International
-
ఏ క్షణంలోనైనా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు.. ‘ట్రంప్ చెప్పినా వెనక్కి తగ్గబోం’
జెరుసలేం: పశ్చిమాశియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్పై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమైంది. ఈ క్రమంలో ఏ సమయంలోనైనా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేయొచ్చంటూ అమెరికన్ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ దాడి ఆపాలంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. నెతన్యాహు మాత్రం ఇరాన్పై దాడి విషయంలో వెనక్కి తగ్గబోమని తేల్చేశారు. ఈ నేపథ్యంలో, అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇజ్రాయెల్ త్వరలోనే ఇరాన్పై దాడి చేయనుందని.. ఈ దాడి అమెరికా అనుమతి లేకుండానే జరిగే అవకాశం ఉందని వాషింగ్టన్ పోస్ట్ కథనంలో పేర్కొంది. ఇరాన్- అమెరికాల మధ్య అణు ఒప్పందంపై చర్చలు జరగాల్సి ఉంది. ఆ చర్చలు విఫలమైతే ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేయనున్నట్లు కథనాలు హైలెట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్లో ఉన్న అమెరికన్లు తిరిగి సొంత దేశం వచ్చేయాలంటూ ట్రంప్ పిలుపునిచ్చారు. అక్కడి నుంచి అమెరికన్ సిబ్బందిని తరలించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ప్రముఖ మీడియా హౌస్ ఆక్సియోస్ నివేదిక ప్రకారం.. ఇరాన్తో అమెరికా అణుఒప్పందం కుదుర్చుకునేందుకు గత కొంత కాలంగా చర్చలు జరుపుతూ వస్తోంది. తాజాగా జరిపే చర్చలు విఫలమైతే.. ఇరాన్పై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ ప్రధాని ట్రంప్ అనుమతి కోరననున్నారు.ఇజ్రాయెల్ హెచ్చరికలపై ఇరాన్ సైతం అదే రీతిలో బదిలిస్తోందని ఆదేశ ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నాసిర్జాదె హెచ్చరించారు. ఇజ్రాయెల్తో పాటు అమెరికా కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అమెరికా మిలిటరీ బేసులపై నేరుగా దాడులు చేస్తామని పునరుద్ఘాటించారు. ఇరాన్ హెచ్చరికలతో అమెరికా విదేశాంగ శాఖ, బహ్రెయిన్, కువైట్ వంటి దేశాల్లో ఉన్న దౌత్య కార్యాలయాల్లో అత్యవసర చర్యల కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మధ్యప్రాచ్యం, తూర్పు యూరోప్, ఉత్తర ఆఫ్రికాలోని యుఎస్ దౌత్య కార్యాలయాలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు పంపించాయి. అంతేకాక, బహ్రెయిన్, కువైట్ వంటి ప్రాంతాల నుంచి అవసరం లేని సిబ్బందిని స్వచ్ఛందంగా వెనక్కు పంపేందుకు అనుమతి ఇచ్చింది.అమెరికా మిలిటరీ బేసులు ప్రస్తుతం ఇరాక్, కువైట్, ఖతార్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి ప్రాంతాల్లో ఉన్నాయి. ఇటువంటి సున్నితమైన పరిస్థితుల్లో ఇజ్రాయెల్ నిర్ణయంతో పశ్చిమాసియా దేశాల్లో కమ్ముకున్న యుద్ధమేఘాలతో భయాందోలన నెలకొంది. -
అదో ప్రమాదకరమైన ప్రాంతం.. ట్రంప్ మరో సంచలన ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మధ్య ప్రాచ్యం(Middle East) నుంచి తమ దేశ సిబ్బందిని వెనక్కు రప్పిస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. అత్యవసరేతర దౌత్య సిబ్బందితో పాటు ఆయా దేశాల్లో మోహరించిన భద్రతాల బలగాలనూ వెనక్కి రప్పించేందుకు ఆదేశాలు జారీ చేశారాయాన. ‘‘అదో ప్రమాదకరమైన ప్రాంతం(Middle East Most Dangerous). అందుకే అక్కడి నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే వచ్చేయాలంటూ ఆదేశాలు పంపించాం. ఏం జరుగుతుందో చూడాలి’’ అని మీడియా ప్రతినిధులతో ట్రంప్ అన్నారు. ఇరాన్తో పెరుగుతున్న ఉద్రిక్తత నేపథ్యంలోనే బలగాలను ట్రంప్ వెనక్కి రప్పిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో ‘ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ఏదైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా?’ అని అడిగిన ప్రశ్నకు.. ఇరాన్ న్యూక్లియర్ ఆయుధాలు(Iran Nuclear Weapons) కలిగి ఉండటానికి అమెరికా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోదు’’ అంటూ ట్రంప్ కామెంట్ చేశారు. రాయిటర్స్ కథనం ప్రకారం.. ఇరాక్ రాయబార కార్యాలయం నుంచి తమ సిబ్బందిలో కొంత మందిని అత్యవసరంగా వెనక్కి రావాలని అమెరికా ఆదేశించినట్లు తెలుస్తోంది. అలాగే బాగ్దాద్లో మోహరించిన బలగాలనూ ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. భద్రతాపరమైన కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నప్పటికీ.. పెరిగిన ఆయిల్ ధరలు(4 శాతం పెరుగుదల) కారణమై ఉండొచ్చన్న విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. మరోవైపు.. బహ్రయిన్, కువైట్ నుంచి బలగాలను స్వచ్ఛందంగానే వెనక్కి రప్పిస్తున్నట్లు అమెరికా భద్రతా విభాగం(State Deparment) ప్రకటించింది. అయితే ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. చమురు ఉత్పత్తి దేశాలైన ఇరాక్, కువైట్, ఖతార్, బహ్రయిన్, యూఏఈలలో అమెరికా బలగాలు ఇంతకాలం మోహరించి ఉన్నాయి. -
న్యూయార్క్ మేయర్ రేసులో మీరా నాయర్ కుమారుడు
ప్రఖ్యాత సినీ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు, ఇండియన్–అమెరికన్ రాజకీయ నాయకుడు జోహ్రాన్ క్వామి మమ్దానీ అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ మేయర్ పదవికి పోటీ పడుతున్నాడు. ఒడిశాలో జన్మించిన మీరా నాయర్ ‘మీరాబాయి ఫిలిమ్స్’బ్యానర్ కింద పలు చిత్రాలు నిర్మిండడంతోపాట దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. కామసూత్ర, మాన్సూన్ వెడ్డింగ్, సలామ్ బాంబే వంటి చిత్రాలతో ఆమె సంచలనం సృష్టించారు.డెమొక్రటిక్ పార్టీ సభ్యుడైనా ఆమె కుమారుడు మమ్దానీ ప్రస్తుతం న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికలు త్వరలో జరుగబోతున్నాయి. ఈ పదవికి మాజీ గవర్నర్ ఆండ్రూ కౌమో పేరు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తోంది. మరోవైపు ఆయనకు మమ్దానీ గట్టి పోటీనిస్తున్నాడు. నిధుల సేకరణ, నూతన ఆలోచనలు, ఆశయాలతోపాటు టెక్నాలజీని విస్తృతంగా వాడుకుంటూ జనాదరణ పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఆండ్రూ కౌమోను ఓడించడం ఖాయమని ధీమాగా చెబుతున్నాడు. ఒకవేళ మమ్దానీ అనుకున్న లక్ష్యం సాధిస్తే.. న్యూయార్క్ సిటీకి మొట్టమొదటి ముస్లిం మేయర్గా, తొలి ఇండియన్–అమెరికన్ మేయర్గా చరిత్ర సృష్టిస్తాడు. ఎవరీ మమ్దానీ? జోహ్రాన్ మమ్దానీ 1991 అక్టోబర్ 18న ఉగాండాలోని కంపాలాలో జన్మించాడు. ఆయన తండ్రి మహమూద్ మమ్దానీ, తల్లి మీరా నాయర్. మహమూద్ మమ్దానీ ఉగాండాతో ప్రముఖ మార్క్సిస్ట్ పండితుడు. జోహ్రాన్కు ఐదేళ్ల వయసున్నప్పుడు ఆ కుటుంబం దక్షిణాఫ్రియాలోని కేప్టౌన్కు చేరుకుంది. రెండేళ్ల తర్వాత అమెరికాలోని న్యూయార్క్లో స్థిరపడింది. జోహ్రాన్ మమ్దానీకి 2018లో అమెరికా పౌరసత్వం లభించింది. బ్రాంక్స్ హైసూ్కల్ ఆఫ్ సైన్స్తోపాటు బౌడిన్ కాలేజీలో విద్యాభ్యాసం చేశాడు. కాలేజీలో ఉన్నప్పుడు రాజకీయాలపై ఆసక్తి చూపించేవాడు. స్థానికంగా రాజకీయ, సేవ కార్యక్రమాల్లో వాలంటరీగా సేవలందించేవాడు.2017లో డెమొక్రటిక్ సోషలిస్టు ఆఫ్ అమెరికా అనే సంస్థలో చేరాడు. తర్వాత డెమొక్రటిక్ పార్టీ అభ్యరి్థగా 2020, 2021, 2022, 2024లో న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. క్వీన్స్ 36వ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చట్టసభల్లో చురుగ్గా పని చేస్తున్నాడు. 20 బిల్లును ప్రతిపాదించగా, అందులో మూడు బిల్లులు చట్టాలుగా మారాయి. న్యూయార్క్ మేయర్ రేసులో 2024 అక్టోబర్ 23న అడుగుపెట్టాడు. జోహ్రాన్ మమ్దానీలో మంచి కళాకారుడు కూడా ఉన్నాడు. 2019లో ‘నానీ’పేరిట ఒక మ్యూజిక్ వీడియో విడుదల చేశాడు. షియా ముస్లిం మతస్థుడైన మమ్దానీ ఇటీవలే రమా దువాజీని వివాహం చేసుకున్నాడు. ఆమె సిరియాలో జని్మంచారు. పలు పత్రికల్లో చిత్రకారిణిగా పనిచేశారు. మమ్దానీ దంపతులు క్వీన్స్లోని అస్టోరియాలో నివాసం ఉంటున్నారు. పాలస్తీనాకు మద్దతు మమ్దానీ ఎన్నికల అజెండా ప్రజలను ఆకట్టుకుంటోంది. నగరంలో అద్దెలపై ఫ్రీజింగ్ విధిస్తానని, రవాణా, శిశు సంరక్షణ సేవలు ఉచితంగా అందిస్తానని, కనీస వేతనాన్ని 30 డాలర్లకు పెంచుతానని మమ్దామీ హామీ ఇస్తున్నారు. ఇక ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదంలో మమ్దానీ పాలస్తీనాకు బహిరంగంగా మద్దతు పలుకుతున్నాడు. గాజాలో వెంటనే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్ను డిమాండ్ చేస్తున్నారు. అన్ని రకాల వివక్షకు ఆయన బద్ధవ్యతిరేకి. అలాగే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను మమ్దానీ నిశితంగా విమర్శిస్తున్నాడు. ఎన్నికల ప్రచారంలో తన దక్షిణాసియా మూలాలను పదేపదే గుర్తుచేస్తున్నాడు. హిందీ భాషలో ఒక వీడియో విడుదల చేశాడు.ఇందులో బాలీవుడ్ సినిమాలు, డైలాగ్ల ప్రస్తావన ఉంది. బిలియనీర్స్ కే పాస్ ఆల్రెడీ సబ్ కుచ్ హై, అబ్ ఆప్కా టైమ్ ఆయేగా(ధనవంతులకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీ వంతు వస్తుంది) అని ఓటర్లకు చెబుతున్నాడు. ఈ నెల 24న మేయర్ ఎన్నిక జరుగనుంది. ర్యాంక్డ్–చాయిస్ వోటింగ్ సిస్టమ్ ద్వారా మేయర్ను ఎన్నుకుంటున్నారు. అంటే ఓటర్లు తమ ప్రాధాన్యత ప్రకారం ఐదుగురు అభ్యర్థులకు ర్యాంకులు ఇస్తారు. ఈ ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచిన అభ్యర్థికి మేయర్ పదవి లభిస్తుంది.-సాక్షి, నేషనల్ డెస్క్. -
మస్క్ క్షమాపణలపై స్పందించిన ట్రంప్.. ఏమన్నారంటే..
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్లు మళ్లీ దగ్గరకానున్నరనే సంకేతాలు వెలువడుతున్నాయి. కొద్దిరోజుల పాటు ఈ ఇద్దరు స్నేహితులు సోషల్ మీడియాలో పరిస్పరం విమర్శలు చేసుకున్నారు. వీరి వివాదం ఎటువైపునకు దారితీస్తుందోనని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసింది. అయితే ఇంతలో ఎలాన్ మస్క్ ట్రంప్ను క్షమాపణలు కోరుతూ, ట్వీట్ చేయడం ఆసక్తికర పరిణామంగా మారింది. ఎలాన్ మస్క్ అధ్యక్షుడు ట్రంప్ను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్పై ఆయన స్పందించారు. ‘న్యూయార్క్ పోస్ట్’తో జరిగిన ఫోన్ ఇంటర్వ్యూలో మస్క్ క్షమాపణలపై ట్రంప్ వ్యాఖ్యానించారు. తన భాషలో కఠినమైన పదాలు ఉన్నప్పటికీ, తనకు కఠినమైన భావాలు లేవని ట్రంప్ అన్నారు. మస్క్ తనను క్షమాపణలు కోరడం చాలా బాగుందని భావిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు. బడ్జెట్ బిల్లుపై మస్క్ పలు విమర్శలు చేశారని, అందుకు అతనిని నిందించనని కూడా ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో కొంత నిరాశకు గురయ్యానని కూడా అన్నారు.ట్రంప్కు మాజీ సహాయకుడు ఎలోన్ మస్క్ గత వారంలో ట్రంప్పై విమర్శలు గుప్పిస్తూ, సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టారు. దీంతో వీరి మధ్య వైరం పెరిగింది. ఆ తరువాత ట్రంప్ తన రాజకీయ విజయంలో మస్క్ పాత్రను తక్కువ చేస్తూ స్పందించారు. దీనికి ప్రతిస్పందనగా 2024 ఎన్నికల్లో ట్రంప్ తన మద్దతు కారణంగానే విజయం సాధించారని మస్క్ పేర్కొన్నారు. తాజాగా మస్క్ తాను గతంలో ట్రంప్పై ఆరోపణలు చేస్తూ, చేసిన పోస్టులలో కొన్నింటిని తొలగించి క్షమాపణలు కోరారు. న్యూయార్క్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్తో ప్రైవేట్గా మాట్లాడిన తర్వాత మస్క్ అధ్యక్షుడు ట్రంప్ను క్షమాపణలు కోరారు. సోమవారం మస్క్ వ్యక్తిగతంగా ట్రంప్ను కలిసినట్లు కొన్ని వార్తలు వెలువడ్డాయి. ఆ సమయంలో ట్రంప్.. ఎలాన్ మస్క్ క్షమాపణలను అంగీకరించారని సమాచారం. అయితే వారి మునుపటి సంబంధాలను పునరుద్ధరించేందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నారో లేదో స్పష్టం చేయలేదని తెలుస్తోంది.ఇది కూడా చదవండి: Bangladesh: ఠాగూర్ పూర్వీకుల ఇల్లు ధ్వంసం -
హసీనా ఎఫెక్ట్.. మోదీ అందుకు అంగీకరించలేదు: యూనస్ అసహనం
ఢాకా: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. తమ డిమాండ్ను అంగీకరించలేదని యూనస్ చెప్పుకొచ్చారు. షేక్ హసీనా బంగ్లా వ్యతిరేక విధానాలను పాటిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు.లండన్లోని చాఠమ్ హౌస్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మహమ్మద్ యూనస్ మాట్లాడారు. కొన్ని నెలల క్రితం బిమ్స్టెక్ సదస్సులో భాగంగా మోదీతో భేటీ అయిన యూనస్.. భారత ప్రధానితో నాటి సంభాషణను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్బంగా యూనస్..‘హసీనాకు భారత్లో ఆశ్రయం కల్పించడంపై నేను మాట్లాడను. అది మీ విధానపరమైన నిర్ణయం. కానీ బంగ్లాదేశ్ ప్రజలను రెచ్చగొట్టేలా ఆమె ఆన్లైన్లో ప్రసంగాలు చేస్తున్నారు. దానివల్ల మా దేశంలో ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ విషయంలో మీరు (భారత ప్రధానిని ఉద్దేశిస్తూ) జోక్యం చేసుకోండి. అలాంటి ప్రకటనలు, ప్రసంగాలు చేయకుండా ఆమెను అడ్డుకోండి’ అని మోదీని కోరినట్లు యూనస్ తెలిపారు. దీనికి మోదీ బదులిస్తూ.. ‘అది సోషల్ మీడియా. దాన్ని నియంత్రించడం సాధ్యం కాదు’ అని చెప్పినట్లు వెల్లడించారు.ఇదిలా ఉండగా.. విద్యార్థుల ఉద్యమంతో పదవి కోల్పోయిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో షేక్ హసీనా.. యూనస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి సంచలన ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ను ఆయన అమెరికాకు అమ్మేశాడు. యూనస్ ఉగ్రవాదుల సహాయంతో అధికారాన్ని ఆక్రమించారు. అంతర్జాతీయంగా నిషేధించిన తీవ్రవాద సంస్థలే ఆయనకు బలంగా నిలిచాయి. నా ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రజలను వీరి నుంచి రక్షించేందుకు కఠిన చర్యలు తీసుకుంది. ఒక్క ఉగ్రదాడి తరువాతే అనేక మందిని అరెస్టు చేశాం. ఇప్పుడు జైళ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అందరినీ విడుదల చేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్ మళ్లీ తీవ్రవాదుల పాలనలోకి వెళ్ళింది. యూనస్ను ‘మిలిటెంట్ నేత’గా పేర్కొంటూ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించడం చట్టవిరుద్దం.. రాజ్యాంగ వ్యతిరేకం అంటూ ఘాటు విమర్శలు చేశారు.గొప్పదైన మా బంగ్లా జాతికి ఉన్న రాజ్యాంగం.. అది ఎన్నో ఏళ్ల పోరాటం, విమోచన యుద్ధం ద్వారా లభించింది.. అక్రమంగా అధికారాన్ని ఆక్రమించిన ఈ మిలిటెంట్ నేతకు ఆ రాజ్యాంగాన్ని తాకే హక్కును ఎవరు ఇచ్చారు? ఆయనకు ప్రజల మద్దతు లేదు, రాజ్యాంగపరమైన ఆధారమూ లేదు. ఆయన ఉన్న స్థానమైన 'చీఫ్ అడ్వైజర్' అనే పదవికి కూడా ఎలాంటి చట్టపరమైన ప్రాతినిధ్యం లేదు.. అది రాజ్యాంగంలోనే లేదు. అయితే, పార్లమెంట్ లేకుండా ఆయన చట్టాలను ఎలా మార్చగలరు? ఇది పూర్తిగా అక్రమం. అవామీ లీగ్ను నిషేధించారు అని విరుచుకుపడ్డారు. -
భారత్కు కొత్త టెన్షన్!.. పాక్కు అండగా అమెరికా భారీ ప్లాన్?
వాషింగ్టన్: భారత్, పాకిస్తాన్ విషయంలో అగ్ర రాజ్యం అమెరికా.. మరోసారి తన వక్రబుద్దిని చాటుకుంది. అమెరికాకు భారత్ మిత్ర దేశం అంటూనే.. వెనుక మాత్రం గోతులు తీసే ప్లాన్ చేస్తోంది. ఓవైపు పాక్ ఉగ్రవాదంపై భారత్ ప్రపంచ దేశాలకు వివరాలను వెల్లడిస్తుంటే.. అమెరికా మాత్రం దాయాదికి మద్దతు పలికింది. పాకిస్తాన్పై అమెరికా అధికారి ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది.అమెరికా సెంట్రల్ కమాండ్(సెంట్కామ్) కమాండర్ జనరల్ మైఖేల్ కురిల్లా తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో పాకిస్తాన్ ఓ అసాధారణ భాగస్వామి అంటూ ప్రశంసించారు. ఐసిస్, ఖొరాసన్కు వ్యతిరేకంగా సాగుతున్న ఆపరేషన్లో పాక్ పాత్రను ఆయన కొనియాడారు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పాత్ర గురించి వివరించారు. అందుకే అమెరికా భారత్తోపాటు పాకిస్తాన్తో సత్సంబంధాలను కలిగి ఉండాలని నొక్కి చెప్పారు. భారత్తో అమెరికా సంబంధం ఉన్నంత మాత్రాన పాకిస్తాన్తో సంబంధం ఉండకూడదని తాను అనుకోవడం లేదని ప్యానెల్ సభ్యుల ముందు వెల్లడించారు. తమకు భారత్, పాకిస్తాన్ రెండు దేశాలతోనూ సంబంధాలు అవసరమని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి."Pakistan has been a phenomenal counter-terrorism partner for America," argues General Michael Kurilla pic.twitter.com/VOzTy8vVli— Shashank Mattoo (@MattooShashank) June 11, 2025కాగా, పహల్గాం ఉగ్ర దాడి అనంతరం పాకిస్తాన్ను ఏకాకిని చేసేందుకు భారత్ ప్రపంచ దేశాల మద్దతును కూడగడుతున్న సమయంలో అమెరికా కమాండర్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం భారత్ను ఆగ్రహానికి గురి చేసే అవకాశం ఉంది. ఇది దౌత్యపరమైన భంగపాటు అవునో కాదో చెప్పాలని ప్రధాని మోదీని కాంగ్రెస్ ప్రశ్నించింది. అమెరికా తీరు సరికాదంటూ పలువురు మండిపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ అలర్ట్ అయినట్టు తెలుస్తోంది."Ties with India cannot cost ties with Pakistan" General Michael Kurilla commander of United States Central Command.Seems the news about Indian Missiles ripping US’s Fissile materials and Nuclear Warhead at Nur Khan Air Base is proving to be True. pic.twitter.com/Ffp7lVdltS— BRADDY (@braddy_Codie05) June 11, 2025అమెరికా భారీ స్కెచ్..ఈ నెల 14న జరిగే తమ దేశ సైన్యం 250వ వార్షికోత్సవానికి హాజరు కావాలని పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసిమ్ మునీర్కు అమెరికా ఆహ్వానం పంపింది. అదే రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 79వ పుట్టినరోజు కూడా. ఈ నెల 12న మునీర్ వాషింగ్టన్కు చేరుకుంటారని సీఎన్-న్యూస్ 18 తెలిపింది. ఈ సందర్భంగా ఉగ్రవాదుల నిరోధానికి చర్యలు తీసుకోవాలని అమెరికా పాక్ను కోరనుంది. అయితే, అమెరికా ఆర్మీ డేకు పాక్ ఛీఫ్ను పిలవడం వెనుక అమెరికా ఉద్దేశమేంటనే చర్చ నడుస్తోంది. మొన్నటి వరకు తమ మద్దతు భారత్కే అంటూ చెప్పిన అమెరికా ఇప్పుడు ఇలా ప్లేట్ ఫిరాయించడం వెనుక ఉద్దేశం ఏంటో తెలియడం లేదు. అయితే, దీని వెనుక అగ్రరాజ్యం పెద్ద ప్లాన్ వేసిందని చెబుతున్నారు. దీంతో పాటుగా చైనా, పాక్ మధ్య పెరుగుతున్న ఆర్థిక, సైనిక సంబంధాలను కూడా దెబ్బ తీయాలని అమెరికా భావిస్తున్నట్టు తెలుస్తోంది. -
Bangladesh: ఠాగూర్ పూర్వీకుల ఇల్లు ధ్వంసం
ఢాకా : బంగ్లాదేశ్లో మరో విధ్వంసం చోటుచేసుకుంది. సిరాజ్గంజ్ జిల్లాలోని రవీంద్రనాథ్ ఠాగూర్ మెమోరియల్ మ్యూజియం కచ్చరిబారిలో ఒక సందర్శకుడికి, మ్యూజియం ఉద్యోగికి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ దరిమిలా స్థానికులు మ్యూజియంను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మ్యూజియంను తాత్కాలికంగా మూసివేశారు.సందర్శకుడిని బంధించి..స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం రవీంద్ర కచ్చరిబారికి ఒక సందర్శకుడు తన కుటుంబంతో పాటు వచ్చాడు. మోటారుసైకిల్ పార్కింగ్ ఫీజు విషయంలో ఆ సందర్శకుడికి, సిబ్బందికి మధ్య వివాదం చెలరేగింది. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనలో సందర్శకుడిని కార్యాలయ గదిలో బంధించి, మ్యూజియం సిబ్బంది అతనిపై దాడి చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.దర్యాప్తుకు ప్రత్యేక కమిటీఇది స్థానికులలో ఆగ్రహానికి కారణమయ్యింది. వారంతా దీనిని నిరసిస్తూ మానవహారంగా ఏర్పడ్డారు. తర్వాత వారు కచ్చరిబారి ఆడిటోరియంలోకి చొరబడి ధ్వంసం చేశారు. సంస్థ డైరెక్టర్పై దాడి చేసి, గాయపరిచారు. ఈ ఘటన నేపధ్యంలో ఈ దాడిపై దర్యాప్తు చేయడానికి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఐదు రోజులలోగా కమిటీ దీనిపై నివేదిక సమర్పించాల్సి ఉంది. కచ్చరిబారి అధికారి హబీబుర్ రెహమాన్ మీడియాతో మాట్లాడుతూ అనివార్య పరిస్థితుల కారణంగా మ్యూజియంను తాత్కాలికంగా మూసివేశామన్నారు. బంగ్లాదేశ్లోని రాజ్షాహి డివిజన్లో గల కచ్చరిబారి రవీంద్రనాథ్ ఠాగూర్ కుటుంబానికి చెందిన నివాస భవనం. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ ఇంటిలో చాలాకాలం ఉన్నారు. ఇక్కడే పలు సాహిత్య రచనలు చేశారు. ఈ భవనం సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా గుర్తింపుపొందింది. దీనిని మ్యూజియంగా మలచారు.ఇది కూడా చదవండి: మరో ‘హనీమూన్ కేసు’.. ఐస్ క్రీం ఫ్రీజర్లో మృతదేహం.. -
యూఎస్లో లాటిన్ రగడ
వలసదారుల రగడతో అమెరికా భగ్గుమంటోంది. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపే క్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన చర్యలు వివాదాలకు దారితీస్తున్నాయి. మెక్సికో వంటి లాటిన్ అమెరికా దేశాల వలసదారులు వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్రమ వలసదారులనే అభియోగాలతో లాస్ ఏంజెలెస్లో గత శుక్రవారం పదుల సంఖ్యలో లాటిన్ ప్రజలను ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ (ఐసీఈ) విభాగం అరెస్టు చేసింది. వాటిని వ్యతిరేకిస్తూ మొదలైన ఆందోళనలు చూస్తుండగానే తీవ్ర రూపు దాలుస్తున్నాయి. లాటిన్లు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసనలకు విధ్వంసానికి పాల్పడుతున్నారు. జాతీయ బలగాల మోహరింపు, మూకుమ్మడి అరెస్టులతో కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. అల్లర్లు ఇతర నగరాలకూ విస్తరిస్తుండటంతో లాస్ ఏంజెలెస్లో తాజాగా కర్ఫ్యూ విధించాల్సి వచి్చంది. ఈ నేపథ్యంలో అమెరికాలో మొత్తం అక్రమ వలసదారులు, వారిలో లాటిన్ అమెరికన్లు ఎందరన్న దానిపై చర్చ జరుగుతోంది. అంతటా మెక్సికన్ జెండాలే! లాస్ ఏంజెలెస్ అల్లర్లలో పాల్గొంటున్న నిరసనకారుల్లో ఎవరి చేతుల్లో చూసినా మెక్సికో జెండాలే కన్పిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలవారికి కలల గమ్యస్థానం అమెరికా. దాంతో అనేక దేశాల నుంచి వలసదారులు అక్కడికి సమక్రమ, అక్రమ మార్గాల్లో పోటెత్తుతూ వచ్చారు. 2022 గణాంకాల ప్రకారమే అమెరికాలో కోటి 10 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులున్నారు. వారిలో ఏకంగా 77 శాతం, అంటే 79 లక్షల పై చిలుకు లాటిన్ అమెరికన్లే. వారిలోనూ ఏకంగా 41 లక్షలతో మెక్సికో తొలిస్థానంలో ఉంది. సెంట్రల్ అమెరికా దేశాల వారు 21 లక్షలు, దక్షిణ అమెరికా నుంచి 10 లక్షలు, కరీబియన్ దీవుల నుంచి 7.3 లక్షల మంది ఉన్నారు. మరోవైపు మూడేళ్లుగా అమెరికాకు వెళ్తున్న శరణార్థుల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. 2016లో 85 వేలుగా నమో దైన శరణార్థులు 2021 నాటికి 11 వేలకు తగ్గారు. కానీ 2024లో ఏకంగా లక్ష మంది పొట్ట చేతపట్టుకుని అమెరికాలో ప్రవేశించారు. వీరిలో ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల వారి సంఖ్యే ఎక్కువ. – సాక్షి, నేషనల్ డెస్క్ -
న్యూయార్క్ మేయర్ రేసులో మీరా నాయర్ కుమారుడు
ప్రఖ్యాత సినీ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు, ఇండియన్–అమెరికన్ రాజకీయ నాయకుడు జోహ్రాన్ క్వామి మమ్దానీ అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ మేయర్ పదవికి పోటీ పడుతున్నాడు. ఒడిశాలో జన్మించిన మీరా నాయర్ ‘మీరాబాయి ఫిలిమ్స్’బ్యానర్ కింద పలు చిత్రాలు నిర్మిండడంతోపాట దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. కామసూత్ర, మాన్సూన్ వెడ్డింగ్, సలామ్ బాంబే వంటి చిత్రాలతో ఆమె సంచలనం సృష్టించారు. డెమొక్రటిక్ పార్టీ సభ్యుడైనా ఆమె కుమారుడు మమ్దానీ ప్రస్తుతం న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికలు త్వరలో జరుగబోతున్నాయి. ఈ పదవికి మాజీ గవర్నర్ ఆండ్రూ కౌమో పేరు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తోంది. మరోవైపు ఆయనకు మమ్దానీ గట్టి పోటీనిస్తున్నాడు. నిధుల సేకరణ, నూతన ఆలోచనలు, ఆశయాలతోపాటు టెక్నాలజీని విస్తృతంగా వాడుకుంటూ జనాదరణ పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఆండ్రూ కౌమోను ఓడించడం ఖాయమని ధీమాగా చెబుతున్నాడు. ఒకవేళ మమ్దానీ అనుకున్న లక్ష్యం సాధిస్తే.. న్యూయార్క్ సిటీకి మొట్టమొదటి ముస్లిం మేయర్గా, తొలి ఇండియన్–అమెరికన్ మేయర్గా చరిత్ర సృష్టిస్తాడు. ఎవరీ మమ్దానీ? జోహ్రాన్ మమ్దానీ 1991 అక్టోబర్ 18న ఉగాండాలోని కంపాలాలో జన్మించాడు. ఆయన తండ్రి మహమూద్ మమ్దానీ, తల్లి మీరా నాయర్. మహమూద్ మమ్దానీ ఉగాండాతో ప్రముఖ మార్క్సిస్ట్ పండితుడు. జోహ్రాన్కు ఐదేళ్ల వయసున్నప్పుడు ఆ కుటుంబం దక్షిణాఫ్రియాలోని కేప్టౌన్కు చేరుకుంది. రెండేళ్ల తర్వాత అమెరికాలోని న్యూయార్క్లో స్థిరపడింది. జోహ్రాన్ మమ్దానీకి 2018లో అమెరికా పౌరసత్వం లభించింది. బ్రాంక్స్ హైసూ్కల్ ఆఫ్ సైన్స్తోపాటు బౌడిన్ కాలేజీలో విద్యాభ్యాసం చేశాడు. కాలేజీలో ఉన్నప్పుడు రాజకీయాలపై ఆసక్తి చూపించేవాడు. స్థానికంగా రాజకీయ, సేవ కార్యక్రమాల్లో వాలంటరీగా సేవలందించేవాడు. 2017లో డెమొక్రటిక్ సోషలిస్టు ఆఫ్ అమెరికా అనే సంస్థలో చేరాడు. తర్వాత డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా 2020, 2021, 2022, 2024లో న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. క్వీన్స్ 36వ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చట్టసభల్లో చురుగ్గా పని చేస్తున్నాడు. 20 బిల్లును ప్రతిపాదించగా, అందులో మూడు బిల్లులు చట్టాలుగా మారాయి. న్యూయార్క్ మేయర్ రేసులో 2024 అక్టోబర్ 23న అడుగుపెట్టాడు. జోహ్రాన్ మమ్దానీలో మంచి కళాకారుడు కూడా ఉన్నాడు. 2019లో ‘నానీ’పేరిట ఒక మ్యూజిక్ వీడియో విడుదల చేశాడు. షియా ముస్లిం మతస్థుడైన మమ్దానీ ఇటీవలే రమా దువాజీని వివాహం చేసుకున్నాడు. ఆమె సిరియాలో జన్మించారు. పలు పత్రికల్లో చిత్రకారిణిగా పనిచేశారు. మమ్దానీ దంపతులు క్వీన్స్లోని అస్టోరియాలో నివాసం ఉంటున్నారు. పాలస్తీనాకు మద్దతు మమ్దానీ ఎన్నికల అజెండా ప్రజలను ఆకట్టుకుంటోంది. నగరంలో అద్దెలపై ఫ్రీజింగ్ విధిస్తానని, రవాణా, శిశు సంరక్షణ సేవలు ఉచితంగా అందిస్తానని, కనీస వేతనాన్ని 30 డాలర్లకు పెంచుతానని మమ్దామీ హామీ ఇస్తున్నారు. ఇక ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదంలో మమ్దానీ పాలస్తీనాకు బహిరంగంగా మద్దతు పలుకుతున్నాడు. గాజాలో వెంటనే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్ను డిమాండ్ చేస్తున్నారు. అన్ని రకాల వివక్షకు ఆయన బద్ధవ్యతిరేకి. అలాగే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను మమ్దానీ నిశితంగా విమర్శిస్తున్నాడు. ఎన్నికల ప్రచారంలో తన దక్షిణాసియా మూలాలను పదేపదే గుర్తుచేస్తున్నాడు. హిందీ భాషలో ఒక వీడియో విడుదల చేశాడు. ఇందులో బాలీవుడ్ సినిమాలు, డైలాగ్ల ప్రస్తావన ఉంది. బిలియనీర్స్ కే పాస్ ఆల్రెడీ సబ్ కుచ్ హై, అబ్ ఆప్కా టైమ్ ఆయేగా(ధనవంతులకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీ వంతు వస్తుంది) అని ఓటర్లకు చెబుతున్నాడు. ఈ నెల 24న మేయర్ ఎన్నిక జరుగనుంది. ర్యాంక్డ్–చాయిస్ వోటింగ్ సిస్టమ్ ద్వారా మేయర్ను ఎన్నుకుంటున్నారు. అంటే ఓటర్లు తమ ప్రాధాన్యత ప్రకారం ఐదుగురు అభ్యర్థులకు ర్యాంకులు ఇస్తారు. ఈ ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచిన అభ్యర్థికి మేయర్ పదవి లభిస్తుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దురహంకారంతో తప్పులు చేశాడు
వాషింగ్టన్: మూడు సంవత్సరాల క్రితం పంజాబ్కు చెందిన యువ పాప్సింగర్ సిద్ధూ మూసేవాలాపైకి తూటాల వర్షం కురిపించి చంపేసిన గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ ఆచూకీ ఇంతవరకు తెలీదు. కానీ బీబీసీ వార్తాసంస్థ ఎట్టకేలకు తాజాగా అతడిని ఇంటర్వ్యూ చేసింది. మూసేవాలాను అంతమొందించడానికి గల కారణాలను రాబట్టింది. దీనిపై గోల్డీబ్రార్ సూటిగా, సుదీర్ఘంగ మాట్లాడారు. ‘‘ దురహంకారంతో సిద్ధూ క్షమించలేనంతగా కొన్ని తప్పులు చేశాడు. ఇక అతడిని చంపడం మినహా మాకు మరో మార్గం కనిపించలేదు. చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే. అది అతడైనాసరే మేమైనాసరే’’ అని గోల్డీ అన్నాడు. కెనడాలో ఉంటూ గోల్డీబ్రార్ ఈ హత్యకు పథకరచన చేసినట్లు తెలుస్తోంది. పంజాబ్కు చెందిన కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ కలిసి ఎన్నో నేరాలు చేశారు. ప్రస్తుతం బిష్ణోయ్ జైలులో ఉన్నాడు. ‘‘సిద్ధూ మ్యూజిక్ అంటే బిష్ణోయ్కు ఇష్టం. 2018 ఏడాది తొలినాళ్లలో సిద్ధూ కెనడాలో ఇంజనీరింగ్ చదవడానికి వచ్చి మ్యూజిక్పై మమకారంతో మంచి పాప్సింగర్గా ఎదిగాడు. అప్పుడే సిద్ధూకు బిష్ణోయ్తో పరియం ఏర్పడింది. రోజూ గుడ్ మార్నింగ్, గుడ్నైట్ మెసేజ్లు బిష్ణోయ్కు సిద్ధూ చేసేవాడు. సిద్ధూ భారత్కు వచ్చిన తర్వాతే భేదాభిప్రాయాలు మొదలయ్యాయి’’ అని అన్నాడు.కబడ్డీతో మొదలై...‘‘మా సొంత రాష్ట్రంలో ప్రఖ్యాత కబడ్డీ ఆటల పోటీలకు సిద్దూ ఆర్థికసాయం చేశాడు. వాస్తవానికి ఆ పోటీలను బిష్ణోయ్ బద్ధశత్రువులైన బామ్బిహా గ్యాంగ్ నిర్వహించింది. మా శత్రువులకు చెందిన గ్రామం నుంచి బామ్బిహా గ్యాంగ్కు చెందిన ఆటగాళ్లు వచ్చి ఆనాడు పోటీల్లో పాల్గొన్నారు. శత్రువులు నిర్వహించిన పోటీలకు సిద్ధూ స్పాన్సర్గా ఉండటం బిష్ణోయ్, అతని గ్యాంగ్కు అస్సలు నచ్చలేదు. అయితే బిష్ణోయ్ గ్యాంగ్లో సభ్యుడైన విక్కీ మిధుఖేరా అనే వ్యక్తి తర్వాత బిష్ణోయ్, సిద్దూల మధ్య సయోధ్య కుదిర్చాడు. అయితే ఈ విక్కీని 2021 ఆగస్ట్లో మొహాలీ సిటీలో కొందరు కాల్చిచంపారు. విక్కీని చంపింది తామేనని బామ్బిహా గ్యాంగ్ ప్రకటించుకుంది. సిద్ధూ స్నేహితుడు, అతని ఒకప్పటి మేనేజర్ శగన్ప్రీత్ సింగ్ పేరును విక్కీ హత్య కేసు చార్జ్షీటులో పోలీసులు ప్రస్తావించారు. దీంతో విక్కీ హత్య వెనుక సిద్ధూ హస్తముందని మేం భావించాం. విక్కీని చంపేందుకు హంతకులకు శగన్ప్రీత్ అన్ని రకాలుగా సాయంచేశాడు. తర్వాత శగన్ ఆస్ట్రేలియాకు పారిపోయాడు. ఆ తర్వాత కూడా శగన్తో సిద్దూ స్నేహం కొనసాగింది. వద్దని మేం వారించినా వినలేదు. దాంతో సిద్ధూతో మా శత్రుత్వం అమాంతం పెరిగిపోయింది. రాజకీయనేతలతో, అధికారంలో ఉన్న పార్టీలతో సిద్ధూకు సత్సంబంధాలున్నాయి. మా శత్రువులు బలోపేతం కావడానికి సిద్ధూ తన రాజకీయ పలుకుబడి, డబ్బును ఉపయోగించాడు. సిద్ధూ తప్పులకు శిక్ష పడాలని మేం భావించాం. కేసు నమోదుచేసి జైళ్లో పడేయాలని వాదించినా ఎవ్వరూ పట్టించుకోలేదు. పద్దతిగా చెబితే విననప్పుడు తూటాల శబ్దాలైనా వింటారేమో. అందుకే తుపాకీ మోత మోగించాం’’ అని గోల్డీబ్రార్ చెప్పాడు. భారత్లో చట్టాలు ఉన్నప్పుడు చట్టాన్ని మీరెందుకు మీ చేతుల్లోకి తీసుకున్నారు? అని ప్రశ్నించగా.. ‘‘ చట్టం. న్యాయం. ఇలాంటివి భారత్లో లేవు. కేవలం శక్తివంతమైన వ్యక్తులకు మాత్రమే అవి దక్కుతాయి. సాధారణ ప్రజలకు అవి అందని ద్రాక్షే’’ అని అన్నాడు. ‘‘ చనిపోయిన విక్కీ సోదరుడు రాజకీయాల్లో ఉండి కూడా తన సోదరుడిని హత్యచేసిన వాళ్లకు శిక్షపడేలా చేయలేకపోయాడు. కావాలంటే అతడితో మాట్లాడి చూడండి అతనెంతగా న్యాయబద్ధంగా పోరాడాడో. చనిపోయిన విక్కీ కోసం నేను ఈ పనిచేశా. సిద్దూను అంతంచేసినందుకు నాకు కాస్తంత పశ్చాత్తాపం కూడా లేదు’’ అని అన్నాడు. రెండు గ్యాంగ్ల మధ్య తగాదాలో సిద్ధూ మృతికి కారణమని తెలిసినా స్పష్టమైన కారణాలు ఇంతవరకూ ఎవరూ చెప్పలేదు. తొలిసారిగా గోల్డీబ్రారే ఈ అంశాలు వెల్లడించారని బీబీసీ తన కథనంలో పేర్కొంది. -
చైనాతో డీల్: ట్రంప్
బీజింగ్/వాషింగ్టన్: అమెరికా, చైనా నడుమ రెండు నెలల వాణిజ్య యుద్ధానికి ఇక తెరపడ్డట్టే. ఇరుదేశాల మధ్య వర్తక ఒప్పదం ఖరారైనట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ‘‘లండన్లో రెండు రోజుల సంప్రదింపుల అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇక నేను, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తుది ఆమోదముద్ర వేయడమే తరువాయి’’ అని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ట్రూత్సోషల్లో ట్రంప్ పోస్ట్ చేశారు. ఇకపై చైనా దిగుమతులపై అమెరికా 55 శాతం సుంకాలు విధిస్తుంది. అమెరికా ఉత్పత్తులపై చైనా 10 శాతం టారిఫ్లు వసూలు చేస్తుంది’’ అని వివరించారు. విభేదాలు ముదిరిన నేపథ్యంలో అమెరికాకు మ్యాగ్నెట్లు మొదలుకుని 17 రకాల అరుదైన ఖనిజాలు తదితరాల ఎగుమతులపై నిషేధాన్ని కూడా చైనా ఎత్తేయనుందని తెలిపారు. ‘‘బదులుగా చైనాకు కూడా గత ఒప్పందాల మేరకు అన్ని విషయాల్లోనూ తలుపులు తెరుస్తాం. చైనా విద్యార్థులను అమెరికా కాలేజీలు, యూనివర్సిటీలు, ఇతర విద్యా సంస్థల్లోకి ఎప్పట్లాగే సాదరంగా ఆహ్వానిస్తాం’’ అని ప్రకటించారు. ‘‘ప్రస్తుతం అమెరికా, చైనా మధ్య సంబంధాలు అద్భుతంగా ఉన్నాయి. ఇరుదేశాలకూ లాభదాయక రీతిలో ఒప్పందం కుదిరింది’’ అంటూ హర్షం వెలిబు చ్చారు. అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచంలో అందుబాటులో ఉన్న మొత్తం అరుదైన ఖనిజ నిల్వల్లో 61 శాతం, ఉత్పత్తిలో ఏకంగా 91 శాతం వాటా చైనాదే. -
జననాల తగ్గుదల వరమా.. శాపమా?
ప్రపంచంలో మరే దేశానికి లేనంతటి యువశక్తి భారత్ సొంతం. మొత్తం జనాభాలోనూ చైనాను అధిగమించి ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచాం. అయితే ప్రపంచవ్యాప్త ట్రెండుకు అనుగుణంగా భారత్లో కూడా జననాల రేటు భారీగా తగ్గుముఖం పడుతూ వస్తోంది. జనాభా పెరుగుదల స్థిరంగా కొనసాగాలంటే జననాల (టీఎఫ్ఆర్–టోటల్ ఫెర్టిలిటీ) రేటు కనీసం 2.1 ఉండాలి. అంటే ప్రతి మహిళ కనీసం ఇద్దరిని కనాలన్నమాట. దీన్ని భర్తీ రేటుగా పిలుస్తారు. కానీ భారత్లో టీఎఫ్ఆర్ ఏకంగా 1.9కి పడిపోయిందని ‘సంతాన సంక్షోభం’ పేరిట ఐక్యరాజ్యసమితి జనాభా కార్యకలాపాల నిధి (యూఎన్ఎఫ్పీఏ) విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. దాంతో జననాల రేటు తగ్గుదల ప్రభావం మన దేశంపై అంతిమంగా ఎలా ఉండనుందన్న చర్చ జోరందుకుంది.ఇదీ పరిస్థితి!1.9 టీఎఫ్ఆర్ కారణంగా భారత్లో జనాభా పెరుగుదల నానాటికీ తగ్గి 40 ఏళ్లకు ఆగిపోతుందని యూఎన్ఎఫ్పీఏ అంచనా వేసింది. అప్పటికి దేశ జనాభా 170 కోట్లకు చేరి అక్కడి నుంచి తగ్గుముఖం పడుతుందని పేర్కొంది. కానీ భారత్లో టీఎఫ్ఆర్ శరవేగంగా 1.29కు పడిపోతుందని గతేడాది లాన్సెట్ జరిగిన అధ్యయనం శాస్త్రీయంగా అంచనా వేసింది. అదే జరిగితే దేశ జనాభాలో తగ్గుదల 40 ఏళ్లకంటే చాలా ముందే మొదలయ్యే వీలుంది. 1950ల్లో ఒక్కో భారత మహిళ సగటున ఏకంగా ఆరుగురిని కనేది! 1980ల నాటికి అది 4.6కు తగ్గింది. అక్కడినుంచి ఇద్దరు పిల్లలు చాలనే పరిస్థితికి రావడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతగానో శ్రమించాల్సి వచ్చింది. చిన్న కుటుంబాలు పరిపాటిగా మారిపోయాయి. మహిళల ఆర్థిక స్వాతంత్య్రం పెరిగిన కొద్దీ వారు కనే పిల్లల సంఖ్య మరింతగా తగ్గుతూ వస్తోంది. ఎక్కువమందిని కని కెరీర్ను పణంగా పెట్టేందుకు వారు ఇష్టపడటం లేదు. పిల్లల పెంపకంలో వారికి భర్త మద్దతు లేకపోవడమూ దీనికి కారణమే.ఆందోళన అక్కర్లేదు!జననాల రేటు (టీఎఫ్ఆర్) తగ్గితే జనాభాపరంగా చాలా మార్పులు చోటుచేసుకుంటా యి. ముఖ్యంగా యువ శ్రామిక శక్తి క్రమంగా తగ్గిపోతుంది. వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. ‘‘2050 నాటికి భారత జనాభాలో వృద్ధుల సంఖ్య ఐదో వంతుకు చేరుతుంది. చైనాది ప్రస్తుతం ఇదే పరిస్థితి. ఒకే సంతానం నిబంధనను దశాబ్దాలుగా కఠినంగా అమలు చేయడమే అందుకు కారణం’’ అని జనాభా నిపుణులు చెబుతున్నారు. ‘‘జనాభా పెరుగుదలను బాగా తగ్గించిన దక్షిణాది రాష్ట్రాలన్నీ దాని పర్యవసానాలను ఇప్పటికే అనుభవిస్తున్నాయి. మొత్తం 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో టీఎఫ్ఆర్ ఇప్పటికే 2.1 కంటే చాలా తక్కువకు పడిపోయింది. బిహార్ (3), మేఘాలయ (2.9), ఉత్తరప్రదేశ్ (2.7) వంటివి మాత్రమే ఇందుకు మినహాయింపు’’ అని ఇంటర్నేషనల్ ఇన్స్టి ట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ డెమోగ్రఫీ ప్రొఫెసర్ శ్రీనివాస్ గోలి వివరించారు. ‘‘అంతమాత్రాన టీఎఫ్ఆర్ తగ్గుదలను చూసి ఇప్పటికిప్పుడు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. దీనివల్ల కార్మిక శక్తి భారీగా తగ్గుతుందన్నది అపోహ మాత్రమే. నైపుణ్యాలను పెంపొందించుకోవడం, ప్రాంతాల మధ్య వలసలను మరింతగా ప్రోత్సహించడం ద్వారా సమస్యను సులువుగా అధిగమించవచ్చు’’ అని అభిప్రాయపడ్డారు. అయితే వృద్ధుల సంఖ్య పెరుగుదల ఒక్కటే మున్ముందు భారత్కు సమస్యగా మారే ఆస్కారముందని ఆయన అంచనా వేశారు. ‘‘వయోపరమైన అంతరం నానాటికీ పెరిగిపోయి చివరికి పెద్దవాళ్ల ఆలనాపాలనా చూసే వారసుల సంఖ్య తగ్గిపోతుంది. ఆ పరిస్థితుల్లో వృద్ధుల సంరక్షణకు అవసరమైన వసతులు, ప్రభుత్వపరమైన సౌకర్యాలు మన దగ్గర బాగా తక్కువే’’ అని గుర్తు చేశారు. 60–75 ఏళ్ల వయసు వారికి ఇప్పటిమాదిరిగా తగిన ఉపాధి అవకాశాలు కూడా మున్ముందు సవాలుగానే మారవచ్చని అహ్మదాబాద్లోని ఎల్జే వర్సిటీ ప్రొఫెసర్ అమితాబ్ కుందు అభిప్రాయపడ్డారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
లూటీ.. విధ్వంసం.. కర్ఫ్యూ
లాస్ ఏంజెలెస్: అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరంలో సరైన పత్రాలులేని వలసదారుల అరెస్ట్లతో మొదలైన ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చాయి. మంగళవారం రాత్రి ఆందోళనకారులు వేల సంఖ్యలో పాల్గొని తమ ఉద్యమాన్ని మరింత ఉధృతంచేశారు. అయితే దీనిని అదునుగా చూసుకుని కొందరు దుండగులు ముసుగులు ధరించి లాస్ఏంజెలెస్ డౌన్టౌన్లో లూటీలకు తెరలేపారు. యాపిల్ ఐఫోన్ స్టోర్సహా పలు దుకాణాలపై దాడులు చేసి లూటీలు చేశారు. విలువైన వస్తువులను అందినకాడిని దోచుకెళ్లారు. ఉద్యమంవేళ యథేచ్ఛగా లూటీలు, విధ్వంసం జరగడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. దుకాణ సముదాయాల నుంచి పారిపోతున్న ముసుగు ధరించిన దుండగులను అరెస్ట్చేశారు. పలువురు ఆందోళనకారులను సైతం అరెస్ట్ చేసినట్లు వార్తలొచ్చాయి. దుకాణాలను యువకులు లూటీలు చేస్తున్న వీడియోలు ఇప్పుడు సామాజికమాధ్యమాల్లో వైరల్గా మారాయి. గత నాలుగు రోజుల్లో మొత్తంగా 23 పెద్ద వ్యాపార సముదాయాలు లూటీకి గురయ్యాయని లాస్ ఏంజెలెస్ నగర మహిళా మేయర్ కరెన్ బాస్ చెప్పారు. నగరంలో తాత్కాలిక కర్ఫ్యూస్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటలదాకా పాక్షిక కర్ఫ్యూను విధిస్తున్నట్లు మేయర్ కరెన్ ప్రకటించారు. ప్రతిరోజూ ఇదే సమయానికి కర్ఫ్యూను అమలుచేయనున్నారు. ఇలా కొద్దిరోజులపాటు పాక్షిక కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. లూటీలు, విధ్వంసానికి పాల్పడిన వారికి గుర్తిస్తూ పోలీసులు అరెస్ట్లపర్వాన్ని మొదలెట్టారు. అడ్డొచ్చిన వారిపైకి రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. డౌన్టౌన్ జిల్లాలోని ఆర్ట్స్ డిస్ట్రిక్, చైనా టౌన్, స్కిడ్ రో, ఫ్యాషన్ డిస్ట్రిక్ ప్రాంతాల్లో కర్ఫ్యూను అమలుచేశారు. కర్ఫ్యూ మొదలయ్యాక కనీసం 200 మందిని పోలీసులు అరెస్ట్చేశారని మేయర్ ప్రకటించారు. లాస్ఏంజెలెస్ 2,300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించగా అత్యధిక లూటీలు, విధ్వంసం జరిగిన 2.5 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే రాత్రి కర్ఫ్యూను అమలుచేస్తామని నగర పోలీస్ చీఫ్ జిమ్ మెక్డోనెల్ చెప్పారు. నగరంలో మరింత ఉద్రిక్తంగా మారడానికి ట్రంప్ ‘నేషనల్ గార్డ్’ తరలింపు’ నిర్ణయమే కారణమని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ఆరోపించారు. సైనికఛత్రంలోకి నగరాన్ని ఇరికించి సమస్యను జటిలంచేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై ట్రంప్ స్పందించారు. ‘‘ఆందోళనకారులు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. దేశానికి శత్రువుల్లా తయారయ్యారు. అల్లరిమూకల అరాచకత్వం ఇక ఎంతమాత్రం సాగనివ్వను. అవసరమైతే తిరుగుబాటు అణచివేత చట్టం,1807ను తీసుకొచ్చి యావత్ సైన్యాన్ని రాష్ట్రంలోకి దింపుతా. లాస్ ఏంజెలెస్లో ఇలాగే అల్లర్లు, ఆందోళనలు కొనసాగితే సిటీని రాష్ట్ర పాలన పరిధి నుంచి తప్పించి కేంద్రప్రభుత్వ అధీనంలోకి తీసుకొస్తా’’ అని శ్వేతసౌధంలో ట్రంప్ హెచ్చరించారు.కోర్టులో గవర్నర్కు చుక్కెదురున్యూయార్క్ గవర్నర్ అనుమతిలేకుండా అసా ధారణ అధికారాలతో లాస్ ఏంజెలెస్లోకి నేషనల్ గార్డ్, మెరైన్లను పంపుతూ ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులను తక్షణం నిలుపుదలచేయాలన్న న్యూయార్క్ అటార్నీ అభ్యర్థనను జడ్జి తిరస్కరించారు. ఈ అంశాన్ని గురువారం మరోసారి పరిశీలిస్తామని శాన్ ఫ్రాన్సిస్కో జిల్లా కోర్టు జడ్జి చార్లెస్ బ్రేయర్ చెప్పారు. మరోవైపు భద్రతా బలగాల మోహరింపు మున్ముందు మరింత ఎక్కువగా ఉంటుందని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చెప్పారు. ఇప్పటికే నేషనల్గార్డ్, మెరైన్లను రప్పించినందుకు ఏకంగా రూ.1,146 కోట్లు ఖర్చయిందని ఆయన వెల్లడించారు. అక్రమవలసదారుల కోసం గాలింపు, అరెస్ట్ విధుల్లో ఉన్న ఫెడరల్ ఏజెంట్లు, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అధికారుల రక్షణ, కేంద్రప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యతలను మాత్రమే నేషనల్ గార్డ్లకు అప్పగించడంతో వాళ్లు ఆందోళనకారులను అరెస్ట్చేయట్లేదు. అరెస్ట్చేసే అధికారం వీళ్లకు లేదు. దీంతో నిరసనకారులు రెచ్చిపోతున్నారు. ఈ సందర్భంగానే ముసుగు ధరించిన ఆగంతకులు లూటీలు చేయగలిగారు.ఇతర నగరాల్లో ఆందోళనలుకర్ఫ్యూతో లాస్ ఏంజెలెస్లో ఉద్రిక్తత రాత్రివేళ కాస్తంత తగ్గుముఖం పట్టినా ఇతర నగరాల్లో మాత్రం ఉధృతంగా కొనసాగుతోంది. శాన్ ఫ్రాన్సిస్కో మొదలు సియాటెల్, న్యూయార్క్, షికాగో, డెన్వర్, శాంటా అనా, ఆస్టిన్, డాలస్, బోస్టన్, వాషింగ్టన్ డీసీదాకా చాలా ప్రధాన నగరాల్లో వందలాది మంది ఆందోళనకారులు రోడ్లపైకి చేరి ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమాలు కొనసా గిస్తున్నారు. నిరసనకారులను నిలువరించేందుకు పోలీసులు తక్కువ ప్రాణహాని ఉండే ఉపకరణాలనే వాడుతున్నారు. భాష్పవాయు గోళాలు, పెప్పర్ స్ప్రే, టేజర్, లాఠీలు, జల ఫిరంగులు, చెవులు చిల్లులు పడే శబ్దాలు వెదజల్లే పరికరాలు, రబ్బర్బుల్లెట్లు బీన్–బ్యాంగ్ రౌండ్లను ప్రయోగిస్తున్నారు.టిక్టాక్ స్టార్పై బహిష్కరణ వేటు16.24 కోట్ల మంది టిక్టాక్ ఫాలోవర్లు ఉన్న ప్రఖ్యాత ఇన్ఫ్లుయెన్సర్ ఖబీ లేబ్ను సైతం అమెరికాలో ఇమిగ్రేషన్ అధికారులు దేశం నుంచి వెళ్లగొట్టారు. వీసా గడువు ముగిశాక సైతం అమెరికా ఉంటున్నందుకు ఆయనపై బహిష్కరణ వేటు వేశారు. దీంతో ఆయనే స్వయంగా అమెరికాను వీడారని వార్తలొ చ్చాయి. సెనెగల్– ఇటాలియన్ మూలాలున్న ఇతను చేసే టిక్టాక్ వీడియో లకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఇతను యూనిసెఫ్ గుడ్విల్ అంబాసి డర్గా ఉన్నారు. మరోవైపు టెక్సాస్ రాష్ట్రంలోనూ నేషనల్ గార్డ్లను రప్పించామని ఆ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ చెప్పారు. -
బాల్యానికి రాబందులుగా కాదు... బంధువులుగా ఉందాం!
నింగిలోని చుక్కలతో ఏనుగును చిత్రించుకోవడం... చందమామలో చెవుల పిల్లిని ఊహించుకోవడం... తొడుక్కున్న బట్టలను మాపుకోవడం.. చెట్లు, పుట్టలెక్కడం.. గెంతడం... ఒకరినొకరు గేలిచేసుకోవడం.. ఏడిపించుకోవడం.. యథేచ్ఛగా ఆడుకోవడం... పితూరీలు, అలకలు, ఉరకలు, పరుగులు... ‘బాల్యం’ అని మనసులో గూగుల్ చేస్తే మెదిలే ఇమేజెస్ అవి! నిజంగా పిల్లలందరూ అంత లగ్జరీ అనుభవిస్తున్నారా అని అనుకునేలోపే ముంబైలో ధారావీ, హైదరాబాద్లో జవహర్ నగర్ లాంటి ప్రాతాలు స్ఫురణకు వస్తాయి! ధారావీ ఎక్కడో దూరం కాబట్టి రెండు రాష్ట్రాలకు సుపరిచితమైన జవహర్ నగర్ను సందర్శిద్దాం... ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా!‘పిల్లల చేతుల్లో ఉండాల్సింది పలక.. బలపం లేదంటే పెన్ను.. పుస్తకం అంతేకానీ పనిముట్లు కాదు’ అంటారు నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు నడుంకట్టిన ఉద్యమనేత కైలాశ్ సత్యార్థి. కానీ జవహర్ నగర్లోని చాలామంది పిల్లల చేతుల్లో పుస్తకాలు కనిపించవు. పనిముట్లే కనిపిస్తాయి. అది నూరు బస్తీల ప్రాతం. దేశంలోని అన్ని ప్రాతాల నుంచి వచ్చిన వలసలతో మినీ ఇండియాను తలపిస్తుంది. వాళ్లలో చాలామందికి ఆధార్లాంటి గుర్తింపు పత్రాలేమీ ఉండవు. వాళ్లు ఏ లెక్కల్లోకీ రాక స్కూల్ అడ్మిషన్ నుంచి ప్రభుత్వ సంక్షేమ, ప్రయోజనాల దాకా ఏవీ వారికి అందట్లేదు. దాంతో చాలామంది పిల్లలు బాలకార్మికులై కనిపిస్తారు.. ఈ జవహర్నగర్కి ఆనుకునే ఉన్న 350 ఎకరాల డంపింగ్ యార్డ్లో చెత్త ఏరుకుంటూ.. భవన నిర్మాణ కార్మికులుగా.. అమ్మాయిలైతే ఇళ్లల్లో పనిచేస్తూ! ఇంకా సీజనల్ లేబర్గా కూడా! వసివాడని ఈ పిల్లలు గంజాయికి బానిసలై కూడా కనిపిస్తారు.మూడు లక్షల జనాభా...ఈ వంద బస్తీల్లో దాదాపు మూడు లక్షల జనాభా ఉంటుంది. సర్కారు బడులు పది మాత్రమే. అందులో ఎనిమిది ప్రైమరీ స్కూళ్లు, రెండు హైస్కూళ్లు. ఇది కా్రపా మండలం కిందకు వస్తుంది. ఈ మండలానికి కనీసం ఒక్క జూనియర్ కాలేజ్ కూడా లేదు. అందుకే స్కూల్కి వెళ్లే పిల్లలు కూడా టెన్త్ అవగానే అబ్బాయిలైతే కూలీలుగా మారుతున్నారు. అమ్మాయిలకైతే పెళ్లి చేసి పంపించేస్తున్నారు. పద్నాలుగు నుంచి పద్దెనిమిదేళ్లలోపు అమ్మాయిలకు పెళ్లిళ్లయి పోతున్నాయి. ఇది హైదరాబాద్ నగరంలోని పరిస్థితి! ఇలా మన దేశమంతటా సుమారు పద్దెనిమిది లక్షల నుంచి ముప్పైమూడు లక్షల వరకు బలకార్మికులు ఉన్నారని యూనిసెఫ్ డేటా వెల్లడిస్తోంది. వీళ్లంతా వ్యవసాయరంగంలో, కుటుంబ వ్యాపారాల్లో పనిచేస్తున్నారని నివేదిక తెలుపుతోంది. అయిదు నుంచి పద్నాలుగేళ్లలోపు పిల్లలంతా ఏదో ఒక పనిచేస్తున్నారని కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ వెల్లడించింది. చట్టం ఏం చెబుతోంది?ద చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్, 1986 ప్రకారం పద్నాలుగేళ్లలోపు పిల్లల చేత ఎలాంటి పనైనా చేయించడం నేరం. పద్నాలుగేళ్ల నుంచి పద్దెనిమిదేళ్ల పిల్లలకు పనివ్వొచ్చు. కానీ ప్రమాదకరమైన వృత్తులు.. పనులు.. పరిస్థితుల్లో ఆ పిల్లలను పెట్టకూడదు. ఈ చట్టానికి కొన్ని మినహాయింపులూ ఉన్నాయి. కుటుంబ వ్యాపారాలు, నిర్దిష్ట పరిస్థితుల్లో టీవీ, సినిమాలు వంటి వినోద రంగాల్లో పిల్లల పనిచేయవచ్చు.అమ్మాయిలే ఎక్కువ..ప్రపంచవ్యాప్త బాలకార్మికుల్లో ప్రతి పదిమందిలో ఒకరు మన దేశం నుంచే కనిపిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో బాలకార్మికుల(5–14 ఏళ్లలోపు) సంఖ్య కోటికి పైనే ఉంది. అంటే అప్పటి పిల్లల జనాభాలో ఇది 3.9 శాతం. అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలే ఎక్కువగా పనిబాట పడుతున్నారని యూనిసెఫ్ సర్వే చెబుతోంది. ఇళ్లల్లో పని దగ్గర్నుంచి ఇంట్లో పెద్దవాళ్ల (అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు)ను చూసుకోవడం, తోబుట్టువులను సంభాళించడం వంటివన్నీ చేస్తున్నారన్నది నివేదికల మాట. మన దేశంలో బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాతాల్లో బాలకార్మికులు ఎక్కువ. ఇటుక బట్టీలు, తీవాచీ, వస్త్ర పరిశ్రమ, ఇళ్లు, హోటళ్లు.. టీ స్టాళ్లు లాంటి అసంఘటిత రంగాల్లో, వ్యవసాయం, మత్స్య పరిశ్రమల్లో బాలకార్మికులు ఎక్కువగా కనిపిస్తారు.బాలకార్మిక వ్యవస్థ వేళ్లూనడానికి కారణాలు అసమానత్వం, సరైన విద్యావకాశాలు, మంచి పని, సామాజిక భద్రత లేకపోవడం, సంప్రదాయ, సాంస్కృతిక చట్రాలు వంటివన్నీ బాలకార్మిక వ్యవస్థను పెంచి పోషిస్తున్నాయి. ఏ రూపాల్లో ఉన్నా 2025 కల్లా బాలకార్మిక వ్యవస్థను సంపూర్ణంగా నిర్మూలించాలనే యునైటెడ్ నేషన్స్ లక్ష్యానికి మద్దతు తెలుపుతూ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీఎస్) భారత ప్రభుత్వమూ సంతకం చేసింది. సంతకం చేయగానే సరిపోదు చిత్తశుద్ధితో ఆ బాధ్యతను నెరవేర్చాలి. పిల్లలందరినీ బడి బాట పట్టించి బాలకార్మికులు లేకుండా చేయడానికి విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి అంటున్నారు బాలల హక్కుల కార్యకర్తలు. ∙రెస్క్యూ, రిహాబిలిటేషన్ వీక్గా ఉందిజవహర్ నగర్లోని డంపింగ్ యార్డ్కి ఆనుకున్న బస్తీల్లో స్క్రాప్ షాప్స్ ఎక్కువ. అందుకే ఇక్కడ చెత్త సేకరణ ఎక్కువగా జరుగుతుంది. ఇవి కాకుండా కన్స్ట్రక్షన్ లేబర్, డొమెస్టిక్ హెల్ప్, సీజనల్ లేబర్కి కూడా వెళ్తుంటారు. ఈ ప్రాతంలో సరిపడా సర్కారు బడులు లేవు. ఉన్నవాటిల్లో చేరడానికి చాలామంది పిల్లలకు గుర్తింపు పత్రాలు లేవు. వాళ్లకు ప్రైవేట్ స్కూళ్లల్లో అడ్మిషన్స్ దొరికినా ఫీజులు కట్టేంత స్థోమత ఉండదు. దాంతో పనిలోకి వెళ్తున్నారు. పద్నాలుగేళ్లు దాటిన పిల్లలు గనుక ఒక్కసారి పనిలోకి వెళితే మళ్లీ వాళ్లను చదువు వైపు మళ్లించడం చాలా కష్టం. ఇక్కడ వార్డ్ లెవెల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు (డబ్ల్యూఎల్సీపీసీ) కూడా యాక్టివ్గా లేవు. దీనివల్ల బాలకార్మికుల రెస్క్యూ, రిహాబిలిటేషన్ చాలా వీక్గా ఉంది. – హిమబిందు, పిల్లల హక్కుల కార్యకర్త -
OP Sindoor: పాక్ కవర్ డ్రైవ్ .. భలే బెడిసి కొట్టిందిగా!
