International
-
అమెరికా-ఇరాన్ చర్చల వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: దోహాలో అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.‘యుద్ధం ఎవరూ కోరుకోవడం లేదు..కానీ ఈ ఒప్పందం కుదరకపోతే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది’అని ఆయన హెచ్చరించారు.2026 మే 22న దోహాలో అమెరికా-ఇరాన్ చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చలు మరింత ముందుకు సాగేందుకు ఇరాన్ స్పీకర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అరాగ్చీ ఖతార్ చేరుకున్నారు. ఈ పరిణామాలతో ఇరుదేశాల మధ్య త్వరలో ఒప్పందం కుదురుతుందనే అంచనాలు నెలకొన్నాయి.ట్రంప్ గత శనివారం సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్, ఖతార్ ఎమిర్ తమీమ్ బిన్ హమద్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సయ్యద్ ఆసిమ్ మునీర్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసీ, జోర్డాన్ రాజు అబ్దుల్లా II, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో చర్చలు జరిపినట్లు తెలిపారు.ఈ చర్చల్లో ట్రంప్, అబ్రహాం ఒప్పందాలపై అన్ని దేశాలు ఒకేసారి సంతకం చేయాలని సూచించారు. ఇప్పటికే యూఏఈ, బహ్రెయిన్ సభ్యులుగా ఉన్నాయని, మిగతా దేశాలు కూడా సిద్ధంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకటి లేదా రెండు దేశాలు సంతకం చేయకపోయినా అది అంగీకారయోగ్యమే కానీ ఎక్కువ దేశాలు ఈ ఒప్పందంలో భాగం కావాలని ఆయన స్పష్టం చేశారు. President Donald Trump posts on Truth Social- "Negotiations with the Islamic Republic of Iran are proceeding nicely! It will only be a Great Deal for all or, no Deal at all to the Battlefront and shooting, but bigger and stronger than ever before, and nobody wants that! During my… pic.twitter.com/D1IhQaGjim— ANI (@ANI) May 25, 2026 -
ఉగ్రదేశంలో ఊరట!
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గులు, ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల నడుమ పొరుగు దేశం పాకిస్థాన్ వినియోగదారులకు కొంత ఊరట లభించింది. పాక్లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తాజా సవరణ ప్రకారం, పెట్రోల్ ధర లీటరుకు రూ.6, హై-స్పీడ్ డీజిల్ (హెచ్ఎస్డీ) ధర లీటరుకు రూ.6.80 మేర తగ్గాయి. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. పాక్ ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించడం ఇది వరుసగా రెండో వారం కావడం గమనార్హం. గత వారం కూడా అక్కడ పెట్రోల్, డీజిల్ ధరలను రూ.5 మేర తగ్గించారు.సవరించిన కొత్త ధరల పట్టికప్రభుత్వ తాజా నిర్ణయం తర్వాత పాకిస్థాన్లో లీటర్ ఇంధన ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.ఇంధనం రకంపాత ధర (లీటరుకు)తగ్గిన ధరప్రస్తుత ధర (లీటరుకు)పెట్రోల్రూ. 409.78రూ. 6.00రూ. 403.78హై-స్పీడ్ డీజిల్రూ. 409.58రూ. 6.80రూ. 402.78గమనిక: విలువ ఆధారంగా భారత రూపాయి, పాకిస్థాన్ రూపాయికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని గుర్తించాలి.(మే 25న 1 భారత రూపాయి=రూ.2.91 పాకిస్థాన్ రూపాయి)అంతకుముందు ఆకాశాన్నంటిన ధరలుఫిబ్రవరిలో ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా వివాదం ప్రారంభమైనప్పటి నుంచి పాకిస్థాన్ ఇంధన మార్కెట్ తీవ్ర అస్థిరతకు గురైంది. అప్పటి నుంచి పాక్ ప్రభుత్వం ప్రతి శుక్రవారం ధరలను సమీక్షిస్తోంది. గత కొన్ని నెలలుగా అక్కడ ధరలు ఏ స్థాయిలో పెరిగాయంటే..మార్చి 6: ఇరాన్ పరిణామాల నేపథ్యంలో తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలను ఏకంగా రూ.55 పెంచారు.ఏప్రిల్ 2: అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా పెట్రోల్ ధరల్లో 43 శాతం, డీజిల్ ధరల్లో 55 శాతం మేర భారీ వృద్ధిని ప్రకటించారు.ఈ వరుస పెంపుదల కారణంగా ఒకానొక దశలో ఇంధన ధరలు దాదాపు మూడు రెట్లు(గరిష్టంగా రూ.445 వరకు) పెరిగి ప్రజలపై తీవ్ర భారాన్ని మోపాయి.భారత్లో పరిస్థితి ఏంటి?అంతర్జాతీయంగా ముడి చమురు ధరల ప్రభావం భారతదేశంపై కూడా పడింది. అయితే, పాకిస్థాన్తో పోలిస్తే భారత్లో ఈ ధరల పెరుగుదల చాలా స్వల్పంగా, నియంత్రణలోనే ఉంది. ఇటీవలి కాలంలో నాలుగు విడతల సవరణల ద్వారా ఇంధన ధరలను మొత్తంగా సుమారు రూ.7 మేర పెంచారు. సోమవారం జరిగిన తాజా సవరణలో పెట్రోల్ ధరపై రూ.2.61, డీజిల్ ధరపై రూ.2.71 పెంచారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల హెచ్చుతగ్గులను బట్టి రానున్న రోజుల్లో దేశీయ చమురు కంపెనీలు మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.ఇదీ చదవండి: స్థిరమైన రాబడి.. నమ్మకమైన పెట్టుబడి -
Bangladesh: ఇనుప రాడ్ల ట్రక్కు బోల్తా.. 15 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు వాయువ్యంగా 83 కిలోమీటర్ల దూరంలో ఉన్న టాంగైల్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ కలచివేసింది. ఈద్-ఉల్-అదా(ఈద్) పండుగ కోసం తమ స్వగ్రామాలకు వెళ్తున్న కూలీలతో వెళ్తున్న ఒక ట్రక్కు, అదుపు తప్పి బోల్తా పడటంతో 15 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈద్ వేళ విషాదంప్రమాదం జరిగిన సమయంలో ట్రక్కులో ఇనుప రాడ్లతో పాటు, ప్రయాణీకులు కూడా ఉన్నారు. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో టాంగైల్ జిల్లాలోని సోరటోయిల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కూలీలు తమ కుటుంబాలతో కలిసి ఈద్ వేడుకలు జరుపుకోవడానికి ఇంటికి బయలుదేరగా, విధి వారిని మార్గమధ్యలోనే బలిగొంది. మృతుల్లో ఎక్కువ మంది రోజువారీ కూలీలేనని అధికారులు తెలిపారు.అదుపు తప్పిన వాహనంస్థానిక పోలీస్ చీఫ్ ఫువాడ్ హుస్సేన్ వెల్లడించిన వివరాల ప్రకారం, వాహనాన్ని నియంత్రించలేక డ్రైవర్ చేసిన పొరపాటు వల్లే ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు డ్రైవర్ అదుపు తప్పడంతో వాహనం బోల్తా పడింది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, అధికారులు రంగంలోకి దిగి, ట్రక్కు కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.నిత్యం వెంటాడుతున్న మరణ మృదంగంబంగ్లాదేశ్లో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. ట్రాఫిక్ నిబంధనలు సరిగ్గా అమలు కాకపోవడం, రహదారుల దుస్థితి, నైపుణ్యం లేని డ్రైవర్ల వల్ల ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో ప్రయాణ భద్రతపై కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి విషాదకర సంఘటనలు పదేపదే పునరావృతమవుతున్నాయి. -
మిడిల్ ఈస్ట్పై ట్రంప్ బిగ్ ప్లాన్.. పాక్, గల్ప్ దేశాల బ్రేక్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కొత్త రాగం ఎత్తుకున్నారు. ఇజ్రాయెల్కు అనుకూలంగా అరబ్, ముస్లిం మెజారిటీ దేశాలపై మరో ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇజ్రాయెల్కు మేలు చేసే విధంగా అబ్రహం ఒప్పందంలో భాగంగా కావాలని పాకిస్తాన్ సహా అరబ్ దేశాలపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ ఒప్పందంలో చేరిన దేశాలు ఇజ్రాయెల్ను అధికారికంగా దేశంగా గుర్తించాలన్నదే ఇందులోని ముఖ్య ఉద్దేశ్యం. అయితే, ఈ ఒప్పందంపై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో అమెరికాకు లాభమేంటి? అనే ప్రశ్న ఎదురవుతోంది. ఇంతకీ ఈ అబ్రహం ఒప్పందం ఏంటి? పాకిస్తాన్ ఎందుకు టెన్షన్ పడుతోంది అనే విషయాలు తెలుసుకుందాం..అబ్రహాం ఒప్పందం అనేది 2020లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ మరియు కొన్ని అరబ్ దేశాల మధ్య కుదిరిన సాధారణీకరణ ఒప్పందం. దీని ప్రధాన ఉద్దేశం ఇజ్రాయెల్ను అధికారికంగా దేశంగా గుర్తించి, దౌత్య, ఆర్థిక, భద్రతా సంబంధాలను ప్రారంభించడం. ఈ ఒప్పందం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, మొరాకోలతో సహా పలు అరబ్ దేశాలతో ఇజ్రాయెల్కు అధికారిక సంబంధాలను ప్రారంభించింది. ఇజ్రాయెల్ను దేశంగా గురిస్తూ మధ్యప్రాచ్యంలో ఒక చారిత్రాత్మక నమూనా మార్పునకు నాంది పలికింది. దశాబ్దాలుగా పాలస్తీనా సమస్య పరిష్కారమయ్యే వరకు చాలా అరబ్ దేశాలు ఇజ్రాయెల్ను దేశంగా గుర్తించడానికి నిరాకరించాయి. కానీ, అబ్రహం ఒప్పందంతో ఇజ్రాయెల్కు లైన్ క్లియర్ అయ్యింది. ఈ ఒప్పందంలో చేరిన అరబ్ దేశాలు ఇజ్రాయెల్ను అధికారికంగా దేశంగా గుర్తించాయి.అబ్రహాం ఒప్పందం లక్ష్యందౌత్య సంబంధాలు: ఇజ్రాయెల్తో అధికారిక రాయబార కార్యాలయాలు, దౌత్య సంబంధాలు ఏర్పరచడం.ఆర్థిక సహకారం: వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటకం, టెక్నాలజీ రంగాల్లో భాగస్వామ్యం.భద్రతా సహకారం: ఇరాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి కలిసికట్టుగా వ్యూహాలు.ఒప్పందంలోని దేశాలు..యూఏఈ, బహ్రెయిన్, మొరాకో, సూడాన్, కజికిస్తాన్: ఈ దేశాలు ఇజ్రాయెల్ను అధికారికంగా దేశంగా గుర్తించాయి.సౌదీ అరేబియా, పాకిస్తాన్: ఇంకా గుర్తించలేదు. వీరి ప్రజాభిప్రాయం పాలస్తీనా రాష్ట్రం ఏర్పాటుపై బలంగా ఉంది.పాలస్తీనా సమస్య: ఇజ్రాయెల్ను గుర్తించడం. పాలస్తీనా రాష్ట్రం ఏర్పాటుపై స్పష్టత లేకుండా ముందుకు వెళ్లడం. అందుకే కొన్ని దేశాలు వెనుకంజ వేస్తున్నాయి.అబ్రహాం ఒప్పందం ఇజ్రాయెల్కు వ్యూహాత్మకంగా లాభదాయకం. కానీ పాలస్తీనా సమస్య పరిష్కారం లేకపోవడం వల్ల రాజకీయంగా కొన్ని నష్టాలు ఉన్నాయి. అమెరికాకు ఇది మధ్యప్రాచ్యంలో తన ప్రభావాన్ని పెంచే ముఖ్యమైన వ్యవహారం కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ట్రంప్.. అరబ్ దేశాల అధినేతలతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా అబ్రహం ఒప్పందంలో భాగంగా కావాలని ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. కానీ పాలస్తీనా సమస్యపై ఇది పెద్ద ప్రభావం చూపిస్తోంది.ఇజ్రాయెల్కు లాభాలుఅరబ్ గుర్తింపు: UAE, బహ్రెయిన్, మొరాకో వంటి దేశాలతో అధికారిక సంబంధాలు ఏర్పడటం వల్ల ఇజ్రాయెల్కు అరబ్ ప్రపంచంలో గుర్తింపు పెరిగింది.ఆర్థిక ప్రయోజనాలు: వాణిజ్యం, టెక్నాలజీ, పర్యాటకం రంగాల్లో కొత్త అవకాశాలు. ఉదాహరణకు, UAE–ఇజ్రాయెల్ మధ్య బిలియన్ల డాలర్ల వ్యాపార ఒప్పందాలు కుదిరాయి.భద్రతా సహకారం: ఇరాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి గల్ఫ్ దేశాలతో రక్షణ సహకారం పెరిగింది.ప్రాంతీయ స్థానం: ఇజ్రాయెల్ CENTCOM (US Central Command)లో చేరడం వల్ల ప్రాంతీయ రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర.ఇజ్రాయెల్కు నష్టాలుపాలస్తీనా సమస్య: ఒప్పందంలో పాలస్తీనా రాష్ట్రం ఏర్పాటుపై స్పష్టత లేకపోవడం వల్ల అరబ్ ప్రజల్లో వ్యతిరేకత.ప్రజాభిప్రాయం: గాజా యుద్ధం తర్వాత అరబ్ దేశాల్లో ప్రజలు ఇజ్రాయెల్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.సౌదీ ఆలస్యం: పాలస్తీనా సమస్య పరిష్కారం లేకుండా సౌదీ అరేబియా ముందుకు రావడం లేదు.అమెరికాకు లాభాలుప్రభావం పెరుగుదల: మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రభావం మరింత బలపడింది.భద్రతా నిర్మాణం: US మిత్రదేశాల మధ్య రక్షణ సహకారం పెరిగింది, ఇరాన్ను ఎదుర్కోవడంలో సమన్వయం సాధ్యమైంది.ఆర్థిక అవకాశాలు: అమెరికా కంపెనీలకు గల్ఫ్–ఇజ్రాయెల్ మార్కెట్లలో కొత్త అవకాశాలు.వ్యూహాత్మక విజయం: దశాబ్దాల తర్వాత అరబ్–ఇజ్రాయెల్ సంబంధాలను తెరవడం ద్వారా అమెరికా తన దౌత్య విజయాన్ని ప్రదర్శించింది.పాలస్తీనా సమస్యలో మార్పులుఅరబ్ ఐక్యతలో విరుగుడు: ఇంతకాలం అరబ్ దేశాలు పాలస్తీనా రాష్ట్రం ఏర్పాటుపై ఒకే విధమైన మద్దతు చూపేవి. కానీ UAE, బహ్రెయిన్, మొరాకో, సూడాన్ ఇజ్రాయెల్ను గుర్తించడం వల్ల ఆ ఐక్యత బలహీనపడింది.పాలస్తీనా నాయకత్వం నిరాశ: పాలస్తీనా అథారిటీ మరియు హమాస్ ఈ ఒప్పందాలను “వంచన”గా పేర్కొన్నాయి.ప్రజాభిప్రాయం: అరబ్ ప్రజల్లో చాలా మంది పాలస్తీనా సమస్య పరిష్కారం లేకుండా ఇజ్రాయెల్తో సంబంధాలు సాధారణీకరించడాన్ని వ్యతిరేకిస్తున్నారు.ఇరాన్ అంశంఇరాన్ అబ్రహాం ఒప్పందంలో చేరడం సిద్ధాంతపరంగా అసాధ్యం. ఎందుకంటే, ఇజ్రాయెల్ను గుర్తించడం ఇరాన్ రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకం. కానీ, ఒప్పందం వల్ల ఇరాన్పై వ్యూహాత్మక ఒత్తిడి పెరిగింది. గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్తో కలిసి పనిచేయడం వల్ల ఇరాన్ తన ప్రభావాన్ని నిలుపుకోవడానికి మరింతగా ప్రాక్సీ యుద్ధాలు మరియు హోర్ముజ్ జలసంధి నియంత్రణపై ఆధారపడుతోంది.పాకిస్తాన్ ఇలా..పాకిస్తాన్ ఇప్పటివరకు అబ్రహాం ఒప్పందంలో చేరలేదు. ఎందుకంటే దేశీయ ప్రజాభిప్రాయం, పాలస్తీనా సమస్యపై కఠినమైన వైఖరి ఉంది. అలాగే ఇరాన్తో సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఇప్పటికీ ఇజ్రాయెల్ను దేశంగా గుర్తించలేదు. పాలస్తీనా రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ఇజ్రాయెల్తో సంబంధాలు సాధారణీకరించవచ్చు అని గతంలోనే అధికారికంగా ప్రకటించింది. మరోవైపు.. పాకిస్తాన్ ప్రజలు పాలస్తీనా రాష్ట్రానికి బలమైన మద్దతు ఇస్తున్నారు. ఇజ్రాయెల్తో సంబంధాలు సాధారణీకరించడమంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను రేపే అవకాశం ఉంది. కానీ, డొనాల్డ్ ట్రంప్ మాత్రం పాకిస్తాన్ను అబ్రహాం ఒప్పందంలో చేరమని కోరుతూ ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని షరీఫ్కు అమెరికా ఒత్తిడిని ఎదుర్కొంటూ, ప్రజాభిప్రాయాన్ని సమతుల్యం చేయాల్సిన క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ను దేశంగా గుర్తిస్తే.. ఇటు ఇరాన్తో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. దీంతో, ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అనే పరిస్థితి ఏర్పడింది. -
రహస్య బంకర్లో మొజ్తబా ఖమేనీ.. వీడని దాడుల భయం!
టెహ్రాన్: ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అత్యంత రహస్య ప్రదేశంలో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా- ఇజ్రాయెల్ దాడుల భయంతో ఆయన బయటి ప్రపంచంతో ఎటువంటి ప్రత్యక్ష సంబంధాలు లేకుండా పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ మరణానికి కారణమైన దాడుల తరహాలోనే, తనపై కూడా దాడులు జరుగుతాయని భావిస్తున్న మొజ్తబా ఖమేనీ, అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య రహస్య బంకర్లలో తలదాచుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.కూలీల వ్యవస్థతో సంక్షోభంఅమెరికా అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం, ఖమేనీని నేరుగా చేరుకోవడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. ఆయనతో సంభాషించడానికి ఒక క్లిష్టమైన ‘కూలీల నెట్వర్క్’ను ఏర్పాటు చేశారు. ఈ పద్ధతి వల్ల ఇరాన్- అమెరికా మధ్య జరుగుతున్న దౌత్య చర్చల్లో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ఇరాన్ ప్రతినిధులు కూడా తమ సుప్రీం లీడర్ను నేరుగా సంప్రదించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల పంపే ప్రతి సందేశానికి స్పందన రావడానికి చాలా సమయం పడుతోంది.అగ్రనేతలకే తెలియని ఖమేనీ ఆచూకీఅత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇరాన్ ప్రభుత్వంలోని అగ్రశ్రేణి అధికారులకు సైతం ఖమేనీ ఎక్కడ ఉన్నారో తెలియదు. తన భద్రత విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్న ఖమేనీ, తన ఆచూకీని బయటపడకుండా చూసుకుంటున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థలు ఇరాన్ అంతర్గత వర్గాల నుండి సేకరిస్తున్న సమాచారం వల్ల, ఇప్పటికే ఇరాన్కు చెందిన చాలా మంది కీలక నేతలు పట్టుబడ్డారు. ఇదే భయం ఇప్పుడు ఖమేనీని అజ్ఞాతంలోకి వెళ్లేలా చేసింది.ఒసామా బిన్ లాడెన్ తరహా వ్యూహంకొందరు విశ్లేషకులు ఖమేనీ అనుసరిస్తున్న ఈ అజ్ఞాత పద్ధతులను, గతంలో ఒసామా బిన్ లాడెన్ అనుసరించిన ‘ఆపరేషనల్ ఇన్విజిబిలిటీ’తో పోలుస్తున్నారు. మొజ్తబా ఖమేనీ గత ఫిబ్రవరి 28 నాటి దాడుల్లో గాయపడినప్పటి నుండి బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఇరాన్ నేతలు చాలా మంది వారాల తరబడి భూగర్భ బంకర్లకే పరిమితం కావడం, ఇరాన్ నాయకత్వంలో నెలకొన్న భయాందోళనలకు అద్దం పడుతోంది.ఇది కూడా చదవండి:కశ్మీర్లో ఎన్ఐఏ మెరుపు దాడులు -
వీడియో: విమానం ఢీ.. చీలిపోయిన పారాగ్లైడర్!
ఆస్ట్రియాలోని ఆల్ప్స్ పర్వతాలపై ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది. విహారయాత్ర కోసం ఎగురుతున్న చిన్న విమానం.. గాల్లో విహరిస్తున్న పారాగ్లైడర్ను నేరుగా ఢీకొట్టింది. ఒక్కసారిగా పారాగ్లైడర్ ముక్కలైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింటకు చేరాయి. ఆ వీడియోలో ఓ చిన్న విమానం పారాగ్లైడర్ మధ్య నుంచి చీల్చుకుంటూ వెళ్లిన దృశ్యాలు షాకింగ్గా కనిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే మహిళ గాల్లోనే అదుపుతప్పి చక్రంలా తిరుగుతూ కిందకు పడిపోయింది. అయితే.. చివరి క్షణంలో ఆమె ఎమర్జెన్సీ పారాచూట్ను తెరవడంతో ప్రాణాపాయం తప్పింది. స్క్మిటెన్హోహే పర్వత ప్రాంతంలో జరిగిన ఈ ఘటన మొత్తం ఆమె కెమెరాలో రికార్డైంది. వెంటనే అత్యవసర బృందాలు హెలికాప్టర్తో చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించాయి. చిన్నచిన్న గాయాలతో ఆమె బయటపడినట్లు సమాచారం. ఆమె పేరు సబ్రినా(44) అని, పారాగ్లైడింగ్లో అనుభవం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఆ తేలికపాటి విమానం కూడా జెల్ ఆమ్ సీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఆ ఢీ కొట్టడాన్ని తాను తప్పించలేకపోయానని సదరు పైలట్(28) అధికారులకు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ వీడియో.. గాల్లో భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది.🇦🇹 A paraglider collided midair with a Cessna 172 over Austria and somehow survived.She deployed her emergency parachute seconds after impact and landed safely.The plane pilot also managed to land safely at Zell am See Airport.pic.twitter.com/6IH7sTi3Ic— Mario Nawfal (@MarioNawfal) May 24, 2026 -
ఇరాన్ డీల్పై నిమ్మలంగా ట్రంప్!
దాదాపు మూడు నెలలుగా ప్రపంచాన్ని వణికించిన అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి. అయితే కాల్పుల తీవ్రత కొంత తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. “డీల్ కోసం తొందరపడొద్దు.. సమయం మాకే అనుకూలంగా ఉంది” అంటూ ట్రంప్ చెప్పడం వెనుక అసలు వ్యూహం ఏంటనేది అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. ట్రంప్ చేసిన ఆ ఒక్క వ్యాఖ్యతో మళ్లీ ప్రపంచ మార్కెట్లు, చమురు దేశాలు, దౌత్య వర్గాల్లో టెన్షన్ మొదలైంది. ట్రంప్ వ్యాఖ్యలను పరిశీలిస్తే.. అమెరికా ఇప్పుడు కేవలం యుద్ధాన్ని ఆపడం మాత్రమే కాదు. ఇరాన్పై దీర్ఘకాల వ్యూహాత్మక ఒత్తిడి కొనసాగిస్తూ భారీ రాజకీయ-ఆర్థిక ఒప్పందాన్ని సాధించాలని చూస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమంపై పూర్తి నియంత్రణ, హర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛాయుత నౌకా రవాణా, మధ్యప్రాచ్యంలో అమెరికా ప్రభావాన్ని మరింత బలపరచడం వంటి లక్ష్యాలతో వాషింగ్టన్ ముందుకెళ్తోందని నిపుణులు చెబుతున్నారు. అయితే అసలు ప్రశ్న ఇప్పుడు ఒక్కటే.. ఇరాన్ ట్రంప్ ప్రతిపాదనలకు ఒప్పుకుందా?..ప్రస్తుతం అందుతున్న సంకేతాల ప్రకారం సమాధానం “పాక్షికంగానే” ఒప్పుకుంది. చర్చలకు సిద్ధమని టెహ్రాన్ వర్గాలు చెబుతున్నా.. అమెరికా షరతులకు పూర్తిగా గ్రీన్సిగ్నల్ మాత్రం ఇవ్వలేదు. ముఖ్యంగా అణు కార్యక్రమాన్ని పూర్తిగా పరిమితం చేయడం, యురేనియం నిల్వలను తగ్గించడం, అంతర్జాతీయ అణు సంస్థ (IAEA) తనిఖీలకు పూర్తి అనుమతి ఇవ్వడం వంటి అంశాల్లో ఇప్పటికీ విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.ఇరాన్ వైఖరి ప్రస్తుతం ‘‘ముందు ఆంక్షలు సడలించండి.. తర్వాత మేం నిర్ణయం చెబుతాం’’ అన్నట్టుగా కనిపిస్తోంది. అమెరికా ఆంక్షలు ఎత్తివేయడం, విదేశాల్లో నిలిచిపోయిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం, యుద్ధం అధికారికంగా ముగిసిందన్న హామీ ఇవ్వడం వంటి అంశాలను టెహ్రాన్ ప్రధాన షరతులుగా పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి అంశాన్ని ఇరాన్ ఇప్పటికీ ఒత్తిడి సాధనంగానే ఉపయోగిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదే సమయంలో ట్రంప్ కూడా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. “పూర్తి ఒప్పందం కుదిరే వరకు బ్లాకేడ్ అలాగే కొనసాగుతుంది” అని ఆయన స్పష్టం చేశారు. అంటే కాల్పులు తగ్గినా.. ఆర్థిక, వ్యూహాత్మక ఒత్తిడి మాత్రం కొనసాగుతుందన్న సంకేతాలు అమెరికా ఇస్తోంది. అందుకే ట్రంప్ అసలు లక్ష్యం యుద్ధాన్ని ఆపడం కంటే.. ఇరాన్ను బలహీన స్థితిలో చర్చల టేబుల్పై ఉంచడమేనా? అనే చర్చ మొదలైంది.అంతర్జాతీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఒక తాత్కాలిక అవగాహన ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఇందులో యుద్ధాన్ని అధికారికంగా ముగించడం, హర్ముజ్ మార్గాన్ని తిరిగి తెరవడం, తదుపరి 30 లేదంటే 60 రోజులపాటు అణు చర్చలు కొనసాగించడం వంటి అంశాలు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ చర్చల్లో పాకిస్థాన్, ఖతార్, ఒమన్ వంటి దేశాలు మధ్యవర్తిత్వం చేస్తుండటం గమనార్హం.ఇక అమెరికా లోపల కూడా ట్రంప్పై ఒత్తిడి పెరుగుతోంది. “మూడు నెలల క్రితం ఇరాన్ సామర్థ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేశామని చెప్పి.. ఇప్పుడు మళ్లీ అదే దేశంతో రాజీ చర్చలు ఎందుకు?” అంటూ కొందరు రిపబ్లికన్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ అణు కేంద్రాలను పూర్తిగా నిర్వీర్యం చేయాలన్న డిమాండ్ను కొనసాగిస్తోంది.ఇప్పటికైతే యుద్ధం కాస్త చల్లారినట్లే కనిపిస్తున్నా.. అసలు గేమ్ ఇప్పుడు మొదలైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ట్రంప్ “టైమ్ మా వైపే ఉంది” అంటుంటే.. ఇరాన్ మాత్రం “మా షరతులు ముందుగా నెరవేర్చాలి” అని పట్టుబడుతోంది. ఈ బేరసారాలు ఎటు దారి తీస్తాయన్నదే ఇప్పుడు ప్రపంచ రాజకీయాలు, చమురు మార్కెట్లు, అంతర్జాతీయ భద్రత భవిష్యత్తును నిర్ణయించబోతోంది. ట్రంప్ ఆ ఒక్క మాటతో మళ్లీ ప్రపంచంలో టెన్షన్ పెరిగిందనే అభిప్రాయాలు ఇప్పుడు గట్టిగానే వినిపిస్తున్నాయి. -
బ్రిటన్లో ప్రవాస భారతీయల రికార్డు.. మేయర్లుగా తల్లీ తనయులు
లండన్: బ్రిటన్లో భారతీయ మూలాలున్న తల్లీ, తనయుడు మేయర్ ఎన్నికల్లో ఘన విజయాన్ని అందుకున్నారు. భారతీయ కుటుంబానికి చెందిన తల్లీకుమారులు ఇద్దరూ బ్రిటన్లో ఒకేసారి మేయర్లుగా ఎన్నిక కావడం విశేషం. వీరి కుటుంబం హర్యానాకు చెందినది.వివరాల ప్రకారం.. హర్యానాలోని రోహ్తక్ నుంచి పర్వీన్ రాణి కుటుంబం 2013లో బ్రిటన్కు వలస వెళ్లింది. పర్వీన్ రాణి కుమారుడు తుషార్ కుమార్ (23) లండన్లోని కింగ్స్ కళాశాలలో చదువుతున్నాడు. ఈ ఏడాది సెప్టెంబరులో పీజీ పూర్తి చేసుకోనున్నారు. అయితే, పర్వీన్ రాణి, తుషార్ కుమార్ ఎన్నికల్లో పోటీ చేశారు.ఈ క్రమంలో ఎల్స్ట్రీ అండ్ బోరమ్వుడ్ పట్టణ కౌన్సిల్కు తుషార్ మేయరుగా ఎన్నికయ్యారు. వారం రోజుల తర్వాత తుషార్ తల్లి పర్వీన్ రాణి హర్ట్స్మేర్ బరా కౌన్సిలుకు భారతీయ మూలాలున్న తొలి మేయరుగా ఎన్నికయ్యారు. ఇలా భారతీయ కుటుంబానికి చెందిన తల్లీకుమారులు ఇద్దరూ బ్రిటన్లో ఒకేసారి మేయర్లుగా ఎన్నిక కావడం విశేషం. ఇక, బ్రిటన్లో భారతీయ మూలాలున్న అతి తక్కువ వయసు గల మేయర్గా తుషార్ చరిత్ర సృష్టించారు. Historic moment in UK politics! For the first time an Indian origin mother and son have become Mayors in Britain. 23 years old Tushar Kumar created history by becoming the youngest Mayor of borehamwood town council, while his mother Praveen Rani was elected mayor of Hertsmere… pic.twitter.com/Z2de5J8z7x— Neeraj Ranjan (@NeerajRanjan84) May 25, 2026 -
ఒక్క కాఫీ.. చిన్న పేస్ట్రీ.. పెద్ద ఉపశమనం!
నేటి ఆధునిక జీవనశైలిలో పని ఒత్తిడి, ఆర్థిక అనిశ్చితి కారణంగా యువత తీవ్ర అలసటకు గురవుతోంది. ఈ క్రమంలోనే ‘లిటిల్ ట్రీట్ కల్చర్’ అనే సరికొత్త ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక్క కాఫీ లేదా చిన్న పేస్ట్రీని ఆస్వాదించడం, ‘క్యూట్ స్టేషనరీ’ కొనుగోలు చేయడం ద్వారా తాత్కాలికంగా మానసిక ప్రశాంతతను వెతుక్కుంటున్నారు. అసలు ఈ ట్రెండ్ వెనుక ఉన్న వాస్తవం ఏమిటి? ఇది కేవలం ఫ్యాషన్ మాత్రమేనా లేక మానసిక ఆరోగ్యానికి సంకేతమా?ఏంటీ ‘లిటిల్ ట్రీట్ కల్చర్’?'లిటిల్ ట్రీట్ కల్చర్' అంటే పెద్ద పెద్ద ఖర్చులు కాదు. పని ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా మూడ్ బాలేనప్పుడు తమకు తాముగా ఇచ్చుకునే చిన్న చిన్న బహుమతులు. ఒక కప్పు కాఫీ, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఒక ఐస్ క్రీమ్, లేదా ఆన్లైన్లో ఒక చిన్న కీచైన్ కొనడం మొదలైనవి దీని పరిధిలోకి వస్తాయి. ఇది కేవలం వస్తువును కొనడం కాదు, కష్ట సమయంలో తనను తాను ఓదార్చుకునే ఒక భావోద్వేగ ప్రక్రియ.పాండమిక్ తర్వాత ఊపందుకున్న అలవాటుకోవిడ్ మహమ్మారి తర్వాత ప్రపంచంలో అనిశ్చితి పెరిగింది. పెద్ద పెద్ద లక్ష్యాల కోసం వేచి చూడటం కంటే, రోజువారీ జీవితంలోనే చిన్న చిన్న సంతోషాలను వెతుక్కోవడం సులభమని యువత భావిస్తోంది. భారీ షాపింగ్లు లేదా ఖరీదైన హాలిడే ట్రిప్పుల కంటే, కేవలం రూ. రూ. 100లోపు ఖర్చుతో లభించే కాఫీ లేదా స్వీట్, తక్షణ ఉపశమనాన్ని ఇస్తుందని నమ్ముతున్నారు.సోషల్ మీడియాలో ‘మెయిన్ క్యారెక్టర్’ మూమెంట్స్ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ వంటి ప్లాట్ఫారమ్లు ఈ ట్రెండ్ను మరింతగా ప్రాచుర్యంలోకి తెచ్చాయి. తాము కొన్న చిన్న వస్తువులను, తమ రోజువారీ జీవితంలోని చిన్న చిన్న సంఘటనలను ‘మెయిన్ క్యారెక్టర్ మూమెంట్స్’గా సోషల్ మీడియాలో ప్రదర్శించడం ఫ్యాషన్గా మారింది. ‘ఈరోజు చాలా కష్టపడ్డాను, కాబట్టి నాకో చిన్న ట్రీట్’ అనే వ్యాఖ్యలు ఇప్పుడు యువతకు అత్యంత ఆనందకర అనుభూతినిస్తున్నాయి.మెదడుపై చిన్న ట్రీట్ల ప్రభావంనిపుణుల అభిప్రాయం ప్రకారం, చిన్న చిన్న సంతోషకరమైన పనులు మెదడులో డోపమైన్ను విడుదల చేస్తాయి. ఇది ఒత్తిడిని తగ్గించి, తాత్కాలికంగా ఉత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యంగా పని ఒత్తిడి, ఆర్థిక భారం, సామాజిక ఒత్తిడి ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న రివార్డులు ఒక రకమైన ‘ఎమోషనల్ రీసెట్’గా పనిచేస్తాయి. ఇక్కడ వస్తువు కంటే, ఆ వస్తువును కొనేటప్పుడు కలిగే ఆత్మసంతృప్తి ముఖ్యమైనది.మైక్రో-లగ్జరీల మార్కెటింగ్ మాయాజాలంఈ ట్రెండ్ను బ్రాండ్లు కూడా చక్కగా వాడుకుంటున్నాయి. చిన్న సైజు పర్ఫ్యూమ్లు, ట్రావెల్-సైజ్ స్కిన్కేర్ ఉత్పత్తులు, క్యూట్ డెకర్ వస్తువులను ‘మైక్రో-లగ్జరీ’లుగా ప్రచారం చేస్తున్నాయి. తక్కువ ధరలో దొరికే ఈ విలాసాలు ఆర్థికంగా భారం కాకపోవడం వల్ల, యువత వీటికి ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఇదే ఇప్పుడు ఒక భారీ వ్యాపార మార్గంగా మారింది.ఇది మంచిదా? లేక అనారోగ్యకరమా?చిన్న చిన్న ఆనందాలు తప్పు కాదు. కానీ అది వ్యసనంగా మారకూడదు. ప్రతి చిన్న కష్టానికి షాపింగ్పైనే ఆధారపడటం ఆర్థికంగా చిక్కుల్లో పడేయవచ్చు. అప్పుడప్పుడు తీసుకునే ‘ట్రీట్’ ఒక రకమైన ఊరటనిస్తే, అదే పనిగా ఖర్చు చేయడం అనేది ‘ఎమోషనల్ స్పెంటింగ్’ అనే ప్రమాదంలోకి నెట్టేస్తుంది. అందుకే సంతోషం అనేదానిని కొనుగోలుతోనే తెచ్చుకోకుండా, ఇతర ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా కూడా సమకూర్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: హార్ముజ్ను మింగేస్తున్న ‘ఎల్లో ఫ్లీట్’ -
మన విద్యార్థులకు కరెన్సీ కష్టాలు
రూపాయి విలువ పతనం.. విదేశాల్లోని భారతీయ విద్యార్థులకు శాపంగా మారింది. ఒక్కపూట తింటూ అర్థాకలితో బతుకుతున్నారు. తక్కువ ధరలో దొరుకుతుందని కొందరు కాలం చెల్లిన ఆహారం కోసం వెతుకుతున్నారు. డబ్బులు సరిపోక అదనపు పనులు చేస్తున్నారు. ఇదంతా వారి చదువులపై ప్రభావం చూపి విద్యార్థుల గ్రేడ్లు దెబ్బతింటున్నాయి. భారత రూపాయి ఇప్పుడు అమెరికన్ డాలర్తో పోలిస్తే కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ సంక్షోభం కొన్ని నెలల్లోనే తీవ్రమైంది. డాలర్కు రూపాయి విలువ 95 మార్కును దాటింది. ఏ క్షణంలోనైనా అది 100 చేరుకునే అవకాశం ఉంది. కొన్నేళ్ల కిందటి వరకు పౌండ్తో పోలిస్తే రూపాయి బలహీనంగా కనిపించేది. 2013లో పౌండ్తో రూపాయి విలువ మూడంకెల స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత 2022లో, యూరోతో పోలిస్తే రూపాయి 100 మార్కును తాకింది. ఇప్పుడు, డాలర్ విలువ 100 రూపాయలకు చేరువవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కడుపు మాడ్చుకుంటూ విదేశాల్లో చదువు అంటే తాము ఊహించుకున్న జీవితం వేరు.. కానీ అక్కడ గడుపుతున్న జీవితం మరోలా ఉంది. బలహీనపడుతున్న రూపాయి, విదేశాల్లోని చాలా మంది భారతీయ విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. సంపన్న కుటుంబాల పిల్లలు తప్ప.. మధ్య తరగతి కుటుంబాల నుంచి వెళ్లిన విద్యార్థులు కష్టాలు పడుతున్నారు. కొందరు అసలు భోజనమే మానేయాల్సి వస్తోంది. మరికొందరు రోజుకు ఒక్క పూట భోజనంతో బతుకుతున్నారు. యూకే, యూఎస్, ఆ్రస్టేలియా, సింగపూర్లోని విద్యార్థులదీ ఇదే పరిస్థితి. బయట తినడం మొత్తమే మానేస్తున్నారు. తక్కువ ధర ఉన్న ఆహారం కోసం ‘టూ గుడ్ టు గో’వంటి యాప్లపై ఆధారపడుతున్నారు. ఈ యాప్లు కోస్టా కాఫీ, స్టార్బక్స్ వంటి ఫుడ్ అవుట్లెట్లలో గడువు ముగియబోతున్న ఆహార వివరాలను పెడతాయి. ఆ లిస్టింగ్ లైవ్లోకి వచ్చిన వెంటనే క్షణాల్లో అయిపోతోంది. వేరోవరో బుక్ చేసుకుని అది చేజారిపోకుండా ఉండేందుకు విద్యార్థులు స్టోర్కు పరుగెడుతున్నారు. అదీ దొరక్కపోతే ఆకలితో అలమటించాల్సిందే. వర్సిటీ ఆహార పంపిణీపై అమెరికాలోని చాలా మంది విద్యార్థులు డబ్బు ఆదా చేసుకోవడానికి విశ్వవిద్యాలయాలు నిర్వహించే ఆహార పంపిణీపై ఆధారపడుతున్నారు. చాలా విశ్వవిద్యాలయాలు వారానికి ఒకసారి కూరగాయలు, పాలు, కిరాణా సామగ్రిని పంపిణీ చేస్తాయి. బయట తినే ఖర్చులను తగ్గించుకోవడానికి విద్యార్థులు ఆ సామాగ్రిని తమ రిఫ్రిజిరేటర్లలో నిల్వ చేసుకుంటున్నారు. కిరాణా సామగ్రిని సైతం కలిసి కొనుగోలు చేస్తున్నారు. అపార్ట్మెంట్లను షేర్ చేసుకుంటున్నారు. ఖర్చులు తగ్గించుకోవడానికి ఏడెనిమిది మంది విద్యార్థులు ఒకే గదిలో లేదా అపార్ట్మెంట్లో ఇరుక్కుని ఉంటున్నారు. అదనపు పని చాలా మంది విద్యార్థులు తమకు అధికారికంగా అనుమతి ఉన్న పని గంటలకు మించి పనిచేస్తున్నారు. అధికారిక పార్ట్టైమ్ ఉద్యోగాలతోపాటు డిపార్ట్మెంట్ స్టోర్లు, రైల్వే స్టేషన్లలో నేల తుడవడం వంటి శారీరక శ్రమతో కూడుకున్న పనులు చేస్తున్నారు. పౌండ్ బలపడుతున్న కొద్దీ యూకేలోని చిన్న విశ్వవిద్యాలయ పట్టణాల్లోనూ రోజువా రీ జీవితం మరింత ఖరీదైనదిగా మారింది. క్యాబ్ల సంగతి పక్కన పెడితే.. ప్రజా రవాణా కూడా ఖరీదైనదిగా మారింది. దీంతో డబ్బు ఆదా చేసుకోవడం కోసం విద్యార్థులు కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి వస్తోంది. భారత్లోని కుటుంబాలపై భారం... ఇది కేవలం విదేశాల్లోని విద్యార్థులనే కాదు.. భారత్ నుంచి వారి చదువుకు డబ్బు పంపుతున్న కుటుంబాలను కూడా ప్రభావితం చేస్తోంది. ఈ కరెన్సీ పతనం మధ్యతరగతి కుటుంబాలకు మరింత ఆందోళనకు గురి చేస్తోంది. తల్లిదండ్రులు తమ పిల్లలను విదేశాలకు పంపడానికి స్పష్టమైన బడ్జెట్ కేటాయిస్తారు. ట్యూషన్ ఫీజులు, అద్దె, రానుపోను విమాన ఛార్జీలు, ఇతరత్రా ఖర్చులను లెక్కిస్తారు. ఈ క్రమంలో కరెన్సీ హెచ్చుతగ్గులను పరిగణనలోకి తీసుకోరు. ప్రస్తుతం కరెన్సీ విలువ తగ్గడం ఫీజుల పెంపుదలలా పనిచేస్తోంది. చాలా విదేశీ విశ్వవిద్యాలయాలు సెమిస్టర్ వారీగా ఫీజులు వసూలు చేస్తాయి. రూపాయి విలువ పడిపోవడంతో చివరి సెమిస్టర్ల నాటికి అప్పటికే తీసుకున్న విద్యా రుణం సరిపోవడం లేదు. విద్యార్థుల ఖర్చులు పెరగడంతో మిగిలిన ఫీజులను భరించడానికి వారి తల్లిదండ్రులు అదనపు రుణాలు తీసుకోవాల్సి వస్తోంది. ఒకే డిగ్రీ కోసం రూపాయి విలువ పడిపోయిన ప్రతిసారీ ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి వస్తోంది. దీర్ఘకాలిక కోర్సులపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటోంది. రూపాయి–డాలర్ మారకపు రేటులో చిన్నపాటి తగ్గుదల కూడా నాలుగైదేళ్లలో అదనంగా పెరిగే లక్షల రూపాయలను అదనంగా చెల్లించాల్సి వస్తోంది. గ్రేడ్లపై ప్రభావం.. భారతీయ విద్యార్థుల కష్టాలు వారి గ్రేడ్లలో ప్రతిబింబిస్తున్నాయి. డబ్బు ఆదా చేసుకోవడం కోసం విద్యార్థులు భోజనం మానేస్తున్నారు. నలుగురు లేదా ఐదుగురు ఒకే గదిలో ఇరుక్కుని ఉంటున్నారు. నిరంతరం ఖర్చులను తగ్గించుకునే క్రమంలో వారు చదువులపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. అమెరికాలోని చాలా మంది భారతీయ విద్యార్థులు ఇప్పుడు పెరుగుతున్న ఖర్చుల గురించే కాకుండా, గ్రాడ్యుయేషన్ తర్వాత ఉపాధి గురించి కూడా ఆందోళన చెందుతున్నారు. వలస, పని వీసాల నిబంధనలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినతరం చేయడంతో హెచ్–1బీ వీసా వ్యవస్థ, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్పై అనిశ్చితి ఏర్పడింది. భవిష్యత్ గందరగోళంగా మారింది. డిస్కౌంట్లో దొరికిన ఆహారం తినే... ‘‘విదేశాల్లో చదువుకునే వారందరూ సంపన్న కుటుంబాల నుంచి వచ్చినవారు కాదు. స్కాలర్షిప్లపై చదువుకుంటున్న వారున్నారు. పిల్లల డిగ్రీల కోసం ఇళ్లను తాకట్టు పెట్టిన తల్లిదండ్రులూ ఉన్నారు. నా మాస్టర్స్ కోసం బడ్జెట్ వేసుకునేటప్పుడు రూపాయి అంశాన్ని నేను పరిగణనలోకి తీసుకోలేదు. కానీ నేను లండన్ వెళ్లాక అర్థమైంది. అప్పుడు అమెరికన్ డాలర్ విలువ రూ.85 ఉంది. నేను తిరిగొచ్చేసరికి రూ. 93కి పెరిగింది. లండన్లో నేను చాలాసార్లు యాప్ల్లో డిస్కౌంట్లో దొరికిన ఆహారం తెచ్చుకునే కడుపు నింపుకున్నాను. యూకేలో ఉన్నా, అమెరికాలో చదువుతున్నా.. ఇంటి నుంచి పంపిన డబ్బును సరిపోయేలా వాడుకోవాలనే ఆందోళన ఉంటుంది. ఇది విద్యార్థుల గ్రేడ్లపై ప్రభావం చూపిస్తుంది’’అని యూకేలో చదువుకొని వచ్చిన థానేకు చెందిన మాన్వి కోలి చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఒప్పందానికి చేరువలో..
వాషింగ్టన్/కైరో/న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో కల్లోలానికి తెరదించి.. శాంతి, స్థిరత్వం నెలకొల్పడానికి అడుగులు ముందుకు పడుతున్నాయి. యుద్ధాన్ని ముగించి, హార్మూజ్ జలసంధిని తిరిగి తెరిచి, శుద్ధిచేసిన యురేనియం నిల్వలను ఇరాన్ వదులుకునేలా చేసే ఒప్పందానికి అమెరికా చాలా చేరువలోకి వచ్చేసిందని అధికార వర్గాలు స్పష్టంచేశాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం దాదాపు ఖరారైనట్లేనని పేర్కొన్నాయి. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని వెల్లడించాయి. అణ్వాయుధ పరీక్షలకు దూరంగా ఉండాలని, శుద్ధి చేసిన యురేనియంను తమకు అప్పగించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. అయితే, దీనికి ఇరాన్ ఇప్పటిదాకా బహిరంగంగా అంగీకరించలేదు. ఆ నిజాన్ని ఇరాన్ అర్థం చేసుకోవాలిఇరాన్తో ఇప్పందం చాలావరకు కుదిరిందని ట్రంప్ శనివారం ప్రకటించారు. ఈ విషయంలో భాగస్వా మిగా ఉన్న మిత్రదేశాలతో మాట్లాడానని చెప్పారు. ‘‘ఇరాన్తో చర్చలు క్రమబద్ధంగా, నిర్మాణాత్మకంగా సాగుతున్నాయి. సమయం మనకు అనుకూలంగా ఉన్నందున, ఒప్పందానికి తొందరపడవద్దని నా ప్రతినిధులకు తెలియజేశా. ఇరు పక్షాలు కొంత సమయం తీసుకుని సరైన నిర్ణయానికి రావాలి. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలి’’అంటూ ఆదివారం సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఇరాన్తో అమెరికా సంబంధాలు మరింత ఫలవంతంగా మారుతున్నాయని ఉద్ఘాటించారు. ఒప్పందం కుదిరి, ధ్రువీకరించబడి, సంతకం చేసే వరకూ ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య దౌత్య, ఆర్థిక, భద్రతా సంబంధాలను నెలకొల్పే అబ్రహం ఒప్పందంలో చేరాలని ఇరాన్ను ట్రంప్ ఆహ్వానించారు. అయితే, అణ్వాయుధాన్ని లేదా బాంబును అభివృద్ధి చేయలేమని లేదా సమకూర్చుకోలేమన్న నిజాన్ని ఇరాన్ అర్థం చేసుకోవాలన్నారు. మరికొన్నిగంటల్లో శుభవార్త: రూబియో ఇరాన్తో చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలియజేశారు. రాబోయే కొన్ని గంటల్లోనే శుభవార్త వినే అవకాశం ఉందని చెప్పారు. ఇరాన్తో ఒప్పందంపై అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటన చేస్తారని సంకేతాలిచ్చారు. రూబియో ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. వివాదాన్ని పరిష్కరించేందుకు సంబంధిత ముసాయిదాపై గత 48 గంటల్లో జరిగిన చర్చల్లో పురోగతి సాధించామని పేర్కొన్నారు. కానీ, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వివరించారు. ఇరాన్ వద్ద ఎప్పటికీ అణ్వాయుధాలు ఉండకూడదనేదే అంతిమ లక్ష్యమని స్పష్టంచేశారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడానికి వీల్లేదన్నారు.ఒప్పందంలో ఏముంది? → ఇరాన్ వద్ద ప్రస్తుతం 440.9 కిలోల(972 పౌండ్లు) యురేనియం ఉంది. ఇది 60 శాతం వరకు శుద్ధత కలిగినది. అణ్వాయుధ తయారీకి 90% శుద్ధి చేసిన యురేనియం అవసరం. → అమెరికాతో ఒప్పందంలో భాగంగా ఈ యురేనియంను వదులుకోవడానికి ఇరాన్ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. → ఇరాన్ యురేనియంను ఎలా వదులుకుంటుందనే విషయం 60 రోజుల వ్యవధిలో జరిగే తదుపరి చర్చలకు లోబడి ఉంటుందని చెబుతున్నారు. → యురేనియంలో కొంత భాగాన్ని నిర్వీర్యం చేస్తారు. మిగిలినదాన్ని మూడో దేశానికి బదిలీ చేస్తారు. ఈ యురేనియంను స్వీకరించడానికి రష్యా ముందుకొచ్చింది. → హార్మూజ్ జలసంధిని పూర్తిస్థాయిలో తెరవడానికి, సుంకాలు లేకుండా నౌకాయానికి వీలు కల్పించడానికి ఇరాన్ అంగీకరించింది. → ఒప్పందం కుదిరినట్లేనని అమెరికా వర్గాల సమాచారం. దానిపై ఇంకా సంతకాలు జరగలేదు. ట్రంప్ ఆమోదం లభించాల్సి ఉందని, కొన్ని రోజులు పట్టవచ్చని అంటున్నారు. -
ప్రస్తుతానికి ఇబ్బందులు తప్పవు
న్యూఢిల్లీ: వీసాల జారీ విషయంలో మరింత మెరుగైన వ్యవస్థను తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. వలసల విధానాన్ని మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టామని, ఈ మార్పు సమయంలో కొన్ని ఆటంకాలు, ఇబ్బందులు ఉండొచ్చని అన్నారు. చట్టబద్ధమైన వలసదారులకు ప్రయోజనం చేకూర్చేలా అంతిమంగా ఒక సమర్థవంతమైన వ్యవస్థను తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమని తేల్చిచెప్పారు. ‘ప్రపంచంలో వలసలను స్వాగతించే అతిపెద్ద దేశం అమెరికా’అని ఉద్ఘాటించారు. అక్రమ వలసదార్ల సవాలును పరిష్కరించడానికి వీసాల జారీలో సంస్కరణలు ప్రారంభించామని, ఇందులో భారత్ను ఎంతమాత్రం టార్గెట్ చేయడం లేదని వివరణ ఇచ్చారు. ఇటీవలి కాలంలో వీసా, వలస విధానాల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేసిన మార్పుల పట్ల భారత్ ఆందోళనను విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్.. మార్కో రూబియో దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ విధానపరమైన మార్పుల వల్ల చట్టబద్ధమైన వలసలు ప్రతికూలంగా ప్రభావితం కాకూడదని అన్నారు. ఎస్.జైశంకర్, రూబియో ఆదివారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ప్రధానంగా భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించారు. కీలక రంగాల్లో ఇరుదేశాలు పరస్పరం సహకరించుకోవాలని, కలిసికట్టుగా ముందుకెళ్లాలన్న అభిప్రాయానికి వచ్చారు. అనంతరం ఇరువురు నేతలు ఉమ్మడిగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజల మధ్య సంబంధాలే భారత్–అమెరికా సంబంధాలకు కీలకమని జైశంకర్ అన్నారు. అమెరికాల వీసాల జారీ విషయంలో భారతీయులు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి రూబియోకు తెలియజేశానని వెల్లడించారు. చట్టబద్ధంగా వెళ్లేవారిని ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదని కోరానని పేర్కొన్నారు. అక్రమ వలసలను అరికట్టే విషయంలో అమెరికాకు సహకరిస్తున్నామని గుర్తుచేశారు. చట్టబద్ధమైన వలసలకు అడ్డంకులు సృష్టించవద్దని అమెరికాకు సూచించారు. అన్నింటికంటే ముఖ్యంగా రెండు దేశాల వ్యాపార, సాంకేతిక, పరిశోధన సహకారానికి వలసలు కీలకమని ఉద్ఘాటించారు. హెచ్–1బీ వీసా నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేయడం భారతీయులకు శరాఘాతంగా మారింది. గ్రీన్ కార్డు విషయలోనూ వారు ఆందోళనకు గురవుతున్నారు. గ్రీన్కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే స్వదేశానికి వెళ్లేలా నిబంధన తీసుకొచ్చారు. అమెరికా తన విదేశాంగ విధానాన్ని ‘అమెరికా ఫస్ట్’గా నిర్దేశించుకుందని, భారతదేశానికి ‘ఇండియా ఫస్ట్’విధానం ఉందని జైశంకర్ అన్నారు. స్వదేశీ జాతీయ ప్రయోజనాకు ఇరుదేశాలు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని వివరించారు. భారత్ మా లక్ష్యం కాదు గ్రీన్ కార్డ్ నిబంధనల్లో మార్పులపై ప్రశ్నకు రూబియో సమాధానమిస్తూ.. ప్రస్తుత వ్యవస్థను సంస్కరించే సమగ్ర విధానంలో ఇది ఒక భాగమని వెల్లడించారు. అమెరికాలో వలస సంక్షోభం నెలకొందని అంగీకరించారు. ఇది భారతదేశం వల్ల జరిగిందని తాను చెప్పడం లేదన్నారు. గత కొన్నేళ్లుగా 2 కోట్ల మందికి పైగా ప్రజలు చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించారని, ఆ సవాలును పరిష్కరించాల్సి ఉందని వివరించారు. ప్రస్తుత వ్యవస్థను సంస్కరించే ప్రక్రియలో భారత్ తమ లక్ష్యం కాదని బదులిచ్చారు. ఎప్పుడైనా ఒక సంస్కరణను చేపట్టినప్పుడు, ప్రజలు భాగస్వాములయ్యే వ్యవస్థలో మార్పు చేసినప్పుడు.. కొన్ని ఇబ్బందులను, అవరోధాలను సృష్టించే ఒక పరివర్తన కాలం ఉంటుందని వ్యాఖ్యానించారు. మన గమ్యం ఒక మెరుగైన వ్యవస్థగా, మరింత సమర్థవంతమైన వ్యవస్థగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడున్న దానికంటే మెరుగైన, సుస్థిరమైన వీసా విధానాన్ని తీసుకురాబోతున్నామని వెల్లడించారు.మూర్ఖులు ఎక్కడైనా ఉంటారు అమెరికాలో భారతీయులు జాత్యహంకారాన్ని ఎదుర్కొంటున్నారనే ఆరోపణల్లో నిజం లేదని మార్కో రూబియో తెలిపారు. నిజంగా భారతీయులపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని అన్నారు. ఆన్లైన్లో, బయట కూడా వ్యాఖ్యలు చేసిన వారు కచ్చితంగా ఉంటారని నేను భావిస్తున్నానని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలోనూ తెలివితక్కువ ప్రజలు, మూర్ఖులు ఉంటారని వ్యాఖ్యానించారు. ఇక్కడ మూర్ఖులు ఉన్నారని కచ్చితంగా తెలుసని అన్నారు. అమెరికాలో కూడా ఎల్లప్పుడూ తెలివితక్కువ వ్యాఖ్యలు చేసే మూర్ఖులు ఉన్నారని తేల్చిచెప్పారు. -
అప్పటివరకు ఇంతే..: మరో బాంబ్ పేల్చిన ట్రంప్
వాషింగ్టన్ డీసీ: పశ్చిమాసియా సంక్షోభానికి పూర్తి పరిష్కారం దిశగా ఇరాన్తో ఒప్పందం చేసుకునే విషయంలో అమెరికా తొందరపడదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం చెప్పారు. ఇరు పక్షాల మధ్య అధికారిక ఒప్పందం కుదిరి, ధ్రువీకరణ పూర్తై, సంతకాలు అయ్యే వరకు ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా విధించిన “దిగ్బంధం” పూర్తి స్థాయిలో కొనసాగుతుందని స్పష్టం చేశారు.అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో కుదిరిన ఇరాన్ అణు ఒప్పందాన్ని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. అది “మన దేశం చేసిన అత్యంత చెత్త ఒప్పందాల్లో ఒకటి” అని వ్యాఖ్యానించారు. బరాక్ ఒబామాపై విమర్శలు చేస్తూ, ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యం పెంచుకునే దారిని ఆ ఒప్పందం తెరిచిందని ఆరోపించారు.‘‘మన దేశం చేసిన అత్యంత చెత్త ఒప్పందాల్లో ఒకటి ఇరాన్ అణు ఒప్పందం. దీనిని బరాక్ హుస్సేన్ ఒబామా, ఆయన అడ్మినిస్ట్రేటివ్లోని అనుభవం లేని వారు ముందుకు తీసుకువచ్చి అమల్లోకి తెచ్చారు. అది ఇరాన్ అణ్వాయుధం తయారు చేసే దిశగా నేరుగా తీసుకెళ్లింది. ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇరాన్తో జరుపుతున్న చర్చలు అలా కాదు. అసలు దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.చర్చలు క్రమబద్ధంగా, నిర్మాణాత్మకంగా సాగుతున్నాయి. టైమ్ మన వైపు ఉండడంతో ఒప్పందం త్వరగా ముగించాలనే తొందరపడొద్దని నా ప్రతినిధులకు చెప్పాను. ఒప్పందం పూర్తిగా ఖరారై, ధ్రువీకరణ పొంది, సంతకం అయ్యే వరకు దిగ్బంధం పూర్తిగా కొనసాగుతుంది. ఇరు పక్షాలు సమయం తీసుకుని సరిగ్గా చేయాలి. ఎలాంటి తప్పులు జరగకూడదు.ఇరాన్ అణ్వాయుధం లేదా అణు బాంబు తయారు చేయకూడదు, పొందకూడదు అన్న విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకు సహకారం అందించిన పశ్చిమాసియా దేశాలన్నింటికీ నా ధన్యవాదాలు. వారు చరిత్రాత్మక అబ్రహాం ఒప్పందాల్లో చేరడం వల్ల ఈ సహకారం ఇంకా బలపడుతుంది. ఎవరికి తెలుసు.. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ కూడా అందులో చేరాలని అనుకోవచ్చు’’ అని డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. -
ఇంటి అద్దెలు భరించలేక ఆగ్రహం కట్టలు తెంచుకుని..
మాడ్రిడ్: మన దేశంలోని పలు నగరాల్లో ఇంటి అద్దెలు ఎంతగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అంతెందుకు హైదరాబాద్లో అద్దెకు ఉండి ఉద్యోగాలు చేసుకునే చాలా మంది .. తమ జీతం అద్దెలు కట్టుకోవడానికే సరిపోతుందంటూ వాపోతుంటారు. అయితే, అద్దెల బాధల వల్ల వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపిన వార్తను ఎప్పుడైనా విన్నారా? స్పెయిన్లో ఆదివారం అదే జరిగింది.మాడ్రిడ్, బార్సెలోనా లాంటి నగరాల్లో పెరుగుతున్న ఇంటి అద్దె ఖర్చులు చాలా మందికి ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. మరోవైపు, కొంత డబ్బు కూడబెట్టుకున్న వారు ఇళ్లు కొందామన్నా అందుబాటు ధరల్లో ఉండడం లేదని నిరసనకారులు చెప్పారు. స్పెయిన్ ప్రజలను ఇళ్ల మార్కెట్కు దూరం చేస్తున్నాయంటూ మాడ్రిడ్లో నిరసన చేపట్టారు.స్పెయిన్లో హౌసింగ్ క్రిసిస్, సోషలిస్టు ప్రధాని పెర్డో సాంచెజ్కు తలనొప్పిగా మారింది. 2027 ఎన్నికలకు ముందు ఇది అతిపెద్ద సవాలు. ఆ దేశంలో సొంత ఇల్లు ఉండాలన్న సంప్రదాయం బలంగా ఉంది. పర్యాటకం, వలసలతో పెరిగిన జనాభా కారణంగా డిమాండ్ పెరగడంతో ఇళ్ల అద్దెలు భారీగా పెరిగాయని విశ్లేషకులు చెబుతున్నారు.నిరసనకారులు నినాదాలు చేస్తూ ఇంటి హక్కును గుర్తు చేస్తూ బ్యానర్లు ప్రదర్శించారు. “మాకు పర్యాటకులు కాదు, నేబర్స్ కావాలి” అని ఒక బ్యానర్లో రాసి ఉంది.ఓ ర్యాలీని మరవకముందే మరొకటిస్పెయిన్లో శనివారం కూడా ఓ ర్యాలీ జరిగింది. సాంచెజ్కు వ్యతిరేకంగా మాడ్రిడ్లో వేలాది మంది నిరసన చేపట్టారు. అవినీతి ఆరోపణలు, ప్రభుత్వంపై అసంతృప్తితో రాజకీయ ఉద్రిక్తతలు, విమర్శలు పెరిగాయి. దీంతో స్పెయిన్లో ఉద్రిక్తతలు పెరిగాయి.ఆ ర్యాలీ మరవకముందే ఆదివారం మరో ర్యాలీ జరగడం గమనార్హం. స్పెయిన్లో ఇల్లు కొనడం చాలా మందికి భారంగా మారింది. మార్కెట్ ఒత్తిళ్లు, ఊహాగానాలు ధరలను పెంచుతున్నాయి. ముఖ్యంగా పెద్ద నగరాలు, తీర ప్రాంతాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది.గత నెలలో స్పెయిన్ ప్రభుత్వం 7 బిలియన్ యూరోల ($8.23 బిలియన్) విలువైన భారీ ప్రణాళికను ఆమోదించింది. వచ్చే నాలుగేళ్లలో మరిన్ని ప్రభుత్వ గృహాలు నిర్మించడం, అధిక అద్దెలు, ఇళ్ల ధరలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేయడం ఈ ప్రణాళిక లక్ష్యం.గత కొన్ని ఏళ్లుగా స్పెయిన్ ప్రజలు దేశవ్యాప్తంగా అనేక నిరసనల్లో పాల్గొంటున్నారు. అధిక అద్దెలు, ఇళ్ల ధరలకు వ్యతిరేకంగా రోడ్లపైకి వస్తున్నారు. గత ఏడాది రికార్డు స్థాయిలో 97 మిలియన్ అంతర్జాతీయ పర్యాటకులు స్పెయిన్ను సందర్శించారు. నగర కేంద్రాల్లో విస్తరించిన పర్యాటక అద్దె ఇళ్లపై ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాన డిమాండ్గా ఉంది. 2025 చివర్లో ఇళ్లకు సంబంధించిన ఖర్చులు ఏడాది ప్రాతిపదికన దాదాపు 13 శాతం పెరిగాయని యూరోపియన్ యూనియన్ గణాంక సంస్థ యూరోస్టాట్ తెలిపింది. బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ అంచనా ప్రకారం.. 50 మిలియన్ జనాభా ఉన్న స్పెయిన్లో 7,00,000 ఇళ్ల కొరత ఉంది. డిమాండ్తో పోల్చితే కొత్త నిర్మాణాల వేగం తక్కువగా ఉంది. -
ఇరాన్ సంచలన ప్రకటన
టెహ్రాన్ : ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ‘మాకు అణ్వాయుధాలు అవసరం లేదు. అణ్వాయుధాల విషయంలో ప్రపంచానికి భరోసా ఇస్తున్నాం. ప్రపంచ అణు నిబంధనలకు కట్టుబడి ఉంటాం’అని తెలిపింది. ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అధికారిక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం..నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఇరాన్ తన యురేనియం నిల్వలను ఒప్పందం ప్రకారం అమెరికాకు ఇవ్వడానికి సిద్ధమైంది.భారత్లోని వారణాసిలో ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ మాట్లాడుతూ.. ‘అణ్వాయుధాలు ఇస్లాంలో హరామ్ (నిషిద్ధం). ముప్పై ఏళ్ల క్రితమే ఇరాన్ వాటిని వద్దని ప్రకటించింది. సుప్రీం లీడర్ ఇచ్చిన ఫత్వా ప్రకారం అవి మతపరంగా నిషిద్ధం’ అని స్పష్టం చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను ‘న్యూక్లియర్ డస్ట్’ అని పేర్కొంటూ, ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండా నిరోధించడం తమ ప్రధాన లక్ష్యం అని పునరుద్ఘాటించారు. ఇటీవల పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కూడా ఇరాన్ నాయకులతో సమావేశమై, పశ్చిమ ఆసియాలో శాంతి ప్రయత్నాలపై చర్చించారు. అమెరికా,ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ పొడిగింపు, హర్మూజ్ జలసంధి పునఃప్రారంభంపై చర్చలు కొనసాగుతున్నాయి. -
‘ఒరెష్నిక్ హైపర్సోనిక్’తో రష్యా భీకరదాడులు
కీవ్: ఉక్రెయిన్పై రష్యా పెద్ద ఎత్తున దాడులు చేసింది. కొన్ని వందల డ్రోన్లు, డజన్లకొద్దీ క్షిపణులను ప్రయోగించింది. కీవ్ నగరంతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నలుగురు మృతిచెందగా, మరో 50 మందికిపైగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున ఆ ప్రాంతమంతా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇళ్లకు, పాఠశాలలకు నష్టం వాటిల్లినట్లు సమాచారం.బిలా సెర్క్వా నగరంపై జరిగిన దాడిలో ఒరెష్నిక్ హైపర్సోనిక్ క్షిపణి వాడినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. ఆ నగరం కీవ్ ప్రాంతంలో ఉంది. ఒరెష్నిక్ హైపర్సోనిక్ క్షిపణి శబ్ద వేగం కన్నా 10 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది.ఉక్రెయిన్ శుక్రవారం స్టారోబిల్స్క్ పట్టణంలోని విద్యార్థుల వసతి గృహంపై దాడి చేసిందని ఆరోపించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు. చెప్పినట్లే ఆదివారం దాడులు చేశారు. రష్యా దాడులు చేయడానికి ముందే జెలెన్ స్కీ మాట్లాడుతూ.. తమ దేశంపై దాడి చేసే సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు. రష్యా ఒరెష్నిక్ క్షిపణి వాడే అవకాశం ఉందని ఉక్రెయిన్ నిఘా సంస్థలకు సమాచారం వచ్చినట్టు కూడా ఆయన చెప్పారు. ఆ క్షిపణిని అడ్డుకోవడం అసాధ్యమని చెబుతున్నారు. ఉక్రెయిన్ జాతీయ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కీవ్ ప్రాంతంలో 50కు పైగా చోట్ల దాడి జరిగింది. ఇళ్లు, షాపింగ్ కేంద్రాలు, అత్యవసర సేవల భవనాలు, పోలీస్ భవనాలు దెబ్బతిన్నట్టు సమాచారం.నీటి సరఫరా కేంద్రంపై కూడా దాడి జరిగినట్టు జెలెన్స్కీ చెప్పారు. “రాజధానిపై భారీ బాలిస్టిక్ దాడి జరిగింది. ఇంకా దాడులు జరిగే అవకాశం ఉంది” అని కీవ్ సైనిక పరిపాలన అధిపతి టిమూర్ ట్కాచెంకో టెలిగ్రామ్లో గత అర్ధరాత్రి తర్వాత పోస్ట్ చేశారు.కీవ్ మేయర్ విటలి తెలిపిన వివరాల ప్రకారం నగరంలో ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చిన్నారులు సహా 30 మంది ఆసుపత్రిలో చేరారు. మధ్య షెవ్చెంకో జిల్లాలో 9 అంతస్తుల భవనంపై దాడి జరిగింది. పై అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. ఒకరు చనిపోయారు.అదే జిల్లాలో పాఠశాల వద్ద ఉన్న ఎయిర్ రైడ్ షెల్టర్ సమీపంలో దాడి జరిగింది. శిథిలాలు పడటంతో ప్రవేశ ద్వారం మూసుకుపోయింది. పలువురు లోపల చిక్కుకున్నారు. ఎమర్జెన్సీ సిబ్బంది నగరంలోని పలు ప్రాంతాలకు చేరుకుని మంటలు ఆర్పారు. శిథిలాలను తొలగించారు. గాయపడిన వారికి చికిత్స అందించారు.రాజధాని చుట్టూ ఉన్న కీవ్ ప్రాంతంలో మరో ఇద్దరు చనిపోయినట్టు ప్రాంతీయ అధిపతి మైకోలా కలాష్నిక్ తెలిపారు. కీవ్ బయట చెర్కాసీ, ఖార్కివ్, క్రోపీవ్నిట్స్కీ, ఒడెసా, పోల్టావా, సుమీ, జైటోమిర్ ప్రాంతాలపైనా దాడులు జరిగాయని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబియా తెలిపారు. -
రష్యా ఆర్మీలో 217 మంది భారతీయులు.. ఏం జరుగుతోంది?
