరణాలను దొంగలు అలవోకగా కాజేసి ఎంచక్కా బైక్లపై ఉడాయించిన ఉదంతం ఇప్పుడు ఫ్రాన్స్సహా యూరప్ దేశాల్లో చర్చనీయాంశమైంది. విశ్వవిఖ్యాత లియోనార్డో డావిన్సీ ‘మోనాలిసా’ చిత్రరాజం సైతం ఇదే మ్యూజియంలో కొలువై రోజూ వేలాది మంది ప్రపంచపర్యాటకులను ఆకర్షిస్తున్న విషయం తెల్సిందే. వందేళ్ల క్రితం ఇదే మ్యూజియంలో ఇదే మోనాలిసా పెయింటింగ్ సైతం చోరీకి గురై రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు దొరికింది. ఇప్పుడు ఆదివారం చోరీకి గురైన అత్యంత విలువైన వజ్రాభరణాలు ఎప్పుడు దొరుకుతాయో, అసలు దొరుకుతాయో లేదోనన్న చర్చ ఇప్పుడు ఫ్రాన్స్లో ఎక్కువైంది. మ్యూజియం తలపులు తెరచిన అరగంట తర్వాత ఈ చోరీ జరగడం గమనార్హం. అపోలో గ్యాలరీలోకి ఇంకా ఎవరూ రాకముందే ఈ చోరీ జరిగినట్లు తెలుస్తోంది.బాస్కెట్ లిఫ్ట్తో వచ్చి, కట్టర్తో కత్తిరించి..దొంగలు పక్కా ప్రణాళికతో వచ్చి దొంగతనం చేసినట్లు స్పష్టమవుతోంది. ఎక్కడా ఎలాంటి అనుమానం రాకుండా చడీచప్పుడులేకుండా తమ పని కానిచ్చేశారు. ఫ్రెంచ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముగ్గురు లేదా నలుగురు ముసుగు ధరించిన వ్యక్తులు ఈ చోరీ చేశారు. మ్యూజియంకు కుడివైపున ‘సీన్’ నది ప్రవహిస్తోంది. అటువైపు మ్యూజియం గోడ వద్ద మరమ్మతులు జరుగుతున్నాయి. అదే ప్రాంతాన్ని దొంగలు తమకు అనువుగా మలచుకున్నారు. వీధుల్లో ఎత్తయిన వీధిలైట్లను మార్చేందుకు వాడే ‘బాస్కెట్’ హైడ్రాలిక్ లిఫ్ట్ సాయంతో పైకి వచ్చి ఉదయం 9.30 గంటలప్పుడు మ్యూజియం భారీ కిటికీ వద్దకు చేరుకున్నారు. వెంట తెచ్చుకున్న పదునైన రంపపు కోత మెషీన్లతో దానిని పరపరా కోసేశారు. తర్వాత నేరుగా డెనన్ వింగ్ విభాగం హాల్లో ఉన్న అపోలో గ్యాలరీలోకి ప్రవేశించారు. ఈ గ్యాలరీలో సాధారణంగా ఫ్రాన్స్ చక్రవర్తుల సంబంధిత 23 కిరీటాలు, ఆభరణాలను ప్రదర్శనకు ఉంచుతారు. అందులోనే నెపోలియన్–3 రాజు, రాణిలకు సంబంధించిన వజ్రా భరణాలు ఉన్నాయి. ప్రదర్శన పేటికలను బద్దలు కొట్టి వీటిల్లో తొమ్మిదింటిని దొంగలు ఎత్తుకెళ్లారు. అయితే వాటిల్లో రాణి యుజెనీకి చెందిన ఒక కిరీటంలోంచి విరిగిపడిన కొన్ని ముక్కలు మాత్రం మ్యూజియం ఆవరణలో కనిపించాయి. వీటిని పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. మ్యూజియం వెబ్సైట్లో పేర్కొన్న ప్రకారం ఈ స్వర్ణకిరీటంలో 1,354 చిన్న వజ్రాలు, 56 మరకతమణులు పొదిగి ఉన్నాయి.ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియంవిస్తీర్ణంపరంగా లౌరీ మ్యూజియం ప్రపంచంలోనే అతిపెద్దది. 73,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అంటే ఏకంగా 10 ఫుట్బాల్ స్టేడియాల విస్తీర్ణంలో ఈ మ్యూజియం ఉంటుంది. ఏకంగా 35,000 పురాతన వస్తువులను ఇందులో ప్రదర్శిస్తారు. ప్రపంచంలో అత్యంత సందర్శకుల రద్దీ ఉన్న మ్యూజియం కూడా ఇదే.ఇంటిదొంగల పనా?మ్యూజియంలోని ఉద్యోగుల పాత్ర ఏదైనా ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. దొంగలు ఉపయోగించిన బాస్కెట్ లిఫ్ట్ను పారిస్లో సర్వసాధారణంగా వాడతారు. అపార్ట్మెంట్లలో మూడు, నాలుగు అంతస్తుల ఫ్లాట్లలోకి ఫర్నీచర్ను తరలించేందుకు దీనినే వాడతారు. ఈ హైడ్రాలిక్ నిచ్చెనను చెర్రీ పికర్ అని కూడా పిలుస్తారు. ఇది అక్కడ ఉండటంతో అటుగా వెళ్లేవాళ్లకు ఎలాంటి అనుమానం రాలే దని తెలుస్తోంది. అపోలో గ్యాలరీలో అత్యంత విలువైన రీజెంట్, సాన్సీ, హోర్టెన్సియా వజ్రాలను సైతం ప్రదర్శనకు ఉంచారు. ఇవి చోరీకి గురయ్యాయో లేదో తెలియరాలేదు. ఇది మాత్రమేకాదు ప్రాన్స్లో మ్యూజియంలలో చోరీలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో పురాతన వస్తువులకు విపరీతమైన డిమాండ్ పెరగడంతో వాటి కోసం దొంగలు మ్యూజియంలపై పడుతున్నారు. ఇదీ చదవండి:హమాస్ మరో డేంజర్ ప్లాన్.. అమెరికా సీరియస్ వార్నింగ్ -
హమాస్ మరో డేంజర్ ప్లాన్.. అమెరికా సీరియస్ వార్నింగ్
వాషింగ్టన్: గాజాలోని పౌరులపై దాడులు చేసేందుకు హమాస్ (Hamas) ప్రణాళికలు రచిస్తోందని కలకలం రేపింది. హమాస్ దాడుల ప్రణాళిక గురించి తమ వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని అమెరికా (USA) విదేశాంగ శాఖ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో, రంగంలోకి దిగిన అమెరికా.. హమాస్కు హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి చర్యలకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది.ఇజ్రాయెల్-హమాస్ మధ్య సుదీర్ఘ యద్ధం జరిగిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో ఇజ్రాయెల్- హమాస్ (Israel- Hamas)ల మధ్య ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ బందీలను సైతం హమాస్ విడుదల చేసింది. అయితే, గాజాలోని పౌరులపై దాడులు చేసేందుకు హమాస్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం బయటకు రావడం తీవ్ర కలకలం రేపింది. ఈ సందర్బంగా అమెరికా (USA) విదేశాంగ శాఖ అలర్ట్ అయ్యింది. పాలస్తీనా పౌరులపై హమాస్ దాడి ప్రణాళిక.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని అమెరికా పేర్కొంది.తమ మధ్యవర్తిత్వ ప్రయత్నాలతో సాధించిన గణనీయమైన పురోగతిని ఇది దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. హమాస్ ఈ దాడులకు పాల్పడితే.. గాజా ప్రజలను రక్షించడానికి, కాల్పుల విరమణ సమగ్రతను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తమకు అందిన ఈ సమాచారాన్ని ఈజిప్టు, ఖతార్, తుర్కియేతో సహా శాంతి ఒప్పందానికి హామీగా ఉన్న దేశాలకు తెలియజేసినట్లు యూఎస్ తెలిపింది. దీంతో, మరోసారి గాజాలో ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయా అని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. -
‘25 వేల మరణాలను అడ్డుకున్నా’: ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు సంచలన ప్రకటన చేశారు. ఇటీవల కరేబియన్లో అమెరికా జరిపిన సైనిక దాడిలో ఒక భారీ మాదకద్రవ్యాల జలాంతర్గామి ధ్వంసమైందని, ఈ దాడిలో ఇద్దరు నార్కో ఉగ్రవాదులను హతం చేశామని, మరో ఇద్దరిని సజీవంగా పట్టుకున్నామని తెలిపారు. ఈ దాడికి సంబంధించిన వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో.. ‘ఆ జలాంతర్గామిలో అధికంగా ఫెంటానిల్ తదితర మాదకద్రవ్యాలు ఉన్నాయని, అది నార్కోట్రాఫికింగ్ ట్రాన్సిట్ రూట్ ద్వారా అమెరికా వైపు వస్తున్నదని, దానిని అడ్డగించడం ద్వారా 25 వేల అమెరికన్ల మరణాలను నిరోధించగలిగానని’ ట్రంప్ పేర్కొన్నారు.తన సోషల్ మీడియా పోస్టులో ట్రంప్.. ‘ఒక భారీ మాదకద్రవ్యాల జలాంతర్గామిని నాశనం చేయడమనేది నాకు లభించిన గొప్ప గౌరవం. ఓడలో అధికంగా ఫెంటానిల్ ఉందని యూఎస్ ఇంటెలిజెన్స్ నిర్ధారించింది. ఆ జలాంతర్గామిలో నలుగురు నార్కోటెర్రరిస్టులు ఉన్నారు. వారిలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సజీవంగా ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను వారి స్వదేశాలైన ఈక్వెడార్, కొలంబియాకు విచారణ కోసం తిరిగి పంపుతున్నారు’ అని పేర్కొన్నారు.ఈ దాడి తర్వాత అమెరికా నావికాదళం ఇద్దరు ఉగ్రవాదులను ప్రాణాలతో పట్టుకుందని, వారిని ఒక అమెరికన్ యుద్ధనౌకలో ఉంచిందని ఫాక్స్ న్యూస్ ధృవీకరించింది. కాగా గత నెలలో కరేబియన్లో యుద్ధ కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుండి అమెరికా అనుమానిత మాదకద్రవ్యాల అక్రమ రవాణా నౌకలను అడ్డగించడం ఇది ఆరోసారి. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ తగిలిందని చెబుతున్న అమెరికా అధికారులు.. ఈ దాడుల్లో హతమైన 27 మంది మాదకద్రవ్యాల స్మగ్లర్లే అని ధృవీకరించే ఎటువంటి ఆధారాలను మీడియాకు అందించలేదు. ఈ రీతిలో అంతమొందించడం చట్టవిరుద్ధమని నిపుణులు వాదిస్తున్నారు. 📹 DESTROYED: Confirmed DRUG-CARRYING SUBMARINE navigating towards the United States on a well-known narcotrafficking transit route."Under my watch, the United States of America will not tolerate narcoterrorists trafficking illegal drugs, by land or by sea." - President Trump pic.twitter.com/N4TAkgPHXN— The White House (@WhiteHouse) October 18, 2025 -
పాక్-ఆప్ఘన్ మధ్య కీలక చర్యలు.. శాంతికి ఓకే
దోహా: కొద్ది రోజులుగా పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఖతార్, తుర్కియే మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య శాంతి చర్యలు ఫలించాయి. పాక్-ఆప్ఘన్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ మేరకు ఖతార్ (Qatar) విదేశాంగ మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో రెండు దేశాల సరిహద్దులో దాడులు నిలిచిపోనున్నాయి.ఖతార్ రాజధాని దోహా వేదికగా పాకిస్తాన్, ఆప్ఘనిస్థాన్ మధ్య శాంతి చర్చలు జరిగాయి. ఈ చర్చలకు ఖతార్, తుర్కియే (Turkey) మధ్యవర్తిత్వం వహించాయి. చర్చల్లో పాల్గొనేందుకు ఇరుదేశాలకు చెందిన రక్షణ మంత్రులు ఖతార్ వచ్చారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణకు సంబంధించి కీలకంగా చర్చించారు. రెండు దఫాలుగా జరిగిన ఈ చర్చల్లో శాశ్వత శాంతి, స్థిరత్వం కోసం ఇరుదేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో, శాంతి చర్చలు ఫలించాయి. ఈ ఒప్పందానికి సంబంధించిన స్థిరత్వాన్ని కొనసాగించడంపై రానున్న రోజుల్లో మరిన్ని చర్చలు జరిపేందుకు కూడా వారు అంగీకరించారని ఖతార్ వెల్లడించింది. ఈ మేరకు ఖతార్ (Qatar) విదేశాంగ మంత్రిత్వశాఖ స్వయంగా ఓ ప్రకటనలో వివరాలను వెల్లడించింది.ఇక, శుక్రవారం అర్ధరాత్రి ఆఫ్ఘనిస్థాన్లోని పాక్టికా ప్రావిన్స్పై పాక్ వైమానిక దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. పాక్ చేసిన దాడుల్లో యువ క్రికెటర్లు, మహిళలు, చిన్నారులతో సహా కనీసం 10 మంది మృతి చెందారు. ఈ క్రమంలో పక్క దేశం నుంచి వస్తున్న దురాక్రమణలకు మాత్రమే ప్రతిస్పందిస్తున్నామన్నట్లుగా ఇరువర్గాలు వాదనలు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఆప్ఘన్ నుంచి వస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయడంతో పాటు సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం పునరుద్ధరణ చర్యలపై మాత్రమే దృష్టి పెట్టామని పాక్ పేర్కొంది. సరిహద్దుల్లో దాడులకు పాల్పడే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారనే ఆరోపణలను ఆప్ఘన్ ఖండించింది. -
ట్రంప్కు బిగ్ షాక్..
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా నిరసనలతో అట్టుడుకుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ భారీ సంఖ్యలో అమెరికన్లు.. ‘నో కింగ్స్’ పేరుతో దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు. ఇక, అమెరికన్లకు మద్దతుగా లండన్ నుంచి వాషింగ్టన్ వరకు యూరప్ దేశాల్లోనూ వీరికి సపోర్టు లభించింది. భారీ సంఖ్యలో నిరసనకారులు రోడ్ల మీదకు వచ్చి ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా గ్రేట్, సంస్కరణల పేరుతో సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. వీసాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కోత, షట్డౌన్ వంటి నిర్ణయాల కారణంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో వందలాది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో విరుచుకుపడుతున్నారు. ఆయన పాలనాతీరు, విధానాలపై అనేక దేశాలతోపాటు స్థానికంగానూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై గతంలో కూడా నిరసనలు చేపట్టిన అమెరికన్లు తాజాగా మరోసారి ఆందోళనలకు పిలుపునిచ్చారు. WOW! Protesters created a HUGE human sign on San Francisco’s Ocean Beach reading “No Kings YES on 50” to support California’s Prop 50 and stand up against Donald Trump’s fascist regime pic.twitter.com/NbUnQk6ZZB— Marco Foster (@MarcoFoster_) October 18, 2025‘నో కింగ్స్’ (No Kings protests) పేరుతో ఆందోళనలు జరుగుతున్నాయి. యాభై రాష్ట్రాల్లో దాదాపు 2500లకుపైగా ప్రదేశాల్లో నిరసనలు చేపట్టారు. పలు ఐరోపా దేశాల్లోనూ వీరికి మద్దతుగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. అమెరికా రాజధాని ప్రాంతం అంతటా నిరసనకారులు కవాతు చేశారు. ఉత్తర వర్జీనియాలో, వాషింగ్టన్ డీసీకి వెళ్లే దారిలో ఓవర్పాస్లపై నిరసనకారులు కవాతు చేస్తూ కనిపించారు. భారీ సంఖ్యలో ప్రజలు నిరసనల్లో పాల్గొన్నారు.Holy shit, look at this crowd from the Boston No Kings protest. Samuel Adams would be damn proud. pic.twitter.com/Efl1i8RExB— Mike Nellis (@MikeNellis) October 18, 2025ట్రంప్ స్పందన..మరోవైపు.. తాజా ఆందోళనలపై ట్రంప్ ఫాక్స్ బిజినెస్ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. వారంతా నన్ను రాజు అని అంటున్నారు. కానీ, వారు చెబుతున్నట్లుగా తాను రాజును కాదు అంటూ వ్యాఖ్యలు చేశారు. తాజా నిరసనల నేపథ్యంలో ఆయా రాష్ట్ర గవర్నర్లు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యగా జాతీయ బలగాలను రంగంలోకి దించారు. ఇక, అమెరికన్ల నిరసనలను వైట్హౌస్తో పాటు రిపబ్లికన్లు తోసిపుచ్చారు. ఈ ర్యాలీల్లో పాల్గొనేవారంతా అమెరికా రాజకీయాలకు దూరంగా ఉండేవారేనని.. ఇవి ‘హేట్ అమెరికా’ నిరసనలని అన్నారు.100,000+ out for a “No Kings” protest in Chicago. pic.twitter.com/oZhGrkfGUX— Spencer Hakimian (@SpencerHakimian) October 18, 2025 Thank you to the many millions who are showing up all over the country to say no to kings. pic.twitter.com/lzS4fzBYct— Adam Schiff (@SenAdamSchiff) October 18, 2025 -
Italy: ఎయిర్ ఇండియా షాక్.. దీపావళి ప్రయాణాలు వాయిదా!
న్యూఢిల్లీ: విదేశాల్లో ఉంటున్న పలువురు భారతీయులు దీపావళి పండుగకు స్వదేశానికి వస్తుంటారు. ఇందుకోసం ఏడాదంతా ఎదురు చూస్తుంటారు. అలాంటి ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాకిచ్చింది. కుటుంబ సభ్యులతో దీపావళి వేడుకల్లో పాల్గొందామనే సంతోషంలో ఉన్న ప్రవాస భారతీయుల ఆశలపై ఎయిర్ ఇండియా నీళ్లు జల్లింది.దీపావళి వేడుకల్లో పాల్గొనేందుకు ఇటలీ నుండి భారతదేశానికి బయలుదేరిన వందలాది మంది ప్రయాణికులు తాము శుక్రవారం ఎక్కాల్సిన ఎయిర్ ఇండియా విమానం రద్దయ్యిందని తెలియడంతో షాక్నకు గురయ్యారు. తదుపరి విమానం సోమవారం(దీపావళి) లేదా ఆ మర్నాడు(మంగళవారం) బుక్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా చెప్పడంతో వారంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు. Hundreds of passengers returning for Diwali break left stranded after Air India’s flight from Milan to Delhi on Oct 17 (AI 138) is cancelled due to a technical glitch. Return now scheduled for four days later. Some were taken to a hotel, where they were later asked to leave.… pic.twitter.com/8LcmrocBfX— Jagriti Chandra (@jagritichandra) October 18, 2025సాంకేతిక సమస్య కారణంగా మిలన్ నుండి ఢిల్లీకి వెళ్లాల్సిన ఏఐ 138 విమానం రద్దు అయ్యిందని ఎయిర్ ఇండియా ప్రకటించింది.‘ఎయిర్ ఇండియా.. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యతనిస్తుందని, షెడ్యూల్ చేసిన విమానంలో సాంకేతిక సమస్య కారణంగా కారణంగా.. 2025, అక్టోబర్ 17న మిలన్ నుండి ఢిల్లీకి వెళ్లాల్సిన ఏఐ 138 విమానం రద్దు అయ్యింది’ అని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ఈ విమానంలో ఎక్కాల్సిన ప్రయాణికులకు హోటల్ వసతి కల్పించామని, విమానాశ్రయం సమీపంలోనే వారికి ఈ ఏర్పాట్లు చేశామని ఎయిర్ ఇండియా తెలిపింది.‘ఎయిర్ ఇండియాతో పాటు ఇతర విమానయాన సంస్థలతో సీట్ల లభ్యత ఆధారంగా 2025, అక్టోబర్ 20 లేదా ఆ తర్వాత ప్రత్యామ్నాయ విమానాలలో ప్రయాణికులు తిరిగి టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఇక్కడ చిక్కుకుపోయిన ప్రయాణికులందరికీ భోజనంతో సహా అవసరమైన అన్ని సహాయాలను ఎయిర్ ఇండియా అందిస్తుంది. వారికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ప్రయాణికులు, సిబ్బంది భద్రతపై ఎయిర్ ఇండియా నిబద్ధత కలిగివుంటుందని పునరుద్ఘాటిస్తున్నాం’ అని ప్రతినిధి పేర్కొన్నారు. -
రాయల్ టైటిల్ వదులుకున్న ప్రిన్స్ ఆండ్రూ
లండన్: బ్రిటన్రా జు చార్లెస్–3 త మ్ముడు ప్రిన్స్ ఆండ్రూ(65) తన రాయల్ టైటిల్ ‘డ్యూక్ ఆఫ్ యార్క్’ను వదులుకున్నారు. ఇకపై అన్ని రాచ బిరుదులను, మర్యాదలను సైతం వదిలేసు కుంటున్నట్లు ఆండ్రూ ఎక్స్ వేదికగా ప్రక టించారు. అమెరికాను కుదిపేసిన ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణంతో ప్రిన్స్ ఆండ్రూకు సంబంధాలున్నట్లు ఇటీవల తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజ కుటుంబం నుంచి వస్తున్న ఒత్తిడుల మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన హిజ్ రాయల్ హైనెస్ (హెచ్ఆర్హెచ్)ను వాడటం ఆపేశారు. -
సోమవారం నుంచి తెరుచుకోనున్న రఫా క్రాసింగ్
కైరో: గాజాకు తిరిగి వచ్చే పాలస్తీనియన్ల కోసం సోమవారం నుంచి రఫా క్రాసింగ్ పాయింట్ను తెరిచి ఉంచుతామని పాలస్తీనా దౌత్య కార్యాలయం తెలిపింది. గాజాకు తిరిగి వెళ్లేందుకు తమ వద్ద పేర్లు నమోదు చేయించుకున్న పాలస్తీనియన్ల సంఖ్య భారీగా ఉందని శనివారం పేర్కొంది. అయితే, ఎందరనే విషయం స్పష్టం చేయలేదు. ఈ ప్రకటనపై ఇజ్రాయెల్ ప్రభుత్వం స్పందించలేదు. యుద్ధానికి ముందు ఇజ్రాయెల్ నియంత్రణలో లేని బయటి ప్రపంచానికి గాజాకు ఉన్న ఏకైక మార్గం ఈ క్రాసింగ్. గాజాను నియంత్రణ తీసుకున్న తర్వాత 2024 మే నుంచి ఇజ్రాయెల్ దీనిని మూసివేసింది. ఇలా ఉండగా, ఇజ్రాయెల్– హమాస్ మధ్య జరిగిన యుద్ధంలో మృతుల సంఖ్య 68 వేలు దాటిపోయిందని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. వారం క్రితం కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత మరణాల సంఖ్య పెరిగిందని పేర్కొంది. శిథిలాల తొలగింపు సందర్భంగా మృతదేహాలు బయటపడుతు న్నట్లు వెల్లడించింది. -
పాక్–ఆఫ్గాన్ యుద్ధాన్ని చిటికెలో ఆపగలను: ట్రంప్
వాషింగ్టన్: పాకిస్తాన్–ఆఫ్గనిస్తాన్ మధ్య పెరుగు తున్న ఘర్షణలపై అమెరికా అధ్యక్షుడు తనదైన శైలిలో స్పందించారు. ఆ రెండు దేశాల మధ్య ఘ ర్షణను ఆపటం తనకు చిటికెలో పని అని తెలి పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీతో శుక్రవారం మధ్యాహ్నం ట్రంప్ సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. పాకిస్తాన్పై జరుగుతున్న దాడి, ఆఫ్గని స్తాన్పై పాక్ జరుపుతున్న దాడి గురించి నాకు అర్థమవుతోంది. నేను గనుక పరిష్కరించాలని అనుకుంటే ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణను ఆపటం చాలా తేలిక. ప్రజలను చంపే ఘర్షణలను ఆపటం అంటే నాకు చాలా ఇష్టం. నేను లక్షల మంది ప్రజల ప్రాణాలు కాపాడాను. ఈ యుద్ధాన్ని ఆపటంలో కూడా విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది’అని పేర్కొన్నారు. కొద్దిరోజులుగా పాక్–ఆఫ్గాన్ మధ్య సైనిక ఘర్ష ణ జరుగుతున్న విషయం తెలిసిందే. -
మొజాంబిక్ తీరంలో పడవ ప్రమాదం..
కొచ్చి: మొజాంబిక్లో బెయిరా తీరంలో జరిగిన పడవ ప్రమాదంలో ముగ్గురు భారతీయులు చనిపోగా ఒకరు గాయపడ్డారు. ఈ ఘటనలో మరో ఐదుగురిని సిబ్బంది కాపాడారని అక్కడి భారత దౌత్య కార్యాలయం తెలిపింది. గురువారం సముద్రంలో నిలిపి ఉన్న ఓడలో మెయింటెన్స్ పనికోసం కొందరిని పడవలో పంపించారు. పడవ నుంచి ఓడను చేరుకునేందుకు ప్రయతి్నస్తుండగా తీవ్రమైన అలల తాకిడికి పడవ బోల్తా పడిందని భారత ఎంబసీ తెలిపింది. ఘటన సమయంలో పడవలో 14 మంది భారతీయ సిబ్బంది ఉన్నారని వివరించింది. అయితే, ప్రమాద బాధితుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటనలో గల్లంతైన వారిలో ఇద్దరు మలయాళీలు కూడా ఉన్నట్లు కేరళ ఎమ్మెల్యే అనూప్ జాకబ్ శనివారం తెలిపారు. వీరిలో ఒకరు ఎర్నాకులం జిల్లా పిరవోమ్కు చెందిన ఇంద్రజిత్(22) కాగా, మరొకరు కొల్లమ్కు చెందిన వ్యక్తి అని ఆయన వివరించారు. -
రెచ్చగొడితే నిర్ణయాత్మక ప్రతిస్పందన
ఇస్లామాబాద్: పాకిస్తాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ మరోసారి నోరుపారేసుకున్నారు. భారత్ తమను ఏమాత్రం రెచ్చగొట్టినా నిర్ణయాత్మక ప్రతిస్పందన ఉంటుందని అన్నారు. తాము ఎవరికీ భయపడబోమని చెప్పారు. బెదిరింపులతో తమను లొంగదీసుకోలేరని వ్యాఖ్యానించారు. తమను రెచ్చగొడితే వెంటనే తగిన బుద్ధి చెప్తామని వెల్లడించారు. నేటి అణ్వాయుధాల వాతావరణంలో యుద్ధాలకు తావులేదని, ఈ విషయంలో భారత సైనికాధికారులు తెలుసుకోవాలని సూచించారు. శనివారం పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో అసిమ్ మునీర్ మాట్లాడారు. కొన్ని నెలల క్రితం భారత్తో జరిగిన సైనిక ఘర్షణలో అద్భుతమైన సామర్థ్యాలు ప్రద ర్శించామని, లక్ష్యాలను ఛేదించామని అన్నారు. కేవలం అంకెల్లో గొప్పగా కనిపిస్తున్న ప్రత్యరి్థపై విజయం సాధించామని స్పష్టంచేశారు. భారత్ను అస్థిరపర్చడానికి భారత ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఒక ఆయుధంగా వాడుకుటోందని అసిమ్ మునీర్ ఆరోపించారు. పిడికెడు మంది ఉగ్రవాదులు తమను ఏమీ చేయలేరని తేల్చిచెప్పారు. అఫ్గానిస్తాన్ గడ్డపై నుంచి పాకిస్తాన్పై దాడులు చేస్తున్నవారిని మట్టిలో కలిపేస్తామని పరోక్షంగా తెహ్రీక్–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ)ని హెచ్చరించారు. -
రక్త పరీక్ష 1.. గుర్తించగల క్యాన్సర్లు 50
వాషింగ్టన్: ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే సామెత వినే ఉంటారు. ఇక్కడ ఒకే ఒక రక్త పరీక్షకు ఒకటికాదు రెండు కాదు ఏకంగా 50 రకాల క్యాన్సర్లను గుర్తించవచ్చు. పలు రకాల క్యాన్సర్లకు తొలి దశలో ఎలాంటి లక్షణాలు బయటకు కనబడవు. అలాంటి క్యాన్సర్ ముదరబోతోందనే హెచ్చరిక సంకేతాన్ని సైతం ఈ రక్తపరీక్ష అందివ్వగలదు. ఉత్తరఅమెరికాలో ఇటీవల జరిపిన సంబంధిత ప్రయోగం విజయవంతమవడంతో బహుళ వ్యాధి నిర్ధారణ రక్త పరీక్షకు బాటలుపడ్డాయి. ఈ 50 క్యాన్సర్లలో దాదాపు మూడు వంతుల క్యాన్సర్లకు ఎలాంటి నిర్ధారణ పరీక్షలు లేవు. కానీ ఈ బ్లడ్టెస్ట్తో వాటి ఆనవాళ్లను సైతం ముందే కనిపెట్టవచ్చు. సగం క్యాన్సర్లను తొలిదశలోనే గుర్తింవచ్చు. దీంతో వాటికి వీలైనంత త్వరగా చికిత్స మొదలెట్టి వాటి బారి నుంచి తప్పించుకోవచ్చు. అమెరికాకు చెందిన ‘గ్రెయిల్’ఫార్మాస్యూటికల్స్ సంస్థ ఈ బ్లడ్ టెస్ట్కు ‘గ్యాలెరీ’అని పేరుపెట్టింది. క్యాన్సర్ కణితి నుంచి ముక్కలై విడివడి మానవ రక్తప్రవాహంలో చక్కర్లు కొడుతున్న డీఎన్ఏ అవశేషాలను ఈ రక్తపరీక్ష ద్వారా గుర్తించవచ్చు. ఈ డీఎన్ఏ అవశేషాలు ఏ అవయవం నుంచి వస్తుందనేది కూడా ఈ బ్లడ్టెస్ట్ ద్వారా తెలుస్తుంది. బ్రిటన్లోని నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) ద్వారా సేకరించిన వేలాది మంది పౌరుల రక్తనమూనాలను పరిశీలించి ఈ బ్లడ్టెస్ట్ సామర్థ్యాన్ని గణించారు. అమెరికా, కెనడాల్లో 25,000 మంది యుక్తవయసు వాళ్ల రక్తాన్ని సైతం సేకరించి నూతన తరహాలో రక్త పరీక్ష చేశారు. వీరిలో ప్రతి 100 మందిలో దాదాపు ఒక శాతం మంది క్యాన్సర్బారిన పడబోతున్నట్లు తేలింది. వీరిలో తర్వాతి కాలంలో 62 శాతం మందికి క్యాన్సర్ లక్షణాల బయటపడటం విశేషం. ‘‘క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల్లో ఇదొక మైలురాయి. ముదరక ముందే క్యాన్సర్ను కనిపెట్టడంతో దానికి చికిత్స చేయడం అత్యంత సులభమవుతుంది. చికిత్సలో విజయశాతాలు అద్భుతంగా ఉంటాయి’’అని అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలోని ఒరెగాన్ హెల్త్, సైన్స్ యూనివర్సిటీలో రేడియేషన్ మెడిసిన్ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ నిమా నబాబిజదేహ్ చెప్పారు. ‘‘క్యాన్సర్ ఉండకపోవచ్చు అని దాదాపు 99 శాతం మందిలో సాధారణ రక్తపరీక్షల్లో ‘నెగెటివ్’అని రాగా, అది తప్పు అని మా రక్తపరీక్ష నిరూపించింది’’ అని వివరించారు. -
ఎక్కడిదక్కడే ఆపేయండి
వాషింగ్టన్: సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని వెంటనే ఆపాలని రెండు దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పిలుపునిచ్చారు. ఇంతవరకు జరిగిన రక్తపాతం చాలని, ఇకనైనా ఎక్కడిదక్కడే ఆపేసి రెండు దేశాలు వెనక్కు తగ్గాలని సూచించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ శుక్రవారం (స్థానిక కాలమానం) మధ్యాహ్నం ట్రంప్ సమావేశమయ్యారు. ఇద్దరు నేతల మధ్య దాదాపు రెండుగంటలపాటు చర్చలు జరిగాయి. అనంతరం తన సొంత సోషల్మీడియా కంపెనీ ట్రూత్ సోషల్లో ట్రంప్ ఓ పోస్ట్ చేశారు. ‘వారు ఎక్కడిదక్కడే ఆపేయాలి. ఇద్దరూ ఎవరికి వారే యుద్ధంలో గెలిచినట్లు ప్రకటించుకోవచ్చు. అసలు విషయాన్ని చరిత్రకు వదిలేద్దాం’అని పేర్కొన్నారు. ఇక ఇళ్లకు వెళ్లండి యుద్ధాన్ని ఆపేసి ఇరుపక్షాలు చర్చలకు ముందుకు రావాలని ట్రంప్ పిలుపునిచ్చారు. వారాంతపు సెలవులు గడిపేందుకు ఫ్లోరిడాకు వచి్చన ఆయన.. అక్కడ మీడియాతో మాట్లాడారు. ‘ఎక్కడికైనా యుద్ధక్షేత్రంలోకి వెళ్లి చూడండి. అంతటా తీవ్రమైన పరిస్థితులే. యుద్ధాన్ని ఎక్కడిదక్కడే ఆపేసి ఇరుపక్షాలు ఇళ్లకు వెళ్లిపోండి. కుటుంబాలతో గడపండి. హత్యలు ఆపండి. ఇరుపక్షాలు ఈ పనిచేయటం మంచిది’అని పేర్కొన్నారు. యుద్ధ విరమణపై రష్యా అధ్యక్షుడు పుతిన్తో ట్రంప్ గురువారం ఫోన్లో సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు తీవ్రంగా ప్రయతి్నస్తున్న ట్రంప్.. గతంలో జెలెన్స్కీని తీవ్రంగా విమర్శించగా, తాజాగా పుతిన్పై బెదిరింపులకు దిగుతున్నారు. ఉక్రెయిన్లో రష్యా ఆక్రమించిన భూభాగాలను వదిలేసి వెనక్కు వెళ్లాలని హెచ్చరించారు. వెనక్కు తగ్గకుంటే ఉక్రెయిన్కు దీర్ఘశ్రేణి అత్యాధునిక తొమహాక్ క్షిపణులు అందిస్తానని రష్యాను హెచ్చరించిన ఆయన.. తాజాగా మాట మార్చి రష్యాను బెదిరించేందుకే అలా చెప్పానని, ఆ క్షిపణులు ఉక్రెయిన్కు అవసం లేదని ఎన్బీసీకి ఇచి్చన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. యుద్ధం ఆపాలన్న ట్రంప్ ప్రకటనను జెలెన్స్కీ స్వాగతించారు. కాల్పుల విరమణ ప్రకటించి, చర్చలు జరిపేందుకు ఇదే తగిన సమయమని పేర్కొన్నారు. -
BCCI: పిరికిపందల దాడి.. అఫ్గన్ బోర్డుకు మద్దతుగా బీసీసీఐ ప్రకటన
