breaking news
International
-
జూన్లో ఎండ ప్రచండమే
నైజీరియా నుంచి జపాన్ దాకా.. పాకిస్తాన్ నుంచి స్పెయిన్ దాకా గత నెలలో ప్రపంచవ్యాప్తంగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 12 దేశాల్లో కొత్త రికార్డులు సృష్టించాయి. మరో 26 దేశాల్లో బాగా వేడి నెలగా జూన్ రికార్డుకెక్కింది. యూరోపియన్ మానిటర్ కోపరి్నకస్ సంస్థకు చెందిన ఏఎఫ్పీ విశ్లేషణ ఈ విషయం వెల్లడించింది. యూరప్, ఆసియా, ఆఫ్రికాలో గత నెలలో 79 కోట్ల మంది వేడి ముప్పును ఎదుర్కొన్నారు. బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా తదితర 26 దేశాల్లో రెండో అత్యంత వేడి నెలగా జూన్ రికార్డు సృష్టించింది. కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగానే ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగిపోతున్నట్లు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరప్లో గత నెలలో సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పారిస్, బెల్జియం, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో జనం అల్లాడిపోయారు. స్విట్జర్లాండ్, ఇటలీ, స్పెయిన్, బోస్నియా, మాంటెనిగ్రోలోనూ ఇదే పరిస్థితి. ఆసియా–పరిఫిక్ ప్రాంతంలో సాధారణంగా ఎక్కువ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కోస్తా తీర ప్రాంతాల్లో 1.2 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. జపాన్ ప్రజలు హాటెస్ట్ జూన్ను చవిచూశారు. దేశంలో 126 ఏళ్ల క్రితం ఉష్ణోగ్రతలను నమోదు చేయడం మొదలైంది. అప్పటి నుంచి అత్యంత వేడి జూన్ నెల ఇదే కావడం గమనార్హం. ఉభయ కొరియా దేశాల్లోనూ సాధారణం కంటే 2 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యింది. హాటెస్ట్ జూన్గా నిలిచిపోయింది. చైనాలో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జూన్లో ఈ స్థాయిలో సూర్యప్రతాపం కనిపించడం ఇదే మొదటిసారి. ఆసియాలోని పాకిస్తాన్, తజకిస్తాన్, ఇరాన్, అఫ్గానిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్లోనూ జూన్ నెల అత్యంత వేడి వసంత కాలంగా నిలిచింది. నైజీరియాలో రికార్డ్–బ్రేకింగ్ స్థాయి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, దక్షిణ సూడాన్, కామెరూన్, కాంగో, ఇథియోపియాలోనూ ఇలాంటి పరిణామమే ఎదురయ్యింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Yemen:16న భారతీయ నర్సుకు ఉరిశిక్ష అమలు
సనా: యెమెన్లో మరణశిక్ష విధించిన భారతీయ నర్సు నిమిషా ప్రియకు జూలై 16న ఉరిశిక్ష అమలు చేయనున్నారు. దేశ ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించడం, సాయుధ దళాలను బలహీనపరిచే చర్యకు పాల్పడటంతో పాటు హత్య వంటి అనేక నేరాలకు యెమెన్ చట్టం మరణశిక్ష విధిస్తుంది. నిమిషా ప్రియ దేశం నుండి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఆమెను అరెస్టు చేశారు. 2018లో ఆమె హత్యకు పాల్పడినట్లు నిర్ధారణ అయ్యింది.యెమెన్ జాతీయుడి హత్యకు పాల్పడిన కేరళకు చెందిన నిమిషా ప్రియ మరణశిక్షకు గత ఏడాది యెమెన్ అధ్యక్షుడు ఆమోదం తెలిపారు. ఈ కేసులోని పరిణామాలను పరిశీలిస్తున్న భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆమె కుటుంబ సభ్యులను సంప్రదించింది. ఆమెకు సాధ్యమైన సహాయాన్ని అందిస్తున్నామని తెలిపింది. నిమిషా ప్రియ తన తల్లిదండ్రుల పోషణా భారాన్ని భరించేందుకు 2008లో యెమెన్కు వెళ్లింది. పలు ఆస్పత్రులలో పనిచేసిన ఆమె.. ఆ తరువాతి కాలంలో సొంత క్లినిక్ను ప్రారంభించింది. 2014లో తలాల్ అబ్దో మహదీ అనే స్థానికునితో కలసి క్లినిక్ను కొనసాగించింది. Indian nurse Nimisha Priya to be executed in Yemen on July 16, claims report.Here’s what her family says: https://t.co/sGOIuq3eHEhttps://t.co/sGOIuq3eHE— WION (@WIONews) July 9, 2025అయితే ఆ తరువాత నిమిషా ప్రియకు మహదీతో విభేదాలు తలెత్తాయి. దీంతో ఆమె అతనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. 2016లో అధికారులు అతనిని అరెస్టు చేశారు. తరువాత అతను జైలు నుండి విడుదలయ్యాడు. అప్పటి నుంచి ఆమెను బెదిరిస్తూ రాసాగాడు. అలాగే ఆమె పాస్పోర్టును తీసుకున్నాడు. ఈ నేపధ్యంలో నిమిషా ప్రియ తన పాస్పోర్ట్ను తిరిగి దక్కించుకునేందుకు మహదీకి మత్తుమందు ఇచ్చిందనే ఆరోపణలు వచ్చాయి. అయితే అది అధిక మోతాదు కావడంతో, మహదీ మృతిచెందాడు. వెంటనే నిమిషా ప్రియ దేశం విడిచి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా, ఆమెను అధికారులు అరెస్టు చేశారు. 2018లో యెమెన్ జాతీయుడిని హత్యచేసినందుకు ట్రయల్ కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించింది. ఈ నిర్ణయాన్ని 2023 నవంబర్లో దేశ సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ సమర్థించింది. -
నోబెల్కు ట్రంప్ పేరును ప్రతిపాదించా
వాషింగ్టన్: నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను నామినేట్ చేసినట్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. ఈ మేరకు నోబెల్ కమిటీకి రాసిన సిఫారసు లేఖను ట్రంప్కు అందజేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం వైట్హౌస్లోని బ్లూరూంలో నెతన్యాహూతో సమావేశమయ్యారు. ఇరాన్ అణుకేంద్రాలపై ఇటీవల చేపట్టిన భారీ దాడులు, గాజాలో హమాస్తో 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం ప్రతిపాదన వీరి మధ్య చర్చకు వచ్చాయి.ఇరు దేశాల ఉన్నతాధికారుల సైతం పాల్గొన్నారు. అనంతరం నెతన్యాహూ మీడియాతో మాట్లాడారు. దేశాలు, ప్రాంతాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నందున ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించానన్నారు. వైమానిక దాడులతో ఇరాన్ అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేయాలంటూ ఇజ్రాయెల్ ఎంతో కాలంగా అమెరికా పాలకులను కోరుతోంది. తాజాగా, ట్రంప్ ఆ కోరిక నెరవేర్చారు. దీంతో, ఆయన పేరును ఇజ్రాయెల్ నోబెల్ కమిటీకి పంపించిందని విశ్లేషకులు అంటున్నారు. -
త్వరలో ఇండియాతో ట్రేడ్ డీల్
న్యూయార్క్: ఇండియాతో అతి త్వరలో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని, ఈ విషయంలో ఇప్పటికే చాలా సమీపంలోకి వచ్చామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇతర దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే ఉత్పత్తులపై ఎంతమేరకు సుంకాలు విధించబోతున్నామో తెలియజేస్తూ తమ అధికారులు ఆయా దేశాలకు లేఖలు పంపిస్తున్నారని వెల్లడించారు. యునైటెడ్ కింగ్డమ్(యూకే), చైనాతో తాజాగా ట్రేడ్ డీల్ కుదిరిందని, ఇకపై భారత్తో ఒప్పందానికి చాలా దగ్గరగా వచ్చేశామని అన్నారు.స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఓ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. లేఖలు పంపించడం వరకే తమ బాధ్యత అని, తమతో ఒప్పందానికి ముందుకు రావాలో వద్దో ఆయా దేశాలే తేల్చుకోవాలని, తుది నిర్ణయం వారిదేనని పరోక్షంగా స్పష్టంచేశారు. కొన్ని దేశాలు తమ ఉత్పత్తులపై 200 శాతం దాకా సుంకాలు విధిస్తున్నాయని, అమెరికాను దోచుకోవడమే వాటి విధానామా? అని ప్రశ్నించారు. ఇకపై అమెరికాలో ఉత్పత్తులు విక్రయించుకోవాలంటే సుంకాలు చెల్లించకతప్పదని తేలి్చచెప్పారు. భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపేశానని, ఆ ఘనత తనకే చెందాలని ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. మాట వినకపోతే వ్యాపారం, వాణిజ్యం నిలిపివేస్తానని హెచ్చరించడంతో ఆ రెండు దేశాలు దారికొచ్చాయని అన్నారు.విదేశాలపై ఏప్రిల్ 2న విధించిన సుంకాల తాత్కాలిక రద్దును ట్రంప్ సర్కారు ఆగస్టు 1వ తేదీ దాకా పొడిగించిన సంగతి తెలిసిందే. మరోవైపు ట్రంప్ సంతకంతో అమెరికా ప్రభుత్వం లేఖలు పంపించిన దేశాల జాబితాలో ఇండియా లేకపోవడం గమనార్హం. బంగ్లాదేశ్, బోస్నియా, కాంబోడియా, ఇండోనేషియా, జపాన్, కజకిస్తాన్, మలేషియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, థాయ్లాండ్, టునీíÙయా తదితర దేశాలకు ఈ లేఖలు అందాయి. మయన్మార్, లావోస్పై 40 శాతం టారిఫ్ మయన్మార్, లావోస్పై డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ మోత మోగించారు. రెండు దేశాల ఉత్పత్తులపై 40 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ మేరకు ఆయా దేశాల అధినేతలకు రాసిన లేఖలను సోషల్ మీడియాలో పోస్టుచేశారు. అలాగే కాంబోడియా, థాయ్లాండ్పై 36 శాతం, సెర్బియా, బంగ్లాదేశ్పై 35 శాతం, ఇండోనేíÙయాపై 32 శాతం, దక్షిణాఫ్రికా, బోస్నియా, హెర్జిగోవినాపై 30 శాతం, కజకిస్తాన్, మలేషియా, టునీíÙయాపై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇవి ఆగస్టు 1 నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించారు. ఈ టారిఫ్లకు ప్రతీకారంగా అమెరికా ఉత్పత్తులపై టారిఫ్లు పెంచే ఆలోచన చేయొద్దని ఆయా దేశాల అధినేతలను సున్నితంగా హెచ్చరించారు. జపాన్, దక్షిణ కొరియా ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. బ్రిక్స్పై 10 శాతం సుంకాలుపునరుద్ఘాటించిన ట్రంప్న్యూయార్క్/వాషింగ్టన్: బ్రిక్స్ కూట మిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. తమ దే శాన్ని, కరెన్సీ (డాలర్) ఆధిపత్యాన్ని దెబ్బ తీసేందుకే అది ఆవిర్భవించిందని మంగళవారం ఆరోపించారు. ‘‘డాలర్కు అంతర్జాతీయంగా ఉన్న విలువను నాశ నం చేసేందుకు బ్రిక్స్ దేశాలు ప్రయ త్ని స్తున్నాయి. తెలివైన అధ్యక్షుడెవరూ అలా జరగనివ్వరు. అది ఒక పెద్ద ప్రపంచ యుద్ధంలో ఓటమి చవిచూడటం వంటిదే.అలా ఎప్పటికీ జరగనివ్వం. ప్రపంచ కరెన్సీల్లో ఇప్పటికీ, ఎప్పటికీ డాలరే కింగ్. దాని ఆధిపత్యాన్ని సవాలు చేయాలనుకుని బ్రిక్స్ దేశాలు అనుకుంటే, తద్వారా మాతో ఆటలు ఆడాలనుకుంటే అభ్యంతరం లేదు. కానీ అందుకు మూల్యంగా వాటన్నింటిపైనా మరో 10 శాతం సుంకాలు విధించి తీరతాం. కేవలం బ్రిక్స్కూటమిలో ఉన్నందుకు అవి చెల్లించాల్సిన భారీ మూల్యమిది. అందుకు అవి సిద్ధంగా ఉన్నాయని నేను భావించడం లేదు’’ అన్నారు. -
ఉగ్రవాదంపై ఒక్కటే మాట
బ్రసీలియా: ఉగ్రవాదంపై భారత్, బ్రెజిల్ సంయుక్త సమరనాదం చేశాయి. ‘‘ఉగ్రవాదాన్ని సహించబోం. ఆ భూతంపై పోరులో మాది ఒకే బాట, ఒకే మాట. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాల మాటే లేదు. ఒకే విధానంతో ముందుకెళ్తాం’’ అని బ్రిక్స్ వేదికగా ప్రకటించాయి. ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డసిల్వాతో మంగళవారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉగ్రవాదంపై భారత్, బ్రెజిల్ ఆలోచనాధోరణి ఒకేలా ఉందంటూ వారు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. పహల్గాం ఉదంతం తర్వాత భారత్కు సంఘీభావం తెలిపినందుకు బ్రెజిల్కు, డసిల్వాకు మోదీ ధన్యవాదాలు తెలిపారు.విస్తృతాంశాలపై చర్చలువాణిజ్యం, అంతరిక్షం, పునరుత్పాదక ఇంధనం, ఆహారం, ఇంధన భద్రత, మౌలికవసతుల అభివృద్ధి, డిజిటల్ ప్రజా వసతులు, రక్షణ, భద్రత, ఆరోగ్యం, ఫార్మాసూటికల్స్, సంస్కృతి, ఇరుదేశాల ప్రజల మధ్య సత్సంబంధాలు తదితర కీలకాంశాలపై మోదీ, డసిల్వా లోతుగా చర్చించారు. కీలకమైన ఖనిజాలు, అధునాతన, నూతన సాంకేతికతలు, కృత్రిమ మేధ, సూపర్ కంప్యూటర్లు అంశాల్లోనూ సహకారం పెంపొందించుకోవడంపై చర్చించారు. 12 బిలియన్ డాలర్లుగా ఉన్న వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఐదేళ్లలో 20 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇంధనం, వ్యవసాయం, డిజిటల్ రూపాంతరీకరణ, ఉగ్రవాదంపైపోరుపై సంయుక్త సహకారం కోసం ఆరు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.కార్నివాల్.. ఫుట్బాల్.. సాంబా‘‘భారత్, బ్రెజిల్ సంబంధాలు కార్నివాల్లాగా వర్ణరంజితంగా ఉండాలి. ఫుట్బాల్ క్రీడలాగా స్ఫూర్తిదాయకంగా ఉండాలి. సాంబా నృత్యంలాగా ఇరుదేశాల ప్రజల హృదయాలను రంజింపజేయాలి. ఇరుదేశాల వీసా కేంద్రాల వద్ద పొడవాటి క్యూ వరసలు మాయమయ్యేలా వీసాప్రాసెసింగ్ వేగంగా జరగాలి. అన్నింటా అదే స్ఫూర్తి కనపడాలి’’ అని మోదీ అన్నారు. పశ్చిమాసియా ఎక్కడైనా సరే, వివాదాలకు చర్చలు, సంప్రదింపులతో పరిష్కారాలు కనుగొనాలన్నారు. ‘‘బ్రెజిల్తో రక్షణ రంగ ఒప్పందం అనేది ఇరుదేశాల మధ్య లోతైన పరస్పర విశ్వాసానికి ప్రతీక.రక్షణరంగ పరిశ్రమల మధ్య మరింత అనుసంధానం కోసం కృషిచేస్తాం. వ్యవసాయం, పశుసంవర్ధనలో రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా సహకారం ఉంది. ఇప్పుడు వ్యవసాయ రంగ పరిశోధన, ఆహార శుద్ధి రంగాలకూ దీనిని విస్తరిస్తాం. ఆరోగ్యరంగంలోనూ పరస్పర సహకారం అందించుకుంటాం. పర్యావరణం, శుద్ధ ఇంధనం అనేవి రెండు దేశాలకూ కీలకమే. నేటి ఒప్పందాలు మా హరిత లక్ష్యాలను నెరవేరుస్తాయి. యూపీఐ చెల్లింపు వ్యవస్థను బ్రెజిల్లోనూ అందుబాటులోకి రావడానికి ప్రయత్నిస్తాం. ఆయుర్వేదం, భారత సంప్రదాయ వైద్యం సైతం బ్రెజిల్కు చేరువచేస్తాం’’ అని మోదీ అన్నారు.మోదీకి అత్యున్నత పౌర పురస్కారంమోదీకి బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారం ‘ది గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్’ లభించింది. బ్రెజిల్ అధ్యక్షుడు డసిల్వా ఆయనకు పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ అవార్డును అధ్యక్షుడు స్వయంగా మోదీ మెడలో వేశారు. ఈ సందర్భంగా డసల్వా, మోదీ కరచాలనం, తర్వాత ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ‘‘ నాకీ అవార్డ్ దక్కడం ఎంతో గర్వంగా, ఉద్వేగంగా ఉంది. ఇది నాకు మాత్రమేకాదు 140 కోట్ల భారతీయులకు దక్కిన పురస్కారం’’ అని మోదీ సంయుక్త ప్రకటన వేళ వ్యాఖ్యానించారు. 2014 మేలో ప్రధాని అయ్యాక మోదీకి ఇలా విదేశాల్లో మొత్తంగా 26 అత్యున్నత పౌరపురస్కారాలు లభించాయి. -
వ్యక్తిని లాగేసుకున్న విమానం ఇంజిన్.. ఆ తర్వాత ఏమైందంటే?
స్పెయిన్: ఇటలీలోని మిలాన్ బెర్గామో విమానాశ్రయంలో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం(జూలై 8) ఎయిర్పోర్టులో విమానం ఇంజిన్ ఓ వ్యక్తిని లాగేసుకుంది. ఈ ఊహించని పరిణామంలో సదరు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.వోలోటియా ఎయిర్లైన్స్కు చెందిన ఎయిర్బస్ A319 విమానం స్పెయిన్కు బయలుదేరేందుకు సిద్ధమవుతోంది. సరిగ్గా అదే సమయంలో ఓ వ్యక్తి విమానాశ్రయ టెర్మినల్లోకి రహస్యంగా ప్రవేశించాడు. తన వాహనాన్ని అక్కడే వదిలేసి విమానాల పార్కింగ్ జోన్లోకి ప్రవేశించాడు.అనంతరం,స్పెయిన్ బయలుదేరేందుకు సిద్ధమవుతున్న వోలోటియా ఎయిర్బస్ A319 విమానం పక్కకు వచ్చాడు. ఈ ఊహించని ఘటనలో, ఆ వ్యక్తి విమానం ఇంజిన్లో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఫలితంగా ఉదయం 10:20 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు ఎయిర్పోర్టులో కార్యకలాపాలు నిలిచిపోయాయి. 19 విమానాల సర్వీసుల్ని రద్దు చేసిన అధికారులు.. మరికొన్నింటిని దారి మళ్లించారు. -
‘నోబెల్కు ట్రంప్ అర్హతలివే..’: నెతన్యాహు
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వాలంటూ ఆయన మద్దతుదారులు, నమ్మకస్తులైన చట్టసభ సభ్యులు చాలాకాలంగా కోరుతూ వస్తున్నారు. ఇందుకు అనుగుణంగా వారు తమ నామినేషన్లను కూడా సమర్పించారు. ఇదే సమయంలో ట్రంప్ తనకు ఈ ప్రతిష్టాత్మ అవార్డు అందకపోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నారంటూ పలు వార్తలు కూడా వినిపించాయి.తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నోబెల్ బహుమతి కమిటీకి అధ్యక్షుడు ట్రంప్ను నామినేట్ చేస్తూ ఒక లేఖ రాశారు. శాంతిని నెలకొల్పడంలో ట్రంప్ తన పాత్రను సమర్థవంతంగా నిర్వహించినందుకు ఆయనను నామినేట్ చేస్తున్నట్లు నెతన్యాహు ఆ లేఖలో పేర్కొన్నారు. సోమవారం వైట్ హౌస్లో జరిగిన విందు కార్యక్రమంలో నెతన్యాహు తాను బహుమతి కమిటీకి పంపిన నామినేషన్ లేఖ కాపీని కూడా మీడియాకు అందజేశారు.‘అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ఎన్నో ఘనమైన పురస్కారాలను, అవార్డులను అందుకున్నారు. ఇరు దేశాల మధ్య ఆయన శాంతిని నెలకొల్పారు. అందుకే నోబెల్ బహుమతి కమిటీకి ఆయనను నామినేట్ చేస్తూ లేఖ పంపాను. దీనిలో ఈ పురస్కారానికి అధ్యక్షుడు ట్రంప్ అర్హుడని తెలియజేశాను’ అని నెతన్యాహు పేర్కొన్నారు. మిడిల్ ఈస్ట్లో శాంతిభద్రతలు నెలకొల్పేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలను నెతన్యాహు ఆ లేఖలో ప్రశంసించారు. ట్రంప్ నాయకత్వం, న్యాయమైన లక్ష్యం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఎంతో గొప్పవి. మధ్యప్రాచ్యంలో ఆయన శాంతిభద్రతలకు చేస్తున్న ప్రయత్నాలను ఇజ్రాయెలీయులకే కాకుండా పలువురు అభినందిస్తున్నారన్నారని నెతన్యాహు పేర్కొన్నారు.చాలా కాలంగా తనను తాను శాంతి దూతగా అభివర్ణించుకుంటున్న ట్రంప్ తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నామినేషన్ చూసి సంబరపడ్డారు. ఈ సందర్భంగా నెతన్యాహుకు కృతజ్ఞతలు చెబుతూ, ఇది చాలా అర్థవంతమైనదని పేర్కొన్నారు. కాగా ఇప్పటివరకూ ముగ్గురు అమెరికా అధ్యక్షులు నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. 1906లో థియోడర్ రూజ్వెల్ట్, 1919లో వుడ్రో విల్సన్, 2009లో బరాక్ ఒబామా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఇది కూడా చదవండి: Maharashtra: బాల్ థాక్రే పాత వీడియో వైరల్.. ‘హిందీ’పై ఏమన్నారు? -
భారత్తో వాణిజ్య ఒప్పందానికి మరింత చేరువయ్యాం: ట్రంప్
భారత్తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందానికి మరింత చేరువయ్యామని వ్యాఖ్యానించారాయన. 14 దేశాలకు టారిఫ్ లేఖలు పంపిన తదనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తాజాగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూకు ఇచ్చిన ప్రైవేట్ డిన్నర్ సందర్భంగా ట్రంప్ భారత వాణిజ్య ఒప్పందంపై వ్యాఖ్యానించారు. ‘‘భారత్తో ఒక గొప్ప ఒప్పందం జరగబోతోంది. ఇది చాలా ప్రత్యేకమైన డీల్ అవుతుంది’’ అని అన్నారు. ఇప్పటికే యూకే, చైనాతో ఒప్పందాలు కుదిరాయన్న ఆయన.. ఇతర దేశాలు అమెరికా షరతులకు అంగీకరించకపోతే సుంకాల మోత తప్పదని హెచ్చరించారు. వారు(ఒప్పందాలకు దిగిరాని వారు) ఎంత టారిఫ్ చెల్లించాలో లేఖలో చెబుతున్నాం అని ట్రంప్ చెప్పారు. భారత్కు కలిగే లాభాలు:మార్కెట్ ప్రాప్యత: అమెరికా మార్కెట్కు భారత ఉత్పత్తులకు ఎగుమతుల అవకాశాలు పెరగొచ్చు.తక్కువ దిగుమతి సుంకాలు: భారత్కు వస్తువులు దిగుమతి చేసుకునే ఖర్చు తగ్గవచ్చు.టెక్నాలజీ ట్రాన్స్ఫర్: మౌలిక సదుపాయాలు, హైటెక్ రంగాల్లో భాగస్వామ్యం మెరుగుకావొచ్చు.భద్రతా సహకారం: వ్యూహాత్మక మైత్రి బలపడే అవకాశం ఉంటుంది.మరోవైపు.. భారత వాణిజ్య ప్రతినిధి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం వాషింగ్టన్లో చర్చలు జరుపుతోంది. వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్లు, డిజిటల్ గోప్యత, పౌర హక్కులు వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య స్వల్ప అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఒప్పందం కుదరకపోతే, తాత్కాలికంగా నిలిపిన 26% దిగుమతి సుంకాలు మళ్లీ అమలులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే.. ఈ ఒప్పందం కుదిరితే మాత్రం రెండు దేశాల ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అవకాశం లేకపోలేదు. ఏ దేశాలపై.. ట్రంప్ ఎంతెంత టారిఫ్ (ఆగస్టు 1 నుంచి అమలు):దేశంటారిఫ్ శాతంజపాన్, దక్షిణ కొరియా, కజకస్తాన్, మలేషియా, ట్యునీషియా25%మయన్మార్, లావోస్40%దక్షిణాఫ్రికా, బోస్నియా30%ఇండోనేషియా32%బంగ్లాదేశ్, సెర్బియా35%కంబోడియా, థాయిలాండ్36% -
మమ్దానీని వెంటాడుతున్న పాత పోస్టులు.. ఏం జరగనుంది?
న్యూయార్క్: న్యూయార్క్ నగర మేయర్ పదవికి పోటీ పడుతున్న జొహ్రాన్ మమ్దానీ చిక్కుల్లో పడ్డారు. 2015లో మమ్దానీ ‘ఎక్స్’లో అల్ ఖైదా ఉగ్రవాదికి అనుకూలంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అతడిని వెంటాడుతున్నాయి. అమెరికాలో జన్మించిన అన్వర్ అల్–ఔలాకీ అనే మత బోధకుడు తీవ్రవాదం బాట పట్టడానికి ఎఫ్బీఐ నిఘా కారణం కావచ్చు అంటూ అప్పట్లో ఆయన వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన అప్పటి వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారి తీశాయి.అయితే, వందశాతం కమ్యూనిస్ట్ పిచ్చోడంటూ మమ్దానీని ఉద్దేశించి అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించిన తర్వాతర ఆయన పాత పోస్టులు తాజాగా వెలుగు చూశాయి. న్యూమెక్సికోలో యెమెన్ దేశస్తుల కుటుంబంలో జన్మించిన ఔలాకీ అమెరికాలోని మసీదుల్లో బోధనలు చేసేవాడు. అటు తర్వాత అల్ఖైదాలో అగ్ర నాయకుల్లో ఒకడయ్యాడు.అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగాన్ తదితరాలపై 2001 సెప్టెంబర్ 11న దాడులకు పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులు ఇతడికి సన్నిహితులని తేలడంతో ఎఫ్బీఐ నిఘా పెంచింది. అటు తర్వాత అతడు 2004లో యెమెన్కు వెళ్లిపోయాడు. అమెరికా ఆస్తులపై దాడులు ఇతడు ఉగ్రవాదులకు పిలుపు ఇచ్చాడనే ఆరోపణలపై 2011లో అధ్యక్షుడు ఒబామా ఆదేశాల మేరకు యెమెన్పై జరిపిన డ్రోన్ దాడుల్లో హతమయ్యాడు. ఎలాంటి నేరారోపణలు లేని అమెరికా పౌరుడిని ప్రభుత్వమే చంపడం అసాధారణ విషయమని న్యూయార్క్ పోస్ట్ అప్పట్లో వ్యాఖ్యానించింది. -
రష్యా మంత్రి ఆత్మహత్య
మాస్కో: ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా గత వారం రాజధాని మాస్కోతోపాటు, సెయింట్ పీట ర్స్బర్గ్ తదితర ప్రాంతాల్లోని విమానాశ్రయాల్లో వందలాది విమానాలు రద్దయ్యాయి. కొన్ని ఆలస్యంగా నడిచాయి. వేలాదిగా ప్రయాణికులు గంటలపాటు విమానాశ్రయాల్లో వేచి ఉండాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు పుతిన్ సోమవారం రవాణా శాఖ మంత్రి రొమాన్ స్టరొవోయ్(53)ను సస్పెండ్ చేశారు. డిప్యూటీ మంత్రి ఆండ్రీ నికిటిన్కు రవాణా శాఖ బాధ్యతలను తాత్కాలికంగా అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే స్టరొవోయ్ తన నివాసంలో తుపాకీ గాయాలతో విగతజీవిగా కనిపించారు. ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. 2024 మేలో రవాణా శాఖ మంత్రిగా స్టరొవోయ్ బాధ్యతలు చేపట్టారు. -
జపాన్, దక్షిణకొరియాపై 25 శాతం సుంకాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ రగడకు తెర తీశారు. జపాన్, దక్షిణ కొరియా ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధించనున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని ట్రూత్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అంతేగాక జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్కు ఈ మేరకు స్వయంగా లేఖలు కూడా రాశారు. ప్రతీకార సుంకాలకు దిగితే ఆ దేశాలపై టారిఫ్లు ఆ మేరకు పెరుగుతాయని అందులో ట్రంప్ హెచ్చరించారు! ఆ లేఖల స్క్రీన్షాట్లను ట్రూత్ సోషల్లో షేర్ చేశారు. జపాన్, దక్షిణకొరియాపై 25 శాతం టారిఫ్ నిజానికి చాలా తక్కువేనంటూ వాపోయారు. ‘‘ఇవి తుది టారిఫ్లు కావు. మీ దేశంతో మా సంబంధాలను బట్టి అంతిమంగా పెరగవచ్చు, తగ్గనూ వచ్చు’’ అన్నారు. టారిఫ్ పెంపుపై భారత్తో పాటు పలు ఇతర దేశాలకు కూడా ట్రంప్ లేఖాస్త్రాలు సంధిస్తున్నట్టు సమాచారం. మస్క్ కొత్త పార్టీ ప్రకటనపై ట్రంప్ ఎద్దేవా న్యూయార్క్: ‘అమెరికన్ పార్టీ’ పేరిట కొత్త పార్టీ పెడతానన్న ఎలాన్ మస్క్ ప్రకటనను హాస్యాస్పదంగా ట్రంప్ సోమవారం అభివర్ణించారు. ‘‘అమెరికాలో ఎన్నో ఏళ్లుగా రెండు పారీ్టలతోనే రాజకీయ వ్యవస్థ నడుస్తోంది. ఇప్పుడు మూడో పార్టీని తీసుకురావడమంటే గందరగోళాన్ని సృష్టించడమే’’ అని అన్నారు. తర్వాత తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లోనూ మస్్కను విమర్శిస్తూ ట్రంప్ పోస్ట్లు పెట్టారు. ‘‘కొన్ని వారాల క్రితం మా స్నేహ రైలుబండ్లు ఢీకొన్నాయి. ఇప్పుడు మస్క్ పూర్తిగా పట్టాలు తప్పారు. అమెరికాలో మూడో పార్టీ ఏదీ అద్భుతాలు చేయలేదన్న చేదు నిజం తెల్సికూడా మస్క్ కొత్త పార్టీ పెడతానంటున్నాడు. సక్రమంగా ఉన్న రాజకీయ వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి తప్ప మూడోపార్టీ ఎందుకూ పనికిరాదు’’ అని వ్యాఖ్యానించారు. -
ప్రపంచానికి బ్రిక్స్ ఆశాదీపం
రియో డి జనిరో: ‘‘అంతర్జాతీయ సహకారానికి, ఆదర్శ బహుళ ధ్రువ ప్రపంచానికి బ్రిక్స్ కూటమి చక్కని ఉదాహరణగా, విశ్వసనీయతకు మారుపేరుగా నిలవాలి. రానున్న రోజుల్లో ఇతర ప్రపంచ దేశాలకు అన్ని విషయాల్లోనూ దిశానిర్దేశం చేసే దారిదీపం కావాలి’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ‘‘బ్రిక్స్పై దక్షిణార్ధ గోళ దేశాలు (గ్లోబల్ సౌత్) ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. వాటిని నెరవేర్చి నమ్మకాన్ని నిలబెట్టుకుందాం. పాలన, అభివృద్ధి, పరస్పర సహకారం తదితరాల్లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పుదాం’’ అని సభ్య దేశాల అధినేతలకు పిలుపునిచ్చారు. ఈ విషయంలో సభ్య దేశాలన్నింటితోనూ భుజం భుజం కలిపి ముందుకు సాగేందుకు భారత్ పూర్తిగా కట్టుబడి ఉందని వక్కాణించారు. బ్రెజిల్లోని రియో డి జనిరోలో బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సదస్సులో సోమవారం రెండో రోజు ‘భిన్నత్వానికి దన్ను, ఆర్థిక వ్యవహారాలు, ఏఐ’, ‘పర్యావరణం, కాప్–30, ప్రపంచ ఆరోగ్యం’ వంటి అంశాలపై జరిగిన సెషన్లలో మోదీ ప్రసంగించారు. బ్రిక్స్ కూటమి బలం దాని భిన్నత్వంలోనే దాగుందని నొక్కిచెప్పారు. కృత్రిమ మేధకు నానాటికీ అపారంగా పెరిగిపోతున్న ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు. ‘ఏఐ’ ఆందోళనలకు అలా చెక్ ‘‘విద్య నుంచి వ్యవసాయం దాకా అన్ని రంగాల్లోనూ ఏఐని భారత్ చురుగ్గా, విస్తృతంగా ఉపయోగిస్తోంది. ఏఐపై నెలకొన్న ఆందోళనలకు సమర్థంగా చెక్ పెట్టాలంటే ఇటు పాలనకు, అటు ఇన్నొవేషన్లకు సమ ప్రాధాన్యమివ్వడమే మార్గం. బాధ్యతాయుతమైన ఏఐ మనందరి లక్ష్యం కావాలి’’ అని మోదీ సూచించారు. ఏఐ ప్రభావంపై వచ్చే ఏడాది భారత్ నిర్వహించనున్న శిఖరాగ్ర భేటీలో పాల్గొనాల్సిందిగా బ్రిక్స్ సభ్య దేశాలన్నింటినీ ఈ సందర్భంగా ఆహా్వనించారు. కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించుకునేందుకు వీలుగా బ్రిక్స్ సైన్స్ అండ్ రీసెర్చ్ రిపోజిటరీ (బీఎస్ఆర్ఆర్) ఏర్పాటును ప్రతిపాదించారు. అంతర్జాతీయ స్థాయిలో కీలక ఖనిజాలు సరఫరాకు ఆటంకం లేకుండా చూడటంలో కూటమి కీలకపాత్ర పోషించాలని అభిలíÙంచారు. ఆ వనరులను ఏ దేశమూ స్వీయ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి, ఇతర దేశాలపై ఆయుధంగా వాడకుండా చూడాలన్నారు. 18 రకాల కీలక ఖనిజ వనరులకు నిలయమైన చైనా ఇటీవల వాటి ఎగుమతులను బాగా తగ్గించడం తెలిసిందే. పరోక్షంగా దాన్ని ఉద్దేశించి మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా ప్రధాని లీ కియాంగ్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో కీలక పాలన సంస్కరణలకు బ్రిక్స్ బాటలు పరవాలని సూచించారు. ప్రపంచ శాంతిని కాపాడటంలో, విభేదాలను శాంతియుతంగా పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించాలన్నారు. అధినేతలతో భేటీలు బ్రిక్స్ సదస్సు సందర్భంగా సోమవారం పలువురు దేశాధినేతలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. 10 దేశాలతో కూడిన ఆసియాన్ కూటమితో భారత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై మలేసియా ప్రధాని అన్వర్ బిన్ ఇబ్రహీంతో చర్చించారు. వర్తకం, పెట్టబడులు, రక్షణ, విద్య, ఆరోగ్యం, పర్యాటకం తదితరాలపై లోతైన సమీక్ష జరిపారు. బొలీవియా అధ్యక్షుడు లూయిస్ ఆల్బర్టో ఆర్స్ కాటకొరా, ఉరుగ్వే అధ్యక్షుడు యమంద్ ఒర్సీతో ద్వైపాక్షిక అంశాలను గురించి మోదీ చర్చలు జరిపారు. యోగాకు ఉరుగ్వేలో నానాటికీ ఆదరణ పెరగుతుండటంపై హర్షం వెలిబుచ్చారు. పర్యావరణ న్యాయం... మాకు పవిత్ర నైతిక విధి పర్యావరణ న్యాయం భారత్ దృష్టిలో పవిత్రమైన నైతిక విధి అని మోదీ ఉద్ఘాటించారు. పారిస్ పర్యావరణ ఒప్పంద ప్రతిజ్ఞలను గడువుకు ముందే నెరవేర్చిన తొలి దేశం భారతేనని గుర్తు చేశారు. ‘‘భూమి ఆరోగ్యంపైనే ప్రజారోగ్యం ఆధారపడి ఉంది. ఈ విషయంలో సంపన్న దేశాలపై గురుతర బాధ్యత ఉంది’’అన్నారు. ‘‘బ్రిక్స్ సారథిగా మానవత్వం, పర్యావరణ న్యాయం తదితరాలకు భారత్ పెద్దపీట వేస్తుంది. సమర్థ కూటమిగా బ్రిక్స్పనితీరుకే సరికొత్త నిర్వచనమిస్తుంది’’ అని మోదీ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది భారత్ బ్రిక్స్ సారథ్య పగ్గాలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఎలాంటి విపత్తులనైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్నివేళలా సిద్ధంగా ఉండాల్సిన అవసరం చాలా ఉందంటూ కరోనా మహమ్మారిని ప్రధాని ఉటంకించారు. ‘‘వైరస్లు వీసాలు తీసుకుని రావని కరోనా నిరూపించింది. వాటి పరిష్కారాలు కూడా పాస్పోర్టులను చూసి ఎంపిక చేసుకునేవి కావు’’ అంటూ చమత్కరించారు. వర్ధమాన దేశాలు ఆత్మవిశ్వాసం విషయంలో సంపన్న దేశాలకు ఏ మాత్రమూ తీసిపోవద్దని సూచించారు. -
డెలివరీ డేట్ను ప్లాన్ చేసుకుంటే పుట్టే పిల్లలకు లుకేమియా ముప్పు
న్యూఢిల్లీ: తల్లీబిడ్డను కాపాడేందుకు అప్పటికప్పుడు చేసే సీ–సెక్షన్(కోత) ఆపరేషన్తో పోలిస్తే ముందస్తుగా ఒక తేదీ అనుకుని ప్లాన్చేసి ఆపరేషన్ చేయించిన సందర్భాల్లో పుట్టిన చిన్నారులకు రక్త క్యాన్సర్ (లుకేమియా) ముప్పు అధికంగా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. బిడ్డ డెలివరీ సాధ్యంకాక ప్రసవవేదనతో ఇబ్బందిపడుతున్న గర్భిణికి మాత్రమే గతంలో సీ–సెక్షన్ విధానంలో కోతపెట్టి ఆపరేషన్ చేసేవారు. తదనంతరకాలంలో మంచిరోజు చూసుకుని, మరికొందరు తమకు వీలున్నప్పుడు, మరికొందరు సెలవుతేదీ ఇలా వేర్వేరు కారణాలతో డెలివరీ తేదీని ప్లాన్చేసుకునే ధోరణి ఎక్కువైంది. ఇలా ప్లాన్డ్ సిజేరియన్ సెక్షన్ ఆపరేషన్ ద్వారా పుట్టిన చిన్నారులు భవిష్యత్తులో లుకేమియా వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ పరిశోధకులు చెప్పారు. సంబంధిత పరిశోధన తాలూకు వివరాలు ‘ది ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్’లో ప్రచురితమయ్యాయి. స్వీడన్లో మెడికల్ బర్త్ రిజిస్ట్రర్ గణాంకాల ద్వారా సేకరించిన 1982–89, 1999–2015 కాలాల్లో జన్మించిన 25 లక్షల మంది చిన్నారుల ఆరోగ్య రికార్డులను విశ్లేషించి ఈ అధ్యయన నివేదికను రూపొందించారు. వీరిలో 3.75 లక్షల మంది అంటే 15.5 శాతం మంది సీ–సెక్షన్ ద్వారా జన్మించారు. వీరిలో 1,495 మందికి లుకేమియా వ్యాధి సోకింది. సహజ ప్రసవం ద్వారా పుట్టిన చిన్నారులతో పోలిస్తే సీ–సెక్షన్ ద్వారా జన్మించిన పిల్లల్లో అత్యత తీవ్రమైన లింఫోబ్లాస్టిక్ లుకేమియా వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువ అని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లో పరిశోధకురాలు, ఈ పరిశోధనలో కీలక రచయిత క్రిస్టినా ఇమోర్ఫియా క్యాంపిస్టీ చెప్పారు. సహజ ప్రసవ సమయంలో ఒక్కోసారి ఉమ్మనీరు సంచి పగలిపోయి శిశువు బయటికొచ్చే వేళ యోని బ్యాక్టీరియా అంటుకుంటుంది. ఈ బ్యాక్టీరియా సోకడం పుట్టినబిడ్డకు ఎంతో మంచిదని సైన్స్ చెబుతోంది. తొలినాళ్లలోనే బ్యాక్టీరియా సోకడంతో భవిష్యత్తులో మంచి, చెడు బ్యాక్టీరియాల మధ్య తేడాలను గుర్తించడం, భవిష్యత్తులో అలర్జీలు, ఆటోఇమ్యూన్ వంటి సమస్యలు రావని, చిన్నారుల పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుదల బాగుంటుందని ఇప్పటికే పలు పరిశోధనలు చెబుతున్నాయి. -
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్కి చెందిన కుటుంబం సజీవ దహనం
కుత్బుల్లాపూర్: అమెరికాలోని డాలస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనమయ్యారు. ఆదివారం రాంగ్ రూట్లో వచ్చిన ట్రక్కు కారును ఢీకొట్టింది. దీంతో కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి అందులో ప్రయాణిస్తున్న శ్రీ వెంకట్, తేజస్విని దంపతులతోపాటు కొడుకు సిద్ధార్థ, కూతురు మృద కాలిపోయారు. తిరుమలగిరికి చెందిన పశుపతినాథ్–గిరిజ దంపతుల కుమారుడు శ్రీ వెంకట్కు జీడిమెట్లకు చెందిన తేజస్వినితో 2013లో వివాహం జరిగింది.పశుపతినాథ్ కొంపల్లి ఎన్సీఎల్లో నివాసముంటున్నారు. ఉద్యోగ నిమిత్తం మూడేళ్ల క్రితం కుటుంబంతో సహా శ్రీ వెంకట్–తేజస్విని దంపతులు డాలస్కు వెళ్లారు. శ్రీ వెంకట్ సోదరి దీపిక అట్లాంటాలో ఉండగా, మూడు రోజుల క్రితం తల్లిదండ్రులతో కలిసి అక్కడకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టగా మంటలు చెలరేగి నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. అయితే వీరితో పాటు ప్రయాణించాల్సిన శ్రీవెంకట్ తల్లిదండ్రులు విమానంలో డాలస్కు వచ్చారు. తమ కొడుకు ఇంటికి రాలేదంటూ ఆరా తీయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. -
Indonesia: అదృశ్యమైన రైతు.. భారీ కొండచిలువ కడుపులో..
జకార్తా: ప్రపంచంలో జరిగే కొన్ని ఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఇండోనేషియాలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. పొలంలో అదృశ్యమైన ఒక రైతు 26 అడుగుల భారీ కొండచిలువకు చిక్కి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆగ్నేయ సులవేసిలోని దక్షిణ బుటన్ జిల్లాలో చోటుచేసుకుంది.ఈ ఘటనపై సౌత్ బుటన్ ప్రాంతీయ విపత్తు నిర్వహణ సంస్థ (బీపీబీడీ) అత్యవసర, లాజిస్టిక్స్ విభాగం హెడ్ లావోడ్ రిసావల్ మాట్లాడుతూ ఒక రైతు శుక్రవారం ఉదయం తన తోటకు వెళ్లి తిరిగి రాలేదు. తరువాత అతనిని భారీ కొండచిలువ మింగినట్లు స్థానికులు గుర్తించారని తెలిపారు. తోటలో ఆ కొండచిలువ ఇబ్బంది పడటాన్ని చూసి, ఏదో భారీ జంతువును మింగి ఉంటుందని భావించి, దానిని చీల్చివేశారన్నారు. అప్పుడు వారు దాని కడుపులో రైతు మృతదేహాన్ని చూసి షాకయ్యారన్నారు.ఈ ప్రాంతంలో ఒక కొండచిలువ మనిషిని మింగడం ఇదే మొదటిసారని లావోడ్ రిసావల్ తెలిపారు.కాగా 2017లోనూ ఇండోనేషియాలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. అప్పట్లో 23 అడుగుల కొండచిలువ ఉబ్బిపోయి కనిపించడంతో, స్థానికులు దానిని చీల్చి చూడగా, దానిలో 25 ఏళ్ల యువకుని మృతదేహం ఉంది. ఈ తరహా భారీ కొండచిలువలు ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లలో కనిపిస్తుంటాయి. ఇవి చిన్నచిన్న జంతువులపై దాడి చేస్తుంటాయి. మనుషులను మింగేందుకు అరుదుగా ప్రయత్నిస్తాయని సంబంధిత అధికారులు తెలిపారు. -
వహ్.. శుభాంశు శుక్లా! కుపోలా విండో ఎందుకంత స్పెషల్?
భారతదేశపు వ్యోమగామి.. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా 👨🚀 మరో అదరుదైన ఫీట్ సాధించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోని ప్రసిద్ధ కుపోలా విండో వద్ద నుంచి భూమిని వీక్షిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యం నెట్టింట వైరల్ అవుతోంది. నాసా-ఇస్రో జాయింట్ మిషన్ యాక్సియమ్ మిషన్ 4లో భాగంగా శుభాంశు శుక్లా ISS చేరుకున్న సంగతి తెలిసిందే. తద్వారా ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా ఆయన చరిత్రకెక్కారు. ఈ మిషన్లో భాగంగా.. శుక్లా కమాండర్ పెగ్గీ విట్సన్, స్లావోస్ ఉజ్నాన్స్కీ, టిబోర్ కాపులతో కలిసి శాస్త్రీయ పరిశోధనలు నిర్వహిస్తున్నారు. మైజెనెసిస్, స్ప్రౌట్స్ ప్రాజెక్ట్, మైక్రో ఆల్గీ ప్రయోగాలు వంటి అనేక శాస్త్రీయ ప్రయోగాల్లో పాల్గొంటున్నారు. తాజాగా.. ఐఎస్ఎస్లోని కుపోలా నుంచి ఆయన చిత్రాలను నాసా రిలీజ్ చేసింది. కుపోలా మాడ్యూల్ అనేది ఐఎస్ఎస్లోని అత్యంత ప్రత్యేకమైన భాగం. అంతరిక్షం నుంచి భూమిని ప్రత్యక్షంగా చూడటానికి రూపొందించిన ఒక విండో గ్యాలరీలా ఉంటుంది.భూమి, నక్షత్రాలు, అంతరిక్ష నౌకలు వంటి వాటిని పరిశీలించేందుకు, ఫోటోలు తీయడానికి, రోబోటిక్ ఆర్మ్ను నియంత్రించేందుకు ఉపయోగిస్తారు.ఇది ఏడు విండోలతో కూడిన గుండ్రటి ఆకారంలో ఉంటుంది. ప్యానోరమిక్ వ్యూ (360 డిగ్రీల దృశ్యం) అందించగల సామర్థ్యం ఉంది. దీనిని ఇటలీ అంతరిక్ష సంస్థ (ASI) రూపొందించి, నాసాకి అందించింది. 2010లో ISSకి ఇది జత చేయబడింది.కుపోలా ద్వారా భూమిని చూడటం అనేది చాలా భావోద్వేగపూరితమైన అనుభవంగా ఉంటుంది. ఈ విండో గుండా తీసిన భూమి చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని విండో టు ది వరల్డ్గా దీనిని వ్యవహరిస్తారు. Finally, we have some awesome images of Astro Shubanshu shukla 🇮🇳🧑🏻🚀Thank you @Axiom_Space for uploading these 📸#Ax4 #ISRO #Shubanshushukla pic.twitter.com/lfwm8PC6OI— ASTROSPACE (@Arslanshaikh_) July 5, 2025ఇదిలా ఉంటే.. శుభాంశు శుక్లా ఐఎస్ఎస్లో పరిశోధనలతో పాటు సాంకేతిక ప్రదర్శనలు, విద్యార్థులతో అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రధాని మోదీతో వీడియో కాల్లో మాట్లాడుతూ.. అంతరిక్షం నుంచి భూమిని చూస్తే ఎలాంటి సరిహద్దులు కనిపించవు, అందులో భారతదేశం ఎంతో విశాలంగా కనిపిస్తుంది అని చెప్పారు. అలాగే.. జూలై 3, 4 తేదీల్లో తిరువనంతపురం, బెంగళూరు, లక్నోలో విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. షెడ్యూల్ ప్రకారం.. జులై 10వ తేదీతో శుక్లా బృందం అంతరిక్ష యాత్ర ముగియాల్సి ఉంది. -
యెమెన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. ప్రతిగా హౌతీల క్షిపణి దాడులు
సనా: ఇజ్రాయెల్- యెమెన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ఓడరేవులు, పలు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం సోమవారం తెల్లవారుజామున వరుస వైమానిక దాడులకు దిగింది. దీనికి ప్రతిగా హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్ వైపు క్షిపణులను ప్రయోగించారు.ఎర్ర సముద్రంలో గ్రీకు యాజమాన్యం ఆధీనంలోని కార్గో షిప్ మ్యాజిక్ సీస్పై ఆదివారం దాడి జరిగిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. రాకెట్ ఆధారిత గ్రెనేడ్లతో కాల్పులు జరిపిన తర్వాత బాంబులతో కూడిన డ్రోన్లు.. పడవలు, ఓడలను ఢీకొట్టాయని యెమెన్ భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ఈ సంఘటన గురించి హౌతీ మీడియా వెల్లడించినప్పటికీ, అధికారికంగా తమ బాధ్యతను ప్రకటించలేదు.ఈ ఓడరేవులను హౌతీ ఉగ్రవాదులు ఇరాన్ నుండి ఆయుధాలను రవాణా చేయడానికి ఉపయోగిస్తుంటారు. ఈ ఆయుధాలను వారు ఇజ్రాయెల్తో పాటు దాని మిత్రదేశాలపై ఉగ్రవాద కార్యకలాపాల నిర్వహణకు ఉపయోగిస్తారని ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఒక ప్రకటనలో తెలిపాయి. తిరుగుబాటుదారులు అంతర్జాతీయ సముద్ర ట్రాఫిక్ను ట్రాక్ చేయడానికి, మరిన్ని దాడులను ప్లాన్ చేయడానికి ఓడలో రాడార్ పరికరాలను అమర్చారని ఇజ్రాయెల్ ఆరోపించింది. 🚨 Israel Launches Over 60 Airstrikes on Houthi-Controlled Yemen Ports in Retaliatory OperationIn the early hours of July 7, Israel initiated a large-scale military campaign named Operation Black Flag, targeting Houthi-controlled infrastructure across Yemen. The Israeli Defense… pic.twitter.com/jRXzxmPLeL— The Tradesman (@The_Tradesman1) July 7, 2025ఇజ్రాయెల్ జరిపిన తాజా వైమానిక దాడులను హౌతీలు అంగీకరించినా, నష్టం ఏ మేరకు జరిగిందో వెల్లడించలేదు. హౌతీ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సారీ మాట్లాడుతూ ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థలు దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. కాగా ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఇంకా అనిశ్చితంగా ఉంది. అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడుల తర్వాత.. ఇరాన్ అణు చర్చలపై తన వైఖరి ఏమిటన్నది ఇంకా వెల్లడించలేదు. -
‘బ్రిక్స్’లో చేరిన ఇండోనేషియా.. ఎన్నిదేశాల భాగస్వామ్యం?
రియో డీ జనీరో: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా అనే ఐదు జాతీయ ఆర్థిక వ్యవస్థల భాగస్వామ్య కూటమి(బ్రిక్స్) ఇప్పుడు మరోదేశాన్ని తన భాగస్వామ్యంలో చేర్చుకుంది. తాజాగా ఇండోనేషియాను కొత్త సభ్యునిగా ‘బ్రిక్స్’ స్వాగతించింది. ఈ నేపధ్యంలో కాలానుగుణంగా బ్రిక్స్ ఎలా విస్తరించిందో ఇప్పుడు తెలుసుకుందాం.2010లో న్యూయార్క్లో జరిగిన ‘బ్రిక్స్’ విదేశాంగ మంత్రుల సమావేశంలో దక్షిణాఫ్రికాను తమ కూటమిలో చేర్చుకునేందుకు అంగీకరించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 2011లో సన్యాలో జరిగిన మూడవ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి దక్షిణాఫ్రికా హాజరైంది. తాజాగా జరిగిన బ్రిక్స్ దేశాధి నేతల సమావేశంలో ఇండోనేషియాను గ్రూప్లో సభ్యునిగా స్వాగతించడంతో, ఇప్పుడు బెలారస్, బొలీవియా, కజకిస్తాన్, నైజీరియా, మలేషియా, థాయిలాండ్, క్యూబా, వియత్నాం, ఉగాండా, ఉజ్బెకిస్తాన్ సహా 10 దేశాలు బ్రిక్స్లో భాగస్వామ్య దేశాలుగా అవతరించాయి.బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగిన 17వ బ్రిక్స్ సమ్మిట్ ఉమ్మడి ప్రకటనలో ‘బ్రిక్స్ సభ్యదేశంగా ఇండోనేషియా రిపబ్లిక్ను, బెలారస్ రిపబ్లిక్, బొలీవియా ప్లూరినేషనల్ స్టేట్, కజకిస్తాన్ రిపబ్లిక్, క్యూబా రిపబ్లిక్, ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ నైజీరియా, మలేషియా, థాయిలాండ్ , సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం, ఉగాండా రిపబ్లిక్, ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్లను బ్రిక్స్ భాగస్వామ్య దేశాలుగా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఆదివారం జరిగిన బ్రిక్స్ సమావేశంలో బ్రిక్స్ విస్తరణలో భాగంగా కొత్త భాగస్వాములను చేర్చుకోవడం అనేది కూటమి దేశాల సామర్థ్యాన్ని పెంపొందిస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. BRICS welcomes Indonesia as member, and 10 partner countries, including Belarus, MalaysiaRead @ANI Story | https://t.co/amBamKwFtb#BRICS #Indonesia #Belarus #BRICS2025 #Thailand pic.twitter.com/H9vPhodQlH— ANI Digital (@ani_digital) July 7, 20252006లో సెయింట్ పీటర్స్బర్గ్లో జరిగిన జీ8 సమ్మిట్లో రష్యా, భారత్, చైనా నేతల సమావేశం అనంతరం సమూహంగా బ్రిక్స్ ఏర్పాటయ్యింది. 2006లో న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో బ్రిక్స్కు అధికారిక గుర్తింపు వచ్చింది. మొదటి బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం 2009లో రష్యాలో జరిగింది. 2010లో న్యూయార్క్లో జరిగిన బ్రిక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో దక్షిణాఫ్రికాను చేర్చడంతో అది బ్రిక్స్గా మారింది.ఇది కూడా చదవండి: ‘నిధుల్లేవ్.. నేనేమి మంత్రినీ కాను’.. వరద సాయంపై ఎంపీ కంగనా -
బ్రిక్స్కు మద్దతిచ్చే దేశాలపై 10% అదనపు సుంకాలు: ట్రంప్
వాషింగ్టన్/బీజింగ్: బ్రిక్స్ కూటమివి అమెరికా వ్యతిరేక విధానాలని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఆ కూటమికి మద్దతిచ్చే ఏ దేశమైనా తమనుంచి 10 శాతం అదనపు సుంకాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని సోమవారం హెచ్చరించారు. ‘‘బ్రిక్స్ అమెరికా వ్యతిరేక విధానాలతో జతకట్టే ఏ దేశం మీదైనా అదనంగా 10% సుంకం విధిస్తాం. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులూ ఉండవు’’ అని ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. కొత్త టారిఫ్ నియమాలు, సవరించిన వాణిజ్య ఒప్పంద నిబంధనలను వివరిస్తూ ఆయా దేశాలకు తక్షణం అధికారిక లేఖలు పంపుతున్నట్టు ప్రత్యేక పోస్టులో తెలిపారు. ట్రంప్ ప్రకటనను చైనా తీవ్రంగా ఖండించింది. ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఇలా సుంకాలను ఆయుధంగా వాడటం దారుణమని మండిపడింది. ఇది ఎవరికీ లాభం చేయబోదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ అన్నారు. ‘‘అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారానికి బ్రిక్స్ ఒక వేదిక. అది ఏ దేశానికీ వ్యతిరేకంగానో, లక్ష్యంగానో లేదు’’ అని స్పష్టం చేశారు.ఖండించిన రియో డిక్లరేషన్బ్రెజిల్లోని రియోడి జనీరోలో జరిగిన బ్రిక్స్ తాజా శిఖరాగ్ర సమావేశం అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారింది. ట్రంప్ సుంకాల విధానాలను బ్రిక్స్ దేశాధినేతలు తీవ్రంగా విమర్శించారు. ‘రియో డి జనీరో డిక్లరేషన్’లో ఈ మేరకు స్పష్టంగా పేర్కొన్నారు. ‘‘సుంకాలను విచక్షణారహితంగా పెంచడం ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బతీసి మరింత తగ్గించే ప్రమాదముంది. ప్రపంచ సరఫరా గొలుసులను దెబ్బతీస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాల్లో అనిశ్చితికి కారణమవుతుంది’’ అని పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నియమాల ఆధారిత, బహిరంగ, పారదర్శక, న్యాయమైన, సమానమైన బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థకు తమ మద్దతును పునరుద్ఘాటించారు. అనంతరం దీనిపై ట్రంప్ మరోసారి తీవ్రంగా ప్రతిస్పందించారు. అమెరికా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న దేశాలపై 10% అదనపు సుంకాలు తప్పవని పునరుద్ఘాటించారు. భారత్తో సహా అనేక దేశాల దిగుమతులపై అదనపు సుంకాలను ప్రకటించిన ట్రంప్ తర్వాత వాటి అమలును 90 రోజుల పాటు నిలిపేయడం తెలిసిందే. ఆ గడువు జూలై 9తో ముగుస్తుంది. తదనంతరం అమెరికా మార్కెట్లోకి ప్రవేశించే భారత వస్తువులపై అదనంగా 26 శాతం దిగుమతి సుంకం పడుతుంది. ప్రస్తుత సుంకాల బెదిరింపులతో ఆ భారాన్ని మరింత పెంచనుంది. -
మస్క్ను చూస్తే జాలేస్తోంది.. అమెరికా అధ్యక్షుడి సంచలన ఆరోపణలు
అమెరికాలో రాజకీయంగా మరో సంచలనం రేగింది. ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ రాజకీయ పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా పార్టీ ఏర్పాటుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. మస్క్ పార్టీని అసంబద్ధమైనదిగా ఆయన అభివర్ణిస్తూ.. తీవ్ర ఆరోపణలే చేశారాయన. అమెరికాలో రిపబ్లికన్ పార్టీ ఘన విజయం సాధించింది. పరిపాలన సజావుగా సాగిపోతోంది. మరోవైపు డెమొక్రట్లు తమ ప్రాబల్యం కోల్పోతున్నారు. అయినప్పటికీ అమెరికా రాజకీయ వ్యవస్థ ఈ రెండు పార్టీలకు అనుకూలంగా ఉంది. ఈ తరుణంలో మూడో పార్టీ ఏర్పాటు అనేది అసంబద్దమైన చర్య. మూడో పార్టీ అమెరికా చరిత్రలో ఎప్పుడూ విజయవంతం కాలేదు అని ట్రంప్ అన్నారు. మూడో పార్టీని ఎవరు ఏర్పాటు చేసుకున్నా(మస్క్ను ఉద్దేశిస్తూ..) తమకేం ఫరక్ పడదని, అయితే ఆ పార్టీ వల్ల అమెరికా రాజకీయాల్లో గందరగోళం నెలకొంటుంది. దేశంలో అస్తవ్యస్తత నెలకొని కలహాలు చెలరేగే అవకాశమూ ఉంది అని ట్రంప్ హెచ్చరించారు. మస్క్ గతంలో తనకు మద్దతు ఇచ్చినా.. ఇప్పుడు పూర్తిగా మారిపోయారని ట్రంప్ అంటున్నారు. ‘‘మస్క్ను చూస్తే జాలేస్తోంది. గత ఐదువారాలుగా ఆయన అదుపు లేకుండా వ్యవహరిస్తున్నారు అని ట్రూత్ సోషల్లో ట్రంప్ ఓ పోస్ట్ చేశారు. నేను ప్రవేశపెట్టిన బిల్లులో Electric Vehicle (EV) Mandate రద్దు చేయడం ముఖ్యాంశంగా ఉంది. దీని వల్ల ప్రజలు ఇకపై గ్యాస్, హైబ్రిడ్ లేదా కొత్త టెక్నాలజీ వాహనాలను స్వేచ్ఛగా కొనుగోలు చేయవచ్చు. అయితే మస్క్ గతంలో ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చి.. ఇప్పుడు వ్యతిరేకంగా వ్యవహరించడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అంతేకాదు.. మస్క్ తన సన్నిహితులను NASA చీఫ్గా నియమించాలనుకున్నారు. కానీ ఆ వ్యక్తి రిపబ్లికన్ పార్టీకి మద్దతు లేని డెమొక్రాట్ కావడం వల్లే అలా నియమించడం అనుచితమని భావించా. అమెరికా ప్రజలను రక్షించడమే నా ముందుకు ప్రధాన కర్తవ్యం’’ అంటూ ట్రంప్ పోస్టులో ప్రస్తావించారు.ఇదిలా ఉంటే.. బిగ్ బ్యూటీఫుల్ బిల్లును వ్యతిరేకిస్తూ ట్రంప్ పాలనా విభాగం డోజ్ నుంచి బయటకు వచ్చేసిన ఎలాన్ మస్క్ విమర్శలను తీవ్రతరం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో బిల్లు ఆమోదం గనుక పొందితే మూడో పార్టీ పెడతానంటూ చెబుతూ వచ్చారు. తాజాగా అదీ జరగడంతో శనివారం రాత్రి తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్(పూర్వపు ట్విటర్)లో ‘అమెరికా పార్టీ’ని ప్రకటించారు. అమెరికాలో రెండు ప్రధాన పార్టీలు.. ఒకే పార్టీ వ్యవస్థగా మారిందని, ప్రజలకు తిరిగి స్వేచ్ఛ ఇవ్వడమే తన లక్ష్యమని చెబుతూ అమెరికా పార్టీ పేరును ప్రకటించారు. అలాగే.. ప్రజలలో 65% మంది మూడవ పార్టీకి మద్దతు ఇస్తున్నారని ఓ పోల్ను చూపించారు. ఈ క్రమంలో ట్రంప్ ప్రవేశపెట్టిన భారీ ఖర్చుల బిల్లును(బిగ్ బ్యూటీఫుల్ బిల్)ను మరోసారి తీవ్రంగా విమర్శించారు. -
భారత్-పాక్లను ఒకేలా తూచలేం: ‘బ్రిక్స్’లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి మద్దతు ఇస్తూ, దానిని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్పై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని ఖండించడంలో భారతదేశానికి మద్దతుగా నిలిచిన దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. పాక్ ఉగ్రవాద మద్దతుదారని, భారత్ ఉగ్రవాద బాధిత దేశమని.. ఈ రెండింటినీ ఒకే త్రాసులో తూకం వేయలేమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.ఉగ్రవాదులకు నిశ్శబ్దంగా అనుమతి ఇవ్వడం కూడా ఆమోదయోగ్యం కాదని ప్రధాని పేర్కొన్నారు. పాకిస్తాన్ తన గడ్డపై ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ద్వారా ఉగ్రవాదాన్ని ఎలా విస్తరిస్తున్నదో స్పష్టమైన ఆధారాలతో భారత్ పదేళ్లుగా చూపిస్తున్నదన్నారు. కాగా ‘రియో డి జనీరో డిక్లరేషన్’లో బ్రిక్స్ గ్రూపు నేతలు ఉగ్రవాద చర్యలను నేరపూరితమైనంటూ తీవ్రంగా ఖండించారు. జమ్ముకశ్మీర్లో 2025, ఏప్రిల్ 22న జరిగిన ఉగ్ర దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో తమ నిబద్ధతను మేము పునరుద్ఘాటిస్తున్నామని పేర్కొన్నారు.ఉగ్రవాదంపై జరుగుతున్న పోరాటానికి సహకారం మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నామని, అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేసి ఆమోదించాలని పిలుపునిస్తున్నామని బ్రిక్స్ నేతలు పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ఉగ్రవాద సంస్థలపై సమిష్టి చర్యలు తీసుకోవాలని అన్ని దేశాలకు పిలుపునిస్తున్నామని రియో డి జనీరో డిక్లరేషన్ పేర్కొంది. కాగా పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించి, పాకిస్తాన్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను, వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. -
ఘనంగా దలైలామా జన్మదిన వేడుకలు
ధర్మశాల/వాషింగ్టన్: టిబెటన్ల అత్యున్నత ఆధ్యాత్మిక గురువు, బౌద్ధమతాన్ని విస్తృతంగా ప్రచారంచేస్తున్న 14వ దలైలామా టెంజిన్ గ్యాట్సో 90వ పుట్టినరోజు వేడుకలు హిమాచల్ప్రదేశ్లో ఆదివారం ఘనంగా జరిగాయి. ప్రపంచదేశాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భౌద్ధ భిక్షువులు, బౌద్ధులు, పలువురు ప్రముఖుల సమక్షంలో ట్సుగ్లాంగ్ఖాంగ్ దలైలామా ఆలయం ప్రాంగణంలో జన్మదిన వేడుకలు జరిగాయి. కంగ్రా జిల్లాలోని మెక్లియోడ్గంజ్ పట్టణంలో జరిగిన ఈ వేడుకలకు పెద్దసంఖ్యలో విద్యార్థులు, నృత్యకారులు, నేపథ్యగాయకులు హాజరయ్యారు. ప్రపంచ శాంతి, మత సామరస్యం కోసం అలుపెరగకుండా పోరాడుతున్న దలైలామాకు తమ మద్దతు ఇకమీదటా కొనసాగుతుందని వేడుకల వేదికపై ఆసీనులైన పలు దేశాల రాజకీయ ప్రముఖులు ప్రకటించారు. ఒక్కో దశాబ్ద జీవితానికి ఒక అంతస్తు గుర్తుగా సిద్ధంచేసిన 9 అంతస్తుల కేక్ను కట్చేశాక వేలాది మంది బౌద్ధుల సమక్షంలో దలైలామా ప్రసంగించారు. ‘‘ జనులందరికీ సేవచేయాలన్న నా సంకల్పానికి మీ ప్రేమే స్ఫూర్తిగా నిలుస్తోంది. శాంతిదేవుడైన ‘బోధిసత్వాచార్యావతార’ చూపిన మార్గంలోనే నిరంతరం నడుస్తున్నా. ఇంద్రియజ్ఞానమున్న జనులంతా నా సోదరసోదరీమణులు, స్నేహితులే. నా శక్తిమేరకు మీకు సేవ చేస్తా. నా పుట్టినరోజు అని తెల్సుకుని అమితానందంతో ఇంతదూరమొచ్చి వేడుకల్లో భాగస్వాములైన మీకందరికీ మనస్ఫూర్తిగా ధాంక్యూ’’ అని దలైలామా వ్యాఖ్యానించారు. ‘‘ఎక్కువ మంది జనముంటే మరింత ఎక్కువగా హృదయానందం పొంగిపొర్లుతుంది. ఆ ఆనందం నాకెంతో స్ఫూర్తినిస్తుంది. బోధిచిత్తాన్నే నేను ఆచరిస్తా. ప్రజల్ని నా వైపునకు తిప్పుకోవాలనే స్వార్థ లక్ష్యాలు పెట్టుకోవడం కంటే ప్రజలకు సేవ చేయడంపైనే నా దృష్టంతా ఉంటుంది’’ అని దలైలామా అన్నారు. కేంద్ర మంత్రులు కిరెణ్ రిజిజు, రాజీవ్ రంజన్ సింగ్, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ, సిక్కిం మంత్రి సోనమ్ లామా, హాలీవుడ్ సీనియర్ నటుడు రిచర్డ్ గెరె తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు. ‘‘ప్రాచీన జ్ఞానసంపదకు, ఆధునిక ప్రపంచానికి సజీవ వారధి దలైలామా. ఆర్యభూమిలో దలైలామా దశాబ్దాలుగా ఉండిపోవడం మనకెంతో సంతోషకరం’’ అని రిజిజు పొగిడారు. శుభాకాంక్షలు తెలిపిన మోదీ దలైలామాకు ప్రధాని మోదీ బర్త్డే విషెస్ చెప్పారు. ఈ మేరకు ‘ఎక్స్’లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘90వ పుట్టినరోజు జరుపుకుంటున్న దలైలామాకు 140 కోట్ల మంది భారతీయులతోపాటు నేను సైతం శుభాకాంక్షలు చెబుతున్నా. ప్రేమ, తపన, సహనం, నైతిక విలువలకు నిలువెత్తు నిదర్శనం దలైలామా. ఆయన ఇచ్చి సందేశం దేశాలకతీతంగా జనులందరికీ శిరోధార్యం. ఆయన ఇలాగే దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నా’’ అని మోదీ అన్నారు. అమెరికా తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో సైతం సందేశం పంపించారు. ‘‘ టిబెటన్ల మానవ హక్కుల పరిరక్షణతోపాటు ప్రాథమిక స్వేచ్ఛకు అమెరికా నిత్యం మద్దతిస్తోంది. ఇతరుల(చైనా) జోక్యంలేకుండా టిబెటన్ల భాష, సంస్కృతి, మత వారసత్వ పరిరక్షణకు అమెరికా పాటుపడుతుంది’’ అని ఆయన అన్నారు. అమెరికా మాజీ అధ్యక్షులు జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా సైతం తమ శుభాకాంక్షల వీడియో సందేశాలు పంపించారు. -
చైనాలో అధికార వికేంద్రీకరణ!