న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో చిక్కుకొని, రష్యా ఆర్మీలో చేరిన భారతీయుల పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పలు వివరాలు సమర్పించింది. సుమారు 217 మంది భారతీయులు రష్యా సైన్యంలో చేరగా, అందులో 49 మంది యుద్ధభూమిలో ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరో ఆరుగురు ఆచూకీ తెలియకుండా పోగా, మొత్తం 139 మందిని తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత రాయబార కార్యాలయం కృషి చేస్తోందని కేంద్రం తెలిపింది.రష్యా వల: ఆశచూపి.. బలిపశువులుగారష్యా తమ సైన్యంలో చేర్చుకునేందుకు విదేశీయులను ఆకర్షణీయమైన ప్యాకేజీలతో ప్రలోభపెట్టింది. నెలకు సుమారు 2,500 డాలర్ల జీతం, 5,000 డాలర్ల సైనింగ్ బోనస్, రష్యా పౌరసత్వం, మరణిస్తే 1,68,000 డాలర్ల పరిహారం ఇస్తామని నమ్మబలికింది. ఈ ఆశతోనే చాలా మంది భారతీయులు రష్యా సైన్యంతో స్వచ్ఛందంగా ఒప్పందాలు చేసుకున్నారని ప్రభుత్వం పేర్కొంది. ఇందులో జైలు శిక్ష అనుభవిస్తున్న కొందరు తమ శిక్ష నుంచి విముక్తి పొందాలనే ఆశతోనే రష్యా ఆర్మీలో చేరడం గమనార్హం.ప్రభుత్వ ప్రయత్నాలు- సవాళ్లుప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధభూమిలో చిక్కుకున్న భారతీయులను రక్షించడానికి భారత ప్రభుత్వం రష్యాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటివరకు 48 మందికి విమాన టిక్కెట్లను ప్రభుత్వం అందించింది. అయితే, యుద్ధ పరిస్థితుల దృష్ట్యా మృతదేహాలను గుర్తించడం, స్వదేశానికి తరలించడం అత్యంత క్లిష్టంగా మారిందని రష్యా అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యుల డిఎన్ఏ నివేదికలను ఇప్పటికే సేకరించి, రష్యన్ అధికారులకు అందజేశామని, మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ఇప్పించే ప్రక్రియను వేగవంతం చేశామని ప్రభుత్వం తెలిపింది.కోర్టు ముందు వాస్తవాలుసుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా కేంద్రం కీలక విషయాలను బయటపెట్టింది. పిటిషన్లో పేర్కొన్న 26 మందిలో ఇప్పటికే 14 మంది మరణించగా, 11 మంది ఆచూకీ తెలియలేదు. ఒక వ్యక్తి వేధింపుల కేసులో రష్యాలో ఎనిమిదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని సంచలనం చేయవద్దని కోరిన కేంద్రం, మరణించిన వారి కుటుంబాలకు పరిహారం అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపింది. -
బలూచిస్తాన్లో మళ్లీ రక్తపాతం
కరాచీ: పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో మళ్లీ రక్తపాతం చోటుచేసుకుంది. షటిల్ రైలులో శక్తివంతమైన పేలుడు జరగడంతో కనీసం 24 మంది మరణించారు. దాదాపు 70 మంది గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడింది తామేనని నిషేధిత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ప్రకటించింది. క్వెట్టా కంటోన్మెంట్ నుంచి బయలుదేరి సిటీ రైల్వే స్టేషన్కు వెళ్తున్న ఈ రైలును చమన్ ఫాటక్ సమీపంలో ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని అసోసియేటెడ్ ప్రెస్ ఆఫ్ పాకిస్తాన్ వెల్లడించింది. కంటోన్మెంట్ ప్రాంతం నుంచి మిలటరీ జవాన్లను రైలులో తరలిస్తుండగా తాము దాడికి దిగామని బీఎల్ఏ ప్రతినిధి తెలిపారు. అయితే, ఇప్పటిదాకా 14 మంది మరణించారని, వీరిలో ముగ్గురు సైనికులు ఉన్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొనగా, కనీసం 24 మంది మృతిచెందారని స్థానిక పోలీసులు స్పష్టంచేశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. షటిల్ రైలులో సాధారణ ప్రయాణికులే ఎక్కువ మంది ఉన్నారని, పేలుడు ప్రభావంతో ఇంజన్, మూడు కోచ్లు దెబ్బతిన్నాయని పాకిస్తాన్ రైల్వేశాఖ మంత్రి హనీఫ్ అబ్బాసీ ప్రకటించారు. పేలుడు శబ్దాలు చాలా దూరం వినిపించాయి. సమీపంలోని వాహనాల అద్దాలు, ఇళ్ల అద్దాలు పగిలిపోయాయంటే పేలుడు తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈద్ పండుగ కోసం పెద్ద సంఖ్యలో జనం స్వస్థలాలకు వెళ్తుండగా పేలుడు జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బీఎల్ఏ ముష్కరుల దుశ్చర్యను పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి పిరికిపంద ఉగ్రవాద చర్యలు పాకిస్తాన్ ప్రజల సంకల్పాన్ని బలహీనపర్చలేవని తేల్చిచెప్పారు. ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలించివేయడానికి అంకితభావంతో కృషి చేస్తున్నామని వెల్లడించారు. మరోవైపు షటిల్ రైలులో పేలుడుతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. పెషావర్కు చేరాల్సిన జాఫర్ ఎక్స్ప్రెస్ను ముందుజాగ్రత్త చర్యగా క్వెట్టా రైల్వేస్టేషన్లోనే నిలిపివేశారు. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని క్వెట్టా కంటోన్మెంట్ రైల్వేస్టేషన్లో 2024 నవంబర్లో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 32 మంది మరణించిన సంగతి తెలిసిందే. -
ఇకపై అమెరికా వీసా ఈజీ.. భారతీయులకు శుభవార్త
న్యూఢిల్లీ: భారతీయులకు అమెరికా శుభవార్త చెప్పింది. అమెరికాలో వ్యాపారం ప్రారంభించాలనుకునే భారతీయులకు త్వరితగతిన వీసా అందించే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. భారత్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ‘అమెరికా ఫస్ట్’ వీసా షెడ్యూల్ను ప్రకటించారు. ఈ కొత్త విధానం వ్యాపార సంబంధాలను బలోపేతం చేసే ప్రయాణికులకు ప్రాధాన్యత ఇస్తూ.. భారత్-అమెరికా ఆర్థిక, వ్యూహాత్మక బంధాలను మరింతగా పెంచే ప్రయత్నంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.మార్కో రూబియో నాలుగు రోజుల భారత్ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలోని అమెరికా ఎంబసీ సపోర్ట్ యానెక్స్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భారత్-అమెరికా సంబంధాలు కేవలం మీడియాకే పరిమితం కాదని..అంతకు మించిన బలమైన సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం భారత్ కంపెనీలు అమెరికాలో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయని గుర్తు చేశారు. ‘అమెరికా ఫస్ట్’ వీసా షెడ్యూల్ఈ కొత్త వీసా షెడ్యూల్ వ్యాపార నిపుణులు, పెట్టుబడిదారులు, అమెరికా ఆర్థిక ప్రయోజనాలను బలోపేతం చేసే వ్యక్తులకు ముందస్తు ప్రాధాన్యత ఇస్తుంది. అంటే, ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపార విస్తరణ కోసం అమెరికాకు వెళ్లే భారతీయులకు వీసా అపాయింట్మెంట్ త్వరగా లభిస్తుంది. వీసా ప్రక్రియలో ఆలస్యం కారణంగా వ్యాపార ప్రయాణాలు, పెట్టుబడి సమావేశాలు,భాగస్వామ్య చర్చలకు అడ్డంకిగా మారుతుంది. అందుకే ఈ కొత్త విధానం అవసరమని ఆయన వివరించారు.ఈ పర్యటనలో రూబియో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున వైట్ హౌస్ ఆహ్వానం అందించారు. ఇరువురు నేతలు ప్రాంతీయ భద్రత, వాణిజ్యం, ఇంధన సరఫరాలు, అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం వంటి అంశాలపై చర్చించారు.ఈ పర్యటనలో రూబియో చేసిన ప్రకటనలు భారత్-అమెరికా సంబంధాలను కొత్త దశలోకి తీసుకెళ్తున్నాయి. వీసా ప్రక్రియలో మార్పులు కేవలం సాంకేతిక సౌలభ్యం మాత్రమే కాదు, రెండు దేశాల మధ్య వ్యాపార, వ్యూహాత్మక బంధాలను మరింతగా బలపరచే ప్రయత్నం. అమెరికా ‘అమెరికా ఫస్ట్’ విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ, భారత్తో సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ పర్యటన స్పష్టంగా తెలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. #WATCH | Delhi: At the US Embassy Support Annex Building dedication ceremony, US Secretary of State Marco Rubio says, "We're introducing a new America First visa schedule that prioritises business professionals that strengthen these ties. But the facility, as I said, is not just… pic.twitter.com/pkY5nlb6r5— ANI (@ANI) May 23, 2026 -
ఇరాన్ సరెండర్.. యురేనియంపై ట్రంప్ విజయం!
టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, శాంతి చర్చలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాతో చర్చలు జరుపుతున్న విస్తృత శాంతి ఒప్పందంలో భాగంగా తన వద్ద ఉన్న శుద్ది చేసిన యురేనియం నిల్వలను వదులుకోవడానికి ఇరాన్ అంగీకరించినట్టు సమాచారం. ఈ మేరకు ఇద్దరు అమెరికా అధికారులు 'ది న్యూయార్క్ టైమ్స్'కు తెలిపారు.ఈ నేపథ్యంలో ఇరాన్ యురేనియం నిల్వల నిర్మూలన పద్దతిపై త్వరలో చర్చలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు.. ఈ విషయంలో ఇరాన్ నుంచి స్పష్టమైన హామీ లభించకపోతే చర్చలు విఫలమయ్యే అవకాశం కూడా ఉంది. కాగా, ఇరాన్ వద్ద 60 శాతం శుద్ది చేసిన దాదాపు 400 కిలోల యురేనియం ఉంటుందని అమెరికా అంచనా వేస్తోంది. అయితే, ప్రతిపాదిత ఒప్పందం వివరాలను ట్రంప్ వెల్లడించనప్పటికీ, దాదాపు ఆయుధ స్థాయి యురేనియం నిల్వలను వదులుకోవడానికి టెహ్రాన్ సూత్రప్రాయంగా అంగీకరించిందని అమెరికా అధికారులు చెబుతున్నారు.🇺🇸🇮🇷 NYT: U.S. officials said Iran has reportedly agreed to give up its stockpile of highly enriched uranium as part of the proposed agreement announced by U.S. President Donald Trump. Officials said details on how the uranium would be removed or downgraded would be discussed… pic.twitter.com/BoNOksRsG4— Global Surveillance (@Globalsurv) May 24, 2026అయితే, ఈ దశలో ఈ అవగాహన ఇంకా విస్తృతంగానే ఉందని, యురేనియంను ఇవ్వడంపై కచ్చితమైన విధానంపై ఇంకా చర్చలు జరగాల్సి ఉందని ఆ అధికారులు తెలిపారు. విస్తృత ఒప్పందం అధికారికంగా కుదిరిన తర్వాత, తదుపరి అణు చర్చల దశలో ఇరాన్ ఈ పదార్థాన్ని ఎలా బదిలీ చేస్తుంది, పలుచన చేస్తుంది లేదా ఇతరత్రా తటస్థీకరిస్తుంది అనే దానిపై వివరణాత్మక చర్చలు జరుగుతాయని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ యురేనియం నిల్వలను దేశం నుండి బయటకు పంపవద్దని ఆదేశించారని ఇరాన్ వర్గాలు ఇటీవల పేర్కొన్న తర్వాత ఈ పరిణామం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది.ఇక, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) ప్రకారం.. ఇరాన్ ప్రస్తుతం 60 శాతం శుద్ధి చేయబడిన దాదాపు 400 కిలోగ్రాముల యురేనియంను కలిగి ఉంది, ఇది ఆయుధ-స్థాయికి దగ్గరగా ఉంది. ఈ నిల్వలను మరింత శుద్ధి చేసి బహుళ అణు బాంబులకు కావలసిన పదార్థాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అధికారులు పదేపదే వాదిస్తున్నారు. కాగా, ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉంది. అలాగే, మధ్యప్రాచ్యంలో చమురు మార్కెట్లు, వాణిజ్య మార్గాలు స్థిరపడే అవకాశం ఉంది.ఆస్తుల విడుదల: యుద్దం కారణంగా ఇరాన్పై అమెరికా మరియు పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల కారణంగా, బిలియన్ల డాలర్ల విలువైన ఆస్తులు విదేశీ బ్యాంకుల్లో ఫ్రీజ్ అయ్యాయి. యురేనియం ఒప్పందం కుదిరితే ఆంక్షలు తొలగిపోయే అవకాశం ఉంది.ఆస్తుల విడుదల: యురేనియం నిల్వను వదులుకోవడానికి అంగీకరించిన ప్రతిఫలంగా, అమెరికా ఈ ఆస్తులను విడదీయడానికి సిద్ధమవుతోంది.ప్రభావం: ఆర్థికంగా ఇరాన్కు ఊపిరి పీల్చే అవకాశం లభిస్తుంది.ప్రాంతీయ స్థిరత్వం: ఆర్థిక ఒత్తిడి తగ్గడం వల్ల ఇరాన్ చర్చల్లో మరింత సహకరించే అవకాశం ఉంది.JUST IN: 🇵🇰🇮🇷 Pakistan official says Iran has agreed to hand over enriched uranium under the Trump-announced deal. pic.twitter.com/OK78Aus5qj— Whale Insider (@WhaleInsider) May 24, 2026ఇదిలా ఉండగా.. ఇరాన్ మాత్రం ఇంకా జాగ్రత్తగానే వ్యవహరిస్తోంది. అమెరికా మరోసారి సైనిక దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబఫ్ మాట్లాడుతూ.. కాల్పుల విరమణ సమయంలో తమ సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకున్నామని తెలిపారు. మళ్లీ దాడులు జరిగితే ప్రారంభ దశ కంటే మరింత తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. -
‘వైట్హౌస్’ఘటన అప్డేట్: ఎవరీ నాసిరే బెస్ట్?
వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్లోని వైట్హౌస్ సమీపంలో శనివారం సాయంత్రం విచక్షణారహితంగా కాల్పులు జరిపి తీవ్ర ఉద్రిక్తతకు కారణమయ్యాడు 21 ఏళ్ల నాసిరే బెస్ట్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భవనం లోపల ఉన్న సమయంలోనే, సెక్రెట్ సర్వీస్ చెక్పోస్ట్ వద్దకు వచ్చి ఈ ఘాతుకానికి ఒడిగట్టిన నిందితుడి వివరాలు బయటకు వచ్చాయి. దర్యాప్తు సంస్థలు సేకరించిన వివరాల ప్రకారం అతని ప్రొఫైల్ ఇలా ఉంది..నిందితుడి వివరాలుచిరునామా: నాసిరే బెస్ట్ అమెరికాలోని మేరీల్యాండ్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. అతని వయసు 21 సంవత్సరాలు.మానసిక స్థితి: ఇతను గత కొంతకాలంగా తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు విచారణలో తేలింది.నేర చరిత్ర: వైట్హౌస్ భద్రతా వలయాన్ని దాటేందుకు ఇతడు ప్రయత్నించడం ఇది మొదటిసారేం కాదు. గతంలో కూడా పలుమార్లు వైట్హౌస్ పరిసరాల్లోకి చొరబడేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు.గతంలో అరెస్టులు: ఏడాది క్రితం, అంటే 2025 జూన్, జూలై నెలల్లోనే ఇతను ఇటువంటి చొరబాటు కేసుల్లో అరెస్టయ్యాడు.కోర్టు నిషేధాజ్ఞలు: ఇతని మానసిక స్థితి, ప్రవర్తనను గమనించిన కోర్టు.. గతంలోనే ఇతనిపై ఒక కీలకమైన ఆదేశాన్ని జారీ చేసింది. వైట్హౌస్ పరిసర ప్రాంతాల్లోకి అస్సలు రావద్దంటూ బెస్ట్పై గతంలోనే కోర్టు నిషేధాజ్ఞలు విధించింది.శనివారం సాయంత్రం ఏం జరిగింది?కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ శనివారం సాయంత్రం వైట్హౌస్ సమీపంలోని 17వ వీధి, పెన్సిల్వేనియా అవెన్యూ వద్ద ఉన్న సెక్రెట్ సర్వీస్ చెక్పోస్ట్ వద్దకు నాసిరే బెస్ట్ చేరుకున్నాడు. అందరూ చూస్తుండగానే తన బ్యాగులో నుంచి తుపాకీ తీసి విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించాడు.సెక్రెట్ సర్వీస్ అధికారులు తక్షణమే స్పందించి ఎదురుకాల్పులు జరపడంతో నిందితుడు నాసిరే బెస్ట్కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు. ఈ కాల్పుల్లో ఒక సాధారణ పౌరుడు (బైస్టాండర్) కూడా గాయపడగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్షేమంగా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం ఎఫ్బీఐ , ఫెడరల్ దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నాయి. ఇది కూడా చదవండి: వైట్హౌస్: అటు కాల్పులు.. ఇటు లైవ్ రిపోర్టింగ్ -
ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఈసారి ఏకంగా ఇరాన్ను అమెరికా జెండా రంగులతో కప్పేశారు ట్రంప్. ఇరాన్ దేశ చిత్ర పటాన్ని అమెరికా జెండా రంగులతో ఎడిట్ చేసిన చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతటితో ఆగకుండా దానికి "మధ్యప్రాచ్యపు యునైటెడ్ స్టేట్స్?" అనే క్యాప్షన్ జతచేశారు. దీంతో, ట్రంప్ చర్య.. పెను దుమారానికి దారి తీసింది.అయితే.. వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్పై సాధ్యమయ్యే సైనిక చర్యపై అమెరికా ప్రభుత్వంలో చర్చలు మళ్లీ మొదలైన తరుణంలో ఈ పోస్ట్ చేయడం గమనార్హం. ఇక, కొన్ని రోజుల క్రితం ఇరాన్ పడవలపై క్షిపణి దాడులు, అంతరిక్ష యుద్ధం, ఇరాన్పై ఎగురుతున్న అమెరికా జెండాను చిత్రీకరిస్తూ ఏఐ (AI) రూపొందించిన చిత్రాలను కూడా ట్రంప్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, యాక్సియోస్ నివేదికలో ఉటంకించిన అమెరికా అధికారుల ప్రకారం.. చివరి నిమిషంలో చేసే దౌత్య ప్రయత్నాలు పురోగతిని సాధించడంలో విఫలమైతే, ఇరాన్పై కొత్తగా సైనిక దాడులు ప్రారంభించడాన్ని ట్రంప్ తీవ్రంగా పరిశీలిస్తున్నారు.While Rubio speaks of progress in negotiations with Iran and promises to reveal more details in the near future, Trump, meanwhile, continues his media game on social networks. He posts a map of Iran colored in the hues of the American flag, captioning it: “The United States of… pic.twitter.com/sM7GxiqXgv— Military Summary (@MilitarySummary) May 23, 2026ఇదిలా ఉండగా.. పశ్చిమాసియా యుద్ధం విషయంలో ఇరాన్తో ఒప్పందం కుదిరేందుకు 50-50 అవకాశాలున్నాయని ట్రంప్ ప్రకటించారు. యుద్ధాన్ని తిరిగి ప్రారంభించాలా లేదా అనేదానిపై ఆదివారం ఆయనొక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇరాన్ వ్యవహారంలో రెండు అంశాల్లో ఏదో ఒకటి జరుగుతుందని అనుకుంటున్నానని వెల్లడించారు. ఒకటి.. వారు(ఇరాన్) ఇంతకు ముందెన్నడూ ఎదుర్కోనంత గట్టిగా తాను దెబ్బకొడతానని వ్యాఖ్యానించారు. రెండోది.. ఒక మంచి ఒప్పందంపై ఇరాన్, అమెరికా సంతకాలు చేస్తాయని పేర్కొన్నారు. యుద్ధం కావాలో లేక ఒప్పందం కావాలో ఇరాన్ త్వరగా తేల్చుకోవాలని సూచించారు. కాగా, ఇరాన్లో కొత్తగా దాడులకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమవుతోందని కొన్ని వార్తాసంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇరాన్ నేతలతో మునీర్ భేటీ పశ్చిమాసియాలో ఘర్షణను తెరదించాలని పాకిస్తాన్ తన వంతు ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఇరాన్లో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చితోపాటు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘలిబాఫ్ను కలుసుకున్నారు. తాజా పరిణామాలపై వారితో చర్చించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను నివారించడం.. శాంతి, స్థిరత్వం, భద్రతను ప్రోత్సహించడంపై సంప్రదింపులు జరిపారు. ఇరాన్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ పరిణామాలు, వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకొనే మార్గాలపై పెజెష్కియాన్, అసిమ్ మునిర్ చర్చించుకున్నట్లు ఇరాన్ అధికారిక తస్నిమ్ వార్తా సంస్థ తెలియజేసింది. -
వైట్హౌస్: అటు కాల్పులు.. ఇటు లైవ్ రిపోర్టింగ్
అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ సెక్యూరిటీ చెక్పాయింట్ వద్ద ఒక్కసారిగా కాల్పుల కలకలం రేగిన సంగతి తెలిసిందే. వైట్హౌస్ వెలుపల లైవ్ కెమెరాల ముందే తీవ్ర భయాందోళనలు, గందరగోళం నెలకొంది. వైట్హౌస్ ఉత్తర మైదానం నుంచి లైవ్ రిపోర్టింగ్ ఇస్తున్న జర్నలిస్టులు.. ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు వినబడటంతో ప్రాణాలు రక్షించుకునేందుకు కిందకు వంగి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.ఈ ఘటనకు సంబంధించిన పలు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వైట్హౌస్ ప్రాంగణం వెలుపల వరుసగా తుపాకీ కాల్పులు జరిగిన ఆ క్షణంలో రిపోర్టర్లు ఎలా స్పందించారో ఈ వీడియోలలో స్పష్టంగా రికార్డైంది. ఓ మీడియా సంస్థకు చెందిన సెలినా వాంగ్ మాట్లాడుతూ.. కొద్ది సెకన్ల పాటు ఆమె ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇది పటాకుల శబ్దంలా అనిపించింది.. కానీ నిజానికి తుపాకీ కాల్పులు" అని తెలిపింది. ఈ ఘటన సమయంలో ఆమె ఆ ప్రాంగణంలో వీడియో షూట్ మధ్యలో ఉన్నారు.'FaytuksNetwork' అనే ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వైరల్ వీడియోలో.. ఓ టెలివిజన్ రిపోర్టర్ డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ల మద్దతు గురించి చాలా ప్రశాంతంగా లైవ్ రిపోర్ట్ ఇస్తుండటం కనిపిస్తుంది. అయితే సరిగ్గా అదే సమయంలో పక్కనే తుపాకీ శబ్దాలు వినిపించాయి. ఆ జర్నలిస్ట్ తాను చెబుతున్న వాక్యాన్ని పూర్తి చేసి.. చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంతో చూస్తూ.. తన టై మరియు ఇయర్పీస్ను సర్దుకుంటూ పరిస్థితి తీవ్రతను గమనించడం ఆ వీడియోలో కనిపించింది.🇺🇸 Reporters duck live on air as shots ring out near White House; gunman killedpic.twitter.com/58MmW6BOAX— U.S.A.I. 🇺🇸 (@researchUSAI) May 24, 2026కాగా, వైట్హౌస్ సమీపంలో సీక్రెట్ సర్వీస్ చెక్పాయింట్ వద్దకు దూసుకొచ్చిన ఓ దుండగుడు బలగాలపై కాల్పులకు దిగాడు. దీంతో సీక్రెట్ సర్వీస్ అధికారులు ఎదురు కాల్పులు జరపగా నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వైట్హౌస్ సమీపంలో వరుస కాల్పుల శబ్దాలు విన్నట్లు జర్నలిస్టులు తెలిపారు.దీంతో జర్నలిస్టులను వైట్హౌస్ ప్రెస్ బ్రీఫింగ్ రూమ్లోకి వెళ్లాలని అధికారులు ఆదేశించారు. కాల్పుల ఘటన నేపథ్యంలో పోలీసులు, భద్రతా బలగాలు వైట్హౌస్ వద్ద భారీగా మోహరించారు. కాల్పుల సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్లోనే ఉన్నట్లు సమాచారం. కాల్పుల శబ్దాలు వినిపించడంతో భవనం మొత్తం కొద్దిసేపు లాక్డౌన్లోకి వెళ్లింది. -
Manila: కూలిన భవనం.. శిథిలాల కింద 19 మంది విలవిల
మనీలా: ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా సమీపంలోని ఏంజెల్స్ సిటీలో ఆదివారం తెల్లవారుజామున ఒక భవనం అకస్మాత్తుగా కుప్పకూలడంతో పెను విషాదం చోటుచేసుకుంది. నిర్మాణ దశలో ఉన్న ఈ భవన శిథిలాల కింద దాదాపు 19 మంది కార్మికులు చిక్కుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. రంగంలోకి దిగిన సహాయక బృందాలు, శిథిలాలను తొలగిస్తూ గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.సహాయక చర్యల్లో ఉత్కంఠభవనం కూలిపోయిన సమయంలో అక్కడ విధి నిర్వహణలో ఉన్న 19 మంది కూలీల ఆచూకీ కోసం అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏంజెల్స్ సిటీ సమాచార అధికారి జే పెలాయో తెలిపిన వివరాల ప్రకారం ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన స్థానికంగా వ్యక్తమవుతోంది. -
హార్ముజ్ను మింగేస్తున్న ‘ఎల్లో ఫ్లీట్’
ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’ దాదాపు 90 రోజులుగా స్తంభించిపోయింది. ఫిబ్రవరి చివరలో అమెరికా-ఇజ్రాయెల్ కూటమి.. ఇరాన్ మధ్య మొదలైన ఘర్షణలు, ఈ జలమార్గాన్ని మూసుకుపోయేలా చేశాయి. 1967 నాటి సూయజ్ కాలువ ఘటనలో పలు నౌకలు చిక్కుకుపోయి తుప్పు పట్టిన ‘ఎల్లో ఫ్లీట్’ మాదిరిగానే ఇప్పుడు హార్ముజ్ జలసంధి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. చరిత్ర నేర్పుతున్న హెచ్చరికలను విస్మరిస్తే, రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర కుదుపులకు లోనయ్యే ప్రమాదం కనిపిస్తోంది.చరిత్ర పునరావృతమైతే?1967లో అరబ్-ఇజ్రాయెల్ యుద్ధ సమయంలో సూయజ్ కాలువలో చిక్కుకున్న 15 నౌకలు, ఎనిమిదేళ్ల పాటు అక్కడే ఉండిపోయి ‘ఎల్లో ఫ్లీట్’గా మిగిలిపోయాయి. ఇప్పుడు హార్ముజ్ జలసంధిలో అదే పరిస్థితి తలెత్తితే? ఇది సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించినా, 90 రోజులుగా సాగుతున్న ఈ అప్రకటిత దిగ్బంధనం చూస్తుంటే, అదే జరగబోతోందనే భయాలు వెంటాడుతున్నాయి. రాబోయే ముప్పును పసిగట్టిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) హార్ముజ్ జలసంధిపై ఆధారపడకుండా చమురును రవాణా చేసేందుకు ప్రత్యామ్నాయ పైప్లైన్ నిర్మాణాన్ని వేగవంతం చేసింది. 2027 నాటికి ఇది సిద్ధం కావచ్చని అంచనా. దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నా, వాస్తవ క్షేత్రస్థాయిలో పరిస్థితి చాలా కాలం పాటు ఉద్రిక్తంగానే ఉండవచ్చని అబుదాబి భావిస్తోంది.వాల్ స్ట్రీట్ ఆశలు ప్రస్తుతం వాల్ స్ట్రీట్ పెట్టుబడిదారులు ఈ సంక్షోభం త్వరలోనే ముగుస్తుందని ఆశిస్తున్నారు. చమురు ధరలు మరీ విపరీతంగా పెరగకుండా, మార్కెట్ సమతుల్యత దెబ్బతినకుండా ఉండేందుకు త్వరగా పరిష్కారం వస్తుందని వారు నమ్ముతున్నారు. అయితే, హార్ముజ్ జలసంధి మూసివేత వల్ల కలిగే ఆర్థిక భారం ఇంకా పూర్తిస్థాయిలో బయటపడలేదన్నది వాస్తవం. అమెరికాలో స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలో ఉన్నంత వరకు, వాషింగ్టన్ పెద్దగా ఆందోళన చెందడం లేదు.ఇరాన్ వ్యూహంమరోవైపు, ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ, ఆ దేశం వెనక్కి తగ్గేలా లేదు. నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు, కరెన్సీ విలువ పడిపోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నా, ఉనికి కోసం పోరాడుతున్న ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగేలా కనిపించడం లేదు. ఇరు పక్షాలు ఎవరికి వారు అవతలి వైపు ముందుగా దిగివస్తారేమోనని వేచి చూస్తున్నారు.నిల్వలతో కాలక్షేపం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా ఆగిపోయింది. సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను వాడుకోవడం, ఎమర్జెన్సీ రిజర్వులను విడుదల చేయడం ద్వారా ఈ ప్రభావాన్ని ఇప్పటివరకు నియంత్రించగలిగారు. కానీ ఈ నిల్వలు శాశ్వతం కాదు. ప్రతిరోజూ మనం ఆ గడువుకు దగ్గరవుతున్నాం.రాబోయే రోజుల్లో భారీ సవాల్చివరగా, హార్ముజ్ జలసంధిని శాశ్వతంగా మూసి ఉంచడం ఏ దేశానికీ మంచిది కాదు. ఒక తాత్కాలిక ఒప్పందం తక్షణ అవసరం. అయితే, గతంలో జరిగిన చరిత్రను గుర్తుంచుకుంటే అసాధ్యమైనది అనుకున్నవి కాలక్రమేణా సాధారణం అయిపోయే ప్రమాదం ఉంది. యుద్ధం ముగిసినా, భౌగోళిక రాజకీయ పరిస్థితులు ప్రపంచ ఇంధన భద్రతకు రాబోయే రోజుల్లో పెద్ద సవాలుగా నిలవనున్నాయి.ఇది కూడా చదవండి: ‘జెన్ జెడ్’ మంత్రం.. ‘హార్ట్ఫుల్నెస్’ ధ్యానం -
వైట్హౌస్ వద్ద మళ్లీ కాల్పులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్హౌస్ వద్ద మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. శనివారం ఓ ఆగంతకుడు సీక్రెట్ సర్వీసు సెక్యూరిటీ చెక్పాయింట్కు వద్దకు దూసుకొచ్చి భద్రతా సిబ్బందిపై తుపాకీతో కాల్పులు జరపడం సంచలనం సృష్టించింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరపడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని యూఎస్ సీక్రెట్ సర్వీసు విభాగం వెల్లడించింది. ఆ సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్లోనే ఉన్నారు. ట్రంప్కు సమీపంలో కాల్పులు జరగడం గత నెల రోజుల వ్యవధిలో ఇది మూడోసారి కావడం గమనార్హం. ట్రంప్ భద్రత ప్రశ్నార్థకంగా మారిందని చెబుతున్నారు. నేనే ఏసుక్రీస్తుని.. రాజధాని వాష్టింగన్లో వైట్హౌస్ కాంప్లెక్స్కు ఆనుకొని 17వ వీధి, పెన్సిల్వేనియా అవెన్యూ ప్రాంతంలో శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత దుండగుడు తన బ్యాగ్ నుంచి హఠాత్తుగా ఆయుధాన్ని బయటకు తీసి కాల్పులు ప్రారంభించాడని సీక్రెట్ సర్వీసు అధికారులు తెలిపారు. తాము వెంటనే ఎదురు కాల్పులు ప్రారంభించామని అన్నారు. దుండగుడితోపాటు అతడికి సమీపంలోనే ఉన్న ఓ వ్యక్తికి కూడా గాయాలయ్యాయని వెల్లడించారు. దుండగుడిని నాసిర్ బెస్ట్(21)గా గుర్తించినట్లు చెప్పారు. నాసిర్ బెస్ట్కు నేరచరిత్ర ఉంది. డి్రస్టిక్ట్ ఆఫ్ కొలంబియా కోర్టు రికార్డుల ప్రకారం.. 2025 జూలైలో అరెస్టయ్యాడు. అప్పట్లో అనుమతి లేకుండా వైట్హౌస్ మరో చెక్పాయింట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. ఆగాలంటూ అధికారులు ఇచ్చిన ఆదేశాలను పాటించలేదు. తానే ఏసుక్రీస్తునని చెప్పుకున్నాడు. తాను అరెస్టు కావాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. అప్పట్లో అతడిపై ప్రాథమిక విచారణ జరిగింది. కానీ, తదుపరి విచారణకు హాజరు కాలేదు. నిందితుడి కాల్పుల్లో సీక్రెట్ సర్వీసు సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని ఎఫ్బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ తెలియజేశారు. టార్గెట్ ట్రంప్? అధ్యక్షుడు ట్రంప్ను ఎవరైనా టార్గెట్ చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో మూడుసార్లు కాల్పులు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్ 25న వాషింగ్టన్లోని వైట్హౌస్ సమీపంలో ఓ హోటల్లో కరెస్పాండెంట్స్ అసోసియేషన్ విందులో ట్రంప్ పాల్గొన్నారు. ఆ సమయంలో ఓ దుండగుడు అదే హోటల్లో కాల్పులకు తెగబడ్డాడు. మే 4న వాషింగ్టన్ మాన్యుమెంట్ సమీపంలో కాల్పులు జరిగాయి. ట్రంప్ అక్కడికి దగ్గర్లోనే ఉన్నారు. తాజాగా వైట్హౌస్లో ట్రంప్ ఉండగానే, బయట సెక్యూరిటీ చెక్పాయింట్ వద్ద యువకుడు కాల్పులు జరిపాడు. వైట్హౌస్లో ఉన్న ట్రంప్పై ఈ కాల్పుల ప్రభావం పడలేదని సీక్రెట్ సర్వీస్ స్పష్టంచేసింది. వాస్తవానికి ట్రంప్ వారాంతాన్ని తన న్యూజెర్సీ గోల్ఫ్ క్లబ్లో గడపాల్సి ఉండగా, దానికి బదులుగా వైట్హౌస్లోనే ఉండాలని తన ప్రణాళికను మార్చుకున్నారు. కాల్పుల ఘటనపై శనివారం సాయంత్రం వైట్హౌస్లో ఉన్న జర్నలిస్టులు స్పందించారు. బయట నుంచి వరుసగా తుపాకీ కాల్పుల శబ్దాలు విన్నట్లు తెలిపారు. జర్నలిస్టులు బయటకు రాకుండా సీక్రెట్ సర్వీసు సిబ్బంది అడ్డుకున్నారు. ప్రెస్ బ్రీఫింగ్ గదిలోకి వెళ్లాలని సూచించారు. ఇదిలా ఉండగా, కాల్పులు జరగ్గానే సీక్రెట్ సర్వీసు సిబ్బంది వైట్హౌస్ ప్రాంగణం చుట్టూ లాక్డౌన్ విధించారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. పరిస్థితి సద్దుమణిగినట్లు గుర్తించి, 45 నిమిషాల తర్వాత లాక్డౌన్ ఎత్తివేశారు. -
మేజర్ అభిలాషకు ఐరాస అవార్డు
ఐక్యరాజ్యసమితి: లెబనాన్లోని ఐక్యరాజ్యసమితి శాంతి మిషన్లో భారత శాంతి పరిరక్షక దళం తరఫున సేవలందిస్తున్న మేజర్ అభిలాష బారక్ ప్రతిష్టాత్మక మిలటరీ జెండర్ అడ్వొకేట్ అవార్డుకు ఎంపికయ్యారు. విధుల్లో భాగంగా మహిళలు, బాలికలకు చేరువయ్యేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఐరాస శుక్రవారం ఎక్స్లో తెలిపింది. యూఎన్ ఇంటెరిమ్ ఫోర్స్ ఇన్ లెబనాన్(యూనిఫిల్)లో ఫిమేల్ ఎంగేజ్మెంట్ టీమ్ కమాండర్గా బారక్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భారత ఆర్మీలో కంబాట్ హెలికాప్టర్ పైలట్గా ఎంపికైన మొట్టమొదటి మహిళ అభిలాష బారక్. ఈ నెల 29వ తేదీన ఐరాస శాంతిపరిరక్షక దళాల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా అభిలాషకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డును గతంలో ఐరాస శాంతిపరిరక్షక దళాల్లో పనిచేసిన భారత్కు చెందిన మేజర్ సుమన్ గవానీ, మేజర్ రాధికా సేన్ తమ సేవలకు గుర్తింపుగా అందుకోవడం విశేషం. -
యుద్ధమా? ఒప్పందమా?
వాషింగ్టన్/ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో సంక్షోభానికి తెరదించడానికి ఇరాన్ తమతో ఒప్పందానికి రాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. ఇరాన్పై బాంబు దాడులు పునఃప్రారంభించాలా? లేదా? అనే దానిపై తన ఆలోచనలు ఫిఫ్టీ.. పిఫ్లీగా ఉన్నాయని తేల్చిచెప్పారు. ఆదివారం నాటికి తుది నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నట్లు స్పష్టంచేశారు. ఆయన శనివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. ఇరాన్ వ్యవహారంలో రెండు అంశాల్లో ఏదో ఒకటి జరుగుతుందని అనుకుంటున్నానని వెల్లడించారు. ఒకటి.. వారు(ఇరాన్) ఇంతకు ముందెన్నడూ ఎదుర్కోనంత గట్టిగా తాను దెబ్బకొడతానని వ్యాఖ్యానించారు. రెండోది.. ఒక మంచి ఒప్పందంపై ఇరాన్, అమెరికా సంతకాలు చేస్తాయని పేర్కొన్నారు. యుద్ధం కావాలో లేక ఒప్పందం కావాలో ఇరాన్ త్వరగా తేల్చుకోవాలని సూచించారు. ఇరాన్తో తాను చక్కటి ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చని లేదా ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇరాన్, పాకిస్తాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఒక ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీని ప్రకారం.. అమెరికా, ఇరాన్లు సైనిక చర్యను నిలిపివేయాలి. ఒక స్పష్టమైన ఒప్పందానికి రావడమే లక్ష్యంగా 30 రోజుల పాటు విస్తృతస్థాయిలో చర్చలు జరపడానికి ఇరుదేశాలు అంగీకరించాలి. చివరి నిమిషంలో జరిగే చర్చలు శాంతి ఒప్పందానికి దారితీయకపోతే, ఇరాన్పై కొత్తగా దాడులు చేసే విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా పరిశీలిస్తున్నారని అమెరికా మీడియా సంస్థ ఆక్సియోస్ వెల్లడించింది. ఇరాన్ నేతలతో అసిమ్ మునిర్ భేటీ పశ్చిమాసియాలో ఘర్షణను తెరదించాలని పాకిస్తాన్ తన వంతు ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునిర్ ఇరాన్లో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చితోపాటు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘలిబాఫ్ను కలుసుకున్నారు. తాజా పరిణామాలపై వారితో చర్చించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను నివారించడం.. శాంతి, స్థిరత్వం, భద్రతను ప్రోత్సహించడంపై సంప్రదింపులు జరిపారు. ఇరాన్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ పరిణామాలు, వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకొనే మార్గాలపై పెజెష్కియాన్, అసిమ్ మునిర్ చర్చించుకున్నట్లు ఇరాన్ అధికారిక తస్నిమ్ వార్తా సంస్థ తెలియజేసింది. -
ఆస్పత్రి నుంచి 18 మంది ఎబోలా రోగుల పరారీ!
ఈశాన్య కాంగోలో ఎబోలా వైరస్ పంజా విసురుతోంది. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ఆరోగ్య కార్యకర్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే స్ధానికుల్లో వ్యక్తమవుతున్న భయాందోళనలు, ఆగ్రహం కాస్తా హింసకు దారితీస్తున్నాయి. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే రెండు ఎబోలా చికిత్సా కేంద్రాలపై దాడులు జరిగాయి. మోంగ్బ్వాలు అనే మైనింగ్ టౌన్లో 'డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్' అనే అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో ఓ ఆస్పత్రి నడుస్తోంది. అయితే ఈ ఆస్పత్రి ప్రాంగణంలో ఎబోలా రోగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక చికిత్సా శిబిరం టెంట్కు స్ధానికులు శుక్రవారం రాత్రి నిప్పంటిచారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తలు పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ గందరగోళంలో ఎబోలా సోకినట్లు అనుమానిస్తున్న 18 మంది రోగులు ఆసుపత్రి నుంచి తప్పించుకుని పారిపోయారు. ఆ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ రిచర్డ్ లోకుడి ఈ ఘటనను ఖండించారు. వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తులు అదృశ్యం కావడం వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో వ్యాప్తి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.కాగా ఈ ఘటనకు ఒక రోజు ముందు ర్వాంపారా అనే పట్టణంలో ఇలాంటి వాతవారణమే దాడే జరిగింది. అక్కడ ఒక ఎబోలా చికిత్సా కేంద్రాన్ని స్థానికులు తగులబెట్టారు. ఎబోలాతో మరణించినట్లు భావిస్తున్న ఒక వ్యక్తి మృతదేహాన్ని వారి సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులకు అప్పగించకపోవడమే ఈ దాడికి కారణమైంది. -
కలిసి పనిచేద్దాం!
న్యూఢిల్లీ: ప్రపంచ సౌభాగ్యం, శాంతి కోసం ఇకపైనా కలిసికట్టుగా పని చేయాలని భారత్, అమెరికా నిర్ణయించుకున్నాయి. ఇరుదేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఎప్పటిలాగే కొనసాగుతున్నాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శనివారం ఢిల్లీలో మోదీతో సమావేశమయ్యారు. పశ్చిమాసియా పరిణామాలను మోదీకి వివరించారు. రక్షణ, వ్యూహాత్మక సాంకేతికతలు, వ్యాపారం, వాణిజ్యం, ఇంధన భద్రత వంటి కీలక రంగాల్లో భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సహకారంపై వారిద్దరూ చర్చించుకున్నారు. రూబియో శనివారం ఢిల్లీకి చేరుకున్న కొద్దిసేపటికే మోదీతో భేటీ అయ్యారు. నాలుగు రోజులపాటు భారత్లో పర్యటించబోతున్నారు. గత ఏడాది కాలం నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను పునఃసమీక్షించే ప్రయత్నంగా రూబియో పర్యటనను నిపుణులు పరిగణిస్తున్నారు. రూబియోను కలవడం ఆనందంగా ఉందంటూ మోదీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. భారత్–అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో నిరంతర పురోగతి, ప్రాంతీయ, ప్రపంచ శాంతి భద్రతకు సంబంధించిన అంశాలపై తాము చర్చించామని వెల్లడించారు. రెండు దేశాలు నిరంతరం సన్నిహితంగా కలిసి పనిచేస్తూనే ఉంటాయన్నారు. వాణిజ్య, రక్షణ సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి, కీలకమైన, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై సహకారాన్ని వేగవంతం చేయడానికి మోదీ, రూబియో అంగీకరించారని అమెరికా విదేశాంగ శాఖ తెలియజేసింది. భారత్ అత్యంత ముఖ్యమైన భాగస్వామి భారత్, అమెరికాలు అనేక రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతి గురించి రూబియో ప్రధాని మోదీకి వివరించారని భారత ప్రభుత్వవర్గాలు తెలిపాయి. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు భారత్ నిరంతరం మద్దతు ఇస్తుందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారని పేర్కొన్నాయి. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సంఘర్షణలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మరోసారి పిలుపునిచ్చారని స్పష్టంచేశాయి. మోదీ, రూబియో మధ్య ఫలవంతమైన సమావేశం జరిగిందని భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. భారత్ తమకు అత్యంత ము ఖ్యమైన భాగస్వామి అని రూబియో తేల్చిచెప్పారు. మోదీతో భేటీ అనంతరం అమెరికా ఎంబసీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు రాబోయే రో జుల్లో ఇరుపక్షాలు కొన్ని కీలక ప్రకటనలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయని తెలిపారు. ఇండో–పసిఫిక్ విషయంలో వాషింగ్టన్ విధానానికి భారతదేశం ‘ఒక మూలస్తంభం’అని అభివరి్ణంచారు.మోదీకి అమెరికా ఆహ్వానం త్వరలో అమెరికా పర్యటించాలని, వైట్హౌస్ను సందర్శించాలని కోరుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరపున మార్కో రూబియో ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. ఈ విషయం అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలియజేశారు. మోదీతో భేటీ సందర్భంగా ఈ ఆహ్వానం అందించారని చెప్పారు. డొనాల్డ్ ట్రంప్కు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయాలని రూబియోను మోదీ కోరారని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ఒక ప్రకటనలో పేర్కొంది. ట్రంప్తో సంభాషణ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారని వెల్లడించింది.కోల్కతాలో మదర్ హౌస్ను సందర్శించిన రూబియో నాలుగు రోజుల పర్యటన కోసం భారత్కు వచ్చిన మార్కో రూబియో తొలుత కోల్కతాలో అడుగుపెట్టారు. సెర్గియో గోర్ ఆయనకు స్వాగతం పలికారు. అమెరికా విదేశాంగ మంత్రి ఒకరు కోల్కతాలో పర్యటించడం 14 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. చివరిసారిగా 2012 మే నెలలో అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ఇక్కడ పర్యటించారు. మార్కో రూబియో కోల్కతాలో ప్రఖ్యాత మదర్ హౌస్ను సందర్శించారు. ఇది భారత రత్న మదర్ థెరిసా స్థాపించిన ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ ప్రదాన కార్యాలయం. మదర్ హౌస్ అధికారులతో రూబియో మాట్లాడారు. అనంతరం నిర్మల శిశు భవన్ కూడా సందర్శించారు. ఇది మిషనరీస్ ఆఫ్ చారిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న పిల్లల సంరక్షణ కేంద్రం. రూబియో ఈ నెల 26వ తేదీ వరకు భారత్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ‘క్వాడ్’దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరవుతారు. ఢిల్లీతోపాటు ఆగ్రా, జైపూర్లో పర్యటిస్తారు. -
9/11 హీరో వెల్లెస్ క్రౌథర్కు అమెరికా అత్యున్నత పురస్కారం!
సెప్టెంబర్ 11, 2001లో (9/11) అల్ఖైదా జరిపిన ఉగ్ర దాడిలో ప్రాణాలను పణంగా పెట్టి ఎందరినో కాపాడిన వెల్లెస్ రెమీ క్రౌథర్కు అమెరికా ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. ఆయనకు మరణానంతరం దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారమైన 'ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్' ఇవ్వనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ ఉగ్రదాడి జరిగి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.కాగా 2001, సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్ (సౌత్ టవర్) పై ఉగ్రవాదులు దాడి జరిగినప్పుడు క్రౌథర్ వయస్సు కేవలం 24 ఏళ్లు మాత్రమే. ఈ దాడి జరిగే సమయంలో క్రౌథర్ సౌత్ టవర్లోని 104వ అంతస్తులో ఈక్విటీస్ ట్రేడర్గా పనిచేస్తున్నాడు. మొదటి విమానం నార్త్ టవర్ను ఢీకొన్న తర్వాత వెల్లెస్కు అక్కడ నుంచి తప్పించుకునే అవకాశముండేంది. కానీ ఆయన మాత్రం తన ప్రాణం కన్న అక్కడ ఉన్నవారిని ఎలాగైనా రక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. క్రౌథర్ ముఖానికి ఎర్రటి రుమాలు కట్టుకుని మెట్ల మార్గాల గుండా ప్రజలను కిందకు దించుతూ వారిని కాపాడాడు. కానీ ఈ ప్రయత్నంలో వెల్లెస్ రెమీ క్రౌథర్ తన ప్రాణాలను కోల్పోయారు. ఆయన ఎరుపు రంగు రుమాలు 9/11 మెమోరియల్ మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఆయన 'మ్యాన్ ఇన్ ది రెడ్ బందాణా'గా గుర్తింపు పొందారు. -
షార్జాలో ఘోరం.. కూతురిని బిల్డింగ్ పైనుంచి తోసేసి తల్లి ఆత్మహత్య
యూఏఈలోని షార్జాలో భారతీయ మహిళ, ఆమె ఐదేళ్ల కుమార్తె మృతి చెందిన ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గల్ఫ్ న్యూస్ కథనం ప్రకారం.. సదరు మహిళ తన ఐదేళ్ల కుమార్తెను 22 అంతస్తుల భవనంపై పైనుంచి కిందకు పడేసి, ఆపై తాను కూడా దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ దిగ్భ్రాంతికర ఘటన బుధవారం ఉదయం 7:15 గంటల ప్రాంతంలో జరిగింది.మృతుల వివరాలు ఇవే..కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లాకు చెందిన ఆర్ష .. తన భర్త నిహాల్, ఐదేళ్ల కుమార్తె రుహి (5)తో కలిసి షార్జాలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటోంది. ఆర్ష స్వంతంగా ఆన్లైన్ వ్యాపారం కూడా నిర్వహిస్తోంది. ఆమె సోదరి కుటంబం కూడా పక్కన పక్కనే ఉన్న మరో అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. అయితే 35 ఏళ్ల ఆర్షకు ఏమైందో తెలియదు కానీ, తన 5 ఏళ్ల కుమార్తెతో ఆత్మహత్య చేసుకుని వారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.ఆమె నివసిస్తున్న భవనంలో 22 అంతస్తు నుంచి మొదట తన ఐదేళ్ల కుమార్తెను బాల్కనీలో నుండి కిందకు విసిరేసింది. ఆ వెంటనే క్షణాల వ్యవధిలో తాను కూడా కిందకు ఆత్మహత్య చేసుకుంది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో సెక్యూరిటీ గార్డ్ వెళ్లి చూసేసరికి వారిద్దరూ రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే షార్జా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె అయితే కనిపెంచిన తల్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
"మీరు నిజాయితీగా.. ట్రంప్కు వ్యతిరేకంగా"
టెహ్రాన్: ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చంతా.. అమెరికా DNI డైరెక్టర్ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా చేయడంపైనే నడుస్తోంది. ఆమెను ఉద్దేశపూర్వకంగా తొలగించారా..? లేక తనంత తానే తప్పుకుందా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్.... తులసీ గబ్బార్డ్ రాజీనామాపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్కు తొత్తుగా పనిచేస్తున్న అమెరికా ప్రభుత్వంలో మీలాంటి నిజాయితీ గల వ్యక్తులు పనిచేయడం విచారకరం అని ఎక్స్లో పోస్ట్ చేసింది.అమెరికాకు అత్యత కీలకమైన జాతీయ గూఢచారి విభాగం డైరెక్టర్ (DNI) పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా చేశారు. తన భర్త అబ్రహాం విలియమ్స్కు అరుదైన ఎముక క్యాన్సర్ నిర్ధారణ కావడంతో కుటుంబానికి సమయం కేటాయించాల్సి వస్తోందని ఆమె అధికారికంగా ప్రకటించారు. “ఈ సమయంలో ఆయనతో ఉండటం నా బాధ్యత” అంటూ ట్రంప్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ రాజీనామాతో జూన్ 30 నుంచి ఆమె తన బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. అయితే తలసీ గబ్బార్డ్ రాజీనామా ఇప్పుడు అంతర్జాతీయంగా పలు చర్చలకు దారితీసింది. దీనిపై తాజాగా అర్మేనియాలోని ఇరాన్ ఎంబసీ స్పందించింది.ఇరాన్ ఎంబసీ ఎక్స్ ఖాతాలో " అబ్రహాం త్వరగా, పూర్తిగా కోలుకోవాలని మేము ఆకాంక్షిస్తున్నాము. మీరు గతంలో కొన్ని సందర్భాల్లో ఇజ్రాయెల్ కోసం కాకుండా అమెరికా కోసం పనిచేస్తారని నిరూపించుకున్నారు, అదే విధంగా పలుమార్లు అధ్యక్షుడు ట్రంప్ ద్వేషించే ఇరాన్ గురించిన నిజాలను కూడా నిష్పక్షపాతంగా మాట్లాడారు. అమెరికాను పక్కనపెట్టి, ఇజ్రాయెల్కు తొత్తుగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వంతో మీలాంటి వ్యక్తి పనిచేయడం విచారకరం. మీకు శుభాకాంక్షలు" అని ఎక్స్ఖాతాలో రాసుకొచ్చింది.అయితే ప్రస్తుతం అమెరికా ప్రభుత్వంలోని వ్యక్తులు ఆ దేశం కోసం కాకుండా పరోక్షంగా ఇజ్రాయెల్ కోసం పనిచేస్తున్నారని ఎంబసీ ఆరోపించింది. అంతే కాకుండా ఆ దేశ ప్రయోజనాల కోసం తులసి గబ్బార్డ్ ట్రంప్కు సైతం కోపం తెప్పించేలా పలుసార్లు మాట్లాడిందని పేర్కొంది.అమెరికా మీడియా కథనాలు అయితే ఆమె రాజీనామా వెనుక కేవలం వ్యక్తిగత కారణాలే లేవన్న చర్చ అమెరికా మీడియా వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఇరాన్, వెనిజులా వంటి అంతర్జాతీయ అంశాలపై ట్రంప్ టీమ్లో జరిగిన కీలక చర్చల నుంచి గబ్బార్డ్ను దూరంగా ఉంచినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. గత కొన్ని నెలలుగా ఆమెకు వైట్హౌస్లో ప్రాధాన్యం తగ్గిందని, కీలక భద్రతా సమావేశాలకు కూడా పిలవలేదని అమెరికా మీడియా ఇప్పుడు కథనాలు ఇస్తోంది.ప్రత్యేకించి.. ఇరాన్ విషయంలో తులసి గబ్బార్డ్ వైఖరి మొదటి నుంచి ట్రంప్ లైన్కు భిన్నంగా కనిపించింది. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందన్న వాదనపై ఆమె కొంత మితవాద ధోరణి ప్రదర్శించగా.. ట్రంప్ మాత్రం దూకుడైన వైఖరిని కొనసాగించారు. ఈ అంశంపైనే ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్సైతం ఆమెకు మద్ధతుగా ఎక్స్లో పోస్ట్ చేసింది. -
తులసి గబ్బార్డ్ ఎగ్జిట్.. వైట్హౌస్లో ఏం జరిగింది?
అమెరికా రాజకీయాల్లో మరోసారి సంచలన చర్చ మొదలైంది. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు అత్యంత నమ్మకస్తురాలిగా పేరున్న తులసి గబ్బార్డ్.. ఆయన శిబిరానికి దూరం కావడంపై చర్చ జోరుగా సాగుతోంది. కొందరైతే “ఆమెను పూర్తిగా పక్కన పెట్టేశారు”.. “వైట్హౌస్ నుంచి తరిమేశారు” అనే స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవానికి ఏం జరిగింది? నిజంగానే ట్రంప్తో విభేదాలే కారణమా? లేక ఆమె చెప్పిన వ్యక్తిగత కారణమే అసలు కారణమా?.. అమెరికాకు కీలకమైన జాతీయ గూఢచారి విభాగం డైరెక్టర్ (DNI) పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా చేశారు. తన భర్త అబ్రహాం విలియమ్స్కు అరుదైన ఎముక క్యాన్సర్ నిర్ధారణ కావడంతో కుటుంబానికి సమయం కేటాయించాల్సి వస్తోందని ఆమె అధికారికంగా ప్రకటించారు. “ఈ సమయంలో ఆయనతో ఉండటం నా బాధ్యత” అంటూ ట్రంప్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ రాజీనామాతో జూన్ 30 నుంచి ఆమె తన బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. భారతీయ మూలాలు లేకున్నా.. తులసి గబ్బార్డ్(45) పేరు చూసి అంతా భారతీయ నేపథ్యం ఉందని అనుకుంటారు. ఆమె తల్లిదండ్రులు భారతీయులు కాదు. వంశపారంపర్యంగానూ భారతీయ మూలాలు లేవు. తండ్రి మైక్ గబ్బర్డ్ సమోవన్-యూరోపియన్ నేపథ్యానికి చెందినవారు. తల్లి క్యారెల్ గబ్బార్డ్ అమెరికన్. కానీ ఆమె తల్లి క్యారెల్ గబ్బార్డ్కు హిందూ ధర్మం, వేద సంస్కృతిపై ఆసక్తి ఉండేది. అదే ప్రభావంతో కుటుంబమంతా హిందూ ఆధ్యాత్మిక జీవనశైలిని అనుసరించింది. అంతేకాదు పిల్లలందరికీ తులసి(తుల్సీ), భక్తి, జై, వృందావన్ వంటి భారతీయ/హిందూ పేర్లు పెట్టారామె. అలా.. చిన్నప్పటి నుంచే భగవద్గీత, యోగా, వేద సంప్రదాయాల మధ్య తులసి పెరిగారు. సాధారణంగా.. అమెరికాలో ఎక్కువ మంది బైబిల్పై ప్రమాణం చేస్తారు. కానీ, 2013లో అమెరికా ప్రతినిధుల సభ సభ్యురాలిగా ఆమె ప్రమాణం చేసేటప్పుడు భగవద్గీత మీద ప్రమాణం చేసి చర్చనీయాంశంగా మారారు. గతంలో భారత్ పర్యటించిన ఆమె సంప్రదాయ దుస్తుల్లో ఆలయాల్లో ప్రత్యేక పూజలు కూడా చేశారు. అలా హిందూ విశ్వాసాలు పాటించే అమెరికన్ రాజకీయ నాయకురాలిగా ఆమెకంటూ ఓ గుర్తింపు ఏర్పడింది. ఏం జరిగి ఉండొచ్చు?అయితే ఆమె రాజీనామా వెనుక కేవలం వ్యక్తిగత కారణాలే లేవన్న చర్చ అమెరికా మీడియా వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఇరాన్, వెనిజులా వంటి అంతర్జాతీయ అంశాలపై ట్రంప్ టీమ్లో జరిగిన కీలక చర్చల నుంచి గబ్బార్డ్ను దూరంగా ఉంచినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. గత కొన్ని నెలలుగా ఆమెకు వైట్హౌస్లో ప్రాధాన్యం తగ్గిందని, కీలక భద్రతా సమావేశాలకు కూడా పిలవలేదని అమెరికా మీడియా ఇప్పుడు కథనాలు ఇస్తోంది.ప్రత్యేకించి.. ఇరాన్ విషయంలో తులసి గబ్బార్డ్ వైఖరి మొదటి నుంచి ట్రంప్ లైన్కు భిన్నంగా కనిపించింది. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందన్న వాదనపై ఆమె కొంత మితవాద ధోరణి ప్రదర్శించగా.. ట్రంప్ మాత్రం దూకుడైన వైఖరిని కొనసాగించారు. ఈ అంశంపైనే ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.ట్రంప్.. పొగిడారు కదా!ఇదే సమయంలో.. రాజీనామాకు “ఆమెను బలవంతంగా తప్పించారు” అన్న ప్రచారం కూడా ఊపందుకుంది. కొన్ని మీడియా కథనాలు వైట్హౌస్ వర్గాలను ఉటంకిస్తూ ఆమెను రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు పేర్కొన్నాయి. కానీ అధికారికంగా మాత్రం ట్రంప్ అలాంటి సంకేతాలు ఇవ్వలేదు. పైగా ఆయన సోషల్మీడియాలో తుల్సీ గబ్బార్డ్ పనితీరును ప్రశంసిస్తూ.. “ఆమె అద్భుతంగా పనిచేశారు. మేం ఆమెను మిస్ అవుతాం” అని వ్యాఖ్యానించారు. అలా.. ఇప్పుడు అమెరికా రాజకీయ వర్గాల్లో రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ఒక వర్గం “వ్యక్తిగత కారణంతోనే ఆమె తప్పుకున్నారు” అంటుండగా.. మరోవైపు “ప్రాధాన్యం తగ్గించడం, కీలక నిర్ణయాల నుంచి దూరం పెట్టడమే అసలు కారణం” అని చెబుతోంది. అయితే.. ఒకప్పుడు ట్రంప్ శిబిరంలో కీలక స్వరంగా ఎదిగిన తులసి గబ్బార్డ్.. గత కొంతకాలంగా ఆ వర్గంలో పూర్తిగా కేంద్రస్థానంలో లేరనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.తులసి గబ్బార్డ్ వ్యక్తిగత జీవితం కూడా అమెరికా రాజకీయాల్లో ప్రత్యేక చర్చకే దారి తీసింది. 2015లో ఆమె సినిమాటోగ్రాఫర్ అబ్రహాం విలియమ్స్ను వివాహం చేసుకున్నారు. ఇద్దరూ హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోవడం అప్పట్లో వార్తల్లో నిలిచింది. తులసి చిన్నప్పటి నుంచే యోగా, ధ్యానం, భగవద్గీత వంటి హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రభావంలో పెరిగారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ సాధారణ జీవనశైలిని ఇష్టపడే నాయకురాలిగా ఆమెకు గుర్తింపు ఉంది. ప్రస్తుతం భర్త ఆరోగ్య సమస్యల కారణంగా కుటుంబానికే ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు. ఈ జంటకు ఇప్పటివరకు పిల్లలు లేరు. తమ వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా ప్రైవేట్గా ఉంచే ఈ జంట.. కుటుంబం, ఆధ్యాత్మిక జీవనం, ట్రావెలింగ్పై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. -
అమెరికా ఇంటిలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ రాజీనామా
ఇరాన్పై యుధ్దం, మిడిల్ ఈస్ట్ సంక్షోభం మధ్య అమెరికాలోమరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంత్రివర్గం నుంచి కీలక వ్యక్తి తప్పుకున్నారు.అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ (డీఎన్ఐ) పదవికి తులసి గబ్బార్డ్ (45)రాజీనామా చేశారు. ఇది జూన్ 30, 2026 నుండి అమలులోకి వస్తుంది. తన రాజీనామా విషయాన్ని ఆన్లైన్ పంచుకున్నారు.తన భర్త అబ్రహాంకు అరుదైన రకమైన ఎముక క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో, ఆయన్ను దగ్గరుండి తీసుకోవాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే వారాలు, నెలల్లో ఆయన చికిత్స మరింత క్లిష్టంగా ఉండబోతోంది. కొన్ని చాలెంజెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఈ పోరాటంలో ఆయన పక్కన ఉండి, పూర్తి మద్దతు ఇవ్వడానికే తాను ప్రజా సేవ నుంచి తప్పుకోవాల్సి వస్తోందని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా గత ఏడాదిన్నరగా తనపై ఉంచిన నమ్మకానికి విశ్వాసానికి అధ్యక్షుడు ట్రంప్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఇదీ చదవండి: 1500 గంటలు, వేలాది క్రిస్టల్స్, కాన్స్ క్వీన్ ఐశ్వర్య లుక్ స్పెషాల్టీ!ఆమె ప్రకటన ''మా పదకొండు సంవత్సరాల వివాహ జీవితంలో అబ్రహాం నాకు ఒక ఆసరాగా నిలిచాడు .తూర్పు ఆఫ్రికాలో జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ మిషన్లో నేను పాల్గొన్నప్పుడు, అనేక రాజకీయ ప్రచారాలలో, మరియు ఇప్పుడు ఈ పదవిలో నా సేవలో కూడా స్థిరంగా నిలబడ్డాడు. అతని బలం, ప్రేమే ప్రతి సవాలులో నన్ను స్థిరంగా నిలబెట్టాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో తన బాధ్యతలను నిర్వర్తించలేను..అలాగే ఈ పోరాటాన్ని ఒంటరిగా ఎదుర్కోనేలా చేయడం భావ్యం కాదు’’ అని ఆమె వెల్లడించారు.ఇదీ చదవండి: BP టెన్షన్ పెడుతోన్న కంటికి కనిపించని శత్రువుకాగా భారత సంతతికి చెందిన తులసి గబ్బార్డ్, 2012లోనే హవాయి నుంచి హౌస్ ఆఫ్ రిప్రసెంటేటివ్స్ కు ఎంపిక అయ్యారు. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ట్రంప్ సర్కార్లో తులసి గబ్బార్డ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (DNI)గా, క్యాబినెట్ స్థాయి ఇంటెలిజెన్స్ పదవిని చేపట్టిన మొదటి పసిఫిక్ ఐలాండర్ అమెరికన్ , హిందూ అమెరికన్ అయ్యారు. ఆమె మాజీ యూఎస్ కాంగ్రెస్ సభ్యురాలు, ఆర్మీ వెటరన్ కూడా.I am deeply grateful for the trust President Trump placed in me and for the opportunity to lead @ODNIgov for the last year and a half. Unfortunately, I must submit my resignation, effective June 30, 2026. My husband, Abraham, has recently been diagnosed with an extremely rare… pic.twitter.com/PS0Dxp5zpd— Tulsi Gabbard 🌺 (@TulsiGabbard) May 22, 2026 -
పుతిన్తో ట్రంప్ గేమ్.. ఎక్కడికి దారి తీస్తుందో..
డొనాల్డ్ ట్రంప్.. ఈ పేరు ఎప్పుడూ సంచలనమే. ఆయన తీసుకునే నిర్ణయాలు, చర్యలు.. ఎప్పుడు ఏం చేస్తారో.. ఏం చెబుతారో అనేది ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. తీసుకున్న నిర్ణయాలు అనేక దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. యూరోప్లో తమ బలగాలను తగ్గిస్తామని ఇన్నాళ్లూ చెప్పిన ట్రంప్ ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. పోలాండ్కు అదనంగా 5000 మంది బలగాలను పంపనున్నట్లు వెల్లడించారు. దీంతో ఆయన చేస్తున్న ప్రకటన నాటో దేశాలను షాక్కు గురిచేసింది.అంతకుముందు ట్రంప్.. జర్మనీ నుంచి తమ సైనికుల సంఖ్యను తగ్గించనున్నట్లు చెప్పారు. జర్మనీ నుంచి సుమారు 5 వేల మందిని ఉపసంహరించనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఇరాన్ యుద్ధంలో అమెరికా పరాజయాన్ని చవిచూసినట్లు జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ ఆరోపించారు. యుద్ధ వ్యూహాంలో అమెరికా విఫలమైనట్లు ఆయన విమర్శించారు. ఈ క్రమంలో జర్మనీ నుంచి తమ బలగాలను ట్రంప్ ఉపసంహరించుకున్నట్టు సమాచారం.కానీ, పోలాండ్కు మాత్రం అదనంగా బలగాలను పంపనున్నట్లు ట్రంప్ చెప్పడం నాటో దేశాల్లో గందరగోళం నెలకొన్నది. పోలాండ్ అధ్యక్షుడిగా కరోల్ నవరోకీ విజయవంతంగా ఎన్నికయ్యారని, ఆయనకు తన మద్దతు ఉంటుందని, అమెరికా ఆయనకు మద్దతుగా 5 వేల మంది బలగాలను పోలాండ్కు పంపుతోందని ట్రంప్ తన ట్రుత్ సోషల్లో తెలిపారు. అయితే, జర్మనీ నుంచి ఉపసంహరించుకునే సైనికులను పోలాండ్కు బదిలీ చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. కాగా, ఇది యూరప్లో అమెరికా సైనిక వ్యూహంలో మార్పులకు సంకేతంగా భావించబడుతోంది. మరోవైపు.. పోలాండ్ నాయకత్వం ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. ఎందుకంటే ఇది రష్యా ముప్పు నుంచి రక్షణను బలోపేతం చేస్తుందని భావిస్తోంది. ఈ నిర్ణయం సైనిక వ్యూహం కంటే రాజకీయ సంబంధాలపై ఆధారపడి ఉందని విశ్లేషకులు అంటున్నారు.పోలాండ్-రష్యా ఘర్షణ.. ప్రస్తుతం పోలాండ్-రష్యా సంబంధాలు తీవ్ర ఉద్రిక్తతలో ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పోలాండ్ తన భద్రతను నాటో మరియు అమెరికా సైనిక ఉనికిపై ఆధారపడి బలోపేతం చేస్తోంది. అలాగే రష్యా చర్యలను ప్రత్యక్ష ముప్పుగా చూస్తోంది. ప్రస్తుతం పోలాండ్-రష్యా మధ్య ఘర్షణలు ప్రత్యక్ష యుద్ధం రూపంలో కాకుండా “హైబ్రిడ్ వార్” రూపంలో జరుగుతున్నాయి. రష్యా పోలాండ్పై సైబర్ దాడులు, గూఢచారి చర్యలు, సమాచార యుద్ధం, మరియు సరిహద్దు అస్థిరతను ఆయుధంగా ఉపయోగిస్తోంది. పోలాండ్ మాత్రం NATO తూర్పు రక్షణలో ముందు వరుసలో నిలిచి రష్యా ముప్పును ఎదుర్కొంటోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియకపోతే పోలాండ్-రష్యా సంబంధాలు మరింత కఠినమవుతాయి. మరోవైపు.. ఇటీవల పోలాండ్ విదేశాంగ మంత్రి పార్లమెంట్లో చేసిన ప్రసంగంలో.. రష్యా నుంచి వచ్చే ముప్పు నిజమైన ప్రమాదమని పేర్కొన్నారు. 2025 నవంబరులో రష్యా క్షిపణి దాడిలో పోలాండ్ పౌరులు మరణించడం ఈ ఉద్రిక్తతను మరింత పెంచింది.పోలాండ్.. నాటో తూర్పు రక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పోలాండ్ తన సైనిక శక్తిని విస్తరించి, NATO తూర్పు ఫ్లాంక్లో ప్రధాన స్థావరంగా మారింది. అమెరికా బలగాల ఉనికి, పోలాండ్ సైనిక విస్తరణ, మరియు NATO Forward Land Forces బెటాలియన్ పోలాండ్ను తూర్పు యూరప్ రక్షణలో కేంద్రంగా నిలబెట్టాయి.ప్రధాన ఘర్షణ రూపాలు1. హైబ్రిడ్ దాడులు సైబర్ దాడులు: పోలాండ్ ప్రభుత్వ, మౌలిక వసతులపై రష్యా తరచుగా సైబర్ దాడులు చేస్తోంది. గూఢచారి చర్యలు: రష్యా గూఢచారులు పోలాండ్లోని కీలక సైనిక, ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సమాచార యుద్ధం: సోషల్ మీడియా, మీడియా ప్రచారాల ద్వారా పోలాండ్ సమాజాన్ని విభజించే ప్రయత్నం.2. సరిహద్దు సమస్యలు బెలారస్ ద్వారా వలసదారుల ప్రవేశం: రష్యా-బెలారస్ కలిసి అక్రమ వలసదారులను పోలాండ్ సరిహద్దులోకి పంపి అస్థిరత సృష్టిస్తున్నారు. సైనిక ఒత్తిడి: పోలాండ్ NATOతో కలిసి తూర్పు సరిహద్దులో బలగాలను పెంచుతోంది.3. ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం పోలాండ్ ఉక్రెయిన్కు ప్రధాన లాజిస్టికల్ హబ్గా మారింది. రష్యా దీన్ని ప్రత్యక్ష ముప్పుగా భావించి పోలాండ్పై దాడులను పెంచింది.పోలాండ్ పాత్రలో ప్రధాన అంశాలు1. Forward Land Forces (FLF) NATO తూర్పు ఫ్లాంక్లోని ఎనిమిది మల్టీనేషనల్ బెటాలియన్లలో ఒకటి పోలాండ్లో ఉంది. ఈ బెటాలియన్ రష్యా దాడులను అడ్డుకోవడానికి మరియు తక్షణ ప్రతిస్పందన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది.2. Mass-Army Strategy పోలాండ్ 2039 నాటికి 500,000 సైనికులు (300,000 యాక్టివ్, 200,000 రిజర్వ్) కలిగిన భారీ సైన్యాన్ని నిర్మిస్తోంది. ఇది దీర్ఘకాలిక, అధిక తీవ్రత గల యుద్ధంను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతుంది. AI, డ్రోన్లు, లాంగ్-రేంజ్ స్ట్రైక్ సిస్టమ్స్ వంటి ఆధునిక సాంకేతికతలను సమీకరిస్తోంది.3. Air & Missile Defence పోలాండ్ NATO Integrated Air and Missile Defence (IAMD)లో కీలక భాగస్వామి. పర్మనెంట్ NATO Air Policing ద్వారా పోలాండ్ ఆకాశాన్ని 24/7 పర్యవేక్షిస్తున్నారు.4. సైబర్ మరియు స్పేస్ రక్షణ పోలాండ్ NATO Eastern Sentry ప్రోగ్రామ్లో భాగమై, సైబర్ దాడులు, ఉపగ్రహ ముప్పులు.రష్యా ప్లాన్..నాటోలో విభేదాలు: రష్యా హైబ్రిడ్ దాడులు NATO ఏకత్వాన్ని బలహీనపరుస్తున్నాయి.యూరప్లో అస్థిరత: సైబర్ దాడులు, ఇంధన సమస్యలు, వలసదారుల ఒత్తిడి యూరప్ భద్రతను దెబ్బతీస్తున్నాయి.ఉక్రెయిన్ మద్దతు తగ్గించడం: రష్యా లక్ష్యం యూరప్ దేశాలు ఉక్రెయిన్కు మద్దతు తగ్గించేలా ఒత్తిడి చేయడం.నాటో ప్రస్తుతం రష్యా, చైనా వంటి దేశాల హైబ్రిడ్ వార్ వ్యూహాలకు ప్రతిస్పందించడానికి ప్రత్యేకమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. 2026లో NATO “Counter-Hybrid Support Teams”, Article 5 invocation readiness, మరియు EUతో సమన్వయం వంటి చర్యల ద్వారా సభ్యదేశాలను రక్షిస్తోంది. ఇలాంటి తరుణంలో ట్రంప్ పోలాండ్కు అదనపు బలగాలను పంపుతానని ప్రకటించడం నాటోకు కొన్ని ఇబ్బందులను కలిగిస్తోంది. మొత్తం మీద రష్యా హైబ్రిడ్ వార్లోకి అమెరికా ఎంట్రీ ఇచ్చిందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.1. సమన్వయం లోపం ట్రంప్ నిర్ణయం NATO మిత్రదేశాలతో ముందుగా చర్చించకుండా తీసుకున్నారు. NATOలో ఏకత్వం, నమ్మకం దెబ్బతింటుంది.2. జర్మనీ నుండి బలగాల తగ్గింపు పోలాండ్కు బలగాలను పంపడం కోసం అమెరికా జర్మనీలోని సైనికులను తగ్గిస్తోంది. జర్మనీ, ఫ్రాన్స్ వంటి పశ్చిమ యూరప్ దేశాలు దీన్ని తమ భద్రతా ప్రాధాన్యత తగ్గింపుగా భావిస్తున్నాయి. నాటోలోని ఇతర దేశాలు దీన్ని సంయుక్త వ్యూహం కాకుండా వ్యక్తిగత రాజకీయ నిర్ణయంగా చూస్తున్నాయి.4. తూర్పు-పశ్చిమ విభేదాలు తూర్పు యూరప్ దేశాలు (పోలాండ్, బాల్టిక్ దేశాలు) అమెరికా బలగాలను స్వాగతిస్తున్నాయి. పశ్చిమ యూరప్ దేశాలు (జర్మనీ, ఫ్రాన్స్) దీన్ని NATOలో విభేదాలు పెంచే చర్యగా భావిస్తున్నాయి. -
గ్రీన్ కార్డ్ విధానంపై ఇండస్ట్రీలో అలజడి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని వైట్ హౌస్ యంత్రాంగం తీసుకొచ్చిన సరికొత్త ఇమ్మిగ్రేషన్ విధానాలు ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో కలకలం రేపుతున్నాయి. చట్టబద్ధమైన గ్రీన్ కార్డ్ నిబంధనలను కఠినతరం చేస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అమెరికా టెక్ దిగ్గజాలు, సిలికాన్ వ్యాలీ పెట్టుబడిదారులు, ఇమ్మిగ్రేషన్ నిపుణులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్పులు అమెరికా ఆర్థిక పురోగతిని, అంతర్జాతీయంగా ఉన్న ఆవిష్కరణల సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.అమెరికా ఏఐ భవిష్యత్తుకే ముప్పుతాజా గ్రీన్ కార్డ్ మార్గదర్శకాల ప్రకారం, దరఖాస్తుదారులు అమెరికా వెలుపల నుంచే ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనిపై లింక్డ్ఇన్ సహ వ్యవస్థాపకుడు, మాజీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రీడ్ హాఫ్మాన్ సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రస్తుతం అమెరికా టెక్ ఎకోసిస్టమ్లో శ్రమిస్తున్న ఏఐ పరిశోధకులు, కీలక ఉద్యోగులు, అంతర్జాతీయ విద్యార్థులు ఇప్పుడు ఈ సుదీర్ఘ బ్యాక్లాగ్ ప్రక్రియ కోసం దేశాన్ని విడిచి వెళ్లాలా? ఇది టెక్ రంగానికే కాదు, మొత్తం అమెరికా వ్యాపార రంగానికి కోలుకోలేని హాని కలిగించే చర్య’ అని హాఫ్మాన్ విమర్శించారు.ప్రముఖ ఏఐ శాస్త్రవేత్త, కోర్సెరా సహ వ్యవస్థాపకుడు ఆండ్రూ ఎన్జీ సైతం ఈ విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. వైట్ హౌస్ తీసుకున్న ఈ నిర్ణయం చట్టబద్ధమైన వలసలపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. దీనివల్ల ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు, వైద్యులు, ఉపాధ్యాయుల కొరత ఏర్పడుతుందన్నారు. కృత్రిమ మేధ రంగంలో అమెరికా ప్రపంచ దేశాలతో పోటీపడే శక్తిని కోల్పోతుందని హెచ్చరించారు.స్టార్టప్లకు ముప్పుఅక్రమ వలసలను అరికట్టే చర్యలను తాము సమర్థిస్తామని, అయితే నైపుణ్యం కలిగిన కార్మికులను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని స్టార్టప్ వ్యవస్థాపకులు అభిప్రాయపడుతున్నారు. బూమ్ సూపర్సోనిక్ వ్యవస్థాపకుడు, సీఈఓ బ్లేక్ స్కోల్ స్పందిస్తూ..‘ఎంతో కష్టపడి పనిచేసే ప్రతిభావంతులు అమెరికాకు రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదు’ అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.ప్రస్తుతం అమెరికాలో చట్టబద్ధంగా ఉంటూ O1 లేదా H1B వీసాలపై పనిచేస్తున్న అత్యున్నత స్థాయి నిపుణులు, శాస్త్రవేత్తలు, బిలియన్ డాలర్ల కంపెనీల వ్యవస్థాపకులు ఇప్పుడు తమ పనిని ఆపేసి స్వదేశాలకు వెళ్లిపోవాలా? ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న బ్యాక్లాగ్ క్లియరెన్స్ కోసం వారు తమ దేశాల్లో వేచి ఉండటం అసాధ్యం. యుద్ధాలు, అంతర్గత కలహాల వల్ల తీవ్రంగా నష్టపోయిన దేశాల నుంచి వచ్చిన వలసదారులు, ప్రస్తుత పరిస్థితుల్లో తమ స్వదేశాలకు తిరిగి వెళ్లడం ప్రాణసంకటంగా మారుతుందని డేవిడోవ్ వెంచర్స్ ఫౌండర్, నిక్ డేవిడోవ్ గుర్తుచేశారు.చట్టసభ సభ్యుల ఆగ్రహంఈ కొత్త నిబంధన ఇప్పటికే తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను మరింత కుదేలు చేస్తుందని చట్టసభ ప్రతినిధి యెవెట్ క్లార్క్ మండిపడ్డారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్న కష్టజీవులను దేశం నుంచి తరిమికొట్టడమేనని, విచ్ఛిన్నమైన వ్యవస్థను ఈ నిర్ణయం మరింత సర్వనాశనం చేస్తుందని ఆమె విమర్శించారు.ఇదీ చదవండి: మిడిల్ మేనేజ్మెంట్ అంతం? -
చాలా కాస్ట్లీ గురూ.. 2 తర్బూజాలు కేవలం రూ. 30 లక్షలు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్రూట్గా జపాన్ తర్పూజా రికార్డ్ కొట్టేసింది. దీంతో జపాన్ రైతు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపతున్నారు. మే 22న సపోరో సంతలో ఇతను పండించిన రెండు ‘యుబారి మెలన్లు’ (తర్బూజాలు) 30 లక్షలకు అమ్ముడు పోయాయి. అదీ అతని ఆనందం. అంత రేటా? ఎస్. రేటే. ఎందుకంటే ఈ యుబారి మెలన్లు హొక్కైడోలోని యుబారి అనే చిన్న పట్టణంలో మాత్రమే పండిస్తారు. అక్కడి నేల, వాతావరణం వేరు. అందుకే ఆ రుచి ఇంకెక్కడా రాదు. పండించేటప్పుడు ఒక్కో మొక్కకు ఒక్క పండు మాత్రమే ఉంచుతారు. మిగతావి తీసేస్తారు. ఆ ఒక్క పండుకే మొక్క శక్తి అంతా పోతుంది. రోజూ రైతులు పండుని పొత్తిళ్లలో పాపాయిలా చూసుకుంటారు. టోపీ కూడా పెడతారు ఎండ తగలకుండా. జపాన్లో వీటి మొదటి పంట వేలం చాలా ప్రెస్టీజ్. పెద్ద కంపెనీలు ‘మా పేరు పేపర్లో రావాలి‘ అని పోటీపడి కొంటాయి పబ్లిసిటీ కోసం. ఆ పండ్లని తినరు, గిఫ్ట్గా ఇస్తారు లేదా డిస్ప్లే పెడతారు. ఇదీ చదవండి: BP టెన్షన్ పెడుతోన్న కంటికి కనిపించని శత్రువురికార్డు: ఇంతకుముందు 2019లో 50 లక్షల యెన్లు రేటు పలికింది. ఇప్పుడు 2026లో 58 లక్షల ఎన్లతో కొత్త రికార్డ్. ప్రతి ఏడాది ధర పెరుగుతూనే ఉంది.ఇదీ చదవండి: 1500 గంటలు, వేలాది క్రిస్టల్స్, కాన్స్ క్వీన్ ఐశ్వర్య లుక్ స్పెషాల్టీ! -
ఇరాన్ గగనతలం మూసివేత.. ఏం జరగనుంది?
టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర దశకు చేరుకున్నాయి. ఇరాన్తో శాంతి చర్చలు కొనసాగుతూనే మరోసారి సైనిక దాడులకు అమెరికా రెడీ అవుతున్నట్టు సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్పై తాజా దాడుల అవకాశాలను తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ, ఏ క్షణంలోనైనా మెరుపు దాడులు జరిగే అవకాశముంది.ఈ నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది. టెహ్రాన్పై అమెరికా మరోసారి దాడులకు సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. భద్రతా కారణాలతో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య తాజా పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి.JUST IN: IRAN AIRSPACE COMPLETELY EMPTY!!As per CBS, the US is prepping for possible strikes on Iran.📹FlightRadar24 pic.twitter.com/pDZ6AObtRL— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) May 23, 2026సీబీఎస్ న్యూస్ కథనం ప్రకారం, ఇరాన్పై సంభావ్య దాడుల నేపథ్యంలో అమెరికా సైన్యం, ఇంటెలిజెన్స్ విభాగాలకు చెందిన పలువురు అధికారులు తమ మెమోరియల్ డే వీకెండ్ సెలవులను రద్దు చేసుకున్నారు. మొదట న్యూజెర్సీలోని తన గోల్ఫ్ క్లబ్లో వీకెండ్ గడపాలని భావించిన ట్రంప్ కూడా తన ప్రణాళిక మార్చుకుని వైట్ హౌస్కు తిరిగి వెళ్లినట్లు సమాచారం. చర్చలు చివరి నిమిషంలో ఫలించకపోతే ఇరాన్పై కొత్త దాడులకు ట్రంప్ సీరియస్గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల మధ్య ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత ఉద్రిక్తతకు దారితీశాయి. "ఇరాన్ ఒప్పందం చేసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉంది. కానీ వాళ్లు అణ్వాయుధాలు కలిగి ఉండటాన్ని మేము ఎప్పటికీ అనుమతించం. అందుకే మేము కఠిన చర్యలు తీసుకున్నాం" అని ట్రంప్ అన్నారు.ఇదే సమయంలో చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ రంగంలోకి దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన ప్రస్తుతం టెహ్రాన్లో ఉన్నారు. శనివారం ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ జనరల్ అహ్మద్ వాహిదీతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఖతార్ ప్రతినిధులు కూడా ఈ చర్చల్లో భాగస్వామ్యమవుతున్నారు. అయితే చర్చలు చాలా క్లిష్టంగా సాగుతున్నాయని అమెరికా అధికారులు చెబుతున్నారు. ప్రతిరోజూ డ్రాఫ్ట్లు మారుతున్నా పెద్దగా పురోగతి కనిపించడం లేదని పేర్కొంటున్నారు. -
టెన్షన్ పడుతున్న ట్రంప్.. ఇవాంక హత్యకు మాస్టర్ ప్లాన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హత్యకు ప్లాన్ జరిగినట్టు అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. దీంతో, ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఇరాన్ ఐఆర్జీసీతో సంబంధాలున్న ఓ ఉగ్రవాది ఈ కుట్ర పన్నినట్లు సదరు మీడియా కథనం పేర్కొంది. అయితే, అతడు తన ప్లాన్ అమలు చేసే లోపే అరెస్టు అయినట్టు తెలిసింది. దీంతో, ఇవాంక ట్రంప్నకు పెను ప్రమాదం తప్పందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హత్యకు ప్లాన్ జరిగినట్టు అమెరికాకు చెందిన దర్యాప్తు అధికారులు వెల్లడించారు. అయితే, ఐఆర్జీసీతో సంబంధాలున్న మహమ్మద్ బాఖర్ సాద్ దావూద్ అల్ సాదీ(32) కొంతకాలం క్రితం తుర్కియేలో అరెస్టు అయ్యాడు. అరెస్టు అనంతరం, అతడిని అమెరికాకు తరలించారు. ఈ క్రమంలో అతడిని విచారించిన దర్యాప్తు అధికారులు కీలక విషయాలను గుర్తించారు. మహమ్మద్ వద్ద ఇవాంక కుటుంబం నివసిస్తోన్న ఇంటి బ్లూప్రింట్ ఉందని వెల్లడించారు. ఫ్లోరిడాలోని ఆమె నివాసం ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినట్లు తెలుస్తోంది.అయితే, 2020లో ఇరాన్ అగ్రశ్రేణి కమాండర్ ఖాసీం సులేమాని హత్యకు ప్రతీకారంగా ఆమెను హతమార్చేందుకు ఈ ప్లాన్ చేసినట్టు సదరు కథనంలో పేర్కొన్నారు. కానీ, అతడు ప్లాన్ అమలు చేసే లోపే అరెస్టు అయ్యాడని తెలియజేసింది. అతడు అరెస్ట్ కాకపోయి ఉంటే ప్రమాదం జరిగేదనే విషయాన్ని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఖాసీం సులేమానీ ఇరాన్ మిలిటరీలో అగ్రశ్రేణి కమాండర్. ఇస్లామిక్ రివెల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్జీసీ) విభాగం ఖుద్ ఫోర్స్కు కమాండర్గా ఉన్న సమయంలో అమెరికా అతడిని హత్య చేసింది. ఈ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటానని మహమ్మద్ బహిరంగంగానే ప్రకటించాడు. ఇరాన్-ఇరాక్ ఉగ్రనెట్వర్క్లో అతడిది కీలకపాత్ర అని అమెరికా అధికారులు వెల్లడించారు.#BREAKING: An IRGC-linked suspect accused of plotting to assassinate Ivanka Trump has been captured.Reports claim the suspect possessed a blueprint of her Florida home and had allegedly vowed to target the former First Daughter. pic.twitter.com/ONINXJwDVL— upuknews (@upuknews1) May 23, 2026 -
మృత్యు గుహలో ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు
సముద్రపు అడుగున ఉన్న ఓ చీకటి గుహ.. ఒక్కసారి లోపలికి వెళ్తే దారి తప్పించే ప్రమాదకర సొరంగాలు.. చుట్టూ మట్టి, సిల్ట్తో నిండిన మార్గాలు.. బయటకు రావడానికి క్షణక్షణం ప్రాణపోరాటం. వెరసి.. ఘోర డైవింగ్ ప్రమాదానికి సంబంధించిన తాజా ఫొటోలు ఇప్పుడు ప్రపంచాన్ని షాక్కు గురిచేస్తున్నాయి.మాల్దీవుల్లో “షార్క్ కేవ్”గా పిలిచే ఆ అండర్వాటర్ గుహలో చిక్కుకుని ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. సముద్రపు అడుగున ఉన్న ప్రమాదకర గుహలో చిక్కుకుని ఐదుగురు ఇటాలియన్ డైవర్లు, వారిని రక్షించేందుకు వెళ్లిన ఓ మాల్దీవుల సైనిక డైవర్ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదంగా మారింది. డైవింగ్ చరిత్రలోనే అతిపెద్ద విషాదాల్లో ఒకటిగా మారిందది. అయితే.. తాజాగా బయటకు వచ్చిన గుహ ఫొటోలు చూస్తే అక్కడి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో అర్థమవుతోంది.మే 14న మాల్దీవుల వావూ అటోల్ సమీపంలోని అలిమథా దీవి దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇటలీకి చెందిన ఐదుగురు అనుభవజ్ఞులైన డైవర్లు “షార్క్ కేవ్”గా పిలిచే సముద్ర గుహలోకి అన్వేషణ కోసం వెళ్లారు. ఈ బృందంలో సముద్ర జీవశాస్త్ర నిపుణురాలు మోనికా మోంటోఫాల్కోనే, ఆమె కుమార్తె జార్జియా సొమ్మక్యాల్, సముద్ర జీవశాస్త్రవేత్త ఫెడెరికో గువాల్టిరి, పరిశోధకురాలు మ్యూరియల్ ఒడ్డెనినో, డైవింగ్ ఇన్స్ట్రక్టర్ గియాన్లుకా బెనెడెట్టీ ఉన్నారు. వాళ్లు ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో.. అధికారుల్లో ఆందోళన నెలకొంది. కొన్ని గంటల తర్వాత గియాన్లుకా బెనెడెట్టీ మృతదేహం గుహ ప్రవేశం దగ్గర లభించింది. మిగిలిన నలుగురి కోసం సహాయక చర్యలు ప్రారంభించగా.. తీవ్ర లోతు, సముద్రపు బలమైన ప్రవాహాలు, చీకటి పరిస్థితులు పెద్ద సవాల్గా మారాయి. ఈ క్రమంలో సహాయక చర్యల్లో పాల్గొన్న మాల్దీవుల సైనిక డైవర్ ముహమ్మద్ మహుద్దీ కూడా డీకంప్రెషన్ సమస్యతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మరణించినట్లైంది.చేసేదిలేక.. ఫిన్లాండ్కు చెందిన ప్రత్యేక నిపుణుల బృందం ఆధునిక పరికరాలతో గుహలోకి వెళ్లి మిగిలిన మృతదేహాలను వెలికితీసింది. అధికారుల చెబుతోంది ఏంటంటే.. వీరు సాధారణంగా అనుమతించే లోతుకంటే చాలా ఎక్కువగా సముద్రంలోకి దిగి ఉంటారేమోనని. దాదాపు 50 నుంచి 60 మీటర్ల లోతులో ఉన్న గుహల్లోకి వెళ్లిన తర్వాత దారి తప్పినట్లు భావిస్తున్నారు. గుహలోని సన్నని మార్గాలు, మట్టి లాంటి సిల్ట్ నీటిలో కలవడంతో పూర్తిగా కనిపించకుండా పోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై మాల్దీవుల అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటన సమయంలో రికార్డ్ అయిన గోప్రో వీడియోలు, డైవింగ్ పరికరాల డేటాను పరిశీలిస్తున్నారు. భద్రతా నిబంధనలు పాటించారా లేదా అనే దానిపై కూడా విచారణ కొనసాగుతోంది.ఆ పేరెలా వచ్చిందంటే..వావూ అటోల్లోని అలిమథా దీవి సమీపంలో ఉన్న “షార్క్ గుహ” మాల్దీవులలో అత్యంత ప్రమాదకరమైన సముద్ర గుహలలో ఒకటిగా గుర్తించబడింది. ఈ పేరు ఈ గుహలో తరచుగా కనిపించే షార్క్ల వల్ల వచ్చింది. ఇక్కడి గుహల్లో రీఫ్ షార్క్లు, ఇతర చిన్న షార్క్ జాతులు తరచుగా కనిపిస్తాయి. అందువల్ల స్థానికులు దీనిని “షార్క్ గుహ” అని పిలుస్తారు. స్థానికంగా దీనిని దేవన కందు అని పిలుస్తారు. మాలే రాజధాని నుండి దాదాపు 100 కి.మీ దూరంలో ఉన్న ఈ గుహ, తన లోతు, నిర్మాణం, ప్రవాహాల వల్ల డైవర్లకు ఒక సవాలుగా మారింది.ఈ గుహలో మూడు విభాగాలు ఉన్నాయి. మొదటి రెండు భాగాలు తక్కువ లోతులో ఉండగా, మూడవ భాగం 50–60 మీటర్ల లోతులో ఉంది. ఈ భాగంలోనే ఇప్పుడు ఇటాలియన్ డైవర్లు చిక్కుకుని ప్రాణాలు పొగొట్టుకున్నారు. గుహలోని మార్గాలు చాలా ఇరుకుగా ఉండి.. మట్టి నీటిలో కలిసిపోవడం వల్ల దారి కనిపించని పరిస్థితులు తాజా ఫొటోలతో బయటకు వచ్చాయి. అలాగే బలమైన సముద్ర ప్రవాహాలు తోడవ్వడంతో డైవర్లకు ఇవి మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. అలా ఏర్పడ్డాయి.. ఈ గుహల నిర్మాణం లక్షల ఏళ్ల భూగర్భ ప్రక్రియల ఫలితం. 55 మిలియన్ ఏళ్ల క్రితం సముద్రపు అడుగున ఉన్న అగ్నిపర్వతాలపై పగడపు దిబ్బలు పెరిగి.. తర్వాత సున్నపు రాళ్ల పొరలు ఏర్పడ్డాయి. గ్లేషియల్ కాలాల్లో సముద్ర మట్టం తగ్గి, సున్నపు రాళ్లు బయటకు వచ్చి వర్షపు నీటితో కరిగి గుహలు ఏర్పడ్డాయి. ఇంటర్గ్లేషియల్ కాలాల్లో మంచు కరిగి సముద్ర మట్టం పెరగడంతో ఆ గుహలు మళ్లీ నీటిలో మునిగిపోయాయి. ఈ ప్రక్రియ 2.6 మిలియన్ ఏళ్లుగా పునరావృతమవుతూ క్రమంగా గుహలు ఏర్పడ్డాయి.“షార్క్ గుహ” ఇప్పటివరకు పూర్తిగా మ్యాప్ చేయబడలేదు. అందుకే అనుభవజ్ఞులైన డైవర్లకు కూడా అత్యంత ప్రమాదకర ప్రదేశంగా పరిగణించబడుతుంది. అందుకే ఈ గుహలోకి 30 మీటర్ల లోతు వరకు మాత్రమే డైవింగ్ అనుమతిస్తారు. ఇప్పుడు ఆరుగురి ప్రాణాలు తీసిన గుహ లోపలి భాగంలో ఎలా ఉందో తీసిన పాత వీడియో కింద చూసేయండి.. -
చైనా గనిలో భారీ పేలుడు90 మంది మృతి
బీజింగ్: చైనాలోని ఓ బొగ్గు గనిలో సంభవించిన పేలుడులో 90 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. షాంగ్జి ప్రావిన్స్లోని క్విన్యువాన్ కౌంటీలో ఉన్న లియుòÙన్యు బొగ్గు గనిలో శుక్రవారం సాయంత్రం ఈ విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ లీకేజీ కారణంగానే ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో గనిలో 247 మంది వరకు కార్మీకులున్నారన్నారు. ఇప్పటి వరకు 201 మంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఘటన నేపథ్యంలో అధ్యక్షుడు జిన్ పింగ్ యంత్రాంగానికి పలు ఆదేశాలు జారీ చేశారు. రక్షణ, సహాయక చర్యలను పక్కాగా చేపట్టాలన్నారు. దర్యాప్తు జరిపి, బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇటువంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. కాగా, చైనాలో తవ్వే బొగ్గులో మూడో వంతు షాంగ్జి ప్రావిన్స్లోని గనుల నుంచే లభిస్తుంది. భారీ ప్రమాదాల చరిత్ర చైనాలోని గనుల్లో భారీ ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. 2023లో ఇన్నర్ మంగోలియా ప్రాంతంలోని ఓ గని కుప్పకూలి 53 మంది సజీవ సమాధి అయ్యారు. 2009లో హెయిలొంగ్ జియాంగ్ ప్రావిన్స్లో గ్యాస్ పేలుడుతో 108 గని కార్మీకులు మృతి చెందారు. 2005లో ఇదే ప్రావిన్స్లోని మరో గనిలో పేలుడుతో 171 మంది ప్రాణాలు కోల్పోయారు. 2005లోనే లియావోనింగ్ ప్రావిన్స్లోని సుంజియావన్ గనిలో గ్యాస్ లీకేజీ పేలుడు కారణంగా 214 మంది అసువులు బాశారు. 2004లో షాంగ్జి ప్రావిన్స్లోని చెంజియాషన్ గనిలో పేలుడుతో 166 మంది, హెనాన్ ప్రావిన్స్లోని డాపింగ్ గనిలో గ్యాస్ లీకేజీ పేలుడు కారణంగా మరో 148 మంది చనిపోయారు.2000లో గుయిఝౌ ప్రావిన్స్ లోని ముచోంగౌ గనిలో పేలుడుతో 162 మంది కార్మీకులు మృతి చెందారు. -
ట్రంప్లా కనిపించిన గేదె.. పాపం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను పోలి ఉందంటూ సోషల్ మీడియాలో ఓ అరుదైన తెల్లగేదె సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు మరో కారణంతో వార్తల్లో నిలిచింది. వేలాది మంది సెల్ఫీలు దిగిన ఆ “ట్రంప్ బఫెలో”కథ.. మరికొన్ని రోజుల్లో ముగియబోతోంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోని నారాయణ్గంజ్లో ఉన్న ఓ ఫారంలో పెంచుతున్న ఈ నాలుగేళ్ల ఆల్బినో గేదె బరువు దాదాపు 700 కిలోలు. నుదుటిపై వేలాడే బంగారు రంగు జుట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెయిర్స్టైల్ను పోలి ఉండటంతో దీనికి “ట్రంప్” అనే పేరు ముద్రపడింది. ఆ తర్వాత ఈ గేదె ఫొటోలు, వీడియోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. అయితే.. బక్రీద్ సందర్భంగా ట్రంప్ గేదెను బలి ఇవ్వబోతున్నారట. ఈ గేదెను పెంచుతున్న ఫారం యజమాని జియౌద్దీన్ మృధా మాట్లాడుతూ.. ఈద్ అల్ అదా(Eid al-Adha) సందర్భంగా బలిచేయడానికి ఇప్పటికే ఓ వ్యక్తి దీనిని కొనుగోలు చేశాడని తెలిపారు. ‘‘ట్రంప్ బఫెలోను మిస్ అవుతాను. కానీ త్యాగమే ఈద్ అసలు స్ఫూర్తి” అని జియౌద్దీన్ చెబుతున్నారు.తెల్లని చర్మం, గులాబీ రంగు ముక్కు, లేత రంగు జుట్టుతో కనిపించే ఈ గేదెను చూసేందుకు ప్రతిరోజూ జనాలు పెద్ద ఎత్తున ఫారంకు వచ్చేవారని.. పిల్లలు, యువత సెల్ఫీలు తీసుకోవడానికి పోటీపడేవారని తెలిపారు. కొందరు దూర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా వచ్చి చూసి వెళ్లేవారట. మరోవైపు.. ఆల్బినో జంతువులు చాలా అరుదుగా కనిపిస్తాయని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. శరీరంలో మెలానిన్ లోపం వల్లే వీటికి తెల్లటి రంగు వస్తుందని వివరించారు. ఈ గేదె ఆరోగ్యంగా ఉండేందుకు రోజుకు నాలుగు సార్లు స్నానం చేయించడంతో పాటు ప్రత్యేక ఆహారం కూడా ఇచ్చేవారని యజమాని చెప్పాడు. అయితే జనసందోహం ఎక్కువ కావడంతో గేదె ఒత్తిడికి గురై బరువు తగ్గిందని, అందుకే చివర్లో ప్రజల ప్రవేశాన్ని పరిమితం చేశాడట. వైరల్ స్టార్గా మారిన ఆ గేదెకు ఇదే చివరి పండుగ కానుండటం స్థానికంగా భావోద్వేగాన్ని రేకెత్తిస్తోంది.ఇదిలా ఉంటే.. ఈ నెల చివర్లో జరగనున్న ఈద్ అల్ అదా కోసం భారీ సంఖ్యలో పశువులను సిద్ధం అవుతున్నాయి. భారీ సైజులో ఉండడమో లేదంటే ప్రత్యేక లక్షణాల కారణంగా పలు పశువులు సోషల్మీడియాలో వైరల్ అవడం సాధారణమైపోయింది. అయితే ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు కావడం.. సంచలన నిర్ణయాలతో పలు దేశాలను షేక్ చేస్తుండడంతో.. ఈ గేదె తన ప్రత్యేక రూపంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. -
New York: షిప్యార్డ్లో భారీ పేలుడు.. ఒకరు మృతి
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్లో గల ఒక షిప్యార్డ్లో సంభవించిన వరుస పేలుళ్లు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. మంటలను ఆర్పేందుకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బందిపైననే వరుసగా రెండుసార్లు పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోగా, 36 మంది తీవ్రంగా గాయపడ్డారు.మృత్యువు అంచున రెస్క్యూ టీమ్షిప్యార్డ్లోని బేస్మెంట్లో ఇద్దరు కార్మికులు చిక్కుకున్నారనే సమాచారంతో అత్యవసర సేవల సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వారు లోపలికి వెళ్లిన కొద్దిసేపటికే మొదటి పేలుడు సంభవించింది. సహాయక చర్యలు కొనసాగుతుండగా, రెండోసారి జరిగిన శక్తివంతమైన పేలుడుతో అంతా ఉలిక్కిపడ్డారు. ఈ సమయంలో లోపల ఉన్న ఫైర్ మార్షల్, ఒక అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.విషమ పరిస్థితిలో బాధితులురెండో పేలుడు ధాటికి ఫైర్ మార్షల్ తలకు గాయమయ్యింది. అలాగే స్వల్పంగా మెదడులో రక్తస్రావం జరగడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మరో అగ్నిమాపక సిబ్బంది పరిస్థితి మొదట ఆందోళనకరంగా ఉన్నా, ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద తీవ్రత దృష్ట్యా, పరిమిత స్థలాల్లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడం అత్యంత ప్రమాదకరమని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.నియంత్రణలోకి మంటలు - దర్యాప్తు షురూప్రమాదం జరిగిన ప్రాంతాన్ని 200 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది చుట్టుముట్టి మంటలను అదుపులోకి తెచ్చారు. మేయర్ జోహ్రాన్ మమ్దాని మాట్లాడుతూ, ఇది చాలా వేగంగా జరిగిన క్లిష్టమైన అత్యవసర పరిస్థితి అని పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు సమగ్ర విచారణను వెంటనే ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.ఇది కూడా చదవండి: ఇరాన్పై మెరుపు దాడులకు ట్రంప్ కసరత్తు -
ఇరాన్పై మెరుపు దాడులకు ట్రంప్ కసరత్తు
వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్తో జరుగుతున్న శాంతి చర్చల్లో ఎటువంటి పురోగతి లేకపోవడంతో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనంతో ఉన్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇరాన్పై మరో విడత దాడులకు దిగాలని ఆయన ఆలోచిస్తున్నారని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ కీలక పరిణామంపై చర్చించేందుకు ట్రంప్ ఇప్పటికే తన ఉన్నత స్థాయి భద్రతా బృందంతో అత్యవసరంగా సమావేశమయ్యారు.చర్చల విఫలం.. పెరుగుతున్న ఒత్తిడిశాంతి చర్చల కోసం ఇరు దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆశించిన ఫలితాలు రావడం లేదని వాషింగ్టన్ వర్గాలు పేర్కొంటున్నాయి. చర్చలు ‘యాతనాభరితంగా’ సాగుతున్నాయని, ప్రతిరోజూ ముసాయిదాలు మారుతున్నా, ఒప్పందం కుదిరే సంకేతాలు కనిపించడం లేదని తెలుస్తోంది. ఇరాన్ అణు ఆయుధాలను కలిగి ఉండటం అమెరికాకు ఆమోదయోగ్యం కాదని, అవసరమైతే కఠిన చర్యలు తప్పవని ట్రంప్ స్పష్టం చేశారు. ఒప్పందం కుదరని పక్షంలో, యుద్ధాన్ని ముగించేందుకు ఒకే ఒక్క ‘నిర్ణయాత్మక’ భారీ సైనిక ఆపరేషన్ చేపట్టాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.పాకిస్థాన్ మధ్యవర్తిత్వ యత్నాలుమరోవైపు, యుద్ధాన్ని ఆపేందుకు పాకిస్థాన్ సైనిక ప్రధానాధికారి అసిమ్ మునీర్ రంగంలోకి దిగారు. ఆయన టెహ్రాన్లో పర్యటిస్తూ, ఇరాన్ ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఖతార్ ప్రతినిధులు కూడా ఈ శాంతి ప్రయత్నాల్లో భాగస్వాములవుతున్నారు. అయితే, అమెరికా-ఇరాన్ మధ్య విభేదాలు ఇంకా సడలిపోతేదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేస్తోంది. పాకిస్థాన్ ఒక అధికారిక మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఏ మేరకు ఫలితాన్నిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.వాషింగ్టన్లోనే ట్రంప్.. మారుతున్న వ్యూహాలుపరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ట్రంప్ తన వ్యక్తిగత పర్యటనలను కూడా రద్దు చేసుకున్నారు. కుమారుడి వివాహం వంటి కీలక వ్యక్తిగత కార్యక్రమాలను పక్కన పెట్టి, తాను వైట్ హౌస్లోనే ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నానని ఆయన ప్రకటించారు. మంగళవారం నాటి వరకు చర్చల ద్వారానే పరిష్కారం కనుగొనాలనే ధోరణిలో ఉన్న ట్రంప్, గురువారం రాత్రి నాటికి దాడుల వైపు మొగ్గు చూపడం అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. రాబోయే గంటలు అత్యంత కీలకంగా మారనున్నాయి.ఇది కూడా చదవండి: ‘జెన్ జెడ్’ మంత్రం.. ‘హార్ట్ఫుల్నెస్’ ధ్యానం -
ట్రంప్ కీలక నిర్ణయం.. పోలాండ్కు అదనపు బలగాలు
వాషింగ్టన్: పోలాండ్కు అదనంగా 5 వేల బలగాలను పంపించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. యూరప్లో తమ బలగాలను తగ్గిస్తామంటూ ట్రంప్, ఆయన యంత్రాంగం ఇటీవల తరచూ ప్రకటనలు చేస్తుండటం తెల్సిందే. ఇందుకు విరుద్ధంగా పోలాండ్కు అదనంగా బలగాలను తరలిస్తామంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ట్రూత్ సోషల్ వేదికగా తెలిపారు.ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో తాను మద్దతు ప్రకటించిన కరోల్ నవ్రోకీ విజయం సాధించడంతో, ఆయనతో తనకున్న సత్సంబంధాల నేపథ్యంలో అదనంగా 5 వేల సైనికులను అక్కడికి తరలించాలని నిర్ణయించుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్తో యుద్ధంలో నాటో దేశాలు తనతో సహకరించకపోగా, జర్మనీ చాన్సలర్ మెర్జ్ చేసిన వ్యాఖ్యలపై గుర్రుగా ఉన్న ట్రంప్ జర్మనీ నుంచి 5 వేల మంది సైనికులను ఉపసంహరించుకున్నట్లు ఇప్పటికే ప్రకటించడం తెల్సిందే. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ చేసిన ప్రకటనతో నాటో దేశాల నేతలు అయోమయానికి గురవుతున్నారు. -
స్వదేశం నుంచే గ్రీన్కార్డు దరఖాస్తులు
వాషింగ్టన్: విదేశీ పౌరులు అమెరికాలో నివసిస్తూ అమెరికాలో శాశ్వత నివాసిత హోదా లేదా గ్రీన్కార్డు కోసం దరఖాస్తులు చేసుకోవాలంటే స్వదేశానికి తిరిగి వెళ్లక తప్పదు. అమెరికా నుంచే దరఖాస్తు చేసుకోవడం కుదరదు. సొంత దేశం నుంచి చేసుకోవాల్సిందే. ఈ విషయాన్ని యూఎస్ సిటిజెన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసు(యూఎస్సీఐఎస్) తాజాగా వెల్లడించింది. తాత్కాలికంగా అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డ్ కోరుకునే విదేశీయులు అసాధారణ పరిస్థితులు మినహా, దరఖాస్తు చేసుకోవడానికి తప్పనిసరిగా తమ స్వదేశానికి తిరిగి వెళ్లాలని యూఎస్సీఐఎస్ ప్రతినిధి జాక్ కాహ్లర్ ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. విదేశీయులు అమెరికా వలస విధానాన్ని సరిగ్గా పాటించాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. అమెరికా చట్టాల అసలు లక్ష్యం ఇదేనని ఇన్నారు. విదేశీయులు తమ స్వదేశం నుంచే దరఖాస్తు చేసుకుంటే వారికి ఇబ్బందులు తప్పుతాయని తెలిపారు. ఒకవేళ దరఖాస్తు తిరస్కరణకు గురైతే అజ్ఞాతంలోకి జారుకొని అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉండిపోవాలనే అవసరం ఉండదన్నారు. వారిని వెతికి పట్టుకొని, బయటకు పంపే అగత్యం కూడా తొలగిపోతుందని వివరించారు. విద్యార్థులు, తాత్కాలిక కార్మికులు లేదా పర్యాటక వీసాలపై వచ్చిన వారు కాకుండా ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం కొద్దికాలం పాటు అమెరికాకు వచ్చినవారు పని పూర్తయ్యాక కచ్చితంగా తిరిగి వెళ్లిపోయేలా తమ వ్యవస్థను రూపొందించినట్లు యూఎస్సీఐఎస్ తెలియజేసింది. వారి ఆగమనం గ్రీన్ కార్డ్ ప్రక్రియలో మొదటి అడుగుగా ఉండకూడదని అభిప్రాయపడింది. -
సైప్రస్తో సుదృఢ బంధం
న్యూఢిల్లీ: భారత్, సైప్రస్ దేశాల మధ్య బంధం మరింత బలోపేతం కానుంది. ఇరుదేశాలు తమ సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాయి, వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకున్నాయి. రక్షణ సహకారం విషయంలో ఐదేళ్ల రోడ్మ్యాప్ను ఆవిష్కరించాయి. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలైడ్స్ శుక్రవారం ఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా నూతన ఆవిష్కరణలు, టెక్నాలజీ, విద్య, సంస్కృతి తదితర రంగాల్లో సహకారం కోసం ఇరుదేశాలు ఆరు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ఒక సంయుక్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే ఒప్పందం కూడా ఇందులో ఉంది. వలసలపై ఒక సమగ్ర భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని భారత్, సైప్రస్ నిర్ణయించుకున్నాయి. కాలపరీక్షకు నిలిచిన స్నేహబంధం వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, నూతన సాంకేతికతలు, విద్య వంటి రంగాల్లో సంబంధాలతోపాటు ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరప్ ఎకనామిక్ కారిడార్ అమలుపై నరేంద్ర మోదీ, నికోస్ క్రిస్టోడౌలైడ్స్ చర్చించుకున్నారు. ఈ భేటీ అనంతరం మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం సైప్రస్లోని మౌలిక సదుపాయాలు, ఇంధనం, వ్యవసాయ రంగాల్లో భారతీయ కంపెనీలకు వాణిజ్య మూలధనాన్ని అందుబాటులోకి తెచ్చి, కొత్త మార్గాలను తెరుస్తుందని పేర్కొన్నారు. అదే సమయంలో భారతదేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న షిప్పింగ్, సముద్ర పరిశ్రమల్లో పెట్టుబడులను పెంచుతుందని వెల్లడించారు. ‘భారత్, సైప్రస్ స్నేహబంధం ఎన్నోసార్లు కాలపరీక్షలకు నిలిచిందని గుర్తుచేశారు. ఈ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచాలన్న నిర్ణయంతో ఇరుదేశాల బంధానికి కొత్త ఆశయాలను, కొత్త ఊపును ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. అలాగే సైబర్ సెక్యూరిటీ డైలాగ్ను ఏర్పాటు చేసుకోబోతున్నట్లు రెండు దేశాలు ప్రకటించాయి. భారత్–యూరప్ సంబంధాలు మెరుగుపడటాన్ని మోదీ ప్రస్తావించారు. అవి ఒక కొత్త స్వర్ణయుగంలోకి ప్రవేశించాయని అన్నారు. మౌలిక సదుపాయాలు, నౌకా రవాణా వంటి కీలక రంగాల్లో సహకారం కోసం భారత్, సైప్రస్లు ఒక సంయుక్త టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయని నికోస్ క్రిస్టోడౌలైడ్స్ తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళికంగా రాజకీయ అనిశ్చితి నెలకొన్న ఈ తరుణంలో యూరోపియన్ యూనియన్ (ఈయూ), భారత్ మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. -
ఎలాన్ మస్క్ పై చైనా గూఢచర్యం!
బీజింగ్: తమ దేశానికి అధికారిక పర్యటనకు వచ్చిన విశిష్ట అతిథులపై డ్రాగన్ దేశం నిఘా పెట్టిందా? వారి కదలికలు తెలుసుకోవడానికి, రహస్యాలు రాబట్టడానికి సైనికాధికారులను మారువేషాల్లో రంగంలోకి దించిందా? గూఢచర్యం సాగించిందా?.. ఇదంతా నిజమేనని స్వతంత్ర బ్లాగర్ జెన్నిఫర్ జెంగ్ చెబుతున్నారు. విదేశీ ప్రముఖులపై గూఢచర్యం చేయడం చైనాకు కొత్తేమీ కాదని అంటున్నారు. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తన బృందంతో కలిసి చైనాలో పర్యటించారు. ఆయన వెంట ప్రపంచ కుబేరుడు, స్పేస్ఎక్స్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తోపాటు అమెరికా పారిశ్రామికవేత్తలు, టెక్నాలజీ నిపుణులు, జర్నలిస్టులు కూడా ఉన్నారు. ట్రంప్ గౌరవార్థం ఆయన బృందానికి చైనా కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) విందు ఇచ్చింది. ఈ సందర్భంగా ఎలాన్ మస్క్ పక్కన ఎర్రరంగు దుస్తుల్లో ఉన్న ఓ మహిళ చాలాసేపు నిలబడి ఉండడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆమె వెయిటర్గా వ్యవహరించారు. నిజానికి సదరు మహిళ వెయిటర్ కాదని, చైనా మిలటరీ ఆఫీసర్ అని జెన్నిఫర్ జెంగ్ తేల్చిచెప్పారు. ఈ మేరకు రెండు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఒక ఫొటోలో వెయిటర్ దుస్తుల్లో ఉన్న మహిళ మరో ఫొటోలో మిలటరీ యూనిఫామ్లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ దుస్తుల కింద తుపాకీ! విదేశాలపై చైనా ప్రభుత్వం గూఢచర్యం చేస్తోందని, అనేక కుట్రలకు పాల్పడుతోందని జెన్నిఫర్ జెంగ్ గతంలోనూ పలు సందర్భాల్లో ఆరోపణలు గుప్పించారు. 2023లో కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడిని అంతం చేసి పరారయ్యారు. అయితే, హత్య వెనుక చైనా కమ్యూనిస్టు పార్టీ హస్తం ఉన్నట్లు జెన్నిఫర్ జెంగ్ తేల్చిచెప్పారు. నిజ్జర్ను చంపేసి, ఈ నిందను భారత్పైకి నెట్టేశారని తెలిపారు. తద్వారా భారత్కు, పచ్చిమ దేశాలకు మధ్య విభేదాలు సృష్టించడం, దూరం పెంచడమే చైనా అసలు కుతంత్రమని స్పష్టంచేశారు. తాజాగా ఎలాన్ మస్క్ పై నిఘా పెట్టిన సైనికాధికారి పేరు జనరల్ చెంగ్ చెంగ్ అని వెల్లడించారు. ఆమె బెటాలియన్ కమాండర్గా పని చేస్తున్నారని తెలిపారు. చైనా ప్రభుత్వమే ఆమెను మారువేషంలో వెయిటర్గా నియమించిందని పేర్కొన్నారు. ‘‘చెంగ్ చెంగ్ తన ఎర్రటి దుస్తుల కింద తుపాకీ లేదా అలాంటి ఆయుధమేదో దాచి ఉంచిందని నేను భావిస్తున్నాను’’అని సోషల్ మీడియాలో పోస్టులో జెన్నిఫర్ జెంగ్ వివరించారు. అయితే, జెంగ్ ఆరోపణలపై చైనా ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. పాశ్చాత్య దేశాలకు సంబంధించిన లక్ష్యాలపై, ప్రముఖులపై చైనా ప్రభుత్వం రహస్యంగా గూఢచారులను మోహరించిన చరిత్ర ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. కార్పొరేట్ టెక్నాలజీ రంగాల్లోకి, దౌత్య వర్గాల్లోకి చైనా ప్రభుత్వ ఏజెంట్లు మారుపేర్లు, మారువేషాల్లో చొరబడుతున్నారని, రహస్యాలు కాజేసే ప్రయత్నాలు సాగిస్తున్నారని పశ్చిమ దేశాల నిఘా సంస్థలు పదేపదే హెచ్చరిస్తున్నాయి. పచ్చిమ దేశాలు అప్రమత్తంగా వ్యవహరించకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి రావొచ్చని చెబుతున్నాయి. చైనాను సులభంగా నమ్మకూడదని అంటున్నాయి. -
ఇరాన్ను ఒప్పించడానికి పాక్ యత్నాలు ముమ్మరం
ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ యుద్ధాన్ని త్వరగా ముగించడమే లక్ష్యంగా పాకిస్తాన్ తన ప్రయత్నాలు వేగవంతం చేసింది. పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునిర్ శుక్రవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్కు చేరుకున్నారు. అమెరికాతో శాంతి ఒప్పందం దిశగా ఇరాన్ను ఒప్పించడానికి ఆయన నేరుగా రంగంలోకి దిగినట్లు పాక్ సైనిక వర్గాలు వెల్లడించాయి. మధ్యవర్తిత్వ ప్రయత్నాలను ఆయన కొనగిస్తున్నారని తెలిపాయి. టెహ్రాన్ ఎయిర్పోర్టులో అసిమ్ మునిర్కు ఇరాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఎస్కందర్ మొమెనీ స్వాగతం పలికారు. పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహిసిన్ నఖ్వీ బుధవారమే ఇరాన్కు చేరుకున్నారు. అసిమ్ మునిర్ ఇరాన్ ముఖ్య నాయకులతో భేటీ కాబోతున్నారు. అబ్బాస్ అరాగ్చీతో నఖ్వీ భేటీ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చితో పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహిసిన్ నఖ్వీ శుక్రవారం సమావేశమయ్యారు. వారిద్దరూ భేటీ కావడం గత 24 గంటల వ్యవధిలో ఇది రెండోసారి. అమెరికా, ఇరాన్ల మధ్య యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో చేసిన ప్రతిపాదనలను వారు సమీక్షించారు. టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య విభేదాలను తొలగిండమే ధ్యేయంగా నఖ్వీ ఇరాన్లో పర్యటిస్తున్నారు. ఆయన ఇప్పటికే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సహా కీలక నేతలతో సమావేశమయ్యారు. -
ట్రంప్ షాకింగ్ నిర్ణయం.. కొడుకు పెళ్లికి దూరం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వారాంతంలో జరగనున్న తన పెద్ద కుమారుడు ట్రంప్ జూనియర్ వివాహ వేడుకకు తాను హాజరుకావడం లేదని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్తో చర్చలు, ఇతర బాధ్యతల కారణంగా వాషింగ్టన్లోని వైట్ హౌస్లోనే ఉండవలసి వస్తోందని ఆయన తెలిపారు. ట్రంప్ జూనియర్, సోషలిస్ట్ బెట్టీనా అండర్సన్ ల వివాహం బహామాస్ లోని ఒక చిన్న ద్వీపంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో జరగనుంది."నా కొడుకు, కాబోయే కోడలు బెట్టీనా పెళ్లి వేడుకలో పాల్గోనాలని ఎంతో ఆశపడ్డాను. కానీ దేశంపై ప్రేమ, ప్రభుత్వ బాధ్యతల వల్ల వెళ్లలేకపోతున్నాను. ఈ కీలక సమయంలో నేను వాషింగ్టన్ వైట్హౌస్లోనే ఉండటం అవసరం." అని ట్రంప్ పేర్కొన్నారు కాగా ఇరాన్తో నడుస్తున్న యుద్ధాన్ని ముగించడానికి పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ప్రస్తుతం కీలక దౌత్య చర్చలు జరుగుతున్నాయి. ఈ కారణంతో ట్రంప్ తన కుమారుడు పెళ్లికి హాజరు కాలేకపోతున్నారు. ఇక ట్రంప్ జూనియర్కు ఇది మూడో వివాహం. ఆయన మొదటి భార్య మాజీ మోడల్ వెనెస్సాతో 12 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత 2018లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత టీవీ సెలబ్రిటీ కింబర్లీ గిల్ఫాయిల్తో నిశ్చితార్థం జరిగింది, కానీ 2024లో విడిపోయారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి జూనియర్ ట్రంప్ పెళ్లి పీటలెక్కనున్నారు. -
లండన్ డ్రగ్స్ కేసు: భారత సంతతి వ్యక్తికి 10 ఏళ్ల శిక్ష!
లండన్లో భారీ ఎత్తున మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న ఒక అంతర్జాతీయ ముఠా గుట్టును మెట్రోపాలిటన్ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాలోని ఐదుగురు సభ్యులకు కలిపి లండన్లోని కింగ్స్టన్ క్రౌన్ కోర్టు మొత్తం 84 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. శిక్ష పడిన వారిలో బర్మింగ్హామ్కు చెందిన భారత సంతతి వ్యక్తి జగ్జీత్ సింగ్ (30) కూడా ఉన్నాడు. అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ సరఫరా చేయడంలో జగ్జీత్ కీలక పాత్ర పోషించాడు. ఈ కేసులో జగ్జీత్ సింగ్కు 10 సంవత్సరాల 6 నెలల శిక్ష పడింది. జగ్జీత్ గత అక్టోబర్లోనే తన నేరాన్ని అంగీకరించాడు. ఇక మిగిలిన నలుగురు నిందితులకు వారి నేర తీవ్రతను బట్టి 14 నుండి 26 ఏళ్ల వరకు జైలు శిక్షలు పడ్డాయి. కాగా 300 కిలోల కొకైన్, 60 కిలోల హెరాయిన్ సీజన్ చేసినట్లు యూకే మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో విలువ సుమారు 8 మిలియన్ పౌండ్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 84 కోట్లు. వీరు ఐరోపా దేశాల నుండి బ్రిటన్కు డ్రగ్స్ తెచ్చి సరఫరా చేసేవారు. ఈ ముఠా డ్రగ్స్ రవాణా కోసం అత్యంత అధునాతనమైన సాంకేతికతను ఉపయోగించినట్లు ఈ కేసు దర్యాప్తు అధికారి ఒక తెలిపారు. -
ట్రంప్ ప్రభుత్వానికి బిగ్ షాక్!
యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. క్యాన్సర్తో పోరాడుతున్న తన భర్తకు మద్దతుగా నిలిచేందుకు తన పదవికి ఆమె రాజీనామా చేశారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పంపిన రాజీనామా లేఖను తులసి గబ్బార్డ్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. తులసి భర్త అబ్రహం ఇటీవల ఒక అరుదైన బోన్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో జూన్ 30 నుం,ఇ తన రాజీనామా అమలులోకి వస్తుందని ఆమె స్పష్టం చేశారు. "నా భర్త అబ్రహంకు ఇటీవల అత్యంత అరుదైన బోన్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. బోయే రోజుల్లో ఆయన ఎన్నో సవాళ్లను, కఠినమైన చికిత్సలను ఎదుర్కోవాల్సి ఉంది. అందుకే ఆయనకు సపోర్ట్గా ఉండేందుకు నా పదవికి రాజీనామా చేయాల్సి వస్తోంది.ఈ క్లిష్ట సమయంలో నేను ప్రజా సేవకు దూరంగా జరిగి, ఆయన వెన్నంటే ఉంటూ పూర్తి మద్దతు అందించడం నా బాధ్యత. నాపై నమ్మకం ఉంచి 'ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్'కు నాయకత్వం వహించే అవకాశం కల్పించినందుకు ప్రెసిడెంట్ ట్రంప్కు ధన్యవాదాలు" అని తన రాజీనామా లేఖలో గబ్బార్డ్ పేర్కొన్నారు.కాగా గబ్బార్డ్ గైర్హాజరీలో జాతీయ నిఘా సంస్థ తాత్కాలిక సంచాలకుడిగా ఆరోన్ లూకాస్ వ్యవహరిస్తారని ట్రంప్ ప్రకటించారు. కాగా ఆరోన్ లూకాస్ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఇంటెలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నారు. -
ఇరాన్ దాడులకు చెక్.. యూఏఈ సరికొత్త వ్యూహాం
ఇరాన్ వరుస డ్రోన్ దాడుల నేపథ్యంలో తమ చమురు నిల్వ కేంద్రాలను రక్షించుకునేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సరికొత్త రక్షణ వ్యూహాన్ని అమలు చేస్తోంది. యూఈఏ ప్రభుత్వం చమురు నిల్వ కేంద్రాల చుట్టూ డ్రోన్ నిరోధక రక్షణ వ్యవస్థను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.ఇందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరలవుతున్నాయి. భారీ డ్రోన్లు దాడి చేసినా, అవి నేరుగా చమురు ట్యాంకులను తాకకుండా అడ్డుకోవడమే ఈ 'యాంటీ-డ్రోన్' వ్యవస్థ ముఖ్య ఉద్దేశం. మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్తో నడుస్తున్న యుద్దం వాతావారణంలో ఇరాన్.. వ్యూహాత్మకంగా యూఏఈను టార్గెట్ చేస్తూ తమ హెచ్చరికల తీవ్రతను పెంచింది. చమురు కేంద్రాలు, పర్యాటక కేంద్రాలు, చివరికి ఒక అణు రియాక్టర్తో సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రదేశాలలో మరోసారి దాడి చేస్తామని టెహ్రాన్ హెచ్చరిస్తోంది. ఈ క్రమంలోనే తమ చమురు నిల్వ కేంద్రాలను కాపాడుకునేందుకు యూఏఈ పటిష్ట చర్యలను మొదలు పెట్టింది.మరోవైపు తమపై నిఘా పెట్టేందుకు, ఉమ్మడి వ్యూహాలు రచించేందుకు యూఏఈ తన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని అమెరికా, ఇశ్రాయేల్ రక్షణ సంస్థలతో పంచుకుంటోందని ఇరాన్ ఆరోపిస్తోంది. కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్తో కలిసి ఒక భారీ నిధిని ఏర్పాటు చేస్తున్నాయి.ఈ రెండు దేశాలు కలిసి అత్యాధునిక యాంటీ-డ్రోన్ ఆయుధాలను తయారు చేయనున్నట్లు సమాచారం. గత నెలలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు యూఏఈని సందర్శించినప్పుడు ఈ ఒప్పందం జరిగినట్లు తెస్తోంది.చదవండి: స్టార్ ప్లేయర్ దూరం.. కేకేఆర్కు ఎదురుదెబ్బ! -
పాక్లో ‘బొద్దింకల’ తుఫాన్
ఇస్లామాబాద్: భారత్లో వ్యంగ్యంగా ప్రారంభమైన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఇప్పుడు సరిహద్దులు దాటి పాకిస్థాన్లోకి ప్రవేశించింది. అక్కడి యువత కూడా కొత్త కొత్త పేర్లతో అకౌంట్లను క్రియేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.పాకిస్థాన్లో కాక్రోచ్ అవామీ పార్టీ, కాక్రోచ్ అవామీ లీగ్, ముత్తాహిదా కాక్రోచ్ మూవ్మెంట్ వంటి పేర్లతో కొత్త సోషల్ మీడియా అకౌంట్లు వెలుగులోకి వచ్చాయి. ‘సిస్టమ్ మనల్ని కాక్రోచ్లుగా భావించింది. మేమే ప్రజల స్వరం అని అకౌంట్ల బయోలో పేర్కొనడం గమనార్హం.లోగోలు,బ్రాండింగ్పాకిస్థాన్లోని ఈ అకౌంట్ లోగోలు భారతీయ వెర్షన్లను పోలి ఉన్నప్పటికీ అవి పచ్చ,తెలుపు రంగు ఉపయోగిస్తున్నాయి. ఇది స్థానిక రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తమను చూపించడానికి ఒక వ్యూహాత్మక నిర్ణయం. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ పీటీఐ,పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ వంటి ప్రధాన పార్టీలకు వ్యతిరేకంగా యువతను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి.యువతలో ప్రభావంఈ ఉద్యమం ఒక వ్యంగ్య రాజకీయ వేదికగా మారింది. నిరుద్యోగం, రాజకీయ వ్యవస్థపై అసంతృప్తి, యువతలోని ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి ఇది ఒక కొత్త మార్గంగా నిలుస్తోంది. భారత్లో ప్రారంభమైన ఈ వ్యంగ్య ఉద్యమం ఇప్పుడు పాకిస్థాన్ యువత కూడా ఆకర్షితులవుతున్నారు. -
ఆ భారతీయ విలువలను తప్పక నేర్చుకోవాలి..!:
ఎందరో విదేశీయలు భారతగడ్డపై అడుగుపెట్టి ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలను మెచ్చుకుంటూ స్థిరపడ్డారు. మరికొందరు వేషధారణ తోపాటు ఈ జీవనశైలినే అనుసరిస్తూ ఆశ్చర్యపరిచినవారు ఉన్నారు. ఇంకొందరు విదేశీ పేరెంట్స్ తమ పిల్లలను ఇక్కడే పెంచుతామన్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో విదేశీ మహిళ చేరిపోయారు. ఏకంగా తమ దేశీయలు భారత్నుంచి ఈ విలవలు నేర్చుకోవాలంటూ ఓ లిస్ట్ చెప్పారామె. ఏంటా విలువలంటే..ప్రస్తుతం భారతదేశంలో నివసిస్తున్న లిథువేనియా మహిళ మోనికా కుంజేశ్వరి దాసి యూరోపియన్లు నేర్చుకోవాల్సిన ఐదు భారతీయ విలువలు గురించి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో షేర్ చేసుకున్నారు. ఆ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. అందులో మోనికా కుంజేశ్వరి దాసి భారత్లో నివశించిన అనుభవం ఆధారంగా తనకు నచ్చిన ఐదు జీవన విధానాలు గురించి మాట్లాడారు. పాశ్చాత్యులు గ్రామీణ భారతీయ జీవన విధానాన్ని చాలా సాధారణమైనదిగా కొట్టిపారేస్తారు. కానీ భారత్లోని చిన్న చిన్న పట్టణాలు, మారు మూల గ్రామాల్లో ఉన్న విలువలు యూరప్ చాలా వేగంగా కోల్పోతోందని అన్నారామె. తాను చెప్పేది వివాదాస్పదంగా ఉండొచ్చేమో కానీ ఇదే ముమ్మాటికీ నిజం అని అంటున్నారామె. "ఏళ్ల తరబడి భారత్లో నివసించాక తెలుసొచ్చిందేంటంటే పాశ్చాత్య దేశాలు భారతీయ సంస్కృతి నుంచి తెలుసుకోదగ్గ విలువైన విషయాలు చాలానే ఉన్నాయి" అంటూ క్యాప్షన్ జోడించి మరి పోస్ట్లో ఆ విలువల జాబితాను పంచుకున్నారామెయూరోపియన్లు తప్పక నేర్చుకోవాల్సిన ఐదు విషయాలు..ఆతిథ్యం: 'అతిథి దేవో భవ' అనే భారతీయ తత్వాన్ని ప్రముఖంగా నొక్కి చెప్పారు దాసి. దీని అర్థం 'అతిథి దేవుడితో సమానం'. భారతదేశంలో అతిథులను ఆదరించే విధానం మరో స్థాయిలో ఉంటుందని అన్నారామె.కమ్యూనిటీ: యూరప్లో కమ్యూనిటీలు విచ్ఛిన్నమవుతున్నప్పటికీ, భారతీయులు ఇప్పటికీ ఐక్యంగా ఉండే కమ్యూనిటీకి విలువ ఇస్తారని దాసి అన్నారు. "ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. స్నేహితులు ఒకరికొకరు అన్నట్లుగా ఉంటారు. ఇరుగుపొరుగు వారికి ఒకరికొకరు తెలుసు. ఎవరికైనా ఏదైనా అవసరమైతే, సహాయం చేయడానికి సాధారణంగా ఎవరో ఒకరు అందుబాటులో ఉంటారని అన్నారామె.ఆహారం, వంట: ఆహారం విషయానికి వస్తే, భారతదేశంలో ఇప్పటికీ ఇంట్లో వంట చేసుకోవడమే సర్వసాధారణం. కుటుంబం అంతా కలిసి కూర్చుని భోజనం చేసేందుకే ఇష్టపడతారు.పరిశుభ్రత: భారతదేశంలోని ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తారని ఇది అందరికీ ఆమోదయోగ్యమైనది, పైగా చుట్టపక్కల వారిపట్ల గౌరవప్రదంగా వ్యవహరించే తీరుగా మెచ్చుకుందామె.ఆనందం: భారతదేశంలోని ప్రజలు జీవితాన్ని ఆస్వాదించడానికి ప్రత్యేక కారణం ఏదీ అవసరం లేదని ఆ లిథువేనియన్ మహిళ నొక్కి చెప్పారు. ప్రతి చిన్న విషయంలో ఆనందం వెతుక్కోవడంలో ఉన్న ఫీల్ వేని, యూరప్ అది పూర్తిగా మర్చిపోయి.. గంభీరంగా అయిపోయిందని అన్నారు. కాగా, నెటిజన్లు ఆమె పోస్టుని చూసి భారతదేశంలోని సానుకూల అంశాలను అందంగా చెప్పినందుకు ధన్యవాదాలు. మా విలువల పట్ల మీ సూక్ష్మమైన పరీశీలనకు గౌరవాభినందనలు అంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Monika Kunjeswari Dasi (@monika_kunjeswari)(చదవండి: -
ఉద్యోగం పోయినా సంబరమే..!
ఉద్యోగం పోతే చాలామంది కుంగిపోతారు. ఇక పెద్ద కంపెనీలో పని చేసే వాళ్లైతే మరింత ఆందోళన చెందుతారు. కానీ ఓ యువతి మాత్రం తన ఉద్యోగం పోయిందనే వార్త విన్న వెంటనే ఆనందంతో ఎగిరి గంతేసింది. “ హమ్మయ్యా.. నా ప్రాణం మళ్లీ తిరిగొచ్చినట్లు అనిపిస్తోంది” అంటూ చెబుతున్న మాటలు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీశాయి.అమెరికాలోని ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ మెటాలో నాలుగేళ్లుగా పనిచేసిన ఆశా రావల్ అనే యువతి ఇటీవల లేఆఫ్ కారణంగా ఉద్యోగం కోల్పోయింది. సాధారణంగా ఇలాంటి సమయంలో బాధపడాల్సిందిపోయి.. ఆమె మాత్రం సంతోషంతో తన మనసులోని మాట బయటపెట్టింది.పెద్ద జీతం, సౌకర్యాలు, పేరు ప్రతిష్ఠ అన్నీ ఉన్నా.. ప్రతిరోజూ ఒకేలా జరిగే సమావేశాలు, గంటల కొద్దీ కూర్చుని పత్రాలు తయారు చేయడం విసుగు తెప్పించాయి. బయటికి మంచి జీవితం కనిపించినా.. లోపల మాత్రం ఖాళీగా అనిపించేదని తెలిపిందామె. ఒకానొక టైంలో.. మెకానికల్ వర్క్తో లోలోపల తాను చనిపోయినట్లు ఫీలయ్యేదానిని.. ఆ బాధతో కుంగిపోయానని చెప్పుకొచ్చింది. అయితే.. View this post on Instagram A post shared by Asha | Maximalist Fashion (@ashamode_)ఉద్యోగం పోయిన తర్వాత మొదటిసారి ప్రశాంతంగా నిద్రపోయానని కూడా ఆమె చెప్పింది. ఇకపై తనకు నిజంగా ఇష్టమైన.. సృజనాత్మక(క్రియేటివిటీ) పనులు చేయాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించింది. కొత్తగా ప్రారంభమైన ఓ చిన్న సంస్థలో చేరి.. కొత్త ఆలోచనలతో పని చేయబోతున్నానని తెలిపింది.ఆమె మాటలు ఇప్పుడు వేలాది ఉద్యోగుల మనసుల్లో ఉన్న భావాలను బయటపెట్టినట్టయ్యాయి. “ఉద్యోగం పోయినా ఇంత ఆనందపడతారా?” అంటూ చాలామంది ఆశ్చర్యపోతుండగా.. “ఆమె చెప్పిందే నిజం” అంటూ మరికొందరు తమ అనుభవాలను పంచుకుంటున్నారు.“డబ్బు కోసం మనసుకు నచ్చని పని చేస్తూ జీవితం మొత్తం గడపాలా?.. లేదంటే మనసు కోరిన దారిలో నడవాలా?” అనే కోణంలో ఆ చర్చ నడుస్తోంది. -
అమెరికాకు కొత్త టెన్షన్.. ఇరాన్పై కీలక ఇంటెలిజెన్స్ నివేదిక
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడితో తీవ్ర ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. యుద్ధం కోసం అధునాతన టెక్నాలజీ ఉన్న బాంబు, క్షిపణులు, డ్రోన్లను ఉపయోగించారు. దీంతో, ఇరువైపులా భారీ నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఇరాన్ క్షీణించిన తన సైనిక సామర్థ్యాలను అంచనా వేసిన దాని కంటే చాలా వేగంగా పునర్నిర్మించుకుంటోంది. దీనికి సంబంధించిన ఓ నివేదిక ఇప్పుడు అమెరికాను టెన్షన్ పెడుతోంది.అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం.. ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని అంచనా వేసిన దాని కంటే వేగంగా నిర్మించుకుంటోంది. ప్రస్తుతం ఇరాన్ డ్రోన్ సామర్థ్యాలలో 50 శాతం ఇంకా మిగిలి ఉన్నాయి. యుద్ధ సమయంలో కోల్పోయిన ఆయుధాలను ఇరాన్ చాలా వేగంగా పునర్నిర్మించుకుంటోంది. నెల రోజుల క్రితం పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఏప్రిల్ 8న ఇరాన్ తన డ్రోన్ల ఉత్పత్తిని కూడా పునఃప్రారంభించింది. అయితే, అమెరికాతో కొనసాగుతున్న ఈ సంఘర్షణలో డ్రోన్లే ఇరాన్ యొక్క ప్రధాన ఆయుధం.యుద్ధం సంఘర్షణలో దెబ్బతిన్న క్షిపణి స్థానాలు, ప్రయోగ పరికరాలు, మరియు కీలక ఆయుధ వ్యవస్థల ఉత్పత్తి శ్రేణులను మరమ్మత్తు చేయడం, వాటి స్థానంలో కొత్త వాటిని ఇరాన్ ఏర్పాటుచేస్తోంది. ఇందులో భాగంగా ఇరాన్ కోల్పోయిన సైనిక బలాన్ని పునరుద్ధరించుకుంటోందని నివేదిక పేర్కొంది. దీని అర్థం, ఒకవేళ యుద్ధం తిరిగి ప్రారంభమైతే ఇరాన్ ప్రాంతీయ మిత్రదేశాలకు మరోసారి ముప్పుగా మారగలదు. ఇరాన్ క్షిపణులు మరియు డ్రోన్ల దాడి పరిధిలోనే ఇజ్రాయెల్ మరియు గల్ఫ్ దేశాలు ఉన్నాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ యొక్క క్షిపణి ఉత్పత్తి సామర్థ్యం తీవ్రంగా క్షీణించడంతో, టెహ్రాన్ ప్రత్యామ్నాయంగా డ్రోన్ యుద్ధం వైపు ఎక్కువగా మొగ్గు చూపవచ్చు. ఈ ముప్పును ప్రాంతీయ మిత్రదేశాలు ప్రత్యేక ఆందోళనతో చూస్తున్నాయి.గతేడాది ఇజ్రాయెల్తో చేసిన 12 రోజుల యుద్ధం కంటే ప్రస్తుతం జరుగుతోన్న యుద్ధంలోనే గల్ఫ్ ప్రాంతంపై ఇరాన్ ఎక్కువగా క్షిపణులను ప్రయోగించింది. సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ విడుదల చేసిన గణాంకాల్లో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 4 మధ్య గల్ఫ్ దేశాలపైకి ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల సంఖ్య 550 దాటినట్లు తెలిసింది. తమపై జరిగిన క్షిపణి దాడులను, డ్రోన్ దాడులను ఒమన్ వెల్లడించలేదు. ఇదే సమయంలో వాషింగ్టన్, ఇజ్రాయెల్లు ఇరాన్పై వేలాది బాంబులను వేశాయి.ఇరాన్ దగ్గర ఉన్న అత్యంత కీలకమైన ఆయుధాలు బాలిస్టిక్ క్షిపణులు. ఇవి ఎక్కువ ఎత్తుకు చేరుకుని, అక్కడ నుంచి లక్ష్యాలను వెంబడించగలవు. శత్రువుకు తీవ్ర నష్టాన్ని కలిగించడానికి అత్యంత శక్తిమంతమైన ఆయుధంగా ఈ బాలిస్టిక్ క్షిపణులను తెహ్రాన్ పరిగణిస్తోంది. తమ వైమానిక దళానికి ప్రత్యామ్నాయంగా దీన్ని చూస్తోంది. క్రూయిజ్, హైపర్సోనిక్ క్షిపణులు తక్కువ ఎత్తులో వెళ్తాయి. తమ లక్ష్యాలను చేరుకునేందుకు వీటికి ఎయిర్ పవర్ ఇంజిన్లు (జెట్ లేదా ప్రొపెల్లర్) సాయం అవసరం.ఫౌండేషన్ ఫర్ ది డిఫెన్స్ ఆఫ్ డెమొక్రసీస్ ప్రకారం..ఇరాన్ వద్దనున్న స్వల్ప శ్రేణి క్షిపణుల రేంజ్ 300 కిలోమీటర్ల నుంచి వెయ్యి కిలోమీటర్లు.ఈ క్షిపణులు గల్ఫ్ దేశాలు సహా పలు ఇతర సరిహద్దు దేశాలపై ప్రయోగించగలిగే సామర్థ్యంతో ఉన్నాయి.మధ్యస్థ శ్రేణి క్షిపణులు వెయ్యి కిలోమీటర్ల నుంచి రెండు వేల కిలోమీటర్ల వరకు ప్రయోగించదగినవి. ఇవి ఇజ్రాయెల్ వరకు చేరుకోగలవు.డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పేర్కొన్న వివరాల ప్రకారం ఇరాన్ వద్దనున్న 8 బాలిస్టిక్ క్షిపణుల రేంజ్..షహాబ్ 1... 300 కిలోమీటర్లుఫతే 110... 300 నుంచి 500 కిలోమీటర్లుషహాబ్ 2... 500 కిలోమీటర్లుజుల్ఫిఖార్... 700 కిలోమీటర్లుఖియామ్ 1... 750 కిలోమీటర్లుషహాబ్ 3... 2000 కిలోమీటర్లుమరోవైపు.. అమెరికా-ఇజ్రాయెల్ దాడులు దీర్ఘకాలంలో ఇరాన్ సైన్యాన్ని ఎంతగా దెబ్బతీశాయనే విషయాన్ని కూడా అమెరికా నిఘా వర్గాల అంచనాలు వేస్తున్నాయి. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం.. క్షిపణుల తయారీకి ఉపయోగించే విడిభాగాలను చైనా ఇరాన్కు సహాయం చేస్తోంది. అయితే అమెరికా దిగ్బంధనం కారణంగా ఆ సహాయం పరిమితం చేయబడింది. అలాగే, రష్యా నుంచి కూడా ఇరాన్ సాయం అందుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇదిలా ఉండగా.. ఇరాన్తో యుద్ధంలో ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచే క్రమంలో అమెరికా భారీగా తన క్షిపణి నిల్వలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు దాని అమ్ములపొదిలోని సగం ఎయిర్డిఫెన్స్ క్షిపణులు ఖాళీ అయినట్లు సమాచారం. ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయి. యుద్ధ సమయంలో ఇరాన్పై అమెరికా 200కు పైగా థాడ్ క్షిపణులను ప్రయోగించింది. వీటితో పాటు మధ్యధరా సముద్రంలో మోహరించిన యుద్ధనౌకల నుంచి 100కు పైగా స్టాండర్డ్ మిసైల్-3, స్టాండర్డ్ మిసైల్-6లను వినియోగించింది. దీంతో పెంటగాన్ వద్ద ఉన్న ఇంటర్సెప్టర్ నిల్వలు సగానికి పడిపోయాయి.అమెరికా వద్ద ఇంకా సుమారు 200 థాడ్ ఇంటర్సెప్టర్లు మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా ఇంత భారీస్థాయిలో క్షిపణులు వినియోగించడంపై రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇది అమెరికా- ఇజ్రాయెల్ సైనిక సమన్వయలోపాన్ని ఎత్తిచూపుతోందన్నారు. ఇక, యుద్ధంలో ఇజ్రాయెల్ 100 కంటే తక్కువ యారో ఇంటర్సెప్టర్లు, 90 డేవిడ్ స్లింగ్లను వాడింది. వీటిలో కొన్ని ఇరాన్కు మద్దతుగా ఉన్న యెమెన్, లెబనాన్ల నుంచి వచ్చే క్షిపణులను అడ్డుకోవడానికి వినియోగించింది. మొత్తం మీద ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడం అమెరికాకు కొత్త టెన్షన్ను తెచ్చిపెట్టింది. -
అమెరికా దెబ్బలన్నీ చూసేశాం.. ఇక ఆట మాదే!
