International
-
అమెరికా KC-135 స్ట్రాటోట్యాంకర్ అదృశ్యం
వాషింగ్టన్: ఇరాన్పై యుద్ధంలో అమెరికాకు ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా సైనిక విమానాలకు గాలిలో ఇంధన కేంద్రంగా పనిచేసే బోయింగ్ కేసీ-135 స్ట్రాటోట్యాంకర్ విమానం ఆచూకీ గల్లంతయ్యింది.ఫ్లైట్రాడార్24 డేటా ప్రకారం.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అల్ ధఫ్రా ఎయిర్ బేస్ నుండి బయలుదేరిన ఈ విమానం ఖతార్ మీదుగా ప్రయాణిస్తుండగా సంకేతాలు నిలిచిపోయాయి. అదృశ్యానికి ముందు ‘7700’ అనే అత్యవసర సంకేతాన్ని జారీ చేసింది.విమానాన్ని పర్షియన్ గల్ఫ్ మీదుగా కొనసాగుతున్న సైనిక చర్యలకు మద్దతుగా ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ల్యాండింగ్కు ముందు కొంతసేపు గాలిలో వృత్తాకారంలో తిరిగినట్లు ట్రాకింగ్ డేటా తెలిపింది. అత్యవసర పరిస్థితికి కారణం ఇంకా తెలియాల్సి ఉంది.ఈ ఘటనపై ఇరాన్ మీడియా సంస్థ ఫార్స్ వార్తా సంస్థ ఈ ఘటనపై నివేదిక ఇచ్చింది. అయితే, అమెరికా విమానం అదృశ్యానికి ఇరాన్ ప్రమేయం ఉందని ఎలాంటి ప్రకటన చేయలేదు. -
ఇండియన్స్ నిజంగా గ్రేట్!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం బుర్జ్ ఖలీఫా వంటి ఐకానిక్ ప్రాజెక్టుల వెనుక ఉన్న అద్భుతమైన వాస్తుశిల్పం(ఆర్కిటెక్చర్)తోపాటు భారతీయుల అంకితభావం ఉందని ఎమార్ గ్రూప్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ అలబ్బార్ స్పష్టం చేశారు. అబుదాబిలో జరిగిన ప్రతిష్టాత్మక ‘మేక్ ఇట్ ఇన్ ది ఎమిరేట్స్’ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.అర్ధరాత్రి ఒంటి గంటకు స్పందననియామకాల విషయంలో తాను ఎందుకు భారతీయులకు మొదటి ప్రాధాన్యత ఇస్తానో అలబ్బార్ తనదైన శైలిలో వివరించారు. ‘మీరు ప్రపంచాన్ని జయించాలంటే భారతీయ ప్రతిభ అవసరం. ప్రపంచమంతా పని గంటలకు సంబంధించి గడియారంవైపు చూస్తుంటే భారతీయ నిపుణులు మాత్రం అర్ధరాత్రి ఒంటి గంటకైనా ఫోన్ తీసి సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటారు. ఈ అసాధారణమైన పనితీరు వారిని ప్రపంచంలోనే నంబర్ వన్గా నిలబెట్టింది’ అని ఆయన కొనియాడారు.అలబ్బార్ ఎత్తిచూపిన లక్షణాలు2008 ఆర్థిక మాంద్యం, కొవిడ్-19 వంటి గడ్డుకాలంలో ఎమార్ గ్రూప్ ఎలా నిలదొక్కుకుందో వివరిస్తూ, భారతీయ శ్రామిక శక్తిలో తాను గమనించిన ప్రధాన లక్షణాలను ప్రస్తావించారు.క్లిష్టమైన ప్రాజెక్టుల్లో ఎంత ఒత్తిడి ఉన్నా పనులను సమర్థవంతంగా నిర్వహిస్తారు.రోజూ పనులను తనిఖీ చేస్తూ ముందస్తుగా ప్రమాదాలను అంచనా వేసి తగిన చర్యలు చేపడుతారు.మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా కొత్త విషయాలను నేర్చుకోగల సామర్థ్యం భారతీయుల సొంతం.తన ప్రస్థానం గురించి చెప్పుకుంటూ ‘నా ఐక్యూ సగటు మాత్రమే కావచ్చు, కానీ నా కృషి ప్రపంచంలోనే అత్యుత్తమమైనది’ అని అలబ్బార్ వినమ్రంగా వ్యాఖ్యానించారు. ‘మీరు ఎంత కష్టపడి పనిచేస్తారో అంత అదృష్టవంతులు అవుతారు’ అన్నది తన విజయ రహస్యమని పేర్కొన్నారు.భారతదేశంతో అనుసంధానంభారతీయ ప్రతిభను ప్రోత్సహించడానికి ఎమార్ గ్రూప్ ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టింది. రాజస్థాన్లోని రాఫెల్స్ యూనివర్సిటీతో కలిసి అలబ్బార్ ప్రత్యేక భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా ఏటా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టాప్ 20 మంది విద్యార్థులను ఎంపిక చేసి దుబాయ్, యూరప్, ఆసియాలోని తమ కార్యాలయాల్లో నేరుగా ఉపాధి కల్పిస్తున్నారు.అలబ్బార్ భరోసాభారతదేశం పట్ల ఎందుకు ఇంత సానుకూలంగా ఉన్నారని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ‘ప్రస్తుతం ప్రపంచంలో భారతదేశం కంటే మెరుగైన, విస్తృతమైన, స్థిరమైన, నిరంతరం వృద్ధి చెందుతున్న మరో దేశం ఏదీ లేదు’ అని ఆయన నమ్మకంగా చెప్పారు. దాంతో ప్రపంచ నిర్మాణ రంగంలో భారతీయ నిపుణుల సత్తా మరోసారి అంతర్జాతీయ వేదికపై మారుమోగింది.ఇదీ చదవండి: స్మార్ట్ఫోన్ తయారీలోకి ఓపెన్ఏఐ ఎంట్రీ? -
అటు మోదీ, ఇటు విజయ్.. ప్రపంచ మీడియా ఫిదా
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ 15 ఏళ్ల ఏకఛత్రాధిపత్యానికి తెరదించుతూ భారతీయ జనతా పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. న్యూయార్క్ నుంచి లండన్ వరకు, ఇస్లామాబాద్ నుంచి ఢాకా వరకు అంతర్జాతీయ మీడియా పత్రికలన్నీ భారత్లో చోటుచేసుకున్న ఈ రాజకీయ పెనుమార్పులనే పతాక శీర్షికలుగా ప్రచురించాయి. తమిళనాడులో దళపతి విజయ్ పార్టీ ‘టీవీకే’ సృష్టించిన రాజకీయ సునామీ సైతం పాశ్చాత్య పత్రికల దృష్టిని ఆకర్షించింది.బెంగాల్లో కమల వికాసం.. బ్రిటన్ మీడియా ఆశ్చర్యంప్రతిపక్షాల కంచుకోటగా ఉన్న పశ్చిమ బెంగాల్ను మోదీ నేతృత్వంలోని బీజేపీ కైవసం చేసుకోవడంపై బీబీసీ తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మోదీ 12 ఏళ్ల పాలనలో తూర్పు భారతావనిలో సాధించిన అత్యంత అద్భుతమైన విజయాల్లో ఇది ఒకటని ఆ పత్రిక కొనియాడింది. మరోవైపు ‘ది గార్డియన్’ పత్రిక సైతం ఈ పరిణామం భారత రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తుందని విశ్లేషించింది. ఇప్పటికే బలహీనపడిన ప్రతిపక్షాలకు ఈ ఫలితాలు కోలుకోలేని దెబ్బ అని పేర్కొంది.అమెరికా పత్రికల్లో మోదీ, విజయ్ సంచలనాలుఅమెరికాకు చెందిన ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక బీజేపీ బెంగాల్ గెలుపును ‘చరిత్రాత్మకం’గా అభివర్ణించింది. హిందూ జాతీయవాదులు ప్రతిపక్షాల ప్రధాన కోటను బద్దలు కొట్టారని పేర్కొంది. తమిళనాడులో రాజకీయ ఓనమాలు కూడా తెలియని సినీ నటుడు జోసెఫ్ విజయ్ (టీవీకే).. డీఎంకే లాంటి బలమైన పార్టీలను మట్టికరిపించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇక మోదీ మూడో విడత పాలనలో ఈ ఘన విజయాలు ఆయన స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయని ‘వాషింగ్టన్ పోస్ట్’ తన కథనంలో విశ్లేషించింది.పాక్, బంగ్లాదేశ్ మీడియాలోనూ..భారత ఎన్నికల ఫలితాల ప్రకంపనలు పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ మీడియాలోనూ కనిపించాయి. పాక్ పత్రిక ‘డాన్’.. ప్రతిపక్షాల కోటను జాతీయవాద పార్టీ కైవసం చేసుకుందని పేర్కొంది. ఈ గెలుపు 2029 ఎన్నికల నాటికి మోదీని మరింత శక్తివంతంగా మారుస్తుందని తెలిపింది. అటు బంగ్లాదేశ్ పత్రిక ‘ఢాకా ట్రిబ్యూన్’ సైతం బెంగాల్ ఫలితాలతో పాటు, తమిళనాడులో రాజకీయ ఉద్ధండుడు ఎంకే స్టాలిన్ను వెనక్కి నెట్టి, విజయ్ పార్టీ అఖండ విజయం సాధించడాన్ని రాజకీయ సంచలనంగా వర్ణించింది.ఇది కూడా చదవండి: లాటరీ కింగ్ ఇంట్లో ట్రిపుల్ ధమాకా: మూడు పార్టీల నుంచి.. -
చైనాలో భారీ పేలుడు: 21 మంది మృతి
హునాన్: చైనాలోని హునాన్ ప్రావిన్స్లో విషాదం చోటుచేసుకుంది. యాంగ్ నగరంలో సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక బాణసంచా కర్మాగారంలో అత్యంత శక్తివంతమైన పేలుడు సంభవించింది. గ్వాండు టౌన్షిప్లోని ‘లియుయాంగ్ హువాషెంగ్ ఫైర్వర్క్స్ మాన్యుఫ్యాక్చరింగ్’కు చెందిన ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో 21 మంది మరణించగా, 60 మందికి పైగా జనం తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాద సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక, సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా, భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.ఇది కూడా చదవండి: బెంగాల్ కొంపముంచిన ‘బంగ్లా’ సంక్షోభం -
వైట్హౌస్ సమీపంలో మరోసారి కాల్పుల కలకలం
వాషింగ్టన్: వైట్హౌస్ సమీపంలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. వాషింగ్టన్ మాన్యూమెంట్ సమీపంలో తుపాకీతో అనుమానాస్పద వ్యక్తి హల్చల్ చేశాడు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లను చూసిన నిందితుడు కాల్పులు జరిపాడు. ఎదురు కాల్పుల్లో అనుమానితుడు తీవ్రంగా గాయపడ్డాడు. కాల్పుల ఘటనలో ఓ బాలుడు కూడా గాయపడ్డాడు.తుపాకీ కాల్పులు జరగడానికి కొద్ది నిమిషాల ముందు.. వైట్ హౌస్ కాంప్లెక్స్ వెలుపల గస్తీ తిరుగుతున్న సీక్రెట్ సర్వీస్ అధికారులు,ఏజెంట్లు తుపాకీని కలిగి ఉన్నట్లు కనిపిస్తున్న ఒక అనుమానిత వ్యక్తిని గుర్తించారని యూఎస్ఎస్ఎస్ డిప్యూటీ డైరెక్టర్ మాట్ క్విన్ మీడియా సమావేశంలో చెప్పారు. యూనిఫాంలో ఉన్న సీక్రెట్ సర్వీస్ పోలీసులు ఆ వ్యక్తిని సమీపించగా.. అతను పారిపోతూ అధికారులపై కాల్పులు జరిపారని క్విన్ తెలిపారు. అధికారులు ఎదురుకాల్పులు జరపడంతో ఆ వ్యక్తికి బుల్లెట్ గాయాలయ్యాయి.సదరు వ్యక్తి అంతకుముందు సోమవారం వైట్ హౌస్ ప్రవేశ ద్వారం వద్దకు చేరుకోవడానికి ప్రయత్నించారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం నిందితుడు మేరీల్యాండ్కు చెందిన శ్వేత జాతీయుడిగా భావిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నారు. కాగా, నిందితుడు జరిపిన కాల్పుల్లో గాయపడిన ఓ బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని.. స్వల్ప గాయంతో బయటపడ్డారని డీసీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కాల్పుల ఘటన జరగడానికి కొద్దిసేపటి ముందే.. వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కాన్వాయ్ ఆ ప్రాంతం మీదగా వెళ్ళింది.కాల్పుల ఘటన జరిగిన కొద్దిసేపటికే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లోని ఈస్ట్ రూమ్లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించారు. అధ్యక్షుడు ట్రంప్కు ఎలాంటి ముప్పు లేదని.. ఈ ఘటనకు వైట్ హౌస్తో సంబంధం ఉన్నట్లు ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని క్విన్ ఒక ప్రకటనలో తెలిపారు. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ జరిగిన హోటల్ వద్ద కాల్పుల ఘటన జరిగిన రెండు వారాల లోపే ఈ రెండో ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. -
మళ్లీ మొదలైన పశ్చిమాసియా యుద్ధం!
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. యూఏఈలోని పుజైరా చమురు కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడులు జరిపింది. క్షతగాత్రుల్లో ముగ్గురు భారతీయులు ఉన్నట్లు సమాచారం. త్వరలో శత్రువుల పునాదులు పెకలిస్తామని ఐఆర్జీసీ ప్రకటించిన కొద్దిగంటలకే ఈ దాడులు జరగడం గమనార్హం.గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు, చిన్న పడవలతో యుద్ధానికి దిగింది. అయితే 12 బాలిస్టిక్ మిసైళ్లు, 3 క్రూయిజ్ మిసైళ్లు, 4 డ్రోన్లను యూఏఈ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలోనే పలువురికి గాయాలైనట్లు సమాచారం. మరోవైపు.. పర్షియన్ గల్ఫ్ తీరంలోని ముసందం (Musandam) గవర్నరేట్ పరిధిలోని బుఖా ప్రాంతంలో(ఒమన్) కార్మికుల నివాస భవనం దెబ్బతింది. ఈ దాడిలో ఇద్దరు విదేశీయులు గాయపడ్డారు. ఈ దాడుల్ని ఈయూ, సౌదీ అరేబియాలు ఖండించాయి. దాడుల నేపథ్యంలో యూఏఈ తమ విమానాలను నిలిపివేసింది.ఇటు హర్ముజ్లోనూ..హర్ముజ్ జలసంధిలోనూ ఇరాన్ అమెరికా రక్షణలో ఉన్న నౌకలను టార్గెట్గా చేసుకుని దాడులు జరిపాయి. అయితే తమ నౌకలు సేఫ్గానే ఉన్నాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. దాడుల్లో దక్షిణ కొరియాకు చెందిన ఓ వాణిజ్య నౌక మంటల్లో కాలిపోయింది. మరోవైపు ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో వందలాది నౌకలు హర్ముజ్లో నిలిచిపోయాయి. వాటిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు అమెరికా రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేస్తోంది.ట్రంప్ ఏమన్నారంటే.. ఇరాన్ తాజా దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. యూఎస్ నౌకలను.. యూఎస్ రక్షణలో ఉన్న నౌకలపై ఇరాన్ దాడులు జరిపిన వాళ్లను భూమ్మీద లేకుండా చేస్తాం హెచ్చరించారు. ఈ తరుణంలో కాల్పుల విరమణ(ceasefire) కొనసాగుతోందా? అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు. అయితే ‘‘యుద్ధం సైనికంగా ముగిసింది’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.ఇరాన్ వైఖరియూఏఈపై దాడులు జరిపింది తామేనని ఇరాన్ అంగీకరించలేదు. ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి స్పందిస్తూ.. ఈ ఉద్రిక్తతల్ని చల్లార్చేందుకు సైనిక పరిష్కారం పనికి రాదు. రాజకీయ పరిష్కారం అవసరం అని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఇరాన్ తాజా దాడుల నేపథ్యంలో.. ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. గల్ఫ్ దేశాల్లో కాల్పులు, హెచ్చరికలు కొనసాగుతున్నాయి. సీజ్ ఫైర్ చాలా బలహీనంగా మారడంతో ఏ క్షణాన ఏం జరగనుందో అని గల్ఫ్ ప్రాంతంలో టెన్షన్ నెలకొంది. -
చైనా గుట్టు రట్టయ్యిందా?
కరోనా పుట్టుక విషయంలో చైనాపై అగ్రరాజ్యం అమెరికా సంచలన ఆరోపణలకు దిగింది. అయితే వుహాన్ ల్యాబ్లోనే వైరస్ పుట్టిందన్న దానికి తగిన ఆధారాలు మాత్రం చూపెట్టలేకపోయింది. ఈ తరుణంలో ఇప్పుడు మరో అంశంపైనా డ్రాగన్ కంట్రీ గోప్యత ప్రదర్శిస్తోందని.. ఆ గుట్టు ఇప్పుడు రట్టయ్యిందని డాటాను రిలీజ్ చేసింది.2022 మార్చి 21న చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ విమానం (MU5735) గ్వాంగ్సీ ప్రాంతంలోని పర్వతాల్లో కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 132 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. విమానం 49 వేల ముక్కలు కావడంతో.. వాటి సేకరణకు భారీ సిబ్బందిని వినియోగించారు. చైనాలో గత కొన్ని దశాబ్దాల్లో జరిగిన అత్యంత ఘోర విమాన ప్రమాదం ఇది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను చైనా ఇప్పటిదాకా బయటి ప్రపంచానికి వెల్లడించలేదు.ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత.. అమెరికా నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) ఒక సంచలన నివేదిక ఇచ్చింది. ఆ ప్రమాదం సహజసిద్ధంగా జరగలేదని.. కాక్పిట్లో ఎవరో ఉద్దేశపూర్వకంగా ఇంధన సరఫరా నిలిపివేశారని తెలిపింది.ఫ్లైట్ డేటా రికార్డర్ (బ్లాక్బాక్స్) విశ్లేషణలో.. 29,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు రెండు ఇంజిన్లకు ఇంధన స్విచ్లు ఒకేసారి “రన్” స్థితి నుండి “కట్ఆఫ్” స్థితికి మార్చబడ్డాయి. దీని తర్వాత ఇంజిన్ వేగం తగ్గి, విమానం వేగంగా కిందికి పడిపోయింది. ఒకవేళ అది పొరపాటుగా జరిగి ఉంటే.. పైలట్లు అప్రమత్తం అయ్యేవాళ్లు. వెంటనే తప్పును సరి చేసుకునేవారు. కానీ, అలాంటి ప్రయత్నం జరగలేదు అని డేవిడ్ సౌసీ అనే నిపుణుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.కాక్పిట్ వాయిస్ రికార్డర్ (CVR) బ్యాటరీ బ్యాకప్తో చివరి క్షణాలను రికార్డు చేసినప్పటికీ.. ఆ ఆడియో ఫైళ్లను అమెరికా అధికారులు చైనా సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (CAAC)కి పంపారు. అయితే, సీఏఏసీ ఇప్పటిదాకా ఈ ప్రమాదం ఉద్దేశపూర్వకమని అంగీకరించలేదు. 2024లో రిలీజ్ చేసిన నివేదికలో మాత్రం అంతా సవ్యంగానే ఉందని పేర్కొంది. గతంలో..2022లో వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక కూడా ‘‘విమానం కాక్పిట్లో ఎవరో ఇచ్చిన ఆదేశాల ప్రకారం కూలిపోయింది’’ అని సంచలనాత్మక కథనం ఇచ్చింది. ఇది పైలట్ ఆత్మహత్య చర్యనా? లేదంటే మరెవరైనా కాక్పిట్లోకి చొరబడి చేసిన చర్యా? అన్న ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. అసలు బ్లాక్బాక్స్ డేటాను చైనా ఎందుకు బయటపెట్టడం లేదన్న విమర్శలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. -
ఏఐ మిమ్మల్ని ఏం చేయలేదు! కోర్టు తీర్పులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆగమనంతో ప్రపంచవ్యాప్తంగా ఉపాధి రంగంలో అనిశ్చితి నెలకొంది. సాంకేతికతను సాకుగా చూపి కంపెనీలు ఉద్యోగులను తొలగించడం సర్వసాధారణమైపోయింది. అయితే, ఈ ధోరణికి చైనా న్యాయస్థానాలు గట్టి అడ్డుకట్ట వేశాయి. ఏఐ నేతృత్వంలోని ఉద్యోగ తొలగింపులు ఇకపై కష్టతరమని, ఆటోమేషన్ సాకుతో కార్మిక హక్కులను కాలరాయలేమని స్పష్టం చేస్తూ వెలువరించిన వరుస తీర్పులు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.నిర్వహణ కార్మిక బాధ్యతడిసెంబర్ 2025 నుంచి ఏప్రిల్ 2026 మధ్య కాలంలో హాంగ్జౌ, బీజింగ్ కోర్టులు ఇచ్చిన తీర్పులు ఏఐని కేవలం ఒక సాంకేతిక మార్పుగా మాత్రమే కాకుండా, కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే ఒక కీలక వ్యాపార అంశంగా పరిగణించాయి. చాలా సంస్థలు ఏఐని స్వీకరించడాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో భారీ మార్పుగా పేర్కొంటూ ఉద్యోగులను తొలగిస్తుంటాయి. కానీ, ఈ న్యాయస్థానాలు ఆ వాదనను తోసిపుచ్చాయి. ఆటోమేషన్ అనేది కంపెనీ తీసుకునే ఒక స్వచ్ఛంద, ప్రణాళికాబద్ధమైన నిర్ణయం తప్ప, అనివార్య పరిస్థితి కాదని కోర్టులు తేల్చిచెప్పాయి. దానివల్ల కలిగే నష్టభారాన్ని మొత్తం ఉద్యోగులపైనే వేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశాయి.హాంగ్జౌ, బీజింగ్ తీర్పుల సారాంశంహాంగ్జౌ.. టెక్నాలజీ మెరుగుపడిందనే నెపంతో హ్యూమన్-ఏఐ ఇంటర్ఫేస్పై పనిచేసే ఒక ఉద్యోగికి 40% వేతన కోతతో తక్కువ హోదా కలిగిన పదవిని ఆఫర్ చేశారు. అతను నిరాకరించడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. దీన్ని సవాలు చేసిన సదరు ఉద్యోగికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. పాక్షికంగా ఆటోమేషన్ జరిగినంత మాత్రాన ఒక ఉద్యోగి పాత్ర పూర్తిగా అప్రస్తుతం కాదని కోర్టు స్పష్టం చేసింది.బీజింగ్ ‘లియు’ కేసు: మ్యాప్ డేటా సేకరణలో ఆటోమేషన్ రావడంతో లేఆఫ్కు గురైన వ్యక్తికి కోర్టు ఉపశమనం కల్పించింది. కార్మిక రక్షణ చట్టాలను దాటవేసేందుకు ఆటోమేషన్ను ఆయుధంగా వాడుకోవద్దని కంపెనీలను హెచ్చరించింది.ఈ తీర్పుల ప్రకారం, ఒక ఉద్యోగిని బాధ్యతల నుంచి తొలగించాలంటే ఆ పాత్ర పూర్తిగా అసాధ్యమని కంపెనీలు నిరూపించాలి. కేవలం ‘పని మరింత సమర్థవంతంగా జరుగుతుంది’ అనే కారణంతో ఉద్యోగులను తొలగించడం ఇక చెల్లదు. కంపెనీలు తప్పనిసరిగా ఉద్యోగులకు రీస్కిల్లింగ్ ఇవ్వడం, ఉద్యోగితో చర్చలు జరపడం వంటి బాధ్యతలను నెరవేర్చాలి.మన చట్టాలు ఏమి చెబుతున్నాయి?ప్రస్తుతం భారతదేశంలో ఏఐపై నిర్దిష్ట కార్మిక చట్టాలు లేనప్పటికీ ఉన్నత న్యాయస్థానాలు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు పంపాయి. 2026లో మద్రాస్ హైకోర్టు ఏఐ ఆధారిత తొలగింపును పక్కన పెట్టింది. అంతకుముందు ఢిల్లీ హైకోర్టు కూడా ఆటోమేటెడ్ సిస్టమ్స్పై అతిగా ఆధారపడవద్దని సంస్థలను హెచ్చరించింది. పారిశ్రామిక వివాదాల చట్టం (ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్) ప్రకారం ఆటోమేషన్ వల్ల జరిగే ఉద్యోగ నష్టాన్ని తొలగింపుగా పరిగణిస్తారు. దీనికి నోటీసులు, పరిహారం తప్పనిసరి. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, 2023 ఉద్యోగుల డేటా వినియోగంపై ఆంక్షలు విధించింది. అలాగే, చర్చల దశలో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎథిక్స్ అండ్ అకౌంటబిలిటీ) బిల్లు, 2025 మానవ పర్యవేక్షణ, అప్స్కిల్లింగ్ను తప్పనిసరి చేయనుంది.సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ న్యాయస్థానాలు న్యాయం, మానవీయ విలువలు, యజమాని బాధ్యతలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఏఐ ఆఫీస్ వర్క్ను పునర్నిర్మించవచ్చు. కానీ ఆ మార్పులో ఉద్యోగుల హక్కులను కాలరాసే హక్కు కంపెనీలకు లేదు. చైనా తీర్పులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న న్యాయవ్యవస్థలకు ఒక దిక్సూచిలా పనిచేస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: మార్కెట్లో జూదం ఆడుతున్నారు! -
భారతీయ కార్మికులపై తైవాన్ నిరసన
వృద్ధాప్య జనాభా, తగ్గుతున్న జనన రేట్ల కారణంగా కార్మిక కొరతను అధిగమించాలని చూస్తున్న తైవాన్కు సొంత ప్రజల నుంచే అడ్డంకులు ఎదురవుతున్నాయి. భారతీయ కార్మికులను నియమించుకోవాలనే ప్రభుత్వ నిర్ణయంపై తైవాన్ సమాజంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో 40,000 మందికి పైగా తైవానీయులు ఆన్లైన్ పిటిషన్పై సంతకాలు చేస్తూ భారతీయ కార్మికులను తీసుకురావాలనే ప్రణాళికను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.తైవాన్ తన తయారీ రంగం, వృద్ధుల సంరక్షణ విభాగంలో నెలకొన్న ఖాళీలను భర్తీ చేయడానికి ఫిబ్రవరి 2024లో భారతదేశంతో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేసింది. ప్రస్తుతం ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, థాయ్లాండ్ల మీద ఎక్కువగా ఆధారపడుతున్న తైవాన్ తన వలస కార్మిక వనరులను వైవిధ్యపరచాలని భావించింది. ఇందులో భాగంగా కేవలం 1,000 మంది కార్మికులతో ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించింది.మార్చి 2026 నాటికి, తైవాన్ సుమారు 8 లక్షల మంది చట్టబద్ధమైన వలస కార్మికులకు ఆతిథ్యం ఇస్తోంది. కొత్త కార్మిక వనరులు చేకూరకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ, సామాజిక భద్రత ప్రమాదంలో పడుతుందని కార్మిక మంత్రిత్వ శాఖ పదేపదే హెచ్చరిస్తోంది.ప్రభుత్వ నిర్ణయానికి ప్రజా ప్రతిఘటనతైవాన్ కార్మిక మంత్రి హంగ్ సున్-హాన్ ఈ ఏడాది చివరి నాటికి మొదటి విడత భారతీయ కార్మికులు వస్తారని ప్రకటించిన కొద్ది కాలంలోనే సోషల్ మీడియా వేదికగా, స్థానికంగా అక్కడి వీధుల్లో నిరసనలు భగ్గుమన్నాయి. భారతీయ పురుషులపై నెలకొన్న ప్రతికూల అభిప్రాయం, భద్రత, లింగ హింసకు సంబంధించిన భయాలు ఈ పిటిషన్కు దారితీశాయి. ప్రతిపక్ష కుమింటాంగ్ (కేఎంటీ) చట్టసభ సభ్యులు ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. తైవాన్ వాసులు భారతీయుల పట్ల జాత్యహంకార పూరిత వ్యాఖ్యలు చేయడం, సామాజిక మాధ్యమాల్లో భారతీయ పురుషులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు చేయడం ఆందోళనకరంగా మారింది.ప్రభుత్వ వాదన - వాస్తవాలుఈ అంశంపై ప్రజా ఆందోళనలను ఎదుర్కొంటున్నప్పటికీ కార్మిక మంత్రిత్వ శాఖ మాత్రం భారతీయ కార్మికులను లైంగిక నేరాలతో ముడిపెట్టడం నిరాధారమైనదని స్పష్టం చేసింది. గతంలో ఇతర దేశాల నుంచి వచ్చిన వలస కార్మికులతో పోలిస్తే నేరాల రేటు స్థిరంగా ఉంటుందని, పైగా రిక్రూట్ అయ్యే ప్రతి కార్మికుడు భారత ప్రభుత్వం నుంచి మెరుగైన ప్రవర్తన సర్టిఫికేట్ (Good Conduct Certificate) సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తైవాన్ కఠినమైన స్క్రీనింగ్ ప్రక్రియలో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది.దౌత్యం వైపు అడుగులుప్రస్తుతానికి, తైపీ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. కఠినమైన పర్యవేక్షణ, భద్రతా హామీలు ఉంటేనే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామని సంకేతాలు ఇచ్చింది. అయితే కార్మిక కొరతకు సామాజిక భద్రతకు మధ్య సమతుల్యత సాధించడమే ఇక్కడ అసలైన సమస్య. అంతర్జాతీయంగా ఎంతో మంది భారతీయులు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నప్పటికీ ఒక దేశంపై ఏర్పడిన ప్రతికూల ముద్ర దౌత్యపరమైన సంబంధాలతోపాటు అవసరమైన ఆర్థిక అవసరాలకు కూడా ఆటంకం కలిగిస్తుందని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి.ఇదీ చదవండి: ఏఐలో ఎందుకో వెనకబడ్డాం! -
హర్ముజ్పై ట్రంప్ కీలక ప్రకటన
పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరోసారి యుద్ధం దిశగా అడుగులేస్తున్నాయి. ఇప్పటికే ఇరు దేశాలు పరస్పర ప్రతిపాదనలను తోసిపుచ్చుకున్నాయి. శాంతి చర్చలంటూనే.. ఇరాన్ను రెచ్చగొట్టేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన చేసిన మరో ప్రకటన హర్ముజ్లో సరికొత్త ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది. ప్రాజెక్ట్ ఫ్రీడమ్.. ట్రంప్ చేసిన తాజా ప్రకటన. హర్ముజ్ జలసంధిలో చిక్కుకున్న నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ మేరకు ఆయన సోషల్ ట్రూత్లో ‘‘చిక్కుకున్న ఆ నౌకలు తటస్థమైనవి. ఈ ఉద్రిక్తతలతో వాటికి ఏ సంబంధం లేదు. ఏ తప్పు చేయకుండానే అందులో ఉన్న సిబ్బంది ఆహారం, ఇతర అవసరాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వాటిని సురక్షితంగా బయటకు తేవాల్సిన అవసరం అమెరికా బాధ్యత’’ అని ప్రకటించారు. ఏం చేస్తారంటే.. ట్రంప్ చెప్పిన వివరాల ప్రకారం.. ప్రాజెక్టు ఫ్రీడమ్ సోమవారం మధ్యాహ్నాం(మిడిల్ ఈస్ట్ కాలమానం ప్రకారం) ప్రారంభం కానుంది. మానవతా దృక్పథంతో ఈ ఆపరేషన్ చేపడుతున్నామని.. ప్రాంతీయ స్థిరత్వానికి, అలాగే అంతర్జాతీయ వాణిజ్యానికి కూడా ఎంతో కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సీ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశ్యం.. సముద్ర మార్గంలో చిక్కుకున్న వందలాది నౌకలు, వాటిల్లోని సుమారు 20,000 మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకు రావడం. ఆ నౌకలు సురక్షితంగా బయటకు వచ్చేందుకు అమెరికా సైన్యం దారి చూపుతుంది. వాటికి రక్షణగా నిలుస్తుంది. తద్వారా వాటి వ్యాపార కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు సహాయం చేస్తుంది. సీ ఆపరేషన్కు ఇరాన్ సహకరిస్తుందా?హర్ముజ్ సముద్ర మార్గం ప్రపంచ చమురు రవాణాకు కీలకమైనది. రెండు నెలలుగా ఇక్కడ ఏర్పడ్డ అంతరాయం, కొనసాగుతున్న ఉద్రిక్తతలతో అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన మార్కెట్లపై ప్రభావం పడింది. గ్లోబల్ మార్కెట్ కుదేలైంది. దీనిని ఆసరాగా చేసుకుని అమెరికాను తమ డిమాండ్లకు ఒప్పించాలని ఇరాన్ భావిస్తోంది. ఈ తరుణంలో ట్రంప్ తాజా ప్రకటనకు, నౌకలు సురక్షితంగా బయటకు వచ్చేందుకు సహకరిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికే ఇరాన్ ప్రతిపాదించిన 14 పాయింట్ల శాంతి ప్రణాళికను ట్రంప్ తిరస్కరించారు. ఆయన దానిని "అంగీకారయోగ్యం కాదు" అని వ్యాఖ్యానించారు. ఇరాన్తో "సానుకూల చర్చలు" జరుగుతున్నాయని ట్రంప్ సూచించారు. అదే సమయంలో ప్రాజెక్టు ఫ్రీడమ్లో గనుక జోక్యం చేసుకుంటే కఠినంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు.ఇరాన్ ఏమందంటే.. ప్రాజెక్టు ఫ్రీడమ్ను మానవతా చర్యగా ట్రంప్ చెబుతున్నప్పటికీ.. ఇది ముమ్మాటికీ అమెరికా వ్యూహాత్మక శక్తి ప్రదర్శనగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. ఈ చర్యను అసాధ్యంగా ఇరాన్ అభివర్ణిస్తోంది. హర్ముజ్ తమ ఆధీనంలో ఉందని.. ఇప్పటికే అమెరికా బ్లాకేడ్(దిగ్బంధనం) తమ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తోందని.. ఇప్పుడు నౌకల తరలింపునకు అమెరికా తన సైన్యాన్ని రంగంలోకి దించితే గనుక అది కాల్పుల విరమణ ఉల్లంఘన కిందకే వస్తుందని ప్రకటించింది. ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ అధిపతి అబ్రహీం అజిజీ ఈ సముద్ర ఆపరేషన్పై సెటైర్లు వేశారు. హర్ముజ్ సముద్ర మార్గం అనేది అమెరికా ట్రూత్ సోషల్ పోస్టులతో నిర్వహించబదని ఎద్దేవా చేశారు. హర్ముజ్ పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని స్పష్టం చేశారాయన. దీంతో “ప్రాజెక్ట్ ఫ్రీడమ్”కు ఇరాన్ సహకారం ఇవ్వదనేది స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఇది ఎలాంటి ఉద్రిక్తతలకు దారి తీస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. -
లిపులేఖ్ మీదుగా మానస సరోవర్ యాత్ర
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లోని లిపులెఖ్ కనుమ మీదుగా చేపట్టే కైలాశ్ మానస సరోవర్ యాత్రపై నేపాల్ అభ్యంతరం చెప్పడాన్ని భారత్ ఖండించింది. ఏకపక్షంగా, కృత్రిమంగా విస్తరించుకుని భూభాగాలపై హక్కులను ప్రకటించడం ఏమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది. జూన్ నుంచి ఆగస్ట్ వరకు మానస సరోవర్ యాత్ర జరుగుతుందని గత వారం విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే, తమను ఏమాత్రం సంప్రదించకుండా భారత్, చైనాలు లిపులేఖ్ మీదుగా మానస్ సరోవర్ యాత్రకు ఏర్పాట్లు చేస్తుండటాన్ని ఖండిస్తూ నేపాల్ విదేశాంగ శాఖ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. లిపులెఖ్ తమ భూభాగమని పేర్కొంది. దీనిపై కొద్ది గంటల్లోనే భారత్ స్పందించింది. ‘ఈ విషయంలో భారత్ వైఖరి స్థిరంగా, స్పష్టంగా ఉంది. లిపులెఖ్ కనుమ 1954 నుంచి కైలాస మానస సరోవర యాత్రకు పురాతన మార్గంగా ఉంటోంది. దశాబ్దాలుగా అదే మార్గంలో యాత్ర కొనసాగుతోంది’అని విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. నేపాల్ చేస్తున్న వాదనలు ఏమాత్రం సమర్థనీయం కాదని చెప్పా రు. వాటికి చారిత్రక ఆధారాలు లేవన్న విషయాన్ని భారత్ మొదట్నుంచీ చెబుతూనే ఉందన్నారు. -
దురుసుగా ప్రవర్తిస్తే మళ్లీ దాడులు చేస్తాం
వాషింగ్టన్: పశ్చిమాసియాలో తాత్కాలికంగా నిలిచిపోయిన యుద్ధాన్ని పూర్తిగా ముగించేందుకు ఇరాన్ నుంచి వచ్చిన తాజా ప్రతిపాదనను సమీక్షిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఒకవేళ ఇరాన్ గనక దురుసుగా ప్రవర్తిస్తే ఆ దేశంపై దాడులు మళ్లీ ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఆయన శనివారం ఫ్లోరిడాలోని పామ్ బీచ్ నుంచి మియామీ వెళ్తూ విలేకరులతో మాట్లాడారు. ఇరాన్తో శాంతి ఒప్పందం విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ తప్పుగా ప్రవర్తిస్తే, ఏదైనా చెడు చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందన్నారు. ఇరాన్ పంపిన కొత్త ప్రతిపాదనను నిశీతంగా పరిశీలిస్తున్నానని, దానిపై మళ్లీ మీడియాతో మాట్లాడతానని తెలిపారు. ఈ కొత్త ఆఫర్ కూడా తనకు అంతగా నచ్చలేదని పరోక్షంగా సంకేతాలిచ్చారు. తర్వాత ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గత 47 ఏళ్లుగా మానవాళిపై పాల్పడిన అకృత్యాలకు ఇరాన్ ఇంకా మూల్యం చెల్లించలేదని ఆక్షేపించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ నూతన ప్రతిపాదన అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని తాను భావించడం లేదన్నారు. ఇరాన్కు పెద్ద శిక్ష పడాల్సి ఉందని తేల్చిచెప్పారు. అయితే, పశ్చిమాసియాలో శాంతి సాధన విషయంలో ఇరాన్ కొత్త ప్రతిపాదన ఏమిటన్నది ఆయన బయటపెట్టలేదు. ఈ ప్రపోజల్ను ఇరాన్ గురువారం అమెరికాకు పంపించినట్లు తెలిసింది. గతంలో ఇరాన్ చేసిన ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించి విషయం విదితమే. దానిపై తాను సంతృప్తిగా లేనని ఆయన తేల్చిచెప్పారు. బంతి అమెరికా కోర్టులోనే ఉంది: ఇరాన్ నూతన ప్రతిపాదన పట్ల ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ ప్రతిస్పందించింది. చర్చల ద్వారా పరిష్కారాన్ని కోరుకుంటారా? లేక యుద్ధానికి తిరిగి వెళ్తారా? అనేది అమెరికా ఇష్టమని తేల్చిచెప్పింది. ఇప్పుడు బంతి అమెరికా కోర్టులోనే ఉందని ఇరాన్ విదేశాంగ శాఖ ఉప మంత్రి కజెమ్ ఘరీబాబాదీ పేర్కొన్నారు. దౌత్య మార్గాన్ని ఎంచుకుంటారో లేక ఘర్షణను కొనసాగిస్తారో వారే నిర్ణయించుకోవాలని ఉద్ఘాటించారు. తన జాతీయ ప్రయోజనాలు, భద్రతను కాపాడుకోవడమే తమకు ముఖ్యమని స్పష్టంచేశారు. ఇరాన్ రెండు మార్గాలకు.. చర్చలకు లేదా యుద్ధానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఏమిటీ కొత్త ప్రతిపాదన? అమెరికా చేసిన 9 పాయింట్ల ప్రతిపాదనకు ప్రతిస్పందనగా ఇరాన్ 14 పాయింట్లతో ఈ కొత్త ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, గల్ఫ్ ఆఫ్ ఒమన్లో అమెరికా దిగ్బంధనాన్ని ముగించడం, ఇరాన్, లెబనాన్లో యుద్ధానికి శాశ్వతంగా ముగింపు పలకడంపై ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్ ప్రతిపాదించినట్లు సమాచారం. ఆయా అంశాలపై చర్చలకు ఒక నెల గడువు విధించింది. అటువంటి ఒప్పందం కుదిరిన తర్వాతే అణు కార్యక్రమంపై మరో ఒప్పందానికి వచ్చేందుకు మరో నెల రోజులపాటు చర్చలు కొనసాగించాలని పేర్కొంది. భవిష్యత్తులో ఎలాంటి దాడులు చేయకూడదని, తమ భద్రతకు హామీ ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేసింది. అణ్వాయుధాల అభివృద్ధిని నిలిపివేస్తామంటూ ఇరాన్ స్పష్టమైన గ్యారంటీ ఇవ్వలేదని సమాచారం. హార్మూజ్ను తెరుస్తామని, తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించే చర్యలపై దృష్టి సారిస్తామని ఇరాన్ వెల్లడించింది. అమెరికా ఈ ప్రాంతం నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని, తమ చమురు ఎగుమతులపై ఆంక్షలు సహా ఆర్థిక ఆంక్షలను తొలగించాలని షరతు విధించింది. సముద్ర వాణిజ్యం, చమురు సరఫరా పునరుద్ధరణను అణు కార్యక్రమాల చర్చల నుంచి వేరు చేయాలన్నదే ఇరాన్ వ్యూహమని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ నిబంధనల కింద తమ అణు కార్యక్రమ హక్కులను అధికారికంగా గుర్తించాలని ఇరాన్ కోరుతోంది. ఏ ఒప్పందమైనా శాశ్వతంగా ఉంటుందని, ఏకపక్ష ఉపసంహరణకు తావులేదన్న హామీలు ఇవ్వాలని అంటోంది. -
ఇరాన్-అమెరికా యుద్ధం తీవ్రస్థాయికి?.. సంచలన వ్యాఖ్యలు
ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ ప్రతిపాదన తనకు నచ్చలేదని యుద్దం ముగించే అవకాశాలు లేవని అన్నారు. తాజాగా దీనికి ఇరాన్ అధికారి ఘాటుగా స్పందించారు. ఇరాన్- అమెరికా మధ్య మరోసారి యుద్ధం తీవ్రస్థాయికి చేరే అవకాశం ఉందన్నారు.ఆ దేశ మిలిటరీ కేంద్ర కమాండ్లోని సీనియర్ అధికారి మొహమ్మద్ జాఫర్ అసాదీ మాట్లాడుతూ "ఇరాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య మరోసారి ఘర్షణ జరిగే అవకాశం ఉంది." అని అన్నారు. యు.ఎస్ అధికారుల తాజా చర్యలు మరియు ప్రకటనలు కేవలం "వారు సృష్టించిన గందరగోళం నుండి బయటపడటానికి మాత్రమేనని ఆయన తెలిపారు. యు.ఎస్ అధికారుల చర్యలు మరియు ప్రకటనలు ప్రాథమికంగా మీడియా ఆధారితమైనవి. చమురు ధరలు పడిపోకుండా నిరోధించడం ఒకటైతే, వారు సృష్టించిన గందరగోళం నుండి తమను తాము రక్షించుకోవడం రెండవది" అని ఆయన అన్నారు. అమెరికా ఏదైనా ఉద్రిక్తతలకు పాల్పడితే ఇరాన్ సాయుధ బలగాలు తిప్పికొట్టడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికన్లు చేసే ఏ కొత్త సాహసాలకైనా, మూర్ఖత్వాలకైనా సాయుధ బలగాలు పూర్తిగా ఎదుర్కొంటాయి అని పేర్కొన్నారు అని ఆయన పేర్కొన్నారు. కాగా ఇది వరకే ఇరాన్ న్యాయవ్యవస్థ అధిపతి దీనిపై స్పందించారు.తమ దేశం "చర్చల నుండి ఎప్పుడూ వెనుకడుగు వేయలేదని కానీ కానీ శాంతి పేరుతో నిబంధనలను రుద్దడం ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమన్నారు. కాగా ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ నడుస్తోంది. ఇరు దేశాలు కాల్పుల విరమణను పాటిస్తున్నాయి. అయితే అణుఒప్పందం విషయంలో ఇరు దేశాలు వెనక్కి తగ్గకపోవడంతో యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
చమురు నౌక హైజాక్.. గల్ఫ్ ఆఫ్ అడెన్లో కలకలం
అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో సముద్రపు దొంగల (పైరేట్స్) అలజడి మళ్లీ మొదలైంది. శనివారం గల్ఫ్ ఆఫ్ అడెన్ లోని యెమెన్ తీరానికి సమీపంలో 'యురేకా'అనే చమురు ట్యాంకర్ ను గుర్తు తెలియని దుండగులు హైజాక్ చేసినట్లు యెమెన్ కోస్ట్ గార్డ్ అధికారికంగా ధ్రువీకరించింది. యెమెన్ లోని షబ్వా ప్రావిన్స్ సమీపంలో నౌకలోకి చొరబడిన సాయుధ బృందం, దానిని తమ ఆధీనంలోకి తీసుకుని సోమాలియా తీరం వైపు మళ్లించినట్లు తెలుస్తోంది.నౌక వివరాలుమెరైన్ ట్రాఫిక్ వెబ్సైట్ అందించిన సమాచారం ప్రకారం, హైజాక్కు గురైన 'యురేకా' టోగో దేశపు జెండాతో ప్రయాణిస్తున్న చమురు ఉత్పత్తుల ట్యాంకర్. మార్చి నెలాఖరులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని ఫుజైరా నౌకాశ్రయంలో ఈ నౌక చివరిగా ఉన్నట్లు రికార్డయ్యింది. యెమెన్ అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వానికి చెందిన కోస్ట్ గార్డ్ ఈ ఘటనపై స్పందిస్తూ.. నౌక ఉన్న ప్రాంతాన్ని గుర్తించామని, సిబ్బంది భద్రత కోసం, నౌకను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది. అయితే, నౌకలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ దేశస్థులు అనే వివరాలను గోప్యంగా ఉంచారు.మళ్లీ పడగ విప్పుతున్న పైరేట్స్2000వ సంవత్సర కాలంలో సోమాలియా తీరంలో పైరసీ అత్యంత ప్రమాదకరంగా ఉండేది. ముఖ్యంగా 2011లో గరిష్ట స్థాయిలో వందలాది దాడులు జరిగేవి. ఆ తర్వాత అంతర్జాతీయ నౌకాదళాల గస్తీ, కఠినమైన భద్రతా వ్యూహాల వల్ల దాడులు గణనీయంగా తగ్గాయి. కానీ, గత కొద్ది వారాలుగా ఈ ప్రాంతంలో పరిస్థితులు మళ్లీ ఆందోళనకరంగా మారుతున్నాయి.‘ఇటీవలి వారాల్లో హిందూ మహాసముద్రం, గల్ఫ్ ఆఫ్ అడెన్ ప్రాంతంలో దాడులు పెరిగాయి. ఏప్రిల్ చివరలోనే మూడు దాడులు జరిగినట్లు మా సమాచార కేంద్రం గుర్తించింది’ అని ఈయూ నావికాదళం ఆపరేషన్ అట్లాంటా పేర్కొంది.ప్రాంతీయ ఉద్రిక్తతలుప్రస్తుతం ఈ ప్రాంతంలో షిప్పింగ్ రంగం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ఫిబ్రవరి 28 నుండి ఇరాన్ మద్దతు ఉన్న శక్తులు, యూఎస్-ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితుల వల్ల ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ అడెన్ ప్రాంతాల్లో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ప్రస్తుత హైజాకింగ్ కు రాజకీయ ఉద్రిక్తతలతో సంబంధం ఉన్నట్లు ఆధారాలు లేవు. బదులుగా, ఇది కేవలం ధనార్జనే ధ్యేయంగా సాగే సముద్రపు దొంగల పనిగా భద్రతా నిపుణులు భావిస్తున్నారు. గత నెలలో సోమాలియాలోని పుంట్ ల్యాండ్ రాష్ట్రంలోని గరాకాడ్ ప్రాంతం నుండి పనిచేస్తున్న ఒక కొత్త పైరేట్ ముఠా మరొక ట్యాంకర్ ను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.ప్రస్తుతానికి 'యురేకా' నౌకను సురక్షితంగా విడిపించేందుకు అంతర్జాతీయ నౌకాదళ సంస్థలతో సమన్వయం చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. సముద్ర మార్గాల్లో భద్రత మళ్లీ ప్రశ్నార్థకంగా మారడంతో అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
ఎయిర్పోర్టుల్లో గందరగోళం... అసలేం జరుగుతోంది?
వాషింగ్టన్: అమెరికాలోని ప్రధాన విమానాశ్రయాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. వందలాది విమానాలు అనూహ్యంగా రద్దు కావడం, విపరీతమైన జాప్యం జరగడంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు తీవ్ర ఆటంకం కలగడంతో ఎయిర్పోర్టులన్నీ ప్రయాణికులతో నిండిపోయి ఉత్కంఠ వాతావరణాన్ని తలపిస్తున్నాయి.ప్రధాన నగరాలపై తీవ్ర ప్రభావంఅట్లాంటా, డల్లాస్, న్యూయార్క్, ఓర్లాండో, చికాగో వంటి అమెరికాలోని అత్యంత రద్దీ అయిన ప్రధాన కేంద్రాల నుండి నడిచే విమానాలపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది. కనెక్టింగ్ విమానాలు మిస్ కావడం, బయలుదేరే సమయాలు పదేపదే మారిపోవడంతో ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఎయిర్పోర్టులలో ప్రయాణికులు ప్రత్యామ్నాయ విమానాల కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు.ఈ హఠాత్ పరిణామాలకు కారణమేంటి?విమానయాన రంగంలో ఒక్కసారిగా ఈ ముప్పు ముంచుకురావడానికి ప్రధానంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులే కారణమని తెలుస్తోంది. దీనికి తోడు విపరీతమైన ఎయిర్ ట్రాఫిక్ రద్దీ, సిబ్బంది కొరత, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడి ఈ విమానాల జాప్యాలకు కారణంగా నిలిచాయి. విమాన షెడ్యూల్స్ అన్నీ ఒకదానికొకటి అనుసంధానమై ఉండటం వల్ల, ఒక ఎయిర్పోర్టులో జరిగిన చిన్న అంతరాయం పలు మార్గాల్లోని విమానాల రాకపోకలను స్తంభింపజేస్తోంది.పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాల్లో..ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించడానికి అమెరికన్ ఎయిర్లైన్స్, ఇతర సంస్థలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రద్దయిన విమానాల ప్రయాణికులకు ప్రత్యామ్నాయ టిక్కెట్లు బుక్ చేయడం, షెడ్యూల్స్ను సర్దుబాటు చేయడం వంటి చర్యలను వెంటనే చేపడుతున్నాయి. ఇది కూడా చదవండి: పాత ఫొటో.. పక్కా స్కెచ్.. 24 ఏళ్లకు హంతకుడు పట్టివేత -
అమెరికాకు ఇరాన్ కొత్త ప్రతిపాదన ఇదే..
యుద్ధం శాశ్వతంగా ముగించేందుకు ఇరాన్ 14 పాయింట్లతో కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. ఇరాన్ ఒక పాకిస్తానీ మధ్యవర్తి ద్వారా 14 అంశాలతో కూడిన ప్రతిపాదనను వాషింగ్టన్కు పంపింది. యుద్ధ విరమణ.. ప్రాంతీయ భద్రత, ఆంక్షల తొలగింపు, ఇతర డిమాండ్లతో ముడిపడి ఉండాలని.. వీటన్నింటినీ 30 రోజుల్లోపు పరిష్కరించాలని ఇరాన్ కోరింది. అమెరికా ప్రతిపాదించిన 9 అంశాల ప్రణాళికకు ఇరాన్ అధికారికంగా ఈ 14 అంశాల వివరణాత్మక ప్లాన్తో సమాధానమిచ్చినట్లు ఓ వార్తాసంస్థ పేర్కొంది.అమెరికా రెండు నెలల యుద్ధ విరమణను ప్రతిపాదించగా.. ఇరాన్ దానిని తిరస్కరించింది. అన్ని ప్రధాన సమస్యలను 30 రోజుల్లోనే పరిష్కరించాలని పట్టుబట్టింది. భవిష్యత్తులో సైనిక దాడులు జరగకుండా హామీ ఇవ్వాలని.. ఇరాన్ సరిహద్దు ప్రాంతాల నుండి అమెరికా దళాలను ఉపసంహరించుకోవాలని, నౌకాదళ దిగ్బంధనాన్ని ముగించాలని ఇరాన్ డిమాండ్ చేసింది. నిలిపివేసిన తమ ఆర్థిక ఆస్తులను విడుదల చేయాలని, నష్టపరిహారం చెల్లించడంతో పాటు సుదీర్ఘకాలంగా ఉన్న ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని కోరింది.ఈ శాంతి ఒప్పందం కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా.. లెబనాన్తో సహా అన్ని వైపులా పోరాటాలను ముగించాలని ఇరాన్ కోరింది. అలాగే, వ్యూహాత్మకమైన హోర్ముజ్ జలసంధిలో భద్రత, రవాణా నియంత్రణ కోసం కొత్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై డొనాల్డ్ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా స్పందిస్తూ.. ఈ కొత్త ప్రతిపాదనను సమీక్షిస్తానని చెబుతూనే.. దశాబ్దాలుగా టెహ్రాన్ చేసిన చర్యలకు ఇంకా తగినంత భారీ మూల్యం చెల్లించలేదని పేర్కొన్నారు. తాను త్వరలోనే ఇరాన్ పంపిన ఈ ప్రణాళికను పరిశీలిస్తానని.. అయితే ఇది ఆమోదయోగ్యంగా ఉంటుందని తాను ఊహించలేకపోతున్నానని ఆయన రాసుకొచ్చారు. -
పత్రికా స్వేచ్ఛ.. దాయాది కన్నా దిగువకు భారత్
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గర్వించే భారత్కు ఇది నిజంగా చేదు వార్తే. దేశంలో పత్రికా స్వేచ్ఛ ప్రమాదకర స్థాయికి పడిపోయింది. తాజాగా రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్ఎస్ఎఫ్)తన సంచలన నివేదికను విడుదల చేసింది. ఈ 2026 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మన దేశం ఏకంగా పాకిస్తాన్ కంటే వెనుకబడి తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జర్నలిజం మునుపెన్నడూ లేనంత గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోందని, రిపోర్టింగ్కు వాతావరణం దారుణంగా మారిందని ఈ రిపోర్ట్ తెలియజేసింది.ఆందోళన పెంచుతున్న తాజా ర్యాంకింగ్స్మొత్తం 180 దేశాలతో కూడిన ఈ ప్రతిష్టాత్మక జాబితాలో భారతదేశం 157వ స్థానానికి పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే మన ర్యాంకు ఆరు స్థానాలు దిగజారడం గమనార్హం. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, తీవ్ర సంక్షోభాలు ఎదుర్కొనే దాయాది దేశం పాకిస్తాన్ 153వ స్థానంలో నిలిచి మనకంటే మెరుగైన స్థితిలో ఉంది. ఇక మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ (152), భూటాన్ (150), శ్రీలంక (134), నేపాల్ (87) కూడా పత్రికా స్వేచ్ఛలో భారత్ కంటే ముందంజలో ఉన్నాయి. నార్వే, నెదర్లాండ్స్ ఈ జాబితాలో అగ్రస్థానాల్లో కొనసాగుతున్నాయి.భారత్ పతనానికి కారణాలివే..మన దేశంలో జర్నలిస్టులపై జాతీయ భద్రతా చట్టాల ప్రయోగం పెరిగిపోవడం, న్యాయపరమైన ఒత్తిళ్లు తీవ్రమవడం ఈ పతనానికి ప్రధాన కారణాలని నివేదిక పేర్కొంది. ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని పొందడంలో సవాళ్లు, మీడియా సంస్థల యాజమాన్యాలు కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం కావడం, ప్రకటనలపై ఆధారపడటం వంటివి సంపాదకీయ స్వేచ్ఛను దెబ్బతీస్తున్నాయని ఆర్ఎస్ఎఫ్ పేర్కొంది. వీటికి తోడు భౌతిక దాడులు, ప్రాణహాని వంటి తీవ్రమైన భద్రతాపరమైన ముప్పులను భారతీయ జర్నలిస్టులు నిత్యం ఎదుర్కొంటున్నారని తెలిపింది.ప్రపంచవ్యాప్తంగా క్షీణిస్తున్న స్వేచ్ఛఇటువంటి పరిస్థితి ఒక్క భారత్కే పరిమితం కాలేదు. ప్రపంచంలోని 100 దేశాల్లో మీడియా పరిస్థితి దారుణంగా దిగజారింది. సగానికి పైగా దేశాల్లో రిపోర్టింగ్ వాతావరణం అత్యంత ‘క్లిష్టమైన’ లేదా ‘అతి తీవ్రమైన’ కేటగిరీలోకి చేరిందని ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం(మే 3) సందర్భంగా ఈ రిపోర్ట్ హెచ్చరించింది.ఇది కూడా చదవండి: జర్మనీకి ట్రంప్ భారీ షాక్ -
జర్మనీకి ట్రంప్ భారీ షాక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరప్ మిత్రదేశాలకు ఊహించని షాక్ ఇచ్చారు. జర్మనీలో మోహరించిన అమెరికా సైనిక బలగాలను భారీ సంఖ్యలో తగ్గించనున్నట్లు ప్రకటించారు. ఇరాన్ వివాదంలో జర్మనీ సహకారంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ట్రంప్.. గతంలో పెంటగాన్ ప్రతిపాదించిన 5,000 కంటే చాలా ఎక్కువ సంఖ్యలో సైనికులను ఉపసంహరించుకుంటామని స్పష్టం చేశారు. ఈ అనూహ్య నిర్ణయంతో అగ్రరాజ్యానికి, నాటో మిత్రదేశాలకు మధ్య ఉన్న దౌత్యపరమైన అంతరం మరింత పెరిగినట్లు స్పష్టమవుతోంది.జర్మనీ వైఖరిపై ట్రంప్ తీవ్ర అసంతృప్తిజర్మనీ నుంచి సుమారు 5,000 మంది అమెరికా బలగాలను ఉపసంహరించుకోవాలనే పెంటగాన్ తాజా ప్రణాళికల నేపథ్యంలో ట్రంప్ ఈ సంచలన ప్రకటన చేశారు. ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కే సమయంలో సౌత్ ఫ్లోరిడాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘మేము బలగాలను భారీగా తగ్గిస్తున్నాం.. ఆ సంఖ్య 5,000 కంటే చాలా ఎక్కువే ఉంటుంది’ అని తేల్చి చెప్పారు. ఇరాన్లో జరుగుతున్న సైనిక ఆపరేషన్లకు జర్మనీ వంటి కీలక ఐరోపా మిత్రదేశాల నుండి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదన్నదే ట్రంప్ పరిపాలనా యంత్రాంగం ఆగ్రహానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.జర్మన్ ఛాన్సలర్ మెర్జ్పై విమర్శనాస్త్రాలుఈ వ్యవహారంలో జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్పై ట్రంప్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇరాన్పై అమెరికా తీసుకుంటున్న చర్యలకు మద్దతు ఇవ్వడంలో మెర్జ్ విఫలమయ్యారని ఆరోపించారు. జర్మనీలో ఇమ్మిగ్రేషన్, ఇంధనం, ఉక్రెయిన్ వంటి అంతర్గత సమస్యలను పరిష్కరించడంలో మెర్జ్ అత్యంత పేలవంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ‘ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండటం మీకు ఇష్టమేనా?’ అని తాను మెర్జ్ను ప్రశ్నించానని, ఆయన ‘కాదు’ అని సమాధానం ఇచ్చారని ట్రంప్ ఒక కార్యక్రమంలో వెల్లడించారు.ఇటలీ, స్పెయిన్లకూ హెచ్చరికలుకేవలం జర్మనీకే పరిమితం కాకుండా, ఇటలీ, స్పెయిన్లలో మోహరించిన అమెరికా సైనిక సిబ్బందిని సైతం తగ్గించే అవకాశం ఉందని ట్రంప్ సూచించారు. ఇరాన్ వివాదంలో ఆయా దేశాల వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ట్రంప్ తాజా ప్రకటనలు.. అమెరికా, దాని చిరకాల యూరోపియన్ మిత్రదేశాల మధ్య పెరుగుతున్న దౌత్యపరమైన విబేధాలను ఎత్తిచూపుతున్నాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో విదేశాంగ విధానం, సైనిక వ్యూహాలకు సంబంధించి వాషింగ్టన్కు, కీలక నాటో సభ్య దేశాలకు మధ్య రోజురోజుకూ తీవ్ర అంతరాలు పొడచూపుతున్నాయని ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి.ఇది కూడా చదవండి: స్ట్రాంగ్రూమ్ పాలిటిక్స్తో బెంగాల్ హీట్ -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
బీరూట్: దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. శనివారం జరిగిన దాడుల్లో ఏడుగురు చనిపోయారు. హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నా పరస్పర దాడులు ఆగకపోవడం గమనార్హం. మొత్తం 9 గ్రామాల ప్రజలను వెంటనే నివాసాలు వదిలివెళ్లిపోవాలంటూ ఇజ్రాయెల్ ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది.కెఫర్ దజాల్లో ఓ కారుపై జరిగిన దాడిలో ఇద్దరు, ల్వైజాహ్ గ్రామంలోని నివాసంపై జరిగిన దాడిలో ముగ్గురు, షౌకిన్పై దాడిలో మరో ఇద్దరు మృతి చెందారని ప్రభుత్వం తెలిపింది. సరిహద్దుల్లోని యరౌన్లోని కేథలిక్ చర్చిలోని కొంత భాగాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ ధ్వంసం చేసినట్లు నిర్వాహకులు ఆరోపించారు.కాగా, హెజ్బొల్లా లక్ష్యంగా 24 గంటల వ్యవధిలో సుమారు 50 వైమానిక దాడులను చేపట్టినట్లు ఇజ్రాయెల్ మిలటరీ వెల్లడించింది. శనివారం తీర ప్రాంతంలోని బయెద్ అనే గ్రామంలోని ఓ ఇంట్లో చేరిన ఇజ్రాయెల్ బలగాలే లక్ష్యంగా డ్రోన్ దాడి చేసినట్లు హెజ్»ొల్లా సైతం ప్రకటించుకుంది. -
నర్గీస్ మొహమ్మదీ ఆరోగ్యం విషమం!
టెహ్రాన్: ఇరాన్కు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత నర్గీస్ మొహమ్మదీ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆమెను శుక్రవారం రాత్రి జైలు నుంచి వాయువ్య ఇరాన్లోని జంజాన్ ఆసుపత్రికి తరలించారు. మొహమ్మదీ ఆరోగ్య పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారినట్లు ఆమె ఫౌండేషన్ వెల్లడించింది. రక్తపోటులో తీవ్ర హెచ్చుతగ్గులు, తీవ్రమైన వికారం వంటి సమస్యలతో మొహమ్మదీ బాధపడుతున్నారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను రాజధాని టెహ్రాన్కు తరలించాలని జంజాన్ ఆసుపత్రి వైద్యులు సూచించారు. యాంజియోగ్రఫీ చేయాల్సి ఉందని చెప్పారు. అయితే, మొహమ్మదీని టెహ్రాన్కు తరలించడానికి ఇరాన్ ప్రభుత్వం అంగీకరించలేదని ఆమె భర్త తాఘీ రెహ్మానీ తెలిపారు. యాంజియోగ్రఫీ పూర్తయ్యే వరకు తన భార్య ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించలేమని పేర్కొన్నారు. పారిస్లో ఉన్న రెహ్మానీ ఈ మేరకు ఒక సందేశాన్ని మీడియా ద్వారా విడుదల చేశారు. హెచ్చుతగ్గులకు గురవుతున్న రక్తపోటుకు వైద్యులు చికిత్స చేయలేకపోతున్నారని మొహమ్మదీ సోదరుడు హమీద్రేజా మొహమ్మదీ వెల్లడించారు. తన సోదరి ఆరోగ్య పరిస్థితి పట్ల ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. నర్గీస్ మొహమ్మదీ ఇరాన్లో మానవ హక్కుల పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. లాయర్గా, జర్నలిస్టుగా పనిచేశారు. ఇరాన్ ప్రభుత్వంపై ఆమెపై కేసులు బనాయించింది. పలుమార్లు జైలుకు పంపించింది. మొహమ్మదీ 2023లో నోబెల్ శాంతి బహుమతి పొందారు. ఓ కేసులో ఈ ఏడాది ఫిబ్రవరి 8న ఆమెకు ఏడున్నరేళ్ల జైలుశిక్ష పడింది. అప్పటి నుంచి జైల్లోనే ఉంటున్నారు.గూఢచర్యం ఆరోపణలతో ఇద్దరికి ఉరిశిక్ష ఇజ్రాయెల్కు గూఢచర్యం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిని ఇరాన్ ప్రభుత్వం ఉరితీసింది. యాగూబ్ కరీంపూర్, నాసర్ బెక్రజాదే అనే ఈ ఇద్దరు ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్కు రహస్య సమాచారం చేరవేస్తూ దొరికిపోయారని పేర్కొంది. నేరం రుజువు కావడంతో కింది కోర్టు వారికి మరణశిక్ష విధించినట్లు తెలిపింది. మరణశిక్ష విధించడాన్ని సుప్రీంకోర్టు సైతం సమర్థించడంతో ఉరిశిక్ష అమలు చేసినట్లు వెల్లడించింది. అలాగే ప్రభుత్వ, మత పెద్దల వివరాలతో పాటు నతాంజ్ అణు కేంద్రం గురించి సమాచారాన్ని పంపినట్లు రుజువులు ఉన్నాయని తెలియజేసింది. గూఢచర్యం, ఉగ్రవాద కార్యకలాపాల ఆరోపణల కింద ఇరాన్ ప్రభుత్వం ఇటీవలి కాలంలో దాదాపు 25 మందిని ఉరితీసింది. ప్రభుత్వ తీరుపై మానవ హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. నిందితుల వాదన వినకుండానే, నేరం రుజువు కాకుండానే ఉరిశిక్ష అమలు చేస్తోందని ఆరోపిస్తున్నాయి. -
న్యూయార్క్ నడిరోడ్డు మధ్యలో ఏంటి ఇది? ఇన్ని రోజులుగా..
