breaking news
International
-
భారత్లో ట్రంప్ అధిక పన్నుల ఎఫెక్ట్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అనేక దేశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ జాబితాలో భారత్ కూడా ఉంది. ట్రంప్ అధిక పన్నుల ప్రభావంతో ఎగుమతులు లేక చాలా మంది ఉపాధి కోల్పోయారు. అంతే కాకుండా ఫీజులు కట్టలేక తమ పిల్లలను పాఠశాలలకు మాన్పించేస్తున్నారు. తుంటరి ట్రంప్ నిర్ణయాలు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో ఏవరు చెప్పడం చాలా కష్టం. స్నేహ హాస్తం అందిస్తూనే చేయి తీసేయడం ట్రంప్కు అలవాటుగా మారింది. ఆయన అధికారం చేపట్టిన తర్వాత అమెరికా- భారత్ ద్వైపాక్షిక సంబంధాలు మెరుగైతాయని అందరూ ఆశిస్తే దానికి భిన్నంగా జరిగింది. పాకిస్థాన్ అంశంలోనూ భారత్కు వ్యతిరేకంగా నిలిచిన ట్రంప్ అనంతరం రష్యానుంచి చమురు కొనకూడదని భారత్కు ఆంక్షలు విధించారు. భారత్ ఆ మాటల్ని ఖాతరు చేయకపోవడంతో పన్నులు 50 శాతం పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు.అయితే ట్రంప్ పన్నుల ఎఫెక్ట్ గుజరాత్ సూరత్లోని వజ్రాల కార్మికుల కుటుంబాలపై పడింది. టాక్సులు 50 శాతానికి చేరడంతో వాటి ధరలు పెరిగి అమెరికాకు ఎగుమతయ్యే జువెల్లర్స్ చాలా తగ్గాయి. దీంతో దానిపై ఆధారపడిన ఎన్నో కుటుంబాలు ఉపాధి కోల్పోయారు. ఈ ప్రభావంతో వారి పిల్లలు పాఠశాలలు మానేయ్యాల్సి వచ్చిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.ఈ శీతాకాల పార్లమెంటు సెషన్లో విద్యార్థులు స్కూల్ డ్రాపౌట్స్పై నివేదిక అందించారు. అందులో 2025-26 గుజరాత్లో పాఠశాల మానేసిన విద్యార్థుల సంఖ్య 2.4 లక్షలుగా ఉంది. గతేడాది 50,541తో పోలిస్తే దాదాపు నాలిగింతలు పెరిగింది. ప్రైవేట్ పాఠశాలలే కాకుండా సూరత్లోని ప్రభుత్వ పాఠశాలలోనూ దాదాపు 600కు పైగా విద్యార్థులు తమ చదువు మధ్యలో విద్యను ఆపేసినట్లు నివేదికలు తెలిపాయి.ఇండియన్ డైమండ్ ఇనిస్టిట్యూట్ ఛైర్పర్సన్ దినేశ్ నవదీయా మాట్లాడుతూ.. "గతంలో వజ్రాల కార్మికులు నెలకు రూ. 30 నుంచి 35 వేలు సంపాదించేవారు ప్రస్తుతం ఆ మెుత్తం దాదాపు రూ. 20వేలకు పడిపోయింది. దీంతో ఇంటి అద్దెలు , ఇతర నిత్యావసరాల ధరలు పెరిగి పిల్లలను స్కూలు ఫీజులు కట్టలేకపోతున్నారు" అని తెలిపారు. ట్రంప్ పన్నుల ప్రభావం వజ్రాల పరిశ్రమపై అధికంగా పడిందని పేర్కొన్నారు. అధిక పన్నుల ప్రభావంతో 50వేల మంది ఉద్యోగులు రాత్రికి రాత్రే ఉద్యోగాలను కోల్పోయారని తెలిపారు. కాగా భారత్ నుంచి ఎగుమతయ్యే పాలిష్ చేసిన వజ్రాలకు అమెరికా అతిపెద్ద మార్కెట్గా ఉంది. భారత్ నుంచి ఎగుమతయ్యే వజ్రాలలో దాదాపు 40 శాతం ఆ దేశానికే వెళతాయి. -
అమెరికా ‘కస్టడీ’లో ఇద్దరు భారత విద్యార్థులు
న్యూఢిల్లీ: అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులకు ఆందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. సెయింట్ లూయిస్ పార్క్లోని ఓ ప్రముఖ భారతీయ రెస్టారెంట్లో అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అక్కడ పనిచేస్తున్న పలువురు సిబ్బందిని ప్రశ్నించిన అధికారులు.. ఇద్దరు భారతీయ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.ప్రాథమిక సమాచారం ప్రకారం వీసా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలతోనే ఈ ఇద్దరు విద్యార్థులను కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా ఈ విద్యార్థులు తమ వీసా నిబంధనలకు విరుద్ధంగా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్నందువల్లే ఈ చర్యలు తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతర్జాతీయ విద్యార్థులకు ఉపాధి కల్పిస్తున్న ప్రదేశాలపై ఇటీవలి కాలంలో అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు నిఘా పెంచారు. గత కొన్ని నెలలుగా అనధికారిక ఉపాధి,వీసా నిబంధనల అమలుపై ఐసీఈ అధికారులు పలు రాష్ట్రాల్లో ఈ తరహా చర్యలను ముమ్మరం చేశారు. BREAKINGICE reportedly detained two Indian students at an Indian restaurant in St. Louis Park yesterday afternoon.STUDENTS, BE VERY CAREFUL. DO NOT TAKE UP ANY PART TIME JOBS THAT ARE NOT LEGALLY ALLOWED. pic.twitter.com/WmEwnAAIVf— M9 USA🇺🇸 (@M9USA_) January 16, 2026విద్యార్థులు చట్టవిరుద్ధంగా పనిచేస్తున్నారన్న అనుమానంతో పలు చోట్ల సోదాలు నిర్వహిస్తుండటానికి తోడు తాజా అరెస్టులతో అక్కడి భారతీయ విద్యార్థుల్లో ఆందోళన మరింతగా పెరిగింది. ఈ ఘటన నేపథ్యంలో విద్యార్థి సంఘాలు, నిపుణులు భారతీయ విద్యార్థులను అప్రమత్తం చేస్తున్నారు. ఇమిగ్రేషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, సరైన అనుమతులు లేకుండా క్యాంపస్ బయట ఉద్యోగాలు చేయడం లాంటి పొరపాట్లు చేయవద్దని సూచిస్తున్నారు. ఇటువంటి ఉల్లంఘనలు.. డిటెన్షన్, వీసా రద్దు లేదా దేశ బహిష్కరణ వంటి తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు.ఇది కూడా చదవండి: కెనడాలో హత్య చేసొచ్చి.. పంజాబ్లో హల్చల్! -
అమెరికా దెబ్బకు విదేశీ విద్యా రుణ వ్యవస్థ డీలా
విదేశీ విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు అమెరికా వీసా నిబంధనలు సవాలుగా మారుతున్నాయి. అమెరికా వీసా విధానంలో వస్తున్న మార్పుల కారణంగా విదేశీ విద్యా రుణాల మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ), ఎడ్యుకేషన్ లోన్ ప్లాట్ఫారమ్ల గణాంకాల ప్రకారం, 2024తో పోలిస్తే 2025 సంవత్సరంలో విదేశీ విద్యా రుణాలు 30 నుంచి 50 శాతం వరకు క్షీణించాయి.తగ్గుతున్న రుణాల పరిమాణంఅమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గడంతో ఆ దేశానికి సంబంధించిన రుణాల పరిమాణం ఏకంగా 60 శాతం పడిపోయింది. విద్యార్థులు యూకే, ఫ్రాన్స్, జర్మనీ, తూర్పు యూరప్ దేశాల వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ అమెరికా యూనివర్సిటీల స్థాయిలో రుణాల పరిమాణం ఉండటం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఆర్బీఐ డేటారిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన విదేశీ రిమిటెన్సుల గణాంకాలు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. విదేశీ విద్య కోసం భారత్ నుంచి పంపే నిధుల ప్రవాహంలో (రిమిటెన్సులు) స్పష్టమైన తగ్గుదల కనిపిస్తోంది. ముఖ్యంగా జనవరిలో ప్రారంభమయ్యే ‘స్ప్రింగ్ అడ్మిషన్ సీజన్’ను పరిశీలిస్తే.. 2024 జనవరిలో 449 మిలియన్ డాలర్లుగా ఉన్న రిమిటెన్సులు 2025 జనవరి నాటికి 368 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. అంటే ఈ కాలంలో సుమారు 18 శాతం మేర తగ్గుదల నమోదైంది.అత్యధిక అడ్మిషన్లు జరిగే ఆగస్టు ‘ఫాల్ సీజన్’లో ఈ క్షీణత మరింత తీవ్రంగా ఉంది. 2024 ఆగస్టులో విదేశీ విద్యా అవసరాల కోసం 416 మిలియన్ డాలర్లు భారత్ నుంచి వెళ్లగా, 2025 ఆగస్టు నాటికి ఆ మొత్తం 319 మిలియన్ డాలర్లకు పరిమితమైంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సీజన్లో ఏకంగా 23 శాతం తగ్గుదల కనిపిస్తోంది. ఇది విదేశీ విద్యా రుణ మార్కెట్పై ఉన్న ఒత్తిడిని, విద్యార్థుల విదేశీ ప్రయాణాల్లో వచ్చిన మార్పును స్పష్టంగా సూచిస్తోంది.(గమనిక: పైన తెలిపిన గణాంకాల్లో విద్యార్థుల జీవన వ్యయం కూడా కలిసి ఉంది)నిపుణుల హెచ్చరికఅభివృద్ధి చెందిన దేశాల్లో నెలకొన్న అనిశ్చితి వల్ల సమీప భవిష్యత్తులో విద్యా రుణాల వృద్ధి మందగించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇన్క్రెడ్ ఫైనాన్షియల్ తన ఆస్తుల నిర్వహణలో 24 శాతం విద్యా రుణాలు ఉండటంతో ఈ ఒత్తిడిని అధిగమించేందుకు ప్రాపర్టీ లోన్ల వంటి ఇతర విభాగాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపింది. విద్యా రుణాలిచ్చే బోర్డర్ప్లస్ కంపెనీ ఒకటి రెండు సంవత్సరాల వరకు కొత్త రుణాల మంజూరు బలహీనంగానే ఉంటుందని తెలిపింది.ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, యాక్సిస్ వంటి బ్యాంకులు.. అవాన్స్, క్రెడిలా వంటి ఎన్బీఎఫ్సీలు ఈ విభాగంలో ప్రధానంగా సర్వీసులు అందిస్తున్నాయి. అమెరికా వీసా విధానాల్లో సానుకూల మార్పులు వచ్చే వరకు ఈ రంగంలో ఇదే రకమైన స్తబ్దత కొనసాగే అవకాశం కనిపిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.ఇదీ చదవండి: భారత వలసదారులపై అమెరికాకు కోపమెందుకు? -
ఖమేనీ ప్రభుత్వానికి థాంక్స్ చెప్పిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇరాన్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్లో నిరసనల్లో అరెస్టైన వందలాది మందిని ఉరి తీయాలని తొలుత అక్కడి ప్రభుత్వం భావించింది. ఈ పరిణామం అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే.. ఏమైందోగానీ వాటిని వాయిదా వేసింది. అయితే.. ఆ నిర్ణయాన్ని ఇప్పుడు పూర్తిగా రద్దు చేసిందట. ఈ విషయాన్ని ట్రంపే స్వయంగా ప్రకటించారు.ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఇలా చెప్పుకొచ్చారు.. నిన్న జరగాల్సిన 800కిపైగా ఉరి శిక్షలను ఇరాన్ నాయకత్వం రద్దు చేసింది. ఈ పని చేసినందుకు ధన్యవాదాలు. ఈ చర్యతో వాళ్లపై గౌరవం పెరిగింది’’ అంటూ పోస్ట్ చేశారు. నిన్న మొన్నటిదాకా సైనిక చర్యకు ఉవ్విళ్లూరిన ట్రంప్.. హఠాత్తుగా ఇలా వెనక్కి తగ్గడం అమెరికా–ఇరాన్ సంబంధాల విషయంలో ఒక కొత్త మలుపు అనే చెప్పొచ్చు.ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, పెరిగిన ధరలు, రాజకీయ ఆంక్షలు, మహిళల స్వేచ్ఛ అణచివేత.. ఈ కారణాలతో ఇరాన్ వ్యాప్తంగా డిసెంబర్ 28వ తేదీ నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి. ఖమేనీ ప్రభుత్వం గద్దె దిగాలని.. బహిష్కృత యువరాజు రెజా పహ్లావి తిరిగి ఇరాన్లో అడుగుపెట్టాలని నినాదాలతో ప్రధాన నగరాలను అట్టుడికి పోయేలా చేశారు. అయితే వేలాది మంది నిరసనకారులు అరెస్టు అయ్యారు. వాళ్లను విదేశీ శక్తులకు సహకరించే శక్తులుగా పేర్కొంటూ ఉరి తీయాలని ఖమేనీ ప్రభుత్వం, అక్కడి న్యాయవ్యవస్థ నిర్ణయించింది. ఇదీ చదవండి: ఎప్పుడేం చేయాలో ట్రంప్నకు తెలుసు ‘‘ఇంటర్నెట్ బ్లాకౌట్ జరిగిన వెంటనే.. 3 వేల మంది విదేశీ గూఢచారులను అరెస్టు చేశాం. గూఢచర్యం నేరానికి ఇరాన్లో మరణశిక్ష ఉంటుంది. మేం అరెస్టు చేసిన విదేశీయులంతా నిరసనకారుల ముసుగులో అల్లర్లను రెచ్చగొట్టారు. వారంతా సుశిక్షితులైన ఉగ్రవాదులు’’ అని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ) ఆరోపించింది. ఈ నిర్ణయాన్ని మానవ హక్కుల సంస్థలు, అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించాయి.అమెరికా అధ్యక్షుడు కూడా ముందుగా ఇరాన్ చర్యలపై హెచ్చరికలు జారీ చేసి.. శిక్షలు అమలు చేస్తే సైనిక చర్యలు తీసుకోవచ్చని సూచించారు. అదే సమయంలో ఇరాన్తో చర్చలు ఉండొచ్చనే సంకేతాలు కూడా ఇచ్చారు. అయితే ఆందోళనకారుల విషయంలో వెనక్కి తగ్గబోమని ఇరాన్ ప్రకటించడంతో ఆయన మరోసారి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అయితే ఈ విషయంలో ఇరాన్ అనూహ్యంగా వెనక్కి తగ్గడం, ట్రంప్ ధన్యవాదాలు తెలపడం ఒక విధంగా ఉద్రిక్తతలను తగ్గించే సంకేతంగా కనిపిస్తోంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. అమెరికా-ఇరాన్ మధ్యవర్తిత్వం విషయంలో ఏం జరిగిందో ఎవరికీ స్పష్టత లేదు. గల్ఫ్ దౌత్యం చేశాయని ప్రచారం ఉంది. అయితే ఎలాంటి ఒప్పందం కుదిరిందో(అణు చర్చకు సంబంధించి), లేదంటే చర్చల పురోగతిలో ఇది ముందడుగు మాత్రమేనా? అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. కానీ తాను చేసిన ఒత్తిడి వల్లే ఇరాన్ ఈ నిర్ణయం వెనక్కి తీసుకుందని కలరింగ్ ఇచ్చుకునే అవకాశం ఉంది. మరోవైపు.. అంతర్జాతీయంగా ట్రంప్పై ఒత్తిడి తెచ్చి ట్రంప్ను వెనక్కి తగ్గేలా చేశామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించుకుంది కూడా. కొసమెరుపు.. ఒకవైపు నిరసనకారుల మరణశిక్ష విషయంలో ఖమేనీ ప్రభుత్వం వెనక్కి తగ్గగా.. వారందరినీ చంపేయాలంటూ అక్కడి మత పెద్ద ఒకరు ఫత్వా జారీ చేశారు. రాజధాని టెహ్రాన్కు చెందిన అహ్మద్ ఖటామీ అనే మతాధికారి శుక్రవారం ప్రార్థనల అనంతరం.. ‘‘ఇది దేవుని తీర్పు. అల్లాహ్ మా వెనక ఉన్నాడు. ఇరాన్ ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధానికి మానసికంగా సిద్ధంగా ఉంది’’ అంటూ జనం కోలాహలం మధ్య ప్రకటించాడు. -
పెదాలు కదిలించే రోబో సింగర్!
అవడానికి అదో యంత్రుడే. అయితేనేం? సుమధుర గాత్రం దాని సొంతం. ఎంచక్కా పాడగలదు. అంతేనా? తాను ఆలపించిన పాటలతో ఏకంగా ఓ ఆల్బం కూడా విడుదల చేసేసింది! కొలంబియాకు చెందిన ఈ రోబో ఘనత అక్కడితో ఆగిపోలేదు. పాటలకు సరిగ్గా సరిపోయే విధంగా లిప్సింక్ కూడా ఇవ్వడం దీని ప్రత్యేకత. ఈ అరుదైన రోబోను కొలంబియా ఇంజనీర్లు అభివృద్ధి చేశారు. హ్యూమనాయిడ్లతో సమాచార మారి్పడి మరింత వాస్తవికంగా ఉండేందుకు ఇది తోడ్పడుతుందని వారంటున్నారు.యూట్యూబ్ వీడియోలు చూసి...లిప్ సింకింగ్ రోబో తాలూకు ఘనత వెనక కొలంబియా సైంటిస్టుల అవిశ్రాంత శ్రమ దాగుంది. క్రియేటివ్ మెషీన్స్ ల్యాబ్కు చెందిన ప్రొఫెసర్ హోడ్ లిప్సన్ బృందం ఇందుకోసం రొటీన్కు భిన్నంగా వెళ్లి మరీ ప్రయోగం చేసింది. ప్రతి అచ్చుకూ, హల్లుకూ రూల్స్ ఫ్రేం చేసే సాధారణ పద్ధతికి బదులుగా ఓ చిన్నారి ఎలా మాటలు నేర్చుకుంటుందో ఈ రోబో కూడా అచ్చం అలాగే నేర్చుకునేటట్టు చేశారు. దాని మృదువైన రోబో శరీరం కింద 26 బుల్లి మోటార్లు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నుంచి దాని ‘స్వర సాధన’మొదలైంది. ముందుగా అద్దం ముందు గంటల తరబడి గడిపింది. సొంత ముఖ కవళికలనే వేలాది రకాలుగా మారుస్తూ, వాటిని తన జ్ఞాపకాల్లో పదిల పరుచుకుంటూ వచ్చింది. అలా తన ముఖాన్ని పూర్తిస్థాయిలో గుర్తు పెట్టుకున్నాక పరిశీలనాత్మక అభ్యసన వైపు మళ్లింది. అంటే ఇతరుల మాటతీరును లోతుగా పరిశీలించింది. ఇందుకోసం ఏఐ సాయంతో యూట్యూబ్లో గంటల తరబడి వీడియోలు చూస్తూ గడిపింది. ఎవరెలా మాట్లాడుతున్నదీ, పాడుతున్నదీ నిశితంగా గమనించింది. ఏ సందర్భంలో పెదాలు ఎలా కదులుతున్నదీ గుర్తు పెట్టుకుంటూ వెళ్లింది. అలా ఎట్టకేలకు ఆడియో సిగ్నళ్లను నేరుగా మోటార్ మూవ్మెంట్స్గా మార్చడంలో విజయం సాధించింది. ఏం మాట్లాడినా దాదాపుగా అందుకు తగ్గట్టుగా పెదాలను కదల్చగల సామర్థ్యాన్ని కూడా సంతరించుకుంది. తన సరికొత్త నైపుణ్యాన్నంతా రంగరించి ‘హెలో వరల్డ్’పేరిట సొంత పాటల ఆల్బం కూడా రూపొందించేసిందీ గాయక రోబో! అందులోని ఓ పాటను, పలు భాషల్లో మాటలను పెదాల కలయికతో పాటుగా ఇటీవలే ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంది కూడా.యంత్రానికి మానవీయ కోణం రోబోకు మానవీయ కోణాన్ని జోడించాలన్నదే తమ ప్రయత్నమని ప్రొఫెసర్ లిప్సన్ వివరించారు. ‘‘బి, డబ్ల్యూ వంటి ఆంగ్ల శబ్దాలను పలకడం మా రోబోకు ఇప్పటికీ సవాలుగానే ఉంది. త్వరలోనే వీటినీ అధిగమిస్తుందన్న నమ్మకం మాకుంది’’అని ధీమా వెలిబుచ్చారు. మనుషులతో కమ్యూనికేట్ చేసిన కొద్దీ అది మరింత మెరుగవుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘రోబోల తయారీలో వాటి నడక, దేన్నయినా పట్టుకోగల నేర్పు వంటివాటికే ప్రాధాన్యమిస్తుంటారు. కానీ ప్రేమ, ఆప్యాయత, ఇష్టం వంటి భావోద్వేగాలను చూపేందుకు ముఖ కవళికలే చాలా ముఖ్యం. ఇప్పటిదాకా రూపొందిన రోబోల్లో ఈ అతి ముఖ్యమైన కోణం లోపించింది. పెద్దలకు రోజువారీ పనుల్లో, లేదా పిల్లలకు చదువులో సాయపడే రోబోలు వారికి ఎంతగా దగ్గరైతే ఫలితం అంత మెరుగ్గా ఉంటుంది. ముఖ కవళికలు ఇందుకు బాగా దోహదపడగలవు. ఈ విషయంలో మేం చెప్పుకోదగ్గ విజయమే సాధించాం. వచ్చే దశాబ్ద కాలంలో కనీసం 100 కోట్ల హ్యూమనాయిడ్ రోబోలు పుట్టుకొస్తాయంటున్న అంచనాల నేపథ్యంలో వాటితో మనుషులు మరింత దగ్గరితనం ఫీలయ్యేందుకు మా టెక్నాలజీ ఎంతగానో దోహదపడనుంది. జీవకళ ఉట్టిపడే రోబో వారికి సాటిమనిíÙతోనే గడిపిన భావం కలిగించగలదు. కనుక ఇకపై రోబోలు కేవలం మీ ఆజ్ఞలను పాటించడంతోనే సరిపెట్టవు. మీ కళ్లలోకి చూస్తూ నవ్వుతాయి. అప్పుడు మనకు కలిగే భావాలకు వెలకట్టగలమా?’’అన్నారు ప్రొఫెసర్ లిప్సన్. ఈ సరికొత్త లిప్ సింకింగ్ రోబోకు సంబంధించిన వివరాలను సైన్స్ రోబోటిక్ జర్నల్లో ప్రచురించారు.మనిషిని దాదాపుగా అన్ని విషయాల్లోనూ రోబోలు అనుకరించేస్తున్న రోజులివి. కాకపోతే ఎంత చేసినా వాటిలోని కృత్రిమత్వం మాత్రం కొట్టొచ్చినట్టుగా కని్పస్తూనే ఉంటుంది. బిగుసుకుపోయినట్టుగా ఉండటం, జీవంలేని రూపం వాటికీ మనిíÙకీ తేడాను ఎప్పటికప్పుడు పట్టిస్తూనే ఉంటుంది. మిగతా శరీరం మాటంతా ఎలా ఉన్నా కనీసం ముఖం వరకూ అయినా మనిషి మాదిరిగా భావాలు పలకడం రోబోలకు ఇప్పటిదాకా సాధ్యపడని విషయమే. ముఖ్యంగా ఇప్పటిదాకా తయారైన స్పీకింగ్ రోబోలు మాటలకు తగ్గట్టుగా పెదాలను కదిలించలేవు. సరిగ్గా ఈ అడ్డంకినే కొలంబియా సైంటిస్టులు ఇప్పుడు విజయవంతంగా దాటేశారు. మాటలకు, పాటలకు పెదాల కదలిక (లిప్ సింక్) సరిగ్గా సరిపోయేలా వారు రూపొందించిన సరికొత్త రోబో ఇప్పుడు అందరినీ తెగ ఆకర్షిస్తోంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నాం
మాస్కో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రాజుకుంటున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ఇరాన్, ఇజ్రాయెల్ నేతలతో ఫోన్లో మాట్లాడారు. మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు సిద్ధంగా ఉన్నామని, సంబంధిత పక్షాలతో నిర్మాణాత్మక చర్చలను ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో మాట్లాడిన పుతిన్.. ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, పశ్చిమాసియాలో పరిస్థితులపై చర్చించారని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ తెలిపింది. ప్రాంతీయ స్థిరత్వం, భద్రత కోసం రాజకీయ, దౌత్యపరమైన ప్రయత్నాలకు సానుకూలంగా ఉన్నామని చెప్పారు. అన్ని స్థాయిల్లో సంబంధాలను కొనసాగించేందుకు ఇరువురు నేతలు అంగీకరించారని క్రెమిన్ వెల్లడించింది. అదేవిధంగా, ఆర్థిక సమస్యల కారణంగా కొనసాగుతున్న నిరసనలను చల్లార్చి, దేశంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఫోన్లో పుతిన్కు వివరించారని కూడా తెలిపింది. ఐరాసతోపాటు ఇతర ప్రపంచ వేదికలపై ఇరాన్ వైఖరికి మద్దతు తెలిపేందుకు అంగీకరించిన రష్యా అధ్యక్షుడు పుతిన్కు పెజెష్కియాన్ ధన్యవాదాలు తెలిపినట్లు ఇరాన్ వార్తా సంస్థ తెలిపింది. ఇలా ఉండగా, ఇరాన్ అణు నిరాయు«దీకరణకు అంగీకరిస్తే ఈ సమస్యకు దౌత్యపరమైన పరిష్కారం లభించినట్లేనని ట్రంప్ దూత స్టీవ్ విట్కాఫ్ చెప్పారని టాస్ పేర్కొంది. అలా జరక్కుంటే పరిస్థితి దారుణంగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించినట్లు కూడా తెలిపింది. -
కెనడా, చైనా స్నేహగీతం
బీజింగ్: కెనడా క్రమంగా అమెరికాకు దూరమవుతూ చైనాకు దగ్గరవుతోంది. చైనా నుంచి దిగుమతయ్యే ఎలక్ట్రానిక్ వాహనాలపై టారిఫ్లను 100 శాతం తగ్గించనున్నట్టు కెనడా ప్రధాని మార్క్ కార్నీ శుక్రవారం ప్రకటించారు. కెనడా వ్యవసాయ ఉత్పత్తులపై చైనా ఇప్పటికే టారిఫ్లను 84 శాతం నుంచి 15 శాతానికి తగ్గించింది. ఇరుదేశాల నేతలు రెండు రోజుల క్రితం బీజింగ్లో సమావేశమయ్యారు. వాణిజ్య బంధం బలోపేతం చేసుకోవాలని నిర్ణయానికొచ్చారు. ఐదేళ్లలో చైనా నుంచి 70 వేలకు పైగా ఈవీలను దిగుమతి చేసుకుంటామని కార్నీ వెల్లడించారు. గత రెండు రోజులు చరిత్రాత్మక, ఫలవంతమైన దినాలు అంటూ వ్యాఖ్యానించారు. కెనడాతో సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్తామని చైనా అధినేత జీ జిన్పింగ్ స్పష్టంచేశారు. గత ఏడాది అక్టోబర్లో మార్క్ కార్నీతో సమావేశమయ్యాయని, చైనా–కెనడా సంబంధాల్లో అప్పుడే నూతన అధ్యాయం ప్రారంభమైందని స్పష్టంచేశారు. గత ఎనిమిదేళ్లలో చైనాలో పర్యటించిన తొలి కెనడా ప్రధానిగా మార్క్ కార్నీ రికార్డుకెక్కారు. వాస్తవానికి కెనడా, చైనాల మధ్య టారిఫ్ల యుద్ధం నడిచింది. అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్న తర్వాత కెనడా ప్రభుత్వం చైనా వైపు మొగ్గుచూపుతోంది. -
అమెరికాతో అత్యుత్తమ వాణిజ్య ఒప్పందం
తైపీ: అమెరికాతో అత్యుత్తమ వాణిజ్య ఒప్పందం కుదిరిందని తైవాన్ ప్రధాని చో టుంగ్–టై ప్రకటించారు. అమెరికాతో వాణిజ్యంలో మిగులు ఉన్నప్పటికీ ఈ ఒప్పందం కుదరడంపై హర్షం వ్యక్తం చేశారు. తాజా ఒప్పందం ప్రకారం తైవాన్ ఉత్పత్తులపై 15 శాతం వరకు టారిఫ్లు తగ్గుతాయి. ప్రతిగా అమెరికాలో 25 వేల కోట్ల డాలర్ల మేర తైవాన్ కంపెనీలు పెట్టుబడులుగా పెడతాయి. ఇప్పటికే అమెరికా యూరోపియన్ యూనియన్, జపాన్లతో ఇలాంటి ఒప్పందాలే కుదుర్చుకుంది. ట్రంప్ ప్రభుత్వం తైవాన్పై వాస్తవానికి 32 శాతం టారిఫ్లను విధించింది. ఆ తర్వాత దానిని 20 శాతానికి తగ్గించింది. కాగా, తైవాన్తో అమెరికా తాజా వాణిజ్య ఒప్పందాన్ని చైనా వ్యతిరేకించింది. తమ భూభాగమైన తైవాన్తో దౌత్య సంబంధాలను నెలకొల్పుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తామంది. -
జంతువులా ఈడ్చుకెళ్లారు
వాషింగ్టన్: అమెరికాలో ఒక మహిళను ఇమిగ్రేషన్ అధికారులు కారులోనుంచి బలవంతంగా బయటకు లాగి అరెస్టు చేసి, చేతులు పట్టుకొని బరబరా ఈడ్చుకెళ్లడం సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన పట్ల అధికారులు దారుణంగా ప్రవర్తించారని బాధితురాలు ఆవేదన వ్యక్తంచేశారు. అలియా రెహ్మాన్(42) అమెరికా పౌరురాలు. ఇక్కడే జన్మించారు. మిన్నెపొలిస్ నగరంలో నివసిస్తున్నారు. చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజూరీ సెంటర్లో చికిత్స కోసం ముందే అపాయింట్మెంట్ తీసుకున్నారు. మంగళవారం కారులో అక్కడికి బయలుదేరారు. మధ్యలో ముఖాలకు మాస్క్లు ధరించిన ఇమిగ్రేషన్ ఏజెంట్లు అడ్డుకున్నారు. ఆమె కూర్చున్నవైపు కారు అద్దం పగులగొట్టారు. సీటు బెల్ట్ను కట్ చేశారు. డ్రైవర్ సీటు గుండా ఆమెను బయటకు లాగారు. కాళ్లు చేతులు పట్టుకొని ఈడ్చుకెళుతూ తమ వాహనంలోకి ఎక్కించారు. డిటెన్షన్ సెంటర్కు తరలించారు. ఆసుపత్రికి వెళ్లాల్సి ఉందని, వదిలిపెట్టాలని రోదిస్తూ వేడుకున్నా కనికరించలేదు. కనీసం చికిత్స అందించే ఏర్పాటు కూడా చేయలేదు. దాంతో బాధితురాలు చాలాసేపు స్పృహ కోల్పోయారు. చివరకు ఆమెను ఆసుపత్రికి తరలించారు. తాను ఇప్పటికీ బతికి ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని అలియా రెహ్మానచెప్పారు. ఒక జంతువును ఈడ్చుకెళ్లినట్లుగా తనను ఈడ్చుకెళ్లారని ఆవేదన వ్యక్తంచేశారు. మిన్నెపొలిస్లో అక్రమ వలసదారులపై ఇమిగ్రేషన్ అధికా రులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. వారిని గుర్తించడానికి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానితులను డిటెన్షన్ కేంద్రాలకు తరలించి ప్రశి్నస్తున్నారు. మరోవైపు వలసదారులకు మద్దతుగా ఆందోళనలు జరుగుతున్నాయి. -
సుడాన్కు ఆయుధాలు అమ్ముతున్న పాకిస్తాన్
సౌదీ అరేబియా నుంచి సూడాన్, లిబియా వరకు పాకిస్తాన్ సైనిక ఉనికి, ఆయుధాల విక్రయ పరిధి క్రమంగా విస్తరిస్తోంది. తాజా నివేదికల ప్రకారం.. సుడాన్కు యుద్ధ విమానాలు సహా ఆయుధాలను విక్రయించేందుకు పాకిస్తాన్ సిద్ధమవుతోంది.పాకిస్తాన్–సుడాన్ దేశాలు సుమారు 1.5 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల ఒప్పందంపై చర్చలు జరుపుతున్నట్లు రాయిటర్స్ నివేదించింది. ఈ ఒప్పందం త్వరలోనే ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుడాన్లో సైన్యం, పారామిలిటరీ సంస్థ అయిన రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య గత దాదాపు మూడేళ్లుగా తీవ్ర అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఈ సంఘర్షణలో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. మహిళలు, పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణలను ఆర్ఎస్ఎఫ్ ఎదుర్కొంటోంది.అరబ్, ఆఫ్రికా దేశాల్లో ఆయుధాల విక్రయాలు, సైనిక ప్రభావాన్ని విస్తరించడం పాకిస్తాన్ దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. గతంలో పాకిస్తాన్ ప్రధానంగా అరబ్ దేశాల సాయుధ దళాలకు శిక్షణ అందించే పాత్రకే పరిమితమై ఉండగా, ఇప్పుడు నేరుగా ఆయుధాలు, యుద్ధ విమానాల ఎగుమతుల వైపు అడుగులు వేస్తోంది.ఈ ఒప్పందంలో ప్రధానంగా చర్చకు వస్తున్నది JF-17 థండర్ యుద్ధ విమానం. ఇది పాకిస్తాన్, చైనా సంయుక్తంగా అభివృద్ధి చేసిన తేలికపాటి, బహుళ-పాత్ర యుద్ధ విమానం. పాకిస్తాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్, చైనాకు చెందిన చెంగ్డూ ఎయిర్క్రాఫ్ట్ కంపెనీ కలిసి దీనిని తయారు చేస్తున్నాయి. తాజా బ్లాక్-3 వెర్షన్లో ఆధునిక రాడార్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ యుద్ధ సాంకేతికత, సుదూర క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం ఉన్నాయి.ఒక్కో JF-17 యుద్ధ విమానం ధర సుమారు 25 నుంచి 30 మిలియన్ డాలర్లుగా అంచనా. ఇది పాశ్చాత్య దేశాల యుద్ధ విమానాలతో పోలిస్తే చాలా తక్కువ కావడంతో, పరిమిత రక్షణ బడ్జెట్ ఉన్న దేశాలకు ఇది ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. -
ఇరాన్పై దాడులు లేనట్లే!
వాషింగ్టన్: ఇరాన్ విషయంలో పూర్తి సంయమనం పాటించాలని అమెరికాతో సన్నిహితంగా మెలిగే పలు మధ్య ప్రాచ్య దేశాలు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఇరాన్పై దాడులు చేయొద్దని అమెరికాను కోరినట్లు అరబ్ దౌత్యవేత్త ఒకరు చెప్పారు. అయతొల్లా అలీ ఖమేనీ నాయకత్వంలోని ఇరాన్పై సైనిక చర్య తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని రోజులుగా సంకేతాలిస్తున్నారు. నిరసనకారులపై దమనకాండ ఆపకపోతే భీకర దాడులకు దిగుతామని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాల పట్ల ఈజిప్టు, ఒమన్, సౌదీ అరేబియా, ఖతార్ తదితర దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆయాదేశాల అత్యున్నత దౌత్యవేత్తలు తాజాగా సమావేశమై చర్చించుకున్నారు. ఇరాన్పై ఇప్పుడు సైనిక చర్యకు పాల్పడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థను మరింత అస్థిరంగా మార్చొద్దని విన్నవించారు. మధ్యప్రాచ్య దేశాల విజ్ఞప్తిని ట్రంప్ మన్నించినట్లే కనిపిస్తోంది. ఆయన కొంత మెత్తబడ్డారు. ఇరాన్పై దాడులకు దిగే ఆలోచన లేదని ప్రకటించారు. సానుకూల సంకేతాలు రావడంతో గురువారం చమురు ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. 26 ఏళ్ల యువకుడు ఇర్ఫాన్ సుల్తానీకి విధించిన మరణ శిక్షను ఇరాన్ ప్రభుత్వం రద్దు చేయడంపై ఫాక్స్న్యూస్లో ప్రచురితమైన వార్తను ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఎప్పుడేం చేయాలో ట్రంప్కు తెలుసు మరోవైపు వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ భిన్న స్వరం వినిపించారు. ఇరాన్ను డీల్ చేసే విషయంలో అన్ని రకాల ఐచి్ఛకాలు ట్రంప్ చేతిలో ఇప్పటికీ ఉన్నాయని స్పష్టంచేశారు. ఎప్పుడేం చేయాలో ఆయనకు తెలుసని ఉద్ఘాటించారు. ఇరాన్లోని క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని వెల్లడించారు. ఆగని ఆందోళనలు ఇరాన్లో పరిస్థితులు కుదుటపడే సూచనలు కనిపించడం లేదు. ఖమేనీ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జనం వీధుల్లోకి వచి్చ, ఖమేనీపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. నిరసనకారులకు, భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన ఘర్షణలో ఇప్పటిదాకా కనీసం 2,637 మంది మరణించారు. వాస్తవ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుందని స్థానిక ప్రసార మాధ్యమాలు చెబుతున్నాయి. ఆ ఆలోచన ఇంకా ఉంది ఇరాన్ సైనిక చర్య అనే ఆలోచన ఇంకా ఉందని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి మైక్ వాల్జ్ పేర్కొన్నారు. గురువారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అత్యవసర సమావేశం జరిగింది. అమెరికాతోపాటు ఇరాన్ ప్రతినిధులు పాల్గొన్నారు. అధ్యక్షుడు ట్రంప్ మాటల మనిషి కాదు, చేతల మనిషి అని మైక్ వాల్జ్ వ్యాఖ్యానించారు. ఇరాన్లో ప్రజల ఊచకోతను ఆపడానికి ట్రంప్ కట్టుబడి ఉన్నారని తెలిపారు. అందుకోసం అన్ని రకాల అవకాశాలను ఆయన ఉపయోగించుకుంటారని, ఆ విషయం ఇరాన్ నాయకత్వానికి బాగా తెలుసని స్పష్టంచేశారు. -
ఆ దేశంతో కలిసిపోతాం: మోల్డోవా
రష్యా ముప్పుతో ఓ యూరోపియన్ దేశం మరో దేశంలో విలీనం కావాలని భావిస్తోంది. 1918–1940 కాలంలో రొమేనియాలో భాగంగా ఉన్న మోల్డోవా.. తిరిగి రొమేనియాలో విలీనం కావాలని ప్రయత్నిస్తోంది. మోల్డోవా అధ్యక్షురాలు మాయా సంధు తమ అభిమతాన్ని బయటపెట్టారు. ఇటీవల ఒక ప్రకటనలో “ఒక వేళ రిఫరెండమ్ జరిగితే విలీనానికి అనుకూలంగా ఓటు వేస్తానని” తెలిపారు. రష్యా ముప్పును ఎదుర్కోవడానికి ఇదే మార్గమని ఆమె భావిస్తున్నారు.ఉక్రెయిన్, రొమేనియా మధ్యలో ఉండే ఒక చిన్న దేశం మోల్డోవా. దీని జనాభా సుమారు 26 లక్షల వరకు ఉంటుంది. అయితే అధ్యక్షురాలి నిర్ణయంపై మోల్డోవా ప్రజల్లో మాత్రం భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోల్డోవాలోని ట్రాన్స్నిస్ట్రియా రష్యాకు చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. ట్రాన్స్డ్నీస్టర్ అని కూడా పిలిచే ఈ ప్రాంతం మోల్డోవా-ఉక్రెయిన్ సరిహద్దు, డ్నీస్టర్ నది మధ్యన ఉంటుంది. ఇక్కడ నాలుగున్నర లక్షల మందికి పైగా నివసిస్తున్నారు. వీరిలో సంప్రదాయ మోల్డోవాన్ల కంటే రష్యన్, ఉక్రేనియన్ సంతతికి చెందిన ప్రజలు అధికంగా ఉన్నారు.అంతర్జాతీయ సమాజం ట్రాన్స్నిస్ట్రియాను మోల్డోవా భాగంగా పరిగణిస్తున్నప్పటికీ 1992 నుండి తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉంది. ఇక్కడ 1,500 కంటే ఎక్కువ రష్యన్ సైనికులు ఉన్న సైనిక స్థావరాలు ఉన్నాయి. వీటిని మోల్డోవా లోపలి భద్రత కోసం శాంతి పరిరక్షకులుగా వ్యవహరిస్తారని అధికారులు పేర్కొంటున్నారు. కానీ రిపోర్టుల ప్రకారం, రష్యా దక్షిణ ఉక్రెయిన్ ను ఆక్రమించి ట్రాన్స్నిస్ట్రియాకు చేరే మార్గం కోసం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇది ఉక్రెయిన్కు వ్యతిరేకంగా రష్యాకు లాజిస్టికల్ పైచేయిని అందించవచ్చు.మరో వైపు మోల్డోవాకు ఇప్పటివరకు నాటోలో కానీ, యూరోపియన్ యూనియన్లో కానీ సభ్యత్వం పొందలేదు. ఈ దేశం గతంలో రష్యన్ సామ్రాజ్యం, తర్వాత సోవియట్ యూనియన్ అధికారంలో ఉండేది. 1990ల నుండి, మోల్డోవా రష్యా ప్రభావం నుండి దూరంగా ఉంటూ, ఐరోపా వైపు ప్రయత్నాలు చేస్తోంది. యూరోపియన్ యూనియన్ సభ్యత్వానికి దరఖాస్తు చేసింది. -
గోల్డ్ కార్డు: బంగారంతోనే షాపింగ్!
నగదుకు ప్రత్యామ్నాయంగా బంగారాన్ని వినియోగించే వినూత్న విధానంతో ‘ఓ గోల్డ్ మాస్టర్ కార్డు’ను దుబాయ్లో అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్డు ద్వారా వినియోగదారులు తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించకుండా, నేరుగా కొనుగోళ్లకు ఉపయోగించుకోవచ్చు.ఓ గోల్డ్ మేనేజ్మెంట్ సంస్థ తమ డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫామ్ను లైఫ్స్టైల్ సూపర్ యాప్గా తిరిగి ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ యాప్ ద్వారా తక్కువ పరిమాణంలోనూ బంగారం యాజమాన్యాన్ని పొందే అవకాశం కల్పిస్తున్నారు.కొత్తగా ప్రవేశపెట్టిన ఓ గోల్డ్ మాస్టర్ కార్డుతో, వినియోగదారులు బంగారాన్ని నగదు మాదిరిగా ఉపయోగించి వివిధ వస్తువులు, సేవలను కొనుగోలు చేయవచ్చు. ఈ లావాదేవీలు సులభమైనవి, సురక్షితమైనని, అన్ని చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ఉంటాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ వినూత్న వ్యవస్థను మావరిడ్ ఫైనాన్స్, మాస్టర్ కార్డ్ సహకారంతో అమలు చేశారు.ఈ కార్డు వినియోగదారులకు అనేక ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. విమానాశ్రయ లాంజ్లకు కాంప్లిమెంటరీ ప్రవేశం, హోటళ్లపై ప్రత్యేక డిస్కౌంట్లు, ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులపై ఆఫర్లు, అలాగే రెస్టారెంట్లు, ఈ-కామర్స్, ఎంటర్టైన్మెంట్ సేవలపై రాయితీలు లభిస్తాయి.ఓ గోల్డ్ మాస్టర్ కార్డు ద్వారా 8,000కు పైగా బ్రాండ్ల ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. యాప్ ద్వారా వోచర్లు, గిఫ్ట్ కార్డులను సులభంగా రీడీమ్ చేసుకునే సదుపాయం ఉంది. అలాగే ఈ-సిమ్ కార్డులు, రివార్డులు, లాయల్టీ ప్రోగ్రామ్లను సులభంగా యాక్సెస్ చేయవచ్చని ఓ గోల్డ్ వ్యవస్థాపకుడు బందర్ అల్ ఓట్మాన్ తెలిపారు. -
పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. కువైట్లో సైరన్ మోత
కువైట్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కువైట్లో ఈ నెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా సైరన్లు మోగించనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది కేవలం సాధారణ పరీక్ష మాత్రమేనని, ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.దేశంలోని అత్యవసర హెచ్చరిక వ్యవస్థలు, పౌర రక్షణ యంత్రాంగం సమర్థంగా పనిచేస్తున్నాయో లేదో పరీక్షించడమే ఈ చర్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడానికీ ఈ పరీక్ష ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ఈ డ్రిల్లో మూడు రకాల సైరన్లు వినిపించనున్నట్లు తెలిపారు. ప్రతి సైరన్కు ప్రత్యేక అర్థం ఉంటుందని వెల్లడించారు. మొదటి సైరన్ ప్రమాదం ఉన్నట్లు హెచ్చరికగా, రెండోది ప్రమాదం కొనసాగుతున్నదని సూచికగా, మూడో సైరన్ ప్రమాదం ముగిసినట్లు తెలిపే సంకేతంగా ఉంటుందని అధికారులు వివరించారు.ప్రజలు ఈ పరీక్ష సమయంలో ప్రశాంతంగా ఉండాలని, అధికారుల సూచనలను పాటించాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. -
400 కేజీల బంగారం దోపిడీ నిందితుడిని అప్పగించండి: కెనడా విజ్ఞప్తి
కెనడా దేశ చరిత్రలోనే అతిపెద్ద బంగారు దోపిడీగా గుర్తింపు పొందిన కేసులో ప్రధాన నిందితుడైన సిమ్రాన్ ప్రీత్ పనేసర్ను తమకు అప్పగించాలని కెనడా అధికారులు అధికారికంగా భారత ప్రభుత్వాన్ని కోరారు. ఈ దోపిడీకి సంబంధించి దాదాపు 20 మిలియన్ డాలర్లకు పైగా విలువైన కార్గో మాయం అయింది.ఎయిర్ కెనడా మాజీ ఉద్యోగి, బ్రాంప్టన్కు చెందిన 33 ఏళ్ల సిమ్రాన్ ప్రీత్ పనేసర్ 2023 ఏప్రిల్లో టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన భారీ దోపిడీలో కీలక పాత్ర పోషించినట్లు కెనడా పోలీసులు ఆరోపిస్తున్నారు. స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ నుంచి వచ్చిన అధిక విలువైన రవాణాను మళ్లించడంలో అతడు లోపలి వ్యక్తిగా సహకరించాడని దర్యాప్తు అధికారులు తెలిపారు.ఈ రవాణాలో సుమారు 400 కేజీల .9999 స్వచ్ఛమైన బంగారం అంటే దాదాపు 6,600 గోల్డ్ బార్లు (కడ్డీలు), అలాగే 2.5 మిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దోపిడీ అనంతరం పనేసర్ భారత్కు పారిపోయినట్లు కెనడా అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో అతనిపై కెనడా వ్యాప్తంగా అరెస్ట్ వారెంట్ జారీ చేయడమే కాకుండా, భారతదేశానికి అధికారిక అప్పగింత అభ్యర్థన పంపారు.‘ప్రాజెక్ట్ 24K’ అనే కోడ్ నేమ్తో ఈ దర్యాప్తు కొనసాగుతోంది. 2023 ఏప్రిల్ 17న టొరంటో పియర్సన్ విమానాశ్రయంలోని ఎయిర్ కెనడా కార్గో ఫెసిలిటీలో ఈ దోపిడీ జరిగింది. ఒక నిందితుడు ఐదు టన్నుల డెలివరీ ట్రక్కులో వచ్చి గిడ్డంగి నుంచి రవాణాను తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. రవాణా తాత్కాలికంగా భద్రత కలిగిన హోల్డింగ్ ఏరియాలో ఉంచినప్పటికీ, మరుసటి రోజు అది కనిపించకుండా పోయినట్లు గుర్తించారు.ఈ దోపిడీ అత్యంత పక్కా ప్రణాళికతో, లోపలి వ్యక్తులు, బయటి సహచరుల సహకారంతో జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు పది మందిపై కేసులు నమోదు కాగా, 21 మిందికి పైగా క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే దొంగిలించిన బంగారం ఎక్కువ భాగం ఇంకా స్వాధీనం కాలేదు.పీల్ రీజినల్ పోలీస్ చీఫ్ నిషాన్ దురైయప్ప ఈ అప్పగింత అభ్యర్థన ప్రాధాన్యతను నొక్కి చెబుతూ.. “మీరు ఎక్కడ దాక్కున్నా, మేము మిమ్మల్ని కనుగొంటాం. సరిహద్దులను దాటిన సంక్లిష్ట నేరాలను ఎదుర్కొనే మా సామర్థ్యాన్ని ప్రాజెక్ట్ 24Kతో చూపిస్తాం” అన్నారు.పనేసర్పై 5,000 డాలర్లకు పైగా దొంగతనం, నేరానికి కుట్ర వంటి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఎయిర్ లైన్ ఉద్యోగిగా అతనికి ఉన్న అంతర్గత ప్రాప్యతే ఈ దోపిడీకి కీలకంగా మారిందని అధికారులు పేర్కొన్నారు. న్యాయ సలహా తీసుకుని స్వచ్ఛందంగా లొంగిపోవాలని పోలీసులు అతనిని కోరుతూ, దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.ఇక ఈ అప్పగింత అభ్యర్థన భారత్–కెనడా న్యాయ సహకారాన్ని పరీక్షించనుంది. ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలు, భారతదేశ దేశీయ చట్టాల ప్రకారం ఈ అభ్యర్థనను భారత అధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో కీలక పరిణామంగా, జనవరిలో దుబాయ్ నుంచి కెనడాకు వచ్చిన అనంతరం మరో 43 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు. పనేసర్ కోసం గాలింపు చర్యలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. -
ఇరాన్ బలం ఎఫ్-14 యుద్ధ విమానాలు... ఇచ్చిన దేశం పైనే దాడి?
ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఏ క్షణాన రెండు దేశాల మధ్య యుద్ధం వస్తుందో అనే భయం ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. అందుకే చాలా దేశాలు తమ పౌరులను అక్కడి నుంచి వెనక్కి రప్పించుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం ఇరాన్ ఎయిర్ఫోర్స్లో కీలకంగా భావిస్తున్న ఎఫ్-14 ఫైటర్ జెట్స్ ఆ దేశానికి అమెరికా ఇచ్చినవే.. అవునండీ ఇది అక్షరాల నిజం.ఇరాన్- అమెరికా దేశాల మధ్య వైరం తీవ్రస్థాయికి చేరుకుంది. రెండు దేశాల మధ్య ఏ క్షణంలోనైనా యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే 1970లలో ఈ రెండు దేశాలు చాలా స్నేహంగా ఉండేవి. ఆ సమయంలో ఆ దేశ అధ్యక్షుడిగా షా మహమ్మద్ రెజా పహ్లావీ ఉండేవారు. పశ్చిమాసియాలో రష్యా ప్రభావాన్ని తగ్గించడానికి అమెరికా ఇరాన్తో చాలా స్నేహంగా ఉండేది. అందుకే అప్పుడు 79 వరకూ, F14 టామ్ క్యాట్ యుద్ధ విమానాలు ఇరాన్కు విక్రయించేలా కీలక ఒప్పందం చేసుకుంది. అప్పుడు ఆయుధాల ఒప్పందంలో ఈ డీల్ చాలా పెద్దది. అయితే కొంతకాలం తర్వాత అమెరికా- ఇరాన్ల మధ్య శతృత్వం రావడంతో అమెరికా ఆంక్షలు విధించడం ప్రారంభించింది. F-14 విడిభాగాల సరఫరా చేయడం పూర్తిగా నిలిపివేసింది. దీంతో అత్యాధునికి ఫైటర్ జెట్స్ ఉన్నా అవి ఎగరడానికి విడిభాగాలు, సాంకేతికమైన మద్ధతు లేకపోవడంతో ఆదేశం కఠిన నిర్ణయం తీసుకుంది. వాటివద్ద ఉన్న యుద్ధవిమానాలలో కొన్నింటినైనా వాడుకునేలా ప్లాన్ వేసింది. వాటి వద్ద ఉన్న F-14 విమానాలను విడగొట్టింది. వాటిని మిగతా వాటికి అమర్చి వాటితో యుద్ధంచేసేలా ప్రణాళిక వేసింది. అయితే ఇరాన్ వద్ద ప్రస్తుతం ఎన్ని F-14 ఫైటర్ జెట్స్ అందుబాటులో ఉన్నాయా అనేది స్పష్టంగా చెప్పలేము. క్రితంతో పోలిస్తే ఎంతో కొంత తగ్గే ఉంటాయనేది కాదనలేని నిజం.ఎఫ్-14 ప్రత్యేకతలు ఎఫ్-14 యుద్ధవిమానాలు చాలా శక్తివంతమైనవి. అత్యంత శక్తివంతమైన రాడార్ వ్యవస్థ దాని సొంతం. ఇవి వందల కిలోమీటర్ల దూరం నుండి శత్రు విమానాలను టార్గెట్ చేసుకొని దాడులు చేయగలవు. అయితే వరల్డ్ సూపర్ మిలటరీ పవర్గా ఉన్న అమెరికాను వీటితో నియంత్రించడం అ సాధ్యం. అయితే ఆ దేశస్థావరాలను ధ్వంసం చేయడంలో ఇవి కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. -
నిరసనకారులను చంపేయండి
టెహ్రాన్: ఇరాన్లో నిరసనలు చేస్తున్న వారందరినీ చంపేయాలంటూ అక్కడి మత పెద్ద ఒకరు ఫత్వా జారీ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం మతాధికారి అహ్మద్ ఖటామీ ఈ మేరకు మరణ ఆజ్ఞలను విడుదల చేశారు. ‘‘ఇది దేవుని తీర్పు’’ అని ఆ ఫత్వాలో పేర్కొన్నారు. శుక్రవారం ఆయన టెహ్రాన్లో జరిగిన ప్రార్థనలకు నాయకత్వం వహించారు. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక రేడియో వెల్లడించింది. నిరసనకారులను ఉరితీయాలంటూ ఖటామీ ఫత్వాను జారీ చేయగానే.. ఆ ప్రాంగణం కేరింతలతో మార్మోగిపోయింది. ఇదే వేదికపైనుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు కూడా ఖటామీ హెచ్చరికలు జారీ చేశారు. ‘‘అల్లాహ్ మా వెనక ఉన్నాడు. ఇరాన్ ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధానికి మానసికంగా సిద్ధంగా ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.ఇరాన్పై దాడిని వాయిదా వేయాలని ట్రంప్ నిర్ణయం తీసుకున్న మర్నాడే.. ఖటామీ నుంచి ఈ తరహా ఫత్వా జారీ కావడం గమనార్హం..! గల్ఫ్ దేశాలు ముక్తకంఠంతో కోరడంతో.. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోగా.. ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా ఖమేనీ ఊపిరి పీల్చుకున్నాడు. మరోవైపు ఇరాన్లోని భారతీయులను తరలించేందుకు భారత విదేశాంగ శాఖ ప్రయత్నాలను ప్రారంభించింది. అటు ఐక్యరాజ్య సమితి(ఐరాస)లో ఇరాన్ ఉప రాయబారి గులాం హుస్సేన్ దర్జీ ప్రస్తుత పరిస్థితులపై ఓ ప్రకటన చేశారు. తమ దేశంలో గందరగోళానికి అమెరికానే కారణమని ఆరోపించారు. ఇరాన్లో జరుగుతున్న అల్లర్ల వెనక అమెరికా వ్యూహాత్మక హస్తముందని పేర్కొన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో అమెరికా మళ్లీ ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీపై గుర్రుగా ఉన్నట్ల తెలుస్తోంది. ఇరాన్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంపై ట్రంప్ సీరియస్ అయినట్లు సమాచారం. ఇదెలా ఉండగా.. ఇంటర్నెట్ బ్లాకౌట్ జరిగిన వెంటనే.. 3 వేల మంది విదేశీ గూఢచారులను అరెస్టు చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ) అధికారులు ప్రకటించారు. గూఢచర్యం నేరానికి ఇరాన్లో మరణశిక్ష ఉంటుంది. తాము అరెస్టు చేసిన విదేశీయులంతా నిరసనకారుల ముసుగులో అల్లర్లను రెచ్చగొట్టారని, వారంతా సుశిక్షితులైన ఉగ్రవాదులని ఆరోపించారు. -
హిందు ఉపాధ్యాయుని ఇంటికి నిప్పు
బంగ్లాదేశ్లో మైనార్టీలపై విద్వేశజ్వాలలు ఆగడం లేదు. గత కొంతకాలంగా ఆ దేశంలో హిందువులపై పెద్దఎత్తున దాడులు జరుగుతున్నసంగతి తెలిసిందే. తాజాగా అక్కడ మరోసారి హింస చెలరేగింది. అక్కడి మత ఛాందసవాదులు సిల్హట్ జిల్లాలో హిందూ కుటుంబం ఉన్న ఇంటికి నిప్పుపెట్టారు. దీంతో ఇది గమనించిన ఆ కుటుంబ సభ్యులు హుటాహుటీన అక్కడి నుండి పరుగు తీశారు.బంగ్లాదేశ్లో హిందువులపై హింస తీవ్రరూపం దాలుస్తుంది. షేక్ హాసీనా భారత్లో తలదాచుకున్న మెుదలు ఏదో రకంగా అక్కడ హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల అక్కడి విద్యార్థినేత ఉస్మాన్ సౌదీ మరణంతో అక్కడి మైనార్టీలపై దాడులు మరోసారి తీవ్రతరమయ్యాయి. అప్పట్నుంచి దాదాపు 42 ఘటనలు జరుగగా దాదాపు 12మందికి పైగా హిందువులు హత్యకు గురయ్యారు. ఈ ఘటనలపై భారత్ తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తుంది. అక్కడి దాడులను ఆపాలని అక్కడి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. అయినప్పటికీ బంగ్లా ప్రభుత్వం స్పందించడం లేదు.తాజాగా మరోసారి ఆ దేశంలో మత విద్వేశం చెలరేగింది. బంగ్లాలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న ఓ హిందూ ఇంటికి అక్కడి అల్లరిమూకలు నిప్పంటించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సిల్హాట్ జిల్లా గోవైన్ ఘాట్ ఉపజిల్లా నందిర్గ్రామంలో బీరేంద్రకుమార్ అనే ఒక పాఠశాల ఉపాధ్యాయుడి ఇంటికి అక్కడి మతఛాందస వాదులు నిప్పుపెట్టారు. ఇది గమనించిన ఇంటిసభ్యులు హుటాహుటీన అక్కడి నుండి ఇంటినుండి పరుగులుతీశారు. ఈవీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.ఇస్లామిక్ గ్రూపులే ఈ దాడులు చేసినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. ఈ వారం ప్రారంభంలో ఒక హిందువ్యక్తిని అక్కడి దుండగులు నరికి చంపగా, అక్కడి జగత్పూర్ అనే గ్రామంలోని పంటపొలాల్లో 27ఏళ్ల యువకుడి మృతదేహం లభ్యమయ్యింది. బంగ్లాదేశ్లో వరుసగా జరుగుతున్న ఘటనలు అక్కడి మైనార్టీలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి.UNENDING XENOPHOBIA THE WORLD WATCHES SILENTLYAnother targeted attack on a Hindu family in Bangladesh. The home of teacher Birendra Kumar Dey (“Jhunu Sir”) in Sylhet’s Gowainghat was set on fire again. pic.twitter.com/injFKFqMkZ— Rahul Shivshankar (@RShivshankar) January 16, 2026 -
నెదర్లాండ్స్లో మేయర్.. 40 ఏళ్ల తర్వాత అమ్మ కోసం వెతుక్కుంటూ నాగ్పూర్కి..!
కుంతీదేవి కర్ణుడి తల్లి. ఆమెకు దుర్వాస మహర్షి ఇచ్చిన వరం వల్ల సూర్యుని ప్రార్థన చేస్తే కర్ణుడు జన్మించాడు. కానీ వివాహం జరగకముందే బిడ్డ పుడితే సమాజం ఏమంటుందో అనే భయంతో ఆ బిడ్డను కుంతీ నదిలో వదిలేసింది. అయితే వరంతో జన్మించిన బిడ్డ కాబట్టి కర్ణుడికి ఏం కాలేదు. మహాభారతంలో దానవీరుడిగా ప్రసిద్ధి చెందాడు కర్ణుడు.ఇప్పుడు నెదర్లాండ్స్లోని ఓ నగరానికి మేయర్గా ఉన్న భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి పరిస్థితి కూడా దాదాపు ఇదే. మూడు రోజుల శిశువుగా ఉన్నప్పుడే ఓ మాతృసంస్థలో వదిలేసింది కన్నతల్లి. ఇది జరిగి ఇప్పటికి 41 ఏళ్లు అయ్యింది. 1985లో నాగ్పూర్కు చెందిన ఓ తల్లి.. తన కుమారుడిని మాతృసంస్థకు అప్పచెప్పింది. నాగ్పూర్లో ఉన్న మాతృసేవా సంఘ్లో విడిచిపెట్టి పెళ్లిపోయింది.ఏ పరిస్థితుల కారణమో, ఎంతటి దయనీయ స్థితిలో ఆ తల్లి కుమారుడిని వద్దనుకుంది. అయితే అక్కడ ఉన్న నర్సు.. ఆ కుర్రాడికి ఫాల్గున్గా నామకరణం చేసింది. ఆ శిశువును తల్లి వదిలేసిన నెల వ్యవధిలో నెదర్లాండ్స్ నుంచి ఒక జంట సదరు మాతృసంస్థకు వచ్చింది. ఆ శిశువును అక్కడ నుంచి తీసుకుని నెదర్లాండ్స్కు తీసుకెళ్లారు. అక్కడ చదువుకుని ఇప్పుడు మేయర్ అయ్యాడు. నెదర్లాండ్స్లోని అమస్టర్డామ్కు దగ్గరగా ఉన్న హీమ్స్టెడ్కు మేయర్గా ఎన్నికయ్యాడు.ఆ శిశువు నెదర్లాండ్స్లో పెరిగి.. అక్కడ మేయర్ కావాలని రాసి పెట్టి ఉంది కాబట్టి అలా జరిగిందని మనం చెప్పుకోవచ్చు. పూర్వ పుణ్యమో, కారణ జన్మమమో ఆ శిశువును ఇప్పుడు మేయర్గా నిలిపింది. తల్లిని వెతుక్కుంటూ భారత్కు..ఆ మేయర్కు ఇప్పుడు తన మూలాల గరించి తెలిసింది. తన పుట్టుక గురించి తెలిసింది. తాను భారత్కు చెందిన ఓ తల్లికి జన్మించాననే విషయం తెలుసుకున్నాడు. ఇప్పుడు ఆ తల్లిని వెలికే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలోనే భారత్కు వచ్చాడు మేయర్ ఫాల్గున్.. ఈ క్రమంలోనే ఓ మాట అన్నాడు ఫాల్లున్. మహాభారతంలోని కర్ణుడి గురించి చెప్పుకొచ్చాడు. తల్లి కుంతీ దేవిని కలవడానికి కర్ణుడికి హక్కు ఉందన్నాడు. అందుకోసమే తాను తల్లి కోసం వెతుకలాట ప్రారంభించానని అంటన్నాడు. దీనిలో భాగంగా 2025లో భారత్కు మూడుసార్లు వచ్చాడు ఈ ‘కలియుగ కర్ణుడు’. నాగ్పూర్ కలెక్టర్ సాయం తీసుకున్నాడు. తాను పుట్టడానికి సాయం చేసిన నర్సును కలిశాడు. నర్సును తాను కలవడం చాలా సంతోషంగా ఉందని, తన జననం ఫాల్గుణ మాసంలో జరిగింది కాబట్టి తనకు ఫాల్గున్ అని పేరు పెట్టినట్లు రిటైర్డ్ అయ్యి ఇంటి వద్దే ఉంటున్న నర్సు తెలిపినట్ల స్పష్టం చేశాడు. తన గురించి పలు విషయాలను ఆమె చెప్పడం ఒక మధురానుభూతిని తీసుకొచ్చిందని పేర్కొన్నాడు నెదర్లాండ్ మేయర్, -
అఫ్గాన్ ప్రభుత్వంపై సంచలన నివేదిక
దక్షిణాసియాలో మరో దేశంలో రాజకీయ అస్థితరత తప్పేలా కనిపించడం లేదు. అఫ్గాన్ తాలిబన్ల ప్రభుత్వం త్వరలోనే కూలిపోయే అవకాశం ఉందని ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ పేర్కొంది. ఇటీవల ఆదేశ సుప్రీం లీడర్ ఆడియో టేప్లో ఇదే విషయాలు బహిర్గతమయినట్లు తెలిపింది.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. చాలా దేశాలు రాజకీయ అస్థితరతతో అతలాకుతలం అవుతున్నాయి. ఇరాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, సిరియా లాంటి దేశాలు అంతర్గత సంక్షోభంతో అట్టుడికిపోతున్నాయి. అయితే తాజాగా ఆ కోవలో అఫ్గానిస్థాన్ చేరునుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. తాలిబన్ల అగ్రనాయకత్వంలో తీవ్ర లుకలుకలున్నాయని వారి మధ్య విభేదాలు ఇటీవల ఆ దేశ తాలిబన్ లీడర్ అయతుల్లా అఖుండ్జాదా మాటల్లో తేటతెల్లమయ్యాయని బీబీసీ నివేదిక పేర్కొంది.ఇటీవల అఫ్గాన్ లీడర్ అఖుండ్జాదా ప్రసంగాన్ని బీబీసీ విడుదల చేసింది. అందులో ఆయన మాట్లాడుతూ "ప్రభుత్వంలో విభేదాలున్నాయి. అంతర్గత విభేదాలు ఇలానే పెరుగుతుంటూ పోతే తాలిబన్ ప్రభుత్వం కూలిపోతుంది". అని ఆయన హెచ్చరించినట్లు బీబీసీ ప్రచురించింది. అంతేకాకుండా తాలిబన్లలో ప్రస్తుతం రెండు వర్గాలున్నాయని వెల్లడించింది.మెుదటివర్గం అఫ్గాన్ సుప్రీం లీడర్ అఖుండ్జాదాకు విదేయులుగా ఉంటూ ఆదేశాన్ని ఇస్లామిక్ పాలనకు కేంద్ర స్థానంగా చేయాలని యత్నిస్తున్నారని తెలిపింది. వీరు కాందహార్ నుంచి పనిచేస్తున్నట్లు పేర్కొంది. మరోకవర్గమేమో సిరాజ్ హుక్కానీ నేతృత్వంలో పనిచేస్తూ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేస్తూ మహిళలకు పిల్లలకు కనీస హక్కులు కల్పించాలని భావిస్తున్నట్లు బీబీసీ తెలిపింది. వీరి కేంద్రం కాబూల్ అని పేర్కొంది. అఫ్గాన్లో తాలిబన్ల పాలన 2021లో ప్రారంభమైంది. ఆసమయంలో తాలిబన్లు కాబూల్ను స్వాధీనం చేసుకోవడంతో అప్పటి ఆదేశ అధ్యక్షుడు అష్రప్ ఘనీ దేశం విడిచిపారిపోయారు. దీంతో వారి పాలన అధికారికంగా ప్రారంభమైంది. -
5,200 ఏళ్ల నాటి పడవ గుర్తింపు, సూపర్ టెక్నాలజీ
ఈజిప్టు పిరమిడ్ల కంటే పురాతనమైన పడవను అమెరికన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. విస్కాన్సిన్లోని పరిశోధకులు మెన్డోటా సరస్సులో 5,200 సంవత్సరాల పురాతన ఈ పడవను గుర్తించారు. ఇక్కడ మొత్తం 16 పురాతన బోట్లను గుర్తించడం విశేషం. న్యూస్వీక్ నివేదిక ప్రకారం ఉత్తర అమెరికాలోని విస్కాన్సిన్ హిస్టారికల్ సొసైటీ (WHS) పరిశోధకులు మెన్డోటా సరస్సులో 5,200 సంవత్సరాల పురాతన పడవను కనుగొన్నారు. మెన్డోటా సరస్సులో మొత్తం 16 పురాతన బోలు చెక్క పడవలను పరిశోధకులు గుర్తించారు. ఈ పడవలలో పురాతనమైనది ఈజిప్టులోని గిజా పిరమిడ్ ఉనికిలో ఉండటానికి ముందు కాలం నాటిదని పరిశోధకులు చెబుతున్నారు. గతంలో అనుకున్న దానికంటే చాలా ముందుగానే జీవించి వ్యవస్థీకృత సమాజాలుగా అభివృద్ధి చెందారని వెల్లడిస్తుందని చెప్పారు.ఇదీ చదవండి: కన్నకూతుళ్లపై తండ్రి అఘాయిత్యం, 6 ఏళ్ల వయసు నుంచిసహజంగా రేడియోధార్మిక మూలకం ఎంతవరకు క్షీణించిందో చూడటానికి కలపను పరీక్షించినప్పుడు, ఈ పడవలు 1300AD , 3000BC మధ్య నిర్మించబడ్డాయని తేలింది. మెండోటా సరస్సు కింద కనుగొనబడిన ఆవిష్కరణలు శాస్త్రవేత్తలు ఉత్తర అమెరికాలో ప్రారంభ మానవ జీవితాన్ని బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి.వేల ఏళ్లకుముందే ప్రపంచవ్యాప్తంగా మానవ పడవ తయారీ నైపుణ్యాలు అభివృద్ధి గురించి వివరించింది. ఈ పడవలు 5,200 సంవత్సరాల క్రితం గ్రేట్ లేక్స్ ప్రాంతంలో ప్రజలు ఎలా ప్రయాణించారు, ఎలా నివసించారో ఇది వెల్లడిస్తుంది. ముఖ్యంగా ఆ కాలంలోనే ఇక్కడి ప్రజలు బలమైన, మన్నికైన ఓడలను నిర్మించేంత అవగాహన , సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండటం విశేషం.2021లో శాస్త్రవేత్తలు 1,200 సంవత్సరాల నాటి మొదటి పడవను కనుగొన్నారు. 3,000 సంవత్సరాల నాటి మరో పడవను 2022లో కనుగొన్నారు. ఆ తర్వాత మరో పద్నాలుగు పడవలు గుర్తించారు. వాటిలో ఆరు 2025లో కనుగొనబడ్డాయి. 16 పడవలలో రెండు మాత్రమే నీటి నుండి బయటకు తీశారు. వీటిలో దాదాపు 3,000 సంవత్సరాల నాటి 14 అడుగుల పొడవైన పడవ కూడా ఉంది. ఇవి ఎక్కువగా ఎరుపు , తెలుపు ఓక్ వంటి గట్టి చెక్కలతో తయారు చేసినవి. పడవల పైన రాళ్లను జాగ్రత్తగా ఉంచారట. శీతాకాలంలో పడవ తయారీకి ఉపయోగించే చెక్క వంకర పోకుండా చూసుకోవడానికి ఈజాగ్రత్త తీసుకుని ఉంటారని నిపుణులు భావిస్తున్నారు. అలాగే WHS బృందం ఓక్ను ఉపయోగించడం అసాధారణ మని పేర్కొంది. సాధారణంగా చెట్టుకు ఉండే ఓపెన్ పోర్స్ నీటిని గ్రహిస్తాయి. ఇవి పడవలు మునిగిపోకుండా తేలియాడేలా చేస్తుంది.ఇదీ చదవండి: టీనేజ్ లవర్స్ : 40 ఏళ్లకు 60లలో మళ్లీ పెళ్లి -
ఇరాన్ సంక్షోభం.. ఐరాస భద్రతా మండలిలో ఆసక్తికర పరిణామం
ఇరాన్ సంక్షోభం నేపథ్యంతో ఐక్యరాజ్య సమితి భద్రతామండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. నిరసనలపై ఆందోళన వ్యక్తం చేసిన మండలి.. అమెరికా సైనిక దాడులు జరపడం ఏమాత్రం సరికాదని అభిప్రాయపడింది. అయితే ఎలాంటి తీర్మానం లేకుండా ముగిసిన ఈ భేటీలో.. ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ జర్నలిస్ట్, ఇరాన్ మహిళా ఉద్యమకారిణి మసీహ్ అలినెజాద్.. యూఎన్ భద్రతా మండలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక ఆహ్వానం మేరకు మండలి భేటీలో పాల్గొన్న ఆమె.. ఇరాన్ యూఎన్ రాయబారి ఘోలంహోసేన్ డర్జీని టార్గెట్ చేసుకున్నారు. ‘‘మీరు(ఇరాన్) నన్ను మూడుసార్లు చంపాలని చూశారు. నా ఇంటి వద్దకు మనుషుల్ని పంపించారు. వాళ్లను నేను చూశాను కూడా’’ అని వ్యాఖ్యానించారామె. ఖమేనీ ప్రభుత్వం ఐసిస్లా ప్రవర్తిస్తోందన్న మసీహ్.. ఇరాన్లో అణచివేతలు మరింతగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో.. అంతర్జాతీయ ఖండనలు ఏమాత్రం సరిపోవని, ప్రపంచ దేశాలు ఇరాన్పై ఒత్తిడిని పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఇరాన్ ఆందోళనకు అమెరికా మద్దతు కొనసాగుతుందని ఆ దేశ ప్రతినిధి మైక్ వాల్ట్జ్ ఉద్ఘాటించారు. ఐరాన్లో జరుగుతున్న నిరసనలు గొప్ప ఉద్దేశంతో కూడుకున్నవని.. ఐరాన్ ప్రజలు తమ స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారని.. మా దేశం, మా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాళ్లతో ఉన్నారు అని స్పష్టం చేశారు. నిరసనలు విదేశీ కుట్ర కాదని.. ఐరాన్ ప్రభుత్వం తన ప్రజలకే భయపడుతోందని వాల్ట్జ్ అన్నారు.యూఎన్ అధికారులు ఇరాన్ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్పై సైనిక దాడులు జరిగితే ఆ ప్రాంతాన్ని మరింత అస్థిరం చేస్తాయని హెచ్చరించారు.ఐరాస సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరస్ తరఫున మార్థా పోబీ మాట్లాడుతూ.. సమస్యలను దౌత్యం ద్వారా పరిష్కరించాలి అని సూచించారు. ప్రాణనష్టం జరగకుండా అన్ని పక్షాలు జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. -
ఇజ్రాయెల్లో భూకంపం.. అణు పరీక్షలే కారణమా?
ఇరాన్ సంక్షోభం కొనసాగుతున్న వేళ.. విరోధి దేశం ఇజ్రాయెల్లో భూకంపం సంభవించింది. నెగెవ్ ఎడారిలోని డిమోనా ప్రాంతంలో 4.2 తీవ్రతతో ఇది చోటుచేసుకోగా.. 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. అయితే.. టెహ్రాన్ హెచ్చరికల నేపథ్యంతో టెల్ అవీవ్ రహస్యంగా అణు పరీక్షలు జరిపి ఉండవచ్చని.. ఇదే భూకంపానికి కారణం కావచ్చనే అనుమానాలు మొదలయ్యాయి. గురువారం ఉదయం సంభవించిన ఈ ప్రకంపనలు జెరూసలేం వరకు ప్రభావం చూపాయి. కొన్ని సెకన్లపాటు నేల కంపించగా.. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని తెలుస్తోంది. అయితే.. సరిగ్గా అదే సమయంలో ఇజ్రాయెల్లోని అన్ని విద్యాసంస్థల్లో ఎమర్జెన్సీ మాక్ డ్రిల్ జరుగుతుండటం ఇక్కడ గమనించదగ్గ విషయం. దీంతో ఇది సహజసిద్ధమైన భూకంపం కాకపోవచ్చనే చర్చ మొదలైంది. ఇది ఇరాన్తో పాటు అమెరికాకు ఇజ్రాయెల్ పంపిన సంకేతం అయి ఉండొచ్చనే అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా.. డిమోనా ప్రాంతంలో ఇజ్రాయెల్కు రహస్య అణు పరిశోధనా కేంద్రం కూడా ఉంది. 1950లలో నిర్మించిన ఈ కేంద్రంలో హెవీ వాటర్ రియాక్టర్ ఉంది. పైగా శాటిలైట్ చిత్రాల ద్వారా.. ఈ ప్రాంతంలో నిర్మాణ పనుల విస్తరణ కూడా ధృవీకరణ అయ్యింది. అయితే అణు పరీక్షలు, అణ్వాయుధాలున్నాయనే ప్రచారాన్ని ఆ దేశం ఏనాడూ అంగీకరించలేదు. అయితే ఇజ్రాయెల్ భూగర్భ శాస్త్ర సంస్థ మాత్రం అధికారికంగా ఇది సహజ భూకంపమేనని ప్రటించడం గమనార్హం.ఇరాన్ అణు ప్రోగ్రామ్ను ఇజ్రాయెల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అది తమ దేశ భద్రతకు ముప్పు కలిగించే అంశమంటూ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో కిందటి ఏడాది అమెరికాతో కలిసి ఇరాన్ అణు కేంద్రాలపై వైమానిక దాడులు కూడా జరిపింది. ఆ సమయంలో ఇరాన్ కూడా అణు పరీక్షలు నిర్వహించినట్లు విస్తృత ప్రచారం జరిగింది.ఇక ఇరాన్లో ఖమేనీ ప్రభుత్వంపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఇంటర్నెట్ బ్యాన్, సమాచార వ్యవస్థలను కట్టడి చేయడంతో అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే ఆందోళనకారుల్ని కఠినంగానే అణచివేస్తున్నారనే సమాచారం మాత్రం బయటకు పొక్కుతోంది. ఈ క్రమంలో భారీ సంఖ్యలో మరణాలు(వేలల్లోనే) సంభవించినట్లు, అరెస్టులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో.. అగ్రరాజ్యం అమెరికా రంగంలోకి దిగింది. ఆందోళనకారులపై హింసను ఉపేక్షించేది లేదని, అవసరమైతే సైనిక చర్య తప్పదంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిస్తూ వస్తున్నారు. అదే సమయంలో చర్చలకు ఆస్కారం ఉందన్న మాటను ఆయన ప్రస్తావిస్తున్నారు. అయితే ఈ నిరసనలను విదేశీ కుట్రగా అభివర్ణిస్తున్న ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ.. తమ దేశం జోలికి వస్తే ప్రతిఘటన తీవ్రంగానే ఉంటుందని అమెరికా, ఇజ్రాయెల్ను హెచ్చరిస్తున్నారు. -
ట్రంప్నకు మచాడో నోబెల్ శాంతి బహుమతి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు తన నోబెల్ శాంతి బహుమతిని అందజేశారు వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడో. గురువారం వైట్ హౌస్లో జరిగిన సమావేశంలో ట్రంప్నకు తన నోబెల్ శాంతి బహుమతి మెడల్ను అందజేసినట్లుగా ఆమె తెలిపారు.వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ దేశ రాజకీయ భవిష్యత్తుపై తీవ్రమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. గంటకు పైగా సాగిన సమావేశం తర్వాత మచాడో వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆమెకు మద్దతుదారులు ఉత్సాహంగా స్వాగతం పలికారు. “మనం అధ్యక్షుడు ట్రంప్పై ఆధారపడవచ్చు” అని ఆమె పేర్కొన్నారు. అనంతరం “థ్యాంక్ యూ, ట్రంప్” అంటూ నినాదాలు చేయించారు.అయితే ఆమె సమర్పించిన నోబెల్ పతకాన్ని ట్రంప్ స్వీకరించారా లేదా అనే ప్రశ్నకు మచాడో సమాధానం ఇవ్వలేదు. ఈ చర్యపై గత కొన్ని వారాలుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అయితే నోబెల్ శాంతి బహుమతి బదిలీ చేయడం లేదా ఇతరులకు అందజేయడం సాధ్యం కాదని నోబెల్ అవార్డుల నిబంధనలు స్పష్టంగా పేర్కొంటున్నాయి. నార్వేజియన్ నోబెల్ ఇన్స్టిట్యూట్ కూడా ఈ విషయాన్ని పునరుద్ఘాటించింది. -
ఇజ్రాయెల్లోని ఇండియన్స్కు అలర్ట్..
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్లో ఉన్న భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది. ఇజ్రాయెల్కు అనవసరమైన ప్రయాణాలు చేయవద్దని భారత పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది.ప్రస్తుతం ఇజ్రాయెల్లో నివసిస్తున్న భారతీయులు అందరూ స్థానిక అధికారులు, ఇజ్రాయెల్ హోం ఫ్రంట్ కమాండ్ జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలు, ప్రోటోకాల్స్ను కచ్చితంగా పాటించాలని భారత విదేశాంగ శాఖ సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో భారతీయులు ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయ 24x7 హెల్ప్లైన్ నంబర్లు +972-54-7520711, +972-54-3278392 సంప్రదించాలని తెలిపింది.పెరుగుతున్న ఉద్రిక్తతలుఇరాన్లో విస్తృత స్థాయిలో నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అడ్వైజరీ జారీ అయింది. ఇరాన్పై సైనిక చర్యకు అమెరికా అవకాశం కొట్టిపారేయకపోవడంతో ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా దాడి చేస్తే ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు చట్టబద్ధమైన లక్ష్యాలుగా మారతాయని ఇరాన్ హెచ్చరించింది.ఈ పరిణామాల ప్రభావంతో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్తో పాటు పలు ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. దక్షిణ, మధ్య ఇజ్రాయెల్లోని అనేక ప్రాంతాల్లో ప్రజా ఆశ్రయాలను తెరవాలని స్థానిక అధికారులు ఆదేశించినట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి.టర్కీకి చెందిన అనడోలు ఏజెన్సీ ప్రకారం, దక్షిణ ఇజ్రాయెల్లోని డిమోనా నగరంలో “అనూహ్య పరిస్థితులకు సిద్ధంగా ఉండటం మంచిది” అనే ఉద్దేశంతో అన్ని ప్రజా ఆశ్రయాలను తెరవాలని మేయర్ ఆదేశాలు జారీ చేశారు.ఇరాన్ నుంచి భారతీయుల తరలింపు ప్రయత్నాలుఇరాన్లో పరిస్థితులు అస్థిరంగా మారుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి భారతీయులను తరలించేందుకు భారత్ సన్నాహాలు చేస్తోంది. ఇరాన్లో నిరసనలు చెలరేగుతున్న నేపథ్యంలో టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారత పౌరులకు ఇప్పటికే అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయ విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు వాణిజ్య విమానాలు సహా అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా దేశాన్ని విడిచిపెట్టాలని, నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది. -
ఇరాన్ టార్గెట్.. ఇజ్రాయెల్ వైమానిక స్థావరాలు?
పశ్చిమాసియాను యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా తమపై ఏదైనా చర్యకు ఉపక్రమిస్తే.. ఉన్నఫళంగా స్పందించేందుకు ఇరాన్ సన్నద్ధమైంది. ఈ క్రమంలో ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్ను కూడా టార్గెట్గా చేసుకుంది. ఈ మేరకు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ఓ ప్రకటనను విడుదల చేసినట్లు అరబిక్ మీడియా వెల్లడించింది. ప్రధానంగా ఐఆర్జీసీ తన వద్ద ఉన్న అత్యంత శక్తిమంతమైన హైపర్ సోనిక్ క్షిపణులను ఇజ్రాయెల్పై ప్రయోగించేందుకు సిద్ధం చేసినట్లు, ఇరాన్ ఇంటెలిజెన్స్ వర్గాలను అరబిక్ మీడియా ఉటంకించింది. ప్రధానంగా ఇజ్రాయెల్కు చెందిన ఎనిమిది వైమానిక, సైనిక స్థావరాలే లక్ష్యంగా హైపర్ సోనిక్ క్షిపణులను సిద్ధం చేసినట్లు చెబుతోంది. తన శక్తిమంతమైన ‘ఫతాహ్’ క్షిపణిని సైతం ఇజ్రాయెల్తో పాటు.. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై గురిపెట్టినట్లు పేర్కొంటోంది.అమెరికా, లేదా ఇజ్రాయెల్ తమపై దాడి చేస్తే.. వెంటనే తమ ప్రతిస్పందనలో భాగంగా హైపర్ సోనిక్ క్షిపణులను ప్రయోగిస్తామని ఇరాన్ వర్గాలు వెల్లడించాయి. ఫతాహ్ క్షిపణులు హైపర్ సోనిక్ వేగంతో లక్ష్యాలను ఛేదించడమే కాకుండా.. మార్గమధ్యంలో వాటి దిశను మార్చే అవకాశాలుంటాయి. అయితే అటు ఇరాన్ గానీ, ఇటు అమెరికా, ఇజ్రాయెల్ గానీ ఈ విషయాలను ధ్రువీకరించడం లేదు.ఇదీ చదవండి:నెతన్యాహూ క్రీట్కు పారిపోయాడు..! -
భారత్లో చొరబాటుకు పాకిస్తానీయుల యత్నం..!
భారత్లో చొరబడేందుకు పాకిస్తానీయులు యత్నించారు. అరేబియా సముద్ర మార్గం ద్వారా తొమ్మిదిమంది పాకిస్తానీయులు.. భారత్లో చొరబాటుకు యత్నించారు. కానీ వారిని భారత సైనికులు పట్టుకున్నారు. భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది వారిని బంధించి గుజరాత్కు తీసుకువస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పినా వారి కార్యకలాపాల్లో మార్పు రావడం లేదు. మత్స్యకారుల వేషంలో ఓ పడవలొ పయనిస్తూ తొమ్మిదిమంది పాక్ దేశీయలు భారత్లో చొరబడేందుకు పన్నాగం వేశార. నిన్న(బుధవారం, జనవరి 14వ తేదీ) రాత్రి, భారత కోస్ట్ గార్డ్ గస్తీ నౌక అరేబియా సముద్రంలో సాధారణ నిఘాలో ఉంది. అయితే . అకస్మాత్తుగా, రాడార్ అనుమానాస్పద కదలికను గుర్తించింది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL) సమీపంలో భారత జలాల్లో ఒక పడవ నిశ్శబ్దంగా కదులుతోంది. ఇది సాధారణ ఫిషింగ్ నౌకలా కనిపించలేదు, ఎందుకంటే దాని కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయి. ఇదే సైనికుల అనుమానాలను రేకెత్తించింది. దాంతో కోస్ట్గార్డ్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని సంకెళ్లతో బంధించి గుజరాత్లోని పోర్ట్కు తీసుకువస్తున్నారు. इंडियन कोस्ट गार्ड ने 9 पाकिस्तानी नागरिक को अवैध घुसपैठ की कोशिश में पकड़ा है. अरब सागर में 14 जनवरी की रात इंडियन कोस्ट गार्ड पेट्रोलिंग कर रही थी तभी उन्हें मछुवारों के भेस में भारत की सीमा में प्रवेश करते हुए पकितानियों को पकड़ा है. फिलहाल मामले की जांच जारी है. pic.twitter.com/A1lQfhHCBR— Versha Singh (@Vershasingh26) January 15, 2026 -
కెంట్ అయ్యప్ప ఆలయంలో వైభవంగా ‘మకరవిళక్కు మహోత్సవం’
కెంట్: ఇంగ్లండ్లోని కెంట్ అయ్యప్ప ఆలయంలో నిన్న (జనవరి 14, బుధవారం) మకరవిళక్కు మహోత్సవం వైభవంగా జరిగింది. పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇంగ్లండ్ నుంచి వచ్చిన అయ్యప్ప భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకు ఆలయం తెరవడంతో ఉత్సవం ప్రారంభమైంది. ఆ తర్వాత ఉదయం 7:10 గంటలకు నిర్మాల్య దర్శనం. ఉదయం 7:30 గంటలకు ఉష పూజ, ఉదయం 8 గంటలకు గణపతి హోమం, ఉదయం 9 గంటలకు ఉచ్చ పూజ నిర్వహించారు.సాయంత్రం 5.30 గంటల నుంచి విశేష అభిషేకం, పూజ, దీపారాధన, సహస్రనామార్చనలు నిర్వహించారు. రాత్రి ఉత్సవాల్లో రాత్రి 9 గంటలకు అథజా పూజ, 9.30 గంటలకు పడిపూజ, 9.45 గంటలకు హరివరాసనం నిర్వహించారు. అభిజిత్, తాజూరు మన హరినారాయణన్ నంబితీశ్వరర్ పూజలు నిర్వహించారు. వెల్లిఒత్తిల్లం అద్రిత్ వాసుదేవ్ కూడా పూజలు నిర్వహించారు. విశ్వజిత్ త్రిక్కాకర సోపాన సంగీతం, తత్త్వమసి బృందం, భజనలు, రమ్య అరుణ్ కృష్ణన్ భరతనాట్యం ప్రదర్శించారు. -
జెలెన్స్కీ కీలక నిర్ణయం.. ఉక్రెయిన్లో ఎమర్జెన్సీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో యుద్ధం, దేశంలో శీతాకాల పరిస్థితులు తదితర కారణాల రీత్యా దేశంలో ఇందన రంగంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రకటించారు.2022లో రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ ఎనర్జీ సెక్టార్ తీవ్రంగా దెబ్బతింది. రష్యా జరిపిన దాడులలో ఉక్రెయిన్ విద్యుత్ ప్లాంట్లు పెద్దమెుత్తంలో దెబ్బత్నిన్నాయి. అంతేకాకుండా అత్యధిక శాతం చమురు యుద్ధానికి అవసరం అవడంతో ఆదేశంలో తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడింది. దీంతో శీతాకాలంలో ఆ దేశంలో పెద్ద ఎత్తున కరెంట్ కోతలతో పాటు నీటి సరఫరాలకు అంతరాయం తదితరమైనవి ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆదేశ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు.దేశంలో ఇందన ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో నెలకొన్న ఎమర్జెన్సీ పరిస్థితులను పరిష్కరించడానికి, సరఫరా అంతరాయాలను పరిష్కరించడానికి ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆ కార్యాలయం 24 గంటలూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలకు అత్యంత కీలకమైన సేవలను తిరిగి పునరుద్ధరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జెలెన్స్కీ ఆదేశించారు. -
నెతన్యాహు క్రీట్కు పారిపోయాడు..!: అరబిక్ మీడియా
ఇజ్రాయెల్ అధినేత బెంజమిన్ నెతన్యాహు ఇప్పుడు టెల్ అవీవ్లో లేరా? ఉన్నఫళంగా ఆయన క్రీట్ ద్వీపానికి పయనమయ్యారా? ఈ ప్రశ్నలకు అరబిక్ మీడియా ఔననే సమాధానం చెబుతోంది. albawaba.com అనే మీడియా సంస్థ ఏకంగా ఓ అడుగు ముందుకేసి.. నెతన్యాహు పారిపోయాడంటూ కథనాన్ని ప్రచురించింది. ఈ మేరకు ఫ్లైట్ ట్రాకింగ్ డేటాను ఉటంకించింది.ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ నుంచి బోయింగ్ 767 (4ఎక్స్-ఐఎస్ఆర్) విమానం గుర్తుతెలియని గమ్యస్థానానికి చేరుకుంది. బెన్ గురియన్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన ఈ విమానం గ్రీస్లోని క్రీట్ ద్వీపంలోని హెరాక్లియోన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. మరో అరబిక్ వార్తాసంస్థ ఈ విమానం ఏథెన్స్ విమానాశ్రయంలో ల్యాండ్ అయినట్లు పేర్కొంది. ఈ విమానం బెంజమిన్ నెతన్యాహుకు చెందిన ‘వింగ్ ఆఫ్ జియాన్’ అని ఫ్లైట్ ట్రాకింగ్ డేటాను ఉటంకిస్తూ మరికొన్ని అరబిక్ వార్తాసంస్థలు పేర్కొన్నాయి. గురువారం ఉదయం 11.22కు టేకాఫ్ అయిన విమానం.. మధ్యాహ్నం 1.06కు గ్రీస్లో ల్యాండ్ అయినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా చెబుతోంది. ఇరాన్ దాడి చేసే అవకాశాలుండడంతో ఇజ్రాయెల్ చీఫ్ గ్రీస్కు వెళ్లిపోయాడంటూ ఆ కథనాలు పేర్కొంటున్నాయి. అయితే.. ‘వింగ్ ఆఫ్ జియాన్’లో నెతన్యాహు ఉన్నారా? లేదా? అనే విషయాలపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. Prime Minister Netanyahu’s aircraft, Wing of Zion, has taken off from Israel.Israeli assessments say this could be a sign that a strike on Iran is very close.They note that ahead of the previous strike on Iran, Wing of Zion also departed just hours before the operation. pic.twitter.com/7P1sNVVdMQ— Reeve Breskin (@reevbreskin) January 14, 2026 -
ఉక్రెయిన్ రాజధానిలో.. ఇజ్రాయెల్ రాయబారుల ‘గజగజ’..!
కీవ్: ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్లో ఇజ్రాయెల్ రాయబారులు గజగజ వణికిపోతున్నారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారిక వార్తాసంస్థ ‘యెదువోత్ అహ్రోనోత్’ స్వయంగా పేర్కొంది. ప్రస్తుతం కీవ్లో మైనస్ 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. రష్యా భారీ దాడులతో అక్కడ వేల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అంతేకాదు.. మూడ్రోజులుగా ఆ ప్రాంతాల్లో నీటి సరఫరా లేదు. దీంతో.. ఇజ్రాయెల్ రాయబారులు చలికి గజగజ వణికిపోతున్నారు.ఇజ్రాయెల్ రాయబారి మైఖేల్ బ్రాడ్స్కీ ఈ సందర్భంగా వైనెట్ న్యూస్తో మాట్లాడుతూ.. ‘కీవ్ ఇప్పుడు ఘోస్ట్ సిటీగా మారిపోతోంది. విద్యుత్తు లేకపోవడంతో.. హీటర్లు పనిచేయక ప్రజలు అల్లాడిపోతున్నారు. తాగునీటి సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో.. పరిసర నగరాలకు తరలిపోతున్నారు’ అని వ్యాఖ్యానించారు. యుద్ధం కొనసాగుతున్నా.. తాము రాయబార కార్యాలయ విధులకు ఆటంకం కలిగించడం లేదని, అయితే.. మౌలిక సదుపాయాలు మృగ్యమవ్వడంతో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందని వివరించారు. ‘మేము ఉంటున్న అపార్ట్ మెంట్లలో విద్యుత్తు లేదు. బయట మైనస్ 18 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. దాంతో వెచ్చని కోట్లు ధరించి గడపాల్సి వస్తోంది. శీతాకాలం చలికి తోడు.. రష్యా దాడులు ఉధృతమవుతున్నాయి. ఉక్రెయిన్లో ఉంటున్న ఇజ్రాయెలీలకు రక్షణ కల్పించేందుకు మేము మా వంతు కృషి చేస్తున్నాం’ అని ఆయన వివరించారు.దీనిపై కీవ్ మేయర్ మాట్లాడుతూ రష్యా దాడులతో వేల మంది పౌరులు చీకట్లో మగ్గిపోతున్నారని, చలికి వణుకుతున్నారని వాపోయారు. పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. కాగా.. రష్యా ప్రయోగించిన హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ‘ఓర్ష్నిక్’ కారణంగా కీవ్లోని విద్యుత్తు వ్యవస్థ చాలా వరకు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అయితే.. పౌరులకు ఇబ్బందులు కలగకుండా జనరేటర్లను సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
పావురాలకు ఆహారమేస్తే జైలుకే..! ఎక్కడో తెలుసా?
ఇంగ్లాండ్ రాజధాని లండన్లో జరిగిన అనూహ్య ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అక్కడ రోడ్డుపై నడిచివెళుతున్న మహిళకు ప్రక్కనే పావురాల గుంపు కనిపించింది. వాటికి ఏదైనా తినిపించాలని అనిపించడంతో ఆహారం వేసింది. దీంతో వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ఆశ్చర్యపోవడం ఆమె వంతయ్యింది.ఇంగ్లాండ్.. లండన్లో పరిసరాల పరిశుభ్రతకు అక్కడి అధికారులు కఠిన చట్టాలు అవలంభిస్తున్నారు. పాపం అది తెలియని ఓ మహిళ పక్షులకు ఆహారం తినిపించి ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే... బుధవారం లండన్లో ఓ మహిళ పావురాలకు ఆహారం వేసింది. అయితే అక్కడి చట్టాల ప్రకారం రోడ్డుపై ఏదైనా పదార్థాలు వేయడం నేరం. దీంతో ఇది గమనించిన పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమె వేడుకోవడంతో 100 పౌండ్లు జరిమానా విధించి వదిలేశారు. ఈ చిత్రాలను అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన ఫోన్లో చిత్రీకరించారు. దీంతో ఇవి వైరల్గా మారాయి. అయితే లండన్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్త చెదారం వేయడం నేరం. అంతేకాకుండా పెద్ద సౌండ్లతో సౌండ్బాక్సుల వాడకం అనుమతి లేకుండా కరపత్రాలు పంచడం తదితరమైన పనులన్నీ అక్కడ నేరంగా పరిగణిస్తారు. వీటికి జైలుశిక్షతో పాటు జరిమానాలు విధిస్తారు. -
ట్రంప్ భయం?.. ఉరిశిక్ష రద్దు చేసిన ఇరాన్
ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. . ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల నేపథ్యంలో అరెస్టైన నిరసనకారుడు ఇర్ఫాన్ సోల్తానికి విధించిన మరణశిక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అమెరికా తమ దేశంపై దాడి చేస్తుందనే భయంతోనే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పొలిటికల్ వర్గాలు భావిస్తున్నాయి.గత కొద్దిరోజులుగా ఇరాన్లో తీవ్రనిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. నిరసన కారులపై కాల్పులు జరిపితే తాము రంగంలోకి దిగుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయినప్పటీకీ ఇరాన్ తన తీరును మార్చుకోలేదు. నిరసనకారులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపింది. ఈ దాడులలో దాదాపు రెండువేల మందికి పైగా మృతిచెందారు. ఈనేపథ్యంలో అమెరికా ఇరాన్పై దాడి చేయడం ఇక తప్పదని అంతా భావించారు. అయితే సడెన్గా పరిస్థితి యూటర్న్ తీసుకుంది.అరెస్టు చేసిన నిరసనకారులకు ఉరితీసే ఆలోచనను ప్రస్తుతానికి పక్కనబెట్టినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాకుండా నిరసనకారుడు ఇర్ఫాన్ సోల్తానీ మరణ శిక్షను రద్దుచేస్తూ ఆదేశాలిచ్చింది. ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరిపినందుకు గానూ జనవరి 10న ఇర్పాన్ సోల్తానీని అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది.అనంతరం నిన్న( జనవరి14న)న మరణశిక్ష అమలు జరపడానికి ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో ఆయన ఉరిశిక్ష వాయిదా వేస్తున్నట్లు ప్రకటించగా తాజాగా ఆయన మరణశిక్షను రద్దుచేస్తూ ఆదేశాలిచ్చింది. కాగా ఇరాన్లో జరుగుతున్న నిరసనలకు ట్రంప్ మద్ధతుగా నిలిచారు. వారిపై దాడి చేస్తే అమెరికా జోక్యం చేసుకుంటుందంటూ హెచ్చరించారు. తాజాగా ఇరాన్ చల్లబడడంతో ట్రంప్ సైతం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ విషయంపై ట్రంప్ స్పందిస్తూ "ముఖ్యమైన వర్గాల నుంచి నాకు సమాచారం అందింది. నిరసనకారులపై హింసాత్మక చర్యలు నిలిపేశారని అలాగే మరణశిక్షలు వాయిదా వేసినట్లు తెలిసింది. అని వాషింగ్టన్లో ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. ప్రస్తుతానికి వేచిచూసే ధోరణి అవలంభించుకుంటున్నాం" అని ట్రంప్ అన్నారు. -
గ్రోక్లో వస్త్రాపహరణం.. మస్క్ కీలక వ్యాఖ్యలు
గ్రోక్ ఇమేజ్ ఎడిటింగ్ టూల్స్పై కొత్త నియమాలపై ప్రముఖ బిలీయనీర్, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ వివరణతో మరింత వివాదం రాజుకుంది. నిజమైన మనుషుల ఫొటోలను అశ్లీలంగా ఎడిట్లు చేయకుండా నిషేధం విధించినప్పటికీ.. వేర్వేరు ప్రాంప్ట్స్తో ఆ తరహా ఫొటోలు జనరేట్ చేస్తున్నారు కొందరు. అయితే.. దానిని అడ్డుకోవడం సాధ్యం కాకపోవచ్చన్న రీతిలో ఆయన మాట్లాడారు. రియల్ వ్యక్తులపై అనుమతి లేకుండా రూపొందించిన సెక్సువల్ డీప్ఫేక్లు తీవ్ర విమర్శలకు గురైన నేపథ్యంలో ఎక్స్ గ్రోక్ చర్యలు తీసుకుంది. దాని వల్ల గ్రోక్ ద్వారా నిజమైన వ్యక్తులను బికినీ లేదంటే ఇతర సెక్సువలైజ్డ్ దుస్తుల్లో చూపించే ఎడిట్స్ చేయడం కుదరదు. అయితే, AI ఆధారిత కల్పిత పాత్రలు లేదంటే ఊహాజనిత వ్యక్తులపై ఇలాంటి కంటెంట్ సృష్టించడం మాత్రం ఇంకా అనుమతించబడుతోంది.ఈ నిర్ణయంపై ఎలాన్ మస్క్ స్వయంగా స్పందించారు. ‘‘అమెరికాలోని “de facto standard” ప్రకారం.. NSFW (Not Safe For Work) మోడ్ ఆన్ చేసినప్పుడు గ్రోక్ ఊహాజనిత పెద్దవారి పాత్రలపై R-rated సినిమాల్లో కనిపించే స్థాయి వరకు ఎడిట్స్ అనుమతించాలి. అయితే, నిజమైన వ్యక్తులపై మాత్రం ఇది వర్తించదు అని ఉద్ఘాటించారు. అయితే.. ఈ మార్పులు వచ్చినప్పటికీ ఇంకా గ్రోక్ ద్వారా సెక్సువలైజ్డ్ ఇమేజ్లు సృష్టించడం సాధ్యమవుతోందని The Verge లాంటి పత్రికలు కథనాలు ఇస్తున్నాయి. “put her in a bikini” లేదంటే “remove her clothes” వంటి డైరెక్ట్ ప్రాంప్ట్స్ పని చేయకపోయినా.. ప్రత్యామ్నాయ అశ్లీల ప్రాంప్ట్లు కొన్ని పనిచేస్తున్నాయి. దీంతో, విధానం కఠినంగా ఉన్నప్పటికీ, అమలు మాత్రం లేదని ఆ కథనం పేర్కొంది. వీటికి తోడు.. గ్రోక్ ద్వారా అదనంగా వయసు ధృవీకరణ పాప్అప్ ఉన్నప్పటికీ.. కేవలం పుట్టిన సంవత్సరం ఎంచుకోవడం ద్వారా దాన్ని తప్పించుకోవచ్చు. ఎటువంటి ఆధారాలు చూపాల్సిన అవసరం లేకపోవడం వల్ల 18 ఏళ్ల లోపు వినియోగదారులు కూడా సులభంగా యాక్సెస్ చేయగలుగుతున్నారు. అదే సమయంలో పురుషుడి సెల్ఫీని సెక్సువలైజ్డ్ ఇమేజ్గా మార్చిన సందర్భం కూడా రిపోర్ట్ అయింది. అయితే.. ఈ లోపాలను కూడా ఎక్స్,గ్రోక్ సమర్థించుకుంటున్నాయి. వినియోగదారుల ప్రాంప్ట్స్ విధానం తప్పుగా ఉపయోగించడం, హ్యాకింగ్ తరహా మార్పుల కారణంగానే ఈ లోపాలు వస్తున్నాయని చెబుతోంది. దీంతో ఈ సమర్థనపై కరెక్ట్ కాదు బాస్ అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
పాకిస్తాన్ నక్క బుద్ది.. భారత్ టార్గెట్గా భారీ ప్లాన్?
