breaking news
International
-
Pakistan: టీటీపీ ఉగ్రవాదులతో ఘర్షణ.. 11 మంది సైనికులు మృతి
న్యూఢిల్లీ: పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో జరిగిన నిఘా ఆధారిత ఆపరేషన్లో నిషేధిత తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ)కు చెందిన 19 మంది ఉగ్రవాదులు, 11 మంది సైనికులు మరణించారని పాక్ సైన్యం తెలిపింది. అక్టోబర్ 7-8 మధ్య రాత్రి ‘ఫిట్నా అల్-ఖవారీజ్’ అనే బృందంలో ఉగ్రవాదులు ఉన్నారనే నివేదికల నేపథ్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించామని సైనిక మీడియా విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.భద్రతా దళాలు- ఉగ్రవాదుల మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 19 మంది ఉగ్రవాదులు మరణించారని, లెఫ్టినెంట్ కల్నల్, మేజర్ సహా 11 మంది పాకిస్తాన్ సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారని సైనిక విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాంతంలో ఇంకావున్న ఉగ్రవాదులను నిర్మూలించేందుకు శానిటైజేషన్ ఆపరేషన్ కొనసాగుతున్నదని పేర్కొంది. నిషేధిత టీటీపీ ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్లోని భద్రతా దళాలు, పోలీసులు, చట్ట అమలు సంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోంది.సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ (సీఆర్ఎస్ఎస్) తాజా గణాంకాల ప్రకారం 2025 మూడవ త్రైమాసికంలో టీటీపీ దాడులకు గురైన అత్యంత ప్రభావిత ప్రాంతంగా ఖైబర్ పఖ్తుంఖ్వా నిలిచింది. హింసాత్మక ఘటనల్లో 221కు పైగా జనం మరణించారు. ఆఫ్ఘనిస్తాన్తో పోరస్ సరిహద్దులను పంచుకునే ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ రెండూ ఉగ్రవాద దాడులను ఎదుర్కొంటున్నాయి. -
Coldrif syrup: ఆ విషయంపై క్లారిటీ ఇవ్వండి: డబ్ల్యూహెచ్వో
మధ్యప్రదేశ్లో చిన్నారుల మరణాలకు కారణమైన దగ్గు మందు ‘కోల్డ్రిఫ్’ ఇతర దేశాలకు ఎగుమతి అయ్యిందా..? అంటూ భారత్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టత కోరింది. భారత అధికారుల నుంచి వివరణ అనంతరం ఆ దగ్గు మందుపై అలర్ట్ జారీ చేసే అవసరముందా? అనే దానిపై పరిశీలిస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.తాజాగా, మధ్యప్రదేశ్లోని ఛింద్వారా జిల్లాలో దగ్గు సిరప్ తాగి మరో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. దీంతో, దగ్గు సిరప్ సంబంధిత మరణాల సంఖ్య 20కి చేరుకుంది. తమియా బ్లాక్లోని భరియాధానా గ్రామానికి చెందిన రెండున్నరేళ్ల బాలిక ధని దెహారియా, జున్నార్దియోకు చెందిన రెండేళ్ల జయుషా యదువంశీ సోమ, మంగళవారాల్లో చనిపోయినట్లు అదనపు కలెక్టర్ ధీరేంద్ర సింగ్ చెప్పారు. దగ్గు మందు తాగిన తర్వాత వీరిద్దరూ కిడ్నీలు ఫెయిలై ప్రాణాలు కోల్పోయారన్నారు. జిల్లాకే చెందిన మరో ఆరుగురు చిన్నారులు నాగ్పూర్లోని మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు సహా అనేక రాష్ట్రాలు కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ను నిషేధించాయి. తమిళనాడు ల్యాబ్ నివేదికల ప్రకారం ‘కోల్డ్రిఫ్’లో 48.6 శాతం డైఎథిలిన్ గ్లైకాల్ (DEG) ఉన్నట్లు తేలింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ‘కోల్డ్రిఫ్’ అనే దగ్గు మందు వాడడం వల్ల పలువురు చిన్నారులు మృత్యువాత పడడంపై దర్యాప్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా.. ఎడపెడా పిల్లలకు దగ్గు, జలుబు సిరప్లు వాడొద్దంటూ సూచనలు జారీ చేసింది. -
Nobel Prize: రసాయన శాస్త్రంలో ముగ్గురికి పురస్కారం
రసాయనశాస్త్రంలో ప్రముఖ శాస్త్రవేత్తలు సుసుము కిటగావా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ ఎం యాఘిలు నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. 2025 సంవత్సరానికి గాను రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని జపాన్లోని క్యోటో విశ్వవిద్యాలయానికి చెందిన సుసుము కిటగావా, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విశ్వవిద్యాలయానికి చెందిన రిచర్డ్ రాబ్సన్, అమెరికాలోని బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ఒమర్ ఎం. యాఘిలు సంయుక్తంగా మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్(ఎంఓఎఫ్) సృష్టించడంలో చేసిన కృషికి నోబెల్కు ఎంపికయ్యారు.రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ ముగ్గురిని "లోహ-సేంద్రీయ చట్రాల((మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్) అభివృద్ధి" కోసం సత్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఇవి లోహ అయాన్లను సేంద్రీయ అణువులతో అనుసంధానించడం ద్వారా తయారైన స్ఫటికాకార పదార్థాలు. ఇవి అధిక పోరస్ నిర్మాణాలను ఏర్పరుస్తాయి. ఈ నానోస్కోపిక్ చట్రాలు వాయువులు, అణువులను బంధించగలవు. నిల్వ చేయగలవు. మార్చగలవు. ఇవి ప్రపంచ స్థిరత్వ సవాళ్లను ఎదుర్కోవడంలో అపారమైన సామర్థ్యాన్ని అందిస్తాయి.ఎంఓఎఫ్లు కార్బన్ డయాక్సైడ్, మీథేన్ లేదా నీటి ఆవిరి వంటి వాయువులను వాటి చిన్న కుహరాల ద్వారా లోపలికి, బయటకు ప్రవహించేలా చేస్తాయి. ఈ ప్రత్యేక లక్షణం గ్రీన్హౌస్ వాయువులను సంగ్రహించడం, నీటిని శుద్ధి చేయడం, హైడ్రోజన్ ఇంధనాన్ని నిల్వ చేయడం వరకు అద్భుతమైన విధులను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. శాస్త్రవేత్తలు ఈ పదార్థాలను ప్రయోజన-నిర్మిత గదులతో కూడిన పరమాణు నిర్మాణం’గా అభివర్ణిస్తారు. BREAKING NEWSThe Royal Swedish Academy of Sciences has decided to award the 2025 #NobelPrize in Chemistry to Susumu Kitagawa, Richard Robson and Omar M. Yaghi “for the development of metal–organic frameworks.” pic.twitter.com/IRrV57ObD6— The Nobel Prize (@NobelPrize) October 8, 2025MOFs అంటే ఏమిటి?Metal–Organic Frameworks అనేవి లోహ అయాన్లు, ఆర్గానిక్ లింకర్లు కలిపి ఏర్పడే అణు నిర్మాణాలు. ఇవి పొడవైన గుహలు కలిగి ఉంటాయి. అందువల్ల వాటిలో నీటి ఆవిరి నుండి నీరు సేకరించడం, కార్బన్ డయాక్సైడ్ శోషణ, హైడ్రోజన్ నిల్వ, విషపూరిత వాయువుల నిర్వహణ వంటి అనేక ఉపయోగాలు ఉన్నాయి.సామాజిక ప్రభావంఈ నిర్మాణాలు పర్యావరణ పరిరక్షణ, శుద్ధ నీటి సేకరణ, ఫలాల పరిపక్వత నియంత్రణ, ఔషధాల సరఫరా వంటి అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారి తీశాయి. MOFs ద్వారా PFAS వంటి హానికర రసాయనాలను నీటిలో నుండి వేరు చేయడం సాధ్యమైంది. -
వద్దు పొమ్మంటే ఎవరికి నష్టం..
అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాలను కఠినతరం చేయడం లేదా ఉన్న ఉద్యోగులను తిరిగి పంపించే నిర్ణయాలు స్వల్పకాలికంగా అమెరికన్ ఉద్యోగులకు మేలు చేస్తాయనే వాదనలున్నాయి. కానీ, దీర్ఘకాలంలో ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రపంచంలో ఆ దేశ పోటీతత్వానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. వలస వచ్చిన నిపుణులు (Immigrant professionals) అమెరికా ఆవిష్కరణకు మూల స్తంభాలుగా ఉన్నారు. పేటెంట్లు (Patents), సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం (STEM) రంగాల్లో గ్రాడ్యుయేట్లు, వెంచర్ క్యాపిటల్-ఫండ్ పొందిన సంస్థల్లో కీలక స్థానాల్లో విదేశీ నిపుణుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.వారంతా విరమించుకుంటే అమెరికన్ కంపెనీల్లో నైపుణ్యాల కొరత (Talent Crunch) ఏర్పడుతుంది. ముఖ్యంగా సాంకేతిక రంగంలో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. దీని వలన ఆవిష్కరణ రేటు తగ్గి, ఉత్పాదకత దెబ్బతింటుంది. కొన్ని అంచనాల ప్రకారం, కఠినమైన వలస విధానాలు దీర్ఘకాలంలో అమెరికా స్థూల జాతీయోత్పత్తి (GDP)ని గణీనయంగా తగ్గించవచ్చు.శ్రామిక శక్తి పెరుగుదలపై ప్రతికూలతఅమెరికన్ స్థానిక జనాభా వయసు పెరుగుతున్న నేపథ్యంలో గత 20 ఏళ్లుగా శ్రామిక శక్తి వృద్ధికి (Labor Force Growth) వలసదారులు ప్రధాన చోదక శక్తిగా ఉన్నారు. 2000 నుంచి 2022 మధ్య 25-54 ఏళ్ల వయసున్న శ్రామికుల్లో దాదాపు మూడు వంతుల పెరుగుదలకు విదేశీయులే కారణం. కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలు శ్రామిక శక్తి వృద్ధిని తగ్గిస్తాయి. ఇది ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే సామర్థ్యాన్ని తీవ్రంగా పరిమితం చేస్తుంది.పోటీ దేశాలకు లాభంఅమెరికాలో ఉద్యోగం కోల్పోయిన లేదా ప్రవేశం దొరకని అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులు (Highly Skilled Professionals) వేరే మార్గాలను అన్వేషిస్తారు. ఈ సమయంలో కెనడా, జర్మనీ వంటి దేశాలు వీరికి స్వాగతం పలుకుతున్నాయి. అమెరికా కోల్పోయిన ఈ మేధాసంపత్తి (Talent) ఇతర దేశాలకు బదిలీ అవుతుంది. తద్వారా ఆ దేశాల ఆవిష్కరణ, ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయి. అమెరికాను కాదని ఇతర దేశాలకు వెళ్లే వలసదారులు అక్కడ వ్యాపారాలను స్థాపిస్తారు. వినియోగాన్ని పెంచుతారు.ఇదీ చదవండి: అమెరికా పొమ్మంటూంటే.. ఇవి రమ్మంటున్నాయి! -
అమెరికా పొమ్మంటూంటే.. ఇవి రమ్మంటున్నాయి!
అమెరికా హెచ్1బీ వీసాపై పెంచిన ఫీజులు, ‘యూఎస్ ఫస్ట్’ వైఖరితో అక్కడ ఉన్న ఇతర దేశాలకు చెందిన చాలామంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దాంతోపాటు అమెరికా వెళ్లాలని భావిస్తున్న ఇతర దేశాల్లోని వారు ఆలోచనలో పడ్డారు. ఈనేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు తమ శ్రామిక శక్తి లోటును భర్తీ చేయడానికి, ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయడానికి నియామకాలను ముమ్మరం చేస్తున్నాయి.నైపుణ్యం కలిగిన వారికి అవకాశాలు..కెనడాఅత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానం కెనడా తన టెంపరరీ ఫారిన్ వర్కర్ ప్రోగ్రామ్ (TFWP) ద్వారా గ్లోబల్ టాలెంట్ స్ట్రీమ్ (Global Talent Stream - GTS) విధానంలో నిపుణులను వేగంగా రిక్రూట్ చేసుకుంటోంది. ఎక్స్ప్రెస్ ఎంట్రీ (Express Entry), గ్లోబల్ టాలెంట్ స్ట్రీమ్ (GTS), ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రామ్స్ (PNP) వంటి విధానాలు అనుసరిస్తోంది. ముఖ్యంగా IT/టెక్నాలజీ (సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, నెట్వర్క్ టెక్నీషియన్లు), ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్, సివిల్), ఆరోగ్యం (నర్సులు, డాక్టర్లు), నిర్మాణం (Construction) వంటి విభాగాల్లో నియామకాలు చేపడుతున్నారు.కెనడా GTS ద్వారా అర్హతగల అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగుల వర్క్ పర్మిట్ దరఖాస్తులను కేవలం రెండు వారాల్లో ప్రాసెస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది అత్యంత వేగవంతమైన ప్రక్రియ.జర్మనీయూరప్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ తన కార్మిక లోటును పూడ్చుకోవడానికి చురుగ్గా వలసదారులను ఆకర్షిస్తోంది. అందుకోసం ఈయూ బ్లూ కార్డ్ (EU Blue Card), ఎంప్లాయ్మెంట్ వీసా, జాబ్ సీకర్ వీసా, ఆపర్చునిటీ కార్డ్ (Opportunity Card) పాలసీలను అనుసరిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఇంజినీరింగ్ (మెకానికల్, ఆటోమోటివ్, ఎలక్ట్రికల్), IT (సాఫ్ట్వేర్ డెవలపర్లు, డేటా సైంటిస్టులు), ఆరోగ్యం (డాక్టర్లు, నర్సింగ్), ఫైనాన్స్ రంగాల్లో అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగం చేయాలంటే జర్మన్ భాషా నైపుణ్యం కలిగిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.ఆస్ట్రేలియా (Australia)ఆస్ట్రేలియా పాయింట్స్-ఆధారిత (Points-based) వ్యవస్థను ఉపయోగిస్తుంది. నైపుణ్యాల కొరత ఉన్న ఉద్యోగాల జాబితాను క్రమం తప్పకుండా ప్రకటిస్తుంది. హెల్త్కేర్ (నర్సింగ్, ఇతర వైద్య నిపుణులు), IT, ఇంజినీరింగ్, నిర్మాణ రంగం(Construction Management)లో అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియాలో కనీస వేతనంగా భారీ మొత్తాన్ని చెల్లిస్తారు.యూకే (United Kingdom)యూకే కూడా పాయింట్స్-ఆధారిత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకు మారింది. నైపుణ్యం కలిగిన కార్మికులకు (Skilled Workers), ఆరోగ్య కార్యకర్తలకు వీసా ప్రక్రియను సులభతరం చేసింది. IT, హెల్త్కేర్ (నర్సులు, వైద్య నిపుణులు), విద్యలో అవకాశాలున్నాయి.స్వీడన్ (Sweden)స్వీడన్ అధిక నాణ్యత గల జీవన ప్రమాణాలు, బలమైన సామాజిక భద్రత, వర్క్-లైఫ్ సమతుల్యత (Work-Life Balance)కు ప్రసిద్ధి చెందింది. టెక్నాలజీ, హెల్త్కేర్, ఇంజినీరింగ్, పునరుత్పాదక శక్తి (Renewable Energy) రంగాల్లో భారీగా అవకాశాలున్నాయి. నైపుణ్యం కలిగిన నిపుణులకు వర్క్ పర్మిట్ ప్రక్రియ చాలా సరళంగా ఉంటుంది.నెదర్లాండ్స్ (Netherlands)నెదర్లాండ్స్ ఒక అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం. హై-టెక్నాలజీ, ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందింది. హైలీ స్కిల్డ్ మైగ్రెంట్ (HSM) వీసా, ఈయూ బ్లూ కార్డ్ పాలసీలు పాటిస్తుంది. IT, ఫైనాన్స్, ఇంజినీరింగ్, హెల్త్కేర్, లాజిస్టిక్స్ (Logistics) వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలున్నాయి.సింగపూర్, యూఏఈఆసియాలో ఈ దేశాలు ఉన్నత స్థాయి జీతాలు, తక్కువ పన్నులు, శక్తివంతమైన వ్యాపార వాతావరణాన్ని అందిస్తున్నాయి. సింగపూర్లో ఫైనాన్స్, ఫిన్టెక్ (FinTech), ఐటీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇంజినీరింగ్ విభాగాల్లో కొలువులున్నాయి. ఇక్కడ జారీ చేసే ఉద్యోగ పాస్లు (Employment Passes) అత్యంత నైపుణ్యం కలిగిన వారికి మార్గాన్ని సుగమం చేస్తాయి. యూఏఈ (దుబాయ్, అబుదాబి)లో నిర్మాణ నిర్వహణ, పర్యాటకం, రియల్ ఎస్టేట్, ఐటీ, ఎనర్జీ వంటి విభాగాల్లో అవకాశాలున్నాయి. ఇక్కడ అందించే గోల్డెన్ వీసాల (Golden Visas) ద్వారా దీర్ఘకాల నివాస అవకాశాలను పొందవచ్చు.ఇదీ చదవండి: పసిడి ప్రియుల నడ్డి విరిగినట్టే! పెరిగిన తులం ధర -
పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్(Pakistan) రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్(Asim Khwaja) సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్తాన్India vs Pakistan) మధ్య యుద్ధం అవకాశాలను ఏమాత్రం తిరస్కరించలేము అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోసారి భారత్తో యుద్ధం జరిగే అవకాశం ఉందన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై కొత్త చర్చ మొదలైంది.పాక్ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ తాజాగా పాకిస్తాన్కు చెందిన సమా టీవీలో మాట్లాడుతూ.. పాకిస్తాన్, భారత్ మధ్య నేను ఉద్రిక్తతలను కోరుకోవడం లేదు. కానీ, రెండు దేశాల మధ్య యుద్ధ పరిస్థితులను తిరస్కరించడం లేదు. మళ్లీ భారత్తో యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదు. యుద్ధం విషయానికి పాకిస్తాన్ గతంలో కంటే మెరుగైన ఫలితాన్ని సాధిస్తాం. భారత్ ఎప్పుడూ ఒకే ఐక్య దేశం కాదని చరిత్ర చూపిస్తుంది. ఔరంగజేబు పాలనలో మాత్రమే ఐక్యంగా ఉంది. ముందు నుంచి పాకిస్తాన్ వేరుగానే సృష్టించబడింది. స్వదేశంలో మేము వాదించుకుంటాం.. పోటీ పడతాం. కానీ, భారత్తో పోరాటం అంటే మాత్రం మేము అందరం కలిస్తే వస్తాం అంటూ బీరాలు పలికారు. దీంతో, వ్యాఖ్యలపై కొత్త చర్చ నడుస్తోంది. పాకిస్తాన్ ప్లాన్ ఏంటి? అని సోషల్ మీడియాతో పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Pakistan Defence Minister Khwaja Asif speaks of the possibility of another Indo-Pak war-“History shows that India was never truly united, except briefly under Aurangzeb. Pakistan was created in the name of Allah. At home, we argue and compete, but in a fight with India we come… pic.twitter.com/bTrDxqhQel— Geeta Mohan گیتا موہن गीता मोहन (@Geeta_Mohan) October 8, 2025ఇక, అంతకుముందు కూడా భారత్పై పాకిస్తాన్(Pakistan) రక్షణ శాఖ మంత్రి అసిమ్ ఖవాజా నోరుపారేసుకున్నారు. భవిష్యత్తులో సైనిక ఘర్షణ జరిగితే తమ యుద్ధవిమానాల శిథిలాల కింద భారత్(India) సమాధి అవుతుందని కామెంట్స్ చేశారు. భారత సైనికాధికారులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన దాడుల్లో భారత్కు భారీ నష్టం వాటిల్లిందని అన్నారు. దెబ్బతిన్న ప్రతిష్టను, విశ్వసనీయతను పునరుద్ధరించుకోవడానికి ఆరాటపడుతున్నారని, విఫల యత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆపరేషన్ సిందూర్లో భారత్ 0–6 స్కోర్తో ఓడిపోయిందని అన్నారు. మరోసారి తమతో సైనిక ఘర్షణకు దిగితే భారత్ను సమాధి చేస్తామని హెచ్చరించారు. కాగా, భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను ఎగదోస్తే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది(Upendra Dwivedi)హెచ్చరించిన తర్వాత ఖవాజా ఇలా వ్యాఖ్యలు చేశారు. -
‘రష్యా.. పచ్చి అబద్ధం’: ఉక్రెయిన్ అదుపులో భారతీయుడు!?
ఉక్రెయిన్ సైన్యం సంచలన ప్రకటన చేసింది. రష్యా తరపున పోరాడుతున్న ఓ సైనికుడ్ని అదుపులోకి తీసుకున్నామని, అయితే అతను భారతీయుడని తెలిపింది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం ధృవీకరించాల్సి ఉంది(Is Indian Captured By Ukraine Army). ది కీవ్ ఇండిపెండెంట్ కథనం ప్రకారం.. పట్టుబడిన యువకుడి పేరు మజోతి సాహిల్ మొహమ్మద్ హుస్సేన్(22). స్వస్థలం గుజరాత్ మోర్బీ. ఉన్నత విద్య కోసం రష్యాకు వెళ్లి.. ఇప్పుడు యుద్ధ సైనికుడిగా ఉక్రెయిన్కు పట్టుబడ్డాడు. ఈ మేరకు అతని స్టేట్మెంట్తో సదరు మీడియా సంస్థ ఓ వీడియో విడుదల చేసింది. ఉన్నత విద్య కోసం రష్యా వెళ్లిన మజోత్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడట. ఏడేళ్ల శిక్ష పడడంతో జైలు జీవితం అనుభవిస్తున్నాడట. అయితే.. యుద్ధంలో పోరాడితే శిక్షా కాలం తగ్గిస్తామని, ఆర్థికంగా కూడా సాయం అందిస్తామని మజోత్కు రష్యా అధికారులు ఆఫర్ చేశారట. జైల్లో ఉండడం ఇష్టం లేక అందుకు అంగీకరించానని, అయితే ఆ ఒప్పందంపై సంతకం చేసింది అక్కడి నుంచి బయటపడేందుకేనని ఆ యువకుడు వీడియోలో చెప్పాడు. రష్యాలో అంతా పచ్చి అబద్ధం. నాకు ఆర్థిక సాయం అందలేదు. తగ్గిస్తామని అధికారులు చెప్పడం, జైల్లో ఉండడం ఇష్టం లేకనే ఆ ఒప్పందం కుదుర్చుకుని రష్యా తరఫున స్పెషల్ మిలిటరీ ఆపరేషన్(Special Military Operation)లో పాల్గొన్నానంటూ అతను చెప్పడం ఆ వీడియోలో ఉంది. ఉక్రెయిన్ స్థావరాన్ని చూడగానే తాను తన రైఫిల్ను పక్కన పెట్టి సాయం కోసం అర్థించానని చెప్పాడతను. తనకు రష్యాకు తిరిగి వెళ్లడం ఇష్టం లేదని.. రష్యా జైల్లో మగిపోవడం కంటే ఇక్కడ ఉక్రెయిన్ జైల్లో శిక్ష అనుభవించడం ఎంతో నయంగా భావిస్తున్నట్లు చెప్పాడతను. Ukraine's military says they have captured an Indian national who was fighting alongside Russian forces.Majoti Sahil Mohamed Hussein is a 22-year-old student from Morbi, Gujarat, India & came to Russia to study at a university pic.twitter.com/Kzi5F4EDR4— Sidhant Sibal (@sidhant) October 7, 2025మరోవైపు ఈ కథనం తమ దృష్టికీ వచ్చిందని, అయితే ఉక్రెయిన్ నుంచి అధికారికంగా తమకు ఎలాంటి సమాచారం అందలేదని భారత విదేశాంగ చెబుతోంది. 2022 ఫిబ్రవరి 24వ తేదీన రష్యా.. ఉక్రెయిన్పై పూర్తి స్థాయి దురాక్రమణను మొదలుపెట్టింది. అయితే ఈ యుద్ధంలో ఇతర దేశాల యువకులకు గాలం వేసి రష్యా సైన్యం ఉపయోగించుకుంటోందని.. ఉత్తర కొరియా, భారత్.. ఇలా పలు దేశాలకు చెందిన యువకులకు ఉద్యోగాలు, ఆర్థిక సాయం ఆఫర్ చేస్తుందనే విమర్శ తొలి నుంచి వినిపిస్తోంది. ఉక్రెయిన్ సైన్యం ఇప్పటికే 48 దేశాలకు చెందిన 1,500 మందికి పైగా విదేశీయులను పట్టుకున్నట్లు(Foreigners Caught in Ukraine War) నివేదికలు చెబుతున్నాయి.ఇదిలా ఉంటే.. ఈ యుద్ధంలో భారతీయులు చిక్కుకుపోవడం పట్ల భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం అవుతోంది. రష్యాలో ఉన్న భారతీయుల్లో 126 మందిని ఉక్రెయిన్ యుద్ధంలో దించారని, అందులో 12 మంది మరణించగా.. మరో 16 మంది ఆచూకీ లేకుండా పోయారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది. ఇదే విషయాన్ని మాస్కో వర్గాల దృష్టికి తీసుకెళ్లిన భారత్.. ఈ యుద్దంలో చిక్కుకున్న తన పౌరులకు విముక్తి కల్పించాలని కోరింది కూడా. ప్రధాని మోదీ సైతం జోక్యం చేసుకున్న నేపథ్యంలో 96 మందిని రష్యా విడుదల చేసింది. అయితే ఇలాంటి నియామకాలు ఆపేసినట్లు రష్యా చెబుతున్నప్పటికీ.. ఆ నియామకాలు మాత్రం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: ట్రంప్ సుంకాలపై గీతా గోపినాథ్ షాకింగ్ రియాక్షన్ -
లండన్-ముంబై ఫ్లైట్.. కాక్పిట్లో ప్రత్యక్షమైన ప్రధాని
బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్(Keir Starmer In India) భారత్కు చేరుకున్నారు. ముంబైలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అయితే ఈ పర్యటనకు బయల్దేరిన సమయంలో విమానం కాక్పిట్లో ప్రత్యక్షమై.. కాసేపు ఆయన సందడి చేశారు. ‘‘నేను మీ ప్రధానిని..’’ అంటూ ఇంటర్కామ్ ద్వారా ప్రయాణికులను ఉత్సాహంగా పలకరించారాయన. లండన్ హీత్రూ ఎయిర్పోర్టులో బయల్దేరే ముందు.. ‘‘కాక్పిట్ ఉంది మీ ప్రధాని. మీ అందరిని ఈ ప్రయాణంలో కలవడం నిజంగా అద్భుతంగా ఉంది. ఇది బ్రిటన్ నుంచి భారత్కు పంపిన అతిపెద్ద వాణిజ్య మిషన్. కొత్త ఫ్రీ ట్రేడ్ ఒప్పందంలో ఉన్న అన్ని అవకాశాలను అన్వేషించేందుక ప్రయత్నిస్తాం. మీతో కలిసి ప్రయాణిస్తున్నందుకు సంతోషంగా ఉంది. విమానం దిగాక మరిన్ని అప్డేట్స్ అందిస్తా’’ అంటూ నవ్వుతూ ఆయన అన్నారు. ఈ వీడియోను స్వయంగా ఆయనే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు(UK PM In Cockpit Video). View this post on Instagram A post shared by Keir Starmer (@keirstarmer)ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రెండ్రోజులపాటు భారత్లో పర్యటించనున్నారు. విజన్ 2035-Vision 2035 పేరిట ఇరు దేశాల భారత్–యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించనున్నారు. తన పర్యటనలో స్టార్మర్.. 125 మందికి పైగా వ్యాపార నాయకులు, సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సంబంధాలు సహా ద్వైపాక్షిక భాగస్వామ్యంపై రెండు దేశాల నడుమ పూర్తిస్థాయిలో చర్చలు జరిగే అవకాశముంది. ముంబైలో జరిగే గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు. అయితే ఈ రెండు దేశాల మధ్య జూలైలోనే కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని యూకే పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. ఇదే జరిగితే 90 శాతం వరకు వస్తువులపై టారిఫ్లు రద్దవుతాయి. స్టార్మర్ వెంట వ్యాపారవేత్తలు, యూనివర్సిటీ వైస్ చాన్స్లర్లు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులతో కూడిన 100 మందితో కూడిన బృందం రానుంది. దాదాపు 9 ఏళ్ల అనంతరం ప్రధాని ప్రతినిధి బృందంలో భారత్కు వస్తున్నందుకు ఎంతో ఆసక్తితో ఉన్నామని ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(ఐసీసీ)యూకే చైర్మన్ లార్డ్ కరణ్ బిలిమోరియా పేర్కొన్నారు. కాగా, రెండు దేశాల నడుమ ప్రస్తుతం 44.1 బిలియన్ పౌండ్ల మేర వాణిజ్యం జరుగుతోంది. జూలైలో కుదిరిన వాణిజ్య ఒప్పందం ఫలితంగా 2030 కల్లా ఇది రెట్టింపవుతుందని అంచనాలున్నాయి. ఇదీ చదవండి: నాలుగు రోజులుగా ట్రాఫిక్లోనే నరకం -
‘ఒరిగిందేం లేదు..’ ట్రంప్ టారిఫ్లకు గీతా గోపినాథ్ నెగెటివ్ మార్క్
ప్రముఖ ఆర్థిక నిపుణురాలు, భారత సంతతికి చెందిన గీతా గోపీనాథ్.. ట్రంప్ సుంకాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వాటి వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇప్పటిదాకా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని అన్నారామె. పైగా ఈ 6 నెలల కాలంలో టారిఫ్లు ప్రతికూల ప్రభావాన్ని చూపాయని తేల్చేశారామె(Gita Gopinath On Trump Tariffs).ప్రపంచంలోనే అత్యధికంగా.. భారత్, బ్రెజిల్పై 50 శాతం సుంకాలను ట్రంప్ విధించిన సంగతి తెలిసిందే. అలాగే.. బ్రాండెడ్ ఔషధాలపైనా 100 శాతం టారిఫ్లు విధించారు. వీటితో పాటు చాలా రంగాలపై సుంకాలు విధించారు.. ఇంకా విధించుకుంటూ పోతున్నారు. అయితే.. లిబరేషన్ డే పేరిట ట్రంప్ ప్రపంచ దేశాలపై టారిఫ్ వార్ మొదలుపెట్టి(Liberation Day Tariffs) ఆరు నెలలు పూర్తి అయిన సందర్భంలో హార్వార్డ్ యూనివర్సిటీ ఎకనామిక్ ఫ్రొపెసర్ గీతా గోపినాథ్ స్పందించారు. ట్రంప్ సుంకాలను నెగటివ్ స్కోర్కార్డ్గా అభివర్ణిస్తూ.. అమెరికా ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావాన్ని విశ్లేషించారు. ఈ టారిఫ్లు అమెరికా ఆర్థిక వ్యవస్థకు లాభం కాకుండా నష్టం కలిగించాయని అన్నారామె. ఈ టారిఫ్లు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచినప్పటికీ.. ‘పన్నుల్లా’ వాటి భారం అమెరికా కంపెనీలు, వినియోగదారులపై పడిందని ఆమె అన్నారు. టారిఫ్ల ప్రభావంతో ద్రవ్యోల్బణాన్ని స్వల్పంగా పెరిగినప్పటికీ.. గృహోపకరణ వస్తువులు, ఫర్నిచర్, కాఫీ వంటి వస్తువుల ధరల పెరుగుదలకు కారణమైందని.. ఇది మధ్య తరగతి కుటుంబాలపై ప్రభావం చూపినట్లు ఆమె అభిప్రాయపడ్డారు. వెరసి.. తయారీ రంగం గణనీయంగా అభివృద్ధి చెందలేదు. అలాగే, వాణిజ్య లోటు తగ్గిన సంకేతాలు కూడా లేవు. టారిఫ్లతో అనుకున్న లక్ష్యాలు నెరవేరలేదు అని ఆమె తేల్చేశారు. స్థానిక పరిశ్రమలకు ప్రోత్సాహం, విదేశీ పోటీని తట్టుకోవడం, వాణిజ్య లోటును తగ్గించడమే లక్ష్యంగా సుంకాల మోత మోగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించుకోవడం తెలిసిందే. అయితే.. ఇందుకు భిన్నంగా ఇప్పటివరకు ఫలితాలు ఇవ్వలేదని IMF మాజీ అధికారి అభిప్రాయపడటం గమనార్హం.It is 6 months since "Liberation day" tariffs. What have US tariffs accomplished?1. Raise revenue for government? Yes. Quite substantially. Borne almost entirely by US firms and passed on some to US consumers. So it has worked like a tax on US firms/consumers. 2. Raise… pic.twitter.com/KZG3UgKB3S— Gita Gopinath (@GitaGopinath) October 6, 2025 గీతా గోపినాథ్(53) భారత సంతతికి చెందిన ప్రముఖ ఆర్థిక నిపుణురాలు. వాషింగ్టన్ విశ్వవిద్యాలయం, ప్రిన్స్టన్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆమె హార్వర్డ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్గా పనిచేశారు. 2019లో IMF చీఫ్ ఎకనామిస్ట్గా నియమితులై, 2022లో ఆ సంస్థకు తొలి డిప్యూటీ మేనేజర్గా బాధ్యతలు చేపట్టారు. 2025లో IMF పదవిని వీడి.. హార్వర్డ్లో తిరిగి ప్రొఫెసర్గా చేరారు.ఇదీ చదవండి: క్వాంటమ్ మెకానిక్స్కు ఎట్టకేలకు గుర్తింపు -
సొంత పౌరులనే చంపుతున్న పాక్
యునైటెడ్ నేషన్స్: పాకిస్తాన్ సొంత పౌరులపైనే బాంబులు వేసి చంపుతోందని, ఆ దేశంలో మారణహోమాలు, మహిళలపై సామూహిక లైంగికదాడులు నిత్యకృత్యమని భారత్ ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సోమవారం ‘మహిళలు, శాంతి, భద్రత’అనే అంశంపై నిర్వహించిన చర్చలో ఐరాసలో భారత శాశ్వత రాయబారి పర్వతనేని హరీశ్ మాట్లాడారు. ఈ చర్చలో పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తటంతో ఆయన దాయాది దేశానికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ చర్చ నుంచి కశ్మీరీ మహిళలను తొలగించాలని గట్టిగా పట్టుబట్టారు.‘సొంత ప్రజలపైనే బాంబులు వేస్తున్న ఒక దేశం, ఒక క్రమపద్ధతిలో మారణహోమానికి పాల్పడుతూ, లక్షలమంది మహిళలపై లైంగికదాడులు చేయించిన దేశం ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తోంది. దురదృష్టవశాత్తూ ఏటా పాకిస్తాన్ దుష్ట చర్యలకు మేం బాధితులం అవుతున్నాం. ముఖ్యంగా జమ్మూకశ్మీర్లో.. అయినా ప్రపంచం పాకిస్తాన్ దృష్టకోణం నుంచే చూస్తోంది’అని ఆగ్రహం వ్యక్తంచేశారు. 1971 మార్చి 25న తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో ఆపరేషన్ సెర్చ్లైట్ పేరుతో పాకిస్తాన్ మారణహోమానికి పాల్పడిందని, 4 లక్షల మంది మహిళలపై పాక్ సైన్యం అత్యాచారాలకు పాల్పడిందని గుర్తుచేశారు.మహిళల భద్రత విషయంలో భారత్ను ఎవరూ వేలెత్తి చూపలేరని స్పష్టంచేశారు. మహిళల భద్రత, శాంతి సాధన విషయంలో ప్రపంచంతో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఐక్యరాజ్యసమతి శాంతి పరిరక్షణ మిషన్లలో భారత్ తరఫున పాల్గొన్న మహిళా అధికారులనే ఈ అంశంలో తమ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. 1960వ దశకంతో కల్లోల కాంగోలో ఐరాస పీస్ కీపింగ్ మిషన్లో భారత్ మహిళా మెడికల్ అధికారుల దళాన్ని పంపిందని గుర్తుచేశారు. -
భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్
స్టాక్హోమ్: భౌతిక శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి 2025 సంవత్సరానికి గాను ముగ్గురు శాస్త్రవేత్తలను వరించింది. క్వాంటమ్ మెకానిక్స్ పరిశోధనలకుగాను జాన్ క్లార్క్, జాన్ ఎం మార్టీనిస్, మైఖేల్ హెచ్ డెవొరెట్లకు ఉమ్మడిగా ఈ బహుమతిని అందజేయనున్నట్లు స్వీడన్లోని నోబెల్ కమిటీ మంగళవారం ప్రకటించింది. వీరిలో క్లార్క్(83)బర్కిలీలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోరి్నయాలో, మార్టినిస్ శాంటా బార్బరాలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోరి్నయాలో, డెవొరెట్ యేల్ యూనివర్సిటీతోపాటు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోరి్నయాలోనూ పరిశోధనలను నిర్వహించారు. వీరి పరిశోధన ఏమిటి? ‘మ్యాక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్, విద్యుత్ సర్క్యూట్లో శక్తి పరిమాణీకరణ‘ అనే అంశంపై చేసిన విప్లవాత్మక ప్రయోగాలకు ఈ పురస్కారాలు లభించాయి. ఈ పరిశోధనల ద్వారా క్వాంటమ్ ఫిజిక్స్ను చేతిలో పట్టుకునేంత చిన్న చిప్లో చూపించగలిగారు. విద్యుత్ సర్క్యూట్లో క్వాంటమ్ టన్నెలింగ్, శక్తి స్థాయిల పరిమాణీకరణను స్పష్టంగా నిరూపించారు. ఇది క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ సెన్సార్లు, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ వంటి రంగాల్లో కొత్త అవకాశాలకు తెరలేపింది. ఈ ముగ్గురు శాస్త్రవేత్తల్లో జాన్ క్లార్క్, జాన్ ఎం మార్టీన్లు అమెరికాకు చెందిన వారు కాగా, హెచ్ డెవొరెట్ ఫ్రాన్స్ దేశస్థుడు. క్వాంటమ్ మెకానిక్స్ ఆవశ్యకత.. గ్రహాలు, నక్షత్రాలు తదితరాలతో కూడిన విశాల విశ్వాన్ని సాధారణ భౌతికశాస్త్రంతో వివరించవచ్చు. ప్రొటాన్లు, న్యూట్రాన్లు, ఎల్రక్టాన్లతో కూడిన అణు ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు క్వాంటమ్ మెకానిక్స్ అవసరం అవుతుంది. ఎనర్జీ క్వాంటిజేషన్, టన్నెలింగ్లు అటువంటి అణుస్థాయి కార్యకలాపాలు. శక్తి ఒక ప్రవాహం మాదిరిగా కాకుండా స్థాయిల్లో ఉంటుందని ఎనర్జీ క్వాంటిజేషన్ చెబుతుంది. దీన్ని అర్థం చేసుకునేందుకు ఒక ఉదాహరణను పరిశీలిద్దాం.. ఇంట్లోని బల్బు వెలుగును క్రమేపీ తగ్గించేందుకు డిమ్మర్ను ఉపయోగిస్తూంటారు కదా.. అలాగే శక్తి కూడా నెమ్మదిగా హెచ్చుతగ్గులకు గురవుతుందన్నమాట. దీన్నే ఎనర్జీ క్వాంటిజేషన్ అంటారు. అయితే, అణుస్థాయిలో ఇలా ఉండదు.శక్తి అనేది మెట్లు ఎక్కినట్లు దశలు, దశలుగా ఉంటుంది. ఈ ఏడాది నోబెల్ అవార్డు గ్రహీతలు ఈ ఎనర్జీ క్వాంటిజేషన్ను కూడా అరచేతిలో పట్టేంత, పూర్తిగా నియంత్రితమైన వ్యవస్థల్లోనూ చూపగలిగారు. క్వాంటమ్ స్థాయి ప్రవర్తన అన్నది అణుస్థాయికి మాత్రమే పరిమితం కాదని నిరూపించడం ఈ ఆవిష్కరణ విశేషం. ఈ ఆవిష్కరణ ఆధారంగా అత్యధిక వేగంతో పనిచేయగల క్వాంటమ్ కంప్యూటర్లకు కీలకమైన క్యూబిట్లను తయారు చేసే వీలు ఏర్పడింది. గూగూల్, ఐబీఎంలు ప్రస్తుతం ఉపయోగిస్తున్న సూపర్ కండక్టింగ్ క్యూబిట్లు ఈ ఆవిష్కరణ ఆధారంగానే తయారయ్యాయి. కంప్యూటింగ్ అంటే లెక్కలు వేసేందుకు ఈ క్యూబిట్లలో ఎనర్జీ క్వాంటిజేషన్, టన్నెలింగ్ వంటివి ఆధారమవుతాయి. అంతేకాదు.. ఈ ఆవిష్కరణ సాయంతో అత్యంత సున్నితమైన క్వాంటమ్ సెన్సర్ల తయారీ వీలవుతుంది. ఎమ్మారై, అ్రల్టాసౌండ్ వంటి వైద్య పరీక్షలు మరింత వివరంగా స్పష్టంగా చేసే అవకాశ మేర్పడుతుంది. తద్వారా వ్యాధులను చాలా తొందరగా గుర్తించవచ్చు. నావిగేషన్, జియలాజికల్ సర్వేల్లోనూ ఈ సెన్సర్లను ఉపయోగించవచ్చు. స్పేస్ టెలిస్కోపులు, గ్రావిటేషనల్ వేవ్ డిటెక్టర్లలో క్వాంటమ్ సెన్సర్ల వాడకం ద్వారా విశ్వం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. హ్యాకింగ్ వంటి మస్యల్లేకుండా అత్యంత సురక్షితంగా సమాచారాన్ని పంపేందుకు అవసరమైన క్వాంటమ్ క్రిప్టోగ్రఫీని అభివృద్ధి చేయవచ్చు. -
సౌర తుపానుతో..మన ఆరోగ్యానికీ ముప్పే!
‘శక్తిమంతమైన సౌర తుపాను భూమిని తాకింది.. ఫలితంగా భూ అయస్కాంత క్షేత్రంలో తీవ్ర అవరోధాలు ఏర్పడ్డాయి. దీనివల్ల శాటి లైట్లు, పవర్గ్రిడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు ప్రభా వితం అయ్యే అవకాశం ఉంది’ ఇలాంటి వార్తలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వింటున్నాం.ఔను, నిజమే. సూర్యుడి నుంచి ఉత్పన్న మయ్యే సౌర తుపాన్లు అంత ప్రభావవంతమైనవే, ప్రమాదకరమైనవే. అది ఆయా వ్యవస్థలనేకాదు.. మానవుల ఆరోగ్యాన్నీ ప్రభావితం చేస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. తాజా అధ్యయనంలో మరో ఆసక్తికర విషయం వెలుగుచూసింది. సౌర తుపాన్ల వంటి వాటివల్ల ప్రభావితమయ్యే భూ అయస్కాంత క్షేత్రం.. మనుషుల్లో గుండెపోటుకు కారణమవుతోందట.బ్రెజిల్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఐఎన్పీఈ), యూనివ ర్సిటీ ఆఫ్ సావో పాలో సంయుక్తంగా ఒక అధ్యయనం నిర్వ హించాయి. గుండెపోటు సమస్య ఉన్న 1,340 మంది.. ఇందులో 871 మంది పురుషులు, 469 మంది స్త్రీల ఆసుపత్రి వివరాలను పరిశీలించారు. భూ అయస్కాంత క్షేత్రం తీవ్రతను... సాధారణం, ఒక మోస్తరు, తీవ్రస్థాయి అనే 3 రకాలుగా విభజించారు. పేషంట్లను కూడా వయసుల వారీగా.. 30 అంతకంటే తక్కువ వయసున్నవారు, 31–60 ఏళ్లవారు, 60 ఏళ్లకు పైబడినవారు.. ఇలా మూడు వర్గాలుగా విభజించారు. మూడు రెట్లు ఎక్కువ.. సౌర తుపాను వల్ల భూ అయస్కాంత క్షేత్రంలో వచ్చిన మార్పులు గుండెపోటును ప్రభావితం చేశాయని అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా సౌర తుపాను సమయంలో గుండెపోటు అవకాశాలు మహిళల్లో ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. భూ అయస్కాంత క్షేత్రం తీవ్రత ‘సాధారణం’తో పోలిస్తే ‘తీవ్రస్థాయి’లో ఉన్నప్పుడు గుండెపోట్లు మూడు రెట్లు ఎక్కువగా వచ్చాయట. రక్తపోటు పెరుగుతోంది..: పరిశోధనలో భాగంగా మధ్యస్థాయి అయస్కాంతావరణం ఉండే చైనాలోని రెండు నగరాలను ఎంచుకున్నారు. అక్కడి 5 లక్షలకుపైగా ప్రజల రక్తపోటు స్థాయిల రికార్డులను సౌరతుపాన్ల కాలంతో పోల్చిచూశారు. జీఎంఏలో మార్పులకు తగ్గట్లు అక్కడి ప్రజల బీపీలో హెచ్చుతగ్గులు ఉన్నట్లు కనుగొన్నారు. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా బీపీలో హెచ్చుతగ్గులు నమోదయ్యాయట. ఇప్పటికే రక్తపోటుతో బాధపడుతున్న వారికి సౌర తుపాను వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.ఊపిరితిత్తులు.. నాడీ వ్యవస్థ..: 2022లో సైన్స్ డైరెక్ట్లో ప్రచురితమైన మరో అధ్యయనంలో.. సౌర తుపాన్ల వల్ల భూ అయస్కాంత ఆవరణలో వచ్చే మార్పులు ఊపిరితిత్తుల పనితీరును ప్రభావితం చేస్తాయని తేలింది. ఆ సమయంలో ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అలాగే ఆ సమయంలో నాడీ వ్యవస్థ పనితీరు కూడా ప్రభావితమైందట.సూర్య – ఏఐ..: సౌర తుపాన్లను, వాటి తీవ్రతను అంచనా వేయ డానికి అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా, ఐబీఎమ్ కంపెనీ సహకారంతో సూర్య అనే ఏఐ వ్యవస్థను రూపొందించింది. శాటిలైట్లు, పవర్గ్రిడ్లు, కమ్యూ నికేషన్ వ్యవస్థలకు ప్రమాదకరమైన సౌర తుపాన్లు వచ్చినప్పుడు ఇది అప్రమత్తం చేస్తుంది.5 లక్షల మందిపై..సౌరతుపాన్ల కారణంగా భూమి మీదకు దూసుకొచ్చే వేడి గాలులు భూ అయస్కాంత ఆవరణాన్ని ప్రభావితం చేసి.. మన రక్తపోటు పెంచుతాయని చైనాలో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఆరు సంవత్సరాలపాటు చైనాలోని 5,00,000 మంది ప్రజల రక్తపోటు స్థాయిలను పర్యవేక్షించి శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కనుగొన్నారు. సౌరతుపాన్ల వల్ల భూ అయాస్కాంతావరణంలో (జీఎంఏ) సంభవించే మార్పులు మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయనే దానిపై అధ్యయనం సాగింది. –సాక్షి, స్పెషల్ డెస్క్ -
రష్యా అధ్యక్షుడు పుతిన్కు ప్రధాని మోదీ ఫోన్.. ఎందుకంటే?
ఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. పుతిన్కు 73వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భారత్-రష్యా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు మోదీ మరోసారి పునరుద్ఘాటించారు. భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ను స్వాగతించడానికి ఎదురు చూస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి తాజా పరిణామాలను మోదీకి పుతిన్ వివరించారు. ఈ సమస్యకు శాంతియుత పరిష్కారం కావాలన్న భారత స్థిరమైన వైఖరిని మోదీ గుర్తు చేశారు.పుతిన్ ఈ ఏడాది డిసెంబర్ ఐదారు తేదీలలో భారత్కు వచ్చి.. ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకునే అవకాశం ఉందని సమాచారం. రష్యా చమురు కొనుగోలుపై అమెరికా న్యూఢిల్లీపై శిక్షాత్మక సుంకాలను విధించిన దరిమిలా ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్న తరుణంలో పుతిన్, ప్రధాని మోదీల భేటీ కీలకంగా మారనుంది. రష్యా అధ్యక్షుడు ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీని కలుసుకున్న సంగతి తెలిసిందే.మరోవైపు, భారత్తో వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు అధినేత పుతిన్ ఇటీవల స్పష్టమైన సంకేతాలిచ్చారు. భారత్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాల దిగుమతులను భారీగా పెంచుకోవాలని, ఇందుకోసం ప్రత్యేక విధానం రూపొందించాలని రష్యా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. రష్యా నుంచి భారత ప్రభుత్వం భారీగా ముడిచమురు కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఇరుదేశాల మధ్య వాణిజ్య లోటు తగ్గిపోయి, వాణిజ్యంలో సమతూకం ఏర్పడేలా చర్యలు తీసుకోవడానికి పుతిన్ సిద్ధమయ్యారు. అందులో భాగంగానే భారత్ నుంచి దిగుమతులు పెంచాలని నిర్ణయించారు. గురువారం(అక్టోబర్ 2) వాల్డాయ్ ప్లీనరీలో పుతిన్ ప్రసంగించారు. ఈ ఏడాది డిసెంబర్లో ఇండియాలో పర్యటించబోతున్నానని, ఇందుకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. తనకు మంచి మిత్రుడు, విశ్వసనీయ భాగస్వామి నరేంద్ర మోదీతో సమావేశం కాబోతున్నానని వెల్లడించారు.ప్రధాని మోదీపై పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన సమతూకం కలిగిన, తెలివైన నాయకుడు అని కొనియాడారు. భారతదేశ ప్రయోజనాల కోసం మోదీ నిరంతరం శ్రమిస్తుంటారని వ్యాఖ్యానించారు. మోదీ నేతృత్వంలో జాతీయవాద ప్రభుత్వం చక్కగా పనిచేస్తోందన్నారు. మోదీతో సమావేశమైనప్పుడు తాను ఎంతో సౌకర్యవంతంగా ఉన్నట్లు భావిస్తానని పేర్కొన్నారు. ఉక్రెయిన్కు సహకరించడం మానుకోవాలని అమెరికాను పుతిన్ హెచ్చరించారు. ఉక్రెయిన్కు దీర్ఘశ్రేణి క్షిపణులు సరఫరా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తేల్చిచెప్పారు. -
Nobel Prize 2025: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్
స్టాక్హోమ్: 2025 ఏడాదికిగాను నోబెల్ పురస్కారాల్లో భాగంగా భౌతిక శాస్త్రంలో చేసిన విశేష కృషికి ముగ్గురు శాస్త్రవేత్తలు ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. జాన్ క్లార్క్, జాన్ ఎం మార్టిన్, మైఖేల్ హెచ్ డెవొరెట్లకు నోబెల్ పురస్కారాలను ప్రకటించారు. క్వాంటమ్ మెకానిక్స్ పరిశోధనలకు గాను వీరు ఈ ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాలకు ఎంపికయ్యారు.వీరి పరిశోధన ఏమిటి?"మ్యాక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నెలింగ్, విద్యుత్ సర్క్యూట్లో శక్తి పరిమాణీకరణ" అనే అంశంపై చేసిన విప్లవాత్మక ప్రయోగాలకు ఈ పురస్కారాలు లభించాయి. ఈ పరిశోధనల ద్వారా క్వాంటమ్ ఫిజిక్స్ను చేతిలో పట్టుకునేంత చిన్న చిప్లో చూపించగలిగారు. విద్యుత్ సర్క్యూట్లో క్వాంటమ్ టన్నెలింగ్, శక్తి స్థాయిల పరిమాణీకరణను స్పష్టంగా నిరూపించారు. ఇది క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ సెన్సార్లు, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ వంటి రంగాల్లో కొత్త అవకాశాలకు తెరలేపింది. ఈ ముగ్గురు శాస్త్రవేత్తల్లో జాన్ క్లార్క్, జాన్ ఎం మార్టిన్లు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు కాగా, హెచ్ డెవొరెట్ ఫ్రాన్స్కు చెందిన శాస్త్రవేత్త. క్వాంటమ్ మెకానిక్స్ ఆవశ్యకత..గ్రహాలు, నక్షత్రాలు తదితరాలతో కూడిన విశాల విశ్వాన్ని సాధారణ భౌతికశాస్త్రంతో వివరించవచ్చు కానీ... ప్రొటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్తలో కూడిన అణు ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు క్వాంటమ్ మెకానిక్స్ అవసరం అవుతుంది. ఎనర్జీ క్వాంటిజేషన్, టన్నెలింగ్లు అట్లాంటి అణుస్థాయి కార్యకలాపాలు. శక్తి ఒక ప్రవాహం మాదిరిగా కాకుండా స్థాయుల్లో ఉంటుందని ఎనర్జీ క్వాంటిజేషన్ చెబుతుంది. దీన్ని అర్థం చేసుకునేందుకు ఒక ఉదాహరణను పరిశీలిద్దాం.. ఇంట్లోని బల్బు వెలుగును క్రమేపీ తగ్గించేందుకు డిమ్మర్ను ఉపయోగిస్తూంటారు కదా.. అచ్చం అలాగే శక్తిని కూడా నెమ్మదిగా హెచ్చుతగ్గులకు గురవుతుందన్నమాట. దీన్నే ఎనర్జీ క్వాంటిజేషన్ అంటారు. అయితే అణుస్థాయిలో ఇలా ఉండదు. శక్తి అనేది మెట్లు ఎక్కినట్లు దశలు, దశలుగా ఉంటుంది. ఈ ఏడాది నోబెల్ అవార్డు గ్రహీతలు ఈ ఎనర్జీ క్వాంటిజేషన్ను కూడా అరచేతిలో పట్టేంత, పూర్తిగా నియంత్రితమైన వ్యవస్థల్లోనూ చూపగలిగారు.క్వాంటమ్ స్థాయి ప్రవర్తన అన్నది అణుస్థాయికి మాత్రమే పరిమితం కాదని నిరూపించడం ఈ ఆవిష్కరణ విశేషం. ఈ ఆవిష్కరణ ఆధారంగా అత్యధిక వేగంతో పనిచేయగల క్వాంటమ్ కంప్యూటర్లకు కీలకమైన క్యూబిట్లను తయారు చేసే వీలేర్పడింది. గూగూల్, ఐబీఎంలు ప్రస్తుతం ఉపయోగిస్తున్న సూపర్ కండక్టింగ్ క్యూబిట్లు ఈ ఆవిష్కరణ ఆధారంగా తయారయ్యాయి. కంప్యూటింగ్ అంటే లెక్కలు వేసేందుకు ఈ క్యూబిట్లలో ఎనర్జీ క్వాంటిజేషన్, టన్నెలింగ్ వంటివి ఆధారమవుతాయి.అంతేకాదు.. ఈ ఆవిష్కరణ సాయంతో అత్యంత సున్నితమైన క్వాంటమ్ సెన్సర్ల తయారీ వీలవుతుంది. ఎమ్మారై, అల్ట్రాసౌండ్ వంటి వైద్య పరీక్షలు మరింత వివరంగా స్పష్టంగా చేసే వీలేర్పడుతుంది. తద్వారా వ్యాధులను చాలా తొందరగా గుర్తించవచ్చు. నావిగేషన్, జియలాజికల్ సర్వేల్లోనూ ఈ సెన్సర్లను ఉపయోగించవచ్చు. స్పేస్ టెలిస్కోపులు, గ్రావిటేషనల్ వేవ్ డిటెక్టర్లలో క్వాంటమ్ సెన్సర్ల వాడకం ద్వారా విశ్వం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. హ్యాకింగ్ వంటి సమస్యల్లేకుండా అత్యంత సురక్షితంగా సమాచారాన్ని పంపేందుకు అవసరమైన క్వాంటమ్ క్రిప్టోగ్రఫీని అభివృద్ధి చేయవచ్చుఇదిలా ఉంచితే, నిన్న(సోమవారం, అక్టోబర్6) వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కారాలు ప్రకటించగా, ఈరోజు(మంగళవారం, అక్టోబర్(7) భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాలును ప్రకటించారు. రేపు(బుధవారం, అక్టోబర్ 8) రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారాలు ప్రకటించనున్నారు. ఆపై వరుసగా సాహిత్యం, శాంతి, ఆర్థికశాస్త్రాల్లో నోబెల్ పురస్కారాలను ప్రకటిస్తారు. డిసెంబర్ 10న, అల్ఫ్రెడ్ నోబెల్ వర్థంతి సందర్భంగా స్వీడన్లోని స్టాక్హోమ్, నార్వేలోని ఒస్లో నగరాల వేదికగా ఈ బహుమతులు అందజేస్తారు.ఇదీ చదవండి: వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ -
గాజా@2: యుద్ధం ముగిసేది ఎప్పుడంటే.. నెతన్యాహు ఆసక్తికర వ్యాఖ్యలు
గాజాలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం(Gaza War) రెండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు సుమారు 67 వేలమంది పౌరులు(సగం మహిళలు, చిన్నారులే), దాదాపు 2 వేల మంది ఇజ్రాయెల్ తరఫున మరణించారు. ఈ తరుణంలో యుద్ధం ముగింపు ఎప్పుడనే దానిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. మేము యుద్ధం ముగింపు దశకు చేరుకున్నాం. కానీ ఇంకా పూర్తిగా ముగించలేదు. గాజాలో ప్రారంభమైనది గాజాలోనే ముగుస్తుంది. మిగిలిన మా 46 బందీల విడుదలతో, హమాస్ పాలన అంతమయ్యే వరకు ఇది కొనసాగుతుంది అని ఓ ఇంటర్వ్యూలో తాజాగా వ్యాఖ్యానించారాయన. బెన్ షాపిరోకు ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో నెతన్యాహు(Netanyahu On gaza War) మాట్లాడుతూ.. ఈ యుద్ధంతో ఇజ్రాయెల్ మరింత బలంగా ఎదిగింది. ఇరాన్ మద్దతు సంస్థల కూటమి(హమాస్, హెజ్బొల్లా, హౌతీలు ఉంటాయి)ని ఎదురించి మరీ నిలిచాం. ఇక మిగిలింది హమాస్ అంతమే అని అన్నారు. ‘‘మేం హమాస్ను ఇంకా పూర్తిగా నాశనం చేయలేదు. కానీ, కచ్చితంగా అక్కడిదాకా చేరతాం. యుద్ధం ముగిసింది అంటే.. మా బంధీలు విడుదల కావాలి. అలాగే.. హమాస్ పాలన అంతం అవ్వాలి అని అన్నారాయన. ట్రంప్తో సంబంధాల గురించి.. ఇటీవల కొన్ని అభిప్రాయ బేధాలు తలెత్తినప్పటికీ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో తన సంబంధం బాగానే ఉందని నెతన్యాహు(Trump Netanyahu Relation) చెప్పుకొచ్చారు. హమాస్పై పోరాటంలో అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ప్రపంచానికి నిజాన్ని చూపించాయని అన్నారాయన. అయితే.. America First" అంటే అమెరికా ఒక్కటే కాదని, ఇజ్రాయెల్ వంటి మిత్ర దేశాలు అవసరమని నెతన్యాహూ ట్రంప్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అదే సమయంలో.. ఇరాన్ 11,000 కిలోమీటర్ల పరిధి ఉన్న అంతర్జాతీయ క్షిపణులు అభివృద్ధి చేస్తోందని.. ఇది అమెరికా తూర్పు తీరాన్ని చేరగలవని హెచ్చరించారాయన. అలా మొదలైన యుద్ధం..2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దులో హమాస్ సంస్థ జరిపిన మెరుపు దాడిలో 1,200 మంది మరణించారు. మరో 251 మంది బంధీలుగా తీసుకెళ్లారు. పాలస్తీనియన్ భూభాగాల్లో ఇజ్రాయెల్ సెటిల్మెంట్ల విస్తరణ.. వాళ్ల చేతుల్లో పాలస్తీనా పౌరులు హింసకు గురి కావడం, అల్-అక్సా మసీదు వద్ద ఘర్షణలు, జెనిన్ శరణార్థి శిబిరంపై దాడులు.. ఈ వరుస పరిణామాలు హమాస్ దాడికి కారణాలు. ఈ భారీ దాడికి ప్రతిగా.. ఇజ్రాయెల్ గాజాపై ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్ చేపట్టింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా జరిపిన దాడుల్లో 67, 000 మందికి పైగా మరణించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారు. విధ్వంసంతో పాటు గాజాను దిగ్భంధించి.. మానవతా సాయాన్ని అందకుండా ఇజ్రాయెల్ బలగాలు చేశాయి. విద్యుత్ కొరత, తిండి, నీరు లేక అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితి.. గాజా యుద్ధం రెండో వార్షికోత్సవం (అక్టోబర్ 7, 2025)లో అడుగుపెట్టిన వేళనే.. ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈజిప్ట్ రాజధాని కైరో వేదికగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20-పాయింట్ల శాంతి ప్రణాళికపై చర్చలు జరుగుతున్నాయి. ఇదే చివరి అవకాశమని, ఆలస్యం వద్దని, త్వరపడకపోతే భారీ రక్తపాతం తప్పదని ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు కూడా.ఇదీ చదవండి: భారత్ సమాధి కాక తప్పదు! -
పాక్తో బలపడిన బంధం.. అమెరికాకు తొలి భూ ఖనిజాల ఎగుమతి
ఇస్లామాబాద్: పాకిస్తాన్- అమెరికాల మధ్య బంధం బలపడుతోంది. తాజాగా పాకిస్తాన్- యునైటెడ్ స్టేట్స్లు అరుదైన భూ ఖనిజాల ఎగుమతి కోసం కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేసే దిశగా ముందడుగు వేశాయని, దీంతో ఇరు దేశాల ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యం నూతన దశలోకి ప్రవేశిస్తున్నదని వార్తా పత్రిక ‘డాన్’ పేర్కొంది. గత సెప్టెంబర్లో పాకిస్తాన్తో భూ ఖనిజాల ఎగుమతి కోసం అమెరికా ఒక అవగాహనా ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేసింది.ఈ స్ట్రాటజిక్ మెటల్స్ (యూఎస్ఎస్ఎం) ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ తొలిసారిగా ఖనిజ నమూనాలను అమెరికాకు పంపింది. పాకిస్తాన్లో ఖనిజ ప్రాసెసింగ్, అభివృద్ధి సౌకర్యాల ఏర్పాటుకు అమెరికన్ సంస్థ దాదాపు 500 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాలని యోచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక వృద్ధికి ఖనిజరంగం కీలకంగా నిలుస్తుంది. ఇప్పుడు ఈ అరుదైన భూ ఖనిజాల రవాణాతో పాకిస్తాన్ మరో ముందడుగు వేసిందని వాషింగ్టన్ వర్గాలు పేర్కొన్నాయి.ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ (ఎఫ్డబ్యూఓ) సమన్వయంతో దేశీయంగా తయారైన ఈ ఖనిజంలో యాంటిమోనీ, రాగి సాంద్రత, నియోడైమియం, ప్రాసోడైమియం వంటి అరుదైన భూమి మూలకాలన్నాయి. యూఎస్ఎస్ఎం ఒక ప్రకటనలో ఈ రవాణాను పాకిస్తాన్-యూఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఒక మైలురాయిగా అభివర్ణించింది. ఈ ఒప్పందం అన్వేషణ, ప్రాసెసింగ్ మొదలుకొని పాకిస్తాన్ లోపల శుద్ధి కర్మాగారాల స్థాపన వరకు అభివృద్ధి చెందనుంది. ఈ రంగంలో ఇరు దేశాల సహకారం కోసం ఒక రోడ్మ్యాప్కు రూపకల్పన చేయనున్నారు. ఈ సందర్భంగా యూఎస్ఎస్ఎం సీఈఓ స్టేసీ డబ్ల్యూ హాస్టీ మాట్లాడుతూ ఈ మొదటి డెలివరీ.. యూఎస్ఎస్ఎం, పాకిస్తాన్ల ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ మధ్య సహకారానికి సంబంధించిన నూతన అధ్యాయాన్ని తెరుస్తుందన్నారు.‘డాన్’ పేర్కొన్న వివరాల ప్రకారం ఈ ఒప్పందంతో పాకిస్తాన్ ప్రపంచంలోని కీలక ఖనిజాల మార్కెట్పై పట్టు సాధించగలదు. ఆర్థిక పరిపుష్టిని అందుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇదిలావుండగా పాకిస్తాన్ ప్రతిపక్ష పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ఈ ఒప్పందంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పీటీఐ సమాచార కార్యదర్శి షేక్ వక్కాస్ అక్రమ్ దీనిపై స్పందిస్తూ పాక్ ప్రభుత్వం వాషింగ్టన్తో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్లుందని, ఒప్పందపు పూర్తి వివరాలను బహిరంగంగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఒప్పందాలు దేశంలో ఇప్పటికే ఉన్న అస్థిర పరిస్థితిని మరింత రెచ్చగొడతాయని అక్రమ్ ఆరోపించారు. -
వీడియో: 18వేల అడుగుల ఎత్తు! సెల్ఫీ తీయబోతే పట్టు తప్పి..