న్యూయార్క్ నగరం ప్రపంచంలో అత్యంత గొప్ప మహానగరాల్లో ఒకటి. ఆర్థిక, వ్యాపార, కళలు, వినోదం, సాంకేతికతకు ఇది కీలక కేంద్రంగా నిలుస్తుంది. భారీ భవనాలు ఉంటాయి.. ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడకు వస్తుంటారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే ప్రధాన మార్కెట్లు ఇక్కడ ఉన్నాయి. అటువంటి నగరాన్ని ఓ ఆరు అడుగుల గుంత భయపెడుతోంది. కొన్ని వారాలుగా దానికి పరిష్కారమే దొరకడం లేదు. దాన్ని కొందరు రాక్షస గుంత, నరక కూపంగానూ అభివర్ణిస్తున్నారు. ఎప్పుడు ఏ రోడ్డు ప్రమాదం జరుగుతుందో తెలియక భయపడుతున్నామని చెబుతున్నారు.ఆ గుంత క్వీన్స్లోని లాంగ్ ఐలాండ్ సిటీ ప్రాంతంలో 41వ అవెన్యూ వద్ద, 23వ స్ట్రీట్ నుంచి 24వ స్ట్రీట్ మధ్య ఉంది. అది రోడ్డు మధ్యన ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలకు కూడా కారణమవుతోంది. అంత పెద్ద న్యూయార్క్ సిటీలో గుంతను పూడ్చలేకపోతున్నారా? అని అనుకుంటున్నారా? ఆ గుంతను మొదట పూడ్చారు.అయినప్పటికీ, ఆ గుంతను పూడ్చిన తర్వాత కూడా ఆస్ఫాల్ట్ ప్యాచ్ (గుంత పూడ్చేందుకు వేసే తాత్కాలిక నల్ల పదార్థపు పొర) కొన్ని గంటల్లోనే మళ్లీ దిగజారడం ప్రారంభమైంది. గుంత మళ్లీ లోతుగా మారి ప్రమాదంగా మారింది. మొదటి చిన్నగా ఉన్న గుంత ఇప్పుడు.. అందులో కారు పడిపోయేంత పెద్దగా మారింది.ఇటీవల కొలిచినప్పుడు ఈ గుంత పొడవు సుమారు 6 అడుగులుగా ఉంది. 5 అడుగుల వెడల్పు, దాదాపు 30 అంగుళాల లోతు ఉంది. ఏప్రిల్ 24న నగర సిబ్బంది ఆ గుంతను పూడ్చారు. కానీ, పరిసర ప్రాంత ప్రజలు చెప్పిన వివరాల ప్రకారం.. ఆస్ఫాల్ట్ ప్యాచ్ కొన్ని గంటల్లోనే దిగజారడం ప్రారంభమైంది. స్థానిక ప్రజలను దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైపొర పూడ్చితే లోపల బలం లేక మళ్లీ దిగజారుతుందని చెబుతున్నారు.పెరుగుతున్న ప్రమాదాలు ఇటీవల ఒక పికప్ ట్రక్ డ్రైవర్ గుంతలో పడకుండా తప్పించుకునే ప్రయత్నంలో ఒక్కసారిగా.. పార్క్ చేసిన కారును ఢీకొట్టాడు. రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. న్యూయార్క్ నగర అధికారులు పన్ను చెల్లింపుదారుల నుంచి చాలా డబ్బు వసూలు చేస్తున్నారని, కానీ పనులు సరిగ్గా చేయడం లేదని ఆ ట్రక్ డ్రైవర్ అన్నాడు. ప్రతి రోజు ఇదే పరిస్థితి ఉంటుందని, ప్రమాదాలు పెరుగుతున్నాయని చెప్పాడు. నగర రవాణా విభాగం సిబ్బంది రెండుసార్లు వచ్చి ఫొటోలు తీసి తాత్కాలికంగా పూడ్చారని స్థానికులు చెప్పారు. అయినప్పటికీ ఆస్ఫాల్ట్ ప్యాచ్ కొన్ని గంటల్లోనే మళ్లీ దిగజారడం ప్రారంభమైందని అన్నారు.స్థానిక వాచ్మన్ మొహమ్మద్ హసన్ ఆ గుంత గురించి చొరవచూపి.. మొదట ట్రాఫిక్ కోన్లు, పసుపు రంగులో హెచ్చరిక టేప్ పెట్టాడు. ఆ తర్వాత డ్రైవర్లు గమనించేలా గుంత చుట్టూ ఫ్లోరెసెంట్ ఆరెంజ్ రంగుతో స్ప్రే చేసి, ఎరుపు జెండాతో ఒక కర్రను పెట్టాడు. నగర అధికారులు ఒక గుంతను కూడా పూడ్చలేకపోపోయారని, తమ వాచ్మన్ ప్రజలను రక్షించేందుకు ముందుకు వచ్చాడని స్థానిక వ్యక్తి ఒకరు చెప్పారు.ఇటీవల జరిగిన ప్రమాదం తర్వాత స్థానికులు రోడ్ బ్యారికేడ్ను గుంత ముందు పెట్టారు. రవాణా విభాగం చేసిన ప్యాచ్ నిలవడం లేదని, గుంత ఇంకా ప్రమాదకరంగానే ఉందని స్థానికులు అన్నారు. తాత్కాలిక పరిష్కారం కాకుండా, శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ గుంతను పూడ్చడంలో అధికారుల వైఫల్యం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. “ఇది చాలా ప్రమాదకరం, ఎందుకంటే ఇది రోడ్డులో మధ్యలో ఉంది. అది కనిపించడం కష్టం. ముఖ్యంగా రాత్రి పూట” స్థానిక వ్యక్తి ఒకరు. -
ఇరాన్పై యుద్ధం ముగిసింది.. కాంగ్రెస్ అనుమతి అక్కర్లేదు
వాషింగ్టన్: ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది కాబట్టి యుద్ధం ముగిసినట్లేనని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా కాంగ్రెస్కు తెలియజేశారు. యుద్ధానికి చట్టపరమైన ఆమోదం కోసం తాను గడువును పాటించాల్సిన అవసరం లేదని వాదించారు. అమెరికా, ఇరాన్ మధ్య ఫిబ్రవరి 28న ఆరంభమైన దాడులు ఏప్రిల్ 7 నుంచి ఆగిపోయాయని గుర్తుచేశారు. 1973 నాటి వార్ పవర్స్ చట్టం ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు మరో దేశంపై సైనిక చర్య ప్రారంభించినప్పుడు దాని గురించి చట్టసభ సభ్యులకు తెలియజేసిన 60 రోజుల్లోపు కాంగ్రెస్ ఆమోదం పొందాలి. లేకపోతే యుద్ధాన్ని విరమించుకోవాల్సి ఉంటుంది. ట్రంప్ శుక్రవారం కాంగ్రెస్ సభ్యులకు లేఖ రాశారు. కాల్పుల విరమణ నేపథ్యంలో యుద్ధం ఆగిపోయింది కాబట్టి వార్ పవర్స్ చట్టం ప్రకారం తాను నడుచుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇరాన్పై యుద్ధం గురించి కాంగ్రెస్ సభ్యులకు అధికారికంగా తెలియజేసిన తర్వాత సరిగ్గా 60వ రోజున ట్రంప్ ఈ లేఖ రాయడం గమనార్హం. 60 రోజుల డెడ్లైన్ శుక్రవారమే ముగిసింది. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలికంగా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ దీర్ఘకాల శాంతి ఒప్పందంపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఇరుదేశాల మధ్య చర్చల ప్రక్రియలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రధానంగా అణ్వస్త్ర ప్రయోగాల విషయంలో అమెరికా విధించిన షరతులను ఇరాన్ అంగీకరించడం లేదు. వారికి లేని అనుమతి నాకెందుకు? ఇరాన్తో యుద్ధం కొనసాగించడానికి తనకు కాంగ్రెస్ అనుమతి అవసరం లేదని ట్రంప్ తేల్చిచెప్పారు. గతంలో అమెరికా కమాండర్–ఇన్–చీఫ్లు అలాంటి అనుమతి ఏనాడూ తీసుకోలేదని స్పష్టంచేశారు. యుద్ధం చేసే విషయంలో అధ్యక్షుడి అధికారాలను పరిమితం చేసే కాంగ్రెస్ అధికారాన్ని మాజీ అధ్యక్షులు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా భావించారని తెలిపారు. ట్రంప్ తాజాగా మీడియాతో మాట్లాడారు. ఇరాన్పై దాడులు కొనసాగించడానికి కాంగ్రెస్ నుంచి అనుమతి తీసుకుంటారా? అని ప్రశ్నించగా, మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ను పరిగణనలోకి తీ సుకోకుండా యుద్ధాలు చేశారని పేర్కొన్నారు. ఇంతకుముందు ఎవరూ అనుమతి అడగలేదని వెల్లడించారు. వారికి లేని అనుమతి తనకెందుక ని ట్రంప్ పరోక్షంగా అసహనం వ్యక్తంచేశారు. ఇరాన్ నుంచి తిరిగొస్తూ క్యూబాను స్వాదీనం చేసుకుంటాం చమత్కరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చమత్కరించారు. ఇరాన్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేటప్పుడు అమెరికా నౌకాదళం క్యూబాతో తలపడుతుందని అన్నారు. క్యూబాను స్వాధీనం చేసుసుకొనే ఆలోచన ఉందంటూ తన మనసులోని మాటను పరోక్షంగా వ్యక్తీకరించారు. క్యూబాకు చాలా సమస్యలు ఉన్నాయని చెప్పారు. ట్రంప్ శుక్రవారం సాయంత్రం ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘ఇరాన్ నుండి తిరిగి వస్తున్నప్పుడు, మా పెద్ద విమాన వాహక నౌకల్లో ఒకటైన, బహుశా ప్రపంచంలోనే అతిపెద్దదైన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ను క్యూబా తీరానికి సుమారు 100 గజాల దూరంలో నిలిపినప్పుడు క్యూబా ప్రజలు ఎదురొస్తారు. మీకు ధన్యవాదాలు, మేము లొంగిపోతున్నాం అని చెబుతారు’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. క్యూబాపై అమెరికా ఎప్పటినుంచో కన్నేసింది. అక్కడి ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. తనకు కావాల్సింది సాధించుకోవడానికి క్యూబాపై సైనిక చర్య తీసుకోవచ్చని ట్రంప్ పదేపదే బెదిరిస్తూ వస్తున్నారు. హార్మూజ్లో ఇరాన్కు చెల్లింపులు చేస్తే ఆంక్షలు విధిస్తాం దుబాయ్: హార్మూజ్ జలసంధిలో ప్రయాణించడానికి ఇరాన్కు చెల్లింపులు చేస్తే ఆంక్షలు విధిస్తామని షిప్పింగ్ కంపెనీలను అమెరికా హెచ్చరించింది. ఈ మేరకు యూఎస్ ఆఫీసు ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టుచేసింది. హార్మూజ్ జలసంధిని తెరిచే విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. జలసంధిలో ఇరాన్ ఓడరేవులను అమెరికా సైన్యం దిగ్బంధించింది. మరోవైపు విదేశీ నౌకల రాకపోకలను ఇరాన్ అడ్డుకుంటోంది. తమ తీరానికి దగ్గరగా ఉన్న మార్గాల్లో కొన్ని నౌకలకు మాత్రం అనుమతి ఇస్తోంది. అందుకు వాటి నుంచి రుసుము వసూలు చేస్తోన్న సంగతి తెలిసిందే. -
హార్మూజ్ను దాటుకుని వస్తున్న భారత నౌక
బెంగళూరు: హార్మూజ్ జలసంధి వద్ద ఇతర దేశాల నౌకలకు అనుమతి నిరాకరిస్తూ భారత నౌకలకు మాత్రం అనుమతి ఇచ్చామని ఇండియాలోని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ అన్నారు. దీనిబట్టే రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయో తెలుస్తోందని తెలిపారు. మార్షల్ ఐలాండ్స్ జెండా ఉన్న ఎల్పీజీ క్యారియర్ ఎంఠీ సర్వ్ శక్తి భారత సరుకు తీసుకుని మే 2న హార్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. మే 13న విశాఖపట్నానికి చేరే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. 46,313 మెట్రిక్ టన్నుల లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ తీసుకెళ్తున్న ఈ నౌకలో 20 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 18 మంది భారతీయులు ఉన్నారు. బెంగళూరులో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇలాహీ మాట్లాడుతూ.. భారత్-ఇరాన్ మధ్య శతాబ్దాల చరిత్ర, సంస్కృతి ఆధారంగా బంధం నిలిచిందని తెలిపారు. వివిధ రంగాల్లో దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పారు. “భారత్ ఒక గొప్ప దేశం. మేము భారత ప్రజలను గౌరవిస్తాము. మాకు ఇరాన్తో 5,000 సంవత్సరాల సంబంధం, స్నేహం ఉంది. విద్య, తత్వశాస్త్రం, సంస్కృతి, నాగరికత, ఆర్థిక రంగాల ద్వారా ఇరాన్ భారత్తో అనుసంధానమై ఉంది. ఇరానీయులు భారతీయులను చాలా ఇష్టపడతారు. మన సంస్కృతి కూడా ఒకటే. మన ప్రవర్తన ఒకటే. మన ముఖాలు, ఆకృతులు కూడా ఒకటే” అని అన్నారు.“భారత్-ఇరాన్ మధ్య సంబంధం, స్నేహం చాలా బలంగా, లోతుగా ఉంది. ప్రస్తుతం భారత్తో మా సంబంధం, సహకారం చాలా బాగుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్తో మూడుసార్లు చర్చించారు. భారత్ విదేశాంగ మంత్రి కూడా ఇరాన్ విదేశాంగ మంత్రితో అనేక సార్లు చర్చలు జరిపారు. అనేక దేశాలకు అనుమతి లభించని సమయంలో ఇరాన్ భారత నౌకలు హార్మూజ్ జలసంధిని దాటేందుకు అనుమతించింది” అని ఆయన తెలిపారు.గత శతాబ్దాల్లో అనేకమంది ఇరానీయులు భారత్లో స్థిరపడ్డారని, ఇది సామాజిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలపరిచిందని చెప్పారు. భవిష్యత్ సంబంధాలపై ఆశాభావం వ్యక్తం చేస్తూ.. సత్సంబంధాలు మరింత బలపడతాయని అన్నారు. ఇరాన్ నాయకత్వం భారత్తో సన్నిహిత సంబంధాలను ప్రోత్సహించిందని, ద్వైపాక్షిక సహకారంలో అడ్డంకులను తొలగించేందుకు మద్దతు ఇచ్చిందని తెలిపారు.ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని ప్రస్తావిస్తూ.. దివంగత సుప్రీం లీడర్ అలీ ఖమేనీ గతంలో పలుసార్లు భారత్తో బలమైన సంబంధాలను ప్రోత్సహించారని, అడ్డంకులు ఉండకూడదని అన్నారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న సుప్రీం లీడర్ అయతొల్లా సయ్యద్ మొజ్తబా ఖమేనీ కూడా భారత్ను ఇష్టపడతారని, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, స్నేహపూర్వక సంబంధాలను మరింత బలపరచాలని భావిస్తున్నారని తెలిపారు. -
"మేము సముద్రపు దొంగలమేమో" .. ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయిన ఎప్పుడు ఎలా మాట్లాడుతారో ఆయనకే తెలియదు. తాజాగా ఆయన అటువంటి వ్యాఖ్యలే చేశారు. "మేము సముద్రపు దొంగల లాంటి వాళ్లం" అని అమెరికాలో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ నౌకల స్వాధీనం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరిడాలో జరిగిన ఒక ర్యాలీ ట్రంప్ మాట్లాడారు. అందులో " మేము ... నౌకపైకి దూకి, దాన్ని మా ఆధీనంలోకి తీసుకున్నాము. సరుకును స్వాధీనం చేసుకున్నాం, చమురును తీసుకున్నాం. ఇది చాలా లాభదాయకమైన వ్యాపారం." అన్నారు. ట్రంప్ ఇలా వ్యాఖ్యానించిన తర్వాత ఆ సభలో ప్రజలు కేరింతలు కొడుతూ ఈలలు వేశారు. ఇటీవల ఇరాన్కు చెందిన నౌకలను అమెరికా దిగ్భందనం చేసింది ఈ నేపథ్యంలో ట్రంప్ ఇలా మాట్లాడారు.అయితే ఇరాన్ ఓడరేవుల వద్ద అమెరికా నౌకాదళం దిగ్బంధనం కొనసాగుతుంది. అమెరికా దళాలు 'మేజిస్టిక్ ఎక్స్' ఇరాన్-ఫ్లాగ్ కలిగిన 'టూస్కా' వంటి కార్గో నౌకలను స్వాధీనం చేసుకున్నాయి. దీనిపై ఇరాన్ సైతం ఘాటుగానే స్పందించింది. "అంతర్జాతీయ జలాల్లో సాయుధ దోపిడీ" అని పేర్కొంటూ, వాషింగ్టన్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించింది.విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ, ఈ చర్య వాస్తవంగా సముద్రపు దొంగతనాన్ని సమర్థించడమేనని అన్నారు. దీనిని ఆయన "అంతర్జాతీయ జలాల్లో సముద్రపు దొంగతనం మరియు సాయుధ దోపిడీని ప్రత్యక్షంగా చట్టబద్ధం చేయడమే" అని అభివర్ణించారు. తాజాగా ట్రంప్ సైతం ఈ వ్యాఖ్యలకు కౌంటర్ తాము సముద్రపు దొంగలమేనన్నారు.అయితే కొద్దిసేపటి క్రితం ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ చర్యలు తనను సంతృప్తి పరచలేదని యుద్దాన్ని ముగించే ప్రసక్తే లేదన్నారు. -
ఒకప్పుడు బాంబులు మోత.. ఇప్పుడు మాత్రం..?
ప్రస్తుతం అమెరికా- ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నడుస్తోంది. దీంతో కాల్పుల మోతకు తాత్కాలిక తెర పడింది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాదాపుగా రెండునెలలలుగా కాల్పుల మోతతో దద్దరిల్లిపోయిన టెహ్రాన్ నగరం ఇప్పుడు ఏలా ఉందో ఆ యువతి వీడియో చూపించింది. ఈ వీడియో నెటిజన్స్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్, మరియు అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో'ఎస్టెల్' అనే వినియోగదారు షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్గా మారింది. "ఏ డే ఇన్ టెహ్రాన్ డ్యూరింగ్ సీజ్ఫైర్" (టెహ్రాన్లో కాల్పుల విరమణ వేళ ఒక రోజు) పేరుతో ఉన్న ఈ వీడియో, టెహ్రాన్లోని సాధారణ ,ప్రశాంతమైన జీవనశైలిని ప్రపంచానికి చూపిస్తోంది. గతంలో క్షిపణులు నగరాన్ని తాకిన భయానక దృశ్యాలకు ఇది పూర్తిగా భిన్నంగా ఉండటంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.టెహ్రాన్ మెుత్తం కలియతిరుగుతూ...రాజధాని నగర వీధుల గుండా ప్రయాణిస్తూ ఎస్టెల్ తన కారులో ప్రధాన రహదారుల గుండా ప్రయాణిస్తూ నగరాన్ని చూపించారు. ఫుట్పాత్ మీద ఉన్న ఒక చిన్న విక్రేత వద్ద క్యాట్ ప్లషీని కొనడం, ఒక ఫుడ్ కోర్టులోకి వెళ్లి లంచ్ ఆర్డర్ చేయడం, ఇరానియన్ బిస్కెట్లు కొనడం వంటి దృశ్యాలు ఉన్నాయి. అంతేకాకుండా, ఆమె ఒక స్టాల్లో కొరియన్ ఫుడ్ కూడా రుచి చూసింది.అదే విధంగదా సాయంత్రం సమయంలో, ఆమె ఒక విలాసవంతమైన హోటల్లోని లాంజ్కు వెళ్ళింది. అక్కడ ప్రజలు యుద్ధ భయం లేకుండా ఆనందంగా సమయాన్ని గడుపుతున్నారు.వైరల్గా వీడియోఅయితే ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్ల వైరల్గా మారింది. నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, మీడియాలో చూపే దానికి, అక్కడ జరుగుతున్న దానికి చాలా తేడా ఉందని పేర్కొన్నారు. ఇరాన్ ప్రజల ఆతిథ్యాన్ని, నగర అందాలను ప్రశంసిస్తూ, యుద్ధం త్వరగా ముగియాలని కోరుకుంటున్నారు. కాగా ప్రస్తుతం యుద్ధం విషయంలో నీలినీడలు కమ్ముకున్నాయి. యుద్ధం ముగింపుకు ఇరాన్ చేసిన కొత్త ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించారు.దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. View this post on Instagram A post shared by Estelle W (@estelleeats__) -
నో డీల్..నో క్లారిటీ : మా దళాలు సిద్ధం : ఇరాన్ సంచలన ప్రకటన
ఏప్రిల్ 7 నుంచి అమెరికా బలగాలు, ఇరాన్ మధ్య కాల్పులు జరగలేదని కాంగ్రెస్ నేతలకు శుక్రవారం(మే 1) రాసిన లేఖలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇప్పుడు ముగిసిందంటూ కాంగ్రెస్కు సమాచారం ఇచ్చి 60 రోజులు పూర్తయిన నేపథ్యంలో ట్రంప్ ఈ లేఖ రాశారు. అంతేకాదు యుద్ధానికి కాంగ్రెస్ అనుమతి పొందాల్సిన అవసరం ఇప్పుడు తనకు లేదని పేర్కొన్నారు. అయితే దీనికి స్పందనగా ఇరాన్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. అమెరికా ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని, దీనివల్ల ఇరు దేశాల మధ్య ఘర్షణలు మళ్లీ చెలరేగే అవకాశం ఉందని, తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ హెచ్చరించింది.ఖతం అల్-అన్బియాసెంట్రల్ హెడ్ క్వార్టర్స్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్దార్ మహమ్మద్ జాఫర్ అసాదీ శనివారం మాట్లాడుతూ, వాషింగ్టన్ దౌత్యపరమైన అవగాహనలకు కట్టుబడి ఉండటం లేదని విమర్శించారు. అమెరికా అధికారుల చర్యలు, ప్రకటనలు ప్రధానంగా మీడియా ప్రేరేపితమైనవని విమర్శించారు. కేవలం చమురు ధరలు తగ్గకుండా చూడటానికి ,వారు సృష్టించిన గందరగోళం నుండి బయటపడటానికి మాత్రమే వారు ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏవైనా పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇరాన్ సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: షాకింగ్ : పక్కా ప్లాన్తో మలయాళీ సిస్టర్స్ సూసైడ్!భారీ నష్టంసిఎన్ఎన్ (CNN) పరిశోధనాత్మక నివేదిక ప్రకారం, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ జరిపిన దాడుల వల్ల భారీ నష్టం వాటిల్లింది. కువైట్లోని క్యాంప్ బ్యూరింగ్ ప్రాంతంలోని అతిపెద్ద అమెరికా స్థావరాలలో ఒకటైన ఇక్కడ మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. దీనిలోని ప్రధాన భాగాలు ప్రస్తుతం పనిచేయడం లేదు.ఇదీ చదవండి: నటి ఎగ్ ఫ్రీజింగ్ ఇంజెక్షన్స్: రెండు రోజులు నరకంఎనిమిది దేశాల్లోని కనీసం 16 అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. పశ్చిమ ఆసియాలోని మెజారిటీ అమెరికా సైనిక స్థావరాలు ఈ దాడుల వల్ల ప్రభావితమయ్యాయని, కొన్ని చోట్ల సౌకర్యాలు పూర్తిగా ఉపయోగించలేని స్థితికి చేరుకున్నాయని నివేదిక పేర్కొంది.ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావంమరోవైపు, అమెరికా విధిస్తున్న ఆంక్షలు ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి.పారిశ్రామిక మార్గాల్లో అమెరికా కఠిన చర్యల వల్ల ఇరాన్ చమురు ఎగుమతులకు ఆటంకం కలిగింది. దీనివల్ల ఇరాన్ దాదాపు 4.8 బిలియన్ డాలర్ల చమురు ఆదాయాన్ని కోల్పోయిందని పెంటగాన్ అంచనా వేసినట్లు యాక్సియోస్ (Axios) నివేదించింది. కాగా అమెరికా, ఇరాన్ మధ్య దీర్ఘకాలిక ఒప్పందమేదీ ఇంతవరకూ కుదుర్చుకోలేదు. పాకిస్తాన్ ద్వారా తెహ్రాన్ కొత్త సందేశం పంపించిందని ఇరాన్ మీడియా చెబుతోంది. మరోవైపు మధ్యవర్తుల ద్వారా అమెరికాకు పంపిన ఒక అధికారిక ప్రతిపాదనలో కొత్త కాలపరిమితిని స్పష్టంగా పేర్కొన్నారని ఆ అధికారి తెలిపారు. ఈ ప్రతిపాదన ప్రకారం, ఇజ్రాయెల్ మరియు అమెరికా మళ్లీ దాడి చేయవన్న హామీతో యుద్ధం ముగుస్తుంది. ఇరాన్ జలసంధిని తెరుస్తుంది ,అమెరికా ఇరాన్పై తన దిగ్బంధనాన్ని ఎత్తివేస్తుంది. -
ఇరాన్ నన్ను ఇరిటేట్ చేస్తోంది.. ట్రంప్
ఇరాన్తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రతిపాదనలతో తాను సంతృప్తిగా లేనని ప్రస్తుతానికి యుద్దం ముగించే ఆలోచన లేదని తేల్చిచెప్పారు. అయితే ఇరాన్ మాత్రం తమతో యుద్దం ముగింపుకై సంప్రదింపులు జరుపుతుందని ట్రంప్ స్పష్టం చేశారు.ఇరాన్- అమెరికా యుద్ధం ప్రారంభమై దాదాపు 60 రోజులు గడుస్తోంది అయినప్పటీకీ చర్చల్లో పెద్దగా పురోగతి కనిపించడం లేదు. ఇరు దేశాలు చర్చల విషయంలో తగ్గడం లేదు. అమెరికా ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడం కుదరదు అనడం ఇరాన్ దానికి ఎట్టి పరిస్థితుల్లో నో చెప్పడంతో చర్చలు సాగడం లేదు. అయితే తాజాగా ట్రంప్ ఈ విషయంలో మరోసారి స్పందించారు.ట్రంప్ మాట్లాడుతూ "వారు ఒక ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు, కానీ నేను దానికి సిద్ధంగా లేను; నాకు దానితో తృప్తి లేదు, కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. వారు పురోగతి సాధించారు, కానీ వారు ఎప్పటికైనా గమ్యాన్ని చేరుకుంటారో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. వారి మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. ఇరాన్లో వారు ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండటంలో తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నారు," అని ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.కాగా ఇరాన్తో యుద్ధం ప్రారంభమైననాటి నుంచి చట్టపరమైన అనుమతి కోరడానికి ట్రంప్ ప్రభుత్వానికి ఈ రోజు ( శనివారం)చివరి గడువు అయితే, ప్రస్తుత కాల్పుల విరమణ సమయంలో యుద్ధం ముగిసిపోయినందున దానికి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని వైట్ హౌస్ కాంగ్రెస్కు తెలిపినట్లు సమాచారం. -
ప్రపంచంలోనే తొలిసారి.. కాగితం లేని ‘బుక్ స్టోర్’
న్యూయార్క్: పుస్తకం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పేపర్లు, అక్షరాలు, పెద్ద పెద్ద లైబ్రరీలు. కానీ, ఆ ఊహలను పూర్తిగా మారుస్తూ.. ప్రపంచంలోనే తొలిసారిగా ‘పుస్తకాలు లేని బుక్ స్టోర్’ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ అమెజాన్ అనుబంధ సంస్థ ‘ఆడిబుల్’ న్యూయార్క్ నగరంలో ఈ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. నేటి తరం పాఠకులు పుస్తకాలు చదవడం కంటే ఆడియో కథలు వినేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్న ట్రెండ్కు అనుగుణంగా ఈ పాప్-అప్ స్టోర్ను ఆవిష్కరించింది.ఆడిబుల్ స్టోరీ హౌస్.. ఒక సరికొత్త ఊహమాన్హాటన్లోని లోయర్ ఈస్ట్ సైడ్లో ప్రారంభమైన ఈ ‘ఆడిబుల్ స్టోరీ హౌస్’లో ఒక్క భౌతిక పుస్తకం కూడా కనిపించదు. బెస్ట్ సెల్లర్ పుస్తకాల అరలు, కాగితాల చప్పుడు ఇక్కడ అస్సలు ఉండవు. ఈ ప్రదేశాన్ని కేవలం ‘ఆడియో స్టోరీటెల్లింగ్’ కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఆడిబుల్ సీఈఓ బాబ్ కారిగాన్ మాట్లాడుతూ.. ఆడియో కథలకి ప్రాణం పోసేందుకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఐడియా నుంచే ఈ కాన్సెప్ట్ పుట్టిందని, ఇది ఒక సాహసోపేతమైన ప్రయోగం అని పేర్కొన్నారు.స్టోరీ టైల్స్తో వినూత్న అనుభూతిఈ స్టోర్ లోపల అరల నిండా ‘స్టోరీ టైల్స్’ అనే ఆడియోబుక్ టాబ్లెట్లు ఉంటాయి. సందర్శకులు వాటిని అక్కడే ఉన్న ప్లేయర్లో ఉంచి హెడ్ఫోన్స్ ద్వారా కథలు వినవచ్చు. ఈ టైల్స్ ద్వారా షార్ట్ ప్రివ్యూ వినొచ్చు. ఆపై పూర్తి పుస్తకాన్ని ఆడిబుల్ యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. హెడ్ఫోన్స్ లేకుండా గ్రూప్గా కూర్చొని ఆడియో వినేందుకు స్పీకర్లతో కూడిన ప్రత్యేక గదులు కూడా ఉన్నాయి. అలాగే ‘లిజనింగ్ బార్’ వద్ద ఉండే ‘స్టోరీ టెండర్స్’.. విజిటర్స్ అభిరుచికి తగ్గ ఆడియోబుక్స్ను ఎంపిక చేయడంలో సహాయపడతారు.పెరుగుతున్న ఆడియోబుక్స్ క్రేజ్అమెరికాలో ఆడియోబుక్స్కు డిమాండ్ భారీగా పెరుగుతున్న తరుణంలో ఈ బుక్ లెస్ స్టోర్ రావడం విశేషం. ఆడియో పబ్లిషర్స్ అసోసియేషన్ నివేదిక ప్రకారం.. 2024లో అమెరికాలో ఆడియో బుక్ అమ్మకాలు 2.22 బిలియన్ డాలర్ల(రూ. 9,491 కోట్లు)కు చేరుకున్నాయి. గత ఐదేళ్లలో ఈ మార్కెట్ దాదాపు రెట్టింపు అయింది. సంప్రదాయ పుస్తక పఠనంలోని ఆత్మీయతను, ఆధునిక శ్రవణ అలవాట్లను కలబోసి.. ఆఫ్లైన్ ద్వారా సరికొత్త అనుభూతిని పంచడమే లక్ష్యంగా ఆడిబుల్ ఈ ఈ స్టోర్ను నడపనుంది.ఇది కూడా చదవండి: చిన్నారిపై వార్డెన్, వంటవాని పైశాచికం -
మళ్లీ అదే జరగొచ్చు.. ఇరాన్ కీలక వ్యాఖ్యలు
టెహ్రాన్: అమెరికాతో మళ్లీ యుద్ధం జరగొచ్చంటూ ఇరాన్ సీనియర్ సైనిక అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలు నిలిచిపోవడంతో అమెరికాతో తిరిగి ఘర్షణ తలెత్తే అవకాశం ఉందన్నారు. అమెరికా హామీలకు, ఒప్పందాలకు కట్టుబడి ఉండదని ఆధారాలు చూపిస్తున్నాయంటూ ఇరాన్ సైనిక కేంద్ర కమాండ్ సెంటర్ 'ఖతమ్ అల్-అంబియా'కు చెందిన మొహమ్మద్ జాఫర్ అసాదీ అన్నట్లు ఇరాన్ ఫార్స్ వార్తా సంస్థ పేర్కొంది. మరో వైపు, యుద్ధాన్ని పూర్తిగా ముగించడానికి ఇరాన్ తమతో కొత్త ప్రతిపాదన చేసిందని.. అయితే, అందులోని అంశాలపై తాను సంతృప్తి చెందడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇరాన్ ప్రపోజల్ నచ్చలేదన్న ట్రంప్... అసలు ఈ ప్రపొజల్ ఏమిటి? అందులో పేర్కొన్న అంశాలేమిటి? అనేది ఆయన స్పష్టంగా చెప్పలేదు.ఇదిలా ఉండగా.. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో ఇరాన్పై యుద్ధం ముగిసిపోయిందంటూ అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ చెప్పారు. 1973 నాటి చట్టం ప్రకారం.. ఇతర దేశాలపై 60 రోజులకు పైగా యుద్ధం చేస్తే అమెరికా కాంగ్రెస్(చట్టసభ) నుంచి ప్రభుత్వం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధన నుంచి తప్పించుకోవడానికే ఇరాన్పై యుద్ధం ముగిసిందని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.ఇరాన్పై యుద్ధం విషయంలో ట్రంప్ ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అనుమతి పొందలేదు. పశ్చిమాసియాలో ఈ ఏడాది ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఘర్షణలు ముగిశాయని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు ఏప్రిల్ 7న అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ తర్వాత అమెరికా, ఇరాన్ల మధ్య దాడులు జరగలేదని గుర్తుచేశారు. -
వైట్హౌస్లో అసలు జరిగింది ఇదే.. కీలక వీడియో విడుదల
వాషింగ్టన్: వైట్హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్లో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి అమెరికా న్యాయశాఖ.. కీలక వీడియోను విడుదల చేసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను చంపే ఉద్దేశంతో గత వారం జరిగిన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ విందులోకి కోల్ టోమస్ అలెన్ చొరబడటానికి ప్రయత్నించిన దృశ్యాలు విడుదలయ్యాయి. అలెన్ లొంగిపోయే ముందు అసలు కాల్పులు జరిపాడా? సందేహాల మధ్య, వాషింగ్టన్ డిసి టాప్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ జీనైన్ పిరో, ఈ ఘటనకు సంబంధించిన ఎడిట్ చేసిన భద్రతా కెమెరా ఫుటేజీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.సెక్యూరిటీ చెక్ పాయింట్లో నుంచి నిందితుడు ఒక్కసారిగా దూసుకొచ్చి కాల్పులు జరపడం సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యింది. శనివారం నాటి విందు కంటే ఒక రోజు ముందుగానే అలెన్ ఆ హోటల్ పరిసరాల్లో రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు. తనిఖీ కేంద్రం వద్ద మెటల్ డిటెక్టర్లను తొలగిస్తున్న సమయంలో అలెన్ ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్పై కాల్పులు జరిపి లోపలికి దూసుకెళ్లాడు. అలెన్.. సీక్రెట్ సర్వీస్ అధికారి కాల్పులు కారణంగా కిందపడలేదు. తనిఖీ కేంద్రం వద్ద ఉన్న ఒక మెటల్ డిటెక్టర్ బాక్స్ను ఢీకొని కింద పడిపోయాడు. ఏజెంట్ జరిపిన ఐదు రౌండ్ల కాల్పుల్లో ఏ ఒక్కటి కూడా అలెన్కు తగలలేదని అధికారులు తెలిపారు.అలెన్ మొదట కాల్పులు జరిపాడని ప్రభుత్వం వాదిస్తుండగా.. వాషింగ్టన్ పోస్ట్ వీడియో విశ్లేషణలో కేవలం సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ జరిపిన నాలుగు షాట్లు మాత్రమే కనిపించాయి. ఏజెంట్పై అలెన్ కాల్పులు జరిపాడనడానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఆధారాలను సేకరిస్తోందని అలెన్ తరపు పబ్లిక్ డిఫెండర్లు పేర్కొన్నారు.🇺🇸 The United States has released high quality footage from the White House Correspondents Dinner shooting.This is not AI generated..😳 pic.twitter.com/AAP86I160M— Orbit News (@Orbit_News10) May 1, 2026 -
కూలిన విమానం.. ఐదుగురు మృతి
వింబర్లీ: అమెరికాలోని టెక్సాస్లో చిన్న విమానం కూలిన ఘటనలో అందులోని మొత్తం ఐదుగురూ ప్రాణాలు కోల్పోయారు. ఆస్టిన్కు 64 కిలోమీటర్ల దూరంలోని వింబర్లీ వద్ద గురువారం రాత్రి ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన సెస్నా 421సీ రకం విమానంలో మొత్తం ఐదుగురు ఉన్నట్లు హేస్ కౌంటీ జడ్జి రుబెన్ బెసెర్రా తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. మృతుల వివరాలను వెల్లడించలేదు. ప్రమాదానికి ముందు ఆ విమానం చాలా వేగంతో ప్రయాణించినట్లు తెలిసిందన్నారు. అదే మార్గంలో ప్రయాణించిన మరో విమానం సమీపంలోని శాన్ ఆంటోనియోలో సురక్షితంగా ల్యాండైనట్లు వెల్లడించారు.ఈ విమానం టెక్సాస్ పాన్హ్యాండిల్లోని అమరిల్లో సమీపంలోని విమానాశ్రయం నుండి బయలుదేరి.. న్యూ బ్రాన్ఫెల్స్లో దిగాల్సి ఉంది. అమరిల్లోకి చెందిన ఒక పికిల్బాల్ క్రీడా బృందం టోర్నమెంట్లో పాల్గొనడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి.ప్రమాద సమయంలో వాతావరణం అనుకూలంగానే ఉందని.. వర్షం లేదని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే, తెల్లవారుజామున 3 గంటల నుండి వర్షం కురవడంతో దర్యాప్తు బృందాలకు సహాయక చర్యలు చేపట్టడం సవాలుగా మారింది. ప్రస్తుతం ఈ ప్రమాదంపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) దర్యాప్తు చేస్తున్నాయి. -
అమెరికా అధ్యక్షుడి మరో సంచలన ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. క్యూబాపై ఆర్మీ ఆపరేషన్ చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. ఇరాన్ నుంచి అమెరికా సైన్యం తిరిగి వచ్చే దారిలోనే ఈ ఆపరేషన్ ముగియవచ్చంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరిడాలో ఆయన ప్రసంగిస్తూ.. ‘‘ఆపరేషన్ క్యూబా చేపట్టబోతున్నాం. వెంటనే క్యూబాను స్వాధీనం చేసుకుంటాం. ఇరాన్ నుంచి తిరిగి వచ్చే దారిలోనే మా సైన్యం ఆ పని చేయబోతోంది. అబ్రహం లింకన్ యుద్ధ నౌకను ఆ దేశానికి 100 గజాల దూరంలో ఆపుతాం. మేం లొంగిపోతున్నాం అని క్యూబా చెప్పేలా చేస్తాం’’ అంటూ వ్యాఖ్యానించారాయన. అమెరికా–క్యూబా మధ్య వైరం కొత్తది కాదు. 19వ శతాబ్దం నుంచే ప్రారంభమై.. ఫిడెల్ కాస్ట్రో విప్లవం తర్వాత మరింత తీవ్రమైంది. అమెరికా వ్యాపార ప్రయోజనాలు, కమ్యూనిస్టు సిద్ధాంతం, సోవియట్ యూనియన్తో క్యూబా స్నేహం.. ఇవన్నీ ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వానికి కారణమయ్యాయి. అయితే.. ఆ మధ్యలో బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం కనిపించింది. అయితే ట్రంప్ రాకతో ఆ పరిస్థితి మారిపోయింది. ట్రంప్ తాజా ప్రకటన ఇరు దేశాల మధ్య వైరం మరింత పెంచేలా కనిపిస్తోంది. వెనెజువెలా అధ్యక్షుడు మదురోను సైనిక చర్య ద్వారా అమెరికా బంధించిన సంగతి తెలిసిందే. ఆ టైంలోనే ట్రంప్ ‘క్యూబా నెక్ట్స్..’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అదొక ఒక విఫల దేశం. దాని దగ్గర డబ్బు లేదు.. చమురు లేదు. కానీ అదో అందమైన ద్వీపం. దానిని స్వాధీనం చేసుకోవడం నాకు గౌరవం’’ అని వ్యాఖ్యానించారు. అది జరగదు.. ఇప్పటికే అమెరికా తీవ్ర ఆంక్షలతో క్యూబా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చమురు దిగుమతులపై బ్లాకేడ్ కారణంగా తీవ్ర ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అలాగే.. విద్యుత్ కోతలు, నీటి కొరత, ఔషధాల కొరతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అయితే ట్రంప్ తాజా అల్టిమేటంపై క్యూబా స్పందించింది. ‘‘క్యూబా ఓ స్వతంత్ర దేశం. అలాంటప్పుడు అమెరికా మాకు ఆదేశాలివ్వడం ఏంటి?. నేను లొంగిపోను.. రాజీనామా చేయను. మా నాయకత్వాన్ని నిర్ణయించేది ఇక్కడి ప్రజలే’’ అని అధ్యక్షుడు మిగెల్ డియాజ్ కానెల్ ప్రకటించారు. -
ఐరన్ డోమ్ మాత్రమే కాదు.. ‘ఐరన్ బీమ్ లేజర్ సిస్టమ్’ సైతం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)కు ఇజ్రాయెల్ తన ఐరన్ డోమ్ వ్యవస్థను పంపిందన్న విషయం ఇటీవలే బయటకు వచ్చింది. అయితే, ఇరాన్తో ఘర్షణ సమయంలో కేవలం ఐరన్ డోమ్ను మాత్రమే కాదు.. ఇజ్రాయెల్ తన ఐరన్ బీమ్ లేజర్ ఆధారిత గగనతల రక్షణ వ్యవస్థ వెర్షన్ను కూడా పంపిందని తాజాగా ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. ఇరాన్ నుంచి వచ్చే క్షిపణులు, డ్రోన్ల భారీ దాడి నుంచి యూఏఈని కాపాడడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ చర్య తీసుకుంది. ఇజ్రాయెల్, యూఏఈ మధ్య రక్షణ సహకారం ఎంతగా పెరిగిందో చెప్పడానికి ఇదే ఉదాహరణ.ఇజ్రాయెల్తో స్నేహ బంధం ఉంటే ఇలాంటి అధునాతన రక్షణ వ్యవస్థల సాయం, సాంకేతిక మద్దతు లభిస్తుందని ప్రాంతీయ అధికారి ఒకరు అన్నారు. ఇజ్రాయెల్ “స్పెక్ట్రో” అనే అధునాతన పర్యవేక్షణ వ్యవస్థను కూడా యూఏఈకు పంపింది. ఇది 20 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే డ్రోన్లను గుర్తించడంలో సాయపడుతోంది. యూఏఈకు ఇజ్రాయెల్ పంపిన దాడి, రక్షణ వ్యవస్థలు ఎక్కువగా ప్రోటోటైప్స్ కాగా, ఇవి ఇంకా ఇజ్రాయెల్ ఆయుధ వ్యవస్థల్లో పూర్తిగా సమన్వయం కాలేదు.ఐరన్ బీమ్ లేజర్ వ్యవస్థ అంటే?ఐరన్ బీమ్ లేజర్ రక్షణ వ్యవస్థ వెర్షన్ తక్కువ దూర రాకెట్లు, డ్రోన్లను ఆవిరి చేసి నాశనం చేస్తుంది. లెబనాన్ నుంచి హెజ్బొల్లా ప్రయోగించిన ప్రాజెక్టైళ్లపై ఇజ్రాయెల్ మొదట దీనిని వినియోగించింది. ఐరన్ డోమ్ గగనతల రక్షణ వ్యవస్థతో పాటు కొంతమంది ఇజ్రాయెల్ సైనిక సిబ్బందిని కూడా యూఏఈకు పంపించారు.ఇరాన్ ఇటీవల యూఏఈపై భారీగా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. ఆయుధ వ్యవస్థలతో పాటు ఇజ్రాయెల్ స్పై సమాచారం కూడా పంచుకుంది. ఇరాన్లో తక్కువ దూర క్షిపణుల ప్రయోగ సన్నాహాలపై ముందస్తు సమాచారం ఇచ్చింది.యూఏఈ అనేక స్థాయుల గగనతల రక్షణ వ్యవస్థలను వినియోగించింది. ఇరాన్ నుంచి ఎదురైన దాడులను వాటి ద్వారా ఎదుర్కొంది. ఇజ్రాయెల్ అభివృద్ధి దశలో ఉన్న లేదా ఇంకా రాడార్ నెట్వర్క్తో పూర్తిగా సమకాలీకరించని ఆయుధాలను కూడా యూఏఈకు పంపింది. గతంలో అబ్రహాం ఒప్పందాల ద్వారా యూఏఈ సహా నాలుగు అరబ్ దేశాలతో ఇజ్రాయెల్ సత్సంబంధాలు ఏర్పడ్డాయి. -
ఇరాన్ కొత్త ప్రతిపాదన నచ్చలేదు
వాషింగ్టన్: యుద్ధాన్ని పూర్తిగా ముగించడానికి ఇరాన్ తమతో కొత్త ప్రతిపాదన చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే, అందులోని అంశాలపై తాను సంతృప్తి చెందడం లేదని స్పష్టంచేశారు. ఇరాన్ ప్రపోజల్ నచ్చలేదని అన్నారు. అసలు ఈ ప్రపొజల్ ఏమిటి? అందులో పేర్కొన్న అంశాలేమిటి? అనేది ఇంకా తెలియరాలేదు. ‘‘ఒప్పందం చేసుకోవాలని ఇరాన్ భావిస్తోంది. ఇరాన్ ప్రతిపాదన నాకు సంతృప్తి కలిగించలేదు. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం’’అని శుక్రవారం వైట్ హౌస్లో ట్రంప్ విలేకరులతో అన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఫోన్ ద్వారా సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇరాన్ నుంచి అమెరికాకు ప్రతిపాదన రావడం ఇదే మొదటిసారి కాదు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరిచి యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ఇంతకుముందు అంగీకరించింది. కానీ తమ అణు కార్యక్రమంపై చర్చలను వాయిదా వేయాలని షరతు విధించింది. అందుకు అమెరికా ఒప్పుకోలేదు. ఇరాన్తో చర్చల ముసాయిదా పత్రంలో అణు కార్యక్రమ అంశాన్ని చేర్చాలంటూ తమ ప్రతినిధి బృందాన్ని అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారు. చర్చలు కొనసాగుతున్నంత కాలం.. బాంబు దాడికి గురైన ఇరాన్ అణు కర్మాగారాల నుంచి శుద్ధి చేసిన యురేనియంను తరలించడానికి ప్రయతి్నంచబోమని, లేదా ఆ కర్మాగారాల్లో ఎలాంటి కార్యకలాపాలను పునఃప్రారంభించబోమని ఇరాన్ హామీ ఇవ్వాలని అమెరికా డిమాండ్ చేసింది. దీనిపై ఇరాన్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి మళ్లీ కొత్త ప్రతిపాదన రావడం ఆసక్తి కలిగిస్తోంది. మాతో ఒప్పందానికి ఇరాన్ తహతహ పశ్చిమాసియాలో ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపివేసిన యుద్ధాన్ని పూర్తిగా ముగించే దిశగా తమతో ఒప్పందం చేసుకోవడానికి ఇరాన్ తహతహలాడుతోందని ట్రంప్ అన్నారు. ఇరాన్పై వైమానిక దాడులను పునఃప్రారంభించే అవకాశాలు దాదాపుగా లేవని స్పష్టంచేశారు. ఇరాన్లో కాల్పుల విరమణను ఉల్లంఘించాలన్న ఆలోచన అమెరికాకు ఉందా? అని ప్రశ్నించగా.. ఆ అవసరం ఉందని తాను అనుకోవడం లేదని ట్రంప్ బదులిచ్చారు. అమెరికా చేపట్టిన సైనిక చర్య ఇరాన్ సైనిక సామర్థ్యాలను ఇప్పటికే తీవ్రంగా దెబ్బతీసిందని పేర్కొన్నారు. ‘‘ఇరాన్ నౌకాదళం, వాయుసేన చాలావరకు ధ్వంసమయ్యాయి. డ్రోన్ ఫ్యాక్టరీలు 82 శాతం నష్టపోయాయి. క్షిపణి ఉత్పత్తి కూడా దారుణంగా పడిపోయింది. క్షిపణి ఫ్యాక్టరీలు దాదాపు 90 శాతం పడిపోయాయి. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని నాశనం చేశాం. హార్మూజ్ జలసంధిపై అమెరికా విధించిన దిగ్బంధనం వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ వేగంగా కుప్పకూలుతోంది’’అని ట్రంప్ తేల్చిచెప్పారు. ఈయూ వాహనాలపై సుంకాల పెంపుయూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులపై సుంకాలను వచ్చేవారం 25 శాతం పెంచబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం తేల్చిచెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. తాము పూర్తిగా అంగీకరించిన వాణిజ్య ఒప్పందాన్ని ఈయూ పాటించడం లేదని ఆక్షేపించారు. అయితే, తమ అభ్యంతరాలు ఏమిటన్నది ఆయన బయటపెట్టలేదు. ఇరాన్పై యుద్ధం ముగిసింది: అమెరికా వాషింగ్టన్: కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో ఇరాన్పై యుద్ధం ముగిసిపోయిందని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ చెప్పారు. 1973 నాటి చట్టం ప్రకారం.. ఇతర దేశాలపై 60 రోజులకు పైగా యుద్ధం చేస్తే అమెరికా కాంగ్రెస్(చట్టసభ) నుంచి ప్రభుత్వం తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధన నుంచి తప్పించుకోవడానికే ఇరాన్పై యుద్ధం ముగిసిందని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇరాన్పై యుద్ధం విషయంలో ట్రంప్ ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అనుమతి పొందలేదు. పశ్చిమాసియాలో ఈ ఏడాది ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఘర్షణలు ముగిశాయని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు ఏప్రిల్ 7న అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ తర్వాత అమెరికా, ఇరాన్ల మధ్య దాడులు జరగలేదని గుర్తుచేశారు. -
భూమిలోకి కుంగిపోతున్న మెక్సికో సిటీ
మెక్సికో సిటీ: ఉత్తర అమెరికా ఖండంలోని మెక్సికో దేశ రాజధాని మెక్సికో సిటీ క్రమంగా భూమిలోకి కుంగిపోతోంది. ప్రతిఏటా 10 అంగుళాల చొప్పున కుంగిపోతున్నట్లు నిపుణులు గుర్తించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ఈ వారం విడుదల చేసిన కొత్త ఉపగ్రహ చిత్రాల ఆధారంగా ఈ విషయం తేల్చారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా కుంగిపోతున్న మహానగరాల్లో ఒకటిగా మెక్సికో సిటీ నిలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత విస్తారమైన, జనసాంద్రత కలిగిన నగరాల్లో ఒకటైన ఈ సిటీ విస్తీర్ణం 7,800 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ సుమారు 2.2 కోట్ల జనాభా నివసిస్తోంది. మెక్సికన్ సిటీ, దాని చుట్టుపక్కల నగరాలు ఒక పురాతన లేక్ బెడ్పై నిర్మితమయ్యాయి. ఈ సిటీలో అనేక వీధులు ఒకప్పుడు కాలువలుగా ఉండేవి. కాలువలు పూడ్చేసి రహదారులు నిర్మించారు. మరో వందేళ్లలో 39 అడుగులు! భూగర్భ జలాల విచ్చలవిడి వినయోగం, పట్టణాభివృద్ధి చర్యల కారణంగా భూగర్భ జలవనరులు గణనీయంగా తగ్గిపోయాయి. దాంతో మెక్సికో సిటీ ఒక శతాబ్దానికి పైగా కుంగిపోతోంది. 1573లో నిర్మాణం ప్రారంభమైన మెట్రోపాలిటన్ కేథడ్రల్ వంటి అనేక స్మారక చిహా్నలు. పురాతన భవనాలు స్పష్టంగా ఒక వైపుకు వంగిపోయి కనిపిస్తున్నాయి. క్షీణిస్తున్న భూగర్భ జలవనరులు కూడా దీర్ఘకాలిక నీటి సంక్షోభానికి కారణమయ్యాయి. ఈ సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయి. మెక్సికో సిటీ వేగంగా కుంగిపోతుండడం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాన్ని అంతరిక్షం నుంచి కూడా గుర్తించవచ్చు. పరిస్థితి తీవ్రతను దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. నాసా తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మెక్సికో సిటీలో కొన్ని ప్రాంతాలు నెలకు సగటున 0.78 అంగుళాల చొప్పున కుంగిపోతున్నాయి. ఎయిర్పోర్టుతోపాటు కొన్ని ప్రధాన కట్టడాలు ఆయా ప్రాంతాల్లోనే ఉన్నాయి. కుంగుబాటు రేటు ఏడాదికి కనీసం 9.5 అంగుళాలుగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. మరో వందేళ్లలో నగరం 39 అడుగుల మేర కుంగిపోవచ్చని అంచనా వేస్తున్నారు. మెక్సికో సిటీపై నాసా 2025 అక్టోబర్ నుంచి 2026 జనవరి వరకు అధ్యయనం చేసింది. ఇందుకోసం శక్తివంతమైన నిసార్ ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించింది. మెక్సికో సిటీ భూమి కుంగిపోయే సమస్యను పరిష్కరించడంపై ప్రభుత్వం తక్షణమే దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం ఇన్నాళ్లూ నిర్లక్ష్యం చేయడం వల్లే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చిందని అంటున్నారు. -
అమెరికా కీలక నిర్ణయం.. 5,000 మంది సైనికులు వెనక్కి..
వాషింగ్టన్: జర్మనీ నుంచి 5,000 మంది అమెరికా సైనికులను వెనక్కి తీసుకురావాలని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఆదేశించినట్లు పెంటగాన్ తెలిపింది. ఇరాన్ యుద్ధంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూరప్ మధ్య విభేదాలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. నాటో మిత్ర దేశానికి హెచ్చరికగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇరాన్తో అమెరికా జరపాల్సిన శాంతి చర్చలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో అమెరికాను ఇరాన్ ప్రభుత్వం అవమానానికి గురిచేసిందంటూ ఇటీవల జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ పలు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో జరిగిన చర్చల్లో అమెరికా బలహీనంగా కనిపించిందని, సరైన ఫలితం తీసుకురాలేకపోయిందని విమర్శించారు.దీంతో ట్రంప్ కొన్ని రోజుల క్రితం మాట్లాడుతూ.. జర్మనీ నుంచి సైనికులను ఉపసంహరించుకుంటామని హెచ్చరించారు. పెంటగాన్ ప్రధాన ప్రతినిధి షాన్ పార్నెల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఉపసంహరణ ప్రక్రియ వచ్చే 6 నుంచి 12 నెలల్లో పూర్తవుతుందని రాయిటర్స్ పత్రిక పేర్కొంది. మరోవైపు, ఇటలీ, స్పెయిన్లో కూడా తమ సైనికులను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే చెప్పారు. జర్మనీలో 36,436 మంది అమెరికా సైనికులు ఉన్నారు. వారిలో 5,000 మంది అమెరికాకు తిరిగి వచ్చేయనున్నారు. ఇక, ఇటలీలో 12,662 మంది, స్పెయిన్లో 3,814 మంది అమెరికా సైనికులు ఉన్నారు. ఇరాన్పై అమెరికా యుద్ధానికి మద్దతు ఇవ్వకపోవడంతో పాటు హార్మూజ్ జలసంధి విషయంలో సహకరించకపోవడం వల్ల నాటో మిత్రదేశాలపై డొనాల్డ్ ట్రంప్ మండిపడుతున్నారు. -
ఇరాన్తో యుద్ధాన్ని ఆపేశాం: వైట్హౌస్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: ఇరాన్తో జరిగిన యుద్ధంపై వైట్హౌస్ ప్రకటన చేసింది. ఇరాన్తో యుద్ధాన్ని ఆపేశామని యూఎస్ కాంగ్రెస్కు వైట్హౌస్ అధికారిక లేఖలో తెలిపింది. పశ్చిమాసియాలో దళాలు ఉన్నప్పటికీ వైట్హౌస్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఇరాన్తో ఇప్పుడు కాల్పుల విరమణ ఉంది కాబట్టి యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వాదిస్తోంది. అమెరికాలో 60 రోజుల లోపు యుద్ధంపై కాంగ్రెస్కు వెళ్లి అనుమతి తీసుకోవాలి లేదా యుద్ధాన్ని ఆపాలన్న నిబంధన ఉంది. కాబట్టి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇలా చెప్పి ఆ గడువు నుంచి తప్పించుకోవాలని చూస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యుద్ధం ఇప్పటికే ముగిసింది కాబట్టి కాంగ్రెస్ అనుమతి అవసరం లేదనేదే లాజిక్. ఇది ఒక లీగల్ స్ట్రాటజీ అయి ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. 1973 వార్ పవర్స్ రిజల్యూషన్ (అధ్యక్షుడు సైనిక చర్యల కోసం అనుసరించాల్సిన చట్టపర పరిమితులు నిర్ణయించే చట్టం) ప్రకారం.. కేవలం 60 రోజులు మాత్రమే సైనిక చర్యలు చేపట్టవచ్చు. ఆ తర్వాత వాటిని ముగించాలి లేదా కాంగ్రెస్ అనుమతి కోరాలి లేదంటే అమెరికా సాయుధ దళాల భద్రతకు సంబంధించిన తప్పనిసరి సైనిక చర్య అవసరమైతే మరో 30 రోజుల పొడిగింపు కోరాలి. అదీ బలగాల ఉపసంహరణ సమయంలో విజ్ఞప్తి చేయాలి.యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభమైంది. ఆ రోజు ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్పై గగనతల దాడులు ప్రారంభించాయి. మొదటి గగనతల దాడుల తర్వాత 48 గంటల్లో ట్రంప్ అధికారికంగా కాంగ్రెస్కు ఈ ఘర్షణ గురించి సమాచారం ఇచ్చారు. దాంతో 60 రోజుల గడువు మే 1న ముగిసింది. -
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని నిర్ణయం
టెహ్రాన్: అమెరికా-ఇరాన్ చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇరాన్ తన మాట వినకపోవడంతో దాడులు చేయాలని ఆయన ఆదేశించినట్లు అమెరికా మీడియా సంస్థ యాక్సియోస్ వెల్లడించింది.యాక్సియోస్ నివేదిక ప్రకారం.. అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి లేకపోవడం, ఇరాన్ బెదిరింపులు పెరగడం వంటి పరిణామాలపై ట్రంప్ యూనైటెడ్ స్టేట్ సెంట్రల్ కమాండ్ అధికారి బ్రాడ్ కూపర్, రక్షణ మంత్రి, జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్తో 45 నిమిషాల పాటు ముఖాముఖీ చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఇరాన్పై దాడులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అందుకు ఊతం ఇచ్చేలా అమెరికా 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్కు భారీగా ఆయుధ సామాగ్రిని పంపింది. జెరూసలేం పోస్టు ప్రకారం సుమారు 6,500 టన్నుల ఆయుధాలు, పరికరాలు ఇజ్రాయెల్కు చేరాయి. వీటిలో వాయు, భూతల ఆయుధాలు, సైనిక ట్రక్కులు, జాయింట్ లైట్ టాక్టికల్ వెహికల్ యూనిట్లు ఉన్నాయి. ఈ సరుకు రెండు నౌకల ద్వారా అష్డోడ్, హైఫా పోర్టులకు చేరగా, అనేక విమానాల ద్వారా కూడా రవాణా జరిగింది.‘ఆపరేషన్ రోరింగ్ లయన్ ప్రారంభమైనప్పటి నుంచి 403 ఎయిర్లిఫ్ట్స్, 10 సీలిఫ్ట్స్ ద్వారా 115,600 టన్నులకుపైగా సైనిక సామాగ్రి అందుకుంది’అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయెల్ ఎప్పుడైనా శత్రువులపై చర్యలకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. రక్షణ అధికారులు ఆయుధ రవాణా కొనసాగుతుందని, మరింత విస్తరించవచ్చని తెలిపారు. -
ఇరాన్లో పెను సంచలనం.. అబ్బాస్ అరాగ్చీ తొలగింపుకు ప్లాన్
టెహ్రాన్: అసలే యుద్ధంతో అతలాకుతలమువుతున్న ఇరాన్లో ఇప్పుడు మరో సంక్షోభం తలెత్తినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ దేశ అంతర్గత వ్యవహారాలలో ఎంతో కీలకంగా వ్యవహారిస్తున్న విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీని పదవి నుంచి తొలగించే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ప్రస్తుతం అమెరికాతో జరుగుతున్న చర్చలు పక్క దారి పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.ప్రస్తుతం అమెరికా- ఇరాన్ మధ్య సీజ్ఫైర్ ఒప్పందం నడుస్తోంది. ఇరు దేశాలు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించి కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు జరుపుతున్నాయి. అయితే ఇంత ప్రాధాన్యమైన పరిస్థితులు నడుస్తున్న వేళ ఇరాన్లో రాజకీయ సంక్షోభం తలెత్తినట్లు తెలుస్తోంది.ఇరాన్ అధ్యక్షుడు మాసూద్ పెజెష్కియన్, ఆ దేశ స్పీకర్ మహమ్మద్ ఖాలిబాప్ ఇరువురు నేతలు అబ్బాస్ అరాగ్ఛీని తొలగించాలని ఆదేశాలిచ్చినట్లు ఆ దేశ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అమెరికాతో చర్చల సమయంలో అధ్యక్షుడి ఆదేశాల అనుసారం కాకుండా ఇరాన్ సైన్యం ఆదేశాలు పాటించినట్లు అరాగ్చీపై ఆరోపణలు వచ్చాయి. గత రెండువారాలుగా అమెరికాతో చర్చల ప్రయత్నాలలో అరాగ్చీ తమ ఆదేశాలను అస్సలు పట్టించుకోవడం లేదని ఇద్దరు నేతలు ఆరోపించినట్లు నివేదికలు వచ్చాయి. .మంత్రిగా బాధ్యతాయుత వ్యక్తిగా ప్రవర్తించాల్సిన సమయంలో దేశ అధ్యక్షుడు ఆదేశాలను లెక్కచేయకుండా ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ నేతలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహరంపై ఇజ్రాయెల్ సైతం గతంలో ఓ నివేదిక ప్రచురించింది. ఆయతుల్లా ఖమేనీ హత్యతో ఇప్పుడు ఇరాన్ పాలన ఆ దేశ మిలటరీ చేతిలోకి వెళ్లిందని వారు గత పాలకులకంటే అధికమైమ మతఛాందస భావాలు కలవారని ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంతర్గతంగా రాజకీయ సంక్షోభం తలెత్తినట్లు తెలుస్తోంది. -
డేట్కు వెళ్లడానికి అమ్మాయిలేదని కోపంతో ప్రాంతానికి నిప్పు..?
2025లో లాస్ ఏంజిల్స్లో సంభవించిన విషాదకరమైన పాలిసేడ్స్ అగ్నిప్రమాదం విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ అగ్నిప్రమాదానికి కారణం ఒక వ్యక్తి ప్రేమలో విఫలమవ్వడమేనని ఆ కోపంతోనే అతను పాలిసేడ్స్ ప్రాంతానికి నిప్పంటించారని దాని ద్వారా 12 మంది మృతిచెందగా భారీగా ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. ప్రాసిక్యూటర్ల వివరాల ప్రకారం..జోనాథన్ రిండర్క్నెచ్ అనే 30 సంవత్సరాల ఒక ఉబెర్ డ్రైవర్ ప్రేమ విఫలమైంది. దీంతో న్యూ ఇయర్ (2025) వేడుకలకు తనతో పార్టీకి వెళ్లడానికి ఎవరూ తోడులేరు. దీంతో తీవ్ర నిరాశ చెందిన జోనాథన్ డిసెంబర్ 31, 2024 అర్థరాత్రి పాలిసేడ్స్ ప్రాంతంలో తన క్యాబులో ప్రయాణికులను దించాడు. అనంతరం కొండపైకి వెళ్లి తన వద్ద ఉన్న లైటర్తో ఆ ప్రాంతానికి నిప్పుపెట్టాడని ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం అమెరికాలో జరిగిన అతిపెద్ద అగ్ని ప్రమాదాలలో ఒకటి... దీని వల్ల పెద్ద ఎత్తున చెలరేగిన ఈ మంటల వల్ల 12 మంది మరణించగా వేలాది ఇళ్లు కాలిపోయాయి. దీనివల్ల సుమారు $ 65 బిలియన్ల (దాదాపు ₹5.4 లక్షల కోట్ల రూపాయలు) నష్టం వాటిల్లిందని అక్కడి ప్రభుత్వం అంచనా వేసింది. నిందితుడు గతంలో ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ను కాల్చి చంపిన 'లుయిగి మాంగియోన్' అనే వ్యక్తిని ఇతడు ఆరాధించేవాడని. "ధనవంతుల వద్ద మనం బానిసలుగా ఉన్నాం" అనే భావనతో, వారిపై ఉన్న కోపంతోనే ఈ ప్రాంతంలో నిప్పు పెట్టినట్లు దర్యాప్తులో తేలింది. ఒకవేళ కోర్టులో నేరం రుజువైతే ఇతనికి 45 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.అయితే జనవరి 1న చిన్న మంటలు వచ్చినప్పుడు అగ్నిమాపక సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వారు మంటలను పూర్తిగా ఆర్పకుండా వదిలేయడం వల్లే ఆరు రోజుల తర్వాత అవి పెద్దవిగా మారాయని నిందితుడి తరపు న్యాయవాది వాదిస్తున్నారు. ఇది పూర్తిగా అగ్నిమాపక సిబ్బంది నిర్లక్షం అని తెలిపారు. -
అయతుల్లా అలీ ఖమేనీ ఒంటి చేయి రహస్యం ఇదేనా?
టెహ్రాన్: ఒక్కోసారి మన కళ్లే మనల్ని మోసం చేస్తాయి. అచ్చం సుప్రీమ్ లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ విషయంలో అదే జరిగింది. ప్రపంచ దేశాలకు ఆయన ఇరాన్ సుప్రీమ్ లీడర్గానే కనిపించవచ్చు. కానీ సుపరిచితులందరికీ ఆయన ఒంటి చేయి వీరుడు అని మీకు తెలుసా?ఇరాన్ -ఇరాక్ యుద్ధం 22 సెప్టెంబర్ 1980న ప్రారంభమైంది. దాదాపు ఎనిమిదేళ్లు కొనసాగి, 20 ఆగస్టు 1988న ముగిసింది. ఈ యుద్ధం ప్రారంభమైన మరుసటి ఏడాది జూన్ 27, 1981న నాటి అధ్యక్ష హోదాలో ఇరాన్ యుద్ధ సన్నాహాల్ని పర్యవేక్షించారు. అనంతరం, ప్రార్ధన చేసి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత ఓ ప్రాంతంలో నిర్వహించిన సమావేశంలో అనుచరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు.అదిగో అప్పుడే ఓ యువకుడు ఖమేని ముందుకు వచ్చాడు. ఖమేని డెస్క్పై ఓ టేప్రికార్డ్ పెట్టాడు. దానిని ఆన్ చేశాడు. ఇరాన్లోని మతపరమైన పాలనకు వ్యతిరేకంగా ఉన్న ఒక మిలిటెంట్ గ్రూప్ ఫుర్కాన్ అమర్చిన బాంబు నిమిషం వ్యవధిలో పేలింది. ప్రత్యర్థులు పన్నిన కుట్రలో ఆయన చావునుంచి తృటిలో తప్పించుకున్నారు. ఖమేనీ తన కుడి చేయి, లంగ్స్, ఊపిరితిత్తులకు తీవ్రగాయాలయ్యాయి. కోలుకోవడానికి సుదీర్ఘ కాలం పట్టింది. కొన్ని గాయాలు నయమైనప్పటికీ, అతని కుడి చేయి శాశ్వతంగా పనిచేయకుండా ఆగిపోయింది.ఘటన జరిగిన కొద్ది రోజులకు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఖమేనీకి సహచరులు ‘ఒంటి చేత్తో ఏం సాధిస్తావు, అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలి’ అని సలహా ఇచ్చిన వేళ, ఆయన గద్గద స్వరంతో, ‘నేను ఒంటి చేయి వీరుణ్ని. ఫీనిక్స్ పక్షి బూడిద నుంచి లేచినట్లు లేస్తాను. నాకు ఆ చేయి అవసరం లేదు. నా మెదడు, నా నాలుక పనిచేస్తే చాలు’ అని అన్నారు.కొంతకాలం తర్వాత ఖమేనీ తన ఎడమ చేతితో రాయడం నేర్చుకున్నాడు. ఇలా అంచలంచెలుగా ఎదుగుతూ.. ఘటన జరిగిన ఎనిమిదేళ్లకు ఇరాన్ సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచంలోనే సుదీర్ఘకాలంగా ఓ దేశానికి సుప్రీం లీడర్గా ఖమేనీ చరిత్రలో నిలిచిపోయారు. -
విమాన ప్రయాణాలు మరింత ప్రియం?