బీజింగ్: చైనాలో అధ్యక్షుడు షీ జిన్పింగ్ శకం ముగిసిందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. 12 ఏళ్లుగా ఇనుప పిడికిలితో దేశాన్ని పాలిస్తున్న ఉన్న ఆయన నెమ్మదిగా అధికారాన్ని పార్టీలోని కీలక విభాగాలకు అప్పగించడం ప్రారంభించారు. దాంతో చైనాలో అధికార మార్పిడి రంగం సిద్ధమైనట్టు కన్పిస్తోంది. 24 మందితో కూడిన అధికార చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీపీసీ)పొలిటికల్ బ్యూరో జూన్ 30న సమావేశమైంది. పార్టీలోని వివిధ సంస్థల పనులపై నిబంధనలను సమీక్షించింది. ఆయా సంస్థలు ప్రభావవంతమైన నాయకత్వాన్ని, సమన్వయాన్ని ప్రదర్శించాలని, ప్రధానమైన పనుల ప్రణాళికతోపాటు చర్చించడం, పర్యవేక్షించడంపై దృష్టి పెట్టాలని సూచించింది. ఈ విషయాలన్నీ ప్రభుత్వ అధీనంలోని వార్తా సంస్థ జిన్హువా తెలపడంతో అధికార మార్పిడి గురించి ఊహాగానాలు చెలరేగాయి. పార్టీ సంస్థలపై నిబంధనలు జిన్పింగ్ పదవీ విరమణ దిశగా సన్నాహాలను సూచిస్తున్నాయని పార్టీలోని కీలక సభ్యుడు ఒకరు తెలిపారు. సీపీసీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత చైనాలో అత్యంత శక్తివంతమైన నేతగా గుర్తింపు పొందిన జిన్పింగ్ పెద్ద సమస్యలపై దృష్టి పెట్టడానికి కొన్ని అధికారాలను ఇలా ఇతరులకు అప్పగిస్తున్నారని కొందరంటున్నారు. ఆదివారం రియో డి జనీరోలో మొదలైన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి కూడా జిన్పింగ్ హాజరలేదు. ఈ సమావేశానికి ఆయన గైర్హాజరవ్వడం గత 12 ఏళ్లలో ఇదే మొదటిసారి. 2012లో సీపీసీ జనరల్ సెక్రటరీగా జిన్పింగ్ అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి పాలనపై వేగంగా పట్టుసాధించారు. చైనాలో అతిపెద్ద అవినీతి వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహిస్తూ, అధికార నిర్మాణాలను తన చేతిలోకి తెచ్చుకున్నారు. పది లక్షల మందికి పైగా అధికారులను శిక్షించారు. డజన్ల కొద్దీ అగ్ర జనరల్లను తొలగించారు. పార్టీ ‘ముఖ్య నాయకుడు’గా తనను తాను ప్రకటించుకున్నారు. మావో తరువాత ఈ హోదాను దక్కించుకున్నది జిన్పింగ్ మాత్రమే. ఆ తర్వాత నియమాలను సవరించి మరీ చైనా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 2022లో పార్టీ జనరల్ సెక్రటరీగా, 2023లో అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి కొనసాగారు. దాంతో బహుశా ఆయన జీవితాంతం అధ్యక్షుడిగా కొనసాగుతారని అంతా భావించారు. -
భారతీయులకు యూఏఈ గోల్డెన్ వీసా
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం కొత్త రకం గోల్డెన్ వీసా పథకాన్ని ప్రారంభించింది. కొన్ని షరతులతో నామినేషన్ విధానంలో ఈ వీసాను జారీ చేయనుంది. లక్ష అరబ్ ఎమిరేట్స్ దినార్లు (సుమారు రూ.23.3 లక్షలు) ఫీజు చెల్లిస్తే జీవితకాలం వర్తించే వీసా అందజేస్తుంది. ఇప్పటిదాకా దుబాయ్లో గోల్డెన్ వీసా పొందాలనుకునే భారతీయులు రూ.4.66 కోట్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేసి ఉండాలి. లేదా వ్యాపారంలో భారీగా పెట్టుబడి పెట్టి ఉండాలి. ఇవేమీ అవసరం లేకుండానే కేవలం ఫీజుతోనే వీసాను అందజేసేందుకు ఉద్దేశించిన ఈ విధానంలో వచ్చే మూడు నెలల్లో కనీసం 5 వేల మంది భారతీయులు దరఖాస్తు చేసుకునే అవకాశముందన్నది దుబాయ్ ప్రభుత్వ వర్గాల అంచనా. పథకం పైలట్ ప్రాజెక్టు కోసం భారత్తోపాటు బంగ్లాదేశ్ను ఎంపిక చేసింది. గోల్డెన్ వీసా కావాలనుకునే వారు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న రయాద్ గ్రూప్ కార్యాలయాలను సంప్రదించాల్సి ఉంటుంది. లేదా ఆన్లైన్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆ కంపెనీ ఎండీ రయాద్ కమాల్ అయూబ్ చెప్పారు. దరఖాస్తుదారుల పూర్తి వివరాలు, మనీ లాండరింగ్ కేసులు, నేర చరిత్రతోపాటు సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తామన్నారు. అన్నీ ఓకే అయితేనే ఆ దరఖాస్తును ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. వీసా జారీపై తుది నిర్ణయం ప్రభుత్వమే తీసుకుంటుందని వివరించారు. ఫీడ్ బ్యాక్ ఆధారంగా మున్ముందు ఈ పథకాన్ని చైనా వంటి ఇతర సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సెపా) కుదిరిన దేశాలకు దుబాయ్ ప్రభుత్వం వర్తింపజేయనుంది. -
ఆటోరిక్షా హ్యాండ్బ్యాగ్ ధర కేవలం 35 లక్షలే
పారిస్: ఫ్యాషన్ పుట్టిల్లుగా పేరొందిన ఫ్రాన్స్లోని పారిస్లో కొత్త డిజైన్ విలాసవంత వస్తువొకటి మార్కెట్లోకి రంగ ప్రవేశం చేసింది. కొత్త ఫ్యాషన్కు అనుగుణంగా మెటీరియల్ కొని, కొలతలు ఇచ్చి, ధరించేలోపే ఆ ఫ్యాషన్ పాతబడిపోతుందని పారిస్ గురించి చెబుతుంటారు. అలాంటి నగరంలో సరికొత్త హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఇప్పుడు సందడి చేస్తోంది. భారత్లో ఇరుకు సందుల్లో సర్రున దూసుకుపోయే సామాన్యుడి రథంగా పేరొందిన ఆటోరిక్షా ఆకృతిలో కొత్త బ్యాగ్ను సిద్ధంచేశారు. ప్రఖ్యాత ఫ్రాన్స్ లగ్జరీ బ్రాండ్ లూయిస్ విటన్ సంస్థ నిపుణులు ఈ బ్యాగ్ను రూపొందించారు. మూడు చక్రాలతో, రెండు చేతి హ్యాండిళ్లతో ఎంతో అందంగా బ్యాగ్కు తుదిరూపునిచ్చారు. ఒంటె రంగులో అత్యంత నాణ్యమైన తోలుతో దీనిని తయారుచేశారు. మెన్స్ స్ప్రింగ్/సమ్మర్ 2026 కలెక్షన్లో భాగంగా భారతీయత ఉట్టిపడేలా నవకల్పనకు ఇలా జీవంపోశారు. మెన్స్వేర్ విభాగ క్రియేటివ్ డైరెక్టర్ అయిన ఫారెల్ విలియమ్స్ సారథ్యంలోని బృందం ఈ ఆటోరిక్షా హ్యాండ్బ్యాగ్ను రూపొందించింది. దీని ధర కేవలం 35 లక్షల రూపాయలు అని ‘డైట్ పరాటా’ అనే నెటిజన్ ఒకరు వెల్లడించారు. వైకుంఠపాళి డిజైన్ ర్యాంప్వాక్ స్టేజీపై ఒక వ్యక్తి నడుచుకుంటూ వచ్చి ఈ బ్యాగ్ను ప్రదర్శిస్తున్న వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై కామెంట్ల పరంపర కొనసాగింది. ‘‘మధ్యతరగతి వాహనం ఇలా ఎట్టకేలకు పారిస్ ఫ్యాషన్ షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది’’, ‘‘ పశ్చిమ దేశాలకు ఒక్కసారిగా ఆసియా ఖండం, భారత్పై మక్కువ పెరిగినట్లుంది. ప్రాడా వారి కొల్హాపురీ పాదరక్షలు, బాస్మతీ రైస్ బ్యాగులతో దుస్తులు.. ఇలా ఇంకెన్నో వస్తువులు ఇప్పుడు ఒక్కసారిగా అంతర్జాతీయ ఫ్యాషన్గా మారిపోయాయి’’ అని కామెంట్లు పెట్టారు. ‘‘ఫ్యాషన్ డిజైనర్ల మెదళ్లలో ఐడియాలు ఇంకిపోయాయి. అందుకే ఇలా భారత్పై పడ్డారు’’, ‘‘ ఆటో బాగుందిగానీ ఎక్కడి నుంచి లోపలికి ఎక్కాలి?’’, ‘‘ ఆ బ్యాగ్ కొనాలంటే ఎన్ని ఆటోలను అమ్మాలో?’’ అని మరికొందరు పోస్ట్లు పెట్టారు. ‘‘ గతంలో ఇదే లూయిస్ విటన్ విమానాలు, డాలి్ఫన్లు, పీతల ఆకృతుల్లో బ్యాగులు తెచ్చింది’’ అని మరొకరు గుర్తుచేశారు. -
ఇక నన్నెవరూ చూడలేరు!
పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తననెవరూ చూడటం లేదనుకుంటుందట. అలాంటి అమాయకత్వమే ఈ ఏనుగు పిల్లది. రాత్రిపూట ఓ చేలో చొరబడిన బుజ్జి ఏనుగు చెరుకు తింటూ ఉండిపోయింది. అంతలోనే ఎవరో వస్తున్నట్టు అలికిడి వినపడటంతో దాక్కోవాలనుకుంది. అదెదో పొదల్లోనో, చెట్టుమాటునో కాదు. దానికి సమీపంలో విద్యుత్ స్తంభం కనిపించింది. వెంటనే వెళ్లి దాని వెనుక దాక్కుంది. అంతేకాదు.. ఇక తానెవరికీ కనబడనని అనుకుంది. దాక్కునేందుకు జంబో కిడ్ చేసిన విఫల ప్రయత్నం వాహనంలో ఉన్నవారికి నవ్వు తెప్పించింది. వెంటనే క్లిక్ మనిపించి.. ఆ చిత్రాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. జరిగిన విషయాన్నంతా జోడించారు. ఆ పిల్ల ఏనుగు అమాయక చర్య ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఫొటో చూసినవారు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు. ఈ ఘటన థాయ్లాండ్లో జరిగింది. థాయ్లాండ్లో కనిపించిన ఈ ఏనుగు భారతీయ సంతతికి చెందింది. ఆసియా ఏనుగుల ఉపజాతి. వాటికున్న చిన్న చెవులే.. ఆఫ్రికన్ ఏనుగుల నుంచి వీటిని వేరుగా చూపిస్తాయి. ప్రస్తుతం థాయ్లాండ్లో 4,422 అడవి ఏనుగులు ఉన్నాయని అంచనా. వాటిలో సగం ఐదు అటవీ ప్రాంతాలలో నివసిస్తున్నాయి. ఇటీవల కాలంలో వాటి జనాభా పెరగడం, అటవీ ప్రాంతాలు తరుగుతుండటంతో ప్రమాదకరంగా మారింది. గత సంవత్సరం, ఏనుగులకు సంబంధించిన 4,700 ప్రమాద సంఘటనలు నమోదయ్యాయి. వాటి కారణంగా 19 మంది మరణించారు. 22 మంది గాయపడ్డారు. వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయని 594, ఆస్తి నష్టం కలిగించాయని 67 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ ఏనుగులను చంపడం కఠినమైన నేరం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘గ్లోబల్ సౌత్’కు దారుణ అన్యాయం
రియో డీ జనీరో: ప్రపంచ ఆర్థికవ్యవస్థ పురోగతికి ఎంతగానో తోడ్పాటు అందిస్తున్న దక్షిణార్ధ గోళ దేశాలు (గ్లోబల్ సౌత్) కీలక నిర్ణయాలు, ప్రయోజనాల విషయంలో బాధిత దేశాలుగా మిగిలిపోతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తంచేశారు. ఇందుకు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేదికైంది. సదస్సుకు అధ్యక్ష, ఆతిథ్య దేశంగా వ్యవహరిస్తున్న బ్రెజిల్లోని రియో డీ జనీరో నగరంలో ఆదివారం బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఆరంభమైంది. సదస్సులో భాగంగా ప్లీనరీ సెషన్లో తొలుత బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డసిల్వా మాట్లాడాక మోదీ మాట్లాడారు. అవన్నీ నెట్వర్క్లేని ఫోన్లే ‘‘ప్రపంచ ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదపడే గ్లోబల్ సౌత్ దేశాలు చివరకు ద్వంద్వ ప్రమాణాల కారణంగా బాధితదేశాలుగా మిగిలిపోతున్నాయి. అభివృద్ది, వనరుల పంపిణీ, భద్రత వంటి ఏ రంగంలో చూసినా గ్లోబల్ సౌత్ దేశాలకు దక్కేది శూన్యం. వాతావరణ మార్పుల కట్టడికి ఆర్థిక సాయం, సుస్థిరాభివృద్ధి, అధునాతన సాంకేతికత బదిలీ వంటి అంశాల్లో గ్లోబల్సౌత్ దేశాలు తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వంటి అంతర్జాతీయ వ్యవస్థలు, సంస్థలను తక్షణం సంస్కరణల బాట పట్టించి దక్షిణార్ధ గోళ దేశాలకు న్యాయం జరిగేలా చూడాలి. విశ్వ ఆర్థికానికి కీలక భాగస్వామిగా ఉండి కూడా ప్రధాన నిర్ణయాత్మక వేదికలపై గ్లోబల్సౌత్కు స్థానం దక్కడం లేదు. వాటి వాణి వినపడటం లేదు. ఇది ప్రాతినిధ్యం దక్కట్లేదనే మాట కంటే విశ్వసనీయంగా, ప్రభావవంతంగా పనిచేసి కూడా ఎలాంటి ప్రయోజనం, లబ్ధి పొందలేపోవడమే గ్లోబల్ సౌత్ దేశాలకు అశనిపాతమవుతోంది. 20వ శతాబ్దంలో ఆవిర్భవించిన ఎన్నో కీలక అంతర్జాతీయ వ్యవస్థల్లో మూడింట రెండొంతుల జనాభాకు అసలు ప్రాతినిధ్యమే దక్కడం లేదు. గ్లోబల్సౌత్ దేశాలు లేకుండా ఇలాంటి వ్యవస్థలన్నీ సిమ్కార్డు ఉన్నా నెట్వర్క్లేని మొబైల్ ఫోన్ లాంటివే’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై సమిష్టి పోరు ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలన్నీ సమిష్టిగా పోరాడాల్సిన అవసరం చాలా ఉందని మోదీ పిలుపునిచ్చారు. పహల్గాంలో అమాయక పర్యాటకులపై పాక్ ప్రేరేపిత జైషే ముష్కర మఠా జరిపిన పాశవిక దాడిని ఈ సందర్భంగా బ్రిక్స్ దేశాధినేతలకు ఆయన గుర్తు చేశారు. బ్రిక్స్ వేదికగా ఆ దాడిని మరోసారి ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నీ భారత్కు అండగా నిలిచాయని గుర్తు చేసుకు న్నారు. మరోసారి అలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా పాక్కు మర్చిపోలేని రీతిలో సైనికంగా గుణపాఠం చెప్పామన్నారు. ఉగ్ర మూలాలను పెకిలించివేయనిదే ప్రపంచ శాంతి అసాధ్యమన్నారు.టైప్రైటర్లతో నేటి సాఫ్ట్వేర్ నడవదు ‘‘సమకాలీన ప్రపంచం, కాలానికి తగ్గట్లుగా మేం మారతాం అని ప్రస్ఫుటంగా తెలియజెప్పేందుకే బ్రిక్స్ కూటమిలోకి కొత్త దేశాలను ఆహ్వానిస్తున్నాం. మా బాటలోనే ఐరాస భద్రతా మండలి, ప్రపంచ వాణిజ్య సంస్థ, బహుళజాతి అభివృద్ధి బ్యాంక్లు సంస్కరణలను తీసుకొచ్చి తమ చిత్తశుద్ధిని చాటాలి’’ అని మోదీ హితవు పలికారు. కృత్రిమమేధ యుగంలో సాంకేతికత వారం వారం అప్డేట్ అవుతోంది. అలాంటప్పుడు 80 ఏళ్ల క్రితం ఏర్పడిన ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థల్లో ఎప్పటికప్పుడు సంస్కరణల అప్డేట్లు జరగాల్సిందే. 20వ శతాబ్దినాటి టైప్రైటర్లతో 21వ శతాబ్దంలోని అధునాతన సాఫ్ట్వేర్ నడవదు. స్వీయ ప్రయోజనాలకంటే కూడా భారత్ మానవాళి ప్రయోజనాలకే పట్టకడుతుంది. బ్రిక్స్దేశాలతో కలిసి సమష్టిగా అన్ని రంగాల్లో నిర్మాణాత్మకమైన ప్రాతినిధ్యం వహించేందుకు మేం సదా సిద్ధంగా ఉన్నాం’’ అని మోదీ అన్నారు. -
ఉగ్రవాదుల్ని భారత్కు అప్పగిస్తావా?.. నువ్వెలా ప్రకటిస్తావ్?
కరాచీ: ఇరుదేశాల మధ్య నమ్మకాన్ని చూరగొనే ప్రక్రియలో భాగంగా ఉగ్రవాదులు హఫీజ్ సయ్యద్, మసూద్ అజహర్లను భారత్కు అప్పగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ మాజీ విదేశాంగమంత్రి, పీపీపీ నాయకుడు బిలావల్ భుట్టో వ్యాఖ్యలు ఇప్పుడు ఆ దేశంలో కలకలం రేపుతున్నాయి. గత శుక్రవారం ఖతార్కు చెందిన ఆల్ జజీర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిలావల్ ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయ ప్రక్రియలో భాగంగా ఒకవేళ భారత్ ఆ ఉగ్రవాదుల్ని అప్పగించాలని కోరితే తాము అందుకు సిద్ధంగా ఉన్నామన్నారు బిలావాల్.లష్కరే తోయిబా (ఎల్ఇటి) మరియు జైషే మొహమ్మద్ (జెఎం) చీఫ్ మసూద్ అజార్ను అప్పగించడంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ లో ఉగ్రవాదమే తీవ్ర అంశంగా మారిన సమయంలో భారత్తో నమ్మకాన్ని చూరగొనడానికి ఇదొక మార్గమన్నారు. ఈ విషయంలో పాకిస్తాన్ ఎటువంటి అభ్యంతరం చెప్పదని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావాల్ స్పష్టం చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలు భారత్లో నిర్వహించారని ఆరోపణలు నేపథ్యంలో వారిని అప్పగిస్తామని, అందుకు సంబంధించిన న్యాయప్రక్రియకు భారత్ సహకరించాలన్నారు. ఇందుకు భారత్ ప్రభుత్వం సహకరిస్తే, పాకిస్తాన్ నుంచి ఎటువంటి అభ్యంతరం ఉండదన్నారు. భారత్ ఆందోళన చెందుతున్న సంబంధిత వ్యక్తులు ఉగ్రవాద కార్యకలాపాలు చేశారని ప్రకటనగా మాత్రమే ఉందని, ఈ క్రమంలో భారత్ సహకరించి న్యాయపరంగా ముందుకు వెళతామంటే వారిని(సంబంధిత ఉగ్రవాదుల్ని) భారత్కు అప్పగిస్తామన్నారు.నున్వెలా ప్రకటిస్తావ్!బిలావల్ భుట్టో ప్రకటనపై ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ కుమారుడు తల్హా సయీద్ తీవ్రంగా మండిపడ్డారు. బిలావాల్ ఆ ప్రకటన ఎలా ఇస్తారంటూ ధ్వజమెత్తారు ఇది అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు తీసినట్లేనని తల్హా విమర్శించారు. ఈ విషయంలో బిలావాలో అప్పగింత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. -
ఫ్రాన్స్ సంచలన ఆరోపణలు.. చైనా, పాక్లు కలిసి..!
తమ యుద్ధ విమానాల అమ్మకాలపై చైనా దుష్ర్పచారాం చేస్తోందని ప్రాన్స్ సంచలన ఆరోపణలు చేసింది. తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారు చేస్తున్న రఫెల్ యుద్ధ విమానాల అమ్మకాలను చైనా దెబ్బతీస్తోందని ఫ్రాన్స్ ఆరోపించింది. పలు దేశాల్లో చైనా రాయబార కార్యాలయాల్లో పని నేసే దౌత్య, రక్షణ ప్రతినిధులు ఈ ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నారని ఫ్రాన్స్ మండిపడుతోంది. ఫేల్ విమానాలను కొనుగోలు చేయవద్దని, వాటి స్థానంలో చైనా తయారీ జెట్లను తీసుకుంటే మంచిదని వివిధ దేశాలను ఒప్పించే యత్నాలు జరగుఉతున్నాయని ఫ్రెంచ్ వర్గాల వెల్లడించాయి. తమ దేశం అధికంగా విమానాల అమ్మకాలనై అత్యధికంగా ఆధారపడిన దేశమని, దాన్ని చైనా దెబ్బ కొట్టడానికి తీవ్ర యత్నాలు చేస్తున్నట్లు ప్రాన్స్ చెబుతోంది. చైనా తన అధికారిక బలంతో ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు ఫ్రాన్స్ అంటోంది. పాకిస్తాన్, చైనా కలిసి ఈ తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని ఫ్రాన్స్ విమర్శించింది. ఈ దుష్ప్రచారంలో భాగంగా, గత మే నెలలో భారత్తో జరిగిన ఘర్షణలో మూడు రఫేల్ విమానాలతో సహా ఐదు భారత విమానాలను కూల్చివేశామని పాకిస్తాన్ చేసిన వాదనలను చైనా వాడుకుంటోందని ఫ్రాన్స్ అధికారులు తెలిపారు. ఆన్లైన్లో కూడా ఈ ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారని తెలిపింది. ఏఐతో మార్ఫింగ్ చేసిన యుద్ధ విమానాల శిథిలాలను చూపిస్తూ చైనా టెక్నాలజీ అమోఘమనే భావనను వారు కల్గిస్తున్నారని తెలిపింది. రఫెల్ అనేది యుద్ధ విమానం మాత్రమే కాదని, అది ఫ్రాన్స్ వ్యూహాత్మక సామర్థ్యానికి, నమ్మకానికి ప్రతీక ఫ్రాన్స్ పేర్కొంది. ఇప్పుడే దాన్నే చైనా తన అధికారిక బలాన్న ఉపయోగించి దుష్ప్రచారానికి దిగినట్లు ఫ్రాన్స్ ధ్వజమెత్తింది.రఫెల్ యుద్ధ విమానాలకు తయారు చేసే డసెల్ట్ ఏవియేషన్ 533 జెట్స్ను వివిద దేశాలకు అమ్మింది. ఈజిప్ట్, భారత్, ఖతర్, గ్రీస్, క్రొయేషియా, యూఏఈ, సెర్బియా, ఇండోనేషియా తదితర దేశాలకు ఫ్రాన్స్ తమ యుద్ధ విమానాలను విక్రయించింద. ఇప్పటివరకూ ఇండోనేషియా 42 యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేయగా, మరిన్ని రఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడాన్ని పరిశీలిస్తోంది. -
‘రెండు తలల పాము’తో మస్క్ ఎలక్షన్ ‘వెర్రి’!
వాషింగ్టన్: అమెరికా (usa) రాజకీయాల్లో కీలక మలుపు అంటూ,. ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ (elon musk) రాజకీయ రంగంలోకి వస్తున్నానంటూ ఆయన స్వయంగా షేర్ చేసిన కొత్త పార్టీ ప్రకటన.. తాజాగా పెద్ద చర్చకు దారి తీసింది. ‘ది అమెరికా పార్టీ’ (the america party) అనే పేరుతో మూడో రాజకీయ శక్తిని ప్రకటించిన మస్క్, ఆ పార్టీకి రెండు తలల పాము మీమ్ను షేర్ చేశారు. కానీ మస్క్ నిజంగానే కొత్త పార్టీని పెట్టారా.. ?లేక జనాల్ని వెర్రివాళ్లను చేయడానికే ఇలా చేశారా అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఎందుకంటే.. అమెరికన్ చట్టాల ప్రకారం..ఆయన అధ్యక్షుడిగా ఎన్నికల బరిలోకి దిగేందుకు అనర్హులు. దీంతో మస్క్ కొత్త పార్టీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మస్క్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదంటే.. కొత్త పార్టీ లేదు. ఏమీ లేదు. తూచ్ అని పక్కకు తప్పుకుంటారా? అని చూడాల్సి ఉండగా.. మస్క్ సౌతాఫ్రికన్ పౌరుడుమస్క్ 2028లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా, అమెరికన్ రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆయన అనర్హులు. ప్రస్తుత అమెరికా రాజ్యాంగాల ప్రకారం.. ఆర్టికల్ 2, సెక్షన్ 1 ప్రకారం.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సదరు అభ్యర్థి అమెరికా పౌరుడై ఉండాలి. తద్వారా మస్క్కు అర్హత లేదు. కారణం ఆయన జన్మస్థలం దక్షిణాఫ్రికా కావడం. మస్క్ పార్టీపై సవాలక్ష ప్రశ్నలుఈ నేపథ్యంలో, మస్క్ పార్టీ విస్తరణకు ముందు వ్యతిరేక వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఆయన మాత్రం అధ్యక్ష పదవిపై నిర్ణయం వచ్చే ఏడాది చెబుతానంటూ ట్వీట్ చేశారు. ఇంతకీ.. మస్క్ టార్గెట్ ఏంటి? అమెరికాను పాలించాలని చూస్తున్నారా? పార్టీగా ప్రభావం చూపాలని అనుకుంటున్నారా? అనేది సదరు అమెరికన్ పౌరుల్లో పుట్టుకొస్తున్న సవాలక్ష ప్రశ్నలు.. ఈ ప్రశ్నలన్నింటికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. మస్క్కే మద్దతు ఈ క్రమంలో మస్క్ కొత్త పార్టీ ఏర్పాటు? అందుకు గల కారణాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అమెరికాలో ప్రస్తుతం అధికార, ప్రతిపక్ష రిపబ్లికన్, డెమోక్రాట్ పార్టీలు ప్రజల స్వేచ్ఛను హరించుతున్నాయని మస్క్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రతిపాదించిన కీలక ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే, మస్క్ అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం జులై 4న తన కొత్త పార్టీని ప్రకటించారు. ముందుగా కొత్త పార్టీ స్థాపన విషయంలో నెటిజన్ల అభిప్రాయాల్ని సేకరించారు. కొత్త పార్టీకి మద్దతుగా 1.2మిలియన్ల మంది నెటిజన్లు స్పందించారు. దాదాపు 80 శాతం మంది మస్క్కు మద్దతు తెలిపారు. ఈ ఫలితాల ఆధారంగా, ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఆయన కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.త్వరలోనే పార్టీ లోగో ప్రకటనపార్టీ పేరు ది అమెరికా పార్టీగా నామకరణం చేసినా.. పార్టీ గుర్తును రెండు తలల పాము మీమ్ను షేర్ చేస్తూ తన పార్టీ ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా నిలబడుతుందనే సంకేతాలిచ్చారు. ఇది అధికారిక పార్టీ లోగోగా ప్రకటించలేదు కానీ.. ప్రారంభ దశలో పార్టీ భావజాలానికి ప్రతీకగా ఈ చిహ్నాన్ని ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తులో పార్టీకి ప్రత్యేక లోగో, జెండా, రంగులు ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఎన్నికల్లో మస్క్ పోటీఇక వచ్చే ఏడాది అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో 2–3 సెనేట్ స్థానాలు, 8–10 ప్రతినిధుల సభ స్థానాల్లో ఎలాన్ మస్క్ పోటీ చేయనున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం, ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం. తన పార్టీ ద్వారా ప్రజల గొంతుకను వినిపించడమే తన పార్టీ ఉద్దేశమనే నినాధాలతో ప్రజల్లోకి వెళ్లనుంది. ఎన్నికల్లో మస్క్ లేజర్ ఫోకస్ వ్యూహం అమెరికాలో ప్రతినిధుల సభ (House of Representatives) సభ్యుల పదవీకాలం కేవలం 2 సంవత్సరాలు. పదవీ కాలం పూర్తయిన వెంటనే ప్రతినిధుల సభ (House of Representatives) లోని 435 స్థానాలకు, సెనేట్ (Senate) లోని 34 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తన పార్టీ సైతం ఈ ఎన్నికల బరిలో దిగేలా ఎలాన్ మస్క్ లేజర్ ఫోకస్ వ్యూహాన్ని అమలు చేయనున్నారు. ఈ స్ట్రాటజీ ప్రకారం దేశంలోని అన్నీ స్థానాల్లో పోటీ చేయకుండా.. కేవలం గెలిచే స్థానాల్లో పోటీకి దిగడం, గెలుపు సమీకరణాల్ని మార్చే ప్రయత్నం చేయడం వంటి అంశాలు దీని కిందకే వస్తాయి.మస్క్ ముందున్న సవాళ్లుకాగా,మస్క్ సంపద, ప్రభావం ఉన్నప్పటికీ, మూడో పార్టీగా ఎదగడం సవాలుతో కూడుకున్నదే. గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తరుఫున మస్క్ ప్రచారం చేశారు. ఆ సమయంలో నేను అమెరికా అధ్యక్షుడిని కాలేను. ఎందుకంటే? నేను సౌతాఫ్రికాలో జన్మించాను. మా తాత అమెరిన్. నేను ఆఫ్రికన్. కాబట్టి నేను అమెరికాకు అధ్యక్షుడిని కాలేను. రాకెట్లను, కార్లను నిర్మించడమే తన లక్ష్యమని చెప్పుకున్న మస్క్ ఇప్పుడు అకస్మాత్తుగా పార్టీ ప్రకటించడం.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని పరోక్ష సంకేతాలివ్వడంపై అమెరికన్లు పెదవి విరుస్తున్నారు. మస్క్కు ఎలక్షన్ ఎర్రి ఉందంటూ మండిపడుతున్నారు. -
కేరళలో బ్రిటిష్ ఎఫ్ 35 జెట్ ఎపిసోడ్.. మరో కీలక మలుపు
తిరువనంతపురం: అత్యవసర పరిస్థితులతో కేరళలో దిగిన యూకే యుద్ధ విమానం ఎఫ్ 35 ఎపిసోడ్ ఇంకా కొనసాగుతోంది. మరమ్మత్తుల విషయంలో యూకే నిపుణులు నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో మరో కీలక మలుపు తిరిగింది. బ్రిటన్కు చెందిన ఆధునాతన స్టెల్త్ యుద్ధ విమానం F-35Bను రిపేర్ చేసేందుకు 21 మంది ఏవియేషన్ ఇంజనీర్ల బృందం ఆదివారం మధ్యాహ్నం తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.నిపుణుల బృందం.. ఆర్ఏఎఫ్ జెడ్ఎం 417 , ఏయిర్బస్ A400M అట్లాస్ విమానంలో దిగారు. ఇంజనీర్లు విమానాన్ని తనిఖీ చేసి, అవసరమైన మరమ్మతులు చేసి మళ్లీ గాలిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సాధ్యం కాకపోతే, దానిని విడిభాగాలుగా విడదీసి, C-17 గ్లోబ్మాస్టర్ విమానంలో యూకేకి ఎయిర్ లిఫ్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ జెట్ను ఎయిర్పోర్ట్లోని ఒక ప్రత్యేక హ్యాంగర్కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.బ్రిటన్కు చెందిన HMS Queen Elizabeth నౌకాదళ విమాన వాహక నౌక ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మిషన్లో పాల్గొంది. జూన్ 14వ తేదీన ఈ నౌక నుంచి ఎగిరిన ఎఫ్ 35 ఫైటర్ జెట్ మిలిటరీ కార్గో ఎయిర్క్రాఫ్ట్.. తిరువంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. తొలుత సాంకేతిక సమస్యగా భావించిన నిపుణులు.. త్వరగతినే ఇది రిపేర్ అవుతుందని భావించారు.అయితే.. ఇంధనం తక్కువగా ఉండడం, ప్రతికూల వాతావరణం కారణంగానే ఇది ల్యాండ్ అయ్యిందని తర్వాతే తేలింది. ఈలోపు.. ల్యాండింగ్ అనంతరం హైడ్రాలిక్ స్నాగ్ అనే లోపం తలెత్తడంతో అది గాల్లోకి లేవలేదు. అప్పటి నుంచి CISF సిబ్బంది విమానానికి నిరంతర భద్రత కల్పించారు. అలాగే భారత వైమానిక దళం (IAF) లాజిస్టికల్ సహాయం అందిస్తూ వచ్చింది. -
‘ఇతరుల జోక్యం లేకుండా’.. దలైలామాకు అమెరికా శుభాకాంక్షలు
వాషింగ్టన్: ఈరోజు (జూలై 6) టిబెటన్ల ఆధ్మాత్మిక గురువు దలైలామా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు ప్రపంచం నలుమూలల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి. అయితే అమెరికా దలైలామాకు ప్రత్యేక సందేశంతో శుభాకాంక్షలు తెలిపింది. ఒకవైపు టిబెటిన్లకు మద్దతు పలుకుతున్నట్లు, మరోవైపు చైనాను హెచ్చరిస్తున్నట్లు అమెరికా సందేశం ఉండటం విశేషం.90వ పుట్టినరోజు జరుపుకుంటున్న దలైలామాకు అమెరికా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. టిబెటన్లు తమ మత పెద్దలను స్వేచ్ఛగా, ‘ఇతరుల జోక్యం లేకుండా’ ఎన్నుకునే సామర్థ్యాన్ని కాపాడుకునేందుకు అమెరికా మద్దతు ఇస్తుందని పేర్కొంది. ప్రపంచానికి దలైలామా ఐక్యత, శాంతి, కరుణల సందేశాన్ని అందిస్తూ, ప్రజల్లో శాంతి నెలకొల్పుతున్నారని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పేర్కొన్నారు.చైనా పేరు ఎత్తకుండానే రూబియో.. టిబెటన్ల సాంస్కృతిక, మత స్వేచ్ఛకు అమెరికా మద్దతు ఇస్తుందనే సందేశాన్ని తెలియజేశారు. టిబెటన్ల హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛల పట్ల గౌరవాన్ని పెంపొందించేందుకు యునైటెడ్ స్టేట్స్ కట్టుబడి ఉందన్నారు. టిబెటన్ల ప్రత్యేక భాష, సాంస్కృతిక, మతపరమైన వారసత్వాన్ని కాపాడే ప్రయత్నాలకు తాము మద్దతు ఇస్తున్నామని, ఇతరుల జోక్యం లేకుండా వారు మత పెద్దలను స్వేచ్ఛగా ఎన్నుకునే సామర్థ్యాన్ని కాపాడుతామని అన్నారు. తదుపరి దలైలామాను ఎన్నుకునే హక్కు తమకే ఉందని చైనా చెబుతున్న ప్రస్తుత తరుణంలో అమెరికా వ్యాఖ్యలు కీలకంగా మారాయి. కాగా టిబెట్పై చైనా చారిత్రక అధికారాన్ని డిమాండ్ చేస్తోంది. సామ్రాజ్య యుగం నాటి సంప్రదాయాలను గుర్తుచేస్తూ, తదుపరి దలైలామాను ఆమోదించే హక్కు తమకే ఉందని బీజింగ్ తరచూ చెబుతోంది. టిబెట్లో అనుసరించే మతపరమైన ఆచారాలపై కఠినమైన నియంత్రణను కొనసాగిస్తోంది. -
ఎలాన్ మస్క్ పార్టీ ప్రకటన.. అమెరికాలో మూడో పార్టీ సక్సెస్ ఎలా ఉందంటే?
వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ‘ది అమెరికా పార్టీ’ స్థాపిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో, అమెరికాలో మరోసారి మూడో రాజకీయ పార్టీ అంశం తెరపైకి వచ్చింది. కాగా.. దీనిని రిపబ్లికన్, డెమొక్రటిక్ అనే రెండు పార్టీల వ్యవస్థకు సవాల్గా మస్క్ అభివర్ణించారు.అయితే, పార్టీ అధికారికంగా నమోదైనట్లు ఫెడరల్ ఎలక్టోరల్ కమిషన్ ఇంకా ధ్రువీకరించలేదు, దానికి సంబంధించి ఇంకా ఎలాంటి పత్రాలనూ కమిషన్ ప్రచురించలేదు. ఆ పార్టీ అధికారికంగా నమోదైందా? లేదా? అనేది అమెరికా ఎన్నికల అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఆ పార్టీని ఎవరు నడిపిస్తారు, ఎలా ఉండబోతోందనే విషయాలను మస్క్ కూడా వెల్లడించలేదు. ఒకవేళ మస్క్ పార్టీని ఎన్నికల గుర్తిస్తే మూడో పార్టీ అవతరించే అవకాశం ఉంది. మస్క్ పార్టీ ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపుతుంది అనేది ఆసక్తికరంగానే మారనుంది.రెండు పార్టీలదే హవా..ఇక, ఇప్పటి వరకు అమెరికా చరిత్రలో మెజార్టీ అధ్యక్షులు కేవలం రెండు పార్టీల నుంచే వచ్చారు. అవే రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందిన వ్యక్తి. గత అధ్యక్షుడు జో బైడెన్ డెమోక్రటిక్ పార్టీకి చెందినవారు. ఇదిలా ఉండగా.. అమెరికా ఇప్పటికే పలుమార్లు కొందరు వ్యక్తులు మూడో పార్టీని పెట్టి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. కేవలం ఒకే ఒకరు జార్జ్ వాషింగ్టన్ మాత్రమే స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి.. అమెరికాకు అధ్యక్షుడు అయ్యారు. ఆయన 1789-97 వరకు అధ్యక్షుడిగా పనిచేశారు. ఇదిలా ఉండగా.. అమెరికా రాజకీయ చరిత్రను పరిశీలిస్తే.. పలు పార్టీలను కొందరు నాయకులు ప్రారంభించినప్పటికీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. కేవలం ఒకటి, రెండు పార్టీలు మాత్రమే ఎన్నికల్లో ఓట్లను చీల్చగలిగాయి. అంతే తప్ప అధికారంలోకి మాత్రం రాలేకపోయాయి. మెజార్టీ నేతలు తమ మార్కును ఎన్నికల్లో చూపించలేకపోయారు. ఈ నేపథ్యంలో ఎలాన్ మాస్క్ కొత్త పార్టీ.. అమెరికాలో ఎంత మేరకు ప్రభావం చూపించనుంది అనేది ఆసక్తికరంగా మారింది. అమెరికన్లు మస్క్ను ఎలా ఆదరిస్తారనేది హాట్ టాపిక్గా మారింది.అమెరికాలో మూడో పార్టీ చరిత్ర ఇలా..Anti-Masonic Party (1828): ఇది అమెరికాలో మొట్టమొదటి మూడో పార్టీగా గుర్తించబడుతుంది. మాసన్రి సంస్కృతిని వ్యతిరేకిస్తూ ఏర్పడింది.Liberty Party (1840): దాస్యవ్యవస్థను వ్యతిరేకించడానికి ఏర్పడింది.Free Soil Party (1848): స్లేవరీ విస్తరణకు వ్యతిరేకంగా.Know-Nothing Party (1850): మైగ్రేషన్, కాథలిక్ వ్యతిరేక భావాలతో పనిచేసింది.Populist Party (People’s Party, 1890s): రైతుల హక్కులు, ఫెడరల్ బ్యాంక్ రిఫార్మ్స్, డైరెక్ట్ సెనేటర్ ఎలెక్షన్స్ వంటివి మద్దతుగా ఉంది.Progressive Party (1912): టెడి రూజవెల్ట్ నాయకత్వంలో ఏర్పడింది. సామాజిక న్యాయం, కార్మిక హక్కులు, వ్యాపార నియంత్రణపై దృష్టి సారించింది.Socialist Party (1901-1950): యుజీన్ డెబ్స్ వంటి నాయకులు ప్రముఖులుగా నిలిచారు.Libertarian Party (1971): వ్యక్తిగత స్వేచ్ఛ, ఉచిత మార్కెట్ సిద్ధాంతాలపై నమ్మకంతో ఏర్పడింది.Green Party (1990): పర్యావరణ పరిరక్షణ, సామాజిక న్యాయం, శాంతి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రారంభమైంది.Reform Party (1995): రాస్ పెరో స్థాపించాడు. ప్రభుత్వ ఖర్చులు తగ్గింపు, కరపన్ను సవరణలు వంటివి ప్రధాన అంశాలు.అయితే, అమెరికాలో పలు పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ కేవలం మూడు పార్టీలు మాత్రమే ఎన్నికల్లో కొంత ప్రభావం చూపించాయి.Theodore Roosevelt (Progressive Party 1912): మూడో పార్టీ అభ్యర్థిగా అత్యధిక ఓట్లు (27%) పొందిన అభ్యర్థి.Ross Perot (Independent/Reform Party 1992): సుమారు 19% ఓటు బ్యాంక్ సంపాదించాడు.George Wallace (American Independent 1968) : ఐదు రాష్ట్రాల్లో విజయం సాధించారు.Ralph Nader (Green Party 2000): ఎన్నికల్లో డెమోక్రాట్ల ఓటు చీల్చాడనే వాదన ఉంది.RFK Jr Cornel West (Independent 2024): ఇండిపెండెంట్గా పోటీ చేసి ప్రభావం చూపించకలేకపోయారు. ఇప్పటి వరకు మూడో రాజకీయ పార్టీ, అభ్యర్థి సాధించిన ఓట్ల శాతం.. -
ఇన్నాళ్లకు వేదికపై ఖమేనీ.. మారుమోగిన నినాదాలు
టెహ్రాన్: ఇజ్రాయెల్తో వివాదం.. ఇరాన్లోని అణుస్థావరాలపై అమెరికా భీకర దాడుల అనంతరం తాజాగా ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ ఒక బహిరంగ వేదికపై కనిపించారు. టెహ్రాన్లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారని సమాచారం. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణల నేపధ్యంలో ఇంతకాలం ఖమేనీ సురక్షితమైన ప్రదేశంలో దాక్కున్నారు.తాజాగా ఇరాన్లోని షియా ముస్లింలకు అత్యంత పవిత్రమైన మొహర్రం సంతాప దినాలలో ఖమేనీ కనిపించారు. షియా ముస్లిం క్యాలెండర్లోని అషురా(మొహరం)ను జరుపుకుంటున్న హాలులోకి ఆయతుల్లా ఖమేనీ ప్రవేశించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇరాన్ స్టేట్ టీవీ మీడియాకు విడుదల చేసింది. ప్రతి సంవత్సరం ఖమేనీ ఈ కార్యక్రమాలలో తప్పనిసరిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా ఖమేనీ సంప్రదాయ నల్లని వస్త్రాలు ధరించి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను చూసిన అక్కడి జనం పలు నినాదాలు చేశారు. 📹 لحظه ورود رهبر انقلاب به حسینیه امام خمینی(ره) در مراسم عزاداری شب عاشورای حسینی#عاشورا pic.twitter.com/09mfwm3qFM— خبرگزاری تسنیم 🇮🇷 (@Tasnimnews_Fa) July 5, 2025జూన్ 14న ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత సుప్రీం నేత ఖమేనీ బహిరంగంగా కనిపించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. వైమానిక దాడుల తొలి రోజుల్లో ఖమేనీ రికార్డ్ చేసిన సందేశాలు మీడియాకు విడుదల చేశారు. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణల సమయంలో భద్రతా సమస్యల కారణంగా ఖమేనీ బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అయితే మతపరమైన ఆచారాలను గుర్తుచేసేందుకు ఆయన ప్రసంగాలను ముందే రికార్డ్ చేసి ప్రసారం చేశారు. ఇది కూడా చదవండి: పుట్టినరోజు సందేశంలో.. దలైలామా నోటి వెంట ఘన భారతం -
టెక్సాస్ అతలాకుతలం.. చిన్నారులు సహా 51 మంది మృతి
కెర్విల్లె: అమెరికాలోని టెక్సాస్లో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షాల కారణంగా ఇప్పటికి వరకు 51 మృతి చెందగా.. పలువురు గల్లంతు అయ్యారు. తాజాగా సమ్మర్ క్యాంప్పైకి వరద దూసుకెళ్లిన ఘటనలో 23 మంది బాలికలు గల్లంతయ్యారు. కనిపించకుండా పోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.కొన్ని నెలలపాటు కురవాల్సిన వాన గురువారం రాత్రి సమయంలో అనూహ్యంగా కేవలం కొన్ని గంటల్లోనే కురిసిందని అధికారులు తెలిపారు. గ్వాడలుపె నది సమీపంలోని హంట్ అనే చిన్న పట్టణం వద్ద ‘క్యాంప్ మిస్టిక్’పేరుతో నిర్వహించే సమ్మర్ క్యాంప్లో 750 మంది బాలికలు పాల్గొన్నారు. వరద ప్రమాదం ముంచుకు రావడంతో అధికారులు కొందరు బాలికలను హెలికాప్టర్ ద్వారా తరలించారు. మిగతా వారిని వంతెన మీదుగా సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. పలు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మృతుల సంఖ్య పెరుగుతోంది. పలుచోట్ల వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంత మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. Good morning. Please keep Texas in your prayers—especially the flood victims, the missing, their families, and the first responders searching for them.Tragedy in Texas: Flash floods along the Guadalupe River have taken 13 lives. 23 young Christian girls from Camp Mystic are… pic.twitter.com/nH5QJz9Mc6— ꜱǫʏʟᴀʀᴋ (@Kralyqs) July 5, 2025 Texas flood in 50 minutes time. pic.twitter.com/ynRpULEgHI— 0HOUR (@0HOUR1__) July 6, 2025This video of the Guadalupe was shot in Kerrville, Tx from the Center Bridge. Watch how fast these flood waters were traveling & washing everything in front of it out.It goes from low & barley flowing to over the top of the bridge in around 35 minutes.I sped the video up to… pic.twitter.com/NcQe4UAQBa— Clyp Keeper (@DGrayTexas45) July 6, 2025This is a nightmare this lady and her bed ridden husband are in a flooded home in Texas and nobody is coming to help them! 😡 pic.twitter.com/Xp2WmiuCDl— Suzie rizzio (@Suzierizzo1) July 5, 2025 -
పుట్టినరోజు సందేశంలో.. దలైలామా నోటి వెంట ఘన భారతం
న్యూఢిల్లీ: నేడు(జూలై 6) ప్రముఖ ఆధ్మాత్మిక గురువు దలైలామా 90వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనను అనుసరించే టిబెటన్ కమ్యూనిటీలకు చెందినవారు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరిని అభినందిస్తూ, దలైలామా ఒక సందేశాన్ని అందించారు.దలైలామా మాటల్లో..‘నేను ఒక సాధారణ బౌద్ధ సన్యాసిని. నేను సాధారణంగా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనను. అయితే మీరంతా నా పుట్టినరోజును దృష్టిలో ఉంచుకుని, వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నందున, నేను కొన్ని ఆలోచనలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.. మనిషి తన భౌతిక అభివృద్ధి కోసం పనిచేయడం ముఖ్యమే! అయినప్పటికీ, సత్ హృదయాన్ని పెంపొందించుకోవడం ద్వారా, ప్రియమైన వారితోనే కాకుండా అందరితో ప్రేమగా ప్రవర్తిస్తూ, ప్రతి ఒక్కరి పట్ల కరుణ చూపడం ద్వారా మనశ్శాంతిని సాధించడంపై దృష్టి పెట్టడం చాలా అవసరం. తద్వారా మనమంతా ప్రపంచాన్ని మరింత మెరుగైన శాంతియుత ప్రదేశంగా మార్చడానికి అవకాశం కలుగుతుంది. 90th Birthday MessageOn the occasion of my 90th birthday, I understand that well-wishers and friends in many places, including Tibetan communities, are gathering for celebrations. I particularly appreciate the fact that many of you are using the occasion to engage in… pic.twitter.com/bfWjAZ18BO— Dalai Lama (@DalaiLama) July 5, 2025ఇక నా విషయానికొస్తే, మానవతా విలువలను, మత సామరస్యాన్ని ప్రోత్సహించడం, మనస్సు, భావోద్వేగాల పనితీరును వివరించే ప్రాచీన భారతీయ విజ్ఞానం గురించి తెలియజేయడం, మనశ్శాంతి, కరుణ మొదలైన అంశాలను వివరించడంపై నిబద్ధత కలిగివున్నాను. అలాగే టిబెటన్ సంస్కృతి, వారసత్వంపై దృష్టి పెట్టడాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నాను. బుద్ధుని బోధనలు, ప్రపంచశాంతి సందేశంతోపాటు భారతీయ గురువులు అందించిన విలువలతో నా దైనందిన జీవితంలో నేను దృఢ సంకల్పాన్ని, ధైర్యాన్ని పెంపొందించుకుంటాను. అంతరిక్షం ఉన్నంత వరకు, జీవాత్మ ఉన్నంత వరకు, ప్రపంచంలోని దుఃఖాన్ని తొలగించాలనే కట్టుబాటుతో ఉంటాను. మనశ్శాంతి, కరుణను పొందించుకునేందుకు నా పుట్టినరోజును ఒక అవకాశంగా స్వీకరిస్తున్నందుకు ధన్యవాదాలు’ అని దలైలామా తన పుట్టినరోజు సందేశంలో పేర్కొన్నారు. -
అన్నంతపనీ చేసిన మస్క్.. పార్టీ ఫ్యూచర్ ప్లాన్ ఇదే..
వాషింగ్టన్ డీసీ: టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. అధ్యక్షుడు ట్రంప్ బిగ్ బ్యూటీఫుల్ చట్టం తీసుకువచ్చిన దరిమిలా, దాన్ని వ్యతిరేకిస్తూ మస్క్ కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. తాను అనుకున్నది సాధించేవరకూ వదలని చెప్పే మస్క్ ఇప్పుడు అమెరికాలో కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు.ప్రముఖ టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్, అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని స్థాపనపై ప్రకటన చేశారు. ఈ పార్టీకి ‘అమెరికా పార్టీ’ అని పేరు పెట్టే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో విభేదాల నేపధ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం విశేషం. ఎలన్ మస్క్ తన ‘ఎక్స్’లో ఒక పోల్ నిర్వహించి, తన 22 కోట్ల మంది ఫాలోవర్స్ను ఓ ప్రశ్న అడిగారు ‘అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని నెలకొల్పాల్సిన సమయం వచ్చిందా?" అని అడిగినప్పుడు 80 శాతం మంది అవును అని సమాధానమిచ్చారు. By a factor of 2 to 1, you want a new political party and you shall have it!When it comes to bankrupting our country with waste & graft, we live in a one-party system, not a democracy.Today, the America Party is formed to give you back your freedom. https://t.co/9K8AD04QQN— Elon Musk (@elonmusk) July 5, 2025ఈ ఫలితాలను వెల్లడిస్తూ మస్క్ ఓ ప్రకటనలో ‘అమెరికాలో 80 శాతం మందికి ప్రాతినిధ్యం వహించే కొత్త రాజకీయ పార్టీ అవసరమని తెలిపారు. ఇది ప్రధాన పార్టీలైన డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని మస్క్ అభివర్ణించారు. కొత్త పార్టీ సాయంతో 2026 మధ్యంతర ఎన్నికల్లో హౌస్, సెనేట్ సీట్లపై మస్క్ దృష్టి సారించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో మస్క్ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికాలో డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు దశాబ్దాలుగా రాజకీయ రంగంలో ఆధిపత్యం చలాయిస్తున్నాయి. ఇప్పుడు మస్క్ ‘అమెరికా పార్టీ’ వీటికి సవాలుగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
‘సమానత’లో భారత్ ఘనత
న్యూఢిల్లీ: 2011–12 కాలం నుంచి చూస్తే 2022–23 నాటికి భారత్లో అసమానతలు బాగా తగ్గుముఖం పట్టాయని ప్రపంచబ్యాంక్ కీర్తించింది. అత్యంత పేదరికం స్థాయిలు కూడా బాగా తగ్గిపోయాయని ప్రపంచ బ్యాంక్ నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం భారత్లో 2011–12 కాలంలో 16.2 శాతంగా ఉన్న ‘అత్యంత పేదరికం’.. 2022–23 ఏడాదికల్లా ఏకంగా 2.3 శాతానికి తగ్గిపోయింది. గత దశాబ్దకాలంలో భారత్లో చేపట్టిన పలు రకాల సంక్షేమ, అభివృద్ధి పథకాల కారణంగా ఇంతటి మార్పు సాధ్యమైందని నివేదిక వ్యాఖ్యానించింది. సమానత్వం విషయంలో స్లోవాక్ రిపబ్లిక్(24.1), స్లోవేనియా(24.3), బెలారస్ (24.4)దేశాలు తొలి మూడు స్థానాలను కైవసం చేసుకోవడం విశేషం. గినీ ఇండెక్స్ స్కోర్లో చైనా, అమెరికా, బ్రిటన్ కంటే భారత్ మెరుగైన స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. 25.5 స్కోర్తో భారత్ ప్రపంచంలో నాలుగో అత్యుత్తమ సమానత్వ దేశంగా ఆవిర్భవించిందని ప్రపంచబ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. దేశ ఆదాయం, సంపద, వినియోగం దేశవ్యాప్తంగా అన్ని కుటుంబాలు, వ్యక్తులకు ఎంత సమస్థాయిలో పంపిణీ అవుతోందన్న దానిని పరిగణనలోకి సున్నా నుంచి 100 వరకు గినీ ఇండెక్స్ స్కోర్ను ఇస్తారు. ఇండెక్స్ స్కోర్గా సున్నా వస్తే ఆ దేశంలో సమానత్వం అత్యున్నత స్థాయిలో ఉందని అర్థం. 98 స్కోర్ వస్తే దేశ సంపద అంతా ఒక్కరిద్దరి చేతుల్లోనే ఉండి మిగతా వాళ్లు కడు పేదరికంలో ఉన్నట్లు అర్థం. 167 దేశాల స్కోర్లను ప్రపంచబ్యాంక్ ప్రకటించగా చైనా 35.7, అమెరికా 41.8 స్కోర్ సాధించాయి. 25.5 స్కోర్తో భారత్ అసమానత కేటగిరీ(25–30)లో దిగువ స్థాయిలో నిలిచింది. నివేదిక ప్రకారం గత దశాబ్దకాలంలో భారత్లో 17.1 కోట్ల మంది భారతీయులు దారిద్యపు కోరల నుంచి బయటపడ్డారు. తక్కువ అసమానతల కేటగిరీలో దాదాపు 30 దేశాలున్నాయి. ఇందులో పటిష్టమైన సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న కొన్ని యురోపియన్ దేశాలు సైతం ఉన్నాయి. వీటిలో ఐస్ల్యాండ్, నార్వే, ఫిన్లాండ్, బెల్జియంలతోపాటు అభివృద్దిచెందుతున్న దేశం పోలండ్, సంపన్న దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. -
మరో 40 ఏళ్లు జీవించాలనుకుంటున్నా
ధర్మశాల: టిబెటన్ల అత్యున్నత ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా త్వరలో తన వారసుడిని ప్రకటిస్తారన్న వార్తలకు చెక్పెడుతూ దలైలామా శనివారం తన మనసులో మాట వెల్లడించారు. మరో 30–40 ఏళ్లు జీవించాలనే ఆశ ఉందని, తుదిశ్వాస వరకు బుద్ధుని బోధనలను శక్తివంచలేకుండా వ్యాప్తి చెందిస్తానని ఆయన ప్రకటించారు. జీవించి ఉన్నంతకాలం తానే లామాగా కొనసాగుతానని ఆయన పరోక్షంగా చెప్పారు. ఆదివారం తన 90వ పుట్టినరోజును పురస్కరించుకుని హిమాలయాల్లోని మెక్లియోడ్గంజ్ పట్టణంలోని సుగ్లాగ్ఖాంగ్ ఆలయంలో దలైలామా ఆయుష్ష బాగుండాలంటూ శనివారం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. శక్తిస్వరూపిణిగా పేర్కొనే ‘ఒరాకిల్’.. దలైలామా చెంతకొచ్చి ఆయనను ఆశీర్వదించింది. ఒరాకిల్ ఆవాహనను ఈ ప్రత్యేక ప్రార్థనల్లో కీలకఘట్టంగా చెప్పొచ్చు. ఈ ప్రత్యేక ప్రార్థనల్లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దలైలామా మీడియాతో మాట్లాడారు. ‘‘కాలజ్ఞానం నాకేదో చెబుతున్నట్లు అనిపిస్తోంది. నాపై అవలోకితేశ్వర ఆశీస్సులు కురుస్తున్నట్లు తోస్తోంది. ఇప్పటికే నా శాయశక్తులా కృషిచేశా. ఇలా బుద్దుని బోధనలను వ్యాప్తి చెందించేందుకు నేను మరో 30–40 సంవత్సరాలు జీవించాలని ఆశ పడుతున్నా. నాపై అవలోకితేశ్వర ప్రభావం చిన్నతనం నుంచే ఉంది. బౌద్ధధర్మాన్ని మరికొంత కాలం ప్రపంచానికి చాటిచెబుతా. అందులోభాగంగానే 130 ఏళ్లు వచ్చేవరకు జీవిస్తాననే భావిస్తున్నా’’అని అన్నారు. -
అమల్లోకి ‘బిగ్ బ్యూటిఫుల్’ చట్టం
వాషింగ్టన్: పన్ను చెల్లింపుదారులపై ట్యాక్స్ భారం తగ్గించడం, వలసచట్టాల అమలుకు కావాల్సిన నిధులను సేకరించడం, రక్షణరంగ బడ్జెట్ పెంపు వంటి ఎన్నో లక్ష్యాలతో రూపొందించిన కీలక ‘వన్ బిగ్ బ్యూటిఫుల్’బిల్లు ఎట్టకేలకు అమెరికాలో చట్టంగా అమల్లోకి వచ్చింది. అమెరికా సెనేట్, ప్రతినిధుల సభలో సుదీర్ఘ చర్చలు, ఉత్క ంఠతో కూడిన ఓటింగ్ల నడుమ ఆమోదం పొందిన ఈ బిల్లుపై అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం ట్రంప్ శ్వేతసౌధంలో సంతకంచేశారు. రెండో దఫా అధ్యక్షుడయ్యాక రిపబ్లికన్ పార్టీపై తన పట్టు సడలలేదని తాజా బిల్లు ద్వారా ట్రంప్ నిరూపించుకున్నారు. మరో దశాబ్దకాలంలో అమెరికా ఆర్థికలోటును మరో 3.3 ట్రిలియన్ డాలర్లు పెంచేసే చట్టంగా అపవాదును మూటగట్టుకున్న దాదాపు 870 పేజీల ఈ కొత్త చట్టంలోని కొన్ని కీలక అంశాలపై క్లుప్తంగా.. 2017నాటి పన్నుల్లో కోత కొనసాగింపు ట్రంప్ తొలిదఫా అధ్యక్షునిగా ఎన్నికైనప్పుడు ప్రజలు చెల్లించాల్సి పన్ను రేటును తగ్గించారు. పరిశ్రమలకూ దీనిని వర్తింపజేశారు. ప్రభుత్వానికి తక్కువ పన్ను చెల్లించిన కారణంగా తమ వద్ద మిగిలిపోయిన సొమ్మును జనం ఖర్చుచేస్తారు. ఇలా వస్తుసేవల వినియోగం పెరిగి ఆర్థికాభివృద్ది ఊపందుకుంటుందని ట్రంప్ ఆశిస్తున్నారు. వైద్యసాయంపై భారీ కోత ఏ ప్రభుత్వమైనా కొత్త పథకం తెస్తే అందులో వైద్య ప్రయోజనాలు పెరుగుతాయి. కానీ ఈ బిల్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య ప్రయోజనాలకు గండికొడుతోంది. తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులు/కుటుంబాలు/ వికలాంగులకు మెడికల్ ఎయిడ్ ప్రయోజనాలు దూరంకానున్నాయి. దీంతో మెడికల్ ఇన్సూరెన్స్ రక్షణలేక లక్షలాది మంది తమ సొంత డబ్బులను వైద్యం కోసం ఖర్చుచేయాల్సిఉంటుంది. ఎక్కువ గంటలు పనిచేసే వ్యక్తులకే అధిక మెడిక్ఎయిడ్ నిబంధనను చేర్చారు. ప్రస్తుతం అమెరికాలో 7.1 కోట్ల మంది ప్రభుత్వ వైద్య బీమా సదుపాయాన్ని పొందుతున్నారు. కొత్త చట్టం కారణంగా 1.7 కోట్ల మందికి ఈ సదుపాయం దూరమవుతుంది. పెన్షన్లు, గౌరవ భృతిపై పన్నుల తగ్గింపు రిటైర్డ్ ఉద్యోగులు, వికలాంగులు, ఇతర పెన్షనర్లపై విధించే సామాజిక భద్రతా ఆదాయ పన్నును తగ్గించారు. 65 ఏళ్లు పైబడిన వాళ్లకు అందే పెన్షన్, ఇతర ప్రయోజనాలపై మూలఆదాయం వద్ద కోతను 4,000 డాలర్లకు పరిమితం చేశారు. తగ్గనున్న ఫుడ్ కూపన్ల లబి్ధదారులు బైడెన్ హయాంలో అందించిన పునరుత్పాదక ఇంధన వనరుల ప్రోత్సాహక ప్రయోజనాలకు ప్రభుత్వం ఈ చట్టం ద్వారా కోతపెట్టింది. సౌర, పవన విద్యుత్ సంస్థలకు ఇచ్చే పన్ను ప్రయోజనాలను తగ్గించి ఆ మేరకు బొగ్గు, చమురు సంస్థలకు ప్రయోజనం కల్పించనున్నారు. కార్లు కొనేందుకు వాహనరుణం తీసుకుంటే అందుకు చెల్లించే వడ్డీని సైతం తగ్గించారు. తక్కువ ఆదాయవర్గాలకు అందించే ఫుడ్ కూపన్లు(టోకెన్లు) తగ్గించనున్నారు. ప్రస్తుతం 4 కోట్ల మంది ఈ ఫుడ్ టోకెన్లను ఉపయోగించుకుంటున్నారు. కొత్త చట్టం కారణంగా 47 లక్షల మంది ఆ అర్హతను కోల్పోతారు. భారీగా రక్షణ బడ్జెట్ రక్షణ బడ్జెట్ను మరో 150 బిలియన్ డాలర్లు పెంచనున్నారు. సరిహద్దు గోడనిర్మాణం, అక్రమంగా చొరబడిన విదేశీయుల కోసం మొత్తంగా 1,00,000 పడకలతో నిర్బంధ కేంద్రాలను నిర్మించనున్నారు. -
శుభాంశు బిజీబిజీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు చేరుకున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా తన విధుల్లో బిజీగా మారారు. ఒకరోజు విశ్రాంతి తర్వాత తన ‘ఐఎస్ఎస్ పదోరోజు’పనుల్లో భాగంగా సూక్ష్మ గురుత్వాకర్షణ స్థితిలో మనిషి ఎముకల సాంద్రత ఎలా ఉంటుంది? అనే అంశంపై ఆయన పరిశోధనలు మొదలుపెట్టారు. భారరహిత స్థితిలో ఎముకలో కణాల పుట్టుక, అభివృద్ధి, వాపు అంశాలపైనా శుక్లా శోధన సాగించారు. దీర్ఘకాలంపాటు ఖగోళయానం చేస్తే రేడియోధార్మీకత కారణంగా వ్యోమగాముల కణాల్లో డీఎన్ఏ నిచ్చెనలు దెబ్బతింటే అవి మళ్లీ మరమ్మతులు చేసుకోవాలంటే భూమి గురుత్వాకర్షణ అవసరం. కానీ ఐఎస్ఎస్లో అత్యంత స్వల్పస్థాయిలో గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. అలాంటప్పుడు రేడియేషన్ ప్రభావ స్థాయిలు ఎలా ఉంటాయనే దానిపై శుక్లా అధ్యయనం మొదలెట్టారు. నీటి ఎలుగుబంటి(టార్డీగ్రేడ్)తోపాటు శైవలాలు శూన్యస్థితిలో ఎలా పెరగగలవు? అనే అంశంపై ప్రయోగంచేశారు. వాటర్బేర్ల ఉనికి, పునరుజ్జీవం, పునరుత్పత్తి విధానాల్లో మార్పులను ఆయన గమనించారు. ఈ సూక్ష్మజీవాలు భవిష్యత్తులో సుస్థిర జీవనానికి, ఆహారం, ఇంధనంతోపాటు పీల్చేగాలికి ఊపిరులూదొచ్చు. అయితే తొలుత భారరహిత స్థితిలో ఈ అతిసూక్ష్మజీవాలు ఎలా మనుగడ సాగిస్తాయో తెల్సుకోవాల్సి ఉంది’’అని యాగ్జియం స్పేస్ సంస్థ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘శుక్లాతోపాటు యాగ్జియం బృంద సభ్యులు ఎముక శూన్యంలో ఎలా పెళుసుబారుతుంది? భూమి మీదకు రాగానే ఎలా పూర్వస్థితిని చేరుకుంటుంది? అనే దానిపైనా ప్రయోగంచేశారు. ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక సంబంధ వ్యాధులకు మరింత మెరుగైన చికిత్సావిధానాల అభివృద్ధికి తాజా ప్రయోగాలు దోహదపడతాయి’’అని యాగ్జియం స్పేస్ తెలిపింది. శూన్య స్థితిలో అస్థిపంజరంలోని కండరాలు ఎందుకు సూక్ష్మస్థాయిలో స్థానభ్రంశం చెందుతాయనే అంశంపైనా శుక్లా పరిశోధన చేశారు. చాలా రోజులపాటు అంతరిక్షయాత్రల్లో భాగంగా ఐఎస్ఎస్లో గడిపే వ్యోమగాములను కండరాల క్షీణత పట్టిపీడిస్తుంది. దీనికి కణస్థాయిలో పరిష్కారం కనుగొనేందుకు శుక్లా ప్రయత్నించారు. -
వైవిధ్యమైన వాణిజ్యం
బ్యూనస్ ఎయిర్స్: తమ ఇరు దేశాల మధ్య వ్యాపారం, వాణిజ్యాన్ని మరింత వైవిధ్యంగా తీర్చిదిద్దుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిల్లీ నిర్ణయించుకున్నారు. అలాగే రక్షణ, ఇంధనం, అరుదైన ఖనిజాలు తదితర కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని అంగీకారానికి వచ్చారు. మోదీ, జేవియర్ మిల్లీ శనివారం అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. వ్యూహాత్మక ప్రయోజనాలు కాపాడుకొనేలా రెండు దేశాల నడుమ రక్షణ రంగంలో సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. రెండు దేశాల వ్యూహాత్మకభాగస్వామ్యాన్ని మరింత ఉన్నతస్థాయికి చేర్చాలని మోదీ, జేవియర్ మిల్లీ తీర్మానించారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శనివారం అర్జెంటీనాకు చేరుకున్నారు. భారత ప్రధాని అర్జెంటీనాలో ద్వైపాక్షిక పర్యటన చేపట్టడం గత 57 ఏళ్లలో ఇదే మొదటిసారి. జేవియర్ మిల్లీతో సమావేశం అనంతరం మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. వ్యవసాయం, రక్షణ, ఇంధనంతోపాటు పలు కీలక రంగాల్లో సహకారంపై చర్చించామని తెలిపారు. ఫార్మాస్యూటికల్స్, క్రీడలు తదితర రంగాల్లో ఇరుదేశాలు కలిసి పనిచేయడానికి అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. జేవియర్తో మిల్లీతో అద్భుతమైన భేటీ జరిగిందని మోదీ పేర్కొన్నారు. భారత్–అర్జెంటీనా మధ్య గత 75 ఏళ్లుగా దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయని, ఐదేళ్ల క్రితం ఈ సంబంధాలు ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి వృద్ధి చెందాయని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ఇరుదేశాల ఉమ్మడి ప్రయాణం మరింత అర్థవంతంగా, ప్రగతిశీలకంగా సాగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేద్దాం వ్యవసాయ రంగంలో మరింతగా సహకరించుకోవాల్సిన అవసరం ఉందని మోదీ, మిల్లీ అభిప్రాయపడ్డారు. ఒక దేశానికి చెందిన వ్యవసాయ ఉత్పత్తులను మరో దేశంలో ప్రజలకు సులువుగా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. దీనివల్ల ఇరుదేశాల రైతులకు లబ్ధి చేకూరుతుందని వారు అంగీకరించారు. ఇందుకోసం జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని, ఆ దిశగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని నిర్ణయించారు. అంతకుముందు ట్రినిడాడ్ అండ్ టొబాగో నుంచి అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాని మోదీకి బ్యూనస్ ఎయిర్స్లోని ఎజీజా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో అధికారులతోపాటు ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్జెంటీనా నేషనల్ హీరో జనరల్ జోస్ డి శాన్ మారి్టన్ స్మారకం వద్ద మోదీ నివాళులరి్పంచారు. భారత్–అర్జెంటీనా మధ్య దశాబ్దాలుగా చక్కటి మైత్రి కొనసాగుతోంది. 2019లో అప్పటి అర్జెంటీనా అధ్యక్షుడు మారిసియో మాక్రీ ఇండియాలో పర్యటించారు. ఆ సమయంలో భారత్, అర్జెంటీనా మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచారు. వాణిజ్యం, రక్షణ, అరుదైన ఖణిజాలు, చమురు, గ్యాస్, అణు ఇంధనం, వ్యవసాయం, సాంస్కృతికం, టెక్నాలజీ వంటి రంగాల్లో రెండు దేశాలు కలిసి పని చేస్తున్నాయి. పలు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. పరస్పరం సహకరించుకుంటున్నాయి. -
ఒంటె కన్నీటి చుక్క విషానికి విరుగుడు!