సెల్ఫీ మోజు.. ఓ పర్వతారోహకుడి ప్రాణం బలి తీసుకుంది(Selfie Death). ఏకంగా 18వేల అడుగుల ఎత్తైన శిఖరాన్ని అధిరోహించే క్రమంలో ఆ వ్యక్తి పెద్ద పొరపాటు చేశాడు. తోటి బృందంతో సెల్ఫీ కోసమని కట్టుకున్న తాడును విప్పదీసుకున్నాడు. అదే.. అతని మరణానికి కారణమైంది. చైనా సిచువాన్లోని మౌంట్ నామా(Mount Nama) శిఖరంపై(ఎత్తు: 5,588 మీటర్లు.. సుమారుగా 18,300 అడుగులు) ఓ బృందం ట్రెక్కింగ్ చేస్తోంది. ఆ సమయంలో ఓ హైకర్.. సేఫ్టీ రోప్ను విప్పేసి సెల్ఫీ కోసం ప్రయత్నించాడు. అయితే పట్టు తప్పి దొర్లుకుంటూ పడిపోయాడు. అలా.. 200 మీటర్లు(656 మీటర్లు) జారిపడి మృతి చెందాడు. ఆ సమయంలో తోటి బృందంలోని సభ్యులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది.మృతుడ్ని 31 ఏళ్ల హాంగ్గా గుర్తించారు. రక్షణ బృందాలు అతన్ని కాపాడే ప్రయత్నం చేయగా.. అప్పటికే అతని ప్రాణం పోయింది. అతికష్టం మీద స్వాధీనం చేసుకున్న హాంగ్ మృతదేహాన్ని.. గోంగ్గా మౌంటెన్ టౌన్కు తరలించారు. సెల్ఫీ కోసం తన సేఫ్టీ రోప్ తీసేయడం.. ఐస్ యాక్స్ లేకపోవడంతో కాళ్లకు ఉన్న క్రాంపాన్ బూట్లు మంచుపై జారి ఈ ఘోరం జరిగిందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. హంగ్ మంచు కొండలు ఎక్కడం ఇదే తొలిసారి అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటన సెప్టెంబర్ 25న చోటుచేసుకోగా, వీడియో సోషల్ మీడియాలోMount Nama Viral Video వైరల్ అవుతోంది. Terrifying Footage Shows Tourist Sliding To His Death After Taking A Selfie On Mount Nama Feng In Sichuan, 🇨🇳He reportedly unclipped his safety harness to take a picture, but slipped on the ice and was sent plummeting into the abyss - to the horror of fellow climbers. pic.twitter.com/Z4Wa5esHlT— sanjay patel (@Sanjaypatel12Dr) October 3, 2025 ఇదిలా ఉంటే.. హంగ్తో పాటు వెళ్లిన బృందం ఎలాంటి అనుమతులు లేకుండానే శిఖరాన్ని అధిరోహించే ప్రయత్నం చేసిందని అధికారులు వెల్లడించారు. అయితే అతను ప్రొఫెషనల్ కాదని, అరుదుగా కొండలెక్కిన అనుభవం మాత్రమే ఉందని సిచువాన్ మౌంటెనీరింగ్ అసోషియేషన్ అంటోంది.ఇదీ చదవండి: మీరు తినగా వదిలేసిన ఆహారం ఏమవుతుందో తెలుసా? -
మరోసారి టారిఫ్ బాంబ్ పేల్చిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ బాంబ్(Trump Another Tariff) పేల్చారు. ఈసారి మధ్యస్థ, భారీ ట్రక్కులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. విదేశీ ట్రక్కులపై పెంచిన ఈ సుంకాలు వచ్చే నెల నుంచి అమల్లోకి రానుంది. నవంబర్ 1వ తేదీ నుంచి మధ్యస్థ, భారీ వాణిజ్య ట్రక్కులపై అమెరికా 25% సుంకాలు వసూలు చేయనుంది. అమెరికాలో వాహనాల ఉత్పత్తిని ప్రొత్సహించే చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. అయితే.. అమెరికా-ఆధారిత భాగస్వామ్య దేశాలు, జాయింట్ వెంచర్లు ఈ టారిఫ్ నుంచి మినహాయింపు పొందే అవకాశం లేకపోలేదు. ఇక.. చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాలపై ఈ లేటెస్ట్ టారిఫ్ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఈ టారిఫ్పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ విడి భాగాలు, ఉపకరణాలు (components) దిగుమతులపై కూడా టారిఫ్లు ఉంటే, ఆటోమొబైల్ ఎక్స్పోర్ట్-ఆధారిత వ్యాపారాలపై ప్రభావం ఉండొచ్చు. భారత్ నుంచి అమెరికాకు ఈ తరహా ట్రక్కుల (Medium/Heavy-duty Trucks) దిగుమతులు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి అంతగా ప్రభావం పడకపోవచ్చు. అయితే.. ఇక్కడి కంపెనీలు అమెరికా మార్కెట్లో ప్రవేశించాలనుకుంటే మాత్రం టారిఫ్ చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: నెల తిరగకముందే రాజీనామా చేసిన ప్రధాని! -
ఇటలీలో ఘోర రోడ్డు ప్రమాదం
లండన్: దక్షిణ ఇటలీలోని మాటేరా నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయ పౌరులు మరణించినట్లు రోమ్లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. మాటేరా నగరంలోని స్కన్జానో జోనికో మున్సిపాలిటీ పరిధిలో, అగ్రి వ్యాలీ వద్ద శనివారం ఒక ట్రక్కును ఏడు సీట్ల రెనాల్ట్ సీనిక్ వాహనం ఢీకొంది. ఈ వాహనంలో నలుగురు భారతీయులు సహా మరో ఆరుగురు ఉన్నట్లు ఇటాలియన్ వార్తా సంస్థ ఏఎన్ఎస్ఏ ఆదివారం తెలిపింది. మృతులను కుమార్ మనోజ్ (34), సింగ్ సుర్జిత్ (33), సింగ్ హరి్వందర్ (31), సింగ్ జస్కరాన్ (20)గా గుర్తించారు. దక్షిణ ఇటలీలోని మాటేరాలో రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయ పౌరులు మరణించడంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘మేము వివరాల కోసం స్థానిక ఇటాలియన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. సంబంధిత కుటుంబాలకు రాయబార కార్యాలయం అన్ని విధాలా సహాయాన్ని అందిస్తుంది’.. అని పేర్కొంది. గాయపడిన ఐదుగురిని పోలికోరో ఆసుపత్రికి, అత్యంత తీవ్రంగా గాయపడిన ఆరో వ్యక్తిని.. పొటెన్జాలోని శాన్కార్లో ఆసుపత్రికి తరలించినట్లు ఇటాలియన్ వార్తా సంస్థ ఏఎన్ఎస్ఏ తెలిపింది. ట్రక్కు డ్రైవర్కు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదంపై మాటేరా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం దర్యాప్తు చేస్తోంది. -
ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ రాజీనామా
పారిస్: ఫ్రాన్స్లో రాజకీయ సంక్షోభం మొదలైంది. నెల రోజుల క్రితమే ఫ్రాన్స్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సెబాస్టియన్ లెకోర్ను సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన గత నెల 9న ప్రధానమంత్రిగా అధికారంలోకి వచ్చారు. నెల లోపలే పదవి నుంచి తప్పుకోవాల్సి వచి్చంది. సెబాస్టియన్ ఆదివారం తన మంత్రివర్గాన్ని నియమించారు. దీనిపై రాజకీయంగా పలు విమర్శలు వచ్చాయి. దాంతో చేసేది లేక సెబాస్టియన్ రాజీనామా సమర్పించారు. దీన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ ఆమోదించారు. మాక్రాన్ ఇప్పుడేంద చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త ప్రధానమంత్రిని నియమిస్తారా? లేక జాతీయ అసెంబ్లీని రద్దు చేసి, మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఫ్రాన్స్లో గత రెండేళ్లలో ఐదుగురు ప్రధానమంత్రులు రాజీనామా చేయడం గమనార్హం. -
వదిలేసిన ఆహారం విషమవుతోంది!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఏటా కోట్లాది టన్నుల ఆహారం ఉత్పత్తి అవుతుంది. కొన్ని దేశాలలో ఉత్పత్తి చేసిన ఆహారంలో చాలా భాగం వృథా అవుతోంది. ఇక్కడ ఫుడ్ వేస్ట్ అవడమే కాదు అది మళ్లీ మనకే ప్రాణాంతకమవుతోంది. ఈ వృథా ఆహార పదార్థాలు చెత్త డంపుల్లో పడి మీథేన్ వంటి ప్రమాదకర గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేస్తుంది. ఇది కార్బన్ డయాక్సైడ్ కంటే ఎక్కువ ప్రమాదకరం. ప్రపంచ గ్రీన్హౌస్ గ్యాస్ ఉద్గారాల్లో ఆహారం వృథా కారణంగా 8 నుంచి 10% వరకు ఉంటున్నాయి. అలాగే 30% వ్యవసాయ భూమిని ఆహార పదార్థాలకు మాత్రమే ఉపయోగిస్తున్నాం. మీకు తెలుసా? ఒక ఇంట్లో ప్రతి వ్యక్తి ఏడాదికి సగటున 132 కిలోగ్రాముల ఆహారాన్ని వృథా చేస్తున్నాడు. అలాగే, ప్రపంచదేశాలు ఏటా 1 లక్ష కోట్ల డాలర్లకు పైగా విలువైన ఆహారాన్ని వదిలేస్తున్నాయి. మరో విషాదమేమంటే.. ఇంత ఆహారం వృతా అవుతున్నా ప్రపంచంలో 78.3 కోట్ల మంది ఆకలితో అలమటిస్తుండటం..!చైనా.. భారత్.. పాకిస్తాన్..ఆహార వృథా సమస్య తీవ్రతపై 2024లో ఓ నివేదిక విడుదలైంది. ఇందులోని డేటాలో ప్రపంచంలోని ఏఏ దేశాల వాళ్లు ఎక్కువ ఆహారాన్ని వృధా చేస్తున్నారో తెలిపారు. ఆహారం వృథా చేసే దేశాల్లో మొదటి స్థానాన్ని చైనా ఆక్రమించింది. ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగిన దేశాలలో చైనా ఒకటి. చైనాలో సంవత్సరానికి 108 మిలియన్ టన్నులకు పైగా ఆహారాన్ని వృథా అవుతోంది. అంటే చైనాలో ప్రతి వ్యక్తి సంవత్సరానికి 76 కేజీల ఆహారాన్ని వృధా చేస్తున్నాడన్నమాట. ఇక రెండో స్థానంలో ఉన్నది మనమే. మనదేశంలో సంవత్సరానికి 78 మిలియన్ టన్నులకు పైగా ఆహారం వృథా అవుతోంది. దేశ జనాభా ఎక్కువ కాబట్టి ప్రతి భారతీయుడు సంవత్సరానికి 54 కేజీలు వృథా చేస్తాడు. అసమర్థ స్టోరేజ్, రవాణా లోపాలు, వ్యవసాయ క్షేత్రం నుంచి మార్కెట్కు తరలించేటప్పుడు ఆహారం చెడిపోవడం..వంటివి ఫుడ్ వేస్ట్ అవడానికి ప్రధాన కారణాలు. మూడో స్థానం పాకిస్తాన్. ఇక్కడ ఏడాదికి 31 మిలియన్ టన్నుల ఆహారం వృథా అవుతోంది. అయితే సగటున ప్రతి వ్యక్తి 122 కేజీలు ఆహారాన్ని వృథా చేస్తున్నాడు. ప్రపంచంలో ఆహారం వృథా అయ్యేది ఇక్కడే. నిల్వ వసతులు లేమిఆహార వృథాలో నాలుగో స్థానం నైజీరియాది. ఇక్కడ 24.8 మిలియన్ టన్నుల వృథాతో సగటున ఒక్కో వ్యక్తి 106 కేజీల ఆహారం వృథా చేస్తున్నాడు. ఇక్కడ వృథా ఎక్కువగా వినియోగదారుల నుంచి కాకుండా కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం, రవాణా సమస్యలు, మార్కెట్ యాక్సెస్ లోపాలతో వృథా అవుతోంది. ఐదో స్థానంలో అమెరికా ఉంది. అమెరికాలో ప్రతి ఏటా దేశం మొత్తంలో 24 మిలియన్ టన్నులు ఆహారం వృథా అవుతండగా లగటు ప్రతి వ్యక్తి 71 కేజీలు వృథా చేస్తున్నారు. ఇక్కడ ఎక్కువగా రెస్టారెంట్లు, సూపర్మార్కెట్లలో ఆహారం వృథా అవుతుంది. ఆరో స్థానంలో బ్రెజిల్. సంవత్సరానికి 20 మిలియన్ టన్నులు పైగా, ప్రతి వ్యక్తికి 95 కేజీలు ఆహారాన్ని వృథా చేస్తున్నారు. ఏడో స్థానంలో ఈజిప్ట్ ఉంది. 18 మిలియన్ టన్నులతో ప్రపంచంలోనే అత్యధికంగా ప్రతి వ్యక్తి 155 కేజీలు వృథా చేస్తున్నారు. ఎనిమిదో స్థానంలో ఇండోనేసియా ఉంటుంది. 15 మిలియన్ టన్నులతో ప్రతి వ్యక్తి 52 కేజీలు వృథా చేస్తున్నాడు. తొమ్మిదో స్థానంలో బంగ్లాదేశ్. 4 మిలియన్ టన్నులు పైగా, కానీ వ్యక్తికి 82 కేజీల చొప్పున వృధా అవుతోంది. బంగ్లాదేశ్ లాంటి దేశానికి ఇది చాలా ఎక్కువ. చివరి స్థానంలో మెక్సికో నిలిచింది. ఏడాదికి 13.4 మిలియన్ టన్నుల మేర వృథా అవుతుంది. సగటున ప్రతి వ్యక్తి 102 కేజీలు ఆహారం వృథా అవుతోంది.మనం ఏమి చేయగలం? అవసరమైన మేరకే కొనుగోలు చేయడం, వ్యర్థాలను కంపోస్ట్ ఎరువుగా మార్చుకోవడం, ఫుడ్ బ్యాంకులకు డొనేట్ చేయడం వంటి చిన్న మార్పులతో పెద్ద తేడా తీసుకురావచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు. మార్పు మన నుంచే మొదలుకావాలన్నది తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం. ఆ తర్వాతే సమాజం, దేశంతో పాటు ప్రపంచం కూడా మారుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం అవసరం. అదే ఆహారం మనకే విషమైతే..? మనుగడ ప్రశ్నార్థకమవుతుంది..! -
వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్
స్టాక్హోమ్: వైద్య శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి 2025 సంవత్సరానికి గాను ముగ్గురు సైంటిస్టులను వరించింది. మనుషుల్లో రోగ నిరోధక వ్యవస్థపై విశిష్టమైన పరిశోధనలు చేసిన మేరీ ఈ.బ్రంకోవ్, ఫ్రెడ్ రామ్స్డెల్, డాక్టర్ షికోమ్ సకాగుచీకి ఈ బహుమతి ఉమ్మడిగా అందజేయనున్నట్లు స్వీడన్లోని నోబెల్ కమిటీ సోమవారం ప్రకటించింది. మేరీ ఈ.బ్రంకోవ్, ఫ్రెడ్ రామ్స్డెల్ అమెరికాకు చెందినవారు కాగా, షికోమ్ సకాగుచీ జపాన్ సైంటిస్టు. 64 ఏళ్ల బ్రంకోవ్ ప్రస్తుతం సియాటెల్లోని ఇనిస్టిట్యూట్ ఫర్ సిస్టమ్స్ బయాలజీలో సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్గా పని చేస్తున్నారు. రామ్స్డెల్(64) శాన్ ఫ్రాన్సిస్కోలో సోనోమా బయోథెరాపిటిక్స్కు శాస్త్రీయ సలహాదారుగా సేవలందిస్తున్నారు. 74 ఏళ్ల సకాగుచీ జపాన్లోని ఒసాకా యూనివర్సిటీకి సంబంధించిన ఇమ్యూనాలజీ ఫ్రాంటియర్ రీసెర్చ్ సెంటర్లో ప్రొఫె సర్గా వ్యవహరిస్తున్నారు. మనుషుల ఆరోగ్యానికి శరీరంలో రోగనిరోధక వ్యవస్థ అత్యంత కీలకం. ప్రమాదకరమైన బ్యాక్టీరియా, వైరస్లు దాడి చేసినప్పుడు గుర్తించి, సమర్థంగా అడ్డుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటుంది. ఇదే రోగ నిరోధక వ్యవస్థ శరీరంలో సొంత కణాలపై దాడి చేయకుండా నియంత్రిత టీ–కణాలు(స్పెషల్ ఇమ్యూన్ సెల్స్) ఎలా కాపాడుతున్నాయో ముగ్గురు సైంటిస్టులు పరిశోధించి కనిపెట్టారు. అవి శరీరానికి సంరక్షకులుగా పని చేస్తున్న విధానాన్ని విడమర్చి చెప్పారు. రెగ్యులేటరీ టీ–సెల్స్ శక్తి సామర్థ్యాలను, రోగ నిరోధక వ్యవస్థను సమతూకంగా ఉంచడంలో వాటి ప్రాధాన్యతను ప్రపంచానికి వెల్లడించారు. ఆరోగ్యాన్ని కాపాడుకొనేందుకు అవసరమైన కొత్త ఔషధాల తయారీకి వారి పరిశోధన దోహదపడుతోంది. అటోఇమ్యూన్ వ్యాధులు, క్యాన్సర్ చికిత్సల్లో మెరుగైన విధానాలకు మార్గం చూపింది. అవయవాల మారి్పడి ప్రక్రియ సైతం సులభతరం కానుంది. ఇమ్యూన్ టోలరెన్స్ను అర్థం చేసుకొనే విధానాన్ని ఈ పరిశోధన మార్చేసింది. నేడు భౌతికశాస్త్రంలో బహుమతి ప్రకటన ఈ ఏడాది మొదటి నోబెల్ బహుమతిని వైద్య శాస్త్రానికి ప్రకటించారు. మంగళవారం భౌతిక శాస్త్రం, బుధవారం రసాయన శాస్త్రం, గురువారం సాహిత్యం, శుక్రవారం శాంతి బహుమతి విజేతల పేర్లను ప్రకటించబోతున్నారు. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ మెమోరియల్ ప్రైజ్ విజేతను ఈ నెల 13న ప్రకటిస్తారు. అ్రల్ఫెడ్ నోబెల్ వర్థంతి సందర్భంగా ఈ ఏడాది డిసెంబర్ 10న విజేతలకు బహుమతి ప్రదానం చేస్తారు. వైద్య శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ పొందిన ముగ్గురు సైంటిస్టులకు ఉమ్మడిగా 1.2 మిలియన్ డాలర్లు (రూ.10.65 కోట్లకుపైగా) అందజేస్తారు. వారు ఆ సొమ్ము సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది. విజేతలకు ఒక్కొక్కరికి 18 క్యారెట్ల బంగారు పతకం లభిస్తుంది. ఏమిటీ టీ–కణాలు? టీ–కణాలు శరీరంలో తెల్లరక్త కణాల్లాంటివే. ఇమ్యూన్ సిస్టమ్లో ఒక భాగంగా ఉంటూ ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుతుంటాయి. ఎముక మజ్జలో పుట్టే టీ–కణాలు థైమస్లో వృద్ధి చెందుతాయి. రోగ నిరోధక వ్యవస్థ రకరకాల టీ–కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేక పాత్ర ఉంటుంది. ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లు, క్యాన్సర్ కణాలను గుర్తించి, నాశనం చేయడంలో ఇవి సైనికులుగా పనిచేస్తాయి. రక్షణ కవచంగా తోడ్పడుతాయి. ఇమ్యూన్ వ్యవస్థ పొరపాటున సొంత కణాలపై దాడి చేయకుండా రెగ్యులేటరీ టీ–కణాలు నిరోధిస్తాయి. అటోఇమ్యూనిటీని అడ్డుకుంటాయి. ఈ ప్రక్రియను పెరిఫెరల్ ఇమ్యూన్ టోలరెన్స్ అంటారు. ఒకవేళ టీ–కణాలు లేకపోతే సాధారణ రోగ నిరోధక వ్యవస్థ గతి తప్పుతుంది. ముఖ్యమైన అవయవాలు దెబ్బతింటాయి. ప్రాణాపాయం సంభవించవచ్చు. రెగ్యులేటరీ టీ–సెల్స్ను షిమోన్ సకాగుచీ 1995లో తొలిసారిగా గుర్తించారు. ఈ ప్రత్యేక కణాల వల్లే రోగ నిరోధక వ్యవస్థ ఒక క్రమపద్ధతిలో పని చేస్తున్నట్లు తేలి్చచెప్పారు. బ్రంకోవ్, రామ్స్డెల్ 2001లో ఈ పరిశోధనను మరింత ముందుకు తీసుకెళ్లారు. ఫాక్స్పీ3 అనే జన్యువును కనిపెట్టారు. రెగ్యులేటర్ టీ–సెల్స్ అభివృది్థలో ఈ జన్యువు పాత్ర కీలకమని గుర్తించారు. ఈ కణాల ఉత్పత్తి, పనితీరును ఫాక్స్పీ3 నియంత్రిస్తున్నట్లు నిరూపించారు. -
పిట్స్బర్గ్లో దారుణ హత్యకు గురైన ఎన్నారై
చంద్రమౌళి నాగమల్లయ్య ఉదంతం మరువక ముందే.. అమెరికాలో భారత సంతతి ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. పెన్సిల్వేనియాలో ఓ మోటల్ మేనేజర్గా పని చేస్తున్న రాకేశ్ ఇహగబన్(51)ను ఓ దుండగుడు కాల్చి చంపేశాడు. తన మోటల్ బయట జరుగుతున్న గొడవను ఆపేందుకు వెళ్లిన క్రమంలోనే ఆయన అనూహ్యంగా ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. అసలేం జరిగిందంటే.. పెన్సిల్వేనియా స్టేట్ పిట్స్బర్గ్లో ఉన్న ఓ మోటల్లో రాకేశ్ ఇహబగన్(Rakesh Ehagaban) మేనేజర్గా పని చేస్తున్నారు. అక్టోబర్ 3వ తేదీన(శుక్రవారం) మధ్యాహ్నా సమయంలో మోటల్ బయట పార్కింగ్ వద్ద ఏదో అలజడి వినిపించింది. బయటకు వెళ్లిన ఆయనకు.. ఓ వ్యక్తి తన దగ్గర ఉన్న గన్తో ఓ మహిళపై కాల్పులకు దిగడం కనిపించింది. అయితే ఆ సమయంలో ఆ వ్యక్తిని ‘‘ఆర్ యూ ఆల్రైట్ బడ్’’ అంటూ రాకేష్ పలకరించాడు. అంతే తన చేతిలో గన్ను రాకేష్ వైపు తిప్పి పాయింట్ బ్లాక్ రేంజ్లో షూట్ చేశాడు ఆ దుండగుడు. బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలి రాకేష్ మరణించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. పారిపోతున్న నిందితుడిపై కాల్పులు జరిపి పట్టుకున్నారు. ఈ కాల్పుల్లో నిందితుడితో పాటు ఓ పోలీస్ అధికారి సైతం గాయపడ్డారు. నిందితుడిని స్టాన్లీ వెస్ట్గా(38) నిర్ధారించిన పోలీసులు.. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. పోలీసులు తెలిపిన అదనపు వివరాల ప్రకారం.. స్టాన్లీ వెస్ట్ గత రెండు వారాలుగా రాకేష్ మేనేజర్గా పని చేస్తున్న పిట్స్బర్గ్ మోటల్లోనే ఉంటున్నాడు. పార్కింగ్ వద్ద అతను కాల్పులు జరిపిన మహిళ కూడా అతనితోనే అక్కడే ఉంటోంది(ఓ చంటి బిడ్డతో సహా). అయితే శుక్రవారం ఏదో గొడవ జరిగి ఆమె వెళ్లిపోతుంటే.. స్టాన్లీ ఆమెపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఆమె మెడలో తూటా దిగి తీవ్రంగా గాయపడింది. వెనక సీటులో ఉన్నా ఆమె బిడ్డకు అదృష్టవశాత్తూ ఏం కాలేదు. రక్తస్రావం అవుతుండగానే.. ఆమె తన వాహనాన్ని తీసుకుని కొద్దిదూరం పారిపోయింది. తర్వాత ఆమెను గుర్తించిన పోలీసులు.. ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆమె స్పృహలోకి వస్తేనే ఏం జరిగిందనేది తెలుస్తుందని కేసు దర్యాప్తు చేస్తున్న రాబిన్సన్ టౌన్షిప్ పోలీసులు చెబుతున్నారు. అయితే.. ఏం సంబంధం లేకుండా గొడవను ఆపేందుకు వెళ్లి భారత సంతతికి చెందిన రాకేశ్ ఇహగబన్ ప్రాణాలు పొగొట్టుకున్నారని వెల్లడించారు.సెప్టెంబర్ 10వ తేదీన.. అమెరికా టెక్సాస్ స్టేట్ డల్లాస్ నగరంలోని ఓ మోటల్ మేనేజర్ అయిన చంద్రమౌళి నాగమల్లయ్య(50)ను అక్కడ పని చేసే.. యోర్డాన్స్ కోబోస్ కత్తితో తల నరికి హత్య చేసిన ఘటన తెలిసిందే. గదిని శుభ్రం చేసే మెషీన్ విషయంలో చిన్నపాటి గొడవకే ఆగ్రహంతో ఊగిపోయి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు కోబోస్. ఈ దారుణం మల్లయ్య భార్య, కుమారుడి కళ్ల ముందే జరగడం గమనార్హం. తల నరికి.. దానిని కాలితో తన్ని.. ఆపై చెత్త బుట్టలో వేసిన దృశ్యాలు కలవరపాటుకు గురి చేశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
సమయం లేదు.. భారీ రక్తపాతం ఎదురు చూస్తోంది
గాజా శాంతి చర్చల వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాజా శాంతి ప్రణాళిక అమలుకు ఎంతో సమయం లేదని.. త్వరగా ముందుకు కదలాలంటూ ఇజ్రాయెల్, హమాస్లకు సూచించారాయన. ఈ క్రమంలో చర్చలు ఆలస్యమైనా.. అటు ఇటు అయినా.. దారుణమైన పరిణామాలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు.ఇది శతాబ్దాల నాటి ఘర్షణ. స్వయంగా ఈ చర్చలను నేనే పర్యవేక్షిస్తుంటా(Trump Gaza Plan). సమయం ఎంతో కీలకం. ఆలస్యం చేస్తే అత్యంత భారీ రక్తపాతం జరుగుతుంది. అలాంటిదాన్ని ఎవ్వరూ చూడాలనుకోరు.. అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్ ద్వారా హెచ్చరించారు. ‘‘ఈ వారం చివర్లో గాజా యుద్ధాన్ని ముగించేందుకు.. బందీలను విడుదల చేయడానికి.. అన్నింటికంటే ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఎప్పటి నుంచో కోరుకుంటున్న శాంతిని నెలకొల్పేందుకు సానుకూల చర్చలే జరుగుతున్నాయి’’ ట్రంప్ అని ఆ పోస్టు ద్వారా వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ చర్చలు కీలక దశలోనే ఉన్నాయంటూ పేర్కొన్నారాయన. ట్రంప్ గాజా ప్లాన్పై ఇజ్రాయెల్, హమాస్(Israel Hamas Deal) రెండూ ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చినప్పటికీ.. చర్చలు మాత్రం నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ తరుణంలో.. ఇవాళ(సోమవారం) ఈజిప్ట్లో ట్రంప్ గాజా ప్లాన్పై చర్చలు జరగనున్న నేపథ్యంలోనే ట్రంప్ వ్యాఖ్యలు ఇటు ఇజ్రాయెల్, అటు హమాస్పై ఒత్తిడిని పెంచేందుకేనని స్పష్టంగా తెలుస్తోంది. కైరో(Cairo)లో ఇవాళ జరుగనున్న ఈ చర్చల్లో హమాస్, ఇజ్రాయెల్, అమెరికా, ఈజిప్ట్ ప్రతినిధులు పాల్గొంటున్నారు. గాజా పట్టణంలో కొనసాగుతున్న యుద్ధం.. మానవీయ సంక్షోభ నేపథ్యంలో కాల్పుల విరమణ, హమాస్ చెరలో ఉన్న బందీల విడుదల, గాజాకు మానవతా సహాయం అందించడం వంటి ప్రధాన అంశాలపై చర్చలు జరగనున్నాయి. అలాగే హమాస్ విముక్త గాజా అంశమూ కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. 2023 అక్టోబర్ 7న హమాస్, ఇజ్రాయెల్ సరిహద్దులో జరిపిన దాడితో ఈ యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దాడులతో.. ఇప్పటిదాకా వేల మంది పౌరులు మృతి చెందారు. తీవ్ర ఆహార సంక్షోభం నెలకొందక్కడ. ఈ పరిణామాలపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో శాంతి ఒప్పందం త్వరగా కుదరాలని అంతర్జాతీయ సమాజం కోరుకుంటోంది. గాజా శాంతి ఒప్పందంలో(Gaza Peace Deal) భాగంగా ట్రంప్ సూచించిన 20 అంశాల శాంతి ప్రణాళికకు హమాస్ అంగీకారం తెలిపింది. ఇజ్రాయెల్ సైతం అంగీకారం తెలిపినప్పటికీ.. హమాస్ లక్ష్యంగా గాజా నుంచి పూర్తిగా తమ బలగాలను ఉపసంహరించుకునేందుకు మాత్రం ఒప్పుకోవడం లేదు. ఈ తరుణంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Truth Social వేదికగా చేసిన తాజా పోస్టులో.. గాజా శాంతి ఒప్పందం మొదటి దశ ఈ వారం పూర్తవుతుందని చెబుతుండడం గమనార్హం. ఇదీ చదవండి: భారత్పై నోరు పారేసుకున్న పాక్ మంత్రి -
ఎవరెస్టుపై అత్యంత భయానక రాత్రి!
ఖట్మాండు: ఎవరెస్ట్ పర్వతంపై భారీ మంచు తుఫాన్ పర్వతంతో(Mount Everest blizzard) ఒక్కసారిగా అలజడి రేగింది. సుమారు 1,000 మంది పర్వతారోహకులు ఈ తుపానులో చిక్కుకునిపోగా.. వారిని రక్షించే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. టిబెట్ వైపు ఈ పరిణామం చోటు చేసుకోవడంతో చైనా ప్రభుత్వం ఈ సహయక చరయలను పర్యవేక్షిస్తోంది. మౌంట్ ఎవరెస్ట్పై టిబెట్(Mount Everest Tibet) వైపు అక్టోబర్ 3న తేదీన భారీ మంచు తుఫాన్ ప్రారంభమైంది. ఈ ప్రభావంతో కర్మా వ్యాలీ, కాంగ్షుంగ్ వైపు ట్రెక్కింగ్ చేస్తున్న వాళ్లు క్యాంప్ సైట్ల వద్ద చిక్కుకునిపోయారు. దీంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో మంచు తొలగిస్తూ దారులను క్లియర్ చేస్తున్నారు. Nearly 1,000 people are trapped on Mount Everest slopes — Rescue operation underway.#MountEverest #Everest pic.twitter.com/hyVSR0ER3a— Shehzad Qureshi (@ShehxadGulHasen) October 5, 2025రెస్యూ బృందాలు ఇప్పటిదాకా 350 మందిని కాపాడినట్లు సమాచారం. వాళ్లందరినీ ఆదివారం నాటికే క్యూదాంగ్ పట్టణానికి తరలించారు. మరో 200 మందిని దశలవారీగా కిందకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. హైపోథర్మియా(Hypothermia.. శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువకి పడిపోవడం) కారణంగా పర్వతారోహకులు తీవ్ర భయాందోళనకు గురైనట్లు స్పష్టమవుతోంది. “ఇది తమ జీవితంలోనే అత్యంత భయంకరమైన రాత్రి” అని పలువురు మీడియాకు రోదిస్తూ చెప్పారు. మంచు తుఫాన్ ధాటికి టెంట్లు కుప్పకూలిపోయాయి. దీంతో పర్వతారోహకులు సురక్షిత ప్రాంతాల వైపు తరలిపోతున్న దృశ్యాలతో ఓ వీడియో రికార్డు బయటకు వచ్చింది. అయితే పర్వతారోహకులు అలా తరలిపోతుండడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దారి తప్పిపోయే అవకాశం ఉండడం, పైగా హైపోథర్మియాతో పాటు ఆక్సిజన్ కొరత వాళ్ల ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. తుఫాన్ తీవ్రంగానే..కర్మా లోయ సముద్ర మట్టానికి 4,200 మీటర్ల ఎత్తులో ఉంది. నేపాల్లో భారీ వర్షాలు, మెరుపు వరదలు,కొండ చరియలు విరిగిపడి 47 మంది మరణించారు. ఈ ప్రతికూల వాతావరణ ప్రభావంతో.. శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు ఎవరెస్ట్పై మెరుపులు ఉరుములతో కూడిన భారీ వర్షం, ఆపై భారీ మంచు తుపాను సంభవించింది. మరోవైపు.. తుపాను నేపథ్యంలో తింగ్రీ కౌంటీ టూరిజం సంస్థ అన్ని టికెట్ అమ్మకాలు, ప్రవేశాలను శనివారం నుంచే నిలిపివేసింది.గతంలోనూ.. ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం.. మౌంట్ ఎవరెస్ట్. అయితే దీనిని అధిరోహించే క్రమంలో అధికారిక లెక్కల ప్రకారం.. ఇప్పటిదాకా 340 మరణించారు. అలాగే గతంలో ప్రకృతి విపత్తుల కారణంగానూ ఇక్కడ ప్రాణ నష్టం సంభవించింది కూడా. 1996 మే 10-11 తేదీల్లో మౌంట్ ఎవరెస్ట్ తుపాను కారణంగా ఎనిమిది మంది మరణించారు. అలాగే.. 2014 ఏప్రిల్ 18వ తేదీన మంచు శిఖరాలు (ice seracs) కూలిపోవడంతో 16 మంది నేపాలీ గైడ్లు మృతి చెందారు. అయితే భద్రతా లోపాలు, పైగా ఈ ఘటనలో భాదిత కుటుంబాలకు తక్కువ పరిహారం చెల్లించడంతో గైడ్లు సమ్మెకు దిగడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 2015 నేపాల్ భూకంపం కారణంగా.. ఎవరెస్ట్ బేస్క్యాంప్పై మంచు కుప్పలు కూలి 22 మంది మృతి చెందారు. చరిత్రలో అత్యంత ఘోరమైన ఎవరెస్ట్ విపత్తుగా దీనికి గుర్తింపు లభించింది. -
భారత్ సమాధి అవుతుంది.. రెచ్చిపోయిన పాక్ మంత్రి
ఇస్లామాబాద్: భారత్పై పాకిస్తాన్(Pakistan) రక్షణ శాఖ మంత్రి అసిమ్ ఖవాజా(Asim Khwaja) నోరుపారేసుకున్నారు. భవిష్యత్తులో సైనిక ఘర్షణ జరిగితే తమ యుద్ధవిమానాల శిథిలాల కింద భారత్(India) సమాధి అవుతుందని ఓవర్గా కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.కాగా, భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను ఎగదోస్తే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది(Upendra Dwivedi) రెండు రోజుల క్రితం హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులను పెంచి పోషించడం పాకిస్తాన్ ఇకనైనా మానుకోవాలని, భారత్ను రెచ్చగొట్టవద్దని ఆయన తేల్చి చెప్పారు. ఆపరేషన్ సిందూర్ 1.0లో చూపించిన సహనాన్ని ఆపరేషన్ సిందూర్ 2.0లో చూపించబోమని స్పష్టంచేశారు.దీనిపై అసిమ్ ఖవాజా ఆదివారం సోషల్ మీడియాలో స్పందించారు. భారత సైనికాధికారులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన దాడుల్లో భారత్కు భారీ నష్టం వాటిల్లిందని అన్నారు. దెబ్బతిన్న ప్రతిష్టను, విశ్వసనీయతను పునరుద్ధరించుకోవడానికి ఆరాటపడుతున్నారని, విఫల యత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆపరేషన్ సిందూర్లో భారత్ 0–6 స్కోర్తో ఓడిపోయిందని అన్నారు. అయితే, 0–6 స్కోర్కు అర్థం ఏమిటన్నది అసిమ్ ఖవాజా వెల్లడించారు. మరోసారి తమతో సైనిక ఘర్షణకు దిగితే భారత్ను సమాధి చేస్తామని హెచ్చరించారు. ఇది కూడా చదవండి: ఎట్టకేలకు దిగి వచ్చిన పాక్ సర్కార్.. పీవోకేతో సంబంధం -
ఇండోనేసియా స్కూలు ప్రమాదం.. 40కి చేరిన మరణాలు
సిడోఆర్జో: ఇండోనేసియాలో స్కూలు భవనం కుప్పకూలిన ఘటనలో మరణాలు 40కి చేరాయి. జాడ తెలియకుండా పోయిన మరో 23 మంది విద్యార్థుల కోసం శిథిలాలను తొలగిస్తూ అన్వేషణ కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు. తూర్పు జావాలోని సిడోఅర్జోలోని అల్ ఖొజినీ స్కూలు భవనం సెప్టెంబర్ 30వ తేదీన అకస్మాత్తుగా కుప్పకూలడం తెల్సిందే. ఈ ఘటనలో ఒకే ఒక్కరు విద్యార్థి మాత్రమే ఎటువంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు. స్కూలులో చదివే 12–19 ఏళ్ల విద్యార్థుల్లో 95 మంది గాయపడ్డారు. వీరిలో తీవ్ర గాయాలైన 8 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు ఆదివారం వెల్లడించారు. స్కూలు భవనంపై మరో అంతస్తు నిర్మిస్తుండటమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ప్రమాదంపై స్కూల్ కేర్ టేకర్గా వ్యవహరిస్తున్న ప్రముఖ మత పెద్ద అబ్దుస్ సలామ్ ముజిబ్ ప్రజలకు బహిరంగ క్షమాపణలు తెలిపారు. దుర్ఘటనపై అధికారులు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. -
జుట్టుపట్టి ఈడ్చి.. నిర్బంధించి
టెల్ అవీవ్: గాజాకు మానవతా సాయం తీసుకెళ్లిన నౌకాయాత్ర సభ్యురాలైన స్వీడన్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్బర్గ్తో ఇజ్రాయెల్ అధికారులు అనుచితంగా ప్రవర్తించారని సహ కార్యకర్తలు ఆరోపించారు. ఆమెను నిర్బంధంలోకి తీసుకుని దురుసుగా ప్రవర్తించారని.. ఆ యాత్రలో పాల్గొన్న పలువురు పర్యావరణ ఉద్యమ కార్యకర్తలు తెలిపారు. టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ కథనం ప్రకారం.. గాజాకు సహాయాన్ని తీసుకెళ్లిన నౌకలో ప్రయాణించిన 137 మంది పర్యావరణ ఉద్యమ కార్యకర్తలను ఇజ్రాయెల్ బహిష్కరించింది. వారు శనివారం ఇస్తాంబుల్కు చేరుకున్నారు. ఈ బృందంలో 36 మంది టర్కిష్ జాతీయులు సహా అమెరికా, యూఏఈ, అల్జీరియా, మొరాకో, ఇటలీ, కువైట్, లిబియా, మలేషియా, మౌరిటానియా, స్విట్జర్లాండ్, ట్యునీషియా, జోర్డాన్ తదితర దేశాలకు చెందిన వారు ఉన్నారు.జంతువుల్లా చూశారు..గ్రెటా థన్బర్గ్పై జరిగిన దురుసు ప్రవర్తనను కళ్లారా చూశామని.. మలేషియా జాతీయుడైన హజ్వానీ హెల్మీ, అమెరికన్ పౌరుడు విండ్ఫీల్డ్ బీవర్ అనే ఇద్దరు కార్యకర్తలు రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. ‘అదొక విపత్తు. మమ్మల్ని జంతువుల్లా చూశారు. గ్రెటా థన్బర్గ్ను జుట్టు పట్టుకొని లాగి, ఇజ్రాయెల్ జెండాను ముద్దు పెట్టుకోమని బలవంతం చేశారు’.. అని 28 ఏళ్ల హెల్మీ ఆవేదన వ్యక్తం చేశారు. శుభ్రమైన ఆహారం, నీరు కూడా ఇవ్వలేదన్నారు.నల్లులున్న గదిలో బంధించి..: గ్రెటా థన్బర్గ్ అనుచరులకు స్వీడిష్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పంపిన ఒక ఈమెయిల్లో.. థన్బర్గ్ను నల్లులున్న గదిలో ఉంచారని, సరైన ఆహారం, నీరు ఇవ్వలేదని పేర్కొన్నట్లు ’ది గార్డియన్’ పత్రిక వెల్లడించింది. ‘రాయబార కార్యాలయం గ్రెటా థన్బర్గ్ను కలవగలిగింది. తనకు నీరసంగా ఉన్నట్లు ఆమె తెలిపింది. తగినంత నీరు, ఆహారం అందలేదు. శరీరమంతా దద్దుర్లు వచ్చాయి.. అవి నల్లుల వల్లే వచ్చాయని అనుమానిస్తున్నట్లు కూడా ఆమె తెలిపింది..’ అని ఈమెయిల్లో వెల్లడించారు. అయితే, ఈ ఆరోపణలన్నీ అబద్ధాలని ఇజ్రాయెల్ కొట్టిపారేసింది. -
ట్రంప్ నాణెంపై వివాదం
వాషింగ్టన్: ప్రపంచంలో నేడు అగ్రరాజ్యంగా గౌరవం అందుకున్న అమెరికాకు 1776 జూలై 4న బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం లభించింది. స్వతంత్ర అమెరికాకు వచ్చే ఏడాది నాటికి 250 ఏళ్లు పూర్తికానున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక వేడుకలకు అమెరికా ఇప్పటినుంచే సిద్ధమవుతోంది. ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్మారక నాణేన్ని ముద్రించి విడుదల చేయాలని యునైటెడ్ స్టేట్స్ మింట్(టంకశాల) నిర్ణయించింది. ఒక డాలర్ విలువ కలిగిన ఈ నాణెంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రాన్ని ముద్రిస్తారన్న ప్రచారం మొదలైంది. అయితే, చాలామంది ఈ విషయం నమ్మలేదు. ట్రంప్తో కూడిన నమూనా నాణెం చిత్రాన్ని యూఎస్ ట్రెజరీ విడుదల చేయడంతో అనుమానాలకు తెరపడింది. ట్రంప్ ముఖం కలిగిన ఒక డాలర్ కాయిన్ రావడం అనేది ఫేక్ న్యూస్ కాదని, ముమ్మాటికీ నిజమని ట్రెజరర్ బ్రాండన్ బీచ్ పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టుచేశారు. నమూనా నాణెం సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్గా మారింది. అమెరికా స్వతంత్ర దేశంగా మారి 250 ఏళ్లు పూర్తికానుండడం ప్రాధాన్యత కలిగిన సందర్భమని, అందుకే తమ అధ్యక్షుడి చిత్రంతో కూడిన స్మారక నాణేన్ని విడుదల చేయబోతున్నామని స్పష్టంచేశారు. దీనిపై త్వరలో మరిన్ని వివరాలు పంచుకుంటానని పేర్కొన్నారు. నాణెంపై ట్రంప్ పోరాట పటిమ కొత్త నాణెంపై అమెరికాలో చర్చ మొదలైంది. నమూనా నాణెంపై ఒక వైపు ట్రంప్ ముఖం కనిపిస్తోంది. పైభాగంలో లిబర్టీ (స్వేచ్ఛ) అనే పదం ముద్రించారు. కిందిభా గంలో ఇన్ గాడ్ వుయ్ ట్రస్ట్(మనం నమ్మే దేవుడి సాక్షిగా) అనే పదాలు కనిపిస్తున్నా యి. మధ్యలో 1776, 2026 సంవత్సరాలను ముద్రించారు. ఇక రెండోవైపు ట్రంప్ పిడికిలి బిగించిన చిత్రం ఉంది. గత ఏడాది పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసింది. ఈ ఘటనలో ఆయన తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. తాను పోరాటం ఆపబోనని పిడికిలి బిగించి నినదించారు. ఈ సందర్భాన్ని గుర్తుచేస్తూ నాణెంపై ఫైట్, ఫైట్, ఫైట్ అనే పదాలకు స్థానం కల్పించారు. అంతేకాకుండా ట్రంప్ వెనుకభాగంలో రెపరెపలాడుతున్న అమెరికా జాతీయ జెండా కనిపిస్తోంది. కాయిన్ రీడిజైన్ చట్టానికి ఆమోదం సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ నాణెన్ని ముద్రిస్తారా? లేక మార్పులేమైనా చేస్తారా? అనేది ఇంకా తెలియరాలేదు. సోషల్ మీడియా చిత్రాన్ని ట్రంప్ అభిమానులు రూపొందించి ఉంటారని తెలుస్తోంది. మొత్తానికి ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ఎందుకంటే అమెరికా చట్టాల ప్రకారం చూస్తే ప్రస్తుతం పదవిలో ఉన్న అధ్యక్షుడు లేదా జీవించి ఉన్న మాజీ అధ్యక్షుడి చిత్రాన్ని నాణెంపై ముద్రించడానికి వీల్లేదు. మరణించాక రెండేళ్ల తర్వాత మాత్రమే ముద్రించవచ్చు. ఈ నేపథ్యంలో ట్రంప్ చిత్రంతో ప్రత్యేక కాయిన్ తీసుకురావాలని మింట్ నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది. అమెరికా కాంగ్రెస్ ఇటీవల కాయిన్ రీడిజైన్ యాక్ట్ను ఆమోదించింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ఒక డాలర్ నాణెన్ని ముద్రించడానికి ట్రెజరీకి అనుమతి మంజూరు చేసింది. 2026 జనవరి 1 నుంచి ఏడాది కాలంపాటు ఒక డాలర్ నాణెలను ముద్రించవచ్చని పేర్కొంది. అయితే, వీటిపై జీవించి ఉన్న లేదా మరణించిన వ్యక్తుల తల గానీ, భుజం గానీ, భుజం పైభాగం నుంచి జట్టు వరకు గానీ ఉండడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. అయితే, చట్టాన్ని ఉల్లంఘించని విధంగా ట్రంప్ చిత్రంతో కొత్త కాయిన్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. తుది డిజైన్ను ట్రెజరీ ఇంకా ఆమోదించలేదని సమాచారం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పదవిలో ఉండగానే అమెరికా నాణెంపై చోటు దక్కించుకున్న ఏకైక అధ్యక్షుడు కాల్విన్ కూలిడ్జ్. 1926లో ఆయన చిత్రంతో కాయిన్ ముద్రించారు. -
నేడు ఇజ్రాయెల్, హమాస్ చర్చలు
కైరో: గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదల ప్రధాన లక్ష్యాలుగా సోమవారం ఈజిప్టు రాజధాని కైరోలో చర్చలు మొదలుకానున్నాయి. పరోక్షంగా జరిగే ఈ చర్చల కోసం ఇజ్రాయెల్, హమాస్ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ వారంలోనే కాల్పుల విరమణ, బందీల విడుదల మొదలుకానుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 20 సూత్రాల కాల్పుల విరమణ ప్రతిపాదనలపై ఇజ్రాయెల్తోపాటు హమాస్ సానుకూలంగా స్పందించడం తెల్సిందే. హమాస్ చెర నుంచి ఇజ్రాయెలీలకు విముక్తి కల్పించడం, బదులుగా ఇజ్రాయెల్ జైళ్లలోని పాలస్తీని యన్లను విడుదల చేయడంపైనే సోమవారం ప్రధానంగా చర్చలు జరపనున్నారు. ఈ చర్చల్లో అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ సైతం పాలుపంచుకుంటారని ఈజిప్టు విదేశాంగ శాఖ తెలిపింది. బందీల విడుదల, గాజాలో 2025 ఆగస్ట్లో ఉన్న ప్రాంతాల్లోకి ఇజ్రాయెల్ బలగాలను ఉపసంహరించుకోవడంపై అంగీకారం కుదిరిన నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందానికి అతి సమీపంలో ఉన్నట్లేనని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలిపారు. కాల్పుల విరమణ దిశగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై ముస్లిం మెజారిటీ కలిగిన 8 దేశాలు ఓ ఉమ్మడి ప్రకటనలో హర్షం వ్యక్తం చేశాయి. పాలస్తీనా అథారిటీకి గాజాను అప్పగించాలని, గాజాను వెస్ట్బ్యాంక్లో విలీనం చేయాలని, గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఆ దేశాలు డిమాండ్ చేశాయి. ఈ చర్యలన్నిటి కంటే ముందుగా బందీల విడుదల, అందుకు బదులుగా ఖైదీలకు విముక్తి జరగాల్సి ఉందన్నారు. ఇలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాజాపై బాంబింగ్ను నిలిపివేయాలని ఇజ్రాయెల్ను కోరిన తర్వాతా దాడులు కొనసాగినట్లు సమాచారం. గాజా నగరం, రఫాలపై ఆదివారం జరిగిన దాడుల్లో కనీసం 12 మంది చనిపోయారని వివిధ ఆస్పత్రుల సిబ్బంది చెప్పారు. కాల్పుల విరమణ ఇంకా మొదలుకానందున, గాజాలో ప్రస్తుతానికి బాంబింగ్ను పూర్తిగా ఆపేయలేదని ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రతినిధి మీడియాకు చెప్పారు. అదేవిధంగా, చర్చలను జాప్యం చేసేందుకు హమాస్ చేసే ప్రయత్నాలపై ఓ కన్నేసి ఉంచామని కూడా ఆమె తెలిపారు. -
నేపాల్లో ప్రకృతి విలయం
కఠ్మాండు/న్యూఢిల్లీ: కుండపోతగా కురుస్తున్న వర్షాలతో వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో నేపాల్లో కనీసం 51 మంది ప్రాణాలు కోల్పోయారు. వరదల్లో కొట్టుకుపోయిన కొందరి జాడ తెలియాల్సి ఉందని ఆదివారం ఉదయం అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో 114 మందిని సహాయక సిబ్బంది కాపాడారన్నారు. నేపాల్లోని ఏడు ప్రావిన్స్లకు గాను ఐదు ప్రావిన్స్ల పరిధిలో రుతుపవనాల ప్రభావంతో శుక్రవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు. దీంతో ప్రభుత్వం సోమవారం జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. కోషి ప్రావిన్స్లోని ఇలమ్ జిల్లా ప్రకృతి ప్రకోపానికి తీవ్రంగా ప్రభావితమైంది. రెండు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఈ జిల్లాలో 37 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు. ఇలమ్లో కొండచరియ విరిగి ఓ నివాసంపై పడటంతో అందులో నిద్రిస్తున్న కుటుంబంలోని ఆరుగురు చనిపోయారని అధికారులు వివరించారు. ఖొటంగ్, రౌటహట్ జిల్లాల్లో పిడుగుపాటుకు ఐదుగురు బలయ్యారు. Heavy rainfall across the Kathmandu Valley today has caused the Bagmati River to swell significantly, leading to elevated water levels and localized flooding risks. 📍Sanepa Bridge🎥Trending Nepal pic.twitter.com/WN0xTR733e— Naveen Reddy (@navin_ankampali) October 5, 2025పంచ్తర్ జిల్లాలో కుంభవృష్టి కారణంగా రోడ్లు దెబ్బతినడంతో జరిగిన ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు. లంగంగ్ ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లి నలుగురు గల్లంతయ్యారు. రసువా జిల్లాలో నలుగురు, ఇలమ్, బారా, కఠ్మాండుల్లో ఒక్కొక్కరు చొప్పున వరదల్లో కొట్టుకుపోయారని అధికారులు వివరించారు. ఆదివారం మధ్యాహ్నానికి పరిస్థితి మెరుగవడంతో రాజధాని కఠ్మాండులోకి ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలను అనుమతించారు. అయితే, వర్షాల తీవ్రతకు అక్కడక్కడా రోడ్లు కొట్టుకుపోయి దెబ్బతినడంతో వాహనదారులు ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో, నేపాల్ ప్రజలు జరుపుకునే అతిపెద్దదైన దుషైన్ పండుగ ముగియడంతో వివిధ ప్రాంతాల నుంచి కఠ్మాండుకు తిరిగి వచ్చే వారితో రోడ్లు కిటకిటలాడుతున్నాయి. రాత్రి వేళ వాహనదారులు ప్రయాణాలను మానుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రోడ్లు కొట్టుకుపో యాయని, కొండచరియల ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. కొన్ని రహదారులను ముందుజాగ్రత్తగా మూసివేశామన్నారు. ఆగకుండా కురుస్తున్న వానలు, దృగ్గోచరత తక్కువగా ఉండటంతో కఠ్మాండులోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు శనివారం విమానాల రాకపోకలను నిలిపివేశారు.ఆదుకుంటాం: మోదీనేపాల్లో భారీ వర్షాలతో వాటిల్లిన నష్టంపై భారత ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మిత్ర దేశం నేపాల్కు ఎలాంటి అవసరము న్నా ముందుగా స్పందించి ఆదుకునేందుకు భారత్ కట్టుబడి ఉంటుందని ఆదివారం ఆయన ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఈ కష్ట కాలంలో నేపాల్ ప్రజలకు, ప్రభుత్వానికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. -
ఎట్టకేలకు దిగి వచ్చిన పాక్ సర్కార్.. పీవోకేతో ఒప్పందం
ఇస్లామాబాద్: గత వారం రోజులుగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో చెలరేగుతున్న నిరసనోద్యమాన్ని చల్లార్చేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. మొదటి మిలిటరీని పంపి ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నించి విఫలమైన షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం.. చివరకు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న జమ్ముకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేకేజేఏఏసీ)తో ఒప్పందం చేసుకుంది.ఈ క్రమంలో 25 అంశాలతో కూడిన ఒప్పందం ప్రతిని పాక్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి తారిఖ్ ఫజల్ చౌదరి శనివారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. గత నెల 29 నుంచి జరుగుతున్న హింసాత్మక ఘర్షణల్లో పాక్ ఆక్రమిత కశ్మీర్లో 10 మంది మరణించారు. అనేకమంది గాయపడ్డారు. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ముజఫరాబాద్కు షహబాజ్ షరీఫ్ గత బుధవారం ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని పంపారు. వారు జేకేజేఏఏసీ నేతలతో రెండు రోజుల పాటు చర్చలు జరిపి ఒక ఒప్పందానికి వచ్చారు. దీని ప్రకారం పాక్ ప్రభుత్వం పీవోకేలోని ముజఫరాబాద్, పూంచ్లలో అదనంగా ఇంటర్మీడియట్, సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డులను ఏర్పాటుచేస్తుంది. అలాగే, ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు స్థానిక ప్రభుత్వం 15 రోజుల్లోగా హెల్త్ కార్డు అమలుకు నిధులు మంజూరు చేయాలి. పీఓకేలో విద్యుత్ వ్యవస్థను మెరుగుపరచడానికి నిధులు అందించాలి. పీఓకే అసెంబ్లీ సభ్యుల అంశంపై న్యాయ, రాజ్యాంగ నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ చర్చించాలి. ఆస్తి బదిలీలపై పన్నును 3 నెలల్లోగా పంజాబ్ లేదా పంఖ్తుఖ్వాలతో సమానంగా తీసుకురావాలి. ఈ ఒప్పందాన్ని పర్యవేక్షించి అమలుచేయడానికి ఓ కమిటీని కూడా ఏర్పాటుచేస్తారు. -
‘త్వరపడండి.. లేదంటే విధ్వంసమే’.. హమాస్కు ట్రంప్ సీరియస్ వార్నింగ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు పాలస్తీనా గ్రూప్ హమాస్ను హెచ్చరించారు. ఇజ్రాయెల్తో శాంతి ఒప్పందానికి త్వరపడి, అంగీకరించాలని లేదంటే గాజాలో మరింత విధ్వంసం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.యుద్ధ విరమణ విషయంలో హమాస్ త్వరగా నిర్ణయం తీసుకోవాలి.. లేకుంటే దానికి ఇచ్చిన అన్ని అవకాశాలు నిలిచిపోతాయి. గాజాలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తితే సహించేదిలేదంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ పేజీలోని ఒక పోస్టులో పేర్కొన్నారు.బందీల విడుదల, శాంతి ఒప్పందానికి అనుగుణంగా ఇజ్రాయెల్ తాత్కాలికంగా బాంబు దాడులను ఆపివేసిందని ట్రంప్ పేర్కొన్నారు. తమ దేశ సీనియర్ రాయబారి ఒకరు బందీల విడుదల వివరాలను ఖరారు చేయడానికి ఈజిప్టుకు వెళుతున్నారని, ఇకపై ఇజ్రాయెల్తో పాటు శాంతి ప్రణాళికను అమలు చేయడంలో హమాస్ జాప్యం చేస్తే సహించబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. బందీల విడుదలపై వివరాలను ఖరారు చేసేందుకు, ఇజ్రాయెల్, హమాస్ మధ్య వివాదాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు రూపొందించిన ఒప్పందంపై చర్చించేందుకు అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఈజిప్టుకు ప్రాంతానికి వెళుతున్నారని వైట్ హౌస్ అధికారి మీడియాకు తెలిపారు.రెండేళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించే ప్రణాళికకు పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ శుక్రవారం సానుకూలంగా స్పందించింది. బందీలను విడుదల చేయడానికి, ఒప్పంద వివరాలను చర్చించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొంది. ఇదే సమయంలో యుద్ధంలో దెబ్బతిన్న భూభాగంపై బాంబు దాడులను వెంటనే నిలిపివేయాలని ట్రంప్ ఇజ్రాయెల్కు పిలుపునిచ్చారు. అయితే ఇజ్రాయెల్ దళాలు ట్రంప్ మాటను ఉల్లంఘిస్తూ గాజాలో దాడులకు దిగాయి. ఇజ్రాయెల్ దాడుల్లో 57 మంది మృతిచెందారని, వారిలో ఒక్క గాజా నగరానికి చెందినవారే 40 మంది ఉన్నారని ఎన్క్లేవ్ పౌర రక్షణ సంస్థ తెలిపింది. -
20 ఏళ్ల తర్వాత సందర్శకుల కోసం
లుక్సార్: ఈజిప్టులోని లుక్సార్ నగరంలో ఫారో చక్రవర్తి సమాధిని రెండు దశాబ్దాల అనంతరం సందర్శకుల కోసం శనివారం తిరిగి తెరిచారు. ఈజిప్టును క్రీస్తు పూర్వం 1390–1350 మధ్యన పాలించిన అమెన్హోటెప్–3 సమాధి ‘ప్రఖ్యాత వాలీ ఆఫ్ కింగ్స్’లో పశ్చిమ దిక్కున ఉంది. దీనిని 1799లో గుర్తించారు. ఇందులోని ప్రధానమైన సార్కోఫాగస్(మమ్మీ) సహా ముఖ్యమైన వస్తువులు లూటీకి గురయ్యాయని ఈజిప్షియన్ యాంటిక్విటీస్ అథారిటీ తెలిపింది. జపాన్ ఆర్థిక, సాంకేతిక సాయంతో రెండు దశాబ్దాలపాటు మూడు దఫాలుగా ఈ సమాధి పునరుద్ధరణ పనులు సాగాయి. ఫారో, ఆయన భార్య సమాధి గోడలపై ఉన్న చిత్రాలకు రంగులు అద్దడం కూడా ఇందులో ఉన్నాయి. సార్కోఫాగస్ను ఉంచిన భారీ పెట్టె ఫ్రేమ్ కూడా ఇందులో ఉంది. వ్యాలీ ఆఫ్ కింగ్స్ ప్రాంతంలో 36 మీటర్ల పొడవు, 14 మీటర్ల లోతున మెట్ల దారి సమాధికి దారి తీస్తుంది. ఇందులో చక్రవర్తిని ఉంచిన ప్రధాన సమాధి ఛాంబర్తోపాటు ఆయన ఇద్దరు భార్యలకు రెండు ఛాంబర్లున్నాయి. వ్యాలీ ఆఫ్ కింగ్స్లో ప్రాచీన ఈజిప్టును క్రీస్తుపూర్వం 1550–1292 సంవత్సరాల మధ్య పాలించిన 17 మంది రాజులు, రాణుల మమ్మీలతోపాటు మరో 16 ఇతరుల మమ్మీలున్నాయి. -
8న బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ రాక
న్యూఢిల్లీ: బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఈ నెల 8, 9వ తేదీల్లో భారత్లో పర్యటించబోతున్నారు. ఈ నెల 9న ముంబైలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన సమావేశమవుతారు. విజన్–2035 రోడ్మ్యాప్లో భాగంగా భారత్, యూకే మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి చేపట్టిన చర్యల పురోగతిని వారు సమీక్షిస్తారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చిస్తారు. ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో స్టార్మర్ ప్రసంగిస్తారు. స్టార్మర్ గత ఏడాది జూలైలో బ్రిటిష్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఆయన భారత్లో పర్యటిస్తుండడం ఇదే మొదటిసారి. -
జపాన్ కొత్త ప్రధాని తకైచి
టోక్యో: జపాన్ చరిత్రలో తొలిసారి ఒక మహిళ ప్రధానమంత్రి పదవి చేపట్టబోతున్నారు. అధికార లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ (ఎల్డీపీ) అధ్యక్షురాలిగా ఆర్థిక భద్రత శాఖ మాజీ మంత్రి సనే తకైచి (64) ఎన్నికయ్యారు. జపాన్లో అధికార పార్టీ అధ్యక్షుడే ప్రధాని అవుతారు. శనివారం అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో వ్యవసాయ శాఖ మంత్రి షింజిరో కొయిజుమిపై ఆమె గెలుపొందారు. షింజిరో కొయిజుమి ఆ దేశ మాజీ ప్రధాని జునిచిరో కొయిజుమి కుమారుడు. పార్టీలో తిరుగుబాటు నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని ప్రస్తుత ప్రధాని షిగెరు ఇషిబా నిర్ణయించుకోవటంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. గత ఏడాది జరిగిన పార్లమెంటు ఎగువ, దిగువ సభల ఎన్నికల్లో ఎల్డీపీ ఓటమి చవిచూడటంతో షిగెరు నాయకత్వంపై పార్టీ నేతలు విశ్వాసం కోల్పోయారు. అయితే ప్రధానిని ఎన్నుకునే దిగువ సభలో ఇప్పటికీ ఎల్డీపీనే అతిపెద్ద పార్టీగా ఉండటంతో తకైచి ప్రధాని కావటం ఖాయమని చెబుతున్నారు. మరో పది రోజుల్లో జపాన్ పార్లమెంటు కొత్త ప్రధానిని ఎన్నుకొనే అవకాశం ఉంది. చైనాకు ప్రబల శత్రువు సనే తకైచికి జపాన్ రాజకీయాల్లో అత్యంత సంప్రదాయవాదిగా పేరుంది. ఆమె మాజీ ప్రధాని షింజో అబె విధానాలకు అతిపెద్ద మద్దతుదారు. చైనాను ప్రబల శత్రువుగా భావిస్తారు. జపాన్ సైనికీకరణకు గుర్తుగా భావించే యషుకుని ఆలయాన్ని ఆమె తరుచూ సందర్శిస్తుంటారు. పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికైన తర్వాత ఆమె మాట్లాడుతూ.. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత తాను మొదట చేయబోయే పని దేశంలో పెరిగిపోతున్న వస్తువుల ధరలను తగ్గించటమేనని తెలిపారు. అమెరికాతో దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రయతి్నస్తానని చెప్పారు. దేశానికి కొత్తగా ఎదురవుతున్న భద్రత, దౌత్య సవాళ్లపై దృష్టిపెడుతానని వెల్లడించారు. అయితే, ఆమె పదవి చేపట్టిన వెంటనే అతిపెద్ద దౌత్య సవాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దక్షిణకొరియాలో ఈ నెల 31 నుంచి ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సమాఖ్య శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కానుంది. ఆ సమావేశాల్లో అమెరికా అధ్యక్షుడితో ఆమె జపాన్ ప్రధాని హోదాలో ముఖాముఖి సమావేశం కావాల్సి ఉంటుంది. ఇటీవల మిత్ర దేశాలపై కూడా ఎడాపెడా టారిఫ్లు విధిస్తున్న ట్రంప్.. జపాన్ను కూడా వదల్లేదు. మరోవైపు జపాన్ తన సైనిక వ్యయాన్ని పెంచాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాతో దౌత్య సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తానని తకైచి తెలిపారు. మరోవైపు దేశంలో సుదీర్ఘకాలంగా అధికారంలో ఉన్న ఎల్డీపీకి ఎదురుగాలి వీస్తోంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పార్లమెంటులోని రెండు సభల్లోనూ ఆ పార్టీ మెజారిటీ కోల్పోయింది. ఇప్పుడు మళ్లీ తన పారీ్టపై ప్రజలకు విశ్వాసం కల్పించటం తకైచి ముందున్న అతిపెద్ద సవాలు. పట్టువదలని సంకల్పంసనే తకైచి ఎల్డీపీ అధ్యక్ష పదవికి 2021లోనే పోటీ పడ్డారు. అయితే, నాడు ఆమె విపరీత సంప్రదాయ భావాలను వ్యతిరేకించిన పారీ్టలోని మెజారిటీ సభ్యులు ఆమెను ఓడించారు. దీంతో నాడు ఆమె మూడో స్థానంలో నిలిచారు. తకైచి 1961 మార్చి 7న నారా ప్రావిన్స్లోని యమటోకొయిరామాలో జని్మంచారు. ఆమె కోబె యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చదివారు. అనంతరం బ్రాడ్కాస్టర్గా, రాజకీయ సలహాదారుగా పనిచేశారు. పలు రచనలు కూడా చేశారు. అనంతరం ఎల్డీపీలో చేరి 1993లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని షింజో అబెకు ఆమె ప్రధాన అనుచరురాలిగా గుర్తింపు పొందారు. ఆయన మంత్రివర్గంలో పనిచేశారు. 2019–20 మధ్య దేశ అంతర్గత వ్యవహారాలు, సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. ఫుమియో కిషిడా మంత్రివర్గంలో 2022–24 మధ్య ఆర్థిక భద్రత సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2024లో కూడా ఆమె పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. కానీ, ప్రస్తుత ప్రధాని షిగేరు ఇషిబా చేతిలో అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ముచ్చటగా మూడోసారి పట్టువదలక ప్రయత్నించి విజయం సాధించి ప్రధాని పదవి చేపట్టబోతున్నారు. ఆమె జపాన్ తొలి మహిళా ప్రధానిగానే కాకుండా నారా ప్రావిన్స్ నుంచి తొలి ప్రధానిగా కూడా రికార్డు సృష్టించబోతున్నారు. -
బందీల విడుదలకు సిద్ధం
గాజా స్ట్రిప్: హమాస్ అంతమే లక్ష్యంగా రెండేళ్లుగా గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ సాగిస్తున్న దాడుల పరంపర ముగింపునకు వచ్చిన జాడలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా శనివారం కీలక పరిణామాలు సంభవించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 20 అంశాల ప్రణాళిక మేరకు తమ వద్ద ఉన్న బందీలందరి విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు హమాస్ ప్రకటించగా గాజాలో యుద్ధానికి ముగింపు పలుకుతూ ట్రంప్ ప్రణాళిక మొదటి దశ అమలుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తెలిపారు. గాజాలోని తమ బలగాలు ఇప్పుడు కేవలం ఆత్మరక్షణ చర్యలకే పరిమితమయ్యాయని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. దాడులు జరపడం లేదంది. అయితే, గాజా నుంచి బలగాలను మాత్రం ఉపసంహరించుకోవడం లేదని స్పష్టం చేసింది.కీలక పరిణామంబందీలందరినీ విడుదల చేయడంతోపాటు గాజాలో అధికారాన్ని స్వతంత్ర రాజకీయ పాలస్తీనా గ్రూపులకు అప్పగించడానికి సిద్ధమని హమాస్ ప్రకటించడాన్ని కీలకమైన పరిణామంగా భావిస్తున్నారు. అయితే, ట్రంప్ ప్రణాళికలోని ఇతర అంశాలపై పాలస్తీనా గ్రూపులతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుందని హమాస్ పేర్కొంది. కొన్నిటిపై మరిన్ని విస్తృత చర్చలు అవసరమవుతాయని కూడా పేర్కొంది. గాజా భవిష్యత్తును పాలస్తీనియన్లే చర్చించి నిర్ణయించుకోవాల్సి ఉందని తెలిపింది. ఈ విషయంలో విదేశీ జోక్యాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నామంది. అయితే, హమాస్ ఆయుధాలను అప్పగించాలన్న ఇజ్రాయెల్ కీలక డిమాండ్ ప్రస్తావన ఇందులో లేకపోవడం గమనార్హం. ఇజ్రాయెల్కు అనుకూలంగా ఉన్న ట్రంప్ ప్రతిపాదనలను చర్చలు జరపకుండా ఆమోదించలేమని హమాస్ సీనియర్ అధికారి మౌసా అబూ మెర్జౌక్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా, బందీలందరినీ 72 గంటల్లోగా విడుదల చేయడం సాధ్యం కాదన్నారు. వారందరినీ ఒకే చోటకు చేర్చేందుకు రోజులు లేక వారాలు పట్టొచ్చని చెప్పారు. ఆయుధాలను అప్పగించే హమాస్ సిద్ధంగానే ఉందన్నారు. అయితే, హమాస్ విడుదల చేసిన అధికార ప్రకటనలో మాత్రం ఆయుధాల అప్పగింత విషయం లేకపోవడం గమనార్హం.బాంబింగ్ ఆపేయాలి: ట్రంప్హమాస్ ప్రకటనను ట్రంప్ స్వాగతించారు. ‘శాశ్వత శాంతిని హమాస్ కోరుకుంటోందని అనుకుంటున్నా. గాజాపై బాంబింగ్ను ఇజ్రాయెల్ వెంటనే నిలిపివేయాలి. బందీలందరినీ తక్షణమే సురక్షితంగా తీసుకురావడానికి ఇదెంతో అవసరం. ఇప్పటికే ఎంతో ఆలస్యమైంది. మిగతా అంశాలపై చర్చలకు సిద్ధం’అని తన ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.శాంతి నెలకొంటుందా?తన శాంతి ప్రణాళిక పూర్తిస్థాయి అమలుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం పూర్తి నమ్మకంతో ఉన్నట్లు కనిపించడం లేదు. ‘చూద్దాం.. ఏం జరుగుతుందో..మనమైతే ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. స్పష్టంగా చెప్పాం’అని ఆయన వ్యాఖ్యానించడం దీనికి అద్దం పడుతోంది. ‘ఈ ఒప్పంద ఫలితంగా గాజాలో కొన్ని రోజులపాటు ఇజ్రాయెల్ కాల్పు లను ఆపేస్తుంది. బందీలను హమాస్ విడుదల చేస్తుంది. హమాస్ ఆయుధాలను అప్పగించకుంటే మాత్రం ఇజ్రాయెల్ తిరిగి దాడులు మొదలుపెడుతుంది’అని ఇజ్రాయెల్ మాజీ సైనికాధికారి ఒకరు పేర్కొన్నారు. హమాస్ చర్చలకు సిద్ధమని ప్రకటించిందే గానీ, ఆ సంస్థ డిమాండ్లలో మాత్రం ఎటువంటి మార్పు లేదని మరో పరిశీలకుడు తెలిపారు. రెండు వర్గాల మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతన లేదని విశ్లేషించారు. -
అరేబియా తీరంలో అమెరికా ఓడరేవు!