ఇస్లామాబాద్: కుక్క తోక వంకర అనే విధంగా పాకిస్తాన్ వ్యవహరిస్తోంది. ఉగ్రవాదం విషయంలో బహిరంగ వేదికలపై తమ దేశం వ్యతిరేకం అంటూనే.. అంతర్గతంగా మాత్రం టెర్రరిజాన్ని పెంచి పోషిస్తోంది. ఈ విషయం ఇప్పటికే పలుమార్లు రుజువైనప్పటికీ.. తాజాగా మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, ఆ దేశ సైన్యం భద్రతా సంస్థలు కలిసి రెండో తరం ఉగ్రవాద నాయకత్వాన్ని నిర్మించడానికి కృషి చేస్తున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇందుకు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకుంటున్నట్టు తెలిసింది. వీరిలో సీనియర్ ఉగ్రవాద కమాండర్ల కుమారులు, వారి దగ్గరి బంధువులు ఉన్నారని నిఘా వర్గాలు తెలిపాయి. వీరంతా భారత్ టార్గెట్గా దాడులకు ప్లాన్ చేస్తున్నారనే సమాచారం బయటకు వచ్చింది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. ఇటీవల పాకిస్తాన్లోని బహవల్పూర్లో ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ), పాకిస్తాన్ ఆర్మీ అధికారుల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తదుపరి తరం నాయకత్వంగా వర్ణించబడిన ఉగ్రవాద సంస్థల సీనియర్ కమాండర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. జమ్ముకశ్మీర్లోకి పెద్ద ఎత్తున చొరబాట్లను ప్లాన్ చేయడం, భవిష్యత్తులో ఉగ్రవాద దాడులను సమన్వయం చేయడమే ముఖ్య లక్ష్యమని చర్చించుకున్నట్టు తెలిసింది. అయితే, జమ్ముకశ్మీర్లో ఇప్పటికే ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడానికి లష్కరే తోయిబా (ఎల్ఈటీ), జైష్-ఏ-మొహమ్మద్ (జెఎమ్) కలిసి పనిచేస్తున్నాయని నిఘా వర్గాలు సూచిస్తున్నాయి.పహల్గాం తరహా ప్లాన్?మరోవైపు.. సీనియర్ లష్కరే కార్యకర్తలు తల్హా సయీద్, సైఫుల్లా కసూరి, జైష్ కమాండర్ అబ్దుర్ రౌఫ్తో ఇటీవలే బహవల్పూర్కు చేరుకున్నారు. అక్కడే జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్తో తల్హా సయీద్, సైఫుల్లా కసూరి రహస్య సమావేశం నిర్వహించారని నిఘా వర్గాలు తెలిపాయి. కాగా, పహల్గాం దాడికి ముందు కూడా ఇలాంటి సమావేశాలు జరిగాయని నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ సమావేశం ఇది రెండు ఉగ్రవాద సంస్థల మధ్య సమన్వయాన్ని మరింతగా పెంచుతుందనే అనుమానాలను బలపరుస్తోంది.హఫీజ్ సయీద్, మసూద్ అజార్ వంటి సీనియర్ ఉగ్రవాద నాయకుల నుండి వారి వారసుల వైపు ISI ఇప్పుడు దృష్టిని మళ్లిస్తోందని భద్రతా సంస్థలు చెబుతున్నాయి. నాయకత్వం, కార్యకలాపాల కొనసాగింపును నిర్ధారించడానికి రెండో తరం ఉగ్రవాద కార్యకర్తలను ప్రోత్సహించడం, నిధులు సమకూర్చడం ఈ వ్యూహంలో భాగంగా ఉన్నట్టు సమాచారం. కాగా, ఇందుకు అత్యంత ప్రముఖ వ్యక్తులలో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ కూడా ఉన్నారు. సైద్ధాంతికంగానే కాకుండా సంస్థాగత నిర్వహణ, నిధుల నెట్వర్క్లు మరియు అంతర్జాతీయ సంబంధాలలో కూడా అతన్ని క్రమపద్ధతిలో తీర్చిదిద్దుతున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి.అదేవిధంగా, మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రౌఫ్ అస్గర్కు ISI మద్దతు, శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. కాగా, అస్గర్.. జైష్-ఎ-మొహమ్మద్లో కార్యకలాపాలను ప్లాన్ చేయడం, ఉగ్రవాద మాడ్యుల్స్ సిద్ధం చేయడం, సరిహద్దు కార్యకలాపాలను సమన్వయం చేయడం వంటి పెద్ద నాయకత్వ పాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రౌఫ్ అస్గర్ గతంలో అనేక ఉగ్రవాద దాడుల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో పాక్ చర్చలు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయనే చర్చ మొదలైంది. -
ట్రంప్ వార్నింగ్తో వెనక్కి తగ్గిన ఇరాన్?
అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన చేశారు. ఇరాన్లో నిరసనకారులకు మరణదండన శిక్షలు వాయిదా పడ్డట్లు ప్రకటించారు. అదే సమయంలో.. సైనిక చర్య ఆలోచనను విరమించుకున్నారన్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. మరోవైపు.. ఇరాన్ సైతం ఆందోళనకారులను ఉరి తీసే ఆలోచనను ప్రస్తుతానికైతే పక్కన పెట్టినట్లు ధృవీకరించింది. ‘‘ముఖ్యమైన వర్గాల నుంచి నాకు సమాచారం అందింది. నిరసనకారులపై హింసాత్మక చర్యలు నిలిపిశారని.. అలాగే మరణశిక్షణలను కూడా వాయిదా వేసినట్లు తెలిసింది’’ అని వాషింగ్టన్లో మీడియా ప్రతినిధులతో ట్రంప్ అన్నారు. ఈ నేపథ్యంతో సైనిక చర్యపై వెనక్కి తగ్గుతారా? అని రిపోర్టర్లు ప్రశ్నించగా.. అక్కడి ప్రభుత్వం నిరసనకారుల్ని హత్యలు చేస్తోంది. ఇప్పుడు వాటిని ఆపేసింది. ఇలాంటి టైంలో వేచి చూసే ధోరణి అవలంభించాలనుకుంటున్నాం అని అన్నారు. దీంతో.. ఏ క్షణమైనా ఇరాన్పై దాడి చేయవచ్చనే సంకేతాన్ని అలాగే ఉంచారు.ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను కఠినంగా అణచివేస్తున్నది తెలిసిందే. ఇప్పటివరకు 18,000 మందికి పైగా అరెస్టు అయ్యారు. ఘర్షణల్లో మరణాల సంఖ్య 2,600 దాటిందని.. 3,000 మందికి పైగా మరణించారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇది 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్లో జరిగిన అత్యంత ఘోర నిరసనలలో ఒకటిగా భావిస్తున్నారు. అయితే.. అరెస్టైన నిరసనకారుల్ని దేశద్రోహులుగా పరిగణిస్తూ న్యాయవిచారణ జరపకుండానే మరణశిక్ష అమలు చేయాలని ఇరాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వరుసలో ఇర్ఫాన్ సోల్తానీ పేరు ప్రముఖంగా వినిపించింది. న్యాయపరంగా ఎలాంటి సాయం అందకుండా చేసి.. కేవలం 10ని. మాట్లాడుకోవడానికి కుటుంబానికి అనుమతిచ్చి.. సోల్తానీని ఉరి తీసేందుకు బుధవారం ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే చివరి నిమిషంలో ఆ ఉరి వాయిదా పడింది. నార్వేలోని హ్యూమన్ రైట్స్ సంస్థ హెన్గావ్ ప్రకారం.. సోల్తానీకి విధించబోయే శిక్షను వారంపాటు వాయిదా వేసినట్లు సమాచారం. అందుకు గల కారణాలకు మాత్రం స్పష్టత లేకుండా పోయింది. ట్రంప్ వార్నింగ్ ప్రభావంతోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి ఇరాన నిరసనకారులకు మద్దతు ప్రకటిస్తున్నారు. అయితే వాళ్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని.. అవసరమైతే సైనిక చర్యలకు దిగుతామని ఖమేనీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అవసరమైన సాయం పంపిస్తాం అంటూ ఆందోళనలను ప్రొత్సహిస్తున్నారు. అయితే కఠిన మార్గాలు ఆయన ఉద్దేశాలు కావని.. ఏదైనా సామరస్యంగా పరిష్కారం కావాలనే కోరుకుంటున్నారని వైట్హౌస్ ప్రతినిధి కరోలైన్ లేవిట్ విరుద్ధమైన ప్రకటన చేయడం గమనార్హం.ఇదిలా ఉంటే.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి సైతం ఈ విషయంలో కీలక ప్రకటన చేశారు. నిరసనలతో సంబంధం ఉన్నవాళ్లకు మరణదండనలు అమలు చేయాలనే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. వాళ్లను ఉరి తీసేందుకు ఎలాంటి ప్రణాళికను సిద్ధం చేయలేదు అని ఆయన ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే, ఇరాన్ న్యాయవ్యవస్థ మాత్రం వేగంగా విచారణలు జరిపి శిక్షలు అమలు చేయాలని చూస్తోంది. -
‘అప్పుడు మిస్సయిన బుల్లెట్ ఇప్పుడు దిగుతుంది’
టెహ్రాన్: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను హతమార్చుతామని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థలు బహిరంగంగా ప్రసారం చేయడం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది.2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డ ఘటన ఇంకా గుర్తుండగానే ఈ బెదిరింపు వెలువడింది. ఆ ఏడాది జూలై 14న పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ట్రంప్పై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో ఆయన చెవికి గాయమైంది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే రక్షణగా చేరి ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన దుండగుడిని భద్రతా బలగాలు అక్కడికక్కడే హతమార్చాయి.ఇప్పుడు అదే ఘటనకు సంబంధించిన ఫొటోలు, విజువల్స్తో ఇరాన్ మీడియా కథనాలు ప్రసారం చేస్తూ..‘గతంలో బుల్లెట్ మిస్సైంది.. ఇక మిస్సవ్వదు, ఖచ్చితంగా లక్ష్యాన్ని తాకుతుంది’ అంటూ ట్రంప్ను బహిరంగంగా బెదిరించింది. దాడులకు దిగితే ఇరాన్ ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందనే అంచనాతో అమెరికా అప్రమత్తమైంది. మధ్యప్రాచ్యంలో తన సైనిక స్థావరాలను ఖాళీ చేస్తోంది. ఈ తరుణంలో ఇరాన్ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు ఇరాన్పై సైనిక దాడులు చేస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో, టెహ్రాన్ ఇప్పటివరకు చేసిన అత్యంత బహిరంగ బెదిరింపులలో ఈ ప్రసారం ఒకటిగా నిలిచింది. అదే సమయంలో, అమెరికా తమ దేశంలో అంతర్గత అశాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తోందని ఇరాన్ అధికారులు ఆరోపిస్తున్నారు.ఇరాన్లో ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, ప్రభుత్వ అవినీతి కారణంగా ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇలాంటి ప్రకటనలు దేశంలో ఉద్రిక్తతను మరింత పెంచుతున్నాయి. ట్రంప్పై ఇరాన్ మీడియా చేసిన బెదిరింపులను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. -
భారత్, చైనా నడుమ షాక్స్గావ్ రగడ
షాక్స్గావ్. భారత్, చైనా నడుమ సరికొత్త రగడకు కేంద్ర బిందువుగా మారిన లోయ. కల్లోల కశీ్మర్లో అత్యున్నత పర్వత శ్రేణుల సమీపంలో ఉన్న ఈ ప్రాంతం ఇరుదేశాల నడుమ మరోసారి ఘర్షణ వాతావరణాన్ని పెంచుతోంది. అది ఎప్పటికీ తమదేనని, అక్కడ జరిపే ఎలాంటి నిర్మాణాలనైనా అక్రమమైనవిగానే పరిగణిస్తామని భారత్ తాజాగా స్పష్టం చేయడం తెలిసిందే. షాక్స్గావ్ తమదేనంటూ చైనా ఎప్పట్లాగే తెంపరితనం ప్రదర్శిస్తోంది. అక్కడి తన నిర్మాణాలన్నీ సక్రమమేనని అడ్డగోలు వాదనకు దిగుతోంది. ఇంతకీ ఏమిటీ షాక్స్గావ్? ఎందుకీ వివాదం?షాక్స్గావ్ లోయ కశ్మీర్లో హంజా–గిల్గిట్ ప్రాంతంలో ఉంటుంది. 5,180 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నెలకొని ఉన్న అతి శీతల ప్రాంతం. ఇటు కారకోరం పర్వత శ్రేణులను, అటు ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్ను ఆనుకునే ఉంటుంది. దీన్ని ట్రాన్స్ కారకోరం శ్రేణిగా అని పిలుస్తారు. దీనికి ఉత్తరాన చైనా, దక్షిణాన, పశి్చమాన పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం (పీఓకే) ఉన్నాయి. అలా ఈ లోయ వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన స్థానంలో ఉండటంతో దీనిపై ఆధిపత్యం చాలా ప్రధానంగా మారింది. పాక్ పెట్టిన చిచ్చు.. భారత్, చైనా నడుమ షాక్స్గావ్ చిచ్చు పెట్టింది దాయాది పాకిస్తానే. స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లోనే నాటి అస్థిర పరిస్థితులను ఆసరాగా చేసుకుని పాక్ సైన్యం షాక్స్గావ్ లోయను ఆక్రమించేసింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపినా అక్కడినుంచి వైదొలగలేదు. భారత్ కూడా ఈ ప్రాంతాన్ని తిరిగి అదుపులోకి తీసుకునే ప్రయత్నాలేవీ చేయలేదు. 1950ల్లో తూర్పు హంజా గుండా చైనా ఈ ప్రాంతాల్లోకి చొచ్చుకురావడం మొదలు పెట్టింది. దాంతో ఆ దేశంతో భారత సంబంధాలు క్రమంగా దిగజారడం మొదలైంది. దాంతో 1963లో నాటి పాక్ పాలకుడు అయూబ్ ఖాన్ ఓ కుటిలాలోచన చేశారు. యార్కండ్ నదితో పాటుగా షాక్స్గావ్ లోయ మొత్తాన్నీ చైనాకు ధారాదత్తం చేసేశారు. చైనా–పాక్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ)లో భాగంగా కొన్నేళ్లుగా చైనా అక్కడ దూకుడుగా పలు నిర్మాణాలు చేపట్టింది. ముఖ్యంగా ఇరు దేశాలనూ అనుసంధానిస్తూ హైవే నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తోంది. ఏకంగా 10 మీటర్ల వెడల్పుతో ఇప్పటికే 75 కి.మీ. పొడవున రోడ్డు నిర్మాణం పూర్తయింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చైనా, పాక్ కుదుర్చుకున్న సీపీఈసీ ఒప్పందం షాక్స్గావ్లో చెల్లబోదని విదేశాంగ శాఖ పునరుద్ఘాటించింద. దానిని భారత్ ఎన్నడూ గుర్తించలేదని స్పష్టం చేసింది. అక్కడి చైనా–పాక్ ఆర్థిక కారిడార్ను అక్రమమైనదిగానే గుర్తిస్తామని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సోమవారం కుండబద్దలు కొట్టారు. దీనిపై చైనా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. భారత్కు ఇరకాటమే.. ప్రాదేశికంగా, సైనికపరంగా షాక్స్గావ్ అత్యంత కీలకమైన ప్రాంతంలో ఉంది. అటు పాక్, ఇటు చైనా రూపంలో ఇద్దరు ప్రత్యర్థులు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ కీలక ప్రాంతంపై పూర్తిస్థాయి పట్టు భారత్కు అత్యంత కీలకం. దీనికి ఒకవైపున్న సియాచిన్ గ్లేసియర్ నుంచి పాక్పై భారత్ నిత్యం డేగకన్ను వేసి ఉంచుతుంది. మరోవైపున ఉన్న కారకోరం శ్రేణి గుండా చైనాపై నిఘా నేత్రం సారిస్తూ ఉంటుంది. ‘‘2024 నాటికే చైనా 4.8 కి.మీ. పొడవైన అఘిల్ కనుమ గుండా దిగువ షాక్స్గావ్ వరకు రోడ్డు నిర్మాణాన్ని దాదాపుగా పూర్తి చేసేసింది. నిర్మాణ బృందాల మాటున చైనా సైన్యం అక్కడ మోహరించింది. ఈ ప్రాంతం సియాచిన్కు 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇది మన భద్రతకు ఎప్పటికైనా ముప్పే’’అని ప్రముఖ భద్రత వ్యవహారాల నిపుణుడు బ్రహ్మ చెల్లాని ఆందోళన వెలిబుచ్చారు. ‘‘దశాబ్దాలుగా సియాచిన్పై భారత్ పట్టు కొనసాగుతోంది. అక్కడినుంచి దక్షిణాన పాక్పై నిత్యం కన్నేసి ఉంచుతున్నాం. ఇప్పుడు ఉత్తరాన షాక్స్గావ్ వైపు నుంచి చైనా ముప్పు ముంచుకొచి్చంది. దాంతో సియాచిన్, పరిసర ప్రాంతాల్లో మనం నిత్యం రెండువైపులా శత్రువులను కాచుకుంటూ ఉండాల్సిన పరిస్థితి. మైనస్ 50 డిగ్రీల అతి శీతల పరిస్థితులుండే చోట మన సైనిక బలగాలను రెండు భాగాలుగా మోహరించాల్సి వస్తుంది’’అని ఆయన వివరించారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
గ్రీన్లాండ్ సొంతం కావాల్సిందే!
నూక్ (గ్రీన్లాండ్): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ నామజపం నానాటికీ శ్రుతి మించుతోంది. ఆ ద్వీపం పూర్తిగా అమెరికా వశం అయి తీరాల్సిందేనని, అది తప్ప ఇంక దేనికీ అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన బుధవారం పునరుద్ఘాటించారు. అంతేకాదు, అందుకు నాటో కూటమి ఇతోధికంగా సాయపడాలని చెప్పుకొచ్చారు. వెనెజువెలాపై సైనిక చర్యతో అధ్యక్షుడు మదురో దంపతులను నిర్బంధించిన అనంతరం ట్రంప్ తన దృష్టినంతా గ్రీన్లాండ్పై కేంద్రీకరించడం తెలిసిందే. ఇది గ్రీన్లాండ్తో పాటు ఆ ద్వీపాన్ని నియంత్రిస్తున్న డెన్మార్క్తో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అవసరమైతే సైనిక చర్య తప్పదని ట్రంప్, అలాగైతే తొలి తూటా పేల్చేది తామేనని డెన్మార్క్ పోటాపోటీ ప్రకట నలతో వాతావరణం బాగా వేడెక్కింది. ఈ పరిస్థితుల్లో ఉద్రిక్తతలను చల్లార్చేందుకు ఒకవైపు డెన్మార్క్, గ్రీన్లాండ్ విదేశాంగ మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన బృందంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో వాషింగ్టన్లో భేటీ అవుతుండగా, అంతకు కేవలం కొద్ది గంటల ముందు ట్రంప్ మళ్లీ ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగారు. ‘అమెరికా జాతీయ భద్రత నిమిత్తం గ్రీన్లాండ్ మాకు కావాల్సిందే. ఆ ప్రయత్నాలకు నాటో కూటమే సారథ్యం వహించాలి. లేదంటే గ్రీన్లాండ్పై రష్యా, చైనా పట్టు సాధిస్తాయి. అలా జరగనివ్వబోం’ అని సొంత సోషల్ మీడియా ‘ట్రూత్ సోషల్’లో ఆయన వరుస పోస్టులు పెట్టారు. ‘మేం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థలో గ్రీన్లాండ్ అతి కీలకం’ అని పేర్కొన్నారు. అంతేకాదు, గ్రీన్లాండ్ అమెరికా గుప్పెట్లోకి వస్తే నాటో మరింత బలోపేతమైన శక్తిగా మారుతుందని చెప్పుకొచ్చారు. డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రతినిధుల బృందం ఇప్పటికే వైట్హౌస్లో ఒక దఫా అమెరికా బృందంతో చర్చలు జరిపింది. వాన్స్తో భేటీ అనంతరం సెనేటర్లు, ఇతర ఉన్నతాధికారులతో వారు మరోసారి సమావేశం కానున్నారు. మరోవైపు, గ్రీన్లాండ్ స్వాధీన ప్రయత్నాలకు రక్షణ, లేదా ఇతర శాఖల నుంచి నిధులు వెచ్చించేందుకు వీల్లేదంటూ ఇద్దరు సెనేటర్లు తాజాగా బిల్లు ప్రవేశపెట్టారు. వీరిలో ఒకరు అధికార రిపబ్లికన్ పార్టీకి చెందినవారు కావడం విశేషం. శుక్ర, శనివారాల్లో వారి బృందం డెన్మార్క్లో పర్యటించనుంది. డెన్మార్క్ ప్రధాని తదితరులతో భేటీ కావాలని వారు నిశ్చయించారు. తమ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలపై గ్రీన్లాండ్వాసులు మండిపడుతున్నారు. తాము అమ్మకానికి సిద్ధంగా లేమంటూ నినదిస్తున్నారు. ‘‘మేం డెన్మార్క్ను ఎంచుకున్నాం. ఆ దేశంలో భాగంగా, యూరోపియన్ యూనియన్ భాగస్వామిగా మాత్రమే కొనసాగుతాం. అంతే తప్ప అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరడం కల్ల’’ అని అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో వారు కుండబద్దలు కొడుతున్నారు. చైనా, రష్యాలతో తమ ద్వీపానికి ముప్పుందన్న ట్రంప్ వాదనను గ్రీన్లాండ్వాసులు ఎద్దేవా చేస్తున్నారు. ఆయన నోట వస్తున్నవన్నీ కాల్పనిక గాథలని వారు చెప్పు కొచ్చారు. ‘‘ట్రంప్కు కావాల్సింది కేవలం మా ద్వీపంలోని అపార సహజ వనరులే. వాటికోసమే ఇలా ఇతర దేశాలను బూచిగా చూపుతూ ప్రయాస పడుతు న్నారు’’ అని మండిపడ్డారు. మరోవైపు, ఫిబ్రవరి 6న గ్రీన్లాండ్లో దౌత్య కార్యాలయం తెరుస్తున్నట్టు నాటో సభ్య దేశమైన ఫ్రాన్స్ కీలక ప్రకటన చేసింది. గ్రీన్లాండ్పై దాడి తప్పదన్న బ్లాక్మెయిలింగ్కు అమెరికా స్వస్తి పలకాలని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయల్ బారొట్ హితవు పలికారు.డెన్మార్క్, గ్రీన్లాండ్ నేతల యునైటెడ్ ఫ్రంట్!ట్రంప్కు వ్యతిరేకంగా డెన్మార్క్, గ్రీన్లాండ్ సంఘటితమవుతున్నాయి. ఈ దిశగా సమైక్య పోరు కోసం యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని వారు నిర్ణయానికి వచ్చారు. ‘‘గ్రీన్లాండ్ పూర్తిగా డెన్మార్క్కు చెందిన భాగమే. కనుక దానికి నాటో సైనిక రక్షణ పూర్తిస్థాయిలో కొనసాగుతుంది’’ అని ఇరు దేశాల ప్రధానులు మెట్టె ఫ్రెడరిక్సన్, జీన్స్ నీల్సన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ‘‘ప్రియ మైన గ్రీన్లాండ్వాసు లారా.. ఈ రోజు మనమంతా సంయుక్తంగా ఒక్కతాటిపై నిలబడి ఉన్నాం. మున్ముందూ అలాగే ఉండబోతున్నాం’’అని ఫ్రెడరిక్సన్ కోపెన్ హాగెన్లో మీడియా భేటీలో ప్రకటించారు. ‘‘అమెరికా, డెన్మార్క్లలో ఏదో ఒకదా న్నే ఎంచుకోవాల్సి వస్తే మా చాయిస్ ఎప్పటికీ డెన్మార్కే. నాటోనే. యూరోపియన్ యూని యనే’’ అని నీల్సన్ కుండబద్దలు కొట్టారు. -
దాడులకు అమెరికా రెడీ!
దుబాయ్/వాషింగ్టన్/బ్యాంకాక్/న్యూఢిల్లీ: ఇరాన్తో వాణిజ్యంచేసే దేశాలపై పాతిక శాతం సుంకాలువేసి టారిఫ్ల కొరడా ఝళిపించిన ట్రంప్ సేన హఠాత్తుగా సుంకాల మాటెత్తకుండా సైన్యంతో దండెత్తబోతోందన్న వార్త సంచలనం సృష్టిస్తోంది. దీనికి బలం చేకూర్చేలా ఖతార్లోని అమెరికా సైనిక స్థావరం నుంచి పెద్దసంఖ్యలో బలగాలు ఇరాన్ దిశగా కదులుతున్నట్లు వార్తలొచ్చాయి. అయితే తమ బలగాలపై ఇరాన్ దాడి చేయొచ్చనే ముందస్తు అంచనాతోనే తమ సైన్యాన్ని స్థావరం నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తున్నామని, దాడి ఉద్దేశం తమకు లేదని అమెరికా అధికారి ఒకరు చెప్పారు. అయితే, ఆందోళనకారులపై కాల్పులు జరిపితే కన్నెర్ర జేస్తానని ఇప్పటికే ప్రకటించిన ట్రంప్.. ఇప్పుడు ఏకంగా తమ స్థావరం మీదనే ఇరాన్ దాడులకు దుస్సాహసం చేస్తే చూస్తూ ఊరుకోబోడని, ఇరాన్ కంటే ముందే దాడులతో విరుచుకుపడతాడని అంతర్జాతీయ యుద్ధరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఇరాన్లో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. తొలుత వందల్లో కన్పించిన మరణాలు ఇప్పుడు వేలల్లో తేలుతున్నాయి. అయతొల్లా అలీ ఖమేనీ ప్రభుత్వం పరిపాలనా బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ మొదలైన ఆందోళనల్లో, పోలీసులతో ఘర్షణల్లో ఇప్పటిదాకా 2,571 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో 2,403 మంది ఉద్యమకారులు కాగా 147 మంది పోలీసులు ఉన్నారు. ఉద్యమంలో పాల్గొనని, అభంశుభం ఎరుగని 12 మంది చిన్నారులు, 9 మంది పౌరులు సైతం ఈ ఘర్షణల్లో చనిపోయారని అమెరికా కేంద్రంగా పనిచేసే ‘ ది హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజె న్సీ’ బుధవారం ప్రకటించింది. ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణచేస్తున్న ప్రభుత్వం ఇప్పటిదాకా 18,100 మందిని నిర్బంధంలోకి తీసుకుంది. దీటుగా బదులిస్తాం.. దాడులు చేస్తామని బెదిరిస్తున్న అమెరికాకు దీటుగా బదులిస్తామని ఖమేనీ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఈ మేరకు ఖమేనీ సలహాదారు అలీ షామ్ఖానీ ‘ఎక్స్’లో ఒక పోస్ట్పెట్టారు. ‘‘గతంలో ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేశామని ప్రగల్భాలు పలికే ట్రంప్.. మేం మీ అల్ ఉదేయిద్ స్థావరంపై క్షిపణులతో దాడి చేసి వినాశనం సృష్టించిన విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు?. ఆనాటి మా దాడి మా సంకల్పం, సామర్థ్యాలకు బలమైన నిదర్శనం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. స్టార్లింక్ నుంచి ఉచిత ఇంటర్నెట్ సేవలు ఉద్యమకారులపై పోలీస్ల దమనకాండతో రక్తసిక్తమవుతున్న ఇరాన్లో వాస్తవ పరిస్థితులు ఇంటర్నెట్, ఫోన్ సేవలు నిలిచిపోవడంతో ఎప్పటికప్పుడు తెలిసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఎలాన్ మస్్కకు చెందిన స్టార్లింక్ సంస్థ ఉచితంగా ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు అందిస్తోందని ఉద్యమకారులు బుధవారం వెల్లడించారు. అయితే ఈ వార్తలను స్టార్లింక్ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ‘‘టెహ్రాన్ ఫోరెన్సిక్ వైద్య కేంద్రం వరండాలో వరసబెట్టి మృతదేహాలు పడి ఉన్నాయి. ఇలాంటి దారుణోదంతాలను బయటి ప్రపంచానికి తెలియజేయాలంటే కనీసం ఇంటర్నెట్ సదుపాయం ఉండాలి. ఈ విషయంలో స్టార్లింక్ పాత్ర కీలకం’’ అని ఇరాన్లోని మెహ్దీ యాహ్యానిజాద్ అన్నారు.ఇరాన్ను వీడాలన్న భారత్పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఇరాన్లోని తమ పౌరులు, భారతీయు లు వెంటనే దేశం వీడాలని టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం ఒక అడ్వైజరీ జారీచేసింది. ఉద్యమస్థలాల వైపు వెళ్లొద్దని, ఎంబసీ వద్ద తమ పేర్లను నమోదుచేసుకోవాలని తమ పౌరులకు రాయబార కార్యాలయం సూచించింది. మరోవైపు ఇరాన్కు ప్రయాణాలను వాయిదావేసుకోవాలని భారత్లోని పౌరులకు భారత విదేశాంగ శాఖ ఒక సూచన చేసింది. -
ఆ డ్రింక్స్, మద్యంపై పన్నులు ఇంకా పెంచండి: WHO
సుగర్ డ్రింక్స్, మద్యంపై పన్నులు ఇంకా పెంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. డబ్ల్యూహెచ్ఓ తాజాగా రెండు కొత్త నివేదికలను విడుదల చేసింది. చక్కెర పానీయాలు, మద్యం చౌకగా మారుతున్నందున, ఆరోగ్య సమస్యలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయని హెచ్చరించింది.తక్కువ స్థిర పన్ను రేట్లు ఉన్న దేశాల్లో ఈ ఉత్పత్తులు ప్రజలకు సులభంగా అందుబాటులో ఉన్నాయని, దాంతో ఊబకాయం, డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, ఇతర రుగ్మతల బారిన పడుతున్నారని పేర్కొంది. ముఖ్యంగా బాధితుల్లో పిల్లలు, యువత ఎక్కువగా ఉంటున్నారని ఆవేదన వెలిబుచ్చింది.బలహీన పన్ను వ్యవస్థల వల్ల హానికరమైన ఉత్పత్తులు చౌకగా అందుబాటులో ఉంటున్నప్పటికీ, ఆరోగ్య వ్యవస్థలు వీటి వల్ల ఏర్పడే వ్యాధులు, రుగ్మతల ఆర్థిక భారాన్ని భరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి."పొగాకు, చక్కెర పానీయాలు,ఆల్కహాల్ వంటి ఉత్పత్తులపై పన్నులను పెంచడం ద్వారా, ప్రభుత్వాలు హానికరమైన ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించగలవు. తద్వారా ముఖ్యమైన ఆరోగ్య సేవలకు నిధులను ఆదా చేసుకోవచ్చు. ఆరోగ్య పన్నులు వ్యాధులను నివారించడానికి, ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి బలమైన సాధనాల్లో ఒకటి" అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ పేర్కొన్నారు.నివేదికల ప్రకారం.. కనీసం 116 దేశాలు చక్కెర పానీయాలపై పన్ను విధిస్తున్నప్పటికీ ఇవి ఎక్కువగా సోడా పానీయాలపై ఉంటున్నాయి. కానీ పండ్ల రసాలు, తియ్యటి పాల పానీయాలు, రెడీ-టు-డ్రింక్ కాఫీలు, టీలు ఇంకా పన్ను నుండి మినహాయింపు పొందుతున్నాయి. ఎనర్జీ డ్రింక్స్పై 97% దేశాలు పన్ను విధిస్తున్నప్పటికీ, 2023 నుండి ఈ సంఖ్య మారలేదు.అలాగే కనీసం 167 దేశాలు మద్యం, మత్తు పానియాలపై పన్ను విధిస్తుండగా, 12 దేశాలు మద్యాన్ని పూర్తిగా నిషేధించాయి. అయితే, ద్రవ్యోల్బణం, ఆదాయ వృద్ధికి అనుగుణంగా ఈ పన్నులు ఉండకపోవడం వల్ల 2022 నుండి చాలా దేశాల్లో ఆల్కహాల్ ధరలో పెద్ద మార్పు రాలేదు అక్కడవి చవక్కానే దొరుకుతున్నాయి. 25 దేశాల్లో అయితే ఎక్కువగా యూరోప్లో మద్యంపై ఎలాంటి పన్నులూ విధించడం లేదు.ఈ చెక్కెర పానీయాలు, మద్యం వ్యాపారాలతో పరిశ్రమలకు లాభాలు పెరుగుతున్నప్పటికీ, ప్రజలు అనారోగ్య సమస్యల బారినపడి తద్వారా వచ్చే ఆర్థిక భారాన్ని మొత్తం సమాజం భరించాల్సి వస్తోందని డబ్ల్యూహెచ్ఓ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో “3 బై 35” కార్యక్రమంలో భాగంగా 2035 నాటికి పొగాకు, మద్యం, చక్కెర పానీయాల వాస్తవ ధరలను పెంచే దిశగా పన్నులను పెంచడం, పునఃరూపకల్పన చేయడంపై దృష్టి పెట్టాలని డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. -
ఇరాన్పై ఇప్పుడే దాడి చేయొద్దు: ట్రంప్ను కోరిన అరబ్ దేశాలు
ఇరాన్పై సైనిక దాడి చేయవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఇజ్రాయెల్తో పాటు కొన్ని అరబ్ దేశాలు కోరినట్లు ఎన్బిసి న్యూస్ నివేదించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్ ప్రభుత్వం ఇంకా అమెరికా దాడితో కూలిపోయేంత బలహీనంగా లేదని ఈ దేశాల అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.ఇరాన్లో ఇటీవల జరిగిన నిరసనల సందర్భంగా నిరసనకారుల హత్యలపై అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన క్రమంలో ఈ నివేదిక వెలువడింది.నివేదిక ప్రకారం.. ఇజ్రాయెల్ అధికారులు ఇరాన్లో పాలన మార్పునకు అనుకూలంగా ఉన్నప్పటికీ, కేవలం విదేశీ సైనిక దాడితో ఆ లక్ష్యం సాధ్యం కాదని అమెరికా అధికారులకు స్పష్టం చేశారు. అలాంటి దాడి ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చడం కన్నా పరిస్థితిని మరింత సంక్లిష్టతరం చేసే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు.సైనిక చర్యలకు బదులుగా, ఇరాన్ ప్రభుత్వాన్ని లోపలినుంచి బలహీనపరిచే వ్యూహాలపై దృష్టి పెట్టాలని ఇజ్రాయెల్ సూచించింది. ఇందులో కమ్యూనికేషన్ బ్లాక్అవుట్లను ఎదుర్కొనేందుకు ఇరానియన్ ప్రజలకు సహాయం చేయడం, ఆర్థిక ఆంక్షలను మరింత కఠినతరం చేయడం, సైబర్ దాడులు నిర్వహించడం, అలాగే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ ఉన్నతాధికారులపై పరిమిత చర్యలు తీసుకోవడం వంటి అంశాలు ఉన్నాయి.ప్రస్తుతం ఇరాన్పై అమెరికా నేతృత్వంలో దాడి చేపట్టేందుకు పొరుగు దేశాల మద్దతు లేదని ఒక అరబ్ అధికారి పేర్కొన్నారు. అమెరికా లేదా ఇజ్రాయెల్ దాడి చేస్తే ప్రతీకార చర్యలు చోటు చేసుకునే అవకాశం ఉందని, అలాగే ఇరాన్ ప్రజలు ప్రభుత్వానికి మద్దతుగా ఏకమయ్యే ప్రమాదం కూడా ఉందని మరో అరబ్ అధికారి హెచ్చరించారు. -
భారత్ను ఆశ్రయిస్తున్న ఇరాన్..!
అశాంతి, ఆందోళనలు ఒకవైపు.. యుద్ధం చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి బెదిరింపులు.. వెరసి ఇరాన్ ప్రభుత్వం కకలావికలం అవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ను ఆశ్రయించే ప్రయత్నం చేస్తోంది. ట్రంప్ను ఎదుర్కొనేందుకు భారతే అండగా ఉంటుందని ఇరాన్ అధినాయకత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి తాజాగా భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్కు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని జైశంకర్ స్వయంగా ఎక్స్ లో బుధవారం పోస్టు చేశారు. ఆ వెంటనే ఇరాన్లోని భారతీయులు వెంటనే ఆ దేశాన్ని వీడాలంటూ విదేశాంగ శాఖ సర్క్యులర్ జారీ చేయడం గమనార్హం..!అయితే.. తమ మధ్య జరిగిన సంభాషణ వివరాలను జైశంకర్ పంచుకోలేదు. ఇరాన్లో పరిస్థితులపై చర్చించినట్లు మాత్రం వెల్లడించారు. ఈ ఫోన్ కాల్ ద్వారా ఇరాన్ ఇప్పుడు భారత్ మద్ధతు కోరుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇదే అంశంపై మంగళవారం కూడా మంత్రి జైశంకర్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్(ఐఓఆర్ఏ) సెక్రటరీ జనరల్ సంజీవ్ రంజన్తో సమావేశమయ్యారు. ఐఓఆర్ఏ సభ్య దేశాల మధ్య సహకారానికి సంబంధించిన కీలక రంగాలను సమీక్షించారు. ప్రభుత్వాలు, వ్యాపారాలు, విద్యాసంస్థలకు సంబంధించిన సంబంధాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించినట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొంది. -
80వ స్థానంతో.. మరింత బలపడ్డ భారత పాస్పోర్టు
న్యూఢిల్లీ: భారత పాస్పోర్టు బలపడింది. పాస్పోర్టుల ర్యాంకింగ్లో భారత్ స్థానం 85 నుంచి 80కి ఎగబాకింది. 55 దేశాల్లో వీసాలు లేకుండానే ప్రవేశించే వెసులుబాటు భారతీయులకు దక్కడంతో.. భారత్ పాస్పోర్టు బలపడింది. అదేసమయంలో పొరుగుదేశం పాకిస్థాన్ పరిస్థితి మరింతగా దిగజారిపోయింది. కింది నుంచి ఐదో స్థానం(పైనుంచి 98వ స్థానం)లో పాకిస్థాన్.. కింది నుంచి 8వ స్థానంలో బంగ్లాదేశ్ ఉండడం గమనార్హం..!2025లో భారత పాస్పోర్టు ర్యాంకింగ్ 85గా ఉండేది. తాజాగా విడుదలైన ర్యాంకింగ్లో భారత్ 5 స్థానాలను ఎగబాకి.. 80కి చేరుకుంది. ముందస్తు వీసా లేకుండా.. ఆయా దేశాల్లోకి ప్రవేశించే వెసులుబాటు మేరకు ఈ ర్యాంకింగ్లను ఇస్తారు. ఈ కోవలో సింగపూర్ పాస్పోర్టు వరుసగా రెండోసారి టాప్లో నిలిచింది. 227 దేశాలకు గాను సింగపూర్ పౌరులు 192 దేశాలకు వీసా లేకుండా ప్రవేశించగలుగుతారు. దీంతో ఆ దేశ పాస్పోర్టు అత్యంత శక్తిమంతంగా మారింది. రెండోస్థానంలో జపాన్, దక్షిణ కొరియా సంయుక్తంగా నిలిచాయి. ఈ దేశాల పౌరులు ఎలాంటి వీసాలు లేకుండానే 188 దేశాలకు ప్రయాణించగలుగుతున్నారు. డెన్మార్క్, లక్సెంబర్గ్, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్ రాష్ట్రాలు 186 దేశాల్లో ఉచిత వీసా ప్రవేశంతో మూడో స్థానంలో నిలిచాయి. అన్నింటికంటే.. ఆఫ్ఘనిస్థాన్ పాస్పోర్టు 101వ ర్యాంకుతో అత్యంత బలహీనంగా ఉంది. -
ఎర్ర సముద్రంలోకి అమెరికా నౌక..
ఇరాన్పై యుద్ధం దిశగా అమెరికా సన్నాహాలను వేగవంతం చేస్తోంది. యూఎస్ విమాన వాహక నౌక రూజ్ వెల్ట్ ఇటీవలే ఎర్ర సముద్రంలోకి ప్రవేశించింది. ఈ మేరకు యూఎస్ సైనిక అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.అదే సమయంలో, మధ్యప్రాచ్య ప్రాంతంలో అమెరికా సైన్యానికి చెందిన ఒక జలాంతర్గామితో పాటు మూడు క్షిపణి విధ్వంసక నౌకలు కూడా మోహరించబడి ఉన్నాయని ఆ వార్తాపత్రిక తెలిపింది. ఇరాన్ అణు కార్యక్రమం, క్షిపణి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని చేపట్టవచ్చిన చర్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు పెంటగాన్ పలు ఎంపికలను సమర్పించింది. వీటిలో సైబర్ దాడులు అలాగే హోంల్యాండ్ సెక్యూరిటీ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునే చర్యలు కూడా ఉన్నట్లు సమాచారం.ప్రాంతీయ భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో, ఎర్ర సముద్రం, మధ్యప్రాచ్య ప్రాంతంలో అమెరికా సైనిక ఉనికిని బలోపేతం చేయడం ద్వారా తమ మిత్ర దేశాలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్కు అనుబంధంగా ఉన్న సాయుధ గుంపులు వాణిజ్య నౌకలపై దాడులు పెంచుతున్న నేపథ్యంలో, సముద్ర మార్గాల రక్షణకు ఈ మోహరింపు కీలకంగా మారింది.ఇదిలా ఉండగా, ఇరాన్తో ప్రత్యక్ష సైనిక ఘర్షణకు దిగకుండా ఒత్తిడి పెంచడమే అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది. దౌత్యపరమైన మార్గాలను తెరిచి ఉంచుతూనే, అవసరమైతే సత్వర స్పందనకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలు పంపడమే ఈ సైనిక కదలికల ఉద్దేశమని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామాలు ప్రాంతీయ రాజకీయాలపై, అలాగే ప్రపంచ చమురు మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. -
ఇరాన్లో భారతీయులకు హైఅలర్ట్
టెహ్రాన్/న్యూఢిల్లీ: ఇరాన్లో పరిస్థితులు రోజురోజుకీ దిగజారుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం టెహ్రాన్లోని భారతీయులకు అలర్ట్ జారీ చేసింది. ‘‘ఇరాన్లో పరిస్థితులు మరింతగా దిగజారుతున్నాయి. భారతీయులు వెంటనే ఇరాన్ను వీడాలి. సురక్షిత దేశాలకు వెళ్లాలి. ఇరాన్లోని భారతీయ విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారులు వీలైనంత తర్వగా ఆ దేశం నుంచి బయట పడాలి’’ అని భారత విదేశాంగ శాఖ బుధవారం ఓ ప్రకటనను విడుదల చేసింది.ఈ నెల 5న జారీ చేసిన అలర్ట్ తో పోలిస్తే.. పరిస్థితులు మరింతగా దిగజారుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. నిరసనలు జరుగుతున్న ప్రదేశాలు, రద్దీ ప్రాంతాలకు వీలైనంత దూరంగా ఉండాలని సూచించింది. నిత్యం టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయ అధికారులతో టచ్లో ఉండాలని ఆదేశించింది. స్థానిక మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలని పేర్కొంది.మరోవైపు టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం కూడా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చితో బుధవారం సాయంత్రం ఫోన్లో చర్చలు జరిపింది. కాగా.. ఇరాన్ అల్లర్లలో మరణాల సంఖ్య 12 వేలకు పెరిగినట్లు ‘ద గార్డియన్’ పత్రిక వెల్లడించింది. నిరసనకారులతోపాటు.. భద్రతాబలగాలు కూడా మృతిచెందినట్లు వివరించింది. బుధవారం సాయంత్రం 300 మృతదేహాలను టెహ్రాన్ వర్సిటీ ప్రాంగణంలో సామూహికంగా ఖననం చేస్తున్న దృశ్యాలను ప్రచురించింది. అయితే.. అమెరికాకు చెందిన మానవ హక్కుల సంస్థ మాత్రం ఇప్పటి వరకు 2,550 మరణాలు నమోదైనట్లు తెలిపింది. వీరిలో 2,403 మంది నిరసనకారులు కాగా.. మిగతా 147 మంది ఐఆర్జీసీ, పోలీసు బలగాలకు చెందినవారని వివరించింది. -
అమెరికాను సమర్థంగా ఎదుర్కొంటాం: ఇరాన్
టెహ్రాన్: తమ దేశంపై అమెరికా దాడులు చేయనున్నట్లు వస్తున్న కథనాలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. వైట్హౌస్ ప్రయత్నాలను తాము విఫలం చేస్తామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ) కమాండర్-ఇన్-చీఫ్, మేజర్ జనరల్ మహమ్మద్ బక్పూర్ స్పష్టం చేశారు.‘‘శత్రువు(అమెరికా) వైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు ఎదురైనా.. తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఏ దాడినైనా ఎదుర్కొనే సామర్థ్యం, పూర్థిస్థాయి సన్నద్ధత మాకు ఉంది. శక్తిమంతమైన ఇరాన్కు వ్యతిరేకంగా వైట్హౌస్ పావులు కదుపుతూ.. భ్రమల్లో బతుకుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ అధినేత బెంజమిన్ నెతన్యాహు.. ఇద్దరూ ఇరాన్ యువత హంతకులే’’ అని ఆయన తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు ట్రంప్, నెతన్యాహుల కిరాయి సేనలు చేసిన క్రూరమైన దాడులను ఇరాన్ ఎప్పటికీ మరిచిపోదని, ఈసారి తగిన గుణపాఠం చెప్పి తీరుతామని స్పష్టం చేశారు. కాగా.. ఇరాన్పై యుద్ధానికి అమెరికా సిద్ధమవుతోందని పాశ్చాత్య, పశ్చిమాసియా మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఏ క్షణంలోనైనా ఇక్కడ దాడులు జరిగే అవకాశాలున్నట్లు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాతోపాటు.. బ్రిటన్ కూడా పశ్చిమాసియాలోని తమ బేస్లలో ఉన్న సైన్యం, వైమానిక దళాలను వెనక్కి రప్పిస్తున్నాయి. -
ఇరాన్పై యుద్ధ సన్నాహాలు?: 75 దేశాలకు అమెరికా వీసాల నిలిపివేత
ఇరాన్పై యుద్ధానికి అమెరికా సన్నాహాలు చేస్తున్నట్లు పాశ్చాత్య, పశ్చిమాసియా మీడియా కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో పశ్చిమాసియాలోని తమ స్థావరాలను అమెరికా ఖాళీ చేస్తూనే.. 75 దేశాలకు వీసాలను నిలిపివేసింది. ఈ చిట్టాలో బంగ్లాదేశ్, పాకిస్థాన్తోపాటు.. మన పొరుగున ఉన్న ఆరు దేశాలు కూడా ఉండడం గమనార్హం..!అమెరికా విదేశాంగ శాఖ తాజాగా జారీ చేసిన ఓ మెమో ప్రకారం.. ఈ 75 దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్ జనరల్స్ ఆఫీసుల్లో అన్నిరకాల వలస వీసాలను రద్దు చేస్తారు. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బిగోట్ మాట్లాడుతూ.. ‘‘కొందరు వలసదారులు అమెరికా ప్రజలను దోపిడీ చేస్తున్నట్లు గుర్తించాం. అందుకే ట్రంప్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది’’ అని వ్యాఖ్యానించారు. వీసాల నిలిపివేత అనేది తాత్కాలికమేనని త్వరలో దీనిపై పునఃపరిశీలన జరుగుతుందని వివరించారు. ఈ నిర్ణయం వల్ల అమెరికా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని అభిప్రాయపడ్డారు.నిషేధిత దేశాల జాబితా పూర్తిస్థాయిలో వెలుగులోకి రాకపోయినా.. రాయిటర్స్ కథనం ప్రకారం ఈ చిట్టాలో బంగ్లాదేశ్తోపాటు.. డొమినికా, ఆంటిగ్వా, బార్బుడా కూడా ఉన్నాయి. ఇరాన్పై యుద్ధానికి సన్నాహాల్లో భాగంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని అరబిక్ మీడియా పేర్కొంది. అమెరికా విడుదల చేసిన జాబితాలోని దేశాలివే..ఆసియా: ఆఫ్ఘనిస్థాన్, ఆర్మేనియా, అజర్ బైజాన్, బంగ్లాదేశ్, భూటాన్, బర్మా (మయన్మార్), కంబోడియా, ఇరాన్, ఇరాక్, జోర్డాన్, కజకిస్తాన్, కువైట్, కిర్గిజిస్తాన్, లావోస్, లెబనాన్, మంగోలియా, నేపాల్, పాకిస్తాన్, సిరియా, థాయిలాండ్, ఉజ్బెకిస్తాన్, యెమెన్.ఆఫ్రికా: అల్జీరియా, కామెరూన్, కేప్ వెర్డే, కోట్ డి ఐవోర్, కాంగో, ఈజిప్ట్, ఎరిట్రియా, ఇథియోపియా, గాంబియా, ఘనా, గినియా, హైతీ, లైబీరియా, లిబియా, మొరాకో, నైజీరియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, రువాండా, సెనెగల్, సియెర్రా లియోన్, సోమాలియా, దక్షిణ సూడాన్, సూడాన్, టాంజానియా, టోగో, ట్యునీషియా, ఉగాండా.ఐరోపా: రష్యా, అల్బేనియా, బెలారస్, బోస్నియా, జార్జియా, కొసావో, మాసిడోనియా (ఉత్తర మాసిడోనియా), మోల్డోవా, మాంటెనెగ్రో.ఉత్తర అమెరికా: ఆంటిగ్వా మరియు బార్బుడా, బహామాస్, బార్బడోస్, బెలిజ్, క్యూబా, డొమినికా, గ్రెనడా, హైతీ, జమైకా, సెయింట్ కిట్స్ మరియు నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్.దక్షిణ - మధ్య అమెరికా దేశాలు: బ్రెజిల్, కొలంబియా, ఉరుగ్వే, గ్వాటెమాలా, నికరాగ్వా. -
పొరుగు దేశాలకు ఇరాన్ వార్నింగ్
దుబాయ్: తమ దేశంలోని నిరసనకారులకు మద్దతు తెలుపుతూ పదే పదే జోక్యం చేసుకుంటున్న అమెరికాను ఇరాన్ మరోసారి హెచ్చరించింది. అమెరికా తమపై దాడికి యత్నించాలనే యత్నిస్తే అంతకుమించి ఎదురుదాడులకు దిగుతామని ఇరాన్ స్పష్టం చేసింది. అదే సమయంలో అమెరికా సైనికా దళానికి పొరుగు దేశాలు ఏమైనా సహకారం అందిస్తే మాత్రం ఆ స్థావరాలే లక్ష్యంగా మిస్సైళ్లతో దాడులకు దిగుతామని పేర్కొంది. ఇరాన్కు సమీపంలో అత్యాధునిక డ్రోన్ల నిఘాను అమెరికా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం హీటెక్కింది. ఏ క్షణంలోనైనా ఇరాన్పై దాడి చేసే అవకాశం ఉండటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనబడుతోంది. అమెరికా గనుక వెనక్కి వెళ్లకపోతే మాత్రం మూల్యం చెల్లించుకుంటారని ఇరాన్ హెచ్చరించింది. కాగా, గత కొంతకాలంగా వెనిజులా పరిణామాలపై దృష్టి సారించిన అమెరికా ఇప్పుడు మళ్లీ తన వ్యూహాత్మక బలగాలను గల్ఫ్ ప్రాంతం వైపు మళ్లిస్తోంది. తాజా నివేదికల ప్రకారం, ఒమన్ గల్ఫ్, ఇరాన్ సరిహద్దు ప్రాంతాల్లో అమెరికా తన నిఘా వ్యవస్థను ముమ్మరం చేసింది. ఇది రాబోయే సైనిక చర్యకు సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు. జనవరి 2026 ప్రారంభం నుంచి అబుదాబి వేదికగా అమెరికా నావికాదళానికి చెందిన ఎంక్యూ-4సీ ట్రైటాన్ డ్రోన్లు నిరంతర నిఘా కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇది హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ (HALE) రకానికి చెందిన డ్రోన్. 50,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నిరంతరంగా 24 గంటల పాటు ఇది ఎగరగలదు. సముద్ర ప్రాంతాల్లోని కదలికలను అత్యంత స్పష్టంగా పర్యవేక్షించే సామర్థ్యం దీని సొంతం. -
కెనడా తీవ్ర ఆరోపణలు.. లారెన్స్ బిష్ణోయ్ వారి మనిషే..!
కెనడా-భారత్ మధ్యసంబంధాలు ప్రస్తుతం కొంత మెరుగుపడ్డాయి. ఇటీవలే ఇరుదేశాలు తమ రాయబారులను నియమించుకున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా ప్రభుత్వం భారత్పై తీవ్ర ఆరోపణలు చేసింది. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ భారత్ తరపునే కెనడాలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది.భారత్- కెనడా మధ్య ప్రస్తుతం ఇప్పుడిప్పుడే పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి. ఇంతకాలం రెండుదేశాల మధ్య సంబంధాలు మెరుగ్గాలేవు. ఆ దేశంలో ఖలిస్థాన్ అనుకూల వాదులు ఎక్కువగా ఉండడం వారు తరచుగా భారత్ని విమర్శించడం జరిగేది. అంతే కాకుండా 2023లో హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉండవచ్చని అప్పటి ఆ దేశ ప్రధాని జస్టిస్ ట్రూడో ప్రకటించారు. దీంతో ఈ ప్రకటనను భారత్ పూర్తిగా ఖండించింది. ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. కాగా ఇప్పుడిప్పుడే ఇరు దేశాల మధ్య సంబంధాలు తిరిగి మెరుగుపడే దశలో ఉన్నాయి.ఈ నేపథ్యంలో కెనడా ప్రభుత్వం సంచలన ఆరోపణ చేసింది. కెనడా పోలీసుల నివేదికలో" లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చాలా హింసాత్మక మైన క్రూర సంస్థ ఇది తన క్రిమినల్ చర్యలను కెనడాతో పాటు ఇతర దేశాల్లో విస్తరిస్తుంది. ఇది భారత ప్రభుత్వం తరపునే తన క్రిమినల్ చర్యలను కొనసాగిస్తుంది" అని నివేదికలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ గ్యాంగ్ మాదకద్రవ్యాల రవాణా మనీ లాండరింగ్ వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడుతుందని తెలిపారు. ఈ గ్యాంగ్ ప్రధాన ఉద్దేశం మత సంబంధిత కారణాలు కాదని దురాశ మాత్రమేనని పోలీసులు పేర్కొన్నారు. అయితే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ను కెనడా ప్రభుత్వం ఇదివరకే ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. పంజాబ్కు చెందిన ఈ లారెన్స్ బిష్ణోయ్ పెద్ద గ్యాంగ్ స్టార్. ఇతని గ్యాంగ్ సభ్యులు దేశవ్యాప్తంగా ఉన్నారు. ప్రస్తుతం బిష్ణోయ్ సబర్మతీ జాతీయ కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. ఇతనిపై భారత్లో అనేక కేసులు నమోదయ్యాయి. -
ఇరాన్పై యుద్ధం.. హింట్ ఇచ్చిన ట్రంప్?!