బికనీర్: లొట్టిపిట్టగా, ఎడారి ఓడగా పేరు తెచ్చుకున్న ఒంటె అంటే చిన్నారులకు ఎంతో ఇష్టం. దానిని ఎక్కితే మొదటి అంతస్తు నుంచి చూస్తున్నంత అనుభూతి కల్గుతుంది. పిల్లలకు ఆనందాన్ని పంచే ఈ ఒంటెలు ఇప్పుడు చిన్నాపెద్దా అనే తేడాలేకుండా అందరికీ రక్షణగా సైతం నిలుస్తాయని తాజా అధ్యయనమొకటి గట్టిగా నమ్ముతోంది. 26 రకాల పాముల విషాలను సైతం తట్టుకునేంత అద్భుతమైన శక్తిసామర్థ్యాలు ఒంటె కన్నీటికి ఉందని ఒక పరిశోధనా బృందం అభిప్రాయపడుతోంది. ఇసుక తుపాన్లు, చుక్క నీరులేని ఎడారి ప్రాంతం, ఒళ్లు కాలి మండిపోయేంత ఎండ.. ఇలా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ అవలీలగా బతికే గుణం ఒంటెకు ఉన్న ట్లే ఆ ఒంటె కన్నీటికీ అసాధారణ శక్తి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. దుబాయ్లోని సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ లే»ొరేటరీలోని శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయనం చేసింది. పాముకాటు విరుగుడు మందు తయారీలో ఒంటె కన్నీటి నుంచి సేకరించిన పోషకాలు అక్కరకొస్తాయని వాళ్లు చెబుతున్నారు. బ్యాక్టీరియా కణ గోడలను ధ్వంసంచేసి వాటిని చంపేసే రోగనిరోధక శక్తి ఉండే ప్రోటీన్లు ఈ కన్నీటిలో పుష్కలంగా ఉన్నాయని, ఈ కన్నీటి సాయంతో అత్యంత శక్తివంతమైన పాముకాటు విరుగుడు మందును తయారుచేయొచ్చని పరిశోధకులు చెప్పారు. సన్నని ఇసుకరేణువుల గాలిలో ఏళ్లతరబడి గడిపిన కారణంగా ఒంటె కన్నీటిలో సహజంగానే కంటిసంబంధ ఇన్ఫెక్షన్లను తట్టుకునే శక్తి ఉంటుందని, ఆ కోణంలో శోధించి ఈ కొత్త విషయాన్ని సాధించామని వాళ్లు చెప్పారు. ఒంటె కన్నీళ్లలో పాముకాటును తట్టుకునే యాంటీబాడీలు అధికంగా ఉన్నట్లు తమ పరిశోధనలో తేలిందని వాళ్లు వెల్లడించారు. ఎలా కనిపెట్టారు? ఎకీస్ కారినాటస్ సోచిరేకీ అనే విషపూరితమైన పాము నుంచి విషాన్ని బయటకు తీసి క్యామలస్ డ్రోమిడేరియస్ రకం ఒంటెకు స్వల్పస్థాయిలో ఎక్కించారు. విషానికి ఒంటె రక్తం, కన్నీరు ఎలా స్పందిస్తున్నాయో అధ్యయనంచేశారు. గుర్రాలకు పాము విషాన్ని ఎక్కించి పాముకాటు విరుగుడు తయారుచేస్తారు. అలా తయారుచేసిన విరుగుడుతో పోలిస్తే ఒంటె కన్నీటిలో యాంటీబాడీ పాళ్లు అత్యధికంగా ఉన్నట్లు తేలింది. అయితే ప్రపంచస్థాయిలో అన్ని రకాల పాముల విషాలకు ఒంటె కన్నీరు ఏ స్థాయిలో ప్రతిస్పందిస్తుంది అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఆ దిశగా పరిశోధన జరగలేదు. దుబాయ్, బికనీర్లో జరిగిన స్థాయిలో అన్నిచోట్లా పరిశోధనలు సత్ఫలితాలనిస్తే విరుగుడు మందు తయారీలో కొత్త అధ్యయనం మొదలైనట్లేనని అధ్యయనకారులు వ్యాఖ్యానించారు. భారత్లో ఏటా వేలాది మంది పాముకాటు కారణంగా చనిపోతున్న సంగతి తెలిసిందే. -
హమ్మయ్యా.. ఊపిరి పీల్చుకున్న జపాన్
క్యాలెండర్లో తేదీ మారింది. ఎట్టకేలకు జపాన్ ఊపిరి పీల్చుకుంది. ఏదో విపత్తు ముంచేస్తోందని ‘జపాన్ బాబా వాంగా’ ర్యో తత్సుకి చెప్పిన కాలజ్ఞానం ఉత్తదేనని తేలిపోయింది. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా జపాన్ డూమ్స్ డే.. చివరకు హుళక్కే అని తేలింది. జులై 5, 2025న మెగా సునామీ జపాన్ను ముంచెత్తబోతోందన్న ప్రచారం.. ఉత్తి ఉత్కంఠగానే తేలిపోయింది. భారీ భూకంపంగానీ.. సునామీగానీ సంభవించలేదు. కొన్ని స్వల్ప ప్రకంపనలు, అగ్నిపర్వతం బద్దలు మినహా ఓ మోస్తరు ప్రకృతి వైపరిత్యాలు సంభవించలేదు. తేదీ మారినా.. ఏం జరగకపోవడంతో ఆ దేశ ప్రజలు హమ్మయ్యా.. అనుకుంటున్నారు. 1999లో ప్రచురించబడిన ఓ మాంగా (The Future I Saw) రచయిత ర్యో తత్సుకి.. జులై 5వ తేదీన విపరీతమైన భూకంపం, యుగాంతం తరహాలో సునామీ ముంచెత్తవచ్చని తన చిత్రాలతో బొమ్మలు గీసింది. మీడియాతో పాటు సోషల్మీడియాలోనూ జపాన్ డూమ్స్ డే అంటూ హడావిడి నడిచింది. #JapanTsunami, #July5, #TheFutureISaw వంటివి ట్రెండింగ్ అయ్యాయి. కొంతమంది పర్యాటకులు పర్యటనలు రద్దు చేసుకున్నారు. అందులో భారత్ నుంచి కూడా చాలామంది ఉన్నారు. జపాన్ లోని ఆకుసెకిజిమా వాసులను అప్రమత్తంగా తరలించాల్సి వచ్చింది.అయితే.. మేధావులు, సైంటిస్టులు.. ఆ భవిష్యవాణి నిరాధారమైనదిగా చెబుతూనే వస్తున్నారు. మరోవైపు అక్కడి వాతావరణ విభాగం కూడా.. భూకంపాలను అంచనా వేయలేమని మొత్తుకుంటూ వచ్చింది. చివరకు అదే నిజమని తేలింది. -
వైరల్ వీడియో.. విమానం నుంచి దూకేసిన ప్రయాణికులు
విమానంలో తప్పుడు ఫైర్ అలర్ట్తో ఒక్కసారిగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆగి ఉన్న విమానం నుంచి కిందికి దూకే క్రమంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. స్పెయిన్లోని పాల్మాడి మాలొర్కా ఎయిర్పోర్ట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులు గాయపడగా.. వారిలో ఆరుగురిని ఆసుపత్రికి తరలించారు. మాంచెస్టర్కు బయలుదేరాల్సిన విమానం టేకాఫ్కు సిద్ధంగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది.స్పెయిన్లోని పాల్మా డి మయోర్కా విమానాశ్రయంలో ర్యాన్ ఎయిర్ బోయింగ్ 737 విమానంలోఈ గందరగోళం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ల నుంచి బయటకు రాగా.. మరికొందరు విమానం రెక్కలపైకి ఎక్కి నేలపైకి దూకారు. ఇది తప్పుడు ఫైర్ అలర్ట్ అని తేలడంతో విమానయాన సంస్థ ప్రయాణికులకు క్షమాపణలు తెలిపింది.In Spain, the Manchester-bound plane was about to take off. Fire alert triggered an evacuation, following which the panicked passengers began jumping from the plane's wing to save themselves. At least 18 people on a Ryanair Boeing 737 aircraft were injured after a fire alert… pic.twitter.com/AYkYPhteJ5— SK Chakraborty (@sanjoychakra) July 5, 2025 -
World Biryani Day: ఈ బిర్యానీ డే మీకో ఛాలెంజ్!
రుచికి రాజు, రాజులకు రుచికరమైన వంటకం బిర్యానీ!. ఇది కేవలం వంటకం కాదు.. ఓ భావోద్వేగం, ఓ సంస్కృతి, ఓ రుచుల పండుగ! బిర్యానీని తినని వాడు ఉండొచ్చు. కానీ బిర్యానీ గురించి వినని వాడు ఉండడు!. ఈ జులై 6న(జులై తొలిఆదివారం) వరల్డ్ బిర్యానీ డే. బిర్యానీ ప్రేమికులు తమ అభిమాన వంటకాన్ని ఘనంగా ఆస్వాదించాల్సిన రోజు కూడా!..హైదరాబాద్ గల్లీ నుంచి హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంటీన్ వరకూ.. బిర్యానీ చేసిన గ్లోబల్ ప్రయాణం నిజంగా ఓ అద్భుతం. 2022లో దావత్ బాస్మతి రైస్ సంస్థ ప్రారంభించిన ప్రపంచ బిర్యానీ దినోత్సవం(World Biryani Day 2025) ఇప్పుడు మూడో ఏడాదిలోకి అడుగుపెట్టింది. ప్రతి సంవత్సరం జులై నెలలోని మొదటి ఆదివారం ఈ వేడుక జరుపుతూ వస్తున్నారు. ఇటు.. సోషల్ మీడియా, అటు.. ఫుడ్ ఫెస్టివల్స్, ఇంకోవైపు రెస్టారెంట్ ఆఫర్లతో బిర్యానీ డే ఓ ఫుడ్ కల్చరల్ సెలబ్రేషన్గా మారింది.హైదరాబాద్ బిర్యానీకి రాజధానినిజాం రాజుల కాలం నుంచి బిర్యానీకి ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు రాజభవనాల్లో వండిన ఈ వంటకం, ఇప్పుడు ప్రతి వీధిలో అందుబాటులో ఉంది. సుమారు 50కి పైగా రకాల బిర్యానీలు నిజాం ఆస్థానంలో తయారయ్యేవని చరిత్ర చెబుతోంది. అందులో చేపల బిర్యానీ నుంచి ఊరేడు పిట్ట బిర్యానీ వరకు ఉన్నాయట!బిర్యానీ.. ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్బిర్యానీ అనే పదం పర్షియన్ భాషలోని "బిర్యాన్" నుంచి వచ్చింది. దీని అర్థం “ఫ్రై చేయడం” లేదా “వేపడం”. అంటే బిర్యానీకి మూలాలు పశ్చిమాసియాలో ఉన్నా, దానికి అసలైన రుచి మాత్రం భారతదేశమే ఇచ్చింది!ఈ బిర్యానీ డే మీకో ఛాలెంజ్!బిర్యానీ అంటే మీకు ఏ రకం ఇష్టం? హైదరాబాదీ బిర్యానీనా?, లేక మలబార్ బిర్యానీనా?, లక్నోబిర్యానీనా?, లేదంటే కోల్కతా బిర్యానీనా?. ఏది అందుబాటులో ఉంటే అదే అంటారా? అయితే సరి!. ఈసారి బిర్యానీ తినడమే కాదు... మీరు ఎప్పుడూ ట్రై చేయని ఓ కొత్త రకమైన బిర్యానీ వండండి. దాని ఫోటో తీసి #WorldBiryaniDay హ్యాష్ట్యాగ్తో 9182729310 నెంబర్కు వాట్సాప్ చేయండి. మీ బిర్యానీ స్టోరీని మాతో పంచుకోండి. అది మీరే వండింది కావొచ్చు.. మీ అమ్మ చేతి బిర్యానీ కావొచ్చు. దానిని ఓ మధురమైన జ్ఞాపకంగా మలిచే ప్రయత్నం మేం చేస్తాం. బిర్యానీ అంటేనే ఒక మాయ!. ఆ మాయకు ప్రపంచవ్యాప్తంగా అనేక రూపాలు ఉన్నాయి. వాటి సంఖ్యను ఖచ్చితంగా చెప్పడం కష్టం, కానీ 100కి పైగా రకాల బిర్యానీలు ఉన్నాయని ఒక అంచనా. వాటిలో కొన్ని ప్రాంతీయ ప్రత్యేకతలతో, కొన్ని దేశీయ వంటకాలతో కలిసినవిగా ఉంటాయి. ప్రతి రకానికి ప్రత్యేకమైన మసాలాలు, వండే పద్ధతి ప్రత్యేకంగానే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధమైన బిర్యానీ రకాలలో కొన్ని: భారతదేశం: హైదరాబాదీ, లక్నో (అవధీ), కోల్కతా, మలబార్, అంబూర్, సింధీ, కశ్మీరీ, ఢిల్లీ స్టైల్, చెట్టినాడ్, ఇలా.. పాకిస్తాన్: కరాచీ బిర్యానీ, లాహోరి బిర్యానీ బంగ్లాదేశ్: కాచ్చి బిర్యానీ, తేహారీ ఇరాన్: బఘాలి పలో, జెరేష్క్ పలో (బిర్యానీకి మూలం ఇదేనని భావిస్తారు) ఇండోనేషియా: మలేషియా, నాసి బిర్యానీ మిడిల్ ఈస్ట్ దేశాల్లో.. మాందీ, కబ్సా (పొడిగా ఉండే బిర్యానీ, పొగ వాసనతో..)ఒక్క భారతదేశంలోనే 30కి పైగా ప్రాంతీయ బిర్యానీలు ఉన్నాయి. వాటిలో వాడే మసాలాలు, బియ్యం రకాలు (బాస్మతి, సీరా సాంబా, జిరా సామా), వంట పద్ధతులు (దమ్, కచ్చి, పక్కి), ఆయా శైలుల ప్రభావం (ముగలాయ్, నవాబీ శైలి).. ఇలా ఆధారపడి ఉంటాయి. -
పుతిన్ అంతే.. చంపుతూనే ఉంటారు.. ట్రంప్ షాకింగ్ కామెంట్స్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన మనుషులను చంపుతూనే ఉంటారంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. యుద్ధం ఏమాత్రం మంచిది కాదంటూ ట్రంప్ హితవు పలికారు. మరోవైపు, రష్యాపై మరిన్ని ఆంక్షలు ఉండొచ్చంటూ ట్రంప్ బెదిరింపులకు దిగారు. ఇటీవల ట్రంప్-పుతిన్లు ఫోన్ కాల్లో మాట్లాడుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఉక్రెయిన్తో యుద్ధ విరమణ విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. యుద్ధం ఆపుతాడని అనుకోవడం లేదంటూ పుతిన్తో ఫోన్ సంభాషణ అనంతరం వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్పై రష్యాతో యుద్ధ విరమణ చేయించడానికి ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాగా, ఉక్రెయిన్ రాజధాని కీవ్ లక్ష్యంగా రష్యా మరోసారి భీకర దాడులకు తెరతీసిన సంగతి తెలిసిందే.గురువారం రాత్రి కేవలం 7 గంటల వ్యవధిలో 550 వరకు డ్రోన్లు, 11 క్షిపణులను ప్రయోగించింది. రష్యా మూడేళ్ల క్రితం ఉక్రెయిన్పై దురాక్రమణ ప్రారంభించాక చేపట్టిన అతిపెద్ద దాడి ఇదేనని చెబుతున్నారు. షహీద్ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణుల పేలుళ్ల మోతలతో కీవ్ దద్దరిల్లింది. సైరన్లు రాత్రంగా మోగుతూనే ఉన్నాయి. ‘మా ప్రజలు కఠినమైన, నిద్ర లేని రాత్రి గడిపారు’ అని అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు.ప్రజలు మెట్రో స్టేషన్లు, బేస్మెంట్లు, భూగర్భ పార్కింగ్ గ్యారేజీల్లోకి పరుగులు తీశారని ఉక్రెయిన్ మంత్రి యూలియా తెలిపారు. కీవ్తోపాటు మరో ఐదు ప్రాంతాలపైకి రష్యా దాడులు చేసిందని జెలెన్స్కీ చెప్పారు. తాము 270 డ్రోన్లను కూల్చివేశామని ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో సంభాషణ జరిపిన రోజే తాజా దాడి జరగడం గమనార్హం. -
ఇలాంటి వ్యక్తి సామాన్యుల కష్టాలను తొలగిస్తాడా?
న్యూయార్క్ నగరంలో ఆర్థిక అసమానతలను రూపుమాపుతానంటూ సోషలిస్ట్ తరహా వాగ్దానాలు చేస్తున్న డెమొక్రటిక్ పార్టీ మేయర్ అభ్యర్థి జొహ్రాన్ ఖ్వామీ మమ్దానీ(33)పై విమర్శల దాడి పెరిగింది. భారతీయ మూలాలున్న మమ్దానీ తల్లిదండ్రులు మీరా నాయర్, మహూమ్ద్ మమ్దానీల ఆస్తిపాస్తుల వివరాలనే అస్త్రాలుగా మార్చుకున్న విమర్శకులు.. ఆయనకు సోషలిజం (Socialism) గురించి మాట్లాడే అర్హత లేదని దెప్పి పొడుస్తున్నారు. మమ్దానీ కుటుంబ నేపథ్యానికి, ఆయనిస్తున్న వాగ్దానాలకు పొంతనే లేదంటున్నారు.జొహ్రాన్ మమ్దానీ (Zohran Mamdani)కి ఉగాండాలో ఉన్న నాలుగెకరాల ప్లాట్ విలువే 2.50 లక్షల డాలర్ల ఖరీదుంటుందని, ఖరీదైన మన్హట్టన్ ప్రాంతంలో విలాస వంతమైన నివాస భవనముందని చెబుతున్నారు. మమ్దానీ కుటుంబానికి 10 లక్షల డాలర్ల దాకా విలువైన ఆస్తులున్నాయని ట్రంప్ తరఫున లారా లూమర్, మెఘన్ మెక్కెయిన్ తెలిపారు.ఉన్నత విద్య, పలుకుబడి కలిగిన కుటుంబం నుంచి వచ్చిన జొహ్రాన్ మమ్దానీకి సగటు ఉద్యోగికి ఉండే ఇబ్బందులేమీ లేవని, ఇటువంటి వ్యక్తి సామాన్యుల ఇబ్బందులను ఎలా తీరుస్తాడని వారు ప్రశ్నిస్తున్నారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికలు మరో నాలుగు నెలలుండగా, మమ్దానీపై విమర్శలు ఇప్పటికే తీవ్ర రూపం దాల్చడం గమనార్హం.చదవండి: నీ భార్య నిన్ను వదిలి వెళ్లిపోతుంది -
భారత్ అభ్యర్థన.. నీరవ్ మోదీ కేసులో కీలక పరిణామం!
భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగవేసి.. మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కేసుకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నీరవ్ మోదీ సోదరుడు నేహల్ మోదీని అమెరికాలో అరెస్టు చేశారు. అతడిని అప్పగించాలన్న భారత దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలు అభ్యర్థించాయి. భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా అమెరికా అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం..నేహల్పై ఉన్న ప్రధాన ఆరోపణలు:పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణం కేసులో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయిమనీ లాండరింగ్ మరియు నేరపూరిత కుట్ర కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారునీరవ్ మోదీకి సంబంధించిన అక్రమ ఆస్తులను దాచడంలో, సాక్ష్యాలను నాశనం చేయడంలో నేహల్ పాత్ర ఉన్నట్లు భారత దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయిఇంకా, నేహల్ మోదీపై అమెరికాలోని ప్రముఖ డైమండ్ కంపెనీ LLD డైమండ్స్ను దాదాపు రూ.19 కోట్ల మేర మోసం చేసిన కేసు కూడా నమోదైంది. తప్పుడు ఒప్పందాల ద్వారా డైమండ్లను తీసుకుని, వాటిని స్వప్రయోజనాల కోసం అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.గుజరాత్కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ(54) పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. దాదాపు ₹14,000 కోట్ల మోసానికి పాల్పడి 2018లో దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన లండన్(యూకే)లో ఉన్నట్లు సమాచారం. దీంతో ఆయన అప్పగింత కోసం భారత్ అభ్యర్థించగా.. ఆ కేసు అక్కడి కోర్టులో విచారణ జరుగుతోంది. నేహల్ అరెస్టుతో నీరవ్ మోదీ కేసులో పురోగతి సాధించినట్లేనని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. -
'నీ భార్య నిన్ను వదిలి వెళ్లిపోతుంది'
'అమెరికాతో మీకేం సంబంధం ఉంది. భారత దేశానికి తిరిగి వెళ్లిపోయి ముంబై, గుజరాత్లతో సంబరాలు చేసుకోండి. మీ భార్య మిమ్మల్ని వదిలేస్తుంది' అంటూ భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నాయకుడు వివేక్ రామస్వామిపై అమెరికన్లు విరుచుకుపడుతున్నారు. వివేక్ రామస్వామిపై అమెరికన్లు జాత్యాహంకార వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. ఒహియో గవర్నర్ పదవికి పోటీ పడుతున్న ఆయనపై సోషల్ మీడియా వేదికగా అమెరికా పౌరులు విద్వేషం వెళ్లగక్కుతున్నారు. తాజాగా ఎక్స్లో షేర్ చేసిన ఫొటోపై తీవ్రంగా ట్రోలింగ్ చేస్తున్నారు.జాతి విద్వేష వ్యాఖ్యలతో ట్రోలింగ్జూలై 4న అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భార్యా, పిల్లలతో దిగిన ఫొటోను వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. 'చిన్న పిల్లలు ప్రతి సంవత్సరం పెద్దవుతున్నారు. హ్యాపీ ఫోర్త్!' అంటూ క్యాప్షన్ జోడించారు. దీనిపై అమెరికన్లు జాతి విద్వేష వ్యాఖ్యలతో ఆయనను ట్రోలింగ్ చేస్తున్నారు. 'మీరు మీ కుటుంబంతో గుజరాత్ లేదా ముంబైలో జరుపుకోవాలి' అంటూ ఒకరు కామెంట్ చేశారు. 'మీరు ఫ్రీడమ్ ఫ్రైస్ని, యాంకర్ బేబీ పౌరసత్వాన్ని తిరిగి పొందారా' అంటూ మరొకరు ప్రశ్నించారు.ఒకరైతే వివేక్ రామస్వామి భార్య ఆయనను వదిలి వెళ్లిపోతుందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. 'ట్రంప్ పాలనలో మీ కుటుంబం లేదా స్నేహితులు ఎవరైనా బహిష్కరించబడతారా అని నేను ఆశ్చర్యపోతున్నాను? బహుశా మీ భార్య కుటుంబ సభ్యులను బహిష్కరిస్తే ఆమె మిమ్మల్ని వదిలివేస్తుంది' అని మరో అమెరికన్ ట్రోల్ చేశారు.అయితే వివేక్ రామస్వామిపై జాతి వివక్ష వ్యాఖ్యలు కొత్తేం కాదు. మే నెలలో తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఎక్స్లో షేర్ చేసిన ఫొటో పైనా కూడా ఆయన వ్యతిరేకులు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇండియాకు తిరిగి వెళ్లిపోవాంటూ తిట్టిపోశారు. వివేక్ సతీమణి డాక్టర్ అపూర్వ తివారి కూడా భారత సంతతికి చెందిన వారే. ఆమె కూడా అమెరికాలోనే జన్మించారు. వివేక్ యాంకర్ బేబీనా? అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేసిన తర్వాత వివేక్ రామస్వామిపై కొత్త ద్వేషం మొదలైంది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందు.. అమెరికాలో జన్మించిన ఎవరికైనా ఆటోమేటిక్గా పౌరసత్వం దక్కేది. అయితే ఇది అందరికీ ఉద్దేశించింది కాదని, అందుకే ఈ నియమాన్ని మార్చాలనుకుంటున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఈ వివాదాస్పద నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో సవాల్ చేయడంతో దీని అమలుపై సందిగ్దం కొనసాగుతోంది. చదవండి: ట్రంప్ మెగా బిల్లు.. ఎన్నారైలకు బిగ్ అలర్ట్మరోవైపు వివేక్ రామస్వామిని యాంకర్ బేబీ అంటూ అమెరికన్లు ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే సిన్సినాటిలో వివేక్ పుట్టేటప్పటికి ఆయన తల్లికి అమెరికా పౌరసత్వం లేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తాను పుట్టిన తర్వాత తన తల్లి పౌరసత్వ పరీక్ష రాసిందని, తన తండ్రి కూడా అప్పటికి అమెరికా పౌరుడు కాదని ఒప్పుకున్నారు. అయితే తన తల్లిదండ్రులు చట్టబద్ధంగా అమెరికాకు వలస వచ్చారని చెప్పారు. చట్టవిరుద్ధంగా అమెరికాలోకి ప్రవేశించిన తల్లిదండ్రుల పిల్లలకు జన్మతః పౌరసత్వం వర్తించదని, వర్తించకూడదని తాను భావిస్తున్నట్టు గతంలో వివేక్ రామస్వామి అన్నారు.The little guys get bigger every year. Happy Fourth! pic.twitter.com/IyfVeLewjx— Vivek Ramaswamy (@VivekGRamaswamy) July 4, 2025 -
వ్యాయామం తంటా లేకుండా ఆరోగ్యం!
ఆరోగ్యం.. కడుపులోని చల్ల కదలకుండా!ఊబకాయం తగ్గించుకునేందుకు..ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకూ..రకరకాల వ్యాయామాలు చేస్తున్న వారందరికీ ఓ గుడ్న్యూస్!ఈ తంటాలేవీ పడక్కరలేదు అంటున్నారు శాస్త్రవేత్తలు!ఎంచక్కా అప్పుడప్పుడూ ఓ మాత్ర వేసేసుకుంటే చాలని..వ్యాయామం చేస్తే వచ్చే లాభాలన్నీ వచ్చేస్తాయని చెబుతున్నారు!ఆ వివరాలేమిటో చూద్దామా?ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం.. అందుకు తగ్గట్టుగా తగిన వ్యాయామంతో శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడం.. ఈ ఆధునిక కాలంలో చాలామంది పాటించే సూత్రం. అయితే, కొంత మందికి వ్యాయామం ఎంత చేసినా.. ఎంతలా కడుపు కట్టుకున్నా ఒళ్లు తగ్గదు. ఆరోగ్య సమస్యలూ వీరిని పీడిస్తూంటాయి. ఇలాంటి వారికీ ఉపయోగపడే ఓ ప్రయోగాన్ని చేశారు చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు. బీట్రూట్, పాలకూర, గింజ ధాన్యాల్లో సహజంగా లభించే ఓ పదార్థం.. వ్యాయామం చేస్తే వచ్చే ఫలితాలను ఇస్తున్నట్లు గుర్తించారు. అంతేకాదు.. ఈ పదార్థం ద్వారా వయసుతోపాటు వచ్చే చాలా ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచవచ్చు అని తేలింది.శారీరక వ్యాయామం చేయకున్నా ఆ ఫలితాలన్నీ ఇచ్చే అద్భుతం కోసం శాస్త్రవేత్తలు ఒకవైపు పరిశోధనలు చేస్తూనే ఉండగా.. చైనా శాస్త్రవేత్తలు ఈ దిశగా ఒక అడుగు ముందుకు వేయగలిగారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్న వారిని పరిశీలించగా.. మిగిలిన వారితో పోలిస్తే వీరిలో బెటనైన్ అనే పదార్థం ఎక్కువ మోతాదులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది మూత్రపిండాల ద్వారా శరీరానికి అందుతుంటుంది. బెటనైన్ ఎలా ఉత్పత్తి అవుతుంది? ఎలా ఉపయోగపడుతుంది అని వివరంగా తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు.ఇందు కోసం కొంతమంది యువకులను ఎంచుకుని ఆరేళ్లపాటు పరిశీలించారు. వీరు రెండు రకాల వ్యాయామాలు చేసేవారు. కొందరు శారీరక దారుఢ్యానికి పరీక్ష పెట్టే ఎండ్యూరెన్స్ వ్యాయామాలు చేస్తుండగా.. మిగిలిన వారు ఎక్కువ శ్రమ ఉన్నవి చేస్తున్నారు. రెండింటివల్ల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో గుర్తించాలన్నది దీని ఉద్దేశం. ఆశ్చర్యకరంగా శరీర కణాల వయసు పెరగకుండా చేయడంలో మూత్రపిండాలు కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది!. ఎండ్యూరెన్స్ వ్యాయామాలు చేసే వారిలో కణాల వార్ధక్యం, మంట/వాపు మిగిలిన వారికంటే తక్కువగా ఉన్నట్లు తెలిసింది. శారీరక శ్రమ ఎక్కువగా ఉన్న వ్యాయామాలు చేస్తున్న వారిలో కణాలు ఒత్తిడికి గురవుతున్నట్లు స్పష్టమైంది.ఎండ్యూరెన్స్ వ్యాయామం చేస్తున్న వారిపై మరిన్ని పరిశోధనలు చేయడం ద్వారా రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేసే ఒక ప్రొటీన్ (ఈటీఎస్1) ఉత్పత్తి తగ్గినట్లు స్పష్టమైంది. అదే సమయంలో కిడ్నీల్లో బెటనైన్ తయారవడం ఎక్కువైంది. వయసు ఎక్కువగా ఉన్న వారు వ్యాయామం చేసిన తరువాత రక్తంలో బెటనైన్ ఎక్కువగా ఉన్నట్లు, ఈ పదార్థం కండరాల శక్తి, జీవక్రియలు, కణంలో చక్కెరలను శక్తిగా మార్చే మైటోకాండ్రియాల ఆరోగ్యం మెరుగైనట్లు తెలిసింది. దీంతో వ్యాయామంతో వచ్చే ప్రయోజనాల వెనుక బెటనైన్ ఉందని స్పష్టమైంది.ఎలుకలకు ఇచ్చి చూశారు..తమ అంచనాలను నిర్ధారించుకునేందుకు శాస్త్రవేత్తలు వయసు మళ్లిన ఎలుకలకు నిర్దిష్ట మోతాదుల్లో బెటనైన్ అందించారు. ఆ తరువాత పరిశీలించినప్పుడు వ్యాయామం చేస్తే వచ్చే లాభాలన్నీ వాటిల్లోనూ కనిపించాయి. అంటే కండరాలు గట్టిపడ్డాయి, ఎక్కువ కాలం శ్రమను ఓర్చుకోగలిగాయి. మంట/వాపు వంటివి తగ్గాయి అన్నమాట!. కణజాలం పునరుత్పత్తి కూడా వేగంగా జరుగుతున్నట్లు తెలిసింది. ‘వ్యాయామం చేయడం వల్ల ముందుగా శరీరంలో మంట/వాపు వస్తాయి. ఒత్తిడి కూడా పెరుగుతుంది. అలాగే కొనసాగిస్తే.. ఇవి తగ్గిపోతాయి. కిడ్నీ ద్వారా ఉత్పత్తి అయ్యే బెటనైన్ తగ్గిస్తుంది’ అని ఈ ప్రయోగాల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త లియు గువాంగ్హూయి తెలిపారు. మొత్తమ్మీద విషయం ఏమిటంటే.. వ్యాయామం అప్పుడప్పుడు చేయడం కాకుండా.. క్రమం తప్పకుండా చేయాలి అని!!. అలాగే బెటనైన్ సమృద్ధిగా లభించే ఆహార పదార్థాలు తినడమూ శరీరానికి మేలు చేస్తుందన్నమాట!. లేదా.. మరిన్ని పరిశోధనల తరువాత బెటనైన్ సప్లిమెంట్లు మార్కెట్లోకి వచ్చినప్పుడు వాటిని రోజూ తీసుకోవచ్చు!!.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా. -
ఒకే కాన్పులో పుట్టిన 9 మంది చిన్నారుల.. నాలుగో హ్యాపీ బర్త్ డే
ఈవిడ ఎవరన్నది మీరు మర్చిపోయి ఉంటారు.. నాలుగేళ్ల క్రితం మీడియాలో మార్మోగిన పేరు.. హలీమా.. గంపెడు సంతానానికి కేరాఫ్ అడ్రస్. ఈ పిల్లలూ మామూళోళ్లు కారు.. రికార్డు బ్రేకింగ్ పిల్లలు. నాలుగేళ్ల క్రితం ఒకే కాన్పులో 9 మందికి జన్మనిచ్చి.. మాలీ దేశానికి చెందిన హలీమా గిన్నిస్ రికార్డు సాధించారు. 9 మంది పుట్టడం రికార్డైతే.. అందరూ బతికిబట్టకట్టడం.. ఇదిగో ఇప్పుడిలా నాలుగో జన్మదినాన్ని జరుపుకోవడం అరుదైన విషయమేకదా.. ఈ సందర్భంగా తండ్రి అర్బీ, తల్లి హలీమాతో వారు దిగిన ఈ ఫొటోను గిన్నిస్ బుక్ తన వెబ్సైట్లో షేర్ చేసుకుంది. సర్పానికి చికిత్స అచ్చంపేట రూరల్: గాయపడిన ఒక సర్పానికి వెటర్నరీ వైద్యుడు చికిత్స చేశారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం లింగోటం సమీపంలోని కోళ్లఫారం వద్ద కొన్నిరోజులుగా పెద్ద పాము సంచరిస్తుండడంతో.. యజమాని స్నేక్క్యాచర్ సుమన్కు సమాచారం అందించాడు. శుక్రవారం కోళ్లఫారం వద్ద పామును పట్టుకునే క్రమంలో.. అతని వద్ద ఉన్న పరికరం గుచ్చుకుని పాముకి గాయమైంది. వెంటనే ఆయన పామును అచ్చంపేటలోని పశువుల ఆస్పత్రికి తీసుకురాగా.. వెటర్నరీ వైద్యుడు హరీశ్ చికిత్స చేశారు. అనంతరం పామును అడవిలో వదిలేశారు. -
అర్జెంటీనా చేరిన ప్రధాని మోదీ.. అధ్యక్షుడు జేవియర్ మిలేతో భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ భారత్-అర్జెంటీనాల సంబంధాలను బలోపేతం చేసే దిశగా తన వంతు ప్రయత్నాలను సాగిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన ఈరోజు (శనివారం) ఉదయం ఆయన అర్జెంటీనాకు చేరుకున్నారు. నేడు ఆయన అధ్యక్షుడు జేవియర్ మిలేతో సమావేశం కానున్నారు. ప్రస్తుతం ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటనలో ఉన్నారు. అర్జెంటీనాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆ రోజు సాయంత్రం ప్రధాని మోదీ అర్జెంటీనా నేషనల్ హీరో జనరల్ జోస్ డి శాన్ మార్టిన్ విగ్రహం వద్ద ఆయనకు నివాళులర్పించనున్నారు. అనంతరం అధ్యక్షుడు మిలే అందించే ఆతిథ్యం అందుకోనున్నారు. నగరంలోని ఐకానిక్ క్లబ్ బోకా జూనియర్స్ ఫుట్బాల్ స్టేడియంను కూడా ప్రధాని సందర్శించనున్నారు. అర్జెంటీనాలో ప్రధాని పర్యటన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని, పరస్పర సహకారానికి కొత్త మార్గాలను తెరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. Landed in Buenos Aires for a bilateral visit which will focus on augmenting relations with Argentina. I’m eager to be meeting President Javier Milei and holding detailed talks with him.@JMilei pic.twitter.com/ucdbQhgsUj— Narendra Modi (@narendramodi) July 5, 2025ఇరు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చలు.. వాణిజ్యం,పెట్టుబడి, ఆరోగ్యం, ఔషధాలు, రక్షణ, మౌలిక సదుపాయాలు, మైనింగ్, వ్యవసాయం, ఆహార భద్రత, గ్రీన్ ఎనర్జీ,డిజిటల్ ఆవిష్కరణ, విపత్తు నిర్వహణ తదితర విభిన్న రంగాలపై దృష్టి సారించనున్నాయి. అధ్యక్షుడు జేవియర్ మిలే ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ అర్జెంటీనాకు చేరుకున్నారు. గతంలో ఈ ఇద్దరు నేతలు 2024లో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో కలుసుకున్నారు. ఈ ఐదు దేశాల పర్యటనకు ముందు, ప్రధాని మోదీ.. అర్జెంటీనాను లాటిన్ అమెరికాలో కీలక ఆర్థిక భాగస్వామిగా, జీ20 సమూహంలో సన్నిహిత సహకారిగా అభివర్ణించారు. ప్రధాని ఈ అర్జెంటీనా పర్యటన అనంతరం 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు.ఇది కూడా చదవండి: మళ్లీ పాక్ అబద్ధం.. అజార్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నడంటూ.. -
బిడ్డను కంటే రూ.12 లక్షలిస్తాం
బీజింగ్: జననాల రేటు ఏటికేడు పడిపోతుండటంపై చైనాలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి బెంగపట్టుకుంది. ఇదే కొనసాగితే భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని భయపడుతోంది. అందుకే, కొత్త పథకంతో ముందుకు వచ్చింది. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ తర్వాత పుట్టే ప్రతి బిడ్డకు నెలకు 3,600 యువాన్లు(సుమారు రూ.42 వేలు) అందిస్తామని ప్రకటించింది.ఆ చిన్నారి తల్లిదండ్రులకు ఇలా మూడేళ్లపాటు మొత్తం రూ.12 లక్షలను చెల్లిస్తామని తెలిపింది. ఇందుకు సంబంధించిన పథకంపై భారీ ఎత్తున ప్రచారం చేస్తోందని బ్లూమ్బర్గ్ తెలిపింది. చైనా ప్రభుత్వం దశాబ్దాలపాటు కొనసాగించిన ఒకే సంతానం విధానానికి 2016లో ముగింపు పలికింది. ఆ తర్వాత కూడా దంపతులు ఒకరికి మించి సంతానాన్ని కనేందుకు మొగ్గు చూపక పోవడంతో చైనా ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. -
మళ్లీ పాక్ అబద్ధం.. అజార్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నడంటూ..
న్యూఢిల్లీ: భారతదేశ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులలో ఒకడైన మసూద్ అజార్ ఎక్కడున్నాడనే విషయంపై పాక్ మరోమారు కల్లబొల్లి కబుర్లు చెప్పింది. అజార్ గురించి తమకేమీ తెలియదని వివరించే ప్రయత్నం చేసింది. కాగా భారత్.. ఆపరేషన్ సింధూర్ నిర్వహిస్తున్న సమయంలో అజార్తో పాటు అతని సంస్థ జైష్-ఎ-ముహమ్మద్ ప్రధాన కార్యాయాన్ని టార్గెట్ చేసింది. తాజాగా పాక్ సంకీర్ణ నేత బిలావల్ భుట్టో జర్దారీ ఉగ్రవాది మసూద్ అజార్కు సంబంధించిన సమాచారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మసూద్ అజార్ 2001లో భారత పార్లమెంటుపై దాడి, 26/11 ముంబై దాడులు, 2016 పఠాన్కోట్ దాడి, 2019లో జరిగిన పుల్వామా దాడిలో పాల్గొన్నాడు. 2019లో ఐక్యరాజ్యసమితి.. అజార్ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించింది. 1999లో కాందహార్ హైజాక్ తర్వాత ప్రయాణీకులకు బదులుగా అతన్ని విడుదల చేశారు. కాగా అజార్, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్లను అప్పగించాలని భారతదేశం ఎప్పటినుంచో పాకిస్తాన్ను డిమాండ్ చేస్తూ వస్తోంది. పాక్లో మసూద్ అజార్ తలదాచుకుంటున్నాడనే ఆధారాలు ఉన్నప్పటికీ పాకిస్తాన్ తనకేమీ తెలియదంటూ కల్లబొల్లి మాటలు చెబుతోంది.తాజాగా అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అధినేత బిలావల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ.. జైష్ ఎ మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ఎక్కడ ఉన్నాడో పాకిస్తాన్కు తెలియదని, అతను ఇక్కడే ఉన్నాడని భావిస్తున్న భారత్.. అతనిని అరెస్టు చేయాలని అనుకుంటోందని అన్నారు. సయీద్ స్వేచ్ఛగా ఉన్నాడా? అని ఆయనను మీడియా అడగగా.. దీనికి ఖచ్చితంగా అవునని సమాధానం చెప్పలేమని, అతను పాకిస్తాన్ అదుపులో లేడని, తాము అతనిని అరెస్టు చేయలేకపోయామని, ఎక్కడున్నాడో కూడా గుర్తించలేకపోయామని కూడా భుట్టో అన్నారు. అయితే అతని గత చరిత్రను అనుసరించి చూస్తే, ప్రస్తుతం మసూద్ అజార్ ఆఫ్ఘనిస్తాన్లో తలదాచుకున్నడని భావిస్తున్నామని అన్నారు.పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్ల అనంతరం భుట్టో చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ పలు ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. వాటిలో మురిద్కేలోని లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం, బహవల్పూర్లోని జైషే-ఏ-మహ్మద్ ప్రధాన కార్యాలయం ఉన్నాయి. కాగా భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పీపీపీ చీఫ్ స్పందిస్తూ, పాకిస్తాన్కు సింధు నీటిని నిరాకరిస్తే యుద్ధానికి దిగుతామని హెచ్చరించారు. సింధు నది తమదేనని ఆయన అన్నారు. -
వైట్హౌస్లో సందడి.. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై ట్రంప్ సంతకం
వాషింగ్టన్: అమెరికాలో ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంతకం చేశారు. దీంతో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టంగా మారింది. వైట్హౌస్ వేదికగా రిపబ్లికన్ సభ్యులు, అధికారుల సంబురాల మధ్య ట్రంప్.. ఈ బిల్లుపై సంతకం పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ట్రంప్ మద్దతుదారులు, మిత్రపక్షాలు, మిలిటరీ కుటుంబాలు, వైట్హౌస్ సిబ్బంది తరలివచ్చారు.అనంతరం, వైట్హౌస్లో ట్రంప్ మాట్లాడుతూ.. ఈ చట్టంతో అందరికీ లబ్ధి జరుగుతుంది. సాయుధ బలగాల నుంచి మొదలు రోజూవారీ కార్మికుల వరకు కొత్త చట్టం మద్దతుగా ఉంటుంది. అమెరికా చరిత్రలోనే మా ప్రభుత్వం అతిపెద్ద పన్నుకోత, వ్యయకోత, సరిహద్దు భద్రతలో అతిపెద్ద పెట్టుబడి సాధించిది. అమెరికా ప్రజలు ఇంత ఆనందంగా ఉండటం గతంలో నేను ఎప్పుడూ చూడలేదు. ఈ బిల్లు ఆమోద ప్రక్రియలో మద్దతుగా నిలిచిన ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్కు, సెనెట్ మెజారిటీ లీడర్ జాన్ థునెకు ధన్యవాదాలు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. SIGNED. SEALED. DELIVERED. 🧾🇺🇸President Trump’s One Big Beautiful Bill is now LAW — and the Golden Age has never felt better. pic.twitter.com/t0q2DbZLz5— The White House (@WhiteHouse) July 4, 2025ఇదిలా ఉండగా.. ప్రభుత్వ వ్యయాన్ని తీవ్రంగా తగ్గించడం, వలస చట్టాలను అమలు చేయడానికి కావాల్సిన కఠినమైన కొత్త విధానాలకు నిధులు సమకూర్చడం, పలు పన్ను కోతలను శాశ్వతం చేయడం వంటివి వన్ బిగ్ బ్యూటిఫుల్ చట్టంలో ఉన్నాయి. ఈ బిల్లుపై ఇటీవల సెనెట్లో సుదీర్ఘ చర్చ సాగింది. ముగ్గురు రిపబ్లికన్లు వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ 51-50 తేడాతో అక్కడ ఆమోదం లభించింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ టై బ్రేకర్గా మారి బిల్లును గట్టెక్కించారు. అనంతరం ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. సుదీర్ఘ చర్చ అనంతరం జరిగిన ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 218, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. ప్రతినిధుల సభలో బిల్లును ఇద్దరు రిపబ్లికన్లు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. 🚨 NOW: President Trump and our INCREDIBLE First Lady Melania share a kiss on the White House balcony as the crowd chants “FOUR MORE YEARS!”What an EPIC day for our country!And THE BEST IS YET TO COME! 🇺🇸💥 pic.twitter.com/XSmJ8S9Ud4— Nick Sortor (@nicksortor) July 5, 2025మరోవైపు.. వైట్హౌస్లో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై ట్రంప్ సంతకం చేస్తున్న సందర్భంగా అక్కడ అమెరికా స్టెల్త్ బాంబర్లు, ఫైటర్ జెట్లు గగనతలంలో చక్కర్లు కొట్టాయి. కాగా, ఇటీవల ఇరాన్ అణుకేంద్రాలపై ఇవి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆకాశంలో ఫైటర్ జెట్లు చక్కర్లు కొడుతుండగా వైట్హౌస్ నుంచి ట్రంప్ వీక్షించారు. This angle of the B-2 and F-35 flyover of the White House before Trump signs the One Big Beautiful Bill 🔥 pic.twitter.com/z5M8f4NVl4— johnny maga (@_johnnymaga) July 4, 2025ఇది కూడా చదవండి: వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు.. ఎన్నారైలకు అలర్ట్ -
షుగర్ డ్రింక్స్, మద్యం, పొగాకుపై... పన్నుల మోత మోగించండి!
నానాటికి మారుతున్న జీవన శైలి ప్రజలను రోగాల బారిన పడేస్తోంది. డయాబెటిస్, కేన్సర్వంటి దీర్ఘకాలిక వ్యాధులు పెరిగిపోతున్నాయి. వీటికి చెక్ పెట్టడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కొత్తరకం ప్రతిపాదన చేసింది. ‘‘చక్కెర పానీయాలు, మద్యం, పొగాకు ధరలు రాబోయే పదేళ్లలో కనీసం 50 శాతం పెరగాలి. వాటిపై ఆ మేరకు పన్నులు పెంచండి’’ అని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. స్పెయిన్లోని సెవిల్లెలో జరిగిన ఫైనాన్స్ ఫర్æ డెవలప్మెంట్ సమావేశం ఈ మేరకు సిఫార్సు చేసింది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను అరికట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. వాటిపై పన్నులను మరింతగా పెంచితే మధుమేహం, కేన్సర్ తదితర వ్యాధులకు కారణమయ్యే హానికరమైన ఉత్పత్తుల వాడకాన్ని బాగా తగ్గించవచ్చని డబ్ల్యూహెచ్ఓ భావిస్తోంది. ‘‘దేశాల దగ్గరున్న అత్యంత సమర్థమైన నియంత్రణ సాధనాల్లో పన్నులు ముఖ్యమైనవి. ప్రజారోగ్యమే లక్ష్యంగా చక్కెర పానీయాలు, మద్యం, పొగాకు వంటివాటి వాడకాన్ని పూర్తిగా తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది’’ అని డబ్ల్యూహెచ్ఓ హెల్త్ ప్రమోషన్, వ్యాధి నివారణ విభాగం అసిస్టెంట్ డెరెక్టర్ జనరల్ జెరెమీ ఫర్రార్ అన్నారు. ఆ దేశాల్లో సత్ఫలితం కొలంబియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ఈ దిశగా చేసిన ప్రయోగం మంచి ఫలితాలిచ్చింది. అదనపు పన్నులతో పొగాకు తదితరాల ధరలు విపరీతంగా పెరగడంతో వాటి వాడకం బాగా తగ్గింది. అయితే డబ్ల్యూహెచ్ఓ సిఫార్సులను పొగాకు తదితర పరిశ్రమలు వ్యతిరేకిస్తున్నాయి. ‘‘చక్కెర, తీపి పానీయాలపై పన్నుల వల్ల ఏ దేశంలోనూ ఆరోగ్య ఫలితాలు మెరుగుపడలేదు. ఊబకాయం వంటివి తగ్గలేదు. ఇలాంటి స్పష్టమైన ఆధారాలను డబ్ల్యూహెచ్ఓ విస్మరించడం ఆందోళనకరం’’ అని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆ‹ఫ్ బెవరేజెస్ అసోసియేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేట్ లోట్మాన్ విమర్శించారు. మరోవైపు, ఇది ప్రజారోగ్యం సాకుతో పన్నుల భారం పెంచే యత్నమని కూడా విమర్శలొస్తున్నాయి. పన్నులు పెంచడం ఆల్కహాల్ సంబంధిత హానిని నివారిస్తుందనడం పక్కదారి పట్టించడమేనని డిస్టిల్డ్ స్పిరిట్స్ కౌన్సిల్లో సైన్స్ అండ్ రీసెర్చ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమండా బెర్గర్ ఆందోళన వ్యక్తం చేశారు. కానీ బ్లూంబర్గ్, ప్రపంచ బ్యాంకు, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ మాత్రం పన్ను పెంపు ప్రతిపాదనను సమరి్థంచాయి. ఇందుకు ముందుకొచ్చే దేశాలకు తోడ్పడతామని చెప్పుకొచ్చాయి. 2012–22 మధ్య దాదాపు 140 దేశాలు పొగాకు ఉత్పత్తులపై పన్నులను 50 శాతం పైగా పెంచాయి. అల్ట్రా ప్రాసెస్డ్ ఆహార పదార్థాలపైనా పన్ను పెంచే యోచనలో ఉన్నాయి. భారత్లో ఇలా... భారత్లో కూడా కొవ్వు, చక్కెర, ఉప్పు అధికంగా ఉండే ఆహారాలపై ఆరోగ్య పన్ను విధించాలని వైద్య నిపుణుల నేతృత్వంలోని జాతీయ కన్సారి్టయం సూచించింది. అంతేగాక పిల్లల ఆహార పదార్థాల మార్కెటింగ్పై కఠినమైన నియమాలు విధించాలని కోరింది. భారత్లో కౌమార దశలో ఉన్నవారిలో ఊబకాయం బాగా పెరుగుతుండటంపై ఇండియన్ కౌన్సిల్ ఆ‹ఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆ‹ఫ్ న్యూట్రిషన్ ఆందోళన వ్యక్తం చేశాయి. యువత ఆహారపు అలవాట్లను మార్చడానికి, మెరుగుపరచడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. క్యాంటీన్లలో, విద్యా సంస్థల సమీపంలో కొవ్వు, చక్కెర, ఉప్పు అధికంగా ఉన్న ఆహార పదార్థాల విక్రయాన్ని నిషేధించాలని డిమాండ్ చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
6న దలైలామా 90వ జన్మదిన వేడుక
ధర్మశాల: టిబెటన్ల బౌద్ధ గురువు దలై లామా 90వ పుట్టిన రోజు వేడుకకు భారీగా ఏర్పాట్లు సాగుతున్నాయి. హిమాలయాల్లోని మెక్లియోడ్గంజ్ పట్టణంలోగల ప్రధాన దలై లామా ఆలయం ట్సుగ్లంగ్ఖంగ్కు కాషాయ వ్రస్తాలు ధరించిన బౌద్ధ భిక్షువుల తాకిడి పెరుగుతోంది. టిబెటన్ ప్రవాస ప్రభుత్వం ఇక్కడే కొలువై ఉన్నందున ఈ పట్టణాన్ని లిటిల్ లాసా అని కూడా పేర్కొంటారు. లామా పుట్టినరోజు వేడుకలతోపాటు ఇక్కడ పలు కార్యక్రమాలు జరగనున్నాయి. దలై లామా తదుపరి వారసుడిని సైతం ప్రకటించనున్నారు. దీంతో, ఇక్కడ జరిగే పరిణామాలను ప్రపంచమే ఆసక్తిగా గమనిస్తోంది. జూన్ 30వ తేదీ నుంచి ప్రారంభమైన వారోత్సవాల్లో మత సదస్సులు, యువజన వేదికలు, సామూహిక ప్రార్థనలు జరుగనున్నాయి. ఈ నెల 2 నుంచి 4వ తేదీ వరకు జరిగిన 15వ టిబెటన్ మత సదస్సుకు 100 మందికి పైగా టిబెటన్ బౌద్ధ నేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. అదేవిధంగా, 3– 5వ తేదీల్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ టిబెటన్ యూత్ ఫోరం సదస్సుకు 15 దేశాలకు చెందిన 100 మందికి పైగా తరలివచ్చారు. దలై లామా పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ నెల 5న ప్రవాసంలోని టిబెటన్ ప్రభుత్వ కేబినెట్ ‘కషగ్’ఆధ్వర్యంలో సామూహిక ప్రార్థనలు జరగనున్నాయి. ప్రధాన టిబెటన్ ఆలయంలో జరిగే ఈ కార్యక్రమానికి టిబెటన్ల తరఫున దలై లామా సైతం హాజరై ప్రార్థనల్లో పాల్గొంటారని సెంట్రల్ టిబెటన్ యంత్రాంగం తెలిపింది. టిబెటన్ల స్వాతంత్య్ర పోరాటాన్ని వివరించే షెన్పెన్ ఖిమ్సార్ దర్శకత్వం వహించిన ‘4 రివర్స్ 6 రేంజెస్’సినిమా ప్రదర్శన 5న సాయంత్రం ఉంటుందని పేర్కొంది. ప్రముఖులు హాజరు జూలై 6న 14వ దలై లామా 90వ పుట్టిన రోజు వేడుకలు జరగనున్నాయి. ప్రత్యేకంగా జరిగే ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, అరుణాచల్ సీఎం పెమా ఖండూ, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాల్, హాలీవుడ్ స్టార్ రిచర్డ్ గెరె తదితర ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా తదుపరి దలై లామాను సైతం ప్రకటిస్తారు. జూలై 7–9వ తేదీల్లో టిబెటన్ కళలు, వైద్యం, సాహిత్యం, మతం, విద్య సంబంధిత ప్రదర్శనలుంటాయి. వైద్య శిబిరం సైతం నిర్వహిస్తారు. టిబెటన్ బౌద్ధులు దలై లామాను బుద్ధుని సజీవ రూపంగా ఆరాధిస్తారు. దలై లామా వారసత్వం కొనసాగుతుందని, గడెన్ ఫొడ్రంగ్ ట్రస్ట్కు మాత్రమే భవిష్యత్తు లామాను నిర్ణయించే అధికారం ఉందని, ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోరాదని దలై లామా బుధవారం స్పష్టం చేయడం తెల్సిందే. అయితే, వారసుడి నిర్ణయంపై తమ అనుమతి తప్పక ఉండాల్సిందేనని చైనా వాదిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా పాలక కమ్యూనిస్ట్ పారీ్టతో టిబెటన్ బౌద్ధమతం దశాబ్దాలుగా సాగిస్తున్న పోరాటంలో నూతన అధ్యాయం మొదలుకానుంది. -
అలా తప్పించుకున్నారు!
టిబెట్ ఆధ్యాత్మిక గురువు, 14వ దలైలామా రేపు 90వ ఏట అడుగుపెట్టనున్నారు. ఆయన 66 ఏళ్లుగా భారత్లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. 23 ఏళ్ల వయసులో భారత్లో అడుగుపెట్టిన ఆయన మరిక తిరిగి టిబెట్ వెళ్లనే లేదు. టిబెటన్లు బుద్ధుని అంశగా భావించి ఆరాధించే దలైలామా భారత్కు ఎందుకు వచ్చారు? బుల్లెట్లను, ద్రోహాన్ని తప్పించుకుని ఒక యువ టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు మనద ఏశానికి ఎలా చేరుకున్నారు? గడ్డకట్టుకుపోయే వాతావరణంలో, కఠినమైన దారుల్లో రెండు వారాలు ఎలా ప్రయాణించారు? ఇది టిబెట్ రాజకీయ కల్లోలాన్ని తెలిపే కథ. అది 1950ల చివరి కాలం. చైనా ఆక్రమణలతో టిబెట్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. 1951లో బలవంతంగా సంతకం చేయించిన పదిహేడు పాయింట్ల ఒప్పందం, చైనా నియంత్రణలో ఉన్న టిబెటన్ ప్రజలకు మతపరమైన స్వయంప్రతిపత్తిని హామీగా ఇచ్చింది. కానీ స్వయంప్రతిపత్తి ఒక భ్రమ అని త్వరలోనే తెలిసొచ్చింది. 13వ దలైలామా ముందే చెప్పినట్టుగా టిబెట్పైనే కాదు, వారి మతంపైనా దాడి జరిగింది. చైనా సైనికులు టిబెట్ రాజధాని లాసాలో స్వేచ్ఛగా తిరుగడం, బౌద్ధ సన్యాసుల భూములను స్వా«దీనం చేసుకోవడంతో దలైలామా అధికారం క్షీణించడం ప్రారంభమైంది. రాజీ కోసం దలైలామా మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయతి్నంచినా లాభం లేకపోయింది. 1959 నాటికి, ప్రతిఘటనలు నిరసనగా మారాయి. తమ ఆధ్యాత్మిక గురువును నిర్బంధిస్తారని, లేదంటే చంపుతారని టిబెట్ ప్రజలు భయపడ్డారు. ఊహించనట్టుగానే లాసాను చైనా సైనిక దళాలు, ట్యాంకులు, ఫిరంగులు చుట్టుముట్టాయి. అదే రోజు, లాసాలో దలైలామాను అంగరక్షకులు లేకుండా వారి సైనిక ప్రధాన కార్యాలయంలో జరిగే నృత్య ప్రదర్శనకు హాజరు కావాలని చైనా జనరల్ కోరాడు. వేలాది మంది టిబెటన్లు వీధుల్లోకి వచ్చి, దలైలామా వేసవి రాజభవనమైన లాసాలోని నార్బులింగకా చుట్టూ మానవహారంంగా ఏర్పడ్డారు. రాజభవనంలో చర్చల తరువాత ఆ రాత్రి దలైలామా లాసాను విడిచి భారత్కు వెళ్లాలని నిర్ణయమైంది. మార్చి 17న పొగమంచు కమ్ముకున్న రాత్రి, ఎప్పుడూ మెరూన్ కలర్ దుస్తుల్లో ఉండే దలైలామా తనను ఎవరూ గుర్తు పట్టకుండా సైనికుడి యూనిఫాం ధరించారు. తల్లి, తోబుట్టువులు, ట్యూటరు, కొందరు విశ్వాసపాత్రులైన అధికారులు వెంట రాగా చీకటి నడుమ వెనుకద్వారం నుంచి రాజభవనాన్ని వీడారు. ౖచైనా సైన్యం చెక్పోస్టులను తప్పించుకుంటూ వారి బృందం ముందుకు నడిచింది. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ఎక్కువగా రాత్రిపూటే ప్రయాణించింది. చుషుల్, లోకా, కైచు లోయ గుండా, ఖెంజిమనే సమీపంలోని హిమాలయాలను దాటి, నేటి అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్కు చేరుకుంది. గడ్డకట్టుకుపోయే వాతావరణం. ఆహారం లేదు. పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. అయినా కెచు నది దాటి, ఎత్తైన లోయల గుండా, మఠాలు, తిరుగుబాటు శిబిరాల గుండా ముందుకు సాగారు. ఒకసారి చైనీస్ నిఘా విమానం వీరిపైనుంచే వెళ్లింది. కానీ దాన్నుంచి తప్పించుకున్నారు. ఎట్టకేలకు మార్చి 26న భారత సరిహద్దుకు మైళ్ల దూరంలో ఉన్న లుంట్సే జోంగ్కు చేరుకుంది. వెంటనే ప్రధాని నెహ్రూకు సమాచారం అందింది. అప్పటికే చైనా నుంచి హెచ్చరికలున్నప్పటికీ ఖాతరు చేయకుండా నెహ్రూ నిర్ణయాత్మకంగా వ్యవహరించారు. తవాంగ్ సమీపంలోని చుటాంగ్ము సరిహద్దు పోస్టుకు వెళ్లి, దలైలామా, ఇతర టిబెటన్ శరణార్థులకు స్వాగతం పలకాల్సిందిగా అస్సాం రైఫిల్స్ను ఆదేశించారు. మార్చి 31 నాటికి, దలైలామా, ఆయన పరివారం ఖెన్జిమనే పాస్ ద్వారా భారత్లోకి ప్రవేశించారు. భారత్, చైనాలను విడదీసే అంతర్జాతీయ సరిహద్దు మెక్మోహాన్ రేఖ సమీపంలో ఒక చిన్న పోస్ట్ వద్ద అస్సాం రైఫిల్స్కు చెందిన భారత జవాను హవల్దార్ నరేన్ చంద్ర దాస్ కంటికి అలసిపోయి, నలిగిన దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి సమీపించడం కనిపించింది. ఆయనే 14వ దలైలామా అని ఆయనకే కాదు.. చాలామంది భారతీయులకు తెలియదు. అలా దలైలామా భారత్లో అడుగు పెట్టారు. ఆ వెంటనే, ‘టిబెటన్ ఆధ్యాత్మిక నాయకునికి భారత్లో ఉండేందుకు స్వాగతం’అంటూ నెహ్రూ నుంచి సందేశం వచ్చింది. దాస్తో పాటు ఇతర అస్సాం రైఫిల్స్ సిబ్బంది దలైలామా, ఆయన పరివారాన్ని తవాంగ్కు తీసుకెళ్లారు. అక్కడ వారికి వైద్యం అందించారు. తరువాత కొన్ని నెలలు ఆయన ముస్సోరీలో ఉన్నారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలకు వెళ్లారు. అప్పటినుంచీ అదే టిబెటన్ల ప్రవాస ప్రభుత్వ కేంద్రంగా మారింది. స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నా దలైలామా సాహసోపేత భారత యాత్రకు ఆరు దశాబ్దాలు నిండాయి. ‘నేను శరణార్థిని. అయినా భారత్లో స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నాను’అని దలైలామా అనేక సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు. అంతేకాదు, భారత్లో తనకు స్వాగతం పలికిన హవల్దార్ నరేన్ చంద్ర దాస్ను 2017లో కలిసి భావోద్వేగానికి లోనయ్యారు కూడా! అప్పటికి దాస్కు 79 ఏళ్లు కాగా దలైలామాకు 81 ఏళ్లు. ‘‘నేను కూడా వృద్ధుడిని అయ్యానని మీ ముఖం చూస్తుంటే నాకర్థమైంది. 58 ఏళ్ల కిందట నాకు భారత్లో రక్షణగా నిలిచినందుకు ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది’’అంటూ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. దలైలామాను అనుసరించి చాలామంది టిబెట్ను విడిచి భారత్కు చేరారు. కానీ టిబెట్ సమస్యకు ఇప్పటికీ పరిష్కారం లభించలేదు. 60 ఏళ్లకిందట ౖసైనికుడి వేషంలో దలైలామా భారత్లో అడుగుపెట్టినప్పుడు టిబెట్ పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. లక్షలాది మంది టిబెటన్ల రాజకీయ, మత, సాంస్కృతికి జీవితాలపై ఇప్పటికీ కత్తి వేలాడుతూనే ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంతరిక్షం నుంచి భూమిని వీక్షించడం అద్భుత అనుభూతి
న్యూఢిల్లీ: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో వారం రోజులు పూర్తి చేసుకున్నారు. సహచర వ్యోమగాములతో కలిసి ఇప్పటికే భూమిని 113 సార్లు చుట్టేశారు. 40.66 లక్షల కిలోమీటర్లు ప్రయాణించారు. ఇది భూమికి, చంద్రుడికి మధ్యనున్న దూరానికి 12 రెట్ల దూరంతో సమానం. ఐఎస్ఎస్లో తన అనుభవాన్ని శుభాంశు శుక్లా శుక్రవారం పంచుకున్నారు. మన భారతీయ ఆమ్ రస్, గాజర్కా హల్వా, మూంగ్దాల్ హల్వా రుచులు ఆస్వాదిస్తున్నానని, వాటిని సహచరులతో పంచుకుంటున్నానని చెప్పారు. ఇతర దేశాల వంటకాలను సైతం రుచి చూస్తున్నానని తెలిపారు. ఆయన తన కుటుంబ సభ్యులు, మిత్రులతో ఐఎస్ఎస్ నుంచి సంభాషించారు. అలాగే హామ్ రేడియో ద్వారా బెంగళూరులోని యూఆర్ఎస్సీ సైంటిస్టులతో మాట్లాడారు. ఇక్కడంతా అద్భుతంగా ఉందని, తామంతా చక్కగా కలిసి ఉంటున్నామని పేర్కొన్నారు. వేర్వేరు దేశాలకు చెందిన ఆహార పదార్థాలను ఒకరికొకరం పంచుకుంటున్నామని వెల్లడించారు. వేర్వేరు దేశాల వ్యక్తులతో కలిసి పని చేయడం ఉత్సాహకరమైన అనుభవమని వ్యాఖ్యానించారు. అన్నింటికంటే ముఖ్యంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి మన భూగోళాన్ని కళ్లారా వీక్షించడం మాటల్లో చెప్పలేని అద్భుత అనుభూతిని ఇస్తోందని వివరించారు. అత్యంత ఎక్కువ కాలం అంతరిక్షంలో గడిపిన మొట్టమొదటి భారతీయ వ్యోమగామిగా శుభాంశు శుక్లా గురువారం సరికొత్త రికార్డు సృష్టించారు. 1984లో రాకేశ్ శర్మ ఏడు రోజుల 21 గంటల 40 నిమిషాలు అంతరిక్షంలో గడిపారు. శుభాంశు శుక్లా ఆ రికార్డును అధిగమించారు. -
7 గంటలు.. 550 డ్రోన్లు
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్ లక్ష్యంగా రష్యా మరోసారి భీకర దాడులకు తెరతీసింది. గురువారం రాత్రి కేవలం 7 గంటల వ్యవధిలో 550 వరకు డ్రోన్లు, 11 క్షిపణులను ప్రయోగించింది. రష్యా మూడేళ్ల క్రితం ఉక్రెయిన్పై దురాక్రమణ ప్రారంభించాక చేపట్టిన అతిపెద్ద దాడి ఇదేనని చెబుతున్నారు. షహీద్ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణుల పేలుళ్ల మోతలతో కీవ్ దద్దరిల్లింది. సైరన్లు రాత్రంగా మోగుతూనే ఉన్నాయి. కీవ్లో ఐదంతస్తుల నివాస భవనం పాక్షికంగా ధ్వంసం కాగా, ఏడంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఒక గోదాము, ఒక గ్యారేజీ, ఆటో రిపేర్ కేంద్రం సైతం మంటల్లో చిక్కుకున్నాయి. కీవ్లోని రైల్వే వ్యవస్థ దెబ్బతిందని అధికారులు తెలిపారు. తెల్లారేసరికి కీవ్ రోడ్లన్నీ ధ్వంసమైన, కాలిపోయిన వాహనాలు, భవనాల వ్యర్థాలతో నిండిపోయాయి. ఈ దాడుల్లో 23 మంది గాయపడినట్లు సమాచారం. ‘మా ప్రజలు కఠినమైన, నిద్ర లేని రాత్రి గడిపారు’అని అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. ప్రజలు మెట్రో స్టేషన్లు, బేస్మెంట్లు, భూగర్భ పార్కింగ్ గ్యారేజీల్లోకి పరుగులు తీశారని ఉక్రెయిన్ మంత్రి యూలియా తెలిపారు. కీవ్తోపాటు మరో ఐదు ప్రాంతాలపైకి రష్యా దాడులు చేసిందని జెలెన్స్కీ చెప్పారు. తాము 270 డ్రోన్లను కూల్చివేశామని ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో సంభాషణ జరిపిన రోజే తాజా దాడి జరగడం గమనార్హం.యుద్ధం ఆపుతాడని అనుకోవడం లేదు:ట్రంప్రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్ సంభాషణ అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడారు. కాల్పుల విరమణపై పుతిన్ సానుకూలంగా స్పందించారా అన్న ప్రశ్నకు ఆయన.. లేదు. ఈ విషయంలో ఎలాంటి పురోగతి సాధించలేదు. ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న దాడులపై నాకు సంతోషంగా లేదు. ఈ యుద్ధాన్ని పుతిన్ ఆపుతారని నేను అనుకోవడం లేదు’అని వ్యాఖ్యానించారు. -
భూమిపైకి కుసుమ ఖడ్గం
వాషింగ్టన్: అంతరిక్షంలో పుట్టుకొచ్చిన ఎర్రని కాంతి మొలకలా, అప్పుడే విచ్చుకుంటున్న కలువ పువ్వులా ఉంది కదూ! కానీ నిజానికది భూమిపైకి అమాంతంగా దూసుకొస్తున్న కాంతి ఖడ్గం! ఉరుములు మెరుపులతో కూడిన తుఫానుకు కారణమయ్యే మేఘాల పై ఆవరణలో, అంటే మిసోస్ఫియర్లో పిడుగుపాట్లు సంభవిస్తే ఇలాంటి కాంతిపుంజాలు ఏర్పడుతుంటాయి. వీటిని ట్రాన్సియెంట్ ల్యూమినస్ ఈవెంట్ (టీఎల్ఈ) చెబుతుంటారు. సాధారణంగా వీటిని భూమిపై నుంచి చూడడం కష్టం. అంతరిక్షం నుంచి మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి. ఈ ఫొటోను వ్యోమగామి నికోల్ వేపర్ అయెర్స్ శుక్రవారం ఉదయం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి తీశారు. మెక్సికో, అమెరికా మీదుగా ఐఎస్ఎస్ ప్రయాణిస్తున్న సమయంలో ఈ దృశ్యాన్ని కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘భూమిపై కాంతి స్తంభం’’గా దీన్ని అభివర్ణించారు. ఇదిప్పుడు శాస్త్ర, సాంకేతిక ప్రపంచాన్ని ఎంతగానో అబ్బురపరుస్తోంది. వీటిని సాంకేతిక భాషలో స్ప్రైట్ లైట్నింగ్ బోల్డ్ (ఎస్ఎల్బీ) అంటారు. సాధారణ పిడుగుపాట్లు మేఘాల నడుమ, లేదంటే మేఘాలకు, నేలకు నడుమ పడుతుంటాయి. ఈ ఎస్ఎల్బీలు మాత్రం మెసోస్పియర్లోని పలుచని ఆవరణలోనే పేలిపోతాయి. తద్వారా ఇలాంటి ఎర్రని ‘మొలకలు’ పుట్టుకొస్తుంటాయి. -
ఆకాశం సైతం హద్దు కాదు
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత్ త్వరలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం తథ్యమని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టంచేశారు. తమ దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత బలంగా ఉందని పేర్కొన్నారు. కృత్రిమ మేధ(ఏఐ), సెమీకండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో ఇండియా శరవేగంగా దూసుకెళ్తోందని, అవి సరికొత్త గ్రోత్ ఇంజన్లుగా మారాయని వెల్లడించారు. ఆయన స్థానిక కాలమానం ప్రకారం గురువారం కరీబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలోని కౌవా పట్టణంలో ప్రవాస భారతీయుల కార్యక్రమంలో ప్రసంగించారు. ఇండియా నేడు అవకాశాల గనిగా మారిందని, అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరుతున్నాయని పేర్కొన్నారు. నవ భారతదేశానికి ఆకాశం సైతం హద్దు కాదని వ్యాఖ్యానించారు. ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని భారతీయులు వారి సొంత భూమిని వదిలేసి వచ్చినప్పటికీ భారతీయ ఆత్మను మాత్రం వదులుకోలేని చెప్పారు. గంగా, యమున నుంచి దూరంగా వచ్చారు గానీ రామాయణాన్ని హృదయంలోనే నిలుపుకున్నారని ప్రశంసించారు. ప్రవాస భారతీయులు కేవలం వలసదారులు కాదని.. గొప్ప నాగరికతకు దూతలు అని తెలి పారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే... ‘‘ప్రవాస భారతీయుల సేవలు ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ ప్రగతికి తోడ్పడుతున్నాయి. సాంస్కృతికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా వారు ఎంతో సేవ చేస్తున్నారు. ఇక్కడ ప్రవాస భారతీయుల ప్రభావం ఎలా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. అయోధ్య రామమందిర నమూనా, సరయూ నది జలాలను, మహాకుంభమేళా జరిగిన త్రివేణి సంగమం నీటిని ఇక్కడికి నాతోపాటు తీసుకొచ్చా. అందుకు ఎంతగానో గర్విస్తున్నా. ఈ పవిత్ర జలా లను ఇక్కడి గంగాధారలో చల్లాలని ప్రధానమంత్రి కమలకు విజ్ఞప్తి చేశా. ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రజలకు ఇదొక ఆశీర్వచనం అవుతుంది. భారత్ ప్రగతికి యువతే చోదక శక్తి పేదల అభివృద్ధి, సాధికారతకు పెద్దపీట వేయడం ద్వారా పేదరికాన్ని ఓడించవచ్చని భారత్ నిరూపించింది. పేదరికం నుంచి దేశానికి పూర్తిగా విముక్తి కల్పించవచ్చన్న విశ్వాసాన్ని పెంచాం. ఇండియా ప్రగతికి శక్తిసామర్థ్యాలు కలిగిన యువతే చోదక శక్తిగా నిలుస్తోంది. నేడు ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ ఇండియాలోనే ఉంది. ఇందులో సగం స్టార్టప్లకు మహిళలే డైరెక్టర్లుగా పనిచేస్తున్నారు. 120 స్టార్టప్లు యూనికార్న్ స్థాయికి ఎదిగాయి. ప్రపంచంలోని మొత్త యూపీఐ చెల్లింపుల్లో 50 శాతం ఇండియాలోనే జరుగుతున్నాయి. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో కొత్తగా యూపీఐ చెల్లింపుల వ్యవస్థ ప్రారంభించినందుకు అభినందనలు తెలియజేస్తున్నా. గుడ్ మారి్నంగ్ అని మెసేజ్ పంపించుకున్నంత సులువుగా డబ్బులు పంపించుకోవచ్చు. వెస్టిండీస్ బౌలింగ్ కంటే కూడా ఇది స్పీడ్గా ఉంటుందని నేను ప్రామిస్ చేస్తున్నా’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదానికి ఆశ్రయం ఇవ్వద్దుపోర్ట్ ఆఫ్ స్పెయిన్: ఉగ్రవాదానికి మానవాళికి శత్రువుగా మారిందని, దానికి ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరూ ఆశ్రయం ఇవ్వొద్దని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని కలిసికట్టుగా ఎదిరించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఆయన శుక్రవారం ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశమని వెల్లడించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము సాగిస్తున్న పోరాటానికి ఈ దేశం మద్దతిస్తోందని, అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రభుత్వం తమ అత్యున్నత పురస్కారం ‘ద ఆర్డర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో’తో నరేంద్ర మోదీని సత్కరించింది.బిహార్ వారసత్వం గర్వకారణం ట్రినిడాడ్ అండ్ టొబాగోకు ఇండియాలోని బిహార్ రాష్ట్రంతో చక్కటి అనుబంధం ఉందని నరేంద్ర మోదీ చెప్పారు. బిహార్ వారసత్వం భారతదేశానికి, ప్రపంచానికి గర్వకారణమని అన్నారు. ఇక్కడున్న చాలామంది భారత సంతతి ప్రజల పూర్వీకులు బిహార్ నుంచి వచ్చినవారేనని తెలిపారు. బిహార్కు ఘనమైన వారసత్వం ఉందని పేర్కొన్నారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి కమలా పెర్సాద్ బిసెసార్ పూర్వీకులు సైతం బిహార్కు చెందినవారేనని చెప్పారు. ఆమె బిహార్ను సందర్శించారని, భారతీయులు ఆమెను ‘బిహార్ బిడ్డ’గా పిలుస్తుంటారని అన్నారు. భారత్, ట్రినిడాడ్ అండ్ టొబాగో మధ్య బలమైన సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. బిహార్కు చెందిన భోజ్పురి భాషను ట్రినిడాడ్ అండ్ టొబాగోలో కూడా చాలామంది మాట్లాడుతుంటారని వివరించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు.మోదీకి సంప్రదాయ స్వాగతం ఘనా నుంచి ట్రినిడాడ్ అండ్ టొబాగో చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. దేశ ప్రధానమంత్రి కమలా పెర్సాద్ బిసెసార్తోపాటు మంత్రులు, అధికారులు ఆయనకు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. భారత సంతతికి చెందిన కమలా పెర్సాద్ బిసెసార్ ఈ సందర్భంగా భారతీయ సంప్రదాయ చీర ధరించారు. అనంతరం ప్రవాస భారతీయుల సమావేశంలో మోదీతోపాటు ఆమె పాల్గొన్నారు. ‘బిహార్ కీ బేటీ’ అంటూ కమలపై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ రాసిన పుస్తకంలోని ‘ఆంఖ్ కా ధన్యా చే’ పద్యాన్ని కమల ఆలపించి అందరినీ ఆశ్చర్యపర్చారు. భారత్ నుంచి తీసుకొచ్చిన పవిత్ర గంగాజలాన్ని ఆమెకు మోదీ బహూకరించారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా కమలా పెర్సాద్ బిసెసార్ రికార్డుకెక్కారు. -
పెళ్లైన 18 ఏళ్ల నిరీక్షణకు తెర.. AIతో తల్లిదండ్రులు కాబోతున్న జంట!