ఇస్లామాబాద్: అమెరికాతో సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వం ఆరాటపడుతోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో స్నేహానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అరేబియా సముద్రం తీరంలో పాక్ భూభాగంలో భారీ ఓడరేవు(పోర్టు) నిర్మించి, నిర్వహించాలని తాజాగా ట్రంప్కు విజ్ఞప్తి చేసింది. బలూచిస్తాన్లో గ్వాదర్ జిల్లాలోని పాస్నీ పట్టణంలో ఈ పోర్టు నిర్మించాలని కోరింది. ఇరాన్ భూభాగంలో భారత ప్రభుత్వం నిర్మిస్తున్న చాబహర్ పోర్టుకు సమీపంలోనే పాస్నీ టౌన్ ఉండడం గమనార్హం. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ సలహాదారులు ఇటీవల అమెరికా సీనియర్ అధికారులను సంప్రదించినట్లు తెలిసింది. పాస్నీలో ఓడరేవు కోసం ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఈ పట్టణం ఇరాన్, అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో ఉంది. వ్యూహాత్మకంగా కీలకమైనది. ఇప్పటికే రూపొందించిన బ్లూప్రింట్ ప్రకారం పాస్నీ పోర్టులో అమెరికా ప్రభుత్వం ఒక టర్మినల్ నిర్మించి, నిర్వహించనుంది. పాకిస్తాన్లోని అరుదైన ఖనిజాలను ఇక్కడి నుంచే అమెరికాకు చేరవేస్తారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, అసిమ్ మునీర్ గత నెలలో వైట్హౌస్లో డొనాల్డ్ ట్రంప్తో సమావేశమయ్యారు. పాకిస్తాన్లో మైనింగ్, ఇంధన రంగాల్లో పెట్టుబడులకు పెట్టాలని ఈ సందర్భంగా అమెరికా కంపెనీలను ఆహ్వానించారు. పాకిస్తాన్లో ఉన్న విలువైన ఖనిజ సంపద గురించి ట్రంప్కు అసిమ్ మునీర్ ప్రత్యేకంగా వివరించారు. చెక్క పెట్టెలో తీసుకొచ్చిన కొన్ని నమూనాలు కూడా చూపించారు. రక్షణ, సాంకేతిక అవసరాల కోసం పాకిస్తాన్తో కలిసి ఖనిజాలను గుర్తించి, వెలికితీయడం కోసం 500 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టడానికి అమెరికా మెటల్స్ కంపెనీ ముందుకొచ్చింది. పాస్నీలోని పోర్టు నిర్మాణం కోసం అమెరికాను పాక్ సర్కార్ కోరడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. పాస్నీ పోర్టు నుంచి ఖనిజ సంపద ఉన్న పశ్చిమ ప్రావిన్స్ల దాకా రైలు మార్గాన్ని అమెరికా నిధులతో నిర్మించాలన్నదే పాక్ ఉద్దేశం. ఈ ప్రాంతం ఇరాన్కు, దక్షిణాసియాకు దగ్గరగా ఉండడం కలిసొచ్చే అంశం. ఇక్కడ పాగా వస్తే అరేబియా సముద్రంతోపాటు మధ్య ఆసియాలో అమెరికా ప్రాబల్యం విస్తరిస్తుంది. అమెరికాకు వాణిజ్య అవకాశాలు కూడా పెరుగుతాయి. అయితే, సైనిక అవసరాల కోసం ఈ పోర్టును ఉపయోగించుకోవడానికి వీల్లేదు. గ్వాదర్లో చైనా ఇప్పటికే ఒక పోర్టును పాక్ సాయంతో నిర్వహిస్తోంది. గ్వాదర్కు 100 కిలోమీటర్ల దూరంలో పాస్నీ ఉంది. ఇక్కడ ఓడ రేవు నిర్మించాలంటూ చైనా ప్రత్యర్థి దేశమైన అమెరికాను పాక్ కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత ప్రభుత్వం నిర్మిస్తున్న చాబహర్ పోర్టుకు 300 కిలోమీటర్ల దూరంలో అమెరికా పోర్టు రానుంది. ఈ ఓడరేవు భారత్కు కీలకం. పాకిస్తాన్తో సంబంధం లేకుండా అఫ్గానిస్తాన్, సెంట్రల్ ఆసియాకు నౌకలు రాకపోకలు సాగించవచ్చు. చాబహర్ కోసం 2024లో భారత్, ఇరాన్లు ఒప్పందంపై సంతకాలు చేశాయి. -
ట్రంప్ మాటను లెక్కచేయకుండా!! గాజాలో మళ్లీ..
ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందానికి హమాస్ సిద్ధంగా ఉందని.. బందీల విడుదలకు అంగీకరించిందిని.. గాజాలో దాడులు ఆపాలని.. అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్కు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ మాటను లెక్కచేయకుండా మళ్లీ దాడులు కొనసాగిస్తోంది. శనివారం గాజాలో ఇజ్రాయెల్ బలగాలు జరిగిపిన దాడుల్లో ఆరుగురు మరణించారు. బందీల విడుదలతో పాటు ట్రంప్ ప్రతిపాదనలో పలు అంశాలకు హమాస్ అంగీకరించిందని.. అమెరికా ఈ యుద్ధాన్ని ముగించే దిశగా ముందుకు వెళ్తోందని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అటుపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు సైతం ‘ట్రంప్ గాజా ప్లాన్’(Trump Gaza Plan) తొలి దశ తక్షణమే అమలు కాబోతోందని అన్నారు. ఆ వెంటనే ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ సైతం దీనిని ధృవీకరించారు. దీంతో పలు దేశాల అధినేతలూ ట్రంప్ కృషికి అభినందనలు తెలియజేశారు కూడా. అయితే.. అనూహ్యాంగా.. ఈ ప్రకటనలు వెలువడిన గంటల వ్యవధిలోనే గాజాపై ఇజ్రాయెల్ బలగాలు(Israel Attacks Gaza Agian) విరుచుకుపడ్డాయి. గాజా సిటీలో జరిపిన దాడుల్లో నలుగురు పౌరులు మృతి చెందగా.. దక్షిణ భాగంలోని ఖాన్ యూనిస్ వద్ద మరో ఇద్దరు చనిపోయినట్లు అక్కడి అధికారులు ధృవీకరించారు. అయితే తాజా దాడులపై ఇజ్రాయెల్, అమెరికా, హమాస్ వైపుల నుంచి స్పందన రావాల్సి ఉంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దులో హమాస్ సంస్థ జరిపిన మెరుపు దాడిలో 1,200 మంది మరణించారు. మరో 251 మంది బంధీలుగా తీసుకెళ్లారు. పాలస్తీనియన్ భూభాగాల్లో ఇజ్రాయెల్ సెటిల్మెంట్ల విస్తరణ.. వాళ్ల చేతుల్లో పాలస్తీనా పౌరులు హింసకు గురి కావడం, అల్-అక్సా మసీదు వద్ద ఘర్షణలు, జెనిన్ శరణార్థి శిబిరంపై దాడులు.. ఈ వరుస పరిణామాలు హమాస్ దాడికి కారణాలు. ఈ భారీ దాడికి ప్రతిగా.. ఇజ్రాయెల్ గాజాపై ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్ చేపట్టింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా జరిపిన దాడుల్లో 66, 000 మందికి పైగా మరణించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారు. విధ్వంసంతో పాటు గాజాను దిగ్భంధించి.. మానవతా సాయాన్ని అందకుండా ఇజ్రాయెల్ బలగాలు చేశాయి. విద్యుత్ కొరత, తిండి, నీరు లేక అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే తాము హమాస్ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతున్నామని, పౌరులను రక్షణ కవచంలా వాళ్లు ఉపయోగించుకుంటున్నారంటూ ఇజ్రాయెల్ చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో ట్రంప్ ఎంట్రీతో పరిస్థితి మారింది. అదే సమయంలో బంధీల విడుదల కోసం ఇజ్రాయెల్పై ఒత్తిడి పెరుగుతూ వస్తోంది.. ఈ తరుణంలో.. ట్రంప్ ప్రతిపాదించిన 20-పాయింట్ల శాంతి ఒప్పందానికి హమాస్ అంగీకారం తెలిపింది. ప్రస్తుతం 48 మంది బంధీలు ఉన్నారని, వారిలో 20 మంది జీవించి ఉన్నారని తెలుస్తోంది. తొలి దశలో భాగంగా.. బంధీల విడుదలకు సిద్ధంగా ఉందని తెలిపింది. -
‘జాక్’ 38 డిమాండ్లకు పాక్ అంగీకారం
Pakistan: జమ్ముకశ్మీర్ అప్నీ అమన్ కమిటీ(జేఏఏసీ-జాక్)ప్రతిపాదించిన 38 డిమాండ్లను పాకిస్తాన్ ప్రభుత్వం శనివారం ఆమోదించింది. అలాగే పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఇటీవల చోటుచేసుకున్న నిరసనకారుల మరణాలపై న్యాయ విచారణకు, నిర్బంధించిన ప్రదర్శనకారుల విడుదలకు పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అలాగే జమ్ముకశ్మీర్ శరణార్థుల కోసం రిజర్వు చేసిన 12 అసెంబ్లీ సీట్లను రద్దు చేయడంపై ఉన్న చట్టపరమైన సాధ్యాసాధ్యాలను ఉన్నత స్థాయి కమిటీ పరిశీలిస్తుందని తెలియజేసింది.పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో అవామీ యాక్షన్ కమిటీ (ఏఏసీ) నేతృత్వంలో కొన్ని రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. పీఓకేలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలని తమ 38 డిమాండ్లను అమలు చేయాలని ఏఏసీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీంతో, భారీ సంఖ్యలో ప్రజలు బయటకు వచ్చి నిరసనల్లో పాల్గొన్నారు. తమ ప్రాథమిక హక్కులను పాకిస్తాన్ హరిస్తోందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణల్లో 10 మంది మరణించగా, 50 మందికి పైగా జనం గాయపడ్డారు.ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న‘జాక్’, ప్రభుత్వ ప్రతినిధుల మధ్య రెండు రౌండ్ల ఉన్నత స్థాయి చర్చల దరిమిలా పాకిస్తాన్ ప్రభుత్వం దిగివచ్చింది. సెప్టెంబర్ 29న సమ్మెకు పిలుపునిచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో హింస చెలరేగింది. కాగా పీఓకేలో కొనసాగుతున్న హింస విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు గతంలో పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ పేర్కొంది. మరోవైపు నిరసనకారులపై పాకిస్తాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న అణిచివేత ధోరణిని భారతదేశం తీవ్రంగా విమర్శించింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని ఆరోపించింది. -
Nobel Prize 2025: నామినేటెడ్ పేర్లు .. 50 ఏళ్లగా ఎందుకంత సీక్రెట్?
న్యూఢిల్లీ: అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి విజేతలను ప్రకటించే వారం దగ్గరపడింది. ఈ సోమవారం అంటే అక్టోబరు 6 నుంచి అక్టోబరు 13 వరకు విజేతల ప్రకటన ప్రక్రియ కొనసాగనుంది. వైద్య రంగం, భౌతిక శాస్త్రం, సాహిత్యం,రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, శాంతి తదితర విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందించేవారిని నోబెల్ బహుమతులతో సత్కరించనున్నారు.జ్యూరీ అనుసరించే విధానంనోబెల్ బహుమతుల ఎంపిక ప్రక్రియ ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. అవార్డుల విజేతలను జ్యూరీ అత్యంత రహస్యంగా ఎంపిక చేస్తుంది. గోప్యత అనేది విజేతల ఎంపికలో తప్పనిసరి విధానం. ఇది నిష్పాక్షికతను నిర్ధారిస్తుంది. నామినీలు, నామినేటర్ల గుర్తింపులను గత 50 ఏళ్లగా ఎంతో గోప్యంగా ఉంచుతున్నారు. ఇటువంటి విధానం బాహ్య ఒత్తిళ్లు, ఊహాగానాలను నివారిస్తుంది. అవార్డుల గొప్పతనాన్ని కాపాడుతూ, విజేతలు ఎవరనే ఉత్కంఠను కొనసాగిస్తుంది. ప్రముఖ ప్రొఫెసర్లు, మునుపటి అవార్డు గ్రహీతలు, ప్రభుత్వాలు, పార్లమెంటు సభ్యులు, శాంతి పరిశోధన సంస్థల డైరెక్టర్లు.. నోబెల్ బహుమతులకు అర్హులైవారిని నామినేట్ చేస్తారు. స్వీయ నామినేషన్లకు అవకాశం ఉండదు.శాంతి బహుమతి విభాగంలో..నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రతి వర్గానికి లేదా విభాగానికి చెందిన నిపుణుల కమిటీలు నామినేషన్లను సమీక్షిస్తాయి. ఈ కమిటీలు నివేదికలను సిద్ధం చేస్తాయి. ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామాలో పేర్కొన్న బహుమతి ప్రమాణాలకు అనుగుణంగా అభ్యర్థులు ఉన్నారా? లేదా అనే దానిపై చర్చలు జరుగుతాయి. నోబెల్ శాంతి బహుమతి విభాగంలో నార్వే పార్లమెంట్ నియమించిన ఐదుగురు సభ్యుల ‘నార్వేజియన్ నోబెల్ కమిటీ’ ఎంపికకు సారధ్యం వహిస్తుంది. వారు తమకు అందిన నామినీల నుండి ఒక షార్ట్లిస్ట్ను తయారు చేస్తారు. అభ్యర్థులను ఖరారు చేసేందుకు నిపుణుల అభిప్రాయాలను తీసుకుంటారు. తుది నిర్ణయాన్ని సాధారణంగా ఏకాభిప్రాయం మేరకు తీసుకుంటారు. అక్టోబర్లో అధికారిక ప్రకటనకు ముందు ఈ తతంగమంతా జరుగుతుంది.ఎంపిక ప్రక్రియలో వీటికి తావుండదుసాహిత్యంలో నోబెల్ బహుమతి విషయానికొస్తే స్వీడిష్ అకాడమీ సభ్యులు నామినేటెడ్ అభ్యర్థులను రచనలను రహస్యంగా అంచనా వేస్తారు. అకాడమీ సభ్యుల మెజారిటీ మద్దతును అందుకున్నవారే తుది అర్హత సాధిస్తారు. గోప్యతా నియమం అన్ని బహుమతి విభాగాలకు వర్తిస్తుంది. లాబీయింగ్, మీడియా హైప్, రాజకీయ జోక్యం మొదలైనవాటికి ఎంపిక ప్రక్రియలో తావుండదు. కఠినమైన గోప్యత, నిపుణుల నిర్ణయం, మెజారిటీ సభ్యుల ఏకాభిప్రాయం మేరకే నోబెల్ బహుమతులకు అత్యంత అర్హులైనవారిని ఎంపిక చేస్తారు. -
నీరవ్ మోదీ కేసులో కీలక పరిణామం.. అప్పగింతకు గ్రీన్ సిగ్నల్!
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నీరవ్ మోదీని భారత్కు అప్పగించేందుకు యూకే సిద్ధమైంది. ప్రస్తుతం బ్రిటన్ జైల్లో ఉన్న నీరవ్ మోదీని.. వచ్చే నెల 23వ తేదీన భారత్కు అప్పగించే అవకాశం ఉంది. ముంబై ఆర్డర్ రోడ్ జైల్లో నీరవ్ మోదీని ఉంచే అవకాశం ఉంది. గుజరాత్కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ(54) పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. దాదాపు ₹14,000 కోట్ల మోసానికి పాల్పడి 2018లో దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన లండన్(యూకే)లో ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయన అప్పగింత కోసం భారత్ అభ్యర్థించగా.. ఆ కేసు అక్కడి కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే తాజాగా నీరవ్ మోదీని భారత్కు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం. నీరవ్ మోదీకి భారత్లో అన్ని వసతులు కల్పిస్తామని, అత్యంత కట్టుదిట్టమైన ముంబై ఆర్డర్ రోడ్ జైల్లో ఉంచుతామని భారత్ హామీ ఇవ్వడంతో బ్రిటన్ కోర్టు అందుకు అంగీకరించింది. దాంతో నీరవ్ మోదీని భారత్కు రప్పించాలని ప్రయత్నానికి మార్గం సుగుమం అయ్యింది. కాగా, ఈ ఏడాది జూలై నెలలో నీరవ్ మోదీ సోదరుడు నేహల్ మోదీని అమెరికాలో అరెస్టు చేశారు. అతడిని అప్పగించాలన్న భారత దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలు అభ్యర్థించాయి. భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా అమెరికా అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో కీలక పాత్ర పోషించినట్లు నేహల్పై ఆరోపణలు ఉన్నాయి మనీ లాండరింగ్ మరియు నేరపూరిత కుట్ర కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. ఇదీ చదవండి: ట్రంప్ ప్రణాళికపై హమాస్ కీలక నిర్ణయం.. బందీల అప్పగింతకు మొగ్గు -
Singapore: వేశ్యలపై దాడి.. ఇద్దరు భారతీయులకు జైలు
సింగపూర్: సింగపూర్లో ఇద్దరు సెక్స్ వర్కర్లను దోచుకుని, వారిపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతదేశానికి చెందిన ఇద్దరు యువకులకు సింగపూర్ కోర్టు ఐదేళ్ల ఒక జైలుతో పాటు 12 బెత్తం దెబ్బలను శిక్షగా విధించింది. ఆరోక్కియసామి డైసన్(23) రాజేంద్రన్ మైలరసన్(27)లు కోర్టు ముందు నేరాన్ని అంగీకరించారని ‘ది స్ట్రెయిట్స్ టైమ్స్’ తన కథనంలో తెలిపింది.ఆరోక్కియసామి, రాజేంద్రన్ ఏప్రిల్ 24న భారత్ నుండి సింగపూర్కు వచ్చారు. రెండు రోజుల తర్వాత వీరు లిటిల్ ఇండియా ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతుండగా, ఒక గుర్తు తెలియని వ్యక్తి వారితో ‘లైంగిక సేవల కోసం వేశ్యలు కావాలా? అని అడుగుతూ, ఇద్దరు మహిళల సమాచారాన్ని అందించాడు. అయితే ఆరోక్కియ తన స్నేహితుడు రాజేంద్రన్తో..మనకు డబ్బు చాలా అవసరమని, ఆ మహిళలను హోటల్ గదిలో దోచుకోవాలని సూచించాడు. దీనికి రాజేంద్రన్ అంగీకరించాడు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకు ఒక హోటల్ గదిలో ఒక మహిళను కలవడానికి వారు ఏర్పాట్లు చేసుకున్నారు.వారిద్దరూ గదిలోకి వెళ్లి, ఆ మహిళ చేతులు, కాళ్లను కట్టేసి దాడి చేశారు. ఆమె దగ్గరున్న నగలు, నగదు, పాస్పోర్ట్, బ్యాంక్ కార్డులను దోచుకున్నారు. తరువాత అదే రోజు రాత్రి 11 గంటలకు వారిద్దరూ మరొక హోటల్లో ఇంకో మహిళను కలుసుకున్నారు. ఆమె కేకలు వేయకుండా ఉండేందుకు రాజేంద్రన్ ఆమె నోటిని మూశాడు. తరువాత ఆమె దగ్గరున్న నగదు, రెండు మొబైల్ ఫోన్లు, ఆమె పాస్పోర్ట్ను దొంగిలించారు. తాము తిరిగి వచ్చే వరకు గది నుండి బయటకు వెళ్లవద్దని ఆమెను హెచ్చరించారు. కాగా బాధిత మహిళల ఫిర్యాదుతో విషయం కోర్టు వరకూ చేరింది.ఈ ఘటనపై జడ్జి తీర్పునిస్తున్న సమయంలో నిందితులు ఆరోక్కియసామి, రాజేంద్రన్ తేలికైన శిక్ష కోసం వేడుకున్నారు.‘మా నాన్న గత ఏడాది మరణించారు. నాకు ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు. వారిలో ఒకరికి వివాహం అయింది. మా దగ్గర డబ్బు లేదు. అందుకే మేము ఇలా చేశాం’ అని ఒక అనువాదకుని సాయంతో ఆరోక్కియసామి జడ్జి ముందు పేర్కొన్నాడు. ‘నా భార్య, బిడ్డ భారతదేశంలో ఒంటరిగా ఉన్నారు. వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు’ అని రాజేంద్రన్ జడ్జి ముందు మొరపెట్టుకున్నాడు. కాగా దోపిడీకి పాల్పడి, గాయపరిచిన నేరానికి ఐదు నుండి 20 ఏళ్ల జైలు శిక్ష,కనీసం 12 బెత్తం దెబ్బలు విధించే అవకాశాలుంటాయని సింగపూర్ దినపత్రిక ‘ది స్ట్రెయిట్స్ టైమ్స్’ పేర్కొంది. -
ట్రంప్ ప్రణాళికపై హమాస్ కీలక నిర్ణయం.. బందీల అప్పగింతకు మొగ్గు
గాజా: గాజాలో యుద్ధానికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై సూత్రాల శాంతి ప్రణాళికపై హమాస్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రంప్ విధించిన గడువులోగా ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హమాస్ ప్రకటించింది. గాజాలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికి, పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు ట్రంప్ ఈ ప్రణాళికను ప్రకటించారు.నరకం తప్పదన్న ట్రంప్ హెచ్చరికలతో..దీనిలోని నిబంధనల ప్రకారం హమాస్ తన ఆధీనంలో ఉన్న బందీలను 72 గంటల్లోగా విడుదల చేయాల్సి ఉంటుంది. ఆయుధాలను విడిచిపెట్టి, పరిపాలన నుంచి తప్పుకోవాలని ప్రధానంగా ట్రంప్ సూచించారు. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇప్పటికే అంగీకారం తెలిపారు. కాగా ఈ ప్రణాళికను అంగీకరించని పక్షంలో నరకం తప్పదని ట్రంప్ ఇప్పటికే హమాస్ను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో హమాస్.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన నిబంధనలకు తలొగ్గింది. బందీల విడుదల విషయంలో మధ్యవర్తులతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇదేవిధంగా గాజా పరిపాలనను స్వతంత్ర టెక్నోక్రాట్ పాలస్తీనా సంస్థకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా ప్రకటించింది. అయితే ఈ ప్రణాళికలోని పలు అంశాలపై పాలస్తీనా వర్గాలతో సంప్రదింపులు అవసరమని తెలిపింది. President Donald J. Trump shares a powerful message in response to Hamas' statement regarding his peace plan: "Very importantly, I look forward to having the hostages come home." pic.twitter.com/RZArVNcXc9— The White House (@WhiteHouse) October 3, 2025ట్రంప్ ప్రణాళిక మొదటి దశ అమలుమరోవైపు ట్రంప్ ప్రణాళికకు ఇజ్రాయెల్, అరబ్ తదితర ముస్లిం దేశాల నుంచి కూడా మద్దతు లభించింది. బందీల విడుదలకు హమాస్ మొగ్గు చూపడం శాంతి దిశగా పడిన కీలక అడుగుగా అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే దీనిపై తుది ఒప్పందం కుదిరి, గాజాలో యుద్ధానికి ముగింపు పడుతుందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. హమాస్ నిర్ణయం దరిమిలా గాజాపై బాంబు దాడులను తక్షణం ఆపాలని ఇజ్రాయెల్కు అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీచేశారు. ఇంతలో ట్రంప్ ప్రణాళిక మొదటి దశను తక్షణ అమలు చేయడానికి ఇజ్రాయెల్ సిద్ధమవుతోందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం తెలిపింది.శాశ్వత శాంతికి హమాస్ సిద్ధం?గాజాలో శాంతిని సాధించగల ఏకైక వ్యక్తిగా తనను తాను అభివర్ణించుకున్న ట్రంప్ మిత్రదేశమైన ఇజ్రాయెల్కు మద్దతు పలికారు. అలాగే హమాస్ శాశ్వత శాంతికి సిద్ధంగా ఉందని నమ్ముతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ‘ఇజ్రాయెల్ వెంటనే గాజాపై బాంబు దాడులను ఆపాలి. తద్వారా బందీలను సురక్షితంగా, త్వరగా బయటకు తీసుకురావచ్చు’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో పేర్కొన్నారు. అదేవిధంగా నెతన్యాహు కార్యాలయం ‘ఇజ్రాయెల్.. నిర్దేశిత సూత్రాలకు అనుగుణంగా యుద్ధాన్ని ముగించడానికి సిద్ధంగా, ఉందని, ఇది అధ్యక్షుడు ట్రంప్ దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది’ అని తెలిపింది. -
చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ ఆర్చ్బిషప్గా ములాలీ
లండన్: చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా మహిళా ఆర్చ్బిషప్ నియమితులయ్యారు. ఆర్చ్బిషప్ ఆఫ్ కాంటర్బరీగా డేమ్ సారా ములాలీ(63)ని కింగ్ ఛార్లెస్–3 నియమించారని శుక్రవారం యూకే ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. దీంతో, చర్చ్ 500 ఏళ్ల చర్రితలో నాయకత్వ స్థాయికి ఎదిగిన మహిళా మతపెద్దగా ములాలీ చరిత్ర సృష్టించినట్లయింది. ప్రపంచ వ్యాప్తంగా 165 దేశాల్లో ఉన్న 8.5 కోట్ల మంది ఆంగ్లికన్లకు ములాలీ ఆధ్యాత్మిక నాయకత్వం వహించనున్నారు. జాతీయ ఆరోగ్య సేవల(ఎన్హెచ్ఎస్) విభాగంలో చీఫ్ నర్స్గా పనిచేసిన సారా ములాలీ 2006లో బోధకురాలిగా బాధ్యతలు చేపట్టారు. 2018లో మొట్టమొదటి మహిళా బిషప్ ఆఫ్ లండన్గా, చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్లో అత్యంత మూడో సీనియర్ మతపెద్దగా ఎదిగారు. గతేడాది నవంబర్ 12వ తేదీన రెవరెండ్ జస్టిన్ వెల్బీ రాజీనామా చేశారు. చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్తో సంబంధమున్న ఓ న్యాయ వాది చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడి నట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయం తెలిసీ సంబంధిత అధికారులకు సమాచారమివ్వలేదని విమర్శలు రావడంతో ఆయన బాధ్యతల నుంచి వైదొలిగారు. అప్పట్నుంచీ ఆర్చ్బిషప్ ఆఫ్ కాంటర్బరీ పదవి ఖాళీగా ఉంది. 106వ ఆర్చ్బిషప్ ఆఫ్ కాంటర్బరీగా మొట్టమొదటి మహిళగా సారా ములాలీ నియమితులవడాన్ని యూకే ప్రధాని స్టార్మర్ స్వాగతించారు. అయితే, 2026 జనవరిలో లండన్లోని సెయింట్ పౌల్స్ కేథడ్రల్లో జరిగే కార్యక్రమంలో ప్రత్యేకంగా ఆర్చ్బిషప్ ఆఫ్ కాంటర్బరీగా ప్రకటించే వరకు ఆమెను ఆర్చ్బిషఫ్ ఆఫ్ కాంటర్బరీ–డిజిగ్నేట్గా వ్యవహరిస్తారు. అనంతరం మార్చిలో కాంటర్బరీ కేథడ్రల్లో జరిగే కార్యక్రమంలో అధికారికంగా ఆమెను ఆసీనురాలిని చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లికన్ కమ్యూనియన్ అంతటా లక్షలాది మంది ప్రజలతో విశ్వాస ప్రయా ణాన్ని పంచుకోవడానికి ఎదురు చూస్తున్నట్లు సారా ములాలీ తెలిపారు. ‘ఇది చాలా పెద్ద బాధ్యత అని నాకు తెలుసు. కానీ, దేవుడు ఎప్పటిలాగే నా బాధ్యతను తీసుకుంటాడనే నమ్మకంతోనే కొత్త బాధ్యతల్లోకి అడుగు పెడుతున్నాను’అని ఆమె వినమ్రంగా చెప్పారు. అంతకుముందు, నర్స్గా పనిచేసిన ములాలీ 2001లో కేవలం 37 ఏళ్లకే యూకే ప్రభుత్వ చీఫ్ నర్సింగ్ అధికారిగా బాధ్యతలు చేపట్టి, చరిత్ర సృష్టించారు. చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్, గ్లోబల్ ఆంగ్లికన్ కమ్యూనియన్, కాంటర్బరీ డయోసెస్ల ప్రతినిధులతో కూడిన కాంటర్బరీ కోసం క్రౌన్ నామినేషన్స్ కమిషన్ (సీఎన్సీ) సారా ములాలీని ఈ పదవికి ఎంపిక చేసింది. -
మాంచెస్టర్ సినగాగ్ వద్ద దాడి
మాంచెస్టర్: ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ సిటీలో దారుణంగా జరిగింది. యూదుల ప్రార్థనా మందిరం(సినగాగ్) వద్ద ఓ దుండగుడు దాడికి దిగాడు. సినగాగ్ బయట నిల్చున్నవారిపైకి గురువారం కారుతో దూసుకొచ్చాడు. అనంతరం కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అడ్రియాన్ డల్బీ(53), మెల్విన్ క్రావిట్జ్(66) మరణించారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, మరణించిన ఇద్దరితో ఒకరు పోలీసుల కాల్పుల్లో మృతువాత పడినట్లు తెలిసింది. దుండుగుడిని అడ్డుకోవాలన్న ఉద్దేశంతో కాల్పులు జరపగా, ఒకరు మృతిచెందినట్లు గుర్తించారు. కానీ, తమ కాల్పుల్లో దుండగుడే హతమైనట్లు పోలీసులు చెబుతున్నారు. -
రష్యా నుంచి అదనంగా ఎస్–400 సిస్టమ్స్
న్యూఢిల్లీ: రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్–400 సర్ఫేస్–టు–ఎయిర్ మిస్సైల్ సిస్టమ్స్ కీలకపాత్ర పోషించాయి. వీటి పనితీరు అద్భుతంగా ఉన్నట్లు తేలింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అదనపు ఎస్–400 సర్ఫేస్–టు–ఎయిర్ మిస్సైల్ సిస్టమ్స్ను సమకూర్చుకోవాలని భారత సైన్యం నిర్ణయించింది. రష్యా అధ్యక్షుడు ఈ ఏడాది డిసెంబర్లో భారత్లో పర్యటించబోతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఎస్–400ల కొనుగోలు గురించి పుతిన్తో మోదీ చర్చించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఐదు ఎస్–400ల కొనుగోలు కోసం భారత ప్రభుత్వం 2018 అక్టోబర్లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ 5 బిలియన్ డాలర్లు. ఇందులో మూడు ఎస్–400లను భారత్కు రష్యా అప్పగించింది. మిగిలిన రెండు త్వరలో రానున్నాయి. ఇవి కాకుండా అదనపు వ్యవస్థల కొనుగోలుకు ప్రతిపాదన సిద్ధమైంది. -
నో అంటే నరకమే!
గాజా స్ట్రిప్: గాజాలో శాంతి సాధన కోసం తాను ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక పట్ల హమాస్ మిలిటెంట్లు ఇంకా స్పందించకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6 గంటల్లోగా ఒప్పుకోవాలని అల్టిమేటం విధించారు. లేకపోతే నరకం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూపిస్తామని హమాస్ను హెచ్చరించారు. ఈ మేరకు ట్రంప్ శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం మొదలై ఈ నెల 7వ తేదీకి రెండేళ్లు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని వెంటనే ముగించాలని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. ఇటీవలే 20 శాతం శాంతి ప్రణాళికను తెరపైకి తెచ్చారు. ట్రంప్ ప్లాన్ను ఇజ్రాయెల్ అంగీకరించింది. ప్రపంచ దేశాలు సైతం స్వాగతించాయి. హమాస్ మాత్రం ఇంకా స్పందించలేదు. ట్రంప్ ప్రణాళిక తమకు ఆమోదయోగ్యం కాదని, ఇందులో కొన్ని అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని పరోక్షంగా పేర్కొంది. అభ్యంతకర అంశాలపై చర్చించాల్సి ఉందని మధ్య వర్తులుగా వ్యవహరిస్తున్న ఈజిప్టు, ఖతార్ కూడా చెబుతున్నాయి. మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పుతాం గడువులోగా హమాస్ తమతో ఒప్పందానికి రావాల్సిందేనని ట్రంప్ స్పష్టంచేశారు. ఇదే ఆఖరి అవకాశంగా భావించాలన్నారు. ఒప్పందానికి రాకపోతే ఇప్పటిదాకా ఎవరూ చూడని నరకాన్ని హమాస్కు చూపిస్తామని ఉద్ఘాటించారు. మిలిటెంట్లపై పూర్తిస్థాయి సైనిక చర్య ప్రారంభమవుతుందన్నారు. ఒక మార్గంలో కాకపోతే.. మరో మార్గంలోనైనా మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పుతామని ట్రంప్ పేర్కొన్నారు. హమాస్ను పూర్తిగా అంతం చేస్తామన్న సంకేతాలిచ్చారు. -
మెలోని గారి మన్ కీ బాత్
బాగా ఇష్టమైన ఇల్లు కాలి బూడిదైతే... ఆ బూడిదను చూస్తూ ఏడుస్తూ కూర్చోలేము. ఒక్కో ఇటుక పేరుస్తూ కొత్త ఇంటికి సిద్ధం అవుతాము. జార్జియా మెలోని అలాగే చేసింది. కుటుంబ కల్లోలాన్ని మనసుపైకి రానివ్వకుండా తిరుగులేని నాయకురాలిగా ఎదిగింది. ఇటలీ తొలి మహిళా ప్రధాని అయింది. ఆమె ఆత్మకథ ‘ఐయామ్ జార్జియా – మై రూట్స్, మై ప్రిన్సిపుల్స్ (ఇండియన్ ఎడిషన్)కు ప్రధాని నరేంద్ర మోదీ ముందుమాట రాశారు.కొన్ని నెలల క్రితం అల్బేనియాలో జరిగిన ఒక సదస్సులో వివిధ దేశాల నేతలు హాజరయ్యారు. ఈ సదస్సుకు హాజరైన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి అల్బేనియా అధ్యక్షుడు స్వాగతం పలికిన తీరు వైరల్ అయింది. కారు దిగి వస్తున్న మెలోనికి వర్షంలో మోకాళ్లపై కూర్చొని నమస్కారం చెబుతూ ఆయన స్వాగతం పలికిన తీరు ప్రపంచాన్ని ఆకట్టుకుంది.న్యూయార్క్లో జరిగిన ఒక అవార్డ్ల కార్యక్రమంలో... ‘మెలోని నిజాయితీపరురాలు. ఆమె మనసు అందమైనది’ అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించాడు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. ఇటలీలో జరిగిన జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మోదీని ‘నమస్తే’ అంటూ మెలోని స్వాగతం పలకడం వైరల్గా మారింది.ఒక్క మాటలో చె ప్పాలంటే... జార్జియా మెలోని అనేది ‘ప్రధాన ఆకర్షణ’కు మరో పేరు.అయితే ఆమె ప్రస్థానం నల్లేరు మీద నడక కాదు. ఒక్కో అడుగు వేస్తూ ప్రయాణం ప్రారంభించింది. ఆ ప్రయాణంలో ఎన్నో ప్రతికూలతలను అధిగమించి ముందుకు వెళ్లింది.‘ఐయామ్ జార్జియా–మై రూట్స్, మై ప్రిన్సిపుల్స్’ను ఒక అధ్యక్షురాలి ఆత్మకథగా మాత్రమే చూడనక్కర్లేదు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ఇటలీ తొలి మహిళా అధ్యక్షురాలి స్థాయికి ఎదగడం అనేది సామాన్య విషయమేమీ కాదు. ధైర్యంలో, ఆత్మవిశ్వాసంలో, సానుకూల శక్తి విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మహిళలకు స్ఫూర్తినిస్తోంది మెలోని.రోమ్లో పుట్టి గార్బటెల్లా జిల్లాలో పెరిగింది మెలోని. చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే మెలోని తండ్రి, కుటుంబాన్ని విడిచి కానరీ దీవులకు వెళ్లాడు. అక్కడ మరో వివాహం చేసుకున్నాడు. మెలోనికి పదిహేడేళ్లు ఉన్నప్పుడు ఆమె తండ్రి మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో తొమ్మిది సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు.తండ్రి దూరం అయ్యాడు. తమకు ఇష్టమైన ఇల్లు అగ్నిప్రమాదంలో నాశనం అయింది. బాల్యం, కుటుంబ విచ్ఛిన్నం తన రాజకీయ దృక్పథాన్ని ప్రభావితం చేశాయని తన ఆత్మకథలో రాసుకుంది మెలోని. పొలిటికల్ పార్టీ ఇటాలియన్ సోషల్ మూమెంట్ (ఎంఎస్ఐ) యువ విభాగం ‘యూత్ ఫ్రంట్’లో చేరడంతో మెలోని రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ తరువాత కాలంలో ‘స్టూడెంట్ మూవ్మెంట్’ నేషనల్ లీడర్గా ఎదిగింది. ప్రావిన్స్ ఆఫ్ రోమ్’ కౌన్సిలర్గా పనిచేసింది. ‘యూత్ యాక్షన్’ అధ్యక్షురాలిగా ఎంపికైంది... ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇటలీ తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించింది.మోదీ ముందుమాట‘దేశభక్తి ఉట్టిపడే అత్యత్తమ నాయకురాలు’ అని ‘ఐయామ్ జార్జియా – మై రూట్స్, మై ప్రిన్సిపుల్స్’ పుస్తకానికి రాసిన ముందు మాటలో మన ప్రధాని నరేంద్ర మోదీ మెలోనిని కొనియాడారు. ఆమె వ్యక్తిగత, రాజకీయ ప్రయాణం గురించి వివరించారు. మెలోని ఆత్మకథను ‘మన్కీ బాత్’లో చె ప్పారు. ‘‘ఇటలీ ప్రధాన మంత్రి మెలోనిపై అభిమానం, స్నేహంతో ఈ ముందుమాట రాశాను. దీన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఆమె స్ఫూర్తిదాయకమైన, చారిత్రక ప్రయాణం భారత్లో ఎంతోమందిని ప్రభావితం చేస్తుంది’’ అని తన ముందు మాటలో రాశారు మోదీ. గతంలో రెండు పుస్తకాలకు మాత్రమే మోదీ ముందు మాట రాశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆనందీబెన్ పటేల్కు అంకితం ఇచ్చిన పుస్తకానికీ, ప్రముఖ బాలీవుడ్ నటి, రాజకీయ నాయకురాలు హేమమాలిని ఆత్మకథకు గతంలో ముందుమాట రాశారు. -
అమెరికా-పాక్లు! నాకు నువ్వు.. నీకు నేను!
ప్రస్తుతం అమెరికా-పాకిస్తాన్ల మైత్రి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత వీరి స్నేహ బంధం బలపడుతూ వచ్చింది. ప్రపంచ దేశాలపై విపరీతమైన సుంకాలు విధిస్తూ అమితానందాన్ని పొందుతున్న ట్రంప్.. పాకిస్తాన్ విషయంలో ఆచితూచి అడుగలు వేస్తున్నారు. భారత్తో ఉన్న బంధాన్ని కాలరాసుకున్న ట్రంప్.. ఇక చేసేది లేక పాక్తో మాత్రం జబ్బలు రాసుకుంటూ తిరుగుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ను అమెరికా పర్యటనలకు పలుమార్లు పిలవడమే ఇందుకు ఉదాహరణ. గత నెలలో ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో భాగంగా అమెరికా పర్యటనకు వెళ్లిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం.. డొనాల్డ్ ట్రంప్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరు భేటీలో ఏం జరిగిందనేది బయటకు చెప్పకపోయినా.. భారత్ గురించి కచ్చితంగా వీరి మధ్య ప్రస్తావన వచ్చే ఉంటుందనే విషయాన్ని ఊహించుకోవచ్చు. అయితే కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ను పొగడ్తలతో ముంచెత్తారు ట్రంప్. గాజాలో శాంతి నెలకొల్పేందుకు ఆ దేశ నాయకులు చేస్తున్న కృషి అమోఘం అంటూ కొనియాడారు. అయితే దీనిపై పాకిస్తాన్ తాజాగా స్పందించింది. ఇందులో తాము చేసేంది కాస్తే అయినా ట్రంప్ గాజాలో శాంతి కోసం చేస్తున్న కృషి వెలకట్టలేదని అంటూ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ప్రశంసించారు. గాజాలో శాంతి కోసం తమకు 20 పాయింట్లతో కూడిన ముసాయిదాను తమకు ట్రంప్ పంపారని, ఇందులో కొన్ని సరిచేసి పంపామన్నారు దార్.‘ట్రంప్ బహిరంగంగా ప్రకటించిన ఈ 20 అంశాలు మావి కావని నేను స్పష్టం చేశాను. ఇవి మావి కావు. మాకు సంబంధమున్న ముసాయిదాలో, కొన్ని మార్పులు చేసామని మాత్రమే నేను చెబుతున్నాను. ఈ క్రెడిట్ అంతా ట్రంప్దే’ అంటూ కొనియాడారు దార్.అయితే ఇరు దేశాల మైత్రి నెటిజన్లు కాస్త వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ‘నాక నువ్వు-నీకు నేను అన్నట్లుగా ఉంది మీ పరిస్థితి.అంటూ పలువురు స్పందించగా, ‘తాను మునిగి, మిగతా వారిని కూడా ముంచుతున్న ట్రంప్తో పాక్ మైత్రి బాగుంది బ్రదర్’ అంటూ మరొకరు కౌంటరిచ్చారు. -
కత్తి ఇవ్వలేదని.. డైరెక్టర్ని ఉద్యోగం నుంచి ఊడబీకిన ట్రంప్!
వాషింగ్టన్:అమెరికాలోని ప్రసిద్ధ ఐజెన్హవర్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ డైరెక్టర్ జాన్ హెన్రీను ట్రంప్ ప్రభుత్వం హఠాత్తుగా పదవి నుంచి తొలగించింది. ఈ నిర్ణయానికి కారణం..బ్రిటన్ రాజు చార్లెస్కు ఓ విలువైన చారిత్రక కత్తిని బహుమతిగా ఇవ్వాలన్న ట్రంప్ ఆదేశాలను ఆయన తిరస్కరించడం. ఈ ఘటన అమెరికా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.1945 నాటి రెండవ ప్రపంచ యుద్ధానికి చెందిన ఆ కత్తిని జాతీయ వారసత్వంగా భావించాల్సినదిగా జాన్ హెన్రీ అభిప్రాయపడ్డారు. ‘ఇది ప్రజల ఆస్తి. చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన వస్తువు. దీన్ని బహుమతిగా ఇవ్వడం సరైనది కాదు’అంటూ ఆయన ట్రంప్ విజ్ఞప్తిని తిరస్కరించారు.అయితే, ట్రంప్ పరిపాలనలో ఉన్న ఉన్నతాధికారులు ఈ కత్తిని అమెరికా-బ్రిటన్ మధ్య స్నేహ బంధానికి ప్రతీకగా ఇవ్వాల్సిన బహుమతిగా పేర్కొన్నారు. కత్తి ఇవ్వండి, లేదంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని జాన్ హెన్రీకి హెచ్చరికలు జారీ చేశారు. ఉన్నతాదికారులు ఒత్తిడి చేస్తున్నప్పటికీ.. మ్యూజియంలో ఉన్న కత్తిని ట్రంప్కు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ట్రంప్ ఆదేశాల మేరకు ఆయన్ను పదవి నుంచి తొలగించారు. ఈ చర్యపై చరిత్రకారులు, మ్యూజియం నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చారిత్రక సంపదను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు. ఇది ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యగా అభివర్ణిస్తున్నారు. ఈ వివాదంపై ఇప్పటివరకు ట్రంప్ లేదా బ్రిటన్ రాజు చార్లెస్ స్పందించలేదు. -
కెనడాలో సౌత్ ఇండియన్ సినిమాల ప్రదర్శన నిలిపివేత!
కెనడాలో భారతీయ చిత్రాల ప్రదర్శన నిలిచిపోయింది. పవన్ కల్యాణ్ ఓజీ, రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1తో పాటు పలు చిత్రాల షోలను రద్దు చేసేశారు. ఈ నిర్ణయానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే.. వారం వ్యవధిలో అక్కడి ఓ థియేటర్పై జరిగిన కాల్పుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని సమాచారం.అసలేం జరిగిందంటే.. ఒంటారియో(Ontario) ప్రావిన్సులోని ఓ థియేటర్పై గత వారం వ్యవధిలో రెండు దాడులు జరిగాయి. సెప్టెంబర్ 25వ తేదీన వేకువ జామున ముసుగులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. థియేటర్ ఎంట్రెన్స్ వద్ద లిక్విడ్ను చల్లి చిన్నపాటి పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో థియేటర్ బయటి భాగం స్వల్పంగా దెబ్బ తింది. అలాగే.. తాజాగా అక్టోబర్ 2వ తేదీన ముసుగులో వచ్చిన ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. అయితే ఈ ఘటనలోనూ అదృష్టవశాత్తూ సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు.कनाडा के सिनेमाघर में आग और फायरिंगकनाडा के ओकविले में स्थित Film. Ca सिनेमा थिएटर पर हमला, 2 युवकों ने थिएटर के दरवाजे पर पेट्रोल डालकर आग लगाई, दोनों चेहरे पर मास्क लगाए SUV कार में आए थे, सिनेमाघर में फायरिंग और आग लगाई, पूरा मामला CCTV में कैद#Canada | #CCTV pic.twitter.com/evEuTSsyaj— NDTV India (@ndtvindia) October 3, 2025ఈ ఘటనల నేపథ్యంలో.. భారతీయ చిత్రాలు అందునా ప్రత్యేకించి దక్షిణ భారత చిత్రాల(South Indian Films Canada) ప్రదర్శనే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని అక్కడి థియేటర్ల నిర్వాహకులు ఓ అంచనాకి వచ్చారు. ఓక్విల్లేలోని ఫిల్మ్.సీఏ సినిమాస్(Film.ca Cinemas) ఓజీ, కాంతార ఏ లెజెండ్ చాప్టర్ 1 చిత్రాల ప్రదర్శనను మాత్రమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఫ్రాంచైజీ సీఈవో జెఫ్ నోల్ కూడా ఓ వీడియో సందేశంలో ఇదే విషయాన్ని పరోక్షంగా ధృవీకరించారు కూడా.ఎక్కడక్కెడంటే.. మరోవైపు అక్కడి ఆన్లైన్ బుకింగ్ జాబితాల నుంచి పలు భారతీయ సినిమాలను తొలగించారు. రిచ్మండ్ హిల్లోని యార్క్ సినిమాస్ కూడా ఫిల్మ్.సీఏ బాటలోనే భారతీయ సినిమాల ప్రదర్శన నిలిపివేసింది. తమ ఉద్యోగులు, ప్రేక్షకుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వాళ్ల నగదును రిఫండ్ చేస్తామని ఒక ప్రకటనలో యార్క్ సినిమాస్ వెల్లడించింది. గ్రేటర్ టోరంటో ఏరియాలోనూ పలు థియేటర్లు ఇదే తరహా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. బ్రిటిష్ కొలంబియా, అల్బర్టా, క్యూబెక్, మానిటోబా ఇతర ప్రావిన్స్లోనూ ఈ అంశంపై చర్చ జరుగుతోంది.ఇదిలా ఉంటే.. ఇది ఖలీస్తానీల పని అయ్యి ఉండొచ్చని సమాచారం. గతంలోనూ ఇదే తరహా దాడులు జరగడమే ఆ అనుమానాలకు కారణంగా తెలుస్తోంది. అయితే హాల్టన్ పోలీసులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. దాడులకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్న తమను సంప్రదించాలని అక్కడి దర్యాప్తు అధికారులు కోరుతున్నారు. ఇదీ చదవండి: అనుభవానికా? లేదంటే యంగ్ బ్లడ్కి పట్టమా?? -
జపాన్ రాజకీయాల్లో పెనుసంచలనం!
జపాన్ రాజకీయాల్లో అత్యంత అరుదైన ఘట్టం ఈ శనివారం చోటు చేసుకోబోతోంది. కాబోయే ప్రధానిని(Japan Next PM) ఎన్నుకునేందుకు అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ శనివారం ఓటింగ్ నిర్వహించుకోనుంది. ప్రధాని రేసులో ఐదుగురు అభ్యర్థుల పేర్లు తెరపైకి రాగా.. సనాయే టకాయిచీ (64) మరియు షింజిరో కోఇజుమి (44) ప్రధానంగా పోటీలో ముందున్నారు.2024 అక్టోబర్, 2025 జూన్, 2025 జూలైలో పార్లమెంట్ ఉభయ సభలకు జరిగిన ఎన్నికల్లో ఎల్డీపీ వరుస పరాజయాలు చవిచూసింది. పార్టీ క్రమక్రమంగా మెజారిటీ కోల్పోవడం, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, పాత పాలనా విధానాలపై విమర్శల నేపథ్యంలో.. షిగెరూ ఇషిబా తన ప్రధాని పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ తరుణంలో పార్టీ కొత్త అధ్యక్షుడ్ని(ప్రధాని కూడా) ఎన్నుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే.. ఈ ఎన్నికతో జపాన్ చరిత్రలో అరుదైన ఘట్టం చోటు చేసుకోబోతోంది. అయితే యువ ప్రధాని, లేదంటే తొలి మహిళా ప్రధాని రాబోయే రోజుల్లో ఆ దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతో హిరోబుమి 1885 డిసెంబర్ 22న జపాన్ తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తాజా మాజీ ప్రధాని ఇషిబాతో కలిపి 64 మంది ఆ దేశానికి ప్రధానులుగా చేశారు. అయితే పురుషాధిక్య రాజకీయాలతో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ దేశానికి.. మహిళా ప్రధాని అవకాశం లేకుండా పోయింది. అయితే.. యూరికో కోయికె 2016లో టోక్యో గవర్నర్గా ఎన్నికై.. జాతీయ స్థాయిలో నాయకత్వం కోసం మహిళలు పోటీ చేసే అవకాశానికి తలుపులు తెరిచారు. ఇప్పుడు.. సనాయే టకాయిచీ ప్రధాని రేసులో నిలిచి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. బలాబలాలు.. అనుభవం వర్సెస్ యువ రక్తంగా జపాన్ ఈ ఎన్నికను భావిస్తోంది. ఎందుకంటే.. టకాయిచీకి దివంగత మాజీ ప్రధాని షింజో అబే రాజకీయ వారసురాలిగా పేరుంది. ఆయన ఆశీస్సులతోనే 2021 సెప్టెంబర్లో జరిగిన ఎల్డీపీ అధ్యక్ష పదవికిపోటీ చేశారామె. అయితే.. ఆ ఎన్నికల్లో పుషియో కిషిదా చేతిలో ఓడారామె. ఇక ఇప్పుడు.. ఆమె దూకుడు ఆర్థిక వ్యయం ప్రతిపాదనతో పీఎం రేసులో ప్రధానంగా నిలిచారు. పైగా ట్రంప్ను హ్యాండిల్ చేయడం ఈమె వల్లే సాధ్యం కావొచ్చనే టాక్ బలంగా వినిపిస్తోందక్కడ.ఇక.. జపాన్ రాజకీయాల్లో పాత తరపు నాయకత్వ శైలికి ప్రత్యామ్నాయం కావాలనే డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తోంది. దానికి తగ్గట్లే కోయిజుమి మితవాద పన్ను తగ్గింపు విధానాన్ని ముందుంచారు. ఇది జపాన్ ఆర్థిక దిశను మలుపు తిప్పే అంశం కావడంతో ఆసక్తి నెలకొంది.ముందస్తు పోల్స్, అంచనాల ప్రకారం.. పోటీ తీవ్రంగానే ఉన్నా కోయిజుమీనే ఆధిక్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం జరగబోయే ఎన్నికల్లో.. తొలి రౌండ్లో గనుక ఫలితం లేకపోతే మరో రౌండ్కు వెళ్తారు. తీవ్ర సంక్షోభం మధ్య.. జపాన్లో గత కొన్ని దశాబ్దాలుగా 1995 సిస్టమ్ అధికారం కొనసాగుతోంది. 1955లో స్థాపించబడిన ఎల్డీపీ(LDP) ఇప్పటికీ జపాన్ రాజకీయాలను శాసిస్తోంది. ఈ 70 ఏళ్ల కాలంలో.. 1993–1996(కూటమి ప్రభుత్వం), 2009–2012(డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్ DPJ) మధ్య కాలాలను మినహాయిస్తే మిగతా ఏళ్లు ఎల్డీపీనే అధికారంలో కొనసాగింది. అయితే అనారోగ్య కారణాలతో షింజో అబే ప్రధాని పదవి నుంచి దిగిపోయాక.. ఆ పార్టీ పట్టు కోల్పోతూ వస్తోంది. ఈ తరుణంలో కొత్త నాయకత్వం ద్వారా పార్టీని పునరుద్ధరించుకోవాలని భావిస్తోంది.ఇదీ చదవండి: మోదీ నా స్నేహితుడు.. ఆయన అలాంటి పని చేయబోరు! -
భారత్తో వాణిజ్య సమతూకం!