ఆపరేషన్ సిందూర్ ఓ విఫల ప్రయత్నమని.. పైగా తాము జరిపిన ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్తో భారత్కు భారీగా నష్టం వాటిల్లిందని పాకిస్తాన్ నెల రోజులుగా ప్రచారం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఫేక్ ఫొటోలతో, అసత్య ప్రచారాలతో ప్రపంచ దేశాల దృష్టిలో నవ్వులపాలు అవుతూ వస్తోంది. తాజాగా మరోసారి అదే రిపీట్ అయ్యింది.అబ్బే.. భారత సైన్యం అసలు తమ ఎయిర్బేస్లపై దాడులే జరపలేదని పాక్ చెబుతున్న సంగతి తెలిసిందే. ఆ దాడులను కవరింగ్ చేసుకునే ప్రయత్నం ఇప్పుడు బయటపడింది. ఆపరేషన్ సిందూర్లో మురిద్, జాకోబాబాద్, భోళరిలో మిలిటరీ స్థావరాలను భారత్ నాశనం చేసింది. అయితే ధ్వంసమైన ఈ ఎయిర్బేస్లను టార్పలిన్(tarpaulin)లతో కప్పి దాచేసే ప్రయత్నం చేసింది పాక్. ఇండియా టుడే జరిపిన శాటిలైట్ చిత్రాల విశ్లేషణలో అవి పైకప్పు కాదని, టార్ఫలిన్లు అని తేలింది. అదీ వాటి పైకప్పు ఆకుపచ్చ, గోధుమ రంగులో మ్యాచ్ అయ్యేలా చూసుకుంది పాక్ ఆర్మీ. అయినప్పటికీ శాటిలైట్ చిత్రాల ద్వారా విషయం బయటపడింది. 'ది ఇంటెల్ ల్యాబ్'కు చెందిన జియో ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ ఈ విషయాన్ని ధృవీకరించారు కూడా. దాడి తర్వాత దెబ్బతిన్నవాటిని పునరుద్ధరించకుండానే.. కేవలం టార్పలిన్తో కవర్ చేశారని సోషల్మీడియాలో ఆయనొక పోస్ట్ చేశారు. ఇదంతా చూస్తున్న కొందరు బాలీవుడ్ అభిమానులు.. పర్దే మేన్ రహ్నే దో, పర్దా న ఉటావో అంటూ పాట పాడుతూనే.. పర్దా తొస్తే అసలు విషయం బయటపడుతుందంటూ పాక్ను ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు.. పాకిస్థాన్ ఆర్థికాభివృద్ధిని పణంగా పెట్టి.. ఆయుధాల కొనుగోళ్లపై దృష్టిపెట్టింది. దేశ రక్షణ బడ్జెట్ను 20 శాతం పెంచింది. ఏకంగా 9 బిలియన్ డాలర్లకు కేటాయించింది. షెహ్బాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం ఆ దేశ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ డిమాండ్లను సంతృప్తిపర్చేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఈ బడ్జెట్లో పెంచిన నిధులతో ఆపరేషన్ సిందూర్లో దెబ్బతిన్న టెర్రర్ క్యాంప్లను మళ్లీ పునరుద్ధరించనుందని తెలుస్తోంది.Nearly a month after India’s strikes in Pakistan, a review by India Today shows craters now concealed & hangars patched with tarpaulin, the visual indicators of damage remain, masked but not restored Read here - https://t.co/r8blLp5Kk1 pic.twitter.com/VzlJGQ6DcA— Damien Symon (@detresfa_) June 11, 2025 -
ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన ఎలాన్ మస్క్.. యూటర్న్ ఇలా..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులను ప్రపంచమంతా చూసింది. వీరిద్దరి వ్యవహార శైలితో ఏమి జరుగుతుందోనని అమెరికన్లు ఆందోళనకు గురయ్యారు. అయితే ఇప్పుడు దీనికి భిన్నమైన సంగతి ఆసక్తికరంగా మారింది. బిలియనీర్ ఎలాన్ మస్క్ తాజాగా తాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని ఇటీవలి కాలంలో సోషల్ మీడియా చేసిన పోస్ట్లలో కొన్నింటిపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘గత వారం అధ్యక్షుడు @realDonaldTrump గురించి నేను చేసిన కొన్ని పోస్ట్ల విషయంలో చింతిస్తున్నాను. అవి చాలా దుమారం రేపాయి’ అని మస్క్ ‘ఎక్స్’లో రాశారు. I regret some of my posts about President @realDonaldTrump last week. They went too far.— Elon Musk (@elonmusk) June 11, 2025ట్రంప్ పరిపాలనా విభాగం తీసుకువచ్చిన కీలక వ్యయ బిల్లును మస్క్ తీవ్రంగా విమర్శించిన తరువాత వీరిద్దిరి మధ్య వైరం మరింత ముదిరింది. దేశీయ ఎజెండాకు మద్దతునిచ్చే వ్యయ బిల్లుకు సహకరించే రిపబ్లికన్ చట్టసభ సభ్యులపై రాజకీయ ప్రతీకారం తీర్చుకోవాలని మస్క్ పిలుపునివ్వడం అధ్యక్షుడు ట్రంప్కు ఆగ్రహం కలిగించింది. ట్రంప్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బడ్జెట్ బిల్లుకు ఓటు వేసే రిపబ్లికన్లపై చర్యకు ప్రయత్నిస్తే, తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని తన మాజీ సలహాదారు ఎలాన్ మస్క్ను హెచ్చరించారు.ఇది కూడా చదవండి: ‘హనీమూన్’ కేసు: ‘కొండ మీంచి తోసేస్తా’.. సోనమ్ ‘ప్లాన్ బీ’ -
కెన్యాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు భారతీయులు మృతి
దోహా: ఖతార్లో నివసిస్తున్న ఐదుగురు భారతీయులు కెన్యాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను దోహాలోని భారత రాయబార కార్యాలయం మంగళవారం వెల్లడించింది.విహారయాత్రలో భాగంగా 28 మంది ప్రవాసభారతీయుల బృందం ఖతార్ నుంచి కెన్యాకు వెళ్లింది. కెన్యాలోని నయాందారూ కౌంటీలో ఒల్ జొరోరోక్–నకూరూ రోడ్డులో వీళ్లు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. విషయం తెల్సుకున్న నైరోబీలోని భారత హైకమిషన్ అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లారు.మృతదేహాల తరలింపు, క్షతగాత్రులకు సహాయక కార్యక్రమాల్లో అధికారులు నిమగ్నమయ్యారని దోహాలోని ఇండియన్ ఎంబసీ తెలిపింది. రోడ్డుపై అదుపు తప్పిన పర్యాటకుల బస్సు పక్కనే ఉన్న లోయలో పడిపోయిందని ది గల్ప్ టైమ్స్ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. చనిపోయిన ఆరుగురి వివరాలు ఇలా ఉన్నాయి. మృతుల్లో ఐదుగురు కేరళకు చెందిన వారుగా గుర్తించారు.మావెలిక్కరకు చెందిన గీతా షోజి ఐజాక్ (58), జస్నా కుట్టిక్కట్టుచలిల్ (29), రూహి మెహ్రీ ముహమ్మద్ (18 నెలలు), ఒట్టప్పలంకు చెందిన రియా ఆన్ (41), టైరా రోడ్రిగ్స్ (8)లు గుర్తించారు. రియా భర్త జోయెల్ మరియు ఆమె పెద్ద కుమారుడు రవిస్ (14) గాయాలతో న్యాండరువాలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక, ఈ ప్రమాదంలో గాయపడిన ప్రవాసభారతీయులను దగ్గర్లోని ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. ⚠️ A tragic road accident occurred in central Kenya, where a bus carrying tourists rolled over, resulting in six fatalities and 27 injuries.Location — The accident took place at Gichaka, along the Ol Jororok-Nakuru road in Nyandarua County.Cause — The exact cause of the bus… pic.twitter.com/QsNRk7o5cq— Sir Adam ™ (@AdamMaina_) June 10, 2025 -
శుభాన్షు అంతరిక్ష ప్రయాణం మళ్లీ వాయిదా
న్యూఢిల్లీ: భారతదేశపు రెండవ వ్యోమగామి శుభాన్షు శుక్లాను అంతరిక్షంలోకి తీసుకెళ్లే ఆక్సియం-4 మిషన్ ప్రయోగం బుధవారం ఐదవసారి కూడా వాయిదా పడింది. ఫాల్కన్ 9 రాకెట్ రిపేర్ కారణంగా ఈ వాయిదా అనివార్యమయ్యింది. స్పేస్ ఎక్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్లో తెలియజేసింది.పోస్ట్ స్టాటిక్ ఫైర్ బూస్టర్ తనిఖీల సమయంలో గుర్తించిన ఎల్ఓ ఎక్స్ లీక్ను రిపేర్ చేసేందుకు స్పేస్ఎక్స్ బృందాలకు అదనపు సమయం అవసరం కానుంది. వీరు ఫాల్కన్ 9 యాక్స్-4 ప్రయోగం నుండి తిరిగి @Space_Station కు బయలుదేరుతున్నారు. మరమ్మత్తు పూర్తయిన తర్వాత తదుపరి ప్రయోగ తేదీని తెలియజేస్తామని స్పేస్ఎక్స్ పేర్కొంది. Standing down from tomorrow’s Falcon 9 launch of Ax-4 to the @Space_Station to allow additional time for SpaceX teams to repair the LOx leak identified during post static fire booster inspections. Once complete – and pending Range availability – we will share a new launch date pic.twitter.com/FwRc8k2Bc0— SpaceX (@SpaceX) June 11, 2025భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు పంపే ఆక్సియం-4 మిషన్ ప్రయోగం ఐదోసారి వాయిదా పడింది. ఈ వాయిదాకు ముందు కూడా ప్రయోగ ప్రాంతంలో అనుకూలమైన వాతావరణం లేని కారణంగా వాయిదా పడిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది. భారతదేశ అంతరిక్ష లక్ష్యాలకు ఒక మైలురాయిగా ఈ మిషన్ నిలుస్తుంది. యాక్సియమ్ స్పేస్, నాసా, స్పేస్ఎక్స్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)ల సహకారంలో ఈ ప్రయోగం జరుగుతోంది. ఇది కూడా చదవండి: ‘హనీమూన్’ కేసు.. ప్రియుడి ‘ప్లాన్’తో భర్తను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. -
‘ఐస్’ మంటలు
లాస్ ఏంజెలెస్/వాషింగ్టన్: అక్రమ వలస దారులను అదుపులోకి తీసుకోవాలన్న ట్రంప్ సర్కార్ పంతం చివరకు అడ్డూఅదుపూలేని నిరసన జ్వాలలను రేపింది. గత మూడు రోజులుగా లాస్ ఏంజెలెస్కే పరిమితమైన ఇమి గ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐస్) ఏరివేత కార్య క్రమం, దానికి వ్యతిరేకంగా మొదలైన ఆందోళనలు ఇప్పుడు ఇతర నగరాలకూ పాకాయి. శాన్ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, సియాటెల్, డాలస్, లూయీ విల్లే, శాన్ ఆంటోనియో, షికాగో నగరాల్లోనూ సోమ వారం ఆందోళనలు మొదలయ్యాయి. ఆందోళన కారుల నుద్దేశిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరిక వ్యాఖ్యలు నిరసనకారులు మరింత రెచ్చిపోయేలా చేశాయి.మీరు నిరసనజ్వాలల్ని ఎగదోస్తే మేం బుల్లెట్లవర్షం కురిపిస్తాం. కట్టలు తెంచుకున్న ఆగ్రహాన్ని కట్టడిచేస్తాం. కాలిఫోర్నియా గవర్నర్ ఆందోళనకారులను రెచ్చగొట్టి నేషనల్ గార్డ్ల మీదకు ఉసిగొల్పుతున్నారు. గార్డ్లను రెచ్చగొడితే దారుణ పరిణామాలను ఎదుర్కొంటారు ’’ అని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్య మం ‘ట్రూత్ సోషల్’ ద్వారా ఆందోళనకారులను హెచ్చరించారు. దానికితోడు లాస్ఏంజెలెస్ నగరానికి అదనంగా మరో 2,000 మంది నేషనల్ గార్డ్ రిజర్వ్బలగాలను పంపించారు. వీరికి తోడుగా 700 మంది నేవీ మెరైన్ సాయుధ సభ్యులూ రంగప్రవేశం చేశారు.వేలాది మంది ఆందోళనకారులు ఒకవైపు వందల మంది పోలీసులు, నేషనల్ గార్డ్, మెరైన్లు ఒకవైపు ఎదురు నిలబడి తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో లాస్ఏంజెలెస్ వీధులు కనీవినీ ఎరుగని స్థాయిలో యుద్ధక్షేత్రాలను తలపించాయి. డౌన్టౌన్ లాస్ఏంజెలెస్లో చాలా మంది మెక్సికో, గ్వాటెమాలా జాతీయజెండాలతో కనిపించారు. ఆందోళనలను రికార్డ్చేస్తున్న సీఎన్ఎన్ వార్తాసంస్థ విలేకరి, ఫొటో, వీడియో జర్నలిస్ట్లను పోలీసులు నిలువరించారు. ఆందోళనకారులు శాంతించాలని కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ గవిన్ న్యూసమ్ విజ్ఞప్తిచేశారు. అదనపు బలగాలను రప్పిస్తూ మరోసారి అసా దారణ అధికారాలను ట్రంప్ దుర్వినియోగం చేశారని న్యూసమ్ ధ్వజమెత్తారు. బలగాలపై గవర్నర్, మేయర్ అభ్యంతరంసోమవారం రాత్రి లాస్ ఏంజెలెస్లోని సివిక్ సెంటర్లోని సిటీ హాల్ వద్దకు వేలాదిగా ఆందోళనకా రులు గుమిగూడి భారీ ర్యాలీ చేపట్టారు. మరోవైపు పెద్దసంఖ్యలో అక్రమవలసదారులను బంధించి ఉంచిన డిటెన్షన్ సెంటర్ ఉన్న ఫెడరల్కాంప్లెక్స్ భవనం వద్దకు సైతం వందల మంది చేరుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. లాస్ఏంజెలెస్ భయంకరమైన ఉద్యమ సంక్షోభంలోకి వెళ్తోందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను న్యూసమ్, నగర మహిళా మేయర్ కరెన్ బాస్ తప్పుబట్టారు. టెక్సాస్, ఆస్టిన్, శాంటా అనా నగరాల్లోనూ..కెంటకీ రాష్ట్రంసహా కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ ప్రాన్సిస్కో శాంటా అనా, టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్, ఆస్టిన్ నగరాల్లోనూ ‘ఐస్’ వ్యతిరేక ఆందోళనలు మొదలయ్యాయి. ఈ నగరాల్లో పలు ప్రాంతాల్లో స్థానికులు రోడ్ల మీదకొచ్చి ఇమిగ్రేషన్ అధికారుల ఆకస్మిక దాడులు, అరెస్ట్లను తప్పుబట్టారు. బోస్టన్, పీట్స్బర్గ్, ఛార్లొటే, సియాటెల్, వాషింగ్టన్ డీసీ, కనెక్టికట్, న్యూయార్క్ నగరాల్లోనూ నిరసన ప్రదర్శనలు భారీ ఎత్తున జరిగాయి. ఆస్టిన్ సిటీలోనూ నేషనల్ గార్డ్ రంగంలోకి దిగారు. ఆస్టిన్ నగరంలో డజనుకుపైగా ఆందోళనకారులను అరెస్ట్చేసినట్లు టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ తెలిపారు.మరోవైపు నేషనల్ గార్డ్లను రాష్ట్రంలోకి అనుమతించే అంశంలో గవర్నర్ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడంపై కోర్టులో కేసు వేశామని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబర్ట్ ఆండ్రీస్ బోంటా మంగళవారం ప్రకటించారు. ‘‘ మా రాష్ట్రంలో ఎలాంటి అంతర్యుద్ధం లేదు. తిరుగుబాటు అస్సలు లేదు. అలాంటప్పుడు రాష్ట్ర సార్వభౌమత్వాన్ని తొక్కిపెట్టేలా అధ్యక్షుడెలా నిర్ణయాలు తీసుకుంటారు?. ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోబోం.అందుకే ట్రంప్, రక్షణ మంత్రి హెగ్సెత్పై కేసు వేశాం. ట్రంప్ ఉత్తర్వును చట్టవ్యతి రేకమైనదిగా ప్రకటించాలని కోర్టును కోరాం. అద నపు నేషనల్గార్డ్ల ప్రవేశాన్ని అడ్డుకునేలా ఆదేశా లు ఇవ్వాలని అభ్యర్థించాం’’ అని ఆయన వెల్లడించారు. నేషనల్ గార్డ్లను రాష్ట్రాల్లోకి అనుమతించడాన్ని విపక్ష డెమొక్రాట్లు తప్పు బట్టారు. ట్రంప్ దేశానికి రాజులా భావిస్తున్నారని కాలిఫోర్నియా డెమొక్రటిక్ పార్టీ నేత, దిగువసభ సభ్యుడు జాన్ గ్యారమెండీ ఆరోపించారు. మరోవైపు గార్డ్ల రాకను హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్వాగతించింది.శ్వేతసౌధం వివరణవలసదారుల ఏరివేత విధుల్లో ఉన్న ఇమ్మి గ్రేషన్ అధికారులు, ఫెడరల్ ఏజెంట్ల రక్షణ, కేంద్రప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసమే నేవీ మెరైన్ బలగాలను రప్పించామని శ్వేతసౌధం వివరణ ఇచ్చింది. నిరసనలను నిలువరించాలంటే నేవీ మెరైన్లు రావాల్సిందేనని బోర్డర్ జార్ టామ్ హోమన్ అభిప్రాయపడ్డారు.కార్మిక నేత విడుదలశుక్రవారం అరెస్టయిన కార్మిక నేత డేవిడ్ హుయెర్టాను 50వేల డాలర్ల పూచీకత్తుతో ఇమిగ్రేషన్ అధికారులు సోమవారం విడుదలచేశారు. సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ అరెస్ట్ తర్వాతే ఆందోళనలు మరింత ఉధృతమవడం తెల్సిందే. -
స్కూల్లో ఘోరం.. తోటి విద్యార్థులపై కాల్పులు, 11 మంది మృతి
గ్రాజ్: ఆస్ట్రియా దేశం గ్రాజ్ నగరంలో ఘోరం జరిగింది. బోర్గ్ డ్రైయర్షుట్సెన్గాసే హై స్కూల్లో ఓ విద్యార్థి తోటి విద్యార్థులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ దారుణంలో 11 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రాజ్ నగరం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల ప్రాంతంలో నిందితుడు గన్నుతో కాల్పులు జరిపినట్లు తమకు సమాచారం అందినట్లు పోలీసులు తెలిపారు. అయితే, కాల్పుల అనంతరం విద్యార్థి తనని తాను గన్నుతో కాల్చుకొని ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దాడి తర్వాత, గ్రాజ్ పాఠశాలను ఖాళీ చేయించారు. విద్యార్థులను సమీపంలోని హెల్మట్ లిస్ట్ హాల్కు తరలించారు.అక్కడ వారికి రెడ్క్రాస్ చికిత్స అందించింది. ఘటనపై అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కాల్పుల శబ్ధం విన్న వెంటనే పోలీసులు స్థానికుల్ని అప్రమత్తం చేశారు. కాల్పులు జరిగిన ప్రాంత ప్రజలు బహిరంగంగా తిరగకూడదని, ఇళ్లలోనే ఉండాలని సూచించారు. 🚨🇦🇹 MULTIPLE DEAD IN AUSTRIAN SCHOOL SHOOTINGA shooting at BORG Dreierschützengasse school in Graz, Austria, has left at several dead, including students and teachers, with many injured.Local media reported at least 8 dead, but authorities have not released the official… pic.twitter.com/7Lqy7GjcAu— Mario Nawfal (@MarioNawfal) June 10, 2025 -
ప్రసూతివార్డునూ వదలని రష్యా డ్రోన్లు
కైవ్: రష్యా మరోమారు ఉక్రెయిన్పై భీకర దాడులకు దిగింది. రాజధాని కైవ్ను లక్ష్యంగా చేసుకుని, ఇక్కడి ఒడెసాలోని ఒక ఆస్పత్రిలోని ప్రసూతివార్డుపై డ్రోన్లతో దాడి చేసింది. దీనికి సంబంధించిన వివరాలను ఉక్రెయిన్ మీడియాకు తెలిపింది. దీనికిముందు కూడా ఉక్రెయిన్పై రష్యా డ్రోన్లతో భారీ దాడులకు తెగబడింది. ఉక్రెయిన్ ఇటీవల జరిపిన దాడులకు ప్రతిగా రష్యా వరుస దాడులను కొనసాగిస్తోంది. శత్రు డ్రోన్లు నగరంలోని అనేక జిల్లాలపై ఒకేసారి దాడి చేస్తున్నాయని కైవ్ సైనిక పరిపాలన అధికారి తైమూర్ త్కాచెంకో టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్లో తెలిపారు. నివాస భవనాలను మంటలు చుట్టుముట్టాయని, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలంలో సేవలు అందిస్తున్నారని అన్నారు. దక్షిణ ఒడెసా ఓడరేవులో భారీ డ్రోన్ దాడి జరిగిందని, అలాగే అత్యవసర వైద్య భవనం, ప్రసూతి వార్డుతో పాటు నివాస భవనాలను లక్ష్యంగా చేసుకుని, డ్రోన్ దాడులు కొనసాగుతున్నాయని ఒడెసా ప్రాంతీయ గవర్నర్ ఒలేహ్ కైపర్ టెలిగ్రామ్లో తెలిపారు. ప్రసూతి ఆసుపత్రిపై జరిగిన దాడిలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, బాధితులు, సిబ్బంది అప్రమత్తమై ముందుగా భవనాన్ని ఖాళీ చేశారని తెలిపారు. అయితే భవనం ధ్వంసమయ్యిందని పేర్కొంటూ, దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన షేర్ చేశారు. మూడేళ్ల క్రితం ఉక్రెయిన్పై రష్యా ప్రారంభించిన ఈ యుద్ధంలో వేలాదిమంది పౌరులు మరణించారు. వారిలో అధిక శాతం ఉక్రేనియన్లు ఉన్నారు. ఇది కూడా చదవండి: ఎనిమిది నిమిషాలు చనిపోయి.. ఏమైందో చెప్పిన మహిళ -
న్యాయ వ్యవస్థ స్వతంత్రత కాపాడేందుకే కొలీజియం
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి ఉద్దేశించిన కొలీజియం వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకు ఇది ముఖ్యమైన భద్రతా వ్యవస్థగా కొనసాగుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. కొలీజియం వ్యవస్థపై విమర్శలు వస్తున్నాయని అంగీకరించారు. ఈ వ్యవస్థ పరిపూర్ణం కాదని చెప్పారు. కానీ, కార్యనిర్వాహక వర్గం జోక్యం నుంచి న్యాయమూర్తులను రక్షించడంలో కొలీజియం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న జస్టిస్ సూర్యకాంత్ తాజాగా సియాటెల్ యూనివర్సిటీలోని ‘రౌండ్ గ్లాస్ ఇండియా సెంటర్’లో జరిగిన కార్యక్రమంతోపాటు మరో రెండు చోట్ల కీలక ప్రసంగాలు చేశారు. సుప్రీంకోర్టు ఇటీవల చేపట్టిన పలు చర్యలను ప్రస్తావించారు. న్యాయ వ్యవస్థలో పారదర్శకతను మెరుగుపర్చేందుకే వీటిని అమల్లోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజల్లో విశ్వాసం పెంచుకోవడానికి న్యాయవ్యవస్థ పదే పదే తమ పారదర్శకతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కొలీజియంపై వస్తున్న విమర్శలను నిరాకరించలేమని, ఈ వ్యవస్థను మరింత మెరుగుపర్చాలన్న సంకల్పంతో న్యాయ వ్యవస్థ ముందడుగు వేస్తోందని ఉద్ఘాటించారు. న్యాయం అంటే సిద్ధాంతం, బాధ్యత న్యాయమూర్తులు అంటే అపరిమిత అధికారం కలిగినవారు కాదని... వారు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమేనని జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. రాజ్యాంగ విలువలను నిలబెట్టే విధంగా వ్యవహరించాలని న్యాయమూర్తులకు సూచించారు. కోర్టులు అధికారాన్ని ప్రదర్శించే వ్యవస్థలుగా కాకుండా, ప్రజాస్వామ్య ప్రయాణంలో భాగస్వాములై ఉండాలని పేర్కొన్నారు. న్యాయం అనేది తాత్కాలికంగా పంపిణీ చేయాల్సిన ఉత్పత్తి కాదని.. అది ఒక సిద్ధాంతం, ఒక బాధ్యత అని తేలి్చచెప్పారు. స్వేచ్ఛ, సమానత్వం, స్వయంపాలన అనేవి అనుకోకుండా వచ్చినవి కాదని, ఇవన్నీ సుదీర్ఘమైన పోరాటాల ఫలితంగా సమాజానికి లభించాయని జస్టిస్ సూర్యకాంత్ గుర్తుచేశారు. సుప్రీంకోర్టులో సీనియారిటీ ఆధారంగా, ప్రస్తుత సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ తరువాత జస్టిస్ సూర్యకాంత్ 2025 నవంబర్లో భారత సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి. -
కేరళ సమీపంలో నౌకలో అగ్నిప్రమాదం
కొచ్చి: సింగపూర్ జెండాతో శ్రీలంక నుంచి ముంబైకి బయల్దేరిన విదేశీ కంటైనర్ సరకు రవాణా నౌక కేరళ సమీప సముద్రజలాల్లో అగ్నిప్రమాదానికి గురైంది. 22 మంది సిబ్బంది ఉన్న ఈ నౌక నుంచి 18 మందిని భారత తీర గస్తీ బలగాలు కాపాడాయి. 270 మీటర్ల పొడవైన ఎంవీ వాన్ హాయ్503 పేరు గల ఈ నౌకలో నలుగురి జాడ గల్లంతయింది. కేరళలోని కన్నూర్ జిల్లాలోని అఝిక్కల్ పట్టణ తీరం నుంచి 44 నాటికల్ మైళ్ల దూరంలో సోమవారం ఉదయం 9.20 గంటలకు ఈ దుర్ఘటన సంభవించింది. విషయం తెల్సిన వెంటనే భారత గస్తీ బలగాలు రంగంలోకి దిగి 18 మంది సిబ్బందిని కాపాడాయి. నౌకలో ఎనిమిది మంది చైనా, ఆరుగు తైవాన్, ఐదుగురు మయన్మార్, ముగ్గురు ఇండోనేసియాకు చెందిన సిబ్బంది ఉండగా వారిలో 18 మందిని రక్షించగాలిగారు. వీరిని ఐఎన్ఎస్ సూరత్ నౌకలో మంగళూరు పోర్ట్కు తీసుకొచ్చారు. షెడ్యూల్ ప్రకారం నౌక జూన్10వ తేదీకల్లా ముంబైలోని నవాషేవా ప్రాంతానికి చేరుకోవాల్సి ఉండగా మార్గమధ్యంలోనే ప్రమాదానికి గురైంది. గత 30 రోజుల్లో కేరళ సమీపంలో సరకు రవాణానౌక ప్రమాదానికి గురికావడం ఇది రెండోసారి. మే 24న లైబీరియా జెండాతో వెళ్తున్న కార్గో నౌక తీరానికి 14.6 మైళ్లదూరంలో మునిగిపోయింది. -
ఉక్రెయిన్పై భీకర దాడి
కీవ్: తమ గడ్డపై డ్రోన్లతో తమ యుద్ధ విమానాలను ధ్వంసం చేసిన ఉక్రెయిన్పై రష్యా సైన్యం ప్రతీకార చర్యలు తీవ్రతరం చేసింది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఏకంగా 479 డ్రోన్లు, 20 క్షిపణులు ఉక్రెయిన్ భూభాగంపై ప్రయోగించింది. రెండు దేశాల మధ్య మూడేళ్ల క్రితం యుద్ధం మొదలైన తర్వాత రష్యా ఒకేరాత్రి ఈ స్థాయిలో దాడికి దిగడం ఇదే మొదటిసారి. ప్రధానంగా మధ్య, పశ్చిమ ఉక్రెయిన్లోని నగరాలు, పట్టణాలను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగాయి. అయితే, రష్యా ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను చాలావరకు మధ్యలోనే కూల్చివేశామని ఉక్రెయిన్ వైమానిక దళం సోమవారం ప్రకటించింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో మొత్తం 277 డ్రోన్లు, 19 క్షిపణులు నేలమట్టం చేశామని వెల్లడించింది. రష్యా దాడిలో ఒకరు గాయపడినట్లు తెలియజేసింది. మరోవైపు రష్యాపై వైమానిక దాడులు యథావిధిగా కొనసాగిస్తున్నట్లు ఉక్రెయిన్ సైన్యం సోమవారం పేర్కొంది. సరిహద్దుకు 650 కిలోమీటర్ల దూరంలో రష్యా భూభాగంలో రెండు ఫైటర్ జెట్లను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. అయితే, దీనిపై రష్యా సైన్యం స్పందించలేదు. మరోవైపు ఆదివారం రాత్రి ఉక్రెయిన్ ప్రయోగించిన 49 డ్రోన్లు కూల్చివేశామని రష్యా రక్షణ శాఖ తేల్చిచెప్పింది. ఇదిలా ఉండగా, మృతదేహాల అప్పగింతపై రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నాయి. వచ్చే వారం కొన్ని మృతదేహాలను పరస్పరం అప్పగించుకొనే అవకాశం కనిపిస్తోంది. -
అమెరికాకు ఎగుమతులు 35 శాతం పతనం: చైనా
బీజింగ్: అమెరికా–చైనా మధ్య వాణిజ్యంలో అనిశ్చితి నెలకొంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో అమెరికాకు ఎగుమతులు 35 శాతం పడిపోయినట్లు చైనా వెల్లడించింది. ఈ ఎగుమతుల విలువ 28.8 బిలియన్ డాలర్లు. గత ఏడాది మే నెలలో ఎగుమతుల విలువ 44 బిలియన్ డాలర్లుగా ఉంది. మరోవైపు అమెరికా–చైనా మధ్య వాణిజ్య చర్చలకు రంగం సిద్ధమవుతోంది. అతిత్వరలో లండన్లో ఈ చర్చలు జరుగనున్నట్లు తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చిన తర్వాత చైనా ఉత్పత్తులపై భారీగా సుంకాలు పెంచిన సంగతి తెలిసిందే. -
అమెరికాలో భారత విద్యార్థులు 11.8% పెరిగారు
వాషింగ్టన్: అమెరికాలో భారత విద్యార్థుల సంఖ్యలో 2024లో 11.8 శాతం పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం అమెరికాలో 4,22,335 మంది భారత విద్యార్థులున్నట్టు యూఎస్ ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) విడుదల చేసిన స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రాం (ఎస్ఈవీపీ) తాజా వార్షిక నివేదిక వెల్లడించింది. అమెరికాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో ఇది 27 శాతం. ఈ విషయంలో భారత్ గత 15 ఏళ్లలో తొలిసారిగా చైనా (20 శాతం)ను దాటేసి అగ్రస్థానంలో నిలవడం విశేషం. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ మెటిక్స్ (స్టెమ్) కోర్సుల్లో అత్యధికంగా 48 శాతం మంది భారత విద్యార్థులే. 20.4 శాతంతో చైనా రెండో స్థానంలో ఉంది. మొత్తంగా చైనా విద్యార్థుల సంఖ్య 2023తో పోలిస్తే 0.25 శాతం తగ్గడం విశేషం.ఆసియా దేశాల హవా..అమెరికాలో చదువుతున్న విదేశీయుల్లో ఆసియా దేశాల హవా కొనసాగుతోంది. మొత్తం 15.8 లక్షల మంది విదేశీ విద్యార్థుల్లో 71.7 శాతం, అంటే 11,34,953 మంది ఆ దేశాలవారేనని నివేదిక తెలిపింది. -
లాస్ ఏంజెలెస్ రణరంగం
లాస్ ఏంజెలెస్: అధ్యక్షుడు ట్రంప్ తన అసాధారణ అధికారాలను ఉపయోగించి నేషనల్ గార్డ్లను రంగంలోకి దింపడంతో మరింత పేట్రేగిపోయిన ఆందోళనకారులు తమ ఉద్యమాన్ని ఉదృతంచేశారు. రోడ్లపై కనిపించిన కారునల్లా దహనంచేసి ఉద్యమాగి్నజ్వాలల్ని మరింత రగిలించారు. దీంతో లాస్ ఏంజెలెస్ నగర వీధులు ఒక్కసారిగా రణరంగంగా మారిపోయాయి. అక్రమవలసదారులను ఫెడరల్ ఏజెంట్లు, ఎఫ్బీఐ, పోలీసులు అరెస్ట్చేయడాన్ని వేలాది మంది ఆందోళనకారులు నిరసించడంతో మొదలైన ఉద్యమం నెమ్మదిగా ఉగ్రరూపం దాల్చుతోంది. ఓవైపు సరైన డాక్యుమెంట్లులేని వలసదారులను అధికారులు అదుపులోకి తీసుకుంటూ, ఆ అధికారులు, ప్రభుత్వ భవనాలకు రక్షణగా నేషనల్ గార్డ్లను ట్రంప్ సర్కార్ రంగంలోకి దింపడంతో నిరసనకారులు మరింతగా రెచ్చిపోయారు. ఫ్రీవే మూసివేత పారామౌంట్ పట్టణంలోని ప్రధాన రహదారిని దిగ్బంధించారు. దక్షిణదిశలో వాహనాల రాకపోకలకు ఉపయోగించే 101 నంబర్ ఫ్రీవే రహదారిని మూసేశారు. అడ్డుకునేందుకు వచ్చిన కాలిఫోర్నియా హైవే పెట్రోల్ అధికారులపైకి నిరసనకారులు చేతికొచ్చిన వస్తువుతో విరుచుకుపడ్డారు. కాంక్రీట్ ముక్కలు, రాళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్ విడిభాగాలు, బాణసంచాను అధికారులపైకి విసిరేశారు. వేలాదిగా ఆందోళనకారులు గుమికూడడంతో వెంటనే అందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని లేదంటే అరెస్ట్లు తప్పవని పోలీసులు మెగాఫోన్లో ప్రకటించారు. అక్రమవలసల ఏరివేత కోసం నేషనల్ గార్డ్లను ఉపయోగించబోమని, కేవలం అధికారులు, డిటెన్షన్ సెంటర్ భవనాల రక్షణ నిమిత్తమే వాళ్లను రప్పించామని లాస్ఏంజెలెస్ పోలీస్ చీఫ్ జిమ్ మెక్డొనెల్ చెప్పారు. డజన్ల కొద్దీ ఆందోళనకారులను అరెస్ట్చేశామని తెలిపారు. పెట్రోల్ బాంబు విసిరినందుకు ఒకరిరి, అధికారులను బైక్తో ఢీకొట్టినందుకు మరొకరిని అరెస్ట్చేశారు. ఫేస్ మాస్క్ లు ధరించొద్దు ఫేస్మాస్క్ ధరించి ఆందోళనల్లో పాల్గొంటే ఉపేక్షించేది లేదని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టంచేశారు. ఫేస్మాస్క్తో ఎవరు కనిపించినా అరెస్ట్ చేయండని అధికారులకు ట్రంప్ తన సొంత సోషల్ మీడియా మాధ్యమం ‘ట్రూత్ సోషల్’ ద్వారా సూచించారు. ఉదయాన్నే నేషనల్ గార్డ్లు రావడంతో ఆందోళనకారుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. రాష్ట్ర పోలీసులు ఉండగా ఫెడరల్ సాయుధవిభాగమైన మీకు ఇక్కడేం పని అంటూ అందోళనకారులు వారితో వాగ్వాదానికి దిగారు. ‘‘ సిగ్గులేదు. ఇంటికి పొండి’’ అంటూ ఎద్దేవాచేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు బలగాలు పొగబాంబులు, భాష్పవాయుగోళాలు, ఫ్లాష్బ్యాంగ్ గ్రనేడ్లను ప్రయోగించారు. దీంతో వాహనాల రాకపోకలను ఆందోళనకారులు 101 ఫ్రీవేపై నిలిపేశారు. సాయంత్రంకల్లా రాష్ట్ర పెట్రోల్ అధికారులు వారిని చెదరగొట్టి రహదారిపై రాకపోకలను పునరుద్దరించారు. దీంతో ఆగ్రహించిన నిరననకారులు అక్కడే నిలిపి ఉంచిన నాలుగు స్వయంచోదిత(సెల్ఫ్ డ్రైవింగ్) వేమో సంస్థ కార్లకు నిప్పంటించారు. మంటలు అంతటా అంటుకోవడంతో ఆ కార్ల నుంచి పేలుడు శబ్దాలు వినిపించాయి. గూగుల్కు చెందిన ఈ కార్లు రోబోట్యాక్సీ సేవలందిస్తున్నాయి. ఉద్యమకారులు రెచ్చిపోతుండటంతో అధికారులు వెంటనే లాస్ఏంజెలెస్ డౌన్టౌన్ ప్రాంతాల్లో జనసంచారంపై నిషేధాజ్ఞలు విధించారు. గుమికూడితే అరెస్ట్చేస్తామని అనౌన్స్మెంట్ ఇచ్చారు. సమాఖ్య విధానాన్ని కాలరాయడమే ‘‘ కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉద్యమాలు వెల్లువెత్తితే సద్దుమణిగేలా చేసే బాధ్యత ఆ రాష్ట్రానిదే. మా రాష్ట్రంలో సమస్యలుంటే మేం పరిష్కరించుకుంటాం. నేషనల్ గార్డ్లను రంగంలోకి దింపాల్సిన అవసరమేంటి?. గార్డ్లను దింపి సమాఖ్య విధానానికి ట్రంప్ సర్కార్ తూట్లుపొడుస్తోంది. ఇది రాష్ట్రాల సార్వ¿ౌమత్వానికి తీవ్ర విఘాతం కల్గించడమే. అధ్యక్షుడి నిర్ణయాన్ని నేను న్యాయస్థానంలో సవాల్ చేస్తా’’ అని డెమొక్రటిక్ పార్టీ నేత, కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ నూసమ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గవర్నర్ అనుమతి, ఆమోదంలేకుండా కాలిఫోర్నియా రాష్ట్రంలోకి నేషనల్ గార్డ్లను కేంద్రప్రభుత్వం రప్పించడం ఇటీవలి దశాబ్దాల్లో ఇదే తొలిసారి. చివరిసారిగా 1965లో నాటి దేశాధ్యక్షుడు లిండన్ బి.జాన్సన్ అలబామాలో పౌరహక్కుల ఉద్యమాన్ని అదుపులోకి తెచ్చేందుకు అమెరికాసైన్యంలో రిజర్వ్ బలగాలైన ‘నేషనల్ గార్డ్’లను రప్పించారు. ‘‘ఆందోళనకారులు శాంతించాలి. నేషనల్ గార్డ్లను తీసుకొచ్చి ఆందోళనకారుల ఆగ్రహజ్వాలలను ట్రంప్ మరింత రాజేశారు. ప్రజలకు రక్షణగా వాళ్లను రప్పించినట్లు కనిపించట్లేదు. ట్రంప్కు మరేదో ఎజెండా ఉన్నట్లుంది’’ అని లాస్ ఏంజెలెస్ నగర మహిళా మేయర్ కరెన్ బాస్ వ్యాఖ్యానించారు. ఆందోళనలు తొలుత లాస్ ఏంజెలెస్ డౌన్టౌన్లో మొదలు తర్వాత పారామౌంట్ పట్టణానికి పాకి ప్రస్తుతం సమీప కాంప్టన్ పట్టణంలో విస్తరిస్తున్నాయి. గత వారంతానికి 100 మందికిపైగా అక్రమవలసదారులను ఫెడరల్ ఏజెంట్లు అరెస్ట్చేసి డిటెన్షన్ సెంటర్లకు తరలించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో 60 మందిని అరెస్ట్చేశారు.విదేశీ జర్నలిస్ట్లకు గాయాలు డౌన్టౌన్ లాస్ఏంజెలెస్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ నుంచి వలసదారులను విడిచిపెట్టాలని ఉద్యమకారులు నినాదాలుచేశారు. అప్పుడు అక్కడ ఆ్రస్టేలియాకు చెందిన 9న్యూస్ టీవీఛానెల్ మహిళా పాత్రికేయురాలు లారెన్ థామస్ రిపోరి్టంగ్ చేస్తున్నారు. అదే సమయంలో ఉద్యమకారులను చెదరగొట్టేందుకు నగర పోలీసులు, నేషనల్ గార్డ్ బలగాలు రబ్బర్ బుల్లెట్ల గన్లను పేల్చారు. దీంతో ఒక రబ్బర్ బుల్లెట్ లారెన్కు తగిలింది. ప్రత్యక్ష ప్రసారం వేళ ఈ ఘటన జరిగింది. విలవిల్లాడుతున్న ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. బ్రిటిష్ ఫొటోజర్నలిస్ట్ నిక్ స్టెర్న్కు సైతం రబ్బర్ బుల్లెట్ తగలి ఐదు సెంటీమీటర్ల లోతు గాయమైంది. ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు స్వీకరించాక దేశవ్యాప్తంగా 1,00,000 మందిని అరెస్ట్చేసినట్లు ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) విభాగం ప్రకటించింది. ట్రంప్ అధ్యక్షుడైన తొలి 100 రోజుల్లో రోజుకు 660 మంది చొప్పున అరెస్ట్చేశారు. గురువారంనాటికి డిటెన్షన్ సెంటర్లలో ఏకంగా 54,000 మంది వలసదారులున్నారు. నేషనల్ గార్డ్లను రప్పించడానికి శ్వేతసౌధం సమరి్థంచుకుంది. కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ అసమర్థ పాలన కారణంగా ఇమిగ్రేషన్ అధికారులకు రక్షణ కరువైంది. అందుకే గార్డ్లను అనుమతించాం’’ అని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లెవిట్ చెప్పారు. లాస్ ఏంజెలెస్లో కొన్ని చోట్ల ఆందోళనకారులు దుకాణాలను లూటీచేశారని పోలీసులు చెప్పారు. పరిస్థితి చేయిదాటితే 500 మంది నేవీ మెరైన్లను రప్పిస్తామని యూఎస్ నార్తర్న్ కమాండ్ హెచ్చరించింది. -
#Axiom4: శుభాంషు శుక్లా అంతరిక్ష యాత్ర వాయిదా
యాక్సియమ్ స్పేస్ సంస్థ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ISS)కి చేపట్టిన నాలుగో మావన సహిత అంతరిక్ష యాత్ర వాయిదా పడింది. ఈ నెల 10న సాయంత్రం 5.52 గంటలకు (భారత కాలమానం ప్రకారం) నింగిలోకి దూసుకెళ్లాల్సింది. అయితే ప్రతికూల వాతావరణంతో రెండు రోజులు వాయిదా వేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ యాత్ర కోసం చేపట్టనున్న నాలుగో మావన సహిత అంతరిక్ష యాత్ర భారత్కు చెందిన కెప్టెన్ శుభాంశు శుక్లాను(shubhanshu shukla) ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) పయనం కావాల్సి ఉంది. వాస్తవానికి యాక్సియం-4 మిషన్ కోసం వీరు గత నెల 29నే నింగిలోకి పయనం కావాల్సింది. అయితే, దాన్ని తొలుత ఈ నెల 8కి, అనంతరం 10కి మార్చారు. తాజాగా మరోసారి వాయిదా పడింది.Launch Of Axiom-4 Mission To ISS Postponed To June 11 Due To Bad Weather#Axiom4 #ShubhanshuShuklahttps://t.co/wsEgLTMx4R— NewsMobile (@NewsMobileIndia) June 9, 2025తాజా షెడ్యూల్ ప్రకారం జూన్ 11వ తేదీన ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్లో ఈ మిషన్ ప్రారంభం కానుంది. 28 గంటల ప్రయాణానంతరం ఐఎస్ఎస్ చేరుకుని, అక్కడ 14 రోజులు గడుపుతారు. శుభాంశు శుక్లా (భారతదేశం), పెగ్గీ విట్సన్ (అమెరికా), స్లావోస్ట్ ఉజ్నాన్స్కీ (పోలండ్), టిబర్ కపు (హంగరీ) ఈ యాత్రలో పాల్గొంటారు. యాక్సియమ్ స్పేస్ (Axiom Space) ద్వారా చేపట్టబడిన ఈ మిషన్, "ఏఎక్స్-4" (AX-4) అని పిలుస్తారు. భారత్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్షయాత్ర ‘గగన్యాన్’ కోసం ఇస్రో తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ముందే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) మన వ్యోమగామి పంపించడం విశేషం. ఐఎస్ఎస్లో శుక్లా చేపట్టబోయే ప్రయోగాలు గగన్యాన్కు ఎంతో ఉపకరిస్తాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ భావిస్తోంది. ఇక.. 1984లో రష్యాకు చెందిన సోయుజ్ రాకెట్ ద్వారా రోదసీ యానం చేసిన రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా కావడం గమనార్హం. -
Indian Student In USA: బేడీలేసి.. బలంగా అదిమిపట్టి
వాషింగ్టన్: విదేశీ విద్యార్థుల విషయంలో ట్రంప్ సర్కార్ కర్కశ వైఖరి తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చింది. ఒక భారతీయ విద్యార్థిని బలవంతంగా ఇండియాకు తరలిస్తూ అతని పట్ల దారుణంగా వ్యవహరించిన వ్యవహారం ఆలస్యంగా మీడియాకు బహిర్గతమైంది. విద్యార్థిని నేరస్తుడి తరహాలో సంకెళ్లు వేసి, దారుణంగా హింసిస్తూ నేలకేసి అదిమిపట్టి అదుపులోకి తీసుకుంటున్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. విద్యాభ్యాసం కోసం తమ దేశానికి వచ్చిన విదేశీ విద్యార్థుల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్న అమెరికా ప్రభుత్వ వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెవార్క్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అక్కడే ఉన్న కునాల్ జైన్ అనే ఒక ప్రవాసభారతీయుడు తన కెమెరాలో ఈ దృశ్యాలను బంధించి తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్చేయడంతో ఈ దారుణోదంతం బహిర్గతమైంది. హరియాణా రాష్ట్రం నుంచి వచ్చిన ఒక భారతీయ యువకుడిని నెవార్క్ ఎయిర్పోర్ట్కు పోలీసులు సంకెళ్లు వేసి తీసుకొచ్చారు. నేనే తప్పు చేయలేదని అరుస్తున్న ఆ యువకుడిని పోలీసులు వెంటనే కిందపడేసి నేలకేసి బలంగా అదిమిపట్టారు. ఒక పోలీసు ఆ యువకుడి మీదనే కూర్చున్నాడు. ‘‘ నేరస్తుడిలా సంకెళ్లు వేయడంతో ఏడుస్తున్న ఆ విద్యార్థిని చూస్తుంటే చాలా జాలివేసింది. కలలను నిజం చేసుకునేందుకు అమెరికాకు వచ్చిఉంటాడు. ఎవరికీ ఏ హానీ తలపెట్టకపోయినా ఇలా అరెస్ట్ అయ్యాడు. ఈ ఘటనను కళ్లారా చూస్తూకూడా నేను నిస్సహాయుడినైపోయా. నా హృదయం ముక్కలైంది. చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులను ఇలా బలవంతంగా పంపేయడం నిజంగా పెద్ద విషాదం. ఆ అబ్బాయి హరియాణా యాస అయిన హర్యాణ్వీలో మాట్లాడుతున్నాడు. ‘‘నాకేం పిచ్చిలేదు. ఈ అధికారులు నేను పిచ్చివాడిని అని అందర్నీ న మ్మించేందుకు కుట్ర పన్నారు’’ అని ఆ విద్యార్థి అరవడం ఆ వీడియోలో కనిపించింది. Here more videos and @IndianEmbassyUS need to help here. This poor guy was speaking in Haryanvi language. I could recognise his accent where he was saying “में पागल नहीं हूँ , ये लोग मुझे पागल साबित करने में लगे हुए हे” pic.twitter.com/vV72CFP7eu— Kunal Jain (@SONOFINDIA) June 8, 2025ఇండియన్ ఎంబసీ ఆదుకోవాలి‘‘ఇలాంటి విద్యార్థుల అంశంలో అమెరికాలోని భారతీయ రాయబార కార్యాలయం, భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ జోక్యం చేసుకుని విద్యార్థులకు తగు న్యాయం జరిగేలా చూడాలి. నెవార్క్ ఎయిర్పోర్ట్లో ఇతని పట్ల దారుణంగా ప్రవర్తించిన న్యూజెర్సీ అధికారులతో మాట్లాడేందుకు కొందరు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది’’ అని జైన్ రాసుకొచ్చారు. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే విదేశీ విద్యార్థుల వీసా గడువును ముగించేసి వాళ్లను బలవంతంగా దేశబహిష్కరణ చేస్తున్న వేళ తాజాగా ఈ ఘటన జరగడం గమనార్హం. పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్, అమెరికా వ్యతిరేక భావజాలం ఉన్న విదేశీ విద్యార్థులను గుర్తించి గెంటేస్తున్న ఉదంతాలు ఇప్పుడు అమెరికాలో ఎక్కువయ్యాయి. -
ఎనిమిది నిమిషాలు చనిపోయి.. ఏమైందో చెప్పిన మహిళ
కొలరాడో: మృత్యువు అనేది ఒక అంతుచిక్కని రహస్యం. జననం ఆవలి మరణంలో ఏముందో తెలుసుకోవాలని మనిషి కొన్ని వేల ఏళ్ల తరబడి ప్రయోగాలు చేస్తున్నాడు. ఈ నేపధ్యంలోనే పలు ఊహాగానాలు పుట్టుకువస్తున్నాయి. అయితే వీటికి స్పష్టమైన ఆధారాలు ఉండటం లేదు. తాజాగా అమెరికాకు చెందిన ఒక మహిళ ‘స్ఫృహ’కు ఆవతలివైపు ఏముందో చూశానని చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది.కొలరాడోకి చెందిన బ్రియానా లాఫెర్టీ(33) తాను నిర్జీవ శరీరంతో తేలుతూ కాలం తెలియని లోకంలోకి ప్రవేశించానని చెప్పింది. ఆమె మయోక్లోనస్ డిస్టోనియా అనే వ్యాధితో బాధపడుతోంది. వైద్యులు ఆమె చనిపోయిందని ప్రకటించిన ఎనిమిది నిముషాల తరువాత ఆమె లేచి కూర్చుని, తనకు ఇంతలో ఏమి జరిగిందో వివరించింది. చివరిసారిగా తనకు ‘సిద్ధంగా ఉన్నారా’? అనే మాట వినిపించిందని లాఫెర్టీ తెలిపారు. ఆ తర్వాత అంతా చీకటిగా మారిందన్నారు. ‘మరణం ఒక భ్రమ? ఆత్మ ఎన్నటికీ చనిపోదు. మన స్పృహ సజీవంగా ఉంటుంది. అది రూపాంతరం చెందుతుంది. మరణానంతర జీవితంలోనూ నా ఆలోచనలు కొనసాగాయి. అక్కడ మన ఆలోచనలు వాస్తవికతను చూస్తాయని నేను గ్రహించాను. ఇది ఒక వరం’ అని లాఫెర్టీ ‘ది మిర్రర్’కు చెప్పారు.ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ఆ సమయంలో నేను అకస్మాత్తుగా నా భౌతిక శరీరం నుండి విడిపోయాను. నేను అప్పటి నా మానవ స్వభావాన్ని చూడలేదు. గుర్తుంచుకోలేదు. నేను పూర్తి నిశ్చలంగా ఉన్నాను. సజీవంగా, అవగాహనతో, గతంలో కంటే అధిక ప్రశాంతతను అనుభూతి చెందాను. ఎటువంటి నొప్పీలేదు. కేవలం ప్రశాంతత, స్పష్టత మాత్రమే ఉంది. ఆ సమయంలో మన భూసంబంధమైన ఉనికి అంతం కాదని కనుగొన్నాను. అక్కడ మనకంటే ఉన్నతమైన ఉనికి, తెలివితేటలు ఉన్నాయి. అవి బేషరతు ప్రేమతో మనల్ని ముందుకు నడిపిస్తాయి. అక్కడ సమయం అనేది లేదు. అయినప్పటికీ అంతా పరిపూర్ణంగా ఉంది’ అని లాఫెర్టీ తెలిపారు.నిజానికి మరణానికి దగ్గరగా ఉన్న అనుభవాలు సంక్లిష్టమైనవి. వాటిని వివరించడం కష్టం అని అంటుంటారు. కానీ శాస్త్రవేత్తలు వాటిని అర్థం చేసుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. 2022లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం మానవ మెదడు మరణం అంచుకు చేరినప్పడు, జీవితంలో ముఖ్య ఘట్టాలను గుర్తుచేసుకుంటుంది. ఇటీవల కెనడాలోని కాల్గరీ విశ్వవిద్యాలయంలో జరిగిన పరిశోధనల్లో జీవులన్నీ జీవితాంతం తమ చుట్టూ ఒక కాంతిని వెదజల్లుతాయని, అయితే ఆ జీవి చనిపోయినప్పుడు ఆ కాంతి అదృశ్యమవుతుందని వెల్లడయ్యింది. ఇది కూడా చదవండి: రాజ్తో సంబంధం.. రాజాతో పెళ్లి?.. ‘హనీమూన్ జంట’కథలో అసలు నిజం -
దాదాపు 200 ఏళ్ల నాటి కండోమ్ : ఎగబడుతున్న జనం
నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్లోని రిజ్క్స్మ్యూజియంలో దాదాపు 200 ఏళ్ల నాటి, మంచి కండిషన్లో ఉన్న కండోమ్ (Condome) ను ప్రదర్శనకు ఉంచారు. ఈ కండోమ్ను గొర్రె అపెండిక్స్ (పేగు)తో తయారు చేసినట్టు భావిస్తున్నారు. దీనిపై ఉన్న ఒక పెయింటింగ్ కూడా చర్చనీయాంశంగా మారింది. ఒక నన్, ముగ్గురు మతాధికారులు ఉన్న ఈ పెయింటింగ్ను "లగ్జరీ సావనీర్"గా పేర్కొంటూ వేలానికి ఉంచారు. అంతేకాదు ఈ మ్యూజియం కళా సేకరణలో ఉంచిన తొలి గర్భనిరోధక సాధకం ఇదేనట.1830 నాటి ఈ కండోమ్, 19వ శతాబ్దపు వ్యభిచారం , లైంగికతపై జరిగే ప్రదర్శనలో భాగమని మ్యూజియం నిర్వాహకులు వె ల్లడించారు. ఇంకా ఈ డచ్ మ్యూజియంలో దాదాపు 7,50,000 వరకు ప్రింట్లు, డ్రాయింగ్లు, ఫోటోలు కూడా ప్రదర్శనకు ఉన్నాయి. ఉన్నాయి."అక్కడ, అది నా ఎంపిక' అని అర్థం వచ్చే ‘వోయిలా మోన్ చోయిక్స్’( ఇది నా చాయిస్) అనే శాసనం బ్రహ్మచర్యం , గ్రీకు పురాణాల నుండి పారిస్ తీర్పు రెండింటికీ అనుకరణగా ఉందని మ్యూజియం తెలిపింది.చదవండి: Weight Loss వేగంగా బరువు తగ్గాలంటే..చూసేందుకు ఎగబడుతున్న జనంఈ కళాఖండాన్ని ప్రదర్శనలో ఉంచినప్పటి నుంచీ, మ్యూజియం యువకులు, వృద్ధులతో నిండిపోయిందని రిజ్క్స్మ్యూజియం క్యూరేటర్ జాయిస్ జెలెన్ తెలిపారు. స్పందన అద్భుతంగా ఉందన్నారు. అయితే మొదటిసారి వేలంలో మొదటిసారి ఈ కండోమ్ను ఉంచినపుడు తాను, తన సహద్యోగి నవ్వుకున్నామని ఆమె గుర్తు చేసుకున్నారు. 2024లో జరిగిన ఒక వేలంలో మ్యూజియం దీనిని కొనుగోలు చేసిందట. ఆ తర్వాత వారు దాన్ని అతినీలలోహిత (UV) కాంతిలో పరీక్షించారు. అలా ఆ కండోమ్ను ఎవరూ ఉపయోగించ లేదని భావిస్తున్నామన్నారు. 2025 నవంబర్ చివరి వరకు ఈ కండోమ్ ప్రదర్శనలో ఉంటుంది. -
11న ఇమ్రాన్ ఖాన్ విడుదల?
హైదరాబాద్: అల్–ఖాదిర్ ట్రస్ట్ కేసులో బెయిల్ లభిస్తే జూన్ 11వ తేదీన పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి విడుదలయ్యే వీలుందని పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ చీఫ్ గోహర్ అలీఖాన్ ప్రకటించారు. దాదాపు రూ.2,200 కోట్ల అల్–ఖాదిర్ యూనివర్సిటీ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్ ఖాన్, అతని భార్య బుష్రా బీబీలకు పడిన శిక్షలను రద్దుచేయాలంటూ దాఖలైన పిటిషన్లపై ఇస్లామాబాద్ హైకోర్టు జూన్ 11న నిర్ణయం తీసుకోనుందని అలీఖాన్ ఆదివారం చెప్పారు. పదవి కోల్పోయాక 72 ఏళ్ల ఇమ్రాన్ 2023 ఆగస్ట్ నుంచి రావల్పిండి నగరంలోని అడియాలా జైలులో గడుపుతున్నారు. -
గ్రెటా థన్బర్గ్కు ఘోర అవమానం.. గాజా దారిలో ఇజ్రాయెల్ అడ్డగింత
గాజా: యుద్ధంతో మరుభూమిగా మారుతున్న గాజాపై ఇజ్రాయెల్ మరోమారు తన ప్రతాపాన్ని చూపింది. స్వీడిష్ పర్యావరణ కార్యకర్త, ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ పేరుతో ఉద్యమాన్ని ఉద్యమాన్ని నడుపుతున్న గ్రెటా థన్బర్గ్తో పాటు పలువురిని గాజా స్ట్రిప్కు తీసుకువెళుతున్న మానవతా నౌక(హ్యూమానిటేరియన్ షిప్)ను ఇజ్రాయెల్ కమాండోలు అడ్డుకున్నారు.ఈ నౌకలో పాలస్తీనా అనుకూల ఫ్రీడమ్ ఫ్లోటిల్లా కూటమి (ఎఫ్ఎప్సీ)కి చెందిన కార్యకర్తలలో పాటు యూరోపియన్ పార్లమెంట్ (ఎంఈపీ) సభ్యురాలు రిమా హసన్ కూడా ఉన్నారు. తాజాగా లైఫ్ జాకెట్లు ధరించి, చేతులు పైకెత్తి కూర్చున్న కొందరి ఫోటోను ఇజ్రాయెట్ పోస్ట్ చేసింది. ఫ్రీడమ్ ఫ్లోటిల్లా సిబ్బందిని ఇజ్రాయెల్ సైన్యం అంతర్జాతీయ జలాల్లో తెల్లవారుజామున అరెస్టు చేసిందని ఇజ్రాయెల్ పేర్కొంది. మానవతావాద సమూహాల కూటమి(ఎఫ్ఎప్సీ)టెలిగ్రామ్ యాప్లో మాడ్లీన్తో సంబంధం కోల్పోయామని, ప్రయాణికులను ఇజ్రాయెల్ దళాలు కిడ్నాప్ చేశాయని పేర్కొంది. The crew was arrested in international waters. pic.twitter.com/ydjA9yZHSC— Rima Hassan (@RimaHas) June 9, 2025శుక్రవారం సిసిలీ నుంచి బయలుదేరిన ఈ నౌక ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి ముందు నుంచి గాజాపై ఇజ్రాయెల్ నావికా దిగ్బంధనను సవాలు చేస్తూ వస్తోంది. అలాగే బాధితులకు సహాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఎఫ్ఎప్సీ తెలిపింది. తాజాగా ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ నౌకను సెలబ్రిటీల సెల్ఫీ నౌకగా పేర్కొంది. అది ఇజ్రాయెల్ తీరానికి సురక్షితంగా చేరుకుంటుందని, ఓడలో ప్రయాణిస్తున్న కార్యకర్తలు ప్రచారం పొందడానికి, మీడియాను రెచ్చగొట్టడానికి ప్రయత్నించారని ఆరోపించింది.గడచిన రెండు వారాల్లో 1,200కు పైగా సహాయ ట్రక్కులు ఇజ్రాయెల్ నుండి గాజాలోకి ప్రవేశించాయని, గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ గాజాలోని పౌరులకు దాదాపు 11 మిలియన్ల ఆహారాన్ని పంపిణీ చేసిందని ఇజ్రాయెల్ ఒక పోస్టులో పేర్కొంది. మాడ్లీన్ గాజాకు చేరుకోకుండా, అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఆదేశించిన దరిమిలా ఈ ఓడను ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంది. గాజాలోని హమాస్ ఉగ్రవాదులకు ఆయుధాలు చేరకుండా నిరోధించడానికే ఇటువంటి చర్యలు చేపడుతున్నామని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇది సహాయం కాదని, ప్రచార స్టంట్ అని, వారి వద్ద 100 పౌండ్ల కంటే తక్కువ విలువచేసే సహాయక సామగ్రి ఉందని, ప్రతిరోజూ గాజాకు పంపిణీ అవుతున్న దాని కన్నా ఇది చాలా తక్కువ మొత్తం అని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ ప్రతినిధి గై నిర్ మీడియాకు తెలిపారు.అయితే ఇజ్రాయెల్ చేపట్టిన ఈ సముద్ర దిగ్బంధం చట్టవిరుద్ధమని ఎఫ్ఎప్సీ పేర్కొంది.గాజాకు చేరుకునేందుకు మేము చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకునే హక్కు ఇజ్రాయెల్కు లేదని ఒక ప్రకటనలో తెలిపింది. ఎఫ్ఎప్సీ నౌక కాన్సైన్స్ గత మేలో మొదటిసారి గాజాకు చేరుకోవడానికి ప్రయత్నించింది. అయితే మాల్టా తీరంలో అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఈ నౌకపై డ్రోన్ దాడి జరగడంతో ప్రయాణం రద్దయ్యింది.ఇది కూడా చదవండి: హనీమూన్ జంట కేసులో బిగ్ ట్విస్ట్.. ప్లాన్ ప్రకారమే భార్య.. -
కర్మ అంటే ఇదేనేమో.. ట్రంప్పై మాస్ ట్రోలింగ్
వాషింగ్టన్: ‘కర్మ’ ఎవరినీ వదలదు అంటారు. అచ్చంగా ఇలాంటి అనుభవమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఎదురైంది. అంతకుముందు, మాజీ అధ్యక్షుడు జో బైడెన్.. విమానం ఎక్కుతున్న సమయంలో కిందపడిన సందర్భంలో ట్రంప్ ఆయనపై సెటైర్లు వేశారు. తాజాగా ట్రంప్ కూడా విమానం ఎక్కుతూ అలాగే కింద పడబోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ క్రమంలో పలువురు నెటిజన్లు ట్రంప్పై సెటైరికల్ కామెంట్స్ చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూజెర్సీలోని ఎయిర్ఫోర్స్ వన్ విమానం మెట్లు ఎక్కుతున్న సమయంలో జారిపడ్డాడు. ట్రంప్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో క్యాంప్ డేవిడ్కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ట్రంప్ మెట్లపై చేయివేసి పైకి లేచారు. అనంతరం, రూబియో సైతం కిందపడ బోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను పలువురు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. బైడెన్ 2.0 ట్రంప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.Here is the whole video. Rubio stumbled as well. Was raining before.Post the whole thing pic.twitter.com/RKVLBZR29Y— Adi 🎗 (@Adi13) June 8, 2025ఇక, జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మెట్లు ఎక్కుతున్న సమయంలో బైడెన్ పలు సందర్భాల్లో కింద పడిపోయారు. దీంతో, బైడెన్ను టార్గెట్ చేసిన ట్రంప్.. పలుమార్లు ఎగతాళి చేసి మాట్లాడారు. ఇప్పుడు అలాంటి విచిత్ర పరిణామామే ట్రంప్కు కూడా ఎదురైంది. 🚨 BREAKING: DOWN GOES DONALDTrump just stumbled and almost faceplanted boarding Air Force One. I’ve been telling you — he drags his legs and he’s clearly not well.When Biden stumbled, the media lost its mind and Tapper wrote an entire fake “nonfiction” book.Where are they… pic.twitter.com/MZlHfbfDUJ— Chris D. Jackson (@ChrisDJackson) June 8, 2025WATCH: President Joe Biden stumbles and falls up the stairs while boarding Air Force One pic.twitter.com/1m7tecpsxc— The Post Millennial (@TPostMillennial) March 19, 2021 -
ప్రధాని మోదీకి బంగ్లా యూనస్ లేఖ.. ఏమన్నారంటే..
ఢాకా: భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్కు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖ రాయగా, దానికి అతను స్పందిస్తూ మరో లేఖ రాశారు. ఇరు దేశాల ప్రజల సంక్షేమం కోసం పరస్పర గౌరవం, అవగాహనా స్ఫూర్తి అవసరమని యూనస్ దానిలో పేర్కొన్నారు. ఈ రెండు లక్షణాలే ఇరు దేశాల ప్రజల సంక్షేమం కోసం మార్గదర్శనం చేస్తాయని అన్నారు. యూనస్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ఈ లేఖను పోస్ట్ చేశారు.ఈద్-ఉల్-అధా సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్కు, అక్కడి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని మోదీ లేఖ రాశారు. దీనికి స్పందించిన యూనస్ ప్రధాని మోదీ ఆలోచనాత్మక సందేశం ఇరు దేశాల మధ్య ఉత్తమ విలువలను ప్రతిబింబిస్తుందని తన లేఖలో పేర్కొన్నారు. ఈ పండుగ చాటిచెప్పే త్యాగం, దాతృత్వం, ఐక్యతా విలువలు ప్రజలను ఒకచోటకు చేరుస్తాయని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా కలిసి పనిచేసేందుకు ప్రేరణ కల్పిస్తాయని పేర్కొన్నారు. pic.twitter.com/gNlLbLv3E6— Chief Adviser of the Government of Bangladesh (@ChiefAdviserGoB) June 8, 2025దీనికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్కు రాసిన లేఖలో భారతదేశపు ఘనత దాని వైవిధ్యమైన సాంస్కృతిక వారసత్వం కారణంగానే వచ్చిందని పేర్కొన్నారు. శాంతియుతమైన, సమ్మిళితమైన ప్రపంచాన్ని నిర్మించడంలో త్యాగం, కరుణ, సోదరభావం విలువలను ఇది మనకు గుర్తు చేస్తుందని అన్నారు. ఇది కూడా చదవండి: రాహుల్ ‘ఫిక్సింగ్’ వ్యాసానికి సీఎం ఫడ్నవీస్ కౌంటర్ ఆర్టికల్ -
జర్నలిస్ట్ను బెదిరించిన ఖలిస్తానీ మద్దతుదారులు
వాంకోవర్: కెనడా గడ్డపై తరచూ భారత వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఖలిస్తానీ వేర్పాటువాదులు తాజాగా కెనడియన్ జర్నలిస్ట్ను బెదిరించారు. ర్యాలీని తన కెమెరాలో రికార్డ్ చేస్తున్నందుకు జర్నలిస్ట్ మోకా బెజిర్గన్ను కొట్టినంత పనిచేశారు. ఆదివారం జరిగిన ఈ ఘటన తాలూకూ వివరాలను మోకా తర్వాత వెల్లడించారు. ఉద్యమకారులంతా దుండగుల్లా వ్యవహరించారని, ఉద్దేశపూర్వకంగా తనను లక్ష్యంగా చేసుకున్నారని మోకా చెప్పారు. ‘‘ ఈ ఘటన జరిగిన రెండు గంటలవుతున్నా నా శరీరం ఇంకా వణికిపోతోంది. ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్లు వ్యవహరించారు. నన్ను చుట్టుముట్టి బెదిరించారు. నా ఫోన్ బలవంతంగా లాక్కున్నారు. గతంలో ఖలిస్తానీ ఉద్యమాలపై సొంతంగా రిపోర్టింగ్ చేసినందుకు నాపై కక్షగట్టారు. ఖలిస్తానీవేర్పాటువాదులపై నేను తటస్థ వైఖరిని ప్రదర్శించడం వాళ్లకు నచ్చలేదనుకుంటా. అందుకే నన్ను కొట్టినంత పనిచేశారు. కెనడా, బ్రిటన్, అమెరికా, న్యూజిలాండ్లలో ఖలిస్తానీయుల వైఖరిని నా రిపోర్టింగ్ ద్వారా ప్రపంచానికి తెలియజేశా. అందుకే గతంలో వీళ్లు నన్ను ఆన్లైన్లో ఇష్టమొచ్చిన పదజాలంతో తిట్టారు. ఆదివారం వాంకోవర్లో వాళ్ల ర్యాలీని నేను కెమెరాలో రికార్డ్చేస్తుంటే అడ్డుకున్నారు. టచ్ చేస్తే ఊరుకునేది లేదని బెదిరించారు. నా పనికి అడ్డురావొద్దని వారించినా వాళ్లు వినిపించుకోలేదు. పదేపదే నా వెనకాల పడ్డారు. ముఖ్యంలో వారిలో ఒకడు నన్ను బాగా ఇబ్బంది పెట్టాడు. అందుకే అతనిపై పోలీసులకు ఫిర్యాదుచేశా. గతంలోనూ అతనిపై ఫిర్యాదుచేశా’’ అని జర్నలిస్ట్ మోకా తర్వాత ఒక వీడియోను విడుదలచేశారు. కెనడాలో ఖలిస్తానీవేర్పాటువాదుల ఆగడాలు ఎక్కువయ్యాయని అక్కడి అధికార యంత్రాంగానికి భారత ప్రభుత్వం పలుమార్లు ఫిర్యాదుచేసినా కెనడా సర్కార్లో ఎలాంటి చలనం లేకపోవడం గమనార్హం. దీంతో ఖలిస్తానీ సానుభూతిపరులకు కెనడా స్వర్గధామంగా తయారైంది. -
అంతరిక్షంలో అంతుబట్టని వస్తువు
అంతరిక్షం అనంత రహస్యాల పుట్ట. మానవుడు ఇప్పటికీ గుర్తించని వింతలు, విడ్డూరాలకు అంతరిక్షంలో కొదవేలేదు. ఖగోళ శాస్త్రవేత్తలకు తాజాగా ఓ వింత అనుభవం ఎదురైంది. డీప్ స్పేస్లో ఓ గుర్తు తెలియని వస్తువును కనిపెట్టారు. అదేమిటన్నది వారికే అంతుబట్టడం లేదు. ఆ వస్తువు నుంచి రేడియో, ఎక్స్ తరంగాలు వెలువడుతున్నట్లు గుర్తించారు. అందులో తరచుగా పేలుళ్లు సంభవిస్తూ తరంగాలను ఉత్పత్తి చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వివరాలను జర్నల్ నేచర్లో ప్రచురించారు. ఈ అంతుబట్టని వస్తువు నుంచి ప్రతి 44 నిమిషాలకోసారి రెండు నిమిషాలపాటు బలమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఇది చాలా అసాధారణమని సైంటిస్టులు అంటున్నారు. ఇలాంటి పరిణామం మునుపెన్నడూ చూడలేదని స్పష్టంచేస్తున్నారు. ఇప్పటిదాకా అంతరిక్షంలో గుర్తించిన వస్తువుల్లో ఇలా తక్కువ సమయంలో తరచుగా సంకేతాలు వెలువడినట్లు తేలలేదు. ఈ కొత్త వస్తువును లాంగ్ పిరియడ్ ట్రాన్సియంట్(ఎల్పీటీ) కేటగిరీలో చేర్చారు. ఇది మ్యాగ్నేటర్ కావొచ్చని అంచనా వేస్తున్నారు. మృత నక్షత్రానికి చెందిన అత్యధిక ఆయస్కాంత శక్తి కలిగిన అవశేషాన్ని మ్యాగ్నేటర్ అంటారు. రాబోయే రోజుల్లో రేడియో, ఎక్స్–రే టెలిస్కోప్ల ద్వారా ఇలాంటి వస్తువులను మరిన్ని గుర్తించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. విశ్వం ఆవిర్భావం గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇవి దోహదపడతాయని చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కాలుష్య కణాలగుట్టువిప్పిన గణితవేత్త
పరిశ్రమల నుంచి, వాహనాల నుంచి వెలువడుతూ భూతాపోన్నతికి కారణమవుతున్న పొగ, కాలుష్యకారక కణాల గురించి శాస్త్రవేత్తలకు ఇప్పటికే ఒక అవగాహన ఉంది. వీటి కారణంగా ఏ స్థాయిలో కాలుష్యం సంభవిస్తోందో, వాతావరణ మార్పులో వీటి ప్రభావ స్థాయిలను పర్యావరణ వేత్తలు ఇప్పటికే అంచనావేయగల్గుతున్నారు. అయినాసరే ఆకస్మిక వర్షాలు, వరదలు వంటి వాటిని ఇప్పటికీ సరిగా అంచనావేయలేని పరిస్థితి. వీటికి కారణంగా గోళాకృతిలో లేని ఇతర రకాల కణాలు కారణమని శాస్త్రవేత్తలు కనుగొన్నారుగానీ వీటి పరిమాణాన్ని, ప్రభావాన్ని గణించే విధానాన్ని అభివృద్దిచేయలేకపోయారు. గత 15 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు ఆస్ట్రేలియాలోని మాక్వరైటన్ విశ్వవిద్యాలయంలోని గణిత శాస్త్రవేత్త, అసోసియేట్ ప్రొఫెసర్ స్టార్ట్ హాకిన్స్ పరిష్కారం కనుగొన్నారు. దీంతో మరింత ఖచి్చతత్వంతో వాతావరణ అంచనా సుసాధ్యంకానుంది. 2008లో వాతావరణ భౌతికశాస్త్రవేత్త మైఖేల్ బాక్స్ చేసిన ఒక ప్రసంగాన్ని హాకిన్స్ విన్నారు. వాతావరణమార్పులకు కారణమవుతున్న అన్ని ఆకృతుల కాలుష్యకణాలను లెక్కించకుండా మనం చేసే వాతావరణ అంచనాలు భవిష్యత్తులో అంత నిరుపయోగంగా మారే ప్రమాదంఉంది’’అని మైఖేల్ బాక్స్ చేసిన ప్రసంగం హాకిన్స్ను ఆలోచనల్లో పడేసింది. ఈ గజిబిజి ఆకృతుల కణాలను లెక్కగట్టే విధానాన్ని అభివృద్ధిచేసి ఈ పొల్యూషన్ పొడుపు ప్రశ్నకు సమాధానం వెతకాలని నిశ్చయించుకుని ఎట్టకేలకు 15 ఏళ్ల తర్వాత ఆ పనిలో సఫలీకృతులయ్యారు. ఏమిటీ కణాలు? వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వెలువడే ధూళి కణాలు గోళాకృతిలో ఉంటాయి. కానీ రాజస్థాన్లోని థార్ఎడారిసహా పలు గనుల తవ్వవం వంటి చోట్ల శిలలు క్రమంగా ఒరుసుకుపోయి, కోతకు గురై అత్యంత సూక్ష్మ శిలా కణాలు ఉద్భవించి గాల్లో కలుస్తున్నాయి. జీవఇంథనాలు మండించినపుపడు వెలువడే కొన్ని రకాల నుసి సైతం భిన్నాకృతిలో ఉంటోంది. ఢిల్లీలో చలికాలంలో నిర్మాణ పనుల వేళ గాల్లో కలిసే పరిశ్రమల వ్యర్థ్యాల నుంచి సైతం వేర్వేరు ఆకృతుల్లో ధూళి కణాలు వెలువడుతున్నాయి. వీటిని ప్రస్తుతమున్న వాతావరణ సిద్ధాంతాలతో గణించడం కష్టం. ఈ కణాలు గాల్లో అధికమై సూర్యరశ్మి భూమిపై పడకుండా అడ్డుకుని భూమిని చల్లబరచవచ్చు లేదంటే భూమి నుంచి వేడి బయటకు పోకుండా అడ్డుకుని భూతాపోన్నతికి కారణం కావచ్చు. ఈ రెండు దృగి్వషియాలను సైతం గోళాకృతియేతర కణాల కోణంలో లెక్కించాల్సి ఉంది. ప్రసరణ దిశలో ఏదైనా వస్తువు అడ్డుగా ఉంటే కాంతి దిశను మార్చుకుంటుంది. ఈ సిద్ధాంతాన్ని ఈ అసాధారణ ఆకృతి కణాలకు అన్వయిస్తూ కంప్యూటేషన్ మెథడ్ను హాకిన్స్ రూపొందించారు. ఇప్పుడీ గణిత సూత్రాలు భవిష్యత్తులో వైద్య ఇమేజింగ్ సాంకేతికతల ఆధునీకరణకూ ఉపయోగపడనున్నాయి. అ్రల్టాసౌండ్ , ఎంఆర్ఐ వంటి సాంకేతికతలు తరంగాలు మన శరీరంలో ఎలా ప్రయాణిస్తాయనే సూత్రాలపైనే ఆధారపడి పనిచేస్తాయి. కొత్త గణిత సూత్రాలతో అత్యాధునిక అ్రల్టాసౌండ్ , ఎంఆర్ఐ తీయొచ్చు. పలు రకాల కోటింగ్లలోనూ విరివిగా వాడొచ్చు. ఈ సూత్రాలను కాంతి విక్షేపణకు సంబంధించిన ప్రతి రంగంలోనూ ఉపయోగించవచ్చు. వడగాల్పులు, రుతుపవన అంచనాలు, కాలుష్య ప్రభావాలు వంటిలోనూ ఈ సూత్రాలను వాడొచ్చు. దీంతో వాతావరణ ముందస్తు హెచ్చరిక వ్యవస్థను మరింత బలోపేతం చేయొచ్చు. ఈ పరిశోధనా వివరాలు ‘క్వాంటేటివ్ స్పెక్ట్రోస్కోపీ, రేడియేటివ్ ట్రాన్స్ఫర్’జర్నల్లో ప్రచురితమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
లాస్ ఏంజెలెస్లో...ముదురుతున్న రగడ
పారామౌంట్(యూఎస్): అమెరికాలోకి అక్రమంగా చొరబడిన వారిని పట్టుకునేందుకు ట్రంప్ సర్కార్ మొదలెట్టిన ఏరివేత కార్యక్రమం మరింత ఉద్రిక్తంగా మారింది. అక్రమ అరెస్ట్లను ఆపితే ఆందోళనలు తగ్గుముఖం పడతాయని, బలగాలను మొహరించి సమస్యను మరింత జఠిలతరం చేయొద్దని విపక్ష డెమొక్రటిక్ పాలిత నగరాల మేయర్లు మొత్తుకుంటున్నాసరే ట్రంప్ ప్రభుత్వం ‘నేషనల్ గార్డ్’ బలగాలను రంగంలోకి దింపింది. ఒక్క లాస్ ఏంజెలెస్ పరిధిలోనే ఏకంగా 2,000 మంది కాలిఫోర్నియా నేషనల్ గార్డ్ సభ్యులు మొహరించారు. దీంతో వీరికి దీటుగా వందలాది మంది ఆందోళనకారులు తమ నిరసనలను ఉధృతంచేశారు. రెండో రోజూ రోడ్లపై చేరి ఫెడరల ఏజెంట్లు, ఎఫ్బీఐ, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పారామౌంట్ పట్టణంలోనూ.. లాస్ ఏంజెలెస్ సిటీ శివారులోని పారామౌంట్ పట్టణంలో హోంశాఖ వద్ద వందలాది మంది నిరసనకారులు గుమిగూడి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలుచేశారు. దీంతో వీళ్లను చెదరగొట్టేందుకు పోలీసులు అత్యంత తీక్షణ కాంతిని వెదజల్లే ఫ్లాష్ బ్యాంగ్ గ్రనేడ్లను విసిరారు. రబ్బర్ బుల్లెట్లను షూట్చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. లాస్ ఏంజెలెస్లో పలు ప్రాంతాల్లో ఆందోళనకారులపైకి పోలీసులు ఇలా భాష్పవాయు గోళాలు, పెప్పర్ బాల్స్, పొగ బాంబులను ప్రయోగించారు. పోలీసులు ప్రయాణిస్తున్న బోర్డర్ పెట్రోల్ వాహనాలపైకి ఆందోళనకారులు ఇటుకలు, రాళ్లు విసిరారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాహనాల రాకపోకలు స్తంభింపజేస్తూ వలసదారులు రోడ్లపై టైర్లను కాలి్చపడేశారు. ఇటీవలికాలంలో లాస్ ఏంజెలెస్ పరిధిలో 118 మంది వలసదారులు, ఐదుగురు నేరస్తులను అరెస్ట్చేసినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది. సైన్యాన్ని దింపుతాం: రక్షణ మంత్రి హెచ్చరిక ‘అక్రమ వలసదారులు, నేరగాళ్లను పట్టుకునేందుకు ఫెడరల్ ఏజెంట్లు చేస్తున్న ముమ్మర గాలింపు చర్యలను ఆందోళనకారులు ఇలాగే అడ్డుకుంటే అనివార్యపరిస్థితుల్లో మేం సైన్యాన్ని రంగంలోకి దింపాల్సి ఉంటుంది. క్యాంప్ పెడల్టన్లోని మెరైన్లనూ రప్పిస్తాం’ అని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ హెచ్చరించారు. మరోవైపు పారామౌంట్, కాంప్టన్ పట్టణాల్లో నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఒక కారుకు నిప్పంటించారు. పారామౌంట్ బిజినెస్ పార్క్ వద్ద ఇమిగ్రేషన్ అధికారులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. బాణసంచా కాలుస్తూ, షాపింగ్ కార్ట్లను రోడ్లపై పడేశారు. బోర్డర్పెట్రోల్ వాహనశ్రేణిపై రాళ్లు రువ్వారు. లాస్ ఏంజెలెస్ ఫెడరల్ డిటెన్షన్ భవనం వద్ద సైతం గుమిగూడి అరెస్టయిన వాళ్లను విడుదలచేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో వారిలో కొందరు పోలీసులు అరెస్ట్చేశారు. ‘‘వారెంట్ల ప్రకారం సైతం చాలా మంది అక్రమవలసదారులను ఆదివారం సైతం అరెస్ట్చేశాం. డ్యూటీ నిర్వహణకు అడ్డుపడిన డజన్లకొద్దీ జనాలనూ అరెస్ట్చేశాం’’ అని యూఎస్ అటార్నీ బిల్ ఈజీలీ ప్రకటించారు. అరెస్ట్ అయిన వారి ఫొటోలను తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్చేశారు. అక్రమ వలసదారుల ఏరివేత వేళ ఇమిగ్రేషన్, కస్టమ్స్ అధికారులకు ఎన్జీ బలగాలు తాత్కాలికంగా రక్షణగా ఉంటాయని ట్రంప్ చెప్పారు.నేషనల్ గార్డ్ రంగప్రవేశంపై అభ్యంతరాలు రాష్ట్రాల్లో శాంతి భద్రతల అంశాన్ని రాష్ట్రాలే పరిష్కరించుకుంటాయి. కానీ ట్రంప్ ఇలా అధ్యక్షుడి అసాధారణ అధికారాలను ఉపయోగించి నేషనల్ గార్డ్ను రప్పించడంపై లాస్ ఏంజెలెస్ మేయర్ కరెన్ బాస్, కాలిఫోరి్నయా గవర్నర్ గవిన్ న్యూసమ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ బలగాలపై గవర్నర్కే అధికారాలుంటాయి. కానీ టైటిల్ 10 అధికారాన్ని ఉపయోగించి నేషనల్ గార్డ్ బలగాలను ట్రంప్ రప్పించారు. గతంలో పౌరహక్కుల ఉద్యమం సమయంలోనూ దేశాధ్యక్షుడు ఈ టైటిల్10ను వాడి నేషనల్ గార్డ్ బలగాలను ఆయా ఉద్యమప్రాంతాలకు తరలించారు. గత అధ్యక్షులు ఐసన్హోవర్, జాన్ ఎఫ్.కెన్నడీ, జాన్సన్లూ ఈ నిబంధనను ప్రయోగించారు. 1967 డెట్రాయిట్ ఆందోళనలు, మారి్టన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యానంతరం సైతం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎన్జీ బలగాలను రప్పించారు. 1970 న్యూయార్క్ పోస్టల్ ఉద్యమాన్ని అణచివేసేందుకు ఆనాడు ఎన్జీ రంగంలోకి దిగింది. చివరిసారిగా 1992లో ఒక నల్లజాతీయుడిని నలుగురు శ్వేతజాతి పోలీసులు దారుణంగా కొట్టినప్పుడు లాస్ ఏంజెలెస్లో అల్లర్లు చెలరేగినప్పుడు ఎన్జీ బలగాలొచ్చాయి. -
గాజాలో ఇజ్రాయెల్ కాల్పులు
గాజా: గాజాలో అన్నార్తులపై ఇజ్రాయెల్ మరోసారి కాల్పులకు తెగబడింది. ఇజ్రాయెల్, అమెరికా ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆహార పంపిణీ కేంద్రాల సమీపంలోనే ఆదివారం ఈ ఘోరం జరిగింది. కాల్పులకు ఐదుగురు పాలస్తీనా పౌరులు బలైనట్టు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరికొందరు గాయపడ్డారని పేర్కొంది. అయితే తమ దళాలపై దాడులకు ప్రయతి్నంచిన వారిపై ప్రతి దాడులకు దిగినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. వివాదాస్పద సామాజిక కార్యకర్త గ్రెటా థన్బర్గ్తోపాటు మరికొందరు గాజాకు వస్తున్న పడవను అడ్డుకుంటామని ఇజ్రాయెల్ పేర్కొంది. ఆస్పత్రి కింద బంకర్: దక్షిణ గాజాలో ఖాన్యూనిస్లోని యూరోపియన్ ఆస్పత్రి కింద మరో భూగర్భ సొరంగం జాడను కనుగొన్నామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. సంబంధిత వీడియో విడుదలచేసింది. దీన్ని హమాస్ కమాండ్ సెంటర్గా వాడుతోందని ఆరోపించింది. -
మస్క్, అమెరికా ఆర్థిక మంత్రి కొట్టుకున్నారు!