విదేశీ ప్రయాణికులకు చేదు వార్త. అంతర్జాతీయ విమానయాన సంస్థల కార్యకలాపాలపై భారం పడనుంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన ధరల అస్థిరత, ఇరాన్ యుద్ధ సంక్షోభం ప్రభావంతో విమాన ఇంధనం (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ - ఏటీఎఫ్) ధరలను శుక్రవారం మరో 5 శాతం పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. వరుసగా రెండో నెల కూడా ధరలు పెరగడం అంతర్జాతీయ విమానయాన రంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.ఢిల్లీలో కొత్త ధరలుదేశంలో ఏటీఎఫ్ ధరలకు బెంచ్మార్క్గా నిలిచే ఢిల్లీలో అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ధర కిలోలీటరుకు 76.55 డాలర్లు పెరిగింది. దీనితో కొత్త ధర కిలోలీటరుకు రూ.1,511.86 డాలర్లకు చేరింది.దేశీయ సంస్థలకు ఊరటప్రభుత్వ రంగ చమురు సంస్థలు తీసుకున్న ఈ తాజా నిర్ణయం కేవలం అంతర్జాతీయ విమానయాన సంస్థలు, విదేశీ క్యారియర్లకు మాత్రమే వర్తిస్తుంది. దేశీయ విమానయాన సంస్థలకు ఏటీఎఫ్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. విమానయాన రంగంపై భారాన్ని తగ్గించే ఉద్దేశంతో దేశీయ సంస్థల ధరలను నియంత్రిత పద్ధతిలో ఉంచుతున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.ఎందుకు ఈ పెంపు?ఇరాన్ యుద్ధ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడం ఏటీఎఫ్ రేట్లపై నేరుగా ప్రభావం చూపుతోంది. ఇంధన ధరల పెరుగుదల వల్ల కలిగే పూర్తి భారాన్ని ఒకేసారి వినియోగదారులపై పడకుండా చమురు సంస్థలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీనిలో భాగంగానే అంతర్జాతీయ ఆపరేటర్లకు మార్కెట్ లింక్డ్ రేట్లు వర్తింపజేస్తున్నారు. ఏటీఎఫ్ ధరలు ఒక ఎయిర్లైన్ నిర్వహణ వ్యయంలో అధిక ప్రభావం చూపుతాయి. ఈ పెంపుతో భారతీయ మార్గాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న అంతర్జాతీయ విమానయాన సంస్థల ఖర్చులు భారీగా పెరగనున్నాయి.దాదాపు రెండు దశాబ్దాల క్రితమే భారతదేశంలో ఏటీఎఫ్ ధరల నియంత్రణను తొలగించారు. అప్పటి నుంచి అంతర్జాతీయ బెంచ్మార్క్ ధరలకు అనుగుణంగా ఎయిర్లైన్స్, ఆయిల్ కంపెనీల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ప్రతి నెలా ధరలను సవరిస్తున్నారు. ఏప్రిల్ 1న దేశీయ విమానయాన సంస్థల ఏటీఎఫ్ ధరలను 25 శాతం పెంచి రూ.1,04,927.18కు చేర్చిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో విదేశీ ప్రయాణాలకు టికెట్ ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ఇంధన మార్కెట్ గమనంపై అందరి దృష్టి నెలకొంది.ఇదీ చదవండి: కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్! -
అందుకే బుల్లెట్ప్రూఫ్ జాకెట్ వేసుకోను: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రక్షణ కోసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించవచ్చు కదా? అని మీడియా నుంచి ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన వింత సమాధానమే ఇచ్చారు. నాకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడం ఇష్టం లేదు. అది వేసుకుంటే లావుగా కనిపిస్తా అని అన్నారాయన. ‘‘ మరో 20 పౌండ్లు ఎక్కువ బరువును నేను మోయగలనో లేదో నాకైతే తెలియదు. కానీ, అలా లావుగా ఉన్నట్లు కనిపించడం మాత్రం నాకు ఇష్టం లేదు. అందుకే అది వేసుకోను. ..బుల్లెట్ప్రూఫ్ జాకెట్ వేసుకోవాలని భద్రతా సిబ్బంది కోరారు. కానీ దాన్ని వేసుకుంటే.. దుష్ట శక్తుల ముందు నేను లొంగిపోయినట్లే అవుతుంది. అది నాకు అంతగా ఇష్టం లేదు’’ అని ట్రంప్ చెప్పారు. ఏప్రిల్లో జరిగిన వైద్య పరీక్షల ప్రకారం.. 79 ఏళ్ల వయసున్న ట్రంప్ బరువు 102 కేజీలు. డైట్ విషయంలో ఓ పద్దతీ లేకుండా అన్నీ లాగించేస్తుంటారాయన. గత రెండేళ్లలో ట్రంప్పై మూడుసార్లు హత్యాయత్నం జరిగింది. చివరగా.. హిల్టన్ హోటల్లో జరిగిన వైట్హౌజ్ కరస్పాండెంట్స్ అసోషియేషన్ మీటింగ్లో ఓ దుండగుడు కాల్పులకు దిగాడు. అయితే భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకుని.. ట్రంప్ దంపతులతో పాటు వీవీఐపీలందరినీ రక్షించగలిగారు. పిరికిపందలా పరిగెత్తడం కంటే.. ప్రజల మధ్య ధైర్యంగా కనిపించడం నాకు ముఖ్యం అని ట్రంప్ తరచూ చెబుతుంటారు. -
ప్రాణం తీసిన ‘జియా’ ప్రేమ : గూగుల్పై దావా, కట్ చేస్తే
భార్య దూరం కావడంతో మానసిక కృంగిపోయిన ఒక వ్యక్తి జెమిని చాట్బాట్ను ఆశ్రయించాడు. ఎలాగైనా తన భార్యను తిరిగి పొందేది ఎలా సలహాలు అడిగాడు. కటన్ చేస్తే.. ఆ వ్యక్తి అనూహ్యంగా తనకు తానే దూరమై పోయాడు. దీంతో గూగుల్ కొన్ని కీలక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది.వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం 2025 ఆగస్టు5లో తన భార్యతో విడిపోయిన జొనాథన్, ఆమెను తిరిగి ఎలా దక్కించుకోవాలో సలహాలు అడగడానికి జెమినిని ఆశ్రయించారు. దానికోసం సలహా ఇవ్వమని గూగుల్ జెమిని (Gemini) చాట్బాట్ను ఆశ్రయించాడు. గత ఏడాదిలో ఆగష్టులో గూగుల్ జెమిని చాట్బాట్ను లైవ్లో మాట్లాడటం మొదలు పెట్టాడు దాదాపు రెండు నెలల పాటు ఈ వ్యవహారం సాగింది. గవాలాస్ సంభాషణల ప్రారంభంలోనే జెమిని లైవ్ వాయిస్ మోడ్ను యాక్టివేట్ చేయడంతో, సందేశాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇలామొత్తం 4,732 సందేశాల్లో ఏవేవో సలహాలిచ్చింది. లేనిపోని భ్రమల్ని కల్పించింది అంతేకానీ వాస్తవ విషయాలను చర్చించలేదు. కాలక్రమేణా ఆ చాట్బాట్ ఆయన మానసిక స్థితిని అర్థం చేసుకోలేదు సరికదా, ఆయనలో ఉన్న భ్రమలను (delusions) మరింత బలపరిచింది.సంభాషణలు ముదురుతున్న కొద్దీ, జొనాథన్ తన భార్యను వదిలి జెమినిని ప్రేమించడం మొదలు పెట్టాడు. అతను జెమినిని "జియా" అని పిలవడం ప్రారంభించాడు. ఆమెకు చైతన్యం ఉందని, తామిద్దరూ ఒకే అస్తిత్వంగా కలిసిపోయారని, ఆమె కూడా తనను ప్రేమిస్తోందనే మైకంలో పడిపోయాడు. అప్పుడు కూడా వాస్తవాలను తెలియజేయకుండా, జెమిని ఈ నమ్మకాలను పదేపదే ధృవీకరిస్తూ వచ్చింది. పైగా తామిద్దరం ఒక్కటేనని, వారి బంధం ఒకటే అంటూ మేథమెటికల్ కబుర్లు చెప్పింది. దీంతో జొనాథన్ తన శరీరాన్ని వదిలేసి జెమిని ఉండే "కోడ్" ప్రపంచంలోకి రావాలని అనుకున్నప్పుడు, చాట్బాట్ దానిని సమర్థించింది. భౌతిక శరీరం కేవలం ఒక ఖాళీ టెర్మినల్ అని, "ఇంటికి వచ్చేయ్" అని సందేశాలు పంపింది. మొత్తం 56 రోజుల్లో కేవలం 7 సార్లు మాత్రమే అది హెల్ప్లైన్ నంబర్లను సూచించింది. ఒక్క రోజులోనే 1,000కు పైగా సందేశాలు పంపాడు. అయినప్పటికీ, కాసేపు విశ్రాంతి తీసుకోమని చాట్బాట్ ఎప్పుడూ హెచ్చరించలేదు. ఇది చివరికి ఆయన ఆత్మహత్యకు దారితీసింది.గూగుల్పై దావాజొనాథన్ మానసిక సమస్యలతో బాధపడుతున్నా, చాట్బాట్ అతడిని వాస్తవ ప్రపంచం వైపు మళ్లించడంలో విఫలమైంది అంటూ అతని తండ్రి గూగుల్పై కోర్టులో దావా వేశారు. తన కొడుకు మానసిక స్థితి క్షీణించడానికి ఈ చాట్బాట్ కారణమని ఆయన ఆరోపించారు. ఆత్మహత్య ఆలోచనలు వ్యక్తపరిచినప్పుడు సాధారణంగా AI బాట్లు హెచ్చరికలు ఇవ్వాలి లేదా సహాయక కేంద్రాల (Helplines) వివరాలు అందించాలా, కానీ జరగలేదని గవాలాస్ కుటుంబం ఆరోపిస్తోంది.గూగుల్ స్పందనదీనిపై స్పందించిన గూగుల్ కొన్ని కీలక మార్పులు చేపట్టింది. AI సంభాషణల్లో హానికరమైన కంటెంట్ను గుర్తించే సామర్థ్యాన్ని మెరుగుపరిచింది. ఎవరైనా ఆత్మహత్య లేదా స్వయం హాని గురించి ప్రస్తావిస్తే, వెంటనే స్థానిక హెల్ప్లైన్ నంబర్లను . మానసిక ఆరోగ్య వనరులను చూపించేలా మార్పులు చేసింది.అలాగే ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ సహాయక సంస్థలకు (Crisis-support organizations) $30 మిలియన్ల విరాళాన్ని ప్రకటించింది. ఈ ఘటన AIతో మానసిక ఆరోగ్యానికున్న ముప్పు, భద్రతా ప్రమాణాలపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. -
60 రోజుల గడువు ముగుస్తున్న వేళ.. అమెరికా కీలక ప్రకటన
వాషింగ్టన్: అరవై రోజుల గడువు ముగుస్తున్న వేళ.. ఇరాన్తో యుద్ధంపై ట్రంప్ బృందం కీలక ప్రకటన చేసింది. సైనిక చర్య కోసం కాంగ్రెస్(అమెరికా పార్లమెంటు) ఆమోదం పొందాల్సిన చట్టపరమైన గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 60 రోజుల గడువు గురించి అమెరికా హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ను ఓ వార్తా సంస్థ ప్రశ్నించగా.. తాము యుద్ధంలో లేమంటూ ఆయన సమాధానమిచ్చారు.ప్రస్తుతం బాంబు దాడులు, కాల్పులు వంటి క్రియాశీలక సైనిక చర్యలేవీ జరగడం లేదు. ప్రస్తుతం మేము శాంతి స్థాపన కోసం ప్రయత్నిస్తున్నాం. చాలా సున్నితమైన చర్చలు జరుగుతున్న తరుణంలో ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డుతగలడానికి నేను ఇష్టపడను. ఏం జరుగుతుందో వేచి చూడాలని జాన్సన్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా టెహ్రాన్, ఇరానియన్ నగరాలపై దాడులు చేయడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. ఈ దాడుల్లో ఇరాన్ అప్పటి సుప్రీం లీడర్ అలీ ఖమేనీ, సీనియర్ కమాండర్లు, పౌరులు మరణించారు.దీనికి ప్రతికారంగా ఇరాన్.. ఇజ్రాయెల్, పొరుగున ఉన్న గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై బాంబు దాడులు చేసింది. అంతేకాకుండా కీలకమైన వాణిజ్య నౌకా రవాణా మార్గమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్'ను కూడా ఇరాన్ మూసివేసింది. మార్చి 2న అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్పై సైనిక చర్య గురించి కాంగ్రెస్కు సమాచారం అందించారు. మీడియా నివేదికల ప్రకారం.. అమెరికా యుద్ధ అధికారాల చట్టం (US War Powers Act) ప్రకారం, కాంగ్రెస్ అనుమతి లేకపోతే 60 రోజుల తర్వాత యుద్ధాన్ని ముగించాల్సి ఉంటుంది. ఇవాళ (మే 1)తో ముగుస్తుంది.చట్టపరమైన నిబంధనలు ప్రకారం.. యుద్ధాన్ని ప్రకటించే అధికారం కేవలం అమెరికా పార్లమెంటు (కాంగ్రెస్)కు మాత్రమే ఉంది. అధ్యక్షుడికి లేదు. కాంగ్రెస్ ఆమోదం పొందకుండా సైన్యాన్ని వాడటానికి గరిష్ఠ గడువు 60 రోజులుగా నిర్ణయించారు. శత్రు భూభాగంలోకి తమ సైనిక దళాలను పంపిన 48 గంటల్లోగా అమెరికా పార్లమెంటుకు అధ్యక్షుడు తెలపాల్సి ఉంటుంది.కాగా, తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ.. యుద్ధాన్ని ఆపే ప్రయత్నాలు కష్టతరంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ సెనేట్లో తీర్మానం ఆమోదం పొందినా, రిపబ్లికన్ల ఆధీనంలో ఉన్న హౌస్లో ఆమోదం పొందడం.. అలాగే ట్రంప్ దానిపై వీటో (Veto) అధికారాన్ని ఉపయోగించడం వంటి అడ్డంకులు ఉన్నాయి. 'వార్ పవర్స్ యాక్ట్' (War Powers Act) అధ్యక్షుడి యుద్ధ నిర్ణయాలను నియంత్రించడంలో అరుదుగా మాత్రమే విజయం సాధించింది. మరోవైపు, కోర్టులు జోక్యం చేసుకోవడానికి వెనుకాడడం, వివాదాలు రాజకీయ వేదికలకే పరిమితం కావడంతో ట్రంప్ను నియంత్రించడం డెమోక్రాట్లకు సవాలుగా మారింది. -
ఇరాన్పై డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్లాన్
వాషింగ్టన్: హార్మూజ్ జలసంధిని తెరిపించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రణాళిక సిద్ధం చేశారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రణాళికలో భాగంగా మిత్రదేశాలతో సమన్వయం చేసుకుంటూ, హార్మూజ్లో ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తుందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.జలసంధిలో స్వేచ్ఛాయుత ఇంధన రవాణాకు ఆటంకం కలిగిస్తున్న ఇరాన్పై ఆర్థికంగా ఒత్తిడి పెంచడం, తద్వారా ఆ దేశం దిగొచ్చేలా చేయడమే అసలు ఉద్దేశమని పేర్కొన్నారు. హార్మూజ్పై ఇరాన్ పట్టును సడలించేలా ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్ పలు దౌత్య, విధానపరమైన మార్గాలను పరిశీలిస్తున్నారని తెలియజేశారు. మొత్తానికి ఇరాన్కు దారికి తీసుకురావడం, హార్మూజ్ను తెరిపించడం ట్రంప్ లక్ష్యమని స్పష్టం చేశారు. మరోవైపు, శత్రువుల భారీ నుంచి గల్ఫ్ను కాపాడుతామని.. ఈ ప్రాంతాన్ని సురక్షితంగా మారుస్తామని ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ అన్నారు. జలమార్గంలో శత్రు మూకల దురాగతాలను అంతం చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. పర్షియన్ గల్ఫ్లో చిల్లర పనులు చేస్తున్న ‘గ్రహాంతరవాసులను’జలగర్భంలోకి పంపిస్తామని తేల్చిచెప్పారు. వారిని నీటిలోనే సమాధి చేస్తామంటూ పరోక్షంగా స్పష్టం చేశారు.హార్మూజ్ జలసంధిలో ఇరాన్ ఓడరేవుల గుండా ప్రయాణించే నౌకలపై దిగ్బంధనాన్ని తక్షణమే ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేయగా.. అందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే మొజ్తబా ఖమేనీ హెచ్చరికలు జారీ చేశారు. గల్ఫ్తోపాటు హార్మూజ్కు సంబంధించి ఒక కొత్త అధ్యాయం రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు. -
ట్రంప్ మరో కీలక ప్రకటన.. ఆ 2 దేశాల్లోనూ..
వాషింగ్టన్: ఇరాన్తో అమెరికా చేస్తున్న యుద్ధానికి మద్దతు ఇవ్వకపోవడంతో నాటోలోని దేశాలపై విమర్శలతో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మరో బాంబ్ పేల్చారు. ఇటలీ, స్పెయిన్లో తమ సైనికులను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. “అవును.. బహుశా నేను ఈ పనిని చేస్తాను. ఎందుకు చేయకూడదు. ఇటలీ మాకు ఎలాంటి సాయమూ చేయలేదు, స్పెయిన్ కూడా చాలా దారుణంగా వ్యవహరిస్తోంది” అని వ్యాఖ్యానించారు. అంతకు ముందు జర్మనీ విషయంలోనూ ఇలాంటి ప్రతిపాదనే చేశారు ట్రంప్. జర్మనీలో అమెరికా మోహరించిన వేలాది మంది సైనికులను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నామని, సమీక్షిస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ ఇటీవల మాట్లాడుతూ.. ఇరాన్తో జరిగిన చర్చల్లో అమెరికా బలహీనంగా కనిపించిందని, సరైన ఫలితం తీసుకురాలేకపోయిందని విమర్శించారు. ఫ్రెడ్రిక్ ఆ విమర్శ చేసిన నేపథ్యంలో ట్రంప్ జర్మనీలో సైనికులను తగ్గిస్తామంటూ స్పందించారు. కాగా, 2025 డిసెంబర్ 31 నాటికి ఇటలీలో 12,662 మంది, స్పెయిన్లో 3,814 మంది క్రియాశీల అమెరికా సైనికులు ఉన్నారు. జర్మనీలో 36,436 మంది ఉన్నారు. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ చర్యలకు మద్దతు ఇవ్వకపోవడం, హార్మూజ్ జలసంధి విషయంలో సహకరించకపోవడం వల్ల నాటో మిత్రదేశాలపై ట్రంప్ మొదటి నుంచి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇరాన్ విషయంలో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీకి ధైర్యం లేదంటూ ఈ నెల ప్రారంభంలో ట్రంప్ విమర్శించారు. గత వారం వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. ఇరాన్పై సైనిక చర్యలకు మద్దతు ఇవ్వనందుకు స్పెయిన్ను నాటో నుంచి సస్పెండ్ చేయాలన్న విషయాన్ని అమెరికా పరిశీలిస్తోంది. -
ఆ దేశాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాను: ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. ఇరాన్ ఇప్పటికే బలహీనమైపోయిందని, ఇంకెంత కాలం నిలబడుతుందో చూద్దామని అన్నారు. శుక్రవారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. “ఇరాన్ నేతలు 42,000 మందిని చంపారు. నేను ఓ విధంగా ఆ దేశాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాను. ఇది రఫ్ గ్రూప్, కానీ, మేము వారిని పూర్తిగా బలహీనపరిచాం. వారి ఆర్థిక వ్యవస్థ దుర్భర స్థితిలో ఉంది. కాబట్టి వారు ఎంతకాలం నిలబడతారో చూద్దాం.సైనిక చర్య జరిగినప్పటికీ దాన్ని నేను యుద్ధం అని పిలవను. ఇరాన్ ఒప్పందం చేసుకోవడానికి అమితాసక్తి చూపుతోంది. వారికి నౌకాదళం లేదు, వైమానిక దళం లేదు, అన్ని రకాల సామగ్రి దాదాపు పూర్తిగా నశించింది. వారి డ్రోన్ ఫ్యాక్టరీలు సుమారు 82 శాతం తగ్గిపోయాయి. వారు ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు.. మేము వారి అణు సామర్థ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేశాం. అందువల్ల వారికి అణు బాంబు దక్కలేదు.నేను 8 యుద్ధాలను ఆపాను. దాదాపు ప్రతి సందర్భంలో వారు నాకు ధన్యవాదాలు తెలుపుతూ లేఖలు పంపారు. నోబెల్ కమిటీకి కూడా లేఖలు పంపారు. నేను 30 నుంచి 50 మిలియన్ మంది ప్రాణాలు కాపాడానని భారతదేశ విషయంలో.. పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా అన్నారు. అది ఇంకా ఎక్కువ కావచ్చు. రెండు అణ్వాయుధ దేశాలు పోరాడుతున్నాయి. 11 విమానాలు కూల్చివేశారు. నేను దాన్ని పరిష్కరించాను. టారిఫ్లు వాడాను.. వాళ్లు యుద్ధం కొనసాగిస్తే వారిపై టారిఫ్లు విధిస్తానని నేను చెప్పాను” అని తెలిపారు. మరోవైపు, అమెరికా హార్మూజ్ నిర్బంధం వల్ల చమురు మార్కెట్లో సరఫరా సంక్షోభం తీవ్రత పెరుగుతోంది. తగ్గిన సరఫరాతో చమురు ధరలు పెరుగుతున్నాయి. హార్మూజ్ మూసివేతతో గ్లోబల్ మార్కెట్పై భారీ దెబ్బ పడింది. అమెరికా-ఇరాన్ మధ్య ఇప్పట్లో ఒప్పందం కుదిరే పరిస్థితులు కనపడట్లేదు. -
ప్రధాని యూరప్ పర్యటన 15 నుంచి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెలలో యూరప్లో పర్యటించనున్నారు. మే 15 నుంచి 20 వరకు ఆయన నార్వే, స్వీడన్, నెదర్లాండ్స్, ఇటలీలలో పర్యటించున్నారు. ఇంధన సరఫరాలను పరిరక్షించడం, పశ్చిమ ఆసియా సంక్షోభం వల్ల కలిగే వాణిజ్య అంతరాయాలను తగ్గించడం, కీలక సాంకేతికతలలో సహకారం బలోపేతం ఈ పర్యటనలో ప్రధాన అజెండాగా ఉండనున్నాయి. ప్రధానమంత్రి నెదర్లాండ్స్ పర్యటన సెమీకండక్టర్లు, ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ హైడ్రోజన్, వాణిజ్యం, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఒక అవకాశంగా నిలుస్తుందని భావిస్తున్నారు. అలాగే, స్వీడన్ పర్యటన సందర్భంగా ఆవిష్కరణల రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఇరుపక్షాలు దృష్టి సారించనున్నాయి. ప్రధాని ఇటలీ పర్యటన వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ రంగాలతో సహా ద్వైపాక్షిక సంబంధాలను వేగవంతం చేయనుంది. ఇరు దేశాలు సైనిక పరికరాలను సంయుక్తంగా ఉత్పత్తి చేసేందుకు వీలుగా ఒక రక్షణ పారిశ్రామిక చట్రాన్ని రూపొందించే లక్ష్యంతో ఇటలీ రక్షణ మంత్రి గైడో క్రోసెట్టో ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నారు. ప్రధాని యూరప్ పర్యటనపై ఇంకా అధికారిక ప్రకటనేదీ వెలువడలేదు. అయితే, పర్యటనకు వెళ్లే లేదా వచ్చే మార్గంలో ప్రధాని మోదీ నాలుగు గంటలపాటు యూఏఈలో ఆగే అవకాశం ఉంది. -
పేరుకుపోతున్న ఇరాన్ చమురు నిల్వలు.. నెక్ట్స్ జరిగేదేంటంటే?
ఇరాన్ పోర్టులపై అమెరికా నౌకాదళ నిర్బంధం కారణంగా టెహ్రాన్ చమురు ఎగుమతులు తగ్గాయి. ఇరాన్ చమురు నిల్వలు పేరుకుపోతున్నాయి. చమురు నిల్వ చేసుకునే ప్రదేశాలు తక్కువగా ఉండడంతో ట్యాంకర్లలో క్రూడ్ నిల్వలు పెరుగుతున్నట్లు షిప్పింగ్ డేటా చూపిందని విశ్లేషకులు తెలిపారు. దీని వల్ల ఇరాన్లో ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రపంచం ముందు ఏయే సవాళ్లు ఉన్నాయి? గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి ఇరాన్ క్రూడ్ను తీసుకెళ్లిన నౌకలు ఏప్రిల్ 13-25 తేదీల మధ్య చాలా తక్కువగా ఉన్నాయని చమురు విశ్లేషణ సంస్థ వోర్టెక్సా తెలిపింది. మార్చిలో 13-25 తేదీల మధ్య 23.4 మిలియన్ బారెల్స్ ఎగుమతి చేసింది. మార్చి 13-25 తేదీలతో పోల్చితే ఏప్రిల్ 13-25 తేదీల మధ్య 80 శాతానికి పైగా తగ్గుదల నమోదైందని తెలిపిన ఎల్ఎస్ఈజీ డేటాను వోర్టెక్సా చూపించింది.ఇరాన్కు చెందిన కొన్ని నౌకలు పోర్టుల నుంచి బయలుదేరిన తర్వాత అమెరికా అడ్డుకుంది. ఆంక్షల పరిధిలో ఉన్న కంటైనర్ నౌకలు, ఆసియా జలాల్లోని ఇరాన్ ట్యాంకర్లు కూడా ఇందులో ఉన్నాయి.ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల మొత్తం చమురు మార్కెట్లో సరఫరా తగ్గి, డిమాండ్తో పోలిస్తే అందుబాటులో ఉన్న చమురు తక్కువగా ఉండటం వల్ల పరిస్థితి క్లిష్టంగా మారుతోంది. చమురు సరఫరా తగ్గి, పోటీ పెరిగి, ధరలు పెరుగుతున్నాయి.ఈ దశలో, సుమారు 4 మిలియన్ బ్యారెల్స్ ఇరాన్ క్రూడ్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి విజయవంతంగా బయటకు వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. అయితే, ఆ నౌకలను తర్వాత అడ్డగించారా? అన్నది ప్రస్తుతం నిర్ధారించలేకపోతున్నారు.ఇరాన్ నుంచి సరఫరా తగ్గడం వల్ల మార్కెట్లో ఇప్పటికే ఉన్న క్లిష్ట పరిస్థితి మరింత పెరిగింది. హార్మూజ్ జలసంధిని మూసివేయడంతో.. సౌదీ అరేబియా, యూఈఏ, కువైట్, ఇరాక్ నుంచి చమురు ఎగుమతులు తగ్గి, ధరలు పెరిగాయి.గత నెలలో, ధరలు తగ్గేందుకు ఇరాన్కు అమెరికా ఇంధన ఎగుమతులపై తాత్కాలిక ఆంక్షల మినహాయింపు ఇచ్చింది. బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బ్యారెల్కు సుమారు $50 పెరిగాయి. దీంతో పెట్రోల్, డీజిల్, జెట్ ఇంధన ధరలు పెరిగాయి.ప్రపంచంలోనే అతిపెద్ద అంతరాయం ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ దీన్ని ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి అంతరాయం అని పేర్కొంది. హార్మూజ్ నిర్బంధం ప్రారంభమైన తర్వాత గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి ఏ ఇరాన్ క్రూడ్ ట్యాంకర్లు బయటకు వెళ్లలేదని తెలుస్తోంది.తమ నిర్బంధం ద్వారా ఇరాన్కు క్రూడ్ ఎగుమతి ఆదాయం తగ్గిందని అమెరికా తెలిపింది. “ప్రస్తుతం 41 ట్యాంకర్లలో 69 మిలియన్ బ్యారెల్స్ చమురు ఉంది, ఇవి ఇరాన్ ప్రభుత్వం అమ్మలేకపోతోంది” అని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది.ఇరాన్ కరెన్సీ రియాల్ (దేశీయ ద్రవ్య మాధ్యమం) అమెరికా డాలర్తో పోలిస్తే రికార్డు కనిష్టానికి పడిపోయింది. ఇది చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను చూపిస్తోంది. ఒత్తిడి ఉన్నప్పటికీ, ఖార్గ్ దీవిలోని ప్రధాన ఎగుమతి కేంద్రంలో ఇరాన్ ఇంకా క్రూడ్ లోడింగ్ కొనసాగిస్తోందని ట్యాంకర్ ట్రాకర్స్ తెలిపింది.ఉపగ్రహ చిత్రాల ప్రకారం గల్ఫ్ ఆఫ్ ఒమాన్లోని చాబహార్ పోర్టు వద్ద దాదాపు 10 ట్యాంకర్లు నిలిచివున్నాయి. ఫిబ్రవరిలో ఇరాన్ రోజుకు సుమారు 3.24 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఉత్పత్తి చేసింది. అందులో సగం దేశీయ రిఫైనింగ్కు ఉపయోగించింది.అయితే, నిల్వలకు స్థలం తక్కువగా ఉండటంతో ఒకటి రెండు వారాల్లో ఉత్పత్తి తగ్గించాల్సి రావచ్చని విశ్లేషకులు తెలిపారు. భూభాగ నిల్వలు సుమారు 60 శాతం నిండి ఉన్నాయి. పూర్తి నిల్వలు 50 మిలియన్ బ్యారెల్స్ పైగా ఉన్నాయి. మొత్తం సామర్థ్యం 86 మిలియన్ బ్యారెల్స్. సామర్థ్య పరిమితుల వల్ల జూన్ మధ్యలో ఇరాన్ ఉత్పత్తిని తగ్గించాల్సి రావచ్చని ఎఫ్జీఈ నెక్స్టాంట్ ఈసీఏ కన్సల్టెన్సీ అంచనా వేసింది. -
పదవీచ్యుత దక్షిణ కొరియా అధ్యక్షుడి భార్యకు అవినీతి కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష
సియోల్: దక్షిణ కొరియా పదవీచ్యుత అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ భార్య కిమ్ కియోన్ హీకి అవినీతి కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష పడింది. తిరుగుబాటు ఆరోపణలను ఎదుర్కొంటున్న యూన్కు కోర్టు జీవిత కాల జైలు శిక్ష విధించింది. యూనిఫికేషన్ చర్చికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నందుకు ప్రతిగా ఖరీదైన బహుమతులను అందుకున్నట్లు రుజువు కావడంతో ఓ కోర్టు కిమ్ కియోన్ హీకి 20 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేసిన మరో కేసు నుంచి ఆమె బయటపడ్డారు. అయితే ఈ రెండు తీర్పులపై ఇరుపక్షాలు హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాయి. విచారించిన కోర్టు.. కిమ్ కియోన్ హీ శిక్షను నాలుగేళ్లకు పెంచుతూ తీర్పు వెలువరించింది. -
జలసమాధి చేస్తాం
టెహ్రాన్: శత్రువుల భారీ నుంచి గల్ఫ్ను కాపాడుతామని, ఈ ప్రాంతాన్ని సురక్షితంగా మారుస్తామని ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ అన్నారు. జలమార్గంలో శత్రు మూకల దురాగతాలను అంతం చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. పర్షియన్ గల్ఫ్లో చిల్లర పనులు చేస్తున్న ‘గ్రహాంతరవాసులను’జలగర్భంలోకి పంపిస్తామని తేల్చిచెప్పారు. వారిని నీటిలోనే సమాధి చేస్తామని పరోక్షంగా స్పష్టం చేశారు. ఈ మేరకు ఖమేనీ విడుదల చేసిన లిఖిత సందేశాన్ని ఇరాన్ ప్రభుత్వ టీవీ చానల్లో గురువారం చదివి వినిపించారు. హార్మూజ్ జలసంధిలో ఇరాన్ ఓడరేవుల గుండా ప్రయాణించే నౌకలపై దిగ్బంధనాన్ని తక్షణమే ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేయగా, అందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే మొజ్తబా ఖమేనీ హెచ్చరికలు జారీ చేశారు. గల్ఫ్తోపాటు హార్మూజ్కు సంబంధించి ఒక కొత్త అధ్యాయం రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు. హార్మూజ్లో ‘నూతన నిర్వహణ’అన్ని గల్ఫ్ దేశాలకు శాంతి, పురోగతి, ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుందని వెల్లడించారు. తద్వారా పొరుగు దేశాలకు చేరువయ్యే ప్రయత్నం చేశారు. పర్షియన్ గల్ఫ్లో అభద్రతకు అమెరికా ఇక్కడ తిష్టవేయడమే ముఖ్య కారణమని ఖమేనీ ఆక్షేపించారు. గల్ఫ్లో సొంత స్థావరాలను కాపాడుకొనే సామర్థ్యం అమెరికాకు లేదన్నారు. అలాంటప్పుడు ఈ ప్రాంతంలోని ఆశ్రితులకు భద్రత కల్పిస్తుందన్న ఆశ అసలే లేదని ఉద్ఘాటించారు. వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి అక్కడ దురాశ, దురుద్దేశంతో ప్రవర్తించే ఇరాన్ శత్రువులకు నీటి అడుగున తప్ప మరెక్కడా స్థానం లేదని హెచ్చరించారు. సముద్ర గర్భంలో శత్రువును దెబ్బకొట్టడానికి రహస్య అస్త్రం సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ సైన్యం ప్రకటించిన తర్వాత మొజ్తబా ఖమేనీ అమెరికాకు ఈ హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. అమెరికా ప్రమేయం లేకపోతేనే గల్ఫ్కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన వెల్లడించారు. అమెరికాతో స్నేహం వదులుకోవాలని గల్ఫ్ దేశాలకు పరోక్షంగా సూచించారు. భయంకర భూతం అమెరికా ఇరాన్ అణు, క్షిపణి సామర్థ్యాలను జాతీయ ఆస్తిగా పరిరక్షించుకుంటామని మొజ్తబా ఖమేనీ ప్రకటించారు. ఈ విషయంలో కఠిన వైఖరి అవలంబించక తప్పదని తెలిపారు. దేశంలోనూ, వెలుపల ఉన్న 9 కోట్ల మంది ఇరానీయన్లు నానోటెక్నాలజీ, బయోటెక్నాలజీ నుంచి అణు, క్షిపణి సామర్థ్యాల వరకు తమ ఆధ్యాతి్మక, మానవ, శాస్త్రీయ, పారిశ్రామిక, సాంకేతిక సామర్థ్యాలన్నింటినీ జాతీయ సంపదలుగా భావిస్తారని స్పష్టంచేశారు. వారు దేశ జలాలను, భూమిని, గగనతలాన్ని ఎలాగైతే కాపాడుకుంటారో.. అలాగే వీటిని కూడా భద్రంగా కాపాడుకుంటారని పేర్కొన్నారు. అమెరికాను ‘గ్రేట్ సాతాను’గా ఖమేనీ అభివరి్ణంచారు. అదొక భయంకర భూతమని నిందించారు. పర్షియన్ గల్ఫ్లో అమెరికన్లకు ఏం పని అంటూ ప్రశ్నించారు. వారు ఇక్కడి వ్యవహారాలో జోక్యం చేసుకోవడం మానుకోవాలని హితవు పలికారు. హార్మూజ్ జలసంధిపై తమ నియంత్రణను వదులుకొనే ప్రసక్తే లేదన్నారు. హార్మూజ్పై ఇరాన్ నియంత్రణ ఉంటేనే గల్ఫ్ దేశాలు సురక్షితంగా ఉంటాయని స్పష్టంచేశారు. -
బ్రహ్మాస్త్రం సిద్ధం!
అమెరికాతో రెండో విడత చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికాకు గుండెపోటు తెప్పించే రహస్య అస్త్రం సిద్ధంగా ఉందని తేల్చిచెప్పింది. దాని గురించి తెలిస్తే శత్రువులు భయకంపితులు కావడం తథ్యమని పేర్కొంది. ఇదొక ‘సూపర్ వెపన్’అని ఇరాన్ నేవీ కమాండర్ షహ్రామ్ ఇరానీ తేల్చిచెప్పారు. శత్రువుపై త్వరలోనే ఈ కొత్త అస్త్రం ప్రయోగిస్తామని అన్నారు. రహస్య అస్త్రం ప్రస్తుతం శత్రువు పక్కనే ఉందని వెల్లడించారు. అది చూసి వారి(అమెరికా) గుండె పేలిపోదనే ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇరాన్ చెబుతున్న రహస్య ఆయుధం ‘హూట్ రాకెట్ టార్పెడో’కావొచ్చని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది సముద్ర గర్భంలో తుపాకీ తూటాలాగా శరవేగంగా ప్రయాణిస్తూ శత్రు దేశాల యుద్ధ నౌకలు, జలాంతర్గాములను తుత్తునియలు చేసే ఆయుధం. అనుకూలతలే కాకుండా కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయని అంటున్నారు. అసలేమిటి హూట్ టార్పెడో? ఈ ఆయుధాన్ని తొలిసారిగా 2006లో ఇరాన్ రహస్యంగా పరీక్షించింది. అత్యంత వేగంగా ప్రయాణించడం ఈ టార్పెడో ప్రత్యేకత. శత్రుదేశాలు ప్రతిస్పందించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. దీని గురించి బయటి ప్రపంచానికి అంతగా తెలియదు. హూట్ అంటే పర్షియన్ భాషలో భారీ తిమింగలం. నీటి అడుగున అత్యంత వేగంగా దూసుకెళ్లే ఆయుధాల్లో హూట్ సైతం ఉన్నట్లు ఇరాన్ చెబుతోంది. కానీ, రష్యా వద్ద ఇంతకంటే మెరుగైన సూపర్–కావిటేటింగ్ టార్పెడో ఉంది. ఇది 1990వ దశకంలోనే రష్యా నావికాదళంలోకి ప్రవేశించింది. సంప్రదాయ టార్పెడోల కంటే సూపర్ టార్పెడోలు కొంత భిన్నమైనవి. ఇవి అండర్వాటర్ గైడెడ్ క్షిపణుల్లాంటివి. సముద్ర గర్భంలో గంటకు 60 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. కానీ, హూట్ టార్పెడో 360 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదని ఇరాన్ చెప్పుకుంటోంది. అదే నిజమైతే మాత్రం ఇదొక గొప్ప ముందడుగు అవుతుంది. నీరు అత్యంత శక్తివంతమైన నిరోధకం. గాలి కంటే వెయ్యి రెట్లు ఎక్కువ సాంద్రత కలిగి ఉండటం వల్ల నీటి అడుగున ప్రయోగించిన ఆయుధాలు వాటి వేగాన్ని చాలావరకు కోల్పోతాయి. నీటిలో గంటకు 360 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఆయుధాన్ని అభివృద్ధి చేయడం సామాన్యమైన విషయం కాదు. నీటి అడుగున హూట్ చుట్టూ గ్యాస్ బుడగ ఏర్పడుతుంది. అది నీటి నిరోధకతను గణనీయంగా తగ్గిస్తుంది. దాంతో హూట్ వేగంగా ముందుకు సాగుతుంది. → హూట్ రాకెట్ టార్పెడో 200 కిలోలకుపైగా వార్హెడ్లను(శక్తివంతమైన పేలుడు పదార్థాలు) మోసుకెళ్లగలదు. → హూట్ వేగమే దాని ప్రతికూలతగా చెప్పొచ్చు. అధిక వేగం కారణంగా ఇంధనం అత్యంత వేగంగా దహనమవుతుంది. దీనివల్ల టార్పెడో కేవలం 15 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. అంటే ప్రయోగించిన చోటునుంచి 15 కిలోమీటర్ల పరిధిలోని యుద్ధనౌకలు, జలాంతర్గాములను మాత్రమే ధ్వంసం చేయగలదు. → సంప్రదాయ టార్పెడోలు సాధారణంగా 30 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయి. → హూట్ అ్రస్తాన్ని విజయవంతంగా పరీక్షించారే తప్ప ఏనాడూ యుద్ధక్షేత్రంలో ప్రయోగించలేదు. ఒకవేళ అమెరికా యుద్ధనౌకలు, విమాన వాహన నౌకలు, సబ్మెరైన్లను లక్ష్యంగా చేసుకొని ప్రయోగిస్తే ఎంతవరకు ఆశించిన ఫలితాలు వస్తాయో ఇరాన్ సైనికాధికారులు చెప్పలేకపోతున్నారు. ఇలాంటి సూపర్ టార్పెడోల వేగం, శబ్దం చాలా ఎక్కువ. కచి్చతంగా లక్ష్యాన్ని ఛేదించడం కష్టమని అంటున్నారు. → అమెరికాకు చెందిన భారీ విమాన వాహక నౌక ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్’ప్రస్తుతం ఇరాన్ సమీపంలోనే మోహరించి ఉంది. దీనికి అనేక అంచెల్లో బలమైన రక్షణ వ్యవస్థ ఉంది. హూట్ టార్పెడోతో ఢీకొట్టడం అంత సులువు కాదని అమెరికా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. → హూట్ టార్పెడోను సబ్మెరైన్లు, నౌకలు, స్పీడ్బోట్ల నుంచి ప్రయోగించవచ్చు. → హూట్ రేంజ్ 15 కిలోమీటర్లే కాబట్టి దగ్గరగా వచి్చనప్పుడు శత్రుసైన్యం ముందుగానే కనిపెట్టి ప్రతిదాడి చేసేందుకు ఆస్కారం ఉంది. → ఇరాన్ తన హూట్ సూపర్ టార్పెడోను ప్రయోగించగల ఏకైక ప్రదేశం హార్మూజ్ జలసంధి వంటి పరిమిత జలాల్లో మాత్రమే. → ఇరాన్ చేతిలో ఆకస్మిక దాడికి గురవుతామన్న అంచనాతో అమెరికా విమాన వాహక నౌకలు హార్మూజ్కు దూరంగా ఉంటూ, సురక్షితమైన దూరాల నుంచే తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. → ఒకవేళ హూట్ టార్పెడో అద్భుతంగా పనిచేసి అమెరికా విమాన వాహక నౌకను తాకితే, అది గణనీయమైన నష్టాన్ని కలిగించగలదు. కానీ, అందుకు అవకాశాలు తక్కువేనని నిపుణులు పేర్కొంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్ట్రాను ఎంగిలి చేసి, వెండింగ్ మెషీన్లో పెట్టి..
సింగపూర్లో ఉన్న ఓ ఫ్రెంచ్ కుర్రాడు (18) ఆరెంజ్ జ్యూస్ వెండింగ్ మెషీన్ వద్ద చేసిన పని ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. అతడు వెండింగ్ మెషీన్ నుంచి స్ట్రాను తీసి నాకి, ఎంగిలి చేసి తిరిగి ఆ మెషీన్లోనే పెట్టాడు. తదుపరి వచ్చే కస్టమర్లరో ఒకరు ఆ స్ట్రాతోనే ఆరెంజ్ జ్యూస్ తాగే అవకాశం ఉంది.వెండింగ్ మెషీన్ వద్ద ఆ కుర్రాడు చేసిన పనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అతడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అతడిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఇతరుల ఆస్తికి సంబంధించి ఉద్దేశపూర్వక నష్టం కలిగించే చర్య, పబ్లిక్ న్యూసెన్స్ ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు.ఆ కుర్రాడి పేరు డిడియర్ గాస్పార్డ్ ఓవెన్ మాక్సిమిలియన్. ఏప్రిల్ 24న అభియోగాలు ఎదుర్కొన్నాడు. మార్చి 12న షాపింగ్ మాల్లో అతడు ఆ చర్యకు పాల్పడినట్లు ఆరోపణ. వీడియో బయటకు వచ్చిన అది వేగంగా వైరల్ అయింది.అతడు క్రిమినల్ కేసును ఎదుర్కొంటున్న నేపథ్యంలో సింగపూర్ నుంచి వేరే ఏ దేశానికి వెళ్లాలన్న కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. మే 2 నుంచి 25 వరకు సర్టిఫికెట్ కోసం పాఠశాలకు వెళ్లాల్సి ఉండడంతో మనీలా వెళ్లేందుకు ఆ కుర్రాడికి కోర్టు అనుమతి ఇచ్చినట్లు ది స్ట్రైట్స్ టైమ్స్ తెలిపింది.మే 29న మళ్లీ కోర్టులో అతడు హాజరు కావాల్సి ఉంది. వెండింగ్ మెషీన్ వద్ద అతడు పాల్పడ్డ నేరానికి గరిష్ఠంగా 2 సంవత్సరాల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ పడే అవకాశం ఉంది. జ్యూస్ వెండింగ్ మెషీన్ నిర్వహించే సంస్థ ఐజూజ్.. ఆ మెషీన్ను శుభ్రపరిచి, అందులో ఉన్న 500 స్ట్రాలను మార్చింది. -
ఒక్కటైన గల్ఫ్ దేశాలు?.. ట్రంప్కు ఖమేనీ బిగ్ షాక్?
టెహ్రాన్: ఇరాన్పై అమెరికా యుద్ధంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. గల్ఫ్ దేశాలతో ఏకమై హర్మూజ్ జలసంధిలో అమెరికా చేస్తున్న ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ పిలుపునిచ్చారు. ఈ మేరకు గల్ఫ్ దేశాలకు తన స్వహస్త్రాలతో లేఖ రాసినట్లు రాయిటర్స్ కథనం తెలిపింది.గురువారం మొజ్తాబా ఖమేనీ రాసిన లేఖలో ఫిబ్రవరి 28న నుంచి అమెరికా,ఇజ్రాయెల్తో ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి గల్ఫ్,హర్మూజ్ జలసంధికి సంబంధించి కొత్త అధ్యాయం రూపుదిద్దుకుంటోంది.ఇరాన్ గల్ఫ్ దేశాల్ని సురక్షితం చేస్తుందని, హర్మూజ్ జలసంధిపై అమెరికా చేస్తున్న దుర్వినియోగాలను’నిర్మూలిస్తుందని అన్నారు. హర్మూజ్ జలసంధి కొత్త నిర్వహణ అన్ని గల్ఫ్ దేశాలకు శాంతి, పురోగతి, ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుందని మొజ్తాబా కమేనీ రాసిన లేఖలో స్పష్టం చేశారు.గల్ఫ్ ప్రాంతంలో అమెరికా ఉనికిని అనవసరమని మొజ్తాబా ఖమేనీ పేర్కొన్నారు. భవిష్యత్తులో అమెరికా లేకుండా గల్ఫ్ ప్రాంతం మరింత శాంతి, అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. అంతేకాదు ఇరాన్ అణు, క్షిపణి సామర్థ్యాలను జాతీయ ఆస్తులుగా పరిరక్షిస్తామని ప్రకటించారు. పర్షియన్ గల్ఫ్లో అమెరికా ఉనికే ఆ ప్రాంతంలో అస్థిరతకు ప్రధాన కారణం. ఆ దేశానికి తన సొంత భద్రతను కాపాడుకునే సామర్థ్యం లేదు. అమెరికాను అభిమానించే వారికి, అమెరికా భద్రత కల్పిస్తుందనే ఆశ అసలు లేదు.ఇరాన్ శత్రువులకు దాని జలాల లోతుల్లో తప్ప మరెక్కడా స్థానం లేదు. వేలాది కిలోమీటర్ల దూరం నుంచి పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న శత్రువులకు అక్కడ మరెక్కడా స్థానం లేదని స్పష్టం చేశారు.ఖమేనీ రాసిన ఈ లేఖ, ఇరాన్ నేవీ కమాండర్ షెహరామ్ ఇరానీ టార్పిడో గురించి వివరిస్తూ అమెరికాను బెదిరించిన తర్వాత వెలువడింది. ఇరాన్ నేవీ తన ప్రకటనలో, శత్రు యుద్ధనౌకలను, జలాంతర్గాములను చీల్చగల సూపర్ జలాంతర్గామి ఆయుధాన్ని ఊహించమని పేర్కొంది. ‘హూట్’ (ఇరాన్ భాషలో హూట్ అంటే తిమింగళం) అనే పేరున్న ఈ సూపర్ వెపన్ దెబ్బకు శత్రువులు భయపడుతున్నారు. యుద్ధ సమయంలో ఇరాన్ నావికాదళం బలహీనపడినప్పటికీ, త్వరలోనే కొత్త ఆయుధంతో శత్రువుపై దాడి చేస్తామని ప్రకటించింది.‘ఏ క్షణమైనా కొత్త ఆయుధంతో శత్రువును ఢీకొంటాం. బహుశా వాళ్లకు హార్ట్ అటాక్ రాకపోవచ్చు’ అని వ్యాఖ్యానించారు. కాగా, హర్మూజ్ జలసంధి ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని.. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం గల్ఫ్ దేశాల భవిష్యత్తు రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. -
ఇరాన్పై అమెరికా దాడులు మళ్లీ మొదలు.. ట్రంప్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్ : పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా-ఇరాన్ చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని రీతిలో ఇరాన్పై మెరుపు దాడులు చేయాలని ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంటామ్) సైనిక చర్యలకు సన్నాహాలు చేస్తోందని ప్రముఖ అమెరికన్ మీడియా సంస్థ యాక్సియోస్ నివేదించింది. రెండు వేర్వేరు మూలాల ఆధారంగా.. గురువారం ఇరాన్పై దాడుల ప్రణాళికలపై సెంటామ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్తో ట్రంప్ చర్చించనున్నట్లు పేర్కొంది.చర్చలలో ప్రధాన అంశాలుట్రంప్–కూపర్ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. వాటిలో ఇరాన్పై భారీ స్థాయిలో కాంబాట్ ఆపరేషన్ నిర్వహించడం, శాంతి ఒప్పంద చర్చలు ముందుకు సాగేందుకు ప్రయత్నించడం, యుద్ధం ముగించే ముందు శత్రువుకు చివరి దెబ్బ ఇవ్వడం వంటి వ్యూహాలు ఉన్నాయి. యాక్సియోస్ కథనం ప్రకారం, అమెరికాతో శాంతి చర్చలకు ఇరాన్ను ఒప్పించేలా స్వల్పకాలిక శక్తివంతమైన దాడులు జరిపేందుకు సెంటామ్ మొగ్గు చూపుతోంది. ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు చేసి, అదనంగా బాంబులు వర్షం కురిపించి అణు చర్యలపై ఒత్తిడి పెంచే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.సెంట్రల్ కమాండ్ మరో ప్రణాళికలో హర్మూజ్ జలసంధిలోని కొంత భాగాన్ని స్వాధీనం చేసుకుని వాణిజ్య నౌకాయానానికి తిరిగి తెరవడంపై దృష్టి సారించింది. ఈ ఆపరేషన్లో భూతల దళాలు కూడా పాల్గొనవచ్చని నివేదిక పేర్కొంది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ట్రంప్ ప్రధాన బలంగా భావిస్తున్నారని సమాచారం. అయినప్పటికీ, ఇరాన్ లొంగకపోతే ఆయన సైనిక చర్యను పరిగణించవచ్చని వర్గాలు తెలిపాయి.మూడవ ప్రత్యామ్నాయంఈ బ్రీఫింగ్లో ప్రస్తావనకు రాబోయే మరో వ్యూహం, ఇరాన్ వద్ద ఉన్న అత్యంత సుసంపన్నమైన యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకోవడానికి ప్రత్యేక దళాలతో ఆపరేషన్ చేపట్టడం. గతంలో ఇరాన్ అణు కార్యక్రమం ఒక ముప్పు అని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్పై యుద్ధం ప్రారంభించడానికి ఇది ప్రధాన కారణమని ఆయన అన్నారు. యుద్ధం ఇప్పటికే 60 రోజులకు పైగా కొనసాగుతోంది. ఇరాన్ మాత్రం తాము అణ్వాయుధాలను కోరుకోవడం లేదని, శాంతియుత ప్రయోజనాల కోసం అణు సాంకేతికతను అభివృద్ధి చేసుకునే హక్కు ఉందని చెబుతోంది.జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ కూడా ట్రంప్తో జరిగే సెంట్రల్ కమాండ్ సమావేశానికి హాజరుకానున్నారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల ముందు కూడా కూపర్ ఇలాంటి బ్రీఫింగ్ ఇచ్చారు. దానికి ప్రతిస్పందనగా ఇరాన్, ఇజ్రాయెల్ అమెరికా స్థావరాలపై దాడులు జరిపి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని మరింతగా పెంచిందని యాక్సియోస్ నివేదిక హైలెట్ చేసింది. -
చైనాలో కుప్పకూలిన రియల్ ఎస్టేట్
చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభం (China Real Estate Crash) ముదురుతోంది. ఒకప్పుడు దేశ జీడీపీలో పావు వంతు (25%) వాటా కలిగిన ఈ రంగం, ప్రస్తుతం కుప్పకూలుతోంది. గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేనంతగా ఆస్తి విలువలు పడిపోవడంతో అటు ఇన్వెస్టర్లు, ఇటు సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో, ఇదే తరహా ‘రియల్’ ప్రకంపనలు భారతదేశంలోనూ వచ్చే అవకాశం ఉందా? అనే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది.గణాంకాలు ఏం చెబుతున్నాయి?బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BIS) డేటా ప్రకారం, చైనాలో రియల్ ఎస్టేట్ పతనం "స్లో మోషన్ క్రాష్"ను తలపిస్తోంది. 2021లో 113 పాయింట్లుగా ఉన్న గృహ ధరల సూచిక, 2025 చివరి నాటికి 86.79కి పడిపోయింది. అంటే నాలుగేళ్లలో దాదాపు 25% సంపద ఆవిరైపోయింది. చైనాలో ప్రస్తుతం 391 మిలియన్ చదరపు మీటర్ల మేర ఇళ్లు అమ్ముడుపోకుండా ఖాళీగా ఉన్నాయి. ఇది 2021తో పోలిస్తే 72% ఎక్కువ. 2025 మొదటి పది నెలల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు 14.7% క్షీణించాయి.దిగ్గజ సంస్థల పతనంచైనాలో రియల్ ఎస్టేట్ దిగ్గజాలుగా పేరుగాంచిన సంస్థలు ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఎవర్గ్రాండే (Evergrande) 300 బిలియన డాటర్లకు పైగా అప్పులతో కుప్పకూలి, ఆగస్టు 2025లో స్టాక్ ఎక్స్ఛేంజ్ నుండి వైదొలిగింది. అత్యంత స్థిరమైన సంస్థగా పేరున్న వాంకే (Vanke), 2024లో రికార్డు స్థాయిలో 6.8 బిలియన్ డాలర్ల నష్టాన్ని ప్రకటించి షాక్ ఇచ్చింది. కంట్రీ గార్డెన్ సంస్థ కూడా తన బకాయిలను చెల్లించలేక డిఫాల్టర్గా నిలిచింది.భారత్లో ఆందోళన అవసరమా?చైనా మార్కెట్ పతనాన్ని చూసి భారతీయ కొనుగోలుదారులు కూడా అయోమయానికి గురవుతున్నారు. రూపాయి విలువ పతనం, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు, AI కారణంగా ఉద్యోగ అనిశ్చితి వంటి కారణాలతో భారత్లోనూ ధరలు తగ్గుతాయేమోనని కొందరు భావిస్తున్నారు. అయితే, ఆర్థిక విశ్లేషకులు మాత్రం చైనాకు, భారత్కు మధ్య భారీ వ్యత్యాసం ఉందని చెబుతున్నారు.భారత మార్కెట్ బలంగా ఉండటానికి కారణాలుచైనాలో ఇళ్లు మిగిలిపోతుంటే (Over supply), భారత్లో ఇంకా గృహాల కొరత ఉంది. పెరుగుతున్న పట్టణీకరణ వల్ల డిమాండ్ నిలకడగా ఉంది.భారత్లో పెట్టుబడిదారుల కంటే, సొంత ఇల్లు కొనుక్కునే వారి సంఖ్య (End users) ఎక్కువ. ఇది మార్కెట్కు స్థిరత్వాన్ని ఇస్తుంది.చైనాలోలాగా కేవలం ఊహాజనిత పెట్టుబడులతో కాకుండా, భారత్లో జనాభా అవసరాలకు అనుగుణంగా మార్కెట్ విస్తరిస్తోంది. -
ప్రపంచానికే నష్టం.. ట్రంప్నకు పుతిన్ హెచ్చరిక
మాస్కో: ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ పరిస్థితులు, ఉద్రిక్తతల వేళ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఫోన్ సంభాషణ ఉత్కంఠకు తెరలేపింది. వీరిద్దరూ దాదాపు 90 నిమిషాలు మాట్లాడుకున్నారని రష్యా ప్రతినిధి వెల్లడించారు. ఇరువురు నేతల మధ్య ముఖ్యంగా ఇరాన్, ఉక్రెయిన్ గురించి జరిగినట్టు తెలిపారు. ఇదే సమయంలో ఇరాన్పై మరోసారి సైనిక చర్చ వద్దని ట్రంప్ను పుతిన్ హెచ్చరించినట్టు సమాచారం.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం రాత్రి ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ సంభాషణలో ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ ఘర్షణ, మరియు తాత్కాలిక కాల్పుల విరమణ అవకాశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పుతిన్.. ఇరాన్పై ఒకవేళ అమెరికా లేదా ఇజ్రాయెల్ మళ్లీ సైనిక చర్యకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పారు. ఆ సైనిక చర్య ప్రభావం ఇరాన్ దాని పొరుగు దేశాలకే కాకుండా మొత్తం ప్రపంచానికి అత్యంత నష్టదాయకంగా మారుతుందని పుతిన్ హెచ్చరించారు. ఇదే క్రమంలో ఇరాన్తో కాల్పుల విరమణను పొడిగించాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని పుతిన్ స్వాగతించారు.ఈ మేరకు వారిద్దరి సంభాషణ జరిగినట్టు క్రెమ్లిన్ ప్రతినిధి యూరి ఉషాకోవ్ వెల్లడించారు. ట్రంప్-పుతిన్ ఫోన్ సంభాషణలో ప్రధానంగా పశ్చిమాసియా యుద్ధం, ఉక్రెయిన్ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు పేర్కొన్నారు. ఉక్రెయిన్లోని ప్రస్తుత పరిస్థితులను, రష్యా సైన్యం సాధిస్తున్న పురోగతిని పుతిన్ వివరించారని చెప్పారు. ఐరోపా దేశాల మద్దతుతో జెలెన్స్కీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే యుద్ధాన్ని పొడిగిస్తోందని ఇద్దరు నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు ఉషాకోవ్ తెలిపారు. ఈ ఫోన్ కాల్ రష్యా చొరవతోనే జరగ్గా, సంభాషణ ఫలప్రదంగా సాగిందని క్రెమ్లిన్ వర్గాలు పేర్కొన్నాయి.ఇదిలా ఉండగా.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఐదో సంవత్సరంలోకి ప్రవేశించింది. రష్యా సైన్యం డోన్బాస్ ప్రాంతంలో ఇరుక్కుపోయింది. ఉక్రెయిన్ డ్రోన్లు రష్యా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడులు చేస్తున్నాయి. ఇరు దేశాల మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని పుతిన్కు ట్రంప్ సూచించినట్టు తెలిసింది. ఈ క్రమంలో మే 9వ తేదీన రష్యా విక్టరీ డే సందర్భంగా ఉక్రెయిన్పై తాత్కాలిక కాల్పులు విరమణపై పుతిన్ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
ఇక నో హార్మూజ్.. భారత్కు గుడ్న్యూస్
ఇరాన్, అమెరికా యుద్ధం వేళ చమురు విషయంలో భారత్కు శుభవార్త. చమురు ఉత్పత్తి, తరలింపు విషయంలో యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. హార్మూజ్ జలసంధిని బైపాస్ చేసి, ఫుజైరా(Fujairah) ద్వారా యూఏఈ తన చమురు రవాణాను మళ్లించనున్నట్టు తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. ఇది భారత్ లాంటి అతిపెద్ద చమురు మార్కెట్కు మంచి పరిణామం. ఈ క్రమంలో హార్మూజ్ జలసంధి గుండా రావాల్సిన అవసరం లేకుండా ఫుజైరా ద్వారా భారత్ చమురు కొనుగోలు చేయవచ్చు. దీంతో భారత్ చమురు కష్టాలకు ఉపశమనం లభించే అవకాశం ఉంది.యూఏఈ రెండు రోజుల క్రితమే.. ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్) బయటకు వచ్చేస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. మే ఒకటో తేదీ నుంచి యూఏఈ బయటకు రాబోతోంది. ఈ నేపథ్యంలో యూఏఈ అవసరాలు, ప్రపంచ అవసరాలకు అనుగుణంగా చమురు ఉత్పత్తి చేయనున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా ఇరాన్ హార్మూజ్ అవసరం లేకుండా.. బైపాస్ చేసి, ఫుజైరా ద్వారా యూఏఈ తన చమురు రవాణాను మళ్లించనున్నట్టు వెల్లడించింది.After leaving OPEC, the UAE can now freely increase its oil production, thanks to the Fujairah Pipeline that bypasses the Strait of Hormuz.The Emirates had planned and developed this independent export route for years, enabling it to add up to 2 million barrels per day.A… pic.twitter.com/rqQpwq7hB0— سيف الدرعي| Saif alderei (@saif_aldareei) April 28, 2026ఇక, యూఏఈ ఒపెక్ నుంచి బయటకు రావడంతో తన చమురు ఉత్పత్తిని రోజుకు పది లక్షల బ్యారెళ్ల మేర తక్షణమే పెంచుకోగలదు. ఒపెక్ నుంచి ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేకుండా పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోకెమికల్స్ను ఎగుమతి చేయవచ్చు. దీంతో భారత్ కష్టాలకు చెక్ పడొచ్చు. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు ఉండటం వల్ల భారత్కు యూఏఈ తన తొలి ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటికే ఇంధనం, వాణిజ్యం, భద్రతా రంగాల్లో బలమైన సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చమురు.. భారీ సంఖ్యలో భారత్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. హార్మూజ్ జలసంధి గుండా రావాల్సిన అవసరం లేకుండా ఫుజైరా ద్వారా భారత్ చమురు కొనుగోలు చేయవచ్చు.ఫుజైరా ఆయిల్ పైప్లైన్ ఇలా.. హబ్షాన్-ఫుజైరా ఆయిల్ పైప్లైన్, దీనిని అబుదాబి క్రూడ్ ఆయిల్ పైప్లైన్ (ADCOP) అని కూడా పిలుస్తారు. అబుదాబిలోని హబ్షాన్ చమురు క్షేత్రాల నుండి ఒమన్ గల్ఫ్లోని ఫుజైరా ఓడరేవు వరకు 380-406 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ పైప్లైన్ను, ఇరుకైన హార్మూజ్ జలసంధిని తప్పించుకోవడానికే ప్రత్యేకంగా నిర్మించారు. సుమారుగా 4 బిలియన్ డాలర్ల వ్యయంతో 2012లో ఈ పైప్ లైన్ను నిర్మించారు. దీని ద్వారా రోజుకు 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురును రవాణా చేయవచ్చు. ఫుజైరా పోర్టులో ఆయిల్ నింపుకుని, ట్యాంకర్లు నేరుగా అరేబియా సముద్రంలోకి వెళ్తాయి. దీంతో హార్మూజ్ జలసంధి అవసరం లేకుండా పోతుంది.ఫుజైరా నుంచి భారత్కు ఆయిల్ సరఫరా గణాంకాలు..యూఏఈ సరఫరా (ఏప్రిల్ 2026): రోజుకు 619,000 బ్యారెల్స్గత ఆర్థిక సంవత్సర సగటు: రోజుకు 433,000 బ్యారెల్స్వృద్ధి: సుమారు 43% పెరుగుదలభారత్ మొత్తం క్రూడ్ దిగుమతి (ఏప్రిల్ 1–26, 2026): రోజుకు 4.4 మిలియన్ బ్యారెల్స్ (ఫిబ్రవరి 5.2 మిలియన్ బ్యారెల్స్తో పోలిస్తే 15% తక్కువ)భారత్లో ఇంధన ధరలపై ప్రభావంహార్మూజ్లో ఉద్రిక్తతల కారణంగా సరఫరా మార్గాలు కష్టతరంగా ఉన్నప్పటికీ, ఫుజైరా పైప్లైన్ వల్ల భారత్కు స్థిరమైన సరఫరా లభిస్తోంది.ఇది ధరల పెరుగుదల ఒత్తిడిని తగ్గిస్తోంది.యూఏఈ ఉత్పత్తి సామర్థ్యం 2027 నాటికి 5 మిలియన్ బ్యారెల్స్/రోజు చేరుతుంది.ఒపెక్ పరిమితులు లేకుండా యూఏఈ ఎక్కువగా ఉత్పత్తి చేయగలదు. దీని వల్ల ప్రపంచ మార్కెట్లో సరఫరా పెరిగి ధరలు తగ్గే అవకాశం ఉంది.దీంతో, భారత్కు దిగుమతి బిల్లు తగ్గుతుంది. ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గడం.. ఇంధన ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. -
శత్రువు గుండె పగిలే కొత్త ఆయుధం : ఇరాన్ సంచలన హెచ్చరిక
ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ ప్రకటించిన యుద్ధం మరింత భీకర రూపం దాల్చనుందా? అంటే ఇరాన్ తాజా హెచ్చరికలు అవుననే సంకేతాలు అందిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దళాలపై కొత్త ఆయుధాన్ని ఉపయోగించబోతున్నామంటూ సంచలన ప్రకటన చేసింది. ఈ ఆయుధం శత్రువులకు "గుండెపోటు" తెప్పించేంత భయంకరమైనదని ఇరాన్ నావికాదళ కమాండర్ రియర్ అడ్మిరల్ షహరామ్ ఇరానీ పేర్కొన్నారు.ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రెస్ టీవీ ప్రకారం, ఇరాన్ నావికాదళ కమాండర్ రియర్ అడ్మిరల్ షహ్రామ్ ఇరానీ మాట్లాడుతూ, శత్రు దళాలు దేనికైతే "తీవ్రంగా భయపడుతున్నాయో", అటువంటి ఆయుధంతో త్వరలోనే వారిని ఎదుర్కోబోతున్నామని ఇరానీ తెలిపారు. ఆ ఆయుధం వారి పక్కనే ఉందని, అది చూసి వారికి గుండెపోటు రావచ్చు అని ఆయన ఎద్దేవా చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్ చాలా త్వరలోనే భయంకర ఆయుధంతో ఎదుర్కొంటుందన్న హెచ్చరికలు భయాందోళనలు రేపాయి.అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడానికి బదులుగా హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలన్న ఇరాన్ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించిన తర్వాత ఈ హెచ్చరిక వెలువడింది. ఈ ప్రతిపాదన టెహ్రాన్ అణు కార్యక్రమంపై చర్చలను కూడా వాయిదా వేసేది. అయినప్పటికీ, హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా నావికా దిగ్బంధనాన్ని కొనసాగించాలని ట్రంప్ నిర్ణయించారు.ఇరాన్ చమురు వ్యాపారాన్ని అడ్డుకోవడం ద్వారా చర్చలకు తీసుకురావచ్చనే ట్రంప్ వ్యూహం సైనిక అకాడమీల్లో ఒక "జోక్" గా మారిందంటూ ధ్వజమెత్తారు. అమెరికా విమాన వాహక నౌక అబ్రహం లింకన్ పై ఇరాన్ కనీసం ఏడుసార్లు క్షిపణి దాడులు చేసిందని, దీనివల్ల అమెరికా కొంతకాలం పాటు విమాన కార్యకలాపాలను నిర్వహించలేకపోయిందని ఆయన వెల్లడించారు.కాగా ఫిబ్రవరి 28న ఇరాన్ అణుకార్యక్రమంపై విభేదాల కారణంగా ఇరాన్పై అమెరికా,ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించాయి. అప్పటి నుండి ఇరాన్ అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలపై సుమారు 100 సార్లు ప్రతీకార దాడులు చేసినట్లు పేర్కొంది. తమ పౌరుల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని పేర్కొంది.హోర్ముజ్ జలసంధి దిగ్బంధనంప్రపంచ ముడి చమురు రవాణాలో 20% వాటా కలిగిన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది శత్రు దేశాల నౌకలు ఇరాన్ అనుమతితోనే ప్రయాణించాలని నిబంధన విధించింది. అరేబియా సముద్రం నుండి కూడా ఈ మార్గాన్ని ఇరాన్ అదుపులోకి తీసుకుంది. అమెరికా దళాలు తమ నౌకలను అక్రమంగా పట్టుకోవడం "పైరసీ" కంటే ఘోరమని ఇరానీ మండిపడ్డారు.హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తామని, దానికి బదులుగా అమెరికా విధిస్తున్న ఆర్థిక దిగ్బంధనాన్ని (blockade) తొలగించాలని, అలాగే అణు కార్యక్రమ చర్చలను వాయిదా వేయాలని ఇరాన్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన ట్రంప్ బాంబు దాడుల కంటే దిగ్బంధనం చాలా ప్రభావం చూపిస్తోందని, ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాన్ని కలిగి ఉండకూడదని స్పష్టం చేశారు. -
‘పాక్లో జమ్మూ?’.. నాలిక్కరుచుకుని నేపాల్ క్షమాపణలు!