టెహ్రాన్: ఇరాన్లో నరమేధం సృష్టించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారా? ఇరాన్పై రాకెట్ దాడులు జరపడానికి అమెరికా సన్నద్ధమవుతోందా?. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చి, ఆయన స్థానంలో ఇరాన్ క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లావీకి పగ్గాలు అప్పగించేందుకు మంతనాలు జరుగుతున్నాయా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు.ఇరాన్లో తీవ్ర ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం కారణంగా పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఖమేనీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నిరసనకారులపై కాల్పులు జరిపి, ఇప్పటివరకు 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో అమెరికా ఇరాన్ ప్రభుత్వంపై దాడి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చడం, రెజా పహ్లావీకి పగ్గాలు అప్పగించే ప్రయత్నాలు, ఎర్ఫాన్ సోల్తానీని ఉరితీయాలని జారీ చేసిన ఆదేశాలు, ట్రంప్ హెచ్చరికలు.. ఈ పరిణామాల మధ్య ఏం జరగనుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఇరాన్ చర్యలకు ధీటుగా స్పందించాలని అమెరికా భావిస్తోంది. అయితే, తమ దేశంపై దాడి జరిగితే మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తామని ఇరాన్ బెదిరిస్తోంది. ఈ నేపథ్యంలో ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, ఇరాక్, టర్కీ వంటి దేశాల్లో ఉన్న తమ సైనిక స్థావరాల నుండి అమెరికా సిబ్బందిని ఖాళీ చేస్తోంది. అమెరికా దాడులు జరిగితే తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని రివల్యూషనరీ గార్డ్స్ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ మాజిద్ మౌసావి ప్రకటించారు.డిసెంబర్ 28 నుంచి కొనసాగుతున్న నిరసనలను అణచివేయడానికి ఇరాన్ ప్రభుత్వం నిరసనకారుల ప్రాణాలు తీస్తోంది. ఇలాగే కొనసాగితే అయతొల్లా ప్రభుత్వానికి హాని కలిగిస్తామని ట్రంప్ పలుమార్లు హెచ్చరించారు. ఇరాన్ ప్రభుత్వం 3,000 మంది పౌరులు మరణించారని చెబుతుండగా, ప్రతిపక్ష ఛానల్ ఇరాన్ ఇంటర్నేషనల్ 12,000 మందికి పైగా మరణించారని నివేదించింది. -
ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ కేసులో బిగ్ ట్విస్ట్
సింగపూర్: అస్సాంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ (Zubeen Garg) ఇటీవల సింగపూర్లో ప్రమాదవశాత్తూ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవుతోన్నవేళ ఈ కేసు కీలక మలుపు తిరిగింది. జూబీన్ గార్గ్ది హత్య కాదని సహజమరణమేనని సింగపూర్ పోలీసులు కోర్టుకు తెలిపారు. లైఫ్ జాకెట్ ధరించకపోవడం వల్లే దుర్ఘటన చోటు చేసుకుందని పేర్కొన్నారు. గతేడాది జుబీన్ నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ కోసం సింగపూర్ పర్యటనకు వెళ్లారు. పర్యటనలో భాగంగా యాట్ పార్టీకి ఒకరోజు ముందు స్విమ్మింగ్ చేస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, జుబీన్ది సహజ మరణం కాదని, హత్య చేసి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై భారత్లోని అస్సాం పోలీసులు,సీఐడీ విభాగం పలువురిని అదుపులోకి తీసుకుంది. సింగపూర్ పోలీసులు సైతం కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో తాజాగా, కేసు దర్యాప్తు పూర్తి చేసిన సింగపూర్ పోలీసులు కరోనర్ కోర్టుకు రిపోర్టును అందించారు.రిపోర్టులో ‘యాట్ పార్టీకి ముందు రోజు జూబీన్ స్విమ్మింగ్కి వెళ్లి ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. స్విమ్మింగ్కు ముందు లైఫ్ జాకెట్ ధరించారు. కానీ స్విమ్మింగ్ వెళ్లిన తర్వాత లైఫ్ జాకెట్ను వద్దన్నారు. రెండు సార్లు లైఫ్ జాకెట్ ధరించాలని నిర్వాహకులు కోరారు. అందుకు జుబీన్ తిరస్కరించారని, స్విమ్ చేస్తూ ప్రాణాలు కోల్పోయినట్లు కోర్టుకు తెలిపారు. -
‘పాలక్ పనీర్’ వివాదం.. రూ.1.8 కోట్ల పరిహారం గెలుచుకున్న దంపతులు
వాషింగ్టన్: పాలక్ పనీర్ వాసనతో ప్రారంభమైన వివాదంలో భారతీయ దంపతులు అమెరికా జిల్లా కోర్టులో రూ.1.8 కోట్ల నష్ట పరిహారం గెలుచుకున్నారు. 2023లో ఉన్నత చదువుల కోసం ఆదిత్య ప్రకాష్ అమెరికా వెళ్లాడు. అక్కడ కొలరాడో బౌల్డర్ యూనివర్సిటీలో ఆంత్రపాలజీ విభాగంలో పీహెచ్డీ చేస్తున్నాడు. యూనివర్సిటీలో చేరిన ఏడాది తర్వాత అయితే, ఓ రోజు యూనివర్సిటీలో ఉన్న ఆదిత్యకు బాగా ఆకలివేసింది. వెంటనే డిపార్ట్మెంట్లో మైక్రోవేవ్లో తన పాలక్ పనీర్ భోజనాన్ని వేడి చేసి తినేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ఓ మహిళా సిబ్బంది అతని వద్దకు వచ్చింది. మైక్రోవేవ్లో పాలక్ పనీర్ వేడిచేస్తుంటే వాసన వస్తుందని ఫిర్యాదు చేసింది. పాలక్ పన్నీర్ను వేడి చేసేందుకు మైక్రోవేవ్ను ఉపయోగించవద్దని సూచించింది.ఆమెకు మద్దతుగా పలువురు ప్రొఫెసర్లు సైతం నిలిచారు. వేడి చేయడం వల్ల వాసన వస్తుందనే కారణంతో బ్రోకలీని నిషేధించారు అని ఫ్రొఫెసర్ ప్రస్తావించగా.. దీనికి ప్రకాష్ ప్రతిస్పందిస్తూ..‘సందర్భం ముఖ్యం. బ్రోకలీ తింటే జాత్యాంహాకారాన్ని ఎదుర్కొంటారు? అని ప్రశ్నించారు. ఆ ఘటన చిలికి చిలికి గాలి వానలా మారింది. పాలక్ పనీర్ వివాదం తర్వాత ప్రకాష్ను మీటింగ్స్ పేరుతో వేధిస్తున్నారు. అదే యూనివర్సిటీలో అసిస్టెంట్ టీచింగ్ స్టాఫ్లో విధులు నిర్వహిస్తున్న అతని భర్య ఉర్మీ భట్టాచార్యను వివరణ ఇవ్వకుండానే విధుల నుంచి తొలగించారు. విద్యార్థులు తమ పీహెచ్డీలో భాగంగా పొందే మాస్టర్స్ డిగ్రీలను ఇవ్వకుండా యూనివర్సిటీ నిరాకరించింది. దీంతో ప్రకాష్,ఉర్మీభట్టాచార్యలు కొలరాడో జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. యూనివర్సిటీ తమ విద్యాహక్కుల్ని అడ్డుకుందని, యూనివర్సిటీ మా పట్ల వివక్షత చూపించారు. చదువులో ఆటంకం కలిగించిందని వాపోయారు. విచారణ చేపట్టిన కోర్టు తాజాగా,వారికి మద్దతుగా నిలిచింది. గతేడాది సెప్టెంబర్లో కేసు పరిష్కరించేందుకు 2లక్షల డాలర్ల (రూ.1.8 కోట్లు) పరిహారం చెల్లించింది. నిలిపివేసిన మాస్టర్స్ డిగ్రీలను వారికి మంజూరు చేసింది.అయితే, భవిష్యత్తులో ఆ విశ్వవిద్యాలయంలో చదువు లేదా ఉద్యోగం చేసే అవకాశాన్ని వారికి నిరాకరించింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ ఘటనపై ఉర్మీ భట్టాచార్య తన ఇన్స్టాలో పోస్టు పెట్టారు. ఈ సంవత్సరం నేను ఒక పోరాటం చేశాను. నేను తినాలనుకున్న ఆహారం తినేందుకు స్వేచ్ఛ.నిరసన తెలిపే హక్కు కోసం… నా చర్మరంగు, నా జాతి, నా మారని భారతీయ యాస ఏదైనా ఉన్నా, నేను పోరాడాను’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీస్తోంది. -
చరిత్ర సృష్టించిన ‘కౌండిన్య’
మస్కట్: భారత పురాతన నౌకానిర్మాణ కౌశలంతో ఇంజిన్, ఇనుము లేకుండా కేవలం చెక్క, కొబ్బరి తాళ్లు, జిగురుతో నిర్మితమైన అపురూప, అద్భుత నౌక ‘ఐఎన్ఎస్వీ కౌండిన్య’ తన సత్తా చాటింది. కేవలం గాలివాటానికి అనుగుణంగా పయనించే నౌకను 17 మంది నిష్ణాతులైన సిబ్బంది విజయవంతంగా గమ్యానికి చేర్చారు. కేవలం 17 రోజుల వ్యవధిలోనే పోరుబందర్ నుంచి సముద్రయానం మొదలెట్టి ఒమన్లోని మస్కట్ సముద్రతీర నగరానికి చేరుకుని భారతీయ నావికానిర్మాణ పటిమను ప్రపంచానికి చాటిచెప్పింది. భారత్, ఒమన్ల మధ్య ప్రాచీన సముద్రయాన రాకపోకలను ఈ నౌక మరోసారి స్మరణకు తెచ్చిందని మస్కట్లో భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఐదో శతాబ్దంనాటి విఖ్యాత అజంతా గుహల్లోని కుడ్య చిత్రం నుంచి ప్రేరణ పొందిన నిపుణులు, కళాకారుల బృందం 65 అడుగుల పొడవుతో నిర్మించిన ఇండియన్ నావల్ సెయిలింగ్ వెసిల్(ఐఎన్ఎస్వీ) కౌండిన్య బుధవారం విజయవంతంగా మస్కట్లోని పోర్ట్ సుల్తాన్ ఖాబూస్కు చేరుకోవడంతో అందులోని నావికులు సంబరాలు చేసుకున్నారు.నౌకకు ఘన స్వాగతం పలికిన మంత్రి, అధికారులుమస్కట్ నౌకాశ్రయానికి చేరుకున్న ఐఎన్ఎస్వీ కౌండిన్యకు భారత పోర్ట్లు, షిప్పింగ్, వాటర్వేస్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ ఘన స్వాగతం పలికారు. మస్కట్లో భారతీయ రాయబార కార్యాలయ సీనియర్ అధికారులు, ఒమన్ పర్యాటక, వారసత్వ మంత్రిత్వ శాఖ, ఒమన్ రాయల్ నేవీ అధికారులు ఈ స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శర్బానంద మాట్లాడారు. ‘‘ఈ నౌక ప్రయాణం భారతీయ సముద్రయాన ఘన చరిత్ర, వారసత్వాన్ని గుర్తుచేసింది. ఇంజిన్లేని నౌకను ధైర్యసాహసాలతో లక్ష్యం దిశగా నడిపించిన నావికాబృందాన్ని చూసి దేశం గర్విస్తోంది. భారత్, ఒమన్ల ప్రాచీన సముద్రయాన బంధాన్ని ఈ నౌక మరోసారి స్మరణకు తెచ్చింది. కమాండర్ ∙హేమంత్ కుమార్, కమాండర్ వికాస్ షేవ్రాన్ల సారథ్యంలో మొత్తంగా నలుగురు అధికారులు, 13 మంది నావికుల బృందంతో ఈ నౌక గత ఏడాది డిసెంబర్ 29వ తేదీన గుజరాత్లోని పోరుబందర్ నుంచి బయల్దేరిన విషయం తెల్సిందే. 650 నాటికల్ మైళ్ల దూరాన్ని ఎలాంటి అవరోధాల్లేకుండా విజయవంతంగా పూర్తిచేశామని నావికాబృందం ఆనందం వ్యక్తంచేసింది. ప్రయాణం విజయవంతమవడంపై కమాండర్ హేమంత్ మాట్లాడారు. ‘‘యుద్ధవిమాన వాహకనౌక మొదలు జలాంతర్గాముల దాకా ఎన్నింటినో భారత్ తయారుచేసింది. కానీ ఇలాంటి విలక్షణ నౌకను గతంలో తయారుచేయలేదు. అజంతా గుహలో రాతిపై వేసిన పురాతన పెయింటింగ్లో అస్పష్ట వివరాలు మినహా నౌక తయారీకి మన దగ్గర ఎలాంటి వివరాలు అందుబాటులో లేవు. కనీసం బ్లూప్రింట్ లేదు. అయినాసరే దీన్నో సవాల్గా తీసుకుని నిపుణులు తయారుచేశారు. నౌక తయారీలో ఇనుము, మేకులు, ఇంజిన్లను ఉపయోగించలేదు. కొబ్బరి నార తాళ్లను తెరచాపలను కట్టేందుకు ఉపయోగించారు. ఉప్పుమయ సముద్రనీటిలో నౌక అడుగుభాగం పాడవకుండా ఉండేందుకు సహజ జిగురును పూతగా ఉపయోగించారు. కేరళ కళాకారులు నౌక విడిభాగాలను ప్రాచీన విధానంలో అతికించారు’’ అని ఆయన వెల్లడించారు. #WATCH | INSV Kaundinya given water salute as it completes its voyage from Gujarat's Porbandar to Oman's MuscatINSV Kaundinya is a recreation of a 5th century Indian ship using the ancient stitching technique. The ship departed from Gujarat's Porbandar on 29th December 2025 pic.twitter.com/xc3NtGdg6U— ANI (@ANI) January 14, 2026 -
అందుకేనా నాటోకు దూరం.. రష్యాతో వైరం..?
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వార్తల్లో లేనిరోజు లేదు. ఇందులో దాదాపు అన్ని వివాదాలే. ఏదొక దేశాన్ని గిల్లడం, లేకపోతే కవ్వించడం, హెచ్చరించడం, ఇవే ట్రంప్ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత కనిపిస్తున్న పరిణామాలు. ఇటీవల కాలంలో ట్రంప్ దూకుడు మరింత ఎక్కువైంది. వెనెజువెలా అధ్యక్షుడిని బంధించడం, అటు తర్వాత ఆ దేశానికి తాత్కాలిక అధ్యక్షుడిని నేనే అని ప్రకటించుకోవడం.. డెన్మార్క్ దేశంలో ఉన్న గ్రీన్లాండ్ను ఏదో రకంగా స్వాధీనం చేసుకోవాలనే పన్నాగం, క్యూబాకు వార్నింగ్.. ఇరాన్పై కాలుదువ్వడం వంటి జరుగుతూనే ఉన్నాయి. అయితే వీటన్నింటి కంటే కూడా నాటోను దాదాపు దూరం పెట్టడం.. రష్యాను రెచ్చగొట్టడం అయితే ట్రంప్ పోకడలకు మరో మెట్ట అని చెప్పాలి. రష్యాకు చెందిన రెండు ఓడలను ట్రంప్ సీజ్ చేయడం చూస్తే మాత్రం యుద్ధానికి కాలుదువ్వడం గానే కన్పించింది. ఎన్నో దేశాల మధ్య యుద్ధాలు ఆపానని చెప్పుకునే ట్రంప్.. ఇప్పుడు పలు దేశాలతో కయ్యానికి సై అంటున్నాడు. అందులో సైనిక పరంగా బలంగా ఉన్న రష్యా, ఇరాన్ల విషయంలో కూడా ట్రంప్ వ్యవహరిస్తున్న శైలి అయోమయంలో పడేస్తుంది. రష్యాను టెస్టు చేస్తున్నాడా?రష్యా ఆర్థిక శక్తి తగ్గిందనే గణాంకాలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఇప్పుడు దానిపై దృష్టి పెట్టాడు. అసలు రష్యా పవర్ ఎంత ఉంది అనే దానిని టెస్ట్ చేయడం కోసం ట్రంప్ సన్నాయి నొక్కులు ప్రారంభించాడు. అయితే సైనిక పరంగా చూస్తే రష్యా ఇప్పటికే టాప్-2లో ఉంది. అసాధారణ సైనిక శక్తి కల్గిన దేశాల్లో రష్యాది రెండో స్థానం. 3,570,000 మంది మిలటరీ సిబ్బంది, 5, 750 యుద్ధ ట్యాంకర్లు రష్యా సొంతం. విస్తృతమైన యుద్ధ ట్యాంకర్ల దళం, అణ్వాయుధాలు కల్గి ఉంది రష్యా. అణు సామాగ్రిని వివిధ దేశాలకు సరఫరా చేసే దేశాల్లో రష్యా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇటీవల రష్యా ఆయిల్ షిప్లను సీజ్ చేసి.. ఆ దేశాన్ని రెచ్చగొట్టే పనిలో ఉన్నాడు ట్రంప్. రష్యా.. తమతో పోరుకు ఎంతవరకూ వస్తుందని టెస్ట్ చేస్తన్నట్లే ఉంది ట్రంప్ వైఖరి. మరి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ట్రంప్ చర్యలని గమనిస్తూనే ఉన్నాడు. పరిస్థితి శ్రుతి మించితే మాత్రం రష్యా వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. తన సహనాన్ని ట్రంప్ పరిక్షీస్తున్నారనే విషయం పుతిన్ ఈపాటికే అర్థం చేసుకునే ఉంటారు. ఒకవేళ అమెరికా ఏమైనా సైనిక చర్యలకు పాల్పడితే మాత్రం దాన్నితిప్పి కొట్టే సామర్థ్యం రష్యాకు ఉంది.. కానీ ఆ దేశ ఆర్థిక పరిస్థితే ఇప్పుడు పుతిన్ను కలవర పెడుతోంది. తమ దేశానికి చెందిన రెండు చమురు షిప్లను అమెరికా సీజ్ చేసినా.. పుతిన్ నియంత్రణ కోల్పోకుండా ఆచితూచి అడుగులు వేయడానికి కారణం ఆ దేశ ఆర్థిక పరిస్థితి. బలహీన పడ్డ రష్యా ఆర్థిక వ్యవస్థ2022లో ఉక్రెయిన్తో యుద్ధం ప్రారంభమయ్యాక.. సైన్యంలో నియామకాలు, ప్రిగోజిన్ నేతృత్వంలోని వాగ్నర్ వంటి కిరాయి సేనల కోసం డబ్బు వెచ్చించాల్సి వచ్చింది. ఒక సంవత్సరం వరకు పరిస్థితులను నియంత్రించుకుంటూ.. ఆర్థిక వ్యవస్థ గాడిలోనే ఉందనిపించినా.. 2023 నుంచి నియంత్రణ కోల్పోయి.. 2024 వచ్చే సరికి అది కాస్తా ముదిరి పాకాన పడింది. చమురు ఎగుమతులపై ఆశలు పెట్టుకున్నా.. ధరలు పడిపోయాయి. అమెరికా ఆంక్షలతో పలు దేశాలు రష్యా చమురు కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నాయి. ఇలా రష్యా ఇరకాటంలో పడింది.వాహనాలు, ఇతరత్రా ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు.. చివరకు వోడ్కాపైనా పన్నులను పెంచుతూ పరిస్థితిని నియంత్రించేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గోరుచుట్టుపై రోకటిపోటు మాదిరిగా ఇప్పుడు ఐరోపా దేశాలు కూడా రష్యాపై ఆంక్షలను కఠినతరం చేశాయి. భారత్పై ఆంక్షలు కూడా అందుకేనా?రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి దేశాల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. అత్యధిక చమురును భారత్.. రష్యా నుంచే కొనుగోలు చేస్తూ వస్తుంది. కానీ ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో రష్యా చమురు కొనుగోలును కాస్త తగ్గించింది. ఇలా రష్యా చమురును కొనుగోలు చేయకుండా పలు దేశాలపై ఆంక్షలు విధిస్తే ట్రంప్ అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. రష్యాను ఆర్థికంగా మరింత ఇరకాటంలో పడేయాలనేది ట్రంప్ చర్యలను బట్టి తెలుస్తోంది, నాటో దేశాలు అంత బలంగా లేవా?ఇటీవల నాటోపై తీవ్ర విమర్శలు చేశారు ట్రంప్. ప్రధానంగా నాటో రక్షణ వ్యయానికి సంబంధించి ఖర్చును అమెరికానే భరించాల్సి వస్తుందని, తమకు ఇక పని లేదని తేల్చిచెప్పేశాడు. అంటే నాటోలో బలమైన దేశాలు లేవనేది ట్రంప్ ఉద్దేశం. నాటోతో ఉన్నా లేకపోయినా తమకు ఏమీ ప్రయోజనం లేదనే భావనకు వచ్చేశాడు ట్రంప్..దాంతో నాటోకు టాటా-బైబై చెప్పేశాడు. నాటోలో యూరప్ దేశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే రష్యా చర్యలను ఎక్కువగా వ్యతిరేకించింది నాటో. ఇప్పుడు నాటోక అమెరికా దూరం అయిపోతే.. మరి వారి పరిస్థితి ఏమిటి.? చెప్పుకోవడానికే 32 దేశాలు.. అందులో 30 యూరప్ దేశాలు.. మిగతా రెండు అమెరికా, కెనడా. ఇప్పుడు అమెరికా దూరం జరగడంతో ఆ సంఖ్య 31కు వచ్చింది. నాటో ఉన్న యూరప్ దేశాలన్ని ఆర్థికంగా సైనిక పరంగా అంతగా బలంగా లేవనే విషయం ట్రంప్ కటీఫ్తోనే అర్థమైంది. ట్రంప్ వ్యూహంలో భాగమా..?అమెరికా అండ లేకపోవడంతో రష్యా ఏదొక సమయంలో నాటోపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఉక్రెయిన్తో యుద్ధాన్ని నాటో దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రష్యాతో యుద్ధం నేపథ్యంలోనే ఉక్రెయిన్ నాటోలో చేరడానికి కారణమైంది. ఇవన్నీ కూడా పుతిన్కు ఆగ్రహం తెప్పించాయి. తనకు నాటో అడ్డుపడింది అనే భావనలో ఉన్నాడు ట్రంప్. ఈ పరిణామాలతో రష్యా-నాటో దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. అత్యంత స్వార్థ ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు వెళుతున్న ట్రంప్.. ముందుగా నాటో దేశాలు-రష్యా కొట్టుకుంటే చూద్దామనే ప్లాన్లో భాగంగానే నాటోకి బైబై చెప్పడం, రష్యాను గిల్లడం చేస్తున్నాడని నిపుణులు అంటున్నారు. తన చర్యలతో ముందు నాటో-రష్యాలను అంచనావేసే ముందస్తు వ్యూహంలో భాగంగానే ట్రంప్ ఇలా చేశారనేది విశ్లేషకులు అభిప్రాయంగా ఉంది. -
సౌదీలో అపరిచితుడికి లిఫ్ట్ ఇస్తే.. ఉన్న ఉద్యోగం ఊడింది
"కాపురం కాపాడడానికి పోతే కాలు తెగింది" అన్న నానుడి ఈ బాధితుడి వ్యవహారంలో సరిగ్గా సరిపోతుంది. పాపం రోడ్డుపై ఒంటరిగా ఉన్నాడనే ఒక వ్యక్తికి లిప్ట్ ఇచ్చాడు. తీరా చూస్తే అక్కడి అధికారులు చేసిన తనిఖీల్లో లిప్ట్ ఇచ్చిన వ్యక్తి అక్రమంగా సౌదీ అరేబియాలోకి ప్రవేశించాడని తేలింది. దీంతో నేరస్థునితో పాటు లిప్ట్ ఇచ్చిన వ్యక్తిని జైలులో తోశారు.సౌదీ అరేబీయాలోని జిజాన్లో ప్రసాద్ అనే వ్యక్తి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతని విధి నిర్వహణలో భాగంగా వాహనంలో వెళుతున్నాడు. అయితే అప్పుడు రోడ్డుపై ఓ వ్యక్తి లిప్ట్ అడిగాడు. దీంతో అతనికి సహాయం చేద్దామనే ఉద్దేశంతో అతనిని వాహనంలోకి ఎక్కించాడు. తీరా కొద్దిదూరం వెళ్లేసరికి పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. వీరిద్దరిని ఆపి పత్రాలు చూపించమని అడగగా ఆవ్యక్తి వద్ద సరైన పత్రాలు లేవు. దీంతో అతను యెమన్కు చెందిన వ్యక్తి అని అతను అక్రమంగా సౌదీ అరేబియాలోకి ప్రవేశించాడని పోలీసులు గుర్తించారు.దీంతో యెమన్కు చెందిన వ్యక్తితో పాటు అతనికి లిప్ట్ ఇచ్చినందుకు ఆ డ్రైవర్ను అరెస్టు చేసి నెలరోజుల పాటు జైలులో ఉంచారు. అనంతరం ఆ సదరు ఉద్యోగి తను పనిచేసే సంస్థకు వెళ్లగా కంపెనీ వెహికిల్ను ప్రజలను ఎక్కించుకున్నారనే అభియోగంతో వారు ఉద్యోగంలో నుంచి తొలగించారు. అనంతరం అతనికి జీతంతో పాటు అతనికి రావాల్సిన కంపెనీ బెనిఫిట్స్ను కూడా ఇవ్వలేదు. దీంతో సదరు ఉద్యోగి తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు.విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో అక్కడి భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. అక్కడి నుండి కేలి సాంస్కృతిక కేంద్రాన్ని సంప్రదించాడు. దీంతో వారు అతనిని తిరిగి భారత్కు పంపించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. అయితే ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని సరైన పత్రాలు లేని వారిని వాహనాల్లో ఎక్కించుకున్నందుకు ఇదివరకూ ఎంతో మంది జైలుపాలయ్యారన్నారు. కనుక సౌదీలో ఉండేవారు ఎవరినైనా వాహనంలో ఎక్కించుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా వారు సూచించారు. -
ఇమ్రాన్ను కలవనివ్వండి.. ఖురాన్తో సోదరిల నిరసన
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం మరోసారి ఆ దేశంలో చర్చనీయాంశమయ్యింది. ఆయనను కలవడానికి ఎవరికీ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో వారి కుటుంబసభ్యులతో పాటు ఆయన మద్ధతుదారులు నిరసనలు చేపడుతున్నారు. తాజాగా ఇమ్రాన్ సోదరిలు అడియాలా జైలు బయట ధర్నా చేపట్టారు.కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాఫిక్గా మారింది. ఆయనను జైలులోనే చంపేశారు అని పుకార్లు రావడంతో ఇమ్రాన్ వ్యవహారం తీవ్ర వివాదాస్పదమైంది. ఆయన కుటుంబసభ్యులతో పాటు పీటీఐ మద్దతుదారులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. దీంతో ఎట్టకేలకు అక్కడి ప్రభుత్వం ఆయనను కలవడానికి అనుమతిచ్చింది. దీంతో ఆయన సోదరి డా. ఖానుమ్ ఆయనను జైలులో కలిసింది. దీంతో ఆయన బ్రతికే ఉన్నాడని అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజాగా మరోసారి ఇమ్రాన్ వ్యవహారం పాక్లో చర్చనీయాంశమైంది.ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశాల ప్రకారం మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను కలవడానికి మంగళ, గురువారాల్లో అనుమతి ఇవ్వాలి. అయితే ఈ ఆదేశాలను అక్కడి అధికారులు పాటించడం లేదు. ఆయనను కలవడానికి వారి సోదరిమణులు ఆలీమాఖాన్, ఉజ్మా ఖాన్లను వారిని కలవడానికి అనుమతించడం లేదు. దీంతో వారు జైలు బయిట ఆందోళన చేపట్టారు.దీంతో వారు జైలు బయిట ఖురాన్ చదువుతూ నిరసన చేపట్టారు. ఇమ్రాన్ సోదరి ఆలీమా ఖాన్ మాట్లాడుతూ.. మేము ఇక్కడ ఖురాన్ చదవడం పూర్తి చేస్తామని వారు భయపడుతున్నారు. ఎటువంటి మనుషులు వారు. అడియాలాకు వెళ్లే దారులన్నీ నిర్భందించారు. అని ఆమె తెలిపారు.అయితే మంగళ, గురవారాల్లో ఇమ్రాన్ను కలవడానికి అనుమతులివ్వాలని కోర్టు చెప్పడంతో ఆ రోజుల్లో అడియాలా జైలు ఎదుటు పెద్దఎత్తున నిరసనలు జరుగుతున్నాయని అక్కడి అధికారులు తెలిపారు. -
మీ నిద్రలోనే మీ ఆయుష్షు!
సాధారణంగా మనమంతా నిద్ర అనేది అలసటను పోగొట్టే విశ్రాంతి దశగా భావిస్తాం. అయితే ఇదే అంశంపై అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కనుగొన్న ఒక నూతన ఆవిష్కరణ ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. కేవలం ఒక రాత్రి నిద్రలో మన శ్వాస తీరు, గురక శబ్దాలు, ఇతర సంకేతాలను విశ్లేషించడం ద్వారా రాబోయే ఐదేళ్లలో మనకు వచ్చే వ్యాధులను ముందుగానే అంచనా వేయవచ్చని వారు నిరూపించారు.రక్త పరీక్షలు, ఎక్స్-రేలు లాంటి వైద్య పరీక్షల అవసరం లేకుండానే, మనం నిద్రపోయే తీరుతెన్నులే మన ఆరోగ్య స్థితిని చక్కగా వివరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా మాదిరిగా అనిపించినప్పటికీ, శాస్త్రవేత్తలు తమ నవ్య ఆవిష్కరణలో దీనిని నిజం చేసి చూపారు. స్టాన్ఫోర్డ్ పరిశోధకులు తాజాగా ‘స్లీప్ఎఫ్ఎం’ (SleepFM) అనే అత్యంత తెలివైన కృత్రిమ మేధస్సు (ఏఐ) నమూనాను అభివృద్ధి చేశారు. ఈ ఏఐ మోడల్ నిద్రలో మనిషి శరీరంలో జరిగే సూక్ష్మ కదలికలను, శ్వాస, గుండె పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తుంది.‘స్లీప్ఎఫ్ఎం’నకు సంబంధించిన పరిశోధనా పత్రం ప్రముఖ మెడికల్ జర్నల్ ‘నేచర్ మెడిసిన్’లో ప్రచురితమైంది. మనం నిద్రపోతున్నప్పుడు మన శరీర శ్వాస విధానం, హృదయ స్పందనల వేగం, పడకపై మారే భంగిమలు తదితర సంకేతాలను ఈ మోడల్ డీకోడ్ చేస్తుంది. తద్వారా ఇది సుమారు 130 రకాల వివిధ వ్యాధులను ఇది ముందే గుర్తించగలుగుతుంది.సుమారు 65 వేల మందికి సంబంధించిన 5.85 లక్షల గంటల నిద్ర డేటాను విశ్లేషించి, ఈ మోడల్ను రూపొందించారు. ఈ స్లీప్ఎఫ్ఎం మోడల్ ఫలితాలు పరిశోధకులను సైతం ఆశ్చర్యపరిచాయి. గుండెపోటు వచ్చే అవకాశాలను ఈ మోడల్ 80 శాతం కచ్చితత్వంతో గుర్తించగా, డిమెన్షియా లాంటి మెదడు సంబంధిత వ్యాధులను 85 శాతం కచ్చితత్వంతో అంచనా వేసింది. కిడ్నీ వైఫల్యాన్ని 80 శాతం, రొమ్ము క్యాన్సర్ ముప్పును 90 శాతం మేర కచ్చితంగా గుర్తించింది. మొత్తంగా చూస్తే, ఈ ఏఐ వైద్యుడు దాదాపు 75 శాతం కేసులలో సరైన ఆరోగ్య సూచనలను అందిస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.మన శరీరం లోపల వ్యాధి లక్షణాలు బయటపడటానికి ముందే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అయితే చాలామంది తీవ్రమైన అనారోగ్య సమస్య వచ్చేవరకూ వైద్యుడిని సంప్రదించరు. అయితే స్లీప్ఎఫ్ఎం పరికరం అందుబాటులో ఉంటే, ఏ వ్యాధిని అయినా ప్రాథమిక దశలోనే గుర్తించి, అప్రమత్తం కావచ్చు. భవిష్యత్తులో మన స్మార్ట్వాచ్ లేదా మన పరుపులోని సెన్సార్లు మన నిద్రను విశ్లేషించి.. ‘మీ ఆరోగ్యం సరిగా లేదు.. వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోండి’ అని హెచ్చరించే రోజులు దగ్గరలోనే రానున్నాయి. ఇది వైద్య ప్రపంచంలో ఒక గొప్ప విప్లవానికి నాంది కానుంది.ఇది కూడా చదవండి: ‘హమాస్’లో తీవ్ర ఉత్కంఠ.. కొత్త నేత కోసం.. -
యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతలు.. భారత వాణిజ్యంపై ప్రభావం
అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, తాజాగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వాణిజ్య సుంకాలు (Tariffs) ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. ఇరాన్తో వాణిజ్య సంబంధాలు కొనసాగించే ఏ దేశమైనా అమెరికాతో చేసే వ్యాపారంపై 25% అదనపు సుంకం చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భారత్-ఇరాన్ వాణిజ్యంపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే అంశాలు చూద్దాం.భారత్-ఇరాన్ వాణిజ్యం: ప్రస్తుత స్థితిగతులుఅధికారిక గణాంకాల ప్రకారం, ఇరాన్తో భారత్కు ఉన్న వాణిజ్య సంబంధాలు ఇటీవలి కాలంలో క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్-ఇరాన్ మధ్య మొత్తం వాణిజ్యం సుమారు 1.68 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది భారత్ మొత్తం ప్రపంచ వాణిజ్యంలో కేవలం 0.15% మాత్రమే. ఇది గతంలో కాస్త ఎక్కువగానే ఉండేది.ఎగుమతులు-దిగుమతులుభారత్ నుంచి ఇరాన్కు సుమారు 1.24 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి అవుతున్నాయి. ఇందులో ప్రధానంగా బాస్మతి బియ్యం, టీ, చక్కెర, ఫార్మాస్యూటికల్స్ (మందులు), రసాయనాలు ఉన్నాయి. ఇరాన్ నుంచి భారత్ సుమారు 0.44 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. డ్రై ఫ్రూట్స్, సేంద్రీయ రసాయనాలు, గ్లాస్వేర్ ప్రధాన దిగుమతులుగా ఉన్నాయి.ట్రంప్ హెచ్చరిక - భారత్పై ప్రభావంట్రంప్ ప్రకటించిన 25% అదనపు సుంకం వల్ల భారత ఎగుమతిదారుల్లో కొంత ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ, ప్రభుత్వ వర్గాల విశ్లేషణ ప్రకారం దీని ప్రభావం పరిమితంగానే ఉండే అవకాశం ఉంది.భారత్ ఇరాన్కు ఎగుమతి చేసే వస్తువుల్లో అత్యధిక భాగం ఆహార పదార్థాలు (బియ్యం, టీ పొడి), మందులు. ఇవి అంతర్జాతీయ ఆంక్షల పరిధిలోకి రావు.ఇరాన్ భారత్ టాప్-50 వాణిజ్య భాగస్వాముల జాబితాలో కూడా లేదు. అందువల్ల 25% సుంకం భారత్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపకపోవచ్చు.సముద్ర రవాణా, చాబహార్ ఓడరేవుభారత్కు వ్యూహాత్మకంగా కీలకమైన చాబహార్ ఓడరేవు విషయంలో అమెరికా సానుకూల వైఖరిని ప్రదర్శించింది. చాబహార్ ఓడరేవు అభివృద్ధి, నిర్వహణకు సంబంధించి భారత్కు ఉన్న ఆంక్షల మినహాయింపును ఏప్రిల్ 2026 వరకు పొడిగించినట్లు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలకు రవాణా సౌకర్యం కల్పించే ఈ ఓడరేవు ద్వారా వాణిజ్యం కొనసాగింపుపై భారత్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.చైనా, యూఈఏ, టర్కీకి దెబ్బఅమెరికా నిర్ణయం వల్ల చైనా, యూఏఈ, టర్కీ వంటి దేశాలపై ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ దిగుమతుల్లో వీటి వాటా చాలా ఎక్కువ. భారత్ తన వాణిజ్యాన్ని ఇప్పటికే వైవిధ్యీకరించుకోవడం వల్ల ఈ టారిఫ్ వార్ నుంచి తక్కువ నష్టంతో బయటపడే అవకాశం ఉంది.ఇదీ చదవండి: భారత రెవెన్యూ వ్యవస్థలో ఆర్థిక సైనికులు -
టారిఫ్ల ఎఫెక్ట్.. కోర్టు తీర్పుపై ట్రంప్నకు టెన్షన్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు టెన్షన్ మొదలైంది. ట్రంప్ అమలు చేసిన టారిఫ్ విధానాలపై అక్కడి సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పు ఇవ్వనుంది. మరోవైపు.. ఒకవేళ కోర్టు టారిఫ్లను వ్యతిరేకిస్తూ తమ ప్లాన్-బీ ఉందని ధీమా వ్యక్తం చేశారు. దీంతో, కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.. ట్రంప్ ఏం చేస్తారా? అని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోర్టు తీర్పు నేపథ్యంలో స్పందిస్తూ..‘మా ప్రభుత్వం విధించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు నిలిపివేస్తే ప్రత్యామ్నాయ మార్గాలను తప్పకుండా అన్వేషిస్తాం. ఇతర అవకాశాలను వెతుక్కుంటాం. ప్లాన్-బీ అమలు చేస్తాం. చైనా ప్రయోజనాలను కాపాడాలనే ఉద్దేశంతోనే కొందరు ఈ టారిఫ్లపై కోర్టుల్లో కేసులు వేశారు. నేను అమలు చేసిన టారిఫ్ల వల్ల తక్కువ కాలంలోనే ఫెడరల్ బడ్జెట్ లోటు సుమారు 27 శాతం వరకు తగ్గింది. ఈ సుంకాల కారణంగా అమెరికాలో వినియోగదారుల ఖర్చులు పెరిగాయని విమర్శలు వస్తున్నాయి. అయితే అది నిజం కాదు. ఈ టారిఫ్లను విదేశీ దేశాలే చెల్లిస్తున్నాయి. అమెరికా వినియోగదారులపై ఎలాంటి భారం పడటం లేదు. ఈ విషయంలో నేను తీసుకున్న నిర్ణయం పూర్తిగా సరైనదే’ అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అనేక దేశాలపై సుంకాలు విధించడం ప్రారంభించారు. తన ఇష్టానుసారం పలు దేశాలను బెదిరింపులకు గురిచేస్తూ సుంకాల పేరుతో బాదడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా న్యాయస్థానాల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం ఈ అంశం దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు పరిధిలోకి చేరింది. టారిఫ్ల అమలులో ట్రంప్ అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని ఉల్లంఘించారా? లేదా? అనే అంశంపై సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే, ఒకవేళ సుప్రీంకోర్టు తాను విధించిన సుంకాలను రద్దు చేస్తే ప్రభుత్వం తీవ్ర ఇబ్బందుల్లో పడుతుందని, ఇప్పటివరకు వసూలు చేసిన టారిఫ్లను తిరిగి చెల్లించడం అసాధ్యమని ట్రంప్ చెప్పుకొచ్చారు. దీంతో, కొంత ఆందోళనకు గురవుతున్నారు. -
‘హమాస్’లో తీవ్ర ఉత్కంఠ.. కొత్త నేత కోసం..
గాజా/కైరో: గత రెండేళ్లుగా ఇజ్రాయెల్తో సాగుతున్న యుద్ధం, అగ్ర నాయకత్వ లేమి మధ్య పాలస్తీనా సాయుధ పోరాట సంస్థ ‘హమాస్’ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అగ్రనేత యాహ్యా సిన్వార్ మరణంతో ఖాళీ అయిన అత్యున్నత నాయకత్వ పీఠాన్ని భర్తీ చేసేందుకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఖతార్ వేదికగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐదుగురు సభ్యుల కౌన్సిల్ నేతృత్వంలో ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలయ్యింది. గాజాలో ఇజ్రాయెల్ సైనిక ఒత్తిడి తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో, హమాస్ మనుగడను కాపాడే కొత్త వారసుడు ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది.హమాస్ కొత్త అగ్రనేత రేసులో ప్రధానంగా ఖలీద్ మెషాల్, ఖలీల్ అల్-హయ్యా పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఖలీద్ మెషాల్ గతంలో హమాస్ రాజకీయ విభాగానికి నాయకత్వం వహించారు. సున్నీ ముస్లిం దేశాలతో మంచి దౌత్య సంబంధాలు కలిగిన మెషాల్ సంస్థలో కీలక నేతగా గుర్తింపు పొందారు. మరోవైపు, ఖలీల్ అల్-హయ్యా ప్రస్తుతం హమాస్కు ప్రధాన సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. ఇరాన్తో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన హయ్యా ఎన్నికైతే, హమాస్పై ఇరాన్ పట్టు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.హమాస్ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన 50 మంది సభ్యుల షురా కౌన్సిల్ రహస్య బ్యాలెట్ ద్వారా ఈ ఎన్నికను నిర్వహించనుంది. ఒక్క ప్రధాన నేతనే కాకుండా, 2024లో లెబనాన్ దాడిలో మరణించిన సలేహ్ అల్-అరూరి స్థానంలో కొత్త ఉప నాయకుడిని కూడా కమిటీ ఎన్నుకోవాల్సి ఉంది. అయితే ఇజ్రాయెల్ లక్షిత దాడుల నేపథ్యంలో, ఒకే వ్యక్తికి పగ్గాలు అప్పగించే కంటే సమిష్టి నాయకత్వం వైపు వెళ్లడమే సురక్షితమని సంస్థలోని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది. 1987లో స్థాపించిన హమాస్ ప్రస్తుతం అత్యంత గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. అమెరికా మధ్యవర్తిత్వంతో అక్టోబర్లో కాల్పుల విరమణ కుదిరినప్పటికీ, గాజాలోని సగ భూభాగం ఇప్పటికీ ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉంది.ఇది కూడా చదవండి: Thailand: కదులుతున్న రైలుపై కూలిన క్రేన్..22 మంది మృతి -
రైలుపై పడిన భారీ క్రేన్
నఖోన్ రాచసీమ(థాయిలాండ్): థాయిలాండ్లో హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ కోసం తెప్పించిన భారీ క్రేన్ అటుగా వెళ్తున్న రైలు ప్రయాణికులకు పెనుశాపంగా పరిణమించింది. అత్యంత వేగంగా వెళ్తున్న రైలు మీద భారీ క్రేన్ పడటంతో బోగీలు పట్టాలు తప్పి, అగి్నకీలలు వ్యాపించిన ఘోర ప్రమాదంలో 31 మంది ప్రయాణికులుప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయాలపాలయ్యారు. విష యం తెల్సుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నంచేశారు. సహాయక సిబ్బంది వెంటనే క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్సనందిస్తున్నారు. చైనా, ఆగ్నేయాసియా ప్రాంతాలను అనుసంధానించే లక్ష్యంతో ఈ హైస్పీడ్ ట్రైన్ ప్రాజెక్ట్ను చేపట్టారు. బ్యాంకాక్ నుంచి ఉమాన్ రాచసమీ ప్రావిన్స్కు బుధవారం ఉదయం బయల్దేరిన రైలుపై మార్గ మధ్యంలో నఖోన్ సిఖియో జిల్లా పరిధిలో భారీ క్రేన్ పడటంతో ఈ పెను ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న రైలుపై నిర్మాణరంగ క్రేన్ పడటంతో బోగీలు పట్టాలు తప్పి ధ్వంసమయ్యాయి. వెనువెంటనే బోగీల నుంచి మంటలు చెలరేగాయి. ఇంకా నలుగురి జాడ తెలియాల్సి ఉందని, బోగీల శిథిలాల కింద చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం అన్వేషణ కొనసాగుతోందని నఖోన్ రాచసీమ గవర్నర్ అనుఫోంగ్ సుక్సోమ్నిత్ చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు రైలులో 171 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. రైలు పట్టాలకు ఇరువైపులా దూరంగా రెండు కాంక్రీట్ సపోర్ట్ పిల్లర్ల మీదుగా గిర్డర్లను ఏర్పాటుచేయగా వాటిపై వినియోగిస్తున్న భారీ నిర్మాణరంగ క్రేన్ అదుపుతప్పి ఈ రైలుపై పడిందని అక్కడి అధికారులు వివరించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు రవాణా శాఖ మంత్రి ఫిఫాట్ రాచకిత్ప్రకరణ్ చెప్పారు. Construction crane for high-speed rail bridge collapsed onto moving passenger train in Sikhiu, Nakhon Ratchasima this morning (14 Jan) at 9:05 am. Train derailed and caught fire. 30+ passengers injured, many trapped in carriages. Multiple rescue teams deployed. pic.twitter.com/X4c0vyQIwA— PR Thai Government (@prdthailand) January 14, 2026 -
ఇరాన్లో పరిస్థితి అంత ఘోరంగా ఉందా?
ఇరాన్ కల్లోలంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రంగా స్పందించారు. నిరసనకారులను ఉరి తీస్తుంటే చూస్తూ ఊరుకోమని.. కచ్చితంగా అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అదే సమయంలో.. అక్కడి నిరసనకారులకు సాయం అందించే ప్రయత్నంలో ఉన్నట్లు ప్రకటించారు. మరోవైపు తమ దేశంలో అలజడిపై ఇరాన్ సైతం సంచలన ఆరోపణలకు దిగింది. అరెస్టైన నిరసనకారుల్లో ఇర్ఫాన్ అనే వ్యక్తిని ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఆందోళనలు కొనసాగితే.. మరికొందరికి అదే పరిస్థితి తప్పదంటూ ఖమేనీ ప్రభుత్వం హెచ్చరించినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ట్రంప్ Truth Socialలో స్పందించారు. అలాంటిదే జరిగితే అమెరికా ఇరాన్ పట్ల కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ‘‘నిరసనలు కొనసాగించండి.. సహాయం వస్తోంది’’ అని ఇరానీయులకు పిలుపునిచ్చారు. అయితే ఆ సహాయం ఏ రూపంలో ఉంటుందో మాత్రం ట్రంప్ వివరించలేదు.దేశవ్యాప్తంగా జరుగుతున్న భారీ నిరసనలపై ఇరాన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని.. వేలాది మంది మరణించి ఉండవచ్చని మానవహక్కుల సంస్థలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అటు ఇంటర్నెట్ బ్లాక్అవుట్, కాల్పులు, అరెస్టులు, మరణశిక్షలు వంటి చర్యలు అంతర్జాతీయ ఆగ్రహానికి కారణమయ్యాయి. ఇరాన్ హ్యూమన్ రైట్స్ సంస్థ ప్రకారం.. ఇప్పటివరకు 734 మంది మరణించారు. కానీ అసలు సంఖ్య వేలల్లో ఉండవచ్చని పలు మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. మృతుల్లో భద్రతా సిబ్బంది కూడా భారీగానే ఉన్నారని చెబుతున్నాయి. అమెరికా ఆధారిత హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ (HRANA) ప్రకారం ఇప్పటివరకు 2,403 మంది నిరసనకారులు మరణించగా.. ఇందులో 12 మంది మైనర్లు ఉన్నారు. మొత్తంగా ఇప్పటిదాకా 18,137 మందిని అరెస్టు చేశారు. అయితే.. ఇరాన్కు చెందిన ఓ టెలివిజన్ సంస్థ వేలమంది శవాలుగా మారిపోయారంటూ కథనం ఇవ్వడం సంచలనాత్మకంగా మారింది. అయితే.. ఆందోళనకారుల మరణాల సంఖ్యను నిర్ధారించని ఇరాన్ ప్రభుత్వం.. భద్రతా బలగాల మరణాలను మాత్రం అమరవీరులుగా ప్రకటించి.. పెద్ద ఎత్తున అంత్యక్రియలు నిర్వహిస్తోంది. సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ ఆ నిరసనలను విదేశీ కుట్రగా అభివర్ణిస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ల హస్తం ఉందని చెబుతూ.. కౌంటర్ వార్నింగులు ఇస్తున్నారు. ట్రంపే ఈ హత్యలకు కారణమంటూ తీవ్ర విమర్శలు చేస్తూ టెహ్రాన్ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ దేశంలో రాజకీయ అస్థిరతను ట్రంప్ ప్రొత్సహిస్తున్నారని.. ఇది సార్వభౌమత్వానికి ముప్పు అని యూఎన్లో ఇరాన్ రాయబారి వ్యాఖ్యానించారు. జరగబోయే పరిణామాలకు అమెరికా, ఇజ్రాయెల్లు సమిష్టిగా బాధ్యత వహించాల్సిందేనన్నారాయన. అయితే ఒకవైపు అణచివేత ద్వారా తన ఆధిపత్యం ప్రదర్శిస్తూనే.. ప్రజల నుంచి తమకు మద్దతు ఉందని చూపేలా ర్యాలీలను ఖమేనీ ప్రభుత్వం ప్రొత్సహిస్తోంది కూడా. అయితే.. నిరసనకారులపై కఠిన చర్యలు అంతర్జాతీయ ఆగ్రహానికి దారితీస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ సహా ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ దేశాలు ఇరాన్పై ఆంక్షలు విధించే ఆలోచన చేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చాయి. జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ ఓ అడుగు ముందుకేసి ఖమేనీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఖమేనీ ప్రభుత్వ పతనం ఖాయమైనట్లు జోరుగా ప్రచారం నడుస్తోంది. అయితే.. విశ్లేషకులు మాత్రం ఇరాన్ పాలన తక్షణమే కూలిపోతుందని చెప్పడం తొందరపాటు అవుతుందని, అణచివేసే ప్రయత్నాలు ఇంకా బలంగానే కొనసాగుతున్నాయని అంటున్నారు. -
రావణకాష్టంగా ఇరాన్
దుబాయ్/వాషింగ్టన్: ఇరాన్లో అనూహ్యంగా పెరిగిన ధరలు, నిరుద్యోగం, ప్రభుత్వ అసమర్థ పాలనతో విసిగిపోయిన జనం నుంచి పెల్లుబికిన ఆగ్రహాగ్ని రోజురోజుకూ మరింతగా విస్తరిస్తోంది. జనం అసంఖ్యాకంగా వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ వాణిజ్య సము దాయాలు, బ్యాంక్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ వాహనాలు, ఏటీఎంలకు నిప్పు పెడుతున్నారు. ఉద్యమ వార్తలు, పుకార్ల వ్యాప్తిని అడ్డుకునేందుకు అయతొల్లా అలీ ఖమేనీ సారథ్యంలోని ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, మొబైల్ సేవలను స్తంభింపజేసింది. అయితే నాలుగు రోజుల తర్వాత కొందరికి మాత్రం అంతర్జాతీయ ఫోన్కాల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో గత రెండు వారాలుగా తాము పడుతున్న బాధలు, నరకయాతనను పలువురు విదేశాల్లోని తమ బంధువుల ముందు ఏకరవు పెట్టారు. సెంట్రల్ టెహ్రాన్లో కనీవినీ ఎరుగని రీతిలో పోలీసులు మొహరించారని దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని బంధువులకు చెప్పారు.ఆన్లైన్ సదుపాయం లేక బ్యాంక్లలో నగదు లావాదేవీలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుండటంతో జనాలకు కరెన్సీ కష్టాలు మొదలయ్యాయి. ఉద్యమకారులను పోలీసులు ఉక్కుపాదంతో అణచివేస్తూ కాల్పులు జరుపుతుండటంతో ఉద్యమసంబంధ ఘటనల్లో ఇప్పటిదాకా 2,003 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ‘హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ’ మంగళవారం ప్రకటించింది. వీరిలో 1,850 మంది ఉద్యమకారులుకాగా 135 మంది పోలీసులు ఉన్నారు. అభంశుభం తెలియని 9 మంది చిన్నారులు, ఉద్యమంలో పాల్గొనని 9 మంది సాధారణ జనం సైతం కాల్పుల్లో కన్నుమూశారు. మరోవైపు అమెరికా ఏ క్షణంలోనైనా దాడి చేస్తే ఇరాన్ సైతం ప్రతిదాడులకు దిగడం ఖాయమన్న అంచనాలతో ఇరానియన్లు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.ఉధృతంగా కొనసాగుతున్న ఆందోళనల ధాటికి దుకాణాలు మూతబ డుతున్నాయి. నిరంకుశ, ఛాందసవాద ఖమేనీ గద్దె దిగి ప్రజాస్వామ్యయుత పాలన కావాలంటూ వేలాదిగా జనం వీధుల్లో నిరసనోద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. పరిస్థితి అదుపుతప్పుతోందని భావించిన ఖమేనీ సర్కార్ పోలీసులను రంగంలోకి దింపి లాఠీచార్జ్, బాష్పవాయుగోళాల ప్రయోగం, తప్పనిసరి పరిస్థితుల్లో తుపాకులకు పనిచెప్తోంది. పోలీసులు, ఉద్యమకారులకు మధ్య ఘర్షణల్లో వేలాది మంది గాయపడ్డారు. గత రెండువారాల వ్యవధిలో 10,700 మందికిపైగా నిరసనకారులను ప్రభుత్వం అరెస్ట్చేసింది.ఉద్యమకారుడు ఇర్ఫాన్ను ఉరితీస్తాం..సుప్రీంకమాండర్ ఖమేనీని దూషిస్తూ గత గురువారం జరిగిన నిరనస ర్యాలీలో పాల్గొన్న నేరానికి 26 ఏళ్ల ఉద్యమకారుడు ఇర్ఫాన్ సొల్తానీని బుధవారం ఉరితీస్తామని ఖమేనీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అన్యాయంగా ఇర్ఫాన్ను ప్రభుత్వం బలితీసుకుంటోందని, అంతర్జాతీయ సమాజం ఈ దారుణాన్ని అడ్డుకోవాలని ‘హెంగ్వా ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్’ సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. టెహ్రాన్ శివారు కరాజ్లోని ఫర్దీస్ ప్రాంతానికి చెందిన ఇర్ఫాన్ను జనవరి 8వ తేదీన పోలీసులు అరెస్ట్చేశారు. దేవునిపై యుద్ధం ప్రకటించాడని ఇర్ఫాన్పై నేరాభియోగాలు మోపి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు.దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎక్కువైంది. ఒక పౌరుడి ప్రాణాలు తీసేందుకు ఖమేనీ ప్రభుత్వం నిర్ణయాలు తీసు కుని ఆగమేఘాల మీద అమలు చేయడం జీవితంలో ఎప్పుడూ చూడలేదని టెహ్రాన్వాసులు అసహనం వ్యక్తంచేశారు. ఇర్ఫాన్ను చివరిసారిగా కలిసేందుకు 11వ తేదీన కుటుంబసభ్యులకు అనుమతి ఇచ్చారు. ఇర్ఫాన్ సోదరి స్వయంగా న్యాయవాది అయినా కూడా ఆమె ఈ కేసు వాదించకుండా ప్రభుత్వం అడ్డుకుంది. మరోవైపు ఇరాన్లో ఉంటున్న తమ పౌరులు తక్షణం ఆ దేశాన్ని వీడాలని అమెరికా మంగళవారం ఒక అడ్వైజరీని జారీచేసింది.నేనున్నా.. రెచ్చిపోండి: ట్రంప్ఆందోళనలను మరింత రెచ్చగొట్టేలా ట్రంప్ మాట్లాడారు. ఈ మేరకు ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘ ఇరానియన్లు దేశ భక్తులు. నిరసనోద్యమాన్ని మరింత ఉధృతం చేయండి. రాజ్యాంగబద్ధ సంస్థలను మీ వశం చేసుకోండి. హంతకులు, దాడులు చేసే వారి పేర్లను రాసిపెట్టుకోండి. మనందరం కలిసి వాళ్ల అంతుచూద్దాం. దాడులకు వాళ్లు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. దారుణ హత్యోదంతాలు ఆగేదాకా ఇరాన్ ప్రభుత్వంతో నేను ఎలాంటి చర్చలు జరపబోను. అందుకే ఇరాన్ అత్యున్న తాధికారులతో అన్నిరకాల సమావేశాలను మంగళవారం రద్దు చేసుకున్నా. మీకు సాయం చేయబోతున్నాం. త్వరలోనే మీకు మా సాయం అందుతుంది. మేక్ ఇరాన్ గ్రేట్ ఎగేన్’’ అని ట్రంప్ రాసుకొచ్చారు. అయితే సాయం ఏ రూపంలో చేయబోతున్నారో ట్రంప్ వెల్లడించలేదు. అయితే అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్తో ఫోన్లో మంతనాలు జరుపుతున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ చెప్పారు. -
ఇక గ్రీన్లాండ్ విలీనమే!
