breaking news
International
-
ట్రంప్ ‘డెడ్ ఎకానమీ’ కామెంట్లకు ప్రధాని మోదీ కౌంటర్!
భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. భారత్, రష్యా బంధంపై విరుచుకుపడే క్రమంలో.. ఇరుదేశాలవీ ‘డెడ్ ఎకానమీ’ అంటూ వ్యాఖ్యానించారాయన. అయితే తాజాగా ఈ వ్యాఖ్యలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ ‘డెడ్ ఎకానమీ’ వ్యాఖ్యలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థ బలమైందని.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించే క్రమంలో ఉందని అన్నారాయన. శనివారం యూపీ వారణాసిలో జరిగిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం బలంగా, నిలకడగా ఉంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఎదిగేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక గందరగోళం నెలకొంది(పరోక్షంగా ట్రంప్ టారిఫ్ల నిర్ణయాన్ని ప్రస్తావించి). అన్ని దేశాలు తమ తమ ప్రయోజనాలపై దృష్టిసారించాయి. భారత్ ప్రయోజనాలకు అవసరమైన చర్యలను మా ప్రభుత్వం తప్పనిసరిగా తీసుకుంటుంది. ఇందు కోసం విభేదాలను పక్కన పెట్టి.. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ముందుకు రావాలి. స్వదేశీ ఉత్పత్తులకు మద్దతివ్వడం ఇచ్చేలా తీర్మానం చేయాలి’’ అని పిలుపు ఇచ్చారాయన. ఇదిలా ఉంటే.. భారత్పై 25శాతం సుంకాలతోపాటు పెనాల్టీ విధిస్తూ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా-భారత్ మధ్య వాణిజ్య బంధాల్ని ప్రస్తావించిన ట్రంప్ తనకేం సంబంధం లేదంటూనే శాపనార్థాలు పెట్టారు. రెండు దేశాలవి డెడ్ ఎకానమీలని, కలిసి అవి ఆర్థిక వ్యవస్థలను మరింత దిగజార్చుకుంటాయని, కలిసి మునుగుతాయని వ్యాఖ్యానించారు. ‘మనకు భారత్ స్నేహితురాలే అయినా ఆ దేశంతో స్వల్ప లావాదేవీలే ఉన్నాయి. ఆ దేశం సుంకాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. ఉక్రెయిన్లో దాడులు ఆపాలని ప్రపంచమంతా గొంతెత్తి అరుస్తుంటే.. భారత్ మాత్రం రష్యా నుంచి ఆయుధాలను, ఇంధనాన్ని కొనుగోలు చేస్తోంది’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన ఇటు భారత్లోనూ రాజకీయ దుమారం రేపింది. మోదీ పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ ఖతమైందని, దేశ ప్రధాని, ఆర్థిక మంత్రికి తప్ప ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. అయితే బీజేపీతో పాటు కాంగ్రెస్ ఎంపీలైన రాజీవ్ శుక్లా(రాజ్యసభ), లోక్సభ ఎంపీ శశిథరూర్లు రాహుల్ వ్యాఖ్యలతో విభేదించడం తీవ్ర చర్చనీయాంశమైంది. -
‘ఇండియా డెడ్ ఎకానమీ’.. ఏఐ దిమ్మతిరిగే సమాధానం
'భారత ఆర్థిక వ్యవస్థ చనిపోయింది' అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన సంచలంగా మారింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నిజమేనా?, భారతదేశ ఆర్ధిక వ్యవస్థ నిజంగా చనిపోయిందా అని తెలుసుకోవడానికి.. అమెరికా సృష్టించిన ఐదు ప్రధానమైన ఏఐ ప్లాట్ఫామ్లను ప్రశ్నిస్తే.. ఎలాంటి సమాధానం ఇచ్చాయో ఈ కథనంలో చూసేద్దాం.ప్రశ్న: భారత ఆర్థిక వ్యవస్థ చనిపోయిందా?చాట్జీపీటీ: భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా చనిపోలేదు. ఇది డైనమిక్, ఎంతో ప్రతిష్టాత్మకమైనదని చాట్జీపీటీ సమాధానం ఇచ్చింది.గ్రోక్: భారత ఆర్థిక వ్యవస్థ చనిపోలేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉందని గ్రోక్ పేర్కొంది.జెమిని: భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని సాధిస్తోందని గూగుల్ జెమిని స్పష్టం చేసింది.మెటా ఏఐ: భారత ఆర్థిక వ్యవస్థ చనిపోలేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటని చెప్పింది.కోపైలెట్: భారతదేశ ఆర్ధిక వ్యవస్థ డెడ్ ఎకానమీ కాదు, ఇది పూర్తిగా వ్యతిరేకం అని కోపైలెట్ వెల్లడించింది.ట్రంప్ ‘డెడ్ ఎకానమీ’ వ్యాఖ్యలుభారత్ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అంటూ ఒకవైపు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ తదితర పేరున్న సంస్థలు కీర్తిస్తుంటే.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం భారత ఆర్థిక వ్యవస్థను ‘డెడ్ ఎకానమీ’ (నిర్వీర్యమైనది)గా అభివర్ణిస్తూ నోరు పారేసుకున్నారు. కాకపోతే ఈ వ్యాఖ్యలు తప్పుగా ఉచ్చరించడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విదేశీ పెట్టుబడులకు భారత్ ఎంతో ఆకర్షణీయ కేంద్రంగా ఉండడమే కాకుండా.. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు భారత్లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీలు) ఏర్పాటుకు క్యూ కడుతుండడాన్ని గుర్తు చేశారు.ఇండియానే ఆధారం''ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గ్లోబల్ సౌత్ ప్రధానంగా మారుతోంది. ఇందులో భారత్ కీలకమైన పాత్ర పోషిస్తోంది. మరోవైపు అభివృద్ధి చెందిన ఒకప్పటి ఆర్థిక వ్యవస్థలు వేగంగా ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. భారత సంతతి వారి కృషి మూలంగానే ఆయా ఆర్థిక వ్యవస్థలు ఎంతో కొంత సానుకూల వృద్ధిని చూపించగలుగుతున్నాయి'' అని ఈవై ఇండియా ముఖ్య విధాన సలహాదారుడు డీకే శ్రీవాస్తవ తెలిపారు. అధిక యువ జనాభా కలిగిన భారత ఆర్థిక వ్యవస్థ ఎంతో చురుకైన, చైతన్యవంతమైనదిగా పేర్కొన్నారు. -
‘నా సీటది.. లేస్తావా.. లేపమంటావా?’.. ఎయిర్పోర్టులో మహిళపై యువకుని దౌర్జన్యం
బొగోటా: కొలంబియాలోని ఎల్ డొరాడో విమానాశ్రయంలో ఆ సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. కూర్చున్న సీటును వదులుకునేందుకు ఇష్టపడని ఒక మహిళపై ఒక యువకుడు దాడి చేశాడు. దీంతో విమానాశ్రయంలో కాసేపు గందరగోళం నెలకొంది.కొలంబియాలోని బొగోటాలో గల ఎల్ డొరాడో అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ ఉదంతం టెర్మినల్ వద్ద జరిగింది. ఒక మహిళ తాను కూర్చున్న సీటును ఇచ్చేందుకు నిరాకరించడంతో ఒక యువకుడు ఆమె చెంపపై కొట్టడం వీడియోలో కనిపిస్తుంది. ఇది టెర్మినల్ వద్ద గందరగోళానికి దారితీసింది. #INACEPTABLE. En la noche del pasado 27JUL, en el aeropuerto El Dorado (Bogotá) violento sujeto agredió a una mujer por pelear una silla. Las imágenes han generado rechazo contra el energúmeno hombre a tal punto que su esposa tuvo que salir en un video a dar explicaciones. pic.twitter.com/wvxFo0GhHg— Colombia Oscura (@ColombiaOscura_) July 30, 2025ఆ యువకుడిని హెక్టర్ శాంటాక్రూజ్ గాను, బాధితురాలిని క్లాడియా సెగురాగా విమాన సిబ్బంది గుర్తించారు. అతను పక్కకు వెళ్లినప్పుడు అతని భార్య పక్కనున్న సీటులో క్లాడియా సెగురా కూర్చుంది. అతను తిరిగి వచ్చి ఆమెను కుర్చీలో నుంచి లేవాలని కోరాడు. అయితే ఆమె అందుకు నిరాకరించింది. దీంతో అతను ఆమెతో ‘నువ్వు లేస్తావా? లేదా నన్ను లేపమంటావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తరువాత పక్కనే ఉన్న ఒక వ్యక్తితో ఫోన్లో రికార్డు చేయమని కోరుతూ, ఆమెపై చేయి చేసుకున్నాడు.దీనిని గమనించిన అక్కడున్నవారు అతనిని అడ్డుకున్నారు. తరువాత అక్కడి భద్రతా సిబ్బంది అతనికి సంకెళ్లు వేసి, అక్కడి నుంచి తీసుకెళ్లారు. క్లాడియా సెగురా తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ ‘నేను వెయిటింగ్ ఏరియాకు చేరుకున్నప్పుడు, అక్కడంతా నిండిపోయింది. అయితే ఒక ఖాళీ కుర్చీని చూశాను. ఆ కుర్చీలో ఏమీ లేకపోవడంతో దానిలో కూర్చున్నాను. ఇంతలో అతను వచ్చి నా చేతిపై కొట్టాడు. నా ఫోన్ లాక్కున్నాడు. నా ముఖంపైన, తలపై బలంగా కొట్టాడు’ అని చెప్పుకొచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
టెస్లాకు రూ.2100 కోట్ల జరిమానా: కారణం ఇదే..
అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు ఫ్లోరిడా కోర్టు భారీ జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. 2019లో జరిగిన రోడ్డు ప్రమాదానికి "ఆటోపైలట్" డ్రైవర్ అసిస్టెన్స్ టెక్నాలజీ కారణమని భావించి కోర్టు ఈ జరిమానా విధించింది.2019లో కీ లార్గోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. నైబెల్ బెనవిడెస్ లియోన్ మరణించగా, ఆమె ప్రియుడు డిల్లాన్ అంగులో గాయపడ్డాడు. ఆ సమయంలో 'జార్జ్ మెక్గీ' టెస్లా కారు నడుపుతున్నాడు. ఆటోపైలట్ ఫీచర్ (టెస్లా కార్లలోని ఒక ఆటోమేటెడ్ డ్రైవింగ్ సిస్టం) ఆన్ చేసి ప్రయాణిస్తున్న సమయంలో.. తన ఫోన్ అనుకోకుండా కారులోనే కింద పడింది. ఆ సమయంలో వంగి ఫోన్ తీసుకున్న సమయంలో కారు రోడ్దుపై ఉన్న వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనపై బాధితులు కోర్టును ఆశ్రయించారు.ఈ ఘటనపై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు.. ఎట్టకేలకు తీర్పునిస్తూ 329 మిలియన్ డాలర్లు పరిగహారంగా చెల్లించాలని ఆదేశించింది. ఇందులో 242 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,100 కోట్లు) టెస్లా చెల్లించాలని.. మిగిలిన మొత్తాన్ని డ్రైవర్ ఇవ్వాలని పేర్కొంది. ఈ తీర్పుపై టెస్లా తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ తీర్పుపై అప్పీల్ చేయనున్నట్లు సంస్థ యాజమాన్యం పేర్కొంది. -
అంత సీన్ లేదు.. ఎక్కడున్నారో మరచిపోయారా?: ట్రంప్కు రష్యా కౌంటర్
మాస్కో: అగ్ర రాజ్యాలు అమెరికా, రష్యా మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. అమెరికాకు చెందిన రెండు అణు జలాంతర్గాములను రష్యా సమీపంలో మోహరించడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. అమెరికా చర్యలకు రష్యా కౌంటరిచ్చింది. అమెరికాను ఎదుర్కొనేందుకు తమవద్ద కూడా తగినన్ని అణు జలాంతర్గాములు ఉన్నాయని రష్యా హెచ్చరించింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు రష్యాకు చేరువలోని సముద్ర జలాల్లో రెండు అణు జలాంతర్గాములను అమెరికా మోహరించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా రష్యా పార్లమెంటు సభ్యుడు విక్టర్ వోడోలాట్స్కీ స్పందిస్తూ.. అమెరికాను ఎదుర్కొనేందుకు రష్యా వద్ద కూడా తగినన్ని అణు జలాంతర్గాములు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మహాసముద్రాల్లో అమెరికా జలాంతర్గాముల సంఖ్య కంటే రష్యావి చాలా ఎక్కువే ఉన్నాయి. అమెరికా మోహరించినవి జలాంతర్గాములు సైతం రష్యా జలాంతర్గాముల నియంత్రణలో ఉన్నాయనే విషయం గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలకు ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు అంటూ కౌంటర్ ఇచ్చారు.🚨 BREAKING: Russian lawmaker Viktor Vodolatsky says Russia has enough nuclear submarines to counter the 2 U.S. subs recently repositioned by President Trump. The move follows provocative remarks from former Russian President Medvedev. #Defense #NuclearSubmarines #USRussia pic.twitter.com/QnsGLdx4Q5— India Defence Daily (@IndiaDefDaily) August 2, 2025మరోవైపు.. గ్లోబల్ అఫైర్స్ మ్యాగజైన్ రష్యా ఎడిటర్ ఇన్చీఫ్ ఫ్యోడర్ లుక్యానోవ్ మాట్లాడుతూ.. ట్రంప్ హెచ్చరికలను ప్రస్తుతానికి తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదన్నారు. అంతకుముందు మాస్కో, వాషింగ్టన్ల మధ్య ప్రత్యక్ష సైనిక ఘర్షణలు జరగకూడదని యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో వాదనతో తాను ఏకీభవిస్తానని రష్యా విదేశాంగ మంత్రి సెర్గా లావ్రోవ్ పేర్కొన్నారు.మెద్వెదెవ్ కామెంట్స్..ఇదిలా ఉండగా.. శుక్రవారం అమెరికా రెండు అణు జలాంతర్గాములను రష్యా సమీపంలో మోహరించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా హాండిల్ ట్రూత్ సోషల్లో ప్రకటించారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహాయకుడు, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రీ మెద్వెదెవ్ చేసిన ‘డెడ్ హ్యాండ్’ హెచ్చరికలకు ప్రతిస్పందనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్..‘అవి మతిలేని, రెచ్చగొట్టే ప్రకటనలు. నిజంగానే అలాంటి పరిస్థితి తలెత్తే ఆస్కారముంటే దీటుగా స్పందించేందుకే ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. రెండు సబ్మెరైన్లను సరైన ప్రదేశాల్లో మోహరించాల్సిందిగా ఆదేశించాను’ అని వివరించారు.ఏమిటీ డెడ్ హ్యాండ్? ఇది రష్యా (నాటి సోవియట్ యూనియన్) అభివృద్ధి చేసిన ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి వ్యవస్థ. ఆ దేశంపై ఎవరన్నా అణు దాడి చేస్తే అందుకు ప్రతిగా ఆటోమేటిక్గా అణు దాడులు జరుపుతుంది. దేశ నాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టుకు పోయినా తనంత తానుగా స్పందించి దాడులకు దిగటం దీని ప్రత్యేకత. -
రష్యాతో భారత్ కటీఫ్.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న చమురుపై ట్రంప్ స్పందించారు. రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇది మంచి చర్య.. భారత్ సరైన నిర్ణయం తీసుకుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘భారత్ ఇకపై రష్యా నుంచి చమురు కొనబోదని నేను అనుకుంటున్నాను. రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, నేను విన్నది సరైందో కాదో నాకు తెలియదు. భారత్ కనుక ఇలా చేస్తే అది మంచి నిర్ణయం. ఏం జరుగుతుందో చూద్దాం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.#WATCH | "I understand that India is no longer going to be buying oil from Russia. That's what I heard, I don't know if that's right or not. That is a good step. We will see what happens..." says, US President Donald Trump on a question by ANI, if he had a number in mind for the… pic.twitter.com/qAbGUkpE12— ANI (@ANI) August 1, 2025జైశ్వాల్ కీలక వ్యాఖ్యలు..మరోవైపు, తాజా పరిణామాలపై భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏ దేశంతోనూ భారత్కు ఉన్న సంబంధాలను మూడో దేశం కోణంలో చూడవద్దని పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలుకు కట్టుబడి ఉన్నామని, అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా తమ నిర్ణయాలు ఉంటాయన్నారు. దేశ ఇంధన ప్రయోజనాలను కాపాడుకోవడంలో భాగంగా అంతర్జాతీయ మార్కెట్లో అత్యుత్తమంగా ఉన్న వాటిని ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళ్తాం. పరస్పర ఆసక్తులు, ప్రజాస్వామ్య విలువలు, ప్రజల మధ్య బలమైన సంబంధాల విషయంలో భారత్, అమెరికా దేశాలు అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తాయి. ఇందులో ఇరు దేశాలు ఎన్నో మార్పులు, సవాళ్లను ఎదుర్కొన్నాయి. అందుకే ముఖ్యమైన ఎజెండాపైనే మేము దృష్టి సారించాం. ఈ భాగస్వామ్యం కొనసాగుతుందని విశ్వసిస్తున్నాం. భారత్, అమెరికా బలమైన భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఇవి బలోపేతమయ్యాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.నిలిచిన కొనుగోళ్లు..ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాపై పశ్చిమదేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కానీ, భారత్ మాత్రం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై అమెరికా సహా పశ్చిమ దేశాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. అయితే, చమురు కొనుగోలుపై భారత్ ఎప్పటికప్పుడు స్పష్టత ఇస్తోంది. కాగా, దీన్ని ఓ కారణంగా చూపుతూ ఇటీవల ట్రంప్.. భారత్పై పెనాల్టీలు ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను దేశీయ సంస్థ నిలిపివేశాయంటూ వార్తలు వస్తున్నాయి.భారత్కు చెందిన ప్రభుత్వ చమురు శుద్ధి సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, మంగళూరు రిఫైనరీ పెట్రోకెమికల్ లిమిటెడ్ వంటి సంస్థలు గత వారం రోజులుగా మాస్కో నుంచి ముడిచమురు కొనుగోలు చేయడం లేదంటూ వార్తలు వచ్చాయి. రిఫైనరీ సంస్థలకు చెందిన విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ కథనం ప్రచురించింది. అయితే, దీనిపై ఆయా సంస్థల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్ అధికారి స్పందించారు. ఇప్పటివరకు అలాంటి ఆదేశాలేమీ ప్రభుత్వం జారీ చేయలేదని వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. -
పాక్లో రైలు ప్రమాదం.. 30 మందికి గాయాలు
లాహోర్: పాకిస్తాన్లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లాహోర్ సమీపంలో రైలు పట్టాలు తప్పడంతో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. లాహోర్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఇస్లామాబాద్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.పాకిస్తాన్ రైల్వేలు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం సాయంత్రం లాహోర్ నుండి రావల్పిండికి వెళ్తున్న ఇస్లామాబాద్ ఎక్స్ప్రెస్.. షేక్పురాలోని కాలా షా కాకు వద్ద పట్టాలు తప్పింది. రైలులోని 10 బోగీలు పట్టాలు తప్పడంతో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సహాయక బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. 🚨🇵🇰 Train Derailment in Pakistan⚠️ Islamabad Express derailed near Kala Shah Kaku (Muridke).🚑 Over 40 passengers injured, rescue teams on site.📍 Cause of derailment under investigation.#Pakistan #TrainAccident #Breaking pic.twitter.com/O6yhz5aBKR— ARIKA🇮🇳🚩 (@nidhisj2001) August 1, 2025ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. లాహోర్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరిన అరగంటకు రైలు బోగీలు పట్టాలు తప్పాయని తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే మంత్రి ముహమ్మద్ హనీఫ్ అబ్బాసి వెంటనే రైల్వే సీఈఓ, డివిజనల్ సూపరింటెండెంట్ను అప్రమత్తం చేశారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుని, పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి ఏడు రోజుల్లోగా విచారణ ఫలితాలను సమర్పించాలని ఆదేశించారు. -
చిన్నారితోపాటు దేశం విడిచి వెళ్లిన రష్యా మహిళ..
న్యూఢిల్లీ: భర్త నుంచి విడిపోయిన రష్యా మహిళ, చిన్నారితోపాటు దేశం విడిచి వెళ్లిపోవడంపై సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులకు తలంటింది. పోలీసులు తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరించి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని మండిపడింది. మైనర్ను రష్యా నుంచి తిరిగి తీసుకువచ్చేందుకు అక్కడి భారత ఎంబసీతో సంప్రదింపులు జరపాలని ఆదేశించింది. చిన్నారి కస్టడీ విషయంలో రష్యా మహిళ కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలని జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగి్చల ధర్మాసనం మే 22వ తేదీన ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. అయినప్పటికీ, ఆమె దేశం విడిచి నేపాల్ మీదుగా రష్యా వెళ్లిపోయినట్లుగా తెలవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ పోలీసుల పూర్తి నిర్లక్ష్యం, వైఫల్యమని పేర్కొంది. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులతోపాటు విదేశాంగ శాఖ కూడా దీన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారని వ్యాఖ్యానించింది. కానీ, చిన్న వివాదం ఏమాత్రం కాదని పేర్కొంది. ‘ఆ బిడ్డను ఈ కోర్టు కస్టడీ నుంచి తల్లి తీసుకుంది. ఇది పిల్లలు తల్లిదండ్రుల మధ్య కస్టోడియల్ వివాదం కేసు కాదు. ఆ బాలుడి సంరక్షణ బాధ్యతను తండ్రికి, తల్లికీ కూడా అప్పగించలేదు. దేశం తరఫున అతడి సంరక్షకుడిగా ఉంటూ సమస్యను పరిష్కరించేందుకు ప్రయతి్నస్తున్నాం. ఆ పిల్లవాడు ప్రస్తుతం కోర్టు కస్టడీలో ఉన్నాడు’అని ధర్మాసనం వెల్లడించింది. ఈ పరిణామానికి కారణమైన స్థానిక స్టేషన్ హౌస్ అధికారి(ఎస్హెచ్వో), డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ)లనే కాదు, అవసరమైతే పోలీస్ కమిషనర్కు సైతం సమన్లు జారీ చేస్తామని తీవ్ర స్వరంతో హెచ్చరించింది. ‘తల్లి కదలికలపై కన్నేసి ఉంచేందుకు మహిళా పోలీసు అధికారులను నియమించాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే, స్థానికుల సాయంతో, పారదర్శకతతో వ్యవహరిస్తూ ఆ మహిళ ఇంట్లోకి ప్రవేశించడానికి సైతం అనుమతిచ్చాం. అయినప్పటికీ ఆమె బిడ్డతోపాటు ఇంటిని ఎలా వదిలి వెళ్లగలిగింది?’అని ఢిల్లీ పోలీసుల తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిని ధర్మాసనం ప్రశ్నించింది. నేపాల్, యూఏఈ, రష్యా వైమానిక సంస్థలను సంప్రదించగా వారు వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశమంటూ ఎలాంటి సమాచారమూ తమకు ఇవ్వలేదని ఐశ్వర్య భాటి తెలిపారు. ‘నేర పూరిత చర్యలకు వ్యక్తిగత గోప్యతనేది వర్తించదు. ఢిల్లీ నుంచి బిహార్ ద్వారా అతి కష్టమైన రోడ్డు మార్గం ద్వారా నేపాల్కు చేరుకుంది. అక్కడ నాలుగు రోజు లు మకాం వేసింది. అయినా ఢిల్లీ పోలీసులు పట్టించుకోలేదు. కోర్టు వద్ద అసలైన పత్రాలుండటంతో ఆమె ఫోర్జరీ పత్రాలతో నేపాల్ వెళ్లినా ఢిల్లీ పోలీసులు అడ్డుకోలేదు’అంటూ ధర్మాసనం మండిపడింది. ఈ విషయంలో ఇంటర్పోల్ సాయం తీసుకోవాలని, అవస రమైన ఆదేశాలను తాము జారీ చేస్తామని ఐశ్వర్య భాటికి తెలిపింది. చిన్నారిని వెనక్కి తీసుకువచ్చే విషయంలో తీసుకున్న చర్యల పురోగతిపై పది రోజుల్లో నివేదికను అందించాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. రష్యా మహిళ చిన్నారి సహా దేశం విడిచి నేపాల్, షార్జాల మీదుగా వెళ్లిపోయి ఉంటుందని జూ లై 21న జరిగిన విచారణ సందర్భంగా కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. నేపథ్యమిదీ..భారత్కు చెందిన వ్యక్తి రష్యా మహిళను పెళ్లి చేసుకున్నారు. ఆమె 2019 నుంచి ఎక్స్–1 వీసాపై ఢిల్లీలోనే ఉంటోంది. కుమారుడు పుట్టాక వారి మధ్య విభేదాలొచ్చాయి. కోర్టు సూచన మేరకు బాలుడి సంరక్షణ బాధ్యతను వారంలో చెరి సగం పంచుకున్నారు. కొన్నాళ్లు సరిగానే ఈ వ్యవహారం నడిచినా అకస్మాత్తు గా ఆ మహిళ, చిన్నారి సహా కనిపించకుండా పోవడంతో ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. -
సెల్ ఫోన్ను సైతం మోయలేనని అనిపించింది..!
వాషింగ్టన్: యాగ్జియం స్పేస్ మిషన్ను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న భారతీయ వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా మొదటిసారిగా మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని భార రహిత స్థితిలో గడిపి భూమిపైకి వచ్చిన తర్వాత భూగురుత్వాకర్షణ శక్తికి అలవాటు పడే క్రమంలో ఎదురైన ఇబ్బందులను ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. గురుత్వాకర్షణ శక్తి ఎంత అవసరమో భూమిని వీడాకనే తమకు తెలిసిందన్నారు. ‘ఒక్కసారిగా భార రహిత స్థితిలోకి మారిపోగా దానికి అలవాటు పడేందుకు కొంత సమయం పట్టింది. అదేవిధంగా, భూమికి తిరిగొచ్చాక కూడా తిరిగి గురుత్వాకర్షణ శక్తికి అలవాటు పడాల్సి వచ్చింది’ అని వివరించారు. క్యాప్సూ్యల్లోంచి బయటకు వచ్చాక సెల్ ఫోన్ సైతం పట్టుకోలేనంత బరువుగా మారిపోవడం తనకు ఆశ్చర్యం వేసిందని తెలిపారు. భూమి పైకి వచ్చిన కొన్ని వారాల తర్వాత సైతం అడ్జెస్ట్ కావడం కష్టమవుతుందని, పడిపోకుండా నిలబడటం, అడుగులు వేయడం సైతం ఇబ్బందిగానే ఉంటుందని చెప్పారు. అందుకే, వ్యోమగాములకు ప్రత్యేక రిహాబిలిటేషన్ కార్యక్రమం ద్వారా బలం కూడదీసుకోవడం, శరీర అవయవాల సమన్వయం, బ్యాలెన్స్ వంటివి ఒక్కటొక్కటిగా అలవాటయ్యాయన్నారు. అంతరిక్షంలో ఉన్నప్పటి మాదిరిగానే వదిలేసిన ల్యాప్టాప్ గాల్లోనే తేలియాడుతుందని భావించి, రూంలోనే దాన్ని పడేశాన ని ఆయన గుర్తు చేసుకున్నారు. అంతరిక్షంలో శూన్య గురుత్వాకర్షణ శక్తిలో అన్నీ తేలియాడుతూనే ఉంటాయి. అటువంటి భారరహిత స్థితిలోనే తనకు అప్పగించిన ప్రయోగాలన్నిటినీ విజయవంతంగా నెరవేర్చానన్నారు. ‘ఇప్పుడంతా మునుపటిలాగానే మారిపోయింది. మరో స్పేస్ మిషన్కు సిద్ధంగా ఉన్నా’అంటూ ఆయన ప్రకటించారు. శుభాంశు అంతరిక్ష కేంద్రంలో ఉంటూ చేపట్టిన ప్రయోగాల డేటా, సేకరించిన నమూనాలు ఇప్పటికే అమెరికా నుంచి భారత్లోని పరిశోధన శాలలకు చేరాయి. త్వరలో భారత్కు రానున్న శుభాంశు శుక్లా ఆ ప్రయోగాల గురించి శాస్త్రవేత్తలకు వివరించనున్నారు. -
‘ఎఫ్–35’ కొనుగోళ్లు బంద్!
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలకు భారత ప్రభుత్వం ప్రతిచర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమ ఉత్పత్తులపై ఏకంగా 25 శాతం సుంకాలు విధించడం, రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తే అదనపు జరిమానాలు విధిస్తామని హెచ్చరించడం భారత్ను పునరాలో చనలో పడేశాయి. ట్రంప్ దూకుడుకు విరుగుడుగా అమెరికా నుంచి రక్షణ పరికరాల కొనుగోలును విరమించుకోవాలని ఇండియా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రధానంగా ఎఫ్–35 యుద్ధ విమానాల కొనుగోలును పూర్తిగా నిలిపి వేయనున్నట్లు తెలిసింది. ట్రంప్ ఇటీవల భారత్పై కారాలు మిరియాలు నూరుతున్నారు. సోషల్ మీడి యాలో వరుసగా పోస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇండియాపై అమెరికా అధ్యక్షుడి మాటల దాడి మరింత తీవ్రమైంది. పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహ రిస్తున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ను వైట్హౌస్ ఆహ్వా నించి, విందు ఇచ్చారు. ఇండియా ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్లు విధించనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఒకవైపు భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతుండగానే ట్రంప్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. భారత్తో తమకు వాణిజ్య లోటు ఉందని, దీన్ని కచ్చితంగా తగ్గిస్తామని ట్రంప్ తేల్చిచెప్పారు. ఈ పరిణామా లన్నీ భారత్కు ఇబ్బందికరంగా మారాయి. అమెరికాతో చర్చలు జరుపలేదు రక్షణ రంగంలో భారత్–అమెరికా మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. అమెరికా రక్షణ పరికరాలు, ఆయుధాలు, సైనిక రవాణా విమానాలను భారత్ ఉపయోగిస్తోంది. మరోవైపు ఎఫ్–35 యుద్ధ విమానాలను భారత్కు విక్రయించాలని డొనాల్డ్ ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నారు. తద్వారా వేల కోట్ల డాలర్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు చేసిన సంయుక్త ప్రకటనలో ఎఫ్–35 యుద్ధ విమానాల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే, ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో ఈ యుద్ధ విమానాల కొనుగోలుపై భారత ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు బ్లూబర్గ్ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ట్రంప్ ఆఫర్ను తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. సమీప భవిష్యత్తులోనూ వీటిని కొనే అవకాశం లేదని పేర్కొంది. మరోవైపు ఎఫ్–35 యుద్ధ విమానాల కోసం అమెరికా ప్రభుత్వంతో అధికారికంగా ఎలాంటి చర్చలు జరుపలేదని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తేల్చిచెప్పారు. ఇదిలా ఉండగా, వాణిజ్య లోటుపై ట్రంప్ అభ్యంతరాల నేపథ్యంలో అమెరికా నుంచి సహజ వాయువు, కమ్యూనికేషన్ పరికరాలు, బంగారం కొనుగోళ్లు పెంచాలని భారత ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతీకార చర్యల్లో భాగంగా అమెరికా ఉత్పత్తులపై భారీగా సుంకాలు పెంచే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి అందుకు దూరంగా ఉండాలని భారత ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. అమెరికాతో నెలకొన్న సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని అంచనా వేస్తోంది. -
రష్యా సమీపంలోకి... అణు జలాంతర్గాములు!
మాస్కో: అగ్ర రాజ్యాలు అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. శుక్రవారం అమెరికా రెండు అణు జలాంతర్గాములను రష్యా సమీపంలో మోహరించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా హాండిల్ ట్రూత్ సోషల్లో ప్రకటించారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహాయకుడు, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ ద్మిత్రీ మెద్వెదెవ్ చేసిన ‘డెడ్ హ్యాండ్’ హెచ్చరికలకు ప్రతిస్పందనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘‘అవి మతిలేని, రెచ్చగొట్టే ప్రకటనలు. నిజంగానే అలాంటి పరిస్థితి తలెత్తే ఆస్కారముంటే దీటుగా స్పందించేందుకే ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. రెండు సబ్మెరైన్లను సరైన ప్రదేశాల్లో మోహరించాల్సిందిగా ఆదేశించా’’అని వివరించారు. ఏమిటీ డెడ్ హ్యాండ్? ఇది రష్యా (నాటి సోవియట్ యూనియన్) అభివృద్ధి చేసిన ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి వ్యవస్థ. ఆ దేశంపై ఎవరన్నా అణు దాడి చేస్తే అందుకు ప్రతిగా ఆటోమేటిగ్గా అణు దాడులు జరుపుతుంది. దేశ నాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టుకు పోయినా తనంత తానుగా స్పందించి దాడులకు దిగటం దీని ప్రత్యేకత. భూమిపై ఎక్కడైనా కొట్టగల క్షిపణి: రష్యా మాస్కో: అత్యాధునిక హైపర్సోనిక్ క్షిపణులను యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఈ ఏడాది చివర్లో వాటిని బెలారస్లో మోహరించే యోచన ఉందని తెలిపారు. రష్యాకు అత్యంత సన్నిహిత దేశమైన బెలారస్ అధ్యక్షుడు అలెగ్జండర్ లుకషెంకోతో కలిసి సెయింట్ పీటర్స్బర్గ్ సమీపంలో పుతిన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ క్షిపణులకు సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. సంవత్సరాంతానికి ఉత్పత్తి్త మొదలవుతుంది. ఉక్రెయిన్తో యుద్ధంలో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఒరెíÙ్నక్, దానికి సంబంధించిన ఆయుధ వ్యవస్థలను గత అక్టోబర్లో పుతిన్ రంగంలోకి దించారు. ఆ సందర్భంగా ఒరెషి్నక్ సామర్థ్యాలను ప్రస్తుతించారు. ‘‘సంప్రదాయ, అణు వార్హెడ్లు రెండింటినీ మోసుకెళ్లగలగడం దీని ప్రత్యేకత. లక్ష్యం భూమిపై ఎక్కడున్నా ఇప్పటికైనా ఈ క్షిపణులు ఆదుకోవాల్సిందే. ఇవి దాదాపుగా మాక్10 వేగంతో దూసుకెళ్తాయి. -
25 శాతం సుంకాలు ఇక అధికారికం
వాషింగ్టన్/న్యూఢిల్లీ: తంపులమారి ట్రంప్ అన్నంత పనీ చేశారు. భారత్పై తాజాగా ప్రకటించిన 25 శాతం సుంకాలపై అమెరికా అధ్యక్షుడు అధికారిక ముద్ర వేశారు. ఈ మేరకు ఉత్తర్వులపై గురువారం సంతకం చేశారు. అంతేగాక పదుల కొద్దీ దేశాలపై కూడా సుంకాల కొరడా ఝళిపించారు. తద్వారా అంతర్జాతీయంగా మరోసారి వాణిజ్య కల్లోలానికి తెర తీశారు. తాజా జాబితాలో లేని దేశాలకు 10 శాతం టారిఫ్ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అత్యధికంగా సిరియాపై 41 శాతం, పలు దేశాలపై అత్యల్పంగా 10 శాతం టారిఫ్లు వడ్డించారు. ఇవి ఆగస్టు 7 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే పాకిస్తాన్పై మాత్రం టారిఫ్లను 29 నుంచి 19 శాతానికి తగ్గించడం విశేషం. తాజాగా టారిఫ్లు విధించిన జాబితాలో 69 దేశాలున్నాయి. మరిన్ని దేశాలు తమతో చర్చలు జరుపుతున్నా, వాటి ప్రతిపాదనలు పరస్పర వర్తక లోటును పూడ్చేలా లేవంటూ ట్రంప్ పెదవి విరిచారు. ఈ నేపథ్యంలో త్వరలో మరిన్ని టారిఫ్ పెంపుదలలు ఉంటాయని వైట్హౌస్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. దీనిపై అధ్యక్షుడే ప్రకటన చేస్తారన్నారు. ఉత్తర అమెరికా వర్తక ఒప్పందం కింద అమెరికాలోకి ప్రవేశించే కెనడా, మెక్సికో ఉత్పత్తులకు సుంకాల బాదుడు నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే అమెరికాలోకి ఫెంటానిల్ భారీ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కెనడా విఫలమవుతోందని వైట్హౌస్ ఆక్షేపించింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన ఉత్పత్తులపై టారిఫ్లను 25 నుంచి 35 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. మెక్సికోకు మాత్రం పలు ఉత్పత్తులపై విధించిన 30 శాతం టారిఫ్లను సంప్రదింపులకు వీలుగా 90 రోజుల గడువిచ్చారు. అయితే ఆటోయేతర, లోహేతర వస్తువులకు మాత్రం గడువు ఇవ్వలేదు. మెక్సికో నుంచి ఉక్కు, అల్యుమినియం, రాగిపై 50 శాతం టారిఫ్లు, ఆటో ఉత్పత్తులపై 25 శాతం తప్పవని వైట్హౌస్ స్పష్టం చేసింది. ట్రంప్ కొద్ది నెలల క్రితం ప్రపంచ దేశాలపై ప్రకటించిన టారిఫ్లు ఆగస్టు 1 నుంచే అమల్లోకి రావడం తెలిసిందే. భారత ఆర్థిక వ్యవస్థ మృతప్రాయమైనది అంటూ బుధవారం ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. మన ఎగుమతులపై 25 శాతం టారిఫ్లు విధిస్తున్నట్టు తాజా ఉత్తర్వుల్లో ఆయన పునరుద్ఘాటించారు. రష్యా నుంచి భారీగా చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తున్నందుకు ప్రకటించిన పెనాల్టీ శాతాన్ని మాత్రం తాజా ఉత్తర్వుల్లో వెల్లడించలేదు. వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు అంశాల్లో అమెరికా ప్రమేయాన్ని అంగీకరించేందుకు భారత్ ఇప్పటికే ససేమిరా అనడం తెలిసిందే. అమెరికాపై భారత్ సుంకాలు దారుణంగా ఉన్నాయంటూ ట్రంప్ ఇటీవలే విమర్శించడం, దేశ ప్రయోజనాలను అన్ని రకాలుగా కాపాడతామని కేంద్రం ప్రకటించడం తెలిసిందే. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల నడుమ చర్చలు కొనసాగుతుండగానే బుధవారం ట్రంప్ 25 శాతం సుంకాలు బాదారు. ఇక అమెరికాకు ఎగుమతులపై 15 శాతం టారిఫ్లకు దక్షిణ కొరియా ఇప్పటికే అంగీకరించింది. వాటిపై 25 శాతం బాదుడు తప్పదంటూ ట్రంప్ తొలుత హెచ్చరించారు. దాంతో ఆయన నిర్ణయించే అమెరికా ప్రాజెక్టుల్లో 350 బిలియన్ల మేరకు పెట్టుబడికి ఒప్పుకుంది. ఇక అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన చైనాపై టారిఫ్లను ట్రంప్ ఏ మేరకు నిర్ణయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 12 నాటికి ఒప్పందం కుదుర్చుకోవాల్సిందిగా ఆ దేశానికి ఆయన ఇప్పటికే అలి్టమేటమివ్వడం తెలిసిందే. ఇరు దేశాల నడుమ పలు అంశాలపై వర్తక విభేదాలు కొనసాగుతున్నాయి. దేశ ప్రయోజనాలు కాపాడతాం: కేంద్రం ట్రంప్ వ్యాఖ్యలు, తాజా ఉత్తర్వులపై కేంద్రం ఆచితూచి స్పందించింది. ‘‘ద్వైపాక్షిక వాణిజ్య భాగస్వామ్యం అనేక ఆటుపోట్లను ఎదుర్కొని నిలిచింది. ఇరు దేశాలు విశ్వసించే ఎజెండాకు కట్టుబడి ఉన్నాం. ఈ బంధం సజావుగా సాగుతుందని విశ్వసిస్తున్నాం’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు ప్రతీకారంగా జరిమానా విధిస్తామన్న ట్రంప్ ప్రకటనను మీడియా ప్రస్తావించగా ఈ విషయంలో జాతి ప్రయోజనాలకు అనుగుణంగా మాత్రమే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
భారత్ కారణంగా పుతిన్ రెచ్చిపోతున్నారు.. రుబియో సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: భారత్, రష్యా చమురు కొనుగోలు విషయమై అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా దగ్గర భారత్ కొంటున్న చమురుతోనే పుతిన్.. ఉక్రెయిన్పై యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇదే భారత్తో చర్చల్లో తమను ఇబ్బందిపెట్టే అంశమని వ్యాఖ్యలు చేశారు.అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియో గురువారం ఫాక్స్ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘అన్ని దేశాల్లాగే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు చమురు, బొగ్గు, గ్యాస్ కొనగలిగే శక్తి భారత్కు ఉంది. అయితే, భారత్.. తమ అవసరాల దృష్ట్యా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. భారత్కు భారీగా ఇంధన అవసరాలున్నాయి. రష్యాపై పలు దేశాల ఆంక్షల వల్ల అక్కడ భారత్కు చమురు చౌకగా లభిస్తోంది. దురదృష్టవశాత్తూ భారత్ చమురు కొనుగోలు చేస్తున్న కారణంగానే రష్యాలను నిధులు సమకూరుతున్నాయి. వాటిని రష్యా.. ఉక్రెయిన్తో యుద్ధం చేయడంలో వాడుకుంటోంది. అదే యుద్ధంలో మనగలగడానికి రష్యాకు ఉపయోగపడుతోందన్నారు. అలాగే, ఇదే భారత్తో చర్చల్లో అమెరికాను ఇబ్బందిపెట్టే అంశం. ప్రపంచ వాణిజ్యంలో భారత్ వాటాదారు. వ్యూహాత్మక భాగస్వామి. అయితే అన్ని అంశాల్లో మాదిరిగా విదేశాంగ విధానంలోని ప్రతి విషయంలో 100 శాతం సమయం కేటాయించడం సాధ్యం కాదు’ అని పేర్కొన్నారు.ఇక, అంతకుముందు.. భారత్, రష్యా బంధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. తనకేం సంబంధం లేదంటూనే శాపనార్థాలు పెట్టారు. ఇద్దరూ వారి మృత ఆర్థిక వ్యవస్థలను దిగజార్చుకోనీయండని, కలిసి మునగనీయండని వ్యాఖ్యానించారు. బుధవారం భారత్పై 25 శాతం సుంకాలతోపాటు పెనాల్టీ విధిస్తూ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాతో భారత్ ఏం చేస్తుందన్న విషయాన్ని అసలు పట్టించుకోబోమని, వారిద్దరూ మునిగిపోతుంటే మాకెందుకని, మిగిలిన అందరి గురించి పట్టించుకుంటామని స్పష్టం చేశారు. ‘మనకు భారత్ స్నేహితురాలే అయినా ఆ దేశంతో స్వల్ప లావాదేవీలే ఉన్నాయి. ఆ దేశం సుంకాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. ఉక్రెయిన్లో దాడులు ఆపాలని ప్రపంచమంతా గొంతెత్తి అరుస్తుంటే.. భారత్ మాత్రం రష్యా నుంచి ఆయుధాలను, ఇంధనాన్ని కొనుగోలు చేస్తోంది’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.#BREAKING | US Secretary of State Marco Rubio calls India a "strategic partner" while also expressing concern over its continued energy imports from Russia. "Look, global trade – India is an ally. It’s a strategic partner. Like anything in foreign policy, you’re not going to… pic.twitter.com/m8OfCpHUXQ— NewsMobile (@NewsMobileIndia) July 31, 2025 -
ట్రంప్ సుంకాల మోత.. అధికంగా 41 శాతం, పాకిస్తాన్పై ఎంతంటే?
వాష్టింగన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాలు బాంబు పేల్చాడు. దాదాపు 70 దేశాలపై తాజాగా సుంకాలను విధిస్తూ కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. దీంతో, కొత్త టారిఫ్లు అమలులోకి రానున్నాయి. కొత్తగా విధించిన వాటిలో అత్యధికంగా సిరియాపై 41 శాతం టారిఫ్లను ట్రంప్ ప్రకటించారు. కెనడాపై 35 శాతానికి సుంకాలను పెంచారు. ఇక, భారత్పై 25 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే.వివరాల ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కొత్తగా టారిఫ్లను విధించారు. డజన్ల కొద్దీ వాణిజ్య భాగస్వాములపై అధిక సుంకాలను విధించారు. సిరియాపై అత్యధికంగా 41 శాతం విధించగా.. కెనడాపై 25 శాతం నుంచి 35 శాతానికి సుంకాల పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 🇺🇸 NOW: President Trump signed an Executive Order to further modify reciprocal tariff rates. pic.twitter.com/e9rtOcf5Kq— Cointelegraph (@Cointelegraph) July 31, 2025అలాగే, లావోస్, మయన్మార్పై 40 శాతం, స్విట్జల్యాండ్పై 39 శాతం, ఇరాక్, సెర్బియాపై 35 శాతం పన్నులు విధించారు. భారత్పై 25 శాతం, పాకిస్తాన్పై 19 శాతం, బంగ్లాదేశ్పై 20శాతం, శ్రీలంకపై 20 శాతం టారిఫ్లు విధిస్తూ.. ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇదిలా ఉండగా.. బ్రిక్స్ దేశాలపై సుంకాల మోత మోగిస్తానన్న ట్రంప్ అన్నంత పని చేశారు. భారత్పై 25శాతం సుంకాలను విధించిన ఆయన.. బ్రెజిల్పై సుంకాలను ఏకంగా 50శాతానికి పెంచారు. శుక్రవారం నుంచే ఇవి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. మరోవైపు పొరుగుదేశం మెక్సికోపై కొంత కరుణ చూపారు. ఆ దేశంతో వాణిజ్య ఒప్పందం కోసం 90 రోజుల సమయమిచ్చారు. అయితే ఈ సమయంలో 25శాతం సుంకం అమల్లో ఉంటుందని గురువారం ప్రకటించారు.🚨 BREAKING: President Trump just signed an order RAISING his reciprocal tariff on Canada from 25% to 35%, effective at midnightThis comes after Canadian PM Carney tried playing games on tradeFAFO, Canada! pic.twitter.com/a0caM6EgxY— Nick Sortor (@nicksortor) July 31, 2025భారత్పై 25 శాతం సుంకాలు పెనాల్టీతో కలిపి ఆగస్టు 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నట్లు చెప్పారు. ‘భారత్ మిత్రదేశమే అయినా.. సుంకాలు ఎక్కువగా ఉన్నందున వారితో పరిమిత స్థాయిలోనే వ్యాపారాలు చేస్తున్నాం. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటి. రష్యా నుంచి భారీ స్థాయిలో సైనిక ఉత్పత్తులు, చమురు కొనుగోలు చేస్తోంది. అందుకే 25 శాతం సుంకాలు, అదనంగా పెనాల్టీ కూడా విధిస్తున్నాం. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి’ ప్రకటించారు.ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటనపై భారత్ స్పందించింది. తాజాగా కేంద్రం ఓ ప్రకటనలో..‘ద్వైపాక్షిక వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను గమనించాం. సుంకాల ప్రభావంపై అధ్యయనం చేస్తున్నాం. రైతులు, వ్యాపారవేత్తలతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. బ్రిటన్తో ఇటీవల కుదుర్చుకున్న ‘ఎఫ్టీఏ’ సహా ఇతరత్రా వాణిజ్య ఒప్పందాల మాదిరిగానే.. ఈ వ్యవహారంలోనూ జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం’ అని తెలిపింది. -
పాలస్తీనాను గుర్తిస్తాం: కెనడా
ఒట్టావా: ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో పాలస్తీనాను గుర్తించే విషయంలో ఫ్రాన్స్, యూకేల బాటలో పయనించాలని కెనడా నిర్ణయించుకుంది. గాజాలో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న అరాచకాలకు నిరసనగా పాలస్తీనా దేశాన్ని గుర్తించాలనుకుంటున్న కెనడా ప్రధాని మార్క్ కార్నీ బుధవారం ప్రకటించారు. శాంతియుతంగా చర్చల ద్వారా ఇజ్రాయెల్– పాలస్తీనా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తమకు నమ్మకం పోయిందని ఆయన వివరించారు. అందుకే సెప్టెంబర్లో జరిగే ఐరాస జనరల్ అసెంబ్లీ 80వ సెషన్లో పాలస్తీనా దేశాన్ని గుర్తించాలని అనుకుంటున్నామన్నారు. అయితే, సంస్కరణలతో, 2026లో సాధారణ ఎన్నికలు జరిపేందుకు పాలస్తీనా అథారిటీ నుంచి గట్టి హామీ లభించాల్సి ఉందన్నారు. భవిష్యత్తులో పాలస్తీనాలో హమాస్కు ఎటువంటి పాత్ర ఉండరాదని, ఎన్నికల్లో పాల్గొనరాదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి బదులుగా శాంతిని కోరుకునే ప్రజలందరి కోసమే రెండు దేశాల విధానాన్ని బలపరుస్తున్నామని కార్నీ తెలిపారు. -
బఫూన్లకు బాస్ ట్రంప్
న్యూఢిల్లీ: రష్యాతో వాణిజ్యం చేస్తున్నదనేసాకు చూపుతూ భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు విధించడంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా మండిపడ్డారు. భారత ప్రభుత్వాన్ని వేధిస్తున్న ట్రంప్ను ఆయన ‘బఫూన్ ఇన్ చీఫ్’గా అభివర్ణించారు. ‘వైట్ హౌస్లోని బఫూర్ ఇన్ చీఫ్ నా దేశ ప్రభుత్వాన్ని వేధిస్తుండటం విచారం కలిగిస్తోంది. ఇలాంటి బెదిరింపులకు లొంగటానికి సామంత రాజ్యం కాదు.. భారత్ సార్వభౌమత్వం కలిగిన దేశం అని స్పష్టం చేశారు. అత్యధిక టారిఫ్లతో మన ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం వాటిల్లుతుందని ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ టారిఫ్ల పెంపుపై ప్రధాని మోదీ మౌనంగా ఉండటాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. మోదీ వైఖరి దారుణమన్నారు. -
యూకే ఏటీసీలో సమస్య.. 100 విమానాలపై ప్రభావం
లండన్: ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో సమస్య తలెత్తడంతో గురువారం దక్షిణ ఇంగ్లండ్లోని పలు విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కనీసం 100 విమాన సర్వీసులు, ఆలస్యంగా నడవడం లేదా రద్దవడం సంభవించాయి. దీంతో వేలాదిగా ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. హీత్రూ, గాట్విక్, బర్మింగ్హామ్, మాంచెస్టర్, కార్డిఫ్, ఎడిన్బరో తదితర విమానాశ్రయాల్లో పలు విమానాలను తాత్కాలికంగా రద్దు చేశారు. సుమారు 20 నిమిషాల తర్వాత సమస్యను పరిష్కరించినప్పటికీ ఆ ప్రభావం సాయంత్రం వరకు కొనసాగింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తాము వెళ్లాల్సిన విమానాలను అధికారులు రద్దు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి దరిద్రంగా మారిందంటూ వ్యాఖ్యలు చేశారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు నిర్విరామంగా పనిచేస్తున్నామని నేషనల్ ఎయిర్ట్రాఫిక్ సర్వీసెస్(ఎన్ఏటీఎస్) తెలిపింది. -
అవి డెడ్ ఎకానమీలు
వాషింగ్టన్/న్యూఢిల్లీ/మాస్కో: ఆంక్షలు విధిస్తామ ని భయపెట్టినా గత కొంతకాలంగా రష్యా నుంచి భారీ ఎత్తున చమురు కొనుగోళ్లను తగ్గించుకోని భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోమారు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత్కు చమురును సరఫరాచేస్తున్న శత్రు దేశం రష్యాను సైతం ట్రంప్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. భారత్, రష్యా రెండూ కలిసి సాధించేది ఏమీ ఉండదని ఎద్దేవాచేశారు. జట్టుకట్టి అనవసరంగా రెండు దేశాల ఆర్థికవ్యవస్థలను మరింత నిర్వీర్యంచేస్తున్నా యని ఇరు దేశాల ప్రభుత్వాలపై విమర్శల బురద చల్లారు. భారత్పై పాతికశాతం టారిఫ్ ఆర్థిక భారం మోపిన ట్రంప్ గురువారం భారత్, రష్యాల వాణిజ్యబంధంపై తన అక్కసును వెళ్లగక్కుతూ సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పలు పోస్ట్లు పెట్టారు. ఐ డోంట్ కేర్..‘‘ రష్యాతో భారత్ ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటోందీ, రష్యాతో భారత్కు ఉన్న సత్సంబంధాలు ఏంటి అనేవి నాకు అస్సలు అవసరం లేదు. అత్యంత కీలకమైన అమెరికాతో వాణిజ్యం అత్యల్ప స్థాయిలో చేసుకుంటూ భారత్ సొంత ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యంచేసుకుంటోంది. ఇక రష్యా సంగతి చెప్పనక్కర్లేదు. రష్యాతో అమెరికాకు ఎలాంటి వాణిజ్య సంబంధాలు లేవు. ఇలాంటి రష్యా, భారత్లో కూడబలుక్కుని సాధించింది ఏమీ లేదు. అవి రెండూ డెడ్ ఎకానమీలు (నిర్వీర్యమైన ఆర్థిక వ్యవస్థలు). ఉమ్మడిగా పతనమవుతున్నాయి. ఈ దేశాలను నేనసలు పట్టించుకోను. భారత్తో మేం చాలా తక్కువ స్థాయిలో వాణిజ్యం చేస్తున్నాం. భారత్ మాపై విధించే అధిక టారిఫ్లే ఇందుకు ప్రధాన కారణం. భారత్ విధించే దిగుమతి సుంకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రపంచంలో అత్యధిక దిగుమతి సుంకాలు వసూలుచేస్తున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. భారత్తో వ్యవహారాలు ఒక్కోసారి సవ్యంగా ఉండవు. దాని పర్యవసానమే ఈ 25 శాతం దిగుమతి సుంకాలు. వీటికి పెనాల్టీ(జరిమానా) అదనం. ఇవన్నీ ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి అమలుచేసి వసూలు మొదలెడతా’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘భారత వాణిజ్య విధానాలు అసంపూర్ణంగా, అస్పష్టంగా ఉంటాయి. దానికితోడు భారత్తో పరస్పర సరుకుల విలువను మాత్రమే జమకట్టే నగదుయేతర వాణిజ్య అవరోధాలు చాలా ఉన్నాయి. మేం వద్దు అని వారిస్తున్నా, హెచ్చరిస్తున్నాసరే రష్యా నుంచి ఆయుధ, ఇంధన ఉత్పత్తులను భారీ ఎత్తున భారత్ కొనుగోలుచేస్తోంది. ఇలా వచ్చిన ఆదాయాన్ని పరోక్షంగా ఉక్రెయిన్ యుద్ధం కోసం రష్యా వినియోగిస్తోంది’’ అని ట్రంప్ ఆరోపించారు.మెద్వెదేవ్, ట్రంప్ మాటల యుద్ధంభారత్ను విమర్శించిన ట్రంప్ పనిలోపనిగా రష్యాపైనా, రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదేవ్పైనా విమర్శలు గుప్పించారు. దీంతో మెద్వదేవ్ సైతం ప్రతివిమర్శలు చేశారు. తొలు త మెద్వదేవ్నుద్దేశిస్తూ ట్రంప్ వ్యంగ్య పోస్ట్ చేశారు. ‘‘రష్యా అధ్యక్షుడిగా పేలవంగా పాలించిన మాజీ అధ్యక్షుడు మెద్వదేవ్ ఇంకా రష్యాకు అధ్యక్షుడినే అని అనుకుంటున్నారేమో. ఏదైనా మాట్లాడేముందు చూసి మాట్లాడండి. అమె రికాపై మాట్లాడే దుస్సాహసం చేయొద్దు’’ అని హెచ్చరించారు. దీనిపై రష్యా భద్రతా మండలి ఉపాధ్యక్షుడి హోదాలో మెద్వదేవ్ ఘాటుగా జవాబిచ్చారు. ‘‘ట్రంప్ ఎలా స్పందించినాసరే రష్యా తన పంథాను వీడబోదు. డెడ్ ఎకానమీ అని నోటికొచ్చినట్లు మాట్లాడటంకాదు. సోవి యట్ కాలంలోనే రష్యా అణుబాంబును తయా రుచేసిందన్న విషయం మర్చి పోవద్దు. అయినా ‘డెడ్’ అనే పదానికి ‘ది వాకింగ్ డెడ్’ అనే సినిమాకు, ‘డెడ్ హ్యాండ్ అనే ‘వ్యవ స్థ’కు ఉన్న శక్తి ట్రంప్కు తెలీదనుకుంటా’’ అని మెద్వదేవ్ వ్యాఖ్యానించారు. శత్రుదేశం దాడిచేసి రష్యా నా యక త్వాన్ని అంతమొందించినాసరే తిరిగి అణు బాంబులు ప్రయోగించేలా రష్యా రూపొందించిన ఆటో మేటిక్ దాడి వ్యవస్థ పేరే డెడ్ హ్యాండ్. -
ఇమ్రాన్ పార్టీకి చెందిన 166 మందికి పదేళ్ల జైలు
లాహోర్: పదవీచ్యుత పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలో పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే వివిధ ఆరోపణలపై జైలు జీవితం అనుభవిస్తున్న విషయం తెల్సిందే. ఖాన్ నిర్బంధాన్ని నిరసిస్తూ 2023 మే 9వ తేదీన పీటీఐ శ్రేణులు దేశవ్యాప్త నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు డజను వరకు సైనిక కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. ఈ చర్యలపై ఫైసలాబాద్లోని యాంటీ టెర్రరిజం కోర్టు(ఏటీసీ) ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. ఫైసలాబాద్లోని ఐఎస్ఐ కార్యాలయ భవనంపై జరిగిన దాడికి సంబంధించి 108 మందికి, పోలీస్ స్టేషన్పై దాడికి పాల్పడిన 58 మందికి పదేళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. శిక్ష పడిన వారిలో నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఒమర్ అయూబ్, సెనేట్లో ప్రతిపక్ష నేత షిబ్లి ఫరాజ్, కీలక నేతలు జర్తాజ్ గుల్, సాహిబ్జాదా హమీద్ రజా ఉన్నారు. దోషులుగా ప్రకటించిన వారిలో ఆరుగురు నేషనల్ అసెంబ్లీ సభ్యులు కాగా ఒకరు పంజాబ్ అసెంబ్లీ సభ్యుడు, ఒక సెనేటర్ ఉన్నారు. ఇప్పటికే పీటీఐకి చెందిన 14 మందిని దోషులుగా ప్రకటిస్తూ మే 9వ తేదీన వెలువరించిన తీర్పులో పేర్కొంది. తీర్పును లాహోర్ హైకోర్టులో సవాల్ చేస్తామని పీటీఐ తాత్కాలిక అధ్యక్షుడు గొహార్ అలీ చెప్పారు. ఆగస్ట్ 5వ తేదీ నుంచి ‘ఫ్రీ ఇమ్రాన్ ఖాన్ మూవ్మెంట్’చేపట్టేందుకు పీటీఐ ప్రయత్నాలు చేస్తున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. -
ఎఫ్డీఏ నుంచి వైదొలిగిన భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త
వాషింగ్టన్: భారతీయ సంతతికి చెందిన శాస్త్రవే త్త, ఆంకాలజిస్ట్ డాక్టర్ వినయ్ ప్రసాద్ ఎఫ్డీఏ నుంచి వైదొలిగారు. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రరేషన్ (ఎఫ్డీఏ) వేక్సిన్ చీఫ్ అయిన వినయ్.. సెంటర్ ఫర్ బయోలాజిక్స్ ఎవాల్యు యేషన్ అండ్ రీసెర్చ్ (సీబీఈఆర్) డైరెక్టర్గా నియమితులైన నియమితులైన ఆయన మూడు నెలల్లోనే బయటికి వచ్చారు. డుచెన్ కండరాల బలహీనతకు జన్యు చికిత్సను ఇటీవల సారెప్టా థెరప్యూటిక్స్ నుంచి ఏజెన్సీ నిర్వహించింది. ఎఫ్డీఏ–ఆమోదించిన చికిత్సను వ్యాధితో బాధ పడుతున్న ఇద్దరు టీనేజర్లపై ప్రయోగించారు. వారిద్దరూ మరణించారు. ఇటీవలే జూలై 18న మరో మరణం సంభవించింది. దీంతో ఆమో దించిన డీఎండీ చికిత్సతోపాటు అన్ని సరుకు లను నిలిపివేయమని సారెప్టాను ఎఫ్డీఏ కోరింది. దీనికి భద్రతా సమస్యలు ఉన్నాయని పేర్కొంది. దీంతో.. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మిత్రురాలు లారా లూమర్ తన బ్లాగులో ఓ పోస్ట్చేశారు. అందులో ఆమె ప్రసాద్ను ప్రగతి శీల వామపక్ష విధ్వంసకారుడని అభివర్ణించారు. అంతేకాదు.. అతను ఏజెన్సీ పనిని బలహీన పరుస్తున్నారని ఆరోపించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో లూమర్ విమర్శలు జాతీయ భద్రతా అధికారులను తొలగించటానికి దారి తీశాయి. దీంతో ప్రసాద్ను విమర్శిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ అభిప్రాయ విభాగం రెండు వ్యాసా లు ప్రచురించింది. ఈ విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో వినయ్ ప్రసాద్ పదవి నుంచి వైదొలిగారు. ప్రసాద్.. శాన్ఫ్రాన్సిస్కోలోని కాలి ఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి ఏజెన్సీలో చేరిన వైద్యుడు. ఆయన నేషనల్ కేన్సర్ ఇనిస్టి ట్యూట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్లో పనిచేశారు. యూఎస్ కోవిడ్–19 వేక్సిన్, మాస్క్ ఆదేశాలను ఆయన తీవ్రంగా విమర్శించారు. -
అన్నార్థులపై బ్రహ్మాస్త్రం
డెయిర్ అల్ – బలాహ్: వ్యూహాత్మకంగా కాల్పుల విరమణ పాటిస్తామని ఇటీవల ప్రకటించిన ఇజ్రాయెల్.. గాజాలో వ్యూహాత్మకంగానే దాడులు చేస్తోంది. గాజా స్ట్రిప్లోని జికిమ్ క్రాసింగ్ వద్ద ఆహారం కోసం ఎదురుచూస్తున్న వారిపై బుధవారం ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 48 మంది మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారు. తమ ఆస్పత్రికి 35 మృతదేహాలు వచ్చాయని అల్–షిఫా హాస్పిటల్ డైరెక్టర్ మొహమ్మద్ అబూ సలి్మయా తెలిపారు. కాల్పుల స్థలం నుంచి గాయపడిన వారిని చెక్క బండ్లలో దూరంగా తీసుకెళ్తున్న, అలాగే పిండి సంచులను మోసుకెళ్తున్న జనసమూహం మీడియా ఫుటేజీలో కనిపించాయి. 100 మందికి పైగా గాయాలతో తమ ఆస్పత్రికి వచ్చారని అల్–సరయా ఫీల్డ్ హాస్పిటల్ తెలిపింది. కొన్ని మృతదేహాలను ఇతర ఆసుపత్రులకు తరలించామని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని గాజా ఆరోగ్య శాఖ అత్యవసర సేవల ఛీఫ్ ఫేర్స్ అవద్ తెలిపారు. నిరాకరించిన ఇజ్రాయెల్.. అయితే దాడులను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. తన దళాలను సమీపించే వ్యక్తులపై మాత్రమే ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరిక కాల్పులు జరిపిందని తెలిపింది. ఇక జీహెచ్ఎఫ్ సహాయ కేంద్రాల వద్దకు వచి్చన జన సమూహాన్ని వారించడానికి సాయుధ కాంట్రాక్టర్లు పెప్పర్ స్ప్రే ఉపయోగించడం, కాల్పులతో హెచ్చరికలు మాత్రమే చేశారని చెబుతోంది. కాల్పుల వల్ల ప్రాణ నష్టం జరిగిందేమో తమకు తెలియదని ఐడీఎఫ్ స్పష్టం చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఇంకా పరిశీలిస్తున్నామని పేర్కొంది. అంతంత మాత్రంగా సహాయం.. రోజుకు కొన్ని గంటల పాటు వ్యూహాత్మక కాల్పుల విరమణ అమలు చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించినప్పటికీ.. మానవతా సహాయం సరఫరాకు అడ్డంకులు మాత్రం అలాగే ఉన్నాయి. స్ట్రిప్లోకి ప్రవేశించే సహాయాన్ని అందించడంలో ఐక్యరాజ్యసమితి ఇప్పటికీ ఇబ్బంది పడుతోంది. ఇజ్రాయెల్ సైన్యం నియంత్రణలో ఉన్న మండలాల్లో చాలా ట్రక్కులను దింపుతోంది. ఇక మరోవైపు ఇజ్రాయెల్ మద్దతుగల జీహెచ్ఎఫ్ నిర్వహిస్తున్న ప్రత్యామ్నాయ సహాయ వ్యవస్థ వల్ల హింస పెరుగుతోంది. విమానాల ద్వారా అంతర్జాతీయ సహాయాన్ని పడేయడం కూడా తిరిగి ప్రారంభమైంది. కానీ.. చాలా పార్శిళ్లు పాలస్తీనియన్లు ఖాళీ చేసిన ప్రాంతాల్లో, మరికొన్ని మధ్యధరా సముద్రంలో పడిపోయాయి. ఆ తడిసిన పిండి సంచులను తెచ్చుకోవడానికి కూడా ప్రజలు ఈత కొడుతూ వెళ్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పోషకాహార లోపంతో మరణాలు.. మరోవైపు పోషకాహార లోపంతో ఒక చిన్నారితో సహా మరో ఏడుగురు పాలస్తీనియన్లు బుధవారం మరణించారు. గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పిల్లలు పోషకాహార లోపంతో మొత్తం 89 మంది మరణించారు. జూన్ చివరి నుంచి పోషకాహార లోపం సంబంధిత కారణాలతో గాజా అంతటా 65 మంది పాలస్తీనియన్ పెద్దలు కూడా మరణించారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే.. గాజాలో ఆకలి చావులు లేవని ఇజ్రాయెల్ చెబుతోంది. గాజాలో ఆకలిపై దృష్టి పెట్టడం హమాస్తో కాల్పుల విరమణ ప్రయత్నాలను బలహీనపరుస్తుందని చెబుతోంది. ఈ గందరగోళం మధ్యనే.. అమెరికా మిడిల్ ఈస్ట్రాయబారి ఇజ్రాయెల్కు వెళుతున్నారు. గాజాలో కాల్పుల విరమణ, హమాస్ చెరలో ఉన్న బం«దీల విడుదలపై ఇజ్రాయెల్తో చర్చలు నిర్వహించనున్నారు. -
చైనాలో గోల్డ్ రష్..!