మాస్కో: భారత్తో వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నట్లు అధినేత పుతిన్ స్పష్టమైన సంకేతాలిచ్చారు. భారత్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాల దిగుమతులను భారీగా పెంచుకోవాలని, ఇందుకోసం ప్రత్యేక విధానం రూపొందించాలని రష్యా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. రష్యా నుంచి భారత ప్రభుత్వం భారీగా ముడిచమురు కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇరుదేశాల మధ్య వాణిజ్య లోటు తగ్గిపోయి, వాణిజ్యంలో సమతూకం ఏర్పడేలా చర్యలు తీసుకోవడానికి పుతిన్ సిద్ధమయ్యారు. అందులో భాగంగానే భారత్ నుంచి దిగుమతులు పెంచాలని నిర్ణయించారు. గురువారం వాల్డాయ్ ప్లీనరీలో పుతిన్ ప్రసంగించారు. ఈ ఏడాది డిసెంబర్లో ఇండియాలో పర్యటించబోతున్నానని, ఇందుకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. తనకు మంచి మిత్రుడు, విశ్వసనీయ భాగస్వామి నరేంద్ర మోదీతో సమావేశం కాబోతున్నానని వెల్లడించారు. ప్రధాని మోదీపై పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన సమతూకం కలిగిన, తెలివైన నాయకుడు అని కొనియాడారు. భారతదేశ ప్రయోజనాల కోసం మోదీ నిరంతరం శ్రమిస్తుంటారని వ్యాఖ్యానించారు. మోదీ నేతృత్వంలో జాతీయవాద ప్రభుత్వం చక్కగా పనిచేస్తోందన్నారు. మోదీతో సమావేశమైనప్పుడు తాను ఎంతో సౌకర్యవంతంగా ఉన్నట్లు భావిస్తానని పేర్కొన్నారు. ఉక్రెయిన్కు సహకరించడం మానుకోవాలని అమెరికాను పుతిన్ హెచ్చరించారు. ఉక్రెయిన్కు దీర్ఘశ్రేణి క్షిపణులు సరఫరా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని తేల్చిచెప్పారు. #BREAKING: Russian President Putin at Valdai Club in Sochi on Trump Tariffs, says, “Indian people will look at what decisions are made by their political leadership. Indian people will never accept any humiliation. I know PM Modi, he will never take any steps of the kind.” pic.twitter.com/2GYqoVK1PO— Aditya Raj Kaul (@AdityaRajKaul) October 2, 2025స్వప్రయోజనాలు దెబ్బతింటే భారత్ సహించదుభారతదేశ ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం భారీగా టారిఫ్లు విధించడాన్ని పుతిన్ తప్పుపట్టారు. దేశ స్వప్రయోజనాలు, ప్రాధాన్యతల కోణంలోనే భారతీయులు నిర్ణయాలు తీసుకుంటారని, వాటిని దెబ్బతీసేలా ఎవరైనా వ్యవహరిస్తే వారు సహించబోరని తేల్చిచెప్పారు. అమెరికా విధిస్తున్న టారిఫ్ల కారణంగా వాటిల్లుతున్న నష్టాన్ని రష్యా నుంచి చమురు కొనడం ద్వారా భారత్ భర్తీ చేసుకుంటోందని అన్నారు. అదేసమయంలో ఒక సార్వ¿ౌమ దేశంగా ప్రతిష్టను కాపాడుకుంటోందని ప్రశంసించారు. భారత్ నుంచి దిగుమతులు పెంచుకుంటామని, వ్యవసాయ ఉత్పత్తులతోపాటు ఔషధ ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్ అధికంగా కొనుగోలు చేస్తామని ఉద్ఘాటించారు. భారత్, రష్యాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోవడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ విషయంలో కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని చెప్పారు. ఫైనాన్సింగ్, లాజిస్టిక్స్తోపాటు చెల్లింపుల్లో కొన్ని అవరోధాలు ఎదురవుతున్నాయని గుర్తుచేశారు. భారత్, రష్యాలు ఏనాడూ ఘర్షణ పడలేదని, భవిష్యత్తులోనూ అలాంటిది తలెత్తే అవకాశమే లేదని పుతిన్ తేల్చిచెప్పారు. భారతీయ సినిమాలంటే ఇష్టం భారతీయ సినిమాలు వీక్షించడం తనకు ఎంతో ఇష్టమని పుతిన్ వ్యాఖ్యానించారు. ఈ సినిమాలకు రష్యాలో విశేషమైన ఆదరణ లభిస్తోందని చెప్పారు. భారతీయ సినిమాలను రోజంతా ప్రసారం చేసేందుకు ప్రత్యేకంగా ఓ చానల్ కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. రెండు దేశాల నడుమ రాజకీయ, దౌత్య సంబంధాలే కాకుండా సాంస్కృతిక, మానవీయ బంధాలు కూడా బలంగా ఉన్నాయని గుర్తుచేశారు. భారతీయ సంస్కృతి అంటే రష్యన్లకు ఎంతో అభిమానం అని వ్యాఖ్యానించారు. చాలామంది భారతీయ విద్యార్థులు రష్యాలో చదువుకుంటున్నారని వెల్లడించారు. ఇదీ చదవండి: పాక్ పరువు.. మళ్లీ పాయే! -
గ్రీస్లో స్తంభించిన జనజీవనం.. పని గంటల పెంపుపై నిరసనలు
ఏథెన్స్: కార్మిక సంఘాల సమ్మెతో గ్రీస్(Greece) దేశంలో జన జీవనం స్తంభించిపోయింది. కార్మిక చట్టాల్లో మార్పులు చేసేందుకు గ్రీస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేయడంతో ఉద్యోగ సంఘాలకు సమ్మెకు పిలుపునిచ్చాయి. పని గంటలను(Working Hours) 13కు పెంచడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో, దేశవ్యాప్తంగా వేలాది మంది నిరసన కారులు వీధుల్లోకి వచ్చారు. ఈ క్రమంలో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.వివరాల ప్రకారం.. గ్రీస్లో ఒక షిఫ్టులో పని గంటలను 13కు పెంచడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గ్రీస్ ప్రభుత్వం ప్రతిపాదించిన కార్మిక చట్ట సవరణల్లో షిఫ్టు పని గంటలను 13కు పెంచడం వంటి ఉన్నాయి. ఈ అదనపు పనిగంటలు వారానికి గరిష్ఠంగా 48 గంటలకు పరిమితి చేయగా, ఏడాదికి 150 గంటలకు మించకూడదని పేర్కొంది. వీటిని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ హక్కులను అణచివేయడమే కాకుండా పని-జీవన సమతుల్యతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహిస్తున్నాయి. ఇందులో భాగంగా కార్మిక సంఘాలు 24 గంటల సమ్మెకు పిలుపునివ్వడంతో దేశవ్యాప్తంగా జనజీవనం స్తంభించింది.ప్రభుత్వ, ప్రైవేటు కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా వేలాది మంది నిరసన కారులు వీధుల్లోకి వచ్చారు. దీంతో ఏథెన్స్లో టాక్సీ, రైలు సర్వీసులు నిలిచిపోయాయి. ఆయా నగరాల్లో బస్సులు, ట్రామ్, ట్రాలీ సర్వీసులు మాత్రం పరిమిత స్థాయిలో సేవలందించాయి. పాఠశాలలు, కోర్టులు, ఆసుపత్రులు సహా ప్రభుత్వ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యోగ సంఘాల సమ్మెకు చెందిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Thousands take to the streets of #Athens as #Greece halts trains, ferries, and taxis for a one-day strike. Workers and students also show solidarity with #Palestine while protesting extended working hours.01-10-2025#Απεργια_1Οκτωβρη #απεργια_πεινας #απεργία pic.twitter.com/1wEx2XozrN— Vedat Yeler (@vedatyeler_) October 1, 2025 -
ఈ నెల్లోనే భారత్-చైనాల మధ్య నేరుగా విమాన సర్వీసులు!
న్యూఢిల్లీ: కోవిడ్ సంక్షోభం, గల్వాన్ ఉద్రిక్తతలతో బీటువారిన చైనా, భారత్ బంధానికి భారతీయ విమానాలు మళ్లీ ఆకాశ మార్గాన స్నేహవారధి నిర్మించనున్నాయి. సుమారు ఇరుదేశాల మధ్య ఐదేళ్ల నుంచి ఆగిపోయిన భారత్, చైనా నేరుగా విమానసర్వీసులను అతి త్వరలో పునరుద్ధరించబడనున్నాయి. ఈ నెల చివరి నాటికి ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు పునరుద్ధరించే అవకాశం ఉంది. ఈ మేరకు భారత్-చైనాల మధ్య సానుకూల వాతావరణంలో చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎడాపెడా టారిఫ్ల మోత మోగించడంతో విసిగి పోయిన భారత్, చైనాలు మళ్లీ స్నేహగీతాన్ని ఆలపిస్తున్నాయి. అందులో భాగంగానే నేరుగా విమానసర్వీసుల పునర్ప్రారంభానికి శ్రీకారం చుట్టబోతున్నాయి.గల్వాన్ నుంచి గట్టిబంధం దిశగా2020 మేలో తూర్పు లద్దాఖ్లో ఇరు దేశాల సైనికుల మధ్య ఉద్రిక్తతకు బీజం పడింది. జూన్లో గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ముష్టిఘాతం, పిడిగుద్దులు, ఘర్షణ కారణంగా ఇరువైపులా జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో సరిహద్దు వెంట గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించి ఉద్రిక్తతలను మరింత పెంచారు. దీంతో భారత్, చైనా సత్సంబంధాలు అడుగంటాయి. పాస్పోర్ట్లు, దిగుమతులు, అనుమతులు మొదలు మరెన్నో రంగాల్లో సత్సంబంధానికి బీటలు పడ్డాయి.అయితే ట్రంప్ ఇష్టారీతిన విధించిన దిగుమతి సుంకాల భారంతో ఇబ్బందులు పడుతున్న భారత్, చైనాలు ఉమ్మడిగా ఈ సమస్యను పరిష్కరించుకుందామని భావిస్తున్నాయి. ఇందుకోసం మళ్లీ స్నేహగీతం పాడక తప్పని నెలకొంది. గత కొద్దినెలలుగా ఇందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. చైనా జాతీయులకు పర్యాటక వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం గత నెలలో అంగీకారం తెలిపింది. దాదాపు ఏడేళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటనకు సిద్ధపడ్డారు.చైనాతో బంధం బలపడాలని తాము కోరుకుంటున్నామని ఆదేశ పర్యటనను ఖరారుచేసి మోదీ సూచనప్రాయంగా చెప్పారు. భారత్ వంటి దేశాలపై టారిఫ్ను అమెరికా పెంచడాన్ని చైనా సైతం తీవ్రంగా పరోక్షంగా ఖండించింది. ఇలా నెమ్మదిగా బలపడుతున్న మైత్రీ బంధాన్ని నేరుగా విమానసర్వీసుల ద్వారా మరింత పటిష్టంచేయాలని భారత్ ఆశిస్తోంది. చివరిసారిగా మోదీ చైనాలో 2018 జూన్లో పర్యటించారు. ఆ తర్వాతి ఏడాది అక్టోబర్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భారత్లో పర్యటించారు. ఇటీవల టియాన్జిన్లో జరిగిన 25వ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆయన పలు కీలక అంశాలపై చర్చించారు: అందులో ఇరు దేశా మధ్య విమాన సర్వీసుల పునరుద్ధరణ అంశం ఒకటి. -
అది భారత్కు అతిపెద్ద ముప్పు.. విదేశీ గడ్డపై రాహుల్
బొగోటా: లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. నరేంద్ర మోదీ పాలనలోని భారత్లో ప్రజాస్వామ్య దాడులు జరుగుతున్నాయంటూ విమర్శించారు. దేశానికి అత్యంత ప్రమాదకరమైనది ఏదైనా ఉందంటే అది దేశంలో ప్రజాస్వామ్మంపై జరుగుతున్న దాడేనంటూ మండిపడ్డారు. కొలంబియాలో ఈఐఏ యూనివర్శిటీలో విద్యార్థులను రాహుల్ కలిశారు. దీనిలో భాగంగా ప్రసంగించిన రాహుల్.. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంపై విమర్శలే లక్ష్యంగా మాట్లాడారు. ‘ ప్రజాస్వామ్యం అనేది ప్రతీ ఒక్కరికీ చోటును కల్పిస్తుంది. కానీ ప్రస్తుతం ప్రజాస్వామ్యంపై అన్ని వైపుల నుంచి దాడులు జరగుతున్నాయి. భారత దేశ జనాభా 140 కోట్లు ఉంది. చైనా పరంగా చూస్తే భారత్ అనేది పూర్తిగా భిన్నం. చైనా అనేది కేంద్రీకృత వ్యవస్థలా ఏకరీతిలో ఉంది. భారత్ వికేంద్రీకృతమై ఉంది. సంస్కృతులు, సంప్రదాయాలు మరియు మతాలను కలిగి ఉంది. భారతదేశం చాలా సంక్లిష్టమైన వ్యవస్థను కలిగి ఉంది. చైనా చాలా కేంద్రీకృతమై, ఏకరీతిగా ఉంది. భారతదేశం వికేంద్రీకృతమై ఉంది బహుళ భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, మతాలను కలిగి ఉంది. భారతదేశం చాలా సంక్లిష్టమైన వ్యవస్థను కలిగి ఉంది. ప్రపంచానికి ఏమి కావాలో దాన్ని సమకూర్చే శక్తి భారత్ వద్ద ఉంది. కానీ పరిస్థితి మరోలా ఉంది. ప్రస్తుత భారత్ ఒకే లైన్లో లేదు. నాయకులు తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారు. వాటిని సరిదిద్దుకోవాలి. అందులో ప్రధానమైనది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి ఒకటి’ అంటూ విమర్శించారు.రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాహుల్ గాంధీ ప్రచార ఆర్భాట నాయకుడే తప్ప ఏమీ లేదంటూ కౌంటరిచ్చింది. విదేశీ గడ్డపై భారత్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడమే ఇందుకు నిదర్శమనమంటూ ధ్వజమెత్తింది. భారత్లో జరుగుతున్న అభివృద్ధి రాహుల్ కనిపించడం లేదా అంటూ ప్రశ్నించింది. ప్రపంచ పటంలో భారత్ గణనీయ అభివృద్ధి రాహుల్కు కనబడటం లేనట్లుంది అంటూ ఎద్దేవా చేసింది. -
ఆసుపత్రిలో అమానుష దృశ్యం.. మాజీ కేంద్ర మంత్రి మృతిపై దేశవ్యాప్తంగా నిరసనలు!
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సన్నిహితుడు, బంగ్లాదేశ్ పరిశ్రమల శాఖ మాజీ మంత్రి నూరుల్ మాజిద్ మహమ్మద్ హుమాయున్ మృతిపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన నూరుల్ మాజిద్ చేతికి హ్యాండ్కప్స్ బిగించి చికిత్స చేయడం వివాదాస్పదంగా మారింది. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నూరుల్ కన్నుమూయడం, ఆసమయంలో చేతికి బేడీలు ఫొటోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. దీంతో షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ నేతలతో పాటు సామాన్య ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షేక్ హసీనా ప్రధానిగా విధులు నిర్వహించే సమయంలో నూరల్ బంగ్లాదేశ్ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవల, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ ప్రభుత్వం నూరల్ను అదుపులోకి తీసుకుంది. 2024లో వివక్ష వ్యతిరేక ఉద్యమం సందర్భంగా జరిగిన దాడుల్లో నూరుల్ మాజిద్ పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. తాజాగా, నాటి కేసులకు సంబంధించి ఆయనను గత నెల 24న బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.వయోభారం రిత్యా అరెస్టయిన స్వల్ప వ్యవధిలో పలుమార్లు ఆస్పత్రి పాలయ్యారు. ఈ క్రమంలో నూరుల్ మాజిద్ సోమవారం ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రి (డీఎంసీహెచ్) ఐసీయూలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. జైలు కస్టడీలో నూరుల్ మాజిద్ మరణించాడని జైలు అధికారులు సైతం అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆ ఫొటోలు సైతం బహిర్ఘతమయ్యాయి. నెట్టింట్లో వైరలైన ఫొటోల్లో నూరుల్ మజీద్ చేతికి బేడీలు ఉండడంపై యూనస్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. మానవ హక్కుల సంఘాలు, రాజకీయ నేతలు అమానుషమైన చర్యగా అభివర్ణిస్తున్నారు. మరోవైపు,పోలీసు అధికారులు మాత్రం నూరుల్ మజీద్పై పలు కేసులు ఉన్నాయని.. పారిపోవడం, ఇతర ప్రమాదాలను నివారించేందుకు ఈ చర్య తీసుకున్నాం’అని పేర్కొన్నారు. కానీ, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని ఇలా బేడీలు వేయడం అవసరమా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి ఈ దుమారంపై యూనస్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. Nurul Majid Mahmud Humayun, a 75-year-old veteran of Bangladesh’s 1971 Liberation War, former Industries Minister, and senior Awami League leader, passed away while undergoing treatment in jail custody at Dhaka Medical College Hospital (DMCH).The day before his death, he was… pic.twitter.com/t582kBShJY— Mohammad Ali Arafat (@MAarafat71) September 30, 2025 -
అదిరిపోవాల్సిన అందాల పోటీలు..భయం..భయంగా..!
ఫిలిప్పీన్స్లోని సెబులో మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ 2025 గాలా ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. సాయంత్రం ఎంతో ఆకర్షణీయంగా జరుగుతున్న వేడుక ఒక్కసారిగా భయాందోళనలతో గందరగోళంగా మారిపోయింది. అందాల భామలు రన్వేపే హోయలు ఒలికిస్తున్న సమయంలోనే 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఒక్కసారిగా పోటీదారులు భయంతో వేదిక నుంచి దూరంగా పారిపోతున్న దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి.ఫిలిప్పీన్స్ భూకంపంభూకంప కేంద్రం సెబు నుంచి 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోగో నగరం వరకు భూకంపం సంభవిస్తుందని గుర్తించి ప్రజలకు అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఇక ఈ ప్రమాదంలో సుమారు 60 మందికి పైగా మరణించగా, 150 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఈ ఆకస్మిక ప్రకృతి విపత్తు అంతర్జాతీయ అందాల పోటీకి అంతరాయ కలిగించిందని అందాల పోటీ నిర్వాకులు తెలిపారు. అయితే మిస్ ఆసియా-పసిఫిక్ ఇంటర్నేషనల్ (MAPI) ఆర్గనైజేషన్ ప్రతినిధులు, సిబ్బంది అంతా క్షేమంగానే ఉన్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. పైగా అక్టోబర్ 1న జరగాల్సిన అందాలపోటీలకు సంబంధించిన అన్ని ఈవెంట్లను రద్దుచేస్తున్నట్లు కూడా ప్రకటించారు నిర్వాహకులు. అంతేగాక మిస్ యూనివర్స్ ఫిలిప్పీన్స్ (MUPH) ఆర్గనైజేషన్ సోషల్మీడియా పోస్ట్లో ఈ ఘోర విపత్తుకు సంఘీభావం తెలుపుతున్నట్లు పేర్కొంది. "ఈ ప్రకృతి విలయం నుంచి కోలుకునేలా తమ సోదరీసోదరీమణులకు అండంగా నిలబడతాం. ఈ విషాద సమయంలో ఫిలిప్పీన్స్ బలం, స్ఫూర్తి, స్థితిస్థాపకత కొనసాగేలా మనవంతుగా కృషి చేద్దాం." అని పోస్ట్లో పిలుపునిచ్చింది. కాగా, సెబులో 6.9 తీవ్రతతో ఘోర భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఈ విపత్తులో చిక్కుకున్న క్షతగాత్రులను సంరక్షించే పనులను వేగవంతం చేసినట్లు ఫిలిప్పీన్స్ భద్రతా అధికారులు తెలిపారు. View this post on Instagram A post shared by 𝐏𝐚𝐠𝐞𝐚𝐧𝐭 𝐄𝐦𝐩𝐫𝐞𝐬𝐬 (@pageantempress) (చదవండి: మచ్చలేని చర్మం, నిగనిగలాడే జుట్టు కోసం డీఎన్ఏ డీకోడ్..!) -
పీఓకేలో పాక్ సైన్యం అరాచకం..
శ్రీనగర్: భారత సరిహద్దుల్లోని పాక్ ఆక్రమిత కశ్మీర్లో(POK) పాకిస్తాన్ సైన్యం రెచ్చిపోయింది. పీఓకేలో అరాచకం సృష్టించింది. పీవోకే ప్రజలు, ఆందోళకారులపై పాక్ సైన్యం(Pakistan Army) విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 12 మంది మృతి చెందారు. దాదాపు 200 మంది గాయపడినట్టు సమాచారం. పాక్ సైన్యం కాల్పులతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.వివరాల ప్రకారం.. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో అవామీ యాక్షన్ కమిటీ (ఏఏసీ) నేతృత్వంలో కొన్ని రోజులుగా నిరసనలు కొనసాగుతున్నాయి. పీఓకేలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలని తమ 38 డిమాండ్లను అమలు చేయాలని ఏఏసీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీంతో, భారీ సంఖ్యలో ప్రజలు బయటకు వచ్చి నిరసనల్లో పాల్గొన్నారు. తమ ప్రాథమిక హక్కులను పాకిస్తాన్ హరిస్తోందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.Visuals of Pakistani forces lying on the ground after violent clashes with civilians in Pakistan Occupied Kashmir (PoK) today. This is the situation of Pakistani forces under the leadership of Asim Munir. Forces are surrendering before civilians in PoK. pic.twitter.com/IdFfw5toZM— Aditya Raj Kaul (@AdityaRajKaul) October 1, 2025అయితే, పాక్ సర్కార్కు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతుండడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పాక్ పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించింది. ఇంటర్నెట్ను నిలిపివేసింది. ఈ నిరసనలతో మార్కెట్లు, దుకాణాలు, రవాణా సేవలు నిలిచిపోయాయి. ఈ ఉదయం ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. తమను అడ్డుకునేందుకు బ్రిడ్జిలపై ఉంచిన షిప్పింగ్ కంటైనర్లను నదిలోకి నెట్టేశారు. ఈ క్రమంలోనే కాల్పులు జరిగాయి. ధిర్కోట్, ముజఫరాబాద్, బాఘ్, మిర్పుర్ ప్రాంతాల్లో పాక్ సైన్యం రెచ్చిపోయి కాల్పులకు తెగబడింది. దీంతో, 12 మంది పౌరులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఏఏసీ లీడర్ షౌకత్ నవాజ్ మిర్ పాక్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుత నిరసనలు ప్లాన్-ఏ అని, ఇంకా తమ వద్ద వేరే ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. 🚨 PAKISTAN EXPOSED 🚨Top leader of the Awami Action Committee in PoK tears into Pak Govt & Army:“Pakistan Govt & Army are killing people in PoK.You brand Hindus as ‘kaafir’ who’ll oppress us — yet you, as Muslim rulers, unleash atrocities here.You call this ‘Azad Kashmir’?… pic.twitter.com/D2QLZX744N— Nihal Kumar (@NihalJrn) October 1, 2025 -
ఐరాస వేదికగా మరోసారి పరువు పోగొట్టుకున్న పాక్..!
జెనీవా: ఐక్యరాజ్యసమితి (United Nations)లో పాకిస్తాన్ మరోసారి పరువు పోగొట్టుకొంది. మానవ హక్కుల మండలిలో పాక్ వక్ర బుద్ధిని భారత్ దుయ్యబట్టింది. పాక్ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించింది. మైనారిటీలపై దాడులు జరిపే ఆ దేశం మానవహక్కులపై ఉపన్యాసాలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందంటూ భారతీయ దౌత్యవేత్త మొహమ్మద్ హుస్సేన్ చురకలు అంటించారు. పాక్ తప్పుడు ప్రచారాలు చేసే బదులు తన దేశంలోని మైనారిటీలపై చూపుతున్న వివక్షతో పోరాడాలంటూ హితవు పలికారు.ఇటీవల పాకిస్తాన్లో ఆ దేశ సైన్యం చేసిన దాడిలో మహిళలు, పిల్లలతో సహా 23 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్లో మైనారిటీలపై జరుగుతున్న దాడులపై భారత్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ హక్కుల కార్యకర్త ఆరిఫ్ అజాకియా కూడా పాక్ సర్కార్ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. బలోచిస్థాన్, ఖైబర్ ప్రావిన్స్లు సుదీర్ఘకాలంగా సైనిక ఆపరేషన్లకు కేంద్రాలుగా మారిపోయాయని మండిపడ్డారు. పాకిస్తాన్ ఇతరుల ముందు మానవ హక్కుల పాఠాలు చెబుతోంది కానీ.. అక్కడి పరిస్థితులు చూస్తే వాటికి పూర్తిగా విరుద్ధం.. తప్పుడు ప్రచారాలతో మోసం చేస్తోందంటూ హుస్సేన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, పాకిస్తాన్ ప్రభుత్వం తమ కనీస ప్రాథమిక హక్కుల్ని సైతం కాలరాస్తోందంటూ ఆవామీ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో నిరసనలు మూడో రోజుకు చేరుకున్నాయి. నిరసనకారులను అదుపు చేసేందుకు పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. బాఘ్ జిల్లా దిర్కోట్లో నలుగురు, ముజఫ రాబాద్, మిర్పూర్లలో ఇద్దరు చొప్పున చనిపో యారు. ముజఫరాబాద్లో మంగళవారం జరిగిన నిరసనల్లో ఇద్దరు చనిపోవడం తెల్సిందే. దీంతో, బలగాల కాల్పుల్లో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10కి చేరుకుంది. -
రన్వేపై రెండు విమానాలు ఢీ.. వీడియో వైరల్
న్యూయార్క్లో లగార్డియా ఎయిర్పోర్టులో పెను ప్రమాదం తప్పింది. రన్వేపై రెండు విమానాలు ఢీకొన్నాయి. రన్వే టాక్సీయింగ్ సమయంలో డెల్టా ఎయిర్లైన్స్ విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందులో ఒక విమానం రెక్క (wing) విరిగిపోయినట్లు స్పష్టంగా కనిపించింది.మరొక విమానం ముక్కు (nose) భాగం దెబ్బతింది. ఈ విమానాలు తక్కువ వేగంతో కదులుతున్న సమయంలో ఈ ఘటన జరగడంతో భారీ ప్రమాదమే తప్పింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. లాగార్డియా విమానాశ్రయం.. కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత న్యూయార్క్ నగరంలో రెండో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం.At least one was injured after two Delta regional jets collided at low speeds while taxiing Wednesday evening at LaGuardia 🇺🇸The right wing of one @Delta plane collided with the nose of the other plane, according to Air Traffic Control audio.https://t.co/ICrgCP2ZsM… pic.twitter.com/ffx9i4xftV— Saad Abedine (@SaadAbedine) October 2, 2025 -
ఖతార్ భద్రత మా బాధ్యత.. ఉత్తర్వులపై ట్రంప్ సంతకం
దుబాయ్: ఖతార్ భద్రత తమ బాధ్యతని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఖతార్ రక్షణకు అవసరమైతే సైనిక పరంగా సాయమందిస్తామని స్పష్టం చేస్తూ తాజాగా ఆయన ఓ ఉత్తర్వు జారీ చేశారు. సోమవారం దీనిపై సంతకం చేయగా బుధవారం వైట్ హౌస్ వెబ్సైట్లో కనిపించింది. అయితే, దీనిపై అమెరికా ఏ మేరకు కట్టుబడి ఉంటుందన్నది స్పష్టం కావాల్సి ఉంది.గాజాలో కాల్పుల విరమణపై చర్చలు జరిపేందుకు ఖతార్ ఉన్న హమాస్ నేతలపై ఇటీవల ఇజ్రాయెల్ అనూహ్యంగా దాడికి దిగడం తెల్సిందే. సోమవారం వైట్ హౌస్లో ట్రంప్తో చర్చలు జరిపిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఆయన సమక్షంలోనే ఖతార్ నాయకత్వానికి క్షమాపణ చెప్పడం తెలిసిందే.🚨⚡️BREAKING AND UNUSUALPresident Trump officially signs an executive order that makes any attack on Qatar a threat to the security of the United States!The White House confirms: "The measures include diplomacy, economics, and even military."-: Something is happening here..… pic.twitter.com/lGEsILidhO— RussiaNews 🇷🇺 (@mog_russEN) October 1, 2025తాజాగా, ఖతార్కు మద్దతుగా ట్రంప్.. సన్నిహిత సహకారం, ఉమ్మడి ప్రయోజనాలే లక్ష్యంగా ఖతార్ ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు, బయటి నుంచి జరిగే దాడుల నుంచి రక్షించేందుకు కట్టుబడి ఉన్నట్లు ఆ ఉత్తర్వులో ప్రకటించారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఖతార్ రాజధాని దోహాలోని హమాస్ కార్యాలయంలో ఉన్న ఆరుగురు చనిపోయారు. ఈ దాడి అనంతరం సౌదీ అరేబియా అణ్వాయుధాలు కలిగిన పాకిస్తాన్తో రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం. -
ఆ పాస్పోర్ట్తో అమెరికాలో సమస్యలు!: కెనడా హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరిలో వైట్ హౌస్కు తిరిగి వచ్చిన తరువాత.. తన ప్రారంభ ప్రసంగంలో "పురుషుడు & స్త్రీ అనే రెండు లింగాలు మాత్రమే ఉన్నాయని" ప్రకటించినప్పటి నుంచి ట్రాన్స్జెండర్స్, బైనరీయేతర వ్యక్తులపై చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కెనడా ప్రభుత్వం తమ పాస్పోర్ట్లలో నాన్బైనరీ 'ఎక్స్' లింగ హోదాతో పాస్పోర్ట్లను కలిగి ఉన్న పౌరులకు హెచ్చరిక జారీ చేసింది.ఎక్స్ లింగ హోదాతో పాస్పోర్ట్లను కలిగిఉన్న వారు యునైటెడ్ స్టేట్స్కు వెళితే.. ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుందని కెనడా ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం 'ఎక్స్' జెండర్ ఐడెంటిఫైయర్తో పాస్పోర్ట్లను జారీ చేసినప్పటికీ.. ఇది ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు తెచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.ఇదీ చదవండి: అమెరికా వీడిన భారతీయ యువతి.. కన్నీటి వీడ్కోలుకెనడా 2019లో పాస్పోర్ట్లపై 'ఎక్స్' ఎంపికను ప్రవేశపెట్టింది. ఫెడరల్ డేటా ప్రకారం.. జనవరి నాటికి దాదాపు 3,600 మంది కెనడియన్లు దీనిని ఎంచుకున్నారు. కెనడా మాత్రమే కాకుండా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ దేశాలు కూడా ఎక్స్ జెండర్ పాస్పోర్ట్లను జరీ చేస్తోంది. కానీ యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ 'ఎక్స్' జెండర్ ఐడెంటిఫైయర్తో పాస్పోర్ట్ల జారీని నిలిపివేసింది. కాగా ఈ విధానం అమలులోకి రాకుండా కోర్టు నిషేధం విధించింది. -
పాక్ ఆర్మీ చీఫ్ మునీర్కు బిగ్ షాక్
ఇస్లామాబాద్: పాకిస్తాన్(Pakistan) ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు(Asim Munir) ఊహించని షాక్ తగిలింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు(Donald Trump) అరుదైన ఖనిజాలను ప్రదానం చేసినందుకు స్వదేశంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. మునీర్కు స్వదేశంలో రాజకీయ నాయకుల నుంచి కౌంటర్లు వస్తున్నాయి. మునీర్ బ్రాండెడ్ సేల్స్ పర్సన్గా వ్యవహరించారని పాకిస్తాన్ సెనేటర్ ఐమల్ వలీ ఖాన్ సెటైరికల్ కామెంట్స్ చేశారు.పాకిస్తాన్ పార్లమెంట్లో తాజాగా సెనేటర్ ఐమల్ వలీ ఖాన్ మాట్లాడారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మన దేశానికి చెందిన అరుదైన ఖనిజాలను బ్రీఫ్ కేసులో పెట్టుకుని తిరుగుతున్నారు. పాకిస్తాన్ మట్టి ఖనిజాలను ట్రంప్కు చూపించారు. మునీర్ ఒక సేల్ పర్సన్ మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ఇక, పాక్ ప్రధాని మేనేజర్లా జరుగుతున్న డ్రామాను చూస్తూ ఉండిపోయారు. ఇంత కంటే పెద్ద జోక్ ఏమైనా ఉంటుందా?. మునీర్ ఏ హోదాలో.. ఏ చట్టం కింద ఇలా చేశారు. ఇది నియంతృత్వం కాదా?. ఇది ప్రజాస్వామ్యం కాదని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. ఇది పార్లమెంటును ధిక్కరించడం కాదా? అని ప్రశ్నిస్తూ ఘాటు విమర్శలు చేశారు. దీంతో, పాక్ ఆర్మీ చీఫ్ మునీర్కు ఎదురుదెబ్బ తగిలింది.⚡ Huge Embarrassment For Pakistan’s 'Failed' Marshal Asim MunirPakistani senator Aimal Wali Khan has criticised Pakistan COAS Asim Munir inside the Pakistani Parliament over selling rare earth minerals in a briefcase to US President Donald Trump. "What a Joke" he says.He… pic.twitter.com/YbiXZoN1Da— OSINT Updates (@OsintUpdates) October 1, 2025ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను బుట్టలో వేసుకోవడానికి పాక్ నాయకులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గత వారం పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ (Pak Army Chief Asim Munir), ప్రధాని షెహబాజ్ షరీఫ్ వైట్ హౌస్లో ట్రంప్ను కలిశారు. ఈ సందర్భంగా ట్రంప్నకు ఓ చెక్కపెట్టెను బహూకరించారు. దానిలో పాక్లో వెలికి తీసిన అరుదైన ఖనిజాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని వైట్ హౌస్ విడుదల చేసింది. పాక్ ఆర్మీ చీఫ్ ఆ పెట్టెలోని రంగురాళ్లను చూపుతూ ఏదో చెబుతుండగా.. ట్రంప్ వాటిని ఆసక్తిగా చూస్తున్నట్లు అందులో ఉంది. అనంతరం మునీర్ మాట్లాడుతూ..‘పాకిస్తాన్ (Pakistan) వద్ద రేర్ ఎర్త్ మినరల్స్ ఖజానా ఉంది. దీంతో దేశ రుణభారం చాలా వరకు తగ్గిపోనుంది. అతి త్వరలోనే పాక్ సుసంపన్న సమాజాల్లో ఒకటిగా మారుతుంది’ అని వ్యాఖ్యలు చేశారు. -
నాలుగు వారాల్లో జిన్పింగ్ను కలుస్తా: ట్రంప్ ప్రకటన
వాషింగ్టన్: అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(donald Trump) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో నాలుగు వారాల్లోగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను(Xi Jinping) తాను కలుస్తానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా చైనాతో సోయాబీన్ అంశంపై చర్చించనున్నట్టు తెలిపారు. కాగా, ట్రంప్ సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో జిన్పింగ్తో భేటీపై ఆసక్తి నెలకొంది.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్లో తాజాగా స్పందిస్తూ..‘చైనా(China) చర్యల కారణంగా అమెరికాలో సోయాబీన్ రైతులు నష్టపోతున్నారు. జోబైడెన్ ప్రభుత్వంలో అమెరికా నుంచి సోయాబీన్ కొనుగోళ్లను చైనా ఆపేసింది. ఇప్పుడు కేవలం చర్చల ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇందులో భాగంగానే జిన్పింగ్తో మాట్లాడాలని అనుకుంటున్నారు. మరో నాలుగు వారాల్లో నేను జిన్పింగ్ను కలిసి దీనిపై మాట్లాడతాను. నేను మా రైతులను ఎప్పటికీ నిరాశపరచను. అమెరికా రైతులకు అండగా ఉంటాను. మేము ఇప్పటికే సుంకాల ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాం. ఆ డబ్బులో కొంత భాగం రైతులకు సహాయం చేయబోతున్నాం. రైతులను ఆదుకుంటాం’ అని చెప్పుకొచ్చారు. Trump announced he will have a meeting with Xi to beg China to start buying American soybeans again: pic.twitter.com/liZZ3cEkFU— Spencer Hakimian (@SpencerHakimian) October 1, 2025 మరోవైపు.. అక్టోబరు చివరివారంలో దక్షిణకొరియాలో ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ (అపెక్) సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి పలు దేశాధినేతలు హాజరుకానున్నారు. ఆ సదస్సు అనుబంధంగా జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతానని ఇటీవల ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక, వచ్చే ఏడాది ఆరంభంలో చైనాలో పర్యటిస్తానని కూడా అమెరికా అధ్యక్షుడు ఆ మధ్య ప్రకటించారు.ఇదిలా ఉండగా.. ట్రంప్ యంత్రాంగం మళ్ళీ టిక్ టాక్ విషయంలో ఆలోచిస్తోంది. దీనికి సంబంధించి మంతనాలను జరుపుతోంది. తాజాగా ఓవల్ ఆఫీసులో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘నేను అధ్యక్షుడు జిన్పింగ్తో మంచి సంభాషణ జరిపాను. ఆయన టిక్టాక్ ఒప్పందాన్ని ఆమోదించారు. ఒప్పందం కోసం మేము ఎదురుచూస్తున్నాం. దానిపై సంతకం చేయాలి. ఇది లాంఛనప్రాయంగా ఉండవచ్చు. టిక్టాక్ ఒప్పందం జరుగుతోంది. పెట్టుబడిదారులు సిద్ధమవుతున్నారు’ అని చెప్పుకొచ్చారు. -
‘నాకు శాంతి నోబెల్ ఇవ్వకుంటే అమెరికాను అవమానించినట్టే’
న్యూయార్క్: నోబెల్ శాంతి బహుమతి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా ఏకంగా బెదిరింపులకే దిగారు. తనకు శాంతి నోబెల్ ఇవ్వకుంటే అమెరికాను తీవ్రంగా అవమానించినట్టేనని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా ఏడు సాయుధ ఘర్షణలను ఆపిన తనకు నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు తాను సోమవారం ప్రతిపాదించిన ప్రణాళికపై మంగళవారం క్వాంటికోలో మిలిటరీ అధికారులతో ట్రంప్ మాట్లాడారు. ‘మనం సాధించాం. సమస్య పరిష్కారమైనట్టే అని భావిస్తున్నాను.. చూడాలి మరి. దీనిని హమాస్ అంగీకరించాల్సిందే (శాంతి ప్రణాళికను). లేదంటే వాళ్లు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్ని అరబ్దేశాలు, ముస్లిం దేశాలు ప్రణాళికను అంగీకరించాయి. ఇజ్రాయెల్ కూడా అంగీకరించింది. ఇది అద్భుతమైన విషయం. పరిస్థితి కొలిక్కి వచ్చింది. ఇది చాలా మంచి పరిణామం. ఇలాంటి పని ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. అయినా, నోబెల్ బహుమతి ఇస్తారా?.. ఇవ్వనే ఇవ్వరు. ఇలాంటి పని ఏదీ చేయని ఎవరో ఒకరికి ఇస్తారు. డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలపై పుస్తకం రాసి, యుద్ధాన్ని ఎలా ఆపాలి అని అందులో వివరించే ఎవరో ఒకరికి నోబెల్ ఇస్తారు. ఏం జరుగుతుందో చూడాలి. ఎవరో ఒక పుస్తక రచయితకు నోబెల్ శాంతి బహుమతి ఇస్తే మాత్రం అది అమెరికాకు తీవ్రమైన అవమానమే. ఇది నేను కచ్చితంగా చెప్పగలను. నాకు అది (నోబెల్) అవసరం లేదు. మన దేశం దానిని (నోబెల్) సాధించాలని కోరుకుంటున్నా. గాజా ఘర్షణకు ముగింపు పలికే ప్రణాళిక అమలవుతుందనే భావిస్తున్నా. ఇది నేను ఆశామాషీగా చెప్పటం లేదు. నాకు అన్నింటికంటే ఇలాంటి డీల్స్ గురించి బాగా తెలుసు. నా జీవితం మొత్తం ఇలాంటివాటితోనే గడిచింది. అందులో ఈ 8 (గాజా ఘర్షణతో కలిసి ట్రంప్ ఆపానని చెబుతున్న యుద్ధాలు) గొప్ప విషయాలు’అని ట్రంప్ పేర్కొన్నారు. -
ఖతార్లో ఎంఎఫ్ హుస్సేన్ మ్యూజియం
దోహా: ప్రముఖ భారతీయ చిత్రకారుడు మక్బూల్ ఫిదా (ఎంఎఫ్) హుస్సేన్కు ఖతార్లో అరుదైన గౌరవం దక్కనుంది. ఎంఎఫహుస్సేన్ పేరుతో ఏర్పాటుచేసిన ప్రత్యేక మ్యూజియంను నవంబర్ 28న ఖతార్ రాజధాని దోహాలో ప్రారంభించనున్నారు. ఖతార్ ఫౌండేషన్ సంస్థ ‘లాహ్ వా ఖ్వాలం: ఎంఎఫ్ హుస్సేన్ మ్యూజియం’పేరుతో దీనిని ఏర్పాటుచేసింది. ఆర్ట్ అండ్ కల్చర్ ద్వారా ఎవరైనా స్ఫూర్తి పొందేందుకు, నేర్చుకునేందుకు, ఆనందంగా గడిపేందుకు ఈ మ్యూజియం వేదికగా ఉంటుందని ఖతార్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కమ్యూనిటీ వ్యవహారాలు) ఖలౌద్ అల్ అలీ మంగళవారం తెలిపారు. ఖతార్ సంస్కృతికి ఈ మ్యూజియం అదనపు హంగుగా మారు తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ మ్యూ జియంలో ఎంఎఫ్ హుస్సేన్ వేసిన చిత్రాలు, ఆయన జీవిత విశేషాలు పొందుపరిచినట్లు వివరించారు. అరబ్ నాగరికతపై ఎంఎఫ్ హు స్సేన్ వేసిన పెయింటింగ్స్లో కొన్నింటిని ఈ మ్యూజియంలో ప్రదర్శిస్తారు. మ్యూజికం అద్దాలను కూడా హుస్సేన్ తన పెయింటింగ్స్లో చిత్రించిన చిత్రాల స్ఫూర్తితోనే రూపొందించటం విశేషం. ఆధునిక భారతీయ చిత్ర కారుల్లో ఎంఎఫ్ హుస్సేన్ ఒకరు. ఆయన బాంబే ప్రోగ్రెస్సివ్ ఆర్టిస్ట్స్ గ్రూప్ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆయన చిత్రాల్లో భారతీయ నగర, గ్రామీణ జీవితం ఉట్టిపడుతుంది. ఆయన పలు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. 2006లో హిందూ దేవతలు, భారత మాతను నగ్నంగా చిత్రించినందుకు ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఖతార్కు వెళ్లిపో యారు. 2010లో ఖతార్ పౌరసత్వం తీసుకున్నారు. 2011 జూన్ 9న 95 ఏళ్ల వయసులో లండన్లో తుదిశ్వాస విడిచారు. భారతీయ చిత్రకళకు ఆయన ఎనలేని సేవ చేశారు. -
త్వరలో ట్రంప్, మోదీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెలాఖరులో మలేసియాలో భేటీ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కౌలాలంపూర్లో ఈ నెల 26, 27వ తేదీల్లో జరిగే 47వ ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య (ఆసియాన్) శిఖరాగ్రానికి ఇద్దరు నేతలు హాజరుకా నున్నారు. ఈ సందర్భంగా వీరు సమావేశమవుతారని విశ్వసనీయవర్గాల సమా చారం. సమావేశానికి రావాలంటూ మలేసియా ఇప్పటికే ఇద్దరు నేతలకు ఆహ్వానం పంపించింది. ట్రంప్ పర్యటన ఖరారైన పక్షంలో, అమెరికా భారత్పై 50 శాతం టారిఫ్లను విధించిన తర్వాత ఇద్దరు నేతలు కలుసుకునే మొట్టమొదటి అంతర్జాతీయ సమావేశం అవుతుంది. -
ట్రంప్ ఆంక్షలతో అమెరికా విద్యారంగం విలవిల
సాక్షి, అమరావతి: అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికాలో విద్యాసంస్థలను ఆర్థిక సంక్షోభం వణికిస్తోంది. విదేశీ విద్యార్థుల చేరికల్లో క్షీణత యూఎస్లోని కళాశాలల మూసివేతకు దారితీస్తోంది. 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో యూఎస్లోని మిడ్ టైర్ కళాశాలల పరిస్థితి దయనీయంగా మారుతోంది. తక్కువ లాభాలతో నడుస్తున్న సంస్థల్లో విద్యార్థుల చేరికల్లో తగ్గుదల, ఆదాయం తగ్గిపోవడం, పెరుగుతున్న ఖర్చులను ఎదుర్కోలేక తీవ్ర ఆర్థిక సంక్షోభానికి దారితీస్తోంది. అక్కడి కళాశాలల దీర్ఘకాలిక మనుగడకు ముప్పుగా పరిణమించింది. వీసా నిబంధనల్లో మార్పులు కొత్త వీసా పరిమితుల కారణంగా యూఎస్ మిడ్ టైర్ కళాశాలల్లో విద్యార్థుల చేరికలు క్షీణించి.. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య తగ్గడంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. ముఖ్యంగా ట్యూషన్ ఆధారిత సంస్థలకు మూసివేత ప్రమాదం పెరుగుతోంది. ఎలైట్ విశ్వవిద్యాలయాలు స్థిరంగా ఉన్నప్పటికీ చిన్న సంస్థలు మాత్రం మనుగడ కోసంసిబ్బందితోపాటు ఇతర కార్యక్రమాలనూ తగ్గించుకుంటున్నాయి. సీఎన్బీసీ సూచించిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఫిలడెల్ఫియా పరిశోధన ప్రకారం.. అమెరికా ఉన్నత విద్యారంగంలో మూసివేతలు, విలీనాలు త్వరలో సంభవించే మాంద్యంతో వేగవంతం అవుతున్నట్టు అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు టెడ్ మిచెట్ ప్రకటించడం గమనార్హం. లక్షన్నర విద్యార్థుల తగ్గుదల అమెరికా కళాశాలల్లో స్థానికంగా చేరికలు తగ్గడంతో పాటు అంతర్జాతీయ విద్యార్థుల రాక ఆగిపోవడంతో సమస్య మరింత తీవ్రం అవుతోంది. అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేటర్స్ అంచనా ప్రకారం 2025–26 విద్యా సంవత్సరంలో అంతర్జాతీయ విద్యార్థుల నమోదులో ఏకంగా 1.50 లక్షల వరకు తగ్గుదల ఏర్పడనుంది. ఇది కొత్త అంతర్జాతీయ విద్యార్థుల చేరికల్లో 30–40 శాతం కాగా.. మొత్తం విద్యార్థులపై 15 శాతం తగ్గుదలను సూచిస్తోంది. ఈ ఫలితాల ప్రకారం అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏడాదికి రూ.58 వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని నివేదిక పేర్కొంది. ఈ ఒత్తిళ్ల ఫలితంగా కొన్ని సంస్థలు మనుగడ సాగించలేని ఆర్థిక వాతావరణం ఏర్పడుతోంది. ఇది ట్రంప్ ఆంక్షల ఎఫెక్టే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన విధాన మార్పులే యూఎస్ విద్యాసంస్థల సంక్షోభానికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. వాస్తవానికి అమెరికన్ సంస్థలకు అంతర్జాతీయ విద్యార్థులు చాలాకాలంగా కీలకమైన ఆర్థిక స్తంభంగా నిలుస్తున్నారు. ఈ విద్యార్థులు పూర్తి ట్యూషన్ ఫీజులు చెల్లిండంతో పాటు జీవన వ్యయాల ద్వారా ఆదాయాన్ని సమకూరుస్తున్నారు. 2024–25లో అంతర్జాతీయ విద్యార్థుల ద్వారా అమెరికాకు ఏటా రూ.4.09 లక్షల కోట్లను అమెరికా ఆర్థిక వ్యవస్థకు అందించారు. వాస్తవానికి పూర్తిగా ట్యూషన్ ఫీజులు చెల్లించే అంతర్జాతీయ విద్యార్థులు దేశీయ విద్యార్థులకు స్కాలర్íÙప్లను అందించేందుకు పరోక్షంగా దోహదపడుతున్నారు. ఇది ఒకరితో ఒకరికి ముడి ఉన్న సంబంధం. అంతర్జాతీయ విద్యార్థులు తగ్గితే ఆదాయం క్షీణించడంతో పాటు స్థానిక విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించే సంస్థల సామర్థ్యం పతనం అవడం ఖాయంగా కనిపిస్తోంది. ట్యూషన్ ఫీజులపైనే ఆధారంఅమెరికాలోని ఉన్నత విద్యారంగం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అనేక విద్యాసంస్థలు ఆయా రాష్ట్రాలు విధించిన పరిమితుల కారణంగా ట్యూషన్ ఫీజులు పెంచుకోలేకపోతున్నాయి. ఇదే సందర్భంలో ఖర్చులు ఏమాత్రం తగ్గడం లేదు. కేవలం ట్యూషన్ ఫీజులపై ఆధారపడి నడిచే కళాశాలలు కోల్పోయిన ఆదాయాన్ని భర్తీ చేయడానికి నానాతంటాలు పడుతున్నాయి. దానాల ద్వారా వచ్చే నిధులు కలిగిన ఎలైట్ విద్యాసంస్థలకు తక్కువ ప్రమాదం ఉంది. రాష్ట్రాల మద్దతుతో నడిచే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మధ్యస్థంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా, చిన్న, మధ్యస్థాయి ట్యూషన్ ఫీజుల ఆధారిత కళాశాలలు మాత్రం కునారిల్లుతున్నాయి. హార్వర్డ్, కొలంబియా, న్యూయార్క్ వర్సిటీ వంటి అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు పెద్ద చార్జీల నిధులు, స్థిరమైన అంతర్జాతీయ డిమాండ్ కారణంగా బాగానే ఉన్నాయి. కానీ.. చిన్న సంస్థలు తమ కార్యకలాపాలను తగ్గించుకుంటున్నాయి. క్యాంపస్ అప్గ్రేడ్ వాయిదా, సిబ్బంది సంఖ్యను తగ్గించుకుంటూ నిధులను ఆదా చేసుకుంటున్నాయి. -
గ్రీన్ కార్డు ఇంటర్వ్యూ మరింత కఠినం
వాషింగ్టన్: అమెరికాలో ఉంటున్న వేలాదిమంది భారతీయులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రీన్ కార్డ్ పైనా ట్రంప్ ప్రభుత్వం దృష్టిపడింది. ఇటీవలే భారతీయులు ఎక్కువగా ఉపయోగించుకునే హెచ్1బీ వీసాపై కఠిన చర్యలను ప్రకటించడం తెల్సిందే. ఇప్పుడిక గ్రీన్కార్డు దరఖాస్తుదారుల ఇంటర్వ్యూ ప్రక్రియలో కఠినతరమైన నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఇంటర్వ్యూల పరిధి మరింత విస్తృతం కానుంది. పరీక్ష కూడా కఠినంగా మారనుంది. దరఖాస్తుదారుల సత్ప్రవర్తనపై ఇమిగ్రేషన్ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేపడతారు. కొత్త విధానం ఈ నెల 20వ తేదీ నుంచే అమల్లోకి రానుండటం గమనార్హం. అమెరికా విలువలను పూర్తిగా స్వీకరించే వారు మాత్రమే పౌరులయ్యేలా చూడటమే ఈ మార్పుల లక్ష్యమని యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) చెబుతోంది. ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూలు నిర్వహించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా హోమ్ల్యాండ్ డిఫెండర్స్ పేరుతో అధికారులను కూడా నియమిస్తోంది. అయితే, దరఖాస్తు దారులకు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి రెండంటే రెండు అవకాశాలు మాత్రమే ఉంటాయి. రెండో ప్రయత్నంలో విఫలమైతే వారికి పౌరస త్వాన్ని తిరస్కరిస్తారని తెలిపింది. అమెరికా లో ఒక వ్యక్తిని శాశ్వత నివాసి అని చూపే అధికారిక గుర్తింపు పత్రమే గ్రీన్ కార్డ్. హోల్డర్లను అధికారికంగా చట్టబద్ధమైన శాశ్వత నివాసులుగా పిలుస్తారు. ఈ విధానం సమగ్రతను స్థాపించడమే తాజా మార్పుల లక్ష్యమని యూఎస్సీఐఎస్ అంటున్నప్పటికీ, వలసదారుల ఉద్దేశాలను సందేహించే అవకాశం ఉందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పౌరశాస్త్ర పరీక్ష. కొత్తగా ప్రవేశపెట్టే ఈ పరీక్షలో దరఖాస్తుదారులకు అమెరికా చరిత్ర, ప్రభుత్వంపై ఉన్న అవగాహనను అంచనా వేస్తారు. మొత్తం 128 ప్రశ్నల నుంచి దరఖాస్తుదారులు 20 ప్రశ్నలను ఎన్నుకుని 12 ప్రశ్నలకు సమాధానం సరిగ్గా ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో 10 ప్రశ్నల్లో ఆరింటికి సరైన సమాధానం ఇవ్వాల్సి ఉండేది. ఈ పరీక్షతోపాటు అభ్యర్థుల సత్ప్రవర్తనను ఇమిగ్రేషన్ అధికారులు అంచనా వేయడం కూడా కఠినతరమైందే. కేవలం నేర రహిత ప్రవర్తన ఉంటే చాలదు. అమెరికా సమాజానికి సానుకూలంగా చేసిన మేలును కూడా చూస్తారు. ఇందులో, 1991 నుంచి వారి చుట్టుపక్కల వారిని సైతం విచారిస్తారు. దరఖాస్తుదారులు తెలిసిన సహ ఉద్యోగులు, సంబంధిత సంస్థల యజమానులు, ఇతరులను కూడా ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూలు చేసి, ప్రవర్తనను బేరీజు వేస్తారు. ఇందులోనూ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండొచ్చు. దీని వల్ల భారతీయులపై ప్రత్యేకంగా వివక్ష చూపే అవకాశముందన్న ఆందోళనలు వ్యక్తమవుతు న్నాయి. అమెరికాలోని వలసదారుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. వేలాది మంది భారతీయులకు గ్రీన్కార్డు ఉంది. పెద్ద సంఖ్యలో భారతీయులు ఎన్నో ఏళ్లుగా ఈ ‘పచ్చకార్డు’కోసం ఎదురు చూస్తున్నారు. 2024 గణాంకాల ప్రకారం అమెరికా పౌరుల్లో 6.1 శాతం, అంటే 49,700 మంది భారతీయులున్నారు. ఈ విషయంలో అమెరికాకు పొరుగునున్న మెక్సికో మొదటిస్థానంలో నిలిచింది. -
అమెరికాలో షట్డౌన్
వాషింగ్టన్: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో మరో అలజడి మొదలైంది. కీలకమైన స్టాప్గ్యాప్ ఫండింగ్ బిల్లుకు సెనేట్లో ఆమోదం లభించలేదు. విపక్ష డెమొక్రటిక్ పార్టీ సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. గడువు ముగిసినా బిల్లు నెగ్గకపోవడంతో ట్రంప్ ప్రభుత్వం దేశంలో షట్డౌన్ ప్రకటించింది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఇది అమల్లోకి వచ్చింది. దీంతో అత్యవసరం కాని ప్రభుత్వ సేవలు, కార్యకలాపాలు నిలిచిపోయాయి. పెద్ద సంఖ్యలో ఫెడరల్ ఉద్యోగులను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు ట్రంప్ సంకేతాలిచ్చారు. ‘బుధవారం తెల్లవారుజాము 00:01 గంటల’ను సూచించే టైమర్ చిత్రాన్ని ‘డెమొక్రటిక్ షట్డౌన్’ పేరిట వైట్హౌస్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అమెరికాలో 1981 తర్వాత ఇది 15వ షట్డౌన్ కాగా, గత ఏడేళ్లలో ఇది రెండోసారి. చాలావరకు ఈ షట్డౌన్లు కేవలం కొన్ని రోజులపాటే కొనసాగాయి. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైనప్పుడు 2018 డిసెంబర్లో షట్డౌన్ ప్రకటించారు. దేశ సరిహద్దుల్లో గోడ నిర్మాణం కోసం భారీగా నిధులు ఖర్చు చేయడానికి సెనేట్ అంగీకరించలేదు. ఫలితంగా షట్డౌన్ అమల్లోకి వచ్చింది. 35 రోజులపాటు కొనసాగింది. ఆధునిక అమెరికా చరిత్రలో ఇదే అత్యధిక కాలం కొనసాగిన షట్డౌన్ కావడం గమనార్హం. 2013లో బరాక్ ఒబామా ప్రభుత్వ హయాంలో 16 రోజులపాటు షట్డౌన్ కొనసాగింది. ఆరోగ్య ప్రయోజనాలపైనే ప్రతిష్టంభన ప్రభుత్వ పరిపాలనకుగాను స్వల్పకాలానికి (ఈ ఏడాది నవంబర్ 21వ తేదీ దాకా) నిధులు విడుదల చేసేందుకు ఉద్దేశించినదే స్టాప్గ్యాప్ ఫండింగ్ బిల్లు. దీన్ని షార్ట్–టర్మ్ గవర్నమెంట్ స్పెండింగ్ బిల్లు అని కూడా అంటారు. త్వరలో గడువు తీరిపోనున్న ఆరోగ్య ప్రయోజనాలను పొడిగించాలని డెమొక్రాట్లు పట్టుబట్టగా, అధికార రిపబ్లికన్లు తిరస్కరించారు. ఈ అంశాన్ని ప్రత్యేకంగా పరిగణించాలని, బిల్లులో చేర్చడానికి వీల్లేదని తేలి్చచెప్పారు. ఆరోగ్య ప్రయోజనాలను పొడిగిస్తే ప్రభుత్వ ఖజానాపై పెనుభారం పడుతుందని స్పష్టంచేశారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని సూచించారు. దాంతో సెనేట్లో బిల్లుకు విపక్ష డెమొక్రాట్లు సుముఖత వ్యక్తంచేయలేదు. అమెరికా కాంగ్రెస్ ఉభయసభల్లో ట్రంప్ పారీ్టకి మెజార్టీ ఉన్నప్పటికీ.. సెనేట్లో మెజార్టీ లేకపోవడంతో స్టాప్గ్యాప్ ఫండింగ్ బిల్లు నెగ్గలేదు. షట్డౌన్ ముగించడంపై ఓటింగ్ విఫలం షట్డౌన్ను తక్షణమే ముగించడానికి బుధవారం సెనేట్లో ఓటింగ్ నిర్వహించారు. డెమొక్రాట్లు అంగీకరించకపోవడంతో ఓటింగ్ విఫలమైంది. ఆరోగ్య రంగానికి సబ్సిడీలు ఇవ్వాలని, అందుకు నిధులు కేటాయించాలన్న తమ డిమాండ్ పట్ల వారు వెనక్కి తగ్గలేదు. ఇదిలా ఉండగా, తాజా షట్డౌన్ ఎన్నిరోజులు కొనసాగుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇప్పుడేం జరగొచ్చు? → షట్డౌన్ విధించిన నేపథ్యంలో అత్యవసర సేవల్లో ఉన్న ఉద్యోగులు మాత్రమే విధుల్లో కొనసాగుతారు. అయితే, షట్ డౌన్ ముగిసేదాకా వారికి వేతనాలు చెల్లించరు. → అత్యవసర సేవల్లో లేని సిబ్బందిని విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తారు. 7.50 లక్షల మందిని తొలగించే అవకాశం ఉంది. వారికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరిహారం రోజుకు 400 మిలియన్ డాలర్ల దాకా ఉండొచ్చని అంచనా. → ఎఫ్బీఐ, సీఐఏ అధికారులు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, ఎయిర్పోర్టు సిబ్బంది, హోంల్యాండ్సెక్యూరిటీ అధికారులు యథావిధిగా విధుల్లో కొనసాగుతారు. సైనిక దళాలు ఎప్పటిలాగే పనిచేస్తాయి. → సోషల్ సెక్యూరిటీ చెల్లింపులకు ఆటంకాలు ఉండవు. ఆరోగ్య బీమాపై వైద్య సేవలు పొందవచ్చు. ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు పనిచేస్తాయి. → పోస్టల్ సర్వీసులు కొనసాగుతాయి. → తమ సిబ్బందిలో 90 శాతం మందిని తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు అమెరికా విద్యాశాఖ ప్రకటించింది. → మ్యూజియంలు, జంతు ప్రదర్శనశాలలు, జాతీయ ఉద్యానవనాలు మూతపడుతున్నాయి. -
పాక్ దళాల కాల్పుల్లో ఎనిమిది మంది నిరసనకారులు మృతి
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుసగా మూడవ రోజు జరిగిన హింసాత్మక నిరసనల్లో బుధవారం ఎనిమిది మంది పౌరులు మరణించారు. బాగ్ జిల్లాలోని ధిర్కోట్లో నలుగురు మృతిచెందారని, ముజఫరాబాద్లో ఇద్దరు, మీర్పూర్లో ఇద్దరు మృతిచెందారని ఎన్డీటీవీ తెలిపింది. మరణించిన నిరసనకారుల సంఖ్య 10కి చేరుకుందని అధికారవర్గాలు తెలిపాయి.‘ప్రాథమిక హక్కుల ఉల్లంఘన’పై అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో గత 72 గంటలుగా భారీ నిరసనలు జరగడంతోపాటు మార్కెట్లు, దుకాణాలను పూర్తిగా మూసివేశారు. రవాణా సేవలను కూడా నిలిపివేశారు. దీంతో జనజీవనం అతలాకుతలయ్యింది. బుధవారం ఉదయం నిరసనకారులు ముజఫరాబాద్లో షిప్పింగ్ కంటైనర్లపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో పలువులు నిరసరకారులు మృతి చెందారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని జనం అటు పాకిస్తాన్ ప్రభుత్వం, ఆ దేశ ఆర్మీకి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాల తరబడి కొనసాగుతున్న దోపిడీ, పేదరికానికి వ్యతిరేకంగా అక్కడి జనం తిరగబడుతున్నారు. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీ ఈ ఉద్యమాలను అణిచివేస్తోంది. అయితే ప్రజలు మరింతగా తిరగబడుతున్నారు. ఆర్మీ, పోలీసులపై దాడులు చేస్తున్నారు. ఆర్మీ వాహనాలను నదుల్లోకి విసిరేస్తున్నారు.గత రెండు రోజులుగా ప్రజలు సైన్యం-పోలీసులకు ఎదురుతిరుగుతున్నారు. పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో 10 మందికి పైగా మరణించినట్లు సమాచారం. వందలాది మంది గాయపడ్డారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ అల్లర్లను కవర్ చేసేందుకు అక్కడి మీడియాకు అనుమతినివ్వడం లేదు. 70 ఏళ్లుగా తమను అణిచివేసి, తమ వనరుల్ని కొల్లగొడుతున్నారని, తమ ప్రాథమిక హక్కుల్ని హరిస్తున్నారని నిరసనకారులు అంటున్నారు. అక్టోబర్ 1న పీఓకేలోని ముజఫరాబాద్ వరకూ లాంగ్ మార్చ్ చేపడతామని నిరసనకారులు ప్రకటించారు. -
Gaza: ఆహారానికి బదులుగా లైంగిక దోపిడీ.. భయానక స్థితిలో మహిళలు
గాజా: యుద్ధంతో అట్టుడికిపోతున్న గాజాలో దుర్భర పరిస్థితులు తాండవిస్తున్నాయి. అక్కడి ప్రజలు సహాయం కోసం నిరంతరం ఎదురు చూస్తున్నారు. ఆహార కొరత, ఉద్యోగాలు కనుమరుగు కావడం లాంటివి ఇక్కడి జనాభాను తీవ్రంగా కుంగదీశాయి. దీనిని అనువుగా మలచుకున్న కొందరు పురుషులు సహాయం మాటున లైంగిక దోపిడీకి పాల్పడుతున్నారని స్థానిక మహిళలు చెబుతున్నారు.ఆరుగురు పిల్లల కోసం..దక్షిణ గాజా స్ట్రిప్లోని ఖాన్ యునిస్లోని ఛారిటీ కిచెన్ నుండి ఆహారాన్ని అందుకునేందుకు ఎదురుచూస్తున్న మహిళలు తమ దుర్భర స్థితిని ‘అసోసియేటెడ్ ప్రెస్’ ముందు వెళ్లగక్కారు. తన ఆరుగురు పిల్లలకు ఆహారం అందించేందుకు వారాల తరబడి ఎదురు చూశానని 38 ఏళ్ల ఒక తల్లి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించింది. ఒక వ్యక్తి తనకు సేవా సంస్థలో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చాడని, తరువాత అతను ఒక ఖాళీ అపార్ట్మెంట్కు తీసుకెళ్లాడని తెలిపింది. దీంతో తాను అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని అనుకున్నానని, అయితే తాను ఆహారం కోసం అతను చెప్పినట్లు చేయల్సి వచ్చిందని తెలిపారు. తరువాత అతను కొంత నగదు, ఆహారం ఇచ్చాడని, దీంతో పిల్లల ఆకలి తీర్చానని ఆమె వివరించింది. అయితే అతను చెప్పినట్లు ఉద్యోగం ఇవ్వలేదని పేర్కొంది. ఆహారానికి బదులుగా కొందరు పురుషులు లైంగిక దోపిడీకి ఎలా పాల్పడుతున్నారనే దానికి ఈ ఘటన ఉదాహరణగా నిలిచింది.సర్వసాధారణంగా లైంగిక దోపిడీ గాజాలో సహాయం అందిస్తున్న సంఘాలు మానవ హక్కుల న్యాయవాదులు ఇటువంటి ఘటనలు ఇక్కడ సర్వసాధారణంగా మారిపోయాయన్నారు. దక్షిణ సూడాన్ నుండి హైతీ వరకు యుద్ధ భూముల్లో ఇలాంటివి నిత్యం కనిపిస్తున్నాయన్నారు. మానవతా సంక్షోభాలు ప్రజలను అనేక విధాలుగా దుర్బలంగా మారుస్తాయనేది భయంకరమైన వాస్తవమని హ్యూమన్ రైట్స్ వాచ్లోని మహిళా హక్కుల విభాగం అసోసియేట్ డైరెక్టర్ హీథర్ బార్ పేర్కొన్నారు. గాజాలో మహిళలు, బాలికలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్నారు. సహాయం అందుకునే నేపధ్యంలో లైంగిక దోపిడీకి గురైన కొందరు మహిళలకు చికిత్స చేసినట్లు పాలస్తీనియన్ మనస్తత్వవేత్తలు తెలిపారు. లైంగిక దోపిడీకి గురైన మహిళల్లో కొందరు గర్భవతులయ్యారన్నారు.పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులు35 ఏళ్ల ఒక వితంతువువు ఒకరు మీడియాతో మాట్లాడుతూ సహాయక స్థలంలో యూనిఫాంలో ఉన్న ఒక వ్యక్తి తనకు ఒక నంబర్ ఇచ్చి, అర్థరాత్రి ఫోన్ చేశాడని తెలిపారు. దీనిపై తాను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, వారు కాల్ రికార్డింగ్స్ అవసరమని చెప్పారని, తాను వాటిని అందించలేకపోయానని ఆమె తెలిపింది. కాగా గత ఏడాది గాజాలో 18 లైంగిక వేధింపుల ఆరోపణలను నమోదు చేసినట్లు పీఎస్ఈఏ నెట్వర్క్ తెలిపింది. మరో ఉదంతంలో 29 ఏళ్ల ఒక తల్లి తన నలుగురు పిల్లలకు ఆహారం అందించేందుకు బదులుగా ఒక సహాయ కార్యకర్త తనను వివాహం చేసుకోవాలని వేధించాడని ఆరోపించింది. తాను అందుకు నిరాకరించానని పేర్కొంది. -
ట్రంప్ పుణ్యమాని.. అమెరికాకు భారీ నష్టం తప్పదా?