వాషింగ్టన్: వైద్య చరిత్రలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) అద్భుతం చేసింది. పెళ్లైన 18 ఏళ్ల తర్వాత మహిళ గర్భం దాల్చేందుకు దారి చూపించింది. త్వరలో ఆమె అమ్మ కాబోతుంది. అంతేకాదు స్టార్ పద్ధతిలో గర్భం దాల్చిన ప్రపంచంలో తొలి మహిళగా చరిత్రలో నిలిచారు. ఇంతకీ ఆ ఎవరా? తల్లి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మాత్రమే కాదు. మానవ జీవితాల్లో పెనుమార్పులు తెస్తున్న అద్భుత సాధనం. ఏఐతో ఉద్యోగాలకు ఎసరు అని అనుకునే వారికంటే దాని వల్ల మా జీవితాలే మారిపోయాయని సంతోషపడే వారు కోకొల్లలు. అలాంటి వారిలో ఈ మహిళ ఒకరు. వ్యక్తిగత భద్రత దృష్ట్యా ఆమె పేరు బహిర్గతం చేయలేదు.వివరాల్లోకి వెళితే.. వాళ్లిద్దరూ భార్య,భర్తలు. వివాహం జరిగి 18 ఏళ్లవుతుంది. సంతనాలేమి సమస్యతో బాధపడుతున్నారు. సంతానం కోసం ఎక్కని గుడి లేదు. మొక్కని దేవుడు లేడు. సంతానం కోసం ఎన్ని ప్రయత్నాలో చేయాలో అన్నీ చేశారు. గతంలో అనేక సార్లు ఐవీఎఫ్ (In Vitro Fertilization) ద్వారా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం విఫలమైంది. కారణం? ఆమె భర్త అజోస్పెర్మియా అనే అరుదైన సమస్యతో బాధపడుతున్నారు. అంటే వీర్యంలో స్పెర్మ్ కనిపించకపోవడం అన్నమాట.అయితే, ఈ నేపథ్యంలో ఆ దంపతులు కొలంబియా యూనివర్సిటీ ఫెర్టిలిటీ సెంటర్ను ఆశ్రయించారు. అక్కడ స్టార్(Sperm Tracking and Recovery) అనే ఏఐ ఆధారిత పద్ధతిని ఉపయోగించారు.ఈ పద్దతిలో ఏఐ గంటలో 8 మిలియన్లకు పైగా చిత్రాలను స్కాన్ చేసి, మానవ కంటికి కనిపించని 44 స్పెర్మ్లు గుర్తించింది.అలా గుర్తించిన స్పెర్మ్లను ఉపయోగించి ఐవీఎఫ్ ద్వారా గర్భధారణ జరిపారు. ఈ స్టార్ పద్ధతిలో గర్భం దాల్చిన ప్రపంచంలో తొలి మహిళగా ఆమె చరిత్రలో నిలవడం గమనార్హం. ఏఐ ఎలా పనిచేస్తుంది?వైద్యులు స్పెర్మ్ నమూనాను ఒక ప్రత్యేక చిప్పై ఉంచి హై-పవర్డ్ ఇమేజింగ్ ద్వారా స్కాన్ చేస్తారు. ఏఐ అల్గోరిథం స్పెర్మ్ ఆకారాన్ని, కదలికలను గుర్తించి వాటిని వేరు చేస్తుంది. ఇది సూక్ష్మతతో కూడిన, వేగవంతమైన ప్రక్రియ, మానవ నిపుణులు రెండు రోజులు వెతికినా కనిపించని స్పెర్మ్లను ఏఐ ఒక గంటలో కనిపెట్టగలిగింది.వైద్య చరిత్రలో గేమ్ చేంజర్ఈ స్టార్ టెక్నాలజీని అభివృద్ధి చేసిన డాక్టర్ జెవ్ విలియమ్స్ మాట్లాడుతూ..‘ఇది గేమ్ చేంజర్. అమ్మ తనాన్ని నోచుకోలేక ఇబ్బందులు పడుతున్న ఎంతో మంది తల్లులకు ఈ ఏఐ టెక్నాలజీ ఓ వరం’ అని అన్నారు.కాగా, ప్రస్తుతం ఈ విధానం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది, కానీ భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని టెక్నాలజీ నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. ఇలా ఏఐ కేవలం యంత్రాల మేధస్సు కాదు, అది మనిషి ఆశలకు రూపం కూడా కావచ్చనే నానుడిని నిజం చేసింది. -
Video: తప్పించుకుని వచ్చిన పెంపుడు సింహం.. జనాలపై దాడి
లాహోర్: పెంపుడు జంతువుల్లో మనం ఎక్కువగా చూసేది కుక్క. ఈ మధ్య క్రూర మృగాలను కూడా పెంచుకుంటున్న వారు కూడా లేకపోలేదు. క్రూర మృగాలను పెంచుకుంటే ఏమౌతుందో తాజా ఘటనతో అద్దం పడుతోంది,. పాకిస్తాన్లో ఓ కుటుంబం సింహాన్ని పెంచుకుంటుంది. ఇది వారి రాయల్టీకీ సింబాలిక్ ఏమిటో గానీ, ఇప్పుడు అదే సింహం ఇద్దరు చిన్నారుల జీవితాలను ప్రమాదంలో పడేసింది. సదరు ఇంటి నుంచి తప్పించుకుని వచ్చిన సింహం.. వీధుల్లో పడింది. తొలుత తప్పించుకున్న సింహం ఓ గొడపై మాటువేసి మరీ జనాలపై దాడి చేసింది. ఈ ఘటన పాకిస్తాన్లో లాహోర్లోని షా దీ కోయి ఏరియాలో చోటు చేసుకుంది. ఇంటి నుంచి తప్పించుకున్న సింహం.. షాపింగ్ వెళుతున్న మహిళపై ముందుగా దాడికి దిగింది. మహిళను వెంబడించి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాము పెంచుకుంటున్న సింహం.. జనావాసాలపై దాడి చేసిందనే వార్త తెలియగానే ఆ ఇంటి యజమానులు అది చూసి ఆనందించినట్లు పిల్లల్ని కోల్పోయిన తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన గురువారం రాత్రి జరిగితే, శుక్రవారం సింహాన్ని పెంచుకుంటున్న యజమానులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తొలుత వారు ఇంటి నుంచి పారిపోయారని, కానీ 12 గంటల్లో వారిని అరెస్ట్ చేసినట్లు లాహోర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆపరేషన్స్ కార్యాలయం స్పష్టం చేసింది. ఆ సింహం 11 నెలల మగ సింహమని, దాన్ని పట్టుకుని వైల్డ్ లైఫ్ పార్క్కి తరలించినట్లు పోలీసులు తెలిపారు.A pet lion, illegally kept in Lahore's Shah Di Khoi area, mauled two children and a woman after escaping. The 5-year-old and 7-year-old are in critical condition at Jinnah Hospital. For more details: https://t.co/UwQpv7eXuA#Lahore pic.twitter.com/h2xI9RhSn5— Daily Pakistan English (@endailypakistan) July 4, 2025 -
మీరు అలా ఎలా అంటారు?: భారత్ వైఖరిపై చైనా
బీజింగ్: ప్రస్తుతం టిబెటన్ల ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా వారసుడి ఎంపికపై చర్చ నడుస్తోంది. తమ అదుపులో ఉండే వ్యక్తిని నియమించుకోవాలని చైనా ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. అయితే 15వ దలైలామా ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉందని, ఆయన వారసుడిని నిర్ణయించే హక్కు ఆయనకు మాత్రమే ఉందని భారత్ స్పష్టం చేసింది. దీనిపై చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇందులో టిబెటన్ల జోక్యాన్ని నివారించేందుకు భారత్ చొరవ చూపితే బాగుంటుందని పేర్కొంది. అత్యంత గౌరవప్రదమైన ఈ వ్యవహారంలో టిబెటన్ల జోక్యాన్ని పక్కకు పెట్టేందుకు సహకరించాలని భారత్కు విన్నవించింది చైనా. ఇక ప్రస్తుత 14వ దలైలామా వ్యతిరేక వేర్పాటువాద స్వభావాన్ని భారత్ స్పష్టంగా తెలుసుకుని మాట్లాడితే మంచిదని, టిబెట్ సంబంధిత అంశాలపై తమ నిబద్ధతలను గౌరవించాలని పేర్కొంది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భారత కేంద్రమంత్రి కిరణ్ రిజుజు చేసిన వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నలకు పై విధంగా సమాధానమిచ్చారు.ఇదీ చదవండి: ఆ హక్కు ఆయనది మాత్రమే.. దలైలామా వారసుడి ఎంపికపై భారత్ -
ట్రంప్ మెగా బిల్లు: ఎన్నారైలకు బిగ్ అలర్ట్
ట్రంప్ కలల బిల్లు.. బిగ్ బ్యూటిఫుల్ బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. గురువారం సుదీర్ఘ చర్చ అనంతరం జరిగిన ఓటింగులో బిల్లు ఆమోదం పొందింది. అంతకుముందు ఈ బిల్లుకు సెనెట్లో ఆమోదం లభించింది. ట్రంప్ సంతకం తర్వాతనీ ఈ బిల్లు చట్టంగా మారనుంది. అటు అమెరికా రాజకీయాల్లో, ఇటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అంశంగా నిపుణులు ఈ బిల్లును భావిస్తున్నారు. అయితే ఇది ఎన్నారైలపై ఎంతంగా ప్రభావం చూపించనుందో ఓ లుక్కేద్దాం.. నగదు బదిలీలపై 1% రెమిటెన్స్ పన్ను2026 జనవరి 1 నుంచి, అమెరికా నుంచి భారత్కు పంపే నగదు ఆధారిత బదిలీలపై 1% పన్ను విధించనున్నారు.నగదు, మనీ ఆర్డర్, చెక్కుల రూపేణా పంపేవాటికి ఇది వర్తిస్తుంది. మొదట ఇది 5%గా ప్రతిపాదించబడింది. తర్వాత 3.5%కి తగ్గించి చివరకు 1 శాతంగా నిర్ణయించారు. ఇది చిన్న మొత్తంగా అనిపించినా.. తరచూ డబ్బు పంపే కుటుంబాలకు ఇది లక్షల్లో అదనపు భారం కానుంది.అయితే డిజిటల్ మార్గాలు ఉపయోగించే వారు పన్ను నుంచి తప్పించుకోవచ్చు. అయితే.. భారత్లో గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే వయసు పైబడినవాళ్లు ఇంకా నగదు మార్గాన్నే నమ్ముకుంటున్నారనేది గుర్తించాల్సిన విషయం. ఉదాహరణకు.. నెలకు $500 పంపే వ్యక్తి.. ఏడాదికి $6,000 పంపుతాడు. బిగ్ బ్యూటీఫుల్ బిల్లు అమల్లోకి వస్తే.. $60 అదనపు పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇది చిన్న మొత్తంగా అనిపించినా.. గణనీయమైన భారంగానే మారనుంది.భారత్కు వచ్చే రెమిటెన్స్లో తగ్గుదలబిగ్ బ్యూటిఫుల్ బిల్ (Big Beautiful Bill) ద్వారా అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 1% రెమిటెన్స్ పన్ను ప్రభావం కేవలం ప్రవాస భారతీయులకే కాదు, భారత ఆర్థిక వ్యవస్థ మొత్తానికే గణనీయంగా ఉండనుంది. రెమిటెన్స్ (Remittance) అంటే ఒక వ్యక్తి విదేశంలో పని చేసి, అక్కడి నుంచీ తన స్వదేశంలోని కుటుంబానికి లేదా ఖాతాకు డబ్బు పంపడం.2023–24లో భారత్కు వచ్చిన మొత్తం రెమిటెన్స్ 135.46 బిలియన్ డాలర్లు. అందులో 32 బిలియన్ డాలర్లు అమెరికా నుంచే వచ్చింది. అయితే1% పన్ను విధానం వల్ల 10–15% తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉంది. అంటే.. 12–18 బిలియన్ డాలర్ల వరకు నష్టం జరగవచ్చు. రెమిటెన్స్లు భారతదేశానికి విదేశీ కరెన్సీ ప్రవాహంలో ప్రధాన భాగం. కాబట్టి ఈ తగ్గుదల వల్ల విదేశీ మారక నిల్వలపై ప్రభావం పడుతుంది. డాలర్ నిల్వలు తగ్గి, రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ద్రవ్యోల్బణం (inflation) పెరగడానికి దారితీయవచ్చు. అదే సమయంలో..రెమిటెన్స్లు అనేక కుటుంబాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ముఖ్యంగా కేరళ, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో అనేక కుటుంబాలకు. అయితే.. డబ్బు తక్కువగా రావడం వల్ల విద్య, వైద్యం, పెళ్లిళ్లు, గృహ నిర్మాణం వంటి అవసరాలపై ప్రభావం పడుతుంది.ఇంకోవైపు.. బ్యాంకింగ్ వ్యవస్థపై ఇది ప్రభావం చూపించనుంది. రెమిటెన్స్ తగ్గితే బ్యాంకుల డిపాజిట్లు తగ్గుతాయి, ఇది వడ్డీ రేట్ల పెరుగుదలకు దారితీయవచ్చు.మరీ ముఖ్యంగా గ్రామీణ బ్యాంకింగ్ సేవలపై ప్రభావం ఉండే అవకాశం ఉంది. వలసలకు ఇక గడ్డు కాలమే?ఈ బిల్లుతో వలస నియంత్రణ మరింత కఠినతరం కాబోతోంది. వీసా ఫీజులు పెరిగాయి. H-1B, L-1 వీసాలతో పాటు ఆశ్రయం దరఖాస్తులకు(Asylum Applications) భారీ రుసుములు విధించబడ్డాయి. అక్రమంగా వచ్చినవారిపై ఓ రేంజ్లో జరిమానాలు విధించాలని నిర్ణయించారు. డిపోర్టేషన్ బలగాల విస్తరణ వంటి చర్యలు ప్రవేశపెట్టబడ్డాయి. అక్రమ వలసదారులను తనిఖీలు చేయడం.. అవసరమైతే అక్కడికక్కడే అరెస్టులు చేసే అవకాశాలు ఉంటాయి. ఇది అమెరికాలో ఉన్న ఎన్నారైలకు మాత్రమే కాదు.. అక్కడ చదువుతున్న విద్యార్థులకు, ఉద్యోగార్థుల్లో కూడా భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా.. అమెరికాలో శాశ్వత నివాసం అనే కలకు బిగ్ బ్యూటీఫుల్ బిల్ ఒక శరాఘాతంగా పరిణమించబోతోందనే చెప్పొచ్చు.పెట్టుబడి ప్రణాళికల్లో మలుపులు!కార్పొరేట్ సంస్థలు, పెద్ద స్థాయి పెట్టుబడిదారులకు ఈ బిల్లుతో పన్ను మినహాయింపులు ఉన్నా.. ఎన్నారైల వాస్తవ ప్రయోజనాలు మాత్రం పరిమితంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా పన్ను రీఫండ్లు U.S. పౌరులకు మాత్రమే వర్తించడంతో, ఎన్నారైల ఆసరా మరింత దెబ్బతినే అవకాశమే కనిపిస్తోంది.సాధారణంగా రియల్ ఎస్టేట్ అనేది ప్రవాస భారతీయులకు కేవలం పెట్టుబడి కాదు.. భారత్తో అనుబంధానికి ఆధారం కూడా. ఈ పన్ను వల్ల భారత్లో ఆస్తుల కొనుగోలు లేదా అమ్మకానికి సంబంధించిన పెద్ద మొత్తాల బదిలీలపై అదనపు ఖర్చు వస్తుంది. అలాంటి సందర్భంలో ఈ పన్ను వారి ఆర్థిక ప్రయోజనాలపై కాదు, భావోద్వేగాలపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.ఈ క్రమంలో.. దీర్ఘకాలికంగా ఆస్తులు కొనాలని భావించిన వారు, ఇప్పుడు పన్ను అమలుకు ముందు ముందుగా డబ్బు పంపించి కొనుగోలు పూర్తిచేయాలని చూస్తున్నారు. ఇది ఒక రకంగా బిల్లు అమలుకు ముందు ఆస్తి రద్దీ(Rush) అనే పరిస్థితిని తెచ్చింది. దీంతో పన్ను అమలుకు ముందు తాత్కాలికంగా బదిలీల పెరుగుదల జరిగే అవకాశం నిపుణులు అంచనా వేస్తున్నారు. రియల్ ఎస్టేట్తో పాటు విద్య, ఆరోగ్య ఖర్చులపై కూడా ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. కంప్లయన్స్ భారముఎన్నారైలు బిగ్ బ్యూటీఫుల్ బిల్లును క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్నారైలు తమ ఆర్థిక ప్రణాళికలను మరింత జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరాన్ని తెచ్చి పెట్టింది. ఎటువంటి మార్గంలో డబ్బు పంపుతున్నారో జాగ్రత్తగా గమనించాలి. లేకపోతే అనవసర పన్నులు పడే అవకాశం ఉంది. కఠినమైన KYC నిబంధనలతో పాటు NRE/NRO ఖాతాలపై నియంత్రణ ఉంటుంది. తద్వారా పాస్పోర్ట్, వీసా, నివాస ధృవీకరణ వంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం పెరుగుతుంది. డబ్బు ఎలా అమెరికా దాటి పోతుంది అనే దానిపై మరింత పర్యవేక్షణ ఉంటుంది. పన్ను రీఫండ్లు కేవలం అమెరికా పౌరులకు మాత్రమే వర్తిస్తాయి — NRIs కు కాదు. అంటే, గ్రీన్ కార్డు హోల్డర్లు, H-1B వీసాదారులు, ఇతర ఎన్నారైలు ఈ ప్రయోజనాలను పొందలేరు.కాబట్టి ఈ బిల్లు ప్రవాస భారతీయులపై (NRIs) కేవలం పన్ను భారం మాత్రమే కాదు, నియంత్రణ (compliance) భారాన్ని కూడా పెంచుతోంది. ఇది పెద్ద మొత్తంలో డబ్బు పంపే వారికి మాత్రమే కాదు, చిన్న మొత్తాల్లో తరచూ పంపే వారికి కూడా అదనపు కాగితాలు, సమయం, ఖర్చు పెరుగుతాయి.ఎన్నారైలు డబ్బు పంపడాన్ని తగ్గిస్తే, భారత్లోని కుటుంబాల ఆదాయం తగ్గుతుంది. ఇది వారి వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలతో పాటు కుటుంబాలపై, చివరికి భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపేలా ఉంది. ఏంటీ బిగ్ బ్యూటీఫుల్ బిల్లు?అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఒక విస్తృత ఆర్థిక, పన్ను, వలస విధానాల చట్టం. పన్నుల్లో కోతలు, వ్యయ నియంత్రణే లక్ష్యంగా తెస్తున్నట్లు చెబుతున్నారాయన.పన్ను కోతలు2017లో అమలైన పన్ను కోతలను శాశ్వతం చేస్తుంది.కార్పొరేట్ కంపెనీలు, ఉన్నత ఆదాయ వర్గాలకు పన్ను మినహాయింపులు కల్పిస్తుంది.టిప్పులు, ఓవర్టైమ్పై పన్ను మినహాయింపుటిప్ ఆదాయం పై పన్ను రద్దు, ఓవర్టైమ్ ఆదాయంపై $12,500 వరకు మినహాయింపు.చైల్డ్ టాక్స్ క్రెడిట్ పెంపుపిల్లలపై టాక్స్ క్రెడిట్ $2,000 నుంచి $2,200కి పెంపు.కానీ తక్కువ ఆదాయ కుటుంబాలకు ఇది పూర్తిగా వర్తించదు.1% రెమిటెన్స్ పన్నుఅమెరికా నుంచి భారత్ వంటి దేశాలకు నగదు బదిలీలపై 1% పన్ను విధించబడుతుంది.బ్యాంక్, డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా(డిజిటల్ లావాదేవీలు) పంపిన డబ్బుకు మినహాయింపు ఉంది.వలస నియంత్రణ కఠినతరంICE అధికారుల నియామకం, డిపోర్టేషన్ కేంద్రాల విస్తరణ, వీసా ఫీజుల పెంపు వంటి చర్యలు ఉన్నాయి.మెడికేడ్, ఫుడ్ స్టాంపులపై కోతలుతక్కువ ఆదాయ గల అమెరికన్లకు ఆరోగ్య, ఆహార సహాయ కార్యక్రమాల్లో కోతలు విధించబడ్డాయి.పునరుత్పాదక శక్తికి ఎదురుదెబ్బసౌర, గాలి శక్తి పథకాలపై పన్ను రాయితీలు తగ్గించబడ్డాయి, ఇది గ్రీన్ ఎనర్జీ రంగానికి నష్టంగా మారుతుంది.లాభాలు ఎవరికీ?కార్పొరేట్ కంపెనీలు, ఉన్నత ఆదాయ వర్గాలు, టిప్/ఓవర్టైమ్ వేతనదారులు లాభపడతారు. కానీ తక్కువ ఆదాయ గల కుటుంబాలు, వలసదారులు, పునరుత్పాదక శక్తి రంగం నష్టపోతాయి.ప్రతిపక్షాల అభ్యంతరాలుడెమొక్రాట్లు, సామాజిక కార్యకర్తలు ఈ బిల్లును "సంపన్నులకు లాభం, సామాన్యులకు నష్టం" అని విమర్శిస్తున్నారు. హకీం జెఫ్రీస్ అనే నేత 8 గంటల పాటు బిల్లుకు వ్యతిరేకంగా ప్రసంగించారు. -
ఎవరా 'బీహార్ కీ భేటీ'?.. మోదీ మనసులో కరేబియన్ ప్రధానికి ప్రత్యేక స్థానం
ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ట్రినిడాడ్ అండ్ టొబాగోకి చేరుకున్నారు. అక్కడ పోర్ట్ ఆప్ స్పెయిన్లోని పియార్కో అంతర్జాతీయ విమానశ్రయంలో ఆయనకు ఆ దేశ మిలటరీ సైనికులచే గౌరవ వందనం లభించింది. అంతేగాదు కరేబియన్ దేశ ప్రధాన మంత్రి కమలా పెర్సాద్-బిస్సేసర్(Kamla Persad-Bissessar)తో సహా 38 మంత్రులు, నలుగురు పార్లమెంట్ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ స్వాగత సమయంలో ట్రినిడాడ్ అండ్ టొబాగొ మంత్రి కమలా పెర్సాద్ భారతీయ దుస్తుల్లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. కానీ మన మోదీ ఆ దేశ ప్రధాని కమ్లా పెర్సాద్ను 'బిహారీకా బేటి' అని పిలవడం విశేషం. అంతేగాదు ఆ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ..భారత్కి ట్రినిడాడ్ అండ్ టొబాగోకి ఉన్న సంబంధబాంధవ్యాలతో సహా ఆ దేశ ప్రధాని భారత మూలాలకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మరి ఆ విశేషంలేంటో సవివరంగా చూద్దామా..!.ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. ఈ కరేబియన్ దేశ ప్రధాని కమలా పెర్సాద్- మా బిహార్ కా భేటి అని సగర్వంగా చెప్పారు. ఆ ప్రధాని పూర్వీకులు బిహార్లోని బక్సర్కు చెందినవారని, ఆమె కూడా భారతదేశంలోని ఆ ప్రాంతాన్ని సందర్శించారని తెలిపారు. మాకు ఈ దేశంతో కేవలం రక్త సంబంధం లేదా ఇంటి పేరుతోనో బంధం ఏర్పడలేదని అంతకుమించిన బాంధవ్యం ఇరు దేశాల నడుమ ఉందని అన్నారు. స్నేహం చిగురించింది ఇలా..అలాగే ఇరు దేశాల మధ్య స్నేహం ఎలా చిగురించిందో కూడా గుర్తు చేసుకున్నారు. బనారస్, పాట్నా, కోల్కతా, ఢిల్లీ వంటి నగరాలు భారతదేశంలోనే కాకుండా ట్రినిడాడ్లో వీధి పేర్లుగా కూడా ఉన్నాయని చెప్పారు. అలా ఈ రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు అత్యంత బలంగా ఉన్నాయన్నారు. అందుకు నిదర్శనం ఇక్కడ జరుపుకునే నవరాత్రులు, మహాశివరాత్రి, జన్మాష్టమి వంటి పండుగలేనని అన్నారు. ఈ దేశ పురాతన చౌతల్(సంగీతం), భైతక్(వ్యాయామం) ఎంత ప్రాచుర్యం పొందాయో తెలుసనని అన్నారు. ఇక ఇక్కడ సుమారు 5 లక్షల మందికి పైనే భారత సంతతికి చెందినవారు నివసిస్తున్నారని, వారిలో దాదాపు 1800 మంది ప్రవాస భారతీయులని, మిగిలినివారు 1845, 1917ల మధ్య భారతదేశం నుంచి ఒప్పంద కార్మికులుగా వలస వచ్చిన స్థానిక పౌరులేనని గుర్తుచేశారు. అందువల్ల మిమ్మల్ని భారత్ జాగ్రత్తగా చూసుకుంటుందని హామీ ఇచ్చారు. అంతేగాదు మా దేశం మీకు సదా ఆహ్వానం పలుకుతుందని చెప్పారు. అలాగే బిహార్ కూడా శతాబ్దాలుగా వివిధ రంగాలలో ప్రపంచానికి మార్గం చూపించదని చెప్పారు. 21వ శతాబ్దంలో కూడా బీహార్ నుంచి కొత్త అవకాశాలు ఉద్భవిస్తాయని అన్నారు.ఎవరీ కమలా పెర్సాద్..కమలా పెర్సాద్ బిస్సేసర్ 1987లో రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. అనేక చారిత్రక నిర్ణయాలతో పేరుతెచ్చుకున్న మంత్రి. అంతేగాదు ఆమె కరేబియన్ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి, అటార్నీ జనరల్, ప్రతిపక్ష నాయకురాలు కూడా. అలాగే కామన్వెల్త్ దేశాలకు అధ్యక్షత వహించిన తొలి మహిళ. అదీగాక తొలి భారత సంతతి మహిళా ప్రధానిగా కూడా ఘనత దక్కించుకున్నారామె.ఇక ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగో భారతదేశంలోని జోధ్పూర్ కంటే చిన్నదేశమే అయినా..మాన భారతదేశ సంస్కృతి, ఆర్థికవ్యవస్థలో కీలక పాత్ర పోషించడం విశేషం. కాగా, ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని నివశిస్తున్న ఆరవతరం భారతీయ ప్రవాసులకు ఓసీఐ(ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా(OCI)) కార్డులు అదిస్తామని ప్రకటించారు మోదీ.#WATCH | Trinidad and Tobago | Addressing the Indian community, PM Modi says, "OCI cards will now be given to the 6th generation of the Indian diaspora in Trinidad and Tobago... We are not just connected by blood or surname, we are connected by belonging. India looks out to you… pic.twitter.com/hBU8tqCb9c— ANI (@ANI) July 4, 2025 (చదవండి: అమెరికా ఆఫీసులో భారతీయ మహిళ ఆకలి తిప్పలు..! పాపం ఆ రీజన్తో..) -
సందట్లో సడేమియా.. పాయె.. ఇది కూడా పాయె!
-రోబోలిప్పుడు క్షవర కళ్యాణానికీ ఎసరు పెట్టేశాయి!-ఇప్పటికైతే ఒక ట్రెండు చోట్ల మాత్రమే కానీ...-ఇంకొన్నేళ్లు పోతే మాత్రం సందు గొందులన్నింట్లోనూ-‘రోబో హెయిర్ కటింగ్ సెలూన్’లు వెలియడమైతే ఖాయం!!!రోబోలొస్తే ఉద్యోగాలు పోతాయని చాలా మంది చెబుతూనే ఉన్నారు. కానీ, పరిస్థితి మరీ క్షురకుల స్థాయికి చేరుతుందని మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే ఊహించారు. విషయం ఏమిటంటే.. నిన్న మొన్నటివరకూ ఏదో హాబీ కొద్ది ఒకరిద్దరు రోబోలతో వెంట్రుకలు కత్తిరించుకునేందుకు, షేవింగ్ చేయించుకునేందుకు ప్రయత్నించేవారేమో కానీ.. ఇప్పుడిప్పుడే ఇవి వాణిజ్యస్థాయిలో అంటే మన వీధి చివరి సెలూన్ల మాదిరిగా దుకాణాలు తెరవడం మొదలైంది. ఈ ట్రెండ్ ఊపందుకుందీ అనుకోండి.. క్షురకులు గతకాలపు జ్ఞాపకంగా మిగిలిపోవడం గ్యారెంటీ అంటున్నారు నిపుణులు!షేన్ వైటన్.. అమెరికా యూట్యూబర్ ఇతడు. ఇంజినీర్ కూడా. ఐదేళ్ల క్రితం ‘స్టఫ్ మేడ్ హియర్’ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాడు. తన బుర్రకొచ్చిన ఆలోచనలను యంత్రాలుగా మారుస్తుంటాడు. ఉదాహరణకు ఇతడు సృష్టించిన బాస్కెట్బాల్ హూప్ (కోర్టుకు ఇరువైపులా ఉండే బోర్డు)! బాల్ ఎలా విసిరినా సరే.. బోర్డు తనను తాను అడ్జెస్ట్ చేసుకుంటుంది. బాల్ కచ్చితంగా రంధ్రంలోకే పడుతుంది! అలాగే.. స్నూకర్ ఆడుతున్నప్పుడు బాల్స్ కచ్చితంగా బాల్స్ను రంధ్రాల్లో పడేలా స్పెషల్ ‘క్యూ’ను తయారు చేశాడు. This Video shows a real robotic barber.Similar tech exists, like Shane Wighton's project reported by Popular Mechanics and CNET. It aligns with demos from startups like Snips AI. pic.twitter.com/2sRHIYGUQI— The Artificial Intelligence Techie (@TheAItechie) July 2, 2025ఈ క్రమంలోనే ఈ యువ ఇంజినీర్కు హెయిర్ కట్కూ ఓ రోబో ఉంటే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన వచ్చింది. ఇంకేముంది.. రంగంలోకి దిగిపోయాడు. బోలెడన్ని విఫల ప్రయత్నాల తరువాత ఓ సక్సెస్ఫుల్ రోబో తయారైంది. వాక్యూమ్ క్లీనర్ వంటిదాన్ని ఉపయోగించి వెంట్రుకలన్నీ పైకి లేచేలా చేసి.. రోబో ద్వారా వెంట్రుకలు కత్తిరించేలా చేశాడు. తల మొత్తాన్ని త్రీడీ మ్యాపింగ్ చేసుకోవడంతోపాటు ఎప్పటికప్పుడు తల కదలికలను కూడా నమోదు చేసుకుంటూ కదులుతుందీ రోబో బార్బర్!.Basketball hoop that doesn't let you miss by Shane Wighton. pic.twitter.com/WP9tYoVLOP— MachinePix (@MachinePix) May 11, 2020ఇదొక్కటే కాదండోయ్.. స్టూడియో రెడ్ అనే కంపెనీ కెమెరాలు, ప్రెషర్ సెన్సర్ల సాయంతో వాణిజ్యస్థాయి రోబో బార్బర్ను రూపొందించే క్రమంలో ఉంది. నేడో రేపో మార్కెట్లోకి వచ్చేస్తుంది ఇది. ఇక ఆటోమెటిక్ హెయిర్ కట్టర్ రోబో గురించి.. త్రీడీ మోడలింగ్, వాక్యూమ్ సక్షన్తోపాటు మొబైల్ ఆప్ ద్వారా అవసరమైన ‘స్టైల్’ను సెలెక్ట్ చేసుకునేలా ఒక రోబోటిక్ వ్యవస్థను సిద్ధం చేసింది. దీనికి పేటెంట్ కూడా వచ్చేసింది. ప్రస్తుతానికి నమూనా యంత్రాల తయారీ, పరీక్షలు జరుగుతున్నాయి! ఇవన్నీ ఆటోమెటిక్ రోబో బార్బర్లైతే.. రోబోకట్, ఫ్లోబీ సిస్టమ్స్ వంటివి సెమీ ఆటోమెటిక్ పద్ధతిలో ఇంట్లోనే కటింగ్, షేవింగ్ చేసుకునే యంత్రాలను రూపొందించే పనిలో ఉన్నాయి!.స్టూడియోరెడ్, షేన్ వైటన్ వంటివారు తాము తయారు చేసిన రోబో బార్బర్లను సెలూన్లలో పెట్టేందుకు ప్రయత్నిస్తుండగా.. ఈ విషయంలో కృత్రిమ మేధ కూడా అడుగుపెట్టేసింది. బార్బర్ జీపీటీ మన ఫొటోలను వాడుకుని ఏ స్టైల్లో ఎలా కనిపిస్తామో చూపిస్తుంది. నచ్చినదాన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే అంటే చాలు! క్ష... వ... రం... మొదలైపోతుంది!!.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా! -
గాల్లో ఉన్న విమానంలో టెన్షన్.. ప్రయాణికుడిపై ఇషాన్ శర్మ దాడి
వాషింగ్టన్: భారత సంతతి ఇషాన్ శర్మ విమానంలో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడి మధ్య వాగ్వాదం జరిగింది. మాటా మాట పెరిగి చివరకు తన్నుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఇషాన్ తీవ్రంగా గాయపడ్డాడు. విమానం ల్యాండింగ్ అయిన తర్వాత ఇషాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. భారత సంతతి వ్యక్తి ఇషాన్ శర్మ(21) అమెరికాలోని న్యూవార్క్లో నివసిస్తున్నాడు. జూలై 1న ఫిలడెల్ఫియా నుంచి ఫ్రాంటియర్ ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణించాడు. ఆ విమానం గాలిలో ఉన్న సమయంలో ఇషాన్ శర్మ నవ్వడం, ఏదో మాట్లాడటంపై ముందు సీటులో కూర్చొన్న కీన్ ఎవాన్స్ ఆందోళన చెందాడు. అనంతరం, క్యాబిన్ సిబ్బంది సహాయం కోరే బటన్ నొక్కాడు. అది గమనించిన ఇషాన్ శర్మ.. ఎవాన్స్ను అడ్డుకుని అతడి గొంతుపట్టుకుని కొట్టాడు. దీంతో, వారి మధ్య వాగ్వాదం పీక్ స్టేజ్కు చేరుకుంది.ఆగ్రహంతో ఎవాన్స్ కూడా తిరిగి శర్మను కొట్టడంతో అతడి కంటికి గాయమైంది. గొడవ పెద్దది కావడంతో విమాన సిబ్బంది వారిద్దరిని నిలువరించారు. ఆ విమానం మయామిలో ల్యాండ్ కాగానే భారత సంతతి వ్యక్తి ఇషాన్ శర్మను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇషాన్ శర్మ తనపై దాడికి ముందు ‘హా హ హ హ హ హ’ అంటూ నవ్వాడని, తనను కించపర్చడంతోపాటు చస్తావని బెదిరించినట్లు ఎవాన్స్ ఆరోపించాడు. అనంతరం, ఇషాన్ తరుఫు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ.. ఇషాన్ శర్మ విమానంలో ధ్యానం చేస్తున్నాడని తెలిపారు. అయితే తనను ఎగతాళి చేస్తున్నట్లు, బెదిరిస్తున్నట్లుగా ఎవాన్స్ భావించడంతో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగిందని చెప్పారు. అంతేగానీ, ఉద్దేశపూర్వకంగా ఎవాన్స్ను కొట్టలేదని క్లారిటీ ఇచ్చాడు. No more vacation…🫣| #ONLYinDADE * Man gets kicked off of Frontier flight after getting into altercation pic.twitter.com/us6ipoW5E7— ONLY in DADE (@ONLYinDADE) July 1, 2025 -
ఇంటర్నెట్ను ఈ వీడియో కుదిపేయకపోతే మంచిదే!
విజయ్ మాల్యా-లలిత్ మోదీ.. ఒకప్పుడు వీవీఐపీలుగా చెలామణి అయిన పెద్ద మనుషులు. ఇప్పుడు భారత ప్రభుత్వం దృష్టిలో ఆర్థిక నేరగాళ్లుగా పరాయి దేశాల్లో తలదాచుకుంటున్న వ్యక్తులు. అయితే ఈ ఇద్దరూ కలిసి ఓ పార్టీలో తెగ ఎంజాయ్ చేస్తూ గడిపిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. I Did It My Way అంటూ అలనాటి అమెరికన్ సింగర్ ఫ్రాంక్ సినాత్రా(Frank Sinatra) పాడిన ప్రసిద్ధ గీతాన్ని ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ-పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా కలిసి ఆలపించారు. లండన్లో గత ఆదివారం తన నివాసంలో లలిత్ మోదీ ఇచ్చిన పార్టీలో ఇది జరిగింది. ఈ విలాసవంతమైన పార్టీ వీడియోను ఈ వీడియోను లలిత్ మోదీ స్వయంగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. పైగా ముందుగానే ఏం జరుగుతుందో ఊహిస్తూనే.. “Controversial for sure. But that’s what I do best” అంటూ సందేశం ఉంచారు. ఇప్పుడు నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ గ్రాండ్ ఈవెంట్ను లలిత్ మోదీ తన నివాసంలోనే నిర్వహించారట. ప్రపంచం నలుమూలల నుంచి 310 మందికి పైగా అతిథులు హాజరయ్యారని ఆయన తెలిపారు. వాళ్లలో విధ్వంసకర బ్యాట్స్మన్ క్రిస్ గేల్ కూడా ఉన్నారు. ఈ వీడియో ఇంటర్నెట్ను కుదిపేయకపోతే మంచిదే. వివాదాస్పదమైతే ఏముంది... అదే నా స్టైల్! అంటూ లలిత్ మోదీ చివర్లో సందేశం ఉంచారు. View this post on Instagram A post shared by Lalit Modi (@lalitkmodi)గేల్ గతంలో ఐపీఎల్ ఆర్సీబీ జట్టుకు ఆడిన సంగతి తెలిసిందే. గేల్ సైతం తన మాజీ బాస్లు లలిత్ మోదీ, మాల్యాలతో కలిసి దిగిన ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ, “We living it up. Thanks for a lovely evening” అని రాశారు. లలిత్ మోదీ 2010లో భారతదేశం విడిచి యూకేలో నివసిస్తున్నారు. ఆయనపై బిడ్ రిగ్గింగ్, మనీలాండరింగ్, విదేశీ మారక చట్ట ఉల్లంఘనల ఆరోపణలు ఉన్నాయి. విజయ్ మాల్యా రూ.9,000 కోట్ల రుణ డిఫాల్ట్ కేసులో భారత్కు కావలసిన నిందితుడు. 2017లో లండన్లో అరెస్టయ్యారు. ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. ఈ ఇద్దరూ చట్టపరమైన చిక్కుల్లో ఉన్నప్పటికీ.. తరచూ ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం, ఒకరి పోస్టులకు మరొకరు కామెంట్లు చేస్తుండడం, పలు ఇంటర్వ్యూలలో కనిపిస్తుండడం అప్పుడప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. -
జపాన్లో వరుస భూకంపాలు.. తత్సుకీ మెగా సునామీ సంకేతమా?
టోక్యో: వరుస భూకంపాలు జపాన్లోని మారుమూల ద్వీపాలను నిద్రలేకుండా చేస్తున్నాయి. కేవలం రెండు వారాల్లో 900 భూకంపాలు సంభవించాయి. దీంతో ప్రజలకు రాత్రుళ్లు నిద్ర ఉండటం లేదు. ఏ క్షణం ఏం జరగుతుందోని ఆందోళనతో రాత్రంతా మేల్కొని ఉంటున్నారు. జూన్ 21 నుంచి టోకారా దీవుల చుట్టూ ఉన్న సముద్రాలలో భూకంప కార్యకలాపాలు చాలా చురుగ్గా ఉన్నాయని, బుధవారం 5.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు.అయితే ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కానీ అవసరమైతే ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండాలని ప్రజలకు సూచించారు. భూమిపై అత్యంత భూకంప ప్రమాదం ఉన్న దేశాలలో జపాన్ ఒకటి. టెక్టోనిక్ ప్లేట్లు కలిసే.. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రదేశంలో ఉండటంతో తరచూ భూకంపాలు వస్తుంటాయి. ఇది ప్రతి సంవత్సరం దాదాపు 1,500 భూకంపాలను ఎదుర్కొంటుంది. కాగా, 12 టోకారా దీవులలో ఏడింటిలో దాదాపు 700 మంది నివసిస్తున్నారు. ఈ సుదూర దీవులలో కొన్నింటిలో ఆసుపత్రులు లేవు. ప్రిఫెక్చురల్ రాజధాని కగోషోమాకు వెళ్లాలంటే ఫెర్రీలో కనీసం ఆరు గంటలు ప్రయాణించాలి. భూకంపాల కారణంగా టోకారా దీవుల్లోని కొన్ని గెస్ట్హౌస్లు పర్యాటకులను అనుమతించడం లేదు. త్వరలో భారీ, ప్రాణాంతక భూకంపం సంభవించవచ్చనే వదంతులలో దేశం మొత్తం ఆందోళన చెందుతున్న తరుణంలో ఈ వరుస ప్రకంపనలు వస్తున్నాయి. 🌏 Current Earthquake Swarm ongoing south of Southern mainland #Japan near Tatsugō.Several M 4.5+ events - could portend a stronger #earthquake to come, and the region should be monitored closely 👀⚠️ This is one of the riskiest world areas in JULY 2025 because of this. pic.twitter.com/K0dmPQZMrP— Weather & Earth 25 (@Weather_Earth25) July 2, 2025ఇదిలా ఉండగా.. శనివారం (జూలై 5న) మెగా సునామీ విరుచుకుపడబోతోందా? జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య ప్రాంతాన్ని ముంచెత్తనుందా? ‘జపాన్ బాబా వాంగా’ పేరుతో ప్రసిద్ధురాలైన ర్యో తత్సుకీ జోస్యం నిజమైతే అక్షరాలా అదే జరగనుంది! ‘ద ఫ్యూచర్ ఐ సా (నేను దర్శించిన భవిష్యత్తు)’ పేరుతో రాసిన పుస్తకంలో ఆమె ఈ మేరకు ఎప్పుడో హెచ్చరించారు. దీంతో, శనివారం నిజంగానే సునామీ వస్తుందా అంటూ ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఊపిరి బిగబట్టి మరీ ఎదురు చూస్తున్నారు. ఈ జోస్యానికి సంబంధించిన వార్తలు, చర్చోపచర్చలతో రెండు రోజులుగా ఇంటర్నెట్ అక్షరాలా హోరెత్తిపోతోంది. ‘జూలై5డిజాస్టర్’ ఇప్పుడు ఆన్లైన్లో ట్రండింగ్లో ఉంది. ఈ భయాందోళనల నడుమ టోక్యో, సమీప ప్రాంతాల్లో విమాన తదితర ప్రయాణాలను జనం భారీగా రద్దు చేసుకుంటున్నారు.తత్సుకీ ఏం చెప్పారు? కరోనా ఉత్పాతాన్ని కూడా తుత్సుకీ ముందే ఊహించి చెప్పడం విశేషం! అప్పటినుంచీ ఆమె పేరు ప్రపంచమంతటా మార్మోగడం మొదలైంది. ఇక జూలై 5న వస్తుందని పేర్కొన్న సునామీ గురించి తన పుస్తకంలో 20 ఏళ్ల ముందే పేర్కొన్నారామె. ‘జపాన్, ఫిలిప్పీన్స్ నడుమ సముద్రగర్భం ఒక్కసారిగా బద్దలవుతుంది. ఆకాశహరమ్యలను తలదన్నేంత ఎత్తున అలలు ఎగిసిపడతాయి. లక్షలాది మందికి ప్రాణగండం’ అంటూ వర్ణించారు. దాంతో ఇది కూడా నిజమవుతుందా అంటూ ఎక్కడ చూసినా అంతులేని ఉత్కంఠ రాజ్యమేలుతోంది. ఎవరీ తత్సుకీ? తత్సుకీ జపాన్కు చెందిన మాంగా ఆర్టిస్టు. ‘ద ఫ్యూచర్ ఐ సా (నేను దర్శించిన భవిష్యత్తు)’ ఆమె స్వయంగా చేత్తో రాసిన పుస్తకం. బ్రిటన్ యువరాణి డయానా మృతి, 2011లో జపాన్ను వణికించిన భూకంపం, సునామీ తదితరాలను అందులో ఆమె ముందుగానే పేర్కొన్నారు. అవన్నీ అక్షరాలా నిజమయ్యాయి కూడా. దాంతో గత శతాబ్దికి చెందిన బల్గేరియా మిస్టిక్, హీలర్ బాబా వంగా పేరిట ఆమెను ఇప్పుడంతా ‘జపనీస్ బాబా వంగా’ అంటూ కీర్తిస్తున్నారు. -
ట్రంప్ భారీ విజయం.. బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు సభ ఆమోదం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కల సాకారమైంది. ట్రంప్ కలల బిల్లు అయిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు గ్రీన్సిగ్నల్ లభించింది. అమెరికా ప్రతినిధుల సభ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 218, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. దీంతో, ఈ బిల్లును తీసుకురావడంలో ట్రంప్ విజయం సాధించారు.అమెరికా ప్రతినిధుల సభ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును గురువారం ప్రవేశపెట్టారు. అనంతరం, దీనిపై సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ క్రమంలో జరిగిన ఓటింగులో బిల్లు ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 218, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. బిల్లును ఇద్దరు రిపబ్లికన్లు వ్యతిరేకించారు. బిల్లును వ్యతిరేకిస్తూ.. సభ మైనారిటీ నేత హకీం జెఫ్రీస్.. 8 గంటల 32 నిమిషాలపాటు మాట్లాడారు. ఇక, అంతకుముందు ఈ బిల్లుకు సెనెట్లో ఆమోదం లభించింది. ట్రంప్ సంతకం తర్వాత చట్టంగా మారనుంది. పన్నుల్లో కోతలు, వ్యయ నియంత్రణ లక్ష్యంగా ఈ బిల్లును ట్రంప్ తీసుకొచ్చారు. ✅ The House of Representatives just officially PASSED the One Big Beautiful Bill.The largest middle-class tax cut in American history — and so much more — is on its way to President Trump's desk.MAGA! pic.twitter.com/V3U8xhenrS— Rapid Response 47 (@RapidResponse47) July 3, 2025ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్' అమెరికా కాంగ్రెస్లో అధికారికంగా ఆమోదం పొందడంపై పలువురు స్పందిస్తున్నారు. ఈ బిల్లు ఆమోదం అనేది ట్రంప్ సాధించిన పెద్ద విజయంగా ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. పన్ను తగ్గింపులు, రక్షణ, సరిహద్దు భద్రతపై భారీ నిధులు కేటాయించే ఈ బిల్లు అమెరికా రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ బిల్లులో మెడికెయిడ్ ఖర్చుల్లో కోతలు, వలస నియంత్రణ, గ్రీన్ ఎనర్జీ పథకాల్లో మార్పులు వంటి అంశాలు కూడా ఉన్నాయి. ఈ బిల్లు ఆమోదానికి ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారు. రిపబ్లికన్ సభ్యులతో ఆయనే మాట్లాడారు.The One Big Beautiful Bill:✅ Passed ✅ Signed ✅ Heading to President Trump’s desk to become lawMuch-needed and much-deserved relief for hardworking Americans is on the way! pic.twitter.com/zoh2dKlfO5— Speaker Mike Johnson (@SpeakerJohnson) July 3, 2025ట్రంప్ ఆనందం.. ఈ బిల్లు ఆమోదం పొందడంపై ట్రంప్ ఆనందం వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియా సోషల్ టూత్ వేదికగా ట్రంప్ స్పందించారు. ఈ సందర్భంగా ట్రంప్.. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లో రిపబ్లికన్లు బిల్లును ఆమోదించారు. తద్వారా మన పార్టీ ఏకతాటిపై ఉంది. ఈ బిల్లు ఆమోదంతో దేశం వేడిగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) వైట్ హౌస్లో ఈ బిల్లుపై సంతకం వేడుక జరుగుతుందని ప్రకటించారు. అన్ని పార్టీలకు చెందిన అమెరికా శాసనసభ్యులను, సెనేటర్లను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అదే రోజు అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం కావడం గమనార్హం. దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని, అలాగే కొత్త సువర్ణ యుగం ప్రారంభాన్ని కలిసి జరుపుకుందాం. అమెరికా ప్రజలు ఎప్పటికన్నా సంపన్నులుగా, సురక్షితులుగా, గర్వంగా ఉండేలా ఈ శాసన బిల్లుతో మార్పు తీసుకొస్తాం అని పేర్కొన్నారు.( @realDonaldTrump - Truth Social Post )( Donald J. Trump - Jul 03, 2025, 6:15 PM ET )The Republicans in the House of Representatives have just passed the “ONE BIG BEAUTIFUL BILL ACT.” Our Party is UNITED like never before and, our Country is “HOT.” We are going to have a… pic.twitter.com/qR2Dql3IYh— Donald J. Trump 🇺🇸 TRUTH POSTS (@TruthTrumpPosts) July 3, 2025బిల్లుకు సంబంధించిన కీలక అంశాలు..2017లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమలు చేసిన పన్ను తగ్గింపును ఈ బిల్లు ద్వారా శాశ్వతంగా అమలు చేయనున్నారు. ఓవర్టైం వేతనాలు, టిప్ ద్వారా ఆదాయం పొందే కార్మికులకు ప్రత్యేక పన్ను మినహాయింపులు అందించే ఏర్పాటు చేశారు. అలాగే SALT (State And Local Tax) మినహాయింపు పరిమితిని 10,000 డాలర్ల నుంచి 40,000 డాలర్లకు పెంచారు. ఈ కొత్త మినహాయింపులు తదుపరి 10 సంవత్సరాల్లో ఫెడరల్ బడ్జెట్ లోటును 3.4 ట్రిలియన్ డాలర్ల వరకు పెంచే అవకాశం ఉంది. ఫుడ్ స్టాంప్ పథకంలో మార్పులు చేశారు. కొత్త బిల్లు ద్వారా రాష్ట్రాలు కూడా ఈ పథకానికి సంబంధించిన వ్యయాన్ని పంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అలాగే పని చేయగల వ్యక్తులకు వయో పరిమితిని 54 నుంచి 64 సంవత్సరాలకు పెంచారు.వలస నియంత్రణపై ఫోకస్...ఈ బిల్లులో సరిహద్దు గోడ నిర్మాణానికి 46 బిలియన్ డాలర్లు, వలసదారుల నిర్బంధ కేంద్రాల విస్తరణకు 45 బిలియన్ డాలర్లు, సిబ్బంది శిక్షణ, నియామకానికి 30 బిలియన్ డాలర్లు కేటాయించారు. ఆశ్రయం కోరే వ్యక్తుల కోసం ముందుగా ప్రతిపాదించిన 1,000 డాలర్ల ఫీజును 100 డాలర్లకు తగ్గించారు. బిల్లులో భాగంగా, ట్రంప్ ప్రభుత్వం బైడెన్ హయాంలో ప్రవేశపెట్టిన గ్రీన్ ఎనర్జీ పథకాలు నిలిపివేసింది.ఆరోగ్య పథకంలో భారీ కోతలుతక్కువ ఆదాయ వర్గాల కోసం ఉన్న మెడికెయిడ్ ఆరోగ్య పథకంలో భారీ కోతలు విధించారు. కొత్తగా విధించిన పని నిబంధనలతో, సుమారు 1.2 కోట్ల మంది తమ వైద్య బీమా కోల్పోయే ప్రమాదం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అక్రమ వలసదారులకు మెడికెయిడ్ సేవలు నిలిపివేయడం, లింగ మార్పు చికిత్సలకు నిధులు నిలిపివేయడం వంటి చర్యలు బిల్లులో పొందుపరిచారు. రూరల్ ఆసుపత్రులను పరిరక్షించేందుకు 50 బిలియన్ డాలర్ల నిధులు ఏర్పాటు చేశారు. -
అట్టుడుకుతున్న యూరప్
బెర్లిన్: యూరప్ దేశాల్లో వడగాడ్పుల తీవ్రత కొనసాగుతోంది. ఇప్పటివరకు స్పెయిన్లో నలుగురు, ఇటలీ, ఫ్రాన్స్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. కార్చిచ్చు ముప్పు పొంచి ఉండటంతో ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించాయి. స్విట్జర్లాండ్లోని బెజ్నౌ అణు రియాక్టర్ను మూసివేశారు. మరో అణు రియాక్టర్లో విద్యుదుత్పత్తిని సగానికి తగ్గించారు. స్పెయిన్లోని కాటలోనియా ప్రాంతంలో కార్చిచ్చుతో ఇద్దరు చనిపోయారు. ఎండల వేడిమికి తాళలేక 300 మంది ఆస్పత్రి పాలయ్యారని ఫ్రాన్స్ మంత్రి ఒకరు వివరించారు. ఇటలీ ప్రభుత్వం 18 నగరాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించింది. జర్మనీలోని అత్యధిక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటాయి. దీంతో, జనం వేడి నుంచి ఉపశమనం కోసం ఓపెన్ ఎయిర్ స్విమ్మింగ్ పూల్స్, సరస్సులను ఆశ్రయిస్తున్నారు. జర్మనీలోని చాలా ప్రాంతాల్లో స్కూళ్లను మూసివేశారు. బ్రాండెన్బర్గ్, సాగ్జనీల్లో పలు ప్రాంతాల్లో మొదలైన కార్చిచ్చును ఫైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. పర్యాటక ప్రాంతాలైన పారిస్లోని ఈఫిల్ టవర్తోపాటు బ్రస్సెల్స్లోని అటోమియంను మూసివేశారు. -
యూపీ, కేరళ విద్యార్థులతో శుభాంశు మాటామంతీ
లక్నో/తిరువనంతపురం: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోని భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లాతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి కేరళ, ఉత్తరప్రదేశ్ పాఠశాల విద్యార్థులు అత్యంత అరుదైన, మాటల్లో చెప్పలేని అనుభూతిని పొందారు. భారరహిత స్థితిలో స్వేచ్ఛగా గాల్లో కదలాడుతూ బంతితో ఆడుకుంటున్న శుక్లాను చూసి ఆ విద్యార్థులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. పట్టరాని ఆనందంతో పదే పదే ప్రశ్నలు సంధించారు. వాళ్ల ప్రశ్నలకు శుక్లా వివరణాత్మక సమాధాలిచ్చారు. ‘‘ ఆయన అలా శూన్యస్థితిలో చక్కర్లు కొడుతుంటే ఎంతో చూడముచ్చటగా ఉంది. మేము అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ఐఎస్ఎస్లో ఎలా గాల్లో ఈదినట్లుగా ముందుకు కదలాలో ఆయన స్వయంగా కదిలి చూపించారు’’ అని కోజికోఢ్లోని నయార్కుళి ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని సంఘవి చెప్పారు. శుక్లా సొంతూరు లక్నోలో, తిరునంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లోని విద్యార్థులూ ఆయనతో మాట్లాడారు. ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు వ్యోమగాములు ఎలాంటి ఆహారం తీసుకుంటారు?. అలా కదులుతూ ఉంటే నిద్రపోవడమెలా?. హఠాత్తుగా ఒంట్లో బాగోలేకపోతే డాక్టర్ ఉండరుగా. అప్పుడెలా?. ఇక్కడి నుంచి ఐఎస్ఎస్కు వెళ్లాక ఎంతకాలానికి అక్కడి వాతావరణానికి అలవాటుపడతారు?. తిరిగొస్తే ఇక్కడ మామూలుగా మారడానికి ఎంత టైమ్ పడుతుంది?.. ఇలా విద్యార్థులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు శుక్లా సమాధానాలు చెప్పారు. ‘‘ ఐఎస్ఎస్లో నిద్రపోవడం ఒక సరదా పని. ఇక్కడ నేల, పైకప్పు రెండూ ఉండవు. అందుకే కొందరు గోడలకు, కొందరు సీలింగ్కు అతుక్కుని నిద్రిస్తూ కనిపిస్తారు. కదలకుండా పడుకోవాలంటే నిద్రపోయే స్లీపింగ్ బ్యాగ్ను దేనికైనా కట్టేసుకోవాల్సిందే’’ అని ఆయన నవ్వుతూ చెప్పారు. దీంతో విద్యార్థులు విరగబడి నవ్వారు. ‘‘ ఇక్కడి వచ్చినప్పటితో పోలిస్తే ఇప్పుడు నేను ఎంతో మెరుగ్గా ఉన్నా. భారరహిత స్థితికి అలవాటు పడటం కాస్తంత ఇబ్బందిగా ఉంటుంది. తిరిగి భూమి మీదకొచ్చాక గురుత్వాకర్షణ స్థితికి మారడం కూడా ఒక సవాలే’’ అని శుక్లా అన్నారు. ‘‘ ఒంటరిగా ఉన్నామని ఫీల్ అయితే వెంటనే కుటుంబసభ్యులు, స్నేహితులతో వర్చువల్గా మాట్లాడి మనసును తేలికచేసుకుంటాం. తరచూ వ్యాయామం చేస్తాం. ప్రయోగాలు సరేసరి’’ అంటూ శుక్లా చెప్పుకొచ్చారు. ఇస్రో వారి విద్యార్థి సంవాద్ కార్యక్రమంలో భాగంగా వ్యోమగాములతో విద్యార్థుల మాటామంతీ పోగ్రామ్ను నిర్వహించారు. ‘‘ ఎప్పుడైనా కొన్ని నిమిషాలు తీరిక సమయం దొరికితే వెంటనే కిటికీల వద్దకు వెళ్లి అంతరిక్ష నుంచి మన పుడమిని చూడటం ఎంతో ఆసక్తికరంగా, ఆనందంగా ఉంటుందని ఆయన నాతో చెప్పారు’’ అని ఒక విద్యార్థి ‘పీటీఐ వీడియోస్’తో చెప్పింది. -
బలమైన భారత్తో స్థిరమైన ప్రపంచం
ఆక్రా: భారతదేశం బలంగా ఉంటే ప్రపంచం మరింత స్థిరంగా, సౌభాగ్యవంతంగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ పరిణామాలు వేగంగా మారిపోతున్న నేపథ్యంలో ప్రపంచ పాలనా విధానంలో విశ్వసనీయమైన, ప్రభావవంతమైన సంస్కరణలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని స్పష్టంచేశారు. ఘనా పార్లమెంట్లో గురువారం ప్రధాని మోదీ ప్రసంగించారు. దక్షిణార్ధ గోళ దేశాల (గ్లోబల్ సౌత్) గొంతుకకు బలం, విలువ ఇవ్వకపోతే ప్రపంచ అభివృద్ధి సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ప్రస్తుత ప్రపంచ అనిశ్చిత పరిస్థితుల్లో స్థిరమైన భారత ప్రజాస్వామ్యం ఒక ఆశారేఖగా వెలిగిపోతోందని హర్షం వ్యక్తంచేశారు. ఇండియా సాధిస్తున్న వేగవంతమైన అభివృద్ధి ప్రపంచ ప్రగతికి ఉ్రత్పేరకంగా మారిందన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ప్రపంచానికి ఒక బలమైన మూలస్తంభంగా నిలుస్తోందన్నారు. భారత్ మరింత బలోపేతమైతే ప్రపంచ స్థిరత్వానికి, సౌభాగ్యానికి తిరుగు ఉండదని స్పష్టంచేశారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే... నినాదాలకు మించిన కార్యాచరణ ‘‘అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఇండియా అగ్రస్థానంలో ఉంది. స్థిరమైన పాలన, రాజకీయ వ్యవస్థ అనే పునాదిపై ఇండియా త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం తథ్యం. గ్లోబల్ సౌత్లో మా వాటా 16 శాతంగా ఉంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ మా దేశంలోనే ఉంది. ఇండియా ఇన్నోవేషన్, టెక్నాలజీ హబ్గా మారింది. పెట్టుబడులకు అంతర్జాతీయ కంపెనీలు ముందుకొస్తున్నాయి. మరోవైపు ప్రపంచానికి కొత్తకొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. వాతావరణ మార్పులు, మహమ్మారులు, ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీ వంటివి సమస్యగా మారాయి. గత శతాబ్దంలో ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థలు వీటిని పరిష్కరించలేకపోతున్నాయి. అందుకే గ్లోబల్ గవర్నెన్స్లో విశ్వసనీయమైన, ప్రభావంతమైన సంస్కరణలు కచి్చతంగా రావాలి. ప్రపంచం బాగు కోసం గ్లోబల్ సౌత్కు మరింత బలం చేకూరాలి. నినాదాలకు మించిన కార్యాచరణ కావాలి. జీ20 కూటమికి మేము సారథ్యం వహించినప్పుడు ‘ఒకే భూగోళం, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు’ అనే విజన్తో పనిచేశాం. మా హయాంలోనే ఆఫ్రికన్ యూనియన్ జీ20లో శాశ్వత సభ్యదేశంగా మారింది. ఆఫ్రికా అభివృద్ధి ఎజెండాకు మద్దతు ఆఫ్రికా అభివృద్ధి ప్రయాణంలో పాలుపంచుకొనేందుకు ఇండియా కట్టుబడి ఉంది. ఆఫ్రికా ప్రజల అభ్యున్నతి కోసం ఆఫ్రికా అభివృద్ధి ఎజెండా–2063కు మద్దతిస్తున్నాం. ఆఫ్రికా లక్ష్యాలు మాకు ప్రాధాన్యతలు. కలిసి పనిచేస్తూ సమానంగా ఎదగాలన్నదే మా విధానం. ఆఫ్రికాతో మా అభివృద్ధి భాగస్వామ్యం కొనసాగుతుంది. స్థానికంగా నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల సృష్టికి కృషి చేస్తాం. ఆఫ్రికాలో కేవలం పెట్టుబడులు పెట్టడమే కాదు, స్థానిక ప్రజల సాధికారతే మా ధ్యేయం. స్ఫూర్తిదాయకమైన చరిత్ర కలిగిన ఘనాలో పర్యటిస్తుండడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది భారత్. మాకు ప్రజాస్వామ్యం అంటే కేవలం ఒక వ్యవస్థ కాదు.. మా ప్రాథమిక విలువల్లో అదొక అంతర్భాగం. ఇండియాలో ప్రజాస్వామ్యానికి వేలాది సంవత్సరాల చరిత్ర ఉంది. నిజమైన ప్రజాస్వామ్యం చర్చ, సంవాదాన్ని ప్రోత్సహిస్తుంది. అది ప్రజలను ఐక్యం చేస్తుంది. గౌరవం, మానవ హక్కులకు అండగా నిలుస్తుంది. ఏ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకైనా పారదర్శక, స్వేచ్ఛాయుత ఎన్నికలు ఆత్మలాంటివి. ఇండియాలో ఎన్నికల సంఘం పనితీరును దగ్గరగా గమనించడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది’’ అని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. ఘనా పార్లమెంట్లో ఘనా–ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ సొసైటీని స్థాపించడాన్ని ఆయన స్వాగతించారు. ఇండియాలో 2,500 రాజకీయ పారీ్టలున్నాయని మోదీ చెప్పగా ఘనా పార్లమెంట్ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. భారత్–ఘనా మధ్య ‘సమగ్ర భాగస్వామ్యం’ భారత్–ఘనా దేశాలు తమ పరస్పర సంబంధాలను ‘సమగ్ర భాగస్వామ్యం’ స్థాయికి పెంచుకున్నాయి. ఘనా అభివృద్ధి ప్రయాణానికి భారత్ తోడుగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఆయన గురువారం ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమానీ మహామాతో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్–ఘనా మధ్య పరస్పర వాణిజ్యాన్ని రాబోయే ఐదేళ్లలో రెండింతలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రెండు రోజుల పర్యటన కోసం మోదీ బుధవారం రాత్రి ఘనా చేరుకున్నారు. తొలుత ఘనా అధ్యక్షుడితో కలిసి ప్రతినిధుల స్థాయి చర్చల్లో పాల్గొన్నారు. గురువారం ఇరువురు నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య నాలుగు కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. సంస్కృతి, సంప్రదాయ వైద్యంతోపాటు వేర్వేరు రంగాల్లో సహకారం కోసం ఈ ఒప్పందాలు కుదిరాయి. ఘనాకు భారత్ కేవలం భాగస్వామి మాత్రమే కాదని, ఘనా దేశ నిర్మాణంలో అండగా నిలుస్తోందని మోదీ ఉద్ఘాటించారు.మోదీకి ఘనా జాతీయ గౌరవ పురస్కారం ప్రధాని నరేంద్ర మోదీకి ఘనా జాతీయ గౌరవ పురస్కారం ‘ద ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనా’ లభించింది. ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమానీ మహామా ఆయనకు ఈ పురస్కారం ప్రదానం చేశారు. ప్రశంసనీయమైన రాజనీతిజ్ఞత ప్రదర్శించడంతోపాటు ప్రపంచ స్థాయి నేతగా ప్రభావం చూపుతున్నందుకు గాను మోదీని ఘనా ప్రభుత్వం ఈ పురస్కారంతో సత్కరించింది. ఇది తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఇది ఎంతో గర్వకారణమని చెప్పారు. 140 కోట్ల మంది భారతీయుల తరఫున ఘనా జాతీయ గౌరవ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.ముగిసిన ఘనా పర్యటనభారత ప్రధానమంత్రి ఘనాలో రెండు రోజుల పర్యటన ముగించుకొని గురువారం ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి పయనమయ్యారు. శుక్రవారం ఆ దేశ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో మోదీ ప్రసంగించే అవకాశం ఉంది. -
అంతరిక్షంలో అతిథి
భూమి దిశగా గ్రహశకలాలు దూసుకొస్తూ అతిథుల్లా పలకరిస్తుంటాయి. అయితే ప్రచండ వేగంతో రావడంతో భూవాతావరణంలోకి రాగానే మండిపోయి మసైపోతాయి. కానీ దేదీప్యమానంగా వెలిగిపోయే తోకతో మెరుపువేగంతో దూసుకొచ్చే తోకచుక్క ఇందుకు మినహాయింపు. ఆకాశంలో కనిపించినంతసేపు కనువిందు చేయడం దీని ప్రత్యేకత. అలాంటి తోక చుక్క ఒకటి మన సౌరమండలంలోకి అతిథిగా వచ్చిందని నాసా శాస్త్రవేత్తలు తాజాగా ప్రకటించారు. దీనికి 3ఐ/అట్లాస్ అని నామకరణం చేశారు. చరిత్రలో ఇప్పటిదాకా సౌరకుటుంబం ఆవలి నుంచి వచ్చిన మూడో కొత్త తోకచుక్క ఇదేనని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చిలీలోని రియో హర్టాడో నగరంలో ఏర్పాటుచేసిన ఆస్ట్రరాయిడ్ టెరిస్ట్రియల్ –ఇంపాక్ట్ లాస్ అరైవల్ సిస్టమ్(అట్లాస్) సర్వే టెలిస్కోప్, అమెరికా శాన్డీగో కౌంటీలోని పాలమార్ అబ్జర్వేటరీ జ్వికీ టెలిస్కోప్లు ఈ తోకచుక్క రాకను జూలై ఒకటో తేదీన కనిపెట్టాయి. ధనస్సు రాశిగా పిలవబడే నక్షత్ర కూటమి వైపు నుంచి ఈ తోకచుక్క మన సౌరకుటుంబం దిశగా వచ్చిందని శాస్త్రవేత్తలు గుర్తించారు.భూమికెలాంటి ప్రమాదం లేదన్న సైంటిస్టులుప్రస్తుతం ఈ తోకచుక్క భూమికి 67 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఇంతదూరం నుంచి వెళ్తుండటంతో దీని కారణంగా భూమికి ఎలాంటి ప్రమాదం లేదని అధ్యయనకారులు తేల్చిచెప్పారు. ఈ తోకచుక్క తన మార్గంలో పయనిస్తూనే సూర్యుని సమీపంగా వెళ్లనుంది. ప్రస్తుతం ఇది సూర్యునికి 67 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్టోబర్ 30వ తేదీన ఆదిత్యునికి అతి దగ్గరగా వెళ్లనుంది. కేవలం 21 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి అది తన పథంలో దూసుకుపోనుంది. అంటే అంగారక గ్రహం కంటే కూడా ఇది సూర్యుని సమీపానికి వెళ్లనుంది. సెప్టెంబర్ నెల వరకు ఖగోళ ఔత్సాహికులు ఈ తోకచుక్కను టెలిస్కోప్ సాయంతో చూడొచ్చు. తర్వాత అది సూర్యుని ఆవలిదిశ వైపుగా వెళ్లడంతో భూమి మీద నుంచి తోకచుక్క సరిగా కనిపించకపోవచ్చు. మళ్లీ డిసెంబర్ తర్వాత కనువిందు చేయనుంది. గతంలో 2017లో ఒక తోకచుక్క, 2019లో మరో తోకచుక్క ఇలా మన సౌరకుటుంబంలోకి అలా అతిథులుగా వచ్చి ఇలా వెళ్లిపోయాయి. 1ఐ/ఓమువామూ, 2ఐ/బొరిసోవ్ తోకచుక్కల తరహాలోనే ఇది కూడా తోకచుక్కలకు సంబంధించిన మరింత వాస్తవిక సమాచారాన్ని అందించి వెళ్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొత్త తోకచుక్క కావడంతో దీని తోక పొడవు, వెడల్పుల వివరాలు ఇంకా తెలియలేదు. కొత్త తోకచుక్కను సీ/2025 ఎన్1 అనే పేరుతోనూ పిలుస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా–పాక్ రక్షణ బంధం బలోపేతం!