అఫ్గనిస్తాన్ క్రికెటర్ల మృతి పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సంతాపం వ్యక్తం చేసింది. అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB)కు సంఘీభావం ప్రకటించింది. తమ క్రికెటర్ల మరణానికి కారణమైన దేశంతో.. అఫ్గన్ బోర్డు సిరీస్ రద్దు చేసుకోవడాన్ని బీసీసీఐ స్వాగతించింది.పిరికిపందల దాడి.. ఈ మేరకు.. ‘‘సరిహద్దులోని పక్తికా ప్రావిన్స్లో పిరికిపందలు జరిపిన సీమాంతర వైమానిక దాడుల్లో అఫ్గనిస్తాన్ యువ క్రికెటర్లు కబీర్ ఆఘా, సిబ్ఘతుల్లా, హరూన్ ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. వీరి మృతి పట్ల బీసీసీఐ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తోంది.ఈ కష్ట సమయంలో బీసీసీఐ అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డుకు మద్దతుగా నిలుస్తుంది. అఫ్గన్ క్రికెట్ ప్రపంచానికి, మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. మీ దుఃఖాన్ని మేమూ పంచుకుంటాం. ఇందుకు కారణమైన అనాగరిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం.తీవ్రంగా కలచివేస్తోందివైమానిక దాడుల్లో మరణించిన అమాయక ప్రజలు.. ముఖ్యంగా క్రీడల్ని భవిష్యత్తుగా ఎంచుకున్న వ్యక్తులు మృతి చెందడం తీవ్రంగా కలచివేస్తోంది. అఫ్గనిస్తాన్ ప్రజలకు బీసీసీఐ హృదయపూర్వకంగా సానుభూతి ప్రకటిస్తోంది. వారి బాధను మేమూ పంచుకుంటాము’’ అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పేరిట బోర్డు శనివారం ప్రకటన విడుదల చేసింది.కాగా పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో అఫ్గన్లోని పక్తికా ప్రావిన్స్లో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. ఇందులో ముగ్గురు స్థానిక క్రికెటర్లు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో పాక్ వైఖరికి నిరసనగా పాకిస్తాన్తో ఆడాల్సిన ముక్కోణపు సిరీస్ నుంచి తప్పుకొంటున్నట్లు అఫ్గన్ బోర్డు ప్రకటించింది.ఆట కంటే దేశమే ముఖ్యంఅఫ్గన్ టీ20 జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్తో పాటు పలువురు క్రికెటర్లు బోర్డు నిర్ణయాన్ని స్వాగతించారు. ఆట కంటే దేశమే ముఖ్యమని పేర్కొన్నారు. కాగా రావల్పిండి వేదికగా నవంబరు 19 నుంచి పాకిస్తాన్- శ్రీలంక- అఫ్గనిస్తాన్ మధ్య త్రైపాక్షిక టీ20 సిరీస్ నిర్వహణకు ముందుగా షెడ్యూల్ ఖరారైంది.అయితే, పాక్ దుశ్చర్య కారణంగా అఫ్గన్ బోర్డు ఈ సిరీస్ను బహిష్కరించగా.. తాము మరో జట్టు కోసం వెతుకుతున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ‘‘అప్గనిస్తాన్ తప్పుకొన్నా ట్రై సిరీస్ కచ్చితంగా జరుగుతుంది. అఫ్గన్ జట్టు స్థానాన్ని భర్తీ చేయగల టీమ్ కోసం చూస్తున్నాం’’ అని పీసీబీ వర్గాలు పీటీఐతో పేర్కొన్నాయి.చదవండి: రషీద్ ఖాన్ సంచలన నిర్ణయం! -
Air China: విమానంలో కలకలం.. గాల్లో ఉండగానే మంటలు
హాంగ్జౌ: ఎయిర్ చైనా విమానంలో ఒక్కసారిగా కలకలం రేగింది. గాల్లో ఉండగానే ఒక ప్రయాణికుడి లగేజీలో మంటలు చెలరేగాయి. హాంగ్జౌ నుంచి దక్షిణ కొరియాలోని ఇంచియాన్కు బయలుదేరిన విమానంలో ఓ ప్రయాణికుడి లగేజీలోని లిథియం బ్యాటరీ పేలింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాకంపితులయ్యారు. ఓవర్హెడ్ బిన్ నుంచి మంటలు రాగా.. విమానం లోపలంతా పొగ వ్యాపించింది.అప్రమత్తమైన సిబ్బంది ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం విమానాన్ని షాంఘైకి మళ్లించారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని ఎయిర్ చైనా వెల్లడిచింది. ఓ ప్రయాణికుడు ఈ ఘటనకు సంబంధించి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.Air China flight CA139 made emergency landing in Shanghai today after a lithium battery in overhead luggage self-ignited. No injuries reportedThat’s why Emirates has now restricted power bank charging onboardpic.twitter.com/KNDVKpINKJ— حسن سجواني 🇦🇪 Hassan Sajwani (@HSajwanization) October 18, 2025 -
ఢాకా ఎయిర్పోర్ట్లో భారీ అగ్ని ప్రమాదం
బంగ్లాదేశ్లోని ఢాకా ఎయిర్పోర్ట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఢాకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆకస్మికంగా మంటలు ఎగిసి పడ్డాయి. దాంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది, ప్రయాణికులు పరుగులు తీశారు. ఈ సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటల్ని అదుపు చేస్తున్నారు. ఢాకాలోని హజ్రాత్ షాహ్జలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం గం. 2. 15 ని.ల ప్రాంతంలో మంటలు వ్యాపించాయి. దాంతో పొగ దావానలంలా వ్యాపించింది. కిలో మీటర్ల మేర పొగ కమ్మేయడంతో విమానాల రాకపోకలను ఉన్నపళంగా నిలిపివేశారు. అంతర్జాతీయ గూడ్స్ వస్తువులు ఉంచే కార్గో ఏరియా గేట్ నంబర్ 8 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశ్లో ఉన్ని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం ఇది. ఇక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.VIDEO | Dhaka, Bangladesh: A fire broke out at a section of the Cargo Village of Hazrat Shahjalal International Airport this afternoon. More details awaited.#Dhaka #AirportFire #HazratShahjalal(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/flGkHso2xq— Press Trust of India (@PTI_News) October 18, 2025ఇదీ చదవండి:Air China: విమానంలో కలకలం.. గాల్లో ఉండగానే మంటలు -
‘ఆధార్’ నమూనాతో ‘బ్రిట్ కార్డ్’.. యూకే ప్రధాని స్టార్మర్ వెల్లడి
లండన్: ఇటీవలే భారత్లోని ముంబైలో పర్యటించిన బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఇక్కడి ఆధార్ డిజిటల్ బయోమెట్రిక్ ఐడీ వ్యవస్థను భారీ విజయంగా అభివర్ణించారు. యూకే రూపొందిస్తున్న ప్రణాళికాబద్ధ డిజిటల్ గుర్తింపు కార్యక్రమం ‘బ్రిట్ కార్డ్’కు దీనిని ఒక నమూనాగా పరిగణిస్తున్నామన్నారు.ఆధార్ కార్డు ప్రజా సంక్షేమం, సేవలకు బయోమెట్రిక్ డేటాను ఉపయోగిస్తుండగా, యూకే పథకం మరోలా ఉపయుక్తం కానుంది. అక్రమ వలసలను అరికట్టే దిశగా యూకే ‘బ్రిట్ కార్డ్’ను తీసుకురానుంది. అయితే దీనిపై యూకేలో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తన రెండు రోజుల ముంబై పర్యటనలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఆధార్ రూపకల్పనలో సహకారం అందించిన నందన్ నీలేకనితో పాటు పలువురితో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా భారతదేశంలో అమలవుతున్న డిజిటల్ ఐడీ కార్యక్రమం అమలు, ప్రభావంపై చర్చించారు. 15 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఆధార్.. దేశంలోని ప్రజలందరికీ కీలకమైన గుర్తింపు కార్డుగా మారింది. బ్యాంకింగ్, సంక్షేమం తదితర సేవలకు ఆధారంగా మారింది. ఈ వ్యవస్థ భారత ఆర్థిక వ్యవస్థకు పరిపాలనా ఖర్చులను ఆదా చేయడంలో కీలకంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఆదార్లోని లోతుపాతులపై చర్చించిన బ్రిటన్ ప్రధాని స్టార్మర్.. బ్రిట్ కార్డు దీనికి భిన్నమైన డిజైన్తో ఉంటుందని, బయోమెట్రిక్ డేటాను సేకరించదని తెలిపారని ‘ది గార్డియన్’ పేర్కొంది. కాగా బ్రిట్ కార్డ్ కోసం యూకే ప్రభుత్వం ఇంకా ఏ ప్రైవేట్ టెక్నాలజీ ప్రొవైడర్లతోనూ భాగస్వామ్యం కాలేదని సమాచారం. బ్రిట్ కార్డు ప్రజల గోప్యతకు భంగం కలిగిస్తుందని ప్రతిపక్ష పార్టీలు, కొందరు లేబర్ పార్టీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
తూచ్ అదంతా ఉత్తినే.. జెలెన్స్కీకి ట్రంప్ ఝలక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మాట మార్చారు. రష్యాను బెదిరించినట్టే వార్నింగ్ ఇచ్చి.. వెంటనే యూటర్న్ తీసుకున్నారు. ఉక్రెయిన్తో రష్యా యుద్ధం ఆపకపోతే జెలెన్స్కీకి అమెరికా వద్ద ఉన్న అత్యంత శక్తివంతమై తోమహాక్ క్షిపణులను ఇస్తామని ప్రకటించిన ట్రంప్.. తాజాగా అలాంటిదేమీ లేదని చేతులెత్తేశారు. దీంతో, మరోసారి అందరి ముందూ నవ్వులపాలయ్యారు.ఇక, రష్యా చేత ఎలా అయినా యుద్ధం ఆపించాలని ట్రంప్ కంకణం కట్టుకున్నారు. ఇందు కోసం ఇప్పటికే పలు రకాల ప్లాన్స్ వేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో సైతం ట్రంప్ భేటీ అయ్యారు. కానీ, ఉక్రెయిన్పై రష్యా దాడులు మాత్రం ఆడగం లేదు. ఈ నేపథ్యంలో రష్యా బెదిరించేందుకు ట్రంప్ కొత్త ప్లాన్ చేశారు. ఉక్రెయిన్తో యుద్ధం ఆపకపోతే తమ దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమై తోమహాక్ క్షిపణులను జెలెన్స్కీకి ఇవ్వాల్సి వస్తుందని రష్యాను బెదిరించారు. ఇలా అయినా పుతిన్కు దారికి తెచ్చేందుకు పైకి గంభీరంగా ప్రకటన చేశారు.🇺🇸🇺🇦 US President Trump has rejected Ukrainian President Zelensky’s request for more tomahawk missiles in a “tense” White House meeting today. @europa pic.twitter.com/O5OVZFOjA7— EUROPA (@europa) October 18, 2025అయితే, తాజాగా ట్రంప్తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భేటీ అయ్యారు. ఓవల్ ఆఫీసులో అధ్యక్షుడు ట్రంప్ను జెలెన్స్కీ కలిశారు. ఈ సందర్బంగా తోమహాక్ క్షిపణులపై చర్చించారు. తమకు క్షిపణులను ఇవ్వాలని అందుకు బదులుగా తాము డ్రోన్లను ఇస్తామని జెలెన్స్కీ చెప్పుకొచ్చారు. కానీ, ట్రంప్ మాత్రం ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఊహించని షాక్ ఇచ్చారు. తోమహక్ క్షిపణులను ఇప్పుడు ఇవ్వలేనని ట్రంప్ తెగేసి చెప్పేశారు. తాజా పరిస్థితుల్లో అమెరికా నిల్వలను తగ్గించలేనని.. వాటిని సరి చూసుకోవాలని తెలిపారు. దాని కన్నా ముఖ్యంగా తనకు యుద్ధం ముగించడమే అత్యంత ముఖ్యమని తెలిపారు.Again, Zelensky had a bath with cold water. He expected to get the Tomahawk cruise missiles to counter attacks on Russia. But Kerlmin already made a deal with President Trump. Mr. Putin is trying to delay the peace process because he doesn’t want to lose his power.— Rudra Raya (@RudraRaya) October 18, 2025 ఈ సందర్బంగా రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకే ఇప్పుడు తాను క్షిపణులను ఇవ్వలేనని చేతులెత్తేశారు. అయితే.. తోమహాక్ క్షిపణులు తమ దగ్గర ఉంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ శాంతి చర్చలను సీరియస్గా తీసుకునేలా చేయవచ్చని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంటున్నారు. మరోవైపు, బుడాపెస్ట్లో సమావేశం తర్వాత క్షిపణుల గురించి ఆలోచిస్తానని ట్రంప్ దానికి బదులు చెప్పారని వైట్హౌస్ అధికారులు చెబుతున్నారు. కాగా, ట్రంప్ తోమహాక్ క్షిపణుల నిరాకరణ వెనుక రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరిక ఉందని తెలుస్తోంది. ఉక్రెయిన్కు క్షిపణులను ఇస్తే అమెరికా-రష్యా సంబంధాలకు హాని కలుగుతుందని, దాని వలన యుద్ధం మరింత సీరియస్ అవుతుందే తప్ప ఏం ఉపయోగం లేదని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. -
అమెరికా అణ్వాయుధ సిబ్బందికి లేఆఫ్స్
యూఎస్ ఫెడరల్ ప్రభుత్వం షట్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అణ్వాయుధాల రూపకల్పన, వాటి నిర్వహణ, వాటిని భద్రపరచడానికి బాధ్యత వహించే కీలక ఏజెన్సీ అయిన నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (NNSA) సిబ్బందికి సామూహిక లేఆఫ్స్ తప్పవని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్వహణకు నిధులు లేకపోవడంతో ఏజెన్సీ తన ఉద్యోగుల్లో అధికశాతం మందిని తాత్కాలికంగా తొలగించవలసి వస్తుంది. దీంతో అమెరికా జాతీయ భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.80 శాతం మంది ఉద్యోగులకు లేఆఫ్స్హౌస్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్, రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు మైక్ రోజర్స్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ..‘NNSA వద్ద ఉన్న నిధులు త్వరలో అయిపోనున్నాయనే సమాచారం ఉంది. దీని కారణంగా ఏజెన్సీలోని ఉద్యోగుల్లో 80 శాతం మందిని తొలగించాల్సి ఉంటుంది’ అని హెచ్చరించారు. యూఎస్ ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ ఇటీవల ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్ఎన్ఎస్ఏపై షట్ డౌన్ ప్రభావాల గురించి మాట్లాడుతూ..‘త్వరలో ఏజెన్సీలో పని చేస్తున్న సుమారు పదివేల మందికి లేఆఫ్స్ ఇస్తాం. మా జాతీయ భద్రతకు వారు కీలకమైన సిబ్బంది. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఈ చర్యలు తప్పడం లేదు’ అని తెలిపారు.జాతీయ భద్రతపై ఆందోళన?‘ఏజెన్సీలో చాలామంది ఉద్యోగులు దేశానికి సంబంధించిన ముఖ్యమైన వ్యూహాత్మక ఆస్తిని నిర్వహిస్తున్నారు. అందులో భద్రత, అత్యవసర సిబ్బంది విధుల్లో ఉంటారు. మేము ఇప్పటికే ఉన్న ఆయుధాగారాన్ని చెక్కుచెదరకుండా, సురక్షితంగా ఉంచబోతున్నాం. జాతీయ భద్రతపై ఎలాంటి ఆందోళన వద్దు’ అని రైట్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ధన త్రయోదశి రోజున బంగారంపై పెట్టుబడా? -
పాకిస్తాన్ సైన్యం అరాచకం.. తాలిబన్ నేత సీరియస్ వార్నింగ్
కాబూల్: దాయది దేశం పాకిస్తాన్(pakistan), ఆఫ్ఘనిస్థాన్(Afghanistan) మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు జరిగిన తర్వాత పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. డ్యూరాండ్ లైన్ వెంట వైమానిక దాడులకు తెగబడింది. ఈ దాడుల కారణంగా పదుల సంఖ్యలో ఆప్ఘన్ పౌరులు మృతి చెందినట్టు తెలిసింది. వారిలో ముగ్గురు ఆప్ఘన్ క్రికెటర్లు కూడా ఉన్నారు.పాక్ సైన్యం ఆప్ఘనిస్థాన్లోని మూడు రాష్ట్రాల్లో జనావాసాలే లక్ష్యంగా వైమానిక దాడులకు పాల్పడింది. ఇరుదేశాలు 48 గంటల కాల్పుల విరమణను పొడిగించడానికి పరస్పరం అంగీకరించిన కొన్ని గంటల తర్వాత పాక్ సైన్యం ఓవరాక్షన్కు దిగింది. డ్యూరాండ్ లైన్ (Durand Line) వెంబడి ఉన్న పక్తికా (Paktika) ప్రావిన్స్లోని అర్గున్, బెర్మల్ జిల్లాలలో పలు ఇళ్లపై మూడు ప్రాంతాల్లో బాంబు దాడి చేసింది. పాక్ దాడుల కారణంగా ముగ్గరు ఆప్ఘన్ క్రికెటర్లతో పాటుగా మరో 10 మంది పౌరులు మృతిచెందినట్టు సమాచారం.మరోవైపు.. పాక్ చర్యలపై తాలిబాన్ సీనియర్ నేత ఒకరు స్పందిస్తూ.. మూడు జిల్లాలపై పాక్ సైన్యం గగనతల దాడులకు తెగబడింది. పాక్ చర్యకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించుకునేందుకు, రెండు దేశాల నాయకులు శనివారం ఖతార్, దోహాలో సమావేశం కానున్నారు. ఇప్పటికే పాక్ ప్రతినిధులు దోహా చేరుకున్నారు, ఆప్ఘనిస్థాన్ నుంచి ఇంకా బయల్దేరాల్సి ఉంది. అయితే, పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ముందే ఉల్లంఘించడం గమనార్హం. -
రష్యా ఆయిల్ కొనుగోళ్లను భారత్ ఆపేయబోతోంది: ట్రంప్
రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని, ఈ మేరకు తన స్నేహితుడు, ఆ దేశ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చెప్పడం తెలిసిందే. అయితే భారత్ ఈ ప్రకటనను తోసిపుచ్చింది. ఈ దరిమిలా ట్రంప్ మరోసారి అదే వ్యాఖ్య చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ రష్యా చమురు కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యల చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో వైట్హౌజ్లో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రష్యా నుంచి చమురు కొనుగోలును అతిత్వరలోనే భారత్ నిలిపివేయబోతోందని అన్నారాయన. తద్వారా మాస్కోపై ఉక్రెయిన్ యుద్ధం ఆపేయాలనే ఒత్తిడి పెరగబోతోందని ట్రంప్ తాజాగా చెప్పారు. ఇండియా రష్యా నుంచి 38 శాతం చమురు కొనుగోలు చేసేది. అయితే ఇక నుంచి ఆ పని చేయబోదు. ఆ దేశం ఇప్పటికే కొనుగోళ్లను తగ్గించేసింది. దాదాపుగా ఆపేసేదాకా వచ్చింది అని ట్రంప్ అన్నారు.ఇదిలా ఉంటే.. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ తనకు రష్యా చమురు కొనుగోలు నిలిపివేతపై స్పష్టమైన హామీ ఇచ్చారని, తమ మధ్య ఫోన్ సంభాషణ జరిగిందని ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. దీంతో.. ఇక్కడి ప్రతిపక్షాలు కేంద్రంపై విరుచుకుపడ్డాయి. ట్రంప్కు మోదీ భయపడుతున్నారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు కూడా. అయితే.. భారత్ తమ పౌరుల ప్రయోజనాలకు అనుగుణంగానే నడుచుకుంటుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు.. ట్రంప్-మోదీల మధ్య అటువంటి సంభాషణ ఏదీ జరగలేదని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్వయంగా వెల్లడించారు కూడా. ట్రంప్ మొదటి నుంచి ఆరోపిస్తోంది ఏంటంటే.. భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోందని, ఆ చమురును బహిరంగ మార్కెట్లో తిరిగి విక్రయించి లాభాలు పొందుతోంది అని. ఇది రష్యాకు ఆర్థికంగా మద్దతు ఇస్తోందని. అలా ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యాకు పరోక్షంగా భారత్ సహకరిస్తోందని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే.. ట్రంప్ భారత్పై 25% ప్రతీకార సుంకం(అంతకు ముందు విధించిన దాంతో కలిపి మొత్తంగా 50 శాతం) విధించినట్లు ప్రకటించారు కూడా. అమెరికాతో వాణిజ్య చర్చలు నడుస్తున్న వేళ ట్రంప్ మరోసారి భారత్ రష్యా చమురును ఆపేయబోతోందన్న వ్యాఖ్య చేయడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు.ఇదీ చదవండి: ట్రంప్ అయోమయావస్థ! -
హెచ్1బీ ఫీజు పెంపుపై పిటిషన్
వాషింగ్టన్: విదేశీ వృత్తి నిపుణులకు అమెరికాలో ఉద్యోగాలు కల్పించేందుకు ఉద్దేశించిన హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్ల (దాదాపు రూ.88 లక్షలు)కు పెంచటాన్ని సవాల్ చేస్తూ యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ కొలంబియాలోని ఒక జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అమెరికా పార్లమెంటు (కాంగ్రెస్) చేసిన చట్టంలో ఏకపక్షంగా మార్పులు చేసే అధికారం దేశాధ్యక్షుడికి లేదని గురువారం దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది. ట్రంప్ ప్రభుత్వంతోపాటు హోమ్లాండ్ సెక్యూరిటీ, మంత్రులు క్రిష్టీ ఎల్ నోయెమ్, మార్కో రుబియోలను ప్రతివాదులుగా చేర్చింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం పూర్తిగా అన్యాయం, తప్పుదోవ పట్టించే విధానం అని ఆరోపించింది. ఫీజు పెంపు వల్ల నైపుణ్యగల విదేశీ నిపుణులు అమెరికాలోకి రాలేరని, అప్పుడు దేశంలో పరిశోధనలు, పోటీతత్వం దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తంచేసింది. ట్రంప్ నిర్ణయం అమెరికా ప్రత్యర్థి దేశాలకు మేలు చేసేదిగా ఉందని యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నీల్ బ్రాడ్లీ విమర్శించారు. పార్లమెంటు అధికారాలను కాలరాసి, అధ్యక్షుడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటం చెల్లదని స్పష్టంచేశారు. 3,600 ఉన్న హెచ్1బీ వీసా ఫీజును అధ్యక్షుడు ట్రంప్ గత నెల 19న ఒకేసారి లక్ష డాలర్లకు పెంచిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం భారతీయ వృత్తినిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఏటా దాదాపు 85,000 హెచ్1బీ వీసాలు జారీచేస్తుండగా, అందులో దాదాపు 70 శాతం భారతీయులే దక్కించుకుంటున్నారు. -
బంగ్లాదేశ్లో మళ్లీ జనాగ్రహం
ఢాకా: బంగ్లాదేశ్లో జనం మళ్లీ ఆందోళన బాట పట్టారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం శుక్రవారం రాజధాని ఢాకాలోని జాతీయ పార్లమెంట్ భవనం ఎదుట భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం తీసుకొచి్చన ‘జూలై నేషనల్ చార్టర్’ను వారు వ్యతిరేకించారు. ఈ చార్టర్లో తమ సమస్యలను ప్రస్తావించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. గత ఏడాది జూలైలో షేక్ హసీనా ప్రభుత్వంపై జరిగిన పోరాటంలో చాలామంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. బాధితులను ఆదుకోవడంపై ‘జూలై నేషనల్ చార్టర్’ఎలాంటి ప్రస్తావన లేకపోవడం పట్ల జనాగ్రహం వ్యక్తమైంది. శుక్రవారమే ఈ చార్టర్పై పార్లమెంట్ భవనంలో సంతకాలు జరగాల్సి ఉంది. షేక్ హసీనా ప్రభుత్వ పతనానికి కారణమైన నిరసనకారులు, వారి కుటుంబ సభ్యులు పార్లమెంట్ భవనాన్ని ముట్టడించారు. తమను అధికారికంగా గుర్తించి, చట్టపరంగా రక్షణ కల్పించాలనిచ ఆర్థిక సాయం అందించాలని, పునరావాస ప్యాకేజీ ప్రకటించాలని, ఈ అంశాన్ని చార్టర్లో చేర్చాలని నినదించారు. పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. ఫరీ్నచర్కు నిప్పుపెట్టారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు, సౌండ్ గ్రనేడ్లు ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు నిరసనకారులు గాయపడ్డారు. ప్రజల ఆందోళన నేపత్యంలో కొన్ని రాజకీయ పార్టీలు చార్టర్పై సంతకాల కార్యక్రమానికి హాజరు కాలేదు. కీలకమైన నేషనల్ సిటిజెన్ పార్టీ సైతం దూరంగా ఉంది. నూతన బంగ్లాదేశ్ జననం: యూనస్ జూలై నేషనల్ చార్టర్(జాయింట్ డిక్లరేషన్)పై సంతకంతో నూతన బంగ్లాదేశ్ జని్మంచిందని తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ పేర్కొన్నారు. చార్టర్పై వివిధ రాజకీయ పారీ్టల నేతలు సంతకాలు చేశారు. మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ, జమాత్–ఇ–ఇస్లామ్ నేతలు సంతకాలు చేసినట్లు తెలిసింది. ‘జూలై యోధులకు’దేశం రుణపడి ఉందని మహమ్మద్ యూనస్ వ్యాఖ్యానించారు. ఏమిటీ చార్టర్? మహమ్మద్ యూనస్ నియమించిన నేషనల్ కాన్సెన్సస్ కమిషన్ వివిధ రాజకీయ పారీ్టలతో చర్చించి ‘జూలై నేషనల్ చార్టర్’ను రూపొంచింది. షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పారీ్టతో మాత్రం చర్చించలేదు. 2024 జూలైలో షేక్ హసీనా ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రారంభమైన నేపథ్యంలో దీనికి జూలై నేషనల్ చార్టర్ అని పేరుపెట్టారు. రాజ్యాంగ సవరణలు, చట్టపరమైన మార్పులు, తీసుకురావాల్సిన కొత్త చట్టాలు వంటి వివరాలను ఇందులో పొందుపర్చారు. షేక్ హసీనాకు వ్యతిరేకంగా పోరాడి మరణించివారి కుటుంబాలకు, క్షతగాత్రులకు నష్టపరిహారం ఇచ్చేలా చార్టర్లో ఒక సవరణ చేసినట్లు నేషనల్ కాన్సెన్సస్ కమిషన్ వెల్లడించింది. -
పూచీకత్తుగా రూ.96 కోట్లు
బీరుట్: లిబియా దివంగత నేత కల్నల్ గఢాఫీ కుమారుడు హానిబాల్ గఢాఫీని బెయిల్పై విడుదల చేసేందుకు అక్కడి కోర్టు అంగీకరించింది. అయితే, బెయిల్ పూచీకత్తును రూ.96.83 కోట్లుగా నిర్ణయించింది. ఈ మొత్తం ఎప్పుడు చెల్లిస్తే అప్పుడు విడుదల కావచ్చని పేర్కొంది. దశాబ్దాలపాటు అధికారంలో కొనసాగిన గఢాఫీ తిరుగుబాటుదార్ల చేతిలో 2011 అక్టోబర్లో చనిపోయారు. అయితే, ఆయన పాలనాకాలంలో 1978లో లిబియాకు వచ్చిన షియాల గురువు మౌసా అల్ సదర్ అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యారు. ఆయన ఏమయ్యారో ఎవరికీ తెలియదు. అయితే, గఢాఫీ కుమారుడు హానిబాల్కు ఆ విషయం తెలుసని అనుమానించిన మిలిటెంట్ల గ్రూపు 2015లో ఆయన్ను అపహరించి బాల్బెక్లో ఉంచింది. అనంతరం లెబనాన్ పోలీసులు అతడిని మిలిటెంట్ల చెరనుంచి విడిపించి బీరుట్ జైలులో ఉంచారు. అప్పటి నుంచి దాదాపు దశాబ్దకాలంగా ఎలాంటి విచారణ లేకుండా జైలులోనే మగ్గుతున్నారు. శుక్రవారం అధికారులు ఆయన్ను జస్టిస్ ప్యాలెస్లో జడ్జి జహెర్ హమాదెహ్ ఎదుట హాజరుపరిచారు. హానిబాల్ బెయిల్ పూచీకత్తును రూ.96.83 కోట్లుగా ఆయన నిర్ణయించారు. ఈ మొత్తం ఎప్పుడు చెల్లిస్తే అప్పుడే జైలు నుంచి విడుదల కావచ్చని తెలిపారు. అయితే, రెండు నెలలపాటు దేశం విడిచి వెళ్లరాదనే షరతును విధించారు. హానిబాల్ తరఫు లాయర్ చర్బెల్ మిలాడ్ అల్–ఖౌరీ ఈ విషయం మీడియాకు వెల్లడించారు. హానిబాల్ వద్ద ప్రస్తుతం డబ్బు లేదని చెప్పారు. ఆయన బ్యాంకు అక్కౌంట్లపై నిషేధం ఉందని చెప్పారు. కాగా, షియా గురువు మౌసా అల్ సదర్ అదృశ్యం వ్యవహారం లెబనాన్లో ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉంది. లెబనాన్లోని ఏదో ఒక జైలులో ఆయన సజీవంగా ఉండి ఉంటారని కుటుంబీకులు భావిస్తుండగా, ఆయన ఎప్పుడో చనిపోయి ఉంటారని చాలా మంది అనుకుంటున్నారు. జీవించి ఉంటే ఆయనకు ఇప్పుడు 96 ఏళ్లుంటాయని అంచనా. -
నన్ను అలా చేసేలే చేశారు: డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: ప్రస్తుతం చైనాపై విధించిన సుంకాలు శాశ్వతం కాదన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. చైనా చర్యలకు అనుగుణంగానే వారి వస్తువులపై అత్యధిక సుంకాలు విధించాల్సి వచ్చిందన్నారు. అవేమీ స్థిరంగా కొనసాగవన్నారు ట్రంప్. కాకపోతే తాను ఆ విధంగా సుంకాలు విధించేలా చేశారంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు.ఫాక్స్ బిజినెస్ నెట్వర్క్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ట్రంప్.. చైనాపై విదించిన సుంకాలకు సంబంధించి ఎదురైన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ ఏడాది ఆరంభంలో ఇరుదేశాలు ఒకరిపై ఒకరు అత్యధిక సుంకాలు విధించుకోవడానికి కారణాలపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ట్రంప్ బదులిచ్చారు. మరో రెండు వారాల్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశం అవుతానని, అప్పుడు ఇరు దేశాల వాణిజ్య సంబంధాలు, సుంకాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందన్నారు. తమ మధ్య భేటీ అంతా సజావుగానే జరుగుతుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. చైనా ఎప్పుడూ తమపై ఆదిపత్యం కోసమే చూస్తుందని, ఏం జరుగుతుందనేది తనకైతే తెలియదని, ఏం జరుగుతందో చూద్దాం’ అని ట్రంప్ పేర్కొన్నారు.కాగా, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో చైనాపై 145 శాతం సుంకాలు విధిస్తూ ట్రంప్ ప్రకటన చేసిన నాటి నుంచి ఇరు దేశాల మధ్య వైరం కాస్త ముదిరింది. ఆపై చైనాపై సుంకాలను 100 శాతానికి పరిమితం చేస్తూ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపై సైతం చైనా తీవ్రంగా మండిపడింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగ్గా ఉండటానికి ఈ తరహా విధానం మంచిది కాదని, తమ ఆధిపత్యంతో ప్రపంచ దేశాల్ని కట్టడి చేయాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని చైనా ధ్వజమెత్తింది. అప్పట్నుంచీ ఇరు దేశాల మధ్య వైరంతో పాటు దూరం కూడా పెరిగింది.ఇదీ చదవండి. ‘రాబోయే కాలమంతా భారత్ది.. ఆ దేశ ప్రధానిది.. అటు తర్వాతే ఎవరైనా’ -
ఎవడ్రా సామి నువ్వు.. పాక్ను ఇంతలా వణికిస్తున్నావ్?