ఒకప్పుడు ప్రపంచ దేశాలన్నీ అమెరికా వైపు చూసేవి.. ఇప్పుడు మాత్రం మెల్లగా తమవైపు తిరుగుతున్నాయని చైనా నమ్ముతోంది. అమెరికా వేసిన ఆర్థిక దెబ్బలు, సాంకేతిక ఆంక్షలు, ఒత్తిడులన్నింటినీ తట్టుకుని మరింత బలపడిపోయామని బీజింగ్ భావిస్తోంది. అంతేకాదు.. “ఇప్పటి నుంచి ఆటను నడిపేది మేమే” అనే సంకేతాలు కూడా పంపిస్తోంది. ట్రంప్ పర్యటన తర్వాత మారిన చైనా వైఖరి ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది.రాజకీయ విశ్లేషకుడు ఆర్నాడ్ బెర్ట్రాండ్ వెల్లడించిన వివరాలు.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. చైనా ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేసే ఒక పరిశోధనా సంస్థ తయారుచేసిన నివేదిక ఆధారంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. “అమెరికా-చైనా సహజీవనం దిశగా ప్రపంచంలో జరుగుతున్న మహా మార్పు” అనే అంశంపై రూపొందిన ఈ నివేదికలో.. ప్రపంచ రాజకీయాల్లో జరుగుతున్న భారీ మార్పులను చైనా ఎలా చూస్తోందో వివరించారు.ఈ నివేదిక ప్రకారం.. చైనా ఇప్పుడు అమెరికాను “అడ్డుకోలేని మహాశక్తి”గా చూడటం లేదట. గత కొన్నేళ్లుగా అమెరికా చేసిన ఆర్థిక ఒత్తిడులు, దిగుమతి సుంకాలు, సాంకేతిక ఆంక్షలు, ప్రపంచ దేశాలను చైనా నుంచి దూరం పెట్టే ప్రయత్నాలు.. ఇవన్నీ జరిగినా కూడా చైనా ఎదుగుదలేం ఆగలేదని బీజింగ్ బలంగా భావిస్తోంది. అందుకే “అమెరికా తన బలమైన దెబ్బ ఇప్పటికే కొట్టేసింది.. ఇక చైనాను పూర్తిగా ఆపడం సాధ్యం కాదు” అనే నమ్మకం అక్కడ బలపడిందని చెబుతున్నారు.ఈ ఆలోచనకు చైనా మాజీ కమ్యూనిస్టు నాయకుడు మావో జెడాంగ్ చెప్పిన “దీర్ఘకాల పోరాట సిద్ధాంతం”ను ఉదాహరణగా చూపిస్తున్నారు. ఈ సిద్ధాంతం ప్రకారం.. మొదట బలహీనంగా ఉన్న దేశం శక్తివంతమైన దేశం ఒత్తిడిని తట్టుకుంటుంది. తర్వాత మెల్లగా ఆర్థికంగా, సాంకేతికంగా, వ్యూహాత్మకంగా బలపడుతూ చివరకు ప్రత్యర్థిని మించిపోతుంది. ప్రస్తుతం చైనా అదే దశలో ఉందని ఆ నివేదిక చెబుతోంది.బలప్రయోగం కాదు, కానీ..ప్రపంచ తయారీ రంగం, ఎలక్ట్రానిక్స్, కృత్రిమ మేధస్సు, పర్యావరణ హిత ఇంధన సాంకేతికత, బ్యాటరీ తయారీ వంటి రంగాల్లో చైనా వేగంగా ఆధిపత్యం పెంచుకుంటోందని నివేదిక పేర్కొంది. అంటే కేవలం డబ్బు పరంగా మాత్రమే కాదు.. భవిష్యత్తు ప్రపంచాన్ని నడిపించే రంగాల్లో కూడా చైనా ముందుకు దూసుకెళ్తోందన్న మాట. ఇంకో కీలక అంశం ఏమిటంటే.. ప్రపంచ క్రమం కూడా మారుతోందని చైనా భావిస్తోంది. ఒకప్పుడు అమెరికా చుట్టూ తిరిగిన ప్రపంచం.. ఇప్పుడు అనేక శక్తి కేంద్రాలుగా విడిపోతుందని, అందులో తామే ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్నామని బీజింగ్ అంచనా వేస్తోంది. అయితే ఈ మార్పు యుద్ధాల ద్వారా కాదని.. ఆర్థిక బలం, పరిశ్రమల శక్తి, సాంకేతిక ఆధిపత్యం, ప్రపంచ వాణిజ్య సంబంధాల ద్వారా వస్తోందని నివేదిక చెబుతోంది. అంటే చైనా ప్రపంచాన్ని బలవంతంగా జయించాలని కాదు.. ప్రపంచ దేశాలు స్వయంగా చైనాపై ఆధారపడే పరిస్థితి వస్తోందని భావిస్తోందన్నమాట.ఇప్పటివరకు చైనా వ్యూహాత్మక పత్రాల్లో కనిపించిన “అమెరికా భయం” ఈసారి కనిపించలేదని బెర్ట్రాండ్ వ్యాఖ్యానించారు. గతంలో అమెరికాను పెద్ద ముప్పుగా చిత్రీకరించిన చైనా.. ఇప్పుడు మాత్రం దాన్ని మేనేజ్ చేయగలిగే అంశంగా మాత్రమే చూస్తోందట. అంటే అమెరికా ఇబ్బందులు కలిగించగలదు కానీ.. చైనా ఎదుగుదలను పూర్తిగా అడ్డుకోలేదనే నమ్మకం అక్కడ పెరిగిపోయిందన్నమాట.తగ్గేదే లే!అయితే చైనా నేరుగా యుద్ధ దారిలో వెళ్లాలని అనుకోవడం లేదని కూడా ఈ నివేదిక చెబుతోంది. అమెరికాతో పరస్పర గౌరవం, సహజీవనం అవసరమని సూచించింది. రెండు దేశాల మధ్య నేరుగా ఘర్షణలు జరగకుండా సంభాషణలు కొనసాగించాలని, కృత్రిమ మేధస్సు నియంత్రణ, వాతావరణ మార్పులు, మాదక ద్రవ్యాల నియంత్రణ వంటి అంశాల్లో కలిసి పనిచేయాలని సూచించింది. అదేసమయంలో తైవాన్ విషయంలో మాత్రం చైనా తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. తైవాన్ చివరకు చైనాతో కలవాల్సిందేనని, అమెరికా అక్కడ వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తే ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని హెచ్చరించింది. ఈ క్రమంలోనే ట్రంప్ ‘తైవాన్ సుదూర’ వ్యాఖ్య చేసి ఉంటాడనే విశ్లేషణ నడుస్తోంది. మొత్తంగా ఈ నివేదిక ద్వారా.. ప్రపంచ భవిష్యత్తు నాయకత్వం తమదేనని చైనా ఇప్పుడు గట్టిగా నమ్ముతోందని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా ప్రభావం మెల్లగా తగ్గిపోతుందని.. తమ ప్రభావం పెరుగుతుందని బీజింగ్ భావిస్తోంది. అయితే అది యుద్ధాలతో కాదు.. ఆర్థిక బలం, సాంకేతిక ఆధిపత్యం, ప్రపంచ దేశాలు చైనాపై ఆధారపడడం పెరుగుతున్న నేపథ్యాలతో సాధ్యమవుతుందని చైనా అంచనా వేస్తోంది. -
నా కుమారుడి పెళ్లికి వెళితే చంపేస్తారు?.. ట్రంప్
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చమత్కారం చేశారు. ఇరాన్తో తనకు ప్రాణహాని ఉందని తను బయిటకే వెళితే చంపేసే అవకాశం ఉందన్నారు. అందువలనే తన కుమారుడి వివాహానికి హాజరుకానని తెలిపారు. అయితే ఒకవేళ తను హాజరైనా కాకపోయిన తప్పుడు వార్తలతో తనకు మరణ తథ్యమని మీడియాకు చురకలంటించారు. ట్రంప్ వ్యవహారశైలి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడుతారో ఆయనకే తెలియదు. అందుకే ట్రంప్ మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఇరాన్తో యుద్ధం నేపథ్యంలో తాను ఏ వేడుకలకు వెళ్లలేనని ఒకవేళ వెళితే తనను చంపేస్తారన్నారు.ఓవల్లోని తన కార్యాలయంలో మాట్లాడుతూ.. "నేను వెళ్లాలని అనుకుంటున్నాను. అయితే నేను వెళ్లడానికి ఇది సరైన సమయం కాదు. ప్రస్తుతం నాకు ఇరాన్ అనే ఒక వ్యవహారం ఉంది. ఒక వేళ నేను వెళ్లినా చంపుతారు. వెళ్లకపోయినా చంపుతారు. అయితే అది తప్పుడు వార్తల వల్ల" అని చమత్కరిస్తూ మాట్లాడారు. తాను పెళ్లికి హాజరైనా, కాకపోయినా మీడియా నుంచి ఎదురయ్యే విమర్శల గురించి ప్రస్తావిస్తూ ఆ విషయంలో నేను గెలవలేను అని ఆయన అన్నారు.అయితే ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ వివాహం ఈ వారాంతంలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ప్రైవేట్ వేడుకలో పామ్ బీచ్ సోషలైట్ మోడల్.. బెట్టినా అండర్సన్ను వివాహం చేసుకోబోతున్నారని సమాచారం. అయితే ఈ వేడుకకు అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వనించారని తెలుస్తోంది. అంతర్జాతీయ పరిణామాలు, అధ్యక్షుడి పర్యటనకు సంబంధించిన భద్రతాపరమైన ఆందోళనల కారణంగా తన హాజరు అనిశ్చితంగా ఉందని ట్రంప్ సూచించారు. -
"తీసుకుంటాం, తుడిచేస్తాం"
వాషింగ్టన్ డీసీ: ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య శాంతియుత వాతావరణం నెలకొంది. ఇరుదేశాలు కాల్పుల విరమణ ప్రకటించడంతో ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణిగాయి. పరిస్థితులు కొద్దిగా కుదుట పడుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇరాన్ వద్ద భారీగా శుద్ధిచేసిన యురేనియం నిల్వలున్నాయని వాటిని ఎట్టి పరిస్థితుల్లో స్వాధీనం చేసుకొని తీరుతామన్నారు.ఇరాన్పై అమెరికా దాడులు ప్రారంభించడానికి ప్రధాన కారణం టెహ్రాన్ అణుబాంబు తయారు చేస్తోందనే ఆరోపణ. ఆ దేశానికి గనుక అణ్వాయుధాలు అందితే అది అత్యంత ప్రమాదమని అమెరికా దాడులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్కు చెందిన అణ్వాయుధ తయారీ కేంద్రాలపై అమెరికా పలుమార్లు దాడులు చేసింది. కాగా ట్రంప్ తాజాగా మరోసారి అణుబాంబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఎట్టిపరిస్థితుల్లో అమెరికా స్వాధీనం చేసుకొని తీరుతుందని ప్రకటించారు.ట్రంప్ మాట్లాడుతూ.. "మాకు అది అవసరం లేదు. కానీ మేము అది పొందుతాం. మాకు అది కావాలి. దానిని మేము పొందిన తర్వాత పూర్తిగా వినాశనం చేస్తాం. కానీ ప్రస్తుతం అది మాకు కావాలి" అని ట్రంప్ అన్నారు.ఇరాన్లోని యురేనియం నిల్వలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇరాన్ వద్ద దాదాపు 900 పౌండ్ల శుద్ధి చేసిన యురేనియం ఉందని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా గతేడాది జరిపిన దాడుల్లో ఆ నిల్వలు పూర్తిగా ధ్వంసమయ్యాయని ట్రంప్ వాదిస్తున్నారు.మోజ్తాబా కీలక ప్రకటనఅయితే ట్రంప్ ప్రకటనల నేపథ్యంలో ఇరాన్ సైతం కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. ఇరాన్లోని యురేనియం నిల్వలను ఎట్టి పరిస్థితుల్లో వేరే దేశాలకు ఎగుమతి చేయకూడదని ఆదేశాలిచ్చినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఇరాన్ అణుబాంబు తయారు చేస్తోందా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. -
పాక్ ప్రధాని చైనా పర్యటన.. మతలబు ఏంటి?
బీజింగ్: పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు చైనాలో పర్యటించనున్నారు. ఈ సమయంలో ఆయన బీజింగ్లో అధ్యక్షుడు జిన్ పింగ్, ప్రధానమంత్రి లి క్వియాంగ్తో భేటీ అవుతారు. చైనా విదేశాంగ శాఖ గురువారం ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే, మొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా వెళ్లిన కొద్ది రోజులకే పాక్ ప్రధాని అక్కడి వెళ్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, లి క్వియాంగ్ ఆహ్వానం మేరకు షెహబాజ్ ఈ పర్యటన చేపడుతున్నారని తెలిపింది. ఉమ్మడి ప్రయోజనాలు, ప్రాంతీయ శాంతి సుస్థిరతల సాధన, అభివృద్ధికోసం రెండు దేశాలు కీలకమైన అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై సన్నిహితంగా, సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని పేర్కొంది. అలాగే, 75 ఏళ్ల ద్వైపాక్షిక సంబంధాల సందర్భంగా ఆర్థిక, రాజకీయ, భద్రతా అంశాలపై చర్చలు జరుపనున్నారు.పర్యటన ప్రాముఖ్యతఆర్థిక సహకారం: చైనా పెట్టుబడులు పాకిస్తాన్లో విద్యుత్ లోటు తగ్గించడంలో కీలక పాత్ర పోషించాయి.రాజకీయ సంకేతం: బహుళ పార్టీ పార్లమెంటరీ ప్రతినిధి బృందం కూడా పాల్గొనడం, పాకిస్తాన్లో విస్తృత రాజకీయ మద్దతు ఉందని సూచిస్తుంది.ప్రాంతీయ భద్రత: రెండు దేశాలు ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, అభివృద్ధి కోసం సమన్వయం కొనసాగిస్తున్నాయి.CPEC ప్రాజెక్టుల ప్రభావం: China–Pakistan Economic Corridor (CPEC) పాకిస్తాన్లో ఆర్థిక, మౌలిక సదుపాయ, సామాజిక రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చింది. ఇది చైనా నిర్మిస్తున్న Belt and Road Initiative (BRI)లో అత్యంత కీలక భాగం.మౌలిక సదుపాయాల అభివృద్ధి: రహదారులు, రైల్వేలు, పోర్టులు (గ్వాదర్ పోర్ట్) నిర్మాణం ద్వారా పాకిస్తాన్లో రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి. -
ఆకలి తీర్చే అమ్మమ్మ!
పొద్దున్నే సూర్యుడి ఉదయించినట్టు.. ఆవిడ ఉదయాలు ప్రతిరోజూ ఓ పేద్ద కాఫీ కప్పుతో మొదలవుతాయి. ఆమె చిన్న గుడారం బయట పుష్పగుచ్ఛాలతో అలంకరించిన ఓ సాదాసీదా బల్ల..నిశ్శబ్ద వాతావరణం..ఓ కప్పు కాఫీ అంతే..! కాఫీ ఆస్వాదించడం ముగిసిన వెంటనే అలికిడి మొదలవుతుంది. ఆమె పొందికగా ఏర్పాటు చేసిన ఓ చిన్న బేకరీ ముందు అప్పటికే జనాలు తమ వంతు రొట్టెముక్క కోసం వరుసగా నిల్చుని ఎదురు చూస్తుంటారు. అదిగో ఆ క్షణంలోనే ఈ అమ్మ్మ తన పని మొదలుపెడుతుంది.. తలా ఓ రొట్టె ముక్కతో ఆకలి తీరుస్తుంది. అంతా ఉచితంగానే..అందరికీ ఆమే అన్నపూర్ణ! బీరూట్: అది లెబనాన్ రాజధాని బీరూట్లో మధ్యధరా సముద్రానికి, సంపన్నులుండే డౌన్టౌన్ ప్రాంతం. కిక్కిరిసి ఉన్న ఓ టెంట్లో చిన్న టేబుల్ వద్ద ఓ పెద్దావిడ కూర్చుని వచ్చిన వారికి బ్రెడ్, టీ అందిస్తున్నారు. టెంట్ వెలుపల చాంతాండంత క్యూలు. ఉదయం మొదలైన బ్రెడ్, టీ పంపిణీ అర్ధరాత్రి వరకు ఆగకుండా కొనసాగుతూనే ఉంటుంది. అదీ ఊచితంగా. ఆవిడ 63 ఏళ్ల సౌభియె జైటర్. హెజ్బొల్లా సాయుధ గ్రూపు లక్ష్యంగా లెబనాన్పై ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడులతో నిరాశ్రయులైన 10 లక్షల మందిలో జైటర్ ఒకరు. ఇజ్రాయెల్ ఆర్మీ హెచ్చరికలతో రాజధాని బీరూట్ శివారు ప్రాంతంలో ఉండే జైటర్ తన కుటుంబంలోని 15 మంది సభ్యులతో కలిసి నగరం మధ్యలోకి మకాం మార్చారు. వాళ్లంతా ఇప్పుడు ఓ టెంట్లో గడుపుతున్నారు. శరణార్థి శిబిరానికి వచ్చిన కొత్తలో జైటర్ సమీపంలో నిర్వహించే ఆహార పంపిణీ కేంద్రానికి వెళ్లారు. అక్కడ గంటల తరబడి క్యూలో నిల్చున్నా తినేందుకు ఏదైనా అందుతుందో లేదో తెలియదని పరిస్థితి ఉండేది. దీంతో, ఆమె సాయం కోసం ఎదురుచూడరాదని నిర్ణయించుకున్నారు. తన కుటుంబంతో పాటు అవసరమైన వారి కోసం తానే స్వయంగా ఆహారం తయారు చేసేందుకు నడుం బిగించారు. వెంట తెచ్చుకున్న గుండ్రటి ఇనుప పెనంపై రోజుకు సుమారు 200 మనాఇష్ రొట్టెలను కాల్చి, ఉచితంగా పంపిణీ చేయడం మొదలుపెట్టారు. విషయం తెలియడంతో గూడు కోల్పోయిన చాలా మంది రోజూ ఉదయాన్నే అక్కడకు రావడం ప్రారంభించారు. త్వరలోనే, ఆ క్యూలు ఆమె ఒక్కతే నిర్వహించలేనంతగా పెరిగిపోయాయి. ఇప్పుడు, ఆ శరణార్థి శిబిరంలోని ఆమె చిన్న మూల ఒక బేకరీగా మారిపోయింది. కొందరు సాయం చేస్తామంటూ వలంటీర్లుగా ముందుకు వచ్చారు. ఆమె చేస్తున్న మంచి పని గురించి విన్న కొందరు ఒక పెద్ద గ్యాస్ ఆధారిత ఓవెన్ను విరాళంగా ఇచ్చారు. అది తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు ఆగకుండా పని చేస్తూనే ఉంటుంది. రొట్టెల తయారీకి సైతం యంత్రాన్ని సమకూర్చుకున్నారు. ఓవెన్ నుంచి వేడివేడి రొట్టెలు బయటకు రాగానే వలంటీర్లు వాటిని అంతే వేగంగా ప్యాక్ చేస్తున్నారు. ‘మేం డిమాండ్ను అందుకోలేక పోతున్నాం. రోజుకు 3 వేల నుంచి 3,500 వరకు మనాఇష్ లను తయారు చేస్తున్నాం. అయినప్పటికీ అన్నార్తులు ఇంకా వస్తూనే ఉన్నారు’అని తెలిపారు జైటర్. టెంట్ నుంచి సామాజిక ఉద్యమం నిరాశ్రయులైన పిల్లల కోసం కేవలం జైటర్ వంటతో ప్రారంభమైన ఈ ప్రయాణం.. ఇప్పుడు దాదాపు పూర్తిగా విరాళాల ద్వారా నడిచే ఒక సామూహిక సామాజిక ఉద్యమంగా మారింది. ఆమె అక్కడ ఇప్పుడొక హీరో అయిపోయారు. ఇటీవల బీరూట్ గవర్నర్ సైతం ఆమెతో కలిసి కాఫీ తాగడానికి అక్కడికి రావడం విశేషం. ‘నా తోటి ప్రజలు గ్యాస్ సిలిండర్లను విరాళంగా ఇవ్వడం ప్రారంభించారు. కొందరు పిండి, మసాలా దినుసులు ఇస్తున్నారు. ఇంకొందరు నూనె, చీజ్, మాంసం, ఈస్ట్ తీసుకువస్తున్నారు. ఈ బేకరీకి ఏది అవసరమో అది అందజేస్తున్నారు’అని జైటర్ వివరించారు. ‘ఇక్కడ ప్రతి ఒక్కటీ ఉచితమే. డబ్బు సంపాదన కోసం ప్రయత్నించే అవసరం నాకు లేదు’అంటున్నారు. యుద్ధం కారణంగా ఇల్లు వదిలి వచ్చి నెలలు గడుస్తున్నా సౌభియే జైటర్ దినచర్య ఇప్పటికీ ఏమాత్రం మారలేదు. ఉదయాన్నే బీరూట్లోని తన టెంట్ వెలుపల పూలతో అలంకరించిన ఒక చిన్న టేబుల్ పక్కన కూర్చుని కనిపిస్తారు. అటుగా వచ్చిన వారిని టీ తాగి వెళ్లండంటూ నవ్వుతూ ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు అక్కడి వారందరికీ ఆమె ఓమ్ మహమ్మద్ అంటే మహమ్మద్ తల్లి అని అర్థం వచ్చే అమ్మమ్మ అన్నమాట. టెంట్ కాదు.. సొంతూరు జైటర్ దృష్టిలో, ఈ బేకరీ కేవలం ఆకలి తీర్చే టెంట్ మాత్రమే కాదు. ఇక్కడుండే వారు సర్వస్వం కోల్పోయామని బాధ పడకుండా తమ సొంతూరి వాతావరణాన్ని తలపించేలా ఉండాలని ఆమె కోరుకుంటున్నారు ’మేమంతా నిరాశ్రయులమయ్యాం. ఇల్లు పోయినంత మాత్రాన, నిరాశ్రయురాలినైనంత మాత్రాన మనోధైర్యాన్ని కోల్పోవాలని అనుకోవడం లేదు’ అని ఆమె అన్నారు. ఆమె చేస్తున్న ఈ ప్రయత్నం ఎంత విజయవంతమైనప్పటికీ ఆకాశంలో నిరంతరం తిరిగే డ్రోన్ల శబ్దాలు, దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్న వైమానిక దాడుల వార్తలు తమ జీవితాలు ఎంతగా మారిపోయాయో నిరంతరం గుర్తు చేస్తూనే ఉంటాయి. అయినప్పటికీ, తను గతంలో ఉన్న మంచి రోజుల్లో చేసిన పనులనే ఇప్పుడూ చేయడానికి ఆమె ప్రయతి్నస్తున్నారు. తన మనవడు, మనవరాళ్లతో ఆడుకుంటూ, బెల్లా అనే తన చిన్న తెల్లటి పెంపుడు కుక్కతో కాలక్షేపం చేస్తున్నారు. -
ఇరాన్ విషయంలో ఏం చేద్దాం?
వాషింగ్టన్: ఇరాన్పై యుద్ధం విషయంలో ఏం చేయాలో తెలియక అమెరికా, ఇజ్రాయెల్ తలపట్టుకుంటున్నాయి. యుద్ధాన్ని ముగించాలా? లేక కొనసాగించాలా? అనేది ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. ఇరాన్ లొంగిపోయే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు మంగళవారం ఫోన్లో చాలాసేపు మాట్లాడుకున్నట్లు తెలిసింది. ఇరాన్ విషయంలో భవిష్యత్తు కార్యాచరణపై వారు విస్తృతంగా చర్చించుకున్నట్లు సమాచారం. మరోవైపు అమెరికా మాత్రం ఇరాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికే ప్రాధాన్యం ఇస్తోంది. దాడులు పునఃప్రారంభించే ఆలోచన లేదని సంకేతాలిస్తోంది. కానీ, మళ్లీ దాడులు చేయాల్సిందేనని నెతన్యాహు పట్టుబడుతున్నారు. ఇరాన్ సైనిక సామర్థ్యాలను మరింతగా దెబ్బతీయడానికి, కీలక మౌలిక సదుపాయాలను నాశనం చేయడం ద్వారా ఆ దేశ పాలనా వ్యవస్థను దెబ్బకొట్టడానికి దాడులు పునఃప్రారంభించాలని అంటున్నారు. ఇరాన్పై తలపెట్టిన దాడులను ఖతార్, యూఏఈ సహా అరబ్ దేశాల అభ్యర్థన మేరకు వాయిదా చేసినట్లు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు పశ్చిమాసియాలో శాంతి సాధన కోసం పాకిస్తాన్, ఖతార్లు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. అమెరికా, ఇరాన్ల మధ్య అంతరాలను పూడ్చే ప్రయత్నంలో భాగంగా సవరించిన శాంతి ఒప్పంద పత్రాన్ని రూపొందించాయి. ఇరాన్తో ఒప్పందం కుదరవచ్చని భావిస్తున్నాననిజ.. కానీ, అలా జరగకపోతే యుద్ధాన్ని పునఃప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నానని ట్రంప్ పేర్కొంటున్నారు. అబ్బాస్ అరాగ్చితో పాకిస్తాన్ మంత్రి భేటీ టెహ్రాన్: పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహిసిన్ నఖ్వీ గురువారం టెహ్రాన్లో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చితో సమావేశమయ్యారు. అమెరికా–ఇరాన్ శాంతి చర్చలపై వారిద్దరూ చర్చించుకున్నారు. తాజా పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. -
కార్మీకుడికి సమ్మె చేసే హక్కుంది
ది హేగ్: హక్కుల సాధన కోసం కార్మీకులు తాము పనిచేసే చోట సమ్మె చేయొచ్చని, అందుకు కీలక కార్మీక ఒడంబడిక వీలు కల్పిస్తోందని అంతర్జాతీయ న్యాయస్థానం గురువారం చరిత్రాత్మక నిర్ణయం వెలువర్చింది. ఈ మేరకు కీలక అడ్వైజరీని విడుదలచేసింది. ఐక్యరాజ్యసమితిలో భాగమైన అంతర్జాతీయ కార్మీక సంఘం(ఐఎల్ఓ) గతంలో చేసిన ఒక ఒడంబడికలో కార్మీకులకు సమ్మె హక్కులు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారని, దీని చెల్లుబాటును తేల్చాలంటూ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్(ఐసీజే)ను మూడేళ్ల క్రితం ఐఎల్ఓ కోరింది. ఈ మేరకు తాజాగా ఐసీజే తన నిర్ణయం వెలువర్చింది. ఐసీజే ఇచ్చే అడ్వైజరీలను ప్రపంచదేశాల ప్రభుత్వాలు తు.చ.తప్పకుండా పాటించాలనే నిబంధన లేనప్పటికీ ఐరాస అంతర్గత విభాగమైన ఐసీజే చేసే సూచనలకు అంతర్జాతీయంగా ప్రాధాన్యత ఉంటుంది. కార్మిక చట్టాలు, ప్రమాణాలు, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలపై ఈ అడ్వైజరీ ప్రభావం చూపనుంది. కార్మీకులకు సమ్మె హక్కులను ప్రసాదిస్తూ ఐఎల్ఓ చేసిన తీర్మానాన్ని 158 దేశాలు ఆమోదించాయి. ఐరాస కార్మీక చట్టాలు, నిబంధనావళిని పాటిస్తామని తెలిపాయి. ఐఎల్ఓలో అమెరికా సభ్యదేశంగా కొనసాగుతున్నప్పటికీ ఈ తీర్మానానికి అగ్రరాజ్యం తన సమ్మతి తెలపలేదు. వాతావరణ మార్పుల కట్టడికి ప్రయత్నించని దేశాలను అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిన దేశాలుగా పరిగణించాలని ఐసీజే గత ఏడాది చరిత్రాత్మక అడ్వైజరీని జారీచేయడం తెల్సిందే. కార్మీకులకు సమ్మె చేసే హక్కు ఉందా అంటూ మొదలైన వాదనలపై 18 దేశాల నుంచి వాదోపవాదనలను ది హేగ్లోని ఐసీజే కోర్టు గతేడాది అక్టోబర్లో ఆలకించింది. ఇందులో మెజారిటీ దేశాలు కార్మీకులకు అనుకూలంగా వాదించడం విశేషం. మెరుగైన జీతభత్యాలు, పనివాతావరణంలో తగు భద్రతా సౌకర్యాల కోసం కార్మీకులు సమ్మెకు దిగొచ్చని ఐసీజే అభిప్రాయపడింది. -
మండే ఎండల్లో ముంచెత్తే వానలు?
దేశవ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్న వేళ ఉత్తరభారత ప్రజలకు సూర్యప్రతాపం నుంచి భారీ ఉపశమనం కల్పించేందుకు అనూహ్యంగా ఉత్తరభారతంపై భారీ వర్షాలు కురిపించేందుకు పాశ్చాత్య భంగం(వెస్టర్న్ డిస్టబెన్సెస్) సంసిద్ధమవుతోందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు గురువారం పాశ్చాత్య భంగం తాలూకు గాలుల తాజా ఉపగ్రహ చిత్రాలను వాతావరణ శాఖ విడుదలచేసింది. వడగాల్పులు, ఉక్కపోతతో ఉత్తరభారత ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్న సమయంలో చలికాలంలో మంచు, వర్షాలకు కారణమయ్యే పాశ్చాత్య భంగం తాలూకు గాలులు హఠాత్తుగా భారత్ దిశగా వస్తుండటంతో ఎండాకాల వేడిమి జనాలకు ఊరట లభించనుంది. మే 21వ తేదీన ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహం ద్వారా తీసిన చిత్రాల్లో పాశ్చాత్య భంగం సంబంధిత గాలులతో మేఘాలు, తుపానుకు ముందు కన్పించే వాతావరణం అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, వాయవ్య భారత గగనతలాలపై అలుముకున్నట్లు కన్పించింది. తెల్లని దట్టమైన మేఘాలు హిమాలయ పర్వతాల వైపు, ఉత్తరభారత మైదానాల దిశగా పయనం మొదలెట్టినట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది. అరేబియా సముద్రం మీద సైతం తేమతో కూడిన మేఘాలు ఏర్పడ్డాయి. ఈశాన్య భారతం మీద, బంగాళాఖాతం మీద సైతం మేఘావృతమైన వాతావరణ పరిస్థితులు స్పష్టంగా కన్పిస్తున్నాయి. పాశ్చాత్య భంగం లేదా పశ్చిమ విక్షోభం అనేది భారత్ను చుట్టుముడితే మరింతగా తేమను మోసుకొచ్చి ఉత్తరభారతంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వాన, ఈదురుగాలులతోపాటు పిడుగులు పడే ప్రమాదముందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ఉత్తర పాకిస్తాన్, జమ్మూకశ్మీర్లపై ఆకాశం అతిగా మేఘావృతం కావడంతో ఇక్కడి వాతావరణం హఠాత్తుగా మారుతూ అస్థిర పరిస్థితులను తీసుకురావచ్చు. ఈశాన్యభారతం మీదా మేఘాలు అతిగా కన్పిస్తుండటంతో వర్షాకాలం ప్రారంభంకాకమునుపే మెరుపులతో కూడిన వర్షాలు పడే ఆస్కారముందని నిపుణులు అభప్రాయపడ్డారు. పాశ్చాత్య భంగం ఇలాగే ఉధృతమై ముందుకు సాగితే ఉత్తరభారతంలో ముఖ్యంగా జమ్మూకశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లోని పశ్చిమ ప్రాంతాల్లో వచ్చే కొద్దిరోజుల్లో వర్షాలు మొదలయ్యే వీలుంది. ధూళి తుపాన్లు, వడగండ్ల వానలు పడినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు వ్యాఖ్యానించారు. పాశ్చాత్య భంగం మోసుకొచ్చి తేమ కారణంగా పడే వర్షాలు యావవత్ భారతదేశంలో ఎండ బాధలను పూర్తిగా తగ్గించకపోయినా ఉష్ణోగ్రతలు కాస్తంత తగ్గడానికి ఖచ్చితంగా దోహదపడతాయని నిపుణులు భరోసా ఇచ్చారు. అరేబియా సముద్రం, బంగాళాఖాతం దక్షిణప్రాంతాల్లో పెరిగిన మేఘాల సంచారం నెమ్మదిగా వర్షాకాల వాతావరణాన్ని సృష్టిస్తోంది. పాశ్చాత్య భంగం వేగంగా భారత్ను చుట్టుముడితే కనీసం ఉత్తర భారత ప్రజలకైనా ఈ ఉక్కపోత రాత్రుల నుంచి ఉపశమనం కల్గుతుంది. వడదెబ్బల భయం తగ్గుతుంది. అయితే విచ్చలవిడిగా పెరుగుతున్న కాలుష్యం, శిలాజ ఇంధనాల అతి వినియోగం, క్లోరోఫ్లోరో కార్భన్లు భారీ స్థాయిలో వెలువడటం వంటివి భారత్లో వడగాల్పులు వచ్చే అవకాశాలు ప్రతిఏటా మరింత పెంచేస్తాయని నిపుణులు హెచ్చరించారు. ఏమిటీ పాశ్చాత్య భంగం? మధ్యధరా సముద్ర ప్రాంతం, కాస్పియన్ సముద్రం, నల్ల సముద్రం ప్రాంతాల నుంచి మొదలై తూర్పు దిశగా పయనిస్తూ భారత్లోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో శీతాకాలంలో వర్షాలను కురిపించే అల్పపీడన వాయు ప్రసరణ వ్యవస్థను పాశ్చాత్యభంగం లేదా పశ్చిమ విక్షోభం అని పిలుస్తారు. పశ్చిమ విక్షోభ గాలులు తేమను మోసుకొస్తూ ఉత్తరభారతంలో మరీ ముఖ్యంగా హిమాలయాల్లో శీతాకాలంలో భారీగా మంచుకురవడానికి కారణమవుతాయి. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్లోనూ వర్షాలకు ఈ పాశ్చాత్య భంగమే కారణం. భారత్లో గోధుమపంట దిగుబడినీ పశ్చిమ విక్షోభం నిర్ణయిస్తుంది. సరైన సమయంలో చుట్టుముట్టే పశ్చిమ విక్షోభంతో పంజాబ్, హరియాణా, యూపీ, రాజస్థాన్లో గోధుమ దిగుబడి పెరుగుతుంది. శీతాకాలంలో మేఘాలు, వర్షం, హిమపాతం తెచ్చే పాశ్చాత్యభంగం ఒకరకంగా ఉత్తరభారతానికి మరో వర్షాకాలం వంటిది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విమానంలో ఎబోలా కలకలం.. ల్యాండింగ్కు అమెరికా నో ఎంట్రీ
ఆఫ్రికాలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దీంతో అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే ఎబోలా వ్యాప్తిని నివారించడానికి ముందు జాగ్రత్త చర్యలను బలోపేతం చేసింది. ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల నుండి వచ్చే వారిపై అమెరికా తాత్కాలిక నిషేధం విధించింది. కానీ ఎయిర్ ఫ్రాన్స్ ఎయిర్లైన్స్ సిబ్బంది చేసిన పొరపాటు వల్ల ఒక కాంగో ప్రయాణికుడు పారిస్ నుంచి అమెరికా వెళ్లే విమానం ఎక్కేశాడు. అయితే సదరు ప్రయాణికుడికి తమ దేశంలో వచ్చేందుకు యూఎస్ అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో గమ్యస్థానానికి మరో 800 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. ఆ విమానాన్ని కెనడాలోని మాంట్రియల్ ఎయిర్పోర్ట్ వైపు మళ్లించారు. మాంట్రియల్ ఎయిర్పోర్ట్కు విమానం చేరుకున్న వెంటనే కెనడా పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ (PHAC) క్వారంటైన్ అధికారులు రంగంలోకి దిగారు. అతడిని పరీక్షించి, ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని నిర్ధారించారు. దీంతో యూఎస్ అధికారులతో విమానంలోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ ఎబోలా వైరస్ కారణంగా మధ్య ఆఫ్రికాలో ఇప్పటికే 140 మంది మరణించారు.మరోవైపు ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో భారత్ కూడా అప్రమత్తమైంది. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సౌత్ సుడాన్ దేశాల నుంచి భారత్ కు వచ్చే ప్రయాణికులు ఎబోలా వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఎయిర్ పోర్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. -
భారత్కు అమెరికా బంపర్ ఆఫర్!
భారత పర్యటనకు ముందు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్కు అవసరమైన ఇంధనాన్ని సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రూబియో స్పష్టం చేశారు. "భారత్కు మాకు ఒక గొప్ప మిత్రదేశం. ఎన్నో ఏళ్లగా ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. భారత్లో అడుగుపెట్టేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాను.ఈ పర్యటన మాకు అత్యంత కీలకం. విదేశాంగ మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత నా మొదటి సమావేశం క్వాడ్ కూటమితోనే జరిగింది. ఇప్పుడు ఆ సమావేశాన్ని భారత్లో నిర్వహించబోతుండటం సంతోషంగా ఉంది. ఈ ఏడాది చివర్లో మరోసారి క్వాడ్ సమావేశం నిర్వహించనున్నాము. అయితే భారత్ ఎంత పరిమాణంలో ఇందనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే.. అంత మొత్తంలో విక్రయించడానికి మేము సిద్దంగా ఉన్నాము. న్యూఢిల్లీ మా 'పోర్ట్ఫోలియోలో ఒక పెద్ద భాగంగా' ఉండాలని కోరుకుంటోందని" మార్కో రూబియో గురువారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.అదేవిధంగా పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్కు ఇంధన భద్రత కల్పించడంపై ఈ పర్యటనలో ప్రధానంగా చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. కాగా రూబియో మే 23న భారత్కు చేరుకోనున్నారు. తొలుత కోల్కతాలో మదర్ థెరిస్సా మిషనరీస్ ఆఫ్ చారిటీస్ను ఆయన సందర్శిస్తారు. నంతరం ఆగ్రా, జైపూర్లను సందర్శించి.. న్యూఢిల్లీ చేరుకుంటారు. -
ఢిల్లీలో ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
వరుసగా ఎయిరిండియా విమానాల్లో చోటుచేసుకుంటోన్న సాంకేతిక సమస్యలు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. గురువారం ఒక్క రోజే రెండు ఎయిరిండియా విమానాలకు భారీ ప్రమాదం తప్పింది. తొలుత ఢిల్లీ నుంచి వచ్చిన విమానం బెంగళూరు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుండగా దాని తోక భాగం రన్వేను బలంగా తాకింది. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ సమయంలో విమానంలో 186 మంది ఉన్నారు.అనంతరం బెంగళూరు నుంచి ఢిల్లీ వస్తున్న మరో ఎయిరిండియా విమానం గురువారం సాయంత్రం ఢిల్లీఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానం రన్వేకు సమీపిస్తున్న సమయంలో, ఒక ఇంజిన్లో మంటలు వచ్చినట్లు కాక్పిట్ సిబ్బందికి అలర్ట్ వచ్చింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆ సిగ్నల్ను క్రాస్ చెక్ చేసుకోగా, ఇంజిన్లో మంటలు రావడం నిజమేనని నిర్ధారణ అయింది.పైలట్లు వెంటనే ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ను అప్రమత్తం చేసి ఎమర్జెన్సీ ల్యాండింగ్కు అనుమతి కోరారు. తక్షణమే అత్యవసర నియమావళిని (SOP) అమలు చేస్తూ విమానాన్ని రన్వేపై సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో విమానంలో ఉన్న ఉన్న ప్రయాణికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం ఆగిన తర్వాత ప్రయాణికులను ఎమర్జెన్సీ విండో ద్వారా కిందకు దించారు. ఈ ఘటనపై డీజీసీఏ (DGCA) పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. -
ట్రంప్ షేర్ లావాదేవీల కలకలం.. వైట్హౌస్ను కుదిపేస్తున్న వివాదం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారీ వివాదంలో చిక్కుకున్నారు. రోజుకు రెండు, మూడు సార్లు షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే సాధారణ ఇన్వెస్టర్లకంటే భిన్నంగా, ట్రంప్ వైట్హౌస్లో కూర్చొని రోజుకు సగటున 40 సార్లు ట్రేడింగ్ చేశారన్న ఆరోపణలు ఇప్పుడు అమెరికా రాజకీయ, ఆర్థిక వర్గాలను కుదిపేస్తున్నాయి. కేవలం 90 రోజుల్లోనే 3,700కు పైగా షేర్ లావాదేవీలు జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది.Bloomberg నివేదికల ప్రకారం, 2026 జనవరి నుంచి మార్చి మధ్య ట్రంప్ లేదా ఆయన సలహాదారులు భారీ స్థాయిలో షేర్ల కొనుగోలు, అమ్మకాల లావాదేవీలు నిర్వహించారు. ముఖ్యంగా Microsoft, NVIDIA, Oracle, Boeing, Amazon, Meta వంటి దిగ్గజ కంపెనీల్లో కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఒక్క ఫిబ్రవరి 10న మాత్రమే మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ షేర్లను 5 మిలియన్ నుంచి 25 మిలియన్ డాలర్ల వరకు అమ్మినట్లు సమాచారం.అధ్యక్షుడా? హెడ్జ్ ఫండ్ బాసా? ఈ స్థాయి ట్రేడింగ్ చూసి వాల్ స్ట్రీట్ నిపుణులే ఆశ్చర్యానికి గురయ్యారు. అమెరికా ప్రభుత్వ నైతిక ప్రమాణాల కార్యాలయానికి సమర్పించిన వందల పేజీల ఆర్థిక వివరాలు ఈ వ్యవహారాన్ని బయటపెట్టాయి. పలువురు మార్కెట్ నిపుణులు ఇది సాధారణ వ్యక్తిగత పెట్టుబడి ఖాతా లాగా కనిపించడం లేదని, భారీ అల్గోరిథమిక్ ట్రేడింగ్ నిర్వహించే హెడ్జ్ ఫండ్ తరహాలో ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.అయితే అసలు వివాదం ఇక్కడి నుంచే మొదలైంది. ఒక దేశాధ్యక్షుడు ప్రభుత్వ విధానాలతో నేరుగా ప్రభావితమయ్యే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ఎంతవరకు సమంజసం? అన్న ప్రశ్న ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్గా మారింది. ఉదాహరణకు NVIDIA సంస్థ చైనాకు ఏఐ చిప్లు ఎగుమతి చేయాలంటే అమెరికా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అలాగే బోయింగ్ కంపెనీ ప్రభుత్వ రక్షణ ఒప్పందాలపై ఆధారపడి ఉంటుంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి కంపెనీలపై ప్రభుత్వం యాంటీ ట్రస్ట్ విచారణలు, ఏఐ నియంత్రణలపై నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటుంది. అలాంటి సమయంలో ఒకవైపు ప్రభుత్వ విధానాలు రూపొందిస్తూ, మరోవైపు అదే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం “కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్” కిందికి వస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.గత అమెరికా అధ్యక్షులు George H. W. Bush, Bill Clinton తమ ఆస్తులను “బ్లైండ్ ట్రస్ట్”లలో ఉంచి ఇలాంటి ఆరోపణలకు తావివ్వకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ట్రంప్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. ట్రంప్ సంస్థల నిర్వహణలో ఆయన కుటుంబ సభ్యుల పాత్ర కొనసాగుతోందని, కొన్ని ఆర్థిక దాఖలాల్లో ఆలస్యానికి జరిమానాలు కూడా చెల్లించారని సమాచారం.ఆటోమేటెడ్ అల్గోరిథమ్స్ ద్వారా జరిగిందా? ఇంత భారీ స్థాయిలో ట్రేడింగ్ సాధ్యమా? లేదంటే ఆటోమేటెడ్ అల్గోరిథమ్స్ ద్వారా జరిగిందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఇది పూర్తిగా అల్గోరిథమిక్ ట్రేడింగ్ అని నిరూపించే ఆధారాలు లేవని తెలుస్తోంది. అయినప్పటికీ, కేవలం మూడు నెలల్లో వేల లావాదేవీలు జరగడం అమెరికా మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.ఈ వివాదానికి మరింత ఊపిరి పోసింది ఇరాన్ అంశం. ఇరాన్తో చర్చలు పురోగమిస్తున్నాయని ట్రంప్ ప్రకటించే ముందు కొందరు ఇన్వెస్టర్లు భారీ స్థాయిలో ఫ్యూచర్స్ మార్కెట్లో బెట్టింగ్ పెట్టారని సమాచారం. ట్రంప్ ప్రకటన తర్వాత చమురు ధరలు పడిపోగా, అమెరికా మార్కెట్లు భారీగా ఎగిశాయి. ఈ టైమింగ్ అనుమానాలకు తావిచ్చినా, ట్రంప్కు నేరుగా సంబంధం ఉందని నిరూపించే ఆధారాలు లేవు.ఇదిలా ఉండగా ట్రంప్ అల్లుడు Jared Kushner పేరు కూడా ఈ చర్చల్లో వినిపిస్తోంది. మధ్యప్రాచ్య దేశాలతో దౌత్య చర్చలు జరుపుతూనే, గల్ఫ్ పెట్టుబడిదారులతో ఆర్థిక సంబంధాలు కొనసాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆయన సంస్థ Affinity Partners సౌదీ అరేబియా సహా గల్ఫ్ సంపద నిధులతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.అయితే వైట్ హౌస్ ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చింది. ట్రంప్ పెట్టుబడులను స్వతంత్ర ఆర్థిక సంస్థలే నిర్వహిస్తున్నాయని, ఆయన గానీ, కుటుంబ సభ్యులు గానీ నేరుగా ట్రేడింగ్లో పాల్గొనడం లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ, ఒక అమెరికా అధ్యక్షుడు ప్రభుత్వ నిర్ణయాలతో ప్రభావితమయ్యే కంపెనీల్లో ఈ స్థాయిలో దూకుడుగా ట్రేడింగ్ చేయడం నైతికంగా సరైనదేనా? అన్న ప్రశ్న మాత్రం అమెరికాలో పెద్ద రాజకీయ చర్చకు దారితీస్తోంది. - వెబ్ డెస్క్ -
అది దేశం దాటివెళ్తే మన సంగతి అంతే: ఇరాన్
టెహ్రాన్: ఇరాన్, అమెరికా మధ్య దౌత్య చర్చలు కొనసాగుతున్న వేళ.. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ శుద్ధిచేసిన యురేనియం నిల్వలు దేశం బయటకు వెళ్లకూడదని ఆదేశించినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. శుద్ధి చేసిన యురేనియాన్ని ఇరాన్ వదులుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కీలక డిమాండ్ను ఇరాన్ మొదటి నుంచి నిరాకరిస్తోంది.అణ్వాయుధ తయారీలో కీలక భాగమైన శుద్ధి చేసిన యురేనియం నిల్వలను పూర్తిగా ఇస్లామిక్ రిపబ్లిక్ నుంచి బయటకు తరలిస్తామని ట్రంప్ గతంలో ఇజ్రాయెల్కు హామీ ఇచ్చారని ఇజ్రాయెల్ అధికారులు రాయిటర్స్కు తెలిపారు.ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కఠిన వైఖరిని కొనసాగిస్తున్నారు. శుద్ధి చేసిన యురేనియాన్ని పూర్తిగా ఇరాన్ అధీనంలో లేకుండా చేసేవరకు, ప్రాంతీయ ప్రాక్సీ మిలీషియాలకు టెహ్రాన్ ఆర్థిక, సామగ్రి సహాయం పూర్తిగా ఆపే వరకు వెనక్కి తగ్గబోమన్నారు. అలాగే, ఆ దేశ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసే వరకు యుద్ధ విరమణపై ఆలోచించబోమని ఆయన స్పష్టం చేశారు.అయితే ఈ వైఖరికి టెహ్రాన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అత్యంత సున్నితమైన భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా పేరు వెల్లడించకుండా మీడియాతో మాట్లాడారు ఇరాన్ వర్గాలకు చెందిన ఓ ప్రతినిధి. “సుప్రీం లీడర్ ఆదేశం స్పష్టంగా ఉంది. శుద్ధిచేసిన యురేనియం నిల్వలు దేశం బయటకు వెళ్లకూడదన్నారు” అని తెలిపారు.అదే వర్గాలు మరో విషయం వెల్లడించాయి. ఈ పదార్థాన్ని విదేశాలకు పంపితే తమ దేశ భద్రత తీవ్రంగా బలహీనపడుతుందని, భవిష్యత్తులో వాషింగ్టన్, టెల్ అవీవ్ నుంచి సైనిక దాడులను ఎదుర్కోలేదని చెప్పాయి. ఇరాన్ అగ్ర పరిపాలనా, సైనిక వర్గాలు ఈ విధంగానే భావిస్తున్నాయి. ఇరాన్ రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం కీలక ప్రభుత్వ విధానాలపై తుది అధికారం సుప్రీం లీడర్ చేతుల్లోనే ఉంటుందని రాయిటర్స్ తెలిపింది.అమెరికా దాడులు చేయనుందా? ఇరాన్ సీనియర్ వర్గాల సమాచారం ప్రకారం.. టెహ్రాన్ రాజకీయ వ్యవస్థలో తీవ్ర అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం యుద్ధ తీవ్రత పూర్తిగా తగ్గినట్టుగా చూపడం అమెరికా వ్యూహాత్మక మోసమని, తప్పుడు రీతిలో భద్రతాభావం కలిగించి మళ్లీ వైమానిక దాడులు ప్రారంభించాలన్న యత్నమని చాలామంది భావిస్తున్నారు.ఈ భయాలకు బలం చేకూర్చుతూ ఇరాన్ ప్రధాన శాంతి చర్చల ప్రతినిధి బాక్వెర్ తాజాగా మాట్లాడుతూ.. “శత్రువు బహిరంగ, రహస్య కదలికలు చూస్తే అమెరికా సైన్యం కొత్త దాడుల సన్నాహాల్లో ఉందని స్పష్టమవుతోంది” అన్నారు.ఇదిలా ఉండగా, సమగ్ర శాంతి ఒప్పందంపై ఇరాన్ సంతకం చేయకపోతే ఆ దేశంపై మరోసారి సైనిక దాడులు ప్రారంభించేందుకు అమెరికా పూర్తిగా సిద్ధంగా ఉందని ట్రంప్ బుధవారం ప్రకటించారు. అయితే సరైన సమాధానాలు రావడానికి కొన్ని రోజుల గడువు ఇస్తామన్న సంకేతం ఇచ్చారు. -
థాయ్లాండ్లో హాయిగా.. ఇక కొన్ని రోజులే!!
బ్యాంకాక్: భారతదేశంతో సహా దాదాపు 90 దేశాల ప్రయాణికులకు గతంలో కల్పించిన 60 రోజుల వీసా రహిత (Visa-Free) బస సదుపాయాన్ని ఉపసంహరించుకోవాలని థాయ్లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024లో ప్రవేశపెట్టిన ఈ పొడిగించిన వీసా రహిత బస పథకాన్ని రద్దు చేయడానికి థాయ్ క్యాబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు 'న్యూస్ రిఫార్మ్' సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.నిర్ణయానికి కారణాలు» ఇటీవలి కాలంలో విదేశీ పౌరులకు సంబంధించిన వరుస నేరాలే ఈ కఠిన నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. » విదేశీయులు పాల్గొంటున్న మాదకద్రవ్యాల నేరాలు, లైంగిక అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) కేసులు పెరిగిపోవడం.» సరైన అనుమతులు లేకుండా హోటళ్లు, పాఠశాలలతో కూడిన వ్యాపారాలను చట్టవిరుద్ధంగా నిర్వహించడం.» కొంతమంది సందర్శకులు ఈ పొడిగించిన వీసా రహిత పద్ధతిని తమ అక్రమ కార్యకలాపాల కోసం దుర్వినియోగం చేస్తున్నట్లు థాయ్ అధికారులు గుర్తించారు.భారతీయ ప్రయాణికులకు ఏం మారనుందంటే..ఈ తాజా నిర్ణయంతో భారతీయ ప్రయాణికులు 2024లో తాత్కాలిక 60 రోజుల మినహాయింపు రాకముందు ఉన్న పాత నిబంధనల్లోకి మారిపోతారు. మునుపటి ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం, భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లకు ఇకపై థాయ్లాండ్లో గరిష్టంగా 30 రోజులు మాత్రమే వీసా లేకుండా ప్రవేశించడానికి, బస చేయడానికి అనుమతి ఉంటుంది.పర్యాటక రంగం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావంథాయ్లాండ్ జీడీపీలో పర్యాటక రంగం వాటా 10% కంటే ఎక్కువ. ఇది అక్కడి స్థానిక ఆర్థిక వ్యవస్థకు కీలకమైన చోదకశక్తిగా ఉంది. ప్రభుత్వం ఈ సంవత్సరం సుమారు 3.35 కోట్ల మంది అంతర్జాతీయ సందర్శకులను స్వాగతించాలని భావిస్తోంది. ఇది గత సంవత్సరం నమోదైన దాదాపు 3.3 కోట్ల మంది రాకపోకల కంటే స్వల్ప వృద్ధి. థాయ్లాండ్ పర్యాటక, క్రీడల మంత్రిత్వ శాఖ నుండి అందిన తాజా డేటా ప్రకారం, 2026 మొదటి త్రైమాసికంలో విదేశీ రాకపోకలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సుమారు 2.3% నుండి 3.4% వరకు తగ్గాయి. -
60 రోజుల్లో ఉద్యోగం : లేదంటే కౌంట్డౌన్ స్టార్ట్
అమెరికా టెక్ పరిశ్రమ వ్యాప్తంగా జరుగుతున్న తాజా ఉద్యోగ కోతలు టెక్ నిపుణులు గుండెల్లో గునపాల్లా దిగుతున్నాయి. ఉద్యోగం కోల్పోతే, దేశంలో నివసించే హక్కును కూడా కోల్పోవాల్సి వస్తుందేమోనన్న భయం వారిలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ ఇంజనీర్లు , సాఫ్ట్వేర్ డెవలపర్లు అమెరికాలోని అతిపెద్ద టెక్ కంపెనీల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. క్లిష్టమైన కోడింగ్ రాశారు, ఎన్నో టీమ్స్ను నడిపించారు. ఫలితంగా విదేశాల్లో జీవితం ఎంతో సురక్షితమైనదని నమ్మారు. అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకొని ఇళ్లు కొనుక్కున్నారు. కుటుంబాలను పెంచుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు, వేలాది మందికి వచ్చిన ఒకే ఒక్క ఈమెయిల్ అంతటినీ మార్చేస్తోంది. అమెరికాలో ఉద్యోగం పోవడం అనేది ఒక కౌంట్డౌన్ షురూ అయినట్టే.సిలికాన్ వ్యాలీలోని కంపెనీలు మరోసారి ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. మెటా (Meta) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వైపు తన వనరులను మళ్లిస్తూ దాదాపు 8వేల ఉద్యోగాలను తొలగించింది. అమెజాన్ కూడా పలు విడతల కోతల తర్వాత మరికొన్ని టీమ్స్ సైజ్ తగ్గిస్తోంది. టెక్ పరిశ్రమ ఏఐ, ఆటోమేషన్ వైపు మళ్లుతున్న నేపథ్యంలో లింక్డ్ఇన్ సైతం ఇటీవలి ఉద్యోగులపై వేటు వేసింది అమెరికాలోని మెజారిటీ భారతీయ టెక్ నిపుణులు H-1B వీసాలపై పనిచేస్తున్నారు. ఇవి నేరుగా వారి యజమానులతో (Employers) ముడిపడి ఉంటాయి. అమెరికా ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం, వీసా స్పాన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్న మరోయజమానిని వెతుక్కోవడానికి,సాధారణంగా 60 రోజులు మాత్రమే సమయం ఉంటుంది. ఒకవేళ వారు విఫలమైతే, దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఉద్యోగం కోల్పోవడం అంటే కేవలం వృత్తి పరమైన నష్టం మాత్రమే కాదు, ఇమ్మిగ్రేషన్, ఇంటి లోన్ల చెల్లింపులు, పిల్లల పాఠశాలల అడ్మిషన్లు, ఆరోగ్య రక్షణ, కుటుంబ నిర్ణయాలతో కూడిన రేస్లా మారుతుంది. ఇప్పటికే చాలా మంది భారతీయులు గ్రీన్ కార్డ్ల కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్నారు. కొందరికి అమెరికాలోనే పుట్టిన పిల్లలు ఉన్నారు. మరికొందరు తాము దీర్ఘకాలం అక్కడే ఉంటామనే నమ్మకంతో ఇళ్లు కొనుగోలు చేశారు. ఉద్యోగం పోవడంతో ఆ ప్లాన్లన్నీ రాత్రికి రాత్రే అనిశ్చితిలోకి వెళ్లిపోతున్నాయి.ఇక ఉద్యోగాలు కోల్పోయిన చాలామంది భారతీయ కార్మికులు అమెరికాలో మరికొంత కాలం కొనసాగడానికి తాత్కాలిక ప్రత్యామ్నాయాలను వెతుక్కోక తప్పని పరిస్థితి. దీనికి B-2 విజిటర్ వీసాకు మారడమే పరిష్కారం. తద్వారా మరో ఉద్యోగం వెతుక్కునే లోపు అక్కడ మరికొన్ని నెలలు ఉండే అవకాశం లభిస్తుంది.60 రోజుల H-1B నిబంధన అంటే ఏమిటి?యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) నిబంధనల ప్రకారం, ఉద్యోగం కోల్పోయిన H-1B కార్మికులకు తమ తదుపరి నిర్ణయాన్ని చూసుకోవడానికి సాధారణంగా 60 రోజుల గ్రేస్ పీరియడ్ (లేదా వారి I-94 హోదా గడువు ముగిసే వరకు, ఏది ముందైతే అది) లభిస్తుంది. ఈ సమయంలో తమ వీసాను స్పాన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్న వేరే యజమానిని వెతుక్కోవచ్చు, వేరే వీసా కేటగిరీకి దరఖాస్తు చేసుకోవచ్చు లేదా అమెరికా విడిచి వెళ్లడానికి సిద్ధం కావచ్చు. ఈ 60 రోజుల గడువు సాధారణంగా ఉద్యోగి యొక్క చివరి పని దినం (Last working day) నుండి ప్రారంభమవుతుంది, అంతేకానీ చివరి జీతం బ్యాంక్ ఖాతాలో జమ అయినప్పటి నుండి కాదు అనేది గుర్తించాలి.సడన్గా ఉద్యోగాలు కోల్పోయిన విదేశీ నైపుణ్యం కలిగిన కార్మికులకు కొంత ఉపశమనం కలిగించడానికి ఈ నిబంధనను ప్రవేశపెట్టారు. కానీ వాస్తవానికి, టెక్ పరిశ్రమలోనే నియామకాలు మందగించినప్పుడు రెండు నెలల సమయం చాలా వేగంగా గడచిపోతుంది. కొత్త స్పాన్సర్ను కనుగొనడం, ఉద్యోగం రావడం, వీసా ట్రాన్స్ఫర్ అంత ఈజీకాదు. అందుకే ఉద్యోగాలు కోల్పోయిన వారు Form I-539 దాఖలు చేయడం ద్వారా తాత్కాలికంగా B-1 లేదా B-2 విజిటర్ వీసాకు మారాలని ఇమ్మిగ్రేషన్ నిపుణులు సలహా ఇస్తుంటారు.కెనడా, యూరప్ వైపు మొగ్గుదశాబ్దాలుగా అమెరికా అంటే కెరీర్ వృద్ధి, అధిక జీతాలు మరియు ప్రపంచ స్థాయి గుర్తింపునకు చిహ్నంగా ఉండేది. కానీ వరుస లేఆఫ్స్, వీసాపై ఆధారపడటం, ఇమ్మిగ్రేషన్పై వస్తున్న రాజకీయ విమర్శలు , AI ఆధారిత మార్పులు చాలా మంది నిపుణులను తమ భవిష్యత్తు గురించి పునరాలోచించుకునేలా చేస్తున్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే లక్షా పదివేలకు పైగా టెకీలు ఉద్యోగాలు కోల్పోయారు. 2025లో ఆమోదించిన H-1B పిటిషన్లలో అత్యధిక శాతం భారతీయులవే ఉన్నాయి. కానీ ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో చాలా మంది భారతీయులు తమ 'అమెరికన్ డ్రీమ్' ఆశలను వదిలేసుకుంటున్న పరిస్థితి. ఇటీవలి ఒక 'బ్లైండ్' (Blind) పోల్ ప్రకారం, అమెరికాలోని భారతీయ నిపుణులలో దాదాపు సగం మంది తాము ఉద్యోగం కోల్పోతే భారతదేశానికి తిరిగి రావడానికి మొగ్గు చూపుతామని తెలిపారు. మరికొందరు కెనడా , యూరప్ వైపు చూస్తున్నారు... -
పాక్ అనాగరిక చర్యలను కడిగేసిన భారత్
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) వేదికగా భారత్ పొరుగుదేశమైన పాకిస్తాన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. పౌరుల సామూహిక హత్యలు, సరిహద్దు ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాక్ చరిత్ర మొత్తం రక్తసిక్తమయమేనని భారత్ పేర్కొంది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రాయబారి హరీష్ పర్వతనేని మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ సైన్యం జరిపిన అనాగరిక దాడులను ప్రపంచం ముందు పెట్టారు. భారత్ అంతర్గత విషయాలపై మాట్లాడే అర్హత పాకిస్తాన్కు లేదని ఆయన స్పష్టం చేశారు.కాబూల్ ఆస్పత్రిపై పాశవిక దాడిసరిహద్దుల్లో పాకిస్తాన్ సృష్టిస్తున్న సాయుధ హింస కారణంగా ఆఫ్ఘనిస్తాన్లో 750 మంది పౌరులు మరణించడం లేదా గాయపడటం జరిగిందని పలు నివేదికలను ఉదహరిస్తూ హరీష్ పర్వతనేని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ఏడాది మార్చిలో పవిత్ర రంజాన్ మాసంలో, ప్రజలంతా ప్రార్థనలు ముగించుకుని వస్తున్న సమయంలో కాబూల్లోని ‘ఓమిద్ అడిక్షన్ ట్రీట్మెంట్ హాస్పిటల్’ పై పాక్ వైమానిక దాడులు చేసింది. ఈ అత్యంత క్రూరమైన, అనాగరిక దాడిలో 269 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 122 మంది తీవ్రంగా గాయపడ్డారు. సైనిక లక్ష్యం కాని ఒక వైద్యశాలపై దాడి చేయడాన్ని ఏ రకంగానూ సమర్థించుకోలేమని భారత్ తేల్చిచెప్పింది.అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనఆఫ్ఘన్ పౌరులను రక్షించాలన్న అంతర్జాతీయ పిలుపులను, మానవతా నిబంధనలను పాకిస్తాన్ పూర్తిగా కాలరాసిందని భారత్ ఆరోపించింది. చీకటి పడ్డాక అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూ.. అంతర్జాతీయ చట్టాల గురించి మాట్లాడటం పాక్ కపటత్వానికి నిదర్శనమని పర్వతనేని మండిపడ్డారు. పౌరుల రక్షణకు సంబంధించిన 'నాన్-రిఫౌల్మెంట్' సూత్రాన్ని పాటించాలని ‘సమితి’ సెక్రటరీ జనరల్ చేసిన విజ్ఞప్తిని కూడా పాకిస్తాన్ బేఖాతరు చేసిందని ఆయన విమర్శించారు. పౌర నష్టాలకు కారణమైన 95 సంఘటనలలో 94 ఘటనలకు పాక్ భద్రతా దళాలే బాధ్యులని సమితి సహాయక మిషన్ నిర్ధారించిందని గుర్తుచేశారు.సొంత ప్రజలనే బాంబులతో చంపే దేశంపాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందని, సరిహద్దు వెంబడి అది సాగిస్తున్న హింస కారణంగా 94,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదానికి ఊతమిచ్చే దేశాలను అంతర్జాతీయ సమాజం తప్పకుండా జవాబుదారీ చేయాలని డిమాండ్ చేసింది.ఇది కూడా చదవండి: భారతీయ నర్స్ కుటుంబాన్ని గెంటేస్తున్న ఆస్ట్రేలియా -
హార్మూజ్పై పట్టుకు ఇరాన్ ప్లాన్.. అథారిటీ ఏర్పాటు
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హార్మూజ్ జలసంధిపై తన నియంత్రణను మరింత బలోపేతం చేస్తూ దీవుల వద్ద చెక్పాయింట్లను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో నౌకలపై రుసుములు విధిస్తోంది. జలసంధిలో ఇరాన్ సరికొత్తగా పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ ఏర్పాటు చేసింది. కొత్త “Hormuz Safe” ఇన్సూరెన్స్ పథకం ద్వారా ఇరాన్ ఆర్థిక లాభాలు పొందుతోంది. దీని వల్ల ప్రపంచ చమురు సరఫరాలో ఐదవ వంతు ప్రభావితం అవుతోంది.హార్మూజ్ జలసంధిపై తన నియంత్రణను బలపరచడానికి ఇరాన్ కొత్త సంస్థను ఏర్పాటు చేసింది. జలసంధి నిర్వహణ బాధ్యతలను పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ (Persian Gulf Strait Authority) అనే ఈ సంస్థను అప్పగించింది. ఇందులో భాగంగా చెక్పాయింట్లు అమలు చేస్తోంది. నౌకలపై ట్రాన్సిట్ అనుమతులు జారీ చేసి, రుసుములు వసూలు చేస్తోంది. ముఖ్యంగా టోల్ ఫీజులు వసూలు చేయడం, నౌకల కార్గో వివరాలు, జెండా, గమ్యం వంటి సమాచారం సేకరించడం వంటివి జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని నౌకలకు రెండు మిలియన్ డాలర్ల వరకు టోల్ ఫీజులు విధిస్తున్నారు. దీని ద్వారా ఇరాన్ $10 బిలియన్ ఆదాయం పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, ఇరాన్ ఈ సంస్థ ద్వారా హార్మూజ్ జలసంధిపై తన భౌగోళిక ప్రభావాన్ని పెంచుకోవడం, ఆర్థిక లాభం పొందడం, అమెరికా ఆంక్షలను తప్పించుకోవాలని ప్లాన్ చేసింది.ఇదే ఉదాహరణ.. కాగా, Agios Fanourios-I అనే ట్యాంకర్ ఇరాక్ క్రూడ్ ఆయిల్తో వియత్నాం వైపు బయలుదేరింది. కానీ ఏప్రిల్ చివరి నుండి దుబాయ్ తీరంలో నిలిపివేయబడింది. మే 10న ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత మాత్రమే హార్మూజ్ గుండా ప్రయాణం కొనసాగింది. సాధారణంగా 5 గంటల్లో పూర్తయ్యే ప్రయాణం, ఇరాన్ జోక్యం వల్ల 2 రోజులు పట్టింది. మరోవైపు.. ఈ జలమార్గం గుండా కేవలం కొద్ది సంఖ్యలో నౌకలు మాత్రమే ప్రయాణించాయి. అమెరికాకు చెందిన సిన్మాక్స్ ఇంటెలిజెన్స్ అనే సంస్థ విశ్లేషణ ప్రకారం.. ఏప్రిల్ 18 నుండి మే 6 మధ్య 60 కంటే తక్కువ నౌకలు మాత్రమే ఈ జలసంధి గుండా ప్రయాణించగలిగాయి. యుద్ధానికి ముందు, సాధారణంగా ఒక రోజులో సుమారు 120 నుండి 140 నౌకలు ఈ జలసంధి గుండా ప్రయాణించేవి, వాటిలో దాదాపు సగం చమురు ట్యాంకర్లే ఉన్నాయి.ప్రభావంప్రపంచ చమురు సరఫరా: హార్మూజ్ గుండా 20% గ్లోబల్ ఆయిల్ వెళ్తుంది.మార్కెట్ కలకలం: ఆలస్యం, రుసుములు, అనిశ్చితి కారణంగా చమురు ధరలు పెరుగుతున్నాయి.ప్రాంతీయ ఉద్రిక్తతలు: గల్ఫ్ దేశాలు, అమెరికా, యూరప్ దేశాలు ఇరాన్ చర్యలను వ్యతిరేకిస్తున్నాయి.ప్రపంచ ప్రతిస్పందన: UK, France వంటి దేశాలు 40 దేశాల సమావేశం ఏర్పాటు చేసి, యూరోపియన్ ఎస్కార్ట్ ప్లాన్పై చర్చిస్తున్నాయి. -
భారతీయ నర్స్ కుటుంబాన్ని గెంటేస్తున్న ఆస్ట్రేలియా
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో స్థిరపడాలనే ఆశతో వెళ్లిన ఓ భారతీయ కుటుంబానికి అక్కడ తీవ్రమైన అన్యాయం జరుగుతోంది. తమ ఆరేళ్ల కుమారుడికి ఉన్న శారీరక ఎదుగుదల లోపాన్ని కారణంగా చూపిస్తూ, ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆ కుటుంబానికి పర్మనెంట్ రెసిడెన్సీ (పీఆర్) నిరాకరించింది. అంతటితో ఆగకుండా, వారిని దేశం నుంచి బహిష్కరించేందుకు సిద్ధమైంది. కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన ఈ కుటుంబం ప్రస్తుతం విక్టోరియాలోని బెండిగో నగరంలో తీవ్ర ఆందోళనతో కాలం వెళ్లదీస్తోంది.కన్నీరు పెట్టిస్తున్న విసా తిరస్కరణ ఈ కుటుంబానికి చెందిన క్రిస్టిన్ దాస్ విక్టోరియాలోని ప్రాంతీయ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ విభాగంలో రిజిస్టర్డ్ నర్సుగా సేవలందిస్తున్నారు. ఆమె భర్త జినీష్ జోసెఫ్ క్వాలిఫైడ్ చెఫ్, అలాగే కొడుకు బాగోగులు చూసుకునే పూర్తి స్థాయి కేర్గివర్గా ఉన్నారు. వీరికి జాజియల్ (6), హేజెల్ (2) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. విక్టోరియాలో ఎమర్జెన్సీ కేర్, హాస్పిటాలిటీ రంగాలలో సేవలు అందిస్తున్నారు. అయినప్పటికీ, కొడుకు అనారోగ్యాన్ని సాకుగా చూపి వీసా నిరాకరించడంపై వారు తీవ్రంగా కలత చెందుతున్నారు.ఐర్లాండ్ వదిలి వస్తే నడిరోడ్డుపైనేనా? గతంలో ఈ కుటుంబం ఐర్లాండ్లో ఉండేది. ఆస్ట్రేలియా వీసా లభించడంతోనే వారు అక్కడి నుంచి ఇక్కడికి తరలివచ్చారు. వీసా దరఖాస్తు ప్రక్రియలోనే తమ కుమారుడి ఆరోగ్య పరిస్థితిని తాము స్పష్టంగా తెలియజేశామని వారు చెబుతున్నారు. ఒకవేళ అప్పుడే వీసా తిరస్కరించి ఉంటే, తాము ఐర్లాండ్లోనే ఉండేవారమని, ఇప్పుడు ఇక్కడ అన్నీ సెట్ చేసుకున్నాక నడిరోడ్డుపై వదిలేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో తమ కుమారునికి అందుతున్న వైద్య సహాయం ఆగిపోతే, వాడి భవిష్యత్తు ఏమిటని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.న్యాయం కోసం డిజిటల్ పోరాటం తమకు జరుగుతున్న అన్యాయంపై ఈ కేరళ కుటుంబం 'Change.org' వేదికగా డిజిటల్ పిటిషన్ వేసింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం తమను దేశం నుంచి బహిష్కరించకుండా నిలిపివేయాలని, మానవతా దృక్పథంతో వీసా మంజూరు చేయాలని వారు ప్రజల మద్దతు కోరుతున్నారు. ఈ పిటిషన్కు ఆస్ట్రేలియా ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఇప్పటికే 7,000 మందికి పైగా దీనిపై సంతకాలు చేసి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ‘మా పిల్లలు ఇక్కడే పెరుగుతున్నారు. ఇదే వారి ఇల్లు... మమ్మల్ని వెళ్లగొడితే మా బాబుకు భవిష్యత్తు ఉండదు’ అంటూ ఆ తల్లిదండ్రులు చేస్తున్న అభ్యర్థన నెటిజన్లను కదిలిస్తోంది.ఇది కూడా చదవండి: ట్రంప్, నెతన్యాహు మధ్య విభేదాలు -
ట్రంప్, నెతన్యాహు మధ్య విభేదాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య బుధవారం జరిగిన ఒక గంట ఫోన్ సంభాషణ అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇరాన్తో దౌత్యపరమైన చర్చలు కొనసాగించాలా లేక సైనిక చర్యలకు దిగాలా అనే అంశంపై వాషింగ్టన్, టెల్ అవీవ్ మధ్య ఏర్పడిన విబేధాలు ఈ కాల్తో బయటపడ్డాయి. గత ఏప్రిల్ 8న కుదిరిన కాల్పుల విరమణ తర్వాత ఇరుపక్షాల మధ్య హెచ్చరికలు కొనసాగుతున్న తరుణంలో, అమెరికా మీడియా సంస్థ ‘అక్సియోస్’ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ చర్చల తర్వాత నెతన్యాహు తీవ్ర ఆగ్రహానికి, ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది.ట్రంప్ దౌత్య వ్యూహం.. నెతన్యాహు అసంతృప్తిఖతార్, పాకిస్తాన్ దేశాలు ప్రతిపాదించి, సవరించిన శాంతి ఒప్పందంపై ట్రంప్ మొగ్గు చూపుతుండగా, నెతన్యాహు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇరాన్ కేవలం కాలయాపన కోసమే ఈ చర్చలను వాడుకుంటోందని, సైనిక దాడులను ఆపడం చారిత్రక తప్పిదమని నెతన్యాహు వాదించారు. అయితే, ‘మంచి ఒప్పందమైనా కుదురుతుంది లేదా గట్టి చర్యలైనా ఉంటాయి’ అని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ప్రతిపాదించిన ‘ఆపరేషన్ స్లెడ్జ్హామర్’ దాడులను గల్ఫ్ మిత్రదేశాల కోరిక మేరకు ప్రస్తుతానికి నిలిపివేసినట్లు ట్రంప్ ఈ కాల్లో పేర్కొన్నారు.హోర్ముజ్ జలసంధి సంక్షోభం - అంతర్జాతీయ ఆందోళనమరోవైపు, ప్రపంచ ఇంధన సరఫరాలో ఐదో వంతు వాటా కలిగిన హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు ఆర్థిక మార్కెట్లను కలవరపెడుతున్నాయి. ఇరాన్ తన పర్యవేక్షణలో కొన్ని నౌకలను అనుమతించినప్పటికీ, అమెరికా నేతృత్వంలోని కౌంటర్-బ్లాకేడ్ ఇంకా కొనసాగుతోంది. ఈ అంతరాయం ఇలాగే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం, ఎరువుల కొరత ఏర్పడుతుందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఎఫ్ఎఓ హెచ్చరించింది. అయితే చర్చలు సఫలమైతే చమురు ధరలు తగ్గుతాయనే ఆశతో మార్కెట్లు కొద్దిగా కోలుకున్నాయి.ఇరాన్ హెచ్చరిక.. యుద్ధ గండం ఇంకా తొలగలేదుఅమెరికా పంపిన ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ తెలిపినప్పటికీ, వారి వైఖరి మారలేదు. స్తంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని, పోర్టులపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తోంది. ఇరాన్ చీఫ్ నెగోషియేటర్ మహ్మద్ బాఖెర్ గాలిబాఫ్ మాట్లాడుతూ అమెరికా దౌత్యం ముసుగులో కొత్త యుద్ధానికి తెరలేపుతోందని ఆరోపించారు. ఒకవేళ ఇరాన్పై మళ్లీ దాడి జరిగితే, ఆ యుద్ధం కేవలం పశ్చిమాసియాకే పరిమితం కాదని, శత్రువులను నామరూపాలు లేకుండా చేస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించారు.ఇది కూడా చదవండి: నాడు మనసులు కలిస్తే.. నేడు డేటా సరిపోలితే.. -