బీజింగ్: ఒకటీరెండూ కాదు..ఏకంగా 20 కిలోల బంగారం, వెండి నగలు...బంగారం, డబ్బు నిండుగా ఉన్న ఇనుప బీరువా..! చైనాలోని ఓ ఊళ్లో జనం వీటిని సొంతం చేసుకునేందుకు తెగ వెతుకుతున్నారు. కొందరు బురద మట్టిని తవ్వి మరీ చూస్తున్నారు. మరికొందరైతే ఏకంగా మెటల్ డిటెక్టర్లను పట్టుకుని తిరుగుతున్నారు. ఇదంతా నిధీ నిక్షేపాల కోసం మాత్రం కాదు..వరదల్లో కొట్టుకుపోయిన సొత్తు కోసం సాగుతున్న ఎడతెగని అన్వేషణ..! ఏం జరిగిందంటే..జూలై 25వ తేదీన షాంగ్జి ప్రావిన్స్లోని వుక్వి కౌంటీలో భారీ వర్షాలతో అనూహ్యంగా వరదలు వచ్చాయి. కొన్ని నిమిషాల వ్యవధిలోనే మీటరు ఎత్తున వరద ఉప్పొంగి పట్టణాన్ని ముంచెత్తింది. ఆ వరద లావోఫెంగ్ జియాంగ్ దుకాణంలోకి కూడా ప్రవేశించింది. అధికార యంత్రాంగం వరద హెచ్చరికలతో ఆ రాత్రంగా జాగారం చేసిన దుకాణం సిబ్బంది, ఉదయం పూట యథా ప్రకారం దుకాణం తెరిచేందుకు ఉద్యుక్తులవుతున్నారు. బంగారం, ఇతర విలువైన సామగ్రిని సురక్షితంగా భద్రపర్చడం మర్చిపోయారు. సరిగ్గా ఆ సమయంలో ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా వేగంగా వరద ప్రవాహం దుకాణంలోకి చేరింది. తేరుకునేలోపే నగలున్న ట్రేలు, కాబిన్లను ఊడ్చిపెట్టుకుపోయింది. నగదు, నగలతోపాటు ఒక ఐరన్ సేఫ్ సైతం వరదతో పాటు మాయమైంది. బంగారం గొలుసులు, ఉంగరాలు, గాజులు, బ్రాస్లెట్లు, వజ్రపు ఉంగరాలు, వెండి ఆభరణాలు, పచ్చలు పోయిన వాటిల్లో ఉన్నాయి. ఐరన్ సేఫ్లో పెద్ద మొత్తంలో నగదుతోపాటు, కరిగించిన బంగారం, కొత్త బంగారు వస్తువులు ఉన్నాయి. వెరసి దుకాణదారుకు వాటిల్లిన నష్టం మార్కెట్ ధర ప్రకారం రూ.12 కోట్లని అంచనా. ఈ సొత్తు కోసం దుకాణం యజమాని కుటుంబంతోపాటు సిబ్బంది రెండు రోజులుగా కాళ్లకు బలపం కట్టుకుని మరీ ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. పోయిన వాటిలో సుమారు కిలో బంగారు ఆభరణాలు దొరికినట్లు అధికారులు చెబుతున్నారు. వరదల కారణంగా పట్టణంలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో, సీసీటీవీ ఫుటేజీ వ్యవస్థ దెబ్బతింది. దీనివల్ల వరద సమయంలో దుకాణంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు సరైన ఆధారమంటూ లేకుండా పోయింది. ఎవరైనా ఈ వస్తువులను తీసుకెళ్లారా? లేక వరదలోనే కొట్టుకుపోయాయా అనేది నిర్థారించడం సైతం కష్టంగా మారింది. తమ నగల దుకాణానికి సంబంధించిన విలువైన వస్తువులను ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా తీసుకున్నట్లు తెలిస్తే చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని యజమాని హెచ్చరిస్తున్నారు. దుకాణంలోని వస్తువులు వరదల్లో కొట్టుకుపోయినట్లు సమాచారం తెలుసుకున్న స్థానికులు సైతం గాలింపు మొదలుపెట్టారు. వరదలకు కొట్టుకు పోయి న బురద, మట్టిని తవ్వి మరీ చూస్తున్నారు. కొందరు మెటల్ డిటెక్టర్లతోనూ వెదుకుతున్నారు. ఈ గోల్డ్ రష్కు సంబంధించిన వీడియోలు ఆన్లైన్లో ప్రత్యక్షమవుతున్నాయి. అయితే, స్థానికులెవరూ దొరికిన వస్తువులను తమకివ్వలేదని దుకాణం యజమాని చెబుతున్నారు. అలా ఎవరైనా తీసుకుపోయినట్లు తెలిస్తే సమాచారమివ్వాలని స్థానికులను కోరుతున్నారు. తెచ్చిన వారికి ఆ వస్తువు విలువను బట్టి బహుమతులను సైతం ఇస్తామని ఆశచూపుతున్నారు.బీజింగ్లో వర్షాలు, వరదల్లో 44 మంది మృతి చైనా రాజధాని బీజింగ్ను భారీ వర్షాలు, వరదలు కకావికలం చేశాయి. శనివారం కురిసిన కుండపోత వానలు, వరదల్లో కనీసం 44 మంది చనిపోగా, 9 మంది గల్లంతయ్యారు. గత నాలుగు రోజులుగా బీజింగ్ సహాయక, రక్షణ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో మరోసారి భీకరంగా వాన కురియడంతో రహదారులు తెగిపోవడంతోపాటు, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని జనాన్ని సురక్షిత ప్రాంతాలకు యంత్రాంగం తరలిస్తోంది. బీజింగ్లో ఉత్తరాన ఉన్న పర్వతప్రాంత మియున్, యాంగ్వింగ్ జిల్లాల్లో అత్యధిక నష్టం వాటిల్లిందని అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. -
75 ఏళ్ల దౌత్య బంధం.. గుర్తుగా భారత్కు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రాక
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్ ఆగస్టు 4 నుండి 8 వరకు భారత్లో పర్యటించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఫిలిప్పీన్స్ అధ్యక్షునితో పాటు ప్రథమ మహిళ లూయిస్ అరనేటా మార్కోస్, క్యాబినెట్ మంత్రులు, సీనియర్ అధికారులు, పలువురు వ్యాపార ప్రతినిధులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భారత్కు రానుంది.2022లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు మార్కోస్ భారతదేశానికి రావడం ఇదే తొలిసారి. ఆగస్టు 5న ప్రధాని మోదీ- ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్ మార్కోస్ జూనియర్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు మార్కోస్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలుసుకోనున్నారు. ఆగస్టు 8న ఫిలిప్పీన్స్కు తిరిగి వెళ్లే ముందు ఆయన బెంగళూరును సందర్శిస్తారు.కాగా భారత్- ఫిలిప్పీన్స్ మధ్య దౌత్య సంబంధాలు 1949 నవంబర్లో ప్రారంభమయ్యాయి. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, సముద్ర సహకారం, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, ఔషధాలు, డిజిటల్ టెక్నాలజీ తదితర రంగాల్లో ఇరు దేశాల భాగస్వామ్యం కొనసాగుతోంది. వీసా ప్రాసెసింగ్ ప్లాట్ఫామ్ అట్లీస్ ప్రకారం, ఫిలిప్పీన్స్ వీసా రహిత ప్రవేశాన్ని ప్రకటించిన తర్వాత భారత్ నుండి ఫిలిప్పీన్స్ కు 28 శాతం మేరకు ప్రయాణాలు పెరిగాయి.కాగా ఫిలిప్పీన్స్ ఇటీవల 14 రోజుల పాటు ఉండేందుకు భారత పౌరులకు వీసా రహిత ప్రవేశాన్ని ప్రకటించింది. -
అమెరికాలో కూలిన యుద్ధ విమానం
కాలిఫోర్నియా: అమెరికాలో నేవీ యుద్ధ వి మానం ఎఫ్–35సీ కూలిపోయింది. సెంట్రల్ కాలిఫోర్నియాలోని లెమూర్లో ఉన్న నేవీ ఎ యిర్ స్టేషన్ సమీపంలో అమెరికా కాలమా నం ప్రకారం బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ఈ ఘటన జరిగింది. అయితే.. శిక్షణలో ఉన్నప్పుడు జరిగిన ఈ ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. విమానంలో అదనపు సిబ్బంది ఎవరూ లేరు. రెస్యూ్క టీమ్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టింది. అయితే.. జెట్ కూలిపోవడానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. జెట్ కూలిపోయిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమానం క్రాష్ కాగానే జెట్ శిథిలాల నుంచి భారీగా మంటలు ఎగసిపడు తున్నాయి. ఆ ప్రాంతమతా నల్లటి పొగ దట్టంగా అలుముకుంది. ఏ మేరకు నష్టం సంభవించింది? బేస్ కార్యకలాపాలపై ప్రభావం పడిందా? అనే విషయాలను నేవీ వెల్లడించలేదు. United States military f-35 jet has crashed and burst into flames at Lemoore Naval Airstation pic.twitter.com/ReohO7lGx2— Osaka James🇺🇸 (@osakajayms) July 31, 2025నావల్ ఎయిర్ స్టేషన్ లెమూర్, సెంట్రల్ కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో నగరానికి 64 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్టెల్త్ ఫైటర్ ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన వాటిలో ఒకటి. దీని ధర దాదాపు 115 మిలియన్లు డాలర్లు ఉంటుంది. అమెరికా రక్షణ దిగ్గజం లాక్హీడ్ మార్టిన్ అభివృద్ధి చేసింది. ఇది మల్టీరోల్ యుద్ధ విమానం. ఇది వైమానిక ఆధిపత్యం, గ్రౌండ్ అటాక్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్తో సహా విస్తృత శ్రేణి మిషన్ల ప్రయోగం కోసం రూపొందించారు. ఈ విమానం అధునాతన స్టెల్త్ టెక్నాలజీ, సెన్సార్లు, అత్యాధునిక ఏవియానిక్స్ను కలిగి ఉంది. ఇటీవల, వాతావరణం అనుకూలించక, తక్కువ ఇంధనం కారణంగా బ్రిటిష్ రాయల్ నేవీ ఎఫ్35బీ వేరియంట్ కేరళలో నెలరోజులపైగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. -
Ireland: భారత సంతతి యువకునిపై జాత్యహంకార దాడి
డబ్లిన్: ఐర్లాండ్లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన యువకునిపై జాత్యహంకార దాడి చోటుచేసుకుంది. ఆ యువకుడు తన అపార్ట్మెంట్కు సమీపంలో నడుచుకుంటూ వెళుతుండగా, అకస్మాత్తుగా ఆరుగురు యువకులు అతనిపై దాడి చేశారు. ఐర్లాండ్లో తాను ప్రేరేపిత జాత్యహంకార దాడిని ఎదుర్కొన్నానని భారత సంతతికి చెందిన డాక్టర్ సంతోష్ యాదవ్ ఘటనా క్రమాన్ని ‘లింక్డ్ఇన్’లో వివరించాడు.ఐర్లాండ్లో జాత్యహంకార యువకుల బృందం తనపై దాడి చేసిందని డాక్టర్ సంతోష్ యాదవ్ ఆరోపించారు.‘నేను రాత్రి భోజనం చేసిన తర్వాత, నా అపార్ట్మెంట్ సమీపంలో నడుచుకుంటూ వెళుతుండగా, ఆరుగురు యువకుల బృందం నాపై వెనుక నుంచి దాడి చేసింది. తరువాత వారు నా కళ్లద్దాలను లాక్కొని, వాటిని పగలగొట్టి, నా తల, ముఖం, మెడ, ఛాతీ, చేతులు, కాళ్లపై ఆగకుండా కొట్టారు. దీంతో నాకు తీవ్ర రక్తస్రావం అయింది. గార్డ్కు కాల్ చేసి,విషయం చెప్పాను. అంబులెన్స్ నన్ను బ్లాంచర్డ్స్టౌన్ ఆసుపత్రికి తీసుకెళ్లింది. నా చెంప ఎముక విరిగిందని వైద్య బృందం నిర్ధారించింది. ఇప్పుడు నన్ను ప్రత్యేక వైద్యసంరక్షణ కోసం రిఫర్ చేశారు’ అని సంతోష్ యాదవ్ పేర్కొన్నారు.ఐర్లాండ్లో మైనారిటీలపై హింస పెరుగుతున్నదని, అయినా అధికారులు నేరస్థులపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని సంతోష్ యాదవ్ ఆరోపించారు. దాడులు చేశాక వారు స్వేచ్ఛగా పారిపోతున్నారని, తిరిగి దాడి చేయడానికి ధైర్యం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఐర్లాండ్ ప్రభుత్వం, డబ్లిన్లోని భారత రాయబార కార్యాలయం, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఐర్లాండ్లోని భారత రాయబారి అఖిలేష్ మిశ్రాలను సంతోష్ యాదవ్ తన పోస్టుకు ట్యాగ్ చేశారు.యాదవ్ తన పోస్ట్లో రెండు ఫోటోలను ఉంచారు. ఒక ఫొటోలో అతని ముక్కు నుంచి రక్తం కారుతున్నట్లు ఉండగా, మరొక ఫోటోలో అతని చేతిలో విరిగిన కంటి అద్దాలు ఉన్నాయి. డాక్టర్ సంతోష్ యాదవ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఆయన కాన్పూర్ విశ్వవిద్యాలయం నుండి బీటెక్ పూర్తి చేశాడు. తరువాత ఘజియాబాద్లోని అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ నుండి పీహెచ్డీ చేసాడు. ప్రస్తుతం సంతోష్ యాదవ్ సీనియర్ డేటా సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు. ఐర్లాండ్లోని డబ్లిన్లో ఉంటున్న ఆయన ఒక టెక్ కంపెనీకి సహ వ్యవస్థాపకునిగా ఉన్నారు. -
భారత్-రష్యా బంధం.. ఐ డోంట్ కేర్: ట్రంప్
మిత్రదేశం అంటూనే భారత దిగుమతులపై 25 శాతం సుంకం విధించిన ట్రంప్.. మరో బాంబ్ పేల్చారు. భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేయడమే అందుకు కారణమని కూడా ఆయన అన్నారు. ఈ తరుణంలో భారత్-రష్యా బంధంపైనా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను మరింత పతనం చేసుకుంటున్నాయని అన్నారాయన. భారత్ రష్యా (Russia) నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోంది. ఆ రెండు దేశాలు ఏ వ్యాపారం చేసుకున్నా నాకు సంబంధం లేదు. కాకుంటే వారి ఆర్థిక వ్యవస్థను ఆ దేశాలు మరింత పతనం చేసుకుంటున్నాయి అని వ్యాఖ్యానించారాయన. న్యూఢిల్లీతో చాలా తక్కువ వ్యాపారం చేస్తున్నామన్న ఎందుకంటే భారత్ అత్యధికంగా సుంకాలు విధిస్తుందని, ఇది ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని ఆరోపించారాయన. ఈ సందర్భంగా.. రష్యా, యూఎస్లు కలిసి ఎలాంటి వ్యాపారం చేయట్లేదని ట్రంప్ స్పష్టంచేశారు. అలాగే రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్పై విరుచుకుపడ్డారు. ‘‘మెద్వెదేవ్ ఓ విఫల నేత. ఆయన ఇప్పటికీ తానే అధ్యక్షుడిని అనుకుంటున్నారేమో. ఆయన మాటలను చూస్తే అలాగే అనిపిస్తోంది. ఆయన ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నారు’’ అని ట్రంప్ హెచ్చరికలు చేశారు. భారత్ మిత్రదేశమే అయినా.. సుంకాలు ఎక్కువగా ఉన్నందున వారితో పరిమిత స్థాయిలో వ్యాపారాలు చేస్తున్నాం. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటి. ఏ దేశంలో లేని విధంగా వాణిజ్యపరంగా అక్కడ అడ్డంకులున్నాయి. రష్యా నుంచి భారీ స్థాయిలో సైనిక ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేస్తోంది. ఉక్రెయిన్పై దాడులను ప్రపంచమంతా ఖండిస్తోంది. భారత్, చైనాలు మాత్రం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాయి. అందుకే భారత్పై 25శాతం సుంకాలు అదనంగా పెనాల్టీ కూడా విధిస్తున్నాం. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి అని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై భారత ప్రభుత్వం స్పందిస్తూ.. ద్వైపాక్షిక వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనను గమనించాం. సుంకాల ప్రభావంపై అధ్యయనం చేస్తున్నాం. రైతులు, వ్యాపారవేత్తలతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. బ్రిటన్తో ఇటీవల కుదుర్చుకున్న ‘ఎఫ్టీఏ’ సహా ఇతరత్రా వాణిజ్య ఒప్పందాల మాదిరిగానే.. ఈ వ్యవహారంలోనూ జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం అని ఓ ప్రకటనలో పేర్కొంది.ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో ట్రంప్ రష్యాకు అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. మరో 10, 12 రోజుల్లో శాంతి ఒప్పందానికి పుతిన్ గనుక ముందుకు రాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. అయితే ట్రంప్ ‘అల్టిమేటం గేమ్’ యుద్ధానికి దారి తీస్తుందని దిమిత్రి మెద్వెదేవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని అయిన మెద్వెదేవ్.. ప్రస్తుతం రష్యా సెక్యూరిటీ కౌన్సిల్కు డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు. ట్రంప్ జారీ చేసే ప్రతీ అల్టిమేటం యుద్ధం వైపునకు అడుగుగా మారుతుంది. ఇది ఉక్రెయిన్ రష్యా మధ్య కాదు.. అమెరికాతోనే అంటూ సోషల్ మీడియాలో ఆయన ఓ ఘాటు పోస్ట్ చేశారు. -
కాలిఫోర్నియా గవర్నర్ పోటీపై కమలా హారిస్ ఆసక్తికర ప్రకటన
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో 2028లో జరగబోయే గవర్నర్ ఎన్నికల్లో తన పోటీపై మాజీ ఉపాధ్యక్షురాలు, అమెరికన్ డెమొక్రాటిక్ పార్టీ సభ్యురాలు కమలా హారిస్ ఆసక్తికర ప్రకటన చేశారు. గతంలో కాలిఫోర్నియా అటార్నీ జనరల్, యూఎస్ సెనేటర్గా పనిచేసిన కమలా హారిస్ తన రాజకీయ భవిష్యత్ ప్రణాళికలను సూచన ప్రాయంగా వెల్లడించారు.2026లో కాలిఫోర్నియా గవర్నర్ పదవికి జరిగే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని కమలా హారిస్ తన సోషల్ మీడియా ఖాతాలో తెలియజేశారు. ఈ ప్రకటన నేపధ్యంలో ఆమె 2028లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. తన పోస్టులో కమలా హారిస్.. ‘గత ఆరు నెలలుగా తాను అమెరికన్ ప్రజల శ్రేయస్సు కోసం పోరాటం కొనసాగించేందుకు ఉత్తమ మార్గం గురించి ఆలోచిస్తున్నాను. నా కెరీర్ తొలి రోజుల నుండి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి, మెరుగైన భవిష్యత్తు కోసం పోరాడుతున్నాను. ఇందుకు ఉత్తమ మార్గం వ్యవస్థను సంస్కరించడమేనని నేను నమ్ముతున్నాను. ప్రాసిక్యూటర్, అటార్నీ జనరల్, యునైటెడ్ స్టేట్స్ సెనేటర్, వైస్ ప్రెసిడెంట్గా దేశానికి సేవ చేయడం నాకు గౌరవప్రదంగా ఉంది’ అని అన్నారు. My statement on the California governor's race and the fight ahead. pic.twitter.com/HYzK1BIlhD— Kamala Harris (@KamalaHarris) July 30, 2025అలాగే 'ఇటీవల కొంతకాలంగా కాలిఫోర్నియా గవర్నర్గా పోటీ చేస్తారా? అని కొందరు అడిగిన దరిమిలా దీనిపై నేను ఆలోచించాను. నేను ఈ రాష్ట్రాన్ని, ఇక్కడి ప్రజలను ప్రేమిస్తున్నాను. అయితే లోతుగా ఆలోచించిన తర్వాత, ఈ ఎన్నికల్లో గవర్నర్ పదవికి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతానికి నేను ఏ ఎన్నికైన పదవిలోనూ ఉండకూడదని అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో నా భవిష్యత్ ప్రణాళికల గురించి మరింత సమాచారాన్ని పంచుకుంటాను’ అని కమలా హారిస్ అన్నారు. ఆమె గతంలో రెండుసార్లు అధ్యక్ష పోటీలో నిలిచారు. అయితే రెండు సార్లూ ఓటమి పాలయ్యారు. 2024లో కమలా హారిస్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, ట్రంప్ చేతిలో ఓడిపోయారు. -
వరదల్లో కొట్టుకుపోయిన 20 కేజీల బంగారం.. తర్వాత ఏం జరిగిందంటే?
చైనాను కొన్ని రోజులుగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదలు కారణంగా షాంగ్జీ ప్రావిన్స్లో ఓ బంగారం షాపులో నుంచి గోల్డ్, వెండి ఆభరణాలు కొట్టుకుపోయాయి. దీంతో వాటిని వెతికేందుకు వీధుల్లో జనం పోటీపడ్డారు. షాంగ్జీ ప్రావిన్స్లోని వుచి కౌంటీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.సముద్ర తీరానికి సమీపంలో ఉండే ఈ ప్రాంతం భారీ వర్షాలతో వరదమయంగా మారింది. బంగారు నగల షాపును ఎప్పటిలాగే జులై 25న ఉదయం తెరిచారు. దీంతో వరద నీరు దుకాణంలోకి దూసుకొచ్చింది. దీంతో షాపులోని నగలు కొట్టుకుపోయాయి. సేఫ్ బాక్సులో రీసైకిల్ చేసిన బంగారంతో పాటు భారీగా నగదు కూడా ఉన్నట్లు ఆ షాపు యజమాని పేర్కొన్నారు. దాదాపు 20 కిలోల బంగారం, వెండి గల్లంతయ్యాయి. మొత్తం నష్టం విలువ 10 మిలియన్ యువాన్ (రూ.12 కోట్లు)గా అంచనా. A gold shop in Wuqi County, Shaanxi says around 20kg of jewelry was lost in recent floods. About 1kg has been recovered so far. Police are investigating, and local authorities are urging anyone who found gold to return it. #Shaanxi #floods pic.twitter.com/kZQsaLqJnz— Spill the China (@SpilltheChina) July 27, 2025 అయితే, బంగారం కొట్టుకుపోయిన విషయం తెలియగానే స్థానికులు భారీగా వీధుల్లోకి చేరుకుని బంగారం కోసం వెతుకులాట ప్రారంభించారు. మెటల్ డిటెక్టర్లు ఉపయోగించి మరి ఆభరణాల కోసం వెతుకుతున్నారు. ఇప్పటివరకు 1 కిలో బంగారం మాత్రమే తిరిగి లభించింది. కొంతమంది స్వచ్ఛందంగా తిరిగి ఇచ్చారు కానీ చాలా మంది తిరిగి ఇవ్వలేదని దుకాణ యజమాని తెలిపారు. బంగారాన్ని దొంగిలించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఆయన హెచ్చరించారు. -
హమాస్కు అరబ్ దేశాల గట్టి షాక్
టెల్ అవీవ్: గాజాపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్న హమాస్కు అరబ్ దేశాల నుంచి గట్టి షాక్ తగిలింది. కొన్నాళ్లుగా గాజాపై హమాస్ సాగిస్తున్న దారుణ మారణకాండను అరబ్ దేశాలు ఖండిస్తూ, ఒక ప్రకటన విడుదల చేశాయి. దానిలో గాజా నుంచి హమాస్ తక్షణం వైదొలగాలని హెచ్చరించాయి. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితిలో జరిగిన సమావేశానికి సహ అధ్యక్షత వహించిన ఫ్రాన్స్.. సౌదీ అరేబియా చేసిన ఈ ప్రకటనను స్వాగతించింది. దీనిని చారిత్రాత్మక ఘటనగా పేర్కొంది.సౌదీ అరేబియా, ఖతార్, ఈజిప్ట్, టర్కీ, జోర్డాన్తో సహా పలు అరబ్, ముస్లిం దేశాలు తాజాగా 2023, అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడులను ఖండించాయి. గాజా స్ట్రిప్లో పాలస్తీనియన్ సమూహం దాని పాలనను ముగించాలని కోరాయి. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి (యూఎన్) సమావేశంలో అరబ్ లీగ్, యూరోపియన్ యూనియన్ (ఈయూ), 17 ఇతర దేశాలు ఒక ప్రకటన చేశాయి. హమాస్ తన చెరలో ఉంచిన బందీలను విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. ఈ ప్రకటనలో అరబ్ దేశాలు,ముస్లిం దేశాలు సంయుక్తంగా గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ చర్యలను ఖండించాయి. పాలస్తీనా శరణార్థుల కోసం పాటుపడుతున్న యూఎన్ ఏజెన్సీలపై నిషేధాన్ని ఎత్తివేయాలని ఇజ్రాయెల్ నేతలను కోరాయి. గాజాలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు విదేశీ దళాలను మోహరించాలని అరబ్ నేతలు కోరారు. గాజాలో తలెత్తుతున్న ఆకలి చావులను ఖండిస్తున్నామని అరబ్ దేశాలు ఆ ప్రకటనలో పేర్కొన్నాయి.ఈ సందర్భంగా ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారోట్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్తో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావాలనే అరబ్ ఉద్దేశ్యాన్ని ఈ ప్రకటన స్పష్టం చేస్తున్నదన్నారు. కాగా గాజాలో ఘర్షణలు ప్రారంభమై 21 నెలలు గడిచింది. ఈ ఘర్షణల్లో 1,200 మందికి పైగా జనం మృతి చెందారు. ఈ యుద్ధం గాజాలోని లక్షలాదిమందిని నిర్వాసితులను చేసిందని, ఈ ప్రాంతంలో మానవతా సంక్షోభానికి కారణంగా నిలిచిందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. -
‘మా సాయంతో భారత్కు పాక్ చమురు’: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: పహల్గామ్ ఉగ్ర ఘటన తరువాత భారత్-పాక్ల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఇప్పుడు వీటికి ఆజ్యం పోసేలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వ్యాఖ్యలు భారత్కు ఆగ్రహాన్ని తెప్పించేలా ఉన్నాయి. ఏదో ఒకరోజు భారత్కు పాకిస్తాన్ చమురు అమ్ముతుందని, అందుకు తాము పాక్కు సాయం చేస్తామని ట్రంప్ వ్యాఖ్యానించారు.భారత్పై 25శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించిన కొన్ని గంటలకు ట్రంప్ మరోమారు భారత్- పాక్ మధ్య చిచ్పుపెట్టే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చమురు నిల్వలను భారీగా అభివృద్ధి చేసేందుకు పాకిస్తాన్ తాజాగా అమెరికాతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుక్నునదని, అయితే ఈ భాగస్వామ్యానికి ఏ కంపెనీ సారధ్యం వహించాలనే విషయాన్ని ఇంకా నిర్ణయించలేదని ట్రంప్ పేర్కొన్నారు. బహుశా పాకిస్తాన్ ఏదో ఒక రోజు భారతదేశానికి చమురు అమ్మే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ ద్వారా ఈ ప్రకటన చేశారు. తాము పాకిస్తాన్తో ఒక ఒప్పందాన్ని ముగించామని, ఈ మేరకు పాకిస్తాన్- యునైటెడ్ స్టేట్స్ సంయుక్తంగా చమురు నిల్వలను భారీగా అభివృద్ధి చేయడంలో కలిసి పనిచేస్తాయన్నారు. ఇదే పోస్ట్లో ట్రంప్.. అమెరికాను చాలా సంతోషపెట్టాలని కోరుకునే పలు దేశాల నేతలతో మాట్లాడానని పేర్కొన్నారు. కొన్ని దేశాలు సుంకాల తగ్గింపు కోసం అమెరికాకు ఆఫర్లు ఇస్తున్నాయని, ఇది దేశ వాణిజ్య లోటును భారీగా తగ్గిస్తుందని పేర్కొన్నారు.తాము వైట్ హౌస్ లో వాణిజ్య ఒప్పందాలపై కసరత్తు చేస్తూ చాలా బిజీగా ఉన్నామని, ఈరోజు మధ్యాహ్నం దక్షిణ కొరియా వాణిజ్య ప్రతినిధి బృందాన్ని కలుస్తానన్నారు. దక్షిణ కొరియా ప్రస్తుతం 25శాతం సుంకాలను కలిగివుందని, అయితే వారు ఆ సుంకాలను తగ్గించే ప్రతిపాదనతో ఉన్నారని, అందుకు వారు ఇచ్చే ఆఫర్ ఏమిటో వినడానికి తాను ఆసక్తిగా ఉన్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు. భారతదేశంపై 25 శాతం సుంకాలు విధించనున్నామని, అయితే ఇరు దేశాల మధ్య ఇంకా చర్చలు నడుస్తున్నాయని, ఈ వారం చివరి నాటికి సుంకాల విషయంలో స్పష్టత వస్తుందని ట్రంప్ వివరించారు. -
వాంగా చెప్పినట్టే ..ఐతే కొంచెం లేటుగా!
అవును. ఆమె చెప్పిందే జరిగింది. జపనీస్ బాబా వాంగా పేరిట ఫేమస్ అయిన మాంగా ఆర్టిస్ట్ రియో తత్సుకి చెప్పింది అక్షరాలా నిజమైంది. జపా న్ తీరాలను పెద్ద సునామీ తాకింది. ఆమె చెప్పిన తేదీన కాకపోయినా మొత్తానికైతే ఘటన జరగనే జరిగింది. జపాన్ తీరాన్ని జులై 5న సునామీ ముంచెత్తుతుందని చెప్పగా ఆ ఉత్పాతం జూలైæ 30న ముంచుకొచ్చింది. దాంతో మాంగా పేరు సోషల్ మీడియాలో మరోసారి మారుమోగుతోంది. ఎవరీ రియో తత్సుకి?తత్సుకి సాధారణ మాంగా ఆర్టిస్ట్ కాదు. ఆమె కలల మధ్య నడిచిన సత్యమని చెబితే అతిశయోక్తేమీ కాదు. ‘ద ఫ్యూచర్ దట్ ఐ సా (నేను చూసిన భవిష్యత్తు)’ పేరిట 1990 దశాబ్దం చివరలో ఆమె ఓ పుస్తకం రాసింది! ఆ పుస్తకంలో తాను నిద్రలో చూసిన కలల్ని కథలుగా మార్చింది. అప్పట్లో దాన్నెవరూ పట్టించుకోలేదు. కామిక్ పుస్తకంగా భావించారు. 2011 మార్చిలో భారీ విపత్తు వస్తుందని పుస్తకంపై ఓ మాట ఉంది. అన్నట్టుగానే అదే నెలలో జపాన్ను భూకంపం, సునామీ వణికించాయి. దాంతో అంతా షాకయ్యారు. ఆ ఘటన తర్వాత ఆమెకు భవిష్యద్దర్శన శక్తి ఉందని కొందరు నమ్మడం మొదలుపెట్టారు. తత్సుకి కలలు ఇప్పుడు మరోసారి ప్రజలను భయపెడుతున్నాయి. ఆ పుస్తకానికి 2021లో మరో ఎడిషన్ తీసుకొచ్చిందామె. అందులో ఓ కొత్త తేదీ వేసింది. అదే 2025 జూలై 5. ఆ రోజు ఫిలిప్పైన్స్ సముద్రంలో భారీ విస్ఫోటనం జరగబోతుందని, సముద్రం ఉప్పొంగిబోతుందని, వరుస భూకంపాలు రావొచ్చని చెప్పింది. 2011 సునామీ కన్నా మూడు రెట్లు ఎక్కువ ప్రళయం రావచ్చంటూ డ్రాయింగ్ వేసింది. అంతటి ఉత్పాతం జరగకపోయినా అదే నెలలో జపాన్ను సునామీ వణికించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రింగ్ ఆఫ్ ఫైర్
ప్రకృతి ఓ దెయ్యంలా మెల్లగా ఒళ్లు విరుచుకుని అలా సాగర జలాల్లోకి కాలు పెట్టింది...! అంతే తీరాన్ని తుత్తునియలు చేసేలా అలలు మిన్నంటి మరీ ఎగిసిపడ్డాయి. ఆ ధాటికి భూమి ఉలిక్కిపడింది. రష్యాను ఠారెత్తించిన బలమైన భూకంపం, ఆ వెంటనే విరుచుకుపడ్డ సునామీ హడలెత్తించాయి. ప్రపంచపు మోకాలిగా చెప్పదగ్గ ఆ రహస్య ప్రాంతంలో పుట్టిన మంటలు, ప్రకంపనలతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. ఆ ప్రాంతమే ‘రింగ్ ఆఫ్ ఫైర్’. అగ్నిపర్వతాలు ఎందుకు అక్కడే ఉప్పొంగుతాయి? భూకంపాలు ఎందుకు అక్కడే ఠంచనుగా ప్రతి వారం సంభవిస్తాయి? ఈ వలయం, దాని తాలూకు విలయం వెనక దాగున్న రహస్యం ఏమిటి?సైలెంట్ కిల్లర్మౌనంగా కనిపించే మృగాలే మహా ప్రమాదకరం. రింగ్ ఆఫ్ ఫైర్లోని అగ్నిపర్వతాలు కూడా ఆ బాపతే. చూసేందుకు నిద్రాణంగా కనిపిస్తాయి కానీ, భూమి లోతుల్లో మంటలు ముదిరిన ప్రతిసారీ ఆ మౌనం పెను శబ్దంగా మారుతుంది. కొన్నిసార్లు విస్ఫోటనంలా బయటపడుతుంది. రష్యాలోని కమ్చా తీరంలో ఎగిసిపడి, ఇటు జపాన్తీరాన్ని కూడా తాకిన ఆ రాకాసి అలలకు కారణమదే. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అచ్చం వలయంలా ఉంటుంది. అతి పెద్దదైన పసిఫిక్ మహాసముద్రాన్ని అట్టడుగున కప్పేసే అగ్నివలయమిది. ఈ మంటల మార్గం దాదాపు 40 వేల కిలోమీటర్ల పొడవుంటుంది! దక్షిణ అమెరికా కొసన మొదలై ఉత్తర అమెరికా తీరాల దా కొనసాగుతుంది. అటు అలాస్కా ద్వీపాలను తాకి, బేరింగ్ సముద్రం దాటి, జపాన్ మీదుగా ఇటు న్యూజిలాండ్ వరకు వ్యాపించి ఉంది. దక్షిణ ధ్రువంలోని మంచు అగ్నిపర్వతాల వరకు చేరుతుంది. ఈ మార్గంలోని దేశాలు మనకు తెలియని ప్రమాదంతో నిత్యం మందుపాతరపై భయంభయంగా గడుపుతున్నాయి. చిలీ, పెరూ, మెక్సికో, అమెరికా, కెనడా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఇండొనేసియా, న్యూజిలాండ్... ఇలా ప్రపంచంలోని అతి శక్తిమంతమైన అగ్నిపర్వతాలన్నీ ఈ వలయంలోనే ఉన్నాయి. భూకంపాలు, అగ్ని విస్ఫోటనలూ ఈ ప్రాంతంలోనే ఎక్కువ.పలకల్లో కలకలంరింగ్ ఆఫ్ ఫైర్లో జరుగుతున్నది భూమి లోతుల్లో భూ పలకల పోరాటం. బయటి నుంచి బలంగా, స్థిరంగా కనిపించే భూమి లోలోతుల్లో ఈ భూ పలకలు ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి. అవి పరస్పరం ఢీకొన్నప్పుడు భూమి కంపిస్తుంది. ఒక పలక కిందకి జారితే అక్కడ పెను మంటల్లాంటివి పుట్టుకొస్తాయి. రష్యాలో తాజా భూకంపానికి కారణం కూడా ఇదే. పసిఫిక్ ప్లేట్ తాలూకు ఒక పెద్ద భూ పలకం, ఉత్తర అమెరికా పలకం పరస్పరం ఢీకొన్నాయి. దాంతో భూమి లోతుల్లో ఒత్తిడి పెరిగి భూగోళం అంతటినీ ఊపేసింది. అందుకే కమ్చట్కా తీరంలో ఏకంగా 8.8 తీవ్రతతో నేల వణికిపోయింది. ఆ వెంటనే సముద్రం గర్జించి అలలుగా ఎగిసింది. ఇలాంటివి రింగ్ ఆఫ్ ఫైర్లో నిజానికి నిత్య సన్నివేశాలే.పసిఫిక్కు గుండెకాయ!పసిఫిక్ మహాసముద్రాన్ని ఒక సువిశాల శరీరంగా భావిస్తే రింగ్ ఆఫ్ ఫైర్ను దాని గుండెగా చెప్పొచ్చు. అక్కడే శ్వాస, అక్కడే ధ్వని, అక్కడే మంట! ఈ గుండె ఒక్కసారి గట్టిగా కొట్టుకుందంటే చాలు... రష్యాలో అలలు ఎగసిపడతాయి. జపాన్ తీరాలు వణికిపోతాయి. అలాంటి గుండెపోటు ఇప్పుడు జరుగుతోంది. అదే కమ్చట్కాలో, జపాన్తీరాంలో సునామీ రూపంలో ఎగసిపడింది. ఈ రింగ్ ఆఫ్ ఫైర్ మానవాళికి ఒక శక్తి, ఒక శాపం, ఒక శాస్త్రం. అది ఎప్పుడు, ఎక్కడ మళ్లీ పుడుతుందో ఎవ్వరికీ తెలీదు. పుట్టిందంటే మాత్రం దాని దెబ్బకు ప్రపంచమంతా విలవిలలాడిపోవాల్సిందే.– సాక్షి, నేషనల్ డెస్క్ -
25 శాతం సుంకాలు
ప్రభావాన్ని సమీక్షిస్తున్నాం: కేంద్రం భారత్పై 25 శాతం సుంకాల విధింపు, రష్యాతో వర్తకం చేస్తున్నందుకు జరిమానా ప్రకటన తాలూకు ప్రభావాన్ని మదింపు చేస్తున్నట్టు కేంద్రం పేర్కొంది. ఈ విషయంలో దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఇరు దేశాలకూ ఆమోదనీయ, లాభదాయక రీతిలో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు కట్టుబడి ఉన్నాం. కొద్ది నెలలుగా ఆ దిశగాఅత్యున్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి’’అని గుర్తు చేసింది. వీటిలో భాగంగా ఆరో రౌండ్ చర్చల నిమిత్తం అమెరికా బృందం ఆగస్టు 25న భారత్ రానుంది.వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై అనూహ్యంగా భారీ టారిఫ్ బాంబు విసిరారు. భారత దిగుమతులపై ఏకంగా 25 శాతం సుంకాలు బాదారు. అంతేగాక వీటికి అదనంగా రష్యాతో వర్తకం చేస్తున్నందుకు భారత్పై ప్రత్యేకంగా జరిమానా కూడా విధించనున్నట్టు పేర్కొన్నారు. ఆ మొత్తం ఎంత న్నది పేర్కొనలేదు. ఈ నిర్ణయాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ట్రూత్ సోషల్’లో బుధవారం ఈ మేరకు ఆయన పలు పోస్టులు పెట్టారు. అమెరికాతో భారత వర్తక విధానాలు, నిబంధనలను అత్యంత దారుణమైనవిగా అభివర్ణించారు.‘‘భారత్ మా మిత్ర దేశమే. కానీ వర్తక, వాణిజ్య సంబంధాల విషయంలో ఆ దేశంతో అంతా సజావుగా లేదు. అమెరికాపై ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్లు వసూలు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. అందుకే ఆ దేశంతో మేం భారీ స్థాయిలో వ్యాపారం చేయడం లేదు’’అని రాసుకొచ్చారు. భారత్తో అమెరికాకు భారీ వర్తక లోటు ఉందని గుర్తు చేశారు. రష్యా నుంచి భారీగా చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తున్నందుకే అదనంగా జరిమానా విధిస్తున్నట్టు స్పష్టం చేశారు. ‘‘ఉక్రెయిన్లో జనహననం ఆగాలని ప్రపంచమంతా ఆకాంక్షిస్తోంది. ఇలాంటి సమయంలో అందుకు పాల్పడుతున్న రష్యాతో భారత్ భారీ వాణిజ్య సంబంధాలు నెరుపుతోంది’’అంటూ ఆక్షేపించారు.అదే జరిగితే రష్యాతో వాణిజ్యం చేస్తున్నందుకు అమెరికా నుంచి జరిమానా ఎదుర్కోనున్న తొలి దేశం భారతే అవుతుంది. భారత్తో వర్తక ఒప్పందం నిమిత్తం అమెరికా బృందం ఆగస్టు 25 నుంచి భారత్లో పర్యటించనుందని కేంద్రం ప్రకటించిన మర్నాడే ట్రంప్ నుంచి అనూహ్యంగా సుంకాల పోటు నిర్ణయం వెలువడటం గమనార్హం. ఈ దెబ్బకు రూపాయి విలువ గత మూడేళ్లలో అత్యధికంగా బుధవారం ఏకంగా 89 పైసలు పతనమైంది. అమెరికా డిమాండ్లకు తలొగ్గేలా భారత్పై ఒత్తిడి పెంచడమే ట్రంప్ ప్రకటన ఉద్దేశమని భావిస్తున్నారు.ఇటీవలి కాలంలో జపాన్, బ్రిటన్, యూరోపియన్ యూనియన్పై కూడా ట్రంప్ ఇలాంటి ఒత్తిళ్లే తెచ్చి అమెరికాకు అనుకూలంగా ఒప్పందాలు కుదుర్చుకుందని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. గతంలో చైనాపై కూడా ఇలాగే ట్రంప్ అడ్డగోలుగా టారిఫ్లను ప్రకటించడం, చివరికి వెనక్కు తగ్గడం తెలిసిందే. భారత చమురు దిగుమతుల్లో కేవలం 0.2 శాతంగా ఉన్న రష్యా వాటా ఉక్రెయిన్తో ఆ దేశం యుద్ధానికి దిగిన అనంతరం ఏకంగా 35 నుంచి 40 శాతానికి పెరిగింది. అయితే ఇప్పటికీ రష్యా నుంచి అతి పెద్ద చమురు దిగుమతిదారుగా చైనాయే నిలుస్తోంది. ఆ దేశంపై మాత్రం ట్రంప్ ఎలాంటి జరిమానాలు విధించలేదు. ట్రంప్ సుంకాల నిర్ణయంపై భారత పరిశ్రమల రంగం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.ట్రంప్ ప్రకటించిన 25 శాతం సుంకాలు ఇప్పటికే అన్ని దేశాలతో పాటు భారత్పైనా అమల్లో ఉన్న 10 శాతం బేస్లైన్ టారిఫ్లకు అదనమా, కాదా అన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. అన్ని దేశాలపై 10 శాతం టారిఫ్ ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వచి్చంది. దీనికి అదనంగా స్టీల్, అల్యుమినియం దిగుమతులపై 50 శాతం, ఆటో రంగంపై 25 శాతం అదనపు సుంకాలను కూడా ట్రంప్ విధించారు. ట్రంప్ ప్రకటన వెలువడ్డ కాసేపటికే కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ భేటీ జరిపి పరిస్థితిని సమీక్షించారు. ఏప్రిల్లో 26 శాతం సుంకాలు భారత్తో వాణిజ్య ఒప్పందం ఖరారు కాలేదని మంగళవారమే ట్రంప్ మీడియాకు చెప్పడం తెలిసిందే. 25 శాతం టారిఫ్ విధించనున్నట్టు అప్పుడే ఆయన సంకేతాలిచ్చారు. 20 నుంచి 25 శాతం దాకా టారిఫ్లు విధిస్తారా అని మీడియా ప్రశ్నించగా, అలాగే భావిస్తున్నట్టు బదులిచ్చారు. గత ఏప్రిల్ 2న భారత్పై 26 శాతం టారిఫ్లను ట్రంప్ ప్రకటించారు. కొద్ది రోజులకే ఆ నిర్ణయం అమలును 90 రోజుల పాటు, అంటే జూలై 9 దాకా, అనంతరం ఆగస్టు 1 దాకా వాయిదా వేశారు. అమెరికా, భారత్ నడుమ వాణిజ్య ఒప్పందం నిమిత్తం అత్యున్నత స్థాయి బృందాల నడుమ ఇప్పటికే ఐదు రౌండ్ల పాటు చర్చలు జరిగాయి. అతి పెద్ద వాణిజ్య భాగస్వామి 2021–25 నడుమ భారత్కు అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. భారత మొత్తం ఎగుమతుల్లో అమెరికా వాటా 18 శాతం. అమెరికాతో భారత్కు 2022–23లో 27.7 బిలియన్లు, 2023–24లో 35.32 బిలియన్లు, 2024–25లో 41 బిలియన్ డాలర్ల మేరకు వాణిజ్య మిగులు నమోదైంది. 2024–25లో భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 186 బిలియన్ డాలర్ల మేర నమోదైంది. వీటిలో భారత్ 86.5 బిలియన్ డాలర్ల మేర వస్తువులను ఎగుమతి చేయగా, 45.3 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది. సేవల రంగంలో అమెరికాకు 28.7 బిలియన్ డాలర్ల మేరకు ఎగుమతులు జరిపింది. 25.5 బిలియన్ డాలర్ల మేరకు దిగుమతులు చేసుకుంది.మొత్తమ్మీద అమెరికాతో వాణిజ్యంలో భారత్ 44.4 బిలియన్ డాలర్ల మిగులు నమోదు చేసింది. ఇది ట్రంప్కు కంటగింపుగా మారింది. అందుకే ఇలా పదేపదే టారిఫ్ల కత్తి దూస్తున్నారు. 2024లో అమెరికాకు భారత ఎగుమతుల్లో డ్రగ్ ఫార్మూలాలు–బయోలాజికల్స్ (8.1 బిలియన్లు), టెలికాం పరికరాలు (6.5 బిలియన్లు), అరుదైన రాళ్లు (5.3 బిలియన్లు) పెట్రోలియం ఉత్పత్తులు (4.1 బిలియన్లు), వాహనాలు–ఆటో పరికరాలు (2.8 బిలియన్లు), బంగారం–ఇతర లోహాలు (3.2 బిలియన్లు) రెడీమేడ్ దుస్తులు, కాటన్ తదితరాలు (2.8 బిలియన్లు) ఇనుము, స్టీల్ ఉత్పత్తులు (2.7 బిలియన్లు) ప్రధానమైనవి. అమెరికా నుంచి దిగుమతుల్లో ప్రధానంగా చమురు (4.5 బిలియన్లు), పెట్రో ఉత్పత్తులు (3.6 బిలియన్లు), బొగ్గు, కోక్ (3.4 బిలియన్లు), వజ్రాలు (2.6 బిలియన్లు), ఎలక్ట్రిక్ యంత్రాలు (1.4 బిలియన్లు), విమాన, రాకెట్ల విడిభాగాలు (1.3 బిలియన్లు), బంగారం (1.3 బిలియన్లు) ఉన్నాయి. మోదీతో ట్రంప్ స్నేహానికి ఇదీ ఫలం!: విపక్షాల ధ్వజం భారత్పై 25 శాతం టారిఫ్ల విధింపు మోదీ ప్రభుత్వ ఘోర వైఫల్యమేనంటూ విపక్షాలు దుయ్యబట్టాయి. మోదీతో స్నేహానికి ట్రంప్ ఏ మాత్రమూ విలువ ఇవ్వడం లేదనేందుకు ఇది తాజా నిదర్శనమని ఎద్దేవా చేశాయి. మోదీపై ట్రంప్ తారీఫ్ (పొగడ్తలు), హౌడీ మోడీ వంటి నినాదాలు ఎందుకూ కొరగానివని తేలిపోయిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎక్స్లో పేర్కొన్నారు.భారత్–పాక్ యుద్ధాన్ని ఆపానని ట్రంప్ 30సార్లకు పైగా చెప్పుకున్నారు. పాక్ ఆర్మీ చీఫ్కు వైట్హౌస్లో ప్రత్యేక విందు ఇచ్చారు. ఐఎంఎఫ్ నుంచి భారీ ఆర్థిక సహాయ ప్యాకేజీ ఇప్పించారు. ఇన్ని చేస్తున్నా మౌనంగా భరిస్తే బహుశా ట్రంప్ నుంచి స్పెషల్ ట్రీట్మెంట్ లభిస్తుందని మోదీ ఆశపడ్డారు. కానీ అలా జరగలేదు’’అన్నారు. కాంగ్రెస్ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నుంచి స్ఫూర్తి పొంది అమెరికా అధ్యక్షుని నిర్ణయాలను దీటుగా ఎదిరించాలని మోదీకి సూచించారు. టీఎంసీ, డీఎంకే, ఆర్జేడీ, వామపక్షాలు తదితరాలు కూడా మోదీ ప్రభుత్వానిది ఘోర వైఫల్యమంటూ నిందించాయి. ఇది భారత్కు తీవ్ర అవమానమని అభిప్రాయపడ్డాయి. -
సునామీ ప్రకంపనలు
టోక్యో/మాస్కో/వాషింగ్టన్/న్యూఢిల్లీ: రష్యా సమీప పసిఫిక్ మహాసముద్రగర్భంలో జనించిన ప్రళయ భీకర సునామీ రెప్పపాటులో ఆ సముద్ర తీర దేశాలను చివురుటాకులా వణికించింది. సముద్రగర్భ భూకంపం ధాటికి ఉద్భవించిన రాకాసి అలలు క్రూరంగా తీరపట్టణాలపై విరుచుకుపడ్డాయి. రిక్టర్స్కేల్పై 8.8 తీవ్రతతో మొదలైన భూ ప్రకంపనలు తీర దేశాల్లోని కోట్లాది మంది ప్రజలను ప్రాణభయంతో పరుగులు పెట్టించాయి. భవనాలు పేకమేడల్లా కూలుతాయన్న భయంతో ఇప్పటికే లక్షలాది మంది తీరప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఆగకుండా ప్రకంపనలు ఉధృతస్థాయిలో రావడంతో భవనాలు కొన్ని నిమిషాలపాటు ఊగిపోయాయి. తీర ప్రాంతాల్లోకి సముద్రపునీరు ఊహించనంతగా కొట్టుకొచ్చింది. రష్యా తూర్పున సుదూరంగా ఉన్న కామ్చట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్సక్–కామ్చాట్స్కీ నగర సమీపంలో ఈ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం రష్యాలో బుధవారం ఉదయం 11.24 గంటలకు పసిఫిక్ మహాసముద్రగర్భంలో 21 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించామని అమెరికా జియాలజికల్ సర్వే సంస్థ ప్రకటించింది. కామ్చట్కా పరిధిలో కొన్ని చోట్ల అలలు ఏకంగా 20 అడుగుల ఎత్తులో దూసుకొచ్చి తీరంలో పెను విలయం సృష్టించాయని రష్యా సోషనాలజీ ఇన్స్టిట్యూట్ ప్రకటించింది. సివిరో కురిల్సŠక్ తీరపట్టణంపై 14 అడుగుల ఎత్తైన రాకాసి అలలు విరుచుకుపడ్డాయి. తీరంలోని నిర్మాణాలను సర్వనాశనం చేశాయి. రష్యా మొదలు జపాన్, అమెరికా, హవాయి, న్యూజిలాండ్, చిలీ, కొలంబియా దాకా సమీపంలోని అన్ని దేశాలను సునామీ ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఆయా దేశాల ప్రభుత్వాలు ఇచ్చిన సునామీ హెచ్చరికలతో తీరప్రాంతాల్లోని ప్రజలంతా ప్రాణభయంతో ఎత్తైన ప్రదేశాలు, బీచ్లకు దూరంగా ఉన్న పచ్చికబయళ్లకు పరుగులు తీశారు. ప్రకంపనలకు తాము ఉంటున్న భవనాలు ఊగిపోవడంతో కొందరు భయంతో కిటికీల నుంచి బయటకు దూకి గాయాలపాలయ్యారు. అమెరికాలోని హోనలూనూ సిటీలో జనం ఒక్కసారిగా కార్లతో వేరే చోట్లకు తరలిపోవడంతో రహదారులన్నీ ట్రాఫిక్తో స్తంభించిపోయాయి. ద్వీప రాష్ట్రం హవాయీలో పలుచోట్ల సునామీ సైరన్లు మోగించారు. భూ ప్రకంపనలు జపాన్ తీరాలను తాకినా ఆ దేశంలోని అణువిద్యుత్ కేంద్రాలకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదని అంతర్జాతీయ అణుఇంధన సంస్థ స్పష్టంచేసింది. సాధారణంగా భూకంపం తర్వాత వచ్చే ప్రకంపనల తీవ్రత అత్యల్పంగా ఉంటుంది. కానీబుధవారం సంభవించిన పెను భూకంపం ధాటికి ఆ తర్వాత వచ్చే ప్రకంపనలు సైతం 6.9 తీవ్రతతో విస్తరించడం గమనార్హం. సునామీ తర్వాత పలు దేశాల బీచ్లు నిర్మానుష్యంగా మారాయి.1900 ఏడాది నుంచి సంభవించిన భారీ భూకంపాలు→ 1960 చిలీ దేశంలోని బియబియో (రిక్టర్ స్కేల్పై 9.5 తీవ్రత)→ 1964 అమెరికాలోని అలాస్కా(రిక్టర్ స్కేల్పై 9.2 తీవ్రత)→ 2011 జపాన్లోని తొహోకూ (రిక్టర్ స్కేల్పై 9.1 తీవ్రత)→ 2004 ఇండోనేసియాలోని సుమత్రా (రిక్టర్ స్కేల్పై 9.1 తీవ్రత)→ 1952 రష్యాలోని కామ్చట్కా (రిక్టర్ స్కేల్పై 9 తీవ్రత)→ 2025 రష్యాలోని కామ్చట్కా (రిక్టర్ స్కేల్పై 8.8 తీవ్రత)→ 2010 చిలీలోని బియోబియో (రిక్టర్ స్కేల్పై 8.8 తీవ్రత)→ 1906 ఈక్వెడార్లోని ఎస్మిరాల్డాస్ (రిక్టర్ స్కేల్పై 8.8 తీవ్రత)→ 1965 అమెరికాలోని అలాస్కా (రిక్టర్ స్కేల్పై 8.7 తీవ్రత)→ 2012 ఇండోనేసియాలోని సుమత్రా (రిక్టర్ స్కేల్పై 8.6 తీవ్రత)బద్దలైన అగ్నిపర్వతంభూకంపం సంభవించినప్పుడే రష్యాలోని కామ్చట్కా పరిధిలోని కిచెవ్స్కయా సోప్రా అగ్నిపర్వతం బద్దలైంది. ఉత్తరార్థ గోళంలోనే అతిపెద్ద అగ్నిపర్వతాల్లో ఒకటైన ఈ అగ్నిపర్వతం బద్దలవడంతో అందులోంచి భారీ స్థాయిలో లావా ఎగజిమ్మింది. పలు పేలుళ్లు సైతం వినిపించాయని రష్యా అకాడమీ ఆఫ్ సైన్సెస్లోని జియోఫిజికల్ విభాగం ప్రకటించింది. పలు దేశాల్లో ప్రకంపనలు తీవ్రస్థాయిలో సంభవించినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. కొన్ని దేశాలు అత్యధిక స్థాయి సునామీ హెచ్చరికలు జారీచేసి తర్వాత పెనుప్రమాదం లేదని తెలిశాక ఉపసంహరించుకున్నాయి.అయినా సర్జరీ ఆగలేదు...రష్యాలోని కామ్చట్కా ప్రాంతంలో భూకంపం వచ్చినప్పుడే అక్కడి ఒక ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్లో శస్త్ర చికిత్స జరుగుతోంది. కాళ్ల కింద నేల కదులుతున్నా వైద్యులు ఏమాత్రం జంకకుండా జాగ్రత్తగా సర్జరీ విజయవంతంగా పూర్తిచేశారు. సంబంధింత వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఆపరేషన్ థియేటర్లోని రోగి పడుకున్న స్ట్రెచర్ను సహాయక సిబ్బంది గట్టిగా పట్టుకోవడం, వైద్యులు సర్జరీని కొనసాగించడం ఆ వీడియోలో రికార్డయింది. దీంతో ఆపత్కాలంలోనూ వైద్యులు చూపిన వృత్తి నిబద్ధతను మెచ్చుకుంటూ పలువురు సామాజికమాధ్యమాల్లో కామెంట్లు పెట్టారు. -
భారత్పై అమెరికా సుంకాల మోత
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై సుంకాల మోత మోగించారు. భారత్పై 25శాతం సుంకాలే కాదు అదనంగా పెనాల్టీ విధించినట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై టారిఫ్ బాంబ్ పేల్చారు. అమెరికా కాలమాన ప్రకారం బుధవారం ఉదయం ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ఆట్వీట్లో భారత్పై టారిఫ్తో పాటు అదనంగా జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. ఈ సుంకం ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది. భారత్ మాకు మిత్రుడే అయినప్పటికీ అత్యధిక దిగుమతి టారిఫ్లు, కఠినమైన ట్రేడ్ బారియర్లు ఉన్నాయని విమర్శించారు. భారత్.. రష్యా నుంచి భారీగా ఆయుధాలు, ఇంధనం కొనుగోలు చేస్తుంది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ నిర్ణయం హేయమైన చర్య’ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్ మా స్నేహ దేశమే. కానీ వారు ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్లు విధిస్తున్న దేశాల్లో ఒకటి. రష్యా నుంచి ఆయుధాలు, ఇంధనం కొనుగోలు చేస్తున్నందుకు గాను 25శాతం టారిఫ్తో పాటు పెనాల్టీ కూడా చెల్లించాల్సిందేనని ట్రూత్ సోషల్ వేదికగా చేసిన ట్వీట్లో పేర్కొన్నారు. -
Tsunami waves: చరిత్రలోనే అత్యంత ఎత్తైన సునామీ
సునామీ.. 2004 డిసెంబర్ 26వ తేదీన హిందూ మహాసముద్ర తీర దేశాల్లో విధ్వంసం సృష్టించే దాకా ఈ విపత్తు గురించి సామాన్య ప్రజలకు పెద్దగా తెలియదు. తాజాగా రష్యాలో సంభవించిన భారీ భూకంపం, సునామీ హెచ్చరికల నేపథ్యంలో ఫసిఫిక్ తీరంలోని 30 దేశాలు గజగజ వణికిపోతున్నాయి. రాకాసి అలలు తీర ప్రాంతాలను ఇప్పటికే పలు ప్రాంతాలను ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో చరిత్ర ఇప్పటిదాకా చవిచూసిన శక్తివంతమైన సునామీ ఏదో చూద్దాం.. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్.. భూకంపాలు, అగ్నిపర్వతాలు ఎక్కువగా సంభవించే ప్రాంతం. ఈ రీజియన్లో ఉన్న రష్యా కామ్చట్కా ద్వీపకల్పం వద్ద రిక్టర్ స్కేల్పై 8.8 తీవ్రత భూకంపం సంభవించి.. పసిఫిక్ తీర దేశాల అంతటా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. జపాన్, అలాస్కా, హవాయి వంటి ప్రాంతాల్లో అలలు 3-4 మీటర్ల(9-13 అడుగుల) ఎగసిపడ్డాయి. ప్రపంచంలో ఇప్పటిదాక సంభవించిన శక్తివంతమైన భూకంపాల లిస్ట్లో.. ఇవాళ్టి రష్యా భూకంపానికి ఆరో స్థానం దక్కింది. అయితే.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సునామీల జాబితాను ఓసారి పరిశీలిస్తే.. 2004.. ఇండోనేషియా (సుమాత్రా)లో సంభవించిన 9.1 తీవ్రత భూకంపం. ఈ భూకంపం ధాటికి సునామీ 13 దేశాల తీరాలను ముంచెత్తి 2,30,000 మందిని బలిగొంది. 2011.. 9.0 తీవ్రతతో సంభవించిన భూకంపం జపాన్ (టోహోకు) తీరాన్ని ముంచెత్తించింది. ఈ ధాటికి ఫుకుషిమా అణు ప్రమాదం సంభవించడంతో పాటు 18,500 మంది మృతి చెందారు. 1960.. చిలీ (వాల్డివియా) 9.5 తీవ్రతతో భూకంపం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భూకంపం ఇది. ఈ ప్రభావం పసిఫిక్ మహాసముద్రం అంతటా కనిపించింది. 1883.. ఇండోనేషియా (క్రాకటోవా) అగ్నిపర్వత విస్ఫోటనం ధాటికి బారీ అలలు ఎగసిపడ్డారు. మొత్తం 36,000 మంది మృతి చెందారు. ఈ పేలుడు శబ్దం.. 4,800 కిలోమీటర్ల దూరం దాకా వినిపించింది!!.సునామీ అనేది జపనీస్ భాషకు చెందింది. దానికి అర్థం హార్బర్ కెరటం. సునామీలు ఏర్పడినప్పుడు రాకాసి అలలు 100 అడుగుల ఎత్తు వరకు వెళతాయి.సునామీ అలలు గంటకి 805 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఒక జెట్ విమానం స్పీడ్తో ఇది సమానం.ప్రపంచంలో జపాన్ తర్వాత అమెరికాలోని హవాయి, అలస్కా, వాషింగ్టన్, ఒరెగాన్, కాలిఫోర్నియాకు సునామీ ముప్పు ఎక్కువ. అందులో హవాయి దీవులకి ఉన్న ముప్పుమరెక్కడా లేదు. ప్రతీ ఏడాది అక్కడ సునామీ సంభవిస్తుంది. ప్రతీ ఏడేళ్లకి తీవ్రమైన సునామీ ముంచేస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలో రింగ్ ఆఫ్ ఫైర్ కారణంగానే 80 శాతానికి పైగా సునామీలు సంభవిస్తున్నాయి. 1896.. జపాన్ (సాన్రికు)లో 8.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. 125 అడుగుల అలలు ఎగసిపడ్డాయి. ఈ సునామీ ధాటికి 22,000 మంది మృతి చెందారు. ఈ సునామీ ప్రభావంతో.. హవాయిలో 25 అడుగుల ఎత్తు మేర అలలు ఎగసిపడ్డాయి. చరిత్రలోనే అత్యంత ఎత్తైన సునామీ(Mega Tsunami).. 1958 అలాస్కా (లిటుయా బే)లో జులై 9వ తేదీన సంభించింది. రిక్టర్ స్కేల్పై 7.8 నుంచి 8.3 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ధాటికి.. 914 మీటర్ల (3000 అడుగుల) నుంచి కొండచరియలు విరిగిపడ్డాయి. 90 మిలియన్ల టన్నుల రాళ్లు ఒక్కసారిగా గిల్బర్ట్ ఇంటెల్ ఉపనదిలోకి పడిపోయాయి. దీంతో ఓ పెద్ద కొండ ఎత్తు మేర నీరు అలలాగ ఎగసిపడింది. సుమారు 1,720 అడుగుల (524 మీటర్లు) అల.. లిటుయా బేను ముంచెత్తింది. ఇది న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కంటే ఎక్కువ!. ఇదే ప్రాంతంలోని లిథుయా గ్లేసియర్ (Lituya Glacier) వద్ద కొంత మంచు కూడా విరిగినట్లు ప్రత్యక్ష సాక్షుల వివరాలు చెబుతున్నప్పటికీ.. ప్రధాన అలను ఏర్పరచినది రాళ్ల పతనం మాత్రమే. అయితే ఇక్కడ జనసాంద్రత.. అదీ ఆ సమయంలో తక్కువగా ఉండేది. అందుకే మెగా సునామీ ముంచెత్తినా కేవలం ఐదుగురే మరణించారు. వీళ్లంతా పడవలో ప్రయాణిస్తుండగా మృత్యువాత పడ్డారు. అయితే మరో ఇద్దరు అనూహ్యంగా ఈ విలయం నుంచి ప్రాణాలతో బయటపడడం గమనార్హం. 1868.. పెరూ(చిలీ) 8.5 తీవ్రత భూకంపంతో సునామీ ముంచెత్తి 25,000 మందిని బలిగొంది. ఇది కూడా హవాయిపై ప్రభావం చూపెట్టింది. 1755.. పోర్చుగల్ (లిస్బన్)లో 8.5–9.0 భూకంపం సంభవించింది. 3 నుంచి 6 నిమిషాలపాటు భూమి కంపించింది. 40 నిమిషాల తర్వాత.. భారీ అలలతో అట్లాంటిక్ మహాసముద్రం అల్లకల్లోలంగా మారింది. సునామీ ముంచెత్తడంతో 50,000 మంది మృతి చెందారు. యూరోప్ అంతటా, అలాగే కరేబియన్ దీవులు, బ్రెజిల్ను ఈ సునామీ ప్రభావం తాకింది. ఈ భూకంప సునామీ చరిత్రలోనే తత్వవేత్తల రచనలతో.. అత్యంత విధ్వంసకరమైన ప్రకృతి విపత్తుగా నిలిచిపోయింది ఇది. -
ఇదేం పాడుబుద్ధయ్యా.. పైలటూ!