వాషింగ్టన్: అగ్రరాజ్యాధిపతి డొనాల్డ్ ట్రంప్, లక్షల కోట్లకు అధిపతి ఎలాన్ మస్క్ మధ్య మాటల మంటలకు మూలకారణమైన ఉదంతం తాజాగా వెలుగు చూసింది. వారి మధ్య సఖ్యత చెడటానికి ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ కారణంగా మారినట్టు ట్రంప్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. గత ఏప్రిల్లో అధ్యక్ష కార్యాలయంలోని ఓవల్ ఆఫీస్లో భేటీ తర్వాత మస్క్, బిసెంట్ బాహాబాహీకి దిగారట! ట్రంప్ సన్నిహితుడు, పాడ్కాస్టర్ స్టీఫెన్ కె.బ్యానన్ ఈ మేరకు బయటపెట్టారు. వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులను తొలగిస్తూ, వాళ్ల జీతభత్యాలను ట్రంప్ సర్కార్కు ఆదా చేస్తూ, లక్షల కోట్ల విదేశీ నిధులను నిలిపివేస్తూ ఆర్థిక శాఖపై తాను భారం తగ్గిస్తుంటే ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ పేరిట పన్నులను తగ్గించి ఆర్థిక శాఖపై అధ్యక్షుడు భారం పెంచుతున్నారంటూ మస్క్ తీవ్రంగా ఆక్షేపించడం తెలిసిందే. బిసెంట్తో ముష్టిఘాతాల పర్వం వారి మధ్య దూరాన్ని బాగా పెంచేసిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.ఓవల్ ఆఫీస్లో ఏం జరిగింది? ఏప్రిల్ నెల మూడోవారంలో ఓవల్ కార్యాలయంలో ట్రంప్తో భేటీ సందర్భంగా అంతర్గత రెవెన్యూ విభాగ కమిషనర్గా మస్క్, బిసెంట్ చెరో పేరు ప్రతిపాదించారు. బిసెంట్ సూచించిన అభ్యర్థి వైపు ట్రంప్ మొగ్గా రు. అవమానభారంతో వెళ్లిపోతున్న మస్క్తో బిసెంట్ వాగ్వాదానికి దిగారు. అది కాస్తా కొట్లాటకు దారితీసింది. ‘రగ్బీ’ మ్యాచ్ తరహాలో బిసెంట్ను మస్క్ తన భుజంతో ఎత్తి కుదేశాడు. ఇద్దరూ కొట్టుకుంటుండటంతో సిబ్బంది నిలువరించారు. ఇది ట్రంప్కు తెలియడంతో ‘మరీ ఓవర్గా ఉంది’ అన్నారు. అనంతరం మీడియా భేటీ సందర్భంగా మస్క్ ముఖం వాచిపోయి, కళ్లు ఎర్రబారడం కన్పించింది. కొడుకుతో ఆడుతుంటే దెబ్బలు తగిలాయని మస్క్ అప్పట్లో కవర్ చేశారు. -
స్పేష్ మిషన్లో భాగస్వామ్యంనా అదృష్టం: శుభాన్షు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆక్జియం–4 స్పేష్ మిషన్లో భాగస్వామి కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (39) చెప్పారు. మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి స్పేస్ఎక్స్ డ్రాగన్ ఎయిర్క్రాఫ్ట్లో ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోబోతున్నారు. అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి మంగళవారం సాయంత్రం 5.52 గంటలకు ఫాల్కన్–9 రాకెట్ ద్వారా వారి ప్రయాణం ప్రారంభం కానుంది. ఇదొక అద్భుతమైన ప్రయాణం అవుతుందని భావిస్తున్నట్లు శుభాన్షు చెప్పారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్లో గ్రూప్ కెపె్టన్ అయిన శుక్లా రాకేశ్ శర్మ అనంతరం 41 ఏళ్లకు అంతరిక్షంలోకి చేరుకోబోతున్న రెండో భారతీయుడిగా రికార్డు సృష్టించబోతున్నారు. ఆగ్జియం మిషన్ నిమిత్తం అమెరికాలో కొద్ది నెలలుగా ప్రత్యేక శిక్షణ పొందారు. రాకేశ్ శర్మ సోవియట్ యూనియన్కు చెందిన సోయజ్ స్పేస్క్రాఫ్ట్లో అంతరిక్షంలోకి వెళ్లి 8 రోజులుండి తిరిగొచ్చారు. ఆయనను శుభాన్షు తన స్ఫూర్తిప్రదాతగా భావిస్తుంటారు. శుక్లాతోపాటు కమాండర్ పెగ్గీ విట్సన్, మిషనల్ స్పెషలిస్టులు టిబోర్ కపూ, స్లావోజ్ ఉజ్నాన్స్కీ–విస్నీవెస్కీ స్పేస్ఎక్స్ మిషన్లో భాగంగా డ్రాగన్ క్యాప్సూల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోబోతున్నారు. డ్రాగన్ క్యాప్సూల్కు శుక్లా పైలట్గా వ్యవహరిస్తారు. -
40 ఏళ్లలో కరువుల తీవ్రతశాతం పెరిగింది
కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి. దాంతో కరువు కాటకాలు తప్పడం లేదు. కరువుల బెడద మరింత ఉగ్రరూపం దాలుస్తోంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల ప్రపంచవ్యాప్తంగా గత 40 ఏళ్లలో కరువుల తీవ్రత ఏకంగా 40 శాతం పెరిగినట్లు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధనలు తేలింది. వర్షపాతం స్థిరంగా ఉన్నచోట కూడా కరువుల తీవ్ర పెరుగుతున్నట్లు వెల్లడయ్యింది. వాతావరణం వేడెక్కుతున్న కొద్దీ అది తేమను ఒడిసిపట్టుకొనే సామర్థ్యం సైతం పెరుగుతోంది. దాంతో కరువులు తీవ్రత సైతం పైపైకి ఎగబాకుతోందని సైంటిస్టులు వెల్లడించారు. వాతావరణం వేడెక్కడానికి, కరువులు తీవ్రంగా మారడానికి మధ్య దగ్గర సంబంధం ఉందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన క్లైమేట్ హజార్డ్స్ సెంరట్ డైరెక్టర్ క్రిస్ ఫాంక్ తెలిపారు. ఈ పరిశోధన వివరాలను నేచర్ జర్నల్లో ప్రచురించారు. రాబోయే రోజుల్లో ప్రపంచమంతటా ఉష్ణోగ్రతలు మరింత పెరగడమే తప్ప తగ్గిపోయే సూచనలైతే కనిపించడం లేదు. దీన్నిబట్టి చూస్తే మరింత తీవ్రమైన కరువులకు మానవాళి సిద్ధపడక తప్పదని చెప్పొచ్చు. ఈ అధ్యయనం కోసం 1901 నుంచి 2022 వరకు వాతావరణ డేటాను సేకరించి, విశ్లేíÙంచారు. అట్మాస్ఫియరిక్ ఎవాపరేటివ్ డిమాండ్(ఏఈడీ) పెరుగుతుండడంతో కరువుల తీవ్రత కూడా పెరుగుతున్నట్లు తేలింది. గత 40 ఏళ్లలో ఇది 40 శాతం పెరిగినట్లు స్పష్టమయ్యింది. ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు పెరిగినా సరే అక్కడి వాతావరణం తేమను అధికంగా పీల్చుకుంటుంది. పంటలు, చిత్తడి నేలలు, అడవుల నుంచి తేమ వాతావరణంలోకి చేరుకుంటుంది. ఫలితంగా నేల నిస్సారమైపోతోంది. పంటలు ఎండిపోతాయి. చిత్తడి నేలలు పొడి నేలలుగా మారిపోతాయి. మరో విషయం ఏమిటంటే.. 1981–2017 నాటి సగటుతో పోలిస్తే గత ఐదేళ్లలో కరువు పరిస్థితి 74 శాతం పెరిగింది. ఈ పెరుగుదలకు 58 శాతం ఏఈడీనే కారణం. 2022లో భూగోళంపై రికార్డు స్థాయిలో 30 శాతం భూభాగం కరువునకు గురయ్యింది. దీనికి 40 శాతం ఏఈడీనే కావడం గమనార్హం. – న్యూఢిల్లీ -
పూ పిల్స్తో సూపర్బగ్స్ ఖతం
శరీరంలో తిష్ట వేసి ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే సూపర్ బగ్స్ను తుదముట్టించడానికి బ్రిటన్ పరిశోధకులు సరికొత్త మాత్రను అభివృద్ధి చేశారు. ప్రధానంగా పేగుల్లో యాంటీబయోటిక్స్ను దెబ్బతీసే ఇన్ఫెక్షన్లకు విరుగుడు కనిపెట్టారు. ఈ మాత్రను మానవ మలంతో తయారు చేయడం గమనార్హం. వీటికి ‘పూ పిల్స్’ అని పేరు పెట్టారు. ఎండబెట్టి, పొడి చేసిన మలాన్ని ఈ మాత్రల తయారీకి ఉపయోగించారు. ఇందుకోసం ఆరోగ్యకరమైన దాతల నుంచి మలం నమూనాలు సేకరించారు. అందులో మనుషులకు మేలు చేసే బ్యాక్టీరియా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. జీర్ణం కాని వ్యర్థాలుంటే తొలగించారు. పూ పిల్స్లోని మంచి బ్యాక్టీరియా పేగుల అంతర్భాగంలోని సూపర్బగ్స్తో నేరుగా పోరాడి బయటకు పంపుతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా పేగుల ఆరోగ్యానికి అవసరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతున్నట్లు తేల్చారు. అండన్లోని గైస్ అండ్ సెయింట్ థామస్ ఆసుపత్రిలో 41 మంది రోగులపై ఈ ప్రయోగం చేశారు. వారికి పూ పిల్స్ ఇచ్చారు. ఇన్ఫెక్షన్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లను నివారించడానికి మలం మాత్రలు చక్కటి ప్రత్యామ్నాయమని డాక్టర్ బ్లెయిర్ మెరిక్ చెప్పారు. యాంటీబయాటిక్స్ను అడ్డుకొనే ఇన్ఫెక్షన్లకు, ఔషధాలకు లొంగని సూపర్బగ్స్కు మూలం పేగులేనని తెలిపారు. పూ పిల్స్తో సూపర్బగ్స్ను పేగుల నుంచి తరిమేయవచ్చని వెల్లడించారు. పూ పిల్స్ వాడకం కొత్తేమీ కాదు. క్లో్రస్టిడియం డిఫిసైల్ బ్యాక్టీరియా వల్ల ఏర్పడే డయేరియా చికిత్సకు ఈ మాత్రలు వాడుతున్నారు. సూపర్బగ్స్ నియంత్రణకు పూ పిల్స్పై మరింత పరిశోధన చేయాలని నిర్ణయించారు. – లండన్ -
కాలిఫోర్నియాలో నిరసనల టెన్షన్.. ట్రంప్ హెచ్చరికలు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఉద్రిక్తత నెలకొంది. అక్రమ వలసదారుల అరెస్ట్ల నేపథ్యంలో వందలమంది ఆందోళనకారులు రోడ్ల మీదకు వచ్చి.. ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించి వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో నిరసన కారులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.ఈ సందర్భంగా నిరసనలపై ట్రంప్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్, లాస్ ఏంజెలెస్ మేయర్ కరెన్ బాస్ తమ బాధ్యతలను నిర్వర్తించలేరు. ఈ విషయం అందరికీ తెలుసు. అప్పుడు ఫెడరల్ ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తుంది. ఆందోళనకారులు, దోపిడీదారుల సమస్య వలే పరిష్కరిస్తాం. అక్రమ వలసదారులు నిరసనలు చేయడం సరైన పద్దతి కాదు’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.( @realDonaldTrump - Truth Social Post )( Donald J. Trump - Jun 07, 2025, 8:25 PM ET )If Governor Gavin Newscum, of California, and Mayor Karen Bass, of Los Angeles, can’t do their jobs, which everyone knows they can’t, then the Federal Government will step in and solve the… pic.twitter.com/mLvzMt9OFb— Donald J. Trump 🇺🇸 TRUTH POSTS (@TruthTrumpPosts) June 8, 2025ఇదిలా ఉండగా.. అక్రమ వలసదారుల ఏరివేత నేపథ్యంలో ఫెడరల్ అధికారులు లాస్ ఏంజెలెస్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. లాస్ ఏంజెలెస్లో మొత్తం 44 మంది అక్రమ వలసదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే అక్కడ నిరసనలు చెలరేగాయి. సుమారు 1000 మంది ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అనంతరం.. నిరసనకారులను చెదరగొట్టేందకు పోలీసులు.. లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారు.🚨🇺🇸 #BREAKING: STAND-OFF WITH ICE: MEXICAN FLAGS GO UP AS ROADS SHUT DOWNProtesters backing illegal immigrants have turned parts of L.A. into a demolition derby.News vans were smashed, roads barricaded, and tempers lit like it’s the Fourth of July. pic.twitter.com/AT5ZQdZ2tE— Md.Sakib Ali (@iamsakibali1) June 8, 2025మరోవైపు.. సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ హుయెర్టాను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆందోళనకారులు ఫెడరల్ భవనం వెలుపలకు చేరుకొని ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారిని అడ్డుకునేందుకు ఫెడరల్ అధికారులు పెప్పర్ స్ప్రేను ప్రయోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Pro-illegal immigrant supporters waving foreign flags celebrating their handiwork on American soil.pic.twitter.com/U8sBQINvog— The Daily Sneed™ (@Tr00peRR) June 8, 2025 -
‘డెమోక్రాట్లకు నిధులిస్తే బాగోదు’.. మస్క్కు ట్రంప్ వార్నింగ్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మధ్య అంతకంతకూ వైరం తీవ్రస్థాయికి చేరుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో వివాదాస్పద బడ్జెట్ బిల్లుకు ఓటు వేసే రిపబ్లికన్లపై చర్యలు తీసుకోవాలని టెక్ బిలియనీర్ ప్రయత్నిస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మాజీ సలహాదారు ఎలాన్ మస్క్ను హెచ్చరించారు. వ్యయ బిల్లుపై మస్క్ విమర్శల అనంతరం అధ్యక్షుడు ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య స్నేహం చెడింది. ఈ నేపథ్యంలో ఈ బిల్లుకు అండగా నిలుస్తున్న రిపబ్లికన్లను మస్క్ టార్గెట్ చేస్తున్నారనే వార్తలు ట్రంప్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో ట్రంప్ బహిరంగంగా మస్క్కు హెచ్చరించారు. ట్రంప్ తీసుకువస్తున్న బడ్జెట్ బిల్లును వ్యతిరేకిస్తున్న కొంతమంది డెమోక్రాట్ ఎంపీలు తమకు భారీగా నిధులు సమకూర్చాలని ఎలాన్ మస్క్ను కోరారు. దీనికి మస్క్ సమ్మతించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో డెమోక్రాట్లకు నిధులు ఇస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఎలాన్ మస్క్ను ట్రంప్ హెచ్చరించారు.ప్రపంచంలో అత్యంత శక్తివంతుడైన డొనాల్డ్ ట్రంప్, అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ మధ్య జరుగుతున్న వివాదం తారాస్థాయికి చేరింది. ఎలాన్ మస్క్తో సంబంధాన్ని సరిదిద్దుకోవాలనే ఆసక్తి తనకు లేదని, ఆయనతో మాట్లాడే ఉద్దేశ్యం కూడా తనకు తనకు లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ తన రెండవ పదవీకాలంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ బిల్లుపై మస్క్ తీవ్ర విమర్శలు చేసిన దరిమిలా వారి మధ్య సంబంధం తెగిపోయింది.ఇది కూడా చదవండి: ఇండోర్ జంట మిస్సింగ్ మిస్టరీ.. ఏ రోజు ఏం జరిగింది? -
హమాస్ రహస్య సొరంగాన్ని గుర్తించిన ఇజ్రాయెల్
జెరూసలేం: ఇజ్రాయెల్ రక్షణ దళాలు హమాస్ రహస్య స్థావరాన్ని గుర్తించాయి. గాజా ఆస్పత్రి కింద హమాస్ టన్నెల్ నెట్వర్క్ను కొనుగొన్నట్లు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ దళాలకు వ్యతిరేకంగా సాగించే హమాస్ కార్యకలాపాలకు ఈ సొరంగం కమాండ్ సెంటర్గా ఉపయోగిస్తుంటారని ఇజ్రాయెట్ తెలిపింది. అలాగే ఆయుధాలు, నిఘా సామగ్రితో కూడిన భూగర్భ మౌలిక సదుపాయాలు కలిగివున్న సొరంగపు ఫుటేజీని విడుదల చేసింది.గాజాలోని ఖాన్ యూనిస్లోని ఒక కీలక ఆస్పత్రి కింద ఈ సొరంగం ఉందని ఇజ్రాయెల్ రక్షణ దళాలు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ సైన్యం తెలిపిన వివరాల ప్రకారం యూరోపియన్ హాస్పిటల్ కాంపౌండ్ కింద ఉన్న ఈ సొరంగం సీనియర్ హమాస్ నేతల కమాండ్ అండ్ కంట్రోల్కు కేంద్రంగా ఉంటూ, ఇజ్రాయెల్ దళాలపై దాడులను సమన్వయం చేయడానికి ఉపయోగపడింది. ⭕️UNCOVERED: An underground tunnel route beneath the European Hospital in Khan Yunis, Gaza. In a special, targeted operation, IDF soldiers located an underground tunnel route containing numerous findings such as command and control rooms, weapons, and additional intelligence… pic.twitter.com/7bPM5ozHN8— Israel Defense Forces (@IDF) June 7, 2025ఇజ్రాయెల్ సైన్యం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో వీడియో ఫుటేజ్ను విడుదల చేసింది. ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ మార్గదర్శకత్వంలో గోలాని బ్రిగేడ్, యాహలోమ్ యూనిట్, ప్రత్యేక దళాలు పాల్గొన్న ఆపరేషన్ సమయంలో ఈ సొరంగాన్ని గుర్తించామని ఇజ్రాయెల్ తెలిపింది. హమాస్ తన ఉగ్రవాద ప్రయోజనాల కోసం గాజాలోని ఆస్పత్రులపై దాడులకు తెగబడుతోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. 2023లో గాజాలోని అల్ షిఫా ఆస్పత్రి కింద కింద ఒక హమాస్ సొరంగాన్ని కనుగొన్నట్లు ఐడీఎఫ్ గతంలో పేర్కొంది. అయితే యుద్ధంలో అది పూర్తిగా ధ్వంసమైంది. ఇది కూడా చదవండి: ఇండోర్ జంట మిస్సింగ్ మిస్టరీ.. ఏ రోజు ఏం జరిగింది? -
అబ్బాయిలకు ఫుల్ డిమాండ్.. ఒక్క ‘హగ్’ ఇవ్వండి.. 600 తీసుకోండి..
బీజింగ్: మారుతున్న జీవనశైలి కారణంగా ఉరుకులు పరుగుల జీవితం నడుస్తోంది. ప్రేమ, ఆప్యాయతలకు, కుటుంబాలకు కొందరు దూరం అవుతున్నారు. డబ్బు సంపాదించే క్రమంలో ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగానే చైనాలో ఓ కొత్త ట్రెండ్ హాట్ టాపిక్గా మారింది. ఒత్తిడికి గురవుతున్న యువతులు.. అబ్బాయిలను హగ్ చేసుకుంటున్నారు. ఈ హగ్ ఊరికే కాదు.. ఒక్కసారి హగ్ చేసుకుంటే సదరు యువతి.. 50 యువాన్లు (భారత కరెన్సీలో దాదాపు 600 రూపాయలు) చెల్లించి ఉంటుంది. దీంతో, చైనా అబ్బాయిలకు ఫుల్ గిరాకీ నడుస్తోంది.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. ఒత్తిడి అధిగమించేందుకు చైనాలోని యువతులు ఓ వినూత్న పద్ధతిని అనుసరిస్తున్నారు. మానసిక సాంత్వన కోసం డబ్బులు చెల్లించి 'మ్యాన్ మమ్స్' (man mums) అని పిలవబడే వ్యక్తుల నుంచి కొద్దిసేపు హగ్ పొందుతున్నారు. గతంలో 'మ్యాన్ మమ్స్' అనే పదాన్ని కండలు తిరిగిన శరీరంతో జిమ్లో కసరత్తులు చేసే పురుషులను ఉద్దేశించి వాడేవారు. అయితే, ఇప్పుడు ఈ పదం అర్థం మారింది. శారీరకంగా ధృడంగా ఉంటూనే, సున్నితత్వం, ఓర్పు, ఆప్యాయత వంటి లక్షణాలున్న పురుషులను 'మ్యాన్ మమ్స్'గా పరిగణిస్తున్నారు. వీరు అందించే కౌగిలింతలు ఒత్తిడిని తగ్గించి, ఓదార్పునిస్తాయని యువతులు భావిస్తున్నారు. చైనా ప్రస్తుతం మ్యాన్ మమ్స్ ట్రెండ్లోకి వచ్చింది. ఇక, ఈ ట్రెండ్ ప్రకారం.. అమ్మాయికి ఎవరైనా అబ్బాయి ఐదు నిమిషాల పాటు హగ్ ఇస్తే రూ. 600 చెల్లిస్తారు అమ్మాయిలు. ఎవరైనా అబ్బాయిలు.. ఐదు నిమిషాల పాటు హగ్ ఇస్తే రూ. 200 నుంచి రూ. 600 వరకు పే చేస్తున్నారు. ఆన్ లైన్లో ముందుగానే ఈ హగ్స్ కోసం అమ్మాయిలు.. నచ్చిన కుర్రాడిని బుక్ చేసుకుంటారు. ఆ తర్వాత మాల్స్, పార్కులు, అండర్ గ్రౌండ్ రోడ్లు.. ఇలా పబ్లిక్ ప్లేసుల్లో ఇలా చేస్తున్నారు. ఇలా నచ్చినవారిని హగ్ చేసుకోవడం వల్ల తమ ఒత్తిడి తగ్గిపోతుందని అమ్మాయిలు భావిస్తున్నారు.In China, some young women are paying strangers — not for therapy or romance, but for something far simpler: a five-minute hug.They’re called “man mums” — gentle, muscular men who offer warmth and emotional comfort in public spaces. The cost? Just US$3 to US$7 for five minutes.… pic.twitter.com/4kD1FpPpws— Ashwini Roopesh (@AshwiniRoopesh) June 7, 2025ఈ సందర్భంగా ఒక యువతి మాట్లాడుతూ.. మూడు గంటల పాటు ఓవర్టైమ్ పని చేసిన తర్వాత, ఒక 'మ్యాన్ మమ్'ను కలుసుకున్నాను. అతను మూడు నిమిషాల పాటు నన్ను కౌగిలించుకున్నాడు. ఉద్యోగం, ఆఫీసు ఒత్తిడికి సంబంధించి ఆవేదన వ్యక్తం చేస్తుండగా అతడు నెమ్మదిగా నా భుజం తట్టాడు. దీంతో, ఒత్తిడి దూరమే ప్రశాంతంగా అనిపించింది’ అని చెప్పుకొచ్చింది.అంతకుముందు.. ఒక విద్యార్థిని, తనకు ఓదార్పునిచ్చేందుకు దయగల, ఫిట్గా ఉండే 'మ్యాన్ మమ్' నుంచి కౌగిలింత కావాలని, అందుకు డబ్బులు చెల్లిస్తానని ఆన్లైన్లో పోస్ట్ చేసింది. ‘నాకు సెకండరీ స్కూల్లో ఉన్నప్పుడు ఒకసారి ఇలాగే కౌగిలించుకుంటే చాలా సురక్షితంగా అనిపించింది. మనం ఒక అండర్గ్రౌండ్ స్టేషన్లో ఐదు నిమిషాలు కౌగిలించుకుంటే చాలు’ అని ఆమె రాసుకొచ్చింది. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది, లక్షకు పైగా కామెంట్లు వచ్చాయి. -
కొలంబియా అధ్యక్ష అభ్యర్థిపై కాల్పులు
బొగోటా(కొలంబియా): కొలంబియాలో 2026 అధ్యక్ష ఎన్నికల్లో విపక్ష డెమొక్రటిక్ సెంటర్ పార్టీ అభ్యర్థి అయిన సెనేటర్ మిగ్వెల్ ఉరిబే టర్బే (39)పై కాల్పులు జరిగాయి. శనివారం సాయంత్రం రాజధాని బొగోటాలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా వెనుక నుంచి ఒక టీనేజర్ తుపాకీతో కాల్పులకు పాల్పడ్డాడు. రెండు తూటాలు తలలోకి, ఒకటి ఛాతిలోకి దూసుకెళ్లినట్లు చెబుతున్నారు. దాంతో మిగ్వెల్ ఒక్కసారిగా కుప్పకూలారు. కాల్పుల వీడియో వైరల్గా మారింది. సమీప ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం ఆయనను హెలికాప్టర్లో శాంటా ఫే ఫౌండేషన్ ఆస్పత్రికి తరలించారు. మెదడు, వెన్నుపూస, నరాల సంబంధ శస్త్రచికిత్సలు చేశారు. పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. మిగ్వెల్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని భార్య మారియా క్లాడియా టరజోనా వాపోయారు. దుండగున్ని ఘటనాస్థలిలోనే అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు కారణం తెలియాల్సి ఉంది. మిగ్వెల్కు ఎలాంటి రాజకీయ శత్రువులు లేరని తెలుస్తోంది. కొలంబియాలో 1980, 1990 దశకాల్లోనూ అధ్యక్ష అభ్యర్థులపై డ్రగ్స్ ముఠాలు దాడులు చేశాయి. వేర్వేరు కాల్పుల ఘటనల్లో మొత్తం ఐదుగురు అధ్యక్ష అభ్యర్థులను పొట్టన పెట్టుకున్నారు. Urgente 🇨🇴 Aquí está el momento del atentado al Dr Miguel Uribe Que dolor de PatriaGobierno miserable !Imágenes sensibles pic.twitter.com/tA3VWGap5V— Luis Aníbal Rincón Arguello. ® 🇨🇴 (@Rincon001A) June 7, 2025ఎవరీ మిగ్వెల్? విపక్ష డెమొక్రటిక్ సెంటర్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా మిగ్వెల్ పేరు ఇప్పుడు కొలంబియా అంతటా మార్మోగుతోంది. మాజీ అధ్యక్షుడు అల్వారో ఉరిబే స్థాపించిన ఆ పార్టీలో మిగ్వెల్ మూడేళ్లుగా సెనేటర్గా ఉన్నారు. ఆయన తాత జూలియో సీజర్ టుర్బే అయాలా 1978–82 మధ్య దేశాధ్యక్షునిగా చేశారు. తల్లి డయానా పాత్రికేయురాలు. 1990లో కిరాతక పాబ్లో ఎస్కోబార్ డ్రగ్స్ ముఠా ఆమెను కిడ్నాప్ చేసింది. వాటికి, కొలంబియా బలగాలకు జరిగిన కాల్పుల్లో ఆమె ప్రాణాలుకోల్పోయారు. తాత రాజకీయ వారసునిగా మిగ్వెల్ ఎదిగారు. బొగోటా సిటీ కౌన్సిల్ సభ్యునిగా, సిటీ గవర్నమెంట్ సెక్రటరీగా సేవలందించారు. 2019లో బొగోటా మేయర్గా పోటీచేసి ఓడిపోయారు.ఇది కూడా చదవండి: జ్యోతి మల్హోత్రాకు పాకిస్తానీ రిటైర్డ్ అధికారితో లింకు ? -
థాయ్లాండ్ బందీ మృతదేహం లభ్యం
టెల్ అవీవ్: గాజాలో థాయ్లాండ్ బందీ నాతాపాంగ్ పింటా మృతదేహాన్ని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం శనివారం ప్రకటించింది. 2023 అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై హఠాత్తుగా దాడికి దిగి 1,200 మందిని హత్య చేయడంతోపాటు 251 మందిని బందీలుగా గాజాకు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. బందీల్లో ఇజ్రాయెల్ పౌరులతోపాటు విదేశీయులు కూడా ఉన్నారు. థాయ్లాండ్ పౌరుడు నాతాపాంగ్ పింటా కూడా అప్పట్లో హమాస్ చెరలో చిక్కుకున్నాడు. అతడిని వినిపించేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. కాల్పుల విరమణ ఒప్పందంతో కొందరు బందీలు విడుదలైనప్పటికీ పింటాకు విముక్తి లభించలేదు. తాజాగా అతడి మృతదేహం లభించడం విషాదాన్ని నింపింది. వ్యవసాయ పనుల కోసం థాయ్లాండ్ నుంచి ఇజ్రాయెల్కు వచ్చిన పింటా చివరకు దురదృష్టకరమైన రీతిలో మరణించాడు. హమాస్ మిలిటెంట్లే అతడిని హత్య చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గత 24 గంటల్లో కనీసం 95 మంది మరణించారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటిదాకా 54,000 మందికిపైగా మృతిచెందడం గమనార్హం -
దాడి.. అరెస్ట్.. ఆందోళన.. లాఠీచార్జ్
లాస్ ఏంజెలెస్: చట్టవ్యతిరేకంగా అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులను గు ర్తించి, అరెస్ట్చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులకు స్థానికుల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవుతోంది. లాస్ ఏంజెలెస్ నగర పరిసరాలు ఇందుకు వేదికయ్యా యి. శుక్రవారం లాస్ ఏంజెలెస్ ప్రాంతాల్లో కొందరు అక్రమ వలసదారులను అరెస్ట్చేయడం ఒక్కసారిగా ఉద్రిక్తతలకు దారితీసింది. ఫెడరల్ ఏజెన్సీ, పోలీసులు, ఎఫ్బీఐ సంయుక్తంగా జరిపిన ఆకస్మిక దాడుల్లో పలువురు అక్రమవలసదారులను అరెస్ట్చేయడంతో అక్కడే ఉన్న స్థానికులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. వీరికి వందలాది మంది విపక్ష డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులు, విదేశీయులు తోడవడంతో ఒక్కసారిగా ఆందోళన తీవ్రరూపం దాల్చింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ పోలీసు చర్యను తీవ్రంగా తప్పుబట్టారు. ఆగ్రహంతో ఊగిపోయిన నిరసనకారులు ప్యాకింగ్ కార్ట్లు, కాంక్రీట్ ముక్కలుసహా దొరికిన వస్తువులతో పోలీసులపైకి దాడికి యత్నించారు. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. వందల మంది నిరసనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. కంటితో చూడలేనంత కాంతిని వెదజ్లే, కళ్లు బైర్లు కమ్మేలా మెరుపులు వెదజల్లే ప్లాష్ బ్యాంగ్ గ్రనేడ్లను విసిరేశారు. దీంతో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది. నగర వ్యాప్తంగా దావానంలా వ్యాపించిన ఈ అక్రమవలసదారుల ఆందోళనలను అణచివేసేందుకు మరింతగా పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. పలు చోట్ల బ్యారీకేడ్లను ఏర్పాటుచేసి వాహనాల రాకపోకలను నిలిపేశారు. మధ్యాహ్నంతో మొదలు తొలుత శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు సిటీలోని ఫ్యాషన్ డిస్ట్రిక్ట్లో ఒక వ్రస్తాల టోకు వ్యాపారిని ఫెడరల్ ఏజెంట్లు అరెస్ట్చేశారు. ఈ అరెస్ట్ను అడ్డుకున్న అక్కడి ఉద్యోగులనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా చూస్తున్న ప్రజల్లో పట్టరాని ఆవేశం పెరిగి ఆందోళనకు దిగారు. పందుల్లారా, పిడివాదం చేసే పోలీసుల్లారా అంటూ కొందరు తిట్ల పురాణం మొదలెట్టారు. ‘‘కుటుంబాలను వేరు చేస్తూ రాత్రిళ్లు మీరు హాయిగా నిద్రపోగలరా?. మీ కుటుంబసభ్యులను కూడా ఇలా అరెస్ట్చేస్తే మీకెలా ఉంటుంది?’’అని అక్కడి ఓ మహిళ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. అరెస్ట్లను అడ్డుకున్న కార్మిక నేత, సరీ్వస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ హుయెరా్టనూ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కారి్మకులు, స్థానికులు మధ్యాహ్నం నాలుగు గంటలకు పెద్ద ఎత్తున గుమిగూడి ఆందోళనకు దిగారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ లాస్ ఏంజెలెస్ ఫెడరల్ డిటెన్షన్ సెంటర్ భవనానికి చేరుకున్నారు. అరెస్ట్చేసి లోపల బంధించిన వారిని వెంటనే విడిచిపెట్టాలని నినాదాలుచేశారు. ఫెడరల్ కోర్ట్హౌస్ భవనంపై ఆందోళనకారులు స్ప్రే పెయింట్తో రాతలు రాశారు. అనుమతిలేకుండా జనం రోడ్లపై గుమిగూడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులు హెచ్చరించినా జనం అక్కడి నుంచి వెళ్లిపోలేదు. దీంతో వీళ్లను చెదరగొట్టేందుకు పోలీసులు పెప్పర్ స్ప్రేలు, ఫ్లాష్ బ్యాంగ్ గ్రనేడ్లను ప్రయోగించారు. ‘‘అక్రమ వలసదారులను అరెస్ట్చేయడానికి మేం రాలేదు. శాంతిభద్రతల పరిరక్షణకు వచ్చాం. ఇక్కడి నుంచి వెళ్లకపోతే అరెస్ట్ తప్పదు’’అని పోలీసుల అధికార ప్రతినిధి డ్రాక్ మేడిసన్ హెచ్చరించారు. సెంట్రల్ లాస్ ఏంజెలెస్లో మూడు చోట్ల తనిఖీలు, సోదాలను పూర్తిచేశామని అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్లోని హోమ్ల్యాండ్ సెక్యూరిటీస్ ఇన్వెస్టిగేషన్స్ విభాగ మహిళా అధికార ప్రతినిధి యాస్మీన్ పిట్స్ ఒకీఫ్ చెప్పారు. అయితే అధికారులు నగరంలో చాలా చోట్ల ఆకస్మిక దాడులు చేశారని వలసదారుల హక్కుల ఐక్యవేదిక(చిర్లా) పేర్కొంది. ఏడు ప్రాంతాలు, రెండు హోమ్ డిపోర్ట్స్, ఒక వేర్హౌస్, ఒక డోనట్ షాప్లో ఈ దాడులు జరిగాయని చిర్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏంజిలికా సలాస్ ఆరోపించారు.44 మంది అరెస్ట్ సెర్చ్ వారెంట్ ప్రకా రం 44 మందిని ఫెడరల్ ఏజెంట్లు అరెస్ట్చేశారు. అరెస్ట్లను అడ్డుకున్నందుకు ఒకరిని అరెస్ట్ చేశారు. రోజుకు కనీసం 3,000 మంది అక్రమ వలసదారులను అరెస్ట్చేయాలని అధ్యక్షభవనం అధికార ప్రతినిధి స్టీఫెన్ మిల్లర్ ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని ఆదేశించడంతో ఫెడ రల్ ఏజెంట్లు ఇలా రంగంలోకి దిగాల్సి వచ్చిందని యాస్మీన్ పేర్కొన్నారు. ప్రస్తు తం రోజుకు సగటున 1,600 మందిని అరెస్ట్చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది తీవ్రమైన నేరాలుచేసిన వాళ్లేనని మిల్లర్ చెప్పారు. ఒక వ్యాపారి తన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి తప్పుడు పత్రాలను సృష్టించాడని యూఎస్ అటార్నీ ఆఫీస్ అధికారి సియారన్ మెక్ఎవీ చెప్పారు. ఇవన్నీ తీవ్రమైన చర్యలని లాస్ ఏంజెలెస్ మేయర్ కరెన్ బాస్ వ్యాఖ్యానించారు. -
‘తీవ్రమైన పేదరికం’ తగ్గుముఖం
న్యూఢిల్లీ: భారతదేశంలో ‘తీవ్రమైన పేదరికం’రేటు క్రమంగా తగ్గిపోతోందని ప్రపంచ బ్యాంకు ఒక నివేదికలో వెల్లడించింది. 2011–12లో పేదరికం రేటు 16.2 శాతం ఉండగా, పదేళ్ల తర్వాత 2022–23 నాటికి 2.3 శాతానికి తగ్గిపోయినట్లు పేర్కొంది. రోజుకు 3 డాలర్లు (రూ.257) సంపాదిస్తే పేదలు కానట్లేనని ప్రపంచ బ్యాంకు గతంలో స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. రోజుకు 2.15 డాలర్లు సంపాదిస్తే పేదలు కాదనే సూత్రీకరణ 2017 దాకా ఉండేది. దాన్ని 2021లో 3 డాలర్లకు పెంచారు. ఇండియాలో 2011–12లో దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్) 34 కోట్ల మంది ఉండగా, 2022–23 నాటికి వారి సంఖ్య 7.5 కోట్లకు పడిపోయినట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక స్పష్టం చేసింది. పేదరిక నియంత్రణలో ఇండియా చక్కటి పురోగతి సాధిస్తున్నట్లు తెలియజేసింది. → 2024లో ఇండియాలో 5.46 కోట్ల మంది రోజువారీ సంపాదన 3 డాలర్ల కంటే తక్కువే ఉంది. ఈ లెక్కన తీవ్రమైన పేదరికం రేటు 5.44 శాతంగా ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు లెక్కగట్టింది. → ఉచితం లేదా రాయితీతో కూడిన ఆహారాన్ని ప్రభుత్వాలు పంపిణీ చేస్తుండడం, కొత్తగా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తుండడంతో పేదరికం తగ్గుముఖం పడుతోంది. → అలాగే పేదరికం విషయంలో పల్లెలు–పట్టణాల మధ్య అంతరం తగ్గిపోతుండడం మరో కీలక పరిణామం. → అత్యంత పేదల్లో 54 శాతం మంది ఐదు అధిక జనాభా కలిగిన రాష్ట్రాల్లోనే ఉన్నారు. → 2011–12 నుంచి 2022–23 మధ్య దేశంలో 17.1 కోట్ల మంది తీవ్రమైన పేదరికం నుంచి బయటపడ్డారు. → ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైన పేదరికం 18.4 శాతం నుంచి 2.8 శాతానికి, పట్టణాల్లో 10.7 శాతం నుంచి 1.1 శాతానికి పడిపోయింది. పల్లెలు–పట్టణాల మధ్య అంతరం 7.7 శాతం నుంచి 1.7 శాతానికి తగ్గిపోయింది. -
ట్రంప్ గద్దె దిగడమా, నాన్సెన్స్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వివాదంపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. అధ్యక్షునితో తలపడటం ద్వారా ఆయన పెద్ద తప్పిదం చేస్తున్నారన్నారు. ఎప్స్టీన్ లైంగిక కుంభకోణంతో ట్రంప్కు సంబంధముందని, ఆయన గద్దె దిగి వాన్స్ అధ్యక్షుడు కావడం ఖాయమని మస్క్ పేర్కొనడం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను ‘నాన్సెన్స్’అంటూ వాన్స్ శుక్రవారం కొట్టిపారేశారు. అధ్యక్షునిగా ట్రంప్ అద్భుతంగా పని చేస్తున్నారన్నారు. ఆయనపై మస్క్ ఆరోపణలను ఖండించారు. ‘‘ఇలాంటి గొడవలు అందరి విషయంలోనూ జరుగుతుంటాయి. అందులోనూ మస్క్ చాలా ఎమోషనల్. కాస్త నెమ్మదించారంటే అంతా సర్దుకుంటుంది. కొంతకాలానికి ఆయనే మా వద్దకు తిరిగొస్తారు’’అని అభిప్రాయపడ్డారు. ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరుందంటూ చేసిన ఎక్స్ పోస్టులను మస్క్ తాజాగా తొలగించారు. అయితే, ‘ఆ పోస్టులను ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం దాచిపెట్టుకోండి’అంటూ భావగర్భితంగా పోస్ట్ చేశారు. మరోవైపు, మస్్కతో తాను మాట్లాడబోతున్నానంటూ వచి్చన వార్తలను ట్రంప్ ఖండించారు. ‘‘ఆ మతి చెడిన మనిíÙతోనా? అలాంటి ఉద్దేశమేదీ నాకు లేదు. నిజానికి మస్కే నాతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. నేనే పట్టించుకోలేదు’’అని స్పష్టం చేశారు. అంతేగాక ఆయన కంపెనీలకు ప్రభుత్వం కట్టబెట్టిన కాంట్రాక్టులన్నింటినీ పూర్తిగా సమీక్షిస్తానని ప్రకటించారు. ‘‘అంతా నిబంధనల మేరకే ఉంటే ఓకే. లేదంటే ఏం చేయాలో ఆలోచిస్తాం’’అని స్పష్టం చేశారు. మస్క్ కంపెనీలపై గతంలో జరిగిన విచారణలను తిరగదోడతారా అని ప్రశ్నించగా, ‘‘అలాంటివి జరిగాయా? నాకు తెలియదు. అదే నిజమైతే ఏం జరగాలో అదే జరుగుతుంది’’అంటూ స్పందించారు. ‘‘చైనా, రష్యా, ఇరాన్ వంటి అంతర్జాతీయ అంశాలతో నేనిప్పుడు యమా బిజీగా ఉన్నా. మస్క్ గురించి ఆలోచేంచే తీరిక కూడా లేదు. మస్కే కాదు, ఒక్క నేను తప్ప ఎవరున్నా లేకున్నా అమెరికాకు వచి్చన లోటేమీ లేదు’’అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. మిడ్ టర్మ్ ఎన్నికల్లో ట్రంప్ డెమొక్రాట్లకు మద్దతిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మస్క్ కొత్త పార్టీ! ట్రంప్తో రగడ నేపథ్యంలో మస్క్ కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నట్టు కని్పస్తోంది. 80 శాతం మంది అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుందంటూ ఎక్స్లో ఆయన ఒపీనియన్ పోల్ పెట్టడం తెలిసిందే. దాన్ని 80 శాతం మంది సమరి్థంచినట్టు శుక్రవారం మస్క్ ప్రకటించారు. ‘‘80 శాతం మందికి ప్రాతినిధ్యం వహించే పారీ్టకి 80 శాతం మద్దతు. విధి అంటే ఇదేనేమో!’’అని ఒక పోస్టులో ఆయన హర్షం వెలిబుచ్చారు. ఆ వెంటనే ‘ద అమెరికా పారీ్ట’అంటూ మరో పోస్ట్ పెట్టారు. అది ఆయన పెట్టబోయే కొత్త పార్టీ పేరు కావచ్చని భావిస్తున్నారు. మస్క్ రష్యాలో స్థిరపడాలనుకుంటే రెడ్కార్పెట్ పరుస్తామని ఆ దేశ చట్టసభ డ్యూమా సభ్యుడు ద్మిత్రీ నొవికోవ్ ప్రకటించారు. ఆయన కోరితే రాజకీయ ఆశ్రయం కల్పిస్తామన్నారు. అయితే ట్రంప్–మస్క్ రగడపై స్పందించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ నిరాకరించారు. -
ఈ నగరాలు...సముద్రం పాలు!
నదీజలాలు. నాగరికతకు పుట్టినిళ్లు. అత్యంత భారీ వర్షాలు వచ్చినప్పుడు ఉగ్రరూపంలో ఉప్పొంగినా తర్వాత సాధారణ స్థితికి వచ్చి మానవులకు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. కానీ సముద్రజలాలు అలాకాదు. ప్రపంచవ్యాప్తంగా సముద్రతీరమున్న ఎన్నో పట్టణాలను ఇప్పుడు సముద్రజలాల పెరిగే నీటిమట్టాలు అక్కడి ప్రజల్లో ఆందోళన మట్టాలను అమాంతం పెంచేస్తున్నాయి. తరతరాలుగా తీరప్రాంతాల్లోనే స్థిరనివాసం ఏర్పాటుచేసుకుని ఉంటున్న స్థానికులను సాగరజలాలు ఇప్పుడు బద్ధశత్రువుగా మారాయి. తీవ్రమైన వ్యాధి శరీరాన్ని కబళించినట్లు ఈ సముద్రజలాలు నెమ్మదిగా ఆయా తీరప్రాంతాల సమతల భూభాగాలను శాశ్వతంగా తనలో కలిపేసుకుంటున్నాయి. శరవేగంగా పెరుగుతున్న సముద్ర నీటిమట్టాలు ఇప్పుడు కోట్లాది మంది ప్రజలకు కంటిమీద కనుకులేకుండా చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డజనుకుపైగా తీరప్రాంతాల్లో సముద్ర నీటిమట్టాలు ఇటీవలికాలంలో చాలా అత్యధిక వేగంతో పెరుగుతున్నాయని సింగపూర్లోని నాంయాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ(ఎన్టీయూ) శాస్త్రవేత్తలు కుండబద్దలు కొట్టారు. 2014 నుంచి చూస్తే గత ఆరేళ్లలోనే ఏటా ఒక సెంటీమీటర్ ఎత్తు సముద్రజలాల నీటిమట్టం పెరుగుతూ తీరప్రాంతాలను శాశ్వతంగా ముంచేసినట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఉత్తర అమెరికా, ద.అమెరికా ఖండాల్లో 48 తీరనగరాలకు తీరనిశోకంగా సాగరజలాలు మారాయని అధ్యయనం పేర్కొంది. వాతావరణ మార్పులకుతోడు కుంగిపోతున్న భూమి కారణంగా ఈ సమస్య తీవ్రమవుతోందని తేలింది. రెండేళ్ల క్రితం ఈశాన్యచైనాలోని తియాంజిన్ నగరంలో తీరప్రాంత వీధులన్నీ కుంగడంతో వేలాది మందిని అపార్ట్మెంట్ల నుంచి హుటాహుటిన ఖాళీ చేయించారు. 2014 నుంచి 2020 ఏడాది వరకు చూస్తే తియాంజిన్ నగర భూభాగం ఏటా 18.7 సెంటీమీటర్లమేర కుంగింది. సముద్రజలాలు పెరిగి భూగర్భజలాలు పెరగడంతో నేల కుంగింది. ముంపు బారిన ముంబై దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరాన్నీ ముంపు సమస్య పట్టిపీడిస్తోంది. 2014 నుంచి చూస్తే సంవత్సరానికి 0.01 సెం.మీ.ల నుంచి 5.9 సెంటీమీటర్ల స్థాయిలో ముంబైలోని చాలా ప్రాంతాలను సముద్రనీరు ముంచేసింది. ఏటా 1 సెం.మీ.చొప్పున నేల సముద్రజలాల్లో కలిసిపోతున్న చోట్ల 62 లక్షల మంది జీవిస్తున్నట్లు ఎన్టీయూ అధ్యయనకారులు ప్రకటించారు. మాతుంగా ఈస్ట్లోని కింగ్ సర్కిల్ స్టేషన్ ప్రాంతం వేగంగా ముంపునకు గురవుతోంది. ఇక్కడ ఏటా 2.8 సె.మీ.ల మేర సముద్రజలాలు పెరుగుతున్నాయి. విశ్వవ్యాప్తంగా సాగరజలాలు గత ఏడాది 0.59 సెంటీమీటర్లమేర ఎగిశాయని నాసా అధ్యయనంలో స్పష్టమైంది. భూగర్భజలాలను విచ్ఛలవిడిగా తోడేయడం, ఊహించనంత బరువుతో ఆకాశహర్మ్యాలను నిర్మించడం, నిరాటంకంగా కొనసాగుతున్న మెట్రో ప్రాజెక్ట్ పనులు, చిత్తడినేలలను ప్రభుత్వాలు పునరుద్ధరించడం తదితర కారణాలు సైతం మహానగరంలోకి సాగరజలాలు చొచ్చుకొచ్చేలా చేస్తున్నాయి. కనీసం 50 లక్షల జనాభా ఉన్న సముద్రతీర నగరాల వెంట సముద్రనీటిమట్టాలు పెరుగుతున్న అంశాన్ని ఉపగ్రహాల సాయంతో విశ్లేషించి ఈ అధ్యయనం చేశారు. అగ్రరాజ్యంలోనూ.. అమెరికాలోని మయామీ సిటీని సాగరజలాలు ముంచెత్తుతున్నాయి. 2014 నుంచి 2020 వరకు చూస్తే మయామీ సిటీలో కోకోనట్ గ్రోవ్సహా చాలా ప్రాంతాలు గరిష్టంగా 2.2 సెంటీమీటర్లమేర సముద్రజలాల మట్టాలు పెరిగాయి. ఏటా 1 సెం.మీ. సముద్రనీరు పెరుగుతున్న ప్రాంతాలు 43,000 మందికిపైగా అమెరికన్లు నివసిస్తున్నారు. న్యూయార్క్ నగరంలోని క్వీన్స్ పరిధిలోని బ్రీజీ పాయింట్ వద్ద నీరు ఏటా 3 సె.మీ.ల మేర పెరుగుతోంది. ఇక్కడ ఏటా 1 సెం.మీ. సముద్రనీరు పెరుగుతున్న చోట 1,03,000 మందికిపైగా అమెరికన్లు నివసిస్తున్నారు. లాస్ ఏంజెలిస్ సిటీలోని శాన్ పెడ్రో సహా పలు తీర ప్రాంతాల్లో నీరు ఏటా 2.5 సె.మీ.ల మేర పెరుగుతోంది. హ్యూస్టన్ సిటీ పరిధిలో గరిష్టంగా ఏకంగా 11 సెం.మీ. మేర సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. హ్యూస్టన్లోని సెంట్రల్ సౌత్వెస్ట్ ప్రాంతంలో ఏటా 8 సెం.మీ.ల మేర సముద్రనీరు పైకొస్తోంది.కొత్త పరిష్కారం చూపుతున్న జపాన్ భూకంపాలను తట్టుకునేలా నిర్మాణాలు చేస్తున్న జపాన్ ఇప్పుడు సముద్రమట్టాల పెరుగుదల ముప్పుకూ మరో పరిష్కారం వెతికింది. విచ్ఛలవిడిగా భూగర్భజలాలను వాడడంతో నేల కుంగి పరోక్షంగా సముద్రనీరు చొచ్చుకొస్తున్న నేపథ్యంలో గ్రౌండ్వాటర్ అతి తోడివేతకు చెక్ పెట్టింది. ఈ విషయంలో కఠిన నిబంధనలను అమలుచేస్తోంది. పటిష్టవంతమైన నీటి పారుదల వ్యవస్థను ఏర్పాటుచేసింది. 2014 ఏడాది నుంచి చూస్తే 0.01–2.3 సె.మీ.ల స్థాయిలో నేల కుంగినా ఇప్పుడు మాత్రం ఆ దురవస్థ నుంచి కాస్తంత బయటపడింది. ఎగువ ప్రాంతాలు, అడువులు, నదుల నుంచి సిటీ వైపుగా వచ్చే నీటిని నగరానికి దూరంగా ఉన్న రెండు రిజర్వాయర్లలో నింపుతోంది. అక్కడి నుంచి అవసరమైన మేరకే నీటి నగరంలో జనావాసాలకు, పరిశ్రమలకు సరఫరాచేస్తోంది. అయితే జపాన్ మోడల్ అన్ని దేశాలకు పనికొస్తుందో లేదో తెలీదు. పైగా ఇది అత్యంత ఖర్చుతో కూడిన వ్యవహారమని జపాన్లోని వసేడా యూనివర్సిటీలో ప్రొఫెసర్ మిగూయెల్ ఎస్తిబాన్ అభిప్రాయపడ్డారు. భూగర్భజలాల అతి తోడివేతను తగ్గించుకుని తైపే నగరం ఈ సమస్య నుంచి కాస్తంత బయటపడింది. దీనికితోడు బ్యాంకాక్, అమెరికాలోని హ్యూస్టన్, బ్రిటన్లోని లండన్ నగరాలు సైతం భూగర్భజాలాల అతివాడకానికి చరమగీతం పాడాయి.భూగర్భజలాలు పైకి రావడానికి కారణాలెన్నో.. తీర ప్రాంతాల వెంట భవనాల నిర్మాణం, గనుల తవ్వకం, భూఫలకాల కదలికలు, భూకంపాలు, సహజంగా భూమిపొరలు ఒత్తకునిపోవడం తదితర కారణాలతో భూమి కాస్తంత కుంగుతుంది. వీటికితోడు కింది పొరలో భూగర్భజలాలు ఉన్న చోటు నుంచి మనం నీటిని తోడేసి ఖాళీచేస్తున్నాం. దీంతో అప్పటిదాకా భూగర్భజలాలపై ఉన్న శిలలు, నేల పొరలు కిందకు పడిపోతున్నాయి. ఇలా భూమి కుంగుతోంది. ‘‘ అత్యధికంగా భూమి కుంగుతున్న 48 తీరప్రాంతాల్లో సగం ప్రాంతాలు ఈ సమస్యకు అతిగా భూగర్భజలాలను తోడేయడమే కారణం’’ అని ఎన్టీయూ పరిశోధనలో కీలక పరిశోధకురాలు చెరిక్ టే చెప్పారు. జకార్తా వంటి నగరాల్లో భూగర్భజలాలను వెలికితీయడం మరీ ఎక్కువైందని ఆయన వెల్లడించారు. ‘‘ అత్యధిక అభివృద్ధి ప్రాజెక్టులు, జనాభా ఉన్న దేశాల్లో అధిక భూగర్భజలాల వినియోగం కనిపిస్తోంది. ముఖ్యంగా, ఆసియా, తూర్పు ఆసియా ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రమవుతోంది. తక్కువ ఎత్తున్న డెల్టా ప్రాంతాల్లో వెలిసిన నగరాలకు ఈ సమస్య మరీ ఎక్కువ. సముద్రంలో కలవడానికి ముందే ఎక్కువ పాయలుగా విడిపోయి ప్రవహించే నదుల వెంట ఉన్న ప్రాంతాల్లోనూ ఇదే సమస్య కనిపిస్తోంది. జకార్తా, బ్యాంకాక్, హో చి మిన్ సిటీ, షాంఘైలకు ఈ ముంపు ముప్పు ఎక్కువ. జకార్తా సిటీలో సగం ప్రాంతాలు సముద్ర నీటిమట్టం కంటే తక్కువ ఎత్తులో ఉండటం గమనార్హం. 1970 ఏడాదితో పోలిస్తే జకార్తాలో ప్రస్తుతం పలు ప్రాంతాలు 4 సెం.మీ. కుంగిపోయాయి. ఈ కారణంగానే తీరానికి కాస్తంత దూరంగా నుసంతారా పేరిట కొత్త రాజధానిని ప్రభుత్వం నిర్మిస్తోంది. ‘‘ తీరం వెంట మా ఇల్లు ఉంది. ఇంటి కిటికీలు నా చిన్నప్పుడు మెడ ఎత్తులో ఉండేవి. ఇప్పుడు మోకాలు ఎత్తుకు వచ్చేశాయి. నేలపై సముద్రనీరు చొచ్చుకొచ్చి నప్పుడల్లా మా ఇంటి అడుగును పూడుస్తూ వచ్చాం. దీంతో గ్రౌండ్ఫ్లోర్లో ఇంటి ఎత్తు తగ్గుతూ వస్తోంది. చివరకు గ్రౌండ్ఫ్లోర్ మొత్తం మునిగిపోతుందో, ఇల్లే కూలిపోతుందో మాకే అర్థంకావట్లేదు’’ అని నార్త్ జకార్తాలోని ఎర్నా, ఆమె తల్లి సోనీ వాపోయారు. తాత్కాలిక ప్రత్యామ్నాయాలు జకార్తా, ఈజిప్్టలోని అలెగ్జాండ్రియా, వియత్నాంలోని హో చీ మిన్ సిటీల్లోకి పెరిగిన సముద్రమట్టాలు చొచ్చుకురాకుండా గోడలు, అవరోధాలు నిర్మించారు. వచ్చిన నీరు అక్కడే తిష్టవేయకుండా కందకాల వంటి తవ్వి నీటిని మరో చోటుకు మళ్లించారు. అయితే ‘‘గోడలు ఒకరకంగా మంచిచేస్తే మరోరకంగా చేటుచేస్తున్నాయి. ఎగువ నుంచి వరద వస్తే మళ్లీ ముంపు సమస్య అలాగే ఉండిపోతుంది’’ అని ఇటలీలోని పడోవా యూనివర్సిటీలో ప్రొఫెసర్ పెట్రో తియాటినీ చెప్పారు. షాంఘై వినూత్న పంథా షాంఘై నగరం వాటర్ ఇంజెక్షన్ అనే కొత్త విధానాన్ని అవలంబిస్తోంది. యాంగ్జే నది నుంచి సేకరించిన నీటిని శుద్ధిచేసి ఆ నీటిని బావులు, ఇతర మార్గాల ద్వారా నేలలోకి పంపిస్తోంది. నీటిని తోడేందుకు వేసిన బోరుబావుల రంధ్రాల నుంచి నీటిని నేలలోకి పంపుతోంది. అలా భూగర్భజలాల మట్టాలను పెంచుతోంది. తద్వారా భూగర్భజలాల సమతుల్యతను కాపాడుతోంది. చైనాలోని చోంగ్క్విన్, ఎల్సాల్విడార్లోని శాన్ సాల్విడార్ సిటీలో ‘స్పాంజ్ సిటీ’ పంథాలో వెళ్తున్నాయి. అత్యధిక నీటిని పీల్చుకునే మట్టిరకం, చెట్లు, గడ్డిని పెంచుతున్నాయి. అదనంగా వచ్చిన నీరు పార్కుల్లోకి, చిత్తడినేలల్లోకి వెళ్లేలే ఏర్పాట్లుచేశారు. ‘‘అదనపు నీటిని నిల్వచేసేందుకు పేద్ద రిజర్వాయర్ కట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది. దీనితో పలిస్తే పదో వంతు వ్యయంతోనే సమస్యకు పరిష్కారం వెతకొచ్చు’’ అని వర్జీనియా టెక్ వర్సిటీలో ప్రొఫెసర్ మనోòÙహర్ షెర్జాయీ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘ఆ పిచ్చోడితో నేను మాట్లాడను’.. మస్క్ను ఉద్దేశిస్తూ ట్రంప్
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ ఒకరు రాజకీయ వేత్త. మరొకరు వ్యాపార వేత్త. నిన్నమొన్నటి వరకు వాళ్లిద్దరూ ఆప్తమిత్రులు. కానీ ఇప్పుడు బద్ద శత్రువులు. ట్రంప్ ఏ ముహూర్తాన బిగ్ బ్యూటిఫుల్ బిల్ తెచ్చారో నాటి నుంచి వాళ్లిద్దరి మధ్య సఖ్యత దెబ్బ తింది. ఒకరంటే ఒకరికి పడటం లేదు. ఆ పిచ్చోడితో నేను మాట్లాడేంది అని ట్రంప్ అంటుంటే.. జెఫ్రీ ఎప్సిటీన్ ఫైల్స్లో ట్రంప్ పేరు కూడా ఉందంటూ మస్క్ బాంబు పేల్చారు. సంబంధిత ఆధారాల్ని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కొద్ది సేపటికే ఆ ట్వీట్ను డిలీట్ చేశారు. ఈ క్రమంలో ట్రంప్తో మస్క్ రాజీకి సిద్ధమయ్యారనే ప్రచారం జోరందుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఢీ అంటే ఢీ అంటున్న టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ వెనక్కి తగ్గారా? ట్రంప్తో రాజీకి రెడీ అయ్యారా?. అంటే అవుననే అనిపిస్తున్నాయి మస్క్ చర్యలు.జెఫ్రీ ఎప్సిటీన్ ఫైల్స్లో ట్రంప్ పేరుందంటూ ఎక్స్ వేదికగా పోస్టు చేసిన ఫైల్స్ను మస్క్ డిలీట్ చేశారు. జెఫ్రీ ఎప్సిటీన్ ఫైల్స్లో తన పేరు ఉండడం వల్లే ఆ డాక్యుమెంట్ను ట్రంప్ బహిర్ఘతం చేయడం లేదంటూ మొన్న సంచలన వ్యాఖ్యలు చేసిన మస్క్ కొద్ది సేపటిక్రితం ఆ పోస్టును డిలీట్ చేశారు. దీంతో మస్క్ వెనక్కి తగ్గారనే ప్రచారం మొదలైంది.టెస్లాలో భారీ నష్టాలు, స్పేస్ ఎక్స్లో ప్రాజెక్ట్లపై ప్రశ్నార్ధకంగా మారిన నేపథ్యంలో ట్రంప్తో విభేదాల విషయంలో మస్క్ ఆలోచనలో పడ్డారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతకుముందు నేను లేకపోతే డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా అమెరికాకు అధ్యక్షుడు అయ్యే వారు కాదు. కొత్త పార్టీ పెడతానంటూ మస్క్ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ స్పందించారు.Trump responds that he has been too busy to think about Elon Musk but added “I just wish him well.”The President is showing so much class, restraint and grace. pic.twitter.com/CfYCqH3aKN— Cassie N (@cass_nguyen_) June 6, 2025 మస్క్ చేసిన వ్యాఖ్యల్ని ఏబీసీ మీడియా ప్రతినిధులు ట్రంప్ వద్ద ప్రస్తావించారు. మీపై మస్క్ ఆరోపణలు గుప్పిస్తున్నారు కదా. మీరు మాట్లాడే ప్రయత్నం చేయడం లేదా? అన్న ప్రశ్నకు ట్రంప్ స్పందించారు. మీరు మాట్లాడేది ఆ పిచ్చోడి గురించేనా. ప్రత్యేకంగానే కాదు. అసలు మాట్లాడేందుకే నేనే ఇష్టపడడం లేదు. ఒకవేళ మస్క్ నాతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నా.. అందుకు నేను సుముఖంగా లేనన్నారు. ఈ క్రమంలో మస్క్- ట్రంప్ వార్ ఎటుకి దారి తీస్తుందోనని రాజకీయ వేత్తలు ఉత్కంఠగా ఎదురు చూస్తుంటే.. ఇన్వెస్టర్లు మాత్రం ట్రంప్,మస్క్లు మళ్లీ ఏం కొంపముంచుతారోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
జ్యోతి మల్హోత్రాకు పాకిస్తానీ రిటైర్డ్ అధికారితో లింకు ?