సరైనా సమాధానం కోసం ఎదురుచూస్తున్న: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ పరిస్థితులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చలు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయని, ఇరాన్ నుంచి తమకు 100 శాతం సానుకూల సమాధానాలు కావాలన్నారు. ఇరాన్తో యుద్ధమా? లేక శాంతి ఒప్పందమా? అనే విషయం తేలడానికి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉందని బాంబు పేల్చారు. ఇరాన్ సరిగా స్పందించని పక్షంలో తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ నుండి దిగిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ..‘ఇరాన్, అమెరికా మధ్య చర్చలు చివరి దశకు చేరుకున్నాయి. మాకు సరైన సమాధానాలు రాకపోతే, పరిస్థితి చాలా వేగంగా చేయిదాటిపోతుంది. ఒకవేళ ఇరాన్ నుంచి సరైన సమాధానం రాకపోతే దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఇరాన్ నుంచి మాకు 100 శాతం సానుకూల సమాధానాలు కావాలి. ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే ఎంతో సమయం, శక్తి, మరికొందరి ప్రాణాలు కాపాడినట్లు అవుతుంది. ప్రస్తుతం చర్చల్లో పాల్గొంటున్న ఇరాన్ ప్రతినిధులు, గతంలో ఉన్నవారి కంటే చాలా వివేకవంతంగా కనిపిస్తున్నారు. ఇరుపక్షాలకు మేలు జరిగేలా వారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా. అయితే, దౌత్యపరమైన ఈ చర్చల సమయం చాలా తక్కువగా ఉంది. ఏదైనా కొన్ని రోజుల్లోనే తేలిపోతుంది’ అని అన్నారు.ఇదే సమయంలో ఇరాన్కు మాత్రం అణ్వాయుధాన్ని సాధించే అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. ఈ చర్చల తర్వాత ఒక ఒప్పందమైనా జరుగుతుందా? లేదా తాము కొన్ని కఠినమైన చర్యలైనా తీసుకోవాల్సి ఉంటుందా? అని వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ మంది చనిపోవడం కంటే, తక్కువ నష్టంతో ఈ సమస్య ముగిసిపోవాలన్నదే తన కోరికని, అయితే తాము ఏ దారిలో వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరికలు జారీ చేశారు.ఒప్పందం కుదరకపోతే భారీ దాడి..అంతకుముందు.. ఇరాన్పై అమెరికా ప్రణాళికాబద్ధ సైనిక దాడిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ట్రంప్ ఇటీవల వెల్లడించారు. గల్ఫ్ దేశాల విజ్ఞప్తితోనే దాడిని వాయిదా వేసినట్లు తెలిపారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్టులో ఇరాన్తో ప్రస్తుతం కీలక చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని గల్ఫ్ దేశాల నాయకులు సూచించారని తెలిపారు. అందుకే ప్రణాళికాబద్ధ దాడిని నిలిపివేశామని పేర్కొన్నారు. అయితే ఒప్పందం కుదరకపోతే ఎప్పుడైనా పూర్తి స్థాయి భారీ దాడికి అమెరికా సైన్యం సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు. అలాగే ఇరాన్కు అణ్వాయుధాలు ఉండకూడదు అన్నది అమెరికా ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. -
గాజా ఫ్లోటిల్లా ఘటన.. ఇజ్రాయెల్ కేబినెట్లో చిచ్చు
గాజా ఫ్లోటిల్లా ఘటనపై ప్రపంచ దేశాలు భగ్గుమంటున్నాయి. గాజాకు మానవతా సాయం అందించేందుకు వెళ్తున్న బృందాన్ని అడ్డుకున్న ఇజ్రాయెల్ భద్రతా సిబ్బంది వాళ్ల పట్ల అమానుషంగా ప్రవర్తించింది. ఇందుకు సంబంధించిన వీడియోను స్వయంగా ఇజ్రాయెల్ నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ ఇటామర్ బెన్-గ్విర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ దుమారం మొదలైంది. సుమారు 40 దేశాల నుంచి 50 ఫ్లోటిల్లా(చిన్నపాటి నౌకలు)ల్లో గాజాకు సాయం అందించేందుకు బయల్దేరాయి. అయితే వాటిని అడ్డుకుని మరీ ఇజ్రాయెల్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. కార్యకర్తలను నేలపై మోకాళ్లపై కూర్చోబెట్టి, చేతులు వెనుకకు కట్టి ఉంచారు. ఆ సమయంలో ఒక మహిళ "ఫ్రీ, ఫ్రీ పాలస్తీన్" అని నినదించగా, పోలీసులు ఆమెను బలవంతంగా నేలపై తోసిన దృశ్యాలు కనిపించాయి. మే 20న ఈ ఘటన చోటు చేసుకుంది.ఆ వీడియోను షేర్ చేసిన బెన్-గ్విర్ ఆ కార్యకర్తలను ఎగతాళి చేస్తూ, "వీరంతా హీరోలుగా వచ్చారు.. ఇప్పుడు చూడండి వీరి పరిస్థితి" అని వ్యాఖ్యానించారు. వాళ్లను ఇజ్రాయెల్ నెగెవ్ ఎడారిలోని కెట్జియోట్ జైలుకు తరలించే అవకాశం ఉందని సమాచారం. అయితే.. ככה אנחנו מקבלים את תומכי הטרורWelcome to Israel 🇮🇱 pic.twitter.com/7Hf8cAg7fC— איתמר בן גביר (@itamarbengvir) May 20, 2026ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ప్రతిస్పందనకు దారితీసింది. ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్ను ఒక సాధారణ భద్రతా చర్యగా చెబుతున్నప్పటికీ.. పెద్ద దౌత్య సంక్షోభంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఫ్రాన్స్, కెనడా, స్పెయిన్, పోర్చుగల్, నెదర్లాండ్స్ వంటి దేశాలు ఇజ్రాయెల్ రాయబారులను పిలిపించి సమన్లు జారీ చేసి నిరసన వ్యక్తం చేశాయి. ఈ ఘటనపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తీవ్రంగా స్పందించారు. అందులో ఇటలీ పౌరులు కూడా ఉన్నారని.. వాళ్లను అవమానకర పరిస్థితుల్లో ఉంచడం ఎంతమాత్రం అంగీకరించలేనిదని అన్నారు. తక్షణమే ఇజ్రాయెల్ క్షమాపణలు చెప్పాలని.. నిర్బంధిత ఇటాలియన్ పౌరులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ జలాల్లో పౌరులను అరెస్టు చేయడానికి ఇజ్రాయెల్కు ఏ హక్కు ఉందని దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మియంగ్ ప్రశ్నిస్తున్నారు. టర్కీ కూడా తమ పౌరుల విడుదల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. ఇటు.. ఈ వీడియో ఇజ్రాయెల్ కేబినెట్లోనే చిచ్చు రాజేసింది. బెన్-గ్విర్ చర్యలు దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని విదేశాంగ మంత్రి గిదియోన్ సర్ విమర్శించారు. ప్రధాని బెంజమిన్ నేతన్యాహు కూడా ఫ్లోటిల్లాను అడ్డుకోవడం ఇజ్రాయెల్ హక్కు అని చెప్పినా, వీడియోలో కనిపించిన ప్రవర్తన "ఇజ్రాయెల్ విలువలకు విరుద్ధం" అని వ్యాఖ్యానించారు.ఈ ఘటనతో మరోసారి గాజాలోని మానవతా సంక్షోభం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. యుద్ధం కారణంగా ఎక్కువ మంది ప్రజలు ఇళ్లను కోల్పోయి శిబిరాల్లో, తాత్కాలిక ఆశ్రయాల్లో జీవిస్తున్నారు. సహాయక సంస్థలు అందిస్తున్న సరఫరాలు అవసరాలకు సరిపోవడం లేదని చెబుతున్నాయి. ఇజ్రాయెల్ మాత్రం తాము సహాయం అడ్డుకోవడం లేదని, సరఫరాలు పర్యవేక్షణలో గాజాకు చేరుతున్నాయని వాదిస్తోంది. అయితే తాజా ఫ్లోటిల్లా ఘటనతో ఇజ్రాయెల్ ముసుగు తొలగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అమెరికాపై చైనా, రష్యా కన్నెర్ర
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో చర్చలు జరిపిన కొద్దిగంటలకే బీజింగ్ వేదికగా సమావేశమైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లు ముక్తకంఠంతో పశ్చిమాసియా యుద్ధాన్ని తప్పుబట్టారు. ఇరాన్పై దండెత్తిన అమెరికా, ఇజ్రాయెల్ యుద్దకాంక్షను ముక్తకంఠంతో ఖండించారు. బాధిత ఇరాన్కు మద్దతుగా నిలుస్తూనే అంతర్జాతీయ చమురు సంక్షోభానికి పరోక్షంగా కారణమైన ఇరాన్నూ పుతిన్, జిన్పింగ్ తప్పుబట్టారు. ఏకపక్షంగా హార్మూజ్ను దిగ్బంధించిన అమెరికాతోపాటు సముద్ర మందుపాతరలు పెట్టి ముడిచమురు నౌకల రాకపోకలను స్తంభింపజేసిన ఇరాన్పై ఇరుదేశాధినేతలు మండిపడ్డారు. ఈ రెండు దేశాల మొండివైఖరితో ఇంధన సంక్షోభం తలెత్తిందని, ధరలు పెరుగుతున్నాయని ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. బీజింగ్లోని ‘గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్’లో సంయుక్త ప్రకటనలో పలు అంశాలను పుతిన్, జిన్పింగ్ ప్రస్తావించారు. ‘‘ఇరాన్పై దండెత్తి అమెరికా, ఇజ్రాయెల్ పశ్చిమాసియాలో అస్థిరతకు మరింత ఆజ్యంపోశారు. ట్రంప్ ప్రతిపాదిత గోల్డెన్డోమ్ షీల్డ్ రక్షణ ప్రణాళిక అంతర్జాతీయ భద్రతపై దుష్ప్రభావం చూపుతుంది. ఇకనైనా పశ్చిమాసియాలో శత్రుత్వం సమసిపోయి శాంతిస్థాపన జరగాలి’’ అని సంయుక్త ప్రకటనలో పుతిన్, జిన్పింగ్ ఆశాభావం వ్యక్తంచేశారు. అంతకుముందు జిన్పింగ్ మాట్లాడారు. చైనా, రష్యాల మధ్య హద్దుల్లేని దృఢానుబంధం కొనసాగుతోందని జిన్పింగ్ వ్యాఖ్యానించారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా చైనాకు విచ్చేసిన రష్యా అధ్యక్షుడు పుతిన్తో బుధవారం బీజింగ్లో ఆ దేశాధ్యక్షుడు జిన్పింగ్ విస్తృతస్థాయిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జిన్పింగ్ ప్రసంగించారు. ‘‘పశ్చిమాసియాలో శత్రుత్వాలు తక్షణం సమసిపోవాలి. గల్ఫ్ మొదలు పశ్చిమాసియాదాకా యుద్ధాలు ఆగిపోవాలి. ఈ మేరకు చర్చలు, సంప్రతింపుల ప్రక్రియను మరింత వేగవంతంచేయాలి. సంక్షోభం సమసిపోతే ఇంధన సరఫరా, పారిశ్రామిక, సరఫరా గొలుసులు మెరుగవుతాయి. అంతర్జాతీయ వాణిజ్యం మళ్లీ గాడినపడుతుంది’’అని జిన్పింగ్ అన్నారు. రష్యాతో బంధంపై జిన్పింగ్ ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘పుతిన్ చైనాకు రావడం ఇది 25వ సారి. చైనా–రష్యా సత్సంబంధాన్ని పుతిన్ పర్యటనలు రుజువుచేస్తున్నాయి. కీలక అంశాలపై పుతిన్ బృందంతో విస్తృతస్థాయిలో లోతైన చర్చలు జరిపా. వ్యూహాత్మక చర్చలు ఫలవంతమయ్యాయి. చక్కటి స్నేహపూర్వక ఇరుగుపొరుగు దేశాలుగా మరింత మెరుగైన సహకారం కోసం సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం కీలక అంశాల్లో ఏకాభిప్రాయానికొచ్చాం. చైనా, రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఈ ఏడాదితో 30 వసంతాలు పూర్తయ్యాయి. ఇంధన భద్రత, డిజిటల్ ఆర్థికవ్యవస్థ, కృత్రిమ మేధ, నవ్య సాంకేతికతల ఆవిష్కరణలో మరింతగా సమష్టిగా దూసుకెళ్లబోతున్నాం’’అని జిన్పింగ్ వ్యాఖ్యానించారు.బంధం సమున్నత శిఖరాలకు: పుతిన్‘గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్’లో తర్వాత పుతిన్ ప్రసంగించారు. ‘‘జిన్పింగ్ నా చిరకాల మిత్రుడు. చైనాలో ఒకసామెత ఉంది. ఒక్క రోజు ఎడబాటు కూడా మూడు వసంతాలను కోల్పోయిన భావన కల్గుతుంది. చైనా, రష్యాల బంధం అలాంటిదే. జిన్పింగ్ను మళ్లీ కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. పాతికేళ్ల ఇరుదేశాల ‘చక్కటి పొరుగుదేశాల, స్నేహపూర్వక, సహకారం ఒప్పందం’ను మరింతగా విస్తరించేందుకు చైనా ఉత్సాహం కనబరుస్తోంది. ఇరుదేశాల బంధం సమున్నత శిఖరాలకు చేరుతోంది’’అని పుతిన్ అన్నారు. -
నదీజలాల్లో తగ్గిపోతున్న ఆక్సిజన్
శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగంతో అంతర్జాతీయంగా ఉష్ణోగ్రతలు ఎగసి వాతావరణ మార్పులు సర్వసాధారణమవుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ ధాటికి వర్షాలు తగ్గి పంటదిగుబడి దారుణంగా పడిపోయి ప్రజలకు ఆకలికష్టాలు మరింత ఎక్కువవుతున్నాయి. వాతావరణ మార్పులు అనేవి ఒక్క మానవాళికే కాదు జలచరాలకూ కొత్త పెనుసమస్యగా దాపురించిందని అంతర్జాతీయ అధ్యయనం ఒకటి హెచ్చరికలు చేసింది. ఉష్ణోగ్రతలు పెరగడంతో నదీజలాల ఉపరితల ఉష్ణోగ్రతలు హెచ్చుతున్నాయని దీంతో నదీజలాల నుంచి ఆక్సిజన్ నెమ్మదిగా అదృశ్యమవుతోందన్న ప్రమాదహెచ్చరికలను చైనాలోని శాస్త్రవేత్తలు సాక్ష్యాధారాలసహితంగా వెల్లడించారు. 1985 ఏడాది నుంచిచూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 21,000 ప్రధాన నదుల్లో ఆక్సిజన్ స్థాయిలు నెమ్మదిగా తగ్గుతున్నాయని అధ్యయనంలో తేలింది. 1985 ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం ముఖ్యమైన నదీజలాల్లో ఆక్సిజన్ 2.1 శాతం తగ్గిందని వెల్లడైంది. ఉష్ణోగ్రతలు ఇలాగే అత్యధిక స్థాయిల్లో కొనసాగితే నదీజలాల్లో ఆక్సిజన్ క్షీణత మరింత పెరిగే ఆస్కారముంది. ఆక్సీజన్ తగ్గిపోతే ప్రాణవాయువును పీల్చి బతికే జలచరాల మనుగడే ప్రశ్నార్థకమంగా మారే ప్రమాదముంది. ఈ పరిశోధన తాలూకు వివరాలు ‘సైన్సెస్ అడ్వాన్సెస్’జర్నల్లో శుక్రవారం ప్రచురితమయ్యాయి. ఆమ్లజని గాఢత తగ్గుతూ పోతే వచ్చే శతాబ్దంచివరినాటికి తూర్పు అమెరికా మొదలు భారత్ దాకా ఉష్ణమండల ప్రాంతాలు దేశాల్లో నదుల్లో చేపల వంటి జలచరాల సంఖ్య దారుణంగా పడిపోతాయి. అప్పుడు నదీజలాల్లో వెతికినా ఒక్క చేప కూడా దొరకదని అధ్యయనం ముందస్తు ప్రమాదఘంటికలు మోగించింది. సాధారణంగా భౌతిక, రసాయన శాస్త్ర భావనల ప్రకారంచూసినా వేడి నీటిలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మానవప్రేరేపిత వాతావరణ మార్పుల ప్రభావం అతిగా ఉంటుందని, ఇలాంటి సందర్భాల్లో ఆయువు పోయాల్సిన ఆమ్లజనికి మనిషే స్వయంగా ఆయువు తీస్తున్నాడని నివేదిక ఘాటు వ్యాఖ్యలుచేసింది. ప్రస్తుతమున్న క్షీణతరేటును పరిగణనలోకి తీసుకుంటే ఈ శతాబ్దంచివరినాటికి నదుల్లో ఆక్సిజన్ 5 శాతం తగ్గిపోయే అవకాశముంది. నదులపై ఆధారపడే వాళ్లకు కష్టం మత్స్యకారులకు, మత్స్యసంబంధ వృత్తులతో జీవనం సాగించే జనాభాకు ఆర్థిక కష్టాలు పెరుగుతాయని ఈ పరిశోధనలో కీలక రచయిత, నంజియాంగ్ సిటీలో చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో ఎన్విరాన్మెంటల్ విభాగ శాస్త్రవేత్త క్వీ గువాన్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘నదుల్లో ఆక్సిజన్ తగ్గిపోతే దానిని డీఆక్సిజనరేషన్గా పిలుస్తాం. ఇది చేపల సంతతిపై, వాటి మనుగడపై దుష్ట్రభావం చూపిస్తుంది. నాణ్యమైన ఆక్సిజన్ లేకపోతే జలచరాల ఉనికి ప్రమాదంలో పడుతుంది. చేపలు, రొయ్యలు, ఇతరత్రా చలజరాల దిగుబడి తగ్గిపోతే మత్స్యకారులతోపాటు మత్స్యరంగం అభివృద్ధి సైతం కుంటుబడుతుంది. ఇది పరోక్షంగా ఆయా దేశాల జీడీపీపైనే ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆక్సిజన్ క్షీణతరేటు విపరీతంగా పెరిగిపోతే నదీమతల్లులు చివరకు జలచరాల మృత్యుకుహరాలుగా రూపాంతరంచెందుతాయి. గల్ఫ్ ఆఫ్ మెక్సికో, చీసాపీక్ బే, లేక్ ఎరీ లాంటి ప్రాంతాల్లో చేపలు కనీసం శ్వాసించే పరిస్థితి ఉండదు. ఒకప్పుడు మత్స్యసంపదకు ఆలవాలమైన ప్రాంతాలన్నీ డెడ్ జోన్లుగా మిగిలిపోతాయి’’అని శాస్త్రవేత్త హెచ్చరించారు. గంగానది మరింత దారుణం ‘‘పారిశ్రామిక విప్లవం ముందునాటితో పోలిస్తే ప్రపంచ ఉష్ణోగ్రతల్లో సగటు మరింత పెరుగుతున్న ఈ రోజుల్లో గంగానదిలో ఆక్సిజన్ పాళ్లు ఏకంగా 20 రెట్లు ఎక్కువ వేగంతో క్షీణిస్తున్నాయి. తూర్పు అమెరికా, ఆర్కిటిక్, భారత్, దక్షిణ అమెరికాలోని నదుల్లో ఈ శతాబ్దం చివరినాటికి ఆక్సిజన్ దాదాపు 10 శాతం క్షీణించనుంది. బ్రెజిల్లోని అమెజాన్ వంటి ఉష్ణమండల నదుల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 1980 నుంచి చూస్తే అమెజాన్ నదిలో ఆక్సీజన్లేని డెడ్జోన్ ప్రాంతాల్లో రోజుల సంఖ్య ప్రతి దశాబ్దానికి అదనంగా 16 రోజులు పెరుగుతూ పోతోంది’’అని శాస్త్రవేత్త క్వీ గువాన్ తెలిపారు. అందరి ఆయువును నిలబెట్టే ఆక్సీజన్ను నదుల్లో నిలుపుకోవాల్సిన బాధ్యత అన్ని దేశాలపై ఉందని శాస్త్రవేత్తలు హితబోధచేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బంధం బలోపేతం
రోమ్: భారత్, ఇటలీ మధ్య బంధం మరింత బలపడింది. ఇరుదేశాలు తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకున్నాయి. పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2029 నాటికల్లా 20 బిలియన్ యూరోలకు చేర్చాలని నిర్ణయించుకున్నాయి. రక్షణ పారిశ్రామిక రోడ్మ్యాప్ను ఖరారు చేశాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలొనీ బుధవారం రోమ్లో సమావేశమయ్యారు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవాలని తీర్మానించారు. పశ్చిమాసియా సంక్షోభం, తద్వారా ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలపై మోదీ, మెలొనీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ ఉద్రిక్తతలు సాధ్యమైనంత త్వరగా చల్లారాలని ఆకాంక్షించారు. శాశ్వతమైన శాంతి సాధనకు చర్చలు, దౌత్య మార్గాలే శరణ్యమని తేల్చిచెప్పారు. హార్మూజ్ జలసంధిని తక్షణమే తెరవాలని, స్వేచ్ఛాయుత నౌకాయానానికి వీలు కల్పించాలని ఇరువురు నేతలు విజ్ఞప్తి చేశారు. ఎఫ్టీఏను త్వరగా అమలు చేయాలి కొన్ని నెలల క్రితం ఖరారైన భారత్–ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ) ద్వారా లభించే అవకాశాలను సది్వనియోగం చేసుకోవాలని మోదీ, వెలొనీ నిర్ణయానికి వచ్చారు. ఆ ఒప్పందాన్ని త్వరగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. జార్జియా మెలొనీతో భేటీ అనంతరం మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్, ఇటలీ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేర్చినందుకు చాలా సంతోషిస్తున్నానని తెలిపారు. ‘భారత్–ఇటలీ సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025–29’మన భాగస్వా మ్యానికి ఆచరణాత్మక, భవిష్యత్ దృష్టితో కూడిన ఫ్రేమ్వర్క్ను అందిస్తుందన్నారు. ఉమ్మడి ప్రయత్నాల ద్వారా ఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 20 బిలియన్ యూరోల లక్ష్యం వైపు వేగంగా దూసుకుపోతోందని హర్షం వ్యక్తంచేశారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో నౌకాయాన స్వేచ్ఛ ఉండాలని మెలొనీ స్పష్టంచేశారు. ఆ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ఆధిపత్యాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. భారత్–ఇటలీ సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యం నుంచి ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి చేరడం సంతోషంగా ఉందన్నారు. సాంకేతికత, ఆవిష్కరణలే చోదక శక్తులు భారత్–ఇటలీ సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025–29ని సమీక్షించి, ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వం అందించేందుకు విదేశాంగ మంత్రుల నేతృత్వంలో ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి భారత్, ఇటలీ అంగీకరించాయి. వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పరిశోధన, నూతన ఆవిష్కరణలు, ఇంధనం, కృత్రిమ మేధ(ఏఐ), అరుదైన సాంకేతికతలు, విద్య, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాల విషయంలో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని మోదీ, మెలోనీ నిర్ణయించారు. రెండుదేశాల భాగస్వామ్యానికి సాంకేతికత, ఆవిష్కరణలే చోదక శక్తులు అని మోదీ స్పష్టంచేశారు. ఏఐ, క్వాంటం, అంతరిక్షం, పౌర అణుశక్తి వంటి రంగాల్లో పరస్పర సహకారానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రెండు దేశాల్లోని స్టార్టప్లు, పరిశోధనా కేంద్రాలు, పరిశ్రమలను అనుసంధానించడానికి ఇండియా–ఇటలీ ఇన్నోవేషన్ సెంటర్పై పనిచేస్తున్నామని వివరించారు. రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య సన్నిహిత సహకారం పరస్పర విశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు. సముద్ర భద్రతా సహకారం, సమన్వయం, సమాచార మారి్పడి, ఉత్తమ పద్ధతులను పెంపొందించే లక్ష్యంతో సముద్ర భద్రతపై ఒక కార్యాచరణ ప్రారంభించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. కొలోజియం సందర్శనమోదీ మంగళవారం రాత్రి ఇటలీకి చేరుకున్నారు. ప్రధాని మెలొనీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మోదీ గౌరవార్థం ప్రత్యేక విందు ఇచ్చారు. తర్వాత రోమ్లోని ప్రాచీన కట్టడం కొలోజియంను ఇరువురు నేతలు కలిసి సందర్శించారు. వేర్వేరు కీలక అంశాలపై తాము అభిప్రాయాలను పంచుకున్నామని మోదీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఇదిలా ఉండగా>, ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మాలారెల్లాతో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, కీలక ఖనిజాలు, ఏఐ, అంతరిక్షం, అణుశక్తి వంటి రంగాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకోవడంపై చర్చలు జరిపారు. మోదీ యూరప్ పర్యటన బుధవారం ముగిసింది. ప్రధాని మోదీకి ఎఫ్ఏఓ అగ్రికోలాప్రధాని మోదీకి ప్రతిష్టాత్మక పతకం లభించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏఓ) ఆయనను అగ్రికోలా మెడల్తో సత్కరించింది. ఆహార భద్రత, సుస్థిర వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో చేసిన విశేషమైన కృషికి గాను మోదీకి ఈ ప్రతిష్టాత్మక పతకం దక్కింది. బుధవారం రోమ్లో ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఖూ డాంగ్యూ చేతుల మీదుగా మెడల్ అందుకున్నారు. ఈ గౌరవం ఆహార భద్రత, సుస్థిరాభివృద్ధి పట్ల భారతదేశానికి ఉన్న అచంచలమైన నిబద్ధతను, వ్యవసాయ రంగంతో సంబంధం ఉన్నవారి కృషిని ప్రతిబింబిస్తోందని మోదీ వెల్లడించారు. ఇది భారతదేశంలోని రైతులు, పశుపోషకులు, మత్స్యకారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, కార్మికులకు దక్కిన గొప్ప గౌరవమని అభివర్ణించారు.మెలొనీకి ‘మెలొడీ’ గిఫ్ట్ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని మెలొనీకి మెలొడీ చాక్లెట్ల ప్యాకెట్ను బహుమతిగా ఇచ్చారు. ఇందుకు గాను మోదీకి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. ‘‘ప్రధాని మోదీ నా కోసం మంచి బహుమతి తీసుకొచ్చారు. చాలాచాలా మంచి చాక్లెట్లు తెచ్చారు. మెలొడీ అందించారు. ఆయన ఇచ్చిన బహుమతికి ధన్యవాదాలు’’అని పేర్కొన్నారు. తనకు అందిన బహుమతిని చూపిస్తూ మెలొనీ సరదాగా ‘మెలొడీ’అనడంతో మోదీ బిగ్గరగా నవ్వేశారు. మోదీ, మెలొనీలకు మెలొడీతో అనుబంధం ఉంది. ఇద్దరి పేర్ల కలయికతో ఏర్పడిన ‘మెలొ డీ’అనే హ్యాష్ట్యాగ్ను 2023లో దుబాయ్లో జరిగిన కాప్ సదస్సు సందర్భంగా ఇటలీ ప్రధానమంత్రి సృష్టించారు. ఆ తర్వాత పలు కార్యక్రమాలలో ఇద్దరు నాయకుల మధ్య జరిగిన ఆత్మీయ సంభాషణల కారణంగా ఈ పదం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 10 అవగాహన ఒప్పందాలు మోదీ–మెలోని చర్చల అనంతరం సైనిక హార్డ్వేర్, ప్లాట్ఫారమ్ల సహ–అభివృద్ధి, సహ–ఉత్పత్తికి మార్గం సుగమం చేస్తూ భారత్, ఇటలీ దేశాలు ఒక రక్షణ పారిశ్రామిక రోడ్మ్యాప్ను ఆవిష్కరించాయి. అంతేకాకుండా ఉన్నత విద్య, ఇటలీకి భారతీయ నర్సుల రాకపోకల కోసం ఇరు దేశాలు కొత్త ఫ్రేమ్వర్క్ను ఖరారు చేశాయి. అరుదైన ఖనిజాలు, వ్యవసాయం, సముద్ర రవాణా, సముద్ర ఉత్పత్తులు తదితర రంగాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా 10 అవగాహనా ఒప్పందాలపై(ఎంఓయూ) భారత్, ఇటలీ సంతకాలు చేశాయి. -
యాప్ద్బాంధవులు
సమస్యను అందరూ గుర్తిస్తారు. కానీ, దాని పరిష్కార మార్గాలను కొందరే కనుగొంటారు. వారు మార్గదర్శకులుగా నిలుస్తారు. ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం, దాడులతో గాజా విధ్వంసమైంది. ఆ ప్రాంతమంతా సంక్షోభంలో నిండిపోయింది. ఆ సంక్షోభంలోనూ కొత్త దారులేస్తూ ఆశలు చిగురింపజేస్తున్నారు అక్కడి యువత. సాంకేతికతతో తమ దేశ పునర్నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారు. అవకాశాలు కోల్పోయినందుకు నిరాశతో ఊసురోమని కూర్చోకుండా తామే కొంతమందికి అవకాశం కల్పిస్తున్నారు. గాజా నగరంలోని ‘తాకత్’వర్క్ స్పేస్లో ఓ మూలన లాప్టాప్తో కూర్చుని సీరియస్గా పనిచేసుకుంటోంది 23 ఏళ్ల సజా అల్ ఘాల్. ఆమె మరో దేశంలోని కంపెనీ కోసం పనిచేయడంలేదు. పాలస్తీనా ప్రజల ఎదుర్కొంటున్న కష్టాలను పరిష్కరించడానికి పనిచేస్తోంది. తన సొంత మొబైల్ యాప్ను డెవలప్ చేస్తోంది. ఆమె డెవలప్ చేస్తున్న యాప్ పేరు ‘వాసెల్నీ’(డబ్ల్యూఏఎస్ఈఎల్ఎన్ఐ). అంటే అరబిక్లో ‘నా గమ్యాన్ని చేరడంలో నాకు సహాయం చేయండి’అని అర్థం. యుద్ధం తరువాత పాలస్తీనాలో పెరిగిన రవాణా ఖర్చులను తగ్గించడానికి రూపొందించిన రవాణా యాప్. ఈ యాప్ వల్ల ప్రయాణాలను ఒకరితో ఒకరు పంచుకోవచ్చు. ఉదాహరణకు, ఉదయం 8 గంటలకు అల్–షిఫా నుంచి మధ్య గాజా నగరంలోని అస్–సరయాకు ఎవరైనా ఒక ప్రయాణాన్ని ప్రతిపాదించవచ్చు. ఆ తర్వాత అటుగా వెళ్లాల్సి ఉన్న ఇతర వ్యక్తులు కూడా అదే ప్రయాణంలో చేరే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఖర్చును పంచుకోవచ్చు. జస్ట్ లైక్ క్యాబ్ షేరింగ్ అన్నమాట. తప్పిపోయిన వస్తువులు... సజా తరహాలోనే యుద్ధ సమయంలో సర్వసాధారణమైన మరో సమస్యపై దృష్టి పెట్టారు 26 ఏళ్ల ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ గ్రాడ్యుయేట్ బహా అల్మల్లాహి. యుద్ధ సమయంలో ప్రజలు సర్వం కోల్పోయారు. వ్యక్తిగత వస్తువులు, అధికారిక పత్రాలు, ఫోన్లు, బ్యాగులు.. మరెన్నో. వాటి ఖరీదు ఎక్కువేం కాకపోవచ్చు. కానీ, వాటి విలువ ఎక్కువ. జీవితంలో ఎంత ప్రాముఖ్యత ఉన్న వస్తువులై ఉంటాయి. అలా పోగొట్టుకున్న వస్తువుల గురించి సోషల్ మీడియా వేదికల్లో విజ్ఞప్తులు వెల్లువెత్తుతుండటం బహా గమనించారు. పోగొట్టుకున్న, లేదా దొరికిన వస్తువుల కోసం ఒక ప్రత్యేక డిజిటల్ వేదికను సృష్టించాలనే ఆలోచన అతనికి వచి్చంది. అలా డెవలప్ అయ్యిందే ‘రజ్జా’లి’. అంటే అరబిక్లో ‘నాకు తిరిగివ్వండి’అని అర్థం. ‘మీకు ఏదైనా దొరికినా లేదా మీరేమైనా పోగొట్టుకున్నా.. దానికోసం ఇక్కడ వెతకండి’అని అన్నాడు. అయితే, ఈ ప్రాజెక్ట్ అక్కడితో ఆగలేదు. యుద్ధం నిరాశ్రయులను చేస్తుండటంతో గాజాలో వలసలు రోజురోజుకు పెరిగాయి. ఈ క్రమంలో కిక్కిరిసిన జనాల మధ్య తమ ఆతీ్మయులను కోల్పోతున్నారు. అలా తప్పిపోయిన పిల్లల కేసులను కూడా చేర్చడానికి భవిష్యత్తులో ఈ ప్లాట్ఫారమ్ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు. ఒక నిర్దిష్ట ప్రాంతంలో పిల్లలు తప్పిపోతే, వెంటనే వారి ఫొటో వివరాలతో వెంటనే సమీప ప్రాంతాల ప్రజలకు తక్షణం తెలపడానికి ఈ యాప్ రూపొందించారు. అనేక అడ్డంకులు.. అయితే, యాప్ను రూపొందించడంతో సగం పని మాత్రమే పూర్తయ్యింది. వాటిని జనంలోకి విస్తతంగా తీసుకెళ్లడం అసలైన టాస్్క. ఉదాహరణకు, సజా రూపొందించిన వాసెల్నీ యాప్ను ఒక వ్యక్తి తెరిచి, అదే సమయంలో అదే మార్గంలో ప్రయాణించడానికి తక్కువ మంది ఉండటమో, అసలు లేకపోవడమో జరిగితే.. అతను ఆ యాప్పై విముఖత చూపే అవకాశం ఉంది. అందుకే దీన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి, డ్రైవర్లను ధృవీకరించడానికి స్థానిక అధికారుల ఆమోదం అవసరమని సజా అంగీకరిస్తున్నారు. పోగొట్టుకున్న పత్రాలను కనుగొనడానికి తన ప్లాట్ఫామ్ను విశ్వసించాలంటే అధికారిక సంస్థల సహకారం అవసరమని బహా చెబుతున్నారు. ఇదంతా వారికి ఆర్థిక భారంగా మారింది. ఎందుకంటే, కొత్త ప్రాజెక్టులు ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలపై ఆధారపడుతున్నాయి. వీటి కొనుగోలు చాలా ఖరీదైన పని. శిక్షణా కేంద్రంగా.. అయితే కేవలం పనిచేసుకోవడానికి కొన్ని సదుపాయాలు, స్థలం మాత్రమే కల్పిస్తే సరిపోదని తొందర్లోనే అర్థమైంది. గాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచ టెక్ ప్రపంచం నుంచి యుద్ధం వేరు చేసింది. రెండేళ్లలో టెక్ ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతుండగా, గాజాలోని యువత ప్రాణాలు కాపాడుకోవడానికి కష్టపడాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగవంతమైన విజృంభణతో.. గాజాలో ప్రోగ్రామర్లు ప్రపంచ మార్కెట్ డిమాండ్లను అందుకోవడంలో వెనుకబడ్డారు. ఈ అంతరాన్ని పూడ్చే శిక్షణా కార్యక్రమాలపై దృష్టి పెట్టడం ప్రారంభించింది. ఫలితంగా, విశ్వవిద్యాలయాలు, స్థానిక, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యంతో ‘తాకత్’ఒక కార్యక్షేత్రం నుంచి శిక్షణనిచ్చే ఇంక్యుబేషన్ కేంద్రంగా రూపాంతరం చెందింది. వీరి నుంచే కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. తమ ప్రత్యక్షంగా ఎదుర్కొనే సమస్యల అనుభవాల నుంచే ఈ పరిష్కార మార్గాలు కనిపెట్టారు విద్యార్థులు. అయినప్పటికీ, ఈ ప్రాజెక్టులకు మోక్షం కలగాలంటే పెట్టుబడి అవసరం. డెవలపర్లు ప్రధాన ఆర్థిక, సాంకేతిక అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. వారి ప్రతిభను ఆచరణలోకి తీసుకురావడానికి పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగులకు ‘తాకత్’... యుద్ధం ప్రారంభమైన తర్వాత చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఆ తరువాత అవకాశాల కోసం ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇక, ఉన్నా.. విద్యుత్ అందుబాటులో లేకపోవడం, ఇంటర్నెట్ అంతరాయాలతో ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. అవి విలాస వస్తువులుగా మారిపోయాయి. కేవలం విద్యుత్, ఇంటర్నెట్ ఉన్న చోటుకోసం నెలకు రెండొందల షెకెల్స్.. అంటే దాదాపు ఏడువేలు. అలాంటి వారికోసమే కో వర్కింగ్స్పేస్ స్థాపించారు సీఈఓ, ఇంజనీర్ అయిన షరీఫ్ నయీమ్. దాని పేరు ‘తాకత్’. ‘యుద్ధం ప్రారంభంలో మౌలిక సదుపాయాలు ధ్వంసవ్వడంతో చాలాకాలం పాటు కమ్యూనికేషన్లు, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వేలాది మంది ఫ్రీలాన్సర్లు, ప్రోగ్రామర్లు పనిచేసే అవకాశం కోల్పయారు. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొందరు అంతర్జాతీయ కాంట్రాక్టులను పోగొట్టుకున్నారు. పవర్ లేక కొందరు ఆన్లైన్ సమావేశాలకు హాజరు కాలేకపోయారు. వారందరికీ పనిచేసుకునే అవకాశం కల్పించాలనే లక్ష్యంతో గాజాలో ‘తకాత్’స్థాపించాను’అని నయీమ్ చెబుతున్నారు. యుద్ధ సమయంలో గాజా నగరంలో ఏర్పాటైన ఇది క్రమంగా నుసైరత్, డెయిర్ అల్–బలాహ్ సహా అనేక ప్రాంతాలకు విస్తరించింది. గాజా నగరంలో తన ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించి, సుమారు 250 మంది ఫ్రీలాన్సర్లు, ప్రోగ్రామర్లకు వసతి కల్పించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
42 యుద్ధవిమానాలను కోల్పోయిన అమెరికా
వాషింగ్టన్: యుద్ధంలో ఇరాన్ వాయుసేన ను చావుదెబ్బ తీశామని గొప్పలు చెప్పకునే అమెరికా సైతం రణరంగంలో భారీస్థాయిలో ఆయుధాలు, యుద్దవిమా నాలను కోల్పోయిందని అమెరికా చట్టసభలు వెలువర్చిన ఒక నివేదిక ద్వారా వెల్లడైంది. అమెరికా చట్టసభల లైబ్రెరీలో భాగమైన కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్(సీఆర్స్)లోని విదేశాంగ, యుద్ధ, వాణిజ్యవిభాగంలోని విషయనిపుణులు, పరిశోధకులు, న్యాయవాదులు సంయుక్తంగా పారదర్శకంగా ఈ నివేదికను రూపొందించారు. నివేదిక ప్రకారంఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరిట ఫిబ్రవరి 28న అమెరికా మొదలెట్టిన ఇరాన్ యుద్ధంలో మొత్తంగా 42 యుద్ధవిమా నాలను ట్రంప్ బలగాలు కోల్పోయాయి. ఇందులో ఎఫ్–15ఈ స్ట్రైక్ ఈగల్ యుద్ధవిమానాలు, ఎఫ్–35ఏ లైట్నింగ్–2 యుద్ధవిమానం, ఏ–10 థండర్బోల్ట్–2 భూతలదాడుల యుద్ధ విమానం, కేసీ–135 స్ట్రాటోట్యాంకర్ ఇంధన విమానం, ఈ–3 సెంట్రీ అవాక్స్ నిఘా, పర్యవేక్షణ కమాండ్ విమానం, ఎంసీ–130జే కమాండో–2 ప్రత్యేక ఆపరేషన్ల విమానం, హెచ్హెచ్–60 డబ్ల్యూ జోలీ గ్రీన్2 హెలికాప్టర్, 24 ఎంక్యూ–9 రీపర్ డ్రోన్లు, ఎంక్యూ–4సీ ట్రైటన్ డ్రోన్లు ఉన్నాయి. యుద్ధవిమా నాలు, వాహనాలు, మందుగుండు, సాయుధ ఉపకరణాలు మొత్తంగా కలిపి ఇప్పటిదాకా రూ.2.81 లక్షల కోట్ల విలువైన రక్షణరంగ ఆస్తులను కోల్పోయినట్లు నివేదిక వెల్లడించింది. -
విమానాల కూల్చివేత కేసు.. రావుల్ కాస్ట్రోకు అమెరికా షాక్
అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది. 1996 నాటి అమెరికా పౌర విమానాల కూల్చివేత కేసులో క్యూబా మాజీ అధ్యక్షుడు రావుల్ కాస్ట్రో (94) పై ఫ్లోరిడా ఫెడరల్ కోర్టులో క్రిమినల్ అభియోగాలు నమోదు అయ్యాయి. దీంతో అధికారికంగా విచారణ ప్రారంభమైంది.ఈ చార్జ్షీట్ విడుదలైన కొద్ది గంటల్లోనే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో క్యూబా ప్రజలను ఉద్దేశించి ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. క్యూబాను కొన్ని దశాబ్దాలుగా పీడిస్తున్న కాస్ట్రో కుటుంబ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడి, ఒక కొత్త మార్గాన్ని ఎంచుకోవాలని అక్కడి ప్రజలకు పిలుపు నిచ్చారు. ఇదే విషయంపై అమెరికా తాత్కాలిక అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె మయామిలో మాట్లాడుతూ.. "30 ఏళ్ల కిందట హత్యకు గురైన నలుగురు అమెరికన్ల కుటుంబాలు ఇప్పటికి న్యాయం కోసం ఎదురుచూస్తున్నాయి. వారు సాధరణ పౌరులు. వారి వద్ద ఎలాంటి ఆయుధాలు కూడా లేవు. శరణార్థులను కాపాడానికి వెళ్లిన మా పౌరులను పొట్టన పెట్టుకున్నారు. అందులో రావుల్ కాస్ట్రోది కీలక పాత్ర. అతడి అరెస్ట్ కోసం త్వరలోనే ఒక వారెంట్ జారీ చేస్తాం. కాబట్టి అతడు తనంతట తాను అమెరికాకు వస్తాడని ఆశిస్తున్నాము. లేకపోతే ఇతర మార్గాల్లో మేమే రప్పిస్తామని" ఆయన పేర్కొన్నారు.అసలు 1996లో ఏమి జరిగిదంటే?'బ్రదర్స్ టు ది రెస్క్యూ' మయామి కేంద్రంగా పనిచేసే ఒక మానవతావాద సంస్థ. అప్పటిలో క్యూబాలోని కమ్యూనిస్ట్ దారుణాలను తట్టుకోలేక చిన్న పడవల్లో సముద్రం గుండా అమెరికాకు పారిపోయే క్యూబన్ శరణార్థులను ఆకాశం నుండి గుర్తించి, వారిని రక్షించడం ఆ సంస్థ పని. ఈ సంస్థకు చెందిన మూడు చిన్న సివిలియన్ విమానాలు 1996 ఫిబ్రవరి 24న ఫ్లోరిడా జలసంధి మీదుగా ప్రయాణించాయి. అయితేఅంతర్జాతీయ జలాలపై ప్రయాణిస్తుండగా క్యూబాకు చెందిన మిగ్ యుద్ధ విమానాలు వాటిపై దాడి చేసి కూల్చివేశాయి. ఈ ఘటనలో కార్లోస్ కోస్టా, అర్మాండో అలెజాండ్రే జూనియర్, మారియో డి లా పెనా, పాబ్లో మోరల్స్ అనే నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు అమెరికా పౌరులు ఉన్నారు. ఆ సమయంలో రావుల్ కాస్ట్రో క్యూబా రక్షణ మంత్రిగా ఉన్నారు. అతడి ఆదేశాల మేరకే అమెరికా సివిలియన్ విమానాలను కూల్చివేశారని అమెరికా న్యాయశాఖ నిర్ధారించింది. దీంతో ఇన్నాళ్ల తర్వాత కాస్ట్రోపై అభియోగాలు నమోదు చేసింది. -
ఇజ్రాయెల్ ప్రధాని పదవికి పోటీ చేస్తా: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్లో తనకు తనకు విశేష ప్రజాదరణ ఉందని, తన అధ్యక్ష పదవీకాలం తర్వాత అక్కడ ప్రధానమంత్రి పదవికి పోటీ చేసే అవకాశముందని వెల్లడించారు. అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై కూడా ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు అంటూ ఆయన వ్యాఖ్యానించారునెతన్యాహు చాలా మంచి వ్యక్తి. నేను ఏం చెబితే ఆయన అది చేస్తారు. ఆయన ఒక యుద్ధ కాలపు ప్రధానమంత్రి. కానీ ఇజ్రాయెల్లో నెతన్యాహుకు సరైన గౌరవం దక్కడం లేదు. అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్లో నాకు మాత్రం 99 శాతం ప్రజాదరణ ఉంది. నేను అక్కడ ప్రధానమంత్రిగా పోటీ చేసినా గెలవగలను" అని ట్రంప్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కాగా ఇరాన్తో ఒప్పందం గురించి విలేకరులు ప్రశ్నించగా.. తనకు ఎలాంటి తొందర లేదని ట్రంప్ స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిని వెంటనే తెరిపించడమే తమ లక్ష్యమని, ఇరాన్కు మరో పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. -
అహ్మదినెజాద్ను అధికారపీఠంపై కూర్చోబెట్టాలని చూశారు
వాషింగ్టన్: వెనుజువెలాలో మదురో దంపతుల అధికారభవనంపైకి మెరుపుదాడిచేసి వాళ్లను బంధించి అధికారపీఠం నుంచికూల దోసిన అమెరికా ప్రభుత్వం అదే తరహాలో ఇరాన్లోనూ అధికార మార్పిడికి యత్నించి విఫలమైందని న్యూయార్క్ టైమ్స్ తాజాగా తన కథనంలో పేర్కొంది. ఈ మేరకు ఒక నివేదికను వెలువర్చింది. 2005 నుంచి2013 ఏడాదిదాకా ఇరాన్కు అధ్యక్షునిగా బాధ్యతలు నెరవేర్చిన మొహ్మూద్ అహ్మదినెజాద్కు తిరిగి అధికారాన్ని అప్పగించాలని అమెరికా, ఇజ్రాయెల్ ప్రయత్నించాయని నివేదిక పేర్కొంది. ఫిబ్రవరి 28వ తేదీన యుద్ధం మొదలైన తొలినాళ్లలోనే ఇరాన్ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీసహా పలువురు కీలక నేతలను వైమానిక దాడులతో అంతమొందించడం తెల్సిందే. వెనువెంటనే అహ్మదినెజాద్ ను గద్దెనెక్కించాలని అమెరికా ప్రయత్నించి నా అందుకు సానుకూలవాతావరణంలేక మిన్నకుండిపోయిందిన న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. అహ్మదినెజాద్ పరిపాలనాధోర ణిని ఏమాత్రం మెచ్చని నాటి ఖమేనీ ఆ తర్వాత ఆయనను గృహనిర్బంధంచేశారు. దీంతో శత్రువుకు శత్రువు మిత్రువు అనే చందంలో ఖమేనీ అంటే మెచ్చని అహ్మది నెజాద్ను అమెరికా, ఇజ్రాయెల్ మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించాయి. ఈ మేరకు ఆయనతో రహస్యంగా సంప్రతింపులు జరిపినట్లు తెలుస్తోంది. గృహనిర్బంధంలో ఉన్న అహ్మదినెజాద్ను విడిపించేందుకే ఫిబ్రవరి 28న ఆయనను బంధించి ఇంటి మీదా అమెరికా దాడులుచేసి ఇంటిని ధ్వంసంచేసింది. అయితే ఈ దాడిలో అహ్మదినెజాద్ గాయపడ్డారని, తర్వాత ఆయన ఎవరికీ కన్పించకుండాపోయారని వార్తలొచ్చాయి. -
బక్రీద్ కానుక.. 1400 మందికి పైగా ఖైదీల విడుదల!
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈద్ అల్ అదా (బక్రీద్) పండుగను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జైళ్లులలో మగ్గుతున్న 956 మంది ఖైదీలను విడుదల చేయాలని నహ్యాన్ ఆదేశించారు.సమాజంలో క్షమాగుణాన్ని,సోదరభావం, సామాజిక సమరసతను పెంపొందించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా వివిద కేసుల్లో శిక్ష అనుభవిస్తూ జరిమానాలు లేదా ఆర్థికపరమైన బకాయిలు చెల్లించలేక జైళ్లలోనే ఉంటున్న ఖైదీల అప్పుల మొత్తాన్ని యూఏఈ అధ్యక్షుడే స్వయంగా చెల్లించనున్నారు. దీంతో బయటకు వచ్చిన ఖైదీలు ఎలాంటి ఆర్ధిక భారం లేకుండా తమ కుటుంబాలతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. మరోవైపు అజ్మాన్ సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షేక్ హుమైద్ బిన్ రషీద్ అల్-నుఐమి కూడా తన పరిధిలోని జైళ్ల నుండి 230 మంది ఖైదీలను విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. షార్జా పాలకుడు షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి సైతం 227 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. దీంతో మొత్తం 1400కు పైగా ఖైదీలు జైళ్ల నుంచి విడుదల కానున్నారు. కాగా ప్రతీ ఏడాది రంజాన్, రంజాన్, బక్రీద్, జాతీయ దినోత్సవాల సమయంలో ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించడం యూఏఈలో ఒక ఆనవాయితీగా వస్తోంది. -
ఇరాన్తో యుద్దం.. అమెరికాకు భారీ షాక్!?
ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని ఫిబ్రవరి 28న ప్రారంభించిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'లో అమెరికాకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ సైనిక చర్యలో అమెరికాకు చెందిన అత్యాధునిక ఫైటర్ జెట్లు, నిఘా డ్రోన్లతో సహా కనీసం 42 విమానాలు పూర్తిగా ధ్వంసమవ్వడమో లేదా దెబ్బతినడమో జరిగిందని 'కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్' తన తాజా నివేదికలో వెల్లడించింది.అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఇతర భద్రతా కారణాల వల్ల ఈ నష్టం తీవత్ర ఇంకా పెరిగే అవకాశముందని సదరు నివేదిక పేర్కొంది. యూఎస్ సెంట్రల్ కమాండ్, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలు, అంతర్జాతీయ వార్త కథనాల ఆధారంగా ఈ దెబ్బతిన్న విమానాల జాబితాను సీఆర్ఎస్ సిద్దం చేసింది.ఇరాన్తో యుద్దంగా కారణంగా ద్వంసమైన వాటిలో 4 ఎఫ్-15ఇ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలు, అత్యాధునిక ఎఫ్-35ఏ లైట్నింగ్ II యుద్ధ విమానం, ఏ-10 థండర్బోల్ట్ గ్రౌండ్-అటాక్ విమానం ఉంది. వీటితోపాటు ఆకాశంలోనే ఇంధనాన్ని నింపే ఏడు కేసీ-135 స్ట్రాటోట్యాంకర్విమానాలు, ఒక ఈ-3 సెంటినరీ అవాక్స్ నిఘా విమానం, రెండు ఎమ్సి-130జే కమాండో II, ప్రత్యేక కార్యాచరణ విమానాలు, ఒక హెచ్హెచ్-60డబ్ల్యూ జాలీ గ్రీన్ II హెలికాప్టర్ ఉన్నాయి.అదేవిధంగా శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఎమ్క్యూ-9 రీపర్ డ్రోన్లు మొత్తం 24 దెబ్బతిన్నాయి. వీటితో పాటు ఒక ఎమ్క్యూ-4సీ ట్రైటాన్ నిఘా డ్రోన్ కూడా ద్వంసమైంది.ఈ నివేదికపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. అత్యంత అధునాతనమైన ఎఫ్-35 యుద్ధ విమానాన్ని కూల్చివేసిన ఘనత తమ సైన్యానిదేనని సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రకటించారు. కాగా ఇరాన్లో కొనసాగుతున్న సైనిక చర్యల అంచనా వ్యయం ప్రస్తుతం 29 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 2,42,000 కోట్లు) పెరిగినట్లు పెంటగాన్ కంప్ట్రోలర్ జూల్స్ డబ్ల్యూ హర్స్ట్ III ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
కువైట్లో ఘోర అగ్నిప్రమాదం.. ఒకే ఇంట్లో ఐదుగురు దుర్మరణం!
కువైట్లో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. జ్లీబ్ అల్ షుయూఖ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ, మంటల కారణంగా ఐదుగురు వ్యక్తులు లోపలే చిక్కుకుపోయి ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని కువైట్ అధికారిక అగ్నిమాపక సంస్థ 'జనరల్ ఫైర్ ఫోర్స్' ధృవీకరించింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోకి తీసుకువచ్చారని కువైట్ వార్తా సంస్థ (KUNA) ఓ ప్రకటనలో పేర్కొంది.అయితే ఈ ప్రమాదంలో మరణించిన ఐదుగురు వ్యక్తుల వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. కాగా ఇటీవలి కాలంలో కువైట్లోని నివాస ప్రాంతాలలో వరుస అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇళ్లలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని కువైట్ జనరల్ ఫైర్ ఫోర్స్ విజ్ఞప్తి చేసింది.చదవండి: క్షిపణులను బూడిద చేసే మరో S-400 వస్తుంది.. ఎలా తీసుకొస్తారంటే? -
క్షిపణులను బూడిద చేసే మరో S-400 వస్తుంది.. ఎలా తీసుకొస్తారంటే?
భారత వైమానిక రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే అత్యంత శక్తిమంతమైన ఆయుధం రష్యా తయారీ S-400 Triumf నాలుగో స్క్వాడ్రన్ ఈ వారం భారత్కు చేరుకోనుంది. శత్రుదేశాల క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాలను ఆకాశంలోనే కూల్చివేయగల ఈ అత్యాధునిక వ్యవస్థ రవాణా ప్రక్రియ ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఒక చిన్న టీవీ లేదా ఫ్రిజ్ సురక్షితంగా ఇంటికి ఎలా చేరుతుందో అనుకునే మనకు, ఇంత భారీ రక్షణ వ్యవస్థను రష్యా నుంచి భారత్కు ఎలా తరలిస్తారు? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది.చరిత్రాత్మక ఒప్పందం భారత్–రష్యా మధ్య 2018లో దాదాపు 5.43 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం మొత్తం ఐదు S-400 స్క్వాడ్రన్లను భారత్ కొనుగోలు చేయాల్సి ఉంది. ఇప్పటికే మూడు యూనిట్లు భారత వైమానిక దళంలో సేవలందిస్తుండగా, ఇప్పుడు నాలుగో స్క్వాడ్రన్ రాజస్థాన్ సరిహద్దుల్లో మోహరించేందుకు సిద్ధమవుతోంది. పాకిస్థాన్ వైపు నుంచి వచ్చే దీర్ఘశ్రేణి క్షిపణులు, డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు ఇది కీలకంగా మారనుంది. భారత వాయుసేన ఈ వ్యవస్థను “సుదర్శన్ చక్ర”గా అభివర్ణిస్తోంది.ఇంత భారీ రక్షణ వ్యవస్థను రష్యా నుంచి భారత్కు తీసుకురావడం సాధారణ విషయం కాదు. ఇది అత్యంత సమన్వయంతో జరిగే భారీ లాజిస్టిక్ ఆపరేషన్. సముద్ర, వాయు, రోడ్డు మార్గాలను కలిపి ప్రత్యేక వ్యూహంతో ఈ తరలింపు చేపడతారు. భారీ క్షిపణి లాంచర్లు, ట్రాన్స్పోర్టర్ వాహనాలు వంటి పరికరాలను భారీ కార్గో నౌకల ద్వారా భారత తీర ప్రాంత పోర్టులకు తరలిస్తారు. మరోవైపు కమాండ్ అండ్ కంట్రోల్ మాడ్యూల్స్, అత్యాధునిక రాడార్లు, ఇంటర్సెప్టర్ క్షిపణులు వంటి సున్నితమైన పరికరాలను రష్యా నుంచి భారీ మిలిటరీ విమానాల ద్వారా నేరుగా భారత వైమానిక దళ స్థావరాలకు చేర్చుతారు.రవాణాకు ముందు భారత వైమానిక దళ అధికారులు రష్యాలోనే ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తారు. అన్ని పరికరాలు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించిన తర్వాత వాటిని ప్రత్యేక భద్రతా కంటైనర్లలో ప్యాక్ చేస్తారు. ప్రస్తుతం భారత్కు వస్తున్న నాలుగో యూనిట్కు సంబంధించిన ఈ తనిఖీలు ఇప్పటికే పూర్తయ్యాయని సమాచారం.సాధారణంగా చాలామంది S-400 అంటే కేవలం క్షిపణులు అమర్చిన ఒక పెద్ద ట్రక్కు మాత్రమే అనుకుంటారు. కానీ వాస్తవానికి అది పూర్తి స్థాయి మొబైల్ యుద్ధ వ్యవస్థ. ఒక స్క్వాడ్రన్లో 16 ప్రత్యేక వాహనాలు ఉంటాయి. ఇందులో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, 600 కిలోమీటర్ల దూరంలో శత్రువులను గుర్తించగల రాడార్లు, లక్ష్యాలను ట్రాక్ చేసి క్షిపణులకు మార్గనిర్దేశం చేసే ఎంగేజ్మెంట్ రాడార్లు, ఎనిమిది మొబైల్ లాంచర్ యూనిట్లు, క్షిపణి రీలోడర్లు, జనరేటర్లు, మెయింటెనెన్స్ వాహనాలు ఉంటాయి. ఈ మొత్తం వ్యవస్థ కలిపి శక్తివంతమైన వైమానిక రక్షణ కవచాన్ని సృష్టిస్తుంది.భారత్కు చేరుకున్న తర్వాత అసలు ఆపరేషన్ ప్రారంభమవుతుంది. పోర్టుల వద్ద కస్టమ్స్, భద్రతా క్లియరెన్స్ పూర్తయిన తరువాత ఈ భారీ కంటైనర్లను ప్రత్యేక మిలిటరీ ట్రక్కుల ద్వారా గమ్యస్థానాలకు తరలిస్తారు. ఈ రవాణా సమయంలో భారీ భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. గగనతలంలోనూ, రోడ్లపైనూ హై అలర్ట్ ప్రకటిస్తారు. అనంతరం భారత వైమానిక దళ సాంకేతిక నిపుణులు అన్ని భాగాలను ఒక భారీ లెగో సెట్స్లా అమర్చి పరీక్షలు నిర్వహిస్తారు. అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్ధారించిన తర్వాతే ఆ వ్యవస్థను యుద్ధ సిద్ధంగా ప్రకటిస్తారు.ఐదో యూనిట్ను చైనా సరిహద్దులో ఇప్పుడున్న నాలుగో స్క్వాడ్రన్ రాజస్థాన్ సరిహద్దులో మోహరించనున్నప్పటికీ, ఈ ఏడాది నవంబర్ నాటికి ఐదో యూనిట్ కూడా భారత్కు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. దానిని చైనా సరిహద్దు ప్రాంతంలో మోహరించనున్నట్టు సమాచారం. అంతేకాదు, అదనంగా మరో ఐదు S-400 యూనిట్ల కొనుగోలుకు కూడా భారత రక్షణ కొనుగోలు మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా బహుస్థాయి “ఇండియన్ ఐరన్ డోమ్” రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడమే భారత లక్ష్యంగా కనిపిస్తోంది.ఒకసారి ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే, శత్రుదేశాల క్షిపణులు, డ్రోన్లు, ఫైటర్ జెట్లు భారత గగనతలంలోకి చొరబడటం దాదాపు అసాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. సముద్రం, గగనం, రోడ్డు మార్గాల ద్వారా అత్యంత రహస్యంగా జరిగే ఈ భారీ రవాణా వెనుక భారత సైన్యం, ప్రభుత్వం చేస్తున్న కృషి ఇప్పుడు దేశ రక్షణలో మరో కీలక అధ్యాయంగా నిలుస్తోంది. -
యుద్ధం రద్దు?. అమెరికా సెనెట్లో నెగ్గిన బిల్లు
వాషింగ్టన్, డీసీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఊహించిన ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్తో యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా కాంగ్రెస్లో ప్రవేశపెట్టిన తీర్మానం 50-47 ఓట్లతో నెగ్గింది. దీంతో ఇరాన్తో యుద్ధం విషయంలో కాంగ్రెస్ ట్రంప్పై పై చేయి సాధించింది. అయితే ఇది చట్టంగా మారడానికి ఇంకా అనేక దశలు దాటాల్సి ఉంది.ఇరాన్తో యుద్ధం ట్రంప్ పాలిట శాపంగా మారింది. ఈ తొందరపాటు నిర్ణయంతో ఇంటా, బయిటా ట్రంప్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. టెహ్రాన్పై దాడితో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తి అనేక దేశాలు ట్రంప్ను విమర్శిస్తుండగా.. మరోవైపు స్వంత దేశంలోనూ యుద్ధానికి వ్యతిరేకంగా తీర్మాణం ప్రవేశపెట్టారు.ఇరాన్పై యుద్ధం ఆపే ప్రతిపాదనను వర్జీనియా డెమెక్రట్స్ సెనేటర్ టిమ్ కెయిన్ ప్రవేశపెట్టారు. ఈ తీర్మాణానికి అనుకూలంగా 50 ఓట్లు రాగా వ్యతిరేకంగా 47 ఓట్లు వచ్చాయి. అయితే ఈ ఓటింగ్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందిన నలుగురు సభ్యులు సైతం ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయడం విశేషం. మరో ముగ్గురు సభ్యులు ఓటింగ్లో పాల్గొనలేదు. దీంతో ట్రంప్కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మాణం అమెరికన్ కాంగ్రెస్లో నెగ్గింది.అయితే ఇది కేవలం ప్రారంభదశ మాత్రమే ఇది పూర్తిస్థాయిలో అమలులోకి రావాలంటే సెనేట్లో ఓటింగ్ జరగాలి అనంతరం రిపబ్లికన్ల అధిక్యం ఉన్న ప్రతినిధుల సభలోనూ నెగ్గాలి అయినప్పటికీ అధ్యక్షుడు తన విచక్షణ అధికారాలను ఉపయోగించి వీటో చేసి దీనిని ఆపవచ్చు. ఒకవేళ వీటోని ఆపాలని అమెరికా కాంగ్రెస్ అనుకుంటే సెనెట్, ప్రతినిధుల సభ రెండింటిలోనూ 2/3 వంతు మెజార్టీతో నెగ్గాల్సి ఉంటుంది. అప్పుడు ఇరాన్పై యుద్ధాన్ని నియంత్రించేలా చట్టం చేయవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యంలా కనిపిస్తోంది.అమెరికా చట్టం ఏం చెబుతుంది.అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు కాంగ్రెస్ ఆమోదం లేకుండా కేవలం 60 రోజులు మాత్రమే సైనిక చర్యలను ప్రారంభించగలరు. ఆ తర్వాత, ఆయన యుద్ధాన్ని ముగించడమో, కాంగ్రెస్ అనుమతి కోరడమో, లేదా దళాల సురక్షిత ఉపసంహరణను నిర్ధారించడానికి అదనంగా 30 రోజులు అభ్యర్థించడమో చేయాలి. అయితే ప్రస్తుతం సీజ్ ఫైర్ నడుస్తోన్న నేపథ్యంలో ట్రంప్ ఈ చట్టం ఇరాన్ యుద్ధానికి వర్తించదని పేర్కొన్నారు. ఏదైమైనా ట్రంప్కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మాణం అమెరికా కాంగ్రెస్లో నెగ్గడం ప్రతిపక్షాలు అతిపెద్ద విజయంగా భావిస్తున్నాయి. -
మూడున్నర ఏళ్లలో అనేక సార్లు భేటీ అయ్యాం: మోదీ, మెలోనీ
రోమ్: ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీతో కలిసి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. భారత్-ఇటలీ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచుతున్నట్టు సంతోషంగా ప్రకటిస్తున్నానని చెప్పారు.‘‘గత మూడున్నర ఏళ్లలో ప్రధాని మెలోనీని ఎన్నోసార్లు కలిసే అవకాశం నాకు వచ్చింది. ఇది భారత్-ఇటలీ మధ్య ఉన్న నిరంతర సహకార బంధాన్ని ప్రతిబింబిస్తోంది. భారత్-ఇటలీ జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ 2025-2029 మా భాగస్వామ్యానికి ఆచరణాత్మక, విజన్ ఉన్న రూపాన్ని ఇస్తోంది. దీనిపై సమయపాలనతో ముందుకు సాగుతున్నాం. మా రెండు దేశాల మధ్య వాణిజ్యం 20 బిలియన్ యూరోల లక్ష్యం వైపు వెళ్తోంది. భారత్లో ఉన్న 400కు పైగా ఇటాలియన్ కంపెనీలు భారత్ అభివృద్ధిలో భాగస్వామ్యమవుతున్నాయి” అని ప్రధాని మోదీ తెలిపారు.సంయుక్త మీడియా సమావేశంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మాట్లాడుతూ.. “ఈ రోజు రోమ్లో మా సత్సంబంధాలను స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి మరింత బలపరుస్తున్నాం. ఇది రెండు దేశాల సంబంధాల్లో ఇప్పటివరకు చేరిన అత్యున్నత స్థాయి. ఇప్పుడు ఇటలీ-భారత్ గతంలో ఎప్పుడూ లేనంత దగ్గరయ్యాయని చెప్పొచ్చు. మా సంబంధాలు పూర్తి సామర్థ్యాన్ని చూపగల స్థాయికి చేరుకున్నాయి. గత మూడున్నర ఏళ్లలో ప్రధాని మోదీతో నేను ఏడు సమావేశాలు నిర్వహించాను. ఆ సమయంలో ఒకరినొకరం, మా అభిప్రాయాలను లోతుగా తెలుసుకున్నాం. గౌరవం, పరస్పర నమ్మకంపై నిలిచిన నిజాయితీ స్నేహాన్ని కూడా నిర్మించుకున్నాం. ఇన్నేళ్ల పాలన తర్వాత కూడా ప్రజల్లో ప్రధాని మోదీకి ఉన్న ఆదరణ చూసి ఆయన దూరదృష్టి, ఆచరణాత్మకత, నాయకత్వాన్ని నేను వ్యక్తిగతంగా మెచ్చుకున్నాను. మా స్నేహం వేగంగా కలిసి పనిచేయడంలో ఎంతో సహాయపడింది” అన్నారు. -
మళ్లీ యుద్ధం: ఇప్పుడు ట్రంప్ ముందున్న 2 మార్గాలివే..
ఇరాన్తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారా? ఇది అమెరికా బలహీనతా? లేక దౌత్య చర్చల దిశగా అడుగా? ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? దాడులు చేస్తామని చెప్పిన ట్రంప్ మరోసారి యూ-టర్న్ ఎందుకు తీసుకున్నారు?అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి కొన్ని గంటల్లోనే భిన్న సంకేతాలు వచ్చాయి. మొదట ఇరాన్పై దాడి చేస్తామని చెప్పారు. తర్వాత సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్ విజ్ఞప్తి చేయడంతో జరగాల్సిన దాడిని వాయిదా వేశారు. దీనిపై పలువురు విశ్లేషకులు వివరించిన అంశాలను చూద్దాం.. ట్రంప్ ముందున్న మార్గాలు రెండు మాత్రమే. ఒకటి ఇరాన్కు రాయితీలు (ఆంక్షల ఎత్తివేత వంటి వెసులుబాట్లు) ఇవ్వడం. అంటే యుద్ధంలో ఓడిపోయామని చెప్పకనే చెప్పడం. గతంలో వియత్నాం, అఫ్గానిస్తాన్ యుద్ధాల్లో కూడా ఇటువంటిదే జరిగింది. కానీ, ఓటమిని అంగీకరించడం అమెరికాకు కష్టమే. మరో మార్గం మళ్లీ దాడులు మొదలుపెట్టడం. అమెరికాలోని నియోకాన్ (కఠిన విదేశాంగ విధానాన్ని సమర్థించే రాజకీయ వర్గం) వర్గాలు, ఇజ్రాయెల్ మరింత ఒత్తిడి పెడితే ఇరాన్ వెనక్కి తగ్గుతుందని భావిస్తున్నాయి. కానీ అది అంత సులువు కాదు.ట్రంప్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇలాంటి మార్పులు పలుసార్లు చేశారు. ఫిబ్రవరి 28న 48 గంటల్లో ఇరాన్ ప్రజా మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని ప్రకటించారు. తర్వాత గడువు పెంచారు. అనంతరం మళ్లీ పెంచారు. ఈ సారి మాత్రం పాకిస్థాన్ వల్ల కాదు.. యూఏఈ, ఖతర్, సౌదీ అరేబియా విజ్ఞప్తి కారణంగా ట్రంప్ నిర్ణయం వాయిదా పడింది.ఈ యుద్ధాన్ని అర్థం చేసుకోవాలంటే మొత్తం పరిస్థితిని చూడాలి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి యుద్ధం మొదలుపెట్టాయి. అప్పట్లో ట్రంప్ లక్ష్యాల్లో ఇరాన్ పాలనా మార్పు, క్షిపణి సామర్థ్యాల నిర్మూలన కూడా ఉన్నాయి. కానీ దాడుల తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ ఏ లక్ష్యాన్నీ సాధించలేకపోయాయి.అంతేకాదు, ఇరాన్ హార్మూజ్ ప్రాంతంపై ఆధిపత్యం సాధించింది. దీంతో ఇప్పటికే ఉన్న సమస్యలకు మరో పెద్ద సమస్య చేరింది. ఏప్రిల్ 8న కాల్పుల విరమణ ప్రకటించారు. ఆ తర్వాత ట్రంప్ ఒప్పందం కోసం అన్ని ప్రయత్నాలు చేశారు. ఏప్రిల్ 11న ఇస్లామాబాద్లో నేరుగా చర్చలు జరిగాయి. అమెరికా ఉపాధ్యక్షుడే అక్కడికి వెళ్లారు.మార్చి 6న ట్రంప్ “ఇరాన్ నుంచి షరతుల్లేని లొంగుబాటు తప్ప మరేదీ అంగీకరించను” అన్నారు. అదే ట్రంప్ తర్వాత ఉపాధ్యక్షుడిని ఇస్లామాబాద్ పంపించారు. ఎందుకంటే “ఉపాధ్యక్షుడితోనే మాట్లాడతాం” అని ఇరాన్ స్పష్టం చేసింది.కాల్పుల విరమణ ప్రకటనలో హార్మూజ్ ప్రాంతాన్ని తెరవాలని అమెరికా డిమాండ్ చేసింది. కానీ, ఆ ప్రాంతం ఇప్పటికీ మూసే ఉంది. అయినా కాల్పుల విరమణ కొనసాగుతోంది. కారణం ట్రంప్ మళ్లీ ప్రత్యక్ష యుద్ధంలోకి వెళ్లాలని అనుకోవడం లేదు. ఏప్రిల్ 8 నుంచి ట్రంప్ దౌత్య చర్చల ద్వారా ఒప్పందం సాధించాలని చూస్తున్నారు. కానీ ఇరాన్ అమెరికా కోరుతున్న షరతులకు ఒప్పుకోవడం లేదు. దీంతో చర్చలు స్థంభించాయి.ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా చూడాలియుద్ధం వల్ల ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా చూడాల్సిన బాధ్యత కూడా ట్రంప్నకు ఉంటుంది. అయితే, యుద్ధం మొదలైనప్పుడు బ్యారెల్ చమురు ధర 75 నుంచి 77 డాలర్ల మధ్య ఉండేది. ఇప్పుడు 115 డాలర్ల వరకు చేరింది. భారత్లో ఇప్పటికే పెట్రోల్ ధరలు రెండుసార్లు పెరిగాయి. ఇంకా పెరుగుతాయి. ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకోవాలని ప్రజలకు సూచిస్తోంది. బ్యాంకు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, సాధారణ ప్రజలు అందరూ పొదుపు పాటించాలని చెబుతోంది. రూపాయి విలువ పడిపోతోంది. కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతోంది. కరెంట్ అకౌంట్ లోటు అంటే విదేశీ లావాదేవీల్లో దేశ ఖర్చులు ఆదాయాల కంటే ఎక్కువ కావడం.ఈ యుద్ధం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీనికి ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహూ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధ్యులు అని విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ మళ్లీ యుద్ధం మొదలుపెడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఇన్ని చిక్కులు ట్రంప్ను చుట్టుముట్టాయి. అమెరికా 40 రోజుల దాడులతో ఫలితం సాధించలేకపోయింది. మళ్లీ దాడులు చేస్తే మరింత తీవ్రతరంగా వైమానిక దాడులు చేయాల్సి వస్తుంది.అలా జరిగితే ఇరాన్ కూడా యూఏఈ, సౌదీ అరేబియా, ఖతర్ ప్రజా మౌలిక సదుపాయాలపై దాడులు చేసే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని అమెరికా, గల్ఫ్ దేశాలు ఎదుర్కోగలవా అన్న ప్రశ్న ఇప్పుడు అందరి ముందుంది. -
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్..ట్రంప్ ఫస్ట్ చాయిస్ ఈయనేనట!