న్యూయార్క్: విమానం ల్యాండయిన 10 నిమిషాలకే ఎన్నారై పైలట్ను అరెస్ట్ చేసిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. చిన్నారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత సంతతికి చెందిన పైలట్ను శాన్ ఫ్రాన్సిస్కో (San Francisco) అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నెల 26వ తేదీన ఉదయం 9.35 గంటల సమయంలో డెల్టా ఎయిర్లైన్స్కు చెందిన విమానం ల్యాండవగా అధికారులు అందులోకి ఎక్కి పైలట్గా ఉన్న రుస్తొమ్ భగ్వాగర్(34)ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి డిటెన్షన్ సెంటర్కు తరలించారు.పదేళ్లలోపు చిన్నారిపై అతడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఈ ఏడాది ఏప్రిల్లో కేసు నమోదైంది. తన తల్లితో డేటింగ్ చేసిన రుస్తొమ్ భగ్వాగర్ (Rustom Bhagwagar) తనను లైంగికంగా వేధించినట్లు ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఆరేళ్లప్పుడు మొదలైన వేధింపులు తనకు 11 ఏళ్లు వచ్చేవరకు సాగించాడని, ఈ విషయం తన తల్లికీ తెలుసునని ఆమె పేర్కొంది. ఆమె సమక్షంలోనూ ఇవి సాగాయని ఫిర్యాదు చేసిందని అధికారులు వెల్లడించారు.కెనడా విమాన ప్రమాదంలో భారతీయుడు మృతి ఒట్టావా: కెనడాలోని న్యూఫౌండ్ల్యాండ్ ప్రాంతంలో చిన్న విమానం కూలిన ఘటనలో భారతీయుడొకరు ప్రాణాలు కోల్పోయారు. డీర్ లేక్ సమీపంలో ఈ నెల 26న ఈ ఘటన చోటుచేసుకుంది. డీర్ లేక్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే విమానం కూలింది.చదవండి: ఆస్ట్రేలియాలో భారత సంతతి వ్యక్తిపై అమానుషంఈ ఘటనలో విమానంలో ఉన్న ఏకైక వ్యక్తి గౌతమ్ సంతోష్(27) ప్రాణాలు కోల్పోయారని టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం మంగళవారం వెల్లడించింది. ఈ ఘటనలో విమానం పైలట్ సైతం అక్కడికక్కడే చనిపోయారని పేర్కొంది. ఇందుకు కారణాలు తెలియాల్సి ఉందని తెలిపింది. -
tsunami: తీరానికి కొట్టుకొస్తున్న భారీ తిమింగలాలు
టోక్యో: జపాన్ను సునామీ తాకింది. బుధవారం రష్యా తీరంలో 8.8 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం కురిల్ దీవులు, జపాన్లోని హక్కైడో తీరప్రాంతాలలో సునామీకి కారణంగా నిలిచింది. అమెరికాలోని కాలిఫోర్నియా, అలాస్కా, హవాయి న్యూజిలాండ్ వైపు ఉన్న ఇతర తీరాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు.జపాన్ వాతావరణ సంస్థ నివేదిక ప్రకారం తూర్పు తీరంలోని ఇషినోమాకి ఓడరేవును 50 సెంటీమీటర్ల ఎత్తులో సునామీ తాకింది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యంత పెద్దదయిన అల. పసిఫిక్ తీరం వెంబడి దక్షిణానికి, హక్కైడో నుండి టోక్యోకు, పలు ఈశాన్య ప్రాంతాలకు సునామీ కదులుతున్నప్పుడు 40 సెంటీమీటర్ల ఎత్తు వరకు అలలు ఏర్పడ్డాయి. ఇటువంటి భారీ అలలు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. JUST IN: At least 4 whales have washed up along the coast of Japan, hours after 8.8 earthquake pic.twitter.com/t9siMZDHFS— BNO News Live (@BNODesk) July 30, 2025భూకంపం సంభవించిన కొన్ని గంటల తర్వాత సునామీ తాకిడికి జపాన్ తీరం వెంబడి నాలుగు భారీ తిమింగలాలు కొట్టుకువచ్చాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి. అలలు ముందుకు వెనుకకు కదులుతుండగా తీరం వెంబడి వస్తున్న తిమింగలాలకు సంబంధించిన వీడియోను బీఎన్ఓ న్యూస్ షేర్ చేసింది.సునామీ అలలు సాధారణ అలల కంటే బలంగా ఉంటాయని, ఈ విధంగా వచ్చే 50 సెం.మీ. అల 200 కిలోల వరకు శక్తిని మోయగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టోక్యో విశ్వవిద్యాలయ భూకంప శాస్త్రవేత్త సకాయ్ షినిచి మీడియాతో మాట్లాడుతూ గతంలో వచ్చిన శక్తివంతమైన భూకంపాల ఫలితంగా సంభవించిన సునామీలు జపాన్కు భారీ నష్టాన్ని కలిగించాయన్నారు. ఇప్పుడొచ్చిన భూకంపం 1952 నాటి భూకంపాన్ని పోలి ఉంని అన్నారు. -
tsunami warning: ‘బీచ్ రోడ్డులో భీకర ట్రాఫిక్.. బిడ్డతో 13వ అంతస్థు సేఫ్’
మాస్కో: రష్యా తీరంలో బుధవారం 8.8 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించిన అనంతరం రష్యాలోని కురిల్ దీవులు, జపాన్లోని హక్కైడో తీర ప్రాంతాలను సునామీ తాకింది. అలాస్కా, హవాయి, న్యూజిలాండ్కు దక్షిణాన ఉన్న తీరాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇంతటి భయానక పరిస్థితుల నేపధ్యంలో హవాయిలోని హోనోలులులో తన ఇంటి వదిలి వెళ్ళడానికి తాను ఎందుకు నిరాకరిస్తున్నానో వివరించే టిక్టాక్ వీడియోను ఒక మహిళ షేర్ చేసింది.సునామీ హెచ్చరికల నేపధ్యంలో సురక్షిత ప్రాంతానికి చేరుకునేందుకు తన పసిబిడ్డను ఎత్తుకుని 15 నుండి 20 నిమిషాలు నడవాల్సి ఉంటుందని షెల్బీ కె బ్లాక్బర్న్ అనే మహిళ తన టిక్టాక్ వీడియోలో వివరించింది. సునామీ తాకనున్నదనే భయంతో స్థానికులు, సందర్శకులు హవాయి నుంచి అలా వే హార్బర్, వైకికి, ఓహులకు కార్లలో చేరుకునే ప్రయత్నంలో ట్రాఫిక్లో చిక్కుకున్నారని షెల్బీ కె బ్లాక్బర్న్ తెలిపింది. ఈ ట్రాఫిక్లో చిక్కుకునే బదులు తన ఇంటిలోనే ఉండటం సురక్షితమని భావిస్తున్నట్లు ఆమె పేర్కొంది. MOTHER AND DAUGHTER WAIT IN WAIKIKI CONDO AS TSUNAMI APPROACHES“I don’t want to risk leaving with my daughter,” she says as sirens blare across Hawaii.Waikiki Beach is in the path. The clock is ticking.This is real. Pray for everyone still there. pic.twitter.com/ttfcFcerYm— HustleBitch (@HustleBitch_) July 30, 2025షెల్బీ తన వీడియోలో తాను బీచ్కు చాలా దూరంలోని బహుళ అంతస్థుల భవనంలోని 13వ అంతస్తులో ఉన్నానని తెలిపింది. తనకు కారు లేదని, ఏదో ఒక కారులో బయలుదేరాలనుకున్నా, బీచ్ నుండి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న వారితో వీధులు పూర్తిగా నిండిపోయాయని తెలిపారు. ఇక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లాలంటే, కుమార్తెను ఎత్తుకుని 20 నిమిషాలు నడవాలని ఆమె వివరించింది. అందుకే ఇక్కడే ఉండటం మంచిదని భావిస్తున్నానని షెల్బీ పేర్కొంది. బీచ్కు దూరంగా ఎత్తుగా ఉన్న తానుంటున్న భవనం సురక్షితమేనని అనుకుంటున్నానని, ఇరుగు పొరుగువారు కూడా పై అంతస్తులకు చేరుకుంటున్నారని ఆమె తెలిపింది. ఈ పరిస్థితులను ఆమె వీడియోలో చూపించింది. -
#KatyTrudeau: స్నేహమా? రొమాంటిక్ రిలేషనా?
కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి వార్తల్లో నిలిచారు. గ్లోబల్ పాప్ స్టార్ కేటీ పెర్రీ(40)తో సన్నిహితంగా ఉంటూ కనిపించారాయన. రెండురోజుల వ్యవధిలో.. రెండుసార్లు జంటగానే వాళ్లు కెమెరాకు చిక్కారు. దీంతో.. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. కెనడా (Canada) ప్రధాని పదవి నుంచి ట్రూడో జనవరిలో వైదొలిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన మీడియా కంట పడుతోంది చాలా తక్కువే. మరోవైపు.. తన కొత్త ఆల్బమ్ 143 ప్రమోషన్స్ కోసం పెర్రీ ప్రస్తుతం కెనడాలో పర్యటిస్తున్నారు. ఈక్రమంలో.. వీరిద్దరూ మాంట్రియల్లో చెట్టాపట్టాలేసుకుని కనిపించారు. తాజాగా.. జులై 28వ తేదీన ఈ జంట ప్రైవేట్ డిన్నర్కు వెళ్లింది. ప్రైవేట్ కార్నర్ టేబుల్ వద్ద కూర్చొని వీరిరువురూ విందు ఆరగించారు. ఆ తర్వాత ఇద్దరూ కొంత సమయం మాట్లాడుకున్నారు. ఆపై రెస్టారెంట్లోని కిచెన్ను పరిశీలించి సిబ్బందికి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలిపారు. అక్కడి నుంచి.. సమీపంలోని ఓ బార్లోనూ ఈ ఇద్దరూ కనిపించారు. ఆ టైంలో వీరు కలిసి మాట్లాడుకుంటున్న దృశ్యాలను ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. ఆ మరుసటిరోజు.. మౌంట్ రాయల్ పార్క్లో గంటకు పైగా జంటగా వాకింగ్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం వీళ్లకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్గా మారాయి. దీంతో ట్రూడో, పెర్రీలు డేటింగ్లో ఉన్నారనే ప్రచారం మొదలైంది. ఈ ప్రచారాన్ని ట్రూడో, పెర్రీ తరఫున ఎవరూ ఖండించలేదు. ట్రూడో(53) తన సతీమణి సోఫీ గ్రెగోయిర్తో 2023లో విడిపోయిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల తమ వివాహబంధానికి స్వస్తి పలుకుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ద్వారా ఈ విషయం వెల్లడించారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. అటు పెర్రీ కూడా ఈ ఏడాది ప్రారంభంలో నటుడు ఓర్లాండ్ బ్లూమ్తో విడిపోయారు. వీరికి ఒక కుమార్తె ఉంది.వీళ్లది స్నేహమా? లేదంటే రొమాంటిక్ రిలేషనా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
చాట్జీపీటీ చెప్పినట్లుగానే .. అమెరికన్ సమోవాకు సునామీ ముప్పు
రష్యా, జపాన్ సునామీ అప్డేట్స్.. చాట్జీపీటీ చెప్పింది: అమెరికన్ సమోవాకు సునామీ ముప్పు తప్పదని చాట్జీపీటీ హెచ్చరికలుఅన్నట్లుగానే అమెరికన్ సమోవాకు అమెరికా ప్రభుత్వం వాతావరణ శాఖ హెచ్చరికలు సునామీ అంచున 50,000 మంది నివాస ప్రాంతమైన అమెరికన్ సమోవాఅమెరికన్ సమోవాకు సముద్ర మట్టంలో హెచ్చుతగ్గులు, బలమైన సముద్ర ప్రవాహాల ముప్పువెల్లడించిన అమెరికా వాతావరణ శాఖదక్షిణ పసిఫిక్ దీవులకు సునామీ ఎఫెక్ట్దక్షిణ పసిఫిక్ దీవులకు సునామీ ఎఫెక్ట్దక్షిణ పసిఫిక్ దీవులను 13 అడుగుల ఎత్తు వరకు సునామీ అలలు తాకే అవకాశంమార్క్వెసాస్ దీవుల్ని ఖాళీ చేయించిన అధికారులుకాలిఫోర్నియాను తాకిన సునామీబుధవారం తెల్లవారుజామున అమెరికా పశ్చిమ తీరాన్ని తాకిన సునామీ అలలువాషింగ్టన్, ఒరెగాన్, కాలిఫోర్నియాలోని తీరప్రాంతాలు ప్రభావితంఇప్పటివరకు అత్యధిక అలలు కాలిఫోర్నియాలోని అరీనా కోవ్ వద్ద 1.6 అడుగుల ఎత్తులో నమోదయ్యాయి. తరువాత క్రెసెంట్ సిటీలో 1.5 అడుగులు.. మాంటెరీలో 1.4 అడుగులు మేర ఎగిసిపడ్డాయి.అమెరికాలో సునామీ తాకిడి.. కాలిఫోర్నియాను తాకిన సునామీఅమెరికా తీరాలను తాకుతున్న సునామీ.అలస్కా, వాషింగ్టన్, నార్త్ క్యాలిఫోర్నియా తీరాలను తాకిన సునామీ.కాసేపట్లో శాన్ఫ్రాన్సిస్కోను తాకనున్న సునామీ.సునామీ భయంతో హవాయి ద్వీపాన్ని వీడుతున్న జనం.రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్. Dozens of Steller sea lions flee tsunami waves on Russia’s Antsiferov Island, captured in striking footage https://t.co/uKMw0MCqrg pic.twitter.com/9UkZUIqxso— RT (@RT_com) July 30, 2025 30 దేశాలు సునామీ ఎఫెక్ట్..30 దేశాలపై సునామీ ప్రభావం చూపుతుందని అధికారుల హెచ్చరికలు. అమెరికా నుంచి న్యూజిలాండ్ వరకు సునామీ హెచ్చరికలు.. దాదాపు తొమ్మిది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు.అయితే, హవాయిలో ప్రశాంతంగానే సముద్రంఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లిన ప్రజలు. Rusya'nın Kamçatka Yarımadasında 8,8, büyüklüğünde deprem meydana geldi.Deprem sonrasında balinalar kıyaya vurmuş.#Japan #Russian #Hawaii #tsunami pic.twitter.com/TurM68zciD— Elif Erdağ (@ElifErdagTR45) July 30, 2025సునామీ ధాటికి రష్యా విలవిల..రష్యాలోని సెవిరియో-కుర్లిస్క్ నగరంపై సునామీ అలల పంజా.నగరాన్ని బలంగా ఢీకొట్టిన సునామీ అలలు.అలల ధాటికి చిన్నాభిన్నమైన నగరం.మరోవైపు.. అమెరికాలోని అలస్కాను తాకిన సునామీ.సునామీ హెచ్చరికలు జారీ.సునామీ వార్నింగ్ నేపథ్యంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం.లాస్ ఏంజెల్స్ నుంచి హవాయికి వెళ్లిన విమానాలు యూటర్న్.ఇప్పటికే పలు విమాన సర్వీసులు రద్దు. Drone footage below reveals extensive damage to the port of Severo-Kurilsk in Russia’s Kuril Islands, following #tsunami waves triggered by the 8.8 magnitude #earthquake off the coast of #Kamchatka.#Sismo #Temblor #Tsunamiwarning #temblorgt #揺れ #地震pic.twitter.com/Hc2NvaXJdx— Chaudhary Parvez (@ChaudharyParvez) July 30, 2025 FLIGHTS TURN BACK as tsunami threat grows in Hawaii Multiple planes en route now diverting to Los Angeles Honolulu airspace tightens pic.twitter.com/wLw9GV4Dni— RT (@RT_com) July 30, 2025 భయపెడుతున్న సునామీ అలలు.. రష్యాను వణికించిన భూకంపం, సునామీభూకంప సమయంలో ఆపరేషన్ చేసిన వైద్యులు.భూమి కంపిస్తున్న సమయంలో సిబ్బంది సాయంతో ఆపరేషన్ చేసిన వైద్యుడు.ప్రస్తుతం సురక్షితంగా పేషంట్.ఆపరేషన్కు సంబంధించిన వీడియో వైరల్.మరోవైపు.. జపాన్లో సునామీ టెన్షన్ నెలకొంది.జపాన్ తీరంలో సునామీ అలలు భయం పుట్టిస్తున్నాయి.భీకర అలలు సముద్ర తీరానికి చేరిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.అలల ధాటికి సముద్రంలోని వేల్స్ తీరానికి కొట్టుకుని వచ్చాయి. ❗️#Tsunami Waves Arrive On Japan's Coast #Earthquake https://t.co/PawVXXBOs0 pic.twitter.com/JiJ44FjMAg— RT_India (@RT_India_news) July 30, 2025Doctors in Kamchatka kept calm during the powerful earthquake— and never stopped the surgery.The patient is doing well, according to the Health Ministry!#Tsunami #Earthquake #China#Russia #Hawaii #Japan #Sismo #Temblor #Tsunamiwarning #揺れ #地震 pic.twitter.com/Y38Hdyybyc— TIger NS (@TIgerNS3) July 30, 2025సునామీ నీటిలో చిక్కుకున్న కారు.. వీడియో జపాన్, రష్యాలో సునామీ రాకాసి అలలు..సునామీ కారణంగా సముద్రపు నీటిలో చిక్కుకున్న కారు. కారు ప్రయాణీకులు, సహా తన పెంపుడు శునకం.నీటిల్లో చికుక్కున్న కారు వీడియో వైరల్. సునానీ కారణంగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్న ప్రజలు. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్.ఇబ్బంది పడుతున్న వివాహదారులు. Breaking News 😞🇷🇺🌊 Terrifying Footage from KamchatkaA video shows Russian citizens and their pet trapped in a car as tsunami waves hit Kamchatka. Water can be seen rushing in as they desperately try to stay safe. pic.twitter.com/uKptePtUjr— Tarique Hussain (@Tarique18386095) July 30, 2025 Insane amount of traffic in #Hawaii right now #Tsunami #earthquake pic.twitter.com/pBdb7M1g4L— john (@JohnBrad64) July 30, 2025మరిన్ని దేశాలకు సునామీ ముప్పు..రష్యా తీరప్రాంతమైన పెట్రోపావ్లోవ్స్క్-కామ్చాట్స్కీలో 8.7 తీవ్రతతో భూకంపం కారణంగా సునామీరష్యా, జపాన్ తీర ప్రాంతాలను తాకిన సునామీసునామీ ముప్పులో పలు దేశాలు..ఈక్వెడార్, రష్యా, వాయువ్య హవాయిన్ ఐలాండ్స్ మూడు మీటర్ల పైకి అలలు ఎగసిపడే అవకాశం చిలీ, కోస్టారికా, ఫ్రెంచ్ పాలినేషియా తదితర దేశాల్లో మీటరు నుంచి మూడు మీటర్ల మేర అలలు ఎగసిపడే అవకాశం 👉రష్యా తీరంలో భారీ భూకంపం అనంతరం.. రష్యా, జపాన్ను సునామీ తాకింది. పెద్ద ఎత్తున అలలు ఎగిసి పడుతున్నాయి. ఉత్తర పసిఫిక్లోని పలు తీర ప్రాంతాలను సునామీ (Tsunami) తాకింది. ఇక, అంతకుముందు.. రష్యాలో రిక్టర్ స్కేల్పై 8.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. 🚨 BREAKING - Tsunami waves hitting the Chiba Prefecture, Eastern Japan#Tsunami #Russia #Hawaii #Earthquake pic.twitter.com/xAx4g0oBAG— T R U T H P O L E (@Truthpolex) July 30, 2025👉జపాన్ వాతావరణ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రపంచంలోనే ఈ స్థాయిలో భూకంపం రావడం 2011 తర్వాత మళ్లీ ఇప్పుడే వచ్చినట్టు పేర్కొంది. ఈ క్రమంలోనే రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంతో పాటు జపాన్కు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. భారతీయులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.👉రష్యాలో 8.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ అప్రమత్తమైంది. అనంతరం, ట్విట్టర్ వేదికగా.. అమెరికాలోని కాలిఫోర్నియా సహా పశ్చిమ రాష్ట్రాల్లో నివసిస్తున్న భారతీయులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సునామీ ముప్పును శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. కాలిఫోర్నియా, హవాయితో పాటు అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాల్లో నివసిస్తున్న భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అమెరికా అధికారులు జారీ చేసే అలర్ట్లను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పాటించాలి. సునామీ హెచ్చరికలు జారీ అయితే.. వెంటనే ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లండి. తీర ప్రాంతాలకు దూరంగా ఉండండి. అత్యవసర పరిస్థితికి సిద్ధమవ్వండి. మీ ఎలక్ట్రానిక్ పరికరాలకు ఛార్జింగ్ ఉండేలా చూసుకోండి. సాయం కోసం ఎమర్జెన్సీ నంబర్లను సంప్రదించండి. అమెరికా అధికారులు ఇచ్చే సూచనలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. వాటిని పాటించాలని హెచ్చరికలు జారీ చేసింది.🚨🚨🚨The Consulate General of India in San Francisco is monitoring the potential tsunami threat following the recent 8.7 magnitude earthquake off Russia's Kamchatka Peninsula. Indian nationals in California, other US West Coast states, and Hawaii are advised to take the…— India in SF (@CGISFO) July 30, 2025👉ఇదిలా ఉండగా.. జపాన్ వాతావరణ సంస్థ హక్కైడో తూర్పు తీరంలోని నెమురోకు దాదాపు 30 సెంటీమీటర్ల (సుమారు 1 అడుగు) ఎత్తులో మొదటి సునామీ అల చేరిందని తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు.. జపాన్లోని నాలుగు పెద్ద దీవులకు ఉత్తరాన ఉన్న హక్వైడో నుంచి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రానున్న మూడు గంటల్లో రష్యా, జపాన్ తీర ప్రాంతాల్లో పెద్దఎత్తున సునామీ అలలు రావొచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే(యూఎస్జీఎస్) పేర్కొంది. అలస్కా అలూటియన్ దీవులలోని కొన్ని ప్రాంతాల్లో సునామీ ప్రభావం ఉంటుందని అలస్కా జాతీయ సునామీ కేంద్రం హెచ్చరించింది. కాలిఫోర్నియా, ఒరెగాన్, వాషింగ్టన్, హవాయితో సహా పలు ప్రాంతాలను అప్రమత్తం చేసింది.pic.twitter.com/iD520Gt6kS A Massive Earthquake triggers a Tsunami, taking thousands of lives in seconds with little to no warning. #Russia #Tsunami #japan #earthquake— Made on Earth by Humans (@1singdollar) July 30, 2025ధైర్యంగా ఉండండి: ట్రంప్👉మరోవైపు, తాజా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ‘పసిఫిక్ మహా సముద్రంలో భారీ భూకంపం కారణంగా హవాయి ప్రాంతానికి సునామీ అలర్ట్ జారీ అయ్యింది. అమెరికాలోని పసిఫిక్ తీర ప్రాంతాలకూ ముప్పు పొంచి ఉంది. ప్రజలంతా ధైర్యంగా ఉండండి. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లండి. అధికారుల సూచనలను ఎప్పటికప్పుడు పాటించండి’ అని అధ్యక్షుడు సూచించారు.#ÚltimaHora - #Tsunami golpeando las costas de #Kamchatka, Rusia🇷🇺Los tsunamis son una secuencia de olas y no siempre las primeras olas son las más grandes. pic.twitter.com/aBgpkukOUX— SkyAlert (@SkyAlertMx) July 30, 2025👉ఇప్పటివరకు ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన ఎలాంటి సమాచారం తెలియలేదు. భూప్రకంపనల నేపథ్యంలో పెట్రోపావ్లోవ్స్క్-కామ్చాట్కా నగరంలోని భవనాలు కంపించాయని రష్యా మీడియా తెలిపింది. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీసినట్లు తెలిపింది. కమ్చాట్కా ప్రాంతంలో విద్యుత్, సెల్ఫోన్ సేవల్లో అంతరాయాలు ఏర్పడినట్లు తెలిపింది. భవనాలు అత్యవసర సేవల కోసం ఒక టాస్క్ఫోర్స్ను ఏర్పాటుచేసినట్లు జపాన్ ప్రభుత్వం పేర్కొంది.🚨 BREAKING - Shocking footage of the moment M8.8 earthquake shit the the coast of the Kamchatka Peninsula, East of Russia#Earthquake #Tsunami #Russia #Hawaii #Alert pic.twitter.com/FKnqm6nRdL— T R U T H P O L E (@Truthpolex) July 30, 2025👉 హవాయి, చిలీ, జపాన్, సోలమన్ దీవుల తీరప్రాంతాలలో అలల స్థాయి కంటే 1 నుండి 3 మీటర్ల ఎత్తులో ఎగసిపడే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. రష్యా, ఈక్వెడార్లోని కొన్ని తీరప్రాంతాలలో 3 మీటర్ల కంటే ఎక్కువ అలలు ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది. -
భారత్పై 25 శాతం సుంకాలు.. గడువుకు ముందే ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ సుంకాలపై ఆగస్టు ఒకటి వరకూ ఇచ్చిన గడువుకు ముందే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ తమకు మంచి మిత్రదేశమని, అయితే ఇదే భారత్ ఇతర దేశాల కంటే ఎక్కువ సుంకాలను వసూలు చేసిందని, కానీ తాము అలా చేయబోమని ట్రంప్ పేర్కొన్నారు. తన ఐదు రోజుల స్కాట్లాండ్ పర్యటన ముగించుకుని, వాషింగ్టన్కు తిరిగి వస్తూ, ఎయిర్ ఫోర్స్ వన్లో ట్రంప్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై తాము 20 శాతం నుండి 25 శాతం వరకూ సుంకం రేటు విధించే అవకాశాలున్నాయన్నారు. అయితే ఇందుకు ఆగస్టు ఒకటి వరకూ గడువు ఉందని, దీనికి ముందుగా ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నందున తుది సుంకం ఇంకా ఖరారు కాలేదని ట్రంప్ పేర్కొన్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ దిగుమతులపై చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమయ్యింది. భారత్పై 20 నుంచి 25శాతం వరకు సుంకాలు విధించే యోచనలో ఉన్నట్టు ట్రంప్ సూచన ప్రాయంగా ప్రకటించారు. అమెరికా- భారత్ వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న సమయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. భారత్ దిగుమతులపై 25శాతం వరకు సుంకాలు విధిస్తారా? అని మీడియా అడిగినప్పుడు ఆయన ‘అలా అనుకుంటున్నాను’ అని సమాధానమిచ్చారు.రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రంప్ అమెరికా ప్రయోజనాల కోసమంటూ ప్రపంచ దేశాలపై భారీ మొత్తంలో సుంకాలు విధించేందుకు ప్రయత్నిస్తున్నారు. తొలుత సుంకాల విధింపునకు 2025 ఏప్రిల్ 2 తుది గడువు పెట్టారు. ఆ సమయంలోపు తమతో ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. ఆ తరువాత ఈ గడువును జూలై 9కి మార్చారు. అనంతరం దానిని ఆగస్ట్ ఒకటి వరకూ పొడిగించారు. కాగా అమెరికా.. యూకే, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, యూరోపియన్ యూనియన్, జపాన్లతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారత్తో ఇంకా ఎలాంటి ఒప్పందం నిర్ణయం కాలేదు. -
భారీ భూకంపంతో వణికిన రష్యా.. 8.7 తీవ్రత నమోదు
మాస్కో: రష్యాలోని తూర్పు కమ్చట్కా ద్వీపకల్పంలో బుధవారం 8.7 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. రాబోయే మూడు గంటల్లో రష్యా, జపాన్ తీరప్రాంతాలకు విధ్వంసక సునామీ అలలు చేరుకోవచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే హెచ్చరించింది. భూకంప ప్రభావిత ఈ ప్రాంతానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. 🚨 BREAKING: Tsunami waves from the 8.7 magnitude earthquake have begun slamming RussiaBuildings are already being swept awayTsunami waves are also heading to Hawaii, expected to arrives within hours pic.twitter.com/dPg72zln9N— Nick Sortor (@nicksortor) July 30, 2025భూకంప తీవ్రతకు భవనాల లోపల జరిగిన కంపనలు ఆ వీడియోలలో కనిపిస్తున్నాయి. ఒక వీడియోలో భూకంపం సంభవించిన సమయంలో అపార్ట్మెంట్లోని ఫర్నిచర్ తీవ్రంగా ఊగిపోవడాన్ని గమనించవచ్చు. Videos are pouring in showing VIOLENT SHAKING from the MASSIVE M8.8 Earthquake off Kamchatka, RUSSIA! pic.twitter.com/zwx1jbhx0y— RT (@RT_com) July 30, 2025రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పానికి అతి సమీపంలో ఈ భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తు నేపధ్యంలో జపాన్ వాతావరణ విభాగం రష్యా తీరం వెంబడి సునామీ హెచ్చరికలు జారీ చేసింది. జపాన్ కాలమానం ప్రకారం ఈ భూకంపం బుధవారం ఉదయం 8:25 గంటలకు సంభవించింది.#BREAKING Yuzhno-Sakhalinsk, Russia 8.7 Earthquake - 46 Miles deep in the Ocean ALL OF THE WEST COAST IS UNDER TSUNAMI WARNING - We will know soon if the bouys pick up the TSUNAMI level soon hereMillions of people could end up evacuating depending how this goes.Hard to… pic.twitter.com/w54KXkE3If— MəanL¡LMə♡₩ (@MeanLILMeoW) July 30, 2025Breaking right now..Earthquake near Russia 8.7 magnitude and a tsunami alert has been spread to Alaska, Japan, and Russia..Developing story here as information is just coming out now..Prayers for all in its wake..🙏🙏🙏pic.twitter.com/aaTokSE7OQ— Chris from Massachusetts AKA TommyboyTrader (@autumnsdad1) July 30, 2025ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎటువంటి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు. జపాన్లోని నాలుగు దీవులకు ఉత్తరాన ఉన్న హక్కైడోకు ఈ భూకంప కేంద్రం 250 కిలోమీటర్లు (160 మైళ్ళు) దూరంలో ఉందని సమాచారం. జపాన్కు చెందిన ఎన్హెచ్కే టెలివిజన్ తెలిపిన వివరాల ప్రకారం, ఇది స్వల్ప ప్రభావమే చూపిందని తెలుస్తోంది. ఈ భూకంప కేంద్రం భూ ఉపరితలం నుంచి 12 మైళ్ల లోతులో ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే కమ్చట్కాలో ఏ మేరకు ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందనే సంగతిని రష్యా ఇంకా వెల్లడించలేదు. కాగా హవాయికి దీపానికి రష్యా సునామీ హెచ్చరిక జారీ చేసింది. ఇది తక్కువ ముప్పు కలిగిన అలర్ట్ అని తెలుస్తోంది. టోక్యో భూకంప శాస్త్రవేత్త షినిచి సకాయ్ మీడియాతో మాట్లాడుతూ ఈ భూకంపం జపాన్ను తీవ్రంగా ప్రభావితం చేసే సునామీకి కారణంగా నిలవనున్నదని అంచనా వేశారు. ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే దేశాలలో జపాన్ ఒకటి. ఈ ప్రాంతంలో ఈ నెల ప్రారంభంలోనే ఐదు భారీ భూకంపాలు- 7.4 తీవ్రతతో సంభవించాయి. అతిపెద్ద భూకంపం 20 కిలోమీటర్ల లోతులో సంభవించింది. పెట్రోపావ్లోవ్స్క్-కమ్చట్స్కీ నగరానికి తూర్పున 144 కిలోమీటర్ల దూరంలో ఇది తన ప్రభావాన్ని చూపింది. 1952,నవంబర్ 4న కమ్చట్కాలో 9.0 తీవ్రతతో సంభవించిన భూకంపం ఆందోళన కలిగించింది. నాడు హవాయిలో 9.1 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. -
హ్యూమనాయిడ్ రోబో కేవలం రూ.5 లక్షలే!
భలే మంచి చౌక బేరము.. రూ.5.12 లక్షలకే హ్యూమనాయిడ్ రోబో అంటోంది చైనాకు చెందిన ఓ కంపెనీ. రోబో.. అంటేనే ఖరీదైన వ్యవహారం. అందులోకి, అచ్చం మనిషిలా ఉండి, మనిషి చేయగలిగే చాలా పనులు చేసే హ్యూమనాయిడ్ రోబో అంటే.. ఇంకా ఖరీదు. కానీ.. అస్సలు కాదు అంటోంది చైనా దిగ్గజం యూనిట్రీ రోబోటిక్స్. రోబోల తయారీలో మంచి పేరున్న ఈ కంపెనీ ఆర్1 హ్యూమనాయిడ్ను తయారుచేసింది. దీని ధర కేవలం 5,900 డాలర్లు (రూ.5.12 లక్షలు) మాత్రమేనట. కంపెనీ గతంలో అందుబాటులోకి తెచ్చిన జీ1తో పోలిస్తే కొత్త మోడల్ ధర 63 శాతం తక్కువ కావడం విశేషం. – సాక్షి, స్పెషల్ డెస్క్యూనిట్రీ రోబోటిక్స్ ఆర్1 హ్యూమనాయిడ్.. పరుగెడుతుంది, నడుస్తుంది, పిల్లిమొగ్గలు వేస్తుంది, చేతుల మీద నిలబడుతుంది. మనం ఇచ్చే వాయిస్ ఆదేశాలకు ప్రతిస్పందిస్తుంది. పరిసరాలను అర్థం చేసుకుంటుంది. ప్రయోగాలకు అనువుగా ఇది పనిచేస్తుంది. అంటే టెక్ కంపెనీలు ఈ హ్యూమనాయిడ్ను మరింతగా అభివృద్ధి చేసేందుకు వీలు కూడా ఉండటం దీనిలోని మరో ప్రత్యేకత. ఆఫీసులు, ఇంటి పనుల కోసం పని మనుషులను పెట్టాలనుకునేవాళ్లు దీన్ని ట్రై చేయొచ్చు అంటోంది కంపెనీ.గంటపాటు నిర్విరామంగా..» ఈ హ్యూమనాయిడ్ ఎత్తు 121 సెంటీమీటర్లు, వెడల్పు 35.7 సెం.మీ. మందం 19 సెం.మీ. » వాయిస్ గుర్తించేందుకు నాలుగు మైక్రోఫోన్ ్స, అల్ట్రావైడ్ యాంగిల్ విజువల్స్ కోసం బైనాక్యులర్ కెమెరా పొందుపరిచారు. వైఫై 6, బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ ఉంది. » కేవలం 25 కేజీల బరువే ఉండటం కూడా వాడకందారులకు చాలా సౌలభ్యం. » బ్యాటరీ ఒకసారి రీచార్జ్ చేస్తే రోబో గంటపాటు పనులు చక్కబెడుతుంది. » మాన్యువల్ రిమోట్ కంట్రోల్తో పనిచేస్తుంది. » పూర్తి కస్టమైజేబుల్.. అంటే కస్టమర్ కోరిన విధంగా మార్పులు చేసి కూడా తయారు చేస్తారు.ఆర్1.. ఒక మైలురాయిఫ్యాక్టరీలు, ఇంటి పనులకు సంబంధించి హ్యూమనాయిడ్ల తయారీలో ఇంతవరకు అమెరికన్ కంపెనీల ఆధిపత్యం ఉండేది. ఇప్పుడు చైనా కంపెనీలు ఈ రేసులోకి ‘తక్కువ ధరకే’ ట్యాగుతో వచ్చాయి. ఇవి పై రెండు రకాల పనులతోపాటు మిలటరీలో కూడా ఉపయోగపడతాయట. చైనాలోని పరిశోధనా ప్రయోగశాలలు, పాఠశాలల్లో వాడుతున్న యూనిట్రీ కంపెనీ తయారీ జీ1 రోబో ధర 16,000 డాలర్లుగా ఉంది. మరింత అధునాతన, పెద్ద సైజులో ఉండే హెచ్1 మోడల్ ధర 90,000 డాలర్ల కంటే ఎక్కువ. అందరికీ అందుబాటు ధరలో ఏకంగా 5,900 డాలర్లకే ఇప్పుడు ఆర్1 హ్యూమనాయిడ్ను తీసుకొచ్చింది. ఇది సంక్లిష్ట హ్యూమనాయిడ్ల విభాగంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.రోజువారీ జీవితంలో మమేకం..» మీరు ఉదయం లేవగానే మీ కదలికలను రోబో గుర్తిస్తుంది. » కాఫీ మెషీన్ ను ఆన్ చేస్తుంది. » ఒకవేళ మీకు కళ్లజోడు అలవాటు ఉంటే.. అది ఎక్కడ ఉన్నా తెచ్చి మీ చేతికి ఇస్తుంది. » ఆ రోజు చేయాల్సిన మీ షెడ్యూల్ను చదువుతుంది.» మీ బిడ్డకు సైన్స్, మ్యాథ్స్.. ఇలా ఏదైనా సబ్జెక్టులో సందేహాలు ఉంటే సమాధానాలతో సహాయపడుతుంది. సంభాషణను సరదా క్విజ్గా కూడా మారుస్తుంది.» అమ్మమ్మ, తాతయ్యల వంటి పెద్దలకు.. ఎతై ్తన షెల్ఫ్ నుండి మందులను తీసుకొచ్చి చేతిలో పెడుతుంది. » ఇంటికి బంధువులు, స్నేహితులు వస్తే వారిని ఆకట్టుకోవడానికి పిల్లిమొగ్గల వంటివి వేస్తుంది. -
కాల్పుల విరమణకు దిగిరాకుంటే ప్రత్యేక పాలస్తీనాకు ఐరాసలో మద్దతిస్తాం
లండన్: పాలస్తీనా విషయంలో ఫ్రాన్స్ దారినే బ్రిటన్ సైతం అనుసరిస్తోంది. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించకుంటే ప్రత్యేక పాలస్తీనా ఏర్పాటుకు వచ్చే సెప్టెంబర్లో ఐక్యరాజ్యసమితిలో జరిగే సర్వప్రతినిధి సభలో ప్రవేశపెట్టే తీర్మానానికి మద్దతిస్తామని బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు. ఈ దిశగా ఇజ్రాయెల్ చర్యలు తీసుకోకుంటే పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామని ఆయన ప్రకటించారు. అదే సమయంలో, హమాస్ తన వద్ద ఉన్న బందీలందరినీ తక్షణమే విడుదల చేయాలని కోరారు. కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేసి, ఆయుధాలను అప్పగించాలన్నారు. భవిష్యత్తులో గాజాలో ఎటువంటి భూమిక పోషించబోమనే హామీని హమాస్ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఇదే సరైన అదను అని స్టార్మర్ తెలిపారు. ఇటీవలే ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సైతం రెండు దేశాల విధానానికి మద్దతు ప్రకటించడం గమనార్హం. -
గాజాలో మరణాలు 60 వేల పైనే
దెయిర్ అల్–బలాహ్: ఇజ్రాయెల్–హమాస్ మధ్య 21 నెలలుగా జరుగుతున్న యుద్ధంలో 60 వేల మందికిపైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య విభాగం మంగళవారం తెలిపింది. మంగళవారం నాటికి 60,034 మంది చనిపోగా మరో 1,45,870 మంది క్షతగాత్రులుగా మిగిలారని పేర్కొంది. మృతుల్లో కనీసం సగం మంది మహిళలు, చిన్నారులేనని తెలిపింది. వైద్యరంగ నిపుణులతో కూడిన గాజా ఆరో గ్య విభాగం తెలిపే గణాంకాలను అత్యంత విశ్వసనీయమైనవిగా ఐరాస ఇతర స్వతంత్ర నిపుణులు కితాబునిస్తున్నారు. ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్ ఫలితంగా గాజాలోని అత్యధిక ప్రాంతంలో విధ్వంసమే మిగిలింది. 90 శాతం మంది పాలస్తీనియన్లు నిరాశ్రయులుగా మారారు. ఆ ప్రాంతంలో అత్యంత తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి.తాజాగా మరో 70 మంది మృతి పరిస్థితులు దారుణంగా కనిపిస్తున్నా ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు మాత్రం యథా ప్రకారం కొనసాగుతున్నాయని స్థానిక ఆస్పత్రి వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో కనీసం 70 మంది చనిపోయారని తెలిపాయి. వీరిలో సగం మంది ఆహార కేంద్రాల వద్ద గుమికూడిన వారేనన్నాయి. సోమవారం దక్షిణ గాజా ప్రాంతంలోకి ప్రవేశించిన ఆహార ట్రక్కుల వద్దకు వచ్చిన వారిపై ఇజ్రాయెల్ జరిపిన కాల్పుల్లో 33 మంది చనిపోయినట్లు ఆస్పత్రులు వెల్లడించాయి. మిగతా వారు సెంట్రల్ గాజాలోని ఆహార కేంద్రం వద్ద జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నాయి. అదేవిధంగా, నుసెయిరత్ నగరంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడుల్లో లో తాత్కాలిక నివాసాల్లో ఉంటున్న 12 మంది చిన్నారులు, 14 మంది మహిళలు సహా 30 మంది అసువులు బాశారని అల్–ఔదా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కరువు వట్టిదే: ఇజ్రాయెల్ గాజాలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొనడం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియన్ సార్ తీవ్రంగా స్పందించారు. అంతర్జాతీయంగా తమపై ఒత్తిడి పెంచేందుకు గాజాలో కరువు ఉందంటూ తప్పుడు ప్రచారం మొదలైందని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఒత్తిడుల వల్ల కాల్పుల విరమణతోపాటు బందీల విడుదలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఇలాంటి ప్రకటనలతో హమాస్ వైఖరి మరింత కఠినంగా మారితే తమ ప్రతిస్పందన సైతం తీవ్రంగానే ఉంటుందన్నారు. గాజాలో అమానవీయ పరిస్థితులపై ప్రధాని మౌనం సిగ్గు చేటు: సోనియా గాంధీ న్యూఢిల్లీ: గాజాలో ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్ నరమేధంతో సమానమైందని కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ అభివర్ణించారు. మానవీయతే మచ్చ తెచ్చే పరిణామాలు గాజాలో చోటుచేసుకుంటున్నా మోదీ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తుండటంపై ఆమె మండిపడ్డారు. ఇలాంటి వైఖరి మన రాజ్యాంగ విలువలకు ద్రోహం చేసినట్లేనన్నారు. ఈ మేరకు ఆమె దైనిక్ జాగరణ్లో రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. పాలస్తీనా విషయంలో మన దేశం దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానాన్ని స్పష్టంగా, ధైర్యంగా, నిష్కపటంగా వెల్లడించాలని ఆమె ప్రధాని మోదీని కోరారు. ఇజ్రాయెల్ అమానవీయ చర్యలను ఎప్పటికప్పుడు ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. -
టర్కీ చెంత ‘మోస్ట్ పవర్ఫుల్’ నాన్ న్యూక్లియర్ బాంబు
అంకారా: అత్యంత శక్తిమంతమైన నాన్ న్యూక్లియర్ బాంబును తుర్కియే(టర్కీ) అభివృద్ధి చేసింది. ఈ విషయాన్ని తమ దేశ 17వ ఇంటర్నేషనల్ డిపెన్స్ ఇండస్ట్రీ ఫెయిర్లో భాగంగా ఈరోజు(మంగళవారం, జూలై 29) ప్రకటించింది. గాజాప్(Gazap) అనే 970 కిలోగ్రాముల ఈ బాంబు.. అత్యంత శక్తిమంతమైన నాన్ న్యూక్లియర్ బాంబుగా పరిగణించబడుతోంది. ఈ బాంబు పరిమాణమే 970 కిలోలు కాగా, దీని విధ్వంస శక్తి 10 వేల ఫ్రాగ్మెంట్లుగా ఉంది. అంటే ఇది సుమారు కిలోమీటర్ పరిధిలో విధ్వంసం సృష్టించే అవకాశం ఉంటుంది. ఈ బాంబు యొక్క ఫ్రాగ్మెంటేషన్ డెన్సిటీ సాధారణ ఎంకే బాంబు కంటే మూడ రెట్లు అధికం. దీన్ని ఫైటర్ జెట్లలో ఉపయోగించే అవకాశం ఉంది. భవిష్యత్లో డ్రోన్ల ద్వారా కూడా ప్రయోగించే అవకాశాలున్నాయి. హయాలెట్ బాంబు సైతం..మరో అత్యంత శక్తిమంతమైన బంకర్ బస్టర్ను సైతం తయారుచేసింది టర్కీ. హయాలెట్ అనే బంకర్ బస్టర్ బాంబును అభివృద్ధి చేసింది. ఇది కఠినమైన లక్ష్యాలను లేదా సైనిక బంకర్ల వంటి లోతైన భూగర్భంలో పాతిపెట్టిన లక్ష్యాలను చొచ్చుకుపోయేలా రూపొందించబడింది. హయాలెట్ను NEB-1, NEB-2 అని కూడా పిలుస్తారు. ఉక్కుగోడలా నిర్మాణాలను సైతం విధ్వంసం చేయడానికి తయారుచేసిన బాంబు ఇది. దీన్ని బంకర్ బస్టర్ బాంబుగా పరిగణిస్తున్నారు. -
‘ ఇక్కడ ఉంది రష్యా.. ఇజ్రాయిల్, ఇరాన్ కాదు’
వాషింగ్టన్: ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపాలని రష్యాకు అమెరికా ఇచ్చిన డెడ్లైన్పై ఇప్పుడు ఆ రెండు(అమెరికా-రష్యా) దేశాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఉక్రెయిన్లో రష్యా సృష్టిస్తున్న రక్తపాతాన్ని ఆపకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ కొన్ని రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన గడువును యూఎస్ రిపబ్లిక్ సెనేటర్ లిండే గ్రాహం గుర్తు చేశారు. ట్రంప్ గడువును రష్యా సీరియస్గా తీసుకున్నట్లు కనబడుటం లేదు. గడువు సమీపిస్తోంది. దీనిపై రష్యా స్పందించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ విషయంపై రష్యా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఆ దేశ అధ్యక్షుడు పుతిన్కు అత్యంత సన్నిహితుడైన దిమిత్రి మెద్వెదేవ్ తీవ్రంగా స్పందించారు. లిండే గ్రాహం చేసిన ట్వీట్ను కోడ్ చేస్తూ మెద్వెదేవ్ కౌంటరిచ్చారు. To those in Russia who believe that President Trump is not serious about ending the bloodbath between Russia and Ukraine:You and your customers will soon be sadly mistaken. You will also soon see that Joe Biden is no longer president.Get to the peace table. https://t.co/IRWk9I0Ljf— Lindsey Graham (@LindseyGrahamSC) July 28, 2025 ఇక్కడ అమెరికా రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. రష్యాతో ట్రంప్ అల్టిమేటం గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ ఉంది రష్యా.. ఇజ్రాయిలో లేక ఇరాన్ దేశమో కాదు. 50 రోజులు లేదా 10... అని కాదు 2 విషయాలను గుర్తుంచుకోవాలి. ప్రతి అల్టిమేటం ముప్పు యుద్ధం వైపు అడుగు అనే విషయం ట్రంప్ గుర్తుంచుకోవాలి. ట్రంప్ చేస్తున్నది రష్యాపైనో, ఉక్రెయిన్ పైనో యుద్ధం కాదు. వేరే పరిణామాలకు దారి తీయొచ్చు(మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని సంకేతాలిస్తూ) ’ అంటూ ఘాటుగా స్పందించారు మెద్వెదెవ్.రష్యాకు 50 రోజుల సమయమేఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వారి మధ్య యుద్ధాన్ని ఆపేందుకు భారీ సుంకాలు ముప్పుతో హెచ్చరించారు. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్కు వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సోమవారం( జూలై 14) నాడు హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్కు 50 రోజుల సమయం ఇస్తున్నా, ఆ లోపు యుద్ధాన్ని ఆపకపోతే మాత్రం సుంకాల పరంగా రష్యా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. ‘ పుతిన్ చర్యలు చాలా నిరాశను కల్గిస్తున్నాయి. యుద్ధంపై 50 రోజుల్లో డీల్కు రాకపోతే రష్యా ఊహించని టారిఫ్లు చవిచూస్తుంది. ఆ టారిఫ్లు కూడా వంద శాతం దాటే ఉంటాయి. రష్యా యొక్క మిగిలిన వాణిజ్య భాగస్వాములను లక్ష్యంగా చేసుకునే ద్వితీయ సుంకాలు అవుతాయి.- ఇప్పటికే పాశ్చాత్య ఆంక్షలను తట్టుకుని కొట్టుమిట్టాడుతున్న మాస్కో సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తాం’ అని ట్రంప్ స్పష్టం చేశారు. వైట్ హౌస్లో నాటో చీఫ్ మార్క్ రూట్ను కలిసిన నేపథ్యంలో ట్రంప్ కాస్త ఘాటుగా స్పందించారు. -
ఆఫీస్ ఫర్నీచర్ అడ్డుపెట్టుకుని.. శరణార్థి కాస్త సూపర్ హీరోగా!
అగ్రరాజ్యపు ప్రముఖ నగరంలో జరిగిన కాల్పుల ఘటన ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసింది. న్యూయార్క్ మిడ్టౌన్ మాన్హటన్ ప్రాంతంలోని ఓ బహుళ అంతస్తుల భవనంలోకి తుపాకీతో ప్రవేశించిన దుండగుడు రెచ్చిపోయాడు. ఈ కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి సహా నలుగురు మృతి చెందారు. అయితే.. ఉద్యోగులు సమయస్ఫూర్తితో చాకచక్యంగా వ్యవహరించి ఉండకపోతే పెను ప్రాణ నష్టమే సంభవించి ఉండేదని తెలుస్తోంది. 345 పార్క్ అవెన్యూలో.. పలు ప్రముఖ సంస్థల కార్యకలాపాలు జరుగుతున్నాయి. అక్కడి కాలమానం ప్రకారం.. సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో కాల్పుల ఘటన చోట చేసుకుంది. ఆ సమయంలో కాల్పుల శబ్దాలు విన్న మిగతా ఉద్యోగులు.. బయట ఏం జరుగుతుందో అనే ఆందోళనకు గురయ్యారు. వెంటనే తేరుకుని తలుపులను బిగించుకున్నారు. సోఫాలు, కుర్చీలు, చేతికి దొరికిన ఫర్నీచర్ను తలుపులకు అడ్డుగా పెట్టుకున్నారు. కొంత మంది తమ డెస్కులను లాక్కెళ్లి అడ్డంగా పెట్టారు. BREAKING: Photo from inside the Blackstone office pic.twitter.com/8DeVVbX5CD— Exec Sum (@exec_sum) July 29, 2025మేము పని ముగించుకుని బయలుదేరేందుకు సిద్ధమవుతున్న సమయంలో, పబ్లిక్ అడ్రస్ ద్వారా ‘shelter in place’ అని హెచ్చరించారు అని షాద్ సాకిబ్ అనే ఉద్యోగి తెలిపారు. జెస్సికా చెన్ అనే ఉద్యోగి మాట్లాడుతూ.. మేము ప్రెజెంటేషన్ చూస్తున్న సమయంలో, ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు వినిపించాయి. వెంటనే టేబుళ్లను తలుపు దగ్గర బారికేడ్ చేశాం అని తెలిపింది. ‘‘ఇది భయంకరమైన అనుభం.. దాడి చేస్తూ అతను(దుండగుడు)పైకి వెళ్లాడు. ప్రాణాలు అరచేతపట్టుకుని వణికిపోయాం’’ అని ఓ మహిళా ఉద్యోగి తెలిపారు. మరో 9/11 దాడి జరుగుతుందేమోనని వణికిపోయాం అని మరికొందరు చెప్పడం గమనార్హం.దుండగుడు ఎవరంటే.. కాల్పుల్లో పోలీస్ అధికారి సహా నలుగురిని దుండగుడు హతమార్చాడు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ తర్వాత 33వ అంతస్తులోకి వెళ్లిన దుండగుడు.. తనను తాను కాల్చుకుని చనిపోయాడు. దుండగుడిని లాస్ వెగాస్ నెవెడాకు చెందిన షేన్ తమురా(27)గా గుర్తించారు. గ్రెనాడా హిల్స్ హై స్కూల్లో ఫుట్బాల్ ప్లేయర్గా ఉన్నాడు. లాస్ వెగాస్లోనే ఒక క్యాసినోలో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. 2022 జూన్ 14న గన్ లైసెన్స్ పొందాడు. దాడి సమయంలో AR-15 రైఫిల్, బుల్లెట్ రెసిస్టెంట్ వెస్ట్ ధరించి ఉంచడం గమనార్హం. నిందితుడికి సంబంధించిన నెవాడా నంబర్ ప్లేట్ ఉన్న BMW కారులో రైఫిల్, రివాల్వర్, మందులు, మ్యాగజైన్లు లభించాయి. న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకటన ప్రకారం.. తమురాకు మానసిక సమస్యలు ఉన్నాయి. అయితే ఈ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డాడనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. సూపర్ హీరో దిదారుల్ ఇస్లాం షేన్ తమురా జరిగిన కాల్పుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు మృతి చెందారు. చనిపోయిన వ్యక్తి.. ఎన్వైపీడీ పోలీస్ అధికారి దిదారుల్ ఇస్లాం. దుండగుడిని అడ్డుకునే క్రమంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. అయితే మూడేళ్ల కిందటి దాకా ఈయన బంగ్లాదేశ్ శరణార్థి. విధుల్లో చేరినప్పటి నుంచి నిబద్ధతతో పని చేస్తున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ప్రస్తుతం భార్య 8 నెలల గర్భవతిగా ఉంది. దిదారుల్ నిజమైన న్యూయార్కర్. దేవుడిని నమ్మే వ్యక్తి. ఆయన రియల్ హీరో అంటూ న్యూయార్క్ మేయర్ ఎరిక్ అడమ్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. దిదాఉల్ నగరాన్ని రక్షించేందుకు ప్రాణ త్యాగం చేశారు. ఆయన సేవలను ఎప్పటికీ గౌరవిస్తాం అని NYPD కమిషనర్ జెస్సికా టిష్ తెలిపారు. తాజా ఘటన.. ఈ సంవత్సరం అమెరికాలో జరిగిన 254వ సామూహిక కాల్పుల ఘటనగా కావడం గమనార్హం. -
చైనాలో భారీ వరదలు
బీజింగ్: ఉత్తర చైనాలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా 30 మంది మరణించారు. 130 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లు, వంతెనలు తెగిపోయాయి. భారీ వర్షాలు కురి సే అవకాశం ఉండటంతో లక్ష మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రాణనష్టాన్ని నివారించడానికి పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టాలని అధ్యక్షుడు జిన్పింగ్ ఆదేశించారు. దేశ రాజధాని వరదలతో అతలాకుతలమైంది. రాజధానిలోనే 80,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వేలాది మందిని ఖాళీ చేయవలసి రావడంతో రాత్రంతా సహాయక చర్యలు కొనసాగాయి. బీజింగ్ సమీపంలోని షాంగ్జీ, హెబీ ప్రావిన్సులు కూడా కుండపోత వర్షాల వల్ల దెబ్బతిన్నాయి. హెబీలోని బావోడింగ్ నగరంలో దాదాపు 20,000 మందిని వారి ఇళ్ల నుంచి తరలించారు. హువైరౌ జిల్లాలో వరదలతో ఒక వంతెనను కూపోయింది. మియున్ జిల్లాలోని ప్రాంతాన్ని భా రీ వర్షం ముంచెత్తిన తరువాత, ఉబ్బిన కింగ్షుయ్ నది రహదారులు దెబ్బతిన్నాయి. బీజింగ్ అంతటా డజన్ల కొద్దీ రోడ్లు మూసివేయబడ్డాయి లేదా దెబ్బతిన్నాయి. మియున్ జిల్లాలో నది ఉప్పొంగుతోంది. షాంగ్జీ ప్రావిన్స్లోని లిన్ఫెన్ సిటీలోని జిక్సియన్ కౌంటీలో ఎల్లో రివర్ ఉధృతంగా ప్రవహిస్తోంది. మంగళవారం సాయంత్రం వరకూ వరద కొనసాగింది. కొండలన్నీ జలపాతాలు అయ్యాయి. కార్లు సెయిలింగ్ బోట్లను తలపి ంచాయి. దక్షిణ చైనాలో కూడా భారీ వర్షాలు కురిశాయి. హాంకాంగ్ ఈ సంవత్సరం మొదటిసారిగా అత్యధిక వర్షపు తుఫాను హెచ్చరికను జారీ చేసింది. బీజింగ్కు దక్షిణంగా, కో–మే తుఫాను సమీపిస్తుండటంతో జెజియాంగ్, జియాంగ్సు, అన్హుయ్ ప్రావిన్సుల్లో కూడా భారీ వర్షాలు కురవనున్నాయి. పూర్తి స్థాయిలో సహాయక చర్యలు : జిన్పింగ్ వరద ప్రభావిత ప్రంతాల్లో సహాయక చర్యలు పూర్తి స్థాయిలో చేపట్టాలని అధ్యక్షుడు జిన్పింగ్ పిలుపునిచ్చారు. తప్పిపోయిన వారని వెదకడానికి, వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు. సాధ్యమైనంతవరకు ప్రాణనష్టాన్ని తగ్గించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది సంభవించిన ప్రకృతి వైపరీత్యాల వల్ల చైనాకు 54.11 బిలియన్ యువాన్లు (ఆరున్నర లక్షల కోట్లు ) నష్టం వాటిల్లిందని అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో 90శాతానికి పైగా వరదల వల్లే కలిగాయని వెల్లడించింది. 🇨🇳中国の国営メディアによると、北京と近隣地域で大雨と洪水により30人以上が死亡し、数万人以上が首都から避難した。https://t.co/E1o1IachDH pic.twitter.com/GJxbcB8W5I— カントリーママ (@0327tnumata) July 29, 2025వరుస వరదలు.. బీజింగ్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు కొత్తేమీ కాదు. ఈ వేసవిలో చైనాలోని అనేక ప్రాంతాలు తీవ్రమైన వాతావరణాన్ని ఎదుర్కొన్నాయి. ఈ నెల ప్రారంభంలో దేశంలోని తూర్పు ప్రాంతంలో రికార్డు స్థాయిలో వేడిగాలులు వీచగా, దేశంలోని నైరుతి ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. సోమవారం, బీజింగ్ సమీపంలోని చెంగ్డే నగరంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు మరణించారు. ఎనిమిది మంది గల్లంతయ్యారు. ఈ నెల ప్రారంభంలో, టైఫూన్ విఫా తూర్పు చైనాను తాకినప్పుడు, షాన్డాంగ్ ప్రావిన్స్లో ఇద్దరు మరణించారు. 10 మంది గల్లంతయ్యారు. ఈ నెల ప్రారంభంలో నైరుతి చైనాలోని యాన్ నగరంలో కొండచరియలు విరిగిపడి ముగ్గురు మరణించారు. 2023లో భారీ వర్షాలు, వరదల కారణంగా 33 మంది మృతి చెందారు. 18 మంది గల్లంతయ్యారు. జూలై 2012లో వరదలు 79 మందిని బలిగొన్నాయి. ఇప్పటివరకు ఇదే అత్యంత తీవ్రమైన విపత్తు. -
‘లండన్ మేయర్ దుష్టుడు’.. సాదిక్ ఖాన్పై ట్రంప్ మాటల దాడి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు నోరు పారేసుకున్నారు. లండన్ మేయర్ను దుష్టుడు అని, అతను చేయకూడని పనిచేశాడని వ్యాఖ్యానించారు. సెప్టెంబర్లో లండన్కు రావాలనుకుంటున్నారా? అని ట్రంప్ను ఒక విలేకరి అడిగినప్పుడు ఆయన తానేమీ మీ మేయర్ అభిమానిని కాదని, అతను చేయకూడని పనిచేశాడని భావిస్తున్నానని వ్యాఖ్యానించారు.సోమవారం స్కాట్లాండ్లో యూకే ప్రధానితో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన లండన్ మేయర్ సాదిక్ ఖాన్పై మాటల దాడి చేశారు. కాగా యునైటెడ్ కింగ్డమ్లో అత్యధిక జనాభా కలిగిన లండన్కు మొదటి ముస్లిం మేయర్గా సాదిక్ ఖాన్ గుర్తింపు పొందారు. రాజకీయ ప్రత్యర్థులు తన మతాన్ని విమర్శించిన సందర్బాల్లో సాదిక్ ఖాన్ ఎదురుదాడికి దిగుతుంటారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో సాదిక్ ఖాన్పై పలు విమర్శలు చేశారు. అయితే సాదిక్ ఖాన్ తాను ఇటువంటి విమర్శలను పట్టించుకోనని గతంలోనే స్పష్టం చేశారు. 2016, మే 9న ఖాన్ లండన్ మేయర్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి అధ్యక్ష అభ్యర్థి ట్రంప్.. సాదిక్ ఖాన్పై పలు విమర్శలు చేశారు. ‘గుడ్ మార్నింగ్’ బ్రిటన్’లో ఖాన్ను మెరటు వ్యక్తి అని, అజ్ఞాని అని ట్రంప్ సంబోధించారు. -
నిమిష ప్రియ మరణశిక్ష రద్దు!
సనా: భారతీయ నర్సు నిమిష ప్రియకు ఎట్టకేలకు మరణశిక్ష నుంచి విముక్తి లభించింది. యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న ఆమెకు గతంలో విధించిన మరణశిక్షను శాశ్వతంగా రద్దుచేసినట్లు భారత గ్రాండ్ ముఫ్తీ, సున్నీ మత ప్రబోధకుడు కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటించింది. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదలచేసింది. అయితే భారత విదేశాంగ శాఖ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆమెకు మరణశిక్ష రద్దుచేయాలంటూ వస్తున్న అభ్యర్థనలను పరిశీలించేందుకు యెమెన్ రాజధాని సనా సిటీలో ఒక అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉత్తర యెమెన్ అధికారులు, అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు పాల్గొన్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. -
నిత్యం డ్రగ్స్.. రోజంతా మత్తులోనే
టెల్ అవీవ్: ఇజ్రాయెల్ గూఢచార విభాగం మొస్సాద్ సంబంధ సోషల్ మీడియా ఖాతాలో ఇరాన్ సుప్రీం నేత అయెతొల్లా ఖమేనీ గురించి తీవ్ర వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి. ఖమేనీ పాలనకు తగిన వ్యక్తి కారని, డ్రగ్స్కు బానిసై ఎప్పుడూ మత్తులోనే జోగుతుంటారని ఆరోపించింది. పర్షియన్ భాషలోని ఈ అకౌంట్ను @Mossad Spokesman గా గుర్తించారు. ఇది ‘మొస్సాద్ ఫార్సి’గా కూడా పేరుతెచ్చుకుంది. అచ్చు మొస్సాద్ అధికార చానెల్ అకౌంట్ మాదిరిగానే కనిపిస్తుంది. ఇరాన్ లక్ష్యంగా ఇందులో పలు వివాదాస్పద వ్యాఖ్యలు ప్రత్యక్షమవుతుంటాయి. ఇరాన్కు ఇబ్బంది కలిగించేలా ఆ దేశ ప్రభుత్వ రహస్య సమాచారం వంటివి ఇందులో కనిపిస్తుంటాయి. అంతేకాదు, పలువురు ముఖ్య నేతలు, అధికారుల గురించిన రహస్య క్విజ్ పోటీలను సైతం ఈ అకౌంట్ నిర్వహిస్తుంటుంది. శుక్రవారం @MossadSpokesman ఎక్స్ అకౌంట్లో..‘రోజులో సగం నిద్రకు, మరో సగం డ్రగ్స్కు బానిసై గడిపే వ్యక్తి దేశాన్ని ఎలా నడపగలరు?..నీళ్లు, కరెంటు, జీవితం’అంటూ పేర్కొంది. అయితే, ఇందులో ఖమేనీ పేరును మాత్రం ప్రస్తావించలేదు. ఇరాన్లో కనీస మౌలిక సదుపాయాలైన నీళ్లు, విద్యుత్ కొరతలతోపాటు నిత్యం కనిపించే ప్రజాందోళనలను పరోక్షంగా పేర్కొంది. ఈ పోస్టుకు 48 గంటల్లోనే 1.80 లక్షల మంది స్పందించారు. గత నెలలో ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య 12 రోజులపాటు కొనసాగిన సంక్షోభం సమయంలో ఈ అకౌంట్లో ఇరాన్ నూతన సైనిక కమాండర్ ఎవరో చెప్పాలంటూ సవాల్ విసరగా ఒక వ్యక్తి కచ్చితమైన పేరును వెల్లడించడం విశేషం. ఈ అకౌంట్లో గతంలోనూ ఇలాంటి రెచ్చగొట్టే పోస్టులే ఉండేవి. డ్రగ్స్ వాడే వారు నాయకత్వం వహించగలరా అంటూ ప్రశ్నించింది. ఇందులో ప్రత్యేకంగా అయెతొల్లా ఖమేనీ పేరును ప్రస్తావించనప్పటికీ ఆ తీవ్రత, కంటెంట్ను బట్టి ఇరాన్ సుప్రీం లీడరే టార్గెట్ అన్న విషయం తేలిగ్గా ఎవరికైనా అర్థమవుతుంది. పర్షియా భాషలో ఉన్న ఈ పోస్టులను ఆటో–ట్రాన్స్లేషన్తో అందరూ చదవొచ్చు. ఈ అకౌంట్ తమదేనంటూ ఇజ్రాయెల్ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. అయినప్పటికీ ఇరాన్ ప్రజలే లక్ష్యంగా మొస్సాద్ నిర్వహించే మెసేజింగ్ చానెల్గానే చెబుతుంటారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ వేళ... గత నెలలో ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ చేపట్టిన వేళ ఈ అకౌంట్ వచ్చిన ఒక పోస్టు తీవ్ర వివాదానికి కారణమైంది. ఇజ్రాయెల్ చేసిన మొట్టమొదటి దాడిలో ఇరాన్కు చెందిన ఘొలాం అలీ రషీద్ అనే మిలటరీ కమాండర్ చనిపోయారు. ఆ వెంటనే అలీ షాద్మానీ అనే ఆయన వారసుడు సైతం మృతి చెందారు. ఆయన స్థానంలో కొత్తగా నియమించిన కమాండర్ పేరును ఇరాన్ రహస్యంగా ఉంచింది. ఈ అంశంపై @Mossad Spokesman రెచ్చగొట్టే రీతిలో స్పందించింది. ఆ కమాండర్ ఎవరో తనకు తెలుసునంటూ, కొత్తగా నియమితులైన కమాండర్ పేరును తెలిస్తే చెప్పాలంటూ నెటిజన్లకు క్విజ్ పెట్టింది. ‘ఇరాన్ ప్రభుత్వం ఖతమ్ అల్ అన్బియాకు కొత్త కమాండర్ను నియమించింది. భద్రత కోసం ఆయన పేరును వెల్లడించలేదు. మాకు అతడెవరో తెలుసు, అతడితో ఉండే వారి పేర్లూ తెలుసు. దురదృష్టవశాత్తూ ఇటువంటి విషయాలను ఇరాన్ ప్రజలకు ప్రభుత్వం తెలియనివ్వడం లేదు. ఆ కొత్త కమాండర్ పేరు తెలిస్తే దయచేసి చెప్పండి’అని కోరింది. దీనికి 2,300 మంది స్పందించారు. ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ తదితర పేర్లను కొందరు ఊహించి చెప్పగా మరికొందరు మాత్రం తిట్టిపోశారు. తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇరాన్ సోషల్ మీడియా యూజర్ బెహ్నమ్ గొలిపౌర్ మాత్రం కొత్త కమాండర్ పేరు అలీ అబ్దొల్లాహి అలియాబాది అంటూ కరెక్ట్గా గెస్ చేశారు. అతడి పేరును ప్రకటించిన మొస్సాద్ అకౌంట్..వ్యక్తిగతంగా తమను కలిసి, బహుమతి అందుకోవాలని కోరింది. -
గాజాలో కరువు వాస్తవమే: ట్రంప్
స్కాట్లాండ్: గాజాలో కరువు పరిస్థితులున్న విష యం వాస్తవమేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. కరువు లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదన్నారు. ‘టీవీల్లో చూస్తే తెలుస్తుంది. అక్కడున్న చిన్నారులు ఎంత ఆకలితో ఉన్నారో... అక్కడ నిజంగానే కరువుంది. దీనిని దాచిపెట్టలేం’అని స్కాట్లాండ్లో పర్యటిస్తున్న ట్రంప్ సోమ వారం పేర్కొన్నారు. గాజా ప్రాంతంలో అమెరికా ఆహార కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని, చిన్నారుల పొట్ట నింపుతుందని చెప్పారు. ప్రజలు స్వేచ్ఛగా సంచరించే చోట, సరిహద్దులు లేని చోట తాము అవాంతరాలు కల్పించబోమన్నారు. గాజా లో హమాస్ చేయలేనిది ఎంతో చేయగలమన్నారు. ‘బందీలందరినీ హమాస్ ఎక్కడ దాచిందో తెలిసిన ఇజ్రాయెల్ హమాస్తో ఒప్పందం కష్టమంటోంది. అదే సమ యంలో, చిట్టచివరి 20 మంది బందీలను హమాస్ రక్షణ కవచాలుగా భావిస్తోంది. అందుకే, వారిని వి డుదల చేయడం లేదు’అని ట్రంప్ వ్యాఖ్యానించారు.గాజాలో 17 టన్నుల ఆహారం జారవేతయూఏఈ వైమానిక దళం విమానాలు రెండో రోజు సోమవారం గాజాలోని పాలస్తీనియన్లకు 17 టన్నుల ఆహార పదార్థాలను జారవిడిచాయని జోర్డాన్ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 19 టన్నుల ఆహార పదార్థాలను ఒక ట్రక్కు కింద లెక్క. అంటే ట్రక్కు కంటే తక్కువ ఆహారాన్ని విడిచినట్లేనని ఐరాస పాలస్తీనా శరణార్థి విభాగం చీఫ్ ఫిలిప్ తెలిపారు. ఆదివారం 25 టన్నుల ఆహార ప్యాకెట్లను జారవిడవడం తెల్సిందే. ఇజ్రాయెల్ ఆర్మీ నెలలుగా అమలు చేస్తున్న దిగ్బంధంతో గాజాలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడటం, జనం, ముఖ్యంగా చిన్నారులు ఆకలి చావులకు గురవుతుండటంపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.పుతిన్కు గడువు 10, 12 రోజులేఉక్రెయిన్తో ఒప్పందానికి రాకుంటే ఆంక్షలేట్రంప్ తాజా హెచ్చరికఉక్రెయన్తో యుద్ధం చేస్తున్న రష్యాకు విధించిన 50 రోజుల గడువును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుదించారు. అధ్యక్షుడు పుతిన్ 10, 12 రోజుల్లో ఉక్రెయిన్తో ఒప్పందం చేసుకోకుంటే ఆంక్షలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. సోమవారం ఆయన స్కాట్లాండ్లో మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్తో యుద్ధాన్ని కావాలనే పొడిగిస్తూ పోతున్న పుతిన్ వైఖరితో అసహనంతో ఉన్నానన్నారు. ఇంత సుదీర్ఘకాలం వేచి ఉండటంలో అర్థం లేదంటూ, మున్ముందు ఏం జరగనుందో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. అందుకే పుతిన్కు తక్కువ సమయం ఇస్తున్నట్లు తెలిపారు. భారీ టారిఫ్ల ను రష్యాపై విధిస్తారా అన్న ప్రశ్నకు ఆయన.. ఇందుకు సంబంధించిన చర్యలపై ఇవ్వాళోరేపో ఒక అధికారిక ప్రకటన వెలువడుతుందని ప్రకటించారు. ప్రస్తుత పరిణామాలపై పుతిన్తో మాట్లా డాలనే ఆసక్తి తనకు అంతగా లేదని చెప్పారు. -
షావోలిన్ గురువుపై చైనా విచారణ
బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా పేరున్న షావోలిన్ టెంపుల్ అధిపతి షి యోంగ్ జిన్పై చైనా ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. లంచాలు తీసుకోవడం, పలువురు మహిళలతో అనైతిక సంబంధాలు నెరపడం, అక్రమ సంతానాన్ని కలిగి ఉండటం వంటి ఆరోపణలను ఆయనపై మోపిందని టెంపుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ విభాగాలు దర్యాప్తు చేపట్టాయంది. దాదాపు 1,500 ఏళ్ల చరిత్ర కలిగిన షావోలిన్ టెంపుల్ సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్లో ఉంది. ప్రపంచవ్యాప్తంటా ఏటా వేలాదిగా శిష్యులు ఇక్కడికి వచ్చి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందుతుంటారు.షి యోంగ్ జిన్ ఈ షావోలిన్ టెంపుల్ అధిపతిగా 1999 నుంచి కొనసాగుతున్నారు. షావోలిన్ టెంపుల్ పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత సొంతం చేసుకున్న ఈయనకు సీఈవో మాంక్ అనే పేరూ ఉంది. షి హయాంలోనే షావోలిన్ టెంపుల్ చైనా వెలుపల కూడా స్కూళ్లను ప్రారంభించింది. సన్యాసుల బృందాలు షావోలిన్ కుంగ్ఫూ విన్యాసాల్లో పాల్గొనడం మొదలైంది. ‘షి యోంగ్జిన్ చర్యలు తీవ్రమైనవి, బౌద్ధ వర్గం, సన్యాసుల ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయి’అని బుద్ధిస్ట్ అసోసియేషన్ ఆఫ్ చైనా ఒక ప్రకటనలో పేర్కొంది. -
భూకంపం వస్తోంది.. జాగ్రత్త..!