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో పలు ఆసక్తికర వివరాలు వెలుగుచూస్తున్నాయి. పాకిస్తానీ రిటైర్డ్ అధికారి నాసిర్ ధిల్లాన్తో జ్యోతి మల్హోత్రాకు సంబంధం ఉన్నట్లు తాజాగా వెల్లడయ్యింది. దర్యాప్తు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం జ్యోతికి ధిల్లాన్తో నేరుగా సంబంధం ఉంది. ఆమె ఒక పాడ్కాస్ట్లో అతని పక్కన కనిపించింది.పాకిస్తాన్ పర్యటన కోసం వచ్చిన జ్యోతిని నాసిర్ ధిల్లాన్ కలుసుకున్నాడు. పాకిస్తాన్ పోలీసు దళం నుంచి పదవీ విరమణ చేసిన ఆయన సొంతంగా యూట్యూబ్ ఛానెల్ను ప్రారంభించాడు. ధిల్లాన్ పాకిస్తాన్ ఐఎస్ఐతో పాటు సైన్యం ఆదేశాల మేరకు పనిచేస్తుంటాడని, నిఘా సమాచారం రాబట్టేందుకు భారతీయ యూట్యూబర్లతో అతను స్నేహం చేస్తుంటాడని అధికారులు చెబుతున్నారు.భారత సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరించడడమే లక్ష్యంగా దిల్లాన్ పనిచేస్తుంటాడని అధికారులు తెలిపారు. ధిల్లాన్ తన ప్లాన్లో భాగంగా మొదట భారత్కు చెందిన యూట్యూబర్ల నమ్మకాన్ని సంపాదిస్తాడని, అనంతరం వారిని ఐఎస్ఐ ఏజెంట్లకు పరిచయం చేస్తాడని, వారు యూట్యూబర్లకు గూఢచర్యానికి సంబంధించిన పనులను అప్పగిస్తారని అధికారుల దర్యాప్తులో తేలింది. ఇది కూడా చదవండి: డిప్యూటీ సీఎం షిండేకు షాకిచ్చిన పైలట్ -
మస్క్.. ‘ది అమెరికా పార్టీ’కి 80 శాతం మద్దతు
వాషింగ్టన్ డీసీ: ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. ఇటీవల మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో యూఎస్లో కొత్త రాజకీయ పార్టీ కోసం పిలుపునిచ్చారు. అగ్రరాజ్యంలో కొత్త పార్టీకి సమయం ఆసన్నమయ్యిందా? అని మస్క్ ‘ఎక్స్’ యూజర్లను అడిగారు. దీనికి వచ్చిన ఆసక్తికర ఫలితాలను తాజాగా ఆయన వెల్లడించారు.మస్క్ తెలిపిన వివరాల ప్రకారం అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు 80 శాతం మంది యూజర్లు మద్దతు పలికారు. ఈ ఫలితాల వెల్లడి తరువాత మస్క్ తన రాజకీయ పార్టీకి ‘ది అమెరికా పార్టీ’ అని పేరు పెడుతున్నట్లు తెలిపారు. ‘ఎక్స్’లో వైరల్ అవుతున్న ఈ పోస్టులో మస్క్.. అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉందని, 80 శాతం ప్రజలు దీనికి మద్దతు పలుకుతున్నారని తెలిపారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని ఆన్లైన్లో మస్క్ పలు విమర్శలు చేశారు. తాను లేకుంటే ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవారని, అతనికి కృతజ్ఞత లేదని మస్క్ ఆరోపించారు. దీనికి స్పందనగా ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫారం ట్రూత్లో మస్క్ కంపెనీలకు ఫెడరల్ కాంట్రాక్టులు, సబ్సిడీలను రద్దు చేస్తానని హెచ్చరించారు. ఎలాన్ మస్క్- డోనాల్డ్ ట్రంప్ మొన్నటి వరకూ ఎంతో సన్నిహితులుగా మెలిగారు. గత జూలైలో పెన్సిల్వేనియా ర్యాలీలో హత్యాయత్నం నుండి ట్రంప్ తృటిలో బయటపడిన అనంతరం మస్క్ బహిరంగంగా ఆయనకు మద్దతును ప్రకటించారు. అయితే ప్రస్తుతం వీరి మధ్య వైరం తారాస్థాయికి చేరింది. ఇది కూడా చదవండి: 400 డ్రోన్లు, 40 క్షిపణులతో ఉక్రెయిన్పై విరుచుకుపడిన రష్యా -
ట్రంప్తో ఫైటింగ్.. మస్క్కు రష్యా బంపరాఫర్
మాస్కో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)ల మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎలాన్ మస్క్ను రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది. మస్క్ తమ దేశానికి రావాలని.. రాజకీయ శరణార్థిగా ఉండేందుకు మస్క్కు అవకాశం కల్పిస్తామని రష్యా తెలిపింది. ఈ మేరకు దిమిత్రి నోవికోవ్ చెప్పుకొచ్చారు.డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య స్నేహ బంధం బీటలు వారింది. ఈ నేపథ్యంలో మస్క్ను మచ్చిక చేసుకునేందుకు రష్యా రంగంలోకి దిగింది. తాజాగా రష్యాకు చెందిన స్టేట్ డూమా ఫెడరేషన్ కమిటీ ఛైర్మన్ దిమిత్రి నోవికోవ్ ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎలాన్ మస్క్ భిన్నమైన వ్యక్తి. ఆయన ఆలోచనా విధానం వేరుగా ఉంటుంది. మస్క్ పూర్తిగా భిన్నమైన ఆట ఆడతారని నేను అనుకుంటున్నా. ఆయనకు రాజకీయ శరణార్థిగా ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయన అలా చేయాలనుకుంటే రష్యా సహకరిస్తోంది. అమెరికాకు చెందిన ఎడ్వర్డ్ స్నోడెన్ లాగానే మస్క్కు కూడా రష్యాలో ఉండేందుకు అవకాశం కల్పిస్తాం అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో అమెరికాలో తర్వాత జరిగే ఎన్నికల్లో డెమోక్రట్లు రావాలని మస్క్ కోరుకోవడం లేదని తాను అనుకుంటున్నానని దిమిత్రి తెలిపారు.మరోవైపు.. ట్రంప్, మస్క్ల మధ్య నెలకొన్న వివాదంపై జోక్యం చేసుకునేందుకు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ నిరాకరించారు. ఇది యూఎస్ సమస్య అని, తమకు ఇందులో జోక్యం చేసుకొనే ఉద్దేశం లేదని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడే స్వయంగా ఈ సమస్యను పరిష్కరించుకుంటారని తాము అనుకుంటున్నట్లు తెలిపారు.Breaking News 🔴Russian MP Dmitry Novikov states that Elon Musk may be offered political asylum in Russia. pic.twitter.com/rp2pwqomuD— Global Report (@Globalrepport) June 6, 2025ఇదిలా ఉండగా.. నిజానికి ట్రంప్, మస్క్ సంబంధాలు కొంతకాలంగా ఒడిదొడుకులమయంగానే సాగుతున్నాయి. ప్రభుత్వ పనితీరుపై మస్క్ పెత్తనం మరీ మితిమీరుతోందని ట్రంప్ బృందం ఆక్షేపిస్తూ వస్తోంది. ఆ క్రమంలో ట్రంప్ గద్దెనెక్కిన ఒకట్రెండు రోజుల నుంచే ఆయన సన్నిహితులతో మస్క్ తరచూ గొడవ పడుతూ వస్తున్నారు. వ్యవహారం శ్రుతి మించుతోందని భావించిన ట్రంప్ కూడా క్రమంగా ఆయనను దూరం పెడుతూ వచ్చారు. డోజ్ సారథిగా కేవలం 130 రోజుల కోసం జరిగిన తన నియామకాన్ని పొడిగిస్తారని మస్క్ ఆశించారని కూడా అంటారు. అలాంటి సూచనలు కన్పించకపోవడంతో ఇటీవల ఆయనే తప్పుకున్నారు. ట్రంప్ ఇటీవల తెరపైకి తెచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ వ్యయానికి కత్తెర వేస్తానని గొప్పలు చెప్పుకున్న పెద్దమనిషి చివరికిలా భారీ దుబారాకు వీలు కలి్పంచే బిల్లుకు రూపమిచ్చారంటూ నిప్పులు చెరిగారు. దాంతో అప్పటిదాకా సంయమనం పాటిస్తూ వచ్చిన ట్రంప్ కూడా శషభిషలన్నీ పక్కనపెట్టి మస్క్ పై విరుచుకుపడ్డారు. -
400 డ్రోన్లు, 40 క్షిపణులతో ఉక్రెయిన్పై విరుచుకుపడిన రష్యా
కీవ్: ఉక్రెయిన్పై రష్యా భీకర దాడికి దిగింది. ఏకంగా 400 డ్రోన్లు, 40 క్షిపణులను ప్రయోగించి, అతిపెద్ద దాడికి పాల్పడింది. ఈ దాడి దేశమంతటినీ ప్రభావితం చేసిందని, లెక్కలేనంత మంది గాయపడ్డారని, వందలాదిమంది శిథిలాల కింద చిక్కుకున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. రష్యాకు చెందిన వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి వాహక నౌకలను లక్ష్యంగా చేసుకుని, ఉక్రెయిన్ ‘ఆపరేషన్ స్పైడర్వెబ్’ను నిర్వహించిన దరిమిలా, రష్యా తాజాగా ఉక్రెయిన్పై భీకరదాడి చేసింది.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ‘ఈరోజు, మన దేశంలోని వివిధ ప్రాంతాలు, నగరాల్లో రెస్క్యూ ఆపరేషన్తో పాటు అత్యవసర కార్యకలాపాలు రోజంతా కొనసాగాయి. రష్యన్లు 400కు మించిన డ్రోన్లు, 40కిపైగా క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడుల్లో 80 మంది గాయపడ్డారు. కొందరు ఇప్పటికీ శిథిలాల కింద విలవిలలాడుతున్నారు. ప్రపంచంలోని కొందరు ఇటువంటి దాడులను ఖండించరు. పుతిన్ ఈ కోవకు చెందిన వ్యక్తి. యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు’ అని పేర్కొన్నారు.ఉక్రెయిన్ రాజధాని కైవ్లో ఈ దాడి కారణంగా ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది మృతిచెందారు. లుట్స్క్లో ఇద్దరు పౌరులు, చెర్నిహివ్లో మరొక వ్యక్తి మృతిచెందారు. మొత్తం ఆరుగురు మరణించారని, పలువురు గాయపడ్డారని ఉక్రేనియన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ (సీఎన్ఎన్) మీడియాకు తెలిపింది. రష్యా జరిపిన ఈ సైనిక దాడి ఇరు దేశాల మధ్య మూడేళ్లుగా కొనసాగుతున్న దాడులలో అతిపెద్ద దాడి. కైవ్ ఉగ్రవాద చర్యలకు ప్రతిగా ఈ దాడులు చేపట్టినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది కూడా చదవండి: కాళ్ల బేరానికి పాక్.. ‘సింధు ఒప్పందం’పై వేడుకోలు -
కాళ్ల బేరానికి పాక్.. ‘సింధు ఒప్పందం’పై వేడుకోలు
న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా పాకిస్తాన్ను ఆర్థిక సంక్షోభం వెంటాడుతోంది. దీనికితోడు ఇటీవల భారత్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడుల అనంతరం ఆ దేశాన్ని మరిన్ని సమస్యలు చుట్టుముట్టాయి. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందంటూ, భారత్ సింధు జలాల ఒప్పందాన్ని (ఐడబ్ల్యూటీ)నిలిపివేయాలని నిర్ణయించింది. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిన పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చి, భారత్కు ఈ విషయమై పునరాలోచించాలని కోరుతూ లేఖ రాసింది.ఇప్పటికే పాకిస్తాన్ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో, భారత్ సింధు జలాల ఒప్పందం నిలిపివేతపై నిర్ణయం తీసుకోవడంతో పాకిస్తాన్ మరింత ఆందోళనకు లోనయ్యింది. వెంటనే తేరుకున్న ఆ దేశ జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా తాజాగా ఐడబ్ల్యూటీని పునరుద్ధరించాలని కోరుతూ, భారత జల్ శక్తి మంత్రిత్వ శాఖకు నాలుగు లేఖలు రాశారు. వీటిని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) పరిశీలనకు పంపినట్లు జల్ శక్తి మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి ఉండలేవని, రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని పాకిస్తాన్కు భారతదేశం ఇప్పటికే స్పష్టం చేసింది. ఐడబ్ల్యూటీని పరస్పర నమ్మకం, స్నేహబంధం మేరకు రూపొందించినప్పటికీ, పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించిందని భారత్ పేర్కొంది. భారత్ తన జాతీయ భద్రతా అధికారాన్ని ప్రయోగిస్తూ.. ఇస్లామాబాద్ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ముగించే వరకు ఈ ఒప్పందం నిలిపివేయనున్నట్లు స్పష్టం చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) ఈ నిర్ణయాన్ని ఆమోదించింది.పాక్లో నెలకొన్న నీటి సంక్షోభాన్ని తక్షణం పరిష్కరించకపోతే దేశంలోని ప్రజలు చనిపోతారని, తమ దేశానికి వచ్చే నీటిలో మూడు వంతులు దేశం వెలుపల నుండి వస్తున్నందని పాక్ సెనేటర్ సయ్యద్ అలీ జాఫర్ ఇటీవల పేర్కొన్నారు. సింధూ బేసిన్ పాక్ జీవనాడి అని, ఈ దేశంలోని ప్రతీ 10 మందిలో తొమ్మిది మంది తమ జీవనోపాధి కోసం సింధు నీటిపై ఆధారపడతారని ఆయన అన్నారు. దేశంలో పండించే పంటలలో 90 శాతం సింధు జలాలపైనే ఆధారపడి ఉన్నాయని, పలు విద్యుత్ ప్రాజెక్టులు, ఆనకట్టలన్నీ దానిపైనే నిర్మితమయ్యాయని సయ్యద్ అలీ జాఫర్ తెలిపారు.ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్ ఎన్నికలపై యూనస్ కీలక ప్రకటన -
చంద్రుడిపై కుప్పకూలిన లాండర్
టోక్యో: జపాన్కు చెందిన ప్రైవేట్ సంస్థ చంద్రుడిపైకి చేపట్టిన ప్రయోగం విఫలమైంది. ఐస్పేస్ సంస్థ పంపిన లూనార్ ల్యాండర్ కుప్పకూలింది. మరో రెండు నిమిషాల్లో చంద్రుడిపైన మినీ రోవర్ ల్యాండవుతుందనగా మిషన్తో సంబంధాలు తెగిపోయాయని ఐస్పేస్ సీఈవో టకేషి హకామడ తెలిపారు. రెండేళ్ల క్రితం ఐస్పేస్ చేపట్టిన మొట్ట మొదటి ప్రయోగం విఫలమైంది. దీంతో, ఈసారి ‘రిసైలెన్స్’ పేరుతో పక్కాగా ఈ ప్రయోగం చేపట్టినట్లు అంతకుముందు టకేషి చెప్పారు. ఈ ప్రయోగానికి సుమారు రూ.815 కోట్లు ఖర్చయిందని ఐస్పేస్ సీఈవో టకేషి చెప్పారు. అయితే, 2027లో నాసాతో కలిసి భారీ ల్యాండర్ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. చంద్రుని ఉపరితలంపై ఉంచడానికి స్వీడన్ కళాకారుడు తయారు చేసిన బొమ్మ పరిమాణంలోని ఎర్రటి ఇంటిని, చంద్రుని మట్టిని సేకరించడానికి పారతో కూడిన రోవర్ రిసైలెన్స్లో ఉన్నాయి. రిసైలెన్స్లో ఉన్న లేజర్ వ్యవస్థ నిర్దేశించిన ప్రకారం ఎత్తును సరిగ్గా అంచనా వేయలేకపోవడంతో ల్యాండర్ అత్యంత వేగంగా చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొట్టి, ధ్వంసమైనట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చామని ఐస్పేస్ ఒక ప్రకటనలో తెలిపింది. -
డిన్నర్కి వెళ్తూ కోటీశ్వరులయ్యారు!
వాషింగ్టన్: అదృష్టం అంటే నిజంగా ఇదేనేమో! డిన్నర్ చేద్దామని సరదాగా హోటల్కు వెళ్తూ మధ్యలో ఆగి కొన్న లాటరీ టికెట్కు ఏకంగా 1.5 మిలియన్ డాలర్ల(రూ.12.86 కోట్లు) సొమ్ము లభించింది. అమెరికాలోనూ న్యూజెర్సీలో ఈ సంఘటన జరిగింది. న్యూజెర్సీ దంపతులు డిన్నర్ కోసం హోటల్కు బయలుదేరారు. మధ్యలో ఓ దుకాణం వద్ద ఆగి 3 డాలర్లు(రూ.257) పెట్టి లాటరీ టికెట్ కొనేశారు. నిజానికి వారిద్దరిలో ఒకరికి ఇదే దుకాణంలో కొనడం ఇష్టంలేదు. మరోచోట చూద్దామని చెప్పారు. కాసేపు ఇద్దరూ చర్చించుకొని చివరికి ఇక్కడే కొనాలని నిర్ణయించుకున్నారు. టికెట్ కొన్న తర్వాత స్క్రాచ్ చేసి చూడగా, ఏకంగా 1.5 మిలియన్ డాలర్ల సొమ్ము గెలుచుకున్నట్లు తెలిసిపోయింది. దంపతులు ఒక్కసారిగా కోటీశ్వరులుగా మారిపోయారు. తమ కష్టాలన్నీ తీరిపోయినట్లేనని వారు ఆనందం వ్యక్తంచేశారు. బిల్లులు చెల్లించడానికి ఇన్నాళ్లూ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇకపై ఆ పరిస్థితి ఉండదని చెప్పారు. తమ జీవితం ఇక సుఖమయం అవుతుందని సంతోషపడ్డారు. 1.5 మిలియన్ డాలర్ల సొమ్మును 25 ఏళ్లపాటు విడతలవారీగా తీసుకొనేలా లాటరీ నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. -
60 ఏళ్ల తర్వాత డిగ్రీ పట్టా సాధించిన 88 ఏళ్ల బామ్మ
న్యూహాంప్షైర్: అమెరికాలోని మెయిన్ రాష్ట్రానికి చెందిన ఓ బామ్మ ఎట్టకేలకు డిగ్రీ పట్టా అందుకున్నారు. వాస్తవానికి ఈమెకీ పట్టా 1959 లోనే అందాల్సి ఉంది. అనివార్య కారణాలతో డిగ్రీ పూర్తి చేయలేకపోయారు. కుమార్తె చొరవ తో దాదాపు 60 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఈమె కల నిజమైంది. న్యూహాంప్షైర్కు చెందిన జోన్ అలెగ్జాండర్(88) సాధించిన ఘనత ఇది. ఈమె మెయిన్ యూనివర్సిటీలో సైన్స్ ఇన్ ఎడ్యుకేషన్ కోర్సులో 1950ల్లో చేరారు. 1959 కల్లా ఈ డిగ్రీని పూర్తి చేయాల్సి ఉంది. పట్టా చేతికి రావాలంటే కోర్సు చివర్లో విద్యారి్థనీ విద్యార్థులు కొద్దికాలంపాటు ఉపాధ్యాయులుగా పనిచేయాలనే నిబంధన ఉంది. అప్పటికి గర్భవతిగా ఉన్న జోన్ను అధికారులు బోధించేందుకు అనుమతించలేదు. ఆ రోజుల్లో జోన్ వంటి వారందరిదీ ఇదే పరిస్థితి. దీంతో, డిగ్రీ పట్టాను అందుకోవాలన్న జోన్ కల అలాగే మిగిలిపోయింది. కుమార్తె సాయంతో.. ఈ ఏడాది ఆరంభంలో జోన్ అలెగ్జాండర్ కుమార్తె ట్రేసీ తల్లి కలను నిజం చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. మెయిన్ యూనివర్సిటీ అధికారులను సంప్రదించారు. కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ విభాగం అసోసియేట్ డీన్గా ఉన్న జస్టిన్ డిమ్మెల్ సానుకూలంగా స్పందించారు. జోన్ అలెగ్జాండర్కు సంబంధించిన విద్యార్హతల వివరాలను క్షుణ్నంగా పరిశీలించారు. 1980ల్లో ఆమె ఓ ప్రీసూ్కల్లో పూర్తిస్థాయి సహాయకురాలిగా పనిచేసినట్లుగా గుర్తించారు. ఈ అనుభవాన్ని బోధనతో సమానమైన అర్హతగా భావించి, జోన్ అలెగ్జాండర్కు డిగ్రీ పట్టా ప్రదానం చేసేందుకు వర్సిటీ యాజమాన్యం అంగీకరించింది. ఈ ఏడాది మేలో జోన్ అలెగ్జాండర్ను గ్రాడ్యుయేట్గా గుర్తిస్తున్నట్లు మెయిన్ వర్సిటీ ప్రకటించింది. మే 11వ తేదీన జరిగిన స్నాతకోత్సవానికి జోన్ వెళ్లలేకపోయారు. బదులుగా ఆమె కుమార్తె ట్రేసీ, మనవరాలు ఇసాబెల్ వర్సిటీ స్నాతకోత్సవంలో పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రెసిడెంట్ ప్రత్యేకంగా జోన్ అలెగ్జాండర్ పేరును ప్రస్తావించారు. విద్యారంగానికి జీవితాన్ని అంకితం చేసిన జోన్ ఎన్నో సేవలందించారని కొనియాడారు. చిట్టచివరికి తన కృషిని గుర్తించడం ఎంతో ముఖ్యమైన అంశమని జోన్ పేర్కొన్నట్లు యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. స్నాతకోత్సవంలో తల్లి తరఫున పట్టా అందుకున్న వేళ ఎంతో ఉద్వేగానికి గురైనట్లు ట్రేసీ పేర్కొన్నారు. యూనివర్సిటీలోని ప్రతి ఒక్కరూ ఎంతో మద్దతిచ్చారన్నారు. కాగా, జోనీ అలెగ్జాండర్ భర్త తీర రక్షక దళం అధికారి. ఈ దంపతులకు నలుగురు కుమార్తెలు. భర్త ఎక్కువ సమయంలో విధుల్లో ఉండాల్సి రావడంతో నలుగురు కూతుళ్ల భారం జోనీయే మోశారు. న్యూ హాంప్షైర్లోనే ఉంటున్న జోనీ ఇప్పటికీ చర్చి, స్థానిక లైబ్రరీ, స్కూళ్లలో జరిగే సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ‘డిగ్రీ సంపాదించడం నా వ్యక్తిగత లక్ష్యం. మా కుటుంబంలోని వారంతా గ్రాడ్యుయేట్లే. ఎట్టకేలకు నేను సైతం గ్రాడ్యుయేట్నయ్యా’అని గర్వంగా చెప్పుకుంటున్నారు జోనీ అలెగ్జాండర్..! -
వీసా మోసగాళ్లున్నారు జాగ్రత్త!
న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని వీసా దరఖాస్తుదారులను ఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయం హెచ్చరించింది. ఇటీవల మారిన నిబంధనలను ఆసరాగా చేసుకునేందుకు మోసగాళ్లు ప్రయతి్నస్తున్నారంటూ ఓ ప్రకటనలో అలర్ట్ చేసింది. బెంగళూరుకు చెందిన ఓ ఇంజినీర్ను సైబర్ నేరగాడు బీ1/బీ2 నాన్ ఇమిగ్రాంట్ వీసా ఇంటర్వ్యూ ముందుగానే ఇప్పిస్తామని మోసం చేశారని వివరించింది. అమెరికా వీసా దరఖాస్తు పోర్టల్లో వ్యక్తిగత వివరాలను, అర్హతలను షేర్ చేయవద్దంటూ శుక్రవారం అమెరికా ఎంబసీ ‘ఎక్స్’లో కోరింది. వీసా ఇంటర్వ్యూ తేదీ ముందుగానే వచ్చేందుకు ఎక్కువ ప్రాసెస్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఎవరైనా చెబితే నమ్మవద్దని, అది వట్టి మోసమని వెల్లడించింది. ఇంజినీర్ ఎలా మోసపోయారంటే.. బెంగళూరు ఆర్ఆర్ నగర్కు చెందిన ఇంజినీర్(45) అమెరికా సందర్శనకు అవసరమైన బీ1/బీ2 నాన్ ఇమిగ్రాంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈయన ఇంటర్వ్యూ షెడ్యూల్ 2026 మార్చిలో ఖరారైంది. టెలీగ్రామ్ యాప్లో వచ్చిన ఓ ప్రకటనను చూసి ఆయన.. ఓ వ్యక్తిని మే 22న సంప్రదించాడు. ఆ మోసగాడు తన పేరు వనం శ్రవణ్ కుమార్గా పరిచయం చేసుకున్నాడు. వీసా ఇంటర్వ్యూ తేదీ ముందుగా రావాలంటే అడ్వాన్స్గా రూ.10వేలు చెల్లించాలన్నాడు. ఆ మేరకు డబ్బు పంపగా, వ్యక్తిగత వివరాలు కావాలడిగాడు. అమెరికా వీసా అప్లికేషన్ పోర్టల్ లాగిన్ పాస్వర్డ్ కూడా తీసుకున్నాడు. ఫేక్ అపాయింట్మెంట్ రీషెడ్యూల్ పత్రం పంపించిన మోసగాడు...మరో రూ.10 వేలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. లేదంటే లాగిన్ పాస్వర్డును మారుస్తానని బెదిరించాడు. ఆ మేరకు రూ.10వేలు చెల్లించిన తర్వాత కూడా ఆ మోసగాడు లాగిన్ పాస్వర్డును మార్చేశాడు. దీంతో, బాధితుడు చేసేదిలేక మే 24న పోలీసులను ఆశ్రయించాడు.అవకాశం కోల్పోయిన బాధితుడు ఈ విషయంలో బాధితుడికి అమెరికా ఎంబసీ నుంచి ఎటువంటి సాయం అందదని సీనియర్ సీఐడీ అధికారి ఒకరు తెలిపారు. బాధితుడు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ తొందరగా వచ్చేందుకు తనంతట తానే థర్డ్ పార్టీని ఆశ్రయించాడని, అధికారిక ప్రక్రియను కాదని దొడ్డిదారిన పని పూర్తి చేసుకునే ఇటువంటి వారిని ఎంబసీ అధికారులు ప్రోత్సహించరన్నారు. వ్యక్తిగత వివరాలతోపాటు పాస్వర్డ్ సైతం మోసగాడికి ఇవ్వడం మరీ దారుణమన్నారు. బాధితుడు మరోసారి వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఇలా ఉండగా, విద్యార్థి వీసా ఇంటర్వ్యూలతోపాటు విజిటర్ వీసా దరఖాస్తుల పరిశీలనను తక్షణమే నిలిపివేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం గత నెలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కాన్సులేట్లకు ఆదేశాలు జారీ చేశారు. అమెరికాలో చదువుకునే అంతర్జాతీయ విద్యార్థులందరి సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేయాలంటూ విదేశాంగ శాఖ నిర్ణయించిన నేపథ్యంలోనే ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. అదేవిధంగా, నాన్ ఇమిగ్రాంట్ వీసా దరఖాస్తుదారుల నుంచి ప్రాసెసింగ్ ఫీజుగా ఇకపై వెయ్యి డాలర్లు వసూలు చేయనున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఇందులో వీసా ఇంటర్వ్యూలు తొందరగా పూర్తవ్వాలని కోరుకునే పర్యాటక వీసా దరఖాస్తు దారులు సైతం ఉన్నారు. -
మరో కరోనా మహమ్మారి!
బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్ల క్రితం ఉధృతంగా మొదలై ఇప్పటికీ మరణశాసనం రాస్తున్న కరోనా వైరస్ కుటుంబానికి చెందిన కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నట్లు అమెరికా పరిశోధకులు గుర్తించారు. కోవిడ్–19కు మూలకారణంగా భావిస్తున్న చైనాలోని గబ్బిలాల్లో ఈ వైరస్ల ఉనికిని కనిపెట్టారు. వీటిలో మరొక్క చిన్నపాటి ఉత్పరివర్తనం(మ్యుటేషన్) జరిగితే మనుషులకు ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని చెబుతున్నారు. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా పరిశోధనలు నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలను నేచర్ కమ్యూనికేషన్స్ పత్రికలో ప్రచురించారు. ఈ మిస్టరీ వైరస్లు కరోనా మాదిరిగానే మెర్స్–కోవ్ కుటుంబానికి చెందుతాయని తెలిపారు. కరోనా వైరస్ సృష్టిస్తున్న ఉత్పాతం గురించి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి బారినపడిన వారిలో 34 శాతం మంది మరణించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. → మెర్స్–కోవ్ కుటుంబంలోని ఉపవర్గమైన మెర్బికో వైరస్లపై అమెరికా సైంటిస్టులు నిశితంగా దృష్టిపెట్టారు. ఈ ఉపవర్గంలోని హెచ్కేయూ5 వైరస్లతో ముప్పు ముంచుకొస్తున్నట్లు పేర్కొంటున్నారు. → హెచ్కేయూ5 వైరస్ల గురించి ఇప్పటిదాకా తెలిసింది తక్కువే. మనుషుల్లో కణాలను తీవ్రంగా ప్రభావితం చేసే శక్తి వీటికి ఉందని వైరాలజిస్టు డాక్టర్ మైఖేల్ లెట్కో చెప్పారు. వీటిలో మరో మ్యుటేషన్ జరిగి, మనుషులకు సోకితే ప్రాణాంతకంగా మారే పరిస్థితిని కొట్టిపారేయలేమని వెల్లడించారు. → సార్స్–కోవ్–2 అనే వైరస్ కోవిడ్–19 వ్యాధిని కలిగించినట్లుగానే హెచ్కేయూ5 వైరస్లు స్పైక్ ప్రొటీన్ ఆధారంగా మనుషుల కణాల్లోకి ప్రవేశించి, నాశనం చేయగలవు. → చైనాలో గబ్బిలాల నుంచి మింక్స్ అనే జంతువులకు వ్యాప్తి చెందినట్లు చెబుతున్నారు. ఇతర జీవులకు సైతం వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. → హెచ్కేయూ5 వైరస్ల విషయంలో ఇప్పటికిప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ మైఖేల్ లెట్కో సూచించారు. అయినప్పటికీ అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. -
అంబేడ్కర్ కలలు సాకారం: జస్టిస్ గవాయ్
లండన్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆశయాలు ఆచరణలోకి వస్తున్నాయని, భారత్లో నిమ్నవర్గాల ప్రజలు కూడా అత్యున్నత రాజ్యాంగ పదవులు అధిరోహిస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు. భారత రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లండన్లోని చరిత్రాత్మక గ్రేస్ ఇన్లో గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని అంబేడ్కర్ బోధించారని గుర్తుచేశారు. బడుగు వర్గాల ప్రజలు కూడా ఉన్నత పదవులు చేపట్టాలని ఆయన కలలుగన్నారని తెలిపారు. అంబేడ్కర్ కలలు సాకారం అవుతుండడం సంతోషంగా ఉందన్నారు. అంబేడ్కర్ సూచించిన దారితో తాము నడుస్తున్నామని తెలిపారు. తాను దళిత వర్గం నుంచే వచ్చినట్లు జస్టిస్ గవాయ్ గుర్తుచేశారు. గిరిజన మహిళ ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతి అయ్యారని పేర్కొన్నారు. ఇది నిజంగా గర్వకారణమని వ్యాఖ్యానించారు. ఇండియాలో అన్ని రంగాల్లో బడుగు బలహీన వర్గాల ప్రాతినిధ్యం పెరుగుతోందన్నారు. -
పెద్దన్నల పోట్లాట
వాషింగ్టన్: ఒకరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. మరొకరు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశానికి అధినేత. బెదిరించి పనులు చక్కబెట్టుకోవడంలో, అవసరం తీరిందనుకుంటే ఎంతటి వారినైనా సరే దూరం పెట్టడంలో, భావోద్వేగాలకు తావన్నదే లేకుండా స్వీయ ప్రయోజనాలే పరమావధిగా వ్యవహరించడంలో ఒకరికొకరు ఏ మాత్రమూ తీసిపోరు. అలాంటి వాళ్లు పరస్పరం తలపడితే ఎలా ఉంటుంది? అచ్చం ఎలాన్ మస్క్ , డొనాల్డ్ ట్రంప్ తాజా రగడ మాదిరిగానే ఉంటుంది. నిజానికి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మొదలైన వారి బ్రొమాన్స్ ట్రంప్ గద్దెనెక్కాక కూడా బ్రహా్మండంగా కొనసాగింది. అవకాశం దొరికినప్పుడల్లా మస్క్ ను ఇంద్రుడు చంద్రుడంటూ ట్రంప్ ఆకాశానికెత్తేశారు. ప్రభుత్వ వ్యయానికి కత్తెర వేసేందుకు సృష్టించిన డోజ్ విభాగపు సారథ్యం అప్పగించారు. దాని ముసుగులో కీలకమైన ప్రభుత్వ డేటాను మస్క్ చేజిక్కించుకున్నారంటూ ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదు. అధ్యక్ష కార్యాలయమైన ఓవల్ ఆఫీసులో, అధికారిక విమానం ఎయిర్ఫోర్స్వన్లో, కేబినెట్ సమావేశాల్లో... ఇలా ఎక్కడ చూసినా మస్కే. వైట్హౌస్ను చివరికి మస్క్కు అత్తారిల్లుగా మార్చేశారంటూ ట్రంప్పై విపక్షాలు దుమ్మెత్తిపోసేదాకా వెళ్లింది. అంతలా కొనసాగిన ట్రంప్, మస్క్ సాన్నిహిత్యానికి మూడు రోజుల క్రితం అనూహ్యంగా, అర్ధాంతరంగా తెరపడింది. అంతే! ఒక్కసారిగా అంతా తల్లకిందులైంది. అసలే మొండితనంలోనూ, నోటి దురుసులోనూ ఒకరికొకరు ఏ మాత్రమూ తీసిపోని బాపతు కావడంతో పరస్పర నిందలు, విమర్శలు, ఆరోపణలతో ‘తగ్గేదే లే’అంటూ ఇద్దరూ చెలరేగిపోతున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే రీతిలో సోషల్ మీడియాలో సవాళ్లు విసురుకుంటున్నారు. మస్క్ కు మతి చలించిందంటూ ట్రంప్ దుయ్యబట్టడమే గాక ఆయన స్పేస్ ఎక్స్, స్టార్లింక్ తదితర సంస్థలకు బిలియన్ల కొద్దీ డాలర్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులు రద్దు చేసి పారేస్తానని హెచ్చరించారు. దాంతో చిర్రెత్తుకొచ్చిన మస్క్ , దమ్ముంటే ఆ పని చేసి చూపించాలంటూ సవాలు విసిరారు. నాసాకు అతి కీలకమైన స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక సేవలను తక్షణం నిలిపేస్తానంటూ బెదిరించారు. అంతేగాక, ‘‘అసలు నావల్లే ట్రంప్ అధ్యక్షునిగా గెలిచారు. కనీసం ఆ కృతజ్ఞత కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు’’అంటూ మండిపడ్డారు. అంతటితో ఆగకుండా మైనర్లతో సెక్స్ కార్యకలాపాల ‘ఎప్స్టీన్ కుంభకోణం’లో ట్రంప్ పేరూ ఉందంటూ పెద్ద బాంబు పేల్చారు. ఈ ఉదంతంలో ఆయన గద్దె దిగడం, ఉపాధ్యక్షుడు వాన్స్ అధ్యక్ష పీఠమెక్కడం తప్పదని జోస్యం చెప్పారు. వారి వాగ్యుద్ధం ఇప్పుడు టాక్ ఆఫ్ ద వరల్డ్గా మారిపోయింది. ఇది చివరికి ఎటు దారి తీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అలా మొదలైంది... నిజానికి ట్రంప్, మస్క్ సంబంధాలు కొంతకాలంగా ఒడిదొడుకులమయంగానే సాగుతున్నాయి. ప్రభుత్వ పనితీరుపై మస్క్ పెత్తనం మరీ మితిమీరుతోందని ట్రంప్ బృందం ఆక్షేపిస్తూ వస్తోంది. ఆ క్రమంలో ట్రంప్ గద్దెనెక్కిన ఒకట్రెండు రోజుల నుంచే ఆయన సన్నిహితులతో మస్క్ తరచూ గొడవ పడుతూ వస్తున్నారు. వ్యవహారం శ్రుతి మించుతోందని భావించిన ట్రంప్ కూడా క్రమంగా ఆయనను దూరం పెడుతూ వచ్చారు. డోజ్ సారథిగా కేవలం 130 రోజుల కోసం జరిగిన తన నియామకాన్ని పొడిగిస్తారని మస్క్ ఆశించారని కూడా అంటారు. అలాంటి సూచనలు కన్పించకపోవడంతో ఇటీవల ఆయనే తప్పుకున్నారు. ట్రంప్ ఇటీవల తెరపైకి తెచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ వ్యయానికి కత్తెర వేస్తానని గొప్పలు చెప్పుకున్న పెద్దమనిషి చివరికిలా భారీ దుబారాకు వీలు కలి్పంచే బిల్లుకు రూపమిచ్చారంటూ నిప్పులు చెరిగారు. దాంతో అప్పటిదాకా సంయమనం పాటిస్తూ వచ్చిన ట్రంప్ కూడా శషభిషలన్నీ పక్కనపెట్టి మస్క్ పై విరుచుకుపడ్డారు.ఏమిటీ ఎప్స్టీన్ కుంభకోణం? మైనర్ బాలికలతో పాటు మహిళలను లైంగికంగా వేధించినట్టు ఎప్స్టీన్పై ఆరోపణలు వెల్లువెత్తాయి. తన ఎదుగుదల కోసం వారిని సన్నిహితులైన రాజకీయ తదితర రంగాల ప్రముఖులకు ఎరగా వేశాడని అభియోగాలు నమోదయ్యాయి. జాబితాలో ట్రంప్, బిల్ క్లింటన్, ప్రిన్స్ ఆండ్రూ, పలు దేశాల ప్రధానులు, రాజకీయ దిగ్గజాలు, హాలీవుడ్ తారలు తదితరులున్నారు. 2019లో అతను జైల్లో అనుమానాస్పదంగా మరణించాడు. సంబంధిత ఫైళ్లను బయట పెడతానని గత అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ హామీ ఇచ్చారు.మస్క్ కు ఎదురుదెబ్బలు విద్యుత్ కార్లపై ట్యాక్స్ క్రెడిట్కు ‘బ్యూటిఫుల్’ బిల్లులో భారీ కోతలు ప్రతిపాదించారు. అందులోని పలు అంశాలు తన వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీసేవి కావడం మస్క్ కు మంటెక్కించింది. అంతకుముందు అమెరికా వైమానిక వ్యవస్థ తన స్టార్లింక్ శాటిలైట్ సిస్టం సేవలను వాడుకునేలా ఒప్పించేందుకు ప్రయతి్నంచినా కుదరలేదు. మస్క్ సన్నిహితున్ని నాసా చీఫ్ పదవికి పరిగణించొద్దని ట్రంప్ నిర్ణయించారు. ట్రంప్తో రగడ నేపథ్యంలో మస్క్ కార్ల కంపెనీ టెస్లా షేర్లు ఏకంగా 14 శాతం పడిపోయాయి.ట్రంప్ గద్దె దిగుతారు: మస్క్అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టీన్తో ట్రంప్కు సంబంధాలున్నట్టు మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. ‘‘అతి పెద్ద బాంబు పేల్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఎప్స్టీన్ దర్యాప్తు ఫైళ్లలో ట్రంప్ పేరు కూడా ఉంది. అందుకే వాటిని ఆయన బయట పెట్టడం లేదు’’అంటూ ఆరోపించారు. ట్రంప్ను అభిశంసించాలంటూ ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్ను సమరి్థంచారు. వాన్స్ను అధ్యక్షున్ని చేయాలన్న పోస్ట్ను రీ పోస్ట్ చేస్తూ ‘అవు’నని కామెంట్ చేశారు. ‘‘ట్రంప్ అధ్యక్షునిగా ఉండేది మహా అయితే మూడున్నరేళ్లు. నేను మాత్రం కనీసం ఇంకో 40 ఏళ్ల దాకా ఉంటాను’’ అన్నారు. అమెరికన్లలో కనీసం 80 శాతం మందికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ స్థాపనపై ఒపీనియన్ పోల్ పెట్టారు. నాసాకు డ్రాగన్ సేవలు ఆపేయబోనంటూ కాస్త వెనక్కు తగ్గారు.మస్క్ తో మాట్లాడను: ట్రంప్ మస్క్ వంటి వ్యక్తి డోజ్ పదవిని నెలల క్రితమే వదిలేసి ఉంటే బాగుండేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ‘బ్యూటిఫుల్ బిల్లు’లో టెస్లాకు మస్క్ ఆశించిన లబ్ధి కని్పంచకపోవడంతో తనపై నిందారోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘ట్రంప్ గురించి కనీసం ఆలోచించడం కూడా లేదు. కొంతకాలం ఆయనతో మాట్లాడబోను’’అని సీఎన్ఎన్ వార్తా సంస్థతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ‘‘పాపం మస్క్ . అతనికేదో సమస్య ఉన్నట్టుంది! బహుశా మతి చలించినట్టుంది’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘బిలియన్ల కొద్దీ డాలర్లు ఆదా చేసేందుకు సులువైన మార్గం ఒకటుంది. మస్క్ సంస్థలకు అందుతున్న ప్రభుత్వ కాంట్రాక్టులు, రాయితీలను తెగ్గోస్తే చాలు!’’అంటూ గురువారం ట్రూత్ సోషల్లో వరుస పోస్టులు పెట్టారు. -
బంగ్లాదేశ్ ఎన్నికలపై యూనస్ కీలక ప్రకటన
ఢాకా: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు ముహమ్మద్ యూనస్ దేశంలోని ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఒకవైపు వివిధ రాజకీయ పార్టీల నుంచి వస్తున్న ఒత్తిడి, మరోవైపు ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ల మధ్య యూనస్ దేశంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించబోయేదీ వెల్లడించారు.2025లో బంగ్లాదేశ్లో చోటుచేసుకున్న తిరుగుబాటు, షేక్హసీనా దేశం విడిచిపెళ్లిపోయిన దరిమిలా ఆ దేశానికి ముహమ్మద్ యూనస్ తాత్కాలిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయనపై గత కొంతకాలంగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ఒత్తిడి పెరిగిపోయింది. ఈ నేపధ్యంలో ఆయన దేశంలో సార్వత్రిక ఎన్నికలు 2026 ఏప్రిల్లో జరుగుతాయని ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి అర్ధభాగంలో ఏ రోజునైనా ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు.గత ఏడాది బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగ కోటా వ్యవస్థలో సంస్కరణల కోసం డిమాండ్ చేస్తూ, రాజకీయ తిరుగుబాటు చోటుచేసుకుంది. కాగా గత నెలలో మాజీ ప్రధాన మంత్రి ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ), డిసెంబర్ 2025 నాటికల్లా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని, వివాదాస్పద సలహాదారులను తొలగించాలని ముహమ్మద్ యూనస్ను కోరింది.ఇది కూడా చదవండి: ‘సిమ్లా ఒప్పందం చావలేదు’.. నాలిక కరుచుకున్న పాకిస్తాన్ -
తరుముకొస్తున్న మరో మహమ్మారి?.. శాస్త్రవేత్తల హెచ్చరిక
కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా వణికించిందో అందరికీ తెలిసిందే. దీని బారినపడి లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. నేటికీ కోవిడ్-19 ప్రపంచ దేశాలను పూర్తిగా వీడనే లేదు. అయితే ఇంతలోనే శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని ముంచెత్తనున్న మరో ముప్పుపై హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని న్యూయార్క్కు చెందిన ‘నేచర్ కమ్యూనికేషన్స్’లో తాజాగా ప్రచురితమైన ఒక అధ్యయనం ఇప్పుడు ఆందోళనను రేకెత్తిస్తోంది. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ, కాల్టెక్, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా బృందాలు తమ పరిశోధనలో మెర్బెకోవైరస్లలోని ఉప వేరియంట్ అయిన హెచ్కేయూ5 వైరస్లపై దృష్టి సారించారు. ఇవి 2019లో ఉద్భవించిన ప్రాణాంతక కరోనా వైరస్కు కారణమైన సార్స్-కోవ్తో సంబంధం కలిగినవి. ఇవి సుమారు 34 శాతం మరణాల రేటును కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు.హెచ్కేయూ5 వైరస్లపై ఇంకా పూర్తిగా అధ్యయనం చేయలేదని, అయితే తమ పరిశోధన ప్రకారం అవి మానవులకు సోకే సామర్థ్యానికి కొంత దూరంలో ఉండవచ్చని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ వైరాలజిస్ట్ డాక్టర్ మైఖేల్ లెట్కో తెలిపారు. కోవిడ్-19 వెనుక ఉన్న వైరస్ అయిన సార్స్ కోవ్-2 మాదిరిగా ఈ బ్యాట్ వైరస్లు కణాలపై దాడి చేయడానికి స్పైక్ ప్రోటీన్లను ఉపయోగిస్తాయన్నారు. ప్రస్తుతానికి హెచ్కేయూ5 వైరస్లు గబ్బిలాలలో మాత్రమే ఏసీఈ2తో అనుసంధానమై ఉన్నాయని, అయితే అవి చిన్నపాటి జన్యు మార్పుతో మానవులలోకి ప్రవేశించేందుకు అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పరిశోధకులు ఈ స్పైక్ ప్రోటీన్లు ఎలా అభివృద్ధి చెందుతాయనేది తెలుసుకునేందుకు అత్యాధునిక ఏఐ సాధనం ఆల్ఫాఫోల్డ్ 3ని ఉపయోగించారు.ఇది కూడా చదవండి: ఖైరతాబాద్ గణేష్ విగ్రహ తయారీకి అంకురార్పణ -
‘సిమ్లా ఒప్పందం చావలేదు’.. నాలిక కరుచుకున్న పాకిస్తాన్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఏ అంశంలోనూ తన తీరు మార్చుకోవడం లేదు. తన దుందుడుకు చర్యలతో ఉద్రిక్తతతలను రేకెత్తిస్తూనే ఉంది. నాటి సిమ్లా ఒప్పందం విషయంలోనూ ఒకసారి నోరు జారి, తిరిగి మాటమార్చింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ 1972 సిమ్లా ఒప్పందాన్ని ‘చనిపోయిన పత్రం’ అని పేర్కొన్నారు. అయితే ఇది జరిగిన మర్నాడే ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ స్పందిస్తూ, తాము భారతదేశంతో ఉన్న ఏ ద్వైపాక్షిక ఒప్పందాలను, రద్దు చేసే దిశగా ఎటువంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.తాజాగా జరిగిన ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ భారతదేశం ఏకపక్ష చర్యలు చేపడుతున్నదని, ముఖ్యంగా జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుతో పాటు సిమ్లా ఒప్పందాన్ని వాడుకలో లేకుండా చేసిందని విమర్శించారు. సిమ్లా ఒప్పందం విఫలమయ్యిందని, భవిష్యత్తులో ఇరు దేశాల వివాదాలను అంతర్జాతీయ యంత్రాంగాల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన అన్నారు. అయితే మరుసటి రోజే పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయానికి చెందిన ఒక సీనియర్ అధికారి ఆసిఫ్ వాదనను తోసిపుచ్చారు. ప్రస్తుతానికి ద్వైపాక్షిక ఒప్పందాన్ని రద్దు చేయడానికి సంబంధించి ఎటువంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. సిమ్లా ఒప్పందంతో సహా ఇరుదేశాల మధ్య అన్ని ఒప్పందాలు అమలులోనే ఉన్నాయని పేర్కొన్నారు.నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ- పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టోల మధ్య 1972, జూలై 2న సిమ్లా శాంతి ఒప్పందం కుదిరింది. 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఇది జరిగింది. ఫలితంగా భారత్ నిర్ణయాత్మక విజయం సాధించింది. ఈ నేపధ్యంలోనే బంగ్లాదేశ్ ఏర్పడింది. కాగా ద్వైపాక్షిక చర్చల ద్వారా లేదా శాంతియుత మార్గాల ద్వారా విభేదాలను పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయనేది ఈ ఒప్పందంలోని ప్రధాన నిర్ణయం.ఇది కూడా చదవండి: ‘జీ 7’కు ప్రధాని మోదీకి ఆహ్వానం.. కాంగ్రెస్ విమర్శలకు చెక్ -
‘గారె’ వాసనకు పడిపోయారు!
నోరూరుంచే వంటను చూసినా.. వాసనొచ్చినా మనసాగదు మనకు. ‘‘ఎవరింట్లోనో వంట అద్దిరి పోతోంది గురూ’’ అనుకుంటాం. ఆ ఇద్దరు అమెరికన్లదీ సేమ్ ఫీలింగ్ కానీ ఆ వంటేదో తెలియదు. ఆకలిమీదున్నారో... తెలియని వంటపై ఆసక్తో తెలియదు కానీ.. ఆ వాసన వెంటపడ్డారు.ఓ భారతీయ సంతతి మహిళ ఇంటి తలుపు తట్టారు వారు. ‘‘మీ ఇంట్లోంచి భలే వాసనొస్తోంది. ఎం వండుతున్నారు’’ అని వారు అడగడం... గారెలని ఆ ఇంటావిడ సమాధానం చెప్పడం విశేషం కాదు కానీ... ‘‘ఇంద.. మీరు ఓ రెండు గారెలు తినండి’’ అని కొబ్బరి చట్నీలతోపాటు ప్లేట్లలో వడ్డించడం మాత్రం నెట్టింట వైరల్ అయిపోయింది.పది రోజుల క్రితం అమెరికాలోని మినసోటాలో జరిగిందీ ఘటన. పేవ్మెంట్లను శుభ్రం చేస్తున్న ఇద్దరు అమెరికన్లు భారతీయ వంటకం వాసనకు పడిపోయిన ఈ ఘటనను కంపెనీ స్వయంగా వీడియో తీసి ఎక్స్లో పోస్ట్ చేసింది.పది రోజుల్లో సుమారు కోటికిపైగా వ్యూస్ వచ్చాయి ఈ వైరల్ వీడియోకి.. చూసినొళ్లు కూడా ‘‘ఇదీ భారతీయం అంటే’’ అని, ‘‘అతిథి దేవో భవకు అసలైన నిదర్శనం’’ అని రకరకాల కామెంట్లు చేస్తూ భారతీయ సంసృ్కతిని, ఆతిథ్యాన్ని నోరార కొనియాడటం ఇంకో విశేషం! ఊరకే అన్నారా...‘‘వింటే భారతం వినాలి. తింటే గారెలే తినాలి అని!! -
ట్రంప్కు చుక్కెదురు.. హార్వర్డ్కు ఊరట
బోస్టన్: విదేశీ విద్యార్థులకు హార్వర్డ్ యూనివర్సిటీ(Harvard University) ప్రవేశం నిషేధించిన వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు చుక్కెదురైంది. ఆయన నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ విధిస్తూ బోస్టన్(మసాచుసెట్స్) ఫెడరల్ కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో హార్వర్డ్కు తాత్కాలిక ఊరట లభించింది.హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై ట్రంప్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన నిర్ణయం సహేతుకం కాదని న్యాయస్థానంలో హార్వర్డ్ సవాల్ చేసింది. అయితే వాదనలు ఇరు పక్షాల వాదనలు వినడానికి ముందే జడ్జి అలిసన్ బర్రౌస్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ నిర్ణయం యూనివర్సిటీ ప్రతిష్టను, విద్యార్థుల భవిష్యత్తును దెబ్బ తీస్తుందని వ్యాఖ్యానిస్తూ.. ఆ ఉత్తర్వులపై తాత్కాలిక నిషేధం విధిస్తునన్నట్లు ప్రకటించారు. ఈ కేసులో తదుపరి విచారణ జూన్ 16వ తేదీన జరగనుంది.కాగా.. హార్వర్డ్లో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే ఫెడరల్ కోర్టు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే యూనివర్సిటీలో చదవాలనుకొనే విదేశీ విద్యార్థుల వీసాలపై ఆంక్షలు విధిస్తూ ఓ కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. మసాచుసెట్స్లోని కేంబ్రిడ్జిలో ఉన్న క్యాంపస్లో విదేశీ విద్యార్థులను హార్వర్డ్లో చేర్చుకోవడం వల్ల జాతీయ భద్రతను ప్రమాదంలోకి నెట్టే ముప్పుందని ఆయన తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.అమెరికాలోనే అతి పురాతనమైన యూనివర్సిటీగా హార్వర్డ్కి పేరుంది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ యూనివర్సిటీ లక్ష్యంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఉగ్రవాదం, యూదు వ్యతిరేకతకు నిలయంగా హార్వర్డ్ మారిందని ట్రంప్ ప్రభుత్వం మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ఇచ్చే 2.2 బిలియన్ డాలర్ల కోత విధించిన ట్రంప్ ప్రభుత్వం, ఆపై మరో 450 మిలియన్ డాలర్ల గ్రాంట్లను నిలిపివేసింది. విదేశీ విద్యార్థుల అక్రమ, హింసాత్మక కార్యకలాపాల రికార్డులను సమర్పిస్తేనే కొత్తగా విదేశీయులను చేర్చుకునేందుకు అనుమతిస్తామని వైట్హౌజ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి స్పష్టం చేసింది. రికార్డులను సమర్పించకపోతే వర్సిటీకున్న ప్రవేశాల అర్హతను రద్దు చేస్తామని హెచ్చరించింది కూడా. అదే సమయంలో విశ్వవిద్యాలయంలో జాతి వివక్షపై ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై ఫెడరల్ అధికారులు విచారణ ప్రారంభించారని పేర్కొంది. అయితే ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను హార్వర్డ్ అధ్యక్షుడు అలాన్ గార్బర్ (Alan Garber) తిప్పికొడుతూ వస్తున్నారు. ఏ రాజకీయ భావజాలంతో యూనివర్సిటీ పని చేయట్లేదని.. విద్యార్థులను ఎంపిక చేయడంలో తాము జాతిని కాకుండా వారి ప్రతిభ, ప్రత్యేక లక్షణాలను చూసి ఎంపిక చేస్తామని స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వ డిమాండ్లకు ఏమాత్రం తలొగ్గేది లేదని.. తమ స్వాతంత్య్రం, రాజ్యాంగ హక్కుల విషయంలో రాజీ పడలేమని పేర్కొంది. తాము చట్ట ప్రకారమే నడుచుకుంటామని.. ప్రభుత్వ యంత్రాంగం కూడా వాటికి అనుగుణంగానే వ్యవహరించాలని కోరింది. మరోవైపు.. అమెరికా ప్రభుత్వం తమ విశ్వవిద్యాలయ కార్యకలాపాలలో చట్టవిరుద్ధంగా జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ ట్రంప్ నిర్ణయాలపై హార్వర్డ్ దావా వేసింది. -
జపాన్: చంద్రుడి ప్రయోగం విఫలం
జపాన్కు చెందిన ప్రైవేట్ స్పేస్ కంపెనీ ఐస్పేస్(ispace) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రుడి ప్రయోగం విఫలమైంది. హకుటో-ఆర్ మిషన్ 2 పేరుతో మూన్(లునార్) ల్యాండర్ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ల్యాండర్ క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. ఈ విషయాన్ని ఐస్పేస్ అధికారికంగా ప్రకటించింది. చంద్రుడి ఉపరితలానికి మరో 5 కిలోమీటర్ల దూరం ఉండగానే ఈ ప్రయోగం విఫలం కావడం గమనార్హం. ఈ మిషన్లో రిసైలెన్స్(Resilience) అనే ల్యాండర్ చంద్రుడిపై సీ ఆఫ్ కోల్డ్ (మేర్ ఫ్రిగోస్) ప్రాంతంలో శుక్రవారం ఉదయం ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ చివరి 10 నిమిషాల్లో గ్రౌండ్ స్టేషన్తో సంబంధాలు తెగిపోయాయి. ఐస్పేస్ సంస్థ విఫలమైన కారణాలను విశ్లేషిస్తోంది. కాగా చంద్రుడిపై ప్రయోగాలు చేసే మొదటి ప్రైవేట్ కంపెనీగా ఐస్పేస్ చరిత్ర సృష్టించాలనుకుంది.As of 8:00 a.m. on June 6, 2025, mission controllers have determined that it is unlikely that communication with the lander will be restored and therefore completing Success 9 is not achievable. It has been decided to conclude the mission.“Given that there is currently no… pic.twitter.com/IoRUfggoiQ— ispace (@ispace_inc) June 6, 2025రీసైలెన్స్ను ఈ ఏడాది జనవరిలో స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఐదు నెలల ప్రయాణం తర్వాత చంద్రుడి కక్ష్యలోకి ఈ ల్యాండర్ ప్రవేశించింది. ఈ ప్రయోగంతో చారిత్రక విజయం సాధిమని స్పేస్ఎక్స్ గంపెడాశలు పెట్టుకుంది. సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో.. ప్రయోగం విఫలమై క్రాష్ ల్యాండ్ అయ్యింది. ఇదిలా ఉంటే.. ఈ ఫెయిల్యూర్ ఐస్పేస్కు కొత్త కాదు. 2023లోనూ చంద్రుడి ప్రయోగం విఫలమైంది. ఆ ప్రయోగంలోని లోటుపాట్లను సరి చేసుకున్నప్పటికీ మరోసారి ఎదురుదెబ్బ తప్పలేదు. -
బాంబు పేల్చిన మస్క్.. ట్రంప్పై సంచలన ఆరోపణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రముఖ బిలీయనీర్ ఎలాన్ మస్క్ల మధ్య గొడవలు నాటకీయ పరిణామాల నడుమ రోజురోజుకీ ముదురుతున్నాయి. ఇరువురు పరస్పరం సంచలన ఆరోపణలతో పోటాపోటీ పడుతున్నారు. తాజాగా.. ట్రంప్ను అభిశంసించి ఆ స్థానంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ను అధ్యక్షుడిగా చేయాలంటూ మస్క్ బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో మరో సంచలన ఆరోపణ చేశాడు.వాషింగ్టన్: ప్రముఖ బిలీయనీర్ ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై సంచలన ఆరోపణలకు దిగాడు. ‘‘పెద్ద బాంబులాంటి విషయాన్ని చెప్పాల్సిన సమయం వచ్చింది. ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES)లో ట్రంప్ పేరు ఉంది. అందుకే ఆ ఫైల్స్ వివరాలను బయటపెట్టడం’’ లేదంటూ ఓ పోస్ట్ చేశాడు. బిగ్ బ్యూటీఫుల్ బిల్ వ్యవహారంలో మస్క్ తీరునుతో తాను విసిగిపోయానంటూ ట్రంప్ మీడియా ముఖంగా చెప్పిన గంటలోపే మస్క్ ఈ ట్వీట్ చేయడం గమనార్హం. Time to drop the really big bomb:@realDonaldTrump is in the Epstein files. That is the real reason they have not been made public.Have a nice day, DJT!— Elon Musk (@elonmusk) June 5, 2025 ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్లో ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలూ ఉన్నాయి. ప్రముఖ ఇన్వెస్టర్ అయిన ఎప్స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఫైల్స్ ఇప్పటిదాకా బయటకు రాకపోవడంతో అమెరికా రాజకీయాల్లో, మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. అంతకు ముందు.. తన మద్దతు లేకుంటే 2024 అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. ‘నేను లేకుంటే ట్రంప్ ఓడిపోయేవారు. ప్రతినిధుల సభపై డెమోక్రాట్లు ఆధిక్యం సాధించేవారు. సెనెట్లో రిపబ్లికన్లు 5149తో ఉండేవారు’ అని ఆయన గురువారం స్పష్టం చేశారు. అయితే.. అయితే మస్క్ వ్యాఖ్యలను ట్రంప్ తోసిపుచ్చారు. రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో తాను అసంతృప్తికి గురయ్యానని, శ్వేతసౌధంలో తన స్నేహితుడు(మస్క్ను ఉద్దేశించి..) లేకపోవడం విచారకరమని ట్రంప్ సైతం వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్ అవసరం లేదని స్పష్టం చేశారు. మస్క్ లేకుండానే పెన్సిల్వేనియాలో తాను గెలిచేవాడినని తెలిపారు. మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు, రాయితీలకు కోత వేస్తానని ట్రంప్ హెచ్చరించారు. అదే సమయంలో మస్క్ వరుసగా ఎక్స్లో స్పందించారు. ట్రంప్ చెప్పిందంతా అబద్ధమని అన్నాడు. బెదిరింపులకు తలొగ్గనని, అవసరమైతే స్పేస్ఎస్ ఒప్పందాన్ని ఆపేస్తానని బదులిచ్చాడు.In light of the President’s statement about cancellation of my government contracts, @SpaceX will begin decommissioning its Dragon spacecraft immediately pic.twitter.com/NG9sijjkgW— Elon Musk (@elonmusk) June 5, 2025 అదే సమయంలో.. కొత్త పార్టీ పెట్టవచ్చా? అని అభిమానులను ప్రశ్నించారు. ‘80శాతం మందికి ప్రాతినిధ్యం వహించేలా అమెరికాలో కొత్త పార్టీ పెట్టడానికి ఇది సమయమేనా?’ అని అడిగాడు. అలాగే ట్రంప్ను తొలగించాలంటూ ఓ వ్యక్తి వేసిన ప్రశ్నకు అవుననే బదులిచ్చాడు. Yes https://t.co/rqRsX8B4Hg— Elon Musk (@elonmusk) June 5, 2025తాను ప్రతిపాదించిన ఫెడరల్ ప్రభుత్వ వ్యయ నియంత్రణ బిల్లును.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యతిరేకించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ బిల్లులోని ముఖ్యఅంశాలు తెలిసి కూడా వ్యతిరేకించారని, దాంతో తాను నిరాశ చెందానని చెప్పారు. ప్రభుత్వ వ్యయ నియంత్రణకు ఉద్దేశించిన ప్రభుత్వ సామర్థ్య విభాగం (డోజ్)కు మస్క్ అధిపతిగా ఉండడం, ఈ బిల్లును చూసిన తరువాత ఆ పదవికి రాజీనామా చేయడం గమనార్హం. గురువారం ట్రంప్ శ్వేత సౌధంలోని ఓవల్హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ ఒక్క విద్యుత్తు వాహనాల అంశం తప్ప బిల్లులోని మిగిలిన అంశాలపై మస్క్కు అభ్యంతరాలు లేవని అన్నారు.‘మస్క్కు ఎంతో చేశాను. ఇద్దరి మధ్య గొప్ప స్నేహం ఉంది. అది కొనసాగుతుందో లేదో చెప్ప లేను. ఆయన నా గురించి ఎంతో గొప్పగా చెప్పారు. చెడుగా ఒక్క మాట అనలేదు. అయినా ఆయనతో అసంతృప్తి చెందా’ అని వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలపై మస్క్ ఎక్స్లో స్పందిస్తూ వ్యయ నియంత్రణ బిల్లును తనకు చూపలేదని తెలిపారు. తన సహకారం లేకుంటే ఎన్నికల్లో ట్రంప్ గెలిచి ఉండేవారు కాదని అన్నారు. -
కొన్నాళ్లు కొట్టుకోనీ!
వాషింగ్టన్/కీవ్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతులెత్తేశారు. రెండు దేశాలనూ ఇంకొన్నాళ్లు కొట్టుకోనివ్వడమే మేలని వ్యాఖ్యానించారు. గురువారం వైట్హౌస్లో జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్తో భేటీ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అవి మరీ చిన్నపిల్లల మాదిరిగా కీచులాడుకుంటున్నాయంటూ ఆక్షేపించారు. ‘‘కొన్నిసార్లు ఓపికున్నంత సేపు కొట్టొకోనివ్వడమే మేలు. తర్వాత ఇద్దరినీ చెరోవైపు లాగేయాలి. నిన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా ఇదే మాట చెప్పా’’ అని ట్రంప్ అన్నారు. అయితే, ‘‘నా మాట వినకపోతే చాలా కఠినంగా వ్యవహరిస్తా. యుద్ధానికి తెర దించకపోతే రెండు దేశాలపైనా ఆంక్షలు విధిస్తా’’ అంటూ మరోసారి కుండబద్దలు కొట్టారు.రష్యా డ్రోన్ దాడుల్లో ఐదుగురు మృతిబుధవారం రాత్రి ఉత్తర ఉక్రెయిన్లోని ప్రిలుకీ నగరంపై రష్యా డ్రోన్ దాడిలో ఐదుగురు మరణించారు. ‘‘స్థానిక ఫైర్ చీఫ్ ఒలెక్జాండర్ లెబిడ్ ఇంటిపై డ్రోన్ దాడులు జరిగాయి. ఆయన భార్య, కుమార్తె, ఏడాది వయసున్న మనవడు చనిపోయారు’’ అని అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. చిన్నారి తల్లి కీవ్లో పోలీసు అధికారి. అక్కడ రష్యా దాడులు పెరగడంతో బాబును తల్లిదండ్రుల దగ్గర వదిలేందుకు వచ్చి తనతో పాటుగా బలైంది. పుతిన్తో ట్రంప్ ఫోన్ సంభాషణ జరిగిన కొద్ది గంటల్లోపే ప్రిలుకీపై దాడి జరగడం గమనార్హం. ఆదివారం తమ వైమానిక స్థావరాలపై జరిపిన దాడులకు గట్టి ప్రతీకారం తీర్చుకుంటామని పుతిన్ తనతో అన్నట్లు అనంతరం ట్రంప్ చెప్పారు. ఈ యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ ప్రయత్నాలు సాగిస్తుండటం తెల్సిందే. -
జపాన్లో జననాలు 6.86 లక్షలే
టోక్యో: జపాన్లో జనాభా గణనీయంగా తగ్గిపోతోంది. గత ఏడాది జననాల సంఖ్య రికార్డుస్థాయిలో పడిపోయింది. దేశంలో 2024లో కేవలం 6,86,061 మంది శిశువులు జన్మించినట్లు ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. ఒక సంవత్సరంలో ఇంత తక్కువగా జననాలు నమోదు కావడం ఇదే మొదటిసారి. 2023 కంటే ఇది 5.7 శాతం తక్కువ కావడం గమనార్హం. దేశంలో గత 16 ఏళ్లుగా వరుసగా జననాల సంఖ్య పడిపోతోంది. ఇక్కడ 1899 నుంచి శిశువుల జననాలను రికార్డు చేయడం మొదలైంది. 7 లక్షల కంటే తక్కువ మంది శిశువులు జన్మించడం 2024లోనే తొలిసారి. దేశంలో 1949లో రికార్డు స్థాయిలో 27 లక్షల మంది జన్మించారు. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 7 లక్షలకు పడిపోయింది. కొత్త జననాలు పెరగకపోవడం, వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థతోపాటు దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు. జనాభా తగ్గడం అనేది ‘నిశ్శబ్ద అత్యవసర పరిస్థితి’ అని జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా అభివర్ణించారు. జననాల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. నూతన దంపతులకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. జపాన్లో ఒక మహిళ తన జీవితకాలంలో బిడ్డలను కనే సగటు రేటు 2023లో 1.2గా ఉండగా, 2024లో 1.1గా నమోదైంది. జపాన్ జనాభా ప్రస్తుతం 12.4 కోట్లు. 2070 నాటికి 8.7 కోట్లకు తగ్గిపోతుందని అంచనా. మొత్తం జనాభాలో 40 శాతం మంది 65 ఏళ్లు దాటినవారే ఉంటారని నిపుణులు చెబుతున్నారు. -
3,000 కొత్త కార్లు సముద్రంపాలు!
యాంకరేజ్: ఏకంగా 3,000 కొత్త కార్లతో చైనా నుంచి మెక్సికోకు బయల్దేరిన భారీ సరుకు రవాణా నౌకలో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నికీలలు మరింతగా విస్తరిస్తుండటతో నౌకను సిబ్బంది నడిసంద్రంలో వదిలేయాల్సి వచ్చింది. లైఫ్బోట్ సాయంతో 22 మంది సిబ్బందిని రక్షించగలిగారు. లండన్ కేంద్రంగా పనిచేసే జోడియాక్ మేరిటైమ్ సంస్థ ఈ ‘ది మార్నింగ్ మిడాస్’నౌకను నిర్వహిస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో అమెరికాలోని అలాస్కా రాష్ట్ర పరిధిలోని అడాక్ దీవి సమీపంలో ఈ అగ్ని ప్రమాద ఘటన జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు సమీపంలో ప్రయాణిస్తున్న కోస్కో హెలాస్ సరకు రవాణానౌకలోని సిబ్బంది అప్రమత్తమై మిడాస్ నౌకలోని 22 మంది సిబ్బందిని రక్షించారు. ఘటన జరిగినప్పుడు నౌకలో 800 కొత్త విద్యుత్ కార్లు సహా 3,000 కార్లు ఉన్నాయి. అగ్నికీలలను ఎలా అదుపులోకి తేవాలనే దానిపై జోడియాక్ సంస్థతో సంప్రతింపులు జరుపుతున్నామని అమెరికా తీరగస్తీ 17వ జిల్లా కమాండర్ రియర్ అడ్మిరల్ మెగాన్ డీన్ చెప్పారు. చైనాలో తయారైన ఈకార్లతో మే 26వ తేదీన నౌక బయల్దేరింది. మెక్సికోలోని లజారో కార్డెనాస్ నౌకాశ్రయానికి ఇది చేరుకోవాల్సి ఉండగా మార్గమధ్యంలో ఇలా అగ్నిప్రమాదంలో చిక్కుకుంది. ఈ నౌకను 2006లో చైనాకు చెందిన నౌకాతయారీ సంస్థ తయారుచేసింది. ఈ నౌక బరువు ఏకంగా 46,800 టన్నులు. -
న్యాయ బంధం బలోపేతం
లండన్: భారత్, యునైటెడ్ కింగ్డమ్(యూకే) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ)తో రెండు దేశాల నడుమ న్యాయ బంధం సైతం మరింత బలోపేతం అవుతుందని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు. ఉమ్మడి న్యాయ సూత్రాల ఆధారంగా ఇరు దేశాలు ఘనమైన న్యాయ చరిత్రను పంచుకుంటున్నాయని వివరించారు. గురువారం యూకే రాజధాని లండన్లో ఇండో–యూకే వాణిజ్య వివాదాల మధ్యవర్తిత్వంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో జస్టిస్ గవాయ్ ప్రసంగించారు. న్యాయ రంగంలో పరస్పర సహకారం ద్వారా భారత్, యూకేలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. 2018 జూలైలో ఇండియా–యూకే మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందాన్ని ప్రస్తావించారు. దీనివల్ల ఇరు దేశాల నడుమ చట్ట, న్యాయ బంధం మరింత పెరిగిందని తెలిపారు. వివాదాల పరిష్కారం, శిక్షణతోపాటు న్యాయ సేవల్లో రెండు దేశాలు కలిసి పని చేయడానికి ఈ ఒప్పందం దోహదపడుతోందని జస్టిస్ గవాయ్ వివరించారు. ఈ కార్యక్రమంలో భారత న్యాయ శాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ సైతం ప్రసంగించారు. సింగపూర్, లండన్ తరహాలో భారత్ సైతం మేజర్ ఇంటర్నేషన్ ఆర్బిట్రేషన్ హబ్గా మారుతోందని చెప్పారు. మరోవైపు ‘బ్రిటిష్ ఇన్స్టి్టట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ కంపేరేటివ్ లా’లో జరిగిన మరో కార్యక్రమంలోనూ జస్టిస్ గవాయ్ మాట్లాడారు. న్యాయ వ్యవస్థలో టెక్నాలజీకి అధిక ప్రాధాన్యం ఇవ్వడం సరైంది కాదన్నారు. దీనివల్ల న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసం తగ్గిపోతుందని పేర్కొన్నారు. కక్షిదారులకు న్యాయం చేకూర్చడానికి టెక్నాలజీని తగిన రీతిలో వాడుకోవాలి తప్ప దానికే పెద్దపీట వేయొద్దని సూచించారు. పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానమే న్యాయ వ్యవస్థను ముందుకు నడిపించే పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు. -
దేశ సేవ నేరమా?