వాషింగ్టన్: కీలకమైన బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్డౌన్ను ఎదుర్కొంటోంది. మంగళవారం అర్ధరాత్రి దాకా కీలకమైన నిధుల బిల్లు విషయంలో సెనేట్లో హైడ్రామా నడిచింది. రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల మధ్య ఎంతకీ పొంతన కుదరలేదు. దీంతో, అమెరికా ప్రభుత్వం షట్డౌన్లోకి వెళ్లింది. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మొదలుకాగానే (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9.30కి) ఈ ప్రక్రియ ప్రారంభమైంది.అయితే, అమెరికాలో షట్డౌన్ మొదలైతే ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేము. 2018-19 మధ్య దాదాపు 35 రోజుల పాటు మూతపడింది. నాడు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నారు. అమెరికా చరిత్రలోనే అది సుదీర్ఘమైన షట్డౌన్గా నిలిచింది. ఇక, ఈసారి షట్డౌన్ ఎన్ని రోజులు కొనసాగనుంది అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఈ షట్డౌన్ కారణంగా అమెరికా తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.గత షట్డౌన్ (2018–19) నష్టం..35 రోజుల పాటు కొనసాగిన ఈ షట్డౌన్ అమెరికా చరిత్రలోనే అత్యంత దీర్ఘమైనది. Congressional Budget Office (CBO) అంచనా ప్రకారం.. 11 బిలియన్ డాలర్ల మేరకు అమెరికా ఆర్థిక వ్యవస్థకు తాత్కాలిక నష్టం వాటిల్లింది. ఇందులో 3 బిలియన్ డాలర్ల మేరకు జీడీపీ స్థిరంగా కోల్పోయింది. అంటే తిరిగి పొందలేని నష్టం ఇది. దీంతో.. 8,00,000 ప్రభుత్వ ఉద్యోగులు జీతం లేకుండా సెలవులోకి వెళ్లారు.భారీ నష్టం తప్పదా?..ప్రస్తుత షట్డౌన్ (2025) నష్టం అంచనా ప్రకారం.. దాదాపు 1,00,000 మంది ఫెడరల్ ఉద్యోగులు రేపటికి రాజీనామా చేయవచ్చని అంచనా ఉంది. దీంతో, 85% నష్టం వాటిల్లే అవకాశం ఉందని తాజా అంచనాలు సూచిస్తున్నాయి. పాస్పోర్ట్, వీసా, పబ్లిక్ మీడియా, ఆరోగ్య బీమా సబ్సిడీలు వంటి సేవలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. ఫెడరల్ కాంట్రాక్టర్లు, చిన్న వ్యాపారాలు, పరిశోధన సంస్థలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవచ్చు. జీడీపీ, ఉద్యోగ గణాంకాలు, ద్రవ్యోల్బణ సూచికలు వంటి కీలక డేటా సేకరణలు నిలిపివేయబడతాయి. దీని వల్ల మార్కెట్లలో అనిశ్చితి పెరుగుతుంది. దీంతో, ఎంత మేరకు నష్టం వాటిల్లుతుందో అనే ఆందోళన అమెరికన్లలో నెలకొంది.గతంలో.. అమెరికా 1981 నుంచి ఇప్పటివరకు 15 సార్లు షట్డౌన్ను ఎదుర్కొంది(అన్నీ తక్కువ రోజుల వ్యవధిలోనే). 2018లో మాత్రం ట్రంప్ హయాంలో బోర్డర్ వాల్ డిమాండ్ కారణంగా 35 రోజుల షట్డౌన్ జరిగింది.. అమెరికా చరిత్రలో ఇప్పటిదాకా అయితే ఇది ఎక్కువ రోజులు. ఇదిలా ఉండగా.. గత ఆరు సంవత్సరాల్లో ఫెడరల్ ప్రభుత్వం షట్డౌన్ కావడం ఇదే ప్రథమం.Folks — this is not a normal government shutdown.Let me explain the stakes and how we got here. pic.twitter.com/nVjXHbbghI— Robert Reich (@RBReich) October 1, 2025ఎందుకీ షట్డౌన్?ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న అమెరికా ఫెడరల్ ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ప్రారంభిస్తుంది. ప్రభుత్వం నడవడానికి అవసరమైన నిధులు కాంగ్రెస్ (House & Senate) ద్వారా ఆమోదించాలి. ఈ సంవత్సరం, రిపబ్లికన్లు తాత్కాలిక నిధుల బిల్లును ప్రవేశపెట్టారు, కానీ డెమొక్రాట్లు ఆరోగ్య బీమా (Affordable Care Act) సబ్సిడీల పొడిగింపును కోరారు. రిపబ్లికన్లేమో ఆ ఆరోగ్య బీమా అంశాన్ని బడ్జెట్ చర్చల నుంచి వేరుగా చర్చించాలని అన్నారు. దీంతో తాత్కాలిక నిధుల బిల్లు ఆమోదం పొందలేదు. ఫలితంగా.. ప్రభుత్వం నిధుల్లేకుండా నిలిచిపోయింది.ఈ క్రమంలో.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వివాదాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చారు. ‘‘షట్డౌన్ వస్తే, ఉద్యోగాల తొలగింపులు జరుగుతాయి. వాళ్లు డెమొక్రాట్లు అవుతారు’’ అంటూ ఆయన హెచ్చరించారు(Trump on Shutdown). ఆ వెంటనే వైట్హౌస్ వర్గాలు ఫెడరల్ ఏజెన్సీలకు షట్డౌన్ ప్రణాళికలు అమలు చేయమని ఆదేశించాయి. సాధారణంగా నిధుల బిల్లు(Funding Bill) ఆమోదం పొందకపోతే.. ప్రభుత్వం వద్ద ఖర్చు చేయడానికి అధికారిక నిధులు ఉండవు. అప్పుడు షట్డౌన్ ఏర్పడుతుంది. షట్డౌన్ అనేది ప్రభుత్వ నిధుల కొరత వల్ల తాత్కాలికంగా సేవలు నిలిపివేయాల్సిన పరిస్థితి. ఇది ప్రజలపై, ఆర్థిక వ్యవస్థపై, అంతర్జాతీయ సంబంధాలపై కూడా ప్రభావం చూపుతుంది. Trump said he wanted a shutdown so that he could destroy government programs and fire Democrats working for the federal government THREE TIMES TODAY ALONE! This is Donald Trump's shutdown. He wanted it. pic.twitter.com/TEJJLRQTiG— Home of the Brave (@OfTheBraveUSA) October 1, 2025 -
అమెరికా షట్డౌన్తో భారత వాణిజ్యంపై ప్రభావం ఎంత?
అమెరికా ప్రభుత్వం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలో ఆరేళ్ల తర్వాత షట్డౌన్లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో భారత వాణిజ్యంపై పడే ప్రభావాల గురించి చర్చ జరుగుతోంది. అమెరికా షట్డౌన్ ప్రభావం భారత వాణిజ్యంపై తప్పకుండా ఉంటుంది. అయితే ఆ ప్రభావం తీవ్రత షట్డౌన్ ఎంత కాలం కొనసాగుతుందనే దానిపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.అమెరికా ప్రభుత్వం షట్డౌన్ అంటే ఏమిటి?అమెరికా ప్రభుత్వం షట్డౌన్ (Government Shutdown) అంటే ఫెడరల్ ప్రభుత్వానికి తాత్కాలికంగా నిధులు నిలిచిపోవడం అని అర్థం. అమెరికాలో ఫెడరల్ ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులు కేటాయించడానికి అక్కడి పార్లమెంట్ (కాంగ్రెస్) ‘బడ్జెట్ బిల్లులు’ లేదా ‘అప్రాప్రియేషన్ బిల్లులు’ ఆమోదించాలి. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే ఈ నిధుల బిల్లులు ఆమోదం పొందాలి.ఒకవేళ కాంగ్రెస్ (సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) తమలో తాము విభేదాల కారణంగా లేదా రాజకీయ కారణాల వల్ల ఆ గడువులోపు ఈ బిల్లులను ఆమోదించడంలో విఫలమైతే, ప్రభుత్వం వద్ద ఖర్చు చేయడానికి చట్టబద్ధంగా నిధులు ఉండవు. నిధులు లేకపోవడంతో అమెరికాలోని అత్యవసరం కాని (Non-Essential) అన్ని ప్రభుత్వ విభాగాలు, సర్వీసులు నిలిచిపోతాయి (షట్డౌన్ అవుతాయి).ఎందుకు ఇలా జరుగుతుంది?ప్రధానంగా పాలక పార్టీలు, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ విభేదాలు తీవ్రంగా ఉన్నప్పుడు షట్డౌన్ ఏర్పడుతుంది. ఆరోగ్య సంరక్షణ, రక్షణ, సరిహద్దు భద్రత లేదా వలస విధానాల వంటి అంశాలపై ఏ పార్టీ ఎంత ఖర్చు చేయాలనే విషయంలో రాజీ కుదరకపోతే ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయి. నిధుల బిల్లు ఆమోదాన్ని అడ్డుకుని తమకు కావాల్సిన ఇతర రాజకీయ డిమాండ్లు లేదా విధాన మార్పులను బడ్జెట్లో చేర్చాలని ఏదైనా ఒక పార్టీ పట్టుబడితే కూడా షట్డౌన్ వస్తుంది.ఈ సమయంలో ఏం జరుగుతుంది?అత్యవసరం కాని సేవలు నిలిపేస్తారు. జాతీయ పార్కులు మూసివేస్తారు. మ్యూజియంలు, అనేక ప్రభుత్వ కార్యాలయాలు మూతపడతాయి. పరిశోధన, గ్రాంట్ల జారీ, కొన్ని రకాల నియంత్రణ (Regulatory) తనిఖీలు నిలిచిపోతాయి. అయితే అత్యవసర సేవలను మాత్రం కొనసాగిస్తారు. జాతీయ భద్రత, సైనిక కార్యకలాపాలు, విమాన రాకపోకల నియంత్రణ (Air Traffic Control), సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి అత్యవసర సేవలు మాత్రం కొనసాగుతాయి.ఉద్యోగులపై ప్రభావంఅత్యవసరం కాని విభాగాల్లోని లక్షలాది మంది ఉద్యోగులకు జీతాలు లేకుండా సెలవు (Furlough) ఇస్తారు. అత్యవసర విధుల్లో ఉన్న ఉద్యోగులు జీతం లేకుండా పనిచేయాల్సి వస్తుంది. కాంగ్రెస్ షట్డౌన్ తర్వాత ఆమోదాన్నిబట్టి వారికి తర్వాత జీతాలు చెల్లిస్తారు. షట్డౌన్ అనేది అమెరికా ఆర్థిక వ్యవస్థకు, ప్రపంచ దేశాలకు అనిశ్చితిని కలిగించే ఒక అరుదైన రాజకీయ సంక్షోభం.భారత వాణిజ్యంపై ప్రభావంసాధారణంగా షట్డౌన్ కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు మాత్రమే ఉంటే భారత వాణిజ్యంపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. ఈ వార్తల కారణంగా ప్రపంచ మార్కెట్లు ముఖ్యంగా స్టాక్ మార్కెట్లు, డాలర్ విలువలో అస్థిరత ఏర్పడవచ్చు. దీని ఫలితంగా భారతీయ స్టాక్ మార్కెట్లు కూడా కొంత ఒడిదుడుకులకు లోనుకావచ్చు. షట్డౌన్ కారణంగా కీలకమైన అమెరికా ఆర్థిక డేటా (ఉదాహరణకు ఉద్యోగాల నివేదికలు, ద్రవ్యోల్బణం లెక్కలు) విడుదల ఆలస్యం కావచ్చు. ఈ డేటా ఆధారంగానే పెట్టుబడిదారులు, సెంట్రల్ బ్యాంకులు (ఫెడ్) నిర్ణయాలు తీసుకుంటాయి. కాబట్టి ఈ అనిశ్చితి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.వీసా, ఇమ్మిగ్రేషన్ సేవల్లో ఆలస్యంఅమెరికా ప్రభుత్వ కార్యకలాపాలు నెమ్మదిస్తే భారతీయ వృత్తి నిపుణులకు లేదా వ్యాపారవేత్తలకు సంబంధించిన వీసా, ఇమ్మిగ్రేషన్ సేవల్లో ఆలస్యం జరగవచ్చు. భారతీయ కంపెనీలకు అమెరికాలో అవసరమైన కొన్ని నియంత్రణ అనుమతులు (Regulatory Approvals) లేదా లైసెన్సుల జారీలో ఆలస్యం ఏర్పడవచ్చు.ఇదీ చదవండి: కీలక వడ్డీ రేట్లు యథాతథం.. ఆర్బీఐ -
ఆరేళ్ల తర్వాత.. అమెరికా ప్రభుత్వ షట్డౌన్
అమెరికాలో ప్రభుత్వ షట్డౌన్(USA Shutdown) మొదలైంది. నిధుల బిల్లుకు అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం లభించకపోవడంతో.. బుధవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30కి) ఫెడరల్ సేవలు నిలిచిపోయాయి. దీంతో.. 7.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందులు మొదలయ్యాయి. అర్ధరాత్రి దాకా కీలకమైన నిధుల బిల్లు(Funding Bill) విషయంలో సెనేట్లో హైడ్రామా నడిచింది. రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల మధ్య ఎంతకీ పొంతన కుదరలేదు. దీంతో సెనేట్ తాత్కాలిక నిధుల బిల్లును తిరస్కరించగా.. షట్డౌన్ ఆందోళన నడుమ ఫెడరల్ సేవలు నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే.. గత ఆరుసంవత్సరాల్లో ఫెడరల్ ప్రభుత్వం షట్డౌన్ కావడం ఇదే. ఎందుకీ షట్డౌన్?ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న అమెరికా ఫెడరల్ ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరాన్ని ప్రారంభిస్తుంది. ప్రభుత్వం నడవడానికి అవసరమైన నిధులు కాంగ్రెస్ (House & Senate) ద్వారా ఆమోదించాలి. ఈ సంవత్సరం, రిపబ్లికన్లు తాత్కాలిక నిధుల బిల్లును ప్రవేశపెట్టారు, కానీ డెమొక్రాట్లు ఆరోగ్య బీమా (Affordable Care Act) సబ్సిడీల పొడిగింపును కోరారు. రిపబ్లికన్లేమో ఆ ఆరోగ్య బీమా అంశాన్ని బడ్జెట్ చర్చల నుంచి వేరుగా చర్చించాలని అన్నారు. దీంతో తాత్కాలిక నిధుల బిల్లు ఆమోదం పొందలేదు. ఫలితంగా.. ప్రభుత్వం నిధుల్లేకుండా నిలిచిపోయింది.ఈ క్రమంలో.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వివాదాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చారు. ‘‘షట్డౌన్ వస్తే, ఉద్యోగాల తొలగింపులు జరుగుతాయి. వాళ్లు డెమొక్రాట్లు అవుతారు’’ అంటూ ఆయన హెచ్చరించారు(Trump on Shutdown). ఆ వెంటనే వైట్హౌస్ వర్గాలు ఫెడరల్ ఏజెన్సీలకు షట్డౌన్ ప్రణాళికలు అమలు చేయమని ఆదేశించాయి.సాధారణంగా నిధుల బిల్లు(Funding Bill) ఆమోదం పొందకపోతే.. ప్రభుత్వం వద్ద ఖర్చు చేయడానికి అధికారిక నిధులు ఉండవు. అప్పుడు షట్డౌన్ ఏర్పడుతుంది. షట్డౌన్ అనేది ప్రభుత్వ నిధుల కొరత వల్ల తాత్కాలికంగా సేవలు నిలిపివేయాల్సిన పరిస్థితి. ఇది ప్రజలపై, ఆర్థిక వ్యవస్థపై, అంతర్జాతీయ సంబంధాలపై కూడా ప్రభావం చూపుతుంది. 📌షట్డౌన్ ఎందుకు జరుగుతుంది?రాజకీయ విభేదాలు వల్ల బడ్జెట్ బిల్లు ఆమోదం పొందకపోవడంపార్టీల మధ్య రాజీ లేకపోవడంప్రాధాన్యతలపై విభేదాలు.. ఉదాహరణకు ఆరోగ్య సంరక్షణ, పన్ను విధానాలు, వలస చట్టాలు🛑 షట్డౌన్ జరిగితే.. నాన్-ఎసెన్షియల్ (అత్యవసరంకాని) సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడతాయిఫెడరల్ ఉద్యోగులుకి వేతనం లేకుండా సెలవు ఇవ్వబడుతుందిప్రభుత్వ కార్యాలయాలు, మ్యూజియంలు, జాతీయ పార్కులు మూసేస్తారువీసా ప్రాసెసింగ్, రుణాల మంజూరు, పరిశోధన కార్యక్రమాలు ఆలస్యమవుతాయి👨✈️ ఎవరిపై ప్రభావం ఉండదు?సైనికులు, సరిహద్దు అధికారులు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు వంటి అత్యవసర సేవల ఉద్యోగులు పని చేస్తారు. కానీ జీతాలు తర్వాతే చెల్లిస్తారుసోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి సేవలు కొనసాగుతాయి🕰️ గతంలో..అమెరికా 1981 నుంచి ఇప్పటివరకు 15 సార్లు షట్డౌన్ను ఎదుర్కొంది(అన్నీ తక్కువ రోజుల వ్యవధిలోనే)2018లో మాత్రం ట్రంప్ హయాంలో బోర్డర్ వాల్ డిమాండ్ కారణంగా 35 రోజుల షట్డౌన్ జరిగింది.. అమెరికా చరిత్రలో ఇప్పటిదాకా అయితే ఇది ఎక్కువ రోజులుఇదీ చదవండి: ఓహో.. ట్రంప్తో మునీర్ అంత మాట అన్నాడా? -
ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం.. 69 మంది మృతి!
ఆగ్నేయాసియా దేశం ఫిలిప్పీన్స్ను భారీ భూకంపం కుదిపేసింది(Philippines Earthquake). మంగళవారం రాత్రి మధ్య సెబు(Cebu Earthquake) ద్వీపం కేంద్రంగా .. రిక్టర్స్కేల్పై 6.9 తీవ్రతతో భారీగా భూమి కంపించింది. ఇప్పటిదాకా 69 మంది మరణించినట్లు అక్కడి మీడియా కథనాలు ఇస్తుండగా.. ఆ సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటిదాకా 150 మందికి గాయాలైనట్లు సమాచారం. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. మంగళవారం రాత్రి 9గం.59ని. సమయంలో భూమి కంపించింది. బోగో నగర ఈశాన్య దిశగా 17 కిలోమీటర్ల దూరంలో.. 5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం నమోదు అయ్యింది. ఈ లోతు భూకంపాన్ని.. శాలో భూకంపం (shallow earthquake) గా పరిగణిస్తారు. ఈ తరహా భూకంపాలు ఎక్కువ నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. తాజా ప్రకంపనల ధాటికి ఇళ్లు, ఆఫీసులు కూలిపోగా.. రోడ్లు, బ్రిడ్జిలు దెబ్బ తిన్నాయి. A powerful offshore #earthquake measuring 6.9 struck the central #Philippines late Tuesday, causing widespread panic as residents rushed into the streets, damaging a historic stone church, and triggering a local tsunami alert.#EarthquakeAlert pic.twitter.com/gTlq4soCw3— News9 (@News9Tweets) October 1, 2025భూకంపం ధాటికి రోడ్ల మీదకు పరుగులు తీసిన జనాలు.. రాత్రంతా రోడ్ల మీదే భయంతో జాగారం చేస్తూ ఉండిపోయారు. ప్రకంపనల ధాటికి ఇళ్ల గోడలు పగిలిపోయాయని, రోడ్లు చీలిపోయాయని, రాత్రంతా చీకట్లలోనే గడిపామని వాళ్లు అంటున్నారు. దాన్బంటాయన్ (Daanbantayan) సమీపంలో ఉన్న చారిత్రక రోమన్ కాథలిక్ చర్చ్ తీవ్రంగా దెబ్బతిందని అధికారులు ధృవీకరించారు. తీర ప్రాంతం అల్లకల్లోలంగా ఉండడంతో తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసి అధికారులు.. ముప్పు లేకపోవడంతో దానిని ఉపసంహరించుకున్నారు. ❗️ 🇵🇭 🔸️ Un puissant séisme de magnitude 6,9 a frappé le nord de l’île de #Cebu, aux #Philippines, provoquant des dégâts matériels, des coupures d’électricité et faisant au moins cinq morts selon les autorités.#PhilippinesEarthquake pic.twitter.com/KprgbRF8YO— Olivier Jorba (@OlivierJorba) October 1, 2025ప్రకంపనల ధాటికి బోగో చుట్టు పక్కల చాలా గ్రామాలు, పట్టణాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి కొండ చరియలు ఓ ఊరిపై విరిగిపడ్డాయని తెలుస్తోంది. ఆ ప్రాంతంలో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రాణ, ఆస్తి నష్టాల స్పష్టతపై మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. ఒక్క బోగోలోనే 14 మంది మరణించినట్లు సెబూ గవర్నర్ పమేలా బారిక్యువాట్రో ప్రకటించారు. సాన్ రెమిగియో పట్టణంలో ఆరుగురు మృతి చెందినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.A total of 26 deaths and 147 injuries were reported as of 8 a.m. Wednesday after a magnitude-6.9 #quake hit the central #Philippines the previous night, according to the National Disaster Risk Reduction and Management Council. pic.twitter.com/TNaDDfVckH— CGTN (@CGTNOfficial) October 1, 2025భారీ ప్రకంపనల ధాటికి సముద్ర అలలు ఎగసిపడడంతో సునామీ హెచ్చరికలు(Philippines Tsunami Alert) జారీ చేశారు. సెబూతో పాటు లెయిట్, బిలిరన్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే ఆ తర్వాత ఆ సునామీ ముప్పు లేదని ధృవీకరించుకున్నాక ఆ హెచ్చరికను ఎత్తేసినట్లు ఫిలిప్పీన్స్ వోల్కనాలజీ అండ్ సెస్మాలజీ సంస్థ డైరెక్టర్ టెరెసిటో బాకోల్కోల్ ప్రకటించారు.ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లో ఉన్న ఈ దేశంలో తరచూ భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలు కావడంతో పాటు ప్రతీ ఏటా పదుల సంఖ్యలో తుపానులు విరుచుకుపడుతూ తీవ్ర నష్టాన్ని కలగజేస్తుంటాయి. తాజాగా సెబు ద్వీపాన్నే తుపాను వణికించింది. దీని ధాటికి 26 మంది మరణించగా.. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ విపత్తు నుంచి తేరుకునేలోపే ఇప్పుడు భూకంపం తీవ్ర నష్టం కలిగించింది. ఇదీ చదవండి: మళ్లీ ట్రంప్ టారిఫ్ బాంబు -
నేపాల్కు కొత్త జీవన దేవత.. సింహాసనాన్ని అధిష్టించిన శాక్య
ఖాట్మాండు: నేపాల్లో కొత్త ‘కుమారి’ (జీవన దేవత)గా రెండున్నరేళ్ల చిన్నారి ఎంపికైంది. ఆర్య తార శాక్య మంగళవారం సంప్రదాయ ‘కుమారి’ సింహాసనాన్ని అధిష్టించింది. ఖాట్మండులోని తలేజు భవాని ఆలయ పూజారి ఉద్ధవ్ కర్మచార్య తెలిపిన వివరాలివి. మంగళవారం శుభ ముహూర్తంలో జరిగిన ప్రత్యేక వేడుకలో ఆర్య తార శాక్య.. అధికారికంగా ఖాట్మాండు నగరం మధ్యలో ఉన్న బసంతాపూర్లోని కుమారి గృహంలోకి ప్రవేశించింది.తొలి రుతుస్రావానికి ముందే ఎంపిక కుమారిని శాక్య జాతి బాలికల నుండి ఎంపిక చేస్తారు. అయితే, బాలికకు మొదటి రుతుస్రావం (రజస్వల) కాకముందే ఈ ఎంపిక జరుగుతుంది. ఇంతకుముందు కుమారిగా ఉన్న బాలిక, తన 12వ ఏట మొదటి రుతుస్రావమయ్యాక ఆ బాధ్యతల నుండి ఇటీవల తప్పుకుంది. ప్రస్తుతం కుమారిగా ఎంపికైన బాలిక వయసు 2 ఏళ్ల 8 నెలలని పూజారి తెలిపారు. కుమారిగా అర్హత సాధించడానికి.. ఈ చిన్నారి కఠినమైన ఎంపిక ప్రక్రియను ఎదుర్కొంది.ఎంపిక కఠినతరం కుమారిగా ఎంపికయ్యే బాలికకు రుతుస్రావం కారాదు. శరీరంపై ఎలాంటి గీతలు లేదా గాయాలు ఉండకూడదు. అన్నింటికన్నా నిర్భయంగా ఉండాలి. ఎంపిక ప్రక్రియలో భాగంగా, ఒక చీకటి గదిలో గేదె తల, భయంకరమైన ముసుగులను ఉంచుతారు. ఆ గదిలోంచి చిన్నారి భయపడకుండా బయటకు రావాలి. కొత్త కుమారిని కొద్ది రోజుల క్రితమే ఎంపిక కమిటీ ఎంపిక చేసింది. కుమారిని హిందువులు, బౌద్ధులు పూజిస్తారు. కుమారిని ఎంపిక చేసే శాక్య జాతిని బౌద్ధులుగా పరిగణించినప్పటికీ, కుమారిని మాత్రం హిందూ దేవతగా గౌరవిస్తారు. ఈ ద్వంద్వత్వం నేపాల్లో శతాబ్దాలుగా ఉన్న మత సామరస్యాన్ని సూచిస్తుంది.500–600 ఏళ్ల క్రితం నుంచే.. ఈ జీవన దేవత లేదా కుమారిని పూజించే సంప్రదాయం.. మల్ల రాజుల పాలనలో సుమారు 500 నుండి 600 ఏళ్ల క్రితం మొదలైంది. అయితే, ఖాట్మండు ప్రధాన ప్రాంతాలలో కుమారిని ఒక ప్రత్యేక రథంపై ఊరేగించే సంప్రదాయం, 18వ శతాబ్దం మధ్యలో చివరి మల్ల రాజు జయప్రకాశ్ మల్ల కాలంలో ప్రారంభమైంది. ఈ సమయంలోనే కుమారి కోసం ప్రత్యేక గృహమైన కుమారి ఘర్ కూడా నిర్మితమైంది. ఖాట్మండులోని హనుమాన్ధోకలో కుమారిని తలేజు దేవత మానవ రూపంగా భావిస్తారు. ప్రస్తుతం ఈ జీవన దేవత ఖాట్మండులో విదేశీ పర్యాటకులకు ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా మారింది. ఏటా ఆగస్టులో వచ్చే ఇంద్ర జాతర పండుగ సందర్భంగా, నేపాల్ అధ్యక్షుడు జీవన దేవతను పూజించి, ఆమె ఆశీర్వాదం పొందే సంప్రదాయం కూడా ఉంది. -
గాజాపై ఆగని ఇజ్రాయెల్ దాడులు
గాజా సిటీ: గాజా వ్యాప్తంగా మంగళవారం కూడా ఇజ్రాయెల్ దాడులు కొనసాగాయి. వైమానిక దాడులు, కాల్పుల ఘటనల్లో 31 మంది పాలస్తీనియన్లు చనిపోయినట్లు వివిధ ఆస్పత్రులు తెలిపాయి. నెట్జరిమ్ కారిడార్ వద్ద ఏర్పాటైన ఆహార పంపిణీ కేంద్రం వద్దకు చేరిన వారిపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో 17 మంది చనిపోగా 33 మంది గాయపడినట్లు అల్ ఔదా ఆస్పత్రి తెలిపింది. నుసెయిరత్ శరణార్థి శిబిరంలోని ఓ టెంటుపై జరిగిన మరో దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. మువాసిలో శరణార్థులుండే రెండు టెంట్లపై ఇజ్రాయెల్ బాంబులు వేసింది. ఒక ఘటనలో నలుగురు మహిళలు, చిన్నారి సహా ఏడుగురు, మరో ఘటనలో..ఏడు నెలల గర్భవతి, చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే, గడిచిన 24 గంటల వ్యవధిలో గాజాలో 160కి పైగా హమాస్ లక్ష్యాలపై దాడులు జరిపి పలువురు మిలిటెంట్లను చంపామని, ఆయుధాల గిడ్డంగుల్ని, నిఘా పోస్టులను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. ఈ పరిణామం...గాజాలో రెండేళ్లుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతామంటూ సోమవారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ సమక్షంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన శాంతి ప్రతిపాదనపై పాలస్తీనా ప్రజల్లో అనుమానాలు రేపుతోంది. ‘ఇది శాంతి ప్రణాళిక కాదు..లొంగుబాటు ప్రణాళిక. మమ్మల్ని మళ్లీ వలస పాలనలోకి నెట్టే ప్రయత్నం’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మళ్లీ ట్రంప్ టారిఫ్ బాంబు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ ఉత్పత్తులపై టారిఫ్ల మోత మోగిస్తూనే ఉన్నారు. ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా లెక్కచేయకుండా ముందుకెళ్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే కలప(టింబర్)పై 10 శాతం, ఫర్నిచర్తోపాటు కిచెన్ కేబినెట్లపై 25 శాతం సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ సుంకాలు ఈ నెల 14వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ట్రంప్ ఆదేశాల పట్ల అమెరికాలో భవన నిర్మాణ రంగంపై మరింత భారం పడడం ఖాయమని నిపుణులు తేల్చిచెబుతున్నారు. ఇళ్ల నిర్మాణం ఖరీదైన వ్యవహారంగా మారుతుందని అంటున్నారు. అమెరికాలో నిర్మాణ వ్యయం ఇప్పటికే విపరీతంగా పెరిగిపోయింది. స్థానిక పరిశ్రమల కోసమే అమెరికా జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకో వడంతోపాటు స్థానిక కలప పరిశ్రమలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతోనే విదేశీ కలప, ఫర్నిచర్పై సుంకాలు విధించినట్లు ట్రంప్ స్పష్టంచేశారు. స్థానిక పరిశ్రమలకు ఊతం ఇస్తే కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుందని, తద్వారా తమ యువతకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దిగుమతులు తగ్గించుకోవడంతోపాటు అమెరికా నుంచి కలప, ఫర్నిచర్ ఎగుమతులు పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. తమ అవసరాలకు సరిపోయే చెట్లు, కలప అమెరికాలో ఉన్నాయని స్పష్టంచేశారు. అమెరికాకు ప్రధానంగా పొరుగుదేశం కెనడా నుంచి కలప దిగుమతి అవుతుంది. ట్రంప్ తాజా నిర్ణయంతో కెనడాకు నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తోంది. -
అతిపెద్ద యుద్ధం ఆపేశా!
వాషింగ్టన్: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్, పాకిస్తాన్ల మధ్య జరిగిన ఘర్షణ పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వాదన నుంచి వెనక్కి తగ్గడం లేదు. ఆ రెండు దేశాల నడుమ అతిపెద్ద యుద్ధాన్ని తానే ఆపేశానని మరోసారి తేల్చిచెప్పారు. రెండు అణ్వస్త్ర దేశాలను కాల్పుల విరమణకు ఒప్పించానని చెప్పారు. మంగళవారం మిలటరీ కమాండర్ల సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. యుద్ధాన్ని ఆపడం ద్వారా లక్షలాది మంది ప్రాణాలను కాపాడారంటూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ తనను ప్రశంసించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. అసిమ్ మునీర్ మాట్లాడిన విధానం తనకు ఎంతగానో నచ్చిందని అన్నారు. అసిమ్ మునీర్ పాకిస్తాన్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అని ట్రంప్ తేల్చిచెప్పారు. తాను రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ తొమ్మిది నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ఏడు యుద్ధాలు ఆపేశానని పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా భారత్–పాక్ల యుద్ధమే ఉందన్నారు. భారత్, పాక్ ఘర్షణలో ఏడు యుద్ధ విమానాలు నేలకూలాయని వెల్లడించారు. అయితే, అవి ఏ దేశానికి చెందినవన్న సంగతి బయటపెట్టలేదు. మరోవైపు ఆపరేషన్ సిందూర్కు విరామం ఇవ్వడం వెనుక అమెరికా ప్రమేయం లేదని, పాకిస్తాన్ సైన్యం కాళ్లబేరానికి వచ్చి వేడుకోవడం వల్లే వైమానిక దాడులు నిలిపివేశామని భారత ప్రభుత్వం ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. -
ట్రంప్ శాంతి మంత్రం
వాషింగ్టన్: కల్లోలిత గాజాలో సంక్షోభానికి, విధ్వంసానికి తెరదించి, శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైన ప్రతిపాదన చేశారు. ‘20 సూత్రాల శాంతి ప్రణాళిక’ను తెరపైకి తెచ్చారు. సోమవారం వైట్హౌస్లో ట్రంప్తో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సమావేశమయ్యారు. గాజా పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధాన్ని ముగించడమే ధ్యేయంగా ట్రంప్ ప్లాన్ను వైట్హౌస్ విడుదల చేసింది. ఈ ప్రణాళిక తమకు ఆమోదయోగ్యమేనని నెతన్యాహు ప్రకటించారు. ట్రంప్ ప్రయత్నాలకు మద్దతు ఇస్తున్నామని చెప్పారు. ఇక హమాస్ సైతం అంగీకరిస్తే గాజాలో యుద్ధం వెంటనే ఆగిపోతుందని ట్రంప్ స్పష్టంచేశారు. హమాస్ స్పందన కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే పాలస్తీనాను స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తించే అవకాశం లేకపోలేదని అమెరికా అధ్యక్షుడు సంకేతాలిచ్చారు. శాంతి ప్రతిపాదనపై 3 నుంచి 4 రోజుల్లోగా స్పందించాలని హమాస్కు డెడ్లైన్ విధించారు. లేకపోతే ‘విషాదకరమైన ముగింపు’ ఉంటుందని తేల్చిచెప్పారు. స్వాగతించిన ఇస్లామిక్ దేశాలు గాజా విషయంలో ట్రంప్ ప్లాన్ను ఈజిప్టు, జోర్డాన్, ఇండోనేషియా, పాకిస్తాన్, తుర్కియే, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్(యూఏఈ) తదితర ఇస్లామిక్ దేశాలు స్వాగతించారు. ఈమేరకు మంగళవారం ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. గాజాలో శాంతి కోసం అమెరికాతో కలిసి పనిచేస్తామని ప్రకటించాయి. చైనా, రష్యా, భారత్తోపాటు పలు యూరప్ దేశాలు సైతం స్వాగతించాయి. ప్రధాని నరేంద్ర మోదీ హర్షం ట్రంప్ 20 సూత్రాల శాంతి ప్రణాళిక పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. పాలస్తీనాతోపాటు ఇజ్రాయెల్ ప్రజల భద్రత, అభివృద్ధికి, శాశ్వత శాంతికి ఒక మార్గం ఏర్పడినట్లేనని, మొత్తం పశి్చమాసియాకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. హమాస్కు మరణ శాసనమే! గాజాలో శాంతి సాధన దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన ప్రణాళికపై చర్చ మొదలైంది. దీనికి ఇజ్రాయెల్ వెంటనే అంగీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు హమాస్ మాత్రం వేచిచూసే ధోరణితో ముందుకెళ్తోంది. ట్రంప్ ప్లాన్ను క్షుణ్నంగా అధ్యయనం చేయాల్సి ఉందని, ఇప్పుడే ఏమీ చెప్పలేమని అంటోంది. నిజానికి ట్రంప్ ప్లాన్ హమాస్కు మరణ శాసనమేనని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.ప్రణాళికలో కీలక అంశాలు → ట్రంప్ ప్లాన్ను ఇజ్రాయెల్, హమాస్ అంగీకరిస్తే గాజాలో దాడులు వెంటనే ఆగిపోతాయి. తమ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలందరినీ 72 గంటల్లోగా హమాస్ మిలిటెంట్లు విడుదల చేయాలి. ఒకవేళ బందీల్లో ఎవరైనా మృతిచెంది ఉంటే వారి మృతదేహాలను ఇజ్రాయెల్కు అప్పగించాలి. → బందీలకు విముక్తి లభించిన తర్వాత ఇజ్రాయెల్ జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 250 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ ప్రభుత్వం విడుదల చేయాలి. 2023 అక్టోబర్ 7 తర్వాత ఇజ్రాయెల్ సైన్యం బంధించిన 1,700 మంది పాలస్తీనా పౌరులను సైతం విడుదల చేయాలి. గాజా నుంచి ఒక బందీ విడుదలైతే, అందుకు ప్రతిగా 15 మంది పాలస్తీనా పౌరులను ఇజ్రాయెల్ విడుదల చేయాల్సి ఉంటుంది. → ట్రంప్ ప్రతిపాదనకు ఆమోదం లభించగానే ఇజ్రాయెల్ సేనలు దాడులు ఆపేసి గాజా నుంచి వెనక్కి వెళ్లిపోతాయి. గాజాలో ఇజ్రాయెల్ దళాలు ఖాళీ చేసిన స్థానంలోకి ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్(ఐఎస్ఎఫ్) చేరుతుంది. పాలస్తీనా ప్రజలకు భద్రత కల్పిస్తుంది, పాలస్తీనా పోలీసులకు శిక్షణ ఇస్తుంది. → బందీలు క్షేమంగా ఇజ్రాయెల్కు చేరుకున్న తర్వాత హమాస్ మిలిటెంట్లు ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవాలి. వారికి క్షమాభిక్ష ప్రసాదిస్తారు. ఒకవేళ మిలిటెంట్లు గాజాను వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోవాలని భావిస్తే అందుకు వారికి సహకారం లభిస్తుంది. అభ్యంతరం లేకపోతే గాజాలోనే ఉండిపోవచ్చు. → అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ నేతృత్వంలోని ‘బోర్డ్ ఆఫ్ పీస్’ గాజాలో పరిపాలన, పునరి్నర్మాణాన్ని పర్యవేక్షిస్తుంది. గాజాను ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా అభివృద్ధి చేస్తారు. → పునరి్నర్మాణం తర్వాత గాజా పరిపాలన బాధ్యతలను పాలస్తీనియన్ అథారిటీకి అప్పగిస్తారు. ఈలోగా పాలస్తీనియన్ అథారిటీలో సంస్కరణలు చేపట్టాల్సి ఉంటుంది. -
సినిమాలపై ట్రంప్ టారిఫ్.. టాలీవుడ్ హీరో నిఖిల్ రియాక్షన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ సినిమాలపై వందశాతం సుంకం విధించడంపై టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ స్పందించారు. ట్విటర్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ట్రంప్ సుంకాలు అమలు చేయడం సాధ్యం కాదని ట్వీట్ చేశారు. బెర్మన్ సవరణ చట్టం ప్రకారం సినిమాలపై దిగుమతి సుంకాలను పూర్తిగా అడ్డుకుంటుందని నిఖిల్ రాసుకొచ్చారు. ఈనెల 29న ఇచ్చిన ట్రంప్ ఆదేశాలపై చట్టపరమైన అడ్డంకులు ఎదుర్కొవాల్సిందేనని అన్నారు. అంతేకాకుండా సినిమాలపై వందశాతం సుంకం అమలు సాధ్యం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా.. టాలీవుడ్ హీరో నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ, ది ఇండియన్ హౌస్ చిత్రాల్లో నటిస్తున్నారు.విదేశీ సినిమాలపై ట్రంప్ టారిఫ్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ సినిమాలకు భారీ షాక్ ఇచ్చారు. విదేశీ సినిమాలపై 100శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలో నిర్మించే చిత్రాలకు మినహాయించారు. ట్రంప్ నిర్ణయంతో తెలుగు సినిమాలపై టారిఫ్ ఎఫెక్ట్ పడనుంది. దీంతో అమెరికాలో విడుదల చేసే టాలీవుడ్ సినిమాలు వందశాతం టారిఫ్ చెల్లించాల్సి ఉంది. విదేశీ సినిమాలపై 100శాతం విధిస్తూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. అందులో ‘మా సినిమా నిర్మాణ వ్యాపారం అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి ఇతర దేశాలు దొంగిలించాయి. ఇది చిన్నపిల్లవాడి నుండి మిఠాయి దొంగిలించినట్లే. బలహీనమైన, అసమర్థ గవర్నర్తో కాలిఫోర్నియా తీవ్రంగా దెబ్బతింది. ఈ దీర్ఘకాలిక, ఎప్పటికీ అంతం కాని సమస్యను పరిష్కరించేందుకు, అమెరికా వెలుపల నిర్మించే అన్ని సినిమాలపై 100 శాతం సుంకం విధిస్తున్నాను’అని పేర్కొన్నారు. No . Trump Tariffs on Films will Not be Implemented. Since The Berman Amendment (50 U.S.C. §1702(b)(3)) explicitly Stops presidential restrictions/Tariffs under IEEPA on imported informational materials like films, as confirmed by congressional records. Combined with First… https://t.co/0d7qvItrr2— Nikhil Siddhartha (@actor_Nikhil) September 30, 2025 -
పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి.. పెరుగుతున్న మృతుల సంఖ్య
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని క్వెట్టా నగరంలో ఆత్మాహుతి దాడి జరిగింది. పాక్ పారామిలటరీ సిబ్బంది లక్ష్యంగా జరిపిన ఈ ఆత్మాహుతి దాడిలో పలువురు మరణించారు. 30మందికి పైగా గాయపడ్డారు. పేలుడు జరిగిన సమయంలో సీసీ టీవీ ఫుటేజీల్లో రోడ్డుపై ఉన్న వాహనాలు ఎగిరిపడ్డాయి. ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.భారీ పేలుడు ధాటికి ఘటన జరిగిన ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల మేర భూమి కంపించింది. పేలుడు తీవ్రతతో భవనాలు సైతం దెబ్బతిన్నట్లు పాక్ స్థానిక మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.పాక్ మీడియా కథనం ప్రకారం..పాకిస్థాన్లో అతిపెద్ద నగరం క్వెట్టా జర్ఘున్ రోడ్లో పాకిస్థాన్ పారామిలటరీ ఫ్రాంటియర్ కోర్ కేంద్ర కార్యాలయం సమీపంలో పారామిలటరీ జవాన్లే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగినట్లు సమాచారం. ఆత్మాహుతి దాడి అనంతరం కాల్పులు సైతం వినిపించాయి.ఈ ఘటనపై బలూచిస్తాన్ ఆరోగ్య మంత్రి బఖ్త్ ముహమ్మద్ కాకర్ స్పందించారు. ఆత్మాహుతి దాడిలో పదిమందికిపైగా మరణించారని ధృవీకరించారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పాక్ మీడియా సంస్థ డాన్ నివేదించింది. ⚡️🇵🇰 Suicide Bomb Blast in Balochistan's Capital Reportedly Targets Paramilitary Security Force - CCTV 📹 The powerful blast was followed by gunfire in Quetta, near the HQ of the Frontier Corps.The explosion, which appeared to target a vehicle, shattered windows and damaged… pic.twitter.com/GUueo7NXBb— RT_India (@RT_India_news) September 30, 2025 -
గాజా ఘర్షణల అంతానికి పిలుపు.. ట్రంప్కు ప్రధాని మోదీ మద్దతు
న్యూఢిల్లీ: గాజా ఘర్షణలను అంతం చేసే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమగ్ర ప్రణాళిక ప్రకటించడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. అధ్యక్షుడు ట్రంప్ చూపిన చొరవకు అందరూ మందుకువస్తారని, గాజాలో ఘర్షణలను అంతం చేసేందుకు, శాంతిని నెలకొల్పేందుకు మద్దతు పలుకుతారని తాను ఆశిస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. We welcome President Donald J. Trump’s announcement of a comprehensive plan to end the Gaza conflict. It provides a viable pathway to long term and sustainable peace, security and development for the Palestinian and Israeli people, as also for the larger West Asian region. We…— Narendra Modi (@narendramodi) September 30, 2025ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో పాటు గాజా ఘర్షణలను అంతం చేసేందుకు ట్రంప్ రూపొందించిన ప్రణాళికను వైట్ హౌస్ విడుదల చేసిన కొన్ని గంటలకు ప్రధాని మోదీ నుండి ఈ ప్రకటన విడుదలయ్యింది. అయితే అమెరికా ప్రభుత్వం రూపొందించిన ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ లేదా హమాస్ అంగీకరించాయా లేదా అనే దానిపై ఇప్పటివరూ సమచారమేదీ లేదు. అయితే ఇంతలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గాజాలో యుద్ధాన్ని ముగించే ప్రణాళికకు అంగీకారం తెలిపారని అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. కానీ హమాస్ ఈ నిబంధనలను అంగీకరిస్తుందా లేదా అనేది తెలియరాలేదు.ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణల ముగింపునకు ట్రంప్ 20 సూత్రాల ప్రణాళికను రూపొందించారు. బ్రిటిష్ మాజీ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్తో సారధ్యంలో యుద్ధ-బాధిత పాలస్తీనా భూభాగంలో తాత్కాలిక పాలక మండలిని ఏర్పాటు చేయడానికి అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించారు. ఈ ప్రణాళిక ప్రకారం ప్రజలు గాజాను విడిచి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇరు వైపులా పరస్పర అంగీకారంతో యుద్ధాన్ని వెంటనే ముగించాలని ట్రంప్ ఆ ప్రణాళికలో పిలుపునిచ్చారు. ఈ ప్రణాళికను అంగీకరించిన 72 గంటల్లోపు హమాస్ తమ దగ్గరున్న ఇజ్రాయెల్ బందీలందరినీ విడుదల చేయాలని కూడా ప్రణాళికలో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదిత శాంతి ఒప్పందాన్ని హమాస్ అంగీకరించకపోతే ఇజ్రాయెల్కు యునైటెడ్ స్టేట్స్ పూర్తి మద్దతు ఉంటుందని ట్రంప్ హామీనిచ్చారు. పాలస్తీనా ప్రజలు వారి విధికి బాధ్యత వహించాలని, తమ శాంతి ప్రతిపాదనను స్వీకరించాలని కోరారు. -
లండన్లో గాంధీ విగ్రహం ధ్వంసం.. తీవ్రంగా స్పందించిన భారత్
లండన్: లండన్లో మహాత్మాగాంధీ (Mahatma Gandhi) విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. లండన్లోని టావిస్టాక్ స్వ్కేర్లో ఉన్న గాంధీ విగ్రహంపై నల్ల రంగుతో విద్వేష పూరిత వ్యాఖ్యలు రాశారు. మహాత్ముని జయంతికి మూడు రోజుల ముందు జరిగిన ఈ ఘటనపై అక్కడి భారత రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఈ పిచ్చి రాతలను సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించింది. అహింస వారసత్వంపై జరిగిన దాడిగా పేర్కొంది.మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం పాటు తీవ్రంగా ఖడిస్తున్నామని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా వెల్లడించింది. మహాత్ముని జయంతి (అక్టోబర్ 2)ని ప్రతి ఏడాది అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.కాగా, ప్రముఖ కళాకారిణి ఫ్రెడ్డా బ్రిలియంట్ రూపొందించిన గాంధీజీ కాంస్య విగ్రహాన్ని లండన్లోని టావిస్టాక్ స్క్వేర్లోని యూనివర్సిటీ కాలేజ్ సమీపంలో 1968లో ప్రతిష్ఠించారు. విగ్రహ ధ్వంసం గురించి స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. విగ్రహాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు.@HCI_London is deeply saddened and strongly condemns the shameful act of vandalism of the statue of Mahatma Gandhi at Tavistock Square in London. This is not just vandalism, but a violent attack on the idea of nonviolence, three days before the international day of nonviolence,…— India in the UK (@HCI_London) September 29, 2025 -
కుప్పకూలిన స్కూల్ బిల్డింగ్.. శిథిలాల కింద 38 మంది!
ఇండోనేషియాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఈస్ట్ జావా రాష్ట్రం సిడోయార్జి పట్టణంలో ఓ ప్రైవేట్ స్కూల్ భవనం కుప్పకూలిపోయింది(School Building Collapse). ఈ ఘటనలో ఒక విద్యార్థి మరణించగా.. వంద మందికి పైగా విద్యార్థులకు గాయాలయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం ఆ ఇస్లామిక్ స్కూల్లో ప్రార్థనలు జరుగుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. భవనం కుప్పకూలడంతో ఒక విద్యార్థి (13) అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన వాళ్లను ఆస్పత్రికి తరలించగా.. వాళ్లలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మరో 38 మంది విద్యార్థుల ఆచూకీ తెలియాల్సి ఉంది. వీళ్లంతా శిథిలాల్లో చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.శిథిలాల కింది నుంచి చిన్నారుల కేకలతో, తల్లిదండ్రుల రోదనలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతోంది. కాంక్రీట్ దిమ్మెలు భారీ పరిణామంలో ఉండడం.. వాటిని కదిలిస్తే మరింత కుప్పకూలిపోయే అవకాశం ఉండడంతో సహాయక చర్యలు జాగ్రత్తగా, నిదానంగా సాగుతున్నాయి. సోమవారం అర్ధరాత్రి దాటాక కూడా సహాయక చర్యలు కొనసాగాయి. రెస్క్యూ బృందాలు(Rescue Teams) తీవ్రంగా శ్రమించి.. 102 మందిని రక్షించినట్లు కాంపోస్.డాట్ కామ్ అనే స్థానిక మీడియా వెబ్సైట్ కథనం ఇచ్చింది. స్కూల్ భవనం పాతది కావడం.. అనుమతి లేకుండా పై అంతస్తుల నిర్మాణాలు చేపట్టడంతోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని స్థానిక అధికారులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ ప్రతినిధి జూల్స్ అబ్రహాం అబాస్ట్ తెలిపారు.ఇదీ చదవండి: చిగురుటాకులా వణికిపోయిన వియత్నాం! -
ట్రంప్-నెతన్యాహు గాజా గేమ్.. ఇదే లాస్ట్ ఛాన్స్!
గాజా సంక్షోభానికి తెర దించే క్రమంలో.. శాంతి ప్రణాళిక(Gaza Peace Plan) ఓ కొలిక్కి వచ్చింది. అమెరికా ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ఎట్టకేలకు అంగీకారం తెలిపింది. వైట్హౌజ్ వేదికగా.. ఇజ్రాయెల్ అద్యక్షుడు బెంజిమన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంయుక్తంగా ఈ ప్రకటన చేశారు. అయితే ఈ ప్రతిపాదనకు హమాస్ గ్రూప్ అంగీకరిస్తుందో లేదో అనే అనుమానాన్ని ఇద్దరూ వ్యక్తం చేయడం గమనార్హం. అమెరికా ప్రతిపాదించిన ఈ 20 సూత్రాల శాంతి ఫార్ములాను హమాస్ గనుక ఒప్పుకుంటే.. 72 గంటల్లో వాళ్ల చేతుల్లో ఉన్న బందీలందరినీ విడుదల చేయాల్సి ఉంటుంది. యుద్ధ విరమణ తక్షణమే అమల్లోకి వచ్చింది. హింసను వదిలిన హమాస్ సభ్యులకు క్షమాభిక్ష దక్కడంతో పాటు భద్రత నడుమ ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కల్పిస్తారు. హమాస్ ఆయుధాలు వదిలి పాలన నుంచి తప్పుకుంటుంది కాబట్టి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటునకు గాజాలో Board of Peace ఏర్పాటు చేస్తారు. గాజా పునర్నిర్మాణం కోసం అంతర్జాతీయ సహాయానికి గేట్లు తెరుస్తారు. ఇలా మిగిలిన అంశాలు ఉన్నాయి. అయితే.. ఒకవైపు శాంతి అంటూనే మరోవైపు హమాస్(Hamas)కు మరోసారి ఈ ఇద్దరు నేతలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాము ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని హమాస్ అంగీకరించాల్సిందేనన్న ధోరణితో ట్రంప్, నెతన్యాహులు మాట్లాడారు. ‘‘హమాస్ గనుక ఈ డీల్కు ఒప్పుకోకపోతే.. వారిని తుదముట్టించేందుకు ఇజ్రాయెల్కు నా పూర్తి మద్దతు ఉంటుంది. ఇది నా తుది హెచ్చరిక.. మరొకటి ఉండదు’’ అని ట్రంప్ ప్రకటించారు. మరోవైపు.. ఈ ఒప్పందం అమలు సులభ మార్గంలో అయినా.. కఠిన మార్గంలో అయినా అమలు అయ్యి తీరుతుంది అంటూ హమాస్కు ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ట్రంప్-నెతన్యాహు(Trump-Netanyahu) ప్రకటించిన శాంతి ఒప్పందానికి సౌదీ అరేబియా, ఈజిప్ట్ సహా 8 ముస్లిం దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. యూరప్ దేశాధినేతలు మాక్రాన్, స్టార్మర్ ఈ ప్రణాళికకు మద్దతు ప్రకటించారు. హమాస్ ఇంతదాకా అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ.. పక్షపాతంగా ఉందనే ‘గాజాలో యుద్ధాన్ని ముగించడమే కాదు. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు ఏర్పాట్లు జరగాలని కోరుకుంటున్నా. శాంతి కోసం మీ ప్రణాళికకు మద్దతు తెలుపుతున్నా. అయితే హమాస్ నుంచి మళ్లీ ఇజ్రాయెల్కు ముప్పు ఉండకూడదు. ఒప్పందంలో తొలి ఘట్టంగా.. గాజా నుంచి బలగాల దశలవారీ ఉపసంహరణ ఉంటుంది. వెంటనే 72 గంటల్లో బందీలను విడుదల చేయాలి. ఆ తరువాత అంతర్జాతీయ పాలకవర్గం ఏర్పాటు కావాలి. హమాస్ ఆయుధాలను వదిలేయాలి. గాజాను నిరాయుధీకరణ చేయాలి. అంతర్జాతీయ పాలకవర్గం విజయవంతమైతే యుద్ధాన్ని శాశ్వతంగా ముగిస్తాం. హమాస్ నిరాయుధీకరణకు అనుగుణంగా ఇజ్రాయెల్ గాజా నుంచి వైదొలగుతుంది. కానీ భవిష్యత్తు భద్రత దృష్ట్యా చుట్టుపక్కల మోహరించి ఉంటాం’ అని నెతన్యాహు వివరించారు. గాజా శాంతి ప్రణాళిక.. ముఖ్యాంశాలుగాజా నగరాన్ని ఉగ్రవాదం లేని ప్రాంతంగా మార్చడం.హమాస్కు పాలనా హక్కు లేకుండా, తాత్కాలిక పాలనను ఏర్పాటు చేయడం.ఇజ్రాయెల్ బంధీలను 72 గంటల్లో విడుదల చేయడం.ఇజ్రాయెల్ 250 జీవిత ఖైదీలు, మరియు 1,700 గాజా ఖైదీలను విడుదల చేయడం.ప్రతి ఇజ్రాయెల్ బంధీ మృతదేహానికి, 15 మంది గాజా మృతదేహాలను తిరిగి ఇవ్వడం.హమాస్ సభ్యులు ఆయుధాలు వదిలి శాంతిగా జీవించాలనుకుంటే, వారికి క్షమాభిక్ష ఇవ్వడం.హమాస్ సభ్యులు గాజా విడిచి వెళ్లాలనుకుంటే, భద్రతతో కూడిన మార్గం కల్పించడం.యుద్ధం ఆగిన వెంటనే, పూర్తి మానవతా సహాయం ప్రారంభించడం.జల, విద్యుత్, ఆసుపత్రులు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం.రఫా సరిహద్దు రెండు దిశలలో తెరవడం.బోర్డ్ ఆఫ్ పీస్ (Board of Peace) అనే అంతర్జాతీయ సంస్థ ద్వారా గాజా పాలన.ట్రంప్ అధ్యక్షతన, ఈ బోర్డు పునర్నిర్మాణం, నిధుల పంపిణీ నిర్వహిస్తుంది.బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సహా పలువురు అంతర్జాతీయ నాయకులకు ఈ బోర్డులో భాగం.పాలనా కమిటీ apolitical, technocratic Palestinians తో ఏర్పాటవుతుంది.పాలస్తీనా అథారిటీ పునరుద్ధరణ తర్వాతే గాజా పాలన చేపట్టాలి.ఇజ్రాయెల్ పూర్తిగా ఉపసంహరించడానికి, దశలవారీగా ప్రణాళిక.అంతర్జాతీయ మానిటర్లు ద్వారా గాజా లోని ఆయుధాల నిర్మూలన.ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక ద్వారా “New Gaza” నిర్మాణం.ప్రత్యేక ఆర్థిక మండలం (Special Economic Zone) ఏర్పాటు.గాజా ప్రజలు అక్కడే ఉండేందుకు ప్రోత్సాహం, బలవంతంగా తరలింపు ఉండదు. -
గాజా ఆక్రమణ ఉండదు
వాషింగ్టన్: గాజా సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. గాజాను ఇజ్రాయెల్ ఆక్రమించబోదని తేల్చిచెప్పారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధానికి త్వరగా తెరపడాలన్నదే తన ఉద్దేశమని వివరించారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారం వైట్హౌస్లో ట్రంప్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడారు. గాజాలో అస్థిరతకు చరమగీతం పాడేసి, శాంతిని నెలకొల్పే దిశగా నెతన్యాహుతో ఒప్పందానికి దరిదాపుల్లోకి వచ్చానని అన్నారు.ఈ ప్రణాళికకు అంగీకారం తెలియజేసినందుకు నెతన్యాహుకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. గాజాలో శాంతి సాధన విషయంలో ఇదొక చరిత్రాత్మక దినం అని వ్యాఖ్యానించారు. మధ్యప్రాచ్యంలో శాశ్వత శాంతికి అడుగు ముందుకు పడినట్లేనని ఉద్ఘాటించారు. తాను ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని హమాస్తోపాటు ఇతర భాగస్వామ్యపక్షాలు సైతం ఆమోదిస్తాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తంచేశారు.ఒకవేళ ఆమోదం లభిస్తే గాజాలో తక్షణమే యుద్ధానికి తెరపడుతుందని తేల్చిచెప్పారు. నెతన్యాహు మాట్లాడుతూ... గాజా విషయంలో దీర్ఘకాల పరిష్కారానికి తాము కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. అదే సమయంలో ప్రాంతీయ భద్రతను కూడా దృష్టిలో పెట్టుకోవాలని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రాచ్యంలో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించే విషయంలో నెతన్యాహుతో చర్చలు ఒక భాగమేనని ట్రంప్ పేర్కొన్నారు. ఖతార్ ప్రధానమంత్రికి నెతన్యాహు క్షమాపణ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఖతార్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్–థానీకి ఫోన్ చేసి క్షమాపణ కోరారు. ఇటీవల ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. ఈ ఉదంతం ముస్లిం దేశాల్లో అలజడి సృష్టించింది. ఇజ్రాయెల్ తీరును ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ నేపథ్యంలో వైట్హౌస్లో డొనాల్డ్ ట్రంప్తో సమావేశమైన నెతన్యాహు అక్కడి నుంచే ఖతార్ ప్రధానికి ఫోన్చేశారు. దోహాపై దాడుల పట్ల విచారం వ్యక్తంచేశారు. క్షమాపణ కోరారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
గ్రేట్ ఎస్కేప్!