ఫోన్ అంటే కాల్స్, మెసేజెస్, వినోదమేనా? అంతకు మించి.. చూడ్డానికి చిన్న పరికరమే కావొచ్చు కానీ కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కాపాడే సంజీవని కూడా. అవును మీరు చదువుతున్నది నిజమే. భూకంప కేంద్రం నుంచి తీవ్రత చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించేలోపే.. విపత్తు రాబోతోందని యూజర్లను హెచ్చరించే వ్యవస్థ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉంది. మొబైల్లోని యాక్సిలరేషన్ సెన్సార్ల ఆధారంగా పనిచేసే ఈ వ్యవస్థ ప్రపంచంలో భూకంప ప్రభావిత ప్రాంతాలలో నివసించే ప్రజలకు సందేశాల రూపంలో హెచ్చరిస్తోంది.– సాక్షి, స్పెషల్ డెస్క్ఆండ్రాయిడ్ ఎర్త్క్వేక్ అలర్ట్ (ఏఈఏ) వ్యవస్థను ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ను అభివృద్ధి చేసిన టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2020 నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లలో పరిచయం చేసింది. ప్రాథమిక (ప్రైమరీ వేవ్స్), ద్వితీయ (సెకండరీ వేవ్స్) భూకంప తరంగాలను ఈ వ్యవస్థ గుర్తిస్తుంది. ఏఈఏ సిస్టమ్ ఇప్పటి వరకు 98 దేశాలలో భూకంప ప్రభావిత ప్రాంతాలలో నివసించే ప్రజలకు హెచ్చరికలను పంపింది. ఇప్పటి వరకు 18,000 పైచిలుకు భూకంప సంఘటనలకు సంబంధించి 79 కోట్లకుపైగా అలర్ట్స్ జారీ చేసింది. ఈ వ్యవస్థ ఇప్పుడు నెలకు సగటున 60 హెచ్చరికలను పంపుతోంది. దాదాపు 1.8 కోట్ల మంది కనీసం ఒక హెచ్చరికనైనా అందుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మంది ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. గూగుల్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీ సీస్మాలజీ ల్యాబొరేటరీ మూడు సంవత్సరాలుగా ఈ వ్యవస్థ పనితీరు, పద్ధతులను వివరిస్తూ డేటాను విడుదల చేశాయి.సెకన్ల ముందు హెచ్చరిక..భూకంపం వచ్చే కొన్ని సెకన్ల ముందు యూజర్లకు ఏఈఏ హెచ్చరిక సందేశాన్ని పంపుతుంది. భూకంప తీవ్రత సాధారణంగా ఉండే అవకాశం ఉంటే ‘మీరు జాగ్రత్త’ అని, ముప్పు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంటే ఆడియో రూపంలో వార్నింగ్తోపాటు పారాహుషార్ అంటూ హెచ్చరిస్తుంది. భూ ప్రకంపనలను గుర్తించడానికి ఫోన్లోని యాక్సిలెరోమీటర్ సాయంతోనే భూ ప్రకంపనలను ఈ వ్యవస్థ గుర్తిస్తుంది. భూకంప తరంగాలు ఫోన్ను చేరగానే ఆ సమాచారాన్ని గూగుల్ సర్వర్లకు పంపుతుంది. ఒక ప్రాంతంలోని ఇతర ఫోన్ల నుంచి కూడా ఇలాంటి సమాచారమే వస్తే భూకంపం సంభవించినట్టు గూగుల్ నిర్ధారిస్తుంది. అత్యంత తీవ్రంగా భూమి కంపించకముందే ప్రభావిత ప్రాంతంలో.. ఆండ్రాయిడ్ ఫోన్ను వాడుతున్న వారికి ఈ వ్యవస్థ హెచ్చరికలను పంపుతుంది. భూకంప తరంగాల కంటే వేగంగా హెచ్చరికలను ప్రసారం చేయడానికి ఏఈఏ కాంతి వేగాన్ని ఉపయోగిస్తుంది.యూఎస్తో మొదలు..ఏఈఏ వ్యవస్థ తొలుత 2020లో యూఎస్లో మొదలైంది. 2021లో న్యూజిలాండ్, గ్రీస్లో, ఆ తర్వాత మిగిలిన దేశాలకు విస్తరించారు. ఈ వ్యవస్థ హెచ్చరించిన సంఘటనల్లో 2023లో టర్కీ–సిరియా (రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.8), ఫిలిప్పీన్స్ (6.7), నేపాల్ (5.7), 2025 ఏప్రిల్లో టర్కీలో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపాలు ఉన్నాయి. ఇప్పటివరకు గుర్తించిన సంఘటనలలో 2,000 కంటే ఎక్కువ తీవ్ర భూకంపాలు ఉన్నాయి. ఇక ఏఈఏ బృందం 2023 ఫిబ్రవరి–2024 ఏప్రిల్ మధ్య 15 మందిని సర్వే చేస్తే.. 79% మంది ఈ హెచ్చరికలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. భూకంపం రాకముందే హెచ్చరిక అందుకున్నట్టు 5.4 లక్షల మంది చెప్పడం విశేషం.కోట్లాది మందికి..2023 నవంబర్లో ఫిలిప్పీన్స్లో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు.. భూకంపం ప్రారంభమైన 18.3 సెకన్ల తర్వాత ఈ వ్యవస్థ మొదటి హెచ్చరికను పంపింది. అత్యంత తీవ్ర ప్రకంపనలు సంభవించిన భూకంప కేంద్రానికి దగ్గరగా ఉన్నవారికి 15 సెకన్లపాటు మెసేజులు పంపారు. దూరంగా ఉన్నవారికి, తక్కువ ప్రకంపనలు వచ్చిన ప్రాంత యూజర్లకు ఒక నిమిషంపాటు అలర్ట్స్ జారీ చేశారు. ఇలా మొత్తంగా 25 లక్షల మందిని అప్రమత్తం చేశారు. 2023 నవంబర్లో నేపాల్లో 5.7 తీవ్రతతో భూకంపం వచ్చినప్పుడు కోటి మందికిపైగా హెచ్చరికలు అందాయి. 2025 ఏప్రిల్లో టర్కీలో భూమి కంపించడం ప్రారంభమైన 8 సెకన్ల తర్వాత మొదటి అలర్ట్ జారీ అయింది. ఈ ఘటనలో 1.1 కోట్ల మందికిపైగా ఈ సందేశాలు అందుకున్నారు.అలర్ట్స్ అందుకోవాలంటే వినియోగదారులు వైఫై లేదా సెల్యులార్ డేటా కనెక్టివిటీని కలిగి ఉండాలి. ఆండ్రాయిడ్ ఎర్త్క్వేక్ అలర్ట్, లొకేషన్ సెట్టింగ్స్ రెండూ ఆన్లో ఉండాలి.భూకంప తీవ్రత సాధారణంగా ఉండే అవకాశం ఉంటే ‘మీరు జాగ్రత్త’ అని, ముప్పు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంటే ఆడియో రూపంలో వార్నింగ్తోపాటు పారాహుషార్ అంటూ హెచ్చరిస్తుంది. -
సెప్టెంబర్లో సిరియా ఎన్నికలు
డమాస్కస్: దీర్ఘకాల అంతర్యుద్ధం అనంతరం.. సిరియాలో పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి 20 ఎన్నికలను నిర్వహించనున్నట్లు పీపుల్స్ అసెంబ్లీ ఎన్నికల ఉన్నత కమిటీ చైర్మన్ మొహమ్మద్ తహా అల్–అహ్మద్ తెలిపారు. గతేడాది డిసెంబర్లో తిరుగుబాటుతో బషర్ అసద్ అధికార పతనం తరువాత.. దేశంలో మొదటిసారి ఎన్నికలు జరగుతున్నాయి. తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్–షరా మార్చిలో తాత్కాలిక రాజ్యాంగంపై సంతకం చేశారు. సాధారణ ఎన్నికలు జరిగి.. శాశ్వత రాజ్యాంగాన్ని ఆమోదించే వరకు తాత్కాలిక పార్లమెంటుగా పీపుల్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరగనున్నాయి. అలవైట్లపై హింస.. డ్రూజ్ మిలిటెంట్ల దాడులు మార్చిలో అలవైట్ మైనారిటీకి చెందిన వందలాది మంది హత్యతో మతపరమైన హింస చెలరేగింది. సిరియా భద్రతా దళాలు అలవైట్ మైనార్టీ వర్గానికి చెందిన వందలాదిమంది పౌరులను చంపినట్టు ఆరోపణలు వచ్చాయి. అలవైట్లను లక్ష్యంగా చేసుకొని 30 సార్లు సాగించిన మారణకాండలో 745 మంది పౌరులు చనిపోయినట్లు బ్రిటన్ కేంద్రంగా పనిచేసే సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యుమన్ రైట్స్ (ఎస్ఓహెచ్ఆర్) తెలిపింది. దీంతో సిరియాలో మైనారిటీల స్థితిగతులపై ఆందోళనలను రేకెత్తించాయి. మరో మైనారిటీ గ్రూప్ డ్రూజ్ మిలిటెంట్లు ప్రభుత్వంపై దాడికి దిగారు. గతంలో ఐఎస్ఎస్ ఉగ్రవాదిగా ఉన్న అహ్మద్ అల్ షరా.. అసద్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఈ డ్రూజ్ మైనారిటీల మిలిటెంట్ల సాయం తీసుకున్నారు. తీరా అల్ షరా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడేటప్పుడు కేవలం ఒక్క డ్రూజ్ నేతకే ప్రభుత్వంలో స్థానం కల్పిస్తానని చెప్పడం, డ్రూజ్ ప్రాభల్య ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో చీలిక వచ్చింది. డ్రూజ్లో ఒక వర్గం ఇలా సాయుధ పంథాను ఉధృతం చేసింది. సువైదా ప్రావిన్స్లో జూలై 13న డ్రూజ్ వ్యాపారి అపహరణతో తాజా హింస ప్రారంభమైంది. డమాస్కస్, సువైదా, డెరాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభించింది. ప్రభుత్వ అనుబంధ దళాల నుండి డ్రూజ్ను రక్షించడానికి తమ దళాలు ప్రయత్నిస్తున్నాయని పేర్కొంది. సువైదాలో 1,100 మందికి పైగా మరణించినట్లు ఎస్ఓహెచ్ఆర్ తెలిపింది. డ్రూజ్, బెడోయిన్, ప్రభుత్వ దళాలు.. దారుణాలకు పాల్పడ్డాయి. అసద్ పతనం నుంచి దేశవ్యాప్తంగా సైనిక స్థావరాలు, ప్రభుత్వ దళాలపై దాడి చేస్తున్న ఇజ్రాయెల్.. సిరియాలోని కుర్దులు, డ్రూజ్, అలవైట్లతో సహా మైనారిటీల రక్షకుడిగా చూపించుకునే ప్రయత్నం చేసింది. అయితే.. ఇజ్రాయెల్ తన విస్తరణ కోసం సిరియాలో మత విభజనను రేకెత్తిస్తోందని విమర్శలున్నాయి. రాష్ట్ర నిర్మాణం, యుద్ధానంతర పునరుద్ధరణ ప్రయత్నాలను మత ఘర్షణలు, ఇజ్రాయెల్ దాడులు పక్కదారి పట్టిస్తున్నాయి. ఈ హింస తర్వాత ప్రజల్లో చీలిక వచ్చింది. కొత్త ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత పెరిగింది. ఈ నేపథ్యంలోనే తాత్కాలిక ప్రభుత్వం ఎన్నికల ప్రకటన చేసింది. అసద్ పతనం తరువాత మొదలైన మతపరమైన విభజనలను తగ్గించి.. పరిస్థితులను పునరుద్ధరించేందుకు తాత్కాలిక అధ్యక్షుడు అల్–షరా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇటీవల తన ఎన్నికల చట్టాలను సవరించింది, పార్లమెంటు సీట్లను 150 నుంచి 210కి పెంచింది. 210 సీట్లలో మూడింట ఒక వంతు స్థానాలను తాత్కాలిక అధ్యక్షుడు అల్–షరా నియమిస్తారు. మిగిలిన స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. దీనికోసం సిరియాలోని ప్రతి ప్రావిన్స్లో ఒక ఎలక్టోరల్ కాలేజీని ఏర్పాటు చేయనున్నారు. -
‘దయ చూపండి.. మా అమ్మ ఉరిశిక్షను ఆపండి’
యెమెన్ దేశంలో ఓ హత్య కేసులో ఇరుక్కుని జీవన్మరణ పోరాటం చేస్తున్న కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియను కాపాడేందుకు కుటుంబ సభ్యులు తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొన్ని రోజులు క్రితం ఆమెకు పడాల్సిన ఉరిశిక్ష చివరి నిమిషంలో రద్దు కావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు నిమిష. బ్లడ్మనీ(క్షమాధనం లేక నష్టపరిహారం) ఇచ్చేందుకు కూడా సిద్ధమైన తరుణంలో ఆమె ఉరిశిక్ష వాయిదా పడింది. అయితే బాధిత తలాల్ అబ్దో మెహదీ కుటుంబం మాత్రం తమకు బ్లడ్మనీ వద్దని ఇప్పటికే తెగేసి చెప్పింది. ఆమెకు శిక్ష పడాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. దాంతో నిమిష ఉరిశిక్ష రద్దు అనేది పక్కకు పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిలో భాగంగా నిమిష కూతరు 13 ఏళ్ల మిషెల్ తన తల్లియందు దయ చూపించాలని యెమెన్ అధికారుల్ని వేడుకోంటుంది. ఈ మేరకు మలయాళం, ఇంగ్లిష్ భాషల్లో తల్లిని రక్షించాలంటూ ప్రాధేయపడుతోంది. ‘ఐ లవ్ యూ మమ్మీ. ఐ మిస్ యూ. మా అమ్మను తిరిగి వెనక్కి పంపడానికి సాయం చేయండి. మా అమ్మ పట్ల దయ చూపండి. తలాల్ కుటుంబానికి థాంక్స్ చెప్పేందుకు మిషెల్ ఇక్కడ ఉంది. మీరు మా అమ్మపై కరుణ చూపి అక్కడ నుంచి విడుదలకు మార్గం చూపండి. రేపు, రేపు మరుసటి రోజు మీ పట్ల మేము చాలా కృతజ్ఞులమై ఉంటాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు’ అని వేడుకుంటోంది. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్తో కలిసి నిమిష ప్రియ కుటుంబ సభ్యులు యెమెన్లో తమ తమ ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే కేఎ పాల్తో కలిసి నిమిష కూతురు మిషెల్ మీడియాతో మాట్లాడింది. -
ఫలించిన ట్రంప్ దౌత్యం.. థాయ్-కంబోడియా తక్షణ కాల్పుల విరమణ
ఆసియా దేశాలు థాయ్-కంబోడియా తాజా సరిహద్దు ఘర్షణలకు ఎట్టకేలకు ముగింపు పడింది. ఇరు దేశాలు ఎలాంటి షరతులు లేకుండా తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ విషయాన్ని చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన మలేషియా ప్రధాని అన్వర్ అబ్రహీం సోమవారం ప్రకటించారు.ఈ ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం దశాబ్దాలుగా కొనసాగుతున్నదే. అయితే.. ఈ ఏడాది మే చివరి వారంలో కంబోడియన్ సైనికుడి కాల్చివేత ఘటన నుంచి 817 కిలోమీటర్ల సరిహద్దు వెంట ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరు దేశాల పరస్పర ఆరోపలతో దాడులను మొదలై.. తీవ్రతరం అవుతూ వచ్చాయి. ఈ క్రమంలో.. గత నాలుగైదు రోజుల ఘర్షణల్లో ఇరు దేశాలకు చెందిన 34 మంది మరణించగా, లక్షా 68వేల మంది నిర్వాసితులు అయ్యారు. దీంతో యుద్ధం ఆపేందుకు థాయ్-కంబోడియా నేతలతో తాను మాట్లాడానని, వారు చర్చలు జరిపేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారని జులై 26వ తేదీన సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అదే సమయంలో.. మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్యవర్తిత్వం చేసేందుకు ముందుకొచ్చారు. ఆయన ఆహ్వానం మేరకు పుత్రజయ(మలేషియాలో)లోని ఇబ్రహీం నివాసంలో సోమవారం థాయ్ తాత్కాలిక ప్రధాని పుమ్తామ్ వేచాయచాయ్, కంబోడియా ప్రధాని హున్మానెట్ సమావేశయ్యారు. ఈ భేటీకి చైనా, అమెరికా రాయబారులు కూడా హాజరయ్యారు. భేటీ తర్వాత మలేషియా ప్రధాని అన్వర్ ఇరు దేశ ప్రధానుల చేతులను చేతిలో ఉంచి సంధి కుదిర్చినట్లు ప్రకటించారు. ట్రంప్ ప్రతిపాదన మేరకు ఇరు దేశాల ప్రధానులం కాల్పుల విరమణకు అంగీకరించాం అని కంబోడియా ప్రధాని హున్మానెట్ ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. అయితే సోమవారం చర్చల సమయంలోనూ ఇరు దేశాల సరిహద్దుల్లో ఘర్షణలు కొనసాగినట్లు సమాచారం.ఇరుదేశాల ఘర్షణలు దేనికంటే..ప్రాచీన హిందూ దేవాలయాలు అయిన తా మోయాన్ థామ్, 11వ శతాబ్దపు ప్రేహ్ విహార్ ఆలయాలు ఇరు దేశాల సరిహద్దు వివాదాలకు కేంద్రంగా ఉన్నాయి. 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం ప్రేహ్ విహార్ ఆలయాన్ని కంబోడియాకే చెందుతుందని తీర్పు ఇచ్చింది. అయితే.. థాయ్లాండ్ ఆ తీర్పును ఖండిస్తూ ఇచ్చింది. 2008లో UNESCO వారసత్వ ప్రదేశంగా నమోదు చేయాలన్న ప్రయత్నం తర్వాత ఇరు దేశాల ఉద్రిక్తతలు పెరిగాయి.2025 మే నెల చివర్లో నుంచి సరిహద్దు వివాదం ముదరసాగింది. ఈ క్రమంలో ప్రైవేట్గా సంధి కోసం ప్రయత్నించిన పేటోంగ్టార్న్ షినవత్రా.. కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్కి ఫోన్ కాల్ చేసి ‘అంకుల్’ అంటూ మాట్లాడింది. ఆ కాల్ రికార్డ్ బయటకు రావడంతో.. అనూహ్యంగా ఆమె పదవి నుంచి వైదొలగాల్సి(సస్పెండ్) వచ్చింది. ఈ తరుణంలో.. జూన్లో కంబోడియా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని వివాద పరిష్కారానికి కోరింది. థాయ్లాండ్ మాత్రం న్యాయస్థాన అధికారాన్ని అంగీకరించలేదు, ద్వైపాక్షిక చర్చలే సరైన మార్గమని పేర్కొంది. -
100 ఏళ్లకు పెళ్లి, 103వ బర్త్డేకి తీరనున్న డ్రీమ్ : లైఫ్ సీక్రెట్ అదేనట!
అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన రెండవ ప్రపంచ యుద్దంలోని పాల్గొన్న హెరాల్డ్ టెరెన్స్ (Harold Terens) ఈ ఏడాది ఆగస్టుకి 103 ఏట అడుగు పెట్టబోతున్నాడు. ఈ సందర్భంగా పెంటగాన్లో తన బార్ మిట్జ్వా (Bar Mitzvah)ను జరుపుకోవడానికి సిద్ధమవుతున్నాడు. తద్వారా 13 ఏళ్ల నాటి డ్రీమ్ను పూర్తి చేయాలని భావిస్తున్నాడు. అసలేంటీ బార్ మిట్జ్వా? అతని కోరిక ఏంటి? తెలుసుకుందాం ఈ కథనంలో.తన 102వ పుట్టిన రోజు సందర్భంగా తాతగారు ఈవిషయాన్ని ప్రకటించారు. యుక్త వయస్సులో స్వీకరించాలని కలలుగన్న బార్ మిట్జ్వా (యూదుల ఆచారం)ను తన తదుపరి పుట్టినరోజు సందర్భంగా స్వీకరించాలని భావిస్తున్నట్లు చెప్పారు. యూదు మతాన్ని అనుసరించే తల్లి పోలాండ్కు చెందిన వారు కాగా, రష్యాకు చెందిన చెండికి మతాలంటే ఇష్టం ఉండదు. ఈ దంపతులకు రెండో సంతానంగా పుట్టాడుహెరాల్డ్ టెరెన్స్. బార్ మిట్జ్వా అంటే ?బార్ మిట్జ్వా అనేది యూదు సంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆచారం. ఇది 13 ఏళ్ల వయసు వచ్చిన యూదు బాలుడు తన మతపరమైన నైతిక బాధ్యతలను స్వీకరించే సందర్భాన్ని బార్మిట్జ్వా అంటారు. ‘మిట్జ్వోట్’ అంటే ‘మత ఆజ్ఞలు’ అని, ‘బార్’ అనే హీబ్రూ అంటే ‘కుమారుడు’ అని అర్థం. సాధారణంగా బార్ మిట్జ్వా వేడుకలో బాలుడు సినగాగ్లో తోరా (యూదు మత గ్రంథం) నుండి ఒక భాగాన్ని చదువుతాడు లేదా హాఫ్తారా పఠిస్తారు. ఈ సందర్భం బాలుడు సమాజంలో పెద్దవాడిగా గుర్తింపు పొందే సందర్భంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలోనే తాను కూడా బార్మిట్జ్వా స్వీకరించాలని భావిస్తున్నానని తెలిపారు. ఇప్పటికే హెరాల్డ్ సోదరుడు తల్లి మతవిశ్వాసాలను అనుసరిస్తూ యుక్త వయస్సులోనే బార్ మిట్జ్వాను స్వీకరించారు. తల్లి తండ్రుల విశ్వాసాల కారణంగా అప్పుడు నెరవేర్చుకోలేకపోయిన కలను,ఇన్నాళ్ల తర్వాత తన 103 ఏట బార్ మిట్జ్వా పొందాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 6న వాషింగ్టన్ డీసీ (Washington DC)లోని పెంటగాన్ (Pentagon)లో అతడి బార్ మిట్జ్వా జరగనుంది.ఇంకో విశేషం ఏమిటంటేగత ఏడాది 100 ఏళ్ల వయసులో 97 ఏళ్ల జీన్ స్వెర్లిన్ను వివాహం చేసుకుని ఈయన వార్తల్లో నిలిచాడు. నార్మాండీలో జరిగిన వివాహం, తన జీవితంలో అత్యంత ముఖ్యమైన సంఘటన అని గుర్తు చేసుకున్నాడు. నీ లైఫ్లో అదే మధురమైందన్నాడు. లైఫ్ ఒక అందమైన కథ లాంటిది. తన జీవితాన్ని పూర్తిగా జీవించాలీ అంటే ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో నేర్చుకుంటే చాలు తిరుగు ఉండదు. కనీసం పదేళ్లు ఆయువు జోడించుకున్నట్టే అంటారాయన. ఒత్తిడి లేని జీవితం నంబర్ వన్ అయితే, రెండోది 90 శాతం అదృష్టం అంటూ తన లైఫ్ రహస్యాన్ని పంచుకున్నాడు.అంతేకాదు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత కూడా టెరెన్స్ చాలా సార్లు మృత్యువు నుంచి బయటపడ్డాడు. ఇరాన్లో ఒక రహస్య మిషన్లో ఒకసారి, లండన్ పబ్లో జర్మన్ రాకెట్ నుండి తప్పించుకున్నాడట. తన జీవితం "ఒక పెద్ద అద్భుత కథ" అని అతను పేర్కొన్నాడు మరియు తన జీవితాన్ని పూర్తిగా జీవించాలని అనుకున్నాడు. "ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో మీరు నేర్చుకోగలిగితే, మీరు చాలా దూరం వెళ్తారని నేను అనుకుంటున్నాను. మీరు మీ జీవితానికి కనీసం 10 సంవత్సరాలు జోడిస్తారు. కాబట్టి అది నంబర్ వన్. మరియు 90% అదృష్టం," అని అతను చెప్పాడు, సుదీర్ఘమైన, సంతోషకరమైన జీవితానికి తన రహస్యాన్ని పంచుకున్నాడు. కాగా హెరాల్డ్ టెరెన్స్ 1942లో US ఆర్మీ ఎయిర్ ఫోర్స్లో చేరాడు . P-47 థండర్బోల్ట్ ఫైటర్ స్క్వాడ్రన్కు రేడియో రిపేర్ టెక్నీషియన్గా పనిచేశాడు. 1944లో D-డే నాడు, అతను ఫ్రాన్స్ నుండి తిరిగి వచ్చే విమానాలను మరమ్మతు చేయడంలో సహాయం చేశాడు. ఆ తరువాత నార్మాండీ నుండి విముక్తి పొందిన యుద్ధ ఖైదీలను ఇంగ్లాండ్కు రవాణా చేయడంలో సహాయం చేశాడు. జూన్ 2024లో, నాజీ ఆక్రమణ నుండి దేశం విముక్తి పొందిన 80వ వార్షికోత్సవం సందర్భంగా ఫ్రెంచ్ ప్రభుత్వం అతన్ని సత్కరించింది. -
బ్యాంకాక్లో కాల్పుల కలకలం
బ్యాంకాక్: థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో సోమవారం ఓ వ్యక్తి ఐదుగురిని కాల్చి చంపాడు. వ్యవసాయ ఉత్పత్తులతోపాటు ఆహారాన్ని విక్రయించే ఓర్ టోర్ కోర్ మార్కెట్లో ఈ ఘటన జరిగింది. నలుగురు సెక్యూరిటీ గార్డులను, ఒక మహిళను కాల్చి చంపిన దుండగుడు చివరకు తనను తాను కాల్చుకున్నాడు. దీంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. బ్యాంకాక్లోని ప్రధాన పర్యాటక కేంద్రంగా సందర్శకులను ఆకటుఏ్టకునే చతుచక్ మార్కెట్కు కొద్ది దూరంలోనే ఈ ఓర్ టోర్ కోర్ మార్కెట్ ఉంది. దుండగుడు వరుస కాల్పులు జరుపుతుండగా ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగెత్తుతున్న దృశ్యం, మృతదేహాలు వీధిలో చెల్లా చెదురుగా పడి ఉన్న దృశ్యం మార్కెట్ సీసీటీవీ కెమెరా ఫుటేజ్లో కనిపించింది. కాల్పుల తర్వాత నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని, అతడిని గుర్తించడానికి పోలీసులు ప్రయతి్నస్తున్నారు. ప్రస్తుతం థాయ్లాండ్, కంబోడియా మధ్య సరిహద్దు ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో ఘర్షణలకు, కాల్పులకు ఏదైనా సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. థాయిలాండ్లో కాల్పులు చాలా సాధారణం. నియంత్రణ అమలులో లోపాల కారణంగా ఇక్కడ తుపాకీలు పొందడం చాలా సులభం. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ తుపాకీ హింస విపరీతంగా పెరిగింది. ఈ ఏడాది మేలో థాయ్లాండ్లోని యు థాంగ్ జిల్లాలో 33 ఏళ్ల వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ముగ్గురు మరణించారు. 2023 అక్టోబర్లో బ్యాంకాక్లోని సియామ్ పారగాన్ మాల్లో 14 ఏళ్ల బాలుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు.చాలా మంది గాయపడ్డారు. 2022 అక్టోబర్లో జరిగిన మరో దారుణ సంఘటన జరిగింది. థాయ్ మాజీ పోలీసు ఒకరు పిల్లల సంరక్షణ కేంద్రంలో జరిపిన కాల్పుల్లో 24 మంది పిల్లలు సహా దాదాపు 36 మంది మరణించారు. #BreakingNews A shooting incident occurred in Bangkok, Thailand, leaving 6 people dead, according to Thai police. The gunman opened fire in the A.T.K. market and later committed suicide.photo footage @CIBThailand #กราดยิง #Thailand #Bangkok pic.twitter.com/AsbACMKdMH— 鳳凰資訊 PhoenixTV News (@PhoenixTV_News) July 28, 2025 -
ముగ్గురు భర్తల ముద్దుల పెళ్లాం!
ఒక వ్యక్తికి పలువురు భార్యలున్న కథలు మనం చాలానే విని ఉంటాం.. ఈమధ్యే హిమాచల్ యువతి ఆచారం ప్రకారం అన్నదమ్ముల్ని మనువాడడం చూశాంమహాభారతంలోని ‘‘పాంచాలి.. పంచ భర్తుక’’ అన్నట్టు కాదు కానీ...ఒక మహిళకు ముగ్గురు భర్తలుండటం గురించి మీరెప్పుడైనా విన్నారా?విని ఉండరు లెండి. ఎందుకంటే ఆమె ఉండేది టాంజానియాలో మరి!. ఇక్కడో విశేషం ఏంటంటే.. ముగ్గురు భర్తలుండటం కాదు, వాళ్లందరి పోషణ బాధ్యత తనే తీసుకోవడం!. ఎంచక్కా.. ఎలాంటి కీచులాటలూ లేకుండా అందరూ ఒకే ఇంట్లో కాపురం కొనసాగిస్తూండటం!. ఆ విశేషాలేవో చూసేద్దాం రండి..నెల్లి... టాంజానియా సరిహద్దులోని ఒకానొక పట్టణంలో ఉంటోంది. కార్లు అమ్మడం, కొనడం వృత్తి. బాగా సక్సెస్ఫుల్ కూడా. ఎనిమిదేళ్ల కాలంలో ఈమె వరుసగా ముగ్గురిని పెళ్లి చేసుకుంది. అంతకంటే ముందు కూడా ఒక భర్త ఉండేవాడు. కానీ.. ఓ కారు ప్రమాదంలో అతడు మరణించాడు. ఆ తరువాత ఒంటరిగానే ఉండాలని అనుకుంది. కానీ.. మరణించిన భర్త తమ్ముడు హసన్ ఆమె పంచన చేరాడు. మొదటి భర్తకు పుట్టిన పిల్లల పెంపకంలో చేదోడు వాదోడుగా ఉన్నాడు. కొంతకాలానికి ఈ వ్యవహారం కాస్తా ప్రేమకు ఆ తరువాత పెళ్లికి దారితీసింది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. కొన్నేళ్లు గడిచాయో లేదో.. ఆమె జీవితంలోకి ‘జిమ్మీ’ ఎంటరయ్యాడు. ఇతగాడు అప్పట్లో బాగా డిప్రెషన్లో ఉండేవాడట. తనకు ఎవరూ లేరన్న ఫీలింగ్తో బాధపడేవాడు. పాపం అనుకుందేమో నెల్లీ అతడిని రెండో మొగుడిగా స్వీకరించింది. ఇది జరిగిన కొంత కాలానికి నెల్లీకి డానీ పరిచయమయ్యాడు. అప్పుడే డిగ్రీ పూర్తి చేసుకున్న డానీ ఉద్యోగం వేటలో ఉన్నాడు. దొరుకుతుందో లేదో అన్న బెంగ, దొరకదేమో అన్న అత్మనూన్యత భావం డానీని వెంటాడేవట. ఈ నేపథ్యంలో నెల్లీ అతడికి ధైర్యం చెప్పేది. ఆ తరువాత ఇతడిని మూడో భర్తగా స్వీకరించింది!అందరూ ఒకే ఇంట్లో..నెల్లీ, అమె ముగ్గురు భర్తలు కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఒకొక్కరికి ఒక్కో బెడ్రూమ్ కూడా ఉంది. ప్రస్తుత ముగ్గురు భర్తలూ నిరుద్యోగులు. దీంతో కార్ల డీలర్గా నెల్లీ సంపాదిస్తున్న దాంతోనే కుటుంబ నడుస్తోంది. ముగ్గురిలో ఎవరితో ఎంత సేపు గడపాలన్న విషయంలో నెల్లీ మాటే చెల్లుతుంది. వారానికి తగిన షెడ్యూల్ వేసుకుని ఆ ప్రకారం వారితో గడుపుతానంటోంది నెల్లీ. ‘‘ముగ్గురు భర్తలూ నాకు సమానమే. అందరినీ ఒకేలా చూసుకుంటా. వాళ్లు కూడా ఎంతో అనోన్యంగా ఉంటారు. బెస్ట్ ఫ్రెండ్స్ అని పిలుచుకుంటారు కూడా’’ అంటుంది నెల్లీ. హసన్, జిమ్మీ, డానీలు కూడా తమ ఉమ్మడి భార్య విషయంలో సంతోషంగానే ఉన్నారు. ఈ ఏర్పాటు బాగానే ఉందని చెబుతున్నారు. ‘‘మగాడికి ఎక్కువ మంది భార్యలున్నప్పుడు లేని అభ్యంతరం.. ఒక మహిళకు ఎక్కువమంది భర్తలుంటే ఎందుకుండాలి?’’ అని ఎదురు ప్రశ్నిస్తాడు జిమ్మీ. చిక్కులూ లేకపోలేదు..నెల్లీ వ్యవహారం టాంజానియాలో కొంతమేరకు చిక్కులు సృష్టించింది. చట్టం ప్రకారం ఈ దేశంలో బహుభార్యత్వం తప్పు కాదు కానీ.. బహుభర్తృత్వం(Polyandry) మాత్రం తప్పు. కేసు పెడితే నెల్లీకి మూడేళ్ల జైలు శిక్ష పడవచ్చునని టాంజానియా లాయర్ ఒకరు చెబుతున్నారు. అంతేకాదు.. నెల్లీ ఇరుగుపొరుగు కూడా ఈ వ్యవహారంపై చెవులు కొరుక్కుంటూనే ఉన్నారు. అయితే ఒక్కటైతే స్పష్టం. మానవ సంబంధాలన్నవి అంత సులువుగా అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం అని!!:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
‘ఆకలి చావులను అరికట్టండి’: గాజా పరిస్థితులపై ఒబామా ఆవేదన
గాజా: గాజా స్ట్రిప్లో అంతకంతకూ పెరుగుతున్న మానవతా సంక్షోభం మధ్య అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలో ఆకలి చావులను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. గాజాలో సంక్షోభానికి శాశ్వత పరిష్కారం.. ఇజ్రాయెల్ బందీలను వెనక్కి తీసుకురావడం, ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలను నిలిపివేయడం జరగాలని ఒబామా పేర్కొన్నారు. ఆకలితో అక్కడి అమాయక ప్రజలు చనిపోతున్నారని, దీనిని నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఒబామా పేర్కొన్నారు.గాజా స్ట్రిప్లోని బాధితులను కలుసుకునేందుకు, వారికి సహాయం చేసేందుకు అనుమతులు ఉండాలన్నారు. వారికి ఆహారం, నీటిని దూరంగా ఉంచడం సమర్థనీయం కాదన్నారు. మరోవైపు గాజాలో పోషకాహార లోపం ఆందోళనకర స్థాయికి చేరుకున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (హూ) ఆదివారం హెచ్చరించింది. వారికి అందే సహాయాన్ని ఉద్దేశపూర్వకంగా నిరోధించడం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది నమోదైన 74 పోషకాహార లోపం మరణాలలో 63 జూలైలో సంభవించాయి. ఇందులో 24 మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. While a lasting resolution to the crisis in Gaza must involve a return of all hostages and a cessation of Israel’s military operations, these articles underscore the immediate need for action to be taken to prevent the travesty of innocent people dying of preventable starvation.…— Barack Obama (@BarackObama) July 27, 2025ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, గాజాలో దాదాపు ఐదుగురు పిల్లలలో ఒకరు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఆహార నిపుణులు కూడా గాజాలో కరువు పరిస్థితులపై ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. ఇక్కడి జనాభాకు సహాయం అందించడంపై ఇజ్రాయెల్ పరిమితులు విధించింది. కాగా ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం గాజాలోని మూడు ప్రాంతాలలో రోజుకు 10 గంటల పాటు యుద్ధానికి విరామం ప్రకటించింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు ఈ విరామం ప్రతిరోజూ ఉదయం 10:00 గంటల నుండి రాత్రి 8:00 గంటల వరకు ఉంటుందని ఇజ్రాయెల్ తెలిపింది. -
ఈయూతో ట్రంప్ భారీ వాణిజ్య ఒప్పందం.. దిగుమతులపై 15శాతం సుంకాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్తో భారీ వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించారు. ఇకపై ఈయూ దిగుమతులపై అమెరికా 15 శాతం సుంకాలను విధించనున్నదని వెల్లడించారు. యునైటెడ్ స్టేట్స్ దీనిని మునుపెన్నడూ లేని భారీ వాణిజ్య ఒప్పందంగా అభివర్ణించింది.యూరోపియన్ వస్తువులపై 30శాతం అమెరికా సుంకాలను నివారించేందుకు ఆగస్టు ఒకటితో గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ ఒప్పందం కుదిరింది. స్కాట్లాండ్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ల మధ్య జరిగిన సమావేశంలో ఈ ఒప్పందం కుదిరింది. ఈయూతో తాము ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని, ఇది ఇరు దేశాలకు లబ్ధి చేకూర్చే ఒప్పందం అని, బహుశా ఇది ఆ దేశంతో కుదిరిన పెద్ద ఒప్పందం అని ట్రంప్ వార్తాసంస్థ ఎఎఫ్పీకి తెలిపారు. Today, President Trump secured a HUGE, POWERFUL TRADE DEAL between the U.S. and EU 🇺🇸 The EU will: 💰 Invest $600 Billion in U.S.⚡️ Purchase $750 Billion in American Energy💸 Open Markets to U.S. pic.twitter.com/PWNtlhpH5b— The White House (@WhiteHouse) July 28, 2025ఈ 15శాతం సుంకాలు యూరప్లోని కీలకమైన ఆటోమొబైల్ రంగం, ఫార్మాస్యూటికల్స్, సెమీకండక్టర్లతో సహా అన్ని రంగాలకు వర్తిస్తాయని ట్రంప్ తెలిపారు. ఈ ఒప్పందం కారణంగా 27 దేశాల ఈయూ కూటమి యునైటెడ్ స్టేట్స్ నుండి 750 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనశక్తిని కొనుగోలు చేస్తుందని, ఈయూ 600 బిలియన్ డాలర్ల అదనపు పెట్టుబడులను అందిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. రష్యా నుండి ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా, రాబోయే మూడు సంవత్సరాలలో యూరోపియన్ యూనియన్ అమెరికా నుంచి ద్రవీకృత సహజ వాయువు, చమురు అణు ఇంధనాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుందని వాన్ డెర్ లేయన్ తెలిపారు.విమానాలు, కొన్ని రసాయనాలు, పలు వ్యవసాయ వస్తువులు, కీలక ముడి పదార్థాలు తరహా ఉత్పత్తులపై సుంకాలను తొలగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని ఆమె పేర్కొన్నారు. జనవరిలో ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఈయూ పలు సుంకాల కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంది. కార్లపై 25శాతం పన్ను, ఉక్కు, అల్యూమినియంపై 50శాతం సుంకాన్ని ఎదుర్కొంటోంది. అయితే ఇప్పుడు ఒప్పందం కుదరకపోతే ఈ 10శాతం సుంకాల రేటు 30శాతం వరకు పెరుగుతుందని అమెరికా హెచ్చరించింది. -
జర్మనీలో రైలు ప్రమాదం.. ముగ్గురు మృతి
బెర్లిన్: జర్మనీలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. 100 మందితో వెళ్తున్న రైలు పట్టాలు తప్పడంతో ముగ్గురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. జర్మనీలోని సిగ్మరింగెన్ పట్టణం నుండి ఉల్మ్ నగరానికి వెళుతున్న ప్యాసింజర్ రైలు అటవీ ప్రాంతంలో పట్టాలు తప్పింది.ఆదివారం(అక్కడి కాలమానం ప్రకారం) నైరుతి జర్మనీలోని బాడెన్-వుర్టెంబర్గ్ పరిధిలోని రీడ్లింగెన్ పట్టణానికి సమీపంలో సాయంత్రం 6:10 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు మృతిచెందారని పోలీసులు తెలిపారు. 50 మంది గాయపడ్డారని భావిస్తున్నారు. అయితే వీరి సంఖ్య ఎంతనేది చెప్పేందుకు అధికారులు నిరాకరించారు. రెండు రైలు బోగీలు పట్టాలు తప్పాయని, దీనికిగల కారణం తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. Γερμανία: Επιβατικό τρένο εκτροχιάστηκε - Αναφορές για αρκετούς νεκρούς και τραυματίες👉🔗https://t.co/6rBCB839rL#ingr #innews #τρενο #γερμανια pic.twitter.com/eX9s7kocd2— in.gr/news (@in_gr) July 27, 2025రైల్వే అధికారులు ప్రస్తుతం ప్రమాద తీరుతెన్నులను పరిశీలిస్తున్నారని ఆపరేటర్ తెలిపారు. ఈ మార్గంలో 40 కిలోమీటర్ల (25-మైళ్ల) పొడవునా రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. మరోవైపు స్థానిక వాతావరణశాఖ ఈ ప్రాంతంలో తీవ్రమైన తుఫాను గాలులు వీస్తున్నందున కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. రవాణా మంత్రులతో మాట్లాడుతున్నానని, అత్యవసర సేవలను అందించాలని కోరానని ఆయన తెలిపారు.స్థానిక టీవీ స్టేషన్ ఎస్డబ్ల్యూ ఆర్ తెలిపిన వివరాల ప్రకారం గాయపడిన వారిని ఆ ప్రాంతంలోని వివిధ ఆస్పత్రులకు తరలించేందుకు హెలికాప్టర్లు సేవలు అందించాయి. కాగా 2022 జూన్లో దక్షిణ జర్మనీలోని బవేరియన్ ఆల్పైన్ రిసార్ట్ సమీపంలో ఒక రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. 1998లో లోయర్ సాక్సోనీలోని ఎస్చెడ్లో హై-స్పీడ్ రైలు పట్టాలు తప్పగా, 101 మంది మృతిచెందారు. -
గ్రీస్లో కార్చిచ్చు విధ్వంసం
ఏథెన్స్: గ్రీస్లో కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోంది. వారంరోజులకు పైగా కొనసాగుతున్న మంటలతో వేలాది ఇళ్లు ధ్వంసం అయ్యాయి. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏథెన్స్ శివారు ప్రాంతం క్రియోనేరిలో మరో కార్చిచ్చు చెలరేగింది. ఇప్పటికే అనేక ప్రాంతాలను మంటలు చుట్టుముట్టగా.. క్రియోనేరిలోని కార్చిచ్చు వేలాది మందిని ప్రమాదంలో పడేసింది. ఏథెన్స్కు ఈశాన్యంగా దాదాపు 20 కి.మీ దూరంలో ఉన్న క్రియోనేరిని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలు, పొడి పరిస్థితులు, బలమైన గాలులతో మంటలు మరింత తీవ్రమవుతున్నాయి. గ్రీకు జర్నలిస్ట్ ఎవాంజెలో సిప్సాస్ ఎక్స్లో షేర్ చేసిన వీడియోలో వినాశకరమైన కార్చిచ్చు దృశ్యాలు కనిపించాయి. ఏథెన్స్కు ఉత్తరాన కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమీపంలోని మరో గ్రామంలో పేలుళ్లు సంభవించాయి. ఆ ప్రాంతంలో కర్మాగారాలు ఉండటంతో మరింత ప్రమాద భయాలు మరింత పెరిగాయి. హెలికాప్టర్లు ద్వారా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయతి్నస్తున్నారు. క్రీట్, ఎవియా, కైథెరా దీవులలో మరో మూడు ప్రధాన కార్చిచ్చులు చెలరేగాయి. ఈ మంటలను ఆర్పేందుకు దేశవ్యాప్తంగా 335 అగ్నిమాపక సిబ్బంది, 19 విమానాలు, 13 హెలికాప్టర్లు పనిచేస్తున్నాయి. వైమానిక దళాలు పగటిపూట మాత్రమే పరిమితం కావడంతో సహాయక చర్యల్లో జాప్యం జరుగుతోంది. గ్రీసులో ఈ వేసవిలో వేడిగాలులు వీయడం ఇది మూడోసారి. శనివారం ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్కు చేరుకున్నాయి. -
ఉక్రెయిన్ డ్రోన్ దాడుల భయం.. నేవీ వేడుకలను తగ్గించుకున్న రష్యా
మాస్కో: ఉక్రెయిన్ డ్రోన్ దాడులు తీవ్రతరం చేసిన నేపథ్యంలో రష్యా తన నేవీ డే వేడుకలపై కోత పెట్టింది. భద్రతాపరమైన ఆందోళనలతో బాల్టిక్ సముద్ర తీరంలోని సెయింట్ పీటర్స్బర్గ్, కలినిన్ గ్రాడ్లలో, సుదూర తూర్పు తీర నౌకాశ్రయంలో వార్షిక నేవీ డే ఉత్సవాల సందర్భంగా ఆదివారం చేపట్టాల్సిన యుద్ధ నౌకల పరేడ్లను రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని రష్యా అధికారులు తెలిపారు. సొంత నగరం సెయింట్ పీటర్స్బర్గ్లోని నేవీ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు పుతిన్ స్వయంగా హాజరు కావాల్సిన జరిగే కార్యక్రమాలను సైతం రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ధ్రువీకరించారు. అన్ని రకాల పరిస్థితులను బేరీజు వేసుకున్నాకే ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకుందన్నారు. భద్రతకు మించింది మరేది లేదని వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి నుంచి వివిధ ప్రాంతాలపైకి ఉక్రెయిన్ ప్రయోగించిన 99 డ్రోన్లను కూల్చినట్లు ఆదివారం రక్షణ శాఖ తెలిపింది. వీటిలో సెయింట్ పీటర్స్బర్గ్ నగరంపైకి వచ్చినవి కూడా ఉన్నాయంది. లెమొనొసోవ్ ప్రాంతంలో డ్రోన్ శకలాలు పడి ఒక మహిళ గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. డ్రోన్ల భయంతో సెయింట్ పీటర్స్బర్గ్లోని పుల్కొవో ఎయిర్పోర్టు అధికారులు ఆదివారం ఉదయం డజన్ల కొద్దీ విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ నగరంలో జరిగిన పలు కార్యక్రమాల్లో అధ్యక్షుడు పుతిన్ పాల్గొన్నారు. యుద్ధ నౌకలను నిర్మించడంతోపాటు నేవీ శిక్షణను వేగవంతం చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. -
‘రాయబారి’ ముసుగులో ఆర్థిక నేరాలు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో నకిలీ రాయబార కార్యాలయం(ఎంబసీ) ఏర్పాటు చేసిన కేసులో మరికొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ ఎంబసీకి సూత్రధారి అయిన హర్షవర్దన్ జైన్(47) గత పదేళ్లలో 162 సార్లు విదేశీ పర్యటనలు చేసినట్లు పోలీపులు గుర్తించారు. అంతేకాకుండా రూ.300 కోట్ల ఆర్థిక కుంభకోణంతో అతడికి సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. ఈ స్కామ్పై ఉత్తరప్రదేశ్ ‘సిట్’దర్యాప్తు చేస్తోంది. హర్షవర్దన్ జైన్ వెస్టార్కిటికా, సెబోర్గా, పౌల్వయా, లాడోనియా వంటి దేశాల పేరుతో ఎంబసీలు నిర్వహించాడు. ఇందుకు ఘజియాబాద్లోని తన రెండంతస్తుల బంగ్లాను అడ్డాగా మార్చుకున్నాడు. ఈ బంగ్లాపై విదేశీ జాతీయ జెండాలు ఎగురుతూ కనిపించేవని స్థానికులు చెప్పారు. ఖరీదైన కార్లలో తిరగడం జైన్కు అలవాటు. వాటిపై విదేశాల నామఫలకాలు, ముద్రలు ఉంటాయి. తనను తాను వెస్టార్కిటికా దేశ రాయబారిగా స్థానికులకు పరిచయం చేసుకున్నాడు. రాయబారిగా నాటకం ఆడుతూ జనాన్ని నిండా ముంచేశాడు. మొత్తానికి జైన్ గుట్టు గతవారం రట్టయ్యింది. ఈ నెల 22న అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి ఎంబసీ కార్యకలాపాలు బహిర్గతమయ్యాయి. ప్రపంచ దేశాల్లో తనకు పలుకబడి ఉందని, విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పటిస్తానంటూ జనం వద్ద భారీగా డబ్బులు వసూలు చేసినట్లు జైన్పై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విదేశాల్లో షెల్ కంపెనీలు కేవలం మోసాలే కాదు, ఆర్థిక నేరాల్లోనూ జైన్ ఆరితేరినట్లు పోలీసులు చెబుతున్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లు, నకిలీ పథకాలు, షెల్ కంపెనీలు, విదేశీ బ్యాంక్ ఖాతాలతో భారీ సొమ్ము కొల్లగొట్టినట్లు పేర్కొంటున్నారు. జైన్ 2005 నుంచి 2015 వరకు 19 దేశాల్లో పర్యటించాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి 54 సార్లు వెళ్లొచ్చాడు. యూకేకు 22 సార్లు వెళ్లాడు. అంతేకాకుండా మారిషస్, ఫ్రాన్స్, కామెరూన్ తదితర దేశాల్లో పర్యటించాడు. విదేశాల్లో జైన్కు సంబంధించిన 25 షెల్ కంపెనీల లింక్లను స్పెషల్ టాస్్కఫోర్స్ వెలికితీసింది. స్టేట్ ట్రేడింట్ కార్పొరేషన్, ఈస్ట్ ఇండియా కంపెనీ యూకే లిమిటెడ్, ఐలాండ్ జనరల్ ట్రేడింగ్ కంపెనీ, ఇందిరా ఓవర్సీస్ లిమిటెడ్ తదితర పేర్లతో ఇవి ఏర్పాటయ్యాయి. అలాగే జైన్ పేరిట విదేశాల్లో 10 బ్యాంకు ఖాతాలున్నాయి. ఆరు దుబాయిలో, మూడు యూకేలో, ఒకటి మారిషస్తో తెరిచాడు. 12 నకిలీ డిప్లొమాటిక్ పాస్పోర్టులను అతడి నివాసంలో పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. అంతర్జాతీయ రాకెట్ హర్షవర్దన్ జైన్ నెట్వర్క్ కేవలం ఇండియాకే పరిమితం కాదు. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు. హైదరాబాద్లో జని్మంచిన టర్కీ జాతీయుడు అహసన్ అలీ సయీద్ కూడా జైన్కు సహకరించాడు. ఇతడి సాయంతో జైన్ విదేశాల్లో పలు కంపెనీలను రిజిస్టర్ చేయించాడు. రూ.300 కోట్ల కుంభకోణంలో అహసన్ అలీ సయీద్ ప్రధాన నిందితుడు. ఇతడు జైన్తో కలిసి స్విట్లర్జాండ్లోని కంపెనీలను టార్గెట్ చేశాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంస్థలను ఎంచుకున్నాడు. తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పిస్తామంటూ పెద్ద మొత్తంలో సొమ్ము గుంజాడు. జైన్, అలీ సయీద్ కలిసి హవాలా మార్గాలు, షెల్ కంపెనీలు, విదేశీ బ్యాంకు ఖాతాలతో ఈ డబ్బును సొంతం చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. సౌదీ అరేబియాకు చెందిన వివాదాస్పద ఆయుధ వ్యాపారి అద్నాన్ ఖషోగ్గీతోనూ జైన్కు సంబంధాలున్నాయి. 2002, 2004లో ఖషోగ్గీ రూ.20 కోట్లను జైన్ బ్యాంకు ఖాతాకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నిధులు జైన్ దేనికోసం ఖర్చు చేశాడన్న దానిపై ఎస్టీఎఫ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. తదుపరి విచారణ కోసం నిందితుడిని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ అధికారులు కోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్పై సోమవారం విచారణ జరుగనుంది. జైన్ను పూర్తిస్థాయిలో ప్రశ్నిస్తే మరికొన్ని సంచలన విషయాలు బయటపడే అవకాదం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. -
కాంగోలో చర్చిపై దాడి.. 38 మంది మృతి
గోమా: కాంగోలోని కేథలిక్ చర్చిలో ఐఎస్ అనుబంధ ఇస్లామిక్ ఉగ్రవాదులు జరిపిన నరమేథంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం మధ్యా హ్నం ఒంటిగంట సమయంలో చర్చిలోకి తుపా కులు, కత్తులతో ప్రవేశించిన అలైడ్ డెమో క్రాటిక్ ఫోర్స్(ఏడీఎఫ్)కు చెందిన దుండగులు కాల్పులు జరుపుతూ దొరికిన వారిని దొరికినట్లు నరికారని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. అనంతరం కొందరిని తమ వెంట అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారని చెప్పారు. ఎందరిని తీసుకెళ్లిందీ తెలియాల్సి ఉంది.అంతకుముందు వారు చర్చి చుట్టుపక్కల నివాసాలకు నిప్పుపెట్టారు.‘మృతదేహాలు ఇప్ప టికీ చర్చి ప్రాంగణంలోనే ఉన్నాయి. చర్చి ఆవరణలోపలే వీరందరికీ సామూహిక ఖననాలు జరిపేందుకు వలంటీర్లు ఏర్పాట్లు చేస్తున్నారు’అని ఇటురి ప్రావిన్స్ లోని కొమాండ అధికారి ఒకరు తెలిపారు. 10 మంది చనిపోయినట్లు మిలటరీ చెబుతు న్నా.. స్థానిక మీడియా మాత్రం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 40కి పైగానే ఉంటుందని పేర్కొంది. ఐరాసకు చెందిన రేడియో స్టేషన్ మాత్రం 43 మంది వరకు దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు సైన్యం తెలిపిందని వెల్లడించింది. అంతకుముందు, సమీపంలోని మచోంగమి గ్రామంపై ఉగ్రవాదులు దాడిచేసి ఐదుగురిని పొట్టన బెట్టుకున్న ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
థాయ్, కాంబోడియా సరిహద్దు ఘర్షణలు
బ్యాంకాక్: థాయ్లాండ్, కాంబోడియాల మధ్య సరిహద్దు వివాదంతో నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఘర్షణలకు తెరపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. థాయ్, కాంబోడియా నేతలు సోమవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో సమావేశమవనున్నారు. ఈ విషయాన్ని థాయ్ ప్రధానమంత్రి కార్యాలయం ఆదివారం తెలిపింది. మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు జరిగే ఈ చర్చల్లో థాయ్ తరఫున తాత్కాలిక ప్రధాని ఫుంతమ్ వెచయాచై పాల్గొంటారని పేర్కొంది. కాంబోడియా ప్రధాని హున్ మనెట్ కూడా చర్చలకు హాజరవుతారని తెలిపింది. అయితే, కాంబోడియా అధికారికంగా స్పందించలేదు. ఆసియాన్ చైర్మన్ స్థానంలో ఉన్న మలేసియా ప్రధాని ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు తన ప్రయత్నాలు ప్రారంభించారని పేర్కొంది. ట్రంప్..ఆసియాన్ జోక్యంఘర్షణలను ఆపేయాలంటూ ఆ రెండు దేశాల నేతలను కోరినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శనివారం తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ప్రకటించడం తెల్సిందే. ఒక ఒప్పందానికి రాకుంటే రెండు దేశాలతో ఎటువంటి వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోబోమంటూ హెచ్చరించడంతో ఇద్దరు ప్రధానులు దిగివచ్చారని ట్రంప్ చెప్పుకున్నారు. బేషరతు కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్కు చెప్పినట్లు కాంబోడియా ప్రధాని హున్ మనెట్ తెలిపారు. థాయ్ ప్రధాని సైతం ఇందుకు సిద్ధమయ్యారని ట్రంప్ తనకు చెప్పారన్నారు. ఈ విషయంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో, థాయ్ విదేశాంగ మంత్రితో చర్చలు జరిపే బాధ్యతను తమ డిప్యూటీ ప్రధాని ప్రాక్ సొఖొన్కు అప్పగించానన్నారు. అయితే, కాంబోడియా నిజాయితీతో చర్చలకు ముందడుగు వేస్తేనే తామూ కలిసి వస్తామని థాయ్ అంటోంది.34కు చేరిన మరణాలువివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో గురువారం మందుపాతర పేలి థాయ్ సైనికులు గాయపడటంతో వివాదం తీవ్రరూపం దాల్చడం తెల్సిందే. శాంతి నెలకొల్పేందుకు ఒక వైపు దౌత్యపరమైన ప్రయత్నాలు సాగుతుండగా, ఆదివారం కూడా రెండు దేశాల సైనికుల మధ్య సరిహద్దుల్లో ఘర్షణలు కొనసాగాయి. పౌర ప్రాంతాలపైకి కాల్పులు జరిపారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. నాలుగు రోజుల ఘర్షణల్లో ఇప్పటి వరకు 34 మంది చనిపోగా 1.68 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. -
గాజాలో కాల్పులకు వ్యూహాత్మక విరామం
డెయిర్ అల్–బలాహ్/జెరూసలేం: పాలస్తీనా భూభాగంలో ఆకలి మరణాలపై అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ఇజ్రాయెల్ వ్యూహాత్మక విరామం ప్రకటించింది. గాజా నగరం, డెయిర్ అల్ బలాహ్, మువాసీ నగరాల్లో రోజుకు పది గంటలు పాటు కాల్పుల విరామం ఉంటుందని తెలిపింది. తదుపరి నోటీసు వచ్చే వరకు స్థానిక సమయం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సైనిక కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. గాజా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆహారం, మందులు పంపిణీ చేసే కాన్వాయ్ల కోసం సురక్షిత మార్గాలు తెరిచి ఉంటాయని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఈ ప్రకటన గాజా వాసులకు కొంత ఉపశమనం కలిగించింది. అయితే ఈ సహాయ నిర్ణయాన్ని ఇజ్రాయెల్ జాతీయ రక్షణ మంత్రి ఇటమర్ బెన్–గ్విర్ విమర్శించారు. ఇది తన ప్రమేయం లేకుండానే జరిగిందన్నారు. హమాస్ మోసపూరిత ప్రచారానికి లొంగిపోవడంగా అభివర్ణించారు. గాజాకు అన్ని రకాల సహాయాన్ని నిలిపివేయాలని, భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆయన పునరుద్ఘాటించారు. ఆదివారం నుంచే అందిన ఆహారం.. వ్యూహాత్మక కాల్పుల విరమణతో.. ఆదివారం జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విమానాలు పారాచూట్ల ద్వారా 25 టన్నుల సహాయాన్ని గాజా ఎన్క్లేవ్లో జారవిడిచాయి. జికిమ్ సరిహద్దు క్రాసింగ్ నుంచి ఆదివారం సహాయ ట్రక్కులు ఉత్తర గాజాలోకి ప్రవేశించాయి. ఆదివారం కెరెమ్ షాలోమ్ క్రాసింగ్ ద్వారా దక్షిణ గాజాకు 1,200 మెట్రిక్ టన్నులకు పైగా ఆహారాన్ని పంపినట్లు ఈజిప్టు రెడ్ క్రెసెంట్ తెలిపింది. ఇజ్రాయెల్–పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య దోహాలో జరిగిన కాల్పుల విరమణ చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగియడం, గాజాలో మానవతా సంక్షోభం నెలకొనడంతో ఇజ్రాయెల్పై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలొచ్చాయి. అయితే.. ఆ దేశం వాటిని తిరస్కరిస్తూ వస్తోంది. తాజా వ్యూహాత్మక విరామం నేపథ్యంలో.. గాజాలో సంక్షోభానికి ఇక తమ ప్రభుత్వాన్ని నిందించడం మానేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాçహూ సూచించారు. ఇంతకుముందు కూడా సురక్షిత మార్గాలున్నా యని, ఇకనుంచి అధికారికంగా ఉంటాయని ఆయన తెలిపారు.పోషకాహార లోపంతో ఆరుగురు మృతిగాజాలో పోషకాహార లోపంతో గత 24 గంటల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయా రు. దీంతో ఆకలితో మరణించిన వారి సంఖ్య 133కి చేరుకుంది. వీరిలో 87 మంది పసి పిల్లలు ఉండటం గమనార్హం. మరోవైపు, ఆదివారం సహాయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఇజ్రా యెల్ జరిపిన కాల్పుల్లో 17 మంది మరణించారని, 50 మంది గాయపడ్డారని సెంట్రల్ గాజాలోని అల్–అవ్దా, అల్–అక్సా ఆసుపత్రుల అధికారులు తెలిపారు. ఈ దాడులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయని ఇజ్రాయెల్ సైన్యం.. ఆదివారం గాజాలో తమ సైనికులు ఇద్దరు మరణించారని ప్రకటించింది. -
ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ చీఫ్ హతం.. తుర్కియే వ్యక్తిని పెళ్లాడిన సిన్వర్ భార్య
జెరూసలేం: గాజాపై ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. హమాస్ ఏరివేత లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. దీంతో, గాజాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇక, ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇప్పటికే హమాస్కు చెందిన కీలక నేతలు హతమయ్యారు.హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్ సహా కీలక ఉగ్రవాదులు చనిపోయారు. గతేడాది అక్టోబర్లో యహ్యా సిన్వర్ను ఇజ్రాయెల్ బలగాలు హతమర్చాయి. అయితే, అంతకుముందే సిన్వర్ సతీమణి పరారైందని తాజాగా వెల్లడైంది. ఆమె.. తుర్కియేకు వెళ్లి అక్కడ మరో వ్యక్తిని వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది.పలు మీడియా కథనాల ప్రకారం.. యహ్యా సిన్వర్ భార్య సమర్ ముహమ్మద్ అబు జమార్ ప్రస్తుతం తుర్కియేలో రహస్యంగా జీవిస్తోందని సమాచారం. గాజాకు చెందిన ఓ సామాన్య మహిళకు చెందిన పాస్ పోర్టు సాయంతో సమర్ తన పిల్లలను తీసుకుని దేశం దాటిందని, తొలుత ఈజిప్ట్ లోకి అక్కడి నుంచి తుర్కియేలోకి ప్రవేశించిందని తెలిపింది. ఆ తర్వాత అక్కడి స్థానికుడిని వివాహం చేసుకుని మారుపేరుతో తుర్కియేలోనే జీవిస్తోందని వై నెట్ వెల్లడించింది. ఈ మొత్తం వ్యవహారం హమాస్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేసే నెట్ వర్క్ సాయంతో జరిగిందని పేర్కొంది. ఇదే మార్గంలో యహ్యా సిన్వర్ సోదరుడి భార్య నజ్వా కూడా దేశం దాటిందని తెలిపింది. అయితే, నజ్వా ఏ దేశంలో ఆశ్రయం పొందిందనే వివరాలు తెలియరాలేదని వివరించింది.అయితే, హమాస్పై ఇజ్రాయెల్ దాడుల్లో సిన్వర్ మరణించడానికి ముందుగానే సమర్ తన పిల్లలతో కలిసి దొంగ పాస్ పోర్టుతో దేశం దాటినట్లు గాజాలోని హమాస్ వర్గాలు వెల్లడించాయని వై నెట్ మీడియా ఓ కథనంలో పేర్కొంది. గాజాలోని స్మగ్లింగ్ ముఠా సమర్ను రఫా బార్డర్ గుండా ఈజిప్టులోకి చేర్చిందని వై నెట్ పేర్కొంది. సాధారణంగా ఇలా మనుషులను అక్రమంగా సరిహద్దులు దాటించేందుకు స్మగ్లింగ్ ముఠాలు పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తాయని తెలిపింది. దీంతో, ఆమె గురించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక, సమర్.. సిన్వర్ను 2011లో వివాహం చేసుకుంది. -
అమెరికాలో కత్తిపోట్లు.. 11 మందికి గాయాలు
ట్రావెర్స్ సిటీ: అమెరికాలోని మిషిగన్ రాష్ట్రం ట్రావెర్స్ సిటీలో శనివారం చోటుచేసుకున్న కత్తిపోట్ల ఘటనలో 11 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులందరినీ మున్సన్ హెల్త్కేర్ ఆస్పత్రికి తరలించారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. వాల్మార్ట్ స్టోర్ వద్దకు వచ్చిన వారిపైకి అతడు ఫోల్డబుల్ చాకుతో దాడికి పాల్పడ్డాడు. ఆయుధం సహా అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు మిషిగన్ వాసి అని తెలిపిన పోలీసులు అంతకుమించి వివరాలను వెల్లడించలేదు. ఇలా ఉండగా, అల్బుక్వెర్క్లోని న్యూమెక్సికో యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి అనుమానితుడు జాన్ ఫుయెంటెస్(18)ని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కాల్పుల్లో 14 ఏళ్ల బాలుడు చనిపోగా మరొకరు గాయపడటం తెల్సిందే. A knife-wielding man stabbed 11 in a Michigan Walmart. A brave armed civilian stepped in, likely saving lives.Most Americans know: Evil can't be reasoned with—only stopped. pic.twitter.com/w70HNNZtM2— Manni (@ThadhaniManish_) July 27, 2025 -
విమానం టేకాఫ్ సమయంలో మంటలు.. భయంతో ప్రయాణీకుల పరుగులు
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికాలో తృటిలో పెను విమాన ప్రమాదం తప్పింది. అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం AA-3023 ల్యాండింగ్ గేర్లో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు రన్పై పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. కొలరాడలోని డెన్వర్ విమానాశ్రయంలో పెను విమానం ప్రమాదం తప్పింది. మియామాకి వెళ్తున్న అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం AA-3023లో మంటలు చేలరేగాయి. బోయింగ్ 737 మాక్స్ 8 విమానం టేకాప్కు సిద్ధమవుతున్న సమయంలో (స్థానిక సమయం) మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ గేర్లో సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా మంటలు వచ్చాయి. త తర్వాత కొద్దిక్షణాల్లోనే మంటలు చెలరేగాయి. డెన్వర్ విమానాశ్రయ పరిపాలన వెంటనే అగ్నిమాపక శాఖను వెంటనే అప్రమత్తం చేసింది. దాంతో ఫైర్స్టాఫ్ వెంటనే విమానం వద్దకు చేరుకొని మంటలను ఆర్పి వేసింది. ఈ ఘటనతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. తమ ప్రాణాలు కాపాడుకునేందుకు విమానం నుంచి కిందకు దిగి.. రన్పై పరుగులు తీశారు. మంటలు వ్యాపించిన సమయంలో విమానంలో 173 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.Landing gear bursts into flames on American Airlines plane at Denver airport. One person was injured. pic.twitter.com/VQlOAkQQwp— Pop Crave (@PopCrave) July 27, 2025విమానం నుంచి దట్టమైన పొగలు వస్తున్న సమయంలో పలువురు ప్రయాణికులు ఒక చేత్తో తమ పిల్లలు.. మరోచేత్తో తమ లగేజీతో స్లయిడ్పై నుంచి జారుతూ కిందకు వచ్చారు. ఈ ఘటనపై డెన్వర్ విమానాశ్రయం, అమెరికన్ ఎయిర్లైన్స్ ప్రకటన విడుదల చేశాయి. ఈ ఘటనలో కేవలం ఒక వ్యక్తికి మాత్రమే గాయాలయ్యాయి. సదరు వ్యక్తికి మొదట ప్రథమ చికిత్స చేసి ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికులను అందరినీ బస్లో టెర్మినల్కు తరలించారు. విమానం టైర్కు సంబంధించిన నిర్వహణ విషయంలో ఇప్పటికీ హెచ్చరికలు చేసినట్లుగా ఎయిర్లైన్స్ పేర్కొంది. ఈ ఘటన తర్వాత సర్వీస్ నుంచి తొలగించి, దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా విమానయాన సంస్థ ప్రయాణికులకు క్షమాపణ చెప్పింది. అగ్ని ప్రమాదం నేపథ్యంలో విమానాశ్రయంలోని రన్వేపై కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది. విమానాన్ని రన్ వే నుంచి తొలగించిన తర్వాత మళ్లీ రాకపోకలు మొదలయ్యాయి.🚨EMERGENCY AT DENVER AIRPORT: An American Airlines Boeing 737 Max 8 was forced to evacuate passengers after its landing gear caught fire during landing.Why always Boeing?pic.twitter.com/FT5tLeqtOr— 𝗗𝗼𝗻𝗮𝗹𝗱𝗼 𝗧𝗿𝘂𝗺𝗽ø 🇺🇲 𝗨𝗽𝗱𝗮𝘁𝗲 (@TrumpUpdateHQ) July 27, 2025There was a plane on fire at Denver airport today.Here's a woman who was nearly in a plane crash yesterday explaining her experience.pic.twitter.com/YCDMPPi4YF— Owen Shroyer (@OwenShroyer1776) July 27, 2025 -
థాయ్, కంబోడియా శాంతి చర్చలకు గ్రీన్సిగ్నల్: ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: థాయ్ల్యాండ్-కంబోడియా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. ఆగ్నేయాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలను తన మధ్యవర్తిత్వంతో విరమింపజేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. రెండు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలకు త్వరలోనే ముగింపు పడనుందని ట్రంప్ చెప్పారు. ఇరు దేశాలు తక్షణ కాల్పుల విరమణ చర్చలకు అంగీకరించాయని వెల్లడించారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా.. కాల్పుల విరమణకు సంబంధి కంబోడియా ప్రధాని హున్ మానెట్, థాయ్ తాత్కాలిక ప్రధాని ఫుమ్తామ్ వెచాయాచాయ్లతో మాట్లాడానని.. ఇరువురు తక్షణ కాల్పుల విరమణకు, శాంతి నెలకొల్పేందుకు అంగీకరించారని చెప్పారు. వారు వెంటనే సమావేశమై చర్చించేందుకు సమ్మతించారన్నారు. అయితే ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం ఎవరు వహిస్తారు, శాంతి చర్చలు ఎక్కడ జరుగుతాయని వివరాలను ఆయన వెల్లడించలేదు. కాగా, కాల్పుల విమరణకు సూత్రప్రాయంగా సుముఖతను వ్యక్తం చేసినట్లు థాయ్లాండ్ తాత్కాలిక ప్రధాని ఫేస్బుక్ వేదికగా వెల్లడించారు. అయితే కంబోడియా నిజాయితీగా వ్యవరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఘర్షణలు ఇలాగే కొనసాగితే అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు ప్రమాదంలో పడతాయని ఇద్దరినీ హెచ్చరించానని వెల్లడించారు.ఇక, ఇటీవలి కాలంలో పలు దేశాల మధ్య యుద్ధాల విషయంలో ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధాన్ని ఆపిన ట్రంప్.. తన మధ్యవర్తిత్వంతోనే పాక్, భారత్ మధ్య కాల్పులు నిలిచాయని పదేపదే చెప్పారు. అనంతరం, భారత ప్రధాని మోదీ ప్రకటనతో ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు.Donald J. Trump Truth Social 07.26.25 12:23 PM EST pic.twitter.com/QB03NMNe9G— Fan Donald J. Trump Posts From Truth Social (@TrumpDailyPosts) July 26, 2025ఇదిలా ఉండగా.. థాయ్ల్యాండ్, కంబోడియా మధ్య ఘర్షణలు ఆదివారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఇప్పటి వరకూ 33 మంది మరణించారు. దాదాపు 1.68 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. సరిహద్దు వెంబడి ఉన్న అనేక గ్రామాల్లో దాడి ఘటనలు చోటుచేసుకున్నాయి. దాడుల్లో ఎఫ్-16 విమానాలు, డ్రోన్లను కూడా వినియోగించినట్టు అధికారులు తెలిపారు. గత గురువారం సరిహద్దులో ఒక మందుపాతర పేలి ఐదుగురు థాయ్ల్యాండ్ సైనికులు గాయాలపాలు కావడం ఈ సంఘర్షణకు దారితీసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరుదేశాలూ పరస్పరం దౌత్య సిబ్బందిని ఉపసంహరించాయి. కంబోడియాలో తాజాగా 12 మరణాలు నమోదయ్యాయి. ఆ దేశంలో ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 13కు చేరింది. ఈ పోరాటాన్ని నిలుపుదల చేయాల్సిందిగా ఆగ్నేయాసియా దేశాల సంఘం(ఆసియన్)పై అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతోంది. తమ దేశ సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న 37,635 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని కంబోడియా సమాచార మంత్రి నెత్ ఫియాక్ట్రా వెల్లడించారు. -
మూడో రోజూ కొనసాగిన ఘర్షణలు
సురిన్(థాయ్లాండ్): థాయ్లాండ్, కాంబోడియా ల మధ్య సరిహద్దుల్లో ప్రారంభమైన ఘర్షణలు శనివారంతో మూడో రోజుకు చేరుకున్నాయి. కాల్పుల ఘటనల్లో ఇరు పక్షాలకు చెందిన కనీసం 33 మంది చనిపోగా, 1.68 లక్షల మధ్య నిరాశ్రయులయ్యారు. కాల్పుల విరమణకు రావాలంటూ ఇరుదేశాలపై అంతర్జాతీయంగా ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. సరిహద్దు వివాదాస్పద ప్రాంతంలో గురువారం మందుపాతర పేలి ఐదుగురు థాయ్ సైనికులు చనిపోవడం ఘర్షణలకు ఆజ్యం పోసింది. శనివారం ఘర్షణలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించింది. ఇరు పక్షాలు రాకెట్లు, శతఘ్నులతో కాల్పులకు దిగాయి. ఎఫ్–16 యుద్ధ విమానాలను, డ్రోన్లను దాడులకు వినియోగించినట్లు థాయ్ ప్రభుత్వం ప్రకటించుకుంది. ఇరు దేశాలు తమ రాయబారులను వెనక్కి పిలిపించుకున్నాయి. థాయ్లాండ్ ఈశాన్య ప్రాంతంలోని కాంబోడియా సరిహద్దును మూసివేసింది. మీరంటే మీరే.. సరిహద్దుల్లోని తమ పుర్సత్ ప్రావిన్స్లోని పలు ప్రాంతాలపైకి థాయ్ సైన్యం శనివారం ఉదయం శతఘ్ని కాల్పులకు దిగిందని కాంబోడియా రక్షణ శాఖ తెలిపింది. అదేవిధంగా, తమ కోహ్ కాంగ్ ప్రావిన్స్ తీర ప్రాంతాల్లోకి థాయ్ నేవీ పడవలు ప్రవేశించాయంది. ఆ దేశం రెచ్చగొట్టేలా దురాక్రమణ చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది. థాయ్ కాల్పుల్లో ఇప్పటి వరకు చనిపోయిన వారిలో ఏడుగురు పౌరులు కాగా నలుగురు సైనికులు ఉన్నారంది. కాంబోడియాలోని పౌర నివాసాలను తాము లక్ష్యంగా చేసుకున్నామంటూ చేస్తున్న ఆరోపణలను థాయ్ ప్రభుత్వం ఖండించింది. కాంబోడియా ఆర్మీ పౌరులను రక్షణ కవచాలుగా వాడుకుంటూ నివాస ప్రాంతాల్లో ఆయుధాలను మోహరిస్తోందని ఆరోపించింది. ట్రాట్ ప్రావిన్స్లోకి ప్రవేశించేందుకు కాంబోడియా ఆర్మీ చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టామంది. ఆసియాన్ చొరవను కోరిన మండలి థాయ్లాండ్ – కాంబోడియా ఉద్రిక్తతలపై హ్యూమన్ రైట్స్ వాచ్ ఆందోళన వ్యక్తం చేసింది. పౌరులు, ముఖ్యంగా చిన్నారులకు హాని తలపెట్టేలా వ్యవహరించవద్దని కోరింది. సరిహద్దులు సమీపంలోని 852స్కూళ్లతోపాటు ఏడు ఆస్పత్రులను థాయ్ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా మూసివేసిందని తెలిపింది. శనివారం మరో 12 మంది చనిపోయినట్లు కాంబోడియా తెలిపింది. దీంతో, ఆ దేశంలో మరణాల సంఖ్య 13కు చేరుకుంది. థాయ్లాండ్ సైతం మరణాల సంఖ్య 20కి చేరినట్లు ప్రకటించింది. వీరిలో అత్యధికులు పౌరులేనని పేర్కొంది. శుక్రవారం అత్యవసరంగా సమావేశమైన ఐరాస భద్రతా మండలి రెండు దేశాలు కాల్పుల విరమణను ప్రకటించేలా చొరవ తీసుకోవాలంటూ ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య ఆసియాన్ను కోరుతూ తీర్మానం చేసింది. ఆసియాన్ అధ్యక్ష స్థానంలో ఉన్న మలేసియా దీనిపై స్పందించింది. రెండు దేశాలతో చర్చలు జరిపి, ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పే బాధ్యతను రక్షణ మంత్రికి అప్పగించినట్లు మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం తెలిపారు. రెండు దేశాల మధ్య ఉన్న 800 కిలోమీటర్ల పొడవైన సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాల విషయంలో దశాబ్దాలుగా విభేదాలు కొనసాగుతున్నాయి. పౌరులకు భారత ఎంబసీ అడ్వైజరీ థాయ్లాండ్తో జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో కాంబోడియాకు వచ్చే భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని నాంఫెన్లోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. ముఖ్యంగా కాంబోడియా సరిహద్దు ప్రాంతాల వైపు రావద్దని కోరింది. ఈ మేరకు శనివారం అడ్వైజరీ జారీ చేసింది. అత్యవసర సాయం కావాల్సిన వారు +855 92881676 నంబర్కు లేక cons.phnompenh@mea. gov.in. మెయిల్ ద్వారా సంప్రదించాలని కోరింది. ఇదే విషయమై శుక్రవారం థాయ్లాండ్లోని భారత ఎంబసీ కూడా అడ్వైజరీ జారీ చేయడం తెల్సిందే. -
మాల్దీవుల అభివృద్ధికి భారత్ సహకారం
మాలె: మాల్దీవులతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకొనేందుకు కట్టుబడి ఉన్నామని భారత ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు చేర్చడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. మాల్దీవుల సర్వతోముఖాభివృద్ధికి సహకారం కొనసాగిస్తామని ప్రకటించారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షల సాకారానికి తమ మద్దతు ఎప్పటికీ ఉంటుందని హామీ ఇచ్చారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శనివారం మాల్దీవుల ఉపాధ్యక్షుడు ఉజ్ హుస్సేన్ మొహమ్మద్ లతీఫ్తోపాటు పలువురు ముఖ్య నాయకులను కలుసుకున్నారు. మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, ఇంధనం, వాతావరణ మార్పుల నియంత్రణ సహా పలు కీలక రంగాల్లో పరస్పర సహకారంపై అతీఫ్తో చర్చించారు. మాల్దీవుల స్వాతంత్య్ర దినోత్సవంలో మోదీ ప్రధాని మోదీ మాల్దీవుల 60వ స్వాతంత్య్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రిపబ్లిక్ స్క్వే ర్లో 50 నిమిషాలపాటు ఈ వేడుకలు జరిగాయి. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జుతోపాటు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, విదేశాంగ మంత్రి విక్రమ్ మిస్రీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మిలటరీ పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. -
హెచ్–1బీ, పౌరసత్వం గగన కుసుమమే!