వాషింగ్టన్: అమెరికా–పాకిస్తాన్ మధ్య రక్షణ బంధం క్రమంగా బలోపేతం అవుతోంది. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన అపరేషన్ సిందూర్లో భారీగా నష్టపోయిన పాక్ సైన్యం అమెరికాకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పాకిస్తాన్ ఎయిర్ఫోర్స్(పీఏఎఫ్) చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇదొక ఉన్నత స్థాయి పర్యటన. పాకిస్తాన్ వైమానిక దళం అధినేత అమెరికాలో అధికారికంగా పర్యటిస్తుండడం గత పదేళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్లో ఇటీవల ఘనమైన ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాలో పర్యటనలో భాగంగా జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ అమెరికా అత్యున్నత సైనికాధికారులతో, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. యూఎస్ ఎయిర్ఫోర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డేవిడ్ అల్విన్ను కలుసుకున్నారు. విస్తృతంగా చర్చలు జరిపారు. అమెరికాతో రక్షణ సహకారం పెంపొందించుకోవడం, కలిసి పనిచేయడం, టెక్నాలజీ ఆధారిత సైనిక మారి్పడి వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ పర్యటనతో అమెరికా–పాక్ మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారం, పరస్పర ప్రయోజనాలు మరింత వృద్ధి చెందుతాయని ఆశిస్తున్నట్లు పాకిస్తాన్ వైమానిక దళం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇరుదేశాల సంబంధాల్లో ఇదొక కీలక మైలురాయి అని అభివరి్ణంచింది. తమ వైమానిక దళాన్ని ఆధునీకరించాలని పాకిస్తాన్ నిర్ణయానికొచ్చింది. ఇందుకోసం అమెరికా సాయాన్ని అర్థిస్తోంది. అమెరికా నుంచి 70 ఎఫ్–16 బ్లాక్ ఫైటర్జెట్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, ఏఐఎం–7 స్పారో ఎయిర్–టు–ఎయిర్ మిస్సైళ్లు, ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ బ్యాటరీలు సమకూర్చుకోవాలని భావిస్తోంది. చైనా ఇచ్చిన ఆయుధాలపై ఆధారపడడం క్షేమంకాదని ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్కు తెలిసొచ్చింది. అందుకే అమెరికా ఆయుధాలపై దృష్టి పెట్టింది. అందుకు అమెరికా సైతం సానుకూలంగా స్పందిస్తుండడం చర్చనీయాంశంగా మారతోంది. -
Pakistan: ‘ఆ 30-45 సెకన్లు ఏం జరిగిందో అర్థం కాలేదు’
ఆపరేషన్ సింధూర్లో భాగంగా తమ దేశంపైకి దూసుకొచ్చిన బ్రహ్మోస్ క్షిపణితో హడలిపోయామని పాక్ ప్రధాని షెహబాజ్ సలహాదారు రానా సనుల్లాహ్ స్పష్టం చేశారు. ఒక్కసారిగా దూసుకొచ్చిన బ్రహ్మోస్ క్షిపణితో భారత్ ఏమైనా అణు యుద్ధాన్ని ఆరంభించిందా అనే ఆలోచనలో పడ్డామన్నారు. రావల్పిడింలోని తమ ప్రధాన ఎయిర్ బేస్ నూర్ ఖాన్ ఎయిర్బేస్పై బ్రహ్మోస్ క్షిపణిని భారత్ ప్రయోగించిన క్రమంలో కాసేపు తాము అలా చూస్తూ ఉండిపోయామన్నారు. ప్రధానంగా 30 నుంచి 45 సెకన్ల పాటు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి తమ సైన్యంలో ఏర్పడిందన్నారు. తొలుత అణు యుద్ధంగా భావించామని, తర్వాత తేరుకుని మిసైల్తో దాడి చేశారనే విషయాన్ని గ్రహించామన్నారు.‘ భారత్ న్యూక్లియర్ వార్హెడ్ను భారత్ ఉపయోగించకపోవడంతో వారు మంచి చేశారని నేను చెప్పడం లేదు. మా దేశ ప్రజలు మాత్రం దీనిపై కచ్చితంగా తప్పుగా అర్ధం చేసుకుని ఉంటారు. అది అణు యుద్ధమేనని మా ప్రజలు అనుకుని ఉంటారు. ఒకవేళ అదే జరిగితే తొలి ప్రపంచ న్యూక్లియర్ వార్ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉండేది’ అని రానా సనుల్లాహ్ స్పష్టం చేశారు.పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. దీనిలో భాగంగా భారత్ బ్రహ్మోస్ క్షిపణిని కూడా ప్రయోగించింది. ఆ బ్రహ్మోస్ క్షిపణి మెరుపుదాడిలో పాకిస్తాన్లో పలు ప్రాంతాలు అతలాకులమయ్యాయి. నూర్ ఖాన్ ఎయిర్బేస్ పరిధిలోని పాకిస్తాన్ శాటిలైట్ వ్యవస్థ నాశనమైంది. పాకిస్తాన్ నూర్ ఖాన్ ఎయిర్బేస్ ప్రాంతంలో భారత్ దాడి చేయడం ఇది తొలిసారి కాదు. 1971లో ఇరు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో సైతం నూర్ ఖాన్ ప్రాంతాన్ని భారత్ టార్గెట్ చేసి పాక్ను కోలునీయకుండా చేసింది. -
ఏంటీ కిరికిరి?..అమెరికా-పాక్ల మధ్య అసలేం జరుగుతోంది?
అమెరికా పర్యటనకు ఇటీవలే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వెళ్లి వచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో డిన్నర్ పార్టీలో సుదీర్ఘంగా మాట్లాడారు. మరి ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ అమెరికా పర్యటనలో ఉన్నారు. పాక్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమెరికాకు వెళ్లడం దశాబ్దం తర్వాత ఇదే తొలిసారి. ఇక్కడ పాకిస్తాన్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ మాత్రం గుమ్మనంగా ఉన్నారు. ఇది పాకిస్తాన్ వ్యూహాత్మకమ చర్యా లేక ప్రధానిని పక్కన పెట్టేశారా? అనేది ప్రస్తుతానికి ప్రశ్నగానే ఉంది. భారత్ చేపట్టిన ఆపరేషన్సింధూర్ తర్వాత పాక్ ప్రధాని మనకు సోయలో కూడా కనిపించడం లేదు. పాక్లో ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనంతరం ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట ఎక్కడా వినిపించకపోవడం ఒకటైతే, పాక్కు చెందిన రక్షణ వ్యవస్థలోని కీలక అధికారులు వాషింగ్టన్లో దర్శనమిస్తూనే ఉన్నారు. భారత్ కొట్టిన దెబ్బతో పాక్ ఆర్మీ ఎంత పేలవంగా ఉందో తేలిపోవడంతో ఇప్పుడు దానిపై వారు దృష్టి సారించినట్లు వార్తలు వస్తున్నప్పటికీ అమెరికా-పాకిస్తాన్ల మధ్య ఏదో జరుగుతుందనే అనుమానం మాత్రం ప్రతీ ఒక్కరికీ ఏదో మూలన తొలుస్తూనే ఉంది. భారత్పై ప్రతీకారం తీర్చుకోవాలనే చర్యలకు అమెరికాతో కలిసి కుట్రలు చేస్తుందా అనేది మరొక కోణంలో చూడాల్సి వస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్(ఫైల్ఫోటో)చైనాను దెబ్బతీయాలన్నేదే లక్ష్యమా?పాక్కు భారత్ శత్రువు అయితే, అమెరికాకు చైనా శత్రువు అనేది కాదనలేని సత్యం. మరి భారత్, చైనాల సరిహద్దుల్లో ఉన్న దేశం పాకిస్తాన్. మరి చైనాను దెబ్బతీయాలన్నా కూడా అమెరికాకు పాక్ సాయం అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకునే పాకిస్తాన్ ఆర్మీనే పదే పదే యూఎస్కు ట్రంప్ పిలుపించుకుంటున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఆ క్రమంలోనే పాకిస్తాన్ను కాకాపట్టి.. చైనా దెబ్బకొట్టాలనే ఉద్దేశంలో ట్రంప్ ఉన్నారా? అనేది ప్రధానంగా అనుమానించాల్సి వస్తోంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రధానికి ఉండే విలువ ఏమిటో అందరికీ తెలిసిందే. మరి అటువంటింది పాక్ ప్రధానిని పక్కన పెట్టి మరీ రక్షణ రంగంలోని కీలక అధికారులతో అమెరికా సమావేశాలేంటో ఎవరికీ అర్థం కావడం లేదు.పునః నిర్మాణంలో ఉగ్రస్థావరాలుఇటీవల సమకూరిన నిధులతో పాక్లోని ఉగ్రస్థావరాలను, ఆర్మీ క్యాంపులను మరమ్మత్తులు చేసే పనిలో పడ్డ పాక్.. ఇప్పడు అమెరికా యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి సిద్ధమైందనేది ప్రముఖంగా వినిపిస్తోంది. అమెరికాకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలకు పాకిస్తాన్ కొనుగోలుకు ఇప్పటికే పాక్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక్కడ పాక్కు అమెరికా ఎంత సపోర్ట్గా ఉందనేది తేటతెల్లమవుతుండగా, భారత్తో మాత్రం అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తోంది అగ్రరాజ్యం. కొన్ని రోజుల క్రితం కెనడా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీని ట్రంప్ ఆహ్వానించినా, అందుకు మోదీ వెళ్లలేదు. ఇది స్వయంగా మోదీ చెప్పినమాట. అమెరికా కుతంత్రాలు ఇప్పటికే ప్రధాని మోదీకి అర్ధం కావడంతోనే ట్రంప్ డిన్నర్ ఆహ్వానాన్ని మోదీ సున్నితంగా తిరస్కరించారు. ఇరుదేశాల మధ్య ఏదో కిరికిరి..?ఇక చైనా కూడా పాక్కు అండగానే ఉంటుంది. ఇటీవల భారత్తో జరిగిన యుద్ధంలో కూడా పాక్కే సపోర్ట్ చేసింది చైనా. అదే సమయంలో ‘చైనా యుద్ధ సామాగ్రినే’ పాక్ ఎక్కువగా కొనుగోలు చేస్తూ వస్తోంది. ఇప్పుడు అమెరికా వైపు చూస్తోంది. అంటే ఏదో కిరికిరి ఉందనేది కామన్ మ్యాన్కు అర్థం అవుతున్న విషయం. విలువకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని పాకిస్తాన్.. చైనాను పక్కన పెట్టడం కూడా పెద్ద పనేం కాదు. పెద్దన్నగా చెప్పుకునే అమెరికా అండదండలు పాకిస్తాన్కు ఉండటంతో తన పాత మిత్రుడు చైనాను దూరం చేసుకోవడానికి కూడా వెనుకాడని దేశం అది. అసలు అమెరికా వ్యూహం ఏమిటి?, పదే పదే వాషింగ్టన్లో పాక్ ఆర్మీ అధికారుల దర్శనం ఏమిటి?, అమెరికా-పాక్ల మధ్య ఏం జరుగుతోంది? అనేది ఇప్పుడు చర్చకు దారి తీసింది. -
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
వాషింగ్టన్: అమెరికాలో కాల్పుల కలకలం రేపాయి. బుధవారం (జూలై 2) రాత్రి చికాగోలో డ్రైవ్ బై కాల్పులు జరిగాయి. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. 14 మందికి తీవ్రగాయాలయ్యాయి. చికాగో స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చికాగో నగరంలోని రివర్ నార్త్ (River North) ప్రాంతం ఆర్టిస్ లాంజ్ (Artis Lounge) అనే నైట్క్లబ్లో రాపర్ మెలో బక్స్ (Mello Buckzz) ఆల్బమ్ రిలీజ్ పార్టీ జరుగుతోంది.ఆ సమయంలో ఓ వాహనం లోపల ఉన్న అగంతకులు నైట్క్లబ్ వెలుపల గుమికూడిన జనంపై కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ దుర్ఘటనలో పోలీసులు ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు.అగంతకులు జరిపిన కాల్పుల్లో 13 మంది మహిళలు, 5 మంది పురుషులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్ట్రోజర్ హాస్పిటల్, నార్త్వెస్టర్న్ మెమోరియల్ హాస్పిటల్స్కు తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గతంలో ఇదే ప్రదేశంలో మరోసారి కాల్పులు జరగడం గమనార్హం.Yet another mass shooting in Chicago media won't tell you about.Initial reports of 3 dead, 20+ injured following gunfire after a record release party.But it's only Black people with illegal handguns again so, HO, HUM, doesn't fit the narrative. pic.twitter.com/DNm5sXLd1i— BarleyPop (@MikePilbean) July 3, 2025 -
ఆ హక్కు ఆయనది మాత్రమే.. దలైలామా వారసుడి ఎంపికపై భారత్ స్పందన
దలైలామా 90వ పుట్టినరోజు వేడుకలకు ధర్మశాల ముస్తాబయ్యింది. మెక్లియోడ్గంజ్లోని ప్రధాన ఆలయమైన సుగ్లగ్ఖాంగ్లో వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు భారత ప్రభుత్వం తరఫున హాజరు కాబోతున్నారు. తాజాగా.. దలైలామా వారసత్వం ఎంపికపై చర్చ నడుస్తుండడంతో ఆయన స్పందించారు. న్యూఢిల్లీ: తన వారసుడి ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉంటుందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు గురువారం ప్రకటించారు. టిబెట్ను గుప్పిట పెట్టుకోవడానికి తమ అదుపులో ఉండే వ్యక్తిని దలైలామా వారసుడిగా ఎంపిక చేయాలని చైనా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దలైలామాదే అంతిమ నిర్ణయమని కిరణ్ రిజిజు అన్నారు. ‘‘15వ దలైలామా ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉంటుంది. దలైలామా వారసుడిని నిర్ణయించే అధికారం టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు తప్ప మరెవరికీ లేదు. దలైలామా స్థానం టిబెటన్లకు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులందరికీ అత్యంత ముఖ్యమైనది. తన వారసుడిని నిర్ణయించే హక్కు దలైలామాకే ఉంది’’ అని కిరణ్ రిజిజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.కొత్త దలైలామాను తామే ఎన్నుకుంటామంటూ చైనా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై 14వ దలైలామా టెన్జిన్ గ్యాట్సో బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దలైలామా ఎంపిక 600 సంవత్సరాలుగా బౌద్ధ సంప్రదాయాల ఆధారంగానే జరుగుతోందని, తాను ఏర్పాటు చేసిన గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ తదుపరి దలైలామా ఎంపిక ప్రక్రియను చేపడుతుందని, ఇందులో ఎవరి జోక్యం ఉండబోదని కుండబద్ధలు కొట్టారు. దలైలామా తన వారసుడు చైనా వెలుపల జన్మించాలని, బీజింగ్ నుంచి ఎంపిక చేసిన వ్యక్తిని ఎవరినైనా తిరస్కరించాలని ఆయన సూచించారు. అయితే చైనా 14వ దలైలామా ప్రకటనపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. టిబెట్ చైనాకి చెందిన భూమిగా పేర్కొంటూ.. దలైలామా ఎంపికపై తమకే హక్కు ఉందని డ్రాగన్ వాదిస్తోంది. దలైలామా, పాంచెన్ లామా, ఇతర ప్రముఖ బౌద్ధ గురువుల ఎంపిక తప్పనిసరిగా 'గోల్డెన్ అర్న్' పద్ధతిలో.. అదీ చైనా ప్రభుత్వ ఆమోదంతోనే జరగాలి అని చైనా విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. ఈ పద్ధతి 18వ శతాబ్దంలో చింగ్ వంశాధిపతి ప్రవేశపెట్టిన విధానమని పేర్కొన్న ఆమె.. చైనా ప్రభుత్వం మత స్వేచ్ఛకు కట్టుబడి ఉందని, అలాగని మత సంబంధిత వ్యవహారాలపై నియంత్రణలు, బౌద్ధ గురువుల నియామకాల కోసం ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి అని ఆమె గుర్తు చేశారు.దలైలామా (Dalai Lama) వారసుడి (successor) ఎంపికను బీజింగ్ ఆమోదించాలన్న చైనా (China) డిమాండ్పై అమెరికా ఇప్పటికే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇందుకోసం ఆ దేశ పార్లమెంట్లో ఓ ప్రత్యేక చట్టాన్ని కూడా చేసింది. వారసత్వంలో జోక్యం చేసుకోవడం మానేయాలని, మత స్వేచ్ఛను గౌరవించాలని చైనాను కోరుతూనే ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తాజాగా తెలిపారు. ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలో చేరింది. 14వ దలైలామా ఎంపిక తర్వాత.. టిబెటన్ సంప్రదాయంలో.. ఒక సీనియర్ బౌద్ధ సన్యాసి ఆత్మ అతని మరణం తర్వాత ఒక చిన్నారి శరీరంలోకి ప్రవేశించి.. పునర్జన్మ పొందుతుందని నమ్ముతారు. జూలై 6, 1935న టిబెట్ క్వింఘై ప్రావిన్స్లోని ఒక రైతు కుటుంబంలో జన్మించిన టెన్జిన్ గ్యాట్సోను.. రెండేళ్ల వయసులో 14వ దలైలామా గుర్తించారు. అయితే కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ నేతృత్వంలోని చైనా దళాలు టిబెట్ను ఆక్రమించుకున్నాయి. 1959లో టిబెట్ ధైవభూమి లాసాలో తిరుగుబాటు విఫలం తర్వాత వెయ్యి మందికిపైగా బౌద్ధ సన్యాసులతో దలైలామా భారత్కు శరణార్ధిగా వచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. -
‘భాగస్వామ్యమే కాదు.. సహ ప్రయాణం’.. ఘనాలో ప్రధాని మోదీ
అక్రా: ఘనా అభివృద్ధి ప్రయాణంలో భారత్ కేవలం భాగస్వామి మాత్రమే కాదని, సహ ప్రయాణం సాగిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధాని తన ఐదు రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమ ఆఫ్రికాలోని ఘనాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఘనాలో ప్రధాని మోదీకి ఆ దేశ ప్రతినిధుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఆ తరువాత ఆయన ఘనా అధ్యక్షుడు జాన్ ద్రామానీ మహామాతో పలు భాగస్వామ్య అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాను ఉద్దేశించి ప్రకటన చేశారు. రాబోయే ఐదు సంవత్సరాలలో ఇరు దేశాలు ద్విమార్గ వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయని, భారత్.. ఘనాకు కేవలం భాగస్వామి మాత్రమే కాదని, ఘనా అభివృద్ధి ప్రయాణంలో సహ ప్రయాణం చేస్తున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత కంపెనీలు ఘనాలో దాదాపు 900 ప్రాజెక్టులలో రెండు బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాయన్నారు. రాబోయే ఐదేళ్లలో పరస్పర వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. I thank the people and Government of Ghana for conferring ‘The Officer of the Order of the Star of Ghana’ upon me. This honour is dedicated to the bright future of our youth, their aspirations, our rich cultural diversity and the historical ties between India and Ghana.This… pic.twitter.com/coqwU04RZi— Narendra Modi (@narendramodi) July 2, 2025ఫిన్టెక్ రంగంలో, భారతదేశం ఘనాతో యూపీఐ డిజిటల్ చెల్లింపుల విధానాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉందని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం మానవాళికి శత్రువని.. ఇరు దేశాలు స్పష్టం చేశాయని, ఆ ముప్పును ఎదుర్కోవడంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని తెలిపారు. రక్షణ, భద్రతా రంగంలో తాము సంఘీభావం ద్వారా భద్రత అనే సూత్రంతో ముందుకు సాగుతామన్నారు. సాయుధ దళాల శిక్షణ, సముద్ర భద్రత, రక్షణ సరఫరా, సైబర్ భద్రత తదితర రంగాల్లో భారత్-ఘనా దేశాల మధ్య పరస్పర సహకారం పెరుగనున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా సంస్కృతి, సాంప్రదాయ వైద్యంతోపాటు పలు రంగాల్లో సహకారాన్ని అందించే నాలుగు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకం చేశాయి.ఇది కూడా చదవండి: కన్వర్ యాత్రకు అవే నిబంధనలు.. మళ్లీ వివాదం తలెత్తేనా? -
అందుకే ట్రంప్ నన్ను టార్గెట్ చేశారు
ట్రంప్-మామ్దానీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మమ్దానీని అరెస్ట్ చేయాలని, ఆయన్ని దేశం నుంచి వెళ్లగొట్టాలని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా న్యూయార్క్లో జరిగిన ఓ పబ్లిక్ ర్యాలీలో ట్రంప్ వ్యాఖ్యలపై మమ్దానీ ఘాటుగానే స్పందించారు. వాషింగ్టన్: న్యూయార్క్ నగర మేయర్ పదవికి భారతీయ మూలాలున్న అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ.. తనను అరెస్ట్ చేసి, దేశం నుండి పంపించాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఆయన ఈ వ్యాఖ్యలు అమెరికాలో వర్గ విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నమేనని అన్నారాయన. 33 ఏళ్ల ఈ డెమొక్రటిక్ సోషలిస్ట్ ట్రంప్పై తీవ్ర విమర్శలే గుప్పించారు. వర్కింగ్ క్లాస్ పీపుల్ను ట్రంప్ మోసం చేశారు. ఆ విషయం నుంచి అమెరికన్ల దృష్టిని మరల్చేందుకు ఆయన తనను లక్ష్యంగా చేసుకున్నారని మమ్దానీ అన్నారు. ‘‘నిన్న ట్రంప్ నన్ను అరెస్ట్ చేయాలని, దేశం నుండి పంపించాలని, పౌరసత్వం తీసేయాలని అన్నారు. నేను ఈ నగరానికి తరాలుగా మొదటి వలసదారుడిగా, మొదటి ముస్లిం, దక్షిణాసియా మూలాలున్న మేయర్గా నిలవబోతున్నాను. ఇది నేను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చానో అనే దానికంటే, నేను ఏం కోసం పోరాడుతున్నానో దాన్ని దృష్టి మళ్లించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నమే అని మమ్దానీ అన్నారు. రిపబ్లికన్లపై తన పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారాయన. Donald Trump is attacking me because he is desperate to distract from his war on working people. We must and we will fight back. pic.twitter.com/pKEwnijJaG— Zohran Kwame Mamdani (@ZohranKMamdani) July 2, 2025న్యూయార్క్ నగర మేయర్ పదవీ రేసులో.. డెమొక్రటిక్ ప్రైమరీలో మాజీ గవర్నర్ ఆండ్రూ కువోమోపై జోహ్రాన్ మమ్దానీ సంచలన విజయం సాధించారు. ఆపై ట్రంప్ సహా రిపబ్లికన్లు మమ్దానీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మమ్దానీ పెద్ద కమ్యూనిస్టు పిచ్చోడని.. న్యూయార్క్ను నాశనం చేయకుండా తానే కాపాడతానని ట్రంప్ ప్రకటించుకున్నారు. ఈలోపు.. ట్రంప్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్పై మమ్దానీ తీవ్రంగా విమర్శించారు. ఈ బిల్లు అమెరికన్ల ఆరోగ్యాన్ని హరించివేస్తుందని, ఆకలితో ఉన్నవారి నుంచి ఆహారాన్ని లాక్కుంటుందని, ధనవంతులకే మళ్లీ లాభాలు చేకూర్చే విధంగా ఉంది అని మమ్దానీ విమర్శించారు. -
ఇండోనేసియాలో పడవ మునక
బాలి: ఇండోనేసియాలోని బాలిలో పడవ మునిగిన ఘటనలో ఆరుగురు చనిపోయారు. కనీసం 29 మంది గల్లంతయ్యారు. 31 మందిని రక్షించామని అధికారులు తెలిపారు. కేఎంపీ తును ప్రతమ జయ అనే పడవ బుధవారం సాయంత్రం తూర్పు జావాలోని కేతాపాంగ్ ఓడరేవు నుంచి బాలిలోని గిలిమనుక్కు బయలుదేరిన అరగంటకే అలల తాకిడికి గురైంది. ప్రమాద సమయంలో ఫెర్రీలో 53 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, 22 వాహనాలు, ట్రక్కులు ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం వరకు 31 మందిని కాపాడారు. వీరిలో సుమారు 20 మంది అపస్మారక స్థితిలో ఉన్నారని అధికారులు తెలిపారు. టగ్ బోట్లు, నౌకలతో సహా తొమ్మిది బోట్లతో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. అలలు రెండు మీటర్ల ఎత్తులో ఎగసిపడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. పూర్తిగా మునిగిపోయిన పడవలో చిక్కుకుని ఎవరూ ఉండే అవకాశాల్లేవని చెప్పారు. కాగా, అధికారులు చెబుతున్న దానికంటే పడవలో ఎక్కుమంది ప్రయాణికులు ఉండే అవకాశాలున్నాయని ప్రత్యక్ష సాకు‡్ష్యలు అంటున్నారు. ఇలా ఉండగా, ఇండోనేసియాలోని దీవుల మధ్య రోజూ ప్రయాణించే లక్షలాది మందికి పడవలే ఆధారం. అయితే, కాలం చెల్లిన ఓడలు, తగినంత భద్రతా తనిఖీలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల బాలి సమీపంలో ఒక పర్యాటక పడవ బోల్తా పడటంతో ఆ్రస్టేలియాకు చెందిన ఓ మహిళ మరణించింది. 2018లో టోబా సరస్సులో పడవ మునిగిన ఘటనలో 150 మందికి పైగా జల సమాధి అయ్యారు. ఇది కూడా చదవండి: ముద్దులొలికే ఈ చిన్నారి ఫొటో వెనుక.. అంతులేని విషాదం -
Mali: ‘అల్ ఖైదా’ మరో ఘాతుకం.. ముగ్గురు భారతీయుల అపహరణ
న్యూఢిల్లీ: పశ్చిమ ఆఫ్రికా దేశంలోని వివిధ ప్రాంతాలలో వరుస ఉగ్రవాద దాడులు చోటుచేసుకుంటున్నాయి. ఇదే నేపధ్యంలో మాలిలో ముగ్గురు భారతీయులను ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా అపహరించింది. దీనిపై భారతదేశం ఆందోళన వ్యక్తం చేస్తూ, మాలి ప్రభుత్వం ఆ ముగ్గురు భారతీయుల సురక్షితమైన విడుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.మాలిలోని కేస్లోగల డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఆ ముగ్గురు భారతీయులు పనిచేస్తున్నారు. వీరి కిడ్నాప్ విషయం తెలిసిన వెంటనే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. జూలై ఒకటిన సాయుధ దుండగుల బృందం ఫ్యాక్టరీ ప్రాంగణంలో దాడి చేసి, ముగ్గురు భారతీయులను బందీలుగా తమ వెంట తీసుకువెళ్లిందని ఎంఈఏ తెలిపింది.అల్-ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్ (జేఎన్ఐఎం)మాలి అంతటా జరిగిన దాడులకు బాధ్యత వహించింది. బమాకోలోని భారత రాయబార కార్యాలయ అధికారులు ఆ ముగ్గురు భారతీయుల విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే వారి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపారని సమాచారం. ఈ హింసాత్మక చర్యను భారత ప్రభుత్వం ఖండిస్తోందని, అపహరణకు గురైన భారత పౌరులను సురక్షితంగా విడుదల చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని మాలి రిపబ్లిక్ ప్రభుత్వాన్ని ఎంఈఏ కోరింది. మాలిలోని భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని,అవసరమైన సహాయం కోసం బమాకోలోని రాయబార కార్యాలయంతో టచ్లో ఉండాలని ఎంఈఏ సూచించింది.ఇది కూడా చదవండి: విమాన ప్రమాద పరిస్థితులపై ‘రీక్రియేషన్’.. ఏం తేలిందంటే.. -
గాల్లో ప్రాణాలు.. ఫోన్లలో వీలునామాలు
టోక్యో: తరుణ్, జెనీలియా జంటగా గతంలో వచ్చిన ‘శశిరేఖా పరిణయం’సినిమాలో గాయాలపాలైన హీరోయిన్ చనిపోతానన్న భయంతో అప్పటికప్పుడు తన ప్రేమను హీరోకు చెప్తుంది. అచ్చం అలాగే తాము చనిపోవడం ఖాయమని భావించిన విమాన ప్రయాణికులు అప్పటికప్పుడు తమ ఆస్తులు ఎవరికి దక్కాలో స్మార్ఫోన్లలో వీలునామాలు, పాస్వర్డ్లు రాసి తమ వారికి సందేశాలుగా పంపించారు. ఈ ఘటన జపాన్లో చోటుచేసుకుంది. ప్రస్తుతం వైరల్గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. జూన్ 30న చైనాలోని షాంఘై పుడోంగ్ ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరిన విమానం మార్గమధ్యంలో ఇలా సాంకేతిక లోపంతో హఠాత్తుగా కిందకు దిగొచ్చి ప్రయాణికులకు గాల్లోనే చుక్కలు చూపించింది. చివరకు పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఎలాగోలా విమానాన్ని సమీప ఒసాకా నగరంలోని కన్సాయ్ విమానాశ్రయంలో రాత్రి 8.50 గంటలకు సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులు, సిబ్బందిసహా విమానంలోని మొత్తం 191 మంది ఊపిరి పీల్చుకున్నారు. A Spring Airlines flight from Shanghai to Tokyo was forced to make an emergency landing at Kansai Airport after a sudden loss of cabin pressure triggered a rapid descent from 36,000 feet to just under 10,500 feet in ten minutes.Flight JL8696 was cruising over Japan when a… pic.twitter.com/2n8rDGfqu5— FL360aero (@fl360aero) July 1, 2025జపాన్లోని టోక్యో నరీటా ఎయిర్పోర్ట్కు బయల్దేరిన ఈ బోయింగ్ 737 విమానం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 6.53 నిమిషాలకు ఈ అనూహ్య పరిస్థితులను ఎదుర్కొంది. విమానంలో తలెత్తిన ఈ సాంకేతిక సమస్యపై ఇప్పుడు సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. రాత్రివేళ హాయిగా నిద్రపోతున్న వేళ విమానం ఒక్కసారిగా కుదుపునకు లోనై కిందకు దూసుకురావడం, ప్రయాణికులు ఉన్నట్లుండి తమ సీట్లలోంచి ఎగిరి పైకప్పునకు ఢీకొనడం, ఆక్సీజన్లు మాసు్కలు పెట్టుకోండని సహాయక సిబ్బంది ఏడుస్తూ చెప్పిన దృశ్యాలను కొందరు ప్రయాణికులు రికార్డ్చేశారు.Passengers on a Japan Airlines flight had to wear oxygen masks after the plane fell nearly 26,000 feet pic.twitter.com/5nseotGv3n— daredevil (@daredevil_1010) July 2, 2025ఇక, తాము ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురై చనిపోతామని భావించిన ప్రయాణీకులు.. అప్పటికప్పుడు తమ ఆస్తులు ఎవరికి దక్కాలో స్మార్ఫోన్లలో వీలునామాలు రాసి తమ వారికి సందేశాలుగా పంపించారు. ఇంకొందరేమో తమ బ్యాంక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ల పిన్ నంబర్లు, లాగిన్ పాస్వర్డ్లు పంపించారు. మరి కొందరు బీమా మొత్తాలు, ఇన్సూరెన్స్ కంపెనీల వివరాలను మెసేజ్లుగా పంపించారు. 36,000 అడుగుల ఎత్తు నుంచి విమానం 10,500 అడుగుల దిగువకు స్వేచ్ఛగా పడిపోతుండటంతో తాము చనిపోవడం ఖాయమని భావించిన చాలా మంది ప్రయాణికులు ఇలా తమ చివరి కోరికలు, వీలునామాలను స్మార్ట్ఫోన్లో తమ కుటుంబసభ్యులకు చేరవేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. -
థాయిలాండ్లో ఒకేఒక్కడు !
బ్యాంకాక్: 1999వ సంవత్సరంలో విడుదలై సంచలన విజయం సాధించిన హీరో అర్జున్ సినిమా ‘ఒకే ఒక్కడు’ గుర్తుండే ఉంటుంది. ముఖ్యమంత్రి పాత్రధారి రఘువరన్ దమ్ముంటే ఒక్కరోజు సీఎంగా పరిపాలించి చూడు ఆ కష్టమేంటో తెలుస్తుంది అంటూ కథానాయకుడికి సవాల్ విసరడం, సవాల్ను అంతేవేగంగా స్వీకరించి అర్జున్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొని మెరుపువేగంతో పరిపాలనను చక్కదిద్దడం సినిమాలో చూశాం. సినిమాలో మాత్రమే సాధ్యమయ్యే ఈ అనూహ్య ఘటనకు ఇప్పుడు థాయిలాండ్ రాజకీయం వేదికైంది. కాంబోడియా ప్రధాని హున్సేన్తో ఫోన్ సంభాషణలో అతివినయం ప్రదర్శిస్తూ సొంత దేశ సైన్యాన్నే కించపరిచారంటూ ఆరోపణలు రావడంతో థాయిలాండ్ యువ మహిళా ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రను మంగళవారం దేశ రాజ్యాంగ న్యాయస్థానం సస్పెండ్చేసింది. దీంతో ప్రధాని పీఠం ఖాళీ అయింది. రాజకీయ సంక్షోభం తలెత్తకూడదనే ఉద్దేశ్యంతో అధికార పార్టీ వెంటనే రవాణా మంత్రి సూర్య జుగ్రూంగ్రియాంగ్కిట్ను ప్రధానిగా ప్రకటించింది. అయితే ఆయన కేవలం 24 గంటలపాటు మాత్రమే ప్రధానమంత్రి హోదా లో కొనసాగుతారని స్పష్టంచేసింది. దీంతో ఒక్క రోజు ప్రధాని అంశం మంగళవారం యావత్ థాయిలాండ్లో చర్చనీయాంశమైంది. ఒక్కరోజు లో కొత్త ప్రధాని ఏమేం బాధ్యతలు నెరవేర్చుతారు?. ఎలాంటి విధానపర నిర్ణయాలు తీసుకుంటారనే చర్చ మొదలైంది. ఈ విస్తృత చర్చల నడుమే సూర్య బుధవారం ఉదయం ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. ఇప్పటికే ఉపప్రధాని బాధ్యతలు నిర్వహిస్తున్న సూర్యకు ఇప్పుడీ ప్రధాని బాధ్యతలు అదనం. బుధవారం బ్యాంకాక్ నగరంలో ప్రధాని కార్యాలయ 93వ వార్షికోత్సవంలో సూర్య పాల్గొని తొలి అధికార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కనీసం 93 గంటలుకూడా ప్రధాని కార్యాలయంలో గడిపే అవకాశంలేని నేత ఏకంగా ప్రధాని కార్యాలయ 93వ వార్షికోత్సవాన్ని ప్రారంభించారని విపక్ష పార్టీలు ఎద్దేవాచేశాయి. 24 గంటల్లో వ్యవస్థలోని అవినీతినంతా ఈయన ప్రక్షాళన చేస్తాడా అంటూ విమర్శలు గుప్పించారు. -
ఎల్లుండే మెగా సునామీ?
పెను ఉత్పాతానికి మరో రెండు రోజులేనా? శనివారం (జూలై 5న) మెగా సునామీ విరుచుకుపడబోతోందా? జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య ప్రాంతాన్ని ముంచెత్తనుందా? ‘జపాన్ బాబా వాంగా’ పేరుతో ప్రసిద్ధురాలైన ర్యో తత్సుకీ జోస్యం నిజమైతే అక్షరాలా అదే జరగనుంది! ‘ద ఫ్యూచర్ ఐ సా (నేను దర్శించిన భవిష్యత్తు)’ పేరుతో రాసిన పుస్తకంలో ఆమె ఈ మేరకు ఎప్పుడో హెచ్చరించారు. దాంతో శనివారం నిజంగానే సునామీ వస్తుందా అంటూ ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఊపిరి బిగబట్టి మరీ ఎదురు చూస్తున్నారు. ఈ జోస్యానికి సంబంధించిన వార్తలు, చర్చోపచర్చలతో రెండు రోజులుగా ఇంటర్నెట్ అక్షరాలా హోరెత్తిపోతోంది. ‘జూలై5డిజాస్టర్’ ఇప్పుడు ఆన్లైన్లో యమా ట్రండింగ్లో ఉంది. ఈ భయాందోళనల నడుమ టోక్యో, సమీప ప్రాంతాల్లో విమాన తదితర ప్రయాణాలను జనం భారీగా రద్దు చేసుకుంటున్నారు. తత్సుకీ ఏం చెప్పారు? కరోనా ఉత్పాతాన్ని కూడా తుత్సుకీ ముందే ఊహించి చెప్పడం విశేషం! అప్పటినుంచీ ఆమె పేరు ప్రపంచమంతటా మార్మోగడం మొదలైంది. ఇక జూలై 5న వస్తుందని పేర్కొన్న సునామీ గురించి తన పుస్తకంలో 20 ఏళ్ల ముందే పేర్కొన్నారామె. ‘‘జపాన్, ఫిలిప్పీన్స్ నడుమ సముద్రగర్భం ఒక్కసారిగా బద్దలవుతుంది. ఆకాశహరŠామ్యలను తలదన్నేంత ఎత్తున అలలు ఎగిసిపడతాయి. లక్షలాది మందికి ప్రాణగండం’’ అంటూ వరి్ణంచారు. దాంతో ఇది కూడా నిజమవుతుందా అంటూ ఎక్కడ చూసినా అంతులేని ఉత్కంఠ రాజ్యమేలుతోంది. ఎవరీ తత్సుకీ? తత్సుకీ జపాన్కు చెందిన మాంగా ఆరి్టస్టు. ‘ద ఫ్యూచర్ ఐ సా (నేను దర్శించిన భవిష్యత్తు)’ ఆమె స్వయంగా చేత్తో రాసిన పుస్తకం. బ్రిటన్ యువరాణి డయానా మృతి, 2011లో జపాన్ను వణికించిన భూకంపం, సునామీ తదితరాలను అందులో ఆమె ముందుగానే పేర్కొన్నారు. అవన్నీ అక్షరాలా నిజమయ్యాయి కూడా. దాంతో గత శతాబ్దికి చెందిన బల్గేరియా మిస్టిక్, హీలర్ బాబా వంగా పేరిట ఆమెను ఇప్పుడంతా ‘జపనీస్ బాబా వంగా’ అంటూ కీర్తిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఘనాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
ఆక్రా: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం పశ్చిమ ఆఫ్రికా దేశం ఘనాకు చేరుకున్నారు. ఘనా అధ్యక్షుడు జాన్ ద్రామానీ మహామా ఆహ్వానం మేరకు ఆయన ఇక్కడ పర్యటిస్తున్నారు. కొటోకా ఇంటర్నేషన్ ఎయిర్పోర్టులో మోదీకి ఘన స్వాగతం లభించింది. సైనికులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. ఘనా ప్రభుత్వాధి నేతలతో మోదీ సమావేశ మవుతారు. భారత్–ఘనా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చిస్తారు. ప్రధాని మోదీ ఘనాలో పర్యటిస్తుండడం ఇదే మొదటిసారి. అలాగే గత మూడు దశాబ్దాల్లో భారత ప్రధాని ఘనాలో అడుగుపెట్టడం కూడా ఇదే తొలిసారి. ఇండియా నుంచి బయలుదేరే ముందు మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. గ్లోబల్ సౌత్లో భారత్కు ఘనా అత్యంత విలువైన భాగస్వామి అని పేర్కొన్నారు. ఘనా పర్యటన అనంతరం ఆయన ఈ నెల 3, 4వ తేదీల్లో ట్రినిడాడ్ అండ్ టోబాగోలో, 4, 5వ తేదీల్లో అర్జెంటీనాలో పర్యటిస్తారు. తర్వాత బ్రెజిల్లో 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతారు. చివరగా నమీబియాలో పర్యటించి, స్వదేశానికి చేరుకుంటారు. -
మనోళ్ల అక్రమ వలసలు తగ్గాయి
వాషింగ్టన్: ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో 10,300 మందికి పైగా భారతీయులు అక్రమంగా అమెరికా లోకి ప్రవేశిస్తూ పట్టుబడ్డారు. వైట్హౌస్ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు పేర్కొంది. అయితే 2024తో పోలిస్తే భారతీయుల అక్రమ వలసలు 70 శాతం తగ్గినట్టు వెల్లడించింది. గతేడాది జనవరి– మే మధ్య 34,535 మంది భారతీ యులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నంలో పట్టుబడ్డారు. అంటే సగటున రోజుకు 230 మంది! 2025లో ఇది రోజుకు 69కి తగ్గింది. ట్రంప్ రెండోసారి గద్దెనెక్కాక ఇమిగ్రేషన్ నిబంధనల అమలును కఠినతరం చేయడమే ఇందుకు కారణమని ప్రభుత్వం తెలిపింది. అమెరికా లోకి ప్రవేశించడానికి ప్రయత్నించి పట్టుబడ్డ 10,382 మంది భారతీయుల్లో గుజరాత్కు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. ట్రంప్ తిరిగి అధికారంలోకి వస్తారని ఊహించే స్మగ్లింగ్ సిండికేట్ 2024 చివరి నుంచి తమ కార్యకలాపాలను తగ్గించిందని నివేదిక పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటి దాకా ఏకంగా 6 లక్షలకు పైగా అక్రమ వలసదారులను అమెరికా సరిహద్దుల వద్ద అరెస్టు చేసింది. 2024లో ఇదే కాలంలో 12,33,959 మంది పట్టుబడ్డారు. పట్టుబడ్డ 10,382 మంది భారతీయుల్లో 30 మంది ఒంటరి మైనర్లున్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో 500 మందికి పైగా భారతీయ మైనర్లను అమెరికా అరెస్టు చేసింది. అనేక దేశాల నుంచి ఏటా వేలాది మంది తమ పిల్లలను అమెరికా–మెక్సికో, అమెరికా–కెనడా సరిహద్దులో వదిలి వెళ్తారు. వారికి అమెరికన్ పౌరసత్వం లభిస్తుందనే ఆశతో ఇలా చేస్తుంటారు. ఈ పిల్లలంతా 12–17 ఏళ్లు, అంతకంటే చిన్న వయసు వారని నివేదికలు చెబుతున్నాయి.పత్రాల్లేని వారు 2.2 లక్షలుడిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) 2024 ఏప్రిల్ నివేదిక ప్రకారం అమెరికాలో 2.2 లక్షల మంది భారతీయులు ఎలాంటి అనుమతి పత్రాలూ లేకుండా అనధికారికంగా నివసిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివకరూ 332 మంది భారతీయులను అమెరికా బహిష్కరించింది. అయినా ప్రమాదకరమైన డంకీ మార్గాల ద్వారా అమెరికాలోకి ప్రవేశించడానికి భారతీయులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు ప్రమాదకరమైన సముద్ర మార్గాల్లోనూ వెళ్తున్నారు. గత మే 9న కాలిఫోర్నియా తీరంలోని డెల్మార్ సమీపంలో జరిగిన పడవ ప్రమాదంలో 14 ఏళ్ల భారతీయ బాలుడు, అతని 10 ఏళ్ల అతని సోదరి మరణించారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
జిన్పింగ్ శకానికి తెర?
చైనాలో షీ జిన్పింగ్ శకం ముగిసిందా? పలువురు అధ్యక్షులకు పట్టిన గతే ఆయనకు కూడా పట్టనుందా? నెల రోజులుగా డ్రాగన్ దేశంలో జరుగుతూ వస్తున్న పలు అనూహ్య పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. మే 21 నుంచి జూన్ 5 దాకా జిన్పింగ్ రెండు వారాల పాటు ఆచూకీ లేకుండాపోయారు. అధికారిక కార్యక్రమాలు వేటిలోనూ పాల్గొనలేదు. కనీసం బహిరంగ వేదికలపై కూడా కన్పించలేదు. ఆయన చైనా పగ్గాలు చేపట్టిన గత 12 ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. దానికి తోడు అధ్యక్షుని గురించిన వార్తలను ప్రతి రోజూ ఫ్రంట్ పేజీల్లో విధిగా ప్రముఖంగా ప్రచురించే చైనా అధికార మీడియాలోఆ రెండు వారాల పాటు ఎక్కడా కనీసం ఆయన ప్రస్తావన కూడా రాలేదు! అధ్యక్షుని గైర్హాజరీపై ప్రపంచమంతా జోరుగా చర్చ జరిగినా చైనా ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. అధికారిక మీడియాలోనూ ఖండన వంటివి రాలేదు. చివరికి జూన్ 5 తర్వాత జిన్పింగ్ తిరిగి దర్శనమిచ్చినా ఆయనలో ముందున్న కళాకాంతులేవీ కన్పించలేదు. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకòÙంకోతో జరిగిన భేటీలో బాగా అనాసక్తంగా దర్శనమిచ్చారు. ‘‘జిన్పింగ్ బాగా నీరసించి, ఆరోగ్యంగా కన్పించారు’’ అని భేటీ తర్వాత బెలారస్ అధ్యక్షుని తరఫున వెలువడ్డ అధికారిక మీడియా ప్రకటన పేర్కొంది. దీనికి తోడు జిన్పింగ్కు భారీ స్థాయిలో ఉండే వ్యక్తిగత భద్రత కూడా కొద్దిరోజులుగా బాగా తగ్గిపోయింది. ఆయన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన మ్యూజియానికి అధికారిక హోదాను తొలగించారు. అంతేకాదు, ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జిన్పింగ్ ఫోన్లో సంభాషించారు. దాన్ని గురించిన చైనా అధికార టీవీ సంస్థ ప్రసారం చేసిన వార్తా కథనంలో జిన్పింగ్ను ఎలాంటి హోదా లేకుండా సంబోధించడం విశేషం! అతి శక్తిమంతమైన డ్రాగన్ దేశాన్ని ఇనుప పిడికిలితో శాసిస్తూ వస్తున్న జిన్పింగ్కు పాలనకు నూకలు చెల్లాయనేందుకు ఇవన్నీ స్పష్టమైన సంకేతాలేనంటూ జోరుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పాలక కమ్యూనిస్టు పారీ్టలో నెలకొన్న తీవ్ర అంతర్గత విభేదాలు అంతిమంగా జిన్పింగ్ను తప్పించే దిశగా సాగుతున్నాయంటూ ప్రవాస చైనా మేధావులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జిన్పింగ్కు ముందున్న అధ్యక్షుడు హూ జింటావో కూడా అధికారాంతానికి ముందు అచ్చం ఇలాగే కొతంకాలం పాటు అనూహ్యంగా కనబడకుండా పోవడం విశేషం. ఆ తర్వాత జిన్పింగ్ పగ్గాలు చేపట్టారు. అనతికాలంలోనే పార్టీలోని తన విరోధులు, వ్యతిరేకుల ఆట కట్టించి అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఇప్పుడు జిన్పింగ్కు కూడా అదే గతే పడుతోందంటూ ఆయన వ్యతిరేకులు సంబరపడిపోతున్నారు. నిజానికి జిన్పింగ్పై తిరుగుబాటుకు పథక రచన చేసింది, నిశ్శబ్దంగా తెర వెనక పావులు కదిపింది 82 ఏళ్ల జింటావోనే అని కూడా చెబుతున్నారు. ఇవేమీ నిజం కాదని, అధ్యక్షుడు తీవ్ర అనారోగ్యం పాలై చికిత్స పొందుతున్నారని మరో వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఈ ఉదంతం ప్రస్తుతం అంతర్జాతీయంగా పెను కలకలం రేపుతోంది. బ్రెజిల్లోని రియో డిజనిరోలో శనివారం నుంచి జరగనున్న 17వ బ్రిక్స్ సదస్సుకు కూడా జిన్పింగ్ హాజరు కావడం లేదు. దీన్ని చైనా అధికారికంగా ధ్రువీకరించింది. మూడు రోజుల సదస్సుకు ఆయన బదులుగా ప్రధాని లీ కియాంగ్ భేటీలో పాల్గొంటారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ బుధవారం మీడియాకు వెల్లడించారు. దీనికి కారణం ఏమిటన్న ప్రశ్నలకు ఆమె సమాధానం దాటవేశారు. బ్రిక్స్ సదస్సుకు జిన్పింగ్ డుమ్మా కొడుతుండటం గత 12 ఏళ్లలో ఇదే తొలిసారి! ఈ పరిణామం ఆయన భవితవ్యంపై అనుమానాలను మరింతగా పెంచుతోంది. జాంగ్ హవా! అధ్యక్షుడు జిన్పింగ్ అధికార కమ్యూనిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శి మాత్రమే గాక సర్వశక్తిమంతమైన సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ)కి చైర్మన్ కూడా. అయితే ప్రస్తుతం చైనాలో అధికార వ్యవహారాలన్నీ సీఎంసీ వైస్ చైర్మన్ జనరల్ జాంగ్ యూక్సియా కనుసన్నల్లో నడుస్తున్నాయని చెబుతున్నారు. జిన్పింగ్ చైనా చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో వరుసగా మూడోసారి అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు సహకరించిన వారిలో జాంగ్ ముఖ్యుడు కావడం విశేషం! శక్తిమంతమైన 24 మందితో కూడిన కమ్యూనిస్టు పార్టీ పొలిట్బ్యూరోలో ఆయన సభ్యుడు. అంతేగాక పారీ్టలోని సీనియర్ సభ్యుల్లో అత్యధికులు ప్రస్తుతం జాంగ్కు దన్నుగా నిలిచినట్టు వార్తలొస్తున్నాయి. మాజీ అధ్యక్షుడు జింటావో అనుయాయులైన వారంతా జిన్పింగ్ను తొలినుంచీ లోలోపల వ్యతిరేకిస్తూ వస్తున్న వారేనని సమాచారం. నిజానికి సైనిక, ఆర్థిక తదితర కీలక వ్యవహారాల్లో కొన్నాళ్లుగా జిన్పింగ్ మాట సాగడం లేదని చెబుతున్నారు. అంతేగాక ఆయన అనుయాయులైన డజన్ల కొద్దీ సైనిక జనరళ్లు కొద్ది రోజులుగా అనూహ్యంగా మాయమవుతున్నారు. మరికొందరికి ఉన్నట్టుండి ఉద్వాసన పలికారు.వారసుడు వాంగ్! చైనా చైనా కమ్యూనిస్టు పార్టీ సారథిగా ఇటీవలే నియమితుడైన వాంగ్యాంగ్ త్వరలో జిన్పింగ్ స్థానంలో అధ్యక్షునిగా పగ్గాలు చేపడతారని వార్తలొస్తున్నాయి. టెక్నోక్రాట్ అయిన వాంగ్కు మృదు స్వభావిగా, మార్కెట్ శక్తుల అనుకూలునిగా పేరుంది. అందుకే సంస్కరణవాది అయిన నాయకునిగా కమ్యూనిస్టు పార్టీ ఆయనను దేశ నాయకత్వ బాధ్యతలకు సిద్ధం చేస్తోందని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విద్యార్థి వీసాలపై ‘కాల పరిమితి’ కత్తి!