వాషింగ్టన్: దేశ ప్రయోజనాల కోసం పని చేయడం నేరమా? అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ప్రశ్నించారు. దేశానికి సేవ చేయడం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా భావించేవారు ఆత్మవిమర్శ చేసుకోవాలని పరోక్షంగా కాంగ్రెస్ నాయకత్వానికి చురక అంటించారు. వారిని వారు ప్రశ్నించుకుంటే అసలు నిజం ఏమిటో తెలుస్తుందన్నారు. కాంగ్రెస్కు రాజీనామా చేసే ఉద్దేశం లేదని స్పష్టంచేశారు. ఆపరేషన్ సిందూర్పై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష బృందానికి నేతృత్వం వహిస్తున్న శశిథరూర్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. తాజాగా ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నానంటూ తనపై కొందరు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలపై స్పందించారు. దేశానికి సేవ చేస్తున్నప్పుడు ఇలాంటి చిల్లరమల్లర విమర్శలు, ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. తాను బీజేపీలో చేరబోతున్నానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ప్రజలు తనను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకున్నారని, ఎంపీగా పదవీ కాలం మరో నాలుగేళ్లు ఉందని, ఇలాంటి సమయంలో పార్టీ మార్పు ప్రశ్న ఎందుకు చర్చకు వస్తోందో తనకు అర్థం కావడం లేదన్నారు. పార్టీ మారాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని తేల్చిచెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలు ‘చిన్న విషయం’అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎదుట ప్రధాని నరేంద్ర మోదీ లొంగిపోయారని, అందుకే పాకిస్తాన్పై యుద్ధం హఠాత్తుగా ఆపేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చేసిన ఆరోపణల పట్ల శశి థరూర్ స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పారీ్టలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం సహజమేనని కొట్టిపారేశారు. అయినా తాము ఇక్కడికి రాజకీయ కార్యక్రమం కోసం రాలేదని, ఐక్య భారత్ ప్రతినిధులుగా వచ్చామని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశ సందేశానికి ప్రపంచ దేశాలకు చేరవేస్తున్నామని ఉద్ఘాటించారు. అఖిలపక్ష బృందంలో వేర్వేరు పార్టీల నేతలు సభ్యులుగా ఉన్నారని గుర్తుచేశారు. ఇది కూడా భిన్నత్వంలో ఏకత్వానికి సంకేతమని వివరించారు. మన మధ్య రాజకీయ విభేదాలు ఏవైనా ఉంటే అవి దేశ సరిహద్దుల్లోనే ఆగిపోవాలని, సరిహద్దు దాటితే మనమంతా భారతీయులమేనని గతంలో ఒక సందర్భంలో తాను చెప్పినట్లు గుర్తుచేశారు. భారత్–పాకిస్తాన్ మధ్య అణు యుద్ధాన్ని ఆపేశానంటూ ట్రంప్ పదేపదే చెబుతుండడంపై ప్రశ్నించగా, ‘‘ట్రంప్ వ్యాఖ్యలు, వాటిపై రాహుల్ విమర్శలు నిజానికి చిన్న విషయాలు’’ అంటూ థరూర్ ఆసక్తికరంగా స్పందించారు. ‘‘అమెరికా అధ్యక్షునిగా ట్రంప్పై భారత్కు ఎంతో గౌరవముంది. ఇలాంటి ఉదంతంతో ద్వైపాక్షిక సంబంధాలు సంక్లిష్టం కావడం భారత్కు ఇష్టం లేదు. ఒక్కటి మాత్రం సుస్పష్టం. మధ్యవర్తిత్వం కోసం ఎవరినో ప్రాధేయపడాల్సిన అవసరం భారత్కు లేదు. పాక్ దాడి చేస్తే గట్టిగా బదులిస్తామని, ఆపేస్తే తామూ ఆపేస్తామని భారత్ మొదట్లోనే చెప్పింది. అలాంటప్పుడు పాక్పై దాడులు ఆపాలని మాకు ఇంకెవరో చెప్పే సందర్భమే తలెత్తదు’’ అని కుండబద్దలు కొట్టారు. ఆపరేషన్ సిందూర్ను తట్టుకోలేక పాకే అమెరికా శరణుజొచ్చిందేమో. లేదంటే కాల్పుల విరమణ కోసం అమెరికాయే పాక్పై ఒత్తిడి చేసి ఉండొచ్చు’’ అన్నారు. -
సముద్రాలకు ఎండదెబ్బ
‘ఎండ దెబ్బ’కు మహాసముద్రాలు అతలాకుతలమై పోతున్నాయి. ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, ఇండొనేసియాలతో కూడిన వాయవ్య పసిఫిక్ ప్రాంత సముద్ర జలాల్లో 2024లో రికార్డు స్థాయిలో ఏకంగా అర డిగ్రీ సెంటీగ్రేడ్ మేరకు అధిక ఉష్ణోగ్రత నమోదైంది. దాంతో పసిఫక్ మహాసముద్ర జలాలు ఏకంగా 4 కోట్ల చదరపు కి.మీ. మేరకు కనీవిని ఎరుగని రీతిలో వేడెక్కిపోయాయి. ఆ పరిధిలోని జీవజాలాన్ని కూడా ఈ పరిణామం తీవ్రంగా ప్రభావితం చేసింది. అరుదైన కోరల్ రీఫ్స్ వంటివాటి ఉనికే ప్రమాదంలో పడింది. అంతేగాక ఇండొనేసియాలోని న్యూ గినియా దీవుల్లో ఉన్న ఆ ప్రాంతపు ఏకైక గ్లేసియర్ ఏడాదిలోనే సగం మేరకు కరిగిపోయింది. ఎండలు ఇలాగే పెరిగిపోతే మరో ఏడాదికల్లా అది పూర్తిగా మాయం కావడం ఖాయమని ఐరాస వాతావరణ విభాగమైన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) జోస్యం చెప్పింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్ల్లో గతేడాది ఎండలు సరికొత్త రికార్డులు సృష్టించాయని గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికలో వెల్లడించింది. ‘‘ప్రపంచమైన ఎండల నడుమ వాయవ్య పసిఫిక్ ప్రాంత దేశమైన ఫిలిప్పీన్స్పై గత అక్టోబర్, నవంబర్ నెలల్లో లెక్కలేనన్ని తుపాన్లు విరుచుకుపడ్డాయి! ఈ విపరిణామాలన్నింటికీ వాతావరణ మార్పులే ప్రధాన కారణం’’ అంటూ వాపోయింది. మొత్తంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత కూడా 2024లో రికార్డు స్థాయిలో పెరిగిపోయిందని అధ్యయనకర్తల్లో ఒకరైన బ్లెయిర్ ట్రెవిన్ వివరించారు. ‘‘మొత్తం పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతను చూసుకున్నా 2022 తర్వాత రెండో అత్యధిక పెరుగుదలను నమోదు చేసింది! అక్కడి సముద్రమట్టాలు ప్రపంచ సగటుతో పోలిస్తే శరవేగంగా పెరిగిపోతున్నాయి. ఇవన్నీ చాలా ప్రమాదకర పరిణామాలే. ఎందుకంటే వాయవ్య పసిఫిక్ ప్రాంత జనాభాలో ఏకంగా సగానికి పైగా తీరానికి కేవలం అర కిలోమీటర్ దూరంలోనే నివసిస్తున్నారు’’ అని హెచ్చరించారు. సముద్రమట్టాల పెరుగుదల వేగం ఇలాగే కొనసాగితే వారంతా అతి త్వరలో నిర్వాసితులుగా మారి పొట్ట చేత పట్టుకుని వలస పోవడం తప్ప మరో మార్గం ఉండదని అధ్యయన బృంద సభ్యుడు థియా తుర్కింగ్టన్ అభిప్రాయపడ్డారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
డొనాల్డ్ ట్రంప్ ట్రాప్లో జిన్పింగ్!
వాషింగ్టన్: అమెరికా-చైనాలు తమకు అవకాశం వచ్చినప్పుడల్లా కత్తులు దూసుకుంటూ ఉంటాయనేది జగమెరిగిన సత్యం. అమెరికా పేరెత్తితే చైనా, డ్రాగన్ పేరెత్తితే అగ్రరాజ్యం అంత ఎత్తున పైకి లేచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల కాంలో వీరి మధ్య మాటల యుద్ధం ఎంతటి తారాస్థాయిలో జరిగిందో అందరికీ తెలిసిందే. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో సుంకాల ఆంక్షలు ఒకటి. ఈ నిర్ణయాలను చైనా తీవ్రంగా విభేదించింది కూడా. జిన్పింగ్కు ట్రంప్ ఫోన్..అయితే తాజాగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. జిన్పింగ్తో ట్రంప్ ఫోన్లో సంభాషించిన విషయాన్ని ఈరోజు(గురువారం) ట్రంప్ తన సోషల్ మీడియా సైట్ ‘ట్రూత్’లో వెల్లడించారు. “నాకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అంటే ఇష్టం. ఆయన ఎప్పుడూ ఇష్టమే, ఆయనతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా కష్టం” అని ట్రంప్ పోస్ట్ చేశారు. సంకాల ‘వార్’సుంకాల ఆంక్షలతో చైనాను విపరీతమైన ఒత్తిడిలోకి నెట్టే యత్నం చేశారు ట్రంప్. అయితే చైనా కూడా ట్రంప్ చర్యలకు ప్రతీ చర్యగా అమెరికా వస్తువులపై కూడా సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది. ఈ క్రమంలోనే చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. అమెరికాకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ‘ భయపెడితే భయపోతాం అనుకుంటున్నారా.. చర్యకు ప్రతిచర్య సిద్ధం’ అంటూ సవాల్ చేశారు. అక్కడ నుంచి ఇరు దేశాల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. చైనా వస్తువులపై 145 సుంకాన్ని ట్రంప్ విధించగా, అమెరికా వస్తువులపై 125 శాతం సుంకాన్ని చైనా విధించింది. అయితే ఆ తర్వాత 145 శాతం సుంకాన్ని 30 శాతానికి తగ్గించగా, 125 శాతం సుంకాన్ని 10కి పరిమితం చేసింది చైనా . ఇలా ఇరు దేశాలు ఒక రాజీకి రావడంతో సమస్య తెరపడినట్లయ్యింది. -
అమెరికా కొంప ముంచుతున్న ట్రంప్!
సాక్షి, హైదరాబాద్: ‘‘మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్’’ ఎన్నికల సందర్భంగా ట్రంప్ వాడిన నినాదమిది. అయితే అగ్రరాజ్యానికి పూర్వవైభవం తెప్పిస్తానని ధీమాగా చెప్పిన ట్రంప్ ఇప్పుడు ఆ దేశానికి ఆర్థికంగా తీవ్ర నష్టం కలిగిస్తున్నాడు. చైనాతో మొదలుపెట్టి.. అన్ని దేశాలపై పన్నులు విధించుకుంటూ పోవడంతో అమెరికా చాలా రకాలుగా నష్టపోవాల్సి వస్తోంది. ఒక్క పర్యాటక రంగంలోనే ఈ ఏడాది వంద బిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోవచ్చునని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తూండగా.. కొన్ని కంపెనీలు టారిఫ్ హెచ్చరికలను పెడచెవిన పెట్టి ఇతర దేశాల్లో కర్మాగారాలను ఏర్పాటు చేసుకుంటునానయి. దీంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి.అమెరికా అధ్యక్షుడైన నాటి నుంచి ట్రంప్ వైఖరి వివాదాస్పదంగానే ఉంది. మాట వినని దేశాలపై పన్నులతో విరుచుకుపడుతున్నాడు. చైనా విషయంలోనైతే ఏకంగా 155 శాతం పన్నులకు సిద్ధపడ్డాడు కూడా. పన్నుల విషయంలో భారతీయులకు కొంత ఉపశమనం లభించినప్పటికీ హెచ్1-బీ వీసాలపై నిబంధనలు, గ్రీన్కార్డులున్నా హద్దుమీరితే పంపేస్తామన్న హెచ్చరికలు, స్వదేశానికి పంపే డబ్బులపై ఐదు శాతం వరకూ పన్నులు వంటి చర్యలు భారతీయులు, భారతీయ సంతతి అమెరికన్లకు ఇబ్బందికరంగానే మారాయి. అయితే ఈ వైఖరి ట్రంప్కు... అమెరికాకు లాభాలేమీ తెచ్చిపెట్టడం లేదు. పైగా నష్టమే కలగజేస్తున్నాయని తాజా పరిణామాలు చెబుతున్నాయి.టూరిజం విషయాన్ని చూద్దాం... ట్రంప్ అధ్యక్షుడు కాకమునుపు అంటే 2024లో అమెరికా సుమారు ఏడు కోట్ల మంది పర్యాటకులను ఆకర్శించింది. రవాణా, షాపింగ్, ఆహార పానీయాల వంటి వాటికి వీరు ఖర్చు పెట్టిన మొత్తం ఎకాఎకి 155 బిలియన్ డాలర్లు. హోటళ్లు, దుకాణాలు కళకళలాడుతూండేవి. కానీ.. అధ్యక్షడైన తరువాత ట్రంప్ విధిస్తున్న టారిఫ్లు, చేస్తున్న ప్రకటనల పుణ్యమా అని ఈ ఏడాది పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.మార్చి నాటికి ఈ తగ్గుదల 14 శాతం వరకూ ఉందని అంచనా. వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో పొరుగున ఉన్న కెనెడా నుంచి వచ్చే వారి సంఖ్య కూడా ఐదో వంతు పడిపోయిందట. ఫలితంగా ఇప్పటివరకూ పర్యాటకులు పెట్టే ఖర్చు 900 కోట్ల డాలర్ల వరకూ తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీని ప్రభావం కాస్తా హోటళ్లు, దుకాణాల్లో స్పష్టంగా కనిపిస్తోందని వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది.వెనకడుగు వేస్తున్న కంపెనీలు..అమెరికాలో వ్యాపార విస్తరణకు ప్రయత్నిస్తున్న చాలా కంపెనీలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డాయి. టారిఫ్ల బెడద ఒకపక్కన.. ఆర్థిక అసందిగ్ధత ఇంకో పక్కన వెంటాడుతూండటంతో ఈ కంపెనీలు తమ ప్రణాళికలను సవరించుకుంటున్నాయి. టారిఫ్ భయాలు, పర్యాటకుల తగ్గుదలల నేపథ్యంలో తాము ఇప్పటికే జారీ చేసిన ముందస్తు ఆర్థిక అంచనాలను వెనక్కు తీసుకుంటున్నట్లు డెల్టా ఎయిర్లైన్స్ ప్రకటించగా... వైద్య పరికరాల తయారీ సంస్థ బెల్లూస్కూరా కూడా దిగుమతి సుంకాల పెరిగిపోయిన నేపథ్యంలో తమ భవిష్యత్తు అంచనాలను సవరించుకుంటోంది.బ్రిటన్ బొమ్మల కంపెనీ క్యారెక్టర్ గ్రూప్, మద్యం తయారీ దిగ్గజం డియాగోలు కూడా మెక్సికో, కెనెడాలపై అమెరికా విధించిన పన్నుల నేపథ్యంలో తమ వ్యాపారల ప్రణాళికలను సవరించుకుంటున్నాయి. ఫలితంగా ఒక్క డియాగో సంస్థకు 200 కోట్ల డాలర్ల వరకూ నష్టం వాటిల్లవచ్చునని అంచనా.భారత్లో తయారీ చేపడితే భారీ సుంకాలు తప్పవన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలను ఐఫోన్ సీఈవో టిమ్ కుక్ పట్టించుకోని విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. అమెరికాలో వినియోగించే ఐఫోన్లో అత్యధికం భారత్లోనే తయారవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఇదే విధంగా అమెరికాలో బాగా పాపులర్ అయిన ట్రాక్టర్ తయారీ సంస్థ ‘జాన్ డీర్’ కూడా టారిఫ్ల హెచ్చరికలను తోసిరాజంటూ... తయారీ రంగాన్ని కెనెడాకు తరలించే ఆలోచనలో ఉంది. ఏతావాతా... ట్రంప్ ధోరణి కాస్తా అమెరికాకు చేటు చేసేట్టే కనిపిస్తోంది!- గిళియార్ గోపాలకృష్ణ మయ్యా -
మేకప్ ప్రొడక్ట్స్తో బికేర్ఫుల్..! పాపం ఆ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ ..
మేకప్ వేసుకోవడం అంటే చాలామంది అతివలకు ఇష్టం. అదీగాక యూట్యూబ్ల పుణ్యమా అని ఎలా వేసుకోవాలో సులభంగా తెలుసుకుంటున్నారు. అయితే కొందరూ అత్యుత్సాహంతో సౌందర్య సాధనాలతో చేసేపనులు చివరికి విషాదాన్ని మిగుల్చుతున్నాయి. డెర్మటాలజిస్ట్లు సైతం మేకప్ ప్రొడక్ట్స్ ఏవి కూడా కంటికి, నోటికి తగలకూడదని హెచ్చరిస్తుంటారు. వాటిల్లో ఉపయోగించే కెమికల్స్ వల్ల ప్రాణాంతక సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుందని సూచిస్తుంటారు. కానీ చాలామంది వీటిని పెడచెవిన పెట్టేస్తారు. అలానే ఇక్కడొక బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ నిర్లక్ష్య ధోరణితో చేసిన పని ఆమె ప్రాణాలనే కోల్పయేలా చేసింది. వివరాల్లోకెళ్తే..సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్గా ఉండే ఈ తైవాన్ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ మేకప్ ముక్బాంగ్కు ఇన్స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె మేకప్కి సంబంధించిన వీడియోలతో వేలాదిమంది అభిమానులను సంపాదించుకుంది. సింపుల్ చిట్కాలతో చక్కగా మేకప్ వేసుకోవడం ఎలాగో చూపించడం తోపాటు..మధ్య మధ్యలో ఆ ప్రొడక్స్ టేస్ట్ చేస్తానంటూ కామెడీ చేసేది. ఒక్కోసారి నిజంగానే టేస్ట్ చేసి చూపించి నెటిజన్లలో ఉత్కంఠ రేపేది. ఆ క్రమంలోనే ఆమె యూట్యూబ్ వీడియోలకు మరింత క్రేజ్ పెరిగింది. ఈ అత్యుత్సాహమే ఆమె ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. బుగ్గలకు పూసుకునే ఫౌండేషన్ దగ్గరి నుంచి లిప్స్టిక్ వరకు అన్ని టేస్ట్ చేసి..ఇది మరింత భయంకరంగా ఉంది అంటూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేది ఈ బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ . సోషల్ మీడియా స్టార్డమ్ కోసం చేసిస పనికి..పలు బ్రాండెడ్ కంపెనీ ఆమె వద్దకు క్యూ కట్టేవి. మంచి స్టార్డమ్ సంపాదించుకుంది గానీ ప్రాణాలను కాపాడుకోలేకపోయింది. ఆ మేకప్ ఉత్పత్తులను టేస్ట్ చేయడమే శాపమై ప్రాణాలను చేజేతులారా కోల్పోయేలా చేసింది. జస్ట్ 24 ఏళ్లకే నిండు నూరేళ్లు నిండిపోయాయి ఆమెకు. ఐతే అధికారికంగా ఆమె మరణానికి గల కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. కానీ ఆమె ఆకస్మికంగా అనారోగ్యం బారినపడి చనిపోయినట్లు బాధితురాలి కుటుంబం ప్రకటించడం గమనార్హం. నిపుణుల వార్నింగ్..దయచేసి ఇలాంటి వీడియోలను ప్రోత్సహించొద్దని గట్టిగా హెచ్చరిస్తున్నారు నిపుణులు. మేకప్ ప్రొడక్ట్స్లో వాడే కెమికల్స్ సాధారణంగా అందరి శరీరాలకి సరిపడవు. అలాంటి వాటిని టేస్ట్ చేసే సాహసం అససలు చెయ్యొద్దని నొక్కి చెప్పారు. అంతేగాదు మేకప్ వేసుకోవడంలో ఎంత శ్రద్ధపెడతామో, తీసేటప్పుడూ కూడా అంతే కేర్ఫుల్గా ఉండాలన్నారు. అలాగే మేకప్తో అలానే అస్సలు పడుకోవద్దని..ఎంత ఆలస్యమైనా..దాన్ని పూర్తిగా తొలగించుకునే నిద్రపోవాలని తెలిపారు. View this post on Instagram A post shared by 芭樂水水 (@guava_beauty_) (చదవండి: అత్యంత వృద్ధ డాక్టర్గా రికార్డు..! ఇప్పటికీ వైద్య సేవలోనే..! ఏజ్లో సెంచరీ కొట్టాలంటే..) -
ఎంపీ మహువా మొయిత్రా రహస్య వివాహం
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) లోక్సభ ఎంపీ మహువా మొయిత్రా(Mahua Moitra) మరోమారు వార్తల్లో నిలిచారు. ఆమె మే మూడవ తేదీన రహస్య వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని టీఎంసీగానీ, మహువా మొయిత్రా గానీ వెల్లడించలేదు. ఈ విషయమై మీడియా ప్రముఖ టీఎంసీ ఎంపీని అడుగగా, ఆయన తనకు తెలియదని చెప్పారు. The other Operation Sindoor: Trinamool MP @MahuaMoitra marries in quiet wedding in Germany https://t.co/AALx1OgY5Y pic.twitter.com/Yugc1cWsfV— The Telegraph (@ttindia) June 5, 2025అయితే వార్తా సంస్థ ‘ది టెలిగ్రాఫ్’ ప్రచురించిన ఫోటోలో మహువా మొయిత్రా బంగారు రంగు చీరలో మెరిసిపోతూ, భర్త పక్కన కనిపించారు. వారి వివాహం జర్మనీలో జరిగినట్టు తెలుస్తోంది. మహువా మొయిత్రా భర్త పేరు పినాకి మిశ్రా. ఆయన బిజు జనతాదళ్కు చెందిన నేత. పూరీ లోక్సభ సభ్యునిగా పనిచేశారు. 50 ఏళ్ల మహువా మొయిత్రా గతంలో డానిష్ ఫైనాన్షియర్ లార్స్ బ్రోర్సన్ను వివాహం చేసుకున్నారు. తరువాత విడాకులు తీసుకున్నారు. అనంతరం ఆమె ప్రముఖ న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్తో దాదాపు మూడేళ్లు రిలేషన్షిప్లో ఉన్నారు. గతంలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే.. మహువా డబ్బులు తీసుకొని లోక్సభలో ప్రశ్నలు అడిగారని ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారంలో నిజానిజాలను నైతిక విలువల కమిటీ తేల్చిచెప్పింది. ఆ దరిమిలా మహువా లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేసి, సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఇది 2023 డిసెంబర్లో జరిగింది. ఇది కూడా చదవండి: అన్నివైపుల నుంచి తోపులాట.. ప్రత్యక్ష సాక్షులు -
‘తలపై గురిపెట్టేవారితో మాట్లాడేదే లేదు’: ఎంపీ శశి థరూర్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ తీరుపై ఎంపీ శశిథరూర్(MP Shashi Tharoor) మండిపడ్డారు. ఉగ్రవాద బెదిరింపులు కొనసాగుతున్నంత కాలం పాకిస్తాన్తో భారత్ మాట్లాడే ప్రస్తకే లేదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న అఖిలపక్షానికి ఆయన నాయకత్వం వహిస్తున్నారు. తమ ప్రతినిధి బృందం వివిధ దేశాల్లో పర్యటిస్తూ, పాక్ తీరును ఎండగడుతున్నదన్నారు.వాషింగ్టన్లోని నేషనల్ ప్రెస్ క్లబ్లో ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ ‘మా తలపై తుపాకీ గురిపెట్టేవారితో చర్చలు జరిపేదేలేదని’ ఆయన స్పష్టం చేశారు. సరిహద్దు ఉగ్రవాదంపై భారతదేశ వైఖరిని అమెరికాతో సహా అన్ని భాగస్వామ్య దేశాల ఎదుట స్పష్టం చేసినట్లు థరూర్ పేర్కొన్నారు. భారత్-పాక్ చర్చలను ప్రోత్సహించడంలో అమెరికా ప్రమేయంపై ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ విషయంలో భారత వైఖరిని అమెరికా అర్థం చేసుకున్నదన్నారు. భారత్ సూత్రప్రాయంగా సంభాషణకు సిద్ధంగా ఉందని, అయితే అది బలవంతంగా ఎప్పటికీ జరగదని ఆయన అన్నారు.వాణిజ్యాన్ని సాకుగా చూపిస్తూ, భారత్-పాక్ యుద్ధాన్ని నియంత్రించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) చేసిన వాదనను కాంగ్రెస్ ఎంపీ తిరస్కరించారు. తనకు అలాంటి అభిప్రాయం లేదని స్పష్టం చేశారు. ఉద్రిక్తతల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్లకు వచ్చిన పోన్ కాల్స్ చూపిస్తూ, ఆ సంభాషణల్లో ఎప్పుడూ వాణిజ్యాన్ని ప్రస్తావించనే లేదని ఆయన అని పేర్కొన్నారు. భారతదేశానికి ఎవరినీ ఒప్పించాల్సిన అవసరం లేదని, వారు ఆగిపోతే, మేము ఆగిపోతామని, తాము ఆత్మరక్షణ దిశగా వ్యవహరించామని థరూర్ పేర్కొన్నారు.భారత్కు చెందిన కొందరు ఎంపీలు, అమెరికాలోని మాజీ రాయబారి తరంజిత్ సింగ్ సంధుతో కూడిన భారత ప్రతినిధి బృందం ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తోంది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందిన దరిమిలా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ గురించి భాగస్వామ్య దేశాలకు వివరించడమే లక్ష్యంగా అఖిలపక్ష సభ్యుల పర్యటన సాగుతోంది. ఈ బృందంలో థరూర్తో పాటు, బీజేపీ ఎంపీలు తేజస్వి సూర్య, భువనేశ్వర్ కలిత, శశాంక్ మణి త్రిపాఠి ఉన్నారు. అలాగే శివసేన నుంచి మిలింద్ దేవరా, మల్లికార్జున్ దేవరా, శాంభవి చౌదరి (లోక్ జనశక్తి పార్టీ), సర్ఫరాజ్ అహ్మద్ (జార్ఖండ్ ముక్తి మోర్చా),జీఎం హరీష్ బాలయోగి (తెలుగు దేశం పార్టీ) ఉన్నారు.ఇది కూడా చదవండి: బెంగళూరు తొక్కిసలాట: మృతులంతా 40 ఏళ్లలోపు వారే.. -
ఆక్సియమ్ స్పేస్ మిషన్లో ఈసారి సరస్వతి దేవి వాహనం..
సాధారణంగా వ్యోమగాములు అంతరిక్షంలోకి చేరుకోగానే..బరువులేని స్థితిలో ఉంటారు. అందుకు గుర్తుగా ఒక బొమ్మను తీసుకువెళ్తుంటారు. భూమి నుంచి దూరంగా భారరహిత స్థితిలో ఉన్నందుకు గుర్తుగా ఒక టాయ్ని రాకెట్లోకి తీసుకువెళ్లే సంప్రదాయం వ్యోమగామలకు ఉంది. అయితే ఈసారి టెక్సాస్కు చెందిన ఆక్సియమ్ స్పేస్ మిషన్ని స్పేస్ఎక్స్-నాసా భాగస్వామ్యంతో మరికొద్దిరోజుల్లోనే ప్రారంభకానున్న సంగతి తెలిసిందే. ఈ మిషన్కు భారత్కి చెందిన శుక్లా పైలట్గా వ్యవహరించనున్నారు. మరీ ఈసారి జీరో గ్రావిటీలో చేరుకున్నందుకు గుర్తుగా వ్యోమగాములు ఏ బొమ్మను తీసుకువెళ్తున్నారు..? దాని ప్రత్యేకత వంటి విశేషాల గురించి సవివరంగా చూద్దామా..!..ఆక్సియమ్ స్పేస్ మిషన్ ఈ నెల జూన్ 10న ప్రారంభకానుంది. ఇది ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ లాంఛ్ అవుతుంది. ఈ రాకెట్ నలుగురికిపైగా వ్యోమగాములు, వారి పరిశోధన సామాగ్రితో సహా అంతరిక్ష కక్ష్యలోకి తీసుకువెళ్లనుంది. వారితోపాటు జీరో-గ్రావిటీకి గుర్తుగా ఓ చిన్న బొమ్మ కూడా ఈ అంతరిక్షంలోకి వెళ్లనుంది. ఈ బొమ్మను జీరోగ్రావిటీ ఇండికేటర్గా వ్యవహరిస్తారు.ఈ మేరకు ప్రీ-ఫ్లైట్ వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో, ఆక్సియం-4 సిబ్బంది మిషన్ జీరో-గ్రావిటీ ఇండికేటర్ను ఆవిష్కరించారు. అదేంటంటే సరస్వతి దేవి వాహనమైన 'హంస'. భారరహిత స్థితిలోకి చేరుకున్న దృశ్యమానాన్ని సూచించడానికి వ్యోమగాములు తమ వెంట ఏదో ఒక బొమ్మ తీసుకువెళ్లే సంప్రదాయంలో భాగంగా ఈ సారి హంసను ఎంపిక చేసుకున్నట్లు ఆక్సియం మిషన్ పేర్కొది. ఇదే ఎందుకంటే..భారతీయులు జ్ఞానాన్ని, ఉన్నత విద్యను అందించే దేవతగా సరస్వతి మాతను ఆరాధిస్తారు. ఆమె వాహనమే ఈ హంస. ఆంనదాన్ని హంసతో పోలుస్తారు. హంస రంగులా ఆనందం నిర్మలమైన తెలుపులో ఉంటుదనేందుకు సూచిక. అలాగే దాని ముక్కు పసుపు,నలుపు రంగుల్లో ఉంటుంది. అంటే సవాళ్లు, విజయాలు ఒకదాని వెంట ఉంటాయనే విషయాన్ని గుర్తుచేస్తుంది. అదీగాక ఈ మిషన్లో ప్రయాణించి నలుగు అంతర్జాతీయ వ్యోమగాములు ఈ హంసనే సాంస్కృతిక చిహ్నంగా ఎంచుకోవడం విశేషం. ముఖ్యంగా ఆ సభ్యులలో ఒకరైన భారతీయ వ్యక్తి వ్యోమగామి శుక్లాకు ఆ బొమ్మతో మతపరంగా మరింత లోతైన సంబంధం ఉంది. ఈ మేరకు గ్రూప్ కెప్టెన్ శుక్లా మాట్లాడుతూ..హంసకు పాల నుంచి నీటిని వేరుచేసే సామర్థ్యం ఉందని విశ్వసిస్తారు. ఇది జ్ఞానానికి సూచిక. ఈ బొమ్మ మా మిషన్ని విజయంతం చేసేలా స్ఫూర్తిని నింపుతుందన్నారు. ఇక ఈ మిషన్ కమాండర్ వ్యోమగామి పెగ్గీ విట్సన్ మాట్లాడుతూ..వ్యోమగామి సిబ్బంది మైక్రోగ్రావిటీ గుర్తుగా స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ లోపల ఈ హంస బొమ్మ స్వేచ్ఛగా తేలుతున్నట్లు కెమెరాల్లో చూడొచ్చన్నారు. అంతేగాదు ఈ ఆక్సియమ్ రాకెట్ను ప్రయోగించిన కొద్దిసేపటికే.. ఈ టాయ్ మైక్రోగ్రావిటీలో మన రాకను సూచిస్తుందని చెప్పారు. ఇక మిషన్లో పాల్గొన్న మూడు దేశాల వ్యోమగాముల ఆకాంక్షలకు చిహ్నం కూడా ఈ హంస బొమ్మే. అదేలా అంటే..భారతదేశంలో ఇది జ్ఞానానికి చిహ్నం కాగా, పోలాండ్, హంగేరిలో ఇది దయకు సంకేతం. అంతేగాదు ఆ నలుగురు వ్యోమగాముల వైవిధ్యానికి, ఐక్యతకు చిహ్నంగా ఈ హంస బొమ్మ నిలవడం మరింత విశేషం. కాగా, ఈ ఆక్సియమ్ 4 మిషన్ గత నెల మే29న ప్రారంభం కావలి, అనివార్య కారణాల రీత్యా జూన్ 8కి షెడ్యూల్ చేశారు. ఆ తర్వాత జూన్ 10 సాయంత్రం 5.52 నిమిషాలకు లాంఛ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది స్పేస్ఎక్స్. మిషన్ సోవియట్ సోయుజ్ T-11తో రాకేష్ శర్మ అంతరిక్షంలోకి ప్రయాణించిన తొలి భారతీయుడు కాగా, సరిగ్గా 41 ఏళ్లకు, ఆక్సియమ్ 4 మిషన్తో గ్రూప్ కెప్టెన్ శుక్లా అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడుగా నిలిచారు. అంతేగాదు బహుళ భారతీయ ఏజెన్సీల భాగస్వామ్యంతో శాస్త్రీయ ప్రయోగాలతో కూడిన అంతర్జాతీయ మానవ సహిత అంతరిక్ష ప్రయాణ మిషన్లో పాల్గొన్న మొదటి భారత పౌరుడు కూడా ఆయనే.(చదవండి: భారత్పై అభిమానంతో అమెరికా నుంచి వచ్చేసింది..! కట్చేస్తే..) -
‘వీసా’ భయాలతో భారతీయ విద్యార్థులు ఏం చేస్తున్నారంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వరుస నిర్ణయాలతో విదేశీ విద్యార్థులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉన్నవాళ్లను సొంత దేశాలకు పంపించేయడం.. కొత్త వాళ్లను అమెరికాలో అడుగుపెట్టనివ్వకుండా కఠిన ఆంక్షల దిశగా అడుగులేస్తున్నారాయన. ఈ క్రమంలో వీసాల కోసం ప్రయత్నిస్తున్న భారతీయ విద్యార్థులు(Indian Students) అప్రమత్తం అయ్యారు. కొందరు తాము చేసిన పోస్టులు తొలగిస్తుండగా.. మరికొందరు ఏకంగా సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేస్తున్నారు. విదేశీ విద్యార్థులకు వీసాలు(American Visas) మంజూరు చేయడానికి ముందు వారి సోషల్ మీడియా ఖాతాలను తనిఖీలు చేసే పనిలో అమెరికా అధికార యంత్రాంగం ఉంది. ఇందుకోసం అర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ఉపయోగిస్తోంది. పాలస్తీనా మద్దతుదారుల దగ్గరి నుంచి.. యూఎస్ క్యాంపస్లలో జరిగిన వివిధ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను ఈ సాంకేతికత ఉపయోగించే బయటకు పంపించేసింది. ఈ క్రమంలో.. అతిగా ఉన్న పోస్టులు చూస్తే చిక్కుల్లో పడతామనే భావనతో అలాంటి వాటిని భారతీయ విద్యార్థులు డిలీట్ చేస్తున్నారు. ఫేస్బుక్, ఎక్స్, లింక్డిన, టిక్టాక్ ఇలా ఇతర ఫ్లాట్ఫారమ్లన్నింటిని జల్లెడ పడుతున్నారు. వాటిల్లో తమ యాక్టివిటీ( పోస్టులు చేయడంతో పాటు లైకులు, షేర్లు, కామెంట్లు.. వగైరా)ని తొలగిస్తున్నారు. కొందరైతే ఏకంగా అకౌంట్నే తొలగిస్తున్నట్లు సమాచారం.అభిప్రాయాల దగ్గరి నుంచి పొలిటికల్ జోక్స్ దాకా వేటిని తమ టైం లైన్లో ఉంచడం లేదు. అమెరికా అధికారులు వాటిని చూస్తే వీసాలు రిజెక్ట్ అవుతాయని భయపడుతున్నారు. అయితే ఇలా హఠాత్తుగా అకౌంట్లనూ తొలగించడమూ మంచిది కాదనే అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. -
జులై 5న.. ఆమె జోస్యంతో వణికిపోతున్న జపాన్
బల్గేరియాకు చెందిన సుప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వంగా గురించి అందరికీ తెలిసే ఉంటుంది!. అంధురాలైన ఆమె భవిష్యత్తులో ఏం జరగనుంది? అనే చాలా విషయాలు చెప్పినవి చెప్పినట్లే జరగడంతో ఆమె కాలజ్ఞానానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. సరిగ్గా.. ఈవిడలాగే జపాన్లోనూ ఒకావిడ ఉంది. ఆమె పేరు రియో టాట్సుకి(Ryo Tatsuki). ఆమె చెప్పిన ఓ విషయంతో వచ్చే నెలలో ఏకంగా ప్రయాణాలే రద్దు చేసుకుంటున్నారు అక్కడి ప్రజలు. జపనీస్ కాలజ్ఞాని రియో టాట్సుకి (Japanese fortune teller Ryo Tatsuki) 2025, జూలై 5న విపత్తు సంభవించబోతోందని అంచనా వేశారు. భూకంపాలు, సునామీ వచ్చే ప్రమాదం ఉందని జనాల్ని హెచ్చరించారు. ఆమె భవిష్యవాణిపై నమ్మకం కలిగిన జపాన్ ప్రజలు తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. ‘న్యూ బాబా వంగా’గా పేరొందిన రియో టాట్సుకి అంచనాల దరిమిలా పలువురు త్వరలో జపాన్- ఫిలిప్పీన్స్ మధ్య సముద్రగర్భ విభజన కారణంగా భారీ భూకంపం లేదంటే సునామీ సంభవించవచ్చని చెప్పుకుంటున్నారు. టాట్సుకి అంచనాలకు శాస్త్రీయ ఆధారం లేకపోయినా, 2011లో జపాన్లో సంభవించిన తోహోకు భూకంపం, సునామీలు ఆమె గత అంచనాలను నిజం చేశాయని అంటున్నారు. నాటి భూకంపంలో ఏకంగా 18వేల మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.బ్లూమ్బెర్గ్ ఇంటెలిజెన్స్ తెలిపిన వివరాల ప్రకారం.. హాంకాంగ్ నుండి సగటు బుకింగ్లు ఏడాదికి 50 శాతం మేరకు తగ్గాయి. జూన్- జూలై మధ్య కాలంలో బుకింగ్లు 83శాతం వరకు తగ్గాయి. ఏప్రిల్-మే హాలీడేస్ సమయంలో 50శాతం మేరకు బుకింగ్ల తగ్గుదల ఉందని హాంకాంగ్లోని ఒక ట్రావెల్ ఏజెన్సీ(Travel agency) తెలిపింది. మరోవైపు రియో టాట్సుకి అంచనాలు నిరాధారమని జపాన్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా టాట్సుకి అంచనాలను పక్కన పెడితే, ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ ఇటీవల జపాన్ పసిఫిక్ తీరంలో త్వరలో భారీ భూకంపం సంభవించనున్నదని, దీని కారణంగా 2 లక్షల 98 వేల మంది వరకు మరణించే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.చెప్పినవి చెప్పినట్లే జరిగాయి1995 కోబ్ భూకంపం: టాట్సుకి ఈ భూకంపాన్ని ముందుగానే ఊహించారు.2011 తోహోకు భూకంపం, సునామీ: టాట్సుకి ఈ విపత్తును ముందుగానే అంచనా వేశారు. నాటి ఈ విపత్తులో 22 వేలకు పైగా మరణాలు సంభవించాయి. దీనిపై టాట్సుకి అంచనా నిజం కావడంతో ఆమెపై జపనీయులకు మరింత నమ్మకం పెరిగింది.టాట్సుకి రాసిన పుస్తకం ‘ది ఫ్యూచర్ ఐ సా’లో 2020లో ఓ వైరస్ జపాన్తో పాటు ప్రపంచాన్ని వణికిస్తుందని చెప్పారామె. అది కోవిడ్-19నేనని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. ఇది కూడా చదవండి: ‘ఒక్కగానొక్క కొడుకయ్యా.. మీకు దణ్ణం పెడతా’ -
భారత్పై అభిమానంతో అమెరికా నుంచి వచ్చేసింది..! కట్చేస్తే..
ఎక్కడ ఉండాలో తెలియదు, ఏమి చేయాలో తెలియదు. ఇండియా అంటే మాత్రం గుండెల నిండా అభిమానం. తట్టాబుట్టా సర్దుకొని ముంబైలో ల్యాండ్ అయింది ఎలిజా కరాజ, ఉద్యోగం వెదుక్కుంటూ ఇండియా నుంచి అమెరికాకు వెళ్లడం అనేది సాధారణం. 19 సంవత్సరాల ఎలిజా కరాజ మాత్రం అమెరికా నుంచి ఇండియాకు వచ్చింది. షికాగోలో పుట్టి పెరిగిన ఈ సిరియన్–అమెరికన్ ఆర్టిస్ట్ ముంబైలోని ఒక స్కూలులో ఆర్ట్ టీచర్గా చేరింది.ఆమె ఉద్యోగంలో చేరేనాటికి ముంబై గురించి బొత్తిగా తెలియదు.తన జీతం గురించి కూడా పట్టించుకోలేదు.కట్ చేస్తే....ఎలిజా కరాజ ముంబైకి వచ్చి పది సంవత్సరాలు అవుతుంది. ముంబై ఇప్పుడు తన సొంత ఇల్లు. హిందీ చాలా బాగా మాట్లాడుతుంది. ముంబైతో పది సంవత్సరాల అనుభవాలను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. ‘హరకాత్’ ఫ్యాషన్ లేబుల్తో ఎంటర్ప్రెన్యూర్గా విజయం సాధించింది. ఇన్స్టాగ్రామ్లో వేలాదిమంది ఫాలోవర్లు ఉన్న ఎలిజా కరాజ ఆర్టిస్ట్, స్టోరీ టెల్లర్, ఎంటర్ప్రెన్యూర్గా ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. ఇన్స్టాగ్రామ్లో వేలాదిమంది ఫాలోవర్లు ఉన్న ఎలిజా కరాజ ఆర్టిస్ట్, స్టోరీ టెల్లర్, ఎంటర్ప్రెన్యూర్గా ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. View this post on Instagram A post shared by 🌑eliza🌙 (@kweenkaraza) (చదవండి: 'ఓపిక'కు మారుపేరుగా ఆర్సీబీ గెలుపు..! ఏకంగా ఢిల్లీ పోలీసులు..) -
WED: పర్యావరణం కోసం.. తిరుగులేని యోధులు
ఆకాశాన్ని అంటుతున్న పర్యావరణ ఉద్యమ భవనాన్ని చూస్తూ....గొప్పగా మాట్లాడుకుంటాం. ఆ అమూల్యమైన భవనం రాత్రికి రాత్రి వెలిసింది కాదు. రాత్రనకా, పగలనకా ఎంతోమంది కష్టపడితే రూపుదిద్దుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మహిళలు ఆ భవనానికి పునాదిరాళ్లు వేశారు. వారి అడుగుజాడలు ఆదర్శప్రాయం, అనుసరణీయం...పక్షులను రక్షించుకుందాంరసాయన ఎరువులు విచ్చలవిడిగా వాడడం వల్ల పర్యావరణానికి జరిగే నష్టాన్ని గురించి విస్తృతంగా ప్రచారం చేసింది రేచెల్ కార్సన్. ఆధునిక పర్యావరణవాదానికి స్ఫూర్తినిచ్చే వ్యక్తిగా గుర్తింపు పొందిన రేచెల్ 1962లోనే ‘సైలెంట్ స్ప్రింగ్’ అనే పుస్తకాన్ని రాసింది. రసాయన ఎరువుల వాడకం వల్ల పక్షులకు జరుగుతున్న ప్రాణ నష్టం గురించి ఈ పుస్తకంలో వివరించింది.పర్యావరణ పార్టీమారినా సిల్వా తన కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పనులు చేసేది. పదహారేళ్ల వయసు వరకు చదవడం, రాయడం రాదు. ఆ తరువాత కష్టపడి చదువుకుంది. డిగ్రీ సాధించింది. చిన్న వయసులోనే సెనెటర్ అయ్యింది. బ్రెజిల్ పర్యావరణశాఖ మంత్రిగా స్ఫూర్తిదాయకమైన పనులకు శ్రీకారం చుట్టింది. అటవీ నిర్మూలన జరగకుండా చేసింది. ఎన్నికలలో ‘పర్యావరణం’ అనేది కీలక అంశం అయ్యేట్లు చేసింది. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ‘సస్టెయినబిలిటీ నెట్వర్క్’ అనే రాజకీయ పార్టీని ప్రారంభించింది.నిర్లిప్తత వదిలేలా...‘వియ్ యాక్ట్ ఫర్ ఎన్విరాన్మెంటల్ జస్టీస్’ వ్యవస్థాపకురాలు పెగ్గీ షెప్పర్డ్. 1988 నుంచి మన్హట్టన్లో పర్యావరణ సంరక్షణకు సంబంధించి కార్యక్రమాలు ఎన్నో చేపట్టింది. అమెరికాలో ఎన్నో ప్రాంతాలు కాలుష్యానికి చిరునామాలుగా ఉండేవి. అయినప్పటికీ ‘మనం ఏం చేయలేము’ అనే నిర్లిప్తత జనాలలో ఉండేది. ఈ పరిస్థితిలో మార్పు తీసుకువచ్చి పర్యావరణ స్పృహ తీసుకు రావడానికి కృషి చేసింది షెప్పర్డ్. ‘నేషనల్ ఎన్విరాన్మెంటల్ జస్టిస్ అడ్వైజరీ కౌన్సిల్’కు తొలి మహిళా చైర్పర్సన్గా గుర్తింపు పొందింది.తిరుగులేని యోధురాలు‘భయం లేని యోధురాలు’గా గుర్తింపు పొందిన మార్జరీ స్టోన్మన్ డగ్లస్ జర్నలిస్ట్, రచయిత్రి. స్త్రీవాదం, పర్యావరణవాదం కోసం తన శక్తిమంతమైన గొంతును వినిపించేది. 1947లో ‘ది ఎవర్గ్లైడ్స్: రివర్ ఆఫ్ గ్రాస్’ అనే ప్రసిద్ధ పుస్తకాన్ని రాసింది. పర్యావరణ సంరక్షణకు ప్రజా మద్దతు కూడగట్టడంలో క్రియాశీల పాత్ర పోషించింది.అడవి తల్లి కోసం...ఎమ్మీ అవార్డ్–విన్నింగ్ జర్నలిస్ట్ వెనేస హాక్ పదిహేను సంవత్సరాలకు పైగా పర్యావరణ సమస్యలను వెలుగులో తీసుకువచ్చింది. కేవలం రాతలకే పరిమితం కాకుండా ప్రజలలో పర్యావరణ స్పృహ కలిగించడానికి ఉద్యమ స్థాయిలో పనిచేసింది. పర్యావరరణ సమస్యలపై ఇన్వెస్టిగేటివ్ యూనిట్ ఏర్పాటు చేసింది. ‘మదర్ జంగిల్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ అంశాలపై క్షేత్రస్థాయిలో పనిచేసింది.ఎన్నో దేశాలకు స్ఫూర్తినిచ్చేలా...‘గ్రీన్బెల్ట్ మూమెంట్’ వ్యవస్థాపకురాలైన వంగరి మాథాయ్ ప్రపంచ ప్రసిద్ధ పర్యావరణ ఉద్యమకారులలో ఒకరు. నోబెల్ శాంతి బహుమతి పొందిన మొదటి ఆఫ్రికన్ మహిళ. మొక్కలు నాటే పనిని ఉద్యమ స్థాయిలో చేపట్టింది. మొక్కలు నాటడం వల్ల పర్యావరణానికి మేలు జరగడంతో పాటు ఎంతోమంది మహిళకు ఉపాధి లభించింది. మాథాయ్ చేసిన పర్యావరణ ఉద్యమ కార్యక్రమాలు ఎన్నో ఆఫ్రికన్ దేశాలకు స్ఫూర్తిని ఇచ్చాయి.(చదవండి: -
భారత్-పాక్ వివాదంపై ట్రంప్-పుతిన్ చర్చ
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’(Operation Sindhur)పై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తాజాగా రష్యన్ అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్- అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో భారత్- పాక్ మధ్య జరుగుతున్న వివాదంతో పాటు ప్రపంచ సమస్యలపై చర్చించారని రష్యా అధికారిక కార్యాలయం క్రెమ్లిన్ ప్రతినిధి యూరీ ఉషాకోవ్ తెలిపారు.ట్రంప్, పుతిన్ల చర్చల్లో మిడిల్ ఈస్ట్తో పాటు భారత్-పాక్ మధ్య జరుగుతున్న సాయుధ సంఘర్షణపై ప్రస్తావనకు వచ్చింది. అయితే అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తిగత జోక్యంతో దీనిపై చర్చ ఆగిపోయింది. అని ఉషాకోవ్ రష్యన్ వార్తా సంస్థ ‘టాస్’కు తెలిపారు. ఆయన ఈ చర్చలపై పూర్తి వివరాలను వెల్లడించలేదు. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. మే 7న పాక్తో పాటు ఉగ్రవాద శిబిరాలకు ఆతిథ్యం ఇస్తున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని సరిహద్దు వెంబడి భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టింది. దీంతో పాకిస్తాన్ వెనక్కు తగ్గింది. మే 10న భారత్-పాక్ దేశాలు కాల్పుల విరమణను ప్రకటించాయి.ఈ నేపధ్యంలో పుతిన్(Putin)- ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ కాల్లో భారత్-పాక్ వివాదంపై చర్చ జరగగా, ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ట్రూత్’ తో తమ సంభాషణలోని వివరాలను వెల్లడించారు. ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ అణు కార్యక్రమం తదితర ప్రపంచ విషయాలపై తాము మాట్లాడుకున్నామని ట్రంప్ తెలిపారు. తమ మధ్య వివిధ అంశాలపై దాదాపు గంటా 15 నిమిషాల పాటు చర్చ కొనసాగిందని, అయితే ఇది తక్షణ శాంతికి దారితీసే సంభాషణ కాదని ట్రంప్ పేర్కొన్నారు.అమెరికా అణు ప్రతిపాదనకు ఇరాన్ విముఖతఅమెరికా రూపొందించిన ముసాయిదా అణు ప్రతిపాదన(Draft nuclear proposal)ను ఇరాన్ తిరస్కరించింది. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మీడియాతో మాట్లాడుతూ అమెరికా కోరుకుంటున్నట్లు టెహ్రాన్ తన యురేనియం సమృద్ధిని ఎన్నటికీ వదులుకోదని స్పష్టం చేశారు. అమెరికా కొత్త అణు ఒప్పంద ప్రతిపాదన తమ ప్రయోజనాలకు అనుగుణంగా లేదని ఇరాన్ పేర్కొంది. ఇరాన్ తమ యురేనియం సమృద్ధిని కొనసాగిస్తామని పట్టుబడుతుండగా, అమెరికా దానిని నిలిపివేయాలని డిమాండ్ చేస్తోంది. దీనిపై ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇటీవల అణు ఒప్పందం కోసం కొత్త ప్రతిపాదనను ఇరాన్తో పంచుకున్నామని అమెరికా తెలుపగా, దానిని ఇరాన్ ధృవీకరించింది. దీనిపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్.. ఇరాన్కు ఆమోదయోగ్యమైన అణు ప్రతిపాదనను పంపారని, దానిని అంగీకరిస్తే, ఇరాన్కు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. లేని పక్షంలో అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా పునరుద్ఘాటించినట్లుగా ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కొనవలసి వస్తుందని లీవిట్ పేర్కొన్నారు.గతంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఒక పోస్ట్లో.. తమ జాతీయ ప్రయోజనాలు, హక్కులకు అనుగుణంగా ఉంటేనే అమెరికా ప్రతిపాదనపై ఇరాన్ ప్రతిస్పందిస్తుందన్నారు. కాగా అమెరికా అణు సంస్థ నివేదిక ప్రకారం ఇరాన్ తన దేశంలోని మూడు ప్రదేశాలలో రహస్య అణు కార్యకలాపాలను నిర్వహించింది. మరోవైపు ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడు ఆయతుల్లా రుహోల్లా ఖొమేనీ ఇటీవల అమెరికా అణు ఒప్పందం 1979 నాటి ఇస్లామిక్ విప్లవ భావజాలానికి వందశాతం వ్యతిరేకంగా ఉన్నదని వ్యాఖ్యానించారు. ఇది కూడా చదవండి: ‘తత్కాల్’ స్కాంకు చెక్.. 2.5 కోట్ల నకిలీ యూజర్ ఐడీలు డియాక్టివేట్ -
ఇరాన్కు ట్రంప్ బిగ్ షాక్.. 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్
ఇరాన్ సహా 12 దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పెద్ద షాకిచ్చారు. ఆ దేశాల పౌరులు అమెరికాలో అడుగుపెట్టకుండా ట్రావెల్ బ్యాన్(Travel Ban) విధిస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన.. రాబోయే సోమవారం(జూన్ 9వ తేదీ) నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ఈ జాబితాలో ఇరాన్(Trump Travel ban on Iran), లిబియా, అఫ్గనిస్తాన్, మయన్మార్, చాద్, కాంగో, ఈక్వెటోరియల్ గినియా, హైతీ, సోమాలియా, సూడాన్, యెమెన్, ఎరిత్రియా సైతం ఉన్నాయి. వీటితో పాటు మరో ఏడు దేశాలపైనా ఆయన తాత్కాలిక నిషేధం విధించారు. ఇందులో.. బూరుండి, వెనిజులా, క్యూబా, లావోస్, సియెరా లియోన్, టోగో, టుర్కిమేనిస్తాన్ ఉన్నాయి.ఈ మేరకు అధ్యక్ష భవనం వైట్ హౌజ్ ఓ ప్రకటన విడుదల చేసింది. వీసా పొందుతున్న వ్యక్తుల సమాచారాన్ని తగిన విధంగా పరిశీలించే అవకాశాలు తక్కువగా ఉండడం, అదే సయమంలో వీసా గడువు ముగిసినా కూడా తిరిగి వెళ్లకుండా అమెరికాలోనే ఉండిపోతుండడం.. ఈ రెండు కారణాల వల్ల భద్రతా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ప్రమాదకరమైన విదేశీ శక్తుల నుంచి అమెరికన్లను రక్షిస్తానని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేశారు. ఇప్పుడు ఆయన ఆ హామీని నిలబెట్టుకుంటున్నారు అని వైట్హౌజ్ అధికార ప్రతినిధి అబిగెయిల్ జాక్సన్ ఎక్స్లో ట్వీట్ చేశారు. అఫ్గనిస్తాన్ తాలిబన్ల నియంత్రణలో ఉండడం, ఇరాన్ క్యూబా దేశాల్లో ఉగ్రవాదాన్ని ప్రభుత్వాలే ప్రోత్సాహిస్తుండడం, చాద్.. ఎరిత్రియాలాంటి దేశాల పౌరులు వీసాల గడువు ముగిసినా అమెరికాలోనే ఉండిపోతుండడం.. లాంటి కారణాలతో ఈ నిషేధం విధిస్తున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ట్రంప్ ‘విదేశీ ఉగ్రవాదుల నుంచి అమెరికాను రక్షించడం కోసమే’ అంటూ ప్రకటించడం గమనార్హం.ఇదిలా ఉంటే.. అధ్యక్షుడిగా ట్రంప్ తన తొలి టర్మ్లోనూ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. 2017లో ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న ఇరాక్, ఇరాన్, సిరియా, సూడాన్, లిబియా, యెమెన్, సోమాలియా దేశాల పౌరులను అమెరికాలోకి రాకుండా నిషేధించారు. అయితే ఆ తర్వాత జో బైడెన్ అధికారంలోకి వచ్చాక 2021లో దానిని ఎత్తివేశారు. -
అయోధ్య రామాలయం అద్భుతం
అయోధ్య: టెక్నా లజీ దిగ్గజం, స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ బుధవారం ఉత్తర ప్రదేశ్లోని అయో ధ్య రామమంది రాన్ని దర్శించుకు న్నారు. భారతీయ సంప్రదాయ కుర్తా పైజామా ధరించి, గర్భాలయంలో బాలరాముడికి ప్రత్యేక పూజలు చేశారు. రామాలయ దర్శనం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని ఆనందం వ్యక్తంచేశారు. తాను ఇప్పటిదాకా చేసిన పనుల్లో ఇది చాలా గొప్ప అని చెప్పారు. ఈ ఆలయం చాలా అందంగా ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఇది అద్భుతమైన దేవాలయం అవుతుందని వెల్లడించారు. అయోధ్యలో హనుమాన్ గార్హీ ఆలయాన్ని కూడా ఎరోల్ మస్క్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎరోల్ మస్క్ వెంట కుమార్తె అలెగ్జాండ్ర మస్క్ కూడా ఉన్నారు. ఎరోల్ మస్క్ రాక సందర్భంగా ఆలయ పరిసరాల్లో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సర్వోటెక్ రెన్యూవబుల్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్కు ఎరోల్ మస్క్ గ్లోబల్ అడ్వైజర్గా పని చేస్తున్నారు. ఆయన ఈ నెల 1న ఇండియాకు వచ్చారు. 6వ తేదీ దాకా ఇక్కడే పర్యటిస్తారు. -
సూర్యుడినే గెంటేస్తాయా?