వాషింగ్టన్: నిపుణులైన విదేశీ ఉద్యోగుల కోసం ఉద్దేశించిన హెచ్–1బీ వీసాల జారీ ప్రక్రియను ట్రంప్ సర్కారు సమూలంగా ప్రక్షాళన చేయనుంది. అమెరికా పౌరసత్వ పరీక్షలను అత్యంత కఠినతరం చేయనుంది. న్యూయార్క్ టైమ్స్ వార్తా సంస్థకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్∙డైరెక్టర్ జోసెఫ్ పలు అంశాలపై మాట్లాడారు. ఇకపై దేశీ ఉద్యోగులకు అత్యధిక వేతానాలిచ్చే అమెరికా కంపెనీలను మాత్రమే పూర్తిస్థాయిలో ప్రోత్సహిస్తామన్నారు. పలు అమెరికా కంపెనీలు విదేశీ ఉద్యోగులను హెచ్–1బీ వీసాలపై రప్పించుకుని అల్ప వేతనాలకు నియమించుకుంటూ స్థానికుల ఉపాధికి గండి కొడుతున్నాయంటూ అధికార రిపబ్లికన్ పార్టీ ప్రజాప్రతినిధులు చాలాకాలంగా గగ్గోలు పెడుతుండటం తెలిసిందే. ఈ ఆందోళనలకు ట్రంప్ సర్కారు తాజా నిర్ణయాలు చెక్ పెడతాయని భావిస్తున్నారు. అయితే వ్యాపార వర్గాలు, కంపెనీలకు మాత్రం ఇది మింగుడు పడకపోవచ్చని అమెరికా మీడియా కోడై కూస్తోంది. విదేశీయుల కోసం అనుసరిస్తున్న పౌరసత్వ పరీక్ష మరీ సులభతరంగా ఉందని జోసెఫ్ ఆక్షేపించారు. ‘‘పరీక్షలో తేలికపాటి ప్రశ్నలున్నాయి. ఇది చట్టస్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇకపై కఠిన ప్రశ్నలతో పరీక్షను మరింత పకడ్బందీగా మారుస్తాం’’అని స్పష్టం చేశారు. -
విశ్వసనీయ నేత మోదీ
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ, విశ్వసనీయత కలిగిన నాయకుడిగా మరోసారి ఘనత సాధించారు. అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్’నిర్వహించిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ ట్రాకర్ సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది. మోదీకి ఏకంగా 75 శాతం అప్రూవల్ రేటింగ్ లభించడం విశేషం. అంటే సర్వేలో పాల్గొన్నవారిలో 75 శాతం మంది మోదీని ప్రజాస్వామ్య ప్రపంచ నేతగా ఆమోదించారు. 18 శాతం మంది మోదీ వైపు మొగ్గు చూపలేదు. మిగతా 7 శాతం మంది ఏదీ చెప్పలేకపోయారు. ఈ సర్వే వివరాలను ‘మార్నింగ్ కన్సల్ట్’ విడుదల చేసింది. అత్యంత విశ్వసనీయ ప్రపంచ నాయకుల్లో మోదీ మొదటి స్థానంలో ఉండగా, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ రెండో స్థానంలో, అర్జెంటీనా అధినేత జేవియర్ మిలీ మూడో స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేవలం 44 శాతం అప్రూవల్ రేటింగ్తో ఎనిమిదో స్థానానికి పరిమితం కావడం గమనార్హం. ఈ నెల 4 నుంచి 10వ తేదీ దాకా ఈ సర్వే నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో ప్రజాభిప్రాయం సేకరించారు. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల కారణంగానే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ తగ్గుతున్నట్లు తెలుస్తోంది. -
భూమి మీద నుంచే శాటిలైట్లపై దాడి!
ఎల్రక్టానిక్స్, టెక్స్టైల్స్, ఆటోమొబైల్స్సహా ఎన్నో రంగాల్లో ప్రపంచ అగ్రగామిగా వెలుగొందుతున్న చైనా ఇప్పుడు మరో అసాధారణ, శక్తివంతమైన ఆయుధ తయారీలో తలమునకలైంది. అగ్రరాజ్యం అమెరికాను తలదన్నేలా ఎన్నెన్నో ఆవిష్కరణలు చేసిన చైనా ఇప్పుడు దేశ భద్రత, రక్షణే పరమావధిగా కీలక ఆయుధాన్ని సృష్టిస్తోంది. తమ వైమానిక, అణు స్థావరాలు, వ్యూహాత్మకప్రాంతాల గుట్టుమట్టు చెప్పే విదేశీ, శత్రు ఉపగ్రహాలను అంతరిక్షంలోనే తునాతునకలు చేసే లేజర్ కాంతి ఆయుధాన్ని అభివృద్ధిచేస్తోంది. కాంతి సాధారణ స్థాయిలోకాకుండా ప్రత్యేకమైన స్ఫటికాల గుండా ప్రసరించినప్పుడు మరింత శక్తివంతంగా మారుతుంది. అత్యంత తీక్షణతో ప్రసరిస్తూ ఆ లేజర్ కాంతి ఎంతటి కఠినమైన పదార్థాౖన్నైనా సునాయాసంగా కోసేస్తుంది. భవిష్యత్తులో పనికిరాకుండా సర్వనాశనంచేసేస్తుంది. లేజర్ కాంతి ఎంతటి శక్తివంతమైందో ఇప్పటికే పరిశ్రమ రంగంలో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడీ లేజర్ కాంతిని అంతరిక్షంలో చక్కర్లు కొట్టే శత్రుదేశాల ఉపగ్రహాలపైకి చైనా ప్రయోగించనుంది. భూమి నుంచి ఎన్నో కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమించే ఉపగ్రహాలను నేలమీద నుంచే గురిచేసి కొట్టడం అంత తేలికైనపని కాదు. అందుకే బేరియం గాలియం సెలినైడ్(బీజీసీఈ) కృత్రిమ స్ఫటికాన్ని చైనా అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రిస్టల్ అని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. ఎంత పెద్ద ఇనుపగుండుతో దెబ్బ కొడితే అంతగా బీభత్సం స్థాయికి పెరుగుతుంది. అలాగే బీజీసీఈ క్రిస్టల్ నుంచి వెలువడే లేజర్ కాంతి సృష్టించే వినాశనం కూడా అంతే భారీ స్థాయిలో ఉంటుంది. సూక్ష్మం నుంచే సర్వనాశనం.. బీజీఈసీతో తయారైన లేజర్ కాంతి పుంజం వ్యాసం కేవలం 6 సెంటీమీటర్లు మాత్రమే. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఒక ఖడ్గం అంచుకు ఉండే పదునులాంటిది. కత్తి అంచును ఎంత సానబడితే అంత పదునెక్కుతుంది. అలాగే ఈ స్ఫటికం ఎంత పారదర్శకంగా ఉంటే అందులోంచి వెలువడే లేజర్ కాంతి అంత ప్రాణాంతకంగా మారుతుంది. ఇది ఆకాశంలో చాలా కిలోమీటర్ల దూరం వరకు తీవ్రత ఏమాత్రం తగ్గకుండా అదే తీక్షణతతో దూసుకెళ్తుంది. అలా అది ఏకంగా ఉపగ్రహాలను సైతం ముక్కలుగా కోసేస్తుంది. స్వల్పశ్రేణి పరారుణకాంతి పుంజాలను అత్యంత సుదూరమైన లేజర్ కాంతి పుంజాలుగా, మారణాయుధాలుగా మార్చేందుకు బీజీఈసీ స్ఫటికం అక్కరకొస్తుంది. ‘‘చదరపు సెంటీమీటర్ల విస్తీర్ణంలో ఏకంగా 550 మెగావాట్ల లేజర్ కాంతిని ఈ స్ఫటికం ప్రసరింపజేస్తుంది. ఇంతటి తీక్షణత ధాటికి ఎంతటి కఠినమైన మూలకంతో తయారైన ఉపగ్రహ ఉపరితల పొరనైనా ముక్కలవడం ఖాయం. వందల కిలోమీటర్ల ఎత్తు నుంచి తమపై నిఘా పెట్టిన శత్రు ఉపగ్రహాలను ఉన్నచోటులోనే ఉన్నపళంగా నిరీ్వర్యంచేసే శక్తి ఈ క్రిస్టల్ పరారుణ కాంతి ఆయుధానికి ఉంది’’అని ప్రొఫెసర్ వూ హైక్సిన్ అన్నారు. ఈయన సింథటిక్ క్రిస్టల్ జర్నల్లో ప్రచురించబడిన పరిశోధనాపత్రానికి ముఖ్యరచయితగా వ్యవహరించారు.అత్యంత సురక్షితం, అతి సామర్థ్యం.. ఇంతటి తీక్షణమైన కాంతి పుంజాన్ని వెదజల్లేటప్పుడు ఈ ఆయుధవ్యవస్థ బాగా వేడెక్కుతుంది. అలాంటప్పుడు వేడికి అదే కాలిపోతుంది. అలాంటి పరిస్థితులురాకుండా దీనిని తయారుచేస్తున్నారు. గతంలో అమెరికా అచ్చం ఇలాంటి ప్రయోగమే చేసి చేతులుకాల్చుకుంది. 1997లో అమెరికా నావికాదళం మిడ్ ఇన్ఫ్రారెడ్ అడ్వాన్స్డ్ కెమికల్ లేజర్(మిరాకిల్) పేరిట ఒక ప్రయోగంచేసింది. సొంత ఉపగ్రహాన్నే పలుమార్లు పరారుణకాంతితో కరిగించేందుకు ప్రయత్నించి విజయవంతమైంది. కానీ ఆ లేజర్బీమ్ను వెదజల్లే వ్యవస్థ సైతం కరిగిపోయింది. ఈ పరిస్థితి తలెత్తకుండా చైనా పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. బేరియం గాలియం సెలినైడ్(బీజీసీఈ) కృత్రిమ స్ఫటికాన్ని చైనా శాస్త్రవేత్తలే తొలిసారిగా 2010లో అభివృద్ధిచేశారు. వెంటనే దీనిని తమ ఆయుధవ్యవస్థల్లో అమర్చుకునేందుకు పలు దేశాల రక్షణశాఖలు ప్రయత్నించినా అది ఎందుకో సఫలంకాలేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రూ. 22,845 కోట్లు కొల్లగొట్టారు!
భారత్లో ఇంటర్నెట్ మారుమూల పల్లెలకూ చేరింది. డిజిటల్ వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. ఈ అంశమే ఇప్పుడు సైబర్ నేరస్తులకు ఆయుధంగా మారింది. దీంతో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం సైబర్ నేరగాళ్లు 2024లో భారతీయుల నుంచి రూ.22,845.73 కోట్లు కొల్లగొట్టారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది. 2023లో ఆర్థిక సంబంధమైన ఫిర్యాదులు 24.42 లక్షలు వస్తే.. 2024లో ఈ సంఖ్య ఏకంగా 36.36 లక్షలకు పెరిగింది.ప్రభుత్వాలు, రిజర్వు బ్యాంకు, బ్యాంకులు, పోలీసు విభాగాలు చేపడుతున్న అవగాహన కార్యక్రమాల పుణ్యమా అని జనంలో సైబర్ నేరాలపట్ల అవగాహన పెరిగినా నేరాలు తగ్గకపోవడం గమనార్హం. సైబర్ మోసాలే కాదు.. బాధితులు పోగొట్టుకుంటున్న మొత్తమూ ఏటా అంచనాలకు మించి నమోదవుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు బాధితులు నష్టం జరిగిపోయాక.. పోలీసు స్టేషన్లు, సైబర్ పోలీస్ స్టేషన్లు, సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టళ్లు, టోల్ ఫ్రీ నంబర్ల వంటివాటిని ఆశ్రయిస్తున్నారు. –సాక్షి, స్పెషల్ డెస్క్లొకేషన్ ఇట్టే పట్టేస్తారుసైబర్ భద్రతా ప్రయత్నాలకు అనుగుణంగా పోలీసుల కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం 9.42 లక్షలకు పైగా సిమ్ కార్డులు, 2,63,348 ఐఎంఈఐలను బ్లాక్ చేసింది. నేరస్తులు ఉన్న చోటు, వారి కేంద్రాలను గుర్తించి నిఘా వ్యవస్థలకు సమాచారం చేరవేసేందుకు ’ప్రతిబింబ్’ మాడ్యూల్ను కూడా ఏర్పాటుచేసింది. ఈ మాడ్యూల్ ద్వారా 10,599 మంది నిందితులను అరెస్టు చేయగలిగారు. తద్వారా 26,096 మంది నేరస్తులను గుర్తించగలిగారు. 63,019 సైబర్ దర్యాప్తు సహాయ అభ్యర్థనలను ప్రాసెస్ చేయగలిగారు.కట్టడికి కలిసికట్టుగా..న్యూఢిల్లీలోని ఇండియన్ సైబర్క్రైమ్ కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) కేంద్రంగా సైబర్ నేరాల నియంత్రణ కేంద్రాన్ని (సీఎఫ్ఎంసీ) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ ఉన్న విభిన్న విభాగాలు.. సైబర్ నేరం జరిగినట్టు ఫిర్యాదు అందగానే వెంటనే స్పందించి ఆర్థిక నష్టాన్ని నివారించేందుకు, అలాగే నేరస్తులను పట్టుకునేందుకు కలిసికట్టుగా నిరంతరం శ్రమిస్తున్నాయి. చట్టవ్యతిరేక కార్యకలాపాల కోసం సమాచారం, డేటా, కమ్యూనికేషన్ లింక్ను నేరస్తులు వాడకుండా నిరోధించేందుకు.. ఐటీ సేవల కంపెనీలకు సమాచారం ఇచ్చేందుకు ‘సహ్యోగ్’ పోర్టల్ను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఆన్లైన్ ఆర్థిక మోసాలకు చెక్ పెట్టే దిశగా టెలికం శాఖ (డాట్) రూపొందించిన ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (ఎఫ్ఐఆర్) ప్లాట్ఫాంను ఉపయోగించుకోవాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ ఇటీవల సూచించింది. మధ్యస్థ, అధిక, అత్యధిక ఆర్థిక మోసాలతో ముడిపడి ఉన్న మొబైల్ నంబర్లను ఇది రియల్ టైమ్లో వర్గీకరిస్తుంది. ప్రస్తుతం చెల్లింపులకు యూపీఐ విధానాన్ని విరివిగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో సైబర్ మోసాల బారిన పడకుండా కోట్ల మందిని ఈ సాంకేతికత కాపాడగలదని తెలిపింది.సైబర్ మోసాల వల్ల భారతీయులు గత ఏడాది రూ.22,845.73 కోట్లు కోల్పోయారు. 2023లో ఈ మొత్తం రూ.7,465.18 కోట్లు.2024లో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో (ఎన్ సీఆర్పీ) 19.18 లక్షలు, సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్) ద్వారా 17.18 లక్షల ఫిర్యాదులు.. మొత్తంగా 36.36 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ఈ రెండు వేదికలు 2023లో అందుకున్న ఫిర్యాదుల సంఖ్య 24.42 లక్షలు.రూ.10 వేల కోట్లకుపైగా కాపాడారు!కేంద్ర ప్రభుత్వానికి చెందిన సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఎఫ్సీఎఫ్ఆర్ఎంఎస్) ద్వారా వచ్చిన 17.8 లక్షల ఫిర్యాదులకుగాను రూ.5,489 కోట్లకు పైగా డబ్బును ప్రజలు కోల్పోకుండా కాపాడగలిగారు. బ్యాంకుల నుంచి 11 లక్షలకు పైగా అనుమానిత సైబర్ నేరస్తుల రికార్డులు అందాయి. సైబర్ నేరగాళ్లు దోచుకున్న సొమ్మును దాచిన 24 లక్షల లేయర్–1 మ్యూల్ ఖాతాల వివరాలను సస్పెక్ట్ రిజిస్ట్రీ ద్వారా నిఘా సంస్థలకు చేరాయి. తద్వారా రూ.4,631 కోట్లకు పైగా విలువైన మోసాలను నిరోధించగలిగారు. -
ప్రపంచంలోని సహజసిద్ధమైన అద్భుతాలేవో తెలుసా?
హలో పిల్లలూం. మనకు ప్రపంచ వింతలంటే ఠక్కున గుర్తొచ్చేవి – ది గ్రే వాల్ ఆఫ్ చైనా, పెట్రా, క్రైస్ట్ ది రిడీమర్, మచ్చు పిచ్చు, చిచెన్ ఇట్జా, రోమన్ కొలోసియం, మనందరికీ ఇష్టమైన తాజ్ మహల్. ఈ ఏడు వింతలు తప్ప మరొకటి జ్ఞప్తికి రావు. ఇవి ఎంతో అందమైన, ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలు, కట్టడాలు అయినప్పటికీ ఇవన్నీ కూడా మానవ నిర్మాతలు. మనకంటే ముందు జీవించిన మన పితరులు వివిధ కాలాలలో, విభిన్న సందర్భాలలో నిర్మించిన అద్భుతమైన కట్టడాలు ఇవి. కానీ ఈరోజు మనం, మానవ ప్రమేయం లేకుండా ప్రకతి ద్వారా సహజంగా ఏర్పడిన వింతల గురించి తెలుసుకుందాం. ప్రపంచంలోని ఏడు సహజసిద్ధమైన అద్భుతాలు (seven natural wonders of the World)1. గ్రాండ్ కాన్యన్ (Grand Canyon)అమెరికాలోని ఈ భారీ లోయ అరిజోనాలో ఉంది. కొలరాడో నది సష్టించిన ఈ కాన్యన్ దాదాపు 446 కిలోమీటర్ల ΄÷డవు, 29 కిలోమీటర్ల వెడల్పుతో 1.6 కిలోమీటర్ల లోతు కలిగి ఉంది. దీని అద్భుతమైన రంగులు, భౌగోళిక నిర్మాణం పర్యాటకులను కట్టిపడేస్తాయి.2. గ్రేట్ బారియర్ రీఫ్ (Great Barrier Reef ) ఆస్ట్రేలియా సమీపంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దిబ్బ. ఇది 2,300 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఈ అద్భుతం అనేక సముద్ర జీవులకు ఆవాసం.3. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ (Amazon Rainforest)దక్షిణ అమెరికాలోని ఈ ఉష్ణమండల వర్షారణ్యం ‘‘ప్రపంచ ఊపిరితిత్తులు’’ గా పిలువబడుతుంది. ఇది అమెజాన్ నది చుట్టూ విస్తరించి ఉండటంతోపాటు భూమ్మీద ఇంతవరకు కనిపించని ఎన్నో జాతుల జంతుజాలం, వక్షజాలానికి నిలయం.4. విక్టోరియా జలపాతం (Victoria Falls) ఆఫ్రికాలోని జాంబియా–జింబాబ్వే సరిహద్దులో ఉన్న ఈ జల΄ాతం జంబేజీ నదిపై ఉంది. దీని వెడల్పు 1.7 కిలోమీటర్లయితే, ఎత్తు 108 మీటర్లు.5. ఆరోరా బోరియాలిస్ (Aurora Borealis Northern Lights)ఉత్తర ధ్రువ ప్రాంతాలలో (నార్వే, స్వీడన్, ఫిన్లాండ్) కనిపించే ఈ అద్భుతమైన ఆకాశ దశ్యం సౌర కణాలు భూమి వాతావరణంతో సంకర్షణ చెందడం వల్ల ఏర్పడుతుంది. ఈ దశ్యాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా ప్రకతి డిజైన్ చేసిన గ్రాఫిక్స్ లా ఉంటాయి.6.పారిసెలో రాక్ (Paricutin Volcano)మెక్సికోలోని ఈ అగ్నిపర్వతం 1943లో ఒక రైతు భూమిలో ఏర్పడింది. ఇది ఏర్పడిన తొమ్మిది సంవత్సరాలలోనే 424 మీటర్ల ఎత్తుకు చేరుకుని ఆధునిక ప్రపంచ వింతగా పరిగణింపబడుతుంది.7. మౌంట్ ఎవరెస్ట్ (Mount Everest, Mount in Asia )ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం, హిమాలయాలలో 8,848 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ మంచు పర్వతాలు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఈ హిమ పర్వతాలను అధిరోహించడానికి కొన్ని వేల మంది ఆసక్తి చూపుతుంటారు. -
అందుకు రెడీ అన్న పాక్.. భారత్ స్పందన కోసం ఎదురుచూపు
భారత్తో చర్చలకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందంటూ ఆ దేశ ఉప ప్రధాని, విదేశాంగశాఖ మంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు. ఆయా అంశాలపై చర్చలకు ఇస్లామాబాద్ సిద్ధమంటూ పునరుద్ఘాటించారు. దీనిపై భారత్ తుది నిర్ణయం తీసుకోవాలన్న దార్.. ఆ దేశ అధికారిక స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు బంతి.. భారతదేశ కోర్టులో ఉందంటూ దార్ వ్యాఖ్యానించారు.వాణిజ్యం నుంచి ఉగ్రవాద వ్యతిరేక చర్యలు వంటి వివిధ అంశాలపై చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ‘అర్థవంతమైన చర్చలు’ అవసరమంటూ ఆయన నొక్కి చెప్పారు. కాశ్మీర్, భద్రత, ఆర్థిక సంబంధాలతో సహా ద్వైపాక్షిక సమస్యలను పరిష్కరించడానికి చర్చలు తిరిగి ప్రారంభించాలని దార్ పిలుపునిచ్చారు.కాగా, పహల్గాం దాడి నేపథ్యంలో పాకిస్థాన్పై భారత్ కఠిన వైఖరి అవలంబించిన సంగతి తెలిసిందే. సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు ఆ దేశంతో ఉన్న అన్ని వాణిజ్య సంబంధాలను కట్ చేసింది. ఆపరేషన్ సిందూర్తో పాక్తో పాటు పీవోకేలో ఉగ్ర స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. భారత్ మే 7వ తేదీన ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించింది. రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ సంక్షోభానికి ముగింపు పలికేందుకు రెండు దేశాలు మే 10వ తేదీన ఒక అంగీకారానికి రావడం తెలిసిందే. -
ఇక చాలు.. గాజాలో పని ముగించండి
గాజాలో చేపట్టిన మిలిటరీ ఆపరేషన్ను ఉధృతం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇజ్రాయెల్ను కోరారు. అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రతిపాదనను హమాస్ సంస్థ తిరస్కరించింది. ఈ పరిణామంతో రగిలిపోయిన ట్రంప్.. ఆ సంస్థ కథ ముగించాల్సిందేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.స్కాట్లాండ్ పర్యటనకు వెళ్లే ముందు ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘మా ప్రతిపాదనే తిరస్కరిస్తారా?. వాళ్లకు(హమాస్) ఒప్పందం చేసుకోవాలనే ఆలోచన నిజంగా లేనట్లు ఉంది. వాళ్లు చావాలనుకుంటున్నారేమో. గాజాలో దాడులను ఉధృతం చేయండి. ప్రక్షాళన చేయండి’’ అంటూ ఇజ్రాయెల్ను ఉద్దేశించి పిలుపు ఇచ్చారాయన.హమాస్ ఒప్పందానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే వారు శాంతికి కాకుండా హింసకు కట్టుబడి ఉన్నారు. ఇప్పుడు చివరి బంధీల వద్దకు వచ్చాం. వాళ్లు ఒప్పందం చేయాలనుకోవడం లేదు. వాళ్లను వేటాడాల్సిందే అని ట్రంప్ అన్నారు.ట్రంప్ తరఫున పశ్చిమాసియా దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్.. ఇజ్రాయెల్- హమాస్ చర్చల నుంచి వెనక్కి తగ్గుతున్నట్లు ప్రకటించారు. ఆ మరుసటిరోజే ట్రంప్ విరుచుకుపడడం గమనార్హం. విట్కాఫ్ ప్రకారం.. ప్రస్తుతానికి ఈ చర్చల నుంచి అమెరికా వెనక్కి తగ్గుతోంది. శాంతి ఒప్పందం పట్ల హమాస్ అంతగా ఆసక్తి చూపించడం లేదు. కొత్త వ్యూహాం కోసం దోహా నుంచి తిరిగి వాషింగ్టన్ వెళ్తునట్లు తెలిపారాయన.ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. హమాస్ పాలనను ముగించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే.. హమాస్ నేత బాసెమ్ నైమ్ మాత్రం, చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయి అని పేర్కొన్నారు. విట్కాఫ్ వ్యాఖ్యలు కేవలం ఇజ్రాయెల్కు మద్దతుగా ఒత్తిడి కలిగించేందుకు చేసినవని విమర్శించారు. మరోవైపు.. మధ్యవర్తులు ఖతార్, ఈజిప్ట్ కూడా చర్చలు సానుకూలంగానే సాగుతున్నట్లు చెబుతున్నాయి. చర్చల్లో కొంత పురోగతి సాధించామని, చర్చలు నిలిపివేయడం సాధారణ ప్రక్రియ అని, అమెరికాతో కలిసి కాల్పుల విరమణ కోసం కోసం ప్రయత్నం కొనసాగిస్తామని చెప్పారు.ఇక.. గాజాలో మానవతా సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆహార కొరత, బాలలలో పోషకాహార లోపం, వందల మంది ఆకలితో మరణించడంలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. UNICEF, UNRWA వంటి సంస్థలు తక్షణ సహాయం అవసరం అని హెచ్చరిస్తున్నాయి. ఇజ్రాయెల్ మాత్రం ఆహారం సరిపడా పంపించామని, ఐరాసనే సరైన పంపిణీ చేయడం లేదని ఆరోపిస్తోంది. -
లక్ష ఏళ్లనాటి సమాధులు
ఇజ్రాయెల్లో ఏకంగా లక్ష ఏళ్ల నాటి అతి పురాతన సమాధుల సమూహం వెలుగు చూసింది. దీన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన శవాల దిబ్బల్లో ఒకటిగా భావిస్తున్నారు. నాటి ఆదిమ మానవుల మృతదేహాలను ఇక్కడ గుంతల్లో జాగ్రత్తగా సమాధి చేసినట్టు కనుగొన్నారు. సెంట్రల్ ఇజ్రాయెల్లోని టిన్ష్మెట్ గుహలోని ఈ సమాధుల సమూహానికి గురించిన వివరాలను ఇటీవలే అకాడమిక్ జర్నల్లో ప్రచురించారు. చనిపోయిన వారి గౌరవార్థం మృతదేహాల పక్కన పాతిపెట్టిన పలు వస్తువులు, అవశేషా లను అక్కడినుంచి తవ్వితీశారు. ఇది మానవ జాతికి సంబంధించి వెలుగు చూసిన అతి గొప్ప ఆవిష్కరణ అని తవ్వకాల బృందం డైరెక్టర్లలో ఒకరు, హీబ్రూ యూనివర్సిటీ ఆర్కియాలజీ ప్రొఫెసర్ యోసి జైద్నెర్ అన్నారు. ఈ దిబ్బల్లో మృతదేహాలను గర్భస్థ పిండం ఆకృతిలో పాతిపెట్టారు. ఇవి లక్ష నుంచి లక్షా 10 వేల ఏళ్ల నాటివని వివరించారు.గుహ మొదట్లోనే పుర్రెటిన్ష్మెట్ ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు 2016 నుంచీ తవ్వకాలు సాగిస్తున్నారు. గుహ మొదట్లో రాతి గుండా బయటికి చొచ్చుకుని వచ్చినట్టుగా ఉన్న ఓ పుర్రెను గుర్తించారు. లోపల సమాధుల్లో శవాల పక్కన గులకరాళ్లు, జంతువుల అవశేషాల వంటివి కనిపించాయి. వీటిలో చాలావరకు నాటి రోజువారీ జీవితంలో ఉపయోగం లేనివే. దాంతో ఇవి అప్పటి ఆచారం ప్రకారం మృతుల గౌరవార్థం ఉంచినవేనని తేల్చారు. ఇవన్నీ రాతియుగం నాటివిగా, అంటే సుమారు 2.5 లక్షల నుంచి 30 వేల ఏళ్ల మధ్యనాటివిగా తేలింది. ఈ వివరాలను నేచర్హ్యూమన్ బిహేవియర్ జర్నల్లో ప్రచురించారు. ఇక్కడ రెండు అస్థిపంజరంతో కూడిన పూర్తిస్థాయి పుర్రెలు, మూడు పుర్రెలు, ఎముకలతో పాటు అలంకరణ సామగ్రి వంటివి కూడా దొరికాయి. అప్పట్లోనే మనిషి కేవలం తిండి, స్వీయరక్షణకు పరిమితం కాకుండా ఇతరత్రా అంశాలను కూడా నేర్చుకున్నట్టు దీన్నిబట్టి తెలుస్తోందని పురాతత్వవేత్తలు అభిప్రాయç ³డుతున్నారు. సున్నితత్వం దృష్ట్యా ఈ గుహ భాగాలను అతి చిన్న పరికరాలతో జాగ్రత్తగా తొలుస్తున్నారు. ఈ నేపథ్యంలో అందులోని పూర్తి విశేషాలు బయట పడాలంటే మరికొన్నేళ్లు పడుతుందని భావిస్తున్నారు. ఇవి ఇజ్రా యెల్లోని 100 ఏళ్ల క్రితం స్కుల్లో, 50 ఏళ్ల నాడు ఖఫ్జేలో బయటపడ్డ గుహలను తలపిస్తు న్నాయి. మృతదేహాలను గాలికి వదిలేయకుండా ఇలా ఒక పద్ధతి ప్రకారం అంత్యక్రియలు జరిపే ఆచారం బహుశా 2 లక్షల ఏళ్ల క్రితమే పురుడుపోసుకుని ఉంటుందని పురాతత్వవేత్తలు అంచనా వేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హెచ్ఐవీకి సూదిమందు ఆమోదించిన ఈయూ
లండన్: హెచ్ఐవీ/ఎయిడ్స్ను అడ్డుకునే సూదిమందు ‘లెనకపవిర్’కు యూరోపియన్ యూనియన్ (ఈయూ)కు చెందిన మెడిసిన్స్ ఏజెన్సీ ఆమోదం తెలిపింది. ఏడాదిలో రెండు పర్యాయాలు తీసుకునే ఈ ఔషధం వైరస్ వ్యాప్తిని నివారించడంలో సాయపడుతుందని పేర్కొంది. యూరప్లో దీనిని యెయ్టువో అనే పేరుతో గిలియడ్ సైన్సెస్ విక్రయాలు జరుపుతుంది. దీంతో ఈయూలోని 27 సభ్య దేశాలతోపాటు ఐస్ల్యాండ్, నార్వే, లీచిన్స్టెయిన్ల్లోనూ ఇది అందుబాటులోకి వస్తుంది. లెనకపవిర్తో హెచ్ఐవీ బాధిత మహిళలు, పురుషులకు చికిత్స చేయగా 100 శాతం ప్రభావవంతంగా పనిచేసినట్లు గతేడాది చేపట్టిన అధ్యయనంలో తేలింది. హెచ్ఐవీ మహమ్మారిని తరిమికొట్టడంలో లెనకపిర్ కీలక మలుపుగా మారనుందని ఐరాస ఎయిడ్స్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విన్నీ తెలిపారు. జూన్లో అమెరికా ప్రభుత్వ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సైతం లెనకపవిర్ను ఆమోదించింది. ఐరాస ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్ఐవీ వైరస్ నివారణలో లెనకపవిర్ ఎంతో సహాయకారికానుందని పేర్కొంది. ఒకసారి ఈ సూది మందు తీసుకుంటే ఆరు నెల్లపాటు హెచ్ఐవీ సోకకుండా ఆపగలుగుతుంది. కాగా, లెనకపవిర్ను తక్కువ ధరలో హెచ్ఐవీ కేసులు తీవ్రంగా ఉండే ఆఫ్రికా, ఆసియా, కరీబియన్ ప్రాంతాల్లోని 120 పేద దేశాలకు సరఫరా చేస్తామని గిలియడ్ సైన్సెస్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల హెచ్ఐవీ బాధితులుండగా 2024లో సుమారు 6.30 లక్షల మంది చనిపోయినట్లు అంచనా. -
పాలస్తీనాకు మద్దతుగా ఫ్రాన్స్
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ పాలస్తీనాకు మద్దతుగా నిలిచారు. ఆ దేశ సార్వభౌమత్వాన్ని ఫ్రాన్స్ గుర్తిస్తుందని మాక్రాన్ చెప్పారు. ఈ విషయాన్ని సెప్టెంబర్లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో అధికారికంగా ప్రకటిస్తానన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. గాజాలో యుద్ధం ఆగిపోవడం, అక్కడి జనాభాను ఆకలి నుంచి రక్షించడమే ప్రస్తుతం మన ముందున్న అత్యవసర కర్తవ్యమని పేర్కొన్నారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడులు జరిగిన వెంటనే ఆయన ఇజ్రాయెల్కు మద్దతు ఇచ్చారు. యూదు వ్యతిరేకతను ఖండించారు. ఆ తరువాతి కాలంలో గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం, రానురాను పెరిగిన సంక్షోభం పట్ల ఆయన తీవ్ర నిరాశ చెందారు. పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తామని గతంలో పలుమార్లు చెప్పిన ఆయన.. తాజాగా పునరుద్ఘాటించారు. నిర్లక్ష్యపూరిత నిర్ణయం: అమెరికాపాలస్తీనా పట్ల ఫ్రాన్స్ తీరును అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించాయి. ఇది హమాస్ ప్రచారానికి ఉపయో గపడే నిర్లక్ష్య పూరిత నిర్ణయ మని విదేశాంగ మంత్రి మార్కో రూబి యో అన్నారు. ‘‘యూ ఎన్ జనరల్ అసెంబ్లీలో పాలస్తీనా రాజ్యాన్ని గు ర్తించాలనే మాక్రాన్ ప్ర ణాళికను అమెరికా తిరస్కరిస్తుంది. ఈ నిర్లక్ష్య నిర్ణయం హమా స్ ప్రచా రానికి ఉపయో గపడుతుంది. శాంతిని దెబ్బ తీస్తుంది’’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఫ్రాన్స్ తీరు సిగ్గుచేటు: ఇజ్రాయెల్ఇక మాక్రాన్ ప్రకటనపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలస్తీనాను గుర్తించడమంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమేనని, ఇది ఇజ్రాయెల్ అస్తిత్వానికి ముప్పు కలిగిస్తుందని ప్రధాని బెంజమిన్ నెతాన్యాహూ అన్నారు. గాజా ఇజ్రాయెల్ను నిర్మూలించే లాంచ్ ప్యాడ్ అవుతుందని, దాని పక్కన శాంతియుతంగా జీవించలేమని తెలిపారు. ఫ్రాన్స్ నిర్ణయం సిగ్గుచేటని ఇజ్రాయెల్ ఉప ప్రధాని యారివ్ లెవిన్ అన్నారు. అది ఫ్రెంచ్ చరిత్రపై ఒక నల్ల మచ్చని, ఉగ్రవాదానికి నేరుగా సహాయమందించడమని చెప్పారు. తాము ఆక్రమించిన వెస్ట్ బ్యాంక్కు ఇజ్రాయెల్ సార్వభౌమత్వాన్ని వర్తింపజేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. స్వాగతించిన హమాస్.. ఫ్రాన్స్ ప్రకటనను పాలస్తీనియన్ అథారిటీ సీనియర్ అధికారి హుస్సేన్ అల్–షేక్ స్వాగతించారు. ఇది అంతర్జాతీయ చట్టాల పట్ల ఫ్రాన్స్ నిబద్ధతను తెలియజేస్తుందన్నారు. పాలస్తీనా ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కులకు, రాజ్య స్థాపనకు మద్దతివ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పాలస్తీనా గుర్తింపు విషయంలో ప్రపంచంలోని అన్ని దేశాలు, యూరోపియన్ దేశాలు ఫ్రాన్స్ను అనుసరించాలని ఆయన పిలుపునిచ్చారు. -
మాల్దీవులతో బలీయ బంధం
మాలె: భారత్, మాల్దీవ్స్ విశ్వసనీయమైన మిత్రదేశాలు అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మాల్దీవ్స్తో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకుంటామని, ద్వీప దేశానికి రూ.4,850 కోట్ల రుణం(లైన్ ఆఫ్ క్రెడిట్) ఇవ్వబోతున్నామని ప్రకటించారు. శుక్రవారం మాల్దీవ్స్ రాజధాని మాలెలో ప్రధాని మోదీ, మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, రక్షణ, మౌలిక సదుపాయాలు తదితర రంగాల్లో పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించారు. అంతకుముందు రెండు రోజుల పర్యటన నిమిత్తం బ్రిటన్ నుంచి శుక్రవారం ఉదయం మాల్దీవులకు చేరుకున్న మోదీకి ఘన స్వాగతం లభించింది. ఎయిర్పోర్టులో మొహమ్మద్ ముయిజ్జుతోపాటు సీనియర్ మంత్రులు ఆయనకు స్వయంగా స్వాగతం పలికారు. అనంతరం రిపబ్లిక్ స్క్వేర్లో మోదీకి సైనికులు గౌరవ వందనం సమర్పించారు. ఇండియా–మాల్దీవ్స్ మధ్య కొన్ని రోజుల క్రితం సంబంధాలు బలహీనపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ పర్యటన విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. సైనిక సామర్థ్యం పెంపునకు సహకారం మాల్దీవులతో సంబంధాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు మోదీ స్పష్టంచేశారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక పెట్టుబడులు ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. భారత్ అమలు చేస్తున్న ‘పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యం’, ‘మహాసాగర్’ విధానాల్లో మాల్దీవులకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. రక్షణ రంగంలో పరస్పర సహకారం ఇరుదేశాల మధ్య పరస్పర విశ్వాసానికి ఒక కొలమానం అని వివరించారు. మాల్దీవుల సైనిక సామర్థ్యం పెంపునకు భారత్ సహకరిస్తుందని హామీ ఇచ్చారు. అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ఎయిర్పోర్ట్కు వచ్చి స్వా గతం పలకడం తన హృదయాన్ని హత్తుకుందని మోదీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.రక్షణ శాఖ కార్యాలయం ప్రారంభం ఇండియా–మాల్దీవ్స్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక సంబంధాలు, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఈ చర్చలు జరుగుతున్నాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్మారక తపాళ బిళ్లను మోదీ, ముయిజ్జు ఆవిష్కరించారు. వేర్వేరు కీలక రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించి అవగాహనా ఒప్పందాలపై(ఎంఓయూ) ఇరు దేశాలు సంతకాలు చేశాయి. మాల్దీవ్స్లో భారత యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి మరో ఒప్పందం కుదిరింది. రూ.4,850 కోట్ల లైన్ ఆఫ్ క్రెడిట్పై రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. మాలె సిటీలో రక్షణ శాఖ కార్యాలయాన్ని మోదీ, ముయిజ్జు ప్రారంభించారు. -
విశ్వానికి అంతముందా!
విశ్వ సిద్ధాంతం సరికొత్త మలుపు తిరిగింది. ఈ అనంత విశ్వం నిరంతరాయంగా, ఎప్పటికీ విస్తరిస్తూనే ఉంటుందన్నది ఇప్పటిదాకా సైంటిస్టులు నమ్ముతూ, చెబుతూ వచ్చిన మాట. కానీ అది నిజం కాదని, విశ్వానికి అంతముందని కొత్త సిద్ధాంత వ్యాసం ఒకటి చెబుతోంది. మరో 2,000 కోట్ల ఏళ్లకు విశ్వం కథ పూర్తిగా ముగిసిపోతుందని అది అంటోంది. దాంతోపాటే నక్షత్రాలు, గ్రహాలు, విశ్వ శక్తి... ఇలా సర్వమూ అంతమైపోతుందట. దీన్ని ‘బిగ్ క్రంచ్’గా సదరు వ్యాసం పేర్కొంది. డార్క్ ఎనర్జీగా పిలిచే రహస్య విశ్వ చోదక శక్తి స్థిరంగా, సానుకూలాత్మకంగా కొనసాగుతుందన్న సిద్ధాంతంపై విశ్వ నిత్య విస్తరణవాదం ఆధారపడి ఉంది. కానీ డార్క్ ఎనర్జీ స్థిరంగా ఉండనే ఉండదని పరిశోధకులు తాజాగా చెబుతున్నారు. డార్క్ ఎనర్జీ సర్వే (డీఎన్ఎస్), డార్క్ ఎనర్జీ స్పెక్ట్రోస్కొపిక్ ఇన్స్ట్రుమెంట్ (డీఈఎస్ఐ) అనే రెండు పెద్ద అంతర్జాతీయ ప్రాజెక్టుల తాలూకు తాజా డేటా ఆధారంగా వారు ఈ మేరకు సూత్రీకరించారు. డార్క్ ఎనర్జీ కాలక్రమంలో మారుతుందని పేర్కొన్న ఇటీవలి సర్వే ఆక్సియాన్–డార్క్ ఎనర్జీ మోడల్ (ఏడీఈ)ను సిద్ధాంతాన్ని ఇది సమర్థిస్తోంది. దీన్ని ప్రస్తుత సూత్రీకరణకు వర్తింపజేస్తే అంతరిక్షం ఎలా ప్రవర్తిస్తుందన్న దాన్ని లెక్కించే విశ్వ స్థిరాంకం నిజానికి ప్రతికూల శక్తి అయి ఉండొచ్చని చెప్పే సంకేతాలను సైంటిస్టులు గమనించారు. ఈ మొత్తం సిద్ధాంతంలో అతి కీలకమైన అంశం ఇదే. ప్రతికూల విశ్వ స్థిరాంకపు ఉనికి అంటే అంతిమంగా దాని విస్తరణను ఆకర్షణ శక్తి అధిగమించేస్తుంది. అప్పటినుంచి విశ్వం వృద్ధి చెందడం నిలిచిపోయి తిరోగమన బాట పడుతుంది. అంతిమంగా అది అంతమైపోతుంది. ఈ బిగ్ క్రంచ్ ఫలితంగా విశ్వంలోని సమస్త శక్తీ పీల్చుకుపోయి అత్యంత సాంద్రతతో కూడిన బిందువుగా మారుతుంది. ఇదే గనక నిజమైతే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతమే తప్పని భావించాల్సి ఉంటుంది.ఆయువు 3,330 కోట్ల ఏళ్లువిశ్వం మొత్తం ఆయుష్షు 3,330 కోట్ల ఏళ్లని ఈ తాజా సిద్ధాంత వ్యాసం ప్రతిపాదించింది. విశ్వం పుట్టి 1,380 కోట్ల ఏళ్లు గడిచినట్టు సైంటిస్టులు తేల్చారు. ఆ లెక్కన దాని ఆయుఃప్రమాణంలో సగం ముగిసిపోయినట్టే లెక్క. అయితే దీన్ని పూర్తిగా విశ్వసించాలంటే మరింత కచ్చితమైన గణాంకాలు అవసరమని సైంటిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా డార్క్ ఎనర్జీ కాలంతో పాటుగా కచ్చితంగా మారుతుందన్న దానిలో నిజానిజాలు తేలాల్సి ఉంటుంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
హైవేపై కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్
ఉత్తర ఇటలీలోని బ్రెస్సియాలో ఘోర ప్రమాదం జరిగింది. చిన్నపాటి విమానం హైవేపై కూలిపోవడంతో ఇద్దరు మరణించారు. మృతులను మిలన్కు న్యాయవాది సెర్గియో రావాగ్లియా(75), ఆయన భార్య ఆన్ మారియా డి స్టెఫానో (60)గా గుర్తించారు. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.రావాగ్లియా హైవేపై అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నం విఫలం కావడంతో.. వేగంగా దూసుకొచ్చిన విమానం ముందు భాగం రోడ్డును ఢీకొట్టింది. దీంతో భారీ మంటలు చెలరేగి పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా ఇద్దరు వాహనదారులు కూడా గాయపడ్డారు.. కానీ ప్రాణాలతో బయటపడ్డారు. మంటలు అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకోగా అప్పటికే ఆ విమానం మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై ఇటలీ నేషనల్ ఏజెన్సీ ఫర్ ఫ్లైట్ సేఫ్టీ దర్యాప్తు చేపట్టింది.🚨 PLANE CRASHED in the middle of the Highway - HORRIFIC VISUALS Brescia, Italy - A small private plane tragically crashed onto a highway The 75 year old Pilot and his partner BOTH DEADToo many Plane Crashes in the last few weeks :'( pic.twitter.com/iRewT9Zz5r— Gautam Seth (@GautamS15540834) July 25, 2025కాగా, ప్రపంచవ్యాప్తంగా వరుస విమాన ప్రమాదాలు ప్రయాణీకులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో విమానం ఎక్కాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ప్రమాదాలకు పైలట్స్, విమానంలో సాంకేతిక లోపాలే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. -
మోజు తగ్గుతోంది.. మొగ్గు మారుతోంది..!
విదేశాల్లో చదువు కోవడం అంటే భారత విద్యార్థులకు మోజు.. అందులోనూ అమెరికా, కెనడా, యూకే వంటి దేశాల్లో చదవడం అంటే అది మరింత క్రేజు. మరి ఇప్పుడు భారత విద్యార్థుల అభిరుచి మారిందా? అంటే అవుననక తప్పదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విదేశాల్లో చదవడం కష్టతరంగా మారింది. ప్రధానంగా వీసా నిబంధనలు కఠినతరం కావడం, ఖర్చులు పెరగడం వంటి తదితర కారణాలతో భారత విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆసక్తి తగ్గిపోతోంది. అదే సమయంలో భారతదేశంలోనే మెరుగైన అవకాశాలు లభించడం వంటి కారణాలతో విదేశాల్లో చదువుకు వెనకడుగు వేస్తున్నారు. విదేశాల్లో భారత విద్యార్థుల చదువుల అంశానికి సంబంధించి పలు నివేదికలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. యూఎస్, యూకేను వదిలేద్దాం..!గత కొన్నేళ్లుగా విదేశాల్లో చదివే భారత విద్యార్థుల సంఖ్య గణనీయకంగా తగ్గింది. 2023 నాటికి విదేశాల్లో చదివే భారత విద్యార్థుల సంఖ్య 8.92 లక్షలు ఉండగా, అది 2024 నాటికి 7.59 లక్షలకు తగ్గింది. దీనికి కారణాలు మాత్రం ప్రధానంగా అగ్రదేశాలైన యూఎస్ఏ, యూకే, కెనడాల్లో చదవాలనే కోరిక ఒకటి. అయితే ఈ దేశాల్లో వీసాల నిబంధనలు కఠినతరంగా మారాయి. దాంతో అమెరికా, యూకే, కెనడాలపై దృష్టి పెట్టడం లేదు. దాంతో విదేశాల్లో చదవాలనుకునే భారత్ విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ఇదొక కారణంగా మారింది. ప్రస్తుతం పలువురు విద్యార్థుల మాత్రమే యూఎస్, యూకేలపై దృష్టి సారిస్తుండగా, అధిక శాతం మంది మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో కొంతమంది భారత్లోనే ఉన్నత చదువులకు ఆసక్తి చూపిస్తుండగా, మరి కొంతమంది మాత్రం వీసా నిబంధనలు సులభతరంగా ఉండి ఫీజులు తక్కువగా ఉండే దేశాల వైపు మొగ్గు చూపిస్తున్నారు.కెనడా అసలే వద్దు..!గతంలో అమెరికాలో చదువు కోవడానికి వీలు లేకపోతే, కెనడా వైపు దృష్టి సారించే వారు అధిక శాతం మంది భారత విద్యార్థులు. అయితే జస్టిన్ ట్రూడో హయాంలో భారత్-కెనడా దౌత్స సంబంధాలు దెబ్బ తినడంతో పాటు అక్కడ వీసా నిబంధనలు కూడా కఠినతరంగా మారాయి.ట్రూడో హయాంలో వీసా పరిమితులు, ఎస్డీఎస్ (Student Direct Stream ప్రోగ్రాం రద్దు, వర్క్ పరిమితులు వంటి మార్పులు భారత విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఒక విషయాన్ని గమనిస్తే 2023లో 2.33 లక్షల మంది విద్యార్థులు కెనడా వెళ్లగా, 2024లో అది కాస్తా1.37 లక్షలకు పడిపోయింది. అంటే కెనడా అసలే వద్దు అనే నిర్ణయానికి అధిక శాతం భారత విద్యార్థులు వచ్చారనేది ఈ గణాంకాల్ని బట్టి అర్ధమవుతోంది.బంగ్లా, ఉజ్బెకిస్థాన్లో ఉన్నత చదువులు..విదేశాల్లో చదువాలనుకునే భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గడం ఒకటైతే, అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్లడానికి వీసా తదితర ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో బంగ్లదేశ్, ఉజ్భెకిస్తాన్, సింగపూర్, రష్యా వైపు మొగ్గు చూపిస్తున్నారు. 2023లో 20,368 మంది భారత విద్యార్థులు బంగ్లాదేశ్ వైపు మొగ్గు చూపగా, మరుసటి ఏడాదికి అది కాస్త పెరిగి 29,232కు చేరింది. 2023 నాటికి ఉజ్బెకిస్థాన్లో చదువుకునే భారత విద్యార్థుల సంఖ్య 6, 601 ఉంగా, అది 2024 నాటికి 9,915 చేరింది. ఇక 2023లో రష్యా వైపు 25,503లో భారత విద్యార్థులు ఆసక్తి చూపగా, 2024 నాటికి 31,444 విద్యార్థులకు చేరింది. ఇక సింగపూర్ విషయానికొస్తే ఏడాదిలో 12,000 నుంచి 14,000 మంది విద్యార్థులకు చేరింది. ఎందుకీ మార్పు..?అసలు విదేశాల్లో చదువు అనేది భారీ ఖర్చుతో కూడుకున్నదైతే, అందులో వీసా తదితర నిబంధనల్లో భారీగా మార్పులు చేయడం మరొకటి. ఇది ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపిస్తోంది. యూఎస్, యూకే, కెనడాల్లోనే వీసా నిబంధనల్లో కఠినమైన మార్పులు వచ్చాయి. దాంతో ‘ ఎందుకీ తలనొప్పి’ అని భావించే చిన్న దేశాల వైపు చూస్తున్నారు. తక్కువ ఖర్చుతో మెడికల్, టెక్నికల్ విద్య పూర్తి చేసే అవకాశాలు అధికంగా ఉండటంతో పాటు వీసా ప్రక్రియ సులభతరంగా ఉండటం మరొక కారణం. భారతీయ విద్యార్థులకు అనుకూలమైన కోర్సులు కూడా ఆయా దేశాల్లో ఉండటం కూడా ప్రత్యామ్నాయంగా వాటివైపు చూడటానికి ప్రధానమైన అంశంగా మారింది ఇక భద్రత పరంగా కూడా అక్కడ పెద్దగా ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉండవని భావించే బంగ్లాదేశ్, సింగపూర్, రష్యా, ఉజ్బెకిస్థాన్ తదితర దేశాల వైపు చూడటానికి మరొక కారణంగా చెప్పవచ్చు. -
ఎవరీ లండన్ చాయ్వాలా.. ఏంటి ప్రత్యేకత?