షికాగో: ఒక ఫుడ్ డెలివరీ వర్కర్ పరుగులు తీస్తుంటే.. దాదాపు పదిమంది ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు వెంబడించారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరలై, అక్కడి ఎన్ఫోర్స్మెంట్ విభాగం పనితీరుపై పెద్ద రచ్చకు దారితీసింది.అసలేం జరిగిందంటే..షికాగో డౌన్టౌన్లో ఆదివారం ఒక ఫుడ్ డెలివరీ వర్కర్ను అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్లు వెంటాడారు. ఈ ఉదంతాన్ని క్రిస్టోఫర్ స్వీట్ అనే వ్యక్తి వీడియో తీసి షేర్ చేశాడు. తన పోస్ట్లో ‘ఎక్స్క్లూజివ్ వార్త.. ఈరోజు ఒక వ్యక్తిని ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్లు షికాగో డౌన్టౌన్లో వెంబడించారు.. అతను ఏవో అనుచిత వ్యాఖ్యలు చేశాడు తప్ప భౌతిక దాడికి దిగలేదు.. బెదిరించలేదు కూడా.. ఏదైతేనేం మొత్తానికి తప్పించుకోగలిగాడు’.. అని వ్యాఖ్యానించారు.నెటిజన్ల స్పందనఈ వీడియో ఆన్లైన్లో విపరీతంగా షేర్ అవు తోంది. చాలామంది నెటిజన్లు అతను తప్పించుకున్న తీరును చూసి ‘బాగా పరుగెత్తాడు’ అంటూ మెచ్చుకుంటున్నారు. కొందరు ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్ల దేహ దారుఢ్యం గురించి కూడా వ్యాఖ్యలు చేశారు. స్వీట్.. ఏకంగా అమెరికన్ ఉన్నతాధికారులను ట్యాగ్ చేస్తూ, ఈ ఘటనను చిత్రీకరించడం ద్వారా తాను ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్ల బండారం బయట పెట్టగలిగానని సరదాగా వ్యాఖ్యా నించాడు.వెంటాడటం వెనుక కథేంటి?ఆదివారం డౌన్టౌన్ షికాగోలో ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్ల ఆపరేషన్లు జరిగాయని స్వీట్ వెల్లడించారు. అరెస్టులను ఇంకా అధికారికంగా ధ్రువీకరించకపోయినా, స్థానిక మీడియా మరిన్ని విషయాలు తెలిపింది. ‘ఆదివారం మధ్యాహ్నం పిల్లలతో సహా ఒక కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నారు’.. అని ఏబీసీ7షికాగో నివేదించింది. డబ్ల్యూబీఈజెడ్ సంస్థ.. ఒక సీనియర్ అమెరికా సరిహద్దు గస్తీ అధికారిని ఉటంకిస్తూ.. అనుమానాస్పదంగా సంచరిస్తున్న కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన అంగీకరించారని వెల్లడించింది. ఫుడ్ డెలివరీ వర్కర్ను వెంటాడటం, కేవలం రూపురేఖలు, ప్రవర్తన ఆధారంగా అరెస్టు చేసిన సంఘటన మొత్తం అమెరికాలో ఇమ్మిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ పద్ధతులపై తీవ్ర చర్చకు తెర లేపింది.! -
మాల్దోవాలో ఈయూ అనుకూల పార్టీ గెలుపు
చిసినౌ: ఒకప్పటి సోవియెట్ యూనియన్లో భాగంగా ఉన్న మాల్దోవాలో జరిగిన ఎన్నికల్లో యూరోపియన్ యూనియన్(ఈయూ) అనుకూల పార్టీ మరోసారి ఘన విజయం సాధించింది. రష్యా అనుకూల గ్రూపులకు ఈ ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. తూర్పు, పశ్చిమ వర్గాలకు మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో వెలువడిన ఈ ఫలితాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అన్ని పోలింగ్ స్టేషన్లలో లెక్కింపు పూర్తయ్యాక వెలువడిన ఫలితాల్లో ఈయూకు అనుకూల విధానాలను అనుసరించే అధ్యక్షురాలు మైయా సండూకు చెందిన అధికార యాక్షన్ అండ్ సాలిడారిటీ(పీఏఎస్)కు 50.1 శాతం ఓట్లు వచ్చినట్లు తేలింది.రష్యా అనుకూల పేట్రియాటిక్ ఎలక్టోరల్ బ్లాక్కు కేవలం 24.2 శాతమే లభించాయి. రష్యాతో మైత్రిని కోరుకునే మరో గ్రూప్ ఆల్టర్నేటివా మూడవ, పాపులిస్ట్ అవర్ పార్టీ నాలుగో స్థానాల్లో నిలిచాయి. డెమోక్రసీ ఎట్ హోమ్ అనే పార్టీ కూడా పార్లమెంట్లో ప్రాతినిధ్యం దక్కించుకుంది. అధికార పీఏఎస్కు 101 సీట్లున్న పార్లమెంట్లో 55 స్థానాలు దక్కాయి.తిరిగి రష్యాకు అనుకూలంగా మారడమా, లేక ఈయూ మార్గంలో నడవడమా అనే విషయం మాల్దోవా వాసులు తేల్చుకునే నిర్ణయాత్మక ఎన్నికలుగా వీటిని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ ఫలితాలతో ప్రస్తుత ప్రభుత్వ విధానాలు కొనసాగుతాయని, ఈయూలో చేరాలని భావించే మాల్దోవా వాసులకు ఘన విజయంగా భావించవచ్చని అంటున్నారు. ఫలితాలపై ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వొన్డెర్ లేయెన్ హర్షం వ్యక్తం చేశారు. ‘యూరప్, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ’కోసం మాల్దోవా ప్రజల నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడిందన్నారు. -
వియత్నాంను వణికించిన బ్వాలోయి
హనోయి: భారీ వర్షం, భీకరగాలులతో కూడిన బ్వాలోయి తుఫాను వియత్నాంలో విలయం సృష్టించింది. తుఫాన్ తీవ్రతకు పలు ప్రావిన్సుల్లో రోడ్లు జలమయం కాగా, ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. గంటకు 133 కిలోమీటర్ల వేగంగా గాలులు తీయడంతో విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వివిధ ఘటనల్లో కనీసం 9 మంది ప్రాణాలు కోల్పోయారు.జాడ తెలికుండా పోయిన 17 మంది జాలర్ల కోసం గాలింపు చేపట్టినట్లు యంత్రాంగం తెలిపింది. సోమవారం ఉదయం 10 గంటలకు తుఫాన్ బలహీనపడి లావోస్ దిశగా వెళ్లిందని అధికారులు తెలిపారు. గాలుల తీవ్రతకు ఇళ్లు కూలిన ఘటనల్లో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన నిన్హ్ బిన్హ్ ప్రావిన్స్లోనే ఆరుగురు చనిపోయారని చెప్పారు. థన్హ్ హొవా, హూయి, దనంగ్ ప్రావిన్స్ల్లో జరిగిన ఘటనల్లో మరో ముగ్గురు మృతి చెందారు. క్వాంగ్ ట్రి ప్రావిన్స్లో గాలుల తీవ్రతకు లంగరేసిన చేపల పడవ తాళ్లు తెగడంతో అది సముద్ర జలాల్లోకి కొట్టుకు పోయింది.దాని కింద ఆశ్రయం తీసుకుంటున్న 9 మంది మత్స్యకారులు గల్లంతయ్యారు. జియా లాయ్ ప్రావిన్స్లో చేపల వేటకు వెళ్లిన 8 మంది జాడ తెలియడం లేదని అధికారులు తెలిపారు. తుఫాన్ కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆదివారం రాత్రి 3.47 లక్షల నివాసితులు అంధకారంలో గడిపారని అధికారులు తెలిపారు. బ్వాలోయి కారణంగా ఫిలిప్పీన్స్లో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. -
పీఓకేలో తిరుగుబాటు
ముజఫరాబాద్: పాకిస్తాన్ ప్రభుత్వంపై పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) ప్రజలు తిరుగుబాటు ప్రారంభించారు. నిరంకుశ పాలనపై నిప్పులు చెరుగుతున్నారు. తమకు ప్రాథమిక హక్కులు కల్పించాలని, అణచివేత చర్యలు ఆపాలని డిమాండ్ చేస్తూ జనం ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పీఓకే రాజధాని ముజఫరాబాద్లో ఆందోళనకారులకు, భద్రతా దళాలకు మధ్య ఘ ర్షణ జరిగింది.హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. జెండాలు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్న సాధారణ ప్రజలపై పాక్ సైన్యంతోపాటు ఐఎస్ఎస్ అండదండలున్న ముస్లిం కాన్ఫరెన్స్ సాయుధ ముష్కరులు కిరాతకంగా కాల్పులు జరిపారు. హక్కుల కోసం ఉద్యమిస్తున్నవారిని పొట్టనపెట్టుకున్నారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా, 22 మందికిపైగా గాయపడ్డారు. ముజఫరాబాద్ వీధులు రణరంగాన్ని తలపించాయి. హింసాకాండ దృశ్యాలు పాకిస్తాన్ వార్తా చానళ్లలో ప్రసారమయ్యాయి. తెరపైకి 38 డిమాండ్లు ప్రాథమిక హక్కుల సాధన కోసం పీఓకేలో అవామీ యాక్షన్ కమిటీ ఉద్యమిస్తోంది. ఆదివారం నుంచి ఆందోళనలు ఉధృతంగా మారాయి. ఎక్కడికక్కడ నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. బంద్ పాటించారు. సోమవారం మార్కెట్లు, దుకాణాలు, కార్యాలయాలు మూతపడ్డాయి. రవాణా సేవలు నిలిచిపోయాయి. ఆందోళనకారులు మొత్తం 38 డిమాండ్లను తెరపైకి తెచ్చారు. ప్రభుత్వం వాటిని నెరవేర్చేదాకా తమ పోరాటం ఆగదని స్పష్టంచేశారు. పాకిస్తాన్లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థుల కోసం పీఓకే అసెంబ్లీలో 12 సీట్లను పాక్ ప్రభుత్వం రిజర్వ్ చేసింది.ఈ సీట్లను రద్దు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. తమ అసెంబ్లీలో కేవలం స్థానికులకే ప్రాతినిధ్యం ఉండాలని అంటున్నారు. పీఓకేలోని మాంగ్లా డ్యామ్, నీలం–జీలం ప్రాజెక్టుల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్లో 60 శాతానికి పాకిస్తాన్కే సరఫరా అవుతోంది. స్థానికులకు దక్కుతున్న ప్రయోజనం స్వల్పమే. ఇదే అంశం వారిలో అసంతృప్తి కలిగిస్తోంది. పీఓకేలోని వనరులు తమకే దక్కాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ధరలు విపరీతంగా పెరగడం జనంలో అసహనం కలిగిస్తోంది. ఇవన్నీ ప్రజా ఉద్యమాన్ని ప్రేరేపించాయి.గత 70 ఏళ్లుగా పాక్ ప్రభుత్వం తమను క్రూరంగా అణచివేస్తోందని, కనీస హక్కులు కూడా కల్పించడం లేదని అవామీ యాక్షన్ కమిటీ నాయకుడు షౌకత్ నవాజ్ మీర్ ఆరోపించారు. ప్రజల ఓపిక నశించిందని, అందుకే పోరాటం సాగిస్తున్నారని చెప్పారు. తమ డిమాండ్లను ఇప్పటికైనా నెరవేర్చకపోతే ప్రజాగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని, పరిస్థితి చెయ్యి దాటిపోయే ప్రమాదం ఉందని పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్కు తేల్చిచెప్పారు. అణచివేత చర్యలు ప్రారంభం పీఓకేలో ప్రజా ఉద్యమాన్ని అణచివేయడానికి పాక్ సర్కార్ చర్యలు చేపట్టింది. భారీ సంఖ్యలో సాయుధ బలగాలను రంగంలోకి దించింది. సమీపంలోని పంజాబ్ ప్రావిన్స్ నుంచి వేలాది మంది సైనికులు పాక్ ఆక్రమిత కశ్మీర్కు చేరుకున్నారు. పలు పట్ణణాల్లో ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. వీధుల్లోకి రావొద్దని ప్రజలను హెచ్చరించారు. రాజధాని ఇస్లామాబాద్ నుంచి అదనపు బలగాలను తరలిస్తున్నట్లు సమాచారం. పీఓకేలో ఆందోళన కార్యక్రమాలను ఉక్కుపాదంతో అణచివేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా పీఓకేలో ఇంటర్నెట్ సేవలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పాక్ వైమానిక దళం గతవారం ఖైబర్ పఖ్తూంక్వా ప్రావిన్స్లోని ఓ మారుమూల గ్రామంపై భారీస్థాయిలో విరుచుకుపడింది. చైనా ఇచ్చిన జే–17 ఫైటర్ జెట్లతో ప్రజలపై నిప్పుల వర్షం కురిపించింది. చైనాలో తయారైన ఎల్ఎస్–6 లేజర్ గైడెడ్ బాంబులు ప్రయోగించింది. ఈ దాడిలో 30 మంది సాధారణ ప్రజలు మరణించారు. అది జరిగిన వారం రోజులకే పీఓకేలో ఆందోళనలు ప్రారంభం కావడం గమనార్హం. -
ట్రంప్ సంచలన నిర్ణయం.. అమెరికాలో తెలుగు సినిమాలకు బిగ్ షాక్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ సినిమాలకు భారీ షాక్ ఇచ్చారు. విదేశీ సినిమాలపై 100శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలో నిర్మించే చిత్రాలకు మినహాయించారు. ట్రంప్ నిర్ణయంతో తెలుగు సినిమాలపై టారిఫ్ ఎఫెక్ట్ పడనుంది. దీంతో అమెరికాలో విడుదల చేసే టాలీవుడ్ సినిమాలు వందశాతం టారిఫ్ చెల్లించాల్సి ఉంది. విదేశీ సినిమాలపై 100శాతం విధిస్తూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. అందులో ‘మా సినిమా నిర్మాణ వ్యాపారం అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి ఇతర దేశాలు దొంగిలించాయి. ఇది చిన్నపిల్లవాడి నుండి మిఠాయి దొంగిలించినట్లే. బలహీనమైన, అసమర్థ గవర్నర్తో కాలిఫోర్నియా తీవ్రంగా దెబ్బతింది. ఈ దీర్ఘకాలిక, ఎప్పటికీ అంతం కాని సమస్యను పరిష్కరించేందుకు, అమెరికా వెలుపల నిర్మించే అన్ని సినిమాలపై 100 శాతం సుంకం విధిస్తున్నాను’అని పేర్కొన్నారు. టాలీవుడ్ సినిమాలపై ఎఫెక్ట్అమెరికాలో 700–800 థియేటర్లలో తెలుగు సినిమాలు విడుదలవుతుంటాయి. అలా విడుదలైన బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్పతో పాటు ఇతర టాలీవుడ్ సినిమాలు అమెరికాలో కోట్ల రూపాయల వసూళ్లు సాధించాయి. టాలీవుడ్ పరిశ్రమ లెక్కల ప్రకారం.. అంతర్జాతీయంగా టాలీవుడ్ సినిమాలకు మార్కెట్ ఉన్న దేశాల్లో అమెరికా తొలి రెండుమూడు స్థానాల్లో ఉంది. టారిఫ్ ప్రభావం ఎలా ఉంటుందంటేఈ క్రమంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో టాలీవుడ్పై భారీ ఎఫెక్ట్ పడనుందని అంచనా. ట్రంప్ తాజా నిర్ణయంతో అమెరికాలో విడుదలయ్యే ప్రతి తెలుగు సినిమాపై వంద శాతం అదనపు టారిఫ్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. ఒక సినిమా పంపిణీదారులు రూ.5 కోట్ల రూపాయల విలువైన హక్కులు కొనుగోలు చేస్తే..మరో రూ.5 కోట్లు టారిఫ్గా చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల సినిమా టికెట్ ధరలు రెట్టింపు కావచ్చు. ప్రేక్షకులపై భారం పడే అవకాశం ఉంది.పరిశ్రమలో ఆందోళనఇండియన్ సినిమాలపై అమెరికా తీసుకున్న నిర్ణయం వల్ల విదేశీ పంపిణీ ఒప్పందాలు, విడుదల వ్యూహాలు మారిపోవచ్చు. అమెరికాలో వసూళ్లు తగ్గిపోతే, నిర్మాతలు, పెట్టుబడిదారులు తమ వ్యూహాలను పునరాలోచించాల్సి ఉంటుంది. ట్రంప్ ఈ నిర్ణయాన్ని ‘అమెరికా సినిమా పరిశ్రమను రక్షించేందుకు’ తీసుకున్నట్లు పేర్కొన్నారు. కానీ, ఇది అంతర్జాతీయ సినిమా వ్యాపారాన్ని గందరగోళంలోకి నెట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా.. రేపే..
అమెరికాలో లక్ష మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు మంగళవారం రాజీనామా చేస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump)పాలనకు వచ్చిన వెంటనే ప్రభుత్వ రంగంలో భారీగా ఉద్యోగుల తగ్గింపునకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉద్యోగాల నుంచి తప్పుకొనే ఉద్యోగులకు ట్రంప్ సర్కారు స్వచ్ఛంద రాజీనామాల కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.ఈ రాజీనామా కార్యక్రమంలో భాగంగా లక్ష మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామాలకు సిద్ధమయ్యారు. దీనికి మంగళవారం తుది గడువు కావడంతో అంగీకరించిన వారందరూ ఆ రోజున రాజీనామా చేస్తారని భావిస్తున్నారు. ఒకవేళ ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామాలు చేయకపోతే పెద్ద ఎత్తున తొలగింపు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఫెడరల్ ఏజెన్సీలను వైట్హౌస్ ఆదేశించింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రభుత్వ రంగంలో అత్యంత భారీ సంఖ్యలో నిష్క్రమణలు ఇవే కావడం గమనార్హం.కాగా చెప్పినట్లు రాజీనామా చేసిన ఉద్యోగులకు ఎనిమిది నెలలపాటు అడ్మినిస్ట్రేటివ్ లీవ్ ఇచ్చి ఆ ఎనిమిది నెలల కాలానికి వేతనాలు, ఇతర ప్రయోజాలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందు కోసం ప్రభుత్వానికి 14.8 బిలియన్ డాలర్లు ఖర్చు కానుంది. అయితే ఉద్యోగుల తగ్గింపుతో దీర్ఘకాలికంగా ఏటా 28 బిలియన్ డాలర్లు ప్రభుత్వానికి ఆదా అవుతాయని అధికారులు చెబుతున్నారు.ఇదీ చదవండి: చైనా కోసం గాడిదలు పెంచుతున్న పాకిస్థాన్.. -
ఇది ఆమె "మన్ కీ బాత్"..! నారీ శక్తికి నిలువెత్తు నిదర్శనం..
భారత్, ఇటలీ ప్రధానులు నరేంద్రమోదీ, జార్జియా మెలోనీ మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలోనే ఆమె ఆత్మకతకు ముందు మాట రాశారు. అందులో ఇటలీ ప్రధాని మెలోని జీవితం ఎప్పుడూ రాజకీయాలు, అధికారం గురించి కాదు అంటూ పలు ఆసక్తి కర విషయాలు వెల్లండించారు. ఒకరి ఆత్మకథలో ముందుమాట ఇంత అద్భుతంగా ఉంటుందా అనేలా..మెలోని గురించి చాలా చక్కగా వివరించారు ప్రధాని మోదీ. మరి ఆ విశేషాలేంటో చూద్దామా..!‘ఐ యామ్ జార్జియా: మై రూట్స్, మై ప్రిన్సిపల్స్(I Am Giorgia — My Roots, My Principles)’ పేరిట రాసిన మెలోనీ ఆత్మకథ ఇండియన్ ఎడిషన్ను త్వరలో మార్కెట్లోకి తీసుకురానున్నారు. దీనిని ‘హర్ మన్కీ బాత్’ అని అభివర్ణించిన ప్రధాని మోదీ.. ముందుమాట రాశారు. అది తనకు దక్కిన గొప్ప గౌరవం అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘‘పీఎం మెలోనీ జీవితం, నాయకత్వం అధికారం గురించి కాదని అన్నారు. నిశితంగా చూస్తే అడగడుగున ధైర్యం దృఢనిశ్చయం ప్రజాసేవ పట్ల నిబద్ధత ప్రస్పుటంగా కనిపిస్తాయని చెప్పారు. నాయకురాలిగా ఆమె ప్రస్థానం స్ఫూర్తిదాయకం, చారిత్రాత్మకమైనదని అన్నారు. ఆమె ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడూ కూడా రాజకీయ విశ్లేషకులు సందేహాస్పదంగా ఉన్నారు. అయితే ఆమె నాయకురాలిగా తన బలం, స్థిరత్వాన్ని అందించారన్నారు. అంతేగాదు ఎల్లప్పుడూ ప్రపంచ వేదికపై ఇటలీ ప్రయోజనాలను అద్భుతమైన స్పష్టతతో వినిపించింది. ఆమె ఎదుగుదల, నాయకత్వాన్ని అర్థం చేసుకోవడానికి, అభినందించడానికి చాలా మార్గాలు ఉన్నాయన్నారు. అయితే తాను భారతీయ సంప్రదాయంలో అనే రూపాల్లో గౌరవించబడుతున్న దైవిక స్త్రీ శక్తి, నారీ శక్తి భావనలతో సరిపోలుస్తానన్నారు. ప్రధాని మెలోనీ ప్రపంచం వేదికపై తన దేశాన్ని నడిపిస్తూ..తన మూలలను మరవలేదు. అందుకే ఆమె రాజకీయ ప్రస్థానం భారతదేశంతో లోతుగా ప్రతిధ్వనిస్తుందని అన్నారు. రోమ్లోని ఓ సాదాసీదా పొరుగు ప్రాంతం నుంచి ఇటలీ అత్యున్నత రాజకీయ పదవిని అధిరోహించేంత వరకు సాగిన రాజకీయ ప్రస్థానం...ఆమె శక్తిని హైలెట్ చేస్తోంది. అంతేగాదు మాతృత్వం, జాతీయ గుర్తింపు, సంప్రదాయాన్ని రక్షించాలనే ఉద్దేశ్యం తదితరాలు భారత పాఠకులతో ప్రతిధ్వనిస్తుందని చెప్పారు. అలాగే ప్రపంచంతో నిమగ్నమవుతూనే సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించుకోవడానికి పడుతున్న ఆరాటం, తపన.. ఆమె వ్యక్తిగత నమ్మకాలు, విలువలకు నిదర్శనమని అన్నారు. పైగా ఆమెకు ప్రజల పట్ల ఉన్న అపారమైన కరుణ, బాధ్యత తోపాటు శాంతిమార్గంలో నడిపించాలనే ఆలోచనలు ఈ పుస్తకం అంతటా ప్రతిధ్వనిస్తాయి అని రాసుకొచ్చారు మోదీ.వాస్తవానికి ఈ బుక్ అసలు వెర్షన్ 2021లోనే పబ్లిష్ అయి, బెస్ట్ సెల్లర్గా నిలిచింది. అప్పుడు మెలోనీ (Giorgia Meloni) విపక్షంలో ఉన్నారు. 2025, జూన్లో దీనిని అమెరికాలో విడుదల చేశారు. అప్పుడు దానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు ముందుమాట రాశారు. కాగా.. మోదీ, మెలోనీలు దిగిన ఫొటోలు ఎప్పుడూ నెట్టింట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్న సంగతి తెలిసిందే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ వేదికగా జరిగిన ‘కాప్ 28’ సదస్సు సందర్భంగా వీరిద్దరూ సెల్ఫీ తీసుకున్నారు. దీన్ని మెలోని ఎక్స్లో షేర్ చేశారు. దానికి మెలోడీ (ఇద్దరి పేర్లలోని అక్షరాలు కలిసేలా) అనే హ్యాష్ట్యాగ్ను జత చేశారు. అప్పటినుంచి ఈ #Melodi పదం ట్రెండ్ అయ్యింది.(చదవండి: వండర్ బామ్మ..! 93 ఏళ్ల వయసులో గోల్డ్ మెడల్) -
చైనా కోసం గాడిదలు పెంచుతున్న పాకిస్థాన్..
తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ సరికొత్త వ్యాపార అవకాశాలపై దృష్టి పెట్టింది. చైనా కోసం గాడిదలను పెంచుతోంది. ఇందుకోసం చైనా కంపెనీ జింగ్యింగ్ పెట్టుబడులతో పెషావర్లో 37 మిలియన్ డాలర్లతో భారీ ప్రాజెక్టును రూపొందించింది. ఇందులో భాగంగా ఏటా 80 వేల గాడిదలను చైనాకు సరఫరా చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది.చైనాలో గాడిద మాంసానికి, ఎముకలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో నెలకు 10 వేల గాడిదలను ప్రాసెస్ చేసి, మాంసం ఎగుమతులు చేయాలని నిర్ణయించినట్లు పాకిస్థాన్ ఆహార భద్రత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే స్థానికంగా మాత్రం గాడిద మాంసం అమ్మకాలపై నిషేధం ఉంటుందట.చైనాకు గాడిద మాంసాన్ని ఎగుమతి చేసేందుకు పెషావర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గాడిదల పెంపకానికి ఆధునిక ప్రయోగశాలలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. అలాగే పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాలలో 40 ప్రత్యేక పొలాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. -
స్వల్ప ఆందోళనల నడుమ.. బంగ్లాలో వైభవంగా దుర్గా పూజలు
ఢాకా: బంగ్లాదేశ్లోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న హిందువులు అత్యంత ఘనంగా దుర్గా పూజలను ప్రారంభించారు. ఈ నేపధ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా పోలీసు సిబ్బందిని భద్రత కోసం మోహరించింది. చెదురుమదురు ఘటనలు మినహా దేశవ్యాప్తంగా దుర్గా పూజలు కొనసాగుతున్నాయి. రాజధాని ఢాకాలోని ఢాకేశ్వరి ఆలయంలో ఆదివారం దుర్గాదేవిని స్వాగతించడానికి భక్తులు ర్యాలీగా తరలివచ్చారు. మారుమోగిన దుర్గాదేవి మంత్రాలు, డప్పు చప్పుళ్లు, శంఖు నాదాలు, ఆలయ గంటల నడుమ అమ్మవారిని ఆహ్వానించారు. మహా షష్టి రోజున దేవత ముఖాన్ని ఆవిష్కరించడంతో పండుగ మొదటి రోజు ఉత్సవం ప్రారంభమైందని స్థానికులు తెలిపారు. ‘ఈ ఏడాది పూజలను అత్యంత ఉత్సాహంగా జరుపుకోవాలని అనుకుంటున్నాం. ప్రభుత్వం అందిస్తున్న సహాయం, భద్రతా ఏర్పాట్ల విషయంలో ఎంతో సంతోషంగా ఉన్నాం’ అని బంగ్లాదేశ్ పూజా వేడుకల మండలి అధ్యక్షుడు బసుదేవ్ ధార్ మీడియాకు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి దేశవ్యాప్తంగా పూజా మండపాల సంఖ్య మరింతగా పెరిగిందని ఆయన అన్నారు.ఇప్పటివరకు 11 దుర్గామండపాల వద్ద చిన్నపాటి ఘర్షణలు చోటుచేసుకున్నాయని, పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని నిందితులను అరెస్టు చేశారని బసుదేవ్ ధార్ తెలిపారు. దేశవ్యాప్తంగా 33,350 మండపాలలో దుర్గా పూజలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ వార్తా సంస్థ బంగ్లాదేశ్ సంగ్బాద్ సంస్థ (బీఎస్ఎస్) తెలిపిన వివరాల ప్రకారం దుర్గా పూజల నేపధ్యంలో దేశమంతటా దాదాపు రెండు లక్షల మంది పారా పోలీస్ సిబ్బంది, 15 వేల మందికి పైగా పారా మిలిటరీ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ)కు చెందిన 430 ప్లాటూన్లను నియమించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు 70 వేల మందికి పైగా పోలీసుల పహారా కాయనున్నారు. ఇటీవల బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ దుర్గా పూజల సన్నాహాలు వీక్షించేందుకు డాకేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. -
నిరసనల ఎఫెక్ట్.. నేపాల్ మాజీ ప్రధాని ఓలీ కీలక ప్రకటన
ఖాట్మాండ్: నేపాల్(Nepal) మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ (KP Sharma Oli) కీలక ప్రకటన చేశారు. తాను దేశం వీడి వెళ్లనున్నట్లు వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ కొట్టిపారేశారు. తాను దేశం విడిచి ఎక్కడికీ పారిపోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపారు.నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ తాజాగా మాట్లాడుతూ.. నేను ఎవరికీ భయపడను. దేశంలోనే ఉండి రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తాను. దేశంలో శాంతిభద్రతలు, రాజ్యాంగ పాలనను తిరిగి పునరుద్ధరించడానికి కట్టుబడి ఉన్నాను. నేను దేశం విడిచి వెళ్లిపోతున్నట్టు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ఫేక్ ప్రచారాన్ని ఖండిస్తున్నాను. నేను ఇక్కడే ఉన్నాను. ఎక్కడికీ వెళ్లడం లేదు. ఎటువంటి ఆధారం లేని ఈ ప్రభుత్వానికి దేశాన్ని అప్పజెప్పి తాను పారిపోతానని అనుకుంటున్నారా? అని పార్టీ యువ విభాగాన్ని ప్రశ్నించారు. ప్రస్తుత ప్రభుత్వం తన భద్రత, అధికారిక హక్కులను రద్దు చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.ఇదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వం ప్రజల తీర్పుతో కాకుండా.. విధ్వంసం శక్తుల ద్వారా అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. ఇప్పటికి కూడా తనకు బెదిరింపు మెసేజులు వస్తున్నాయన్నారు. నిరసనకారులు తన నివాసాన్ని ధ్వంసం చేయడంతో ప్రస్తుతం గుండు ప్రాంతంలోని అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. నేపాల్లో అవినీతికి వ్యతిరేక ఉద్యమంగా ఇటీవల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దీంతో ప్రధాని కేపీ శర్మ సహా పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే సుశీలా కార్కీని తాత్కాలిక ప్రధానిగా జెన్-జీ(Gen Z) ఎంపిక చేసిన విషయం తెలిసిందే. 🚨 Nepal’s former Prime Minister and CPN-UML chairman KP Sharma Oli has denied speculation about his departure, accusing the Sushila Karki-led government of trying to remove his security and official benefits amid political tensions. pic.twitter.com/CJY9PUQ4bL— Geo Strategist (@GeoStrategistX) September 29, 2025 -
Bangladesh: గిరిజన బాలికపై సామూహిక అకృత్యం.. నిరసనల్లో ముగ్గురు మృతి
ఢాకా: బంగ్లాదేశ్లో ఒక బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం తీవ్ర నిరసనలకు దారి తీసింది. గిరిజన పాఠశాలకు చెందిన ఒక విద్యార్థినిపై జరిగిన అత్యాచారానికి వ్యతిరేకంగా జమ్ము స్టూడెంట్స్ బృందం నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఈ నేపధ్యంలో ఆదివాసీ గిరిజనులకు, ఇక్కడ స్థిరపడిన బెంగాలీవారికి మధ్య అల్లర్లు చోటుచేసుకున్నాయి. పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించినప్పటికీ ఘర్షణలు కొనసాగి, ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు. భారత్- మయన్మార్ సరిహద్దుల్లోని చిట్టగాంగ్ కొండ ప్రాంతాల్లోని ఖగ్రాచారీ జిల్లాలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన దరిమిలా ఘర్షణలు చోటుచేసుకున్నాయి.ఈ హింసాకాండలో 13 మంది సైనిక సిబ్బంది, ముగ్గురు పోలీసులు గాయపడ్డారని ఢాకాలోని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఖగ్రాచారీ జిల్లా కేంద్రంలో తొలుత హింస చెలరేగింది. అక్కడి చక్మా, మర్మ అనే ఆదివాసీ తెగలకు చెందినవారు శనివారం టైర్లు కాల్చివేస్తూ, చెట్ల కొమ్మలు, ఇటుకలను అడ్డుగా పెట్టి రోడ్డు దిగ్బంధనం చేశారు. దీంతో పోలీసు అధికారులు అప్రమత్తమై పరిస్థితిని పర్యవేక్షించారు. పోలీసులతో పాటు సైనిక, పారామిలిటరీ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ)దళాలు గస్తీ నిర్వహించాయి. అయినప్పటికీ హింస చెలరేగింది.బాధిత బాలిక ట్యూషన్ నుండి తిరిగి వస్తుండగా ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఒక నిర్మానుష్య ప్రదేశంలో అపస్మారక స్థితిలో పడివున్న బాలికను కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే ఆమెకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ నేపధ్యంలో పోలీసులు ఒక బెంగాలీ యువకుడిని అరెస్టు చేశారు. అతను అత్యాచారం చేసిన వారిలో ఒకడని పోలీసులు అనుమానిస్తున్నారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆ యువకుడిని విచారిస్తున్నారు. కాగా గుయిమారాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారని, వారి మృతదేహాలను ఖగ్రాచారీ ఆస్పత్రిలో ఉంచారని పోలీసు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ అహ్సాన్ హబీబ్ విలేకరులకు తెలిపారు. -
పాకిస్తాన్ సర్కార్కు బిగ్ షాక్.. పీవోకేలో ఆందోళనలు.. ఇంటర్నెట్ బంద్
శ్రీనగర్: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(POK) ఉద్రికత్త చోటుచేసుకుంది. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మౌలిక సంస్కరణలను కోరుతూ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు ప్రారంభమయ్యాయి. ఇటీవల ఎన్నడూ లేనంత స్థాయిలో ఆందోళనలు చేపట్టడంతో భారీ సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.వివరాల ప్రకారం.. అవామీ యాక్షన్ కమిటీ (Awami Action Committee (AAC)) నాయకత్వంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది పౌరులు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లో భారీ నిరసనలు చేపట్టారు. కాగా, అవామీ యాక్షన్ కమిటీ.. 38 పాయింట్ల నిర్మాణాత్మక సంస్కరణలను డిమాండ్లను పాక్ ప్రభుత్వానికి ఇచ్చింది. పీఓకేలో మౌలిక సంస్కరణలు (Structural Reforms) తీసుకురావాలని.. తమ 38 డిమాండ్లను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ‘‘షటర్-డౌన్.. వీల్-జామ్’’ పేరుతో అవామీ యాక్షన్ కమిటీ సమ్మెకు పిలుపునిచ్చింది. ఇందులో ముఖ్యంగా.. పాకిస్తాన్లో నివసిస్తున్న కాశ్మీరీ శరణార్థుల కోసం రిజర్వు చేయబడిన పీవోకే అసెంబ్లీలో 12 శాసనసభ స్థానాలను రద్దు చేయాలని, ఇది ప్రాతినిధ్య పాలనను దెబ్బతీస్తుందని తెలిపింది.#BREAKING: Thousands of civilians to launch massive protests in Pakistan Occupied Kashmir (PoK) tomorrow against Pakistani Govt under leadership of Awami Action Committee. Pak forces bring thousands of troops from Punjab to crush protest. Internet shutdown from midnight in PoK. pic.twitter.com/nfeSviJHsC— Aditya Raj Kaul (@AdityaRajKaul) September 28, 2025ఈ సందర్బంగా అవామీ యాక్షన్ కమిటీ (ఏఏసీ) నాయకుడు షౌకత్ నవాజ్ మీర్ ముజఫరాబాద్లో మాట్లాడుతూ..‘మా ప్రచారం ఏ సంస్థకు వ్యతిరేకంగా కాదు. గత 70 సంవత్సరాలుగా మా ప్రజలకు నిరాకరించబడిన ప్రాథమిక హక్కుల కోసమే పోరాటం. ప్రజలకు హక్కులను అందించడం ప్రభుత్వం బాధ్యత అని చెప్పుకొచ్చారు. మరోవైపు.. పాక్ ప్రభుత్వం దశాబ్దాలుగా తమను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతున్నట్లు నిరసనకారులు తెలిపారు. ఈ క్రమంలో పీవోకేలోని పలు ప్రాంతాల్లో పౌరులు పాక్ బలవంతపు ఆక్రమణల నుంచి విముక్తి కల్పించాలని నినాదాలు చేస్తూ (Protests In PoK) రోడ్ల పైకి వచ్చారు. ప్రభుత్వం తమ డిమాండ్ల విషయంలో చర్చలు జరపడానికి ముందుకురావాలని అవామీ యాక్షన్ కమిటీ కోరింది. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే నిరసనలను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతుండడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పాక్ ప్రభుత్వం పీవోకేలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించింది. పంజాబ్ నుంచి వేల సంఖ్యలో పాక్ సైనికులు అక్కడికి చేరుకున్నట్టు పౌరులు తెలిపారు. ఇక, ఆందోళనల నేపథ్యంలో పీవీకే ఆదివారం అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. చెక్ పోస్టులు, ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. Pakistani occupational forces are committing genocide in Pakistan-occupied Kashmir. @UNHumanRights remains silent. @BBCWorld @AJEnglish ignore it because it doesn’t suit their agendas. #POK #Kashmir #HumanRights pic.twitter.com/MxC1VCG6O1— Sabharwal (@GulshanKum6415) September 28, 2025 -
12 మంది భారత జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక
కొలంబో: శ్రీలంక ఉత్తర ప్రాంతంలోని జాఫ్నా వద్ద ఆదివారం ఆ దేశ నేవీ 12 మంది భారతీయ జాలర్లను అరెస్ట్ చేయడంతోపాటు, వారి బోటును స్వాదీనం చేసుకుంది. ఆదివారం ఉదయం శ్రీలంక ప్రాదేశిక జలాల్లో డెల్ఫ్ట్ దీవి పక్కన అక్రమంగా చేపలు పడుతుండగా పట్టుకున్నామని నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. కంకసేతురై హార్బర్కు మత్స్యకారులతోపాటు బోటును తరలించామంది. భారత్–శ్రీలంక ద్వైపాక్షిక సంబంధాలలో మత్స్యకారుల అంశం వివాదాస్పదంగా మారింది. శ్రీలంక నేవీ పాక్ జలసంధిలో భారత మత్స్యకారులపై కాల్పులు జరిపి, వారి పడవలను స్వా«దీనం చేసుకోవడం పరిపాటిగా మారింది. -
మాది విశేషమైన బంధం
ఐక్యరాజ్యసమితి: భారతదేశ ప్రయోజనాలను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరించే స్వతంత్ర విదేశాంగ విధానాలను తాము సంపూర్తిగా గౌరవిస్తామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పేర్కొన్నారు. అమెరికాతో గానీ మరే ఇతర దేశంతోగానీ భారత్ సంబంధాలు, భారత్, రష్యాల మధ్య సంబంధాలకు ప్రామాణికం కావని స్పష్టం చేశారు. భారత్, రష్యాలు విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయన్నారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఆయన ఈ మేరకు విస్పష్టంగా ప్రకటించారు. అమెరికా లేదా మరే ఇతర దేశంతో భారత్ సంబంధాల్లో ఏర్పడే ఉద్రిక్తతల ప్రభావం భారత్–రష్యాల మధ్య పడబోదని లావ్రోవ్ తెలిపారు. అంతకుముందు, ఆయన మీడియాతో మాట్లాడారు. రష్యా ఆయిల్ కొనరాదంటూ భారత్పై అమెరికా చేస్తున్న ఒత్తిడుల నేపథ్యంలో ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. ‘అమెరికాతో సంబంధాలను గురించి భారతీయ మిత్రులను అడగను. ఇలాంటి విషయాలపై స్వయంగా తీసుకోగల సామర్థ్యం వారికి ఉంది’అని ఆయన అన్నారు. ‘అమెరికా ఒక వేళ మాకు చమురు విక్రయించాలనుకుంటే ఆ విషయంలో ఆ దేశంతో సంప్రదింపులకు మేం సిద్ధం. అంతేతప్ప, ఇతర దేశాల నుంచి మేం ఏం కొనాలి, రష్యాతో ఏం కొనాలి, ఏం కొనకూడదు అనేవి మా సొంత విషయం. దీనికి భారత్–అమెరికా అజెండాతో సంబంధం లేదు’అని అమెరికాకు బదులిచి్చనట్లు జై శంకర్ నాతో అన్నారు. ఆయనది చాలా సరైన సమాధానం, ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే అంశం’అని లావ్రోవ్ వివరించారు. రెండు దేశాల మధ్య ఉన్నతస్థాయి సంబంధాలు సాధారణంగానే కొనసాగుతున్నాయన్నారు. ఈ విషయంలో ఎటువంటి ఇబ్బందీ కలగలేదని తెలిపారు. ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) సమావేశాల సమయంలో తమ అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీ సమావేశమైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్లో భారత్లో పర్యటించే అవకాశాలున్నాయని లావ్రోవ్ వెల్లడించారు. వాణిజ్యం, సైనిక, సాంకేతిక సహకారం, ఆర్థిక, మానవీయ అంశాలు, ఆరోగ్యం, హైటెక్, కృత్రిమ మేధ వంటి అంశాల్లో ద్వైపాక్షిక సంబంధాలతోపాటు, ఎస్సీవో, బ్రిక్స్ వంటి అంతర్జాతీయ వేదికలపై రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారం కొనసాగుతోందన్నారు. ఐరాస సమావేశాలకు హాజరైన భారత విదేశాంగ మంత్రి జై శంకర్తోనూ లావ్రోవ్ భేటీ అయ్యారు. బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రులతో భేటీ అయ్యారు. -
చైనా మాజీ మంత్రికి మరణ శిక్ష రద్దు...రెండేళ్ల జైలు
బీజింగ్: లంచం తీసుకున్నారనే ఆరోపణలపై మరణశిక్ష ఎదుర్కొంటున్న చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ నేత, మాజీ వ్యవసాయ, గ్రామీణ వ్యవహారాల శాఖ మంత్రి టంగ్ రెంజియన్కు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 2007–2024 వివిధ హోదాల్లో పనిచేసి, అధికారాన్ని దురి్వనియోగం చేశారని ఆరోపించింది. సుమారు రూ.336 కోట్ల మేర లంచాలు తీసుకున్నారని తెలిపింది. అయితే, తన ఆస్తులతోపాటు, అక్రమంగా సంపాదించిన సొత్తును సైతం ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించారని, విచారణకు పూర్తిస్థాయిలో సహకరించారని కోర్టు తెలిపింది. పశ్చాత్తాపం వ్యక్తం చేసినందున ఆయనకు మరణ శిక్షను రద్దు చేస్తూ రెండేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు పేర్కొంది. జిలిన్ ప్రావిన్స్లోని చంగ్చున్ పీపుల్స్ కోర్ట్ ఆదివారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. 2012లో జిన్పింగ్ అధికార పగ్గాలు చేపట్టాక అవినీతి ఆరోపణలునన కనీసం 10 లక్షల మంది అధికారులకు శిక్షలుపడ్డాయి. వీరిలో కమ్యూనిస్ట్ పార్టీ అగ్ర నేతలు సైతం పదుల సంఖ్యలో ఉన్నారు. -
ఇరాన్పై ఐరాస మళ్లీ ఆంక్షలు
దుబాయ్: ఇరాన్ అణు కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి మళ్లీ ఆ దేశంపై పూర్తి స్థాయి ఆంక్షలను విధించింది. ఇప్పటికే ఆ దేశ ప్రజలు సంపాదించిందంతా ఆహారం కోసమే ఖర్చు పెడుతూ, భవిష్యత్తుపై ఆందోళన చెందుతుండగా వారిపై ఆంక్షల వల మళ్లీ పడింది. అణు కార్యక్రమాన్ని వదిలేయాలంటూ చిట్టచివరి నిమిషంలో ఐరాసలో జరిగిన దౌత్య చర్చలు విఫలం కావడంతో ఆదివారం రాత్రి 8 గంటల సమయం నుంచి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీనిఫలితంగా, విదేశాల్లో ఉన్న ఇరాన్ ఆస్తులు ఫ్రీజ్ అవుతాయి. ఇరాన్ కుదుర్చుకున్న ఆయుధ ఒప్పందాలూ ఆగిపోతాయి. ఇరాన్ తన బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమాన్ని కొనసాగించాలని చూస్తే మరిన్ని ఆంక్షలు మోపే ప్రమాదముంది. ఈ ఆంక్షలు ‘స్నాప్బ్యాక్’గా (స్వయంచాలికంగా–ఆటోమేటిక్)గా అమల్లోకి వస్తాయి. దీనివల్ల, ఇరాన్పై విధించిన ఇతర ఆంక్షల మాదిరిగా చైనా, రష్యాలు భద్రతామండలిలో వీటిని వీటో చేయడం కుదరదు. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, యూకేలతో ఇరాన్ 2015లో కుదుర్చుకున్న అణు ఒప్పందంలో ఈ షర తులన్నీ ఉన్నాయి. జూన్లో ఇజ్రాయెల్తోపాటు అమెరికా తమ అణు కేంద్రాలపై దాడి చేసిన నేపథ్యంలో ఇరాన్ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ)నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఇప్పటికీ ఆ దేశం వద్ద 60% శుద్ధి చేసిన యురేనియం నిల్వలున్నాయి. 90% శుద్ధి చేసిన యురేనియంతో బాంబులను తయారు చేసే సామర్థ్యం ఇరాన్ సొంతమవుతుంది. తమ అణు కార్యక్రమం శాంతియుత అవసరాలకేనంటూ ఇరాన్ చెబుతున్నా అమెరికా, పశి్చమదేశాలు అనుమానిస్తున్నాయి. నెల రోజుల క్రితమే స్నాప్బ్యాక్ను ప్రయోగిస్తామంటూ ఫ్రాన్స్, జర్మనీ, యూకేలు హెచ్చరించాయి. అయినప్పటి కీ ఇరాన్ ఐఏఈఏ పరిశీలకులను అణు కేంద్రాల్లో తనిఖీలకు అనుమతించేందుకు అంగీకరించలేదు. శుద్ధి చేసిన యురేనియం నిల్వల గురించిన సవివర నివేదికను ఐఏఈఏకు పంపలేదు. దీంతో ఆంక్షలు అనివార్యమయ్యాయని పశ్చిమ దేశాలంటున్నాయి. శాంతియుత ప్రయోజనాల కోసమైతే యురే నియంను 60 శాతం వరకు శుద్ధి చేయాల్సిన అవసరం లేదు కదా అని ప్రశి్నస్తున్నాయి.ఎన్పీటీ నుంచి వైదొలిగే యోచన ఐరాస ఆంక్షలు అమల్లోకి రావడంతో ఇరాన్ ప్రతీకార చర్యలపై తీవ్ర సమాలోచనలు చేస్తోంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్పీటీ) నుంచి వైదొలిగే ప్రతిపాదనను ఇరాన్ పార్లమెంట్ పరిశీలించే అవకాశాలున్నాయని ఎక్కువగా ఉన్నాయని స్పీకర్ మహ్మద్ బఘెర్ కలిబాఫ్ తెలిపారు. ఆంక్షలను ఆయన అన్యాయమన్నారు. ఎన్పీటీ నుంచి వైదొలగడం ద్వారా అణు బాంబును తయారు చేసే అవకాశాలున్నాయన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. అమెరికా ట్రంప్ హయాంలో 2018లో అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగినందున యూరప్ దేశాలైన యూకే, జర్మనీ, ఫ్రాన్స్లకు స్నాప్బ్యాక్ అమలు చేసే అర్హత లేదని ఆయన తెలిపారు. అయితే, ఇరాన్కు దౌత్య మార్గాలు తెరిచే ఉన్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలిపారు. ఇందుకోసం ముందుగా ఇరాన్ తమతో నేరుగా చర్చలకు రావాలని ఆయన స్పష్టం చేశారు. ఐఏఈఏ నుంచి వైదొలగడం ఇరాన్ తీవ్రమైన తప్పిదమని, ఇదే సాకుతో అమెరికా, ఇజ్రాయెల్లు ఆ దేశంపై మళ్లీ దాడులకు దిగే ప్రమాదముందని విశ్లేషకులు అంటున్నారు. -
ఆకాశయానానికి మహా బ్రిడ్జి
బీజింగ్: ఇంజనీరింగ్, నిర్మాణ రంగాల్లో అద్భుతాలు సృష్టించడంలో డ్రాగన్ దేశం చైనా ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. ఇప్పుడు మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వంతెనను ఆదివారం అధికారికంగా ప్రారంభించింది. వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. నైరుతి చైనాలోని గిజౌ ప్రావిన్స్లో ‘హుజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ బ్రిడ్జి’ పేరిట ఈ భారీ వంతెన నిర్మించారు. ఈ బ్రిడ్జి ఎత్తు 625 మీటర్లు. అంటే ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ కంటే రెండు రెట్లు ఎక్కువ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వంతెనగా హుజియాంగ్ బ్రిడ్జి రికార్డుకెక్కింది. మొత్తం పొడవు 2,890 మీటర్లు. రెండు ఆధార స్తంభాల మధ్య(స్పాన్) వంతెన పొడవు 1,420 మీటర్లు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన స్పాన్ బ్రిడ్జిగా మరో రికార్డు సృష్టించింది. కొండ ప్రాంతంలో దీన్ని నిర్మించారు. 2022లో నిర్మాణ పనులు మొదలయ్యా యి. మూడేళ్లలోనే పూర్తయ్యాయి. ఇదొక ఇంజనీరింగ్ అద్భుతం అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. నిర్మాణంలో ఇంటెలిజెంట్ కేబుల్ హోస్టింగ్ సిస్టమ్తోపాటు 2,000 ఎంపీకే హై–్రస్టెంత్ స్టీల్ వైర్ ఉపయోగించారు. ఈ మహా వంతెనకు 21 పేటెంట్లు దక్కడం గమనార్హం. మారుమూల ప్రాంతంలో ఇది అందుబాటులోకి రావడంతో ఇతర ప్రాంతాలతో అనుసంధానం పెరుగుతుందని, స్థానికంగా అభివృద్ధి వేగం పుంజుకుంటుందని, నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పులు రాబోతున్నాయని, అధికారులు చెప్పారు. వంతెన ప్రారంబోత్సవానికి వేలాది మంది జనం హాజరయ్యారు. సంబరాల్లో మునిగిపోయారు. పరస్పరం తమ ఆనందం పంచుకున్నారు. ప్రపంచంలోనే ఎత్తయిన బ్రిడ్జి తమ ప్రాంతంలో అందుబాటులోకి రావడం చాలా గర్వంగా ఉందని చెప్పారు. నాటు పడవలపై ప్రయాణించే అగత్యం ఇక తప్పిపోయిందని, కొత్త వంతెనపై రయ్రయ్ అంటూ దూసుకెళ్తామని అన్నారు. -
4,500 ఏళ్ల నాటి ఆభరణం
ఇస్తాంబుల్: తుర్కియే(టర్కీ)లో వేలాది సంవత్సరాల క్రితం నాటి అరుదైన బంగారు ఆభరణం, విలువైన పచ్చరాయి(జేడ్) తవ్వకాల్లో బయటపడ్డాయి. ప్రాచీన నగరం ‘ట్రోయ్’లో పురావస్తు పరిశోధకులు తవ్వకాలు సాగిస్తుండగా, ఇవి బహిర్గతమయ్యాయి. గత శతాబ్ద కాలంలో తవ్వకాల్లో వెలుగుచూసిన అత్యంత విలువైన నిధి ఇదేనని అంచనా వేస్తున్నారు. ఈ రెండు వస్తువులు ప్రపంచ పరిశోధకులు దృష్టిని ఆకర్శిస్తున్నాయి. ‘ట్రోయ్’లో గత 160 ఏళ్లుగా తవ్వకాలు జరుగుతుండడం విశేషం. తాజాగా బయటపడిన బంగారు ఆభరణం క్రీస్తుపూర్వం 2,500 ఏళ్ల నాటిదని, కంచు యుగంలో అప్పటి ప్రజలు ఛాతీపై ధరించి ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు. ఇది ఒక తీగకు అతికించిన నాలుగు వలయాల ఆకారంలో ఉంది. ఈ ఆభరణం 4,500 ఏళ్ల క్రితం నాటిది కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అప్పట్లో బంగారం వినియోగం అధికంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ట్రోయ్లో జరిగిన తవ్వకాల్లో ఆ ఆభరణంతోపాటు ఒక లోహపు పిన్ను, పచ్చరాయి కూడా బయటపడ్డాయి. ఈ రాయి కూడా 4,500 సంవత్సరాల క్రితం నాటిదని గుర్తించినట్లు తుర్కియే పర్యాటక శాఖ మంత్రి మెహ్మెట్ నూరీ ఎర్సో చెప్పారు. దీన్ని ఆ కాలంలో అత్యంత విలాసవంతమైన వస్తువుగా భావించేవారని, ధనవంతులు ఉంగరంలాగా ధరించేవారని పేర్కొన్నారు. తవ్వకాల్లో దొరికిన విలువైన ఈ నిధిని ట్రోయ్ మ్యూజియంలో ప్రదర్శిస్తామని, ప్రజలు తిలకించవచ్చని చెప్పారు. ప్రస్తుత వీటి విలువ తేల్చే పనిలో నిపుణులు నిమగ్నమయ్యారు. ట్రోయ్ నగరానికి ఘనమైన చరిత్రే ఉంది. కంచు యుగంలో ఇక్కడ వ్యాపారం బాగా జరిగేది. విదేశాల నుంచి వర్తకులు వచ్చేవారు. విలువైన వస్తువుల క్రయవిక్రయాలు జోరుగా సాగేవి. ట్రోయ్ భూగర్భంలో అత్యంత విలువైన నిధి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. -
మాజీ ప్రధాని ఓలి పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకోండి
కఠ్మాండు: పదవీచ్యుత ప్రధాని కేపీ శర్మ ఓలిసహా నలుగురి పాస్పోర్టులను స్వాధీనం చేసుకోవాలని జ్యుడీషియల్ కమిషన్ నేపాల్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ నెలారంభంలో నేపాల్లో జరిగిన జెన్ జడ్ ఆందోళనలను అప్పటి కేపీ శర్మ ఓలి ప్రభుత్వం అణచివేసేందుకు తీసుకున్న చర్యలపై దర్యాప్తునకు ఉన్నతస్థాయి జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటవడం తెల్సిందే. ఓలితోపాటు మాజీ హోం మంత్రి రమేశ్ లేఖక్, మాజీ హోం శాఖ కార్యదర్శి గోకర్ణ మణి దువాడి, జాతీయ దర్యాప్తు శాఖ మాజీ చీఫ్ హుతరాజ్ థాప, కఠ్మాండు జిల్లా మాజీ అధికారి ఛాబి రిజాల్లు ఇతర దేశాలకు వెళ్లాలనుకుంటే ముందుగా ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలని కూడా కమిషన్ పేర్కొంది. దర్యాప్తు సజావుగా సాగేందుకు ఇదెంతో అవసరమని కమిటీ సభ్యుడు బిగ్యాన్ రాజ్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. జెన్ జడ్ ఆందోళన కారులపై కాల్పులకు తాను ఆదేశించ లేదంటూ ఓలి ఖండించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ నెల 8వ తేదీన జరిగిన కాల్పుల్లో 19 మంది చనిపోవడం తెల్సిందే. -
కీవ్పై రష్యా భీకర దాడి
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్ లక్ష్యంగా రష్యా మరోసారి పెద్ద సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కొనసాగిన దాడుల్లో భారీ నష్టం వాటిల్లింది. కీవ్తోపాటు జపొరిఝియా ప్రాంతాల్లో జరిగిన విధ్వంసంతో 12 ఏళ్ల బాలిక సహా నలుగురు చనిపోగా, 42 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ దాడిని పౌరులపై జరుగుతున్న యుద్ధంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అభివరి్ణంచారు. రష్యా గత నెలలో కీవ్పై చేపట్టిన భారీ దాడిలో కనీసం 21 మంది మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత జరిగిన మొదటి భారీ దాడి ఇది. తాజా దాడిలో రష్యా 595 డ్రోన్లు, 48 బాలిíస్టిక్, క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్లు ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. వీటిలో చాలా వరకు డ్రోన్లను, 43 క్షిపణులను మధ్యలోనే అడ్డుకున్నామంది. రాజధానిలోని సిటీ సెంటర్ సమీపంలో సంభవించిన భారీ పేలుడుతో దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్నంతా కమ్మేశాయి. పలు నివాస భవనాలు, మౌలిక వసతులు, మెడికల్ ఫెసిలిటీ, కిండర్గార్టన్ దెబ్బతిన్నాయి. డ్రోన్ల దాడిలో బహుళ అంతస్తుల నివాస భవనం ఒకటి తీవ్రంగా దెబ్బతింది. పై అంతస్తుల్లో మంటలు చెలరేగగా, కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎక్కడ చూసినా శిథిలాలే కనిపించాయి. ఫైర్ ఫైటర్లు, అత్యవసర సేవల సిబ్బంది ఎలక్ట్రిక్ రంపాలతో శిథిలాలను తొలగించారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకోవడంతో, జనం భయకంపితులయ్యారు. రాజధాని వ్యాప్తంగా 20కుపైగా ప్రాంతాల్లో నష్టం వాటిల్లింది. సైరన్ల మోతలతో జనం కీవ్లోని సెంట్రల్ రైల్వే స్టేషన్లోకి పరుగున చేరుకున్నారు. హెచ్చరికలు నిలిచాక బయటకు వచ్చారు. ఇలా ఉండగా, ఉక్రెయిన్పై రష్యా దాడుల నేపథ్యంలో ఆదివారం వేకువజామున పొరుగునున్న పోలండ్ తన సైన్యాన్ని అప్రమత్తం చేసి, యుద్ధ విమానాలను సరిహద్దుల్లో మోహరించి ఉంచింది. ముందు జాగ్రత్తగా ఈ మేరకు రక్షణ చర్యలు చేపట్టామని పోలండ్ మిలటరీ పేర్కొంది. కీవ్పై చేపట్టిన దాడుల గురించి రష్యా రక్షణ శాఖ స్పందించలేదు. కానీ, శనివారం రాత్రి నుంచి ఉక్రెయిన్ ఆర్మీ ప్రయోగించిన 41 డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని రష్యా తెలిపింది. అమెరికాతో భారీ ఆయుధ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శనివారం ప్రకటించిన నేపథ్యంలో ఈ దాడులు జరపడం గమనార్హం. ఈ ప్యాకేజీలో అమెరికా నుంచి ఉక్రెయిన్ 90 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను కొనుగోలు చేయడం, ఉక్రెయిన్ తయారీ క్షిపణులను అమెరికా నేరుగా కొనుగోలు చేయడం ఉన్నాయి. -
భారత్ను దారికి తీసుకురావాలి
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఇండియా, బ్రెజిల్ను ఉద్దేశించి కీలక వ్యా ఖ్యలు చేశారు. ఆ రెండు దేశాలను దారికి తీసుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసే చర్యలకు దూరంగా ఉండాలని ఇండియా, బ్రెజిల్ దేశాలకు హితవు పలికా రు. అమెరికా ఉత్పత్తులకు మార్కెట్లు తెరవాల్సిందేనని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. బ్రెజిల్, ఇండియా, స్విట్లర్లాండ్, తైవాన్ వంటి దేశాల వ్యవహార శైలి తమకు తీవ్ర అసంతృప్తి కలిగిస్తోందని అన్నారు. అమెరికా పట్ల నిజంగా స్నేహ పూర్వకంగా ఉండాలనుకుంటే సరిగ్గా ప్రతిస్పందించాలని స్పష్టంచేశారు. అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసేలా పని చేస్తుండడం వల్లనే ఇండియా వంటి దేశాలతో తాము కఠినంగా ఉండాల్సి వస్తోందని లుట్నిక్ తేల్చిచెప్పారు. ‘‘మీ ఉత్పత్తులు అమెరికన్లకు విక్రయించుకోవాలని కోరుకుంటే మా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లా డుకోండి. సంధి చేసుకోండి’’ అని సూ చించారు. ఇండియా సహా పలుదేశాల తో వాణిజ్య చర్చలు చురుగ్గా ముందు కు సాగడం లేదని తెలిపారు. ఆయా దేశాల మొండి పట్టుదల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆక్షేపించారు. వివాదాలను త్వరలో పరిష్కరించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా రష్యా నుంచి ముడి చమురు కొంటున్నందుకు భారత ఉత్పత్తులపై ట్రంప్ ప్రభుత్వం 50 శాతం టారిఫ్లు విధించిన సంగతి తెలిసిందే. రష్యా నుంచి కొనుగోళ్లు ఆపాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. భారత్ అందుకు అంగీకరించడం లేదు. తమ అవసరాల కోసమే రష్యా నుంచి చమురు కొంటున్నామని, ఇందులో దురుద్దేశం ఏమీ లేదని చెబుతోంది. భారత్ వాదనను అమెరికా నమ్మడం లేదు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి మీరే నిధులు ఇస్తున్నారంటూ మండిపడుతోంది. మరోవైపు భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా కావడం గమనార్హం. 2024–25లో రెండు దేశాల మధ్య 131.84 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. ఇందులో 86.5 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను అమెరికాకు భారత్ ఎగుమతి చేసింది. -
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం, ముగ్గురు దుర్మరణం
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. నార్త్ కరోలినాలో ఒక రెస్టారెంట్ వద్ద ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. బోటులో వచ్చి జనంపై విరుచుకుపడ్డాడు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.North Carolina shooter opens FIRE from a boatGunfire tears into restaurant — reports of 7 victimsSuspect takes off by boat & remains at large https://t.co/Y5rvJl2PWS pic.twitter.com/B3rPl1BbS4— RT (@RT_com) September 28, 2025విల్మింగ్టన్కు సమీపంలోని సౌత్పోర్ట్ యాట్ బేసిన్ ప్రాంతంలో ఉన్న ‘అమెరికన్ ఫిష్ కంపెనీ’ అనే రెస్టారెంట్లో శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. రెస్టారెంట్ సమీపంలో బోటులు వచ్చిన వ్యక్తి ఒక్కసారిగా తుపాకీతో జనంపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏడుగురికి బుల్లెట్ గాయాలయ్యాయి. ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం అదే బోటులో పరారయ్యాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాల్పుల ఘటనను సిటీ మేనేజర్ నోవా సాల్డో ధ్రువీకరించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. అయితే మృతుల వివరాలను, గాయపడిన పరిస్థితుల గురించి వివరాలను అధికారులు ఇంకా విడుదల చేయలేదు. స్థానికులు సంఘటనా ప్రాంతానికి దూరంగా ఉండాలని, సౌత్పోర్ట్ ప్రాంతానికి ఎవరూ రావొద్దని, ఇంటి లోపలే ఉండాలని మరియు ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే 911కు నివేదించాలని పోలిసులు కోరారు. బ్రున్స్విక్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం, సౌత్పోర్ట్ పోలీస డిపార్ట్మెంట్కు సహాయం అందిస్తోంది. నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశాయి.pic.twitter.com/0P055nihKy— TheBlaze (@theblaze) September 28, 2025 -
అర్జెంటీనాలో దారుణం.. లైవ్ స్ట్రీమ్లో యువతుల హత్య
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియా లైవ్లో ముగ్గురు యువతులను దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో బాధితులకు న్యాయం చేయాలని, ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలిపారు.వివరాల ప్రకారం.. అర్జెంటీనాకు చెందిన లారా, బ్రెండా, మెరానా అనే ముగ్గురు యువతులను డ్రగ్స్ ముఠా అత్యంత దారుణంగా హత్య చేశారు. సెప్టెంబర్ 19వ తేదీన ముగ్గురు యువతులు ఒక పార్టీకి హాజరయ్యేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఐదుగురు సభ్యుల డ్రగ్స్ ముఠా వారిని కిడ్నాప్ చేసింది. అనంతరం, వారిని వేధింపులకు గురిచేస్తూ నిందితులు సోషల్ మీడియా ఇన్స్స్టాగ్రామ్ లైవ్లో హత్య చేశారు. ఈ సందర్భంగా నిందితులు.. తమ వద్ద నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నా.. దొంగలించినా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి అనే వ్యాఖ్యలు వినిపించినట్టు స్థానిక మీడియా తెలిపింది.De Plaza de Mayo a Congreso resonó fuerte el grito de NI UNA MENOS. Cientos de mujeres, familias, organizaciones y sindicatos colmaron las calles para exigir justicia por Morena Vardi, Brenda del Castillo y Lara Gutiérrez. pic.twitter.com/fc4i2slf2d— Shok Argentina (@shokargentina) September 28, 2025ఇక, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలించారు. ఐదుగురు నిందితుల్లో ఒకరిని బొలీవియన్ సరిహద్దు నగరం విల్లాజోన్లో పోలీసులు అరెస్టు చేశారు. అతడిని విచారిస్తున్నట్టు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పెరువియన్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో అతడి ఫొటోను విడుదల చేశారు.🚨Confirmaron oficialmente que los tres cuerpos hallados en Florencio Varela son los de Brenda Castillo (20), Morena Verri (20) y Lara Morena Gutiérrez (15)Una cámara de seguridad las registró subiendo a una camioneta Chevrolet Tracker con patente adulterada, en La Tablada.… pic.twitter.com/Pba9OOhB3M— Hechos y Derecho (@Hechosanderecho) September 24, 2025మరోవైపు.. యువతుల హత్యపై అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ నగరంలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. బాధితులకు న్యాయం చేయాలని.. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజల రోడ్లకు మీదకు వచ్చారు. బాధితుల కుటుంబ సభ్యులు ఆవేదనతో నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు పట్టుకుని పార్లమెంట్ వరకు ర్యాలీ తీశారు. -
గత ఏడాది అత్యంత క్లిష్టమైంది!