వాషింగ్టన్: విదేశీ వలసదారులపై బహిష్కరణ వేటు వేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా విదేశీ విద్యార్థులపై ‘కాల పరిమితి’ కత్తి దూసేందుకు సాహసించారు. విదేశీ విద్యార్థులకు కాలపరిమితితో సంబంధం లేకుండా ఇన్నాళ్లూ ఎఫ్–1 స్టూడెంట్ వీసాలు జారీచేస్తుండగా ఇకపై స్పష్టమైన తుదిగడువుతో విద్యార్థి వీసాలు జారీచేయాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తోంది. గడువు దాటాక అమెరికా గడ్డపై ఉంటే మళ్లీ స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత ప్రతిపాదనలో ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్(ఓఎంబీ) వద్ద పరిశీలనలో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర పడితే ఇకపై విద్యార్థి అమెరికాలో చేయబోయే కోర్సు పూర్తయినా, పూర్తికాకపోయినా వీసాపై ముద్రించిన గడువుతేదీలోపు అమెరికాను వీడాల్సి ఉంటుంది. ఇన్నాళ్లూ ఇలాంటి గడువు అనేదే లేదు. అమెరికాలోకి అడుగుపెట్టినప్పుడు ఎంచుకున్న విద్యా కోర్సు సంపూర్ణంగా పూర్తయ్యేదాకా ఆ స్టూడెంట్ వీసా చెల్లుబాటులోనే ఉండేది. దీనినే ‘ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’గా పిలుస్తారు. ఈ స్టేటస్లో ఇకపై గడువు తేదీని ముద్రించాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. గతంలో కోర్సు ఆలస్యమైతే వీసా గడువు పొడిగింపు వంటి వెసులుబాట్లు ఉండేవి. ఇకపై అలాంటివి ఒప్పుకోబోమని ట్రంప్ సర్కార్ కరాఖండీగా చెబుతోంది. దీంతో ఎఫ్–1 వీసాలతో అమెరికా విద్యాభ్యాసం కోసం వచ్చే భారతీయ విద్యార్థులపై మరింత ఆర్థిక భారం పడనుంది. అనివార్య కారణాలతో కోర్సు ఆలస్యమైనాసరే వీసా గడువు మాత్రం పాత తేదీకే పూర్తవుతుంది. అలాంటి సందర్భాల్లో కోర్సు పూర్తికాకముందే అమెరికాను వీడాల్సి ఉంటుంది. ఈ గండం నుంచి గట్టెక్కేందుకే మరోసారి వీసా కోసం దరఖాస్తు చేసుకోవడం, ఆ దరఖాస్తు ఆమోదం కోసం వేచి ఉండటం, దరఖాస్తు, తదితరాల ఖర్చులు తడిసిమోపెడై విద్యార్థులకు ఖర్చు మరింత పెరగనుంది. ఎక్స్చేంజ్ విజిటర్లకూ కష్టాలే జే–1 వీసా సాధించి ఎక్స్చేంజ్ విజిటర్లుగా వచ్చే వాళ్లకూ ఇదే నిబంధనను వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. చిన్నారులకు ఇంట్లో సేవచేయడం అందుకు ప్రతిఫలంగా భోజన, వసతి, స్వల్ప భత్యం వంటి సదుపాయాలు పొందే ‘ఆపెయిర్’ యువతకు ఇదే గడువు విధించాలని చూస్తున్నారు. కొత్త ప్రతిపాదలు అమల్లోకి వస్తే విదేశీ విద్యార్థులతోపాటు ఎక్స్చేంజ్ విజిటర్ల విభాగంలోకి వచ్చే అధ్యాపకులు, విదేశీ మీడియా ప్రతినిధులు, విద్యావేత్తలు, కళాకారులు, ఉపాధ్యాయులు, ట్రైనీలు, ఇంటర్న్లు, వైద్యులు సైతం వీసా కాలపరిమితి కష్టాలను ఎదుర్కోనున్నారు. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఈ ప్రతిపాదనలు చేసింది. ప్రతిపాదనలు ప్రస్తుతం ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ విభాగం పరిశీలిస్తోంది. వీటిని ఫెడరల్ రిజిస్ట్రీలో ప్రచురించాక 30 లేదా 60 రోజుల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించి తుది నిర్ణయం తీసుకుంటారు. అత్యవసరమైతే దొడ్డిదారిన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి కూడా ట్రంప్ ప్రభుత్వం ఈ నిబంధనను అమల్లోకి తెచ్చే ప్రమాదముందని తెలుస్తోంది. పలు వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు ఇప్పటికే వీసా దరఖాస్తుదారుల ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టా గ్రామ్, లింక్డి్డన్ వంటి సామాజిక మాధ్యమ ఖాతాలను అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఇన్ఫోర్స్మెంట్ అధికారులు జల్లెడ పడుతున్నారు. అమెరికా వ్యతిరేక, హమాస్ అనుకూల పోస్ట్లు, ట్వీట్లు, వీడియోలు ఉన్నాయో లేదోనని పరిశీలించి ఆ మేరకు దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. ఇన్ని అడ్డంకులను దాటుకుని సంపాదించిన వీసాను కేవలం గడువు ప్రాతిపదికన మంజూరుచేయడం తగదని పలు వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గడువు విధింపు కారణంగా లక్షలాది మంది విద్యార్థులపై అదనపు ఒత్తిడి, ఆర్థికభారం తప్పదని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అకడమిక్ కోర్సుల విధానం అస్తవ్యస్తమవుతుందని పలువురు పేర్కొన్నారు. గడువుదాటి అమెరికాలో ఉంటే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఢిల్లీలోని అమెరికా ఎంబసీ మే 14వ తేదీన హెచ్చరించడం తెల్సిందే. -
శత్రు భీకర అపాచీలొస్తున్నాయ్
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ తన వైమానిక సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేసుకుంటున్న తరుణంలో భారత వాయుసేనకు అమెరికా నుంచి తీపి కబురు అందింది. ఐదేళ్ల క్రితంనాటి ఒప్పందంలో భాగంగా తొలి దఫా అపాచీ యుద్ధ హెలికాప్టర్లను అందజేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అమెరికా నుంచి తెప్పిస్తున్న ఈ అధునాతన హెలికాప్టర్లు వచ్చాక వీటిని వాయుసేన దళాలకు అందించనున్నారు. పాకిస్తాన్ సరిహద్దు వెంట కీలక మిషన్లలో ఇవి పాలుపంచుకోనున్నాయి. దాదాపు రూ.5,140 కోట్ల ఒప్పందంలో భాగంగా భారత్కు అమెరికా ఆరు అపాచీ ఏహెచ్–64ఇ రకం యుద్ధ హెలికాప్టర్లను అందచేయాల్సి ఉంటుంది. 15 నెలల క్రితమే తొలి బ్యాచ్ హెలికాప్టర్లను డెలివరీ చేయాల్సిఉన్నా ఇంతవరకు అది ఆచరణలో సాధ్యంకాలేదు. ఎట్టకేలకు ఈనెలలోనే మూడింటిని అప్పజెప్పనున్నారు. వీటిని వెంటనే పాక్ సరిహద్దులో మోహరించనున్నట్లు తెలుస్తోంది. రవాణాకు సంబంధించిన 2024 మార్చిలోనే కొన్ని హెలికాప్టర్లను అందుకున్నా యుద్ధ హెలికాప్టర్ల అందజేత మాత్రం ఇన్ని నెలలుగా ఆలస్యమైంది. ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ కోర్కు తొలుత గత మే–జూన్లో ఇస్తామని అమెరికా ప్రకటించింది. తర్వాత ఈ గడువును పొడిగించింది. తర్వాత డిసెంబర్కల్లా ఇస్తామని తెలిపింది. ఆ గడువు కూడా ముగిసింది. ఇక 2025 జూన్లో ఇస్తామని ఇటీవల ప్రకటించింది. సరఫరా గొలుసులో అవాంతరాల కారణంగా భారత్కు అప్పగింత ఆలస్యమైందని అమెరికా వివరణ ఇచ్చింది. రెండో దఫా మూడు హెలికాప్టర్లను మరుసటి ఏడాదిలో అందజేయనున్నట్లు అమెరికా పేర్కొంది. పశ్చిమ సరిహద్దు వెంట భారత సైనికదళాల ప్రత్యేక ఆపరేషన్లలో నూతన తరం అపాచీ హెలికాప్టర్లు కీలక బాధ్యతలు నెరవేర్చనున్నాయి. వేగం, దాడి, లక్ష్య చేధనలో తిరుగులేని సామర్థ్యాలు నూతన హెలికాప్టర్ల సొంతం. కొత్త హెలికాప్టర్ల చేరికతో భారత అమ్ములపొది మరింత శక్తివంతంకానుంది. 2015నాటి ఒప్పందం ప్రకారం ఇప్పటికే 22 అపాచీ హెలికాప్టర్లను భారత వాయుసేన అందుకుంది. వీటికి తోడుగా అత్యంత శక్తివంతమైన, ఎటాక్ హెలికాప్టర్లు అత్యావశ్యకం కావడంతో ఇలా నూతన తరం ఏహెచ్–64ఇ కోసం భారత్ అమెరికాకు ఆర్డర్ ఇచ్చింది. మెరుపుదాడిలో దిట్ట→ 2012లో తయారుచేసిన ఏహెచ్–64డీ బ్లాక్–3ని మరింత ఆధునీకరించి ఏహెచ్–64ఈ గార్డియన్గా రూపాంతరీకరించారు.→ గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. గరిష్టంగా ఏకధాటిగా 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.→ గరిష్టంగా 16 హెల్ఫైర్ రకం చిన్న క్షిపణులు, 2.75 అంగుళాల వ్యాసముండే 76 రాకెట్లు, వందల బుల్లెట్ల వర్షం కురిపించే 30 ఎంఎం బుల్లెట్ చైన్ ఇందులో అమర్చారు.→ గరిష్టంగా 10,543 కేజీల బరువులను మోసుకెళ్లగలదు. నిమిషానికి 2,800 అడుగుల ఎత్తుకు ఎగరగలదు.→ గరిష్టంగా 20,000 అడుగుల ఎత్తు వరకు ఎగరగలదు→ నూతన తరం హెలికాప్టర్లో జాయింట్ టాక్టిక్ ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఒకేసారి నిరాటంకంగా భిన్నరకాల సైనిక వ్యవస్థలతో ఇది అనుసంధానమవుతుంది. అంటే క్షిపణిని ప్రయోగించి మిస్సైల్ లాంచర్, భూస్థిర రాడార్లు, కమాండర్ కంట్రోల్ సెంటర్లు, తోటి హెలికాప్టర్లు, యుద్ధ విమానాలతో ఇది అనుసంధానమై ఉంటుంది.→ కమ్యూనికేషన్, నావిగేషన్, సెన్సార్, దాడికి సంబంధించి అధునాతన టెక్నాలజీతో దీనిని రూపొందించారు.→ తాను సేకరించిన డేటాను, శత్రుజాడను రెప్పపాటు కాలంలో సైనిక స్థావరాలు, వ్యవస్థలకు చేరవేసి అప్రమత్తంచేస్తుంది. తనపై దాడికి తెగబడే శత్రు హెలికాప్టర్లు, భూ స్థిర స్థావరాలపై బుల్లెట్ల వర్షం కురిపించగలదు.→ ఇన్ఫ్రారెడ్ లేజర్ సాంకేతికతతో వర్షం వంటి అననుకూల పరిస్థితుల్లోనూ లక్ష్యాన్ని వేగంగా, సులభంగా గుర్తించి దాడి చేయగలదు→ టీ700– జనరల్ ఎలక్ట్రిక్701డీ రకం శక్తివంతమైన ఇంజిన్లు ఇందులో ఉంటాయి. అధునాతన రెక్కల కారణంగా ఇది చాలా వేగంగా నిట్టనిలువుగా గాల్లోకి ఎగరగలదు. → అన్ని రకాల డ్రోన్ల నుంచి సీ, డీ, ఎల్, కేయూ బ్యాండ్ల ద్వారా వీడియో డేటాను తెప్పించుకుని విశ్లేషించి కమాండ్ సెంటర్కు చేరవేయగలదు→ వీటిలో ఇంధన ట్యాంక్ కూడా పెద్దది. దీంతో ఎక్కువ సేపు శత్రువుతో పోరాడేందుకు ఇది ఎంతో అనువైంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
విదేశీయులకు ట్రంప్ మరో బిగ్ షాక్
వాషింగ్టన్: విదేశీయులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకిచ్చారు. విద్యార్ధులు,విజిటర్ల వీసాలపై నిర్ధిష్ట సమయాన్ని విధించనున్నారు. ఆ గడువు పూర్తయిన విద్యార్థులు, విజిటర్లు వారి వీసాల్ని రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్ కాకపోతే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానంపై ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అమెరికాలో విదేశీయులపై ఆంక్షల కత్తి వేలాడుతున్నట్లైందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అక్రమ వలస దారులు అరికట్టేలా అమెరికా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్థులు, టూరిస్టులు దేశంలో ఉండే సమయాన్ని నిర్ధేశించనుంది. ఆ సమయం గడువు దాటిన తర్వాత దేశంలో ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త వీసా ప్రతిపాదనలు తెచ్చింది.ఇప్పటి వరకు ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానాన్ని రద్దు చేసి, ప్రతి వీసాకు నిర్దిష్ట గడువు విధించాలని ట్రంప్ సర్కారు భావిస్తోంది. ప్రస్తుతం F-1 (విద్యార్థులు), J-1 (ఎక్స్చేంజ్ విజిటర్లు) వీసాలపై ఉన్నవారు తమ విద్యను కొనసాగిస్తున్నంత వరకు అమెరికాలో ఉండే హక్కు ఉంది. కొత్త ప్రతిపాదన అమలైతే, వారు పూర్తిగా గడువు ముగిసేలోపు దేశాన్ని విడిచి వెళ్లాలి లేదా వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేయాలి.త్వరలోనే అమలుప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వ ప్రతిపాదనను హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ సిద్ధం చేసి, ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ (OMB) సమీక్షకు పంపింది. ప్రజల అభిప్రాయాల కోసం 30–60 రోజుల గడువు ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఆ తరువాత ఈ కొత్త వీసా రూల్స్ అమల్లోకి రానున్నాయి. విదేశీ విద్యార్థులపై ట్రంప్ చర్యలు:ట్రంప్ పాలనలో అక్రమ వలసదారుల తొలగింపు, యూనివర్సిటీలపై నియంత్రణ పెరిగింది. హార్వర్డ్ యూనివర్సిటీపై 2.2 బిలియన్ డాలర్ల ఫెడరల్ ఫండింగ్ను నిలిపివేశారు. ట్రంప్ విధించిన షరతులను హార్వర్డ్ తిరస్కరించడంతో విదేశీ విద్యార్థులకు ప్రవేశాన్ని నిషేధించారు. అయితే, ఇటీవల ఓ ఫెడరల్ న్యాయమూర్తి ఈ నిర్ణయాన్ని నిలిపివేశారు. అయినప్పటికీ విదేశీయులపై ట్రంప్ మరిన్ని కఠిన ఆంక్షలు విధించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానంపై దృష్టిసారించినట్లు సమాచారం. -
అదేదో మీ ముద్దుల భార్యతోనే మొదలుపెట్టండి!
వలసదారుల బహిష్కరణ విషయంలో దూకుడు పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కౌంటర్ పడింది. అమెరికా పౌరసత్వం పొందిన వారిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై సంతకాల సేకరణ జరుగుతోంది. అదేదో.. తన ముద్దుల భార్య మెలానియా నుంచే మొదలుపెట్టాలంటూ డిమాండ్ చేస్తూ ఏకంగా సంతకాల సేకరణ చేపట్టారు. ‘‘Deport Melania" అనే పేరుతో అమెరికాలో ఆన్లైన్లో సంతకాల సేకరణ ప్రారంభమైంది. ఈ పిటిషన్లో మెలానియా ట్రంప్, ఆమె తల్లిదండ్రులు, కుమారుడు బారన్ అమెరికా నుంచి బహిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్ ఏమన్నారంటే.. అమెరికన్ పౌరసత్వాన్ని దుర్వినియోగం చేస్తున్న విదేశీ మూలాలవారు దేశం నుంచి వెళ్లిపోవాలి అని. ట్రంప్ చెప్పిన దానిప్రకారం.. విదేశాల నుంచి వచ్చి పౌరసత్వం పొందిన వారిని బహిష్కరించాలంటే, ముందుగా ఆయన కుటుంబం నుంచే ఆ ప్రక్రియ ప్రారంభించాలి అనేది ఈ పిటిషన్ ఉద్దేశం. మెలానియా పౌరసత్వంపై వివాదం ఏంటంటే.. మెలానియా ట్రంప్ అసలు పేరు మెలనియా క్నావ్స్. స్లోవేనియాలో జన్మించారు. 1970 ఏప్రిల్ 26న అప్పటి యుగోస్లావియాలోని నోవో మెస్టో (Novo Mesto) అనే పట్టణంలో జన్మించారు. ప్రస్తుతం ఇది స్లోవేనియా దేశంలో భాగంగా ఉంది. బాల్యంలో ఆమె సెవ్నికా అనే గ్రామంలో గడిపారు. ఆమె తండ్రి కార్లు అమ్మేవారు. తల్లి బట్టల పరిశ్రమలో పని చేసేది. తన 16వ ఏట మోడలింగ్ కెరీర్ను ప్రారంభించిన మెలానియా.. తర్వాత పారిస్, మిలాన్లకు వెళ్లి అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. ఆపై మోడలింగ్ కోసం వీసా ద్వారా 1996లో అమెరికాకు వచ్చారు. మెలానియా 2000లో EB-1 వీసా (Einstein Visa) కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2001లో ఆమెకు ఈ వీసా మంజూరు అయ్యింది. అయితే అప్పటికి ఆమె సాధారణ ఫ్యాషన్ మోడల్ మాత్రమే. ఆమెకు అంత స్థాయి అంతర్జాతీయ గుర్తింపు కూడా లేదు అనే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 2005లో ట్రంప్ను వివాహం చేసుకున్న ఆమె.. 2006లో అమెరికా పౌరసత్వం పొందారు.EB-1 వీసా అంటే.. ఇది అమెరికా ప్రభుత్వం ఇచ్చే ఉన్నత ప్రతిభ కలిగిన వ్యక్తుల కోసం ప్రత్యేక వీసా. సాధారణంగా నోబెల్ బహుమతి విజేతలు, ఒలింపిక్ పతకాలు, పులిట్జర్, అకాడమీ అవార్డులు వంటి అంతర్జాతీయ గుర్తింపు ఉన్నవారికి మాత్రమే ఈ వీసా లభిస్తుంది. అయితే, మెలానియా నిజంగానే ఆ గుర్తింపునకు అర్హత ఉన్న వ్యక్తేనా? అనే విషయంపై వివాదం నడుస్తోందక్కడ. 2025 జూన్లో జరిగిన అమెరికా కాంగ్రెస్ విచారణలో డెమొక్రాటిక్ ప్రతినిధి జాస్మిన్ క్రాకెట్ వ్యాఖ్యానిస్తూ.. మెలానియా పొందింది Einstein వీసా అయితే లెక్క సరిపోవడం లేదంటూ విమర్శించారు.ట్రంప్ ప్రభుత్వం వలసదారులపై తీసుకుంటున్న కఠిన చర్యలు, వీసా రద్దులు, చైన్ మైగ్రేషన్((పౌరులు తమ కుటుంబ సభ్యులకు గ్రీన్ కార్డులు పొందించే విధానం) వ్యతిరేకత వంటి విధానాలను ప్రోత్సహిస్తోంది. అదే సమయంలో.. ఆమె పొందిన పౌరసత్వం చట్టబద్ధమైనదే. కానీ, తన పౌరసత్వం ద్వారా ట్రంప్ భార్య మెలానియా తన తల్లిదండ్రులకు గ్రీన్ కార్డులు ఇప్పించారు. అంటే.. ఏ రకంగా చూసుకున్నా ట్రంప్ పాలసీకి ఈ చర్యగా విరుద్ధంగా ఉంది. అందుకే.. ఆ మొదలుపెట్టేదోదో మెలానియాతోనే మొదలుపెట్టండి అని అమెరికన్లు సంతకాల పిటిషన్ చేపట్టారు. -
బోయింగ్ విమానంలో కుదుపులు : ప్రయాణికులు హడల్, కడసారి సందేశాలు
గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర ఎయిరిండియా విమాన ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణీకులను పీడకలలా వెంటాడుతోంది. దీంతో విమానంలో చీమ చిటుక్కుమంటే చాలు ప్రాణభయంతో ఉలిక్కి పడుతున్నారు. తాజాగా జపాన్ ఎయిర్లైన్స్ బోయింగ్ 737 విమానంలో ఏర్పడిన సాంకేతిక లోపంతో ప్రయాణీకులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ తరువాత ఏం చేశారో తెలుసా? జూన్ 30న షాంఘై పుడాంగ్ విమానాశ్రయం - టోక్యో నరిటా విమానాశ్రయానికి బయలుదేరిన విమానంలో ఏం జరిగిందో పదండి తెలుసుకుందాం.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం జపాన్ ఎయిర్లైన్స్ బోయింగ్ 737 విమానం 36వేల అడుగుల ఎత్తులో శరవేగంగా దూసుకుపోతోంది. 191 మంది ప్రయాణికులతో ఈ విమానం చైనాలోని షాంఘై నుండి జపాన్ రాజధాని నగరం టోక్యోకు వెళుతోంది. సీట్లలో అలా కూర్చుని, సీట్ బెల్ట్ తీసి అలా రిలాక్స్ అవుతున్నారో లేదో ఒక్కసారిగా కలకలం రేగింది. విమానం యాంత్రిక సమస్యను ఎదుర్కొంది. ఫలితంగా 10 నిమిషాల్లోపు దాదాపు 36,000 అడుగుల నుండి 10,500 అడుగుల కంటే తక్కువ ఎత్తుకు దిగిపోయింది విమానం. క్యాబిన్లో ఒత్తిడి తగ్గడంతో, ఫ్లైట్ అటెండెంట్స్ మాస్క్లు ధరించాలనే సూచనలు అందించారు. ఆక్సిజన్ మాస్క్లు ధరించిన ప్రయాణికుల వణికిపోయారు. విమానం కూలిపోతోందనే భయంతో హడలిపోయారు. నిద్రలో ఉన్న ఒక్క కుదుపుతో మేల్కొన్నారు. మరికొందరు ప్రయాణికులు వీడ్కోలు సందేశాలు రాయడం మొదలు పెట్టారు. బ్యాంక్ పిన్లు ,బీమా సమాచారం వంటి వ్యక్తిగత వివరాలతో ప్రియమైనవారికి సందేశాలు పంపడం ప్రారంభించారు.A #JapanAirlines #flight from #Shanghai to #Tokyo made an emergency landing at Kansai Airport last night after a cabin depressurization alert. The #Boeing 737-800, carrying 191 people, landed safely. No injuries reported. #China #Japan pic.twitter.com/wCneZ3nkk0— Shanghai Daily (@shanghaidaily) July 1, 2025"> మరోవైపు ఈ పరిణామంతో పైలట్ అత్యవసర పరిస్థితిని ప్రకటించి విమానాన్ని ఒసాకాలోని కాన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. పైలట్ చాకచక్యంగా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణీకులంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా గత నెలలో, అహ్మదాబాద్-లండన్ మార్గంలో బోయింగ్ విమానం జరిగిన వినాశకరమైన ప్రమాదంలో 275 మంది మరణించారు. అప్పటి నుండి, బోయింగ్ విమానాలతో సంబంధం ఉన్న అనేక ప్రమాదాలు, తయారీదారు భద్రతా వ్యవస్థపై అనేక అనుమానాలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. -
షేక్ హసీనాకు ఆరు నెలల జైలు శిక్ష
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina)కు బుధవారం ఆరు నెలల జైలు శిక్షపడింది. ఆడియో లీక్ వ్యవహారంలో.. ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) కోర్టు ధిక్కరణ కింద ఆమెకు ఈ శిక్ష విధించిందని సమాచారం. ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆరు నెలల జైలు శిక్షపడింది. కోర్టు ధిక్కరణ కేసులో బంగ్లా న్యాయస్థానం ఆమెకు ఈ శిక్ష విధించిందని బుధవారం(జులై 2న) అక్కడి మీడియా కథనాలు ఇస్తోంది. గత ఏడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పదవి కోల్పోయి, దేశం వీడిన షేక్ హసీనా.. భారత్లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే.. గత ఏడాది అక్టోబర్లో షేక్ హసీనా.. రాజకీయ నాయకుడు షకీల్ అకాండ్ బుల్బుల్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ లీక్ అయ్యింది. అందులో న్యాయవ్యవస్థను బెదిరించేలా ఉన్న వ్యాఖ్యలపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. ఈ వ్యాఖ్యలకుగానూ హసీనాకు ఆరు నెలలు, షకీల్ బుల్బుల్కు 2 నెలల జైలు శిక్ష విధిస్తూ జస్టిస్ ఎం.డి. గోలం మోర్టుజా మొజుందర్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం తీర్పు ప్రకటించింది.ఇదిలా ఉంటే.. ఆమెతో పాటు అప్పటి నేతలు, సలహాదారులు, సైనికాధికారులపై నేరారోపణలు నమోదయ్యాయి. ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) ఇప్పటికే ఆమెకు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆమెను స్వదేశానికి రప్పించేందుకు యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది.ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు 30 శాతం కోటా కొనసాగించాలన్న ప్రభుత్వం నిర్ణయంపై నిరుద్యోగులు కిందటి ఏడాది జూన్లో ఆందోళన చేపట్టారు. హైకోర్టు ఈ కోటాను సమర్థిస్తూ తీర్పు ఇవ్వడంతో.. నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. సుప్రీంకోర్టు స్టే ఇచ్చినప్పటికీ, నిరసనలు తగ్గలేదు. క్రమంగా ఆ ఆందోళన హింసాత్మకంగా మారింది. ఘర్షణల్లో 300 మందికి పైగా మరణించగా.. వేలాది మందికి గాయాలయ్యాయి. కర్ఫ్యూ, ఇంటర్నెట్ షట్డౌన్, సైన్యం మోహరింపు వంటి కఠిన చర్యలు తీసుకున్నా.. పరిస్థితి అదుపులోకి రాలేదు. చివరకు.. షేక్ హసీనా రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఆందోళనలు ప్రధాని నివాసాన్ని తాకడంతో.. ఆమె అక్కడి నుంచి భారత్కు వచ్చేశారు. 2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆమె రాజీనామా అనంతరం, తాత్కాలిక ప్రధానిగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ బాధ్యతలు స్వీకరించారు. -
హెలికాప్టర్ నుంచి రూ. 4 లక్షలు పైనే డబ్బుల వర్షం..!
కొందరు సాయం, దాతృత్వం వంటి పదాలకు కొత్త అర్థాలు ఇస్తారు. అది దానం చేసినట్లు మనల్ని అవమానిస్తున్నట్లు కూడా అర్థం కాదు. చూడటానికి తమ డాబు దర్పం చూపించుకోవడానికి చేసిన దానదర్శంలా ఉంటుంది. ఇక్కడొక వ్యక్తి తన తన అంత్యక్రియల తంతులో వేలాదిగా డబ్బు పేద ప్రజలకు పంచాలనేది అతడి కోరికి. అతన ఆలోచన బాగానే ఉన్నా ఇచ్చిన విధానం చూస్తే..ఎవ్వరికైన చిర్రెత్తుకొస్తుంది. ఇదేం దాతృత్వం రా బాబు అని నెటిజన్లు సైతం మండిపడుతున్నారు.డెట్రాయిట్కి చెందిన 58 ఏళ్ల డారెల్ ప్లాంట్ థామస్ తన అంత్యక్రియల సమయంలో పేద ప్రజలకు ఎంతో కొంత డబ్బు సాయం చేయాలనేది అతడి కోరిక. సమాజం తనను చిరకాలం గుర్తించుకునేలా తన దానం ఉండాలని ఆశించాడు. ఆయన గత నెల జూన్ 27న తుదిశ్వాస విడిచారు. దాంతో అతడి కొడుకులు డేరెల్, జోంటే ఇద్దరు తండ్రి కోరకి మేరకు హెలికాప్టర్ ఏర్పాటు చేసి మరీ గులాబి రేకుల తోపాటు సుమారు రూ. 4 లక్షల పైన నగదును ఆకాశం నుంచి వర్షంలా కురిపించారు. దాంతో ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడి ప్రజజీవనం స్థబించిపోయింది. అంతేగాదు ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఆ నగదు, గులాబి పూరేకులు పడిన రహదారిని మొత్తం మూసేశారు కూడా. రోడ్లపైనే పాదాచారులు, వాహనదారులు గులాబి రేకుల తోపాటు పడుతున్న నగదును తీసుకోవడానికి రావడంతో ఒక్కసారిగా పరిస్థితి అంతా గందరగోళంగా మారింది. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో ఇలా ఒకవైపు రహదారిని మొత్తం మూసేసింది. అయితే అధికారులు గులాబి రేకులు మాత్రమే అనుకున్నారట..ఇలా డబ్బుల వర్షం కురిసినట్లు తెలియదని చెబుతుండటం గమనార్హం. అయితే పోలీసులు ఆ డబ్బులను ఏమి స్వాధీనం చేసుకోమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కానీ పలువురు మాత్రం ఇది దాతృత్వంలా లేదని. ఇది సరైన విధానం కాదని మండిపడ్డారు. అలాగే యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ ఘటనపై సీరియస్గా దర్యాప్తు చేస్తోంది. Detroit man has a helicopter drop money from the sky as his last wish.58-year-old car wash owner Darrell "Plant" Thomas passed away in June and wanted to give his community one final gift.On the day of his funeral, Thomas' sons Darell and Jonte organized a helicopter to drop… pic.twitter.com/ZOhM5gFXJE— Collin Rugg (@CollinRugg) July 1, 2025 (చదవండి: కాస్మెటిక్ యాంటీ-ఏజింగ్ చికిత్సల ఖరీదు ఎంతంటే..!) -
వామ్మో పాము.. విమానంలో కలకలం
ఆస్ట్రేలియాలోని విమానంలో ఓ పాము కలకలం సృష్టించింది. దీంతో ఆ విమానం రెండు గంటలు ఆలస్యంగా టేకాఫ్ అయింది. మెల్బోర్న్ ఎయిర్పోర్టు నుంచి బ్రిస్బేన్కు వెళ్లే విమానంలోకి పాము దూరింది.విమానంలో ప్రయాణికుల లగేజ్ భద్రపరిచే ప్రాంతంలోకి పాము వెళ్తుండగా సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు స్నేక్ క్యాచర్ను రంగంలోకి దించారు. సుమారు అరగంట పాటు శ్రమించి పామును పట్టుకున్నారు. అనంతరం విమానానికి తనిఖీలు నిర్వహించి టేకాఫ్ చేశారు.మొదట పాము విషపూరితమైనదిగా అనుమానించారు.. కానీ పట్టుకున్న తర్వాత అది విషపూరితం కాదని.. అది పసిరిక పాముగా గుర్తించినట్లు స్నేక్ క్యాచర్ తెలిపారు. అధికారుల నుంచి సమాచారం అందగానే అరగంటలో తాను ఎయిర్పోర్టుకు చేరుకున్నానని, సెక్యూరిటీ తనిఖీల వద్ద బాగా ఆలస్యం జరిగినట్లు స్నేక్ క్యాచర్ పెల్లీ వెల్లడించాడు. -
చైనా కుతంత్రం.. దలైలామా సంచలన ప్రకటన
టిబెటన్ ఆధ్మాత్మిక గురువు దలైలామా(Dalai Lama) సంచలన ప్రకటన చేశారు. తన తదనంతరమూ ‘దలైలామా’ పదవీ సంప్రదాయం మనుగడలో కొనసాగుతుందని తెలిపారాయన. మరణానంతరం కూడా దలైలామా పదవి కొనసాగుతుందని.. ఈ ఎంపిక ప్రక్రియలో చైనా ప్రమేయం ఎట్టిపరిస్థితుల్లో ఉండబోదని కుండబద్ధలు కొట్టారాయన. దలైలామా పదవి 600 సంవత్సరాలుగా కొనసాగుతున్న బౌద్ధ సంప్రదాయం. తదుపరి దలైలామా ఎంపిక కోసం చైనా కుతంత్రాలు చేస్తోంది. అయితే తన మరణానంతరం బౌద్ధ మతాధిపతిని ఎంచుకునే బాధ్యతను గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్(Gaden Phodrang Trust) అనే సంస్థకు ఆయన అప్పగించారు. ఈ ట్రస్ట్ను దలైలామానే 2015లో స్థాపించారు. ఇది భవిష్యత్ దలైలామాను గుర్తించే అధికారిక సంస్థగా వ్యవహరిస్తుందని బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారాయన. అంతేకాదు.. తన వారసత్వం కొనసాగాలని 14 ఏళ్లుగా టిబెట్, హిమాలయ, మంగోలియా, రష్యా, చైనా మద్దతుదారుల నుంచి అభ్యర్థనలు వస్తూనే ఉన్నాయని వెల్లడించారాయన. Statement Affirming the Continuation of the Institution of Dalai Lama(Translated from the original Tibetan)On 24 September 2011, at a meeting of the heads of Tibetan spiritual traditions, I made a statement to fellow Tibetans in and outside Tibet, followers of Tibetan… pic.twitter.com/VqtBUH9yDm— Dalai Lama (@DalaiLama) July 2, 2025అయితే టిబెట్పై ఆధిపత్యం చెలాయిస్తున్న చైనా ప్రభుత్వం గోల్డెన్ అర్న్ అనే పద్ధతిలో తమకు అనుకూల వ్యక్తిని దలైలామాగా నియమించాలని భావిస్తోంది. ఈ ప్రయత్నాన్ని తాజాగా దలైలామా ఖండించారు. ధర్మాన్ని నమ్మని కమ్యూనిస్టులు పునర్జన్మ వ్యవస్థలో జోక్యం చేసుకోవడం అనుచితం అని వ్యాఖ్యానించారాయన. తద్వారా తన వారసత్వాన్ని ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రకారం కొనసాగించాలన్న సంకల్పాన్ని వ్యక్తపరిచారు. తన 90వ పుట్టినరోజు కంటే నాలుగు రోజుల ముందుగానే(జులై 6న) దలైలామా తాజా ప్రకటన చేయడం చైనా ప్రభుత్వానికి గట్టి సవాలుగా మారింది.చైనా రియాక్షన్ ఇదిదలైలామా ప్రకటనపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం స్పందించింది. "దలైలామా, పాంచెన్ లామా, ఇతర ప్రముఖ బౌద్ధ గురువుల ఎంపిక తప్పనిసరిగా 'గోల్డెన్ అర్న్' పద్ధతిలో.. అదీ కేంద్ర ప్రభుత్వ ఆమోదంతోనే జరగాలి అని ఆ శాఖ ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. ఈ పద్ధతి 18వ శతాబ్దంలో చింగ్ వంశాధిపతి ప్రవేశపెట్టిన విధానమని పేర్కొన్న ఆమె.. చైనా ప్రభుత్వం మత స్వేచ్ఛకు కట్టుబడి ఉందని, అలాగని మత సంబంధిత వ్యవహారాలపై నియంత్రణలు, బౌద్ధ గురువుల నియామకాల కోసం ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి అని మావో నింగ్ గుర్తు చేస్తున్నారు.ప్రస్తుత దలైలామా అసలు పేరు టెన్జిన్ గ్యాట్సో(89).. 14వ దలైలామా. ఈయన 1935లో టిబెట్లోని టాక్సేర్ గ్రామంలో జన్మించారు. 1940లో 14వ దలైలామాగా గుర్తింపు పొందారు. టిబెట్లో లాసా బౌద్ధ యాత్రికులకు అత్యంత పవిత్రమైన ప్రాంతం. ఆ ప్రాంతం కేంద్రంగా దలైలామా బౌద్ధ మత ప్రచారం, ఇతర కార్యకలాపాలు నిర్వహించేవారు. 1950లో చైనా టిబెట్ను ఆక్రమించింది. అయితే 1959లో ఆ ఆక్రమణకు వ్యతిరేకంగా లాసాలో తిరుగుబాటు జరగ్గా.. చైనా దానిని అణచివేసింది. అంతేకాదు ప్రపంచమంతా ఇప్పుడు శాంతికాముడిగా భావించే దలైలామాను.. అప్పట్లో వేర్పాటువాదిగా, తిరుగుబాటుదారుడిగా చైనా ముద్ర వేసింది. దీంతో ఆయన భారత్లోని ధర్మశాలకు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. అప్పటి నుంచి చైనా టిబెట్ సంబంధాల్లో లాసా ఓ కీలక రాజకీయ కేంద్రంగా కొనసాగుతోంది. ఇక.. టిబెటన్ బౌద్ధులు మాత్రం, పారంపరిక పద్ధతుల ప్రకారమే దలైలామా ఎంపిక జరగాలని కోరుకుంటున్నారు. కానీ..టిబెట్ చైనా స్వభూమిగా పేర్కొంటూ.. దలైలామా ఎంపికపై తమకే హక్కు ఉందని డ్రాగన్ వాదిస్తోంది. మరోవైపు దలైలామా వ్యవహారంలో చైనా జోక్యాన్ని అగ్రరాజ్యం అమెరికా సైతం ఖండిస్తూ వస్తోంది. దలైలామా ఎంపికపై చైనాకు ఎలాంటి హక్కు లేదు అని చెబుతోంది. 2020లో అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ రాయబారి శామ్యూల్ డీ బ్రౌన్బ్యాక్.. ధర్మశాలలో టిబెటన్ శరణార్థులతో సమావేశమై, ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. అంతేకాదు.. చైనా జోక్యాన్ని ఖండిస్తూ అమెరికా కాంగ్రెస్ 2020లో "టిబెట్ పాలసీ అండ్ సపోర్ట్ యాక్ట్" అనే చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం.. చైనా జోక్యం లేకుండా దలైలామా ఎంపిక జరగాలి. ఒకవేళ ఈ ప్రక్రియలో గనుక చైనా అధికార యంత్రాంగం జోక్యం చేసుకుంటే వాళ్లపై ఆంక్షలు విధించవచ్చు. -
మండుతున్న ఎండలు
పారిస్: భానుడి భగభగలతో యూరప్ ప్రజలు తల్లడిల్లుతున్నారు. అనేక దేశాల్లో ఉష్ణోగ్రతలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. మొట్టమొదటి వడగాడ్పుల తీవ్రతకు పలు చోట్ల కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తూ నివాస ప్రాంతాలను దహించి వేస్తోంది. ప్రభుత్వాలు ప్రజలకు వేడి నుంచి ఉపశమనం కలిగించే చర్యలను అమలు చేస్తున్నాయి. స్పెయిన్ రాజ«దాని బార్సిలోనాలో ఎండల తీవ్రత వందేళ్ల రికార్డును చెరిపేసింది. 1914లో ఈ నగరంలో జూన్లో నమోదైన సరాసరి ఉష్ణోగ్రత 26 డిగ్రీలు. తాజాగా, జూన్ 30న 37.9 డిగ్రీలతో ఈ రికార్డు బద్దలైంది. కొండప్రాంతం, మధ్యదరా సముద్రం మధ్యలో ఉండే బార్సిలోనాలో సాధారణంగా అంతగా ఎండలుండవు. ఈ సీజన్లో ఈ పరిస్థితి తలకిందులైంది. స్పెయిన్లోని మిగతా ప్రాంతాల్లో సైతం ఎండలు మండిపోతున్నాయి. ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్లోనూ ఇవే పరిస్థితులు కొనసాగుతున్నాయి. పారిస్లో మంగళవారం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం సుమారు 1,300 స్కూళ్లను మూసివేశారు. పారిస్లోని ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ఈఫిల్ టవర్ను గురువారం వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇటలీలోని 27 ప్రధాన నగరాలకు గాను 17 చోట్ల వడగాడ్పులు వీస్తున్నాయి. వడగాడ్పులతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. యూకేలోని కెంట్లో అత్యధికంగా 33.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. ఈ ఏడాదిలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. అత్యధికంగా 35 డిగ్రీల వరకు పెరిగే ప్రమాదముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అదేసమయంలో తుర్కియేలో మొదలైన కార్చిచ్చు నివాసప్రాంతాల్లోకి వేగంగా వ్యాపిస్తోంది. ప్రభుత్వం బిలెసిక్, హటాయ్, జ్మిర్ నగరాల నుంచి ముందు జాగ్రత్తగా 50 వేల మందిని ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలించింది. కొన్ని ప్రాంతాల్లో మంటలను అదుపులోకి తెచి్చనప్పటికీ విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలు పనిచేయడం లేదు. గ్రీస్లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు జనాన్ని ఠారెత్తిస్తున్నాయి. వీటికి తోడు కార్చిచ్చు ప్రమాదం పొంచి ఉందని అధికారులు చియోస్, సమోస్, ఇకారియా, కితిరా, లకోనియా అట్టికా తదితర ప్రాంతాల్లో ప్రమాదహెచ్చరికలు జారీ చేశారు. -
America: ‘ఇస్కాన్’లో బుల్లెట్ పేలుళ్లు.. తక్షణ చర్యలకు భారత్ డిమాండ్
శాన్ ఫ్రాన్సిస్కో: హోలీ ఉత్సవాలకు ప్రసిద్ధి చెందిన అమెరికాలోని స్పానిష్ ఫోర్క్లో గల ఇస్కాన్ రాధా కృష్ణ ఆలయ ప్రాంగణంలో తాజాగా బుల్లెట్ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా ఆలయానికి భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. ఇస్కాన్ తెలిపిన వివరాల ప్రకారం రాత్రివేళ ఆలయంలో భక్తులు, అతిథులు ఉన్న సమయంలో ఆలయ భవనం చుట్టుపక్కల 20 నుండి 30 బుల్లెట్ కాల్పులు జరిగాయి.శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ ఈ దాడిని ఖండిస్తూ, ఇస్కాన్కు సంఘీభావం తెలిపింది. అలాగే నిందితులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరింది. కాన్సులేట్ తన ‘ఎక్స్’ పోస్ట్లో స్పానిష్ ఫోర్క్, ఉటాలోని ఇస్కాన్ రాధా కృష్ణ ఆలయంలో జరిగిన కాల్పుల సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితులపై సత్వర చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను కోరుతున్నామని పేర్కొంది. We strongly condemn the recent firing incident at the ISKCON Sri Sri Radha Krishna temple in Spanish Fork, Utah. The Consulate extends full support to all the devotees and the community and urges the local authorities to take prompt action to bring the perpetrators to justice.…— India in SF (@CGISFO) July 1, 2025ఈ ఏడాది మార్చి 9న కాలిఫోర్నియాలోని చినో హిల్స్లోని బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ (బీఏపీఎస్)) హిందూ ఆలయంపై ఖలిస్తానీ గ్రూపు దాడి చేసింది. నాటి వివరాలను బీఏపీఎస్ తన అధికారిక పేజీలో వివరించింది. గత ఏడాది సెప్టెంబర్ 25 రాత్రి కాలిఫోర్నియాలోని సాక్రమెంటోలోని స్వామి నారాయణ మందిరంపై కూడా విధ్వంసక శక్తులు దాడిచేశాయి. ఇటువంటి ఘటనలు స్థానిక హిందువులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇది కూడా చదవండి: అరెస్టు హెచ్చరికలు.. ట్రంప్పై జోహ్రాన్ మమ్దానీ ఫైర్ -
అరెస్టు హెచ్చరికలు.. ట్రంప్పై జోహ్రాన్ మమ్దానీ ఫైర్
వాషింగ్టన్: అమెరికాలో ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టాక పాలనలో పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపధ్యంలో ఆయనపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) విధి నిర్వహణకు అడ్డుతగిలితే డెమొక్రాట్ జోహ్రాన్ మమ్దానీని అరెస్టు చేస్తామని ట్రంప్ సారధ్యంలోని రిపబ్లికన్ పార్టీ ప్రకటించింది.దీనిపై భారత సంతతికి చెందిన న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ స్పందిస్తూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలకు తాను తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. మమ్దానీ అధికారికంగా న్యూయార్క్ నగర మేయర్ పదవికి డెమొక్రాటిక్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. రాబోయే నవంబర్లో జరిగే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొననున్నారు. డెమొక్రాటిక్ అభ్యర్థిగా ధృవీకరణ జరిగిన వెంటనే ఆయన ట్రంప్ తీరుపై మండిపడ్డారు. ఒక ప్రకటనలో అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులను పట్టించుకోనని స్పష్టం చేశారు. My statement on Donald Trump's threat to deport me and his praise for Eric Adams, who the President "helped out" of legal accountability. https://t.co/m7pNcT2DFS pic.twitter.com/UcYakMx4lI— Zohran Kwame Mamdani (@ZohranKMamdani) July 1, 2025యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు తనను అరెస్టు చేస్తానని, తన పౌరసత్వాన్ని తొలగించి, నిర్బంధ శిబిరంలో ఉంచుతానని హెచ్చరించారని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ట్రంప్ చర్యలు ప్రజాస్వామ్యంపై దాడిని సూచిస్తున్నాయన ఆరోపించారు. 2021లో డెమొక్రాట్గా ఎన్నికైన ఆడమ్స్ను అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసించడంలో ఆశ్చర్యమేమీ లేదని, అది మేయర్ ఆడమ్స్ పదవీకాలానికి ముగింపు పలకాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తుందని అన్నారు.దక్షిణాసియాలోని ఉగాండాలో జన్మించిన జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ అసెంబ్లీ సభ్యునిగా ఉన్నారు. ఆయన నవంబర్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గెలిస్తే, ఈ నగరానికి తొలి ముస్లిం మేయర్ కానున్నారు. కాగా మమ్దానీ పౌరసత్వాన్ని రద్దు చేయాలని పలువురు రిపబ్లికన్లు అధ్యక్షుడు ట్రంప్పై ఒత్తిడి తెస్తున్నారు. ఆయన ఇటీవలే అంటే.. 2018లోనే అమెరికా పౌరసత్వం పొందారని అంటున్నారు.ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ ఐదు దేశాల పర్యటన షురూ.. షెడ్యూల్ ఇదే.. -
రష్యాతో భారత్ స్నేహం.. అమెరికా కక్షసాధింపు హెచ్చరిక
వాషింగ్టన్: భారత్, చైనా విషయంలో అమెరికా మరో సంచలన ప్రకటన జారీ చేసింది. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్, చైనాలపై 500 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించింది. దీంతో, అగ్రరాజ్యం అమెరికా తీరు తీవ్ర చర్చకు దారి తీసింది. ఇక, ఇటీవలే భారత్తో బిగ్ డీల్ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా ఇలా మాట మార్చడం గమనార్హం.రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రష్యా, ఉక్రెయిన్ మధ్య పరిస్థితులను గమనిస్తున్నాం. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై తప్పకుండా చర్చలు ఉంటాయి. ఉక్రెయిన్కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500 శాతం సుంకం విధిస్తాం. రష్యా నుంచి చమురును భారత్, చైనాలు 70శాతం కొనుగోలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ రెండు దేశాలపై సుంకం విధించే అంశం పరిశీలిస్తున్నామని అన్నారు. ఇదే సమయంలో ఆగస్టులో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఈ బిల్లుపై ట్రంప్ కూడా ఓకే చెప్పారని వెల్లడించారు. అయితే, ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో రష్యా కాల్పులు విరమణకు అంగీకరించలేదు. ట్రంప్ సూచనలు, హెచ్చరికలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లెక్క చేయలేదు. దీంతో, రష్యాను అమెరికా టార్గెట్ చేసింది. రష్యాను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసే యూఎస్ ప్రయత్నాల్లో ఇది ఒకటిగా తెలుస్తోంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే.. రష్యా నుంచి పెద్దమొత్తంలో ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది మన ఔషధాలు, వస్త్రాలు వంటి ఎగుమతులపై ప్రభావం పడుతుంది. ఇక, ఉక్రెయిన్కు మద్దతు ఇచ్చే దేశాల కోసం లిండ్సే మరో ఒప్పందాన్ని ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది.ట్రంప్ బిగ్ డీల్ ప్రకటన..ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే భారత్తో బిగ్ డీల్ ఉండనున్నట్టు తెలిపారు. త్వరలోనే భారత్తో ఒప్పందం కుదుర్చుకోనున్నాం. అది ఒక కొత్త డీల్ అవుతుంది. ప్రస్తుతం భారత్ ఇంకా దాన్ని అంగీకరించలేదు. వాళ్లు డీల్కు ఒప్పుకుంటే తక్కువ సుంకాలు విధించేలా ఒప్పందం కుదురుతుందని అన్నారు. జూలై తొమ్మిదో తేదీ నాటికి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. దీనిపై చర్చలు సైతం జరుగుతున్నట్టు తెలుస్తోంది. -
‘పహల్గామ్’ ముష్కరులపై తక్షణ చర్యలకు ‘క్వాడ్’ డిమాండ్
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని ఆలోచింపజేసింది. ఉగ్రవాదంపై వ్యతిరేక పోరాటాన్ని మరింత వేగవంతం చేయాల్సిన అవసరాన్ని గుర్తు సింది. తాజాగా అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియాల భాగస్వామ్య కూటమి క్వాడ్(క్యూయూఏడీ)పహల్గామ్ ఉగ్రదాడిపై ఒక ప్రకటన చేసింది. పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్నవారిని, వారికి సహకరించినవారిని తక్షణం న్యాయస్థానం ముందు నిలబెట్టాలని కోరింది. BREAKING: QUAD condemns Pahalgam terror attack; says,'perpetrators, organizers, and financiers of this reprehensible act to be brought to justice without any delay' pic.twitter.com/zCA06YkMqZ— Sidhant Sibal (@sidhant) July 2, 20252025, ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మృతిచెందారు. ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలన్నీ ఈ చర్యను ఖండించాయి. ‘క్వాడ్’ సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాద చర్యలను, హింసాత్మక తీవ్రవాద చర్యలను ఖండిస్తుందని, ఉగ్రవాదంపై పోరాటానికి నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని ఆ ప్రకటనలో పేర్కొంది. పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి బాధితుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తున్నామని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని ‘క్వాడ్’ ఆ ఉమ్మడి ప్రకటనలో పేర్కొంది. పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్నవారి విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టాలని ‘క్వాడ్’ నేతలు కోరారు.ఇది కూడా చదవండి: ‘అందుకు ఇజ్రాయెల్ ఓకే’: గాజాలో కాల్పుల విరమణపై ట్రంప్ -
‘అందుకు ఇజ్రాయెల్ ఓకే’: గాజాలో కాల్పుల విరమణపై ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇజ్రాయెల్-గాజా యుద్ధంపై ఆసక్తిరక ప్రకటన చేశారు. ఇరాన్ మద్దతు కలిగిన హమాస్ ఉగ్రవాదులు.. గాజాలో ఇజ్రాయెల్తో 60 రోజుల కాల్పుల విరమణకు తుది ప్రతిపాదనకు అంగీకరించాలని కోరారు. దీనికి సంబంధించిన పత్రాలను ఖతార్- ఈజిప్ట్కు మధ్యవర్తిత్వం వహించే అధికారులు అందిస్తారని తెలిపారు. ట్రంప్ తన సోషల్ మీడియా పోస్ట్లో తమ ప్రతినిధులు గాజా విషయమై ఇజ్రాయెల్ అధికారులతో సుదీర్ఘమైన సమావేశాన్ని నిర్వహించారని తెలిపారు. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తదితరులు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సీనియర్ సలహాదారు రాన్ డెర్మెర్తో సమావేశమయ్యారని సమాచారం. కాగా 60 రోజుల కాల్పుల విరమణను ఖరారు చేసేందుకు రూపొందించిన షరతులను ఇజ్రాయెల్ అంగీకరించిందని, తాము ఈ యుద్ధాన్ని ముగించడానికి అన్ని పార్టీలతో కలిసి పని చేస్తామని ట్రంప్ పేర్కొన్నారు. ఖతార్, ఈజిప్ట్ ప్రతినిధులు హమాస్కు ఈ తుది ప్రతిపాదనను అందజేస్తారని ట్రంప్ పేర్కొన్నారు.మిడిల్ ఈస్ట్లో మంచి జరిగేందుకు హమాస్ ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తుందని భావిస్తున్నానని, దీనికి సమ్మతించని పక్షంలో పరిస్థితులు మరింత దిగజారవచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు. గాజాలో ఇజ్రాయెల్.. హమాస్ ఉగ్రవాదుల మధ్య బందీల విడుదల కోసం ఈ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ తెలిపిన వివరాల ప్రకారం 2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై దాడి చేసి 1,200 మందిని హత్యచేసి, 251 మందిని బందీలుగా పట్టకున్న దరమిల గాజాలో యుద్ధం ప్రారంభమైంది.ఇది కూడా చదవండి: ‘పహల్గామ్’ ముష్కరులపై తక్షణ చర్యలకు ‘క్వాడ్’ డిమాండ్ -
ఓ-1 రూట్లో యూఎస్కు!
అగ్ర రాజ్యంలో ఉద్యోగం చేయాలన్నది లక్షలాది మంది కల. యూఎస్ వర్క్ వీసా పొందడం ఆషామాషీ కాదు. ఈ వీసా కోసం సుదీర్ఘ కాలం వేచి ఉండడం, వలసలపై ట్రంప్ ప్రభుత్వ కఠిన చర్యలు.. వెరసి అమెరికాలో ఉద్యోగ అవకాశాలను కోరుకునే నిపుణులకు ఓ–1 వీసా ప్రత్యామ్నాయంగా అవతరిస్తోంది. స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం), కళలు, విద్య, వ్యాపారం, అథ్లెటిక్స్, సినిమా, టెలివిజన్ రంగంలో ‘అసాధారణ సామర్థ్యం‘ కలిగిన వ్యక్తులకు తాత్కాలిక నివాసం కోసం ఈ ప్రత్యేక నాన్–ఇమ్మిగ్రెంట్ వీసా జారీ చేస్తారు. తీవ్ర పోటీ ఉన్న హెచ్–1బీ వీసాకు ప్రత్యామ్నాయంగా ఓ–1 వీసా వినుతికెక్కుతోంది. అయితే లాటరీ లేకుండానే వీసా పొందే అవకాశం ఉండడం అభ్యర్థులకు కలిసి వచ్చే అంశం. – సాక్షి, స్పెషల్ డెస్క్జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు; చలనచిత్రం, టెలివిజన్ పరిశ్రమలో అసాధారణ విజయాల రికార్డు ద్వారా.. అసాధారణ సామర్థ్యాన్ని ప్రదర్శించే వ్యక్తులకు యూఎస్లోకి ఓ–1 వీసా తాత్కాలిక ప్రవేశాన్ని అందిస్తోంది. ఈ వీసా పొందాలంటే దరఖాస్తుదారులు ప్రముఖ అవార్డులు, విద్య పరిశోధన ప్రచురణలు, వారున్న రంగానికి చేసిన సేవల వంటి ఎనిమిది కఠిన ప్రమాణాలలో కనీసం మూడింటిని కలిగి ఉండాలి.కఠిన పరిశీలన కారణంగా కేవలం 37 శాతం మాత్రమే దరఖాస్తులు ఆమోదం పొందుతున్న హెచ్–1బీ వీసా మాదిరిగా కాకుండా.. అధిక నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులు వ్యవస్థాగత అడ్డంకులను దాటడానికి ఓ–1 వీసా వీలు కల్పిస్తోంది. అర్హతల విషయంలో ఇది దరఖాస్తుదారులకు మరింత సౌలభ్యాన్ని అందిస్తోంది. ఈ వీసా పొందాలంటే కనీస జీతం లేదా అధికారిక డిగ్రీ అవసరం లేదు. సాధించిన విజయాలకు రుజువుగా అంతర్జాతీయ అవార్డులు, మీడియా కవరేజీ పొందుపరిస్తే చాలు.మూడవ స్థానంలో మనమే..: ఓ–1 వీసాలు పొందిన దేశాల జాబితాలో గ్రేట్ బ్రిటన్, బ్రెజిల్ తర్వాత మూడవ స్థానంలో భారత్ నిలిచింది. 2022–23లో భారతీయులు 1,418 ఓ–1 వీసాలు దక్కించుకున్నారు. అధిక నైపుణ్యం కలిగిన విదేశీ ప్రతిభను ఆకర్షించడానికి, కొనసాగడానికి టెక్నాలజీ కంపెనీలు దృష్టిసారించాయి. అమెరికా ప్రస్తుతం భారీగా నిపుణుల వేటలో ఉంది. ప్రధానంగా ఏఐ నిపుణుల అవసరం పెరిగింది. దీంతో విదేశీ పరిశోధకులు, ఇతర అధిక నైపుణ్యం కలిగిన నిపుణులకు డిమాండ్ను పెంచుతోంది. వీరిలో అత్యధికులు యూఎస్లోకి సులభ మార్గాన్ని ఓ–1 వీసా అందిస్తుందని భావిస్తున్నారు.చాలా ఖరీదు... ఓ–1 వీసా దరఖాస్తు సాధారణంగా హెచ్–1బీ వీసా దరఖాస్తు కంటే చాలా ఖరీదైనది. దీని ఖర్చులు 10,000–30,000 డాలర్ల వరకు ఉంటాయి. హెచ్–1బీ ఫీజుల కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ అన్నమాట. కానీ సక్సెస్ రేట్ 93 శాతం ఉంది. తొలుత గరిష్టంగా మూడేళ్ల వరకు యూఎస్లో నివాసానికి అనుమతిస్తారు. అసాధారణ సామర్థ్యాన్ని ప్రదర్శించడం కొనసాగించినంత వరకు సంవత్సర కాల పరిమితితో అభ్యర్థి కోరినన్నిసార్లు గడువు పొడిగిస్తారు. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అధికారిక డేటా ప్రకారం మంజూరైన ఓ–1 వీసాల సంఖ్య 2019–20లో 8,838 మాత్రమే. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య రెండున్నర రెట్లకుపైగా పెరిగింది.దిగ్గజ కంపెనీల క్యూ..గూగుల్, ఓపెన్ ఏఐ, టెస్లా, మెకిన్సే వంటి దిగ్గజ కంపెనీలు భారత్ నుండి కొత్త ప్రతిభను ప్రోత్సహించడానికి రెడీ అయ్యాయి. ఈ కంపెనీలు సేవలందిస్తున్న రంగాల్లో బాగా స్థిరపడిన అభ్యర్థులను వారి యూఎస్ ప్రధాన కార్యాలయానికి ఆకర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. హార్వర్డ్, యేల్, కొలంబియా వంటి అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు ఎల్లప్పుడూ ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ అధ్యాపకులను, పరిశోధకులను నియమించునే పనిలో ఉంటున్నాయి.ఏటా పెరుగుతున్నాయ్..హెచ్1–బీతో పోలిస్తే ఓ–1 వీసాల సంఖ్య తక్కువగా ఉంది. 2023–24లో మొత్తం 2,25,957 హెచ్1–బీ వీసాలకు ఆమోద ముద్రపడింది. ఓ–1 వీసాల విషయంలో ఈ సంఖ్య 22,669 మాత్రమే. హెచ్1–బీ డిమాండ్ తగ్గుతున్న ధోరణిలో ఉన్నప్పటికీ.. ఓ–1 వీసాలు సంవత్సరానికి దాదాపు 10% పెరుగుతున్నాయి. ఓ–1 వీసాలకు అయ్యే ఖర్చు ఎక్కువైనప్పటికీ కంపెనీలు, వ్యక్తులు ఇప్పటికీ ఇంత పెద్ద మొత్తం వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నారు. -
అన్నార్తులపై మళ్లీ ఇజ్రాయెల్ దాడులు... గాజాలో 74 మంది దుర్మరణం
దెయిర్ అల్ బలాహ్: గాజాలో అన్నార్తులపై ఇజ్రాయెల్ పాశవిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆహార కేంద్రాలపై ఇజ్రాయెల్ సైనికుల కాల్పులు, వైమానిక దాడుల్లో ఏకంగా 74 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. సముద్రతీర అల్–బకా కేఫ్పై సోమవారం జరిగిన వైమానిక దాడుల్లో 30 మంది మరణించారు. జీహెచ్ఎఫ్ ఆహార కేంద్రంపై జరిపిన కాల్పుల్లో 23 మంది మరణించారు. గాజాలో జరిగిన మరో రెండు దాడుల్లో 15 మంది మరణించారని షిఫా ఆసుపత్రి తెలిపింది.జవైదా పట్టణ సమీపంలో ఓ భవనంపై దాడిలో ఆరుగురు మరణించినట్టు అల్ అక్సా ఆసుపత్రి తెలిపింది. అల్ బకా కేఫ్ పరిసరాలు దాడుల ధాటికి భూకంపం వచ్చినట్టుగా కంపించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 20 నెలలుగా యుద్ధం కొనసాగుతున్న సమయంలోనూ కార్యకలాపాలు కొనసాగించిన అతికొద్ది కేఫ్లలో ఇది ఒకటి. ఇంటర్నెట్ సదుపాయం ఉండటంతో ఫోన్ చార్జింగ్ కోసం స్థానికులు ఎక్కువగా వస్తుంటారు. నేలపై రక్తసిక్తమైన, వికృతమైన మృతదేహాలు, గాయపడిన వారిని దుప్పట్లలో మోసుకెళ్తున్న దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి. మృతుల్లో మహిళలు, పిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది.ఆహారం కేంద్రం నుంచి వస్తుండగా...ఇజ్రాయెల్, అమెరికా మద్దతుతో ఖాన్ యూనిస్లోని గాజా హ్యుమానిటేరియన్ ఫండ్ (జీహెచ్ఎఫ్) ఆధ్వర్యంలో నడుస్తున్న సహాయ కేంద్రం నుంచి తిరిగి వస్తున్న అన్నార్తులపై కాల్పులు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు వివరించారు. ‘‘సైనికులతో కూడిన యుద్ధ ట్యాంకులు, వాహనాలు మావైపు దూసుకొచ్చాయి. ఇష్టానికి కాల్పులకు దిగాయి’’ అని వెల్లడించారు. పిల్లలతో సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారని, వారి పరిస్థితి తెలియడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. ఈ ఉదంతాన్ని సమీక్షిస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. -
మస్క్కు ట్రంప్ వార్నింగ్ ..!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మధ్య మళ్లీ వివాదం రాజుకుంది. ‘బిగ్, బ్యూటిఫుల్ బిల్’తో వారి మధ్య అప్పట్లో సాగిన వాగ్యుద్ధం మరోసారి తీవ్ర రూపు దాలుస్తోంది. బిల్లును వ్యతిరేకిస్తున్న మస్క్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో ఎవరికీ దక్కని విధంగా ఆయన సబ్సిడీలు పొందారని ఆక్షేపించారు. సబ్సిడీలే లేకపోతే రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహాలు, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి వంటివేవీ ఉండేవి కాదన్నారు. దుకాణం మూసేసి, ఇంటికి (దక్షిణాఫ్రికా) వెళ్లాల్సి వస్తుందంటూ ఎద్దేవా చేశారు. ‘‘బిగ్ బిల్లు మన దేశ చాలా సంపదను ఆదా చేస్తుంది. బహుశా డోజ్ దీని గురించి బాగా ఆలోచించాలి. మస్క్ పొందుతున్న ప్రభుత్వ సబ్సిడీలు, కాంట్రాక్టులను పరిశీలించాలి’’ అని తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ట్రంప్ పేర్కొన్నారు.‘‘మస్క్ నన్ను అధ్యక్షునిగా ఆమోదించడానికి చాలా ముందునుంచే ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నా. ఈ అంశం నా ప్రచారంలో ప్రధానంగా ఉంటూ వస్తోంది. ఎలక్ట్రిక్ కార్లకు నేనేమీ వ్యతిరేకం కాదు. అవి మంచివే. కానీ అంతా వాటినే వాడాలని మాత్రం ఎవరూ బలవంతం చేయకూడదు’’ అని వ్యాఖ్యానించారు. అనంతరం ఫ్లోరిడా వెళ్లేముందు వైట్హౌస్ ఆవరణలో ఈ అంశంపై మరోసారి మీడియాతో మాట్లాడారు. ‘‘మస్క్కు బాగా అసంతృప్తి ఉంది. కానీ ఒక్కటి మాత్రం చెప్పదలచా. ఆయన మరెంతో నష్టపోవాల్సి రావచ్చు.ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన డోజ్ను మస్క్పైకి ఉసిగొల్పాల్సి రావచ్చు. బహుశా అదే ఆయన్ను కబళించే రాకాసిగా మారవచ్చు!’’ అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై మస్క్ స్పందిస్తూ, తనకిస్తున్న సబ్సిడీలను ఎత్తేయాలంటూ ట్రంప్కు సవాలు విసిరారు. ఆ తర్వాత ఈ అంశంపై మీడియాతో ట్రంప్ స్పందించారు. మస్క్ను అమెరికా నుంచి తిప్పి పంపించే యోచన ఉందా అని ప్రశ్నించగా ‘‘నాకు తెలియదు. దీనిపై దృష్టి సారించి చూడాలి’’ అని బదులిచ్చారు. డోజ్కు ఇటీవలి దాకా సారథ్యం వహించింది మస్కే కావడం విశేషం. ఆయన 1971లో దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించారు. అమెరికాలో ఏళ్ల తరబడి నివసించిన అనంతరం 2002లో ఆ దేశ పౌరసత్వం పొందారు.కొత్త పార్టీ దేశావసరం: మస్క్బిగ్, బ్యూటిఫుల్ బిల్పై మస్క్ నెల రోజులుగా ట్రంప్తో విభేదిస్తున్నారు. తుది ఓటింగ్కు ముందు సోమవారం కాంగ్రెస్లో ట్రంప్ చర్చించిన సందర్భంగా మస్క్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాన్ని రుణ బానిసత్వపు బిల్లుగా అభివర్ణించారు. ‘‘ఈ బిల్లు వల్ల జాతీయ రుణం మరో 3 లక్షల కోట్ల డాలర్లకు పైగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో నిజంగా ప్రజల గురించి ఆలోచించే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి బహుశా సమయం ఆసన్నమైంది’’ అని మస్క్ ఎక్స్లో పోస్టు చేశారు. బిల్లును విమర్శించడంతోనే ఆగలేదు.హౌస్ ఫ్రీడమ్ కాకస్ చైర్మన్ ప్రతినిధి ఆండీ హారిస్తో సహా ప్రముఖ రిపబ్లికన్ చట్టసభ సభ్యులపైనా విమర్శలు గుప్పించారు. ‘చరిత్రలో అతిపెద్ద రుణ పరిమితి పెరుగుదలతో రుణ బానిసత్వ బిల్లుకు మీరు ఓటు వేసి.. మిమ్మల్ని మీరు ఫ్రీడమ్ కాకస్ అని ఎలా పిలుచుకుంటారు?’ అని మస్క్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఖర్చులను తగ్గించాలంటూ మొన్నటిదాకా ప్రచారం చేసి, ఇప్పడిలా దేశ చరిత్రలోనే అతిపెద్ద రుణ పెరుగుదల బిల్లుకు ఓటేసిన ప్రతి కాంగ్రెస్ సభ్యుడూ సిగ్గుతో తల దించుకోవాలని వ్యాఖ్యానించారు. మస్క్ పోస్టును సోషల్ మీడియాలో ఏకంగా 2.6 కోట్ల మందికి పైగా చూడటం విశేషం. బిల్లు ఆమోదం పొందితే కొత్త పార్టీ పెడతానంటూ ఆ తర్వాత కొద్ది గంటలకే మస్క్ మరో పోస్ట్ పెట్టారు. ‘ఈ పిచ్చి బిల్లు రిపబ్లికన్ పార్టీకి ఆత్మహత్యాసదృశమే అవుతుంది.అది ఆమోదం పొందితే ఆ మర్నాడే ‘అమెరికా పార్టీ’ ఏర్పడుతుంది. డెమొక్రాట్–రిపబ్లికన్ పార్టీలకు ప్రత్యామ్నాయం ఇప్పుడు దేశానికెంతో అవసరం. రాబోయే పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఆ పోస్టును ఏకంగా 3.2 కోట్ల మంది వీక్షించారు. ఇప్పటికే ప్రతినిధుల సభ ఆమోదం పొందిన ‘బిగ్’ బిల్లుపై మూడు రోజులుగా సెనేట్లో తీవ్రస్థాయి చర్చ జరుగుతోంది. మంగళవారం ఇది ఆమోదం పొందింది. దీనితో విద్యుత్ వాహనాలకు ప్రస్తుతం అందుతున్న భారీ సబ్సిడీలు పూర్తిగా అటకెక్కుతాయి. మస్క్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా, అంతరిక్ష ప్రయోగాల సంస్థ స్పేస్ఎక్స్ ప్రభుత్వం నుంచి భారీ కాంట్రాక్టులు, సబ్సిడీలు పొందుతున్న విషయం తెలిసిందే. -
చైనా అధ్యక్షుడిగా వాంగ్ యాంగ్?