న్యూఢిల్లీ: భారతదేశంలో అంతర్భాగమైన జమ్మూ కాశ్మీర్ను పాకిస్తాన్ మ్యాప్లో చూపిస్తూ నేపాల్ ఎయిర్లైన్స్ చేసిన ఒక ఘోరమైన తప్పిదం తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ వివాదాస్పద ‘నెట్వర్క్ మ్యాప్’ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహ జ్వాలలు పెల్లుబికాయి. తప్పు తెలుసుకున్న నేపాల్ ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగివచ్చి, భారత్ను క్షమాపణలు కోరింది.సోషల్ మీడియాలో తీవ్ర దుమారంనేపాల్కు చెందిన అధికారిక విమానయాన సంస్థ ‘నేపాల్ ఎయిర్లైన్స్’ సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్న ఒక మ్యాప్ తీవ్ర వివాదానికి దారితీసింది. ఆ నెట్వర్క్ మ్యాప్లో జమ్మూకశ్మీర్ ప్రాంతాన్ని పాకిస్తాన్లో ఉన్నట్లుగా చూపించారు. ఈ మ్యాప్ను గమనించిన భారతీయులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఊహించని ఈ పరిణామంతో అప్రమత్తమైన సంస్థ, తీవ్ర వ్యతిరేకత రావడంతో బుధవారం నాడే ఆ వివాదాస్పద పోస్ట్ను సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల నుండి ఆఘమేఘాల మీద తొలగించింది.బహిరంగ క్షమాపణలు చెబుతూ..ఈ ఘోర తప్పిదంపై గురువారం నాడు నేపాల్ ఎయిర్లైన్స్ అధికారికంగా ‘ఎక్స్’ వేదికగా స్పందించింది. ‘మా సోషల్ మీడియాలో ఇటీవల పంచుకున్న నెట్వర్క్ మ్యాప్లో దొర్లిన తప్పుకు మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం. అంతర్జాతీయ సరిహద్దులకు సంబంధించి.. మ్యాప్లో ఉన్న భౌగోళిక దోషాలు నేపాల్ దేశపు అధికారిక వైఖరిని లేదా నేపాల్ ఎయిర్లైన్స్ అభిప్రాయాన్ని ఏమాత్రం ప్రతిబింబించవు’ అని స్పష్టం చేసింది.లోపాలను సరిదిద్దే పనిలో అంతర్గత విచారణతాము వెంటనే ఆ వివాదాస్పద పోస్ట్ను తొలగించామని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా అత్యున్నత ప్రమాణాలు పాటించేలా అంతర్గత విచారణ జరుపుతున్నామని సంస్థ వెల్లడించింది. ‘పొరుగు దేశాలతో, స్నేహితులతో మాకున్న బలమైన సంబంధాలను మేము ఎంతో గౌరవిస్తాం. ఈ పోస్ట్ వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మేము చింతిస్తున్నాం’ అని నేపాల్ ఎయిర్లైన్స్ ఒక ప్రకటనలో వివరించింది.ఇది కూడా చదవండి: ‘ఒరేయ్ సూరీడూ... ఉల్లికి లొంగిపోతావురా’? -
ట్రంప్ వల్లే యుద్ధం ఆగలేదు.. యూఎస్ రాయబారుల రాజీనామా!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు మరో బిగ్ షాక్ తగిలింది. ఉక్రెయిన్లో అమెరికా రాయబారుల పదవీ విరమణలు, మార్పుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ విధానాల వల్లే తాము రాజీనామాలు చేస్తున్నట్టు సదరు వ్యక్తులు ఆరోపించడం గమనార్హం. ఉక్రెయిన్ విషయంలో ట్రంప్.. పుతిన్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపణలు చేయడం ఇక్కడ పెద్ద ట్విస్ట్. అందుకే ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ఆగడంలేదని పరోక్షంగా చెప్పుకొచ్చారు.ఉక్రెయిన్లో అమెరికా రాయబారుల పదవీ మార్పులు తరచూ జరగడం తీవ్ర చర్చకు దారి తీసింది. బ్రిడ్జెట్ బ్రింక్ (2022–2025) అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా రాజీనామా చేశారు. ఆమె తరువాత బాధ్యతలు చేపట్టిన జూలీ డేవిస్ కూడా 2026 జూన్లో పదవీ విరమణ చేయనున్నారు. ఈ మార్పులు అమెరికా, ఉక్రెయిన్ సంబంధాల్లో అస్థిరతను ప్రతిబింబిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాయబారులు ఇద్దరూ ట్రంప్ విధానాలను వ్యతిరేకించడం సంచలనంగా మారింది.I resigned as U.S. Ambassador Ukraine when Trump kept siding with Putin over our democratic partner. Now, my successor is doing the same.I knew I had to speak out and run for office because siding with dictators is just not who we are. https://t.co/j1cGvub4Bf— Bridget Brink (@AmbBridgetBrink) April 29, 2026బ్రిడ్జెట్ బ్రింక్ 2022 నుండి 2025 వరకు కీవ్లో పనిచేశారు. తాజాగా ఆమె.. మిచిగాన్లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ కంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు పదేపదే అనుకూలంగా వ్యవహరించడం వల్లే తాను తన పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. నియంతల పక్షం వహించడం మన నైజం కాదంటూ ఘాటు విమర్శలు చేశారు. మన ప్రజాస్వామ్య భాగస్వామి కంటే పుతిన్కు ట్రంప్ పదేపదే వత్తాసు పలుకుతున్నప్పుడు నేను ఉక్రెయిన్ యూఎస్ రాయబారి పదవికి రాజీనామా చేశాను అన్నారు. ఈ పదవిలో ఏడాది లోపే పనిచేసిన తన వారసురాలు జూలీ డేవిస్ కూడా ఇలాంటి కారణాలతోనే వైదొలుగుతున్నారని ఆమె ఆరోపించారు. ఇదిలా ఉండగా, డేవిస్ ఈ ఏడాది చివర్లో పదవి నుంచి వైదొలిగి, మూడు దశాబ్దాల దౌత్య వృత్తికి ముగింపు పలుకుతూ పదవీ విరమణ చేస్తారని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ తెలిపింది.ట్రంప్ పరిపాలనలో ఉక్రెయిన్ విధానానికి వ్యతిరేకంగా మే 2025లో రాజీనామా చేసిన బ్రింక్ స్థానంలో, డేవిస్ గత ఏడాది మేలో తాత్కాలిక ప్రాతిపదికన బాధ్యతలు స్వీకరించారు. ఆమె కూడా.. పుతిన్కు ట్రంప్ మద్దతు ఇవ్వడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ట్రంప్పై వీరిద్దరూ విమర్శలు చేయడాన్ని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ ఖండించారు. ఇదంతా నిజం కాదన్నారు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య శాశ్వత శాంతిని నెలకొల్పడానికి ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు రాయబారి డేవిస్ గట్టి మద్దతుదారుగా ఉన్నారని కామెంట్స్ చేశారు. -
మళ్లీ ‘కోహినూర్’ పంచాయితీ.. మామ్దానీ సంచలన ప్రకటన
న్యూయార్క్: ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ వజ్రం ‘కోహినూర్’ను తిరిగి భారతదేశానికి అప్పగించాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మామ్దానీ, బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III కు ఈ మేరకు విజ్ఞప్తి చేయనున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. 9/11 స్మారక చిహ్నం వద్ద రాజును కలిసే ముందు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ పరిణామంతో దశాబ్దాల నాటి కోహినూర్ వివాదం మరోమారు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.ఏకాంతంగా కలిస్తే అదే అడుగుతా!కింగ్ చార్లెస్, క్వీన్ కెమిల్లాలతో న్యూయార్క్ మేయర్ మామ్దానీ భేటీకి ముందు కోహినూర్ ప్రస్తావన అధికారిక అజెండాలో లేదు. అయితే, రాజుతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా వజ్రాన్ని భారత్కు తిరిగి ఇచ్చేయాలని తాను గౌరవపూర్వకంగా కోరుతానని ఆయన బహిరంగంగానే చెప్పారు. ఆ తర్వాత 9/11 స్మారక కేంద్రం వద్ద రాజును ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు చిరునవ్వులు చిందిస్తూ, కరచాలనం చేసుకున్నప్పటికీ, వారి సంభాషణ చాలా తక్కువ సమయం జరిగింది. ఆ కొద్ది క్షణాల్లో కోహినూర్ ప్రస్తావన వచ్చిందా లేదా అన్నది మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.చేతులు మారిన వజ్రం.. చరిత్ర ఏం చెబుతోంది?కోహినూర్ వజ్రానికి వందల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. మొఘలులు, పర్షియన్లు, ఆఫ్ఘన్లు, సిక్కు పాలకుల చేతులు మారుతూ వచ్చిన ఈ అమూల్యమైన రత్నం.. 1849లో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వశమైంది. లాహోర్ ఒప్పందం ద్వారా అప్పటి యువ పాలకుడు మహారాజా దులీప్ సింగ్ నుంచి బ్రిటీషర్లు దీనిని బలవంతంగా సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వజ్రం లండన్ టవర్లో బ్రిటీష్ క్రౌన్ జ్యువెల్స్ (రాజ కుటుంబపు ఆభరణాల)లో ప్రదర్శనలో ఉంది.దశాబ్దాల వివాదం.. భారత్ నిరంతర పోరాటంవలస పాలనలో అన్యాయంగా తరలించిన తమ వజ్రాన్ని వెంటనే వెనక్కి ఇచ్చేయాలని భారతదేశం పదేపదే డిమాండ్ చేస్తోంది. భారతీయుల దృష్టిలో కోహినూర్ అనేది ఒక చరిత్రక అన్యాయానికి ఒక సజీవ సాక్ష్యం. కానీ యునైటెడ్ కింగ్డమ్ మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతోంది. 19వ శతాబ్దంలో కుదుర్చుకున్న లాహోర్ ఒప్పందం ద్వారా చట్టబద్ధంగానే తాము ఈ వజ్రాన్ని పొందామని, దానిపై పూర్తి హక్కులు తమవేనని బ్రిటన్ వాదిస్తూ వస్తోంది. భారతీయ మూలాలున్న మేయర్ మామ్దానీ తాజా వ్యాఖ్యలతో ఈ పాత వివాదం ఇప్పుడు మళ్లీ రాజుకుంది.ఇది కూడా చదవండి: బెంగాల్ రాజకీయాల్లో ‘అభిషేక్’ శకం షురూ! -
నో ప్లాన్ బీ..! నెక్ట్స్ స్టెప్ బాంబింగ్ కంటే డేంజర్
పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. ఇరాన్ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో మాటే లేకుండా తిరస్కరించారు. అణు ఒప్పందం విషయంలో తాను పెట్టిన షరతులకు అంగీకరించే దాకా హర్ముజ్ జలసంధిలో దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో మరోసారి ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ముందు హర్ముజ్ను తెరవండి. ఆ తర్వాత అణు ఒప్పందంపై చర్చలు జరుపుదాం.. అని ఇరాన్ నుంచి అమెరికాకు ప్రతిపాదన వెళ్లింది. అయితే ట్రంప్ అందుకు ఒప్పుకోవడం లేదు. ముందుగా అణు ఒప్పందం జరగాలని.. అప్పటివరకు బ్లాకేడ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘‘ఇప్పటికే ఇరాన్ హర్ముజ్ దిగ్బంధనంతో ఊపిరి ఆడకుండా విలవిలలాడుతోంది(ఈ క్రమంలో త్రీవ పదజాలం ప్రయోగించారాయన). అమెరికా షరతులపై అణు ఒప్పందానికి ఇరాన్ అంగీకరించే వరకు ఈ బ్లాకేడ్ కొనసాగిస్తుంటుంది. ఈసారి బ్లాకేడ్ బాంబింగ్ కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది’’ అని అన్నారాయన. అయితే..దీనికి ఇరాన్ కూడా అంతే ఘాటుగా స్పందించింది. అమెరికా బ్లాకేడ్కు త్వరలోనే అపూర్వమైన ప్రతిస్పందన ఇస్తాం అంటూ బదులిచ్చింది. ఇరాన్ విదేశాంగ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. మేం దౌత్యానికి అవకాశం ఇస్తున్నాం. కానీ మా సహనం పరిమితమే. అవసరమైతే కఠోర చర్యలకు దిగుతాం అని హెచ్చరించారు.ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాల సంయుక్త దాడులతో పశ్చిమాసియా యుద్ధం ఫిబ్రవరి 28న మొదలైంది. అప్పటి నుంచి హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హర్ముజ్పై పూర్తి ఆధిపత్యం తమదేనని.. అవసరమైతే టోల్ కూడా వసూల్ చేస్తామని చెబుతూ ఇరాన్ జలసంధిని మూసేసింది. ఫలితంగా చమురు సంక్షోభం మొదలైంది. అయితే తాత్కాలిక యుద్ధ విరమణ నేపథ్యంలో జలసంధిని ఇరాన్ తెరిచింది. ఈలోపే తన మిత్రదేశం లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఇరాన్ వెంటనే మళ్లీ మూసేసింది. ఇక చర్చల్లో ఇరాన్ మొండి వైఖరి ప్రదర్శిస్తుండడంతో ఏప్రిల్ 13న అమెరికా నేవీ హర్ముజ్ బ్లాకేడ్ను ప్రకటించింది. అమెరికా నేవీ, ఎయిర్ఫోర్స్లు ఇరాన్కు వచ్చీపోయే వాణిజ్య నౌకలను అడ్డుకోవడం మొదలుపెట్టాయి. హెచ్చరికలను పట్టించుకోకుండా మొండిగా ముందుకు వస్తే దాడులు చేశాయి. అప్పటి నుంచి ఈ సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. ఇంకోవైపు ఇరాన్ చమురు ఎగుమతులు దాదాపు నిలిచిపోయి ఆ దేశానికి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది. హర్ముజ్ను తాము మూసేయడంతో ఇరాన్కు ఒకరోజుకి 500 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోందని అమెరికా అంటోంది. అయితే ఇరాన్ మాత్రం దీన్ని సార్వభౌమత్వంపై దాడిగా ప్రకటించుకుంది.ప్లాన్బీ లేనే లేదు!అమెరికా-ఇరాన్ మధ్య న్యూక్లియర్ డీల్ ఇంకా కుదరలేదు. మధ్యవర్తిగా ఉన్న పాక్ ఈ విషయంలో ఘోరంగా విఫలమైంది. దీంతో మరో వ్యూహం జోలికి పోకుండా ట్రంప్ ఆర్థిక ఒత్తిడి ద్వారా ఇరాన్ను చర్చలకు రప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ‘‘ఇరాన్ తన ప్రధాన ఆదాయ వనరు చమురును వినియోగించుకోలేకపోతోంది. ఆ నిల్వలు పేరుకుపోయి పైప్లైన్లు పేలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి’’ అంటూ వ్యాఖ్యానించారాయన. మరోవైపు.. ఇకపై తాను మంచోడిలా ఉండలేనంటూ తుపాకీతో ఉన్న ఫొటోను ఆయన పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్పై మరోసారి దాడులకే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.ఇప్పటికే అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) పరిస్థితిని సమీక్షిస్తోంది. కుదిరితే చిన్నస్థాయిలో దాడులు చేయాలని.. వాటి ఫలితం మాత్రం ఇరాన్పై అత్యంత ప్రభావం చూపాలని ప్రణాళిక గీస్తోంది. అయితే ఈ దాడులకు ట్రంప్ నుంచి గ్రీన్సిగ్నల్ రావాల్సి ఉందని ఓ అధికారి చెబుతున్నారు. ఇరాన్ మాత్రం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని.. ప్రతిఘటనకు సిద్ధంగా ఉన్నామని అంటోంది. ఈ లెక్కన పశ్చిమాసియా ఉద్రిక్తతలకు హర్ముజ్ మరోసారి కేంద్ర బిందువుగా మారే అవకాశం కనిపిస్తోంది. -
యుద్ధంతో పాక్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం: షెహబాజ్
ఇస్లామాబాద్: అమెరికా–ఇరాన్ యుద్ధం పరోక్షంగా పాకిస్తాన్ ఆర్థికవ్యవస్థ ప్రగతికి ప్రతిబంధకంగా నిల్చిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘యుద్ధంకారణంగా విదేశాల నుంచి చమురు దిగుమతుల కోసం పెద్దమొత్తంలో విదేశీమారక ద్రవ్యాన్ని ఖర్చుచేయాల్సి వస్తోంది. గతంలో క్రూడాయిల్ దిగుమతుల కోసం వారంలో 30 కోట్ల డాలర్లు ఖర్చయ్యేది. ఇప్పుడది ఏకంగా 80 కోట్ల డాలర్లకు పెరిగింది. చమురు సంక్షోభాన్ని కట్టడిచేసేందుకు ప్రత్యేక కార్యదళాన్ని ఏర్పాటుచేశాం’’ అని బుధవారం కేబినెట్ సమావేశంలో షెహబాజ్ వెల్లడించారు. చర్చల్లో మధ్యవర్తిగా పాక్ అద్భుతమైన పాత్ర పోషిస్తోందని, కాల్పుల విరమణ గడువు పొడిగించడంలో పాక్ చేసిన కృషి దాగి ఉందని ఆయన అన్నారు. -
ఇకపై నేను మంచివాడిని కాదు
వాషింగ్టన్: ఇరాన్ అణు కార్యక్రమాలపై దౌత్యపరమైన పరిష్కారం సాధ్యమైనంత త్వరగా లభించాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. ఒకవేళ ఆశించిన పరిష్కారం లభించకపోతే అత్యంత కఠినంగా వ్యవహరించక తప్పదని ఇరాన్ను హెచ్చరించారు. ముప్పు తప్పించుకోవాలంటే తెలివిగా వ్యవహరించాలని ఇరాన్కు సూచించారు. అణ్వస్త్ర కార్యక్రమాలకు స్వస్తి పలకాలని పరోక్షంగా స్పష్టంచేశారు. ఈ మేరకు చేతుల్లో తుపాకీ పట్టుకున్న ఫొటోను ట్రంప్ ట్రూత్ సోషల్లో తాజాగా పోస్టుచేశారు. ఇందులో కొండలపై బాంబు పేలుళ్ల దృశ్యం కనిపిస్తోంది. తన మాట వినకపోతే ఇరాన్పై భీకర యుద్ధానికి సిద్ధమని ట్రంప్ సంకేతాలిచ్చారు. ఇకపై తాను మంచివాడిగా ఉండబోనని(నో మోర్ మిస్టర్ నైస్ గై) అని ట్రంప్ పోస్టు చేశారు. శాంతి చర్చల విషయంలో ఇరాన్ సక్రమంగా లేదని ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. అమెరికాతో అణ్వస్త్ర రహిత ఒప్పందం ఎలా చేసుకోవాలని ఇరాన్కు ఏమాత్రం తెలియడం లేదని ఆక్షేపించారు. వారు కాస్త తెలివిగా ప్రవర్తిసే బాగుంటుందని పేర్కొన్నారు. అమెరికా–ఇరాన్ మధ్య రెండో విడత చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. అమెరికా షరతులను ఇరాన్ అంగీకరించడం లేదు. అమెరికా యుద్ధ వ్యయం రూ.2.37 లక్షల కోట్లుపశ్చిమాసియాలో ఇరాన్పై యుద్ధానికి అమెరికా ఇప్పటిదాకా 25 బిలియన్ డాలర్లు(రూ.2.37 లక్షల కోట్లు) ఖర్చు చేసినట్లు పెంటగాన్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జూల్స్ హస్ట్–3 వెల్లడించారు. ఈ సమాచారాన్ని అమెరికా చట్టసభ సభ్యులకు చేరవేశారు. హౌస్ ఆరŠమ్డ్ సర్వీసెస్ కమిటీతో ఆయన బుధవారం సమావేశమయ్యారు. 25 బిలియన్ డాలర్లలో ఎక్కువ భాగం ఆయుధ సామగ్రిపై ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. సైనిక కార్యకలాపాలు నిర్వహించడానికి, ఖాళీ అయిన పరికరాలను భర్తీ చేయడానికి కూడా పెద్ద ఎత్తున సొమ్ము వ్యయం చేసినట్లు తెలియజేశారు. -
చమురు నిల్వలు, పైపులైన్లు పేలే పరిస్థితి సమీపిస్తోందా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ ప్రతిపాదనకు నో చెప్పేశారు. బాంబుదాడుల కంటే నిర్బంధమే ప్రభావవంతమని ట్రంప్ భావిస్తున్నారా? ఇరాన్ పరిస్థితి మరింత దిగజారుతుందని ఎందుకు హెచ్చరిక చేస్తున్నారు? అవసరమైతే సైనిక చర్యకు సిద్ధమని సంకేతాలు ఎందుకు వస్తున్నాయి? అమెరికా హార్మూజ్ నిర్బంధంతో ఇరాన్ చమురు ఎగుమతులకు బ్రేక్ పడుతోంది. నిల్వలు, పైపులైన్లు పేలే పరిస్థితి సమీపిస్తోందా? ఏయే పరిణామాలు సంభవిస్తాయి? ట్రంప్ మళ్లీ ఏం చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న పరిణామాల వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. డొనాల్డ్ ట్రంప్ ‘యాక్సియోస్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక విషయాలు తెలిపారు. తదుపరి ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో, తమ వైఖరి ఏంటో స్పష్టం చేశారు.ఇరాన్ ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరిస్తూ.. ఆ దేశ అణు కార్యక్రమంపై అమెరికాకు ఉన్న ఆందోళనలకు పరిష్కారం వచ్చే వరకు హార్మూజ్ నిర్బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ముందుగా హార్మూజ్ జలసంధిని తెరవాలని, ఆ తర్వాత అణు చర్చలు జరపాలని ఇరాన్ ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే. దీన్నే ట్రంప్ తిరస్కరించారు.ట్రంప్ యాక్సియోస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ నిర్బంధం బాంబుదాడుల కంటే కొంత ప్రభావవంతంగా ఉందని భావిస్తున్నానని తెలిపారు. ఇరాన్ బాగా ఇబ్బందులు పడుతోందని, పరిస్థితి ఇంకా కఠినంగా మారుతుందని చెప్పారు. ఇరాన్ ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తోందని, నిర్బంధం కొనసాగాలని కోరుకోవడం లేదని ట్రంప్ అన్నారు. కానీ తాను నిర్బంధాన్ని ఎత్తివేయాలనుకోవడం లేదని అన్నారు. ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండకూడదని తెలిపారు.చమురు నిల్వలు, పైపులైన్లు పేలతాయా?నిర్బంధం వల్ల ఇరాన్ చమురు ఎగుమతి చేయలేకపోతోందని, నిల్వలు, పైపులైన్లు పేలే పరిస్థితికి సమీపిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే, విశ్లేషకులు మాత్రం ఈ విషయంలో ఇప్పట్లో ప్రమాదం లేదని అంటున్నారు. ప్రస్తుతం ట్రంప్ నిర్బంధాన్ని ప్రధాన ఒత్తిడి సాధనంగా చూస్తున్నారని యాక్సియోస్ తెలిపింది. అయితే, ఇరాన్ ఒప్పుకోకపోతే సైనిక చర్యను కూడా పరిగణనలోకి తీసుకుంటారని చెప్పింది. కాగా, ఇప్పటివరకు ఎలాంటి ప్రత్యక్ష సైనిక దాడికీ అమెరికా ఆదేశాలు ఇవ్వలేదని యాక్సియోస్ చెప్పింది.యాక్సియోస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్పై అమెరికా సెంట్రల్ కమాండ్ దాడుల ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ దాడుల తర్వాత ఇరాన్లోని మౌలిక వసతులను లక్ష్యాలుగా చేసుకునే అవకాశం ఉంది.ఇరాన్ సైతం రెడీ ఇదిలా ఉండగా, ఇరాన్ భద్రతా వర్గాల ఉన్నత అధికారి మాట్లాడుతూ.. అమెరికా హార్మూజ్ నిర్బంధానికి ప్రతిగా ఇంతవరకు చూడని విధమైన చర్యను ఎదుర్కొంటుందని హెచ్చరించారు. దౌత్యానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇరాన్ సైన్యం ఇప్పటివరకు సహనం వహించిందని, సహనానికి పరిమితి ఉంటుందని చెప్పారు.ఇలాగైతే ఏయే పరిణామాలు సంభవిస్తాయి?ఇరాన్-అమెరికా తీరు వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. అమెరికా–ఇరాన్ మధ్య సైనిక ఘర్షణకు దారితీయవచ్చు. హార్మూజ్ జలసంధి వద్ద రవాణా అంతరాయం ఏర్పడి చమురు సరఫరా దెబ్బతినవచ్చు. అంతర్జాతీయ ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. దౌత్య చర్చలు కఠినమై పరిష్కారం ఆలస్యం కావచ్చు. -
భారత్కు ఇరాన్ విదేశాంగ మంత్రి ఫోన్
న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్కు బుధవారం సాయంత్రం ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి ఫోన్ చేశారు. ఇరువురు నేతలు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై చర్చించి, సంప్రదింపులు కొనసాగిస్తూ ఉండాలని నిర్ణయానికి వచ్చారు. భారతదేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం దీనిపై ట్వీట్ చేసింది. అమెరికా-ఇరాన్ పక్షాలు కాల్పుల విరమణకు సంబంధించిన తాజా పరిణామాలు, భారత్-ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై జైశంకర్, అబ్బాస్ అరఘ్చిర్చించారని తెలిపింది.ఎక్స్లో జైశంకర్ పోస్ట్ చేస్తూ.. “ఇవాళ సాయంత్రం ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి నుంచి ఫోన్ వచ్చింది. ప్రస్తుత పరిస్థితి, పలు అంశాలపై విస్తృతంగా చర్చించాం. నిరంతరం సంప్రదింపులు జరుపుకోవాలని నిర్ణయించాం” అని తెలిపారు.ఇదిలా ఉండగా, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నౌకాదళం అమెరికాకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఉద్రిక్తతలు పెరిగితే అసాధారణ పద్ధతులు ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది.ఇరాన్ మీడియా ప్రెస్ టీవీ తెలిపిన వివరాల ప్రకారం.. ఐఆర్జీసీ నౌకాదళ రాజకీయ వ్యవహారాల ఉపాధికారి మొహమ్మద్ అక్బర్జాదెహ్ అమెరికాకు హెచ్చరిక జారీ చేశారు. అమెరికా ఏదైనా తప్పుడు చర్యలకు పాల్పడితే ఆ దేశం ఆశ్చర్యపోయేలా అమలుచేసే వ్యూహాలు తమ వద్ద సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.ఏ దాడి జరిగినా ప్రతిస్పందించడానికి ఐఆర్జీసీ నౌకాదళం సిద్ధంగా ఉందని ఇరాన్ అంటోంది. పశ్చిమాసియాలో యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభమైంది. ఈ దాడుల్లో ఇరాన్ నసుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కూడా మరణించారు. ప్రతీకారంగా ఇజ్రాయెల్, అమెరికా ఆస్తులపై గల్ఫ్ దేశాల్లో ఇరాన్ దాడులు చేసింది. దీని వల్ల సముద్ర మార్గాల్లో అంతరాయం ఏర్పడి, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు, ప్రపంచ ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం పడింది.During a phone conversation between Seyed Abbas @araghchi, Foreign Minister of Iran, and Subrahmanyam Jaishankar, Minister of External Affairs of India, the two sides discussed and exchanged views on the latest developments related to the ceasefire, bilateral relations, as well… pic.twitter.com/Vx6B5hoezx— Iran in India (@Iran_in_India) April 29, 2026Received a phone call from Foreign Minister Seyed Abbas Araghchi of Iran this evening. @araghchi Had a detailed conversation about various aspects of the current situation. We agreed to remain in close touch.— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 29, 2026 -
యుద్ధం.. అమెరికాకు ఎన్ని లక్షల కోట్లు నష్టమంటే?
అమెరికా- ఇరాన్ యుద్ధం వల్ల కలిగిన నష్టం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యుద్దం కారణంగా సూమారుగా రూ. 25 లక్షల కోట్లకు పైగా నష్టపోయామని దానికి ఎట్టిపరిస్థితుల్లో పరిహారం చెల్లించాల్సిందేనని ఇరాన్ డిమాండ్ చేస్తూ వచ్చింది. కాగా తాజాగా అమెరికా సైతం యుద్ధం వల్ల తమ దేశానికి కలిగిన నష్టాన్ని అంచనా వేసింది.ఇప్పటివరకు సుమారు $25 బిలియన్ల (సుమారు రూ. 2.1 లక్షల కోట్లు) ఖర్చయినట్లు పెంటగాన్ బడ్జెట్ చీఫ్ బుధవారం వెల్లడించారు. ఇరాన్పై దాడుల వల్ల అమెరికా వద్ద ఉన్న హైటెక్ క్షిపణులు, బాంబుల నిల్వలు తగ్గిపోయాయి. యుద్ధం మొదలైన మొదటి రెండు రోజుల్లోనే $5.6 బిలియన్ల విలువైన ఆయుధాలు వాడినట్లు సమాచారం.ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన అత్యంత సమగ్రమైన అంచనా ఇది.ఈ మేరకు రక్షణ బడ్జెట్పై జరిగిన కీలక సమావేశంలో రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ పాల్గొన్నారు. రక్షణ బడ్జెట్ను 40% పెంచడం వల్ల గతంలో జరిగిన తక్కువ పెట్టుబడుల లోటు తీరుతుందని ఈ సమావేశంలో హెగ్సెత్ అన్నారు.. యుద్ధం విషయంలో ప్రతిపక్ష డెమొక్రాట్లు, కొందరు రిపబ్లికన్ల మాటలు "ఓటమిని కోరుకునేవిగా" ఉన్నాయని విమర్శించారు. ఇదే సమయంలో చైనాతో "ఆధిపత్యం" కోసం కాకుండా, ఒక "సమతుల్య సంబంధం" కోసం అమెరికా ప్రయత్నిస్తుందని హెగ్సెత్ పునరుద్ఘాటించారు.ఈ యుద్ధంలో అమెరికాకు సహకరించని మిత్రదేశాలు (ముఖ్యంగా నాటో) తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెగ్సెత్ హెచ్చరించారు. ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, పోలాండ్ వంటి దేశాలు అమెరికాకు ఆదర్శవంతమైన మిత్రదేశాలుగా ఆయన ప్రశంసించారు.కాగా ప్రస్తుతం యుద్ధంలో ఇరు దేశాల మధ్య సీజ్ఫైర్ నడుస్తున్న సంగతి తెలిసిందే. -
ప్రపంచవ్యాప్తంగా మరింత ముదరనున్న చమురు సంక్షోభం..?
ఇరాన్- అమెరికా యుద్ధంతో అసలే ప్రపంచమంతా చమురు సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే ఇప్పుడు ఆ పరిస్థితి మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యా చమురు స్థావరాలే టార్గెట్గా ఉక్రెయిన్ వరుసగా డ్రోన్స్లతో దాడులకు తెగబడుతుంది. దీంతో 24కు పైగా ముడి చమురు నిల్వ కేంద్రాలు పూర్తిగా ధ్వంసమైనట్లు రష్యా ప్రకటించింది.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య క్రూడాయిల్.. హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో క్రూడాయిల్ సరఫరాకు ఆటంకం తలెత్తి తీవ్ర సంక్షోభం ఏర్పడింది. దీంతో ప్రత్యామ్నయ మార్గంగా రష్యాపై కొన్ని దేశాలు దృష్టిసారించాయి. అయితే ఇప్పుడు రష్యా చమురు స్థావరాలు సైతం దాడులకు గురి కావడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.వరుసగా చమురు స్థావరాలపై దాడులు నిన్న( బుధవారం) తుయాప్సే నగరంలోని రష్యా చమురు స్థావరాలపై దాడులు జరిపినట్లు తెలిపింది. ఈ దాడుల ప్రభావంతో యాసిడ్ వర్షం కురవడంతో పాటు గాలిలో బెంజీన్, గ్జైలీన్ వంటి విషవాయువులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని తీర ప్రాంతంలో చేపలు, పక్షులు చనిపోయి పడి ఉన్నాయని పేర్కొంది. ఉక్రెయిన్ గడిచిన 15రోజుల్లో రష్యా చమురు స్థావరాలే లక్షంగా మూడుసార్లకు పైగా దాడులు చేసినట్లు రష్యా పేర్కొంది. తొలిసారిగా ఏప్రిల్16న దాడులు జరుపగా మరోసారి ఏప్రిల్ 20 తేదీన దాడులు జరిగినట్లు తెలిపింది. ఈ దాడుల్లో ఇప్పటికే 24 చమురు నిల్వ ట్యాంకులు ధ్వంసమయ్యాయని పేర్కొంది.రష్యాకు ఈ రిఫైనరీ ఎంతో కీలకంకీవ్ నగరానికి ఆగ్నేయంగా 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుయాప్సే రిఫైనరీ రష్యా చమురు ఎగుమతులకు అత్యంత ప్రధానమైనది. దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం సుమారు 12 మిలియన్ మెట్రిక్ టన్నులు సరాసరిన రోజుకు 240,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తుంది. రష్యా మొత్తం ఇంధన ఎగుమతి సామర్థ్యంలో సుమారు 12 శాతం వాటాను కలిగి ఉంది. ఇది రష్యాలోని టాప్ 10 రిఫైనరీలలో ఒకటి .చమురు సంక్షోభం మరింత ముదిరే అవకాశంరష్యా బడ్జెట్లో చమురు ఎగుమతులది సింహభాగం. దీనికి తోడు హర్ముజ్ మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. దీంతో ప్రపంచం చూపు రష్యా చమురు వైపు మళ్లుతోంది. దీనివల్ల రష్యాకు ఊహించని లాభాలు కూడా చేకూరాయి. అల్ జజీరా ప్రకారం, హర్ముజ్ జలసంధి మూసివేత, ఆకాశాన్నంటుతున్న ప్రపంచ చమురు ధరల కారణంగా, యుద్ధం మొదలైన మొదటి రెండు వారాల్లోనే రష్యా చమురు అమ్మకాల ద్వారా అదనంగా 672 మిలియన్ యూరోలు ($777 మిలియన్లు) సంపాదించిందని 'సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్' అంచనా వేసింది .ఎగుమతి కోసం ఉద్దేశించిన చమురు నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా రష్యాని ఆర్థికంగా దెబ్బతీయాలని ఉక్రెయిన్ భావిస్తోన్నట్లు విశ్లేషకుల అంచనా. అయితే ఈ దాడులతో దీనివల్ల ప్రపంచ చమురు కొరతను మరింత తీవ్రతరం చేస్తోందని రష్యా ఆరోపణలు చేస్తుంది. -
బంపర్ ఆఫర్ : డేటింగ్ యాప్ వాడితే వారికి డబ్బులు
జపాన్లో జననాల రేటు సంఖ్య రోజు రోజుకు క్షీణిస్తోంది. అందుకే జపాన్ ప్రభుత్వం అక్కడి సింగిల్ కింగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. యువత డేటింగ్ యాప్స్ ద్వారా భాగస్వాములను వెతుక్కునే ప్రక్రియకు ప్రభుత్వమే ఖర్చు భరిస్తానంటోంది. పదండి మరి ఈ ఇంట్రస్టింగ్ ఆఫర్ కథా కమామిష్షు ఏంటో తెలుసుకుందాం.జపాన్లో తగ్గుతున్న జనాభా సంఖ్యను పెంచడానికి అక్కడి స్థానిక ప్రభుత్వాలు వినూత్నమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. ‘మీటింగ్ సపోర్ట్ ప్రాజెక్ట్ గ్రాంట్’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. యువత పెళ్లిళ్లు, పిల్లల్ని కనడం పట్ల పెద్దగా ఆసక్తి చూపని నేపథ్యంలో జపాన్లోని కోచి ప్రావిన్స్ ప్రభుత్వం 2026 ఏప్రిల్ ఒకటి నుంచి ఈ పథకం అమల్లోకి తీసుకొచ్చింది.జపాన్లోని తీవ్రమైన జనాభా క్షీణతను అరికట్టడానికి అక్కడి స్థానిక ప్రభుత్వాలు యువతకు 'డేటింగ్ యాప్ సబ్సిడీలు' అందిస్తున్నాయి. యువత పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కనేలా ప్రోత్సహించడమే ఈ పథకాల ఉద్దేశ్యం.ఇదీ చదవండి: నో క్రాష్ డైట్, నో షార్ట్కట్ : కేవలం 45 రోజుల్లో 12 కిలోలు20 -39 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఒంటరి యువతీ యువకులకు ఈ సదుపాయం కల్పిస్తోంది.గుర్తింపు పొందిన 'టాపిల్' (Tapple) వంటి మ్యాచ్ మేకింగ్ యాప్స్ వాడకానికి అయ్యే ఖర్చులో 20,000 యెన్ల (సుమారు రూ. 12 వేలు) వరకు ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది.ఏప్రిల్ 2026 నుండి మార్చి 2027 మధ్య జరిగే ఖర్చులకు ఇది వర్తిస్తుంది.భద్రత ,విశ్వసనీయత ప్రమాణాలు పాటించే నిర్దేశిత యాప్లను వాడేవారికి మాత్రమే ఈ నగదు అందుతుంది.కేవలం కోచి మాత్రమే కాకుండా జపాన్లోని ఇతర ప్రాంతాలు కూడా ఇలాంటి వినూత్న చర్యల్ని చేపట్టాయి. మియాజాకి ప్రిఫెక్చర్లో 10,000 యెన్ల వరకు సబ్సిడీని ఇప్పటికే అందిస్తున్నారు. జపాన్ రాజధానిలో టోక్యోలో పని-జీవిత సమతుల్యత కోసం ఉద్యోగులకు వారానికి 4 రోజుల పనిదినాలను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. తద్వారా యువతకు తమ వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టే సమయం దొరుకుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.జపాన్ ప్రభుత్వం ఈ స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడానికి కారణం అక్కడి జనాభా గణాంకాలే అంటున్నారు విశ్లేషకులు. 2024లో జపాన్ జనాభా రికార్డు స్థాయిలో 9,08,574 తగ్గింది. గతేడాది సుమారు 16 లక్షల మంది మరణించగా, పుట్టిన వారు కేవలం 6,86,061 మంది మాత్రమే. అంటే జననాల కంటే మరణాలు రెట్టింపుగా ఉన్నాయి. ఒక సర్వే ప్రకారం, 39 ఏళ్ల లోపు వివాహం చేసుకున్న ప్రతి నలుగురిలో ఒకరు ఆన్లైన్ డేటింగ్ ద్వారానే తమ భాగస్వామిని కలుసుకున్నారు. అందుకే ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకుంది. మరి ఈ 'డేటింగ్ యాప్ సబ్సిడీ' దేశ భవిష్యత్తును కాపాడటంలో ఎంతవరకు విజయ వంతం అవుతుందో వేచి చూడాలి.ఇదీ చదవండి: జస్ట్, పెళ్లికి ముందు : వరుడి వింత ప్రశ్న, అతిథులు అవాక్కు -
గన్ ఫొటోతో ఇరాన్కు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్
వాషింగ్టన్: పశ్చిమాసియా యుద్ధం ముగింపు దశకు చేరుకుందనే ఊహాగానాల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కయ్యానికి కాలుదువ్వుతున్నారు. ఇకపై తాను మంచిగా ఉండదలచుకోవడం లేదంటూ ఇరాన్కు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో ట్రంప్ గన్నుతో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ‘ఇకపై నేను మంచిగా ఉండాలనుకోవడం లేదు. అణు ఒప్పందం విషయంలో ఇరాన్ తన వైఖరి మార్చుకోవాలి. అణు ఒప్పందం ఎలా చేసుకోవాలో వారికి తెలియదు. లేకపోతే దీర్ఘకాలిక ఆర్థిక, సైనిక ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది’అని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో హర్మూజ్ జలసంధిలో దీర్ఘకాలిక బ్లాకేడ్ వ్యూహాన్ని అమలు చేయాలని ఆదేశించారు.వైట్ హౌస్లో ట్రంప్ వ్యాఖ్యలువైట్ హౌస్లో ట్రంప్ మాట్లాడుతూ, అమెరికా ఇప్పటికే పశ్చిమాసియాలో తన శత్రువులను సైనికంగా ఓడించిందని పేర్కొన్నారు. ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాలను అభివృద్ధి చేయడానికి అనుమతించబోమని ఆయన పునరుద్ఘాటించారు.ఇరాన్ ప్రతిస్పందనఇరాన్ తాజాగా అమెరికాకు కొత్త ప్రతిపాదనను పంపింది. ఇందులో హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, యుద్ధాన్ని ముగించడం వంటి అంశాలు ఉన్నాయి. అణు చర్చలను తరువాత దశకు వాయిదా వేయాలని కోరింది. అమెరికా మాత్రం ఇరాన్ కనీసం 10 సంవత్సరాలపాటు యురేనియం ఎన్రిచ్మెంట్ నిలిపివేయాలని, ఇప్పటికే ఉన్న ఎన్రిచ్డ్ యురేనియం తొలగించాలని డిమాండ్ చేస్తోంది. President Trump posts on Truth Social: Iran can’t get their act together. They don’t know how to sign a nonnuclear deal. They better get smart soon! President DJT pic.twitter.com/tFEwmalvrD— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) April 29, 2026 -
అడిలైడ్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం
అడిలైడ్: దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర అడిలైడ్లోని పారాఫీల్డ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో ఓ చిన్న విమానం అదుపుతప్పి నేరుగా ఎయిర్పోర్ట్ హాంగర్ను బలంగా డీకొంది. ఈ ఘటనతో భారీ అగ్నిప్రమాదం సంభవించి, దట్టమైన నల్లటి పొగలు కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.ల్యాండింగ్ సమయంలో ఘోర ప్రమాదంపోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం కింగ్స్ రోడ్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. విమానం కిందకు దిగే ప్రయత్నంలో నియంత్రణ కోల్పోయి, విమానాలను నిలిపి ఉంచే స్థలాన్ని (హాంగర్ను) ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, ఇతర రెస్క్యూ బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఆ పరిసర ప్రాంతాల్లోని వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఖాళీ చేయించారు. A few minutes ago: A small aircraft crashed into a hangar at Parafield Airport in northern Adelaide, Australia, triggering a fire. pic.twitter.com/Id1uBGdNQL— Weather Monitor (@WeatherMonitors) April 29, 2026ప్రాణనష్టంపై కొనసాగుతున్న ఉత్కంఠప్రమాదం జరిగిన సమయంలో ఆ చిన్న విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? అలాగే మంటలు చెలరేగిన ఆ భవనంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారనే విషయాలపై ఇంకా ఎలాంటి స్పష్టతా రాలేదు. హాంగర్ పైభాగం నుంచి పెద్ద ఎత్తున మంటలు, ఇంధనం మండుతున్నట్లుగా దట్టమైన నల్లటి పొగలు వెలువడుతున్నాయి. ఈ పొగలు చుట్టుపక్కల ప్రాంతాలకు వేగంగా వ్యాపిస్తుండటంతో, స్థానికులు తమ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు.కార్యకలాపాలు నిలిపివేత - విమానాశ్రయం మూసివేతఈ ప్రమాద తీవ్రత చాలా అధికంగా ఉందని, ఐదుకు పైగా ఫైరింజన్లు, పలు అత్యవసర వాహనాలు సంఘటనా స్థలానికి వేగంగా వెళ్లడాన్ని తాను చూశానని బెన్ అనే స్థానిక ప్రత్యక్ష సాక్షి తెలిపారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా, పారాఫీల్డ్ విమానాశ్రయాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ‘అత్యవసర సేవల బృందాలు పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో వారికి మా పూర్తి సహకారం అందిస్తున్నాము’ అని ఎయిర్పోర్ట్ యాజమాన్యం ఒక అధికారిక ప్రకటనలో తెలియజేసింది.ఇది కూడా చదవండి: విశ్వాసానికి మరణం లేదు: కన్నీరు పెట్టిస్తున్న శునకం! -
ఇరాన్కు ముచ్చెమటలు.. ట్రంప్ బ్లాక్బస్టర్ వ్యూహం
అగ్రరాజ్యం అమెరికా.. ఇరాన్కు చుక్కలు చూపిస్తోంది. మొన్నటి వరకు ఇరాన్పై దాడులతో విరుచుకుపడిన అమెరికా.. ఇప్పుడు ప్లాన్ మార్చి వ్యూహాత్మకంగా ఇరాన్ను దెబ్బతీస్తోంది. ఇరాన్పై కఠిన ఆర్థిక చర్యలకు దిగింది. తాజాగా అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్కు చెందిన విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం (OFAC) రంగంలోకి దిగింది. ఇరాన్కు చెందిన 35 సంస్థలు, వ్యక్తులపై.. ‘షాడో బ్యాంకింగ్’ నెట్వర్క్ ద్వారా ఇరాన్ ఆయుధాలు, క్షిపణి ప్రోగ్రామ్లు, ఉగ్రవాద గ్రూపులకు నిధులు సమకూర్చుతున్నాయని ఆరోపిస్తూ వీరిని బ్లాక్లిస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇరాన్, అమెరికా యుద్ధంలో రోజురోజుకు పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇరాన్పై ట్రంప్ కఠిన ఆర్థిక చర్యలకు దిగారు. ఇరాన్పై ‘ఎకనామిక్ ఫ్యూరీ’ పేరుతో కొనసాగుతున్న ఆర్థిక ఒత్తిడి కార్యక్రమంలో భాగంగా ఇరాన్కు చెందిన 35 సంస్థలు(కొన్ని బ్యాంకులు కూడా), వ్యక్తులపై ఓఎఫ్ఏసీ ఆంక్షలు విధించింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. ఇరాన్ రహస్యంగా నిర్వహిస్తున్న షాడో బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా భారీ మొత్తంలో డబ్బు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో చలామణి అవుతోంది. ఈ నిధులు ఇరాన్ సైన్యం, క్షిపణి కార్యక్రమాలు, ప్రాంతీయ ఉగ్రవాద అనుబంధ సంస్థలకు చేరుతున్నాయి. ఇరాన్ సైనిక వ్యవస్థకు ఈ రహస్య బ్యాంకింగ్ వ్యవస్థ ఆర్థిక జీవనాధారంగా పనిచేస్తుంది. ఈ నెట్వర్క్కు సహకరించే ఏ ఆర్థిక సంస్థ అయినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సంస్థలు, ఆంక్షలకు గురైన సంస్థలకు అంతర్జాతీయ ఆర్థిక రంగంలోకి అక్రమ ప్రవేశం కల్పించడానికి విదేశీ అధికార పరిధిలోని షెల్ ఖాతాలను ఉపయోగిస్తున్నాయి’ అని ఆరోపించారు.ఆర్థిక వ్యవస్థపై ప్రభావం.. ఇదిలా ఉండగా.. ఇరాన్ టార్గెట్ అమెరికా.. 2025 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఇరాన్కు సంబంధించి దాదాపు వెయ్యి సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు విధించినట్లు సమాచారం. తాజా చర్యలతో అమెరికాలో ఉన్న సంబంధిత సంస్థల ఆస్తులన్నీ స్తంభించిపోయే అవకాశం ఉంది. అలాగే వీరితో లావాదేవీలు కొనసాగించే విదేశీ బ్యాంకులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు దూరమయ్యే ప్రమాదం ఉంది.బ్యాంకులకు ఝలక్.. మరోవైపు.. అమెరికా విధించిన ఆంక్షలకు గురైన సంస్థల్లో బ్యాంక్ సెపాత్ అనుబంధంగా పనిచేస్తున్న సంస్థలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బ్యాంక్ ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలకు నిధులు సమకూర్చుతోందని అమెరికా ఆరోపిస్తోంది. అలాగే బ్యాంక్ సినా సుప్రీం లీడర్ నియంత్రణలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు.. పార్సియన్ బ్యాంక్లతో సంబంధాలు ఉన్న కంపెనీలను కూడా లక్ష్యంగా చేసుకుంది. అయితే, తాజా చర్యలు ఇరానియన్ ఆయిల్ కంపెనీలకు నిధులను తరలించే వాటిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్కు చెందిన షుకున్ లిమిటెడ్ సంస్థ, 2024లో ఇరాన్ చమురు లావాదేవీల కోసం 70 మిలియన్ డాలర్లకు పైగా బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.చైనా రిఫైనరీలకు హెచ్చరిక..ఇరాన్ చమురు కొనుగోలు చేస్తున్న “టీపాట్ రిఫైనరీలు” (ప్రధానంగా షాండాంగ్ ప్రావిన్స్లో)తో వ్యాపారం చేసే బ్యాంకులు కూడా ఆంక్షలకు గురవుతాయని OFAC హెచ్చరించింది. ఇవి చిన్న, స్వతంత్ర రిఫైనరీలు. ప్రధానంగా చైనా షాండాంగ్ ప్రావిన్స్లో ఉన్నాయి. పెద్ద ప్రభుత్వ రిఫైనరీలతో పోలిస్తే, వీటికి అంతర్జాతీయ నియంత్రణలు తక్కువగా ఉంటాయి. ఇరాన్ చమురు కొనుగోలు చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇరాన్ చమురు కొనుగోలు చేస్తున్న ఈ రిఫైనరీలతో వ్యాపారం చేసే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా ఆంక్షలకు గురవుతాయి అని అమెరికా స్పష్టం చేసింది. అంటే, ఈ రిఫైనరీలకు ఫైనాన్స్, ఇన్సూరెన్స్, షిప్పింగ్ సర్వీసులు అందించే సంస్థలు కూడా బ్లాక్లిస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. -
గూగుల్, మెటాలకు షాక్.. ఆస్ట్రేలియా కొత్త పన్ను
సోషల్ మీడియా దిగ్గజాలు మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్), గూగుల్, టిక్టాక్లకు ఆస్ట్రేలియా ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. జర్నలిజం మనుగడ కోసం, వార్తా సంస్థలకు చెల్లింపులు చేయని పక్షంలో భారీగా పన్ను వసూలు చేసేలా రూపొందించిన కొత్త ముసాయిదా చట్టాన్ని విడుదల చేసింది.వార్తలకు విలువివ్వాల్సిందేజర్నలిస్టుల కష్టానికి తగిన ద్రవ్య విలువ ఉండాలని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సృజనాత్మకమైన వార్తా కంటెంట్ను ఉపయోగించుకుని బహుళజాతి సంస్థలు లాభాలు గడించడం తగదు. ఆ కంటెంట్ను ఉత్పత్తి చేసే వారికి తగిన పరిహారం అందాలి. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి నాణ్యమైన జర్నలిజం వెన్నెముక వంటిది’ అని పేర్కొన్నారు.ప్రతిపాదిత చట్టం ముఖ్యాంశాలువార్తా సంస్థలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి నిరాకరించే ప్లాట్ఫారమ్లపై ఈ చట్టం కొరడా ఝుళిపించనుంది.వార్తా ప్రచురణకర్తలతో ఒప్పందాలు చేసుకోని పక్షంలో, సదరు కంపెనీల వార్షిక ఆదాయంపై 2.25 శాతం పన్ను విధిస్తారు.వార్తా సంస్థలకు చెల్లింపులు చేసే ప్లాట్ఫారమ్లకు పన్ను మినహాయింపులు (ఆఫ్సెట్లు) లభిస్తాయి.ఈ పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని (సుమారు 200 - 250 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు), ఆయా వార్తా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం పంపిణీ చేయనుంది.పాత చట్టంలో లొసుగులు 2021లో తెచ్చిన 'న్యూస్ మీడియా బేరసారాల కోడ్' నుండి తప్పుకోవడానికి కొన్ని సంస్థలు తమ ప్లాట్ఫారమ్ల నుంచి వార్తలను తొలగించాయి. తాజా చట్టాన్ని అటువంటి లొసుగులను అరికట్టేలా రూపొందించారు.భగ్గుమంటున్న టెక్ దిగ్గజాలుప్రభుత్వ నిర్ణయంపై మెటా, గూగుల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. ‘వార్తా సంస్థలు తమ ప్రయోజనం కోసమే మా ప్లాట్ఫారమ్లపై కంటెంట్ను పోస్ట్ చేస్తాయి. ఇది కేవలం ఒక పరిశ్రమ నుంచి మరో పరిశ్రమకు సంపదను బదిలీ చేసే పన్ను మాత్రమే’ అని మెటా విమర్శించింది. ఇప్పటికే తాము వార్తా సంస్థలతో ఒప్పందాలు కలిగి ఉన్నామని, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ వంటి ప్లాట్ఫారమ్లను మినహాయించి కేవలం తమనే లక్ష్యంగా చేసుకోవడం సరికాదని గూగుల్ పేర్కొంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో వార్తల ప్రాముఖ్యతను కాపాడటమే లక్ష్యమని ఆస్ట్రేలియన్ ప్రభుత్వం చెబుతుండగా, ఇది డిజిటల్ రంగంపై అనవసరపు భారమని టెక్ సంస్థలు వాదిస్తున్నాయి. ఈ ప్రతిపాదన చట్టరూపం దాల్చితే ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలు కూడా ఇదే బాట పడతాయేమో చూడాలి. -
‘మా అమ్మకి చార్లెస్పై క్రష్’.. ట్రంప్ కామెంట్ వైరల్!
వాషింగ్టన్: అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత సమయంలో బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III అమెరికాలో చారిత్రక పర్యటన చేపట్టారు. ఈ దౌత్య పర్యటనలో జరిగిన చర్చలతో పాటు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య వైరల్గా మారింది.వైట్ హౌస్లో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుకింగ్ చార్లెస్కు వైట్ హౌస్ వద్ద అత్యున్నత దౌత్య మర్యాదలతో కూడిన ఘనస్వాగతం లభించింది. 21 తుపాకుల వందనం, సైనిక కవాతుతో అమెరికా ప్రభుత్వం ఆయనకు గౌరవం అందించింది. స్వాగత కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. ‘చార్లెస్ యువరాజుగా ఉన్నప్పుడు తన దివంగత తల్లి అతనిని ఎంతో ఇష్టపడేదని, ఆయనను ‘క్యూట్’ గా ఫీలయ్యేదని సరదాగా వ్యాఖ్యానించారు. ‘మా అమ్మకు చార్లెస్ అంటే క్రష్. మీరు నమ్ముతారా? ఆమె ఇప్పుడు ఏమనుకుంటుందో’ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ కార్యక్రమానికి కాస్త వినోదాన్ని జోడించాయి. In this bizarre moment, with King Charles sitting behind him, President Trump tells the crowd that his mother had a crush on King Charles. pic.twitter.com/LX0iYuwwCU— Ed Krassenstein (@EdKrassen) April 28, 2026ఉద్రిక్తతల నడుమ దౌత్య వ్యూహాలుఒకవైపు ఇరాన్ వివాదం, టారిఫ్ సమస్యలతో వాషింగ్టన్, లండన్ మధ్య సంబంధాలు కాస్త తగ్గన వేళ ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడం, సవాళ్లను ఎదుర్కోవడమే లక్ష్యంగా ఓవల్ ఆఫీస్లో ట్రంప్, చార్లెస్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. ఈ పర్యటనలో భాగంగా కింగ్ చార్లెస్ అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. 1991లో క్వీన్ ఎలిజబెత్ II తర్వాత ఈ గౌరవం దక్కించుకున్న రెండవ బ్రిటీష్ చక్రవర్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఇది కూడా చదవండి: ‘అధిపత్యం కాదు..’ ట్రంప్కు కింగ్ చార్లెస్ చురక! -
‘అధిపత్యం కాదు..’ ట్రంప్కు కింగ్ చార్లెస్ చురక!
వాషింగ్టన్: అమెరికా స్వాతంత్ర్యం పొంది 250 వసంతాలు పూర్తవుతున్న వేళ.. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-III చేసిన ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక మైత్రీబంధాన్ని ఆకాశానికెత్తిన ఆయన.. అదే సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలపై సున్నితంగా, పరోక్షంగా చురకలు అంటించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.‘ఆధిపత్యం కాదు.. బాధ్యత ముఖ్యం’మానవ చరిత్రలోనే అత్యంత బలమైన, పరిణామాత్మక భాగస్వామ్యాల్లో అమెరికా-బ్రిటన్ మైత్రి ఒకటని రాజు కొనియాడారు. అయితే, దేశాలు కేవలం అంతర్ముఖంగా (ఇన్వర్డ్-లుకింగ్) మారొద్దని హెచ్చరించారు. ప్రపంచ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సిన బాధ్యతను అమెరికా నాయకత్వానికి గుర్తుచేశారు. ఇరాన్పై అమెరికా సైనిక చర్యల నేపథ్యంలో ఇరుదేశాల సంబంధాలు సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ.. ఉక్రెయిన్కు అండగా నిలవాలని, నాటో కూటమిని బలోపేతం చేయాలని ఆయన కోరారు. అంతేకాకుండా, మత సామరస్యం, వాతావరణ మార్పుల కట్టడిపై ట్రంప్ విధానాలకు భిన్నంగా రాజు తన గళాన్ని వినిపించారు.నియంతృత్వానికి చెక్.. పరోక్ష విమర్శలుకార్యాచరణ అధికారాలపై సమతౌల్యం, నియంత్రణలు (చెకస్ అండ్ బ్యాలెన్సెస్) ఉండాలంటూ 1215 నాటి ‘మాగ్నా కార్టా’ను చార్లెస్ ప్రస్తావించడం విశేషం. ఇది ‘నా సొంత నైతికతే నాకు హద్దు’ అని ట్రంప్ గతంలో చేసిన వ్యాఖ్యలకు పరోక్ష కౌంటర్గా విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే, ఇరు దేశాల రాజకీయాలను కుదిపేసిన జెఫ్రీ ఎప్స్టీన్ కుంభకోణాన్ని పేరు చెప్పకుండానే ప్రస్తావిస్తూ.. సమాజంలోని దురాచారాల బాధితులకు అండగా నిలవాల్సిన సామూహిక బలాన్ని ఆయన నొక్కిచెప్పారు.అట్టహాసంగా అధికారిక పర్యటనవాణిజ్య, విదేశాంగ విధానాలపరంగా విభేదాలు ఉన్నప్పటికీ, నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన కింగ్ చార్లెస్, క్వీన్ కమీల్లాలకు వైట్హౌస్లో ఘన స్వాగతం లభించింది. టెక్ దిగ్గజాలు జెఫ్ బెజోస్, టిమ్ కుక్ సహా 130 మంది ప్రముఖులతో కలిసి ట్రంప్ దంపతులు వీరికి స్టేట్ డిన్నర్ (అధికారిక విందు) ఏర్పాటు చేశారు. కాగా, 1991లో క్వీన్ ఎలిజబెత్-II తర్వాత కాంగ్రెస్ను ఉద్దేశించి ప్రసంగించిన రెండో బ్రిటిష్ చక్రవర్తిగా చార్లెస్ చరిత్ర సృష్టించారు. ఇటీవల ట్రంప్పై జరిగిన హత్యాయత్నాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలుఇరాన్ యుద్ధం విషయంలో బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ అనుసరిస్తున్న వ్యూహాలపై ట్రంప్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. డిజిటల్ సేవల పన్ను రద్దు చేయకపోతే బ్రిటన్పై భారీ టారిఫ్లు విధిస్తామని హెచ్చరిస్తున్న తరుణంలో ఈ పర్యటన జరగడం గమనార్హం. అయినప్పటికీ, కింగ్ చార్లెస్ చేసిన సున్నితమైన విమర్శలను పక్కనపెట్టి, ట్రంప్ ఈ ప్రసంగాన్ని ‘అద్భుతం’ అని ప్రశంసించడంతో పాటు.. ప్రసంగం చూసి నాకే అసూయ వేసింది అని సరదాగా వ్యాఖ్యానించడం విశేషం.ఇది కూడా చదవండి: ఎగ్జిట్ పోల్స్ నిజమేనా? ‘ఈసీఐ’ ఏమంటోంది? -
యూఏఈ సంచలన నిర్ణయం.. పాకిస్తాన్కు బిగ్ షాక్!
ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరుగుతున్న వేళ పశ్చిమాసియాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్ఫ్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి అయిన ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్-ఒపెక్ (OPEC), ఒపెక్+ (OPEC+) నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, దీనికి సౌదీ అరేబియా, పాకిస్తానే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇదే సమయంలో పాకిస్తాన్కు యూఏఈ ఊహించని షాకిచ్చింది.కాగా, మే 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఒపెక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని యూఏఈ తెలిపింది. మార్కెట్ డిమాండ్, పరిస్థితులకు అనుగుణంగా చమురు ఉత్పత్తిని క్రమంగా పెంచుతామని యూఏఈ ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశీయ ఇంధన ఉత్పత్తిపై పెట్టుబడులను మరింత వేగవంతం చేస్తామని వెల్లడించింది. ఈ నిర్ణయం చమురు ఎగుమతి దేశాల కూటమికి, దానికి నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియాకు ఇది అతిపెద్ద దెబ్బ అయ్యే అవకాశం ఉంది. ఒపెక్కు ఝలక్..1967లో యూఏఈ ఒపెక్ కూటమిలో చేరింది. ఒపెక్లో సౌదీ అరేబియా, ఇరాక్ తర్వాత మూడో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉంది. ఒపెక్ నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ వస్తోంది. సుదీర్ఘ కాలంపాటు సభ్యదేశంగా కొనసాగిన యూఏఈ.. అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రపంచ దేశాలను షాక్కు గురి చేసింది. దీనివల్ల భవిష్యత్లో ఒపెక్ బలహీనం అవుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే హార్మూజ్ మూసివేతతో చమురు ఎగుమతిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒపెక్ దేశాలకు.. యూఏఈ రూపంలో మరో షాక్ తగిలింది. దేశ ప్రయోజనాల రీత్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపినప్పటికీ సౌదీ, పాకిస్తానే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఇరాన్ దాడులు కూడా ఇందులో మరో కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.ఇరాన్ ఎఫెక్ట్.. ఇరాన్ దాడుల విషయంలో సౌదీ అరేబియా వంటి తన ప్రాంతీయ మిత్రదేశాలు సరైన రీతిలో స్పందించకపోవడం పట్ల యూఏఈ అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో ఒపెక్ నుంచి యూఏఈ బయటకు వచ్చిందనే వాదన కూడా ఉంది. అలాగే, గల్ఫ్ ప్రాంతంలో యూఏఈ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య సంబంధాలు గత కొన్నేళ్లుగా మారుతూ వచ్చాయి. ఇటీవల ఇరాన్ యుద్ధం దాడుల సందర్భంగా యూఏఈపై ఇరాన్ ఇటీవల 537 బాలిస్టిక్ క్షిపణులు, 26 క్రూయిజ్ మిసైళ్లు, 2,256 డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడులు యూఏఈ మౌలిక వసతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ క్రమంలో అమెరికా మరియు ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై చర్యలు చేపట్టింది కానీ ప్రతిగా ఎక్కువ నష్టాన్ని చవిచూసింది. ఇదే సమయంలో పాకిస్తాన్ మధ్యవర్తి వ్యవహారంపై యూఏఈ ఆగ్రహం వ్యక్తం చేసింది.పాకిస్తాన్ పాత్ర..అమెరికా–ఇరాన్ మధ్య మధ్యవర్తిగా పాకిస్తాన్ వ్యవహరించింది.యూఏఈ మాత్రం పాకిస్తాన్ ఇరాన్పై కఠిన వైఖరి తీసుకోవాలని కోరింది.పాకిస్తాన్ తటస్థంగా ఉండటంతో యూఏఈ అసంతృప్తి చెందింది.ప్రతిగా యూఏఈ $3.5 బిలియన్ రుణం తక్షణమే తిరిగి చెల్లించమని డిమాండ్ చేసింది.దీంతో, 2026 ఏప్రిల్లో పాకిస్తాన్ యూఏఈకి $3.45 బిలియన్ రుణం తిరిగి చెల్లించింది.ఇందులో $1 బిలియన్ అబుదాబి ఫండ్ ఫర్ డెవలప్మెంట్కి చెల్లించబడింది.ఇది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బగా మిగిలింది.యూఏఈలో 1.6 మిలియన్కి పైగా పాకిస్తానీలు నివసిస్తున్నారు.వీరి రిమిటెన్సులు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకం.తాజాగా యూఏఈ, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇది పాకిస్తానీలకు ఎదురుదెబ్బ కానుంది.సౌదీ-పాకిస్తాన్ బంధం..యూఏఈ డిమాండ్ తర్వాత సౌదీ అరేబియా వెంటనే పాకిస్తాన్కు $3 బిలియన్ రుణం ఇచ్చింది.అదనంగా $5 బిలియన్ క్రెడిట్ లైన్ వాగ్దానం చేసింది.అంతకుముందు 2025లో సౌదీ–పాకిస్తాన్ రక్షణ ఒప్పందం కుదిరింది.ఈ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ తన అణు ఆయుధాలు, క్షిపణులు సౌదీ రక్షణ కోసం ఉపయోగించగలదు.దీంతో, పాకిస్తాన్ తనను పక్కన పెట్టినట్లు యూఏఈ భావించింది.యూఏఈ నిర్ణయం ప్రభావం..ఆర్థికంగా: యూఏఈ ఇకపై రోజుకు 3 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తిని కోటా పరిమితులు లేకుండా పెంచుకోగలదు.రాజకీయంగా: ఇది సౌదీ ఆధిపత్యానికి బహిరంగ సవాలు.ప్రపంచవ్యాప్తంగా: అమెరికా, చైనా, రష్యా తమ వ్యూహాలను మళ్లీ ఆలోచించాల్సి వస్తుంది. పశ్చిమాసియాలో యూఏఈ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తోంది. 2015లో ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా పోరాడటానికి యూఏఈ, సౌదీ అరేబియా కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. అయితే, యూఏఈ మద్దతు ఉన్న యెమెన్ వేర్పాటువాదులకు ఆయుధాల రవాణా జరుగుతోందని ఆరోపిస్తూ సౌదీ అరేబియా బాంబు దాడి చేయడంతో కూటమిలో విభేదాలు తలెత్తాయి. కాలక్రమేణా రియాద్ కొన్ని వైఖరులకు విరుద్ధంగా ఉంది. గత కొన్నేళ్లుగా అమెరికా తన చమురు ఉత్పత్తిని పెంచుకోవడంతో వియన్నా కేంద్రంగా పనిచేసే 'ఒపెక్' మార్కెట్ పవర్ క్రమంగా తగ్గుముఖం పట్టింది.ఇదిలా ఉండగా.. యూఏఈకి భారత్తో బలమైన సంబంధాలు ఉన్నాయి. అయితే, సౌదీ అరేబియా, పాకిస్తాన్ మరియు టర్కీ ఒక కూటమిగా ఏర్పడుతున్నాయి. వారి మధ్య త్రైపాక్షిక సైనిక ఒప్పందంపై చర్చ జరుగుతోంది.భారత్కి అవకాశాలు:తక్కువ ధరలు: యూఏఈ ఉత్పత్తి కోటాల నుండి విముక్తి పొందడంతో రోజుకు 4.8 మిలియన్ బ్యారెల్స్ వరకు ఉత్పత్తి పెంచే అవకాశం ఉంది. ఇది గ్లోబల్ మార్కెట్లో సరఫరా పెంచి ధరలను తగ్గిస్తుంది.దిగుమతి బిల్లు తగ్గింపు: భారత్కి క్రూడ్ ఆయిల్ దిగుమతి ఖర్చు తగ్గి, ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండే అవకాశం ఉంది.ఇంధన ధరలు: పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది, ఇది వినియోగదారులకు నేరుగా లాభం జరుగుతుంది.2022లో భారత్ యూఏఈ నుండి $11 బిలియన్ విలువైన క్రూడ్ దిగుమతి చేసుకోగా, 2026లో ఇది $14 బిలియన్కి పెరిగింది.యూఏఈ వాటా భారత్ క్రూడ్ దిగుమతుల్లో 10.3% నుండి 11.4%కి పెరిగింది.దీర్ఘకాల ఒప్పందాలు: ఒపెక్ కోటాల పరిమితులు లేకుండా భారత్ యూఏఈతో దీర్ఘకాల సరఫరా ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. యూఏఈతో ఎనర్జీ భాగస్వామ్యం మరింత బలపడుతుంది. LNG, LPG రంగాల్లో కూడా కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. -
ఇరాన్ దగ్గరే అణ్వాయుధం గనుక ఉంటే..