ఇండియన్ కల్చర్లో టీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇంటికి గెస్టులు ఎవరు వచ్చినా ముందుగా టీయిచ్చి మాటలు కలుపుతాం. మిత్రులు, సావాసగాళ్లతో చాయ్లు తాగుతూ చేసే చర్చలకు అంతే ఉండదు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత చాయ్ పే చర్చ చాలా ఫేమస్ అయింది. తనను తాను చాయ్వాలాగా ఆయన ఎన్నోసార్లు చెప్పుకున్నారు. పీఎం మోదీకి చాయ్ అందించి వైరల్ అయ్యాడో యువ చాయ్వాలా. అది కుడా లండన్లోని బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసంలో. ఇద్దరు ప్రధానులకు చాయ్ పోసిన కుర్రాడి పేరు అఖిల్ పటేల్.భారత్, బ్రిటన్ దేశాల మధ్య గురువారం చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) కుదిరింది. ఈ సందర్భంగా లండన్లోని బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం అయిన చెకర్స్లో కీలక భేటీ జరిగింది. యూకే పీఎం కీర్ స్టార్మర్, ప్రధాని మోదీ కీలకాంశాలపై చర్చలు సాగించారు. పచ్చికలో ఏర్పాటు చేసిన ఒక టీ స్టాల్లో తాజాగా తయారు చేసిన భారతీయ మసాలా చాయ్ను ఇరువురు అగ్రనేతలు ఆస్వాదించారు. తర్వాత ఈ ఫొటోలను మోదీ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. "చెకర్స్లో ప్రధానమంత్రి కీర్ స్టార్మర్తో 'చాయ్ పే చర్చా'... భారత్-యూకే సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని రాశారు. View this post on Instagram A post shared by Amala Chai | Masala Chai (@amala_chai)మోదీ షేర్ చేసిన ఫొటోలో.. సాంప్రదాయ భారతీయ కుర్తాలో ఒక యువకుడు.. ఇద్దరు ప్రధానులకు చాయ్ సర్వ్ చేస్తునట్టు కనబడింది. ముఖ్యంగా టీస్టాల్ బ్యానర్పై రాసివున్న క్యాప్షన్ అందరినీ ఆకర్షించింది. "తాజాగా తయారుచేసిన మసాలా చాయ్. భారతదేశం నుంచి వచ్చించి, లండన్లో తయారైంది అని రాసుంది. ఇరువురు అగ్రనేతలకు చాయ్ అందించిన ఆ యువకుడి పేరు అఖిల్ పటేల్. అమలా చాయ్ పేరుతో యూకేలో ఆయన బిజినెస్ చేస్తున్నారు.‘Chai Pe Charcha’ with PM Keir Starmer at Chequers...brewing stronger India-UK ties! @Keir_Starmer pic.twitter.com/sY1OZFa6gL— Narendra Modi (@narendramodi) July 24, 2025 ఒక చాయ్వాలాకు మరో చాయ్వాలా..భారత్, బ్రిటన్ ప్రధానులకు చాయ్ అందించి అపరూప క్షణాలకు సంబంధించిన వీడియోను అఖిల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అమలా చాయ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో రీల్ను షేర్ చేశారు. కీర్ స్టార్మర్తో కలిసి మోదీ.. టీస్టాల్ వద్దకు రావడం.. మీరు ఇండియా రుచులను ఆస్వాదిస్తారు అంటూ స్టార్మర్తో మోదీ చెప్పడం వంటివి వీడియోలో ఉన్నాయి. "ఇందులో ఏలకులు, జాజికాయ, నల్ల మిరియాలు ఉన్నాయి" అని కప్పుల్లో టీ పోస్తూ పటేల్ చెప్పాడు. ప్రధాని మోదీకి టీ గ్లాస్ అందిస్తూ.. ఒక చాయ్వాలాకు మరో చాయ్వాలా (Chaiwala) టీ అందిస్తున్నాడు అనగానే.. మోదీ గట్టిగా నవ్వేశారు. కీర్ స్టార్మర్ చాయ్ తాగుతూ చాలా బాగుందని కితాబిచ్చారు. ఎవరీ అఖిల్ పటేల్?భారత మూలాలు కలిగిన అఖిల్ పటేల్.. 2019లో తన అమ్మమ్మ ప్రేరణతో అమలా చాయ్ను ప్రారంభించాడు. అతడి అమ్మమ్మ 50 ఏళ్ల క్రితం లండన్కు వలసవచ్చి స్థిరపడ్డారు. పటేల్ లింక్డ్ఇన్ బయో ప్రకారం.. అతడు లండన్లోని హాంప్స్టెడ్లోని యూనివర్సిటీ కాలేజ్ స్కూల్లో చదువుకున్నాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (LSE) నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (BSc), మేనేజ్మెంట్ చేశాడు. గ్రాడ్యుయేషన్ వివిధ సంస్థల్లో ఇంటర్న్షిప్లు పూర్తి చేశాడు.చదవండి: మీరు ఎలా చనిపోవాలనుకుంటున్నారు?చిన్నతనంలో తన అమ్మమ్మ పెట్టే మసాలా చాయ్ అంటే అఖిల్కు చాలా ఇష్టం. అయితే బయట తాగే చాయ్లలో ఇలాంటి రుచి లేదని గమనించాడు. తన అమ్మమ్మ ఫార్ములాతో బ్రిక్ లేన్ ప్రాంతంలో అమల చాయ్ పేరుతో టీస్టాల్ ప్రారంభించాడు. అస్సాం, కేరళ రైతుల నుంచి నేరుగా తేయాకులు, సుగంధ ద్రవ్యాలు తెప్పించుకుని వాటితోనే మాసాలా చాయ్ తయారు చేస్తాడు. అందుకే అమల చాయ్కు తక్కువ కాలంలోనే బాగా పేరొచ్చింది. తాజాగా ఇద్దరు ప్రధాన మంత్రులకు మసాలా చాయ్ అందించి ప్రపంచం దృష్టిలో పడ్డాడు అఖిల్ పటేల్. -
థాయ్-కంబోడియా ఘర్షణలు.. భారతీయులకు అడ్వైజరీ
థాయ్లాండ్, కంబోడియా దేశాలు సరిహద్దు వివాదంతో పరస్పర దాడులకు తెగబడుతున్న సంగతి తెలిసిందే. దశబ్దాలుగా కొనసాగుతున్న ఈ వివాదం.. తాజాగా తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో భారతీయుల కోసం అడ్వైజరీ జారీ అయ్యింది.భారత పౌరులు థాయ్లోని ఏడు ప్రావిన్స్ల వైపు ప్రయాణం చేయొద్దని శుక్రవారం థాయ్లాండ్లోని భారత రాయబార కార్యాలయం సూచింది. అంతేకాదు మార్గదర్శకాల కోసం థాయ్ అధికారుల సహకారం కోరవచ్చని అందులో స్పష్టం చేసింది. ట్రాట్, సురిన్, సిసాకెట్, బురిరామ్, సా కవావో, ఛంథాబురి, ఉవోన్ రట్చథాని..ప్రావిన్స్లు ఈ జాబితాలో ఉన్నాయి.In view of the situation near Thailand-Cambodia border, all Indian travelers to Thailand are advised to check updates from Thai official sources, including TAT Newsroom.As per Tourism Authority of Thailand places mentioned in the following link are not recommended for… https://t.co/ToeHLSQUYi— India in Thailand (@IndiainThailand) July 25, 2025ఇదిలా ఉంటే.. మరోవైపు థాయ్లాండ్ తాత్కాలిక ప్రధాని పుమ్తోమ్ వెచయాచై కూడా ఆయా ప్రావిన్స్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నట్లు ప్రకటించారు. ప్రాచీన దేవాలయాల చుట్టూ ఉన్న భూభాగంపై ఆధిపత్యం కోసం కొన్ని దశాబ్దాలుగా థాయ్లాండ్ – కాంబోడియా మధ్య నడుస్తున్న వివాదం.. తాజాగా తీవ్రరూపం దాల్చింది.Ta Muen, Ta Moan Thom దేవాలయాలు తమవంటే తమవని ఇరు దేశాలు కొన్ని దశాబ్దాలుగా వాదించుకుంటున్నాయి. అయితే అంతర్జాతీయ న్యాయస్థానంలో కంబోడియాకు అనుకూలంగా తీర్పు వెలువడినప్పటికీ.. థాయ్లాండ్ నుంచి అభ్యంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో.. మే నెలలో కంబోడియాకు చెందిన సైనికుడ్ని థాయ్ సైన్యం కాల్చి చంపింది. అప్పటి నుంచి ఇరు దేశాల సరిహద్దులో వాతావరణం వేడెక్కింది. అయితే ఈ పరిస్థితిని చల్లార్చేందుకు థాయ్ ప్రధాని షినవత్రా.. కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్తో రాయబారం చేయబోయారు. ఆ సమయంలో ‘అంకుల్’ అని సంబోధిస్తూ మాట్లాడిన ఫోన్కాల్ బయటకు వచ్చింది. ఈ పరిణామంపై థాయ్ సైన్యం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పారు. అయితే ఈ అంశంపై అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం విచారణకు ఆదేశించడంతో పాటు ఆమెను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో జులై 3న పుమ్తోమ్ వెచయాచై థాయ్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది.జూలై 23, 2025న ల్యాండ్మైన్ పేలడంతో థాయ్లాండ్కు చెందిన ఐదుగురు సైనికులు గాయపడ్డారు. ప్రతిగా.. థాయ్లాండ్ F-16 యుద్ధ విమానాలతో కాంబోడియా లక్ష్యాలపై బాంబుల దాడులు చేసింది. ఈ పరిణామంతో ఇరు దేశాల రాయబారులను ఉపసంహరించుకున్నారు.గురువారం నాటి ఘర్షణల్లో ఇరుదేశాలకు చెందిన 14 మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు. ఈ సంక్షోభంతో సరిహద్దులో ఉంటున్న వేలమంది తమ తమ దేశాలకు పారిపోయారు. శుక్రవారం సైతం ఈ దాడులు కొనసాగుతున్నాయి. థాయ్లాండ్ కంబోడియన్ సరిహద్దులో వైమానిక దాడులు చేస్తోంది. -
మాక్రాన్పై ఇటు ఇజ్రాయెల్, అటు అమెరికా ఆగ్రహం
పాలస్తీనాను దేశంగా గుర్తించాలన్న ఫ్రాన్స్ నిర్ణయాన్ని అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రంగా తప్పుబట్టాయి. ఇప్పటికే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇప్పటికే ఈ నిర్ణయం తీసేసుకోగా.. సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే..మాక్రోన్ నిర్ణయాన్ని ఇటు ఇజ్రాయెల్, అటు అమెరికా ఖండించాయి. ఇది అక్టోబర్ 7వ తేదీ నాటి బాధితులకు ద్రోహం చేయడంలాంటిదేనని అమెరికా విదేశాంగ కార్యదర్శి మాక్రో రుబియో అన్నారు. మాక్రోన్ నిర్ణయాన్ని సిగ్గుచేటుగా పేర్కొన్న రుబియో.. ఇది హమాస్కు అనుకూలంగా ఉందంటూ మండిపడ్డారు.ఐరాస సాధారణ అసెంబ్లీలో పాలస్తీనాకు దేశం గుర్తింపు కోసం ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చేస్తున్న ప్రయత్నాలు ఖండించదగ్గవి. 2023 అక్టోబవర్ 7వ తేదీన ఇస్లామిక్ గ్రూప్ హమాస్ దాడులతోనే గాజాకు ఈ పరిస్థితి వచ్చింది. అలాంటి సంస్థకు మద్దతుగా ఫ్రాన్స్ నిర్ణయం ఉంది. ఇది సిగ్గుచేటు అని రుబియో ట్వీట్ చేశారు.The United States strongly rejects @EmmanuelMacron’s plan to recognize a Palestinian state at the @UN general assembly. This reckless decision only serves Hamas propaganda and sets back peace. It is a slap in the face to the victims of October 7th.— Secretary Marco Rubio (@SecRubio) July 25, 2025మరోవైపు.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ పాలస్తీనాకు దేశం గుర్తింపు ఇవ్వడమంటే.. అది ఉగ్రవాదానికి బహుమతి ఇచ్చినట్లేనని అన్నారు. పైగా ఇది ఇజ్రాయెల్కు ముప్పు కలిగించే అంశమేనని అభిప్రాయపడ్డారాయన.ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 142 దేశాలు పాలస్తీనాకు దేశం గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నాయి. అయితే యూరప్ దేశం నుంచి ఈ డిమాండ్ చేస్తున్న పవర్ఫుల్ దేశంగా ఇప్పుడు ఫ్రాన్స్ ఈ జాబితాలో నిలిచింది.పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ దాడులతో గాజాలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. తీవ్ర మానవ సంక్షోభం తలెత్తడంపై ఇప్పటికే పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు దాడులు.. మరోవైపు సాయం అందకుండా ఈ పరిస్థితికి ఇజ్రాయెల్ కారణమైందన్న విమర్శ బలంగా వినిపిస్తోంది(ఫ్రాన్స్ కూడా ఇదే గళం వినిపిస్తోంది). అయితే ఇజ్రాయెల్ మాత్రం ఆ వాదనను తోసిపుచ్చుతోంది. ఈ తరుణంలో ఫ్రాన్స్ నిర్ణయం ఆసక్తికర పరిణామాలకు దారి తీసే అవకాశం లేకపోలేదు. -
సీఈవోతో సరసాల ఎపిసోడ్లో కీలక మలుపు
వాషింగ్టన్: ప్రముఖ మ్యూజిక్ కాన్సర్ట్ ‘కోల్డ్ ప్లే’ ఎపిసోడ్లో మరో కీలక మలుపు తిరిగింది. కంపెనీ మాజీ సీఈవో ఆండీ బైరాన్ను కౌగిలించుకున్నందుకు అమెరికా టెక్ సంస్థ ఆస్ట్రానమర్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ క్రిస్టిన్ కాబోట్ను సైతం సంస్థ బయటకు సాగనంపింది. సంస్థ పరువు తీశారంటూ ఆమెతో బలవంతంగా రాజీనామా చేయించింది. ఈ క్రమంలో హ్యూమన్ రిసోర్స్ చీఫ్ కాబోట్ ఇప్పుడు తమ కంపెనీలో లేరని, రాజీనామా చేశారంటూ ఆస్ట్రానమర్ ఓ ప్రకటనలో తెలిపింది. గత బుధవారం మాసెచూసెట్స్ స్టేట్ బోస్టన్లోని గిల్లెట్ స్టేడియంలో కోల్డ్ ప్లే కాన్సర్ట్ జరిగింది. ఆ కాన్సర్ట్లో ఆస్ట్రానమర్ సీఈవో ఆండీ బిరాన్,హెచ్ఆర్ హెడ్ క్రిస్టిన్ కాబోట్లు హాజరయ్యారు. అయితే,కాన్సర్ట్ జరిగే సమయంలో ఆండీ, క్రిస్టెన్ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. సరిగ్గా అదే సమయంలో వారిపై స్పాట్ లైట్ పడడం, ఆ దృశ్యం పెద్దస్క్రీన్లో కనిపించడంతో వారి ప్రేమాయణం బయటపడింది. సీఈవో వ్యవహారం ఆయన స్థాయికి తగ్గట్టుగా లేదని నెటిజన్లు చురకలు వేయగా... విడాకులు ఇవ్వనున్నట్లు ఆయన భార్య సంకేతాలిచ్చింది.సంస్థ ఆస్ట్రానమర్ ఆండీని పదవి నుంచి బలవంతంగా తొలగించింది. సీఈవో బాధ్యతల్ని మరొకరికి అప్పగించింది. అవమానం భారం తట్టుకోలేని ఆండీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో హెచ్ఆర్ హెడ్ క్రిస్టెన్ కబోట్ సైతం సంస్థకు రాజీనామా చేయడం టెక్ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. Andy Byron, CEO of Astronomer, was caught at a Coldplay concert apparently having an affair with the company’s CPO, Kristin Cabot.Both Byron and Cabot are married to other people.Most awkward moment of 2025?pic.twitter.com/bVOTq6XgF8— Paul A. Szypula 🇺🇸 (@Bubblebathgirl) July 17, 2025 -
దశాబ్దాల సరిహద్దు వైరం.. దేవాలయంపై దాడి.. పదవి కోల్పోయిన ప్రధాని..
కాంబోడియా: థాయ్ల్యాండ్, కంబోడియా సరిహద్దుల్లో ఘర్షణల కారణంగా ఇప్పటి వరకు 14 మంది పౌరులు మృతి చెందగా.. దాదాపు లక్ష మంది నిరాశ్రయులయ్యారు. ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియక.. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి.థాయ్ల్యాండ్, కంబోడియా దళాల మధ్య గురువారం ఘర్షణలు తీవ్రమయ్యాయి. రెండు దేశాల సైనికులు సరిహద్దుల్లో ఫైరింగ్ జరిపారు. ప్రాచీన ఆలయం టా మోన్ థామ్ వద్ద ఈ ఘటన జరిగింది. థాయ్ల్యాండ్లోని సురిన్ ప్రావిన్సులో ఈ ఆలయం ఉన్నది. బోర్డర్ ఫైరింగ్తో రెండు దేశాల్లో ఉద్రిక్తలు మళ్లీ మొదలయ్యాయి. తాజా ఘటనపై థాయిలాండ్ ఆరోగ్య మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. సురిన్ ప్రావిన్స్లో ఒక ప్రధాన ఆసుపత్రిపై షెల్లింగ్ దాడి జరిగిందని, ఈ దాడిని యుద్ధ నేరంగా పరిగణించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, గత కొన్ని రోజులుగా బోర్డర్ వద్ద ఇలాంటి పరిస్థితి ఉన్నది. అసలు ఈ సరిహద్దు వివాదంతోనే గతంలో థాయ్ ప్రధాని ఏకంగా పదవిని కోల్పోయారు.ల్యాండ్మైన్ల వివాదం..ఇటీవల కాలంలో ఇరుదేశాల మధ్య మందుపాతరల అంశం కీలకంగా మారింది. వివాదాస్పద ప్రదేశాల్లో ల్యాండ్మైన్లు పేలడంతో థాయ్ల్యాండ్ సైనికులు గాయపడ్డారు. జూలై 16వ తేదీన పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సైనికుడు.. ల్యాండ్మైన్ బ్లాస్ట్లో కాలు కోల్పోయినట్లు థాయ్ అధికారులు తెలిపారు. థాయ్ ఇది తమ ప్రదేశంలో జరిగిందని చెబుతుండగా.. కంబోడియా మాత్రం ప్రీహ్ విహార్ ఆలయ పరిసరాల్లో చోటు చేసుకొందని వాదిస్తోంది. వారం క్రితం కూడా వివాదాస్పద స్థలాల్లో ఇలాంటి ఘటనలే చోటు చేసుకొన్నాయి. పినోమ్ పెన్ సేనలు రష్యా నుంచి కొనుగోలు చేసిన మైన్లను ఇటీవలే ఇక్కడి భూమిలో పాతినట్లు బ్యాంకాక్ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను కంబోడియా ఖండించింది. థాయ్ సేనలే ఒప్పందంలోని గస్తీ మార్గాలను ఉల్లంఘిస్తున్నాయని చెబుతోంది. తాజాగా సరిహద్దు వివాదం ముదరడంతో థాయ్ వాయుసేనకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు రంగంలోకి దిగి ట మోన్ థోమ్ ఆలయ ప్రదేశంలో బాంబింగ్ చేశాయి. ఇక క్షేత్ర స్థాయిలో కంబోడియా సేనలు ప్రతి దాడులు చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి.Thailand-Cambodia border dispute: 100,000 Thai civilians evacuated amid second day of clashes#ไทยกัมพูชา #กองทัพบก #ไทยนี้รักสงบแต่ถึงรบไม่ขลาด #ชายแดนไทยกัมพูชา #MauroIcardi #cambodiaopnedfire #ปราสาทตาเมือนธม #Thailand #cambodiaopenedfirefirst pic.twitter.com/6DbtMbRHVZ— Buzz Buddy (@urs_099) July 25, 2025సరిహద్దు వివాదం ఇలా.. ఫ్రెంచ్ కాలంలో 1907లో రూపొందించిన సరిహద్దు మ్యాప్లు ఆధారంగా ఇరు దేశాల మధ్య 817 కి.మీల సరిహద్దు ఉంది. ఇరు దేశాలు శాంతియుతంగా కలిసి ఉంటున్నప్పటికీ.. సరిహద్దులు మాత్రం తరచూ ఘర్షణలతో రగులుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ ఆలయాలు ఉన్న ప్రీహ్ విహార్, ట మోన్ థోమ్, ట మ్యూన్ థోమ్ ఉన్న పర్వతాలు, అరణ్యాలు కలగలిసిన ప్రాంతాల కోసం ఈ పోరాటం జరుగుతోంది. డాంగ్రెక్ పర్వతాల శిఖరం థాయ్ల్యాండ్కు అత్యంత సమీపంలో ఉంటుంది. ఈ ఆలయం కంబోడియాకు చెందుతుందని 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దానిని థాయ్ల్యాండ్ అంగీకరించింది. కానీ, ఆ దేవాలయం కేంద్రంగా స్థానిక సెంటిమెంట్లు తరచూ వివాదాలకు కారణమవుతున్నాయి.Chilling footage shows Cambodia unleashing rockets into Thailand as violent clashes broke out along the countries' border — at least 12 are dead.Source -Fox News pic.twitter.com/8NkBx8DQr8— Chinasa Nworu (@ChinasaNworu) July 24, 2025కంబోడియా విజ్ఞప్తి మేరకు 2008లో ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. దీనిని థాయ్ల్యాండ్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇక, కొన్నేళ్ల ముందు ఐసీజే మరో తీర్పు ఇచ్చి అగ్గి రాజేసింది. ప్రీహ్ విహార్ పరిసరాల్లో కంబోడియా సార్వభౌమత్వం ఉందని.. థాయ్ దళాలు వైదొలగాలని కోరింది. దీనికి బ్యాంకాక్ అంగీకరించినా.. మ్యాప్లు, మిలిటరీ గస్తీలపై వివాదం మొదలైంది. ఇక తమ దేశ పరిధిలోని సురిన్ ప్రావిన్స్లోని ట మోన్ థోమ్, ట మ్యూన్ థోమ్ ప్రాంతాలు కూడ ఇరు దేశాల వివాదాస్పద ప్రదేశాలుగా మారిపోయాయి. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఘర్షణలో ఓ కంబోడియా సైనికుడు మృతి చెందాడు. పినోమ్ పెన్లో ఇది జాతీయవాద సెంటిమెంట్ను రగిల్చింది. Perdana Menteri Thailand Paetongtarn Shinawatra sedang menghadapi tekanan politik yang semakin besar untuk mundur.Gara-garanya, rekaman percakapan kontroversialnya dengan mantan Pemimpin Kamboja, Hun Sen, bocor ke publik dan menuai kecaman luas.~J #Thailand… pic.twitter.com/UgFIYC97iC— Kompas.com (@kompascom) June 20, 2025పదవి కోల్పోయిన ప్రధాని.. అధికారం చేపట్టిన పది నెలలకే థాయ్లాండ్ యువ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రాకు పదవీగండం ఈ వివాదం నుంచే వచ్చింది. కంబోడియా మాజీ ప్రధాని హున్సేన్తో ఫోన్కాల్లో మాట్లాడింది. అంకుల్ అంటూ ఆయనను సంబోధించిన ఆమె.. తన దేశంలోని పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా థాయ్ ఆర్మీ కమాండర్ తనకు వ్యతిరేకంగా ఉన్నాడని పేర్కొన్నారు. అయితే, వీరిద్దరి మధ్య జరిగిన ఈ ఫోన్కాల్ సంభాషణ లీకైంది. దీంతో సొంత పక్షం నుంచే ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని ఫోన్తో తమ దేశ పరువు, ఆర్మీ గౌరవం దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ షినవత్రా సంకీర్ణ ప్రభుత్వం నుంచి కన్జర్వేటివ్ భూమ్జాయ్థాయ్ పార్టీ విడిపోయింది. షినవత్రా పదవిని కోల్పోయారు. 🇹🇭🇰🇭 #ThaiArmy Mobilizes Overnight Amid Ongoing #BorderWar with #Cambodia#Thailand #Cambodia 🇰🇭Video circulating on shows Royal Thai Army soldiers mobilized overnight to reinforce defensive positions along the #ThaiCambodian border, as clashes stretch into Day 2 of the conflict pic.twitter.com/z2m4dHyJBD— Mahalaxmi Ramanathan (@MahalaxmiRaman) July 25, 2025 -
అంతా ఉత్తుత్తే.. మస్క్ మీద ప్రేమ ఒలకబోస్తున్న ట్రంప్
వాష్టింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. టెస్లా సీఈవో,అపర కుబేరుడు ఎలాన్ మస్క్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘నాకు మస్క్ కావాలి. మస్క్తో కలిసి పనిచేయాలని ఉంది. మస్క్ కంపెనీలకు అమెరికా ప్రభుత్వం ఇచ్చే భారీ సబ్సిడీలు తీసేస్తానని అందరూ అంటున్నారు. ఇది నిజం కాదు! నేను మస్క్ను, అలాగే అమెరికాలోని అన్ని వ్యాపారాలను అద్భుతంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను’అని ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. తాజా, ట్రంప్ ట్వీట్తో గత కొంతకాలంగా ట్రంప్-మస్క్ల మధ్య కొసాగుతున్న మాటల యుద్ధానికి పులిస్టాప్ పెట్టినట్లైంది. ఒకప్పుడు డొనాల్డ్ ట్రంప్- మస్క్లు స్నేహితులు. కానీ బిగ్ బ్యూటీఫుల్ బిల్లుతో మిత్రలు కాస్తా బద్ద శత్రువుల్లా మారారు. బిగ్ బ్యూటీఫుల్ బిల్లాంతా నాన్సెస్ అని మస్క్ అంటే.. మస్క్ కంపెనీలకు అమెరికా ప్రభుత్వం రాయితీలు ఇవ్వబోదని వార్నింగ్ ఇస్తూ కయ్యానికి కాలుదువ్వారు.అదిగో అప్పడే జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ ప్రయోమం అందంటూ మస్క్ వరుస ట్వీట్లు, అమెరికాలో ప్రస్తుతం ఉన్న రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ది అమెరికా పార్టీ పేరుతో కొత్త పార్టీ అంటూ హడావిడి చేశారు. ఉన్నట్లుండి ఏమైందో ఏమో మస్క్ సైలెంట్ అయ్యారు.ఈ క్రమంలో ట్రంప్ కూడా ఓ మెట్టుదిగొచ్చాడు. ట్రూత్ పోస్టులో ఎలాన్ మస్క్ కంపెనీలపై సబ్సిడీలు తొలగిస్తానన్న ఆరోపణలను ఖండించారు. మస్క్ కంపెనీలతో పాటు అమెరికాను అభివృద్ధి చేస్తానంటూ ట్వీట్లో చెప్పడంతో వ్యాపార వర్గాల్లోనే కాదు రాజకీయాల్లో సైతం ఆసక్తికరంగా మారింది. -
పత్రాలన్నీ వెంట ఉండాల్సిందే
వాషింగ్టన్: అసలు కంటే కొసరు పనే ముఖ్యమన్న తరహా లో అమెరికా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఎలాగూ వీసా నిబంధనలు, ఎయిర్పోర్ట్లో క్షుణ్ణంగా తనిఖీలు దాటుకొని అమెరికాలోకి అడుగుపెట్టినా దాదాపు ప్రతి ఒక్క అమెరికాయేతర వ్యక్తులంతా ఎక్కడ పడితే అక్కడ అధికారులు అడిగే అన్ని రకాల డాక్యుమెంట్లను చూపించాల్సిందేనని ట్రంప్ సర్కార్ హెచ్చరించింది. ఈ మేరకు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్స్(సీబీపీ) విభాగం హెచ్చరికలు జారీచేసింది. గ్రీన్కార్డ్ సాధించిన వ్యక్తులు సహా అమెరికా పౌరసత్వం పొందని వారంతా నిరంతరం తమ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను తమ వెంటేసుకుని తిరగాల్సిందేనని సీబీపీ పే ర్కొంది. అధికారులు అడిగినప్పుడు చూపించకపోతే జరిమానా ముప్పు తప్పదని, కొన్ని సార్లు అత్యల్పస్థాయి నేరాభియోగాలను సైతం ఎదుర్కో వాల్సిఉంటుందని సీబీపీ హెచ్చరించింది. 18 ఏళ్లు, ఆపైబడిన వారందరికీ ఇదే నియమం వర్తించనుంది. దీంతో విద్య, ఉద్యోగాల కోసం వచ్చే భారతీ యులు, వారి వెంట వచ్చే కుటుంబసభ్యులు, చిన్నారులకు కొత్త సమస్య వచ్చిపడింది. సినిమా, షాపింగ్, పార్క్, హోటల్, ఆస్పత్రి, రైల్వేస్టేషన్.. ఇలా ఎక్కడికి వెళ్లినా ముఖ్యమైన రిజిస్ట్రేషన్ పత్రా లు పట్టుకెళ్లడమంటే ఎంతో ఇబ్బందితో కూడిన వ్యవహారం. అక్రమంగా వలసవచ్చారని ఏ క్షణాన ఎవరిపై అనుమానం వచ్చినా వెంటనే అధికారులు సోదాలు, తనిఖీలుచేసేందుకు వీలుగా విదేశీయు లకు ఈ అడ్వైజరీని జారీచేసినట్లు సీబీపీ తెలిపింది. -
భగ్గుమన్న సరిహద్దు వివాదం
బ్యాంకాక్: థాయ్లాండ్–కాంబోడియాల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న సరిహద్దు వివాదం తీవ్రరూపం దాల్చింది. సరిహద్దు ప్రాంతాల్లో ఇరు దేశాల సైనికులు గురువారం ఉదయం తుపాకులు, ఫిరంగులు, రాకెట్లతో కాల్పులకు దిగారు. థాయ్లాండ్ వైమానిక దాడులను సైతం ప్రారంభించింది. ఈ ఘటనల్లో 12 మంది చనిపోయారు. వీరిలో 11 మంది పౌరులు కాగా, ఒక సైనికుడు ఉన్నారని థాయ్ తాత్కాలిక ప్రధాని ఫుంథమ్ వెచాయచై తెలిపారు. మరో నలుగురు సైనికులు 25 మంది వరకు పౌరులు గాయపడ్డారన్నారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్యను కాంబోడియా విడుదల చేయలేదు. ఘర్షణల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లోని పౌరులు భయంతో ఇళ్లను వదిలి పారిపోతున్నట్లు తెలిపే వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. సరిహద్దుల్లోని కనీసం ఆరు ప్రాంతాల్లో కాల్పులు కొనసాగుతున్నట్లు థాయ్ రక్షణ శాఖ తెలిపింది. ఏం జరిగిందంటే..ప్రాచీన ‘ట మ్యుయెన్ థోమ్’ఆలయం సమీపంలోనే గురువారం ఉదయం ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ మొదటగా మొదలైంది. ఘర్షణకు కారణం మీరంటే మీరేనని ఎవరికి వారు ఆరోపణలు సంధించుకుంటున్నారు. సరిహద్దుల్లోని తమ సైనిక స్థావరాలకు సమీపంలో డ్రోన్ కనిపించగా కొద్దిసేపటికే ఆరుగురు కాంబోడియా సైనికులు దూసుకొచ్చారని, ఘర్షణను నివారించేందుకు ప్రయత్నిస్తుండగానే వారు కాల్పులకు దిగారని థాయ్ ఆర్మీ తెలిపింది. ఆస్పత్రిపైనా కాంబోడియా దాడులు చేసిందని ఆరోపించింది. అందుకే, తాము సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు చేపట్టినట్లు అనంతరం ప్రకటించింది. తమ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తే ఆత్మ రక్షణ చర్యలను తీవ్రతరం చేస్తామని థాయ్ ప్రభుత్వం హెచ్చరించింది. అయితే, థాయ్ సైన్యం తమ ప్రాంతంలోకి ముందుగా డ్రోన్ను పంపించిందని, ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని కాంబోడియా ఆర్మీ పేర్కొంది. పురాతన ప్రియా విహియార్ ఆలయంలోని రహదారిపై థాయ్ జెట్ విమానాలు బాంబులు విసిరాయని ఆరోపించింది. థాయ్ దురాక్రమణను వెంటనే నిలిపివేసేందుకు భద్రతా మండలిని సమావేశపర్చాలని కాంబోడియా ప్రధాని హున్ మనెత్ ఐరాసకు తాజాగా లేఖ రాశారు.పేలిన మందుపాతరబుధవారం వివాదాస్పద సరిహద్దు ప్రాంతంలో మందుపాతర పేలి థాయ్లాండ్ సైనికుడొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో థాయ్ ప్రభుత్వం కాంబోడియా రాయబారిని బహిష్కరించడంతోపాటు ఆ దేశంలోని తమ రాయబారిని వెనక్కి పిలిపించుకుంది. కాంబోడియాతో గల ఈశాన్య సరిహద్దు క్రాసింగ్లన్నిటినీ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. తమ పౌరులను కాంబోడియా వీడాలని కోరింది. ప్రతిగా కాంబోడియా సైతం థాయ్తో దౌత్య సంబంధాలను కనీస స్థాయికి తగ్గించుకుంటున్నట్లు తెలిపింది. బ్యాంకాక్లోని తమ దౌత్య సిబ్బంది మొత్తాన్ని వెనక్కి పిలిపించుకుంది. థాయ్లాండ్ దౌత్య సిబ్బంది మొత్తం తమ దేశం విడిచివెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. తమ ఉబోన్ రట్చంథని ప్రావిన్స్లో బుధవారం మందుపాతర పేలి ఐదుగురు గాయపడినట్లు థాయ్లాండ్ ప్రభుత్వం తెలపగా తమ ప్రియా విహియార్ ప్రాంతంలో ఈ పేలుడు చోటుచేసుకుందని కాంబోడియా అంటోంది.వెయ్యేళ్ల ఆలయమే కేంద్రంగాభారతదేశాన్ని పాలించిన గుప్తులు, పల్లవ చక్రవర్తుల ప్రాబల్యం అప్పట్లో థాయ్లాండ్, కాంబోడియాల దాకా విస్తరించింది. పల్లవుల కాలంలో 11వ శతాబ్దంలో ఖ్మెర్ రాజులు నిర్మించిన మూడు హిందూ ఆలయాలున్నాయి. ఈ ఆలయా ల్లో శివలింగం, సంస్కృత లిపిలో శాసనాలు, హిందూ దేవతల చిత్రాలు ఉన్నాయి. ఇక్కడి ప్రసత్తా మ్యుయెన్ థోమ్ అనే శివాల యా న్ని 11వ శతాబ్దంలో ఉదయాదిత్యవర్మన్–2 అనే రాజు నిర్మించాడు. దాంగ్రెక్ పర్వతాల్లో పురాతన ఖ్మెర్ హైవేను కాంబోడి యాలోని అంగ్కోర్ను థాయ్లాండ్లోని ఫిమయితో కలిపే మార్గంలో ఈ ఆలయం ఉంది. దీని ప్రకారం ఖ్మెర్ సామాజ్య సరిహద్దులపై తమకే హక్కుందని కాంబోడియా అంటుండగా, థాయ్లాండ్ అంగీకరించట్లేదు. శిథిలావస్థకు చేరిన ఈ ఆలయాలు రెండు దేశాల మధ్య వివాదంతో మరోసారి తెరపైకి వచ్చాయి. ఫ్రాన్స్ ఇచ్చిన మ్యాప్తో వివాదంథాయ్లాండ్లోని సురిన్ ప్రావిన్స్, కాంబోడియా లోని ఒద్దార్ మియాంచే ప్రావిన్స్ల పొడవునా ఉన్న వెయ్యేళ్లనాటి ప్రాచీన శివాలయం ‘టమ్యుయెన్ థోమ్’ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. థాయ్లాండ్, కాంబోడియాలు గతంలో ఫ్రాన్స్ వలస పాలనలో ఉన్నాయి. ఆ సమయంలో 1907లో రెండు దేశాల సరిహద్దులను విభజిస్తూ ఫ్రాన్స్ ఒక మ్యాప్ను రూపొందించింది. ఈ మ్యాప్లో పేర్కొన్న భూ భాగం తమదేనని కాంబోడియా అంటుండగా, థాయ్లాండ్ అది అస్పష్టంగా ఉందని వాదిస్తోంది. దీనిపై కాంబోడియా అంతర్జాతీయ న్యాయ స్థానానికి వెళ్లగా 1962లో అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో అప్పటి నుంచీ తరచూ చోటుచేసుకుంటున్న సైనిక ఘర్షణల్లో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కాంబోడియా 2011లో మరోసారి అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విచారించిన న్యాయస్థానం 2013లో మరోసారి కాంబోడియాకే ఆ దేవాలయ ప్రాంతంపై హక్కుందంటూ మరోసారి ప్రకటించింది. థాయ్లాండ్ మాత్రం ఈ తీర్పును అంగీకరించడంలేదు. -
ఇక స్వేచ్ఛా వాణిజ్యం
లండన్: భారత్, బ్రిటన్ సంబంధాల్లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ)పై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. పరస్పర ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెండు రెట్లు పెంచుకోవాలని వ్యూహాత్మక భాగస్వామ్యపక్షాలైన భారత్, యూకే నిర్ణయించుకున్నాయి. అమెరికా వాణిజ్య విధానాల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని తీర్మానించాయి. భారత ప్రధాని మోదీ గురువారం లండన్లో యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ‘యూకే–ఇండియా విజన్ 2035’ రోడ్మ్యాప్ను ఆవిష్కరించారు. అధికారికంగా సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ)గా పిలుస్తున్న డీల్పై మోదీ, కీర్ స్టార్మర్ సమక్షంలో భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, బ్రిటిష్ వాణిజ్య మంత్రి జోనాథన్ రేనాల్డ్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం వల్ల భారత్, యూకే మధ్య వాణిజ్యం ఏటా 34 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తు న్నారు. ఎఫ్టీఏపై సంతకాలు జరగడం పట్ల మోదీ హర్షం వ్యక్తంచేశారు. భారత్, యూకే సంబంధాల్లో ఇదొక చరిత్రాత్మక దినమని అభివరి్ణంచారు. ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ తర్వాత ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయినట్లు తెలిపారు. కీర్ స్టార్మర్ స్పందిస్తూ.. యూరోపియన్ యూనియన్(ఈయూ) తా ము బయటకు వచి్చన అనంతరం కుదుర్చుకున్న అతిపెద్ద ఒప్పందం ఇదేనని స్పష్టంచేశారు. ఉగ్రవాదంపై పోరులో ఐక్యంగానే.. కీర్ స్టార్మర్తో చర్చల అనంతరం ప్రధాని మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండించినందుకు యూకే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉగ్రవాదంపై పోరులో భారత్, యూకే ఐక్యంగా పనిచేస్తున్నాయని చెప్పా రు. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావులేదన్నారు. భారత్కు ఎనలేని మేలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో భారత్కు ఎనలేని మేలు జరుగుతుందని ప్రధానమంత్రి వెల్లడించారు. భారత వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార పరిశ్రమకు బ్రిటిష్ మార్కెట్లో నూతన అవకాశాలు లభిస్తాయన్నారు. భారతీయ యువత, రైతులు, మత్స్యకారులతోపాటు సూక్ష్మ, చిన్న, మ ధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈ) లబ్ధి చేకూరుతుందని స్పష్టంచేశారు. భారతీయ వ్రస్తాలు, పాదరక్షలు, వజ్రాలు, బంగారు ఆభరణాలు, సముద్ర ఆహారం, ఇంజనీరింగ్ వస్తువులకు యూకే మార్కెట్లోకి ప్రవేశం లభిస్తుందన్నారు. ‘విజన్–2030’ రోడ్మ్యాప్పై ఇండియా, యూకే అంకితభావంతో ముందుకెళ్తున్నాయని ఉద్ఘాటించారు.మోదీకి స్టార్మర్ విందు యూకే పర్యటన కోసం బుధవారం రాత్రి లండన్ చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. భారీ సంఖ్యలో తరలివచి్చన ప్రవాస భారతీయులు ఆయనకు స్వాగతం పలికారు. లండన్కు 50 కిలోమీటర్ల దూరంలోని తన నివాసంలో గురువారం మోదీకి బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. భారత్, యూకే కలిసికట్టుగా పనిచేస్తాయని స్టార్మర్ అన్నారు. రెండు దేశాలు సహజ భాగస్వామ్య పక్షాలు అని మోదీ చెప్పారు. చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించుకుంటున్నాయని తెలిపారు. డబుల్ కంట్రిబ్యూషన్స్ కన్వెన్షన్(డీసీసీ)పై ఏకాభిప్రాయానికి వచ్చామని వెల్లడించారు. రెండు దేశాల్లో టెక్నాలజీ, ఫైనాన్స్తోపాటు సేవల రంగానికి మేలు జరుగుతుందన్నారు. సులభతర వాణిజ్యానికి ప్రోత్సాహం లభిస్తుందన్నారు. భారత్–యూకే సంబంధాలపై మోదీ క్రికెట్ పరిభాషలో వివరణ ఇచ్చారు. కొన్నిసార్లు స్వింగ్ అండ్ మిస్ ఉండొచ్చని, అయినప్పటికీ ఎప్పటికీ స్ట్రెయిట్ బ్యాట్తో ఆడుతూనే ఉంటామన్నారు. హైస్కోరింగ్తోపాటు బలమైన భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నాయని స్పష్టంచేశారు. మోదీ, స్టార్మర్ ‘బకింగ్హమ్ స్ట్రీట్ క్రికెట్ క్లబ్’ క్రీడాకారులతో సంభాíÙంచారు. ఒప్పందంతో లాభమేంటి? వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడంతోపాటు పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా భారత్, యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. మూడేళ్ల చర్చల తర్వాత ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఇది అమల్లోకి వస్తే జరిగేది ఏమిటంటే.. → బ్రిటిష్ ఉత్పత్తులపై ఇండియాలో సగటు సుంకాలు 15 శాతం నుంచి 3 శాతానికి తగ్గిపోతాయి. → బ్రిటన్ నుంచి విస్కీ, చాక్లెట్లు, సాఫ్ట్ డ్రింకులు, కాస్మెటిక్స్, కార్లు, వైద్య పరికరాలు భారత మార్కెట్లోకి విస్తృతంగా ప్రవేశిస్తాయి. → బ్రిటిష్ విస్కీపై ప్రస్తుతం విధిస్తున్న 150 శాతం సుంకాన్ని భారత ప్రభుత్వం 75 శాతానికి తగ్గిస్తుంది. రాబోయే పదేళ్లలో 40 శాతానికి తగిస్తుంది. అంటే బ్రిటిష్ విస్కీ ఇండియాలో చౌకగా లభిస్తుంది. → భారత్ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులు, వస్తువులపై సుంకాలను యూకే సర్కార్ సగానికి తగ్గిస్తుంది. వ్రస్తాలు, పాదరక్షలు, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గిపోతాయి. → ప్రధానంగా భారతీయ రైతులకు భారీ లబ్ధి చేకూరుతుంది. వ్యవసాయ ఉత్పత్తులపై యూకేలో టారిఫ్లు దాదాపు 95 శాతం తగ్గుతాయి. జర్మనీ, నెదర్లాండ్స్తోపాటు ఈయూ రైతులతో సమానంగా, కొన్నిసార్లు అంతకంటే ఎక్కువే భారతీయ రైతులు లాభపడతారు. ఇండియా నుంచి దిగుమతి అయ్యే తేయాకు, పండ్లు, కూరగాయలు, మసాలా పొడులు, తృణధాన్యాలు, పచ్చళ్లు, రెడీ–టు–ఈట్ ఆహారం, పండ్ల గుజ్జుతోపాటు శుద్ధి చేసిన ఆహారంపై టారిఫ్లు సున్నాకు పడిపోతాయి. → మత్స్య, సముద్ర ఉత్పత్తులపై సుంకాలను 99 శాతం తగ్గించబోతున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడులో చేపలు, రొయ్యల పెంపకం చేస్తున్న రైతులకు లాభమే. → ఇండియా నుంచి యూకేకు దిగుమతి అయ్యే స్మార్ట్ఫోన్లు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్, ఇన్వర్టర్లపై ఎలాంటి టారిఫ్ ఉండదు. → దేశీయ మద్యం ఉత్పత్తులు, పానీయాలు యూకే మార్కెట్లోకి ప్రవేశించబోతున్నాయి. సంప్రదాయ గోవా ఫెనీ, నాసిక్ వైన్స్, కేరళ కల్లు ఇందులో ఉన్నాయి. → ఎఫ్టీఏతో రానున్న మూడేళ్లలో ఇండియా నుంచి యూకేకు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 20 శాతానికి పైగా పెరుగుతాయని అంచనా. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. → దేశీయ రైతులు, పరిశ్రమలను దృష్టిలో పెట్టుకొని పాడి ఉత్పత్తులు, వంట నూనెలు, యాపిల్స్ను ఎఫ్టీఏ నుంచి భారత ప్రభుత్వం మినహాయించింది. బ్రిటన్ నుంచి వచ్చే ఈ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు ఉండబోదు. మీరు ఆంగ్ల పదాలు వాడొచ్చు ఎఫ్టీఏపై సంతకాల తర్వాత మోదీ, స్టార్మర్ ఉమ్మడిగా మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్టార్మర్ స్పీచ్ను హిందీలోకి అనువాదం చేస్తున్న దుబాసీ కొంత ఇబ్బందిపడ్డారు. ఆయనకు అప్పటికప్పుడు సరైన హిందీ పదాలు తగల్లేదు. అది గమనించిన మోదీ ‘‘ఇబ్బంది పడాల్సిన పనిలేదు. మీరు మధ్యలో ఆంగ్ల పదాలు వాడొచ్చు. దాని గురించి చింతించకండి’’ అని సూచించారు. దుబాసీ క్షమాపణ కోరగా, ఫర్వాలేదని మోదీ అన్నారు. ఇదంతా చూసిన స్టార్మర్ చిరునవ్వు చిందించారు. -
బ్రిటన్ కింగ్ ఛార్లెస్ను కలిసిన మోదీ
లండన్: బ్రిటన్లో పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అక్కడ బ్రిటన్ రాజు ఛార్లెస్ను కలిశారు. గురువారం రాజు అధికారిక నివాసాల్లో ఒకటైన నోర్ఫోక్ ప్రాంతంలోని సాండ్రింగ్హామ్ హౌస్కు విచ్చేసిన మోదీని ఛార్లెస్ సాదరంగా ఆహ్వానించారు. ఇద్దరూ కొద్దిసేపు పలు అంశాలపై మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఛార్లెస్కు మోదీ తెల్లని పూరెమ్మలు ఉండే సోనోమా డేవిడియా ఇన్వాలుక్రాటా అనే వింతైన మొక్కను బహూకరించారు. ఈ చెట్టుకు పూసే పూలను దూరం నుంచి చూస్తే గాల్లో ఎగిరే తెల్లపావురాల్లా కనిపిస్తాయి. శ్వేతవర్ణ పూరెమ్మలు ఉండటంతో దీనిని హ్యాండ్కర్చీఫ్ చెట్టు అని కూడా అంటారు. అమ్మ పేరిట ఒక చెట్టు కార్యక్రమంలో భాగంగా ఛార్లెస్కు మోదీ ఈ మొక్కను బహుమతిగా అందించారు. తల్లిని గుర్తుచేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం తెల్సిందే. సాధారణంగా డేవిడియా మొక్క నాటిన 20 ఏళ్ల తర్వాతే పూలు పూస్తుంది. కానీ సోనోమా రకం సంకరజాతి మొక్క కేవలం రెండు, మూడేళ్లలోనే విరగబూస్తుంది. -
వనాలకు ఆకాశ శరాలు
వాషింగ్టన్: వెచ్చని సూర్యకిరణాలు పుడమి తల్లిని ముద్దాడకుండా అడ్డుకుంటూ దట్టంగా, ఏపుగా పెరిగిన వృక్షాలను చూసి వరుణదేవునికి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుదో లేదో తెలీదుగానీ వర్షం వంటి సందర్భాల్లో భూమిపైకి దూసుకొచ్చే మెరుపులు, పిడుగుల కారణంగా కోట్లాది వృక్షాలను కాలిబూడిద అవుతున్నాయి. పిడుగులు పడడంతో ఉద్భవించే అతి ఉష్ణానికి ప్రతి ఏటా అక్షరాలా 35 కోట్ల చెట్లు నిట్టనిలువునా కాలిపోతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. పుడమిపై పచ్చదనం క్షీణించడానికి పిడుగులు కూడా ప్రబల హేతువుగా మారాయన్న కొత్త విషయాన్ని అధ్యయనకారులు వెల్లడించారు. మ్యూనిచ్ టెక్నికల్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ మేరకు విస్తృతస్థాయిలో పరిశోధన చేశారు. పిడుగులు పడటంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది చెట్లు కాలిపోతున్నాయని, దీంతో పచ్చదనం తగ్గిపోతోందని అధ్యయనంలో స్పష్టమైంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన అడవుల్లో వృక్షాల క్షీణతకు సంబంధించిన సమాచారాన్ని ఆధునిక గణన పద్ధతులతో విశ్లేషించి ఈ విషయాన్ని దృవీకరించుకున్నారు. అయితే వాస్తవంగా చూస్తే ఏటా ఇంతకంటే ఎక్కువ సంఖ్యలోనే వృక్షాలు పిడుగులకు బలికావొచ్చని అధ్యయనకారులు అంచనావేశారు. ‘‘ప్రతి సంవత్సరం పడుతున్న పిడుగుల కారణంగా ఎన్ని చెట్లు కాలిపోతున్నాయి అనేది అంశంతోపాటే ఏఏ దేశాల్లో పిడుగుల ఘటనలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి? వాటి కారణంగా తగ్గిన పచ్చదనంతో అక్కడ మారిన వాతావరణ పరిస్థితుల వివరాలనూ సేకరిస్తున్నాం’’అని అధ్యయనంలో ముఖ్య రచయిత ఆండ్రీస్ క్రాస్ చెప్పారు. భారీ స్థాయిలో నష్టం 32 కోట్ల చెట్లు అంటే చిన్న విషయం కాదు. ఏకంగా ప్రపంచ వృక్ష సంపదలో 2.1 శాతం నుంచి 2.9 శాతానికి సరిపడా వృక్షాలు అంతరించిపోతున్నట్లే లెక్క. ఈ లెక్కన పుడమిపై పచ్చదనం గాఢత సైతం తగ్గుతోంది. ఇంతటి భారీ సంఖ్యలో చెట్లు లేకపోవడం కారణంగా ఈ చెట్లుఉంటే పీల్చుకునే కార్భన్డయాక్సైడ్ అలాగే వాతావరణంలోనే పోగుబడుతోంది. ఇలా ఏటా ఏకంగా 77 కోట్ల నుంచి 109 కోట్ల టన్నుల కార్భన్డయాక్సైడ్ వాతావరణంలోనే ఉండిపోతోంది. ఇది భూతాపోన్నతికి ప్రత్యక్షంగా కారణమవుతోందని అధ్యయనకారులు ఆందోళన వ్యక్తంచేశారు. పిడుగులు పరోక్షంగా 109 కోట్ల టన్నుల సీఓ2 వాతావరణంలో పేరుకుపోవడానికి కారణమైతే.. కార్చిచ్చు, అడవి దగ్ధం వంటి ఘటనల కారణంగా వృక్షసంపద కాలిపోయి తద్వారా దాదాపు అదే స్థాయిలో 126 కోట్ల టన్నుల కార్భన్డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదల అవుతోంది.మరింతగా పిడుగుల వర్షం! రాబోయే రోజుల్లో పిడుగులు పడే దృగి్వషయాలు మరింతగా సర్వసాధారణం కానున్నాయని అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం ఉష్ణమండల అరణ్యాల్లో పిడుగులు ఎక్కువగా పడుతున్నాయి. దీంతో భారీసంఖ్యలో చెట్లు నాశనమవుతున్నాయి. రాబోయే రోజుల్లో సముద్రమట్టంతో పోలిస్తే మధ్యస్థాయి, కాస్తంత ఎక్కువ ఎత్తులో ఉండే దేశాల్లోనూ పిడుగుల బెడద ఎక్కువ కానుందని అధ్యయనకారులు చెప్పారు. సమశీతోష్ణ మండలాలు, యూరప్ దేశాల్లో పిడుగులు ఎక్కువగా పడే అవకాశముంది. దీంతో అటవీ ఆవరణ వ్యవస్థ, అక్కడి కార్భన్డయాక్సైడ్ స్థాయిలపై దుష్ప్రభావం పెరగనుంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాలు తమ పరిధిలోని అడవుల సంరక్షణపై మరింతగా దృష్టిసారించాలని అధ్యయనకారులు సూచించారు. -
WWF దిగ్గజం హల్క్ హోగన్ కన్నుమూత
దిగ్గజ రెజ్లర్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (ప్రస్తుతం డబ్ల్యూడబ్ల్యూఈ) సూపర్ స్టార్ హల్క్ హోగన్ (Hulk Hogan) (71) ఇవాళ (జులై 24) ఉదయం కన్నుమూసినట్లు తెలుస్తుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో గల తన నివాసంలో హోగన్ తుది శ్వాస విడిచారని సమాచారం. కార్డియాక్ అరెస్ట్ కారణంగా హోగన్ మృతి చెందినట్లు తెలుస్తుంది.1953 ఆగస్ట్ 11న జన్మించిన హోగన్ అసలు పేరు టెర్రి జీనీ బోల్లియా. 80వ దశకంలో హోగన్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (WWF) ద్వారా విశేష ప్రజాదరణ పొందారు. హోగన్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ రెజిల్ మానియాలోని తొలి తొమ్మిది ఎడిషన్లలో ఎనిమిది టైటిళ్లు సాధించాడు.హోగన్కు డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమర్లలో కూడా చోటు దక్కింది. 1984లో హోగన్ తన తొలి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్నాడు. హోగన్ తన కెరీర్ ఉన్నతిలో ఆండ్రీ ద జెయింట్, మాఛో మ్యాన్ రాండీ సావేజ్, అల్టిమేట్ వారియర్ లాంటి దిగ్గజ రెజర్లతో కుస్తీ పడ్డాడు. హోగన్కు అతని మీసాలు చాలా ప్రత్యేకతనిచ్చాయి.హోగన్ రెజ్లింగ్ కాకుండా సినిమాలు, టీవీ రియాలిటీ షోల్లో కూడా నటించాడు. హోగన్ గడిచిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తరఫున ప్రచారం చేశాడు. హోగన్కు భారత్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. 80వ దశకంలో పిల్లలకు హోగన్ సుపరిచితుడు. -
ట్రంప్ ఎఫెక్ట్ : కేన్ షుగర్ కోకా కోలా కమింగ్ సూన్
కోకా-కోలా తన ట్రేడ్మార్క్ కోకా-కోలా లైనప్ను విస్తరింపజేస్తూ అమెరికా మార్కెట్ కోసం అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్కు బదులుగా చెరకు చక్కెరతో తయారు చేసిన కేన్ షుగర్ కోకా కోలా సాఫ్ట్ డ్రింక్ను లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది. కంపెనీ రెండవ త్రైమాసిక ఆదాయాలప్రకటన సందర్బంగా ఈ విషయాన్ని ప్రకటించింది. డైట్ కోక్ అభిమానిగా పేరుగాంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తర్వాత కోకా-కోలా అమెరికాలో కేన్ షుగర్ కోక్ను ప్రారంభించినట్లు ధృవీకరించింది.గత వారం అధ్యక్షుడు ట్రంప్ అమెరికాలో నిజమైన చెరకు చక్కెరతో చేసిన కోక్కోసం కోకా-కోలాను ఒప్పించానని పేర్కొంటూ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. జూలై 16న ట్రూత్ సోషల్లో పోస్ట్ చేసిన పోస్ట్లో తాను దీనిపై తాను కోకా-కోలాతో మాట్లాడుతున్నానని, వారు అలా చేయడానికి అంగీకరించారని" తెలిపారు.మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలకు అమెరికా మొక్కజొన్న పరిశ్రమనుంచి సహా మిశ్రమ స్పందనలు వచ్చాయి.అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ను చెరకు చక్కెరతో భర్తీ చేయడం సమంజసం కాదు. అధ్యక్షుడు ట్రంప్ అమెరికన్ తయారీ ఉద్యోగాలు, అమెరికన్ రైతులు , వాణిజ్య లోటును తగ్గించడంకోసమే ఉన్నారంటూ కార్న్ రిఫైనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు , CEO జాన్ బోడే విమర్శించారు. అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ను చెరకు చక్కెరతో భర్తీ చేయడం వల్ల వేలాది అమెరికన్ ఆహార తయారీ ఉద్యోగాలు తగ్గిపోతాయి. వ్యవసాయ ఆదాయం తగ్గుతుంది ,విదేశీ చక్కెర దిగుమతులు పెరుగుతాయన్నారు.ఇదీ చదవండి: 10 నెలల పాపను ఛాతీపై పట్టుకోబెట్టుకునే తండ్రికి వింత అనుభవంకాగా కోకా-కోలా మొదట తన అన్ని పానీయాలలో చెరకు చక్కెరను ఉపయోగించేది. కానీ 1984లో చక్కెర ధరలు పెరగడంతో అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్కు మారిందని ఫార్చ్యూన్ తెలిపింది. సాధారణంగా "మెక్సికన్ కోక్" అని పిలువబడే చెరకు చక్కెర కోకా-కోలా, మెక్సికో నుండి దిగుమతుల ద్వారా అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే అందుబాటులో ఉంది, అక్కడ దీనిని గాజులో బాటిల్ చేసి సాంప్రదాయ తీపి పద్ధతులను ఉపయోగించి తయారు చేస్తారు.చదవండి: ఏనుగులంటే ప్రాణం : కానీ మల్టీ మిలియనీర్ని ఏనుగే తొక్కేసింది! -
భారతీయులకు ఉద్యోగాలు ఆపండి
న్యూయార్క్/వాషింగ్టన్: విపరీతమైన వీసా ఆంక్షలు అమలుచేస్తూ, సోషల్మీడియా ఖాతాలను జల్లెడపడుతూ వీలైనంతవరకు భారతీయులను అమెరికా గడ్డపై కాలుమోపకుండా అడ్డు తగులుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు నేరుగా అక్కడి కంపెనీలకే ఆదేశాలు ఇచ్చేందుకు తెగించారు. చట్టబద్ధంగా, అత్యంత నైపుణ్యముండి వీసాలతో అమెరికాకొస్తున్న భారతీయులను కాదని, అమెరికన్లకే కొలువుల్లో పట్టంకట్టాలని ట్రంప్ అక్కడి టెక్ దిగ్గజ సంస్థలకు హితవు పలికారు. బుధవారం వాషింగ్టన్లో జరిగిన ఏఐ సదస్సులో ట్రంప్ పాల్గొని ప్రసంగించారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలనుద్దేశిస్తూ సూటిగా సూచనలు ఇచ్చారు. ‘‘ వేర్పాటు వాదంలాంటి ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్) భావాజలంలో మన అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలు కొట్టుకుపోతున్నాయి. గ్లోబలైజేషన్ కోసం పరితపిస్తున్నాయి. ఈ క్రమంలో కంపెనీలన్నీ కోట్లాది మంది అమెరికన్ల విశ్వాసాన్ని కోల్పోయి కృతçఘ్నులుగా తయారవుతున్నాయి. మీరు తోటి అమెరికన్ల పట్ల తీవ్ర నిర్లక్ష ధోరణిని కనబరుస్తున్నారు. అమెరికాలో లభించిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ ఇక్కడి కంపెనీలు చైనాలో భారీ ఫ్యాక్టరీలు నిర్మిస్తున్నాయి. భారత్ నుంచి తక్కువ జీతభత్యాలకు ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఐర్లాండ్లో నష్టాలు వస్తున్నాయన్న సాకుతో ఇక్కడ లాభాలను తక్కువచేసి చూపిస్తూ పన్నుల భారాన్ని తగ్గించుకుంటున్నాయి. ఇవన్నీ చేస్తూ మీ తోటి అమెరికన్పౌరుల ఉద్యోగ హక్కులను కాలరాస్తున్నారు. ఇక నా హయాంలో మీ ఆటలు సాగవు. అమెరికా టెక్నాలజీ సంస్థలన్నీ మన దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేయాలి. ఫ్యాక్టరీల కల్ప నలో, ఉద్యోగాల్లో అమెరికన్లకే తొలి ప్రాధాన్యం దక్కాలి. ఇకనైనా భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వడం ఆపండి. అమెరికన్లకు ఉపాధి కల్పించండి. మిమ్మల్ని నేను అడిగేది ఇదొక్కటే. ఈ పని మీరు ఖచ్చితంగా చేస్తారనే భావిస్తున్నా’’ అని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.#WATCH | Trump promises to bring tech jobs back home, slamming US firms for outsourcing to China and hiring Indian workers abroad.#DonaldTrump #UnitedStates #China #India pic.twitter.com/p2KLKkDqj9— News18 (@CNNnews18) July 24, 2025 ట్రంప్ వ్యాఖ్యలు.. భారతదేశంపై ప్రభావంట్రంప్ వ్యాఖ్యలు అమెరికా-భారత టెక్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.ఇండియన్ IT ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ రంగం పై ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉంది.“No more Indian workers” అని ట్రంప్ స్పష్టంగా హెచ్చరించారు.Apple, Google, Tesla వంటి కంపెనీలు భారతదేశం లో ఉద్యోగాలు ఇవ్వడం పై 25% టారిఫ్ విధించవచ్చని హెచ్చరిక జారీ చేశారు. -
ఆఖరి నిమిషంలో కూలిన విమానం
మాస్కో: ల్యాండింగ్ విఫలంకావడంతో మళ్లీ గాల్లోకి లేచి మరోసారి ల్యాండింగ్ కోసం గాల్లో చక్కర్లు కొడుతున్న 50 ఏళ్ల పాత రష్యా విమానం ఒకటి అనూహ్యంగా కొండప్రాంతంలో కూలిపోయింది. రష్యాలోని చైనా సరిహద్దుల్లోని మారుమూల అమూర్ రీజియన్లోని టిండా పట్టణ సమీపంలో ఈ ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కుప్పకూలిన విమానం నుంచి చెలరేగిన మంటల్లో విమానంలోని వారంతా అగ్నికి ఆహుతయ్యారు. మొత్తం 48 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నారులు సైతం ఉన్నారు. టిండా విమానాశ్రయానికి 15 కిలోమీటర్ల దూరంలో గురువారం ఉదయం ఈ ఘోర ప్రమాదం జరిగింది. రష్యా శివారు అమూర్ రీజియన్ గవర్నర్ వాసిలీ ఓర్లోవ్ తెలిపిన వివరాల ప్రకారం.. సోవియట్ కాలంనాటి అంగారా ఎయిర్లైన్స్ ఆంటోనోవ్ ఏఎన్24 విమానం ఖబరోవ్సŠక్ నుంచి బ్లాగోవెచెన్సక్ సిటీకి బయల్దేరింది. షెడ్యూల్ ప్రకారం మార్గమధ్యంలో టిండా పట్టణంలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే ల్యాండింగ్కు ప్రయత్నించగా అది సాధ్యంకాలేదు. దీంతో మళ్లీ గాల్లోకి లేచి మరోసారి ల్యాండింగ్ కోసం ఆకాశంలో అలా చుట్టూ తిరిగి వస్తోంది. ఈ క్రమంలో ఎయిర్పోర్ట్కు 15 కిలోమీటర్ల దూరంలో అటవీప్రాంతంపై ఎగురుతుండగా హఠాత్తుగా రాడార్ల నుంచి అదృశ్యమైంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రం నుంచి ఈ విమానానికి సంబంధాలు తెగిపోయాయి. వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి ఎంఐ–8 హెలికాప్టర్తో గాలింపు చేపట్టగా సమీప కొండప్రాంతంలో విమానం శకలాలు కనిపించాయి. ప్రమాదానికి అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. అసాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా విమానం అదుపుతప్పి నేలరాలి ఉంటుందని స్థానిక ఇంటర్ఫ్యాక్స్ న్యూస్ఏజెన్సీలో కథనాలు వెలువడ్డాయి.🚨 JUST IN: Aerial footage shows the wreckage of the crashed An-24 in Russia’s Amur Region.Civil Defense confirms: no survivors found.The plane was carrying nearly 50 people.🎥👇 #Russia #PlaneCrash #An24 #Breaking pic.twitter.com/LyXWnBmRa9— Depin Bhat (@DepinBhat) July 24, 2025#BREAKING: Russian plane missing with about 50 people on board.the plane, operated by the Angara airline, was headed for the town of Tynda in the Amur region bordering China.#Russia #PlaneMIssing #AngaraAirline #An24 #China #RussianPlane #aviation #aviationnews pic.twitter.com/RQVKxlfKOM— upuknews (@upuknews1) July 24, 2025 దుర్ఘటనలు:2011: Flight 9007 – ఇన్-ఫ్లైట్ ఇంజిన్ ఫైర్ వల్ల ఒబీ నదిలో విమానం కూలి ఏడుగురు చనిపోయారు2019: Flight 200 – టేకాఫ్ తర్వాత ఇంజిన్ ఫెయిల్యూర్ జరిగి ఓ బిల్డింగ్ను ఢీకొని అగ్నిప్రమాదం సంభవించింది. ఇద్దరు సిబ్బంది ఈ ఘటనలో చనిపోయారు.2025, జులై 24న: ఏ24 ఫ్లయిట్- గమ్యస్థానానికి కొద్దికిలోమీటర్ల దూరంలో ఉండగా తెగిపోయిన సిగ్నల్స్.. కాసేపటికే ప్రమాదం.. విమానంలోని 43 మంది మరణించినట్లు తెలుస్తోంది. -
ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరు.. ఊహించిందేనన్న వైట్హౌజ్!