అది కాబూల్లోని ఓ మారుమూల కొండ ప్రాంతం. ఓ టయోటా ల్యాండ్ క్రూజర్ వాహనం నిదానంగా వెళ్తోంది. ఓ క్షిపణి రయ్మంటూ దూసుకొచ్చి ఆ వాహనాన్ని ఢీ కొట్టింది. ‘హమ్మయ్యా..’ అంటూ పాక్ సైన్యం సంబురాలు చేసుకుంది. కట్ చేస్తే.. ఆ మరుసటిరోజే ‘నేను అమరుడ్ని..’ అనే రేంజ్లో ఓ వ్యక్తి వాయిస్తో ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. అంతే పాక్ సైనికాధికారుల ముఖంలో సంతోషం పోయి.. మళ్లీ తలపట్టుకున్నారు. పాకిస్తాన్-అఫ్గనిస్తాన్ మధ్య గత 10 రోజులుగా పరస్పర దాడులతో యుద్ధ పరిస్థితులు నెలకొన్నది చూస్తున్నదే!. ఈ దరిమిలా 48 గంటల కాల్పుల విరమణతో పరిస్థితి కాస్త చల్లారినట్లే కనిపిస్తోంది. అయితే.. ఒకప్పుడు జగ్రి దోస్తులుగా ఉన్న ఈ రెండు దేశాలు దుష్మన్లుగా మారడానికి కారణం.. ఒకే ఒక్కడు. వాడి పేరు నూర్ వాలి మోహ్సూద్(Noor Wali Mehsud). పాక్కు కొరకరాని కొయ్యగా(వ్యక్తిగా) మారిన ఇతని గురించి ఇంటర్నెట్లో ఇప్పుడు తెగ వెతికేస్తున్నారు. నూర్ వాలి మెహ్సూద్(47).. ఒకప్పుడు తాలిబాన్ ఉద్యమంలో భాగమైన వ్యక్తి. అయితే ఆ తర్వాతి కాలంలో తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) అనే ఉగ్రవాద సంస్థకు నాయకత్వం వహిస్తూ.. పాక్ను వణికిస్తున్నాడు. ఇతని నేతృత్వంలో టీటీపీ సంస్థ పాక్ గడ్డపై పలు దాడులు జరిపింది. మరీ ముఖ్యంగా సైనిక స్థావరాలు, పోలీసు ఔట్పోస్టులను లెక్కలేన్నంటిని నాశనం చేసింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో ఇతని నేతృత్వంలో జరిగిన దాడులతో పాక్కు తీరని నష్టమే వాటిల్లింది. అలా.. తమ దేశ భద్రతా వ్యవస్థకు నూర్ వాలి మెహ్సూద్ పెనుముప్పుగా మారడంతో పాక్ ప్రభుత్వం శాంతి చర్చలకు ఆహ్వానించింది. అయితే.. నూర్ మొండి పట్టు వల్లే ఆ చర్చలు విఫలం కావడం గమనార్హం. తాజాగా ఇతగాడి చర్యల వల్ల పాకిస్తాన్-ఆఫ్ఘనిస్థాన్ సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి.ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్న పాక్ సైన్యం.. అతను ప్రయాణిస్తున్న కాన్వాయ్పై క్షిపణి దాడులు చేసింది. అయితే అనూహ్యంగా నూర్ వాలి దాడి నుంచి తప్పించుకున్నాడు. అతని అనుచరులు గాయాలతోనే బయటపడినట్లు తెలుస్తోంది. తన క్షేమసమాచారాన్ని తెలియజేస్తూ ఆ మరుసటిరోజే ఆడియో క్లిప్ ఒకటి నూర్ బయటకు వదిలాడు. ఈ టీటీపీ ఏంటసలు.. తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) పలు నిషేధిత సంస్థలు కలిసి ఏర్పాటు చేసిన గ్రూప్. అయితే.. ఇది ఏర్పడడానికి ఒక బలమైన కారణం ఉంది. లాల్ మసీదు ఏరియా.. ఇస్లామాబాద్లో ఒకప్పుడు మతపరమైన కేంద్రంగా విరజిల్లేది. మౌలానాలు అబ్దుల్ అజీజ్, అబ్దుల్ రషీద్ ఘాజీ సారథ్యంలో షరియా చట్టం అమలు కోసం ఉద్యమించారు. అయితే.. ఉద్యమం మాటున ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ అప్పటి సైనికాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ప్రభుత్వం ఆపరేషన్ సైలెన్స్ పేరిట చర్యకు ఉపక్రమించింది. జులై 3-11 తేదీ మధ్య ఈ దాడిలో 100 మంది మరణించగా.. 11 మంది సైనికులు, 200 మంది పౌరులు గాయపడ్డారు.మరణించిన వాళ్లంతా మిలిటెంట్లేనని ముషారఫ్ నాడు ప్రకటించారు. లాల్ మసీద్ ఘటన భావోద్వేగంగా, మతపరంగా ప్రజలను ప్రభావితం చేసింది. అయితే.. ఈ ఘటనను ఇస్లాం మీద దాడిగా భావించిన పలు గ్రూపులు.. పాకిస్తాన్ ప్రభుత్వానికి ప్రతీకారంగా కలసి TTPను డిసెంబర్ 2007లో ప్రకటించాయి. దీని లక్ష్యం.. అప్పటి ముష్రాఫ్ ప్రభుత్వాన్ని కూల్చేయడం, పాకిస్తాన్లో షరియా చట్టం అమలయ్యేలా చూడడం. కాలక్రమంలో.. ఇది పాక్ సరిహద్దు ప్రాంతాల్లో శిబిరాలను ఏర్పాటు చేసుకుని పాక్ భూభాగంపై తరచూ దాడులు చేస్తూ వస్తోంది.నూర్ సారథ్యం.. మరో మలుపు!2018లో అఫ్గన్ సరిహద్దులో అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో టీటీపీ కీలక నేతలు ముగ్గురూ మరణించారు. దీంతో నూర్ వాలి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. నూర్ వాలి మెహ్సూద్ సారథ్యంలో తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) కొత్త పంథా ఎంచుకుంది. టీటీపీ అంటే అప్పటిదాకా పాక్ అమాయక పౌరులను బలిగొన్న కరుడుగట్టిన ఉగ్రసంస్థగా ముద్రపడిపోయింది. 2014లో ఓ పాఠశాలలో జరిపిన దాడిలో 130 మంది చిన్నారులు మరణించడం.. ఇందుకు ఓ ఉదాహరణ కూడా. అయితే మత పండితుడైన నూర్.. తన సారధ్యంలో అలాంటివి జరగకూడదని బలంగా తీర్మానించాడు. పాక్ సైన్యం అనేది ఇస్లాంకు వ్యతిరేకంగా.. 78 ఏళ్లుగా పాక్ ప్రజలను బందీఖానాలో ఉంచిందని, రాజకీయ జోక్యంతో భ్రష్టు పట్టిపోయిందని ఘాటు విమర్శలు చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో పౌరుల జోలికి పోకూడదని.. కేవలం పాక్ ఆర్మీ, అవసరమైతేనే పోలీసులను లక్ష్యంగా చేసుకోవాలని టీటీపీ కేడర్కు సూచించాడు. అలా టీటీపీపై పడ్డ మచ్చను చెరిపేసే ప్రయత్నం చేశాడు నూర్. 2021లో అఫ్గానిస్థాన్లో తాలిబాన్ అధికారంలోకి రావడంతో.. TTPకు ఆఫ్ఘన్ సరిహద్దుల్లో స్వేచ్ఛగా సంచరించే అవకాశం కలిగింది. ప్రత్యేకించి.. పాక్ ఉత్తర పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లో దాడులు పెరిగాయి. పాక్ చేసే ప్రధాన ఆరోపణ ఏంటంటే.. నూర్ వాలి ఆఫ్ఘనిస్తాన్లో ఆశ్రయం పొందుతున్నాడని, తాలిబాన్ తాత్కాలిక ప్రభుత్వ సహకారంతోనే మరింత రెచ్చిపోతున్నాడని. అంతేకాదు.. తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ఇస్లాం మతాన్ని వక్రీకరిస్తోందని, అలాంటి సంస్థకు భారతదేశమూ మద్దతు ఇస్తోందని ఆరోపిస్తూ వచ్చింది. అయితే, ఈ ఆరోపణలను న్యూఢిల్లీ ఖండించింది, తాము ఎలాంటి మద్దతు ఇవ్వలేదని స్పష్టం చేసింది. -
భారత్ డర్టీ గేమ్స్ ఆడుతోంది.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్ను టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో భారత్ డర్టీ గేమ్స్ ఆడుతోందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలాగే, భారత్ (India) తరఫున ఆప్ఘనిస్తాన్ పరోక్ష యుద్ధం చేస్తుందంటూ నిందలు మోపే ప్రయత్నం చేశారు. భారత్, ఆప్ఘన్తో రెండు వైపులా యుద్దానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉందన్నారు.పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రమయ్యే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా.. ‘పాకిస్తాన్ విషయంలో ఆప్ఘన్, భారత్ అనుచితంగా వ్యవహరిస్తున్నాయి. రెండు వైపులా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. భారత్ సరిహద్దులో డర్టీ గేమ్ ఆడుతోంది. ఇస్లామాబాద్ యుద్ధ పరిస్థితులపై ప్రతిస్పందించడానికి వ్యూహాలను రూపొందించింది. యుద్ధానికి సంబంధించి బలమైన అవకాశాలు ఉన్నాయి. యుద్ధ వ్యూహాల గురించి బహిరంగంగా చర్చించలేను. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.🚨🚨 Pakistan is prepared for 2 front war: Khawaja Asif Anchor: According to war analysts, India might play dirty games along the border. Are you anticipating that?Khawaja Asif: No, absolutely, you cannot rule that out. There are strong possibilities. pic.twitter.com/ixIU7ClFrJ— Naren Mukherjee (@NMukherjee6) October 17, 2025అంతకుముందు కూడా ఆసిఫ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆప్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ ఇటీవల భారత్లో పర్యటించడంపై అక్కసు వెళ్లగక్కారు. ముత్తాఖీ ఆరు రోజుల పర్యటనలో పలు ప్రణాళికలు చేశారంటూ వ్యాఖ్యానించారు. ఈ పర్యటన వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇతర ఉద్దేశాలను కలిగి ఉందన్నారు. ఇక, ఈ ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేయొద్దంటూ హెచ్చరికలు చేశారు. తాలిబాన్ నిర్ణయాలను ఢిల్లీ స్పాన్సర్ చేస్తోంది. ఢిల్లీ కోసం కాబూల్ ప్రాక్సీ యుద్ధం చేస్తోంది అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ‘ఆప్ఘన్లో భారీ దాడులు జరిగాయి. స్నేహపూర్వక దేశాల జోక్యం తర్వాత కాల్పుల విరమణకు వారు అంగీకరించారు. కానీ, అది పేలవంగా ఉంది. ఇది ఎక్కువ కాలం ఉంటుందని అనుకోవడం లేదు’ అని అన్నారు.ఇది కూడా చదవండి: ‘ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్ కాల్.. అంతా ఉత్తిదే’ -
శ్రీలంకను భారత భద్రతకు ముప్పుగా మారనివ్వను
న్యూఢిల్లీ: శ్రీలంక గడ్డపై భారత వ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకుని తీరతానని శ్రీలంక మహిళా ప్రధాని హరిణి అమరసూర్య వ్యాఖ్యానించారు. ఢిల్లీలో డిగ్రీ చదువుకున్న రోజులను ఆమె గుర్తుచేసుకున్నారు. 1991–94కాలంలో ఢిల్లీ వర్సిటీ పరిధిలోని హిందూ కాలేజీలో సోషియాలజీలో డిగ్రీ చదువుకున్న నేపథ్యంలో గురువారం ఆమె పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు. ‘‘శ్రీలంక నిరంతరం ఒకే నిబంధనకు కట్టుబడి ఉంటుంది. పొరుగున ఉన్న మిత్రదేశం భారత్కు ముప్పు వాటిల్లేలా మా భూభాగాన్ని ఎలాంటి భారతవ్యతిరేక కార్యకలాపాలకు నెలవు కానివ్వను. ఈ నియమాన్ని త్రికరణ శుద్ధిగా పాటిస్తాం’’అని అన్నారు. తమ దేశంలో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి గత ప్రభుత్వం కూలిపోవడంపై ఆమె మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యం అనేది ప్రేక్షకులు ఆస్వాదించే క్రీడ కాదు. అతి నిరంతర అవిశ్రాంత కృషి. అంటే మన సమాజంతో ఎల్లప్పుడూ మమేకం కావాలి. న్యాయం కోసం పోరాడాలి. ప్రతి ఒక్కరూ తమతమ స్థాయిలో అందరి సంక్షేమం కోసం పాటుపడాలి. శ్రీలంక దేశ చరిత్రలో భారత్ శాశ్వత భాగస్వామిగా కీర్తికిరీటం పొందింది. ద్వీపం అయిన మా దేశంలో ఆర్థికసంక్షోభం తలెత్తినప్పుడు భారత్ నిజమైన నేస్తంలా ఆపన్న హస్తం అందించింది’’అని ఆమె అన్నారు. జయసూర్య తెలుసా? ప్రజాస్వామ్యంలోని గొప్పతనాన్ని భారత్, శ్రీలంకలో చూడొచ్చు. నాలాంటి సాధారణ వ్యక్తులను సైతం సమాజంలోని సమస్యలు, విద్యావ్యవస్థ రాటుదేలేలా చేస్తాయి. దేశసేవ చేసే స్థాయికి ఎదగనిస్తాయి. పాక్ జలసంధి కేవలం 22 నాటికల్ మైళ్ల దూరం మాత్రమే సముద్రం వెంట భారత్, శ్రీలంకలను విడదీస్తోంది. కానీ ఇరుదేశాల నాగరికత, సాంస్కృతి, మత, ప్రాచీన బంధం ఏకంగా 2,000 సంవత్సరాల క్రితమే బలపడింది. ఇప్పుడు క్రికె ట్ సైతం ఈ బంధాన్ని పెనవేస్తోంది. 1991 లో ఇక్కడ డిగ్రీ ఆనర్స్ చదివేందుకు హిందూ కాలేజీలో తొలిసారి అడుగు పెట్టినప్పుడు నా పేరు చెప్పా. నాది శ్రీలంక అని తెలిసి చాలా మంది ఒక్కటే ప్రశ్న వేశారు. నీకు క్రికెటర్ జయసూర్య తెలుసా?’’అని ఆమె అన గానే పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న ప్రిన్సిపాల్ అంజూ శ్రీవాస్తవసహా నాటి ఆమె స్నేహితులు పక్కున నవ్వారు. ‘‘భారత్, శ్రీలంకలు ఒకే సంప్రదాయ వారసత్వం, విలువలు, పరస్పర గౌరవాలతో ఎదిగాయి. ఈ సంస్కృతి బంధం పోగులే ఇరు దేశాల సమాజ సౌభ్రాత్వాన్ని పెనవేసేలా చేశాయి. కొన్ని విషయాల్లో మనలో మనకు కొన్ని పొరపొచ్చాలు రావొచ్చు. కానీ చివరకు అందరం ఇరుగుపొరుగున కలిసే జీవిస్తున్నాం. కలిసి పనిచేస్తున్నాం. చివరకు ఒకరినొకరం గౌరవించుకుంటున్నాం. శ్రీలంక ఆర్థిక పురోభివృద్ధికి భారత్ ఎంతగానో సాయపడుతోంది. కష్టకాలంలో మా ఆర్థిక స్థిరత్వం, ప్రగతికి భారత్ అండగా నిలబడింది. 2022లో తీవ్ర ఆర్థికసంక్షోభంలో మేం కూరుకుపోతే భారత్ రుణసాయం చేసింది. ఈ సాయాన్ని మేం ఏనాటికీ మరువం. ఇరుదేశాల భాగస్వామ్యం నేటి తాత్కాలిక అగత్యం కాదు. రేపటి శాశ్వత అవసరం. గత డిసెంబర్లో మా దేశాధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకె ఢిల్లీలో పర్యటించడం, ఏప్రిల్లో లంకలో మోదీ పర్యటన బలపడుతున్న ఇరుదేశాల బంధానికి గుర్తులు’’అని ఆమె అన్నారు. -
కూచిపూడి నర్తకి అరుణిమకు అరుదైన గౌరవం
లండన్: భారతీయ నృత్యరూపకం కూచిపూడికి బ్రిటన్లో ఎనలేని గుర్తింపు తెస్తూ దేశవ్యాప్తంగా భారతీయ కళకు మరింత వన్నె తెచ్చిన ప్రముఖ నాట్యకళాకారిణి అరుణిమ కుమార్ను యూకే సర్కార్ అరుదైన గౌరవంతో సత్కరించింది. బ్రిటన్ రాజు ఛార్లెస్–3 ‘గౌరవ బ్రిటిష్ ఎంపైర్ మెడల్(బీఈఎం)’తో అరుణిమను గౌరవించారు. ఒక కూచిపూడి కళాకారిణి ఈ మెడల్ను సాధించడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. భారతీయ శాస్త్రీయ నృత్యాన్ని అంతర్జాతీయ వేదికలపై అద్భుతంగా ప్రదర్శిస్తూ భారత్, బ్రిటన్సహా పలు దేశాల మధ్య సాంస్కృతి సంబంధాల బలోపేతానికి ఆమె తన కూచిపూడి కళ ద్వారా కృషిచేశారని బ్రిటన్ రాజకుటుంబం పేర్కొంది. యూకేలో పౌర, సైనిక కార్యకలాపాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులకు బ్రిటన్ రాజు ప్రతిఏటా ఈ పురస్కారాన్ని ప్రదానంచేస్తారు. అరుణిమ ఇప్పటికే బ్రిటన్ సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాత సాధించారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 వర్ధంతి వేడుకల్లో, బకింగ్హామ్ ప్యాలెస్లో, లండన్లోని యూకే ప్రధాని కార్యాలయం 10, డౌనింగ్ స్ట్రీట్లో అరుణిమ ఎన్నోసార్లు కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. భారతీయ నృత్యరూపం అంబాసిడర్గా, ఇన్ఫ్లూయన్సర్గా, సాంస్కృతిక సారథిగా అరుణిమకు మంచి పేరుంది. తనకు బ్రిటిష్ ఎంపైర్ మెడల్ రావడంపై అరుణిమ సంతోషం వ్యక్తంచేశారు. ‘‘రాజు నుంచి గౌరవ పురస్కారం పొందడం నిజంగా ఎంతో గర్వంగా, సముచితంగా గౌరవంగా అనిపిస్తోంది. కళలో నా కృషిని అంతర్జాతీయ స్థాయిలో గుర్తించినందుకు సంతోషంగా ఉంది. ఇది నా వ్యక్తిగత గుర్తింపుగా భావించట్లేను. అంతర్జాతీయ వేదికపై భారతీయ శాస్త్రీయ నాట్యానికి దక్కిన గౌరవం. కూచిపూడి నాకు జీవితాంతం తోడుంటుంది. నా భావాల వ్యక్తీకరణకు మాధ్యం కూచిపూడి’’అని ఆమె అన్నారు. ఈమెకు చెందిన ‘అరుణిమ కుమార్ డ్యాన్స్ అకాడమీ’50కిపైగా దేశాల్లో 3,000కుపైగా నృత్య ప్రదర్శనలు ఇచి్చంది. ఐదేళ్ల చిన్నారి మొదలు 75 ఏళ్ల వృద్దుల దాకా ఈమె వద్ద కూచిపూడి నేర్చుకుంటున్నారు. ఇప్పటికే ఈమెకు వందలాది మంది శిష్యులు ఉన్నారు. పద్మ భూషణ్ శ్రీమతి స్వప్నసుందరి, పద్మశ్రీ జయరామారావు వద్ద అరుణిమ శిష్యరికం చేసి కూచిపూడిలో నైపుణ్యం సాధించారు. -
ఒక ఫైటర్ జెట్ 3.5 కోట్ల పూసలు
దక్షిణాఫ్రికాకు చెందిన కళాకారుడు రాల్ఫ్ జిమాన్ అయిదేళ్లపాటు 3.5 కోట్ల పూసలు ఉపయోగించి ఒక పాత సోవియట్ మిగ్–21 ఫైటర్ జెట్కు కొత్త రూపాన్ని ఇచ్చాడు. యుద్ధ చిహా్నలను కళాఖండాలుగా మార్చే అతని ‘వెపన్స్ ఆఫ్ మాస్ ప్రొడక్షన్’ శ్రేణిలో ఇది చివరిది, అత్యంత ప్రతిష్టాత్మకమైనది. రాల్ఫ్ జిమాన్కు చిన్నప్పటి నుంచే ఆయుధాలతో భయంకరమైన అనుభవాలున్నాయి. 1970లలో, జోహన్నెస్బర్గ్లో 13 లేదా 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, అతన్ని ఓ వ్యక్తి .45 మాగ్నమ్ తుపాకీతో బెదిరించాడు. కానీ తనకు 50 ఏళ్ల వయసు వచ్చేసరికి దాదాపు 15 నుంచి 20 సార్లు తుపాకీ గురి పెట్టినట్లు జిమాన్ గుర్తు చేసుకున్నాడు. ఈ భయంకరమైన అనుభవాల వల్లే ఆయన ‘తుపాకుల వ్యతిరేకి’గా మారారు. ప్రస్తుతం లాస్ ఏంజిలెస్లో ఉంటున్న జిమాన్, వృత్తిరీత్యా కమర్షియల్ ఫొటోగ్రాఫర్, ఫిల్మ్మేకర్. దశాబ్ద కాలంగా యుద్ధ కళాఖండాలను లక్షలాది చేతితో అల్లిన పూసలు ఉపయోగించి కళాత్మక వస్తువులుగా మార్చ డమే తన పనిగా పెట్టుకున్నాడు. జిమాన్ తన కళాఖండాల ద్వారా దక్షిణాఫ్రికా చరిత్రలో హింసపై ఒక సందేశాన్ని ఇవ్వాలనుకున్నాడు. అందుకోసం 2019లో అత్యంత పెద్ద సవాలుగా మిగ్–21 విమానాన్ని ఎంచుకున్నాడు. అయిదేళ్ల కష్టం.. మిగ్–21 కళాఖండం మొదట, జిమాన్ ఫ్లోరిడాలోని ఒక సైనిక కాంట్రాక్టర్ నుండి మిగ్–21 జెట్ను కొనుగోలు చేశాడు. అది ముక్కలుగా, మంచి స్థితిలో లేకపోయినా, కళాఖండంగా మార్చడానికి కచ్చితంగా సరిపోతుందని ఆయన భావించాడు. తొలు త ఆయన బృందం మిగ్ ఇంజన్ను తొలగించి విమానాన్ని లాస్ ఏంజిలెస్లోని స్టూడియోకు తరలించింది. జిమాన్ అల్యూమినియం ప్యానెల్లపై డిజైన్లను రూపొందించి, ఆ పేపర్ షీట్లను దక్షిణాఫ్రికాకు పంపాడు. జోహన్నెస్బర్గ్, క్వాజులు–నటల్, మ్పుమలంగా ప్రావిన్సుల నుండి వచ్చిన జింబాబ్వేయన్, న్డెబెలె కమ్యూనిటీలకు చెందిన 100 మందికి పైగా కళాకారులు ఈ ప్యానెళ్లను పూసలతో తయారు చేయడం ప్రారంభించారు. ఈ కళాఖండాన్ని పూర్తి చేయడానికి 5 సంవత్సరాలకు పైగా సమయం పట్టింది. 51 అడుగుల పొడవు, 24 అడుగుల వెడల్పు ఉన్న ఈ విమానంపై సుమారు 3.5 కోట్ల పూసలు అమర్చినట్లు అంచనా.విద్యకు నిధి మిగ్–21 ప్రాజెక్టుకు మద్దతు ఇచి్చన డీటీగ్రుయిల్లె చారిటీ సంస్థ ద్వారా ఈ కళాకారుల పిల్లలు, ఇతర యువత 25 మంది విద్యకు స్పాన్సర్íÙప్ లభిస్తోంది. వీరు వైద్యం, నర్సింగ్, ఫ్యాషన్ డిజైన్ వంటి కోర్సులు చదువుతున్నారు. ఈ అద్భుతమైన మిగ్–21 విమాన కళాఖండాన్ని అమెరికాలో ప్రదర్శన తర్వాత అమ్మకానికి ఉంచుతారు. దీనిద్వారా వచ్చే నిధులు విద్యా కార్యక్రమాలకు, ఉక్రెయిన్లో యుద్ధ బాధితులైన పిల్లలకు ఆర్ట్ థెరపీ అందించడానికి వినియోగిస్తారు. యుద్ధ చిహ్నాలను ఆకర్షణీయమైన కళాఖండాలుగా మార్చడం ద్వారా రాల్ఫ్ జిమాన్ కళతో శాంతి, ఆశ సందేశాన్ని ప్రపంచానికి బలంగా తెలియజేస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇక ఉక్రెయిన్–రష్యాపైనే దృష్టి: ట్రంప్
వాషింగ్టన్: ఇజ్రాయెల్–హమాస్ యుద్ధానికి తెరదించానని, బందీల విడుదల కోసం ఒప్పందం కుదిర్చానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇక తన మొత్తం దృష్టిని ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ముగించడంపైనే కేంద్రీకరించినట్లు తెలిపారు. రష్యాను చర్చల వేదికపైకి రప్పించడానికి ఉక్రెయిన్కు లాంగ్–రేంజ్ ఆయుధాలు అందజేసే అంశాన్ని పరిశీలిస్తానని అన్నారు. రష్యా దాడులను తిప్పికొట్టడానికి దీర్ఘశ్రేణి క్షిపణులు ఇవ్వాలని ఉక్రెయిన్ సైన్యం ఎప్పటినుంచో అమెరికాను కోరుతోంది. ట్రంప్ బుధవారం శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలుకుతానన్న విశ్వాసం ఉందన్నారు. శాంతి చర్చల కోసం ముందుకు రావాలని రష్యా అధినేత పుతిన్కు సూచించారు. లేకపోతే మరింత ఒత్తిడి పెంచక తప్పదని తేల్చిచెప్పారు. మాట వినకపోతే మరిన్ని కఠిన ఆంక్షలకు సిద్ధంగా ఉండాలని పరోక్షంగా హెచ్చరించారు. తాను అధికారంలోకి వస్తే ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని తక్షణమే ఆపేస్తానని గత ఏడాది ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హామీ ఇచి్చన సంగతి తెలిసిందే. అయితే, అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలవుతున్నా ఆయన తన హామీని నిలబెట్టుకోలేకపోయారు. ఉక్రెయిన్, రష్యా అధినేతలతో పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ యుద్ధం మాత్రం ఆగడం లేదు. -
ఏఐ టాయిలెట్!
సాక్షి, సాగుబడి: కృత్రిమ మేధ.. ఇప్పుడు టాయిలెట్ని కూడా అత్యా ధునిక స్మార్ట్ లేబొరేటరీగా మార్చేసింది! మనకు మున్ముందు రాగల జబ్బుల్ని ముందుగానే పసిగట్టే ఆధారపడదగిన గట్ హెల్త్ డేటాను.. చిటికెలో మొబైల్ యాప్లోకే అప్లోడ్ చేసేస్తాయట ఈ సూపర్ స్మార్ట్ ఏఐ టాయిలెట్లు!అన్ని రంగాల మాదిరిగానే రోజువారీ వ్యక్తిగత ఆరోగ్య సమాచార సేకరణ వ్యవస్థ కూడా అత్యాధునికతను సంతరించుకుంటోంది. పొద్దున్నే నిద్ర లేవగానే చిటికెలో ఆనాటి తాజా వ్యక్తిగత ఆరోగ్య గణాంకాలను అందించే మొబైల్ యాప్లు, డిజిటల్ ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటికి సరికొత్త కొనసాగింపుగా వచ్చిందే స్మార్ట్ మరుగుదొడ్డి!కూర్చుని లేచేలోపే..మలమూత్ర విసర్జన చేస్తున్నంతటి సేపట్లోనే సెన్సార్లు, కృత్రిమ మేధ విశ్లేషణ పరికరాలు.. మల మూత్రాల రంగు, రూపు, నాణ్యతలను బట్టి ఆరోగ్య స్థితిగతుల్ని ఇట్టే పసిగట్టేస్తాయి. కడుపులో సూక్ష్మజీవరాశి ఎంత ఆరోగ్యంగా ఉందో, ఏదైనా తేడా ఉంటే దాని వల్ల ఏయే వ్యాధులు ముసురుకునే ప్రమాదం పొంచి ఉందో కూడా తేల్చి చెప్పేస్తాయి. కమోడ్ మీద కూర్చొని, లేచే సమయానికే ఈ సమస్త సమాచారం మొబైల్ యాప్లో అప్లోడ్ చేసేస్తాయి ఈ ఏఐ టాయిలెట్లు! ప్రత్యక్ష పరీక్షల మాదిరిగా నూటికి నూరు శాతం కచ్చితత్వంతో ఈ పరీక్షల ఫలితాలు ఉంటాయని అనుకోలేం. కానీ, కొలరెక్టల్ కేన్సర్ వంటి అనేక జబ్బుల్ని అత్యంత తొలి దశలోనే గుర్తించటంలో సూపర్ స్మార్ట్ టాయిలెట్ల పాత్రను తోసిపుచ్చలేమని నిపుణులు చెబుతున్నారు. జపాన్లో తయారీస్మార్ట్ టాయిలెట్ల తయారీలో జపాన్కు చెందిన టోటో టాయిలెట్స్ సంస్థ ఒక ముందడుగు వేసింది. మరుగుదొడ్డి కమోడ్కు అమర్చిన సెన్సార్.. మలం రంగు, ఆకారం, పరిమాణం వంటి వివరాలను అందిస్తుంది. బార్కోడ్ స్కానర్ మాదిరిగా క్షణాల్లో రిపోర్టు ఇస్తుంది. మనిషి కూర్చోగానే సెన్సార్ యాక్టివేట్ అవుతుంది. ఎల్ఈడీ లైటు వెలుతురులో మలాన్ని సెన్సార్ పరీక్షిస్తుంది. సేకరించిన సమాచారాన్ని అప్పటికప్పుడే స్మార్ట్ఫోన్ యాప్కు పంపిస్తుంది. మల విసర్జన చేసిన ప్రతిసారీ సేకరించిన సమాచారంతో కూడిన స్టూల్ కేలండర్ను ఈ యాప్ భద్రపరుస్తుంది. ట్రెండ్ ఎలా ఉంది.. ఏమైనా తేడాలున్నాయా.. ఉంటే, వాటిని సరిదిద్దుకోవటానికి జీవన శైలిని ఎలా మార్చుకోవాలో కూడా సూచనలిస్తుంది. సుఖ మల విసర్జనకు అనుసరించాల్సిన పద్ధతులను సూచిస్తుంది కూడా.ప్రత్యేక స్టార్టప్లుకృత్రిమ మేధతో కూడిన బాత్రూమ్ టెక్నాల జీలను అందించే స్టార్టప్లు అందుబాటులోకి వచ్చాయి. అమెరికాలోని ఆస్టిన్ నగరంలోని త్రోన్ అనే స్టార్టప్ మల మూత్రాల బాగోగులను విశ్లేషించేందుకు ఏఐ టాయిలెట్ కెమెరాను రూపొందించింది. టాయిలెట్ను ఉపయోగించే వ్యక్తి జీర్ణవ్యవస్థ పనితీరు, మూత్ర విసర్జన తీరు ఎలా ఉంది? ఆ వ్యక్తి సరిపడా నీరు తాగుతు న్నారా లేదా?.. వంటి రియల్ టైమ్ డేటాను కూడా మొబైల్ యాప్కు పంపుతుంది. ఎక్కువ మంది వాడే టాయిలెట్లలో కూడా ప్రతి యూజర్ గట్ ప్రొఫైల్ను త్రోన్ ఏఐ వ్యవస్థ సిద్ధం చేస్తుంది. టాయిలెట్ను వాడుతున్న వ్యక్తి ఎవరో బ్లూటూత్ ద్వారా గుర్తించి కచ్చితమైన వివరాలను ఎవరివి వాళ్లకు అందిస్తుంది. రోజువారీ బాత్రూమ్ అలవాట్ల ఆధారంగా వ్యక్తుల ఆరోగ్య సమాచార వ్యవస్థను సంపన్నం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. -
మోదీ మాటిచ్చారు..!
వాషింగ్టన్: రష్యా నుంచి భారత్ చౌకగా ముడిచమురు కొనుగోలు చేస్తుండడం పట్ల చాలా రోజులుగా అసహనంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తామంటూ తన మిత్రుడు, భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని స్పష్టంచేశారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని నిలిపివేసే విషయంలో ఇదొక కీలకమైన ముందడుగు అవుతుందని అన్నారు. చమురు కొనడం ఆపేస్తే రష్యాపై ఒత్తిడి పెరుగుతుందని, తద్వారా ఉక్రెయిన్పై దండయాత్ర ఆగిపోతుందని ఉద్ఘాటించారు. వైట్హౌస్లోని ఓవల్ ఆఫీసులో బుధవారం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోలు చేస్తుండడం తమకు ఎంతమాత్రం సంతోషం కలిగించడం లేదని తేల్చిచెప్పారు. ఇలాంటి కొనుగోళ్ల వల్ల రష్యాకు ఆర్థికంగా మేలు జరుగుతోందని, అంతిమంగా ఆ సొమ్మంతా ఉక్రెయిన్పై యుద్ధానికే ఖర్చవుతోందని తెలిపారు. ఎవరైనా సరే రష్యాకు ఆర్థికంగా సాయం అందించడం మానుకోవడం మంచిదని హితవు పలికారు. ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న మతిలేని యుద్ధంలో లక్షల మంది బలైపోయారని ట్రంప్ ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే రష్యా నుంచి చమురు కొనడం నిలిపివేస్తామంటూ ఈరోజు తన మిత్రుడు మోదీ మాట ఇచ్చారని పేర్కొన్నారు. ఇక చైనా సైతం అదే దారిలో నడుస్తుందని తాము ఆశిస్తున్నట్లు తెలియజేశారు. చైనా ప్రభుత్వం రష్యా నుంచి చమురు దిగుమ తి చేసుకోవడం ఆపేస్తే మంచిదని సూచించారు. త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తవుతుంది ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు అంటూ ట్రంప్ ప్రశంసించారు. తానంటే మోదీకి ఎంతో ప్రేమ అని వ్యాఖ్యానించారు. ఇక్కడ ప్రేమ అనే పదాన్ని మరోలా అర్థం చేసుకోవద్దని మీడియా ప్రతినిధులను కోరారు. మోదీ రాజకీయ జీవితానికి ఇబ్బందులు సృష్టించాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. మోదీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ‘‘భారత్ను చాలా ఏళ్లుగా గమనిస్తున్నా. అదొక నమ్మశక్యంకాని దేశం. ప్రతి సంవత్సరం ఒక కొత్త నాయకుడు అధికారంలోకి వస్తుంటారు. కొందరైతే కొన్ని నెలలపాటే ఉండొచ్చు కూడా. కానీ, నా స్నేహితుడు మోదీ చాలాఏళ్లుగా వరుసగా అధికారంలో కొనసాగుతున్నారు. రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తామంటూ ఆయన నాకు మాట ఇచ్చారు. నిజంగా నాకు తెలియదు గానీ అదొక బ్రేకింగ్ స్టోరీ కావొచ్చు! మోదీ వెంటనే ఆ పని చేయకపోవచ్చు. నా అంచనా ప్రకారం కొంత సమయం పట్టొచ్చు. కానీ, త్వరలోనే ఆ ప్ర క్రియ పూర్తవుతుంది. ఉక్రెయిన్పై యుద్ధం ముగిసిన తర్వాత రష్యాతో వాణిజ్య సంబంధాలను భారత్ పునరుద్ధరించుకోవచ్చు’’ అని ట్రంప్ పేర్కొన్నారు. పాక్ను అనబోయి..భారత్లో ఏడాదికొక పాలకుడు అధికారంలోకి వస్తాడంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పాకిస్తాన్ పరిస్థితిని ట్రంప్ పొరపాటున భారత్కు అన్వయించి మాట్లాడినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగతోంది. ట్రంప్ మానసిక ఆరోగ్యంపై అనుమానాలు తలెత్తుతున్నాయని జనం పోస్టులు చేస్తున్నారు. నిజానికి భారత్లో ఏడాదికొక ప్రధానమంత్రి మారిపోయిన సందర్భాలు లేవు. పాకిస్తాన్లోనే అలాంటి పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే.అంతా అబద్ధం‘మోదీ, ట్రంప్ ఫోన్ సంభాషణ జరగలేదు’ రష్యా చమురు విషయంలో ప్రధాని మోదీ హామీ ఇచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను భారత విదేశాంగ శాఖ గురువారం ఖండించింది. బుధవారం మోదీ, ట్రంప్ మధ్య ఫోన్లో ఎలాంటి సంభాషణ జరగలేదని తేల్చిచెప్పింది. ట్రంప్ చెప్పిందంతా అబద్ధమని పరోక్షంగా స్పష్టంచేసింది. దేశ అవసరాలు, ప్రయోజనాల కోణంలోనే రష్యా నుంచి ముడిచమురు కొంటున్నామని, ఇందులో మరో మాటకు తావులేదని ఒక ప్రకటనలో వెల్లడించింది. తమ ఇంధన విధాన నిర్ణయాలకు స్థిరమైన ధరలు, నిరంతరాయమైన సరఫరానే పతిప్రాదిక అని పేర్కొంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఇంధన దిగుమతుల్లో మార్పులుచేర్పులు చేసుకుంటున్నామని ఉద్ఘాటించింది. ఇంధన వనరుల్లో వైవిధ్యం కొనసాగిస్తున్నామని విదేశాంగ శాఖ వివరించింది. ట్రంప్ను చూస్తే మోదీకి భయం: రాహుల్ న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను చూసి ప్రధాని మోదీ భయపడుతున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. కీలకమైన ప్రభుత్వ నిర్ణయాలను మోదీ అమెరికాకు ఔట్సోర్సింగ్కు ఇచ్చినట్లు కనిపిస్తోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వ పాలనలో విదేశాంగ విధానం పూర్తిగా కుప్పకూలిందని మండిపడ్డారు. రష్యా నుంచి చమురు కొనడం ఆపేస్తామంటూ మిత్రుడు మోదీ మాట ఇచ్చారని ట్రంప్ ప్రకటించడంపై రాహుల్ గురువారం తీవ్రంగా స్పందించారు. రష్యా చమురు విషయంలో భారత ప్రభుత్వం తరఫున నిర్ణయాలు తీసుకొని, ప్రకటనలు చేసే అధికారాన్ని ట్రంప్కు మోదీ కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్రంప్ వల్ల తరచుగా ఎదురుదెబ్బలు తగులుతున్నప్పటికీ అభినందన సందేశాలు పంపిస్తున్నారని ప్రధానమంత్రిపై ధ్వజమెత్తారు. ఈ మేరకు రాహుల్ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. భారత ఆర్థిక శాఖ మంత్రి అమెరికా పర్యటనను ఎందుకు రద్దు చేశారో చెప్పాలన్నారు. హమాస్–ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించే విషయంలో ఈజిప్టులోని షెర్మ్ ఎల్–õÙక్లో జరిగిన భేటీకి ప్రధాని మోదీ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. అమెరికా ఒత్తిడి కారణంగానే ఆపరేషన్ సిందూర్ ఆగిపోయిందంటూ డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెబుతున్నా ప్రధాని మోదీ ఎందుకు ఖండించడం లేదని రాహుల్ గాంధీ నిలదీశారు. -
‘ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్ కాల్.. అంతా ఉత్తిదే’
న్యూఢిల్లీ: భారత్ ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసినట్లు, ఇక రష్యా చమురు కొనుగోలు చేయమని ట్రంప్కు మోదీ హామీ ఇచ్చినట్లు వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. అయితే వీటిని భారత కేంద్ర ప్రభుత్వం ఖండించింది. మోదీకి ట్రంప్ ఫోన్ చేసిన విషయంలో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ఆ వార్తలన్నీ రూమర్లేనని, అందులో ఎటువంటి వాస్తవం లేదని తెలిపింది. ‘నిన్న అసలు మోదీ-ట్రంప్ల మధ్య ఎటువంటి సంభాషణ జరగేలేదు. మోదీకి ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడలేదు. రష్యా చమురు నిలిపివేస్తామని ట్రంప్కు మోదీ హామీనూ ఇవ్వలేదు. వారి మధ్య ఎటువంటి టెలిఫోన్ సంభాషణ జరగనేలేదు. ఇదంతా అవాస్తవం’ అని విదేశాంగ మంత్రత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ స్పష్టం చేశారు. ఇదీ విషయం..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వైట్హౌస్లో మీడియాతో మాట్లాడుతూ.. @రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో నేను భారత్తో మాట్లాడాను. రష్యా చమురు దిగుమతి చేసుకోవడంపై భారత ప్రధాని మోదీ వద్ద ఆందోళన వ్యక్తం చేశాను. ఇలా చమురు కొనుగోలు చేయడం వల్ల రష్యాకు లాభం కలుగుతోంది. పుతిన్ యుద్ధం కొనసాగించేందుకు ఈ నిధులు ఉపయోగపడుతున్నాయి. మాస్కో నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నందుకు నేను సంతోషంగా లేను అని చెప్పా’. ఈ సందర్బంగా ప్రధాని మోదీ.. ఇక నుంచి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని ఈరోజు తనకు హామీ ఇచ్చారని ఇదొక కీలక ముందడుగు అని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో, నిజంగానే మోదీ హామీ ఇచ్చారా? అనే చర్చ నడుస్తున్న సమయంలో భారత ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది.ఇదీ చదవండి: మోదీ గొప్పోడే.. : ట్రంప్ చిత్రమైన వ్యాఖ్యలు -
World Food Day: టన్నుల ఆహారం చెత్తకుప్పల్లోకి!