గత మే 21-జూన్ 5 తేదీల మధ్య సుమారు 15 రోజులపాటు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ (72) జనానికి కనిపించలేదు. దీంతో ఎన్నో ప్రశ్నలు, సందేహాలు. మరి పాలనా పగ్గాలు వాస్తవంగా ఎవరి చేతిలో ఉన్నట్టు? ఈ పరిణామం చైనా కమ్యూనిస్టు పార్టీలో నాయకత్వ మార్పుకు సంకేతమా? అంటే... డ్రాగన్ ముఖచిత్రం అలాగే దర్శనమిస్తోంది. ఈ నెల 6, 7 తేదీల్లో బ్రెజిల్ దేశంలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకూ జిన్ పింగ్ హాజరుకాబోవడం లేదు. తాను గద్దెనెక్కాక బ్రిక్స్ శిఖరాగ్రానికి జీ హాజరుకాకపోవడం ఇదే తొలిసారి! ఆయన బదులు చైనా ప్రధాన మంత్రి లీ కియాంగ్ బ్రిక్స్ సదస్సుకు వెళ్లనున్నారు.సమస్య బ్రిక్స్ గురించి కాదు. అసలు చైనాలో ఏం జరుగుతోంది? జిన్ పింగ్ కేవలం దేశాధ్యక్షుడే కాదు... చైనీస్ కమ్యూనిస్టు పార్టీ (సీసీపీ) ప్రధాన కార్యదర్శి, సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) ఛైర్మన్ కూడా. సీఎంసీ తొలి వైస్ ఛైర్మన్ అయిన జనరల్ జాంగ్ యూక్సియా (జహంగ్ యూషా) చేతిలో ప్రస్తుతం దేశ పాలనా పగ్గాలు ఉన్నట్టు సమాచారం. కమ్యూనిస్టు పార్టీలో శక్తిమంతమైన 24 మంది సభ్యుల పొలిట్ బ్యూరోలో జాంగ్ సభ్యుడు. దేశ మాజీ అధ్యక్షుడు హు జింటావోకు విశ్వాసపాత్రులైన పార్టీ సీనియర్ సభ్యులు పలువురు జాంగ్ యూక్సియాకు మద్దతిస్తున్నట్టు తెలుస్తోంది. చైనాలో కీలక ఆర్థిక, సైనిక రంగాలపై జీ జిన్ పింగ్ ప్రభావం సన్నగిల్లుతోంది. ఆయన భావజాలపు ముద్ర బలహీనపడుతోంది. జీ నాయకత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది.ఆర్థిక రంగం ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. నిరుద్యోగం బాగా ప్రబలుతోంది. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. జిన్ పింగ్ రాజకీయ వారసుడిగా టెక్నోక్రాట్ వాంగ్ యాంగ్ (70) తెరపైకొస్తున్నారు. ఉదారవాదిగా, సంస్కర్తగా వాంగ్ యాంగ్ కు పేరుంది. ఇక జిన్ పింగ్ సన్నిహితులుగా ముద్రపడిన జనరల్స్ ఉద్వాసనకు గురవుతున్నారు. అలా జిన్ పింగ్ క్రమంగా ‘మసకబారుతున్నారు’. కాదు... పార్టీ నాయకత్వమే ఆయన్ను పక్కకు తప్పిస్తోంది. మూడేళ్ళ క్రితం 2022లో చైనా కమ్యూనిస్టు పార్టీ సమావేశంలో... జిన్ పింగ్ పక్కన ఆశీనుడైన దేశ మాజీ అధ్యక్షుడు హు జింటావోను... తాను ‘రాను రానంటున్నా’... సిబ్బంది అమర్యాదకరంగా, బలవంతంగా బయటికి లాక్కెల్లిన దృశ్యాలను ఎవరు మరువగలరు? ఆ చర్యను జిన్ పింగ్ నిలువరించే ప్రయత్నం చేయకపోగా కనీసం అటు వైపు కన్నెత్తి చూడలేదు. హై ప్రొఫైల్ నేతలను ఇలా సాగనంపడం చైనాకు కొత్త కాదు. తమ దేశంలో తలెత్తే అంతర్గత వివాదాల ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కోసం బహిర్గత (విదేశాంగ) వ్యవహారాలను ఉపయోగించుకోవడం చైనాకు రివాజు కనుక... ప్రస్తుత సమయంలో మన దేశం జాగ్రత్తగా ఉండాలనేది నిపుణుల హెచ్చరిక. ఇండియాపై సైబర్ దాడులను చైనా తీవ్రతరం చేయవచ్చు. అలాగే భారతదేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా డ్రాగన్ దెబ్బతీసే అవకాశాలూ లేకపోలేదు. - జమ్ముల శ్రీకాంత్ -
ట్రంప్ పెర్ఫ్యూమ్స్ : ‘విక్టరీ 45-47’ లాంచ్.. సీక్రెట్ ఏంటంటే..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త ఫెర్ఫ్యూమ్స్ బ్రాండ్ను లాంచ్ చేసింది. 'ట్రంప్ ఫ్రాగ్రెన్స్' కింద తనరెండు రకాల సెంట్ ఉత్పత్తులను లాంచ్ చేశారు. 'విక్టరీ 45-47' పేరుతో వీటిని తీసుకొచ్చారు. తన ప్రైవేట్ సోషల్ మీడియాలో ట్రంప్ ఈవిషయాన్ని ప్రకటించారు.ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, డెమోక్రటిక్ ప్రత్యర్థి కమలా హారిస్ను ఓడించి, ఘన విజయానికి గుర్తుగా ఈ పెర్ఫ్యూమ్ బాటిల్స్కు ‘విక్టరీ 45-47' అని పేరు పెట్టారట. అంతేకాదు, డొనాల్డ్ ట్రంప్ 45వ అధ్యక్షుడిగా తొలిసారి, రెండోసారి 47వ అధ్యక్షుడిగా రెండుసార్లు ఎంపిక కావడానికిది సింబాలిక్ అట.ఇది చదవండి: Today tip : ఒళ్లంత తుళ్లింత.. ఈ టిప్స్ తప్పవు మరి!"పురుషులు, మహిళలకోసం ట్రంప్ ఫ్రాగ్రెన్స్లు వచ్చాయి. ఇవి గెలుపు.. బలం..విజయం అనే ట్యాగ్లతో తీసుకొచ్చారు. ఒక బాటిల్ తీసుకోండి, మీ ప్రియమైనవారి కోసం కూడా ఒకటి తీసుకోవడం మర్చిపోవద్దు. ఆనందించండి, గెలుస్తూ ఉండండి!"అంటూ అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం విశేషం. ఈ సెంటు బాటిల్స్ గెట్స్ ట్రంప్ ఫ్రాగ్రెన్స్. కామ్లో ట్రంప్ సంతకంతో పాటు , ట్రంప్ ఐకానిక్ బంగారు విగ్రహాన్ని కూడా అమర్చారు. ఈ పరిమిత ఎడిషన్ పెర్ఫ్యూమ్, కొలోన్ ధర 249 డాలర్లు అంటే దాదాపు 21 వేల రూపాయలు. -
బ్యూటీఫుల్ ప్రధానికి బిగ్ షాక్
థాయిలాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రాకు భారీ షాక్ తగిలింది. ఆమెను ప్రధాని పదవి నుంచి సస్పెండ్ చేస్తూ ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కంబోడియాతో జరిగిన డిప్లొమాటిక్ వివాదం నేపథ్యంలో.. నైతిక ప్రమాణాలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. ఈ మేరకు 7-2 మెజారిటీ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఇవాళ( జులై 2) నుంచి రాజ్యాంగ న్యాయస్థానం తీర్పు ఇచ్చేంతవరకు ఆమెను ప్రధాని విధుల సస్పెండ్ చేసినట్లు పేర్కొంది. తీర్పుపై షినవత్రా స్పందిస్తూ.. తన విధులకు అంతరాయం కలగకూడదని తాను కోరుకున్నప్పటికీ, కోర్టు ఆదేశాలను అంగీకరిస్తానంటూ చెప్పుకొచ్చారు.థాయ్లాండ్ బిలియనీర్, మాజీ ప్రధాని అయిన తక్సిన్ షినవత్రా కుమార్తె ప్రస్తుత థాయ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా గతేడాది ఆగస్టులో ఆమె ఆ పదవిని చేపట్టారు. 37 ఏళ్లకే ప్రధాని పీఠాన్ని అధిష్టించిన ఆమె.. ఆ దేశ చరిత్రలోనే అతి పిన్న ప్రధానిగా, రెండో మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించారు. అంతేకాదు.. అందం, ఫ్యాషన్స్లోనూ స్టైల్ ఐకాన్గా, బ్యూటిఫుల్ పీఎంగా నెట్టింట విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు.థాయ్లాండ్కు పొరుగున ఉన్న కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్కి థాయ్ ప్రధాని షినవత్రా ఫోన్ చేశారు. ‘‘అంకుల్’’ అంటూ ఆయనను సంబోధించిన ఆమె.. తన దేశంలోని పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా సరిహద్దులో థాయ్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బూన్సిన్ను ఉద్దేశించి తనకు వ్యతిరేకంగా ఉన్నట్లు ఆమె ఆయనతో చెప్పారు పేర్కొన్నారు. అయితే, జూన్ 15వ తేదీన జరిగిన ఈ ఫోన్కాల్ సంభాషణ తాజాగా బయటకు వచ్చింది.సాధారణంగానే కంబోడియా-థాయ్లాండ్ల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. పైగా సరిహద్దు వివాదాల కారణంగా ఈ మధ్యకాలంలో(మే 28వ తేదీ నుంచి) అవి మరింతగా దెబ్బతిన్నాయి. అయితే.. 2023లో హున్ సేన్ ప్రధాని పదవి నుంచి దిగిపోగా.. ఆయన కుమారుడు హున్ మానెట్ అధికార పగ్గాలు చేపట్టారు. పదవిలో లేకపోయినా కంబోడియా రాజకీయాలను ప్రభావితం చేయగల వ్యక్తి హున్సేన్. అలాంటి వ్యక్తితో షినవత్రా ఫోన్లో మాట్లాడడం.. పైగా దేశ భద్రతకు సంధించిన విషయాలను ప్రత్యర్థితో పంచుకున్న తీరు కూడా వివాదాస్పదమైంది. -
దుకాణం బంద్ చేసి.. మస్క్కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు
బిగ్ బ్యూటీఫుల్ బిల్లుపై తీవ్ర విమర్శలు చేస్తున్న ఎలాన్ మస్క్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. అతడు (మస్క్) అమెరికాలో వ్యాపారం చేయలేకపోతే దుకాణం మూసేసి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సి వస్తుంది అని హెచ్చరించారు. ఒకసారి ఆయన అమెరికా ప్రభుత్వం నుంచి పొందిన సబ్సిడీలను తాను చూసుకోవాలి. అమెరికా చరిత్రలోనే ఎవరూ పొందలేనంత సబ్సిడీలను మస్క్ పొందారు. అలాంటి వ్యక్తి నా ప్రభుత్వంలో DOGE (Department of Government Efficiency) చీఫ్గా పనిచేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఒకవేళ ఆ సబ్సిడీలే వద్దనుకుంటే ఆయన తన వ్యాపారాలను బంద్ చేసుకోవచ్చు. అమెరికా వదిలి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లిపోవొచ్చు అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. అదే జరిగితే.. ఇంకా రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహాలు, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి అవసరం ఆయనకు ఉండదు. పైగా మన దేశానికి భారీగా డబ్బు ఆదా అవుతుంది. దీనిపై DOGE (Department of Government Efficiency) గట్టిగా పరిశీలన చేయాలి. ఇది పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేసే అవకాశం! అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన భారీ ఖర్చుల బిల్లు(One Big, Beautiful Bill)పై ఎలాన్ మస్క్ మొదటి నుంచి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంతోనే ఆయన డోజ్ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారు. అయితే మస్క్ ఎంతగా విమర్శించినప్పటికీ.. ట్రంప్ మాత్రం మస్క్ మంచి స్నేహితుడనే చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో.. బిల్లు గనుక ఆమోదం పొందితే ఆ మర్నాడే తాను రాజకీయ పార్టీని ప్రకటిస్తానని మస్క్ తాజాగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ట్రంప్ కూడా ఇప్పుడు ఘాటుగా స్పందించడం మొదలుపెట్టారు. ట్రంప్ రెండో దఫా అధ్యక్ష విజయంలో ఎలాన్ మస్క్ కీలక పాత్రే పోషించారు. ఆ ఎన్నికల సమయంలో దాదాపు $300 మిలియన్ల విరాళాలు ఇచ్చారు. కానీ బిల్లు కారణంగా ఇప్పుడు ఇద్దరి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. ట్రంప్ తాజా వ్యాఖ్యలు చూస్తుంటే మస్క్ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. -
అదే జరిగితే.. రేపే కొత్త పార్టీ పెడతా!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సన్నితుడిగా, రాజకీయ సలహాదారుడిగా వ్యవహరించిన అపర కుబేరుడు ఎలాన్ మస్క్.. ఇప్పుడు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా బ్యూటీఫుల్ బిల్పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదొక పిచ్చి ఖర్చు అని, పన్ను చెల్లింపుదారులకు భారంగా మారుతుందని అన్నారాయన. అలాగే పార్టీ ఏర్పాటుపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.వాషింగ్టన్: గతంలో ట్రంప్కు మద్దతుగా నిలిచిన మస్క్.. తన ఎక్స్ వేదికగా అదే వ్యక్తి పాలనా విధానాలను వరుస పోస్టులతో తిట్టిపోస్తున్నారు. ట్రంప్ ప్రతిపాదిత బిగ్ బ్యూటీఫుల్ బిల్లుపై మరోసారి స్పందిస్తూ..ఈ బిల్లు సాధారణ అమెరికన్లకు నష్టం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో కొత్త పార్టీ ఏర్పాటుపైనా ఆయన కీలక ప్రకటన చేశారు. ఖర్చులను తగ్గిస్తామని చెప్పిన రిపబ్లికన్ నాయకులు ఇప్పుడు భారీ ఖర్చులకు మద్దతు ఇస్తున్నారు. అమెరికా సెనేట్లో ప్రస్తుతం ఓట్ల పోరు కొనసాగుతోంది. రిపబ్లికన్లు ట్రంప్ రెండో పదవీకాలానికి కీలకమైన ఈ బిల్లును ఆమోదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ బిల్లు ఆమోదితమైతే, ప్రజల కోసం నిజంగా పనిచేసే కొత్త రాజకీయ పార్టీ అమెరికా పార్టీని రేపే స్థాపిస్తానంటూ మస్క్ వ్యాఖ్యానించారు. ట్రంప్ కోసం 250 మిలియన్ డాలర్లతో మద్దతు ప్రచారం నిర్వహించిన మస్క్.. ట్రంప్ ప్రతిపాదించిన బిల్లు అమెరికన్లకు తీవ్ర నష్టం చేకూరుస్తుందనే అభిప్రాయం తొలి నుంచి వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లుతో జరిగే పిచ్చి ఖర్చు స్పష్టంగా చూపిస్తోంది. ఇది దేశపు అప్పు పరిమితిని రికార్డు స్థాయిలో ఐదు ట్రిలియన్ డాలర్ల వరకు పెంచుతోంది. ప్రజల గురించి నిజంగా పట్టించుకునే కొత్త రాజకీయ పార్టీ ఏర్పడాల్సిన సమయం వచ్చింది. అంటూ ఎక్స్ ఖతాలో పోస్ట్ చేశారాయన. తద్వారా.. మస్క్ ప్రస్తుత అమెరికా రాజకీయ వ్యవస్థపై తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరిచారు. అమెరికా సెనేట్ ప్రస్తుతం ట్రంప్ ప్రతిపాదించిన "One Big, Beautiful Bill" పై ఓట్ల పోరులో నిమగ్నమై ఉంది. ఈ బిల్లును జూలై 4 స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఆమోదించాలనే లక్ష్యంతో రిపబ్లికన్లు వేగంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలుహౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ గత నెలలో ఈ బిల్లును తక్కువ మెజారిటీతో ఆమోదించింది.ఇప్పుడు సెనేట్ తమ సవరణలతో కూడిన బిల్లును తుది రూపంలోకి తీసుకురావాల్సి ఉంది.ఆ తర్వాత హౌస్ మళ్లీ ఆ సవరణలను ఆమోదించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ బిల్లు చట్టంగా మారేందుకు అధ్యక్షుడి సంతకం కోసం పంపబడుతుంది. ఈ బిల్లులో..సరిహద్దు భద్రత, రక్షణ, శక్తి ఉత్పత్తికి భారీ ఖర్చులు ప్రతిపాదించబడ్డాయి. అయితే ఆరోగ్య సంరక్షణ, పోషకాహార కార్యక్రమాలపై ఖర్చులను తగ్గించనున్నారు.అమెరికా కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం అంచనా ప్రకారం, ఈ బిల్లు వచ్చే దశాబ్దంలో దాదాపు $3.3 ట్రిలియన్ డాలర్ల లోటును కలిగించనుంది. -
‘హార్వర్డ్’కు ట్రంప్ మరో షాక్.. యూదు హక్కులపై వేటు
వాషింగ్టన్: అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంపై ట్రంప్ పరిపాలనా విభాగం మరోమారు దృష్టి సారించింది. హార్వర్డ్తో పాటు వర్శిటీలోని ఇజ్రాయెల్ విద్యార్థులు పౌర హక్కులను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించింది. దీనిపై హార్వర్డ్ అత్యవసర చర్యలు చేపట్టకపోతే సమాఖ్య నిధులను నిలిపివేస్తామని హెచ్చరించింది.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వర్శిటీ పాఠ్యాంశాలు, సిబ్బంది నియామకం, విద్యార్థుల అడ్మిషన్ తదితర విషయాల్లో చేసిన ఆదేశాలను ధిక్కరించిన నేపధ్యంలో ‘హార్వర్డ్’పై ట్రంప్ పాలకవర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. హార్వర్డ్ అధ్యక్షునికి ట్రంప్ యంత్రాంగం పంపిన ఒక లేఖలో.. గాజాలో హమాస్పై ఇజ్రాయెల్ యుద్ధానికి వ్యతిరేకంగా క్యాంపస్లో జరిగిన నిరసనల్లో విద్యార్థులను రక్షించడంలో వర్శిటీ విఫలమైందని ఆరోపించింది. దీనిపై దర్యాప్తు తర్వాత కూడా హార్వర్డ్ ఉద్దేశపూర్వకంగా ఉదాసీనంగా వ్యవహరించిందని పేర్కొంది.అమెరికా ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ విలేకరులతో మాట్లాడుతూ ‘హార్వర్డ్’ పౌర హక్కుల చట్టాన్ని ఉల్లంఘిస్తోందని, ఇదేకొనసాగితే సమాఖ్య నిధులు అందవని హెచ్చరించారు. కాగా ట్రంప్ పరిపాలనా విభాగం మసాచుసెట్స్లోని విశ్వవిద్యాలయంలో చేరాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులకు వీసాలు నిరాకరించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాలకు సూచించింది. అయితే హార్వర్డ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీతో పాటు ఇతర ఏజెన్సీలు దీనిని వ్యతిరేకించాయ. ఇటువంటి చర్యలు చట్టవిరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని వాదించాయి. దీంతో కోర్టులు ప్రస్తుతానికి ట్రంప్ యంత్రాంగం చేపట్టాలకుకున్న చర్యలకు అడ్డుకట్టవేశాయి. 2024-2025 విద్యా సంవత్సరంలో హార్వర్డ్లోని మొత్తం విద్యార్థులలో 27 శాతం మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు.ఇది కూడా చదవండి: వ్యూహాత్మక మిత్రదేశంగా భారత్: ప్రధాని మోదీకి వైట్హౌస్ అభినందనలు -
వ్యూహాత్మక మిత్రదేశంగా భారత్: ప్రధాని మోదీకి వైట్హౌస్ అభినందనలు
వాషింగ్టన్ సీడీసీ: భారత ప్రధాని మోదీ తరచూ వివిధ దేశాల్లో పర్యటిస్తూ, ఆయా దేశాలతో భారత్ బంధాన్ని బలోపేతం చేసే దిశగా ప్రయత్నిస్తుంటారు. అలాగే వ్యూహాత్మక ఒప్పందాలను కుదుర్చుకుంటుంటారు. ఈ నేపధ్యంలో ఆయా దేశాల అధిపతుల అభినందనలు అందుకుంటుంటారు. ప్రధాని మోదీ తాజాగా అమెరికా నుంచి అభినందనలు అందుకున్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని మోదీతో చాలా మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. శ్వేతసౌధం వెలుపల జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక మిత్రదేశంగా భారతదేశం నిర్వహిస్తున్న పాత్రను ప్రశంసించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్య బలమైన సంబంధం ఉందని కూడా అన్నారు.భారత్- అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం గురించి కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. గత వారమే భారత్- అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు జరిగాయని, ఈ విషయమై తాను అమెరికా వాణిజ్య కార్యదర్శితో మాట్లాడానని, ఆయన అధ్యక్షుడు ట్రంప్తో ఇదేవిషమై సమాలోచనలు జరుపుతున్నారన్నారు. ఈ ఒప్పందాలను ఖరారు చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని, త్వరలోనే అమెరికా వాణిజ్య బృందం దీనికి సంబంధించిన ప్రకటన వెలువరుస్తుందన్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రస్తుతం అమెరికా విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొంటున్న తరుణంలో అమెరికా ఈ వివరాలు తెలిపింది.ఐక్యరాజ్యసమితిలో జరుగుతున్న ‘క్వాడ్’(క్యూయూఏడీ) సదస్సులో పాల్గొన్న జైశంకర్ తొలుత ‘ది హ్యూమన్ కాస్ట్ ఆఫ్ టెర్రరిజం’ అనే ప్రదర్శనను ప్రారంభించారు. ఉగ్రవాదంపై పోరాడాల్సిన ఆవశ్యతను ప్రపంచదేశాలకు తెలియజేసే ఉద్దేశంతో దీనిని నిర్వహిస్తున్నారు. క్వాడ్ అనేది ఆస్ట్రేలియా, భారత్, జపాన్ , యునైటెడ్ స్టేట్స్ మధ్య కుదిరిన దౌత్య భాగస్వామ్యం. ఇది ఇండో-పసిఫిక్కు మద్దతు పలికేందుకు ఉద్దేశించినది. ఈ గ్రూపు 2004 డిసెంబరులో సంభవించిన హిందూ మహాసముద్ర సునామీ సమయంలో ఈ దేశాలు పరస్పరం మానవతా దృక్ఫధాన్ని చాటేందుకు ఏర్పాటయ్యింది.ఇది కూడా చదవండి: భారత్-పాక్ సరిహద్దుల్లో కలకలం.. ఆ కుళ్లిన మృతదేహాలు ఎవరివి? -
పప్పన్నం చేత్తో తిన్నందుకు తిట్టిపోస్తున్నారే!
న్యూయార్క్: న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థిత్వాన్ని గెల్చుకున్న జోహ్రామ్ ఖ్వామీ మమ్దానీ ఏం చేసినా ఇప్పుడు విమర్శల వర్షం కురుస్తోంది. ఇప్పుడు తాపీగా కూర్చుని పప్పన్నం తిన్నా సరే అమెరికా రాజకీయనేతలు తీవ్రంగా తప్పుబట్టడం ఇప్పుడు కొత్త వార్తాంశంగా నిలిచింది. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మమ్దానీ భోజనం చేస్తూ కనిపించారు. ఒక చిన్న ప్లేట్లో అన్నం, పప్పు చేత్తో కలుపుకుని కడుపారా తిన్నారు. ‘‘ ప్రపంచాన్ని చూసే దృక్కోణాన్ని నేను అభివృద్ధి చెందుతున్న(థర్డ్ వరల్డ్) దేశాల నుంచే నేర్చుకున్నా’’ అని అన్నారు. అయితే ఈ వీడియోను ‘ఎడ్ ఓక్నెస్’ అనే ‘ఎక్స్’ ఖాతాలో ఒకతను పోస్ట్చేసి మమ్దానీ తీరును తప్పుబట్టారు. ‘‘ అన్నాన్ని చేత్తో తింటూ ఆయన తనకు థర్డ్ వరల్డ్ స్ఫూర్తి అని చెబుతున్నారు’’ అని ఆ నెటిజన్ వ్యాఖ్యానించారు. దీనికిఅమెరికా దిగువసభ సభ్యుడు, రిపబ్లికన్ పార్టీ యువనేత బ్రాండన్ జీనీ గిల్ సైతం మద్దతు పలికి మమ్దానీని తప్పుబట్టారు. Civilized people in America don’t eat like this.If you refuse to adopt Western customs, go back to the Third World. https://t.co/TYQkcr0nFE— Congressman Brandon Gill (@RepBrandonGill) June 30, 2025‘‘ అమెరికాలో ఉంటూ అనాగరికంగా తింటున్నారు. మీకు థర్డ్ వరల్డ్ స్ఫూర్తి అయితే ఆ థర్డ్ వరల్డ్లోనే బతకండి. అక్కడికి వెళ్లిపొండి’’ అని ఒక క్యాప్షన్ పెట్టారు. ‘‘ రాజకీయ జిమ్మిక్కులో భాగంగానే ఆయన ఇలా చేత్తో తింటున్నారు. సాధారణంగా ఆయన చేత్తో కాకుండా చెంచాలు, ఫోర్క్లతో తింటారు’’ అని కొందరు నెటిజన్లు విమర్శించారు. మ్యాన్హాట్టన్ జిల్లా అటార్నీ రేసులో ఉన్న రిపబ్లికన్ నాయకురాలు మాడ్ మరూన్ సైతం విమర్శించారు. అయితే మరికొందరు మాత్రం మమ్దానీకి మద్దతు పలికారు. ‘‘ఆయన చక్కగా చేత్తో కలుపుకుని తిన్నారు. తినడం అనేది ఆయా వ్యక్తుల సంస్కృతి, ఆచార వ్యవహారాలు, అలవాట్లకు సంబంధించిన అంశం. ఇది పూర్తిగా జాత్యహంకారమే’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ రాజకీయంగా ఆయనను ఎదుర్కొనే సత్తాలేక ఆయన వ్యక్తిగత అలవాట్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. చేత్తో తినని వాళ్లకే అమెరికా చెందుతుందని రాజ్యాంగంలో రాశారా?. చేత్తో తింటే అనాగరికం ఎలా అవుతుంది?’’ అని మరికొందరు మమ్దానీకి మద్దతు పలికారు. ‘‘ టాకూస్, ఫ్రెంచ్ ప్రై, బర్గర్, పిజ్జా, లేస్ ప్యాకెట్ ఎలా తింటారు?. చేత్తోనేకదా తినేది. మరి అలాంటప్పుడు పప్పన్నం హాయిగా చేత్తో కలిపి తింటే తప్పేంటట?’’ అని మరికొందరు వాదించారు. ‘‘ అమెరికాలో అన్నం చేత్తో తినడం కూడా తప్పేనా?. అమెరికా ఎటు పోతోంది?’’ అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. -
ఆ దేశాన్ని వీడుతున్న ప్రజలు!.. కారణం ఏంటంటే?
యుద్ధాలు, అంతర్యుద్ధాలు కొన్ని దేశాల ప్రజలను శరణార్థులుగా మారుస్తుంటే.. వాతావరణంలో మార్పులు ఒక దేశ మనుగడకు ముప్పుగా పరిణమించాయి. అ దేశం పేరు తువాలు. హవాయి, ఆ్రస్టేలియా మధ్యలో పసిఫిక్ మహాసముద్రంలో తొమ్మిది చిన్న పగడపు దీవులతో కూడిన అతి చిన్న దేశం. ఇక్కడి జనాభాలో మూడింట ఒక వంతుకు పైగా ఆ్రస్టేలియాకు వెళ్లిపోవాలనుకుంటున్నారు. ప్రజలు దేశాన్ని వీడటానికి కారణమేంటి? వాతావరణం ఆ దేశానికి ముప్పుగా ఎలా మారింది? ఇప్పుడు వార్తల్లో ఎందుకు నిలిచింది చూద్దాం. తువాలు.. ప్రపంచంలోనే అత్యల్ప జనాభా కలిగిన దేశాలలో ఒకటి. ఇక్కడి జనాభా 10,000 మంది కంటే తక్కువ. అంటే మన దేశంలో చిన్న పట్టణంతో సమానం. 1978లో బ్రిటిష్ పాలకుల నుంచి నుంచి స్వాతంత్య్రం పొందింది. సహజమైన సౌందర్యానికి నెలవు. స్కూబా డైవింగ్కు ఎంతో ప్రసిద్ధి పొందింది. ఇక ఈ దేశంలో అతి పెద్ద దీవి.. పగడపు దీవి అయిన ఫనాఫుటి. ఇది దేశ రాజధాని కూడా.దీనికి కొన్ని ప్రదేశాల్లో కేవలం 65 అడుగుల వెడల్పు ఉన్న రన్వే లాంటి భూమి ఉంది. వాతావరణంలో మార్పులు ఈ దేశానికి ముప్పుగా పరిణమించాయి. దీంతో ఇక్కడి ప్రజలు ఆ్రస్టేలియాకు వలసపోతారు. వీరికి నివాసం కల్పించడం కోసం మానవతా దృక్పథంతో ఆ్రస్టేలియా ల్యాండ్మార్క్ వీసా పథకాన్ని రూపొందించింది. ఈ నెల 16న దరఖాస్తుల విండోను ప్రారంభించింది.ఇప్పటివరకు 4,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. వీరి నుంచి జనవరి 2026 వరకు 280 మందిని ఎంపిక చేయనుంది. ఈ వీసాలను గెలుచుకున్న వారు.. ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసం పొందుతారు. విద్య, ప్రజారోగ్యంతోపాటు పనిచేసే హక్కు కూడా వారికి లభిస్తుంది. 2050 నాటికి తువాలులో సగానికి పైగా భూమి మునిగిపోతుందని, ఇక 2100 నాటికి 90శాతం దేశం సముద్రంలో కలిసిపోతుందని తువాలు ప్రధాన మంత్రి ఫెలేటి టియో తెలిపారు. అయితే భవిష్యత్తులో ఎవరూ అక్కడ నివసించలేకపోయినా, తువాలుకు గుర్తింపు ఇస్తామని ఆస్ట్రేలి యా హామీ ఇచ్చింది – -
కొండను కదిలించడం అంటే ఇదే!
వందేళ్ల పురాతనమైన ఇటుక కట్టడం.. 44 వేల చదరపు అడుగుల నిర్మాణం.. 8270 టన్నుల బరువు.. చిన్నసైజు కొండలా ఉంటుంది. కానీ.. మనిషి సంకల్పం ముందు మాత్రం దూదిపింజె చందంగా తేలికగా మారిపోయింది. ఇటు నుంచి అటుకు.. కొంత సమయం తరువాత అటు నుంచి ఇటుకు వచ్చేసింది. చైనాలో జరిగిందీ అద్భుతం. భూగర్భంలో ఓ షాపింగ్ సెంటర్ కట్టేందుకు అడ్డుగా ఉందని.. షాంఘైలోని హయాన్లీ షికుమెన్ భవనాన్ని చెక్కు చెదరకుండా పక్కకు తరలించారు. మల్టీ లెవల్ అండర్గ్రౌండ్ షాపింగ్ మాల్ నిర్మాణం పూర్తి కాగానే యథాతథ స్థితికి చేర్చేశారు.వివరాలు... ఇప్పుడంటే మాయమయ్యాయి కానీ.. ఒకప్పుడు చైనాలో నడవా ఇళ్లు భారీ ఎత్తునే ఉండేవి. నడవ ఇల్లు అంటే అర్థం కాకపోతే.. విశాలమైన సెంట్రల్ కోర్టు ఉన్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అనుకోండి. 1920, 30లలో కట్టిన ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఈ హుయాన్లీ షికుమెన్ కాంప్లెక్స్. కాలం మారిపోయింది. షాంఘై మహా నగరమైంది. ప్రజల అవసరాలు పెరిగిపోయాయి. ఇందుకు తగ్గట్టుగా ఈ కాంప్లెక్స్ ఉన్న చోట ఓ భారీ భూగర్భ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని ప్రభుత్వం తీర్మానించింది. అయితే వందేళ్ల చరిత్ర ఉన్న హుయాన్లీ కాంప్లెక్స్ను కూల్చేసేందుకు స్థానిక ప్రభుత్వానికి మనసు రాలేదు. దాన్ని కాపాడుకుంటూనే అండర్గ్రౌండ్ షాపింగ్ కాంప్లెక్స్ కట్టేద్దామని తీర్మానించారు.ఈ ప్రాజెక్టు కాంట్రాక్ట్ దక్కించుకున్న షాంఘై కన్స్ట్రక్షన్ నెం:2 సంస్థ భవనాన్ని నఖశిఖ పర్యంతం పరిశీలించి.. త్రీడీ స్కానింగ్ చేసి... పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి తరలించాలని, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం తరువాత మళ్లీ ముందు ఉన్న చోటికి తెచ్చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది. అత్యాధునిక కృత్రిమ మేధ సాయంతో పనిచేసే డ్రిల్లింగ్ రోబోలు రంగంలోకి దిగాయి. మట్టికి, నిర్మాణానికి మధ్య తేడాను స్పష్టంగా అర్థం చేసుకోగల ఈ రోబోలు భవనం చుట్టూ ఒక పద్ధతి ప్రకారం తవ్వడం మొదలుపెట్టాయి. అడుగుభాగంలోకి చేరి ఒక్కటొక్కటిగా 432 హైడ్రాలిక్ వాకింగ్ రోబోలను నిలిపాయి.ఒక్కోటి పది టన్నుల బరువును మోయగల సామర్థ్యం ఉన్నవి. సెన్సర్ల సాయంతో పీడనం, కంపనలు వంటివి గుర్తిస్తూ వాకింగ్ రోబోలు అన్నీ సమన్వయంతో నెమ్మదిగా కదలుతూ భవనం మొత్తాన్ని పక్కనున్న ఖాళీస్థలంలో ఏర్పాటు చేసిన ర్యాంప్పైకి చేర్చాయి. ఒక రోజుకు కేవలం 33 అడుగుల దూరం మాత్రమే ప్రయాణిస్తూ... భవనం చెక్కు చెదరకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 2023లో మొదలైన ఈ తరలింపు కొద్ది రోజుల్లోనే ముగిసింది కానీ.. ఆ తరువాత ఖాళీ స్థలంలో అండర్గ్రౌండ్ షాపింగ్ కాంప్లెక్స్తోపాటు ఒక భూగర్భ మెట్రో రైలు స్టేషన్, పార్కింగ్ ఏర్పాట్లు వంటివన్నీ పూర్తి చేశారు. ఈ ఏడాది మే నెల 19న హుయాన్లీ కాంప్లెక్స్ను మళ్లీ యథాతథ స్థితికి తీసుకొచ్చే పని మొదలై 19 రోజుల్లోనే ముగించారు. జూన్ ఏడవ తేదీకల్లా భవనం తన సొంత పునాదులపై నిలిచింది.ఇదే తొలిసారా?ఊహూ కానేకాదు. భారీ భవంతులను పక్కకు జరిపడం గతంలోనూ చాలాసార్లు జరిగింది. 1985లో టెక్సస్లోని సాన్ ఆంటోనియలో ఉండే ఫెయిర్మౌంట్ హోటెల్ను కూడా ఆరు బ్లాకుల దూరం కదిలించారు. భారీ క్రేన్, డంప్ ట్రక్కుల సాయంతో జరిగిందీ తరలింపు. చక్రాలపై కదిలిన అతి భారీ భవంతిగా ఇప్పటికీ గిన్నిస్ రికార్డు కొనసాగుతోంది. దీని బరువు 14.5 లక్షల కిలోలు లెండి!1930లో ఇండియానా బెల్ అనే టెలిఫోన్ కంపెనీ ఏడు అంతస్తుల తన ప్రధాన కేంద్ర భవనాన్ని ఒక దిక్కు నుంచి ఇంకో దిక్కుకు మళ్లించడం కూడా ఒక రికార్డే. పైగా ఇలా ఈ భవనాన్ని తిప్పేస్తున్నప్పుడు దాంట్లో కార్యకలాపాలు ఏ మాత్రం నిలిపివేయకపోవడం ఇంకో విశేషం! 1962లో చైనా కూడా సుమారు 22 అంతస్తుల భవనం ఒకదాన్ని 90 డిగ్రీల మేరకు పక్కకు తిప్పేయడం కొసమెరుపు!- గిళియారు గోపాలకృష్ణ మయ్యా! -
బెజోస్తో పెళ్లి, ఆ పోస్ట్లన్నీమాయం, పేరు మార్చేసిన లారెన్ సాంచెజ్
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, జర్నలిస్ట్ లారెన్ సాంచెజ్ వివాహం ఇటలీలోని వెనిస్లో అంగరంగ వైభవంగా జరిగింది. అత్యంతవిలాసవంతమైన ఈ వివాహానికి పలువురు గ్లోబల్ సెలబ్రిటీలు విచ్చేశారు.. వివాహానికి సంబంధించిన చిత్రాలు, వివాహ ఖర్చు, ముఖ్యంగా లారెన్ సాంచెజ్, జెఫ్ బెజోస్ దుస్తులు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం మరో విషయం ట్రెండింగ్లో నిలిచింది.జెఫ్ బెజోస్తో పెళ్లి తరువాత లారెన్ సాంచెజ్ కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లి అయిన కొన్ని గంటల తర్వాత, సాంచెజ్ తన పాత ఇన్స్టాగ్రామ్ ఫోటోలన్నింటినీ డిలీట్ చేసింది. కేవలం తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను మాత్రమే ఉంచింది. అంతేకాదు తన ఇంటి పేరును కూడా మార్చేసింది. తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ను "లారెన్ సాంచెజ్ బెజోస్" గా మార్చుకుంది. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్గా నిలిచింది.ఇదీ చదవండి: 900 గంటలు, 180 బటన్స్ : ఆమె స్పెషల్ వెడ్డింగ్ గౌను విశేషాలు View this post on Instagram A post shared by Lauren Sánchez Bezos (@laurensanchezbezos) జెఫ్ బెజోస్ ఏకంగారూ.548 కోట్లు ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది. జెఫ్ బెజోస్ బ్లాక్ కోట్ ధరించగా, సాంచెజ్ తెల్లటి వెడ్డింగ్ గౌనులో స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్, ప్రముఖ జర్నలిస్ట్ ఓప్రా విన్ఫ్రే, కిమ్ కర్దేషియాన్, కోలే కర్దేషియాన్, జోర్డాన్ రాణి రనియా, భారత్కు ఫ్యాషన్ ఐకాన్, వ్యాపారవేత్త భార్య నటాషా పూనా వాలా తదితరులు హాజరయ్యారు. -
BAN: కుమిల్లా ఘటన.. భగ్గుమన్న హిందూ సంఘాలు
బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీ వర్గం మరోసారి ఆందోళన బాట పట్టింది. కుమిల్లా(Comilla) జిల్లా దారుణ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ.. గత మూడు రోజులుగా ఉధృతంగా నిరసనలు చేస్తున్నారు. వివాహితపై స్థానిక నేత ఒకరు అత్యాచారానికి దిగడం, అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో లీక్ చేయడమే ఇందుకు ప్రధాన కారణం. కుమిల్లా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లోకి చొరబడిన ఫజోర్ అలీ అనే వ్యక్తి.. హిందూ మతానికి చెందిన ఓ వివాహితను బెదిరించి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా ఆ ఘోరాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో వదిలాడు. ఈ వీడియో వైరల్ కావడంతో హిందూ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఢాకా యూనివర్సిటీ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా పిర్యాదును వెనక్కి తీసుకోవాలని బాధితురాలిపై ఒత్తిడి పెరుగుతోందన్న మీడియా కథనాల నేపథ్యంలో.. ఈ ఆందోళనలు మరింత ఉదృతంగా మారాయి. అయితే ప్రజలు మాత్రం బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని చెబుతున్నప్పటికీ ఆందోళనలు చల్లారడం లేదు. Urgent protest march by Hindu students at Dhaka University after the horrific rape of a Hindu girl in Muradnagar, Comilla last night. The Islamist rapist must face justice and the harshest punishment. Silence is not an option! #StopHinduGenocideInBangladesh #JusticeForHindus pic.twitter.com/yAaGGkm82f— Voice of Bangladeshi Hindus 🇧🇩 (@VHindus71) June 29, 2025ఏం జరిగిందంటే..బాధితురాలు(21) వివాహిత. ఆమె భర్త దుబాయ్లో పని చేస్తుంటాడు. హరిసేవా పండుగ కోసం ఆమె తన పిల్లలను తీసుకుని కుమిల్లా జిల్లా మురాద్నగర్ ఉపజిల్లా రామ్చంద్రాపూర్ పాచ్కిట్ట గ్రామంలోని తన పుట్టింటికి వెళ్లింది. రాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడిన ఫజోర్ అలీ.. కత్తి చూపించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను హింసిస్తూ ఆ ఘోరాన్ని తన ఫోన్లో బంధించాడు. జూన్ 26వ తేదీ.. ఈ ఘోరం జరిగింది. జూన్ 27వ తేదీ.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. విచారణలో నిందితుడు ఫజోర్ అలీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) నేతగా నిర్ధారణ అయ్యింది. దీంతో రాజకీయ దుమారం రేగింది. జూన్ 28వ తేదీ.. సోషల్ మీడియాలో లైంగిక దాడికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. దీంతో హిందూ సంఘాలు భగ్గుమన్నాయి.జూన్ 29 వేకువఝామున.. ప్రధాన నిందితుడు ఫజోర్ అలీని ఢాకాలోని సయేదాబాద్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. మిగిలిన నలుగురిని బాధితురాలి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు అరెస్ట్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ మైనారిటీ సంఘాలు, ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళకు దిగారు. జూన్ 30.. బాధితురాలిని కేసు వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిళ్లు వస్తున్నాయని అక్కడి మీడియా సంస్థల్లో వరుస కథనాలు.. దీంతో తమ ఆందోళనను ఉధృతం చేశాయి హిందూ సంఘాలుమరోవైపు.. కుమిల్లా వివాహిత అత్యాచార కేసుకు సంబంధించిన తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది అత్యాచారం కాదని వివాహేతర సంబంధ వ్యవహారమని.. బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడిందని.. బాధితురాలికి సంబంధించిన వీడియోలు అంటూ ఫేక్ పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో పలు ఫ్యాక్ట్చెక్ వెబ్సైట్ల అక్కడి అధికారులను సంప్రదించి అవి ఫేక్న్యూస్గా తేల్చేస్తున్నాయి. కిందటి ఏడాది మొదలై.. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ హిందూ సంఘాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టడం గత ఏడాది కాలంగా జరుగుతోంది. 2024 డిసెంబరులో, ఢిల్లీ, లఖ్నవూ, జైపూర్, నాగ్పూర్ వంటి నగరాల్లో హిందూ సంస్థలు నిరసన ర్యాలీలు నిర్వహించాయి. నిరసనకారులు “బంగ్లాదేశ్లో హిందువుల నరమేధాన్ని ఆపాలి” అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.బంగ్లాదేశ్లో 2024 ఆగస్టు నుండి అక్టోబరు మధ్య 88 మతపరమైన హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని అక్కడి తాత్కాలిక ప్రభుత్వమే అంగీకరించింది. వీటిలో ఎక్కువగా హిందువులపై దాడులే ఉన్నాయని పేర్కొంది కూడా. ఈ నేపథ్యంతో.. ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీన థాయ్లాండ్ బ్యాంకాక్ వేదికగా జరిగినబిమ్స్టెక్ (BIMSTEC) శిఖరాగ్ర సమావేశంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్తో భారత ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఆ సమయంలో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పడాలంటే.. బంగ్లాదేశ్ తీరు మారాల్సిందేనని ప్రధాని మోదీ చెప్పినట్లు తెలుస్తోంది. -
900 గంటలు, 180 బటన్స్ : ఆమె స్పెషల్ వెడ్డింగ్ గౌను విశేషాలు
లేటు వయసులో లేటెస్ట్గా అంటూ లవ్ బర్డ్స్ అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్,లారెన్ సాంచెజ్ (Lauren Sanchez and Jeff Bezos) వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఇటలీలోని వెనిస్లో శనివారం రాత్రి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, రాజకీయ , వినోద రంగాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరైనారు. ఈ సందర్భంగా 55 ఏళ్ల వధువు వెడ్డింగ్ గౌన్ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది.మాజీ టీవీ యాంకర్ , పైలట్ లారెన్ సాంచెజ్, డోల్స్ & గబ్బానా ఆల్టా మోడా రూపొందించిన గౌనులో మెరిసింది. ఈ పెళ్లి గౌను తయారీకి 900 గంటలు పట్టిందట. అలాగే చేతితో తయారు చేసిన ఇటాలియన్ లేస్,180 సిల్క్ చిఫ్ఫోన్-కవర్డ్ బటన్లుకూడా ఉన్నాయట. హౌస్బోట్ చిత్రంలో నటి సోఫియా లోరెన్ ధరించిన 1950ల నాటి లుక్ ప్రేరణగా దీని డిజైన్ రూపొందించారు. దీని ధర దాదాపు 12 కోట్లు అని అంతర్జాతీయ మీడియా నివేదించింది. అన్నట్టు ఈ గౌను తయారీ వెనుక పెద్ద కథే ఉందట. View this post on Instagram A post shared by Lauren Sánchez Bezos (@laurensanchezbezos)వోగ్ కథనం ప్రకారం ఏప్రిల్లో, సాంచెజ్ బెజోస్ స్థాపించిన బ్లూ ఆరిజిన్స్ స్పేస్ ఫ్లైట్ కంపెనీలో అంతరిక్ష అంచుకు వెళ్లింది. ఈ అనుభవం తనను అనేక విధాలుగా మార్చిందని, అదే తన జీవితంలో మధురమైన క్షణాల సమయంలో ఎలా కనిపించాలో నిర్ణయం తీసుకునేలా చేసిందని తెలిపింది. అంతకుముందు తాను స్ట్రాప్లెస్ డ్రెస్ ధరించాలని ఊహించుకున్నానని సాంచెజ్ చెప్పింది. కాలాతీతంగా, అర్థవంతంగా తన డ్రెస్ ఉండాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. అలాగే తన పెళ్లి రోజున తన గ్లామ్ ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది, ఇది గౌను కాదు, కవితా భాగం, మీ మ్యాజిక్కు ధన్యవాదాలు అంటూ మేకర్స్కు ధన్యవాదాలు తెలిపింది.తానేంటో, తన స్టోరీ ఏంటో తెలియజేయాలనే కోరికతోపాటు, 11 నిమిషాలు తన అంతరిక్ష యాత్రకు ప్రత్యేక జ్ఞాపకంగా కొంచెం నీలిరంగులో,ముఖ్యంగా పెళ్లి కూతుళ్లు అదృష్టంగా భావించే వివాహ సంప్రదాయాన్ని జోడించేలా ఈ స్పెషల్ వెడ్డింగ్ గౌన్ను ఎంచుకున్నట్టు వెల్లడించింది. అంతేకాదు ఈ డ్రెస్ను ముందే చూడాలిన జెఫ్ బెజోస్ చాలా వేడుకున్నాడట. కానీ బిగ్ సర్ప్రైజ్గా ఉండాలని లారెన్ సాంచెజ్ దీనికి సున్నితంగా తిరస్కరించిందిట. కాగా 2019నుంచి డేటింగ్లో ఉన్న లారెన్ శాంచెజ్ జెఫ్ బెజోస్, గత ఏడాది నిశ్చితార్థం చేసుకున్నారు. జూన్ 27న పెళ్లి చేసుకున్నారు. View this post on Instagram A post shared by Vogue (@voguemagazine) -
భారత్-పాక్ సరిహద్దుల్లో కలకలం.. ఆ కుళ్లిన మృతదేహాలు ఎవరివి?
జైసల్మేర్: రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలోని భారత్-పాక్ సరిహద్దుల్లో పాక్షికంగా కుళ్లిపోయిన స్థితిలో రెండు మృతదేహాలు కనిపించాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆ మృతదేహాలు ఒక మైనర్ బాలిక, మరో యువకునివిగా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలంలో లభ్యమైన పాకిస్తాన్ సిమ్ కార్డ్, ఐడీలు, మొబైల్ ఫోన్, వాటర్ బాటిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.వాకి మరణానికి డీహైడ్రేషన్ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వారు చట్టవిరుద్ధంగా భారతదేశంలోకి ప్రవేశించారా లేదా అనేదానిని అధికారులు నిర్ధారించాల్సి ఉంది. అంతర్జాతీయ సరిహద్దు నుండి భారత భూభాగంలో 12 కిలోమీటర్ల దూరంలోని సాధేవాలా ప్రాంతంలో ఈ మృతదేహాలను గుర్తించినట్లు జైసల్మేర్ ఎస్పీ సుధీర్ చౌదరి తెలిపారు. మృతులను రవి కుమార్ (17), శాంతి బాయి (15)గా గుర్తించామన్నారు.వారి దగ్గర లభ్యమైన ఐడీలు 2023లో జారీ అయ్యాయని ఎస్పీ తెలిపారు. రవి కుమార్ పేరుతో పాకిస్తానీ సిమ్ కార్డు, గుర్తింపు కార్డు కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిద్దరూ దాదాపు వారం రోజుల క్రితం మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను రామ్గఢ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మార్చురీకి పోలీసులు తరలించారు. పోస్ట్మార్టం పరీక్ష తర్వాత వాకి మృతికి కారణమేమిటనేది వెల్లడి కానున్నదని పోలీసులు పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: సీసీటీవీ సాక్షిగా భార్యాభర్తల గొడవ, ఆ మర్నాడే.. -
ట్రంప్, నెతన్యాహులపై ఇరాన్ ఫత్వా.. ప్రపంచవ్యాప్త పిలుపు
టెహ్రాన్: ఇరాన్లోని అణుకేంద్రాలపై ఇజ్రాయెల్, అమెరికా దాడుల దరిమిలా ఆ దేశాలపై ఇరాన్ గుర్రుగా ఉంది. ఈ నేపధ్యంలో తాజాగా ఇరాన్కు చెందిన షియా మత పెద్ద గ్రాండ్ అయతోల్లా నాసర్ మకరెం షిరాజీ... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులపై ‘ఫత్వా’ జారీచేశారు. వారిని దేవుని శత్రువులుగా అభివర్ణించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వంపై బెదిరింపులకు దిగుతున్న అమెరికన్, ఇజ్రాయెల్ నేతల సామ్రాజ్యాలను కూలదోయాలని మకరెం షిరాజీ ఒక ఉత్తర్వులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు పిలుపునిచ్చారు. BREAKING: Iranian Grand Ayatollah Issues FATWA Against President Trump, Seen as Call for Global TerrorIran’s top Shiite cleric, Grand Ayatollah Naser Makarem Shirazi, has just issued a religious fatwa against President Donald Trump and Israeli Prime Minister Benjamin Netanyahu,… pic.twitter.com/Ud6BWKvL9a— Simon Ateba (@simonateba) June 30, 2025ఇరాన్ నేతలను బెదిరించే ఏ వ్యక్తి నైనా యుద్ధ నేతగా పరిగణిస్తారని మకరెం తన తీర్పులో పేర్కొన్నట్లు మెహర్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. మొహరేబ్ అంటే దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేసే వ్యక్తి. ఇరానియన్ చట్టం ప్రకారం, మొహరేబ్గా గుర్తించినవారికి ఉరిశిక్ష, శిలువ వేయడం, అవయవాలను విచ్ఛేదనం చేయడం లేదా బహిష్కరించడం లాంటివి చేస్తారని ఫాక్స్ న్యూస్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలంతా.. ఈ శత్రువులు మాట్లాడిన మాటలు, చేసిన తప్పులకు పశ్చాత్తాపపడేలా చేయడం అవసరమని ఆ ఫత్వాలో పేర్కొన్నారు. జూన్ 13న ఇరాన్లో ఇజ్రాయెల్ బాంబు దాడులను ప్రారంభించింది. 12 రోజులపాటు సాగిన ఈ యుద్ధం అనంతరం ఈ మతపరమైన ఆదేశం వెలువడింది. ఇరాన్లోని మూడు అణు కేంద్రాలపై దాడి చేసేందుకు అమెరికా.. ఇజ్రాయెల్ దళాలతో చేరిన దరిమిలా ఈ యుద్ధం ముగిసింది.ఇది కూడా చదవండి: ‘అచ్చం వెన్నలా..’.. ‘ఫోర్డో’దాడులపై ట్రంప్.. -
శ్రీలంక నేవీ అదుపులో మన జాలర్లు
కొలంబో: శ్రీలంక నావికా దళం ఆదివారం ఎనిమిది మంది భారతీయ మత్స్యకారులను అరెస్ట్ చేయడంతోపాటు, వారి ట్రాలర్లను స్వాధీనం చేసుకుంది. మన్నార్కు ఉత్తర ప్రాంతంలో ఆదివారం ఉదయం తమ ప్రాదేశిక జలాల్లో అక్రమంగా చేపలు పడుతున్న భారతీయ మత్స్యకారులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు శ్రీలంక నేవీ తెలిపింది. భారత్, శ్రీలంకల నడుమ సంబంధాల్లో మత్స్యకారుల సమస్య వివాదాస్పదమైంది.శ్రీలంక నేవీ పాక్ జలసంధిలో భారత మత్స్యకారులపై కాల్పులు జరపడం, తమ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారని అరెస్ట్లు చేయడం, వారి పడవలను స్వాధీనం చేసుకోవడం తరచూ జరుగుతున్నాయి. -
అణుహత్యలు!
ఇరాన్ అణు బలాన్ని దెబ్బతీసే లక్ష్యంతో జూన్ 13న ఇజ్రాయెల్ ప్రారంభించిన ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’, కనీసం 14 మంది అణు శాస్త్రవేత్తలను హతమార్చింది. ఇరాన్ అణు సిద్ధాంత భౌతిక శాస్త్రవేత్త, ‘ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీ’ అధిపతి అయిన మొహమ్మద్ మెహదీ టెహ్రాన్చి, ఆ దేశ అణుశక్తి సంస్థ మాజీ అధిపతి ఫెరేడౌన్ అబ్బాసి–దవానీ వంటి ప్రముఖులు కూడా మరణించినవారిలో ఉన్నారు. ఇజ్రాయెల్ కానీ, మరో దేశంగానీ ఎందుకిలా అణు శాస్త్రవేత్తల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంటాయి?! – సాక్షి, స్పెషల్ డెస్క్యుద్ధం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు నేరుగా సైనికులతోనూ పోరాడరు. ఆయుధాలకు ఆయువుపట్టులా ఉన్న శాస్త్రవేత్తలనూ లక్ష్యంగా చేసుకుంటారు. ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంలో ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అణు స్థావరాల కంటే ముందు, అణు శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఉండే వ్యూహం ఒకటే. కీలకమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను నిర్మూలించటం ద్వారా అణు కార్యక్రమాలను ముందుకు సాగకుండా నిలువరింపజేయటం, సంస్థాగతమైన ఆయువు పట్టును పూర్తిగా దెబ్బతీయడం. ఇరాన్ విషయంలో ఇప్పుడు ఇదే జరిగింది. 2020లో ఇరాన్ అణు సూత్రధారి మొహ్సేన్ ఫక్రిజాదేను చంపడం వెనుక ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ పన్నిన వ్యూహ లక్ష్యం కూడా సరిగ్గా ఇటువంటిదే.ఇప్పటి వరకు 100 హత్యలుఅణు శాస్త్రవేత్తలను ప్రధాన లక్ష్యంగా చేసుకుని దాడులు చేయటం అన్నది ‘అణు’యుగం ప్రారంభం నుంచీ ఉన్నదే. 1944 నుంచి 2025 వరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 మంది శాస్త్రవేత్తలు శత్రుదేశాల దాడుల్లో హతమయ్యారు. అయితే ఈసారి ఇజ్రాయెల్, మునుపటి రహస్య కార్యకలాపాల మాదిరిగా కాకుండా, బహిరంగంగానే ఇరాన్ శాస్త్రవేత్తల్ని హతమార్చింది. ఇరాన్ అణు మౌలిక సదుపాయాలు, వాయుసేన రక్షణ వ్యవస్థలు, ఇంధన వనరులపైన కూడా చెప్పి మరీ ప్రత్యక్ష దాడులు జరిపింది.నాలుగు ‘హంతక’ దేశాలుచరిత్రలో పొందుపరిచి ఉన్న వివరాలను బట్టి చూస్తే ప్రపంచంలో ప్రధానంగా నాలుగు దేశాలు తమ శత్రు దేశాలకు చెందిన తొమ్మిది వేర్వేరు అణు కార్యక్రమాలపై పనిచేస్తున్న శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ నాలుగు దేశాలలో మొదటి వరుసలో ఇజ్రాయెల్, అమెరికా; రెండో వరుసలో బ్రిటన్, సోవియెట్ యూనియన్ ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్, ఇరాక్, ఈజిప్ట్ల కోసం పనిచేస్తున్న శాస్త్రవేత్తల్ని ఆ నాలుగు దేశాలు లక్ష్యంగా చేసుకున్నాయి. తాజా ఇజ్రాయెల్ దాడులకు ముందు వరకు 2007 నుంచి 10 మంది ఇరాన్ అణు శాస్త్రవేత్తలు హత్యకు గురయ్యారు. శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకోవడం అన్నది సంబంధిత దేశంలోని శాస్త్రవేత్తలకే పరిమితం కాలేదు. ఉదాహరణకు, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ‘మోసాద్’ 1980 లో ఇటలీ ఇంజనీరు మారియో ఫియోరెల్లి ఇంటిపై బాంబు దాడి చేసి, ఇరాక్ అణు స్థావరాలకు కోసం పని చేస్తున్న ఐరోపా సంస్థలను పరోక్షంగా హెచ్చరించింది. ఏఐతో చంపేశారుశాస్త్రవేత్తలను ‘మట్టుపెట్టటం’లో మునుపటి విధానాలు మారిపోయాయి. గతంలో వ్యక్తులపై నేరుగా కాల్పులు, లేదంటే బాంబు దాడులు చేసేవారు. ఆ పద్ధతులే ఇప్పుడు మరింత అధునాతనంగా మారాయి. ఉదాహరణకు, తాజా ఆపరేషన్ లో మరణించిన ఫెరేడౌన్ అబ్బాసి గతంలో 2010 కారు బాంబు దాడి నుండి బయటపడిన వారే. ఇరాన్ కు చెందిన సుప్రసిద్ధ అణుశాస్త్రవేత్త ఫక్రిజాదే హత్య అప్పట్లో ఓ సంచలనం. అతడి కదలికలపై ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్ 2019 నుంచీ నిఘా వేసింది. 2020లో అతడి హత్య కోసం.. ఇప్పటి పరిభాషలో చెప్పాలంటే ఏఐను ఉపయోగించింది. ఒక టన్ను బరువు ఉండే రిమోట్ కంట్రోల్డ్ మెషీన్ గన్ ఇందుకోసం వాడారు. అత్యంత రహస్యంగా ఆ గన్ విడి భాగాలను ఇరాన్ లోకి తీసుకొచ్చారు. వాటిని ఒకచోట అమర్చి, ఫక్రిజాదే ప్రయాణిస్తున్న దారిలో ఒక పాడుబడిన వాహనంలో ఉంచారు. అతడు భార్యతో సహా ప్రయాణిస్తుంటే.. కేవలం ఒక్కడికే గురిపెట్టారు. మొత్తం 15 బుల్లెట్లను కేవలం నిమిషం వ్యవధిలో ప్రయోగించారు. కారులో అతడి పక్కనున్న భార్యకు ఏమీ కాలేదట. హత్య జరిగిన మరుక్షణమే మెషీన్ గన్ ఉంచిన వాహనం కూడా పేలిపోయి, అందులో ఎలాంటి ఆనవాలూ లభించలేదట. ఈ మొత్తం ఆపరేషన్ ను ఇరాన్ వెలుపల ఒక కమాండ్ సెంటర్ నుంచి నిర్వహించడం విశేషం.చెప్పి చేయటం మొదలైంది!సైనిక చర్యలతో పాటు, దౌత్యం, ఆంక్షలు, సైబర్ దాడులు, నిఘా కార్యకలాపాలు అన్నవి విస్తృతమైన అణ్వస్త్రవ్యాప్తి నిరోధక వ్యూహంలో భాగంగా ఉంటాయి. అయితే ప్రధానంగా శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఉన్న కారణం ఏమిటంటే – దౌత్యపరమైన ప్రయత్నాలన్నిటినీ జాప్యం అయ్యేలా చేయటం, తద్వారా అణ్వస్త్రాల తయారీ ఖర్చులు పెరిగేలా చేయటం, అలాంటి కార్యక్రమాలకు ఇతరులకు సహకరించకుండా నిరోధించడం. ఎంత ప్రభావం ఉంటుంది?శాస్త్రవేత్తలను హతమార్చటం అన్నది బలమైన సందేశాన్ని పంపుతుందని, శత్రువు దూకుడును తగ్గిస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఇజ్రాయెల్ సైన్యం ఇటీవలి తన దాడులను ‘సామూహిక విధ్వంసక ఆయుధాలను సమకూర్చుకునే సామర్థ్యానికి గట్టి దెబ్బ’గా అభివర్ణించింది. అయితే, ఇరాన్ అణు కార్యక్రమంలో వేలాది మంది శాస్త్రవేత్తలు పాల్గొంటూ ఉండొచ్చనే మాట ఎప్పటి నుంచో వినిపిస్తూ ఉన్నదే. ఒకరిద్దరు శాస్త్రవేత్తలను హతమార్చటం వల్ల అణ్వస్త్ర దేశ గమనం పెద్దగా మారకపోవచ్చు. పైగా ఇటువంటి హత్యలు నైతికమైన, చట్టపరమైన, మానవతాపరమైన ఆందోళనలను పెంచుతాయి. శాస్త్రవేత్తల హత్యలు వారిని అమరవీరుల స్థాయికి పెంచే అవకాశం ఉండటంతో అణు అభివృద్ధికి ప్రజల మద్దతు లభించవచ్చు కూడా. -
అమెరికా.. మమ్మల్ని ఆదుకోండి: జెలెన్ స్కీ వేడుకోలు
రష్యా-ఉక్రెయిన్ యద్దాన్ని ఆపేశానని ఇది వరకే బడాయి కబుర్లు చెప్పిన అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా ఉక్రెయిన్పై రష్యా చేసిన అతిపెద్ద దాడిపై ఏం చెబుతారు?, ఇదే మాటను ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆవేదనతో కూడిన స్వరంతో ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం రష్యా డాడులకు తట్టుకోలేని స్థితిలో ఉన్నామని, ఈ సమయంలో అమెరికా తమకు తక్షణ రక్షణ సాయం చేయాలని వేడుకుంటున్నారు. అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు కూడా తమ అండగా నిలబడి, రష్యాను ఎదుర్కోనేందుకు సాయం చేయాలని జెలెన్ స్కీ సుదీర్ఘమైన ఉద్వేగభరిత పోస్ట్ పెట్టారు. ‘మాకు రక్షణ కావాలి. అది కూడా తక్షణమే కావాలి. రష్యా మా దేశంలోని ప్రతీదాన్ని టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోంది. ప్రస్తుతం మేము జీవన పోరాటం చేస్తున్నాం. స్మిలాలోని నివాసిత ప్రాంతంలో కూడా రష్యా భీకరమైన దాడులు చేసింది. మా ఎఫ్-16 పైలట్ రష్యా దాడుల్లో చనిపోయాడు. సుదీర్ఘకాలంగా రష్యా చేస్తున్న యుద్ధం ఆపేలా కనిపించడం లేదు. వారికి భీకర దాడులు చేసే శక్తి సామర్థ్యాలు ఉండటంతో మాపై వరుస పెట్టి దాడుల చేస్తూ వస్తోంది. ఈ వారంలోనే 114 మిస్సెళ్లను, 1270 డ్రోన్లతో దాడి చేయడంతో పాటు 1,100 పైగా బాంబులు విసిరింది. ప్రపంచం శాంతి కోసం పిలుపునిచ్చినప్పటికీ, చాలా కాలం క్రితమే యుద్ధం చేస్తూనే ఉండాలని పుతిన్ నిర్ణయించుకున్నాడు. ఇది పుతిన్ వైఖరిని స్పష్టం చేస్తంది. ఈ యుద్ధాన్ని ముగించాలి. దురాక్రమణదారుడిపై ఒత్తిడి అవసరం, అలాగే మాకు రక్షణ కూడా అవసరం. అమెరికాతో పాటు యూరప్ దేశాలు, మిగతా భాగస్వాముల మాకు అండంగా ఉండండి. ఇప్పటివరకూ మాకు సాయంగా ఉన్నవారందరికీ ధన్యవాదాలు’ అని జెలెన్ స్కీ తన పోస్ట్లో పేర్కొన్నాడు. ఇక తాము అమెరికా డిఫెన్స్ సిస్టమ్ను కూడా కొనుగోలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తమ పరిస్థితిని చెప్పుకొచ్చారు జెలెన్ స్కీ.Almost all night long, air raid alerts sounded across Ukraine — 477 drones were in our skies, most of them Russian-Iranian Shaheds, along with 60 missiles of various types. The Russians were targeting everything that sustains life. A residential building in Smila was also hit,… pic.twitter.com/1ExZhYAMBg— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) June 29, 2025 రష్యా-ఉక్రెయిన్ వార్ చరిత్రలోనే.. అతి పెద్ద దాడి ఇదే -
పెళ్లి కోసం అమెరికా వెళ్లి.. భారతీయ యువతి మిస్సింగ్
పెళ్లి కోసం అమెరికా వెళ్లిన భారతీయ మహిళ అదృశ్యమైంది. అమెరికా పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భారత్కు చెందిన 24 ఏళ్ల సిమ్రాన్ అనే యువతి జూన్ 20న అమెరికాకు చేరుకోగా, పెద్దలు కుదిర్చిన పెళ్లి కోసం అమెరికాకు వచ్చినట్లు అధికారులకు చెప్పింది. అమెరికా వచ్చిన కొన్ని రోజులకే సిమ్రాన్ అదృశ్యమైనట్లు న్యూజెర్సీ అధికారులు వెల్లడించారు.జూన్ 25న ఆమె చివరిసారి కనిపించిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు.. ఆమె ఫోన్ చూస్తూ ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టు కనిపించింది. ఆమెలో ఎలాంటి ఆందోళన కనిపించలేదని తెలిపారు. మరోవైపు, ఆమె అమెరికాకు వచ్చింది.. పెళ్లి కోసమా, లేక వేరే ఉద్దేశ్యమా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె చివరిసారిగా గ్రే స్వెట్ప్యాంట్స్, వైట్ టీ షర్ట్, బ్లాక్ ఫ్లిప్ఫ్లాప్స్ ధరించి, చిన్న డైమండ్ ఇయరింగ్స్ పెట్టుకుని కనిపించింది. ఆ యువతి వాడుతున్న ఫోన్ కేవలం వైఫై ద్వారా మాత్రమే పని చేయడంతో పోలీసులు ఆమెను ట్రేస్ చేయలేకపోతున్నారు.సిమ్రాన్ ఇంగ్లీష్ మాట్లాడలేదని, అమెరికాలో ఆమెకు బంధువులు కూడా ఎవరూ లేరని పోలీసులు తెలిపారు. భారత్లోని ఆమె బంధువులను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదన్నారు. సిమ్రాన్ రూపు రేఖలు, మిస్సింగ్కు ముందు ఆమె ధరించిన దుస్తులు, ఇతర వివరాలను వెల్లడించారు. ఆమె ఆచూకీ గురించి ఎవరికైనా తెలిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. -
రష్యా-ఉక్రెయిన్ వార్ చరిత్రలోనే.. అతి పెద్ద దాడి ఇదే
శనివారం రాత్రి రష్యా 477 డ్రోన్లు, 60 క్షిపణులతో ఉక్రెయిన్పై రష్యా దాడి చేసింది. యుద్ధం మొదలైన నాటి నుంచి జరిగిన అతిపెద్ద దాడి ఇదేనంటూ ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. వీటిల్లో 249ని కూల్చేశామని.. మరో 226 ఎలక్ట్రానిక్ జామింగ్ వ్యవస్థల ప్రభావంతో కూలిపోయాయని.. గత రాత్రి అతిపెద్ద దాడే జరిగిందంటూ ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడి చేసినట్లు అధికారులు వివరించారు. ఈ దాడిలో ఉక్రెయిన్కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానం కూలిపోయిందని.. ఒక పైలట్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం రష్యా ఆరు గంటలకు పైగా దాడులు చేసింది. దేశ వ్యాప్తంగా కీలకమైన మౌలిక సదుపాయాలు దెబ్బతీన్నాయని అధికారులు పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య 2022 దాడులు కొనసాగుతున్నాయి. 36 నెలలు గడిచినా ఆగని రష్యా, ఉక్రెయిన్ పోరు ఆగడం లేదు.రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్లో వెలుగుచూసిన అతిపెద్ద వైరం ఇదే. వాస్తవానికి తాజా యుద్ధానికి పునాదులు పదేళ్ల క్రితమే పడ్డాయి. 2014లో ఉక్రెయిన్లోని క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ఉన్నపళంగా ఆక్రమించుకుంది. ఆనాటి నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. ఆ తర్వాత 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఉక్రెయిన్ పైకి రష్యా దండయాత్ర మొదలెట్టింది. వందల కొద్దీ చిన్నపాటి క్షిపణులు ప్రయోగిస్తూ వేలాది సైనికులను కదనరంగంలోకి దింపింది.తొలి రోజుల్లో రాజధాని కీవ్దాకా దూసుకొచ్చి భీకర దాడులు చేసిన రష్యా ఆ తర్వాత ఆక్రమణ వేగాన్ని అనూహ్యంగా తగ్గించింది. ఉక్రెయిన్ వైపు నుంచి ప్రతిఘటన కూడా దీనికి ఒక కారణం. ఉక్రెయిన్ తొలినాళ్లలో యుద్ధంలో తడబడినా ఆ తర్వాత అగ్రరాజ్యం, యూరప్ దేశాల ఆర్థిక, ఆయుధ, నిఘా బలంతో చెలరేగిపోయింది. ధాటిగా దాడులు చేస్తూ పుతిన్ పటాలానికి ముచ్చెమటలు పట్టించింది. దీంతో మరింత శక్తివంతమైన ఆయుధాలను రష్యా బయటకుతీయక తప్పలేదు.ఇదీ చదవండి: Russia-Ukraine war: యుద్ధం @ మూడేళ్లు -
కిరికిరి మొదటికి వచ్చింది .. మరోసారి బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై మస్క్ విమర్శలు
వాషింగ్టన్: అపరకుబేరుడు ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ల మధ్య వివాదం మళ్లీ మొదటికొచ్చింది. ఈ ఏడాది ట్రంప్ ప్రవేశపెట్టిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’పై ఎలాన్ మస్క్ తాజాగా మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ బిల్లును అమలు చేసేలా దిశగా దాదాపు చర్చకు సిద్ధమవుతోంది. ఇందుకోసం 1,000 పేజీల ప్రతిపాదనను సిద్దం చేసింది. ఈ తరుణంలో.. ఆ బిల్లు అవివేకం, విధ్వంసకరం’ అని మస్క్ అభివర్ణించారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా మస్క్ ట్వీట్ చేశారు. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ను చట్టం చేసే ప్రయత్నంలో ‘బిల్లు డ్రాఫ్ట్’ను అమెరికా ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ క్రమంలో బిల్లు డ్రాఫ్ట్ను మస్క్ తప్పుబట్టారు. తాజా సెనేట్ డ్రాఫ్ట్ బిల్లు మిలియన్ల మంది ఉద్యోగాలకు ఎసరు పెడుతోంది. దేశానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. అధికార రపబ్లికన్ పార్టీ లీడర్లకు ఇదే నా హెచ్చరిక. బిల్లు చట్టంగా మారిస్తే విధ్వంసం సృష్టించినట్లే. అంతేకాదు, చట్టం అమలైతే ఇప్పటికే స్థాపించిన పరిశ్రమలు, ప్రారంభించబోయే పరిశ్రమలకు రానున్న రోజుల్లో అపార నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే పేర్కొన్నారు. ఇంతకుముందు కూడా హౌస్లో ప్రవేశపెట్టిన బిల్లును మస్క్ వ్యతిరేకించారు. ఆబిల్లుకు ఆమోదం లభించడంతో టెస్లా విలువ భారీగా పతనమైంది. నాటి నుంచి గత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ల మధ్య వైరం మొదలైంది. దుబారా ఖర్చుల్ని తగ్గించేందుకు అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (doge) సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వరుసగా ట్రంప్ తీరును బహిరంగంగా ఎండగడుతూ వచ్చారు. ఒకానొక దశలో నేను ప్రచారం చేయకపోతే రిపబ్లికన్ అధికారంలోకి వచ్చేదే కాదు. ఆ పార్టీ నేతలు 50కే పరిమితమయ్యేదని వ్యాఖ్యానించారు. ఎప్సిటీన్ ఫైళ్లలో ట్రంప్ ఉన్నారంటూ బాంబు పేల్చారు. అందుకే ఎప్సిటీన్ ఫైళ్లను బహిర్గతం చేయటం లేదంటూ ట్రంప్పై సంచలన ఆరోపణలు చేశారు. The latest Senate draft bill will destroy millions of jobs in America and cause immense strategic harm to our country!Utterly insane and destructive. It gives handouts to industries of the past while severely damaging industries of the future. https://t.co/TZ9w1g7zHF— Elon Musk (@elonmusk) June 28, 2025ట్రంప్ సైతం మస్క్ను అదే స్థాయిలో ప్రతి విమర్శలు చేశారు. మస్క్ తీరు ఇలాగే కొనసాగితే మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు, రాయితీలకు కోత వేస్తానని హెచ్చరించారు. ఈ క్రమంలో ఉన్నట్లుండి ఏమైందో ఏమో.. తాను చేసిన వ్యాఖ్యలకు ట్రంప్ మస్క్ క్షమాపణలు చెప్పారు. అనూహ్యంగా మళ్లీ బిగ్ బ్యూటిఫుల్ బిల్ను వ్యతిరేకిస్తూ కామెంట్లు పెట్టారు. మరి ఈ కామెంట్లకు ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. -
భారత్పై పాక్ ఆర్మీ చీఫ్ అనుచిత వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసీం మునీర్ మరోసారి భారత్పై నోరుపారేసుకున్నారు. భారత్ ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచుతోంది అంటూ వింత వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో భారత్ గనుక మరోసారి పాకిస్తాన్పై దాడి చేస్తే.. తమ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నట్టు తెలిపారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.పాక్ ఆర్మీ చీఫ్ ఆసీం మునీర్ కరాచీలోని నేవల్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్బంగా మున్నీర్.. భారత్కు వ్యూహాత్మక ముందుచూపు కొరవడింది. ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది. ప్రాంతీయ స్థిరత్వాన్ని పాకిస్తాన్ కాపాడుతోంది. భారత్ దూకుడు వేళ పాక్ బలంగా స్పందించింది. ప్రాంతీయ శాంతిని దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ పరిపక్వంగా ఆలోచన చేసింది. పాక్ ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేసే స్థితిలో ఉంటే.. భారత్ ఉద్రిక్తతలు సృష్టిస్తోంది. మరోసారి పాకిస్తాన్పై దాడికి పాల్పడితే నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తాం’ అంటూ హెచ్చరించారు.మరోవైపు.. అంతకుముందు కూడా మునీర్.. భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. భారత్ నెట్వర్క్కు ఆప్ఘనిస్థాన్ వేదికగా మారిందన్నారు. అక్కడి వారితో పాకిస్తాన్పై దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. అలాగే, పాక్.. ఆప్ఘనిస్తాన్తో స్నేహ సంబంధాలను కోరుకుంటోంది. కానీ, ఆ దేశం భారత్ పోషిస్తున్న ఉగ్రవాదులకు వేదిక ఇవ్వకూడదని కోరుకుంటున్నా అంటూ పొంతనలేని వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ దాడులు పాకిస్తాన్కు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్కు కీలకమైన ఎయిర్బేస్లపై భారత్ విరుచుకుపడింది. దీంతో, ఎయిర్బేస్లు ధ్వంసమయ్యాయి. వీటిల్లో పాక్ సైనిక ప్రధాన కార్యాలయానికి సమీపంలోని నూర్ ఖాన్ ఎయిర్బేస్ కూడా ఉంది. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు దాదాపు 8 కీలక మిలిటరీ స్థావరాలు దెబ్బతిన్నాయి.Pakistan Failed Marshal Asim Munir once again rants & pokes India, reaffirms his support for the continued terrorism against India in Jammu and Kashmir.Also vowed continued political, moral, & diplomatic backing for proxy insurgency.#PakistanIsATerrorState #AsimMunir #Pakistan pic.twitter.com/6zHSA6gk8o— TIger NS (@TIgerNS3) June 29, 2025 -
భారత్పై పాక్ దుష్ప్రచారం.. ‘ఆర్మీ కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి మీ పనే’..