వాషింగ్టన్: సౌర కుటుంబం మొత్తానికి ఆవాసంగా ఉన్న పాలపుంత గెలాక్సీ కొన్ని లక్షల కాంతి సంవత్సరాల తర్వాత సూర్యుడిని గెంటేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. పాలపుంత గెలాక్సీ సమీపంలోనే ఆండ్రోమెడా గెలాక్సీ ఉంది. ఈ రెండింటి మధ్య ఆకర్షణ పెరుగుతుండటంతో ఒకదానితో మరోటి ఢీకొనడమో, విలీనం కావడంతో తథ్యమని దాదాపు వందేళ్ల క్రితమే ఖగోళ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అయితే ఈ సంయోగ ప్రక్రియకు మన సౌరకుటుంబానికి మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని తాజాగా కనుగొన్నారు. ప్రణయ భీకర వేగంతో రెండు గెలాక్సీలు ఢీకొన్నప్పుడు జనించే బలాలు ఊహకందనంత శక్తివంతంగా ఉంటాయి. ఈ బలాలు ఏకంగా గెలాక్సీల్లోని నక్షత్రాలను సైతం చిన్న రాళ్లలాగా దూరంగా విసిరివేయగలవు. ఈ బలాలే మన సూర్యునికి బద్ధశత్రువుగా మారనున్నాయని తాజా అధ్యయనం పేర్కొంది. గెలాక్సీలు ఢీకొన్నప్పుడు సూర్యుడు తన కక్ష్య నుంచి దూరంగా విసిరివేయబడతాడని, దీంతో ఏకంగా గెలాక్సీ నుంచి గెంటివేతకు గురౌతాడని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. సూర్యుడు తన కక్ష్యను కోల్పోయినప్పుడు భూమి వంటి గ్రహాల ఉనికే ప్రశ్నార్థకంగా మారనుంది. బలాల తీవ్రతకు విసురుగా దూరంగా వెళ్లే క్రమంలో సూర్యుడు తనతోపాటు తన చుట్టూ ఉండే గ్రహాలను లాగేసుకుంటూ వెళ్లితే సరేసరి. అలా జరగకపోతే గ్రహాలన్నీ చెల్లాచెదురుకావడమో, శాశ్వతంగా కక్ష్యలను కోల్పోయి అనాథలుగా మారడమో ఖాయమని అధ్యయనకారులు అంచనావేస్తున్నారు. నాసా వారి హబుల్ స్పేస్ టెలిస్కోప్, యురోపియన్ స్పేస్ ఏజెన్సీ వారి గియా స్పేస్ టెలిస్కోప్ల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించడంతో ఈ మేరకు అంచనాకొచ్చామని వాళ్లు తెలిపారు. సంబంధిత అధ్యయన వివరాలు నేచర్ ఆస్ట్రోనమీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. వేయి కోట్ల ఏళ్ల తర్వాత..! ‘‘వచ్చే 10 బిలియన్ సంవత్సరాల తర్వాత ఈ ఢీకొనే ప్రక్రియ జరగొచ్చు. నేరుగా ఢీకొనే అవకాశాలు 50 శాతమే. సుళ్లు తిరుగుతూ సంయోగం జరగే అవకాశాలూ ఉన్నాయి. ఇలా 22 భిన్న అవకాశాలను పరిశీలించాం. పొరుగు గెలాక్సీలుగా సంచరించే అవకాశం కూడా ఉంది. ఢీకొంటే మాత్రం జరిగే విధ్వంసంలో మన సూరీడు దూరంగా వెళ్లిపోయే వీలుంది’’అని ఈ పరిశోధనలో ముఖ్య రచయిత టిల్ సవాలా చెప్పారు. మరో నాలుగైదు బిలియన్ సంవత్సరాల తర్వాత సూటిగా ఢీకొనే అవకాశాలు సైతం 2 శాతం ఉన్నాయని సవాలా వెల్లడించారు. -
గజరాజు దొంగ షాపింగ్
బ్యాంకాక్: థాయిలాండ్లో ఒక అడవి ఏనుగు అమాంతం సూపర్మార్కెట్లోకి దూసుకొచ్చి ఎలాంటి బీభత్సం సృష్టించకుండా తనకేం కావాలో అవి మాత్రమే తినేసి నెమ్మదిగా వెళ్లిపోయిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. నఖోన్ రాట్చసీమా ప్రావిన్సులో ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. దుకాణం ఉన్న ప్రాంతం ఖవో ఏఈ జాతీయవనానికి దగ్గర్లో ఉంది. ఈ నేషనల్పార్క్లో అడవి ఏనుగులు ఎక్కువ. వాటిల్లో కొన్ని అడవి నుంచి బయటికొచ్చి తిరుగుతుంటాయి. అలా తిరిగే ఏనుగుల్లో 27 ఏళ్ల మగ ఏనుగు ప్లాయీ బియాంగ్ లేక్ కూడా ఒకటి. ఈ ఏనుగు తరచూ అదే ప్రాంతంలో సంచరిస్తున్నా ఎవరికీ ఎప్పుడూ ఎలాంటి హానీ తలపెట్టలేదు. అయితే జూన్ రెండో తేదీన ఈ ఏనుగు హఠాత్తుగా ఖంప్లోయీ కకావూ అనే మహిళకు చెందిన ఒక సూపర్మార్కెట్లోకి దూరింది. అప్పుడు అక్కడే కౌంటర్ వద్ద ఉన్న మహిళా యజమాని ఒక్కసారిగా భయపడిపోయి అరిచి దుకాణంలోపలికి పరుగెత్తింది. సాధారణంగా అడవి మదపుటేనుగులు పట్టరాని ఆవేశంతో సమీప ప్రాంతాలను నాశనంచేస్తాయి. కానీ బియాంగ్లేక్ ఏనుగు మాత్రం ఎంతో ప్రశాంతంగా కనిపించింది. కేవలం అక్కడ ఉన్న మిఠాయిలను మాత్రమే తినాలని నిర్ణయించుకుంది. ఎదురుగా ఎన్నో రకాల తినుబండారాలు కనిపిస్తున్నా డీప్ రిఫ్రిజిరేటర్ను పక్కకు తోసేసిమరీ స్వీట్లు పెట్టిన చోటుకొచి్చంది. నెమ్మదిగా ఒక్కో స్వీట్ ప్యాకెట్ను గుటకాయస్వాహా చేసింది. ఇలా దాదాపు పది ప్యాకెట్లను తినేసింది. ఎలాగూ దాడి చేశాంకదా అదేదో పూర్తిగా సరిపోతుందని అనుకుందేమో. తర్వాత అరటి పండ్లను అమాంతం మింగేసింది. తర్వాత వేరునెనగపట్టీలను కకకరా నమిలేసింది. తర్వాత నెమ్మదిగా వెళ్లిపోయింది. ‘‘భయంతో లోపలికి పరుగెత్తా. తర్వాత ధైర్యం చేసుకుని పో పో అని ఎంత అరిచినా అది నా మాటను పట్టించుకోలేదు. ఈ ఏనుగును బయట చాలా సార్లు చూశా. మా దుకాణం ముందు నుంచి చాలా సార్లు వెళ్లిందిగానీ ఎప్పుడూ ఇలా ‘షాపింగ్’చేయలేదు’’అని దుకాణం యజమాని బియాంగ్ లేక్ చెప్పారు. ఏనుగు దుకాణంలో దూరిన వార్త తెల్సి అటవీశాఖ సిబ్బంది వచ్చి దానిని అక్కడి నుంచి తరిమేశారు. అయితే షాపులో ఏనుగు లూటీ వార్త తెలిసి ఒక వన్యప్రాణి సంరక్షణ సంఘం ప్రతినిధులు మా దుకాణానికి వచ్చారు. ఏనుగు షాపింగ్ చేసి బిల్లు చెల్లించకుండా వెళ్లిందని తెలిసింది. ఇదిగోండి ఆ బిల్లు అమౌంట్ అని నష్టపరిహారం 800 థాయ్ బాత్లను వాళ్లు చెల్లించివెళ్లారు’’అని దుకాణయజమానురాల నవ్వుతూ చెప్పారు. -
కొరియా సారథికి సవాళ్ల స్వాగతం
అమెరికా, జపాన్లతో సత్సంబంధాల బలోపేతం దిశగా అడుగులు దక్షిణ కొరియాలో నెలల తరబడి కొనసాగుతున్న రాజకీయ సంక్షోభాన్ని, అధికార అస్థిరతకు చరమగీతం పాడుతూ అధికార పగ్గాలు చేపట్టబోతున్న నూతన అధ్యక్షుడు లీ జే మ్యుంగ్కు ఎన్నో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. ఉత్తర కొరియాతో చిరకాల వైరానికి స్వస్తి పలికి చర్చలు, దౌత్యంతో కొరియా ద్వీపకల్పంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పుతానని బుధవారం మ్యుంగ్ ఉద్ఘాటించారు. దేశంలో అసమానతలను పారద్రోలి అవినీతిపై యుద్ధం చేస్తానని ఆయన అన్నారు. దేశంలో మార్షల్ లా విధించి చివరకు పదవీచ్యుతుడైన యూన్ సుక్ యోల్ స్థానంలో అధ్యక్ష పీఠంపై ఆసీనులైన మ్యుంగ్ దేశాన్ని ఏ స్థాయిలో జనరంజకంగా పాలిస్తారనే అంచనాలు, విశ్లేషణలు ఫలితాలు వెలువడిన వెనువెంటనే వెల్లువెత్తాయి. దాడికి రంకెలేస్తున్న ఉ.కొరియాతో మైత్రి, అమెరికా, జపాన్ మిత్రదేశాలతో సత్సంబంధాల మెరుగు, ఆర్థికవ్యవస్థను ఉరకలెత్తించడం, ట్రంప్తో దిగుమతి టారిఫ్ల పోరులో నెగ్గడంసహా ఎన్నో అంశాలను మ్యుంగ్ ఏపాటి సమర్థవంతంగా పరిష్కారాల దిశగా లాక్కొస్తారనే మీమాంస సగటు ద.కొరియన్ పౌరుడిలో మొదలైంది. ఆర్థికాభివృద్ధిపై ప్రధానంగా దృష్టి కొన్ని నెలలుగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడంపై తొలుత మ్యుంగ్ దృష్టిసారించనున్నారు. రాజకీయ అస్థిరత కారణంగా తమ పెట్టుబడులకు రక్షణ కరువవుతుందనే అనుమానాలు ఎక్కువవడంతో విదేశీ పెట్టుబడులు తగ్గిపోయాయి. దీనికితోడు వినియోగదారుల వినిమయం సైతం బాగా తగ్గిపోయింది. యువతకు ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. ట్రంప్ ద.కొరియాపై అధిక టారిఫ్ల మోత మోగిస్తాననడం సైతం దేశానికి శరాఘాతమైంది. వీటన్నింటికీ మ్యుంగ్ పరిష్కారాలు వెతకాల్సి ఉంది. ట్రంప్ విధించిన కొత్త పన్నుల అమలుకు 90 రోజుల విరామ గడువు జూలై 9వ తేదీతో ముగుస్తుంది. ఈలోపు ట్రంప్తో మ్యుంగ్ చర్చలు జరిపి టారిఫ్ల భారాన్ని తగ్గించుకోవాల్సి ఉంది. మరోవైపు తమ దేశంలో తిష్టవేసిన 28,000 మంది అమెరికన్ సైనికులకు జీతాలు, ఆయుధాలు మాత్రమే ట్రంప్ సర్కార్ సమకూర్చుతుంది. మిగతా సకల సౌకర్యాల ఖర్చు ద.కొరియానే భరిస్తోంది. ఈ భారం తగ్గించాల్సిన బాధ్యత ఇప్పుడు మ్యుంగ్ భుజస్కంధాలపై పడింది. ఉత్తర కొరియాతో దోస్తీకీ సై కొరియా ద్వీపకల్పంలో శాంతిస్థాపనే ధ్యేయంగా మ్యుంగ్ తానే ఒక అడుగు ముందుకేయాల్సి ఉంది. తమపై అమెరికా వేలాడదీసిన ఆర్థిక ఆంక్షల కత్తిని తొలగించేదాకా చర్చలు ఉండబోవని గతంలోనే ఉ.కొరియా తెగేసి చెప్పింది. ఈనేపథ్యంలో అమెరికాతో దౌత్యం నెరిపి నార్త్కొరియాను నేస్తంగా మార్చుకోవాల్సిన బాధ్యత సైతం మ్యుంగ్పై ఉంది. సంప్రతింపుల మార్గాన్ని తెరుస్తానని బుధవారం మ్యుంగ్ ప్రకటించారు. మాజీ మంత్రి లీ జోంగ్ సియోగ్ను నిఘా చీఫ్గా నియమించారు. ఈయనకు గతంలో ఉ.కొరియాతో ద్వైపాక్షిక, శాంతి చర్చలు జరిపిన అపార అనుభవం ఉంది. ఉ.కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్తో శిఖరాగ్ర భేటీ వెంటనే సుసాధ్యంకాకపోయినా భవిష్యత్తులో నేరుగా మంతనాలకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మ్యుంగ్ చెప్పారు. ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యాకు ఉ.కొరియా భారీగా సైనిక,ఆయుధ సాయం చేసిన నేపథ్యంలో రష్యా ద్వారా దౌత్యం జరిపేందుకు సైతం మ్యుంగ్ ప్రయతి్నంచే వీలుంది. త్రైపాక్షిక సంబంధాల బలోపేతంఅమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థను తమ భూభాగంలో నెలకొల్పడం ద్వారా ఇరు కొరియాల మధ్య అమెరికా కయ్యాన్ని పెంచుతోందని మ్యుంగ్ గతంలో పలుమార్లు ఆరోపించారు. అమెరికా, జపాన్లంటే మ్యుంగ్కు అస్సలు నచ్చదని గతంలో చాలా సార్లు వార్తలొచ్చాయి. ఇప్పుడీ అపవాదును పోగొట్టుకుని ‘వాషింగ్టన్–సియోల్–టోక్యో’ త్రైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి చేస్తానని మ్యుంగ్ చెప్పారు. చైనా, రష్యాలతోనూ ఘర్షణాత్మక వైఖరులను మ్యుంగ్ విడనాడాల్సిన తరుణం ఆసన్నమైంది. మ్యుంగ్తో త్వరలోనే ద్వైపాక్షి చర్చలు జరుపుతానని జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా బుధవారం చెప్పారు. దీంతో జపాన్తో సత్సంబంధాలు మరింత మెరుగయ్యే వీలుంది. టారిఫ్లు పెంచుతానన్న ట్రంప్తో నేరుగా మాట్లాడే నేతలేక గత కొద్దివారాలుగా ద.కొరియా తెగ ఇబ్బందులు పడింది. కొత్తగా అధికారం చేపట్టిన మ్యుంగ్ తక్షణం ట్రంప్తో చర్చలు జరిపి టారిఫ్ల భారం తగ్గించాల్సి ఉంది. సొంతింటి ప్రక్షాళన.. మార్షల్ లా తదనంతర పరిణామాల్లో విపక్ష పీపుల్ పవర్ పార్టీపై కక్ష తీర్చుకోకుండా మ్యుంగ్ సంయమనం పాటించాల్సిన తరుణమిది. గత మూడేళ్లు అధికారంలో ఉన్న పీపీపీ పార్టీపై అక్రమ కేసులు బనాయిస్తూపోతే దేశంలో మళ్లీ నిరసనలు, ఆందోళనలు మొదలై శాంతిభద్రతల పరిరక్షణ పెద్ద సమస్యగా మారొచ్చు. ఇది మ్యుంగ్కు కొత్త తలనొప్పులు తేవొచ్చు. రాజకీయ కక్ష సాధింపు విషయంలో మ్యుంగ్ వైఖరి ఇంకా తెలియాల్సి ఉంది. విపక్ష పార్టీల నేతలపై దేశంలో తిరుగుబాటు వంటి తీవ్రమైన అభియోగాల్లో శిక్షలు పడే వీలుండటంతో నిరసనలు జరిగే వీలుంది. వీటిని మ్యుంగ్ ఏ స్థాయిలో ఎదుర్కొంటారో చూడాలి. యూన్ మార్షల్ లా ఘటనపై సమగ్ర దర్యాప్తునకు మాత్రం ఆదేశిస్తానని మ్యుంగ్ చెప్పారు. శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీ ద.కొరియా నూతన అధ్యక్షుడిగా బుధవారం బాధ్యతలు చేపట్టిన మ్యుంగ్కు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం అయ్యేందుకు మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని మోదీ తన శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు. –సాక్షి నేషనల్ డెస్క్పేద కార్మికుడి నుంచి పగ్గాలు చేపట్టేదాకా.. 60 ఏళ్ల మ్యుంగ్ 14 ఏళ్ల వయసులో పేదరికంలో మగ్గిపోతూ పరిశ్రమలో బాలకార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించారు. మ్యుంగ్ సియోల్ నగర దగ్గర్లోని ఆండోంగ్ పర్వతమయ గ్రామంలో 1963 డిసెంబర్ 8న జని్మంచారు. వాళ్ల తల్లిదండ్రుల ఏడుగురు సంతానంలో మ్యుంగ్ ఐదోవాడు. మ్యుంగ్ తండ్రి పట్టణంలో దు కాణాల సముదాయాలను శుభ్రం చేసేవారు. సామూహిక స్నానాల గదుల వద్ద తల్లి రుసుములను వసూలుచేస్తూ జీవించేవారు. మ్యుంగ్ అక్రమంగా బాలకార్మికునిగా ఆభరణాల తయారీ పరిశ్రమలో, రిఫ్రెజిరేటర్ల అసెంబ్లీ విభాగాల్లో సైతం పనిచేశాడు. ఆ సమయంలో ఫ్యాక్టరీ మెషీన్లో పడి ఎడమ చేయి మణికట్టును పూర్తిగా కోల్పోయారు. దీంతో పనిచేయడం కుదరక మళ్లీ చదువు బాటపట్టాడు. 1986లో చుంగ్ఆంగ్ ప్రైవేట్ లా వర్సిటీలో న్యాయపట్టా సాధించారు. దాదాపు రెండు దశాబ్దాలపాటు మానవహక్కుల కేసులను వాదిస్తూ మంచి లాయర్గా పేరు తెచ్చుకున్నారు. 2005లో రాజకీయాల్లో చేరారు. సామాజిక ఉదారవాద ఊరీ పార్టీలో చేరారు. 2010లో సియాంగ్నమ్ నగర మేయర్గా గెలుపొందారు. 2018లో అతిపెద్ద గియోంగీ ప్రావిన్స్కు గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. 2021 అక్టోబర్లో కొద్దిలో డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష పదవిని కోల్పోయినా ఏడాది తిరిగేలోపే పార్టీ పగ్గాలు చేపట్టారు. 2024 జనవరిలో బుసాన్ సిటీలో ప్రజాకార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఒక ఆగంతకుడు మెడపై పొడిచి చంపబోయాడు. సర్జరీ తర్వాత ఈయన కోలుకున్నారు. తాజాగా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. -
మలేసియాలో పారని పాక్ పాచిక
కౌలాలంపూర్: మలేసియా గడ్డపై పాకిస్తాన్ చేసిన భారతవ్యతిరేక కుయుక్తులు నిష్ఫలమయ్యాయి. ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలను వివరిస్తూనే ఉగ్ర విషం చిమ్ముతున్న పాకిస్తాన్ వైఖరిని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టేందుకు మలేసియాలో పర్యటిస్తున్న భారత అఖిలపక్ష దౌత్య బృందం ఆ దేశాధికారులతో సమావేశమైంది. అయితే ఈ భేటీను అడ్డుకునేందుకు పాకిస్తాన్ ప్రయత్నించింది. మతాన్ని అడ్డుగా పెట్టే ప్రయత్నంచేసి చివరకు భంగపడింది. జేడీ(యూ) ఎంపీ సంజయ్ ఝా నేతృత్వంలోని భారత అఖిలపక్ష దౌత్య బృందం మలేసియాలో 10 వేర్వేరు భేటీలకు సిద్దమవగా ఈ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వొద్దని మలేసియా ప్రభుత్వానికి అక్కడి పాకిస్తాన్ ఎంబసీ లేఖ రాసింది. ‘‘ మనం మనం ఒక్కటే. మన రెండు దేశాలూ ముస్లిం దేశాలే. భారత ప్రతినిధి బృందం చెప్పే అంశాలకు విలువ ఇవ్వకండి. అసలు వాళ్లకు అనుమతే ఇవ్వకండి. మొత్తం 10 వేర్వేరు కార్యక్రమాలను జరగనివ్వకండి’’ అని ఆ లేఖలో పాకిస్తాన్ తన అక్కసు వెళ్లబోసుకుంది. అయినాసరే మలేసియా సర్కార్ భారత్కే మద్దతు పలికింది. మొత్తం 10 కార్యక్రమాలకూ అనుమతి ఇచ్చింది. మలేసియా పార్లమెంట్ స్పీకర్ వైబీ టాన్ శ్రీ దాటో జొహారీ బిన్ అబ్దుల్తో సంజయ్ఝా బృందం భేటీ అయి పాక్ ఉగ్రధోరణిని వివరించింది.బిలావల్ భుట్టోకు చేదు అనుభవంభారత్కు పోటీగా అమెరికాలో పర్యటిస్తున్న పాకిస్తాన్ దౌత్య బృందానికి సారత్యంవహిస్తున్న ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ పీపుల్స్పార్టీ(పీపీపీ) నేత బిలావల్ భుట్టో జర్దారీకి న్యూయార్క్లకు చేదు అనుభవం ఎదురైంది. పహల్గాం దాడి తర్వాత భారత్లో ముస్లింలను దూషించడం ఎక్కువైందని, వాళ్లను దయ్యాల్లా చూస్తున్నారని బిలావల్ అమెరికాలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ఈయన వ్యాఖ్యలను ముస్లిం జర్నలిస్ట్ అహ్మద్ ఫథీ మీడియా సమావేశంలో లేవనెత్తి బిలావల్ను ఇరుకునపెట్టారు. ‘‘ పహల్గాం ఘటనను భారత ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా ఒక ఆయుధంగా వాడుతోందనేది పూర్తిగా తప్పు. ఆపరేషన్ సిందూర్ వివరాలను భారత్ తరఫున ముస్లిం మహిళా నావికాధికారి మీడియాకు వివరించారు. ముస్లింలను భారత్ తన ప్రతినిధులుగా భావిస్తోందికదా?’’ అని ప్రశ్నించారు. దీంతో బిలావల్ ముఖం ఎర్రబడింది. ఏం చెప్పాలో తెలీక నీళ్లు నమిలారు. భారత దాడి వివరాలను కల్నల్ సోఫియా ఖురేషి వివరించడం తెల్సిందే. -
పర్యావరణ విలాపం
యుద్ధం కొనసాగినన్ని రోజులూ రణ క్షేత్రాల్లో ఎక్కడ చూసినా రక్తతర్పణమే. సైనికుల రుధిరంతో తడిసి ముద్దయిన భూములు మాత్రమే కాదు పరోక్షంగా కోట్లాది ఎకరాల్లో సాగుభూమి, జనావాస ప్రాంతాలు ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్ఈపీ), 2024 నివేదిక స్పష్టంచేసింది. హౌతీల తిరుగుబాటు, హమాస్–ఇజ్రాయెల్ యుద్ధం, ఉక్రెయిన్–రష్యా యుద్ధంతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జరుగుతున్న అంతర్యుద్ధాలు, ఘర్షణలు చివరకు పర్యావరణ సంక్షోభాగ్నుల్ని మరింత ఎగసిపడేలా చేస్తున్నాయని యూఎన్ఈపీ నివేదిక వెల్లడించింది. సరిహద్దు వివాదాలు మొదలు అంతర్జాతీయ విధానాలదాకా పొరుగు దేశాలు, శత్రుదేశాల మధ్య వైరం తుదకు పర్యావరణాన్ని మరింతగా నాశనంచేస్తోందని నివేదిక హెచ్చరిస్తోంది. దశాబ్దాల క్రితమే జీవాయుధాలు ప్రయోగించి కిలోమీటర్ల కొద్దీ జనావాసాలను విషవాయువులతో గరళమయం చేసిన దేశాల దుష్టాంతాలనూ నివేదిక గుర్తుచేసింది. యుద్దాల వేళ శత్రు దేశాల జలాశయాలను, ఆనకట్టలపై బాంబులేసి నేలమట్టంచేయడంతో వందల కోట్ల లీటర్ల తాగు,సాగునీరు దిగువ ప్రాంతాలను ముంచేసి లక్షల ఎకరాల సాగుభూములు నీటమునుగుతున్నాయి. ఆనకట్టల నీరు సమీప ప్రాంతాల్లో గనుల తవ్వకాన్ని స్తంభింపజేస్తోంది. ఆయా నదీ ప్రవాహాల వెంట జీవవైవిధ్యం సైతం ధ్వంసమవుతోంది. మైదాన ప్రాంతాలు, పీఠభూములు సైతం నామరూపాల్లేకుండా నాశనమవుతున్నాయి. ఇలా ఆయా దేశాల్లో పర్యావరణం పతనమవుతోంది. జీవవైవిధ్యానికి గొడ్డలిపెట్టు1990 దశకం నుంచి చూస్తే ఇప్పటిదాకా ఎన్నో యుద్ధాలు మరెన్నో రకాలుగా పర్యావరణ విధ్వంసానికి ప్రధాన కారణమయ్యాయి. 1990 దశకంలో యుద్ధంలో భాగంగా కువైట్లోని 700కుపైగా చమురు బావులకు ఇరాక్ సేనలు నిప్పు పెట్టాయి. దీంతో రోజుకు 50 లక్షల బ్యారెళ్ల చమురు అగ్నికి ఆహుతై నల్లటి మేఘాలు యావత్ ప్రాంతంలో కమ్మేశాయి. దీంతో అంతులేని పర్యావరణ విధ్వంసం జరిగింది. చమురుబావులు ఏకధాటిగా ఏడు నెలలపాటు తగలబడి చరిత్రలో ఎన్నడూ లేనంతటి పొగను సహజావరణలోకి వెదజల్లాయి. సమీప సముద్ర ఉపరితలజలాలు సైతం విస్తృతంగా పరుచుకున్న చమురు తెట్టతో పాడైపోయాయి. దీంతో పర్యావరణ సమతుల్యత బాగా దెబ్బతింది. కువైట్ లోని 99 శాతం మంచినీటి సరస్సులు కాలుష్యకాసారాలుగా మిగిలిపోయాయి. వాయుకాలుష్యానికితోడు ఆ రీజియన్లో మెజారిటీ ప్రజలకు శ్వాససంబంధ వ్యాధులు ప్రబలాయి. ఈ ఘటనతో ప్రపంచం ఆర్థికగాయాలను చవిచూడాల్సి వచ్చింది. ఆతర్వాతి నుంచే ముడి చమురు ధరలు వడివడిగా పెరగడం మొదలైంది.ఆనకట్టల పేల్చివేతతో అంతులేని విధ్వంసంఉక్రెయిన్పైకి దురాక్రమణ జెండాతో దూసుకొస్తున్న రష్యా వైమానిక దళాలు 2023లో కఖోవ్కా ఆనకట్టను రాత్రికిరాత్రే పేల్చేశారు. దీంతో డ్యామ్లోని అపార జలరాశి దిగువ ప్రాంతాల్లోకి వృథాగా పోయింది. దిగువ ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. 5 లక్షల ఎకరాల్లో పంటభూములు పూర్తిగా నాశనమయ్యాయి. గనులు, చమురు బావులు, పారిశ్రామిక వ్యర్థాలు మొత్తం డినిప్రో నది, నల్లసముద్ర పరీవాహక ప్రాంతాల్లోకి కొట్టుకొచ్చి పర్యావరణ విధ్వంసాన్ని మరింత పెంచాయి. ఇలా ఒక్క కఖోవ్కా డ్యామ్ పేల్చివేతతో దాదాపు వేయికిపైగా ప్రాంతాల్లో పర్యావరణం కోలుకోనంతగా పాడైపోయిందని నివేదిక పేర్కొంది. జీవవైవిధ్యం ధ్వంసమవడంతోపాటు వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డునపడ్డాయి.తాజాగా గాజాలో..గాజాలో ఇజ్రాయెల్ విధ్వంసం ఇంకా కొనసాగుతోంది. భవ నాలు, రోడ్లను పేల్చేయడంతో గాజా అంతటా ఎక్కడ చూసినా కాంక్రీట్ శిథిలాల కుప్పలే కనిపిస్తున్నాయి. 2023–24 కాలంలో గాజాలో దాదాపు 4 కోట్ల టన్నుల చెత్త పెరిగింది. అంటే ప్రతి చదరపు మీటర్కు 107 కేజీల చెత్త అదనంగా వచ్చి చేరింది. గాజాలో పచ్చదనం దాదాపు పూర్తిగా కనుమరుగైంది. గాజా సమీప ప్రాంతాల్లో 80% చెట్లు కూలిపోయాయి. మూడింట రెండొంతుల సాగుభూమి బాంబులు, ఫిరంగి గుళ్లు, క్షిపణి శకలాలతో నిండిపోయి సాగుకు పనికిరాకుండా పోయాయి. తూర్పు మధ్య« దరా ప్రాంతంలో భూమాత ఊపిరితిత్తులుగా ఖ్యాతిగాంచిన ‘వాడీ గాజా’ చిత్తడి నేలలు చాలా వరకు ధ్వంసమయ్యాయి. ఇక్కడి 150 రకాల సకశేరుక జీవులు, 70 రకాల ప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.దళాలు.. పర్యావరణ దోషులురోజూ ప్రపంచవ్యాప్తంగా వందల పౌరవిమానాలు కోట్ల లీటర్ల ఇంథనాన్ని మార్గమధ్యంలో ఆకాశంలో మండిస్తూ పొగను వెదజల్లుతూ పర్యావరణానికి చేటుచేస్తున్నాయి. సముద్రమార్గాల్లో ప్రయాణిస్తూ సరుకు రవాణా నౌకలు సైతం ఇదే పనిచేస్తున్నాయి. వీటిని మించి యుద్ధా్దల ద్వారా దేశాల సాయుధబలగాలు అత్యధికస్థాయిలో కర్బన ఉద్గారాలను వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయని నివేదిక కుండబద్దలు కొట్టింది. గ్రీన్హౌస్ గ్యాస్ల విడుదలలో యుద్ధాల్లో పాల్గొన్న దేశాల మిలటరీల వాటా 5.5 శాతానికి పెరిగింది. ఇందులో ఒక్క అమెరికా వాటానే ఒక శాతం ఉండటం గమనార్హం. యుద్ధ ట్యాంక్లు, శతఘ్నులు, జెట్ విమానాలు, సైనిక రవాణా వాహనాలు కోట్ల లీటర్ల ఇంధనాన్ని తాగేస్తూ పొగ, అత్యధిక స్థాయిలో కర్బన ఉద్గారాలను వెలువరిస్తున్నాయి. గాజాలో పేలుళ్లతో పేరుకుపోయిన 1.5 కోట్ల టన్నుల కాంక్రీట్ శిథిలాలు సైతం పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమించనున్నాయి. సహజ వనరులు నాశనం కావడానికి కొత్తగా పొడచూపుతున్న యుద్ధాలు 40 శాతం కారణమని నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇకనైనా పర్యావరణ విధ్వంసాలకు ఆయా దేశాలను బాధ్యులను చేస్తూ నష్టపరిహార, సహాయక చర్యలు తీసుకోవాలని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ కొన్ని సూచనలు చేసింది. అవేంటంటే..→ విస్తృతస్థాయిలో, ఎక్కువ మంది పౌరులను ప్రభావితంచేసే ఘర్షణలను ఇకపై అంతర్జాతీయ నేరంగా పరిగణించాలి→ ఐరాస వాతావరణ మార్పుల ముసా యిదా సమావేశం(యూఎన్ఎఫ్సీసీసీ) నిబంధనలను అనుసరిస్తూ ఇకపై ప్రతిదేశం తమ సైన్యం ఏ స్థాయిలో కర్బన ఉద్గారాలను వెదజల్లిందో ఆ డేటాను నిష్పాక్షికంగా బహిర్గతం చేయాలి→ అంతర్జాతీయ రెడ్క్రాస్ సంస్థ ప్రతిపాదించినట్లుగా ఘర్షణలు సద్దుమణిగాక యుద్ధంతో దెబ్బతిన్న పర్యావరణానికి పునరుజ్జీవం కల్పించేందుకు 20 శాతం నిధులను కేటాయించాలి→ ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సులో భారత్ చేసిన ‘‘ ఒకే భూమి, ఒకే కుటుంబం’ ప్రేరణగా సమీకృత వాతావరణ దౌత్య వేదికనూ నెలకొల్పాలి. సరిహద్దుల వెంట నిరాయుధీకరణకు అధిక ప్రాధాన్యతనివ్వాలి→ 2024లో అన్ని దేశాల సైనిక బడ్జెట్లు 2.4 ట్రిలియన్ డాలర్లకు పెరిగినట్లే.. జీవవైవిధ్య పరిరక్షణా నిధులనూ దేశాలు పెంచాలి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికాపై చైనా.. ‘ఆగ్రో టెర్రరిజం’
ఆగ్రో టెర్రరిజానికి పాల్పడిన ఇద్దరు చైనీయులను అమెరికా పోలీసులు అక్కడి కాలమానం ప్రకారం మంగళవారం అరెస్ట్ చేయటంతో ప్రపంచ దేశాలు ఒక్కసారి ఉలిక్కిపడ్డాయి. పంటలకు తీవ్రనష్టం కలిగించటం ద్వారా వ్యవసాయ, ఆహార భద్రతకు విఘాతం కలిగించే ఉగ్రవాద చర్యలను ఆగ్రో టెర్రరిజంగా చెబుతారు. అదే దురుద్దేశంతో ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’అనే ప్రమాదకరమైన శిలీంధ్రాన్ని అక్రమంగా, కుట్రపూరితంగా అమెరికాలోకి తెచ్చారన్న ఆరోపణపై చైనా పౌరులైన యుంకింగ్ జియాన్, ఆమె సన్నిహితుడు జున్యాంగ్ లియులను అమెరికా పోలీసులు అరెస్ట్ చేసి, విచారణ జరుపుతున్నారు. ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా కూడా చైనా నుంచే వ్యాప్తిలోకి వచ్చిందన్న అనుమానాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఇటీవల అమెరికా.. చైనా నుంచి వస్తువుల దిగుమతిపై సుంకాలు అతి భారీగా పెంచిన నేపథ్యంలో తాజా ఆగ్రో టెర్రరిజం చర్య చర్చనీయాంశమైంది. చైనా కమ్యూనిస్టు పార్టీ కుతంత్రమే యుంకింగ్ జియాన్ చైనా కమ్యూనిస్టు పార్టీ విధేయురాలని, ఈ ప్రమాదకర శిలీంధ్రంపై చైనాలో పరిశోధన చేసిన ఆమెకు చైనా ప్రభుత్వం నిధులు ఇచ్చినట్లు కూడా ఆధారాలున్నాయని కాష్ పటేల్ తెలిపారు. ‘సహ నిందితుడైన ఆమె సన్నిహితుడు జున్యాంగ్ లియు కూడా చైనా యూనివర్సిటీలో ఇదే శిలీంధ్రంపైనే పరిశోధనలు చేస్తుండేవాడు. ఈ శిలీంధ్రంపై మిచిగాన్ యూనివర్సిటీలో పరిశోధనల కోసమే డెట్రాయిట్ మెట్రోపాలిటన్ ఎయిర్పోర్ట్ ద్వారా గత ఏడాది అక్రమంగా రవాణా చేసినట్లు లియు తొలుత బుకాయించినా, తర్వాత తప్పు అంగీకరించారని తెలిపారు. వీరిద్దరిపైనా కుట్ర, అమెరికాలోకి వస్తువుల స్మగ్లింగ్, తప్పుడు స్టేట్మెంట్లు,వీసా అక్రమాలకు సంబంధించిన అభియోగాలు నమోదు చేశా’మని కాష్ పటేల్తెలిపారు. అమెరికా ఆహార వ్యవస్థను దెబ్బతీయటం ద్వారా తీవ్ర పరిణామాలు కల్పించి అమెరికా ప్రజల జీవితాలను, ఆర్థిక వ్యవస్థను పెనుప్రమాదంలోకి నెట్టాలన్న కుతంత్రంతో చైనా కమ్యూనిస్టు పార్టీ అనుక్షణం పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ దుర్భిద్ధితోనే పరిశోధకులను, ఇతరులను అమెరికా సంస్థల్లోకి పనిగట్టుకొని చొప్పిస్తోందని చెప్పటానికి ఇదొక ప్రబల నిదర్శనం అని కాష్ పటేల్ అన్నారు. ఈ కుతంత్రాలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ఎఫ్బిఐ అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉంటుందన్నారు. నష్టం జరగకముందే ఈ ముప్పును పసిగట్టడంలో డెట్రాయిట్ ఎఫ్బిఐ బృందం, కస్టమ్స్–సరిహద్దు భద్రతా దళాలు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేశారని ప్రశంసించారు. ఆగ్రో టెర్రరిజం మూలాలు.. మధ్య ప్రాచ్యానికి చెందిన అస్సిరియన్ అనే జాతి వారు క్రీ.పూ. 660లోనే వ్యవసాయసంబంధమైన ఉగ్రవాదచర్యకు తొలిసారి పాల్పడ్డారని చరిత్ర చెబుతోంది. ధాన్యపు పంటలను నాశనం చేసే ఎర్గోట్ అనే శిలీంధ్రాన్ని ప్రయోగించి శత్రువుల నీటి వనరులను అస్సిరియన్లు కలుషితం చేశారు. ఆధునిక కాలంలో తొలి ప్రపంచ యుద్ధంలో జర్మనీ గ్లాండర్స్, ఆంథ్రాక్స్ క్రిములను శత్రువుల గుర్రాలపై ప్రయోగించింది. యూరప్లో శత్రు సేనలకు సరఫరా అయ్యే ధాన్యాగారాలపై ఈ ఫంగస్లను ప్రయోగించినట్టు చెబుతారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో.. బ్రిటన్లోని బంగాళా దుంపల పొలాలను ‘కొలరాడో పొటాటో బీటిల్స్’సాయంతో నాశనం బ్రిటన్ చేయాలని ప్రయత్నించింది. విమానం సాయంతో వీటిని పొలాల్లోకి విడిచిపెట్టింది. ప్రమాదకరమైన ఫంగస్‘ప్రమాదకరమైన జీవాయుధాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకురావటం వ్యవసాయ సంబంధమైన ఉగ్రవాద చర్య. యావత్ జాతి భద్రతకే ఇది ప్రత్యక్ష ముప్పు’వంటిదని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ)డైరెక్టర్ కాష్ పటేల్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘‘యుంకింగ్ జియాన్ అనే యువతి మిచిగాన్ యూనివర్సిటీలో పరిశోధనల కోసం ఫ్యూసేరియం గ్రామినిరమ్ అనే ప్రమాదకరమైన శిలీంధ్రాన్ని దేశంలోకి అక్రమంగా తీసుకువచ్చినట్లు భావిస్తున్నాం.గోధుమ, వరి, మొక్కజొన్న, బార్లీ తదితర పంటల్లో ‘కంకి ఎండు తెగులు’ను కలిగించటం ద్వారా దిగుబడిని తీవ్రంగా నష్టపరిచే అత్యంత ప్రమాదకరమైన ఫంగస్ ఇది. ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల డాలర్ల మేర ఆర్థిక నష్టానికి కారణమవుతున్న ఈ శిలీంధ్రం.. పంటలను దెబ్బతీయటంతో పాటు మనుషులు, పశువుల తీవ్రమైన అనారోగ్య సమస్యలను సృష్టించగలదు’అని ఆయన పేర్కొన్నారు. పాక్ ద్వారా మన దేశంలోకీ.. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల ద్వారా భారత్కు కూడా ఆగ్రో టెర్రరిజం ముప్పు పొంచి ఉందన్న చర్చ జరుగుతోంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్డిఓ) పత్రాల ప్రకారం.. బంగ్లాదేశ్లో కనిపించిన ఒక ప్రమాదకర ఫంగస్ 2016లో పశ్చిమ బెంగాల్లోని 2 జిల్లాల్లోకి ప్రవేశించింది. గోధుమ పంటను నాశనం చేసే ఆ ఫంగస్ను ప్రభుత్వం సమర్థంగా నాశనం చేసింది. మూడేళ్ల పాటు గోధుమ పంట వేయకుండా ఆదేశాలు జారీచేసి, ఆ ఫంగస్ విస్తరించకుండా చేయగలిగింది. అంతకుముందు 2015లో పత్తి పంటను నాశనం చేసే ప్రమాదకర వైరస్ పాకిస్థాన్ నుంచి దక్షిణ పంజాబ్ ప్రాంతంలోకి ప్రవేశించింది. దాదాపు మూడింట రెండొంతుల పత్తి పంట నాశనమైపోయింది. సుమారు 670 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. పంట నష్టాన్ని భరించలేక సుమారు 15 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.- సాక్షి, స్పెషల్ డెస్క్ -
‘సిందూర్’లో తునాతునకలైన పాక్ యుద్జ విమానాలివే..
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన దరిమిలా, భారతదేశం ప్రతీకార సైనిక చర్యగా ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టింది. దీనిలో పాకిస్తాన్ వైమానిక దళం (పీఏఎఫ్)నకు చెందిన ఆరు యుద్ధ విమానాలు(Fighter jets), రెండు ఎంతో విలువైన నిఘా విమానాలు, పదికి పైగా సాయుధ డ్రోన్లు, ఒక సీ-130 హెర్క్యులస్ రవాణా విమానం ధ్వంసమయ్యిదని భారత అధికార వర్గాలు తెలిపాయి.భారత వైమానిక రక్షణ విభాగాలు పాక్ విమానాలను గగనతల పోరాటంలో నాశనం చేశాయి. పాకిస్తాన్లోని పంజాబ్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్ముకశ్మీర్లోని కొన్ని ప్రాంతాలలో ఈ యుద్ధాలు జరిగాయి. ఈ జెట్ల కూల్చివేతలను రాడార్ ట్రాకింగ్ ద్వారా నిర్ధారించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఢీకొన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత పాకిస్తానీ విమానం ట్రాకింగ్ గ్రిడ్ల నుండి అదృశ్యమైందని ఆ వర్గాలు వివరించాయి. పాకిస్తాన్ భోలారి వైమానిక స్థావరంలో ఉంచిన స్వీడిష్కు చెందిన మరో ఏఈడబ్ల్యూ అండ్ సీవిమానం ఎయిర్-టు-సర్ఫేస్ క్రూయిజ్ క్షిపణి దాడిలో ధ్వంసమైంది.ఐఏఎఫ్ మానవరహిత వ్యవస్థలపై కూడా దాడులు చేసింది. రాఫెల్, ఎస్యూ-30 జెట్లతో కూడిన ఆపరేషన్లో చైనాకు చెందిన ఎలిట్యూడ్, లాంగ్-ఎండ్యూరెన్స్ డ్రోన్లను కలిగిన హ్యాంగర్ ధ్వంసమయ్యింది. భారత వైమానిక రక్షణ విభాగాలు సంఘర్షణ సమయంలో జమ్ముకశ్మీర్, రాజస్థాన్లోని పలు పాకిస్తాన్ యూసీఏవీలను అడ్డగించి కూల్చివేశాయి. మే ఆరు-ఏడు తేదీల మధ్యరాత్రి పాకిస్తాన్(Pakistan)లోని పంజాబ్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులు చేయడంతో భారతదేశం తన సైనిక ప్రతిస్పందన ప్రారంభించింది.బహవల్పూర్లోని జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన కార్యాలయం, మురిద్కేలోని లష్కరే-ఎ-తోయిబా శిబిరం, ముజఫరాబాద్, కోట్లి, రావలకోట్, భీంబర్, చక్వాల్లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను భారత సైన్యం గుర్తించింది. భారత్ తన తొలి దాడుల తర్వాత, పశ్చిమ సరిహద్దు వైపు డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. కాగా తీవ్రమైన దౌత్యపరమైన ఒత్తిడి అనంతరం పాకిస్తాన్ డిజిఎంఓ, మేజర్ జనరల్ కాశిఫ్ అబ్దుల్లా.. భారత లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ను సంప్రదించి తక్షణ కాల్పుల విరమణకు అభ్యర్థించారు. తదనంతరం భారత్ సైనిక కార్యకలాపాలను నిలిపివేయడానికి అంగీకరించింది. అయితే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే తిరిగి భారత్ ప్రతీకార దాడులకు దిగుతుందని హెచ్చరించింది. ఇది కూడా చదవండి: బీహార్లో మరో దారుణం.. తొమ్మిదేళ్ల దళిత బాలిక విలవిల -
ఘోరం.. లేడీ టిక్టాక్ స్టార్ దారుణ హత్య...! పరువు హత్య?
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో టీనేజీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సనా యూసఫ్(17) హత్యకు గురైంది. సనాకు టిక్టాక్లో 7.40 లక్షల మంది, ఇన్స్టాలో 5 లక్షల మంది ఫాలోయెర్లున్నారు. ఇస్లామాబాద్లో సుంబల్ ప్రాంతంలో కుటుంబంతో కలిసి ఉంటోంది. ఈమె తండ్రి ప్రభుత్వ అధికారి కాగా, తల్లి గృహిణి. ఈమె 15 ఏళ్ల సోదరుడు ఖైబర్ ప్రావిన్స్లోని సొంతూరు చిత్రాల్కు వెళ్లాడు. మంగళవారం నివాసంలో ఉండగా ఈమె వద్దకు ఉమర్ హయత్ అలియాస్ కాకా వచ్చాడు. కొద్దిసేపు మాట్లాడాక తన వెంట తెచ్చుకున్న రివాల్వర్తో ఆమెపైకి రెండుసార్లు కాల్పులు జరిపి, పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన సనా అక్కడికక్కడే చనిపోయింది. ఆ సమయంలో సనా బంధువు ఒక్కరే ఇంట్లో ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దుండగుడి కోసం గాలింపు జరిపి, ఫైసలాబాద్లో ఉండగా పట్టుకున్నారు. ఈ నేరానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు చెప్పారు. హయత్ కూడా టిక్టాకరేనని తెలిపారు. ఇతడి నుంచి రివాల్వర్, ఐఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, పాకిస్తాన్లో హత్యకు గురైన మూడో మహిళా ఇన్ఫ్లుయెన్సర్ సనా. పంజాబ్లో మహిళా టిక్టాకర్ను ఇటీవలే ఆమె బంధువొకరు చంపేశారు. ఫిబ్రవరిలో పెషావర్లో మరో మహిళా టిక్టాకర్ హత్యకు గురయ్యారు. -
ఇరాన్లో భారతీయుల ఆచూకీ గల్లంతు.. కథ సుఖాంతం
టెహ్రాన్: ఇరాన్లో గల్లంతైన ముగ్గురు భారతీయుల ఆచూకీ లభ్యమైందని భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.ఇస్లామిక్ రిపబ్లిక్ మెహార్ న్యూస్ ప్రకారం.. భారత్లోని పంజాబ్కు చెందిన ఓ వ్యక్తి నిర్భందానికి గురయ్యాడు. ట్రెహాన్లో స్థానిక ట్రావెల్ కంపెనీ బాధితుడికి ఆస్ట్రేలియాలో ఉన్నత ఉద్యోగాలు, అత్యధిక శాలరీ ఇప్పిస్తామంటూ నమ్మించింది. టెహ్రాన్ నుంచి ఆస్ట్రేలియాలి వెళ్లాల్సి ఉంది. కానీ వాళ్లు మోసపోయారు. మోసగాళ్లు వారిని నిర్బందించారు. Three missing Indian citizens freed by Tehran policeLocal media in Iran say police have found and released three Indian men who had gone missing in Iran.https://t.co/YAkirkKRHg— Iran in India (@Iran_in_India) June 3, 2025 చిత్ర హింసలకు గురి చేశారు. బాధితుల బంధువులకు వీడియో కాల్లో భారీ మొత్తంలో డిమాండ్ చేశారు. డబ్బులు ఇస్తే వదిలేస్తామని, లేదంటే ప్రాణాలు తీస్తామని హెచ్చరించారు. దీంతో ఆందోళన గురైన బాధిత కుటుంబ సభ్యులు కేంద్రం, ఇరాన్లోని భారత దౌత్య కార్యాలయాలనికి ఫిర్యాదు చేశారు. ఘటనపై భారత ఎంబసీ స్పందించింది. ఇరాన్ అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది.భారత్ రాయబార కార్యాలయంలో విజ్ఞప్తితో రంగంలోకి దిగిన ఇరాన్ పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. దక్షిణ టెహ్రాన్లోని వరమిన్లో బందీలుగా ఉన్న బాధితుల్ని సురక్షితంగా రక్షించారు. ఇదే విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు, భారత ప్రభుత్వానికి సమాచారం అందించడంతో కథ సుఖాంతమైంది. త్వరలో బాధితులు భారత్కు రానున్నారు. -
పాకిస్తాన్ జైలు నుంచి 216 మంది ఖైదీలు పరార్
కరాచీ: పాకిస్తాన్లోని కరాచీలో మాలిర్ జైలు నుంచి 216 మంది ఖైదీలు తప్పించుకున్నారు. వీరిలో 80 మందిని తిరిగి అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా మంగళవారం వెల్లడించింది. కరాచీ ప్రాంతంలో భూకంపం సంభవించడంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం రాత్రి మాలిర్ జైలు నుంచి ఖైదీలను సురక్షిత ప్రాంతానికి తరలిస్తుండగా తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. ఖైదీలు పారిపోయేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక ఖైదీ మరణించాడు. ముగ్గురు భద్రతా సిబ్బందితోపాట జైలు అధికారి ఒకరు గాయపడ్డారు. భూకంపం తర్వాత జైలు బ్యారక్ల నుంచి 600 మందికిపైగా ఖైదీలను బయటకు తీసుకురాగా, 216 మంది పరారయ్యారు. 80 మందిని మళ్లీ అదుపులోకి తీసుకోగలిగారు. పరారీలో ఉన్న మిగతా ఖైదీల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇంకా 136 మందిని పట్టుకోవాల్సి ఉందని అధికారులు చెప్పారు. అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన మాలిర్ జైలులో మొత్తం 6,000 మంది ఖైదీలు ఉన్నారు. -
అమెరికా.. భయం భయం
వాషింగ్టన్: సమఉజ్జీలుగా మాత్రమేకాదు అమెరికా, రష్యాలకు సువిశాల భూభాగం విషయంలోనూ సారూప్యత ఉంది. రష్యాపై ఉక్రెయిన్ ‘స్పైడర్ వెబ్’ డ్రోన్ల దాడి తర్వాత అమెరికాకు ఇదే తరహా ముప్పు పొంచి ఉందన్న వార్తలు ఇప్పుడు అమెరికా పౌరుల భయాందోళనలను పెంచేస్తున్నాయి. అమెరికా సొంత భూభాగంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మిత్ర దేశాల పరిధిలోని అమెరికా నేవీ, వైమానిక స్థావరాలపై డ్రోన్ల మెరుపుదాడి తప్పదని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ‘‘ తమకు ఇలాంటి ముప్పు లేదని అమెరికా రాజకీయ శ్రేణులు, సైనిక వర్గాలు చెప్పడానికి లేదు. రష్యా మాదిరే అమెరికా సైతం బుల్లి డ్రోన్ల దాడులను ముందే పసిగట్టడం చాలా కష్టం. వైమానిక స్థావరాల్లోని బాంబర్ విమా నాలు బాగా బలిసిన బాతుల్లా అక్కడే తిష్టవే స్తాయి. వీటిని సులభంగా డ్రోన్లతో నాశనంచేయొచ్చు’’ అని గతంలో యుద్ధక్షే త్రాల నుంచి ప్రత్యక్షంగా రిపోర్టింగ్ చేసిన మాజీ డిఫెన్స్ జర్నలిస్ట్ టైలర్ రోగోవే వ్యాఖ్యా నించారు. టైలర్ ప్రస్తుతం ‘ది వార్ జోన్’ అనే పత్రికకు ఎడిటర్ ఇన్ చీఫ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సైనిక, భద్రతా వ్యవహా లపైనే ఈ పత్రిక ప్రధానంగా కథనాలు వెలువర్చుతుంది. చైనాలో 400.. అమెరికాలో 22అమెరికాలో యుద్ధవిమానాలకు రక్షణ ఏర్పా ట్లు ఏపాటివో ‘అమెరికా కాంగ్రెషనల్’ నివేది కలే స్పష్టంచేస్తున్నాయి. యుద్ధ విమానాలు షెల్టర్ల కోసం చైనా ఏకంగా 400 వరకు అత్యంత పటిష్టమైన హ్యాంగర్వంటి నిర్మాణా లను పూర్తిచేసింది. కానీ అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాలో ఇలాంటివి కేవలం 22 ఉన్నాయి. డ్రోన్లు లోపలిదాకా వచ్చి నేరుగా విమానంపైనా పడకుండా ఇలాంటి నిర్మాణా లు సమర్థవంతంగా అడ్డుకుంటాయి. తైవాన్ విషయంలో చైనాతో అమెరికా గగనతల యుద్ధానికి దిగితే చైనా డ్రోన్ల ఆధిపత్యం తప్పదని ఓ నివేదిక పేర్కొంది. వ్యూహాత్మక, అంతర్జాతీయ అధ్యయ నాల కేంద్రం(సీఎస్ ఐఎస్) 2023 నివేదిక ప్రకారం చైనా డ్రోన్లు/ క్షిపణులు అమెరికా విమానాలు గాల్లోకి లేచేలోపే పార్కింగ్ స్థలాల్లోనే నాశనంచేసి అక్కడే సమాధి చేస్తా యని ఆ నివేదిక సారాంశం. ‘‘ఇన్నాళ్లూ అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ (యూఎఫ్ఓ)లుగా పిలుచుకునే వస్తువులు వాస్తవానికి శత్రు నిఘా డ్రోన్లు అయి ఉండొచ్చు. ఇన్నాళ్లూ వాటిని గుర్తు తెలియని ఎగిరే వస్తువులుగా పొరపడ్డారు. దశాబ్దాలుగా ఈ ఎగిరే వస్తువులు చాలా వరకు అమెరికా వ్యూహాత్మక ప్రదేశాలపైనే చక్కర్లు కొట్టడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది’’ అని టైలర్ రోగోవే అన్నారు. -
పాక్లో మరో ఘోరం.. ఎవరీ సనా యూసఫ్?
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో మరో ఘోరం చోటు చేసుకుంది. సనా యూసఫ్(Sana Yousuf) అనే టీనేజర్ దారుణ హత్యకు గురైంది. మంగళవారం ఇస్లామాబాద్ సుంబల్ ప్రాంతంలో ఆమె ఉంటున్న ఇంటికి ఓ వ్యక్తి వచ్చాడు. సనాతో మాట్లాడుతూనే.. వెంట తెచ్చుకున్న రివాల్వర్తో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన సనా అక్కడికక్కడే చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు దుండగుడి కోసం గాలింపు జరిపి, ఫైసలాబాద్లో ఉండగా పట్టుకున్నారు. నిందితుడిని ఉమర్ హయత్(Umar Hayath) అలియాస్ కాకాగా నిర్ధారించారు. సనాను ఉద్దేశపూర్వకంగానే చంపినట్లు ఉమర్ అంగీకరించాడు. సనాకు టిక్టాక్లో 7.40 లక్షల మంది, ఇన్స్టాలో 5 లక్షల మంది ఫాలోయెర్లున్నారు. ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా తెలుస్తోంది. నేరానికి పాల్పడిన ఉమర్ కూడా టిక్టాకరేనని పోలీసులు ధృవీకరించారు. అయితే.. నేరానికి ఎందుకు పాల్పడ్డాడనే కారణాన్ని మాత్రం పోలీసులు వెల్లడించలేదు. నిందితుడి నుంచి రివాల్వర్, ఐఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. సనా(17) మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతోందని తెలుస్తోంది. ఆమె తండ్రి ప్రభుత్వ అధికారి, సోషల్ యాక్టివిస్ట్ కూడా. తల్లి గృహిణి. ఈమె 15 ఏళ్ల సోదరుడు ఖైబర్ ప్రావిన్స్లోని సొంతూరు చిత్రాల్కు వెళ్లాడు. ఘటన సమయంలో ఆమె దగ్గరి బంధువు ఒకరు ఇంట్లో ఉన్నారు. ఈ కేసులో ఆ బంధువే ప్రత్యక్ష సాక్షి. కాగా, పాకిస్తాన్(Pakistan)లో ఈ మధ్యకాలంలో హత్యకు గురైన మూడో మహిళా ఇన్ఫ్లుయెన్సర్(Social Media Teenager) సనా కావడం గమనార్హం. పంజాబ్లో మహిళా టిక్టాకర్ను ఇటీవలే ఆమె బంధువొకరు చంపేశారు. ఫిబ్రవరిలో పెషావర్లో మరో మహిళా టిక్టాకర్ హత్యకు గురయ్యారు. సనా కేసు అక్కడి సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఈ కేసును పరువు హత్య, ప్రేమ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు.ఇదీ చదవండి: ఏకాంత వీడియోలు ఒక్కొటిగా బయటకు.. -
అమెరికా దివాళా తీయడం ఖాయం.. ట్రంప్పై మస్క్ విమర్శలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ప్రభుత్వంపై అపరకుబేరుడు, మాజీ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డోజ్)చీఫ్, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ (elon musk) షాకింగ్ కామెంట్లు చేశారు. అమెరికా ద్రవ్యలోటు 2.5 బిలియన్ డాలర్లకు చేరుతుంది. ఇలాగే కొనసాగితే అమెరికా దివాళా తీయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలను విభేదించిన ఎలాన్ మస్క్కు డోజ్ నుంచి బయటకు వచ్చారు. అయితే, తొలిసారి ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్ని విభేదించారు. ట్రంప్పై విమర్శలు గుప్పించారు. ట్రంప్ ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’పై తీవ్రంగా మండిపడ్డారు బిగ్,బ్యూటిఫుల్’ (Big Beautiful Bill) అంటూ ట్రంప్ (donald trump) చెబుతున్న బిల్లు గొప్పగా ఏమీ లేదన్నారు. ఈ బిల్లు వల్ల త్వరలోనే ట్రంప్ ప్రభుత్వం దివాళా తీస్తుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ భారీ, దారుణమైన కాంగ్రెస్ వ్యయ బిల్లు అసహ్యకరమైనది. దీనికి ఓటు వేసిన వారు సిగ్గు పడాలి. మీరు తప్పు చేశారని మీకు తెలుసు’ అని పేర్కొన్నారు. I’m sorry, but I just can’t stand it anymore.This massive, outrageous, pork-filled Congressional spending bill is a disgusting abomination.Shame on those who voted for it: you know you did wrong. You know it.— Elon Musk (@elonmusk) June 3, 2025ట్రంప్ నిర్ణయం మారదుఅయితే, వైట్ హౌస్ మాత్రం దీనిపై పెద్దగా స్పందించలేదు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లెవిట్ మాట్లాడుతూ.. ఈ బిల్లుపై మస్క్ నిర్ణయం ఏంటో ట్రంప్కు తెలుసు. అయినప్పటికీ అధ్యక్షుడి అభిప్రాయాన్ని మార్చలేదు. ఇది ఒక బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆయన దానిని కాపాడుతున్నారు’ చెప్పారు.గతంలో ఇదే బిల్లును విమర్శిస్తూ మస్క్ స్పందించారు. ఈ బిల్లు ఇప్పటికే భారీగా ఉన్న లోటు బడ్జెట్ 2.5 ట్రిలియన్కు పెంచుతుంది. అమెరికన్ కాంగ్రెస్ దేశాన్ని దివాళా తీసే దిశాగా ప్రయత్నాలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ నిర్ణయం నిరాశ పరిచిందిమస్క్ ఈ బిల్లుపై డోజ్ (డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ)కు రాజీనామా అనంతరం సీబీఎస్ న్యూస్తో మాట్లాడుతూ.. ‘ఈ భారీ ఖర్చుల బిల్లు మమ్మల్ని నిరాశపరిచింది. ఇది బడ్జెట్ లోపాన్ని తగ్గించకుండా పెంచుతోంది. ఇది డోజ్ టీమ్ చేస్తున్న పనిని అడ్డుకుంటోంది. బిల్లు పెద్దదిగా ఉండొచ్చు, అందంగా ఉండొచ్చు. కానీ రెండూ ఒకేసారి ఉండటం నాకు తెలియదు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనన్నారు. -
అన్నార్థులపై మళ్లీ పేలిన తూటా
రఫా: గాజాలోని పాలస్తీనియన్ల పట్ల ఇజ్రాయెల్ మరోసారి పాశవికంగా వ్యవహరించింది. ఆహార పంపిణీ కేంద్రం వద్దకు వెళ్తున్న వారే లక్ష్యంగా జరిపిన కాల్పుల్లో 27 మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇది మూడు రోజుల్లో జరిగిన మూడో కాల్పుల ఘటన కావడం గమనార్హం. మంగళవారం ఉదయం జరిగిన కాల్పుల్లో కనీసం 184 మంది గాయపడినట్లు రెడ్ క్రాస్ తెలిపింది. ఐరాస మానవ హక్కుల విభాగం కూడా ధ్రువీకరించింది. మృతదేహాలను ఖాన్యూనిస్లోని నాస్సెర్ ఆస్పత్రికి తరలించారు.బుల్లెట్లు తగిలిన క్షతగాత్రులను అంబులెన్సుల్లో వేరే ఆస్పత్రులకు తరలిస్తుండగా చూశామని, కొందరు ఉత్త చేతులతోనే వెనుదిరిగి వస్తుండగా, నేలపై పడిన ఖాళీ పిండి సంచులు రక్తపు మరకలతో తడిచిపోయాయని అసోసియేటెడ్ ప్రెస్ రిపోర్టర్ ఆహార పంపిణీ కేంద్రం వద్ద దారుణ పరిస్థితిని వివరించారు. కాగా, పంపిణీ కేంద్రం వద్ద నిర్దేశించిన బాటను వదలి తమ బలగాల దిశగా వస్తున్న అనుమానితులనే కాల్చామని, హెచ్చరిక కాల్పులను సైతం వీరు లెక్కచేయలేదని ఇజ్రాయెల్ ఆర్మీ అంటోంది. గాజాలో ఇజ్రాయెల్ ఏర్పాటు చేసిన మిలటరీ జోన్లలో అమెరికాకు చెందిన ఫౌండేషన్ ఆహార పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటి నుంచి కాల్పుల ఘటనలు కొనసాగుతున్నాయి. హమాస్ శ్రేణులకు ఆహార పదార్థాలు అందకుండా చేయాలన్నదే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ అంటుండగా..ఆకలిని ఆయుధంగా చేసుకోవడం తగదని ఐరాస అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.ఇప్పుడు ఏర్పాటు చేసిన ఆహార పంపిణీ కేంద్రాలు ఆకలిని ఏమాత్రం తీర్చలేవని అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఆది, సోమవారాల్లో ఆహార పంపిణీ కేంద్రాల వద్దకు వచ్చిన వారిపై ఆర్మీ జరిపిన కాల్పుల్లో 34 మంది ప్రాణాలు విడిచారు. ఆహార పంపిణీ బాధ్యతలు చేపట్టిన గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ మాత్రం తమ కేంద్రాల వద్ద గానీ, చుట్టుపక్కల గానీ ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగలేదని చెబుతోంది. మంగళవారం 21 ట్రక్కుల ఆహారాన్ని పంపిణీ చేశామని తెలిపింది. కాల్పుల ఘటనలన్నీ రఫాలో ఇజ్రాయెల్ మిలటరీ జోన్లలోని పంపిణీ కేంద్రాల వద్దే చోటుచేసుకున్నాయి. ఇక్కడికి మీడియాను ఆర్మీ చాలా పరిమితంగా అనుమతిస్తోంది. గతంలో గాజాలోని సుమారు 20 లక్షల మందికి నిత్యం 600 ట్రక్కుల్లో ఆహార పదార్థాలు అందేవి. వీరందరికీ ఈ ఆహారమే ఆధారం. ఇజ్రాయెల్ ఆర్మీ నెలలపాటు కొనసాగించిన దిగ్బంధనం కారణంగా ఆహార నిల్వలు పూర్తి స్థాయిలో అడుగంటాయి. -
ద.కొరియా అధ్యక్షుడిగా లీ జే మ్యుంగ్
సియోల్: దక్షిణ కొరియాలో కొద్దినెలలుగా నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. మంగళవారం నిర్వహించిన అధ్యక్ష ఎన్నికల్లో విపక్ష డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ కొరియా పారీ్టకి చెందిన లీ జే మ్యుంగ్ విజయం సాధించారు. అధికార పార్టీ నేత, పీపుల్ పవర్ పార్టీ అభ్యర్థి కిమ్ మూన్ సూ ఓడిపోయారు.గత డిసెంబర్లో దేశవ్యాప్తంగా అత్యయిక స్థితి(మార్షల్ లా) విధించి పరువుతో పాటు అంతిమంగా పదవి సైతం కోల్పోయిన పదవీచ్యుత యూన్ సుక్ యెల్ స్థానంలో ఓటర్లు తమ నూతన దేశాధ్యక్షుడిగా మ్యుంగ్ను ఎన్నుకున్నారు. అయితే చిరకాల మిత్రదేశాలు అమెరికా, జపాన్లకు బదులుగా చైనా, ఉత్తరకొరియాలకు అనుకూలంగా మాట్లాడతారనే అపవాదు మ్యుంగ్కు ఉంది. -
డ్రోన్ వార్ఫేర్!
డ్రోన్ల రంగప్రవేశంతో యుద్ధాల తీరుతెన్నులే సమూలంగా మారిపోతున్నాయి. యుద్ధ విమానాలు మొదలుకుని చిన్నపాటి ఆయుధాల దాకా అన్నింటికీ డ్రోన్లు అతి సమర్థమైన ప్రత్యామ్నాయాలుగా మారుతున్నాయి. ఈ కొత్త తరం డ్రోన్ వార్ఫేర్కు ఉక్రెయిన్ చేపట్టిన ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ పరాకాష్టగా నిలిచింది. ఇది ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా పక్కలో పాక్ వంటి దాయాది ఉన్న భారత్కు పెను హెచ్చరిక సంకేతమే. నిఘా నేత్రాలకు చిక్కకుండా డ్రోన్లను కీలక సైనిక స్థావరాల, పౌర వ్యవస్థల సమీపానికి చేర్చగలిగితే చాలు, వాటిపై పెను దాడులకు పాల్పడవచ్చు.ఊహించలేనంత నష్టం కలగజేయవచ్చు. పాక్ ప్రేరేపిత ఉగ్ర ముఠాల స్లీపర్ సెల్స్ దేశమంతటా చొచ్చుకుపోయి మాటేసి ఉన్నాయన్న నిఘా హెచ్చరికల నేపథ్యంలో మనకిది ఆందోళనకర పరిస్థితేనని రక్షణ నిపుణులు అంటున్నారు. అలాంటి దాడులను కాచుకోవడం నిజంగా కత్తిమీద సామేనని అభిప్రాయపడుతున్నారు.నాలుగేళ్ల క్రితమే: మన సైనిక దళాలను లక్ష్యం చేసుకుని నాలుగేళ్ల క్రితమే డ్రోన్ దాడులకు తెగబడ్డారు. 2021లో జమ్మూలోని వైమానిక స్థావరంపై రెండు డ్రోన్లతో దాడులు చేశారు.వాటి ద్వారా అత్యాధునిక పేలుడు పదార్థాలను (ఐఈడీ) ఎయిర్బేస్పైకి జారవిడిచారు. అవి అదృష్టవశాత్తూ బహిరంగంగా నిలిపి ఉంచిన యుద్ధవిమానాలు, హెలికాప్టర్లకు, సిబ్బందికి దూరంగా పడి పేలడంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఆ ఐఈడీలు పాక్ సైన్యం అందజేసినవేనని దర్యాప్తులో తేలింది. వాటి తయారీలో ఉపయోగించిన ముడి పదార్థాలన్నీ మిలిటరీ గ్రేడ్కు చెందినవని నిర్ధారణ అయింది. పాక్ నుంచి మనకు ఎన్నిరకాలుగా పెను ముప్పు పొంచి ఉందో చెప్పేందుకు ఇది ఉదాహరణ మాత్రమే.అదే పాక్ యుద్ధ తంత్రం!: ప్రత్యక్ష పోరులో పాక్ కనీసం కొద్ది రోజుల పాటు కూడా భారత్ ముందు నిలవలేదని ఆపరేషన్ సిందూర్, అనంతర ఘర్షణలు మరోసారి నిరూపించాయి. కనుక పాక్ తనకు బాగా అలవాటైన సూడో యుద్ధ నీతినే నమ్ముకుంటుందనడంలో సందేహం లేదు. ఉగ్ర ముఠాలకు మనపై దాడులకు ప్రేరేపించి, అందుకు కావాల్సిన సరంజామా అంతా అందించి సాయపడుతుంది. ఈ ముప్పుకు డ్రోన్ల రూపంలో ఇప్పుడు కొత్త కోరలు మొలిచినట్టే. కనుక భారత్ అత్యంత అప్రమత్తతతో మెలగక తప్పదు. అందుకే భారత్ డ్రోన్ దాడులను సమర్థంగా కాచుకుని, పూర్తి స్థాయిలో తిప్పికొట్టే వ్యవస్థలను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరముంది. భారత్ తన కీలక సైనిక స్థావరాలు, మౌలిక వ్యవస్థల రక్షణను మరింత కట్టుదిట్టం చేసేందుకు సమగ్ర విధానాన్ని రూపొందించుకోవాల్సి ఉంటుందని రక్షణరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.’సిందూర్’లో డ్రోన్ల హవాఆపరేషన్ సిందూర్, తదనంతర ఘర్షణల్లో డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి. ఆపరేషన్ తొలి రోజు మే ఏడో తేదీన పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర శిబిరాలు, స్థావరాలను మన సైన్యం నేలమట్టం చేయడం తెలిసిందే.⇒ అందుకు ప్రతి చర్యగా పాక్ ప్రధానంగా నమ్ముకున్నది డ్రోన్ దాడులనే. మన సరిహద్దుల పైకి వందలాది డ్రోన్లు ప్రయోగించింది. వాటిలో చాలావరకు మన భూభాగంలోకి ప్రవేశించాయి.⇒ ఫలితంగా పాక్తో జరిగిన నాలుగు రోజుల ఘర్షణల్లో భారత్ కూడా డ్రోన్లను విస్తృతంగా వినియోగించింది.⇒ పాక్ వైమానిక స్థావరాలపై దాడులకు ముందు యుద్ధ విమానాల ముసుగులో డ్రోన్లను పంపి దాయాది కీలక రాడార్ వ్యవస్థలు ఎక్కడెక్క డున్నదీ పక్కగా పసిగట్టింది. ఆ వెంటనే గుక్కతిప్పుకోనివ్వని క్షిపణి దాడులతో వాటిని ధ్వంసం చేసింది.⇒ తర్వాత పాక్లోని 11 కీలక వైమానిక స్థావరాలను నేలమట్టం చేసి చావుదెబ్బ తీసింది. రాడార్ వ్యవస్థలను కోల్పోయిన పాక్ నిస్సహాయంగా చూస్తుండటం తప్ప ఏమీ చేయలేకపోయింది. పాక్ ఆర్మీ చీఫ్తో పాటు సైనిక ఉన్నతాధికారులు బ్యాంకర్లలో తల దాచుకోవాల్సి వచ్చింది. కేవలం డ్రోన్లను ఎరగా వేసి భారత్ ఇంతటి ఫలితాలు సాధించడం విశేషం. -
రణ పంచతంత్రం
అగ్రరాజ్యం అమెరికాకు సరిసాటిగా ప్రపంచంలోనే పేరెన్నికగన్న రష్యా గత మూడేళ్లుగా ఉక్రెయిన్ను యుద్ధంలో ముచ్చెమటలు పట్టిస్తోంది. యుద్ధం తొలినాళ్లలోనే ఉక్రెయిన్ రాజధాని కీవ్ను వందలాది ట్యాంక్లతో చుట్టేసి ఆక్రమించినంత పనిచేసిన రష్యా ఆతర్వాత కాస్తంత వెనుక్కు తగ్గింది. అణ్వాయుధాలు లేని ఉక్రెయిన్ ఏనాటికైనా తన ముందు తలవంచక తప్పదన్న రష్యా నిఘా నిర్లక్ష్యం తాజాగా భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. ఉక్రెయిన్ డ్రోన్ల దండు ‘స్పైడర్ వెబ్’ పేరుతో చేసిన దాడి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొత్తతరహా రణతంత్రంగా మార్మోగిపోతోంది.దీంతో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు యుద్ధవ్యూహాలకు పదునుపెట్టక తప్పదని ఈ ఉదంతం మరోసారి నిరూపించింది. గతంలో యుద్ధట్యాంకులను ఎంత త్వరగా ముందుకు ఉరికిస్తే అంత త్వరగా శత్రుదేశ భూభాగం మన వశం అవుతుందనే భావన ఉండేది. ఇప్పుడు ఎంత మెరుపువేగంతో డ్రోన్లను సరైన లక్ష్యందిశగా పంపితే అంత త్వరగా సమరక్షేత్రంలో జైత్రయాత్ర పూర్తిచేయొచ్చనే వాదన మొదలైంది. ఉక్రెయిన్ స్పైడర్ వెబ్ దాడి ప్రపంచవ్యాప్తంగా ఐదు రకాలుగా రణవ్యూహాలను రాటుదేల్చాల్సిన పరిస్థితిని తీసుకొచ్చిందని యుద్ధరంగ నిపుణులు చెబుతున్నారు. ఆ ఐదింటి గురించి ఓసారి పరిశీలిస్తే..1. దాడి కంటే వ్యూహం కీలకంయుద్ధంలో ఎంత బలంగా కొట్టామనేది కాదు. ఎక్కడ ఎప్పుడు ఎలా కొట్టామనేది ముఖ్యం. దాడి కంటే వ్యూహం ప్రధానమని తాజా ఘటన మరోసారి నిరూపించింది. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం కంటే ముందు.. ముందస్తు ప్రణాళికలో ఎలాంటి పొరపాట్లులేకుండా చూసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు పనికిరావు. రష్యా వైమానికస్థావరాలపై దాడి కోసం తాము దాదాపు ఏడాది, ఏడాదిన్నరకాలంగా వ్యూహరచన చేస్తున్నామని ఆదివారం దాడి తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. ఖచ్చితమైన దాడి కంటే అత్యంత స్పష్టమైన ప్రణాళిక అనేదే యుద్ధవిజయానికి కీలకం. కొత్త తరహా వ్యూహాన్ని రచించడం, దాని అమలుకు సిబ్బందిని మోహరించడం, దాడి చేయడం, దాడి తర్వాత అక్కడి నుంచి మెరుపువేగంతో అదృశ్యమవడం అనేవి ముఖ్యం.2. రవాణా మార్గాలు.. రణతంత్ర ఆయుధాలుయుద్ధంలో సరిహద్దుల వద్దకు క్షిపణులను, భారీ బాంబులను తరలించడానికి స్వదేశంలోని రహదారులనే ఏదేశమైనా ఉపయోగించుకుంటుంది. కానీ ఉక్రెయిన్ ఈ దాడిలో రష్యన్ రహదారులనూ ఉపయోగించుకుంది. డ్రోన్లను సరిహద్దు దాటించాక ఎవరూ గుర్తుపట్టకుండా చెక్క క్యాబిన్లలో సర్దిపెట్టి వాహనాల్లోకి ఎక్కించారు. తర్వాత వందల కిలోమీటర్ల దూరం వరకు రోడ్డుమార్గంలోనే తీసుకెళ్లారు. సరిహద్దు దాటొచ్చిన డ్రోన్లను ఉక్రెయిన్ సమీప ప్రాంతాల్లో ఉపయోగించకుండా ఇలా వందల కిలోమీటర్లు తరలిస్తుందనే రష్యా అధికారులు అస్సలు ఊహించలేదు.అందుకే సుదూర ప్రాంతాల్లో ఎక్కడా వాహనాల తనిఖీలు జరగలేదు. యుద్ధంవేళ దేశవ్యాప్తంగా భారీ కంటైనర్లను సైతం తనిఖీచేయాలనే కొత్త నిబంధనను ఈ ఉదంతం తెరమీదకు తెస్తోంది. ప్రతీ కంటైనర్ను తనిఖీచేస్తే ఇంతటి దాడుల నుంచి ఏ దేశమైనా రక్షణ పొందొచ్చనే కొత్త పాఠాన్ని ఈ దాడి బోధిస్తోంది. రష్యాలో జరిగే అక్రమ సరకు రవాణా మార్గాలను ఉక్రెయిన్ తనకు అనుకూలంగా మలుచుకుంది. ఏదైనా దేశంలో జరిగే స్మగ్లింగ్, అక్రమ రవాణా అనేది ఇలాకూడా వైమానికస్థావరాలపై దాడులకు పరోక్షంగా కారణమవుతుందని ఈ ఉదంతం చాటుతోంది.3. బుల్లి డ్రోన్తోనూ భారీ లక్ష్యం బద్దలు!ఆదివారం రష్యాలో ధ్వంసమైన విమానాలను ఉక్రెయిన్ ప్రధాన భూభాగం నుంచి సుదూర ప్రాంతాల్లో నిలిపి ఉంచారు. ఈ విమానాలను ఉక్రెయిన్ తన సొంత భూభాగం నుంచి లక్ష్యంగా చేసుకుని దాడిచేయాలంటే దీర్ఘశ్రేణి క్షిపణి కావాలి. ఆ క్షిపణి తయారీకి భారీ స్థాయిలో వ్యయం తప్పదు. సైబీరియా, ఆర్కిటిక్ ఖండ సమీప రష్యా వైమానిక స్థావరాలపై దాడి చేయాలంటే అత్యంత సుదూరాలకు ప్రయాణించే బాలిస్టిక్ క్షిపణులు అవసరం. కానీ ఇవేం లేకుండానే ఇదే పనిని బుల్లి డ్రోన్లు అత్యంత సులభంగా పూర్తిచేయగలవని తాజా ఘటనతో స్పష్టమైంది. అంటే సుదూర లక్ష్యల ఛేదనకు వందల కోట్ల ఖర్చుతో తయారైన క్షిపణులతో పనిలేదని ఈ ఘటనతో తేలిపోయింది. లక్ష్యం ఎంత దూరంగా ఉందనేది ముఖ్యంకాదు. దానికి ఎంత దగ్గరి నుంచి బద్దలుకొట్టగలం అనేదే ప్రధానం.4. తక్కువ వ్యయంతో ఎక్కువ నష్టం చేయొచ్చు..ముల్లును ముల్లుతోనే తీయాలనేది పాత సామెత. యుద్దవిమానాలను కూల్చేయాలంటే మనం కూడా యుద్ధవిమానంతోనో, క్షిపణితోనో దాడి చేసి నాశనంచేయాల్సిన పనిలేదని ఈ దాడి కొత్త విషయాన్ని చెబుతోంది. అత్యంత భారీ వ్యయంతో రూపుదిద్దుకున్న బాంబర్ విమానాలను నాశనం చేయడానికి అత్యంత చవకైన డ్రోన్లు ఉంటే చాలు. ఉక్రెయిన్ దాడిలో రష్యాకు చెందిన 41 యుద్ధవిమానాలు ధ్వంసమయ్యాయి.వాటి విలువ ఏకంగా రూ.60,000 కోట్లు ఉంటుందని అంచనా. ఇంతటి శక్తివంతమైన అస్త్రాలను నిర్వీర్యంచేసేందుకు మనం కూడా అంతే స్థాయిలో ఖర్చుచేయాల్సిన పనిలేదని ఈ దాడి ఘటన తేటతెల్లంచేసింది. స్పైడర్స్ వెబ్ దాడి తర్వాత రణతంత్రాల పాఠాలను తమకూ బోధించాలని కొన్ని మిత్రదేశాలు బతిమాలినట్లు అంతర్జాతీయమీడియాలో కథనాలు వెలవడ్డాయి. అణ్వస్త్ర దేశంకాకపోయినా ఇప్పుడీ దాడితో ఉక్రెయిన్ ఒక్కసారిగా వార్ హాట్ఫేవరెట్గా నిలిచింది.5. మనం మాత్రమే రహస్యం అనుకుంటే సరిపోదు..రహస్య స్థావరం అనేది రహస్యంగా ఉంటేనే బాగుంటుంది. అందరికీ తెల్సిపోయాక రహస్య స్థావరం అంటే బాగోదు. గగనతల నిఘా నేత్రాలు కొలువైన శాటిలైట్లయుగంలో ప్రతీదీ బహిరంగమే. అందుకే ఫలానా చోట స్థావరం ఉందని తెలిసినా దానిపై దాడి చేయడం అసాధ్యం అనే స్థాయిలో దానికి భద్రత కల్పించడం అవశ్యమని తాజా ఘటనతో నిరూపితమైంది. నిఘా సంస్థ కార్యాలయంలో రహస్యాలు ఎంత భద్రంగా ఉంటాయో, నిఘా సంస్థ పరిసరాలు సైతం అంతే రక్షణాత్మకంగా ఉండాలని తాజా ఘటన చాటింది.రష్యా ఇంటెలిజెన్స్ సంస్థ ఎఫ్ఎస్బీ ప్రాంతీయ ప్రధాన కార్యాలయం సమీపంలోనే తమ కమాండర్సెంటర్ను నిర్వహించామని ఉక్రెయిన్ ప్రకటించింది. దీంతో శత్రు దేశాలపై నిఘాతోపాటు స్వీయ నిఘాపైనా మరింత దృష్టిపెట్టాల్సిన ఆవశ్యకతను ఈ ఉదంతం గుర్తుచేస్తోంది. అధునాతన ఆయుధాలకంటే అధ్భుతమైన ఆలోచనలే ఆయాదేశాలకు అసలైన అస్త్రాలుగా అక్కరకొస్తాయని స్పైడర్స్వెబ్ ఘటన ఉద్ఘాటిస్తోంది. -
ఓస్! ఇంతేనా?!