గాలి, నీరు తర్వాత మనిషికి అత్యంత ముఖ్యమైనది ఆహారం. ప్రతి ఒక్కరికీ తగిన ఆహారం తీసుకునే హక్కు ఉంది. అంతర్జాతీయ ఒప్పందాలు, మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన ప్రకారం ప్రతి ఒక్కరికీ ఆహారం, జీవితం, స్వేచ్ఛ, పని, విద్య తదితర హక్కులు ఉండాల్సిందే. వైవిధ్యం, పోషణ, స్థోమత, అందుబాటు, భద్రతతో కూడిన పోషక విలువలున్న ఆహారం అందరికీ అందాలి. దీనిని గుర్తించిన ఐక్యరాజ్య సమితి ప్రతీ ఏటా ‘ప్రపంచ ఆహార దినోత్సవం’ నిర్వహిస్తోంది.ఎలా మొదలయ్యింది?ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ)1945, అక్టోబర్ 16న స్థాపితమయ్యింది. దీనికి గుర్తుగా ఇదే రోజున ప్రతి సంవత్సరం ‘ప్రపంచ ఆహార దినోత్సవం’ జరుపుకుంటున్నాం. ప్రపంచ ఆహార కార్యక్రమం, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వ్యవసాయ అభివృద్ధికి అంతర్జాతీయ నిధి తదితర సంస్థలు ఈ రోజున ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తాయి. ఈ ఏడాది జరుపుకునే ప్రపంచ ఆహార దినోత్సవం థీమ్ ‘మెరుగైన ఆహారాలు, మెరుగైన భవిష్యత్తు కోసం చేయి చేయి కలుపుదాం’. ఈ ఏడాది ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ 80వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. పేదరికం, యుద్ధ సంఘర్షణలు, వాతావరణ మార్పుల కారణంగా లక్షలాది మంది ఆహార అభద్రతతో బాధపడుతున్నారు. 2030 నాటికి ఆకలిని అంతం చేయాలనే లక్ష్యంతో ఎఫ్ఏఓ పనిచేస్తోంది.ఆందోళన కలిగిస్తున్న ఆహార వ్యర్థాలుప్రపంచంలో ఉత్పత్తి అయిన మొత్తం ఆహారంలో మూడింట ఒక వంతు వృథా అవుతోందని పలు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2021లో ఉత్పత్తయిన ఆహారంలో 19 శాతం వృథా అయినట్లు ఒక నివేదిక తెలిపింది. దీని పరిమాణం 105 కోట్ల టన్నులుగా లెక్కగట్టారు. ప్రతి మనిషి ప్రతి ఏటా 79కేజీల ఆహారాన్ని వృథా చేస్తున్నట్లు నివేదిక వివరించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా రోజుకు వంద కోట్ల భోజనాలకు సమానం అని ఐక్యరాజ్య సమితి తెలిపింది. 2019లో 17శాతం ఉన్న ఆహార వృథా 2021కి వచ్చేసరికి రెండు శాతం పెరిగి 19శాతాని కి చేరినట్లు వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ఆహార వృథా 60 శాతం గృహాల్లో జరుగుతుండగా, హోటళ్లు, ఇతర ఆహార సేవా సంస్థల్లో 28శాతం ఉన్నట్లు తెలిపింది. మిగిలిన 12 శాతం ఇతర కారణాల వల్ల జరుగుతున్నట్లు తేలింది. భారతదేశంలో ఏటా 68 మిలియన్ టన్నుల ఆహారం వృథా అవుతోంది. ఆహార వృథాను అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చర్యలు చేపట్టాయి.ఆకలితో కోట్లాదిమంది విలవిలఆహార వృథా పరిస్థితి సంగతి అలా ఉంటే.. నేటికీ కనీసం తీనేందుకు గుప్పెడు అన్నం లేక కోట్లాది మంది ఆకలితో అలమటిస్తున్నారు. రోజంతా పస్తులుండే వారు కొందరైతే, ఒక పూట మాత్రమే తినే స్థితిలో అనేక మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 78.3కోట్ల మంది ఆకలి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచంలోని ప్రతి ముగ్గురిలో ఒకరు ఓ మోస్తరు ఆకలి బాధను అనుభవిస్తున్నారు. 2022లో 240కోట్ల మంది ఆహార కొరతను ఎదుర్కొన్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. తెలిపింది. 78.3కోట్ల మంది ఆకలితో అలమటించగా, 14.8కోట్ల మంది పిల్లల్లో పోషహాకార లోపం కనిపించినట్లు తేలింది. తిండి లేక అల్లాడుతున్న ప్రజల్లో 25శాతం ఇండియాలోనే ఉన్నారన్నది గమనార్హం. భారత దేశ జనాభాలో 14.5శాతం మంది పోషకాహారలేమితో బాధపడుతున్నారు. ఐదేళ్లలోపు పిల్లలో మరణాలకు ప్రధాన కారణం పోషకాహార లోపమేనని ఐసీఎంఆర్ హెచ్చరించింది.వాతావరణ మార్పులతో కుంగుబాటుప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న వాతావరణ మార్పులు, జీవన ప్రమాణాల కారణంగా క్రమంగా వ్యవపాయ సాగుబడి తగ్గిపోతుంది. పంటలు దెబ్బతిని దిగుబడులు తగ్గిపోతున్నాయి. దీనికి తోడు పట్టణీకరణ కారణంగా వ్యవసాయం చేసే భూమి విస్తీర్ణం గణనీయంగా కుంచించుకపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆహార వృథాను అరికట్టడం ఎంతో అవసరం. ఇందుకోసం ప్రభుత్వాలతో పాటు ప్రజలూ బాధ్యతాయుతంగా మెలగాలి. గృహ అవసరాల కోసం సరైన ప్రణాళికతో ఆహార పదార్థాలను కొనుగోలు చేయాలి. మరోవైపు ఆహార వ్యర్థాలు వాతావరణ మార్పులకు దోహదం చేస్తాయి. పల్లపు ప్రదేశాలలో ఆహారం కుళ్లిపోవడం కారణంగా గ్రీన్హౌస్ వాయువు మీథేన్ విడుదలవుతుంది. ఇది హానికారకంగా మారుతుంది. ఆకలిని పరిష్కరించడం అంటే ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేయడం మాత్రమే కాదని, ఆహార వ్యర్థాలను తగ్గించడం, వాతావరణ మార్పులకు నూతన విధానాలు అవలంబించాలనే విషయాన్ని ప్రపంచ ఆహార దినోత్సవం మనకు గుర్తు చేస్తుంది. -
మోదీ గొప్పోడే.. : ట్రంప్ చిత్రమైన వ్యాఖ్యలు
భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసలు గుప్పించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపేస్తామని మోదీ తనకు మాట ఇచ్చారని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మోదీ గొప్ప వ్యక్తి అంటూనే ట్రంప్ విచిత్రమైన వ్యాఖ్య ఒకటి చేశారు. మోదీ ఓ గొప్ప వ్యక్తి. భారత్ను ఎంతో కాలంగా నేను చూస్తున్నా. అది ఎంతో అద్భుతమైన దేశం. అలాంటి దేశానికి నా స్నేహితుడు అధినేతగా దీర్ఘకాలికంగా కొనసాగుతున్నారు. ఆయన ట్రంప్ను ఎంతో ప్రేమిస్తారు. ఇక్కడ ప్రేమంటే తప్పుగా అర్థం చేసుకోకండి. నేను ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనుకోవడం లేదు అంటూ నవ్వుతూ అన్నారాయన. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందని.. ఈ చర్యతో ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు భారత్ అర్ధిక సహకారం అందిస్తోందని ట్రంప్ మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే భారత దిగుమతులపై 50 శాతం సుంకాలు విధించారాయన. అయితే తాజాగా వైట్హౌజ్లో ఆయన మాట్లాడుతూ.. రష్యా నుంచి భారత్ ఇక మీదట చమురు కొనదని మోదీ హామీ ఇచ్చారని ప్రకటించారు. ఇప్పటికప్పుడే కాకపోయినా.. త్వరలోనే ఈ నిర్ణయం అమలు చేస్తామని మోదీ తనతో చెప్పారని ట్రంప్ అన్నారు. అలాగే.. భారత్ నిర్ణయం ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు కీలక ముందడుగు అని అభివర్ణించారాయన. అలాగే తన తదుపరి లక్ష్యం చైనానే అని ప్రకటించారాయన. -
తాలిబాన్ల చేతిలో.. పాక్కు ఘోర అవమానం
పరస్పర ఆరోపణలతో.. అఫ్తనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. బుధవారం జరిగిన పాకిస్తాన్ వైమానిక దాడుల్లో కనీసం 15 మంది అఫ్గాన్ పౌరులు మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. దీంతో తాలిబాన్ సైన్యం ప్రతిచర్యలకు దిగడంతో పాక్ సైన్యం తోకముడిచినట్లు తెలుస్తోంది. అయితే యుద్ధం తప్పదనే భావిస్తున్న తరుణంలో.. అనూహ్యంగా 48 గంటలపాటు కాల్పుల విరమణ తెరపైకి రావడం గమనార్హం. ఈ క్రమంలో.. కాబూల్, కాంహార్ దాడులపై అఫ్గనిస్తాన్ ప్రజలు రగిలిపోతున్నారు. స్పిన్ బోల్దక్ వద్ద పాక్ మిలిటరీ ఔట్ పోస్టులపై తాలిబాన్ బలగాలు మెరుపు దాడులు చేయగా, సైనికులు పరారైనట్లు, కొంత మందిని బంధించినట్లు సమాచారం. భారీగా ఆయుధాలు, ఆహార పదార్థాలు, పాక్ సైనికుల దుస్తులు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకొని నంగర్హార్ ప్రావిన్స్లో బహిరంగంగా ప్రదర్శించారు. పాక్ సైనికుల ప్యాంట్లను ప్రదర్శిస్తూ.. వ్యతిరేక నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాక్ దాడుల నేపథ్యంలో అఫ్గన్ ప్రజలు తాలిబాన్లకు మద్దతుగా నిలిచారు. అవసరమైతే మేము కూడా ముజాహిదీన్గా మారిపోయి యుద్ధానికి సిద్ధం అని కాందహార్ యువకులు కొందరు చెబుతున్నారు. ఇస్లామిక్ ఎమిరేట్(తాలిబాన్ తాత్కాలిక ప్రభుత్వం) సరైన ప్రతీకారం తీసుకుంది. ప్రజలంతా పాకిస్తాన్కు వ్యతిరేకంగా తాలిబాన్తో ఉన్నారు అని పక్తియా ప్రజలు అంటున్నారు. మా భూమిని రక్షించిన భద్రతా బలగాలకు కృతజ్ఞతలు. మేము ఎల్లప్పుడూ వారి పక్కనే ఉంటాం అని కాబూల్ వాసి ఒకరు తెలిపారు.బీబీసీ జర్నలిస్టు దౌద్ జున్బిష్ ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. పాక్ సైన్యం విడిచిపెట్టిన అవుట్పోస్టుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్న ప్యాంట్లను తాలిబాన్ ప్రదర్శిస్తోంది అని ధృవీకరించారు. ఈ నేపథ్యంలో ఇది పాక్కు తీవ్ర అవమానమే అనే చర్చ నడుస్తోంది. Viral video: Afghan Taliban displaying pants of Pakistani Army soldiers - who were captured by Afghanistan, in the recent border clashes.Why does Pakistani Army always surrender with their pants open? 🤔pic.twitter.com/JqcKw28aou— Treeni (@TheTreeni) October 15, 2025 Again #Pakistan Begging For Cease fire from #Afghanistan .Wait for tomorrow and they will claim victory ! Afghans Celebrating with the pants of their Pak army men hanging in their Bazaar. Pak army is getting battered from all sides .#PakistanArmy pic.twitter.com/HN0Rgz45sc— Meena K (@Raagmaand) October 15, 2025 పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ ఒకప్పుడు మిత్రదేశాలే అయినా.. డ్యూరాండ్ లైన్ విషయంలో కయ్యానికి కాలు దువ్వుకున్నాయి. గత వారం రోజులుగా రెండు దేశాల సైన్యాలు 7 చోట్ల ఘర్షణలకు దిగాయి. తొలుత కాబూల్లోని తెహ్రాక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) క్యాంపులపై పాక్ సైన్యం వైమానిక దాడులకు దిగింది. దాంతో తాలిబన్లు సైతం ఎదురుదాడి ప్రారంభించారు. అయితే దాడుల విషయంలో పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి ఈ రెండు దేశాలు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈ ఉద్రిక్తతలతో ఇప్పటిదాకా 200 మంది తాలిబన్లు, 58 మంది పాక్ సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. 2021లో అఫ్గానిస్తాన్ను తాలిబన్లు స్వాదీనం చేసుకున్న తర్వాత పాక్తో ఇదే అతిపెద్ద ఘర్షణ కావడం గమనార్హం. మరోవైపు.. అఫ్గనిస్తాన్ మంత్రి భారత పర్యటనకు వెళ్లిన వేళే.. ఈ దాడులు మొదలయ్యాయి. కాబూల్లో రాయబార కార్యాలయం ప్రారంభిస్తామని భారత ప్రభుత్వం ప్రకటించడం పాకిస్తాన్కు కంటగింపుగా మారింది. భారత్, అఫ్గానిస్తాన్ మధ్య సంబంధాలు బలపడుతుండడాన్ని పాక్ జీర్ణించుకోలేకపోతున్నట్లు స్పష్టమవుతోంది.ప్లీజ్.. మధ్యవర్తిత్వం వహించరా?కాల్పుల విరమణ విషయంలో ఇరు దేశాలు పరస్పరం విరుద్ధ ప్రకటన చేసుకుంటున్నారు. తాలిబాన్ల విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు పాక్, పాకిస్తాన్ కోరుకోవడం వల్లనే కాల్పుల విరమణకు తాము అంగీకరించినట్లు తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీవుల్లా ముజాహిద్ చెబుతున్నారు. మరోవైపు.. ఖతార్, సౌదీ అరేబియా ప్రభుత్వాలను పాక్ తరఫున ఫోన్లు వెళ్లినట్లు తెలుస్తోంది. మధ్యవర్తులుగా వ్యవహరించాలని, వెంటనే జోక్యం చేసుకొని తాలిబాన్లను శాంతి ఒప్పందానికి ఒప్పించాలని కోరింది.ఇదీ చదవండి: ఇక నేనే ప్రెసిడెంట్ని.. నేను చెప్పినట్లే ప్రజలు వినాలి! -
ఇక నేనే అధ్యక్షుడిని.. సైనిక నేత మైఖేల్ వెల్లడి
ఆంటనానారివో: తూర్పు ఆఫ్రికా ద్వీపదేశమైన మడగాస్కర్లో(Madagascar) అధ్యక్షుడు ఆండ్రీ రాజోలీనా సారథ్యంలోని ప్రభుత్వాన్ని కూలదోసిన మిలటరీ కమాండర్, కల్నల్ మైఖేల్ ర్యాండ్రియానిరినా(Randrianirina) బుధవారం తన మనసులోని మాట బయటపెట్టారు. త్వరలో దేశాధ్యక్షునిగా(Madagascar President) పగ్గాలు చేపట్టబోతున్నట్లు అంతర్జాతీయ మీడియాకు చెప్పారు.జెన్ జెడ్ యువత(Gen Z) నేతృత్వంలో మొదలైన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం ఉప్పెనలా మారడంతో ప్రాణభయంతో అధ్యక్షుడు రాజోలీనా విదేశానికి పారిపోయారు. రాజోలీనా లేకపోవడంతో దేశ అత్యున్నత రాజ్యాంగ కోర్టు ఆహ్వానం మేరకు త్వరలో తాను దేశ పరిపాలనా బాధ్యతలు తీసుకోబోతున్నట్లు మైఖేల్ చెప్పారు. మైఖేల్ సారథ్యంలోని నిపుణులైన క్యాప్శాట్ సైనిక బృందం తిరుగుబాటు చేపట్టడంతో రాజోలీనా చేతులెత్తేయడం తెలిసిందే. ‘‘నిన్ననే మేం వాస్తవానికి బాధ్యతలు తీసుకోవాల్సింది. దేశంలో అధ్యక్షుడు లేడు. సెనేట్లోనూ అధ్యక్షుడి జాడ లేదు. అసలు ప్రభుత్వమే లేదు. అందుకే త్వరలో మేం నూతన ప్రధానికి నియమిస్తాం’’అని మైఖేల్ వ్యాఖ్యానించారు.అయితే ఎప్పటికల్లా నూతన ప్రభుత్వ ఏర్పాటు ఉంటుందనే మైఖేల్ స్పష్టంచేయలేదు. సెనేట్, న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం అధికారులను తొలగిస్తున్నట్లు మైఖేల్ ఇప్పటికే జాతీయ రేడియోలో ప్రకటించారు. 1960లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందాక మడగాస్కర్ ఎన్నో తిరుగుబాట్ల పాలిటపడింది. దేశంలో నిరుద్యోగం, పేదరికం పెచ్చరిల్లడం, ప్రజల జీవన వ్యయాలు పెరగడం, నీటికొరత, విద్యుత్ సంక్షోభం, అమాంతం పెరిగిన అవినీతితో జెన్జెడ్ యువత విసిగిపోయి ఉద్యమబాట పట్టడం, దీనికి సైనిక తిరుగుబాటు తోడవడంతో రాజోలీనా ప్రభుత్వం కూలిపోయింది. -
మోదీ నాకు మాటిచ్చారు.. పుతిన్ ఆటకు చెక్: ట్రంప్
వాషింగ్టన్: భారత్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో రష్యా నుంచి భారత్(India) చమురు కొనుగోలుచేయదని ప్రధాని మోదీ(PM Modi) తనకు కీలక హామీ ఇచ్చారని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి రష్యాను ఒంటరి చేయడంలో ఇదొక కీలక అడుగుగా ట్రంప్ అభివర్ణించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వైట్హౌస్లో మీడియాతో మాట్లాడుతూ.. రష్యా(Oil Buy From Russia) నుంచి చమురు కొనుగోలు విషయంలో నేను భారత్తో మాట్లాడాను. రష్యా చమురు దిగుమతి చేసుకోవడంపై భారత ప్రధాని మోదీ వద్ద ఆందోళన వ్యక్తం చేశాను. ఇలా చమురు కొనుగోలు చేయడం వల్ల రష్యాకు లాభం కలుగుతోంది. పుతిన్ యుద్ధం కొనసాగించేందుకు ఈ నిధులు ఉపయోగపడుతున్నాయి. మాస్కో నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్నందుకు నేను సంతోషంగా లేను అని చెప్పినట్టు తెలిపారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ.. ఇక నుంచి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని ఈరోజు తనకు హామీ ఇచ్చారని ఇదొక కీలక ముందడుగు అని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో, నిజంగానే మోదీ హామీ ఇచ్చారా? అనే చర్చ నడుస్తోంది. అయితే, ఇప్పటి వరకు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత్ ధ్రువీకరించలేదు.మరోవైపు.. రష్యా, చైనా అంశంపై కూడా ట్రంప్ ప్రస్తావించారు. ఈ సందర్బంగా చైనా సైతం రష్యా ఆయిల్ను కొనకుండా చేస్తానని ఇక ఇదే మిగిలి ఉందన్నారు. భారత్, చైనా.. అమెరికాతో కలిసి వస్తే పుతిన్ చేస్తున్న యుద్ధానికి చెక్ పెట్టవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, ఇంధన విధానంపై భారత్, అమెరికాల మధ్య ఘర్షణ ఉన్నప్పటికీ యూఎస్కు భారత్ సన్నిహిత భాగస్వామి అని ట్రంప్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ తనకు స్నేహితుడని చెప్పుకొచ్చారు. #WATCH | "Yeah, sure. He's (PM Narendra Modi) a friend of mine. We have a great relationship...I was not happy that India was buying oil. And he assured me today that they will not be buying oil from Russia. That's a big stop. Now we've got to get China to do the same thing..."… pic.twitter.com/xNehCBGomR— ANI (@ANI) October 15, 2025 -
పేరాయణం!
ఈ పెద్దమనిషి పేరు చెప్పాలంటే 20 నిమిషాలు కావాలి. అంటే, ఓ సినిమా ఇంటర్వెల్ అయ్యేంత సేపు! అదండీ విషయం! మామూలుగా అయితే ఎవరినైనా పరిచయం చేసుకుంటే ‘హాయ్, నా పేరు ఫలానా’ అని సెకన్లలో చెప్పేస్తాం. కానీ, లారెన్స్ వాట్కిన్స్ అనే న్యూజిలాండ్ మాజీ సెక్యూరిటీ గార్డ్కి మాత్రం ఆ విధానం అస్సలు నచ్చలేదు! పేరు కాదది.. అష్టాదశ పురాణం!ఆయన పేరంటే పేరు కాదు, అదొక అష్టాదశ పురాణం! మొత్తం 2,253 పదాలు ఉంటాయిట! గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా ‘ప్రపంచంలోనే అతి పొడవైన వ్యక్తిగత పేరు’.. అని అధికారికంగా ప్రకటించింది. అంటే.. ఆయన తన పూర్తి పేరు చెప్పడం మొదలుపెడితే.. మీరు ఒక కాఫీ తాగి రావచ్చు. ఓ రెండు చిన్న కవితలు రాసి ముగించవచ్చు. పక్కన ఉన్న స్నేహితుడితో ఓ దేశ రాజకీయాల గురించి చర్చ మొదలెట్టి ముగించవచ్చు కూడాను.. మీరు టిఫిన్ చేయడం పూర్తయ్యేలోపు కూడా ఆయన పేరు సగం కూడా పూర్తి కాదు మరి! పెళ్లి మండపంలోనూ అదే హంగామా!1991లో లారెన్స్ వాట్కిన్స్ మొదటి పెళ్లప్పుడు జరిగింది మరింత కామెడీ. ఆ పెళ్లి తంతు జరిపించే వ్యక్తి తెలివైన వాడు. రిస్క్ తీసుకోకుండా, లారెన్స్ గారి ఆ 2,253 పేర్ల లిస్ట్ను ముందుగానే రికార్డ్ చేశాడట!. మండపంలో మంగళవాయిద్యాల బదులు ఆ రికార్డింగ్ అర్ధగంట పాటు మోగుతూనే ఉందట!. అక్కడికి వచ్చిన అతిథులు షాంపైన్ తాగుతూ, ఆ అనంతమైన నామస్మరణను వింటూ హాయిగా తిరిగారట!. ఎట్టకేలకు 20 నిమిషాల తర్వాత, నామకరణ ఘట్టం ముగిశాక, ‘ఐ డూ’ అనే ముఖ్యమైన మాట చెప్పడానికి లారెన్స్ గారికి అవకాశం దొరికింది! ఆయన చిన్నప్పుడు ’రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్’ షో చూసి, గిన్నిస్ రికార్డ్స్ పుస్తకాలు చదివి, ‘నాలాంటి సాధారణ మనిషికి ఏ ప్రత్యేక ప్రతిభ లేదు’ అని బాధపడిపోయాడట. అప్పుడు, తనకున్న ఏకైక అవకాశం.. ప్రపంచంలోనే అతి పొడవైన పేరు పెట్టుకోవడమే అని డిసైడ్ అయ్యారు!సంతకం సంగతేంటి?రోజువారీ అవసరాల కోసం, ఆయన తన పేరును కేవలం ’లారెన్స్ అలోన్ అలోయ్ వాట్కిన్స్’ అని కుదించుకుని, సంతకాన్ని వాట్కిన్స్–5 (అయిదో తరం) అని పెడతారట. ఆయన పూర్తి పేరుతో ఉన్న పాత పాస్పోర్ట్కి ఏకంగా ఆరు అదనపు పేజీలు అవసరమయ్యాయట! ఇదే లారెన్స్ గారి పూర్తి పేరులారెన్స్ అలోన్ అలాయిస్ అలోయిసియస్ ఆల్ఫెజ్ అలున్ అలురెడ్ ఆల్విన్ అల్యాసాండిర్ ఆంబీ ఆంబ్రోస్ ఆంబ్రోసియస్ అమియాస్ అమియోట్ అమియాస్ అండర్స్ ఆండ్రీ ఆండ్రియా ఆండ్రియాస్ ఆండ్రూ ఆండీ అనైరిన్ ఆంగ్విష్ ఆన్లెయిఫర్ ఆంథిన్... (ఓస్.. ఇంతేనా అనుకున్నారు కదూ.. అయిపో లేదు.. ఇంకా ఉంది..)– సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత పాస్పోర్టుకు 85వ ర్యాంకు
సింగపూర్: భారత పాస్పోర్టు స్థానం గత ఏడాదితో పోలిస్తే పడిపోయింది. 2025 హెన్లీ పాస్పోర్టు ఇండెక్స్లో 85వ ర్యాంకు దక్కించుకుంది. భారత పాస్పోర్టుతో 57 దేశాలకు వీసా లేకుండా వెళ్లే సౌలభ్యం ఉంది. గత ఏడాది ఇదే ఇండెక్స్లో 80వ ర్యాంకు లభించింది. అప్పట్లో 62 దేశాలకు వీసా లేకుండా వెళ్లే సౌకర్యం ఉండేది. ఏడాది కాలంలో 5 స్థానాలు పడిపోయినట్లు స్పష్టమవుతోంది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్టుగా సింగపూర్ పాస్పోర్టు తన స్థానాన్ని కాపాడుకుంది. ఈ పాస్పోర్టు ఉంటే 193 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. ఈ జాబితాలో దక్షిణ కొరియా పాస్పోర్టుకు రెండో ర్యాంకు దక్కింది. దీంతో 190 దేశాలకు వీసాతో నిమిత్తం లేకుండా వెళ్లే వీలుంది. మూడో స్థానంలో ఉన్న జపాన్ పాస్పోర్టుతో 189 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. జర్మనీ, ఇటలీ, లగ్జెంబర్గ్, స్పెయిన్, స్విట్జర్లాండ్ పాస్పోర్టులు నాలుగో ర్యాంకు దక్కించుకున్నాయి. వీటితో 188 దేశాలకు వీసా–ఫ్రీ సౌలభ్యం ఉంది. -
కెన్యా రాజకీయ దిగ్గజం ఒడిన్గా అస్తమయం
నైరోబీ: కెన్యా రాజకీయాలపై తనదైన చెరగని ముద్రవేసిన దిగ్గజ విపక్ష నేత, మాజీ ప్రధానమంత్రి రైలా ఒడిన్గా తుదిశ్వాస విడిచారు. 80 ఏళ్ల వయసులో ఆయుర్వేద చికిత్స కోసం ఇటీవల ఆయన భారత్కు విచ్చేశారు. కేరళలోని కొత్తట్టుకులంలోని దేవమాత ఆస్పత్రిలో చేరారు. బుధవారం ఆస్పత్రి ప్రాంగణంలో ఉదయపు నడకకు ఒడిన్గా బయల్దేరగా గుండెపోటుతో కుప్పకూలారు. అక్కడే ఉన్న ఆయన కుమార్తె, సోదరి, వ్యక్తిగత వైద్యుడు, భారత, కెన్యా భద్రతాధికారులు హుటాహుటిన ఆయనను ఆస్పత్రిలోకి తీసుకెళ్లగా అప్పటికే ఆయన కన్నుమూశారని వైద్యులు ధ్రువీకరించారు. గత 12 సంవత్సరాలుగా కెన్యా పార్లమెంట్లో విపక్షనేతగా కొనసాగుతున్న ఒడిన్గా దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు. అజీమియో లా ఉమోజా(వన్ కెన్యా) కూటమి పార్టీకి సారథ్యంవహిస్తున్నారు. ఒడిన్గా మరణ వార్త తెల్సి కెన్యా ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. దేశ ప్రజాస్వామ్యాన్ని పటిష్టంచేసేందుకు అవిశ్రాంతంగా పోరాడిన తమ నేత లేడన్న వార్త తెలిసి నైరోబీలోని ఆయన సొంతింటికి జనం పోటెత్తారు. కెన్యా అధ్యక్షుడు విలియం రూటో సైతం ఒడిన్గా నివాసానికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. మరణం పట్ల భారత ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. ‘‘నిలువెత్తు దార్శనికుడు నేలకొరిగారు’’అని ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టారు. కెన్యా ప్రజాస్వామ్యం కోసం పాటుపడిన గొప్పనేత ఒడిన్గా అంటూ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫొసా, టాంజానియా అధ్యక్షుడు సమియా సులుహూ సహా పలువురు ప్రపంచనేతలు తమ సంతాప సందేశాల్లో పేర్కొన్నారు. కెన్నెత్ మతిబా తర్వాత బహుళ రాజకీయపార్టీల కెన్యా ప్రజాస్వామ్యంలో ఒడిన్గాను మరో జాతిపితగా పలువురు కొనియాడతారు. అత్యంత ప్రజాదరణ నేతగా పేరు ఇటీవలి దశాబ్దాల్లో ఒడిన్గా కెన్యా రాజకీయాల్లో ముఖ్యనేతగా ఎదిగారు. కెన్యా స్వాతంత్య్రం సాధించాక తొలి ఉపాధ్యక్షుడిగా సేవలందించిన జరమోగు అజుమా ఒడిన్గా కుమారుడే ఈ ఒడిన్గా. కెన్యాలోని కిసుము నగరంలో 1945 జనవరి 7న జన్మించారు. రాజకీయ కుటుంబంలో జన్మించిన ఈయన చిన్నతనం నుంచే రాజకీయాలపై ఆకర్షితులయ్యారు. జర్మనీలో ఇంజనీరింగ్ చదివారు. రాజకీయాల్లోకి రాకముందు కెన్యా నాణ్యతా ప్రమాణాల సంస్థకు మేనేజర్గా పనిచేశారు. తర్వాత డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. అయితే కేంద్రప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నించాడన్న ఆరోపణలపై అరెస్టయి జైలు జీవితం గడిపారు. 1997లో తొలిసారిగా దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలయ్యారు. తర్వాత దేశబహిష్కరణకు గురై యూరప్లో గడిపారు. 1992లో స్వదేశానికి తిరిగొచ్చారు. తర్వాత సైతం నాలుగుసార్లు ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చినా అధ్యక్ష పగ్గాలు చేపట్టలేకపోయారు. 2007లో స్వల్ప తేడాలో పదవి దక్కకపోవడంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. రోజుల తరబడి జరిగిన హింసాత్మక ఘటనల్లో వందల మంది చనిపోయారు. కానీ ఈయనపై ఎలాంటి ఆరోపణలు రాకపోవడం విశేషం. ఘర్షణలు సద్దుమణిగాక 2008 నుంచి 2013దాకా కూటమి ప్రభుత్వంలో ఆయన ప్రధానమంత్రిగా సేవలందించారు. యువకునిగా ఉన్నప్పుడు నైరోబీలోని గోర్ మహియా ఫుట్బాల్ క్లబ్ తరఫున కొంతకాలం ఫుట్బాల్ సైతం ఆడారు. -
పాక్, అఫ్గాన్ మధ్య మళ్లీ ఘర్షణ
ఇస్లామాబాద్: ఒకప్పటి సన్నిహిత మిత్రదేశాలైన పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ఇరుదేశాల సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణ జరిగింది. కాందహార్ ప్రావిన్స్లో మంగళవారం అర్ధరాత్రి పాక్ సైన్యం, తాలిబన్ ఫైటర్ల మధ్య కాల్పులు జరిగాయి. తర్వాత ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 15 మంది సాధారణ పౌరులు మరణించారు. 100 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 80 మందికిపైగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. పాక్ దాడిలో దాదాపు 50 మంది తాలిబన్లు మరణించినట్లు సమాచారం. సరిహద్దుల్లో ఘర్షణ నానాటికీ ముదురుతుండడంతో పాక్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఖతార్, సౌదీ అరేబియా ప్రభుత్వాలను ఫోన్లో సంప్రదించింది. అఫ్గాన్ సరిహద్దుల్లో శాంతి నెలకొనేలా మధ్యవ ర్తులుగా వ్యవహరించాలని, వెంటనే జోక్యం చేసుకొని తాలిబన్లను ఒప్పించాలని కోరింది. పరస్పరం నిందలు పాక్, అఫ్గాన్ మధ్య గతవారం హింసాకాండ మొదలైంది. కాబూల్లోని తెహ్రాక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) క్యాంపులపై పాక్ సైన్యం వైమానిక దాడులకు దిగింది. దాంతో తాలిబన్లు సైతం ఎదురుదాడి ప్రారంభించారు. డురాండ్ లైన్లో 58 మంది పాక్ సైనికులను హతమార్చారు. 20 పాక్ సెక్యూరిటీ ఔట్పోస్టులను ధ్వంసం చేశారు. 2021లో అఫ్గానిస్తాన్ను తాలిబన్లు స్వాదీనం చేసుకున్న తర్వాత పాక్తో ఇదే అతిపెద్ద ఘర్షణ కావడం గమనార్హం. అఫ్గాన్ విదేశాంగ మంత్రి ముత్తాఖీ భారత్లో పర్యటిస్తున్న సమయంలోనే పాక్ సైన్యం తాలిబన్లపై గురిపెట్టింది. మంగళవారం రాత్రి తొలుత పాక్ జవాన్లే కాల్పులు జరిపారని, భారీ ఆయుధాలు ప్రయోగించారని తాలిబన్ అధికార ప్రతినిధి జబీవుల్లా ముజాహిద్ ఆరోపించారు. తమ ఎదురుకాల్పుల్లో పెద్ద సంఖ్యలో పాక్ జవాన్లు హతమయ్యారని, పాక్ ఆయుధాలను, యుద్ధ ట్యాంక్లను స్వా«దీనం చేసుకున్నామని వెల్లడించా రు. అయితే, రెండు సరిహద్దు పోస్టులు సహా మొ త్తం నాలుగుచోట్ల తాలిబన్లు మొదట కాల్పులు జరిపారని, దాంతో తాము ప్రతిస్పందించాల్సి వచ్చిందని పాకిస్తాన్ సైన్యం తెలియజేసింది. ఎదురుకాల్పుల్లో 30 మంది తాలిబన్ ఫైటర్లు మరణించారని స్పష్టంచేసింది. స్పిన్ బోల్డాక్లో మరో 20 మంది మృతిచెందారని వివరించింది. తాలిబన్లకు సంబంధించిన 8 సైనిక పోస్టులు, 6 యుద్ధ ట్యాంకులు ధ్వంసమైనట్లు పేర్కొంది. తాలిబన్ల దాడిలో చమన్జిల్లాలో నలుగురు సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారని పాక్ వెల్లడించింది. ఒరాక్జాయ్ జిల్లాలో ఆరుగురు పాక్ పారామిలటరీ సిబ్బంది మృతిచెందినట్లు తెలిసింది. ఇరువర్గాల కాల్పుల నేపథ్యంలో సరిహద్దుల నుంచి వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. గత పది రోజులుగా సరిహద్దు మార్గాలను అధికారులు మూసివేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు నానాటికీ క్షీణిస్తున్నాయి. పాక్ రక్షణ శాఖ మంత్రి, ఐఎస్ఐ అధినేత, ఇద్దరు సైనికాధికారులకు వీసాలు ఇవ్వడానికి తాలిబన్ ప్రభుత్వం నిరాకరించింది. వారిని తమ దేశంలోకి అనుమతించబోమని తేల్చిచెప్పింది. దాంతో అఫ్గాన్తో అన్ని రకాల సంబంధాలను తెంచేసుకుంటున్నట్లు పాక్ ప్రభుత్వం సంకేతాలిచ్చింది. మరోవైపు భారత్, అఫ్గానిస్తాన్ మధ్య సంబంధాలు బలపడుతుండడాన్ని పాక్ జీరి్ణంచుకోలేకపోతోంది. కాబూల్లో రాయబార కార్యాలయం ప్రారంభిస్తామని భారత ప్రభుత్వం ప్రకటించడం పాకిస్తాన్కు కంటగింపుగా మారింది.48 గంటల కాల్పుల విరమణ అఫ్గానిస్తాన్తో 48 గంటలపాటు తాత్కాలిక కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. తాలిబన్ల విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. పాకిస్తాన్ కోరుకోవడం వల్లనే కాల్పుల విరమణకు తాము అంగీకరించినట్లు తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీవుల్లా ముజాహిద్ తెలియజేశారు. ఒప్పందాన్ని తాము గౌరవిస్తామని అన్నారు. ఒకవేళ పాకిస్తాన్ సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే తగిన రీతిలో బదులిస్తామని స్పష్టంచేశారు. -