లండన్: తన జీవితంలో 2024 సంవత్సరం అత్యంత కఠినమైనదని ప్రిన్స్ విలియం వ్యాఖ్యానించారు.గత ఏడాది విలియం భార్య కేట్, ఆయన తండ్రి కింగ్ చార్లెస్–3 ఇద్దరూ క్యాన్సర్ చికిత్స చేయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే లెవీ నిర్వహిస్తున్న ’ది రెలుక్టెంట్ ట్రావెలర్’ షోలో విలియం ఈ విషయాలు పంచుకున్నారు. ’షిట్స్ క్రీక్’ నటుడు యూజీన్ లెవీ నిర్వహిస్తున్న ఆపిల్ టీవీ+ ఎపిసోడ్కు సంబంధించిన ప్రివ్యూలో విలియం మాట్లాడుతూ.. ‘2024 నా జీవితంలోనే అత్యంత కఠినమైన సంవత్సరం అని నేను చెబుతాను. జీవితం మమ్మల్ని పరీక్షించాలని నిర్ణయించుకుంది.. ఆ పరీక్షను అధిగమించగలిగినప్పుడే మనమేమిటో తెలుస్తుంది.’ అని వ్యాఖ్యానించారు. అక్టోబర్ 3న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ ప్రివ్యూలో విలియం.. లెవీని విండ్సర్ కోట చుట్టూ తిప్పుతూ చూపించడం, వారిద్దరూ ఒక పబ్లో బీరు పంచుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్న దృశ్యాలున్నాయి. కేట్ జనవరిలో తనకు క్యాన్సర్ నయమైందని ప్రకటించారు. ఇటీవల ఆమె అనేక బహిరంగ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ నెల ప్రారంభంలో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూకే పర్యటనలో.. ఆయనకు రాజ మర్యాదలతో ఆహ్వానం పలకడంలో ఆమె, విలియం కీలక పాత్ర పోషించారు. కింగ్ చార్లెస్ కూడా గత సంవత్సరం చికిత్స కోసం నెలల పాటు విరామం తీసుకున్న తర్వాత దైనందిన జీవితంలో పాల్గొంటున్నారు. కానీ కింగ్ చార్లెస్–3, కేట్లు ఇద్దరూ తాము ఏ రకమైన క్యాన్సర్కు చికిత్స చేయించుకున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. -
గాజాలో 70 మంది పాలస్తీనియన్లు మృతి
డెయిర్ అల్–బలాహ్: గాజా వ్యాప్తంగా ఇజ్రాయెల్ ఆర్మీ చేపట్టిన వైమానిక దాడులు, కాల్పుల ఘటనల్లో కనీసం 70 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర, సెంట్రల్ గాజా పై శనివారం ఉదయం నుంచి ఈ దాడులు కొనసాగాయని అల్ జెజీరా తెలిపింది. మృతుల్లో కనీసం 36 మంది గాజా నగరంలోని వారేనని పేర్కొంది. నుసెయిరత్ శరణార్థి శిబిరంలోని ఓ నివాసంపై జరిగిన దాడిలో కుటుంబంలోని 9 మంది చనిపోయారని అల్ ఔదా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. గాజా నగరంలోని టుఫాలో జరిగిన మరో దాడిలో 11 మంది మృతి చెందారు. వీరిలో సగం మంది మహిళలు, చిన్నారులేనని అల్ అహ్లీ ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. షటి శరణార్థి శిబిరంపై జరిగిన మరో దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు షిఫా ఆస్పత్రి పేర్కొంది. గాజాలోని వేర్వేరు చోట్ల ఆహార పంపిణీ కేంద్రాల వద్దకు వచ్చిన వారిపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఆరుగురు పాలస్తీనియన్లు మృత్యువాతపడ్డారు. గాజా నగరాన్ని పూర్తిగా ఆక్రమించుకునేందుకు భారీగా సైన్యాన్ని రంగంలోకి దించిన ఇజ్రాయెల్.. వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయాలంటూ ప్రజలకు హెచ్చరికలు కొనసాగిస్తోంది. దీంతో, ఇప్పటి వరకు 3 లక్షల మందికి పైగా నగరాన్ని విడిచి వెళ్లిపోగా, తాము ఎక్కడికి వెళ్లలేమంటూ మరో 7 లక్షల మంది భవనాల శిథిలాలు, టెంట్లలోనే ఉండిపోయారు. గడిచిన రెండు వారాల్లో ఇజ్రాయెల్ ఆర్మీ జరిపి వైమానిక దాడుల్లో రెండు క్లినిక్లు ధ్వంసమయ్యాయని స్థానికులు తెలిపారు. ఔషధాలు, పరికరాలు, ఆహారం, ఇంధనం లేకపోవడంతో మరో రెండు ఆస్పత్రులను నిర్వాహకులు మూసివేయాల్సి వచ్చిందన్నారు. చాలా మంది పేషెంట్లు, సిబ్బంది ఆస్పత్రులను వదిలి వెళ్లిపోతున్నారు. చాలా తక్కువ సంఖ్యలో వైద్యులు, నర్సులు మాత్రమే కదల్లేని రోగులు, ఇంక్యుబేటర్లలో ఉంచిన చిన్నా రులకు వైద్య సాయం అందిస్తున్నారు. ఇజ్రాయెల్ దాడులు తీవ్ర రూపం దాల్చడంతో తమ సేవలను నిలిపివేస్తున్నామని ‘డాక్టర్స్ వితౌవుట్ బోర్డర్స్’గ్రూపు వైద్యులు శుక్రవారం ప్రకటించారు. గాజాలో హమాస్ లక్ష్యంగా చేపట్టిన తమ ఆపరేషన్ పని పూర్తయ్యాకే ఆగుతుందని ఐరాస జనరల్ అసెంబ్లీలో తోటి ప్రపంచ దేశాల నేతల సమక్షంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ దాడులు జరగడం గమనార్హం. 2023 అక్టోబర్ 7న హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రారంభించిన దాడుల్లో ఇప్పటి వరకు 65 వేల మంది ప్రాణాలు కోల్పోగా, 1.67 లక్షల మంది గాయపడ్డారు. బాధితుల్లో సగానికి పైగా మహిళలు, చిన్నారులేనని గాజా ఆరోగ్య విభాగం చెబుతోంది. -
స్వదేశానికి రష్యా మహిళ, పిల్లలు
బెంగళూరు: కర్ణాటకలోని ఒక గుహలో నివసిస్తూ పట్టుబడిన రష్యా మహిళ, ఆమె ఇద్దరు మైనర్ కుమార్తెలు స్వదేశానికి తిరిగి వెళ్లడానికి ప్రయాణ పత్రాలను జారీ చేయవచ్చని కేంద్ర ప్రభుత్వానికి కర్ణాటక హైకోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. పిల్లల తండ్రిగా చెప్పుకొంటున్న ఇజ్రాయెల్ జాతీయుడు ద్రోర్ శ్లోమో గోల్డ్స్టెయిన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయమూర్తి బి.ఎం.శ్యామ్ ప్రసాద్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మైనర్ పిల్లలను వెంటనే దేశం నుంచి పంపించేయవద్దని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ గోల్డ్స్టెయిన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నీనా కుటీనాగా అనే రష్యన్ మహిళ, ఆమె పిల్లలు జూలై 11న కుమ్టా తాలూకాలోని గోకర్ణ సమీపంలోని రామతీర్థ కొండల్లోని గుహలో కనిపించారు. ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి దాదాపు రెండు నెలల పాటు తగిన నివాస పత్రాలు లేకుండా అక్కడ నివసించినట్లు అధికారులు తెలిపారు. భారతదేశంలో తన పిల్లలు ఎక్కడున్నారో గుర్తించలేకపోయానంటూ వారి తండ్రి గోల్డ్స్టెయిన్ గత డిసెంబర్లో గోవాలోని పనాజీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై శుక్రవారం జరిగిన విచారణలో, కుటీనా, ఆమె కుమార్తెలకు రష్యా కాన్సులేట్ అక్టోబర్ 9 వరకు మాత్రమే చెల్లుబాటయ్యే అత్యవసర ప్రయాణ పత్రాలను జారీ చేసినట్లు కోర్టు నమోదు చేసింది. అలాగే, వీలైనంత త్వరగా రష్యాకు తిరిగి వెళ్లడానికి ఆసక్తిని వ్యక్తం చేస్తూ కుటీనా స్వయంగా కాన్సులేట్కు చేసిన విన్నపాన్ని కూడా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. కస్టడీకి సంబంధించిన ప్రక్రియలు ఇంకా పెండింగ్లో ఉన్నందున, పిల్లల శ్రేయస్సుకు విఘాతం కలిగించేలా వారిని దేశం నుంచి పంపించడం సరికాదని గోల్డ్స్టెయిన్ కౌన్సిల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, భార్య, పిల్లలు గుహలో ఏకాంతంగా ఎందుకు నివసించవలసి వచ్చిందనే దానిపై గోల్డ్స్టెయిన్ సంతృప్తికరమైన వివరణ ఇవ్వలేదని కోర్టు వ్యాఖ్యానించింది. పిల్లల సంక్షేమం, రష్యాకు తిరిగి వెళ్లాలనే తల్లి అభ్యర్థన, వారి ప్రయాణానికి సహాయం చేయడానికి రష్యా ప్రభుత్వం సిద్ధంగా ఉండటం వంటివి.. ఇతర అంశాల కంటే ముఖ్యమని ధర్మాసనం పేర్కొంది. శుక్రవారం విచారణ సందర్భంగా, రష్యా మహిళ రెండో కుమార్తెకు సంబంధించిన డీఎన్ఏ నివేదిక అందిందని, దానిని రష్యా ప్రభుత్వానికి అందజేసినట్లు అదనపు సొలిసిటర్ జనరల్ అరవింద్ కామత్ కోర్టుకు తెలియజేశారు. దీని ఆధారంగా, రష్యా ప్రభుత్వం వారికి పౌరసత్వం, రష్యాకు ప్రయాణించడానికి అత్యవసర ప్రయాణ పత్రాలను జారీ చేసిందని వివరించారు. -
యూరప్ చుట్టూ డ్రోన్ గోడ
బ్రస్సెల్స్: రష్యా– ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో యూరప్ దేశాలు మరిన్ని ఆత్మరక్షణ చర్యలకు నడుం బిగించాయి. రష్యా డ్రోన్లు, యుద్ధ విమానాలు తమ గగనతలంలోకి ప్రవేశించిన ఘటనలు ఇటీవలి కాలంలో తరచూ చోటుచేసుకుంటుండటం ఈ దేశాలను మరింత అప్రమత్తం చేసింది. రష్యా, ఉక్రెయిన్లతో తమకున్న సరిహద్దు గగనతలాల్లో చోటుచేసుకునే ఉల్లంఘనలను సకాలంలో గుర్తించి, అడ్డగించేందుకు సమగ్ర రక్షణ వ్యవస్థ, డ్రోన్ వాల్ను ఏర్పాటు చేసుకోవాలని యూరోపియన్ యూనియన్(ఈయూ) దేశాలు నిర్ణయించాయి. శుక్రవారం బెల్జియం రాజధాని బ్రసెŠస్ల్స్లో జరిగిన ఈయూ రక్షణ మంత్రుల వర్చువల్ సమావేశం ఈ మేరకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇటీవల పెరిగిపోయిన గగనతల ఉల్లంఘనలపై సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వీటిలో కొన్ని ఉల్లంఘనలకు రష్యానే కారణమంటూ దేశాలు నిందిస్తున్నాయి. అయితే, వీటికి తాము కారణం కాదని, ఉద్దేశపూర్వకంగా వీటిని ప్రయోగించామంటూ తమపై ఆరోపణలు వేయడం సరికాదని రష్యా అంటోంది. సభ్య దేశాల గగనతలంలోకి ప్రవేశించే రష్యా డ్రోన్లు, యుద్ధ విమానాలను కనిపించిన వెంటనే కూల్చేయాలంటూ నాటోకు ఆదేశాలిచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. చొరబాటు ఘటనలను నివారించేందుకు డ్రోన్ వాల్/ డ్రోన్ షీల్డ్ మాత్రమే సరైన పరిష్కారమనే అభిప్రాయానికి తాజాగా ఈయూ మంత్రులు వచ్చారు. ‘ఈయూ, నాటోలను రష్యా పరీక్షిస్తోంది. మా స్పందన వేగంగా, దీటుగా, ఐక్యంగా ఉండాలి’అని ఈయూ రక్షణ కమిషనర్ అండ్రియస్ కుబిలియస్ పేర్కొన్నారు. ఈ చర్చల్లో 10 తూర్పు యూరప్ దేశాల మంత్రులతోపాటు ఉక్రెయిన్, నాటో అధికారులు పాలుపంచుకున్నారు. డ్రోన్ షీల్డ్ను పూర్తి చేసేందుకు కనీసం ఏడాది పట్టొచ్చని కుబిలియస్ చెప్పారు. ‘సవివరమైన, సాంకేతికపరమైన రోడ్ మ్యాప్ రూపకల్పనకు ఆయా దేశాల రాయబారులు త్వరలోనే సమావేశమవుతారు. మా దృష్టంతా సమర్థవంతమైన ఉల్లంఘనల హెచ్చరికల వ్యవస్థను నెలకొల్పడంపైనే ఉంది’అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈ ప్రతిపాదనపై వచ్చే వారం డెన్మార్క్ రాజధాని కోపెన్హాగెన్లో జరిగే ఈయూ నేతల శిఖరాగ్రంలోనూ చర్చ జరుగుతుందన్నారు. అక్టోబర్ మరోసారి భేటీ అయ్యే ఈయూ రక్షణ మంత్రులు, తమ వెంట రక్షణ పరిశ్రమల ప్రతినిధులను కూడా తీసుకువస్తారని కుబిలియస్ వివరించారు. శుక్రవారం జరిగిన సమావేశం ఒక మైలురాయి వంటిదని అభివర్ణించారు. ఇప్పటి నుంచి అసలైన కార్యాచరణ మొదలవుతుందని వెల్లడించారు. మార్చిలో ప్రతిపాదన వచ్చినా..ఫిన్లాండ్, ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా, పోలండ్ దేశాలు డ్రోన్ వాల్ ప్రాజెక్టుపై కొన్ని నెలలుగా పనిచేస్తున్నాయని ఈయూ రక్షణ కమిషనర్ ఆండ్రియస్ కుబిలియస్ పేర్కొన్నారు. డ్రోన్ షీల్డ్ ఏర్పాటుకు అవసరమైన నిధులు సమకూర్చాలంటూ మార్చిలో ఎస్టోనియా – లిథువేనియాలు చేసిన వినతిని ఈయూ పట్టించుకోలేదు. అయితే, ఈలోగా పరిస్థితులు మారాయి. గురు, శుక్రవారాల్లో డెన్మార్క్తో తమ సరిహద్దులకు సమీపంలో డ్రోన్ల సంచారాన్ని గుర్తించామని జర్మనీ పేర్కొంది. దీంతో, డ్రోన్ గోడ అవసరాన్ని అందరూ గుర్తించారని కుబిలియస్ తెలిపారు. సెప్టెంబర్ 10వ తేదీన పోలెండ్ గగనతలంలోకి ప్రవేశించిన రష్యా డ్రోన్లను కూల్చి వేసేందుకు నాటో యుద్ధవిమానాలు రంగంలోకి దిగాయి. కేవలం చిన్న బెదిరింపునకే ఖరీదైన ప్రతిచర్యకు దిగాల్సి వచ్చిందన్నారు. డ్రోన్ల సంచారం కనిపించడంతో ఇటీవల డెన్మార్క్లోని విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. రష్యాతో సరిహద్దులు పంచుకుంటున్న ఇతర దేశాల్లోనూ ఇలాంటి భయాలే నెలకొన్నాయన్నారు. ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలు సైతం హైబ్రిడ్ యుద్ధం అనుభవాన్ని చవి చూస్తున్నాయని పోలెండ్ రక్షణ మంత్రి వ్లాడిస్లావ్ కోసినియక్–కమీజ్ అన్నారు. రష్యా నుంచి దీని తీవ్రంగా మరీ ఎక్కువగా ఉంది, వీటిపై సరైన రీతిలో స్పందించాల్సిన సమయం వచ్చిందని ఆయన తెలిపారు. యుద్ధ నౌక నుంచి లేదా మరేదైనా పడవ నుంచి డ్రోన్లను అత్యంత సులువుగా ప్రయోగించే ప్రమాదమున్నందున తూర్పు దేశాలే కాదు, మొత్తం యూరప్లోని దేశాలు ఈ ప్రాజెక్టులో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. సమగ్ర భద్రత కోసం ముందుకు రావాలన్నారు. ఇలా ఉండగా, కోపెన్హాగెన్లో వచ్చే వారం జరిగే శిఖరాగ్రాలకు కనీసం డజను మంది దేశాల నేతలు పాల్గొనే అవకాశం ఉంది. అయితే, డ్రోన్ బెడద తీవ్రంగా ఉన్నందున మిలటరీ యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన రుణ సాయం అందిస్తామని పొరుగునున్న స్వీడన్ ముందుకు వచ్చింది. ఈ వ్యవస్థ అనుమానాస్పద డ్రోన్లను కనిపెట్టిన వెంటనే కూల్చివేస్తుందని ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెర్సన్ చెప్పారు. దీనిపై డెన్మార్క్ సానుకూలంగా స్పందించింది. -
వివక్షాపూరిత టారిఫ్లతో వాణిజ్యానికి విఘాతం
ఐక్యరాజ్యసమితి/న్యూయార్క్: విచక్షణారహితంగా టారిఫ్లను విధిస్తూ వాణిజ్య నియంత్రణ చర్యలకు పాల్పడటంపై బ్రిక్స్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇటువంటి నిర్బంధపూరిత విధానాలతో గ్లోబల్ సౌత్ దేశాలను అణగదొక్కే ప్రమాదముందని హెచ్చరించాయి. ప్రపంచ వాణిజ్యాన్ని మరింత తగ్గించి, ప్రపంచ సరఫరా గొలుసులను దెబ్బతీసి, అంతర్జాతీయ ఆర్థికవాణిజ్య కార్యకలాపాలలో అనిశి్చతిని కల్పిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి రక్షణాత్మక చర్యలు ప్రస్తుత ఆర్థిక అసమానతలను మరింత తీవ్రతరం చేయడంతోపాటు ప్రపంచ అభివృద్ధి అవకాశాలను ప్రభావితం చేస్తాయని పేర్కొంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వార్షిక సమావేశాలకు హాజరైన బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రులు భారత్ అధ్యక్షతన శుక్రవారం న్యూయార్క్లో భేటీ అయ్యారు. 2026లో బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టనుండటం తెల్సిందే. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అధ్యక్షతన భేటీ జరిగింది. అనంతరం మంత్రులు అమెరికా ప్రభుత్వం, అధ్యక్షుడు ట్రంప్ పేరును ప్రస్తావించకుండా ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశం పహల్గాం ఉగ్రదాడిని కూడా ఖండించింది. -
ఉగ్రవాదమే తమ విధానమని పొరుగుదేశం ప్రకటించుకుంది
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి వేదికగా, ప్రపంచ దేశాల నేతల సాక్షిగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పొరుగు దేశం నైచ్యాన్ని మరోసారి తేటతెల్లం చేశారు. ఒక దేశం ఉగ్రవాదాన్ని తన విధానంగా ప్రకటించుకుందంటూ కడిగిపారేశారు. ఇలాంటి దేశాలను దగ్గరకు తీసుకునే దేశాలు సైతం ఉగ్ర కాటుకు గురికాక తప్పదని జై శంకర్ వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి ఆయన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. మనం హక్కుల గురించి చెప్పేటప్పుడు ఉగ్రవాదం వంటి తీవ్రమైన సమస్యల్ని కూడా దీటుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో పహల్గాంలో అమాయక పర్యాటకుల్ని పొట్టనబెట్టుకున్న ఉదంతమే సీమాంతర ఆటవిక ఉగ్రవాదానికి తాజా ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రంగా బిందువుగా తయారైన పొరుగు దేశం నుంచి ఈ సవాల్ను భారత్ స్వాతంత్య్రం వచి్చననాటి నుంచి ఎదుర్కొంటూనే ఉంది. అంతర్జాతీయ ఉగ్ర సంస్థల్లో ప్రధానంగా ఉండేవన్నీ ఆ ఒక్క దేశం నుంచే పనిచేస్తున్నాయి. ఐరాస ఉగ్రవాదులుగా గుర్తించిన వారంతా ఆ దేశస్తులే’అని జై శంకర్ అన్నారు. పహల్గాం దారుణం నేపథ్యంలో ఉగ్రవాదం నుంచి తన ప్రజలను రక్షించుకునే హక్కును భారతదేశం వినియోగించుకుందని, ఉగ్రవాద సంస్థలను, దోషులను న్యాయం ముందు నిలబెట్టిందని చెప్పారు. ఉగ్రవాదం ఉమ్మడి ముప్పు కాబట్టే దీనిపై జరిగే పోరులో ప్రపంచ దేశాల మధ్య సహకారం ఎంతో అవసరమన్నారు. దేశాలు ఉగ్రవాదాన్ని బహిరంగంగా తమ విధానంగా ప్రకటించినప్పుడు, ఉగ్రవాద కేంద్రాలు ఒక పరిశ్రమ స్థాయిలో పనిచేస్తున్నప్పుడు, ఉగ్రవాదులను బహిరంగంగా కీర్తించినప్పుడు ప్రపంచ దేశాలు నిర్ద్వంద్వంగా ఖండించాలి. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడాన్ని అడ్డుకోవాలి’అని కోరారు. అదే సమయంలో, ఐరాస పనితీరును సైతం ఆయన ప్రశ్నించారు. నేటి అవసరాలకు అనుగుణంగా ఈ అంతర్జాతీయ వేదిక పనిచేస్తుందా అని మనం ప్రశ్నించుకోవాలన్నారు. ఆకాంక్షలకు, అవసరాలకు అనుగుణంగా ఐరాస భద్రతా మండలిలో శాశ్వత, శాశ్వతేతర సభ్యదేశాల సంఖ్య మరింత పెరగాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్ తన ప్రజలను, వారి ప్రయోజనాలను దేశీయంగా, అంతర్జాతీయంగా పరిరక్షించేందుకు కట్టుబడి ఉంటుందని తేల్చి చెప్పారు. భారత్ గ్లోబల్ సౌత్కు గొంతుకగా ఉంటుందని జైశంకర్ స్పష్టం చేశారు. -
కాళ్లబేరానికి వచ్చిందనే కనికరించాం!
ఐక్యరాజ్యసమితి: ఆపరేషన్ సిందూర్ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడం వల్లనే భారత ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించిందంటూ ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలను అదే వేదిక నుంచి భారత్ గట్టిగా తిప్పికొట్టింది. పాకిస్తాన్ సైన్యం కాళ్లబేరానికి వచ్చి ప్రాధేయపడడం వల్లే దాడులు ఆపేశాం తప్ప ఇందులో మూడో వ్యక్తి ప్రమేయం ఎంతమాత్రం లేదని తేల్చిచెప్పింది. భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షిక వ్యవహారాల్లో మూడోపక్షం జోక్యాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టంచేసింది. ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి పెటల్ గహ్లోత్ శుక్రవారం సాయంత్రం ఐరాస సాధారణ సభ(జనరల్ అసెంబ్లీ) సమావేశంలో ప్రసంగించారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్పై నిప్పులు చెరిగారు. అర్థంపర్థంలేని అసంబద్ధమైన మాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని గొప్పగా కీర్తించడం, ఆకాశానికి ఎత్తేయడం ఆయనకే చెల్లిందని ధ్వజమెత్తారు. పాకిస్తాన్ విదేశాంగ విధానానికి ఉగ్రవాదమే మూలస్తంభంగా మారిందన్నారు. ఆపరేషన్ సిందూర్తో చావుదెబ్బ తిన్న పాకిస్తాన్ కింద పడినా తనదే పైచేయి అని చెప్పుకోవడానికి ఆరాట పడుతోందని ఎద్దేవా చేశారు. పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిందని, పాకిస్తాన్తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని ఉగ్రవాద స్థావరాలను, శిక్షణ కేంద్రాలను, ఎయిర్బేస్లను నేలమట్టం చేసిందని గుర్తుచేశారు. పెటల్ గహ్లోత్ ఇంకా ఏం మాట్లాడారంటే... అందుకేనా మీ సంబరాలు? ‘‘ ఈ ఏడాది మే 7న ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైంది. భారత్పై మరిన్ని దాడులు చేస్తామంటూ మే 9 దాకా పాకిస్తాన్ బెదిరింపులకు దిగింది. వెంటనే దాడులు ఆపాలంటూ మే 10న భారత్ను పాక్ సైన్యం వేడుకుంది. మూడో వ్యక్తితో సంబంధం లేకుండా నేరుగా సంప్రదించింది. భారత సైన్యం చేపట్టిన వైమానిక దాడుల్లో భారీగా నష్టం వాటిల్లడంతో పాకిస్తాన్కు తత్వం బోధపడింది. ఆపరేషన్ సిందూర్లో పాక్ కీలక వైమానిక కేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆ ఫొటోలు బయటకు వచ్చాయి. అవి ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా చూడొచ్చు. భారత్పై జరిగిన యుద్ధంలో విజయం సాధించామని షెహబాజ్ షరీఫ్ చెప్పుకుంటున్నారు. పూర్తిగా ధ్వంసమైన రన్వేలు, మంటల్లో కాలిపోయిన హ్యాంగర్లు ఆయనకు విజయంగా కనిపిస్తున్నాయా? ఉగ్రవాదులకు అధికారుల నివాళులా? పాకిస్తాన్ భూభాగంలోని బహవల్పూర్, మురిద్కేలో ఉగ్రవాద శిబిరాలు, శిక్షణ కేంద్రాలు నామరూపాల్లేకుండాపోయిన చిత్రాలు మనమంతా చూశాం. భారత సైన్యం దాడుల్లో కరడుగట్టిన ఉగ్రవాదులు హతమైపోయారు. వారి అంత్యక్రియలకు పాకిస్తాన్ సీనియర్ సైనికాధికారులు, ప్రభుత్వాధికారులు స్వయంగా హాజరయ్యారు. నివాళులరి్పంచారు. ముష్కరులను గొప్ప వ్యక్తులుగా పరిగణించడం పాకిస్తాన్ విధానమని మరోసారి తేలిపోయింది. వారిని శిక్షించాల్సిందే పహల్గాంలో పర్యాటకుల ప్రాణాలను బలి తీసుకున్న ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ను ఏప్రిల్ 25న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో వెనకేసుకొచి్చంది పాకిస్తాన్ కాదా? పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ భద్రతా మండలి జారీ చేసిన ప్రెస్ స్టేట్మెంట్లో టీఆర్ఎఫ్ పేరును ఎవరు తొలగించారు? డ్రామాలు, అబద్ధాలు నిజాన్ని కప్పిపుచ్చలేవు. పహల్గాం దాడికి కారణమైన ముష్కరులను, వారి పోషకులను చట్టం ముందు నిలబెట్టి శిక్షించాల్సిందే. ఉడత ఊపులకు భారత్ భయపడదు ఉగ్రవాదంపై భారత్ వైఖరి స్పష్టంగా ఉంది. ఉగ్రవాదులను, వారి పోషకులను వేర్వేరుగా చూడడం లేదు. భారత్ దృష్టిలో వారంతా ఒక్కటే. వారిని శిక్షించాల్సిందే. అణుబాంబులు ఉన్నాయని బెదిరిస్తూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తామంటే సహించే ప్రసక్తే లేదు. అలాంటి ఉడత ఊపులకు భారత్ ఎప్పటికీ భయపడదు. ఎవరికీ తలవంచదు. భారత్తో సమగ్ర చర్చలకు సిద్ధంగా ఉన్నామని షెహబాజ్ షరీఫ్ చెబుతున్నారు. చర్చలు జరగాలని ఆయన నిజాయితీగా కోరుకుంటే ‘తొలుత పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్రవాద కేంద్రాలన్నింటినీ మూసివేసి ఉగ్రవాదులను మాకు అప్పగించాలి. ఆ తర్వాతే చర్చలు. మతోన్మాదం, విద్వేషం, అసహనం అనే రొచ్చులో చిక్కుకున్న పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి వేదికపై విశ్వాసం, శాంతి గురించి బోధనలు చేయడం విచిత్రంగా ఉంది’’ అని పెటల్ గహ్లోత్ ఘాటుగా వ్యాఖ్యానించారు. -
వాంగ్చుక్కు పాక్తో సంబంధాలు.. పక్కా ఆధారాలున్నాయి: డీజీపీ
లేహ్: లద్దాఖ్ పర్యావరణ ఉద్యమకారుడు, సామాజికవేత్త సోనమ్ వాంగ్చుక్ను పోలీసులు నిన్న(సెప్టెంబర్ 26 శుక్రవారం) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. లద్దాఖ్ రాజధాని లేహ్లో జరిగిన హింసాకాండలో నలుగురు మరణించగా, 70 మంది గాయపడ్డారు. యువతను రెచ్చగొట్టి హింసను ప్రేరేపించాడన్న కారణంతో జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద డీజీపీ ఎస్.డి.సింగ్ జమ్వాల్ ఆధ్వర్యంలో సోనమ్ వాంగ్చుక్ను ఆయన సొంత గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు.ఇదిలా ఉండగా.. సోనమ్ వాంగ్చుక్కు పాకిస్థాన్తో సంబంధాలున్నాయంటూ లద్దాఖ్ డీజీపీ ఎస్డీ సింగ్ జామ్వాల్ శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సంచలన ప్రకటన చేశారు. పాక్తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలిందన్న డీజీపీ.. పొరుగు దేశం బంగ్లాదేశ్ను కూడా ఆయన సందర్శించినట్లు లద్దాఖ్ డీజీపీ వెల్లడించారు. ఓ పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారితో వాంగ్చుక్కు సంబంధాలున్నాయని పేర్కొన్న డీజీపీ.. తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయంటూ స్పష్టం చేశారు. పాక్లో జరిగిన ఓ కార్యక్రమానికి కూడా వాంగ్చుక్ హాజరైనట్లు తేలిందన్నారు.కాగా, లద్దాఖ్లో అశాంతి, ఉద్రిక్తతలకు వాంగ్చుక్ కారణమంటూ కేంద్ర హోంశాఖ ఆరోపించిన సంగతి తెలిసిందే. అరబ్ వసంతం, నేపాల్ జెన్–జెడ్ ఉద్యమాల గురించి యువతకు నూరిపోస్తూ, వారిని రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తూ హింసను ప్రేరేపిస్తున్నారని మండిపడింది. అయితే, కేంద్ర ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలను వాంగ్చుక్ ఖండించారు. హింస వెనుక తన ప్రమేయం లేదని తేల్చిచెప్పారు. -
రోజంతా చిన్న గదిలో బంధించారు
చండీగఢ్: అమెరికాలో దాదాపు 30 ఏళ్లుగా ఉంటూ.. ఏ ఒక్కరోజు కూడా ఏ తప్పూ చేయని తనను ఆ దేశ ఇమిగ్రేషన్ అధికారులు అత్యంత దారుణంగా భారత్కు బలవంతంగా (డిపోర్ట్) పంపేశారని పంజాబ్కు చెందిన 73 ఏళ్ల హర్జిత్కౌర్ కన్నీటిపర్యంతమయ్యారు. కనీసం తన కుటుంబసభ్యులకు వీడ్కోలు కూడా చెప్పనివ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారన్న ఆరోపణలతో హర్జిత్కౌర్ను అరెస్టు చేసిన ఆ దేశ అధికారులు.. కొద్దిరోజుల క్రితం భారత్కు తిప్పి పంపారు. ఆమె శనివారం మొహాలీలోని తన సోదరి నివాసంలో మీడియాతో తన ఆవేదనను పంచుకున్నారు. అమెరికా అధికారులు తనతో అత్యంత దారుణంగా వ్యవహరించారని, ఎందుకు అరెస్టు చేశారో కూడా చెప్పలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. కౌర్ స్వస్థలం పంజాబ్లోని తార్న్తరణ్ జిల్లా పంగోటా గ్రామం. భర్త చనిపోవటంతో ఆమె 1992లో ఇద్దరు కుమారులను తీసుకొని అమెరికా వెళ్లారు. కాలిఫోరి్నయాలోని ఈస్బేలో స్థిరపడ్డారు. శాశ్వత నివాసం కోసం ఆమె పెట్టుకున్న దరఖాస్తును 2012లో అమెరికా అధికారులు తిరస్కరించారు. అప్పటి నుంచి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆమె స్థానిక ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) కార్యాలయానికి వెళ్లి హాజరు వేసుకుంటూనే ఉన్నారు. అలాగే ఈ నెల 8న ఐసీఈ కార్యాలయానికి వెళ్లిన ఆమెను రెండుగంటలపాటు కూర్చోబెట్టి.. అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. అధికారుల తీరుపై ఆమె కుటుంబసభ్యులు, స్థానిక సిక్కు ప్రజలు తీవ్ర అభ్యంతరం తెలిపినా ప్రయోజనం లేకపోయింది. ఇటీవలే ఆమెను భారత్కు బలవంతంగా పంపేశారు. కూర్చునే అవకాశం కూడా ఇవ్వలేదు మోకాళ్ల సర్జరీ చేయించుకున్న తనను అమెరికా అధికారులు ఒక రాత్రంతా ఓ గదిలో బంధించి కనీసం కూర్చునే సౌకర్యం కూడా కల్పించలేదని హర్జిత్కౌర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘ప్రతి ఆరు నెలలకు నేను ఐసీఈ ఆఫీస్కు వెళ్లి హాజరు వేయించుకునేదాన్ని ఈ నెల 8న అలాగే వెళ్లాను. కానీ, ఏ కారణం చెప్పకుండానే నన్ను అరెస్టు చేశారు. నా కుటుంబసభ్యులకు కనీసం వీడ్కోలు కూడా చెప్పే సమయం ఇవ్వకుండా బలవంతంగా తీసుకెళ్లిపోయారు. నన్ను భారత్కు తామే తీసుకెళ్తామని నా కుటుంబసభ్యులు అధికారులకు తెలిపి, విమాన టికెట్లు చూపించినా వాళ్లు పట్టించుకోలేదు. నాకు అమెరికాలో వర్క్ పరి్మట్ ఉంది. ఐడీ, లైసెన్స్ అన్నీ ఉన్నాయి. అయినా అరెస్టు చేశారు’అని వాపోయారు. తనకు ఎదురైన పరిస్థితి ఎవరికీ ఎదురుకావద్దని కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘ఏం చెప్పనూ.. ! నా పరిస్థితి ఎవరికీ రాకూడదు. నన్ను అరెస్టు చేసిన తర్వాత అధికారులు నా ఫొటోలు తీసుకొని ఒక రాత్రంతా ఓ గదిలో ఉంచారు. అది చాలా చల్లని ప్రదేశం. నాకు కనీసం కూర్చునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. నా చేతులకు బేడీలు వేసి బంధించి శాన్ఫ్రాన్సిస్కో నుంచి బేకర్స్ఫీల్డ్కు తీసుకెళ్లారు. మందులు కూడా వేసుకోనివ్వలేదు. నా మొరను ఎవరూ పట్టించుకోలేదు. నేను పూర్తిగా శాకాహారిని. వాళ్లు నాకు గొడ్డుమాంసంతో కూడి భోజనం ఇచ్చారు. దీంతో నేను అది తినలేక చిప్స్, బిస్కట్లతోనే కడుపు నింపుకున్నాను’అని చెప్పారు. ఖైదీలకు వేసినట్లు నాకు ఓ యూనిఫాం వేసి పంపేశారు. నా మనవడు ‘ఈ డ్రస్లో నిన్ను చూడలేకపోతున్నా నానమ్మ’ అని బాధపడ్డాడు అని కౌర్ తెలిపారు. మళ్లీ అమెరికా వెళ్తా తాను మళ్లీ అమెరికా వెళ్లగలననే నమ్మకం ఉందని హర్జిత్ కౌర్ తెలిపారు. ‘భారత్లో నాకు ఉండటానికి ఏమీ లేదు. నా కుటుంబమంతా అమెరికాలోనే ఉంది. నా స్వగ్రామంలో నా ఇల్లు ఉందో కూలిపోయిందో కూడా తెలియదు. నేను మళ్లీ అమెరికా వెళ్లి నా కుటుంబాన్ని కలుస్తాననే నమ్మకం ఉంది’అని ఆశాభావం వ్యక్తంచేశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచి్చన తర్వాతే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. -
పాక్లో మిన్నంటిన నవరాత్రి సంబరాలు, గార్బా, దాండియా సందడి
దసరా నవరాత్రి ఉత్సవాలు ఒక్క భారతదేశానికే పరిమితం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు దసరా వేడుకలను నిర్వహించుకుంటారు. దేశంలోని అనేక నగరాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అయితే పాకిస్థాన్లోని కరాచీ నగరంలో దసరా సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు నెట్టింట విశేషంగా నిలిచాయి.పాకిస్తాన్లో నివాసం ఉంటున్న ఇండియన్ ప్రీతం దేవ్రియా ఈ వీడియోను షేర్ చేశారు. అక్కడి భారతీయ భక్తులు గర్బా, దాండియా నృత్యాలతో సందడి చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరాచీ నుండి మరొక వీడియో, ధీరజ్ షేర్ చేసిన మరో వీడియోలు కూడా దసరా సంబరాలను ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ దుస్తుల్లో ఇవిద్యుత్ దీపాలతో అలంకరించిన ఒక వీధిలో దుర్గామాత చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించడం విశేషం. ముస్లింలు ఎక్కువగా నివసించే పాక్లో నవరాత్రి సంబరాలు ప్రత్యేకంగా నిలిచాయి. వ సోషల్ మీడియా వినియోగదారులు పాకిస్తాన్లోని హిందూ సమాజం గురించి హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు ఉత్సుకతతో స్పందించారు.పాకిస్తాన్లో శాకాహారులు , జైనులు ఉన్నారా అని అడిగినప్పుడు, ప్రీతమ్ దేవ్రియా ఉన్నారని ధృవీకరించారు. ఈ వేడుకలను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపించారు. పలువురు వారికి "నవరాత్రి శుభాకాంక్షలు" అందించారు. View this post on Instagram A post shared by प्रीतम (@preetam_devria) View this post on Instagram A post shared by प्रीतम (@preetam_devria) -
అక్టోబర్లో భారత్కు బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ రాక
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు బ్రిటిష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ 2025, అక్టోబర్ రెండవ వారంలో భారత్లో తన తొలి అధికారిక పర్యటన చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2025, జూలైలో రెండు దేశాలు చారిత్రాత్మక సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సెటా)పై సంతకం చేసిన తరువాత ఈ పర్యటన జరుగుతోంది.మూడేళ్లకు పైగా చర్చలు సాగిన దరిమిలా కుదిరిన ఈ ఒప్పందంలో బారత్-యూకే మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 120 అమెరికా బిలియన్ డాలర్లకు రెట్టింపు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఒప్పందం 2026 నుంచి అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు. బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ తన పర్యటనలో ప్రధాని మోదీతో వాణిజ్యం, సాంకేతిక, రక్షణ రంగాలపై చర్చించనున్నారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ఇరు దేశాలు ముందడుగు వేస్తున్నాయి. బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ పర్యటన భారత్-యుకె సంబంధాలలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. ఇది ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతిక భాగస్వామ్యాలను విస్తరించడానికి దోహదపడనుంది. గత ఏడాది జూలైలో పదవీ బాధ్యతలు స్వీకరించిన బ్రిటిష్ ప్రధాని స్టార్మర్ భారతదేశంలో చేయబోయే తొలి పర్యటన ఇది. ఇరు దేశాల మధ్య పెట్టుబడి అవకాశాలకు ఈ పర్యటన దోహదపడునున్నదని నిపుణులు భావిస్తున్నారు. -
అమెరికా ఆంక్షలపై ద్వంద్వ వైఖరి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మితిమీరిన టారిఫ్లతో చెలరేగిపోతున్నారు. గతంలో పెంచిన 25 సుంకాలకు అదనంగా ఇటీవలే భారత్పై మరోసారి భారీగా 25 శాతం సుంకాలు పెంచారు. అందుకు రష్యా చమురును భారత్ దిగుమతి చేసుకుంటోందనే సాకు చెప్పారు. భవిష్యత్తులో ఈ దిగుమతులను తగ్గించుకుంటే సుంకాల నిలిపివేతపై ఆలోచిస్తామని ఉద్ఘాటించారు. అయితే రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులు, వాటి వ్యాపారంపై మాత్రం నోరు మెదపడంలేదు.ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో రష్యా ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచే లక్ష్యంతో యూఎస్ అనేక ఆంక్షలను, వాణిజ్య పరిమితులను విధించింది. ఇందులో కొన్ని కీలకమైన రష్యా వస్తువులపై టారిఫ్లు పెంచినట్లు కూడా తెలిపింది. అయితే, రష్యా నుంచి ప్రస్తుతం అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తువుల జాబితాను పరిశీలిస్తే ఈ టారిఫ్ల ఎఫెక్ట్ ఎంతమేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అమెరికాకు రష్యా నుంచి చేసే వస్తువుల నుంచి లబ్ధి చేకూరుతుందనే భావిస్తే ట్రంప్ శత్రువునైనా ముద్దాడేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది. కానీ, భారత్ మాత్రం తనకు చమురు తక్కువ ధరకు ఇచ్చే రష్యా నుంచి కొనుగోలు చేస్తే యూఎస్కు కంటగింపుగా ఉంది.అమెరికా కొన్ని ఆంక్షలు, వాణిజ్య నిషేధాలు ఉన్నప్పటికీ కీలకమైన వస్తువులు ఇంకా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇటీవల కొన్ని సర్వేల ప్రకారం.. అత్యధిక విలువ కలిగిన ఎగుమతుల్లో కొన్ని కింది విధంగా ఉన్నాయి.ఎరువులు (Fertilizers): అత్యంత ముఖ్యమైన దిగుమతుల్లో ఒకటి. వ్యవసాయ రంగంలో కీలకమైన భాస్వరం (Phosphorus), పొటాషియం (Potassium) ఆధారిత ఎరువులు ఇందులో ప్రధానం.విలువైన రాళ్లు, లోహాలు, నాణేలు (Precious Stones, Metals, Coins): వజ్రాలు, విలువైన లోహాలు వంటివి ఇందులో ఉన్నాయి.కర్బనేతర రసాయనాలు (Inorganic Chemicals): వివిధ పరిశ్రమలకు అవసరమైన ముఖ్యమైన రసాయనాలను దిగుమతి చేసుకుంటోంది.యంత్రాలు, న్యూక్లియర్ రియాక్టర్లు, బాయిలర్లు (Machinery, Nuclear Reactors, Boilers): న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించిన విడి భాగాలు ఇందులో ఉన్నాయి.ప్రాథమిక లోహాలు (Other Base Metals): పల్లాడియం, అల్యూమినియం వంటి లోహాలు.అమెరికా అవసరాలపై ప్రభావంఎరువుల కొరత, ధరల పెరుగుదలరష్యా నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తువుల్లో ఎరువులు అత్యంత ముఖ్యమైనవి. వీటిపై టారిఫ్లు లేదా ఆంక్షలు పెంచితే, అమెరికాలోని రైతులు ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది. ఎరువుల ధరలు పెరిగితే, ఆహార ధాన్యాల ఉత్పత్తి వ్యయం పెరిగి, అంతిమంగా అమెరికన్ వినియోగదారులకు ద్రవ్యోల్బణం (Inflation) రూపంలో భారం పడుతుంది. రష్యాను దెబ్బతీయడానికి విధించిన టారిఫ్లు, అమెరికా ప్రజల జేబులకే చిల్లు పెట్టే అవకాశం ఉంది. ఇది గ్రహించి యూఎస్ చాకచక్యంగా వ్యవహరిస్తోంది.కీలక లోహాలు, రసాయనాలుపల్లాడియం వంటి కొన్ని లోహాలు, రసాయనాలు రష్యా నుంచే ప్రధానంగా యూఎస్కు దిగుమతి అవుతున్నాయి. వీటిని ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, ఇతర కీలక పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. సరఫరా గొలుసు (Supply Chain)లో ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయాలు దొరికే వరకు ఈ దిగుమతులను నిలిపివేయడం లేదా టారిఫ్లు పెంచడం కష్టమైన పని.ఎంపిక చేసిన టారిఫ్లు..ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముందు అమెరికాకు రష్యా ప్రధానంగా ఎగుమతి చేసిన వస్తువుల్లో ముడిచమురు, గ్యాస్ వంటి ఎనర్జీ ఉత్పత్తులు ప్రధానంగా ఉండేది. యుద్ధం నేపథ్యంలో మొదట్లోనే వాటిపై సంపూర్ణ నిషేధం విధించారు. కానీ, అమెరికా పరిశ్రమలకు నిత్యావసరంగా ఉన్న ఎరువులు, న్యూక్లియర్ ఇంధనం (యురేనియం) వంటి వాటిపై మాత్రం టారిఫ్లు, ఆంక్షల అమలులో కొంతమేరకు సడలింపు ఇచ్చారనే చెప్పాలి. ఇది రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం కంటే అమెరికా ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతినని వ్యవస్థల్లో మాత్రమే కఠిన ఆంక్షలు విధించారనే వాదనకు తావిస్తోంది.ఇతర దేశాలపై సెకండరీ టారిఫ్ల బెదిరింపులురష్యా నుంచి చమురు లేదా ఇతర వస్తువులు కొనుగోలు చేస్తున్న దేశాలపై ‘సెకండరీ టారిఫ్లు’ విధిస్తామని యూఎస్ బెదిరింపులకు పాల్పడుతోంది. ఇది అంతర్జాతీయంగా విమర్శలకు దారి తీస్తోంది. ముఖ్యంగా భారత్, చైనా వంటి దేశాలపై ఇటువంటి బెదిరింపులు వాణిజ్య యుద్ధానికి దారితీసే ప్రమాదాన్ని పెంచుతాయి. ఇవి రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంతో సంబంధం లేకుండా అమెరికన్ విదేశాంగ విధానాన్ని అడ్డంగా పెట్టుకుని అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించే ప్రయత్నంగా కనిపిస్తోంది.చివరగా..రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే ప్రయత్నంలో భాగంగా టారిఫ్లను మరింత కఠినతరం చేస్తే అంతర్జాతీయ సరఫరా గొలుసులకు మరింత ఆటంకం ఏర్పడుతుందని యూఎస్ గుర్తెరుగాలి. ఇది ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలు పెరిగేందుకు దోహదం చేస్తుందని గ్రహించాలి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం తన లక్ష్యాలను చేరుకోవడానికి టారిఫ్లపై కాకుండా, మరింత పటిష్టమైన, ప్రపంచ భాగస్వామ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి! -
అదంతా పచ్చి అబద్ధం: ఎలాన్ మస్క్
అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం ఎప్స్టీన్ ఫైల్స్తో డొనాల్డ్ ట్రంప్ను కొంతకాలం ఎలాన్ మస్క్(Elon Musk) ఇరుకునపెట్టడం తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్షుడిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మస్క్.. ఒక్కసారిగా చల్లబడ్డారు. ఈ తరుణంలో మస్క్ పేరే ఎప్స్టీన్ ఫైల్స్లో కనిపించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరు ఉందని, అందుకే ఆ ఫైల్స్ను బయటపెట్టడం లేదంటూ ఈ ఏడాది జూన్లో మస్క్ సంచలన ఆరోపణలకు దిగారు. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదుగానీ.. వరుసబెట్టి చేసిన ట్వీట్లన్నింటినీ డిలీట్ చేసుకుంటూ వచ్చారాయన. ఈ తరుణంలో.. అమెరికా హౌజ్ ఓవర్సైట్ కమిటీ విడుదల చేసిన జెఫ్రీ ఎప్స్టీన్ ఎస్టేట్ తాలుకా డాక్యుమెంట్లలో మస్క్ పేరు కనిపించింది.అందులో.. ఒక దగ్గర ఎలాన్ మస్క్ డిసెంబర్ 6న ఐల్యాండ్కు రావాలి అని ఉంది. దీంతో ఎప్స్టీన్కు చెందిన ప్రైవేట్ ద్వీపానికి మస్క్ వెళ్లారా? అనే ప్రశ్న మొదలైంది. అయితే.. ఎలాన్ మస్క్ ఈ ఆరోపణను ఖండించారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టత ఇచ్చారు. అయితే.. మస్క్ ఎప్స్టీన్ ఫైల్స్పై ఇలా స్పందించడం ఇదేం తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఆయనకు, ఎప్స్టీన్కు మధ్య సంబంధాల గురించి రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే.. తానెప్పుడు ఎప్స్టీన్ ఐల్యాండ్కు వెళ్లలేదని మస్క్ చెబుతూ వస్తున్నారు. మరోవైపు.. 8,544 పేజీల డాక్యుమెంట్లలో విమాన ప్రయాణాల వివరాలు, క్యాలెండర్లు, ఎప్స్టీన్కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వివరాలు ఉన్నాయి. కేవలం మస్క్ పేరు మాత్రమే కాదు.. అందులో ట్రంప్ సహా బిల్గేట్స్, ప్రిన్స్ ఆండ్రూ వంటి వారి పేర్లు కూడా ఉన్నాయి. అయితే పేర్లు ఉన్నంత మాత్రానా వాళ్లు ఎప్స్టీన్ లైంగిక వేధింపుల వ్యవహారంలో భాగస్వాములు అయి ఉంటారనే నిర్ధారణ లేదని దర్యాప్తు సంస్థలు మొదటి నుంచి చెబుతూ వస్తుండడం గమనార్హం.ఎవరీ ఎప్స్టీన్..అమెరికాలో సంచలనం సృష్టించింది జెఫ్రీ ఎప్స్టీన్(Jeffrey Epstein)హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం. అమెరికన్ ఫైనాన్షియర్, ప్రముఖ ఇన్వెస్టర్ అయిన జెఫ్రీ ఎప్స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. ఇదే కేసులో అరెస్టైన ఎప్స్టీన్ సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్వెల్.. ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్లో ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలూ ఉన్నాయి. చాలా ఏళ్లపాటు మైనర్ బాలికలపై ఎప్స్టీన్ లైంగిక దాడికి పాల్పడ్డాడన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాదు.. 90వ దశకం నుంచి అమెరికాలో ప్రముఖ ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు ఎప్స్టీన్ అమ్మాయిలను సప్లై చేశాడని, ఈ వ్యవహారంలో అతని సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్వెల్ సహకరించారన్న అభియోగాలు ఉన్నాయి. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ ఫైల్స్ వివరాలు బహిర్గతం అవుతాయని అంతా భావించారు. అందుకు తగ్గట్లే.. ఎఫ్బీఐ, అమెరికా న్యాయవిభాగం ఆ బాధ్యతలు సంయుక్తంగా చేపట్టాయి. అయితే జులై మొదటి వారంలో యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బాండీ అనూహ్యమైన ప్రకటన చేశారు. అందులో సంచలనాత్మక వివరాలేవీ లేవని అన్నారామె. ఎప్స్టీన్ వద్ద ‘క్లయింట్ లిస్ట్’ లేదు. ఆయన బ్లాక్మెయిల్ చేయలేదని, ప్రాముఖ్యమైన వ్యక్తులపై నేరపూరిత ఆధారాలు లేవని” పేర్కొన్నారు. అయితే.. ఎప్స్టీన్తో ట్రంప్కు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే ఆ వివరాలను బయటపెట్టనివ్వడం లేదన్న విమర్శలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు(పాతవి) నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ట్రంప్ వివాహ వేడుకలోనూ ఎప్స్టీన్ కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడం గమనార్హం. ఈ క్రమంలో.. ఈ సెక్స్ స్కాండల్ను కదిలించిన అమెరికన్ విజువల్ ఆర్టిస్ట్ మరియా ఫార్మర్(ఎప్స్టీన్పై ఫిర్యాదు చేసిన తొలి వ్యక్తి.. ఈమె కేసులోనే ఎప్స్టీన్ అరెస్టయ్యాడు).. ట్రంప్ను కూడా ఎఫ్బీఐ సంస్థ విచారించాలని డిమాండ్ చేస్తున్నారు.ఆ విగ్రహం తొలగింపుఎప్స్టీన్ ఫైల్స్తో ట్రంప్ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రత్యర్థులు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వాషింగ్టన్లోని నేషనల్ మాల్ దగ్గర ట్రంప్- ఎప్స్టీన్ చేతులు కలిపి సరదాగా ఉన్న ఓ విగ్రహాన్ని సెప్టెంబర్ 23వ తేదీన ఏర్పాటు చేశారు. Best Friends Forever అనే క్యాప్షన్ అక్కడ ఉంచారు. ఇది జనాలను విపరీతంగా ఆకర్షించింది. అయితే.. నిబంధనల ఉల్లంఘన పేరిట ఆ మరుసటిరోజే అధికారులు దానిని అక్కడి నుంచి తొలగించారు. సీక్రెట్ షేక్హ్యాండ్ అనే సంస్థ ఈ విగ్రహం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. -
భారత్-పాక్ యుద్ధం, సింధూ జలాలపై షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
న్యూయార్క్: ఆపరేషన్ సిందూర్, సింధూ నదీ జలాలపై పాకిస్తాన్(Pakistan) ప్రధాని షెహబాజ్ షరీఫ్(Shahbaz Sharif) సంచలన ఆరోపణలు చేశారు. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేసిందని షరీఫ్ ఐక్యరాజ్య సమితి(UN) వేదికగా ఆరోపించారు. భారత్ తీసుకున్న చర్యలు అంతర్జాతీయ చట్టాల్ని ఉల్లంఘిస్తున్నాయని.. ఇది యుద్ధ చర్యకు సమానం అంటూ రెచ్చిపోయారు. అంతటితో ఆగకుండా.. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) చొరవ ప్రశంసనీయం అంటూ మెచ్చుకున్నారు.ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశాలకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెళ్లారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ..‘ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సాహసోపేత నాయకత్వ చొరవ ప్రశంసనీయం. ట్రంప్ చర్యలు, నిర్ణయాలతో దక్షిణాసియాలో పెద్ద ముప్పు తప్పింది. ప్రపంచ వ్యాప్తంగా పలు వివాదాల ముగింపునకు ట్రంప్ నిజాయతీగా కృషి చేస్తున్నారు. ప్రపంచంలో శాంతి ఉండాలని కోరుకుంటున్నారు. బలమైన స్థితిలో ఉన్నప్పటికీ ట్రంప్ దూరదృష్టి గల నాయకత్వంలో కాల్పుల విరమణకు పాకిస్తాన్ అంగీకరించింది. ఆయన జోక్యం చేసుకోకపోయి ఉంటే భారత్-పాక్ల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరిగేది. దక్షిణాసియాలో శాంతి స్థాపనకు ట్రంప్ చేసిన విశేష కృషికి గాను పాక్.. ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది’ అని చెప్పుకొచ్చారు. Pakistani Prime Minister Shehbaz Sharif about Trump: 🇵🇰❤️🇺🇸“Pakistan has nominated Trump for the Nobel Peace Prize, and this is the least we can do for his love of peace. He is truly a man of peace.”pic.twitter.com/xYPcXvmX6O— S.Haidar Hashmi (@HaidarHashmi0) September 27, 2025అనంతరం, సింధూ జలాలు, కశ్మీర్ అంశంపై షరీఫ్ స్పందిస్తూ..‘సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేసింది. భారత్ తీసుకున్న చర్యలు అంతర్జాతీయ చట్టాల్ని ఉల్లంఘిస్తున్నాయి. ఇది యుద్ధ చర్యతో సమానం. కశ్మీర్ సహా అన్ని వివాదాస్పద అంశాలపై భారత్తో సమగ్ర చర్చలకు సిద్ధంగా ఉన్నాం. కశ్మీరీల స్వీయ నిర్ణయాధికారం కోసం ఐరాస ఆధ్వర్యంలో నిష్పక్షపాత ఓటింగ్ నిర్వహించాలి. ఉగ్రవాదాన్ని పాక్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. టీటీపీ, బీఎల్ఏ వంటి విదేశీ నిధులతో నడిచే సంస్థల నుంచి నిరంతరం బాహ్య ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాం’ అని తెలిపారు.షరీఫ్ వ్యాఖ్యలకు భారత్ కౌంటర్.. మరోవైపు షరీఫ్ వ్యాఖ్యలను భారత్ తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో భారత్ స్పందిస్తూ..‘పాకిస్తాన్ తనను బాధిత దేశంగా చిత్రీకరించుకుంటూ సీమాంతర ఉగ్రవాదానికి జవాబుదారీతనం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడింది. ఐరాసలో బాధిత దేశంగా నటించే పాక్ ప్రయత్నాలను అడ్డుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని భారత్ కోరింది. పాక్లోని ఉగ్ర స్థావరాలను తక్షణం ధ్వంసం చేయాలని డిమాండ్ చేసింది. Breaking:Pakistan must shut down terror camps, hand over terrorists to India, Indian Diplomat @petal_gahlot's right of reply to Pakistan PM Shehbaz Sharif at UNGAFull address pic.twitter.com/WoxZM93cBl— Sidhant Sibal (@sidhant) September 27, 2025 -
గూగుల్కి అసలు అర్థమేంటో తెలుసా?