జెఫ్రీ ఎప్స్టీన్ పాపాల్లో ట్రంప్కు వాటా ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్స్టీన్ ఓ మానవ మృగం అని, అతనితో చాలా ఏళ్లపాటు ఎలాంటి సంబంధాలు కొనసాగలేదని ట్రంప్ చెబుతూ వస్తున్నారు. ఈ తరుణంలో కీలకమైన ఎప్స్టీన్ పైల్స్లో ట్రంప్ పేరు నిజంగా ఉందా? లేదా? అనే చర్చ అమెరికాలో విస్తృతంగా నడుస్తోంది. తాజాగా.. ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరు పలుమార్లు ప్రస్తావన ఉందని, ఆ విషయాన్ని యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బాండీ(Palm Bondi) అధ్యక్షుడు ట్రంప్ దృష్టికి తీసుకెళ్లారని వాల్ స్ట్రీట్ జర్నల్ బుధవారం ఓ సంచలనాత్మక కథనం ప్రచురించింది. మే నెలలోనే ఇది జరిగిందని, అయితే ఆ ఫైల్స్లో ట్రంప్ ప్రస్తావన ఏయే సందర్భాల్లో వచ్చిందనేది మాత్రం సదరు కథనం వివరించలేదు. ఎప్స్టీన్తో దగ్గరి సంబంధాలే ట్రంప్కు ఉన్నాయంటూ మొన్నీమధ్య wsj ఓ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. 2003లో ఎప్స్టీన్ పుట్టినరోజు కానుకగా ట్రంప్ ఓ లేఖ రాశారన్నది ఆ వార్త సారాంశం. అయితే ఆ కథనాన్ని తోసిపుచ్చిన ట్రంప్ సదరు మీడియా సంస్థపై భారీ పరువు నష్టం దావా వేశారు. ఈలోపు కనీసం వారం కూడా తిరగకుండానే మరో కథనంతో అదే మీడియా సంస్థ వచ్చింది. అయితే..ఇది ఊహించిందేనని వైట్హౌజ్ అంటోంది. ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరు.. ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేసింది అమెరికా అధ్యక్ష భవనం. సదరు మీడియా సంస్థ నుంచి ఇలాంటి కథనాలు ఊహించినవేనని, డెమోక్రాట్లు, లిబరల్ మీడియా ట్రంప్పై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఒక ప్రకటనలో తెలిపింది. మాజీ అధ్యక్షుడు ఒబామాపై విచారణ నేపథ్యంలోనే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారంటూ వైట్హౌజ్ వర్గాలు అంటున్నాయి. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై అమెరికాలో రాజకీయ దుమారం రేగింది. రష్యాతో చేతులు కలిపి హిల్లరీ క్లింటన్ ప్రచారాన్ని ట్రంప్ దెబ్బ తీయాలని చూశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఆ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లభించలేవు. అయితే.. తాజాగా ఈ అంశంలో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా పాత్రపై పెను దుమారం రేగింది. ట్రంప్, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తుల్సీ గబ్బార్డ్ ఆరోపణలు ప్రకారం.. ఒబామా తన ప్రభుత్వంలో ఉన్న అధికారులతో కలిసి రష్యా జోక్యంపై తప్పుడు ఇంటెలిజెన్స్ నివేదికలు తయారు చేశారని, తద్వారా ట్రంప్ ప్రచారాన్ని అడ్డుకోవాలని చూశారన్నది ఆ కథనాల సారాంశం. ఈ ఆరోపణలకు సంబంధించి డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ను గబ్బార్డ్ విడుదల చేశారు కూడా. అయితే.. ఒబామా మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్లో.. అమెరికన్ ఫైనాన్షియర్, ప్రముఖ ఇన్వెస్టర్ అయిన జెఫ్రీ ఎప్స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. ఇదే కేసులో అరెస్టైన ఎప్స్టీన్ సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్వెల్.. ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అమెరికాలో సంచలనం సృష్టించింది జెఫ్రీ ఎప్స్టీన్ హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం. చాలా ఏళ్లపాటు మైనర్ బాలికలపై ఎప్స్టీన్ లైంగిక దాడికి పాల్పడ్డాడన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాదు.. 90వ దశకం నుంచి అమెరికాలో ప్రముఖ ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు ఎప్స్టీన్ అమ్మాయిలను సప్లై చేశాడని, ఈ వ్యవహారంలో అతని సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్వెల్ సహకరించారన్న అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలో.. ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది ప్రధానంగా తెర మీదకు వచ్చింది. ఇది ఈ స్కామ్కు సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్లో ఎప్స్టీన్ టోటల్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయని గతంలో దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. వీటిని బయటపెట్టాలని చాలా ఏళ్లుగా డిమాండ్ నడుస్తోంది అక్కడ. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ ఫైల్స్ వివరాలు బహిర్గతం అవుతాయని అంతా భావించారు. అందుకు తగ్గట్లే.. ఎఫ్బీఐ, అమెరికా న్యాయవిభాగం ఆ బాధ్యతలు సంయుక్తంగా చేపట్టాయి. అయితే జులై మొదటి వారంలో యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బాండీ అనూహ్యమైన ప్రకటన చేశారు. అందులో సంచలనాత్మక వివరాలేవీ లేవని అన్నారామె. ఎప్స్టీన్ వద్ద ‘క్లయింట్ లిస్ట్’ లేదు. ఆయన బ్లాక్మెయిల్ చేయలేదని, ప్రాముఖ్యమైన వ్యక్తులపై నేరపూరిత ఆధారాలు లేవని” పేర్కొన్నారు. అయితే.. ఎప్స్టీన్తో ట్రంప్కు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే ఆ వివరాలను బయటపెట్టనివ్వడం లేదన్న విమర్శలు ఇప్పుడు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు(పాతవి) నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ట్రంప్ వివాహ వేడుకలోనూ ఎప్స్టీన్ కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడం గమనార్హం. ఈ క్రమంలో.. ఈ సెక్స్ స్కాండల్ను కదిలించిన అమెరికన్ విజువల్ ఆర్టిస్ట్ మరియా ఫార్మర్(ఎప్స్టీన్పై ఫిర్యాదు చేసిన తొలి వ్యక్తి.. ఈమె కేసులోనే ఎప్స్టీన్ అరెస్టయ్యాడు).. ట్రంప్ను కూడా ఎఫ్బీఐ సంస్థ విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. -
Australia: హిందూ ఆలయ గోడలపై జాత్యహంకార వ్యాఖ్యలు
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లోగల ఒక హిందూ దేవాలయం గోడలపై ద్వేషపూరిత జాత్యహంకార రాతలు కనిపించడంతో కలకలం చెలరేగింది. ఆస్ట్రేలియా హిందూ కౌన్సిల్ అధ్యక్షుడు, విక్టోరియా చాప్టర్, మకరంద్ భగవత్ ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ ఆలయం శాంతి, భక్తి, ఐక్యతకు నిలయమని ఆయన పునరుద్ధాటించారు.ఆస్ట్రేలియాలోని వాధర్స్ట్ డ్రైవ్లో గల స్వామినారాయణ ఆలయం గోడపై దుండగులు ఎర్రటి పెయింట్ చల్లి, జాత్యహంకార దుర్భాషపూరిత వ్యాఖ్యలు రాశారు. స్థానిక దినపత్రిక తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆలయానికి సమీపంలోని రెండు ఆసియా రెస్టారెంట్లలో కూడా ఇదే సందేశం కనిపించింది. హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు, విక్టోరియా చాప్టర్, మకరంద్ భగవత్ ఈ సంఘటనపై స్పందిస్తూ, స్వామి నారాయణ ఆలయం రోజువారీ ప్రార్థనలు, సామూహిక భోజనాలు, సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తుందని భగవత్ తెలిపారు.అయినప్పటికీ ఇటువంటి ఘటనలు ఎదురవడం శోచనీయమన్నారు. హిందువులు ఇతర వర్గాలవారిపై ప్రేమను చూపించాలని, ద్వేషంపై ప్రేమ విజయం సాధిస్తుందని భగవత్ అన్నారు. ఆలయంలో జరిగిన ఘటన తీవ్రంగా కలత పెట్టే అంశమని, భయాన్ని వ్యాప్తి చేయడానికే విద్రోహులు ఇటువంటి చర్యకు పాల్పడ్దారని భగవత్ పేర్కొన్నారు. -
థాయ్, కంబోడియా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత
బ్యాంకాక్: థాయ్లాండ్- కంబోడియా మధ్య సరిహద్దు వివాదాల కారణంగా ఇరు దేశల సంబంధాలు క్షీణిస్తున్నాయి. తాజాగా సరిహద్దుల్లో భద్రతా దళాల ఘర్షణలు జరిగినట్లు ఇరు దేశాలు మీడియాకు తెలిపాయి. థాయ్ సైన్యం, కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ప్రసాత్ తా ముయెన్ థామ్ సమీపంలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. థాయ్లాండ్ పరిధిలోని సురిన్ ప్రావిన్స్లో ప్రసాత్ తా ముయెన్ ఉంది. అయితే కంబోడియా ఇది తమదేనని చెబుతోంది.ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిన దరిమిలా థాయ్- కంబోడియా సైనికుల పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. గురువారం ఉదయం పేలుళ్ల శబ్ధాలు వినిపిస్తుండటంతో, తాము పారిపోయి కాంక్రీట్ బంకర్లో దాక్కుంటున్నట్లు థాయ్లాండ్ ప్రజలు తెలిపారు. థాయ్లాండ్ , కంబోడియాలు ఎవరు తొలుత కాల్పులు జరిపారనే దానిపై వాదనలు చేసుకున్నాయి. ఈ ఆగ్నేయాసియా పొరుగు దేశాల మధ్య సంబంధాలు మే నెల నుండి క్షీణిస్తూ వస్తున్నాయి. ఈ నేపధ్యంలో చోటుచేసుకున్న సాయుధ ఘర్షణలో కంబోడియా సైనికుడొకరు మృతిచెందారు.థాయ్లాండ్ ముందుగా ఈ సాయుధ ఘర్షణను ప్రారంభించిందని, కంబోడియా స్వయం రక్షణ పరిధిలోనే వ్యవహరించిందని, అయితే థాయ్ దళాల నిర్ద్వంద్వ చొరబాటుకు ప్రతిస్పందించామని కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. బుధవారం సరిహద్దు సమీపంలో జరిగిన ఒక ల్యాండ్ మైన్ పేలుడులో ఐదుగురు థాయ్ సైనికులు గాయపడ్డారు. దీనికి ముందు కూడా ఒక ల్యాండ్ మైన్ పేలి, ముగ్గురు థాయ్ సైనికులు గాయపడ్డారు. 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం ఈ ప్రాంతంపై కంబోడియాకు సార్వభౌమాధికారాన్ని ఇచ్చింది. అప్పటి నుంచి ఇరు రెండు దేశాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. -
‘ఎల్ఏసీ’లో ఏం చేద్దాం?.. భారత్-చైనా సమీక్ష
న్యూఢిల్లీ: భారత్- చైనా దేశాలు తూర్పు లడఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి ప్రస్తుతం ఉన్న పరిస్థితిని సమీక్షించాయి. సరిహద్దు వివాదాలపై ఇరు దేశాలకు చెందిన ప్రత్యేక ప్రతినిధులు తదుపరి చేపట్టాల్సిన చర్యలకు ఏర్పాట్లు చేశాయి. ఢిల్లీలో జరిగిన వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (డబ్ల్యూఎంసీసీ)సమావేశంలో ఇరుపక్షాలు ఈ అంశాలపై చర్చలు జరిపాయి.సరిహద్దుల్లో ప్రశాంతత, సాధారణ పరిస్థితి నెలకొనడం, ద్వైపాక్షిక సంబంధాలను క్రమంగా సాధారణీకరించేందుకు ఈ చర్చలు దోహదపడతాయని ఇరు దేశాల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ)తెలిపింది. ఈ ఏడాది చివర్లో భారత్లో జరగనున్న ప్రత్యేక ప్రతినిధుల (ఎస్ఆర్) తదుపరి దశ చర్చలకు భారత్- చైనా సిద్ధమయ్యాయని ఎంఈఏ పేర్కొంది. ఈ చర్చలకు భారత ప్రత్యేక ప్రతినిధిగా జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ)అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి నేతృత్వం వహించనున్నారు.ఈ చర్చలకు ముందు వాంగ్ భారతదేశాన్ని సందర్శించే అవకాశం ఉంది. గడచిన తొమ్మిది నెలలుగా భారత్- చైనాలు ఇరు దేశాల సంబంధాలను సాధారణీకరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. రెండు వైపులా ఘర్షణ పాయింట్ల నుండి దళాలను విరమించుకున్నప్పటికీ, తూర్పు లడఖ్ ప్రాంతంలో ఎల్ఏసీ వెంబడి 60 వేల మంది సైనికులున్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్న అనంతరం డబ్ల్యూఎంసీసీ చర్చలు జరిగాయి.2020 జూన్లో తూర్పు లడఖ్లోని గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణ ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. గత ఏడాది అక్టోబర్ 21న ఖరారైన ఒప్పందం ప్రకారం డెమ్చోక్, డెప్సాంగ్ పాయింట్ల నుండి సైనిక దళాలను వెనక్కు మళ్లించారు. గత ఏడాది అక్టోబర్లో రష్యాలోని కజాన్లో ప్రధాని నరేంద్ర మోదీ- చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ మధ్య జరిగిన సమావేశంలో ఇరుదేశాల దౌత్య సంబంధాలను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు. -
మతోన్మాదం, ఉగ్రవాదంలో మునిగిన పాక్
ఐక్యరాజ్యసమితి: సమయం, సందర్భం కాకపోయినా కశ్మీర్ అంశాన్ని ప్రతిసారీ అంతర్జాతీయ వేదికపై ప్రస్తావిస్తున్న పాకిస్తాన్కు భారత్ మరోసారి దీటుగా బదులిచ్చింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో జూలై నెల సమావేశంలోభాగంగా మంగళవారం ‘‘బహుళత్వం ద్వారా అంతర్జాతీయ శాంతిభద్రత ప్రోత్సాహం, శాంతియుతంగా వివాదాల పరిష్కారం’’అంశంపై జరిగిన చర్చలో పాకిస్తాన్ తొలుత ప్రసంగించింది. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ను ఉద్దేశిస్తూ పాకిస్తాన్ ఉపప్రదాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ప్రసంగించారు. ‘‘కశ్మీర్ను భారత్ ఆక్రమించింది. తాజా ఉద్రిక్తతలను అడ్డంపెట్టుకుని సిందూ నదీజలాల ఒప్పందం అమలును భారత్ రద్దుచేసింది. కశ్మీర్సహా భారత్తో నెలకొన్ని ప్రతిష్టంభనకు అంతర్జాతీయ జోక్యం తప్పనిసరి’’అని ఇషాక్ దార్ అన్నారు. ఈయన వ్యాఖ్యలపై ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ దీటుగా బదులిచ్చారు. ‘‘బాధ్యతాయుతంగా ఉంటూ ప్రపంచ శాంతి, భద్రత కోసం భారత్కృషిచేస్తోంది. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించకూడదనే అంతర్జాతీయ ప్రాథమిక సూత్రాన్ని భారత్ పాటిస్తోంది. ప్రజాస్వామ్య పథంలో పైపైకి దూసుకెళ్తూ, ఆర్థిక శక్తిగా అవతరిస్తూ, బహుళత్వానికి, సామాజిక సమ్మిళిత వృద్ధిని సాధిస్తూ భారత్ బిజీగా ఉంటే ఉగ్రవాదం, మతోన్మాదం, అంతర్జాతీయ ద్రవ్యనిది సంస్థ(ఐఎంఎఫ్) వంటి చోట్ల వేల కోట్ల రుణాలుచేస్తూ పాకిస్తాన్ బిజీగా ఉంది’’అని హరీశ్ దెబ్బిపొడిచారు. పాకిస్తాన్కు ఐఎంఎఫ్ 2.1 బిలియన్ డాలర్ల రుణాలు మంజూరుచేసిన విషయం తెల్సిందే. ‘‘పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు అనుబంధంగా పనిచేసే ది రెసిస్టెంట్ ఫ్రంట్ సంస్థ ఉగ్రవాదులే పహల్గాంలో పాశవిక హత్యాకాండకు తెరలేపారు’’అని హరీశ్ గుర్తుచేశారు. -
గాజాలో అన్నమో రామచంద్రా!
కల్లోలిత గాజాలో ఆకలి కేకలతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఎటు చూసినా మనసును కలిచివేసే దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ కఠిన ఆంక్షలతో ఆహారం, మానవతా సాయం అందక పాలస్తీనా పౌరుల డొక్కలెండిపోతున్నాయి. రోజుల తరబడి తిండి లేక నీరసించి, ప్రాణాలు విడిచేస్తున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలోనే కనీసం 15 మంది మరణించారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు గాజా అరోగ్య శాఖ ప్రకటించింది. ఆకలి చావులు ఎలా అడ్డుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది. ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత గాజాలోని పాలస్తీనా పౌరులకు ఒక్కసారిగా కష్టాలు వచ్చిపడ్డాయి. కనీస సౌకర్యాల సంగతి పక్కనపెడితే కడుపునిండా తిండి దొరకడమే గగనంగా మారింది. అధికారిక గణాంకాల ప్రకారమే ఇప్పటివరకు 111 ఆకలి చావులు సంభవించాయి. వీరిలో 80 మందికిపైగా చిన్నారులే ఉండడం గమనార్హం. గాజాలో అత్యంత భయానక వాతావరణం కనిపిస్తోందని సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తంచేసింది. నిత్యం ఇజ్రాయెల్ దాడుల్లో అమాయక జనం బలైపోతున్నారని వెల్లడించింది. ఆకలి చావులు సంభవిస్తుండడం ఇటీవలి కాలంలో అతిపెద్ద సంక్షోభమమని స్పష్టంచేసింది. ప్రాణాలకు తెగిస్తేనే.. ఉత్తర గాజాలోని ఓ ఆసుపత్రిలో ఆరేళ్ల బాలుడు యూసుఫ్ అల్–సఫాదీ మరణించాడు. తల్లి పాలు అందక అతడు మృతిచెందినట్లు బంధువులు చెప్పారు. యూసుఫ్ తల్లికి కొన్ని నెలలుగా సరైన పౌష్టికాహారం దొరకడం లేదు. అనారోగ్యం బారినపడింది. తన బిడ్డకు స్తన్యం ఇవ్వడానికి ఆమె వద్ద పాలు లేకుండాపోయాయి. చివరకు యూసుఫ్ ప్రాణమే పోయింది. బయట ఆవు పాలు, గేదె పాలు కొందామన్న ఎక్కడా లేవు. ఒకవేళ దొరికినా లీటర్ 100 డాలర్లు(రూ.8,639) చెబుతున్నారు. 13 ఏళ్ల బాలుడు అబ్దుల్ హమీద్ అల్–గల్బాన్ది మరో వ్యధ. అతడికి చాలా రోజులుగా తిండి లేదు. చివరకు మృత్యువు కబళించింది. గాజాలో ఆకలి చావులుగా గత ఐదు నెలలుగా కొనసాగుతున్నాయి. గాజాలోకి మానవతా సాయం సరఫరా కాకుండా ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంటోంది. విదేశాల నుంచి ఆహారం, నీరు, ఇంధనం, ఔషధాలు, నిత్యావసరాలు రానివ్వడం లేదు. ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి మేరకు మే నెలలో ఆంక్షలు కొంత సడలించింది. మానవతా సాయాన్ని పరిమితంగానే అనుమతిస్తోంది. ఐక్యరాజ్యసమితి మద్దతున్న గాజా హుమానిటేరియన్ ఫౌండేషన్(జీహెచ్ఎఫ్) గాజా ప్రజలకు ఆహారం, నిత్యావసరాలు సరఫరా చేస్తున్నప్పటికీ అవి ఏ మూలకూ చాలడం లేదు. ఆహార పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరిన జనంపై ఇజ్రాయెల్ సైన్యం విచ్చలవిడిగా కాల్పులు జరుపుతోంది. ఈ కాల్పుల్లో 1,000 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. కడుపు నింపుకోవాలంటే ప్రాణాలకు తెగించాల్సిన పరిస్థితి దాపురించింది. అభాగ్యుల ఎదురుచూపులు ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ జైలుగా పేరుగాంచిన గాజా స్ట్రిప్లో 20 లక్షల మందికిపైగా నివసిస్తున్నారు. ఒకవైపు ఆహార లేమి, మరోవైపు పౌష్టిహాకార లోపం జనాన్ని పట్టిపీడిస్తున్నాయి. ఆహారం దొరకడం ఒక ఎత్తయితే, అది నాణ్యంగా లేకపోవడం మరో సవాల్గా మారింది. చాలినంత తిండి లేక అల్లాడుతున్నారు. చాలామంది అర్ధాకలితో కాలం గడపాల్సి వస్తోంది. ఆకలి భూతం ప్రతి ఇంటి తలుపును తడుతోంది. ఆదుకొనే ఆపన్నహస్తాల కోసం అభాగ్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇజ్రాయెల్ దయ తలిస్తే తప్ప గాజా పౌరులు బతికి బట్ట కట్టే పరిస్థితి లేదని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ వ్యాఖ్యానించారు. నిండిపోయిన ఆసుపత్రులు పౌష్టికాహార లోపంతో అనారోగ్యం పాలై ఆసుపత్రు ల్లో చేరుతున్న బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. బాధితులకు చికిత్స చేయడానికి సరైన సదుపాయాలు కూడా లేవని, వారు తమ కళ్ల ముందే మరణిస్తున్నారని, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని సెంట్రల్ గాజాలోని అల్–అక్సా హాస్పిటల్ వైద్యుడు ఖలీల్ అల్–డక్రాన్ తెలిపారు. ఇజ్రాయెల్ సైన్యం కాల్పుల్లో గాయపడినవారితో ఆసుపత్రులో నిండిపోయాయని, ఇతర రోగులను చేర్చులేకపోతున్నామని మరికొందరు డాక్టర్లు వెల్లడించారు. గాజాలో ప్రస్తుతం 6 లక్షల మందికిపైగా జనం పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్లు అంచనా. వీరిలో 60 వేల మంది గర్భిణులే కావడం గమనార్హం. ఆహార లేమికి తోడు డీహైడ్రేషన్, రక్తహీనతతో గర్భిణులు మరణం అంచులకు చేరుకుంటున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం గాజాను పూర్తిగా ఖాళీ చేయించే పనిలో నిమగ్నమైంది.ప్రపంచ దేశాలు స్పందించాలి గాజా పరిణామాలపై 100కిపైగా అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తంచేశాయి. ఆకలి చావులు ఆపడానికి వెంటనే చర్యలు చేపట్టాలని, తక్షణమే కాల్పుల విరమణ పాటించేలా ఇజ్రాయెల్పై ఒత్తిడి పెంచాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశాయి. టన్నుల కొద్దీ ఆహారం, నీరు, ఔషధాలు గాజా బయటే ఉండిపోయాయని, ఇజ్రాయెల్ ఆంక్షల కారణంగా అవి పాలస్తీనా పౌరులకు అందడం లేదని మెర్సీ కారప్స్, నార్వేజియన్ రెఫ్యూజీ కౌన్సిల్, డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ తదితర సంస్థలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ దమనకాండ వల్ల గాజాలో మృత్యుఘోష మొదలైందని, ఆకలి చావులు పెరిగిపోతున్నాయని వెల్లడించాయి. ప్రపంచ దేశాలు ఇప్పటికైనా స్పందించాలని, గాజా ప్రజల ప్రాణాలు కాపాడాలని స్వచ్ఛంద సంస్థలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు బుధవారం ఉమ్మడిగా లేఖ విడుదల చేశాయి. సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎయిరిండియా ఘటన.. ఆ మృతదేహాలు మా వాళ్లవి కావు
లండన్: గత నెలలో జరిగిన భారత విమానయాన చరిత్రలో జరిగిన ఘోర ప్రమాదాల్లో ఒకటైన అహ్మదాబాద్ ఎయిరిండియా విమానం ప్రమాదంపై మరో వివాదం నెలకొంది. ‘అహ్మదాబాద్ ఎయిరిండియా (Air India Flight 171) ప్రమాదంలో ఇద్దరు యూకే ప్రయాణికులు మృతి చెందారు. మృతదేహాల్ని గుర్తించేందుకు కుటుంబ సభ్యుల నుంచి అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి వైద్యులు డీఎన్ఏ నమోనాల్ని సేకరించారు. వాటి ఆధారంగా ఘటనా స్థలంలో లభ్యమైన రెండు మృతదేహాలు వారి కుటుంబ సభ్యులవేనంటూ యూకే కుటుంబసభ్యులకు అప్పగించారు.అసలు మృతదేహాలు ఎక్కడా?కానీ డీఎన్ఏ పరీక్షల్లో యూకే కుటుంబ సభ్యుల డీఎన్ఏకు.. భారత్ వైద్యులు అప్పగించిన మృతదేహాలకు డీఎన్ఏ వేరుగా ఉందని తెలిపారు. మరి యూకే మృతుల బంధువులకు అప్పగించిన మృతదేహాలు ఎవరివి? అసలు మృతదేహాలు ఎక్కడ ఉన్నాయనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇదే విషయంపై యూకే ప్రయాణికుల కుటుంబ సభ్యులు భారత్తో న్యాయపోరాటం చేస్తున్నారు. మృతదేహాల మార్పుపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు.డీఎన్ఏ మ్యాచ్ అవ్వలేదుమృతదేహాల మార్పుపై బాధితుల తరుఫు న్యాయవాది జేమ్స్ హీలీ మీడియాతో మాట్లాడారు. ‘జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమానం ఏఐ 171 విమానంలో 12,13 సీట్లలో మా క్లయింట్ (యూకే ప్రయాణికులు) ప్రయాణించారు. మృతదేహాల గుర్తింపు కోసం మృతుల కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ సేకరించారు. వాటి ఆధారంగా మృతదేహాల్ని గుర్తించారు. మాకు అప్పగించారు. మాకు అప్పగించిన మృతదేహాల్ని.. కుటుంబసభ్యుల డీఎన్ఏతో టెస్ట్ చేశాం. కానీ మాకు అప్పగించిన మృతదేహాల డీఎన్ఏకు, కుటుంబ సభ్యుల డీఎన్ఏకు మ్యాచ్ అవ్వడం లేదని వెల్లడించారు.260 మంది ప్రయాణికులు దుర్మరణంఅహ్మదాబాద్ నుంచి జూన్ 12న లండన్ బయలుదేరిన ఎయిరిండియా డ్రీమ్లైనర్ విమానం.. టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఘటన సమయంలో విమానంలో 242 మంది ఉండగా.. ఒకే ఒక్క వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా 241 మంది మృతిచెందారు. ఇక, ఈ విమానం అహ్మదాబాద్ మేఘాణి నగర్లో బీజే మెడికల్ కాలేజీ హాస్టల్పై పడటంతో అందులోని పలువురు మృతిచెందారు. మొత్తంగా ఈ దుర్ఘటనలో 260 మంది మృతి చెందగా వారిలో 19మంది ప్రమాద సమయంలో బీజే మెడికల్ కాలేజీలో ఉన్నవారివేనని అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి సూపరిటెండెంట్ రాకేష్ జోషి తెలిపారు. యూకే బాధిత ప్రయాణికులకు మద్దతుగా ఎయిరిండియాడీఎన్ఏ రిపోర్టుల ఆధారంగా మృతదేహాల్ని గుర్తించడం, కుటుంబ సభ్యులకు అప్పగించే బాధ్యత ఎయిరిండియాది కానప్పటికీ.. యూకే ప్రయాణికుల కుటుంబ సభ్యులకు ఎయిరిండియా యాజమాన్యం అండగా నిలిచింది. బాధితుల మృతదేహాలను గుర్తించే విషయంలో తమ సహకారం ఉంటుందని హామీ ఇచ్చింది.అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన యూకే ప్రయాణికుల మృతదేహాల్ని డీఎన్ఏ ఆధారంగా గుర్తించారు. ఆ మృతదేహాల్ని అంతర్జాతీయ అత్యవసర సేవ కెన్యన్ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ సర్వీసెస్ను ఉపయోగించింది. ఎయిర్ ఇండియా కార్గో ద్వారా మృతదేహాల అవశేషాలను మోసుకెళ్లే శవపేటికలను యూకేకి పంపారు. -
పాక్ ఆస్పత్రిలో.. 26/11 ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ మృతి
ఇస్లామాబాద్: భారత పార్లమెంట్పై దాడి(2001), 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో కీలక పాత్ర పోషించిన లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ పాకిస్తాన్లోని బహవల్పూర్లో గల ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మీడియాకు అందిన వివరాల ప్రకారం మే 6న భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన సమయంలో క్షిపణి దాడి కారణంగా అబ్దుల్ అజీజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇతను లష్కర్ ఎ తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరికి అత్యంత సన్నిహితుడని సమాచారం.అబ్దుల్ అజీజ్ పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కర్ ఎ తోయిబాకు నిధులను అందించే అగ్రశ్రేణి నిర్వాహకుడు. సోషల్ మీడియాలో ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ అంత్యక్రియలకు సంబంధించిన దృశ్యాలు పత్యక్షమయ్యాయి. వీటిలో డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి, అబ్దుర్ రవూఫ్ తదితర సీనియర్ లష్కర్ నేతలు ఆయన మరణానికి దుఃఖిస్తున్నట్లు కనిపిస్తోంది. అజీజ్ గతంలో గల్ఫ్ దేశాలతో పాటు యూకే, యూఎస్లోని రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూపులు, పాకిస్తాన్ కమ్యూనిటీల నుండి నిధులు సేకరించినట్లు తెలుస్తోంది. అలాగే వివిధ ఉగ్రవాద కార్యకలాపాలకు లాజిస్టిక్స్, ఆయుధ సరఫరా, నియామకాలను అజీజ్ చేపట్టాడని తెలుస్తోంది.అతని మృతి లష్కర్ ఎ తోయిబాకు తీరని లోటుగా ఉగ్రవాదనేతలు భావిస్తున్నారు. అబ్దుల్ అజీజ్ భారత్లో జరిగిన పలు ఉగ్రదాడులతో సంబంధం ఉంది. 2001 పార్లమెంట్ దాడికి పాకిస్తాన్ నుండి డబ్బు, పరికరాలను తరలించడంలో సహాయం చేశాడని నిఘా నివేదికలు తెలియజేస్తున్నాయి. 2006 ముంబై లోకల్ రైలు పేలుళ్లకు కూడా ఇతను ఆర్థిక సహాయం అందించాడని భావిస్తున్నారు. 2008 ముంబై దాడుల సమయంలో, అజీజ్ సముద్ర మార్గాల ద్వారా ఆయుధాలు, ఉపగ్రహ ఫోన్లను అందజేసినట్లు తెలుస్తోంది. -
Pakistan: ఇమ్రాన్ ఖాన్కు కోలుకోలేని దెబ్బ.. ఏడుగురు పీటీఐ నేతలకు పదేళ్ల జైలు
ఇస్లామాబాద్: పాక్ న్యాయస్థానం నుంచి పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్ ఇమ్రాన్కు కోలుకోలేని దెబ్బ పడింది. దేశంలో గతంలో జరిగిన అల్లర్ల కేసుల్లో ఏడుగురు పీటీఐ నేతలకు పదేళ్ల జైలు శిక్ష విధించారు. 2023, మే 9న పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్టు దరిమిలా దేశంలోని సైనిక స్థావరాలు, ప్రభుత్వ యాజమాన్యంలోని భవనాలపై పీటీఐ నేతలు దాడులకు తెగబడ్డారు. ఈ నేపధ్యంలో పలువురు నేతలతో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ అల్లర్ల కేసులో లాహోర్లోని ఉగ్రవాద నిరోధక కోర్టు (ఏటీసీ) తాజాగా పీటీఐకి చెందిన ఏడుగురు సీనియర్ నేతలకు పదేళ్ల జైలుశిక్ష విధించింది. కోర్టు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం జైలు శిక్ష పడిన నేతలలో సెనేటర్ ఎజాజ్ చౌదరి (పార్టీ సీనియర్ మహిళా నేత) సర్పరాజ్ చీమా (పంజాబ్ మాజీ గవర్నర్), డాక్టర్ యాస్మిన్ రషీద్ (పంజాబ్ మాజీ ఆరోగ్య మంత్రి) , మెహమూదూర్ రషీద్ (మాజీ మంత్రి) న్యాయవాది అజీమ్ పహత్ (పార్టీ న్యాయ సలహాదారు) ఉన్నారు. మరో ఇద్దరు నేతలు కూడా శిక్ష పడినవారిలో ఉన్నారు. అయితే పలు మీడియా నివేదికలు ఐదుగురి పేర్లను హైలైట్ చేశాయి. ఈ కేసులో పీటీఐ వైస్ చైర్మన్, మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.మరో కేసులో పంజాబ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత మాలిక్ అహ్మద్ ఖాన్ భచర్, పీటీఐ పార్లమెంటేరియన్ అహ్మద్ చట్టా, మాజీ శాసనసభ్యుడు బిలాల్ ఎజాజ్లకు పదేళ్ల జైలు శిక్ష విధించారు. నాడు జరిగిన అల్లర్ల తర్వాత పోలీసులు వేలాది మంది నిరసనకారులను అరెస్ట్ చేశారు. ఇమ్రాన్ఖాన్ 2023, ఆగస్టు నుండి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. పీటీఐ నేతలకు విధించిన శిక్షను ఫెడరల్ ప్రభుత్వం స్వాగతించింది. దీనిని సానుకూల చర్యగా అభివర్ణించింది. కాగా పీటీఐ పంజాబ్ చాప్టర్ హెడ్ అలియా హంజా, సీనియర్ నేత బాబర్ అవాన్, శాసనసభ్యుడు అసద్ కైసర్ ఈ శిక్షలను ఖండించారు. ఈ కేసులలో చట్టపరమైన విధానాలను అనుసరించలేదని, విశ్వసనీయ సాక్షులను హాజరుపరచలేదని వారు ఆరోపించారు. -
‘సమితి’లో పాక్ బండారం బయటపెట్టిన భారత్
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ తీరుతెన్నులను భారత్ ఎండగట్టింది. భారతదేశం వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పరిణమిస్తుండగా, పాకిస్తాన్ ఒకవైపు మతతత్వం, మరోవైపు ఉగ్రవాదంలో మునిగిపోయి, భారీ రుణగ్రహీతగా మారిందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత ప్రతినిధి పర్వతనేని హరీష్ పేర్కొన్నారు.ఐక్యరాజ్యసమితిలో ‘అంతర్జాతీయ శాంతి- భద్రతను ప్రోత్సహించడం’ అనే అంశంపై జరిగిన ఉన్నత స్థాయి బహిరంగ చర్చలో పర్వతనేని హరీష్ మాట్లాడుతూ, భారతదేశం పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశమని, పురోగతి, శ్రేయస్సు, అభివృద్ధి నమూనాలలో ఎదుగుతున్నదని పేర్కొన్నారు. పొరుగుదేశం ఇందుకు భిన్నంగా ఉన్నదని ఆరోపించారు. భారత్ ఐక్యరాజ్యసమితి లక్ష్యంలో భాగస్వామ్యం వహిస్తూ, మరింత శాంతియుత, సంపన్నమైన,ప్రపంచం కోసం సమిష్టిగా కృషి చేయడంలో చురుకుగా, నిర్మాణాత్మకంగా పాల్గొంటున్నదని అన్నారు.భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో పోటీ పడుతుండగా, అదే సమయంలో పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికల నుండి రుణాలు తీసుకోవడంలో బిజీగా ఉందని హరీష్ ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజానికి ఆమోదయోగ్యం కాని పద్ధతులకు పాల్పడుతున్నదని ఆయన అన్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడిని గుర్తు చేస్తూ, ఈ ఘటనలో పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మంది అమాయక పౌరులను కాల్చి చంపారని హరీష్ పేర్కొన్నారు. అనంతరం భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించి పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను తునాతునకలు చేసిందన్నారు. -
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ఆమోదం.. యూకే పర్యటనలో ప్రధాని మోదీ సంతకం
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ తన లండన్ పర్యటనలో జూలై 24న సంతకం చేయనున్న భారత్- యూకేల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందంగా ఇది నిలవనుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. భారత్-యూకేల మధ్య ఈ వాణిజ్య ఒప్పందం కోసం జరిపిన చర్చలు ముగిసినట్లు ఇరు దేశాలు మే 6న ప్రకటించాయి.ప్రధాని మోదీ చేపట్టే యునైటెడ్ కింగ్డమ్, మాల్దీవుల నాలుగు రోజుల పర్యటన బుధవారం(జూలై 23)ప్రారంభంకానుంది. ఈ పర్యటనలో వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ ప్రధానమంత్రి వెంట ఉండనున్నారు. కాగా 2030 నాటికి ఈ రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యాన్ని 120 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేసేదిగా ఈ ఒప్పందం ఉంది. తోలు, పాదరక్షలు, దుస్తులు వంటి శ్రమతో కూడిన ఉత్పత్తుల ఎగుమతిపై పన్నులను తొలగించాలని, బ్రిటన్ నుండి విస్కీ, కార్ల దిగుమతులను చౌకగా మార్చాలని ఈ వాణిజ్య ఒప్పందం ప్రతిపాదించింది.భారత్-యూకేల ఈ ఒప్పందంలో వస్తువులు, సేవలు, ఆవిష్కరణ, మేధో సంపత్తి హక్కులు తదితర అంశాల ప్రస్తావన ఉంది. ఈ ఒప్పందంపై ఇరు దేశాల వాణిజ్య మంత్రులు సంతకం చేయనున్నారు. అనంతరం దీనిని అమలు చేసేందుకు బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. మరోవైపు సామాజిక భద్రతా ఒప్పందంపై రెండు దేశాలు చర్చలు జరిపాయి. కాగా ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం (బిట్)పై చర్చలు కొనసాగుతున్నాయి. 2024-25లో యూకేకి భారతదేశ ఎగుమతులు 12.6 శాతం పెరిగాయి. దిగుమతులు 2.3 శాతం మేరకు పెరిగాయి. భారత్-యూకేల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2022-23లో20.36 యూఎస్ బిలియన్ డాలర్ల నుండి 2023-24లో 21.34 యూఎస్ బిలియన్ డాలర్లకు పెరిగింది. -
United States: నిర్బంధ కేంద్రాల్లో మహిళలకు ఘోర అవమానం
వాషింగ్టన్ డీసీ: అమెరికాలోని నిర్బంధ కేంద్రాల్లో(డిటెన్షన్ సెంటర్లు)మహిళకు ఘోర అవమానకర పరిస్థితులు ఎదురవుతున్నాయి. మయామి పశ్చిమ ప్రాంతంలోని క్రోమ్ నార్త్ సర్వీస్ ప్రాసెసింగ్ సెంటర్లో మహిళా ఖైదీలు.. పురుష ఖైదీల ఎదుట టాయిలెట్లను ఉపయోగించవలసిన దుస్థితి ఏర్పడింది.‘యూ ఫీల్ లైక్ యువర్ లైఫ్ ఈజ్ ఓవర్’ పేరుతో వెలువడిన ఒక నివేదికలో అమెరికాలోని ఫ్లోరిడాలో గల మూడు ఇమ్మిగ్రేషన్ సెంటర్లలో తగిన ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేని వలసదారులు ఘోర అవమానకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. 2025 మొదటి నుంచి ఈ విధమైన దుస్థితి మరింతగా పెరిగిందని నివేదికలో వెల్లడించారు. సంకెళ్ళు వేయడం, అరకొర ఆహారం అందించడం, పరిశుభ్రంగా లేని ప్రాంతంలో ఉంచడం, వైద్య సంరక్షణలో ఆలస్యం చేయడం మొదలైనవి వీటిలో ఉన్నాయని తెలియజేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఖైదీ మరిణించారని కూడా దానిలో పేర్కొన్నారు.అక్రమ వలసదారులను సంకెళ్లతో బంధించి, వారి చేతులు వెనుకకు కట్టి, కుక్కల మాదిరిగా స్టైరోఫోమ్ ప్లేట్లలోని ఆహారాన్ని మోకరిల్లి తినాలంటూ అధికారులు బలవంతం చేశారని ఆ నివేదిక పేర్కొంది. పదుల సంఖ్యలో పురుషులను గంటల తరబడి సెల్లలో బంధించారని, సాయంత్రం 7 గంటల వరకు ఆహారం పెట్టలేదని నివేదిక తెలిపింది. తాము జంతువుల మాదిరిగా ఆహారం తినవలసి వచ్చిందని పెడ్రో అనే ఖైదీ తెలిపాడు. ఈ ఘటన మయామి ఇమ్మిగ్రేషన్ జైలులో చోటుచేసుకుంది. పశ్చిమ మయామిలోని క్రోమ్ నార్త్ సర్వీస్ ప్రాసెసింగ్ సెంటర్లో పురుష ఖైదీల ముందు మహిళా ఖైదీలు టాయిలెట్లను ఉపయోగించవలసిన దుర్భర పరిస్థితిని అధికారులు కల్పించారని నివేదిక పేర్కొంది. పోంపానో బీచ్లోని బ్రోవార్డ్ పరివర్తన కేంద్రంలో 44 ఏళ్ల హైతీ మహిళ మేరీ ఏంజ్ బ్లేజ్ ఇటువంటి దుర్భర పరిస్థితుల్లోనే మృతిచెందింది. ఎవర్గ్లేడ్స్లోని అలిగేటర్ అల్కాట్రాజ్ జైలులో సౌకర్యాలు లేనప్పటికీ సరైన పత్రాలు లేని ఐదువేల మంది వలసదారులను ఉంచి, ఇబ్బందుకు గురిచేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. -
జపాన్తో భారీ వాణిజ్య ఒప్పందం.. ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్: జపాన్తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర ప్రకటన చేశారు. టోక్యో తమతో వాణిజ్య ఒప్పందానికి అంగీకరించిందని, దీని ప్రకారం జపాన్ వస్తువులపై అమెరికా 15 శాతం సుంకం విధిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. గతంలో ఈ ఒప్పందానికి జపాన్ అంగీకరించకపోతే ఆగస్టు ఒకటి నుండి 25 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు.జపాన్తో ఒప్పందంపై ట్రంప్ మాట్లాడుతూ అమెరికా, జపాన్లు పరస్పరం 15 శాతం ఒప్పందపు రేటుతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయన్నారు. ఈ ఒప్పందం ప్రకారం తన ఆదేశాల మేరకు జపాన్.. అమెరికాలో 550 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతుందని, ఫలితంగా ఆ దేశం 90 శాతం లాభాలను పొందుతుందని డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తాము జపాన్తో ఒక భారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని, బహుశా ఇప్పటివరకు అమెరికాతో ఆ దేశం చేసుకున్న అతిపెద్ద ఒప్పందం ఇదేనని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో రాశారు. Donald J. Trump Truth Social :We just completed a massive Deal with Japan, perhaps the largest Deal ever made. Japan will invest, at my direction, $550 Billion Dollars into the United States, which will receive 90% of the Profits. This Deal will create Hundreds of Thousands of… pic.twitter.com/GBIUPiey6z— Markets Today (@marketsday) July 23, 2025అయితే ఈ పెట్టుబడులకు సంబంధించిన వివరాలను ట్రంప్ వెల్లడించలేదు. కానీ ఈ ఒప్పందం లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని ట్రంప్ తెలియజేశారు. కార్లు, ట్రక్కులు, బియ్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యానికి గేట్లు తెరుచుకుంటాయని, ఇకపై అమెరికాకు జపాన్ 15 శాతం పరస్పర సుంకాలను చెల్లిస్తుందన్నారు. ఆగస్టు ఒకటి వరకూ విధించిన గడువుకు ముందే వరుస ఒప్పందాలను కుదుర్చుకుంటామని గతంలో పేర్కొన్న ట్రంప్ ప్రస్తుతం అదేపనిలో తలమునకలై ఉన్నారు. ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, బ్రిటన్ వియత్నాంతో ఇటీవలే ఒప్పందాలు పూర్తయ్యాయి. ఇప్పుడు జపాన్తో వాణిజ్య ఒప్పందం కుదిరిందని ట్రంప్ ప్రకటించారు. -
వీనస్ దాకా వెళ్లే గీత లేదు మరి..
అరచేతి గీతల్లోనే అంతా ఉందంటారు.. గీత సరిగా లేకుంటే.. తలరాతే మారిపోతుందంటారు.. మనుషుల వరకూ ఓకే.. మరి ఇదే ‘గీత’ సిద్ధాంతం అంతరిక్ష నౌకలకు కూడా వర్తిస్తే.. గీత సరిగా లేక.. వాటి ‘బతుకు’ రాతే మారిపోతే.. సరిగ్గా 63 ఏళ్ల క్రితం జరిగింది ఇదే!! శుక్ర మహా‘దిశ’ సరిగాలేక... అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా.. భూమికి ఆవల ఉన్న గ్రహాలపై తన తొలి ప్రయోగాలు కొనసాగిస్తున్న సమయం అది.. వీనస్(శుక్రుడు)పై అధ్యయనానికి మెరైనర్–1ను సిద్ధం చేసింది. శుక్ర గ్రహం మీద ఉన్న వాతావరణం, అక్కడి అయస్కాంత క్షేత్రాలు, రేడియేషన్ తదితరాలపై సమాచారాన్ని తెలుసుకోవడానికి దీన్ని తయారుచేశారు. 1962, జూలై 22న దీన్ని ప్రయోగించారు. మొదట్లో అంతా సరిగానే నడిచింది. తర్వాత రాకెట్ ప్రయాణించాల్సిన దిశ మారింది. అదలాగే కొనసాగితే.. ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో నౌకలు అధికంగా తిరిగే ప్రదేశంలో పడే ప్రమాదం ఉంది. దీంతో రేంజ్ సేఫ్టీ ఆఫీసర్ దాన్ని ధ్వంసం చేయడానికి కమాండ్ ఇచ్చారు. ప్రయోగించిన 294 సెకన్ల తర్వాత మెరైనర్–1ను గాల్లోనే పేల్చేశారు. గీత మారిందిలా.. ఈ వైఫల్యానికి కారణంపై ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. చివరికి ఓ చిన్న గీత.. మొత్తం అంతరిక్ష నౌక అదృష్ట గీతనే మార్చేసిందని తేల్చారు. రాకెట్ దిశను నిర్దేశించే సాఫ్ట్వేర్లో ఓవర్బార్(పైన రాసే గీత) మిస్ చేయడం వల్ల ఇది జరిగిందని గుర్తించారు. ఒక ఈక్వేషన్లో రేడియస్కు ఖకు బదులు ఖవచ్చింది. అంతే.. రాకెట్ దిశ మారిపోయింది. దీని వల్ల నాసా ఎంతో విలువైన పాఠాన్ని నేర్చుకుంది. ఈ ప్రయోగం కోసం ఖర్చు పెట్టిన రూ.160 కోట్లు పోవడం సంగతి పక్కనపెడితే.. కోడింగ్ కావచ్చు.. మరేదైనా కావచ్చు.. ఉపగ్రహ ప్రయోగాల్లో చేసే చిన్నపాటి తప్పులు మొత్తం మిషన్ వైఫల్యానికి ఎలా దారి తీస్తాయన్నది తెలుసుకుంది. అయితే, మెరైనర్–1 వైఫల్యం భవిష్యత్ ప్రయోగాలకు బాగా పనికివచ్చింది. తదుపరి మిషన్లన్నిటిలోనూ ప్రతి అంశాన్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేయడం అన్నది పరిపాటిగా మారింది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
పుతిన్తో ముఖాముఖి చర్చలకు సిద్ధం
కీవ్: రష్యాతో జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అధ్యక్షుడు పుతిన్తో నేరుగా చర్చలకు తాను సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మరోసారి ముందుకువచ్చారు. తుర్కియే మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల మధ్య బుధవారం మరో దఫా చర్చలు జరగనున్నాయన్నారు. ఈసారి మరింత మంది యుద్ధ ఖైదీల విడుదలతోపాటు రష్యా నిర్బంధంలో ఉన్న తమ చిన్నారులను తిరిగి అప్పగించాలని కోరుతామన్నారు. అయితే, ఇలాంటి చర్చలతో పెద్దగా ఫలితం కనిపించదని ఆయన పేర్కొన్నారు.యుద్ధాన్ని ఆపేందుకు పుతిన్ ముఖాముఖి చర్చలే మార్గమని చెప్పారు. ‘ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎన్నడూ కోరుకోలేదు. అనవసరమైన ఈ యుద్ధాన్ని మొదలుపెట్టింది రష్యాయే. కాబట్టి, ఆ దేశమే ఈ యుద్ధానికి స్వస్తి చెప్పాలి’అని జెలెన్స్కీ స్పష్టం చేశారు. రెండో ప్రపంచయుద్ధం తర్వాత అతి పెద్ద సంక్షోభానికి ముగింపు పలికేందుకు జెలెన్స్కీ గతంలోనూ పలుమార్లు ముఖాముఖి చర్చలకు ముందుకు వచ్చినా పుతిన్ ముఖం చాటేశారు. కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన పిలుపును సైతం పుతిన్ పట్టించుకోలేదు.ఉక్రెయిన్పై రష్యా గ్లైడ్ బాంబులుమరోవైపు, రష్యా సైన్యం ఉక్రెయిన్ తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లోని వెయ్యి కిలోమీటర్ల పొడవైన యుద్ధక్షేత్రంలో ముందుకు చొచ్చుకువెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోంది. సుమీ, ఒడెసా, క్రమటోర్స్క్ ప్రాంతాల్లోని నాలుగు నగరాలపై ప్రమాదకర గ్లైడ్ బాంబులను ప్రయోగించింది. ఈ దాడుల్లో ఒక చిన్నారి సహా 24 మంది గాయపడ్డారు. క్రమటోర్స్్కలోని ఓ నివాస భవన సముదాయంలో మంటలు చెలరేగాయి. డ్రోన్ దాడితో సుమీలోని పుటివ్ల్లో గ్యాస్ స్టేషన్కు మంటలు అంటుకున్నాయి. ఇలా ఉండగా, మాస్కోతోపాటు పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ ప్రయోగించిన 35 లాంగ్ రేంజ్ డ్రోన్లను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. -
నా బ్యాటరీ నేనే మార్చుకుంటా!
రోబోలు రోజు రోజుకూ తెలివిమీరి పోతున్నాయి. అలసట, శ్రమ, కోపతాపాలేవీ లేకుండా రోజంతా పనిచేయగలవు కాబట్టి మనిషి కూడా వాటికి మరిన్ని హంగులు చేరుస్తున్నాడు. ఈ క్రమంలో బ్యాటరీల్లో ఛార్జీలైపోతే తనంతట తానే వాటిని మార్చుకునే సరికొత్త రోబోను సిద్ధం చేసింది.. యూబీటెక్ కంపెనీ! వాకర్ ఎస్2 అని పిలుస్తున్న ఈ హ్యూమనాయిడ్ రోబోలో రెండు బ్యాటరీలుంటాయి. ఒకదాంట్లో ఛార్జ్ అయిపోతోందని తెలిస్తే చాలు.. ఈ రోబో దగ్గరలో ఏర్పాటు చేసిన బ్యాటరీ స్టేషన్కు వెళ్లి ఒకదాని తరువాత ఒకటి తీసేసి ఫుల్ ఛార్జ్ ఉన్నవాటిని అమర్చుకుంటుంది.ఒక బ్యాటరీలో ఛార్జ్ అయిపోతోంది అనగా వాకర్ ఎస్2 బ్యాటరీ స్టేషన్కు వెళ్లి తన మొండెం భాగాన్ని సరైన పొజిషన్లో ఉంచి చేతుల చివరలో ఉన్న టూల్స్ సాయంతో బ్యాటరీని తొలగించుకుంటుంది. స్టేషన్లోని బ్యాటరీని బిగించుకుంటుంది. వాకర్ ఎస్2లోని కెమెరాలు బ్యాటరీపై ఉండే పచ్చటి లైట్ ఆధారంగా ఎంత ఛార్జ్ అయ్యిందో తెలుసుకుంటుందట. అచ్చం మనిషిలాగే రెండు కాళ్లపై నడిచే ఈ వాకర్ ఎస్2 సుమారు 5.6 అడుగుల ఎత్తు ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో దీన్ని ఆఫ్ చేసేందుకు కూడా ఒక బటన్ ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాల కోసం ఇంకొంత కాలం వేచి ఉండాల్సిందే.విద్యుత్తుతో నడిచే వాహనమైనా, ఇతరాలైనా పనిచేయాలంటే కరెంటు ప్లగ్కు కనెక్ట్ అయినా అయి ఉండాలి. లేదంటే బ్యాటరీలో ఎంతో కొంత ఛార్జ్ ఉండాలి. ఛార్జింగ్ చేసుకునేందుకు కొంత సమయం పడుతుందన్నది మనకు తెలిసిందే. ఇలా కాకుండా సెకన్లలో బ్యాటరీలను మార్చుకునే వాహనాలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.ఈ సౌకర్యాన్ని యూబీటెక్ ఇప్పుడు రోబోలకు అందించిందన్నమాట. ఇట్లాంటి రోబోలున్నాయి అనుకోండి.. ఫ్యాక్టరీల్లో కాఫీ, టీ, లంచ్ బ్రేకుల్లాంటివి అస్సలు ఉండవన్నమాట. అంతేకాదు...బ్యాటరీలు మార్చడానికి మనిషి అవసరమూ ఉండదు. ఫ్యాక్టరీల్లో అక్కడక్కడ బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే సరి. టెస్లా సంస్థకు చెందిన ఆప్టిమస్, టెస్లా బోట్, బోస్టన్ డైనమిక్స్ సిద్ధం చేస్తున్న అట్లాస్, ఫిగర్ ఏఐ రోబోలన్నింటిలో బ్యాటరీలు ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఛార్జ్ అయిపోతే దగ్గరలో ఉండే సాకెట్లోకి ప్లగ్ పెట్టి ఛార్జ్ చేసుకోవాలి. ఒక్క అజిలిటీ రోబోటిక్స్ మాత్రమే బ్యాటరీలను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది-గిళియారు గోపాలకృష్ణ మయ్యాPhotos and video credit to UBtech -
‘మీ ఎకానమీని కూల్చేస్తాం’.. భారత్, చైనాలకు అమెరికా వార్నింగ్
వాషింగ్టన్: ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాను ఆర్ధికంగా దెబ్బకొట్టేందుకు అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) సభ్యుడు లిండ్సే గ్రాహం భారత్, చైనాతో పాటు ఇతర దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. ధర తక్కువగా ఉందని రష్యా వద్ద క్రూడాయిల్ను కొనుగోలు చేయాలని చూస్తే మీ ఆర్ధిక వ్యవస్థను నిట్ట నిలువునా కూల్చేస్తామని ఆయా దేశాలకు వార్నింగ్ ఇచ్చారు.ఇంతకు ముందు గ్రాహం రష్యా నుంచి ఆయా ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తున్న దేశాలపై 500 శాతం టారిఫ్ విధించాలనే ప్రతిపాదనలు తెచ్చారు. ఈ క్రమంలో మరోసారి టారిఫ్ ధరల్ని ప్రస్తావిస్తూ ఆయా దేశాలపై విమర్శలు గుప్పించారు. ఫాక్స్ మీడియాతో మాట్లాడుతూ.. ‘రష్యా వద్ద తక్కువ ధరకే ఆయిల్ దొరుకుతుందని కొనుగోలు చేస్తున్న బ్రెజిల్,చైనాతో పాటు భారత్కు నేను చెప్తున్నది ఒకటే. కీవ్ వద్ద ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలతో ఈ యుద్ధం(టారిఫ్) కొనసాగుతుంది. ఈ యుద్ధంలో సంబంధిత దేశాల్ని చీల్చి చెండాడుతాం. ఆర్ధిక వ్యవస్థను కూల్చేస్తామని పునరుద్ఘాటించారు. మీరు (భారత్,చైనా, బ్రెజిల్) చేస్తున్నది రక్తపాతం. ఎవరైనా అతన్ని ఆపే వరకు అతను (పుతిన్) ఆగడు అంటూనే.. రష్యాపై ప్రత్యక్షంగా బెదిరింపులకు దిగారు. ట్రంప్తో ఆటలాడుకోవాలని చూస్తే ప్రమాదాన్ని ఏరికోరి తెచ్చుకున్నట్లే. మీ చేష్టల ఫలితంగా మీ దేశ ఆర్ధిక వ్యవస్థకే నష్టం వాటిల్లుతుందని ధ్వజమెత్తారు. కాగా, ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యా తీరును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుబడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో యుద్ధాన్ని ఆపేలా చర్చలకు రావాలని ట్రంప్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ఆదేశించారు. ఈ బెదిరింపుల్ని రష్యా ఖండించింది. అమెరికా మాపై ఎలాంటి ఆంక్షలు విధించినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది. Lindsey Graham: Here’s what I would tell China, India and Brazil. If you keep buying cheap Russian oil… we will tariff the hell out of you and we’re going to crush your economy pic.twitter.com/x05J3G8oOk— Acyn (@Acyn) July 21, 2025 -
నదిలో లైవ్ రిపోర్టింగ్.. వెన్నులో వణుకుపుట్టించే వీడియో
నిజంగానే.. ఆ న్యూస్ రిపోర్టర్కు వెన్నులో వణుకు పుట్టించిన ఘటనే ఇది. ఓ బాలిక మిస్సింగ్ కేసులో లైవ్ రిపోర్టింగ్ చేస్తుండగా భయానక అనుభవం ఎదురైంది అతనికి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింటకు చేరింది. బ్రెజిల్లోని బాకబాల్ రీజియన్ మారాన్యో ప్రాంతంలో రయిస్సా అనే 13 ఏళ్ల బాలిక జూన్ 30వ తేదీన అదృశ్యమైంది. మియరిమ్ నదిలో స్నేహితులతో ఈతకు వెళ్లి కొట్టుకుపోయింది. గత ఈతగాళ్లు ఎంత గాలించిన ఫలితం లేకుండా పోయింది. అయితే పోలీసులు మాత్రం మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని ఆమె ఆచూకీ కోసం గాలిస్తూనే ఉన్నారు. ఈలోపు.. టీవీ రిపోర్టర్ లెనిల్డో ఫ్రాజావో నీళ్లలోకి దిగి బాలిక మిస్సింగ్ కేసు వార్తకు సంబంధించి రిపోర్టింగ్ చేస్తూ కనిపించాడు. ఇంతలో అతని కాళ్లకు ఏదో తాకింది. తీరా చూస్తే అది ఆ బాలిక మృతదేహం!!. దీంతో ఒక్కసారిగా వణికిపోయిన అతను.. ఇక్కడేదో తాకుతుందంటూ తన టీంనుఅప్రమత్తం చేసే ప్రయత్నం చేశాడు. మళ్లీ లోపలకు వెళ్లను.. అక్కడేదో తాకుతోంది. బహుశా చెయ్యి అనుకుంటా అంటూ వణికిపోతున్న గొంతుతో చెప్పాడు.వెంటనే ఆ బృందం పోలీసులకు సమాచారం అందించింది. వాళ్లు ఆ బాలిక మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్మార్టంకు తరలించారు. నీట మునిగే ఆమె చనిపోయిందని.. బహుశా ఆ మృతదేహం నది అడుగుభాగంలోని మట్టిలో ఇంతకాలం కూరుకుపోయి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఆ రిపోర్టర్కు భయానక అనుభవం మిగిల్చిన వీడియో కిందే ఉంది! చూసేయండి.. A Brazilian TV reporter may have stumbled onto the body of a missing 13-year-old girl during a live segment from the very river she vanished inLenildo Frazão was waist-deep in the Mearim River, demonstrating the water’s depth on camera in Bacabal, Maranhão — the last place the… pic.twitter.com/0i3y13fsZ9— Re:Flex (@re_flex_world) July 21, 2025 -
ఆయన నన్ను అదోలా చూస్తూ ఉండిపోయాడు
అమెరికాను కుదిపేసిన లైంగిక కుంభకోణం ఎప్స్టీన్ ఫైల్స్లో.. అమెరికా విజువల్ ఆర్టిస్ట్ మరియా ఫార్మర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై సంచలన ఆరోపణలకు దిగారు. ఈ వ్యవహారంలో ట్రంప్ పాత్రపైనా ఎఫ్బీఐ దర్యాప్తు జరగాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారామె.1996లో మరియా ఫార్మర్ ఫిర్యాదుతోనే జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ ట్రాఫికింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రముఖ ఫైనాన్షియర్ ఎప్స్టీన్తో పాటు అతని సన్నిహితురాలైన గిస్లేన్ మాక్స్వెల్పై కేసులు నమోదు అయ్యాయి. అటుపై ఈ వ్యవహారంలో పలువురు ప్రముఖులు ఉన్నారన్న ఆరోపణల నడుమ.. అగ్రరాజ్యంలో ఈ కేసు సంచలనాత్మకంగా మారింది.తాజాగా.. న్యూయార్క్ టైమ్స్కి మరియా ఫార్మర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ట్రంప్నూ ఎఫ్బీఐ విచారించాలని కోరారామె. అది 1995లో ఓ అర్ధరాత్రి. నేను మాన్హట్టన్లోని ఎప్స్టీన్ ఆఫీస్లో ఉన్నా. కాస్త కురచైన దుస్తులే నేను వేసుకుని ఉన్నా. ఇంతలో సూట్లో ఓ వ్యక్తి వచ్చారు. నా కాళ్ల వంకే చూస్తూ ఉండిపోయారు. ఇంతలో ఎప్స్టీన్ లోపలికి నడుచుకుంటూ వచ్చారు. ‘‘లేదు.. లేదు.. ఆమె నీకోసం రాలేదు’’ అంటూ ఆయన్ని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఆ సమయంలో ‘‘ఆ పిల్లకి 16 ఏళ్లు ఉంటుందా?’’ అని ఆయన ఎప్స్టీన్ను అడగడం నేను విన్నాను అని ఫార్మర్ చెప్పుకొచ్చారు. ఆ వ్యక్తి ఎవరో కాదని.. డొనాల్డ్ ట్రంప్ అని ఆమె బాంబ్ పేల్చారు.అయితే ఎప్స్టీన్తో ఉండగా ట్రంప్ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఏనాడూ తాను చూడలేదని, కానీ, ఆరోజు జరిగింది మాత్రం తాను జీవితాంతం గుర్తు పెట్టుకున్నానని అన్నారామె. ‘‘ఎన్నో ఏళ్లు గడుస్తున్నా ఇది నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదే విషయాన్ని నేను 1996, 2006లో ఎఫ్బీఐ ముందు చెప్పాను. కానీ, ఇప్పటిదాకా ఆయన్ని దర్యాప్తు సంస్థ విచారించలేదు. ఎందుకు?’’ అని ప్రశ్నించారామె. అయితే..ఎప్స్టీన్ వ్యవహారంలో(ఫైల్స్లోనూ) ఇప్పటిదాకా ట్రంప్ పాత్ర ఉన్నట్లుగానీ, కనీసం అనుమానితుడిగానైనా ఆయన పేరు ఉన్నట్లుగానీ ఏ దర్యాప్తు సంస్థ చెప్పలేదు. ఇక మరియా ఫార్మర్ తాజా ఆరోపణలను వైట్హౌజ్ వర్గాలు కొట్టిపారేశాయి. ‘‘ఎప్స్టీన్ ఆఫీస్కు అధ్యక్షుడు ట్రంప్ ఏనాడూ వెళ్లింది లేదు. పైగా అతని(ఎప్స్టీన్)పై ఆరోపణలు రాగానే తన క్లబ్ నుంచి ట్రంప్ బయటకు పంపించేశారు కూడా’’ అని కమ్యూనికేషన్ డైరెక్టర్ స్టీవెన్ షెవుంగ్ మీడియాకు తెలిపారు. ప్రెస్ సెక్రటరీ కరోలీన్ లీవిట్ న్యూయార్క్ టైమ్స్ కథనాలను తీవ్రంగా తప్పుబట్టారు. జెఫ్రీ ఎప్స్టీన్కు ట్రంప్ నడుమ మధ్య సంబంధాలు ఉన్నాయని చెప్పేందుకు.. తిరగదోడి మరీ చెత్తను ప్రచురిస్తున్నారంటూ మండిపడ్డారు.ట్రంప్-ఎప్స్టీన్ మధ్య సంబంధాల గురించి చర్చ దశాబ్దాలుగా నడుస్తోంది. ఈ ఇద్దరూ కలిసి పలు పార్టీల్లో పాల్గొన్న ఫొటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఈ విషయంలో ట్రంప్ మద్దతుదారులే తరచూ ఆయన్ని తరచూ విమర్శిస్తుండడం గమనార్హం. అయితే ట్రంప్ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తూ వస్తున్నారు. లైంగిక ఆరోపణల తర్వాత అతనికి(ఎప్స్టీన్) దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు.2003లో ఎప్స్టీన్కు ట్రంప్ బర్త్డే విషెస్.. అది కూడా విచిత్రంగా చెప్పారంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ఇచ్చింది. ఈ కథనంపై భగ్గుమన్న ట్రంప్.. సదరు వార్తా సంస్థపై 10 బిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేశారు. ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ మరియా ఫార్మర్ ఇంటర్వ్యూను ప్రచురించడంపై ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి.అమెరికాలో సంచలనం సృష్టించింది జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం. ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలూ ఉన్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది ఈ స్కామ్కు సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్లో ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయని గతంలో దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి.ప్రముఖ ఇన్వెస్టర్ అయిన ఎప్స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. ఇదే కేసులో అరెస్టైన ఎప్స్టీన్ సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్వెల్పై.. అమ్మాయిలను, బాలికలను సరఫరా చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. చైల్డ్సెక్స్ ట్రాఫికింగ్ కేసులో 2021లో ఆమెకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం అమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తోంది. ఈ కేసులో ఉపశమనం కోసం ఆమె సుప్రీం కోర్టులో అప్పీల్ చేయగా.. అది విచారణ దశలో ఉంది. -
‘అతిథే కాదు లగేజీ దేవోభవ’.. 30 ఏళ్లలో ఒక్క బ్యాగూ మిస్సవని విమానాశ్రయం
టోక్యో: ప్రపంచంలోని ఏ విమానాశ్రయానికీ దక్కని ఘనతను జపాన్లోని ఆ విమానాశ్రయం సొంతం చేసుకుంది. అదే కాన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (కిక్స్). గడచిన 30 ఏళ్లలో ఈ విమానాశ్రయంలో ఒక్క లగేజీ కూడా మిస్ కాలేదంటే ఒక పట్టాన నమ్మలేం.. కానీ ఇది ముమ్మాటీకీ నిజం. 2024లో ఈ విమానాశ్రయం ప్రపంచంలోని ఉత్తమ లగేజీ డెలివరీ విమానాశ్రయంగా గుర్తింపు పొందుతూ మరోమారు ‘స్కైట్రాక్స్’ అవార్డును దక్కించుకుంది.ఒసాకాలోని ఈ కన్సాయ్ విమానాశ్రయం 1994లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. ఇప్పటివరకు ఇది ఏటా మూడు కోట్ల ప్రయాణికులకు సేవలు అందిస్తూ వస్తోంది. ఇప్పటి వరకూ ఈ విమానాశ్రయం ఎనిమిది సార్లు ‘స్కైట్రాక్స్’ అవార్డును గెలుచుకుంది. లగేజీ పికప్కు ముందు వేచి ఉండే సమయం, లగేజీ డెలివరీ సామర్థ్యం, పోగొట్టుకున్న లగేజీల ఆధారంగా వివిధ గణాంకాలు సేకరించి, ఈ అవార్డును అందజేస్తారు. ఈ విమానాశ్రయం 2023 ఆర్థిక సంవత్సరంలో సుమారు కోటి లగేజీలను అందజేసింది.కిక్ విమానాశ్రయం ట్రాక్ రికార్డ్ ఇంత విజయవంతం కావడానికి కారణం ఇక్కడి ‘మల్టీలేయర్డ్ చెకింగ్ వర్క్’. ప్రతి బ్యాగేజీని పరిరక్షించేందుకు విమానాశ్రయ విభాగం ముగ్గురు సిబ్బందిని ప్రత్యేకంగా కేటాయించింది. తప్పులను, పొరపాట్లను నివారించేందుకు బహుళ సిబ్బంది సమాచారాన్ని పంచుకోవడం చాలా ముఖ్యమని లగేజీ కార్యకలాపాలను పర్యవేక్షించే సుయోషి హబుటా నిక్కీ తెలిపారు. విమానం వచ్చిన 15 నిమిషాలలోపు ప్రయాణికుల లగేజీలను వారికి అందించడం వారి లక్ష్యంగా ఈ విమాశ్రయ సిబ్బంది పనిచేస్తుంటారు. జపాన్ ప్రజలు అనుసరించే ఆతిథ్య కళ ‘ఓమోటేనాషి’ని ఇక్కడి సిబ్బంది ఆకళింపు చేసుకున్నారు. ప్రయాణికుల లగేజీని వారికి అందించడమనేది ఒక హామీ అని వారు నమ్ముతారు. ఇక్కడి ప్రతి సూట్కేస్ను ఇటు డిజిటల్ పద్దతిలో, అటు భౌతికంగానూ డ్యూయల్ ట్యాగింగ్ సిస్టమ్తో ట్రాక్ చేస్తారు. ఫలితంగా ఏ బ్యాగు కూడా మిస్సయ్యే అవకాశం ఉండదు. ఇక్కడి సిబ్బందికి లాజిస్టిక్స్లో మాత్రమే కాకుండా మానవ తప్పిదాలను ఊహించడంలోనూ శిక్షణ అందిస్తారు. బ్యాగేజీ విషయంలో అవకతవకలు జరిగితే, బ్యాగ్ విమానం నుండి బయటకు వెళ్లే ముందే హెచ్చరిక వ్యవస్థ అప్రమవుతుంది. పర్యాటకులు ఈ విమానాశ్రయాన్ని ‘ప్రయాణికులతో పాటు వారి లగేజీని కూడా గౌరవించే విమానాశ్రయం’ అని ప్రశంసిస్తుంటారు. -
‘భారత్-పాక్ మధ్యవర్తిత్వంలో ట్రంప్ కీలకం’: వైట్ హౌస్ వంతపాట..