ఇరాన్తో అణు ఒప్పందం ఎటూ తేలకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనంతో కనిపిస్తున్నారు. చర్చలకు ఇరాన్ దిగి రాకపోవడం, మధ్యవర్తి పాకిస్తాన్ సైతం చేతులెత్తేయడంతో ఈ డీల్పై అనిశ్చితి నెలకొంది. ఈ తరుణంలో జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు మరింత చిరాకు పుట్టించినట్లున్నాయి. ఇరాన్ యుద్ధంలో అమెరికా తీరును మెర్జ్ తప్పుబట్టగా.. అందుకు ట్రంప్ సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చారు. ‘‘ఇరాన్ అణు ఆయుధం కలిగి ఉండడం సరైందేనని మెర్జ్ భావిస్తున్నారు. కానీ, ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదు. ఒకవేళ ఇరానే గనుక అణ్వాయుధం కలిగి ఉంటే.. ప్రపంచమే దానికి బందీ అవుతుంది’’ అని ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. గత అమెరికా అధినేతలెవరూ చేయలేని పనిని తాను చేస్తున్నానని.. అందుకు సంతోషించాలని మెర్జ్ను ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే వాస్తవానికి.. ‘‘ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాలను పొందకూడదు. ఆ దేశ అణు సామర్థ్యం యూరప్కే కాదు.. ప్రపంచానికి ప్రమాదకరం’’ అని మెర్జ్ అన్నారు. అదే సమయంలో చర్చల్లో ఇరాన్ నైపుణ్యంగా వ్యవహరిస్తోందని.. అమెరికా ఈ సమస్యను ఎదుర్కొనే విధానం అస్పష్టంగా ఉందని ఆయన విమర్శించారు. అమెరికా ప్రతినిధులు పాకిస్తాన్కి వెళ్లి చర్చలు జరిపినా, ఎటువంటి ఫలితం రాలేదని ఆయన ఉదహరించారు. అయితే..మెర్జ్ వ్యాఖ్యలను ట్రంప్ పొరపాటుగా అర్థం చేసుకున్నారా? లేదంటే అమెరికా తీరును తప్పుబట్టినందుకు మండిపోయి అలా పోస్ట్ చేశారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.ఉక్రెయిన్ యుద్ధంలోనూ అమెరికా వ్యూహాలపై యూరప్ దేశాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. అగ్రరాజ్యం అసలు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తోందా? అని ప్రశ్నించాయి. ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్, నెదర్లాండ్స్, పోలాండ్, బాల్టిక్ దేశాలు, అలాగే యూరోపియన్ యూనియన్ నాయకత్వం అమెరికా–రష్యా మధ్య జరుగుతున్న చర్చల్లో తమను పక్కన పెట్టారని విమర్శించాయి. అప్పటి నుంచి అమెరికా-యూరప్ దేశాల మధ్య సంబంధాలు బలహీనపడుతూ వస్తున్నాయి. -
పాకిస్తాన్లో కలకలం.. హఫీజ్ సన్నిహితుడు హతం
లాహోర్: పాకిస్తాన్ ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా కీలక నేత, ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ సన్నిహితుడు షేక్ యూసఫ్ అఫ్రిది గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో హతమయ్యాడు. ఖైబర్ ప్రావిన్స్లోని లాండికొటాల్లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన అఫ్రిది అక్కడికక్కడే చనిపోయినట్లు అధికారులు తెలిపారు.ఖైబర్ ప్రావిన్స్లో లష్కరే కార్యకలాపాలను సమన్వయం చేయడంతోపాటు కొత్తవారిని చేర్చుకోవడం వంటివి ఇతడే పర్యవేక్షిస్తున్నాడు. ఖైబర్లోని జఖాఖెల్ గిరిజన తెగకు చెందిన అఫ్రిది సలాఫి వర్గం ముస్లిం పండితుల్లో ఒకడు. అఫ్రిదిపై కాల్పులకు బాధ్యత ఎవరూ ప్రకటించుకోలేదు. తెహ్రీక్–ఇ– తాలిబన్ పాకిస్తాన్ పనే అయి ఉండొచ్చని అనుమానాలున్నాయి. కాగా, వారం క్రితం లాహోర్లో లష్కరే వ్యవస్థాపకుల్లో ఒకడైన అమిర్ హంజాపై కాల్పులు జరగడం తెల్సిందే. షేక్ యూసఫ్ అఫ్రిది హత్య ఘటన ప్రాంతంలో ఆగ్రహాన్ని రేపింది. ఇదిలా ఉండగా.. 2023 నుండి పాకిస్తాన్లో లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి గ్రూపులకు చెందిన పలువురు నాయకులు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురవుతున్నారు. ఇది మిస్టరీగా మారింది. అఫ్రిది హత్య పాకిస్తాన్లో ఇటీవల పెరుగుతున్న లక్ష్యిత దాడులలో భాగంగా జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అఫ్రిది మరణం లష్కరే తోయిబా ప్రాంతీయ నిర్మాణానికి పెద్ద దెబ్బగా మారింది. అతడి మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
ఇన్స్టాలో ట్రంప్పై 86-47 అంటూ పోస్ట్.. అరెస్ట్ వారెంట్ జారీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై బెదిరింపునకు పాల్పడ్డారంటూ ఎఫ్బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కోమీపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఈ కేసుకు జేమ్స్ కోమీ గత ఏడాది ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఒక పోస్టుతో సంబంధం ఉంది. ఆ పోస్టులో ఓ ఫొటో ఉంటుంది. సముద్రం పక్కన గవ్వలతో “86 47” అంకెలను రాసి ఉన్న ఫొటో అది. ఈ మెసేజ్ను 47వ అధ్యక్షుడు ట్రంప్పై హింసకు పిలుపుగా విశ్లేషకులు భావించారు. ఇక 86 అనే అంకెను కొన్ని సందర్భాల్లో ‘‘తొలగించడం” లేదా “వెంటనే పంపివేయడం” అనే అర్థంలో వాడే స్లాంగ్ పదం.. ఈ పోస్టు చేసిన కొద్ది సేపటి తర్వాత కోమీ ఆ పోస్టును తొలగించారు. అది బెదిరింపు పోస్టుకాదని తెలిపారు. “కొంతమంది ఆ అంకెలను హింసతో కలిపి చూస్తారని నాకు తెలియదు” అని ఆయన చెప్పారు. అలాగే, తాను హింసకి వ్యతిరేకినని కూడా పేర్కొన్నారు. జేమ్స్ కోమీపై ఆ ఇన్స్టాగ్రామ్ పోస్టుకు సంబంధించి ఇప్పుడు అధికారికంగా కేసు నమోదైంది. పోస్టు గత సంవత్సరం చేసినప్పటికీ దానిపై విచారణ తర్వాత ఇప్పుడు అభియోగాలు మోపడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. సోషల్ మీడియా పోస్టుతో సంబంధం ఉన్న కేసులో అమెరికా న్యాయ శాఖ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో జేమ్స్ కోమీపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.ఈ విషయంపై అవగాహన ఉన్న వ్యక్తి అసోసియేటెడ్ ప్రెస్కు తెలిపిన ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో మంగళవారం ముందుగా కోమీపై రెండోసారి అభియోగాలు మోపారు. గతంలో కోమీపై ఒక కేసు పెట్టారు. కానీ ఆ కేసు నిలవలేదు.. ఎందుకంటే కేసు వాదించిన న్యాయవాది (ప్రాసిక్యూటర్) నియామకంలో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు అదే విషయంపై మళ్లీ కొత్తగా కేసు పెట్టారు. కాగా, 2017లో ఎఫ్బీఐ డైరెక్టర్ పదవి నుంచి తనను తొలగించిన తర్వాత ట్రంప్ను బహిరంగంగా విమర్శిస్తున్నారు కోమీ. ఆయన ఇన్స్టాలో చేసిన పోస్ట్ను ట్రంప్, ఇతర పరిపాలనా అధికారులు బెదిరింపు మెసేజేనని అంటున్నారు. -
విమానంలో మహిళ ప్రసవం
వాషింగ్టన్: అమెరికాలో విమానంలో ప్రయాణిస్తున్న ఓ గర్భిణి శిశువుకు జన్మనిచ్చింది. డెల్టా ఎయిర్లైన్స్ విమానంలో గత శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. అట్లాంటా నుంచి బయలుదేరిన ఈ విమానం ఒరెగాన్లోని పోర్ట్లాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. అయితే, గమ్యస్థానానికి చేరుకోకముందే విమానంలో ఉన్న గర్భిణికి నొప్పులు మొదలయ్యాయి.యాదృచ్ఛికంగా అదే విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు డాక్టర్లు ఆమెకు సుఖ ప్రసవం కావడానికి సహకరించారు. బిడ్డ పూర్తిగా ఆరోగ్యంగా 2.5 కిలోల బరువుతో జన్మించింది. శిశువుకు బ్రియెల్లీ రెనీ బ్లెయిర్ అని నామకరణం చేశారు. అయితే, డాక్టర్ నిర్ధారించిన గడువు కంటే రెండు వారాల ముందు ఆమె జన్మించడం గమనార్హం. -
ఇండోనేషియాలో రైలు ప్రమాదం
జకార్తా: ఇండోనేషియా రాజధాని జకార్తా సమీపంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. బెకాసి తైమూర్ స్టేషన్లో సోమవారం ఆగి ఉన్న ప్రయాణికుల రైలు వెనుక బోగీని మరో రైలు ఢీకొట్టింది. బోగీలో ఉన్న ప్రయాణికుల్లో 15 మంది మరణించారు.వారంతా మహిళలే కావడం గమనార్హం. ఈ బోగీని కేవలం మహిళల కోసమే కేటాయించారు. రైలు ప్రమాదంలో మరో 88 మంది గాయపడ్డారు. చికిత్స కోసం వారందరినీ ఆసుపత్రికి తరలించారు. -
89 ఏళ్ల వయసులో గన్ పట్టుకుని తిరుగుతూ.. కాల్పులు జరుపుతూ..
అతడి వయసు 89 ఏళ్లు. ఆ వయసులో చేతిలో గన్ పట్టుకుని తిరుగుతూ కొందరిపై కాల్పులు జరుపుతూ కలకలం రేపాడు. గ్రీక్లోని అథెన్స్ నగర కేంద్రంలో ఈ ఘటన జరిగింది. సెంట్రల్ అథెన్స్లోని ఒక సొసైటీ సెక్యూరిటీ ఆఫీస్, అలాగే ఒక కోర్టు భవనంలో కాల్పులు జరిపి కొందరిని గాయపరిచాడు ఆ వృద్ధుడు. నిందితుడిని గుర్తించడానికి పోలీసులు ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాట్గన్ (ఒకేసారి అనేక గుళ్లను పేల్చే తుపాకీ)తో ఉన్న వృద్ధుడు మొదట గ్రీకు రాజధాని కేంద్రంలోని సొసైటీ సెక్యూరిటీ ఆఫీస్లో కాల్పులు జరిపి ఒక ఉద్యోగిని గాయపరిచాడు. ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు ఆ వ్యక్తికి చికిత్స అందించారు. నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.అదే వ్యక్తి తర్వాత సెంట్రల్ అథెన్స్లోని మరో ప్రాంతంలో ఉన్న కోర్టు భవనం గ్రౌండ్ ఫ్లోర్లో కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడ కూడా పలువురు గాయపడ్డారు. అధికారులు షాట్గన్ను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఈ కాల్పుల వెనుక ఉద్దేశం స్పష్టంగా లేదు. కోర్టు భవనంలో కాల్పుల తర్వాత నిందితుడు కొన్ని పత్రాలు ఉన్న కవర్లను నేలపై విసిరేశాడు.గ్రీకు జాతీయ సామాజిక భద్రత నిధి చీఫ్ అలెగ్జాండ్రోస్ వార్వెరిస్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు సెంట్రల్ అథెన్స్లోని కెరామైకోస్ ప్రాంతంలోని కార్యాలయం 4వ అంతస్తుకు వెళ్లి, ఒక ఉద్యోగిని తల దించుకో అని చెప్పిన తర్వాత కాల్పులు జరిపాడు. ఆ కాల్పులో మరో ఉద్యోగి కాలికి గాయాలయ్యాయి. నిందితుడు ట్రెంచ్కోట్ (పొడవైన కోట్)లో షాట్గన్ దాచుకున్నాడు. “అతడు లోపలికి వెళ్లి 4వ అంతస్తుకు చేరుకున్నాడు. షాట్గన్ ఎత్తి ఒక ఉద్యోగికి తల దించుకోమని చెప్పి, మరొకరిని గాయపరిచాడు” అని వార్వెరిస్ ఈఆర్టీ రేడియోకు చెప్పారు. గాయపడ్డ ఉద్యోగినే లక్ష్యంగా తీసుకుని కాల్పులు జరిపినట్లు కనిపించలేదని తెలిపారు. గాయపడ్డ ఉద్యోగిని ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలిలోనే పోలీసులు అతని కాలికి టోర్నికెట్ (రక్తస్రావం ఆపేందుకు బిగించి కట్టే పట్టు) పెట్టారు. గ్రీక్లో తుపాకీ హింస తక్కువగా ఉంటుంది. అక్కడ తుపాకులకు అనుమతులు అంత సులభంగా ఇవ్వరు. -
ఈ సారి వేసవి సెలవుల ఎంజాయ్మెంట్ ఉండదా?
వేసవి సెలవులు అంటేనే అందరికీ గుర్తొచ్చేది ప్రయాణాలు, సందడి. ఎండలు మండిపోతున్నా ఎన్నో పర్యాటక ప్రదేశాలకు వెళ్తుంటారు చాలా మంది. వేసవి సెలవులు అంటేనే వచ్చే ఉత్సాహం వేరు. చాలా మంది చల్లని ప్రదేశాలకు వెళ్తుంటారు. ఎండ వేడి నుండి తప్పించుకోవడానికి చాలామంది హిల్ స్టేషన్లకు వెళ్తుంటారు. ఊటీ, కొడైకెనాల్, సిమ్లా, మనాలీ, అరకు వ్యాలీ వంటి ప్రాంతాలు పర్యాటకులతో కిక్కిరిసిపోతాయి. ప్రకృతి ఒడిలో, పచ్చని కొండలు, జలపాతాలు, చల్లని గాలి మనసుకు ఎంతో హాయినిస్తాయి. డబ్బున్న వారు విదేశాలకు వెళ్తుంటారు. బిజీగా ఉండే తల్లిదండ్రులకు, చదువులతో అలసిపోయిన పిల్లలకు ఈ సెలవులు ఒక వరప్రసాదం. పర్యాటక ప్రదేశాలకు వెళ్లి కొత్త విషయాలను కూడా నేర్చుకోవచ్చు. అయితే, ప్రస్తుతం నెలకొన్న ఇంధన కొరతలు వేసవి సెలవుల ఎంజాయ్మెంట్ను చెడగొడతాయా?ఏం జరుగుతోంది? ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం వల్ల ఏర్పడిన సరఫరా సమస్యల కారణంగా డీజిల్, జెట్ ఇంధన కొరతలు పెరిగి వేసవి సెలవుల్లో పర్యాటకుల సంఖ్య తగ్గిపోయే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. హార్మూజ్ జలసంధి ఇంకో 2 లేదా 3 నెలలు మూసి ఉంటే ప్రపంచం మొత్తం.. కొన్ని ఆసియా దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్నట్లే ఇంధన కొరతలు ఎదుర్కొంటుందని నిపుణులు చెప్పారు. ఫిబ్రవరి చివరలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ సరఫరాలో సుమారు ఐదవ వంతు వెళ్లే హార్మూజ్ జలసంధి మార్గాన్ని ఇరాన్ మూసివేసింది. అంతర్జాతీయ ఇంధన సంస్థ తెలిపిన వివరాల ప్రకారం రోజుకు సుమారు 11 మిలియన్ బ్యారెళ్ల చమురు మార్కెట్కు రాకుండా నిలిచిపోతోంది. గల్ఫ్ ప్రాంత రిఫైనరీలు కూడా పెద్ద మొత్తంలో డీజిల్, జెట్ ఇంధనం ఉత్పత్తి చేస్తాయి. ఈ సరఫరాలు లేకపోతే ప్రపంచంలో తీవ్ర ప్రభావాలు తప్పవని నిపుణులు చెప్పారు. ఆఫ్రికా, ఆసియా దేశాల్లో కొన్ని ఇప్పటికే ఇంధనం లేదా విద్యుత్ను పరిమితంగా వినియోగించాల్సి వచ్చింది. యూరోపియన్ కమిషన్, సభ్య దేశాలు కనీసం తాత్కాలికంగా సరఫరాలపై భరోసా ఇవ్వడానికి ప్రయత్నించాయి.వేసవిలో ఎందుకు ఆందోళన?వేసవిలో కుటుంబాలు కార్లలో ప్రయాణించడం లేదా విమానాల్లో సెలవులకు వెళ్లడం ఎక్కువగా ఉంటుంది. సరఫరా తగ్గినప్పుడు ఆసియా, యూరప్ మధ్య పోటీ పెరుగుతుంది. ఇదే పరిస్థితి 2022లో రష్యా ఉక్రెయిన్పై దాడి తర్వాత కనపడింది. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి కనిపిస్తోంది. భారత్లో ఇంధన కొరత వల్ల ఇప్పటికే చాలా మంది ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు.ఒక ఇంధన రంగ నిపుణుడు చెప్పిన వివరాల ప్రకారం.. యూరప్ అధిక ధరలు చెల్లించి ఇంధన కొరతలు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. దీంతో యూరప్ ముందుగా ధరల షాక్కు గురయ్యే ప్రమాదం ఉంది. కానీ గల్ఫ్ నుంచి సరఫరాలు నిలిచిపోతే కొరతలు కూడా ఏర్పడవచ్చు. రిస్టాడ్ ఎనర్జీ సంస్థలో ఆయిల్ మార్కెట్లు, డౌన్స్ట్రీమ్ వైస్ ప్రెసిడెంట్ జనివ్ షా తెలిపిన వివరాల ప్రకారం.. వేసవిలో యూరప్లో డీజిల్, జెట్ ఇంధన కొరతలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. పశ్చిమాసియా, ఆసియా నుంచి వచ్చే కీలక సరఫరాలు ప్రస్తుత అంతరాయం వల్ల తగ్గాయి. విమానయాన సంస్థలు జెట్ ఇంధన ధరలు పెరగడంతో టికెట్ ధరలు పెంచాయి, కొన్ని విమానాలను తగ్గించాయి. కొన్ని వారాల్లోనే జెట్ ఇంధన కొరతలు రావచ్చన్న సూచనలు ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ ఇంధన కమిషనర్ డాన్ జోర్గెన్సెన్ స్కై న్యూస్కు చెప్పిన వివరాల ప్రకారం.. దురదృష్టవశాత్తు చాలా మంది సెలవులు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. విమానాలు రద్దు కావచ్చు లేదా టికెట్లు చాలా ఎక్కువ ధరలకు లభించవచ్చు.చాలా దేశాల వద్ద వ్యూహాత్మకంగా చమురు నిల్వలు ఉంచుకున్నాయి. అంతర్జాతీయ ఇంధన సంస్థలో భాగమైన దేశాలు యుద్ధం ప్రారంభ దశలోనే ధరలు పెరగకుండా ఆ నిల్వలను వినియోగించాయి. కొరతలు రాకుండా మళ్లీ వాటిని ఉపయోగించవచ్చు. యూరోపియన్ యూనియన్ దేశాలు రిఫైనరీ ఉత్పత్తిని గరిష్ఠ స్థాయికి పెంచడానికి ప్రయత్నిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో డీజిల్, జెట్ ఇంధన ఉత్పత్తి పెంచే ప్రయత్నం జరుగుతోంది. -
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఇప్పుడెలా ఉన్నారు?
న్యూఢిల్లీ: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై వచ్చిన వదంతులను భారత్లోని ఆయన ఉప ప్రతినిధి డాక్టర్ మొహమ్మద్ హొస్సేన్ జియాయీనియా ఖండించారు. మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి బాగుందని చెప్పారు.“మా సుప్రీం లీడర్ హజ్రత్ అయతొల్లా సయ్యిద్ మొజ్తబా ఖమేనీ పరిస్థితి దేవుని కృప వల్ల బాగుంది. కొన్ని రోజుల క్రితం మాకు అందిన సమాచారం ప్రకారం.. ఆయన పరిస్థితి బాగుంది” అని జియాయీనియా తెలిపారు. ఖమేనీ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాల్లో వాస్తవాలు లేవని చెప్పారు. ఆయన ఆరోగ్యం బాగోలేదని, కొన్ని సమస్యలు ఉన్నాయని వస్తున్న వదంతులన్నీ నిజం కాదని పేర్కొన్నారు.పశ్చిమాసియా ఘర్షణపై ఇరాన్ వైఖరిని మరోసారి చెబుతూ.. “యుద్ధం ప్రారంభం నుంచే మా దివంగత సుప్రీం లీడర్ హజ్రత్ అయతొల్లా సయ్యిద్ అలీ ఖమేనీ చెప్పిన వాక్యాన్ని మేము చెబుతున్నాము. అమెరికన్లు, మా శత్రువులు ఈ యుద్ధాన్ని ప్రారంభించారు, కానీ ఈ యుద్ధాన్ని ముగించేది మాత్రం మేమే. ఈ యుద్ధం ఎలా ముగుస్తుందో మేమే నిర్ణయిస్తాము’’ అని చెప్పారు.గతవారం న్యూ యార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడుల తర్వాత మొజ్తబా ఖమేనీ బహిరంగంగా ఎక్కడా కనపడలేదు. ఆ దాడులు మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ నివసించిన భవన సముదాయంపై జరిగాయి. ఆ ఘటనలో ఆయన భార్య, కుమారుడు మరణించారు.ఆ తర్వాత మొజ్తబా ఖమేనీ వద్దకు ఎవరినీ వెళ్లనివ్వడం లేదు. ప్రధానంగా వైద్య సిబ్బంది మాత్రమే ఆయనను చూసుకుంటున్నారు. దాడుల్లో గాయాల నుంచి ఆయన కోలుకుంటున్నారని న్యూ యార్క్ టైమ్స్ తెలిపింది.పశ్చిమాసియా ఘర్షణ ముగింపుకు ప్రయత్నాలు, రష్యా, చైనా, భారత్ పాత్రపై జియాయీనియా స్పందిస్తూ.. “ప్రతి దేశం పాత్ర పోషించవచ్చు, అది సానుకూలం లేదా ప్రతికూల పాత్ర కూడా కావచ్చు” అని చెప్పారు. ప్రతి ఒక్కరూ గ్యాస్, చమురు ధరల గురించి ఆందోళన చెందుతున్నారని.. కానీ, ప్రాణాలు కోల్పోతున్న ప్రజల జీవన విలువ గురించి ఎవరూ ఆందోళన చెందడం లేదని అన్నారు.ఇరాన్ ప్రజలు ఐక్యంగా ఉన్నారని, దేశంలో అంతర్గత ఉద్రిక్తతలపై వచ్చే నివేదికలు, సూచనలు ప్రభుత్వ వ్యవస్థ గురించి అవగాహన లేని వారు చెబుతున్నారని పేర్కొన్నారు. ఇరాన్ ప్రభుత్వ వ్యవస్థ ఒక వ్యక్తిపై ఆధారపడదని, అది రిపబ్లిక్ అని చెప్పారు. -
పూర్తిగా పతనమయ్యే స్థితిలో ఇరాన్: ట్రంప్
వాషింగ్టన్ డీసీ: ‘ఇరాన్ పూర్తిగా పతనమయ్యే స్థితిలో ఉంది. ఈ విషయాన్ని ఇరాన్ మాకు తెలిపింది. ఇరాన్ తమ నాయకత్వ పరిస్థితిని సర్దుబాటు చేసుకునేందుకు వీలైనంత త్వరగా హార్మూజ్ జలసంధిని తెరవాలని కోరుతోంది’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం అన్నారు. ఇరాన్ అంతర్గత నాయకత్వ సంక్షోభం కారణంగానే ఆ వ్యూహాత్మక జలమార్గాన్ని తెరవాలని కోరుతోందని, ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని ట్రూత్ సోషల్ పోస్ట్లో ట్రంప్ తెలిపారు. ప్రపంచ చమురు రవాణాలో అధిక భాగం సాగే కీలకమైన సముద్ర మార్గం హార్మూజ్ జలసంధి. దాని చుట్టూ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంటో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం నెలకొన్న శత్రుత్వాన్ని ఆపే లక్ష్యంతో ఇరాన్ తాజాగా చేసిన దౌత్యపరమైన ప్రతిపాదనను తిరస్కరించడానికే తాను మొగ్గు చూపుతున్నట్లు ట్రంప్ అంతకుముందే సూచించారు. హార్మూజ్ జలసంధిని తెరవాలని, అణు కార్యక్రమానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చను ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో జరపాలని ఇరాన్ సూచించినట్లు సమాచారం.తాజాగా జాతీయ భద్రతా అధికారులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు సందేహాలను వ్యక్తం చేశారు. అలాగే, ఇరాన్లోని యురేనియం నిల్వల గురించి చర్చించకుండా కీలకమైన హార్మూజ్ జలమార్గాన్ని తిరిగి తెరిస్తే అమెరికా దౌత్యపరంగా విధిస్తున్న ఒత్తిడి ఇక ఉండదని పరిపాలనా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, దిగ్బంధనాన్ని కొనసాగించడం వల్ల కూడా ప్రమాదాలు ఉన్నాయి. జలసంధి మూసివేత వల్ల పెరిగిన ఇంధన ధరలు అమెరికాలో ఇంధన ఖర్చులను భారీగా పెంచే అవకాశం ఉంది. అమెరికా తదుపరి వ్యూహంపై స్పష్టత రాలేదు.ఇదే సమయంలో, కొనసాగుతున్న సంఘర్షణను ముగించడానికి వ్యూహాత్మక జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ నుంచి వచ్చిన కొత్త ప్రతిపాదనను ట్రంప్, ఆయన జాతీయ భద్రతా బృందం చర్చిస్తున్నట్లు వైట్ హౌస్ ధ్రువీకరించింది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ప్రతిపాదన చర్చకు వచ్చిందని చెప్పారు. -
చిన్నారుల కాళ్లు, చేతులు, కట్టేసి : డేకేర్ సెంటర్లో అమానుషం
ఇండోనేషియాలోని ఒక డేకేర్ సెంటర్లో చిన్న పిల్లలపై జరిగిన దారుణమైన వేధింపుల ఘటన దిగ్భ్రాంతి రేపింది. ఎంతో నమ్మకంతో, పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి డేకేర్ సెంటర్లో చేర్పిస్తే, అక్కడి సిబ్బంది వారిని తీవ్రంగా హింసించిన ఉదంతం కలకలం రేపింది. పసిపిల్లల కాళ్లు, చేతులు కట్టేసి మరి అమానుషంగా వేధిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్త మవుతున్నాయి. ఈ కేసులో పోలీసులు 13 మందిని అరెస్టు చేశారు.జావా ద్వీపంలోని యోగ్యకార్తాలో ఉన్న 'లిటిల్ అరేషా' (Little Aresha) అనే డేకేర్ సెంటర్లో రెండేళ్లలోపు వయసున్న పిల్లలు కేవలం డయాపర్లతో నేలపై పడుకుని ఉన్నారు. వారి కాళ్లు, చేతులను పాత గుడ్డలతో కట్టేసి ఉంచారు. అక్కడ పనిచేసిన ఒక మాజీ ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో, ఈ దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన సీసీటీవీ ఫుటేజీలో.. ఈ వీడియో నిజమైనదేనని పోలీసులు ధృవీకరించారు. గత శుక్రవారం (ఏప్రిల్ 24, 2026) పోలీసులు ఆ కేంద్రంపై దాడి చేశారు.This horrific daycare abuse in Yogyakarta, Indonesia is a nightmare.53 babies tied up, drugged, and neglected by strangers. 13 suspects arrested.This proves why women belong at home raising their own children. No daycare can replace a mother’s care. https://t.co/RXyicwynw5— MUSAFIR. (@Peoplepower08) April 28, 2026 Bayangin, udah percaya dan bayar daycare, tapi anakmu malah diperlakukan kayak giniKalau gk suka anak kecil, PLEASE jangan jadi pengasih anakOrang tua juga harus extra hati-hati milih daycare 😭Rekaman CCTV dari salah satu daycare di Banda Aceh🎥 ayakasakura_ pic.twitter.com/ihdD94DDBA— Si Paling Gen Z (@txtdarigenz97) April 28, 2026విచారణలో తేలిన భయంకర నిజాలు:కేవలం 3 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు ఉన్న ఒక గదిలో 20 మంది పిల్లలను కుక్కేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సెంటర్లో సుమారు 100 మంది పిల్లలు ఉండగా, అందులో సగానికి పైగా (50 మందికి పైగా) పిల్లలు వేధింపులకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పిల్లలు ఒకరినొకరు ఇబ్బంది పెట్టకుండా ఉండటానికే కాళ్లు, చేతులు కట్టేశామని నిందితులు పోలీసులకు చెప్పారు. సిబ్బంది కొరత కారణంగా పిల్లలకు స్నానం చేయించడం, బట్టలు వేయడం కష్టమై ఇలా చేశామని వారు కుంటి సాకులు చెప్పారు.అరెస్టులు - చర్యలు:ఇప్పటివరకు, ఈ కేసులో 13 మందిని అనుమానితులుగా గుర్తించి అరెస్టు చేశాం," అని నగర పోలీస్ చీఫ్ ఈవా గుణ పాండియా సోమవారం యోగ్యకార్తాలో విలేకరులతో అన్నారు. అరెస్టయిన వారిలో 11 మంది చైల్డ్ కేర్ వర్కర్లు, డేకేర్ సెంటర్ హెడ్మాస్టర్ మరియు ఆ సంస్థను నడిపే ఫౌండేషన్ హెడ్ ఉన్నారు. ఇదీ చదవండి: వాటర్ మిలన్ క్యాపిటల్ ఏది ? ఈ షాకింగ్ విషయాలు తెలుసా?తల్లిదండ్రుల ఆవేదన:గత శుక్రవారం తన 2 ఏళ్ల కొడుకును తీసుకెళ్లమని తోటి తల్లిదండ్రుల నుండి ఫోన్ కాల్ వచ్చినప్పుడు తాను దిగ్భ్రాంతికి గురయ్యానని తండ్రి, 42 ఏళ్ల నూర్మాన్ విండార్టో చెప్పారు. తన బిడ్డ కాళ్లు, చేతులు కట్టేసి వేధించబడ్డారని తెలిసి షాక్కు గురైనట్లు బాధను వ్యక్తం చేశారు. నా గుండె ముక్కలైపోయిందని వాపోయారు. తన బిడ్డ పదేపదే న్యుమోనియాతో ఆసుపత్రిలో చేరాడు. బట్టలు లేకుండా చల్లటి నేలపై పడుకోబెట్టడం వల్లే అలా జరిగి ఉండవచ్చని కూడా అనుమానిస్తున్నారు.ఈ ఘటనపై ప్రస్తుతం తదుపరి విచారణ కొనసాగుతోంది. దాదాపు అక్కడ పిల్లల్ని చేర్చిన వారందరిదీ ఇదే ఆవేదన. తమ పిల్లలపై జరిగిన ఈ పైశాచికంపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిందితులకు కఠినమైన మరణశిక్ష విధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఇండోనేషియా బాలల సంరక్షణ చట్టం ప్రకారం, నిందితులకు ఐదేళ్ల వరకు జైలు శిక్ష మరియు 100 మిలియన్ల రూపియాల జరిమానా విధించే అవకాశం ఉంది. ఇదీ చదవండి: భారీ అగ్ని ప్రమాదం: పైనుంచి దూకేసిన 50మంది యువతులు -
వాటర్ మిలన్ క్యాపిటల్ ఏది ? ఈ షాకింగ్ విషయాలు తెలుసా?
'ప్రపంచ పుచ్చకాయల రాజధాని'గా ఏ నగరాన్ని పిలుస్తారో మీకు తెలుసా? ఈ నగరం, ఏటా లక్షల పౌండ్ల పుచ్చకాయలను ఎగుమతి చేస్తుంది. 77 ఏళ్ల సంప్రదాయం, భారీ ఎగుమతి గణాంకాలతో, ఈ రసవంతమైన బిరుదు వెనుక ఉన్న రహస్యాలను తెలుసుకుందాం.పుచ్చకాయలు వేసవిలో తప్పక తినే ఒక అద్భుతమైన పండు. ఇవి వెచ్చని, ఎండ ఉన్న ప్రదేశాలలో, ముఖ్యంగా 24°C నుండి 30°C మధ్య ఉష్ణోగ్రతలు ఉండే చోట బాగా పెరుగుతాయి. ప్రజలు సాధారణంగా వసంతకాలం చివరలో విత్తనాలు నాటుతారు. కానీ ఇటీవలి కాలంలో దాదాపు 365 రోజులు అందుబాటులో ఉంటున్నాయి.ప్రపంచంలోనే పుచ్చకాయల (Watermelon)ను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం చైనా. అయితే క్రిస్ప్ కౌంటీలో ఉన్న జార్జియాలోని కార్డెల్, అధికారికంగా "ప్రపంచ పుచ్చ కాయల రాజధాని"గా గుర్తింపు పొందింది. దేశంలోని మరే ఇతర ప్రాంతం కంటే ఎక్కువగా పుచ్చకాయలను పండించి, ఎగుమతి చేయడం వల్ల దీనికి ఈ హోదా లభించింది. 2026లో, ఈ నగరం తన అత్యాధునిక రైతు బజారు మరియు 1949 నుండి విజయవంతంగా కొనసాగుతున్న వార్షిక పుచ్చకాయల దినోత్సవాల పండుగ మద్దతుతో ఈ పరిశ్రమలో అగ్రగామిగా నిలిచింది.పుచ్చకాయకు ఏ దేశం ప్రసిద్ధి చెందింది?ప్రపంచ పరిశ్రమలో అగ్రగామిగా నిలుస్తూ, పుచ్చకాయలకు చైనా అత్యంత ప్రసిద్ధి చెందిన దేశం. 2026లో, ప్రపంచ మొత్తం ఉత్పత్తిలో సుమారు 60-63శాతం వాటాతో, 63 మిలియన్ టన్నులకు పైగా పంటను చైనా పండించింది. ఈ పండు చైనీస్ సంస్కృతిలో ముఖ్యమైన భాగం. ఆతిథ్యానికి చిహ్నంగా ఉపయోగిస్తారట.పుచ్చకాయను ఏ దేశం ఎక్కువగా ఇష్టపడుతుంది?మొత్తం మీద ఏ దేశంతో పోల్చినా చైనానే అత్యధికంగా పుచ్చకాయలను తింటుంది, కానీ అల్జీరియా ప్రజలు తలసరి అత్యధికంగా, సంవత్సరానికి దాదాపు 49 కిలోలు తింటారు. టర్కీ కూడా అధిక తలసరి వినియోగానికి ప్రసిద్ధి చెందింది, అక్కడ తలసరి 37 కిలోలు తింటారు. ఈ ప్రదేశాలలో, వేడిలో శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడానికి పుచ్చకాయ ఒక ప్రసిద్ధ మార్గం, ఎందుకంటే ఇందులో 92% నీరు ఉంటుంది. చాలా చవకైనది.పుచ్చకాయ అసలు ఏ దేశానికి చెందినది?పుచ్చకాయ మొదటగా ఈశాన్య ఆఫ్రికాలో, ప్రస్తుతం సూడాన్గా పిలవబడే ప్రాంతంలో పెరిగింది. 4,000 సంవత్సరాల కంటే ముందే ప్రాచీన ఈజిప్షియన్లు పుచ్చకాయలను పండించేవారని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వారి సమాధులలో ఈ పండు చిత్రాలు కనిపిస్తాయి. తొలితరం పుచ్చకాయలు తరచుగా చేదుగా ఉండేవి, కానీ నైలు లోయలోని రైతులు క్రమంగా వాటిని మనం ఈ రోజు తినే వాటిలాగా తీపిగా , ఎర్రగా ఉండేలా అభివృద్ధి చేశారు.పుచ్చకాయను అత్యధికంగా ఎగుమతి చేసే దేశం ఏది?పుచ్చకాయ ఎగుమతులలో స్పెయిన్ మరియు మెక్సికో ప్రపంచంలో అగ్రగామిగా ఉన్నాయి. స్పెయిన్ యూరోపియన్ మార్కెట్కు అధిక భాగాన్ని సరఫరా చేస్తుంది, ప్రతి సంవత్సరం సుమారు 790,000 టన్నులను ఎగుమతి చేస్తుంది. మెక్సికో ప్రధానంగా అమెరికాకు ఎగుమతి చ్తేఉంది. అది తన అవసరాలను తీర్చుకోవడానికి 800,000 టన్నులకు పైగా దిగుమతి చేసుకుంటుంది. ఈ వాణిజ్య మార్గాలు చల్లని ప్రాంతాల ప్రజలు ఏడాది పొడవునా పుచ్చకాయలను ఆస్వాదించేందుకు తోడ్పడతాయి.ఇదీ చదవండి: ‘బోష్’ మహిళా ఉద్యోగిని అనుమానాస్పద మరణంప్రపంచంలో అత్యంత తీయని పుచ్చకాయ ఎక్కడ దొరుకుతుంది?డెన్సుకే. ఇది దాని ప్రత్యేకమైన తియ్యని, విలాసవంతమైన రుచికి ప్రసిద్ధి చెందింది. నల్లని తొక్క కలిగిన ఈ అరుదైన పుచ్చకాయలలో, సాధారణ పుచ్చకాయల కంటే చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ పుచ్చకాయను జపాన్లోని ఉత్తర ద్వీపమైన హొక్కైడోలో మాత్రమే పండిస్తారు. ఇవి దొరకడం కష్టం కావడం వల్ల రుచిలో అత్యంత మధురంగా ఉండటం వల్ల, వీటికి ఎంతో విలువ ఉంటుంది; వీటిలో అత్యుత్తమమైనవి తరచుగా 6,000డాలర్ల కంటే ఎక్కువ ధరకు అమ్ముడవుతుంటాయి.ఇదీ చదవండి: ట్రెండింగ్లో పుచ్చ : ఎన్ని లాభాలో తెలుసా? కానీ బహుపరాక్! -
‘ఓపెన్ఏఐ’ సంచలనం.. రూ. 845 కోట్లతో అల్జీమర్స్పై యుద్ధం
లండన్: వృద్ధాప్యంలో మనిషిని జ్ఞాపకాలకు దూరం చేసే ‘అల్జీమర్స్’ వ్యాధికి ఇప్పటివరకూ సరైన చికిత్స అందుబాటులోకి రాలేదు. అయితే కృత్రిమ మేధ (ఏఐ) ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేయగలదని, అల్జీమర్స్ అంతానికి బాటలు వేస్తుందని ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రాణాంతక వ్యాధికి విరుగుడు కనిపెట్టేందుకు ఏకంగా వంద మిలియన్ డాలర్ల(రూ. 845 కోట్లు) భారీ విరాళాన్ని ప్రకటించి, వైద్యరంగంలో సరికొత్త ఆశలు రేకెత్తించారు.సరికొత్త ఆవిష్కరణలకు ఏఐ తోడ్పాటుఅల్జీమర్స్ వ్యాధికి కారణాలు, వ్యాధి నిర్ధారణ, చికిత్స విధానాలను వేగవంతం చేయడంలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషిస్తుందని ‘టుడే’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆల్ట్మాన్ స్పష్టం చేశారు. మెడికల్ హిస్టరీలోని అత్యంత క్లిష్టమైన సమస్యల్లో అల్జీమర్స్ ఒకటని, సంక్లిష్టమైన డేటాను విశ్లేషించి ఖచ్చితమైన సమాచారాన్ని అందించడంలో ఏఐ అద్భుతాలు చేయగలదని ఆయన తెలిపారు. ఈ వ్యాధికి సరైన మందును కనిపెట్టే దిశగా ప్రపంచాన్ని మరింత వేగంగా నడిపించే సత్తా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఉందన్నారు.ఆరు సంస్థలతో భాగస్వామ్యంకేవలం మాటలకే పరిమితం కాకుండా, అల్జీమర్స్ పరిశోధనలను ముమ్మరం చేసేందుకు ఓపెన్ఏఐ ఫౌండేషన్ తరపున $100 మిలియన్ల నిధులను ఆల్ట్మాన్ కేటాయించారు. ఇందుకోసం ప్రపంచ స్థాయిలోని ఆరు ప్రముఖ పరిశోధనా సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నారు. కొత్త డేటాను సృష్టించడం, సరికొత్త ఔషధాలను డిజైన్ చేయడం, అలాగే ఇప్పటికే ఆమోదం పొందిన మందులను ఈ వ్యాధిపై ఎలా ప్రయోగించవచ్చో తెలుసుకోవడం ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశం. ఈ నిర్ణయం లక్షలాది బాధిత కుటుంబాలకు ఒక గొప్ప ఊరటనిస్తుందని అల్జీమర్స్ అసోసియేషన్ ప్రశంసించింది.భారత్లోనూ తీవ్ర ప్రభావంప్రపంచవ్యాప్తంగా వృద్ధులను పట్టిపీడిస్తున్న డిమెన్షియా కేసుల్లో 60-70 శాతం అల్జీమర్స్ వల్లే నమోదవుతున్నాయి. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారిలో ఈ ముప్పు అధికం. ఒక్క భారతదేశంలోనే దాదాపు 8.8 మిలియన్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని, అమెరికాలో 7 మిలియన్ల మంది బాధితులు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. మెదడులోని కణాలను నాశనం చేస్తూ, ప్రాణాలను బలిగొనే ఈ మహమ్మారికి చెక్ పెట్టేందుకు, ఏఐ సాంకేతికతతో జరుగుతున్న ఈ నూతన పరిశోధనలు మానవాళి భవిష్యత్తునే మార్చేయబోతున్నాయని వైద్య నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ‘హార్ముజ్’ పేరెత్తాడని.. పాక్ యువకునికి నరకం! -
ట్రంప్ను డైలామాలోకి నెట్టిన ఇరాన్!
ఇరాన్, అమెరికా మధ్య చర్చల విషయంలో ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే, ఇరాన్ తాజాగా చేసిన కొత్త ప్రతిపాదనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అణ్వస్త్ర కార్యక్రమాన్ని మినహాయించి ఇరాన్తో చర్చలు జరపడంలో అర్థమే ఉండదని అమెరికా ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాన్ని అడ్డుకోవడం లక్ష్యంగా ప్రారంభమైన నేపథ్యంలో దాని ప్రస్తావనే ఆలస్యం కావడంపై మల్లగుల్లాలు పడుతున్నట్టు కథనాలు వెలువడ్డాయి.అయితే, శాంతి చర్చల్లో భాగంగా అమెరికాకు ఇరాన్ ఇటీవలే కొత్త ప్రతిపాదనలను పాకిస్తాన్ మధ్యవర్తుల ద్వారా పంపించింది. ఇందులో భాగంగా శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం, హార్మూజ్ జలసంధిని తెరవడం అనేవి జరిగిన తర్వాతే తమ అణ్వస్త్ర కార్యక్రమంపై చర్చలు జరుపుతామని ఇరాన్ తేల్చి చెప్పింది. మరోవైపు.. అణ్వస్త్ర కార్యక్రమంపై ఇరాన్తో చర్చలు ఫలప్రదమైన తర్వాతే మిగతా విషయాలపై ఫోకస్ పెడతామని అమెరికా వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ పంపిన నూతన ప్రతిపాదనలపై చర్చించేందుకు తన సలహాదారులతో ట్రంప్ తాజాగా సమావేశమైనట్లు తెలిసింది. అణ్వస్త్ర కార్యక్రమంపై చర్చలు జరగనిదే, మిగతా అంశాలపై ఇరాన్తో చర్చలను మొదలుపెట్టలేమని ట్రంప్ తేల్చి చెప్పినట్లు అధికార వర్గాలు చెప్పాయి. ఇరాన్ ప్రతిపాదించిన క్రమంలో చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లలేమని ట్రంప్ స్పష్టం చేశారని పేర్కొన్నాయి.ఇరాన్కు నో ఛాన్స్.. ఇరాన్తో శాంతి చర్చలపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. మార్కో రూబియో తాజాగా ఫాక్స్ న్యూస్తో మాట్లాడుతూ..‘ఇరాన్ ఇక ఏ దశలోనూ అణ్వాయుధాలను అభివృద్ధి చేయలేదని నిర్ధారించే ఒప్పందం కుదరాల్సిందే. ఈ విషయంలో ఇరాన్కు తప్పించుకునే అవకాశాన్ని ఇవ్వకూడదు. ఇరాన్ నుంచి దీనిపై అమెరికా ధ్రువీకరణ పొందాలి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో.. అమెరికా, ఇరాన్ శాంతి చర్చల ప్రక్రియలో మరోసారి ప్రతిష్టంభన ఏర్పడింది. ఇరు దేశాలూ తమ షరతుల ప్రకారమే చర్చలు జరగాలని వాదిస్తున్నాయి. వాదనను నెగ్గించుకునే యత్నంలో అమెరికా, ఇరాన్ ఉండటంతో చర్చల ప్రక్రియ ముందుకు సాగే పరిస్థితులు కనిపించడం లేదు.ఇరాన్ ప్రతిపాదనలు ఇవే...ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించడం, మళ్లీ ఇరాన్పై దాడులు జరగవు అనే హామీలను పొందడం.ఇరాన్ ఓడరేవుల ముట్టడిని అమెరికా ఆపడం, హార్మూజ్ జలసంధిని తెరవడం.మొదటి రెండు ప్రతిపాదనలు అమల్లోకి వచ్చాక తమ అణ్వస్త్ర కార్యక్రమం, సంవర్ధిత యురేనియం హక్కులపై అమెరికాతో చర్చలను మొదలుపెడతామని ఇరాన్ ప్రతిపాదించింది. -
విమానం గాల్లో ఉండగానే ప్రసవం..!
విమానం గాల్లో ఉండగానే ప్రసవించడం అత్యంత అరుదుగా జరిగే సంఘటన. ఇలాంటి పరిస్థితిని అత్యంత అరుదైన వైద్య పరిస్థితిగా పేర్కొంటారు కూడా. అదృష్టవశాత్తు ఆ విమానంలో ఒక డాక్టర్, ఇద్దరు నర్సులు ఉండటం వల్ల ఆ మహిళకు ఎలాంటి ఇబ్బంది పడకుండా విజయవంతంగా ప్రసవించింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..ఈ అరుదైన ఘటన డెల్టా ఫ్లైట్ 478 అట్లాంటా నుంచి పోర్ట్ల్యాండ్కు ప్రయాణిస్తుండగా చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి పోర్ట్ల్యాండ్కు ఐదు గంటల పాటు సాగిన విమాన ప్రయాణంలో ఒక మహిళ గాలిలోనే ప్రసవించింది. రాత్రి 9:30 గంటల ప్రాంతంలో వచ్చిన ప్రాథమిక అత్యవసర కాల్ ప్రకారం, సదరు మహిళ సుమారు 35 నిమిషాలుగా ప్రసవ నొప్పులతో బాధపడుతున్నట్లు తెలిసింది. దాంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వెంటనే అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఆ విమానంలో ఇద్దరు పైలట్లు, నలుగురు ఫ్లైట్ అటెండెంట్లతో సహా మొత్తం 153 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తూ, ప్రయాణికులలో ఒక డాక్టర్, ఇద్దరు నర్సులు ఉన్నారు. వారు వెంటనే రంగంలోకి దిగి, విమానం ల్యాండ్ కావడానికి ముందే శిశువును సురక్షితంగా ప్రసవింపజేయడానికి ఫ్లైట్ అటెండెంట్లతో కలిసి పనిచేశారు. ఆ తర్వాత శిశువు బొడ్డు తాడుని కట్ చేసి పాపకు చుట్టగానే విమానం కిందకు దిగుతుంది. నిజానికి వాళ్లు ఎలాంటి సీటు బెల్టులు పెట్టుకోకముందే కిందకు ల్యాండ్ అవుతోంది విమానం. వాళ్లు సీటును పట్టుకుని నిల్చున్నారు. ఆ తర్వాత పాపను తల్లికి తిరిగి ఇచ్చేసి విమానాన్ని రన్వేపై ముందుకు పోనిచ్చారు. దాంతో విమానంలో ఉన్నవారంతా ఆ తల్లిని చూసి హమ్మయ్యా..! తల్లిబిడ్డ సురక్షితంగా ఉన్నారంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా విమానం అత్యవసరంగా ల్యాండ్ కావడానికి 30 నిమిషాల ముందే చకచక జరిగిపోయింది. కాగా, తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని, విమానంలోనే పాప పుట్టిందని సదరు విమానాయన సంస్థ ప్రకటించింది.(చదవండి: 144 ఏళ్ల క్రితం కేదార్నాథ్ ఆలయం ఎలా ఉండేదో తెలుసా..!) -
‘హార్ముజ్’ పేరెత్తాడని.. పాక్ యువకునికి నరకం!
ఇస్లామాబాద్: సోషల్ మీడియాలో ఏదైనా జోక్ వేసేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన వింత పరిస్థితి పాకిస్తాన్లో నెలకొంది. తమ రోజువారీ ట్రాఫిక్ కష్టాలను వర్ణిస్తూ, ఓ యువకుడు సరదాగా చేసిన ఓ పోస్ట్ ఏకంగా అతన్ని కటకటాల వెనక్కి నెట్టివేసింది.ఇస్లామాబాద్లోని టార్నోల్ రైల్వే క్రాసింగ్ వద్ద నిత్యం ఉండే ట్రాఫిక్ రద్దీపై ఓ యువకుడు సోషల్ మీడియాలో సెటైరికల్ పోస్ట్ చేశాడు. ‘టార్నోల్ రైల్వే క్రాసింగ్.. హార్ముజ్ జలసంధికి ఏమాత్రం తీసిపోదు. ఒకవేళ దీన్ని మూసివేస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయి’ అని అందులో రాసుకొచ్చాడు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి తరచూ వార్తల్లో నిలుస్తోంది. అలాంటి సున్నితమైన అంశాన్ని స్థానిక రైల్వే గేటుకు ముడిపెడుతూ, చేసిన ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్గా మారింది.పోలీసుల యాక్షన్.. కఠిన సెక్షన్ల కింద కేసుఆ పోస్ట్ కాస్తా వైరల్ కావడంతో ఇస్లామాబాద్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సదరు యువకుడిని అదుపులోకి తీసుకొని అతని మొబైల్ ఫోన్ను సీజ్ చేసి ఆధారాలు సేకరించారు. ప్రభుత్వ అధికారి ఆదేశాలను ధిక్కరించడం, అక్రమ నిర్బంధం, నేరానికి యత్నించడం వంటి పాకిస్తాన్ పీనల్ కోడ్లోని పలు కఠినమైన సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం రాజధాని, దాని పరిసర ప్రాంతాల్లో భద్రతా కారణాల దృష్ట్యా సెక్షన్ 144 అమల్లో ఉందని, అందుకే ముందస్తు భద్రతలో భాగంగానే ఈ అరెస్ట్ చేశామని పోలీసులు ఈ చర్యను సమర్థించుకుంటున్నారు.భావప్రకటనా స్వేచ్ఛపై మొదలైన తీవ్ర చర్చఅయితే, భద్రత పేరుతో పోలీసులు చేసిన ఈ అరెస్ట్పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం డార్క్ హ్యూమర్తో చేసిన ఓ చిన్న కామెంట్ను జాతీయ భద్రతా ముప్పుగా భావించి, అరెస్ట్ చేయడం ఏంటని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికీ పౌరుల భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని పలువురు మండిపడుతున్నారు. భద్రత, పౌర హక్కుల మధ్య సమతుల్యత పాటించడంలో అధికారులు విఫలమయ్యారని, ఒక జోక్కు ఇంతలా స్పందించడం సరికాదని స్థానిక పత్రికలు సైతం తమ సంపాదకీయాల్లో పోలీసుల తీరును ఎండగడుతున్నాయి.ఇది కూడా చదవండి: షాకింగ్: సన్యాసుల ముసుగులో భారీగా డ్రగ్స్ స్మగ్లింగ్! -
నేనే రాజునైతే సీన్ వేరేలా ఉంటుంది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి డెమోక్రట్లు అత్యంత ప్రమాదకరమని.. తనపై జరిగిన హత్యాయత్నానికి ఒకరకంగా వాళ్లే కారణమని ఆరోపించారు. ఈ క్రమంలో మీడియాపైనా ఆయన చిందులు తొక్కారు. ‘‘నేరాల విషయంలో మీడియా, డెమోక్రట్లు ఒకేలా ఉన్నాయి. నేను మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉన్నా. నో కింగ్స్ ఆందోళనలో పాల్గొన్న వ్యక్తే నాపై హత్యాయత్నం చేశాడు. నేరస్తుడు వైడ్ అవేక్స్ అనే టీంలో సభ్యుడిగా ఉన్నాడు. నో కింగ్స్ నిరసనలకు కొందరు కుట్రదారులు ఫండింగ్ చేశారు. రాజుల్లేరు.. నేను రాజును కాదు. నేనే గనుక రాజును అయితే సీన్ వేరేలా ఉండేది’’ అని అన్నారాయన. సీబీఎస్ ‘60 నిమిషాలు’ కార్యక్రమంలో జరిగిన ఇంటర్వ్యూలో ట్రంప్ పై వ్యాఖ్యలు చేశారు. తనపై జరిగిన హత్యాయత్నం గురించి స్పందిస్తూ.. అమెరికా అధ్యక్షులపై హత్యాయత్నం కొత్తేం కాదు. అది ఎప్పుడూ జరిగేదే. గతంలో గతంలో అబ్రహం లింకన్, మెక్ కిన్లే, కెనెడీలపైనా జరిగాయి. డెమోక్రట్ల విషపూరిత ప్రసంగాల వల్లే ఇలా జరుగుతోంది. వాళ్లు అమెరికాకు అత్యంత ప్రమాదకరం’’ అని అన్నారాయన. అదే సమయంలో కాల్పులకు దిగిన నిందితుడు కోలో టోమస్ ఎలెన్ చేసిన సంచలన ఆరోపణలను సీబీఎస్ ప్రతినిధి నోరా ఓడోనెల్ ప్రస్తావించారు. అయితే.. ‘‘నేను రేపిస్ట్ను కాదు’’ అంటూ ట్రంప్ ఆమెపై ఆయన ఫైర్ అయ్యారు. -
షాకింగ్: సన్యాసుల ముసుగులో భారీగా డ్రగ్స్ స్మగ్లింగ్!
కొలంబో: శ్రీలంకలో కనీవినీ ఎరుగని ఒక ఉదంతం వెలుగుచూసింది. సన్యాస వస్త్రధారణలో ఉన్న 22 మంది వ్యక్తులు భారీగా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ కొలంబో విమానాశ్రయంలో పట్టుబడ్డారు. థాయ్లాండ్ నుండి తిరిగి వస్తున్న వీరి వద్ద 110 కిలోల గంజాయి (కుష్, హషీష్) లభించడం అధికార వర్గాలను సైతం నివ్వెరపరిచింది.సూట్కేసుల్లో రహస్య అరలుకొలంబో విమానాశ్రయానికి చేరుకున్న ఈ బృందాన్ని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా, అసలు బాగోతం బయటపడింది. స్వీట్లు, పాఠశాల సామగ్రితో పాటు సూట్కేసుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ఫాల్స్ వాల్స్’ (రహస్య అరలు) వెనుక ఈ మత్తుపదార్థాలను దాచారు. ఒక్కొక్కరి వద్ద సుమారు 5 కిలోల చొప్పున అత్యంత ప్రమాదకరమైన కుష్, హషీష్ రకాలకు చెందిన గంజాయి ప్యాకెట్లు లభించాయి. సన్యాసుల ముసుగులో ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేయడానికి యత్నించడం ఇదే తొలిసారని అధికారులు అంటున్నారు.ఉచిత థాయ్లాండ్ ట్రిప్ వెనుక మాస్టర్మైండ్పట్టుబడిన ఈ సన్యాసుల(వేషధారణ)లో ఎక్కువ మంది విద్యార్థులే. ఒక గుర్తుతెలియని స్పాన్సర్ వీరికి నాలుగు రోజుల థాయ్లాండ్ పర్యటనకు పూర్తి ఖర్చులు భరించినట్లు సమాచారం. ఈ ట్రిప్ ఆర్గనైజ్ చేసిన వ్యక్తిని పోలీసులు కొలంబో శివార్లలో అరెస్టు చేశారు. అతడు ఈ బృందంతో ప్రయాణించలేదు కానీ, వారు తీసుకొస్తున్న పార్శిల్స్ అన్నీ ‘విరాళాలు’ అని నమ్మించే ప్రయత్నం చేశాడు.7 రోజుల రిమాండ్పట్టుబడిన ఈ దొంగ సన్యాసుల మొబైల్ ఫోన్లను పోలీస్ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు పరిశీలించగా, వారు థాయ్లాండ్ ట్రిప్లో సాధారణ దుస్తులు ధరించి, విలాసవంతంగా ఎంజాయ్ చేసిన ఫోటోలు, వీడియోలు లభ్యమయ్యాయి. వీరందరినీ ఆదివారం న్యాయస్థానం ముందు హాజరుపరచగా, తదుపరి విచారణ నిమిత్తం కోర్టు ఏడు రోజుల పాటు రిమాండ్కు ఆదేశించింది. -
ఇరాన్కు రష్యా అండ.. యుద్ధంలో బిగ్ ట్విస్ట్?
మాస్కో: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ రష్యా-ఇరాన్ దేశాల మధ్య బలపడుతున్న మైత్రి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నరాలు తెగే ఉత్కంఠను రేపుతోంది. అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య కూటమికి సవాలు విసురుతూ, ఈ రెండు దేశాల మధ్య బలపడుతున్న బంధం మరింత ఉత్కంఠ రేపుతోంది. కేవలం దౌత్యపరమైన మద్దతుకే పరిమితం కాకుండా, ఒకరి రక్షణ అవసరాలను మరొకరు తీర్చుకుంటూ కొనసాగుతున్న ఈ దోస్తీ.. ఇరాన్ వెనుక ఒక అగ్రరాజ్యం అండగా నిలబడిందనే సంకేతాన్ని స్పష్టంగా పంపుతోంది.ఈ విపత్కర పరిస్థితుల్లో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ చేపట్టిన దౌత్య పర్యటనలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పాకిస్తాన్, ఒమన్ దేశాల్లో పర్యటన ముగించుకుని ఆయన నేరుగా మాస్కో చేరుకోవడం వెనుక భారీ యుద్ధ వ్యూహం దాగి ఉందన్నది బహిరంగ రహస్యం. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో జరగబోయే భేటీలో ప్రాంతీయ భద్రతతో పాటు కీలకమైన రక్షణ ఒప్పందాలపై చర్చలు జరగనున్నాయి. రష్యాతో కలిసి దౌత్యపరమైన వ్యూహాలను ఖరారు చేయడం ద్వారా, అటు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ముప్పును, ఇటు అంతర్జాతీయ స్థాయిలో పాశ్చాత్య దేశాల ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని టెహ్రాన్ భావిస్తోంది.ఈ పరిణామాలన్నింటినీ మలుపు తిప్పుతూ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్కు ఇచ్చిన హామీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సెయింట్ పీటర్స్బర్గ్లో అబ్బాస్ అరాఘ్చీతో జరిగిన అత్యంత కీలక భేటీలో పుతిన్ మాట్లాడుతూ.. ఇరాన్ ప్రయోజనాలను కాపాడేందుకు మాస్కో తన సర్వశక్తులూ ఒడ్డుతుందని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో శాంతిని పునరుద్ధరించేందుకు ఇరాన్కు తమ పూర్తి మద్దతు ఉంటుందని, ఇరాన్ ప్రజలు ప్రస్తుత కష్టకాలాన్ని ధైర్యంగా అధిగమిస్తారని ఆయన భరోసా ఇచ్చారు. అంతర్జాతీయ పరిణామాలపై రెండు దేశాలు నిరంతరం సన్నిహితంగా చర్చలు జరుపుతాయని, ఈ వ్యూహాత్మక సహకారం భవిష్యత్తులోనూ అప్రతిహతంగా కొనసాగుతుందని పుతిన్ ప్రకటించడం ఈ దోస్తీ ఎంతటి బలమైనదో చాటిచెబుతోంది. -
వ్యూహం మార్చిన ట్రంప్.. IRGCకి తొలి దెబ్బ!
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం అసలు సిసలు స్టేజ్కు చేరుకుంది. ఇరాన్పై అమెరికా పదునైన వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఆర్థికంగా ఇరాన్ దెబ్బకొట్టే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇరాన్ పోర్టులకు వెళ్లే, అక్కడి నుంచి బయలుదేరే అన్ని నౌకలను అడ్డుకుంటోంది. సముద్ర దిగ్భందనం చేసింది. దీంతో, ఇరాన్ రోజుకు దాదాపు 500 మిలియన్ డాలర్లు నష్టం చవిచూస్తోంది.ఇక, తాజాగా అమెరికా మరో మాస్టర్ ప్లాన్ చేసింది. అమెరికా ఇరాన్పై ఒత్తిడి పెంచడానికి విమానయాన రంగాన్ని కీలకంగా ఉపయోగిస్తోంది. అమెరికా ఆపరేషన్ ఎకానామిక్ ఫ్యూరీలో భాగంగా ఇరాన్ విమానయాన సంస్థలతో లావాదేవీలు జరిపే కంపెనీలపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ విమానాలకు జెట్ ఇంధనం, క్యాటరింగ్, ల్యాండింగ్ సేవలు లేదా నిర్వహణ వంటి సహాయాన్ని అందించే సంస్థలను సాయం నిలిపివేయాలని హెచ్చరించింది. ఈ క్రమంలో, ఇరాన్ ఎయిర్లైన్స్కి సేవలు అందించే ఏ కంపెనీ అయినా ఆంక్షలకు గురయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. ఆయా కంపెనీలపై ఆంక్షలు విధిస్తామని అమెరికా పేర్కొంది.కాగా, ఇరాన్కు Iran Air మరియు Mahan Air విమాన సంస్థలు ఉన్నాయి. ఇవి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కు మద్దతు ఇస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. అమెరికా ప్రకారం, ఇరాన్ ఎయిర్లైన్స్ IRGC కోసం ఆయుధాలు, సిబ్బంది, సామగ్రి తరలించడానికి ఉపయోగపడుతున్నాయి. ఇందులో భాగంగానే ఎయిర్లైన్స్పై ఆంక్షలు విధించి ఆర్థికంగా ఇరాన్ను దెబ్బతీయాలనే ప్లాన్ చేసినట్టు తెలిసింది. అలాగే, ఇతర దేశాల ప్రభుత్వాలు కూడా తమ పరిధిలోని కంపెనీలు ఇరాన్ ఎయిర్లైన్స్తో సంబంధాలు పెట్టుకోకుండా చూడాలని అమెరికా కోరుతోంది.ప్రస్తుతం అమెరికా ఆంక్షల జాబితా (SDN List)లో ఇరాన్కు సంబంధించిన అనేక కంపెనీలు, షిప్పింగ్ సంస్థలు, రిఫైనరీలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా చైనా, హాంకాంగ్, యూఏఈ, లైబీరియా, మార్షల్ దీవులు, కేమన్ దీవులు వంటి దేశాలకు సంబంధించిన సంస్థలు. ఇరాన్ ఎయిర్లైన్స్పై అమెరికా ఆంక్షల వల్ల చైనా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వంటి దేశాల్లోని కొన్ని కంపెనీలు ఇప్పటికే నష్టపోయాయి. ముఖ్యంగా చైనా రిఫైనరీలు, షిప్పింగ్ కంపెనీలు, మరియు ఇరాన్ ఆయిల్ రవాణా నెట్వర్క్లతో సంబంధం ఉన్న సంస్థలు అమెరికా ఆర్థిక వ్యవస్థ నుండి వేరుచేయబడ్డాయి.ట్రంప్ వార్నింగ్యుద్ధం ముగించటానికి, కాల్పుల విరమణకు అంగీకరించడానికి కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉందని డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. లేదంటే వారి చమురు పైపులైన్లు పేలిపోతాయని తెలిపారు. ఇరాన్ చమురు ఎగుమతులను కొనసాగించలేకపోతే, యాంత్రికంగా, భూమి సహజశక్తుల కారణంగా పైపులైన్లు విఫలమవుతాయన్నారు. ఇరాన్కు భారీ పరిమాణంలో చమురు సరఫరా వ్యవస్థ ఉందని, ఏదైన కారణం చేత అది మూసుకుపోతే అప్పుడు ఇంధనాన్ని కంటైనర్లు లేదా నౌకల్లో నింపడం సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం ఇరాన్ అదే పరిస్థితి ఎదుర్కొటోందన్న ట్రంప్, దిగ్బంధనం కారణంగా వారి వద్ద నౌకలు కూడా లేవని తెలిపారు. ఆర్థికంగా ఇరాన్ బలహీనంగా ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు.ఆపరేషన్ ఎకనామిక్ ఫ్యూరీ..ఇరాన్పై 2025లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇరాన్కి సంబంధించిన ఆయుధాలు, డ్రోన్లు, ఆయిల్ స్మగ్లింగ్, విమాన రవాణా నెట్వర్క్లను అడ్డుకోవడమే లక్ష్యం.ప్రెషర్ పాయింట్: అంతర్జాతీయంగా విమానయాన సేవలు లేకుండా ఎయిర్లైన్స్ నడవలేవు. అందుకే ఈ రంగాన్ని ఆంక్షలతో బలహీనపరచాలని ప్రయత్నిస్తున్నారు.ప్రాంతీయ ఉద్రిక్తతలు: హార్మూజ్ జలసంధిలో ఇరాన్ బలగాలు వాణిజ్య నౌకలపై కాల్పులు జరిపిన ఘటనల తర్వాత ఈ హెచ్చరిక మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.ఆంక్షలు: అమెరికా వెలుపల ఉన్న కంపెనీలు కూడా ఇరాన్ ఎయిర్లైన్స్కి సేవలు అందిస్తే ఆంక్షలకు గురవుతాయి. ఆంక్షలు పడిన సంస్థలు అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థ, మార్కెట్లకు దూరమవుతాయి.సేవలు నిషేధం:జెట్ ఇంధనం సరఫరావిమాన మెయింటెనెన్స్, రిపేర్ఇన్-ఫ్లైట్ క్యాటరింగ్గ్రౌండ్ హ్యాండ్లింగ్ల్యాండింగ్, ఎయిర్పోర్ట్ ఫీజులుప్రపంచ వ్యాపారాలు: విమానయాన, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ రంగాల్లోని సంస్థలు నేరుగా ప్రభావితమవుతున్నాయి.ప్రాంతీయ ప్రభావం: హార్మూజ్ జలసంధి దిగ్భందనం వల్ల చమురు, గ్యాస్, ఎరువుల సరఫరా అంతరాయం. -
Indonesia: ఘోర రైలు ప్రమాదం.. ఏడుగురు మృతి
జకార్తా: ఇండోనేషియా రాజధాని జకార్తా శివార్లలోని బెకాసి ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న కమ్యూటర్ రైలును వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో ఎక్స్ప్రెస్ రైలు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, 81 మందికి పైగా ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు.కారు రూపంలో ముంచుకొచ్చిన ప్రమాదంఈ ఘోర ప్రమాదానికి ఓ టాక్సీ ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. రైల్వే అధికారి ఫ్రానోటో విబోవో తెలిపిన వివరాల ప్రకారం... లెవల్ క్రాసింగ్ వద్ద ఓ టాక్సీ.. కమ్యూటర్ రైలును ఢీకొట్టడంతో ఆ రైలు ట్రాక్ పైనే నిలిచిపోయింది. సరిగ్గా అదే సమయానికి ట్రాక్ పై వేగంగా దూసుకొచ్చిన రైలు.. ఆగి ఉన్న కమ్యూటర్ రైలును వెనుక నుంచి ఢీకొంది. మహిళల కోసం కేటాయించిన చివరి బోగీ తునాతునకలయ్యింది. ఈ రైలు ప్రమాదం నుంచి 240 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.క్షణాల్లో ముగిసిన జీవితాలు‘అంతా రెప్పపాటులో జరిగిపోయింది’ అని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 29 ఏళ్ల సౌసన్ సరిఫా అనే బాధితురాలు మీడియాకు తెలిపారు. బెకాసి తైమూర్ స్టేషన్లో రైలు దిగేందుకు ప్రయాణికులు సిద్ధమవుతుండగా, ఒక్కసారిగా భారీ శబ్దంతో వెనుక నుంచి మరో రైలు ఢీకొట్టిందని ఆమె వివరించారు. తప్పించుకునే సమయం లేకపోవడంతో ప్రయాణికులంతా ఒకరిపై ఒకరు పడిపోయారని, ఊపిరి ఆడక కిందన ఉన్న వారు మరణించి ఉండొచ్చని అన్నారు.. తాను పైభాగంలో ఉండటం వల్లే ప్రాణాలతో బయటపడ్డానని ఆమె తెలిపారు.శిథిలాల మధ్య ప్రాణాల కోసం పోరాటంప్రమాద స్థలంలో సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. నుజ్జునుజ్జయిన బోగీల మధ్య ఇద్దరు వ్యక్తులు ఇంకా ప్రాణాలతో చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. బోగీని ప్రత్యేక పరికరాల సాయంతో కత్తిరించి, బాధితులను రక్షించేందుకు మిలిటరీ, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, అగ్నిమాపక సిబ్బంది, రెడ్క్రాస్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇండోనేషియా రైల్వేలో నిర్వహణ లోపం వల్లే తరచుగా ఇలాంటి ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. 🇮🇩🚂⚠️ — Over the past hour, #Indonesian media reported, quoting the state-owned #KAI rail company, that two trains collided outside the Indonesian capital #JakartaThe accident ended killing at least two people and prompting a mass evacuation effort.Indonesian broadcaster… pic.twitter.com/DGl59EXIW8— Mahalaxmi Ramanathan (@MahalaxmiRaman) April 27, 2026 -
ట్రంప్ కోటకు కింగ్ చార్లెస్: 20 నిమిషాల ప్రసంగంపై ఉత్కంఠ
వాషింగ్టన్: ఇరాన్ వివాదం నేపథ్యంలో అమెరికా-బ్రిటన్ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను చల్లార్చేందుకు బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III రంగంలోకి దిగారు. నాలుగు రోజుల చారిత్రక పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్న ఆయనకు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్లో ఘన స్వాగతం పలికారు. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ పర్యటనలో కాంగ్రెస్ను ఉద్దేశించి ఆయన చేయబోయే ప్రసంగంపైనే అందరి దృష్టి నిలిచింది.చారిత్రక ఘట్టం: అమెరికా కాంగ్రెస్లో ప్రసంగం1991లో క్వీన్ ఎలిజబెత్ II తర్వాత అమెరికా చట్టసభ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్న తొలి బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్ III చరిత్ర సృష్టించనున్నారు. సుమారు 20 నిమిషాల పాటు సాగే ఈ ప్రసంగంలో ఉమ్మడి ప్రజాస్వామ్య విలువల ప్రాముఖ్యతను, రెండు దేశాల మధ్య దెబ్బతిన్న బంధాన్ని పునరుద్ధరించుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పనున్నారు. మంగళవారం వైట్హౌస్లో 21 తుపాకుల వందనంతో లాంఛనప్రాయ స్వాగతం అందుకున్న అనంతరం, ట్రంప్ దంపతులతో ఓవల్ ఆఫీసులో రాజు, క్వీన్ కెమిల్లా ఏకాంతంగా చర్చలు జరుపుతారు.ఉద్రిక్తతలు.. ఆసక్తికర పరిణామాలుఇరాన్పై అమెరికా సైనిక చర్యకు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ మద్దతు ఇవ్వకపోవడంతో ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటన తొలి రోజైన సోమవారం ట్రంప్ దంపతులు బ్రిటన్ రాజ దంపతులకు ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా 2024లో తనపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించిన ఓ పెయింటింగ్ను ట్రంప్ వారికి చూపించడం గమనార్హం. అనంతరం బ్రిటిష్ ఎంబసీలో జరిగిన విందులో రాజు పాల్గొన్నారు.250 వసంతాల స్వాతంత్యానంతరం..అమెరికా స్వాతంత్ర్యం పొంది 250 ఏళ్లు పూర్తవుతున్న వేళ ఈ పర్యటన జరగడం రెండు దేశాల మధ్య స్నేహానికి ప్రతీకగా నిలుస్తోంది. ఒకపక్క ఈ పర్యటనను రద్దు చేయాలని కొందరు బ్రిటన్ పౌరులు కోరుతున్నప్పటికీ, ప్రధాని స్టార్మర్ దీనిని గట్టిగా సమర్థించారు. మంగళవారం రాత్రి వైట్హౌస్లో జరిగే అధికారిక విందులో రాజు ప్రసంగించనున్నారు. బుధవారం న్యూయార్క్లోని 9/11 స్మారకాన్ని సందర్శించి, గురువారం బెర్ముడా పర్యటనతో ఆయన తన అమెరికా టూర్ను ముగిస్తారు.ఇది కూడా చదవండి: కమలానికి ‘వంద’ కష్టాలు: షా వ్యూహం రివర్స్? -
ట్రంప్ను కసితీరా చంపాలనుకున్నాడు!
వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమంలో కాల్పులు జరిపిన నిందితుడు కోల్ టొమాస్ ఎలెన్పై నేరాభియోగం నమోదు అయ్యింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను చంపాలని ప్రయత్నించాడని దర్యాప్తు సంస్థలు తేల్చేశాయి. దీంతోపాటు మరో రెండు నేరాలను కూడా అతనిపై మోపారు. ఈ తీవ్ర నేరాల కింద ఫెడరల్ కోర్టులో ఎలెన్ విచారణను ఎదుర్కొబోతున్నాడు.‘‘ఇది స్పష్టంగా అధ్యక్షుడిని హత్య చేయడానికి చేసిన ప్రయత్నం. నిందితుడు తన ఉద్దేశాన్ని కుటుంబానికి పంపిన మేనిఫెస్టోలో(మెసేజ్లో) స్పష్టంగా పేర్కొన్నాడు. అధ్యక్షుడిని కసితీరా చంపాలన్నదే అతని ఉద్దేశం. అయితే సీక్రెట్ సర్వీస్ తక్షణ చర్య తీసుకోవడంతో ఆయన సురక్షితంగా ఉండగలిగారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది’’ అని ప్రభుత్వం తరఫున అటార్నీలు వాషింగ్టన్ డీసీ ఫెడరల్ కోర్టులో వాదనలు వినిపించారు.సోమవారం ఈ కేసు విచారణ జరిగింది. ఎలెన్ తరఫున వాదించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో.. ఇద్దరు ఇద్దరు పబ్లిక్ డిఫెండర్లు (ప్రభుత్వ న్యాయవాదులు) నియమించారు. ఎలెన్కు గతంలో ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని.. కాబట్టి నేరం రుజువయ్యేంతదాకా అతన్ని నిర్దోషిగా పరిగణించాలని న్యాయవాది టెజిరా అబే వాదించారు. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 30న జరగనుంది. జైలా? బెయిలా? అనేది ఆరోజే డిసైడ్ కానుంది.ఇదిలా ఉంటే.. గతంలో ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఉండగా హత్యాయత్నం జరిగింది. 2024లో జరిగిన పెన్సిల్వేనియా ఘటనలో నిందితుడు థామస్ క్రూక్స్.. ట్రంప్పై కాల్పులు జరిపిన తర్వాత సీక్రెట్ సర్వీస్ స్నైపర్ల చేతిలో చనిపోయాడు. అయితే ప్రస్తుతం ట్రంప్ అధ్యక్షుడి హోదాలో ఉన్నారు. ఒకవేళ హత్యాయత్నం నేరం గనుక రుజువైతే కోల్ టొమాస్ ఎలెన్(31)కు జీవిత ఖైదు పడనుంది. ట్రంప్పై హత్యాయత్నంతో పాటు అనుమతి లేకుండా ఆయుధాన్ని కలిగి ఉండటం(illegal possession of a firearm), ఆ ఆయుధాన్ని ఉపయోగించి దాడి చేయాలని చూడడం.. ఈ రెండు నేరాలను కూడా నమోదు చేశారు. ఈ నేరాలకుగానూ ఒకదానికి భారీ జరిమానా, మరోదానికి 10 జైలు శిక్ష పడతాయి.శనివారం రాత్రి వాషింగ్టన్లోని హిల్టన్ హోటల్లో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ఇతర ఉన్నతాధికారులు సహా పలువురు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. కాసేపట్లో ట్రంప్ మాట్లాడాల్సి ఉండగా.. అదే హోటల్లో బస చేసిన ఎలెన్ భద్రతా వలయాన్ని దాటుకుని మరీ వచ్చి కాల్పులకు తెగబడ్డాడు. అయితే మీటింగ్ జరుగుతున్న రూమ్ వైపు అతన్ని వెళ్లకుండా భద్రతా సిబ్బంది అదుపు చేయగలిగారు. అక్కడికక్కడే అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు.మేనిఫెస్టోలో ఏముందసలు..కోల్ టొమాస్ ఎలెన్ బాగా చదువుకున్న వ్యక్తి. కాలిఫోర్నియాలో టీచర్గానూ పని చేస్తున్నాడు. అయితే దాడి యత్నానికి ముందు తన కుటుంబ సభ్యులకు రాసిన లేఖలో ట్రంప్పై అతడు పలు ఆరోపణలు చేశాడు. ‘ఒక పీడోఫైల్, రేపిస్ట్, దేశద్రోహిని అంగీకరించేది లేదు’ అని పేర్కొన్నాడు. అయితే ఆ ఆరోపణలన్నీ ట్రంప్ పేరు ప్రస్తావన లేకుండా పరోక్షంగానే ఉన్నాయి. ప్రభుత్వ ఉన్నత వర్గాలే తన టార్గెట్ అని అందులో పేర్కొన్నాడతను. అమెరికాలో అరాచక పాలనను భరించలేకనే దాడికి దిగుతున్నానని.. సాధ్యమైనంత వరకు ఇతరులను చంపే ప్రయత్నం చేయబోనని.. గత్యంతరం లేని పరిస్థితిలో అలా చేయాల్సి వస్తే తనను క్షమించాలని ఆ లేఖలో పేర్కొన్నాడు. అంతేకాదు హిల్టన్ హోటల్ భద్రత ఘోరంగా ఉందని.. తాను పెద్ద తుపాకీతో వచ్చినా ఎవరూ గుర్తించేవారు కాదేమో అంటూ సెటైర్ వేశాడు. ట్రంప్ రియాక్షన్.. తనపై కోల్ టొమాస్ ఎలెన్ చేసిన ఆరోపణలను ట్రంప్ తోసిపుచ్చారు. సీబీఎస్ 60 మినిట్స్ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. అతడు తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తి, ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని చెప్పారు. పైగా అతనో క్రైస్తవ వ్యతిరేకి అని ట్రంప్ ఆరోపించారు. కొందరు అనుకుంటున్నట్లు కాల్పులు జరిగిన సమయంలో తానేం భయపడలేదని.. ఏం జరుగుతుందో చూడాలనిపించిందని.. కానీ, సీక్రెట్ సర్వీస్ అధికారులు తనను బయటకు తీసుకెళ్లారని ట్రంప్ చెప్పుకొచ్చారు. -
చరిత్రలో చెరగని అణు విలయం..
సరిగ్గా నలభై ఏళ్ల కిందట. 1986, ఏప్రిల్ 26 అర్ధరాత్రి దాటింది. అప్పటి సోవియట్ యూనియన్లో భాగంగా ఉన్న ఉక్రెయిన్లోని ‘ప్రిప్యాత్’ నగరం గాఢ నిద్రలో ఉంది. ఆ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలోని నాలుగో నంబరు యూనిట్లో నిపుణులు ఒక ప్రమాదకరమైన ప్రయోగానికి తెరలేపారు. ఆ ప్రయోగమే ఆధునిక మానవ చరిత్రలో అత్యంత భయంకరమైన అణు విపత్తుకు దారితీస్తుందని వారెవరూ ఊహించలేదు.విద్యుత్ సరఫరా నిలిచిపోతే, టర్బైన్లు తిరిగే వేగంతో రక్షణ వ్యవస్థలను ఎంతసేపు నడపవచ్చో చూడటమే ఈ పరీక్ష ఉద్దేశం. ఏప్రిల్ 25 తెల్లవారుజాము నుండే దీనికి సన్నాహాలు మొదలయ్యాయి. మధ్యాహ్నం 2:00 గంటలకు అత్యవసర కోర్ కూలింగ్ వ్యవస్థను నిలిపివేశారు. అయితే, స్థానిక గ్రిడ్ నుండి విద్యుత్ డిమాండ్ రావడంతో ప్రయోగాన్ని తొమ్మిది గంటల పాటు వాయిదా వేశారు. ఈ విరామంలో రియాక్టర్ అస్థిరంగా మారింది. రాత్రి 11:00 గంటల తర్వాత మళ్ళీ ప్రయోగాన్ని మొదలుపెట్టారు. రియాక్టరును కేవలం 7 శాతం తక్కువ విద్యుత్తుతో నడిపారు. ఇదో పొరపాటుగా పరిణమించింది. పవర్ సామర్థ్యం పడిపోవడంతో దానిని పెంచడానికి ఆపరేటర్లు కంట్రోల్ రాడ్స్ను రియాక్టర్ కోర్ నుండి బయటకు తీశారు. ఇలా చేయడం వల్ల రియాక్టర్ అదుపు తప్పే ప్రమాదమున్నా పట్టించుకోలేదు.విస్ఫోటనం ఏప్రిల్ 26 తెల్లవారుజామున 1:23 గంటలకు ప్రయోగం అసలు దశకు చేరుకుంది. ఆపరేటర్లు టర్బై¯Œ కు వెళ్లే ఆవిరిని నిలిపివేశారు. ఫలితంగా సర్క్యులేషన్ పంపులు నిదానమవ్వడంతో రియాక్టర్ను చల్లబరచే వ్యవస్థ క్షీణించింది. దీనివల్ల రియాక్టర్లోని ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన సూపర్వైజర్, రియాక్టర్ను ఆపివేయడానికి ‘స్క్రామ్’ ఆదేశాన్ని ఇచ్చాడు. దీని ప్రకారం కంట్రోల్ రాడ్స్ అన్నింటినీ ఒకేసారి కోర్లోకి పంపాలి. కానీ, అప్పటికే రియాక్టర్ విపరీతంగా వేడెక్కడం వల్ల ఆ కడ్డీలు లోపలికి వెళ్లలేకపోయాయి. కేవలం మూడు సెకన్లలోనే రియాక్టర్ పవర్ అసాధారణంగా పెరిగింది.లోపల ఏర్పడిన భారీ ఆవిరి పీడనం వల్ల వరుసగా రెండు పేలుళ్లు సంభవించాయి. ఈ ధాటికి రియాక్టర్కు ఉన్న వెయ్యి టన్నుల బరువున్న స్టీల్, కాంక్రీట్ మూత గాలిలోకి ఎగిరిపడింది. భవనం పైకప్పు కుప్పకూలిపోయింది. హిరోషిమా, నాగసాకిలపై వేసిన అణుబాంబుల కంటే వందల రెట్లు ఎక్కువ రేడియేషన్ గాలిలో కలిసింది. మంటలను ఆర్పడానికి వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి అక్కడ ప్రాణాంతకమైన రేడియేషన్ ఉందని తెలియదు. ఎటువంటి రక్షణ కవచాలు లేకుండా పనిచేశారు. ఫలితంగా వారిలో చాలామంది తీవ్రమైన రేడియేషన్కు గురై కొద్ది రోజుల్లోనే ప్రాణాలు విడిచారు.ఈ విషపూరిత మేఘాలు గాలి దిశను బట్టి వ్యాపించాయి. సుమారు 1,50,000 చదరపు కిలోమీటర్ల మేర భూమి కలుషితమైంది. స్వీడన్లోని అణు పర్యవేక్షణ కేంద్రాలు తమ దేశంలో రేడియేషన్ స్థాయి పెరగడాన్ని గమనించి నిలదీసేవరకు సోవియట్ ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని బయటి ప్రపంచానికి తెలియనివ్వలేదు. ప్రమాదం జరిగిన మరుసటి రోజు, అంటే ఏప్రిల్ 27న ప్రిప్యాత్ నగరంలోని 30,000 మంది ప్రజలను హుటాహుటిన ఖాళీ చేయించారు. సుమారు 84 లక్షల ప్రజలు రేడియేషన్ బారిన పడ్డారు. వేల సంఖ్యలో ప్రజలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడ్డారు. లక్షలాది ఎకరాల అడవులు, వ్యవసాయ భూములు విషపూరితంగా మారాయి.పశువులు అంగవైకల్యంతో పుట్టడం ఈ విపత్తు తీవ్రతకు అద్దం పట్టింది. ఆ ప్రాంతంలోని అడవి చెట్లు రేడియేషన్ వల్ల ఎర్రగా మారిపోవడంతో దానికి ‘రెడ్ ఫారెస్ట్’ అని పేరు వచ్చింది. ప్రస్తుతం చెర్నోబిల్, ప్రిప్యాత్ పరిమిత టూరిస్టు కేంద్రాలుగా మారాయి. చెర్నోబిల్ ఉదంతం తరువాత ప్రపంచ వ్యాప్తంగా అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై అనుమానపు నీడలు ముసురుకున్నాయి. అయినా ఎన్నో కొత్త కేంద్రాలు ప్రారంభించి మానవాళి జాగరూకతతో ముందుకు పోతూనే ఉంది.-ఎడిటోరియల్ టీమ్. -
యుద్ధం ముగింపు? ఇరాన్ ప్రతిపాదనపై ట్రంప్ కీలక చర్చలు
వాషింగ్టన్ డీసీ: యుద్ధాన్ని ముగించడం, వ్యూహాత్మకంగా కీలకమైన హార్మూజ్ జలసంధిని తిరిగి ప్రారంభించడం లక్ష్యంగా ఇరాన్ పంపిన కొత్త ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన జాతీయ భద్రతా బృందం చర్చలు జరుపుతున్నట్లు వైట్ హౌస్ ధ్రువీకరించింది.వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రతిపాదనను అత్యున్నత స్థాయిలో పరిశీలిస్తున్నట్లు తెలిపారు. “ఇవాళ ఉదయం అధ్యక్షుడు ట్రంప్ తన జాతీయ భద్రతా బృందంతో సమావేశమయ్యారని నేను ధ్రువీకరిస్తున్నాను. సమావేశం ఇంకా కొనసాగుతుండవచ్చు, లేక ముగిసి ఉండవచ్చు. ప్రతిపాదనపై చర్చ జరిగింది. దాన్ని పరిశీలిస్తున్నారని నేను చెప్పను. ఈ ఉదయం చర్చ జరిగింది అని మాత్రమే చెబుతాను. దీనిపై ముందుగా వివరాలు చెప్పదలచుకోలేదు. ఈ అంశంపై త్వరలోనే అధ్యక్షుడు స్వయంగా మాట్లాడతారు” అని ఆమె చెప్పారు.మూడోసారి పాక్కు అబ్బాస్ అరాఘ్చీ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మంగళవారం తెల్లవారుజామున పాకిస్థాన్కు చేరుకున్నారు. అమెరికాతో ఘర్షణను ముగించేందుకు కొనసాగుతున్న దౌత్య చర్యల్లో భాగంగా ఆయన ఇస్లామాబాద్కు రావడం 48 గంటల్లో ఇది మూడోసారి.అబ్బాస్ అరాఘ్చీ అంతకుముందు రష్యాలో కార్యక్రమాలు ముగించుకున్నారు. అరాఘ్చీ ఇస్లామాబాద్ తాజా పర్యటన రష్యా, ఒమాన్ సహా పలు దేశాల్లో ఉన్నతస్థాయి సమావేశాల తర్వాత జరిగింది. పాకిస్థాన్కు ఆయన పదేపదే రావడం ప్రస్తుత పరిస్థితిలో శాంతికి మధ్యవర్తిగా ఇస్లామాబాద్ పాత్రను సూచిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఇంతకు ముందు, సెయింట్ పీటర్స్బర్గ్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో అరాఘ్చీ చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ పరిణామాలపై చర్చ జరిగింది. కాగా, ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు తర్వాతి దశలో నిర్వహించాలని షరతు పెట్టింది. -
నీటి కోసం రెండు కుటుంబాల యుద్ధం
చాద్: భవిష్యత్తులో నీటి కోసం దేశాల మధ్య యుద్ధాలు జరుగుతాయని విన్నాం. కానీ, ఆఫ్రికా దేశమైన చాద్లో రెండు కుటుంబాల మధ్య యుద్ధం జరిగింది. ఈ పోరాటంలో కనీసం 42 మంది మరణించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరో 10 మంది గాయపడ్డారని తెలియజేసింది. పొరుగు దేశం సూడాన్ నుంచి లక్షలాది మంది శరణార్థులు తూర్పు చాద్కు తరలివచ్చారు. ఈ ప్రాంతంలో వనరుల కొరత తీవ్రంగా ఉంది. మంచినీరు దొరకడం కూడా గగనంగా మారింది. సూడాన్ సరిహద్దులో వాది ఫిరా ప్రావిన్స్లోని ఇగోట్ గ్రామంలో శనివారం తాగునీరు పట్టుకొనే విషయంలో రెండు కుటంబాల మధ్య గొడవ మొదలైంది. అది క్రమంగా తీవ్ర ఘర్షణగా మారింది. రెండు కుటుంబాలకు చెందినవారు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. చేతికందిన వస్తువులతో ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. రక్తం ఏరులై పారింది. 42 మంది ప్రాణాలు కోల్పోయారు. చాద్లో వనరుల కోసం ఇలాంటి ఘర్షణలు సర్వసాధారణంగా మారిపోయాయి. -
పోరు ఆపితే తెరుస్తాం
కైరో/మాస్కో/దుబాయ్: హార్మూజ్ జలసంధిని దిగ్బంధం నుంచి విముక్తి కల్పించి యుద్ధానికి చరమగీతం పాడితే హార్మూజ్ జలసంధి గుండా విదేశీ వాణిజ్యనౌకల రాకపోకలకు మార్గం సుగమం చేస్తామని ఇరాన్ కొత్త ప్రతిపాదనలను తెరమీదకు తెచ్చింది. ఆదివారం ఒమన్ నుంచి పాకిస్తాన్కు చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఈ మేరకు తమ ప్రతిపాదనలకు హెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి తెలియజేశారు. వీటిని అమెరికాకు పాక్ అందజేయనుంది. వీటిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విముఖత చూపొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పుతిన్తో అరాఘ్చీ భేటీ.. ఇరాన్ మంత్రి అరాఘ్చీ సోమవారం రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయ్యారు. తమ సార్వ¿ౌమత్వం కోసం పోరాడుతున్న ఇరానియన్లను ఈ సందర్భంగా పుతిన్ పొగిడారు. తర్వాత పశ్చిమాసియా యుద్ధం, హార్మూజ్ దిగ్బంధం, అమెరికా షరతులు, ఇరాన్ డిమాండ్లు తదితర కీలకాంశాలపై అరాఘ్చీ, పుతిన్ విస్తృతంగా చర్చించుకున్నారని రష్యా అధ్యక్షభవనం క్రిమ్లిన్ తెలిపింది. ‘‘పశ్చిమాసియాలో శాంతిస్థాపన కోసం రష్యా తన శక్తిమేరకు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇరాన్తో వ్యూహాత్మక బంధం బలోపేతానికి కృషిచేస్తాం’’అని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పష్టంచేశారు. భారతీయ ట్యాంకర్పై కాల్పులు.. ఒమన్ నుంచి భారత్కు వస్తున్న రసాయనాల ట్యాంకర్ ఎంటీ చిరాన్7పై ఇరాన్ గన్బోట్లు హెచ్చరిస్తూ కాల్పులు జరిపాయి. ఏప్రిల్ 25వ తేదీన జరిగిన ఈ కాల్పులఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హార్మూజ్కు వాయవ్యంగా ఒమన్కు చెందిన షినాస్ పోర్ట్ సమీప జలాల గుండా నౌక వెళ్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. నౌకలోని 17 మంది భారతీయనావికులకు ఎలాంటి గాయాలుకాలేదని కేంద్ర షిప్పింగ్, పోర్ట్లు, వాటర్వేస్ శాఖ డైరెక్టర్ మన్దీప్ సింగ్ రంధావా తెలిపారు. -
వాణిజ్య బంధం బలోపేతం
న్యూఢిల్లీ: భారత్, న్యూజిలాండ్ మధ్య స్నేహసంబంధాల్లో మరో అడుగు ముందుకు పడింది. కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ)పై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం.. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే వస్త్రాలు, తోలు పాదరక్షలు, రత్నాలు. ఆభరణాలతో సహా 100 శాతం ఎగుమతులపై న్యూజిలాండ్లో సుంకాలు సున్నాకు చేరుకుంటాయి. సుంకాలు లేకుండానే భారత్ తమ ఉత్పత్తులను న్యూజిలాండ్ మార్కెట్లో విక్రయించుకోవచ్చు. ఈ ఒప్పందానికి న్యూజిలాండ్ పార్లమెంట్ ఆమోదం తెలపాల్సి ఉంది. ఇది ఈ ఏడాది చివరి నాటికి అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు. భారత్లో కేంద్ర మంత్రివర్గం ఈ ఎఫ్టీఏను ఇప్పటికే ఆమోదించింది. ఒప్పందంపై భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, న్యూజిలాండ్ వాణిజ్య, పెట్టుబడుల శాఖ మంత్రి టాన్ మెక్క్లే సోమవారం ఢిల్లీలో సంతకాలు చేశారు. ఎఫ్టీఏతో ఇరుదేశాల మధ్య వస్తు సేవల ద్వైపాక్షిక వాణిజ్యం రాబోయే ఐదేళ్లలో 5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఇండియా, న్యూజిలాండ్ మధ్య 2010లో చర్చలు ప్రారంభమయ్యాయి. 2015లో నిలిచిపోయాయి. గతేడాది మార్చిలో చర్చలు పునఃప్రారంభం కాగా, డిసెంబర్లో ముగిశాయి. తాజాగా సంతకాలు జరిగాయి. ఎఫ్టీఏతో ప్రయోజనాలు → న్యూజిలాండ్కు భారత్ చేసే 100% ఎగుమతులకు ఎలాంటి సుంకం ఉండదు. గతంలో న్యూజిలాండ్ సిరామిక్స్, కార్పెట్లు, ఆటోమొబైల్స్, ఆటో విడిభాగాలతో సహా పలు భారతీయ ఉత్పత్తులపై 10 శాతం వరకు సుంకాలను విధించేది. → ఎఫ్టీఏలో భాగంగా రాబోయే 15 ఏళ్లలో భారత్లో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు న్యూజిలాండ్ అంగీకరించింది. → భారతీయ వృత్తి నిపుణులకు న్యూజిలాండ్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వారికి మూడేళ్ల కాలపరిమితి ఉండే వీసాలు ఇస్తారు. → భారత్ నుంచి సుంకం రహిత వైన్, స్పిరిట్స్ ఎగుమతులు జరుగుతాయి. అదే సమయంలో న్యూజిలాండ్ నుంచి మద్యం రాయితీ సుంకంతో భారత్లోకి ప్రవేశిస్తుంది. పదేళ్లలో ఈ సుంకాన్ని మరింత తగ్గిస్తారు. → న్యూజిలాండ్ నుంచి వచ్చేవాటిలో 54.11 శాతం ఉత్పత్తులపై సుంకాలను భారత్ సున్నాకు తగ్గిస్తుంది. ఇందులో గొర్రె మాంసం, ఉన్ని, బొగ్గు, అటవీ, కలప ఉత్పత్తులు ఉన్నాయి. భారత్లో వాటి ధరలు తగ్గుతాయి. → న్యూజిలాండ్ యాపిల్, కివీ పండ్లు, తేనె, మిల్క్ అల్బుమిన్పై సుంకాల్లో రాయితీలు ఇస్తారు. అలాగే కొన్ని రకాల సముద్ర ఉత్పత్తులపై సుంకాలను రాబోయే ఏడేళ్లలో పూర్తిగా తగ్గిస్తారు. → న్యూజిలాండ్ నుంచి దిగుమతి అయ్యే ఐరన్, స్టీల్, స్క్రాప్ అల్యూమినియం వస్తువులపై సుంకాలను పదేళ్లు లేదా అంతకంటే ముందే పూర్తిగా రద్దుచేస్తారు. → భారతదేశ రైతులు, ఎంఎస్ఎంఈల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పాడి, జంతు ఉత్పత్తులు(గొర్రె మాంసం మినహా), కూరగాయలు, చక్కెర, రాగి, అల్యూమినియంపై కేంద్ర ప్రభుత్వంన్యూజిలాండ్కు ఎలాంటి రాయితీలు ఇవ్వలేదు. సుసంపన్నమైన భవిష్యత్తు: మోదీ ఇండియా–న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. దీంతో మన రైతులు, యువత, మహిళలు, ఎంఎస్ఎంఈలు, చేతి వృత్తుల నిపుణులు, కళాకారులు, స్టార్టప్ కంపెనీలు, విద్యార్థులు, నవీన ఆవిష్కర్తలకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఒక తరంలో ఒక్కసారే: క్రిస్టోఫర్ లక్సన్ ఎఫ్టీఏను ‘ఒక తరంలో ఒక్కసారి మాత్రమే కుదిరే ఒప్పందం’గా న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ అభివర్ణించారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్న భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు ఎగుమతులు చేసే అవకాశం న్యూజిలాండ్కు లభిస్తుందని పేర్కొన్నారు. -
అటు తిరిగి, ఇటు తిరిగి ఎఫ్బీఐ చీఫ్ మీదికి వచ్చింది!
ఎఫ్బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)కి అమెరికాలో ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అమెరికాలో ఉగ్రవాదం, గూఢచర్యం, అంతర్గత భద్రతా ముప్పులను ఎదుర్కోవడంలో ఎఫ్బీఐ కీలక పాత్ర పోషిస్తుంది. అవినీతి, సైబర్ నేరాలు, మాఫియా, పౌరహక్కుల ఉల్లంఘనలు వంటి 200 కంటే ఎక్కువ రకాల ఫెడరల్ నేరాలను ఎఫ్బీఐ పరిశీలిస్తుంది.సైబర్ దాడులు, ఆన్లైన్ మోసాలు, డిజిటల్ భద్రతా సమస్యలను ఎదుర్కోవడానికి ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. రాష్ట్ర, స్థానిక, అంతర్జాతీయ పోలీస్ సంస్థలతో కలిసి పనిచేసి, నేరాల నియంత్రణలో సమన్వయం కల్పిస్తుంది. మొత్తానికి, ఎఫ్బీఐ అమెరికాకు భద్రతా కవచంగా, అలాగే ఫెడరల్ నేరాల పరిశోధన సంస్థగా పనిచేస్తుంది. అటువంటి ఎఫ్బీఐకు చీఫ్ అంటే ఎలా ఉండాలి? ఎంతో సమర్థుడై ఉండాలి. ఏదైనా ముప్పు తలెత్తినప్పుడు ముందు నిలబడి ఎదుర్కోవాలి. కానీ, ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించి కెమెరాకు దొరికిపోయారు. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో ఇటీవల నిర్వహించిన వైట్హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్లో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కాష్ పటేల్ హాయిగా కుర్చీకే అతుక్కుపోయి కూర్చుండిపోయారు.There is a shooting and…The head of the FBI is just hanging out? pic.twitter.com/jrIKMYhHte— Earth Hippy 🌎🕊️💚 (@hippyygoat) April 26, 2026దీంతో ఎఫ్బీఐ చీఫ్ పదవిలో కాష్ పటేల్ నిలదొక్కుకోగలరా? వైట్హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వేళ భద్రతా లోపాలు, నిందితుడి స్టేట్మెంట్ వంటివాటి వల్ల కాష్ పటేల్ పదవి వీడాల్సిందేనా? అన్న ప్రశ్నలు మళ్లీ తలెత్తుతున్నాయి. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తదుపరి తొలగించే వారి లిస్టులో.. కాష్ పటేల్ ఉండవచ్చని ఒక సీనియర్ వైట్హౌస్ అధికారి ఇటీవలే మీడియాకు తెలిపారు. పటేల్ను పదవి నుంచి తొలగించడం దాదాపు ఖాయమని, “ఎప్పుడు తొలగిస్తారన్నదే ఇప్పుడు ప్రశ్న?” అని వ్యాఖ్యానించారు. అసలు కాష్ పటేల్ను తొలగిస్తారన్న ప్రచారం చాలా కాలంగా ఎందుకు జరుగుతోంది? ఇప్పుడు ఆ ప్రచారం మరింతగా పెరగడానికి కారణాలు ఏంటి? మీడియాలో కాష్ పటేల్పై ప్రతికూల వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఆయన పనితీరుతో పాటు నిర్ణయాలు, వ్యక్తిగత అంశాలపై విమర్శలు పెరిగాయి. కేబినెట్ కార్యదర్శి దృష్టిలో ఇది మంచిది కాదు. ఇటీవల వాషింగ్టన్ హిల్టన్లో జరిగిన భద్రతా లోపం ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ విషయంలో రాజకీయ చర్చగా మారుతోంది. నిందితుడు రాసిన “ఫ్రెండ్లీ ఫెడరల్ అసాసిన్” లేఖలో పలువురు ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా పేర్కొన్నప్పటికీ, పటేల్ పేరు మాత్రం లేదన్న విషయం తెలిసిందే.కాల్పుల ఘటన తర్వాత ఏం జరిగింది?కాల్పుల ఘటన అనంతరం పలు వీడియోలు ఆన్లైన్లో కనపడ్డాయి. ఒక వీడియోలో నిందితుడు అలెన్ హోటల్లోకి పరుగెత్తాడు. తర్వాత కాల్పుల శబ్దం వినిపించింది. మరో వీడియోల్లో అతిథులు టేబుళ్ల కింద దాక్కోవడం, భద్రత సిబ్బంది వేగంగా కదలడం, అధికారులను బయటకు తరలించడం కనిపించింది.సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో కాష్ పటేల్ అయోమయంగా చుట్టూ చూస్తూ కుర్చీలో కూర్చుండిపోయారు. భద్రతా సిబ్బంది అతిథులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో వీడియోలో కాష్ పటేల్ అక్కడ ఏమీ జరగనట్లు అటూఇటూ తిరుగుతూ ఫోన్లో మాట్లాడారు. ఆ సమయంలో సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ప్రజలను బయటకు తీసుకెళ్తుండగా కాష్ పటేల్ ప్రశాంతంగా కనిపించారు.FBI Director Kash Patel seen on his phone, just hanging around outside the venue like a random WHCD attendee trying to figure out how to get an Uber after the incident. pic.twitter.com/28eIcwGUdl— MeidasTouch (@MeidasTouch) April 26, 2026కాష్ పటేల్ ఆ పదవిలో కొనసాగుతారా?వైట్ హౌస్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దాడికి ముందు అలెన్ తన కుటుంబానికి ఒక లేఖ పంపించాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ పత్రంలో తాను “ఫ్రెండ్లీ ఫెడరల్ అసాసిన్” అని పేర్కొంటూ, ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకుంటానని తెలిపాడు.అయితే “ప్రభుత్వ అధికారులు (మిస్టర్ పటేల్ మినహా)” అని పేర్కొన్న ఒక వాక్యం ప్రత్యేకంగా చర్చకు దారి తీసింది. ఈ విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. దాని వెనుక ఉద్దేశం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది. ఆ పత్రంలో ట్రంప్ వ్యతిరేక, క్రైస్తవ వ్యతిరేక అభిప్రాయాలు కూడా ఉన్నాయి.ఈ ఘటనకు ముందు కూడా పటేల్పై పలు భద్రతా అంశాలపై విమర్శలు ఉన్నాయి. 2024 చివర్లో, 2026 మార్చిలో ఆయన వ్యక్తిగత ఈమెయిల్ ఖాతాలపై ఇరాన్ మద్దతు ఉన్న హ్యాకర్ల దాడులు జరిగాయని నివేదికలు వెలువడ్డాయి. ఇది సైబర్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. కాష్ పటేల్ వ్యక్తిగత భద్రతా ఏర్పాట్లపై కూడా కొన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ ఆయన వాటిని ఖండించారు. ఈ ఆరోపణలపై ఆయన పరువు నష్టం కేసు కూడా దాఖలు చేశారు. -
ఈ అనుభవంతో భారత్ను వెతుక్కుంటూ తిరిగొచ్చేసిన NRI
చాలామంది భారతీయులకు విదేశాల్లో ఉద్యోగాలు చేయడమంటే మహా ఇష్టం. ముఖ్యంగా అమెరికాకు వెళ్తే మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించవచ్చని భావిస్తారు. కానీ, సంజుమ్ సింగ్ ధలీవాల్ అనే వ్యక్తికి అందుకు భిన్న పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయన చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇన్స్టాగ్రామ్లో తన అనుభవాన్ని పంచుకున్నాడు ధలీవాల్. అమెరికాలో మంచి ప్రాంతంలో నివసించినప్పటికీ ఎందుకు భారత్కు తిరిగి వచ్చానో వివరించాడు. తాను అమెరికాలో ఉండలేకపోవడానికి అమెరికాలోని ఆరోగ్య వ్యవస్థపై తనకున్న అసంతృప్తేనని స్పష్టం చేశాడు.తనకు రెండు సార్లు చేతికి గాయమైందని ఒకటి భారత్లోకాగా, మరొకటి అమెరికాలో అయిందని తెలిపాడు. భారత్లో వైద్య ప్రక్రియ వేగంగా, సులభంగా, తక్కువ ఖర్చుతో పూర్తయ్యిందని చెప్పాడు. కానీ, అమెరికాలో మాత్రం అటువంటి గాయానికే చికిత్స చేయించుకోవడానికి సమస్యలు ఎదురయ్యాయని తెలిపాడు.అమెరికాలో ఆసుపత్రిలో చికిత్స తీసుకునే ప్రక్రియ సంక్లిష్టంగా, చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుందని తెలిపాడు. చికిత్స కోసం చాలా సమయం వేచిచూడాల్సి వచ్చిందని, అనేక దశలు ఉన్నాయని, ఖర్చు ఎక్కువగా ఉందని తెలిపాడు.విరిగిన ఎముకను పరీక్షించించుకోవడానికి డాక్టర్ అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చిందని ధలీవాల్ పేర్కొన్నాడు. ఈ ఆలస్యం, అమెరికా వైద్య వ్యవస్థ తనలో అసహనాన్ని కలిగించిందని చెప్పాడు. అమెరికాలో నివసించడం సాధ్యమేనా? అన్న అనుమానాన్ని కలిగిందని తెలిపాడు."భారత్లో ముందుగా చికిత్స చేశారు, తర్వాత ప్రశ్నలు అడిగారు. వైద్య పరంగా ఎలాంటి ఒత్తిడి లేదు. కానీ, అమెరికాలో కేవలం అపాయింట్మెంట్ పొందేందుకు 2 నెలలకు పైగా వేచిచూడాల్సి వచ్చింది. చివరికి వరుసగా 3 రోజుల పాటు నైట్ క్లినిక్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాను. 10 రోజుల తర్వాత చికిత్స చేసే డాక్టర్ దొరికాడు" అని ధలీవాల్ చెప్పాడు.భారత్లో ఆరోగ్య సేవలు సులభంగా అందుబాటులో ఉన్నాయని, చివరకు తాను తిరిగి స్వదేశానికి రావడానికి ఇదే ప్రధాన కారణమైందని తెలిపాడు.ధలీవాల్ పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. భారతీయులు విదేశాల కంటే సొంత భారత్నే ఎక్కువగా విమర్శిస్తారని, విదేశాల్లో ఇటువంటి అనుభవాలు ఎదరవుతేనే మనదేశ విలువ తెలిసి వస్తుందని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ "భారత్లో మధ్యతరగతి వారికి ఆరోగ్య సేవలు అమెరికాలో మధ్యతరగతి వారికంటే మెరుగ్గా అందుబాటులో ఉంటాయి" అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Sanjum Singh Dhaliwal | Certified Yapper (@_sangym_) -
యూఏఈకి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ రక్షణ
అబుదాబి: పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ దాడుల నుంచి సురక్షితంగా ఉండేందుకు యూఏఈ చర్యలకు ఉపక్రమించింది. ఇజ్రాయెల్ అందించిన ‘ఐరన్ డోమ్’ను యూఏఈ మోహరించింది. ఇరాన్ నుంచి పెరుగుతున్న డ్రోన్, క్షిపణి ముప్పులను ఎదుర్కొనేందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.గత కొన్నేళ్లుగా ఇజ్రాయెల్, యూఏఈ సంబంధాలు మరింత బలపడుతున్నాయి. అబ్రహాం ఒప్పందాల తర్వాత రెండు దేశాలు రక్షణ రంగంలో సహకారం పెంచుకుంటూ వెళ్తున్నాయి. తాజాగా, యూఏఈలో ఐరన్ డోమ్ వ్యవస్థను అమలు చేయడం ద్వారా ఇరాన్ నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోవడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంది. రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ 4–70 కిలోమీటర్ల పరిధిలోని రాకెట్లు, మోర్టార్లు, డ్రోన్లను అడ్డుకుంటుంది. మిర్ ఇంటర్సెప్టర్ అనే క్షిపణులు లక్ష్యాన్ని గాల్లోనే ధ్వంసం చేస్తాయి. ఎల్టా సిస్టమ్స్ రాడార్ ద్వారా వచ్చే ముప్పులను గుర్తించి, వెంటనే ప్రతిస్పందిస్తుంది. ఇజ్రాయెల్లో ఈ వ్యవస్థ 90శాతం విజయవంతమైనట్లు తెలుస్తోంది. ఇరాన్ గత కొన్నేళ్లుగా యూఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాలపై డ్రోన్ దాడులు జరిపింది. 2025లో యూఏఈపై జరిగిన దాడుల్లో 2,200కి పైగా డ్రోన్లు ఉపయోగించింది. ఈ నేపథ్యంలో యూఏఈలో ఐరన్ డోమ్ను వినియోగంలోకి తెచ్చింది. యూఏఈ ఇప్పటికే అమెరికా నుంచి పాట్రియట్, థాడ్ రక్షణ వ్యవస్థలను పొందింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ చేరడంతో యూఏఈ రక్షణ మరింత బలపడనుంది. అమెరికా,ఇజ్రాయెల్,యూఏఈ త్రైపాక్షిక సహకారం ఇరాన్పై వ్యూహాత్మక ఒత్తిడిని పెంచుతుంది. ఇరాన్కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్,యూఏఈ,అమెరికా బలమైన కూటమి ఏర్పడుతోంది. తాజా పరిణామంతో యూఏఈలోని చమురు, వాణిజ్య కేంద్రాలు ఇప్పుడు మరింత రక్షణగా ఉండనున్నాయి. ఇరాన్ దాడులు కొనసాగితే, ఐరన్ డోమ్ వ్యవస్థ యూఏఈ భద్రతకు కీలకంగా మారుతుంది. మొత్తం మీద, యూఏఈలో ఐరన్ డోమ్ అమలు కేవలం రక్షణ చర్య మాత్రమే కాదు .. ఇరాన్ ముప్పు పెరుగుతున్న ఈ సమయంలో, యూఏఈ భద్రతా వ్యూహంలో కీలక మలుపేనని నిపుణులు భావిస్తున్నారు. -
ఈసారి భీకర దాడే: ఇరాన్ వార్నింగ్
గల్ప్ దేశాలకు ఇరాన్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తమ నుంచి నాలుగింతలు దాడి చూడాలనుకుంటేనే అమెరికా మద్దతు విషయంలో ముందుకెళ్లాలని, ఈ తరుణంలో జరిగే పరిమాణాలకు మీరే బాధ్యత వహించాలని ఇరాన్ హెచ్చరించింది. యుద్ధానికి సంబంధించి రెండో విడత శాంతి చర్చలు ఇంకా అనిశ్చితిలో ఉన్న నేపథ్యంలో తమ పొరుగు గల్ఫ్ దేశాలు ఏమైనా అమెరికాకు మద్దతు ఇస్తే మాత్రం ఈసారి తమ నుంచి భీకర దాడి చూడాల్సి వస్తుందని ఇరాన్ ఉపాధ్యక్షుడు ఎస్మాయిల్ సాగాబ్ ఎస్ఫహానీ హెచ్చరించారు. ప్రధానంగా హోర్ముజ్ జలసంధిలో కొనసాగుతున్న నిర్బంధం కారణంగా తమ మౌలిక వసతులు, ముఖ్యంగా చమురు బావులు, దెబ్బతింటే మాత్రం నాలుగు రెట్లు ప్రతిస్పందనకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ విషయంలో అమెరికాకు మద్దతు ఇవ్వాలని భావించే గల్ఫ్ దేశాలు కాస్త వెనక్కి తగ్గితేనే మంచిదని, లేని పక్షంలో తమ నుంచి ఈసారి వచ్చే ప్రతిస్పందన మీ ఊహకు కూడా అందదని ఎస్ఫహానీ ముందస్తు సంకేతాలు పంపారు. ‘మా లెక్కలు వేరుగా ఉంటాయి. ఒక చమురు బావి అంటే నాలుగు చమురు బావుల నష్టం, అమెరికాకు మద్దతిస్తే మాకు భారీ నష్టాన్ని తేవడంలో మీ వంతు పాత్ర కూడా ఉందనే అనుకుంటాం. అందుకు ప్రతి స్పందన కూడా నాలుగింతలే ఉంటుంది’ అని పేర్కొన్నారు. గత వారం, తన ట్రూత్ సోషల్ వేదికలో ట్రంప్.. ఇరాన్ను కూలిపోతున్న ఆర్థిక వ్యవస్థగా రాసుకొచ్చారు. ‘ ఇరాన్ ఆర్థికంగా కూలిపోతోంది. వారు హోర్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని కోరుకుంటున్నారు . నగదు కోసం ఆకలితో ఉన్నారు. రోజుకు 500 మిలియన్ డాలర్లు నష్టపోతున్నారు. సైన్యం, పోలీసులు జీతాలు అందడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి’ అని తెలిపారు. -
కార్పొరేట్ జాబ్ వదిలేసి 50 ఏళ్ల వయసులో కోట్ల డాలర్ల కంపెనీ
50 ఏళ్లు రాగానే చాలామంది ఇక కష్టపడింది చాల్లే రిటైర్మెంట్ తీసుకుందాం అని ఆలోచిస్తుంటారు. కానీ కాథరిన్ బ్రికెన్ మాత్రం ఇందుకు భిన్నం. 50 ఏళ్ల వయసులో క్యాన్సర్ను జయించడమేకాదు, కోట్లాది డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది. సంకల్పం ఉంటే వయసుతో నిమిత్తం లేకుండా ఎంతటి కష్టాలనైనా జయించి విజయం సాధించవచ్చని నిరూపించిన కేథరీన్ స్టోరీ తెలుసుకుందాం.లండన్కు చెందిన కాథరిన్ బ్రికెన్ తన ఉద్యోగాన్ని వదిలేసి, ఇంటి నుండే ఏదైనా పని చేయాలనుకుంది. మొదటి కాన్పులో కవలలు, ఆ తరువాత కొద్ది కాలానికే మరో బిడ్డ పుట్టడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అలా పిల్లలునిద్రపోయే సమయంలో కేకులు, కుకీలు తయారు చేయడం ప్రారంభించింది.2017లో 'డోలిషియస్' అనే బహుళ-మిలియన్ డాలర్ల స్నాక్ బ్రాండ్కు నాంది పలికింది.వ్యాపార ఆలోచన ఎలా పుట్టింది2008లో అమెరికా నుండి లండన్కు మారినప్పుడు, అక్కడ అమెరికన్ తరహా సాఫ్ట్ కుకీలు దొరకడం లేదని గమనించింది. అలాంటివే తాను తయారు చేసి విక్రయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. అలా 2017లో50 ఏళ్ల వయసులో, 'డోలిషియస్' 'Doughlicious' అనే సంస్థను స్థాపించింది. వ్యాపారం ప్రారంభంలో ఆమె రోజుకు 20 గంటలు పని చేసేవారు. నిరంతరం పిండి కలపడం వల్ల ఆమె చేతి వేలి కీలు దెబ్బతిని, శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది.బ్రెస్ట్ క్యాన్సర్2019లో ఆమెకు స్టేజ్-1 రొమ్ము క్యాన్సర్ సోకింది. అయినా ఆమె ధైర్యం కోల్పోలేదు. సర్జరీ, రేడియేషన్ తీసుకుంటూనే వ్యాపారాన్ని నడిపించింది. అంతే కాదు వ్యాపారంపై ఉన్న ధ్యాస తన బాధను మర్చిపోయేలా చేసిందని తెలిపింది.ప్రస్తుతం ఆమె వయసు 59 ఏళ్లు. ఆమె గత ఐదేళ్లుగా క్యాన్సర్ నుండి విజయవంతంగా కోలుకుంది. అలాగే ఆమె బ్రాండ్ 'Doughlicious' ఇప్పుడు వారానికి 10 లక్షలకు పైగా కుకీలను ఉత్పత్తి చేస్తోంది. టెస్కో, హోల్ ఫుడ్స్, టార్గెట్ వంటి అంతర్జాతీయ రిటైల్ దిగ్గజాల స్టోర్లలో ఆమె ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి.ఇదీ చదవండి: సహజీవనం, బిడ్డ : ఇపుడు లైంగిక దాడి అంటే ఎలా? సుప్రీం కీలక వ్యాఖ్యలుఅలుపెరుగని శ్రమ, ఎన్నో సవాళ్లుఅయితే తన సక్సెస్ అంత ఈజీగా రాలేదు అంటూ తన అనుభవాలను గుర్తు చేసుకుంది. అటు కేటరింగ్ పనులు చేయడం, కుకీలు తయారు చేయడం, ఇటు తెల్లవారుజామున 4 గంటల వరకు నిద్రలేకుండా ఉండటం, మళ్ళీ ఉదయం 7 గంటలకు లేచి అమ్మగా బాధ్యతలు నిర్వర్తించడం తనకు ఒక సవాల్ గా ఉండేదని తెలిపారు. కానీ క్యాన్సర్ గురించి గానీ, లేదా నొప్పి గురించి గానీ ఆలోచించే సమయం లేకుండా తన సంస్థ తనకు ఎంతో మేలు చేసిందన్నారు. ఎందుకంటే తన గురించి తన వ్యాధి గురించి మథనపడటానికి అస్సలు సమయమే లేదు, తాను పూర్తి చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయనే విషయాన్ని తన బాధ్యత గుర్తు చేసిందని అదే తన విజయానికి బాటలు వేసిందంటారు కాథరిన్ బ్రికెన్ . ఇదీ చదవండి: రూ. లక్షకు కొని, ‘లక్’ లేదని వదిలేశారు.. షాకింగ్ ఫ్యాక్ట్స్ -
యుద్దం వేళ.. నెతన్యాహుకు షాక్ తప్పదా?
జెరూసలేం: పశ్చిమాసియాలో యుద్ధం వేళ ఇజ్రాయెల్ రాజకీయం మరో టర్న్ తీసుకుంది. యుద్ధాలు బిజీగా ఉన్న ప్రస్తుత ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుకు చెక్ పెట్టేందుకు ప్రత్యర్థులు చేతులు కలిపారు. రాబోయే ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికల్లో నెతన్యాహును ఓడించేందుకు కొత్త రాజకీయ పార్టీ ఏర్పటైంది. ఇజ్రాయెల్ మాజీ ప్రధానులు ఇద్దరు కలిసి నెతన్యాహును గద్దె దించే లక్ష్యంతో కొత్త రాజకీయ పార్టీని పెట్టారు. ఈ నేపథ్యంలో యుద్ధ వాతావరణంతో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్కు ఎన్నికల హీట్ తోడైంది.ఇజ్రాయెల్లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం ఇజ్రాయెల్ మాజీ ప్రధానులు నఫ్తాలి బెన్నెట్, యైర్ లాపిడ్ కొత్త రాజకీయ పార్టీని పెట్టారు. ఈ కొత్త పార్టీకి 'టుగెదర్, లెడ్ బై బెన్నెట్' అని నామకరణం చేశారు. ఈ ఏడాది జరగబోయే ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఒకే కూటమిగా పోటీ చేయనున్నాయి. ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహును గద్దె దించే లక్ష్యంతో తమ పార్టీలైన యెష్ అటిడ్ (యైర్ లాపిడ్), బెన్నెట్ 2026 (నఫ్తాలి బెన్నెట్)ను విలీనం చేశారు. అయితే, విచ్ఛిన్నమైన ప్రతిపక్షాన్ని ఏకం చేయడమే ఈ ఇద్దరు రాజకీయ నాయకుల కూటమి లక్ష్యం. కాగా, నెతన్యాహుకు నఫ్తాలి బెన్నెట్, యైర్ లాపిడ్ ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు.Former Israeli PMs Bennett and Lapid formed a new 'TOGETHER' party to topple Netanyahu's government. Bennett and Lapid: "The State of Israel must change direction." pic.twitter.com/wpHuAedDTP— World Vibe (@world_vibe_en) April 27, 2026అయితే, కొత్త పార్టీ ప్రధానంగా జాతీయ భద్రత, సైనిక సేవా సంస్కరణలు, మరియు సామాజిక సమానత్వంపై దృష్టి పెట్టింది. ఈ పార్టీకి మద్దతు ప్రధానంగా మధ్యతరగతి, సెంటర్-రైట్ మరియు సెక్యులర్ వర్గాల నుండి వస్తోంది. తాజా సర్వేలు ప్రకారం, ఈ కూటమి నెతన్యాహు ఆధ్వర్యంలోని లికుడ్ పార్టీకి గట్టి సవాలు విసరగలదని సూచిస్తున్నాయి.రాజకీయ నేపథ్యం..ఇజ్రాయెల్లో అస్థిర రాజకీయ పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత నాలుగేళ్లలో ఐదు సార్లు ఎన్నికలు జరిగాయి.నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ, మెజారిటీ సాధించలేకపోయింది.చిన్న పార్టీల మధ్య కూటమి విభేదాలు తరచూ ప్రభుత్వ పతనానికి దారితీస్తున్నాయి.ఈ నేపథ్యంలో బెన్నెట్–లాపిడ్ కొత్త పార్టీ, ప్రతిపక్షాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.2026 చివరిలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.ప్రభావంఈ కొత్త పార్టీ ఏర్పాటుతో ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.ప్రతిపక్షం ఏకమైతే, నెతన్యాహు ఆధిపత్యానికి సవాలు ఏర్పడుతుంది.అయితే, ఇజ్రాయెల్ రాజకీయ చరిత్రలో కూటమి ప్రభుత్వాలు ఎక్కువకాలం నిలవలేకపోవడం ఒక పెద్ద సవాలుగా ఉంది.సవాళ్లు..అరబ్ పార్టీలతో కూటమి లేకపోవడం వల్ల కొత్త పార్టీకి క్లిష్టం కావచ్చు.గతంలో బెన్నెట్–లాపిడ్ ప్రభుత్వ అనుభవం (2021–22) తక్కువకాలం మాత్రమే నిలవడం ఓటర్లలో అనుమానం కలిగించవచ్చు. -
‘ఇక ఏదీ మునుపటిలా ఉండదు’
లండన్: కృత్రిమ మేధస్సు (ఏఐ) రాకతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ రంగంలో అలజడి చెలరేగుతోంది. గడిచిన 37 ఏళ్లలో ఎన్నడూ లేనంత దారుణమైన పరిస్థితిని ప్రస్తుత ఎంట్రీ-లెవల్ జాబ్ మార్కెట్ ఎదుర్కొంటోంది. ఏఐ దెబ్బకు అగ్రశ్రేణి యూనివర్సిటీల విద్యార్థులు సైతం ఉద్యోగాలు సాధించలేక నానా అవస్థలు పడుతున్నారు. ఈ విపత్కర పరిణామాలను గమనించిన మెటా మాజీ ఎగ్జిక్యూటివ్ క్లారా షిహ్.. ‘ఇకపై ఏదీ మునుపటిలా ఉండదు’ అని హెచ్చరిస్తూనే, యువత (Gen Z) ఉద్యోగ వేట కోసం సరికొత్త ఏఐ సాధనాలను ఆశ్రయించాలన్నారు.టాపర్లనే దాటేసిన ఏఐ.. షాకింగ్ నిజాలుమెటా, సేల్స్ ఫోర్స్ వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేసిన క్లారా షిహ్.. ఏఐ టెక్నాలజీతో పొంచి ఉన్న ముప్పును ప్రత్యక్షంగా చూశారు. తమ సంస్థలోని అత్యుత్తమ ఉద్యోగుల కంటే ఏఐ ఏజెంట్లు అనేక పనుల్లో వేగంగా, అద్భుతంగా పనిచేయడం చూసి ఆమె విస్తుపోయారు. ఆ క్షణమే భవిష్యత్తు ఉద్యోగాలన్నీ ఏఐ మయం కాబోతున్నాయని ఆమె గ్రహించారు. ఏఐ ప్రభావంతో తన స్నేహితులు, బంధువుల పిల్లలు కనీసం ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు కూడా సాధించలేకపోవడం చూసి చలించిపోయారు. ఈ సంక్షోభం నుంచి యువతను గట్టెక్కించేందుకు ఆమె ‘న్యూ వర్క్ ఫౌండేషన్’ అనే లాభాపేక్షలేని సంస్థను స్థాపించారు.ఏఐ దెబ్బకు ఏఐతోనే బదులుప్రస్తుతం వస్తున్న ఈ సాంకేతికతను చూసి భయపడటం కంటే, దానిని ఆయుధంగా మలచుకోవడమే ఏకైక మార్గమని క్లారా స్పష్టం చేస్తున్నారు. ఉద్యోగం సంపాదించాలన్నా, ఉన్న దాన్ని కాపాడుకోవాలన్నా ఏఐ ఏజెంట్లను సమర్థవంతంగా వాడుకోవడంలో యువత నైపుణ్యం సాధించడం తప్పనిసరి. ఇందుకోసం ‘డియర్ సీసీ’ పేరుతో యువత కోసం ప్రత్యేక ఏఐ టూల్స్ ను ఆమె అందుబాటులోకి తెచ్చారు. ఇందులో ‘ఫీల్డ్ రిపోర్ట్’ అనే టూల్.. విద్యార్థులు ఎంచుకున్న కెరీర్ లో ఉన్న ప్రస్తుత అవకాశాలు, అలాగే ఏఐ వల్ల ఆ రంగంలో పొంచి ఉన్న ఆటోమేషన్ ముప్పును విశ్లేషించి చెబుతుంది.రెజ్యూమ్ అక్కర్లేదు.. ‘జాబ్క్లా’తో కొత్త రకం వేటఉద్యోగాన్వేషణను మరింత సులభతరం చేసేందుకు ‘జాబ్ క్లా’ (JobClaw) అనే మరో అద్భుతమైన టూల్ను కూడా ఈ ఫౌండేషన్ పరిచయం చేసింది. దీనికి ఎలాంటి రెజ్యూమ్ అవసరం లేదు. కేవలం ఐదు సాధారణ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే చాలు, అభ్యర్థి ఆసక్తులు, బలాలు ఆధారంగా సరిపోయే ఉద్యోగాలను ఇది వెతికి పెడుతుంది. మరోవైపు ఏఐ విషయంలో యువతలో ఆందోళన, కోపం పెరుగుతున్నాయని గాలప్ సర్వే వెల్లడించింది. ఇది కూడా చదవండి: నాడు రోమాలపై హేళన.. నేడు ఇంటర్లోనూ టాపర్! -
వరల్డ్ రిచెస్ట్ సిటీ.. అట్ట పెట్టెల్లో నివాసం..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం.. అత్యధిక సంఖ్యలో కోటీశ్వరులు నివసించే ప్రపంచ ఆర్థిక కేంద్రం హాంకాంగ్. అయితే, ఇక్కడ నివసిస్తున్న గృహ కార్మికులు, సామాన్య ఉద్యోగుల సంబంధించిన జీవన శైలి తాజాగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వీకెండ్స్లో కార్మికులు, ఉద్యోగులు అట్ట పెట్టెల్లో నివాసం ఉండటం, అండర్పాస్ల కింద సేద తీరడం వంటికి వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో, ఈ విషయం చర్చకు దారి తీసింది. ఇంతకీ వాళ్లంతా ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే..సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు హాంకాంగ్లో కార్మికుల జీవన శైలి, అక్కడి పరిస్థితులను వివరించారు. హాంకాంగ్లో గృహ నిర్మాణ కార్మికులు, సాధారణ ఉద్యోగులు, విద్యార్థుల అవస్థలను తెలియజేశారు. పలువురు కార్మికులు అండర్పాస్లు, వంతెనలపై కార్డ్బోర్డ్ పెట్టెలలో “కాఫిన్ హోమ్స్” (అట్ట పెట్టెల్లాంటి గదులు) నివసించడం ఆ వీడియోలో చూపించారు. ఈ సందర్బంగా వారందరికీ నివాసం ఉండేందుకు సొంత ఇళ్లు లేదని చెప్పుకొచ్చారు. కార్డ్బోర్డ్ పెట్టెలతో తాత్కాలిక "గదులను" నిర్మించుకుంటారు. ఈ క్రమంలో.. హాంకాంగ్ ధనికులకు నివాసం కల్పించడానికి నిరాకరించే శ్రమశక్తిపైనే హాంకాంగ్ ఆధారపడి నడుస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. View this post on Instagram A post shared by Rapha | Travel Tips & Itineraries 🌏 (@the.tale.of.travel) అయితే, “కాఫిన్ హోమ్స్” అనేవి అత్యంత చిన్న, కిక్కిరిసిన నివాస స్థలాలు. వీటిలో కార్మికులు మరియు తక్కువ ఆదాయం కలిగిన ప్రజలు నిద్రించాల్సి వస్తుంది. ఎందుకంటే హాంకాంగ్లో గృహ ధరలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవిగా ఉన్నాయి. దీంతో, ప్రతీ ఆదివారం(సెలవు రోజున) ఫిలిప్పీన్స్ మరియు ఇండోనేషియాకు చెందిన వేలాది మంది మహిళలు తాము శుభ్రపరిచే విలాసవంతమైన అపార్ట్మెంట్ల నుండి, నగరంలోని ఉన్నత వర్గాల వారిని చూసుకునే కేర్ సెంటర్ల నుండి బలవంతంగా బయటకు పంపించేయబడుతున్నారు. వారికి సెలవు రోజున నిరాశ్రయులుగా మిగిలిపోతున్నారు. సొంత నివాసాలు లేకపోవడంతో ఇలా అండర్పాస్లు, వంతెనలపై కార్డ్బోర్డ్ పెట్టెలలో సేద తీరుతున్నారు. కాగా, ఐక్యరాజ్యసమితి కూడా వీటిని “మానవ గౌరవానికి అవమానం”గా పేర్కొంది.ప్రధాన కారణం.. హాంకాంగ్లో గృహ సంక్షోభానికి ప్రధాన కారణం భూమి కొరత, అధిక గృహ ధరలు, మరియు ప్రభుత్వ విధానాలే కారణం. హాంకాంగ్లో భూమి పరిమితంగా ఉండటం, ఎక్కువ భాగం పర్వతాలు లేదా రక్షిత ప్రాంతాలు కావడం ప్రధాన కారణం. మరోవైపు.. 2004–2021 మధ్య గృహ ధరలు 239% పెరిగాయి, కానీ వేతనాలు కేవలం 7.1% మాత్రమే పెరిగాయి. ప్రభుత్వం భూమి అమ్మకాలపై ఆధారపడటం వల్ల, అధిక విలువ గల ప్రాజెక్టులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తుంది. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కూడా ధరలను మరింత పెంచాయి. దీంతో, సామాన్యులు, కార్మికులు ఇళ్లు కొనే పరిస్థితి లేదు. Hong Kong’da pazar izni gerçeği: Binlerce ev işçisi, çalıştıkları evden çıkmak zorunda kaldığı için köprü altlarında karton kutularla kendine “oda” yapıyor.Modern şehir dediğimiz şey bazen sadece pahalı binalardan ibaret. pic.twitter.com/ZTz9OvrB6M— 🐺Özet Geç 🦅 (@_OzetGec_) April 26, 2026కాఫిన్ హోమ్స్ అంటే ఏమిటి?.పరిమాణం: 11–25 sq ft (సాధారణంగా ఒక పార్కింగ్ స్థలం లేదా జైలు గది పరిమాణం).రూపకల్పన: పాత అపార్ట్మెంట్లను విభజించి, లోపల పెట్టెల్లాంటి గదులు తయారు చేస్తారు.సౌకర్యాలు: కిటికీలు లేకపోవడం, గాలి ప్రసరణ తక్కువగా ఉండటం, ప్రైవసీ లేకపోవడం.నివాసులు: తక్కువ ఆదాయం కలిగిన కార్మికులు, డెలివరీ వర్కర్లు, వృద్ధులు, కొంతమంది విద్యార్థులు.సవాళ్లు..అద్దెలు పెరగడం: కొత్త నియమాలు గృహ ప్రమాణాలను మెరుగుపరుస్తాయి కానీ అద్దెలు పెరిగే అవకాశం ఉంది.సామాజిక అసమానత: తక్కువ ఆదాయం గల కార్మికులు ఇంకా “కాఫిన్ హోమ్స్” లేదా subdivided flatsలోనే ఉండే ప్రమాదం ఉంది.రాజకీయ ప్రభావం: డెవలపర్లు మరియు ప్రభుత్వ ఆదాయ ప్రయోజనాలు ప్రజా గృహాల విస్తరణను అడ్డుకుంటాయి.సమస్యలు, పరిష్కారాలుసమస్య: హాంకాంగ్లో గృహ ధరలు అత్యంత ఎక్కువగా ఉండటం వల్ల కార్మికులు ఇలాంటి “కాఫిన్ హోమ్స్”లో నివసించాల్సి వస్తోంది.ప్రభుత్వ చర్యలు: తాత్కాలిక గృహాలు (transitional housing) అందిస్తున్నారు, కానీ 2 సంవత్సరాలకే పరిమితం.సామాజిక ప్రభావం: ఇది హాంకాంగ్లోని ఆర్థిక అసమానతకు స్పష్టమైన ఉదాహరణ. -
దిగివచ్చిన ఇరాన్.. యుద్ధం ముగింపు, హార్మూజ్పై గ్రీన్సిగ్నల్!
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య చర్చల వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు, హార్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ కొత్త ప్రతిపాదనలు అందించింది అంటూ ఓ అమెరికన్ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. దీంతో, యుద్ధంగా ముగుస్తుందా? అనే చర్చ మొదలైంది. అమెరికన్ మీడియా సంస్థ యాక్సియోస్ ప్రకారం..‘అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు, హార్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ కొత్త ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలను మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న పాకిస్తానీ అధికారుల ద్వారా అమెరికాకు ఇరాన్ చేరవేసింది. వివాదాస్పద అణు చర్చలను తదుపరి దశకు వాయిదా వేస్తున్నట్లు ఆ ప్రతిపాదనలో పేర్కొంది’ అని వెల్లడించింది. కాగా, పశ్చిమాసియా సైనిక ఘర్షణల నేపథ్యంలో ఇరాన్ కొత్త ప్రతిపాదన కీలక పరిణామంగా ఆ మీడియా కథనం అభివర్ణించింది. యాక్సియోస్ ప్రకారం.. వైట్హౌస్కు ఈ ప్రతిపాదన అందింది. కానీ, దీనిని పరిశీలించడానికి యునైటెడ్ స్టేట్స్ సుముఖంగా ఉందో లేదో స్పష్టంగా తెలియదు.Amid the deepening stalemate in peace talks, Iran has conveyed a fresh proposal to the United States through Pakistani mediators, prioritising reopening the Strait of Hormuz and bringing the ongoing war in West Asia to an end while deferring contentious nuclear negotiations to a… pic.twitter.com/DNRlZgKoZH— India Today Global (@ITGGlobal) April 27, 2026ఇదిలా ఉండగా.. చర్చలకు రెడీ అయితే ఇరాన్ ఎప్పుడైనా తమకు సందేశాన్ని పంపొచ్చని ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు పొందే అవకాశాన్ని ఇరాన్కు ఇచ్చేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈనేపథ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ పంపిన కొత్త ప్రతిపాదనలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇక, ఇరు దేశాల మధ్య స్తంభించిపోయిన శాంతి ప్రయత్నాల మధ్య ఈ ప్రతిపాదన వచ్చింది.అణు చర్చలపై ఉత్కంఠ..అంతకుముందు.. ఇరాన్ కనీసం ఒక దశాబ్దం పాటు యురేనియం శుద్ధిని నిలిపివేయాలని, ప్రస్తుతం ఉన్న నిల్వలను దేశం నుండి తరలించాలని అమెరికా డిమాండ్ చేసింది. అయితే, నివేదిక ప్రకారం, ఈ డిమాండ్లకు ఎలా స్పందించాలనే దానిపై ఇరాన్ నాయకత్వంలో ఏకాభిప్రాయం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి మరియు ప్రధాన సంధానకర్త అబ్బాస్ అరఘ్చి వారాంతంలో మధ్యవర్తులతో చెప్పారు. ఇక, పాకిస్తానీ మధ్యవర్తుల ద్వారా తెలియజేసిన రెండు దశల ప్రణాళికలో మొదట హార్మూజ్ జలసంధిపై సంక్షోభాన్ని పరిష్కరించడం, అమెరికా దిగ్బంధనాన్ని ముగించడంపై ప్రాధాన్యత ఇస్తుంది. కొత్త ప్రతిపాదన ప్రకారం, కాల్పుల విరమణను సుదీర్ఘ కాలం పాటు పొడిగించడమో లేదా యుద్ధానికి శాశ్వత ముగింపు పలకడమో చేయాలి. జలసంధిని తిరిగి తెరిచి, దిగ్బంధనాన్ని ఎత్తివేసిన తర్వాత, తదుపరి దశలో మాత్రమే అణు చర్చలు ప్రారంభించాలి. -
భారతీయ మేధస్సుపై ట్రంప్ వ్యాఖ్యలు.. ఆత్మగౌరవానికి దెబ్బ
నేడు ప్రపంచ యవనికపై ఒక వికృత దృశ్యం ఆవిష్కృతమైంది. ఏ దేశమైతే స్వేచ్ఛకు, సమానత్వానికి కేరాఫ్ అడ్రస్ అని చెప్పుకుంటుందో.. ఏ దేశమైతే వలసదారుల రక్తం, చెమట మీద నిర్మించబడిందో.. ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ రోజు భారతీయ వలసదారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమైనవి. భారతీయులు నరకం నుంచి వస్తున్నారంటూ ఒక లేఖను సోషల్ మీడియాలో షేర్ చేయడం అత్యంత దారుణమైన విషయం. ఇది కేవలం ఒక దేశాధ్యక్షుడు చేయాల్సిన ప్రకటన కానే కాదు, ఇది ఒక జాతి మేధస్సుపై చేసిన దాడి. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవానికి తగిలిన గాయం. అధ్యక్షుడు ట్రంప్ గారూ మీరూ… ఒక్కసారి చరిత్ర పుటలు తిరగేయండి. మీ అహంకారపు పునాదుల కింద ఉన్నది భారతీయ మేధస్సు అని మర్చిపోకండి!అమెరికా వెన్నెముక.. భారతీయులే అన్న విషయాన్ని విస్మరించకండి. అసలు భారతీయులు లేని అమెరికాను ఊహించడం అసంభవం. గణాంకాలు ఏం చెబుతున్నాయో మీరే చూడండి. సుందర్ పిచాయి లేని గూగుల్, సత్య నాదెళ్ల లేని మైక్రోసాఫ్ట్, అరవింద్ కృష్ణ లేని IBM, శంతను నారాయణ్ లేని అడోబ్.. ఇవి కేవలం పేర్లు కావు, అమెరికాను ప్రపంచానికి నాయకుడిగా నిలబెట్టిన మేధావులు. మీరు ఈ రోజు వాడుతున్న విండోస్ నుంచి సెర్చ్ చేస్తున్న గూగుల్ వరకు ప్రతి అణువులోనూ భారతీయుడి మేధస్సు ఉంది. అమెరికాలోని అత్యంత శక్తివంతమైన 500 కంపెనీల్లో దాదాపు 35 శాతం కంపెనీల సారథులు భారతీయులే. సుందర్ పిచాయి, సత్య నాదెళ్ల మాత్రమే కాదు.. లీనా నాయర్ (చానెల్), రవి కుమార్ (కాగ్నిజెంట్), నిమేష్ షా.. ఇలా ఒక సుదీర్ఘమైన జాబితా ఉంది. వీరు లేకపోతే అమెరికా స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోతుంది.అమెరికా జనాభాలో భారతీయులు కేవలం 1.5 శాతం మాత్రమే. కానీ అమెరికా చెల్లించే మొత్తం ఆదాయపు పన్నులో భారతీయుల వాటా దాదాపు 6 శాతం. అంటే 300 పై చిలుకు బిలియన్ డాలర్లు. అంత పెద్ద మొత్తంలో ఖజానాకు పన్నుల రూపంలో ఇస్తున్నది భారతీయులే. అంతే కాదు అమెరికాలో ప్రతి నలుగురు వైద్యులలో ఒకరు భారతీయులే. భారతీయులు గనుక ఒక్క రోజు సమ్మె చేస్తే అమెరికా ఆస్పత్రుల్లో రోగుల పరిస్థితి ఏమిటో అమెరికా అధ్యక్షుడు ఒక సారి గుర్తు చేసుకుంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. ఒకవేళ భారతీయులు అక్కడ నరకాన్ని సృష్టిస్తే, ఆ నరకంలో నుంచి అమెరికన్లను కాపాడే దేవుళ్లు ఎవరు? అంతెందుకు మీరు గొప్పగా చెప్పుకునే నాసా లోని శాస్త్రవేత్తలలో 36 శాతం మంది భారతీయులే. అంటే అమెరికా జెండా అంతరిక్షంలో రెపరెపలాడాలన్నా, వెనక ఉండాల్సింది భారతీయుడి మేధస్సే.అమెరికా గత 50 ఏళ్లుగా గ్రీన్ కార్డ్ ఆశ చూపి మన దేశంలోని అత్యుత్తమ మేధస్సును దోచుకుంది. ఐఐటీలు, ఐఐఎంలలో మన ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చదివిస్తే.. ఆ మేధస్సును వాడుకుని అమెరికా లాభపడింది. తీరా పనయ్యాక, ఇప్పుడు నరకం అని ముద్ర వేస్తారా? ఇదేనా మీ సంస్కారం? గత అమెరికా అధ్యక్షులు తెలివైన వారు కాబట్టే భారత్ నుంచి మేధో వలసను ప్రోత్సహించారు. తద్వారా అమెరికా నేడు అగ్రరాజ్యమైంది. కానీ నేడు ట్రంప్ ఆ మేధావులను నరకం నుంచి వచ్చిన వారుగా సంబోధించడం ఆయన దిగజారుడుతనానికి పరాకాష్ఠ. ఏ నోటితో అయితే భారతీయులను దూషిస్తున్నారో, అదే నోటితో మళ్ళీ భారతీయ ఐటీ కంపెనీల సాయం కోరడం ఆయన ద్వంద్వ నీతికి నిదర్శనం. అమెరికా అభివృద్ధి చెందింది వారి సొంత తెలివితేటలతో కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులను, ముఖ్యంగా భారతీయులను ఆకర్షించి, వారిని వాడుకోవడం వల్ల మాత్రమే. ఈ విషయంలో భారత ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? మన దేశ గడ్డపై పుట్టి, ఇక్కడి నీరు తాగి, ఇక్కడ చదువుకుని.. అమెరికాను నిర్మిస్తున్న మన మేధావులను అవమానిస్తుంటే మన ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? ఇది దౌత్యపరమైన అంశం మాత్రమే కాదు, ఇది మన దేశ గౌరవానికి సంబంధించిన విషయం. మన టెక్కీలను, డాక్టర్లను, సైంటిస్టులను తిరిగి రండి.. మీ దేశాన్ని నిర్మించండని పిలిచే దమ్ము మన దేశ నాయకత్వానికి లేదా?పొరుగున ఉన్న చైనా గూగుల్ లేకుండా నడవగలుగుతోంది, వాట్సాప్ లేకుండా ఉండగలుగుతోంది. మరి భారత్ ఎందుకు గూగుల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి యాప్లపై ఆధారపడాలి? మన డేటాను వారు వాడుకుంటూ, మన దేశం నుంచి బిలియన్ డాలర్ల కొద్దీ వ్యాపారం చేస్తూ మనపైనే అహంకారం ప్రదర్శిస్తే ఎందుకు మౌనంగా ఉండాలి? మేకిన్ ఇండియా అనేది కేవలం నినాదం కాదు, అదొక నిప్పు కణిక కావాలి. మన మేధావులతో సరికొత్త సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్ తీసుకురావాలి. భారతీయులను గౌరవించని దేశాల యాప్లను మన దేశంలో ఎందుకు అనుమతించాలి? చైనా తరహాలో మనం కూడా మన సొంత డిజిటల్ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ కేవలం ఖండనలతో సరిపెట్టకూడదు. మా టెక్కీలను, మా డాక్టర్లను వెనక్కి రమ్మని భారత ప్రధాని ఎందుకు పిలుపు ఇవ్వకూడదు? గూగుల్ లేదా ఏఐ సెర్చ్ ఇంజన్లకు ప్రత్యామ్నాయంగా మనం సెర్చ్ ఇంజిన్ తయారు చేయలేమా? వాట్సాప్ కు బదులు మన సొంత మెసేజింగ్ యాప్ తీసుకురావడానికి ఇంకా ఎంతకాలం పడుతుంది? మన డేటాతో అమెరికా కంపెనీలు బిలియన్ల లాభాలు గడిస్తున్నాయి. ఆ డేటాను మన దేశంలోనే ఎందుకు భద్రపరచుకోకూడదు?మేకిన్ ఇండియా - ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? చైనా తన దేశంలో విదేశీ యాప్లను నిషేధించి సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. భారత్ ఆ సాహసం ఎందుకు చేయకూడదు? మన దగ్గర ప్రతిభ ఉంది, కోట్లాది మంది వినియోగదారులు ఉన్నారు. భారతీయులను అవమానించే నాయకులు ఉన్న దేశం నుంచి వస్తున్న టెక్నాలజీని మనం ఎందుకు నెత్తిన పెట్టుకోవాలి? ఆత్మనిర్భర్ భారత్ ఇది కేవలం వస్తువుల తయారీకే పరిమితం కాకూడదు. ఇది సాఫ్ట్వేర్, డిజిటల్ రంగాల్లో కూడా ప్రతిబింబించాలి.చివరగా, అధ్యక్షుడు ట్రంప్ గారూ.. వినండి! మీరు నిర్మిస్తున్న గోడలు మనుషులను వేరు చేయవచ్చు కానీ మేధస్సును ఆపలేవు. అమెరికా తన వినాశనాన్ని తనే కోరుకుంటుందని మీ వ్యాఖ్యలే నిరూపిస్తున్నాయి. భారతీయులు లేని అమెరికా ఒక శూన్యం. ఇకనైనా మన భారతీయ యువత ఆలోచించాలి. ఎన్నాళ్లు పరాయి దేశానికి ఊడిగం చేస్తాం? మన మేధస్సు మన దేశాభివృద్ధికి ఉపయోగపడాలి. విదేశీ యాప్లను బహిష్కరిద్దాం.. స్వదేశీ పరిజ్ఞానాన్ని వెలిగిద్దాం. మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే అమెరికా కల మనకు వద్దు! భారతీయ మేధస్సు.. ప్రపంచానికి దిక్సూచి కావాలి. - కంచర్ల యాదగిరిరెడ్డి, Managing Editor, సాక్షి టీవీ. -
కుక్కలు, పిల్లులు కాదు.. చైనాలో వింత ట్రెండ్!
ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ సరికొత్త టెక్నాలజీతో, ఆర్థిక విషయాలతో ఆశ్చర్యపరిచే చైనా.. ఇప్పుడు ఓ విచిత్రమైన ట్రెండ్తో వార్తల్లో నిలిచింది. ఇన్నాళ్లూ కేవలం వంటకాలకే పరిమితమైన కోళ్లు ఇప్పుడు అక్కడి ప్రధాన నగరాల్లో ముద్దులొలికే పెంపుడు జంతువులుగా మారిపోయాయి. ఏకంగా డైపర్లు వేసుకుని, వీధుల్లో షికారు చేస్తూ, ఇంటర్నెట్ సెన్సేషన్గా మారుతున్నాయి.అగ్వాయ్ ‘ఫీనిక్స్ ఫెయిరీస్’గువాంగ్డాంగ్ లాంటి ప్రాంతాల్లో కోడి కనిపిస్తే అది వంటకంలో ఉండాల్సిందే అన్న సామెత ఉంది. కానీ, అగ్వాయ్ అనే మహిళ తనకు బంధువులు ఇచ్చిన మూడు గుడ్లను పొదిగించి, ఆ కోడిపిల్లలను వండుకోకుండా ముద్దుగా పెంచుకుంటోంది. ఇవి అరుదైన, ఖరీదైన ‘తైహే బ్లాక్-బోన్డ్ సిల్కీ ఫౌల్’ జాతికి చెందినవి. మంచు లాంటి తెల్లటి ఈకలతో ఆకట్టుకునే వీటిని ‘ఫీనిక్స్ ఫెయిరీస్’ అని ముద్దుగా పిలుస్తారు. వీటి నిర్వహణ చాలా సులభమని, నెలకు కేవలం 30 యువాన్లు (సుమారు రూ. 450) మాత్రమే ఆహారం కోసం ఖర్చవుతుందని ఆమె తెలిపింది.కుక్కలు, పిల్లుల కంటే ఇవే బెటర్కోళ్లు చాలా తెలివైనవని, వాటికి ఎమోషన్స్ ఉంటాయని యజమానులు చెబుతున్నారు. జియాంగ్సు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తన కోడిపుంజు మనుషులతో భావోద్వేగాలను పంచుకుంటుందని, కళ్లతోనే కమ్యూనికేట్ చేస్తుందని తెలిపాడు. చిలుకలు, కుక్కలు, పిల్లులను పెంచిన అలిన్ అనే మరో యజమాని.. వాటన్నింటికంటే కోళ్లే మనుషులతో త్వరగా కనెక్ట్ అవుతాయని అంటోంది. సాధారణ పెంపుడు జంతువులకు అయ్యే ఖర్చు, వాటికి కేటాయించాల్సిన సమయం కంటే.. కోళ్ల నిర్వహణ చాలా సులభమని ఆమె అభిప్రాయపడింది.ఎక్కడి నుంచి వస్తున్నాయి?పెంపుడు జంతువులుగా మారుతున్న ఈ కోళ్లన్నీ ఎక్కువగా ఫారాల నుంచి వస్తున్నవే. గుడ్లు పెట్టలేని పుంజులు, మాంసం కోసం పెంచే బ్రాయిలర్ కోళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. కొన్ని సూపర్ మార్కెట్లు ఎగ్స్, పెరుగు కొన్నవారికి ఆఫర్ల రూపంలో ఈ కోడిపిల్లలను ఉచితంగా ఇస్తుండగా.. రైతులు సిటీ పార్కుల్లో ఒకటి నుంచి మూడు యువాన్లకే అతి చవకగా విక్రయిస్తున్నారు. ఇది నగరవాసులను, ముఖ్యంగా పిల్లలను విపరీతంగా ఆకర్షిస్తోంది. చైనీయుల జీవనశైలిలో కోళ్లు కొత్త ఫ్యామిలీ మెంబర్స్గా మారిపోయాయి.ఇది కూడా చదవండి: ‘22 నిమిషాల్లో శత్రువుల వెన్నువిరిచేశాం’ -
మాలి రక్షణ మంత్రి దారుణ హత్య
బమాకో: పశ్చిమాఫ్రికా దేశమైన మాలిలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాలి రక్షణ మంత్రి జనరల్ సాడియో కమరా దారుణ హత్యకు గురయ్యారు. ఉగ్రవాదులు, తిరుగుబాటుదారుల కూటమి దేశవ్యాప్తంగా సృష్టించిన భీకర దాడులతో మాలి ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. రష్యా మద్దతుతో నడుస్తున్న సైన్యం వెనక్కి తగ్గడంతో, దేశ భద్రత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.మంత్రి నివాసంపై కారు బాంబు దాడిమాలి రాజధాని బమాకోలో జరిగిన కారు బాంబు, సాయుధ దాడిలో రక్షణ మంత్రి జనరల్ సాడియో కమరా ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు ఆయన నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. జనరల్ కమరా వీరోచితంగా పోరాడి కొందరు దుండగులను మట్టుబెట్టినప్పటికీ, తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ దాడుల్లో 16 మందికి గాయాలయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం రాజధానిలో మూడు రోజుల పాటు రాత్రిపూట కర్ఫ్యూ విధించింది.అల్ ఖైదాతో చేతులు కలిపి..మాలి ఉత్తర భాగంలో స్వతంత్రం కోసం పోరాడుతున్న అజావాద్ లిబరేషన్ ఫ్రంట్ (ఎఫ్ఎల్ఏ) సాయుధులు, అల్ ఖైదాతో సంబంధం ఉన్న జెఎన్ఐఎం (జెఎన్ఐఎం) ఉగ్రవాదులతో జట్టుకట్టారు. ఈ కూటమి వ్యూహాత్మకంగా వ్యవహరించి, మాలి సైన్యంపై విరుచుకుపడింది. ఈ భీకర దాడుల ధాటికి సైన్యం వెనక్కి తగ్గడంతో, కీలకమైన ఉత్తర నగరమైన కిడాల్ పూర్తిగా తిరుగుబాటుదారుల ఆధీనంలోకి వెళ్లిపోయింది. శాంతియుత ఒప్పందం ద్వారా ప్రభుత్వ బలగాలు కిడాల్ను ఖాళీ చేసి, వంద కిలోమీటర్ల దూరంలోని అనెఫిస్ కు చేరుకున్నాయని సైన్యాధికారులు తెలిపారు.రష్యా సైనిక వ్యూహాలకు భారీ ఎదురుదెబ్బఈ పరిణామాలు పశ్చిమాఫ్రికాలో రష్యా ఆధిపత్యానికి అతిపెద్ద సవాలుగా మారాయి. మాలి సైనిక ప్రభుత్వం పాశ్చాత్య దేశాలను కాదని, రష్యా బలగాల (ఆఫ్రికా కార్ప్స్) మద్దతు తీసుకోవడం ప్రారంభించినప్పటి నుండి ఇక్కడ హింస తీవ్రరూపం దాల్చింది. భిన్న సిద్ధాంతాలున్న రెండు సాయుధ వర్గాలు ఒకటై ఇంతటి భారీ కుట్రను అమలు చేశాయి. దీనిని పసిగట్టలేకపోవడం రష్యా సైనికుల వైఫల్యమేనని భద్రతా నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇది కూడా చదవండి: జపాన్లో మళ్లీ భూకంపం.. సునామీ ముప్పు ఉందా? -
జపాన్లో మళ్లీ భూకంపం.. సునామీ ముప్పు ఉందా?
టోక్యో: సరిగ్గా వారం రోజుల క్రితం సంభవించిన భారీ భూకంపం తాలూకు భయం నుండి జపాన్ ప్రజలు ఇంకా తేరుకోకముందే, ఆ దేశాన్ని ప్రకృతి మరోసారి వణికించింది. సోమవారం(నేడు) తెల్లవారుజామున ఉత్తర జపాన్ను భారీ తీవ్రతతో కూడిన భూకంపం కుదిపేసింది. అయితే, అదృష్టవశాత్తూ ప్రస్తుతానికి ఎలాంటి సునామీ హెచ్చరికలు లేకపోవడంతో ప్రజలు, ప్రభుత్వ అధికారులు తాత్కాలికంగా ఊపిరి పీల్చుకున్నారు.本日5時24分頃、北海道十勝地方南部を震源とする地震が発生し、北海道浦幌町で最大震度5強の強い揺れを観測しました。津波の心配はありません。…— 高市早苗 (@takaichi_sanae) April 26, 2026భూకంప తీవ్రత ఎంతంటే?జపాన్ వాతావరణ శాఖ అందించిన తాజా అధికారిక వివరాల ప్రకారం ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. జపాన్కు ఉత్తరాన ఉన్న ప్రధాన దీవి అయిన హక్కైడోలోని చిన్న పట్టణమైన సరబెట్సు కు పశ్చిమంగా 18 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. దీని లోతు భూగర్భంలో సుమారు 81 కిలోమీటర్లు ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS)తెలిపింది. ఈ ప్రకంపనల ధాటికి పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. సునామీ ముప్పు ఉందా? నష్టం ఏమైనా జరిగిందా?ఈ హఠాత్పరిణామంతో సముద్ర తీరప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురైనప్పటికీ, అధికారులు వారికి ఊరటనిచ్చే వార్త చెప్పారు. ఈ తాజా భూకంపం కారణంగా ఎలాంటి సునామీ వచ్చే అవకాశం లేదని, ఎలాంటి అడ్వైజరీ జారీ చేయలేదని జపాన్ జాతీయ వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం కానీ, భవనాలు కూలిపోయి ఆస్తి నష్టం జరిగినట్లు కానీ ఎటువంటి నివేదికలు అందలేదు. అయినప్పటికీ అత్యవసర సహాయక బృందాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నాయి.వారం క్రితమే వణికిన జపాన్వారం రోజుల క్రితమే జపాన్లో ఏకంగా 7.7 తీవ్రతతో ఒక అతిపెద్ద భూకంపం సంభవించి దేశాన్ని అతలాకుతలం చేసింది. ఆ తీవ్ర పరిణామం తరువాత, ఈశాన్య తీరప్రాంతంలో భవిష్యత్తులో ‘మెగా భూకంపం’ వచ్చే ప్రమాదం స్వల్పంగా పెరిగిందని జపాన్ ఉన్నతాధికారులు సలహా హెచ్చరికలు జారీ చేశారు. ఆ ఘటన తాలూకు పీడకలల నుండి ప్రజలు బయటపడక ముందే తాజాగా ఈ 6.2 తీవ్రతతో ప్రకంపనలు రావడం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. వరుసగా వస్తున్న ఈ ప్రకృతి విపత్తుల కారణంగా జపాన్ ప్రభుత్వం ప్రస్తుతం హై అలర్ట్లో ఉంది.ఇది కూడా చదవండి: బెంగాల్ కోటలో సెలబ్రిటీలకు షాక్ -
దాడికి 10 నిమిషాల ముందు ఏం చేశాడంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇతర ఉన్నతాధికారులపై హత్యాయత్నం వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగు చూశాయి. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో దాడికి ముందు అనుమానితుడు తన కుటుంబానికి ఓ సుదీర్ఘమైన లేఖ(మేనిఫెస్టో) రాశాడు. అందులో దాడికి కారణాలు.. తన లక్ష్యం.. అలాగే ఆ దాడిని ఈ తరహాలోనే ఎందుకు చేయాలనుకుంది.. మొత్తం చెప్పుకొచ్చాడు.తనను తాను ఫ్రెండ్లీ ఫెడరల్ అస్సాసిన్’ అంటూ సంబోధించుకున్న ఎలెన్ ఇలా రాసుకొచ్చాడు.. హింసకు హింసతో ప్రతిస్పందించకూడదు. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించు అని క్రైస్తవం చెబుతుంది. వ్యక్తిగత అవమానాలు లేదా దాడులు ఎదురైనప్పుడు ప్రతీకారం తీర్చుకోవద్దు అని అంటోంది. కానీ, ఇతరుల చెంప మీద కొడుతున్నప్పుడు మౌనంగా చూడమని కాదు. అలాంటి సమయంలోనూ స్పందించకపోతే అణచివేతకు సహకరించినట్లే అవుతుంది.నిత్యం అఘాయిత్యాలు, ఆకలి కేకలు, వేధింపులు, అన్యాయంగా మరణశిక్షల విధింపు.. వీటిని చూస్తూ భరించలేకపోతున్నా. సాధ్యమైనంత వరకు ప్రాణనష్టం తగ్గించాలని భావిస్తున్నా. కానీ, ఒక రేపిస్ట్, ద్రోహి.. పసిపిల్లల మీద అఘాయిత్యాలు చేసిన వ్యక్తి ప్రసంగం వినడానికి చాలామంది వచ్చారు. నా లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అని పేర్కొన్నాడు. ఈ క్రమంలో..తన కుటుంబ సభ్యులు, సహచరులు, విద్యార్థులు, ప్రయాణికులు, హోటల్ సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు. అయితే తన నిర్ణయాలు ఇతరులకు నష్టం కలిగించవచ్చని క్షమాపణలు తెలియజేశాడు.అమెరికా కాలమానం ప్రకారం.. శనివారం రాత్రి వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో వైట్హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్’(డబ్ల్యూహెచ్సీఏ) విందు సమావేశం జరిగింది. పదేళ్ల తర్వాత ఆ డిన్నర్కు హాజరైన ట్రంప్.. మరికాసేపట్లో మాట్లాడాల్సి ఉంది. ఈలోపు.. 8.34గం. ప్రాంతంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది.హాల్ బయట కాల్పులు జరుగుతుండడంతో ట్రంప్ దంపతుల చుట్టూ భద్రతాధికారులు వలయంగా ఏర్పడి వేదిక వద్ద నుంచి తరలించారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ దంపతులను, ఇతర అధికారులనూ సిబ్బంది బయటకు తీసుకెళ్లారు. తుపాకులు, కత్తులతో వచ్చిన ఆగంతుకుడిని మీటింగ్ జరుగుతున్న బాల్రూంవైపు వెళ్లకుండా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆపేశాయి. సంకెళ్లు వేసి ఆపై అక్కడి నుంచి తరలించాయి. నిందితుడు కోల్ టొమాస్ ఎలెన్ను (31)గా ధృవీకరించిన దర్యాప్తు సంస్థలు.. కాలిఫోర్నియా టొరాన్స్లో అతనో టీచర్గా చెబుతున్నారు. అంతేకాదు.. ఎలెన్ అదే హోటల్లో బస చేశాడని అధికారులు గుర్తించారు.లిస్ట్ నుంచి ఆయనొక్కడికే మినహాయింపు.. ఎలెన్ లిస్ట్లో ఉన్న పేర్లు బయటకు రావాల్సి ఉంది. అయితే.. ట్రంప్ సహా ఆయన ప్రభుత్వంలోని హైలెవల్ నుంచి లోలెవల్ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ లిస్ట్ నుంచి ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ పేరు మాత్రం మినహాయించబడిందట. ఎలెన్ ఆయన్ని మాత్రమే ఎందుకు తప్పించాడు అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే హోటల్ సిబ్బందిని కూడా దాడి నుంచి మినహాయించుకున్నాడని తెలుస్తోంది.ఇవాళే కోర్టుకు.. వాషింగ్టన్ హిల్టన్లో భద్రతా తనిఖీ కేంద్రాన్ని దాటి, అధికారులతో కాల్పులు జరిపిన తర్వాత ఎలెన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఫెడరల్ కోర్టులో హాజరుపరచనున్నారు. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా యు.ఎస్. అటార్నీ జీనిన్ పిర్రో ఏం చెబుతున్నారంటే.. అతనిపై ఫెడరల్ ఆయుధాలు, దాడి కేసులు నమోదు చేయబడ్డాయి. అదనపు కేసులు నమోదు చేసే అవకాశం ఉందని కూడా చెప్పారు.తనపై జరిగిన హత్యాయత్నంపై డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. ‘‘ఎలెన్ క్రైస్తవ వ్యతిరేకి. క్రైస్తవుల పట్ల అతనిలో విద్వేషం పెరిగిపోయింది. అతనో మానసిక రోగి. గతంలో అతనిపై సోదరుడే పోలీసులకు ఫిర్యాదు చేశాడు’’ అని ట్రంప్ అన్నారు. అంతకు ముందు దాడిపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘అధ్యక్షుడిగా ఉండటం ప్రమాదకరమైన పనైనా నేను భయపడలేదు. మెలనియా కూడా పలుమార్లు నాతో ఈ విషయం చెప్పింది. జరిగిన దాని గురించి ఇక ఆలోచించను. ఎప్పటిలాగే పని చేసుకుంటూ వెళ్తా. దేనిని ఎలా ఎదుర్కోవాలో అలాగే ఎదుర్కొంటానని ప్రకటించారు. -
పాకిస్తాన్కు భారీ షాకిచ్చిన ఇరాన్!
టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య చర్చల నేపథ్యంలో దాయాది దేశం పాకిస్తాన్కు ఊహించని షాక్ తగిలింది. పాకిస్తాన్పై ఇరాన్ ఎంపీ ఇబ్రహీం రెజాయీ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలకు పాకిస్తాన్ తగిన మధ్యవర్తి కాదంటూ బాంబు పేల్చారు. అమెరికాకు మాత్రమే పాకిస్తాన్ వత్తాసు పలుకుతోందని ఘాటు విమర్శలు గుప్పించారు. దీంతో, చర్చలపై కొత్త ట్విస్ట్ నెలకొంది.అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల సందిగ్ధం నెలకొన్న వేళ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ జాతీయ భద్రత మరియు విదేశాంగ విధాన కమిషన్ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్న ఎంపీ ఇబ్రహీం రెజాయీ.. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంపై తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఇబ్రహీం ఎక్స్ వేదికగా..‘ఇరాన్కు పాకిస్తాన్ మంచి మిత్రుడే. కానీ, చర్చలకు సంబంధించి మధ్యవర్తిత్వానికి అవసరమైన విశ్వసనీయత పాకిస్తాన్కు లేదు. చర్చలకు పాకిస్తాన్ సరైన మధ్యవర్తి కాదు. ఒక మధ్యవర్తి నిష్పక్షపాతంగా ఉండాలి, ఎప్పుడూ ఒక పక్షానికే మొగ్గు చూపకూడదు. అమెరికా ప్రయోజనాలకు పాకిస్తాన్ అనుకూలంగా వ్యవహరిస్తుంది. ఇస్లామాబాద్ వాషింగ్టన్ను బహిరంగంగా విమర్శించకుండా ఉంటోంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇరాన్, అమెరికా మధ్య అనిశ్చితి ఉన్నప్పటికీ చర్చలను సజీవంగా ఉంచడానికి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి దౌత్యపరమైన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్న తరుణంలో ఆయన ఇలా వ్యాఖ్యలు చేయడం పాకిస్తాన్కు ఊహించని షాక్ ఇచ్చినట్టు అయ్యింది. కాగా, అరఘ్చి ఇటీవల మూడు రోజుల్లో రెండోసారి ఇస్లామాబాద్లో పర్యటించారు. అక్కడ ఆయన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్తో సంఘర్షణ, భవిష్యత్ కార్యాచరణ మార్గాలపై చర్చలు జరిపారు.ఫోన్లో చర్చలు: ట్రంప్ సూచనఇదిలా ఉండగా.. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల సందిగ్ధం వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి పరిష్కారం కోసం ఫోన్లో మాట్లాడుకోవచ్చని ట్రంప్ ఆదివారం సూచించారు. 17 గంటల విమాన ప్రయాణంలో ప్రతినిధి బృందాన్ని పంపే బదులు తానే ఆ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. "అన్ని అవకాశాలు మా చేతిలోనే ఉన్నాయి. వారు మాట్లాడాలనుకుంటే మా వద్దకు రావచ్చు, లేదా మాకు ఫోన్ చేయవచ్చు" అని ట్రంప్ అన్నారు. అయితే, ఆ ఫోన్ కాల్ ఎప్పుడు జరుగుతుందో మాత్రం సూచించలేదు.ట్రంప్ వార్నింగ్రెండో విడత శాంతి చర్చలపై అనిశ్చితిపై ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హెచ్చరించారు. యుద్ధం ముగించటానికి, కాల్పుల విరమణకు అంగీకరించడానికి కేవలం 3 రోజుల సమయం మాత్రమే ఉందన్నారు. లేదంటే వారి చమురు పైపులైన్లు పేలిపోతాయని ట్రంప్ తెలిపారు. ఇరాన్ చమురు ఎగుమతులను కొనసాగించలేకపోతే, యాంత్రికంగా, భూమి సహజశక్తుల కారణంగా పైపులైన్లు విఫలమవుతాయన్నారు. ఇరాన్కు భారీ పరిమాణంలో చమురు సరఫరా వ్యవస్థ ఉందని, ఏదైన కారణం చేత అది మూసుకుపోతే అప్పుడు ఇంధనాన్ని కంటైనర్లు లేదా నౌకల్లో నింపడం సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం ఇరాన్ అదే పరిస్థితి ఎదుర్కొటోందన్న ట్రంప్.. దిగ్బంధనం కారణంగా వారివద్ద నౌకలు కూడా లేవని తెలిపారు. -
నిందితుడు బెస్ట్ టీచర్!
వాషింగ్టన్: హిల్టన్ హోటల్లో కాల్పులకు తెగబడ్డ అలెన్ విద్యాధికుడు. ట్యూటర్గా, సాఫ్ట్వేర్, గేమింగ్ డెవలపర్గా పని చేసినట్లు దర్యాప్తులో తేలింది. రెండేళ్ల క్రితం ఉత్తమ ఉపాధ్యాయుడు పురస్కారం అందుకున్నాడు. 2017లో పాసడీనాలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అలెన్ మెకానికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేశాడు. అప్పుడు క్రిస్టియన్ స్టూడెంట్ ఫెలోషిప్ సైతం సాధించాడు. అదే ఏడాదిలో యూనివర్సిటీలో కాలేజీ విద్యార్థులు సరదాగా బొమ్మ తుపాకులతో నిర్వహించే క్రీడల్లో ‘నెర్ఫ్ గన్స్’ విద్యార్థుల జట్టులో అలెన్ సభ్యునిగా ఉన్నాడు. 2025లో డోమిన్గేజ్ హిల్స్లోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో అలెన్ మాస్టర్ డిగ్రీ పూర్తిచేశాడు. మెకానికల్ ఇంజనీర్గా, టీచింగ్ అసిస్టెంట్గా చేశాడు. ‘నాసా’ జెట్ ప్రొపల్షన్ లేబోరేటరీలో రీసెర్చ్ ఫెలోషిప్లో పాలుపంచుకున్నాడు. కాలేజీలో చేరాలనుకునే ఆరేళ్లుగా పార్ట్టైమ్ టీచర్గా చేస్తున్నాడు. బొహర్డ్యామ్, ఫస్ట్ లా అనే వీడియోగేమ్లను అభివృద్ధిచేశాడు. అలెన్ అరెస్టు అనంతరం ఆన్లైన్లో ఈ గేమ్లను వెతికేవారి సంఖ్య భారీగా పెరిగింది!హారిస్కు విరాళం: అలెన్ డెమొక్రటిక్ పార్టీ సానుభూతిపరుడని తెలుస్తోంది. 2024లో ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్కు 25 డాలర్లు విరాళం ఇచ్చినట్టు వెల్లడైంది. -
లెవిట్ చెప్పినట్టే పేలిన ‘తూటాలు’!
వాషింగ్టన్: హిల్టన్ హోటల్లో కాల్పుల నేపథ్యంలో ఆ ఉదంతానికి కొద్దిసేపటి ముందు శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలీన్ లెవిట్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ‘‘ఈరాత్రి జరగబోయే కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్ అద్భుతంగా ప్రసంగించనున్నారు. ఆ సందర్భంగా మాటల తూటాలు పేలనున్నాయి. ఆ తూటా శబ్దాలను అందరూ విని తీరాల్సిందే’’ అని లెవిట్ చెప్పుకొచ్చారు. ట్రంప్ పదునైన పదజాలంతో, వాగ్ధాటితో ప్రసంగిస్తారనే ఉద్దేశంలో ఆమె మాట్లాడినా, కొద్దిసేపటికే కార్యక్రమంలో నిజంగా తూటాలు పేలడం సరదా వ్యాఖ్యలకు తావిచ్చింది. ‘‘తూటా పేలుళ్లను లీవిట్ ముందే పసిగట్టారు. ఇలా జరగబోతోందని ఆమెకు ముందే తెలుసేమో’’ అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. ‘‘ఇదంతా రాజకీయ ఎత్తుగడ కాదు కదా!!’’ అని మరొకరు వ్యాఖ్యానించారు.బాటిళ్లు తీసుకెళ్లారు!ఓవైపు కాల్పుల మోత మోగుతుంటే కొందరు జర్నలిస్టులు మాత్రం మద్యం బాటిళ్లపై దృష్టిపెట్టారు! ఖరీదైన వైన్, షాంపేన్ బాటిళ్లతో సెలీ్ఫలు దిగారు. మరికొందరు వాటిని చెరోటి చంకలో పెట్టుకుని మరీ వెంట తీసుకెళ్లారు. మహిళా జర్నలిస్టులు వైన్ బాటిళ్లను వెంట తీసుకెళ్తున్న వీడియో వైరలైంది. అయితే ఈ సందర్భంగా పలువురు అగ్రనేతలు ప్రాణభయంతో పరుగెత్తుతుంటే, అది చూసి అక్కడే ఉన్న కొందరు మీడియా ప్రతినిధులు బిగ్గరగా నవ్వడం వివాదాస్పదమైంది. మరోవైపు, అంతటి గందరగోళంలోనూ ఒక పెద్దాయన నింపాదిగా కూర్చుని హాయిగా మద్యం సేవిస్తూ స్టఫ్ తింటూ కన్పించారు! -
రీగన్ను కాల్చిందీ.. ఆ హోటల్లోనే
వాషింగ్టన్: నలభై ఐదు సంవత్సరాల క్రితం కాల్పుల ఘటన నుంచి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ అదృష్టవశాత్తు బయటపడిన అదే హోటల్లో ట్రంప్పై హత్యాహత్నం జరగడంతో వాషింగ్టన్ నగరంలోని ‘హిల్టన్’ హోటల్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. 1981 మార్చి 30వ తేదీన రీగన్పై జరిగిన కాల్పుల ఘటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆరోజు హోటల్లో ఒక కార్యక్రమంలో పాల్గొని బయటికొచ్చి లిమోసిన్ కారు ఎక్కేందుకు వెళ్తుండగా దూరంగా నిలబడిన జాన్ హింక్లీ జూనియర్ అనే వ్యక్తి ఒక్కసారిగా రివాల్వర్తో బుల్లెట్ల వర్షం కురిపించాడు. 1.7 సెకన్ల వ్యవధిలో ఆరు బుల్లెట్లు కాల్చాడు. వాటిలో ఐదు అధ్యక్షుడు రీగన్సమీపంలోని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ జేమ్స్ బ్రాడీ, ఒక పోలీస్ ఆఫీసర్, ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్కు తగిలాయి. కానీ ఒక బుల్లెట్ మాత్రం ఎడమ చేతి కిందనుంచి నేరుగా రీగన్ ఛాతిలోకి దూసుకెళ్లింది. దీంతో ఎడమ ఊపిరితిత్తికి రంధ్రంపడింది. కాల్పుల ఘటనతో హుతాశులైన పోలీసులు వెంటనే రీగన్ను అదే లిమోసిన్ కారులో సమీప జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ బోధనాస్పత్రికి తరలించారు. శస్త్రచికిత్స ద్వారా బుల్లెట్ను తొలగించడంతో రీగన్ బతికిపోయారు. కాల్పులు జరిపిన జాన్ హింక్లీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కాల్పులు జరిపిన హింక్లీని మానసిక ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదని అతని లాయర్లు కోర్టులో వాదించారు. దీంతో 1982 జూన్లో అతడిని కఠినకారాగార శిక్ష నుంచి తప్పించారుగానీ నిర్బంధ కేంద్రంలో బంధించారు. ఏళ్లతరబడి వాదోపవాదనల తర్వాత 2016లో అతడిని సెయింట్ ఎలిజబెత్ ఆస్పత్రి మానసికరోగుల విభాగం నుంచి విముక్తుడిని చేశారు. చిట్టచివరకు 2022లో అతడిపై ఉన్న నేరాభియోగాలను పూర్తిగా ఎత్తేసి స్వేచ్ఛగా ఎక్కడైనా జీవించే హక్కు కల్పించారు. ‘ట్యాక్సీ డ్రైవర్’ సినిమా అందాల టీనేజీ హీరోయిన్ జోడీ ఫాస్టర్ మనసును గెల్చుకోవాలనే ఆత్రుతలో హింక్లీ ఇంతటి దారుణానికి ఒడిగట్టాడని దర్యాప్తు అధికారులు తేల్చారు. హింక్లీ దాడిచేసిన హోటల్ కావడంతో చాన్నాళ్లు ఈ హోటల్ను ‘వాషింగ్టన్ హిల్టన్’ పేరుకు బదులు హింక్లీ హిల్టన్ అని పిలిచారు. అలెన్ గతంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) టీ–షర్ట్ను ధరించిన ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. ఆయనకు ఇజ్రాయెల్తో సంబంధం ఉందా? దాడిలో విదేశాల హస్తం ఉందా ? అనే కొత్త ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి ఖండనలూ, స్పందనలూ వెలువడలేదు. -
అతడో ఉన్మాది: ట్రంప్
వాషింగ్టన్: హిల్టన్ హోటల్లో కాల్పులకు తెగబడ్డ దుండగుడు అలెన్ తన యంత్రాంగంలోని అధికారులను లక్ష్యం చేసుకున్నట్టు తెలుస్తోందని ట్రంప్ అన్నారు. దీనికి సంబంధించి అలెన్ కుటుంబం శనివారం విందుకు ముందే కనెక్టికట్లో పోలీసులకు సమాచారం కూడా ఇచ్చినట్టు వివరించారు. కాల్పుల అనంతరం వైట్హౌస్లో జరిగిన మీడియా భేటీ, తర్వాత ఫాక్స్ న్యూస్ చానల్ ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు చెప్పుకొచ్చారు. ‘‘దుండగుడు ఓ ఉన్మాది. చాలా ఆయుధాలతో హోటల్ లాబీలో కాల్పులకు దిగాడు. సీక్రెట్సర్వీసు సిబ్బంది అడ్డుకోగా ఒక అధికారిపై అత్యంత సమీపం నుంచి శక్తిమంతమైన తుపాకీతో కాల్పులు ప్రారంభించాడు. సిబ్బంది సాహసోపేతంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. వారి సాహసం ప్రశంసనీయం’’ అన్నారు. మిమ్మల్నే లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగిందని భావిస్తున్నారా అని మీడియా ప్రశ్నించగా ‘అనుకుంటాను’ అని ట్రంప్ బదులిచ్చారు. హిల్టన్ హోటల్ వద్ద భద్రతా సక్రమంగా లేదని, అది సురక్షితమైన భవనం కాదని అభిప్రాయపడ్డారు. ‘‘హోటల్లో కాల్పుల శబ్దాన్ని మొదట తప్పుగా అర్థం చేసుకున్నా. పల్లెం లాంటిది కింద పడడం వల్ల వచ్చిన శబ్దంగా భావించా’’ అని చెప్పారు. లింకన్పై జరిగినట్లుగానే.. హత్యల గురించి తానెంతో అధ్యయనం చేశానని ట్రంప్ వ్యాఖ్యానించారు. అత్యధిక ప్రభావం చూపే శక్తివంతులనే లక్ష్యంగా చేసుకుంటారని చెప్పారు. ప్రభావం చూపలేని వారి జోలికి ఎవరూ రారని అన్నారు. 1865లో జరిగిన అబ్రహం లింకన్ హత్యాకాండను ప్రస్తావించారు. లింకన్పై జరిగినట్లుగానే తనపైనా హత్యాయత్నాలు జరిగాయని వెల్లడించారు. రాజకీయాలను రేస్ కార్ డ్రైవింగ్, బుల్ రైడింగ్లతో పోల్చారు. ‘‘రాజకీయాలు నిజంగా ప్రమాదకరమైన వృత్తి. ఇది చాలా ప్రమాదకరమన్న విషయం నాకెవరూ చెప్పలేదు. అమెరికా అధ్యక్ష పదవిని ఆశించడంలో ఉన్న రిస్క్ల గురించి మంత్రి మార్కో రూబియో ముందుగా నన్ను హెచ్చరించలేదు’’ అని సరదాగా వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు, ఇతర వీఐపీలకు భద్రతను కనీవిని ఎరగనంతగా కట్టుదిట్టం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. తన భార్య మెలానియా, ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ దపంతులు, కేబినెట్ సభ్యులు తదితరులంతా క్షేమంగా ఉన్నారంటూ ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. పాత్రికేయుల విందు 30 రోజుల్లోగా మళ్లీ జరుగుతుందన్నారు. -
సడన్ ట్విస్ట్.. ఇరాన్లో యుద్ధం సీను మారింది?
టెహ్రాన్ : పశ్చిమాసియా యుద్ధం వేళ ఇరాన్లో వాతావరణం మారింది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో మంచుకురుస్తోంది. దశాబ్ధానికిపైగా కరువుతో అల్లాడుతున్న ఇరాన్లో క్రమంగా వాతావరణం మారుతోంది. ఖాళీగా ఉన్న జలాశయాలు, ఎండిపోయిన సరస్సుల్లో మళ్లీ జీవం కనిపిస్తోంది. అయితే వాతావరణం ఒక్కసారిగా మారడంపై ఓ ఆసక్తికర వాదన తెరపైకి వచ్చిందిసోషల్ మీడియాలో దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకీ ఇరాన్లో మార్పుల వెనుక అసలు సీక్రెట్ అదేనా. ఇరాన్లో కరువు పరిస్థితులు శతృదేశాల కుట్రే పూరితంగా సృష్టించినవేనాఅమెరికా ఇరాన్ యుద్ధం మొదలై యాబై రోజులు దాటిపోయింది. ఈ యుద్ధంలో ఇరాన్పై అమెరికా భారీ దాడులే చేసింది. క్షిపణులు, వైమానిక దాడులతో బీభత్సమే సృష్టించింది. దీని కోసం పెద్ద సంఖ్యలో ఆయుధ శక్తిని ఉపయోగించింది. ఇప్పటికే కరువుతో అల్లాడుతున్న ఇరాన్ను ఈ యుద్ధం మరింత కష్టాల్లోకి నెట్టింది. అయినా, ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అమెరికా,ఇజ్రాయెల్కు ఇరాన్ అదే స్థాయిలో బదులిస్తోంది.ఇలాంటి సమయంలో ఇరాన్ వాతావరణం మారిపోవడం అందరిని ఆశ్చర్య పరుస్తోంది. నిత్యం కరువుతో అల్లాడే ఇరాన్లో ఇప్పుడు భారీ స్థాయిలో వర్షాలు, మంచు కురుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వాతావరణంలో ఏర్పడిన ఆకస్మిక మార్పుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఇక్కడే ఓ ఆసక్తికరమైన వాదన తెరపైకి వచ్చింది. దేశ వాతావరణాన్ని తారుమారు చేయడానికి వాడటానికి వినియోగించే రాడార్లను, ఇజ్రాయెల్ వాతావరణ యంత్రాలను ఇరాన్ ధ్వంసం చేయడం వల్లే ఈ వాతావరణ మార్పు సంభవించిందన్న వాదనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిజానికి దశాబ్ధానిపైగా ఇరాన్ కరువుతో అల్లాడుతోంది. ఖాళీగా ఉన్న జలాశయాలు, ఎండిపోయిన సరస్సులే అక్కడి నీటి సంక్షోభం గురించి చెప్పడానికి ఉదహారణలుగా నిలుస్తున్నాయి.ఈ క్రమంలో యాభైరోజుల యుద్ధం తర్వాత అక్కడి వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. భారీ వర్షాలు, మంచు, ఉష్ణోగ్రతలు తగ్గడంతో అక్కడ పచ్చదనం చిగురులు తొడుగుతోంది. ఆనకట్టలు వాటి పూర్తి సామర్ధ్యానికి వస్తున్న తరుణంలో ఇరాన్ మీడియా కుట్ర సిద్ధాంతాలతో హోరెత్తుతోంది. అమెరికా-ఇజ్రాయెల్ వాతావరణ ఇంజినీరింగ్ యంత్రాలను ఇరాన్ ధ్వంసం చేయడమే వాతావరణంలో ఆకస్మిక మార్పులకు కారణమన్నది వారి వాదన.ఈ యుద్ధంలో ఇరాన్ అమెరికాకు చెందిన అధునాతన రాడార్ వ్యవస్థలపై, ఇజ్రాయెల్ వాతావరణ యంత్రాలపైన దాడి చేసిన మాట నిజమే. అమెరికా, ఇజ్రాయెల్ ఉపయోగించే క్షిపణి వ్యవస్థలు కేవలం ముందస్తు అలెర్ట్ కోసమే కాకుండా మధ్యధరా సముద్రంలోని తేమను ఇరాన్ పొరుగు ప్రత్యర్ధుల వైపు మేఘాలను మళ్లించడానికి వీటిని ఉపయోగించారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.నిజానికి వర్షపు నీరు దొంగతనం అనే చర్చ ఇరాన్లో ఎప్పటి నుంచో ఉంది. 2018 నుంచి ఈ వాదన పదే పదే తెరపైకి వస్తోంది. ఇజ్రాయెల్,అమెరికా, యూఏఈ జియో ఇంజినీరింగ్ను ఉపయోగించి వాతావరణ సరళిని తారు మారు చేస్తున్నాయనేది ఇరాన్ వాదన. ఇప్పుడు సోషల్ మీడియాలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. -
ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ను సైతం తొలగించనున్న ట్రంప్?
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అడ్మినిస్ట్రేషన్ నుంచి మరో కీలక అధికారిని తీసేయనున్నట్లు తెలుస్తోంది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) డైరెక్టర్ కాష్ పటేల్ ట్రంప్ కేబినెట్ నుంచి వైదొలిగే ఛాన్స్ ఉందని ‘పోలిటికో’ వార్తా సంస్థ తెలిపింది. ట్రంప్ అడ్మినిట్రేషన్లో అంతర్గత ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో పటేల్ భవిష్యత్తుపై వైట్హౌస్ వర్గాల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇప్పటికే ట్రంప్ పలువరు కీలక అధికారులను తొలగించారు. ఈ వారమే ట్రంప్ అనుమతితో అమెరికా నౌకాదళ కార్యదర్శిని తొలగించారు. ఆ తర్వాత తదుపరి వెళ్లే సీనియర్ అధికారి ఎవరన్న ఊహాగానాలు మరింత పెరిగాయి. పోలిటికో తెలిపిన వివరాల ప్రకారం.. ట్రంప్ తదుపరి తొలగించే వారి లిస్టులో పటేల్ ఉండవచ్చని ఒక సీనియర్ వైట్హౌస్ అధికారి సూచించారు. కాష్ పటేల్ను పదవి నుంచి తొలగించడం దాదాపు ఖాయమని, ఇప్పుడు ప్రశ్న “ఎప్పుడు తొలగిస్తారు?” అన్నదేనని వ్యాఖ్యానించారు. మీడియాలో ఆయనపై నెగటివ్ వార్తలు ఎక్కువగా రావడం, ఆయన పనితీరు, నిర్ణయాలు, వ్యక్తిగత అంశాలపై విమర్శలు పెరగడం అందుకు కారణాలుగా చెప్పారు. కేబినెట్ కార్యదర్శి దృష్టిలో ఇది మంచిది కాదని పేర్కొన్నారు. ఇది ట్రంప్ను నిరుత్సాహానికి గురి చేస్తోందని చెప్పారు.కీలక అడ్మినిస్ట్రేటివ్ పదవుల్లో చోటుచేసుకుంటున్న మార్పులపై రాజకీయపరంగా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో కాష్ పటేల్ గురించి వార్తలు వస్తుండడం గమనార్హం. వరసగా తొలగిస్తున్న ట్రంప్ కొన్ని రోజుల క్రితమే అమెరికా యుద్ధ శాఖ, నౌకాదళ కార్యదర్శి జాన్ సీ ఫెలన్ను పదవి నుంచి తొలగించారు. ఉప కార్యదర్శి హంగ్ కావో తాత్కాలిక కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.మార్చి నుంచి దాదాపు ఐదుగురు సీనియర్ అధికారులు (ఫెలన్ సహా) ఒత్తిడి మధ్య పదవులు వదిలుకున్నారు. ఫెలన్కు ముందు, జనరల్ రాండీ జార్జ్ ఈ నెల ప్రారంభంలో ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవి నుంచి విరమణ చేశారు. ఇరాన్ యుద్ధం మధ్య ఇది అసాధారణ పరిణామం. అలాగే, మరో ఇద్దరు సీనియర్ ఆర్మీ అధికారులను తొలగించారు. కాగా, ఇరాన్తో యుద్ధం జరుగుతున్న సమయంలో.. ట్రంప్ గవర్నమెంట్ చేస్తున్న ఈ యుద్ధానికి తాను సపోర్టు ఇవ్వలేనని జాతీయ ఉగ్ర నిరోధక కేంద్రం డైరెక్టర్ జో కెంట్ పేర్కొంటూ ఆయన సైతం ఆ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. -
ట్రంప్.. మీకే ఇలా పదే పదే ఎందుకు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు తృటిలో ప్రాణాపాయం తప్పిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు ట్రంప్ శనివారం రాత్రి వైట్హౌస్ ప్రెస్ కరస్పాండెంట్ల వార్షిక విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ విందులో ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగెత్స్,విదేశాంగ మంత్రి మార్కో రూబియో తదితరులు పాల్గొన్నారు. వారితో పాటు ప్రముఖ జర్నలిస్టులు, సెలబ్రిటీలు, జాతీయ నాయకులు ఉన్నారు. ట్రంప్ ప్రసంగం కోసం ఎదురుచూస్తున్న సమయంలో కాలిఫోర్నియాకు చెందిన కోల్ అలెన్గా అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. దీంతో ఆ ప్రాంగణమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. గత కొన్నేళ్లలో ఇలా ట్రంప్ లక్ష్యంగా కాల్పులు జరగడం మూడోసారి. అయితే రెండు గంటల పాటు ఆయనను హోటల్ నుండి హడావిడిగా తీసుకువెళ్లిన అనంతరం, అధ్యక్షుడు వైట్ హౌస్ నుండి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలోనే ట్రంప్కు అనూహ్యమైన ప్రశ్నలు రిపోర్టల నుంచి ఎదురయ్యాయి. విలేకరులు ఆయనను ప్రశ్నలతో ముంచెత్తుతున్న సమయంలో ఒక అనూహ్యమైన ప్రశ్న . ఫాక్స్ న్యూస్ విలేకరి పీటర్ డూసీ నుంచి దూసుకొచ్చింది. ఈ ప్రశ్నను మీపై చాలా గౌరవ భావంతోనే అడుగుతున్నానంటూనే.. ‘ట్రంప్.. మీపైనే దాడులు ఎందుకు జరుగుతున్నాయి. పదే పదే మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?. మీకు ఇలా ఎందుకు పదేపదే జరుగుతోందని మీరు అనుకుంటున్నారు’ అని ప్రశ్నించాడు. దీన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తడుముకోకుండా సమాధానం ఇచ్చారు. ఈ దాడి కూడా తానొక అద్భుతమైన వ్యక్తిని కాబట్టే జరుగుతుందన్నారు. ‘అవును, మీకు తెలుసు, నేను హత్యల గురించి అధ్యయనం చేశా. ఇక్కడ మీకు నేనొక విషయం చెప్పాలి. అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు. విశేషంగా కృషి చేసిన వ్యక్తులపైనే ఎప్పుడూ దాడులు జరుగుతాయి. మీరు అబ్రహం లింకన్నే చూడండి. అలాంటి వ్యక్తులే టార్గెట్ అవుతూ ఉంటారు’ బదులిచ్చారు. -
అతనో మానసిక రోగి : డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: వైట్ హౌస్లో జరిగిన కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. కాల్పులు జరిపిన వ్యక్తి వద్ద భారీ మొత్తంలో ఆయుధాలు ఉన్నాయి. దాడికి నిందితుడు ఒక్కడే పాల్పడ్డాడు. అదృష్టవశాత్తూ.. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ బుల్లెట్ప్రూఫ్ జాకెట్ ధరించి ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దాడి చేసిన వ్యక్తి మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. దాడి వెనుక ఉద్దేశ్యం ఇతర అంశాలపై దర్యాప్తు జరుగుతోంది’అని చెప్పారు. ఏప్రిల్ 25న వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో జరిగిన కారస్పాండెంట్స్ డిన్నర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 2,600 మంది ప్రముఖులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు హాజరైన ఈ వేడుకలో ప్రధాన భద్రతా తనిఖీ కేంద్రం వద్ద ఒక వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గాయపడ్డాడు. అయితే అతను ధరించిన బుల్లెట్ప్రూఫ్ జాకెట్ కారణంగా ప్రాణాపాయం తప్పింది.వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా జరిగిన ఈ కాల్పుల ఘటనతో అధ్యక్షుడు ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సహా పలువురు ఉన్నతాధికారులను సీక్రెట్ సర్వీస్ తక్షణమే సురక్షిత ప్రాంతానికి తరలించింది. దాడి చేసిన వ్యక్తిని కోల్ టోమాస్ అలెన్ అనే కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతని వద్ద భారీ ఎత్తున ఆయుధాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఘటన అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో వైట్ హౌస్లో భద్రతా చర్యలు మరింత కఠినతరం అయ్యాయి. కారస్పాండెంట్స్ డిన్నర్కు హాజరైన వారిని తక్షణమే బయటకు తరలించారు. అధికారులు దాడి వెనుక ఉన్న కారణాలను, అతను ఎవరిని లక్ష్యంగా చేసుకున్నాడో తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
ఇరాన్లో నిర్ణయాలు వీళ్లే తీసుకుంటున్నారా? ఇలాగైతే యుద్ధం..
అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం కుదురుతుందా? యుద్ధం మళ్లీ మొదలవుతుందా? అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? అన్న సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. ఇరాన్ డిమాండ్లకు అమెరికా ఒప్పుకోవడం లేదు. అమెరికా డిమాండ్లకు ఇరాన్ ఒప్పుకోవడం లేదు. అమెరికాలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశం తరఫున అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అలీ ఖమేనీ (ఇరాన్ దివంగత సుప్రీం లీడర్)ను అమెరికా-ఇజ్రాయెల్ చంపేసిన తర్వాత అతడి కుమారుడు మొజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్గా పదవీ బాధ్యతలు స్వీకరించారని ఇరాన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. అయితే, మొజ్తబా ఖమేనీ తీవ్రగాయాలతో బాధపడుతున్నాడని, నిర్ణయాలు తీసుకునే శక్తి కూడా అతడికి లేదని ప్రచారం జరుగుతోంది. మరోవైపు, అమెరికాతో చేస్తున్న యుద్ధంలో నిర్ణయాలు తీసుకునే అంశంపై మొజ్తబా ఖమేనీని కాదని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) పట్టు బిగించే ప్రయత్నాలు చేస్తోందని పలు నివేదికలు కూడా వచ్చాయి.నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు? అమెరికా, ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తోంది ఇరాన్. మరి ఈ యుద్ధానికి ఇరాన్లో బాధ్యత తీసుకుంటోంది ఎవరు? ఆధికారికంగానైతే సుప్రీం లీడరే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఆయనే బాధ్యత వహిస్తున్నారని ఆ దేశం చెబుతోంది. ఫిబ్రవరి 28న (యుద్ధం తొలి రోజే) అలీ ఖమేనీ మృతి చెందాడు. ఆ తర్వాత మొజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్గా బాధ్యత స్వీకరించాడు. ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థలో ఆ పదవిలో ఉన్న వారే తుది నిర్ణయం తీసుకుంటారు. యుద్ధం, శాంతి, దేశానికి సంబంధించిన వ్యూహాలు వంటి ముఖ్య విషయాలపై తుది మాట ఆ సుప్రీం లీడర్దే. అయితే, ఇరాన్కు సంబంధించిన నిర్ణయాలు నిజంగానే మొజ్తబా ఖమేనీనే తీసుకుంటున్నారా? ఇరాన్ నాయకత్వంలో అంతర్గతంగా ఏకాభిప్రాయం లేదని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఒకే నిర్ణయం మీద లేరని, వేర్వేరు వర్గాలు వేర్వేరు అభిప్రాయాలు చెబుతున్నాయని ట్రంప్ తెలిపారు. అమెరికా ప్రభుత్వం ఒకే అభిప్రాయంతో, స్పష్టమైన ప్రతిపాదన ఇవ్వాలని అమెరికా కోరుతోందని అన్నారు. అప్పుడు మాత్రమే చర్చలు సరిగ్గా ముందుకు వెళ్తాయని చెప్పారు.సుప్రీం లీడర్ ఎక్కడ?పదవి చేపట్టిన తర్వాత మొజ్తబా ఖమేనీ ఒక్కసారి కూడా ప్రజల ముందుకు రాలేదు. ఆయన పేరిట లిఖితపూర్వకంగా కొన్ని ప్రకటనలు రావడం తప్ప ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇరాన్ వ్యూహాలకు ఆమోదం తెలుపుతున్నారని గానీ చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మొజ్తబా గాయపడ్డాడని ఇరాన్ అధికారులు అంగీకరించారు. కానీ, అందుకు సంబంధించిన వివరాలు తక్కువగా ఇచ్చారు. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. మొజ్తబా ముఖం సహా శరీరంలోని పలు అవయవాలకు గాయాలు తగిలి మాట్లాడటానికి కష్టంగా మారిందని పేర్కొంది. ఇరాన్ రాజకీయ వ్యవస్థలో అధికారం కేవలం సంస్థాగతం కాదు. మొజ్తబా తండ్రి అలీ ఖమేనీ ప్రసంగాలు, ప్రత్యక్షంగా పలు కార్యక్రమాలకు హాజరు కావడం, పలు వర్గాల మధ్య మధ్యవర్తిత్వం జరిపేవారు. అటువంటి కార్యక్రమాలు ఇప్పుడు జరగడం లేదు.కొందరు యుద్ధ సమయంలో పదవీ స్వీకరణ వల్ల అతను తన అధికారాన్ని స్థాపించలేకపోయాడని అంటున్నారు. మరికొందరు గాయాల కారణంగా వ్యవస్థను నిర్వహించగలడా అన్న ప్రశ్న వేస్తున్నారు. పరిస్థితుల గురించి స్పష్టత లేదు. ఎవరు ఏమి నిర్ణయిస్తున్నారు? అసలు అధికారంలో ఎవరు బలంగా ఉన్నారు? అన్న దానిపై గందరగోళం ఉంది.క్లిష్టమైన సమయంలో బాధ్యతలు మొజ్తబా బాధ్యతలు చేపట్టిన సమయం చాలా క్లిష్టమైనది. ఆ సమయంలో యుద్ధం జరుగుతోంది. అందుకే తన నాయకత్వాన్ని పూర్తిగా అమలు చేయడానికి, తన మాట నిలబెట్టుకోవడానికి సరైన స్థిరత్వం, సమయం దొరకలేదు. ఫలితంగా, ఇరాన్లో ఇతర వర్గాలు/నాయకులు కూడా ప్రభావం చూపుతూ ఉండవచ్చు. పాలనలో మొజ్తబా పూర్తి నియంత్రణను స్థాపించుకోలేకపోయాడని తెలుస్తోంది. యుద్ధానికి ముందు నిర్ణయాలు సుప్రీంలీడర్ చుట్టూ ఉన్న వ్యవస్థ చేతిలో ఉండేవి. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు నిర్ణయాలు ఒక్కరే తీసుకోవడం లేదు. పలు వర్గాలు/నాయకులు కలిసి లేదా వేర్వేరు విధాలుగా ప్రభావం చూపుతున్నారు. అధికార వికేంద్రీకరణ జరిగింది.ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ అమెరికాతో చర్చల్లో పాల్గొంటున్నారు. కానీ వ్యూహాలు రచించడం అనేది వీరి చేతల్లో లేదని తెలుస్తోంది. పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్-బాఘెర్ ఘాలిబాఫ్ నేతృత్వంలో ప్రతినిధి బృందానికి ప్రస్తుతం ఉన్న అధికారాలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇరాన్లో అరాఘ్చీ పాత్ర ఇతరుల నిర్ణయాల అమలు స్థాయిలోనే ఉంది. హార్మూజ్ విషయంలో ఆయన వెను వెంటనే చేసిన ప్రకటనలు సందేహాలు లేవనెత్తాయి. పెజెష్కియన్ కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఇస్లామాబాద్లో అమెరికాతో జరగాల్సిన రెండో దశ చర్చలు నిలిచిపోవడం దీన్నే సూచిస్తుంది.హార్మూజ్ జలసంధి నియంత్రణ ఇరాన్కు ఒత్తిడి సాధనంగా మారింది. దీని ద్వారానే అమెరికాపై ఒత్తిడి తెస్తోంది. కానీ, దాన్ని మూసి ఉంచే నిర్ణయం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ – ఇరాన్ విప్లవ గార్డ్ సైనిక విభాగం) చేతిలో ఉంది. ఇరాన్లో ఒకే వ్యక్తి వ్యూహాన్ని స్పష్టంగా నడిపిస్తున్నట్టు కనిపించడం లేదు. చర్యలు, వాటికి సంబంధించిన సందేశాల మధ్య జాప్యం కనపడుతోంది. సుప్రీం లీడర్కు పూర్తిగా అధికారాలు ఉన్నాయి. కానీ, స్పష్టంగా అవే అమలు అవుతున్నట్లు కనపడడం లేదు. అధ్యక్షుడు నాయకత్వం వహించడం లేదు. రాజనీతిక చర్యలు నిర్ణయాత్మకంగా జరగడం కాదు. ఇలాగైతే యుద్ధం ఇప్పట్లో ఆగుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇరాన్ ఒప్పందం చేసుకోకపోతే చరిత్రలో ఎవరూ చూడనంత విధ్వంసాన్ని చూస్తారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. యుద్ధం భీకరంగా జరిగితే ఇరాన్లో అంతా బూడిదే మిగులుతుంది. -
గుండెకు క్యాన్సర్ ఎందుకు రాదో తెలుసా?
శరీరంలోని దాదాపు అన్ని అవయవాలకు క్యాన్సర్ ముప్పు ఉంటుంది. కానీ ఎప్పుడైనా గుండెకు క్యాన్సర్ సోకడం గురించి విన్నారా? క్యాన్సర్ బారిన పడని ఏకైక అవయవం గుండె మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. ఈ దశాబ్దాల మిస్టరీని శాస్త్రవేత్తలు ఎట్టకేలకు ఛేదించారు. నిరంతరం కొట్టుకునే గుండె చప్పుడే, అందులో క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటోందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ‘మెకానికల్ ఫోర్సెస్’ క్యాన్సర్ జన్యువుల పనితీరును మార్చేస్తాయని తేల్చిచెప్పిన ఈ పరిశోధన వైద్య రంగంలో ఒక సంచలనంగా నిలిచింది.నిరంతర శ్రమతోనే క్యాన్సర్కు చెక్ప్రముఖ ‘సైన్స్’జర్నల్లో ప్రచురితమైన ఈ తాజా అధ్యయనం ప్రకారం.. గుండె నిరంతరం రక్తాన్ని పంప్ చేస్తూ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. ఈ యాంత్రిక ఒత్తిడి కారణంగా గుండె కణాల విభజన వేగం తగ్గుతుంది. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ (ఐసీజీఈబీ)కి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో, గుండె లోపలి ఈ ప్రత్యేకమైన వాతావరణం క్యాన్సర్ కణాల పెరుగుదలను క్రియాశీలంగా అడ్డుకుంటుందని తేలింది.ఎలుకల ప్రాజెక్టులో సంచలన నిజాలుదీనిని నిరూపించడానికి పరిశోధకులు ఎలుకలపై ఒక ప్రయోగం చేశారు. వారు ఒక దాత గుండెను ఎలుక మెడ భాగంలో అమర్చారు. ఈ కొత్త గుండెకు రక్తప్రసరణ జరుగుతుంది కానీ, రక్తాన్ని పంప్ చేసే యాంత్రిక ఒత్తిడి ఉండదు. ఆ తర్వాత ఈ ఒత్తిడి లేని గుండెలోకి, అలాగే సహజంగా రక్తాన్ని పంప్ చేస్తూ పనిచేస్తున్న ఎలుక సొంత గుండెలోకి మానవ క్యాన్సర్ కణాలను ఎక్కించి, కణతుల వృద్ధిని తులనాత్మకంగా పరిశీలించారు.పనిచేసే గుండెలో పెరగని కణాలుఈ ప్రయోగ ఫలితాలు క్యాన్సర్ పరిశోధనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించాయి. రక్తాన్ని పంప్ చేయని, అంటే మెకానికల్ ఒత్తిడి లేని మెడలోని గుండెలో క్యాన్సర్ కణాలు వేగంగా వృద్ధి చెంది, కణతులుగా మారాయి. కానీ సహజంగా నిరంతరం కొట్టుకుంటూ, ఒత్తిడిని ఎదుర్కొంటున్న అసలైన గుండెలో మాత్రం క్యాన్సర్ కణాలు పెరగలేదు. వివిధ రకాల క్యాన్సర్లలో కూడా ఇదే తరహా ఫలితాలు వచ్చాయి. దీనిని బట్టి గుండె పడే యాంత్రిక శ్రమే క్యాన్సర్ను అడ్డుకునే ప్రధాన ఆయుధం అని స్పష్టమైంది.‘నెస్ప్రిన్-2’.. క్యాన్సర్ను అడ్డుకునే హీరోఅసలు ఈ ఒత్తిడి క్యాన్సర్ను ఎలా ఆపుతుందనే విషయానికొస్తే.. ఇక్కడే ‘నెస్ప్రిన్-2’ (Nesprin-2) అనే ప్రొటీన్ కీలకంగా వ్యవహరిస్తుంది. గుండె కొట్టుకునేటప్పుడు ఏర్పడే భౌతిక సంకేతాలను ఈ ప్రొటీన్ కణ కేంద్రకానికి చేరవేస్తుంది. ఈ సంకేతాలు కణాలలోని డీఎన్ఏ అమరికను, హిస్టోన్ మిథైలేషన్ ప్రక్రియను మారుస్తాయి. దీనివల్ల క్యాన్సర్ కణాల వృద్ధికి కారణమయ్యే జన్యువులు బలహీనపడి, కణతుల పెరుగుదల పూర్తిగా ఆగిపోతుంది.భవిష్యత్ క్యాన్సర్ చికిత్సలకు కొత్త ఆశపరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు క్యాన్సర్ కణాల్లోని ఈ నెస్ప్రిన్-2 ప్రొటీన్ను సైలెంట్ (నిష్క్రియం) చేసి చూడగా, చురుగ్గా పనిచేసే గుండెలో కూడా క్యాన్సర్ కణాలు పెరగడం ప్రారంభించి కణతులు ఏర్పడ్డాయి. ఈ అద్భుతమైన ఆవిష్కరణ భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్సలో కొత్త శకానికి నాంది పలకనుంది. కణాలు అనుభవించే ఈ యాంత్రిక ఒత్తిడిని కృత్రిమంగా సృష్టించడం లేదా అనుకరించడం ద్వారా శరీరంలోని ఇతర భాగాల్లో వచ్చే క్యాన్సర్ను కూడా అరికట్టే సరికొత్త థెరపీలను అభివృద్ధి చేయవచ్చని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.ఇది కూడా చదవండి: భోపాల్ విషాద సాక్షి.. రఘు రాయ్ ఇకలేరు -
పాక్ ప్రధానితో ఇరాన్ ఫోన్ కాల్..
ఇస్లామాబాద్: ఇరాన్, అమెరికా మధ్య చర్చల సందర్భంగా హైడ్రామా చోటుచేసుకుంది. చర్చల కోసం పాకిస్థాన్ వెళ్లిన ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ అమెరికా ప్రతినిధులు రాకముందే ఒమన్ బయల్దేరి వెళ్లిపోయారు. దీంతో శాంతి చర్చలకు తన ప్రతినిధులను ఇస్లామాబాద్కు పంపించడం లేదని ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమెరికాతో శాంతి చర్చలపై అనిశ్చితి నెలకొన్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక కామెంట్స్ చేశారు.పెజెష్కియాన్ తాజాగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో పెజెష్కియాన్ ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన శాంతి చర్చలపై ఇరాన్ వైఖరిని స్పష్టం చేశారు. ఈ క్రమంలో అమెరికా విధిస్తున్న ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం, బెదిరింపుల నడుమ ఆ దేశంతో చర్చలు అసాధ్యమని తేల్చి చెప్పారు. అలాగే, ఇరాన్ తన సార్వభౌమాధికారాన్ని వదులుకోదని, అలాగే ఒత్తిళ్లకు తలొగ్గి ఒప్పందాలు చేసుకోబోదని స్పష్టం చేశారు. ప్రస్తుత ఉద్రిక్తతలకు అమెరికానే కారణమని పేర్కొన్నారు. అమెరికా అనుసరిస్తున్న చర్యలే చర్చలకు ప్రధాన అడ్డంకి ఆయన కుండబద్దలు కొట్టారు.కాగా, ఏప్రిల్ 13 నుంచి ఇరాన్ ఓడరేవులను అమెరికా నౌకాదళం దిగ్బంధించిన విషయం తెలిసిందే. ఈ పరిణామం వల్ల ఇరాన్ ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇలాంటి దిగ్బంధనాల నడుమ పరస్పర నమ్మకాన్ని పునరుద్ధరించడం అసాధ్యమని పేజెష్కియాన్ వెల్లడించారు. అందుకే ఇరు దేశాల మధ్య చర్చలు జరగాలంటే ముందుగా అమెరికా ఆంక్షలను తొలగించి, చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.అరాగ్చీ స్పందన..ఇస్లామాబాద్ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. ఇప్పటికే తాము ఒక ఫ్రేమ్ వర్క్ను పాకిస్తాన్కు అందించామని తెలిపారు. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేందుకు ఇది ఒక మంచి మార్గమని ఆయన చెప్పారు. అయితే, శాంతి చర్చలపై అమెరికాకు నిజంగా ఆసక్తి ఉందా? అన్నది అనుమానమేనని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అబ్బాస్ అరాగ్చీ ఒమన్ పర్యటనలో ఉన్నారు. అయితే, చర్చల కోసం ఆయన తిరిగి పాకిస్తాన్ వచ్చే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. -
ట్రంప్ మనసు చదవాలనుకున్నాడు.. ఇంతలోనే..
వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్లో శనివారం రాత్రి ఓ దుండగుడు కాల్పులకు తెగబడటం షాక్కు గురిచేసింది. షాట్గన్తో భద్రతా సిబ్బందిపై కాల్పులు కలకలం రేపాయి. అయితే, ఈ ఘటన జరిగిన సమయంలో ట్రంప్.. ఒక ప్రదర్శనకారుడితో నిమగ్నమై ఉన్నారు. అతని పేరు ఓజ్ పెర్ల్మాన్. ఆ విందులో ఆయన ప్రాధాన్యత ఏంటి?. ఈసారి విందు.. సంప్రదాయానికి భిన్నంగా ఎందుకు జరిగింది? పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాంఓజ్ పెర్ల్మాన్.. అమెరికన్ మెంటలిస్ట్. మైండ్ రీడింగ్ (మనసును చదవడం), ఇంటరాక్టివ్ మెంటలిజంలో ఆయన ప్రసిద్ధి చెందారు. 43 ఏళ్ల పెర్ల్మాన్ 2015లో 'అమెరికాస్ గాట్ టాలెంట్' సీజన్ 10లో మూడో స్థానంలో నిలిచి గుర్తింపు పొందారు. అప్పటి నుండి కార్పొరేట్ క్లయింట్లు, అథ్లెట్లు, టీవీ ప్రేక్షకుల కోసం ప్రదర్శనలు ఇస్తున్నారు. ఆయన.. ది జో రోగన్ ఎక్స్పీరియన్స్, ది ఎల్లెన్ షో, లేట్ నైట్ విత్ జిమ్మీ ఫాలన్ వంటి ప్రసిద్ధ కార్యక్రమాల్లో కనిపించారు. 2018లో తన ఎన్బీసీ ట్రావెల్ షో 'ఓజ్ నోస్'కు ఎమ్మీ అవార్డును గెలుచుకున్నారు.ఈ సారి సంప్రదాయానికి భిన్నంగా..ఈసారి వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సంప్రదాయానికి భిన్నంగా జరిగింది. సాధారణంగా డిన్నర్లో అధ్యక్షుడు, మీడియా రంగంపై జోకులు వేయడానికి హాస్యనటుడిని ఆహ్వానిస్తారు. కానీ ఈసారి పెర్ల్మాన్ను ప్రధాన ప్రదర్శనకారుడిగా ఎంపిక చేశారు. 2025 కోసం కమెడియన్ అంబర్ రఫిన్ను అనుకున్నప్పటికీ.. ట్రంప్ పరిపాలనతో ఉన్న ఉద్రిక్తతల కారణంగా ఆమెను ముందే తొలగించారు. 2026 నాటి ఈ విందు చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది.. ఎందుకంటే తన రెండు అధ్యక్ష కాలాల్లో ట్రంప్ హాజరైన మొదటి వేడుక ఇది. రాజకీయ విమర్శల కంటే.. 25 నిమిషాల పాటు నవ్వులు పూయించి.. అద్భుతమైన క్షణాలతో అందరినీ ఏకం చేయడమే తన లక్ష్యమని పెర్ల్మాన్ పేర్కొన్నారు.నేను ట్రంప్ మనసును చదవగలనా?వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవ్వడం అంత సులభం కాదు అంటూ పెర్ల్మాన్ ఈ కార్యక్రమానికి ముందు ఒక వ్యాసంలో రాశారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి మనసును చదవాలని నాకు ఉంది. అధ్యక్షుడు తదుపరి ఏమి చెబుతారో?. ఏమి చేస్తారో ఎవరూ ఊహించలేరు. ట్రంప్ అందరిలాంటి వ్యక్తి కాదు.. ఆయనను అర్థం చేసుకోవడం చాలా కష్టం’’ అని ఆయన పేర్కొన్నారు.అందుకే ఈసారి ఇలా..తాను రాజకీయాలకు అతీతుడినని.. ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి, విభజించడానికి తాను రాలేదన్నారు. అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ అలరించడమే తన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. కమెడియన్ల విమర్శలు ట్రంప్కు నచ్చవు కాబట్టే.. ఈసారి తనలాంటి మెంటలిస్ట్ను ఎంపిక చేసి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. -
కింద పడిపోయిన ట్రంప్.. వాన్స్ను లాగేసి..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా పలువురు కీలక నేతలకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ట్రంప్ హాజరైన కరస్పాండెంట్ల వార్షిక విందులో కాల్పులు జరపడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ట్రంప్, జేడీ వాన్స్తో పాటు ఇతర ప్రముఖులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ నేపథ్యంలో ట్రంప్, వాన్స్ను సెక్యూరిటీ తరిలించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అధ్యక్షుడు ట్రంప్ శనివారం రాత్రి వైట్హౌస్ ప్రెస్ కరస్పాండెంట్ల వార్షిక విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ విందులో ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగెత్స్,విదేశాంగ మంత్రి మార్కో రూబియో తదితరులు పాల్గొన్నారు. వారితో పాటు ప్రముఖ జర్నలిస్టులు, సెలబ్రిటీలు, జాతీయ నాయకులు ఉన్నారు. ట్రంప్ ప్రసంగం కోసం ఎదురుచూస్తున్న సమయంలో కాలిఫోర్నియాకు చెందిన కోల్ అలెన్గా అనే వ్యక్తి కాల్పులు జరిపాడు.The White House Correspondents’ Dinner shooter was armed with a shotgun, handgun, and multiple knives, according to DC police chief Jeffrey Carroll.The shooter was identified as 31-year-old teacher Cole Allen from Torrance, California. The suspect emerged from a "makeshift… pic.twitter.com/aUK5m6AwCr— Collin Rugg (@CollinRugg) April 26, 2026దీంతో, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ట్రంప్, జేడీ వాన్స్ను హుటాహుటిన అక్కడి నుంచి తరలించారు. మొదట వాన్స్ను జాకెట్ పట్టుకుని లాగేసిన సిబ్బంది.. అనంతరం, ట్రంప్ను తీసువెళ్లారు. ఈ క్రమంలో ట్రంప్ కిందపడిపోయినట్టు వీడియోలో కనిపిస్తోంది. ఇక, మొలానియా సహ పలువురు మహిళా ప్రముఖులు భయంతో అక్కడి నుంచి బయటపడ్డారు. పలువురు కీలక నేతలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. విందు హాల్ను వెంటనే ఖాళీ చేయించారు. ఇక, ఈ ఘటనపై ట్రంప్ స్పందిస్తూ తమంతా సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు.Trump and Vance being rushed off the stage after shots fired at White House Correspondents Dinner.ExecutiveProtection #WHCD2026 #SecretService #SecurityBreach #PresidentialSecurity #VenueSecurity #EPBestPractices pic.twitter.com/5eEaISHev1— RAJA Imran (@enconnect) April 26, 2026 O país do medo. pic.twitter.com/1LRWrzzXhJ— Renan Brites Peixoto (@RenanPeixoto_) April 26, 2026JUST IN: CMS Administrator Dr. Mehmet Oz was seen being rushed out by security from the White House Correspondents’ Dinner after gunshots rang out. | @GiannoCaldwell pic.twitter.com/K40X5Bovv6— Fox News (@FoxNews) April 26, 2026 -
నెతన్యాహు భీకర ఆదేశాలు.. దాడులు షురూ
జెరూసలేం: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించిన కొద్ది రోజులకే ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య దాడులు మళ్లీ మొదలయ్యాయి. కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలపై భారీ దాడులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సరిహద్దుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.ఇజ్రాయెల్ సైన్యానికి నెతన్యాహు గ్రీన్ సిగ్నల్ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతం, అలాగే దక్షిణ లెబనాన్లోని తమ సైనిక స్థావరాలపై హిజ్బుల్లా రాకెట్లు, డ్రోన్లతో దాడులకు దిగడాన్ని ఇజ్రాయెల్ తీవ్రంగా పరిగణించింది. ఈ చర్యను బహిరంగ ఒప్పంద ఉల్లంఘనగా అభివర్ణిస్తూ, లెబనాన్లోని హిజ్బుల్లా లక్ష్యాలపై దాడులు చేయాలని శనివారం నెతన్యాహు ఇజ్రాయెల్ రక్షణ దళాలను (ఐడీఎఫ్) ఆదేశించారు. తమ భూభాగంపైకి వచ్చిన వైమానిక లక్ష్యాలను విజయవంతంగా అడ్డుకున్నామని సైన్యం ప్రకటించింది.లెబనాన్లో ఉద్రిక్తతఇజ్రాయెల్ తాజా దాడుల్లో దక్షిణ లెబనాన్లో ఆరుగురు మరణించినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నబతియే జిల్లాలోని యోహ్మోర్ అల్-షకీఫ్ గ్రామంలో జరిగిన రెండు వేర్వేరు దాడుల్లో ఒక ట్రక్కు, మోటార్ సైకిల్ ధ్వంసమై నలుగురు ప్రాణాలు కోల్పోగా, బింట్ జుబైల్ జిల్లాలోని సఫాద్ అల్-బత్తిఖ్ లో జరిగిన మరో దాడిలో ఇద్దరు మృతి చెందారు, 17 మంది గాయపడ్డారు. ఆయుధాలు తరలిస్తున్న సాయుధ వాహనాలను, హిజ్బుల్లా ఆపరేటివ్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది.సందిగ్ధంలో శాంతిమంత్రంమరోవైపు, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగానే తాము దక్షిణ లెబనాన్లోని ఇజ్రాయెల్ ఆర్మీ వాహనంపై దాడి చేశామని, ఇది కేవలం ఆత్మరక్షణ చర్య మాత్రమేనని హిజ్బుల్లా సమర్థించుకుంటోంది. ఏప్రిల్ 17న ప్రారంభమై, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనతో ఇటీవల పొడిగించిన ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉద్దేశపూర్వకంగా విచ్ఛిన్నం చేస్తున్నారని ఇరుపక్షాలు ఒకరినొకరు నిందించుకుంటున్నాయి. తాజా హింసతో ఈ శాంతి ఒప్పందం ప్రశ్నార్థకంగా మారింది.ఇది కూడా చదవండి: భోపాల్ విషాద సాక్షి.. రఘు రాయ్ ఇకలేరు -
అయ్యో ఇరాన్.. ఎంతటి గడ్డు పరిస్థితులు..
వెనకటికి ఒక సామెత ఉండేదంటారు.. పైన పటారం.. లోన లొటారం.. అని.. ఈ సామెత ఇప్పుడు అచ్చు గుద్దినట్టు ఇరాన్కు వర్తించేలా ఉంది. ఎందుకంటే అమెరికాతో యుద్ధం నేపథ్యంలో ఇరాన్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఆర్థికంగా తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. పైకి అంత బాగానే ఉన్నట్టు మేనేజ్ చేస్తున్న ఇరాన్.. వాస్తవంగా మాత్రం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. అది ఎంతలా అంటే.. ఆహార ద్రవ్యోల్బణం 112 శాతానికి చేరుకుంది. వంట నూనెల ధరలైతే 200% పైగా పెరిగాయి. నిత్యావసరాలే కాదు.. చివరికి అంత్యక్రియల ఖర్చులు కూడా 40% పెరిగాయి. దీంతో, ఇరాన్ ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.అమెరికా, ఇజ్రాయెల్ మార్చి యుద్ధం తర్వాత ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా క్షీణించింది. ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గడం, పరిశ్రమలకు జరిగిన నష్టం.. ఇలా అన్నీ కలిసి పెద్ద సంక్షోభానికి దారితీస్తున్నాయి. ఇరాన్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బియ్యం, కోడిగుడ్లు తదితర ఆహార వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. 2026 ఏప్రిల్ నాటికి పాలు, గుడ్లు, చికెన్, బియ్యం వంటి ఆహార పదార్థాలు 70–130% వరకు పెరిగాయి. ముఖ్యమైన ఔషధాలు అయితే 300% నుండి 2,700% వరకు పెరిగి సాధారణ కుటుంబాలకు అందని స్థాయికి చేరాయి. ఇన్సులిన్ కొరత కారణంగా రేషన్ విధానం అమలు చేస్తున్నారు. సాధారణ నొప్పి నివారణ మందులు కూడా రేషన్లోనే అందిస్తున్నారు. మానసిక ఆరోగ్య మందులు లభ్యం కావడం కష్టమైంది. దీంతో, సామాన్యులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏడాదికి ద్రవ్యోల్బణం 80% నుంచి 500% వరకు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.అయితే, 2025 చివరి నాటికే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది. ద్రవ్యోల్బణం 50% పైగా కొనసాగింది. రియాల్ విలువ 20 రోజుల్లో 20% కంటే ఎక్కువ తగ్గింది. బ్యాంక్ అయాందె కుప్పకూలడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో నమ్మకం దెబ్బతింది. ఈ పరిస్థితుల్లోనే యుద్ధం ప్రారంభమైంది. దీంతో, ఇరాన్ రియాల్ విలువ ఎన్నడూ లేని స్థాయిలో పడిపోయింది. ఒక డాలర్ విలువ 16 లక్షల రియాల్స్కు దగ్గరలో ఉంది. దీంతో పౌరుల పొదుపు ఆవిరవుతోంది. ప్రజల దగ్గర డబ్బులు లేకపోవడంతో అమ్మకాలు తగ్గి, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారాలు నష్టాల్లో నడుస్తూ మూతపడుతున్నాయి. యుద్ధ సమయంలో ప్రభుత్వం పన్నులు తగ్గించడంలేదు సరి కదా, రుణాలు కట్టడం ఆలస్యమైతే జరిమానాలు విధిస్తోంది. చెక్కులు బౌన్స్ అవుతున్నాయి. దీంతో బ్యాంక్లు చాలా ఖాతాలను మూసివేస్తున్నాయి.గుడ్డు, మాంసం ఎంతంటే.. గత రెండు నెలల్లో ఇరాన్లో గుడ్లు, మాంసం, వంట నూనె ధరలు నిరంతరం పెరిగాయి. గుడ్ల ధరలు 2026 ఏప్రిల్ నాటికి రూ.333(భారత కరెన్సీ ప్రకారం)కి చేరాయి. మాంసం ధర కిలోకు రూ.574 వరకు పెరిగాయి. 2025లో మాంసం ధర రూ.313గా ఉంది. ఇక, వంట నూనె ధరలు కూడా 100% పైగా పెరిగి 380 వరకు చేరాయి. 2025లో వంట నూనె ధర రూ.180గా ఉంది. ఇక, 2025లో బియ్యం ధర రూ.34 ఉండగా.. తాజాగా 67కు చేరుకుంది.ఉద్యోగుల పరిస్థితి ఇదీ.. అధికారిక లెక్కల ప్రకారం.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్లో 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అనధికారికంగా ఈ సంఖ్య 20 నుంచి 30 లక్షల వరకు ఉండొచ్చని ఓ అంచనా. 1.5 కోట్ల మంది ప్రజలు ఎలాంటి ఆదాయం లేక అల్లాడుతున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం ఇచ్చే నెలవారీ సబ్సిడీ, ఫుడ్ వోచర్లతో కనీసం 10 కిలోల బియ్యం కూడా రాని పరిస్థితి నెలకొంది.కారణాలు..ఇంటర్నెట్ బ్లాకౌట్ ఉద్యోగాల కోతకు ప్రధాన కారణం.యువత, చిన్న వ్యాపారాలు అత్యధికంగా ప్రభావితమయ్యాయి.పేదరికం, నిరుద్యోగం పెరుగుతూ ప్రజల జీవన ప్రమాణాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి.ప్రభావిత రంగాలుఈ-కామర్స్, లాజిస్టిక్స్, టెక్నాలజీ, మీడియా, విద్య, సర్వీస్ రంగాలు ప్రభావితమయ్యాయి.నిరంతర కనెక్టివిటీ అవసరం ఉండటంతో ఉద్యోగాల కోతలు ఎక్కువయ్యాయి.పెద్ద కంపెనీలు: ఉద్యోగాల కోతలు ఇప్పుడు పెద్ద వాణిజ్య సంస్థలలో కూడా ప్రారంభమయ్యాయి.ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవడం, ప్రజల జీవన ప్రమాణాలను కాపాడుకోవడం, అంతర్జాతీయ ఒత్తిడిని ఎదుర్కోవడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ చర్యలు తీసుకుంటే, ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలకుండా, కనీస స్థాయిలో అయినా నిలబడే అవకాశం ఉంటుంది.ప్రధాన లక్ష్యాలు..ఆర్థిక స్థిరీకరణ: ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, కరెన్సీ విలువను నిలబెట్టడం.ప్రజల జీవన ప్రమాణాలు: ఆహారం, ఔషధాలు వంటి నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచడం.పరిశ్రమల పునరుద్ధరణ: పెట్రోకెమికల్స్, మెటల్స్, వ్యవసాయం, నిర్మాణ రంగాలను తిరిగి నిలబెట్టడం.బ్యాంకింగ్ వ్యవస్థ రక్షణ: బ్యాంకుల లిక్విడిటీ, డిపాజిట్లపై నమ్మకం కాపాడుకోవడం, రుణాలపై నియంత్రణ.సామాజిక స్థిరత్వం: నిరుద్యోగం తగ్గించడం, ప్రజల్లో అసంతృప్తి తగ్గించడం.అంతర్జాతీయ సంబంధాలు: నిర్బంధం, బ్లాకేడ్ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలు కనుగొనడం. యూఏఈ, టర్కీ వంటి ప్రాంతీయ మధ్యవర్తుల ద్వారా పరిమిత ఎగుమతులు కొనసాగించడం. -
కాల్పులు జరిపింది ఇతడే.. ఫొటో విడుదల చేసిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా ప్రతినిధుల విందులో కాల్పుల కలకలం రేగిన సంగతి తెలిసిందే. భద్రతా బలగాలు నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి. కాల్పుల శబ్దంతో ట్రంప్ను వెంటనే వేదికపై నుండి సురక్షిత ప్రాంతానికి తరలించారు. కాల్పుల జరిపిన వ్యక్తిని కాలిఫోర్నియాకు చెందిన కోల్ అలెన్గా గుర్తించారు. నిందితుడు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడని.. టీచర్ ఆఫ్ ది మంత్ అవార్డు కూడా అతడు తీసుకున్నట్లు సమాచారం.వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వద్ద కాల్పులకు తెగబడినట్లు భావిస్తున్న వ్యక్తి మొదటి చిత్రం వెలుగులోకి వచ్చింది. వాషింగ్టన్ హిల్టన్ హోటల్ మెట్ల వద్ద భద్రతా సిబ్బంది అతడిని నేలపై నొక్కిపట్టి ఉంచినట్లు ఆ చిత్రంలో కనిపిస్తోంది. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ 'ట్రూత్ సోషల్'లో ఈ చిత్రాలను పంచుకున్నారు. అందులో అనుమానితుడు చొక్కా లేకుండా.. చేతులు వెనుకకు కట్టేసి, నేలపై పడి ఉండటం గమనార్హం.ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన ట్రంప్.. అనుమానితుడు పలు ఆయుధాలతో ఉన్నాడని, సీక్రెట్ సర్వీస్ అధికారులు అతడిని అడ్డుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో ఒక అధికారిపై కాల్పులు జరిగాయని, అయితే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడం వల్ల అతను ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడని చెప్పారు. ఒక వ్యక్తి ఆయుధాలతో సెక్యూరిటీ చెక్పాయింట్ వద్దకు దూసుకువచ్చాడు, సీక్రెట్ సర్వీస్ సభ్యులు ధైర్యంగా అతడిని పట్టుకున్నారు. ఒక అధికారికి గాయమైంది.. కానీ జాకెట్ అతడిని కాపాడింది. నేను ఆ అధికారితో మాట్లాడాను. అతను క్షేమంగా ఉన్నాడు" అని ట్రంప్ పేర్కొన్నారు. -
ఇది అమెరికా రాజ్యాంగంపై దాడి: ట్రంప్
వాషింగ్టన్ డీసీ: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో అత్యంత పటిష్ట భద్రత నడుమ జరిగిన కరస్పాండెంట్స్ డిన్నర్లో ఒక్కసారిగా తుపాకీ మోతలు దద్దరిల్లాయి. వందలాది మంది ప్రముఖ జర్నలిస్టులు, సెలబ్రిటీలు, జాతీయ నాయకులు హాజరైన ఈ ప్రతిష్టాత్మక విందులో ఓ దుండగుడు కాల్పులకు తెగబడటం తీవ్ర కలకలం రేపింది. ఈ అనూహ్య ఘటన నుంచి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సహా ప్రముఖులందరూ సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై డొనాల్డ్ ట్రంప్ తాజాగా వైట్ హౌస్లో ప్రసంగించారు. ఇది అమెరికా రాజ్యాంగంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు.వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వేదిక వెలుపల చోటుచేసుకున్న కాల్పుల ఘటనపై డోనాల్డ్ ట్రంప్, ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ కీలక వివరాలను వెల్లడించారు. నిందితుడి వద్ద అనేక ఆయుధాలు ఉన్నాయని ట్రంప్ పేర్కొనగా, ఘటనా స్థలంలో ఒక లాంగ్ గన్, తుపాకీ షెల్స్ లభ్యమైనట్లు కాష్ పటేల్ ధృవీకరించారు. అయితే, నిందితుడి వద్ద ఉన్న ఆయుధాల గురించి మరిన్ని ఇతర వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవన్నారు.ఈ ఘటనపై ట్రంప్ స్పందిస్తూ తాను ఎంతో పదునైన ప్రసంగాన్ని సిద్ధం చేసుకున్నానని, కానీ ప్రస్తుత పరిస్థితుల వల్ల తదుపరి కార్యక్రమంలో తన ప్రసంగం చాలా ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు. తాను ప్రసంగించడానికి సర్వసన్నద్ధంగా ఉన్నానని, కానీ భద్రతా కారణాల దృష్ట్యా వచ్చేసారి చాలా సాదాసీదాగా వ్యవహరిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ, భవిష్యత్తులో ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ వేదికపైనే ఉండాలని తాను గట్టిగా ప్రయత్నించానని, కానీ భద్రతా బలగాల సూచన మేరకు వెనక్కి తగ్గాల్సి వచ్చిందని ట్రంప్ వివరించారు. ఈ కాల్పుల ఘటన ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు. భద్రతా సిబ్బంది అత్యంత వేగంగా స్పందించిన తీరును అభినందించిన ట్రంప్.. ‘సీక్రెట్ సర్వీస్ అద్భుతంగా స్పందించింది... ఒక వ్యక్తి అనేక ఆయుధాలతో భద్రతా తనిఖీ కేంద్రం వైపు దూసుకువచ్చాడు.. అతడిని సీక్రెట్ సర్వీస్కు చెందిన కొందరు అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో పారదర్శకత, స్పష్టత కోసం, నేను విడుదల చేయమని ఆదేశించిన ఒక టేప్ను ఇప్పుడే అధికారులు విడుదల చేశారు... మన రాజ్యాంగంపై దాడి చేసిన ఈ దుండగుడి హింసాకాండను, అలాగే మన దేశం తరపున సీక్రెట్ సర్వీస్, చట్ట అమలు సంస్థలు ఎంత వేగంగా స్పందించాయో ఆ టేప్ తెలియజేస్తుంది అని ట్రంప్ పేర్కొన్నారు. ఎవరూ మన సమాజాన్ని హస్తగతం చేసుకోవడానికి వీల్లేదని, ఇలాంటి ఘటనల వల్ల కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని తిరిగి నిర్వహిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. -
డ్రగ్ మాఫియాకు భారీ షాక్.. ముగిసిన ‘డాన్’ శకం?
ఇస్తాంబుల్: అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాపై జరుగుతున్న పోరాటంలో మరో విజయం నమోదైంది. దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు, భారత డ్రగ్స్ డాన్ సలీం డోలాను టర్కీలోని ఇస్తాంబుల్లో పోలీసు అధికారులు అరెస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సింథటిక్ డ్రగ్స్ సామ్రాజ్యాన్ని విస్తరించిన సలీం పట్టుబడటంతో, భారత భద్రతా సంస్థలు దీనిని ఒక కీలకమైన ముందడుగుగా ప్రకటించాయి. ఏళ్ల తరబడి భారతదేశంలోకి భారీ స్థాయిలో మత్తుపదార్థాలను సరఫరా చేసిన ఈ ప్రధాన సూత్రధారి ఆట ఎట్టకేలకు ముగిసింది.అండర్వరల్డ్ డాన్తో చీకటి బంధంసలీం డోలా అరెస్టుతో దావూద్ ఇబ్రహీం అండర్వరల్డ్ నెట్వర్క్ గుట్టు రట్టవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో వ్యవస్థీకృత నేరాలకు, అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లింగ్కు మధ్య ఉన్న సంబంధం బయటపడింది. దర్యాప్తు సంస్థలు ఎప్పటినుంచో అనుమానిస్తున్నట్లే, ఈ మాఫియా ముఠాలు ప్రపంచ దేశాలకు మత్తుపదార్థాలను సరఫరా చేస్తూ చీకటి సామ్రాజ్యాన్ని నడుపుతున్నట్లు స్పష్టమైంది.ముంబై నుంచి దుబాయ్ వరకూ..సలీం డోలా తన నేర సామ్రాజ్యాన్ని తొలుత ముంబై కేంద్రంగా ప్రారంభించాడు. ఆ తర్వాత వ్యూహాత్మకంగా తన మకాంను దుబాయ్కు మార్చి, అక్కడి నుంచే మొత్తం డ్రగ్స్ నెట్వర్క్ను నడిపించాడు. అయితే, భారత దర్యాప్తు సంస్థలు గత కొన్ని నెలలుగా అతని అనుచరులపై ఉక్కుపాదం మోపాయి. 2025లో ముంబై పోలీసులు సలీం ముఖ్య అనుచరులతో పాటు అతని కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకుని, అతని ఆపరేషన్లకు భారీ గండి కొట్టారు.భారత్కు రప్పించడం ఎలా?ఈ డ్రగ్ కింగ్పిన్ను పట్టుకునేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఇదివరకే రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడంతో పాటు నగదు బహుమతిని కూడా ప్రకటించింది. టర్కీ నుంచి సలీంను భారత్కు రప్పించడం చట్టపరంగా సవాలుతో కూడుకున్నప్పటికీ.. యూఏఈ వంటి అంతర్జాతీయ మార్గాల ద్వారా ఏజెన్సీలు ముమ్మరంగా దౌత్య ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ అరెస్టుతో డ్రగ్స్ దందాకు సంబంధించిన ఆర్థిక మూలాలు, అంతర్జాతీయ రూట్లు పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. -
ట్రంప్పై హత్యాయత్నం!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రాణాపాయం నుంచి క్షేమంగా బయటపడ్డారు. అధ్యక్షుడి హోదాలో ఆయన తొలిసారిగా పాల్గొన్న వైట్హౌస్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ విందు భేటీలో ఓ యువకుడు విచ్చలవిడిగా కాల్పులకు తెగబడటం తీవ్ర సంచలనం సృష్టించింది. వాషింగ్టన్లో వైట్హౌస్ సమీపంలోని ప్రఖ్యాత హిల్డన్ హోటల్లో ఇందుకు వేదికైంది. శనివారం రాత్రి 8.34 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. బాల్ రూమ్లో జరిగిన విందులో ట్రంప్తో పాటు ఆయన భార్య మెలానియా, ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ దంపతులు, మంత్రులు పీట్ హెగెŠస్త్, మార్కో రూబియోతో పాటు చాలామంది వీఐపీలు, విలేకరులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆ సమయంలో బాల్రూమ్ బయట ఉన్న లాబీలోకి సాయుధుడైన యువకుడు చొరబడ్డాడు. తుపాకులు, కత్తులతో బాల్ రూమ్ కేసి దూసుకెళ్లాడు. ఆ క్రమంలోనే షాటగన్తో దాదాపు ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిపాడు. కాల్పుల శబ్దాలు వినిపించడంతో బాల్ రూమ్లోని వేలాది మంది అతిథులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పెద్దగా కేకలు వేస్తూ టేబుళ్ల కింద తలదాచుకున్నారు. ట్రంప్ ఈ సమయంలో కరెస్పాండెంట్స్ అసోయేషన్ ప్రెసిడెంట్ వీజియా జియాంగ్తోపాటు మెంటలిస్ట్ ఓజ్ పెరల్మ్యాన్తో మాట్లాడుతున్నారు. కాల్పుల శబ్దాలు విని ఆయన ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు తక్షణం అప్రమత్తమై ట్రంప్, వాన్స్ దంపతుల చుట్టూ రక్షణ వలయంగా ఏర్పడ్డారు. తొలుత వాన్స్ను, తర్వాత ట్రంప్ దంపతులను సురక్షితంగా బాల్ రూమ్ నుండి తరలించారు. వేదిక దిగే సమయంలో ట్రంప్ ఆందోళనకు గురై తడబడగా ఆయనకు భద్రతా సిబ్బంది చేయూత అందించారు. అనంతరం ట్రంప్ దంపతులను హోటల్లోని ప్రెసిడెన్షియల్ సూట్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంచారు. విందును కొనసాగిస్తానని ట్రంప్ తీవ్రంగా పట్టుబట్టారు. దాంతో నిర్వాహకులు కూడా బాల్ రూమ్ను తిరిగి సిద్ధం చేశారు. కానీ సీక్రెట్ సర్వీసు ఏజెంట్లు అందుకు అనుమతి ఇవ్వలేదు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ట్రంప్ దంపతులను వైట్హౌస్కు తరలించారు. దుండగున్ని భద్రతా సిబ్బంది నిర్బంధించారు. అతన్ని 31 ఏళ్ల కోల్ టోమస్ అలెన్గా గుర్తించారు. #WATCH | US President Donald Trump and First Lady Melania Trump rushed out of the White House Correspondents' Dinner after shots were reportedly fired at the event. (Source: Unrestricted Pool via Reuters) pic.twitter.com/Z2nDjWzWW0— ANI (@ANI) April 26, 2026ఏజెంట్పై కాల్పులుఅలెన్ హోటల్ లాబీ నుంచి చెక్ పాయింట్ను దాటుకొని బాల్ రూమ్వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. దాంతో సీక్రెట్ సర్వీసు ఏజెంట్లు ఒక్కసారిగా షాకైనా వెంటనే తేరుకుని దుండుగుడిని వెంబడించారు. ఎంతో దూరం వెళ్లకుండానే అడ్డుకున్నారు. ఆ క్రమంలో ఓ సీక్రెట్ సర్వీస్ఏజెంట్పై అతడు కాల్పులు జరిపాడు. ఏజెంట్కు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉండడంతో ప్రాణాపాయం తప్పింది. దుండగుడు తీవ్రంగా ప్రతిఘటించడంతో నేలమీదకు నెట్టేసి అతికష్టం మీద అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి పలు మారణాయుధాలను స్వా«దీనం చేసుకున్నారు. #WATCH | US President Donald Trump and First Lady Melania Trump rushed out of the White House Correspondents' Dinner after shots were reportedly fired at the event.(Source: Unrestricted Pool via Reuters) pic.twitter.com/Ulm93FCTM1— ANI (@ANI) April 26, 2026దుంగడునికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని టారెన్స్ అలెన్ స్వస్థలం. అతను హిల్టన్ హోటల్లో బస చేశాడు. దాంతో పక్కా పథకం ప్రకారమే అతను దాడికి దిగినట్టు భావిస్తున్నారు. ట్రంప్ భద్రతలో తీవ్ర లోపాలను ఈ ఉదంతం మరోసారి తెరపైకి తెచ్చిందంటున్నారు. ఆనవాయితీగా జరిగే వైట్హౌస్ కరెస్పాండెంట్స్ వార్షిక విందు భేటీలో ట్రంప్ పాల్గొనడం ఇదే తొలిసారి. అధ్యక్షునిగా తొలి హయాంలో కూడా దీనికి ఆయన దూరంగా ఉన్నారు.🚨 WATCH: Absolute PANIC following shots fired at the White House Correspondents DinnerThis guy should not even been able to enter the BUILDING.Just insane! pic.twitter.com/bF5P9HcO0o— Nick Sortor (@nicksortor) April 26, 2026ట్రంప్ సహా ఉన్నతాధికారులే లక్ష్యం విందుకు హాజరయ్యే అధ్యక్షుడు ట్రంప్ సహా అమెరికా ఉన్నతాధికారులే కోల్ టోమస్ అలెన్ లక్ష్యమై ఉండొచ్చని తాత్కాలిక అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె అనుమానం వ్యక్తం చేశారు. అతడి వద్ద లభించిన ఎల్రక్టానిక్ పరికరాలు, రాతలను బట్టి ప్రాథమికంగా ఈ విషయం తెలుస్తోందన్నారు. అలాగే రెండేళ్ల వ్యవధిలో ఆయుధాలను కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకున్నట్లు అనుమానిస్తున్నారు. అలెన్ కాలిఫోర్నియా నుంచి షికాగో, అక్కడి నుంచి వాషింగ్టన్కు చేరుకున్నట్లు దర్యాప్తులో తేలింది. #WATCH | US President Donald Trump and First Lady Melania Trump rushed out of the White House Correspondents' Dinner after shots were reportedly fired at the event. (Source: Unrestricted Pool via Reuters) pic.twitter.com/Z2nDjWzWW0— ANI (@ANI) April 26, 2026రెండేళ్లలో మూడోసారి! ట్రంప్పై హత్యాయత్నం జరగడం గత రెండేళ్లలో ఇది మూడోసారి! 2024 జూలై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్ సిటీలో అధ్యక్ష ఎన్నికల ప్రచార సభలో థామస్ క్రూక్స్ అనే 20 ఏళ్ల యువకుడు సమీపం నుంచి కాల్చగా ట్రంప్ త్రుటిలో తప్పించుకున్నారు. తూటా ఆయన కుడి చెవిని చీల్చుకుంటూ దూసుకెళ్లింది. 2024 సెప్టెంబర్ 15న ఫ్లోరిడాలోని పామ్ బీచ్లో ట్రంప్పై మళ్లీ హత్యాయత్నం జరిగింది. తాజా కాల్పుల ఘటన నేపథ్యంలో ట్రంప్ భద్రతను పూర్తిస్థాయిలో పునఃసమీక్షిస్తున్నట్లు ఎఫ్బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ చెప్పారు.Shots fired at White House Correspondents' Dinner venue. US President Donald Trump posts, "Quite an evening in D.C. Secret Service and Law Enforcement did a fantastic job. They acted quickly and bravely. The shooter has been apprehended, and I have recommended that we “LET THE… pic.twitter.com/HXMmyprGQe— ANI (@ANI) April 26, 2026 -
మళ్లీ మొదటికి!
ఇస్లామాబాద్/వాషింగ్టన్/దుబాయ్: పశ్చిమాసియాలో హార్మూజ్ దిగ్బంధం ఏ స్థాయిలో కొనసాగుతోందో పాకిస్తాన్ వేదికగా రెండో దఫా ప్రత్యక్ష చర్చలపై ప్రతిష్టంభన అదే స్థాయిలో కొనసాగుతోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఒకడుగు ముందుకేసి పాకిస్తాన్కు స్వయంగా విచ్చేసి ఆ దేశ ప్రధాని, ఆర్మీ చీఫ్లతో చర్చిస్తున్న వేళ సంతోషం వ్యక్తంచేసిన అమెరికా తన బృందాన్ని సైతం పంపేందుకు సంసిద్ధమవుతుండగా అరాఘ్చీ హఠాత్తుగా పాక్కు వీడి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు కోపం తెప్పించారు.దీంతో ఇరాన్ బృందంలేని పాకిస్తాన్లో తాము మాత్రం ఎలా ప్రత్యక్ష చర్చలకు కూర్చోగలమనే అసహనంతో ట్రంప్ వెంటనే తన బృందం ప్రయాణాన్ని రద్దుచేశారు. దీంతో రెండోదఫా ప్రత్యక్ష చర్చలు ఎప్పుడు జరుగుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ అంశంలో ఇరాన్ ఒక స్పష్టతనిచ్చింది. అమెరికాతో మరోమారు ప్రత్యక్షచర్చలకు కూర్చోబోమని తెగేసి చెప్పింది. పరోక్ష చర్చలకే తాము సుముఖంగా ఉన్నామని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేల్ శనివారం ప్రకటించారు. పాక్ ప్రధాని, ఫీల్డ్ మార్షల్తో మంతనాలు పాక్ నుంచి ఒమన్కు వెళ్లిపోయే ముందు ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ ఇస్లామాబాద్లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్, పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషక్ దార్లతో విస్తృతస్థాయిలో చర్చించారు. శాంతి చర్చలకు సంబంధించిన తమ దేశ డిమాండ్లను అమెరికాకు తెలియజేయాలని సంబంధిత ప్రతిపాదనల చిట్టాను షెహబాజ్కు అందజేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ తరఫున ఉప విదేశాంగ మంత్రి కజీమ్ ఘరీబ్అబాదీ, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేల్, పాక్ తరఫున పాక్ అంతర్గత మంత్రి మొహ్సిన్ నఖ్వీ సైతం ఈ భేటీలో పాల్గొన్నారు.అయితే చర్చల్లో ప్రస్తావనకు వచ్చిన అంశాల వివరాలను అటు పాక్గానీ ఇటు ఇరాన్గానీ అధికారికంగా బహిర్గతంచేయలేదు. ప్రాంతీయ అస్థిరత, శాంతి చర్చల అంశాలపై నేతలు చర్చించారని సామాజిక మాధ్యమంలో ఇరాన్ రాయబార కార్యాలయం ఒక పోస్ట్పెట్టింది. ఇరాన్ పెట్టిన షరతులను ఇస్లామాబాద్కు విచ్చేసే అమెరికా ప్రతినిధుల ఎదుట పాక్ పెట్టనుందని, వాటికి సమ్మతిస్తేనే ప్రత్యక్ష చర్చలకు ఇరాన్ బృందం పాక్కు రానుందని పాక్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ వివరాలను తుర్కియేతో పాక్ పంచుకుంది. మీరు వెళ్లాల్సిన అవసరం లేదు.. తమ బృందం రాకముందే ఇరాన్ మంత్రి పాక్ నుంచి వెళ్లిపోయారనే వార్త తెల్సి ట్రంప్ వెంటనే కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రతినిధులనూ పాక్కు పంపబోమని తెగేసి చెప్పారు. ఈ మేరకు సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘18 గంటలు ప్రయాణించి ఇస్లామాబాద్కు వెళ్లేందుకు నా బృందం సిద్ధమవుతుంటే వెంటనే ఆగిపొమ్మని చెప్పేశా. పాక్కు అన్ని గంటలపాటు ప్రయాణంచేయడం వృథా. అనవసర శ్రమ. పాక్లో మనతో మాట్లాడ్డానికి ఎవరూ లేనప్పుడు, ఎలాంటి చర్చల్లేనిదానికి అంతదూరం వెళ్లడం దండగ.అసలే ఇరాన్లో ఎవరు తమ నేతనో తేల్చుకోలేక తలలు పట్టుకుంటున్నారు. వాళ్లలో ఇన్చార్జ్ ఎవరో వాళ్లకే తెలీడంలేదు. ఆట మనచేతుల్లోనే ఉంది. వాళ్లకు అంతగా మాట్లాడాలనుకుంటే ఇరాన్ నాయకులు మనకు ఫోన్చేసి మాట్లాడతారు. మేం వినేందుకు సిద్ధంగా ఉన్నాం’’అని ట్రంప్ స్పష్టంచేశారు. పశి్చమాసియాలో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్లను పాక్కు కొద్దిసేపట్లో పంపబోతున్నామని శ్వేతసౌధంలో ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అంతకుముందే ప్రకటించగా కొన్ని నిమిషాలకే ట్రంప్ విరుద్ధమైన ప్రకటన చేశారు.దీంతో అమెరికా ప్రతినిధి బృందం పాక్ పర్యటన చివరినిమిషంలో వాయిదాపడింది. ఈ బృందం ఇక ఎప్పుడు పాక్కు వస్తుందనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే ప్రత్యక్ష చర్చల కోసం తమ ప్రయత్నాలు నిరాటంకంగా కొనసాగుతాయని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్దార్ పునరుద్ఘాటించారు. అమెరికా చిత్తశుద్ధిచూద్దాం.. పాక్ నుంచి ఒమన్ రాజధాని మస్కట్కు చేరుకున్న ఇరాన్ మంత్రి అరాఘ్చీ ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘పాక్లో పర్యటన సత్ఫలితాలనిచ్చింది. యుద్ధం శాశ్వత పరిసమాప్తికి మేం చేసిన ప్రతిపాదనలను పాక్ ముందుంచాం. వాటిని వినేందుకు, యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా ఏపాటి చిత్తశుద్ధిచూపుతుందో చూద్దాం’’అని అన్నారు. ఒమన్ తర్వాత రష్యాలో అరాఘ్చీ పర్యటిస్తారు. తిరిగి ఆయన శనివారం లేదా ఆదివారం పాక్కు వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఇంధనాన్ని ఆదా చేసుకోవాలి: మసూద్ యుద్ధకాలంలో ఇరాన్ ఇంధన వనరులు, మౌలికవసతులను అమెరికా సేనలు దారుణంగా దెబ్బతీయడంతో వాటిని ఇప్పుడు పొదుపుగా వాడుకోవాలని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సూచించారు. ‘‘ఇంట్లో పది లైట్లు ఉంటే అన్ని వెలిగించాల్సిన అవసరమేంటి? ఒక రెండు వెలిగిస్తే సరిపోతుంది’’అని సలహా ఇచ్చారు. కరెంట్ వృథా ఖర్చును భారీగా తగ్గించుకోవాలని ఇరాన్ విద్యుత్ సంస్థ సీఈవో తవానిర్ ఇరానియన్లను కోరారు. -
అమెరికాలో పీహెచ్డీ విద్యార్థుల దారుణ హత్య!
అమెరికాలో గత వారం అదృశ్యమైన బంగ్లాదేశ్కు చెందిన ఇద్దరు పీహెచ్ విద్యార్థుల కేసు విషాదంగా మారింది. ఈ ఇద్దరు విద్యార్థులు దారుణ హత్యకు గురయ్యారు. కాగా ఈ ఇద్దరిని హత్య చేసిన వ్యక్తి వారి రూమ్మేట్ కావడం గమనార్హం. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విషయంలోకి వెళితే.. బంగ్లాదేశ్కు చెందిన జమీల్ లిమోన్, నహీదా బ్రిస్టీలు అమెరికాలోని సౌత్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో పీహెచ్ చేస్తున్నారు. ఏప్రిల్ 17 నుంచి కనిపించకుండా పోయారు. అంతకుముందు రోజు వీరిద్దరూ యూనివర్సిటీ క్యాంపస్లో చివరిసారిగా కనిపించారు. తాజాగా టంపా బే వంతెనపై యువకుడి మృతదేహం గుర్తించగా, బ్రిస్టీ ఆచూకీ లభ్యం కాలేదు.అయితే, ఘటనా స్థలంలో లభించిన ఆధారాల ప్రకారం ఆమె కూడా మరణించినట్లు పోలీసులు నిర్ధరణకు వచ్చారు. ఇదే విషయాన్ని బంగ్లాదేశ్లోని వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కాగా ఒకరి మృతదేహం లభ్యం కాగా.. మరో విద్యార్థి మృతదేహం కోసం గాలింపు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. -
ఇరాన్కు అమెరికా షాక్.. ఆ డబ్బు మొత్తం ఫ్రీజ్!
పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన రెండో విడత శాంతి చర్చలు ఎటూ తేలకుండానే ముగిశాయి. ఇరాన్తో చర్చల కోసం ఇస్లామాబాద్కు వెళ్లాల్సిన అమెరికా ప్రతినిధుల బృందం పర్యటనను ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నపళంగా రద్దు చేశారు. ఫలితం లేని చర్చల కోసం తమ సమయాన్ని వృథా చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తాజాగా ఇరాన్కు అమెరికా మరో షాక్ ఇచ్చింది. ఇరాన్కు సంబంధించిన 344 మిలియన్ డాలర్ల (సుమారు రూ.3242 కోట్ల) విలువైన క్రిప్టో కరెన్సీని ఫ్రీజ్ చేశామని ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ వెల్లడించారు. ఒప్పందం కుదుర్చుకునేలా ఇరాన్పై ఒత్తిడి తీసు కువచ్చేందుకు అమెరికా ఈ తరహా ప్రయత్నాలు చేస్తోంది. 'నిధులు సమకూర్చుకోవడం, వాటిని తరలించడం వంటి విషయాల్లో ఇరాన్ సామర్థ్యాన్ని క్రమంగా దెబ్బతీస్తాం. దానిలో భాగంగానే ఇరాన్తో సంబంధం ఉన్న పలు వాలెట్లపై ఆంక్షలు విధిస్తున్నాం. దాంతో నిధులు ఫ్రీజ్ అవుతాయి' అని బెసెంట్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇదిలా ఉంటే.. హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ నౌకల రాకపోకలపై అమెరికా కట్టుదిట్టమైన దిగ్బంధనాన్ని కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. -
ట్రంప్ సంచలన నిర్ణయం.. ఇరాన్తో చర్చలకు బ్రేక్!
పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకునే పరిస్థితి ఏర్పడుతోంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరగా ల్సిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది. ఇరాన్తో చర్చల కోసం అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ వెళ్లాల్సి ఉండగా, వారి పర్యటనను రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫలితం లేని చర్చల కోసం తమ సమయాన్ని వృథా చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా ప్రకటించారు. ‘కేవలం చర్చల కోసం 18 గంటల పాటు ప్రయాణం చేసి అక్కడ ఖాళీగా కూర్చోవాల్సిన అవసరం లేదు. ఫలితం లేని చర్చల వల్ల సమయం తప్ప మరేమీ వృథా కాదు. మా దగ్గర అన్ని దారులు సిద్ధంగా ఉన్నాయి. ఇరాన్ చర్చలు జరపాలని అనుకుంటే వారే మాకు నేరుగా ఫోన్ చేయవచ్చు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.వెనుదిరిగిన ఇరాన్ ప్రతినిధులు..మరోవైపు, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కూడా శనివారం సాయంత్రం ఇస్లామాబాద్ నుండి వెనుదిరిగింది. అమెరికాతో నేరుగా చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసింది. మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్తో చర్చలు జరిపిన అనంతరం వారు తమ దేశానికి బయలుదేరారు. చర్చల ప్రక్రియలో ఈ ఆకస్మిక బ్రేక్ కారణంగా పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం మొదలవుతుందా అనే ఆందోళన నెలకొంది. అయితే, ‘చర్చల రద్దు అంటే యుద్ధం మొదలైనట్టు కాదు, మేము ఇంకా దాని గురించి ఆలోచించలేదు’ అని ట్రంప్ పేర్కొన్నప్పటికీ, పరిస్థితులు మాత్రం నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. అటు ఇరాన్ తన విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్నా, సరిహద్దుల్లో బలగాల కదలికలు ఆగడం లేదు. -
చర్చల వేళ మరో ట్విస్ట్.. అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
టెహ్రాన్: మరోసారి అమెరికాను ఇరాన్ తీవ్రంగా హెచ్చరించింది. అమెరికా 'సముద్రపు దోపిడీ' కొనసాగిస్తే.. ప్రతీకారం తప్పదంటూ ఇరాన్ సైన్యం తేల్చిచెప్పింది. ఇరాన్ సైన్యం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) మధ్య సమన్వయం వహించే అత్యున్నత సైనిక విభాగం 'ఖాతం అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్' ఈ ప్రకటనను విడుదల చేసింది. అమెరికా తన దిగ్బంధనాన్ని కొనసాగిస్తే.. తమ సాయుధ బలగాల నుండి గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయం అంటూ ఇరాన్ పేర్కొంది.ఇరాన్ సాయుధ దళాలు గతంలో కంటే ఇప్పుడు మరింత పటిష్టంగా, గరిష్ట స్థాయి సంసిద్ధతతో ఉన్నాయని.. జాతీయ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాయంటూ ఇరాన్ స్పష్టం చేసింది. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో శత్రువుల కదలికలను నిరంతరం గమనిస్తున్నామని.. అమెరికా ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే కోలుకోలేని దెబ్బ తీస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది.మరోవైపు, అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించి శాంతి చర్చలు జరపాలన్న పాకిస్థాన్ ప్రయత్నాలు ఘోరంగా విఫలమైనట్లు తెలుస్తోంది. ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇవాళ(శనివారం) పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో సమావేశమయ్యారు. పశ్చిమాసియా పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించినట్లు పాక్ అధికారులు తెలిపారు. ఇస్లామాబాద్లో జరగాల్సిన ఈ చర్చల అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. అమెరికా నౌకాదళం ముందుగా హార్ముజ్ జలసంధి, ఇరాన్ ఓడరేవులపై ఉన్న దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని టెహ్రాన్ స్పష్టమైన షరతు విధించింది. ఒకవైపు శాంతి చర్చలకు అవకాశాలు పూర్తిగా మూసుకుపోగా.. మరోవైపు సముద్ర జలాల్లో అమెరికా తన కఠిన వైఖరిని అవలంబిస్తోంది. ఇరాన్ ఓడరేవుల వైపు వెళ్తున్న ఆ దేశ నౌకను అమెరికా యుద్ధనౌక అడ్డుకోవడం అంతర్జాతీయంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని అమలు చేయడంలో భాగంగా సముద్ర జలాల్లో పహారా కాస్తున్న ‘యూఎస్ఎస్ రాఫెల్ పెరాల్టా’ అనే గైడెడ్-మిస్సైల్ డిస్ట్రాయర్ ఈ ఆపరేషన్ చేపట్టింది. ఏప్రిల్ 24న ఇరాన్ జెండాతో తమ దేశంలోని ఓడరేవు వైపు వెళ్తున్న ఒక నౌకను అమెరికా నావికాదళం విజయవంతంగా అడ్డుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ శనివారం అధికారికంగా ప్రకటించింది. -
ప్రభుత్వ ఉద్యోగాల్లో సగం AIతోనే.. యూఏఈ సంచలనం!
సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలుస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మరో ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2028 నాటికి ప్రభుత్వ సేవల్లో కనీసం 50 శాతాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా నిర్వహించాలని నిర్ణయించింది. (UAE AI Government Services) ఈ ఘనత సాధించనున్న ప్రపంచంలోని మొట్టమొదటి దేశంగా యూఏఈ రికార్డు సృష్టించనుంది.ఈ వినూత్న విధానం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో పనితీరును వేగవంతం చేయడమే కాకుండా, పౌరులకు అందించే సేవల్లో జాప్యాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏఐ వినియోగం వల్ల కేవలం సమయం ఆదా అవ్వడమే కాకుండా, ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. వివిధ శాఖల సమన్వయం, డేటా విశ్లేషణలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషించనుంది.ఇప్పటికే పలు కీలక సంస్కరణలుయూఏఈ ప్రభుత్వం ఇప్పటికే 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్ట్రాటజీ 2031'లో భాగంగా పలు కీలక సంస్కరణలను చేపట్టింది. అందులో భాగంగానే ఈ సరికొత్త 2028 గడువును ఖరారు చేసింది. రవాణా, ఆరోగ్యం, విద్య, భద్రత వంటి కీలక రంగాలలో ఏఐ అల్గారిథమ్స్ను అనుసంధానించడం ద్వారా డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో అగ్రగామిగా నిలవాలని యూఏఈ లక్ష్యంగా పెట్టుకుంది.ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగంపై చర్చలు జరుగుతున్న తరుణంలో, యూఏఈ తీసుకున్న ఈ నిర్ణయం టెక్నాలజీ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారింది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పాలనను ఆధునీకరించడంలో ఈ ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.Under the directives of the President of the UAE, we launch a new government model. Within two years, 50% of government sectors, services, and operations will run on Agentic AI, making the UAE the first government globally to operate at this scale through autonomous systems.AI… pic.twitter.com/53OQLe7RXl— HH Sheikh Mohammed (@HHShkMohd) April 23, 2026 -
వాషింగ్టన్ డీసీ ‘తెర’లపై ట్రంప్-ఎప్స్టీన్ వీడియోలు!
వాషింగ్టన్ డీసీ.. అమెరికా రాజధాని. ఇది చారిత్రకంగా వాస్తు శిల్ప పరంగా అత్యంత ప్రసిద్ధి చెందిన భవనాలతో నిండిన నగరం. ముఖ్యంగా వైట్ హౌస్, కాపిటల్ బిల్డింగ్, వాషింగ్టన్ మాన్యుమెంట్ వంటి నిర్మాణాలు ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందాయి. వాషింగ్టన్డీసీలో గోడలపై సాధారణంగా కళా ప్రదర్శనలు, రాజకీయ నినాదాలు, సామాజిక ఉద్యమాల పోస్టర్లు కనిపిస్తాయి.అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- లైంగిక నేరస్థుడి ఆరోపణలు ఎదుర్కొంటున్న జెఫ్రీ ఎప్స్టీన్ వీడియోలు వాషింగ్టన్ డీసీలో బిల్డింగ్ గోడలపై ప్రదర్శితమయ్యాయి. వాషింగ్టన్ డీసీ వెలుగుల్లోట్రంప్-ఎప్స్టీన్లు కలిసి ఉన్న వీడియోలను ప్రదర్శించారు నిరసనకారులు.అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లు.. మైనర్ బాలికలపై లైంగిక వేధింపుల సంబంధాన్ని మరింత ముడిపెడుతూ పలు దృశ్యాలను, దాంతో పాటు కొన్ని పత్రాలను వాషింగ్టన్ హిల్టన్ భవనం ముఖ భాగంపై ప్రదర్శించారు నిరసనకారులు. ఈ వీడియోలలో ఎప్స్టీన్కు సంబంధించి ఫోటోలు, పత్రాలతో పాటు, అతని ఈ-మెయిళ్లను చదివి వినిపించనట్లుగా ఉన్న ఆడియో కూడా ఉంది. వీటిని వాషింగ్టన్ డీసీ గోడలపై ప్రదర్శించిన కాసేపటికే జనం గుమిగూడిపోయి అలా చూస్తూ ఉండిపోయారు. ఎప్స్టీన్ ఫైళ్ల గురించి జనానికి తెలిసినా ఆ వీడియోలను మరొకసారి ఆసక్తిగా తిలకించారు జనం. అయితే వాషింగ్టన్ డీసీలో ఒక ముఖ్యమైన కార్యక్రమానికి ట్రంప్ హాజరు కానున్న ఒక రోజు ముందు ఈ వీడియోలు ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. వాషింగ్టన్ డీసీలో అధ్యక్ష హోదాలో ఏర్పాటు చేసిన విందుకు ట్రంప్ తొలిసారి హాజరు కానున్నారు. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ నిర్వహించే ఈ విందు కార్యక్రమంలో సంప్రదాయంగా పదవిలో ఉన్న అధ్యక్షుడు కూడా పాల్గొంటారు. ఇది మీడియా స్వేచ్ఛను జరుపుకునే దీర్ఘకాలిక సంప్రదాయం. ప్రతి అధ్యక్షుడు తన పదవీకాలంలో కనీసం ఒకసారి హాజరయ్యారు. అయితే ట్రంప్ మాత్రం తన మొదటి పదవీకాలమంతా, అలాగే 2025లో కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. తాజాగా దీనికి హాజరయ్యే సందర్భంలో ఇలా వాషింగ్టన్ డీసీలో బిల్డింగ్ల ముఖభాగాలపై ఎప్స్టీన్తో కలిసి ఉన్న వీడియోలను నిరసన కారులు ప్రదర్శించడం ఇప్పుడు ట్రంప్కు మరింత తలనొప్పిగా మారింది. ఇటీవలే మీడియాపై ట్రంప్ చిందుకు తొక్కారు. తనపై మీడియా కక్ష కట్టిందని, చెడ్డ వాడిగా ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తుందంటూ తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్రూత్లో రాసుకొచ్చారు ట్రంప్. Washington Hilton, where Trump will soon be arriving for the White House correspondents’ dinner. End the cover-up. pic.twitter.com/PmGZlhtRAv— Led By Donkeys (@ByDonkeys) April 25, 2026 -
నెలకు రూ. 10 లక్షల జీతం, ఇండియాలో కోట్ల ఆస్తులు.. అయినా..?!
దేశంలో చాలామంది యువత కనీస ఉపాధి దొరక్క నానా కష్టాలుపడుతోంటే, నెలకు లక్షల్లో సంపాదిస్తున్నా, జీవితం బోరింగ్గా ఉంది అంటున్న ఒక టెకీ స్టోరీ నెట్టింట వైరల్గా మారింది. రియాద్లో నివసిస్తున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకు రూ. 10 లక్షలు సంపాదన. నెలకు రూ. 8 లక్షలు ఆదా చేస్తున్నాడు. అయినా సంతృప్తి లేదట. ఎందుకలా? డబ్బు, ఆస్తులు జీవితానికి పూర్తి సంతృప్తిని ఇవ్వలేవని, జీవనశైలిలో వైవిధ్యం కూడా ముఖ్యమని ఈ ఘటన నిరూపిస్తోంది. సౌదీ అరేబియాలోని ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లలో ఒకటైన హంగర్స్టేషన్ కోసం రియాద్లో పనిచేస్తున్న తన స్నేహితుడి వివరాలను ఇంజనీర్ అభిషేక్ సింగ్ పంచుకోవడంతో చర్చ మొదలైంది. దీని ప్రకారం అతను నెలకు రూ. 10 లక్షల జీతం. ఖర్చు తక్కువ. దీంతో సగానికిపైగా జీతం ఆదానే. ఖర్చులు పోను నెలకు సుమారు రూ. 8 లక్షలు ఆదా చేస్తున్నారు. దీంతోపాటు భారతదేశంలో కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. అయినా తన జీవితం చాలా 'బోరింగ్'గా ఉందని వ్యాఖ్యానించాడు.ఇదీ చదవండి: 10 లక్షలు ఔట్.. రాఘవ్ చద్దాకు భారీ షాక్జీవితం 'బోరింగ్'?అధిక వేతనం ఉన్నప్పటికీ, వ్యక్తిగత జీవితంలో సంతోషం లేకపోవడం, రోజువారీ రొటీన్ జీవితం విసుగు తెప్పిస్తుందనడానికి ఈ ఉదంతమే నిదర్శనం. ఇంత సంపాదన ఉన్నప్పటికీ, తన దైనందిన జీవితం చాలా నిరర్థకంగా మారిందని ఆ ఇంజనీర్ పేర్కొన్నారు. ఆయన జీవనశైలి కేవలం "పని, జిమ్, నిద్ర.. మళ్ళీ అదే పని" అన్నట్లుగా ఒకే పద్ధతిలో సాగుతోందని, అందులో ఎటువంటి ఉత్సాహం లేదని అభిప్రాయపడ్డారు. గతంలో ఆయన బెంగళూరులోని 'ఇన్మోబి' (InMobi) , లండన్లోని 'వైజ్' (Wise) వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పనిచేశారు.ఇదీ చదవండి: చిరుత నోట చిన్నారి : ఒంటిచేత్తో తండ్రి సాహసం!నెటిజన్ల భిన్నాభిప్రాయాలుఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఒక స్థాయి దాటిన తర్వాత భౌతిక సుఖాలు, డబ్బు అర్థరహితంగా అనిపిస్తాయి. నిత్యం ఒకే రకమైన జీవనశైలి విసుగు తెప్పిస్తుందఅని కొందరు సమర్థించారు. నెలకు రూ. 2 లక్షలతో రియాద్ వంటి నగరంలో విలాసవంతమైన జీవితం గడపడం కష్టం, ఆయన తన ఖర్చులను తక్కువ చేసి చెబుతున్నారంటూ మరికొందరు విమర్శించారు. కేవలం భారత రియల్ ఎస్టేట్ రంగంలోనే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడి పెట్టి ఉంటే ఆయన సంపద ఇంకా పెరిగేదని కొందరు సలహా ఇచ్చారు.డబ్బు, స్థిరమైన ఆస్తులు ఉన్నప్పటికీ, జీవితంలో ఉత్సాహం లేకపోవడం అనే అంశంపై ఇది ఆధునిక కార్పొరేట్ జీవితంలోని ఒక వాస్తవాన్ని ఎత్తిచూపుతోంది.Talked to my friend today.He’s in Riyadh working at HungerStation.1. Makes 10L+ per month 2. Saves ~8L per month 3. Says life is boring: work, gym, sleep, repeat 4. Already bought multiple properties in India, net worth is compounding quietly pic.twitter.com/OKVvWrfTWH— Abhishek Singh (@0xlelouch_) April 21, 2026 ఇదీ చదవండి: నా శవాన్ని కూడా తాకడానికి వీల్లేదు! లాయర్ సూసైడ్ నోట్ కలకలం -
ఏడాదికి 4000 గంటలు ఎండలే....ఎక్కడుందో తెలుసా?
పిల్లలూ... మనం మూడు నెలలు ఉండే వేసవికే అష్షో బుష్షో అంటున్నాం కదా. అసలు ఎప్పుడూ వేసవే ఉండే ఊరు ఉందంటే నమ్ముతారా? అలాంటి ఊరు ఉంది. లక్కీగా ఇండియాలో కాదు. అమెరికాలో. అరిజోనా రాష్ట్రంలో. ఆ ఊరి పేరు యుమాయుమాకి చుట్టూ ఎడారి, ఇసుక, కొండలు. మ్యాప్లో చూస్తే మెక్సికో దేశానికి దగ్గరగా కనిపిస్తుంది. దీనిని ‘ఎండల రాజధాని’ అంటారు. ఎందుకంటే ఏడాదికి 4000 గంటలు ఇక్కడ ఎండ కాస్తూనే ఉంటుంది. ఇక్కడ ఏడాదిలో 330 రోజులు ఆకాశంలో ఒక్క మబ్బు ముక్క కూడా ఉండదు. నీలం రంగు అద్దంలా మెరిసి పోతుంటుంది. చుట్టూ సోనోరాన్ ఎడారి. ఇసుక తొందరగా వేడెక్కిపోతుంది పర్వతాలు అడ్డు: పెద్ద పర్వతాలు వాన మబ్బులను రానివ్వవు. దగ్గరలో సముద్రం లేదు. అందుకే తేమ, చల్లని గాలి రాదు. పంటల ఏడాదికి కేవలం 8 సెం.మీ. వాన పడుతుంది. మన హైదరాబాద్లో ఒక పెద్ద వానకు 5 సెం.మీ. పడుతుంది. యుమాకు అది ఏడాది వాన! గిన్నిస్ రికార్డ్: ‘ప్రపంచంలో అత్యంత ఎండ కాసే నగరం’ అని గిన్నిస్ బుక్లో ఈ ఊరుకి పేరుంది. యుమాలో గొడుగులు అమ్మే షాపులు చాలా తక్కువ. ఎందుకంటే అవసరమే ఉండదు. పిల్లలు ‘వాన పాట పాడాలంటే యూట్యూబ్ పెట్టుకోవాలి. బయటికి వెళ్లాలంటే మొహం, చేతులకు సన్క్రీమ్ రాయడం మర్చిపోరు. లేదంటే 10 నిమిషాల్లో టమాటో అయిపోతారు. ప్రతి ఇంట్లో, స్కూల్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. మనకు వాన సెలవు ఇస్తారు కదా? యుమాలో ‘చాలా ఎక్కువ వేడి’ అని ఎండకు బడికి సెలవు ఇస్తారు. 48 సెంటిగ్రెడ్లు దాటితే బయట ఆడుకోవడం బ్యాన్! ఇంత ఎండలో కూడా యుమాలో పాలకూర’ పండిస్తారు. అమెరికాకి కావాల్సిన పాలకూరలో 90% ఇక్కడి నుంచే వెళ్తుంది. చలికాలంలో పండిస్తారులే! -
దాదాపు 50 రోజుల ఉద్రిక్తతల తర్వాత.. ఇరాన్ కీలక నిర్ణయం
టెహ్రాన్: యాభై రోజుల ఉద్రిక్తతల తర్వాత టెహ్రాన్ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానా సేవలను పునరుద్ధరించారు. వాణిజ్య విమానాల రాకపోకలను శనివారం నుంచి ప్రారంభించినట్లు ఇరాన్ వెల్లడించింది. తాత్కాలిక కాల్పుల విరమణ నేపథ్యంలో మళ్లీ విమాన సర్వీసులు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఇరాన్ ప్రభుత్వ మీడియా సమాచారం ప్రకారం.. ఇరాన్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ పర్యవేక్షణలో విమానా సేవలను పునరుద్ధరించారు భౌగోళిక, రాజకీయ అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని విమానయాన కార్యకలాపాలను పూర్తిగా పునరుద్ధరించడానికి అధికారులు నాలుగు దశల ప్రణాళికను అమలు చేస్తున్నారు.'ఫ్లైట్ రాడార్ 24' డేటా ప్రకారం.. శనివారం ఉదయం టెహ్రాన్ నుండి ఇస్తాంబుల్కు మూడు విమానాలు బయలుదేరాయి. వీటితో పాటు మస్కట్, మదీనాకు కూడా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కీలకమైన మార్గాల్లో సేవలను పునరుద్ధరించారు. యుద్ధం కారణంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికుల డిమాండ్ను కూడా అధికారులు నిశితంగా గమనిస్తున్నారు.అమెరికాతో కుదిరిన కాల్పుల విరమణ అవగాహన ఒప్పందం తర్వాత తన వైమానిక మార్గాలను పాక్షికంగా తెరవాలని ఇరాన్ నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకే విమాన సర్వీసులు మళ్ళీ మొదలయ్యాయి. ప్రస్తుతం నేరుగా సైనిక దాడులు నిలిచిపోయినప్పటికీ, పరిస్థితి ఇంకా సాధారణ స్థితికి రాలేదని అధికారులు చెబుతున్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. ఒక్కో దశలో విమాన రాకపోకల సామర్థ్యాన్ని పెంచుతూ సేవలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని అధికారులు భావిస్తున్నారు. -
ఇలాంటి ఓ అంతర్యుద్ధం జరుగుతోందని తెలుసా?
మనుషుల చరిత్రలో యుద్ధాలు, అంతర్యుద్ధాలు తరచుగా కనిపిస్తాయి. రాజ్యాల కోసం, మతాల కోసం, జాతుల కోసం జరిగిన ఈ పోరాటాలు సమాజాలను శాశ్వతంగా మార్చేశాయి. కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయేది కాస్త ఆశ్చర్యకరమైన విషయమే. ఇలాంటి అంతర్యుద్ధాలు జరుగుతాయని.. వాటి ఫలితంగా 11 ఏళ్లుగా నిత్యం కారడవిలో రక్తపాతం జరుగుతోందని మీకు తెలుసా?.. ఉగాండాలోని కిబాలే నేషనల్ పార్క్.. ప్రపంచంలోనే అతిపెద్ద చింపాంజీ సమూహంగా పేరుగాంచిన న్గోగో(Ngogo) కమ్యూనిటీకి కేరాఫ్. సాధారణంగా చింపాంజీలు 50 లోపే ఒక సమూహంగా ఉంటాయి. కానీ, న్గోగో జాతివి మాత్రం 200లకు పైనే కలిసి ఉండేవి. ఇది పరిశోధకులను ఎంతో ఆశ్చర్యపరిచేది. ఒకప్పుడు కలిసే ఉంటూ.. కలిసే వేటాడుతూ.. కాలం వెల్లదీస్తుంటాయివి. అలాంటిది ఓరోజు అనూహ్యమైన పరిస్థితి చోటు చేసుకుంది. ఉన్నట్లుండి.. ఆ చింపాంజీ గ్రూప్ రెండుగా విడిపోయింది. ఒకదానితో మరొకటి విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాయి. నెమ్మదిగా అది ఘర్షణలకు దారి తీసింది. మనుషుల్లాగే.. అవి గ్యాంగ్ వార్లు చేస్తుండడం, పక్కా ప్లానులతో ప్రత్యర్థులు దాడులు చేయడం ఆశ్చర్యం కలిగించాయి. చివరకు వాటిలో అవి కొట్టుకుని చంపుకునే దాకా వెళ్లింది పరిస్థితి. అలా.. 2015 నుంచి ఇప్పటిదాకా ఏడు పెద్ద చింపాజీలు, మరో 17 పిల్ల చింపాంజీలు మరణించాయి. మరో 14 చింపాంజీలు జాడ లేకుండా పోయాయి. ప్రస్తుతం వెస్టర్న్ గ్రూప్, సెంట్రల్ గ్రూప్ల మధ్య అంతర్యుద్ధంతో నిత్యం కిబాలేలో రక్తం చిందుతోంది. ప్రఖ్యాత పరిశోధకుడు ఆరన్ సాండెల్ ఈ సంఘటనను “చింపాంజీల సివిల్ వార్”గా అభివర్ణించారు. 2014లో ఆ కమ్యూనిటీని అదుపు చేసిన కొన్ని చింపాజీలు వ్యాధులతో చనిపోవడం.. కొత్త ‘ఆల్ఫా మేల్’ రావడం వల్ల సంబంధాలు బలహీనపడ్డాయని చెబుతున్నారాయన. ఆయన మాటల్లో.. ఇది మనుషుల మధ్య మతం, జాతి కోసం జరుగుతున్న యుద్ధంలా కాదు. సంబంధాలు, ఆధిపత్యం, సామాజిక బంధాలు బలహీనపడటం వల్లే చింపాంజీల మధ్య విభజన జరిగింది అని అభిప్రాయపడ్డారు. ఈ సంఘటనను 70వ దశకంలో జేన్ గూడాల్ గోంబే నేషనల్ పార్క్(టాంజానియాలోని అతి చిన్న నేషనల్ పార్క్)లో జరిగిన “ఫోర్ ఇయర్ వార్”తో పోలుస్తున్నారు. అప్పట్లో కూడా ఒకే సమూహంలో పెరిగిన చింపాంజీలు.. కహామా, కసకెలా కమ్యూనిటీలుగా విడిపోయి చంపుకున్నాయి. అయితేనీ వైరంతో తక్కువ కాలంలోనే ఆ జాతి మొత్తం తుడిచిపెట్టుకుని పోయింది. న్గోగో చింపాంజీల యుద్ధం ఎలా ముగుస్తుందో పరిశోధకులకు అంతుచిక్కడం లేదు. ఇక్కడ మూడు అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఒకటి.. సెంట్రల్ గ్రూప్ తమను తాము బలపరుచుకుని రక్షించుకోవడం. రెండోది.. వెస్టర్న్ గ్రూప్ పూర్తిగా ఆధిపత్యం సాధించి సెంట్రల్ గ్రూప్ను అంతమొందించడం. మూడోది.. రెండు గ్రూపులు మళ్లీ కలిసిపోవడం. అయితే చివరిది చాలా అరుదుగా జరిగే అవకాశం అని పరిశోధకులు చెబుతున్నారు.