వాషింగ్టన్: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై ఆకస్మిక దాడి, అప్పటి సుప్రీం నాయకుడు అలీ ఖమేనీని హతమార్చిన తరువాత టెహ్రాన్లో పాలన మార్పు అనేది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అజెండాలో ఒక కీలక భాగంగా ఉంది. ఆ దాడుల తొలినాళ్లలో, ఇరాన్ తదుపరి నాయకుడు ఇస్లామిక్ రిపబ్లిక్ నుంచే రావాలని ట్రంప్ పదేపదే మాట్లాడుతూ వచ్చారు. దీనికి సంబంధించి ట్రంప్ వ్యూహం తాజాగా తెరపైకి వచ్చింది.ఇరాన్ టాప్ లీడర్ కోసం ట్రంప్ మనసులోని ప్రత్యేకమైన, అత్యంత ఆశ్చర్యకరమైన వ్యక్తి మరెవ్వరో కాదు ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనెజాద్. కొత్త ఇరాన్ ప్రభుత్వానికి నాయకుడిగా ట్రంప్ ఎంచుకున్న అహ్మదీనెజాద్ కఠినమైన, ఇజ్రాయెల్ వ్యతిరేక, అమెరికా వ్యతిరేక అభిప్రాయాలకు పేరుగాంచిన వ్యక్తి కావడం గమనార్హం.ఈ విషయంపై సమాచారం అందుకున్న అమెరికా అధికారులను ఉటంకిస్తూ, మంగళవారం 'ది న్యూయార్క్ టైమ్స్' నివేదిక ప్రకారం... ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీనెజాద్ను దేశానికి కొత్త నాయకుడిగా తిరిగి నియమించాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ మరియు అమెరికా 'ఆపరేషన్ రోరింగ్ లయన్' ,'ఎపిక్ ఫ్యూరీ' ఆపరేషన్లను చేపట్టాయి. ఇరాన్కు నాయకత్వం వహించి, "ఇరాన్ రాజకీయ, సామాజిక , సైనిక పరిస్థితిని" నిర్వహించగల సమర్ధుడిగా అమెరికన్లు అహ్మదీనెజాద్ను భావిస్తున్నారని ఆయన సహచరుడు ఒకరు మీడియాకు తెలిపారు.ఈ సాహసోపేతమైన ప్రణాళికను ఇజ్రాయెల్ సిద్ధం చేసింది. ఫిబ్రవరి 28న జరిగిన దాడుల్లో గాయపడిన అహ్మదీనెజాద్ను ఈ ప్రతిపాదన కోసం సంప్రదించారని, అయితే ఆ తర్వాత ఈ ప్లాన్ బెడిసికొట్టిందని నివేదిక సూచించింది. 2005 నుండి 2013 వరకు ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఆయనను ఒక హాలోకాస్ట్ నిరాకరిణిగా,అణుబాంబు పిచ్చివాడిగా, అప్పటికే విసిగిపోయి ఉన్న దేశంపై ఇస్లామిక్ విప్లవ భావజాలాన్ని బలవంతంగా రుద్దిన వ్యక్తిగా చాలామంది భావిస్తారు. అలాగే అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మతతత్వ ఫాసిజానికి చిహ్నంగా కనిపించడమే కాదు, ఒకానొక సమయంలో ఆయన "ఇజ్రాయెల్ను ప్రపంచ పటంలోనే లేకుండా తుడిచేయాలి" అని కూడా పిలుపు నిచ్చారు.గత దశాబ్ద కాలంగా ఆయన ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకిగా మారిపోవడంతో ఇరాన్ గార్డియన్ కౌన్సిల్ ఆయనను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా అధికారికంగా నిషేధించింది. అంతేకాదు ఆయన ఇస్లామిక్ ప్రభుత్వం నిఘాలో కూడా ఉన్నారు.'ది అట్లాంటిక్' నివేదిక ప్రకారం, యుద్ధం ప్రారంభం కావడానికి చాలా కాలం ముందే, ఇరాన్ ప్రభుత్వం అహ్మదీనెజాద్ ఇంటి వద్ద బాడీగార్డులను కాపలా పెట్టింది. పేరుకు ప్రముఖ పౌరుడి రక్షణ కోసమే అయినా, అసలు ఉద్దేశం ఆయనపై నిఘా ఉంచడమే. అయినప్పటికీ, ఇరాన్లో ఆయనకు ఇంకా ఆదరణ ఉంది, అందుకే అక్కడి ప్రభుత్వం ఆయన పట్ల అప్రమత్తంగా ఉంటుంది.యుద్ధం మొదటి రోజున అహ్మదీనెజాద్ ఇంటిపై జరిగిన ఇజ్రాయెల్ దాడి ఉద్దేశం ఆయనను గృహ నిర్బంధం నుండి విడిపించడమే. ఆయన ఆ దాడి నుండి ప్రాణాలతో బయటపడినప్పటికీ, ఈ క్షిపణి దాడి తర్వాత పాలనా మార్పు ప్రణాళికపై ఆయన విరక్తి చెందారని అమెరికా అధికారులు మరియు అతని సహచరుడు ఒకరు తెలిపారు. అప్పటి నుండి ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు, ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అనే వివరాలు తెలియవు. టెహ్రాన్లో నాయకత్వ మార్పు విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని ఆయన సొంత సహాయకులే కొందరు విశ్వసించడం లేదని తెలుస్తోంది.ఇదీ చదవండి: రోమ్లో ‘మెలోడీ’ రీయూనియన్ : మోదీ, మెలోనీ ఫోటోలు, లైక్ల సునామీవైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ ఈ విషయంపై స్పందిస్తూ... "మొదటి నుండి, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ (Operation Epic Fury) పై ప్రెసిడెంట్ ట్రంప్ తన లక్ష్యాలను స్పష్టంగా వెల్లడించారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను నాశనం చేయడం, వాటి ఉత్పత్తి కేంద్రాలను కూల్చివేయడం, వారి నౌకాదళాన్ని ముంచేయడం మరియు వారి ప్రాక్సీలను బలహీనపరచడం. అమెరికా సైన్యం తన లక్ష్యాలన్నింటినీ విజయవంతంగా అధిగమించింది, ఇప్పుడు మా చర్చల ప్రతినిధులు ఇరాన్ అణుసామర్థ్యాలను శాశ్వతంగా నాశనం చేసే ఒప్పందం కోసం కృషి చేస్తున్నారు" అని తెలిపారు. దీనిపై ఇజ్రాయెల్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.అహ్మదీనెజాద్ ఎందుకు ?వెనిజులా నాయకుడు నికోలస్ మదురోను బంధించడంలో ట్రంప్ విజయం సాధించారు. ఇదే నమూనాను ఇరాన్లో కూడా పునరావృతం చేయవచ్చని ట్రంప్ భావించినట్లు తెలుస్తోంది. అలాగే మదురోను తొలగించిన తర్వాత వెనిజులాలో అధికారం చేపట్టిన డెల్సీ రోడ్రిగ్జ్ లాంటి వ్యక్తిగా అమెరికా అహ్మదీనెజాద్ను చూసి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదీ చదవండి: మూల్యం : ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టుకు ఎదురుదెబ్బ -
పుతిన్ పర్యటనతో చమురు సంక్షోభం తీరుతుందా..?
మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఏడాది భారత్లో పర్యటించనున్నారు. బ్రిక్స్ సదస్సుకు హాజరుకావడానికి ఆయన భారత్ వస్తున్నప్పటికీ ఈ పర్యటనలో పలు కీలకమైన ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా చమురు సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో పుతిన్ భారత్ పర్యటన ఎంతో కీలకం కానుంది.ప్రస్తుతం మిడిల్ఈస్ట్లో యుద్ధపరిస్థితుల నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు 100 నుంచి 110 డాలర్ల పైమాటకు చేరి తీవ్రంగా హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. దీనికి తోడు హర్ముజ్ను మూసివేయడంతో చమరు రవాణా దెబ్బతిని తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత్లో సైతం పెట్రో డీజిల్ ధరలు పెద్ద ఎత్తున పెరగవచ్చనే ఆందోళన ప్రజలలో నెలకొంది.ఈ నేపథ్యంలో పుతిన్ భారత్ పర్యటన ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో చమురు సంక్షోభం తీరేలా ఇరు దేశాల మధ్య ఏదైనా ఒప్పందం జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దానికి బలం చేకూర్చేలా ఇటీవలే ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మాట్లాడుతూ "భారతదేశానికి ఇంధన సరఫరా ఒప్పందాల విషయంలో ఎలాంటి అడ్డంకులు రాకుండా రష్యా అన్ని బాధ్యతలను నెరవేరుస్తుంది. బాహ్య శక్తుల నుండి వచ్చే ఎలాంటి అనైతిక పోటీల వల్ల భారత్ ప్రయోజనాలకు నష్టం వాటిల్లనివ్వం." అని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ మాటలతో భారత్కు ఎంతో ఊరట లభించింది.ఇతర ఇంధన రంగాలు కేవలం ముడి చమురు మాత్రమే కాకుండా, భారత్కు అవసరమైన ఎల్.ఎన్.జి బొగ్గు సరఫరాలను పెంచడం, తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం లాంటి ఉమ్మడి ప్రాజెక్టుల విస్తరణపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది.రూపాయి-రూబుల్ చెల్లింపులుఅంతే కాకుంగా చమురు కొనుగోళ్లకు సంబంధించి డాలర్ల కొరత లేదా అంతర్జాతీయ ఆంక్షల ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, స్వదేశీ కరెన్సీలలో (రూపాయి - రూబుల్) సురక్షితమైన బ్యాంకింగ్ మరియు ఆర్థిక ఛానళ్లను ఏర్పాటు చేయడంపై ఈ పర్యటనలో మోదీ, పుతిన్ తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇందులో ఓ సమస్య ఉంది. రష్యా నుంచి చమరుదిగుమతులతో భారత్ తన స్వంత కరెన్సీలో చెల్లింపులు చేస్తే ఆ డబ్బులు వారి వద్ద అధికంగా నిల్వ ఉంటున్నాయి. ఎందుకంటే రష్యా భారత్కు ఎగుమతులు చేస్తున్నంతగా ఆ దేశానికి భారత ఎగుమతులు లేవు అందుకే వారి వద్ద కరెన్సీ నిల్వలు అధికంగా ఉంటున్నాయి. దీంతో రష్యా ఆ డబ్బను తిరిగి భారత ప్రభుత్వ బాండ్లు, షేర్లు ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతుంది.భారత్కు రష్యా పూర్తి స్థాయిలో చమురు సరఫరా చేయగలదా?రష్యా రోజుకు సుమారు 10.3 మిలియన్ బ్యారెళ్ల (1 కోటి 3 లక్షల బ్యారెళ్లు) ముడి చమురును ఉత్పత్తి చేస్తుంది. ఇందులో దాదాపు 4.5 నుండి 4.9 మిలియన్ బ్యారెళ్లను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది. భారత్కు సగటున రోజుకు సుమారు 5.3 మిలియన్ బ్యారెళ్ల వరకూ చమురు అవసరం కనుక రష్యా భారత్ అవసరాలను దాదాపు తీర్చగలదు.ప్రధాన సమస్యలులాజిస్టిక్స్, రవాణా సవాళ్లు గల్ఫ్ దేశాలు (సౌదీ, ఇరాక్, యూఏఈ) భారత్కు భౌగోళికంగా చాలా దగ్గరగా ఉన్నాయి. అక్కడి నుండి చమురు నౌకలు కేవలం 4 నుండి 7 రోజుల్లో భారత్ చేరుకుంటాయి. కానీ రష్యా నుండి చమురు రావాలంటే చాలా దూరం ప్రయాణించాలి. రష్యా పశ్చిమ నౌకాశ్రయాల నుండి వచ్చే నౌకలు భారత్ చేరడానికి 30 నుండి 35 రోజులు పడుతుంది.పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల రష్యా చమురును రవాణా చేయడానికి అంతర్జాతీయ నౌకలు, భీమా సంస్థలు ముందుకు రావడం లేదు. రష్యా తన స్వంత 'షాడో ఫ్లీట్' (పాత నౌకలు) ద్వారానే సరఫరా చేస్తోంది. భారత్కు కావాల్సినంతగా ఇందులో చమురు రవాణా చేయడం కొద్దిగా కష్టమైన పని.రిఫైనరీల సాంకేతికత భారతదేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు (Refineries) దశాబ్దాలుగా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చే 'సౌర్ క్రూడ్' (సల్ఫర్ ఎక్కువగా ఉండే చమురు) ను శుద్ధి చేసేలా డిజైన్ చేయబడ్డాయి. రష్యా నుంచి వచ్చే 'ఉరల్స్ క్రూడ్' రకం కొద్దిగా భిన్నంగా ఉంటుంది.భారతీయ రిఫైనరీలు రష్యా చమురును 100% వాడలేవు; సాంకేతిక బ్యాలెన్స్ కోసం మిడిల్ ఈస్ట్ చమురును కూడా కలిపి వాడాల్సి ఉంటుంది.భారత్కు ఇష్టం లేదు వ్యూహాత్మకంగా భారతదేశం తన ఇంధన అవసరాల కోసం ఏ ఒక్క దేశం పైనా పూర్తి స్థాయిలో ఆధారపడదు. రేపు రష్యాతో ఏదైనా సమస్య వస్తే భారత్ ఇరుక్కుపోతుంది. అందుకే భారత్ తన రిస్క్ను తగ్గించుకోవడానికి రష్యాతో పాటు సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ, అమెరికా దేశాల నుండి చమురును విడివిడిగా కొనుగోలు చేస్తుంది. అయితే ఈ పర్యటనతో భారత చమురు సమస్య పూర్తిగా తీరుతుంది అని చెప్పడం అతిశయోక్తే అయినప్పటికీ ప్రస్తుత చమురు సంక్షోభ పరిస్థితులను అరికట్టడానికి ఎంతో కొంత సహకరిస్తుందనేది మాత్రం చెప్పవచ్చు. -
పాక్, ఇమ్రాన్ ఆరోపణలు.. అమెరికా రియాక్షన్ ఇదే..
వాషింగ్టన్: పాకిస్తాన్లో రాజకీయ సంక్షోభం ఆరోపణలపై ఎట్టకేలకు అమెరికా విదేశాంగశాఖ స్పందించింది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ను పదవి నుంచి తొలగించిన విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. పాక్ రాజకీయాలు అక్కడి ప్రజలకు సంబంధించినవే అంటూ ట్విస్ట్ ఇచ్చింది.కాగా, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ను పదవి నుంచి తొలగించడం వెనుక అగ్ర రాజ్యం అమెరికా హస్తం ఉందని ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరోపణలపై తాజాగా అమెరికా విదేశాంగశాఖ స్పందిస్తూ..‘పాకిస్తాన్ రాజకీయాలతో అమెరికాకు సంబంధం లేదు. పాకిస్తాన్, అమెరికా కేవలం మిత్ర దేశాలు మాత్రమే. ఇమ్రాన్ను పదవి నుంచి తొలగించిన విషయంలో మాకు ఎలాంటి ప్రమేయం లేదు. పాక్ రాజకీయాలు ఆ దేశ ప్రజలకు మాత్రమే సంబంధించినవి’ అని క్లారిటీ ఇచ్చారు.ఇదిలా ఉండగా.. 2022, ఏప్రిల్లో ఇమ్రాన్ఖాన్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అంతకుముందు అమెరికాలోని పాక్ రాయబారి అసద్ మజీద్ ఖాన్తో అమెరికా హోంశాఖలోని దక్షిణ- మధ్య ఆసియా వ్యవహారాల సహాయ కార్యదర్శి డొనాల్డ్ లూ సమావేశమయ్యారు. అందులో వారు ఇమ్రాన్ను పదవి నుంచి తొలగించి జైల్లో పెట్టాలని.. అప్పుడే ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని మాట్లాడుకున్నట్లు సదరు కథనాలు వెల్లడించాయి. రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం విషయంలో ఇమ్రాన్ తటస్థ వైఖరిని అవలంభించడం వల్లే ఆయన్ను పదవి నుంచి తప్పించాలని యూఎస్ నిర్ణయించినట్లు పాక్లో లీకైన దౌత్య సమాచారం వెల్లడించింది.డ్రాప్ సైట్ న్యూస్ నివేదిక ప్రకారం2022 ఫిబ్రవరి 24న ఇమ్రాన్ ఖాన్ మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కలిశారు. యాదృచ్చికంగా అదే రోజు రష్యా ఉక్రెయిన్పై దాడిని ప్రారంభించింది. ఉక్రెయిన్ యుద్ధంపై పాకిస్తాన్ రష్యాను బహిరంగంగా విమర్శించాలని కోరుకున్నారు. కానీ ఇమ్రాన్ అలా చేయలేదు యుద్ధం పట్ల తటస్థ వైఖరి ప్రదర్శించారు. అనంతరం 2022 మార్చి 7న, వాషింగ్టన్లోని అప్పటి పాకిస్తాన్ రాయబారి అసద్ మజీద్ ఖాన్కు, అమెరికా సహాయ విదేశాంగ కార్యదర్శి డోనాల్డ్ లూకు మధ్య సంభాషణ జరిగింది. అవిశ్వాస తీర్మానం నుండి ఇమ్రాన్ ఖాన్ వైదొలిగితే, అమెరికా అన్నింటినీ క్షమిస్తుందని లూ మజీద్తో చెప్పారు. ముప్పై మూడు రోజుల తరువాత, 2022 ఏప్రిల్ 9న, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పడిపోయింది. అని డ్రాప్ సైట్ న్యూస్ కథనం ప్రచురించింది.ఇమ్రాన్ తొలగింపు అనంతర పరిణామాలుఏప్రిల్ 2022, ఇమ్రాన్ను తొలగించిన మరుసటి రోజే షాబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి అయ్యారు. అనంతరం కొద్ది నెలలకు నవంబర్లో ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బాజ్వా పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో అసిమ్ మునీర్ కొత్త ఆర్మీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. నవాజ్ షరీఫ్తో సంప్రదించిన తర్వాతే ఈ నియామకం జరిగిందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. 2024 ఎన్నికల సమయంలో ఇమ్రాన్ పార్టీ PTI ఎన్నికల చిహ్నమైన గబ్బిలాన్ని తొలగించారు. దీంతో అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేయవలసి వచ్చింది. PTI మద్దతు ఉన్న అభ్యర్థులు అత్యధిక స్థానాలను గెలుచుకున్నారు. అయినప్పటికీ, PML-N, PPP పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.అమెరికా-పాక్ సంబంధాలుఇమ్రాన్ ఖాన్ అధికారం నుండి వైదొలగిన తర్వాత, పాకిస్తాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. ఇరు దేశాల సంబంధాలు వ్యూహాత్మక మరియు వ్యాపార ఒప్పందాల వరకు విస్తరించాయి. పాక్లో ఒక క్రిప్టో కౌన్సిల్ ఏర్పడింది. ట్రంప్ కుటుంబానికి చెందిన ఎల్ఎఫ్ కంపెనీతో 36 బిలియన్ డాలర్ల రెమిటెన్స్ పైప్లైన్ ఒప్పందం కుదిరింది. 500 మిలియన్ డాలర్ల విలువైన అరుదైన ఖనిజాల ఒప్పందం కూడా కుదిరింది. గాజా స్ట్రిప్కు సైనికులను పంపేందుకు ఒక ప్రతిపాదన చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అసిమ్ మునీర్ మరియు షాబాజ్ షరీఫ్లను బహిరంగంగా ప్రశంసిస్తున్న సంగతి తెలిసిందే. -
ఇది కదా లక్ అంటే : పాత ప్యాంట్లో రూ. 57 కోట్ల జాక్పాట్
మనకు రాసిపెట్టి ఉండాలే గానీ అదృష్టం ఎలాగైనా మన తలుపు తడుతుంది. ఒక అమెరికన్ విషయంలో ఇది అక్షరాలా నిజమైంది. ఒక అమెరికా వ్యక్తి తన పాత ప్యాంట్ జేబులో మర్చిపోయిన లాటరీ టికెట్ను జస్ట్ దాని గడువు తీరడానికి కొన్నిరోజుల ముందు గుర్తించాడు కట్ చేస్తే రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అదెలా అని ఆశ్చర్య పోతున్నారా? పదండి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.పీపుల్ మ్యాగజైన్ కథనం ప్రకారం, న్యూజెర్సీకి చెందిన ఆ వ్యక్తి గత ఏడాది మే నెలలో, తాను తరచుగా వెళ్లే ఒక గ్యాస్ స్టేషన్ (పెట్రోల్ బంక్)లో పిక్-6 లాటరీ టిక్కెట్ను కొనుగోలు చేశాడు. అయితే, టిక్కెట్ కొన్న తర్వాత, దానిని ఎక్కడ పెట్టాడో గుర్తులేదు. దాదాపు ఒక ఏడాది పాటు దాని సంగతే పూర్తిగా మర్చిపోయాడు. గడువు ముగియ డానికి కొన్ని రోజుల ముందు, 5.9 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 57.11 కోట్లు) విలువైన లాటరీ టిక్కెట్ను కనుగొన్నాడు. అంతే జాక్పాట్ కొట్టాడు.కథ ఎలా మలుపు తిరిగిందంటే?గత నెలలో లాటరీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. జాక్పాట్ గెలుచుకున్న టికెట్ ఇంకా ఎవరూ క్లెయిమ్ చేయలేదని, త్వరలోనే దాని గడువు ముగిసిపోతుంతని వెల్లడించారు. అలాగే ఆ టికెట్ అమ్మిన పెట్రోల్ బంక్ పేరును కూడా పేర్కొన్నారు. దీంతో తాను రెగ్యులర్గా వెళ్లే బంక్ పేరు వినడంతో ఆ వ్యక్తికి అనుమానం వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్లి సిబ్బందిని విచారించాడు. ఆ బంక్లో 'పిక్-6' గేమ్ ఆడేది కేవలం కొద్దిమంది రెగ్యులర్ కస్టమర్లు మాత్రమేనని సిబ్బంది చెప్పారు. ఒకసారి బాగా వెతకండి సామీ కోట్ల రూపాయల లాటరీ అంటే మాటలా? అని సలహా ఇచ్చారు.పాత ప్యాంటులో దొరికిన అదృష్టంఇంటికి వచ్చిన ఆ వ్యక్తి తన ఇల్లంతా జల్లెడ పట్టేశాడు. డ్రాయర్లు, అల్మారాలు, స్టోరేజ్ రూమ్లు అన్నీ వెతికేశాడు. ఇక చివరగా తన క్లోసెట్ (కబోర్డ్)లో ఉన్న పాత బట్టల్లో వెతకడం మొదలు పెట్టాడు. సరిగ్గా అపుడే అదృష్ట దేవత పలకరించింది. ఒక పాత ప్యాంట్ జేబులో నలిగిపోయి ఉన్న లాటరీ టికెట్ అతనికి దొరికింది.రూ. 57 కోట్లు సొంతంఆ టికెట్ నంబర్లను చెక్ చేయగానే రూ. 57 కోట్ల భారీ జాక్పాట్ తనదేనని ఎగిరి గంతేశాడు. టికెట్ గడువు ముగియడానికి కేవలం 8 రోజులు మాత్రమే సమయం. క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే లాటరీ హెడ్క్వార్టర్స్కు పరుగులు తీసి తన బహుమతిని క్లెయిమ్ చేసుకున్నాడు. ఈ ఘటన తర్వాత లాటరీ అధికారులు ప్రజలకు ఒక ముఖ్య సూచన చేశారు. చాలామంది టికెట్లు కొని ఎక్కడో పెట్టి మర్చిపోతుంటారని, దీంతో ఒక్కోసారి లాటరీ సొమ్మును ఎవరూ తీసుకోకుండానే ఉండిపోతాయని అందువల్ల పాత టికెట్లను జాగ్రత్తగా దాచుకుంటూ, అప్పుడప్పుడు సరిచూసుకుంటూ ఉండాలని కోరడం విశేషం. -
మోదీకి ప్రశ్నా.. నార్వే మహిళా జర్నలిస్టు దుస్సాహసం!
ఇంటా బయటా విలేకరులతో మాట్లాడడానికి ఇష్టపడని మన ప్రధాన మంత్రి మోదీ నిన్న నార్వే టూర్లో Dagsavisan అనే పత్రిక మహిళా జర్నలిస్టు (Helle Lyng Svendsen) నుంచి చేదు అనుభవాన్ని ఎదుర్కున్నారు. "Prime Minister Modi, why don't you take some questions from the freest press in the world?" అని ఆ జర్నలిస్టు అడిగారు.నార్వే ప్రధానితో కలిసి జాయింట్ ప్రెస్ మీట్ ముగించుకుని కరచాలనం చేసి వెళ్తుండగా అది వినిపించిందో, లేదో గానీ మోదీ గారు ఆ ప్రశ్న పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత, ఎక్స్ వేదికగా ఆమె రచ్చ చేశారు. "It is our job to question the powers we cooperate with," అని ఆమె రాశారు. దీని మీద సోషల్ మీడియాలో హంగామా జరుగుతోంది. కాషాయ సోషల్ మీడియా బృందం ఆమె వెంటపడి కామెంట్స్తో కుమ్ముతోంది. దీనిపై రాహుల్ గాంధీ కూడా స్పందించారు. ఈ క్రమంలో దాచడానికి ఏమీ లేనప్పుడు భయపడటం ఎందుకు?. తన విశ్వసనీయతపైనే సందేహాలున్న ఒక ప్రధానమంత్రి, కేవలం కొన్ని ప్రశ్నలకు భయపడి వెళ్లిపోవడాన్ని ప్రపంచం చూసినప్పుడు, భారతదేశ ప్రతిష్ట ఏమవుతుంది? అని ప్రశ్నించారు.కాగా, 2015లో బ్రిటన్లో, 2023లో అమెరికాలో మాత్రమే మోదీ విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత జర్నలిస్టులకు దూరంగా ఉంటున్నారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అయిన మీడియాను ఏ మాత్రం పట్టించుకోకుండా మూడు సార్లు ప్రధానమంత్రి అయిన ఘనత ఆయనకే దక్కింది. నార్వేలో ఇద్దరు ప్రధానులు చేసింది press briefing మాత్రమే అనీ, అది press conference కాదు కాబట్టి ఆయన సమాధానం చెప్పకుండా వెళ్ళారని భారత అధికారులు అంటున్నారు. It is indeed a point!When there is nothing to hide, there is nothing to fear.What happens to India’s image when the world sees a compromised PM panic and run from a few questions? https://t.co/tOO8vzESpf— Rahul Gandhi (@RahulGandhi) May 18, 2026సమాధానం ఇస్తే బాగుండేది..ప్రోటోకాల్లో లేకపోయినా, మన ప్రధాని ఆ జర్నలిస్టు నుంచి ఒక ప్రశ్న తీసుకుని చక్కగా నవ్వుతూ సమాధానం ఇస్తే బాగుండేది. మహా అయితే.. మానవ హక్కుల ఉల్లంఘన, ముస్లిం వ్యతిరేకత, వ్యవస్థల నిర్వీర్యం, రెండు యుద్ధాల (ఇరాన్, ఉక్రెయిన్) వంటి వివాదాస్పద ప్రశ్న ఒకటి అడిగి ఉండేది ఆమె. ఆ ప్రశ్నకు నేరుగా కాకపోయినా, డొంక తిరుగుడుగా సూపర్ సమాధానాలు చెప్పవచ్చు. దానికి కూడా మంచి పాజిటివ్ కవరేజ్ వచ్చేది. నాకు ఆసక్తి కలిగించిన అంశం ఏమిటంటే, ఒక మహిళా జర్నలిస్టు ధైర్యంగా ప్రశ్న అడిగితే ఆమె ఘోర అపరాధం చేసినట్లు ఆ దేశ అధికారులు, భద్రతా సిబ్బంది ఎవ్వరూ స్పందించలేదు. మన దగ్గర అయితే సీన్ వేరుగా ఉంటుంది. అందుకే మహిళా జర్నలిస్టులు గ్రేట్.ఇక, ఫ్రాన్స్ కేంద్రంగా ఉండే అంతర్జాతీయ NGO రిపోర్టర్స్ విత్అవుట్ బోర్డర్స్ ప్రతి ఏడాదీ World Press Freedom Index విడుదల చేస్తుంది. వివిధ కొలబద్దల ఆధారంగా దేశాలకు ర్యాంకింగ్ ఇస్తారు. 180 దేశాలలో మీడియా స్వేచ్ఛలో ఫస్ట్ ప్లేస్లో నార్వే ఉండగా, భారత్ ర్యాంకు 157గా కొనసాగుతోంది. - డాక్టర్ ఎస్.రాము, సీనియర్ జర్నలిస్ట్. ఇదిలా ఉండగా.. ఓస్లోకు చెందిన డగ్సావిసెన్ అనే పత్రికలో హెల్లి లింగ్ పనిచేస్తున్నది. మోదీ నార్వే విజిట్ను కవర్ చేసే బృందంలో ఆమె కూడా ఉన్నారు. గతంలో MSN మరియు ఇతర నార్వేజియన్ మీడియా సంస్థల్లో జర్నలిస్టుగా పనిచేశారు. తమ ప్రభుత్వంతో సహకరించే అధికారులను ప్రశ్నించడం తన కర్తవ్యం అని ఆమె తెలిపారు. అనంతరం, ఈ పరిణామాల కారణంగా తన ఇన్స్స్టాగ్రామ్, ఫేస్బుక్ బ్లాక్ అయినట్టు ఆమె పేర్కొంది. లింగ్ ప్రశ్నల వర్షం.. ఇక భారత విదేశాంగ మంత్రిత్వశాఖ నిర్వహించిన మీడియా సమావేశంలోనూ లింగ్ మళ్లీ ప్రశ్నలు కురిపించారు. భారత్లో ఉన్న ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ, మానవ హక్కుల గురించి ఆమె ప్రశ్నించారు. అంతర్జాతీయ సమాజం ఇండియాను ఎందుకు నమ్మాలని ఆమె అడిగారు. సంక్లిష్టమైన అంశాల్లో ప్రధాని మోదీ స్పందించడం లేదని ఆమె ఆరోపించారు. లింగ్ చేసిన ఆరోపణలకు విదేశాంగ శాఖ ప్రతిని సిబి జార్జ్ స్పందించారు. భారతీయ ప్రజాస్వామ్యాన్ని, మీడియాను ఆమె సమర్ధించారు. అయితే ఏమీ తెలియని ఎన్జీవోలు ఇచ్చే నివేదికలను విదేశీ విమర్శకులు పరిశీలిస్తుంటారని జార్జ్ అన్నారు. విదేశాంగ శాఖ, జర్నలిస్టు మధ్య జరిగిన సంభాషణకు చెందిన వీడియోలు వైరల్ అయ్యాయి. -
ఎబోలా డేంజర్ బెల్స్.. 131 మరణాలు..
కిన్షాసా: ఆఫ్రికాలోని కాంగో తూర్పు ప్రాంతంలో అరుదైన ఎబోలా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ అంటువ్యాధి బారిన పడి ఇప్పటి వరకు కనీసం 131 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. మరో 513 అనుమానిత కేసులున్నాయంటున్నారు. ఎబోలా వ్యాప్తి, కేసులు పెరుగుతున్న తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.మొదటి మరణం సంభవించిన తర్వాత కూడా అధికారులు సాధారణంగా వచ్చే వైరస్ వేరియట్ అనుమానంతో పరీక్షలు చేయడం, అందులో నెగటివ్ అని తేలడంతో ఈ వైరస్ కొన్ని వారాల పాటు ఎవరికీ దొరకకుండానే వ్యాప్తి చెందిందని ఆరోగ్య నిపుణులు తెలిపారు. బుండిబుగ్యో అనే ఈ అరుదైన వైరస్ వేరియంట్కు మందులు, వ్యాక్సిన్లు లేవన్నారు. త్వరలో డబ్ల్యూహెచ్వో అత్యవసర భేటీ కాంబోలో ఎబోలా వేగంగా ప్రమాదకరరీతిలో వ్యాప్తి చెందుతుండటంపై డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసుస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒకటీరెండు రోజుల్లోనే తమ విభాగం సమావేశమై, వ్యాధి కట్టడికి అవసరమైన చర్యలపై చర్చిస్తుందన్నారు. పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న కేసులు, ఆరోగ్య సిబ్బంది మరణాలు, ప్రజలు ఒకే చోట ఉండకుండా తరచూ రాకపోకలు సాగించడం వంటివాటిపైనా దృష్టి సారిస్తామన్నారు. కాంగోలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించిన నేపథ్యంలో సమన్వయంతో చర్యలు చేపట్టాల్సిన అవసరముందని ఆయన తెలిపారు. ఎబోలా కేసులు పెరుగుతున్న సరిహద్దుల్లోని ఉగాండాకు చెందిన రెండు ప్రావిన్స్లకు కూడా ఆరోగ్య సిబ్బందిని పంపిస్తామన్నారు. -
మరో గంటలో దాడి చేద్దామనుకున్నా
వాషింగ్టన్: శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు మొండికేస్తున్న ఇరాన్ను ఎలాగైనా దారికి తెచ్చేందుకు ఆ దేశంపై దాడి చేద్దామని నిర్ణయించుకున్నామని, అయితే చివరినిమిషంలో ఆ ప్రణాళికను పక్కనపెట్టేశానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. మంగళవారం దాడిచేయాలని భావించామని సోమవారం అర్ధరాత్రి ప్రకటించిన ట్రంప్ తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకోవాల్సి వచి్చందో వివరించారు. మంగళవారం శ్వేతసౌధం ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ‘‘జనం ఆశ్చర్యపోయినా, ఆశ్చర్యపడకపోయినా నాకు అనవసరం. శత్రుదేశం అణ్వాయుధాలను చేజిక్కించుకుని నా కళ్లముందే ప్రపంచం బద్ధలుకాకముందే తేరుకోవాలని నిర్ణయించుకున్నా. అందుకే ఇరాన్పై దాడిచేయాలని ప్రణాళిక సిద్ధంచేశా. గంటలో దాడి చేద్దామనుకునేలోపే గల్ఫ్ దేశాల నుంచి నాకు ఫోన్కాల్స్ వచ్చాయి. ఖతర్ అమీర్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీ, సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సాద్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్తోపాటు కువైట్, బహ్రెయిన్ నుంచీ నాకు ఫోన్కాల్స్ వచ్చాయి. దాడి నిర్ణయాన్ని విరమించుకోవాలని వాళ్లు సూచించారు. ఇరాన్తో చర్చలు సీరియస్గా జరుగుతున్న ఈ సమయంలో దాడులు సముచితం కాదు అని వాళ్లు అభిప్రాయపడ్డారు. దీంతో దాడి చేయలేదు. ఇరాన్కు అణ్వాయుధం దక్కకూడదనే షరతుతోనే శాంతి ఒప్పందం కుదరాలి. అలా జరగని పక్షంలో తక్షణం దాడి చేయాలని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డేనియల్ కేన్, సైన్యం, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్కు సూచించా’’అని చెప్పారు. -
ట్రంప్ అల్టిమేటం.. అమెరికాకు ఇరాన్ ఘాటు హెచ్చరిక
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. “రెండు మూడు రోజుల్లో శాంతి ఒప్పందానికి రాకపోతే, కొత్త దాడులు తప్పవు” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు అల్టిమేటం జారీ చేశారు. గల్ఫ్ దేశాల అభ్యర్థనతో మంగళవారం జరగాల్సిన దాడిని వాయిదా వేశానని.. ఇరాన్ దిగి రాకుంటే వారాంతంలో దాడులు తప్పవని సంకేతాలిచ్చారాయన. ఈ అల్టిమేటంపై ఇరాన్ స్పందించింది. ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి స్పందించారు. అదే జరిగితే తామేంటో చూపిస్తామని అంటున్నారాయన. ‘‘మళ్లీ యుద్ధం జరిగితే అమెరికాను మామూలుగా దెబ్బ తీయం. మరిన్ని సర్ప్రైజ్లు ఉంటాయి. అందుకు ఆ దేశం సిద్ధంగా ఉండాలి’’ అని ఘాటు హెచ్చరికలు జారీ చేశారాయన. అలాగే.. ఇరాన్ తొలిసారిగా అమెరికా F-35 జెట్ను కూల్చివేసిందని చెప్పిన అరగ్చి.. అమెరికా కాంగ్రెస్ రీసెర్చ్ సర్వీస్ నివేదికలోనే జరిగిన నష్టాలు బయటపడ్డాయని గుర్తుచేశారు.అరగ్చి చెప్పిన “మరిన్ని సర్ప్రైజ్లు” అంచనా వేయడం కాస్త కష్టమే. అయితే యుద్ధంలో ఇరాన్ వ్యూహాలు, దాడుల స్వభావం చూసుకుంటే మాత్రం.. అధునాతన డ్రోన్ దాడులు: ఇరాన్ ఇప్పటికే అమెరికా MQ-9 రీపర్ డ్రోన్లను కూల్చివేసింది. భవిష్యత్తులో మరింత శక్తివంతమైన, స్వార్మ్ (గుంపులుగా వచ్చే) డ్రోన్ దాడులు జరిగే చాన్స్ లేకపోలేదు.మిసైల్ దాడులు: సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్బేస్పై ఇరాన్ క్షిపణి దాడులు చేసి KC-135 ట్యాంకర్లు, E-3 AWACSను దెబ్బతీసింది. ఇలాంటి దీర్ఘశ్రేణి క్షిపణి దాడులే మళ్లీ జరగవచ్చు.సైబర్ దాడులు: ఇరాన్ గతంలో అమెరికా నెట్వర్క్లపై సైబర్ దాడులు చేసినట్లు నివేదికలు ఉన్నాయి. కొత్త యుద్ధంలో సైబర్ రంగంలో పెద్ద ఎత్తున దాడులు జరగవచ్చు.సముద్ర మార్గాల అడ్డంకులు: హర్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు రవాణా జరుగుతుంది. ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేస్తే గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ కుదేలవుతుంది.అనూహ్యమైన ఆయుధ వినియోగం: అరగ్చి చెప్పిన “సర్ప్రైజ్”లో కొత్త రకం యుద్ధ సాంకేతికత, లేదంటే ఇప్పటివరకు బయటపడని ఆయుధాలు ఉండే అవకాశం ఉంది.కాంగ్రెస్ రీసెర్చ్ సర్వీస్ నివేదిక ప్రకారం.. ఈ యుద్ధంలో అమెరికా కనీసం 42 సైనిక విమానాలను కోల్పోయింది. వీటిలో 24 MQ-9 రీపర్ డ్రోన్లు, నాలుగు F-15E ఫైటర్ జెట్లు, ఒక A-10 థండర్బోల్ట్, రెండు MC-130J ప్రత్యేక ఆపరేషన్ విమానాలు, ఒక KC-135 ట్యాంకర్, ఒక MQ-4C ట్రిటాన్ డ్రోన్ ఉన్నాయి. అదనంగా.. F-35A జెట్, E-3 సెంట్రీ AWACS, HH-60W హెలికాప్టర్ వంటి విమానాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రక్షణ విభాగం పెంటగాన్ అంచనా ప్రకారం.. ఈ యుద్ధం అమెరికాకు ఇప్పటివరకు 29 బిలియన్ డాలర్ల ఖర్చు తెచ్చింది.ఫిబ్రవరి 28, 2026న “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ” పేరుతో అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై దాడులు ప్రారంభించాయి. బదులుగా ఇరాన్ మిత్రపక్షాల సాయంతో కౌంటర్కు దిగింది. అయితే.. ఏప్రిల్లో తాత్కాలిక కాల్పుల విరమణ, ఆపై పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో చర్చలకు అడుగులు పడడంతో యుద్ధం ముగియవచ్చని అంతా భావించారు. అయితే అలా జరగలేదు. శాంతి చర్చలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఓవైపు చర్చల ప్రభావంతో యుద్ధ తీవ్రత కొంత తగ్గినా.. ఇప్పుడు మళ్లీ ఇరు దేశాల కవ్వింపు చర్యలతో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ట్రంప్ అల్టిమేటం, అరఘ్చి హెచ్చరికలతో యుద్ధం మరోసారి మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. కొత్త ఘర్షణలు ఏ సంక్షోభానికి దారి తీస్తాయోనని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
షిడ్వార్ ద్వీపాన్ని చుట్టుముట్టిన చమురుతెట్టు
దుబాయ్: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు మొదలెట్టాక హార్మూజ్ జలసంధి సమీపంలోని షిడావ్ర్ ద్వీపాన్ని చమురుతెట్టు చుట్టేసింది. ఇప్పుడు చమురుతెట్టు అక్కడి జీవావరణంపై గొడ్డలిపెట్టుగా తయారైంది. షిడ్వార్ ద్వీపంలోని సముద్రతీరాలను పెద్దమొత్తంలో ముడిచమురుతో జిగటగా తయారైన అలలు పోటెత్తుతున్నాయి. ద్వీపం తీరం మొత్తాన్నీ దాదాపు చమురుతెట్టు ఆక్రమించేసింది. ఈ జీవావరణ విధ్వంసం తాలూకు వివరాలు సంబంధిత ఉపగ్రహ చిత్రాలు, ఫొటోల్లో స్పష్టంగా తెలుస్తోంది. ఇరాన్లోని చమురుశుద్ధి కర్మాగారాలపై దాడుల తర్వాత పెద్దమొత్తంలో ముడిచమురు సముద్రజలాల్లోకి చేరింది. ఇది పల్చని పొరలా సముద్రఉపరితల జలాలపై పేరుకుని అలలరూపంలో సమీప ద్వీపాల తీరాలకు చేరుతోంది. వీటితోపాటు ఇరాన్కు చెందిన ఎహ్సాన్ జలాలీ అనే వ్యక్తితీసిన స్మార్ట్ఫోన్ వీడియో ఫుటేజీ సైతం షిడ్వార్ ద్వీపంలో జరిగిన జీవావరణ విధ్వంసాన్ని కళ్లకుకడుతోంది. తాబేళ్లు, పక్షులు, స్క్వాడ్చేపలు, డాలి్ఫన్లు ఇలా పలురకాల జీవులు చమురుతెట్టులో చిక్కుకుని చనిపోతున్నాయి. 30 సెంటీమీటర్ల రెజల్యూషన్తో ఫొటోలు తీసే ఎయిర్బస్ డిఫెన్స్, స్పేస్ ప్లీడస్ నియో ఆప్టికల్ శాటిలైట్ ద్వారా తీసిన ఫొటోలనూ తాజాగా విడుదలచేశారు. ఏప్రిల్ పదో తేదీన ఇరాన్లోని చమురుశుద్ధి కర్మాగారాలపై దాడి తర్వాత రెండ్రోజులైనా అక్కడి నుంచి మంటలు ఎగిసిపడుతున్నట్లు శాటిలైట్ చిత్రాల్లో స్పష్టమైంది. షిడ్వార్ ఐలాండ్ను స్థానికంగా మరో ద్వీపం అని కూడా పిలుస్తారు. చిత్తడి నేలలకు ఈ ద్వీపం ప్రసిద్ధి. ఇరాన్లో కని్పంచే బుల్లి ‘టెర్న్’పక్షు లు, సముద్రపక్షులకు ఈ ద్వీపం ఆలవాలంగా ఉంది. చిత్తడినేలలను భూమి సహజ ఊ పిరితిత్తులుగా పేర్కొంటారు. మురుగునీరు విస్తరించకుండాచేసి, భూగర్భజలాలను శుద్ధిచేసే నేలలుగా చిత్తడినేలలుప్రసిద్ధిచెందాయి. ఇప్పుడివి నాశనమవుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేశారు. -
#Melodi: రోమ్లో మెలోడీ మూమెంట్
విదేశీ పర్యటనలో భాగంగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ చేరుకున్నారు. రోమ్లో మోదీకి ఇటలీ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ ఘన స్వాగతం పలికారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని చివరగా ఇక్కడ పర్యటించబోతున్నారు. నా స్నేహితుడికి రోమ్ నగరం స్వాగతం పలుకుతోంది అంటూ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ ఉంచారు. అంతకు ముందు.. ఇద్దరూ కలిసి ఒకే కారులో ప్రయాణించారు. ఇటలీ చారిత్రక కోలోసియం సందర్శించారు. అక్కడ సెల్ఫీ కూడా దిగారు. వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో రోమ్లో మెలోడీ#Melodi మూమెంట్స్ అంటూ నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. మోదీ, మెలనీ పేర్లను కలిపి అలా సరదాగా పిలుస్తారన్నది చాలామందికే తెలిసే ఉంటుంది. వీళ్ల స్నేహంపై సోషల్ మీడియాలో తరచూ చర్చ నడుస్తుంటుంది కూడా. Welcome to Rome, my friend! 🇮🇹🇮🇳 pic.twitter.com/mUjFL4HIqY— Giorgia Meloni (@GiorgiaMeloni) May 19, 2026మోదీ 2024లో జీ7 సమ్మిట్ కోసం ఇటలీ వెళ్లారు. అయితే అధికారిక ద్వైపాక్షిక పర్యటన మాత్రం ఇదే. ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య మిత్రబంధాన్ని కాస్త వ్యూహాత్మక సంబంధంగా మార్చాలని మోదీ భావిస్తున్నారు. వాణిజ్యం, రక్షణ, సముద్ర భద్రత, ఆహార భద్రత, గ్రీన్ ఎనర్జీ వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. తొలుత ఇటలీ అధ్యక్షుడు సెర్జియో మట్టారెల్లాతో మోదీ భేటీ అవుతారు. అటుపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఎఫ్ఏవో (Food and Agriculture Organisation) ప్రధాన కార్యాలయం సందర్శించి అక్కడ ఆహార భద్రత అంశంలో భారత్ వైఖరిని మోదీ చాటిచెప్పే అవకాశం ఉంది. అలాగే.. ఇండియా-మిడిల్ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC) ద్వారా వాణిజ్య, రవాణా, కనెక్టివిటీ విస్తరణ అంశాలను చర్చించనున్నారు. రక్షణ, సముద్ర భద్రత, సరఫరా గొలుసులు, టెక్నాలజీ, వాణిజ్యం రంగాల్లో సహకారం కోసం రూపొందించిన Joint Strategic Action Plan 2025–2029 పైనా చర్చించే అవకాశం కనిపిస్తోంది. గ్రీన్ ఎనర్జీ, మొబిలిటీ, డిఫెన్స్ తయారీలో కొత్త పెట్టుబడులు, భాగస్వామ్యాలపైనా చర్చిస్తారని సమాచారం. ప్రవాస భారతీయులతో.. రోమ్లోని హోటల్ వద్ద భారతీయ ప్రవాసులు మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు. వారణాసి ఘాట్లను ప్రతిబింబించే చిత్రకళా బహుమతి అందించారు. సాంప్రదాయ నృత్యాలు, సంగీత ప్రదర్శనలు కూడా జరిగాయి. ఈ పర్యటన భారత్–ఇటలీ సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లే అవకాశంగా భావిస్తున్నారు. రక్షణ, వాణిజ్యం, సముద్ర భద్రత, ఆహార భద్రత రంగాల్లో రెండు దేశాలు కలిసి పనిచేయడం ద్వారా యూరప్లో భారత్ వ్యూహాత్మక స్థానం మరింత బలపడనుంది. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, డిఫెన్స్ తయారీ రంగాల్లో కొత్త పెట్టుబడులు, భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశం ఉంది. -
సంబంధాలు ఉన్నతస్థాయికి
ఓస్లో: తమ సంబంధాలను ఇకపై గ్రీన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని భారత్, నార్డిక్ దేశాలు నిర్ణయించుకున్నాయి. భారత ప్రధాని మోదీ మంగళవారం నార్వే రాజధాని ఓస్లోలో మూడో ఇండియా–నార్డిక్ సదస్సులో పాల్గొన్నారు. క్లీన్ ఎనర్జీ, సుస్థిరాభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, నవీన సాంకేతిక పరిజ్ఞానంతోపాటు కీలక రంగాల్లో పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించారు. మోదీతోపాటు ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రన్ ఫ్రొస్టాడాటిర్, ఫిన్లాండ్ ప్రధాని పెటెరీ ఓర్పో, డెన్మార్క్ ప్రధాని మెటే ఫ్రెడరిక్సన్, నార్వే ప్రధాని జోనా గర్ స్టోర్, స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఈ సదస్సుకు హాజరయ్యారు.అనంతరం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాదంపై భారతదేశం, నార్డిక్ దేశాలు స్పష్టమైన, ఐక్య వైఖరిని కలిగి ఉన్నాయని మోదీ తేల్చిచెప్పారు. ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో రాజీపడి ప్రసక్తే లేదని, ద్వంద్వ ప్రమాణాలకు తావులేదని స్పష్టంచేశారు. ప్రపంచంలో ఉద్రిక్తతలు, సంఘర్షణలు కొనసాగుతున్న తరుణంలో నియమాల ఆధారిత ప్రపంచ క్రమాన్ని బలోపేతం చేయడానికి భారత్, నార్డిక్ దేశాలు కలిసి పని చేస్తూనే ఉంటాయని వెల్లడించారు.ఉక్రెయిన్ అయినా, పశ్చిమాసియా అయినా వివాదాల ప్రారంభ పరిష్కారానికి, శాంతి కోసం జరిగే ప్రయత్నాలకు మద్దతునిస్తూనే ఉంటామని పునరుద్ఘాటించారు. ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన పట్ల నిబద్ధత తమను సహజ భాగస్వాములను చేస్తోందన్నారు. గ్రీన్ టెక్నాలజీ భాగస్వామ్యంతో మొత్తం ప్రపంచానికి మంచి భవిష్యత్తును అందిస్తామని మోదీ పేర్కొన్నారు. మూడు దేశాల ప్రధానులతో భేటీ ఐస్లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ దేశాలతో క్లీన్ ఎనర్జీ, వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, సుస్థిరాభివృద్ధి, డిజిటలీకరణ, కృత్రిమ మేధ(ఏఐ), క్వాంటమ్ టెక్నాలజీ తదితర రంగాల్లో పరస్పర సంబంధాలను బలపేతం చేసుకోవడంపై మోదీ చర్చించారు. ఆయన మంగళవారం ఆయా దేశాల ప్రధానమంత్రులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. భారత్, మూడు నార్డిక్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిపై చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్లో పర్యటించాలని మూడుదేశాల ప్రధానులను మోదీ ఆహ్వానించారు. ఐస్లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ దేశాలతో సంబంధాలకు భారత్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని మోదీ ఉద్ఘాటించారు. ఇటలీకి పయనమైన మోదీ ప్రధాని మోదీ నార్వే పర్యటన పూర్తిచేసుకొని మంగళవారం ఇటలీకి పయనమయ్యారు. నార్వే పర్యటన ఫలవంతంగా ముగిసిందని ఆయన ‘ఎక్స్‘లో పోస్టుచేశారు. పలు సమావేశాల్లో పాల్గొన్నానని, కీలక రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంపొందించడానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. -
పెంకులేకుండానే గుడ్లను పొదిగారు!
వాషింగ్టన్: అంతరించిపోయిన జీవులను డీఎన్ఏల సాయంతో మళ్లీ పునర్సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికాలోని జీవసాంకేతికరంగ సంస్థ ‘కొలోసల్ బయోసైన్సెస్’తన ప్రయోగాల్లో కీలక విజయం సాధించింది. న్యూజిలాండ్లో చాలా శతాబ్దాల క్రితం అంతరించిపోయిన భారీ పక్షిజాతి ‘మోవా’ను పునర్సృష్టించే క్రతువులో మరో ముందడుగువేశామని కొలోసల్ బయోసైన్సెస్ తాజాగా ప్రకటించింది. మోవాకు జన్యువులపరంగా అత్యంత సారూప్యత ఉండే ఇతర జాతుల పక్షుల డీఎన్ఏతో సింథసిస్ చేసి తొలుత మోవా గుడ్డును తయారుచేయాలని సంకల్పించింది.అయితే ఆనాటి మోవాజాతి గుడ్డు సాధారణ కోడిగుడ్డు కంటే ఏకంగా గరిష్టంగా 80 రెట్లు పెద్దగా ఉంటుంది. ఇంతటి భారీ గుడ్డును పొదగాలంటే అంతపెద్దస్థాయిలో కృత్రిమ ఎగ్షెల్ అవసరం అవుతుంది. ఈ ప్రయోగాల్లో భాగంగా కృత్రిమమేధతో త్రిమితీయ(3డీ) ముద్రిత చిన్నపాటి ఎగ్షెల్ను తయారుచేశామని కంపెనీ ప్రకటించింది. ఇందులో సాధారణ కోడి గుడ్లలోని పచ్చ, తెల్లసొనలను బయటకుతీసి ఈ 3డీ ముద్రిత ఎగ్షెల్లో పెట్టి విజయవంతంగా పొదిగామని కంపెనీ మంగళవారం వెల్లడించింది. ప్రయోగంలో భాగంగా ఇలా ఇప్పటిదాకా 26 కోడిపిల్లలను సృష్టించారు. ఏఐ ఎగ్షెల్ ఎలా? పెంకును పగలగొట్టి పచ్చ, తెల్లసొనలను కప్పులాంటి ఇతర గోళాకార ఆకృతుల్లో పొదగడంపై గతంలోనూ చాలా మంది ప్రయోగాలు చేశారు. అయితే సహజసిద్ధ పెంకు నుంచి మాత్రమే సరిపడా ఆక్సిజన్ అందుతుంది. దాంతోనే లోపల గుడ్డు పొదుగుతుంది. ఇందుకోసం ఆక్సిజన్ సరైన మోతాదులో అందేలా లోపలివైపు జల్లెడ లాంటి దానిని కొలోసల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. దానికి బయటివైపు పారదర్శకంగా ఉండేలా మరో కణత్వచాన్ని తయారుచేశారు. వీటి సాయంతో పచ్చ,తెల్లసొనలు ఏమాత్రం పాడవకుండా సహజసిద్ధ వాతావరణాన్ని వాటికి అందించామని శాస్త్రవేత్తలు తెలిపారు. పచ్చ,తెల్లసొన కోడిపిల్లగా మారే క్రమంలో సాధారణ పెంకు నుంచి కాల్షియంను సంగ్రహించుకుంటుంది.ఇదే తరహాలో తాము కూడా ఈ ఏఐ ఎగ్షెల్ ద్వారా కాల్షియంను అందించామని పరిశోధకులు తెలిపారు. ఈ ఎగ్షెల్ను ఇంక్యుబేటర్లో పెట్టి సరిపడా వేడిని అందించి పొదిగారు. తమ ప్రయోగం విజయవంతంకావడంపై కొలోసల్ సంస్థ సీఈఓ బెన్లామ్ ఆనందం వ్యక్తంచేశారు. సింథటిక్ బయాలజీ పితామహుడిగా పేరొందిన అమెరికా దిగ్గజ బయోటెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ జార్జ్ చర్చ్ ఆధ్వర్యంలో కొలోసల్ సంస్థ పనిచేస్తోంది. ‘‘కృత్రిమమేధతో పనిచేసే కృత్రిమ ఎగ్షెల్ సాంకేతికత మరింత అభివృద్ధి చెందితే భవిష్యత్తులో అంతరించిపోయిన పక్షిజాతులకూ తిరిగి ప్రాణం పోయవచ్చు. న్యూజిలాండ్లో ప్రాచీనకాలంలో కలియతిరిగిన మోవా జాతిని పునర్సృష్టించాలంటే దాని గుడ్డును మోయగలిగే భారీ పక్షిజాతులు ఇప్పుడులేవు. అందుకే ఇలా కృత్రిమ ఎగ్షెల్ తయారీకి పూనుకున్నాం’’అని బెన్లామ్ వివరించారు. -
సెప్టెంబర్లో భారత్కు పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటన తేదీలు ఖరారయ్యాయి. సెప్టెంబర్ 12, 13వ తేదీల్లో ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్రంలో అధ్యక్షుడు పుతిన్ పాల్గొంటారని క్రెమ్లిన్ ప్రతినిధి యూరి ఉషకోవ్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక అంశాలపై చర్చించేందుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్తోనూ ఆయన వేరుగా భేటీ అవుతారని వివరించారు.బ్రిక్స్ అధ్యక్ష హోదాలో ఉన్న భారత్ ఈ శిఖరాగ్రానికి ఆతిథ్యం ఇస్తోంది. భారత్కు పుతిన్ చివరిసారిగా 2025 డిసెంబర్లో వచ్చారు. అప్పట్లో ఆయన భారత్–రష్యా వార్షిక సమావేశంలో పాల్గొన్నారు. బ్రెజిల్, భారత్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికాలతో ఏర్పాటైన బ్రిక్స్లో ప్రస్తుతం ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ, ఇండోనేసియా కూడా సభ్యదేశాలుగా ఉన్నాయి. -
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ కూలిపోవడంలో యుఎస్ఏ పాత్ర..?
వాషింగ్టన్, డీసీ: పాకిస్థాన్ మాజీ ప్రధాని ప్రభుత్వం కూలిపోవడంపై అమెరికా మీడియా సంస్థ 'డ్రాప్ సైట్ న్యూస్' సంచలన కథనం ప్రచురించింది. అయిన ప్రభుత్వం కూలిపోవడానికి కేవలం ఇమ్రాన్ ఖాన్ తన పదవిని కేవలం అవిశ్వాస తీర్మానం వల్ల కోల్పోలేదని దాని వెనక అమెరికా, పాకిస్థాన్ సైన్యం కుట్ర ఉందని కథనం ప్రచురించింది.డ్రాప్ సైట్ న్యూస్ నివేదిక ప్రకారం2022 ఫిబ్రవరి 24న ఇమ్రాన్ ఖాన్ మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కలిశారు.యాధృచ్చికంగా అదే రోజు రష్యా ఉక్రెయిన్పై దాడిని ప్రారంభించింది. ఉక్రెయిన్ యుద్ధంపై పాకిస్తాన్ రష్యాను బహిరంగంగా విమర్శించాలని కోరుకున్నారు. కానీ ఇమ్రాన్ అలా చేయలేదు యుద్ధం పట్ల తటస్థవైఖరి ప్రదర్శించారు. అనంతరం 2022 మార్చి 7న, వాషింగ్టన్లోని అప్పటి పాకిస్తాన్ రాయబారి అసద్ మజీద్ ఖాన్కు, అమెరికా సహాయ విదేశాంగ కార్యదర్శి డోనాల్డ్ లూకు మధ్య సంభాషణ జరిగింది. అవిశ్వాస తీర్మానం నుండి ఇమ్రాన్ ఖాన్ వైదొలిగితే, అమెరికా అన్నింటినీ క్షమిస్తుందని లూ మజీద్తో చెప్పారు. ముప్పై మూడు రోజుల తరువాత, 2022 ఏప్రిల్ 9న, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పడిపోయింది. అని డ్రాప్ సైట్ న్యూస్ కథనం ప్రచురించింది.ఇమ్రాన్ తొలగింపు అనంతర పరిణామాలుఏప్రిల్ 2022, ఇమ్రాన్ను తొలగించిన మరుసటి రోజే షాబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి అయ్యారు.అనంతరం కొద్ది నెలలకు నవంబర్లో ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బాజ్వా పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో అసిమ్ మునీర్ కొత్త ఆర్మీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. నవాజ్ షరీఫ్తో సంప్రదించిన తర్వాతే ఈ నియామకం జరిగిందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.2024 ఎన్నికల సమయంలో ఇమ్రాన్ పార్టీ PTI ఎన్నికల చిహ్నమైన గబ్బిలాన్ని తొలగించారు. దీంతో అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేయవలసి వచ్చింది. PTI మద్దతు ఉన్న అభ్యర్థులు అత్యధిక స్థానాలను గెలుచుకున్నారు. అయినప్పటికీ, PML-N, PPP పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.దీంతో 2025లో మునీర్ అధికారం మరింత పెరిగింది: నివేదిక ప్రకారం, రాజ్యాంగ మార్పుల అనంతరం అసిమ్ మునీర్ను ఫీల్డ్ మార్షల్ మరియు రక్షణ దళాల అధిపతిగా నియమించారు. దీంతో సైన్యం, రక్షణ మౌలిక సదుపాయాలు, పాకిస్తాన్ అణు కమాండ్పై ఆయన పట్టు మరింత బలపడింది.పతాక స్థాయికి అమెరికా-పాక్ సంబంధాలుఇమ్రాన్ ఖాన్ అధికారం నుండి వైదొలగిన తర్వాత, పాకిస్తాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. ఇరు దేశాల సంబంధాలు వ్యూహాత్మక మరియు వ్యాపార ఒప్పందాల వరకు విస్తరించాయి.పాకిస్థాన్లో ఒక క్రిప్టో కౌన్సిల్ ఏర్పడింది. ట్రంప్ కుటుంబానికి చెందిన ఎల్ఎఫ్ కంపెనీతో 36 బిలియన్ డాలర్ల రెమిటెన్స్ పైప్లైన్ ఒప్పందం కుదిరింది. 500 మిలియన్ డాలర్ల విలువైన అరుదైన ఖనిజాల ఒప్పందం కూడా కుదిరింది. గాజా స్ట్రిప్కు సైనికులను పంపేందుకు ఒక ప్రతిపాదన చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అసిమ్ మునీర్ మరియు షాబాజ్ షరీఫ్లను బహిరంగంగా ప్రశంసిస్తున్న సంగతి తెలిసిందే. ముందే చెప్పిన ఇమ్రాన్తన ప్రభుత్వం పడిపోయినప్పుడు ఇమ్రాన్ ఖాన్ కూడా విదేశీ కుట్ర జరిగిందని ఆరోపించారు. 2022 మార్చిలో జరిగిన ఒక ర్యాలీలో, తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నారని పేర్కొంటూ ఆయన ఒక కాగితాన్ని ఊపారు. ఈ కేసు ఆ తర్వాత సైఫర్ కేసుగా ప్రసిద్ధి చెందింది. -
ఇరాన్ వార్.. నయా ట్రెండ్
ప్రపంచ యుద్ధాల రూపురేఖలు మారిపోతున్నాయ్. క్షిపణులు, అణు బాంబులు, డ్రోన్లు మాత్రమే కాదు.. ఇప్పుడు సరిహద్దులు, వనరులు, ఆఖరికి డిజిటల్ నెట్వర్క్లు కూడా ఆయుధాలయ్యాయి. అదెలా సాధ్యమో.. పశ్చిమాసియా యుద్ధంతో ఇరాన్ కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. తనకంటే బలమైన సైన్యం ఉన్న అమెరికాను విసిగెత్తిస్తూ ‘వార్ ట్రెండ్’ను సెట్ చేసింది.ఇరాన్ తన సరికొత్త వ్యూహం అమలుకు.. హర్ముజ్ జలసంధిని వేదికగా చేసుకుంది. దీని ద్వారానే ప్రపంచంలో ఐదో వంతు చమురు రవాణా జరుగుతుందని తెలిసిందే కదా. అందుకే జలసంధిపై తమదే పూర్తి ఆధిపత్యం అని ప్రకటించుకుని.. టోల్ప్లాజా ఏర్పాటుతో వసూళ్లు చేపట్టాలని భావించింది. తద్వారా.. వచ్చిన సొమ్ముతో యుద్ధం వల్ల దెబ్బతిన్న ఇరాన్ను పునరుద్ధరించుకోవడం, దేశ అభివృద్ధికి కావాల్సిన నిధుల్ని సమకూర్చుకుంటామని ప్రకటించి ప్రపంచ దృష్టిని ఆకర్షించుకోగలిగింది. అదే సమయంలో.. సముద్ర గర్భం కేబుళ్లపై దృష్టిసారించి భయపెట్టింది కూడా. ఇప్పుడు కేబుళ్ల విషయంలో అమెరికన్ దిగ్గజ కంపెనీలు కాంప్రమైజ్ కావాలని.. ఎంతో కొంత తమకు చెల్లించాలని(పన్ను, ఫీజు, ఫైన్.. ఏదో ఒక రూపేణా).. అలాగే వాటి నిర్వహణ(రిపేర్లు వగైరా) బాధ్యతలు కూడా తమ ఆధ్వర్యంలోనే సాగాలని కండిషన్లు పెడుతోంది. లేకుంటే కత్తిరింపులు తప్పవన్నట్లు బెదిరిస్తోంది. అలా.. తన భౌగోళిక స్థానాన్నే ఇరాన్ ఆయుధంగా మలుచుకుంది.టిట్ ఫర్ టాట్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ విషయంలో ఏం చేయాలనుకున్నాడో.. ఇరాన్ ఆ పనే కౌంటర్గా చేసి చూపించింది. అదే ఆర్థికంగా దెబ్బ తీయడం. ఇరాన్ను ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరి చేసిన ట్రంప్.. హర్ముజ్ బ్లాకేడ్, నిధుల ఫ్రీజ్లను చూపించి ఇరాన్ మెడలు వంచాలనుకున్నాడు. అయితే ఆ నష్టం ధాటికి ఇరాన్ తలొగ్గలేదు. సరికదా.. యుద్ధాన్ని సరికొత్త మలుపులు తిప్పింది.యుద్ధం ప్రారంభంలో.. చౌకగా తయారైన షాహెడ్ డ్రోన్లు ఉపయోగించి అమెరికా రక్షణ వ్యవస్థలను ఆగమాగం చేసింది. తద్వారా అమెరికా సైన్యానికి భారీ నష్టం వాటిల్లింది. ఆ తర్వాత హర్ముజ్ జలసంధి ద్వారా నౌకాయానాన్ని అడ్డుకోవడంతో తన వ్యూహాన్ని మొదలుపెట్టింది. హర్ముజ్ అనేది కేవలం 21 కిలోమీటర్ల వెడల్పు ఉండడం, పైగా తమ తీరానికి దగ్గరగా ఇరాన్కు ఎంతో కలిసొచ్చింది. రోజుకు 100–150 నౌకలు వెళ్లే హర్ముజ్లో మైన్స్, డ్రోన్లు, ఫాస్ట్ అటాక్ బోట్స్తో నియంత్రించింది. ఫలితంగా ఒక్క నౌక కూడా నీట మునగకుండానే ఇన్సూరెన్స్ ప్రీమియంలు 300% పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 100 డాలర్లు దాటింది. యూరప్ దేశాలు అదనంగా 28 బిలియన్ డాలర్ల ఇంధన బిల్లు చెల్లించాల్సి వచ్చింది. అలా క్షిపణుల యుద్ధం కాస్తా ఆర్థిక యుద్ధం అయ్యింది.భవిష్యత్తులో.. ఇరాన్ తన యుద్ధాన్ని క్షిపణుల నుంచి మరో దారికి మలిచింది. ఎనర్జీ + డేటా.. ఇవి రెండూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే అంశాలే. అలా రెండు కీలక ప్రవాహాలను ఒకేసారి నియంత్రించే శక్తి తమ వద్ద ఉందని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇకపై యుద్ధం కేవలం బాంబులు, గన్స్తో కాదు.. వివిధ వనరుల రూపంలోనూ జరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఇరాన్ చూపించిన ఈ యుద్ధ వ్యూహాన్ని ఉత్తర కొరియా, చైనా అధ్యయనం చేస్తున్నాయి. రష్యా కూడా ఈ ఉద్రిక్తతను నిశీతంగా పరిశీలిస్తోంది. అందుకే ఇది కేవలం ఒక దేశానికి కాదు, ప్రపంచానికి కొత్త హెచ్చరిక అని నిపుణులు చెబుతున్నారు.కొత్తదేం కాదా?ఇరాన్ అనుసరించిన ఈ వ్యూహం కొత్తేదేం కాదట. ఇది అర్థం చేసుకోవాలంటే చరిత్రలోని కొన్ని ఘట్టాలను గుర్తు చేసుకోవాలనుకుంటున్నారు విశ్లేషకులు.థెర్మోపిలే యుద్ధం (480 BC): స్పార్టా రాజు లియోనిడాస్ కొద్దిమంది సైనికులతో పర్షియన్ సైన్యాన్ని ఒక పర్వత మార్గంలో నిలువరించగలిగాడు. సంఖ్యలో తక్కువైనా, భౌగోళిక స్థానం (చోక్పాయింట్)ను ఉపయోగించి శత్రువుల అధిక బలాన్ని నిర్వీర్యం చేశాడు. ఇది “స్థానం” అనే ఆయుధం ఎంత శక్తివంతమో చూపించింది.రోమన్ సామ్రాజ్యం – కార్తేజ్: ప్యూనిక్ యుద్ధాల అనంతరం రోమన్లు కార్తేజ్ పొలాలను ఉప్పు చల్లి ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు. ఇది భౌగోళిక వనరులను ధ్వంసం చేసి శత్రువును బలహీనపరిచే వ్యూహం.నెపోలియన్ (19వ శతాబ్దం): బ్రిటన్తో వాణిజ్యాన్ని నిషేధించి యూరప్ ఆర్థిక వ్యవస్థను నియంత్రించాడు. ఇది వాణిజ్యాన్ని ఆయుధంగా మార్చిన ఉదాహరణ.బలహీన దేశం కూడా తన భౌగోళిక స్థానాన్ని ఆయుధంగా మార్చుకుని శక్తివంతమైన దేశాలను నిలువరించగలదు. ఇది చరిత్ర చెప్పిన పాఠం. ఆ పాఠాన్నే ఇరాన్ వల్లేసింది. అమెరికా అణు బాంబులను ఆపడానికి యుద్ధం మొదలుపెడితే.. కానీ ఇరాన్ తన భూభాగాన్ని ఆయుధంగా మార్చి మరింత శక్తివంతమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. -
మేయర్ పీఠంపై ఇండియన్.. ఎవరీ తుషార్ కుమార్?
లండన్: తూర్పు ఇంగ్లాండ్లో 23 ఏళ్ల తుషార్ కుమార్ మేయర్ ఎన్నికల్లో గెలిచి యునైటెడ్ కింగ్డమ్ (UK) చరిత్రలోనే మేయర్ పీఠాన్ని అధిరోహించి అత్యంత పిన్నవయస్కుడైన భారతీయునిగా చరిత్ర సృష్టించారు. కింగ్స్ కాలేజ్ లండన్ నుండి పొలిటికల్ సైన్స్ పూర్తి చేసిన తుషార్ కుమార్, గత వారం జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో 'ఎల్ స్ట్రీ అండ్ బోర్హామ్వుడ్' (Elstree and Borehamwood) టౌన్ కౌన్సిల్ మేయర్గా బాధ్యతలు స్వీకరించారు.రాజకీయ ప్రస్థానంలేబర్ పార్టీకి చెందిన ఈ కౌన్సిలర్ 2023లో 'ఎల్ స్ట్రీ అండ్ బోర్హామ్వుడ్' టౌన్ కౌన్సిల్లో చేరారు. మేయర్గా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన డిప్యూటీ మేయర్గా కూడా సేవలందించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తుషార్ కుమార్ మాట్లాడుతూ.. "23 ఏళ్ల వయసులో, యునైటెడ్ కింగ్డమ్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన భారతీయ సంతతి మేయర్గా అధికారికంగా బాధ్యతలు చేపట్టడం నాకొక అద్భుతమైన గౌరవం" అని ఆనందం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచిన స్థానిక ప్రజలకు, కౌన్సిలర్లకు, కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.మాజీ మేయర్ డాన్ ఓజారోవ్ అందించిన మార్గదర్శకత్వానికి ధన్యవాదాలు తెలిపిన తుషార్.. కొత్త డిప్యూటీ మేయర్గా ఎన్నికైన కౌన్సిలర్ లిండా స్మిత్కు స్వాగతం పలికారు.లక్ష్యాలు లండన్లో విద్యార్థిగా ఉన్నప్పుడే కౌన్సిలర్గా ఎన్నికైన తుషార్, నిజమైన మార్పు అనేది స్థానిక సంఘాల స్థాయి నుంచే మొదలవుతుందని, యువతను ప్రజా సేవ వైపు, సామాజిక జీవితం వైపు ప్రేరేపించడమే తన ప్రధాన లక్ష్యమని తుషార్ పేర్కొన్నారు. తన మేయర్ పదవీ కాలంలో స్థానికంగా ఉన్న పేద ప్రజలకు సహాయం చేసే 'WD6 ఫుడ్ సపోర్ట్' (WD6 Food Support) అనే స్వచ్ఛంద సంస్థకు ప్రధాన చారిటీగా మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుతెలిపారు. తుషార్ కుమార్ తనలో ఆత్మవిశ్వాసాన్ని, పబ్లిక్ స్పీకింగ్ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి కింగ్స్ కాలేజ్ లండన్లోని 'సివిక్ లీడర్షిప్ అకాడమీ' ఎంతగానో సహాయపడిందని చెప్పారు. అలాగే విద్యార్థిగా ఉన్నప్పుడు 'యూనివర్శిటీ ఆఫీసర్స్ ట్రైనింగ్ కార్ప్స్' లో కూడా ఆయన అనుభవాన్ని గడించారు. గతంలో ఆయన బ్రిటన్ ప్రభుత్వ 'డిపార్ట్మెంట్ ఫర్ వర్క్ అండ్ పెన్షన్స్' (DWP) లో పాలసీ అడ్వైజర్గా, అలాగే ఒక జాతీయ LGBTQ చారిటీ సంస్థలో రీసెర్చ్ అనలిస్ట్గా పనిచేశారు. 'బుక్మార్క్ రీడింగ్ చారిటీ' ద్వారా అక్షరాస్యత కార్యక్రమాలకు కూడా ఆయన మద్దతు అందించారు. -
కన్నీళ్లు తెప్పించే క్షణం..! ఎట్టకేలకు 130 ఏళ్ల ..