వాషింగ్టన్: భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న అశాంతిని చల్లార్చడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించారని యూఎస్ఏ అధికార కార్యాలయం వైట్హౌస్ పునరుద్ఘాటించింది. ట్రంప్ అధికార యంత్రాంగంలోని పలువురు అధికారులు కూడా ఇదే వాదన వినిపిస్తున్నారు.భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని అధ్యక్షుడు ట్రంప్ నిలిపివేశారని, అలాగే రష్యా- ఉక్రెయిన్ మధ్య సంధికి మధ్యవర్తిత్వం వహించారని వైట్హైస్ మరోమారు వాదనకు దిగింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మీడియాతో మాట్లాడుతూ అధ్యక్షుడు ట్రంప్.. గాజాలో శాంతి ఒప్పందంపై చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారని, అతని ప్రయత్నాల కారణంగా పలువురు బందీలు విడుదలయ్యారని అన్నారు. ట్రంప్ ఆదేశాల దరిమిలా ఇరాన్లోని అణు సౌకర్యాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు.‘మేము చాలా యుద్ధాలను ఆపాం. భారత్- పాకిస్తాన్లు అణ్వాయుధ దేశాలు. ఇవి పరస్పరం ఘర్షణపడుతున్నాయి. ఈ దేశాల మధ్య జరిగే యుద్ధాన్ని నిలువరించాం. ఇటీవల ఇరాన్లో మేము ఏమి చేసామో అందరూ చూశారు. ఆ దేశ అణ్వాయుధ సామర్థ్యాన్ని ధ్వంసం చేశాం. భారత్- పాక్ మధ్య జరిగే యుద్ధాన్ని వాణిజ్యం ద్వారా పరిష్కరించామని కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. అయితే భారత్-పాక్ల మధ్య కాల్పుల విరమణ విషయంలో మూడవ పక్షం ప్రమేయం లేదని భారత్ స్పష్టం చేసింది. -
ఇజ్రాయెల్ ఆర్మీ యథేచ్ఛగా కాల్పులు
గాజా/లండన్: గాజాలోని అన్నార్తుల పట్ల ఇజ్రాయెల్ అనుసరిస్తున్న వైఖరిని ఐరాస తీవ్రంగా ఖండించింది. ఆహార కేంద్రాల వద్దకు వచ్చే వారిపై ఇజ్రాయెల్ ఆర్మీ యథేచ్ఛగా కాల్పుల జరుపుతోందంటూ మండిపడింది. ఆదివారం ఒక్క రోజే 80 మంది ఉసురుతీయడాన్ని ప్రస్తావించిన ఐరాస ఆహార విభాగం(డబ్ల్యూఎఫ్పీ)..పాలస్తీనియన్ల పాలిట భయంకరమైన రోజుల్లో ఒకటని అభివర్ణించింది. ఆదివారం ఆహార పదార్థాలతో గాజానగరంలోకి ప్రవేశించిన ట్రక్కుల దిశగా వెళ్తున్న వారిపైకి ఇజ్రాయెల్ ఆర్మీ కాల్పులు జరపడంతో భారీ సంఖ్యలో జనం చనిపోవడం తెల్సిందే. కాగా, డబ్ల్యూఎఫ్పీ ప్రకటనపై ఇజ్రాయెల్ స్పందించలేదు. ఇలా ఉండగా, ఆదివారం రాత్రి నుంచి గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ సాగించిన వైమానిక దాడుల్లో ఇద్దరు మహిళలు, ఐదుగురు చిన్నారులు సహా 13 మంది చనిపోయారు.సెంట్రల్ గాజాలోని నెట్జరిమ్ కారిడార్ వద్ద గుంపుగా చేరిన పాలస్తీనియన్లపై జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. హమాస్ శ్రేణులు లక్ష్యంగా 21 నెలలుగా యథేచ్ఛగా ఇజ్రాయెల్ ఆర్మీ సాగిస్తున్న దాడుల్లో మరణాలు 59 వేలు దాటాయని గాజా ఆరోగ్య విభాగం సోమవారం తెలిపింది. 2023 అక్టోబర్ 7 నుంచి సాగిస్తున్న దాడుల్లో క్షతగాత్రుల సంఖ్య 1,42,135కు చేరుకుందని వివరించింది.తక్షణమే హింస ఆగిపోవాలి గాజాపై సాగిస్తున్న దాడులను వెంటనే నిలిపివేయాలని యూకే, ఫ్రాన్స్ తదితర 23 దేశాలు ఇజ్రాయెల్ను కోరాయి. అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను గౌరవించాలని హితవు పలికాయి. ఇందులో 20 యూరప్ దేశాలతోపాటు ఆ్రస్టేలియా, కెనడా, జపాన్ ఉన్నాయి. ఆయా దేశాల విదేశాంగ శాఖ మంత్రులు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గాజా పౌరుల అవస్థలు ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరాయి. నీరు, ఆహారం వంటి కనీస అవసరాలను తీర్చాలని కోరుతున్న పాలస్తీనా పౌరులు, ముఖ్యంగా చిన్నారులను అమానవీయంగా చంపడం ఆపాలని వారు కోరారు. -
స్కూల్పై కూలిన జెట్
ఢాకా: ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటూ తరగతి గదిలో ప్రశాంతంగా కూర్చున్న విద్యార్థులపై అకస్మాత్తుగా ఆకాశం నుంచి మృత్యువు యుద్ధవిమానం రూపంలో దూసుకొచ్చింది. చైనా తయారీ ఎఫ్–7బీజీఐ శిక్షణ యుద్ధవిమానం ఉన్నపళంగా పాఠశాలపై కుప్పకూలడంతో పాఠశాల విద్యార్థులుసహా 20 మంది సజీవదహ నమయ్యారు. వీరిలో 16 మంది చిన్నారులు, ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక పైలట్ ఉన్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఈ ఘోర విమానప్రమాదం సోమవారం మధ్యాహ్నం 1.15 గంటలకు సంభవించింది. కాలినగాయాలతో రక్తమోడుతున్న మరో 171మందిని హుటాహుటిన ఆస్పత్రులకు తరలించి చికిత్సనందిస్తున్నారు. ఢాకా నగరంలోని ఉట్టారా పరిధిలోని డియాబరీ ప్రాంతంలోని మైల్స్టోన్ స్కూల్, కాలేజీ క్యాంపస్పై ఈ శిక్షణవిమానం కుప్పకూలిందని బంగ్లాదేశ్ ఫైర్ సర్వీస్, సివిల్ డిఫెన్స్ విభాగ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ జహీద్ కమల్ చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. విమానంలో అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తడంతో అది అదుపుతప్పి ఇలా పాఠశాలపై పడిపోయిందని తెలుస్తోంది. ఒక్కసారిగా పాఠశాల మంటల్లో చిక్కుకుపోవడంతో స్థానికులు హుటాహుటిన వచ్చి రక్తసిక్తమైన చిన్నారులను రిక్షాలు, ఆటోల్లో దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించారు. విషయం తెల్సుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ‘‘కుర్మిటోలాలోని ఏకే ఖాన్దాకర్ వైమానిక స్థావరం నుంచి సోమవారం ఉదయం ఒంటిగంట ఆరు నిమిషాలకు బయల్దేరిన శిక్షణవిమానం కొద్దిసేపటికే అదుపుతప్పింది. పరిస్థితి సెకన్లలో పసిగట్టిన పైలట్ తౌకిర్ విమానాన్ని జనావాస ప్రాంతం మీద నుంచి దూరంగా తీసుకెళ్లేందుకు మళ్లించే ప్రయత్నంచేశారు. కానీ ఆలోపే విమానం వేగంగా కిందకు పడిపోయింది’’ అని బంగ్లాదేశ్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ సమీ ఉద్ దౌలా చెప్పారు. ఘటనపై దర్యాప్తునకు కమిటీని ఏర్పాటుచేశామని దౌలా అన్నారు.మిన్నంటిన రోదనలువిగతజీవులుగా మారిన చిన్నారులను చూసి పిల్లల తల్లిదండ్రులు దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్న దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. కూలిన భవనం, చెల్లాచెదురుగా పడిన విద్యార్థుల మృతదేహాలు, తల్లిదండ్రుల ఆక్రందనలు, సహాయక చర్యలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. క్షతగాత్రులను తరలించేందుకు డజన్లకొద్దీ అంబులెన్సులు ఘటనాస్థలికి చేరుకున్నాయి. విమానం సృష్టించిన బీభత్సం ధాటికి నేలమట్టమైన పాఠశాల శిథిలాల కింద నుంచి 20 మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన వారిలో ఎనిమిది మంది ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కంబైన్డ్ మిలటరీ ఆస్పత్రి, ఢాకా మెడికల్ బోధ నాస్పత్రి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ(ఎన్ఐబీపీఎస్)లో పలువురికి చికిత్స నందిస్తున్నారు. మా ఆస్పత్రికి తీసుకొస్తున్న క్షతగా త్రుల సంఖ్య పెరుగుతోందని ఎన్ఐబీపీఎస్ వైద్యు డొకరు మీడియాతో చెప్పారు. విమానాన్ని నడిపిన పైలట్ లెఫ్టినెంట్ మొహమ్మద్ తౌకిర్ ఇస్లామ్ సైతం ప్రాణాలు కోల్పోయాడు. ఎఫ్–7బీజీఐ విమానం భారీ పేలుడుతో నాలుగంతస్తుల పాఠశాల భవనంపై కూలిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. రక్తసి క్తమైన మృతదేహాలను ఒకటి నుంచి ఏడో తరగతి క్లాసుల్లో వరుసగా పేర్చారని అక్కడి ఒక ఉపాధ్యా యుడు చెప్పారు. ‘‘ చిన్నపిల్లల క్లాసులు అయిపో యాయి. ఫైనల్ బెల్ కొట్టాం. ఆనందంగా పిల్లలు బ్యాగులు సర్దుకుని లైన్లలో నిల్చుని బయటకు వెళ్తున్నప్పుడే విమానం కూలింది. చుట్టూతా మంటలే. ఆ మంటలు, దట్టమైన పొగలో అసలేం కనిపించలేదు. నా రెండు చేతులు కాలిపోయాయి. ఊపిరాడలేదు’’ అని ఒక ఉపాధ్యాయురాలు ఆ భ యానక దృశ్యాన్ని గుర్తుచేసుకున్నారు. ‘‘ మధ్యాహ్నం 1.15 గంటల ప్రాంతంలో క్లాసులు జరు గుతున్నాయి. హఠాత్తుగా విమానం నా కళ్లెదుటే కుప్పకూలింది. నాకు కేవలం 10 అడుగుల దూరంలో అది కూలడం చూశా. ప్రైమరీ స్కూల్ పిల్లలకు పాఠాలు చెప్పే రెండంతస్తుల బిల్డింగ్ గ్రౌండ్ఫ్లోర్ను విమానం ఢీకొట్టింది’’ అని ప్రాంగణంలో 11వ గ్రేడ్ చదువుతున్న ఫహీమ్ హుస్సేన్ అనే విద్యార్థి భయపడుతూ చెప్పాడు. Bangladesh Air Force China Made FT-7BGI (training) aircraft, tail no. 701, crashes in Uttara near Milestone College. 1:06pm and crashed into the college campus soon after.Casualties : at least 6-7 min. pic.twitter.com/0vg4bvjD86— (((Bharat)))🚨™️🕉🚩🔱 🇮🇳 🇮🇱🇷🇺🇺🇸🎗 (@Topi1465795) July 21, 2025 -
ఇస్కాన్ రెస్టారెంట్లోకి చికెన్ తెచ్చిన యువకుడు.. తీవ్ర విమర్శలు
ఇస్కాన్ ఆలయాలను కృష్ణ భక్తులు ఎంతో పరిత్రమైనవిగా భావిస్తారు. ఇక్కడ నిత్యం పూజలు, భజనలు జరుగుతుంటాయి. ఇక్కడికి వచ్చేవారు ఆలయంలోని వాతావరణానికి ముగ్ధులువుతుంటారు. ప్రశాంతతకు ఇస్కాన్ ఆలయం చిరునామా అని చెబుతుంటారు. అయితే తాజాగా ఒక ఇస్కాన్ ఆలయంలో ప్రశాంతతను భంగపరిచే ఉదంతం చోటుచేసుంది. అది వైరల్గా మారింది.లండన్లోని ఇస్కాన్ గోవింద రెస్టారెంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆఫ్రికన్ సంతతికి చెందిన ఒక యువకుడు కేఎఫ్సీ చికెన్ బాక్స్తో ప్రాంగణంలోకి ప్రవేశించి, దానిని తినడం మొదలుపెట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిని చూసిన పలువురు నెటిజన్లు ఇదొక రెచ్చగొట్టే చర్యగా, ఉద్దేశపూర్వకంగా చేసిన పనిగా అభివర్ణించారు. వైరల్గా మారిన ఆ వీడియోలో గోవింద రెస్టారెంట్కు చికెన్ తీసుకువచ్చిన ఆ యువకుడు అక్కడి సిబ్బందితో ‘మాంసాహారం ఉందా?’ అని అడుగుతున్నట్లు కనిపిస్తుంది. అయితే ఆ రెస్టారెంట్లో శాఖాహార వంటకాలు మాత్రమే ఉంటాయని తెలియగానే, ఆ యువకుడు కేఎఫ్సీ అతను కేఎఫ్సీ బాక్స్ నుండి చికెన్ను తీసి, కౌంటర్ దగ్గరే తినడం ప్రారంభిస్తాడు. SHOCKING NEWS 🚨 African-British man forcibly eats chicken at ISKCON Govinda’s restaurant in London.MAN (Enters): Only veg food here?STAFF: Yes, only vegetarian food. What would you like?Then he pulled out KFC chicken and began eating it inside 😳He even offered the… pic.twitter.com/ISWyTwwBf0— Times Algebra (@TimesAlgebraIND) July 20, 2025తరువాత అతను తన దగ్గరునున్న చికెన్ను అక్కడున్న అందరికీ చూపిస్తాడు. ఇంతలో అక్కడి సిబ్బంది అతనిని వారించగా, అతను వారితో వాగ్వాదానికి దిగుతాడు. దీంతో వారు సెక్యూరిటీ సాయంతో అతనిని ఆలయ ప్రాంగణం నుంచి బయటకు పంపిస్తారు. ఇస్కాన్లోకి చికెన్ తెచ్చిన యువకునిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు అతనిపై పలువురు దుమ్మెత్తి పోస్తున్నారు. మరికొందరు దీనిని జాతివివక్ష చర్యగా పేర్కొంటున్నారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలు చేసివుంటారని ఆశిస్తున్నానని ఒక యూజర్ పేర్కొన్నారు. హిందువులు ప్రతీకారం తీర్చుకోరని భావించిన అతను ఈ పనికి పాల్పడి ఉంటాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
ట్రంప్ కసి.. ఒబామా అరెస్టు అంటూ ఏఐ వీడియో
సంచలన ఆరోపణల వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేసిన ఓ వీడియో తీవ్ర చర్చనీయాంశమైంది. ‘చట్టానికి ఎవరూ అతీతులు కాదని’ సందేశంతో ఆయన ఆ పోస్ట్ చేశారు. అయితే మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అరెస్ట్ అయిన నేపథ్యంతో ఉన్న ఏఐ వీడియోను తన ట్రూత్ ప్లాట్ఫారమ్లో పోస్ట్ చేయడం గమనార్హం. ఓవల్ ఆఫీసులో ట్రంప్తో భేటీ అయిన సందర్భంలో మాజీ అధ్యక్షుడు ఒబామాను ఎఫ్బీఐ అరెస్టు చేసినట్లుగా ఆ వీడియో ఉంది. ఒబామా చేతుల్ని వెనక్కి విరిచి మరీ అధికారులు బేడీలు వేశారు. ఆ సమయంలో నవ్వుతూ కనిపించారు ట్రంప్. అటుపై ఒబామా కటకటాల్లో ఉన్నట్లు ఆ వీడియోలో ఉంది. అంతకంటే ముందు ఈ వీడియోలో.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని పలువురు నేతలు చెప్పిన సందేశాన్ని దానికి జత చేశారు. ఆ నేతల్లో ముందుగా ఉంది ఒబామానే కావడం గమనార్హం. Donald #Trump reposts AI-generated video depicting Barack #Obama being arrested.#MAGA | #USApic.twitter.com/crkL8bew9l— Shivanshi Singh (@Shivansshi) July 21, 2025 అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై సంచలన ఆరోపణలకు దిగారు. 2016లో ట్రంప్ విజయం టైంలో ఒబామా ప్రభుత్వం కుట్రలకు తెర తీసిందని.. రష్యా ఎన్నికల జోక్యంపై కల్పిత ఇంటెలిజెన్స్ నివేదికలు తయారు చేయించారని, తద్వారా ట్రంప్ అధ్యక్ష పదవికి అర్హత లేదని చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారామె. ఈ క్రమంలో ఆమె అమెరికా న్యాయవిభాగానికి US Department of Justiceకి కొన్ని డాక్యుమెంట్లు సమర్పించినట్లు సమాచారం. Treason, Tulsi & Trump! Gabbard has accused #BarackObama of 'weaponizing intelligence' against #DonaldTrunp in 2016 - I explain why timing and intention of this huge claim is being questioned 👇#EpsteinFiles #TulsiGabbard pic.twitter.com/orQbiEICNK— Shreya Upadhyaya (@ShreyaOpines) July 20, 2025 ఈ వ్యవహారంపై రిపబ్లికన్ నేతలు గబ్బార్డ్కు మద్దతు తెలుపుతూ.. ఆమెపై ప్రశంసలు గుప్పించారు. అయితే డెమోక్రట్లు మాత్రం ఈ ఆరోపణలను రాజకీయ ప్రేరణతో కూడినవిగా, ఆధారాలు లేనివిగా అభివర్ణించారు. మరోవైపు Obama ఇంకా ఈ ఆరోపణలపై స్పందించలేదు. అయితే ఈ ఆరోపణలు వెల్లువెత్తిన మరుసటిరోజే ట్రంప్ ఇలా ఓ ఏఐ వీడియో తన అధికారిక ఖాతాలో పోస్ట్చేయడం గమనార్హం. -
హమాస్ కమాండర్ హతం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ సైనిక దళం గాజాలో 75 ఉగ్రవాద లక్ష్యాలపై దాడి చేసింది. ఫలితంగా నగరంలో దట్టమైన పొగతో పాటు మంటలు ఎగసిపడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. హమాస్ కమాండర్ బషర్ థాబెట్ను ఐడీఎఫ్ హతమార్చింది. హమాస్ అభివృద్ధి ప్రాజెక్టుల విభాగంలో కీలకంగా వ్యవహరిస్తున్న సీనియర్ కమాండర్ బషర్ థాబెట్ మృతిని ఇజ్రాయెల్ రక్షణ దళాలు ధృవీకరించాయి. హమాస్ ఆయుధ ఉత్పత్తి, పరిశోధన కార్యకలాపాలను పర్యవేక్షించడంలో పేరొందిన థాబెట్.. ఇజ్రాయెల్ దాడుల్లో హతం కావడం హమాస్కు తీరనిలోటుగా పరిణమించింది. ఐడీఎఫ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆపరేషన్ హమాస్ ఉపయోగించే ఆయుధాల తయారీ ప్రదేశాలు, కీలక ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది.ఇజ్రాయెల్ వైమానిక దళం (ఐఎఎఫ్)గాజాలోని సైనిక స్థావరాలు, సెల్ సైట్లతో సహా దాదాపు 75 లక్ష్యాలను విజయవంతంగా ఢీకొట్టిందని ఐడీఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. యుద్ధం కారణంగా పరిస్థితులు అంతకంతకూ క్షీణిస్తున్న తరుణంలో ఇజ్రాయెల్ ఈ తాజా ఆపరేషన్ జరిపింది. గడచిన 24 గంటల్లో 115 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్ నిరంతర దాడుల కారణంగా ఆహారం, నీరు, వైద్య సామాగ్రి కొరత ఏర్పడి మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.గాజాలో ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ, ట్యునీషియా, ఇరాక్, టర్కీ, లెబనాన్, మొరాకోతో సహా అనేక దేశాలలో నిరసనలు కొనసాగుతున్నాయి. సంఘర్షణలు తీవ్రతరం అవుతున్న తరుణంలో ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లోని పాలస్తీనియన్లు.. ఇజ్రాయెల్ స్థిరనివాసుల నీటి వనరులపై దాడులను మరింతగా పెంచారు. ఇరువర్గాల మధ్య శాంతి చర్చలు స్తబ్దుగా ఉండటంతో, కాల్పుల విరమణకు అవకాశాలు అనిశ్చితంగానే ఉన్నాయి. ఫలితంగా గాజాలో మానవతా సంక్షోభం మరింతగా పెరుగుతూ వస్తోంది. -
పాప్కార్న్ రోబోలు వచ్చేస్తున్నాయ్
లాస్ ఏంజెలెస్: వేడివేడి పాప్కార్న్ కావాలంటే చెఫ్కే చెప్పనక్కర్లేదు. తమ హ్యూమనాయిడ్ రోబోట్కు చెప్పినా చకచకా చేసి ఇచ్చేస్తుందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చెప్పారు. తమ ‘టెస్లా’ సంస్థ అభివృద్ధిచేస్తున్న హ్యూమనాయిడ్ రోబో త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుందని మస్క్ ప్రకటించారు. లాస్ఏంజెలెస్ నగరంలోని ప్రఖ్యాత హాలీవుడ్ ప్రాంతంలో టెస్లా కొత్తగా ‘డిన్నర్, సూపర్చార్జర్’ అనే రెస్టారెంట్, చార్జింగ్ స్టేషన్ను ఏర్పాటుచేస్తోంది. ఇందులో ఆప్టిమస్ పేరిట ఒక రోబోట్ను అందుబాటులోకి తేనున్నారు.ఇది పోప్కార్న్ను ఎప్పటికప్పుడు తాజాగా తయారుచేసి అతిధులు, వినియోగదారులకు అందిస్తుంది. సంబంధిత వీడియోను మస్క్ తన ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్చేశారు. అడిగిందే తడవుగా కస్టమర్కు కవర్లో పాప్కార్న్ను సర్వ్చేయడం, ప్రతిగా ధన్యవాదాలు తెలిపిన కస్టమర్కు రోబోట్ చేయి ఊపుతూ అభివాదంచేయడం ఆ వీడియోలో ఉంది. ‘‘ ఈరోజు ఇంటర్నెట్లో చూడదగ్గ వీడియో ఉందంటే అది ఇదే. కస్టమర్కు ఆప్టిమస్ ఎంత చక్కగా, పద్ధతిగా, మర్యాదగా సర్వ్ చేస్తోందో చూడండి. ఇదంతా త్వరలో సర్వసాధారణ విషయంగా మారబోతోంది’’ అని మస్క్ ‘ఎక్స్’లో క్యాప్షన్ పెట్టారు.హాలీవుడ్లోని శాంటామోనికా బోల్వార్డ్ ప్రాంతంలో ఈ అధునాతన డిన్నర్, సూపర్చార్జర్ రెస్టారెంట్, చార్జింగ్ స్టేషన్ను నిర్మిస్తున్నారు. ‘‘ భవిష్యత్తులో ఈ రోబోలు మన దైనందిన జీవిత పనులన్నీ చేస్తూ మనకు సాయంగా ఉంటాయి. మనం కూర్చున్న చోటుకే వచ్చి మనకు కూల్డ్రింక్స్ అందిస్తాయి. పెంపుడు శునకాన్ని అలా బయట వాకింగ్కు తీసుకెళ్తాయి. పిల్లలను ఆడిస్తాయి’’ అని గతేడాది అక్టోబర్లో జరిగిన రోబోల సంబంధ ‘మనం’ కార్యక్రమంలో మస్క్ వ్యాఖ్యానించారు. -
కుంచించుకుపోతున్న బుల్లి గ్రహం
వాషింగ్టన్: అప్పుడే పుట్టిన బిడ్డ అనుకోని అనారోగ్య సమస్యతో అల్లాడుతుంటే అయ్యో అంటాం. ఇప్పుడు అంతరిక్షంలోనూ ఇలా తన ఉపరితల వాతావరణాన్ని కోల్పోతూ త్వరలో ఒట్టి శిలాగ్రహంగా మిగిలిపోనున్న ఒక నవజాత గ్రహాన్ని నాసా ఖగోళవేత్తలు తాజాగా గుర్తించారు. మన పుడమి పుట్టి 500 కోట్ల ఏళ్లు. భూమి వయసుతో పోలిస్తే కేవలం 80 లక్షల ఏళ్ల వయస్సున్న బుల్లి గ్రహం జాడను నాసా శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టారు. కేవలం 80 లక్షల ఏళ్ల వయస్సున్న ఈ చిన్న గ్రహానికి ‘టీఓఐ 1227–బీ’అని నామకరణంచేశారు.ఇలా నామకరణం చేశారో అలా అది కుంచించుకుపోవడం చూసి ఆశ్చర్యపోయారు. పాత సినిమాల్లో దేవతల తీక్షణమైన చూపునకు రాక్షసులు కాలి భస్మమైపోయినట్లు ఇప్పుడు బుల్లి గ్రహం సైతం తన పుట్టుకకు కారణమైన నక్షత్రం నుంచి వెలువడే అత్యంత శక్తివంతమైన ఎక్స్–రే కిరణాల ధాటికి నాశనమవుతోంది. గ్రహం తన ఉపరితల వాతావరణాన్ని కోల్పోతోంది. వాతావరణాన్ని కోల్పో తూ అది కుంచించుకుపోతోందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. నాసా చంద్ర ఎక్స్–రే అబ్జర్వేటరీ ద్వారా ఈ బుల్లి గ్రహం కుంచించుకుపోతున్న వైనాన్ని ఖగోళవేత్తలు గమనించారు. ఈ వివరాలు ఆస్ట్రోఫిజిక్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అత్యంత సమీపంగా పరిభ్రమణం సూర్యుడు– బుధగ్రహం మధ్య ఉండే దూరంతో పోలిస్తే ఐదోవంతు దూరంలోనే ఈ బుల్లిగ్రహం తన పేరెంట్ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తోంది. ఇంత దగ్గరగా పరిభ్రమిస్తుండటంతో ఆ నక్షత్రం నుంచి వెలువడుతున్న అత్యంత తీవ్రస్థాయి రేడియేషన్ ఈ గ్రహంపై పడుతోంది. ‘‘ఆ నక్షత్రం నుంచి వెలువడే భారీ రేడియేషన్ ధాటికి ఈ గ్రహంపై వాతావరణం త్వరలో పూర్తిగా ఆవిరైపోతుంది.ఈ రేడియేషన్ను గ్రహించాక గ్రహం సైతం రేడియేషన్ను వెదజల్లుతోంది’’అని పరిశోధనలో ప్రధాన రచయిత, రోచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పీహెచ్డీ విద్యార్థి అత్తిల వర్గా చెప్పారు. ఈ గ్రహం మన భూమికి రెండు రెట్లు బరువుంది. విశ్వంలో భిన్న పరిస్థితులు ఎలాగైతే ఇలాంటి బుల్లి గ్రహాలకు పురుడుపోస్తాయో, మళ్లీ అవే భిన్న పరిస్థితులు ఆ గ్రహాల మీది వాతావరణాన్ని అంతర్థానంచేస్తాయనే విషయాన్ని మరింత లోతుగా తెల్సుకునేందుకు ‘టీఓఐ 1227బీ గ్రహం’అక్కరకొస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
వాట్సాప్ స్టేటస్లో ప్రకటనలు!
వాషింగ్టన్: మనిషి చేతికి ఆరు వేలిగా స్మార్ట్ ఫోన్ తిష్ట వేస్తే, అందులో అత్యంత ఎక్కువగా వాడుతున్న యాప్గా వాట్సాప్ నిలిచింది. అందులో కొత్త ఫీచర్ జోడించడం ద్వారా లాభాల పంట పండించుకోవాలని దాని మాతృ సంస్థ ‘మెటా’ భావిస్తోంది. వాట్సాప్ వినియోగదారులు తాము వాట్సాప్లో స్టేటస్గా వాక్యాలు, ఫొటోలు, వీడియోలు, లింక్లు పెడితే అవతలి వాళ్లు చూడాలంటే తొలుత వాణిజ్య ప్రకటనలు దర్శనమివ్వనున్నాయి. అన్నిరకాల వ్యాపార సంస్థల నుంచి వచ్చే ఈ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా ఆదాయాన్ని పొందాలని మెటా ఆశిస్తోంది. స్మార్ట్ఫోన్ వినియోగదారులు తమ దైనందిన జీవిత విశేషాలను తరచూ వాట్సాప్లో స్టేటస్లో పెట్టుకోవడం సర్వసాధారణమైంది. తొలుత ఎంపికచేసిన కొద్దిమంది యూజర్లు, టెస్టర్లకు మాత్రమే ఈ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ ఫీచర్ను అందుబాటులోకి తేనుంది. స్టేటస్ యాడ్స్తోపాటు ప్రమోటెడ్ ఛానళ్లను అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఏమిటీ స్టేటస్ యాడ్స్? ఇన్స్టా గ్రామ్లో స్టోరీస్ యాడ్స్ మాదిరే ఇవి కూడా వినియోగదారులు ఏవైనా స్టేటస్ పెడితే వాటి మధ్యలో ఇకపై వాణిజ్య ప్రకటనలు దర్శనమిస్తాయి. మధ్యలో కనిపించేవి కేవలం యాడ్స్ మాత్రమే అని ప్రత్యేకంగా తెలిసేలా వాటికి ‘స్పాన్సర్డ్’ అనే మార్క్ను పెడతారు. తద్వారా వాణిజ్య ప్రకటనలకు, వ్యక్తిగత స్టేటస్ అప్డేట్స్కు మధ్య తేడాను అవతలి బంధువులు, స్నేహితులు సులభంగా తెల్సుకోగల్గుతారు. ఒకవేళ యూజర్లు ఈ యాడ్స్ను చూడొద్దనుకుంటే బ్లాక్ చేయొచ్చు. భవిష్యత్లో కనిపించకుండా పాప్అప్ను బ్లాక్ కూడా చేయొచ్చు. స్టేటస్తోపాటు కల్సిపోయినంత మాత్రాన యూజర్ల స్టేటస్ డేటా అనేది వ్యాపారసంస్థలకు వెళ్లదు. యూజర్ల వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లదని మెటా చెబుతోంది. యాడ్స్ ప్రసారం ద్వారా టిక్టాక్, యూట్యూబ్, ఇన్స్టా గ్రామ్ భారీ లాభాలు సాధిస్తున్న వేళ వాట్సాప్ సైతం అదే బాటలోకి నెమ్మదిగా వస్తోంది. -
ఎన్నికల్లో ఇషిబాకు ఎదురుదెబ్బ?
టోక్యో: జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా సారథ్యంలో అధికార కూటమికి ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగులుతుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. పార్లమెంట్ ఎగువసభలోని 248 సీట్లకు గాను ఆదివారం సగం సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటికే ఎగువసభలో అధికార పక్షానికి 75 సీట్లుండగా తాజా ఎన్నికల్లో మరో 50 సీట్లు నెగ్గాల్సి ఉంది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఇషిబాకు 32 నుంచి 51 వరకు సీట్లు మాత్రమే దక్కవచ్చని చెబుతున్నాయి. ఎగువ సభలో మెజారిటీ లేకుంటే ఇషిబా సర్కారుకు ప్రస్తుతానికి ఎలాంటి ముప్పూ ఉండదు.కానీ, ఈ ప్రభావం దేశాన్ని రాజకీయ అస్థిరతకు గురి చేసే అవకాశాలున్నాయంటున్నారు. సంకీర్ణ పక్షాలు ఇషిబాను గద్దె దిగాలని కోరవచ్చు. ఈ పరిస్థితుల్లో ఇషిబా కొత్త భాగస్వామ్యపార్టీని వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంతిమంగా, ఈ పరిణామాలు దేశంలో రాజకీయ అస్థిరతకు దారి తీసే ప్రమాదముందని పరిశీలకులు భావిస్తున్నారు. అసలే అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న అధికార పక్షాన్ని నిత్యావసరాల ధరల పెరుగుదల, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లు ప్రజాదరణను దూరం చేశాయని భావిస్తున్నారు. -
అన్నార్తులపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు
గాజా: గాజా స్ట్రిప్లో మారణహోమం కొనసాగుతూనే ఉంది. ఆహారం, మానవతా సాయం కోసం అల్లాడుతున్న సామాన్య పాలస్తీనా పౌరులను ఇజ్రాయెల్ సైన్యం లక్ష్యంగా చేసుకుంటోంది. ఆదివారం ఇజ్రాయెల్ జవాన్ల కాల్పుల్లో కనీసం 85 మంది మరణించారు. ఇజ్రాయెల్ భూభాగం నుంచి జికిమ్ క్రాసింగ్ ద్వారా ఉత్తర గాజాలోకి ప్రవేశించిన వాహనాల వద్దకు జనం పరుగెత్తుకొని వస్తుండగా ఇజ్రాయెల్ సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ ఘటనలో 79 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 150 మంది గాయపడ్డారు.వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వాహనాల్లో చేరవేస్తున్న ఆహారం కోసం జనం ఆరాటపడగా, చివరకు ప్రాణాలే పోయాయి. దక్షిణ గాజాలో జరిగిన కాల్పుల్లో మరో ఆరుగురు బలయ్యారు. సెంట్రల్ గాజా నుంచి జనం బయటకు వెళ్లిపోవాలంటూ ఇజ్రాయెల్ మిలటరీ ఆదివారం హెచ్చరికలు జారీ చేసింది. ఒకవైపు కాల్పుల విరమణ కోసం ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఖతార్లో చర్చలు కొనసాగుతుండగానే ఈ హెచ్చరికలు వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ చర్చల్లో పెద్దగా పురోగతి కనిపించడం లేదని మధ్యవర్తులు చెబుతున్నారు. -
హెచ్–1బీ వీసాకు కొలువుతో లింకు!
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా అధ్యక్షునిగా పాలించిన కాలంలో అమలై తర్వాత బైడెన్ హయాంలో బుట్టదాఖలైన ఒక విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ట్రంప్ తొలివిడత అమెరికా అధ్యక్షునిగా పరిపాలించిన కాలంలో హెచ్–1బీ వీసాల కోసం లాటరీ విధానాన్ని పక్కనబెట్టి ఆయా కంపెనీలు ఉద్యోగానికి ఇచ్చే జీతభత్యాల ఆధారంగా వీసాలను జారీచేయాలని నిర్ణయించారు. ఆ విధానాన్నే ఆనాడు అమలుచేశారు. దీంతో కంపెనీలు మరింత మంది ఉద్యోగులను ఉన్నత ఉద్యోగాలకు తీసుకుంటాయని, తక్కువ స్థాయి ఉద్యోగాలు అమెరికన్లకే దక్కుతాయని ట్రంప్ సర్కార్ భావించింది. అయితే విదేశాల నుంచి వచ్చే నిపుణులైన ఉద్యోగులకు అన్ని స్థాయిల ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో జో బైడెన్ సర్కార్ ఈ విధానాన్ని రద్దుచేసి మళ్లీ లాటరీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ లాటరీ విధానానికి స్వస్తిపలికి ఉద్యోగి జీతం, హోదా, పొజిషన్ ఆధారంగా హెచ్–1బీ వీసాలు ఇవ్వాలని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం భావిస్తోంది. ఇందులోభాగంగా సంబంధిత ప్రతిపాదనను సమీక్షించాలంటూ శ్వేతసౌధంలోని ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ ఫర్ రివ్యూ విభాగానికి తన ప్రతిపాదనలను పంపింది.వాస్తవానికి ప్రతి సంవత్సరం ఎన్ని హెచ్–1బీ వీసాలు జారీ చేయాలనే పరిమితిని అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్) నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ప్రతి సంవత్సరం 85,000 హెచ్–1బీ వీసాలను జారీచేస్తున్నారు. వీటిలో 20,000 వీసాలను మాస్టర్స్ డిగ్రీ పట్టా ఉన్న ఉద్యోగులు ప్రత్యేకంగా కేటాయించారు. వీటిలో అత్యధికం అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలే సాధిస్తున్నాయి. ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు చేసి తమ ఉద్యోగుల్లో ఎక్కువ మందికి వీసా దక్కేలా చేస్తున్నాయి. ఇక ఎలాంటి పరిమితి లేని వీసాలను విశ్వవిద్యాలయాల్లోని పరిశోధన విభాగాల కోసం కేటాయించారు.2026 ఏడాదికి జారీచేయాల్సిన వీసాల కోసం స్వీకరించాల్సిన దరఖాస్తులు సరిపడా రావడంతో వాటి ప్రాసెస్ను నిలిపివేశారు. అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సరీ్వసెస్ విభాగం శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ లెక్కన 2026 సంవత్సరానికి లాటరీ విధానం ఉండకపోవచ్చని స్పష్టమైంది. పొజిషన్ ఆధారంగా వీసాల జారీ ప్రక్రియలను అమెరికాలోని ఆర్థికరంగ నిపుణులు స్వాగతిస్తున్నారు. అత్యధిక వృత్తి నైపుణ్యాలున్న వ్యక్తులకే అత్యధికంగా హెచ్–1బీ వీసాలు దక్కే అవకాశం ఉండటంతో వారి కృషి, పని ద్వారా అమెరికా ఆర్థికవ్యవస్థ మరింత మెరుగుపడుతుందని వారు ఆశిస్తున్నారు. -
రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు
రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.4గా నమోదైంది. రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంతో పాటు హవాయిలోని కొన్ని ప్రాంతాలకు పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం సునామీ హెచ్చరికలను జారీ చేసింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ముందు జాగ్రత్తగా పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు అప్రమత్తం చేశారు.పెట్రోపావ్లోవ్స్క్-కామ్చాట్కా నగరానికి తూర్పున 143 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహా సముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనికి ముందు దాదాపు గంట సమయంలోనే ఈ ప్రాంతంలో ఐదు భూకంపాలు నమోదైనట్లు యూఎస్జీఎస్ తెలిపింది.ఈ భారీ భూకంపాలు.. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:28 నుంచి 3:49 గంటల మధ్య సంభవించాయి. ఈ భూకంపాల కారణంగా కొన్ని భవనాలు దెబ్బతిన్నాయని, అయితే ప్రాణ నష్టం గురించి ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం వెల్లడికాలేదు. ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. -
కిస్ కిస్ కిస్సిక్.. కొంపముంచిన కోల్డ్ప్లే
ప్రముఖ మ్యూజిక్ కాన్సర్ట్ ‘కోల్డ్ ప్లే’ ఆ కంపెనీ సీఈవో కొంపముంచింది. తన సహోద్యోగినితో సన్నిహితంగా మెలుగుతూ.. ముద్దు పెట్టుకొన్న వీడియో వైరల్ కావడం తెలిసిందే. ఈ ఎపిసోడ్ ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఆయన ఏకంగా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మరోవైపు.. నాలుగు రోజుల తర్వాత కూడా ఆ వీడియో విపరీతంగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో ప్రముఖ కంపెనీలు సైతం తమ ప్రచారాలకు ఆ వీడియోను వాడేసుకుంటున్నాయి. ఆస్ట్రానమర్ సీఈవో ఆండీ బైరోన్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తాను కంపెనీ వీడుతున్నట్లు శనివారం ఆయన ప్రకటించారు. ఆ కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో చీఫ్ పీపుల్ ఆఫీసర్ క్రిస్టిన్ క్యాబెట్ను కౌగలించుకుని.. ముద్దాడుతున్న వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. బుధవారం మాసెచూసెట్స్ స్టేట్ బోస్టన్లోని గిల్లెట్ స్టేడియంలో జరిగిన కోల్డ్ ప్లే కాన్సర్ట్లో వీళ్లిద్దరి ఇలా కెమెరా కంటపడ్డారు. ఆ వెంటనే నాలుక్కరుచుకొని ఇద్దరు విడిపోయి దాక్కొన్నారు. దీంతో కోల్డ్ప్లే క్రిస్ మార్టిన్ ‘‘వారు అఫైర్లో అయినా ఉండి ఉండాలి.. లేదా సిగ్గుతో దాక్కొని ఉండాలి’’ అంటూ కామెంట్ చేయడంతో అది మరింత వైరల్ అయ్యింది. మరోవైపు.. Andy Byron, CEO of Astronomer, was caught at a Coldplay concert apparently having an affair with the company’s CPO, Kristin Cabot.Both Byron and Cabot are married to other people.Most awkward moment of 2025?pic.twitter.com/bVOTq6XgF8— Paul A. Szypula 🇺🇸 (@Bubblebathgirl) July 17, 2025ఈ వ్యవహారం కంపెనీకి తలవంపులుగా మారింది. దీంతో సీఈవో ఆండీ బైరోన్ను సస్పెండ్ చేస్తున్నట్లు కంపెనీ సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రకటించింది. ఈ విషయం వైరల్ కావడంతో ఆస్ట్రానమర్ కంపెనీ అంతర్గత దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో ఆండీ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని లింక్డిన్లో ఆ కంపెనీ ఒక పోస్టు ద్వారా తెలియజేసింది. After a video of him with his company’s HR head at a Coldplay concert went viral, Andrew Byron, the CEO of U.S. tech company Astronomer, has resigned from his position. The New York-based company shared this information on LinkedIn.#Coldplay #AndrewByron pic.twitter.com/QA6iTGDxqq— Bipin Singh (@bipinsinghreal) July 20, 2025‘‘మా కంపెనీ లీడర్లు నడవడిక, బాధ్యత విషయంలో అత్యున్నత స్థాయి ప్రమాణాలు పాటిస్తారని ఆశిస్తాం. ఇటీవల ఆ స్థాయి ప్రమాణాలను నిలబెట్టుకోలేదు. ఆండీ తన రాజీనామా సమర్పించారు. దీనిని బోర్డ్ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదించారు’’ అని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆస్ట్రానమర్ అనేది న్యూయార్క్ కేంద్రంగా నడుస్తున్న ఒక టెక్నాలజీ కంపెనీ.క్రిస్ట్రిన్ క్యాబెట్కు గతంలో వివాహం.. విడాకులు అయ్యాయి. ఆండీ బైరోన్కు వివాహం అయ్యింది. ఆయన భార్య మేగన్ కెరిగన్ బైరోన్.. ఓ ప్రముఖ విద్యాసంస్థకు అసోషియేట్ డైరెక్టర్గా పని చేస్తున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. అయితే ఆండీ వీడియో వైరల్ కావడంతో ఆ కాపురంలోనూ కలతలు చెలరేగినట్లు కథనాలు వెలువడుతున్నాయి. -
పాక్లో వర్ష బీభత్సం.. 200 మంది మృతి
ఇస్లామాబాద్: పొరుగుదేశం పాకిస్తాన్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. వర్షాకాలంలో ముఖ్యంగా జూన్ నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో పాక్లో భారీ వరదలు సంభవిస్తుంటాయి. ఫలితంగా కొండచరియలు విరిగిపడుతూ, అపారనష్టం వాటిల్లుతుంటుంది.ఇటువంటి విపత్తుల కారణంగా ఇటీవలి కాలంలో 100 మంది పిల్లలతో సహా 200 మందికి పైగా జనం ప్రాణాలను కోల్పోయారని, 500 మందికి పైగా జనం గాయపడ్డారని పాకిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్ఎండీఏ) తెలిపింది.అధికారిక డేటా ప్రకారం పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ అత్యధికంగా 123 మంది మృత్యువాత పడ్డారు. అలాగే ఖైబర్ పఖ్తుంఖ్వాలో 40, సింధ్లో 21, బలూచిస్తాన్లో 16,ఇస్లామాబాద్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్ముకశ్మీర్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఫైసలాబాద్లో వర్షాల కారణంగా గణనీయమైన నష్టం వాటిల్లింది. రెండు రోజుల్లో చోటుచేసుకున్న 33 ఘటనలలో 11 మంది మృతి చెందారు. 450 మి.మీ కంటే అధిక వర్షపాతం నమోదైన చక్వాల్లో 32 రోడ్లు కొట్టుకుపోయాయి. మౌలిక సదుపాయాల నష్టంతో పాటు, కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోయాయి. అనేక ప్రాంతాలలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగలేదు. -
20 ఏళ్లుగా కోమాలో.. సౌదీ ‘స్లీపింగ్ ప్రిన్స్’ కన్నుమూత
సౌదీ అరేబియా ప్రిన్స్ అల్వలీద్ బిన్ ఖలెద్(36) ఇక లేరు. గత 20 ఏళ్లుగా కోమాలో ఉన్న ఆయన.. శనివారం కన్నుమూశారు. ఈ కారణంగానే సౌదీ అరేబియా స్లీపింగ్ ప్రిన్స్గా ఈయనకంటూ ఓ పేరు ముద్రపడిపోయింది. ప్రిన్స్ అల్వలీద్ బిన్ ఖలెద్ సౌదీ అరేబియా రాజ కుటుంబానికి చెందినవారు. ఆయన ప్రిన్స్ ఖలెద్ బిన్ తలాల్ అల్ సౌద్ పెద్ద కుమారుడు. 2005లో లండన్లోని మిలిటరీ అకాడమీలో చదువుకుంటున్న టైంలో ఖలెద్ కారు ప్రమాదంలో గాయపడ్డాడు. మెదడులో రక్తస్రావం జరిగి.. వెంటిలేటర్పై కోమాలో ఉంటూ ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఖలెద్ కోసం అమెరికా, స్పెయిన్ నుండి నిపుణులు కూడా చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. జూలై 20న రియాద్లో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. Statement On the Passing of Prince Alwaleed bin Khaled bin Talal Al Saud pic.twitter.com/st19kxb7lC— Global Imams Council (GIC) (@ImamsOrg) July 19, 2025 View this post on Instagram A post shared by @arabianroyalagency -
అమెరికాలో తప్పిన ఘోర విమాన ప్రమాదం
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. డెల్టా ఎయిర్లైన్స్ బోయింగ్ 767 ఇంజిన్లో మంటలు చెలరేగడంతో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. వీడియోలో బోయింగ్ విమానం ఎడమ ఇంజిన్ నుండి మంటలు రావడం కనిపిస్తోంది. అట్లాంటాకు వెళ్లాల్సిన ఈ డెల్టా ఎయిర్ లైన్స్ విమానం లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.❗️Boeing 787 Makes Emergency Landing in LA 🇺🇸 - Engine ON FIRE 🔥Video claims to show a Delta Airlines flight bound for Atlanta on Friday making an emergency landing at LAX. The engine reportedly caught fire shortly after take-off.📹 @LAFlightsLIVE https://t.co/t1HBVLDi0P pic.twitter.com/vYNgkpZJcq— RT_India (@RT_India_news) July 19, 2025శుక్రవారం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఇంజిన్ మంటల్లో చిక్కుకున్నట్లు గుర్తించడంతో.. అట్లాంటాకు వెళ్లాల్సిన డెల్టా ఎయిర్ లైన్స్ విమాన్నాన్ని లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం (ఎల్ఏఎక్స్)కి తిరిగి మళ్లించి, అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ విమాన ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని, అగ్నిమాపక సిబ్బంది రన్వేపై మంటలను చల్లార్చడంతో ముప్పు తప్పిందని అధికారులు తెలిపారు. ఏవియేషన్ A2Z నివేదిక ప్రకారం ఈ విమానం విమానాశ్రయం నుండి బయలుదేరిన వెంటనే ఇంజిన్లో మంటలు వ్యాపించాయి. విమాన సిబ్బంది అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) విమానాన్ని తిరిగి విమానాశ్రయానికి మళ్లించేలా మార్గనిర్దేశం చేసింది. ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ విమానం దాదాపు 25 సంవత్సరాల క్రితం నాటిది.డెల్టా ఇలాంటి సమస్యను ఎదుర్కోవడం ఈ ఏడాది ఇదేమీ మొదటిసారి కాదు. గత ఏప్రిల్లో ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో డెల్టా విమానం మంటల్లో చిక్కుకుంది. అట్లాంటాకు బయలుదేరడానికి సిద్ధమవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో విమానంలో 282 మంది ప్రయాణికులు, 10 మంది విమాన సహాయకులు, ఇద్దరు పైలట్లు ఉన్నారు. అయితే ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. -
ఐఎస్ఎస్ వైపూ ట్రాఫిక్ బిజీ!
వాషింగ్టన్: తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం కోసం వరసబెట్టి భక్తులు క్యూ లైన్లలో నిల్చున్నట్లు ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కి సైతం వ్యోమ నౌకలు ఒకరకంగా క్యూ కట్టాయి. కొద్ది వారాల వ్యవధిలో సరకు రవాణా స్పేస్క్రాఫ్ట్ లేదా వ్యోమగాములను తీసుకొచ్చే వ్యోమనౌకలు ఒకదాని వెంట మరోటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి రాకపోకలు సాగిస్తూ ఐఎస్ఎస్ మార్గాన్ని బిజీగా మార్చేశాయి. నాసా, రోస్కాస్మోస్, స్పేస్ ఎక్స్ సంస్థల వ్యోమనౌకలు తమ వంతు కోసం వేచిచూస్తున్నాయి. బోయింగ్ వారి ప్రతిష్టాత్మక స్టార్లైనర్ వ్యోమనౌక మరో ఏడాదిదాకా ఐఎస్ఎస్కు పయనమయ్యే అవకాశం దక్కదని తాజా షెడ్యూల్ను బట్టి తెలుస్తోంది. చరిత్రలో ఎన్నడూలేనంతగా ఐఎస్ఎస్కు స్పేస్క్రాఫ్ట్ల రాకపోకలు ఇటీవ లకాలంలో ఎక్కువయ్యాయి. గత రెండు మూడు వారాలపాటు యాగ్జియం–4 మిషన్ వారి డ్రాగన్ ‘గ్రేస్’ క్యాప్సూల్ ఐఎస్ఎస్ ‘ఔట్పోస్ట్’ వద్ద ‘పార్కింగ్’లో ఉండిపోయింది. ఇటీవలే అది భారత వ్యోమగామి శుభాంశు శుక్లాసహా నలుగురు వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకొచ్చింది. దీంతో క్రూ–11 మిషన్ ప్రయోనికి రంగం సిద్ధమైంది. ఇదిగాక ఇప్పటికే ఐఎస్ఎస్ వద్ద రష్యా అంతరిక్ష సంస్థ పంపిన ప్రోగ్రెస్–92 కార్గోషిప్ అక్కడ తిష్టవేసింది. దీంతోపాటు మరోమూడు వ్యోమనౌకలు ఐఎస్ఎస్ వద్దే ఉన్నాయి. స్పేస్ఎక్స్ డ్రాగన్, సోయూజ్ ఎంఎస్–27, ప్రోగ్రెస్ రీ–సప్లై నౌకలు అక్కడ ఉన్నాయి. చాలా రోజులుగా ఐఎస్ఎస్లో విధుల్లో ఉండి అలసిపోయిన వ్యోమగా ములను భూమి మీదకు తీసుకొచ్చేందుకు, అక్కడ నిండుకున్న సరుకులను భూమి నుంచి మోసుకొచ్చేందుకు తరచూ ఇలా వ్యోమనౌకలు ఐఎస్ఎస్కు వస్తూనే ఉన్నాయి. ఈ స్పేస్క్రాఫ్ట్ల ట్రాఫిక్ ఈ ఏడాది చివరిదాకా కొనసాగనుంది. డిసెంబర్లోపు మరో ఆరు వ్యోమనౌకలు అక్కడికి చేరుకోనున్నాయి. కొత్త వ్యోమగాములను మోసుకెళ్లడం, సరకుల తరలింపు, ఆధునిక శాస్త్రసాంకేతికత సంబంధ ఉపకరణాలను మోసుకుంటూ ఇవి అటూఇటూ తిరగనున్నాయి. అత్యంత బరువైన ప్రయోగ పేలోడ్లను తరలించనున్నాయి. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన 2000 సంవత్సరం నుంచి చూస్తే ఐఎస్ఎస్కు ఇంతటి భారీ ఎత్తున వ్యోమగాములు, సరకులు, ప్రయోగ పరికరాల రాకపోకలు పెరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. అమెరికా నాసా, రష్యా వారి రోస్కాస్మోస్, ఎలాన్మస్క్ స్పేస్ఎక్స్, స్టార్లైనర్ ఇలా అన్ని సంస్థల స్పేస్క్రాఫ్ట్లు అంతరిక్షయానాన్ని బిజీగా మార్చాయి.క్యూ వరస నుంచి తప్పుకున్న స్టార్లైనర్భారతీయ మూలాలున్న మహిళా అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్సహా బుచ్ విల్మోర్ను బోయింగ్ వారి స్టార్లైనర్ వ్యోమనౌక 2024 జూన్లో ఐఎస్ఎస్కు పంపించింది. అయితే తిరుగుప్రయాణంలో అది మొరాయించడంతో వ్యోమగాములు లేకుండానే పలుసార్లు వాయిదాల తర్వాత ఒంటరిగా భూమికి తిరిగొచ్చింది. దీంతో 2025లో స్టార్లైనర్ మరోసారి ఐఎస్ఎస్కు వెళ్లలేదు. ఇలా స్పేస్షిప్ల ట్రాఫిక్ నుంచి ఇది తప్పుకుంది. న్యూ మెక్సికోలోని నాసా వారి వైట్శాండ్స్ పరీక్షకేంద్రంలో ఈ స్టార్లైనర్ వ్యోమనౌకకు సమగ్రస్థాయిలో పరీక్షలు జరుపుతున్నారు. 2026లో జరపబోయే ఐఎస్ఎస్ ప్రయాణానికి సురక్షితమేనా కాదా అనేది నిర్ధారించుకునేందుకు కీలక సమీక్షా పరీక్షలు జరుపుతున్నారు. నెలల తరబడి నిరీక్షణ తర్వాత సునీతా విలియమ్స్ చివరకు క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ వ్యోమనౌకలో తిరుగుపయనమైన విషయం విదితమే. అంతర్జాతీయ అంతరిక్ష సందర్శకుల తాకిడి ఎక్కువైతే ఐఎస్ఎస్ మార్గం మరింత బిజీగా మారనుంది. -
థాయ్లాండ్లో మాయలేడి
బ్యాంకాక్: అందం ఎరవేసి బౌద్ధ గురువులు, సన్యాసులను ఉచ్చులోకి లాగి, రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన మాయలేడి వ్యవహారం థాయ్లాండ్లో సంచలనం సృష్టిస్తోంది. గత నెలలో బ్యాంకాక్లోని బౌద్ధ ఆలయం నుంచి ఫ్రా థెప్ అనే సీనియర్ గురువు అదృశ్యమయ్యాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులకు నివ్వెరపోయే నిజాలు తెలిశాయి. అతడి అదృశ్యం వెనుక ‘మిస్ గోల్ఫ్’ అనే మహిళ ప్రమేయం ఉన్నట్లు వెల్లడయ్యింది. ఆమె ఇంట్లో సోదాలు చేయగా, 80 వేలకుపైగా సెక్స్ ఫొటోలు, వీడియోలు ఉన్న ఫోన్లు లభించాయి. ఆమె అసలు పేరు విలావన్ ఎమ్సావత్ అని గుర్తించారు. వయసు 30 ఏళ్లు. బౌద్ధ సన్యాసులకు వలవేసి, ఏకాంతంగా ఉన్నప్పుడు వారికి తెలియకుండా ఫొటోలు, వీడియోలు చిత్రీకరించడం, వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేసి, భారీగా డబ్బులు వసూలు చేయడం ఆమె దినచర్య అని పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. బెదిరింపులు, బలవంతపు వసూళ్లు, మనీ లాండరింగ్ కేసులో ఎమ్సావత్ను పోలీసులు అరెస్టు చేశారు. చాలామంది బౌద్ధ గురువులు, సన్యాసులు ఆమె వలలో చిక్కినట్లు గుర్తించారు. గత మూడేళ్లలో వారి నుంచి 385 బాత్స్ (రూ.102 కోట్లు) వసూలు చేసింది. అదృశ్యమైన ఫ్రా థెప్ ఆచూకీ ఇంకా లభించలేదు. అతడితో ఎమ్సావత్కు 2024 మే నెలలో సంబంధం ఏర్పడింది. అతడితో తాను బిడ్డను కన్నట్లు చెబుతోంది. బిడ్డ సంరక్షణ కోసం ఫ్రా థెప్ నుంచి తనకు రూ.1.90 కోట్లు ఇప్పించాలని డిమాండ్ చేస్తోంది. ఎమ్సావత్ బౌద్ధ సన్యాసుల నుంచి డబ్బులతోపాటు ఖరీదైన వస్తువులు, వాహనాలు కూడా స్వీకరించింది. అయితే, ఆ సొమ్మును ఆన్లైన్ జాదంలో పెట్టింది. బౌద్ధ ఆలయాలకు భక్తుల నుంచి విరాళంగా వచ్చిన డబ్బును సన్యాపులు ఈ మాయలేడికి ధారపోసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. భగవంతుడి సన్నిధిలో ఉంటూ ఆదర్శవంతమైన జీవితం గడపాల్సిన బౌద్ధ సన్యాసులు శారీరక సుఖాల కోసం ఆరాటపడడం పట్ల జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
Yoweri Museveni: 40 ఏళ్లుగా నాటౌట్!
వయసు 80 ఏళ్లు. అందులో దేశాధ్యక్షునిగానే ఏకంగా 40 ఏళ్లు! ఇదీ, ఉగాండా ప్రెసిడెంట్ యోవేరి ముసేవేని ట్రాక్ రికార్డు! అయినా తనివి తీరలేదేమో, ఈ వయసులో కూడా మళ్లీ అధ్యక్ష బరిలో దిగుతున్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఆయనే అభ్యర్థి అని పాలక నేషనల్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ (ఎన్ఆర్ఎం) పార్టీ ప్రకటించింది. అందుకు ముసేవేని అంగీకరించారు కూడా. ఎన్ఆర్ఎం గెలుపు నల్లేరుపై నడకే అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన 40 ఏళ్ల రికార్డను మరింత మెరుగు పరుచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. జనవరిలో ఎన్నికలు ఉగాండాలో 2026 జనవరిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. పాప్ స్టార్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన బాబీ వైన్ వాటిలో ముసేవేని ప్రధాన ప్రత్యర్థిగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. విపక్ష నేషనల్ యూనిటీ పార్టీ తనను నామినేట్ చేస్తే ముసేవేనిపై తలపడేందుకు సిద్ధమని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ‘‘దేశంలో అణచివేత పెరుగుతోంది. విపక్షాల్లో కొనసాగడమే దుర్భరంగా మారింది. విపక్ష నేతలపై నేరుగా ఉగ్రవాది ముద్ర వేస్తున్నారు’’ అన్నారాయన. వైన్ 2021 సార్వత్రిక ఎన్నికల్లో కూడా బరిలో దిగినా ముసేవేని చేతిలో ఓటమి చవిచూశారు. మరో ప్రముఖ ప్రతిపక్షం ఫోరం ఫర్ డెమొక్రటిక్ చేంజ్ (ఎఫ్డీసీ) నేత కిజ్జా బెసిగ్యే దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాజీ సైనికాధికారి అయిన ఆయన గత నవంబర్ నుంచి నిర్బంధంలో ఉన్నారు. పశుల కాపర్ల కుటుంబం యోవేరి ముసేవేని 1944లో ఉగాండాలోని ఎంబారా జిల్లాలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పశువుల కాపర్లు, పెంపకదారు లు. ఆయన మిషనరీ పాఠశాలల్లో చదివారు. టాంజానియాలోని దారెస్సలాం విశ్వవిద్యాలయంలో చదువుతుండగా ఆఫ్రికన్ విముక్తి ఉద్యమాలతో అనుబంధం ఏర్పడింది. వామపక్ష విద్యార్థి సంఘానికి చైర్మన్ అయ్యారు. నేషనల్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ (ఎన్ఆర్ఎం) ఆధ్వర్యంలోని సాయుధ దళమైన నేషనల్ రెసిస్టెన్స్ ఆర్మీకి నేతృత్వం వహించారు. 1980ల్లో నాటి అధ్యక్షుడు ఒబోటే పాలనకు వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం చేశారు. 1986లో తిరుగుబాటు నాయకుడిగా అధికారాన్ని చేజిక్కించుకున్నారు. నాటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధిస్తూ వస్తున్నారు. ఆయన పదవిలో కొనసాగడానికి వీలుగా రాజ్యాంగాన్ని రెండుసార్లు సవరించి మరీ వయో,, పదవీకాల పరిమితులను తొలగించారు! ఆ తర్వాత 2001, 2006, 2011, 2016 ఎన్నికల్లో ముసేవేని వరుస విజయాలు సాధించారు. 2017లో మరోసారి రాజ్యాంగ సవరణ చేసి అధ్యక్ష అభ్యర్థుల వయో వయో పరిమితిని పూర్తిగా ఎత్తేశారు. తద్వారా 2021లో తిరిగి ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా ఉగాండాను ముసేవేని ప్రగతి పథంలోకి నడిపించారు. రాజకీయ స్థిరత్వం అందించారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మార్చారు. మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టారు. పత్రికా స్వేచ్ఛకు మద్దతిచ్చారు. ఇదంతా నాణేనికి ఒకవైపే ముసేవేనిపై తీవ్ర అవినీతి మచ్చలున్నాయి. దాంతో కొన్నేళ్లుగా ఆయన ఆదరణ, ప్రాబల్యం తగ్గుతూ వస్తున్నాయి. విపక్ష నేతలను వేధించడం, నిర్బంధించడం వంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఉత్తర ఉగాండాను దశాబ్దాలుగా భయభ్రాంతులను చేస్తున్న లార్డ్స్ రెసిస్టెన్స్ ఆర్మీ (ఎల్ఆర్ఏ)ని కట్టడి చేయడంలో విఫలమయ్యారని ముసేవేని ఆరోపణలు ఎదుర్కొన్నారు. సోమాలి యాలో ఆఫ్రికన్ యూనియన్ దళానికి సైనిక సాయం చేసి ప్రశంసలు కూడా అందుకున్నారు. అయితే 2013లో దక్షిణ సూడాన్ చెలరేగిన అంతర్యుద్ధంలో ప్రభుత్వానికి మద్దతిచి్చవిమర్శలపాలయ్యరు. – సాక్షి, నేషనల్ డెస్క్