ఇవాళ గూగుల్ ఓపెన్ చేశారా?.. దాని ఫాంట్ వేరే రకంగా కనిస్తోందా?.. అదేదో అప్డేట్ అనుకుని కంగారుపడేరు. ఇవాళ గూగుల్ 27వ పుట్టినరోజు. అందుకే డూడుల్ అలా దానికి విషెష్ తెలిపిందంతే. అయితే గూగుల్ ప్రారంభమైంది సెప్టెంబర్ 4వ తేదీన. అలాంటప్పుడు ఇవాళ బర్త్డే జరుపడానికి ఓ ప్రత్యేక కారణం ఉందని మీకు తెలుసా?.. అసలు గూగుల్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా??..గూగుల్ను లారీ పేజ్(Larry Page), సెర్గీ బ్రిన్(Sergey Brin) ప్రారంభించారు. 1998లో సెప్టెంబర్ 4న అధికారిక కంపెనీ గుర్తింపు దక్కించుకుంది. అయితే.. 2003 నుంచి గూగుల్ బర్త్డే మారిపోయింది. 2003లో సెప్టెంబర్ 8న, 2004లో సెప్టెంబర్ 7న, 2005లో సెప్టెంబర్ 26 నిర్వహించుకుంది. అయితే 2006 నుంచి సెప్టెంబర్ 27ను క్రమం తప్పకుండా తన పుట్టినరోజుగా మార్చేసుకుంది. ఇందుకు కారణం లేకపోలేదు!.సెప్టెంబర్ 27, 2006లో గూగుల్ అరుదైన మైలురాయి దాటింది. అత్యధిక వెబ్పేజీలను ఇండెక్స్ చేసిన ఘనత గూగుల్ సొంతం చేసుకుంది. అంటే.. ఒక నిర్దిష్ట సమయంలో తన సెర్చ్ ఇంజిన్ ద్వారా అప్పటిదాకా ఎవరూ సాధించని ఫీట్ సాధించింది. అలా.. ఆ అరుదైన ఘనత సాధించిన సందర్భాన్ని బర్త్డేగా మార్చుకుంది. అప్పటి నుంచి మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగానే తన పుట్టినరోజున డూడుల్స్, ప్రమోషన్స్, తన ఉత్పత్తులపై డిస్కౌంట్లను ప్రకటిస్తుంటుంది. ఇంతకీ గూగుల్ అర్థమేంటంటే.. Google అనే పదానికి అర్థం ఏ డిక్షనరీలోనూ కనిపించదు. అసలు ఆ పదానికి ఓ అర్థమంటూ లేదు కూడా. వాస్తవానికి.. గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్ మరియు సెర్గీ బ్రిన్ 1997లో తాము రూపొందించిన ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్కు గూగోల్(Googol) అనే పేరు పెట్టాలనుకున్నారు. గూగోల్ అంటే.. 1 పక్కన 100 సున్నాలు ఉండే సంఖ్య. అపారమైన సమాచారాన్ని అందిస్తుంది అనే అర్థం వచ్చేలా ఆ పదం అనుకున్నారు. అయితే.. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో వీళ్లద్దరి సహచరి విద్యార్థి సీన్ అండర్సన్.. Googol.com అనే డొమెయిన్కు బదులు Google.com అని టైప్ చేశాడు. అయితే లారీ పేజ్ ఆ పేరు నచ్చి.. అప్పటికప్పుడు ఆ డొమెయిన్ను ఫిక్స్ చేశారు. అలా ఆ తప్పిదమే చివరికి ఇప్పుడు ప్రపంచమంతా వెతుక్కునే ప్రముఖ బ్రాండ్గా మారింది.ఇది తెలుసా?.. గూగుల్ ప్రధాన కార్యాలయం గూగుల్ఫ్లెక్స్(Googleplex) అమెరికా కాలిఫోర్నియా స్టేట్ మౌంటెన్ వ్యూలో ఉంది. ఈ హెడ్ ఆఫీస్లో స్టాన్(Stan) అనే డైనోసార్ బొమ్మ ఉంటుంది. గూగుల్ అనేది ఎంత పెద్ద సెర్చ్ ఇంజిన్ అయినా సరే.. డైనోసార్లా అంతం అయిపోకుండా, కొత్త ఆలోచనలో ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారట. అంతేకాదు.. 2010లో తమ ఆవరణలో ఉన్న గడ్డిని కత్తిరించేందుకు మెషీన్లు, పరికరాల సాయంతో కాకుండా అద్దెకు గొర్రెలను తెచ్చి ఇకోఫ్రెండ్లీ ఐడియాతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది కూడా. ఇంకో ఆసక్తికరమైన ముచ్చట ఏంటంటే.. గూగుల్కు నెట్ ఆగిపోతే వచ్చే డైనోసార్ గేమ్ తెలుసు కదా. 2014లో ఈ ఆఫ్లైన్ గేమ్(T-Rex Runner-Chrome Dino) ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. ఇంటర్నెట్ లేకపోతే మనం డైనోసార్ యుగంలో ఉన్నాం అనే ఫన్తో యూజర్ల దృష్టి మరలకుండా ఉండేందుకే ఈ గేమ్ను క్రియేట్ చేశారట!. -
బ్రిటన్ పౌరులకు డిజిటల్ ఐడీ కార్డులు
లండన్: బ్రిటన్ పౌరులకు త్వరలో డిజిటల్ ఐడీ కార్డులు రానున్నాయి. ప్రభుత్వ సేవలు పొందేందుకు, ఉద్యోగాలు సంపాదించేందుకు కూడా ఈ కార్డులు తప్పనిసరి కానున్నాయి. బ్రిటన్ పౌరులతోపాటు దేశంలో శాశ్వత నివాస అర్హత పొందిన విదేశీయులకు కూడా ఈ డిజిటల్ ఐడీ కార్డులు అందజేస్తామని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తెలిపారు. ఈ కార్డుల వల్ల పౌరుల వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి ప్రమాదం వాటిల్లదని పేర్కొన్నారు. పౌరులు భౌతికమైన కార్డులు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదని, స్మార్ట్ఫోన్ లేని పౌరులు కూడా ఈ కార్డును అవసరమైన చోట వాడుకోవచ్చని వివరించారు. 20 ఏళ్ల క్రితమే వీటిని ప్రవేశపెట్టాలని ప్రయతి్నంచిన అప్పటి ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతతో వెనక్కి తగ్గింది. -
గాజాలో పని పూర్తిచేసే తీరుతాం
ఐక్యరాజ్య సమితి: గాజాలో హమాస్కు వ్యతిరేకంగా తాము చేపట్టిన యుద్ధం మధ్యలో ఆపే ప్రసక్తే లేదని, పని పూర్తిచేసి తీరుతామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ స్పష్టంచేశారు. గాజా యుద్ధం, పాలస్తీనా విషయంలో అంతర్జాతీయ ఒత్తిళ్లకు పశ్చిమదేశాలు తలొగ్గవచ్చేమో కానీ.. ఇజ్రాయెల్ మాత్రం వెనక్కు తగ్గదని తేల్చి చెప్పారు. ఐరాస సర్వప్రతినిధి సభను ఉద్దేశించి శుక్రవారం ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కొన్ని దేశాలు నెతన్యాహూ ప్రసంగాన్ని బహిష్కరించాయి. కొన్ని దేశాల ప్రతినిధులు సభలోనే ఉండి నెతన్యాహూ ప్రసంగిస్తున్నప్పుడు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిగా మరికొన్ని దేశాల ప్రతినిధులు ఇజ్రాయెల్కు మద్దతుగా నినాదాలు చేశారు. ఆమెరికా మాత్రం ఎప్పటిలాగే ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచింది. చాలావరకు ముఖ్య దేశాలన్నీ ఈ సమావేశానికి జూనియర్ అధికారులను పంపి తమ నిరసనను తెలిపాయి. గాజాపై దాడులను ఆపాలని అంతర్జాతీయంగా ఎంతగా ఒత్తిళ్లు వస్తున్నా.. నెతన్యాహూ పట్టించుకోకపోవటంతో ఇటీవలే ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. క్రమంగా అంతర్జాతీయంగా ఒంటరిగా మారుతున్నా నెతన్యాహూ వెనక్కి తగ్గేదే లేదు అని ప్రకటించారు. పాలస్తీనాను గుర్తించిన దేశాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘పశ్చిమదేశాల నేతలు ఒత్తిళ్లకు తలొగ్గవచ్చు. కానీ, మీకు నేను ఒక హామీ ఇస్తున్నా.. ఇజ్రాయెల్ ఎప్పటికీ తలొగ్గదు. మీ అవమానకరమైన నిర్ణయం (పాలస్తీనాను దేశంగా గుర్తించటం) యూదులు, అమాయక పౌరులకు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. యూదు వ్యతిరేక భావజాలం ఎప్పటికీ అంతమవదేమో.. కానీ, అది దారుణంగా చావాలి’అని పేర్కొన్నారు. ప్రసంగం సందర్భంగా నెతన్యాహూ, ఆయన బృందం ఇజ్రాయెల్పై హమాస్ దాడిచేసి పౌరులను బందీలుగా తీసుకెళ్లిన ఘటనను చూపించే క్యూఆర్ కోడ్ను ధరించారు. ‘ది కర్స్’పేరుతో రూపొందించిన ఓ మ్యాప్ను కూడా ప్రదర్శించారు. -
కశ్మీర్ ప్రజలకు మా మద్దతు
ఐక్యరాజ్యసమితి: జమ్మూకశ్మీర్లో ప్రస్తుత పరిస్థితికి ముమ్మాటికీ భారత ప్రభుత్వమే కారణ మని పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ విమర్శించారు. నిష్పక్షపాతంగా ప్రజాభి ప్రాయ సేకరణ జరగాలని జమ్మూకశ్మీర్ ప్రజలు కోరుకుంటున్నా రని, వారికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. స్వయం పాలన వారి ప్రాథమిక హక్కు అని తెలిపారు. సింధూ నది జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. ఈ ఒప్పందంలో ఎలాంటి ఉల్లంఘన జరిగినా అది తమపై యుద్ధంగా పరిగణిస్తామని వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావించారు. నాలుగు రోజులపాటు ఘర్షణ జరిగిందని, పాక్ వైమానిక దళం దాడుల్లో భారత్కు చెందిన ఏడు యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని చెప్పారు. అన్ని కీలక అంశాలపై భారత్తో సమగ్ర చర్చలకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. అన్ని రకాల వివాదాలకు చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే శాంతియుత పరిష్కారం కనిపెట్టాలన్నది తమ విధానమని పేర్కొన్నారు. భారత్తో సంప్రదింపులకు నిజాయితీతో కృషి చేస్తున్నామని చెప్పారు. నోబెల్ బహుమతికి ట్రంప్ పేరు ప్రతిపాదిస్తున్నాం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై షెహబాజ్ షరీఫ్ ప్రశంసల వర్షం కురిపించారు. దక్షిణాసియాలో భారీ యుద్ధం ఆగిందంటే అదంతా ట్రంప్ చలవేనని తేల్చిచెప్పారు. భారత్, పాక్ల మధ్య శాంతికోసం ట్రంప్ ఎంతగానో చొరవ తీసుకున్నారని వెల్లడించారు. ఆయన వల్లే యుద్ధం ఆగిపోయిందన్నారు. ట్రంప్ సేవలకు గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ పేరును ప్రతిపాదిస్తున్నామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారికంగా ట్రంప్ పేరును నామినేట్ చేస్తోందని తెలియజేశారు. -
ట్రంప్ ఫార్మా షాక్
వాషింగ్టన్: టారిఫ్ల మోతతో ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరో బాంబు పేల్చారు. ఈసారి ఫార్మా రంగంపై సుంకాలతో విరుచుకుపడ్డారు. విదేశాల నుంచి దిగుమతయ్యే ఫార్మా (బ్రాండెడ్, పేటెంటెడ్) ఉత్పత్తులపై ఏకంగా 100% సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా, కిచెన్ క్యాబినెట్లు, బాత్రూమ్ వ్యానిటీలపై 50%, సోఫాలు ఇతరత్రా ఫర్నిచర్పై 30% చొప్పున, భారీ ట్రక్కులపై 25 శాతం దిగుమతి సుంకాలను వడ్డించారు.తాజా సుంకాలన్నీ అక్టోబర్ 1 నుంచే అమల్లోకి వస్తా యని గురువారం తన సోషల్ మీడియా సైట్ ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేశారు. అయితే, జనరిక్ ఔషధాలకు సుంకాలు వర్తించవని, దీని వల్ల ఫార్మా టారిఫ్ల ప్రభావం భారత్పై పెద్దగా ఉండదని మన కంపెనీలు చెబుతున్నాయి. మరోపక్క, ధరలు పెరిగిపోవడంతో అమెరికా ప్రజలకు వైద్యం, ఔషధాలు మరింత భారమవుతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా, కిచెన్ క్యాబినెట్లు, ఫర్నిచర్పై సుంకాల దెబ్బకు ఇళ్ల ధరలు ఎగబాకడంతో పాటు అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగేందుకు దారితీస్తుందనేది ఆర్థిక నిపుణుల మాట!జాతీయ భద్రత సాకు...ఔషధాలు, కిచెన్ క్యాబినెట్లు, సోఫాలు ఇతరత్రా ఫర్నీచర్, భారీ ట్రక్కులపై దిగుమతి సుంకాల విధింపునకు జాతీయ భద్రత, ఇతరత్రా కారణాలను ట్రంప్ సాకుగా చూపడం విశేషం. అయితే, అమెరికాలో కార్యకలాపాలు మొదలుపెట్టిన, ఇప్పటికే ప్లాంట్లను నిర్మిస్తున్న ఫార్మా కంపెనీలకు ఈ టారిఫ్లు వర్తించవని ట్రంప్ పేర్కొన్నారు. మరి అమెరికాలో ఇప్పటికే ఫ్యాక్టరీలు ఉన్న విదేశీ ఫార్మా సంస్థలకు టారిఫ్లు వర్తిస్తాయా లేదా అనేది దానిపై స్పష్టత లేదు. 2024లో అమెరికా దాదాపు 233 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా, వైద్య ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నట్లు అంచనా. ట్రంప్ టారిఫ్ దెబ్బతో కొన్ని మందుల ధరలు రెట్టింపు కావడంతో పాటు వైద్య ఖర్చులు కూడా భారీగా పెరిగి పోయే అవకాశం ఉంది.‘టారిఫ్లు అమెరికన్లకు పెను భారంగా మారతాయి. ఔషధాల ధరలు తక్షణం పెరిగిపోవడం, ఇన్సూరెన్స్ ఖర్చులు ఎగబాకడం, ఆసుపత్రుల్లో మందులకు కొరతతో ప్రజలు అల్లాడటం ఖాయం’ అని కెనడియన్ చాంబర్ ఆప్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ పాస్కల్ చాన్ హెచ్చరించారు. మరోపక్క, విదేశాల్లో తయారైన భారీ ట్రక్కులు, విడిభాగాలను దిగుమతి చేసుకోవడం వల్ల దేశీ తయారీ సంస్థలను దెబ్బతీస్తోందని ట్రంప్ స్పష్టం చేశారు. సుంకాల పెంపు భారాన్ని వినియోగదారులపై వేయడం వల్ల ధరలు భారీగా ఎగబాకుతాయన్న ఆందోళనలను ట్రంప్ కొట్టిపారేశారు.ఇదిలా ఉంటే, కిచెన్ క్యాబినెట్లు, ఫర్నీచర్పై సుంకాలతో ఇళ్ల ధరలకు రెక్కలు రావడం ఖాయమని రియల్టీ సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పటికే సరఫరా సమస్యలు, అధిక వడ్డీ రేట్లతో ప్రజలకు ఇళ్ల కొనుగోలు భారమవుతున్న తరుణంలో ట్రంప్ టారిఫ్లు మరింత గుదిబండగా మారతాయని అమెరికా జాతీయ రియల్టర్ల అసోసియేషన్ పేర్కొంది. ఏప్రిల్లో వివిధ దేశాలపై సుంకాల మోతకు తెరతీసినప్పుడు అమెరికాలో ద్రవ్యోల్బణం 2.3 శాతంగా ఉండగా, తాజాగా 2.9 శాతానికి ఎగబాకడం గమనార్హం.బడా ఫార్మా దిగ్గజాల అమెరికా బాట...కొన్ని నెలలుగా ట్రంప్ టారిఫ్ బెదిరింపుల నేపథ్యంలో మెర్క్, ఎలీలిలీ, జాన్సన్ అండ్ జాన్సన్, ఆస్ట్రాజెనికా, రోషె తదితర అంతర్జాతీయ ఫార్మా దిగ్గజాలు ఇప్పటికే అమెకాలో విస్తరణ ప్రణాళికలను ప్రకటించాయి. భారీగా పెట్టుబడులను కుమ్మరిస్తామంటూ ట్రంప్కు హామీ ఇచ్చాయి. బడా కంపెనీలు తయారీ ప్లాంట్లను అమెరికాకు తరలిస్తుండటం, ప్లాంట్ల నిర్మాణ పనులకు తెరతీయడంతో వాటిపై పెద్దగా ప్రభావం ఉండదని జెఫరీస్ ఎనలిస్ట్ ఆకాశ్ తివారీ అభిప్రాయపడ్డారు. చిన్న కంపెనీలకు మాత్రం టారిఫ్ల దెబ్బ తప్పదని పేర్కొన్నారు. -
నాటో చీఫ్ వ్యాఖ్యలను ఖండించిన భారత్
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా వ్యూహం గురించి భారత ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా అధినేత పుతిన్కు ఫోన్చేసి ఆరా తీశారంటూ నాటో సెక్రెటరీ జనరల్ మార్క్ రుటే చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైస్వాల్ శుక్రవారం ఖండించారు. రుటే వ్యాఖ్యలు ఆధారరహితం అని తేల్చిచెప్పారు. రష్యా నుంచి ముడి చమురు కొంటున్నందుకు భారత ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీగా టారిఫ్లు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ విషయంలో రష్యా వ్యూహం పట్ల మోదీ ఆసక్తి కనబర్చారని, ఇటీవల పుతిన్కు ఫోన్ చేసి ఆరా తీశారని మార్క్ రుటే చెప్పడం సంచలనం సృష్టించింది. జరగని సంభాషణ జరిగినట్లు మార్క్ రుటే ప్రకటించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని రణ«దీర్ జైస్వాల్ అన్నారు. ఆధారాలు లేకుండా మాట్లాడొద్దని రుటేకు హితవు పలికారు. ఉక్రెయిన్పై రష్యా వ్యూహం గురించి మోదీ తెలుసుకోలేదని స్పష్టంచేశారు. రష్యా నుంచి ముడి చమురు కొంటూనే ఉంటామని ఉద్ఘాటించారు. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు వద్దని సూచించారు. రష్యా నుంచి పశ్చిమ దేశాలు కూడా ముడి చమురు కొంటున్నాయని రణ«దీర్ జైస్వాల్ పరోక్షంగా గుర్తుచేశారు. -
ట్రంప్ ఎఫెక్ట్.. పుతిన్తో మోదీ చర్చలు: నాటో అధికారి కీలక వ్యాఖ్యలు
వాష్టింగన్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) విధిస్తున్న టారిఫ్ల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్తో రష్యా యుద్దం విషయమై పుతిన్తో భారత ప్రధాని మోదీ(Narendra Modi) చర్చలు జరిపారని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటె వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధించిన సుంకాల ఎఫెక్ట్ వల్లే ఇదంతా జరుగుతోందని చెప్పుకొచ్చారు.న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో నాటో(NATO) సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే మాట్లాడుతూ..‘భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలు రష్యాపై పెద్ద ప్రభావాన్ని చూపుతున్నాయి. పుతిన్తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడుతున్నారు. ఉక్రెయిన్ విషయంలో రష్యా వ్యూహాన్ని వివరించాలని మోదీ కోరారు. రెండు దేశాల మధ్య యుద్ధం గురించి ఆరా తీశారు. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు భారత్పై సుంకాల భారం పడటంతో పుతిన్తో చర్చలు జరుపుతున్నారు. భవిష్యత్ వ్యూహాల గురించి అడిగి తెలుసుకున్నారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అయితే, ఆయన వ్యాఖ్యలపై భారత్ స్పందించలేదు. "Delhi is on phone with Vladimir Putin in Moscow, & Narendra Modi asking, hey I support you but could you explain to me the strategy bcz I have been hit with 50% tariffs. Prez Trump is implementing what he says"NATO Secretary-General Mark Ruttepic.twitter.com/63cEh4CxNZ— Sidhant Sibal (@sidhant) September 26, 2025ఇదిలా ఉండగా.. డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో బాంబు పేల్చారు. ఈసారి ఫార్మా దిగుమతులపై భారీగా సుంకాలను ప్రకటించారు(Impose New Tariffs). బ్రాండెడ్, పేటెంట్ ఉన్న ఔషధ ఉత్పత్తుల దిగుమతులపై ఏకంగా 100 శాతం వరకు టారిఫ్లు విధిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయం భారత ఫార్మాస్యూటికల్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ చర్యలు అమెరికాలో తయారీని ప్రోత్సహించడమే లక్ష్యంగా తీసుకున్నవిగా ట్రంప్ పేర్కొన్నారు. అప్హోస్టర్డ్ ఫర్నిచర్పై 30 శాతం, భారీ ట్రక్కులపై 25 శాతం దిగుమతి సుంకాలు విధించనున్నట్లు వెల్లడించారు. అలాగే బ్రాండెడ్ , పేటెంటెడ్ డ్రగ్స్పై(pharmaceutical products) ఏకంగా 100 శాతం విధిస్తామని స్పష్టం చేశారు. అయితే.. అమెరికాలో ప్లాంట్లను నిర్మిస్తున్న విదేశీ ఔషధ తయారీ సంస్థలకు సుంకాలు వర్తించదన్నారు. ఈ నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తీసుకొస్తామని ట్రూత్ సోషల్ మీడియా ద్వారా ట్రంప్ తెలిపారు. -
ట్రంప్ శాంతి దూత: షరీఫ్
న్యూయార్క్/ఇస్లామాబాద్: అమెరికా–పాకిస్తాన్ల మధ్య బంధం నానాటికీ బలపడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు భారత్పై కన్నెర్ర చేస్తూ, మరోవైపు పాక్ పాలకులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తాజాగా వైట్హౌస్లో ట్రంప్తో సమావేశమయ్యారు. ప్రాంతీయ భద్రత, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో పరస్పరం సహకారంతోపాటు పలు కీలక అంశాలపై వారు చర్చించారు. గత ఆరేళ్లలో వైట్హౌస్లో అడుగుపెట్టిన మొట్టమొదటి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కావడం గమనార్హం. ట్రంప్ను శాంతిదూతగా షరీఫ్ అభివరి్ణంచారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఘర్షణలు నిలిపివేయడానికి ట్రంప్ నిజాయితీగా కృషి చేస్తున్నారని కొనియాడారు. భారత్, పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి రావడానికి ట్రంప్ సాహసోపేత, నిర్ణయాత్మక నాయకత్వమే కారణమని ఉద్ఘాటించారు. దక్షిణాసియాలో అతిపెద్ద యుద్ధం జరగకుండా ట్రంప్ నివారించారని పేర్కొన్నారు. ట్రంప్ నాయకత్వంలో అమెరికా–పాక్ సంబంధాలు రానున్న రోజుల్లో మరింత బలపడతాయని ఆశాభావం షెహబాజ్ షరీఫ్ వ్యక్తంచేశారు. వీలును బట్టి పాకిస్తాన్లో పర్యటించాలంటూ ట్రంప్ను సాదరంగా ఆహ్వానించారు. ఈ మేరకు పాక్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ భేటీ కంటే ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఒక గొప్ప నాయకుడు వైట్హౌస్కు రాబోతున్నారని చెప్పారు. ఇది కూడా చదవండి: ‘ఎవరు బతకాలో ఆయుధాలే నిర్ణయిస్తున్నాయి..’మారిన ట్రంప్ వైఖరి 2019 జూలైలో అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అమెరికాలో పర్యటించారు. వైట్హౌస్లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలిశారు. ఇమ్రాన్ ఖాన్కు అతికష్టంమీద ట్రంప్ అపాయింట్మెంట్ దొరికింది. పాకిస్తాన్ అబద్ధాలు చెబుతోందని, అమెరికాకు దగా చేస్తూ సహాయం రూపంలో బిలియన్ల డాలర్ల నిధులు పొందుతోందని ట్రంప్ ఆ సమయంలో ఆరోపించారు. పాక్ భూభాగం ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోయిందని మండిపడ్డారు. ట్రంప్ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన జో బైడెన్ కూడా పాకిస్తాన్ పట్ల వ్యతిరేకంగానే వ్యవహరించారు. పాక్ ప్రధానమంత్రులతో కనీసం ఫోన్లో కూడా మాట్లాడేందుకు బైడెన్ ఇష్టపడలేదు. వారిని ఏనాడూ వైట్హౌస్కు ఆహ్వానించలేదు. ఇదిలా ఉంటే, ఈ ఏడాది జనవరిలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వైఖరి మారిపోయింది. పాక్ పట్ల పూర్తి సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పట్ల ట్రంప్ అంతులేని అనురాగం ప్రదర్శిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. Just Now 🇵🇰🇺🇸🚨 Pakistan PM Shahbaz Sharif, Field Marshal Asif Munir with US President Donald Trump, and Secretary of State Marco Rubio at The White House.Photos 📷#America #MAGA #Pak #USA pic.twitter.com/VKOXTecLpx— Mayank (@mayankcdp) September 26, 2025 -
అరెస్టు భయంతో నెతన్యాహు ఏం చేశారంటే..!
ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు(Benjamin Netanyahu) చేసిన పని ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ(UNGA) సమావేశాలకు హాజరయ్యేందుకు ఆయన న్యూయార్క్ వెళ్లారు. అయితే ప్రయాణంలో ఆయన యూరప్ గగనగలం కాకుండా.. సుదీర్ఘ మార్గంలో ప్రయాణించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గాజా యుద్ధ నేపథ్యంతో.. అంతర్జాతీయ న్యాయస్థానం(International Court Of Justice) నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. యుద్ధ నేరాలకు పాల్పడ్డ ఆయన్ను అవకాశం దొరికితే అరెస్ట్ చేయొచ్చని అందులో సభ్యత్వం ఉన్న 125 దేశాలకు ఇంటర్నేషనల్ కోర్టు సూచించింది. దీంతో ఐక్యరాజ్య సమితి సమావేశాలకు హాజరు కావాల్సిన ఆయన యూరప్ దేశాల మీదుగా కాకుండా.. మరో మార్గంలో వెళ్లారనే చర్చ నడుస్తోంది. ఫ్లైట్ ట్రాకింగ్ డాటా ప్రకారం.. ఆయన అధికారిక విమానం ‘వింగ్స్ ఆఫ్ జియాన్’ మధ్యధరా సముద్రం, జిబ్రాల్టార్ ద్వారం.. అట్లాంటిక్ మీదుగా న్యూయార్క్కు చేరుకుంది. ఈ క్రమంలో.. ఫ్రాన్స్, ఇటలీ, గ్రీస్ ఎయిర్స్పేస్ను తప్పించుకున్నట్లైంది. అయితే ఈ రూట్లో వెళ్లడం ద్వారా ఆయన అదనంగా 600 కిలోమీటర్లు ప్రయాణించారని సమాచారం. ఇదిలా ఉంటే కిందటి ఏడాది కూడా ఆయన ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే అప్పటికి నెతన్యాహుపై వారెంట్ జారీ కాలేదు. కానీ, ఆయన ప్రసంగిస్తున్న సమయంలో పలు దేశాల ప్రతినిధులు లేచి వెళ్లిపోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక అంతర్జాతీయ న్యాయస్థానం కిందటి ఏడాది నవంబర్లో నెతన్యాహు, మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలంట్లను యుద్ధనేరస్తులుగా పేర్కొంటూ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే ఈ అభియోగాలను ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. ఇదీ చదవండి: ఎవరు బతకాలో ఆయుధాలే నిర్ణయిస్తాయి! -
ఎవరు బతకాలో ఆయుధాలే నిర్ణయిస్తున్నాయి: జెలెన్స్కీ
యునైటెడ్ నేషన్స్: ప్రపంచ దేశాలన్నీ మానవ చరిత్రలో గతంలో ఎన్నడూ చూడనంతగా విధ్వంసకర ఆయుధాల రేసులో పరుగులు పెడుతున్నాయని ఉక్రెయిన్(Ukraine) అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ( Volodymyr Zelensky) విమర్శించారు. ప్రస్తుతం ప్రపంచంలో ఎవరు బతికి బట్టకట్టాలన్నది ఆయుధాలే నిర్ణయిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin).. ఉక్రెయిన్పై సాగిస్తున్న యుద్ధాన్ని యూరప్ ఖండం అంతటికీ విస్తరించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పుతిన్కు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం మొత్తం ఏకం కావాలని పిలుపునిచ్చారు. యుద్ధాలు ఆపటంలో ఐరాస విఫలం ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలను ఆపటంలో ఐక్యరాజ్య సమితితోపాటు అంతర్జాతీయ సంస్థలన్నీ విఫలమయ్యాయని జెలెన్స్కీ ఆరోపించారు.ఉక్రెయిన్, గాజా(Gaza), సూడాన్.. ఇలా ఏ ఒక్క యుద్ధాన్ని ఆపలేకపోయాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశాలు మనుగడ సాగించటానికి అంతర్జాతీయ చట్టాలు ఏమాత్రం ఉపయోగపడటం లేదని మండిపడ్డారు. ‘స్నేహితులు, ఆయుధాలు ఉన్నవారికి తప్ప. ఇతరుల భద్రతకు ఎలాంటి హామీ లేదు’అని పేర్కొన్నారు. కలసి ఉంటే ఎంతో మార్పు తీసుకురాగలమని అన్నారు. రష్యాతో దాదాపు మూడేళ్లుగా సాగుతున్న యుద్ధంలో తమకు మద్దతుగా నిలిచిన అమెరికా, యూరప్ దేశాలకు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. యుద్ధాన్ని ఇంకా కొనసాగిస్తూ వెళ్తన్న రష్యా తీరును ఐరాస సభ్యదేశాలన్నీ ఖండించాలని కోరారు.ఇది కూడా చదవండి: ఆ మూడు విధ్వంసాలపై దర్యాప్తు జరగాల్సిందే..‘రష్యా వెంటనే యుద్ధాన్ని ఆపకపోతే.. మేము కూడా దీనిని మరింత విస్తరిస్తాం. మరింత విధ్వంసకరంగా మారుస్తాం. మొదట ఉక్రెయిన్పై దాడిచేసిన రష్యా.. ఇప్పుడు యూరప్ అంతటా తన డ్రోన్లను తిప్పుతోంది. రష్యా కార్యకలాపాలు ఎప్పుడు ఎల్లలు దాటాయి. జార్జియా, బెలారస్లాగా కాకుండా రష్యాకు జోక్యం నుంచి మాల్దోవా తనను తాను కాపాడుకుంటోంది. యూరప్ ఖండం మాల్దోవాను కూడా కోల్పోకూడదు. ఆ దేశానికి ఇప్పుడు కావాల్సింది రాజకీయపరమైన సానుభూతి కాదు. నిధులు, ఇంధన మద్దతు కావాలి’అని పేర్కొన్నారు. డ్రోన్లతోనే వేలమంది హత్య ప్రస్తుత యుద్ధాల్లో డ్రోన్లతోనే వేలమందిని ఎలా చంపాలో చూపిస్తున్నారని జెలెన్స్కీ అన్నారు. ‘ఇటీవల డ్రోన్ల కారణంగానే యూరప్లో విమానాశ్రయాలు మూసివేయాల్సి వచ్చింది. టాక్టికల్ డ్రోన్ను పరీక్షించినట్లు గత వారమే ఉత్తరకొరియా ప్రకటించింది. అతి తక్కువ వనరులు ఉన్న దేశాలు కూడా ప్రమాదకరమైన డ్రోన్లను తయారుచేస్తున్నాయి. ప్రస్తుతం మనం మానవ చరిత్రలోనే అత్యంత విధ్వంసకరమైన ఆయుధాల రేసు యుగంలో నివసిస్తున్నాం’అని పేర్కొన్నారు. -
భారత్కు ట్రంప్ భారీ షాక్!
సుంకాల యుద్ధంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో బాంబు పేల్చారు. ఈసారి ఫార్మా దిగుమతులపై భారీగా సుంకాలను ప్రకటించారు(Impose New Tariffs). బ్రాండెడ్, పేటెంట్ ఉన్న ఔషధ ఉత్పత్తుల దిగుమతులపై ఏకంగా 100 శాతం వరకు టారిఫ్లు విధిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయం భారత ఫార్మాస్యూటికల్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది.ఈ చర్యలు అమెరికాలో తయారీని ప్రోత్సహించడమే లక్ష్యంగా తీసుకున్నవిగా ట్రంప్ పేర్కొన్నారు. అప్హోస్టర్డ్ ఫర్నిచర్పై 30 శాతం, భారీ ట్రక్కులపై 25 శాతం దిగుమతి సుంకాలు విధించనున్నట్లు వెల్లడించారు. అలాగే బ్రాండెడ్ , పేటెంటెడ్ డ్రగ్స్పై(pharmaceutical products) ఏకంగా 100 శాతం విధిస్తామని స్పష్టం చేశారు. అయితే.. అమెరికాలో ప్లాంట్లను నిర్మిస్తున్న విదేశీ ఔషధ తయారీ సంస్థలకు సుంకాలు వర్తించదన్నారు. ఈ నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తీసుకొస్తామని ట్రూత్ సోషల్ మీడియా ద్వారా ట్రంప్ తెలిపారు. భారతంపై ప్రభావం..భారత ఔషధ కంపెనీలకు అమెరికా అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానం. 2024లో భారత్ 27.8 బిలియన్ డాలర్ల విలువైన ఔషదాలను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసింది. అందులో సుమారు భారత్ 3.6 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలనే అమెరికాకు ఎగుమతి చేసింది. అయితే ఈ ఏడాది మొదటి అర్ధ భాగంలోనే దాదాపు 3.7 బిలియన్ డాలర్ల ఎగుమతులు అమెరికాకు వెళ్లడం గమనార్హం. ట్రంప్ విధించిన తాజా సుంకాలు బ్రాండెడ్, పేటెంట్ ఉన్న ఔషధాలపై వర్తిస్తాయన్నది స్పష్టత వచ్చింది. సాధారణంగా భారత్ అమెరికాకు ఎగుమతి చేసే మందుల్లో జనరిక్ ఔషదాలే ఎక్కువ. అయితే ట్రంప్ తాజా నిర్ణయం స్పెషాలిటీ డ్రగ్స్ తయారీ చేస్తున్న భారత మల్టీనేషనల్ కంపెనీలపై ఈ ప్రభావం పడనుంది. ఈ నిర్ణయం భారత ఔషధ పరిశ్రమను గట్టి దెబ్బే కొట్టవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే సిప్లా, డివిస్ లాబ్స్, అజంత ఫార్మా, అలాగే.. నిఫ్టీ ఫార్మా స్టాక్స్పై టారిఫ్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. మరింత తప్పదు!ఇప్పటికైతే 100 శాతం సుంకాలు ప్రకటించిన ట్రంప్.. భవిష్యత్తులో మరింత పెంచే అవకాశాలు లేకపోలేదని హెచ్చరించారు. ఆ సుంకాలు 150% నుంచి 250% వరకు ఉండే అవకాశం ఉంది. ఇక.. అమెరికాలో తయారీ ప్లాంట్లు నిర్మిస్తున్న కంపెనీలకు ట్రంప్ మినహాయింపు ఇచ్చారు. అయితే అమెరికాలో తయారీ ప్లాంట్లు నిర్మిస్తున్న ఉన్న కంపెనీలకు ఈ సుంకాలు వర్తించవని అన్నారు. దీంతో ఇప్పటికే ప్లాంట్లు ఉన్న కంపెనీలకు మినహాయింపు వర్తిస్తుందా అనే విషయంలో స్పష్టత కొరవడింది.ఇదీ చదవండి: ‘ఇడియట్ ట్రంప్’పై సుందర్ పిచాయ్ ఏమన్నారంటే.. -
ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు సర్కోజీకి ఐదేళ్ల జైలు
పారిస్: ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికొలస్ సర్కో జీ(70)కి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. లిబియా నేత దివంగత కల్నల్ గడాఫీ నుంచి అక్రమంగా లక్షలా ది యూరోలను పొందేందుకు నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు తేలడంతో పారిస్ క్రిమినల్ కోర్టు ఈ మేరకు గురువారం తీర్పు వెలువరించింది.ఈ తీర్పుపై మాజీ అధ్యక్షుడు అప్పీలుకు వెళ్లినా జైలుకు వెళ్లక తప్పదని జడ్జి పేర్కొనడం గమనార్హం. లిబియాపై అప్పట్లో పశ్చిమదేశాలు విధించిన ఆంక్షలను సడలించేందుకు సర్కోజీ సాయమందించడం, ప్రతిగా సర్కోజీ ఎన్నికల ప్రచారానికి గడాఫీ నిధులను సమకూర్చడం ఈ కుట్రలో కీలకంగా ఉన్నాయి. సర్కోజీ 2007–12 కాలంలో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్నారు. -
ఆ ‘మూడు విధ్వంసాల’పై దర్యాప్తు జరగాల్సిందే
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తనకు ఎదురైన చేదు అనుభవాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎస్కలేటర్, టెలీప్రాంప్టర్, ప్రసంగం సమయంలో ఆడియో ఆగిపోవటం యాదృచ్ఛికంగా జరిగిన పొరపాట్లు కాదని తన సొంత సోషల్మీడియా ప్లాట్ఫాం ట్రూత్ సోషల్లో బుధవారం అసహనం వ్యక్తం చేశారు. ఈ మూడు ఘటనలను ‘మూడు విధ్వంసాలు’అని పేర్కొన్న ఆయన.. ఆ ఘటనలపై లోతుగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలకు ఐక్యరాజ్యసమితి సిగ్గుపడాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలేం జరిగింది? మూడు రోజుల క్రితం ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించేందుకు ఆ సంస్థ ప్రధాన కార్యాలయానికి ట్రంప్ వెళ్లారు. ఆయన ప్రధాన హాలులోకి వెళ్లేందుకు తన సతీమణి మెలానియా ట్రంప్తో కలిసి ఎస్కలేటర్ ఎక్కగానే అది ఆగిపోయింది. దీంతో వారు ఇద్దరు మెట్లు ఎక్కుతూ జనరల్ అసెంబ్లీ హాలులోకి వెళ్లారు. అక్కడ ప్రపంచ దేశాల ప్రతినిధులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగం ప్రారంభించగానే టెలిప్రాంప్టర్ (ప్రసంగ పాఠం కనిపించే తెర) ఆగిపోయింది. దీంతో ఆయన ప్రసంగ పాఠం లేకుండానే 57 నిమిషాలు ఉపన్యాసం కొనసాగించారు. 15 నిమిషాల్లోనే టెలిప్రాంప్టర్ను తిరిగి పునరుద్ధరించినప్పటికీ ఆయన సొంతంగానే ప్రసంగం కొనసాగించారు. అయితే, తన మాటలు హాలులోని ఎవరికీ వినపడలేదని ఆ తర్వాత తనకు తెలిసిందని ట్రంప్ తెలిపారు. ఐరాస సిగ్గుపడాలి ఈ సాంకేతిక పొరపాట్లపై ఐరాసపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఈ ఘటనలపై ఐరాస సిగ్గుపడాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఐరాసలో నిన్న (అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం) నాకు నిజమైన అవమానం జరిగింది. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు దురదృష్టకరమైన ఘటనలు జరిగాయి. అసెంబ్లీ హాలుకు వెళ్లేందుకు నేను, మెలానియా ఎస్కలేటర్ ఎక్కగానే అది ఆగిపోయింది. అదృష్టంకొద్ది మేము కిందపడలేదు. ఎస్కలేటర్ మెట్ల అంచులు చాలా పదునుగా ఉన్నాయి. కిందపడి ఉంటే ముఖానికి గాయాలయ్యేవి. మేము ఎస్కలేటర్ రెయిలింగ్ పట్టుకొని తమాయించుకున్నాం. లేదంటే ఇది పెద్ద విపత్తే అయ్యేది. తర్వాత నేను జనరల్ అసెంబ్లీలో ప్రసంగించేందుకు పోడియంపై నిలుచున్నాను.నా ప్రసంగం వినేందుకు ప్రపంచవ్యాప్తంగా కోట్లమందితోపాటు హాలులో ప్రపంచ దేశాల ప్రతినిధులంతా ఆసక్తిగా చూస్తున్నారు. అప్పుడే నా టెలిప్రాంప్టర్ ఆగిపోయింది. నాకు ఏమీ అర్థంకాలేదు. వెంటనే నేను ఆలోచించాను. మొదట ఎస్కలేటర్, ఇప్పుడు టెలిప్రాంప్టర్.. ఏంటీ ఈ ప్రదేశం ఇలా ఉంది అనిపించింది. శుభ సమాచారం ఏమిటంటే.. టెలిప్రాంప్టర్ లేకుండానే నేను చేసిన ప్రసంగానికి మంచి రివ్యూలు వచ్చాయి. ఇలా చాలా కొద్దిమంది మాత్రమే చేయగలరు. ఇక మూడో విధ్వంస ఘటన నేను ప్రసంగం ముగించిన తర్వాత తెలిసింది.నా ప్రసంగం హాలులో ఉన్నవారిలో ఇంటర్ప్రెటర్స్, ఇయర్పీస్లు పెట్టుకున్నవారికి తప్ప ఎవరికీ వినపడనేలేదు. ప్రసంగం పూర్తవగానే ఎలా ఉంది అని మెలానియాను అడిగాను. ఆమె ‘నాకు ఒక్క మాట కూడా వినపడలేదు’అని చెప్పారు’అని ట్రంప్ ట్రూత్ సోషల్లో రాసుకొచ్చారు. ట్రంప్ ఆరోపణలపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ స్పందించారు. జరిగిన ఘటనలు దురదృష్టకరమని పేర్కొన్నారు. ఒక వీడియోగ్రాఫర్ పొరపాటు వల్లే ఎస్కలేటర్ ఆగిపోయిందని వివరణ ఇచ్చారు. కాగా, ఎస్కలేటర్ ఆగిపోయినప్పుడు ఐరాస సిబ్బంది ఎగతాళిగా మాట్లాడుకోవటం కనిపించిందని మీడియాలో వార్తలు వచ్చాయి. -
అక్రమ నిధుల కేసు.. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు సర్కోజీకి ఐదేళ్ల జైలు
పారిస్: ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికొలస్ సర్కోజీకి అక్రమ నిధుల కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడింది. పారిస్లోని న్యాయస్థానం ఆయనను దోషిగా తేల్చింది. 2007లో అధ్యక్ష ఎన్నికల సమయంలో లిబియాకు చెందిన గడాఫీ నేతృత్వంలోని ప్రభుత్వ నుండి సర్కోజీ అక్రమంగా భారీగా నిధులు స్వీకరించారనే ఆరోపణల దరిమిలా నమోదైన ఈ కేసు కోర్టులో నడుస్తోంది. కేసులోని కొన్ని అభియోగాలనను కొట్టివేయగా, ఒకదానిలో నికొలస్ సర్కోజీని దోషిగా నిర్థారించిన న్యాయస్థానం ఆయనకు శిక్షను ఖరారు చేసింది.సర్కోజీకి జైలు శిక్షను తప్పనిసరిగా అమలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. అయితే, జైలుకు వెళ్లే తేదీపై నిర్ణయాన్ని మాత్రం తరువాత వెల్లడిస్తామని న్యాయస్థానం తెలిపింది. నికొలస్ సర్కోజీ 2007 నుంచి 2012 వరకు ఫ్రాన్స్ అధ్యక్షునిగా పనిచేశారు. అయితే అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో గడాఫీ నేతృత్వంలోని లిబియా ప్రభుత్వం నుండి వచ్చిన ఆర్థిక సాయంపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నిధులను దౌత్య సహాయంగా చెప్పకుండా స్వీకరించారని, అవి తన ఎన్నికల ప్రచారానికి ఉపయోగించినట్లు పలువురు ఆరోపించారు. అవినీతి, ప్రచారానికి అక్రమ నిధుల వినియోగం, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం తదితర ఆరోపణలు రుజువు కానప్పటికీ.. నేరపూరిత కుట్రలో సర్కోజీని న్యాయస్థానం దోషిగా ప్రకటించి, ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.ఈ కేసులో నేరపూరిత కుట్రకు సంబంధించిన అభియోగాన్ని మాత్రమే న్యాయస్థానం ఖరారు చేసింది. తీర్పు వెలువడిన సమయంలో మాజీ అధ్యక్షుడు నికొలస్ సర్కోజీ సహా ఆయన కుటుంబ సభ్యులు కోర్టు రూమ్లోనే ఉన్నారు. ఈ కేసు విచారణలో సర్కోజీ ప్రభుత్వంలోని ఇద్దరు మాజీ మంత్రులను కూడా కోర్టు దోషులుగా తేల్చింది. ఎన్నికల ప్రచారం కోసం లిబియా నుంచి నిధులు సమకూర్చేందుకు వీరు సంయుక్తంగా కుట్ర పన్నారని న్యాయస్థానం తెలిపింది. కాగా గతంలో అవినీతికి సంబంధించిన మరో కేసులో కూడా సర్కోజీకి జైలు శిక్ష పడింది. -
ట్రంప్ ఓ ‘ఇడియట్’: గూగుల్ ఇమేజెస్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తోపాటు ఆయన పేరు కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ట్రంప్ పేరుతో గూగుల్లో సెర్చ్(Google search) చేస్తే ఆయనకు సంబంధించి తాజా వార్తావిశేషాలు, తాను తీసుకున్న నిర్ణయాలు, తన పర్యటనలు... ఇలా విభిన్న సమాచారం ప్రత్యక్షం అవుతుంది. అయితే గూగుల్ ఇమేజెస్లో ఇటీవల ‘ఇడియట్’ అని సెర్చ్ చేస్తున్న వ్యూయర్లకు కూడా ట్రంప్ ఫొటోనే దర్శనమివ్వడం పట్ల తీవ్ర దుమారం రేగింది. దాంతో అమెరికా ప్రభుత్వం స్పందించి ఈ వ్యవహారంపై జ్యుడీషియరీ కమిటీ ఏర్పాటు చేసింది. ఇటీవల ఆ కమిటీ ముందు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్(Sundar Pichai) అలా జరగడానికి కారణాలేంటో వివరించారు.ఇటీవల యూఎస్ హౌస్ జ్యుడీషియరీ కమిటీ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ను గూగుల్ ఇమేజెస్లో ‘ఇడియట్’ అనే పదాన్ని సెర్చ్ చేసినప్పుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చిత్రాలను ఎందుకు చూపించారని ప్రశ్నించింది. ఈ సందర్భంగా గూగుల్ సెర్చ్ అల్గారిథమ్ ఎలా పనిచేస్తుందో వివరించారు. ‘మేము కీవర్డ్ తీసుకుంటాం. మా ఇండెక్స్లోని బిలియన్లలో ఉన్న పేజీలతో సరిపోలుస్తాం. ఆ సమయంలో ఆ కీవర్డ్కు సంబంధించిన, తాజాగా ఉన్న, ప్రజాదరణ పొందిన సమాచారాన్ని యూజర్లకు అందిస్తాం. ఇది పూర్తిగా ఇతర వ్యక్తులు సెర్చ్ చేస్తున్నదానిపై ఆధారపడి ఉంటుంది. దాని ఆధారంగా వాటిని ర్యాంక్ చేస్తాం’ అన్నారు.గూగుల్ బాంబింగ్‘ఈ విధానాన్ని ‘గూగుల్ బాంబింగ్’ అని పిలుస్తారు. ఇది ఒక నిర్దిష్ట పదాన్ని నిర్దిష్ట పేజీకి లింక్ చేయడం వంటి ఆన్లైన్ సమన్వయ సెర్చ్ ఫలితాలను ప్రభావితం చేస్తుంది. గూగుల్ మాన్యువల్గా ఫలితాలను తారుమారు చేయదు. రాజకీయ పక్షపాతం వహించదు. ఈ అల్గోరిథమ్లు వినియోగదారుల ప్రవర్తన, ఇంటర్నెట్ ట్రెండ్స్ను ప్రతిబింబిస్తాయి’ అని పిచాయ్ నొక్కి చెప్పారు. ‘ఇది కొన్నిసార్లు ఊహించని లేదా వివాదాస్పద ఫలితాలను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: చెప్పులు ధరించి డ్రైవింగ్ చేస్తే చలానా!? -
చిక్కుల్లో అందాల భామ ‘బేబీ’.. బిగుస్తున్న ఉచ్చు
థాయ్ బ్యూటీ క్వీన్ సుపన్నీ నోయినోంతాంగ్(Suphannee Noinonthong) అలియాస్ బేబీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అందాల రాణి కిరీటం దక్కిన మరుసటిరోజే ఆమె అశ్లీల వీడియోలు ఇంటర్నెట్లో దర్శనమిచ్చాయి. దీంతో నిర్వాహకులు ఆమె కిరీటాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే అందులో ఉంది తానేనని, తాను ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆమె తర్వాత వివరణ ఇచ్చుకుంది. థాయ్లాండ్(Thailand)లో 76 ప్రావిన్స్కు విడివిడగా అందాల పోటీలు నిర్వహిస్తారు. ఆ 76 మంది బ్యూటీ క్వీన్లను ఒక దగ్గరికి తీసుకొచ్చి మళ్లీ జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తారు. అక్కడ నెగ్గిన వాళ్లను మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీకి పంపిస్తారు. అలా.. 27 ఏళ్ల సుపన్నీ(బేబీగా ఆమెకు పాపులారిటీ దక్కింది) ప్రాచువాప్ ఖిరీ ఖాన్ ప్రావిన్స్ నుంచి అందాల భామ గుర్తింపు దక్కించుకుంది. అయితే సెప్టెంబర్ 20వ తేదీన ఆమెకు కిరీటం దక్కగా.. ఆ వెంటనే ఆమెకు సంబంధించిన నగ్న చిత్రాలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ-సిగరెట్లు తాగుతూ, అశ్లీల నృత్యాలు.. చేష్టలతో ఆ వీడియోలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో.. ఆ మరుసటిరోజే నిర్వాహకులు టైటిల్ను వెనక్కి తీసుకుని, ఆమెను డిస్క్వాలిఫై అయినట్లు ప్రకటించారు. అయితే.. ఈ పరిణామాలపై ఆమె క్షమాపణలు తెలియజేసింది. ఆ వీడియోలో ఉంది తానేనని ఒప్పుకుంది. ఈ మేరకు నిర్వాహకులను, తన మద్దతుదారులను ఉద్దేశిస్తూ ఫేస్బుక్లో ఓ సుదీర్ఘ పోస్ట్ ఉంచింది. కరోనా టైంలో తన తల్లి జబ్బు చేసి మంచాన పడిందని, ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు అలా అశ్లీల వెబ్సైట్కు పని చేయాల్సి వచ్చిందని తెలిపింది. అయితే అంత చేసినా తన తల్లిని ఎంతోకాలం బతికించుకోలేకపోయానని, అప్పటి నుంచి మళ్లీ అలాంటి వాటి జోలికి వెళ్లలేదని వివరణ ఇచ్చుకుంది. ఈ ఘటన తనకు విలువైన గుణపాఠం నేర్పిందన్న ఆమె.. జీవితంలో ఎలాంటి తప్పు చేయబోనంటూ వ్యాఖ్యానించింది. తాను బ్యూటీ క్వీన్ కిరీటం గెలిచిన తర్వాతే అవి బయటకు వచ్చాయని.. ఉద్దేశపూర్వకంగానే వాటిని బయట పెట్టిన వాళ్లను కోర్టుకు లాగుతానని ఆమె హెచ్చరించింది. ఈ వివరణ తర్వాత.. పలువురు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. మరోవైపు.. నిర్వాహకులను కలిసిన బేబీ తన టైటిల్ విషయంలో విజ్ఞప్తి చేసుకుంది. జాతీయ స్థాయిలో పోటీలకు అనుమతించాలని వేడుకుంది. ఈ తరుణంలో జరిగిన విచారణకు ఆమె హాజరు కాగా.. న్యాయనిపుణులు ఆమెను పలు అంశాలపై ఆరా తీశారు. అందాల పోటీల్లోని పాల్గొనే ముందు ఒప్పందంలోని ఓ క్లాజ్ ప్రకారం.. కంటెస్టెంట్లు అశ్లీల కార్యకలాపాలకు దూరంగా ఉన్నామనే కాలమ్పై సంతకం చేయాలి. ఒకవేళ అది అబద్ధమని తేలితే వాళ్లపై క్రిమినల్ చర్యలు ఉంటాయి. బేబీ తెలిసి కూడా ఆ కాలమ్పై సంతకం చేయడంతో.. ఆమెకు మూడేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష పడే అవశకాం ఉందని న్యాయనిపుణులు తెలిపారు. దీంతో ఆమె అందరి ముందే లబోదిబోమంది. అయితే టైటిల్ వెనక్కి ఇచ్చే అంశాన్ని పునరాలోచన చేస్తామని నిర్వాహకులు చెప్పడంతో ఆమె సగం సంతోషంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. -
మానవ మృగాన్ని వేటాడిన భారతీయుడు!
అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాల్లో భారతీయులపై జరుగుతున్న జాత్యాహంకార దాడుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఈ మధ్యే నాగమల్లయ్య అనే కర్ణాటకవాసిని డల్లాస్లో ఓ వలసదారుడు అతికిరాతకంగా తల నరికి చంపడమూ చూశాం. అయితే.. ఇందుకు భిన్నంగా కాలిఫోర్నియా స్టేట్లో చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పసికందులపై అఘాయిత్యానికి పాల్పడ్డ మానవ మృగాన్ని.. భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి మట్టుపెట్టాడు. అక్కడి వార్తా సంస్థల కథనాల ప్రకారం.. సెప్టెంబర్ 18వ తేదీన ఫ్రెమాంట్ సిటీ(Fremont City)లో డేవిడ్ బ్రిమ్మర్(71) అనే వ్యక్తి వరుణ్ సురేష్(29) చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. హత్య అనంతరం పోలీసులకు తానే సమాచారం అందించి నిందితుడు లొంగిపోయాడు. ఈ క్రమంలో.. విచారణ అనంతరం సెప్టెంబర్ 22వ తేదీన హత్యా అభియోగాలను పోలీసులు అధికారికంగా నమోదు చేశారు. మూడు రోజుల తర్వాత.. అంటే సెప్టెంబర్ 25వ తేదీన ఈ ఘటన ప్రముఖంగా వెలుగులోకి వచ్చింది. అయితే.. వరుణ్ సురేష్(Varun Suresh) పోలీసుల విచారణలో సంచలన విషయాలను వెల్లడించాడు. చనిపోయిన డేవిడ్ బ్రిమ్మర్ గతంలో పసికందులపై లైంగిక వేధింపులకు పాల్పడి.. తొమ్మిదేళ్లు జైలు జీవితం గడిచి వచ్చాడు. పబ్లిక్ సె* అఫెండర్ రిజిస్ట్రీలో అతని పేరు కూడా నమోదు అయ్యింది. ఇది గమనించిన వరుణ్ సురేష్.. అతన్ని ఎలాగైనా మట్టు పెట్టాలని అనుకున్నాడు. పబ్లిక్ సర్టిఫైడ్ అకౌంటెంట్ వేషంలో ఓ బ్యాగు వేసుకుని కస్టమర్ల కోసం ప్రతీ ఇంటికీ తిరిగే ముసుగులో బ్రిమ్మర్ కోసం నెలలపాటు వెతికాడు. అలా ఆఖరికి.. బ్రిమ్మర్ ఇంటి తలుపు తట్టి కలుసుకున్నాడు. ఆపై చుట్టుపక్కల వాళ్లను అతని గురించి ఆరా తీశాడు. తాను వెతుకుతున్న వ్యక్తి అతనేనని ధృవీకరించుకున్నాడు.సెప్టెంబర్ 18వ తేదీన మరోసారి డేవిడ్ బ్రిమ్మర్(David Brimmer) ఇంటి తలుపు తట్టాడు. షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ మెడలో తన దగ్గర ఉన్న కత్తితో పోట్లు పొడిచాడు. చేసిన ఘాతుకాలకు పశ్చాత్తాపం చెందుతున్నావా? అని ఆరా తీశాడు. అయితే రక్తపు మడుగులో బ్రిమ్మర్ అతన్ని తోసేసి పారిపోయే ప్రయత్నం చేయబోయాడు. ఈ క్రమంలో బ్రిమ్మర్ గొంతును కోసి తాను చేపట్టిన సర్పయాగం వరుణ్ పూర్తి చేశాడు. చేసిన నేరానికి తానేం బాధపడడం లేదని, పైగా అది తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని వరుణ్ సురేష్ పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. వరుణ్ సురేష్ 2021లో ఓ ఆసక్తికరమైన కేసులో అరెస్ట్ అయ్యాడు. ఫ్రెమంట్లోనే ఓ ప్రముఖ హోటల్లో బాంబు ఉందని బెదిరించడమే కాక.. చోరీకి ప్రయత్నించాడనే నేరం కింద మూడు నెలల జైలు జీవితం గడిపాడు. అయితే.. ఆ హోటల్ సీఈవో కూడా మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తే. ఆ సమయంలో అతన్ని చంపేందుకే తీవ్రంగా ప్రయత్నించాడనని వరుణ్ సురేష్ ఇప్పుడు వెల్లడించడం గమనార్హం. అలమెడా కౌంటీ జిల్లా అటార్నీ కార్యాలయం ఈ కేసు విచారణ జరుపుతోంది. వరుణ్ సురేష్ నేపథ్యం ఏంటి?.. అతను పసికందులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని(Paedophile) ఎందుకు టార్గెట్ చేసుకున్నాడు?. అనే వివరాలు తెలియరావాల్సి ఉంది.చదవండి: ప్రాణాల కోసం పరిగెత్తినా.. తల ఎగిరి పడింది! -
వెనిజులాలో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు
కారాకస్: దక్షిణ అమెరికాలోని వెనిజులాలో(venezuela) భారీ భూకంపం సంభవించింది. భూకంపం(Earthquake) తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదు అయినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది. భూకంప తీవ్రత కారణంగా ప్రజలందరూ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో వెనిజులాలో భూకంపం సంభవించింది. జులియా రాష్ట్రంలోని మెనేగ్రాండే ప్రాంతానికి తూర్పు-ఈశాన్య దిశలో 24 కిలోమీటర్ల (15 మైళ్లు) దూరంలో, రాజధాని కారకాస్ కు పశ్చిమాన 370మైళ్లు (600 కిలోమీటర్లు)కంటే ఎక్కువ దూరంలో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది. భూకంపం ఐదు మైళ్లు (7.8కిలో మీటర్లు) లోతులో ఉందని ఏజెన్సీ నివేదించింది. మెనే గ్రాండే దేశ చమురు పరిశ్రమకు ముఖ్యమైన ప్రాంతమైన మారకైబో సరస్సుకు తూర్పున భూకంప కేంద్రం ఉంది.BREAKING: A powerful M6.2 earthquake has struck northwest Venezuela near Maracaibo, Zulia state.•Depth: just 7.8 km (very shallow)•230,000+ people felt strong to very strong shaking•USGS: 10–100 deaths possible, major damage likely•Tremors reached Caracas and parts of… pic.twitter.com/j3Ysx1sTK5— Sarcasm Scoop (@sarcasm_scoop) September 25, 2025కాగా, భూకంపం ప్రభావంతో పలు ప్రాంతాల్లోని ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఆస్తి, ప్రాణ నష్టంపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు.. వెనిజులాలోని అనేక రాష్ట్రాలతోపాటు పొరుగున ఉన్న కొలంబియా, కరీబియన్ నెదర్లాండ్స్, కరసౌ, అరుబాలతోపాటు మొత్తం ఆరు దేశాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ముఖ్యంగా వెనిజులా, కొలంబియాలో భూకంప తీవ్రత ఎక్కువగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Un fuerte terremoto de magnitud 6.1 sacude varias regiones en Venezuela este miércoles. pic.twitter.com/D8lrT4WqaU— Diario La Noticia (@lanoticiahn) September 25, 2025Blast evacuates Caracas subway as massive quake pummels VenezuelaNO reports the earthquake caused metro shutdown pic.twitter.com/SDgmCjmLBH— RT (@RT_com) September 25, 2025 -
అనుమానపు ట్రంప్.. రహస్య విచారణకు ఆదేశం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్య సమితికి మంగళవారం సతీమణి మెలానియాతో కలిసి వెళ్లిన ఆయన.. జనరల్ అసెంబ్లీ 80వ సమావేశంలో ప్రసంగించిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ తనకు ఎదురైన అనుభవాలు యాదృచ్ఛికమేమీ కాదని.. ఇందులో కుట్ర దాగి ఉందని అంటున్నారాయన. ఐక్యరాజ్య సమితిలో వరుస చేదు అనుభవాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు సార్లు సాంకేతిక వైఫల్యాలు చోటుచేసుకున్నాయన్న ఆయన.. అదేం యాదృచ్ఛికం కాదని అనుమానం వ్యక్తం చేశారు. ఎస్కలేటర్, టెలిప్రాంప్టర్, సౌండ్ సిస్టమ్ పనిచేయకపోవడం.. ఈ మూడు ఘటనలు దురుద్దేశపూర్వకంగానే కనిపిస్తున్నాయన్నారు. మొదటిది.. ట్రంప్ తన సతీమణి మెలానియా, సిబ్బందితో ఎస్కలేటర్పై ఉన్న సమయంలో అది అకస్మాత్తుగా ఆగిపోయింది. రెండోది.. ఆయన యూఎన్జీఏలో ప్రసంగించేటప్పుడు టెలిప్రాంప్టర్ పని చేయలేదు. దీంతో ఆయన ప్రింటెడ్ కాపీ ద్వారా తన సందేశాన్ని చదివి వినిపించారు. మూడోది.. ప్రసంగ సమయంలో మైక్ పనిచేయకపోవడం. దీని వల్ల అక్కడున్నవాళ్లు(భార్య మెలానియాతో సహా) తన మాటలు వినలేకపోయారని.. ఇంటర్ప్రెటర్లు ద్వారా మాత్రమే వాళ్లకు వినిపించిందని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై ఆయన అక్కడికక్కడే తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే..NEW: White House Press Secretary Karoline Leavitt calls for investigation after a UN escalator shut off as President Trump and First Lady Melania Trump stepped on.According to The Times, UN staff members had previously "joked" about turning off the escalator."To mark Trump’s… pic.twitter.com/UE1AFdCn2R— Collin Rugg (@CollinRugg) September 23, 2025ఇది తనపై జరిగిన కుట్రగా ఆయన భావిస్తున్నారట. వీటిపై విచారణకు రహస్య దర్యాప్తు సంస్థలను పురమాయించినట్లు, వీటి వెనుక ఎంతటివారున్నా వదిలే ప్రసక్తే లేదంటూ సోషల్ మీడియా ద్వారా ట్రంప్ వెల్లడించారు. అయితే.. ఐక్యరాజ్య సమితి(UNO) ట్రంప్ అనుమానాలను తోసిపుచ్చింది. అమెరికా ప్రతినిధుల బృందంలోకి ఓ వీడియోగ్రాఫర్ పొరపాటున స్టాప్ బటన్ నొక్కడంతో ఎస్కలేటర్ ఆగిపోయి ఉంటుందని యూఎన్ అధికార ప్రతినిధి ఒకరు చెబుతున్నారు. ఇక.. టెలిప్రాంప్టర్ నిర్వహణ వైట్ హౌస్ బాధ్యత కాబట్టి తమపై ఆరోపణలు సరికావని అంటోంది. ఇదిలా ఉంటే.. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్(New York City)లో ఉంది. ఇక్కడ నిర్వాహణ లోపాలు బయటపడడం తరచూ జరిగేదే. దీనికి తోడు నిధుల లేమితో ఈ అంతర్జాతీయ సంస్థ ఈ మధ్యకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే హెడ్ ఆఫీస్తో పాటు జెనీవాలో ఉన్న కార్యాలయంలోనూ ఎలివేటర్లు, ఎస్కలేటర్లు, ఏసీలు, లైట్లు ఆఫ్ చేయిస్తోంది కూడా. యూఎన్కు అత్యధికంగా ఆర్థిక సాయం అందించేది అమెరికానే. అలాంటి దేశం నుంచి ఫండింగ్ ఆగిపోవడంతో ఐరాసకు ఈ పరిస్థితి నెలకొంది.ఇదీ చదవండి: 150 దేశాలు.. ఐరాసను చీల్చి చెండాడిన ట్రంప్ -
జోక్యం చేసుకుంటే దీటుగా బదులిస్తాం.. ట్రంప్కు చైనా కౌంటర్
బీజింగ్: ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి భారత్, చైనాలే నిధులు సమకూరుస్తున్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై డ్రాగన్ దేశం చైనా విరుచుకుపడింది. తాము రష్యాతో జరుపుతున్న వాణిజ్యంపై అమెరికా జోక్యం చేసుకుని ఎలాంటి చర్యలైనా చేపడితే దానికి దీటుగా బదులిస్తామని చైనా స్పష్టంచేసింది.చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గుయో జియాకున్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. యూరోపియన్ యూనియన్తో పాటు సాక్షాత్తు అమెరికానే రష్యాతో వాణిజ్యం నెరుపుతున్నాయని చెప్పారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని నివారించి శాంతిని నెలకొల్పేందుకు చైనా చర్చలను చురుకుగా ప్రోత్సహిస్తోందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. చైనా, భారత్ దేశాలు రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తూ ఆ దేశానికి ఆర్థిక బలాన్నిస్తున్నాయని ట్రంప్ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.‘అమెరికా, ఈయూ దేశాలతోపాటు ప్రపంచంలోని చాలా దేశాలు రష్యాతో వాణిజ్యం చేస్తున్నాయి. చైనా, రష్యా కంపెనీలు డబ్ల్యూటీఓ నిబంధనలు, మార్కెట్ సూత్రాలకు అనుగుణంగా సహకారం అందించుకుంటూ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. మేము ఏ థర్డ్ పార్టీని కూడా లక్ష్యంగా ఎంచుకోలేదు. ఎవ్వరి ప్రయోజనాలను కూడా దెబ్బతీయట్లేదు. మా న్యాయమైన హక్కులను, ప్రయోజనాలను కాపాడేందుకు ఏం చేయాలో అది మాత్రమే చేస్తాం’ అని గుయో జియాకున్ చెప్పారు. -
బ్యాంకాక్లో నడిరోడ్డుపై భారీ సింక్హోల్
బ్యాంకాక్: థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో నగరంలోని ఓ రహదారిపై బుధవారం ఉన్నట్టుండి భారీ గొయ్యి ఏర్పడింది. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. చుట్టుపక్కల నిర్మాణాలు, భవనాలకు ముప్పు పొంచి ఉండటంతో అధికారులు ఆ ప్రాంతాన్ని ఆగమేఘాలపై ఖాళీ చేయించారు. ఒక పోలీస్స్టేషన్ను, ఆస్పత్రి ఔట్పేషెంట్ వార్డును మూసివేశారు. విద్యుత్, నీటి సరఫరాను ఆపారు. రోడ్డుపై పేద్ద సింక్హోల్ ఏర్పడటంతో మూడు వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. భూగర్భ రైలు మార్గం నిర్మాణ పనుల వల్లే రహదారి కుంగినట్లుగా భావిస్తున్నామని వెల్లడించారు. రోడ్డు నెమ్మదిగా కుంగిపోతుండటం, ఒరిగిపోతున్న విద్యుత్ స్తంభాలు, పగిలిపోతున్న నీళ్ల పైపు లైన్లు, గుంత పెద్దదైన కొద్దీ కార్లు, తదితర వాహనాలు వెనక్కి మళ్లడం, పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోవడం వంటి వీడియోలు ఆన్లైన్లో ప్రత్యక్షమయ్యాయి. గుంత ఒక అంచు సరిగ్గా పోలీస్ స్టేషన్ ఎదుట ఆగిపోయింది. భూగర్భ నిర్మాణం అందులో కనిపిస్తోంది. భారీ వర్షాలు కురుస్తున్నందున గుంత మరింత విస్తరించకుండా సాధ్యమైనంత త్వరగా పూడ్చివేసే చర్యలకు యంత్రాంగం ఉపక్రమించింది. -
ఐరాసలో ఎర్డోగన్ ‘కశ్మీర్’ పాట
యునైటెడ్ నేషన్స్: తుర్కియే అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ మరోసారి కశ్మీర్ అంశంలో వేలు పెట్టారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించిన ఆయన.. ఉగ్రవా ద నిర్మూలనకు భారత్–పాకిస్తాన్ మధ్య సహకారం ఎంతో అవసరమని పేర్కొ న్నా రు. ‘కశ్మీర్లోని మా సోదర సోదరీ మణుల సంక్షేమం కోసం ఆ సమస్య ఐరాస తీర్మానం మేరకు శాంతియుతంగా చర్చల ద్వారా పరి ష్కరించబడుతుందని ఆశిస్తున్నా. దక్షిణాసి యాలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడటం చాలా ముఖ్యం. గత ఏప్రిల్లో పాక్, భారత్ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతల తర్వాత కాల్పుల విరమణ పాటించటాన్ని మేం స్వాగతిస్తు న్నాం’అని పేర్కొన్నారు. పాకిస్తాన్కు సన్ని హిత దేశంగా ఉన్న తుర్కియే అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తోంది.