వాళ్లు ఇస్తున్న సబ్సిడీలు అన్యాయం: భారత్పై చైనా ఫిర్యాదు
ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), బ్యాటరీ ఉత్పత్తి రంగాలలో భారత్ అందిస్తున్న సబ్సిడీలు (EV Battery Subsidies) దేశీయ పరిశ్రమలకు అన్యాయంగా లాభాన్ని కలిగిస్తున్నాయని ఆరోపిస్తూ చైనా (China) బుధవారం ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) వద్ద ఫిర్యాదు చేసింది. చైనా చేసిన ఫిర్యాదు వివరాలను త్వరలో పరిశీలిస్తామని భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.భారత్ ‘ నేషనల్ క్రిటికల్ మినరల్ స్టాక్ పైల్’ (NCMS) కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిసిన వెంటనే చైనా ఈ ఫిర్యాదు చేసింది. ఈ స్కీం లక్ష్యం అరుదైన భూ మూలకాలు (rare earth elements) వంటి కీలక ఖనిజాల లభ్యతను మెరుగుపరచడం, దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం. ఈ మూలకాలు ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్లు, ఇతర గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీలకు కీలకం కావటంతో, వాటి ఎగుమతిపై ఆంక్షలు విధించాలని చైనా ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.ఇతర దేశాలపైనా..చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. భారత్తో పాటు తుర్కియే, కెనడా, యూరోపియన్ యూనియన్ దేశాలపై కూడా ఈ తరహా ఫిర్యాదులు డబ్ల్యూవో వద్ద నమోదయ్యాయి. డబ్ల్యూవో నిబంధనల ప్రకారం మొదటి దశలో చర్చల ద్వారానే వివాద పరిష్కారం వెతకాలి. చర్చలు ఫలితం ఇవ్వకపోతే, సమస్యపై తీర్పునిచ్చే ప్యానెల్ ఏర్పాటుకు అవకాశం ఉంటుంది.ఈ విషయంపై స్పందించిన భారత వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్.. చైనా సమర్పించిన వివరాలను త్వరలో అధ్యయనం చేస్తామని తెలిపారు. చర్చలతో పరిష్కారం సాధించే దిశగా భారత్ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.ఇక వాణిజ్య సంబంధాల పరంగా చైనా భారత్కు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అయితే 2023-24లో చైనాకు భారత ఎగుమతులు 14.5% తగ్గి 14.25 బిలియన్ డాలర్లకు చేరాయి. అదే సమయంలో చైనాతో దిగుమతులు 11.52% పెరిగి 113.45 బిలియన్ డాలర్లకు చేరడంతో వాణిజ్య లోటు 99.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. -
అమెరికాలో ఐదేళ్లలో 100 మందిపైగా భారత విద్యార్థుల మృతి
ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం భారత యువత ఎక్కువగా అమెరికా వెళ్తుతున్నారు. అగ్రరాజ్యంలో ఉన్న విదేశీ విద్యార్థుల్లో ఇండియన్ స్టూడెంట్సే అధికంగా ఉన్నారు. ఉన్నత చదువులతో పాటు పనిచేసుకునే సౌలభ్యం ఉండడంతో భారత విద్యార్థుల్లో అధికశాతం అమెరికావైపు మొగ్గుచూపుతున్నారు. అయితే అమెరికాలో మన విద్యార్థుల మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.భారత విదేశాంగ శాఖ తాజా గణాంకాల ప్రకారం.. గత ఐదేళ్లలో అమెరికాలో దాదాపు 160 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. 2020, జూన్ నుంచి 2024 జూన్ వరకు 108 మంది భారత విద్యార్థులు (Indian Students) మరణించారు. గతేడాది నుంచి ఇప్పటివరకు మరో 10 మంది వరకు చనిపోయారు. అధికారిక లెక్కల కంటే భారతీయుల మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని ప్రవాస తెలుగు సంఘాల ప్రతినిధులు అంటున్నారు. ప్రమాదాలు, దొంగతనాలు, తుపాకీ కాల్పుల కారణంగా ఎక్కువ మంది చనిపోతున్నారని వెల్లడించారు. 40 కుటుంబాలకు సహాయం''అమెరికాలో మనవాళ్లు చనిపోతున్న విషాదకర ఘటనలు ఈ మధ్యకాలంలో తరచుగా చూస్తున్నాం. యాక్సిడెంట్లు, చోరీలు, తుపాకీ కాల్పుల్లో మనవాళ్లు ఎక్కువగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. విహారయాత్రలకు వెళ్లి నీళ్లలో మునిగిపోయి చనిపోతున్న ఘటనలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. దాదాపు 40 కుటుంబాలకు సహాయం అందించాం. పార్థీవదేహాలను ఇండియా పంపించడానికి, ఇక్కడ అంత్యక్రియల ఏర్పాట్ల కోసం మా వంతు సాయం చేశామ''ని వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ వ్యవస్థాపకుడు వంశీరెడ్డి కంచరకుంట్ల 'టైమ్స్ ఆఫ్ ఇండియాకు' తెలిపారు.జాగ్రత్తలు తప్పనిసరికాగా, నేరాలు ఎక్కువగా జరిగే గ్రామీణ ప్రాంతాల్లో అనధికారికంగా పనిచేస్తుండడం కూడా మన యువతపై దాడులకు మరో కారణమని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వ్యవస్థాపకుడు విశ్వేశ్వర్రెడ్డి కాల్వల అన్నారు. అయితే దాడులకు గురవకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అని ఇమ్మిగ్రేషన్ (Immigration) లాయర్ జనేత ఆర్ కంచర్ల అన్నారు. హైరిస్క్ ఏరియాలు అవైడ్ చేయాలని, లేట్నైట్ బయట తిరగకూడదన్నారు. చెడు సావాసాలకు దూరంగా ఉండాలని, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయరాదని సూచించారు.చెడు అలవాట్లతో..మోతాదుకు మించి మత్తు పదార్థాలు సేవించే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మాజీ కార్యదర్శి అశోక్ కోళ్ల ఆందోళన వెలిబుచ్చారు. ఇలాంటి కేసులు గత సంవత్సరంలో దాదాపు 30 వరకు తానా (TANA) దృష్టికి వచ్చినట్టు వెల్లడించారు. కాలిఫోర్నియా, టెక్సాస్, కనెక్టికట్ రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు ఎక్కువగా వెలుగులోకి వచ్చినట్టు చెప్పారు. ఇక్కడికి వచ్చిన కొద్దిరోజులకే కొంత మంది చెడు అలవాట్లకు ఆకర్షితులవుతున్నారని చెప్పారు.కాగా, కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీలలో ఎక్కువగా భారతీయుల మరణాలు నమోదయ్యాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనే దాదాపు 60 శాతం మంది భారతీయులు (Indians) నివసిస్తున్నారు.చదవండి: ఎయిర్ బ్యాగ్.. పిల్లాడి ప్రాణం తీసింది!2025లో కాల్పుల్లో చనిపోయిన తెలుగు విద్యార్థులుఅక్టోబర్ 4, 2025: టెక్సాస్ స్టేట్ డల్లాస్ నగరంలో జరిగిన కాల్పుల్లో హైదరాబాద్ ఎల్బీనగర్ బీఎన్ రెడ్డి నగర్కు చెందిన చంద్రశేఖర్ పోలే(27) కన్నుమూశాడు. బీడీఎస్ పూర్తయ్యాక 2023లో ఉన్నత చదువుల కోసం డల్లాస్ వెళ్లిన చంద్రశేఖర్.. పెట్రోల్ బంకులో దోపిడీని అడ్డుకునే క్రమంలో అతడు ప్రాణాలు కోల్పోయాడు.సెప్టెంబర్ 3, 2025: అమెరికాలో పోలీసుల కాల్పుల్లో మహబూబ్నగర్కు చెందిన యువకుడు మహ్మద్ నిజాముద్దీన్ (29) మృతి చెందాడు. కాలిఫోర్నియా శాంటాక్లారా ఏరియాలో రూమ్మేట్తో గొడవపడి, కత్తితో అతడిని పొడిచాడు. దీంతో పోలీసులు నిజాముద్దీన్పై కాల్పులు జరిపారు.జనవరి 20, 2025: హైదరాబాద్కు చెందిన రవితేజ అనే ఎంబీఏ విద్యార్థి కనెక్టికట్లోని న్యూ హెవెన్లో దుండగుల కాల్పుల్లో మృతిచెందాడు. సైన్స్లో మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్లిన అతడు.. పెట్రోల్ బంకులో దోపిడీని అడ్డుకోవడంతోనే ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వచ్చాయి. -
పాక్- ఆఫ్ఘన్ సరిహద్దు ఘర్షణలు.. పలువురు మృతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఘర్షణలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ దళాలు, స్థానిక ఉగ్రవాదులు సరిహద్దు వెంబడి జరిపిన కాల్పులకు తమ సైన్యం ప్రతీకారం తీర్చుకున్నదని పాకిస్తాన్ తెలిపింది. తాజా ఘర్షణల్లో పదుల సంఖ్యలో సైనికులతో పాటు పౌరులు కూడా మృతిచెందారని ఇరువైపుల భద్రతా అధికారులు మీడియాకు తెలిపారు.కాందహార్ ప్రావిన్స్లోని స్పిన్ బోల్డాక్లో ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో ఆఫ్ఘన్ తాలిబాన్ వర్గాలు గస్తీ తిరుగుతున్నాయి. కాగా ప్రధాన సరిహద్దు పోస్టులపై ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు చేసిన రెండు దాడులను తిప్పికొట్టామని, దక్షిణ కాందహార్ ప్రావిన్స్లోని ఆఫ్ఘన్ వైపున ఉన్న స్పిన్ బోల్డాక్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన దాడుల్లో దాదాపు 20 మంది తాలిబాన్ సభ్యులు మరణించారని పాకిస్తాన్ సైన్యం తెలిపింది. పౌర జనాభాను పట్టించుకోకుండా ఈ దాడి జరిగిందని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. పాకిస్తాన్ సైన్యంతో సరిహద్దులో రాత్రిపూట జరిగిన ఘర్షణల్లో దాదాపు 30 మంది మరణించారని తెలుస్తోంది.రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో జరిగిన తాజా హింసలో 15 మంది పౌరులు మృతి చెందారని సంబంధిత అధికారులు ఆఫ్ఘన్ వార్తా సంస్థకు తెలిపారు. పాకిస్తాన్ సరిహద్దు జిల్లా ఒరాక్జాయ్లో దళాలు ఉగ్రవాదుల మధ్య జరిగిన పోరాటంలో ఆరుగురు పాకిస్తాన్ పారామిలిటరీ సైనికులు మృతి చెందారని, పలువురు గాయపడ్డారని భద్రతా అధికారులు వెల్లడించినట్లు రాయిటర్స్ పేర్కొంది. కాగా తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ పాకిస్తాన్ దళాలు భారీ ఆయుధాలతో దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. గత వారాంతంలో ఆఫ్ఘనిస్తాన్.. పాకిస్తాన్పై ప్రతీకార దాడులు చేపట్టింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో జరిగిన దాడికి ప్రతిస్పందనగా ఇరు దేశాల మధ్య దాడులు కొనసాగుతున్నాయి.కాగా తమ దాడుల్లో 58 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించినప్పటికీ, మృతుల సంఖ్య 23 అని పాకిస్తాన్ తెలిపింది. ఎదురు కాల్పుల్లో 200 మందికి పైగా తాలిబాన్లను, అనుబంధ దళాలను అంతమొందించామని పేర్కొంది. ఈ ఉద్రిక్తతల మధ్య అక్టోబర్ 12 నుంచి ఆఫ్ఘనిస్తాన్- పాకిస్తాన్ మధ్య సరిహద్దు క్రాసింగ్లను మూసివేశారు. ఏఎప్పీ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం తాజాగా జరిపిన మోర్టార్ కాల్పుల్లో 15 మంది పౌరులు మరణించారని స్పిన్ బోల్డక్ ప్రాంతంలోని స్థానిక సమాచార విభాగం ప్రతినిధి అలీ మొహమ్మద్ హక్మల్ తెలిపారు. 80 మందికి పైగా మహిళలు, పిల్లలు గాయపడ్డారని స్పిన్ బోల్డక్ జిల్లా ఆసుపత్రి అధికారి అబ్దుల్ జాన్ బరాక్ మీడియాకు తెలిపారు. -
చైనాను అడ్డుకోవడానికి భారత్ మద్దతు కావాలి: స్కాట్ బెసెంట్
వాషింగ్టన్: అమెరికా, చైనా(China) మధ్య టారిఫ్ల కారణంగా ట్రేడ్ వార్ కొనసాగుతోంది. అరుదైన ఖనిజాలపై చైనా ఆధిపత్యం విషయంలో అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో చైనాకు వ్యతిరేకంగా భారత్ మద్దతు ఇవ్వాలని ఆశిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్(Scott Bessent) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో చైనాను టార్గెట్ చేసి.. ప్రపంచ పంపిణీ వ్యవస్థలపై చైనా గురిపెట్టిందని ఆరోపణలు గుప్పించారు.అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తాజాగా ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘అమెరికా ప్రపంచ శాంతి, ఆర్థిక స్థిరత్వం కోసం కృషి చేస్తోంది. ఇదే సమయంలో చైనా ప్రపంచంలో వార్ ఎకానమీకి ఫైనాన్స్ చేస్తోందని ఆరోపించారు. అరుదైన ఖనిజాల(rare Metals) ఉత్పత్తి, సరఫరాపై చైనా పెంచుకుంటున్న ఆధిపత్యాన్ని అడ్డుకోవడంలో భారత్, యూరోపియన్ దేశాలు అమెరికాతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. అయితే, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆధునిక సాంకేతిక పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ సామగ్రి తయారీలో ఈ ఖనిజాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చైనా ఈ వనరులలో దాదాపు 70% సరఫరాను నియంత్రిస్తుండటంతో, అమెరికా దీనిని వ్యూహాత్మక ముప్పుగా చూస్తోంది. ఇక, అక్టోబర్ 9 నుంచి అరుదైన ఖనిజాల ఎగుమతులకు అనుమతులు తప్పనిసరి చేస్తూ చైనా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.NEW:🇺🇲🇮🇳 US Treasury Secretary Scott Bessent now expects to receive support from India in the case of China's rare earth materials, despite the fact that a few weeks ago Trump imposed tariffs on them and blackmailed India to stop buying oil from Russia. pic.twitter.com/S0ol7tWiR8— Megatron (@Megatron_ron) October 14, 2025అయితే.. ఆయన మాటల్లో స్పష్టంగా చైనాపై వ్యతిరేక ధోరణి కనిపించింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు, సాంకేతిక పరమైన పోటీ, దక్షిణ చైనా సముద్రం వివాదం వంటి అంశాలు ఇప్పటికే ఉద్రిక్తతలను పెంచాయి. ఇప్పుడు అరుదైన ఖనిజాల విషయం కూడా ఆ వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. అమెరికా ఈ వనరుల సరఫరాను చైనా నుండి స్వతంత్రంగా మార్చుకునే ప్రయత్నంలో ఉంది. భారత్ ఈ రంగంలో విస్తారమైన వనరులు కలిగి ఉండటంతో, అమెరికా వ్యూహాత్మకంగా భారత్ వైపు మొగ్గు చూపుతోంది.మరోవైపు, అమెరికా ఇటీవల భారత్పై కొన్ని ఉత్పత్తులపై టారిఫ్లు విధించడం, వాణిజ్య పరమైన అడ్డంకులు సృష్టించడం విమర్శలకు దారితీసింది. టారిఫ్లతో భారత్ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తూనే, చైనాపై పోరులో మద్దతు కోరడం విరుద్ధ ధోరణిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. అయినప్పటికీ, ఖనిజాల రంగంలో భారత్ భాగస్వామ్యం అమెరికాకు వ్యూహాత్మకంగా అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు. -
చైనాకు గూఢచర్యం?? .. భారత సంతతి అధికారి అరెస్ట్
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికా రక్షణ నిపుణుడు ఆష్లీ జె టెలిస్(Ashley Tellis) అరెస్ట్ అయ్యారు. అమెరికా రక్షణ వ్యవస్థకు సంబంధించిన కీలక పత్రాలను అక్రమంగా కలిగి ఉన్నారనే ఆరోపణలపై అదుపులోకి తీసుకుని అక్కడి అధికారులు విచారిస్తున్నారు. అదే సమయంలో.. చైనాకు గూఢచర్యం చేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు జరుగుతుండడం గమనార్హం. Who Is Ashley Tellis.. ఆష్లీ జె టెలిస్ ముంబైలో జన్మించారు. బాంబే వర్సిటీ పరిధిలోని సెయింట్ జెవియర్స్ కాలేజీలో బీఏ, ఎంఏ చదివారు. తరువాత యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో పీహెచ్డీ పూర్తి చేశారు. అక్కడే అమెరికాలోని పలు ప్రభుత్వ విభాగాల్లో కీలక పదవుల్లో పని చేసి.. విదేశీ విధాన నిపుణుడిగా ఎదిగారు. ముఖ్యంగా.. అమెరికా విదేశాంగ శాఖలో సీనియర్ అడ్వైజర్గా పనిచేస్తూ.. అమెరికా-భారత్ అణు ఒప్పందంలో కీలక పాత్ర(US-India Civil Nuclear Agreement) పోషించారు. అంతేకాదు విదేశీ విధాన పరిశోధకుడిగా ఇరు దేశాల సంబంధాలపైనా ఆయన ఎన్నో రచనలు చేశారు. ప్రస్తుతం ఆయన కార్నెగీ ఎండౌమెంట్లో సీనియర్ ఫెలోగా పనిచేస్తున్నారు. అయితే..జాతీయ రక్షణ సమాచారంతో కూడిన డాక్యుమెంట్లను ఆయన అనుమతి లేకుండా తన వెంట తీసుకెళ్లారనే అభియోగం నమోదైంది. 18 యూఎస్సీ సెక్షన్ 793(ఈ) ప్రకారం.. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన వ్యవహారంగా కేసు నమోదు అయింది. ప్రస్తుతం.. రహస్య ప్రాంతంలో టెలిస్ను విచారణ జరుపుతున్నారు. తూర్పు వర్జినీయా అటార్నీ ఆఫీస్ కార్యాలయం ఆయన అరెస్ట్, విచారణను ధృవీకరించింది.ఫెడరల్ అధికారులు ఏమన్నారంటే.. 64 ఏళ్ల వయసున్న టెలిస్.. దేశభద్రతకు సంబంధించిన గోప్యమైన పత్రాలను తన వెంట తీసుకెళ్లడం చట్ట ప్రకారం తీవ్ర నేరమే. తన సహ ఉద్యోగినిని రహస్య పత్రాలకు సంబంధించి ప్రింట్లు తనకివ్వమని ఆయన కోరారు. యూఎస్ ఎయిర్ఫోర్స్లోని సైనిక సామర్థ్యాలకు సంబంధించిన పత్రాలను ప్రింట్ చేశారు. అలాగే.. చైనా అధికారులతోనూ ఆయన సమావేశమైనట్లూ ఆధారాలు ఉన్నాయి. 2022తో పాటు 2023 ఏప్రిల్ 11న బీజింగ్ అధికారులతో జరిగిన విందులోను పాల్గొన్నారు. ఈ మధ్యే చైనా అధికారులు ఆయనకు ఓ కాస్ట్లీ బ్యాగును కూడా గిఫ్ట్గా అందించారు అని అన్నారు. అయితే చైనా అధికారులతో భేటీ .. అకడమిక్కు సంబంధించినదని ఆయన అసిస్టెంట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి.. గూఢచర్యం ఆరోపణలు ఇప్పటికైతే నిర్ధారణ కాలేదు. అలాంటి అభియోగాన్ని నమోదు చేయలేదు. అయితే కీలక పత్రాలకు సంబంధించిన నేరం రుజువైతే మాత్రం 10 సంవత్సరాల జైలు శిక్ష, $250,000(మన కరెన్సీలో రూ. 2 కోట్ల 21 లక్షల) జరిమానా విధించవచ్చు. కేసు విచారణ దశలో ఉన్నందున కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు దక్కే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఏఐ గురించి గరికపాటి ఆసక్తికర వ్యాఖ్యలు -
శాంతి చర్చల వేళ సంచలనం.. హమాస్ ప్రత్యర్థుల ఊచకోత
గాజా: ఇజ్రాయెల్ బందీల విడుదల అనంతరం హమాస్ సాయుధ గ్రూపు చూపు ఇప్పుడు ప్రత్యర్థి వర్గాలపై పడింది. గాజా ప్రాంతంపై పట్టు తిరిగి సాధించేందుకు విరోధి సాయుధ శ్రేణులను ఏరి పారేసే పనికి పూనుకుంది. ఈ పరిణామం అమెరికా మధ్యవర్తిత్వంతో నెలకొన్న కాల్పుల విరమణ మనుగడపై కొత్త అనుమానాలను తెరపైకి తెస్తోంది. ఇప్పటికైనా శాంతి నెలకొందని సంతోష పడుతున్న పాలస్తీనియన్లను హమాస్ వైఖరి భయపెడుతోంది.వివరాల ప్రకారం.. హమాస్ ఫైరింగ్ స్క్వాడ్ తాజాగా ప్రత్యర్థి వర్గాలకు చెందిన 8 మందిని కాల్చి చంపినట్లు సమాచారం. మొత్తమ్మీద 50 మందిని ఇప్పటి వరకు మట్టుబెట్టి ఉంటుందని వైనెట్ వార్తా సంస్థ తెలిపింది. అంతర్గత భద్రతను హమాస్ చూసుకుంటుందని ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపట్లోనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నట్లు ఆ సంస్థ వ్యాఖ్యానించింది. కళ్లకు గంతలు కట్టి, బంధించిన వారిని ముసుగులు ధరించిన హమాస్ సభ్యులు దాదాపు బహిరంగంగానే కాలుస్తున్నట్లుగా ఉన్న వీడియోను షఫఖ్ న్యూస్ ప్రసారం చేసింది.Hamas continues mass executing anyone it sees as a potential threat in Gaza. No trial, no judge, no jury. But yeah, sure, these are the “freedom fighters.” 🤨https://t.co/v8o5CGqild— The Persian Jewess (@persianjewess) October 15, 2025దీనిపై స్పందించిన హమాస్.. ఇజ్రాయెల్ బలగాలకు సహకరించడంతోపాటు నేర కార్యకలాపాల్గో పాల్గొన్నందుకే వీరిని శిక్షించామని తెలిపింది. అయితే, హమాస్ చర్యలు గాజాలోని డొగ్ముష్ వంటి గ్రూపులతో హింసాత్మక ఘర్షణలకు దారి తీస్తున్నాయి. డొగ్ముష్ వర్గం గాజాలోని అత్యంత శక్తివంతమైన సాయుధ గ్రూపుల్లో ఒకటి. హమాస్ భద్రతా విభాగంతో జరిగిన కాల్పుల్లో డొగ్ముష్కు చెందిన 52 మంది చనిపోయారని వైనెట్ పేర్కొంది. ఈ పోరులో 12 మంది హమాస్ సాయుధులు కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో హమాస్ సీనియర్ నేత బస్సెమ్ నయీమ్ కుమారుడు కూడా ఉన్నట్లు వైనెట్ పేర్కొంది. ప్రత్యర్థుల ప్రాంతాల్లోకి గుట్టుచప్పుడు కాకుండా అంబులెన్సుల్లో వెళ్లిన హమాస్ శ్రేణులు శత్రు సంహారం చేస్తున్నారని తెలిపింది. పౌరుల ప్రాణాలకు ప్రమాదం కలిగించేలా వ్యవహరిస్తోందంటూ హమాస్పై విమర్శలు వస్తున్నాయి.కొన్ని గ్రూపులకు ఇజ్రాయెల్ సాయంఅత్యంత అధునాతన, భారీ ఆయుధాలు కలిగిన డొగ్ముష్కు ఎప్పట్నుంచో హమాస్తో విభేదాలున్నాయి. ఈ గ్రూపునకు ఇజ్రాయెల్ మద్దతుందనే అనుమానాలు కూడా ఉన్నాయి. రఫాలోని యాసెర్ అబూ షబాబ్ సారథ్యంలోని గ్రూపు సహా గాజాలోని పలు ముఠాలకు పరిమితంగా సాయం, ఆయుధాలు అందిస్తున్నట్లు ఇజ్రాయెల్ ఇటీవల ప్రకటించడం గమనార్హం. ఇటీవల హమాస్ శ్రేణులు యాసెర్ అబూ షబాబ్ సన్నిహితుడొకరిని చంపేసినట్లు ప్రకటించుకున్నాయి. షబాబ్ను వదిలేది లేదని కూడా తెలిపాయి.@DonaldTrump @SecRubio @HowardLutnik32 @StephenM @jaredkushner This isn’t October 7 - it’s from the past few hours. Hamas is parading through Gaza, showing off the bodies of the many people they’ve executed since the ceasefire. pic.twitter.com/oWffZUI0g2— Flor (@HeavensFlor) October 15, 2025హమాస్లోని యారో యూనిట్ హింసాత్మక ప్రతీకార చర్యల్లో ఆరితేరిందని నిపుణులు అంటున్నారు. ఇన్నాళ్లూ సొరంగాల్లో రహస్యంగా నక్కుతూ పనిచేసిన హమాస్ సాయుధులు ఇప్పుడు తమ శత్రువుల అంతం చూసే పనిలో నిమగ్నమైనట్లు చెబుతున్నారు. శాంతి ఒప్పందాన్ని అనుసరించే ఉద్దేశం హమాస్ లేనట్లు కనిపిస్తోందంటున్నారు. ‘ఆయుధాలను ఉంచుకోవాలనే ఉద్దేశంతోనే హమాస్ ఇప్పటికీ ఉంది. నిరాయుధీకరణ రెండో దశ చర్చలు ప్రారంభమయ్యేటప్పటికి గాజాపై పట్టు నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది’అని విశ్లేషకులు అంటున్నారు. -
ఛీ.. ఈ చెత్త ఏంటి? అసహ్యమేస్తోంది.. ఎందుకిలా చేశారు?: ట్రంప్ ఫైర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సంతోషం వచ్చినా.. కోపం వచ్చినా అస్సలు ఆగరు. తాజాగా టైమ్ మ్యాగజైన్ ఆయన్ని పొడుగుతూ ఓ కథనం ఇచ్చింది. అయినా కూడా ట్రంప్కు బాగా కోపం వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. టైమ్ మ్యాగజైన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత సోషల్ మీడియా సోషల్ ట్రూత్లో ఓ పోస్ట్ పెట్టారు(Trump Angry On Time Magazine). కవర్ పేజీపై తన ఫొటోలో జుట్టు సరిగా కనిపించకపోవడమే అందుకు ప్రధాన కారణం. ఇంతకీ ఆయన ఆ పోస్టులో ఏమన్నారంటే.. నా గురించి వచ్చిన కథనం కొంతవరకు బాగానే ఉంది. కానీ కవర్పై ఉన్న ఫోటో మాత్రం చరిత్రలోనే చెత్త ఫోటో. వాళ్లు నా జుట్టును కనిపించకుండా చేశారు. నా జుట్టును తలపై చిన్న తలపాగా.. ఏదో తేలియాడుతున్నట్లుగా చూపించారు. ఇది చాలా విచిత్రంగా అనిపించింది. నాకు ఎప్పుడూ కింది యాంగిల్ నుంచి తీసే ఫోటోలు నచ్చవు. ఇది మాత్రం చాలా చాలా చెత్త ఫొటో. అందుకే దీన్ని తప్పక విమర్శించాలి. అసలు వాళ్లు ఏం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు?’’ అంటూ ట్రంప్ మేనేజ్మెంట్పై మండిపడ్డారు. ఇదిలా ఉంటే టైమ్ మ్యాగజైన్ను ట్రంప్ కోపడ్డడం ఇదే తొలిసారేం కాదు. ఫిబ్రవరిలో.. డోజ్ చీఫ్గా ఉన్న ఎలాన్ మస్క్ ఓవల్ ఆఫీస్లో రెజల్యూట్ డెస్క్ మీద కూర్చున్నట్లు ఓ ఫొటోను ప్రచురించింది. ట్రంప్ ఆ ఫొటోపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు టైమ్ మ్యాగజైన్ ఇంకా నడుస్తుంది అనుకోలేదు అంటూ వెటకారం ప్రదర్శించారు. అదే సమయంలో.. అయితే మస్క్ పని తీరును ఆ సమయంలో ఆయన ప్రశంసించారు.ఇదిలా ఉంటే.. ఇప్పుడు ట్రంప్ మీద టైమ్ మాగజైన్ His Triumph అనే శీర్షికతో కవర్ పేజీ ఇచ్చింది. గాజా శాంతి ఒప్పందంలో ఆయన చేసిన కృషికిగానూ ఈ కథనం ప్రచురించింది. ఈ ఒప్పందంతోనే 20 మంది ఇజ్రాయెలీ బందీలను హమాస్ విడుదల చేయగా.. ఇజ్రాయెల్ సుమారు 2,000 మంది పాలస్తీనా ఖైదీలను, 360 మంది పాలస్తీనీయుల మృతదేహాలను విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ ఏడాదిలోనే తాను పలు యుద్ధాలను ఆపానంటూ ట్రంప్ నోబోల్ శాంతి బహుమతి డిమాండ్ చేయగా.. రూల్స్ అడ్డురావడంతో ఆయన కల నెరవేరలేదు!. దీంతో వచ్చే ఏడాదైనా దక్కవచ్చనే ఆశ పెట్టుకున్నారాయన.ఇదీ చదవండి: ఇదేందయ్యా ఇదీ.. ఇంత భజనా? -
ఇక నేనే అధ్యక్షుడిని
ఆంటనానారివో: తూర్పు ఆఫ్రికా ద్వీపదేశమైన మడగాస్కర్లో అధ్యక్షుడు ఆండ్రీ రాజోలీనా సారథ్యంలోని ప్రభుత్వాన్ని కూలదోసిన మిలటరీ కమాండర్, కల్నల్ మైఖేల్ ర్యాండ్రియానిరినా బుధవారం తన మనసులోని మాట బయటపెట్టారు. త్వరలో దేశాధ్యక్షునిగా పగ్గాలు చేపట్టబోతున్నట్లు అంతర్జాతీయ మీడియాకు చెప్పారు. జెన్ జెడ్ యువత నేతృత్వంలో మొదలైన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం ఉప్పెనలా మారడంతో ప్రాణభయంతో అధ్యక్షుడు రాజోలీనా విదేశానికి పారిపోయారు. రాజోలీనా లేకపోవడంతో దేశ అత్యున్నత రాజ్యాంగ కోర్టు ఆహ్వానం మేరకు త్వరలో తాను దేశ పరిపాలనా బాధ్యతలు తీసుకోబోతున్నట్లు మైఖేల్ చెప్పారు. మైఖేల్ సారథ్యంలోని నిపుణులైన క్యాప్శాట్ సైనిక బృందం తిరుగుబాటు చేపట్టడంతో రాజోలీనా చేతులెత్తేయడం తెల్సిందే. ‘‘నిన్ననే మేం వాస్తవానికి బాధ్యతలు తీసుకోవాల్సింది. దేశంలో అధ్యక్షుడు లేడు. సెనేట్లోనూ అధ్యక్షుడి జాడ లేదు. అసలు ప్రభుత్వమే లేదు. అందుకే త్వరలో మేం నూతన ప్రధానికి నియమిస్తాం’’అని మైఖేల్ వ్యాఖ్యానించారు. అయితే ఎప్పటికల్లా నూతన ప్రభుత్వ ఏర్పాటు ఉంటుందనే మైఖేల్ స్పష్టంచేయలేదు. సెనేట్, న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం అధికారులను తొలగిస్తున్నట్లు మైఖేల్ ఇప్పటికే జాతీయరేడియోలో ప్రకటించడం తెల్సిందే. 1960లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందాక మడగాస్కర్ ఎన్నో తిరుగుబాట్ల పాలిటపడింది. దేశంలో నిరుద్యోగం, పేదరికం పెచ్చరిల్లడం, ప్రజల జీవన వ్యయాలు పెరగడం, నీటికొరత, విద్యుత్ సంక్షోభం, అమాంతం పెరిగిన అవినీతితో జెన్జెడ్ యువత విసిగిపోయి ఉద్యమబాట పట్టడం, దీనికి సైనిక తిరుగుబాటు తోడవడంతో రాజోలీనా ప్రభుత్వం కూలిపోయింది. -
సూపర్వుడ్ !