ప్రపంచ జనాభా మొత్తాన్ని ఒక ముద్దలా చేస్తే ఆ ముద్ద ఎంత పరిమాణంలో ఉంటుంది? ఏమిటీ పిచ్చి ప్రశ్న?! పిచ్చి ప్రశ్న కాదు. కొందరు శాస్త్రవేత్తలకు వచ్చిన ఆలోచన! వారి ఆలోచనకు తాజాగా ఒక గణిత శాస్త్రవేత్త అంచనా వేసి పెట్టారు. ఆయన లెక్క ప్రకారం – ప్రస్తుత ప్రపంచ జనాభాను మొత్తం ఒక ముద్దలా చేస్తే ఆ ముద్ద ఎంత పరిమాణంలో ఉంటుందో తెలుసా? మీరు అనుకున్న దాని కంటే చాలా చిన్నదిగా! ఇదేం జవాబు? లెక్కా పక్కా ఉండక్కర్లేదా? ఉంది.. లెక్క ఉంది.. పక్కాగా కూడా ఉంది.‘రెడిట్’ ఇంటర్నెట్ ఫోరమ్లో ‘కివి2703’ అనే అకౌంట్లో ఒక అజ్ఞాత గణితశాస్త్ర నిపుణుడు ప్రపంచ జనాభా మొత్తాన్ని ఒక ముద్దగా (మీట్బాల్) గా చేస్తే 0.6 మైళ్లు.. అంటే కిలోమీటరు వెడల్పు లోపలే ఉంటుందని అంచనా వేశారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, న్యూయార్క్లో 1250 అడుగుల ఎత్తయిన ‘ఎంపైర్ స్టేట్ బిల్డింగ్’కు రెండున్నర రెట్లు, లేదా పారిస్లో 1063 అడుగుల ఐఫిల్ టవర్కు మూడింతలకు పైగా ఎత్తులో ఆ మీట్బాల్ ఉంటుందని ఆయన లెక్క తేల్చారు. – సాక్షి, స్పెషల్ డెస్క్శాస్త్రవేత్త గారూ.. మీరు ఓకేనా ?గణిత శాస్త్రవేత్త సమాధానం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. 788 కోట్ల జనాభాను ముద్దగా చేస్తే ‘ఇంతేనా ఉండేది.. ఇంత చిన్నాగానా’ అని ఒక నెట్ యూజర్ ఆశ్చర్యపోతే, ‘ఇంతకన్నా పెద్దదిగా ఉంటుంది అనుకున్నానే..’ అని ఇంకొక యూజర్ కామెంట్ చేశారు. మరొకరైతే, ‘మీరు బాగానే ఉన్నారా సైంటిస్టు గారూ?’ అని గణిత శాస్త్రవేత్తపై జోక్ వేశారు. గతంలో – మానవజాతి ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచ జనాభా అంతటిని కలిపి అమెరికాలోని గ్రాండ్ కాన్యన్ లోయలోకి చేరిస్తే ఎంత పరిమాణంలో ఉంటుందో ఒక సైన్స్ యూట్యూబ్ చానల్ వేసిన గ్రాఫిక్స్ నుంచి స్ఫూర్తి పొంది ఈ గణిత శాస్త్రవేత్త తాజాగా తన లెక్కలు వేశారట. మానవులందరూ ఒక చోట శంఖం ఆకారంలో కుప్పగా ఆ వీడియోలో ఉండగా, అజ్ఞాత శాస్త్రవేత్త అదే ప్రయోగాన్ని ఒక గుండ్రటి మాంసపు ముద్దగా చేసి చూపించారు. సెంట్రల్ పార్క్లో ‘మీట్బాల్’మానవ ‘మీట్బాల్’ పరిమాణాన్ని లెక్కంచటానికి అజ్ఞాత గణితవేత్త కొన్ని ప్రాథమిక అంచనాలను తీసుకున్నారు. ప్రస్తుత ప్రపంచ జనాభాను 788 కోట్లుగా వేసుకున్నారు. ఒక్కో మనిషి సగటు బరువును 62 కిలోలుగా అనుకున్నారు. మానవ శరీరాల సాంద్రతను క్యూబిక్ మీటరుకు 985 కిలోగ్రాములుగా లెక్కించారు. క్యూబిక్ మీటరు అంటే ఒక మీటరు పొడవు, ఒక మీటరు వెడల్పు, ఒక మీటరు ఎత్తు ఉన్న ప్రదేశం. ఈ అంచనాల నుంచి ‘హ్యూమన్ మీట్బాల్’ ఎంత పరిమాణంలో ఉంటుందో లెక్కించారు. ఆ లెక్క ప్రకారం భూమి పైన ఉన్న 788 కోట్ల మందిని ఒక చక్కటి బంకతో కలిపి ముద్ద చేస్తే ఇంచుమించు ఒక కిలోమీటరు వెడల్పులో గోళాకారం తయారైంది. ఆ ఎర్రటి మాంసపు బంతిని న్యూయార్క్ సెంట్రల్ పార్క్ మధ్యలో ఉంచితే ఎలా ఉంటుందో కూడా ఆయన ఒక విజువల్ సృష్టించారు. గ్రాండ్ కాన్యన్లో ‘మీట్ కోన్’అమెరికాలోని సుప్రసిద్ధ యూట్యూబ్ చానళ్లలో ‘వీసాస్’ ఒకటి. విద్య, సైన్స్, గణితం వంటి అంశాలపై 40 ఏళ్ల మైకేల్ స్టీవెన్స్ వీడియోలు చేస్తుంటాడు. ఈ యూట్యూబ్ చానల్లో గతంలో పోస్ట్ చేసిన ఒక వీడియోను చూసి మానవ మీట్బాల్ను అంచనా వెయ్యటానికి స్ఫూర్తి పొందారు రెడిట్ అజ్ఞాత గణిత శాస్త్రవేత్త. ఆరిజోనా రాష్ట్రంలో కొలరాడో నది ఒడ్డున ఉన్న గ్రాండ్ కాన్యన్ లోయలో... సృష్టి ఆరంభం నుంచి ఉన్న మానవ జనాభానంతా (సుమారు 10,600 కోట్లు) పోస్తే, ఆ లోయలో 15 కుప్పలు తయారైనట్లు ‘వీసాస్’ ప్రెజెంటర్ మైకేల్ స్టీవెన్స్ గ్రాఫిక్స్తో చేసిన వీడియో అది. అంతమంది జనాభాను ఒక చోట చేర్చినా కూడా ఆ లోయ ఇంకా ఖాళీగానే ఉండటం విశేషం అని స్టీవెన్స్ అంటారు. 446 కి.మీ. పొడవు, కొన్నిచోట్ల 1.6 కి.మీ. వరకు లోతు ఉన్న ఆ లోయలో.. కెనడాకు చెందిన గ్రాఫిక్ డేటా విజువలైజేషన్ బ్లాగర్ ఇస్మాయిల్ శాంటోస్ బ్రాల్ట్ జనాభాను నింపారు. మనిషి సగటు బరువును 70 కిలోలుగా వేసుకుని, 49 కోట్ల టన్నుల బరువుతో 700 కోట్ల మంది జనాభాను ఒక కుప్పగా చేరిస్తే అదే పరిమాణంలో 15 కుప్పలు తయారయ్యాయి. ఈ వీడియో ప్రేరణతోనే ఇప్పుడీ రెడిట్ శాస్త్రవేత్త ప్రస్తుత జనాభాతో మీట్బాల్ను సృష్టించారు. -
ఏఐ కంపు కోణాన్ని బయటపెట్టిన మహిళా ఎంపీ
అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ.. షార్ట్ కట్లో ఏఐ. ఇప్పుడు దాదాపు ప్రతీ రంగంలో దీని వినియోగం ఉంటోందని, అది ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ, ఆ సాంకేతికత ఆధారంగా జరుగుతున్న కంపు వ్యవహారాలను మాత్రం చర్చించుకోలేకపోతున్నాం. అయితే ఇక్కడో ఓ మహిళా ప్రజా ప్రతినిధి ధైర్యం చేసి ముందడుగు వేశారు.లారా మెక్క్లూర్.. న్యూజిలాండ్ ఏసీటీ పార్టీ ఎంపీ. ఈవిడ చేసిన ఓ పని ఇప్పుడు మీడియాలో విస్తృత చర్చకు దారి తీసింది. చట్ట సభలో.. అదీ సభ్యులందరి ముందు గూగుల్లో నుంచి తన నగ్న ఫొటోను వెతికి.. ప్రింట్ తీసి మరీ అందరి ముందు ప్రదర్శించారామె. ‘‘ఇది నా నగ్న చిత్రమే. కానీ, నిజమైంది కాదు. వీటిని గూగుల్ నుంచే తీశాను. అయితే వీటిని సృష్టించి..గూగుల్లో అప్లోడ్ చేసింది కూడా నేనే. ఇందుకు నాకు పెద్ద కష్టమేమీ కాలేదు. ఐదు నిమిషాలలోపే పట్టింది’’ అని అన్నారామె.తద్వారా ఏఐ ఆధారిత డీప్ఫేక్ ఎంత ప్రమాదకరమైందో చెప్పే ప్రయత్నం చేశారామె. చట్ట సభను అగౌరవపరిచే ఉద్దేశంతో తాను ఈ పని చేయలేదని, దేశ యువతకు జరిగే నష్టం గురించి సభ్యులకు తెలియజేసే ప్రయత్నం చేశానని ఆమె చెప్పుకొచ్చారు. ‘‘డీప్ఫేక్.. చాలా ప్రమాదకరమైంది. అలాంటి ఫొటోలు, వీడియోలతో జీవితాలు నాశనం అవుతున్నాయి. నేను చేసిన పని మీకు జుగుప్సగా అనిపించొచ్చు. కానీ, ఈ వ్యవహారం ఎంత సులువో.. అంతే ప్రమాదకరమైంది కూడా. అది మీరంతా ఆలోచించాలనే ఇలా చేశా. ఇక్కడ సమస్య టెక్నాలజీతో కాదు. దానిని తప్పుడు దోవలో ఉపయోగిస్తున్న విధానమే. కాబట్టి.. వీటి కట్టడికి ప్రత్యేక చట్టాలు కచ్చితంగా అవసరం’’ అని ప్రసంగించారామె. మే 14వ తేదీన జరిగిన ఈ డిబేట్ తాలుకా వివరాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.🇳🇿 MP HOLDS UP AI-NUDE OF HERSELF IN PARLIAMENT TO FIGHT DEEPFAKESNew Zealand politician Laura McClure held up an AI-generated nude of herself in Parliament to push a law against fake explicit images.She made it at home to show how easy it is to create deepfakes that can ruin… pic.twitter.com/G74KLOoh7o— Mario Nawfal (@MarioNawfal) June 2, 2025ఏఐను వివిధ రంగాల్లో ఎంత సవ్యంగా ఉపయోగిస్తున్నారో.. సోషల్ మీడియాలో అంతే తప్పుడు దోవలోనూ ఉపయోగించడం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో!. వాళ్ల మీద అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు సృష్టించి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాంటి పాపులర్ యాప్లలోనూ కొందరు ఆకతాయిలు వదులుతుండడం గమనార్హం. అయితే ఇలాంటివి తమ కంట పడ్డా కూడా గట్టిగా నిలదీసేందుకు ప్రముఖులు ముందుకు రాకపోవడం ఇక్కడ గమనార్హం. -
భారత్ను బెదిరించిన ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ మృతి!
లాహోర్: భారత్ను విచ్ఛిన్నం చేస్తామంటూ ఇటీవల బెదిరింపులకు పాల్పడిన జైఫే మహ్మద్ ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ మృతిచెందాడు. ఈ విషయాన్నిజైషే మహ్మద్ ఉగ్రవాద సంబంధిత సోషల్ మీడియా హ్యాండిల్స్ ధృవీకరించాయి ఆ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఉగ్రవాది అబ్దల్ అజీద్ మృతిచెందిన విషయాన్ని వెల్లడించడంతో పాటు అతని అంత్యక్రియలు బహవల్పూర్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. కార్డియక్ అరెస్టుతో అబ్దుల్ అజీజ్ మృతి చెందినట్లు సమాచారం. ఇటీవల పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాయాది దేశానికి చెందిన తొమ్మిది ప్రాంతాల్లో దాడులు చేసింది, అందులో ఉగ్రవాది అబ్దల్ అజీజ్ అంత్యక్రియలు నిర్వహించనున్న బహవల్పూర్ ఒకటి.అయితే ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ మృతిచెందిన విషయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తుందని ప్రపంచ దేశాల ముందు చులకనైన ఆ దేశం.. ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ మృతిపై మాట్లాడకుండా ఉండటమే మేలు అనే భావనలోనే ప్రకటనలకు దూరంగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దాంతోనే పాకిస్తాన్ అధికారులు ఈ ఘటనపై ఇప్పటివరకూ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. Jaish-E-Mohammad Commander Maulana Abdul Aziz Esar died yesterday.Died of Cardiac arrest probably 🤷🏻♀️ pic.twitter.com/tdSAwsi908— manju 🇮🇳 (@justtweettz) June 3, 2025 -
నా పిల్లలు.. మోదీ తాతను మిస్ అవుతున్నారు: ఉషా వాన్స్
వాషింగ్టన్ : తన పిల్లలు వాళ్ల మోదీ ( భారత ప్రధాని నరేంద్ర మోదీ) తాతను మరిచిపోలేకపోతున్నారని, మిస్ అవుతున్నారని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) సతీమణి ఉషా వాన్స్ (Usha Vance) గుర్తు చేశారు. జేడీ వాన్స్ దంపతులు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో భారత్లో పర్యటించారు. భారత పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ తమ పట్ల వ్యక్తిగతంగా చూపించిన ప్రేమ, ఆప్యాయతను మరిచిపోలేమంటూ.. ఉషా వాన్స్ అన్నారు. మరోసారి భారత్లో పర్యటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పిన ఆమె.. ఈ సారి తన మూలాలున్న ప్రాంతాల్లో పర్యటించాలని భావిస్తున్నట్లు తెలిపారు.Usha Vance about Modi ji 🔥 pic.twitter.com/44qcmseFFX— desi mojito 🇮🇳 (@desimojito) June 3, 2025అమెరికా వాషింగ్టన్ డీసీలో యూఎస్- ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరంలో ఉషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె భారత్ పర్యటన అనుభూతిని పంచుకున్నారు. కుమారులు ఇవాన్, వివేక్ కుమార్తె మీరాబెల్లు భారత్ పర్యటనను పదే పదే ప్రస్తావిస్తున్నారని.. భారత సంస్కృతి, సంప్రదాయాలు, రామాయణం గురించి ఇప్పటికీ మాట్లాడుతున్నట్లు తెలిపారు. 'నా పిల్లలు భారత పర్యటనలో ఉండగా ప్రధాని మోదీని తమ తాత లాగా భావించారు. ముఖ్యంగా నా కుమారుడు మోదీ నివాసంలో మామిడి పండ్లన్నింటినీ తీసుకున్నాడు. తనకు అక్కడే ఉండిపోవాలని ఉందని' అతడు పేర్కొన్నట్లు వెల్లడించారు. తన ఐదేళ్ల కుమార్తె మీరాబెల్ పుట్టిన రోజుకు ప్రత్యేక బహుమతి ఇచ్చిన నరేంద్ర మోదీ తమ గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు. మరోసారి భారత్లో పర్యటించేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. కానీ, ఈసారి తన కుటుంబ మూలాలు ఉన్న ప్రాంతాల్లోనూ తాను పర్యటిస్తానన్నారు. -
తక్కువ ఖర్చుతో రష్యాలో ఉక్రెయిన్ బీభత్సం.. ప్రపంచ నేతల్లో ఇదే చర్చ!
కీవ్: ఆపరేషన్ స్పైడర్స్ వెబ్. వీడియోగేమ్ ఆడుతున్నంత అలవోకగా రష్యా భూభాగం 4 వేల కిలోమీటర్లు లోపలికి చొచ్చుకుని వెళ్లి దాడులు చేసేందుకు ఉక్రెయిన్ చేపట్టిన కోవర్ట్ మిలటరీ ఆపరేషన్. ఇప్పుడిదే ప్రపంచ నేతల్లో హాట్ టాపిక్. ఎందుకంటే?.2022 నుంచి ప్రారంభమైన ఉక్రెయిన్పై రష్యా యుద్ధంలో ఓ వైపు శాంతి చర్చలు జరిపేందుకు తాము సిద్ధమంటూ ఉక్రెయిన్ భీకర దాడికి తెగబడింది. ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ పేరుతో రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ ఊహించని పరిణామంలో 40 రష్యా యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. ఫలితంగా మాస్కో 60వేల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా.అయితే, నాటో దేశాలు నిరంతరం ఆయుధాలతో సహా సర్వ సామగ్రీ సమకూరుస్తుంటే తప్ప యుద్ధరంగంలో పూట గడవని పరిస్థితి ఉక్రెయిన్ది. అవతలున్నదేమో అపార సైనిక పాటవానికి మారుపేరైన రష్యా. అలాంటి అగ్రరాజ్యంలో ఉక్రెయిన్ బీభత్సం ఎలా సృష్టించిందనేదే ఇప్పుడు అందరి మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న.🇺🇦 #Ukraine - 🇷🇺 #Russia: Ukraine struck four Russian airbases in a coordinated long-range drone attack, destroying over 40 aircraft, including Tu-95 and Tu-22M3 bombers, as well as an A-50 surveillance jet. The drones were smuggled deep into Russia, hidden inside wooden sheds… pic.twitter.com/y7L0wVTMS6— POPULAR FRONT (@PopularFront_) June 1, 2025 రహస్యంగా రష్యాలోకి డ్రోన్ల తరలింపుఈక్రమంలో రష్యాపై ఉక్రెయిన్ దాడి జరిపిన తీరుపై జాతీయ,అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగా.. మూడు టైమ్ జోన్లు. 6,000 కి.మీ. పరిధిలో ఉన్న ఐదు రష్యా వైమానిక స్థావరాలు. ఏకకాలంలో విజయవంతంగా దాడులు జరిపేందుకు ఉక్రెయిన్ మార్కెట్లో అతి తక్కువ ధరకే ఒక్కో డ్రోన్ ఖరీదు 1200 డాలర్లు ఖర్చుతో మొత్తం 117 డ్రోన్లను సెమీ ట్రైలర్ ట్రక్కుల్లో నింపింది. ఇందుకోసం ట్రక్కును ప్రత్యేకంగా చెక్కతో డిజైన్ చేయించింది. Today, a brilliant operation was carried out. The preparation took over a year and a half. What’s most interesting, is that the “office” of our operation on Russian territory was located directly next to FSB headquarters in one of their regions.In total, 117 drones were used in… pic.twitter.com/tU0SMN9jdB— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) June 1, 2025మనుషుల అవసరం లేకుండానేమనుషుల సహాయం లేకుండా ఉక్రెయిన్లో ఉండి.. రష్యాలోకి చొరబడ్డ ట్రక్ డోర్లును ఓపెన్ చేయడం, ట్రక్కు లోపల ఉన్న డ్రోన్లు లోపలి నుంచి ఎగురుకుంటూ బయటకు రావడం, రష్యా బాంబర్ విమానాలపై మెరుపు దాడి చేయడం ఇదంతా ఉక్రెయిన్ రిమోట్ కంట్రోల్తో చేసింది. ఫలితంగా కొన్ని గంటల వ్యవధిలో రష్యా 40 యుద్ధ విమానాలు సర్వనాశనం చేసింది. ఈ హాని విలువ సుమారుగా 7 బిలియన్ (దాదాపు రూ.60వేల కోట్లకు)పైగా ఉన్నట్లు అంచనా.రష్యన్ భద్రతా సంస్థకు సమీపం నుంచి ఈ దాడిలో అత్యంత కీలకమైనది సైబీరియాలోని ఇర్కుట్స్క్ ప్రాంతంలోని బిలాయా ఎయిర్ బేస్. ఇది ఉక్రెయిన్ నుండి దాదాపు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది సాధారణంగా ఉక్రెయిన్ డ్రోన్లు చేరుకోలేని దూరం. అందుకే ప్రత్యేక వ్యూహంతో డ్రోన్లను దగ్గరకు తీసుకెళ్లి దాడి చేశారు. ఈ ఆపరేషన్ను రష్యన్ భద్రతా సంస్థ (FSB) కార్యాలయానికి సమీపంలో కోఆర్డినేషన్ సెంటర్ నుంచి చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు. స్పైడర్స్ వెబ్ అనే కోడ్ పేరుతో జరిగిన అతిపెద్ద దాడిని చరిత్ర పుటల్లో నిలిచిపోయే ఆపరేషన్గా అభివర్ణించారు. “The ‘office’ of our operation on Russian territory was located directly next to an FSB headquarters in one of their regions,” — Zelenskyy. pic.twitter.com/RC10fBPUrG— Special Kherson Cat 🐈🇺🇦 (@bayraktar_1love) June 1, 2025ఈ దాడిలో మూడున్నరేళ్లుగా ఉక్రెయిన్పై క్షిపణి, బాంబు దాడులకు రష్యా ప్రధానంగా ఉపయోగిస్తున్న సైనిక విమానాల్లో టు-95, టు-22ఎం, టు-160 వంటి వ్యూహాత్మక బాంబర్లతో పాటు ఏ-50 విమానం కూడా ఉంది. ఈ దాడి ద్వారా రష్యా క్రూయిజ్ మిసైల్ వాహక బాంబర్లలో సుమారు 34శాతం నష్టం జరిగింది.జెలెన్స్కీ ఈ ఆపరేషన్ను స్వయంగా పర్యవేక్షించారు. ఈ దాడి కోసం 18 నెలలపాటు ప్రణాళికలు రూపొందించారు. దాడికి ముందు, ఆపరేషన్లో పాల్గొన్న అన్ని గూఢచారులను రష్యా భూభాగం నుండి ఉక్రెయిన్ సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దాడిని ధ్రువీకరించింది. కానీ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. ఈ విమానాల నష్టం వల్ల ఉక్రెయిన్పై విధ్వంసకర క్షిపణి దాడులను అందించగల సామర్ధ్యం రష్యాకు తగ్గే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
World Bicycle Day: మొదటి వాహనముకు వందనం!
రాజైనా రైతైనా.. కొడుకైనా కూతురైనా కలెక్టరైనా బంట్రోతైనా.. ఊరైనా పట్నమైనా మనిషికి ప్రాప్తమయ్యే మొదటి వాహనం సైకిల్. దోగాడే వయసులో ట్రై సైకిల్ తొక్కిబైస్కిల్కు ఎదగడమే చేయాల్సింది. ఇక అక్కడి నుంచి ఎక్కడికి చేరినా జీవితాన్ని బేలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగమని చెబుతుంది సైకిల్. ప్రతి ఒక్కరి బాల్యంలో సైకిల్ విడదీయరానిది. ఆ మాటకొస్తే సైకిల్లోని ప్రతి పార్ట్ జీవన సందేశాన్ని వినిపిస్తుంది. అసలు సైకిల్ని ఇష్టపడని వారెవరు?సైకిల్! ట్రింగ్ ట్రింగ్మని బెల్లు కొడుతూ జ్ఞాపకాలు కమ్ముకుంటున్నాయా? చిన్నప్పుడు ఎవరిదో ఇంటి ముందు సైకిల్ స్టాండ్ వేసి ఉంటే కింద కూచుని పెడల్ తిప్పుతూ వెనుక చక్రం గిర్రున తిరుగుతుంటే చూసిన జ్ఞాపకం. ముందు చక్రంలో వెనుక చక్రంలో స్పోక్స్ మధ్యన ఉండే ఇంధ్రధనువు రంగుల కుచ్చు గుబ్బలను ఆసక్తిగా చూసిన జ్ఞాపకం. వెనుక సీటుకు డైనమో ఉంటుంది. అది ఆన్ చేస్తే బ్యాక్ టైర్కు అంటుకుంటుంది. టైరు తిరిగే కొద్దీ డైనమో నుంచి కరెంటు జనరేట్ అయ్యి ముందున్న బల్బు వెలుగుతుంది. ఆ రోజుల్లో రాత్రుళ్లలో లైటు వెలిగే సైకిల్ తొక్కేవాడు గొప్ప.అవును. సైకిల్ తొక్కడం గొప్పే. ఎంతమంది దగ్గర ఉండేదని. ఒకవేళ ఉన్నా అందులో అంతరం. ర్యాలీ, హంబర్ సైకిళ్లు ఉన్నవారు శ్రీమంతులు, హీరో సైకిల్ ఉన్నవారు మధ్య తరగతి వారు, అట్లాస్ అంటే ఇక పేదవాళ్లు కొని తెగ తొక్కడమే. ఆ తర్వాత బి.ఎస్.ఏ సైకిళ్లు వచ్చాయి. వాళ్లు తెచ్చిన లేడీస్ సైకిళ్లు ఆడపిల్లలను వాటిపై కూచోబెట్టి నేరుగా స్కూళ్లకు కాలేజీలకు పంపాయి. చిన్న పట్టణాల్లో సాయంత్రాలు సైకిల్ తొక్కుతూ వెళ్లే ఆడపిల్లలకు ఉండే క్రేజ్ సామాన్యం కాదు. మగాడికి ‘మగాడు’ అనిపించుకునే సవాళ్లు సమాజం పెడుతూ ఉంటుంది. ఆ సవాళ్లలో ఒకటి సైకిల్ తొక్కడం నేర్చుకోవడం. ఏడు, ఎనిమిది తరగతులకు రావడంతోటే ఊళ్లలో పల్లెల్లో పిల్లలు సైకిల్ నేర్చుకుని ఉండాల్సింది. ‘ఏంటి.. మీవాడికి ఇంకా సైకిల్ తొక్కడం రాదా’ అనంటే అవమాన పడిపోయే తండ్రులు ఉండేవారు. కొడుకు తిట్లతో రెచ్చగొట్టి ‘సైకిల్ తొక్కుతావా లేదా’ లేదా అని ఎక్కించి వెనుక పరిగెత్తుతూ నేర్పించేవారు. ఆ రోజుల్లో పిల్లలు తొక్కే సైకిళ్లు ఎక్కడివని? అన్నీ పెద్దలు తొక్కేవే. అందుకే పిల్లలు మొదట ఆఫ్ పెడల్ తొక్కి, ఆ తర్వాత ఫ్రంట్ బార్ మీద కూచుని తొక్కి, కాళ్లందే ఎత్తు పెరిగాక సీటు మీద కూచుని తొక్కేవారు.సైకిల్ తొక్కడం అంత వీజీ కాదు. ఆ రోజుల్లో ప్రతి సైకిలూ తన యజమానిని సొంత ఊరి చెరువు నీళ్లు గటగటా తాగించేది. ఒక సైకిలుకు బ్రేకులు పడవు. ఒక సైకిల్కు పెడళ్లు ఊడిపోతాయి. ఒక సైకిల్కు చైను లూజు. మరో సైకిలుకు స్టాండ్ పడదు. స్టాండ్ వేసి జరగ్గానే ధబేలున పడుతుంది. ఒక సైకిలుకైతే సీటు అట్టగట్టుకుని పోయి కూచుంటే ముళ్ల మీద కూచున్నట్టు ఉంటుంది. ఒక సైకిలు సైడుకు లాగుతూ ఉంటుంది. ఒక సైకిలుకు హ్యాండిలు వంకర. ఇక పంక్చర్లు వేసి వేసి లోపల టైరు బ్యారుమన్నా ఓనరు కనికరించక దాన్ని తొక్కుతూనే ఉంటాడు. డబ్బులే లేని ఆ కాలంలో సైకిలే సిరి.సైకిల్ వల్ల ఫ్రెండ్షిప్స్ ఏర్పడతాయి. ఫ్రంట్ రాడ్ మీద కూచుని సినిమాకొచ్చేవాడొకడు. బ్యాక్ క్యారేజీ మీద కూచుని సంతకు పోదాం అనేవాడొకడు. ఎదురుగాలిలో తొక్కుతుంటే వెనుక కూచున్నవాడు కూడా తోడు తొక్కుతాడు. అంటే రెండు పెడళ్ల మీద నాలుగు కాళ్లు. సైకిల్ డౌన్లో తొక్కేటప్పుడు గడ్డిపోచకంటే తేలిగ్గా ఉంటుంది. ఎదురుగాలిలో తొక్కుతుంటే రాకాసి దెయ్యమంత బరువు పెరుగుతుంది. అన్నింటి కంటే హింస ఏమిటంటే చైనుకు ఉన్న మడ్గార్డు గనుక పెడల్కు రాసుకుంటూ ఉంటే మనం వీధి వెంట వెళుతున్నామని ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు.. ఆ గర్గర్మనే సౌండ్కి.సైకిల్కు సింగారాలు చేసేవారు ఉండేవారు. హ్యాండిల్కు చెరొక మిర్రర్ని బిగించే సోగ్గాళ్లు ఉండేవారు. హ్యాండిల్ మీద ఫ్రంట్ క్యారేజ్ బిగిస్తే వాటి మీద బుక్స్ పెట్టుకోవచ్చు. సీటుకు స్పాంజ్ కవర్ చాలా షోకు. స్టీలు బిందెల మీద పేర్లు రాసినట్టు సైకిల్ హ్యాండిల్ మీద ఓనర్ పేరు రాయించడం సేఫ్. సైకిల్ దొంగతనం అయితే పోలీసులు ఆ పేరును బట్టి వాపసు చేసేవారు.ఆ రోజుల్లో అద్దె సైకిళ్ల జమానా నడిచింది. ఐదారు సైకిళ్లు అద్దెకు ఇస్తూ బతికే వారుండేవారు. సైకిళ్లన్నీ అద్దెకెళ్లిపోతే కావాల్సిన వాళ్లు వెయిట్ చేస్తూ కూచునేవారు. కొందరైతే రే΄÷్పద్దున నాకు సైకిల్ కావాలి అని ముందే అద్దెకు మాట్లాడుకునేవారు. సైకిల్ లేకుండా పని ఎవరికి జరిగేదని? సామాన్లు తెచ్చుకోవాలన్నా, పక్కూరికి పనికి వెళ్లాలన్నా, నీళ్లు తెచ్చుకోవాలన్నా, ఎవరికైనా బాగా లేకపోతే డాక్టర్ని పిలుచుకు రావాలన్నా, చావు కబురు చె΄్పాలన్నా సైకిలే గతి. సైకిల్ వేదాంతి. బతుకు బండిని బేలెన్స్ తప్పకుండా చూసుకోమని, అత్యాశలకూ అతి కోరికలకూ బ్రేకులు వేస్తూ నువ్వెంత తొక్కగలవో అంతలోనే బతకమని, మంచి అనుబంధాలనే ఆయిల్ను తరచూ రిమ్ములకు రాస్తూ ఉండమని, మంచి చెడ్డల్లో పాల్గొంటూ సైకిల్ బెల్లులా ఉనికి చూపమని, వెనుక క్యారేజీ మీద కూచోబెట్టుకునే పాటి సహాయమైనా ఇతరులకు చేస్తూ ఉండాలని, జీవితపు పరుగుకు అప్పుడప్పుడు స్టాండ్ వేసి నిలబెట్టమని లేదంటే కనీసం సైడ్ స్టాండ్ వేయమని చెబుతుంటుంది. లేదంటే హటాత్తుగా సైకిల్ మొరాయించి ఓవరాయిలింగ్కు వస్తుందని హెచ్చరిస్తుంది.సైకిల్లా సింపుల్గా బతకడం ఇవాళ చాలా కష్టమైపోతుంది. కాసింత గాలి కొడితే ఇక సైకిల్ ఏమీ అడగదు. కాని నేడు మనం ఉపయోగిస్తున్న, వాడుతున్న, అందుకోవాలనుకుంటున్న ప్రతిదీ మన నుంచి చాలా అడుగుతున్నాయి. ఇంటి వాకిటలో నిలబెట్టిన సైకిల్ ఎంత నిమ్మళంగా ఉంటుంది!‘వరల్డ్ సైకిల్ డే’ రోజున జీవితపు వేగాన్ని తగ్గించుకుని ఆస్వాదనకు పెడల్ వేద్దాం.– కె. -
ఏడాదిలోపు సుదర్శన చక్రాలిచ్చేస్తాం
న్యూఢిల్లీ: కొత్తగా తయారుచేసి భారత్కు ఇవ్వాల్సిన ఎస్–400 గగనతల రక్షణ వ్యవస్థ(సుదర్శన చక్ర)లను 2025–2026 షెడ్యూల్ ప్రకారం అందజేస్తామని రష్యా స్పష్టంచేసింది. ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్తాన్పైకి భారత్ క్షిపణులను ప్రయోగించడం, ప్రతిగా అటు నుంచి దూసుకొచ్చిన క్షిపణులను భారత ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకోవడం తెల్సిందే. దీంతో ఒప్పందం ప్రకారం మిగతా ఎస్–400 యూనిట్లనూ త్వరగా తయారుచేసి సరఫరాచేయాలని భారత్ ఇటీవల రష్యాను కోరింది. దీనిపై రష్యా డెప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ ఇన్ ఇండియా రోమన్ బబూష్కిన్ సోమవారం స్పందించారు. ‘‘భారత్, పాక్ పరస్పర సైనిక చర్యల్లో ఎస్–400 అద్భుత పాటవాన్ని ప్రదర్శించిందని మేం కూడా విన్నాం. భారత్తో భాగస్వామ్యానికి దశాబ్దాల చరిత్ర ఉంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో యూరప్ మాత్రమేకాదు భారత్లోనూ రక్షణ సన్నద్ధత అత్యంత కీలకమైన అంశంగా మారింది. మరో రెండు యూనిట్లను భారత్కు అందించాల్సి ఉంది. వాటిని షెడ్యూల్ ప్రకారం తయారుచేసి డెలివరీ ఇస్తాం’’అని బబూష్కిన్ అన్నారు. 2018లోనే రష్యాతో భారత్ రూ.46,000 కోట్లతో ఎయిర్ డిఫెన్స్ డీల్ కుదుర్చుకోవడం తెల్సిందే. ఇందులోభాగంగా ఐదు స్క్వాడ్రాన్ల ఎస్–400 యూనిట్లను రష్యా తయారుచేసి భారత్కు ఇవ్వనుంది. మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ త్వరలో భారత్లో పర్యటించనున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ మరికొద్ది వారాల్లో ఖరారుకానుంది. -
ఉగ్రవాదంతో మానవాళికే ప్రమాదం
లండన్/కౌలాలంపూర్/కైరో/మాడ్రిడ్: మానవాళి మనుగడకే ప్రమాదంగా మారిన ఉగ్రవాదంపై పోరుకు భారత్ కృతనిశ్చయంతో ఉందని కేంద్ర ప్రభుత్వం పంపించిన అఖిల పక్ష బృందాల ప్రతినిధులు వివిధ దేశాల నేతలకు వివరిస్తున్నారు. బీజేపీ ఎంపీ రవి శంకర్ ప్రసాద్ సారథ్యంలో లండన్ వెళ్లిన ప్రతినిధి బృందం యూకే మంత్రి కేథరిన్ వెస్ట్ను కలిశారు. ఉగ్రవాదంపై పోరాటంలో యూకే భారత్తో కలిసి వస్తుందని ఈ సందర్భంగా కేథరిన్ హామీ ఇచ్చారు. ఇండో–పసిఫిక్ ప్రాంత స్థిరతకు భారత్ చేస్తున్న కృషిని ఆమె కొనియాడారు. బీజేపీ ఎంపీ బైజయంత్ జే పాండా సారథ్యంలోని బృందం ఆదివారం రాత్రి అల్జీరియా మంత్రి మహ్మద్ ఖౌనెతో భేటీ అయ్యారు. జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఝా సారథ్యంలో మలేసియా వెళ్లిన మరో బృందం కౌలాలంపూర్లో వివిధ పార్టీల ముఖ్య నేతలతో సమావేశమై, ఉగ్రవాదంపై భారత్ వైఖరిని వివరించింది. ఈజిప్టుకు ఎన్సీపీ(ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే నేతృత్వంలో వెళ్లిన బృందం ఈజిప్టు పార్లమెంట్ సభ్యులతో సమావేశమయ్యారు. సోమవారం డీఎంకే ఎంపీ కనిమొళి ఆధ్వర్యంలో స్పెయిన్ వెళ్లిన బృందం సభ్యులు మాడ్రిడ్లో విదేశాంగ మంత్రి జోస్ మాన్యు యెల్ అల్బరెస్తో చర్చలు జరిపారు. ఉగ్రవాదాన్ని సహించరాదన్న భారత్ వైఖరిని తాము బలపరుస్తామన్నారు. శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే సారథ్యంలోని బృందం లైబీరియాకు, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆధ్వర్యంలోని అఖిలపక్ష బృందం బ్రెజిల్కు వెళ్లి, పహల్గాం ఉగ్రదాడి అనంతర పరిణామాలను అక్కడి ప్రభుత్వాలకు వివరించాయి. -
భూకంప ప్రభావం అంతరిక్షంలో!!
పట్టాలపై రైలు పరుగులు తీస్తుంటే.. హఠాత్తుగా ముందున్న ఇంజిన్ కాస్తంత నెమ్మదించినా వెనకాలే క్యూ కట్టిన బోగీలన్నీ టపటపా ఢీకొన్నంత పనిచేస్తాయి. ఎందుకంటే ప్రతి బోగీ పక్క బోగీతో అనుసంధానమై ఉంటుంది. కానీ ఎలాంటి అనుసంధానంలేని సుదూర శాటిలైట్లు సైతం భూకంపం వేళ ప్రభావితం అవుతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. భూకంపం ధాటికి భూకంపకేంద్ర సమీప భవనాలు, భవంతులు పేకమేడల్లా కదలిపోవడం చూస్తుంటాం. కానీ ఆకాశంలో ఉండే కృత్రిమ ఉపగ్రహాల పనితీరు సైతం భూకంపాల తీవ్రతకు లోనవుతోందని తాజా పరిశోధనలో తేలింది. భౌతికంగా భూమితో అనుసంధానంకాని ఉపగ్రహాలకు భూకంప పర్యవసానాలకు మధ్య గల సంబంధాన్ని తొలిసారిగా ఈ పరిశోధన ఆవిష్కరించింది. జపాన్లోని నగోయా విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తల బృందం చేసిన ఈ పరిశోధనా తాలూకు వివరాలు ‘ఎర్త్, ప్లానెట్స్, స్పేస్’జర్నల్లో ప్రచురితమయ్యాయి. భూతలం సహా గగనతలం.. రెండు భూఫలకాల కొనల వద్ద రాపిడి, ఢీకొనే సందర్భాల్లో భూకంపం సంభవిస్తుంది. ఇవి భూతల వనరులనే కాదు గగనతల కృత్రిమ వనరులైన శాటిలైట్లనూ ప్రభావితం చేస్తాయని అధ్యయనకారుల్లో అనుమానం మొదలైంది. ఈ అనుమానాన్ని నివృత్తిచేసుకునేందుకు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(జీఎన్ఎస్ఎస్)లోని 4,500కుపైగా రిసీవర్ల ద్వారా సమగ్ర సమాచారాన్ని తెప్పించుకుని ఆ డేటాతో త్రిమితీయ(3డీ) ‘‘వాతావరణ ఇబ్బందుల’’ముఖచిత్రాన్ని రూపొందించారు. 2024 జనవరి ఒకటో తేదీన జపాన్లోని ఇషికావా ప్రిఫెక్ఛర్లోని నోటో ద్వీపకల్పంలో రిక్టార్ స్కేల్పై 7.5 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం సంభవించింది. అప్పుడు ఆకాశంలోకి సంక్లిష్టమైన ధ్వని తరంగాలు దూసుకెళ్లాయి. ఇవి భూమి నుంచి ఆకాశంలో 60 నుంచి 1,000 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న అయనో ఆవరణం(ఐనోస్ఫియర్)లోకి వెళ్లాయి. అక్కడి స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లతో నిండిన వాయువులను ఈ ధ్వనితరంగాలు విపరీతంగా ప్రేరేపించాయి. దాంతో ఈ వాయువులు కింద పొర అయిన థర్మోస్ఫియర్ వాతావరణంలోకి కొంత శక్తిని విడుదలచేశాయి. అప్పటికే థర్మోస్పియర్ ఆవరణలో స్థిరంగా ఉన్న శాటిలైట్లపై ఈ అదనపు శక్తి ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో శాటిలైట్ల నుంచి భూమి మీదకు జరగాల్సిన కమ్యూనికేషన్ సిగ్నళ్ల ప్రసరణ వేగంలో మార్పులు కనిపించాయి. సిగ్నళ్లు ఆలస్యంగా రావడంతోపాటు సిగ్నళ్లలో సాంద్రత సైతం తగ్గిపోయినట్లు గుర్తించారు. టోమోగ్రఫీ సాయంతో వైద్యరంగంలో వాడే సీటీ స్కాన్ తరహాలో వేర్వేరు కోణాల్లో శాటిలైట్ల డేటాను క్రోడీకరించి 3డీ చిత్రాలను రూపొందించారు. భూకంపం సంభవించినప్పుడు కేవలం పది నిమిషాల వ్యవధిలోనే ధ్వని తరంగాలు ఐనోఆవరణను చేరిపోతున్నాయి. ప్రశాంత కొలనులో రాయి విసిరితే ఏర్పడే వలయాకార అలల్లా ధ్వని తరంగాలు ఐనోస్ఫియర్లోకి వెళ్తున్నాయి. భూకంపం సంభవించినప్పుడు భూఫలకాలు ఢీకొన్న ఒక్క ప్రాంతంలోనే ధ్వని తరంగాలు ఉధ్భవిస్తాయని గతంలో భావించారు. అలాకాకుండా నోటో ద్వీపకల్ప ఘటనలో 150 కిలోమీటర్ల పొడవునా రెండు భూఫలకాలు ఢీకొన్న చోట్ల నుంచి ధ్వనితరంగాలు పుట్టుకొచ్చాయని, ఇలాంటి సందర్భాల్లోనే అధిక తరంగాలు ఉద్భవిస్తున్నాయని ఈ పరిశోధనలో ముఖ్య రచయిత డాక్టర్ వెజియాంగ్ ఫూ చెప్పారు. పలు సమస్యలు.. ధర్మోస్ఫియర్పై అదనపు ఒత్తిడితో శాటిలైట్ల నుంచి ప్రసారాల నాణ్యత తగ్గిపోవడంతో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్), శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భూకంపాలతో ఉపగ్రహాల పనితీరూ దెబ్బతింటుందని స్పష్టంగా అర్థమైందని మరో రచయిత, ప్రొఫెసర్ యుచీ ఒట్సుకీ చెప్పారు. భూకంపాల ముందస్తు హెచ్చరికల వ్యవస్థను మరింత పటిష్టచేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని యుచీ అభిప్రాయపడ్డారు. భూకంపాలతోపాటు సునామీ, అగి్నపర్వతాల విస్ఫోటం వంటి అత్యంత తీవ్ర వాతావరణ పరిస్థితులకూ తమ అధ్యయన మోడళ్లను అన్వయించి మరింత విస్తృతస్థాయి అవగాహనకు ప్రయతి్నస్తున్నామని పరిశోధకులు వెల్లడించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పీఓకేలో నిరసనల హోరు
గిల్గిత్: ఆపరేషన్ సిందూర్తో పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్కు స్థానిక వ్యాపారులు నిరసనల సెగ మరింత తగులుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని గిల్గిత్–బాల్టిస్టాన్లోని స్థానిక వ్యాపారులు తమ స్వప్రయోజనాలను పాక్ ప్రభుత్వం పణంగా పెడుతోందని ఆందోళన బాటపట్టారు. వీళ్లకు స్థానిక రాజకీయ పారీ్టల మద్దతు సైతం తోడవడంతో ఉద్యమం మరింత ఉధృతమవుతోంది. గత మూడు రోజులుగా స్థానిక సరకు ఎగమతి, దిగుమతిదారులు, చిరు వ్యాపారు లు ఆందోళన కొనసాగిస్తున్నారు. స్థానిక గుల్మార్ట్ నగర్లో వేలాది మంది వ్యాపారులు, స్థానికులు బైఠాయించి నిరసనకు దిగారు. చైనా, పాకిసాŠత్క్ ఎకనమిక్ కారిడార్(సీపీఈసీ)లో కలికితురాయి వంటి కారాకోరమ్ జాతీయ రహదారిని గత మూడు రోజులుగా వ్యాపారులు దిగ్బంధించారు. దీంతో పాక్, చైనా మధ్య భారీ సరకు రవాణా వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఆందోళన కార్యక్రమాల్లో అధికార పీఎంఎల్(నవాజ్) పారీ్టకి చెందిన నేతలు సైతం పాల్గొన్నారు. ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవిన్యూ(ఎఫ్బీఆర్) నిర్ణయాలు పూర్తి లోపభూయిష్టంగా ఉన్నాయని, కేవలం చైనాకు లబి్ధచేకూర్చేలా ఆర్థిక విధానాలను అవలంభిస్తున్నారని సరకు ఎగుమతి, దిగుమతిదారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. చైనా దోపిడీ విధానాలు పాకిస్తాన్ను ఆర్థికంగా హత్య చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. వ్యాపారులకు తోడుగా హూంజా, సమీప పట్టణాల నుంచి వేలాదిగా విద్యావేత్తలు, పౌర సంఘాల ప్రతినిధులు తరలివచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. 2023 అక్టోబర్లోనూ గిల్గిత్–బాల్టిస్తాన్ ప్రజలు భారత్ అనుకూల ఉద్యమం చేశారు. భారత్లోని కార్గిల్ను కలిపే రోడ్డును మళ్లీ తెరవాలని, తద్వారా సరకు దిగుమతులకు అనుమతించి స్థానికంగా ద్రవ్యోల్బణాన్ని కిందకు దిగొచ్చేలా చేయాలని స్థానికులు ఉద్యమించారు. ‘సరిహద్దులు చెరిపేయండి, కార్గిల్ సరిహద్దును తెరవండి’’అంటూ ప్రముఖ కార్యకర్త షబ్బీర్ మయ్యార్ ఆధ్వర్యంలో ఉద్యమం కొనసాగడడం తెల్సిందే. తర్వాత ఆయనను ఉగ్రవ్యతిరేక చట్టం కింద పాక్ సర్కార్ అరెస్ట్చేసింది. పరస్పర నిందారోపణలు గిల్గిత్–బాల్టిస్తాన్లో ఇమ్రాన్ఖాన్కు చెందిన పీటీఐ పార్టీ అధికారంలో ఉందని, ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవిన్యూ(ఎఫ్బీఆర్) నిర్ణయాలతో తమకు సంబంధంలేదని పీఎంఎల్(నవాజ్) పార్టీ చెబుతోంది. ‘‘పీటీఐ పార్టీ విధానాల కారణంగా స్థానికంగా వ్యాపారం దెబ్బతింటోంది. ఎగుమతిదారులు, వ్యాపారులు, దుకాణదారులు, కారి్మకులు, కస్టమ్స్ క్లియరెన్స్ ఏజెంట్లు, హోటళ్లు, చిరువ్యాపారులు అందరూ ఆరు నెలలుగా తీవ్రంగా నష్టపోతున్నారు. స్థానిక ప్రభుత్వం ఏకంగా ఉగ్రవాదులకే క్షమాభిక్షలు పెట్టింది. కనీసం వ్యాపారులను పట్టించుకోరా?’’అని పీఎంఎల్(నవాజ్) పార్టీ నేత జావేద్ హుస్సేన్ ప్రశ్నించారు. హుస్సేన్ వ్యాఖ్యలను పీటీఐ పార్టీ నేతలు ఖండించారు. ‘‘ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవిన్యూ అనేది కేంద్రప్రభుత్వానికి సంబంధించిన విషయం, మా ప్రభుత్వంతో సంబంధం లేదు’’అని గిల్గిత్–బాల్టిస్తాన్ ముఖ్యమంత్రి కార్యాలయం అధికార ప్రతినిధి మొహమ్మద్ అలీ ఖయీద్ చెప్పారు. ఇరు ప్రభుత్వాల నడుమ వ్యాపారులు ఆర్థిక చితికిపోతున్నారు. సరకుల కొరతతో ధరలు పెరిగి సామాన్యులు ఆరునెలలుగా అల్లాడిపోతున్నారు. కస్టమ్స్ క్లియరెన్సుతో.. సరిహద్దుల్లోని సోస్త్ డ్రై పోర్ట్ ద్వారా దిగుమతి చేసుకున్న ఉత్పత్తులకు కస్టమ్స్ క్లియరెన్సు అనుమతులు ఇవ్వకపోవడంతో తాజాగా వ్యాపారులు నిరసనకు దిగారు. గత ఆరు నెలలుగా 257 కన్సైన్మెంట్లు ఇలా డ్రై పోర్ట్లోనే ఆగిపోయాయి. దీంతో కొంత సరకు పాడయింది. దీంతో వ్యాపారులు ఆర్థికంగా నష్టపోయారు. ఇదిగాక మిగిలిన సరకుకు సైతం రోజువారీ నిల్వ చార్జీలు ఇతరత్రాలు మోపడంతో వ్యాపారుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ సరకుకు మోక్షం కల్గించేదాకా కారాకోరమ్ హైవేను తెరిచేదిలేదని వ్యాపారులు భీషి్మంచుకుని కూర్చున్నారు. నగర్, హూంజా, గిల్గిత్ ప్రాంతాలకు చెందిన గిల్గిత్–బాల్టిస్తాన్ దిగుమతి, ఎగుమతిదారుల సంఘం ఆధ్వర్యంలో పాక్–చైనా ట్రేడర్స్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో ఈ ఉద్యమం కొనసాగుతోంది. హైవేపై రాకపోకలు ఆగిపోవడంతో ఇరువైపులా కిలోమీటర్ల కొద్దీ సరకు, ప్రయాణికుల వాహనాలు నిలిచిపోయాయి. -
ఎండలు ముందే ముగిశాయెందుకు?
మే నెల భానుడి ప్రచండ వేడికి పెట్టింది పేరు. రోహిణి కార్తెలో రోకళ్లు పగులుతాయని పెద్దల మాట. సూర్యప్రకోపానికి జనం విలవిల్లాడిపోయే కాలంగా ఎండాకాలం దశాబ్దాలుగా పేరు తెచ్చుకుంది. కానీ ఈసారి మే నెలలో దాదాపు వేడి మాయమై చల్లదనమే రాజ్యమేలింది. దేశవ్యాప్తంగా చాలా చోట్ల వర్షాలు పడ్డాయి. పైగా ముందస్తుగానే ఎండాకాలం జనాలకు బైబై చెప్పి వెళ్లిపోయింది. 2024లో మే, జూన్ నెలల్లో ఎండలు విపరీతంగా ఉండటంతో 2025లో ఆదిత్యుడు ఇంకెంత రెచ్చిపోతాడోనన్న భయాలను పటాపంచలు చేస్తూ ఈసారి మే నెలలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే నమోదవడం విశేషం. తక్కువ ఎండలకు తోడు తక్కువ రోజులే ఎండాకాలం కొనసాగడం గమనార్హం. వేడిమి, ఉక్కబోతతో విసుగుతెప్పించే వేసవికాలం వేగంగా గడిచిపోయింది. 2024 సంవత్సరం భూమి మీద అత్యంత ఉష్ణమయ ఏడాదిగా చరిత్రలో నిలిచిపోయింది. ఇక భారత్లో గత ఏడాది మేలో దేశవ్యాప్తంగా వడగాలులు చండ ప్రచండంగా వ్యాపించి జనాన్ని బెంబేలెత్తించాయి. ఇందుకు పూర్తి భిన్నంగా 2025 మేనెల సాగిపోవడం సాధారణ ప్రజానీకాన్ని ఆశ్చర్యంలో, ఒకింత ఆలోచనలో పడేసింది. ఈసారి దేశ వాతావరణ ముఖచిత్రంలో మార్పులొచ్చాయని కొందరు విశ్లేషణలు మొదలెట్టారు. 2024 మే, జూన్లో..గత ఏడాది మే, జూన్ నెలల్లో దేశవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదుకావడంతోపాటు వడగాల్పుల ఘటనలు చాలా చోట్ల సంభవించాయి. దీంతో చాలా ప్రాంతాల్లో కరువు తాండవించింది. దీంతో జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటాయి. నీటి లభ్యత బాగా తగ్గిపోయింది. భూగర్భజలాలు మరింత కిందకు వెళ్లిపోయాయి. విద్యుత్ కొరత సమస్య సైతం అధికమైంది. వాతావరణ మార్పులతో ముడిపడిన ఈ అధిక ఉష్ణోగ్రతల విపరిణామాలు వెనువెంటనే వ్యవసాయం, ఆరోగ్యంతోపాటు కోట్లాది మంది మధ్యతరగతి ప్రజల జీవనంపైనా దుష్ప్రభావాలు చూపాయి. వడదెబ్బకు జనం పిట్టల్లా రాలిపోయారు. 2025 మేలో అధిక ఉష్ణోగ్రతలు నమోదుకాకుండా అకాలవర్షాలు అడ్డుకున్నాయి. దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాల్లో వర్షాలు పడ్డాయి. పలు చోట్ల కుండపోత వర్షాలు కురిశాయి. వాతావరణ చక్రంలో మార్పుల కారణంగానే మేలో వేడిమి మటుమాయమై చల్లదనం వచ్చి చేరిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. చల్లదనం అత్యధిక రోజులు కొనసాగడంతో అది అంతిమంగా ఎండకాలం ముగింపునకు ముందస్తు నాంది పలికిందని నిపుణులు విశ్లేషించారు. మరెన్నో కారణాలు..వర్షాకాలం ఈసారి ముందస్తుగా ముంచుకురావడం సైతం ఎండకాలం తీవ్రతను తగ్గించేసింది. వాతావరణంలో ముందస్తుగా తేమ శాతం పెరగడం, చల్లని గాలుల క్రమానుగతిలో మార్పులు సైతం ఉష్ణోగ్రత అధికం కాకుండా అడ్డుకున్నాయి. దీంతో వేసవికాలంలో వేడి తగ్గిపోయింది. గతంతో పోలిస్తే ఈసారి ఎండాకాలంలో వాతావరణం చాలావరకు మేఘావృతమైంది. దాంతోపాటు దేశంలో మేనెలలో ప్రతిరోజూ ఏదోఒక చోట వర్షాలు పడుతూ సగటు ఉష్ణోగ్రత పెరగకుండా నిలువరించాయి. ఈ చల్లదన పరిస్థితులు పరోక్షంగా ప్రభుత్వాల మీదా పెనుభారాన్ని ఒక్కసారిగా దించేశాయి. విద్యుత్ డిమాండ్ పెరగకుండా అడ్డుకున్నాయి.ముందుకొచ్చిన కొత్త ధోరణిఉడికించే ఉష్ణోగ్రతలు ఉన్నపళంగా తగ్గిపోవడం కొన్ని రకాల పంటల దిగుబడిపైనా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చక్కటి వేడి పరిస్థితుల్లోనే కొన్నిరకాల పంటలు ఏపుగా పెరిగే పరిస్థితులు ఉంటాయని, ఈసారి ఎండలు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో ఆయా పంటల సాగుఫలంపై ప్రతికూల ప్రభావం పడొచ్చని వ్యవసాయరంగ నిపుణులు చెబుతున్నారు. ఈసారి మారిన ఈ పరిస్థితులకు తగ్గట్లు కర్షకులు తమ పంటల విత్తునాటడం మొదలు ఎరువులు, పురుగుమందులు చల్లడం దాకా ప్రతిదాంట్లో కాస్తంత సమయపాలన పాటించడం తప్పనిసరి అయిందని వాళ్లు చెబుతున్నారు. హఠాత్తుగా ఎండాకాలం వ్యవధి తగ్గి వర్షాలు మొదలవడంపై వాతావరణ విభాగం సైతం వాతావరణ ముందస్తు అంచనాల వ్యూహాలకు పదునుపెట్టింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అక్కడ ఏడాదికి 25,000 రోజులు
వాషింగ్టన్: భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగిరావడానికి 365 రోజులు పడుతుందని తెల్సిందే. అదే మాదిరి ఒక చిన్నపాటి మరుగుజ్జు గ్రహం లాంటి ఖగోళ వస్తువు మన సూర్యుని చుట్టూ అత్యంత నెమ్మదిగా తిరుగుతోంది. ఎంతగా అంటే ఒక చుట్టు చుట్టేయడానికి ఏకంగా 25,000 రోజుల సమయం తీసుకుంటోంది. సౌరమండలంలో కొత్తగా కనిపెట్టిన ఈ మరుగుజ్జు గ్రహానికి 2017 ఓఎఫ్201 అని పేరుపెట్టారు. అయితే దీనిని గ్రహం హోదా ఇవ్వాలా వద్దా అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే దీనిని పూర్తిస్థాయిలో గ్రహ లక్షణాలు లేవని తేలింది. నెప్ట్యూన్ గ్రహం ఎంత దూరంలో అయితే సూర్యుడి చుట్టూ తిరుగుతోందో అంతకంటే కాస్తంత ఎక్కువ దూరంలో ఈ అంతరిక్ష పదార్థం మన సూర్యుని చుట్టూ తిరుగుతోంది. ఇది చాలా నెమ్మదిగా పరిభ్రమిస్తోంది. ఒకసారి సూర్యుడిని చుట్టిరావడానికి 25,000 రోజుల సమయం తీసుకుంటోంది. దీని వెడల్పు ఏకంగా 700 కిలోమీటర్లు. ‘‘ కోట్ల సంవత్సరాలుగా ఒకే కక్షలో పరిభ్రమిస్తోంది. ఆ లెక్కన చూస్తే బుల్లి గ్రహం హోదా పొందే అర్హత కాస్తంత దీనికి ఉంది’’ అని అమెరికాలోని న్యూజెర్సీ కేంద్రంగా పనిచేసే ప్రిన్స్టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీలో ఖగోళ భౌతిక శాస్తవేత్త సిహావో చెంగ్ అన్నారు. మరుగుజ్జు గ్రహాల హోదా పొందిన ఐదింటిక కంటే ఈ కొత్త ఖగోళ వస్తువు కాస్తంత చిన్నగా ఉంది. గతంలో గ్రహంగా చెలామణి అయిన ఇటీవల మరుగుజ్జు గ్రహంగా స్థిరపడిపోయిన ప్లూటో వ్యాసం 2,377 కిలోమీటర్లుకాగా ఈ 2017 ఓఎఫ్201 వ్యాసం కేవలం 700 కిలోమీటర్లే! -
దక్షిణ కొరియాలో నేడే ఎన్నికలు
సియోల్: నెలల తరబడి కొనసాగిన రాజకీయ సంక్షోభం అనంతరం దక్షిణ కొరియాలో మంగళవారం అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. గత డిసెంబర్లో మార్షల్ విధించి పరువుతో పాటు అంతిమంగా పదవి కూడా కోల్పోయిన యూన్ సుక్ యెల్ స్థానంలో 4.4 కోట్ల మంది ఓటర్లు నూతన అధ్యక్షున్ని ఎన్నుకోనున్నారు. ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నా ప్రధాన పోటీ అధికార పీపుల్ పవర్ పార్టీ అభ్యర్థి కిమ్ మూన్ సూ, విపక్ష డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ కొరియా పారీ్టకి చెందిన లీ జే మ్యుంగ్ మధ్యే నెలకొంది. వారు తొలుత నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డా, మ్యుంగ్ క్రమంగా పై చేయి సాధించారు. దీనికి తోడు తాజా మాజీ అధ్యక్షుని ఏకపక్ష పోకడలను విమర్శించేందుకు సూ నిరాకరించడంతో ఆయన గ్రాఫ్ బాగా పడిపోయింది. ఈ నేపథ్యంలో 61 ఏళ్ల మ్యుంగ్ భారీ మెజారిటీతో నెగ్గడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. సాయంత్రానికల్లా ఎన్నికల ఫలితాలు వెలువడి నూతన అధ్యక్షుడు బుధవారమే బాధ్యతలు చేపడతారు. -
కెనడాలో జీ7 శిఖరాగ్రానికి మోదీ డుమ్మా!?
న్యూఢిల్లీ: కెనడాలో ఈ నెల 15 నుంచి మొదలయ్యే జీ7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ వెళ్లకపోవచ్చని తెలుస్తోంది. ఆరేళ్లుగా జీ7 సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్న ప్రధాని మోదీ మొదటిసారిగా డుమ్మా కొట్టే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. జూన్ 15–17 తేదీల మధ్య అల్బర్టాలో ఈ భేటీ జరగనుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం వంటి కీలకమైన అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లపై కూటమిలోని ప్రముఖ పారిశ్రామిక దేశాల నేతలు చర్చించనున్నారు. శిఖరాగ్రానికి రావాలంటూ ప్రధాని మోదీకి కెనడా ఇప్పటి వరకు ఆహ్వాన సైతం పంపలేదు. ఇప్పటికిప్పుడు ఆహ్వానం వచ్చినా ఇరుదేశాల మధ్య నెలకొన్న సంబంధాలు, వేగంగా మారుతున్న అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సన్నద్ధతకు సమయం పడుతుందని చెబుతున్నారు. జీ7 కూటమిలో అమెరికా, యూకే, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్ సభ్యదేశాలు కాగా, ప్రస్తుతం కెనడా అధ్యక్షత బాధ్యతల్లో ఉంది. -
పోలండ్ అధ్యక్షుడిగా కరోల్ ఎన్నిక
వార్సా: పోలండ్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో కన్జర్వేటివ్ లా అండ్ జస్టిస్ పార్టీకి చెందిన కరోల్ నవ్రొకి(42) ఎన్నికయ్యారు. అత్యంత ఉత్కంఠగా సాగిన పోరులో నౌరొకికి 50.89% శాతం ఓట్లు రాగా, ప్రత్యర్థి, వార్సా మేయర్ రఫాల్ ట్రస్ కోవ్స్కీకి 49.11% ఓట్లు పోలయ్యాయి. రెండు వారాల క్రితం జరిగిన మొదటి రౌండ్ ఓటింగ్ సమయంలో ఈయూ, నాటో అనుకూల పార్టీల మధ్య నెలకొన్న తీవ్ర విభేదాలు తేటతెల్ల మయ్యాయి. ఆదివారం సాయంత్రం ప్రకటించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో రఫాల్ ట్రస్కోవ్స్కీ ముందంజలో ఉన్నారు. కేవలం రెండు గంటల్లోనే ఫలితం తారుమారవడం గమనార్హం. ఓటమిని అంగీకరించిన ట్రస్కోవ్స్కీ సోమవారం నవ్రొకికి అభినందనలు తెలిపారు. మాజీ బాక్సర్, చరిత్రకారుడు, అయిన నవ్రొకికి ఎటువంటి రాజకీయ అనుభవం లేదు. నవ్రొకికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ప్రకటించడం విశేషం. ఆయనకే గెలుపు అవకాశాలున్నాయని కూడా వ్యాఖ్యానించారు. నవ్రొకి ఎన్నికల కార్యక్రమాల్లో అమెరికా జెండాలు సైతం కనిపించడం గమనార్హం. వైట్హౌస్కు రావా లంటూ నెల క్రితమే నవ్రొకిని ట్రంప్ ఆహ్వానించారు. -
ఆపరేషన్ స్పైడర్స్వెబ్...నయా పెరల్ హార్బర్!
నాటో దేశాలు నిరంతరం ఆయుధాలతో సహా సర్వ సామగ్రీ సమకూరుస్తుంటే తప్ప యుద్ధరంగంలో పూట గడవని పరిస్థితి ఉక్రెయిన్ది. అవతలున్నదేమో అపార సైనిక పాటవానికి మారుపేరైన రష్యా. అలాంటి అగ్రరాజ్యానికి చెందిన ఏకంగా 41 బాంబర్ విమానాలను ఏదో వీడియోగేమ్ ఆడుతున్నంత అలవోకగా దాని సొంతగడ్డ మీదే ధ్వంసం చేసిన తీరు ప్రపంచవ్యాప్తంగా పెను కలకలం సృష్టించింది. అది కూడా ఏ ఒక్కచోటో కాదు. రష్యావ్యాప్తంగా ఏకంగా మూడు టైమ్ జోన్లలో, ఏకంగా 6,000 కి.మీ. పరిధిలో ఉన్న ఐదు వైమానిక స్థావరాలపై ఏకకాలంలో విజయవంతంగా దాడులు జరగడం విశేషం. ఆ దెబ్బకు రష్యా బాంబర్ శ్రేణి విమానాల్లో మూడో వంతు తుడిచిపెట్టుకుపోయాయి! అత్యంత సంక్లిష్టమైన ఇంతటి ఆపరేషన్ను పూర్తి కచ్చితత్వంతో, కేవలం డ్రోన్ల సాయంతో కారుచౌకగా, తనవైపు ఎలాంటి ప్రాణనష్టమూ లేకుండా పూర్తి చేసిన వైనం రక్షణ నిపుణులనే విస్మయపరిచింది. ఆధునిక ప్రపంచ యుద్ధ చరిత్రలోనే అతి పెద్ద, అత్యంత సంక్లిష్టమైన సర్జికల్ స్ట్రైక్ ఇదేనని చెబుతున్నారు. అంతేగాక ఏ కోణం నుంచి చూసినా అత్యంత విజయవంతమైన దాడిగా కూడా ఇది నిలిచింది. రష్యా చరిత్రలో అతి పెద్ద నిఘా వైఫల్యంగా కూడా ఇదేనని చెబుతున్నారు. ఈ దాడులను తమ పాలిట ‘పెరల్ హార్బర్’ ఉదంతంగా రష్యా మీడియానే అభివర్ణిస్తోంది. రెండో ప్రపంచయుద్ధం చివర్లో హవాయిలోని పెరల్ హార్బర్పై జపాన్ మెరుపు దాడులకు దిగి అమెరికా యుద్ధనౌకలను సముద్రంలో ముంచేసింది. ఈ ఉదంతం అమెరికాను యుద్ధంలోకి లాగడమే గాక జర్మనీ, జపాన్ తదితర అక్షదేశాల ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. ‘ఆపరేషన్ స్పైడర్స్వెబ్’ పేరిట ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడులు రష్యాను ఆ స్థాయిలో దెబ్బకొట్టాయని అక్కడి మీడియా వాపోతోంది. అది అక్షరాలా నిజమేనని రక్షణ నిపుణులు ముక్త కంఠంతో చెబుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ ఆధునిక యుద్ధ వ్యూహాలను తక్షణం సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని ఇది మరోసారి గుర్తు చేసిందని వారంటున్నారు.ఇంత భారీ ఆపరేషన్కు రష్యా గడ్డ మీద కూడా అవసరమైన మద్దతు తప్పనిసరి. ఇందుకోసం ఉక్రెయిన్ రష్యాలో ఏకంగా ఆఫీసే తెరిచింది! అది కూడా రష్యా అంతర్గత భద్రతా విభాగం ఎఫ్ఎస్బీ కార్యాలయం పక్కనేనని జెలెన్స్కీ వెల్లడించడం విశేషం. ఏ ప్రాంతంలో అన్నది మాత్రం చెప్పలేదు. → మొత్తం ఆపరేషన్ను ఉక్రెయిన్ సీక్రెట్ సరీ్వస్ (ఎస్బీయూ) పక్కాగా నిర్వహించింది.→ దీన్ని జెలెన్స్కీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. దాడి వెనక ఏడాదిన్నర ప్రణాళిక ఉన్నట్టు వెల్లడించారు. ‘‘రష్యా గడ్డ నుంచే ఎంతోమంది ఇందుకు తోడ్పడ్డారు. వారందరినీ దాడులకు ముందే సురక్షితంగా తరలించాం. మావైపు ప్రాణనష్టం లేకుండా రష్యాను చావుదెబ్బ తీశాం’’ అన్నారు. రష్యాపై మరిన్ని దాడులు తప్పవన్నారు.→ డ్రోన్ దాడుల అనంతరం రష్యా ప్రతీకార దాడుల్లో 12 మంది ఉక్రెయిన్ సైనికుల మృతికి బాధ్యత వహిస్తూ ఉక్రెయిన్ పదాతి దళాధిపతి మేజర్ జనరల్ మైకేలియో ద్రాపత్యు రాజీనామా చేశారు.ఎక్కడెక్కడ దాడులు... → ఒలెన్యా (ముర్మాన్స్క్ ), బెలయా (ఇర్కుట్స్క్ –సైబీరియా), ద్యాగిలెవొ (సెంట్రల్ ర్యాజాన్), ఇవనొవొ → ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి బెలయా ఏకంగా 4,000 కి.మీ. దూరంలో ఉంటుంది! → వీటిలో ఒలెన్యా, బెలయా స్థావ రాల మధ్య దూరం ఏకంగా 6,000 కి.మీ.! ఇవి పరస్పరం మూడు టైమ్ జోన్ల దూరంలో ఉండటం విశేషం. → అమూర్, ఇవనోవో, ర్యాజన్ తదితర ప్రాంతాల్లోనూ డ్రోన్ దాడుల యత్నాలు జరిగాయని రష్యా ధ్రువీకరించింది.గతంలోనూ... మూడేళ్ల పై చిలుకు యద్ధంలో అనూహ్య, ఆకస్మిక దాడులతో రష్యాకు ఉక్రెయిన్ తీవ్ర నష్టం కలిగించడం ఇది తొలిసారేమీ కాదు. → 2022 ఏప్రిల్లో రష్యా యుద్ధనౌక మోస్క్ వాను నెప్ట్యూన్ యాంటీ షిప్ మిసైళ్లతో ఉక్రెయిన్ నల్లసముద్రంలో ముంచేసింది. ళీ 2022 అక్టోబర్లో ఆక్రమిత క్రిమియాను రష్యా భూభాగానికి కలిపే కీలక కెర్చ్ బ్రిడ్జిని బాంబులతో పేల్చేసింది. ళీ 2024 ఆగస్టులో ఉక్రెయిన్ సైన్యం తొలిసారిగా సరిహద్దులు దాటి రష్యా భూభాగంపై మెరుపు దాడులకు దిగి కుర్క్స్ ప్రాంతాన్ని స్వా«దీనం చేసుకుంది. తీరని అవమానం మిగిల్చిుంది!ట్రక్కుల్లో తరలించి...సింపుల్ ప్లానింగ్. పూర్తి గోప్యత. పక్కా రిహార్సల్స్. ఆకస్మిక దాడి. అమలులో మెరుపువేగం. 100 శాతం లక్ష్యసాధన. సర్జికల్ స్ట్రైక్స్ వంటి స్పెషల్ ఆపరేషన్స్ ఏ మేరకు సఫలమైందీ తేల్చేందుకు ప్రఖ్యాత సైనిక నిపుణుడు అడ్మిరల్ విలియనం మెక్రావెన్ సిద్ధాంతీకరించిన గీటురాళ్లు. వాటన్నింటినీ పూర్తిస్థాయిలో మేళవించిన ఆపరేషన్గా స్పైడర్స్ వెబ్ నిలిచింది. → మొత్తం ఆపరేషన్లో ఉక్రెయిన్ చాలావరకు పౌర మౌలిక సదుపాయాలనే వాడుకుంది. → ఇంతటి భారీ స్థాయి దాడులకు ప్రణాళిక రచించిన ఉక్రెయిన్, అందుకు సిద్ధం చేసిన డ్రోన్లను రష్యాలోకి తేలిగ్గా దొంగచాటుగా తరలించడం విశేషం. → అనంతరం వాటిని ట్రక్కుల్లో చెక్క కంటైనర్లలో పెట్టి ఎయిర్బేస్లకేసి తరలించారు. → ఒక్కో కంటైనర్లో 36 డ్రోన్లను ఉంచారు. వాటిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. → దాడుల్లో ఎక్కడా ప్రత్యక్షంగా సిబ్బందిని నియోగించే అవసరమే లేకుండా పకడ్బందీగా ముందస్తు ఏర్పాట్లు చేశారు. → ట్రక్కులను వైమానిక స్థావరాలకు అతి సమీపంలోకి తీసుకెళ్లారు. → అక్కడినుంచి నిర్ధారిత సమయంలో కంటైనర్ల పైకప్పును రిమోట్ ద్వారా తెరిచారు. → ఆ వెంటనే వాటిలోంచి డ్రోన్లు పైకెగిరి లక్ష్యాలపైకి దూసుకెళ్లాయి. సరిగ్గా విమానాలపై పడి పేలిపోయాయి. కంటైనర్ల నుంచి డ్రోన్లు పైకి ఎగురుతున్న దృశ్యాలతో కూడిన వీడియోలను రష్యా మీడియా విడుదల చేసింది. వాటిని అడ్డుకునేందుకు కొందరు సాయుధులు ట్రక్కులపైకి ఎక్కుతున్న దృశ్యాలు కూడా కొన్నింట్లో కనిపిస్తున్నాయి.కారుచౌకే.. కానీ ఖతర్నాక్ రష్యా ఎయిర్బేస్లపై దాడుల్లో ఉక్రెయిన్ వాడింది ఎఫ్పీవీ (ఫస్ట్ పర్సన్ వ్యూ) రకం డ్రోన్లు. → ఇవి కారుచౌకగా దొరుకుతాయి. పేలుడు పదార్థాలను బిగించి పంపగల ఒక్కో ఎఫ్పీవీ డ్రోన్ ఖరీదు కేవలం రూ.42 వేలు మాత్రమేనని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. → అయితే గురితప్పకుండా లక్ష్యాన్ని ఛేదించడంలో వీటికివే సాటి. → డ్రోన్కు అమర్చిన కెమెరా సాయంతో అక్కడి పరిసరాలను దాని ఆపరేటర్ ప్రత్యేక కళ్లద్దాల సాయంతో లైవ్లో చూడటమే గాక వీడియో తీయగలడు. రిమోట్గా ఆపరేట్ చేయగలడు. → పరిసరాల చిత్రీకరణ వంటి సైనికేతర పనుల్లో ఈ డ్రోన్లను విరివిగా వాడుతుంటారు. వీటి రేంజ్ కొన్ని కిలోమీటర్లకే పరిమితం.రష్యా అణుదాడి చేస్తుందా...? ఉక్రెయిన్ డ్రోన్ దాడులపై రష్యా తీవ్ర అవమాన భారంతో ఉడికిపోతోంది. కారుచౌకైన డ్రోన్లతో కోలుకోలేని దెబ్బతీయడాన్ని జీర్ణం చేసుకోలేకపోతోంది. దీనికి ప్రతీకారం తప్పదని రష్యా రక్షణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. కనుక ఉక్రెయిన్పై భారీ స్థాయిలో విరుచుకుపడటం ఖాయమే. → ఉక్రెయిన్ ప్రధానంగా నాటో సభ్యదేశాలు సమకూర్చిన ఆయుధాలనే తనపై వాడుతోంది. కనుక యూరప్లోని నాటో దేశాల్లోని సైనిక స్థావరాలు, ఆయుధాగారాలను రష్యా లక్ష్యంగా చేసుకోవచ్చు. వాటిపై దాడులు చేస్తామని గతంలోనే ఎన్నోసార్లు హెచ్చరించింది కూడా. → ఉక్రెయిన్ బహుశా ఈ ప్రమాదాన్ని ముందే ఊహించింది. డ్రోన్ దాడులు పూర్తిగా తన పనేనని, నాటో మిత్రులకు ఏ సంబంధమూ లేదని జెలెన్స్కీ ప్రకటించారు. వాణిజ్యపరంగా సులువుగా అందుబాటులో ఉన్న డ్రోన్లనే దాడుల్లో వాడినట్టు వివరించారు. అందుకు రుజువుగా దాడుల ఫొటోలను విడుదల చేశారు. → నష్ట, అవమాన తీవ్రత దృష్ట్యా ఉక్రెయిన్పై రష్యా అణుదాడికి దిగినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు.రష్యాకు నష్టం ఇలా... → 41 టీయూ–95, టీయూ–22ఎం3 దీర్ఘ శ్రేణి బాంబర్లు, దాడుల్లో వాటికి ఆద్యంతం దన్నుగా నిలిచే ఏ–50 నిఘా విమానాలపై డ్రోన్ దాడులు జరిగాయి. → వాటిలో 14 పూర్తిగా, మిగతా 27 చాలావరకు ధ్వంసమైనట్టు చెబుతున్నారు. → మూడున్నరేళ్లుగా ఉక్రెయిన్పై క్షిపణి, బాంబు దాడులకు రష్యా ప్రధానంగా ఉపయోగిస్తున్నది ఈ విమానాలనే! → ఈ నష్టం విలువ కనీసం రూ.60 వేల కోట్ల (700 కోట్ల డాలర్ల)పై చిలుకేనని రష్యా రక్షణ శాఖే అంచనా వేసింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏకాంత వీడియోలు ఒక్కొక్కరివిగా బయటకు..!