ప్రస్తుతం ఏఐ టెక్నాలజీతో శరవేగంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి ప్రపంచ దేశాలు. కొంగొత్త ఆవిష్కరణలు, రోజుకో సరికొత్త టెక్నాలజీతో దూసుకుపోతుంది యువత. అలాంటి ఈ కాలంలో వెట్టిచాకిరి వ్యవస్థ, బానిసలు అనేవి ఇంకా ఉన్నాయంటే నమ్ముతారా?. పుస్తకాల్లో, చరిత్ర పుటల్లో చదివిన ఘటనలు ఇంకా కళ్లముందు కదలాడటమే కాదు, ఆ దురాగతలకే బలి అవుత్ను వాళ్లు ఇంకా మన మధ్యే ఉన్నారు. అలాంటి భావోద్వేగ ఘటనే పాకిస్తాన్లో చోటుచేసుకుంది. ఓ కుటుంబం అప్పులో ఊబిలో చిక్కుకుని, తరతరాలు వెచ్చిచాకిరిలో మగ్గిపోయింది. సింపుల్గా చెప్పాలంటే ఆధునిక బానిసలు. బాధలనే చీకట్లో మగ్గిపోతున్న వాళ్ల బతుకుల్లోకి ఓ విదేశీయుడి కారణంగా వెలుగు సంతరించుకుంది. అసలేం జరిగిందంటే..పాకిస్తాన్లోని పంజాబ్లోని కసూర్ ప్రాంతంలో ఇటుక బట్టీలలో దాదాపు 130 ఏళ్లుగా వెట్టిచాకిరిలో చిక్కుకుంది ఓ కుటుంబం. ఆ ఫ్యామిలీని విడిపించేందుకు ఓ మానవతావాది ముందుకొచ్చారు. నివేదికల ప్రకారం..తరతరాల క్రితం వారి పూర్వీకులు తీసుకున్న 'పేష్కి' అనే అప్పు భారంతో పనిచేస్తూ ఉండేది. ఆ అప్పు ఎన్నడూ తీరకపోవడంతో తర్వాత తరాలు వేతనాలు లేకుండా పనిచేస్తూ జీవితాంత బానిసలుగా బతుకీడుస్తున్నారు. వాళ్లకు విముక్తి కలిగించే రక్షణ చర్యను ఆరోన్ హచింగ్స్ అనే విదేశీయుడు చేపట్టారు. 'జూబ్లీ క్యాంపెయిన్' అనే మానవహక్కుల సంస్థ సభ్యుడైన ఆరోన్ వారి జీవితాలకు బానిసత్వం నుంచి విముక్తి కల్పించి, కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. ఈ 'జూబ్లీ క్యాంపెయిన్' సంస్థ పలు దేశాలలో బానిసత్వం, మతపరమైన హింసకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఒక మానవ హక్కుల సంఘం. హచింగ్స్ ఆ కుటుంబం బానిసత్వం నుంచి విముక్తి లభిస్తుందని తెలుసుకుని ఎలా భావోద్వేగంగా స్పందించారో రికార్డు చేసి మరీ వీడియోని పంచుకున్నారు. అంతేగాదు ఆ వీడియోకి ఐదో రోజు గుడ్న్యూస్ తెలుసుకున్న ఆ కుటుంబం..కన్నీళ్లు పెట్టుకున్న క్షణం అనే క్యాప్షన్ జోడించి మరి పోస్టు చేశారు. కాగా, ఈ జూబ్లీ క్యాంపెయిన్ ప్రపంచవ్యాప్తంగా జాతి, మత మైనారిటీల కోసం మానవ హక్కులు, మత స్వేచ్ఛను ప్రోత్సహించడానికి పనిచేస్తుంది. ఈ క్యాంపెయిన్ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్, మయన్మార్, నైజీరియా, పాకిస్తాన్, ఇరాన్, ఈజిప్ట్ వంటి దేశాలలో బలవంతపు చాకిరీ, వెట్టిచాకిరి,మానవ అక్రమ రవాణా వంటి సమస్యలపై పనిచేస్తోంది. నెటిజన్లు ఈ వీడియోని చూసి..ఆ విదేశీయుడు హచింగ్స్ని ప్రశంసించగా, ఇంకా ఇలాంటివి కొనసాగుతున్నాయా అని విస్తుపోస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Aaron Hutchings (@aaronhutchings77) (చదవండి: ఆ కేఫ్ మొత్తం ఆడవాళ్లే..!) -
ఇస్లాంపూర్- కృష్ణానగర్గా .. పాకిస్థాన్లో పేర్ల మార్పు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలోని చారిత్రక కట్టడాలకు, వారసత్వ సంపదలకు విభజనకు ముందు ఉన్న పేర్లను తిరిగి నామకరణం చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఇంతకాలం ఇస్లామిక్ సంప్రదాయాలతో ముడిపడి ఉన్న వ్యక్తులకు, ప్రదేశాలకు పేర్లు ఉండగా ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో వాటికి పాత పేర్లు రానున్నాయి.పాకిస్థాన్ మతతత్వ విధానాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ దేశానికి చెందిన ప్రతి చిన్న విషయంలో మతతత్వ విధానాలనే ఆ దేశం ఫాలో అవుతుంటుంది. ఈ నేపథ్యంలోనే అక్కటి చారిత్రక ప్రదేశాలకు ఇస్లామిక్ భావజాలలతో సంబంధం ఉన్న పేర్లనే పెట్టింది. కాగా ఇప్పుడు ఆ నిర్ణయం మార్చుకోనున్నట్లు ప్రకటించింది. మార్పు జరిగే ప్రాంతాల పేర్లుకృష్ణ నగర్ - ఇస్లాంపురాగాసంత్నగర్ - సున్నత్ నగర్ధరంపురా - ముస్తఫాబాద్గాబ్రాండ్రెత్ రోడ్- నిష్తర్ రోడ్గాటెంపుల్ స్ట్రీట్ - హమీద్ నిజామీ రోడ్గా లక్ష్మీ చౌక్- మౌలానా జఫర్ అలీ ఖాన్ చౌక్గాజైన్ మందిర్ రోడ్- బాబ్రీ మసీద్ చౌక్గా రామ్ గలిని -రెహమాన్ గలికుంహర్పురా- ఘజియాబాద్ గా మార్చారు.అదే విధంగా క్వీన్స్ రోడ్ - ఫాతిమా జిన్నా రోడ్.జైల్ రోడ్- అల్లామా ఇక్బాల్ రోడ్, డేవిస్ రోడ్ పేరును సర్ అగా ఖాన్ రోడ్గా, లారెన్స్ రోడ్ పేరును బాగ్-ఇ-జిన్నా రోడ్గా, మరియు ఎంప్రెస్ రోడ్ పేరును షహ్రా-ఇ-అబ్దుల్ హమీద్ బిన్ బదీస్గా మార్చారు.కాగా పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఆదేశాలనుగునంగానే చారిత్రక ప్రదేశాలకు దేశ విభజనకు ముందు ఉన్న పేర్లను పెట్టాలని నిర్ణయించుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. కాగా ఇటీవల జరిగిన పంజాబ్ క్యాబినెట్ సమావేశంలో చారిత్రక ప్రదేశాలకు వాటి పూర్వ పేర్లే ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.అదే విధంగా ప్రస్తుతం గ్రేటర్ ఇక్బాల్ పార్క్గా పిలవబడుతున్న మింటో పార్క్లోని మూడు క్రికెట్ మైదానాలను, ఒక సాంప్రదాయ అఖారాను (కుస్తీ రంగం) పునరుద్ధరించాలని కూడా ప్రధాని ప్రతిపాదించారని అక్కడి అధికారులు తెలిపారు. -
ట్రంప్, నెతన్యాహులను హతమారిస్తే రూ. 480 కోట్లు : ఇరాన్
Iran War అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను హతమార్చిన వారికి 58 మిలియన్ డాలర్ల (సుమారు 50 మిలియన్ యూరోలు, రూ. 480 కోట్ల ) బహుమతి (బౌంటీ) ప్రకటించే దిశగా ఇరాన్ పార్లమెంట్ ఒక బిల్లును సిద్ధం చేస్తోందని 'ఇరాన్ వైర్', 'ది టెలిగ్రాఫ్ యూకే' నివేదికల ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.ఇరాన్ పార్లమెంట్కు చెందిన 'నేషనల్ సెక్యూరిటీ అండ్ ఫారిన్ పాలసీ కమిటీ' చైర్మన్ ఇబ్రహీం అజీజీ ఈ బిల్లును సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి "కౌంటర్-యాక్షన్ బై ది మిలిటరీ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆఫ్ ది ఇస్లామిక్ రిపబ్లిక్" అని పేరు పెట్టినట్టు తెలుస్తోంది. .ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిటీ చైర్మన్ ఇబ్రహీం అజీజీ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిగిన వైమానిక దాడుల్లో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. ఇతనితోపాటు పలువురు కుటుంబ సభ్యులు కూడా హతమయ్యారు. ప్రస్తుత సుప్రీం లీడర్ తీవ్ర గాయాలు పాలుకావడానికి కూడా ఈ దాడులే కారణమని అంచనా. ఈ దాడులకు ప్రతీకారంగా ట్రంప్, నెతన్యాహులను హతమార్చడానికి రివార్డులను ప్రతిపాదించే ఈ బిల్లుపై ఇరాన్ పార్లమెంట్ త్వరలోనే ఓటింగ్ నిర్వహించనుంది. ఖమేనీ హత్యలో పాత్ర ఉన్నందుకు గాను ట్రంప్, నెతన్యాహు, మరియు యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్లను లక్ష్యంగా చేసుకుని ఈ "ప్రతీకార చర్య" తీసుకోవాలని అజీజీ పేర్కొన్నట్లు ఇరాన్ వైర్ తెలిపింది. జాతీయ భద్రతా కమిషన్ లోని మరొక సభ్యుడు మహమూద్ నబవియాన్ కూడా, ట్రంప్, నెతన్యాహులను "నరకానికి పంపే" ఎవరికైనా బహుమతులు ఇచ్చే బిల్లుపై తమ పార్లమెంట్ త్వరలోనే ఓటు వేస్తుందని ప్రకటించారు. మసాఫ్ (Masaf) మీడియా : 'కిల్ ట్రంప్' ప్రచారం ,సైబర్ గ్రూప్ ప్రకటనఇరాన్ ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థ 'మాసఫ్' కొన్ని రోజుల క్రితమే ఒక ప్రకటన చేస్తూ, ఇస్లామిక్ ప్రభుత్వం "కిల్ ట్రంప్" అనే ప్రచారం కోసం 50 మిలియన్ల డాలర్ల ఆర్థిక వనరులను సమకూర్చుకుందని పేర్కొంది.హండాలా (Handala) హ్యాకింగ్ గ్రూప్: అంతకుముందు, ఇరాన్ ప్రభుత్వ మద్దతు ఉన్న సైబర్ వార్ఫేర్ గ్రూప్ "హండాలా" కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా న్యాయ శాఖ తమ గ్రూప్ సభ్యుల సమాచారం కోసం 10 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించినందుకు ప్రతిస్పందనగా... "అణచివేత, అవినీతికి ప్రధాన సూత్రధారులు" అయిన ట్రంప్ మరియు నెతన్యాహులను అంతమొందించడానికి తాము ఈ వనరులను కేటాయించామని హండాలా క్లెయిమ్ చేసింది. ఈ ఇద్దరు దేశాధినేతలపై "ప్రత్యక్ష చర్య" తీసుకునే ఏ వ్యక్తికైనా లేదా సమూహానికైనా ఈ డబ్బు చెల్లిస్తామని ఆ హ్యాకింగ్ గ్రూప్ పేర్కొంది. ఇరాన్ ప్రతిపాదించిన ఈ బౌంటీ (రివార్డు) చట్టం, గతంలో వారు చేసిన మతపరమైన ఫత్వాలు లేదా ప్రచారాల కంటే చాలా ప్రమాదకరమైనదిగా భావిస్తున్నారు.గతంలో ఇరాన్ కేవలం మతపరమైన ఫత్వాలు లేదా ప్రచారాల ద్వారా మాత్రమే ఇలాంటి హెచ్చరికలు చేసేది. కానీ ఇప్పుడు ఏకంగా పార్లమెంట్లో చట్టబద్ధంగా బౌంటీ బిల్లును తీసుకురావాలని చూడటం అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందాన్ని తీవ్ర ముప్పులోకి నెడుతుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: వింటేజ్ లుక్ : ఇషా అద్భుతమైన ఫ్యాషన్ స్టైల్అమెరికా హెచ్చరిక: గతంలో ట్రంప్ మాట్లాడుతూ.. తనను చంపడానికి ఇరాన్ ప్రయత్నిస్తే, ఆ దేశాన్ని "భూమ్మీద లేకుండా పూర్తిగా తుడిచిపెట్టేస్తాం" (Wipe them off the face of the Earth) అని తీవ్రంగా హెచ్చరించారు.శాంతి చర్చల్లో సందిగ్ధత: ఇరాన్ తాజాగా అమెరికాకు ఒక కొత్త శాంతి ప్రతిపాదనను పంపినప్పటికీ, అది పాత ప్రతిపాదనల కంటే పెద్దగా మెరుగ్గా ఏమీ లేదని వాషింగ్టన్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయని మరియు ఇరాన్ సానుకూలంగా స్పందించాల్సిన ఒత్తిడి వారిపైనే ఉందని అమెరికా అధికారులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: వివాదంలో యాసిడ్ దాడి బాధితురాలు : అసలు ఏమైంది? -
తైవాన్ యుద్ధంలోకి ఫిలిప్పీన్స్
మనీలా: తైవాన్ చుట్టూ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా నుండి తైవాన్పై ఏ చిన్న దాడి జరిగినా, భౌగోళికంగా సమీపాన ఉన్న కారణంగా ఫిలిప్పీన్స్ అనివార్యంగా యుద్ధంలోకి ప్రవేశిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ యుద్ధమే వస్తే, భౌగోళికంగా తమ దేశం అందులో భాగస్వామ్యం వహించక తప్పదంటూ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు డ్రాగన్ కంట్రీ చైనాకు తీవ్ర ఆగ్రహం తెప్పించే అవకాశం ఉంది.సైనిక ఘర్షణ మొదలైతే..తైవాన్ విషయంలో తమకు వేరే ప్రత్యామ్నాయం లేదని జపనీస్ మీడియాకు మార్కోస్ స్పష్టం చేశారు. తైవాన్ తమకు చాలా దగ్గరగా ఉండటమే కాకుండా, దాదాపు 2,00,000 మంది ఫిలిప్పీన్స్ పౌరులు అక్కడ నివసిస్తూ, పనిచేస్తున్నారని ఆయన గుర్తుచేశారు. ఒకవేళ నిజంగానే సైనిక ఘర్షణ మొదలైతే ఉత్తర ఫిలిప్పీన్స్ ఆ యుద్ధ ప్రభావానికి తీవ్రంగా గురవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధంలోకి వెళ్లడం తమకు ఇష్టం లేకపోయినా, భౌగోళిక పరిస్థితులు తమను బలవంతంగా లాగుతాయని తెలిపారు.జపాన్తో చేతులు కలుపుతూ..ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే వారం మార్కోస్ జపాన్లో పర్యటించనున్నారు. జపాన్ ప్రధాన మంత్రి సనే తకైచితో సమావేశమై భద్రతా సహకారంపై కీలక చర్చలు జరపనున్నారు. టోక్యో ఇటీవల రక్షణ ఎగుమతుల నిబంధనలను సడలించిన క్రమంలో, జపాన్ భద్రతా విధానంపై మరింత స్పష్టత వస్తుందని మార్కోస్ తెలిపారు. తూర్పు చైనా సముద్రంలో బీజింగ్ నుండి జపాన్, ఫిలిప్పీన్స్ ఎదుర్కొంటున్న బెదిరింపులు, సవాళ్లు ఒకటేనని ఆయన పేర్కొన్నారు. జపాన్ భవిష్యత్తు కార్యాచరణ ఏమిటనేది తెలుసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు.చైనాతో దౌత్యం.. ట్రంప్, జిన్పింగ్ మంతనాలుదక్షిణ చైనా సముద్రంపై బీజింగ్తో ప్రాదేశిక వివాదం ఉన్నప్పటికీ, శాంతిని నెలకొల్పేందుకు చైనాతో ఉన్నత స్థాయి సంప్రదింపులు జరుపుతున్నట్లు మార్కోస్ ప్రకటించారు. మరోవైపు గత వారం బీజింగ్లో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తైవాన్ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. తైవాన్ విషయంలో జోక్యం చేసుకుంటే తీవ్ర ఘర్షణలకు దారితీస్తుందని జిన్పింగ్ హెచ్చరించినట్లు ట్రంప్ స్వయంగా తెలిపారు.ఇది కూడా చదవండి: ఆర్జీ కర్ కేసు: సందీప్ ఘోష్ ప్రాసిక్యూషన్కు అనుమతి -
అమెరికా మసీదులో కాల్పులు.. ముగ్గురు మృతి
అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో ఉలిక్కిపడింది. కాలిఫోర్నియాలోని శాన్ డియాగో ఇస్లామిక్ సెంటర్ (మసీదు) వెలుపల సోమవారం మధ్యాహ్నం ఇద్దరు దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక సెక్యూరిటీ గార్డుతో సహా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు విడిచారు. ఈ ఘటనను పోలీసులు ద్వేష పూరిత దాడిగా అనుమానిస్తున్నారు. అయితే ఈ ఘటనా స్థలానికి సమీపంలోని వీధిలో పార్క్ చేసి ఉన్న ఒక కారులో 17, 19 ఏళ్ల వయస్సు ఉన్న ఇద్దరు యువకుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. దాడి చేసిన అనంతరం నిందితులు ఇద్దరూ తమను తాము కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.పోరాడిన సెక్యూరిటీ గార్డుమరణించిన ముగ్గురిలో ఒకరైన సెక్యూరిటీ గార్డు.. సాయుధులైన దుండగులు లోపలికి చొరబడకుండా అతను తన ప్రాణాలను పణంగా పెట్టి అడ్డుకున్నాడు. ఆ సమయంలో మసీదు కాంప్లెక్స్ పరిధిలోని ‘అల్ రషీద్’ స్కూల్లో వందలాది మంది చిన్న పిల్లలు ఉన్నారు. ఒకవేళ అతడే గానీ అడ్డుపడకపోయింటే పెద్ద ఎత్తున రక్తపాతం జరిగి ఉండేది. ఈ ఘటన జరిగిన వెంటనే వందలాది మంది పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అరబిక్, ఖురాన్ పాఠశాలలోని చిన్న పిల్లలను పోలీసులు సురక్షితంగా బయటకు తరలించారు. -
హరిత ఇంధనంలో సమష్టి కృషి
ఓస్లో: యూరప్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్తో శుద్ధ ఇంధనంలో సమష్టి కృషే ధ్యేయంగా హరిత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నారు. శుద్ధ ఇంధనం మొదలు వాతావరణ మార్పులను తట్టుకోవడం, తక్కువ కర్భన ఉద్గారాలు వెదజల్లేలా సముద్రవాణిజ్యాన్ని ప్రోత్సహించడం, డిజిటల్ సాంకేతిక, అంతరిక్షం, ఆర్కిటిక్ ఖండంలో పరిశోధన దాకా పలు అంశాలపై నార్వే ప్రధానితో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సోమవారం నార్వే రాజధాని నగరం ఓస్లోలో జోనాస్ గార్ స్టోర్తో విస్తృతస్థాయిలో చర్చల సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘‘ఇరుదేశాల మధ్య బంధాన్ని హరిత వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించుకున్నాం. పర్యావరణ అనుకూల సుస్థిరాభివృద్ధి ధ్యేయంగా శుద్ధ ఇంధనంతోపాటు వాతావరణ మార్పుల కట్టడి, పర్యావరణ పరిరక్షణ కోసం ఇకపై భారత్, నార్వే కలిసి నడుస్తాయి. గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ తర్వాత భారత దేశ ప్రతిభ, అందిపుచ్చుకునే తత్వం, వేగాన్ని నార్వే సాంకేతికత, పెట్టుబడులతో జోడించి రెండు దేశాల పరిశ్రమలు, సంస్థలు క్లీన్ ఎనర్జీ మొదలు బ్లూ ఎకానమీ, గ్రీన్ షిప్పింగ్ దాకా ఎన్నో రంగాల్లో అద్భుతాలు సృష్టించనున్నాయి. సత్సంబంధంలో భారత్, యూరప్ కొత్త స్వర్ణయుగంలోకి అడుగుపెడుతున్నాయి. వచ్చే 15 ఏళ్లలో భారత్లోకి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులతోపాటు పది లక్షల ఉద్యోగాల కల్పనకు భారత్, యురోపియన్ స్వేచ్ఛా, వాణిజ్య ఒప్పందం బాటలుపరుస్తుంది. వచ్చే నాలుగేళ్లలో నార్వే, భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆర్కిటిక్లో భారత పరిశోధనా కేంద్రం ‘హిమాద్రి’కి నార్వే ఎంతగానో సాయపడుతోంది. ఇస్రో, నార్వే స్పేస్ ఏజెన్సీ మధ్య అవగాహన ఒప్పందం కుదరడం సంతోషకరం. ఆహార, ఇంధన భద్రత మొదలు పలు రంగాల్లో ఇరుదేశాల మధ్య బంధం సమున్నత శిఖరాలకు చేరుకోబోతోంది. ఉక్రెయిన్కావొచ్చు పశ్చిమాసియా సంక్షోభంకావొచ్చు ఏదైనా సంఘర్షణను చర్చలు, సంప్రతింపులు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోగలం. శాంతిస్థాపనకు భారత్, నార్వే ఎల్లప్పుడూ కృషిచేస్తాయి’’అని మోదీ వ్యాఖ్యానించారు. మోదీకి నార్వే అత్యున్నత పురస్కారం నార్వే అత్యున్నత పౌర పురస్కారం ‘ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేనియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’ను మోదీ అందుకున్నారు. భారత్–నార్వే సత్సంబంధాలను సమున్నత శిఖరాలకు చేర్చేందుకు మోదీ చేస్తున్న కృషి, ఆయన దార్శనిక నాయకత్వానికిగాను మోదీని ఈ పురస్కారంతో గౌరవిస్తున్నట్లు నార్వే ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ మెడల్ను రాజప్రాసాదంలో నార్వే రాజు హరాల్డ్–5 స్వయంగా మోదీకి ప్రదానంచేశారు.మోదీకి పురస్కారం అందజేస్తున్న రాజు హరాల్డ్ మోదీ పారిపోయారు: రాహుల్మీడియా ఎదుట నార్వే ప్రధానితో మోదీ కరచాలనంచేశాక మీడియా ప్రతినిధుల నుంచి ఎలాంటి ప్రశ్నోత్తరాలను స్వీకరించకుండానే భారత ప్రధాని వెనుతిరిగారు. దీనిపై నార్వే మీడియా ప్రతినిధులు అసహనం వ్యక్తంచేశారు. ‘‘మోదీ మా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. ప్రపంచ పత్రికాస్వేచ్ఛలో నార్వే అగ్రస్థానంలో ఉంది. అదే భారత్ 157వ స్థానంలో అట్టడుగున ఉంది. పాలస్తీనా, ఎమిరేట్స్, క్యూబా లాంటి దేశాల పక్కన ఆగిపోయింది’’అని హెలీ లింగ్ అనే జర్నలిస్ట్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై లోక్సభలో విపక్షనేత రాహుల్గాంధీ స్పందిస్తూ ‘ఎక్స్’లో సోమవారం ఒక పోస్ట్పెట్టారు. ‘‘భయపడనప్పుడు దాచిపెట్టాల్సిన పనేలేదు. మీడియా అడిగేప్రశ్నలకు సమాధానం చెప్పలేక మోదీ పారిపోయారు. ఇలా చేస్తే భారత పరువు పోదా?’’అని రాహుల్ నిలదీశారు. -
ప్రైవేట్ ఉద్యోగులకు నాలుగు రోజుల సెలవులు ప్రకటన
అబుదాబి: యూఏఈ వ్యాప్తంగా ప్రైవేటు రంగ ఉద్యోగులకు అరాఫత్ దినోత్సవం, ఈద్ అల్ అదా (బక్రీద్) పండుగలను పురస్కరించుకుని నాలుగు రోజుల పాటు వేతనంతో కూడిన సెలవును ప్రభుత్వం ప్రకటించింది. ఈద్ సెలవులు ప్రైవేట్ రంగ ఉద్యోగులకు మే 26న ప్రారంభమై మే 29 వరకు కొనసాగుతాయి.ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ఇదే వరకే ప్రకటించారు. వారికి మే 25 నుంచి మే 29 వరకు మొత్తం 5 రోజులు సెలవులు ఉంటాయి. శని, ఆదివారాల వారాంతపు సెలవుల అనంతరం ఇరు రంగాల ఉద్యోగులూ తిరిగి జూన్ 1 నుంచి విధులకు హాజరు కానున్నారు. కాగా ఆదివారం సాయంత్రం (మే 17) 'దుల్ హిజ్జా' నెలవంక కనిపించినట్లు మూన్ సైటింగ్ కమిటీలు, ఖగోళ పరిశోధన కేంద్రాలు అధికారికంగా ధ్రువీకరించాయి. ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్లో చివరి నెల అయిన ధు అల్ హిజ్జా 10వ రోజున ఈద్ అల్ అధా జరుపుకుంటారు. అరాఫా మే 26 మంగళవారం వచ్చే అవకాశం ఉంది. ఈద్ అల్ అధా పర్వదినం మే 27 బుధవారం ఉదయం ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు. -
ఇరాన్తో యుద్దం.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్పై జరపాలనుకున్న సైనిక దాడిని ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు ట్రంప్ ప్రకటించారు. ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల అధినేతలు చేసిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముగింపు ప్రతిపాదనల విషయంలో తిరస్కరణల పరంపర కొనసాగుతుండడంతో మరోసారి మధ్యప్రాచ్యంలో బాంబుల మోత మోగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ట్రంప్ తాజా నిర్ణయంతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు ప్రస్తుతానికి కాస్త పక్కకు తొలిగాయి."ఇరాన్తో ప్రస్తుతం కీలకమైన చర్చలు జరుగుతున్నాయి. దీంతో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్పై మేము తలపెట్టిన సైనిక దాడిని వాయిదా వేయమని ఖతార్ అమీర్ షేక్ తమీమ్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, యూఏఈ అధ్యక్షుడు మహ్మద్ బిన్ జాయెద్లు నన్ను కోరారు. ఇరాన్ వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు లేకుండా చేస్తామమని" ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో రాసుకొచ్చారు. కాగా ఇరాన్ విషయంలో ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ భిన్నమైన వైఖరులను కలిగి ఉన్నాయి. ఇరాన్తో శాంతి చర్చలు సఫలం కాకపోతే భారీ దాడి చేస్తామని ట్రంప్ ఇటీవలే మరోసారి హెచ్చరించారు. దీంతో అమెరికా-ఇరాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం వస్తే మొత్తం తమ ప్రాంతమే అతలాకుతలం అవుతుందని భావించిన గల్ఫ్ దేశాలన్నీ ఇప్పుడు ఏకతాటిపైకి వచ్చి యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాయి. -
ఇకపై ఒకటో తేదీనే జీతం.. లేదంటే కంపెనీ క్లోజ్!
అబుదాబి: యూఏఈలో ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులకు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి శ్రమకు తగ్గ ఫలితం సమయానికి దక్కేలా 'మినిస్టీరియల్ రిజల్యూషన్ నంబర్ 0340 ఆఫ్ 2026' పేరుతో కొత్త చట్టాన్ని యూఏఈ మానవ వనరులు, స్వదేశీకరణ మంత్రిత్వ శాఖ తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం.. ప్రైవేట్ రంగ సంస్థలు తమ ఉద్యోగులకు ప్రతి నెలా మొదటి తేదీ నాడే జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఒకటో తేదీ లోపు జీతం అకౌంట్లో పడకపోతే, దానిని 'ఆలస్యమైన వేతనం' గా పరిగణిస్తారు. కంపెనీ సేఫ్ జోన్లో ఉండాలంటే 1వ తేదీ నాటికి ఉద్యోగి మొత్తం జీతంలో కనీసం 85% డబ్బులు అకౌంట్లో వేయాలి. ఒకవేళ జీతం చెల్లించకపోతే రెండో రోజు నుంచి సదరు కంపెనీపై ప్రభుత్వం నిఘా పెట్టి, నోటీసులు జారీచేస్తోంది. ప్రభుత్వం ఐదు రోజుల వరకు చూస్తోంది. అప్పటికి ఉద్యోగుల ఖాతాలో జీతాలు జమ కాకపోతే సదరు కంపెనీలకు కొత్త వర్క్ పర్మిట్లను జారీ చేయడం అధికారులు నిలిపివేస్తారు.16 రోజులు దాటితే కార్మికుల తరపున మంత్రిత్వ శాఖే స్వయంగా రంగంలోకి దిగి కేసు నమోదు చేస్తోంది. ఈ నిబంధనలు జూన్ 1, 2026 నుండి అమలుల్లోకి రానున్నాయి. ఈ కొత్త చట్టంతో యూఏఈలో పనిచేస్తున్నప్రవాస భారతీయులకు మేలు జరగనుంది.అయితే 11 ప్రత్యేక కేసులకు మాత్రం ఈ గడువు చట్టం నుండి మినహాయింపు ఇచ్చారు:కోర్టులో వేతన వివాదాల క్లెయిమ్ నడుస్తున్న కార్మికులు.కంపెనీ నుండి పారిపోయినట్లు రిపోర్ట్ నమోదైన వారు.జైలు లేదా కస్టడీలో ఉండి విధులకు హాజరుకాలేని వారు.అధికారికంగా జీతం లేని సెలవులో ఉన్న కాలంలో.ఓడలపై పనిచేసే నావికులు (సీఫేరర్స్).విదేశీ కంపెనీల బ్రాంచ్లలో పనిచేస్తూ, యూఏఈ వెలుపల జీతాలు పొందే విదేశీయులు.3 నెలల లోపు కాలపరిమితి గల 'మిషన్ వర్క్ పర్మిట్'లపై ఉన్నవారు.స్థానిక యూఏఈ పౌరుల యాజమాన్యంలోని చేపల వేట పడవలు.స్థానిక పౌరుల స్వంత యాజమాన్యంలోని పబ్లిక్ టాక్సీలు.బ్యాంకులు, ఆర్థిక సంస్థలు.మతపరమైన ప్రార్థనా స్థలాలు. -
రెస్టారెంట్లో బుల్లెట్ల వర్షం.. నలుగురిని బలితీసుకున్న 17 ఏళ్ల కుర్రాడు!
దక్షిణ టర్కీలోని మెర్సిన్ నగరంలో సోమవారం తుపాకుల మోత మోగింది. ఓ దుండగుడు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. టర్కిష్ వార్తా సంస్థ డీహెచ్ఏ ప్రకారం... నిందితుడు మొదట ఒక రెస్టారెంట్లోకి చొరబడి అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆ తర్వాత నగరంలోని మరో ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో మరో ఇద్దరు మరణించారు. అనంతరం దుండగుడు కారులో పారిపోయినట్లు డీహెచ్ఏ తమ కథనంలో పేర్కొంది. కాల్పులు జరిపిన వ్యక్తిని 17 ఏళ్ల యువకుడిగా పోలీసులు గుర్తించారు. నిందుతుడి కోసం పోలీసులు హెలికాప్టర్లతో సహాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు స్ధానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ కాల్పుల్లో మరణించిన వారిలో రెస్టారెంట్ యజమాని, అక్కడ పనిచేసే ఓ ఉద్యోగి ఉన్నారు. నగరంలోని వేరే చోట జరిగిన కాల్పుల్లో పశువులను మేపుకుంటున్న ఒక యువకుడు, అలాగే ఒక ట్రక్ డ్రైవర్ దుర్మరణం పాలయ్యారు.చదవండి: పాకిస్థాన్ భయంకర వ్యూహం.. చైనాతో ‘అణు’ డీల్కు రహస్యంగా.. -
దుబాయ్ లాటరీ: భారతీయులకు జాక్పాట్
అబుదాబిలో నిర్వహించిన బిగ్ టికెట్ లాటరీ డ్రాలో మరోసారి భారతీయులను అదృష్టం వరించింది. యూఏఈలో ప్రవాసుల కలల సిరి 'అబుదాబీ బిగ్ టికెట్' మే నెల మొదటి వారపు ఈ-డ్రా ఫలితాలను తాజాగా ప్రకటించింది. ఈ లక్కీలో డ్రాలో 1,00,000 దిర్హాల (సుమారు రూ. 26 లక్షలకు పైగా) నగదు బహుమతిని మొత్తం నలుగురు గెలుచుకున్నారు. ఈ నలుగురు విజేతలలో ఇద్దరు భారతీయులు కాగా, మిగిలిన ఇద్దరు మలేషియా, బంగ్లాదేశ్ పౌరులు. విజేతలలో ప్రతి ఒక్కరికీ 25,000 దిర్హాల (సుమారు రూ. ఆరున్నర లక్షలు) చొప్పున నగదు బహుమతి దక్కనుంది.లాటరీ గెలుచుకున్న భారతీయలు వీరేకేరళకు చెందిన 39 ఏళ్ల జవాద్ నజీర్.. ఖతార్లోని పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ రంగంలో పనిచేస్తున్నాడు. అయితే ఖతార్లో ఉంటున్న జవాద్, అబుదాబి బిగ్ టికెట్ గురించి తెలుసుకుని గత మూడేళ్లుగా తన 20 మంది స్నేహితులతో కలిసి టికెట్లు కొనుగోలు చేస్తున్నాడు. ఇప్పుడు ఎట్టకేలకు అతడికి అదృష్టం వరించింది. లక్కీ డ్రాలో గెలిచినట్లు ఫోన్ కాల్ వచ్చినప్పుడు మొదట నమ్మలేకపోయానని నజీర్ తెలిపాడు. అదేవిధంగా వచ్చిన బహుమతి మొత్తాన్ని మా స్నేహితులమంతా సమానంగా పంచుకుంటాం అని జవాద్ ఆనందం వ్యక్తం చేశాడు. మరోవైపు బెంగళూరు చెందిన వినయ్ పుదుమన గత 15 ఏళ్లుగా దుబాయ్లో నివాసముంటున్నాడు.గత ఐదేళ్లుగా బిగ్ టికెట్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వినయ్.. మొదట్లలో తన స్నేహితులతో కలిసి టికెట్లు కొనేవాడు. కానీ ఆ తర్వాత సొంతంగానే టికెట్లు కొనడం ప్రారంభించాడు. ఆన్లైన్ ద్వారా ఆయన కొనుగోలు చేసిన 037772 అనే నంబర్ టికెట్ అతడికి భారీ నగదుబహుమతిని తెచ్చిపెట్టింది. -
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. సౌదీకి తోడుగా పాక్ సైన్యం భారీ మోహరింపు
ఇస్లామాబాద్:పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ ఏ క్షణమైనా మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా మిత్రదేశాలు అప్రమత్తమయ్యాయి. ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు సమాయత్తమవుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ సౌదీ అరేబియాకు 8 వేల మంది సైనిక బలగాలను పంపింది. సైనికులతో పాటు ఫైటర్ జెట్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా పంపినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించింది. అయితే, ఇస్లామాబాద్లో జరిగిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. ఇరాన్తో సాంస్కృతిక, భౌగోళిక సంబంధాలు ఉన్నప్పటికీ, పాకిస్థాన్ సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలతో వ్యూహాత్మక ఒప్పందాలు కుదుర్చుకుంది.ఒప్పందం ప్రకారం, ఇరాన్ దాడులు చేస్తే తిప్పికొట్టేలా సైన్యం, యుద్ధ విమానాలను సౌదీకి పంపినట్లు భద్రతా అధికారులు ధృవీకరించారు. గతేడాది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. వాటిలో ప్రత్యర్థి దేశాల దాడుల సమయంలో ఒకరికొకరు అండగా నిలబడాలని నిబంధనలు ఉన్నాయి. పాకిస్థాన్-సౌదీ రక్షణ ఒప్పందం పూర్తి వివరాలు గోప్యంగా ఉన్నప్పటికీ, ఒకరిపై దాడి జరిగితే మరొకరు రక్షణకు రావాల్సి ఉంటుందని ప్రకటించారు. రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, ఈ ఒప్పందం సౌదీ అరేబియాను పాకిస్థాన్ అణు కవచం కింద ఉంచుతుందని సూచించారు.సమాచారం ప్రకారం, పాకిస్థాన్ ఏప్రిల్ ప్రారంభంలో 16 జేఎఫ్-17 యుద్ధ విమానాలు, రెండు డ్రోన్ స్క్వాడ్రన్లు, హెచ్క్యూ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను సౌదీకి పంపింది. ఈ మోహరింపులో 8,000 సైనికులు ఉన్నారు. అవసరమైతే మరిన్ని సైనికులను పంపుతామని పాకిస్థాన్ హామీ ఇచ్చింది.ఘర్షణ సమయంలో పంపిన సైనికులు, వైమానిక దళ సిబ్బంది ప్రధానంగా సలహా, శిక్షణ పాత్ర పోషిస్తారని అధికారులు తెలిపారు. ఒప్పందం ప్రకారం గరిష్టంగా 80,000 పాకిస్థాన్ సైనికులను సౌదీకి పంపే అవకాశం ఉంది. అదనంగా యుద్ధ నౌకలు పంపే అంశం కూడా ఒప్పందంలో ఉంది.ఈ మోహరింపు ప్రతీకాత్మకంగా కాకుండా, యుద్ధ విమానాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, వేలాది సైనికులతో కూడిన పెద్ద స్థాయి చర్య అని వర్గాలు పేర్కొన్నాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం, సౌదీ ఇరాన్పై గోప్య దాడులు జరిపింది. పాకిస్థాన్ గతంలో కూడా సౌదీకి సైనిక శిక్షణ, సలహా అందించింది. మరోవైపు, సౌదీ పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభ సమయంలో ఆర్థిక సహాయం అందించింది. -
పాకిస్థాన్ భయంకర వ్యూహం.. చైనాతో ‘అణు’ డీల్కు రహస్యంగా..
పాకిస్థాన్ రక్షణ వ్యవస్థ ఏం చేసినా భారత్ను దృష్టిలో పెట్టుకునే చేస్తుంది. భారత్ త్రివిధ దళాల వద్ద ఉన్న విధ్వంసకర ఆయుధాలను చూసి పాక్ భయపడుతుంది. భారత్లో ఎటువంటి ఆయుధాలు ఉన్నాయో, ఎలాంటి అణ్వాయుధ వ్యవస్థలు ఉన్నాయో అటువంటివి అభివృద్ధి చేసుకోవాలని భావిస్తుంది. కానీ, అగ్ర దేశాల వద్ద అప్పులు అడుక్కునే పాక్ ఎన్నో రకాల ఆయుధాలను తన అమ్ములపొదిలో చేర్చుకోలేకపోయింది. ప్రపంచంలో 6 దేశాలకు అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాముల ఆధారిత సముద్ర అణు నిరోధక వ్యవస్థ ఉంది. అవే.. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే, భారత్. ఇక ఇజ్రాయెల్ వద్ద క్రూయిజ్ క్షిపణులు మోసే సంప్రదాయ జలాంతర్గాములు ఉన్నాయి. ఉత్తర కొరియా వద్ద అణు బాలిస్టిక్ క్షిపణిని మోసే ఒక సంప్రదాయ జలాంతర్గామి ఉంది. భారత్కు అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాముల ఆధారిత సముద్ర అణు నిరోధక వ్యవస్థ ఉండడంతో తమకూ కావాలని పాక్ ప్రయత్నాలు జరిపింది.చైనా నౌకాదళం తమ గ్వాదర్ పోర్ట్ను శాశ్వతంగా వినియోగించుకునే అవకాశం ఇస్తామని పాకిస్థాన్ చెప్పినట్లు తెలుస్తోంది. దానికి ప్రతిఫలంగా అణుదాడి చేయగల సామర్థ్యం ఉన్న జలాంతర్గాములు లేదా అణు ఆయుధ వ్యవస్థను ఇవ్వాలని చైనాను పాక్ కోరిందని అమెరికాకు చెందిన ‘‘డ్రాప్ సైట్ న్యూస్’’ పేర్కొంది. శత్రుదేశం ముందుగా అణుదాడి చేసినా.. జలాంతర్గాముల నుంచి తిరిగి అణుదాడి చేసే శక్తిని పొందాలని పాక్ భావిస్తోంది. దీన్ని అణు నిరోధక వ్యవస్థలో అత్యంత కీలక భాగంగా భావిస్తారు.పాక్ సైన్య రహస్య పత్రాలను పరిశీలించి.. పాకిస్థాన్ సైన్య రహస్య పత్రాలను పరిశీలించామని, దాని ఆధారంగా ఈ విషయాన్ని చెబుతున్నామని ‘‘డ్రాప్ సైట్ న్యూస్’’ తెలిపింది. 2024లో పాకిస్థాన్ సైన్యం-చైనా ద్వైపాక్షిక చర్చల్లో ఈ డిమాండ్ వచ్చిందని పేర్కొంది. ఆ సమయంలో పాకిస్థాన్ సైన్యానికి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ నాయకత్వం వహించాడు. 2024 ఆరంభంలో గ్వాదర్ను చైనా సైన్యానికి శాశ్వత స్థావరంగా మార్చేందుకు అనుమతి ఇస్తామని చైనాకు పాకిస్థాన్ రహస్యంగా హామీ ఇచ్చింది. ఆ తర్వాత అదే ఏడాది అణ్వాయుధాలు మోసే జలాంతర్గాములు ఇవ్వాలని చైనాను కోరింది. దీంతో ఇప్పటికే పాక్ వద్ద ఉన్న గగనతల, భూతల అణ్వాయుధాల ద్వంద్వ వ్యవస్థను సముద్ర వ్యూహాత్మక ఆయుధాలతో కూడిన త్రివిధ వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ డిమాండ్ అసంబద్ధమని చైనా భావించడంతో చర్చలు నిలిచిపోయాయి.ఇమ్రాన్ ఖాన్ను అధికారంలో నుంచి తొలగించాలని ఒత్తిడి తెచ్చిన అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ అడ్మినిస్ట్రేటివ్లోని కీలక అధికారి రహస్య కేబుల్ వివరాలు కూడా ‘‘డ్రాప్ సైట్ న్యూస్’’ వెల్లడించింది. దీంతో, అణ్వాయుధాలు కలిగిన పాకిస్థాన్.. అటు చైనా, ఇటు అమెరికాతో చర్చోపచర్చలు జరిపినట్టు స్పష్టమైంది. గత ఐదేళ్లలో అమెరికా-పాకిస్థాన్ సంబంధాలను మలిచిన పరిణామాలను ఈ కథనం వివరించింది. అమెరికాతో సన్నిహితంగా ఉంటూనే.. వ్యూహాత్మక ఆయుధాలు ఇవ్వాలని చైనాతోనూ పాకిస్థాన్ బేరసారాలు జరిపింది.అణ్వాయుధాలు మోసే జలాంతర్గాములు 3 రకాలుగా ఉంటాయి.. అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములు, క్రూయిజ్ క్షిపణులు మోసే సంప్రదాయ జలాంతర్గాములు, బాలిస్టిక్ క్షిపణులు మోసే సంప్రదాయ జలాంతర్గాములు.ఈ మూడింట్లో పాకిస్థాన్ దేన్ని కోరిందో పాకిస్థాన్ కథనంలో స్పష్టత లేదు. 1970 చివర, 1980 ఆరంభంలో చైనా సహకారంతో పాకిస్థాన్ అణుబాంబు తయారుచేసింది. రహస్య అణు సాంకేతిక బదిలీల్లో ఇదే తొలి ఉదాహరణగా భావిస్తున్నారు. అధిక సాంద్రత యురేనియం సరఫరాతో పాటు, 1960లలో పరీక్షించిన 12 కిలోటన్నుల సామర్థ్యమున్న సీహెచ్ఐసీ-4 అణు విస్ఫోటక రూపకల్పనను కూడా పాకిస్థాన్కు చైనా ఇచ్చింది. 1990లలో అణ్వాయుధాలను ప్రయోగించే ఎం-11 మధ్యదూర బాలిస్టిక్ క్షిపణులను కూడా పాకిస్థాన్కు చైనా విక్రయించింది.ఈ ఆయుధాలతో గగనతలం, భూమి నుంచి ప్రయోగించే ద్వంద్వ అణు వ్యవస్థను పాకిస్థాన్ తయారుచేసుకుంది. కానీ త్రివిధ వ్యవస్థలో మూడో భాగమైన సముద్ర ఆధారిత అణ్వాయుధ సామర్థ్యం మాత్రం సాంకేతిక, ఆర్థిక పరిమితుల వల్ల సాధ్యం కాలేదు.సముద్రం అడుగునుంచి ప్రయోగించే అణ్వాయుధాను అత్యంత శక్తివంతమైన ఆయుధాలుగా భావిస్తారు. శత్రువు తొలి అణుదాడి చేసినా, తీవ్ర నష్టం జరిగిన తర్వాత కూడా ప్రతిదాడి చేయొచ్చు. 2017లో 450 కిలోమీటర్ల పరిధితో జలాంతర్గామి నుంచి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించి త్రివిధ అణు వ్యవస్థ పూర్తి చేశామని పాకిస్థాన్ ప్రకటించింది. కానీ పాకిస్థాన్ వద్ద కేవలం 5 క్రియాశీల సంప్రదాయ జలాంతర్గాములు మాత్రమే ఉండటం, క్షిపణి పరిధి తక్కువగా ఉండటం వల్ల ఇది ప్రాథమిక స్థాయి సముద్ర అణు నిరోధక వ్యవస్థగానే మిగిలింది. -
ఇజ్రాయెల్కు పదులకొద్దీ విమానాల్లో మందుగుండు సామగ్రి
టెల్ అవీవ్: జర్మనీలోని స్థావరాల నుంచి అమెరికాకు చెందిన పదుల కొద్దీ కార్గో విమానాలు మందుగుండు సామగ్రితో సోమవారం ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో దిగినట్లు అల్ జజీరా వార్తా సంస్థ తెలిపింది. ఇజ్రాయెల్కు చెందిన ఛానల్ 13 సమాచారం ఆధారంగా ఈ వివరాలు వెల్లడించింది.ఇరాన్పై మరోసారి దాడులు ప్రారంభించే ఉద్దేశంతోనే వాషింగ్టన్ చర్యలు కొనసాగుతున్నాయన్న అనుమానాలు పెరిగాయి. దీంతో పశ్చిమాసియా ఘర్షణ మరింత ఉద్ధృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అమెరికా చర్యలు ఇరాన్పై యుద్ధాన్ని తిరిగి ప్రారంభించే సన్నాహాల్లో భాగమని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది.యురేనియం నిల్వలు, ఆంక్షల సడలింపు, యుద్ధ నష్టపరిహారం అంశాలపై చర్చలు నిలిచిపోయిన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి హెచ్చరిక జారీ చేశారు. “ఇరాన్ ముందున్న సమయం వేగంగా ముగుస్తోంది. వారు వెంటనే కదలాలి. లేకపోతే వారి దగ్గర ఏమీ మిగలదు. సమయం అత్యంత కీలకం” అని ట్రూత్ సోషల్ పోస్టులో ట్రంప్ ఆదివారం పేర్కొన్నారు.చర్చలు పునఃప్రారంభించేందుకు అమెరికా విధించిన ప్రధాన షరతులను ఇరాన్ మీడియా బయటపెట్టిన కొన్ని గంటలకే ట్రంప్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. 400 కిలోల శుద్ధి చేసిన యురేనియాన్ని అప్పగించాలని, ఒక అణు కేంద్రాన్ని మాత్రమే కొనసాగించాలని, యుద్ధ నష్టపరిహారం డిమాండ్ను వదులుకోవాలని అమెరికా కోరింది.దీనికి ప్రతిగా టెహ్రాన్ కూడా చర్చలపై 5 షరతులు పెట్టింది. పశ్చిమాసియాలో, ముఖ్యంగా లెబనాన్లో సైనిక చర్యలు ముగియాలని, ఇరాన్పై ఆంక్షలు తొలగించాలని, విదేశాల్లో నిలిపివేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ పేర్కొన్నట్లు అక్కడి మీడియా తెలిపింది.అదనంగా యుద్ధ నష్టాలకు పరిహారం ఇవ్వాలని, హార్మూజ్ జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఈ వ్యూహాత్మక మార్గంలో నౌకల రాకపోకలపై ఇరాన్ నియంత్రణ కఠినతరం చేసింది. మరోవైపు ఇరాన్ పోర్టులు, సముద్ర వాణిజ్యంపై అమెరికా విస్తృత నౌకాదళ దిగ్బంధంతో ఒత్తిడి పెంచింది. -
చైనాలో భారీ భూకంపం: కుప్పకూలిన భవనాలు
గ్వాంగ్సీ : చైనాలోని గ్వాంగ్సీ ప్రాంతాన్ని భయంకరమైన ప్రకృతి విపత్తు వణికించింది. సోమవారం తెల్లవారుజామున సంభవించిన 5.2 తీవ్రత గల భారీ భూకంపం విధ్వంసాన్ని సృష్టించింది. గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ప్రాణభయంతో ఒక్కసారిగా ఇళ్లలోంచి వీధుల్లోకి పరుగులు తీశారు. కళ్ల ముందే క్షణాల వ్యవధిలోనే పలు బహుళ అంతస్తుల భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోవడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.ఇద్దరు మృత్యువాత గ్వాంగ్సీ పరిధిలోని లియోజౌ నగరం, అలాగే దాని చుట్టుపక్కల ప్రాంతాలను ఈ భూకంపం అత్యంత తీవ్రంగా కుదిపేసింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరొకరు గల్లంతైనట్లు చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువా, సీసీటీవీ తమ కథనాల్లో వెల్లడించాయి. ఈ విపత్తులో గాయపడిన మరో నలుగురు బాధితులను హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని ఉన్నతాధికారులు తెలిపారు.నేలమట్టమైన 13 భవనాలుభారీ ప్రకంపనల ధాటికి ఆ ప్రాంతంలో ఏకంగా 13 భవనాలు పూర్తిగా నేలమట్టం అయ్యాయని అధికారులు తెలిపారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్లను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. ముందస్తు జాగ్రత్తగా ప్రాణనష్టాన్ని నివారించే ఉద్దేశ్యంతో ప్రభావిత ప్రాంతాల నుంచి ఏకంగా 7,000 మందికి పైగా నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అత్యవసర ప్రతిస్పందన బృందాలు రంగంలోకి దిగి యుద్ధప్రాతిపదికన సహాయక, పునరావాస కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. రైల్వే వ్యవస్థపై ప్రభావంభూకంపం దెబ్బకు రైల్వే వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడింది. రైల్వే మౌలిక సదుపాయాలకు వాటిల్లిన నష్టాన్ని, భద్రతా పరిస్థితులను అంచనా వేసేందుకు నిపుణుల బృందాలు విస్తృత తనిఖీలు ప్రారంభించాయి. ఈ క్రమంలో రైళ్ల రాకపోకలకు, రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రజలను హెచ్చరించింది. రాబోయే రోజుల్లో ఆఫ్టర్ షాక్స్ (మరిన్ని ప్రకంపనలు) వచ్చే ప్రమాదం పొంచి ఉందన్న తీవ్ర ఆందోళనల నేపథ్యంలో, అదనపు నష్టం జరగకుండా నివారించేందుకు అత్యవసర సహాయక సిబ్బందిని భారీ సంఖ్యలో మోహరించారు. -
క్రూజ్ షిప్లో ప్రాణాంతక వైరస్.. కెనడాలో తొలి కేసు!
ఒట్టావా: అట్లాంటిక్ మహాసముద్రంలో ‘ఎంవీ హోండియస్’ క్రూజ్ షిప్లో ప్రయాణించిన వారిలో ప్రాణాంతక ‘ఆండీస్ హంటా వైరస్’ వెలుగుచూడటం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తాజాగా ఈ నౌకలో ప్రయాణించిన ఓ కెనడా దేశస్థునికి ఈ వైరస్ సోకినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారికంగా నిర్ధారించడంతో విమానయాన, పర్యాటక వర్గాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.కెనడాలో తొలి కేసు నమోదుఏప్రిల్ 1న అర్జెంటీనా నుంచి బయలుదేరిన ఎంవీ హోండియస్ క్రూజ్ షిప్లో మొత్తం నలుగురు కెనడా పౌరులు ప్రయాణించారు. వీరిలో ఒకరి నమూనాలను పరీక్షించగా, మే 16న హంటా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయిందని పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఆఫ్ కెనడా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. విన్నిపెగ్లోని నేషనల్ మైక్రోబయాలజీ ల్యాబొరేటరీలో చేసిన పరీక్షల్లో, అతడితో పాటు ప్రయాణించిన మరో కెనడియన్కు మాత్రం నెగెటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు.మనిషి నుంచి మనిషికి వ్యాప్తిసాధారణంగా ఎలుకలు, వాటి వ్యర్థాల ద్వారా మాత్రమే ఈ హంటా వైరస్ వ్యాపిస్తుంది. కానీ, ప్రస్తుతం ఈ క్రూజ్ షిప్లో వెలుగుచూసిన ‘ఆండీస్’ రకం మాత్రం మనిషి నుంచి మనిషికి నేరుగా సోకే అత్యంత ప్రమాదకరమైన వైరస్ కావడం ఆందోళన కలిగిస్తోంది. నౌకలో ప్రయాణికుల మధ్య వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించిన ఆరోగ్య సంస్థలు తక్షణమే అప్రమత్తమై, ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిపై పర్యవేక్షణ చేపట్టాయి.కోవిడ్లా కాదు.. ప్రజలకు ముప్పు లేదుక్రూజ్ షిప్లో కేసులు నమోదైనప్పటికీ, కెనడాలోని సామాన్య ప్రజలకు ఈ వైరస్ వల్ల ప్రస్తుతం ఎలాంటి ముప్పు లేదని అధికారులు భరోసా ఇచ్చారు. ఇప్పటివరకు కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాలేదని, కాంటాక్ట్ ట్రేసింగ్, పరీక్షలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిని కోవిడ్-19 మహమ్మారితో పోల్చవద్దని, ప్రజలు అనవసర భయాందోళనలకు గురికావొద్దని వైద్యాధికారులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: నాడు మన సొంతం.. నేడు పరాయి ముచ్చట! -
ఇరాన్ సంచలన నిర్ణయం
పశ్చిమాసియా యుద్ధం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. కీలకమైన వాణిజ్య మార్గం హర్ముజ్ మూసివేతతో పలు దేశాలు సంక్షోభాలతో అల్లలాడిపోతున్నాయి. ఇరాన్కు మరో ఆప్షన్ లేదని.. చర్చలకు దిగి రావాల్సిందేనని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఈ సంక్షోభం ఏ మలుపు తిరుగుతుందో అనే ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఇరాన్ మరో కీలక బలహీనతపై దృష్టి సారించింది.. హర్ముజ్ జలసంధి కిందుగా సాగుతున్న అంతర్జాతీయ డిజిటల్ కనెక్టివిటీ మార్గాలు.. ఈ యుద్ధంలో కొత్త ఉద్రిక్తతలకు దారి తీసేలా కనిపిస్తున్నాయి. టెహ్రాన్ వర్గాలు తాజాగా ప్రకటించిన ప్రణాళికనే ఇందుకు కారణం. దీని ప్రకారం.. హర్ముజ్ కింద నుంచి వెళ్తున్న అండర్ మైన్ సీ కేబుల్స్కుగానూ ఫీజులు వసూలు చేయాలని ఇరాన్ బలంగా భావిస్తోందట!. ‘‘జలసంధి గూండా పలు నెట్వర్క్ కేబుల్స్ వెళ్తున్నాయి. అయితే.. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు ఈ మార్గాల వినియోగానికి ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. సహకరించకపోతే డేటా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడవచ్చు’’ అని ఇరాన్ హెచ్చరించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అంతేకాదు.. కేబుళ్ల మరమ్మత్తులు, నిర్వహణ హక్కులు కూడా ఇరాన్ కంపెనీలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అనుబంధ మీడియా ఒకటి కథనం ప్రచురించింది. దీంతో ఇరాన్ మూమాలు బ్లాక్మెయిలింగ్కు దిగడం లేదన్న చర్చ జోరందుకుంది.అదే గనుక జరిగితే..ప్రపంచ ఇంటర్నెట్, డేటా ట్రాఫిక్లో 95% పైగా ఈ సముద్రపు మార్గాల ద్వారానే జరుగుతుంది. హర్ముజ్ జలసంధి గుండా అనేక అంతర్జాతీయ కనెక్టివిటీ మార్గాలు వెళ్తాయి. భద్రతా కారణాల వల్ల ఎక్కువ భాగం ఒమన్ వైపు ఉన్నప్పటికీ.. ఫాల్కన్, గల్ఫ్ బ్రిడ్జి ఇంటర్నేషనల్ అనే రెండు ప్రధాన మార్గాలు మాత్రం ఇరాన్ జలప్రాంతాల గుండా సాగుతున్నాయి. వీటికి నష్టం కలిగితే బ్యాంకింగ్ వ్యవస్థలు, ఆర్థిక మార్కెట్లు, సైనిక కమ్యూనికేషన్లు, కృత్రిమ మేధస్సు, అంతర్జాతీయ లావాదేవీలు అన్నీ ప్రభావితమవుతాయి. ఇరాన్ అండర్ సీ మైన్ కేబుల్స్పై దృష్టి పెడితే.. ఇరాన్ పొరుగు దేశాలు, భారత్, తూర్పు ఆఫ్రికా, యూరప్–ఆసియా మధ్య ఆర్థిక లావాదేవీలు అన్నీ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. సింగపూర్ వంటి ఆసియా డేటా హబ్ల నుంచి యూరప్ వరకు కనెక్టివిటీ దెబ్బతింటే, ఫైనాన్షియల్ ట్రేడింగ్, బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్లు, క్రాస్-బోర్డర్ పేమెంట్లు అన్నీ ఆలస్యమవుతాయి. ప్రత్యామ్నాయ మార్గాలున్నా, పెద్ద స్థాయి అంతరాయం అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతుంది. ఒకవేళ ఏదైనా డ్యామేజ్ జరిగినా మరమ్మత్తులు కూడా సవాలే. ఎందుకంటే రిపేర్ షిప్లు ఒకేచోట నిలిచి పని చేయాలి. ఆ సమయంలో ఇరాన్ అడ్డుకుంటే అది అసాధ్యం కాదు..నిజానికి.. యుద్ధ ప్రారంభ సమయంలోనే అండర్ సీ కేబుల్స్ అంశం తెర మీదకు వచ్చింది. వీటిని కత్తిరించడం ద్వారా ఇరాన్ ‘డిజిటల్ వార్’ జరపొచ్చనే ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆ సమయంలో ఇరాన్ వాటిని కొట్టిపారేసింది. ఇప్పుడు జలసంధిలో నౌకల నుంచి మాత్రమే కాదు.. ఈ కేబుల్స్పైనా ఫీజులు వసూలు చేసే యోచన చేస్తుండడం గమనార్హం. అంతర్జాతీయ చట్టంఇరాన్ మీడియా ప్రకారం, 1982లోని ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టం (UNCLOS) ప్రకారం తీరరాష్ట్రాలకు తమ జలప్రాంతాల్లో కనెక్టివిటీ మార్గాలపై షరతులు విధించే హక్కు ఉంది. ఇరాన్ ఆ ఒప్పందంపై సంతకం చేసినా.. ఇంకా ఆమోదించలేదు. సుయాజ్ కాలువలో ఈజిప్ట్ వసూలు చేసే ఫీజులను ఉదాహరణగా చూపుతున్నా.. హోర్ముజ్ సహజ జలసంధి కావడం వల్ల పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అయితే.. చమురు తర్వాత ఇప్పుడు డేటా కూడా ఇరాన్ చేతిలో బందీ అవుతుందా? అనే ఆందోళన అంతర్జాతీయంగా పెరుగుతోంది. హర్ముజ్ జలసంధి కింద ఉన్న ఈ మార్గాలు కత్తిరించబడినా? లేదంటే పన్నులు విధించబడినా.. ప్రపంచ డిజిటల్ కనెక్టివిటీకి ఇది మరో పెద్ద దెబ్బ కానుంది. -
ఎనిమిదేళ్ల తర్వాత ఎయిర్షో.. ఢీ కొట్టి ముక్కలైన విమానాలు
అమెరికాలో ఘోరం సంభవించింది. ఎయిర్షోలో రెండు యుద్ధ విమానాలు ఒకదాన్నొకటి ఢీ కొట్టి పేలిపోయాయి. స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం ఐడాహో స్టేట్ మౌంటెన్ హోమ్ ఎయిర్ఫోర్స్ వద్ద ఈ ఘటన జరింది. అయితే అదృష్టవశాత్తూ పైలట్లు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. గన్ఫైటర్ స్కైస్ ఎయిర్ షోలో రెండు అమెరికా EA-18G గ్రౌలర్ యుద్ధ విమానాలు మధ్య ఆకాశంలో ఢీకొన్నాయి. ఈ ఘటన మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఢీకొన్న వెంటనే విమానాలు పేలిపోయి ముక్కలైపోయాయి. ప్రమాద స్థలంలో దట్టమైన నల్ల పొగలు ఎగసిపడగా, అత్యవసర సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. బేస్ను తక్షణమే లాక్డౌన్ చేశారు. ఆదివారం మిగిలిన అన్ని కార్యక్రమాలను రద్దు చేశారు.విమానాల్లో ఉన్న నాలుగు మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఢీకొన్న క్షణాల్లోనే వారు పారా షూట్ల సహాయంతో కిందికి దిగారు. ఈ విషయాన్ని షో నిర్వాహకులు, అమెరికా నేవీ ధృవీకరించారు.Footage of the mid air collision between a pair of Navy Super Hornets/Growlers during the Gunfighter Skies Air Show at Mountain Home Air Force Base moments ago. pic.twitter.com/yQqPavmSWk— OSINTtechnical (@Osinttechnical) May 17, 2026మౌంటెన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్ ప్రతినిధి ప్రకారం, ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. "అత్యవసర సిబ్బంది అక్కడే ఉన్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం" అన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి ప్రారంభమైన ఈ ఎయిర్ షోకు వేలాది మంది హాజరయ్యారు. అయితే ఈ ప్రమాదం గత ఘటనలను గుర్తు చేసింది. 2018లో ఒక హ్యాంగ్ గ్లైడర్ పైలట్ రన్వేపై కూలి మరణించాడు. 2003లో థండర్బర్డ్స్ జెట్ కూలిపోయింది. కానీ పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. తాజా ప్రమాదం మళ్లీ ఎయిర్ షో భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. -
అమ్మను దూరం చేసి.. పసివాడిని బలి తీసుకున్న ట్రంప్ యంత్రాంగం
ఫ్లోరిడా: అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన కఠినమైన వలసవిధానాలు పరోక్షంగా ఓ చిన్నారి ప్రాణాలను బలితీసుకున్నాయి. అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు హోండురాస్ మూలాలున్న ఓ తల్లి, ఆమె రెండేళ్ల కుమారుడిని వేరు చేశారు. గతిలేక ఆ తల్లి తన కుమారుడిని బంధువుల ఇంట్లో వదిలేసి వెళ్లగా ఇప్పుడా అబ్బాయి విగతజీవిగా కన్పించాడు. ఈ ఉదంతంలో తల్లిదే తప్పు అంటూ అధికారుల వింతవాదనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హోండురాస్ దేశానికి చెందిన వెండీ హెర్నాండెజ్ రెయెస్ తన రెండేళ్ల కుమారుడు ఆర్లిన్ జోసీతో కలిసి ఫ్లోరిడాలోని ఎస్కాంబియా కౌంటీలో నివసిస్తోంది. జనవరిలో లూసియానాలో ఓ రోజు నిర్మాణ పనులకు వెళ్లగా అక్కడి సిబ్బంది ఆమెను, మరికొందరిని అక్రమ వలసదారులంటూ ఇమిగ్రేషన్ అధికారులకు అప్పగించారు. అధికారులు వెండీని నిర్బంధ కేంద్రంలో బంధించారు. రెండేళ్ల ఆర్లిన్ నిర్బంధ కేంద్రంలో ఉండటం కుదరదని అధికారులు తెగేసి చెప్పారు. దీంతో చేసేదిలేక ఆమె తన కుమారుడిని ఫ్లోరిడాలోని ఎస్కాంబియా కౌంటీలో ఉండే బంధువుæ మల్డోనాడోకి అప్పగించింది. అధికారులు నెల రోజుల్లోనే ఆమెను హొండురస్కు బలవంతంగా పంపేశారు. బంధువుల ఇంట్లో ఉన్న తన కుమారుడు తీసుకురావాలని అధికారులను ఎంతగా వేడుకున్నా వాళ్లు కనికరం చూపలేదు. ఆర్లిన్ సంరక్షణా బాధ్యతలు తీసుకున్న మల్డోనాడో సైతం అక్రమ వలసదారుడే. గతంలో నేరాలకు పాల్పడ్డాడు. అతడి చిత్రహింసల తాళలేక ఆర్లిన్ మార్చి నెలలో ప్రాణాలు కోల్పోయాడు. శరీరమంతటా గాయాలతో నిండిపోయింది. పిల్లాడి మృతి వార్త తెలిసి స్థానిక పోలీసుఅధికారులు మల్డోనాడోను అరెస్ట్ చేశారు. అయితే చిన్నారి మరణానికి ఆమె తల్లే పరోక్షంగా కారణమని, తాము చెప్పినా వినకుండా ఆర్లిన్ను వదిలేసి వెళ్లిందని ఇమిగ్రేషన్ అధికారులు వాదిస్తున్నారు. ఈ వాదనలను తల్లి తీవ్రంగా ఖండించారు. తన వెంట కుమారుడిని తీసుకెళ్తానని ఎంత మొత్తుకున్నా అధికారులు వినిపించుకోలేదని, ఇప్పుడు తిరిగి నింద తనపై మోపుతున్నారని ఆమె ఏడుస్తూ చెప్పారు. ప్రాణంగా చూసుకుంటున్న కన్న కొడుకును రాక్షసుడి చేతుల్లో పెట్టి వదిలేసి వెళ్లిపోయేంతటి కర్కశురాలిని కాదంటూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. -
తుపానుకు ముందు ప్రశాంతత
వాషింగ్టన్: ఇరాన్ను ఎలాగైనా తమ దారికి తెచ్చుకునేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇరాన్పై కొన్ని రోజులుగా సైనిక చర్యలు చేపట్టకపోవడాన్ని ‘తుపానుకు ముందు ప్రశాంతత’గా ట్రంప్ అభివరి్ణంచారు. ఇరాన్కు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. వైమానిక దాడులను పునఃప్రారంభించేందుకు ఉన్నతాధికారులతో ట్రంప్ చర్చలు జరుపుతున్నట్లు వార్తలొచ్చాయి. కృత్రిమ మేధతో సృష్టించిన ఒక ఫొటోను ట్రంప్ తాజాగా సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఈ ఫొటోలో అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దడం(మాగా) అని రాసి ఉన్న టోపీని ట్రంప్ ధరించారు. నావికాదళ అడ్మిరల్ ట్రంప్కు వెనకాల నిలబడి ఉన్నారు. వెనక ఆకాశం ఉరుములు మెరుపులతో భీకరంగా ఉంది. ఈ ఫొటోను పోస్ట్చేసి ట్రంప్ పరోక్షంగా ఇరాన్కు ఒక స్పష్టమైన హెచ్చరిక చేశారని యుద్ధరంగ నిపుణులు వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో శాంతికి షరతులే అడ్డంకిపశ్చిమాసియాలో శాంతి సాధనకు ఓ వైపు కృషి జరుగుతుంటే మరోవైపు అవరోధాలు ఎదురవుతున్నాయి. అమెరికా, ఇరాన్ల మధ్య చర్చల్లో ప్రతిష్టంభన పర్వం కొనసాగుతోంది. తమ షరతులకు అంగీకరిస్తే శాశ్వత కాల్పుల విరమణకు అంగీకరిస్తామంటూ అమెరికా కొత్తగా ఐదు షరతులను తెరమీదకు తెచ్చింది. వాటికి ఇరాన్ కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టంచేసింది. ఇరాన్ అణ్వాయుధాలు సొంతం చేసుకునేందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని అమెరికా పలుమార్లు తేల్చిచెప్పింది. ఇరాన్ వద్దనున్న 400 కిలోల శుద్ధిచేసిన యురేనియంను తమకు అప్పగించాలని చర్చల సందర్భంగా ట్రంప్ సర్కార్ షరతు విధించింది. మరో షరతు ఏమిటంటే.. ఇరాన్ అణు కర్మాగారాల్లో కేవలం ఒక సముదాయం మాత్రమే పనిచేస్తూ ఉండాలి. మిగిలినవి మూసివేయాలి. క్షిపణి నిల్వలను గణనీయంగా తగ్గించుకోవాలని డిమాండ్ చేస్తోంది. అలాగే ఇన్నాళ్లూ అమెరికా ఆంక్షలు, విధానపరమైన నిర్ణయాల వల్ల తీవ్రంగా నష్టపోయామని, అందుకు తమకు పరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. కానీ, అమెరికా ఒప్పుకోవడం లేదు. యుద్ధాన్ని ముగించడానికి అంకితభావంతో చర్చలు జరపాలన్న ప్రతిపాదనకు అమెరికా నిర్దిష్ట హామీని ఇవ్వడంలో విఫలమైందని ఇరాన్ మీడియా ఆదివారం వెల్లడించింది. -
సహకారమే మన బలం
గోథెన్బర్గ్: సహకారమే మన బలమని భారత ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మోదీ ఆదివారం స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్స్సన్తో సమావేశమ్యారు. ఇరుదేశాల మధ్య సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని ఈ సందర్భంగా ఇరుదేశాలు అంగీకరించాయి. భారత్–ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం స్ఫూర్తితో తమ ప్రజల ప్రయోజనం కోసం కొత్త అవకాశాలను అన్వేషించాలని నిర్ణయించారు. వ్యాపారం, వాణిజ్యం, టెక్నాలజీ, రక్షణ సహా కీలక రంగాల్లో పరస్పర సహకారంపై సంప్రదింపులు జరిపారు. సహకారమే మన బలమని ఉద్ఘాటించారు. రెండో రోజుల పర్యటన నిమిత్తం నెదర్లాండ్స్ నుంచి ఆదివారం ఉదయం స్వీడన్లోని గోథెన్బర్గ్కు చేరుకున్న మోదీకి ఘనస్వాగతం లభించింది. మోదీ గౌరవార్థం ఆయన ప్రయాణించిన విమానానికి స్వీడన్ ఎయిర్పోర్స్ విమానాలు ఎస్కార్ట్గా వచ్చాయి. గోథెన్బర్గ్ ఎయిర్పోర్టులో మోదీకి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్స్సన్ సాదర స్వాగతం పలికారు. మోదీకి స్వాగతం పలకడానికి స్వీడన్లోని ప్రవాస భారతీయులు తరలివచ్చారు. మోదీ రాకను పురస్కరించుకొని నిర్వహించిన సంగీత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం మోదీ, క్రిస్టర్స్సన్ మధ్య ప్రతినిధుల స్థాయి భేటీ జరిగింది. ఇరు పక్షాలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడానికి అందుబాటులో ఉన్న నూతన మార్గాలపై చర్చించారు. హరిత పరివర్తన, కృత్రిమ మేధ(ఏఐ), వర్ధమాన సాంకేతికతలు, స్టార్టప్లు, సప్లై చైన్లు, రక్షణ, అంతరిక్షం, వాతావరణ చర్యలు సహా ప్రజల మధ్య సంబంధాల విషయంలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై భారత్, నెదర్లాండ్స్ ప్రత్యేకంగా దృష్టి సారించాయి. ప్రధాని మోదీకి ‘పోలార్ స్టార్’ గౌరవం ప్రధాని మోదీ స్వీడన్ అత్యున్నత పురస్కారం ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్, డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్’అందుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి చేసిన కృషి, దూరదృష్టి కలిగిన నాయకత్వానికి గుర్తింపుగా ఈ పురస్కారం అందజేసినట్లు స్వీడన్ యువరాణి విక్టోరియా ప్రకటించారని విదేశాంగ శాఖ తెలిపింది. భారత్, నెదర్లాండ్స్ మధ్య ఇక వ్యూహాత్మక భాగస్వామ్యం ద హేగ్: అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో భారత్, నెదర్లాండ్స్ దేశాలు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లాయి. ఇకపై ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నెదర్లాండ్స్లో పర్యటించారు. ఆ దేశ ప్రధానమంత్రి రోబ్ జెటెన్తో సమావేశమయ్యారు. ఇరుదేశాలు మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా రక్షణ, అరుదైన ఖనిజాలు సహా కీలక రంగాల్లో పరస్పర సహకారం కోసం 17 ఒప్పందాలపై భారత్, నెదర్లాండ్స్ సంతకాలు చేశాయి. పశ్చిమాసియా పరిణామాలపై ఇద్దరు ప్రధానమంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంధన సరఫరాలో అంతరాయాల వల్ల ప్రపంచదేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు. భేటీ తర్వాత వారిద్దరూ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.మోదీకి రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ పురస్కారాన్ని అందజేస్తున్న స్వీడన్ యువరాణి విక్టోరియా -
60 ఏళ్లకు గర్భం దాల్చి తల్లి అయ్యి.. 76 ఏళ్ల వయసులోనేమో..