వాషింగ్టన్: ఉక్కు కంటే ఏకంగా 10 రెట్లు పటిష్టమైన చెక్కను అమెరికా శాస్త్రవేత్తల బృందం విజయ వంతంగా సృష్టించింది. దీనికి సూపర్వుడ్(Superwood) అని పేరుపెట్టింది. సాధారణ కలపనే రసాయన చర్యకు గురిచేసి అత్యంత పటిష్టమైన, కఠిన కలపగా రూపాంతరం చెందించారు. మౌలిక వసతుల రంగంలో నాణ్యమైన, ఎక్కువ కాలం పాడవకుండా ఉండే మన్నికైన కలపకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో స్టీల్ను తలదన్నేలా కలపను సృష్టించి అమెరికా శాస్త్రవేత్తలు ఔరా అనిపించారు. ఈ బృందానికి ప్రఖ్యాత మెటీరియల్ సైన్స్ నిపుణుడు లియాంగ్బింగ్ హూ సారథ్యం వహించారు.ఈ పరిశోధన ఫలితాలు ప్రఖ్యాత ‘నేచర్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. చెట్టు కలపకు పటిష్టతను, రంగును ఇచ్చే లింగ్నిన్ అనే పదార్థాన్ని కలప నుంచి తొలగించి ఆ చెక్కకు చెక్కుచెదరని పటిష్టతను ఆయన ఆపాదించగలిగారు. ఇందుకోసం హూ బృందం వినూత్నమైన పద్ధతిని అవలంభించింది. సహజ కలప చెక్క నుంచి లింగ్నిన్, హెమీ సెల్యూలోజ్లను తొలగించేందుకు ఆ చెక్కలను తొలుత సోడియం హైడ్రాక్సైడ్, సోడియా సల్ఫేట్ ద్రావకంలో ఉడకబెట్టారు. తర్వాత అదే వేడిమీద చెక్కలను సమతల పరికరంతో గట్టిగా అదిమారు.దీంతో కలపలోని కణాల సవ్యఅమరిక ధ్వంసమై అన్నీ ఒక్కదగ్గరకు చేరిపోయాయి. దీంతో సెల్యూలోజ్ నానోకణాలు చిక్కగా ఒకే దగ్గరకు చేరి కలప ఉక్కులాగా గట్టిపడింది. ఇది ఏకంగా స్టీల్ కంటే 10 రెట్లు గట్టిగా ఉన్నట్లు పలు పరీక్షల్లో నిర్ధారణ అయింది. తేమను తట్టుకుంటూ సులువుగా విరిగిపోకుండా చెక్క మరింత దృఢత్వాన్ని సంతరించుకుంది. ఈ చెక్క బరువు సైతం సాధారణ చెక్క బరువులో ఆరోవంతే ఉండటం విశేషం. తక్కువ బరువు ఉండటంతో భూకంపాల వంటి సందర్భాల్లో ఈ చెక్కతో నిర్మించిన ఇళ్లు అంత త్వరగా కంపనాలకు గురికావు.అత్యంత తేలికగా ఉండటంతో నిర్మాణంలో ఉపయోగించడం సైతం చాలా సులువు. ఇల్లు, కార్యాలయాల ఫర్నిచర్, ఇంటీరియల్ పనుల్లో రెండు సాధారణ చెక్కలు నట్లు, బోల్ట్లతో జతచేసినప్పుడు అవి త్వరగా పాడవుతుంటాయి. ఈ సమస్యకు ఈ కొత్తతరహా కలపతో చెక్ పెట్టొచ్చని కంపెనీ చెబుతోంది. సూపర్వుడ్ పేరిట ఈ చెక్కను అమెరికాలోని మేరీల్యాండ్లోని ఫ్రెడెరిక్ ప్రాంతంలో వాణిజ్యపరంగా తయారుచేయనున్నారు. హూ సహ వ్యవస్థాపకునిగా ఉన్న ఇన్వెంట్వుడ్ అనే సంస్థ ఈ కలపను తయారుచేయనుంది.సాధారణ కలప కంటే 20 రెట్లు శక్తివంతంలియాంగ్బింగ్ హూ పదేళ్ల క్రితమే ఇలా పటిష్టమైన చెక్క కోసం ప్రయోగాలు మొదలెట్టారు. ‘‘భూమిపై అత్యధికంగా లభ్యమయ్యే సహజ పాలిమర్గా సెల్యూలోజ్ను చెప్పొచ్చు. ఇది కలపలో మెండుగా ఉంటుంది. దీని సాయంతో ఉక్కులాంటి చెక్కను తయారు చేయాలని గతంలోనే భావించా. 2017లోనే ఈ తరహా ప్రయోగం చేశా. ఇన్నాళ్లకు వాణిజ్యపర ఉత్పత్తికి సిద్దమయ్యాం’’ అని హూ చెప్పారు. -
మీ అభివృద్ధిలో భారత్ విశ్వసనీయ భాగస్వామి
న్యూఢిల్లీ: మంగోలియా దేశాభివృద్ధిలో భారత్ విశ్వసనీయ భాగస్వామి పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. నాలుగురోజుల భారత పర్యటనలో భాగంగా మంగళవారం ఢిల్లీకి చేరుకున్న మంగోలియా అధ్యక్షుడు ఉఖ్నా(Khurelsukh Ukhnaa) ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఉఖ్నా భారత్కు రావడం ఇదే తొలిసారి. ఇరువురి ద్వైపాక్షిక చర్చల తర్వాత మోదీ మాట్లాడారు. ‘‘ భారత్, మంగోలియా బంధం కేవలం ద్వైపాక్షికం కాదు. అంతకుమించిన గాఢమైన, ఆత్మీయ, ఆధ్యాత్మిక బంధం. మన ఇరుదేశాల భాగస్వామ్యం ఇరు దేశాల ప్రజల సత్సంబంధాల్లో ప్రతిబింబిస్తోంది.భారత్ అందించిన 1.7 బిలియన్ డాలర్ల ఆర్థికసాయంతో మంగోలియాలో చేపట్టిన చమురు శుద్ధి కర్మాగారం ప్రాజెక్ట్ ఆ దేశ ఇంధన రక్షణకు మరింత భద్రత చేకూరుస్తుంది. విదేశాల్లో భారత్ చేపట్టిన అతిపెద్ద అభివృద్ధి భాగస్వామ్య ప్రాజెక్ట్ ఇదే. ఇందులో మంగోలియా సిబ్బందితోపాటు 2,500 మందికిపైగా భారతీయ నిపుణులు పనిచేస్తూ ఈ ప్రాజెక్ట్ను సుసాధ్యం చేస్తున్నారు. ఇది మాత్రమేకాకుండా ఎన్నో అంతర్జాతీయ వేదికలపై ఇరు దేశాల భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. ఇండో–పసిఫిక్లో స్వేచ్ఛా, సులభతర, సమగ్రత వాణిజ్యానికి ఇరుదేశాలు కృషిచేస్తున్నాయి. గ్లోబల్ సౌత్ వాణిని గట్టిగా ఇరుదేశాలు గట్టిగా వినిపిస్తున్నాయి. మంగోలియా పౌరులకు భారత్ ఉచితంగా ఈ–వీసాలను అందించనుంది’’ అని మోదీ చెప్పారు. పలు రంగాల్లో పరస్పర సహకారంఈ సందర్భంగా ఉఖ్నా భారత్ను పొగిడారు. ‘‘స్వచ్ఛ ఇంధన రంగంలో భారత్ అద్భుతంగా నాయకత్వ పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ సౌరకూటమిలోనూ భారత్ తనదైన కీలక భూమిక పోషిస్తోంది’’ అని శ్లాఘించారు. తర్వాత మోదీ మాట్లాడారు. ‘‘బౌద్ధమతం విషయంలో ఇరుదేశాలు తోబుట్టువులే. గౌతమ బుద్దుడి ముఖ్య శిష్యులైన సరిపుత్ర, మౌద్గల్యయానల పవిత్ర అవశేషాలు వచ్చే ఏడాది మంగోలియాకు భారత్ అప్పగించనుంది. గందన్ బౌద్ధారామానికి భారత్ త్వరలో ఒక సాంస్కృతిక ఉపాధ్యాయుడిని పంపనుంది. ఆయన అక్కడి బౌద్ధ ప్రాచీన ప్రతులను అధ్యయనం చేయనున్నారు.మంగోలియాలో బౌద్ధమత వ్యాప్తికి నాటి బిహార్లోని పురాతన నలంద విశ్వవిద్యాలయం ఎంతగానో సాయపడింది. ఇప్పుడు అదే రీతిలో గందన్ మఠం, నలంద వర్సిటీల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తాం ’’అని మోదీ చెప్పారు. ‘‘లద్దాఖ్ స్వయంప్రతిపత్తి పర్వతప్రాంత అభివృద్ధి మండలి, మంగోలియాలోని అర్ఖాంగాయ్ ప్రావిన్స్ల మధ్య సాంస్కృతిక బంధం బలపడేందుకు మంగళవారం ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. రక్షణ మొదలు భద్రత, ఇంధనం, గనులు, సమాచార సాంకేతికత, విద్య, ఆరోగ్యం, సంస్కృతిక సహకార రంగాల్లో ఇరుదేశాల భాగస్వామ్యం, పరస్పర సహకారం మరింత బలపడింది’’ అని మోదీ అన్నారు. 1955లో ఇరుదేశాల మధ్య దౌత్యసంబంధాలు మొదలయ్యాయి. -
పాపం మెలోనీ! అటు ట్రంప్.. ఇటు ఎర్డోగాన్
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీని సోషల్ మీడియా ఇప్పుడు పాపం అంటోంది. అందుకు ఈజిప్ట్ శర్మ్ షేక్-ఎల్ నగర వేదికగా జరిగిన గాజా శాంతి సదస్సు కారణం. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమె అందంగా గురించి బాహాటంగా వ్యాఖ్య చేయడంతో ఆమె కాస్త ఇబ్బందికి గురైనట్లు కనిపించారు. అదే సమయంలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఆమె వ్యక్తిగత అలవాటు చేసిన సంభాషణ సోషల్ మీడియాకు ఎక్కింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలో ఓ మహిళను నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పడం.. ప్రమాదకరం. ఒకరకంగా అలా కామెంట్ చేయడం.. రాజకీయ ప్రస్థానాన్ని ముగించినట్లే. కానీ, నేను ఆ ప్రమాదాన్ని పట్టించుకోను. మీరు అందంగా ఉన్నావ్ అని చెబితే ఏమీ అనుకోవు కదా అంటూ వెనక్కి తిరిగి మెలోనీని చూస్తూ ట్రంప్ అన్నారు. దీంతో ఆమె సిగ్గుపడుతూ థ్యాంక్స్ చెబుతూ.. గుటకలు మింగారు. అలాగే.. Trump to Giorgia Meloni:“In the U.S., if you tell a woman she’s beautiful, your political career is over. But I’ll take my chances. You won’t be offended if I say you’re beautiful, right?“pic.twitter.com/YZEdsZjwSU— Spencer Hakimian (@SpencerHakimian) October 13, 2025ఇంకోవైపు.. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్తో జరిగిన సంభాషణా వైరల్ అవుతోంది. విమానం నుంచి దిగుతున్నప్పుడు నిన్ను చూశాను. బాగా కనిపిస్తున్నావు. కానీ నీ చేత పొగతాగడం ఆపించాలి అని అన్నారాయన. ఆ సమయంలో అక్కడే ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమానుయేల్ మాక్రోన్ అది అసాధ్యం అంటూ జోక్ పేల్చారు. అయితే.. అది తనకు తెలుసని.. పొగ తాగడం ఆపేస్తే తాను నలుగురితో కలవలేనని అంటూ ఆమె నవ్వుతూనే బదులిచ్చారామె. Erdogan to Meloni in Cairo:“You look great but I have to get you to stop smoking”🇮🇹🇹🇷 pic.twitter.com/f1CzICF1tq— Visegrád 24 (@visegrad24) October 13, 2025ఇదిలా ఉంటే.. 48 ఏళ్ల మెలోనీకి స్మోకింగ్ అలవాటు ఉందనేది బాహాటంగా తెలిసిన విషయమే!. గతంలో తాను రాసిన పుస్తకాల్లోనూ ఆమె ఆ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతేకాదు.. ప్రపంచ నాయకులతో ఇంటెరాక్షన్ కోసం ఆ అలవాటు ఎంతో పనికి వచ్చిందని, ట్యూనీషియా అధ్యక్షుడు కైస్ సయీద్తో కలిసి స్మోక్కూడా చేస్తానని ఆమె తెలిపారు. మరోవైపు.. టర్కీని ధూమపాన రహిత దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఎర్డోగాన్ కార్యచరణ రూపొందించారు. 2028 నాటికల్లా ఆ దేశాన్ని అలా తీర్చిదిద్దాలని ఆయన భావిస్తున్నారు.ఇదీ చూడండి: బాబోయ్.. ఇదేం భజన?: పాక్ పీఎం పొగడ్తలకు మెలోనీ రియాక్షన్ -
మోదీకి ట్రంప్ ప్రశంస.. బిత్తరపోయిన పాక్ పీఎం.. వీడియోలు చూసేయండి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన పనికి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ బిత్తరపోయారు. భారత ప్రధాని మోదీపై ప్రశంసలు గుప్పించిన ట్రంప్.. పాక్తో సంబంధాలపైనా వ్యాఖ్య చేసే సరికి షరీఫ్ నోటి వెంట మాట రాలేదు. అదే సమయంలో షరీఫ్ ప్రసంగించిన టైంలోనూ మరో ఘటన చోటు చేసుకుంది. ఈజిప్ట్ గాజా శాంతి సదస్సులో ఈ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈజిఫ్ట్ శర్మ్ ఎల్-షేక్ వేదికగా గాజా శాంతి సదస్సు Gaza Peace Summit 2025 జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో భారత్, పాకిస్తాన్, ఇజ్రాయెల్, అరబ్ దేశాల నేతలు 20 మంది దాకా పాల్గొన్నారు. ఆ సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ గొప్ప దేశం. అక్కడ నా మంచి మిత్రుడు ఉన్నారు. ఆయన అత్యంత అద్భుతంగా పనిచేస్తున్నారు. భారత్, పాకిస్తాన్ కలిసి శాంతియుతంగా జీవించగలవు అని అన్నారు. ఆ వెంటనే.. పాకిస్తాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ వైపు చూస్తూ ట్రంప్ ‘అంతే కదా?’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే.. ఈ వ్యాఖ్యలకు నోట మాట పడిపోయిందేమో.. షరీఫ్ నవ్వుతూ ఏదో కవర్ చేసుకోబోయారు. అదే సమయంలో.. పక్కనున్న మిగతా దేశాల నేతలు చిన్నగా నవ్వుకున్నారు. మరోవైపు.. Trump: "I think Pakistan and India are gonna live very NICELY together"Turns to Shehbaz Sharif: ‘Right?’Look at Chatukar's big smile. He still thinks this Joker Trump can save him when Bharat goes for the DECISIVE one?Anyway, let both of them happy 'TILL THEN'! pic.twitter.com/qlhS55S3GY— BhikuMhatre (@MumbaichaDon) October 13, 2025 షెహ్బాజ్ షరీఫ్ తన ప్రసంగంలో ట్రంప్ భజనకే పరిమితం అయ్యారు. ఇండియా, పాకిస్తాన్ రెండూ అణు శక్తులు. ఈ వ్యక్తి (ట్రంప్) మరియు ఆయన బృందం నాలుగు రోజుల పాటు మధ్యవర్తిత్వం చేయకపోయుంటే, యుద్ధం ఎవరికీ చెప్పుకోలేని స్థాయికి చేరిపోయేది అని అన్నారు. ఆయన ఇప్పటికే ఏడు యుద్ధాలు ఆపారని, ఇవాళ ఎనిమిదోది(గాజా సంక్షోభం గురించి) ఆపారని అన్నారు. అలాంటి వ్యక్తిని తాను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తున్నా అనడంతో.. వెనకాలే ఉన్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తల పట్టుకుని.. రకరకాల హవభావాలతో ‘ఇవేం పొగడ్తలు’ అన్నట్లు ఎక్స్ప్రెషన్లు ఇచ్చారు. వెనుకనే నోటిమీద చేయి వేసుకొని చూస్తుండిపోయారామె. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. Pakistan's Prime Minister Shehbaz Sharif calls for Donald Trump to receive the Nobel Peace Prize: "Mr. President, I would like to salute you for your exemplary leadership. Visionary leadership." "I think you are the man that this world needed most at this point in time. The… pic.twitter.com/QXVOxszZx7— Mary Margaret Olohan (@MaryMargOlohan) October 13, 2025మరోవైపు.. ట్రంప్ గాజా ప్లాన్ కుదరడంపై భారత ప్రధాని మోదీ.. ట్రంప్కు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో గాజా శాంతి సదస్సుకు భారత ప్రధాని మోదీని ట్రంప్ ఆహ్వానం అందించారు. అయితే మోదీ తరఫున ప్రత్యేక దూతగా విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్దన్ సింగ్ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ను కలిసి.. శాంతి ఒప్పందంపై భారత్ తరఫున సంతకం చేశారాయన. ఈ విషయాన్ని విదేశాంగ ప్రతినిధి రణ్దీర్ జైశ్వాల్ అధికారికంగా ధృవీకరించారు. తన చొరవ వల్లే పాక్-భారత్ మధ్య ఉద్రిక్తతలు చల్లారాయంటూ ట్రంప్ మే 10వ తేదీ నుంచి నిన్న ఇజ్రాయెల్ పార్లమెంట్ ప్రసంగంలోనూ ప్రస్తావించడం తెలిసిందే. -
యుద్ధం ఆపకుంటే ఉక్రెయిన్కు తొమహాక్లు ఇస్తాం
వాషింగ్టన్: ఉక్రెయిన్తో సుదీర్ఘకాలంగా చేస్తున్న యుద్ధాన్ని రష్యా వెంటనే ఆపకుంటే తాము ఉక్రెయిన్కు అత్యంత శక్తిమంతమైన దీర్ఘశ్రేణి క్షిపణులైన తొమహాక్లు అందిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఆదివారం ఆయన ఇజ్రాయెల్కు వెళ్తూ తన విమానం ఎయిర్ఫోర్స్ వన్లో మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ‘ఈ యుద్ధానికి ముగింపు పలకకుంటే నేను వారికి (ఉక్రెయిన్) తొమహాక్లు అందజేస్తాను. తొమహాక్లు చాలా ప్రత్యేకమైనవి, శక్తిమంతమైనవి, ప్రభావవంతమైనవి. నిజంగా చెప్తున్నా ఉక్రెయిన్ చేతికి ఇలాంటి ఆయుధాలు అందటం రష్యాకు అస్సలు మంచిది కాదు. ఉక్రెయిన్కు తొమహాక్లు ఇచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. కానీ, యుద్ధాన్ని ముగించేందుకు అదే సరైన పని. ఇలాంటి పరిస్థితి రావాలని రష్యా కోరుకోదనే అనుకుంటున్నా. ఈ అంశంపై నేను రష్యాతోనూ మాట్లాడే అవకాశాలు లేకపోలేదు’అని ట్రంప్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడారు. ఆ సందర్భంగా ఉక్రెయిన్కు తొమహాక్ క్షిపణులు అందజేసేందుకు సిద్ధమని చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు. ఉక్రెయిన్పై కీలకమైన ఆయుధాలు వాడకుండా రష్యాపై కూడా తాను ఒత్తిడి తీసుకురాగలనని పేర్కొన్నారు. కాగా, ఉక్రెయిన్కు తొమహాక్ క్షిపణులు అందిస్తే రష్యా– అమెరికా మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతింటాయని పుతిన్ ఇటీవలే హెచ్చరించారు. ఏమిటి తొమహాక్ల ప్రత్యేకత? తొమహాక్ క్షిపణుల పూర్తిపేరు బీజీఎం–109 తొమహాక్ లాండ్ అటాక్ మిసైల్స్ (టీఎల్ఏఎం). ఇవి ఎలాంటి వాతావరణంలో అయినా లక్ష్యాన్ని అత్యంత కచి్చతత్వంతో ధ్వంసం చేయగలవు. జెట్ ఇంజన్ శక్తిగత ఈ సబ్సోనిక్ క్యూయిజ్ క్షిపణులను ప్రస్తుతం అమెరికా నేవీ, రాయల్ ఆస్ట్రేలియన్ నేవీలు వాడుతున్నాయి. వీటిని యుద్ధనౌకలు, సబ్మెరైన్ల ద్వారా ప్రయోగిస్తారు. జాన్హాప్కిన్స్ యూనివర్సిటీలోని అప్లయిడ్ ఫిజిక్స్ లే»ొరేటరీ వీటిని అభివృద్ధి చేసింది. 1970 దశకంలో వీటిని జనరల్ డైనమిక్స్ మొదట ఉత్పత్తి చేసింది. ఆ తర్వాత కాలానుగుణంగా వీటిని అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. వీటితో బహుళ లక్ష్యాలను ఛేదించవచ్చు. యుద్ధనౌకలతోపాటు భూమిపై ఉండే లక్ష్యాలను కూడా ధ్వంసం చేయవచ్చు. ఒక్కో క్షిపణి ఖరీదు దాదాపు రూ.18 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో వివిధ రకాలున్నాయి. టీఎల్ఏఎం బ్లాక్ 2 క్షిపణి రేంజ్ 2,500 కిలోమీటర్లు. బ్లాక్ 3 రేంజ్ 1,300 కిలోమీటర్లు. సబ్మెరైన్స్ నుంచి ప్రయోగించే క్షిపణుల రేంజ్ వేరుగా ఉంటుంది. ఇవి శత్రు రాడార్లను ఏమార్చి దాడులు చేయగలవు. -
చీకటి ‘వేదం’!
43 ఏళ్ల చీకటి తర్వాత వెలుగు.. కానీ అంతలోనే కారుచీకట్లు! నిర్దోషిగా విడుదలైన ఆ అమాయకుడికి ఆ ఆనందం మిగల్లేదు. వేదనల ‘వేదం’ విషాదానికి అంతేలేదు. ఇది న్యాయమా? మానవత్వమా? అంటే సమాధానాలే లేవు. కళ్ల ముందు రెండు తరాలు గడిచిపోయాయి. కానీ ఆయన మాత్రం ఏం మారలేదు. చేయని నేరానికి నాలుగు దశాబ్దాలకు పైగా (43 ఏళ్లు) జైలు గోడల మధ్య నలిగిపోయిన సుబ్రహ్మణ్యం ‘సుబు’ వేదం (64), ఎట్టకేలకు న్యాయం గెలిచి, నిర్దోషిగా విడుదలయ్యాడు. జీవితం, స్వేచ్ఛ, కుటుంబం.. ఈ బంధాల రుచి మళ్లీ చూడబోతున్నానని ఆశపడ్డాడు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు లేదు. అమెరికా చట్టం అతన్ని మళ్లీ బందీగా మార్చింది.అప్పుడు తప్పుడు శిక్ష.. ఇప్పుడు దేశ బహిష్కరణ ముప్పు చేయని హత్య కేసులో నాలుగు దశాబ్దాలకు పైగా జైలు శిక్ష అనుభవించిన తర్వాత, సుబ్రహ్మణ్యం ‘సుబు’ వేదం ఎంతో కాలంగా ఎదురుచూసిన స్వేచ్ఛకు బదులుగా, కొత్త కష్టాలు ఎదురయ్యాయి. పెద్దగా పరిచయం లేని భారతదేశ బహిష్కరణ ముప్పు అతనికి ఏర్పడింది. తనపై ఉన్న హత్య కేసు శిక్షను రద్దు చేయడంతో, అక్టోబర్ 3న పెన్సిల్వేనియాలోని హంటింగ్డన్ స్టేట్ కరెక్షనల్ ఇన్స్టిట్యూషన్ నుండి విడుదలైన 64 ఏళ్ల సుబు వేదంను, వెంటనే అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అదుపులోకి తీసుకుంది. చేయని హత్యకు చెరసాలలో మగ్గి.. కేవలం తొమ్మిది నెలల వయసులో భారతదేశం నుండి అమెరికాకు వచి్చన వేదం, శాశ్వత ఆమెరికా నివాసి. కానీ 1980లో పెన్సిల్వేనియాలో జరిగిన 19 ఏళ్ల థామస్ కిన్సర్ కాలి్చవేత కేసులో.. దాదాపు మొత్తం వయోజన జీవితాన్ని జైలులోనే గడిపాడు. స్టేట్ కాలేజ్ సమీపంలోని సింక్హోల్లో కిన్సర్ మృతదేహం లభించింది, అతనితో చివరిగా కనిపించిన వ్యక్తి వేదం (కిన్సర్ మాజీ హైసూ్కల్ సహ విద్యారి్థ) అని పోలీసులు ఆరోపించారు. వేదం తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. అతన్ని 1983, 1988లలో రెండుసార్లు దోషిగా నిర్ధారించారు. పెరోల్ కూడా లేకుండా జీవిత ఖైదు విధించారు. శిక్ష రద్దు, ఎఫ్బీఐ నివేదిక ఆగస్ట్ 2025లో, ఒక సెంటర్ కౌంటీ న్యాయమూర్తి అతని శిక్షను రద్దు చేస్తూ, ప్రాసిక్యూటర్లు చట్టవిరుద్ధంగా ఒక ఎఫ్బీఐ నివేదికను డిఫెన్స్ న్యాయవాదుల నుండి దాచిపెట్టారని తీర్పు చెప్పారు. ఈ తీర్పు తరువాత, సెంటర్ కౌంటీ జిల్లా అటార్నీ బెర్నీ కాంటోర్నా అన్ని అభియోగాలను అధికారికంగా కొట్టివేశారు. ‘కాలం గడిచిపోవడం, కీలక సాక్షుల నష్టం, వేదం దశాబ్దాల జైలు శిక్షను కారణాలుగా’ పేర్కొన్నట్లు ‘ది ఫిలడెలి్ఫయా ఎంక్వైరర్’ వెల్లడించింది. సుదీర్ఘ అన్యాయం ‘వేదం.. పెన్సిల్వేనియా చరిత్రలో సుదీర్ఘకాలం అన్యాయంగా శిక్షకు గురైన వ్యక్తిగా, అమెరికాలో అత్యధిక కాలం శిక్ష అనుభవించిన వారిలో ఒకరిగా నిలబెట్టింది. ‘వేదం.. తన జీవితంలో అత్యంత విలువైన నాలుగు దశాబ్దాల కాలాన్ని తప్పుడు శిక్ష వల్ల కోల్పోయాడు. ఇప్పుడాయన వయసు 64. ఈ దేశంలోనే ఆయన సోదరి, మేనకోడళ్లు, మనవరాళ్లు.. కుటుంబ బంధాలు అన్నీ ఉన్నాయి. ఏ బంధుత్వం, ఏ పరిచయం లేని దేశానికి, తను ఏమాత్రం తెలియని భారత్కు పంపాలని నిర్ణయించడం ఏం న్యాయం?’.. అని ఆయన న్యాయవాది ఆవేదన వ్యక్తం చేశారు. చీకటిలోనూ అక్షర దీపం సుబు తన జైలు జీవితాన్ని దుఃఖంతో ముగించలేదు. ఆయన తన చుట్టూ ఉన్న చీకటిలో జ్ఞాన దీపాలను వెలిగించారు. జైలులో ఖైదీల కోసం అక్షరాస్యత తరగతులు, డిప్లొమా కార్యక్రమాలు నిర్వహించారు. మూడు డిగ్రీలు, 4.0 జీపీఏతో ఎంబీఏ కూడా పూర్తి చేసి, 150 ఏళ్ల జైలు చరిత్రలోనే అరుదైన ఖైదీగా నిలిచారు. మా పోరాటం మానవత్వం కోసమే.. సుబు మేనకోడలు జోయ్ మిల్లర్ వేదం మాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తాయి. ‘43 ఏళ్ల పాటు జైలులో బంధించి వేదం జీవితాన్ని తీసేసుకున్నారు. ఇప్పుడు, ఆయనను ప్రేమించే వారందరికీ దూరంగా, ఏమీ తెలియని ప్రపంచానికి పంపడం అనేది, ఆ అన్యాయాన్ని మరింత పెంచడమే. వేదం తల్లిదండ్రులు ఆయన్ని చూసేందుకు ఏళ్ల తరబడి జైలుకు వచ్చి కన్నుమూశారు. దయచేసి, మా కుటుంబాన్ని ఇకనైనా కలవనివ్వండి. ఈ పోరాటం చట్టం గురించి కాదు... మానవత్వం కోసం’.. అని కన్నీటిపర్యంతమయ్యారు. తప్పుడు శిక్ష పడిన ఒక వ్యక్తి స్వేచ్ఛ కోసం, కుటుంబంతో కలవడం కోసం చేస్తున్న ఈ ఆఖరి పోరాటానికి న్యాయస్థానం ఎలా స్పందిస్తుందోనని యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. -
బందీల విడుదలను స్వాగతిస్తున్నాం: మోదీ
న్యూఢిల్లీ: గాజాలో బందీలుగా ఉన్న మొత్తం 20 మందిని హమాస్ విడుదల చేయడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు పశ్చిమాసియా ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు నిజాయితీతో సాగిస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు. ‘రెండేళ్లకు పైగా నిర్బంధంలో ఉన్న బందీలందరి విడుదలను స్వాగతిస్తున్నాం. వారి స్వేచ్ఛ వారి కుటుంబాల ధైర్యానికి, అధ్యక్షుడు ట్రంప్ తీవ్రమైన శాంతి ప్రయత్నాలకు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ బలమైన సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుంది’అని ప్రధాని మోదీ సోమవారం ఎక్స్లో పేర్కొన్నారు. పశ్చిమాసియాలో శాంతిస్థాపనకు అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నాలకు తాము తోడుగా ఉంటామన్నారు. -
సంక్లిష్ట వ్యవహారమిది
షర్మ్ ఎల్ షేక్(ఈజిప్ట్): గాజాలో శాంతి వీచికలు మొదలయ్యాక ఆ శాంతిని శాశ్వతంగా సుస్థిరం చేసేందుకు మొదలైన ప్రయత్నాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలుచేశారు. ఈజిప్ట్లోని సినాయ్ ద్వీపకల్పంలోని షర్మ్ ఎల్ షేక్ నగరంలో పలువురు యూరప్ దేశాలు, పశి్చమాసియా దేశాల అగ్రనేతల సమక్షంలో శాంతి శిఖరాగ్ర సదస్సులో గాజా కాల్పుల విరమణ ఒప్పందంపై ట్రంప్ సంతకంచేశారు. ఆయనతోపాటు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్ సిసీ, ఖతార్ అమీర్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ, తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అగ్రనేతల సమక్షంలో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ‘‘ఇది చరిత్రాత్మకమైన ఒప్పందం. కోట్లాది మంది ప్రజల ప్రార్థనలు నెరవేరాయి. మధ్యవర్తిత్వం వహించిన ఖతార్, ఈజిప్ట్, తుర్కియేలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మధ్యవర్తిత్వం విషయంలో ఈజిప్ట్ అధ్యక్షుడు ఎల్ సిసి అద్భుతంగా వ్యవహరించారు. మీరు నమ్ముతారో లేదో తెలీదుగానీ అసలు ఈ వివాదం 500 నుంచి మూడువేల సంవత్సరాల నాటిది అని అనుకుంటున్నా. ఇప్పటికి ఓ కొలిక్కి వచి్చంది. ఇంకా ఇందులో ఎంతో సంక్లిష్టత ఉంది. ఈ ఒప్పందం అత్యంత చిక్కుముళ్లతో కూడుకుంది. ఎన్నో నిబంధనలు, షరతులను పొందుపరిచాం. వాస్తవానికి పశ్చిమాసియాలో ఈ యుద్ధం చివరకు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని చాలా మంది భావించారు. ఇకపై అలాంటిదేమీ ఉండబోదు. నేను గతంలో ఎన్నో సంక్లిష్టమైన సమరాలు, సమస్యలను పరిష్కరించా. ఇది మాత్రం అతిపెద్ద రాకెట్ షిప్లాగా సమస్యాత్మకంగా మారింది. చివరకు పరిష్కరించాం’’ అని ట్రంప్ అన్నారు. తర్వాత నేతలంతా గ్రూప్ ఫొటోకు పోజిచ్చారు. తర్వాత నేతలంతా వేరే వేదికపై చేరారు. అక్కడ మళ్లీ ట్రంప్ బ్రిటన్, ఇటలీ, పాకిస్తాన్, ఈజిప్ట్, ఖతార్, తుర్కియే తదితర కీలక దేశాల అగ్రనేతలను పొగుడుతూ మాట్లాడారు. భారత్ గొప్పదేశం వెనకాల పలువురు నేతలు, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిలబడి ఉండగా వాళ్ల సమక్షంలో ట్రంప్ మాట్లాడారు. ‘‘ భారత్ గొప్పదేశం. నాకు అత్యంత మిత్రదేశం. భారత్ గొప్ప పనులెన్నో చేసింది. ఇకమీదట పాకిస్తాన్, భారత్లు ఇరుగుపొరుగున హాయిలా కలిసిమెలసి ఉంటాయని ఆశిస్తున్నా’’ అని అన్నారు. ఆ సందర్భంలో షరీఫ్ నవ్వుతూ కనిపించారు. తర్వాత ఈజిప్ట్ అధ్యక్షుడు సిసీ మాట్లాడారు. ‘‘పాలస్తీనియన్లకు స్వయం నిర్ణయాధికారం ఉండాల్సిందే. వాటిని భవిష్యత్తులో ఏ దేశమూ లాగేసుకోకూడదు. స్వతంత్ర దేశంగా ఎదగాలి’’ అని సిసీ ఆశాభావం వ్యక్తంచేశారు. -
సంబంధాల బలోపేతానికి భారత్–కెనడా రోడ్మ్యాప్ ఖరారు
న్యూఢిల్లీ: వాణిజ్యం, అరుదైన ఖనిజాలు, ఇంధన రంగాల్లో సహకారం బలోపేతానికి భారత్, కెనడాలు రోడ్ మ్యాప్ ఖరారు చేసుకున్నాయి. సోమవారం కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్లతో చర్చలు జరిపారు. 2023లో సిక్కు ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యానంతరం రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించుకోవడమే లక్ష్యంగా ఆమె భారత్కు రావడం తెల్సిందే. రెండు దేశాల వ్యూహాత్మక ప్రాముఖ్యతలు, ప్రపంచ ఆర్థిక పరిణామాల ఆధారంగా వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో సాధ్యమైనంత త్వరగా మంత్రుల స్థాయి చర్చలు ప్రారంభించాలని జై శంకర్, అనితా ఆనంద్ నిర్ణయించారు. ఈ సందర్భంగా కెనడా గడ్డపై ఖలిస్తానీ వేర్పాటు వాదులు సాగిస్తున్న కార్యకలాపాలపై జై శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. రెండు పక్షాలు పరస్పర ఆందోళనలు, సున్నితమైన అంశాలపై నిర్మాణాత్మక, సమతుల్య భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు. ఈ మేరకు వారు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ‘భారత్, కెనడా ప్రధాన మంత్రులు నాలుగు నెలల క్రితం రెండు దేశాల సంబంధాల్లో కొత్త ఊపును తెచ్చేందుకు ప్రాధాన్యతలను నిర్దేశించారు. వాటికి అనుగుణంగా, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించుకుంటూ పరస్పర గౌరవం ఆధారంగా కొత్త రోడ్మ్యాప్పై ఏకాభిప్రాయానికి చేరుకున్నాం’అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కెనడా యురేనియం సరఫరాదారులతో భారత అణు ఇంధన సంస్థ అధికారులు జరుపుతున్న చర్చలను ఇద్దరు నేతలు స్వాగతించారు. అంతకు ముందు, అనితా ఆనంద్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వాణిజ్యం, టెక్నాలజీ, ఇంధనం, వ్యవసాయం, ప్రజల మధ్య సహకారం పెంచుకునే అంశాలను మంత్రి అనితా ఆనంద్తో చర్చించినట్లు మోదీ ఎక్స్లో తెలిపారు. కెనడా ప్రధాని కార్నీతో చర్చలకు ఆసక్తితో ఎదురు చూస్తున్నానన్నారు. -
అవధుల్లేని ఆనందం
డెయిర్ అల్ బాలాహ్(గాజా స్ట్రిప్)/జెరూసలేం: నెలల తరబడి చీకట్లో మగ్గిపోయిన ఇజ్రాయెలీ బందీలు ఎట్టకేలకు హమాస్ బందీ సంకెళ్లను తెంపుకుని స్వేచ్ఛా వాయువులు పీల్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన హమాస్, ఇజ్రాయెల్ 20 సూత్రాల శాంతి ప్రణాళిక శుక్రవారం అమల్లోకిరాగా బందీల విడుదల సోమవారం మొదలైంది. రెండేళ్లకుపైగా తమ వద్ద బందీలుగా ఉంచుకున్న 20 మంది ఇజ్రాయెలీలను హమాస్ పాలస్తీనాలోని వేర్వేరు చోట్ల ఏకకాలంలో విడిచిపెట్టింది. దీంతో ఇజ్రాయెలీ బందీల కుటుంబాల్లో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. బందీలు విడుదలయ్యారన్న వార్త తెలీగానే ఇజ్రాయెల్ రాజధాని టెల్అవీవ్ ప్రధాన కూడళ్ల వద్ద వేలాది మంది జనం పోగయ్యి సంబరాలు చేసుకున్నారు. కుటుంబసభ్యులు, స్నేహితులు, ఆప్తులు బందీల కోసం ఎదురుచూశారు. చిక్కిశల్యమైన తమ వారిని చూసిన ఆనందంలో బందీల కుటుంబ సభ్యులు కేరింతలు కొట్టారు. వాళ్లను హత్తుకుని ఆనందభాష్పాలను రాల్చారు. ‘‘ మా నాన్న ఓమ్రీ మిరాన్ ఏకంగా 738 రోజుల తర్వాత ఇంటికొచ్చారు. ఆయన రాక కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాం. వేదన అంతా ఇప్పుడు మటుమాయమైంది’’ అని ఓమ్రీ సంతానం ఆనందం వ్యక్తంచేసింది. ఓమ్రీని వీడియోకాల్లో తొలిసారిగా చూసిన ఆయన భార్య లేషే మిరాన్ లావీకు ఆనందంతో మాటలు రాలేదు. నిర్బంధంలో ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయిన పలువురు బందీల పార్థివదేహాలను సైతం హమాస్ రెడ్క్రాస్ ప్రతినిధులకు అప్పగించింది. మరికొన్ని మృతదేహాలు ఎక్కడ ఉన్నాయో తమకు సైతం స్పష్టంగా తెలీదని హమాస్ ప్రతినిధులు చేసిన ప్రకటనపై బందీలు, ఆచూకీగల్లంతైన బాధితుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. 20 సూత్రాల శాంతి ప్రణాళికకు హమాస్ కచ్చితంగా కట్టుబడి ఉండాలని డిమాండ్చేసింది. ఇజ్రాయెల్ సైతం ఒప్పందంలో భాగంగా ఆక్రమిత వెస్ట్బ్యాంక్లోని ఓపెర్ జైలు నుంచి దాదాపు 2,000 మంది పాలస్తీనియన్ ఖైదీలను విడిచిపెట్టింది. వీళ్లలో గతంలో జీవితఖైదు పడిన 250 మంది ఖైదీలు న్నారు. యుద్ధం మొదలయ్యాక గాజాలో అదుపు లోకి తీసుకున్న వందలాది మందిని ఇజ్రాయెల్ విడుదలచేసింది. దీంతో వీళ్లంతా గాజా, వెస్ట్ బ్యాంక్లకు బయల్దేరారు. బస్సులో చేరుకున్న తమ వారిని చూసిన ఆనందంలో రమల్లా సిటీలోని పాలస్తీనియన్లు ఉబ్బితబ్బిబ్బయ్యారు.పీడకల పోగొట్టాం.. శాంతిస్థాపన బాధ్యత మీదే: ట్రంప్బందీల విడుదలతో కీలకపాత్రపోషించిన ట్రంప్ సోమవారం పశ్చిమాసియా పర్యటనలో భాగంగా తొలుత ఇజ్రాయెల్కు చేరుకున్నారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ నెస్సెట్లో ప్రసంగించారు. 2008 తర్వాత అమెరికా అధ్యక్షుడు నెస్సెట్లో ప్రసంగించడం ఇదే తొలిసారి. 1949 ఏడాది నుంచి చూస్తే గతంలో కేవలం ముగ్గురు అమెరికా అధ్యక్షులు మాత్రమే కేనేసెట్కు వచ్చారు. స్పీకర్ ఆమిర్ ఒహామా ఘన స్వాగతం తర్వాత పార్లమెంటేరియన్లనుద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ‘‘ నెలలతరబడి పట్టి పీడించిన బాధాతప్త యుద్ధ పీడ కలను మేం పోగొట్టాం. తుపాకులు ఇప్పుడు మౌనం దాల్చాయి. ఇక మీరు రణక్షేత్రంలో సాధించడానికి ఏమీ లేదు. ఇక ఈ ప్రాంతంలో శాంతి స్థాపన సువర్ణావకాశాన్ని మీరు అందిపుచ్చుకోండి. శాంతిని శాశ్వత చేయండి. పశ్చిమాసియాలో కొత్త శాంతి ఉషోదయం మొదలైంది. మధ్యవర్తిత్వం వహించిన నా అల్లుడు జేడ్ కుష్నర్, అమెరికా విదేశాంగ మంత్రి రూబియో, అరబ్ దేశాలకు కృతజ్ఞతలు. ఇజ్రాయెల్కు మాత్రమేకాదు పశ్చిమాసియాలో సువర్ణా« ద్యాయం మొదలుకానుంది. గాజాలో నిస్సైనికీ కరణ జరగాలి. హమాస్ ఆయుధాలను త్యజించాలి. దానికి ఇంకా అంగీకారం కుదరలేదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రసంగాన్ని ఒకరు అడ్డుకోబోగా భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని పక్కకు లాక్కెళ్లారు.ట్రంప్కు ఇజ్రాయెల్ అత్యున్నత పౌర పురస్కారంగాజా ఒప్పందం కుదిర్చి బందీల విడుదలకు కృషి చేసినందుకు ట్రంప్కు ఇజ్రాయెల్ అరుదైన గౌరవంతో సత్కరించనుంది. తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్’ను ట్రంప్కు ప్రదానం చేయనున్నట్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇస్సాక్ హెర్జోగ్ సోమవారం ప్రకటించారు. త్వరలో ప్రత్యేక కార్యక్రమంలో ట్రంప్ను ఈ పురస్కారంతో సత్కరిస్తామని ఇస్సాక్ చెప్పారు. -
కాబోయే వాడు హగ్ చేసుకున్నాడని రూ. 3.73లక్షల డిమాండ్..!
ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్.. ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయింది. పెళ్లి కుదిరి నిశ్చితార్థం తంతు ముగిస్తే చాలు.. ఇక ప్రీ వెడ్డింగ్ షూట్కి ప్లాన్ చేసుకుంటున్నారు. పాత కాలంలో అమ్మాయి-అబ్బాయి ఒకరిని ఒకరు చూసుకోవడమే గగనమైతే.. ఇప్పుడు ఆ ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. పెళ్లికొడుకు-పెళ్లికూతరు(పెళ్లికి ముందే) ప్రీ వెడ్డింగ్ షూట్లో మెరిసి మురిసిపోవడం పరిపాటిగా మారిపోయింది. ఇదంతా ఇలా ఉంచితే, ప్రీ వెడ్డింగ్ షూట్లో అమ్మాయిని అబ్బాయి హగ్ చేసుకున్నందుకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు. అటు పెళ్లి క్యాన్సల్ కావడం ఒకటైతే, తనను హగ్ చేసుకున్నందుకు మూడు లక్షల డబ్బై ఐదు వేలు రూపాయిలు ఇవ్వాలని అమ్మాయి డిమాండ్ చేస్తోంది. చైనాలో చేసుకున్న ఈ ఘటన వైరల్గా మారింది. వీరి నిశ్చితార్థం జనవరిలో జరగ్గా, నవంబర్లో ప్రీ వెడ్డింగ్ షూట్ దాదాపు పూర్తి చేసుకున్నారు. ఒక హోటల్ తీసుకుని మరీ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. అయితే ఒకానొక సందర్భంలో అమ్మాయి ముందుండి, అబ్బాయి వెనుక ఉండే ఫోటో తీసే సందర్భంలో హగ్ చేసుకోమన్నాడు ఫోటో గ్రాఫర్. దాంతో నిశ్చితార్థ పెళ్లి కొడుకు ఆమెను హగ్ చేసుకున్నాడు. అంతే ఈ పెళ్లి క్యాన్సిల్ అంటూ అమ్మాయి తెగేసి చెప్పేసింది. ఇలా హగ్ చేసుకోవడం ఏంటని పాత సంప్రదాయాన్ని తిరగతోడింది. తాము నిశ్చితార్థం చేసుకోవడానికి ఖర్చులు అయినందున రూ. 3.73 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ఆ అమ్మాయికి నిశ్చితార్థంలో అబ్బాయి కుటుంబం వారు 200,000 యువాన్లు(రూ. 25 లక్షలు) బహుమతిగా ఇవ్వడానికి అంగీకరించి అది కాస్తా ఇచ్చేశారు. ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ కావడంతో 30,000 యువాన్లు(రూ. 3.73 లక్షలు ) కట్ చేసి మిగతా అమౌంట్ను తిరిగి ఇచ్చేసింది. ఇలా ఎందుకు కట్ చేసారని అడిగితే.. అబ్బాయి హగ్ చేసుకున్నందుకు అని ఆమె సమాధానం చెప్పింది. ఇది సరైన పద్ధతి కాదంటున్నాడు ఆ సంబంధం కుదిర్చిన మధ్యవర్తి. తాను వెయ్యికిపైగా పెళ్లిల్లు చేశానని, ఈ అమ్మాయి మాత్రం చాలా భిన్నంగా ఉందన్నాడు. పెళ్లి రద్దు చేసుకున్న తర్వాత మొత్తం తిరిగి ఇవ్వకుండా ఇలా కట్ చేసుకుని మిగతా 170,500 యువాన్లు(సుమారు రూ. 21లక్షలు) మాత్రమే తిరిగి ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదని అంటున్నారు. ఏమీ కారణం లేకుండానే పెళ్లి క్యాన్సిల్ చేసుకుని ఇలా డిమాండ్ పేరుతో సుమారు నాలుగు లక్షల రూపాయిలు కట్ చేసుకోవడంపై తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశాడు ‘పెళ్లిళ్ల పేరయ్య’.ఇదీ చదవండి: ఇజ్రాయిల్ పార్లమెంట్లో ట్రంప్ ప్రసంగానికి నిరసన సెగ -
ఇజ్రాయిల్ పార్లమెంట్లో ట్రంప్ ప్రసంగానికి నిరసన సెగ
ఇజ్రాయిల్-హమాస్ల మధ్య జరిగిన శాంతి ఒప్పందంలో భాగంగా ఇజ్రాయిల్ పార్లమెంట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తుండగా నిరసన సెగ ఎదురైంది. ట్రంప్ ప్రసంగించే సమయంలో ఇద్దరు ఎంపీలు ట్రంప్ ప్రసంగానికి అడ్డుతగిలారు. స్లోగాన్స్తో ట్రంప్ ప్రసంగాన్ని పదే పదే అడ్డుకున్నారు. ఇలా ట్రంప్ ప్రసంగానికి అంతరాయం ఏర్పడటంతో ఆ ఇద్దరు ఎంపీలను బహిష్కరించారు. పార్లమెంట్ నుంచి వారిని మార్షల్స్ సాయంతో బయటకు తీసుకెళ్లిపోయారు. 2023, అక్టోబర్ 7వ తేదీన హమాస్ కిడ్నాప్ చేయబడినప్పటి నుండి వారు బందీలుగా పట్టుకున్న చివరి సజీవ బందీలను ఇజ్రాయెల్కు తిరిగి పంపడాన్ని ట్రంప్ గుర్తు చేస్తున్న సందర్భంగా ఆయన ప్రసంగానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తమైంది. హమాస్తో తొలి దశ ఒప్పందంలోని ఇది సువర్ణాధ్యాయంగా మిగిలిపోతుందని ట్రంప్ వ్యాఖ్యలలపై వారు నిరసన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: హమాస్ కొత్త బ్రాండ్ పేరు.. ‘ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్’ -
సృజనాత్మక ప్రగతికి ఆర్థిక నోబెల్
స్టాక్హోమ్: ప్రపంచ ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తూనే, అంతర్జాతీయంగా జీవన ప్రమాణాల మెరుగుకు దోహదపడే ‘సృజనాత్మక విధ్వంసం’ భావనను మరింత ప్రభావవంతంగా వివరించిన ముగ్గురు ఆర్థికవేత్తలకు 2025 ఏడాదికిగాను ఆర్థిక నోబెల్ పురస్కారం దక్కింది. సోమవారం నోబెల్ కమిటీ ఆర్థికవేత్తలు జోయెల్ మోకిర్, ఫిలిప్ అఘియన్, పీటర్ హోవిట్లకు 2025 ఏడాదికి ఎకనమిక్స్ నోబెల్ను ప్రకటించింది. ‘‘కొత్త ఉత్పత్తులు, తయారీ విధానాలకు కొత్త ఆవిష్కరణలు ఏ రకంగా దోహదపడతాయనేది ఈ ముగ్గురు వివరించారు. ఆర్థిక స్తబ్దత అనేది ఎప్పుడైనా జరగొచ్చు. దాని పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని వీళ్లు సోదాహరణంగా హెచ్చరించారు’’ అని ఆర్థికశాస్త్ర నోబెల్ కమిటీ చైర్మన్ జాన్ హాస్లర్ కొనియాడారు. ముగ్గురికీ సంయుక్తంగా దాదాపు రూ.10.63 కోట్ల నగదు బహుమతి లభిస్తుంది. ఇందులో సగభాగాన్ని డచ్ ఆర్థికవేత్త మోకిర్ అందుకోనున్నారు. మిగతా సగాన్ని ఫిలిప్, పీటర్ పంచుకోనున్నారు. ముగ్గురికీ విడివిడిగా 18 క్యారెట్ల విలువైన బంగారు నోబెల్ మెడల్ను మెడలో వేయనున్నారు. కృత్రిమమేధతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ప్రగతిలో దూసుకుపోతుందన్న అంచనాల మధ్య క్రియేటివ్ డిస్ట్రక్షన్ సిద్ధాంత విశ్లేషకులకు ఆర్థిక నోబెల్ దక్కడం విశేషం. ఏమిటీ పరిశోధన? ‘‘పాత ఆవిష్కరణల స్థానాన్ని కొత్త ఆవిష్కరణలు భర్తీచేస్తున్నప్పుడు అవి ఎలా పనిచేస్తున్నాయి అనేది ఒక్కటి పరిశీలిస్తే సరిపోదు. అసలు ఆ కొత్త ఆవిష్కరణ ఏ రకంగా విజయం సాధిస్తుందనేది శాస్త్రీయంగా అర్థంచేసుకోగలగాలి. దీనిని ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు చక్కగా వివరించారు’’ అని నోబెల్ కమిటీ కొనియాడింది. ప్రత్యామ్నాయంగా కొత్త సాంకేతికతలు రావడంతో పాతవి కనుమరుగవుతాయి. ఒకరకంగా పాత ఆవిష్కరణలను మనుగడలో లేకుండా కొత్తవి నాశనంచేస్తాయి. ఈ ఆర్థిక భావనను ‘సృజనాత్మక విధ్వంసం’ అంటారు. ఈ భావనను అమెరికా, ఇజ్రాయెల్ మూలాలున్న నెదర్లాండ్స్ ఆర్థిక చరిత్రకారుడు జోయెల్ మోకిర్ తనదైన శైలిలో వివరించారు. ఇందుకోసం పాత ఆర్థికశాస్త్ర పుస్తకాలను తిరగేశారు. 79 ఏళ్ల మోకిర్ ప్రస్తుతం అమెరికాలోని నార్త్వెస్టర్న్ వర్సిటీలో ఆర్థిక పరిశోధనలు చేస్తున్నారు. ఇదే భావనను ఫ్రాన్స్లో జని్మంచిన ఆర్థికవేత్త ఫిలిప్ అఘియన్, కెనడాలో జని్మంచిన ఆర్థికవేత్త పీటర్ విలి్కన్సన్ హోవిట్ సైతం గణిత సిద్ధాంతాలతో వివరించారు. 69 ఏళ్ల అఘియన్ ప్రస్తుతం పారిస్లోని కాలేజ్ ది ఫ్రాన్స్లో, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. 79 ఏళ్ల హోవిట్ ప్రస్తుతం అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా సేవలందిస్తున్నారు. ఆర్థికనోబెల్కు ఎంపికైన విషయం తెల్సి ఆర్థికవేత్త మోకిర్ షాక్కు గురయ్యారు. ‘‘ఏదైనా అనూహ్యమైనది సాధించినప్పుడు షాక్లో ఉన్నామని చాలా మంది చెబుతుంటారు. అది నిజంగా నిజం. నేనిప్పుడు అదే అనుభూతిని పొందా. నోబెల్ గెల్చుకుంటానని అస్సలు అనుకోలేదు. నిజానికి మీకు నోబెల్ రావొచ్చని నా విద్యార్థులు చెప్పారు. వాళ్లతో ఒక్కటే చెప్పా. వస్తే నాకు పోప్ పదవి రావొచ్చుగానీ నోబెల్ రాదని చెప్పా’’ అని మోకిర్ సరదాగా మాట్లాడారు. ‘‘ఈ వేసవికాలానికి నాకు 80 ఏళ్లు నిండుతాయి. అయినా నా వృత్తి నుంచి రిటైర్మెంట్ తీసుకోను. ఆర్థికవేత్తగా జీవితాంతం కొనసాగాలన్నదే నా కల’’ అని ఆయన అన్నారు. నజరానాను పరిశోధనకు కేటాయిస్తా.. నోబెల్ గెల్చుకోవడంపై ఆర్థికవేత్త అఘియన్ స్పందించారు. ‘‘ఈ అనుభూతిని వరి్ణంచడానికి నాకు మాటలు రావట్లేదు. ప్రైజ్మనీగా నాకు దక్కే నగదును మళ్లీ ఆర్థికశాస్త్ర పరిశోధనల కోసమే ఖర్చుచేస్తా. అమెరికాలో ట్రంప్ సర్కార్ విదేశీ మేధావులను రానీయకుండా అడ్డుకుంటోంది. ట్రంప్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, రక్షణాత్మకత ధోరణి చాలా తప్పు. ఇది ప్రపంచ ఆర్థిక ప్రగతికి, ఆవిష్కరణలకు విఘాతంగా మారనుంది’’ అని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఈ భావన ఎప్పటిది? క్రియేటివ్ డిస్ట్రక్షన్ అనేది దశాబ్దాలనాటి పాత సిద్ధాంతం. ఈ భావనను ఆర్థికవేత్త జోసెఫ్ షుమ్పీటర్ ప్రతిపాదించారు. ఆయన 1942లో రచించిన తన ‘పెట్టుబడిదారీవిధానం, సామ్యవాదం, ప్రజాస్వామ్యం’ పుస్తకంలో ఈ సిద్ధాంతాన్ని తొలిసారిగా పేర్కొన్నారు. ఈ సృజనాత్మక విధ్వంసం భావనను తమదైన రీతిలో వివరించేందుకు అఘియన్, హోవిట్లు 1992లో ఒక గణితశాస్త్ర మోడల్ను అభివృద్ధిచేశారు. అఘియన్ 2017లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆర్థిక పథకానికి సైతం తుదిరూపుని చ్చారు. కృత్రిమమేధ రంగంలో ఫ్రాన్స్లో అగ్రగామిగా మార్చాలంటే ఏ రకమైన విధానాలను అవలంభించాలో తెలుపుతూ 25 ప్రతిపాదనలను మేక్రాన్కు అఘియన్ అందజేశారు. ‘‘ఆర్థిక ప్రగతిని ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించకూడదు. అది ఎందుకు సాధ్యమైందో అర్థంచేసుకుని ముందుకు సాగాలి. లేదంటే సంక్షోభంలో చిక్కుకుపోతాం’’ అని జాన్ హాస్లర్ వ్యాఖ్యానించారు. -
ఇజ్రాయెల్లో సంబరాలు.. హమాస్ నుంచి బందీల విడుదల
జెరూసలేం: దాదాపు రెండేళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారికి విముక్తి లభించింది. గాజాలో బందీల విడుదల మొదలైంది. తొలివిడతలో తాజాగా ఏడుగురు ఇజ్రాయెల్ బందీలను హమాస్.. రెడ్ క్రాస్కు అప్పగించింది. ఆ తర్వాత కొద్ది సేపటికి మిగిలిన వారిని విడుదల చేసినట్టు తెలుస్తోంది. దీంతో, ఇప్పటికే రెడ్క్రాస్ వాహనశ్రేణి ఖాన్ యూనిస్కు చేరుకుంది.ఈ క్రమంలో ప్రధాని నెతన్యాహు, ఆయన సతీమణి బందీలకు స్వాగతం పలుకుతూ సందేశం విడుదల చేశారు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వెల్లడించింది. మరోవైపు.. బందీల కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు.. తమ వారి కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు బయటకు వచ్చాయి. బందీలు హమాస్ నుంచి విడుదల అవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్లో సంబురాలు చేసుకుంటున్నారు. హమాస్పై యుద్ధంలో తాము విజయం సాధించినట్టు సంబురాలు జరుపుకుంటున్నారు. Prime Minister Netanyahu is receiving real-time updates on the ongoing release of the hostages and is in continuous contact with hostage affairs coordinator Gal Hirsch. pic.twitter.com/JRAnwOXTK9— Cheryl E 🇮🇱🎗️ (@CherylWroteIt) October 13, 2025 Fantastisch nieuws.Eerste gijzelaars vrijgelaten.Uit de handen van de islamitische terreurbeweging Hamas.Na twee lange jaren weer vrij.Terug naar hun geliefden en familie in Israël!❤️#HostageRelease #Israel pic.twitter.com/VT7EXuFekX— Geert Wilders (@geertwilderspvv) October 13, 2025ఇదిలా ఉండగా.. 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్పై దాడి చేసి 1200 మందిని హత్య చేసి, 251 మందిని హమాస్ అపహరించిన విషయం తెలిసిందే. వారిలో కొంత మందిని గతంలో విడుదల చేసింది. కొందరిని ఇజ్రాయెల్ సైన్యం రక్షించింది. మరికొంత మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక తొలి దశలో భాగంగా ఇజ్రాయెల్, హమాస్ ఇటీవల కాల్పుల విరమణకు అంగీకరించాయి. శుక్రవారం నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది.#BREAKING: First Israeli hostages to be released by Hamas at the Re'im base are Alon Ohel, Matan Angrest, brothers Gali and Ziv Berman, Eitan Mor and Omri Miren. #HostageRelease #Israel #Gaza pic.twitter.com/JCci4e7rJQ— OSINT Spectator (@osint1117) October 13, 2025ఇందులో భాగంగా తమ వద్ద ఉన్న 48 మంది బందీలను హమాస్ విడిచిపెట్టనుంది. ఇందులో 20 మంది సజీవంగా ఉన్నారు. ఇందుకు ప్రతిగా 2వేల మందికి పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయనుంది. వీరంతా సోమవారం సాయంత్రం జైళ్ల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ విడుదల కార్యక్రమం ముగిసిన తర్వాత ట్రంప్ శాంతి ప్రణాళికలో రెండో దశపై చర్చలు ప్రారంభమవుతాయి. ఇందులో హమాస్ ఆయుధాలను త్యజించడం.. గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ ప్రధాన అంశాలు. ఈ చర్చలకు అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ⚡️BREAKING:Seven Israeli hostages have been handed over to the Red Cross as part of the ongoing peace agreement between Israel and Hamas.#BreakingNews #HostageRelease #Gaza #RedCross #PeaceDeal pic.twitter.com/BiJrOUOBmn— Tabish Rahman (@Tabishtabi11) October 13, 2025In Israel tens of thousands are already out in the streets to experience the return of the hostages, together. pic.twitter.com/Dc36YuGmzO— Israel News Pulse (@israelnewspulse) October 13, 2025 -
ట్రంప్ లూప్ ఆగట్లే.. నెక్స్ట్ ఆపేది ఆ యుద్ధమేనంట!