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఆత్మాహుతి దాడి 13మంది సైనికులు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటనను పాకిస్తాన్ భారత్ పైకి నెట్టేసింది. తమ దేశ సైనికుల మరణానికి భారత్ కారణమని ప్రచారం చేస్తోంది. అయితే, పాక్ ప్రచారాన్ని భారత్ ఖండించింది. పాక్ చేస్తున్న ప్రచారం ఆమోదయోగ్యం కాదంటూ ఆదివారం విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. జూన్ 28న పాక్ ఉత్తర వజీరిస్తాన్ జిల్లా ఖైబర్ పఖ్తున్ఖ్వాలో ఆర్మీ సైనికులు ప్రయాణిస్తున్న కాన్వాయ్ని ఓ అగంతకుడు పేలుడు పదార్థాలు నిండిన వాహనంతో ఢీ కొట్టారు. ఈ ఘటనలో 13మంది ఆర్మీ సైనికులు మరణించగా..10 మంది గాయాలయ్యాయి. 13 మంది సాధారణ పౌరులు గాయపడినట్లు ప్రముఖ పాక్ మీడియా సంస్థ డాన్ తెలిపింది. Statement regarding Pakistan 🔗 : https://t.co/oQyfQiDYpr pic.twitter.com/cZkiqY1ePu— Randhir Jaiswal (@MEAIndia) June 28, 2025 ఈ దాడి వెనక భారత్ ఉందంటూ పాకిస్తాన్ అధికారంగా చేసిన ప్రకటనను ఖండించింది. వజీరిస్తాన్లో పాక్ ఆర్మీ కాన్వాయ్పై జరిగిన ఆత్మాహుతి దాడిలో భారత్ ప్రమేయం ఉందని పాక్ అధికారికంగా ప్రకటన చేసింది. ఆ ప్రకటనను మేం ఖండిస్తున్నాం. ఆమోదయోగ్యం కాదని..విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. పాక్ మీడియా ఏమంటోంది దక్షిణ వజీరిస్తాన్లో నిఘా ఆధారిత ఆపరేషన్ (IBO)లో ఇద్దరు సైనికులు మరణించి, 11 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన కొద్ది రోజులకే ఈ దాడి జరిగిందని డాన్ పేర్కొంది. పలు నివేదికల ప్రకారం, 2021లో కాబూల్లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాలలో హింస గణనీయంగా పెరిగింది. తమ దేశంలో తమ గడ్డను ఉపయోగించుకొని దాడులకు తెగబడుతోందని తాలిబాన్ల ప్రభుత్వంపై పాక్ ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఆ ఆరోపణల్ని తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధులు ఖండించారు. కాగా,ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్తాన్ రెండింటిలోనూ ప్రభుత్వంతో పోరాడుతున్న సాయుధ గ్రూపులు ఈ సంవత్సరం ప్రారంభం నుండి జరిపిన దాడుల్లో దాదాపు 290 మంది మరణించారు. వారిలో ఎక్కువ మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
‘రోజంతా కోర్టులో కూర్చోబెడతారా’: నెతన్యాహు కేసుపై ట్రంప్ ఆగ్రహం
వాషింగ్టన్: ఇరాన్పై దాడుల అనంతరం అమెరికా ఇజ్రాయెల్ మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడింది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు మద్దతుగా నిలిచారు. అతనిపై వచ్చిన అవినీతి అరోపణలపై జరుగుతున్న విచారణ అర్థంలేనిదన్నారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్లో చేసిన ఒక పోస్ట్ లో ఇజ్రాయెల్ ప్రధానిపై చేస్తున్న ఆరోపణలు భయంకరమైనవిగా పేర్కొన్నారు.2019లో ఇజ్రాయెల్లో లంచం, మోసం, నమ్మక ద్రోహం ఆరోపణలతో తనపై మోపిన పలు అభియోగాలను ప్రధాని నెతన్యాహు ఖండించారు. ఈ అభియోగాలపై 2020లో విచారణ ప్రారంభమైంది. వీటిలో మూడు క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. కాగా ఈ అవినీతి కేసులో తాను సాక్ష్యం చెప్పడాన్ని వాయిదా వేయాలని నెతన్యాహు కోరగా, కోర్టు దానిని తిరస్కరించింది. ‘ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా జరుగుతున్న చర్య చాలా దారుణం. ఆయన ఒక యుద్ధ వీరుడు, ఇరాన్ నుంచి పొంచివున్న అణు ముప్పును తొలగించడంలో అమెరికాతో కలిసి పనిచేసిన ప్రధాని అని’ ట్రంప్ పేర్కొన్నారు.నెతన్యాహు ప్రస్తుతం హమాస్తో ఒప్పందంపై చర్చలు జరుపుతున్నారని, బందీలను తిరిగి తీసుకురావడంపై కూడా చర్చిస్తున్నారని ట్రంప్ పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయనను రోజంతా కోర్టు గదిలో కూర్చోబెట్టడం ఎలా సాధ్యమవుతుంది? అని ట్రంప్ ప్రశ్నించారు. ట్రంప్ దీనిని రాజకీయ వేటగా పేర్కొన్నారు. ఇది న్యాయం పేరుతో జరుగున్న అపహాస్యమని అన్నారు. ప్రధాని నెతన్యాహు నాయకత్వంలో తాము గొప్ప విజయాన్ని సాధించామని పేర్కొన్నారు. నెతన్యాహును 2024లో నటి స్టార్మీ డేనియల్స్కు డబ్బు చెల్లింపులకు సంబంధించిన కేసులో దోషిగా నిర్ధారించారు. వ్యాపార రికార్డులను తప్పుగా చూపించారనే ఆరోపణలను నెతన్యాహు ఎదుర్కొంటున్నారు.ఇది కూడా చదవండి: Shefali Death: యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ తీసుకున్నాక.. -
తనను తాను డెలివరీ చేసుకుంది!
కొత్త పుంతలు తొక్కుతున్న కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీకి సరికొత్త నిదర్శనం ఇది.. సైన్స్ ఫిక్షన్ సినిమాను పోలిన సన్నివేశం ఇది.. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన వస్తువు చిటికెలో డోర్ డెలివరీ అవుతున్నట్లుగా ఒక కొత్త టెస్లా కారు ఫ్యాక్టరీ నుంచి స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ కస్టమర్ ఇంటికి వచ్చేసింది! హైవేపై సాఫీగా మందుకు కదులుతూ.. మధ్యమధ్యలో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఆగుతూ.. గరిష్టంగా 115 కి.మీ. వేగంతో దూసుకెళ్తూ తన కొత్త ఓనర్ ఉన్న లొకేషన్కు భద్రంగా చేరుకుంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా కంపెనీ ప్రపంచంలోనే తొలిసారిగా ఏమాత్రం మానవ ప్రమేయం లేకుండా తమ కొత్త కారును నేరుగా వినియోగదారుడి చెంతకు చేర్చింది. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో నడిచే పూర్తిస్థాయి అటానమస్ కారు ‘మోడల్ వై’ను టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో ఉన్న ఫ్యాక్టరీ నుంచి అక్కడికి 30 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్న కస్టమర్ ఇంటికి పంపించింది. మార్గమధ్యలో ట్రాఫిక్ సిగ్నళ్లు, ఫ్లైఓవర్లు, హైవేలను దాటుకుంటూ కారు తన కొత్త యజమాని ఇంటికి చేరుకుంది. ఫ్యాక్టరీ నుంచి గమ్యస్థానం చేరుకొనే వరకు కారు సాగించిన ప్రయాణాన్ని అందులోని ‘డాష్ క్యామ్’రికార్డు చేసింది. ఇందుకు సంబంధించి టెస్లా విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. మరోవైపు తమ అటానమస్ కారు డెలివరీని ఎలాన్ మస్క్ ‘ఎక్స్’వేదికగా ప్రకటించారు. ‘తొలిసారి ఒక కారు యజమానికి తనను తాను డెలివరీ చేసుకుంది’అని పేర్కొన్నారు. నిర్ణీత గడువుకన్నా ఒక రోజు ముందే కారును డెలివరీ చేశామన్నారు. తనకు తెలిసినంత వరకు వాహనంలో వ్యక్తులెవరూ లేకుండా లేదా రిమోట్ ఆపరేటింగ్ లేకుండా ఒక పబ్లిక్ హైవేపై ప్రయాణించిన తొలి పూర్తిస్థాయి అటానమస్ కారు తమదేనన్నారు. ఈ విజయాన్ని సాధించినందుకు టెస్లా సాఫ్ట్వేర్, ఏఐ చిప్ డిజైన్ బృందాలను ఆయన అభినందించారు. మోడల్ వై కారు గంటకు గరిష్టంగా 115 కి.మీ. వేగంతో ప్రయాణించినట్లు టెస్లా ఏఐ, ఆటోపైలట్ విభాగం చీఫ్ అశోక్ ఎల్లుస్వామి వెల్లడించారు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
ఎగిరే ట్యాక్సీలు
పౌర విమానయాన చరిత్రలోనే తొలిసారిగా జూన్ 3న అమెరికాలో ‘అలియా సీఎక్స్300’ అనే విద్యుత్ విమానం ఐదుగురు ప్రయాణికులతో విజయవంతంగా గమ్యస్థానాన్ని చేరుకుని చరిత్ర సృష్టించింది. 130 కి.మీ. ప్రయాణానికి దీనికి పట్టిన సమయం 35 నిమిషాలు కాగా, ఇంధనానికి (విద్యుత్కు) అయిన ఖర్చు సుమారుగా రూ.700. అంత చౌకగా విమానయానాన్ని సాధ్యం చేయటంలో కొత్త శకానికి నాంది పలికిన ఈ విమానం.. మనదేశ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ అభివృద్ధి ప్రయత్నాలకూ పరోక్షంగా ప్రోత్సాహాన్నిచ్చింది. అత్యాధునిక విమాన రవాణా (ఏఏఎమ్)లో భాగంగా ఇప్పటికే కీలక చర్యలు చేపట్టిన మనదేశం వచ్చే ఏడాది నాటికి ఈ విమానాలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పనిచేస్తోంది.2023లో బెంగళూరులో జరిగిన ఒక అధ్యయనంలో.. ప్రైవేటు వాహనాలు వాడే ఉద్యోగుల్లో 57 శాతం, ప్రజా రవాణా ద్వారా ప్రయాణించే ఉద్యోగుల్లో 55 శాతం మంది కార్యాలయాలకు ఆలస్యంగా వస్తున్నారని తేలింది. ఆలస్యం కారణంగా ఏడాదిలో సుమారు 7 లక్షల పని గంటలు నష్టపోయారని అంచనా. 2023లో ట్రాఫిక్ రద్దీ కారణంగా కోల్పోయిన పని గంటల వల్ల ఒక్క బెంగళూరు నగరమే 200 బిలియన్ డాలర్లు నష్టపోయింది.పట్టణాల్లో ఇలాంటి సమస్యలు అధిగమించేందుకు తక్కువ వ్యవధిలో గమ్యానికి చేర్చే అత్యాధునిక విమాన రవాణా (ఏఏఎమ్) ఎంతో ఉపయోగపడుతుందని ‘స్కై వేస్ టు ద ఫ్యూచర్ – ఆపరేషనల్ కాన్సెప్ట్స్ ఫర్ అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ఇన్ ఇండియా’ నివేదికలో పేర్కొన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్, భారత పౌర విమానయాన మంత్రిత్వశాఖ కలిసి సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి.అంతర్జాతీయ సంస్థలతో కలిసి..మానవ రహిత ఎయిర్ ట్యాక్సీ, ఎయిర్ మొబిలిటీలో నూతన ఆవిష్కరణల కోసం.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), యూరోపియన్ యూనియన్ సేఫ్టీ ఏజెన్సీ (ఈఏఎస్ఏ) మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. అంతేకాకుండా, ఈ వ్యవస్థ నిర్వహణ కోసం అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ), అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వంటి వాటితోనూ మనదేశం కలిసి పనిచేస్తోంది. విద్యుత్ ఎయిర్ ట్యాక్సీలపై అధ్యయనం చేసేందుకు డీజీసీఏ 7 వర్కింగ్ గ్రూపులను ఏర్పాటుచేసిందని ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ గ్రూపులు దృష్టి సారిస్తున్న అంశాల్లో ప్రధానమైనది వెర్టిపోర్టులు (ఎయిర్ ట్యాక్సీల కోసం ప్రత్యేకించిన ఎయిర్పోర్టులు. సాధారణ హెలికాప్టర్ మాదిరిగానే ఎయిర్ ట్యాక్సీలు నిలువుగా టేకాఫ్ అవుతాయి. అదే విధంగా ల్యాండ్ అవుతాయి.). ఇంకా అటానమస్ డ్రోన్ల ట్రాఫిక్ వ్యవస్థ, ఎయిర్ ట్యాక్సీల నిర్వహణ, మరమ్మతులు, నియంత్రణ మార్గదర్శకాలు, సురక్షిత ప్రయాణానికి అవసరమైన మౌలిక వసతుల వంటి అంశాలపై ఈ గ్రూపులు పనిచేస్తున్నాయి.రెండు దశల్లో విస్తరణభారత్లో తొలి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ 2026 అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డీజీసీఏ ఏర్పాటు చేసిన కమిటీలు 2026 నాటికి ఎయిర్ ట్యాక్సీలను మొదట ఢిల్లీ–ఎన్ సీఆర్, ముంబై, బెంగళూరులలో ప్రారంభించి, తదుపరి దశలో చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలకు విస్తరింపజేసే దిశగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీల విధి విధానాలు ఖరారు అయ్యాక ఇండిగో మాతృసంస్థ అయిన ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ (ఐజీఇ), అమెరికా ఎయిర్ ట్యాక్సీ తయారీ కంపెనీ ‘ఆర్చర్ ఏవియేషన్’తో కలిసి ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనుందట. చార్జీలు ఎంత ఉండొచ్చు?ఎయిర్ ట్యాక్సీ చార్జీలు ప్రస్తుతం ఉన్న క్యాబ్ చార్జీల కంటే కాస్త మాత్రమే ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఉదాహరణకు ప్రస్తుతం క్యాబ్లో ఢిల్లీ నుండి గుర్గావ్కు ఒక మనిషికి రూ. 1,500–2,000 చార్జీ అవుతుండగా, దీనికి ఒకటిన్నర రెట్లు మాత్రమే ఎక్కువగా రూ. 2,000–3,000 వరకు ఎయిర్ ట్యాక్సీ చార్జీ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.ఏమని పిలవాలి?విద్యుత్ ఎయిర్ ట్యాక్సీని సాంకేతికంగా ‘ఎలక్ట్రిక్ వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్’ (ఇ.వి.టి.ఓ.ఎల్.) ఎయిర్క్రాఫ్ట్ అంటున్నారు. మొత్తంగా ఈ రవాణా వ్యవస్థని ‘అత్యాధునిక విమాన రవాణా (ఏఏఎమ్)’ అంటారు. – సాక్షి, స్పెషల్ డెస్క్పనిచేస్తున్న 2 సంస్థలుడీజీసీఏ రికార్డుల ప్రకారం ప్రస్తుత దేశంలో పౌర విమానయాన రంగంలో ఎయిర్ ట్యాక్సీల తయారీకోసం 2 సంస్థలు పనిచేస్తున్నాయని పార్లమెంటులో ప్రభుత్వం ప్రకటించింది. అవి చెన్నైకి చెందిన ‘యుబిఫ్లై టెక్నాలజీస్’ లేదా ఈ–ప్లేన్ కంపెనీ. ఐఐటీ మద్రాసులో ప్రాణం పోసుకున్న ఈ కంపెనీ ఎయిర్ ట్యాక్సీ, కార్గో ట్యాక్సీల తయారీలో పనిచేస్తోంది.చండీగఢ్కి చెందిన ‘నల్వా ఏరో’. ఇది కనీసం ఐదుగురు ప్రయాణించగలిగే ఎయిర్ ట్యాక్సీ రూపకల్పనలో నిమగ్నమై ఉంది.ఎన్నో ప్రయోజనాలు» వెర్టిపోర్టులన్నీ సౌర, పవన విద్యుత్వంటి సంప్రదాయేతర ఇంధన వనరులతో నడిచేలా చూడాలన్నది కేంద్రం ఆలోచన. అలాగే, ఇవి పూర్తిగా గ్రీన్ పోర్టులుగా పర్యావరణ హితంగా ఉండాలని యోచిస్తోంది. విద్యుత్ ఎయిర్ ట్యాక్సీలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.» రోడ్లమీద ట్రాఫిక్ సమస్యకు ఫుల్స్టాప్ పెట్టొచ్చు» కాలుష్య కారక ఉద్గారాలను విడుదల చేయవు. శబ్ద కాలుష్యమూ ఉండదు.»ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంతోపాటు సరకు రవాణా, ఎమర్జెన్సీ సేవలకూ పనికొస్తుంది» అత్యాధునిక సాంకేతికత, ప్రమాణాలతో పనిచేస్తాయి కాబట్టి ప్రమాదాలకు ఆస్కారం చాలా తక్కువ» సరికొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి» మారుమూల ప్రాంతాలకు కూడా ఈ ట్యాక్సీ సేవలను అందించవచ్చు -
గాజాలో 24 గంటల్లో 81 మంది మృతి
డెయిర్ అల్–బలాహ్: గాజా వ్యాప్తంగా ఇజ్రాయెల్ ఆర్మీ యథేచ్ఛగా సాగించిన దాడుల్లో గత 24 గంటల వ్యవధిలో కనీసం 81 మంది పాలస్తీనియన్లు చనిపోయారని, 422 మంది గాయాల పాలయ్యారని గాజా ఆరోగ్య విభాగం తెలిపింది. గాజా నగరంలోని పాలస్తీనా స్టేడియంలో ఆశ్రయం పొందుతున్న 12 మంది శరణార్థులు సైతం ప్రాణాలు కోల్పోయారు. అపార్టుమెంట్లపై జరిగిన దాడిలో మరో 8 మంది మృతి చెందారని షిఫా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరో 23 మృతదేహాలను తమ ఆస్పత్రి మార్చురీకి తీసుకువచ్చారని నాస్సెర్ ఆస్పత్రి అధికారులు చెప్పారు. టుఫ్పాలో నలుగురు చిన్నారులు సహా 11 మంది మృతి చెందారని అహ్లి ఆస్పత్రి తెలిపింది. రఫాలోని ఆహార పంపిణీ కేంద్రం వద్ద జనంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఆరుగురు, ఖాన్యూనిస్ నగరంలోని అల్ ఖరారాలో నలుగురు చనిపోయారు. ఆ వార్తలు అబద్ధం: నెతన్యాహూ గాజాలో అమెరికా, ఇజ్రాయెల్ ప్రభుత్వాల సాయంతో ఏర్పాటు చేసిన ఆహార పంపిణీ కేంద్రాల వద్ద జనంపై కాల్పులు జరపాలని ఆరీ్మకి ఆదేశాలు జారీ చేసినట్లుగా వచి్చన వార్తలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తీవ్రంగా ఖండించారు. అవన్నీ సైన్యాన్ని అప్రతిష్ట పాలు చేసే వార్తలంటూ కొట్టిపారేశారు. జనంపై ఆర్మీ ఉద్దేశపూర్వకంగా కాల్పులు జరుపుతోందంటూ వచి్చన వార్తలపై దర్యాప్తునకు ఆదేశిస్తామన్నారు. దాదాపు రెండున్నర నెలలుగా గాజాను పూర్తిగా దిగ్బంధించిన ఇజ్రాయెల్ సైన్యం నెల క్రితం ఆహార పంపిణీ కేంద్రాలను ప్రారంభించింది. ఈ కేంద్రాల వద్ద సైన్యం యథేచ్ఛగా సాగిస్తున్న కాల్పుల్లో ఇప్పటి వరకు కనీసం 500 మంది పాలస్తీనియన్లు చనిపోగా వందలాదిగా గాయపడ్డారు.త్వరలోనే కాల్పుల విరమణవచ్చే వారం గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. శుక్రవారం వైట్హౌస్లోని ఓవల్ ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం ఖరారయ్యే దిశగా చర్చలు సాగుతున్నాయన్నారు. ఈ ఒప్పందంతోపాటు ఇరాన్, తదితర అంశాలపై చర్చించేందుకు ఇజ్రాయెల్ వ్యూహాత్మక వ్యవహారాల శాఖ మంత్రి రాన్ డెర్మర్ వచ్చే వారం వాషింగ్టన్ వెళ్తారని సమాచారం. -
రష్యాలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి
మాస్కో: రష్యా ఆందోళనను పట్టించుకోకుండా పశ్చిమదేశాలు విస్తరణ వాదాన్ని అనుసరిస్తున్నాయని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మండిపడ్డారు. తమ దేశంలో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు. శుక్రవారం పుతిన్ బెలారస్ రాజధాని మిన్స్క్లో జరిగిన యురేసియన్ ఎకనామిక్ సమిట్(ఈఏఈయూ)కు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రష్యాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులు, కాల్పులకు తెగబడుతున్నా ఎవరూ పట్టించుకోరు. ఇప్పటికీ దారుణాలు కొనసాగుతున్నా వాటి గురించి మాట్లాడరు. అంతా బాగుందని చెప్పుకుంటుంటారు’అంటూ పశ్చిమదేశాలపై పుతిన్ ధ్వజమెత్తారు. ఉగ్రవాదాన్ని సైతం రష్యాలో వేర్పాటువాదానికి ఒక సాధనంగా పశ్చిమ దేశాలు భావించాయని ఆరోపించారు. ‘నాటో విస్తరణకు సంబంధించి రష్యాకు ఇచ్చిన హామీలను పశ్చిమదేశాలు విస్మరించాయి. ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో సైతం విఫలమయ్యాయి. ఉక్రెయిన్లో మేం చేపట్టిన స్పెషల్ ఆపరేషన్ మూలాలేమిటనే అంశంపై పశ్చిమ దేశాలు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఉక్రెయిన్ సంక్షోభానికి దశాబ్దాల క్రితమే బీజాలు పడ్డాయి. నాటో విస్తరణ విషయంలో చెప్పిన పచ్చి అబద్ధాలే తాజా సమస్యకు కారణం. ఒకదాని తర్వాత మరో దేశాన్ని నాటోలోకి కలుపుకుంటూ విస్తరించుకుంటూ వస్తున్నాయి. మా ఆందోళనలను పట్టించుకోకుండా నాటో కార్యకలాపాలు యథా ప్రకారం కొనసాగిస్తోంది. ఇది కాదా దుందుడుకు వైఖరి? ఇది కచ్చితంగా దుందుడుకు విధానమే. పశ్చిమ దేశాలు దీనిపై దృష్టి పెట్టడానికి ఇష్టపడవు’అని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్తో మూడేళ్లుగా సాగిస్తున్న యుద్ధంపై పశ్చిమ దేశాలతో రష్యాకు విభేదాలు తీవ్రతరమైన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రష్యా దూకుడును నిలువరించేందుకు సభ్య దేశాలు తమ జీడీపీలో 5 శాతం రక్షణకు కేటాయించాలంటూ నాటో ఇటీవల నిర్ణయించడం తెల్సిందే. -
ఒంటి చేత్తో యుద్ధం ఆపేశా
వాషింగ్టన్: భారత్, పాకిస్తాన్ మధ్య అణు యుద్ధం జరిగే పరిస్థితి ఏర్పడగా, తానే చొరవ తీసుకొని ఒంటిచేత్తో ఆపేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టంచేశారు. అన్ని రకాల వాణిజ్య సంబంధాలు తెంచేసుకుంటామని హెచ్చరించడంతో ఈ రెండు దేశాలు తన మాట విని దారికొచ్చాయని, యుద్ధం ఆపేశాయని చెప్పారు. ట్రంప్ తాజాగా శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడారు. భారత్, పాక్ మధ్య ఘర్షణ మొదలైన తర్వాత తన సీనియర్ అధికారులను రంగంలోకి దించానని, ఇరుదేశాలను ఒత్తిడి పెంచానని తెలిపారు. తన చాతుర్యం ఫలించి యుద్ధం ఆగిపోయిందని వెల్లడించారు. తానే కనుక చొరవ తీసుకోకపోత రెండు దేశాల మధ్య కచ్చితంగా అణు యుద్ధం జరిగేదని స్పష్టంచేశారు. తనలాగా గొప్ప పని చేసిన అమెరికా అధ్యక్షుడు గతంలో మరొకరు ఉన్నారో లేదో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. మధ్య కాల్పుల విరమణకు భారత్, పాక్లను ఒప్పించడం ద్వారా గొప్ప పని చేశానని అన్నారు. సెర్బియా, కొసావో దేశాలను సైతం ఇలాంటి దారికి తీసుకొచ్చానని, అక్కడ పెద్ద యుద్ధం ఆపేశానని ట్రంప్ ఉద్ఘాటించారు. వాణిజ్య సంబంధాలు తెంచేసుకుంటానని బెదిరించడంతో అవి ఘర్షణకు స్వస్తి చెప్పి, శాంతిని ఆశ్రయించాయని పేర్కొన్నారు. ఈ రెండు దేశాల్లో మంచి నాయకులు ఉన్నారని, వారు తెలివైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. అమెరికాతో వాణిజ్యం కావాలా? లేక ఒకరిపై ఒకరు అణు బాంబులతో దాడులు చేసుకుంటారా? అని ప్రశ్నించగా, వాణిజ్యమే కావాలని బదులిచ్చారని వివరించారు. -
పాక్ మళ్లీ మొదలుపెట్టేసింది.,.!
కరాచీ: భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఉనికిలో లేకుండా ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాక్ అతాలకుతలమైంది. భారత్ దాడుల్ని తిప్పి కొట్టలేక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కాస్త దారికొచ్చింది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లోకి చొచ్చుకుపోయిని భారత ఆర్మీ బలగాలు అక్కడ కీలక ఉగ్రస్థావరాలను చిన్నాభిన్నం చేశారు. సుమారు వందమందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం ఒకటైతే, ఉగ్రస్థావరాలు ఉన్న చోటల్లా భారత్ చేసిన దాడులకు పాకిస్తాన్ ఊపిరి తీసుకోలేకపోయింది. అలాగే పాక్ ఆర్మీ క్యాంపుల్ని కూడా భారత్ టార్గెట్ చేసి పైచేయి సాధించింది. మళ్లీ భారత్పై పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగడితే ఆపరేషన్ సింధూర్ ఆన్లోనే ఉంటుందని ప్రధాని మోదీ హెచ్చరికల నేపథ్యంలో వారు కాల్పుల విరమణకు వచ్చారు. ఈ తరహా దాడుల్ని ఊహించని పాక్.. ప్రస్తుతం మళ్లీ తిరిగి భారత్ నేలకూల్చిన నిర్మాణాలను పునః నిర్మించుకునే పనిలో పడింది. పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలుగా భావిస్తున్న వాటిని తిరిగి నిర్మిస్తోంది. ఇటీవల పాక్కు విదేశీ ఫండింగ్ బాగానే అందడంతో దానిని ధ్వంసమైన ఉగ్రస్థావరాల కోసం కూడా ఖర్చు చేస్తోంది. దాంతో పాటు పాక్ ఆర్మీ క్యాంప్లకు సంబంధించి శాటిలైట్ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతినడంతో దానిని కూడా పునరుద్దరించే పనిలో పడింది. లుని, పుట్వాల్, తైపు పోస్ట్, జమిలా పోస్ట్, ఉమ్రాన్వాలి, చప్రార్, ఫార్వర్డ్ కహుటా, చోటా చక్ మరియు జంగ్లోరా వంటి ప్రాంతాలలో ఈ మేరక పాకిస్తాన్ పునర్నిర్మాణాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరొకవైపు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు, ఐఎస్ఐ సహకారంతో, నియంత్రణ రేఖ (ఎల్ఓసి) సమీపంలోని దట్టమైన అడవులలో హైటెక్ టెక్నాలజీతో చిన్న ఉగ్రవాద శిబిరాలను నిర్మించడానికి యత్సిస్తున్నట్లు ఇండియా టుడే తన కథనంలో పేర్కొంది. అసలు ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్.. ఉగ్రవాద శిబిరాల పునః నిర్మాణం కోసం అయ్యే ఖర్చులను అప్పులు చేసి మరీ తిప్పలు తెచ్చకోవడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. -
ఒక్క రోజులో 16 సూర్యోదయాలు: శుభాంశు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం( ఐఎస్ఎస్)లో కి అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ఇండియన్ ఎయిర్ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతో ప్రభాని నరేంద్ర మోదీతో జరిపిన సంభాషణ ఆసక్తికరంగా సాగింది. ఈరోజు(శనివారం, జూన్ 28వ తేదీ) శుభాంశు శుక్లాతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. తొలుత శుభాంశును విష్ చేసిన ప్రధాని మోదీ.. ‘ఇది శుభ్ ఆరంభ్ అని, ఇది నయా శకం’ అని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్న మోదీ.. గొప్ప ఘనతను సాధించావంటూ కొనియాడారు. దానికి శుభాంశు బదులిస్తూ ఇది తన ఒక్కడి విజయం కాదని, భారత్ విజయమని వినమ్రతను చాటుకున్నారు. PM @narendramodi interacted with Group Captain Shubhanshu Shukla, who is aboard the International Space Station. pic.twitter.com/Q37HqvUwCd— PMO India (@PMOIndia) June 28, 2025 అదే సమయంలో అక్కడ ఎలా ఉంది అని మోదీ అడగ్గా... ఇక్కడ వాతావరణం అంతా భిన్నంగా ఉందని శుభాంశు తెలిపారు. ఈ కక్ష నుంచి చూస్తే భారత్ చాలా స్పెషల్గా కనిపిస్తుందని శుభాంశు స్పష్టం చేశారు. ఇక్కడ రోజుకు 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలుగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ కక్షలో పరిస్థితులకు అలవాటు పడుతున్నామని, నిద్ర పోవడం అనేది చాలా పెద్ద చాలెంజ్గా ఉందన్నారు. ఇక్కడ గ్రావెటీ లేమి కారణంగా చిన్న చిన్న సమస్యలు తలెత్తుతున్నాయని శుభాంశు తెలిపారు. తల కాస్త భారంగా ఉంటుందని, ఇలా కొన్ని సమస్యలు ఉన్నాయని, ఇవన్నీ చిన్న చిన్న ఇబ్బందులేనని తెలిపారు. మీ యొక్క ఆశీర్వాదంతో ఐఎస్ఎస్లో అతి సులభంగా అడుగుపెట్టానని పేర్కొన్నారు శుభాంశు. ఇక ఐఎస్ఎస్ నుంచి భారత్ చాలా పెద్దదిగా కనిపిస్తుందని, మ్యాప్ కంటే భిన్నంగా ఉందని మోదీ పేర్కొనగా, ఇక్కడ నుంచి చూస్తే భారత్ చాలా స్పెషల్గా కనిపిస్తుందని శుభాంశు తెలిపారు. ఇలా పలు విషయాలను పంచుకుంటూ ప్రధాని మోదీ-శుభాంశుల సంభాషణ కొనసాగింది. #WATCH | Prime Minister Narendra Modi interacts with Group Captain Shubhanshu Shukla, who is aboard the International Space Station.PM Modi says "Today, you are away from our motherland, but you are the closest to the hearts of Indians...Aapke naam mein bhi shubh hai aur aapki… pic.twitter.com/lWOk7AVlL3— ANI (@ANI) June 28, 2025 -
అంతరిక్షం నుంచి భారత్ ఓ అద్భుత దృశ్యకావ్యం
న్యూఢిల్లీ: ‘‘అంతరిక్షం నుంచి భారత్ ఓ అద్భుత దృశ్యకావ్యంలా కనువిందు చేస్తోంది’’ – మన వ్యోమగామి వాయుసేనాని, యాగ్జియం–4 మిషన్ కెప్టెన్ శుభాంశు శుక్లా (39) చేసిన భావోద్వేగపూరిత వ్యాఖ్యలివి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో క్రమంగా కుదురుకుంటున్న ఆయన శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో లింక్ ద్వారా మాటామంతి జరిపారు. ‘‘మ్యాప్లో చూసే భారతావనికి, అంతరిక్షం నుంచి కనిపిస్తున్న దృశ్యానికి పోలికే లేదు. ఇక్కడినుంచి మన దేశం చాలా పెద్దదిగా, ఎంతో గొప్పగా కనిపిస్తోంది. అంతరిక్షం నుంచి భూమి కూడా దేశాల ఎల్లలన్నవే లేకుండా ఎటునుంచి చూసినా నిండుగా, ‘వసుధైక కుటుంబం’లా కనువిందు చేస్తోంది. భూగోళమంతా మన ఇల్లుగా, అన్ని దేశాల ప్రజలందరం సమస్త మానవాళికీ ప్రాతినిధ్యం వహిస్తున్నామని మనసుకు తోస్తోంది’’ అని వివరించారు. ఐఎస్ఎస్లో కాలుపెట్టిన తొలి భారతీయునిగా శుభాంశు తిరుగులేని చరిత్ర సృష్టించారంటూ మోదీ ప్రస్తుతించారు. ‘‘మాతృభూమి నుంచి మీరు అత్యంత దూరంగా ఉండొచ్చు గాక. కానీ ప్రస్తుతం ప్రతి భారతీయుని హృదయానికీ అత్యంత దగ్గరగా ఉన్నారు. మీ పేరులోనే శుభముంది. అందుకు తగ్గట్టే మీ యాత్ర కూడా సరికొత్త యుగానికి శుభారంభం పలికింది. మన దేశ యువతకు కొంగొత్త ఆశలతో కూడిన కొత్త అధ్యాయానికి మీ ప్రస్థానం గొప్పగా బాటలు పరిచింది’’ అంటూ కొనియాడారు. ‘‘ఇప్పుడు మనమిలా మాట్లాడుకుంటున్న ఈ సమయాన ప్రతి ఒక్క భారతీయునికీ భావోద్వేగపరంగా మీతో విడదీయలేనంతటి బంధం పెనవేసుకుపోయింది. ఆ 140 కోట్ల పై చిలుకు అవ్యక్త భావనలను, ఆకాంక్షలను వారి ప్రతినిధిగా మీకు చేరవేస్తున్నాను. త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా వెంట తీసుకెళ్లిన మీకు నా మనఃపూర్వక శుభాభినందనలు. యాగ్జియం–4 మిషన్కు నా శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు. తన ఐఎస్ఎస్ యాత్రను దేశ ప్రజలందరి సమష్టి ఘనతగా శుభాంశు అభివర్ణించారు.మీ సారథ్యంలో కలలకు కొత్త రెక్కలు‘‘రోజుకు 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలు ఆస్వాదిస్తున్నాం. గంటకు 28 వేల కి.మీ. వేగంతో భూమికి ప్రదక్షిణలు చేస్తున్నాం. ఈ వేగం మన దేశ ప్రగతి పరుగులకు అద్దం పడుతోంది’’ అని శుభాంశు తెలిపారు. ఐఎస్ఎస్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటూ మోదీ ఆరా తీశారు. అక్కడి పరిస్థితులకు ఎలా అలవాటు పడుతున్నారని అడిగారు. తాను బావున్నానని శుభాంశు తెలిపారు. కాకపోతే శూన్య గురుత్వాకర్షణ స్థితిలో నిద్రపోవడం కూడా పెను సవాలుగానే ఉందంటూ చమత్కరించారు! అన్నింటికీ ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నట్టు చెప్పారు. ‘‘ఇలాంటి సవాళ్ల కోసమే ఏడాది పాటు కఠోర శిక్షణ పొందాం. కానీ తీరా ఇక్కడికొచ్చాక అంతా మారిపోయింది. శూన్యస్థితి కారణంగా చిన్నచిన్న విషయాలు కూడా భూమి మీదికంటే ఎంతో భిన్నంగా ఉన్నాయి. ఇది నాకు నిజంగా సరికొత్త అనుభూతి. ‘‘అంతరిక్షంలో తరచూ తీవ్ర ఒత్తిళ్లతో కూడిన పరిస్థితులెన్నో ఎదురవుతుంటాయి. అందుకే ఏకాగ్రత, ప్రశాంతచిత్తం చాలా అవసరం. అప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోగలం. శిక్షణ సందర్భంగా వీటి గురించి ఎంతో తెలుసుకున్నా. అదంతా బాగా ఉపకరిస్తోంది. భూమికి 400 కి.మీ. ఎత్తుకు చేరిన ఈ ప్రయాణం నా ఒక్కనిది కాదు. మొత్తం దేశానిది. అంతరిక్షంలో భారత్కు ప్రాతినిధ్యం వహించడం పట్ల ఎనలేని సంతోషంగా ఉన్నా. నాకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపిన మీకు, 140 కోట్ల సహచర భారతీయులకు కృతజ్ఞతలు. ఇలా ఒకనాటికి వ్యోమగామిని అవుతానని చిన్ననాడు కలలో కూడా అనుకోలేదు. మీ నాయకత్వంలో దేశం తన కలలకు కొత్త రెక్కలు తొడుక్కుంటోంది’’ అంటూ ప్రధాని నాయకత్వాన్ని ప్రశంసించారు. ‘‘యువతకు నేనిచ్చే సందేశమల్లా ఒక్కటే. ఆకాశమే మీ హద్దు!’’ అని పేర్కొన్నారు. సంభాషణను ముగిస్తూ ‘భారత్ మాతా కీ జై’ అంటూ శుభాంశు చేసిన నినాదాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రమంతటా ప్రతిధ్వనించాయి. PM @narendramodi interacted with Group Captain Shubhanshu Shukla, who is aboard the International Space Station. pic.twitter.com/Q37HqvUwCd— PMO India (@PMOIndia) June 28, 2025 #WATCH | Prime Minister Narendra Modi interacts with Group Captain Shubhanshu Shukla, who is aboard the International Space Station.PM Modi says "Today, you are away from our motherland, but you are the closest to the hearts of Indians...Aapke naam mein bhi shubh hai aur aapki… pic.twitter.com/lWOk7AVlL3— ANI (@ANI) June 28, 2025అపార అనుభవంతో తిరిగి రండిమన గ‘ఘన’ యాత్రలకు అదే పునాదిశుభాంశుకు ప్రధాని ‘హోంవర్క్’అంతరిక్షాన్ని మరింతగా అన్వేషించాలన్న మన యువత, విద్యార్థుల సంకల్పాన్ని శుభాంశు చరిత్రాత్మక యాత్ర మరింత బలోపేతం చేస్తుందని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ఆయనకు ప్రత్యేకమైన ‘హోంవర్క్’ అప్పగించారు. ‘‘తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్కు వీలైనంత త్వరలో శ్రీకారం చుట్టేందుకు భారత్ ఎంతో పట్టుదలతో ఉంది. అలాగే పూర్తి స్వదేశీ ‘భారత అంతరిక్ష కేంద్రం’ నిర్మించేందుకు, భారత వ్యోమగాములను చంద్రునిపైకి పంపేందుకు కూడా! అంతరిక్ష పరిస్థితులపై సంపూర్ణ అనుభవం గడించి విజయవంతంగా తిరిగిరండి. గగన్యాన్ తదితర ప్రాజెక్టులన్నింటికీ మీరు వెంటతీసుకొచ్చే వెలకట్టలేని అనుభవమే తిరుగులేని పునాది!’’ అని విశ్వాసం వెలిబుచ్చారు. అంతరిక్షంలో భారత్ సృష్టించబోయే నూతన చరిత్రకు తన యాత్ర కేవలం ఆరంభం మాత్రమేనని శుభాంశు బదులిచ్చారు.క్యారెట్ హల్వా, మామిడి రసం రుచి చూపాతనతో పాటు ఐఎస్ఎస్కు క్యారెట్ హల్వా, మామిడి రసం తీసుకొచ్చానని ప్రధానికి శుభాంశు వివరించారు. వాటిని, చవులూరించే పలు భారతీయు మిఠాయిలను ఐఎస్ఎస్లోని 10 మంది తోటి వ్యోమగాములతో శుభాంశు పంచుకున్నట్టు చెప్పారు. చరిత్ర సృష్టించిన శుభాంశు -
పాక్లో ఆత్మాహుతి దాడి.. 13 మంది సైనికులు మృతి
కరాచీ: పాకిస్తాన్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది సైనికుల మృతిచెందారు. పాకిస్తాన్ సైనికులే లక్ష్యంగా దూసుకొచ్చిన ఆత్మాహుతి దళంలోని సభ్యుడు.. ఆర్మీ వాహనంపైకి దూసుకొచ్చి తనను తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో 13 మంది పాక్ సైనికులు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో 19 మంది స్థానికులు, మరో 10 మంది ఆర్మీలోని సైనికులు గాయాలపాలయ్యారు.మిలటరీ కాన్వాయ్ వెళుతున్న సమయంలో సూసైడ్ బాంబర్ ఒక్కసారిగా ఆ కాన్వాయ్పై దూకాడు. ఆపై వెంటనే తన వెంట తెచ్చుకున్న బాంబును పేల్చేసుకున్నట్లు పాక్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనలో దగ్గర్లో ఉన్న ఇళ్లు కూడా ధ్వంసమైనట్లు తెలిపారు. అయితే ఇది ఎవరు చేశారు అనే దానిపై ఇంకా ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. కానీ తెహ్రిక్-ఈ-తాలిబన్ గ్రూప్ అనేది తరుచుగా పాక్లోని సైనికులే లక్ష్యంగా దాడులు చేయడంతో ఇది కూడా వారే చేసే ఉంటారని అనుమానిస్తున్నారు. ఇది బలూచిస్తాన్ ప్రాంతంలో జరగ్గా, ఇటీవల కాలంలో పాకిస్తాన్లోని పలు చోట్ల ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో జాన్డోలా చెక్పోస్ట్ పరిధిలో సూసైడ్ బాంబింగ్ జరిగింది. ఇక్కడ కూడా పాకిస్తాన్ ఆర్మీ క్యాంపే లక్ష్యంగా దాడి జరిగింది. బలోచ్ మిలిటెంట్లు జఫ్ఫార్ ఎక్స్ప్రెస్ను అటాక్ చేసిన ఘటనలో 21 మంది ప్రయాణికులు అసువులు బాశారు. ఇక గ్లోబెల్ టెర్రర్ ఇండెక్స్ లో పాకిస్తాన్లోనే అత్యధికంగా ఉంది. పాక్లో ఉగ్రవాదం అనేది 45 శాతంగా నమోదు కాగా, అంతకంతకు పెరుగుతూ ఉంది. మరణాల పరంగా చూస్తే 2023లో ఉగ్రవాద చర్యలతో 748 ప్రాణాలు కోల్పోగా, 2024 నాటికి అది 1, 081గా పెరిగింది. -
ముంచెత్తిన వరద.. సాయం కోసం 2 గంటలకు పైగా ఎదురు చూపులు
సరదాగా నది ఒడ్డుకు పిక్నిక్ వెళ్లడం ఆ కుటుంబం పాలిట శాపమైంది. ఆకస్మిక వరదల్లో చిక్కుకుని రెండు గంటలపాటు ప్రాణాలను రక్షించుకునేందుకు పోరాడింది ఆ కుటుంబం. అయితే సకాలంలో సాయం అందక.. అధికార యంత్రాంగ వైఫల్యంతో చివరకు నదిలో కొట్టుకుపోయి విగతజీవులుగా తేలారు. క్రికెట్ గ్రౌండ్లను ఆరబెట్టడానికి హెలికాఫ్టర్లను ఉపయోగించే పాకిస్తాన్లో ఘోరం జరిగింది. స్వాత్ నదీ ఆకస్మిక వరదల్లో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది కొట్టుకుపోగా, అందులో 10 మంది మరణించారు. నలుగురు ప్రాణాలతో బయటపడగా.. వరదలో గల్లంతైన మరో నలుగురి జాడ తెలియాల్సి ఉంది. జూన్ 27వ తేదీన జరిగిన ఈ ఘటన తాలుకా వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.పంజాబ్ సియాల్కోట్కు చెందిన ఓ కుటుంబం మరికొందరు దగ్గరి బంధువులతో కలిసి ఖైబర్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని ఫిజాఘట్ వద్ద స్వాత్ లోయకు పిక్నిక్కు వచ్చింది. ఉదయం 8గం.ప్రాంతంలో అల్పాహారం చేస్తుండగా.. పిల్లలు, మహిళలు కొందరు నదీ సమీపంలోకి వెళ్లి సెల్ఫీలు దిగుతున్నారు. ఆ సమయంలో స్వాత్ నదికి ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో వాళ్లను బయటకు తీసుకురావాలనే ప్రయత్నంలో.. అంతా వరదలో చిక్కుకున్నారు. ఈలోపు అక్కడికి చేరుకున్న స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేస్తూనే.. మరోవైపు సహాయం కోసం అధికారులకు సమాచారం అందించారు. అయితే రెండు గంటలు గడిచినా.. సహాయక బృందాలు అక్కడికి రాలేదు. ఈలోపు వరద అంతకంతకు పెరగడం.. వాళ్లు సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. ఓ పెద్ద రాయి మీద నిలబడి సాయం కోసం ఆశగా ఎదురు చూశారు. నీళ్లలో జారిపోతున్న తమ వాళ్లను రక్షించుకునేందుకు చివరిదాకా ప్రయత్నించారు. అయినా లాభం లేకపోయింది. మొత్తం 18 మంది అంతా చూస్తుండగానే వరదలో కొట్టుకుపోగా.. నలుగురిని స్థానికులు అతికష్టం మీద రక్షించగలిగారు. ఇప్పటిదాకా 10 మృతదేహాలను అధికారులు వెలికి తీశారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. మరో నలుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది.సకాలంలో అధికారులు స్పందించి ఉంటే ప్రాణాలు దక్కేవని స్థానికులు విమర్శిస్తుండగా.. ప్రతికూల వాతావరణంతోనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్ట లేకపోయామని అధికారులు వివరణలు ఇస్తున్నారు. అయితే ఎగువన వర్షాలతో స్వాత్ నదికి వరద క్రమక్రమంగానే పెరిగిందని.. అధికారులు అప్రమత్తం చేసి ఉంటే ప్రాణాలు దక్కి ఉండేవని అక్కడి మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. క్రికెట్ గ్రౌండ్లను ఆరబెట్టేందుకు సైనిక హెలికాఫ్టర్లను ఉపయోగించిన పాక్ ప్రభుత్వం.. సకాలంలో స్పందించి ఉంటే వాళ్లందరి ప్రాణాలు దక్కి ఉండేవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ వీడియో నెట్లో వైరల్ అవుతుండడంతో.. విమర్శలు మాత్రం అంతకంతకు పెరిగిపోతున్నాయి.ప్రాణాల కోసం పోరాడిన ఆ వీడియోను మీరూ చూసేయండి. A Country where helicopter reaches to dry the Cricket ground in few minutes. Yet can't reach in Several hours to save human lives. #Swat pic.twitter.com/vJAPDQnPJ6— Aima Khan (@aima_kh) June 27, 2025 -
కాలం కలిసొచ్చింది... కారు నడిచొచ్చింది!
‘‘కలిసొచ్చే కాలానికి... నడిచొచ్చే కొడుకు పుడతాడంట!’’ పాతకాలపు సామెత. ఈ టెక్నాలజీ యుగంలో ఈ పప్పులేమీ ఉడకవు. కానీ.. డబ్బులు ఉంటే షోరూమ్కు వెళ్లి బోలెడన్ని పత్రాలపై సంతకాలు పెట్టి డ్రైవింగ్ వస్తే సొంతంగా.. లేదంటే అద్దెడ్రైవర్ను పెట్టుకుని మరీ తెచ్చుకోవాల్సిన కారు మాత్రం ఇప్పుడు దానంతట అదే నడిచొస్తుంది!. విషయం ఏమిటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది!.. ఎలాన్ మస్క్ సృష్టించిన అద్భుతం డ్రైవర్లెస్ కారు మొట్టమొదటిసారి కొనుగోలుదారు ఇంటి వద్దకు వచ్చేసింది. ఈ విషయాన్నే టెస్లా కార్ల కంపెనీ యజమాని ఈలాన్ మస్క్ గర్వంగా తన ‘ఎక్స్’ ప్లాట్ఫామ్పై పంచుకున్నారు కూడా. ఎలాంటి మానవ సాయం, జోక్యం లేకుండా.. టెక్సస్లోని టెస్లా గిగా ఫ్యాక్టరీలో తయారైన ‘మోడల్ వై’ కారు స్థానికంగా కొనుగోలుదారు వద్దకు గంటకు 72 మైళ్ల వేగంతో ప్రయాణిస్తూ వచ్చిందన్నమాట. First time that a car has delivered itself to its owner! https://t.co/xgZBRDaMiX— Elon Musk (@elonmusk) June 28, 2025పైగా... అనుకున్నదాని కంటే ఒక రోజు ముందుగా ఎలాన్ మస్క్ పుట్టినరోజు నాడే ఈ కారు డెలివరీ కావడం ఒక విశేషం. ఆటోమొబైల్ రంగ చరిత్రలో ఇదో చిరస్మరణీయ ఘట్టం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. డ్రైవర్ల అవసరం లేని వాహనాలతో క్యాబ్లు నడపాలన్న మస్క్ ఆలోచనలు వాస్తవమయ్యే దిశగా ఇంకో ముందడుగూ పడిందన్నమాట!. మోడల్ వై గురించి క్లుప్తంగా..2020లో లాంచ్ అయిన కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇది. టెస్లా మోడల్ త్రీ ప్లాట్ఫామ్పై నిర్మించారు. ఐదుగురు కూర్చోగలరు. కొన్ని ప్రాంతాల్లో ఏడు సీట్లు ఉన్న వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. టెక్సస్లోని ఆస్టిన్ ప్రాంతం ఫ్రీమాంట్లోని టెస్లా గిగాఫ్యాక్టరీతోపాటు షాంఘై, బెర్లిన్లలో ఈ మోడల్ వై కార్లు తయారవుతున్నాయి. వేరియంట్ను బట్టి 60 - 81 కిలోవాట్ హవర్ల బ్యాటరీతో నడుస్తుంది. లిథియం అయాన్ ఫాస్పే్ట్ (ఎల్ఎఫ్పీ), నికెల్ మాంగనీస్ కోబాల్ట్ (ఎన్ఎంసీ) బ్యాటరీలతో లభిస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే వేరియంట్ను బట్టి 320 నుంచి 330 మైళ్ల దూరం ప్రయాణించగలదు. పావుగంటలోనే 180 మైళ్ల దూరం ప్రయాణించగలిగేంత విద్యుత్తును ఛార్జ్ చేసుకోవచ్చు. కేవలం 5.4 సెకన్లలోనే 60 మైళ్ల వేగాన్ని అందుకోగల శక్తి దీని సొంతం. గరిష్ట వేగం గంటకు 155 మైళ్లు! వాహనం లోపలి విశేషాల గురించి చూస్తే.. 15.4 అంగుళాల విశాలమైన టచ్స్ట్రీన్, పనోరమిక్ గ్లాస్ రూఫ్లు ఉంటాయి. కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టగలిగితే ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ వేరియంట్ను కొనుక్కోవచ్చు. లేదంటే కొన్ని పరిమితమైన ఫీచర్లతో డ్రైవింగ్ అవసరాన్ని తగ్గించేవి లభిస్తాయి. తెల్లగీతల మధ్య మాత్రమే ప్రయాణించడం, అడాప్టివ్ క్రూయిజ్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటివి అన్నమాట. అత్యాధునిక ఆడియో సిస్టమ్ ఉండనే ఉంది. భద్రత విషయానికి వస్తే ఫైవ్ స్టార్ రేటింగ్ లభించింది. చివరిగా ధరల గురించి... రకాన్ని బట్టి 39.3 లక్షల రూపాయలు (46000 డాలర్లు) నుంచి 41.01 లక్షల రూపాయలు (48,000 డాలర్లు) వరకూ ఉంటుంది.::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
ఆరేళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. తొలి ఫొటో షేర్ చేసిన లారెన్
ఆరేళ్ల డేటింగ్ తర్వాత ఆ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అమెజాన్ వ్యవస్థాపకుడు.. అపర కుబేరుడు జెఫ్ బెజోస్, ప్రముఖ జర్నలిస్ట్ లారెన్ సాంచెజ్ వివాహం ఇటలీ చారిత్రక నగరం వెనిస్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లివేడుకకు హాలీవుడ్ నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి ప్రముఖ తారాగణమంతా హాజరైంది. పెళ్లి తాలుకా ఫస్ట్ ఫొటోను లారెన్ స్వయంగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ వ్యవస్థపాకుడిగా, ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా జెఫ్ బెజోస్(61) కొనసాగుతున్నారు. 2019 నుంచి జర్నలిస్ట్ అయిన లారెన్(55)తో ఆయన డేటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో 2023లో వీళ్ల ఎంగేజ్మెంట్ జరగ్గా.. శుక్రవారం(జూన్ 27న) వీళ్ల వివాహం జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా, ఆమె భర్త జారెడ్ కుష్నెర్, ప్రముఖ జర్నలిస్ట్ ఓప్రా విన్ఫ్రే, కిమ్ కర్దాషియన్, కోలే కర్దాషియన్, జోర్డాన్ రాణి రనియా తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.వివాహం తర్వాత ఈ ఇన్స్టా పేజీకి తన పేరును లారెన్ శాంచెజ్ బెజోస్గా మార్చుకున్న ఆమె.. గతంలో తాను చేసిన పోస్టులన్నింటినీ డిలీట్ చేశారు. కేవలం పెళ్లి వేడుకకు సంబంధించిన రెండు పోస్ట్లను షేర్ చేశారు. జెఫ్ బెజోస్ (Jeff Bezos), లారెన్లు 2018 నుంచే డేటింగ్లో ఉన్నారు. 2019 వరకు ఆ విషయం బయటకు రాలేదు. అదే ఏడాది బెజోస్ తన భార్య మెకంజీ స్కాట్తో ఉన్న 25 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. లారెన్తో ఎంగేజ్మెంట్ టైంలో 2.5 మిలియన్ డాలర్ల విలువైన వజ్రాల ఉంగరాన్ని అమెజాన్ అధిపతి ఆమెకు ఇచ్చినట్లు కథనాలు వెలువడ్డాయి.జెఫ్ బెజోస్ గురించి.. జెఫ్ బెజోస్ జనవరి 12, 1964న అల్బుకర్కీ, న్యూ మెక్సికో(అమెరికా) జన్మించారు. 1994లో బెజోస్ సెకండ్హ్యాండ్ పుస్తకాలు అమ్మే ఆన్లైన్ స్టోర్గా అమెజాన్ను ప్రారంభించారు. అదే ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థగా మారింది. ఆపై 2000లో బ్లూ ఆరిజిన్ అనే అంతరిక్ష సంస్థను స్థాపించారు. 2013లో వాషింగ్టన్ పోస్ట్ అనే ప్రముఖ వార్తాపత్రికను కొనుగోలు చేశారు. 2017 నుంచి 2021 వరకు ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఫోర్బ్స్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు.వైవాహిత జీవితానికొస్తే.. మెకెంజీ స్కాట్ను బెజోస్ 1993లో వివాహం చేసుకున్నారు, 2019లో ఈ జంట విడాకులు తీసుకుంది. మెకెంజీ స్కాట్ ఒక ప్రముఖ అమెరికన్ రచయిత్రి, దాతృత్వవేత్త. అమెజాన్ స్థాపన ప్రారంభ దశలో ఈమె కీలక పాత్ర పోషించారు. విడాకుల సమయంలో ఆమెకు సుమారు 38 బిలియన్ డాలర్లు విలువైన అమెజాన్ షేర్లు లభించాయి. విడాకుల అనంతరం మెకెంజీ స్కాట్ తన సంపదలో పెద్ద భాగాన్ని దాతృత్వానికి కేటాయిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆమె ఇప్పటివరకు రూ. లక్ష కోట్లకు పైగా విరాళాలు ఇచ్చారామె. విద్య, ఆరోగ్యం, సామాజిక న్యాయం వంటి రంగాల్లో పనిచేస్తున్న 360 లాభాపేక్షలేని సంస్థలకు ఆమె సహాయం అందించారు. ఈ జంటకు నలుగురు పిల్లలు(ఒకరిని దత్తత తీసుకున్నారు). ఆపై లారెన్ సాంచెజ్తో ప్రేమలో మునిగిపోయిన ఆయన.. నిశ్చితార్థం చేసుకుని ఇప్పుడు వివాహం చేసుకున్నారు. లారెన్ వెండీ సాంచెజ్ (Lauren Wendy Sánchez).. వయసు 55. ఆమె ఒక టీవీ ప్రెజెంటర్, జర్నలిస్ట్, హెలికాప్టర్ పైలట్ కూడా. Extra", "Good Day LA వంటి షోలతో ఆమెకు పేరు దక్కింది. 2024లో ఆమె బ్లూ ఆరిజిన్ ద్వారా అంతరిక్షానికి వెళ్లిన తొలి మహిళలలో ఒకరిగా నిలిచారు. "Black Ops Aviation" అనే ఎయిర్ ఫిల్మింగ్ కంపెనీ ఉంది — ఇది మహిళల చేత నడపబడే మొదటి సంస్థలలో ఒకటి. ఫ్యాషన్ ఐకాన్గా ఆమె స్టైలిష్ దుస్తులు, డిజైనర్ బ్రాండ్స్ కోసం ప్రసిద్ధి. ఇటీవల కర్దాషియన్ కుటుంబం ఆమెకు విలాసవంతమైన UFO-ప్రేరిత బ్యాగ్ బహుమతిగా ఇచ్చారు.లారెన్ గతంలో ఎన్ఎఫ్ఎల్ మాజీ ఆటగాడు టోనీ గోంజాలెజ్తో డేటింగ్ చేసి ఓ కొడుకును కన్నారు. ఆపై హాలీవుడ్ టాలెంట్ ఏజెంట్ పాట్రిక్ వైట్సెల్ను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు. పాట్రిక్ నుంచి విడాకులు తీసుకున్నాక ఆమె జెఫ్ బెజోస్తో డేటింగ్ మొదలు పెట్టారు. View this post on Instagram A post shared by Lauren Sánchez Bezos (@laurensanchezbezos) -
‘మధ్యవర్తిత్వం’ చట్టవిరుద్ధం.. పాక్కు భారత్ మరో షాక్
న్యూఢిల్లీ: నాటి(1960) సింధు జలాల ఒప్పందంపై ఏర్పాటైన ‘మధ్యవర్తిత్వ న్యాయస్థానం’ ఇచ్చిన అనుబంధ తీర్పును భారత్ ఒక ప్రకటనలో తిరస్కరించింది. స్వయంగా ఏర్పాటైన ఈ ప్యానెల్ చట్టవిరుద్ధమని, ఇది ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ, పాక్.. నెదర్లాండ్స్లోని హేగ్లో గల మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ నేపధ్యంలో వెలువడిన తీర్పుపై భారత్ మండిపడింది. కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్(మధ్యవర్తిత్వ న్యాయస్థానం) ఆదేశాలపై భారత విదేశాంగశాఖ స్పందించింది. నాటి(1960) సింధు జలాల ఒప్పందంపై ఏర్పాటైన చట్టవిరుద్ధ మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని తాము అంగీకరించలేదని, అయినా అది భారత కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ము, కాశ్మీర్లోని కిషెన్గంగా , రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి దాని సామర్థ్యంపై అనుబంధ అవార్డుగా వర్ణించే ఆదేశాల్ని ఇచ్చిందని పేర్కొంది.కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఉనికిని భారతదేశం ఎప్పుడూ గుర్తించలేదని, ఈ కోర్టు తీసుకునే చర్యలు, అది తీసుకునే నిర్ణయం చట్టవిరుద్ధమని, అది చెల్లదని భారత విదేశాంగశాఖ తేల్చిచెప్పేసింది. పహల్గామ్ ఉగ్ర దాడి అనంతరం భారత్.. అంతర్జాతీయ చట్టం ప్రకారం తన హక్కులను వినియోగించుకుంటూ, పాక్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతును విరమించుకునే వరకు సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది. భారతదేశం మున్ముందు ఈ ఒప్పందం ప్రకారం తన బాధ్యతలను నిర్వర్తించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ విషయంలో ఏ మధ్యవర్తిత్వ న్యాయస్థానం జోక్యం తమ ఉనికిలో లేదని తెలిపింది.ఇది కూడా చదవండి: ఖమేనీ జోలికొస్తే ఖబడ్డార్: ట్రంప్కు ఇరాన్ వార్నింగ్ -
సుంకాలపై ట్రంప్ కొత్త ట్విస్ట్.. అధ్యక్ష పదవిపై సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పలు దేశాలపై విధించే సుంకాల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. సుంకాలపై నిర్ణయం తీసుకోవడానికి అమెరికాకు చాలా వెసులుబాటు ఉందన్నారు. సుంకాలను తిరిగి విధించడానికి జులై తొమ్మిది గడువును ఇప్పుడే నిర్ణయించలేమని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇక.. తాజాగా, అమెరికా అధ్యక్ష పదవిని ఉద్దేశిస్తూ ఆ పదవిలో ఉండటం చాలా ప్రమాదకరమని ఆయన తెలిపారు.అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికా దిగుమతుల విషయంలో సుంకాలపై నిర్ణయం తీసుకోవడానికి మాకు స్వేచ్చ ఉంది. సుంకాల విధింపును అనుకున్న సమయం కంటే కుదించవచ్చు లేదా పొడిగించవచ్చు. అయితే, నేను వ్యక్తిగతంగా తొందరగా ముగించడానికే ఇష్టపడతాను. మీ అందరికీ ఓ విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు 25 శాతం చెల్లిస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు. అయితే సుంకాలపై పెంపు నిర్ణయం మరింత వాయిదా పడే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బీసెంట్ సంకేతాలు ఇచ్చారు. అమెరికా కార్మిక దినోత్సవం (సెప్టెంబర్ 1) నాటికి ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు.కెనడాతో కష్టం..అలాగే, కెనడాతో వాణిజ్య చర్చలు ముగిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. అమెరికన్ కంపెనీలపై విధిస్తున్న డిజిటల్ ట్యాక్స్ను దాడిగా అభివర్ణించారు. ఇందుకు దీటుగా కెనడాపై కూడా సుంకాలు విధిస్తామని అన్నారు. త్వరలో ఈ వివరాలు వెల్లడిస్తానని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. ‘ఇది చాలా దారుణమైన పన్ను, అందుకే కెనడాతో వాణిజ్య చర్చలన్నిటికీ తక్షణం ముగింపు పలుకుతున్నాము. కెనడాతో వాణిజ్యం చాలా కష్టం. వారు తమ తీరు మార్చుకునే వరకూ ఎలాంటి చర్చలూ ఉండవు’ అని పేర్కొన్నారు.అధ్యక్ష పదవి డేంజర్..ఇక, తాజాగా ట్రంప్ హైట్హౌస్లో మీడియాతో మాట్లాడుతూ గతేడాది పెన్సిల్వేనియాలో అధ్యక్ష ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన హత్యాయత్నాన్ని ట్రంప్ గుర్తుచేసుకున్నారు. అనంతరం, ట్రంప్.. అధ్యక్ష పదవి ప్రమాదకరమైనది. ఎన్నో సవాళ్లతో కూడుకొని ఉంటుందని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడి బాధ్యతలను కారు రేసింగ్, బుల్ రైడింగ్ లాగే ఇక్కడ కూడా చావు ఎప్పుడు ఎదురవుతుందో చెప్పలేమన్నారు. ఈవిషయం తనకు ఎవరైనా ముందే చెప్పి ఉంటే.. తాను ఈ రేసులో ఉండేవాడిని కాదన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన వృత్తి అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, గతంలో ట్రంప్పై పలుమార్లు హత్యాయత్నాలు జరిగిన సంగతి తెలిసిందే. గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్పై హత్యాయత్నం జరిగింది.HOLY SH*T 🚨 President Trump just ENDED trade talks with Canada announcing massive tariffs soonAMERICA WILL NOT BE BULLIEDWE WILL NOT BACK DOWN pic.twitter.com/voOXgaBEes— MAGA Voice (@MAGAVoice) June 27, 2025ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చాక పలు దేశాలపై భారీగా టారిఫ్లు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆయా దేశాలతో ఎగుమతులు, దిగుమతుల టారిఫ్లపై నిర్ణయం తీసుకోవడం, వాణిజ్య ఒప్పందం చేసుకోవడం కోసం 90 రోజుల పాటు పెంచిన సుంకాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ గడువు జులై తొమ్మిదో తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
ఖమేనీ జోలికొస్తే ఖబడ్డార్: ట్రంప్కు ఇరాన్ వార్నింగ్
టెహ్రాన్: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ విరమణ అనంతరం పలు వ్యాఖ్యలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఇరాన్ మరోమారు హెచ్చరించింది. అధ్యక్షుడు ట్రంప్ నిజంగా తమతో ఒక ఒప్పందానికి రావాలనుకుంటే, ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖమేనీ విషయంలో అగౌరవ, ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలను చేయకూడదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి పేర్కొన్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ నేత ఖమేనీపై చేసిన వ్యాఖ్యలను అబ్బాస్ అరఘ్చి ఖండించారు. ట్రంప్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో నిజాయితీ వ్యవహరించాలనుకుంటే ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ విషయంలో అగౌరవంగా మాట్లాడకూడదన్నారు. ట్రంప్ తన అనుచిత వ్యాఖ్యలతో ఖమేనీ అభిమానులు, మద్దతుదారులను బాధపెడుతున్నారని అబ్బాస్ అరఘ్చి ఆరోపించారు.ఇరాన్ క్షిపణులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ అమెరికాను ఆశ్రయించిందని, ఇంతకుమించి ఆ దేశానికి మరో మార్గం లేదని అబ్బాస్ అరఘ్చి వ్యాఖ్యానించారు. ఇరానియన్ ప్రజలు.. బెదిరింపులు, అవమానాలకు లొంగిపోరని విదేశాంగ మంత్రి అన్నారు. ఇరాన్ సుప్రీం నేత ఖమేనిని హత్య నుండి రక్షించానని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో పేర్కొన్న దరమిలా అబ్బాస్ అరఘ్చి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తమతో చర్చలకు తిరిగి రావాలని ట్రంప్ కోరారు. అయితే అమెరికాతో అణు చర్చలను తిరిగి ప్రారంభించేదిలేదని ఇరాన్ స్పష్టం చేసింది.ఇది కూడా చదవండి: ‘శశి థరూర్.. ఒవైసీ వేరుకాదు’: జావేద్ అక్తర్