బీజింగ్: చైనాలో 16 ఏళ్ల క్రితం 60 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చింది ఓ బామ్మ. గర్భం దాల్చిన అత్యధిక వయసున్న మహిళగా అప్పట్లో వార్తల్లో నిలిచిన ఆ మహిళకు ఇప్పుడు 76 ఏళ్లు. వ్యక్తిగతంగా ఎన్నో విషాదాలు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని ఆమె ఈ వయసులో సోషల్ మీడియా ద్వారా తనను తాను నిరూపించుకుంది.ఆ బామ్మ పేరు షెంగ్ హైలిన్. ఆమె జీవిత ప్రయాణాన్ని చూపించిన ఫోటో సిరీస్ అంతర్జాతీయ అవార్డు గెలుచుకున్న తర్వాత మళ్లీ వార్తల్లో నిలిచింది. గత కొన్ని ఏళ్లుగా కష్టపడి షెంగ్ చైనా సోషల్ మీడియా వేదికల్లో దాదాపు 10 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించింది. సోషల్ మీడియాలో ఆమె పేరెంటింగ్ సలహాలు, వంట వీడియోలు, ప్రేరణాత్మక విషయాలు పంచుకుంటోంది.60 ఏళ్ల వయసులో పిల్లలు ఎందుకు? షెంగ్ ఏకైక కుమార్తె టింగ్టింగ్, అల్లుడు పెళ్లి తర్వాత కొద్ది రోజుల్లోనే 2009లో కార్బన్ మోనాక్సైడ్ విష ప్రభావంతో మృతి చెందారు. ఆ విషాదం, ఒంటరితనంతో తీవ్రంగా కలత చెందిన షెంగ్, 60 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ చికిత్స చేయించుకోవాలని నిర్ణయించింది. అప్పట్లో ఈ విషయం చైనాలో సంచలనం రేపింది.గర్భధారణ సమయంలో తీవ్రమైన వాపులు, రక్తస్రావం వంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా, షెంగ్ 2010లో జిజి, హుయ్హుయ్ అనే కవల పాపలకు జన్మనిచ్చింది. ఈ ప్రసవం దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. షెంగ్, ఆమె భర్త జీవితాల్లో ఆ కవల పిల్లలు కొత్త ఆశ నింపినా వృద్ధాప్యంలో పిల్లలను పెంచడం సవాలుగా మారింది. షెంగ్ పదవీ విరమణకు ముందు ఆసుపత్రి డైరెక్టర్గా పని చేసింది. ఆమె భర్త యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉన్నారు. అయినా పిల్లల సంరక్షణ, విద్య, రోజువారీ ఖర్చులు కుటుంబంపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చాయి.కుటుంబాన్ని పోషించడం కోసం షెంగ్ చైనా అంతటా తిరుగుతూ ఆరోగ్యం, పోషకాహారం అంశాలపై ఉపన్యాసాలు ఇచ్చింది. తన కుమార్తెలకు నాణ్యమైన విద్యతో పాటు పియానో, డ్యాన్స్ వంటి శిక్షణ అందించేందుకు ఆమె నిరంతరం శ్రమించింది.అయితే, 2016లో షెంగ్ భర్తకు పక్షవాతం రావడంతో కుటుంబం మరో భారీ విషాదాన్ని ఎదుర్కొంది. అనంతరం గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో ఆయన 2022లో మృతి చెందారు. అదే సమయంలో నకిలీ పెట్టుబడి మోసంలో షెంగ్ 20 లక్షల యువాన్లకుపైగా డబ్బు కోల్పోయిందని సమాచారం.షెంగ్ ఆన్లైన్ ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది. 73 ఏళ్ల వయసులో లైవ్స్ట్రీమింగ్, షార్ట్ వీడియోలను ప్రారంభించింది. కుమార్తెల భవిష్యత్తు కోసం సంపాదించడం కొనసాగించింది. ఇప్పుడు ఆమెకు 76 ఏళ్లు. ప్రస్తుతం ఆమె తరచుగా లైవ్స్ట్రీమ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ పేరెంటింగ్, వృద్ధాప్యం, రోజువారీ జీవితం గురించి మాట్లాడుతోంది. ఇంటి సామగ్రి, ఆరోగ్య సంబంధిత వస్తువులు కూడా విక్రయిస్తోంది. ఆన్లైన్లో “మదర్ షెంగ్” పేరుతో ప్రసిద్ధి చెందిన ఆమె అనేక మంది తల్లిదండ్రులకు స్ఫూర్తిగా నిలిచింది. -
గగనతలంలో మోదీకి స్వీడన్ యుద్ధ విమానాల ఎస్కార్ట్
గోతెన్బర్గ్: ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల యూరప్ పర్యటనలో భాగంగా స్వీడన్లోని గోతెన్బర్గ్ చేరుకున్నారు. విమానాశ్రయంలో మోదీకి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనకు ఉన్న భౌగోళిక రాజకీయ ప్రాధాన్యాన్ని సూచిస్తూ స్వీడన్ గగనతలంలోకి ప్రధాని మోదీ విమానం ప్రవేశించిన సమయంలో ఆ దేశ గ్రిపెన్ యుద్ధ విమానాలు భద్రత కల్పించాయి.గ్రిపెన్ యుద్ధ విమానం గగనతల రక్షణ, శత్రు లక్ష్యాలపై దాడులు, గూఢచారి సమాచార సేకరణ వంటి పలు విధుల్లో ఉపయోగపడుతుంది. అత్యాధునిక రాడార్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ యుద్ధ సాంకేతికత, క్షిపణి దాడి సామర్థ్యాలు ఇందులో ఉన్నాయి.ఈ విమానాలకు వేగంగా టేకాఫ్ తీసుకోవడం, చిన్న రన్వేలపై కూడా పనిచేయడం వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో హైవేలపై నుంచి కూడా ఆపరేట్ చేసేలా దీనిని రూపొందించారు. గ్రిపెన్లో అధునాతన డేటా లింక్ వ్యవస్థ ఉంది. దీని ద్వారా ఇతర యుద్ధ విమానాలు, ఆర్మీ, రాడార్ కేంద్రాలతో వేగంగా సమాచార మార్పిడి జరుగుతుంది.స్వీడన్లో 2 రోజుల పర్యటన స్వీడన్ నేలపై అడుగుపెట్టిన ప్రధాని మోదీ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్ పర్యటనల్లో కీలక దౌత్య కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చిన ఉత్సాహంతో కనిపించారు. స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ మే 17-18 తేదీల్లో స్వీడన్లో పర్యటిస్తున్నారు.ఈ రెండు రోజుల కీలక పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త మార్పులకు దారి తీసే అవకాశం ఉంది. వాణిజ్యం, సాంకేతిక ఆవిష్కరణలు, గ్రీన్ టెక్నాలజీలు, అభివృద్ధి చెందుతున్న రంగాలకు కొత్త ఊపు ఇవ్వనుంది. ఈ సమావేశాన్ని కీలక దౌత్య ఘట్టంగా భావిస్తున్నారు. ఎన్నో ఏళ్ల విరామం తర్వాత భారత ప్రధాని నార్డిక్ (ఉత్తర యూరప్ ప్రాంతంలో ఉన్న దేశాల సమూహం) దేశంలో పర్యటన చేపడుతున్నారు. నార్డిక్ దేశాల్లో స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ దేశాలు ఉంటాయి.“2018లో జరిగిన తొలి ఇండియా-నార్డిక్ సమ్మిట్లో పాల్గొనేందుకు ప్రధాని గతంలో స్వీడన్ పర్యటించారు” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ, ప్రధాని క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించనున్నారు. భారత్-స్వీడన్ సంబంధాలన్నింటినీ సమీక్షించి కీలక రంగాల్లో కొత్త సహకార అవకాశాలను గుర్తించనున్నారు.ఈ ఉన్నతస్థాయి చర్చలు భారత్, స్వీడన్ మధ్య ఆర్థిక, వాణిజ్య సత్సంబంధాన్ని మరింత బలోపేతం చేసే అవకాశముంది. సాంప్రదాయ వాణిజ్య రంగాలకే పరిమితం కాకుండా.. గ్రీన్ మార్పు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాలు, స్టార్టప్లు, సరఫరా వ్యవస్థల బలోపేతం, రక్షణ తయారీ, అంతరిక్ష సహకారం, వాతావరణ చర్యలు, ప్రజల మధ్య సంబంధాల బలోపేతంపై కూడా చర్చలు జరగనున్నాయి.ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వ్యవస్థల్లో యూరప్లో ప్రముఖ దేశంగా స్వీడన్కు గుర్తింపు ఉంది. భవిష్యత్ రంగాల్లో వ్యూహాత్మక సహకారాన్ని విస్తరించేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.#WATCH | Swedish Gripen fighter jets escort PM Narendra Modi’s plane as he enters SwedenPM Modi is visiting Gothenburg, Sweden, on May 17-18 at the invitation of Swedish Prime Minister Ulf Kristersson. pic.twitter.com/m2Rgoxg3x8— ANI (@ANI) May 17, 2026 -
పశ్చిమాసియా యుద్ధం.. ఇరాన్కు అమెరికా ఐదు షరతులు
వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ అణు చర్చలు మరింత ఉద్రిక్తతకు దారితీశాయి. ఇరాన్కు అమెరికా ఐదు కీలక షరతులను విధించింది. వాటిలో ప్రధానంగా 400 కిలోల యురేనియం అమెరికాకు అప్పగించాలి. ఇరాన్లో ఒక్క అణు కేంద్రం మాత్రమే కొనసాగాలి. గత ఆంక్షల వల్ల కలిగిన నష్టాలకు ఎటువంటి పరిహారం ఇవ్వబోం. విదేశాల్లో స్తంభించిన ఇరాన్ ఆస్తుల్లో 25 శాతం కూడా విడుదల చేయదు. అలాగే వివిధ యుద్ధ రంగాల్లో శాంతి కొనసాగింపుపై చర్చలు జరగాలి అని స్పష్టం చేసింది.ఈ డిమాండ్లపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బదులుగా, ఇరాన్ తన షరతులను ప్రకటించింది. లెబనాన్ సహా అన్ని యుద్ధ రంగాల్లో శాంతి కొనసాగించాలి. అన్ని ఆంక్షలను తొలగించాలి. విదేశాల్లో స్తంభించిన నిధులను విడుదల చేయాలి. యుద్ధ నష్టాలకు పరిహారం ఇవ్వాలి. అలాగే హర్మూజ్ జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలి అని తెలిపింది.ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బకాయీ మాట్లాడుతూ.. అమెరికా-ఇజ్రాయెల్లు శాంతి పేరుతో యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. సంక్షోభాన్ని సృష్టించి, దాన్ని శాంతి పేరుతో మరింత పెంచడం అమెరికా-ఇజ్రాయెల్ల పాత పద్ధతి అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ హెచ్చరించారు. తమ ప్రతిపాదనలకు అమెరికా అంగీకరించకపోతే ఆ దేశ చెల్లింపు దారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఇరాన్ను తీవ్రంగా కుదిపేశాయి. ప్రతిగా, ఇరాన్ హర్మూజ్ జలసంధి మార్గాలను అడ్డుకోవడంతో ప్రపంచ ఇంధన సరఫరా దెబ్బతింది. ఏప్రిల్ 8న పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో తాత్కాలిక కాల్పుల విరమణ కుదిరినా, శాశ్వత శాంతి ఒప్పందం సాధ్యం కాలేదు. ఇరాన్ సైన్యం అమెరికా మరోసారి దాడి చేస్తే మరింత తీవ్రమైన ప్రతీకారం ఉంటుందని పునరుద్ఘాటించింది. -
రష్యాలో కలకలం.. భారీగా డ్రోన్ దాడులు.. నలుగురి మృతి
మాస్కో సహా రష్యాలోని పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ భారీ స్థాయిలో డ్రోన్ దాడులు చేసింది. దీంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడాది వ్యవధిలో రష్యాపై జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడి ఇదేనని అధికారులు వివరించారు. ఆదివారం రష్యా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మాస్కోలో ముగ్గురు మృతిచెందగా, ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలోని బెల్గొరోడ్లో మరో వ్యక్తి చనిపోయాడు.మాస్కో గవర్నర్ ఆండ్రే వోరోబ్యోవ్ తెలిపిన వివరాల ప్రకారం.. నగర ఉత్తర భాగంలోని ఖిమ్కిలో ఓ ఇంటిపై డ్రోన్ దాడి జరగగా ఓ మహిళ మృతి చెందింది. శిథిలాల కింద మరో బాధితుడు ఉన్నాడని తెలుస్తోంది. మైటిష్చి జిల్లాలోని పొగొరెల్కి గ్రామంలో మరో ఇద్దరు చనిపోయినట్లు ఆయన తెలిపారు. దాడుల్లో అపార్ట్మెంట్ భవనాలు, మౌలిక సదుపాయ కేంద్రాలు దెబ్బతిన్నాయని వోరోబ్యోవ్ తెలిపారు.మాస్కో మేయర్ సెర్గెయ్ సోబ్యానిన్ను ఉటంకిస్తూ రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మాస్కోను లక్ష్యంగా చేసుకున్న 81 డ్రోన్లను రాత్రికిరాత్రే గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయి. మాస్కో చమురు శుద్ధి కేంద్రం సమీపంలో కొందరు గాయపడ్డారు. శుద్ధి కేంద్రం పనులు ఆగలేదని, 3 ఇళ్లు దెబ్బతిన్నాయి.రష్యా రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ 556 డ్రోన్లను అడ్డుకున్నారు. మాస్కోలోని అతిపెద్ద షెరెమెత్యేవో విమానాశ్రయం పరిధిలో డ్రోన్ శకలాలు పడినప్పటికీ ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధం ముగింపు దశకు చేరవచ్చని సూచించిన తర్వాత ఈ దాడులు జరిగాయి. గత వారం ట్రంప్ మాట్లాడుతూ యుద్ధం ఆపేందుకు రష్యా, ఉక్రెయిన్ త్వరలో ఒప్పందానికి వస్తాయని తాను నమ్ముతున్నట్లు చెప్పారు.ఇదే సమయంలో ఉక్రెయిన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలపై రష్యా దాడులు కొనసాగాయి. ఖార్కివ్ ప్రాంతంలో గత 24 గంటల్లో 15 ప్రాంతాలను రష్యా బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయని, ఏడుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.దక్షిణ ఖెర్సోన్ ప్రాంతంలో శనివారం ఉదయం ఇన్హులెట్స్ గ్రామంపై రష్యా డ్రోన్ పేలుడు పదార్థాలు వదలగా 36 ఏళ్ల వ్యక్తి మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. -
యువతులపై ఆగని ఆగడాలు.. అలా చేస్తే పెళ్లికి అంగీకారమే
కాబూల్: మహిళలపై తాలిబన్ల ఆంక్షలు ఎంతమాత్రమూ ఆగడం లేదు. పెళ్లిడుకు వచ్చిన అమ్మాయిలు వివాహ విషయమై మౌనంగా ఉంటే పెళ్లికి అంగీకరించినట్లు భావించాలని కొత్త చట్టాన్ని తెచ్చారు. ఇది వరకే ఆరో తరగతి తరవాత బాలికలకు చదువుకోవడం నిషేదించిన తాలిబన్లు ఇప్పుడు మరో కఠిన చట్టం అమలులోకి తెచ్చారు.తాలిబాన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంజాదా భార్యాభర్తల విడిపోవడానికి సంబంధించిన సూత్రాలు అనే 31 నిబంధనల జీవోలో ఈ విషయాలను పొందుపరిచారు. అందులో వివాహ దశకు వచ్చిన అమ్మాయి తన వివాహ విషయమై మౌనంగా ఉంటే, దానిని వివాహానికి ఆమె అంగీకరించినట్లుగానే పరిగణించవచ్చని చట్టాన్ని తీసుకవచ్చారు. బాల్య వివాహాలపై హక్కులు పూర్తిగా తండ్రులు, తాతలకు ఇవ్వబడినట్లు పేర్కొన్నారు. బాల్యంలో జరిగిన వివాహాలను బాలికలు రజస్వల అయిన తర్వాత రద్దు చేసుకోవచ్చని దానికి తాలిబాన్ కోర్టు ఆమెదం తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.అయితే అఫ్గానిస్థాన్ లో బాలికలపై జరుగుతున్న ఆగడాలపై వచ్చిన నివేదికలు తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. మానవ హక్కుల సంస్థల నివేదికల ప్రకారం అప్పులు తీర్చడానికి లేదా ఆర్థిక సహాయం కోసం పసిపిల్లలను పెళ్లి చేస్తామని వాగ్దానాలు చేస్తున్నారని తెలిపాయి. బ్రిటిష్ వార్తా సంస్థ 'జిబి న్యూస్'నివేదికల ప్రకారం భార్య శరీరంపై గాయాలు కనిపించనంత వరకు భర్తలు వారిని శారీరకంగా శిక్షించవచ్చు. మహిళలపై కఠిన చట్టాలు కాగా తాలిబన్లు ఇదివరకే మహిళలపై పలు కఠినచట్టాలు అమలులోకి తెచ్చారు.బాలికలు 6వ తరగతి దాటిన తర్వాత పాఠశాలలకు వెళ్లడాన్ని నిషేధించారు.యూనివర్సిటీల బంద్: మహిళలు ఉన్నత విద్య (యూనివర్సిటీలు) అభ్యసించకుండా పూర్తిగా నిషేధం విధించారు. దీనివల్ల ఆ దేశంలో మహిళా డాక్టర్లు, టీచర్లు తయారయ్యే అవకాశం దాదాపు లేకుండా పోయింది.మహిళలు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు చేయడాన్ని నిలిపివేశారు. కేవలం కొద్దిమంది ఆరోగ్య రంగ సిబ్బందికి మాత్రమే మినహాయింపులు ఉన్నాయి.మహిళలు ఒంటరిగా సుదూర ప్రయాణాలు చేయకూడదని మగవారి తోడు తప్పనిసరని పేర్కొన్నారు.మహిళలకు డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వడం నిలిపివేశారు.పార్కులు, జిమ్లు, బ్యూటీ పార్లర్లు, వినోద ప్రదేశాలకు మహిళలు వెళ్లకుండా పూర్తిగా నిషేధించారు. మహిళలు బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు తల నుండి కాళ్ల వరకు పూర్తిగా కప్పేసేలా హిజాబ్ లేదా బురఖా ధరించడం తప్పనిసరి చేశారు -
విజృంభిస్తున్న ఎబొలా.. WHO హెల్త్ ఎమర్జెన్సీ
కాంగోలో ఎబోలా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకూ దాదాపు 87 మంది మృతిచెందారు. దీంతో వరల్డ్ హల్త్ ఆర్గనైజేషన్ (WHO) అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.డెమెక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఎబొలా వైరస్తో అట్టుడుకిపోతుంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకూ 87 మంది మరణించినట్లు ఆ దేశ అధికారులు ప్రకటించారు. తూర్పు ఇటూరి, బూనియా ప్రాంతాలలో కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 347 మందికి వైరస్ సోకింది. ఇప్పటివరకు నమోదైన 87 మరణాలలో... 57 మోంగ్వాలులో, 27 ర్వాంపారాలో, బునియా మూడు మరణాలు సంభవించాయి. అయితే (WHO) అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పటికీ ఎబొలాను మహమ్మారి (Pandamic) గా మాత్రం ప్రకటించలేదు. ఈ వైరస్ లక్షణాలుప్రమాదకరమైన ఈ వైరస్ వాంతులు, రక్తం, వీర్యం వంటి వాటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. అరుదుగా వ్యాపించే ఈ వ్యాధి ప్రాణాపాయం కలిగిస్తుంది. కాంగోలో మొట్టమొదటిసారిగా 1976లో ఈ వైరస్ బయటపడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం 17సార్లు కాంగోలో ప్రబలింది. 2018–2020 మధ్య కాలంలో దేశంలో వెయ్యి మందికి పైగా చనిపోయారు. -
మసాజ్ పేరుతో 61 మందిపై లైంగిక దాడి.. భారత సంతతి అరెస్ట్
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో దారుణం జరిగింది. భారత సంతతికి చెందిన సుమిత్ అనే వ్యక్తి 61మందిని మసాజ్ పేరుతో వేధించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు నేరం రుజువు కావడంతో అతనికి 13 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అనంతరం దేశబహిష్కరణ చేసింది.అక్కడి అధికారులు వివరాల ప్రకారం 39 ఏళ్ల సుమిత్ అనే వ్యక్తి 2011లో ఢిల్లీ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లారు. అతను అక్టోబర్ 2021 నుంచి జూలై 2022 మధ్య ఒక మసాజ్ పార్లర్లో పని చేశారు. కాగా ఆ సమయంలో మసాజ్ పేరుతో మహిళలను లైంగికంగా వేధించాడు. మహిళల రహస్య వీడియోలు తీసి వారని లైంగికంగా వేదించాడు.కాగా ఈ కేసులో అతనిపై 97 అభియోగాలను నమోదు కాగా అన్నింటిని కోర్టులో అంగీకరించాడు.అయితే ఈ కోసును విచారించిన కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. 61 మంది మహిళలపై లైంగిక దాడి చేసినందుకు గాను సుమిత్కు 13 సంవత్సరాల 10 నెలల జైలు శిక్ష విధించింది. అతను మహిళల నమ్మకాన్ని ఉల్లంఘించి, మసాజ్ల సమయంలో అనుచితమైన చర్యలకు పాల్పడ్డాడని కోర్టు వ్యాఖ్యానించింది. చికిత్స కోసం వచ్చని మహిళలను వారి నమ్మకాన్ని, భద్రతను దుర్వినియోగం చేశాడని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.అయితే సుమిత్కు సుమిత్కు మసాజ్ థెరపీలో ఎలాంటి అధికారిక అర్హతలు లేనప్పటికీ అక్రమంగా మసాజ్ సెంటర్లో విధులు నిర్వహస్తున్నారని శిక్షాకాలం పూర్తి చేసుకున్న తర్వాత అతడిని ఆస్ట్రేలియా బహిష్కరించవచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది. -
హంటా, నోరో, కోవిడ్.. ప్రాణాంతక నిజాలు!
న్యూఢిల్లీ: క్రూయిజ్ షిప్లలో వరుసగా నమోదవుతున్న నోరోవైరస్ కేసులు, అంతర్జాతీయ ప్రయాణికుల్లో బయటపడిన అరుదైన ‘హంటా’ వైరస్ ఉదంతాలు ప్రపంచాన్ని మరోసారి తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ తాజా పరిణామాలు కోవిడ్-19 నాటి చీకటి రోజులను గుర్తుచేస్తున్నాయి. అయితే ఈ మూడు వైరస్లు వ్యాప్తి చెందే విధానం, లక్షణాలు, వాటి వల్ల పొంచి ఉన్న ప్రాణాపాయం ఒకదానికొకటి పూర్తి భిన్నం. ఆ వ్యత్యాసాలు ఏమిటో నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.హంటా వైరస్: అరుదైనప్పటికీ ప్రాణాంతకంఎలుకల ద్వారా మనుషులకు సోకే ‘హంటా వైరస్’ చాలా అరుదైనదే అయినప్పటికీ, ప్రాణాపాయం కలిగించడంలో దీని తీవ్రత చాలా ఎక్కువ. ఎలుకల వ్యర్థాలు, మూత్రం లేదా లాలాజలం ఉన్న గాలిని పీల్చడం ద్వారా ఇది సోకుతుంది. జ్వరం, కండరాల నొప్పులు, తీవ్రమైన తలనొప్పి వంటి ప్రాథమిక ఫ్లూ లక్షణాలతో మొదలవుతుంది. తరువాత క్రమంగా ఊపిరితిత్తుల్లో నీరు చేరే ప్రమాదకరమైన ‘హంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్’కు దారితీసి, శ్వాస తీసుకోవడాన్ని కష్టతరం చేస్తుంది. అయితే ఇది మనిషి నుంచి మనిషికి వ్యాపించే అవకాశం చాలా తక్కువ కావడం ఒక్కటే ఇందులో ఉన్న సానుకూలాంశం.నోరోవైరస్: వేగంగా చుట్టుముట్టే కడుపు ఫ్లూపాఠశాలలు, ఆఫీసులు క్రూయిజ్ షిప్ల వంటి రద్దీ ప్రాంతాల్లో ‘నోరోవైరస్’ అత్యంత వేగంగా, సులువుగా వ్యాపిస్తుంది. కలుషితమైన ఆహారం, నీరు, ఉపరితలాలను తాకడం ద్వారా ఇది సోకుతుంది. ఇది ప్రధానంగా జీర్ణవ్యవస్థపై దాడి చేస్తుంది. ఫలితంగా ఆకస్మిక వాంతులు, అతిసారం, తీవ్రమైన కడుపు నొప్పి వేధిస్తాయి. సాధారణంగా ఆరోగ్యవంతుల్లో ఇది రెండు, మూడు రోజుల్లోనే తగ్గిపోయినప్పటికీ, పిల్లలు, వృద్ధుల్లో ప్రాణాంతక డీహైడ్రేషన్కు (శరీరంలో నీరు శాతం పడిపోవడం) దారితీసే ప్రమాదం ఉంది. దీనికి నిర్దిష్టమైన మందు లేదు, విశ్రాంతి , ద్రవాహారం తీసుకోవడమే ఏకైక మార్గం.కోవిడ్-19: దీర్ఘకాలిక ప్రభావం చూపే శ్వాసకోశ వ్యాధిగాలి ద్వారా, తుంపర్ల ద్వారా అత్యంత సులభంగా వ్యాపించే కోవిడ్-19 నేరుగా శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తుంది. పొడి దగ్గు, గొంతు నొప్పి, వాసన లేదా రుచి కోల్పోవడం దీని ప్రధాన లక్షణాలు. వ్యాక్సిన్ల రాకతో చాలా వరకు దీని తీవ్రత తగ్గినప్పటికీ, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది ఇంకా ముప్పుగానే పరిణమిస్తోంది. కొందరిలో నెలల తరబడి వేధించే ‘లాంగ్ కోవిడ్’ సమస్యలు కూడా ఉన్నాయి. నోరోవైరస్ నివారణకు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, కోవిడ్ను అడ్డుకునేందుకు మంచి గాలి ఆడేలా చూసుకోవడం, హంటా వైరస్ దరిచేరకుండా ఎలుకల సంచారాన్ని నివారించడం అత్యంత ఆవశ్యకం.ఇది కూడా చదవండి: బాబా వంగ చెప్పిన డెడ్లీ వైరస్ ఇదేనా? -
చైనా కంత్రీ వేషాలు.. తైవాన్ స్ట్రాంగ్ కౌంటర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చేతులెత్తేశారు. తైవాన్కు అండగా నిలుస్తామని, ఆ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతామని ఇన్నాళ్లూ చెప్పుకొచ్చిన ట్రంప్.. చైనా పర్యటన అనంతరం తైవాన్కు భారీ షాకిచ్చారు. చైనా నుంచి తైవాన్ను రక్షించలేమని నాలుక మడతేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్నకు తైవాన్ విదేశాంగ శాఖ స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. తైవాన్ ఎప్పటికీ చైనాకు లోబడి ఉండదని తేల్చిచెప్పింది.అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యల అనంతరం, తైవాన్ విదేశాంగ శాఖ స్పందిస్తూ.. తమది పూర్తి సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్యం కలిగిన ‘స్వతంత్ర’ దేశమని స్పష్టం చేసింది. తైవాన్ ఎప్పటికీ చైనాకు లోబడి ఉండదని తేల్చిచెప్పింది. అమెరికా నుంచి తాము కొనుగోలు చేసే ఆయుధాలు, ఉభయ దేశాల మధ్య ఉన్న 'తైవాన్ రిలేషన్స్ యాక్ట్' భద్రతా ఒప్పందంలో భాగమేనని సమర్థించుకుంది. మరోవైపు, తైవాన్ అధ్యక్షుడు లై చింగ్-టే కీలక వ్యాఖ్యలు చేశారు. తైవాన్ను సార్వభౌమ దేశంగా చూస్తామని ప్రకటించారు. తైవాన్ ప్రజాస్వామ్యాన్ని, స్వతంత్రతను కాపాడుకోవడమే తమ లక్ష్యం అని ఆయన పునరుద్ఘాటించారు. ఈ వ్యాఖ్యలు చైనా-అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతను మరింత పెంచాయి. కాగా, అమెరికా, చైనా ఒత్తిడుల మధ్య తైవాన్ తన స్వీయ గుర్తింపును నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది.ఇదిలా ఉండగా.. చైనా పర్యటన తర్వాత తైవాన్ విషయమై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎక్కడో దూరంగా ఉన్న తైవాన్ కోసం అత్యంత బలీయమైన చైనాను ఢీకొట్టలేమని పరోక్షంగా తేల్చిచెప్పారు. ఎవరో(తైవాన్) స్వతంత్రంగా ఉండాలని తాను ఆకాంక్షించడం లేదన్నారు. చైనా నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకొనే ఆలోచన మానుకోవాలని తైవాన్కు సూచించారు. ‘‘మనం యుద్ధం చేయడానికి 15,289 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. నేను అది కోరుకోవడం లేదు. చైనాకు తైవాన్ ద్వీపం కేవలం 95 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాళ్లు(తైవాన్, చైనా) సహనం వహించాలని కోరుతున్నాను. ఉద్రిక్తతలకు దూరంగా ఉండాలి. తైవాన్ ద్వీపం గురించి నేను, జిన్పింగ్ ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అయితే, తైవాన్ను అమెరికా రక్షిస్తుందా? లేదా అనేదానిపై చర్చించడానికి నేను నిరాకరించా. తైవాన్ విషయంలో జిన్పింగ్కు స్పష్టమైన, బలమైన ఉద్దేశాలు ఉన్నాయి. తైవాన్ స్వాతంత్య్ర పోరాటం ఆయనకు ఎంతమాత్రం ఇష్టంలేదు’’అని స్పష్టంచేశారు. తైవాన్ విషయంలో ఇకపై జోక్యం చేసుకునే ఆలోచన లేదని సంకేతాలిచ్చారు. చైనా–తైవాన్ సమస్య ప్రధానంగా “సార్వభౌమాధికార” (sovereignty) పై వివాదం. చైనా తైవాన్ను తన ప్రావిన్స్గా భావిస్తే, తైవాన్ ప్రజాస్వామ్యంగా స్వతంత్ర దేశంలా పనిచేస్తోంది. ఈ విభేదం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైన ఘర్షణకు కారణమవుతోంది. ఇక, తైవాన్లో అమెరికా పాత్ర ప్రధానంగా రక్షణ, వాణిజ్యం, మరియు రాజకీయ మద్దతు చుట్టూ తిరుగుతుంది. 1979లో చైనాతో అధికారిక సంబంధాలు ఏర్పరచుకున్నప్పటికీ, అమెరికా Taiwan Relations Act ద్వారా తైవాన్కు ఆయుధాలు, రక్షణ సహాయం అందిస్తోంది. ఇది చైనా-అమెరికా సంబంధాల్లో అత్యంత ఉద్రిక్తకర అంశం.చరిత్రాత్మక నేపథ్యం1895: షిమోనోసేకి ఒప్పందం ప్రకారం తైవాన్ జపాన్కు అప్పగించబడింది.1945: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తైవాన్ను రిపబ్లిక్ ఆఫ్ చైనా (ROC)కు అప్పగించారు.1949: చైనా అంతర్గత యుద్ధంలో కమ్యూనిస్టులు విజయం సాధించగా, నేషనలిస్టులు తైవాన్కు పారిపోయి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.1971: ఐక్యరాజ్యసమితిలో చైనా స్థానాన్ని బీజింగ్లోని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (PRC) స్వీకరించింది. తైవాన్ అంతర్జాతీయంగా ఒంటరైంది.చైనా తైవాన్ను “విభిన్న ప్రావిన్స్”గా భావిస్తుంది.ఒక దేశం, రెండు వ్యవస్థలు (హాంకాంగ్ మోడల్) ప్రతిపాదించింది కానీ తైవాన్లో ప్రధాన పార్టీలు దీనిని తిరస్కరించాయి.బలప్రయోగం ద్వారా అయినా తైవాన్ను కలుపుకోవాలని హెచ్చరిస్తోంది.తైవాన్లో ప్రజాస్వామ్య ఎన్నికల ప్రభుత్వం ఉంది, సుమారు 2.3 కోట్ల జనాభా.ఎక్కువ మంది ప్రజలు ప్రస్తుత స్థితి (status quo) కొనసాగాలని కోరుకుంటున్నారు. అంటే పూర్తిగా స్వతంత్రత ప్రకటించకుండా, చైనాకు లోబడకుండా ఉండాలనుకుంటున్నారు.అంతర్జాతీయ ప్రభావంఅమెరికా: తైవాన్కు ఆయుధాలు, రక్షణ సహాయం అందిస్తోంది.ఐక్యరాజ్యసమితి: తైవాన్ సభ్యత్వం లేదు; కేవలం 12 చిన్న దేశాలు మాత్రమే అధికారికంగా గుర్తిస్తున్నాయి.ప్రాంతీయ భద్రత: తైవాన్పై దాడి జరిగితే, అమెరికా-చైనా మధ్య యుద్ధం జరిగే ప్రమాదం ఉంది. -
ఈ టైమ్ తుపాన్ ముందు ఉన్న ప్రశాంతత.. ఇక విధ్వంసమే..?
వాషింగ్టన్ డీసీ: ఇరాన్- అమెరికా మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్కు ట్రంప్ బిగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ ఈ సారి శాంతి ఒప్పందంపై సంతకం చేయకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇప్పుడు నడుస్తున్న కాలం తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతతగా పేర్కొన్నారు. ఈ మేరకు తన ట్రూత్ ఖాతాలో ఒక ఏఐ జనరేటెడ్ పిక్తో వార్నింగ్ ఇచ్చారు.ఇటీవలే చైనా పర్యటన ముగించుకొని వచ్చారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ చాలా బాగుందని ఆయన చాలా గొప్ప మనిషని కొనియాడారు. తైవాన్ విషయంలోనే అమెరికా మద్దతు ఉండదని చెప్పకనే చెప్పారు. అయితే గత కొద్దిరోజులుగా అమెరికా-ఇరాన్ మధ్య సీజ్ఫైర్ నడుస్తోన్న నేపథ్యంలో మరోసారి ఇరాన్పై విరుచుకుపడుతూ మాట్లాడారు.ట్రంప్ మాట్లాడుతూ "ఒకవేళ ఇరాన్ శాంతి ఒప్పందానికి అంగీకరించకుండా, హర్ముజ్ జలసంధి విషయంలో తన దూకుడు వైఖరిని కొనసాగిస్తే, చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు నడుస్తున్న శాంతికాలం తుపానుకు ముందు ప్రశాంతతగా గుర్తుంచుకోవాలి" అని అన్నారు. అయితే ఇరాన్పై తిరిగి వైమానిక దాడులను ప్రారంభించడానికి పెంటగాన్ పలు సైనిక ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసిందని ట్రంప్ నిర్ణయం కోసమే వేచి చూస్తున్నారని పలు నివేదికలు పేర్కొన్నాయి.మరోవైపు ఇరాన్ సైతం వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. అమెరికా దాడులు చేస్తే ఎదుర్కోవడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని ఏ దాడికైనా గట్టిగా ప్రతిస్పందిస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఇదివరకే తేల్చిచెప్పారు. మధ్యప్రాచ్య సంఘర్షణ ప్రపంచ క్రమాన్ని పునర్నిర్మిస్తోందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ కూడా పేర్కొన్నారు.కాగా హర్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలకు "టోల్ టాక్స్" స్థానంలో "సర్వీస్ ఛార్జ్"ను ప్రవేశపెట్టి, అక్కడ ఒక కొత్త నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఇరాన్ ప్రణాళిక వేస్తున్నట్లు సమాచారం. -
మరో వివాదానికి తెరలేపిన ఎలాన్ మస్క్
ఇన్స్టాగ్రామ్ కేవలం అమ్మాయిల కోసమేనంటూ ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ మరో వివాదానికి తెరలేపారు. సోషల్ మీడియా అలవాట్లు, ఆన్లైన్ ట్రెండ్స్పై జరుగుతున్న ఒక వైరల్ చర్చకు స్పందిస్తూ పురుషులను ఎగతాళి చేసే విధంగా కామెంట్స్ చేశారు. మనుషుల ఆన్లైన్ అలవాట్లు వారి జీవితంలోని విభిన్న దశలను ఎలా ప్రతిబింబిస్తాయనే అంశంపై చర్చ నడిచింది.రోజంతా ఇన్స్టాగ్రామ్ స్టోరీలు పెట్టడం, ఇంట్లో వండిన వంటకాల ఫోటోలను అప్లోడ్ చేయడం, ఆకర్షణీయమైన ఫోటోలు పోస్ట్ చేయడం వంటి సాధారణ ఇన్స్టాగ్రామ్ ట్రెండ్స్ను ఆ థ్రెడ్లో ప్రముఖంగా ప్రస్తావించారు. కొంతమంది మగవాళ్లు తమ ఇన్స్టా ప్రొఫైల్స్ నాకు పంపుతుంటారు. అప్పుడు నాకు వాళ్లేమైనా లింగమార్పిడి చేయించుకుంటున్నారా అనిపిస్తుందంటూ మస్క్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.LmaoInstagram is for girls— Elon Musk (@elonmusk) May 15, 2026దీంతో ఆయనపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్ వైరల్ అవ్వగా.. మస్క్ చేసిన వ్యాఖ్యలు స్త్రీ ద్వేషపూరితంగా.. అభ్యంతరకరంగా ఉన్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఆ పురుషులు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న మహిళలు కావచ్చు. అక్కడ అంతా ఫేక్ మాత్రమే కనిపిస్తుందంటూ కామెంట్ చేశారు. -
ఆ డీల్ ఓకే అయితేనే భారత్తో సంబంధాలు.. బంగ్లాదేశ్
ఢాకా: భారత్- బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలపై ఆ దేశ మంత్రి మీర్జా ఫఖ్రుల్ అస్రాం ఆలంగీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇరు దేశాల మధ్య సంబంధాలు గంగానది జలాల భాగస్వామ్య పునరుద్ధరణతోనే ఆధారపడి ఉంటాయన్నారు. బంగ్లాదేశ్ ప్రజల అంచనాలు మరియు అవసరాలకు అనుగుణంగా భారత్ కొత్త ఒప్పందంపై చర్చలు జరపాలని భారత్పై ఒత్తిడి తెచ్చారు.1996లో అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా హయాంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన ప్రస్తుత గంగా నీటి ఒప్పందం ఈ ఏడాది (2026) డిసెంబర్తో ముగియనుంది. అయితే ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఈ అంశంపై స్పందించింది. బీఎన్పీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగిర్ మాట్లాడుతూ "భారత్తో మంచి సంబంధాలు కొనసాగడం అనేది గంగా నీటి భాగస్వామ్య ఒప్పందం లేదా ఫరక్కా ఒప్పందంపై సంతకం చేయడంపైనే ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య జరిగే నీటి పంపిణీ ఒప్పందాలకు నిర్దిష్ట కాలపరిమితి అంటూ లేకుండా ఒప్పందం ఉండాలి". అన్నారు.గంగా నది వివాదంభారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ముర్షిదాబాద్ జిల్లా సరిహద్దు దాటిన తర్వాత గంగానది నేరుగా బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. అక్కడ గంగానదిని పద్మానది అనే పేరుతో పిలుస్తారు. దిగువ దేశమైన బంగ్లాదేశ్ వ్యవసాయం, జీవవైవిధ్యం మరియు నీటి సరఫరాకు ఈ నది చాలా కీలకం.కాగా కోల్కతా ఓడరేవులో పూడికను కొట్టుకుపోయేలా చేసి, హుగ్లీ నదిలో నావిగేషన్ను మెరుగుపరచడానికి ఫరక్కా బ్యారేజ్ భారత్ నిర్మించింది. అయితే దీనివల్ల ఎండాకాలంలో ఫరక్కా బారేజ్ వల్ల బంగ్లాదేశ్కు వచ్చే నీటి ప్రవాహం తగ్గిపోతోందని, దీనివల్ల ఉప్పునీటి శాతం పెరిగి, వ్యవసాయం, నదీ వ్యవస్థలు మరియు పర్యావరణం దెబ్బతింటున్నాయని బంగ్లాదేశ్ నిపుణులు ఆరోపిస్తున్నారు.వివాదాస్పదంగా 'పద్మా బారేజ్' ప్రాజెక్ట్ఫరక్కా బారేజ్ వల్ల జరుగుతున్న నష్టాన్ని పూడ్చుకోవడానికి పద్మా నదిపై ఒక భారీ బారేజ్ నిర్మించే ప్రాజెక్ట్కు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ బ్యారేజ్ వల్ల భారత్లోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశాలున్నాయని వాదిస్తోంది. భారత్స్పందన ఈ నీటి వివాదాలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ మాట్లాడారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య 54 నదులు ఉన్నాయని వీటన్నిటిపై చర్చించడానికి ఇప్పటికే ఒక పటిష్టమైన ద్రైపాక్షిక యంత్రాంగం అందుబాటులో ఉందని తెలిపారు.అదే సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నందున సింధు నది నీటి ఒప్పందం ప్రస్తుతం నిలిపివేయబడిందని తెలిపారు. -
బాబా వంగ చెప్పిన డెడ్లీ వైరస్ ఇదేనా?
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడించిన ఎన్నో ఊహించని సంఘటనలను ముందే పసిగట్టిన బల్గేరియా అంధురాలు, ‘నొస్ట్రడామస్ ఆఫ్ ది బాల్కన్స్’గా పేరుగాంచిన బాబా వంగ పేరు ఇప్పుడు వార్తల్లో మరోమారు మార్మోగుతోంది. 2026 సంవత్సరానికి సంబంధించి ఆమె వెల్లడించిన కొన్ని భయంకరమైన అంచనాలు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఆందోళనలకు తెరతీస్తున్నాయి.అంతుచిక్కని రోగాల ముప్పుప్రిన్సెస్ డయానా మరణం నుండి కోవిడ్-19 మహమ్మారి వరకు అనేక ప్రధాన ప్రపంచ పరిణామాలను కచ్చితంగా అంచనా వేసిన ఘనత బాబా వంగకు దక్కుతుంది. కొందరు నెటిజన్లు తాజాగా ఉదహరిస్తున్న వివరాల ప్రకారం.. 2025 మరియు 2027 మధ్యకాలంలో మానవాళి ‘ పూర్తిగా అంతుచిక్కని వైద్య పరిస్థితులను’ ఎదుర్కొంటుందని ఆమె తీవ్రంగా హెచ్చరించారు. అత్యంత వేగంగా వ్యాపిస్తూ, ఎలాంటి మందులు లేదా చికిత్సకు లొంగకుండా ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలను పూర్తిగా కుప్పకూల్చే ప్రమాదకరమైన వైరస్లు దాడి చేస్తాయని ఆమె తన జోస్యంలో పేర్కొన్నారు.హంటా, నోరో వైరస్లతో లింక్?బాబా వంగ హెచ్చరించిన ఈ ‘కల్లోల సమయం’ ఇప్పుడు నిజంగానే మొదలైందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ప్రపంచంలోని కొన్ని దేశాల్లో అకస్మాత్తుగా వెలుగుచూస్తున్న ‘హంటా వైరస్’ ‘నోరో వైరస్’ వ్యాప్తిని ప్రజలు ఆమె అంచనాలతో ముడిపెడుతున్నారు. అప్పట్లో ఆమె చెప్పిన చికిత్సకు లొంగని భయంకరమైన వైరస్లు ఇవేనా? అని సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు.నిజానిజాలు ఏంటి?అయితే నెట్టింట పెరుగుతున్న ఈ తీవ్ర ఆందోళనల మధ్య ఒక ముఖ్యమైన వాస్తవాన్ని అందరూ గమనించాలి. బాబా వంగ తన భవిష్యవాణిలో ఎక్కడా ‘హంటా వైరస్’ లేదా ‘నోరో వైరస్’ పేర్లను నిర్దిష్టంగా ప్రస్తావించినట్లు ఎలాంటి అధికారిక లేదా ప్రామాణిక రికార్డులు లేవు. ఆగస్టు 11, 1996న బల్గేరియాలో మరణించిన ఆమె చెప్పినట్లుగా ప్రచారంలో ఉన్న మాటలకు, ప్రస్తుత వ్యాధుల వ్యాప్తికి ప్రజలే స్వయంగా పోలికలు తెస్తున్నారు తప్ప, ఇందులో కచ్చితమైన ఆధారాలు లేవని గుర్తించాలని నిపుణులు అంటున్నారు.ఇది కూడా చదవండి: సిరియా టు గల్ఫ్.. ఇండియా మీదుగా డ్రగ్స్ స్మగ్లింగ్! -
రోడ్డుపై లక్ష దిర్హామ్ల నోట్ల కట్ట.. ప్రవాసి నిజాయితీ
దుబాయ్: రోడ్డుపై డబ్బు కనిపిస్తే ఏం చేస్తారు.. అది చిన్న మొత్తమైనా, పెద్ద మొత్తమైనా అటూ ఇటూ చూసి వెంటనే జేబులో పెట్టేసుకుంటారు. చాలా మంది చేసేదిదే. అయితే దుబాయ్లో ఓ ప్రవాసుడు దీనికి భిన్నంగా నిజాయితీని చాటుకున్నాడు. రోడ్డుపై పడి ఉన్న లక్ష దిర్హామ్ల (భారత కరెన్సీలో రూ. 25 లక్షలకు పైగా) భారీ నగదు కట్టను చూసి ఆశపడకుండా, వెంటనే పోలీసులకు అప్పగించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.అసలేం జరిగిందంటే?దుబాయ్లోని కరామాలో నివసిస్తున్న రాజ్ అనే ప్రవాస వ్యాపారవేత్త, తన వ్యాపార అవసరాల కోసం స్థానిక బ్యాంకు నుండి 2,60,000 దిర్హామ్ల చెక్కును విత్డ్రా చేసుకున్నాడు. ఆ నగదును ఒక కవరులో పెట్టుకుని వస్తుండగా, మార్గమధ్యంలో కవరు కొద్దిగా తెరుచుకుని అందులోని ఒక లక్ష దిర్హామ్ల కట్ట కింద పడిపోయింది.ఇంటికి వెళ్లాక గానీ రాజ్ ఈ విషయాన్ని గమనించలేదు. గత 15 ఏళ్లుగా దుబాయ్లో ఉంటున్న తనకు ఇలాంటి చేదు అనుభవం ఎదురవడం ఇదే మొదటిసారని, ఆ సమయంలో తాను తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని ఆయన తెలిపాడు. వెంటనే బ్యాంకుకు వెళ్లి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, బ్యాంకు లోపల నగదు అంతా సరిగ్గా ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయన వెంటనే రఫా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, తాను వచ్చిన మార్గంలో వెతకడం ప్రారంభించాడు.అదే సమయంలో 'అల్ సియారా డాక్యుమెంట్ క్లియరింగ్ సర్వీసెస్' యజమాని, ప్రవాసుడైన మహ్మద్ అలీకి రోడ్డుపై పడి ఉన్న నగదు కట్ట కనిపించింది. యుఏఈలో అతి తక్కువ జీతంతో జీవితాన్ని ప్రారంభించి, ప్రస్తుతం ఒక చిన్న టైపింగ్ సెంటర్ నడుపుకుంటున్న అలీ.. ఆ భారీ మొత్తాన్ని చూసి ఎంతమాత్రం సంకోచించకుండా వెంటనే దుబాయ్ పోలీసులకు సమాచారం అందించి, నగదును వారికి భద్రంగా అప్పగించాడు.మరోవైపు, రోడ్డుపై కారు పక్కన ఆందోళనగా నిలబడి ఉన్న రాజ్ను చూసి సమీపంలోని ఒక రెస్టారెంట్ సిబ్బంది కూడా పోలీసులకు సమాచారం అందించారు. రఫా పోలీస్ స్టేషన్ హ్యాపీనెస్ డివిజన్ అధికారులు కెప్టెన్ అలీ హాజీ హసన్ యూసుఫ్, ఫస్ట్ సార్జెంట్లు ముస్తఫా అబ్దుల్వాలు, అలీ ఖల్ఫాన్లు రంగంలోకి దిగి వేగంగా దర్యాప్తు చేపట్టారు. మహ్మద్ అలీ అప్పగించిన నగదు వివరాలను, రాజ్ కోల్పోయిన వివరాలను సరిపోల్చి, కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఆ సొమ్మును అసలు యజమాని అయిన రాజ్కు సురక్షితంగా అందజేశారు. -
మాట మార్చిన ట్రంప్
వాషింగ్టన్: చైనా బారి నుంచి తమ మిత్రదేశం తైవాన్ను రక్షించే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతులెత్తేశారు. తైవాన్కు అండగా నిలుస్తామని, ఆ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతామని ఇన్నాళ్లూ ప్రకటించిన ట్రంప్ చైనా అధినేత షీ జిన్పింగ్తో భేటీ తర్వాత మాట మార్చేశారు. ఎక్కడో దూరంగా ఉన్న తైవాన్ కోసం అత్యంత బలీయమైన చైనాను ఢీకొట్టలేమని పరోక్షంగా తేల్చిచెప్పారు. ఎవరో(తైవాన్) స్వతంత్రంగా ఉండాలని తాను ఆకాంక్షించడం లేదన్నారు. చైనా నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకొనే ఆలోచన మానుకోవాలని తైవాన్కు సూచించారు. శుక్రవారం ఫాక్స్న్యూస్తో ట్రంప్ మాట్లాడారు. ‘‘మనం యుద్ధం చేయడానికి 15,289 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. నేను అది కోరుకోవడం లేదు. చైనాకు తైవాన్ ద్వీపం కేవలం 95 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాళ్లు(తైవాన్, చైనా) సహనం వహించాలని కోరుతున్నాను. ఉద్రిక్తతలకు దూరంగా ఉండాలి. తైవాన్ ద్వీపం గురించి నేను, జిన్పింగ్ ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అయితే, తైవాన్ను అమెరికా రక్షిస్తుందా? లేదా అనేదానిపై చర్చించడానికి నేను నిరాకరించా. తైవాన్ విషయంలో జిన్పింగ్కు స్పష్టమైన, బలమైన ఉద్దేశాలు ఉన్నాయి. తైవాన్ స్వాతంత్య్ర పోరాటం ఆయనకు ఎంతమాత్రం ఇష్టంలేదు’’అని ట్రంప్ స్పష్టంచేశారు. తైవాన్ విషయంలో ఇకపై జోక్యం చేసుకొనే ఆలోచన లేదని సంకేతాలిచ్చారు. అమెరికా, చైనా.. జి–2 డొనాల్డ్ ట్రంప్ చైనాలో మూడు రోజుల పర్యటన పూర్తిచేసుకొని శుక్రవారం సాయంత్రం స్వదేశానికి తిరిగివచ్చారు. చైనా అధినేత షీ జిన్పింగ్తో జరిగిన చర్చలను రెండు గొప్ప దేశాల నాయకుల సమావేశంగా అభివర్ణించారు. అమెరికా వ్యవసాయ రంగానికి ప్రయోజనం చేకూర్చే ఒప్పందాలతో సహా ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాలను చైనాతో కుదుర్చుకున్నట్లు చెప్పారు. ‘‘అమెరికా చైనాలు గొప్ప దేశాలు. నేను దీన్ని జి–2 అని పిలుస్తాను’’ అని అభివర్ణించారు.చైనా బహుమతులు బుట్టదాఖలు బీజింగ్: కీలకమైన ఒప్పందాల కోసం తన బృందంతో కలిసి చైనా పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరకు ఉత్తచేతులతోనే వెనక్కి వెళ్లిపోయారు. కొన్ని ఒప్పందాలు కుదిరాయని ట్రంప్ చెప్పినప్పటికీ వాటి వివరాలు బహిర్గతం చేయలేదు. ఒక దేశాధినేత మరో దేశానికి అధికారిక పర్యటనకు వెళ్లినప్పుడు బహుమతులతో సత్కరించడం ఆనవాయితీ. పుస్తకాలు కూడా బహూకరిస్తుంటారు. అధినేత బృందంలోని సభ్యులకు కూడా బహుమతులు లభిస్తాయి. వాటిని స్వదేశానికి తీసుకెళ్తుంటారు. అధ్యక్షుడికి వచ్చినవి ప్రభుత్వ ఆస్తి. వాటిని వేలం వేయడమో లేదా మ్యూజియంలో భద్రపర్చడమో చేస్తుంటారు. కానీ.. ట్రంప్, ఆయన బృందం మాత్రం చైనా నుంచి ఏమీ తీసుకెళ్లకుండా తిరిగి వెళ్లిపోయారు. శుక్రవారం బీజింగ్లో ఎయిర్పోర్టులో ఎయిర్ఫోర్స్ వన్ విమానం సమీపంలో ఏర్పాటు చేసిన చెత్తకుండిలో వాటిని వదిలేశారు. చైనా వస్తువులేవీ తమ దగ్గర ఉండకుండా జాగ్రత్తపడ్డారు. ట్రంప్ ప్రతినిధి బృందం, వైట్హౌస్ సిబ్బంది, ఆఖరికి అమెరికా జర్నలిస్టులు కూడా చైనా బహుమతులను ఇక్కడే విడిచిపెట్టారు. చైనా పర్యటనకు వచ్చినప్పుడు అమెరికా సిబ్బంది ఇలా చేయడం మొదటిసారి కాదు. కానీ, బహిరంగంగా అందరూ చూస్తుండగా బహుమతులను పక్కనపారేయడం మాత్రం ఇదే తొలిసారి. అమెరికా నుంచి వచ్చిన సిబ్బందికి చైనా అధికారులు ఫోన్లు, ఎల్రక్టానిక్ పరికరాలు, బ్యాడ్జ్లు, జ్ఞాపికలను గిఫ్ట్గా ఇచ్చారు. కానీ, అవన్నీ చైనాలోనే చెత్తకుండి పాలయ్యాయి. తమపై చైనా ప్రభుత్వం నిఘా పెడుతుందన్న భయంతోనే బహుమతులను వదిలేశారని తెలుస్తోంది. -
దుబాయ్ లాటరీ: ముగ్గురికి లక్కీ ఛాన్స్!
దుబాయ్: యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రాలో శనివారం పలువురు అదృష్టవంతులు నగదు బహుమతులు గెలుచుకున్నారు. అయితే, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన భారీ జాక్పాట్ బహుమతిని మాత్రం ఈసారి ఎవరూ దక్కించుకోలేకపోయారు.డ్రా వివరాలు శనివారం రాత్రి జరిగిన డ్రా (డ్రా నెం: 260516)లో విజేతలను నిర్ణయించిన సంఖ్యలు ఇలా ఉన్నాయి..'డేస్' (Days) సెక్షన్ సంఖ్యలు: 20, 17, 14, 18, 24, 12నెల' (Month) సెక్షన్ సంఖ్య: 5గ్యారెంటీడ్ 'లక్కీ ఛాన్స్ ఐడీ' ప్రైజ్ కేటగిరీ ద్వారా ముగ్గురు నివాసితులు ఒక్కొక్కరు 50,000 దిర్హమ్ల (సుమారు రూ.11 లక్షలకు పైగా) నగదు బహుమతిని సొంతం చేసుకున్నారు. గెలిచిన లక్కీ ఛాన్స్ ఐడీలు ఇవే.. AX2216481, BZ5027000, AP1481503.నెక్స్ట్ డ్రాకు చేరిన భారీ జాక్పాట్ఈ రౌండ్లో 30 మిలియన్ దిర్హమ్ల (సుమారు రూ.68 కోట్లకు పైగా) గ్రాండ్ ప్రైజ్తో పాటు, 5 మిలియన్ దిర్హమ్ల రెండో బహుమతిని కూడా ఎవరూ గెలుచుకోలేదు. దీంతో ఈ రెండు భారీ మొత్తాలు తదుపరి డ్రాకు బదిలీ (రోల్ఓవర్) అయ్యాయి.అయితే, లక్కీ డే విభాగంలో ఇద్దరు పాల్గొనేవారు మూడో బహుమతిని దక్కించుకున్నారు. 'డేస్' విభాగంలోని ఐదు సంఖ్యలను, సింగిల్ 'నెల' సంఖ్యతో సరిపోల్చినందుకు గాను వీరికి ఒక్కొక్కరికి 100,000 దిర్హమ్ల (సుమారు రూ.22.6 లక్షలు) చొప్పున లభించాయి.మే 20న తదుపరి డ్రావారానికి రెండుసార్లు జరిగే ఈ షెడ్యూల్లో భాగంగా.. తదుపరి యూఏఈ లాటరీ డ్రా వచ్చే బుధవారం (మే 20) జరగనుంది. జాక్పాట్ మొత్తం మరింత పెరగడంతో, రాబోయే డ్రాలో పెద్ద బహుమతులు గెలుచుకునేందుకు మరో సువర్ణావకాశం లభించనుంది. -
గొప్ప కలలున్నాయి
ద హేగ్: భారత్ అంటే అవకాశాల గని అని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్పునకు లోనవుతోందని తెలిపారు. భారతదేశ ఆకాంక్షలు ఇకపై సరిహద్దులకే పరిమితం కాబోవని అన్నారు. ప్రధాని మోదీ శనివారం నెదర్లాండ్స్లో పర్యటించారు. రాజధాని ద హేగ్లో ప్రవాస భారతీయుల సదస్సులో ప్రసంగించారు. భారత్ నేడు గొప్ప కలలు కంటోందని, దేశ యువత ఆకాంక్షలు ఆకాశాన్నంటుతున్నాయని వ్యాఖ్యానించారు. 21వ శతాబ్దంలో దేశం అవకాశాలకు మారుపేరుగా మారిందన్నారు. సాంకేతికతతోపాటు మానవతా దృక్పథంతో భారత్ ముందుకు సాగుతోందన్నారు. మన దేశం ఎంత ప్రాచీనమైనదో, అంతే ఆధునికంగా కూడా ఎదుగుతోందని హర్షం వ్యక్తంచేశారు. భారత్లోని పూర్వీకుల స్వగ్రామాలతో మళ్లీ అనుబంధం పెంచుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రవాస భారతీయులకు సూచించారు. ‘అభివృద్ధి చెందిన భారత్’దిశగా సాగుతున్న ప్రయాణంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. దీనివల్ల మన దేశ శక్తిసామర్థ్యాలు మరింత బలోపేతం అవుతాయని, మీ పెట్టుబడులకు గొప్ప ప్రతిఫలం లభిస్తుందని వెల్లడించారు. ‘ఇదీ మోదీ గ్యారంటీ’అంటూ నెదర్లాండ్స్లోని భారతీయులకు, భారత మూలాలున్న ప్రజలకు హామీ ఇచ్చారు. అద్భుతాలు సృష్టిస్తున్న స్టార్టప్లు ‘‘ఈ రోజు మన దేశం చాలా పెద్ద ఎత్తున కలలు కంటోంది. కేవలం మార్పును కాదు.. ఉత్తమమైన మార్పును కోరుతోంది. అత్యంత వేగవంతమైన మార్పు కావాలని ఆకాంక్షిస్తోంది. ఆకాశమే హద్దుగా ఉన్నతస్థాయికి ఎదగాలని యువత భావిస్తోంది. ఇండియాలో స్టార్టప్ వ్యవస్థ బలోపేతం కావడానికి ఇదే అసలు కారణం. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ ఇండియాలో ఉంది. 2014లో కేవలం నాలుగు యూనికార్న్ సంస్థలు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 125కి చేరుకుంది. తులిప్లు, తామర పువ్వులు భారతదేశ ఆకాంక్షలు కేవలం దాని సరిహద్దులకే పరిమితం కాలేదు. ఒలింపిక్స్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలని, ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగాలని, హరిత ఇంధన రంగంలో అగ్రగామిగా నిలవాలని, ప్రపంచ వృద్ధికి చోదక శక్తిగా మారాలని తపన పడుతోంది. దేశం నేడు గొప్ప మార్పును వీక్షిస్తోంది. ఇటీవలే ప్రపంచంలో అతిపెద్ద ఏఐ సదస్సును విజయవంతంగా నిర్వహించాం. అంతకంటే ముందు జీ20 సదస్సు జరిగింది. ఇవి కేవలం ఒక్కసారి జరిగిన సంఘటనలు కావు. అతిపెద్ద కార్యక్రమాలు నిర్వహించడం నేటి భారతదేశపు లక్షణంగా, విశ్వాసంగా మారింది. భారత్, నెదర్లాండ్స్ మధ్య బంధం విడదీయరానిది. ఇంధన భద్రత నుంచి జల భద్రత వరకు ఇరుదేశాలు సన్నిహితంగా సహకరించుకుంటున్నాయి. నెదర్లాండ్స్ తులిప్లకు, భారత్ తామర పువ్వులకు ప్రసిద్ధి. మూలాలు నీటిలో ఉన్నా, భూమిలో ఉన్నా.. సరైన పోషణతో వృద్ధి చెందగలవని తులిప్, తామర పువ్వులు మనకు సందేశాన్నిస్తున్నాయి. భారత్, నెదర్లాండ్స్ భాగస్వామ్యానికి కూడా ఇదే పునాది. ఓటింగ్లో కొత్త రికార్డులు గర్వకారణం అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో 80 శాతం నుంచి 90 శాతానికిపైగా ఓటింగ్ నమోదయ్యింది. ఎన్నికల ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. ఓటింగ్లో కొత్త రికార్డులు నమోదవుతుండడం గర్వంగా ఉంది. బెంగాల్ చిరుతిండి ఝాల్మురీ నెదర్లాండ్స్ దాకా చేరిందో లేదో ఇక్కడి భారతీయులే చెప్పాలి. నేను ఇక్కడికి రాగానే నినాదాలతో నన్ను స్వాగతించిన విధానం అమితంగా ఆకట్టుకుంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాజ దంపతులతో మోదీ భేటీ నెదర్లాండ్స్ రాజు విల్లెమ్–అలెగ్జాండర్, రాణి మక్సిమా దంపతులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. రాయల్ ప్యాలెస్లో జరిగిన ఈ భేటీలో భారత్–నెదర్లాండ్స్ సంబంధాలపై చర్చించారు. చోళుల రాగి ఫలకాలు భారత్కు అప్పగింత 11వ శతాబ్దానికి చెందిన చోళ రాజవంశపు రాగి ఫలకాలను నెదర్లాండ్స్ శనివారం భారత్కు అప్పగించింది. భారత ప్రధాని మోదీ, నెదర్లాండ్స్ ప్రధాని రోబ్ జెటెన్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. నెదర్లాండ్స్లో లీడెన్ ప్లేట్లుగా పిలిచే అనైమంగళం రాగి ఫలకాలను తిరిగి పొందాలని భారత్ 2012 నుంచి ప్రయత్నిస్తోంది. మొత్తం 21 పెద్ద ప్లేట్లు, మూడు చిన్న ప్లేట్లు ఉన్నాయి. బరువు 30 కిలోలు. వీటిపై తమిళ భాషలో అక్షరాలు చెక్కి ఉన్నాయి. రాజరాజ చోళ–1 తన కుమారుడైన రాజరాజ చోళ–2కు చేసిన వాగ్దానం ఇందులో ఉంది. ఈ ఫలకాలను తమిళ చోళ రాజవంశానికి చెందిన అత్యంత ముఖ్యమైన చారిత్రక ఆధారాలుగా పరిగణిస్తున్నారు. భారతదేశం వెలుపల తమిళ వారసత్వపు ముఖ్యమైన కళాఖండాల్లో ఇవి కూడా ఒకటి. ఇవి రాజరాజ చోళ–1 కాలానికి సంబంధించినవని చెబుతున్నారు. చోళుల రాజముద్ర కలిగిన కంచు తీగతో వీటిని కట్టి ఉంచారు. ఇవి శతాబ్దాల క్రితమే చేతులు మారి భారత్ నుంచి నెదర్లాండ్స్కు చేరాయి. రాగి ఫలకాలు తిరిగి భారత్కు అందడం ప్రతి భారతీయుడికి ఆనందకరమైన క్షణమని మోదీ అభివర్ణించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఇన్నాళ్లూ ఈ రాగి ప్లేట్లను భద్రపర్చినందుకు నెదర్లాండ్స్ ప్రభుత్వానికి, లీడెన్ యూనివర్సిటీకి కృతజ్ఞతలు తెలియజేశారు. -
ముంచుకొస్తున్న మహా ఎల్ నినో!
న్యూఢిల్లీ: ఇంకో పది రోజుల్లో భారత్ను నైరుతి రుతుపవనాలు పలకరించనున్న శుభవేళ ఎల్ నినో రూపంలో పెనుముప్ప ప్రపంచదేశాలను చుట్టేయనుందన్న చేదువార్త ఇప్పుడు చక్కర్లుకొడుతోంది. పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల జలాలు అత్యధికంగా వేడెక్కి ఈసారి సూపర్ ఎల్ నినోను సృష్టించనున్నాయని తాజాగా వాతావరణ అంచనాలు వెలువడ్డాయి. దీంతో పలు దేశాల్లో అతివృష్టి, మరికొన్ని దేశాల్లో అనావృష్టి తాండవించనుందని వాతావరణ శాస్త్రవేత్తలు విశ్లేషించారు. భారత్లోనూ సూపర్ ఎల్నినో దు్రష్పభావాలు అధికంగా ఉండనున్నాయి. ఈసారి జూన్లో సూపర్ ఎల్ నినో ఏర్పడితే నైరుతి రుతుపవనాల ద్వారా భారత్లో లోటున వర్షపాతం నమోదుకానుందని తెలుస్తోంది. ఎల్ నినోతో ఏర్పడే అసాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా భారత్లో అత్యధిక రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గిపోగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో అతివర్షాలు కురిసే ఆస్కారముందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. భూమధ్యరేఖ వెంబడి దక్షిణ అమెరికా ఖండం పశ్చిమతీరం వైపు పెరూ, ఈక్వెడార్ దేశాల సమీప పసిఫిక్ మహాసముద్రజలాలు అతిగా వేడెక్కితే ఆ దృగ్విషయాన్ని ఎల్నినోగా పిలుస్తాం. ఈ పరిస్థితుల్లో సముద్రగాలులు పశ్చిమానికి బదులు తూర్పునకు పయనిస్తాయి. దీంతో చాలా దేశాల్లో వర్షపాతం తగ్గే అవకాశాలు పెరుగుతాయి. ఈసారి జూన్ లేదా జూలైకల్లా సూపర్ ఎల్నినో ఏర్పడితే భారత్లో వర్షపాతం తగ్గే అవకాశముందని వాతావరణశాస్త్ర నిపుణుడు డాక్టర్ మాధవన్ నాయర్ తెలిపారు. 1997, 2015లో ఎల్నినో ఏర్పడినప్పుడు భారత్ చవిచూసిన దు్రష్పభావాలకంటే ఈఏడాది పరిస్థితులు మరింత దారుణంగా ఉండొచ్చని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఈసారి ఎలా ఉండొచ్చు? భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈసారి వర్షపాతం దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ) కేవలం 92 శాతానికి పరిమితంకావొచ్చు. అంటే వర్షపాతం సాధారణం కంటే తక్కువగా పరిమితమవుతుంది. 1971 నుంచి 2020 ఏడాది వరకు జూన్–సెప్టెంబర్(వర్షాకాలం)లో నమోదైన 870 మిల్లీమీటర్ల దీర్ఘకాలిక సగటు వర్షపాతాన్ని ప్రామాణికంగా తీసుకుని ఈ లెక్కలు కడతారు. ఈసారి లోటు వర్షపాతం నమోదయ్యే సంభావ్యత 35 శాతముంది. చరిత్రలో ఎప్పుడుచూసినా ఇది 16 శాతం కాగా ఈసారి ఏకంగా రెట్టింపునకు చేరడం ఆందోళనకరం. భారత్లో ఈసారి జూన్లో పెద్దగా వర్షాలు పడకపోవచ్చని వాతావరణశాఖతోపాటు ప్రైవేట్ వాతావరణ అంచనాల సంస్థ స్కైమేట్ తెలిపింది. ఉత్తర, పశ్చిమ, మధ్యభారతాల్లో సూపర్ ఎల్ నినో దెబ్బకు వర్షాకాలంలోనూ పొడివాతావరణం కొనసాగి కరువురావొచ్చు. దీంతో సాగుదిగుబడి తగ్గి రైతులకు ఆర్థిక కడగండ్లు మిగిలేప్రమాదముంది. ఆగస్ట్, సెప్టెంబర్లో పంజాబ్, హరియాణా, రాజస్తాన్లో వర్షపాతం తగ్గొచ్చు. లద్దాఖ్, రాజస్తాన్లోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్యం, దక్షిణభారత ఈశాన్యభాగాలు, తెలంగాణలో దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉండే అవకాశముంది. చెన్నైలో కుంభవృష్టి పడొచ్చు. ఈఏడాది తమిళనాడు రాజధానికి వరదముప్పు పొంచి ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనావేశారు. గతంలో 2015–16లో భారత్లో సూపర్ ఎల్ నినో పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు దీర్ఘకాలిక సగటు వర్షపాతం కేవలం 86 శాతంగా నమోదైంది. ఈఏడాది దారుణ పరిస్థితులు దాపురించనున్నాయన్న అంచనాలతో ఆ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులు కార్యాచరణతో సంసిద్ధంకావాల్సిన తరుణం ఆసన్నమైందని వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. -
కువైట్ కీలక నిర్ణయం: ప్రభుత్వ ఆఫీసుల పని వేళలు తగ్గింపు
దుబాయ్: వేసవి కాలంలో దేశంలో పెరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని అదుపు చేయడం, నేషనల్ పవర్ గ్రిడ్పై ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యంగా కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే వేసవి నెలల్లో ప్రభుత్వ సంస్థల్లో పని గంటలను రోజుకు ఆరు గంటలకు తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.ఇప్పటివరకు రోజుకు ఏడు గంటలుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పని వేళలను, ఆరు గంటలకు కుదించాలనే ప్రతిపాదనకు సివిల్ సర్వీస్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది.అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. వేసవిలో ముఖ్యంగా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. ఈ సమయంలో ఏసీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం విపరీతంగా పెరిగి విద్యుత్ నెట్వర్క్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ పీక్ అవర్స్లో పవర్ గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడేందుకు ప్రభుత్వ విస్తృత ప్రణాళికలో భాగంగానే ఈ పని వేళల తగ్గింపు నిర్ణయం తీసుకున్నారు.ప్రభుత్వ కార్యాలయాలతో పాటు, విద్యుత్ లోడ్ను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా పలు కర్మాగారాలు (ఫ్యాక్టరీలు) సైతం గరిష్ట డిమాండ్ ఉన్న సమయాల్లో తమ ఉత్పత్తి కార్యకలాపాలను తగ్గించుకుంటున్నట్లు తెలుస్తోంది.మూడు నెలల పాటు అమలుఈ తగ్గించిన పని గంటలు వేసవి కాలంలో మూడు నెలల పాటు అమలులో ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి విధివిధానాలు, కార్యాచరణ యంత్రాంగాన్ని సివిల్ సర్వీస్ కమిషన్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.కొత్త ప్రతిపాదనల ప్రకారం.. ఉద్యోగుల ఫ్లెక్సిబుల్ మార్నింగ్ అటెండెన్స్ విండోను (ఉదయం ఆఫీసుకు వచ్చే సమయం) ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు (ఒక గంటకు మాత్రమే) పరిమితం చేయనున్నారు. అలాగే సాయంత్రం షిఫ్టులు 5 గంటల నుండి ప్రారంభం కానున్నాయి.మరోవైపు, పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా నీటిని, విద్యుత్ను హేతుబద్ధంగా వినియోగించుకునేలా కువైట్ విద్యుత్, నీరు, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ పలు అదనపు చర్యలను కూడా అమలు చేస్తోంది. ఇంధన వనరులను పొదుపుగా వాడుకుంటూ, గరిష్ట వినియోగ సమయాల్లో గ్రిడ్ దెబ్బతినకుండా చూసేందుకు ప్రజలందరూ బాధ్యతాయుతమైన వినియోగ అలవాట్లను అలవర్చుకోవాలని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది.