ప్రపంచ శాంతికాముకుడిగా తనను తాను అభివర్ణించుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump).. నోబెల్ శాంతి బహుమతిని మాత్రం దక్కించుకోలేకపోయారు. అయితే ఈ ఫలితం తనను కుంగదీయబోదని, శాంతిని నెలకొల్పాలన్న తన ప్రయత్నాలను ఏమాత్రం ఆపబోదని అంటున్నారాయన. తాజాగా ఆయన మరో యుద్ధంపై కన్నేశారు. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగం, ఈజిప్ట్లో జరగబోయే గాజా శాంతి సదస్సు నేపథ్యంతో పర్యటన బయల్దేరిన టైంలో ఆయన మీడియాతో కాసేపు ముచ్చటించారు. ఆ సమయంలో.. , యుద్ధాలను ఆపడంలో తాను నేర్పరినని, తన పాలనలో ఎన్నో ప్రపంచ సంక్షోభాలు పరిష్కారం అయ్యాయని వ్యాఖ్యానించారాయన. అలాగే.. ప్రస్తుతం తన దృష్టి పాక్-అఫ్గన్ ఘర్షణలపై(Pak Afghan Clashes) ఉందని అన్నారు.ఇది నేను ఆపిన 8వ యుద్ధం(గాజా సంక్షోభాన్ని ఉద్దేశించి..). అఫ్గనిస్తాన్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతోందని విన్నాను. తిరిగి వచ్చాక దాని సంగతి చూస్తా. ఎందుకంటే.. యుద్ధాలను ఆపడంలో నేను నేర్పరిని కదా అని వ్యాఖ్యానించారు. అయితే తన శాంతి ప్రయత్నాలు అవార్డులను తేలేకపోయినా(నోబెల్ను ఉద్దేశించి..) ప్రాణాలను నిలబెడుతోందని, అది తనకెంతో గౌరవాన్ని అందిస్తోందని వ్యాఖ్యానించారాయన.ఇదిలా ఉంటే.. పశ్చిమాసియా పర్యటనకు బయల్దేరే ముందు కూడా ట్రంప్ మళ్లీ అదే పాట పాడారు(Trump On India Pak Tensions). భారత్-పాక్ మధ్య యుద్ధం టారిఫ్ల బెదిరింపులతోనే ఆగిందని పునరుద్ఘాటించారు. ‘‘భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల గురించి ఓసారి ఆలోచించండి. కొన్ని యుద్ధాలు మూడు, నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. లక్షల మంది మరణించారు. నేను వాటిని ఒక్క రోజులోనే ముగించాను. అది గొప్ప విషయం’’ అని అన్నారు. అణ్వాయుధాలు ఉన్న రెండు దేశాలు యుద్ధానికి దిగాయి. దౌత్యంతో ప్రయత్నిద్దామనుకుంటే మాట వింటారా?. అందుకే సుంకాలు విధిస్తా అని బెదిరించా. 24 గంటలు గడవకముందే దెబ్బకు దిగొచ్చారు. లేకుంటే యుద్ధం ఆగి ఉండేదా? అని మే నెలలో జరిగిన భారత్-పాక్ ఉద్రిక్తతలపై ట్రంప్ వ్యాఖ్యానించారు. అఫ్కోర్స్.. ఈ కాల్పుల విమరణలో మూడో దేశం, వ్యక్తి.. ప్రేమయం లేదని, పాక్ కోరితేనే కాల్పుల విరమణకు అంగీకరించామని భారత్ చెబుతూ వస్తోంది. ఇక ఇదిలా ఉంటే.. పాక్-అఫ్గన్ సరిహద్దుల మధ్య గత రాత్రి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భీకర దాడులతో 58 మంది పాక్ సైనికులను మట్టుబెట్టినట్లు అఫ్గన్ అధికారులు ప్రకటించారు. అయితే చనిపోయింది 23 మందేనని పాక్ సైన్యం అంటోంది. ఇదీ చదవండి: తాలిబన్ల దెబ్బ.. పాక్కు భారీ నష్టం -
తుపాను బీభత్సం.. 44 మరణాలు.. మేయర్పై దాడికి యత్నం
పొజారికా: మెక్సికోలో మధ్య, ఆగ్నేయ ప్రాంతాల్లో తుపాను బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు, వరదలకు సంబంధించిన ఘటనల్లో కనీసం 44 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. వెరాక్రుజ్ రాష్ట్రంలో ఈ నెల 6–9 తేదీల మధ్యలో అత్యధికంగా 54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో, కజొనెస్ నది పొంగి ప్రవహించింది. శుక్రవారం వేకువజామున పొజారికా వీధుల్లో నాలుగు మీటర్ల మేర వరద ప్రవహించింది. వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. తుపాను బీభత్సం కారణంగా పొజారికాలో ప్రజలు బురద నీటిలోనే జీవనం కొనసాగిస్తున్నారు. వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో పరిస్థితిని పరిశీలించేందుకు అక్కడికి వచ్చిన మేయర్పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి ప్రయత్నించారు. ఆయన కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఆగ్రహంతో స్థానికులు.. మేయర్ వాహనంపై రాళ్లు రువ్వి, బురద చల్లారు. విపత్తు సమయంలో ముందస్తుగా తమను ఎందుకు హెచ్చరించలేదని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.#Internacionales | 🇲🇽 Vecinos de Poza Rica, México, arremetieron con piedras y reclamos contra el alcalde por las inundaciones tras no alertar a la población sobre la creciente del río Cazones.Video: Cortesía. pic.twitter.com/lOgmdbUf0I— #ÚltimaHora (@ultimahsv) October 13, 2025 మరోవైపు.. వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ప్రాణనష్టం పెరిగింది. దీంతో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాల గవర్నర్లను సమావేశపరిచి అత్యవసర ప్రతిస్పందన ప్రణాళికను నిర్దేశించారు. కాగా, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.🚨 BREAKING: HERE WE GO AGAIN: MASSIVE FLOODING UNFOLDING IN RUIDOSO, NEW MEXICOWater levels surged 20 FEET in just 30 minutes, shattering records.Flash flood warnings are active. Burn scar zones are fueling the chaos.pic.twitter.com/7paFApY4P9— HustleBitch (@HustleBitch_) July 8, 2025 #Internacionales | 🇲🇽🚨 Las lluvias dejaron grandes afectaciones en Veracruz, México, mientras ciudadanos reclaman por el abandono del gobierno. Video: Cortesía. pic.twitter.com/xofN5YtbWr— #ÚltimaHora (@ultimahsv) October 13, 2025Heavy rainfall causes MASS flooding in Mexico, with rescue operations underwayReports claim 27 DEAD as a result of of severe weather conditions pic.twitter.com/yZ3oTokStL— RT (@RT_com) October 11, 2025🚨 No están solos. Estamos en #Veracruz, donde las lluvias han golpeado fuerte… pero la ayuda ya se está brindando. pic.twitter.com/YXShKOKlW3— Cruz Roja Mexicana IAP (@CruzRoja_MX) October 12, 2025 -
పశ్చిమాసియాకు ట్రంప్.. భారత్ తరఫున కీర్తివర్దన్సింగ్
గాజా యుద్ధాన్ని ముగించానన్న జోష్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) నేడు పశ్చిమాసియాలో పర్యటించనున్నారు. తొలుత ఇజ్రాయెల్లో పర్యటించి.. అక్కడి నుంచి ఈజిప్ట్లో జరగబోయే అత్యున్నతస్థాయి శాంతి సదస్సులో పాల్గొంటారు. కాల్పుల విరమణ తర్వాత ట్రంప్ పర్యటన కావడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. పర్యటనకు బయల్దేరే ముందు ట్రంప్ ఎయిర్పోర్టులో రాయిటర్స్తో మాట్లాడారు. గాజా యుద్ధం ముగిసిందని ప్రకటించిన ఆయన.. విషయం అర్థమై ఉంటుందని వ్యాఖ్యానించారు. అతిత్వరలో సాధారణ పరిస్థితులు నెలకొనబోతున్నాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా.. తొలుత ఇజ్రాయెల్ పార్లమెంట్ క్నెసెట్(Trump In Israel Parliament)లో ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో ఆ దేశంలో పర్యటించిన నాలుగో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ నిలవనున్నారు. అటు నుంచి ఆయన ఈజిప్ట్కు వెళ్లి.. శర్మ్ ఎల్-షేక్ నగరంలో అత్యున్నత స్థాయి శాంతి సదస్సులో పాల్గొంటారు. కాల్పుల విరమణలో ఖతార్ దేశ మధ్యవర్తిత్వాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాగే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చక్కగా పని చేశారని ప్రశంసించారు. బంధీల విడుదల కూడా ఊహించిన దానికంటే ముందే జరగొచ్చని, ధ్వంసమైన గాజాను బోర్డ్ ఆఫ్ పీస్ ద్వారా పునర్విర్మిస్తామని అన్నారాయన. యూదులు, ముస్లింలు, అరబ్ దేశాలు.. అంతా సంతోషంగా ఉన్నారని అన్నారాయన. గాజా శాంతి సదస్సుఇదిలా ఉంటే.. ఇవాళ శర్మ్ ఎల్-షేక్ నగరం(Sharm El-Sheikh Summit)లో జరగనున్న సదస్సుకి 20కి పైగా ప్రపంచ దేశాల నేతలు, ప్రతినిధులు పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈజిప్ట్ అధ్యక్షుడు అల్-సిసి సంయుక్త అధ్యక్షతన ఈ సదస్సు జరగనుంది. శాంతి ఒప్పందానికి రూపకల్పన చేయడం, గాజా పునర్నిర్మాణం ప్రధాన లక్ష్యాలుగా ఈ సదస్సు జరగనుంది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా కూడా హాజరుకానున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందించింది. అయితే ఆయన తరఫున విదేశీ వ్యవహారాల శాఖ సహాయక మంత్రి కీర్తివర్దన్సింగ్ హాజరు కానున్నారు. బందీల విడుదల.. నేడేదాదాపు రెండేళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారికి సోమవారం తెల్లవారుజామున విముక్తి కలగనుంది. గాజాలో మూడు ప్రాంతాల్లో వారిని హమాస్ విడుదల చేయనుంది. ఇజ్రాయెల్ బలగాలు, హమాస్ మధ్య ఆదివారం వరకు కాల్పుల విరమణ కొనసాగింది. సోమవారం ఉదయం 20 మంది బంధీలు విడుదలవుతారని ఇజ్రాయెల్ అధికార ప్రతినిధి షోష్ బెడ్రోసియన్ ప్రకటించారు. ఒప్పందం ప్రకారం.. హమాస్ మొత్తం బంధీలను మధ్యాహ్నం 12 గంటలలోగా విడుదల చేయాల్సి ఉంటుంది. అలాగే ఇజ్రాయెల్ 250 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనుంది. అయితే హమాస్ సీనియర్ కమాండర్లను మాత్రం విడుదల చేయడం లేదని తెలుస్తోంది. అయితే.. గాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి బంధించిన మరో 1,700 పాలస్తీనా పౌరుల్ని(ఇందులో 22 మైనర్లు, 360 మిలిటెంట్ల మృతదేహాలు కూడా ఉన్నాయి) విడుదల చేయనున్నటలు ఇజ్రాయెల్ ధృవీకరించింది.తాజా పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. హమాస్పై విజయం సాధించాం అని ప్రకటించారాయన. అయితే.. భద్రతా సవాళ్లు ఇంకా మిగిలే ఉన్నాయని వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక బందీల విడుదల నేపథ్యంలో ఇజ్రాయెల్ బలగాలు ‘ఆపరేషన్ రిటర్నింగ్ హోంOperation Returning Home’ చేపట్టాయి. 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేయడంతో 1,200 మంది మరణించారు. ఆపై 251 మందిని హమాస్ అపహరించిన సంగతి తెలిసిందే. వారిలో కొంత మందిని గతంలో విడుదల చేసింది. కొందరిని ఇజ్రాయెల్ సైన్యం రక్షించింది. మరికొంత మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక తొలి దశలో భాగంగా ఇజ్రాయెల్, హమాస్ ఇటీవల కాల్పుల విరమణకు అంగీకరించడంతో గాజా సంక్షోభానికి ఎండ్ కార్డ్ పడింది. ఇదీ చదవండి: సైనిక తిరుగుబాటుతో అట్టుడికిన మడగాస్కర్! -
150 ఏళ్లు బతకడం సైన్స్ ఫిక్షన్ కాదు
మాస్కో: వందేళ్లు హాయిగా జీవించిన వ్యక్తులను పూర్ణాయుశ్కులు అంటుంటాం. అయితే అంతకంటే మరో 50 ఏళ్లు ఎక్కువే జీవించగల ఎంతో మంది వ్యక్తులు మన మధ్యే ఉన్నారని రష్యా శాస్త్రవేత్త విటాలీ కోవల్యోవ్ వ్యాఖ్యానించారు. రష్యాలోని వోల్గోగ్రాడ్ ప్రభుత్వ వైద్య విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగా సేవలందిస్తున్న ఈయన ఈయన తాజాగా వైద్య, ఆరోగ్య సంబంధ విషయాలను వివరించే బయోపాలిటిక్స్ ఛానల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ పలు అంశాలపై మాట్లాడారు. ‘‘వృద్దాప్య ఛాయల్లోకి పడిపోవడం ఇటీవల తగ్గింది. 150 ఏళ్లు జీవించడం అనేది సైన్స్ ఫిక్షన్ కానేకాదు. 150 ఏళ్లు జీవించగల సత్తా ఉన్న మనుషులెందరో ఇటీవల పుట్టారు. వాళ్లలో కొందరు ఇప్పుడు 20 ఏళ్లు, 30 ఏళ్లు, 40 ఏళ్ల వయసులో ఉన్నారు. వృద్దాప్యాన్ని నెమ్మదింపజేసే ప్రయోగాలెన్నో జరుగుతున్నాయి. వృద్దాప్య వేగాన్ని తగ్గించడం అసాధ్యం అనేది తప్పుడు భావన. 150 ఏళ్లు పైబడిన తర్వాత కూడా మనిషి హాయిగా జీవించగలిగే ఔషధాల సృష్టికి ప్రయోగాలు జరుగుతున్నాయి’’అని ఆయన అన్నారు. గత నెలలో బీజింగ్లోని తియాన్మెన్స్కే్వర్లో జరిగిన చైనా సైనిక పరేడ్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్యే అచ్చం ఇలాంటి అంశంపైనే మాటామంతీ జరగడం తెల్సిందే. ‘‘జీవసాంకేతిక శాస్త్రం అద్భుతంగా పురోగమిస్తోంది. ముసలివైపోతున్న, పాడవుతున్న అంతర్గత అవయవాలను ఎప్పటికప్పుడు మారి్పడి చేసుకుంటూ మనిషి చాన్నాళ్లు జీవించవచ్చు. ఇలా నూతన అవయవాలతో యవ్వన ఛాయతో మెరుగైన జీవనం సాధ్యమే. బయోటెక్నాలజీతో సాధ్యమైతే చివరకు మృత్యువునూ జయించవచ్చు’’అని జిన్పింగ్తో పుతిన్ వ్యాఖ్యానించడం తెల్సిందే. -
శాంతి శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని బదులు మంత్రి కేవీ సింగ్
న్యూఢిల్లీ: ఈజిప్టులోని ఎర్ర సముద్ర తీర నగరం షర్మ్ ఎల్ షేక్లో సోమవారం జరిగే శాంతి శిఖరాగ్ర సదస్సు(పీస్ సమిట్)కు మన దేశం తరఫున కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ హాజరవనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా 20కి పైగా దేశాల నేతలు పాల్గొనే ఈ సమావేశానికి రావాలంటూ ఈజిప్టు అధ్యక్షుడు ఎల్ సిసి ప్రధాని మోదీకి ఆదివారం ఆహ్వానం పంపించారు. అయితే, ఆయన తన బదులుగా మంత్రి కేవీ సింగ్ను పంపిస్తున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గాజాతోపాటు పశ్చిమాసియాలో శాంతి నెలకొల్ప డమే లక్ష్యంగా జరిగే కార్యక్రమానికి ఈజిప్టు అధ్యక్షు డు ఎల్ సిసి, ట్రంప్ సహాధ్యక్షత వహించనున్నారు. గాజా శాంతి ఒప్పందంపై ఈ సందర్భంగా సంతకాలు జరుగుతాయి. శిఖరా గ్రానికి ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటె రస్, యూకే ప్రధాని స్టార్మర్, ఇటలీ ప్రధాని మెలోనీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తదితర నేతలు హాజరవ నున్నారు.బాంబు పేల్చిన హమాస్అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందం అమలుపై అప్పుడే అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఆదివారం హమాస్ చేసిన ప్రకటనే ఇందుకు తాజా ఉదాహరణ. సోమవారం ఈజిప్టులో జరిగే శాంతి శిఖరాగ్రాన్ని తాము బహిష్కరిస్తున్నామని హమాస్ తెలిపింది. ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందంపై తాము సంతకం చేసేది లేదని స్పష్టం చేసింది. -
శాంతియుత పరిష్కారం కావాలి
న్యూఢిల్లీ: పాకిస్తాన్తో సరిహద్దుల వెంట కొనసాగుతున్న ఉద్రిక్తత సమసిపోయేందుకు శాంతియుత పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నట్లు అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ఖాన్ ముత్తాఫీ వ్యాఖ్యానించారు. పోరు సద్దుమణిగేందుకు శాంతియుత మార్గాలను అన్వేషిస్తామని, అది సాధ్యంకాకుంటే ఇతర ‘మార్గాలను’ వెతుకుతామని ఆయన అన్నారు. భారత పర్యటనలో ఉన్న ముత్తాఖీ ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల వంటి విదేశీ శక్తుల చొరబాట్లను అడ్డుకునేందుకు అఫ్గానిస్తాన్ ఐక్యంగా పోరాడుతుంది. అఫ్గాన్ సార్వభౌమత్వానికి భంగపరిచే ఎలాంటి చర్యలను మేం సహించబోం. చర్చలు, పరస్పర అవగాహన ద్వారా సమస్యల పరిష్కారానికే మా ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్గానిస్తాన్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఎలాంటి ఉద్రిక్తతలకు తావివ్వకూడదనేదే మా విదేశాంగ విధానం. అది కుదరనప్పుడు మేం వేరే దారులను వెదికి అనుకున్నది సాధిస్తాం. అయినా మాకు పాక్ ప్రభుత్వం, ప్రజలతో ఎలాంటి విబేధాలు లేవు. అక్కడ తిష్టవేసిన కొన్ని శక్తులే(ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు) అసలు సమస్య. అఫ్గాన్లో అంతర్గతంగా విబేధాలు ఉండి ఉండొచ్చు. కానీ బయటిశక్తుల నుంచి పెను ప్రమాదం పొంచి ఉంటే తాలిబాన్ ప్రభుత్వ, పౌరులు, మతాధికారులు అంతా ఏకమై శత్రువును తుదముట్టిస్తారు ’’ అని ఆయన అన్నారు. -
ఉద్రిక్తంగా పాక్–అఫ్గాన్ పోరు
ఇస్లామాబాద్/పెషావర్: తెహ్రీక్–ఇ–తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ) సంస్థ స్థావరమే లక్ష్యంగా పాకిస్తాన్ జరిపిన దాడులు చివరకు తాలిబాన్, పాక్ మధ్య పోరును మరింత ఉధృతం చేశాయి. పాక్–అఫ్గాన్ సరిహద్దు ప్రాంతంలో ఆదివారం సైతం ఇరు దేశాల పరస్పర దాడుల పర్వం కొనసాగింది. శత్రుదేశానికి భారీ నష్టం వాటిల్లజేశామని అటు అఫ్గానిస్తాన్, ఇటు పాకిస్తాన్ ప్రకటించుకున్నాయి. 200 మందికిపైగా తాలిబాన్ ఫైటర్లను అంతంచేశామని పాకిస్తాన్ ఆర్మీ ఆదివారం ప్రకటించగా తాము 58 మంది పాక్ సైనికులను చంపేశామని అఫ్గాన్ ప్రభుత్వం పేర్కొంది. పాక్కు చెందిన 25 ఆర్మీ పోస్ట్లను సైతం దాడులను ధ్వంసంచేశామని అఫ్గాన్ సర్కార్ వెల్లడించింది. తమ దాడుల ధాటికి 30 మంది పాక్ సైనికులు రక్తమోడారని వెల్లడించింది. ఈ మేరకు తాలిబాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లాహ్ ముజాహిద్ మాట్లాడారు. ‘‘ మా అఫ్గాన్ ప్రభుత్వానికి కంట్లో నలుసులా తయారైన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తోంది. పాక్లో తలదాచుకున్న ఐఎస్ఐఎస్ ముఖ్యులను మాకు అప్పగించాలి. ఐఎస్గ్రూప్ ఒక్క అఫ్గానిస్తాన్కే కాదు యావత్ ప్రపంచానికే పెనుముప్పు’’ అని ముజాహిద్ అన్నారు. సరిహద్దు వెంట కాల్పుల మోత‘ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ పరిధిలోని బరా మ్చాల్లో సరిహద్దు వెంబడి ఉన్న అంగూర్ అడ్డా, బజౌర్, కుర్రం, డిర్, చిత్రాల్లోని పాక్ ఆర్మీ పోస్ట్ లపై మా బలగాలు దాడులుచేశాయి. డ్యూరాండ్ రేఖ వెంబడి పాక్ పోస్ట్లపై తెగబడి పలువురు పాక్ సైనికులను చంపేశాం’ అని ముజాహిద్ వివరించారు. -
మడగాస్కర్లో సైనిక తిరుగుబాటు
అంటాననరివో: ఆఫ్రికా దేశం మడగాస్కర్లో మరోసారి అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో తిరుగుబాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధ్యక్షుడు ఆండ్రీ రజొలినా ప్రకటించారు. అక్రమంగా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు జరిగే ప్రయత్నా లను అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకు వస్తున్నానంటూ ఆయన పేర్కొన్నారు. సైనిక బలగాలు ఐక్యంగా ఉండి, రాజ్యాంగాన్ని, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఆయన ప్రస్తుతం ఎక్కడున్నదీ తెలియడం లేదు. తాను దేశంలోనే ఉన్నానని, ఎక్కడికీ వెళ్లలేదని రజొలినా కూడా ప్రకటించారు. రజొలినా అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలంటూ సెప్టెంబర్ 25వ తేదీ నుంచి జెన్ జెడ్ మడగాస్కర్ పేరుతో యువత ఆందోళనలు సాగిస్తోంది. శనివారం అతిపెద్ద ర్యాలీ జరిగింది. ఈ ప్రదర్శనలో ఆర్మీలో కీలకమైన క్యాప్శాట్ అనే యూనిట్ కూడా పాల్గొంది. ఈ నేపథ్యంలో ఆదివారం అధ్యక్ష కార్యాలయం తిరుగుబాటుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా ప్రకటించడం గమనార్హం. హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న జాడలు లేవు. రాజధాని వీధుల్లో ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది. తిరుగుబాటుకు కారణాలు, దీని వెనుక ఎవరున్నారు..వంటి విషయాలను అధ్యక్షుడు రజొలినా వెల్లడించలేదు. -
సాయం పంపిణీకి ఏర్పాట్లు
కైరో: కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో పాలస్తీనియన్లకు తక్షణ మానవతా సాయం అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి ఒప్పందం ప్రకారం రోజుకు 600 ట్రక్కుల సాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇజ్రాయెల్కు చెందిన పర్యవేక్షణాధికారి ఒకరు తెలిపారు. ఆదివారం తాము 400 ట్రక్కుల ఆహార పదార్థాలను పంపించనున్నట్లు ఈజిప్టు ప్రకటించింది. కెరెమ్ షలోమ్ వద్ద ఇజ్రాయెల్ అధికారులు తనిఖీలు జరిపాక, ఇవి గాజా స్ట్రిప్లోకి ప్రవేశిస్తాయని పేర్కొంది. ఈజిప్టు వైపు నుంచి రఫా క్రాసింగ్ మీదుగా గాజాలోకి పదుల సంఖ్యలో ట్రక్కులు ప్రవేశిస్తున్న ఫుటేజీ మీడియాలో ప్రత్యక్షమైంది. ట్రక్కుల్లో టెంట్లు, దుప్పట్లు, ఆహారం, ఇంధనం, వైద్య సాయం ఉన్నాయని ఈజిప్టు రెడ్ క్రీసెంట్ తెలిపింది. నెలలపాటు కొనసాగిన ఇజ్రాయెల్ దిగ్బంధనం ఫలితంగా గాజాలో తీవ్రమైన కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. యుద్ధం సమయంలో అవసరమైన సాయంలో 20 శాతం మేర మాత్రమే సరఫరా చేయగలిగామని ఐరాస తెలిపింది. ప్రస్తుతం తమ వద్ద 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ఆహారం, మందులు, ఇతర మానవీయ సాయం సిద్ధంగా ఉందని, ఇజ్రాయెల్ ఓకే చెప్పిన వెంటనే గాజాలోకి వీటిని పంపుతామంది.బందీలు, ఖైదీల విడుదలకు ఏర్పాట్లుగాజాలో హమాస్ వద్ద ఉన్న ఇజ్రాయెల్ బందీల విడుదల, ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న వందలాది పాలస్తీనా ఖైదీల విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి బందీల విడుదల మొదలవుతుందని ఈ వ్యవహారాలను పర్యవేక్షించే ఇజ్రాయెల్ అధికారి గాల్ హిర్‡్ష చెప్పారు. సజీవంగా ఉన్న వారి కోసం ఆస్పత్రులతోపాటు రెయిమ్ క్యాంపులో ఏర్పాట్లు చేశామన్నారు. మృతదేహాలను తమకు అప్పగించిన వెంటనే గుర్తింపు కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్కు తరలించనున్నట్లు చెప్పారు. హమాస్ చెరలో ఉన్న 48 మందిలో కనీసం 20 మంది సజీవంగా ఉండొచ్చని అంటున్నారు. ఇలా ఉండగా, తమ జైళ్ల నుంచి 2 వేల మంది పాలస్తీనా ఖైదీల విడుదల సమయాన్ని ఇజ్రాయెల్ ఇంకా ప్రకటించలేదు. వీరిలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 250 మందితోపాటు, యుద్ధ సమయంలో గాజా నుంచి ఎలాంటి కారణం చూపకుండా ఇజ్రాయెల్ ఆర్మీ పట్టుకెళ్లిన మరో 1,700 మంది ఉన్నారు.నేడు ఇజ్రాయెల్కు ట్రంప్ రాకబందీలను విడుదల చేయనుండటంతో ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో అన్నీ తానై వ్యవహరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ రానున్నారు. ఇజ్రాయెల్ పార్లమెంట్ నెస్సెట్లో జరిగే కార్యక్రమంలో బందీల కుటుంబాలతో ఆయన మాట్లాడుతారని వైట్హౌస్ తెలిపింది. అనంతరం ఈజిప్టు వెళతారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్ సిసితో కలిసి ప్రాంతీయ, అంతర్జాతీయ నేతలతో జరిగే శాంతి శిఖరాగ్రానికి సహాధ్యక్షత వహిస్తారు. -
ఉక్రెయిన్ చేతికి టోమాహాక్ క్షిపణి.. అమెరికాకు.. రష్యా వార్నింగ్!
మాస్కో: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం తారాస్థాయికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్కు అమెరికా టోమాహాక్ క్షిపణులు పంపే యోచనపై రష్యా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధం అన్ని వైపుల నుండి తీవ్ర రూపం దాల్చడంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని రష్యా హెచ్చరించింది.అయితే, డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్కు టోమాహాక్ క్షిపణులు ఇవ్వడంపై స్పష్టత ఇచ్చారు. ఈ క్షిపణులను పంపే ముందు, యుద్ధ తీవ్రత పెరగకుండా చూసుకుంటానని తెలిపారు. ఉక్రెయిన్ వాటిని ఎలా ఉపయోగించబోతుందో ముందుగా తెలుసుకోవాలని భావిస్తున్నానని చెప్పారు. ఈ అంశంపై తాను ఇప్పటికే నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు.‘టోమాహాక్ల అంశం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది’అని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ రష్యన్ ప్రభుత్వ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు. అన్ని వైపుల నుండి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయనే వాస్తవం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్లో అత్యంత ఘోరమైన ఉక్రెయిన్ యుద్ధం. 1962లో జరిగిన క్యూబా క్షిపణి సంక్షోభం తర్వాత, ఇప్పుడు రష్యా–పశ్చిమ దేశాల మధ్య జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధం అత్యంత తీవ్రమైన ఘర్షణగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుతం రష్యా.. పశ్చిమ దేశాలతో తీవ్రమైన రాజకీయ, దౌత్య వివాదంలో ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి రష్యా కామెంట్స్పై ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల మాట్లాడుతూ, టోమాహాక్ క్షిపణులను అమెరికా సైనికుల ప్రత్యక్ష సహకారం లేకుండా ఉపయోగించడం అసాధ్యం అని అన్నారు. అందువల్ల, ఈ క్షిపణుల సరఫరా యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే దశకు తీసుకెళ్తుందని హెచ్చరించారు.టోమాహాక్ క్షిపణిటోమాహాక్ క్షిపణి 2,500 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయి. అంటే ఉక్రెయిన్ నుంచి వీటిని ప్రయోగిస్తే అవి మాస్కో, యూరోపియన్ రష్యాలోని చాలా ప్రాంతాలను సులభంగా చేరుకోగలవు. టోమాహాక్ అనేది అమెరికా నేవీ ఐకానిక్ సబ్సెనిక్ కూయిజ్ క్షిపణి. దీనిని 1970ల నుంచి అభివృద్ధి చేశారు. దీనిని ఓడలు, జలాంతర్గాములు, ల్యాండ్ లాంచర్ల నుంచి ఈజీగా ప్రయోగించవచ్చు. ఇది 1,000 మైళ్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా కచ్చితంగా చేదించగలదు. వీటిలో బ్లాక్ ఐవీ (TACTOM) వెర్షన్ అత్యంత అధునాతనమైనది. ఈ సూపర్ వెపన్కు మరో ప్రత్యేకత కూడా ఉంది. దీనిని విమానం నుంచి ప్రయోగించినప్పుడు ఒకసారి నిర్దేశించిన లక్ష్యాలను కూడా మార్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడీ క్షిపణులను అమెరికా.. ఉక్రెయిన్కు ఇస్తుంటే రష్యా ఆందోళన వ్యక్తం చేస్తోంది. -
కతార్ రాయబారుల మృతి.. ఇజ్రాయెల్-గాజా శాంతి ఒప్పంద చర్చల్లో కలకలం
కైరో: ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం కోసం జరగనున్న ‘షార్మ్ ఎల్-షేక్ పీస్ సమ్మిట్’కు ముందు ఊహించని విషాద ఘటన చోటు చేసుకుంది. ఈజిప్ట్లోని షార్మ్ ఎల్ షేక్ వద్ద శనివారం (అక్టోబర్ 11న) జరిగిన ఘోర కారు ప్రమాదంలో కతార్కు చెందిన ముగ్గురు కీలక దౌత్యవేత్తలు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం వెనుక ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొస్సాద్ ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.అక్టోబర్ 13న ఈజిప్ట్లోని షార్మ్ ఎల్ షేక్ అనే ప్రాంతంలో ఇజ్రాయెల్-గాజాల మధ్య శాంతి ఒప్పందం కోసం ‘షర్మ్ ఎల్-షేక్ పీస్ సమ్మిట్’ జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు కతార్ దేశాధినేతకు సేవలందించే అమిరీ దివాన్(Amiri Diwan) కార్యాలయానికి చెందిన ముగ్గురు దౌత్యవేత్తలు కారులో బయల్దేరారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా,శాంతి చర్చలు జరిగే ప్రాంతానికి యాభై కిలోమీటర్ల దూరంలో కతార్ రాయబారులు ప్రయాణిస్తున్న కారు బోల్తా పడడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కతార్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. శాంతి కోసం తమ ప్రాణాలను అర్పించిన వీర దౌత్యవేత్తల సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయి’అని అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఇజ్రాయెల్, పాలస్తీనా పక్షాలు సైతం ఈ ఘటనపై సంతాపం ప్రకటించాయి.ఇజ్రాయెల్-గాజాల మధ్య శాంతి ఒప్పందం ఈజిప్ట్ దేశంలోని రెడ్ సీ తీరంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక నగరం షార్మ్ ఎల్ షేక్ వద్ద జరగనున్నాయి. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధాన్ని ముగింపు పలికేలా తొలిసారి అక్టోబర్ 6న, అక్టోబర్ 7న రెండోసారి చర్చలు జరిగాయి. యుద్ధానికి ముగింపు, బందీల విడుదల, గాజాకు మానవతా సహాయం అందించేలా జరిగిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో అక్టోబర్ 13న ‘షర్మ్ ఎల్-షేక్ పీస్ సమ్మిట్’లో ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధానికి ముగింపు పలికే శాంతి ఒప్పందం కుదరనుంది.కతార్ రాయబారుల మరణంతో శాంతి చర్చల్లో కలకలంఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం కోసం జరగనున్న ‘షార్మ్ ఎల్-షేక్ పీస్ సమ్మిట్’కు ముందు జరిగిన ఘోర ప్రమాదం అంతర్జాతీయ దౌత్యపరంగా కలకలం రేపుతోంది. శాంతి చర్చల్లో పాల్గొనడానికి ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ప్రమాదం శాంతి చర్చలపై నీలినీడలు కమ్ముకోనున్నాయనే అంతర్జాతీయంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చర్చలకు ముందు ఇలాంటి విషాద ఘటన జరగడం వల్ల చర్చలు, భద్రతా ఏర్పాట్లు, పక్షాల నమ్మకంపై ప్రభావం పడే అవకాశముంది.మొస్సాద్ ప్రమేయంపై వస్తున్న ఆరోపణలు ఈ ఘటనను మరింత ఉద్రిక్తతకు దారి తీసేలా చేస్తున్నాయి. అయితే, ఈ విషాదం శాంతి ప్రయత్నాలకు అడ్డంకిగా మారుతుందా? లేక మరింత నిశ్చయంతో ముందుకు సాగుతాయా? అన్నది సమయం చెప్పాలి. -
హమాస్ కొత్త బ్రాండ్ పేరు.. ‘ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్’
హమాస్.. నిన్న, మొన్నటి వరకూ మిలిటెట్లు(నిషేధిత ఉగ్రవాద సంస్థ). ఇప్పుడు వారి పేరు మారింది.. వారి బ్రాండ్ కూడా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఒత్తిడితో ఇజ్రాయిల్తో శాంతి ఒప్పందంలో భాగంగా ఇప్పుడు హమాస్ కాస్త ‘ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్’గా రూపాంతరం చెందింది. తాజాగా వీరి బ్రాండ్ పేరును విడుదల చేసింది హమాస్. దీనిలో భాగంగా సుమారు ఏడు వేల మంది హమాస్ మిలిటెంట్లు సాధారణ పౌరుల వలే మారిపోవడానికి సిద్ధమయ్యారు.. ఈ మేరకు ఇజ్రాయిల్ రక్షణ దళాలు(ఐడీఎఫ్).. గాజాలో ఇటీవల ఉపసంహరించుకున్న ప్రాంతాలపై నియంత్రణను తిరిగి స్థాపించడానికి పౌర దుస్తులలో దర్శనమిస్తున్నారు. మొన్నటి వరకూ చీకటిలో యుద్ధం చేసిన వీరు.. ఇప్పుడ జన జీవన స్రవంతిలోకి వచ్చి నేరుగా గాజాకు అండగా ఉంటామంటున్నారు. మా వారిని విడిచిపెడతారని ఆశిస్తున్నాం..మరొకవైపు గడువులోగా బందీలను స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు హమాస్ తెలిపింది. వాల్స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ట్రంప్ రేపు ఉదయం ఇజ్రాయెల్లో అడుగుపెట్టే సమయానికి హమాస్ చేతిలో బందీలు విడుదల అవుతారని ఇజ్రాయెల్ భావిస్తోంది. రెండేళ్ల నాటి యుద్ధం.. ముగిసిన వేళ..హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సుమారు రెండేళ్ల క్రితం గాజాలో ప్రారంభించిన విధ్వంసక యుద్ధం ముగిసిన జాడలు కనిపిస్తు న్నాయి. అక్డోబర్ 10వ తేదీ మధ్యాహ్నం నుంచి గాజాలో ప్రశాంత వాతావరణం నెలకొంది. పాలస్తీని యన్లపై కాల్పులు, వైమానిక దాడులు నిలిచిపోయాయి. ఆ ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందం మధ్యాహ్నం నుంచి అమల్లోకి వచ్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం సైతం ధ్రువీకరించింది.యుద్ధానికి విరామం ఇవ్వడానికి, మిగిలిన బందీలను పాలస్తీనా ఖైదీలతో మార్పిడి చేయడానికి సంబంధించిన ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ప్రధాని నెతన్యాహూ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆర్మీ ఈ మేరకు ప్రకటించడం గమనార్హం. దీంతో, సెంట్రల్ గాజాలోని వాడి గాజాలో గుమికూడిన వేలాది మంది పాలస్తీనియన్లు ఉత్తర ప్రాంతంలోని తమ సొంత నివాసాల దిశగా నడక సాగించారు. ఒప్పందం ప్రకారం...గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను ఉపసంహరించుకున్న అనంతరం హమాస్ తమ వద్ద బందీలుగా ఉన్న 48 మందిని విడుదల చేయాల్సి ఉంటుంది. వీరిలో కనీసం 20 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇందుకు బదులుగా 2 వేల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెడుతుంది. వీరి జాబితాను శుక్రవారం అధికారులు విడుదల చేశారు. ఇందులో పాలస్తీనా అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత మర్వాన్ బర్ఘౌటి కూడా ఉన్నారు. బందీలు, ఖైదీల విడుదల ఆదివారం రాత్రి లేదా సోమవారం మొదలవుతుందని మధ్యవర్తులుగా వ్యవహరించిన ఈజిప్టు అధికారులు తెలిపారు. సిద్ధంగా మానవతా సాయంగాజాలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో మానవతా సాయం తీసుకువచ్చిన ట్రక్కులు సాధ్యమైనంత త్వరగా చేరుకునేందుకు ఈజిప్టు, గాజా మధ్యనున్న రఫా సహా ఐదు సరిహద్దులను తెరిచి ఉంచనున్నారు. సుమారు 1.70 లక్షల టన్నుల మందులు, ఆహారం, ఇతర అత్యవసరా లను గాజాలోకి తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని ఐరాస మానవతా సాయం చీఫ్ టామ్ ఫ్లెచర్ తెలిపారు. సానుకూల సంకేతాలు అందిన వెంటనే రంగంలోకి దిగుతామని చెప్పారు. ఇజ్రాయెల్తో కుదిరిన డీల్ ప్రకారం కాల్పుల విరమణ ఒప్పందం అమలును పర్యవేక్షించేందుకు 200 మంది సైనికులను గాజాకు పంపుతామని అమెరికా అధికారులు చెప్పారు.వారి మెడపై కత్తి ఉంది..: నెతన్యాహూఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెరపైకి తెచ్చిన కాల్పుల విరమణ ప్రణాళికలో పేర్కొన్న హమాస్ నిరాయుధీకరణ, గాజా భవిష్యత్తు పాలన వంటి అంశాలపై ఎటువంటి స్పష్టత లేదు. ‘ట్రంప్ ప్రకటనలో తర్వాతి భాగం హమాస్ నిరాయుధీకరణే. ఇది సులువుగా జరిగితే సరేసరి. లేదంటే బలవంతంగానైనా సాధిస్తాం. మెడపై కత్తి ఉందని తెలిసే హమాస్ ఒప్పందానికి వచ్చింది. ఇప్పటికీ కత్తి మెడపైనే ఉంది’అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ పేర్కొనడం గమనార్హం. కాగా, శుక్రవారం మధ్యాహ్నం అధికారికంగా కాల్పుల విరమణ ప్రారంభమవడానికి కొద్ది గంటల ముందుగానే బలగాల ఉపసంహరణ పూర్తయిందని ఇజ్రాయెల్ బ్రిగేడియర్ జనరల్ ఎఫ్పీ డెఫ్రిన్ చెప్పారు. ఉపసంహరణ అంశం సున్నితత్వం దృష్ట్యా గాజాలోని ఇటీవల స్వాధీనం చేసుకున్న 50 శాతం ప్రాంతంలో బలగాలు కొనసాగుతాయని ఓ సైనికాధికారి పేర్కొనడం విశేషం.ఇది ఇజ్రాయిల్కు పరోక్ష వార్నింగేనా? ప్రస్తుతం ఇజ్రాయిల్-హమాస్లు అమెరికా ఒత్తిడితో శాంతి ఒప్పందానికి ముందుకొచ్చినా ఇరు వర్గాల్లో ఎక్కడో భయం ఉంది. వారి మధ్య చోటు చేసుకుంది మామాలు యుద్ధం కాదు. విధ్వంసకర యుద్ధం. ఈ క్రమంలోనే వారి మధ్య శాంతి ఒప్పందం జరిగినా కూడా రెండు వర్గాలు జాగ్రత్తగా ఉండాలనే ముందస్తు ప్రణాళికతో సిద్ధమైనట్లు తెలుస్తున్నాయి. హమాస్ ఏమీ చేసే పరిస్థితి లేకే ఒప్పందానికి వచ్చిన ఇజ్రాయిల్ ప్రధాని నెతాన్యాహూ స్పష్టం చేసిన నేపథ్యంలో హమాస్ కూడా వారు మొత్తం ఆయుధాలను వదిలేయడానికి సిద్ధంగా లేరనేది అర్ధమవుతోంది. తాము ఉంటాం.. కానీ ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్ గా ఉంటామని చెబుతున్నారు. జస్ట్ మేము మారాం.. అంతే.. మా లక్ష్యం మారలేదు’ అని సందేశాన్ని ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్ ఏర్పాటు ద్వారా పంపినట్లు అయ్యింది. అంటే అవసరమైన పక్షంలో మళ్లీ తాము యుద్ధం చేయడానికి సిద్ధమేనని పరోక్ష సంకేతాలు పంపారు. ఇప్పుడు హమాస్.. ది గాజా సెక్యూరిటీ ఫోర్సెస్’ రూపొంతరం చెందడానికి ప్రధాన కారణం మాత్రం ఇజ్రాయిల్ను పూర్తిగా నమ్మలేని స్థితి. అటు ఇజ్రాయిల్ కూడా హమాస్ను పూర్తిగా నమ్మడం లేదు. ఒప్పందానికి కట్టుబడే అటు ఇజ్రాయిల్-ఇటు హమాస్లు తమ తమ చెరల్లో ఉన్న బంధీలను విడిచిపెట్టడానికి సిద్ధమయ్యాయి. ఒకవేళ వీరి మధ్య ఏమైనా విభేదాలు తలెత్తితే మళ్లీ యుద్ధం రాదనే విషయం కూడా చెప్పలేమనేది విశ్లేషకుల అభిప్రాయం.ఇదీ చదవండి: 58 మంది పాక్ సైనికుల మృతి