పొరుగుదేశం పాకిస్తాన్లో డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్ల కమ్యూనిటీని వణికిపోతోంది. గత కొన్నిరోజులుగా అక్కడి ఇన్ఫ్లుయెన్సర్ల పరువు బజారున పడుతోంది. వరుసబెట్టి ఒక్కొక్కరి ఏకాంత వీడియోలు బయటకు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై జనాలు వాళ్లను తిట్టిపోస్తుండగా.. మరోవైపు వాళ్ల కవరింగ్లు, వివరణలు, చట్టపరమైన చర్యలతో ప్రస్తుతం ఈ అంశం అక్కడ హాట్ టాపిక్గా మారింది.పాక్లో టిక్టాక్, ఇన్స్టాగ్రామ్లతో పాపులర్ అయిన కొందరు యువతుల ప్రైవేట్ వీడియోలు గత కొన్నిరోజులుగా వైరల్ అవుతున్నాయి. విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న మినాహిల్ మాలిక్, ఇమ్షా రెహమాన్ల వీడియోలు తొలుత సర్క్యులేట్ కావడంతో.. వాళ్లకున్న మిలియన్ల ఫాలోవర్లు షాక్కు గురయ్యారు. ఆ వెంటనే టాక్ షోలు, మ్యూజిక్ వీడియోలతో పాపుల్ అయిన మథీరా ఖాన్ వీడియో వైరల్ అయ్యింది. తాజాగా.. కన్వాల్ అఫ్తాబ్ అనే మరో ఇన్ఫ్లుయెన్సర్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.ఈ వీడియోలను ఆ ఇన్ఫ్లుయెన్సర్లు(Influencers) ఖండిస్తున్నారు. అవి తమవి కావని, ఇదంతా ఏఐ సృష్టి అని వివరణలు ఇస్తున్నారు. పనిలో పనిగా ఫిర్యాదులు చేస్తూ.. చట్టపరమైన చర్యలకు వెెళ్తున్నామని ప్రకటించారు. మినాహిల్ ఓ అడుగు ముందుకు వేసి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. అయితే ఆ కామెంట్ తీవ్ర విమర్శలకు దారి తీసింది. అందుకు కారణం.. ఆమె చేసింది బాలీవుడ్ నటి కరీనా కపూర్ గతంలో చెప్పిన మాటలు కావడం!.ఇదిలా ఉంటే.. ఈ డర్టీ వ్యవహారంలో భారత్ ప్రస్తావనతో అక్కడి టీవీ చానెల్స్లో చర్చలు నడిపిస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) నేపథ్యంతో అక్కడి మీడియా ఛానెల్స్ను, సోషల్మీడియా ఇన్ఫ్లుయెన్సర్లలో చాలామందిని భారత్ నిషేధించింది. ఈ క్రమంలో ఇది భారత్ నుంచి జరుగుతున్న వ్యవహారమేనని అక్కడి మీడియా చర్చ జరపడాన్ని ప్రస్తావిస్తూ.. భారత్కు చెందిన ఎకనామిక్ టైమ్స్ ప్రముఖంగా ఓ కథనం ఇచ్చింది.SHOCKING NEWS 🚨 Private videos of several Pakistani influencers of Pakistan have leaked online.Pakistan’s influencer community is facing a wave of scandals one after another 😱After viral incidents involving TikTok stars Minahil Malik and Imsha Rehman, now videos of Mathira… pic.twitter.com/rFdRAPIBY8— BALA (@erbmjha) June 1, 2025 -
‘ఉగ్రవాదానికి తావు లేదు’: కొలరాడో దాడిపై శశి థరూర్
న్యూఢ్లిల్లీ: పాకిస్తాన్ కేంద్రంగా విస్తరిస్తున్న ఉగ్రవాదంపై పలు దేశాలకు తెలియజేస్తూ, అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్(MP Shashi Tharoor), కొలరాడోలో జరిగిన దాడిపై ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశం, యునైటెడ్ స్టేట్స్లో ఉగ్రవాదానికి తావులేదన్నారు.కొలరాడోలోని బౌల్డర్లో జరిగిన ఉగ్ర దాడిపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందించారు. ‘బౌల్డర్లో ఈరోజు జరిగిన ఉగ్రదాడి గురించి భారత ఎంపీల ప్రతినిధి బృందం సభ్యులు తెలుసుకున్నారని, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలియగానే ఉపశమనం పొందామని, ఉగ్రవాదానికి మన దేశాలలో స్థానం లేదు’ అని శశిథరూర్ తన ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు. థరూర్ ప్రతినిధి బృందం ప్రస్తుతం బ్రెజిల్(Brazil)లో ఉంది. మంగళవారం అమెరికాకు చేరుకోనుంది. Members of the Indian MPs’ delegation learned with concern about the terror attack in Boulder, Colorado today. We are relieved there was no loss of life.We all share Secy of State @SecRubio’s view that “terror has no place” in our countries.#boulderattack @IndianDiplomacy…— Shashi Tharoor (@ShashiTharoor) June 2, 2025కొలరాడోలోని బౌల్డర్ డౌన్ టౌన్లోని కోర్టు భవనం సమీపంలో మొహమ్మద్ సబ్రీ సోలిమాన్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడని, ఈ దాడిలో అనుమానితుడు కాక్టెయిల్స్, తాత్కాలిక ఫ్లేమ్త్రోవర్ను ఉపయోగించాడని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఈ దాడిలో ఆరుగురు గాయపడ్డారు.ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారం దాడికి పాల్పడిన వ్యక్తి ‘ఫ్రీ పాలస్తీనా’ అంటూ కేకలు వేశాడు. హమాస్ నిర్బంధంలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలని కోరుతూ ‘రన్ ఫర్ దేర్ లైవ్స్’పేరుతో కార్యక్రమం నిర్వహిస్తుండగా, అక్కడికి సమీపంలోనే ఈ దాడి జరిగిందని యాంటీ-డిఫమేషన్ లీగ్ తెలిపింది. ఇది కూడా చదవండి: ఒక్కరోజులో 415.8 మి.మీ వర్షపాతం.. ఎక్కడంటే.. -
OP Spider Web: రష్యాకు తగిన శాస్తే జరిగింది
కీవ్: ఉక్రెయిన్ తాజాగా రష్యా సైనిక వైమానిక స్థావరాలపై భీకర డ్రోన్ దాడులకు పాల్పడింది. ఈ మెగా దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ(Ukrainian President Zelensky) సమర్థించుకున్నారు. ఇది అద్భుతమైన ఆపరేషన్గా అభివర్ణించిన ఆయన.. రష్యాకు భారీ స్థాయిలో నష్టం కలిగించిందని, ఆ దేశానికి తగిన శాస్తేనని ప్రకటించారు.Today, a brilliant operation was carried out — on enemy territory, targeting only military objectives, specifically the equipment used to strike Ukraine. Russia suffered significant losses — entirely justified and deserved.— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) June 1, 2025‘స్పైడర్స్ వెబ్’ పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్లో ఉక్రెయిన్ మొత్తం 117 డ్రోన్లను ఉపయోగించిందని, దీనికి తగిన సంఖ్యలో డ్రోన్ ఆపరేటర్లు పాల్గొన్నారని జెలెన్స్కీ చెప్పారు. వారు రష్యా వైమానిక స్థావరాలలో ఉంచిన వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణి వాహక నౌకలను ఢీకొట్టేలా చేశారని పేర్కొన్నారు. తమ సిబ్బంది ఈ దాడులు చేసేందుకు ఏడాది పాటు ప్రణాళిక వేశారని, అది ఇప్పుడు ఇది సంపూర్ణంగా అమలయ్యిందని, ఇది పూర్తిగా ప్రత్యేకమైన ఆపరేషన్(Special operation) అని గట్టినమ్మకంతో చెబుతున్నానని జెలెన్స్కీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఈ దాడితో రష్యన్లు 40 యూనిట్లకు పైగా వ్యూహాత్మక వైమానిక స్థావరాలను కోల్పోవడం తనకు సంతృప్తికరంగా అనిపించిందని, తాము ఇటువంటి దాడులను ఇకముందు కూడా కొనసాగిస్తామని జెలెన్స్కీ తెలిపారు. ఈ దాడిలో కీవ్ సహాయం అందించిన వారిని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు ఆయన తెలిపారు. తాము దాడి చేయడానికి కొద్దిసేపటి ముందు, తమకు రష్యా మరో దాడికి సిద్ధమవుతోందని ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందిందని ఆయన అన్నారు. ఉక్రెయిన్ ప్రజలను అన్ని విధాలుగా రక్షించుకుంటామని అన్నారు. తాము ఈ యుద్ధాన్ని కోరుకోలేదని, యుద్ధాన్ని కొనసాగించాలని ఎంచుకున్నది రష్యన్లే అని జెలెన్స్కీ ఆరోపించారు. ఇస్తాంబుల్లో మాస్కో- కైవ్ మధ్య జరగనున్న శాంతి చర్చలకు ఒక రోజు ముందు ఉక్రెయిన్ ఈ దాడులకు దిగడం గమనార్హం. ఇదిలా ఉంటే.. రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం 2022 ఫిబ్రవరి లో ప్రారంభమైంది. ఇరు దేశాలు పరస్పరం సరిహద్దు షెల్లింగ్, డ్రోన్ దాడులు, రహస్య దాడులు చేసుకుంటున్నాయి. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. ఈ యుద్ధాన్ని ముగించడానికి ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని ఆయన సూచించారు.ఇది కూడా చదవండి: రష్యా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి -
ఒంటరి నిర్బంధమే... భరించలేని శిక్ష
ఇవావో హకామడ. ఇటీవల అంతర్జాతీయంగా మారుమోగిన కేసు. జపాన్లో శిక్షల తీవ్రత, అక్కడి నేర న్యాయవ్యవస్థ గురించి మరోసారి చర్చకు తెరతీసిన కేసు. 89 ఏళ్ల హకామడ మాజీ ప్రొఫెషనల్ బాక్సర్. తను పనిచేసే సంస్థ యజమానిని, అతడి కుటుంబాన్ని హత్య చేశాడన్న ఆరోపణలపై 1968లో కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. దాని అమలును పెండింగ్లో పెట్టడంతో ఏకంగా 50 ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపాడు! ప్రపంచంలో అత్యంత ఎక్కువ కాలం జైలు జీవితం గడిపిన మరణశిక్ష ఖైదీగా రికార్డులకెక్కాడు. అయితే, పోలీసుల చిత్రహింసలకు తట్టుకోలేకే చేయని నేరాన్ని ఒప్పుకోవాల్సి వచ్చిందని హకామడ ఇటీవల వాపోయాడు. ఈ కేసులో సాక్ష్యాలు తారుమారైనట్టు షిజుయోకా జిల్లా కోర్టు కూడా 2024 మార్చిలో అనుమానం వ్యక్తం చేసింది. పునర్విచారణకు ఆదేశిస్తూ హకామడను విడుదల చేసింది. అనంతరం 2024 సెప్టెంబర్ 26న అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. అర్ధశతాబ్దానికి పైగా అక్రమంగా నిర్బంధించినందుకు 21.7 కోట్ల యెన్లు (సుమారు రూ.12.5 కోట్లు) నష్టపరిహారంగా చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జపాన్లో అత్యధిక క్రిమినల్ నష్టపరిహారంగా ఇది రికార్డు సృష్టించింది. దీని వెనక హకామడ సోదరి హిడెకో దశాబ్దాల పోరాటం దాగుంది. లాయర్లను కలవడం, పిటిషన్లు వేయడం, ప్రజా మద్దతు కూడగట్టడం... ఇలా ఆమె చేయని ప్రయత్నం లేదు. కానీ సోదరుడు ఎట్టకేలకు విడుదలయ్యాడన్న ఆనందం కూడా ఆమెకు మిగల్లేదు. 55 ఏళ్ల ఒంటరి నిర్బంధం హకామడ మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీయడమే అందుకు కారణం. జపాన్ జైళ్లలో ఖైదీల దుస్థితికి ఇది తాజా తార్కాణంగా నిలిచింది.రాత్రంతా రోదనే!జపాన్ జైళ్లలో అత్యంత కఠిన నిబంధనలు అమలవుతాయి. పలు నేరాలకు ఒంటరి నిర్బంధాన్ని శిక్షగా అమలు చేస్తారు. తోటి ఖైదీలతో మాట్లాడటం దేవుడెరుగు, తమలో తాము కూడా గట్టిగా మాట్లాడుకునేందుకు అనుమతి ఉండదు! పైగా వారిని కలిసేందుకు కుటుంబీకులు, లాయర్లను తప్ప స్నేహితులతో పాటు ఎవరినీ అనుమతించరు. ఉత్తర ప్రత్యుత్తరాలను పూర్తిగా సెన్సార్ చేస్తారు. వ్యక్తిగత వస్తువులను అత్యంత పరిమితంగా అనుమతిస్తారు. కూర్చోవడం, నడవడం, మాట్లాడటం, తినడం, నిద్రపోవవడం అన్నీ పక్కాగా టైం ప్రకారం చేయాల్సిందే. ఒక్క సెకను అటూ ఇటూ అయినా శిక్ష తప్పదు. అతి శీతల వాతావరణంలో కూడా టోపీలు, గ్లవ్స్ ధరించడానికి వీల్లేదు. అధికారులపై ఫిర్యాదుకు, సంఘటితం కావడానికి హక్కుండదు. ఏ నిబంధనను కాస్త ఉల్లంఘించినా గార్డుల చేతిలో చావుదెబ్బలే! గంటల తరబడి మోకాళ్లపై కూర్చోబెడతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఖైదీలు తీవ్రంగా కుంగిపోతుంటారు. అయితే ఏడ్వడంపై ఆంక్షలు లేవు. దాంతో చాలామంది ఖైదీలు రాత్రిళ్లు ఏడుస్తుంటారు. ఖైదీలను ఇలా ఏళ్లపాటు ఒంటరిగా నిర్బంధించడంపై హ్యూమన్ రైట్స్ వాచ్, ఆమ్నెస్టీ వంటి మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయినా జపాన్ న్యాయవ్యవస్థలో దశాబ్దాలుగా ఎలాంటి సంస్కరణలు జరగలేదు.శిక్షలు అత్యంత కఠినంజపాన్లో శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. చిన్న నేరాలకు కూడా జైలు శిక్షలు, భారీ జరిమానాలు విధిస్తారు. కొద్ది మోతాదులో డ్రగ్స్ దొరికినా, వాడినా ఏడాది నుంచి పదేళ్ల జైలు, 50 లక్షల యెన్ల జరిమానా విధించవచ్చు. క్రిమినల్ కేసులు రుజువయ్యే రేటు ఏకం 99 శాతం! బలమైన సాక్ష్యాలుండి, గెలుస్తామని నమ్మిన కేసులనే ప్రాసిక్యూటర్లు దాఖలు చేస్తారు. చాలా కేసుల్లో విచారణకు ముందే నిందితులు నేరం అంగీకరిస్తారు. కనుక జపాన్లో ఒకసారి అభియోగాలు నమోదైతే ఇక నిర్దోషిగా బయటపడటం అసాధ్యమేనన్న విమర్శలూ ఉన్నాయి.నేరాలు చాలా తక్కువప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాల్లో ఒకటిగా జపాన్కు పేరుంది. సమర్థ నేర న్యాయవ్యవస్థ దాని సొంతం. 2023లో అక్కడ నమోదైన మొత్తం నేరాలు కేవలం 7 లక్షలు. వాటిలో అత్యధికం దొంగతనాలే. అరెస్టు తర్వాత అనుమానితులను 48 గంటల దాకా అదుపులో ఉంచుకునే అధికారం పోలీసు లకు ఉంది. తర్వాత కేసును ప్రాసిక్యూటర్కు అప్పగిస్తారు, వారు 24 గంటల్లోపు నిందితుడిని విచారించి తదుపరి నిర్బంధానికి న్యాయమూర్తి అనుమతి పొందాలి. అలా 23 రోజుల దాకా నిర్బంధించొచ్చు. ఈ విధానంపై అనేక విమర్శలున్నాయి.జైలు గోడలు బద్దలైనా... ఒక్కరూ పారిపోలేదు!జైళ్లలో తీవ్ర నిర్బంధ పరిస్థితులున్నా పారిపోయేందుకు మాత్రం ఖైదీలు కల్లో కూడా సాహసించరు! దొరికితే శిక్షల తీవ్రత రెట్టింపవుతుంది మరి! పైగా జపాన్లో తప్పించుకుని ఎంతోకాలం తిరగడం అసాధ్యం. 1923 సెప్టెంబర్ 1న తీవ్ర భూకంపానికి యొకోహామాలో జైలు గోడ కూలింది. ఆ సమయంలో జైల్లో 1,100 మంది ఖైదీలున్నా కనీసం ఒక్కరు కూడా పారిపోలేదు. కూలిన గోడల లోపలే గడిపారు. దాంతో ముచ్చటపడ్డ జైలు డైరెక్టర్ ఖైదీలను ఒక రోజంతా బయటి తిరిగొచ్చేందుకు అనుమతించారు. 24 గంటలు పూర్తవుతూనే ప్రతి ఖైదీ టంచనుగా తిరిగొచ్చాడు! -
రష్యా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి
మాస్కో: ఉక్రెయిన్ తాజాగా రష్యాపై డ్రోన్ దాడులతో విరుచుకు పడింది. రష్యన్ భూభాగంలోని ఐదు ఎయిర్బేస్(Airbase)లపై ఉక్రెయిన్ దాడి చేసింది. దీనిపై రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ ‘కైవ్ (ఉక్రెయిన్)ప్రభుత్వం.. ముర్మాన్స్క్, ఇర్కుట్స్క్, ఇవనోవో, రియాజాన్,అముర్ ప్రాంతాలలోని వైమానిక స్థావరాలపై ఎఫ్పీవీ డ్రోన్లను ఉపయోగించి, ఉగ్ర దాడికి పాల్పడింది. అయితే తమ సైన్యం ఆ ఉగ్ర దాడులను తిప్పికొట్టింది. సైనికులకు, పౌరులకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ దాడుల్లో పాల్గొన్న కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం’ అని ఒక ప్రకటనలో తెలిపింది.ఈ దాడులలో తమ విమానాలు కొన్ని ఆహుతయ్యాయని రష్యా తెలిపింది. ముర్మాన్స్క్, ఇర్కుట్స్క్ ప్రాంతాలలోని సైనిక వైమానిక స్థావరాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల నుండి ఎఫ్పీవీ డ్రోన్(FPV drone)లను ప్రయోగించడంతో పలు విమానాలు మంటల్లో చిక్కుకున్నాయి. ఆ తరువాత మంటలు ఆరిపోయాయని రష్యా పేర్కొంది. అయితే తాము చేపట్టిన ఈ దాడిలో రష్యాకు చెందిన 40 విమానాలు దెబ్బతిన్నాయని ఉక్రెయిన్ తెలిపింది. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ (ఎస్బీయూ) ఈ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించిందని ఉక్రెయిన్ మీడియా పేర్కొంది.రష్యా- ఉక్రెయిన్లు ఇస్తాంబుల్లో రెండవ దఫా శాంతి చర్చలు ప్రారంభించనున్న తరుణంలో ఈ దాడులు చోటుచేసుకున్నాయి. ఉక్రెయిన్ ప్రచురణ సంస్థ ప్రావ్దా అందించిన వివరాల ప్రకారం ఉక్రెయిన్ ఈ దాడులకు ఏడాదిగా ప్లాన్ చేసింది. డ్రోన్లు బయటకు దూసుకువచ్చి, లక్ష్యంగా ఎంచుకున్న వైమానిక స్థావరాలపై దాడులు చేశాయి. క్షిపణుల ఆయుధాగారం లేని ఉక్రెయిన్ దానికి బదులుగా దాడులకు తెగబడేందుకు భారీగా డ్రోన్లను సమకూర్చుకుంది. ఇది కూడా చదవండి: దడ పుట్టించిన దుమ్ము తుఫాను.. గాలిలో విమానం చక్కర్లు -
లవర్ను నమ్మి 30 కోట్ల కానుక.. పుట్టినరోజున అదిరిపోయే ట్విస్ట్
మాంట్రియల్: మాజీ ప్రియుడికి వచ్చిన రూ.30 కోట్ల లాటరీ సొమ్ము తీసుకోని ఓ యువతి తన కొత్త ప్రియుడితో పారిపోయింది. జరిగిన మోసాన్ని గుర్తించి లబోదిబోమన్న ఆ బాధితుడు తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితుడు కోర్టుకెక్కాడు. ఈ సంఘటన కెనడాలో చోటుచేసుకుంది.అసలేం జరిగిందంటే.. విన్నీపెగ్ పట్టణానికి చెందిన లారెన్స్ క్యాంప్బెల్, క్రిస్టల్ యాన్ మెక్కే ప్రేమించుకున్నారు. ఏడాదిన్నరపాటు కలిసి ఓ హోటల్ గదిలో జీవించారు. క్యాంప్బెల్ 2024లో ఓ లాటరీ టికెట్ కొన్నాడు. ఆ టికెట్కు ఇటీవలే జాక్పాట్ తగిలింది. క్యాంప్బెల్ 5 మిలియన్ డాలర్ల (రూ.30 కోట్లు) సొమ్ము గెలుచుకున్నాడు. కానీ, ఈ డబ్బు తీసుకోవాలంటే అతడి వద్ద సరైన గుర్తింపు కార్డు లేదు. బ్యాంకు ఖాతా కూడా లేదు. వెస్ట్రన్ కెనడా లాటరీ కార్పొరేషన్ నుంచి లాటరీ సొమ్ము తీసుకోవడానికి తన ప్రియురాలి సాయం కోరాడు. ఆమెను పూర్తిగా నమ్మాడు.ఈ క్రమంలో ఆమె తన ఐడీ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించడంతో ఎట్టకేలకు లాటరీ సొమ్ము ఆ ఖాతాలోకి చేరింది. ఆ సయయంలో లారెన్స్ క్యాంప్బెల్, క్రిస్టల్ యాన్ మెక్కే నమూనా చెక్కును చేతపట్టుకొని ఫొటోలకు, వీడియోలకు ఫోజులిచ్చారు. ఇది తనకు క్యాంప్బెల్ ఇస్తున్న పుట్టినరోజు కానుక అంటూ ఆమె మురిసిపోయింది. నిజానికి ఆ యువతి అప్పటికే మరో వ్యక్తితో ప్రేమలో పడింది. పాత ప్రియుడికి చెందిన రూ.30 కోట్లలో అతడికి చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా కొత్త ప్రియుడితో పరారయ్యింది. అతడితో సంబంధాలు తెంచేసుకుంది. ఫోన్లో కూడా దొరకలేదు. కొన్ని రోజుల తర్వాత ఆమె ఆచూకీ కనిపెట్టగలిగాడు. మరో వ్యక్తితో పడకపై ఆమెను చూశాడు. తాను దారుణంగా మోసపోయినట్లు గుర్తించిన క్యాంప్బెల్ న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాడు. -
అడుక్కునే స్థితిలో ఉన్నామంటే.. ఆదుకునే పరిస్థితుల్లేవ్: పాక్ ప్రధాని ఆవేదన
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ దేశ నోట ఆర్థిక దుస్థితికి అద్దం పట్టే వ్యాఖ్యలు వెలువడ్డాయి. నిత్యం చిప్ప పట్టుకుని దేహీ అంటూ అర్థించడాన్ని మిత్రదేశాలు కూడా హర్షించడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. తమ దేశ ప్రజలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని కన్నీరు పెట్టుకున్నంత పని చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఆదివారం క్వెట్టాలో ఆయన సైనికాధికారులను ఉద్దేశించి పాక్ ప్రధాని షరీఫ్ మాట్లాడారు. ఈ సందర్భంగా షెహబాజ్ షరీఫ్.. ‘చైనా, సౌదీ అరేబియా, తుర్కియే వంటివి పాక్కు విశ్వసనీయమైన మిత్రులు. కానీ చీటికీమాటికీ అప్పులివ్వాలని కోరుతుంటే అవి కూడా చిరాకు పడుతున్నాయి. విద్యా, వర్తకం, ఆరోగ్యం, పరిశోధనల వంటి రంగాల్లో మనం కూడా పెట్టుబడులు పెట్టాలని ఆశిస్తున్నాయి. ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్తోపాటు ఆర్థిక భారాన్ని మోస్తున్న చివరి వ్యక్తిని తానేనని అన్నారు. దేశంలో సహజ వనరులతోపాటు మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని, వాటిని సమర్థమంతంగా ఉపయోగించుకోవడం ద్వారా ఆర్థిక సవాళ్లను అధిగమించవచ్చు’ అని చెప్పుకొచ్చారు. 🚨Utterly Humilating!!Pakistan PM Shehbaz Sharif's another SHOCKING admission after admitting BrahMos strikes:“Even trusted allies like China, Saudi Arabia, Turkey, Qatar & UAE don’t want Pakistan constantly begging with a bowl in hand.” pic.twitter.com/pyrYwRXhmD— Megh Updates 🚨™ (@MeghUpdates) May 31, 2025ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ కొంతకాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సాయం కోసం ప్రపంచదేశాలను అభ్యర్థిస్తోంది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ బెయిల్ అవుట్ ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో భాగంగా ఇటీవల ఒక బిలియన్ డాలర్ల నిధులు మంజూరు చేసింది. ఇందుకోసం అనేక షరతులను విధించిన ఐఎంఎఫ్.. భారత్తో ఉద్రిక్తతలు పెంచుకుంటే పాక్కే ఎక్కువ సమస్యలు వస్తాయని, దేశంలో ఆర్థిక, ఇతర సంస్కరణల లక్ష్యాలకు ముప్పు కలిగిస్తాయని చురకలు అంటించింది. ఈ క్రమంలో కొన్ని షరతులను సైతం విధించింది. -
అమెరికాలో ‘పాలస్తీనా టెన్షన్’.. బాంబు దాడి కలకలం
వాషింగ్టన్: అమెరికాలోని కొలరాడో(Colorado)లో కలకలం చెలరేగింది. ఇక్కడి బౌల్డర్లో చోటుచేసుకున్న దాడిలో పలువురు గాయాలపాలయ్యారు. ఈ ఉదంతంలో ప్రమేయం ఉన్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ)డైరెక్టర్ కాష్ పటేల్ దీనిని ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు.ఎప్బీఐ పబ్లిక్ అఫైర్స్ అసిస్టెంట్ డైరెక్టర్ బెన్ విలియమ్సన్ సోషల్ మీడియా సైట్ ‘ఎక్స్’లో ఈ విషయాన్ని తెలియజేస్తూ నిందితుడు యూదులపై బాంబులు విసురుతూ ‘ఫ్రీ పాలస్తీనా’ అని అరిచాడని తెలిపారు. కొలరాడో అటార్నీ జనరల్ ఫిల్ వీజర్ మాట్లాడుతూ ఈ ఘటనలో కొందరిని లక్ష్యంగా చేసుకోవడం చూస్తుంటే ఇది విద్వేషపూరిత నేరంగా కనిపిస్తున్నదన్నారు. కాగా నిందితుడిని 45 ఏళ్ల మొహమ్మద్ సబ్రీ సోలిమాగా ఎప్బీఐ గుర్తించింది.ఈ ఘటనపై బౌల్డర్ పోలీస్ చీఫ్ స్టీఫెన్ రెడ్ఫెర్న్ మాట్లాడుతూ గాజాలో ఇజ్రాయెల్ బందీలను గుర్తుచేసుకుంటూ ప్రదర్శన జరుగుతుండగా, దానికి సమీపంలోనే ఈ దాడి జరిగిందన్నారు. గాజా- ఇజ్రాయెల్ యుద్ధం నేపధ్యంలో అమెరికాలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ఇజ్రాయెల్(Israel) మద్దతుదారులు.. ఈ పాలస్తీనా అనుకూల నిరసనలను యూదు వ్యతిరేక నిరసనలుగా పేర్కొంటున్నారు. 🚨Disturbing scenes of panic and chaos! Stay away & Safe.⚠️Developing: Police are asking the public to avoid Pearl and 13th in Boulder after a reported attack as it's show here! pic.twitter.com/8ZBYzYKdgZ— Mohanad Shaabani (@MohanadShaabani) June 1, 2025బౌల్డర్లో జరిగిన ఘటనను చూసిన కొలరాడో విశ్వవిద్యాలయానికి చెందిన 19 ఏళ్ల బ్రూక్ కాఫ్మన్ మాట్లాడుతూ, దాడి జరిగిన సమయంలో నలుగురు మహిళలు కాలిన గాయాలతో బాధపడుతుండటాన్ని చూశానని తెలిపారు. దాడి చేసిన వ్యక్తి ప్రాంగణంలో చొక్కా లేకుండా నిలుచుని, ఏదో ద్రవం ఉన్న గాజు సీసాలను పట్టుకుని అరిచాడని ఆమె వివరించారు. కాగా ప్రముఖ యూదు డెమొక్రాట్, సెనేట్ మైనారిటీ నేత చక్ షుమెర్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ పోటీ -
సాకర్ సంబరాల్లో అపశ్రుతి
పారిస్: యూరోపియన్ సాకర్ ఫైనల్లో శనివారం రాత్రి ఇంటర్ మిలన్పై పారిస్ సెయింట్ జెర్మయిన్ జట్టు విజయం అనంతరం ఫ్రాన్సులో జరిగిన ఉత్సవాలు హింసాత్మకంగా మారాయి. వాటిలో ఇద్దరు అభిమానులు ప్రాణాలు కోల్పోగా, ఒక పోలీసు అధికారి తీవ్ర గాయాలతో కోమాలోకి జారుకున్నారు. డాక్స్ నగర వీధుల్లో జరిగిన సంబరాల్లో 17 ఏళ్ల బాలుడు కత్తిపోట్లకు గురై మరణించాడు. పారిస్లో విజయోత్సవాల ప్రాంతంలో కారు ఢీకొని ఓ స్కూటరిస్ట్ మృతి చెందాడు. కౌటన్స్ ప్రాంతంలో సాకర్ అభిమానులు పేల్చిన బాణసంచా తాకడంతో తీవ్రంగా గాయపడిన ఓ పోలీసు అధికారి కోమాలోకి వెళ్లారు. వీటికి సంబంధించి 500 మందిపైగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పారిస్లో భారీగా పోలీసులను మోహరించారు. -
బ్రిటన్ గాట్ టాలెంట్ పోటీలో రన్నరప్గా అసోం చిన్నారి
గువాహటి: అసోంకు చెందిన తొమ్మిదేళ్ల బినితా చెత్రీ ప్రఖ్యాత ‘బ్రిటన్ గాట్ టాలెంట్ (బీజీటీ)’ రియాలిటీ డ్యాన్స్ పోటీల్లో రెండో రన్నరప్గా నిలిచింది. కొండప్రాంత కర్బి అంగ్లాంగ్ జిల్లాలోని ఓ కుగ్రామంలో నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈ బాలిక ప్రపంచ వేదికపై సత్తా చాటడం విశేషం. ఈమె ప్రతిభను అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మెచ్చుకున్నారు. ఆమె ప్రదర్శన బ్రహ్మపుత్ర నుంచి థేమ్స్ నది వరకు అందరినీ మంత్రముగ్ధులను చేసిందని, తమను గర్వపడేలా చేసిందని ప్రశంసలు కురిపించారు. శనివారం జరిగిన ఫైనల్స్లో బ్రిటిష్ మెజీíÙయన్ హ్యారీ మౌల్డింగ్ విజేతగా నిలిచాడు. ఎల్ఈడీ డ్యాన్స్ గ్రూప్ రెండో స్థానంలో నిలిచింది. బీజీటీ ఫైనల్స్ చేరిన తొలి భారతీయురాలు బినితాయేనని ఆమె కుటుంబసభ్యులు చెప్పారు. బినితా స్వగ్రామం పేరు టల్బాలిజన్. తండ్రి అమర్ చెత్రీ ఊళ్లో చిన్న కోళ్లఫారం నడుపుతుంటారు. బినితా ప్రిపరేషన్ కోసం కర్బి అంగ్లాంగ్ అటానమస్ కౌన్సిల్ రూ.5 లక్షలు సాయంగా అందజేసింది. -
పేగు క్యాన్సర్ బాధితులకు వ్యాయామంతో మేలు
వాషింగ్టన్: నిత్యం వ్యాయామంతో పేగు క్యాన్సర్ బాధితులకు ఎంతో మేలు కలుగుతున్నట్లు తాజా అధ్యయనంతో తేలింది. కనీసం మూడేళ్లపాటు వ్యాయామం చేస్తే వారు వారు జీవించే అవకాశాలు చాలావరకు మెరుగవుతున్నట్లు వెల్లడయ్యింది. అంతేకాకుండా వ్యాయమం చేసేవారికి ఈ క్యాన్సర్ సోకే పరిస్థితి ఉండదని అంటున్నారు. పేగు క్యాన్సర్కు చికిత్స పొందుతున్నవారు కసరత్తులపై ఎక్కువగా దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంగ్ల్లండ్, కెనడా, ఆ్రస్టేలియాలో ఈ అధ్యయనం నిర్వహించారు. 889 మంది బాధితులను పరిశీలించారు. వీరంతా పేగు క్యాన్సర్ బారినపడి కీమోథెరపీ చికిత్స పొందినవారే. సగం మందికి వ్యాయామాలు చేయాలని సూచించారు. తగిన పౌష్టికాహారం తీసుకోవాలని చెప్పారు. కానీ, వారు పెడచెవిన పెట్టారు. మిగిలిన సగం మందికి అధ్యయనకర్తలు కోచ్లను ఏర్పాటుచేశారు. కచ్చితంగా వ్యాయామాలు చేసేలా చర్యలు తీసుకున్నారు. నడక, ఈత వంటి ఎక్సర్సైజ్లతో శరీరాలను బాగా కదిలించినవారు చురుగ్గా మారడంతోపాటు పేగు క్యాన్సర్ ప్రభావం తగ్గిపోయినట్లు తేలింది. వ్యాయామం చేయనివారితో పోలిస్తే వీరి జీవితకాలం పెరిగినట్లు స్పష్టమయ్యింది. -
అమెరికాలో కాల్పులు.. ముగ్గురు మృతి
వాషింగ్టన్: అమెరికాలో రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో ఒక పోలీసు అధికారి సహా ముగ్గురు చనిపోగా పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. లాస్ ఏంజెలెస్ నగరంలోని బాల్డి్వన్ పార్క్లో శనివారం రాత్రి 7 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి రైఫిల్తో కాల్పులకు దిగాడు. ఘటనలో ఒక పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోగా మరొకరు గాయపడ్డారు. అనంతరం అధికారులు మరో మృతదేహాన్ని గుర్తించారు. ఘటనకు సంబంధించి ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రుడికి ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు. మరో ఘటన..నార్త్ కరోలినాలోని కటౌబా కౌంటీలో శనివారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకున్న మరో కాల్పుల ఘటనలో ఒకరు చనిపోయారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. -
గాజాలో అన్నార్తులపైకి కాల్పులు 31 మంది మృతి
రఫా (గాజా స్ట్రిప్): గాజాలో మాటలకందని ఘోరం చోటుచేసుకుంది. అన్నార్తులపై ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. ఐరాస సాయాన్ని కాదని అమెరికా దన్నుతో గాజా లో ఇజ్రాయెల్ స్వయంగా సహాయ కేంద్రాలను మొదలుపెట్టడం తెలిసిందే. వాటినుంచి ఆహారం తెచ్చుకోవడానికి వెళ్తున్న వారిపై తూటాల వర్షం కురిపించింది. ఆ కాల్పుల్లో 31 మంది పాలస్తీనావాసులు బలయ్యారు. కనీసం 170 మందికి పైగానే గాయపడ్డట్టు హమాస్ వర్గాలు వివరించాయి. సహాయ కేంద్రానికి కిలోమీటర్ దూరంలో ఈ దారుణం జరిగినట్టు గాజా ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు ప్రత్యక్ష సాక్షులు కూడా తెలిపారు. దీనిపై అంతర్జాతీయంగా దుమారం రేగుతుండటంతో ఇజ్రాయెల్ తీవ్ర ఇరకాటంలో పడింది. అలాంటి ఉదంతమేదీ ఇప్పటిదాకా తమ దృష్టికి రాలేదని నెతన్యాహు ప్రభుత్వం చెప్పుకొచ్చింది. దీనిపై దర్యాప్తు చేపట్టినట్టు పేర్కొంది. -
చెట్టు రంగు మారిందో... అగ్నిపర్వతం పేలిందే!
అగ్నిపర్వతాలు ఎప్పుడు బద్ధలవుతాయో కచ్చితంగా గుర్తించగల పరిజ్ఞానం ఇప్పటిదాకా లేదు. ఇది తరచూ తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీస్తోంది. అగ్నిపర్వతాల విస్ఫోటాన్ని ముందుగానే కనిపెట్టగల విధానాన్ని తాజాగా ఆవిష్కరించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’, స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ దిశగా కీలక ముందడుగు వేశారు. అగ్నిపర్వతం చుట్టుపక్కల ఉండే చెట్లూ చేమల ఆధారంగా అదెప్పుడు పేలేదీ ముందుగానే గుర్తించవచ్చని వారంటున్నారు. అగ్నిపర్వతం పేలినప్పుడు శిలాద్రవం (మాగ్మా) వెలువడుతుందన్నది తెలిసిందే. మాగ్మా కంటే ముందే కార్బన్ డయాక్సైడ్ అధిక మోతాదుల్లో వెలువడుతుంది. దాన్ని పీల్చే చెట్ల ఆకుల రంగు మారిపోతుంది. అవి ముదురు ఆకుపచ్చ రంగును సంతరించుకుంటాయి. ఈ మార్పును స్పష్టంగా గమనించవచ్చు. అంతేగాక పేలుడుకు ముందు ఆ ప్రాంతంలో భూమి ఎత్తు హఠాత్తుగా పెరుగుతుంది. భూకంప తరంగాలు ఉత్పన్నమవుతాయి. ఇవన్నీ అగ్నిపర్వతం పేలుడుకు సంకేతాలేనని నాసా ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉపగ్రహాలతో విశ్లేషణ అగ్నిపర్వతాలపై కార్బన్ డయాక్సైడ్ స్థాయిలను గుర్తించాలంటే సైంటిస్టులు ఆ పర్వతాలపైకి చేరుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే తక్కువ స్థాయిలో వెలువడే కార్బన్ డయాక్సైడ్ను ఉపగ్రహ చిత్రాల ద్వారా అంచనా వేయడం సాధ్యం కాదు. కానీ ఇది చాలాసార్లు ప్రమాదకరంగా మారుతోంది. ఇలాంటి సమస్యలు ఇకపై దూరమైనట్లే. ఎందుకంటే చెట్ల ఆకుల రంగు ద్వారా అగ్నిపర్వతాల పేలుడును కచ్చితంగా గుర్తించగలమని సైంటిస్టులు పేర్కొంటున్నారు. ఈ రకమైన విశ్లేషణకు ఎన్నో రకాల శాటిటైట్లు అందుబాటులో ఉన్నాయని టెక్సస్లోని యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్లో వోల్కనాలజీ డాక్టోరల్ విద్యార్థి నికోల్ గిన్ చెప్పారు. ఇటలీలో సిసిలీ తీరంలోని మౌంట్ ఎట్నా అగ్నిపర్వతంతోపాటు సమీపంలోని చెట్టూచేమల చిత్రాలను లాండ్శాట్ 8, టెరా శాటిలైట్, సెంటినెల్–2తోపాటు ఇతర ఎర్త్–అబ్జర్వింగ్ ఉపగ్రహాల ద్వారా సేకరించారు. వాటిని సమగ్రంగా విశ్లేషించారు. అక్కడ అధిక కార్బన్ డయాక్సైడ్తో చెట్ల ఆకుల రంగు మారినట్లు కనిపెట్టారు. ఈ అగ్నిపర్వతం నుంచి మాగ్మా ప్రవాహం మొదలైంది.→ ప్రపంచ జనాభాలో 10 శాతం అగ్నిపర్వతాలకు కొన్ని మైళ్ల దూరంలోనే నివసిస్తోంది.→ అగ్నిపర్వతాల పేలుడు గురించి ముందే తెలియక చాలా సందర్భాల్లో ఆస్తి, ప్రాణనష్టం సంభవిస్తున్నాయి.→ చెట్ల ఆకుల రంగు ద్వారా పేలుడును సామాన్యులు సైతం ముందే కనిపెట్టవచ్చని సైంటిస్టులు అంటున్నారు. తద్వారా ప్రాణాపాయం నుంచి సులువుగా బయటపడొచ్చని సూచిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉక్రెయిన్ అతిపెద్ద ఆపరేషన్.. 40 రష్యన్ విమానాలు ధ్వంసం!
కీవ్: రష్యాపై ఉక్రెయిన్ మెరుపు దాడికి దిగింది. తాజాగా ఉక్రెయిన్ చేసిన దాడుల్లో 40కి పైగా రష్యా యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. .యుద్ధంలో ఇప్పటివరకు ఉక్రెయిన్ చేపట్టిన అతిపెద్ద సైనిక చర్య ఇదే కావడం గమనార్హం. ఇది రష్యా వైమానిక బలగాలకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.రష్యాపై తాము చేసిన దాడుల్లో 40 ఎయిర్ క్రాఫ్ట్లు ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ మీడియా స్పష్టం చేసింది. సరిహద్దు నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తూర్పు సైబీరియాలోని పలు సైనిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడిందని తెలిపింది. ఇర్కుట్స్క్ ప్రాంత రష్యన్ గవర్నర్ ఈ దాడిని ధృవీకరించారు. శ్రీద్ని గ్రామంలోని సైనిక యూనిట్పై కీవ్ ఎటాక్ చేసిందని ఆయన వెల్లడించారు. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ సైబీరియాలోని ఒలెన్యా, బెలయాలోని వైమానిక స్థావరాలతో సహా నాలుగు రష్యన్ సైనిక వైమానిక స్థావరాపై ఏకకాలంలో దాడులు చేసింది.2 బిలియన్ డాలర్లకు పైగా ఆస్తి నష్టం!ఈ విధ్వంసకర దాడుల కారణంగా సుమారు 2 బిలియన్ డాలర్లకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. ఈ దాడులు యుద్ధ పరిణామాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఉక్రెయిన్ ఇటీవలి కాలంలో డ్రోన్ టెక్నాలజీలో గణనీయమైన పురోగతి సాధించినట్లు ఈ దాడుల ద్వారా తెలుస్తోంది. అయితే ఉక్రెయిన్ దాడుల్లో ఏడుగురు మృతి చెందగా, 69 మందికి గాయాలయ్యాయి. 524 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చేశామని రష్యా చెబుతోంది. -
చైనాతో పెట్టుకోవద్దు.. అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్
బీజింగ్: అమెరికా, చైనా మధ్య మరోసారి మాటల యుద్ధం చోటుచేసుకుంది. తాజాగా అమెరికాకు డ్రాగన్ చైనా గట్టి హెచ్చరికలు జారీ చేసింది. చైనాను అదుపు చేసేందుకు తైవాన్ విషయంలో అమెరికా తలదూర్చడం సరికాదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇందులో మూడో దేశం జోక్యం చేసుకోవడం తగదని వార్నింగ్ ఇచ్చింది.చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. తైవాన్ అంశాన్ని హెగ్సెత్ ప్రస్తావించడం కరెక్ట్ కాదు. చైనాను అదుపు చేసేందుకు తైవాన్ సమస్యను అమెరికా తీసుకురావడం సరికాదు. తైవాన్ అంశం చైనా అంతర్గత వ్యవహారం. ఇందులో మూడో దేశం జోక్యం మానుకోవాలి. నిప్పుతో ఆడుకోవద్దంటూ అమెరికాకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.Chinese Foreign Ministry Spokesperson’s Remarks on US Defense Secretary Pete Hegseth’s Negative Comments on China at the Shangri-La DialogueHegseth deliberately ignored the call for peace and development by countries in the region, and instead touted the Cold War mentality of… pic.twitter.com/PaO14RW6kE— Lin Jian 林剑 (@SpoxCHN_LinJian) June 1, 2025ఇక, అంతకుముందు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సింగపూర్లో జరిగిన అంతర్జాతీయ భద్రతా సదస్సుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెగ్సెత్ మాట్లాడుతూ.. భౌగోళిక, సముద్ర వివాదాల పరిష్కారంతో పాటు తైవాన్ విషయంలో చైనా ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. భవిష్యత్తులో ఆ దేశం నుంచి వచ్చే ముప్పును.. ముఖ్యంగా తైవాన్పై దాని దూకుడు ప్రదర్శనను ఎదుర్కోవడానికి అమెరికా.. విదేశాల్లో తన రక్షణను బలోపేతం చేస్తోందన్నారు.MUST-SEE: Pete Hegseth declares the US will not be pushed out or intimidated by China."We do not seek conflict with communist China. We will not instigate nor seek to subjugate or humiliate." "President Trump and the American people have immense respect for the Chinese… pic.twitter.com/l6USFabG66— Resist the Mainstream (@ResisttheMS) June 1, 2025ఇదే సమయంలో తైవాన్ను స్వాధీనం చేసుకోవడానికి చైనా దాని చుట్టూ సముద్రజలాల్లో యుద్ధ విమాన వాహక నౌకలను మోహరిస్తూ బెదిరింపులకు పాల్పడుతోందని పేర్కొన్నారు. లాటిన్ అమెరికాపైనా చైనా కన్నేసిందనీ.. పనామా కాలువపై తన ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు కృషి చేస్తోందని చెప్పారు. చైనా నుంచి ఆర్థిక, సైనిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న ఇండో పసిఫిక్ ప్రాంత మిత్రదేశాలను గాలికి వదిలేయలేం. ఆయా దేశాలు తమ రక్షణ వ్యయాన్ని పెంచుకోవాలి. చైనా దూకుడు ప్రదర్శిస్తే అమెరికా దాన్ని అడ్డుకుంటుంది అని చెప్పుకొచ్చారు. దీనికి చైనా కౌంటర్ ఇచ్చింది. -
రష్యాలో ఘోర రైలు ప్రమాదం.. పలువురు మృతి, గాయాలు
మాస్కో: రష్యాలో ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి రైల్వే బ్రిడ్జి కూలిపోవడంతో ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. పలువురు ప్రయాణికులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలో శనివారం రాత్రి వంతెన కూలిపోయింది. అదే సమయంలో ప్యాసింజర్ రైలు వెళ్తున్న కారణంగా సదరు రైలు ప్రమాదానికి గురైంది. ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలోని రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని రష్యా అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా, దాదాపు 30 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.⚡ BREAKING Russian Emergency crews are cutting through metal train cars to rescue trapped passengers. The Klimov–Moscow train was crushed after the blast, caused by the detonation of a bridge support in the Vygonichsky district of Russia’s Bryansk region.#Russia #Bryansk https://t.co/X6oD1mZJUk pic.twitter.com/RZoahsb4wC— ⚡𝙉𝙊𝙄𝙎𝙀 𝘼𝙇𝙀𝙍𝙏𝙎 (@NoiseAlerts) May 31, 2025ఈ సందర్భంగా బ్రయాన్స్క్ ప్రాంతీయ గవర్నర్ అలెగ్జాండర్ బొగోమాజ్ మాట్లాడుతూ.. రైలు ప్రమాదం నేపథ్యంలో అత్యవసర సేవలు, ప్రభుత్వ అధికారులు సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. మృతిచెందిన వారిలో రైలు లోకో పైలట్ కూడా ఉన్నారు. ప్యాసింజర్ రైలు మాస్కో నుండి క్లిమోవ్కు వెళుతోందని అన్నారు.BREAKING: Multiple dead and wounded after bridge collapses onto passenger train in Russia's Bryansk region, according to BazaSabotage is suspected pic.twitter.com/S4v4c0aXfJ— Faytuks News (@Faytuks) May 31, 2025అయితే, గత మూడేళ్లుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. బ్రయాన్స్క్ ప్రాంతం రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉండటంతో డ్రోన్ దాడులు, బాంబు దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే దాడుల ప్రభావంతో వంతెన కూలిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. -
జాగ్రత్త.. 25 కోట్ల తేనెటీగలు తప్పించుకున్నాయి
వాషింగ్టన్: మల్లాది ‘నత్తలొస్తున్నాయ్ జాగ్రత్త’ నవల గుర్తుందా? కెన్యా నుంచి వచ్చిన భయంకరమైన రాక్షస నత్తలు ఓ రైలు ప్రమాదంలో తప్పించుకుని ఆంధ్ర రాష్ట్రంపై పడతాయి. చూస్తుండగానే అసంఖ్యాకంగా పెరిగిపోయి అల్లకల్లోలం చేసిపారేస్తాయి. అదీ, ఇదీ అని తేడా లేకుండా దొరికిన దాన్నల్లా తినేస్తూ భయోత్పాతం సృష్టిస్తాయి. అమెరికాలో వాషింగ్టన్ రాష్ట్రంలో కూడా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఒకటీ రెండూ కాదు, ఏకంగా 25 కోట్ల తేనెటీగలు తప్పించుకున్నాయి! 31,751 కిలోల తేనెతుట్టెలతో వెళ్తున్న వాహనం లిండెన్ సమీపంలో కెనడా సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ మూలమలుపు వద్ద వేగాన్ని డ్రైవర్ నియంత్రించలేకపోవడంతో బోల్తా పడింది. తేనెతుట్టెలన్నీ చెల్లాచెదురుగా పడిపోవడంతో తేనెటీగలు బయటికొచ్చి జారుకున్నాయి. విషయం తెలియగానే పోలీసులు తేనెటీగల నిపుణులతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అంతా కలిసి తేనెతుట్టెలను ఒక్కచోటికి చేర్చారు. తప్పించుకున్న తేనెటీగల కోసం ఎదురుచూస్తూ గడుపుతున్నారు. అవి తప్పకుండా తుట్టెల వద్దకు తిరిగొస్తాయని నిపుణులు చెప్పారు. ‘‘తేనెటీగలు రాణి ఈగను విడిచి ఉండలేవు. దాన్ని తీసుకొని రెండు మూడు రోజుల్లో వచ్చేస్తాయి’’ అని వివరించారు. కనుక రెండు మూడు రోజులపాటు పరిసర ప్రాంతాలకు రావొద్దని స్థానికులకు పోలీసులు సూచించారు. అమెరికాలో లక్షలాది తేనెటీగలను తరచుగా ఇలా ఒకచోటి నుంచి మరోచోటికి తరలిస్తుంటారు. వ్యవసాయంలో తేనెటీగలది కీలక పాత్ర. పరాగ సంపర్కానికి, పంటలు పండడానికి దోహదపడతాయి. ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల సంఖ్య భారీగా తగ్గిపోతుండటంతో మే 20ని ‘ప్రపంచ తేనెటీగల దినం’గా జరుపుకోవాలని ఐరాస 2018లో పిలుపునిచ్చింది. -
చైనాతో తక్షణ ప్రమాదం వాస్తవం
సింగపూర్: డ్రాగన్ దేశం చైనా నుంచి ఇండో–పసిఫిక్ దేశాలకు తక్షణ ముప్పు పొంచి ఉందని, ఇది నిజమని అమెరికా విదేశాంగ మంత్రి పీటర్ హెగ్సెత్ హెచ్చరించారు. చైనా నుంచి ఎదురయ్యే సైనిక, ఆర్థికపరమైన ఒత్తిడుల నేపథ్యంలో ఈ ప్రాంతంలోని మిత్ర దేశాలను ఒంటరిగా వదిలేయబోమని హామీ ఇచ్చారు. అదే సమయంలో, ఆయా దేశాలు రక్షణపరంగా మరింత బలోపేతం కావాలని సూచించారు. జీడీపీలో 5 శాతం మేర రక్షణ రంగానికి కేటాయించాలని సూచించారు. యూరప్ దేశాలు సైతం ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చైనా నుంచి వేగంగా పెరుగుతున్న ముప్పును, ముఖ్యంగా తైవాన్ విషయంలో దుండుడుకు చర్యలకు ముకుతాడు వేసేందుకు అమెరికా రక్షణ చర్యలను ముమ్మరం చేస్తుందని ప్రకటించారు. తైవాన్ను ఆక్రమించుకునేందుకు చైనా ఆర్మీ రిహార్సల్స్ చేస్తోందని హెగ్సెత్ వ్యాఖ్యానించారు. ఇదే లక్ష్యంతో సైన్యానికి రోజువారీ శిక్షణ అందిస్తోందన్నారు. 2027 నాటికి తైవాన్ను విలీనం చేసుకోవాలనే లక్ష్యాన్ని సాధించే సత్తా తమకుందని చైనా ఇప్పటికే చేసిన ప్రకటనపై ఆయనీ వ్యాఖ్యలు చేశారు. సింగపూర్లో జరుగుతున్న అంతర్జాతీయ భద్రతా సదస్సు ‘షంగ్రీ లా డైలాగ్’లో హెగ్సెత్ శనివారం కీలకోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెక్యూరిటీ స్టడీస్ ఏర్పాటు చేసింది. చైనా విస్తారమైన దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ ద్వీపాలను ఏర్పాటు చేసి మిలటరీ ఔట్ పోస్టులను నెలకొల్పుతోంది. అత్యంత అధునాతన హైపర్సోనిక్ క్షిపణులను తయారు చేయడంతోపాటు అంతరిక్షంలోనూ పైచేయి సాధించేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఈ బెడదను దృష్టిలో ఉంచుకునే అమెరికా ‘గోల్డె న్ డోమ్’క్షిపణి రక్షణ వ్యవస్థ ఏర్పాటుకు సిద్ధమైంది. పనామా కాలువ సహా లాటిన్ అమెరికా ప్రాంతంలోనూ పలుకుబడిని పెంచుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందని హెగ్సె త్ ఆరోపించారు. ఈ ప్రాంతంలోని కొన్ని దేశాలు అమెరికా సైనిక మద్దతును పొందుతూనే చైనాతో ఆర్థికంగా సంబంధాలు నెరుపుతుండటం ప్రమాదకరమైన వ్యవహా రమని హెగ్సెత్ పేర్కొన్నారు. యూరప్ దేశాలు తమ సొంత భద్రతను చూసుకోవా లని, ఇండో–పసిఫిక్ బాధ్యతను అమెరికాకు వదిలేయాలన్నారు. అనంతరం మాట్లాడిన ఈయూ ఉపాధ్యక్షురాలు కాజా కల్లాస్ హెగ్సె త్ వ్యాఖ్యలను ఖండించారు. ‘ఉత్తరకొరియా బలగాలు రష్యా తరఫున ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్నాయి. అదే సమయంలో, రష్యాకు చైనా మద్దతుగా నిలుస్తోంది. యూరప్, ఆసియాల భద్రత ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి’అని పేర్కొన్నారు.హాజరు కాని చైనా రక్షణ మంత్రిఏటా జరిగే ఈ సదస్సుకు చైనా తన రక్షణ మంత్రిని పంపిస్తుంటుంది. అమెరికాతో నడుస్తున్న టారిఫ్ విభేదాల నేపథ్యంలో ఈసారి దిగువ స్థాయి అధికారులతో కూడిన బృందాన్ని పంపించింది. హెగ్సెత్ వ్యాఖ్యలను ఈ బృందంలోని చైనా నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ హు గంగ్ఫెంగ్ తీవ్రంగా ఖండించారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. -
సరదాల వేళ... తలుపులతో జాగ్రత్త!
వాషింగ్టన్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ను ఆయన భార్య ముఖంపై చేతులు వేసి తోసేస్తున్న వీడియో ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వైరల్ కావడం తెలిసిందే. దానిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తాజాగా స్పందించారు. శుక్రవారం మీడియా భేటీ సందర్భంగా విలేకరులు ఈ అంశాన్ని లేవనెత్తారు. ‘‘అది అధ్యక్ష దంపతుల నడుమ సరదా సన్నివేశం మాత్రమే. మాక్రాన్తో మాట్లాడాను. వారి మధ్య సమస్యేమీ లేదు. అంతా బానే ఉంది’’అని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఓ దేశాధినేతగా వైవాహిక బంధానికి సంబంధించి మరో దేశాధ్యక్షునికి మీరిచ్చే సలహా ఏమిటని ప్రశ్నించగా, ‘‘సరదాల వేళ తలుపులు మూసున్నదీ, లేనిదీ ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి చాలు. అంతకంటే మరేమీ అక్కర్లేదు’’అంటూ బదులిచ్చి నవ్వులు పూయించారు. -
ఉక్కు, అల్యూమినియంపై 50% సుంకం
పెన్సిల్వేనియా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. తమ దేశంలో ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటామని, ఇందుకోసం విదేశీ ఉక్కుపై సుంకాన్ని రెండు రెట్లు చేస్తామని అన్నారు. ఆయన శుక్రవారం పిట్స్బర్గ్లో ఇర్వీన్ స్టీల్ ప్లాంట్ కార్మికులతో మాట్లాడారు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఉక్కుపై 50% టారిఫ్ విధించనున్నట్లు చెప్పారు.జపాన్కు చెందిన నిప్పన్ స్టీల్ సంస్థ అమెరికా స్టీల్ కంపెనీలో పెట్టుబడులు పెట్టబోతోందని, దీనిపై ఒప్పందం కుదిరిందని చెప్పారు. విదేశీ అల్యూమినియంపైనా టారిఫ్ను 50 శాతానికి పెంచనున్నట్లు ట్రంప్ తేల్చిచెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. స్టీల్తోపాటు అల్యూమినియంపై పెరిగిన టారిఫ్లు బుధవారం నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించారు. ఇదిలా ఉండగా, టారిఫ్ల పెంపుల వల్ల అమెరికాలో స్టీల్, అల్యూమినియం ధరలు విపరీతంగా పెరిగిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. గృహ నిర్మాణం మరింత భారం కానుంది. ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఉక్కు ధరలు ఇప్పటికే 16%పెరిగిపోయాయి. అమెరికా తనకు అవసరమైన స్టీల్, అల్యూమినియంను ఎక్కువగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. మరోవైపు భారత్–పాకిస్తాన్ ఘర్షణలపై ట్రంప్ తన నోటి దురుసు ఆపడం లేదు. రెండు దేశాల అణుయుద్ధం జరిగే పరిస్థితిని నివారించినందుకు గర్వపడుతున్నానని మరోసారి చెప్పారు. కాల్పుల విరమణ వెనుక ట్రంప్ ప్రమేయం లేదని భారత్ పదేపదే చెబుతున్నా ఆయన పట్టించుకోవడం లేదు. -
మేఘపై ఎంఐటీ క్రమశిక్షణ చర్య
మస్సాచుసెట్స్: పాలస్తీనా అనుకూల ప్రసంగం చేసిన భారత సంతతికి చెందిన మేఘ వేమూరిపై మస్సాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. మేఘ పేరును ప్రస్తావించకుండా ఇందుకు సంబంధించి ఒక ప్రకటన చేసింది. ‘ఆ వ్యక్తి నేడు జరిగే స్నాతకోత్సవంలో పాల్గొనాల్సి ఉంది. అయితే, ఈ రోజు జరిగే కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిషేధం విధించామన్న విషయాన్ని తెలియజేశాం’అని ఎంఐటీ ప్రతినిధి కింబర్లీ అలెన్ చెప్పారు. ‘ఎంఐటీ వాక్ స్వాతంత్య్రానికి మద్దతుగా నిలుస్తుంది. ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా, పదే పదే నిర్వాహకులను తప్పుదారి పట్టించి, వేదికపై నుంచి నిరసనకు నాయకత్వం వహించింది. ఒక ముఖ్యమైన వేడుకకు అంతరాయం కలిగించినందుకు ప్రతిస్పందనగా తీసుకున్న చర్యకు కట్టుబడి ఉన్నాం’అని తెలిపారు. గురువారం మేఘ పాలస్తీనాకు అనుకూలంగా చేసిన ప్రసంగం ఆన్లైన్లో వైరలవుతోంది. కాగా, శుక్రవారం జరిగే స్నాతకోత్సవం ప్రధాన కార్యక్రమంలో మేఘ షెడ్యూల్ ప్రకారం ప్రసంగించాల్సి ఉంది. అయితే, వివాదం నేపథ్యంలో ఆమెకు అధికారులు అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రకటించారు. -
మార్స్ కొంప ముంచిన సౌర గాలులు
భూమికి సమీపంలో ఉన్న అంగారక గ్రహం(మార్స్)పై విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయి. అక్కడికి వ్యోమగాములను పంపించే ప్రయత్నాలు సైతం మొదలయ్యాయి. ఈ అరుణ గ్రహంపై కోట్లాది సంవత్సరాల క్రితం నీరు, వాతావరణం ఉండేవి. అవి క్రమేపి అంతరించిపోయాయి. మొత్తం శూన్యం ఆవరించింది. జీవుల మనుగడపై ఆస్కారమే లేకుండాపోయింది. మార్స్పై నీరు, వాతవరణం కనుమరుగైపోవడానికి కారణం ఏమిటన్నది ఎట్టకేలకు గుర్తించగలిగారు. బలమైన సౌర గాలులు, సౌర తుఫాన్ల కారణంగా అంగారక గ్రహం ఆయస్కాంత శక్తిని కోల్పోయినట్లు తేలింది. ఆయస్కాంత శక్తిని కోల్పోయిన తర్వాత అక్కడున్న ద్రవ రూపంలోని నీరు అంతరిక్షంలోకి ఆవిరైపోయింది. వాతావరణం సైతం నెమ్మదిగా అంతరించింది. దాంతో మార్స్ ఉపరితలంపై ఎర్రమట్టి దిబ్బలు, దుమ్ము, రాళ్లు మాత్రమే మిగిలాయి. మార్స్ అటా్మస్పియర్ వోలటైల్ ఎవల్యూషన్(మావెన్) మిషన్లో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ఈ విషయం కనిపెట్టింది. చాలా ఏళ్లుగా పరిశోధకుల మదిని తొలిచేస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికినట్లయ్యింది. సౌర గాలుల్లోని శక్తి కణాలు అంగారకుడి వాతావరణంలోకి చొచ్చుకెళ్లాయని, దాంతో నీరు ఆవిరైందని, తటస్థ కణాలు, అణువులు వాతావరణం నుంచి బయటకు వెళ్లిపోయాయని నిర్ణయానికొచ్చారు. ఈ పరిశోధన కోసం సోలార్ విండ్ అయాన్ అనలైజర్, న్యూట్రల్ గ్యాస్, ఐయాన్ మాస్ స్పెక్ట్రోమీటర్ ఉపయోగించారు. మార్స్పై ఒక భాగం పూర్తిగా వెలుతురు, మరో భాగం పూర్తిగా చీకటి ఉంటుంది. ఈ రెండు భాగాల సమగ్ర డేటా సేకరించారు. సౌర గాలులు, తుఫాన్లు అరుణ గ్రహం స్థితిగతులను పూర్తిగా మార్చేసినట్లు స్పష్టమయ్యింది. ఈ మొత్తం పరిశోధన వివరాలను సైన్స్ అడ్వాన్సెస్ పత్రికలో ప్రచురించారు. అంగారకుడిపై మరింత అవగాహన పెంచుకోడానికి, భవిష్యత్తులో చేపట్టే పరిశోధనలకు ఈ వివరాలు దోహదపడతాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఒకవేళ మార్స్పై నీరు, వాతావరణం యధాతథంగా ఉంటే అది మరో భూగోళంగా మనుషుల మనుగడకు తోడ్పడేదని మనం భావించవచ్చు. సౌర గాలులు, తుఫాన్లు అంగారకుడి కొంప ముంచడమే కాదు.. మన ఆశలనూ నీరుగార్చేశాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కొన్ని జెట్లను కోల్పోయాం
సింగపూర్/న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాక్తో జరిగిన ఘర్షణల్లో మనకు వైమానికంగా నష్టం జరిగిందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అంగీకరించారు. మన ఫైటర్ జెట్లను దాయాది కూల్చేసినట్టు వెల్లడించారు. షాంగ్రిలా డైలాగ్ నిమిత్తం సింగపూర్లో పర్యటిస్తున్న ఆయన శనివారం బ్లూంబర్గ్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. పాక్తో యుద్ధం భారత్ ఫైటర్ జెట్లను నష్టపోయిందా అన్న ప్రశ్నకు బదులుగా ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి పెను రాజకీయ దుమారానికి దారితీశాయి. ఆపరేషన్ సిందూర్కు సంబంధించిన వాస్తవాలను మోదీ సర్కారు తొక్కిపెట్టిందనేందుకు ఇదే నిదర్శనమని కాంగ్రెస్ దుయ్యబట్టింది. సీడీఎస్ వ్యాఖ్యల నేపథ్యంలో మన యుద్ధ సన్నద్ధతపై స్వతంత్ర విచారణకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఈ మొత్తం ఉదంతంపై లోతుగా చర్చించేందుకు తక్షణం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ‘అణు’ స్థాయికి పోలేదు పాక్పై దాడుల సందర్భంగా యుద్ధ విమానాలను నష్టపోయినట్టు వాయుసేన గతంలోనే పరోక్షంగా అంగీకరించింది. పాక్ వైమానిక స్థావరాలపై దాడుల వివరాలను ఆర్మీ, నేవీ సైనిక ఆపరేషన్స్ డైరెక్టర్స్ జనరల్తో కలిసి వాయుసేన డీజీ ఎయిర్ మార్షల్ ఎ.కె.భారతి అప్పట్లో ఎప్పటికప్పుడు మీడియాకు వెల్లడించారు. మన ఫైటర్ జెట్లను కూల్చేశామన్న పాక్ ప్రకటన ఏ మేరకు వాస్తవమని మే 11 నాటి భేటీలో విలేకరులు ప్రశ్నించగా, ‘‘యుద్ధమన్నాక నష్టాలు సహజం. కాకపోతే మన పైలట్లంతా సురక్షితంగా తిరిగొచ్చారు. యుద్దం ఇంకా కొనసాగుతున్నందున మనం ఫైటర్ జెట్లను కోల్పోయామా అన్న ప్రశ్నకు ఈ దశలో బదులివ్వలేను’’ అని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో పాక్తో సాగిన ఆ నాలుగు రోజుల ఘర్షణల్లో మనకు నష్టం జరిగిందంటూ సైన్యం నుంచి ఇలా తొలిసారి స్పష్టమైన ప్రకటన వెలువడటం, అదీ స్వయానా త్రివిధ దళాలకు అధిపతి అయిన సీడీఎస్ నోటినుంచి రావడం విశేషం. అయితే మనం ఎన్ని విమానాలను నష్టపోయిందీ చెప్పేందుకు జనరల్ చౌహాన్ నిరాకరించారు. అంతేగాక ఆరు భారత యుద్ధ విమానాలను కూల్చేశామన్న పాక్ వాదన కూడా శుద్ధ అబద్ధమన్నారు. ‘‘తొలి దశలో, అంటే మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టిన రోజు నష్టాలు జరిగాయి. అయితే అసలు సమస్య యుద్ధ విమానాలను కోల్పోవడం కాదు. అలా జరగడం వెనక కారణాలను వీలైనంత త్వరగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. జరిగిన వ్యూహాత్మక తప్పిదాలను రెండు రోజుల్లోపే కనిపెట్టగలిగాం. కాబట్టే పొరపాట్లను వెంటనే సరిదిద్దుకుని యుద్ధ విమానాలన్నింటినీ తిరిగి రంగంలోకి దించాం. మే 8, 10 తేదీల్లో శత్రువును చావుదెబ్బ తీయగలిగాం. పాక్ లోలోపలికి చొచ్చుకుపోయి మరీ అత్యంత కచ్చితత్వంతో దాడులు చేశాం’’ అని ఆయన వివరించారు. ‘‘చైనా అందజేసిన భారీ ఆయుధాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పాక్ను ఏ మాత్రమూ ఆదుకోలేకపోయాయి. వాటి గురించి పాక్ చెప్పుకున్న గొప్పలన్నీ వట్టివేనని మన దాడులు రుజువు చేశాయి. ఎందుకంటే పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను తుత్తునియలు చేస్తూ దాని భూభాగంలో 300 కి.మీ. లోపలి దాకా అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులు చే శాం’’ అన్నారు. పాక్తో ఘర్షణ ఏ దశలోనూ అణుయుద్ధానికి దగ్గరగా రాలేదని స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా మే 7న భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టడం తెలిసిందే. పాక్, పీఓకేల్లోని 9 ఉగ్ర శిబిరాలు, శిక్షణ కేంద్రాలను బ్రహ్మో స్ తదితర అత్యాధునిక క్షిపణులతో నామరూపాల్లేకుండా చేసింది. మర్నాడు పాక్ డ్రోన్లు తదితరాలతో సరిహద్దు గ్రామాలు, పట్టణాలపై ప్రతీకార దాడులకు దిగింది. బదులుగా మన సైన్యం పాక్లో కి 11 కీలక వైమానిక స్థావరాలను నేలమట్టం చేసింది. నాలుగు రోజుల ఘర్షణల అనంతరం ఇరుదేశా లు కాల్పుల విరమణకు అంగీకరించాయి. పాక్ సై న్యం విజ్ఞప్తి మేరకే అందుకు ఒప్పుకున్నట్టు భారత్ పేర్కొనగా తానే ఒప్పందం కుదిర్చానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు.స్వదేశీ శక్తికి తార్కాణం రక్షణ రంగంలో భారత్ సాధించిన స్వావలంబనకు ఆపరేషన్ సిందూర్ అద్దం పట్టిందని సీడీఎస్ జనరల్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. సింగపూర్లో జరిగిన ఆసియా స్థాయి రక్షణ శిఖరాగ్ర సదస్సు షాంగ్రిలా డైలాగ్ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆకాశ్ వంటి పూర్తి దేశీయ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పాక్ దాడులను అత్యంత సమర్థంగా అడ్డుకుని తిప్పికొట్టాయని గుర్తు చేశారు. గగనతల రక్షణకు విదేశాల సాయంపై ఆధారపడకుండా సొంతంగా అభివృద్ధి చేసుకున్న దేశవ్యాప్త సమీకృత రాడార్ వ్యవస్థ అద్భుతంగా రాణించి సత్తా చాటిందన్నారు. దాయాది విద్వేష మంత్రం శాంతి కోసం భారత్ ఎన్ని ప్రయత్నాలు చేసినా బదులుగా పాక్ విద్వేషమే వెల్లగక్కిందని సీడీఎస్ జనరల్ చౌహాన్ దుయ్యబట్టారు. ‘‘2014లో ప్రధాని నరేంద్ర మోదీ పాక్కు స్నేహ హస్తం సాచారు. రెండు చేతులు కలవనిదే చప్పట్లు అసాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ను దూరం పెట్టడమే సరైన వ్యూహం. ఇప్పుడు భారత్ చేస్తున్నది అదే’’ అని వివరించారు. ‘‘స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో సామాజికంగా, ఆర్థికంగా, తలసరి ఆదాయంలోనూ పాక్ మనకంటే చాలా ముందంజలో ఉంది. కానీ ఇప్పుడు ప్రతి రంగంలోనూ మనం పాక్ అందుకోలేనంతగా ప్రగతి సాధించాం’’ అని గుర్తు చేశారు.దేశాన్ని తప్పుదోవ పట్టించిన కేంద్రం: కాంగ్రెస్ పాక్తో జరిగిన సాయుధ ఘర్షణ విషయంలో మోదీ సర్కారు దేశాన్ని తప్పుదోవ పట్టించిందంటూ కాంగ్రెస్ మండిపడింది. అది దాచేసిన నిజాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని ఫైటర్ జెట్లను కోల్పోయామన్న సీడీఎస్ ప్రకటనను ఉద్దేశించి అభిప్రాయపడింది. పాక్తో నాలుగు రోజుల ఘర్షణలో ఎంత నష్టం జరిగిందో వాస్తవాలు వెల్లడించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ‘‘సీడీఎస్ ప్రకటన నేపథ్యంలో సిందూర్కు సంబంధించి ఎన్నో కీలక సందేహాలు తలెత్తుతున్నాయి. వాటన్నింటికీ సమాధానాలు లభించాలంటే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలే ఏకైక మార్గం. కాబట్టి తక్షణం వాటిని ఏర్పాటు చేయాలి. అంతేకాదు, మన యుద్ధ సన్నద్ధతపై స్వతంత్ర కమిటీతో దర్యాప్తు జరిపించాలి’’ అంటూ ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. కార్గిల్ యుద్ధంపై కూడా వాజ్పేయి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం కమిటీ వేసి సమీక్ష జరిపిందని గుర్తు చేశారు. ‘‘మన వీర పైలట్లు ప్రాణాలకు తెగించి దేశ గౌరవాన్ని కాపాడారు. వారికి వందనం’’ అంటూ ఖర్గే కొనియాడారు.