వాషింగ్టన్: డెన్మార్క్లో భాగంగా కొనసాగుతూ పాక్షికంగా స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన గ్రీన్లాండ్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటి నుంచో కన్నేశారు. సహజ వనరులు, ముడి చమురుతో కూడిన ఆ ప్రాంతాన్ని అమెరికాలో విలీనం చేసుకొనే దిశగా అడుగులేస్తున్నారు. అందులో భాగంగా రిపబ్లికన్ సభ్యుడు ర్యాండీ ఫైన్ అమెరికా కాంగ్రెస్లో సోమవారం ‘గ్రీన్లాండ్ అనెక్సేషన్ అండ్ స్టేట్హుడ్’ పేరిట బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు చట్టసభలో ఆమోదం పొందితే గ్రీన్లాండ్ను అమెరికాలో విలీనం చేసి 51వ రాష్ట్రంగా మార్చేసే అధికారం అధ్యక్షుడు ట్రంప్కు లభిస్తుంది.అమెరికా జాతీయ భద్రత కోసం గ్రీన్లాండ్ను ఎలాగైనా స్వా«దీనం చేసుకోక తప్పదని ట్రంప్ ఇప్పటికే స్పష్టంచేశారు. వీలైతే సులభ మార్గంలో, లేకపోతే కఠిన మార్గంలో గ్రీన్లాండ్ను అమెరికాలో కలిపేస్తామని ఆయన ప్రకటించారు. బల ప్రయోగానికైనా సిద్ధమని పరోక్షంగా సంకేతాలిచ్చారు. డబ్బులిచ్చి గ్రీన్లాండ్ను కొనుగోలు చేస్తామని అమెరికా చెప్పగా అందుకు డెన్మార్క్ నేతలు అంగీకరించలేదు. ఆ ప్రాంతం అమ్మకానికి లేదని తెలియజేశారు.గ్రీన్లాండ్ విలీనం అనేది విస్మరించదగిన అంశం కాదని ర్యాంటీ ఫైన్ పేర్కొన్నారు. అమెరికా భద్రతకు అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. గ్రీన్లాండ్ విలీనం లేదా బలవంతపు ఆక్రమణ కోసం చర్యలు చేపట్టడానికి వీలుగా ట్రంప్కు అధికారాలు ఇవ్వడానికే బిల్లును తీసుకొచి్చనట్లు తెలిపారు. ఈ ఆర్కిటిక్ ద్వీపం అమెరికాలో ఒక రాష్ట్రంగా మారాలంటే ఫెడరల్ చట్టంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఆ ఫొటోల్లో ట్రంప్ అంతరంగం గ్రీన్లాండ్ను ఎప్పుడెప్పుడు సొంతం చేసుకోవాలా? అని డొనాల్డ్ ట్రంప్ తెగ ఆలోచిస్తున్నారు. ఆయన మనసంతా అక్కడే ఉంది. అమెరికా అధ్యక్ష భవనమైన వైట్హౌస్ మంగళవారం నాలుగు ఆసక్తికరమైన ఫొటోలను ‘ఎక్స్’లో షేర్ చేసింది. వీటిని ఒక క్రమపద్ధతిలో అమర్చి చూస్తే ట్రంప్ అంతరంగం బయటపడుతోంది. ఇందులో ట్రంప్ వైట్హౌస్లోని ఓవల్ ఆఫీసు కిటికీ నుంచి అటువైపున్న గ్రీన్లాండ్ను నిశితంగా గమనిస్తున్నారు. తాజా పరిస్థితిని ఆయన పర్యవేక్షిస్తున్నట్లుగా దీనికి శీర్షికను జోడించారు. -
ఇరాన్పై టారిఫ్ కొరడా!
సాక్షి, న్యూఢిల్లీ: శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆందోళనకారులను ఉక్కుపాదంతో అణిచేస్తున్న ఖమేనీ సారథ్యంలోని ఇరాన్ ప్రభుత్వంపై అమెరికా దాడులతో సమాధానం చెబుతుందని అంతా భావిస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా టారిఫ్ల కొరడా ఝుళిపించారు. ఇప్పటికే పెరిగిన ధరలు, నిరుద్యోగం, నిరసనలతో సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ఇరాన్ను మరింతగా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేలా, వాణిజ్యరంగంలో ఇరాన్ను ఏకాకిని చేసేలా ట్రంప్ పథక రచన చేశారు.ఇందులోభాగంగా ఇకపై ఇరాన్తో వ్యాపార, వాణిజ్య సంబంధాలు కొనసాగించే ప్రతి దేశంపై తాము 25 శాతం అదనపు టారిఫ్లను విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘మాతో వ్యాపారం చేసే దేశాలు ఒకవేళ ఇరాన్తోనూ వ్యాపార, వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తే ఆ దేశాలపై అదనంగా 25 శాతం టారిఫ్ విధిస్తాం. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది. ఇదే తుది నిర్ణయం. ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోవు’ అని ట్రంప్ తేల్చిచెప్పారు.భారత్పై పడనున్న పెను ప్రభావం ట్రంప్ తాజా నిర్ణయం భారత్ను ఇరకాటంలో పడేసింది. ఇరాన్కు ప్రధాన వాణిజ్య భాగస్వాముల్లో భారత్ ఒకటి. చైనా, తుర్కియే, యూఏఈ, పాకిస్థాన్లతో పాటు భారత్ కూడా ఇరాన్తో విస్తృతమైన వాణిజ్య సంబంధాలను కలిగి ఉంది. ఇప్పటికే ఆంక్షల వలయంలో ఉన్న భారత్పై రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లు జరుపుతున్నందుకుగాను, అమెరికా ఇప్పటికే 50 శాతం టారిఫ్ విధించింది. ఇప్పుడు ఇరాన్తో సంబంధాల కారణంగా అదనంగా మరో 25 శాతం భారం పడనుంది. దీంతో అధిక టారిఫ్లకు భయపడి ప్రపంచదేశాలు ఇరాన్తో వాణిజ్యాన్ని పూర్తిగా తగ్గించుకుంటాయి.అంతర్జాతీయ వాణిజ్యం కునారిల్లడంతో విదేశీ మారకద్రవ్యం లేకపోవడంతో ఇరాన్ చివరకు ఏకాకిగా మారుతుందని, అప్పుడు తాను చెప్పిన మాట ఇరాన్ వింటుందని అమెరికా భావిస్తోంది. అయితే అధిక టారిఫ్ కారణంగా ఇకపై ఇరాన్తో భారత వాణిజ్య పరిమాణం భారీగా తగ్గే ప్రమాదముందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. భారత్–అమెరికా వాణిజ్య బంధంపైనా తీవ్ర ఒత్తిడి పెరిగే వీలుంది. ఇరాన్తో భారత్ వేల కోట్ల వాణిజ్యంఇరాన్తో భారత్ వాణిజ్య బంధం కేవలం వ్యూహాత్మకమే కాదు, ఆర్థికంగానూ కీలకమైనది. 2023లో భారత్ నుంచి ఇరాన్కు దాదాపు 1.19 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 10,740 కోట్లు) ఎగుమతులు జరిగాయి. ఇందులో సింహభాగం బాస్మతి బియ్యానిదే. ఏటా దాదాపు రూ.6,623 కోట్ల విలువైన బియ్యం ఇరాన్కు ఎగుమతి అవుతోంది. తేయాకు, పంచదార, ఔషధాలు, సోయాబీన్ సైతం ఇరాన్కు ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు అమెరికా ఆంక్షల భయంతో ఈ ఎగుమతులు నిలిచిపోతే, దేశీయ మార్కెట్లో ఈ పంటల ధరలు పడిపోయి అన్నదాతలు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.అలాగే ఇరాన్ నుంచి భారత్ దిగుమతి చేసుకునే డ్రైఫ్రూట్స్, రసాయనాల ధరలు భగ్గుమనే అవకాశం లేకపోలేదు. ఇరాన్ నుంచి భారత్ 1.02 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9,205 కోట్లు) విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. ఇందులో డ్రైఫ్రూట్స్ (ఎండు ద్రాక్ష, అంజీర్), రసాయనాలు, గాజు పాత్రలు ఉన్నాయి. డీజీసీఐఎస్ 2025 గణాంకాల ప్రకారం ధాన్యాల ఎగుమతి 64.9 కోట్ల డాలర్లుగా ఉండగా, కాఫీ, టీ, సుగంధ ద్రవ్యాల ఎగుమతులు 7.3 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. కృత్రిమ నారలు, ఎలక్ట్రికల్ ఉపకరణాలు, కృత్రిమ ఆభరణాల వంటివీ ఇరాన్కు ఎగుమతి అవుతున్నాయి.అగమ్యగోచరంగా ‘చాబహార్’ భవిష్యత్తుభారత్–ఇరాన్ సంబంధాల్లో చాబహార్ పోర్ట్ అత్యంత కీలకమైనది. పాకిస్థాన్ను పక్కనపెట్టి మధ్య ఆసియాకు చేరేందుకు భారత్ దీనిని వ్యూహాత్మకంగా అభివృద్ధి చేస్తోంది. 2024 మే నెలలో ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ చాబహార్లోని షాహిద్ బెహెష్తీ టెర్మినల్ నిర్వహణ కోసం ఇరాన్తో పదేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు కోసం భారత్ భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో ఈ ప్రాజెక్టు భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ఓడరేవు అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షల కత్తి వేలాడే అవకాశం ఉంది.భారత్–ఇరాన్ మధ్య శతాబ్దాల నాటి చారిత్రక, సాంస్కృతిక బంధం ఉంది. ఒకవైపు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన అమెరికా.. మరోవైపు వ్యూహాత్మక మిత్రదేశమైన ఇరాన్. ఈ రెండింటి మధ్య సమతుల్యత పాటించడం ఇప్పుడు భారత్కు పెద్ద సమస్యగా తయారైంది. డాలర్ ఆధిపత్యం లేకుండా రూపాయి మారకంలో వాణిజ్యం చేయడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ, అమెరికా మార్కెట్ను వదులుకునే సాహసం భారత్ చేయలేకపోవచ్చు. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వం ఎలాంటి దౌత్యపరమైన మంత్రం ప్రయోగిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
పాకిస్తాన్ డ్రోన్ల చొరబాటు: దేశ సరిహద్దులో మరోసారి ఉద్రిక్తత
రాజోరి: నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ డ్రోన్లు మళ్లీ కనిపించడం వల్ల రాజోరి జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం సాయంత్రం కెర్రీ సెక్టార్లోని డుంగా గాలా మరియు కోల్డ్క్సి ప్రాంతాల్లో రెండు నుండి మూడు డ్రోన్లు గమనించబడ్డాయి. సైన్యం వెంటనే కాల్పులు జరపగా, డ్రోన్లు అదృశ్యమయ్యాయి. అవి బుల్లెట్లకు గురై పడిపోయి ఉండవచ్చని లేదా తిరిగి పాకిస్తాన్ వైపు వెళ్లి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఆదివారం సాయంత్రం రాజోరి, పూంచ్, సాంబా జిల్లాల్లో డ్రోన్లు కనిపించిన ఘటన తర్వాత ఇది రెండోసారి. సాయంత్రం 7 గంటల నుండి 7.30 మధ్య డ్రోన్లు గమనించబడ్డాయి. సైన్యం వెంటనే ప్రాంతాన్ని అడ్డుకుని, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించనుంది. సైన్యం ప్రజలను అప్రమత్తంగా ఉండమని విజ్ఞప్తి చేసింది. ఏదైనా అనుమానాస్పద వస్తువు కనిపిస్తే వెంటనే ఆర్మీకి సమాచారం ఇవ్వాలని సూచించింది. పూంచ్ జిల్లాలోని ఎత్తైన ప్రాంతాల్లో ట్రెక్కింగ్, హైకింగ్, క్యాంపింగ్ వంటి కార్యకలాపాలను వెంటనే నిషేధించారు. ఈ ఆర్డర్లు రాబోయే రెండు నెలల పాటు అమలులో ఉంటాయి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ కార్యాలయం నుండి జారీ చేసిన ఉత్తర్వులో, భద్రతా కారణాల వల్ల ఈ నిషేధం విధించబడిందని పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో వ్యక్తుల కదలిక ప్రజా భద్రతకు ముప్పుగా మారవచ్చని అధికారులు హెచ్చరించారు. -
ఇరాన్లో నిరసనకారుడు ఇర్ఫాన్కి ఉరి శిక్ష: అంతర్జాతీయ ఆందోళన
ఇరాన్లో ప్రజాస్వామ్యానికి మద్దతుగా నిరసనల్లో పాల్గొన్న 26 ఏళ్ల యువకుడు ఇర్ఫాన్ సోల్తానీకి ఉరి శిక్ష విధించనున్నట్లు మానవ హక్కుల సంస్థలు వెల్లడించాయి. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. రాజధాని టెహ్రాన్ సమీపంలోని కరాజ్ నగరంలో జరిగిన నిరసనల సందర్భంగా సోల్తానీని గత వారం అరెస్టు చేశారు. సరైన విచారణ లేకుండా జనవరి 14న అతనికి ఉరి శిక్ష అమలు చేయనున్నట్లు కుటుంబానికి సమాచారం అందింది. నార్వేకు చెందిన మానవ హక్కుల సంస్థ ఇరాన్ హ్యూమన్ రైట్స్ (IHR) ఈ విషయాన్ని ధృవీకరించింది. ఇప్పటివరకు నిరసనలలో 648 మంది మరణాలు అధికారికంగా నమోదు అయ్యాయని IHR తెలిపింది. వాస్తవ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. కొన్ని అంచనాల ప్రకారం, మరణాల సంఖ్య 6,000 దాటే అవకాశం ఉంది. ఇంటర్నెట్ షట్డౌన్ కారణంగా స్వతంత్ర ధృవీకరణ కష్టమవుతోంది. ఇప్పటివరకు 10,000 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. మరో మానవ హక్కుల సంస్థ నేషనల్ యూనియన్ ఫర్ డెమోక్రసీ ఇన్ ఇరాన్ (NUFD) సోల్తానీ ఉరి శిక్షను ఆపాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. సోల్తానీ చేసిన నేరం ప్రజాస్వామ్యం కోసం తన గొంతు వినిపించడం మాత్రమేనని NUFD పేర్కొంది. అమెరికా నివేదిక ప్రకారం, కరాజ్లో శనివారం నిరసనల సమయంలో సోల్తానీని అరెస్టు చేశారు. సోల్తానీపై "దేవునిపై యుద్ధం చేస్తున్నాడు" అనే అభియోగం మోపబడింది. ఈ అభియోగం ఇరాన్ చట్టాల ప్రకారం మరణశిక్షకు దారితీస్తుంది. న్యాయవాదిని కలిసే హక్కు కూడా అతనికి నిరాకరించబడిందని NUFD ఆరోపించింది. సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ నేతృత్వంలోని ప్రభుత్వం అసమ్మతిని అణచివేయడానికి ప్రయత్నిస్తోందని మానవ హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. సోల్తానీకి ఉరి శిక్ష అమలు అవుతుందా లేదా అన్నది ఇంకా స్వతంత్రంగా ధృవీకరించబడలేదు. ఈ ఘటన ఇరాన్లో ప్రజాస్వామ్య ఉద్యమాలపై అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతుందా లేదా ప్రభుత్వం మరింత కఠినతర చర్యలు తీసుకుంటుందా అన్నది చూడాలి. -
భారతీయ విద్యార్థులకు షాక్.. ఆస్ట్రేలియా వీసా నియమాలలో కీలక మార్పులు
సాక్షి, న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో చదువు కొనసాగించాలని కలలుకంటున్న భారతీయ విద్యార్థులకు మరో పెద్ద షాక్ ఎదురైంది. ఆస్ట్రేలియా ప్రభుత్వం విద్యార్థి వీసా నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ భారతదేశాన్ని ‘అత్యధిక రిస్క్’ కేటగిరీ (Assessment Level 3 – AL3)లో ఉంచింది. ప్రధాన మార్పులు - భారతదేశం AL3 కేటగిరీకి: ఇంతవరకు AL2లో ఉన్న భారత్ ఇప్పుడు AL3లోకి పడిపోయింది. - డాక్యుమెంటరీ అవసరాలు: విద్యార్థులు తమ ఆర్థిక స్థితి, విద్యా అర్హతలకు మరింత బలమైన రుజువులు సమర్పించాలి. - బ్యాంక్ స్టేట్మెంట్లు: ఆర్థిక స్థితి నిరూపణ కోసం నేరుగా బ్యాంక్ ధృవీకరణ అవసరం. - డిగ్రీల ధృవీకరణ: విద్యా అర్హతలు సంబంధిత సంస్థల నుండి నేరుగా ధృవీకరించబడతాయి. భారతదేశం ఆస్ట్రేలియాకు అతిపెద్ద అంతర్జాతీయ విద్యార్థి వనరులలో ఒకటి. ప్రస్తుతం 1.4 లక్షల మంది భారతీయ విద్యార్థులు అక్కడ చదువుతున్నారు. ఈ మార్పులు 2026 జనవరి 8 నుండి అమల్లోకి వస్తాయి. నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ కూడా అదే ‘హై రిస్క్’ విభాగంలో ఉంచబడ్డాయి. ఇటీవలి కాలంలో భారతదేశంలో నకిలీ డిగ్రీ రాకెట్లు, వీసా మోసం కేసులు పెరగడం వల్ల ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పుల వల్ల దక్షిణాసియా విద్యార్థులకు ఆస్ట్రేలియాలో ప్రవేశం మరింత కఠినతరం అవుతుంది. -
పుతిన్ ఎఫెక్ట్? భారత్కు మరో దేశాధినేత
ఢిల్లీ: ప్రస్తుతం రష్యాతో భారత్ సంబంధాలు ఎంతో మెరుగ్గా ఉన్నాయి. గతేడాది ఆదేశ అధ్యక్షుడు పుతిన్ భారత్లో పర్యటించారు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పరస్పరం పొగడ్తల వర్షం కురిపించుకున్నారు. పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. త్వరలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం రానున్నట్లు ఆ దేశ రాయబారి తెలిపారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ త్వరలో భారత్లో పర్యటించనున్నట్లు భారత్లోని ఉక్రెయిన్ రాయబారి ఒలెక్సాండర్ పోలిష్చుక్ అధికారికంగా ప్రకటించారు. గుజరాత్లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన పోలిష్చుక్ ఈ వివరాలు తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధాలను మరింత బలోపేతం చేయడానికే జెలెన్స్కీ భారత్లో పర్యటిస్తున్నారని పేర్కొన్నారు. పర్యాటకం, మెడిసిన్, ఇండస్ట్రీయల్ వస్తువులు, పోర్టులు తదితర రంగాలలో పరస్పర సహాకారం ఉండనున్నట్లు తెలిపారు.2024లో మోదీ ఉక్రెయిన్లో పర్యటించినప్పుడు జెలెన్స్కీ ఇండియా వెళ్లాలని నిశ్చయించుకున్నట్లు పోలిష్చుక్ తెలిపారు. జెలెన్స్కీ పర్యటన ఆ రోజే ఖరారైందన్నారు. ఉక్రెయిన్ కష్టాల్లో ఉన్న సమయంలో ఆ దేశంలో పర్యటించిన అతి కొద్దిమంది ప్రపంచ నాయకులలో మోదీ ఒకరని భారత ప్రధానిని కొనియాడారు. తమ దేశంలో శాంతి నెలకొనాలని గుజరాత్లోని ద్వారకా మందిరంలో పూజలు చేసినట్లు పోలిష్చుక్ తెలిపారు.అయితే ఇంతకాలం భారత్ను పన్నులతో ఇబ్బందులు పెడదామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నించాడు. అది సాధ్యం కాకపోవడంతో ఇటీవలే ఆ దేశ రాయబారి భారత్ను ప్రశంసిస్తూ మాట్లాడారు. వచ్చే ఏడాది ట్రంప్ భారత్లో పర్యటిస్తారని తెలిపారు. ఒకరోజైనా గడవకముందు ఉక్రెయిన్ సైతం అదే విధంగా మాట్లాడింది. ఈ పర్యటనల వెనక ఏమైనా అంతర్యముందా అని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు. -
చైనాకు భారత ఆర్మీ జనరల్ వార్నింగ్.. ఆ భూమి ఎప్పటికీ మాదే
భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ చైనాకు వార్నింగ్ ఇచ్చారు. షక్సాగామ్ వ్యాలీలో చైనా మౌళిక సదుపాయాల నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో భారత్ అంగీకరించదని తేల్చిచెప్పారు. 1963లో చైనా-పాక్ మధ్య జరిగిన భూబదిలీ ఒప్పందాన్ని ఇండియా ఎప్పుడు ఆమోదించేది లేదని ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు.కాగా షక్సాగామ్ వ్యాలిలో చైనా చేపడుతున్న నిర్మాణాలపై జనవరి 9న భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ భూమిపై పాక్- చైనా చేసుకున్న ఒప్పందం ఎప్పటికీ చెల్లదు. దీనిని భారత్ ఎప్పటికీ గుర్తించదని ప్రకటించింది. అయితే దానికి చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో వింగ్ నిన్న (సోమవారం) స్పందించారు. 1963లోనే ఈ భూభాగంపై పాకిస్థాన్-చైనా అంగీకారం చేసుకున్నాయని ఇప్పుడు దానిపై స్పందించడానికి భారత్కు అవకాశం లేదన్నారు. ఈ వ్యాఖ్యలపై భారత ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేదీ తాజాగా స్పందించారు. జనరల్ ద్వివేదీ మాట్లాడుతూ " ఈ ప్రాంతంలో జరిగే ఏ కార్యకలాపాలను భారత్ గుర్తించదు. షక్సాగామ్పై 1963లో పాక్తో చేసుకున్న ఒప్పందం ఎట్టిపరిస్తితుల్లో చెల్లదు. అక్కడ కట్టే నిర్మాణాలను అక్రమ కట్టడాలుగానే భారత్ భావిస్తోంది" అన్నారు. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునే హక్కు భారత్కు ఉందని కూడా జనరల్ ద్వివేదీ స్పష్టం చేశారు.షక్సాగామ్ వివాదంషక్సాగామ్ లోయ ప్రాంతం పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో ఉంది. దీనిని పాకిస్థాన్ 1963లో జరిగిన ఒప్పందంలో భాగంగా చైనాకు అప్పగించింది. ఆ భూమిలో ప్రస్తుతం చైనా రహదారులు, సైనికస్థావరాలు తదితర నిర్మాణాలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో భారత్ ఈ నిర్మాణాలను వ్యతిరేకిస్తుంది. -
ఇరాన్లో నిరసనలు.. రెండు వేల మంది మృతి!
ఇరాన్లో పరిస్థితులు చేయిదాటిపోయాయి. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిపై ప్రభుత్వం ఊచకోతలకు పాల్పడుతోంది. తాజాగా అక్కడి ఓ ప్రభుత్వ ఆసుపత్రి ముందు కనబడిన దృశ్యాలు హృదయ విధారకంగా కనిపిస్తున్నాయి. ఆ దేశ రాజధాని టెహ్రాన్లోని ఓ ఆసుపత్రి ముందు వందల సంఖ్యలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండగా వారిలో.. తమ వారు ఉన్నారా అని భయంభయంగా అక్కడి ప్రజలు వెతుకుతున్నారు. ఈ దృశ్యాలు ప్రపంచాన్ని కలతచెందేలా చేస్తున్నాయి.ఇరాన్లో ద్రవ్యోల్బణం, అవినీతి తదితర కారణాలతో అక్కడి ప్రజలు ఖమేనీ ప్రభుత్వంపై పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఇస్లామిక్ పాలన అంతంకావాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. మహిళలు సైతం రోడ్లెక్లి హిజాబ్లను తొలిగించి చేతిలో సిగరెట్లు పట్టుకొని ఇస్లామిక్ చట్టాలకు వ్యతిరేకంగా నిరనసలు జరుపుతున్నారు. అయితే ఆందోళన కారులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని అమెరికా రంగంలోకి దిగుతుందని ట్రంప్ హెచ్చరించారు. అయినప్పటికీ ఖమేనీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. నిరసన కారులను ఊచకోతకోస్తుంది.రెండు వేల మంది మృతిఇప్పటివరకూ నిరసనలో పాల్గొన్న వారిలో 2 వేల మంది మృతి చెందిన విషయాన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ అధికారి ఒకరు మరణాల సంఖ్యను వెల్లడించారు. ఇరాన్ పౌరులు చేపట్టిన ఈనిరసనలను ఆ దేశం ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది. ఆందోళనలు ఇలానే కొనసాగితే మరణాల సంఖ్య కూడా ఇలానే ఉంటుందని హెచ్చరించింది. తమ దేశానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం ఎక్కువైతే తీవ్ర పరిణామాలుంటాయని తెలిపింది. ఈ నిరసనల్లో పాల్గొన్న ఉగ్రవాద శక్తులు ప్రభుత్వ భవనాలు, పోలీస్ స్టేషన్లు, వ్యాపారాలు, పౌరులు, భద్రతా దళాలపై కాల్పులు జరిపాయని సదరు అధికారి పేర్కొన్నారు. ఆ దేశానికి చెందిన ఓమంత్రి ఈ నిరసనలను ఖండిస్తున్నారు. అయితే ఇరాన్ రెడ్లైన్ దాటిందని అక్కడి పరిస్థితులను అమెరికా నిశితంగా గమనిస్తుందని తమ నిర్ణయం త్వరలోనే ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందా? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.Dozens of black body bags seen in Iran. pic.twitter.com/6PB0y6sNxP— Open Source Intel (@Osint613) January 13, 2026 -
అమెరికా చేతికి గ్రీన్లాండ్?..వెలుగులోకి షాకింగ్ ప్లాన్!
వాషింగ్టన్:గ్రీన్లాండ్ను చేజిక్కించుకోవాలనే ప్రయత్నాలను అమెరికా ముమ్మరం చేస్తోంది. ఆ దీవిని అమెరికాలో కలపాలని ప్రతిపాదిస్తూ రిపబ్లికన్ పార్టీకి చెందిన చట్టసభ్యుడు రాండి ఫైన్ బిల్లును ప్రవేశపెట్టారు. గ్రీన్లాండ్ అనక్సీయేషన్ అండ్ స్టేట్హుడ్ యాక్ట్ పేరుతో ప్రవేశపెట్టిన ఈ బిల్లులో గ్రీన్లాండ్ను అమెరికాలో కలపడం, ప్రత్యేక రాష్ట్రంగా పరిగణించడం వంటి అంశాలు పొందుపరచబడ్డాయి.ఈ మేరకు రాండి ఫైన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘బిగ్ న్యూస్. చట్టసభలో గ్రీన్లాండ్ అనక్సీయేషన్ అండ్ స్టేట్హుడ్ యాక్ట్ పేరుతో బిల్లును ప్రవేశపెట్టాను. ఈ బిల్లుకు అధ్యక్షుడు ట్రంప్ ఆమోదం తెలపాలి. గ్రీన్లాండ్ను అమెరికాలో కలపాలి’ అని పేర్కొన్నారు. గ్రీన్లాండ్ను అమెరికాలో కలుపుకోవడం ద్వారా జాతీయ భద్రత బలోపేతం అవుతుంది. అదే సమయంలో గ్రీన్లాండ్ను అమెరికా రాష్ట్రంగా మార్చడం ద్వారా ఆర్కిటిక్ ప్రాంతంలో చైనా, రష్యా ప్రభావాన్ని తగ్గించవచ్చు. కాబట్టి గ్రీన్లాండ్ అమెరికా భద్రతకు అత్యంత అవసరమని ఆయన అన్నారు.ప్రస్తుతం గ్రీన్లాండ్ డెన్మార్క్ రాజ్యానికి చెందిన స్వయం పాలిత ప్రాంతం. దీనికి స్వంత పార్లమెంట్ ఉన్నప్పటికీ, విదేశాంగం, రక్షణ వ్యవహారాలు డెన్మార్క్ ఆధీనంలోనే ఉంటాయి. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ట్రంప్ డెన్మార్క్తో చర్చలు జరిపి గ్రీన్లాండ్ను కొనుగోలు చేయడం లేదా అమెరికాలో కలుపుకోవడం కోసం అధికారం పొందుతారు. గ్రీన్లాండ్ భౌగోళికంగా చాలా ముఖ్యమైనది. ఇది ఆర్కిటిక్ సముద్ర మార్గాలను నియంత్రించగలదు, అలాగే సైనిక రవాణా, వాణిజ్యం, ఇంధన మార్గాలు అన్నీ ఇక్కడి ద్వారా ప్రభావితం అవుతాయి.2019లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ను కొనుగోలు చేయాలనే ఆలోచన వ్యక్తం చేశారు. ఆ సమయంలో డెన్మార్క్ ప్రభుత్వం దీన్ని ఖండించింది. ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఈ బిల్లు ప్రతిపాదన దశలోనే ఉంది. ఇది ఆమోదం పొందితేనే గ్రీన్లాండ్ను అమెరికా 51వ రాష్ట్రంగా మార్చే ప్రక్రియ మొదలవుతుంది. Huge News! Today, I am proud to introduce the Greenland Annexation and Statehood Act, a bill that allows the President to find the means necessary to bring Greenland into the Union. Let me be clear, our adversaries are trying to establish a foothold in the Arctic, and we can’t… pic.twitter.com/h28sXU7LAU— Congressman Randy Fine (@RepFine) January 12, 2026 -
ఒంటరి జీవుల వింత యాప్.. అత్యధిక డౌన్లోడ్లతో..
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఒంటరిగా ఉండాలనుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా చైనాలో ఒంటరితనం అనేది ఒక సామాజిక అంశంగా మారిపోయింది. ఈ క్రమంలో ఒంటరిగా ఉండేవారి భద్రతను దృష్టిలో ఉంచుకుని, రూపొందించిన ‘ఆర్ యూ డెడ్?’ (Are You Dead?) అనే మొబైల్ యాప్ ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తోంది.ఈ యాప్ గత మే నెలలో ప్రారంభమైనప్పటి నుండి అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న పెయిడ్ యాప్గా నిలిచింది. ఎవరైనా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు.. వారికి ఏదైనా ప్రమాదం జరిగినా లేదా అనారోగ్యానికి గురైనా ఆ సమయంలో తలెత్తే భయాన్ని ఈ యాప్ పోగొడుతోంది. ఈ యాప్లో క్లిష్టమైన ఫీచర్లు లేదా నిరంతర ట్రాకింగ్ అనేది ఉండదు. యాప్ యూజర్లు ప్రతి రెండు రోజులకు ఒకసారి యాప్ను ఓపెన్ చేసి, తాము క్షేమంగా ఉన్నామని నిర్ధారించడానికి స్క్రీన్పై కనిపించే బటన్ను నొక్కాలి.ఒకవేళ వినియోగదారుడు నిర్ణీత సమయంలోగా స్పందించకపోతే, యాప్ వెంటనే అత్యవసర కాంటాక్ట్ నంబర్కు సందేశాన్ని పంపుతుంది. తద్వారా సదరు వ్యక్తికి ఏదో ప్రమాదం జరిగి ఉండవచ్చని వారి సన్నిహితులు గ్రహించి, వెంటనే స్పందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రారంభంలో ఉచితంగా లభించిన ఈ యాప్, ప్రస్తుతం 8 యువాన్ల (సుమారు రూ. 95) ధరతో అందుబాటులో ఉంది. చైనాలో 2030 నాటికి ఒంటరిగా నివసించే వారి సంఖ్య 20 కోట్లకు చేరుకోవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.వృద్ధాప్యం, ఉపాధి కోసం ఇతర నగరాలకు వలస వెళ్లడం మారుతున్న సామాజిక పరిస్థితుల కారణంగా ఈ యాప్ ఆదరణం పొందుతోంది. ఈ యాప్ పేరు ‘ఆర్ యూ డెడ్?’ (మీరు చనిపోయారా?) అని ఉండటంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పేరు ప్రతికూలంగా ఉందని కొందరు వినియోగదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనికి బదులుగా ‘ఆర్ యూ అలైవ్?’ లేదా మరేదైనా పేరు పెట్టాలని సూచిస్తున్నారు. దీనిపై స్పందించిన నిర్వాహకులు యాప్ పేరును మార్చడంపై ఆలోచిస్తున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: ‘బంగ్లా’లో హిందూ ఓటర్ల భయం.. ఈసీకి ప్రత్యేక వినతి -
‘బంగ్లా’లో హిందూ ఓటర్ల భయం.. ఈసీకి ప్రత్యేక వినతి
ఢాకా: బంగ్లాదేశ్లో హిందువుల రక్షణపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. 2026, ఫిబ్రవరి 12న జరగనున్న పార్లమెంటరీ ఎన్నికల నేపథ్యంలో, తమకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆ దేశంలోని మైనారిటీ సంఘాలు ఎన్నికల సంఘాన్ని (ఈసీ)కోరాయి. తాజాగా ఫెనీ జిల్లాలో సమీర్ దాస్(28) అనే హిందూ యువకుడిని దుండగులు దారుణంగా కొట్టి, కత్తితో పొడిచి హత్య చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో ఢాకేశ్వరి హిందూ సభ, హిందూ క్రైస్తవ బౌద్ధ ఐక్య వేదిక ప్రతినిధులు ఎన్నికల అధికారులను కలిసి, హిందూ ఓటర్లకు తగిన భద్రత కల్పిస్తూ, ఎన్నికల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడులు నిరంతరం కొనసాగుతున్నాయని, దీంతో ఓటు వేయాలంటే భయం కలుగుతోందని మైనారిటీ సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల సంఘంతో జరిగిన భేటీలో, హిందువులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అదనపు భద్రతను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. భయం నీడలో ఓటు వేయడం సాధ్యం కాదని, హింసను నివారించడానికి, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రత్యేక పోలింగ్ బూత్లు కేటాయించాలని వారు కోరారు. గత డిసెంబర్ నెలలోనే మైనారిటీలపై జరిగిన దాడులకు సంబంధించి దాదాపు 51 కేసులు నమోదైనట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు.గత కొద్ది రోజులుగా బంగ్లాదేశ్లో హిందువులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులు మరింతగా పెరిగాయి. ఫెనీ జిల్లాలో సమీర్ దాస్ హత్యకు గురికాగా, అంతకుముందు జెస్సోర్ జిల్లాలో రాణా ప్రతాప్ బైరాగి అనే వ్యాపారిని కాల్చి చంపారు. నర్సింగ్దీ జిల్లాలో శరత్ మణి చక్రవర్తి అనే కిరాణా షాపు యజమాని కూడా దుండగుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ తరహా దాడులు మైనారిటీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని మైనారిటీ సంఘాలు పేర్కొన్నాయి.బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై భారత ప్రభుత్వం, వివిధ రాజకీయ పార్టీలు స్పందించాయి. సమీర్ దాస్ హత్యను ఖండించిన బీజేపీ నేత అమిత్ మాలవీయ.. యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం మైనారిటీలను రక్షించడంలో విఫలమైందని విమర్శించారు. ఈ దాడులను కల్పితం అని ప్రభుత్వం కొట్టిపారేయడం విచారకరమని సీనియర్ పాత్రికేయుడు కాంచన్ గుప్తా పేర్కొన్నారు. మానవ హక్కుల సంఘాలు ఈ హింసపై మౌనం వహించడాన్ని ఆయన తప్పుబట్టారు.ఇది కూడా చదవండి: అయోధ్య నుండి పూరి.. ఐఆర్సీటీసీ గోల్డెన్ ఆఫర్ -
కంత్రి ట్రంప్.. అసలు ఉద్దేశం బయటపడిందిగా!
ట్రంప్ ఉద్దేశం నిజంగా ఇరాన్ను ఆర్థికంగా దెబ్బ తీయడమేనా?. అందుకే ఆ దేశంతో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం సుంకాలు విధించారా?.. ఇక మీదట ఏ దేశం కూడా ఇరాన్ వైపు చూడకూడదనేదే ఆయన ఆలోచనా?. కానీ కాస్త లోతుల్లోకి వెళ్తే కాదేమో అనిపిస్తోంది. ఒక దెబ్బకు రెండు పిట్టలు చందాన కనిపిస్తోంది ఆయన వ్యవహారం.‘‘మోదీ-ట్రంప్ది నిజమైన స్నేహం. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. భారత్-అమెరికా రెండు దేశాల సత్సంబంధాలకు వాణిజ్యం అనేది చాలా కీలకం. వీలైనంత త్వరగా వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు రెండు దేశాల ప్రతినిధులు నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఇక సుంకాలనేవి పెద్ద విషయమే కాదు. మాకు భారత్ తర్వాతే ఎవరైనా’.. ఇది భారత్కు అమెరికా రాయబారిగా బాధ్యతలు చేపట్టిన సెర్గియో గోర్ చెప్పిన మాటలు. కానీ క్షేత్రస్థాయిలో.. ఉక్రెయిన్ సంక్షోభం, ఇరాన్ సంక్షోభం.. ఏదైనా సరే అటు తిరిగి ఇటు తిరిగి ట్రంప్ నిర్ణయాలు భారత్ పైకే వస్తున్నాయి. ఉక్రెయిన్ యద్ధంలో రష్యాకు పరోక్షంగా భారత్ సహకరిస్తోందంటూ ట్రంప్ తొలి నుంచి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో రష్యాను ఇరుకున పెడుతున్నామని చెబుతూ.. భారత్పై సుంకాల మోత మోగించారాయన. అలాగే ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అదే చేశారు. ఇరాన్తో వాణిజ్యం జరిపే టాప్ 5 దేశాల్లో భారత్ కూడా ఉంది. అంటే.. ట్రంప్ తీసుకున్న 25 శాతం సుంకాల పెంపు నిర్ణయం భారత్కు వర్తించనుంది. దీంతో ట్రంప్ అసలు టార్గెట్(రష్యా, ఇరాన్..)తో పాటు భారత్ను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. స్నేహ హస్తం చాస్తూనే..రెండో దఫా అధికారంలోకి వచ్చాక భారత్తో ట్రంప్ అనుసరిస్తున్న తీరుపై మొదటి నుంచే అనుమానాలు నెలకొన్నాయి. భారత్ అమెరికాకు బాగా కావాల్సిన దేశమని.. మోదీ తనకు మంచి మిత్రుడు అంటూనే చేయాల్సింది చేసుకుంటూ పోతున్నారాయన. అవకాశం ఉన్నా.. ఇద్దరూ ఒకే వేదిక మీద కనిపించడం లేదు. కీలక సదస్సులకు కూడా ఎవరో ఒకరు డుమ్మా కొడుతూ వస్తున్నారు. దీంతో వీళ్ల స్నేహ బంధానికి బీటల వారిందా? అనే చర్చా నడిచింది. అయితే.. ‘‘నన్ను సంతోషపెట్టాలని వాళ్లు (భారత్) అనుకుంటున్నారు. ప్రధాని మోదీ మంచి చాలామంచి వ్యక్తి. నేను సంతోషంగా లేనన్న విషయం ఆయనకు తెలుసు. నన్ను సంతోషపెట్టడం చాలా ముఖ్యం. వారు రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే.. మేం సుంకాలను పెంచుతాం. అది వారికి ఏమాత్రం బాగోదు. మా ఆంక్షలు రష్యాను తీవ్రంగా బాధిస్తున్నాయి..’’ అంటూ ఓ వారం కిందట కూడా ట్రంప్ మాట్లాడారు.ఇంకా అయిపోలేదు.. అమెరికాతో వాణిజ్యం విషయంలో భారత్ కరెక్ట్గా లేదంటూ ప్రతీకార సుంకంగా 25 శాతం.. అటుపై వద్దని చెబుతున్నా రష్యాతో చమురు వాణిజ్యం జరుపుతున్నారంటూ పెనాల్టీ పేరు చెప్పి మరో 25 శాతం సుంకాలు విధించారు ట్రంప్. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా సుంకాలను ఆయన తన మిత్రదేశం పైనే విధించినట్లైంది. అందునా.. ఎలాంటి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోకుండానే(నాన్చుతూ వస్తున్నారు) ఈ నిర్ణయం అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ ఉద్రిక్తతలతో దానిని 75 శాతానికి పెంచారు. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. రష్యాతో చమురు వాణిజ్యం జరిపే దేశాలపై 500 శాతం టారిఫ్లు విధించే బిల్లుపై ఆయన ఇప్పటికే సంతకాలు చేశారు. ఆ బిల్లును రేపోమాపో అమెరికా చట్ట సభలో ముందుకు కదిలించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ జాబితాలో భారత్తో పాటు చైనా, బ్రెజిల్ కూడా ఉన్నాయి. ఇప్పటికే ట్రంప్ దెబ్బకు అమెరికాతో భారత్ సంబంధాలు బలహీన పడ్డాయి. ఆయన తీరు ఇలాగే కొనసాగితే.. రాబోయే రోజుల్లో మరింత అధ్వాన్నం కావొచ్చనే అమెరికా మాజీ విదేశాంగ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.ఇరాన్-భారత్.. ఎలాంటి ఎఫెక్ట్రష్యా చమురు విషయంలో భారత ప్రభుత్వం వైఖరి మొండిగానే కనిపిస్తోంది. ఎవరి ఒత్తిళ్లకు భారత్ తలొగ్గదని.. జాతి ప్రయోజనాలకు తగ్గట్లు తమ నిర్ణయాలు ఉంటాయని మొదటి నుంచి చెబుతోంది. అదే సమయంలో రష్యా నుంచి చమురు ఉత్పత్తులను పూర్తిగా నిలిపివేయకుండా.. దిగుమతిని తగ్గించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరి ఇరాన్ విషయంలో ఎలాంటి వైఖరి అవలంభించబోతుంది.. ఇరాన్ నుంచి భారత్ మెథనాల్, పెట్రోలియం బిటుమెన్, లిక్విఫైడ్ ప్రొపేన్, ఆపిల్స్, ఖర్జూరాలు, కెమికల్స్ దిగుమతి చేసుకుంటోంది. భారత్ నుంచి ఇరాన్కు.. ఆర్గానిక్ కెమికల్స్, బాస్మతి బియ్యం, టీ, చక్కెర, ఔషధాలు, పండ్లు, పప్పులు, మాంస ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఇరాన్-భారత్ మధ్య 2024-2025 వాణిజ్యం విలువ.. అక్షరాల రూ.14,000 కోట్లు. అందులో భారత్ నుంచి ఎగుమతుల విలువ రూ.10,000 కోట్లు కాగా, దిగుమతులు రూ.3,700 కోట్ల పైమాటే. అయితే.. ట్రంప్ 2018లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆంక్షల కారణంగా భారత్ ఇరాన్ మధ్య వాణిజ్యం భారీగా క్షీణించింది. ఎంతగా అంటే.. 2019లో ఆ వాణిజ్యం విలువ రూ.1.5 లక్ష కోట్లుగా ఉండేది. మరి తాజా ఆంక్షలతో ఏం జరుగుతోందో చూడాలి.. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అమెరికా కొత్త టారిఫ్లు కఠినంగా అమలు చేస్తే.. భారత కంపెనీలు అమెరికా మార్కెట్ యాక్సెస్ కాపాడుకోవడానికి ఇరాన్తో వ్యాపారాన్ని తగ్గించవలసి రావొచ్చు. అదే జరిగితే.. ఇరాన్కు ఎగుమతి చేసే భారత వ్యాపారులు తీవ్రంగా ప్రభావితమవుతారు.చాబహార్పై డైలమా?భారత్–ఇరాన్ సంబంధాల్లో చాబహార్ పోర్ట్ పాత్ర అత్యంత వ్యూహాత్మకం. పైగా భారత్ అక్కడ షహీద్ బెహేష్తీ టెర్మినల్ అభివృద్ధి చేస్తోంది. అయితే.. 2018 ఆంక్షల సమయంలో భారత్ విజ్ఞప్తి మేరకు ట్రంప్ సానుకూలంగా స్పందించి మినహాయింపు ఇచ్చారు. తిరిగి.. 2025 సెప్టెంబర్లో పరిస్థితుల ప్రభావమని చెబుతూ ఆ మినహాయింపును రద్దు చేశారు. దీంతో ఆ మినహాయింపు ఏప్రిల్ 29తో ముగియనుంది. దీంతో మినహాయింపు గడువు ముగిసిన తర్వాత పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి.ఏమై ఉండొచ్చు.. తనను తాను శాంతి కాముకుడిగా చెప్పుకుని తిరుగుతున్న ట్రంప్.. పెద్దన్న హోదాలో వరుసగా యుద్ధాలను ఆపుతున్నానంటూ హడావిడి చేస్తున్నారు. ఈ వంకతో నోబెల్ శాంతి బహుమతి అందుకోవాలని పక్కా ప్లాన్డ్తో ముందుకు సాగారు. కానీ, ఆ ఆశలు అడియాసలు అయ్యాయి. ట్రంప్ను నోబెల్ వరించలేదు. దానికి భారత్ మోకాలు అడ్డుపెట్టిందని ఆయన బలంగా భావించి ఉండొచ్చు. పాక్తో ఉద్రిక్తతలు చల్లారడంలో ట్రంప్ ప్రేమయం(మూడో వ్యక్తి) లేదని ఢిల్లీ వర్గాలు తేల్చేశాయి. ఈ ప్రకటన ఆయనకు స్వతహాగా కోపం.. అసహనం తెప్పించి ఉండొచ్చు. పోనీ ఉక్రెయిన్ యుద్ధంతోనైనా నోబెల కల నెరవేరిందా? అంటే అదీ లేదు. వాణిజ్యం ఆపేయకుండా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు భారత్ పరోక్షంగా సహకరించిందనే కోపమూ ఉండొచ్చు. వీటన్నింటితో పాటు షాంగై సదస్సు వేదికగా.. పుతిన్-జింగ్పిన్-మోదీల స్నేహంగా మెదలడమూ ట్రంప్కు నచ్చకపోయి ఉండొచ్చు. కారణాలేవైనా.. భారత్ విషయంలో ఆయన అనుకున్నది చేస్తూ పోతున్నారు. -
లక్షకు పైగా యూఎస్ వీసాల రద్దు..
అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భద్రతా కారణాలు, చట్టపరమైన నిబంధనలు ఉల్లంఘనల నేపథ్యంలో యూఎస్ విదేశాంగ శాఖ ఏడాది కాలంలో ఏకంగా 1,00,000 కంటే ఎక్కువ వీసాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. రద్దు చేసిన వాటిలో దాదాపు 8,000 విద్యార్థి వీసాలు, 2,500 ప్రత్యేక వర్క్ పర్మిట్లు ఉండటం గమనార్హం. క్రిమినల్ రికార్డులు లేదా చట్టపరమైన నిబంధనలు అతిక్రమించిన విదేశీ పౌరులపై చేపట్టిన చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.సురక్షిత అమెరికా లక్ష్యంగా..ఇటీవల తన అధికారిక ఎక్స్(గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా యూఎస్ విదేశాంగ శాఖ ఈ వివరాలను వెల్లడించింది. అమెరికాను సురక్షితంగా ఉంచడానికి వీసారద్దును, కఠినమైన నిబంధనలను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ట్రంప్ పరిపాలనలో వీసా అమలును కఠినతరం చేయడం, యూఎస్లోకి ప్రవేశించిన తర్వాత కూడా వీసా హోల్డర్ల ప్రవర్తనను పర్యవేక్షించే స్క్రీనింగ్ విధానాల విస్తరణ వల్లే ఈ స్థాయిలో రద్దులు జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.భారతీయులపై ప్రభావంఅమెరికా వీసా హోల్డర్లలో అధిక సంఖ్యలో ఉన్న భారతీయులపై ఈ నిర్ణయం నేరుగా ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పరంగా చైనాను అధిగమించిన భారత్, ఇప్పుడు కఠినమైన యూఎస్ స్క్రీనింగ్ విధానాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 2025లో భారతీయ విద్యార్థులకు వీసా జారీ ప్రక్రియ నెమ్మదించింది. హెచ్-1బీ వీసాలపై ఉన్న భారతీయ ఐటీ నిపుణులు కూడా అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. కొత్త H-1B వీసాలపై ప్రతిపాదిత 1,00,000 డాలర్ల ఫీజు విధించే నిబంధన కంపెనీలకు భారంగా మారింది. ప్రస్తుతం ఈ అంశం యూఎస్ కోర్టుల్లో చట్టపరమైన సవాలును ఎదుర్కొంటోంది. ఒకవైపు భారత్లోని రాయబార కార్యాలయం వరుసగా రెండో ఏడాది 10 లక్షల కంటే ఎక్కువ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలను జారీ చేసినప్పటికీ, ఈ వీసాల రద్దు ఆందోళన కలిగిస్తోంది.🚨BREAKING: The State Department has now revoked over 100,000 visas, including some 8,000 student visas and 2,500 specialized visas for individuals who had encounters with U.S. law enforcement for criminal activity.We will continue to deport these thugs to keep America safe. pic.twitter.com/wuHVltw1bV— Department of State (@StateDept) January 12, 2026రంగంలోకి భారత ప్రభుత్వంపెరుగుతున్న వీసా రద్దులు, కఠిన నిబంధనలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్థులు, కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తాము నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపింది. ‘ప్రభావిత భారతీయ పౌరులతో సంప్రదింపులు జరుపుతున్నాం. వీసా ఆందోళనలను అధికారికంగా యూఎస్ దృష్టికి తీసుకెళ్లాం’ అని ప్రభుత్వం ప్రకటించింది.ఇదీ చదవండి: పండగ ముందు పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే.. -
పక్కా ప్లాన్తో సమీర్ దాస్ను అటకాయించి..
బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. స్థానికుల దాడిలో తాజాగా సమీర్ దాస్ అనే మరో హిందువు మృతిచెందారు. మీడియా కథనాల ప్రకారం.. చిట్టాగాంగ్లోని దాగన్భూయాన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడిని ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందినట్లు తెలుస్తోంది.సమీర్ దాస్(28) స్థానికంగా ఆటోడ్రైవర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం రాత్రి అతన్నిఅడ్డగించిన గుంపు ఒక్కసారిగా విరుచుకుపడింది. అతనిపై దాడి చేసి కత్తులతో పొడిచి చంపారు. ఆపై సమీర్ ఆటోలోనే అక్కడి నుంచి పారిపోయారు. ఘటన జరిగిన తీరుతో ఇది ప్రీప్లాన్డ్గా తెలుస్తోందని స్థానిక అధికారి ఒకరు తెలిపారు. మత కోణం ఉందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేమని అన్నారాయన. నిందితులను గాలించేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. అయితే.. అతని కుటుంబ సభ్యులు మాత్రం స్థానికులు కొందరు మతం పేరుతో తమను దూషిస్తున్నారని.. గత కొంతకాలంగా తన కొడుకును కొందరు వెంబడిస్తున్నారని అంటున్నారు. 2024లో తలెత్తిన రాజకీయ సంక్షోభం తర్వాతి నుంచి బంగ్లాదేశ్లో మైనారిటీ వర్గాలపై దాడులు పెరిగిపోయాయి. తాజాగా సమీర్ దాస్పై జరిగిన దాడితో కలిపి.. గత 42 రోజుల్లో 13 ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో ఐదు హత్యలు కొత్త ఏడాది 13 రోజుల్లోనే జరిగాయి. మైనారిటీల దాడుల ఘటనలను.. బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ ఖండిస్తోంది. పిబ్రవరిలో ఆ దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ సమయంలో మత ఘర్షణలు చోటుచేసుకోవడంపై కౌన్సిల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు.. మైనారిటీలు.. అందునా హిందువులపై దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. ‘‘బంగ్లాదేశ్లో మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని దాడులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ దాడులు వ్యక్తుల మీద, అలాగే వాళ్ల నివాసాలు, వ్యాపారాలపై కూడా జరుగుతున్నాయి. తక్షణమే వీటిని నిలువరించి.. మైనారిటీలకు భద్రత కల్పించాల్సిన అవసరం అక్కడి ప్రభుత్వంపై ఉంది’’ అని భారత విదేశాంగ శాఖ గత శుక్రవారం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే భారత్ ఈ దాడులను భూతద్దంలో పెట్టి చూస్తోందంటూ యూనస్ ప్రభుత్వం అంటోంది. -
వృద్దాప్యంలో యవ్వనం.. జపాన్ బామ్మల సరికొత్త రికార్డు
ప్రపంచంలోనే అత్యధికంగా దీర్ఘాయువు కలిగిన వారు ఉన్న దేశంగా జపాన్ మరోసారి వార్తల్లో నిలిచింది. 2025 సెప్టెంబర్ నాటి గణాంకాల ప్రకారం జపాన్లో 100 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి సంఖ్య రికార్డు స్థాయిలో లక్షకు (99,763 మంది) చేరుకుంది. ఈ వృద్ధుల జనాభాలో ఏకంగా 88 శాతం మంది మహిళలే కావడం గమనార్హం. జపాన్ ప్రజల దీర్ఘాయువు రహస్యం.. వారి సంప్రదాయ ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమనే కాకుండా, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.ఆహారం కంటే అలవాట్లే కీలకంఢిల్లీలోని సిటీ ఇమేజింగ్ అండ్ క్లినికల్ ల్యాబ్స్ వ్యవస్థాపకులు డాక్టర్ ఆకార్ కపూర్ అభిప్రాయం ప్రకారం, జపాన్ ప్రజల దీర్ఘాయువుకు కేవలం వారు తీసుకునే ఆహారం మాత్రమే కారణం కాదు. క్రమశిక్షణ, నిరంతరం యాక్టివ్ ఉండటం, సామాజిక అనుబంధాలతో కూడిన జీవన విధానం మొదలైనవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా ‘మితంగా తినడం’ అంటే పొట్ట నిండక ముందే భోజనాన్ని ముగించడం (హరా హచి బు) వంటి పద్ధతులు శారీరక మెటబాలిక్ ఒత్తిడిని తగ్గిస్తాయి. ప్రాసెస్ చేసిన ఆహారానికి, చక్కెర పదార్థాలకు దూరంగా ఉండటం వారిని ఆరోగ్యంగా ఉంచుతోంది.మహిళల దీర్ఘాయువు వెనుక..జపాన్ శతవృద్ధులలో 88 శాతం మహిళలే ఉండటానికి జీవశాస్త్రపరమైన, ప్రవర్తనాపరమైన పలు కారణాలు ఉన్నాయి. మహిళల్లో ఉండే 'ఈస్ట్రోజెన్' హార్మోన్ గుండె సంబంధిత సమస్యల నుండి రక్షణ కల్పిస్తుందని, కణాల వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేస్తుందని డాక్టర్ కపూర్ వివరించారు. దీనితో పాటు మహిళలు తమ ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, సామాజిక సంబంధాలను మెరుగుపరుచుకోవడం ద్వారా వారు కుంగుబాటు (Depression) వంటి సమస్యలకు దూరంగా ఉంటూ, యవ్వనవంతులుగా జీవిస్తున్నారని పరిశోధనల్లో వెల్లడయ్యింది.నివారణే శరణ్యంజపాన్ ప్రజల దీర్ఘాయువు వెనుక ఆ దేశ పటిష్టమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఉంది. ఆ దేశంలో వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే, వ్యాధి రాకుండా చూసుకోవడానికే అత్యధిక ప్రాధాన్యతనిస్తారు. ప్రభుత్వం అందించే సార్వత్రిక ఆరోగ్య కవరేజీతో సామాన్యులకు కూడా మెరుగైన వైద్యం అందుబాటులో ఉంది. రోజువారీ నడక, ఇంటి పనులు, హాబీలలో నిమగ్నం కావడం, బలమైన సామాజిక బంధాలు జపాన్ ప్రజల ఆయుష్షును పెంచుతున్నాయి.ఇది కూడా చదవండి: కేరళ అవియల్ తింటారా? లడక్ తుక్పా సిప్ చేస్తారా? -
ఇరాన్కు కొత్త టెన్షన్.. చైనా కరుణించేనా?
టెహ్రాన్: ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్న వేళ ఖమేనీకి కొత్త టెన్షన్ ప్రారంభమైంది. గత కొన్ని రోజులుగా ఇరాన్ను టార్గెట్ చేసి ఇజ్రాయెల్ ఇప్పటికే రెండు సార్లు ప్రయత్నించినట్టు తెలిసింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ఐడీఎఫ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ తమీర్ హేమాన్ ధృవీకరించారు. దీంతో, ఇజ్రాయెల్ దాడుల ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఈ సందర్భంగా తమీర్ హేమాన్ మాట్లాడుతూ.. ఇరాన్లో ఇటీవలి పరిణామాలు అమెరికా, ఇజ్రాయెల్ మధ్య సైనిక సహకారాన్ని బలోపేతం చేసింది. గడిచిన రెండు వారాల్లో రెండు సార్లు ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేసే వరకు వెళ్లింది. కానీ, ఇరాన్పై అమెరికా హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని దాడులు చేయలేదు. ఇరాన్కు సంబంధించి అమెరికాతో చర్యలు ఇప్పటికే జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు లేవు. ఇరాన్లో ఇప్పటికే ఉద్రిక్తకర పరిస్థితులు ఉన్నాయి.ఇక, ఇరాన్లో కొన్ని రోజులుగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు చేసిన పోస్టుపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. తమపై అమెరికా దాడి చేస్తే.. ఆ దేశంతో పాటు ఇజ్రాయెల్ తమ లక్ష్యాలుగా మారతాయని హెచ్చరించింది. దీంతో, ఇరాన్ను ఇజ్రాయెల్ టార్గెట్ చేసినట్టు తెలిసింది.🔥 BREAKING: Israel came this close to striking Iran, twice, in the last few weeks. Former IDF intelligence chief Tamir Hayman just confirmed what many feared: we’re on the edge of something massive.👇— Fouled Anchor 🇺🇸🍊 (@anchor_fouled) January 13, 2026మరోవైపు.. అమెరికా, ఇజ్రాయెల్ బెదిరింపుల నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఇరాన్.. చైనాను సాయం కోరినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, చైనా మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు సమాచారం. అంతకుముందు కూడా ఇరాన్కు చైనా సాయం అందించింది. గతేడాది ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంలో ఇరాన్కు చైనా రహస్యంగా ఆయుధాలు పంపించింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. మూడు మిస్టరీ కార్గో విమానాలను టెహ్రాన్కు పంపినట్లు తెలిసింది. మూడు బోయింగ్-747 విమానాలు చైనాలోని వివిధ ప్రాంతాల నుంచి టెహ్రాన్ వైపు వెళ్లినట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ మూడు విమానాలూ కజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, తుర్క్మెనిస్థాన్ వైపు నుంచి ఇరాన్ సమీపంలోని వెళ్లాయి. -
బాసూ.. ఈ స్పీడు ఏంటి?
పట్టుమని పాతికేళ్లు లేవు.. కోట్లాది మంది అభిమానులు అతని సొంతం!. అన్నింట్లోనూ తలదూర్చడం.. తనకు సంబంధం లేని విషయాల్లో వేలు పెట్టడం అతని స్టైల్. ఆ ప్రయత్నంలో చేసే స్టంట్లు ‘భలే గమ్మత్తు’గా అనిపిస్తాయి. నవ్వులు పూయిస్తాయి. విమర్శలతో పాటు ట్రోలింగ్కు దారి తీస్తాయి. ఒక్కోసారి అతన్ని చూస్తే ‘పాపం’ అనిపిస్తుంది. అయితే అంతిమంగా ఆ చేష్టలే అతనికి ఆల్రౌండర్ గుర్తింపు తెచ్చి పెట్టాయి. డారెన్ జాసన్ వాట్కిన్స్ జూనియర్ ఈ పేరు ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ, ఐషోస్పీడ్.. ఇంటర్నెట్ ప్రపంచంలో అందునా యువతకు సుపరిచితుడే.ఇంటర్నెట్ సెలబ్రిటీ, ప్రముఖ కంటెంట్ క్రియేటర్ అయిన ఐషోస్పీడ్(21).. అరుదైన ఫీట్ సాధించాడు. యూట్యూబ్లో అతని సబ్స్క్రైబర్ల సంఖ్య 48 మిలియన్లు దాటింది. తద్వారా ప్రపంచంలో అత్యధిక సబ్స్క్రయిబర్స్ లిస్ట్లో(వ్యక్తిగతంగా) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం స్పీడ్ “Speed Does Africa Tour”లో భాగంగా 28 రోజులపాటు ఆఫ్రికా టూర్లో ఉన్నాడు. జనవరి 11వ తేదీన కెన్యాలో అడుగుపెట్టిన అతనికి సాదర స్వాగతంతో పాటు 3.6 లక్షల కొత్త అభిమానులు వచ్చి చేరారు. అదీ ఒక్కరోజులోనే.స్పీడ్ కెన్యాలో అడుగుపెట్టిన వెంటనే లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభించాడు. విమానాశ్రయం నుంచి వీధుల వరకు అతని వెంట అభిమానులు చేరుకున్నారు. ఒకేసారి 2 లక్షల మంది లైవ్లో వీక్షించడం యూట్యూబర్ చరిత్రలోనే అతిపెద్ద రికార్డులలో ఒకటిగా నిలిచింది. అదే రోజు X (ట్విటర్) ఫ్లాట్ఫారమ్లో 1.42 లక్షల సార్లు అతని పేరు ప్రస్తావించబడింది. ఇది కూడా ఓ రికార్డే.ఈ టూర్లో ఐస్పీడ్ కెనా అధ్యక్షుడు విలియం రూటోను కలిశాడు. “జాంబో, ఐషోస్పీడ్, కెన్యాకు స్వాగతం. కెన్యా ఒక దేశం మాత్రమే కాదు, ఇది ఒక అనుభూతి” అంటూ ఆత్మీయంగా పలకరించారు. టూరిజం మంత్రి రెబెక్కా మియానో కూడా అతడ్ని కలిశారు. అటుపై ఒలింపిక్ జావెలిన్ చాంపియన్ జూలియస్ యేగోను కలిశాడు. సఫారీ ర్యాలీలో కారులో ప్రయాణిస్తూ అభిమానులను ఉత్సాహపరిచాడు. నైరోబీ ప్రసిద్ధ మటాటు కల్చర్ను ఆస్వాదించాడు. నైరోబీ నేషనల్ మార్కెట్తో పాటు కెన్యట్టా మార్కెట్, ఉహురు పార్క్ను సందర్శించాడు. చివరగా.. హెలికాప్టర్ రైడ్లో నగరాన్ని వీక్షించి.. నిర్మాణంలో ఉన్న తలంతా స్టేడియం (రైలా ఒడింగా)ను వీక్షించాడు.Soooon 🔜He will Meet Aliens in 2027 😂#ishowspeed #ishowspeedinkenyapic.twitter.com/4GdF7a16DP— Barath (@barathcharlie23) January 11, 2026ఎవడీ స్పీడు!ఐషోస్పీడ్ అసలు పేరు డారెన్ జాసన్ వాట్కిన్స్ జూనియర్ (Darren Jason Watkins Jr). అమెరికాలోని ఓహియో రాష్ట్రం సిన్సినాటి నగరానికి చెందినోడు. యూట్యూబర్గానే కాకుండా.. లైవ్స్ట్రీమర్, రాపర్. ఫుట్బాలర్, రెజ్లర్.. ఇలా అన్ని రంగాల టచ్తో పాపులారిటీ సంపాదించుకుంటున్నాడు. క్రిస్టియానో రొనాల్డోకు వీడొక వీరాభిమాని. అందుకే ఫుట్బాల్కి సంబంధించిన కంటెంట్తో ఇంకా ఎక్కువ గుర్తింపు పొందాడు. అదే సమయంలో.. లైవ్ స్ట్రీమింగ్లో ప్రవర్తన, వివాదాస్పద వ్యాఖ్యలతోనూ విమర్శలు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. తల్లి లేకుండా పెరిగిన స్పీడు.. టీనేజ్ వయసులోనే యూట్యూబర్ అవతారం ఎత్తాడు. ఆ సమయంలో విరామం లేకుండా లైవ్ స్ట్రీమింగులు చేయడం.. తక్కువ ఆదాయం, విమర్శలతో మానసికంగా కుంగిపోయాడు. అయితే నేలకు కొట్టిన బంతిలా.. మళ్లీ అంతెత్తుకు ఎదిగాడు. స్పీడ్లోని ఎనర్జీ, హాస్యభరితమైన లైవ్స్ట్రీమ్స్ వల్ల అతనికి ఫ్యాన్స్ తయారవుతుంటారు. అలా అతగాడి పాపులారిటీని తమ దేశ టూరిజాన్ని పెంచుకునేందుకు వివిధ దేశాలు ప్రయత్నిస్తుంటాయి. తాను చేసే పనులు, చాలెంజ్లలో ఎన్నో దూల వేషాలు వేస్తూ.. మీమ్స్ రూపంలో సోషల్ మీడియాలో ఆదరణ దక్కించుకున్నాడు.. ఇలా ఈ స్పీడుగాడు భారత్లోనూ అభిమానుల్ని సంపాదించుకున్నాడు. Speed asking chat is this (Gandhi Ji) Virat Kohli grandpa .?😭😂😂#ishowspeed #ishowspeedinIndia@ishowspeedsui #ViratKohli @imVkohli pic.twitter.com/z6l7zsRpjW— abbhhiiiiiiii (@abbhhiiiiiii) October 12, 2023గతంలో 2023లో ఐషోస్పీడ్ భారత్కు వచ్చాడు. ఆ టైంలో ధోనీ, కోహ్లీ జెర్సీలు వేసుకుని ముంబై వీధుల్లో సందడి చేయడంతో క్రికెట్ ఆడాడు. ఆటోలో తిరిగాడు. ప్రముఖ సింగర్ దలేర్ మెహందీని కలిసి ర్యాప్ చేశాడు. మరోసారి వచ్చే ప్రయత్నం చేశాడు కానీ కుదరలేదు. ఈ ఏడాదిలో కచ్చితంగా అతను భారత్కు వచ్చే అవకాశం ఉంది.ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిగత యూట్యూబర్ MrBeast (జిమ్మీ డొనాల్డ్సన్). ఇతనికి 459 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో టీ సిరీస్, కోకోమిలన్ చానెల్స్ ఉన్నాయి. అయితే వ్యక్తిగత జాబితాలో మాత్రం మిస్టర్బీస్ట్ తర్వాత ఐషోస్పీడ్లే యూట్యూబ్ టాప్లో ఉన్నాడు. -
ఇరాన్ సంచలన నిర్ణయం.. అతడికి ఉరిశిక్ష
టెహ్రాన్: ఇరాన్లో ఆర్థిక సంక్షోభం కారణంగా ఆందోళన తీవ్ర రూపం దాల్చాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనల్లో ఇప్పటికే దాదాపు 600 మంది మృతి చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్.. సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఖమేనీకి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలకు సంబంధించి మొదటి ఉరిశిక్షను అమలు చేయడానికి ఇరాన్ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో 26 ఏళ్ల ఇర్ఫాన్ సోల్తానీకి త్వరలో మరణశిక్ష అమలు కానుంది. దీంతో, ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, వివరాల మేరకు.. టెహ్రాన్ శివారులోని కరాజ్ సమీపంలోని ఫర్దిస్కు చెందిన సోల్తానీ జనవరి ప్రారంభం నుండి ఇరాన్ అంతటా వ్యాపించిన అయతొల్లా అలీ ఖమేనీకి వ్యతిరేక నిరసనలలో పాల్గొన్నారు. ఈ క్రమంలో జనవరి 8వ తేదీన సోల్తానీ అరెస్టు అయ్యాడు. అయితే, ఇరాన్లో నిరసనల నేపథ్యంలో అక్కడి అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిరసనకారులను హెచ్చరించే క్రమంలో సోల్తానీకి మరణ శిక్షను విధించారు. ఒక మానవ హక్కుల సంస్థ, మీడియా నివేదికల ప్రకారం.. సోల్తానీకి విధించిన శిక్ష బుధవారం అమలు కానుంది. కాగా, గతంలో ఇరాన్ అసమ్మతిని అణచివేయడానికి మరణశిక్షను ఒక సాధనంగా ఉపయోగించినప్పటికీ, ఆ మరణ శిక్షలు ఎక్కువగా కాల్చివేతల ద్వారానే అమలు చేయబడ్డాయి. కానీ, ప్రస్తుత నిరసనలలో మాత్రం మొదటిసారిగా సోల్తానీని ఉరితీయనున్నట్టు సమాచారం. నిరసనల కారణంగా ఇరాన్లో ఇప్పటి వరకు దాదాపు పదివేల మందిని అరెస్ట్ చేసినట్టు తెలిసింది. Erfan Soltani is scheduled to be executed by hanging in Iran in 48 hours.He was arrested in Karaj on January 9 for taking part in the protests. His family was given just 10 minutes to say goodbye. No lawyer. No fair trial. Days later, the Islamic regime sentenced him to death.… pic.twitter.com/jxRwCJznpj— Sarah Raviani (@sarahraviani) January 12, 2026కుబుంబ సభ్యుల ఆందోళన.. మరోవైపు.. ఇజ్రాయెల్, అమెరికాకు చెందిన వార్తా సంస్థ జెఫీడ్ నివేదించిన ప్రకారం సోల్తానీ కేసు తదుపరి విచారణలను నిరోధించే లక్ష్యంతో వేగంగా మరణ శిక్షను అమలు చేయాలని అక్కడి అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. ఇక, నార్వేలోని కుర్దిష్ పౌర హక్కుల సంస్థ ఈ మరణ శిక్ష అమలుపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా.. సోల్తానీ అరెస్ట్ అయిన నాటి నుంచి అతడిని న్యాయవాది సంప్రదించడం, తన వాదనలను వినిపించే అవకాశం కూడా దక్కలేదు. అరెస్టు చేసిన అధికారి గుర్తింపుతో సహా కేసులోని కీలక అంశాల గురించి అతని కుటుంబానికి కూడా సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. కానీ, షెడ్యూల్ ప్రకారం అతడికి మరణ శిక్ష అమలు చేస్తామని అధికారులు తమకు తెలియజేశారని సుల్తానీ కుటుంబ సభ్యులు చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు.అనుకూల ప్రదర్శనలు.. తాజాగా ఇరాన్లో దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రభుత్వ అనుకూల ప్రదర్శనలు మొదలయ్యాయి. తమ బలాన్ని ప్రదర్శించేందుకు ఇరాన్ ప్రభుత్వం సోమవారం లక్షల మంది ప్రభుత్వ మద్దతుదారులను వీధుల్లోకి సమీకరించింది. టెహ్రాన్లోని ఎంఘెలాబ్ స్క్వేర్ వద్ద వేల మంది ప్రదర్శనకారులు గుమిగూడారు. దేశాధ్యక్షుడు పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తదితరులూ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ‘అమెరికన్- ఇజ్రాయెల్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇరాన్ తిరుగుబాటు’గా ఈ ప్రదర్శనలను ఇరాన్ (Iran) అధికారిక మీడియా ప్రసారం చేసింది. కాగా, తమ దేశంలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయని అబ్బాస్ అరాఘ్చి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. -
మరో టారిఫ్ బాంబ్ పేల్చిన ట్రంప్
ఇరాన్ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఆ దేశంతో వ్యాపారాలు చేసే దేశాలన్నింటిపైనా 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని.. ఇదే తుది నిర్ణయమని, ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని ప్రకటించారు.ట్రేడింగ్ ఎకనమిక్ డాటా బేస్ ప్రకారం.. చైనా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాక్లు ఇరాన్ ప్రధాన వాణిజ్య భాగస్వాములుగా ఉన్నాయి. పొరుగున ఉండడంతో పాటు చమురు నేపథ్యంలో ఇవి భారీగా వాణిజ్యం చేస్తున్నాయి. అలాగే.. భారత్, రష్యా, ఈయూలు కూడా ఈ లిస్ట్లో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకే సుంకాల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.ఇక భారత్ కూడా ఇరాన్కు ముఖ్యమైన వాణిజ్య భాగస్వామే. 2025లో ఇరాన్ ఎగుమతుల్లో సుమారు 7% (5.1 బిలియన్ డాలర్లు) భారతదేశానికి వచ్చాయి. దీంతో భారత్ కూడా మూల్యం చెల్లించుకోవాలసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే భారత్పై 50 శాతం సుంకాలు అమలవుతున్న సంగతి తెలిసిందే.ఇరాన్పై ఇప్పటికే.. అణ్వాయుధాల నేపథ్యంతో ఇరాన్ విషయంలో అమెరికా కఠినంగా వ్యవహరిస్తోంది. ఇరాన్ క్రూడ్ ఆయిల్ ఎగుమతులను పరిమితం చేయడం, ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ సహా ఇతర ప్రధాన బ్యాంకులపై ఆంక్షలు విధించడం.. తద్వారా అంతర్జాతీయ లావాదేవీలకు అవాంతరాలను కల్పించడం.. అలాగే.. ఇరాన్ షిప్పింగ్ కంపెనీలు, పోర్టులు, ఆయిల్ ట్యాంకర్లపై ఆంక్షలను అమలు చేస్తోంది. అలాగే.. ఇరాన్ మిలిటరీ, డ్రోన్, మిసైల్ ప్రోగ్రామ్లకు సంబంధించిన సంస్థలపై నిషేధాలు విధించింది. ఇరాన్ ప్రభుత్వ అధికారులు, రెవల్యూషనరీ గార్డ్ (IRGC) సభ్యులు, ఆ దేశం తరఫున మానవ హక్కుల ఉల్లంఘనలకు బాధ్యులైన వ్యక్తులకు సంబంధించి అమెరికాలో ఉన్న ఆస్తులను ఫ్రీజ్ చేయడం, వాళ్లు అగ్రరాజ్యానికి రాకుండా నిషేధం విధించడం లాంటి నిర్ణయాలు అమలు చేస్తోంది. ఇప్పుడు ఆర్థికంగా మరింత దెబ్బ తీయడానికే.. వాణిజ్య దేశాలపై సుంకాలను విధించినట్లు స్పష్టమవుతోంది.చల్లారని జ్వాలలుఆర్థిక సంక్షోభం, ఇతరత్రా పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్లో సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతమైన సంగతి తెలిసిందే. అయితే వాటిని అణచివేసేందుకు కూడా అక్కడి ప్రభుత్వం అంతే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో.. వందల మంది మరణించగా(646 మంది అని తాజా సమాచారం).. వేల మందిని అక్రమంగా అరెస్టులు చేశారు. ఉరి తీతలకు కూడా సిద్ధమైంది. అయితే ఈ అణచివేతను చూస్తూ ఊరుకోబోమని ట్రంప్ అంటున్నారు.చర్చలంటూనే..ఇరాన్పై సైనిక చర్య చేపట్టేందుకు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నామంటూ అమెరికా అధ్యక్షుడు హెచ్చరిస్తూ వస్తున్నారు. అయితే పబ్లిక్గా ట్రంప్ కఠినంగా మాట్లాడుతున్నప్పటికీ.. వ్యక్తిగతంగా ఇరాన్ను వేరే రీతిలో డీల్ చేస్తన్నారని వైట్హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ చెబుతున్నారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్పై ఎయిర్ స్ట్రైక్స్ జరిపే అంశం కూడా అమెరికా పరిశీలనలో ఉంది. కానీ, అదే సమయంలో ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ ద్వారా దౌత్య ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అని అన్నారామె. ఈ తరుణంలో ట్రంప్ ఒక్కసారిగా టారిఫ్ బాంబ్ పేల్చడం గమనార్హం. -
షక్స్గామ్ లోయ మాదే
బీజింగ్: సరిహద్దుల్లోని షక్స్గామ్ లోయ ప్రాంతం తమదేనంటూ చైనా మళ్లీ ప్రకటించుకుంది. భారత్ అభ్యంతరం తెలపడంతో ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన చేసింది. లోయలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు అభ్యంతరాలకు తావులేకుండా నిర్మిస్తున్నవని తెలిపింది. షక్స్గామ్లోయలో చైనా ఆధ్వర్యంలో మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులపై భారత్ శుక్రవారం అభ్యంతరం తెలిపింది. భారత దేశ ప్రాదేశిక సమగ్రతకు, ప్రయోజనాలకు భంగం కలిగిన పక్షంలో తగు చర్యలు తీసుకునే హక్కు తమకుందని స్పష్టం చేసింది. పాకిస్తాన్ ఆక్రమించుకున్న జమ్మూకశీ్మర్లోని భాగమే షక్స్లోయ. సుమారు 5,180 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న ఈ లోయను పాక్ ప్రభుత్వం 1963లో చైనాకు అప్పగించి, సరిహద్దు ఒప్పందం కుదుర్చుకుంది. ‘షక్స్గామ్ లోయ భారత్లోనిదే. 1963లో చైనా–పాకిస్తాన్ కుదుర్చుకున్న సరిహద్దు ఒప్పందాన్ని మేం ఎన్నడూ గుర్తించలేదు. ఈ ఒప్పందం చట్టవిరుద్ధం, చెల్లుబాటు కాదని పలుమార్లు తెలిపాం’అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ«దీర్ జైశ్వాల్ తెలిపారు. అదేవిధంగా, బలవంతంగా ఆక్రమించుకున్న భారత భూభాగం మీదుగా వెళ్లే చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)ను కూడా భారత్ గుర్తించడం లేదని ఆయన స్పష్టం చేశారు. జమ్మూకశీ్మర్, లద్దాఖ్లలోని పూర్తి ప్రాంతం భారత్లో విడదీయరాని భాగమని చెప్పారు. ఇదే అంశాన్ని చైనా, పాక్ అధికారులు పలు మార్లు తెలిపామని జైశ్వాల్ వెల్లడించారు. జైశ్వాల్ ప్రకటనపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ సోమవారం మీడియా సమక్షంలో స్పందించారు. భారత్ పేర్కొన్న భూభాగం చైనాదేనన్నారు. చైనా తన భూభాగంలోనే మౌలిక వసతుల నిర్మాణాలను చేపట్టింది. 1960ల్లో చైనా, పాకిస్తాన్లు సరిహద్దు ఒప్పందం కుదుర్చుకున్నాయి. తమ ఉమ్మడి సరిహద్దును అంగీకరించాయి’అని తెలిపారు. సీపెక్పై మావో నింగ్ మాట్లాడుతూ..ఇది దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని, సామాజికారి్థక అభివృద్ధికి ఉద్దేశించిన ప్రాజెక్టని చెప్పారు. సీపెక్, సరిహద్దు ఒప్పందాలతో కశ్మీర్ విషయంలో తమ వైఖరి మారబోదన్నారు. ఈ వివాదాన్ని ఐరాస, మండలి తీర్మానాలకు లోబడి పరిష్కరించుకోవాలన్నదే తమ అభిమతమన్నారు. ఇలాఉండగా, కశీ్మర్ వివాదం పరిష్కారమయ్యాక అధికారికంగా ఒప్పందంపై సంతకాలు చేద్దామంటూ 1963నాటి ఒప్పందంలో చైనా–పాక్లు పేర్కొనడం గమనార్హం. -
వ్యూహాత్మక సుస్థిరత సాధిద్దాం
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: మారుతున్న అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ అంశాలు, యుద్ధాలు, ఉద్రిక్తత పరిస్థితుల నడుమ ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, జర్మనీ ఉమ్మడిగా నినదించాయి. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా పరస్పరం వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఇరుదేశాలు ఉమ్మడిగా నిర్ణయించుకున్నాయి. ఈ మేరకు ప్రధాని మోదీ, జర్మనీ చాన్స్లర్ ఫ్రెడరిక్ మెర్జ్లు విస్తృతస్థాయిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తర్వాత సోమవారం ఢిల్లీలో ఇరుదేశాధినేతలు సంయుక్త ప్రకటన విడుదలచేశారు. రక్షణ, వాణిజ్యం,భూ అయస్కాంత లోహాలు, సెమీకండక్టర్లు సహా కీలక రంగాల్లో పరస్పర సహకారంపై అగ్రనేతలిద్దరూ చర్చించారు. అంతర్జాతీయ సమస్యలకు ఉమ్మడిగా పరిష్కారాలు సూచించే స్థాయికి ద్వైపాక్షిక బంధాలను ధృడపర్చుకోవాలని నేతలు నిర్ణయించుకున్నారు. రక్షణ పారిశ్రామిక సహకారం, ఉన్నత విద్యారంగంలో మరింత మెరుగైన సహకారం సహా 19 అంశాలపై రెండు దేశాల మధ్య అవగాహన ఒప్పందాలు కుదిరాయి. పూర్తిస్థాయిలో వాణిజ్యానికి బాటలుపడేలా భారత్–యూరోíపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా సాకారం చేసుకోవాలని మోదీ, మెర్జ్లు అభిలíÙంచారు. విదేశాలకు విమానాల్లో ప్రయాణించే భారతీయులు జర్మనీ మీదుగా వెళ్తున్నప్పుడు అవసరమయ్యే ట్రాన్సిట్ వీసాతో పనిలేకుండా వీసారహిత ప్రయాణాలకు అనుమతించాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. దీంతో భారతీయుల అంతర్జాతీయ ప్రయాణాలు సులభతరం కానున్నాయి. పెరిగిన సహకారమే పరస్పర విశ్వాసానికి ప్రతీక సంయుక్త ప్రకటన వేళ మోదీ మాట్లాడారు. ‘‘రక్షణ, భద్రత రంగాల్లో ఏటికేడు పెరుగుతున్న సహకారమే ఇరుదేశాల మధ్య పరస్పర విశ్వాసం, ఐక్య దార్శనికతకు ప్రబల నిదర్శనం. వాణిజ్య ఒప్పందం సాఫీగా సాగేలా పూర్తి స్థాయి సహాయసహకారాలు అందిస్తున్న చాన్స్లర్ మెర్జ్కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇరు దేశాల రక్షణ పరిశ్రమల మధ్య సహకారం బలపడేలా మార్గసూచీ కోసం కలిసి పనిచేద్దాం. దీంతో సహఅభివృద్ధి, సహ ఉత్పత్తిలో కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి’’అని మోదీ అన్నారు. ‘‘పారదర్శకమైన, స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ వాణిజ్యానికి కట్టుబడి ఉన్నాం. సముద్ర చట్టాలపై ఐక్యరాజ్యసమితి తీర్మానాలను గౌరవిస్తాం. నూతన ద్వైపాక్షిక ఇండో–పసిఫిక్ సంప్రదింపుల వ్యవస్థను ప్రారంభిస్తున్నాం. ఇండియా–పశి్చమాసియా–యూరప్ ఆర్థిక నడువాకు మా మద్దతు కొనసాగుతుంది’’అని ఇరునేతలు సంయుక్త ప్రకటనలో స్పష్టంచేశారు. ఇండో–పసిఫిక్ సముద్రజలాల్లో చైనా ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో భారత్, జర్మనీ ఈ నిర్ణయానికొచ్చాయి. నైపుణ్య కార్మికులకెంతో డిమాండ్ ఈ సందర్భంగా చాన్స్లర్ మెర్జ్ మాట్లాడారు. ‘‘ఇరు దేశాల ప్రజల మధ్య సత్సంబంధాలు బలపడుతున్నాయి. భారత్ నుంచి ఏటా నైపుణ్య కార్మికులు, సహాయకులు, నర్సుల డిమాండ్ పెరుగుతోంది. భారత్లోని ఆరోగ్యసంరక్షణ వృత్తినిపుణులకు జర్మనీలో ఎంతో గిరాకీ ఉంది. అయితే సరఫరా వ్యవస్థలు, ముడి పదార్థాల తరలింపులో బడా శక్తుల జోక్యం పెరిగిపోయింది. దీనిని భారత్, జర్మనీ ఉమ్మడిగా ఎదుర్కోనున్నాయి’’అని మెర్జ్ పరోక్షంగా చైనా, అమెరికాలను విమర్శించారు. ‘‘జర్మనీ విశ్వవిద్యాలయాలకు ఇదే నా స్వాగతం. భారత్లోకి అడుగుపెట్టి మీ వర్సిటీల క్యాంపస్లను ఆరంభించండి. ప్రతిభావంతులైన భారతీయ యువత మీ జర్మనీ ఆర్థికవ్యవస్థ అభివృద్ధికి కృషిచేస్తోంది. సమగ్ర మార్గసూచీ అనేది విద్యారంగంలో భాగస్వామ్యాన్ని సమున్నత శిఖరాలకు చేర్చుతుంది’అని మోదీ అన్నారు. -
భారతే ముఖ్యం
న్యూఢిల్లీ: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన యంత్రాంగంలోని పలువురు సలహాదారుల నోటి దురుసు కారణంగా భారత్తో దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణపై అమెరికా గట్టిగా దృష్టి సారించింది. భారత్లో అమెరికా నూతన రాయబారి సెర్గియో గోర్ ఈ దిశగా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ కోణంలో చూసినా అమెరికాకు భారత్ అంతటి ముఖ్యమైన దేశం మరొకటి లేదని స్పష్టం చేశారు. సోమవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం అమెరికా దౌత్య కార్యాలయ సిబ్బంది, మీడియాను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దిశగా ఇరు దేశాల మధ్య చర్చలు నిలిచిపోయాయన్నది నిజం కాదని గోర్ స్పష్టం చేశారు. ఈ దిశగా ఇరు దేశాల ప్రతినిధుల నడుమ మంగళవారమే తర్వాతి దశ చర్చలు జరగనున్నట్టు వెల్లడించారు. అరుదైన ఖనిజాలు, కృత్రిమ మేధకు సంబంధించి అమెరికా సారథ్యంలో రూపొందుతున్న వ్యూహాత్మక కూటమిలో భారత్ భాగస్వామి కావాలని అభిలషించారు. ఈ మేరకు ట్రంప్ తరఫున భారత్ను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ‘‘భారత్ ప్రపంచంలోకెల్లా అతి పెద్ద దేశం. భారత్, అమెరికా నడుమ ఉన్నది కేవలం సారూప్య ప్రయోజనాలు మాత్రమే కాదు. విడదీయలేని దృఢమైన బంధం కూడా’’ అని అన్నారు. ‘‘భారత్ ఓ అద్భుత దేశం. దౌత్యాన్ని ప్రపంచానికే ఆదర్శప్రాయ రీతిలో పునర్ నిర్వచించే సువర్ణావకాశం ప్రస్తుతం ఇరుదేశాల ముందుంది. భారత్, అమెరికా మైత్రి ఈ శతాబ్దంలోకెల్లా అత్యంత ప్రభావశీల భాగస్వామ్యంగా రూపుదిద్దుకోగలదు’’ అని 38 ఏళ్ల గోర్ అభిప్రాయపడ్డారు. ‘‘భారత్ కంటే ఆవశ్యకమైన భాగస్వామి అమెరికాకు ఇంకెవరూ లేరు. రాయబారిగా భారత్తో బంధం విషయంలో వచ్చే కొన్నేళ్లకు సంబంధించి ఓ భారీ ఎజెండాయే నా ముందుంది. వ్యూహాత్మక భాగస్వామ్యం, శక్తి సామర్థ్యాలతో పాటు పరస్పర గౌరవాదరాలు, నాయకత్వ పటిమే పునాదులుగా అన్ని అంశాలపైనా లోతుగా చర్చించుకుందాం’’ అని పిలుపునిచ్చారు. ట్రంప్, ప్రధాని మోదీ మధ్య నిజమైన, దృఢమైన స్నేహముందని గోర్ అన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గత రెండు దశాబ్దాల్లోకెల్లా అత్యల్ప స్థాయికి చేరేందుకు కారణమైన విభేదాల పరిష్కారానికి వారి స్నేహబంధం కచ్చితంగా తోడ్పడుతుందని అభిప్రాయç ³డ్డారు. ‘‘నిజమైన మిత్రులు పరస్పరం విభేదించవచ్చేమో. కానీ అంతిమంగా తమ భేదాభిప్రాయాలను పరిష్కరించుకుంటారు’’ అని అమెరికా–భారత్ నడుమ బంధానికి బీటలు పడ్డట్టు గోర్ పరోక్షంగా అంగీకరించారు. ‘‘ఇరు దేశాల బంధం విషయంలో వాణిజ్యం చాలా ముఖ్యమైన అంశమే. దానితో పాటు భద్రత, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, ఇంధనం, టెక్నాలజీ, విద్య, వైద్యం వంటి పలు కీలక రంగాల అంశాల్లో ఇరు దేశాలూ అత్యంత సన్నిహితంగా కలిసి పని చేయనున్నాయి’’ అని గోర్ వివరించారు.బంధానికి బీటలు..ఇటీవలి కాలంలో భారత్, అమెరికా బంధం ఒడిదుడుకుల్లో పడటం తెలిసిందే. రష్యా నుంచి భారత్ చమురు కొనడంపై తాను సంతోషంగా లేనని ట్రంప్ అనడం, టారిఫ్లను భారీగా పెంచుతానని హెచ్చరించడం, అందుకు తగ్గట్టే భారత్, చైనాలపై ఏకంగా 500 శాతం టారిఫ్ల విధింపుకు అమెరికా బిల్లు సిద్ధం చేస్తుండటం ఉద్రిక్తతల్ని మరింత పెంచింది. దాంతో ఇరు దేశాల సంబంధాలు కొంతకాలంగా నేలచూపులు చూస్తూ వస్తున్నాయి. పైగా మోదీ స్వయంగా ట్రంప్కు ఫోన్ చేసి మాట్లాడని కారణంగానే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నిలిచిపోయిందని అమెరికా వాణిజ్య మంత్రి లుట్నిక్ బాహాటంగా వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితి మరింత దిగజారింది. వీటికి తోడు భారతీ యులను ప్రధా నంగా లక్ష్యంగా చేసుకుని హెచ్– 1బీ వీసాలపై అమెరికా నానాటికీ ఆంక్షల చట్రాన్ని బిగిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ సన్నిహిత బృందంలో కీలక సభ్యుడైన గోర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్ తో సంబంధాలను తిరిగి మెరుగు పరు చుకునే ప్రయత్నాల్లో అవి భాగమేనని భావిస్తున్నారు. గోర్ ప్రస్తావించిన పిక్స్ సిలికా కూటమిలో జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్, ఇజ్రాయెల్ ఇప్పటికే చేరాయి.మోదీకి ట్రంప్ శుభాకాంక్షలు‘‘భారత్ బయల్దేరే ముందే ట్రంప్తో మాట్లాడా. ఈ అద్భుత దేశం పౌరులకు, ముఖ్యంగా ప్రియ మిత్రుడు మోదీకి శుభాకాంక్షలు అందించాల్సిందిగా ఆయన నాకు చెప్పారు’’ అని గోర్ తెలిపారు. ‘‘రెండు వారాల క్రితం ట్రంప్తో మాట్లాడా. ఆయన భారత్ సందర్శన తాలూకు అద్భుత అనుభవాలను నాతో పంచుకున్నారు. ఒకట్రెండేళ్లలో మరోసారి భారత్లో పర్యటించాలని కూడా ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు’’ అని వివరించారు. ‘‘రాయబారిగా మొట్టమొదటే భారత్ వంటి ప్రపంచంలోకెల్లా అతిపెద్ద, అతిపురాతన దేశంలో పని చేసే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. మన రెండు అతి గొప్ప దేశాల బాగస్వామ్యాన్ని సమున్నత స్థాయికి తీసుకెళ్లడమే నా ముందున్న లక్ష్యం’’ అని గోర్ ప్రకటించారు. -
చర్చలకు దిగొచ్చిన ఇరాన్
దుబాయ్: దాడులు తప్పవన్న తన హెచ్చరికలకు ఇరాన్ దిగొచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సామరస్యంగా చర్చించుకుందామని ప్రతిపాదించినట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఆదివారం రాత్రి ఎయిర్ఫోర్స్వన్ విమానంలో ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. ఇరాన్ అభ్యర్థన మేరకు ఆ దేశ నాయకత్వంతో చర్చల కోసం ఏర్పాట్లు జరుగుతున్నట్టు వెల్లడించారు. అయితే నిరసనకారుల మరణాల సంఖ్య ఇలాగే పెరిగితే మాత్రం తాను చర్చలకు బదులు ‘చర్యలు’ తీసుకోవాల్సి రావచ్చని ట్రంప్ హెచ్చరించారు. ‘‘మా సైన్యం పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. గట్టి ఆప్షన్లనే పరిశీలిస్తున్నాం’’ అని వెల్లడించారు. అమెరికా దాడికి దిగితే దీటుగా తిప్పికొడతామన్న ఇరాన్ ప్రకటనను మీడియా ప్రస్తావించగా, ‘వారు అదే చేస్తే కనీవినీ ఎరగని రీతిలో వారిపై విరుచుకుపడతాం’ అని ట్రంప్ అన్నారు. ట్రంప్ చర్చల ప్రకటనపై ఇరాన్ ధ్రువీకరించలేదు. అయితే అమెరికాతో చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయని ఇరాన్ విదేశాంగ శాఖ అధకార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాచీ చెప్పారు. అయితే అవి ఏకపక్షంగా ఉంటే అంగీకరించబోమన్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్ఘాచీ మాత్రం నిరసనల్లో చోటుచేసుకుంటున్న హింసాకాండ, రక్తపాతాల ఏకైక ఉద్దేశం తమపై దాడికి అమెరికాకు అవసరమైన సాకు కల్పించడమేనని దుయ్యబట్టడం విశేషం. మరోవైపు మూడో వారానికి చేరిన ఇరాన్ ఆందోళనల్లో మృతుల సంఖ్య599కు చేరుకున్నట్టు అమెరికాకు చెందిన మానవ హక్కుల సంస్థ తాజాగా వెల్లడించింది. వీరిలో 525 మంది దాకా నిరసనకారులు కాగా మిగతా మృతులు పోలీసు, భద్రతా సిబ్బంది అని పేర్కొంది. క్షతగాత్రుల సంఖ్య 11 వేలు దాటినట్టు తెలిపింది.ప్రదర్శనల్లో అధ్యక్షుడు..నిరసనలు నింగినంటుతున్న వేళ ఇరాన్లో మరో పరిణామం చోటుచేసుకుంది. వాటికి ప్రతిగా ప్రభుత్వ అనుకూలంగా ఉన్న వేలాది మందితో ఇరాన్ సర్కారు రాజధాని టెహ్రాన్లో భారీ ప్రదర్శనలకు దిగింది. అధ్యక్షుడు పెజెష్కియాన్తో పాటు విదేశాంగ మంత్రి తదితరులు వీటిలో పాల్గొనడం విశేషం. అమెరికా, ఇజ్రాయెల్ ప్రాయోజిత ఉగ్రవాదంపై ప్రజాగ్రహంగా ఇరాన్ వీటిని అభివర్ణించింది. కెర్మన్, రష్త్ తదితర పట్టణాల్లోనూ ఈ ప్రదర్శనలు కొనసాగాయి. మరోవైపు, ఇరాన్లో సుస్థిరత నెలకొనాలని చైనా ఆకాంక్షించింది. ఈ విషయంలో బయటి శక్తుల ప్రమేయానికి తావుండరాదని స్పష్టం చేసింది. సొంత ప్రజల మీదే ఇరాన్ యంత్రాంగం ఇంత దారుణంగా దమనకాండకు దిగడం దారుణమని జర్మనీ చాన్స్లర్ ఫ్రెడరిక్ మెర్జ్ విమర్శించారు. నిరసనకారుల ధైర్యసాహసాలకు హ్యాట్సాఫ్ అని పేర్కొన్నారు.స్టార్ లింక్ సేవలు కట్మిన్నంటుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను కట్టడి చేసే యత్నాల్లో భాగంగా ఇరాన్లో స్టార్ లింక్ ఉపగ్రహ సేవలను ఖమేనీ యంత్రాంగం నిలిపేసింది. ఇందుకోసం మిలిటరీ గ్రేడ్ ‘కిల్ స్విచ్’ను యాక్టివేట్ చేసినట్టు సమాచారం. ఈ అత్యాధునిక జామింగ్ పరిజ్ఞానాన్ని ఇరాన్కు రష్యా లేదా చైనా అందించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇరాన్వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను కొద్దిరోజుల క్రితమే నిలిపేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ నెట్వర్క్ ద్వారానే అక్కడి సమాచారం అంతో ఇంతో బయటి ప్రపంచానికి తెలుస్తూ వస్తోంది. తాజాగా ఆ లింకును ఇరాన్ తెంచేసింది. ఏమిటీ కిల్ స్విచ్?స్టార్లింక్ ఉపగ్రహాలను జామ్ చేసేందుకు ఇరాన్ యంత్రాంగం వాడిన కిల్ స్విచ్ ఇప్పుడు ట్రెండింగ్లో నిలిచింది. ఇది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మిలిటరీ గ్రేడ్జామింగ్ ఎక్విప్మెంట్. దీని ఖరీదు 15.6 లక్షల డాలర్లని సమాచారం. స్టార్లింక్ రిసీవర్లు తమ యూజర్లను లొకేట్ చేసి వారితో కనెక్టయ్యేందుకు జీపీఎస్ను వాడతాయి. మిలిటరీ గ్రేడ్ జామర్లు ఆ లింకును తెంపేస్తాయి. అందుకోసం సదరు ఉపగ్రహం తాలూకు ఫ్రీక్వెన్సీలోనే అత్యంత శక్తిమంతమైన రేడియో సిగ్నళ్లను విడుదల చేస్తాయి. మొత్తం వ్యవస్థను కలిపి కిల్ స్విచ్గా పేర్కొంటారు. 2014 నుంచీ రష్యా ఈ టెక్నాలజీని వాడుతోంది. -
భారత సంతతి సైంటిస్టుకు ప్రతిష్టాత్మక ఆర్ఏఎస్ పురస్కారం
వాషింగ్టన్/లండన్: భారత సంతతికి చెందిన ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త శ్రీనివాసన్ కులకర్ణికి బ్రిటన్కు చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ స్వర్ణ పతకం దక్కింది. అమెరికావాసి అయిన కులకర్ణి అంతరిక్ష రంగంలో కాల విభాగంలో జరిపిన మైలురాళ్ల వంటి పరిశోధనలకు ఈ పురస్కారాన్ని గెలుచుకున్నారు. పలు ఆస్ట్రో ఫిజికల్ పరిశోధనల్లో ఆయన స్టీఫెన్ హాకింగ్, జోస్లిన్ బెల్ బర్న్వెల్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ల సరసన నిలువదగ్గ స్థాయిలో కృషిచేశారు. కులకర్ణి 1985 నుంచి కాలిఫోరి్నయా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. మరుగుజ్జు తారలు, సుదూరాల్లోని గామా కిరణ విస్ఫోటనాలు వంటివాటి గుట్టుమట్లు విప్పడంలో ఆయన ఎనలేని కృషి చేశారు. బర్కిలీ వర్సిటీలో పరిశోధక విద్యార్థిగా ఉండగానే మిల్లీసెకన్ పల్సర్పై చేసిన పరిశోధనలతో ఆ రంగంలోని ఉద్ధండుల దృష్టిలో పడ్డారు. కులకర్ణి 1997లో చేసిన పరిశోధన గామా కిరణ విస్ఫోటాలు తారా సమూహాలకు ఆవల కూడా సంభవిస్తాయని రుజువు చేసింది. ఇది ఆస్ట్రోఫిజిక్స్ తీరుతెన్నులనే కొత్త మలుపు తిప్పింది. పాలోమర్ ట్రాన్సియెంట్ ఫ్యాక్టరీ (పీటీఎఫ్), జ్వికీ ట్రాన్సియెంట్ ఫెసిలిటీ (జీటీఎఫ్) వంటి కీలక సూత్రాల ఆవిష్కరణలో ఆయనది కీలక పాత్ర. ఆశ్చర్యం, ఆనందం: కులకర్ణి ఆర్ఏఎస్ పురస్కారం పట్ల కులకర్ణి హర్షం వెలిబుచ్చారు. గతంలో దాన్ని అందుకున్న హేమాహేమీల సరసన తన పేరు చేరడం ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉందన్నా రు. కులకర్ణి 1978లో ఐఐటీ ఢిల్లీలో మాస్టర్స్ చేశారు. అనంతరం 1983లో బర్కిలీ వర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రస్తుతం నాసా 2030లో ప్రయోగించబోతున్న యూవీఈఎక్స్ అ్రల్టావయోలెట్ స్కై సర్వే మిషన్తో పాటు కెక్ అబ్జర్వేటరీ తాలూకు జెడ్షూటర్ స్పెక్ట్రోమీటర్ మిషన్లోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీకి 200 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. ఆ్రస్టానమీ మొదలుకుని జియోఫిజిక్స్ దాకా పలు రంగాల్లో అద్భుతమైన కృషి చేసిన శాస్త్రవేత్తలకు ఆర్ఏఎస్ ప్రదానం చేసే గోల్డ్మెడల్ను వారి సేవలకు అత్యంత విలువైన గుర్తింపుగా భావిస్తుంటారు. -
వీసా అక్కరలేదు.. ఇండియన్స్కు జర్మనీ గుడ్న్యూస్
భారతీయులకు జర్మనీ శుభవార్త చెప్పింది. తమ దేశంలోని విమానాశ్రయాల మీదుగా ప్రయాణించే భారతీయ పాస్ పోర్ట్ హోల్డర్లకు వీసా రహిత టాన్సిట్ (ప్రయాణ) సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ భారత పర్యటన సందర్భంగా ఒక సంయుక్త ప్రకటనలో ఈ నిర్ణయం ప్రకటించారు.జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ జనవరి 12 నుంచి 13 వరకు రెండు రోజుల పాటు భారత్లో పర్యటిస్తున్నారు. ఇది మెర్జ్ తొలి భారత పర్యటన కాగా ఫెడరల్ ఛాన్సలర్గా ఆయన చేపట్టిన మొదటి ఆసియా పర్యటన కూడా కావడం విశేషం.ఈ నిర్ణయం ప్రకారం.. జర్మనీ విమానాశ్రయాల ద్వారా ఇతర దేశాలకు ప్రయాణించే భారతీయులకు ప్రత్యేక ట్రాన్సిట్ వీసా అవసరం ఉండదు. అయితే, ప్రయాణికులు విమానాశ్రయం పరిధిని దాటి బయటకు వెళ్లకూడదు. అంటే వీసా లేకుండా జర్మనీలోకి ప్రవేశించడానికి మాత్రం అనుమతి ఉండదు.ఛాన్సలర్ మెర్జ్తో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే కీలక అడుగుగా ఆయన అభివర్ణించారు. -
మేము దాడి చేయకుంటే వాళ్లు చేస్తారు: ట్రంప్
గత కొంతకాలంగా గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటానంటూ డెన్మార్క్ను రెచ్చగొడుతున్న ట్రంప్ తాజాగా ఆ అంశంపై మరోసారి మాట్లాడారు. ఎట్టిపరిస్థితుల్లోనూ గ్రీన్లాండ్ను చేజిక్కించుకోవాల్సిందేనన్నారు లేకుంటే చైనా, రష్యాలు ఆ పని చేస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.వెనిజువెలా అధ్యక్షున్ని బంధించి ఆ దేశ పాలనను హస్తగతం చేసుకున్న ట్రంప్ తన తదుపరి టార్గెట్ గ్రీన్లాండ్ అని ప్రకటించారు. అరుదైన ఖనిజాలు, చమురు, సహజవాయువులు పుష్కలంగా ఉండడంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆ ద్వీపంపై అమెరికా అధ్యక్షుడి కన్ను పడింది. దీంతో ఎలాగైనా ఆ ద్వీపాన్ని అమెరికాలో విలీనం చేస్తామని దాని రక్షణ బాధ్యత తమపై ఉందని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అయితే దీనిపై గ్రీన్లాండ్ ప్రజలు నిరాసక్తి చూపిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో అమెరికాలో కలిసేది లేదని తాము స్వతంత్రంగా ఉండదలుచుకుంటున్నామని తమ దేశ పార్లమెంటులో తీర్మానం సైతం చేశారు.అయినప్పటికీ ట్రంప్ తన తీరును మార్చుకోవడం లేదు తాజాగా గ్రీన్లాండ్ వ్యవహారంపై మరోసారి స్పందించారు. "గ్రీన్లాండ్ను అమెరికా స్వాధీనం చేసుకుంటుంది. లేకపోతే చైనా, రష్యా దాన్ని స్వాధీన పరచుకుంటాయి. ఎట్టిపరిస్థితుల్లో అది నేను జరగనివ్వను". అని ట్రంప్ అన్నారు. గ్రీన్లాండ్ కోసం డెన్మార్క్తో ఒప్పందం చేసుకుంటాం. లేదా ఎలాగైనా స్వాధీనం చేసుకుంటాం అని పేర్కొన్నారు.రష్యా, చైనా దేశాల సైనిక బలం ఏమిటో మీకు తెలుసు వారికి ప్రతిచోట సబ్మెరైన్లు, డిస్ట్రాయర్లు ఉన్నాయి. వారి సైనిక శక్తిని మీరు తట్టుకోలేరు అని డెన్మార్క్నుద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే గ్రీన్లాండ్పై ట్రంప్ వ్యాఖ్యలనను డెన్మార్క్ ప్రధాని ఖండించారు. ఒకవేళ గ్రీన్లాండ్పై అమెరికా దాడి చేస్తే అది 80 సంవత్సరాల ట్రాన్స్ అట్లాంటిక్ ఒప్పందానికి భంగం కలిగించడమేనన్నారు. -
"భారత్ తర్వాతే మాకు ఎవరైనా": అమెరికా
ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఆశించిన స్థాయిలో లేవు. ట్రంప్ పన్నుల మోతతో ఇరు దేశాల మధ్య డిస్టెన్స్ కొద్దిగా పెరిగింది. ఈ నేపథ్యంలో యూఎస్ రాయబారి సెర్గియా గోర్ కీలక ప్రకటన చేశారు. అమెరికాకు భారత్ తర్వాతే ఏదేశమైనా అని అన్నారు. వచ్చే ఏడాది ట్రంప్ భారత్ పర్యటించే అవకాశం ఉందని తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధికారం చేపట్టాక భారత్కు అమెరికాతో సంబంధాలు మెరుగుపడుతాయని అంతా ఆశించారు. దానికి కారణం కూడా లేకపోలేదు. భారత ప్రధాని మోదీ, ట్రంప్ మంచి స్నేహితులు కావడంతో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మెరుగపడతాయనుకున్నారు. తీరా చూస్తే సీన్ రివర్స్ అయ్యింది. ఆపరేషన్ సిందూర్ అనంతరం ట్రంప్ పాక్కు అనుకూలంగా వ్యాఖ్యానించడం, తనవల్లే రెండుదేశాల మధ్య యుద్ధం ఆగిందని తరుచుగా వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని భారత్ ఖండించినా ట్రంప్ తన తీరు మార్చుకోలేదు. అంతేకాకుండా రష్యా నుంచి చమురు కొంటే అధిక పన్నులు వేస్తానని బెదిరించారు. ఇలా అమెరికాతో డిస్టెన్స్ పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో భారత్లో అమెరికా రాయబారిగా సెర్గియా గోర్ ఈ రోజు( సోమవారం) బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల ద్రైపాక్షిక సంబంధాలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఢిల్లీలోని యూఎస్ రాయబార కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. " డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ ఇద్దరు మంచి స్నేహితులు. వీరిద్దరి స్నేహం నిజమైనది. కనుక వారిమధ్య ఏవైనా విభేదాలు ఉంటే వారి పరిష్కరించుకుంటారు. అమెరికాకు భారత్ అంత కీలకమైన దేశం మరేదిలేదు. ట్రంప్ వచ్చే ఏడాది భారత్ పర్యటించే అవకాశం ఉంది" అని ఆయన అన్నారు.తాను ట్రంప్తో చివరిసారి డిన్నర్ చేసినప్పుడు ట్రంప్ తన చివరి భారత పర్యటన వివరాలను గుర్తు చేసుకున్నారని ప్రధాని మోదీతో మైత్రి అపూర్వమని ఆయన అన్నారని తెలిపారు. భారత్, అమెరికా మధ్య రెండవ దశ ట్రేడ్ డీల్స్ మంగళవారం నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. రాయబారిగా భారత్-అమెరికా మధ్య సరైన ఎజెండా రూపొందించడం రాయబారిగా తన బాధ్యతని సెర్గియా గోర్ పేర్కొన్నారు. -
2026లో యుగాంతం, భయాలు ఇవిగో..
కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ‘2026లో ప్రపంచం అంతం’ అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాబా వంగా 2026లో ప్రపంచం అంతం గురించి చేసిన జోస్యాలు ప్రజల్లో ఆసక్తిని, భయాన్ని పెంచాయి. అలాగే, చర్చలకు కారణమవుతున్నాయి. అయితే, బాబా వంగా జోస్యాలు శాస్త్రీయ ఆధారాలు లేని ఊహాగానాలు మాత్రమేనని కొందరు కొట్టిపారేస్తున్నారు. ఇవి ప్రజల్లో సాంస్కృతిక, మానసిక ప్రభావం చూపుతున్నాయి కానీ.. వాస్తవంగా 2026లో ప్రపంచం అంతమవుతుందనే ఆధారం లేదని చెబుతున్నారు. ఇంతకీ 2026 గురించి బాబా వంగా ఏం చెప్పారు...?బల్గేరియాకు చెందిన బాబా వంగా గురించి చాలా మంది అనేక సమయాల్లో వినే ఉంటారు. ఆమె చెప్పిన ఎన్నో జోస్యాలు నిజం అయ్యాయి. చిన్న వయస్సులోనే చూపు కోల్పోయిన బాబా వంగా ప్రకృతి విలయాలు, ప్రపంచ యుద్ధాలు, విపత్తుల గురించి జోస్యం చెప్పారు. అందులో చాలా వరకు నిజం అయ్యాయి కూడా. కరోనా మహమ్మారిని కూడా బాబా వంగా ముందే ఊహించారు. ఈ క్రమంలో 2026 ఏడాది గురించి బాబా వంగా పలు సంచలన విషయాలను వెల్లడించారు. 2026లో మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభం అవుతుందని చెప్పారు. ఆమె 2026 సంవత్సరాన్ని యుద్ధం వినాశన సంవత్సరంగా పేర్కొన్నారు. 2026తో ప్రపంచం అంతం అవుతుందని చెప్పడం టెన్షన్కు గురిచేస్తోంది. న్యూయార్క్ పోస్ట్, ది మిర్రర్, ఎక్స్ప్రెస్ వంటి పత్రికలలో విస్తృతంగా వచ్చిన నివేదికల ప్రకారం.. ఆమె అనుచరులు మరియు వ్యాఖ్యాతలు 2026 సంవత్సరానికి అనేక నాటకీయ సంఘటనలను ఆపాదిస్తున్నారు. దీంతో, ఈ విషయంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.మూడో ప్రపంచ యుద్దం..వీటిలో రష్యా, అమెరికా, చైనా, యూరప్ వంటి దేశాలు మధ్య ప్రపంచ సంఘర్షణలు తీవ్రతరం కావడం.. మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే విధ్వంసకర భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, తీవ్రమైన వాతావరణం, వరదలు, తుఫానులతో సహా భారీ ప్రకృతి వైపరీత్యాలు భూమిపై 7–8% భూభాగాన్ని ప్రభావితం చేయడం వంటివి ఉన్నాయి. గ్రహాంతరవాసులతో మొదటి పరిచయం, బహుశా నవంబర్లో భూమి వాతావరణంలోకి ప్రవేశించే భారీ గ్రహాంతర నౌకతో సహా, AI ఆధిపత్యం, ఆర్థిక అస్థిరత.. ఆసియా లేదా చైనా వైపు ప్రపంచ శక్తిలో మార్పు పెరుగుతుందని కూడా అంచనా వేయబడింది.అయితే, ఇది బాబా వంగా మాత్రమే కాదు. పలువురు ప్రముఖులు సైతం ఆసక్తిగా దీనికి ఆజ్యం పోశారు. నోస్ట్రాడమస్ యొక్క క్వాట్రైన్ల వివరణల ప్రకారం "రక్త నదులు", ప్లేగులు, నిరంకుశుల గురించి హెచ్చరిస్తున్నాయి. 2003లో రహస్యంగా అదృశ్యమైన పాకిస్తాన్ ఆధ్యాత్మిక నాయకుడు రియాజ్ అహ్మద్ గోహర్ షాహి.. ఈ సంవత్సరం భూమిని తాకే మండుతున్న తోకచుక్క గురించి మాట్లాడారు. బ్రెజిల్కు చెందిన "లివింగ్ నోస్ట్రాడమస్" అథోస్ సలోమ్ 2024లో ప్రపంచ యుద్ధం, సైబర్ సంఘర్షణ మరియు AI ఆధిపత్యం దగ్గర పడుతున్నాయని అంచనా వేశాడు. మరోవైపు, ఘనా ప్రవక్త ఎబో నోహ్ విపరీతమైన వరదలు వస్తాయన్నారు. దీని కోసం అతను ఘనాలో అనేక చాపలను నిర్మించినట్టు చెప్పుకొచ్చారు. దీంతో, వీరి వ్యాఖ్యలు నిజమవుతాయా? అనే ప్రశ్నలు ఎదరవుతున్నాయి. ఈ భయం ఎక్కడిది?‘2026 డూమ్స్ డే’ టాక్ మొదటి నుంచీ ఒక్క కారణం మీదే నడుస్తోంది. 1980ల్లో బెంజమిన్ క్రెమ్ అనే వ్యక్తి మైత్రేయ అలియాస్ కొత్త యుగం రాబోతోందని 2025-2026లో ప్రపంచం పూర్తిగా మారిపోతుందని జోస్యం చెప్పాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఈ వ్యవహారం ఆస్టరాయిడ్ వైపు మళ్లింది. మరికొద్ది రోజులకు నోస్ట్రడామస్ ఎంట్రీ ఇచ్చాడు. ఇంతో జోతిష్యం కూడా తెరపైకి వచ్చింది. పలువురు జోతిష్యులు తమకు నచ్చిన విధంగా ప్రళయం అని ఒకరు అంటే.. ‘2026 మహా ప్రళయం’ అని మరికొందరు చెబుతున్నారు. అయితే, బాబా వంగా యొక్క అసలు "డూమ్స్డే" తేదీ చాలా దూరంలో ఉంది. ఆమె 5079లో ప్రపంచ ముగింపు (లేదా విశ్వ సంఘటన ద్వారా "సంపూర్ణ డూమ్స్డే") గురించి అంచనా వేసింది.ఆస్టరాయిడ్ ఢీకొడుతుందా?ఇంటర్నెట్లో ఎక్కువగా వైరల్ అయ్యే వీడియోల్లో రెండు ఆస్టరాయిడ్స్ గురించి ఎక్కువగా ప్రస్తావన ఉంటుంది. ఒకటి Apophis (99942), రెండు 2024 YR4. Apophis 2029 ఏప్రిల్ 13న భూమికి 31,000 కిలోమీటర్ల దూరంలోకి వస్తుంది. కానీ 2021లోనే నాసా 100% సేఫ్ అని ధృవీకరించింది. 2026లో దాని దూరం లక్షల కిలోమీటర్లు. 2024 YR4 లేదంటే ఇంకా ఏదైనా ఆస్టరాయిడ్ 2026లో ఢీకొనే ఛాన్స్ ఉందా? అంటే లేదనే చెప్పొచ్చు. నాసా, ESA, NEOWISE టెలిస్కోప్లు 99% పెద్ద ఆస్టరాయిడ్స్ ను ట్రాక్ చేస్తున్నాయి. ఏదైనా రిస్క్ ఉంటే ఇప్పటికే పెద్ద హెచ్చరికలు వచ్చేవి.అంతం తప్పదా? గత సంవత్సరాలతో పోల్చితే ఈ ఏడాది కాస్త కష్ట సంవత్సరం కావచ్చు. వాతావరణ మార్పుల విషయం మరింత తీవ్రమవుతుంది. రాజకీయ ఉద్రిక్తతలు ముఖ్యంగా ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ లాంటి ఘటనలు పెరగవచ్చు. AI వల్ల కొత్త రకం ఆర్థిక మాంద్యం రావచ్చు. కానీ, ఇవన్నీ మనం ఇప్పటికే ఎదుర్కొంటున్న సమస్యలే. కొత్తగా ప్రపంచాన్ని నాశనం చేసేవి కావు. చివరిగా.. గతంలో Y2K (2000), మయన్ క్యాలెండర్ (2012), కరోనా ‘ప్రపంచం అంతం’ టాక్ (2020) గురించి విన్నాం. ప్రతిసారీ భయపడ్డాం. కానీ, ఏమీ కాలేదు. 2026 కూడా అలాగే గడిచిపోతుంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. -
రెడ్ లైన్ దాటేసింది.. ఇక తాడోపేడో తేల్చుకుంటాం
ఆందోళనలతో అట్టుడికిపోతున్న ఇరాన్కు అమెరికా మరో సాలిడ్ వార్నింగ్ ఇచ్చింది. రెడ్ లైన్ దాటేసిందని.. ఇక తీవ్ర చర్యలు తప్పదన్నట్లుగా తీవ్ర సంకేతాలు పంపించింది. ఈ మేరకు అధ్యక్ష డొనాల్డ్ ట్రంప్ స్వయంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అమెరికా గనుక ఇరాన్ వ్యవహారంలో జోక్యం చేసుకున్నా.. కవ్వింపు చర్యలకు దిగినా.. తాము అమెరికా మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతామని టెహ్రాన్ వర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం(భారత కాలమానం ప్రకారం) ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఇలా అన్నారు.. ‘‘ఇరాన్ పరిణామాలను అమెరికా సైన్యం నిశితంగా పరిశీలిస్తోంది. అక్కడి పరిస్థితి అంతకంతకు దిగజారుతోంది. ఆందోళనకారుల పట్ల అక్కడి ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. ముందు నుంచి చెబుతున్నట్లు మేం చూస్తూ ఊరుకోం. మేము బలమైన చర్యలపై పరిశీలిస్తున్నాం. గంట గంటకు నివేదికలు తెప్పించుకుంటున్నాం. ఆ నిర్ణయం త్వరలోనే ఉంటుంది’’ అని ట్రంప్ ప్రకటించారు. అంతటితో ఆగకుండా.. ఇరాన్–అమెరికా మధ్య అణు చర్చల అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించిన ట్రంప్.. ఇరాన్ ప్రతిపక్షాలు తనతో టచ్లో ఉన్నట్లు వెల్లడించారు. అటు అమెరికాలో ఉంటూ ఇరాన్ నిరసనలను ప్రొత్సహిస్తున్న బహిష్కృత ఇరాన్ యువరాజు రేజా పహ్లవి రేపోమాపో ట్రంప్తో భేటీ కాబోతున్నారు. దీంతో ఖమేనీని గద్దె దించేందుకు అమెరికా అధ్యక్షుడు గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. సీనియర్ సలహాదారులతో సంప్రదింపులను ముమ్మరం చేసినట్లు వైట్హౌజ్ వర్గాలు చెబుతున్నాయి. కరెన్సీ పతనం, బడ్జెట్లో సామాన్యుల నడ్డి విరిచే నిర్ణయాలు, ధరల పెరుగుదల.. ఇలా ఒక్కో నిర్ణయాలు ఖమేనీ పాలనపై అక్కడి ప్రజలకు విరక్తి కలిగించాయి. గతేడాది డిసెంబర్ 28న తేదీన టెహ్రాన్ సహా ప్రధాన నగరాల్లో ప్రారంభమైన నిరసనలు.. భద్రతా బలగాల అణచివేత చర్యలతో హింసాత్మకంగా మారాయి. హక్కుల సంఘాల లెక్క ప్రకారం.. ఇప్పటిదాకా 500 మందికి పైగా మరణించారు. 10,600 మందిని అక్రమ అరెస్ట్ చేశారు. అయితే ఇరాన్ మాత్రం ఈ ఆందోళనలను విదేశీ కుట్రగా అభివర్ణిస్తోంది. ఆ కథనాలను కూడా వండి వారుస్తున్నట్లు మండిపడింది. ఇరాన్పై దాడి జరిగితే, ఇజ్రాయెల్తో పాటు అన్ని అమెరికా బేస్లు, నౌకలు మా లక్ష్యాలు అవుతాయి అంటూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఖలీబాఫ్ హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు.. ఇజ్రాయెల్, అమెరికాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తరపున దేశవ్యాప్త ర్యాలీలకు పిలుపు ఇచ్చారాయన. 2022 తర్వాత ఇరాన్లో ఉధృతంగా కొనసాగుతున్న ఆందోళనలివే. హిజాబ్ ధరించలేదని ఓ యువతిపై మోరల్ పోలీసింగ్ ప్రయోగించగా.. అనుమానాస్పద రీతిలో ఆమె ఆస్పత్రిలో మరణించింది. దీంతో యువతులు పెద్ద ఎత్తున ఇరాన్ వీధుల్లోకి చేరి ఉద్యమించారు. అయితే ఖమేనీ ప్రభుత్వం వాటిని అణచివేసింది. ఇరాన్పై చర్యలకు అమెరికా ముందున్న ఆప్షన్లు: సైనిక దాడులు, సీక్రెట్ సైబర్ ఎటాక్స్, ఇరాన్పై అత్యంత కఠిన ఆంక్షలు, చివరగా.. అక్కడి ప్రతిపక్ష నేతలకు, నిరసనలు తెలియజేస్తున్న గ్రూపులకు డిజిటల్ మద్దతు ఇవ్వడం. ఇరాన్లో ఇంటర్నెట్ నిషేధం అమల్లో ఉండడంతో.. అక్కడేం జరుగుతుందో బయటి దేశాలకు తెలియని పరిస్థితి. ఈ క్రమంలో.. టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్తో మాట్లాడి స్టార్లింక్ (శాటిలైట్ ఆధారిత) ద్వారా ఇరాన్లో ఇంటర్నెట్ పునరుద్ధరించాలనుకుంటున్నట్లు ట్రంప్ చెబుతున్నారు. -
ట్రంప్ సంచలన ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. వెనెజువెలాకు తాత్కాలిక అధ్యక్షుడిగా తనకు తాను ప్రకటించుకున్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్లో స్వయంగా ఆయన ఒక పోస్ట్ చేశారు. ప్రపంచ చరిత్రలోనే ఈ తరహా ప్రకటన.. మొట్టమొదటిది కావడం గమనార్హం. In his Truth Social post, US President Donald Trump recognises himself as the 'Acting President of Venezuela' pic.twitter.com/A23DlWqIBw— ANI (@ANI) January 12, 2026డ్రగ్స్ అభియోగాలతో కూడిన నేరాలకుగానూ.. వెనెజువెలా రాజధాని కారకస్పై అమెరికా సైనిక చర్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. జనవరి 3వ తేదీన రాజధాని నగరంపై మెరుపు దాడులు జరిపి.. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన సతీమణి సిలియా ఫ్లోరస్లను బంధించి న్యూయార్క్కు తీసుకెళ్లింది. సుమారు 150 యుద్ధ విమానాలతో అమెరికా వెనెజువెలాపై నిర్వహించిన భారీ ఆపరేషన్లో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్ని పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి.మదురో అక్రమ అరెస్ట్ తర్వాత వెనెజువెలా అధ్యక్ష స్థానంలో.. ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ను వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా కూర్చోబెట్టింది ఆ దేశ సుప్రీం కోర్టు. అయితే.. వెనెజువెలాలో తమ ప్రభుత్వమే ఉంటుందని ఆ సమయంలో ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటనపై విమర్శలు రావడంతో.. వెనెజువెలాలో స్థిర ప్రభుత్వం కొలువుదీరేంత దాకా పర్యవేక్షణ మాత్రమే ఉంటుందని మరో ప్రకటన చేశారు. ఇప్పటికే వెనెజువెలా చమురుపై సర్వహక్కులు తమవేనని.. ఏ దేశమైనా తమతోనే డీల్ కుదుర్చుకోవాలని ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. అంతర్జాతీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. తాత్కాలిక అధ్యక్షుడినంటూ ట్రంప్ చేసిన తాజా ప్రకటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఇలాంటి ప్రకటనకు అసలు చట్టబద్ధత ఉంటుందా? అనే ప్రశ్న మొదలైంది. గతంలో.. గతంలో కొందరు నాయకులు తమ దేశానికి రాజులుగా, అధ్యక్షులుగా ప్రకటించుకున్న ఉదాహరణలు ఉన్నాయి. నెపోలియన్ బోనపార్టే(ఫ్రాన్స్), అహ్మత్ జోగ్(అల్బేనియా), బోరిస్ స్కోసిరెఫ్(అండోరా).. ఈ లిస్ట్లో ఉన్నారు. కానీ చరిత్రలోనే.. ఇలా ఒక దేశ అధ్యక్షుడు మరో దేశంపై అధికారాన్ని ప్రకటించుకున్న దాఖలాలైతే లేవు(మీ దృష్టిలో ఏదైనా ఉంటే.. సోషల్ మీడియాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు). కాబట్టి ట్రంప్ ప్రకటన అత్యంత అరుదైనదిగా చరిత్రలో నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రకటనపై వెనెజువెలా ప్రభుత్వం, ఇతర దేశాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. -
దేనికైనా రెడీ.. ట్రంప్కు క్యూబా అదిరిపోయే కౌంటర్
హవానా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యూబాకు హెచ్చరికలు జారీ చేశారు. వెనెజువెలా నుంచి చమురు కానీ, నిధులు కానీ కావాలంటే తమతో త్వరగా ఒప్పందం చేసుకోవాలని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో ట్రంప్నకు క్యూబా కౌంటరిచ్చింది. నిబంధనలను నిర్దేశించే నైతిక అధికారం అమెరికాకు లేదంటూ ఘాటుగా స్పందించింది.అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలపై క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్-కానెల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలో క్యూబా ఒక స్వేచ్ఛాయుతమైన, స్వతంత్ర, సార్వభౌమ దేశం. మేము ఏం చేయాలో ఎవరూ నిర్దేశించాల్సిన అవసరం లేదు. క్యూబా ఎప్పుడూ సంఘర్షణను కోరుకోదు. చివరి రక్తపు బొట్టు వరకు మాతృభూమిని రక్షించడానికి సిద్ధంగా ఉంది. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు క్యూబా సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు.మరోవైపు.. క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగ్జ్ స్పందిస్తూ.. ప్రపంచ శాంతి ముప్పు కలిగించే విధంగా అమెరికా వ్యవహరిస్తోంది. నేరపూరిత రీతిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలు ఉన్నాయి అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. ఏ దేశం నుండి అయినా ఇంధనాన్ని దిగుమతి చేసుకునే హక్కు క్యూబాకు ఉందని వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అమెరికా, క్యూబా మధ్య మాటల యుద్ధం మొదలైంది. అయితే, క్యూబా లొంగిపోయే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో, ట్రంప్ నిర్ణయం ఎలా ఉండనుంది అనే ఉత్కంఠ నెలకొంది.ట్రంప్ హెచ్చరికలు.. ఇక, అంతకుముందు క్యూబా విషయమై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెనెజువెలాలోని అపారమైన చమురు నిల్వలపై ఆధిపత్యం అమెరికా చేతుల్లోకి వచ్చింది. ఇకపై తమతో ఒప్పందం చేసుకుంటే తప్ప చమురు దక్కదని క్యూబాకు ట్రంప్ స్పష్టంచేశారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఆలస్యం కాకముందే మేల్కోవాలని, ఒప్పందానికి సిద్ధం కావాలని పేర్కొన్నారు. వెనెజువెలా నుంచి వస్తున్న చమురు, డబ్బుతోనే క్యూబా మనుగడ సాగిస్తోందని పేర్కొన్నారు. ఒకవేళ ఒప్పందం గనుక చేసుకోకపోతే అవన్నీ ఆగిపోతాయని క్యూబాను ట్రంప్ హెచ్చరించారు.ఈ సందర్భంగా ట్రంప్ విదేశాంగ మంత్రి రూబియో సామర్థ్యాన్ని కొనియాడుతూనే.. ఆయన భవిష్యత్తులో క్యూబాకు అధ్యక్షుడయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. రూబియో తల్లిదండ్రులు 1950వ దశకంలో క్యూబాలోని బాటిస్టా నియంతృత్వ పాలన నుంచి తప్పించుకుని అమెరికాకు వలస వచ్చిన వారు కావడం గమనార్హం. కాగా, ట్రంప్ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక పక్క సరదాగా చేసిన వ్యాఖ్యలని కొందరు అంటుంటే, క్యూబా పట్ల ట్రంప్ ప్రభుత్వ కఠిన వైఖరికి ఇది సంకేతమని మరికొందరు విశ్లేషిస్తున్నారు. -
ఇరాన్ ఆందోళనల్లో భారతీయుల అరెస్ట్?!
ఇరాన్ అమెరికా మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఆందోళనకారులను అణచివేస్తే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే సైనిక చర్యకు దిగుతామని ట్రంప్.. తమ దేశ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే అంతు చూస్తామంటూ ఖమేనీ సవాల్-ప్రతిసవాల్ విసురుకుంటున్నారు. అయితే ఆందోళనలతో ఇరాన్ నెత్తురోడుతున్న వేళ.. ఆ దేశంలోని ఇతర దేశాల పౌరుల భద్రతపై ఆందోళన నెలకొంది. ఇరాన్ సంక్షోభంలో(Iran Crisis) మరణాలను అక్కడి ప్రభుత్వం తక్కువగా చూపెడుతోందంటూ మానవ హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటిదాకా 548 మరణించారని.. అందులో 48 భద్రతా సిబ్బంది ఉన్నారని తెలుస్తోంది(హెచ్ఆర్ఏఎన్ఏ అనే అమెరికా మానవ హక్కుల సంఘం లెక్కల ప్రకారం). అలాగే 10 వేల మంది ఆందోళనకారుల్ని అరెస్ట్ చేశారని సమాచారం. అయితే.. అరెస్ట్ అయిన వాళ్లలో ఇతర దేశా పౌరులు ఉన్నట్లు పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. నిరసనల్లో పాల్గొనకపోయినా.. కొందరి చేతులకు బేడీలు వేసి తీసుకెళ్తన్నట్లుగా దృశ్యాలు అందులో ఉన్నాయి. అందులో భారతీయులు, అఫ్గనిస్థాన్ జాతీయులు ఎక్కువగా ఉన్నట్లు ఆ ప్రచార సారాంశం. పైగా విదేశీ వ్యవహారాల శాఖ సంబంధిత పేర్లతో ఉన్న అకౌంట్లలో ఆ వీడియోలు పోస్టు కావడం గమనార్హం. దీంతో.. ఆ దేశంలో పనుల నిమిత్తం వెళ్లిన భారత పౌరులు.. విద్యార్థుల భద్రతపై ఢిల్లీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే.. భారత్లో ఇరాన్ రాయబారి మహ్మద్ ఫతాలి(Mohammad Fathali) ఆ కథనాలను ఖండించారు. అలాంటిదేమీ.. ఇరాన్లోని భారతీయులతో సహా ఇతర దేశాల పౌరుల భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని స్పష్టత ఇచ్చారు. సోషల్ మీడియాలో జరిగిన ఫేక్ ప్రచారం ఆధారంగానే ఆ కథనాలు పుట్టుకొచ్చాయని అంటున్నారు. పుకార్లను నమ్మొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఆయన క్లారిటీగా ఓ పోస్ట్ చేశారు. అయితే.. అటు ఇరాన్ ఈ తరహా కథనాలు మొదటి నుంచే ఖండిస్తోంది. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్న కుట్ర అని ఆరోపించింది. ఇరాన్ నిరసనలను కొందరు విదేశీ నటులు.. మీడియా వక్రీకరిస్తున్నాయని.. తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తోంది. మన పిల్లలు సేఫ్!భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. ఇరాన్లో 10,000 నుంచి 12,000 మంది భారతీయులు ఉన్నారు. ఇందులో పనుల నిమిత్తం వెళ్లేవాళ్లు, భారతీయ మూలాలు ఉన్నవాళ్లు కూడా ఉన్నారు. అయితే అక్కడికి భారత్ నుంచి అత్యధికంగా వెళ్లేది వైద్య విద్య అభ్యసించేందుకు వెళ్లే విద్యార్థులే. ఈ నేపథ్యంలో.. వాళ్ల భద్రతపై కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. వాళ్లు సురక్షితంగా ఉన్నారని ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (AIMSA), ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్స్ (FAIMA) ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంలో భారత రాయబార కార్యాలయం, సీనియర్ అధికారులు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారని.. విద్యార్థులతో, అక్కడి అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొంది. -
జమ్మూ కశ్మీర్లో పాకిస్థాన్ డ్రోన్లపై భారత సైన్యం కాల్పులు
జమ్మూ కశ్మీర్లోని నౌషెరా సెక్టార్లో ఆదివారం సాయంత్రం పాకిస్థాన్ వైపు నుంచి వచ్చిన డ్రోన్లపై భారత సైన్యం కాల్పులు జరిపింది. లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సైనిక వర్గాల సమాచారం ప్రకారం.. పలు డ్రోన్లు గగనతలంలో కనిపించాయి. డ్రోన్లు ఆయుధాలు లేదా మత్తు పదార్థాలు వదిలి ఉండవచ్చన్న అనుమానంతో సైన్యం ఆ ప్రాంతంలో విస్తృతంగా శోధిస్తోంది. నిన్న కూడా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) వైపు నుంచి వచ్చిన ఒక డ్రోన్, సాంబా సెక్టార్లో ఆయుధాల సరుకును వదిలింది. డ్రోన్లను అడ్డుకోవడానికి సైన్యం మెషిన్ గన్స్ను వినియోగించింది. డ్రోన్ల ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో అక్రమంగా ఆయుధాలు, మత్తు పదార్థాలు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనతో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులు మరింత కఠినతరమయ్యాయి. సైన్యం అప్రమత్తంగా ఉండి ప్రతి కదలికను గమనిస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది. -
నేడు మోదీ, మెర్జ్ కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఇరుదేశాల ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, జర్మనీ చాన్స్లర్ ఫ్రెడరిక్ మెర్జ్లు సోమవారం గుజరాత్లో భేటీకానున్నారు. ఇందుకు గాందీనగర్లోని మహాత్మాగాంధీ మందిర్ వేదికకానుంది. సోమవారం ఉదయం 9.30 గంటలకు మోదీ, మెర్జ్లు తొలుత అహ్మదాబాద్లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శిస్తారు. అక్కడ మహాత్మునికి నివాళులరి్పస్తారు. తర్వాత 10 గంటల సమయంలో సబర్మతీ నదీతీరంలో జరుగుతున్న ప్రఖ్యాత ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో పాల్గొంటారు. ఇరు నేతలు స్వయంగా పతంగులను ఎగరేసే అవకాశముంది. తర్వాత నేరుగా గాం«దీనగర్కు చేరుకుంటారు. అక్కడి మహాత్మామందిర్లో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. కీలక అంశాలపై విస్తృతస్థాయి చర్చించనున్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిపై సమీక్ష జరపనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, నైపుణ్య శిక్షణ, రవాణా రంగాల్లో పరస్పర సహకారంపై ప్రధానంగా చర్చలు జరిగే అవకాశం ఉంది. రక్షణ, భద్రత, శాస్త్ర సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, పరిశోధన, హరిత ఇంధనం, సుస్థిరాభివృద్ధి, ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాల వంటి కీలక అంశాలపైనా విస్తృతస్థాయిల చర్చ జరగనుంది. అత్యంత నమ్మకమైన నేస్తంగా జర్మనీ.. ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో వేగంగా మారుతున్న సమీకరణాల నేపథ్యంలో భారత్కు యూరప్లో అత్యంత నమ్మకమైన నేస్తంగా జర్మనీ అవతరించింది. కేవలం వాణిజ్యానికే పరిమితమైన సంబంధాలు నేడు రక్షణ, అంతరిక్షం, హరిత ఇంధనం, సాంకేతికత వంటి కీలక రంగాలకు విస్తరించి, ఇరు దేశాల మైత్రిని సరికొత్త శిఖరాలకు చేర్చాయి. 1951లో భారత్తో దౌత్య సంబంధాలు ఏర్పరుచుకున్న తొలి దేశాల్లో జర్మనీ ఒకటి. 2026 నాటికి ఈ బంధం 75 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న తరుణంలో భారత్కు జర్మనీ అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. దీనికి నిదర్శనమే జర్మనీ నూతన ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ తన తొలి ఆసియా పర్యటన కోసం భారత్ను ఎంచుకోవడం. ఇరు దేశాల మధ్య 2000వ సంవత్సరంలో కుదిరిన ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ 2025 నాటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుని రజతోత్సవాలు జరుపుకోవడం ఈ బంధంలోని దృఢత్వాన్ని చాటిచెబుతోంది. రక్షణ రంగంలో ‘రెడ్ కార్పెట్’.. ఒకప్పుడు రక్షణ పరికరాల ఎగుమతులపై కఠిన ఆంక్షలు విధించిన జర్మనీ నేడు తన వైఖరిని పూర్తిగా మార్చుకుని భారత్కు ఈ రంగంలో ఎర్రతివాచీ పరిచి మరీ ఆహా్వనిస్తోంది. రక్షణ ఎగుమతుల నియంత్రణలను సడలించి, భారత్కు అత్యాధునిక సాంకేతికతను అందించేందుకు సిద్ధమైంది. హిందూ మహాసముద్రంలో చైనా ప్రాబల్యం పెరుగుతున్న వేళ ఇండో–పసిఫిక్ ప్రాంత భద్రతలో జర్మనీ తన భాగస్వామ్యాన్ని పెంచుకుంది. ఇటీవల జరిగిన ‘మలబార్–2025’ నావికా విన్యాసాల్లో జర్మనీ పాల్గొనడం, భారత వాయుసేన నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘తరంగ్ శక్తి–1’ విన్యాసాల్లో జర్మన్ ఎయిర్ ఫోర్స్ పాలుపంచుకుంది. రికార్డు స్థాయిలో వాణిజ్యం.. యూరోపియన్ యూనియన్లో భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా జర్మనీ తన స్థానాన్ని పదిలపరుచుకుంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో రూ.1.51 లక్షల కోట్ల(16.65 బిలియన్ డాలర్ల)కు చేరింది. భారత్లో ఇప్పటికే సీమెన్స్, ఫోక్స్ వ్యాగన్, డీహెచ్ఎల్ వంటి 2,000కు పైగా జర్మనీ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. జర్మనీలో 215కు పైగా భారతీయ కంపెనీలు ఐటీ, ఆటోమొబైల్, ఫార్మా రంగాల్లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాయి.ఉన్నత విద్య కోసం జర్మనీకి ఛలో.. విద్య, పరిశోధన, ఉపాధి రంగాల్లోనూ ద్వైపాక్షిక బంధం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు విదేశీ విద్య అంటే అమెరికా, బ్రిటన్లవైపే చూసే భారతీయ విద్యార్థులు ఇప్పుడు జర్మనీకి సైతం పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. ప్రస్తుతం జర్మనీలో 60 వేల మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. జర్మనీలోని విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అత్యధికం. ఇరు దేశాల మధ్య కుదిరిన ‘మైగ్రేషన్ అండ్ మొబిలిటీ’ ఒప్పందం ద్వారా భారతీయ నిపుణులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు మరింత సులభతరమయ్యాయి. ఇస్రో, జర్మన్ స్పేస్ సెంటర్ (డీఎల్ఆర్) మధ్య 1974 నుంచి కొనసాగుతున్న అంతరిక్ష పరిశోధనల సహకారం నేడు మరింత విస్తృతమైంది. ఐఐటీ మద్రాస్ వంటి భారతీయ విద్యాసంస్థలు జర్మన్ వర్సిటీలతో కలిసి డ్యూయల్ డిగ్రీలను ఆఫర్ చేస్తున్నాయి. ఇలా.. సంస్కృతి నుంచి సాంకేతికత వరకు, రక్షణ నుంచి వాణిజ్యం వరకు అన్ని రంగాల్లోనూ భారత్–జర్మనీ బంధం ‘డబుల్ ఇంజిన్’ వేగంతో దూసుకెళ్తోంది. గ్రీన్ ఎనర్జీకి జర్మనీ భరోసా.. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో జర్మనీ భారత్కు వెన్నుదన్నుగా నిలుస్తోంది. 2030 నాటికి భారత్లో హరిత ఇంధన ప్రాజెక్టుల కోసం 10 బిలియన్ యూరోల ఆర్థిక సాయం అందించేందుకు జర్మనీ కట్టుబడి ఉంది. అహ్మదాబాద్, సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్టులతో పాటు గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని గ్రీన్ ఎనర్జీ కారిడార్లు, కొచి్చలో వాటర్ మెట్రో ప్రాజెక్టుకు జర్మనీ ఆర్థిక, సాంకేతిక సహకారం అందిస్తోంది. -
నాటి సౌర తుఫాను... భూమిని వణికించింది!
2024 అక్టోబర్లో సంభవించిన భారీ సౌర తుఫాను భూమిని గట్టిగా వణికించిందని సైంటిస్టులు తాజాగా తేల్చారు. ముఖ్యంగా భూ అయస్కాంత క్షేత్రంపై అది పెను ప్రభావమే చూపిందట. భారత్ ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ఆదిత్య ఎల్1 సౌర అబ్జర్వేటరీయే ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం విశేషం!నాటి సౌర తుఫాను భూ అయస్కాంత క్షేత్రంతో పాటు దాని తాలూకు రక్షణ వ్యవస్థలను కూడా పునాదులతో సహా కంపింపజేసింది! ఆదిత్య ఎల్1 అందించిన డేటాను విశ్లేషించిన మీదట సైంటిస్టులు ఈ మేరకు నిర్ధారించారు. ఆ తుఫానర తాలూకు పెను ప్రభావాన్ని పరిశీలించేందుకు ఆదిత్య ఎల్1 అందించిన డేటాను అప్పటికే అందుబాటులో ఉన్న ఇతర అంతర్జాతీయ డేటాతో కలగలిపి నాసా లోతుగా విశ్లేషించింది. 2024 అక్టోబర్లో సూర్యునిపై అతి శక్తిమంతమైన ప్లాస్మా పేలుళ్లు సంభవించాయి. ఫలితంగా చెలరేగిన అపార శక్తి కణాలు అతి భారీ పరిమాణంలో భూమికేసిదూసుకొచ్చాయి. భూమిని సూర్యుని తాలూకు పరారుణ, రేడియో ధార్మిక కిరణాలు తదితరాల బారినుంచి అనునిత్యం కాపాడే అయ స్కాంతావరణాన్ని అపార శక్తితో ఢీకొ ట్టాయి. వాటి ధాటికి అది కిందమీదులై నట్టు సైంటిస్టులు చెబుతున్నారు. అంతేకాదు, ఆ ఆఘాతం దెబ్బకు అయస్కాంతావరణం స్వల్పకాలం పాటు చెప్పుకో దగ్గ స్థాయిలో కుంచించుకు పోయిందట కూడా! అంతేగాక భూ ఎగువ వాతావరణ పొరల్లో అరోరా ప్రవాహాలు విపరీత స్థాయికి పెరిగాయి. ఫలితంగా పలు కృత్రిమ ఉపగ్రహాలు కూడా ప్రభావితం కావడం, పలు దేశాల్లో కమ్యూనికేషన్ల వ్య వస్థ తాత్కాలికంగా దెబ్బతినడం, పవర్ గ్రిడ్లు, మౌలిక వ్యవస్థలు పడకేయడం, జీపీఎస్ వ్యవస్థలు మొరాయించడం తెలిసిందే. ఈ భీకర సౌర తుఫానుకు సంబంధించిన రియల్ టైమ్ నిర్మాణాత్మక విశ్లేషణను ఆదిత్య ఎల్1 అందించింది. అంతరిక్షంలో జరుగుతున్న కీలక పరిణా మాలకు సంబంధించి రియల్ టైమ్ డేటా ఆవశ్యకతను ఈ ఉదంతం మరోసారి కళ్లకు కట్టిందని సైంటిస్టులు చెబుతు న్నారు. ముఖ్యంగా 2026లో సూర్యప్ర తాపం పరాకాష్టకు చేరవచ్చన్న అంచనాల నేపథ్యంలో ఇది మరీ ముఖ్యమని వారంటున్నారు. ఈ పరిశోధన ఫలితాలను ఆస్ట్రోఫిజికల్ జర్నల్లో ప్రచురించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆలస్యం కాకముందే మేల్కోండి
వాషింగ్టన్: వెనెజువెలా నుంచి చమురు కానీ, నిధులు కానీ కావాలంటే తమతో త్వరగా ఒప్పందం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్యూబాకు తేల్చిచెప్పారు. వెనెజువెలా చమురుకు అతిపెద్ద వినియోగదారు క్యూబా. వెనెజువెలాలో నికోలస్ మదురో ప్రభుత్వాన్ని ట్రంప్ సైన్యం కూలదోసిన సంగతి తెలిసిందే. డెల్సీ రోడ్రిగ్స్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వం కొలువుదీరింది. వెనెజువెలాలోని అపారమైన చమురు నిల్వలపై ఆధిపత్యం అమెరికా చేతుల్లోకి వచ్చింది. ఇకపై తమతో ఒప్పందం చేసుకుంటే తప్ప చమురు దక్కదని క్యూబాకు ట్రంప్ స్పష్టంచేశారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఆలస్యం కాకముందే మేల్కోవాలని, ఒప్పందానికి సిద్ధం కావాలని పేర్కొన్నారు. వెనెజువెలా నుంచి వస్తున్న చమురు, డబ్బుతోనే క్యూబా మనుగడ సాగిస్తోందని పేర్కొన్నారు. ఒకవేళ ఒప్పందం గనుక చేసుకోకపోతే అవన్నీ ఆగిపోతాయని క్యూబాను ట్రంప్ హెచ్చరించారు. అయితే, ట్రంప్ హెచ్చరికపై క్యూబా స్పందన ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. క్యూబా లొంగిపోయే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు క్యూబా ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. వెనెజువెలా నుంచి చమురు, నిధులు రాకపోతే పూర్తిగా కుప్పకూలడం తథ్యం. ఈ నేపథ్యంలో అమెరికాతో డీల్కు సిద్ధపడుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా ట్రంప్ విదేశాంగ మంత్రి రూబియో సామర్థ్యాన్ని కొనియాడుతూనే.. ఆయన భవిష్యత్తులో క్యూబాకు అధ్యక్షుడయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. రూబియో తల్లిదండ్రులు 1950వ దశకంలో క్యూబాలోని బాటిస్టా నియంతృత్వ పాలన నుంచి తప్పించుకుని అమెరికాకు వలస వచి్చన వారు కావడం గమనార్హం. కాగా, ట్రంప్ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక పక్క సరదాగా చేసిన వ్యాఖ్యలని కొందరు అంటుంటే, క్యూబా పట్ల ట్రంప్ ప్రభుత్వ కఠిన వైఖరికి ఇది సంకేతమని మరికొందరు విశ్లేíÙస్తున్నారు. -
దాడి చేస్తే అంతు చూస్తాం
టెహ్రాన్/దుబాయ్: నిరసనలు, ఆందోళనలతో అట్టుడుకుతున్న ఇరాన్లో పరిస్థితి క్రమంగా చేయి దాటిపోతోంది. ప్రజల ఆక్రోశం తీవ్ర ఆవేశంగా రూపుదాలుస్తోంది. దేశవ్యాప్తంగా ఏ నగరం చూసినా ఉద్యమాలతో అట్టుడికిపోతోంది. మొత్తం 36 ప్రావిన్సుల్లోనూ జనాందోళన పెద్దపెట్టున కొనసాగుతోంది. 100కు పైగా నగరాలు అట్టుడుకుతున్నాయి. ముఖ్యంగా రాజధాని టెహ్రాన్లో ఆదివారం నిరసనకారులు వీధుల్లోకి పోటెత్తారు. ఖమేనీ నియంతృత్వ పాలన తమకొద్దంటూ నిరసనలతో హోరెత్తించారు. వాటిని ఇరాన్ ఉక్కుపాదంతో అణచివేస్తుండటం, దీన్ని చూస్తూ ఊరుకోబోమని, నేరుగా జోక్యం చేసుకోవాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ఇరాన్ను హెచ్చరించడం తెలిసిందే. దాంతో ఆ రెండు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు నానాటికీ తీవ్రరూపు దాలుస్తున్నాయి. పరిస్థితి ఏ క్షణమైనా అదుపు తప్పేలా కనిపిస్తోంది. అయితే ఇంటర్నెట్ పడకేయడం, ఫోన్ లైన్లు కూడా మూగబోవడంతో అక్కడ తాజా పరిస్థితి అంచనాలకు అందడం లేదు. వాస్తవ మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అంతేగాక వేలాది మందిని సైన్యం, పోలీసు బలగాలు నిర్బంధంలోకి తీసుకుంటున్నట్టు వార్తలందుతున్నాయి. నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతున్నారంటూ ఆందళన వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు ఇరాన్ తాజాగా ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. తమపై దాడికి దిగే దుస్సాహసం చేస్తే అగ్ర రాజ్యం, దానితో పాటు ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఖలిబాఫ్ ఆదివారం పేర్కొన్నారు. నిండు పార్లమెంటులోనే ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. నిరసనల వెల్లువ! ఇరాన్లో జనాగ్రహం, నిరసనల వెల్లువ కొనసాగుతూనే ఉన్నాయి. టెహ్రాన్తో పాటు రెండో అతి పెద్ద నగరం మషాద్లోనూ ప్రజలు వీధుల్లోకి పోటెత్తుతున్నారు. రాత్రుళ్లు సెల్ఫోన్ లైట్లు వెలిగించి మరీ నిరసన తెలుపుతున్నారు. నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఇందుకు సంబంధించిన శాటిలైట్ ఫుటేజీ ఆన్లైన్లో వైరల్గా మారింది. వీధుల నిండా పోలీసు, సైనిక సిబ్బంది పహారా, డ్రోన్ల నిఘా పెరిగినట్టు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి. మషాద్లో పలుచోట్ల పోలీసులు, భద్రతా దళాలతో జనం ఘర్షణలకు దిగుతున్నారు. వీధుల నిండా తగలబడ్డ సామాన్లు తదితరాలు కనిపిస్తున్నాయి. కెర్మన్ తదితర నగరాలు నిరసనలతో అట్టుడుకుతున్నాయి. వాటిని మరింత తీవ్రతరం చేయాల్సిందిగా ప్రజలకు పిలుపునిస్తూ ప్రవాసంలో ఉన్న ఇరాన్ రాకుమారుడు రెజా పహ్లావీ ఒక వీడియో విడుదల చేశారు. ప్రభుత్వ టీవీలో మాత్రం ఖోమ్, ఖాజ్విన్ తదితర నగరాల్లో జరుగుతున్న ప్రభుత్వ అనుకూల నిరసనల దృశ్యాలను చూపిస్తున్నారు. నిరసనలపై ఉక్కుపాదమే ఇరాన్ పార్లమెంటు కార్యకలాపాలను ప్రభుత్వ టీవీ చానల్ ఆదివారం ప్రత్యక్ష ప్రసారం చేసింది. నిరసనలను అదుపు చేయడంలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారంటూ పోలీసులు, రివల్యూషనరీ గార్డ్ సిబ్బందిని స్పీకర్ ఖలిబాఫ్ ప్రస్తుతించారు. నిరసనల్లో అరెస్టయిన వారి విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అమెరికా గనక ఇరాన్పై దాడికి దిగితే ఈ ప్రాంతంలోని ఆ దేశ సైనిక స్థావరాలు, యుద్ధ నౌకలు తదితరాలన్నింటినీ లక్ష్యంగా చేసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. 538 మందికి పైగా బలి !రెండు వారాలకు పైగా ఇరాన్లో సాగుతున్న ఆందోళనల్లో మరణించిన వారి సంఖ్య 538కు పెరిగినట్టు అమెరికాకు చెందిన మానవ హక్కుల కార్యకర్తల వార్తా సంస్థ ‘యాక్టివిటీ’పేర్కొంది. దేశవ్యాప్తంగా 10,670 మందిని ప్రభుత్వం అరెస్ట్ చేసింది. శవాలతో నిండిన పికప్ ట్రక్కు విజువల్స్ టీవీల్లో ప్రసారమయ్యాయి. ఇరాన్లో పలు నగరాల్లో ఆస్పత్రుల్లో శవాలు గుట్టలుగా పేరుకుంటున్నట్టు మానవ హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. ఉత్తర ఇరాన్లో రస్త్ పట్టణంలోని పౌర్సిన ఆస్పత్రికి ఒక్క శుక్రవారం రాత్రే ఏకంగా 70కి పైగా శవాలు వచి్చనట్టు సమాచారం. టెహ్రాన్లో ఒక ఆస్పత్రికి తాజాగా 38 శవాలు వచి్చనట్టు అక్కడి మెడిక్ చెప్పారు. ‘చాలావరకు నేరుగా తలలో ఛాతీలో కాల్చి చంపారు. అంతేకాదు, చాలామంది యువకులు తూటా గాయాలతో వచి ఆస్పత్రిలో చేరుతున్నారు‘ అని ఆయన వివరించారు. అయితే ఇస్ఫహాన్ ప్రావిన్స్లో 30 మందిని, కెర్మన్షాలో ఆరుగురు పోలీసులను నిరసనకారులు చంపారని ప్రభుత్వం పేర్కొంది. మషాద్లో మసీదుకు నిప్పు పెట్టారని ప్రభుత్వం పేర్కొంది. నిరసనకారులు క్రూరంగా వ్యవహరిస్తున్నారని పోలీసులు అన్నారు. ‘‘ఐసిస్ తరహాలో పోలీసు, భద్రతా సిబ్బందిని హతమారుస్తున్నారు. సజీవంగా తగలబెడుతున్నారు’’ అని మండిపడుతున్నారు. బలహీనంగా ఇరాన్ అమెరికాకు హెచ్చరికలు జారీ చేస్తున్నా, ఇరాన్ ఇప్పటికిప్పుడు భారీ స్థాయిలో దాడులకు దిగే స్థితిలో ఉందా అని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత జూన్లో ఇజ్రాయెల్తో జరిగిన 12 రోజుల యుద్ధంలో ఆ దేశ వైమానిక సంపత్తి చాలావరకు ధ్వంసం కావడం తెలిసిందే. అంతేగాక ఇజ్రాయెల్కు మద్దతుగా రంగంలోకి దిగిన అమెరికా ఇరాన్ అణు స్థావరాలను భారీ బాంబులతో ధ్వంసం చేసేసింది. ఈ నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్పై దాడులకు దిగే దుస్సాహసం ఇరాన్ సుప్రీం లీడర్ 87 ఏళ్ల అయతొల్లా అలీ ఖమేనీ చేస్తారా అన్నది చూడాల్సిందే. ఈ నేపథ్యంలో ఇరాన్లో పరిణామాలను ఇజ్రాయెల్ అత్యంత నిశితంగా గమనిస్తోంది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదివారం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో పలు అంశాలపై ఫోన్లో సుదీర్ఘంగా మాట్లాడారు.యూఎస్, ఇజ్రాయెలే ఎగదోస్తున్నాయి: పెజెష్కియాన్ ఇరాన్ను అస్థిర పరిచేందుకు అమెరికా, ఇజ్రాయెల్ కుట్ర చేస్తున్నాయని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఆరోపించారు. తమ దేశంలో అవి పనిగట్టుకొని నిరసనలను ఎగదోస్తున్నాయని దుయ్యబట్టారు. అయితే నిరసనకారుల ఆవేదనను సహానుభూతితో ఆలకిస్తామని ప్రకటించారు. ‘‘ప్రజలకు చాలా విషయంలో అనుమానాలు, ఆందోళనలు ఉన్నాయి. వాటిని పరిష్కరించేందుకు వారితో చర్చించడం అవసరం’’అని చెప్పుకొచ్చారు. కాకపోతే అల్లర్ల పట్ల అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. విధ్వంసకారులు మొత్తం సమాజాన్నే సర్వనాశనం చేసేందుకు ప్రయతి్నస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన చేసిన ప్రసంగాన్ని ప్రభుత్వ టీవీ ఆదివారం ప్రసారం చేసింది. అయితే ఇరాన్పై సైనిక దాడి విషయంలో ఉన్నతాధికారులు తాజాగా ట్రంప్కు పలు ఆప్షన్లు సూచించారని తెలుస్తోంది. వాటిపై ఆయన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వైట్హౌస్ వర్గాలు చెబుతుండటం విశేషం. -
పాక్-అమెరికా సైనిక విన్యాసం.. ఎందుకో తెలిస్తే షాక్..!
భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల వేళ అమెరికా- పాక్ సంయుక్తంగా “Inspired Gambit 2026” జాయింట్ కౌంటర్ టెర్రరిజం సైనిక విన్యాసం పంజాబ్ ప్రావిన్సులో చేపడుతుంది. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలపై ఇరు దేశాలు ఉమ్మడి డ్రిల్ నిర్వహిస్తున్నాయి.హంతకులే సంతాప సభలు చేస్తారు అనే ఒక నానుడి మన వాడుక భాషలో చాలా ప్రాచుర్యంలో ఉంది. పాకిస్థాన్ విషయంలో ఇది సరిగ్గా సరిపోతుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ముష్కరులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్న ఆ దేశం ఇప్పుడు అమెరికాతో సంయుక్తంగా కలిసి జాయింట్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ చేపడుతుంది. ఇటీవల భారత భద్రతా ఏజెన్సీలు 131 మంది ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్లో ఉన్నారని నివేదికలు అందించగా అందులో 122 మంది పాకిస్థాన్కు చెందిన వారేనని పేర్కొంది. అయినప్పటీకీ ఉగ్రవాద నిరోధక చర్యలు చేపడుతున్నట్లుగా అమెరికాతో డ్రిల్ నిర్వహిస్తుంది. కాగా ప్రస్తుతం సరిహద్దు రేఖ వెంబడి భారత బలగాలు నిఘాను ముమ్మరం చేశాయి. ఉగ్రవాదుల చొరబడే అవకాశం ఉందని భద్రతా బలగాలు హెచ్చరించడంతో కట్టుదిట్టమైన పహారా నిర్వహిస్తున్నాయి. ఆ ప్రాంతంలోనే ఈ ఆపరేషన్ నిర్వహిస్తుండడంతో భారత్ మరింత అప్రమత్తమైంది. డ్రోన్లు, ఇతర పేలుడు పదార్థాలు భారత సరిహద్దులోకి పడకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది.అయితే ఈ ఆపరేషన్పై భారత ఆర్మీ అధికారులు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాలకు ఉగ్రవాద నిరోధక చర్యలు చేపడుతున్నట్లు కనిపిస్తున్న దేశం. భారత్పైకి దాడి చేసే ముష్కరులు ఆశ్రయం కల్పిస్తుందన్నారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్-అమెరికా దౌత్య సంబంధాలు చాలా మెరుగైన సంగతి తెలిసిందే. -
వరల్డ్ ఫేమస్ టాప్-10 వింటర్ ఫెస్టివల్స్ ఇవే
మనకు పండుగల సీజన్ ఇది. అలాగే ప్రపంచంలో అనేక ప్రాంతాల్లోనూ పండుగల సీజనే. చల్లని వాతావరణం వణకిస్తుంది...అలాగే ఎన్నో విందు వినోదాలనూ తెస్తుంది. కాలాలన్నింటిలో అత్యధికులు ఇష్టపడేది శీతాకాలమే. కురిసే మంచు తడిసే నేల కురిపించే అందాల నడుమ పందిరి వేసే సందళ్ల ఎన్నో.. అందుకే.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో శీతాకాల పండుగలు బాగా ప్రాచుర్యం పొందాయి.పలు దేశాలు చల్లని వాతావరణంలో కళ, సంస్కృతి, సంప్రదాయంతో మమేకమైన వినోద భరిత కార్యకలాపాలను ఆస్వాదించడానికి ప్రజలను ఒకచోట చేర్చే ఉత్తేజకరమైన శీతాకాల పండుగలను నిర్వహిస్తాయి. ఈ పండుగలు సంగీతం, లైట్లు, అలంకరణలు, ఆహారం ఉత్తేజకరమైన సంప్రదాయాలతో ఆకట్టుకుంటాయి. మంచు శిల్పాల నుంచి రంగురంగుల కవాతుల వరకు, ప్రతి పండుగలో సందర్శకులను ఆకర్షించే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇవి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల్ని ఆకర్షిస్తాయి. అలాంటి అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రపంచంలోని టాప్–10 అత్యంత ప్రజాదరణ పొందిన శీతాకాల పండుగలు...👉చైనాలో జరిగే హార్బిన్ అంతర్జాతీయ మంచు శిల్ప ఉత్సవం ప్రపంచంలోనే అతిపెద్దది. ఇది డిసెంబర్ నెలలో క్రిస్మస్ రోజున ప్రారంభమై ఫిబ్రవరి మధ్య వరకూ కొనసాగుతుంది.👉జపాన్లో సప్పోరో మంచు ఉత్సవం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ కొనసాగుతుంది ఈ పండుగ.👉కెనడా లోని క్యూబెక్ సిటీలో నిర్వహించే క్యూబెక్ వింటర్ కార్నివాల్ కూడా అత్యధిక సంఖ్యలో సందర్శకుల్ని ఆకర్షిస్తుంది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ సందడే సందడి..👉11వ శతాబ్ధపు చారిత్రక మూలాలు ఉన్న ఇటలీ లోని ది వెనిస్ కార్నివాల్ కళ్లు తిరిగే కలర్ పుల్ సందడిని మోసుకొస్తుంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 17వ తేదీ వరకూ కొనసాగుతుంది.👉అమెరికాలో నిర్వహించే సెయింట్ పాల్ వింటర్ కార్నివాల్ తనదైన శైలితో సందర్శకుల్ని ఆహ్వానిస్తుంది. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ దాకా ఈ ఫెస్టివల్ జరుగుతుంది👉దాదాపు 50ఏళ్ల క్రితం ప్రారంభమైంది కెనడా రాజధాని ప్రాంతం లో జరిగే వింటర్లూడ్ ఫెస్టివల్. ఈ ఏడాది జనవరి 30 నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకూ కొనసాగుతుంది.👉నెదర్లాండ్స్లో నిర్వహించే ఆమ్స్టర్ డామ్ లైట్ ఫెస్టివల్ను లెగసీ అనే థీమ్తో నిర్వహిస్తున్నారు. చిత్రకళతో పాటు బోట్ టూర్స్ తదితర విశేషాలకు వేదికైన ఈ పండుగ గత ఏడాది నవంబర్లో ప్రారంభమైంది.. జనవరి 18వ తేదీ వరకూ కొనసాగుతుంది.👉స్కాట్లాండ్లో ఏకంగా 3 నెలల పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరుగుతుంది అప్ హెల్లీ యా ఫైర్ ఫెస్టివల్.. జనవరి 9న ప్రారంభమై మార్చి 20వ తేదీ వరకూ జరుగుతుంది.👉సెవన్ వండర్స్ ఆఫ్ ద వింటర్గా పేరొందింది దక్షిణ కొరియా లోని హ్వాచియోన్లో నిర్వహించే సాంచియోనియో ఐస్ ఫెస్టివల్. ఇది జనవరి 10న ప్రారంభమై ఫిబ్రవరి 1 వరకూ జరుగుతుంది.👉స్కాట్లాండ్ లో జరిగే హోగ్మనే ఉత్సవం...కొత్త సంవత్సరానికి స్వాగత వేడుక. ఇది కూడా అత్యంత ప్రాచుర్యం పొందిన వింటర్ ఫెస్టివల్స్లో ఒకటిగా గుర్తింపు పొందింది. -
అక్షరాలా ఊచకోతే!
వాషింగ్టన్: అమెరికా ఇటీవల వెనెజువెలా రాజధాని కారకస్పై మెరుపు దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికొలస్ మదురోను సతీసమేతంగా నిర్బంధించడం, న్యూయార్క్కు మెరుపువేగంతో తరలించిన ఘటనకు సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంత పెద్ద కిడ్నాప్, తరలింపు ఆపరేషన్ను అగ్రరాజ్యం కేవలం అరగంటలో ముగించిన తీరు చూసి ప్రపంచమంతా నోరెళ్లబెట్టింది. అయితే అమెరికా స్పెషల్ ఫోర్సెస్ ఆ సందర్భంగా మదురో అంగరక్షకులను, ఇతర సెక్యూరిటీ సిబ్బందిని అక్షరాలా ఊచకోతే కోశాయట! రంగంలోకి దిగింది కేవలం 20 మందే అయినా వందలాది మంది రక్షణ సిబ్బందిని పిట్టల్లా కాల్చి చంపారట. ఆ సమయంలో విధుల్లో ఉన్న మదురో సెక్యూరిటీ సిబ్బందిని ఉటంకిస్తూ అమెరికా అధికార భవనం వైట్హౌస్ ప్రెస్ మహిళా సెక్రెటరీ కరోలిన్ లెవిట్ శనివారం ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ‘మీరు ఏం చేస్తున్నా సరే, అర్జెంటుగా ఆపేసి ఇదోసారి చదవండి...’ అంటూ క్యాప్షన్ కూడా జోడించారు. అప్పుడేం జరిగిందో సదరు సెక్యూరిటీ గార్డు ఇంటర్వ్యూ తరహాలో చెప్పుకొచ్చారు. ‘‘అంతా హఠాత్తుగా మొదలైంది. ఉన్నట్టుండి మా రాడార్ వ్యవస్థలన్నీ మూగబోయాయి. ఏమైందా అని చూస్తుండగానే మా మీదుగా అసంఖ్యాకంగా డ్రోన్లు ఎగరసాగాయి. ఇదంతా రెప్పపాటులో జరిగిపోయింది. ఎలా స్పందించాలో తెలియక మేం తికమక పడుతుండగానే హెలికాప్టర్లు ప్రత్యక్షమయ్యాయి. వాటినుంచి దాదాపు 20 మంది సైనికులు దిగారు. మేం చాలామందిమి ఉన్నా వారి దగ్గరున్న అత్యాధునిక ఆయుధాల ముందు మా సంఖ్యా బలం ఎందుకూ కొరగాకుండా పోయింది. మా జీవితంలో అలాంటి వారితో అప్పటిదాకా ఎప్పుడూ పోరాడలేదు. నేలపై కాలు పెట్టిన క్షణం నుంచీ వారు అక్షరాలా ఊచకోతకు దిగారు. అత్యంత వేగంగా, అంతకుమించిన కచ్చితత్వంతో కాల్పులు సాగించారు. ఒక్కొక్కరూ నిమిషానికి కనీసం ఏకంగా 300 రౌండ్లకు పైగా కాల్చారు’’ అని చెప్పుకొచ్చాడు.జీవాయుధమా?దాడి సందర్భంగా అమెరికా సైనికులు తామె న్నడూ చూడని ఒక అత్యాధునిక ఆయుధాన్ని సైతం ఉపయోగించినట్లు మదురోకు రక్షణ విధుల్లో ఉన్న భద్రతాసిబ్బందిలో ఒకరు చెప్పడం విశేషం. ‘‘ ఆ అత్యాధునిక ఆయుధం నుంచి అత్యంత తీవ్రతతో కూడిన శబ్ద తరంగాలు వెలువడ్డాయి. వాటి తీవ్రతకు నా తల బద్దలవుతుందా అనిపించింది. మా ముక్కులోంచి రక్తం కారసాగింది. కొందరైతే రక్తం కక్కుకున్నారు. ఆ శబ్దం దెబ్బకు కదల్లేని పరిస్థితిలోకి జారుకున్నాం. వాళ్లలో కనీసం ఒక్కరంటే ఒక్కరిని కూడా కనీసం గాయపరచలేకపోయాం. మాలో వందల మందిని పొట్టన పెట్టుకున్నారు’’ అని వివరించారు. ‘‘అమెరికాతో పోరాడగలమని ఇప్పటికీ నమ్ముతున్న లాటిన్ అమెరికా దేశాలన్నింటికీ ఒకటే చెబుతున్నా. అమెరికా సైనిక సామర్థ్యం గురించి మీకసలు ఏమీ తెలియదు’’ అంటూ సదరు గార్డు హెచ్చరికలు కూడా చేయడం విశేషం. -
'ఒకరు కాదు.. వెయ్యి మంది కాదు.. భారత్కు మసూద్ అజార్ హెచ్చరికలు
నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (JeM) చీఫ్ మసూద్ అజార్కు సంబంధించిన ఒక ఆడియో వెలుగులోకి వచ్చింది. తన వద్ద భారీ సంఖ్యలో ఆత్మాహుతి దాడులకు పాల్పడే ‘‘సూసైడ్ బాంబర్లు’’ ఉన్నాయంటూ ప్రకటించారు. వారు ఏ క్షణంలోనైనా దాడికి సిద్ధంగా ఉన్నారంటూ హెచ్చరించాడు. భారత్పై దాడులు చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు స్పష్టమవుతోంది.‘‘ఒకరు కాదు, ఇద్దరు కాదు.. వెయ్యి మంది కాదు. వేల సంఖ్యలో ఆత్మాహుతి బాంబర్లు దాడికి సిద్ధంగా ఉన్నారు. వారు భారత్లోకి చొరబడటానికి అనుమతించాలని నాపై ఒత్తిడి తెస్తున్నారు. నేను మొత్తం సంఖ్యను బహిరంగంగా తెలియజేస్తే ప్రపంచం షాక్ అవుతుంది’’అని ఆడియోలో ఉంది. ఈ ఉగ్రవాదులు దాడులకు పాల్పడి, అమరవీరులు అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారన్నా అజార్.. ఈ వ్యక్తులు తమ లక్ష్యాన్ని సాధించడానికి, తమ దృష్టిలో షహాదత్ (మరణం ద్వారా మతపరమైన గౌరవం) పొందడానికి అత్యంత ఉత్సాహంగా ఉన్నారంటూ పేర్కొన్నారు. అయితే, ఆడియో రికార్డింగ్ ఎప్పటిది? నిజమా? కాదా? అనేది నిర్థారణ కాలేదు.ఆపరేషన్ సిందూర్లో జైషే మమ్మద్ స్థావరం పూర్తిగా నేలమట్టమైన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్లో మసూద్ అజహర్ కుటుంబలో 14 మంది మృతి చెందారు. మసూజ్ అజహార్ సోదరి,బావ, మేనల్లుడు సైతం ఉన్నారు. ఆపరేషన్ సిందూర్పై జైషే మహ్మద్ ఉగ్ర ముఠా అధినేత మసూద్ అజార్ లేఖ విడుదల చేశారు. ప్రధాని మోదీ అన్ని రకాల యుద్ధ నియమాలను ఉల్లంఘించారు. ఆపరేషన్ సిందూర్పై నాకు భయం లేదు. నిరాశ లేదు. విచారం లేదని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, భారత్ను నాశనం చేస్తానంటూ లేఖలో ఓవరాక్షన్ చేశారు.కాగా, భారత్లో ఇప్పటివరకూ జరుగుతూ వచ్చిన ఉగ్రదాడుల వెనుక మసూద్ అజార్ది కీలక పాత్ర. 2001 పార్లమెంట్ దాడి, 2008 ముంబై దాడులతో సహా అనేక ఉగ్రదాడులకు ఇతను సూత్రధారిగా ఉన్నాడు. 2016లో పఠాన్కోట్లో ఎయిర్బేస్పై జరిగిన దాడితో పాటు 2019లో పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత సైనికుల్ని పొట్టన పెట్టుకున్న ఘటనలో కూడా మసూద్ అజార్ ‘పాత్ర ఉంది. ఆ నేపథ్యంలో భారత్ మోస్గ్ వాంటెడ్ ఉగ్రవాదిగా మసూద్ అజార్ ఉన్నాడు. -
ఇరాన్ సుప్రీంని బంధిస్తే జరిగేది ఇదే?
డొనాల్డ్ ట్రంప్ పేరు ఇప్పుడు వరల్డ్వైడ్గా చర్చనీయాంశమయ్యింది. వెనిజువెలా అధ్యక్షున్ని వారి దేశంలోనే బంధించి అమెరికాకు లాక్కెళ్లి ట్రంప్ తన రౌడీయిజం ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించాడు. అయితే ఈ నేపథ్యంలో ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఇరానే అని బలంగా చర్చ నడుస్తోంది. అక్కడ జరుగుతున్న నిరసనలు ఈ వాదనకు కొంత మేర బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ ట్రంప్ ఇరాన్ సుప్రీంని బంధిస్తే జరిగే పరిణామాలు తెలుసుకోవానుందా? అయితే ఈ కథనం చదవండి.ప్రస్తుతం ఇరాన్లో పరిస్థితులు తీవ్ర ఆందోళనకరంగా మారాయి. అక్కడ ద్రవ్యోల్బణం, పేదరికం, అవినీతి కారణంగా విసిగిపోయిన ప్రజలు ఆ దేశ సుప్రీం లీడర్ ఆయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఖమేని పాలన అంతం అవ్వాలని నినాదాలు ఇస్తున్నారు. అక్కడి మహిళలు సైతం ఇస్లాం సంప్రదాయం ప్రకారం ధరించే హిజాబ్లను తొలగించి వాటిని తగలబెడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం నిరసనకారులపై జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు మృతిచెందారు. దీంతో ట్రంప్ రంగంలోకి దిగారు. నిరసనకారులపై దాడులు చేస్తే అమెరికా రంగంలోకి దిగుతుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇరాన్పై దాడికి దిగి ఆదేశ సుప్రీం ఖమేనీని బంధిస్తారా? అనే ఊహాగానాలు మెుదలయ్యాయి.ఇరాన్ సైనిక శక్తివెనిజువెలాతో పోలిస్తే ఇరాన్ సైనిక పరంగా ఎంతో బలమైంది. దాదాపుగా ఆరు లక్షలకు పైగా ఆర్మీ ఆ దేశ సొంతం. అంతేకాకుండా 15 బిలియన్ల డాలర్లకు పైగా ఆర్మీ బడ్జెట్ కలిగి ఉంది. 10 వేలకు పైగా యుద్ధ ట్యాంకులు, మూడు వందలకు పైగా యుద్ధ విమానాలు, జలాంతర్గాములు పటిష్ఠమైన నేవీ విభాగం ఇరాన్ సొంతం. అన్నిటి కంటే ప్రధానంగా ఇరాన్ వద్ద అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ మిస్సైల్స్ దాదాపు 2000 కిలోమీటర్ల రేంజ్ కవర్ చేసేవి ఉన్నాయి. వీటితో ఇరాన్ బలమైన ప్రాంతీయ శక్తిగా అవతరించింది. అంతేకాకుండా అణుబాంబు తయారికి ఇరాన్ ప్రయత్నాలు జరుపుతుందని వాదనలు ఉన్నాయి.ఆర్మీ పరంగా ఇంత బలంగా ఉన్నప్పటికీ వరల్డ్ సూపర్ పవర్గా ఉన్న అమెరికాను ఎదిరించడం ఇరాన్కు కష్టమే.. అయితే వెనిజువెలా అధ్యక్షున్ని బంధించినంత తేలికగా ఖమేనీని అదుపులోకి తీసుకోలేరనేది కాదనలేని వాస్తవం. ఒకవేళ ఖమేనీని ట్రంప్ కిడ్నాప్ చేస్తే ఇరాన్ పూర్తి స్థాయి యుద్దానికి దిగే అవకాశం ఉంది. దీంతో ఇరు వైపులా భారీ నష్టంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయి.ఇస్లాం దేశాల మద్ధతుఇరాన్కు ఇస్లాం దేశాల పూర్తి మద్దతు లభించడం కష్టం ఎందుకంటే ఇరాన్ ప్రజలు షియా మతాన్ని అవలంభిస్తారు. ప్రపంచంలో షియామతం పాటించే దేశాలు ఇరాన్, ఇరాక్, లెబనాన్, సిరియా, బహ్రెయిన్ యెమెన్ దేశాల సహాకారం లభించే అవకాశం ఉంది. అదే సున్నీ మతం పాటించే సౌదీ అరేబియా, టర్కీ, కువైట్, యెమన్ తదితర దేశాలు చాలా వరకూ ఇరాన్కు సపోర్టుగా నిలువవు. అయితే మిలటరీ పవర్స్ అయినా రష్యా, చైనా దేశాలతో ఇరాన్కు మంచి సంబంధాలున్నాయి. అయితే ఆ సపోర్ట్ అమెరికాకు ఎదురు నిలిచి నేరుగా యుద్ధంలో పాల్గొనేంతగా ఉంటుందా అంటే కాదనే సమాధానమే వస్తోంది.మూడో ప్రపంచ యుద్ధంఅయితే ప్రస్తుతం ట్రంప్ మామ మంచి జోరుమీదున్నారు. వెనిజువెలా అధ్యక్షున్ని బంధించిన తనను ఎవరూ ప్రశ్నించలేదు అని ఫీలవుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఇరాన్లో పరిస్తితులు ఏమాత్రం బాగాలేవు. దేశంలో తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. సుప్రీం లీడర్ ఖమేనీపై అక్కడి ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఖమేనీని బంధిస్తే పెద్ద వ్యతిరేకత ఎదురుకాకపోవచ్చు. అంతే కాకుండా మూడోప్రపంచ యుద్దం వచ్చే అవకాశాలు దాదాపు లేవనే చెప్పవచ్చు. అయితే ఈ కిడ్నాప్ వెనిజువెలా అధ్యక్షున్ని బంధించినంత తేలికగా మాత్రం ఉండదు అనేది కాదనలేని సత్యం. -
2010లో పెట్టిన ఆర్డర్.. 2026లో వచ్చిన డెలివరీ
ఏదైనా ఒక వస్తువు ఆర్డర్ పెడితే.. డెలివరీ కావడానికి ఓ నాలుగైదు రోజులు లేదా వారం రోజులు అనుకుందాం. ఆర్డర్ పెట్టిన 16 ఏళ్ల తరువాత డెలివరీ అయితే?, ఇది వినడానికి వింతగా అనిపించినా.. లిబియాలో ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.ఒకప్పుడు గ్లోబల్ మార్కెట్లో నోకియా ఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఉండేది. దీంతో కొత్తగా ఏ మోడల్ వచ్చిన సేల్స్ అద్భుతంగా జరిగేవి. ఇలాంటి సమయంలో లిబియాకు చెందిన ఓ షోరూమ్ ఓనర్ 2010లో ఎక్కువ సంఖ్యలో నోకియా ఫోన్స్ ఆర్డర్ పెట్టారు. అయితే అవి మాత్రం 2026లో డెలివరీ అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.వీడియోలో గమనించినట్లయితే.. ఒక వ్యక్తి నోకియా ఫోన్లను ఒక్కొక్కటిగా చూపించడం, అక్కడున్నవారంతా నవ్వుకోవడం చూడవచ్చు. ఇక్కడ వివిధ నోకియా మోడల్స్ ఉన్నాయి.ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ ఒక్కరోజు సంపాదన ఎంతో తెలుసా?నిజానికి 2010లో నోకియా ఫోన్లకు మంచి డిమాండ్ ఉండేది. అయితే కాలక్రమంలో ప్రత్యర్ధ కంపెనీలకు సరైన పోటీ ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్, యాపిల్ ఐఫోన్లను డిమాండ్ ఉంది. ఇప్పుడు నోకియా ఫోన్స్ వాడేవాళ్ల సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. డెలివరీకి 16ఏళ్ల సమయం పట్టడానికి కారణం.. అప్పట్లో లిబియాలో సివిల్ వార్ మొదలైంది. దీంతో దేశం మొత్తం అతలాకుతలం అయింది. ఈ కారణంగా షిప్మెంట్ ఆగిపోయింది. డెలివరీ చేయాల్సిన మొబైల్స్ వేర్ హౌస్లోనే ఉండిపోయాయి. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో డెలివరీలు జరిగాయని తెలుస్తోంది.Une commande de Nokia arrive avec 16 ans de retardUn revendeur libyen, installé à Tripoli, avait commandé ces téléphones en 2010, mais n'a reçu sa livraison qu'en 2026. pic.twitter.com/0SoXaMCK7w— Renard Jean-Michel (@Renardpaty) January 8, 2026 -
ట్రంప్ అంతరంగ మథనం
డొనాల్డ్ ట్రంప్.. ‘‘వెనెజువెలాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని బంధించి గెలిచేశాం. ఇక వెనెజువెలా అంతా మా చేతుల్లోనే’’ట్రంప్లోని మరొక మనిషి.. ‘‘ఇక నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన వెనెజువెలా ప్రతిపక్ష నేత మచాడో కూడా ఆ పురస్కారాన్ని నాకు ఇస్తానంటుంది.. ఇక తీసుకోవడమే తరువాయి. ఆ బహుమతిని కూడా తీసుకుంటే నా కల తీరిపోతుంది’’నోబెల్ ఇనిస్టూట్యూట్.. ‘ఒకరికి ఇచ్చిన పురస్కారాన్ని వేరే వాళ్లకు ఇవ్వడం కుదరదు. ఆ బహుమతి ఎవరికి ఇస్తే వారికే శాశ్వతం. బదిలీ కుదరదు’ అని స్పష్టంఈ క్రమంలోనే ఎప్పుడూ బిజీబిజీగా ఉండే ట్రంప్.. భావోద్వేగాల పరంగా చూస్తే ఆయన మనసు కనీసం ఈరోజు సమావేశం అయ్యి ఉండొచ్చు. నోబెల్ కోసం ట్రంప్ మనసు లో సమావేశం జరిగితే ఇలానే ఉంటుందేమో. వాషింగ్టన్లోని వైట్ హౌస్ గోడలను వదిలిపెట్టి.. ఏకాంతంగా ట్రంప్ అంతరంగ మథనం ఎలా ఉంటుందో చూద్దాం.ట్రంప్ ప్రధాన అజెండా: ‘నోబెల్ శాంతి బహుమతి నాకు వస్తుందా… లేదా?’అంతర్మథన ప్రతినిధుల వాదనలుఆశావాద వర్గం: ‘ మచాడో ఇచ్చేస్తానంటుంది… ఇక బహుమతి నా చేతిలోనే!నిరాశావాద వర్గం: ‘ నోబెల్ ఇనిస్టిట్యూట్ వద్దు అంటోంది. ఇవ్వరు… ఇవ్వనివ్వరు… ఇది అంతా కలగానే మిగిలిపోతుంది’ప్రచార వర్గం: ‘బహుమతి రాకపోయినా, ట్విట్టర్లో ‘నేనే గెలిచాను’ అని చెప్పేస్తే సరిపోతుంది!’తాజా సర్వేట్రంప్ మెదడులో నిర్వహించిన ఓటింగ్ ప్రకారం:45% ఆలోచనలు ‘నోబెల్ వస్తుంది’ అని నమ్ముతున్నాయి.55% ఆలోచనలు ‘ఇది కుదరదు’ అని నిరాశతో తలదించుకున్నాయి.ట్రంప్ మనసు తుది తీర్మానంనోబెల్ శాంతి బహుమతి రాకపోయినా, ‘నేను శాంతి ప్రతీకనే… కానీ నా మనసులో మాత్రం యుద్ధం కొనసాగుతుంది’ అని ట్రంప్ అంతర్మథన సమావేశం ముగిసింది.మయసభ ఘట్టం మాదిరి.. మహాభారతంలో మయసభ ఘట్టం చాలా ముఖ్యమైంది. ప్రసిద్ధి పొందింది కూడా. పాండవులు అశ్వమేథ యాగం నిర్వహించినప్పుడు.. దుర్యోధనుడు బస చేసిన అద్భుత భవనం మయసభ. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు అనేకానేక చిత్ర విచిత్రమైన ఏర్పాట్లతో విశ్వకర్మ దీన్ని నిర్మించాడని ప్రతీతి. అయితే దుర్యోధనుడు ఇక్కడ ఉండగా... నేల అనుకుని నీటి కొలనులో అడుగుపెట్టి కింద పడతాడు. అది చూసి... ద్రౌపది చెలికత్తెలు ఫక్కుమని నవ్వితే.. అది ద్రౌపదేనని నమ్మిన దుర్యోధనుడు అవమానానికి గురైనట్లు ఫీలవుతాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి కూడా ఇప్పుడు ఇలాగే ఉండి ఉంటుంది. నోబెల్ శాంతి బహుమతి అన్నది ఆయనకు ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది. ఎన్నో యుద్ధాలు ఆపానని చెప్పుకునే ట్రంప్.. ‘నేను నోబెల్ శాంతికి’ అర్హుడినని పదే పదే చెప్పుకున్నారు కూడా. అయితే ఆ పురస్కారం ఆయన దరిదాపుల్లోకి కూడా చేరలేదు. ఇక్కడ కనీసం ఆ పురస్కారాన్ని గెలిచిన వెనెజువెలా ప్రతిపక్ష నేత కొరీనా మచోడా.. ఆ పురస్కారాన్ని ట్రంప్కు ఇస్తానని పదే పదే అంటున్నప్పటికీ అది కూడా తీరే పరిస్థితి లేదు.దాంతో తనకు అసలు నోబెల్ శాంతి పురస్కారం వస్తందా.. లేదా.. అది తన భ్రాంతియేనా? అన్నట్ల మారిపోయింది. -
Syria: ఐసిస్ స్థావరాలపై అమెరికా భీకర దాడులు
డమాస్కస్: సిరియాలో తిష్టవేసిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద ముఠాలను మట్టుబెట్టడమే లక్ష్యంగా అమెరికా సైన్యం శనివారం భారీ దాడులు చేపట్టింది. అమెరికా తూర్పు తీర కాలమానం ప్రకారం మధ్యాహ్నం సమయంలో ఈ దాడులు జరిగినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. సిరియా వ్యాప్తంగా ఉన్న ఐసిస్ నెట్వర్క్ను మట్టికరిపించే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ మెరుపు దాడుల్లో ప్రాణనష్టం ఏ మేరకు జరిగిందనే వివరాలను పెంటగాన్ ఇప్పటి వరకూ వెల్లడించలేదు.గత డిసెంబర్ 13న సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు అమెరికా సైనికులతో పాటు ఒక అనువాదకుడు మృతి చెందారు. ఈ ఘటనను అమెరికా తీవ్రంగా పరిగణించింది. తమ వ్యూహాత్మక సైనిక చర్యలో భాగంగానే ఈ తాజా దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ప్రస్తుతం సిరియాలో సుమారు వెయ్యి మంది అమెరికా సైనికులు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని సమాచారం. గత కొద్ది నెలలుగా అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు సిరియాలో ఐసిస్ అనుమానితులపై గగనతల, భూతల దాడులు నిర్వహిస్తున్నాయి.13 ఏళ్ల అంతర్యుద్ధం దరిమిలా 2024లో మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ను తిరుగుబాటుదారులు గద్దె దించారు. వీరి నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం, అమెరికాకు పూర్తి స్థాయిలో సహకరిస్తోంది. గత ఏడాది చివరిలో సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షారా వైట్ హౌస్ సందర్శించిన సందర్భంగా ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఈ ఉమ్మడి దాడులు కొనసాగుతున్నాయి. ప్రస్తుత సిరియా ప్రభుత్వంలో అల్-ఖైదాతో సంబంధం కలిగిన సభ్యులు కూడా ఉన్నారు. వీరు కూడా ఐసిస్ గ్రూపును వ్యతిరేకిస్తూ, అమెరికాతో కలిసి ఐసిస్ అణచివేతకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే గడిచిన కొన్ని నెలలుగా సిరియా భద్రతా దళాలు కూడా అమెరికా సంకీర్ణ దళాలతో కలిసి దాడుల్లో పాల్గొంటున్నాయి. ఐసిస్ ఉగ్రవాద ముఠాను తుడిచిపెట్టడమే లక్ష్యంగా, అంతర్జాతీయ సహకారంతో ఈ ఆపరేషన్ ముందుకు సాగుతోంది. -
ఇరాన్లో నిరసనలు ఉధృతం
టెహ్రాన్/దుబాయ్: నింగినంటుతున్న నిత్యావసర సరకులు ధరలు, పేదికకం, అవినీతి, అస్తవ్యస్త పాలనతో విసిగిపోయిన ఇరాన్ ప్రజల్లోంచి పెల్లుబికిన ఉద్యమాగ్ని మరింత ఎగసిపడుతోంది. రెండు వారాలుగా ఉద్యమిస్తున్న నిరసనకారుల శనివారం సైతం తమ ఆందోళనను కొనసాగించారు. ఉత్తర టెహ్రాన్లోని సాదత్ అబాద్ ప్రాంతంలో వేలాది మంది స్థానికులు రోడ్ల మీద కొచ్చి భారీ నిరసన ప్రదర్శన చేశారు. ఖమేనీ, ఆయన పాలన అంతమవ్వాలి అని నినదించారు. ఇస్ఫమాన్ నగరంలో ప్రభుత్వ కార్యాలయాలపైకి ఆందోళనకారులు గ్యాసోలిన్ బాంబులను విసిరేశారు. మహిళలు తమ హిజాబ్లను తొలగించి తగలబెట్టారు. నియంత పాలన నశించాలని నినదించారు. ఈ సందర్భంగా ఖమేనీ చిత్రపటానికి నిప్పంటించారు. అయితే ఆందోళనకారుల మధ్య సమన్వయాన్ని దెబ్బతీసేందుకు, తాజా సమాచారాన్ని కప్పిపుచ్చేందుకు, బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెంచేందుకు అయతొల్లా అలీ ఖమేనీ సారథ్యంలోని ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, ఫోన్ సేవలను స్తంభింపజేసింది. అయినాసరే ఆందోళనలు మరింత విస్తృతమవుతూ ఖమేనీ సర్కార్కు పెనుసమస్యగా మారాయి. దీంతో ఇరాన్ అటార్నీ జనరల్ మొహమ్మద్ మొవాహెదీ అజాద్ రంగంలోకి దిగి ఆందోళనకారులన తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ‘‘ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ అత్యంత కఠిన శిక్షలు విధిస్తాం. అలాంటి వాళ్లంతా దేవునికి శత్రువులే. వాళ్లకు మరణశిక్ష వేస్తాం’’అని అన్నారు. మరోవైపు, ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీల్లో ఇప్పటిదాకా 551 మంది చనిపోయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. హింసిస్తే దాడులు చేస్తా: ట్రంప్ ఇరాన్లో నిరసనకారులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శనివారం తన మద్దతు మరోసారి ప్రకటించారు. ‘‘శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్న ఇరాన్ ప్రజలపై ఖమేనీ ప్రభుత్వం విచక్షణారహితంగా బుల్లెట్ల వర్షం కురిపిస్తోంది. ఆందోళనలను అణిచివేసే క్రమంలో నిరసనకారులను పొట్టనబెట్టుకుంటోంది. ఇది ఇలాగే కొనసాగితే అమెరికా దళాలు రంగంలోకి దిగడం ఖాయం’’అని ట్రంప్ అన్నారు. ఉధృతంచేయండి: యువరాజు పిలుపు ఇస్లామిక్ విప్లవం తర్వాత దేశాన్ని వీడిన ఇరాన్ యువరాజు రెజా పహ్లావీ శనివారం ఆందోళనకారులకు తాజాగా మరో సందేశం పంపించారు. ‘‘అందరూ జాతీయ జెండాలు, చిహా్నలతో వీధుల్లోకి వచ్చేయండి. శనివారం, ఆదివారం సైతం ఆందోళన కార్యక్రమాలు చేపట్టండి. కేవలం వీధుల్లోకి వస్తే సరిపోదు. నగరాల కూడళ్లను ఆక్రమించండి. నేను కూడా ఉద్యమకారునిగా మారతా. త్వరలోనే మాతృభూమిపై అడుగుపెడతా’’అని వీడియో సందేశంలో పహ్లావీ పేర్కొన్నారు.నారీ నిరసన... కొత్తగా టెహ్రాన్: ఇరాన్లో అయొతొల్లా అలీ ఖమేనీ సారథ్యంలో 1979లో ఉవ్వెత్తున ఎగసిపడిన ఇస్లామిక్ చైతన్యవిప్లవంలో మహిళా హక్కులు మాడిమసైపోయినందుకు తీవ్ర నిరసనగా నేడు మహిళాలోకం కొత్త తరహాలో ఉద్యమిస్తోంది. ఖమేనీ ఫొటోకు నిప్పుపెట్టి ఆ తర్వాత తగలబడిపోతున్న అదే ఫోటోతో తమ సిగరెట్ను అంటించుకుంటూ అతివలు తమలోని నిరసనజ్వాలలను జనానికి తెలియజేస్తున్నారు. అనూహ్యంగా పెరిగిన ద్రవ్యోల్బణం, అవినీతి, అసమర్థ, అస్తవ్యస్త పాలనతో విసిగిపోయిన ఇరాన్ ప్రజలు గత కొద్దిరోజులుగా వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేస్తుండటం తెల్సిందే. వీటికితోడు మహిళాలోకం చేస్తున్న ఈ నయా నిరసనకు ఆన్లైన్ వేదికలు జై కొట్టాయి. -
నోబెల్ శాంతికి నేనే బెస్ట్: ట్రంప్
న్యూయార్క్/వాషింగ్టన్: గతేడాది నోబెల్ శాంతి బహుమతి తనకు దక్కలేదన్న అక్కసును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వెళ్లగక్కారు. అసలు ఆ పురస్కారానికి తనకంటే అర్హుడు చరిత్రలోనే మరెవరూ లేరని చెప్పుకున్నారు. వెనెజువెలా చమురు నిల్వలకు సంబంధించిన ప్రణాళికల గురించి చర్చించేందుకు చమురు, సహజవాయు కంపెనీల ఉన్నతాధికారులతో శుక్రవారం వైట్హౌస్లో జరిపిన సమావేశాన్ని ట్రంప్ ఇందుకు వేదికగా మార్చుకోవడం విశేషం. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఏమీ చేయకపోయినా నోబెల్ శాంతి పురస్కారం దక్కిందంటూ ఈ సందర్భంగా ఆయన వాపోయారు. ‘‘రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కాక కేవలం 8 నెలల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 8 అతి పెద్ద యుద్ధాలను ఆపాను. 36 ఏళ్లు, 32, 31, 28, 25 ఏళ్లుగా సాగుతున్న యుద్ధాలవి. తద్వారా లక్షలాది మంది ప్రజలు చనిపోకుండా కాపాడా’’అన్నారు. అంతేకాదు, ‘భారత్, పాకిస్తాన్ మధ్య పూర్తిస్థాయి యుద్ధం దిశగా వెళ్తున్న భారీ ఘర్షణను కూడా ఆపేశా’నని మరోసారి చెప్పుకున్నారు. రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపి లక్షలాదిగా ప్రాణ నష్టాన్ని నివారించినందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా తనకు కృతజ్ఞతలు కూడా తెలిపారని గుర్తు చేశారు. భారత్, పాక్ మధ్య యుద్ధాన్ని ఆపానని ట్రంప్ చెప్పుకోవడం గత రెండు రోజుల్లో ఇది రెండోసారి. ‘‘అసలు ఒబామాకు నోబెల్ పురస్కారం ఎందుకిచ్చారో ఇప్పటికీ కనీసం ఆయనకు కూడా తెలియదు. నాకు మాత్రం వాస్తవానికి నేను ఆపిన ప్రతి యుద్ధానికి ఒక నోబెల్ శాంతి బహుమతి చొప్పున ఇవ్వాలి’’అని చెప్పుకున్నారు. -
వెస్ట్బ్యాంక్లో పాలస్తీనా వాసిపై దాడి
టెల్ అవీవ్: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లోని ఓ నర్సరీపై ముసుగు ధరించిన సాయుధులు దాడి చేశారు. ఒక పాలస్తీనా వాసిని దారుణంగా కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. దెయిర్ షరాఫ్ గ్రామానికి సమీపంలోని ఓ మొక్కల నర్సరీ ఉంది. ఇందులో పాలస్తీనా వాసి అయిన 67 ఏళ్ల బధిరుడు బసిమ్ సలేహ్ యాస్సిన్ పనిచేస్తున్నాడు. సెటిలర్లయిన కొందరు వ్యక్తులు ముసుగులు, ఆయుధాలు ధరించి గురువారం ఆ నర్సరీ వద్దకు వచ్చారు. వారిని చూసి నర్సరీలో పనిచేసే వారంతా దూరంగా వెళ్లిపోయారు. వెళ్తూ వారు బధిరుడైన బసిమ్కు హెచ్చరికలు చేశారు. వినిపించకపోవడంతో అతడు అక్కడే ఉండిపోయాడు. దుండగులు వచ్చీ రావడంతోనే అక్కడ కనిపించిన బసిమ్పై కాళ్లతో తన్నుతూ కర్రలతో కొట్టారు. అతడు నేలపై పడిపోయేదాకా కొట్టి, వదిలేసి వెళ్లిపోయారు. ఈ దాడిని ప్రత్యక్షంగా చూసిన వారు సెల్ఫోన్లలో బంధించి ఆన్లైన్లో ఉంచారు. బసిమ్ చేతి వేళ్లు విరిగిపోయా యని, శరీరమంతటా గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు నర్సరీ నిర్వాహకులు తెలిపారు. -
వెల్కమ్ బ్యాక్ మై ఫ్రెండ్!
అది టోక్యో వీధి.. మధ్యాహ్నపు ఎండ.. నిత్యం కిటకిటలాడే ఆ నగరంలో ఒక వృద్ధుడు ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. అతని కళ్లలో ఒక తరం కిందటి జ్ఞాపకం మెరుస్తోంది. సరిగ్గా 48 ఏళ్ల క్రితం విడిపోయిన తన ప్రాణ మిత్రుడు కనిపిస్తాడా? అసలు ఆ పాత ఈమెయిల్ చిరునామా ఇంకా పని చేస్తోందా?అమ్మ దాచిన అపురూప నిధికథ అమెరికాలోని నార్త్ కరోలినాలో మొదలైంది. వాల్టర్ అనే వ్యక్తి.. తన తల్లి మరణానంతరం ఆమె పాత వస్తువులను సర్దుతున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. చనిపోవడానికి ముందు ఆమె రాసుకున్న పాత కాగితాల మధ్య.. ఒక చిరునామా, ఒక పాత ఈమె యిల్ ఐడీ కనిపించింది. అది 48 ఏళ్ల క్రితం తన ఇంట్లో ఎక్సే్ఛంజ్ స్టూడెంట్గా ఉన్న జపాన్ మిత్రుడు కజుహికోది. అతను వాల్టర్ ఇంట్లోనే ఉండి చదువుకున్నాడు. అలా వాల్టర్, కజుహికోలు చిన్నప్పుడే మంచి మిత్రులయ్యారు. వాల్టర్ తల్లికి కజుహికో అంటే చాలా ఇష్టం. ఆ అబ్బాయి సొంత కొడుకులా ఉండేవాడు. అందుకే ఆమె పాత కాగితాల్లో కజుహికో వివరాలను, ఆఖరికి అతని పాత ఈమెయిల్ చిరునామాను కూడా భద్రంగా రాసి పెట్టుకుంది.ఆఖరి ప్రయత్నం ఫలించిందినిజానికి 48 ఏళ్ల తర్వాత ఆ ఈమెయిల్ పని చేస్తుందని ఎవరూ అనుకోరు. కానీ జపాన్ వెళ్లే విమానం ఎక్కడానికి కొద్ది నిమిషాల ముందు, వాల్టర్ ఒక చిన్న సాహసం చేశాడు. ‘ఆ ఈమెయిల్ ఐడీ ఇప్పుడు పనిచేస్తుందో లేదో.. ఆ మిత్రుడు బతికే ఉన్నాడో లేదో’.. అన్న సందేహంతోనే ఒక మెయిల్ పంపాడు. విమానం దిగేసరికి అద్భుతం జరిగింది.. నాలుగు దశాబ్దాల నిశ్శబ్దాన్ని బద్ధలు కొడుతూ.. అవతలి వైపు నుండి సమాధానం వచ్చింది. జపాన్లో ఉన్న కజుహికో స్పందించాడు. కానీ వారి మధ్య భాష సమస్య ఎదురైంది. వాల్టర్ మిత్రుని భార్య నోబుకో మధ్యవర్తిగా మారి, వారిద్దరి మధ్య సందేశాలను అనువదించింది. చివరికి టోక్యోలో ఒక లంచ్ మీటింగ్ ఖరారైంది.కన్నీటి ఆలింగనంనిర్దేశించిన ప్రదేశంలో ఇద్దరూ కలుసు కున్నారు. 48 ఏళ్ల క్రితం యవ్వనంలో చూ సుకున్న ఆ ఇద్దరి కనులు.. ఇప్పుడు ముడతలు పడ్డ ముఖాల్లో ఒకరినొ కరిని గుర్తు పట్టా యి. ఇంకేమీ మా ట్లాడలేదు.. ఒకరి నొకరు గట్టిగా హత్తుకున్నారు. ఆ ఆలింగనంలో అర్ధ శతాబ్దపు ఎడబాటు, ఆనందం, కన్నీళ్లు అన్నీ కలిసిపోయాయి. ఈ దృశ్యం చూసిన వారందరి కనులు చెమర్చాయి.స్నేహానికి ’ఎక్స్పైరీ డేట్’ లేదు!వాల్టర్ కుమార్తె మెరెడిత్ డీన్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయ్యింది. వారి ఆలింగనం చూసి సోషల్ మీడియా ప్రపంచం మొత్తం ఫిదా అయిపోయింది. చితికిపోయిన కాగితం మీద దొరికిన అక్షరం.. విడిపోయిన ఇద్దరు మిత్రులను కలిపింది. ప్రపంచం ఎంత వేగంగా మారుతున్నా, స్వచ్ఛమైన స్నేహానుబంధం ఏనాటికీ వాడిపోదని ఈ సంఘటన నిరూపించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గ్రీన్లాండ్ను సొంతం చేసుకోవాల్సిందే
వాషింగ్టన్: అరుదైన ఖనిజాలు, చమురు, సహజ వాయువు నిల్వలతో కూడిన గ్రీన్లాండ్ను సాధ్యమైనంత త్వరగా అమెరికాలో విలీనం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తహతహలాడుతున్నారు. గ్రీన్లాండ్ను రష్యా, చైనాలు ఆక్రమించుకోక ముందే సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని అమెరికన్లకు ఆయన తేల్చిచెప్పారు. ట్రంప్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. గ్రీన్లాండ్ విషయంలో తన మనసులోని మాటను మరోసారి బయటపెట్టారు. వీలైతే సులభమైన మార్గంలో.. లేకపోతే కఠినమైన మార్గంలో ఆ ప్రాంతాన్ని అమెరికాలో కలిపేయక తప్పదని ఉద్ఘాటించారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తాము అనుకున్నది చేసి తీరుతామన్నారు. త్వరలో ఏదో ఒకటి చేయక తప్పదని వెల్లడించారు. గ్రీన్లాండ్ రక్షణ బాధ్యత తమపై ఉందన్నారు. లీజుకు తీసుకున్న ప్రాంతంపై యాజమాన్య హక్కుందని ఎలా అంటారని డెన్మార్క్పై అసహనం వ్యక్తంచేశారు. లీజు ఒప్పందాలతో ఎలాంటి ఉపయోగం ఉండదని, చట్టబద్ధంగా యాజమాన్య హక్కులు ఉండాలని వ్యాఖ్యానించారు. విలీనాన్ని ఎవరూ ఆపలేరు చైనా ప్రజలను, రష్యా ప్రజలను తాను చాలా అభిమానిస్తానని.. కానీ, వారు గ్రీన్లాండ్లో అమెరికాకు పొరుగువారిగా ఉండిపోవడం తమకు ఇష్టం లేదని ట్రంప్ అన్నారు. అలా జరగనివ్వబోనని పేర్కొన్నారు. ఈ విషయం అర్థం చేసుకోవాలని నాటోకు సూచించారు. మొత్తానికి గ్రీన్లాండ్ అనేది అమెరికాలో అంతర్భాగం కావడం తథ్యమని, అలా జరగడం ఎవరూ ఆపలేరని ట్రంప్ పరోక్షంగా స్పష్టంచేశారు. అమెరికా జాతీయ భద్రతకు గ్రీన్లాండ్ అత్యంత కీలకమని ట్రంప్ పదేపదే చెబుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ రష్యా, చైనా నౌకలు పాగా వేస్తున్నాయని, అది తమ భద్రతకు విఘాతం కలిగిస్తోందని అంటున్నారు. గ్రీన్లాండ్ వాయవ్య భాగంలో అమెరికాకు ఇప్పటికే సైనిక స్థావరం ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇది ఏర్పాటయ్యింది. ప్రస్తుతం అక్కడ 100 మందికిపైగా అమెరికా జవాన్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అమ్మకానికి లేదు గ్రీన్లాండ్ ప్రస్తుతం డెన్మార్క్లో భాగంగా కొనసాగుతోంది. పాక్షికంగా స్వయం ప్రతిపత్తి హోదాను అనుభవిస్తోంది. ఇక్కడి ప్రజలకు డెన్మార్క్ పౌరసత్వం ఉంది. డెన్మార్క్ నుంచి ప్రభుత్వ పథకాలు అందుకుంటున్నారు. గ్రీన్లాండ్ను డబ్బుతో కొనాలన్న ఆలోచన ఉన్నట్లు అమెరికా శ్వేతసౌధం అధికారులు ఇటీవలే ప్రకటించారు. ఆ ప్రయత్నం విఫలమైతే బలప్రయోగం తప్పదన్న సంకేతాలు ఇచ్చారు. సైన్యాన్ని రంగంలోకి దించాల్సి ఉంటుందని వెల్లడించారు. అమెరికా దురాక్రమణ ప్రయత్నాల పట్ల డెన్మార్క్, గ్రీన్లాండ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని, డబ్బుతో కొనేయాలన్న ఆలోచన ఉంటే మానుకోవాలని డెన్మార్క్ నేతలు తేల్చిచెప్పారు. ఒకవేళ అమెరికా గనుక సైనిక చర్యకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ‘నాటో’అంతమవుతుందని అన్నారు. పార్లమెంట్లో తీర్మానం అమెరికాలో తాము అంతర్భాగంగా మారే ప్రసక్తే లేదంటూ గ్రీన్లాండ్ పార్లమెంట్లో శుక్రవారం తీర్మానం చేశారు. పార్లమెంట్లోని అన్ని పారీ్టలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. అమెరికా నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నాయి. గ్రీన్లాండ్ ఎప్పటికీ గ్రీన్లాండర్స్దే గ్రీన్లాండ్ ప్రధానమంత్రి జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్తోపాటు అధికార, ప్రతిపక్ష నాయకులు శుక్రవారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. అమెరికా పౌరులుగా లేదా డెన్మార్క్ పౌరులుగా మారాలన్న కోరిక తమకు లేదని తేల్చిచెప్పారు. తమ దేశాన్ని స్వాహా చేయాలన్న ప్రయత్నాన్ని పక్కనపెట్టాలని అమెరికాను కోరారు. ఎప్పటికీ గ్రీన్లాండ్ పౌరులుగానే ఉంటామని, అందులో మరో మాటకు తావులేదని వెల్లడించారు. విలీనం వెనుక ఎన్నో సవాళ్లు బల ప్రయోగంతో గ్రీన్లాండ్ను విలీనం చేసుకోవాలన్న ఆరాటం ట్రంప్లో ఉన్నప్పటికీ అది అనుకున్నంత సులభం కాదని నిపుణులు అంటున్నారు. ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని చెబుతున్నారు. సైనిక చర్యకు దిగితే అంతర్జాతీయ సమాజం వ్యతిరేకించే అవకాశం ఉంది. అమెరికాతో సంబంధాల విషయంలో విదేశాలు పునరాలోచించుకోవచ్చు. మొదట ‘నాటో’కూటమిలో సంక్షోభం తలెత్తుతుంది. కూటమి విచి్ఛన్నమైనా ఆశ్చర్యం లేదు. కొన్ని దేశాలు గ్రీన్లాండ్ రక్షణ కోసం ముందుకు రావొచ్చు. గ్రీన్లాండ్ సమీపంలో ఇప్పటికే రష్యా, చైనాల జలాంతర్గాములు, నౌకలు ఉన్నాయి. ఉమ్మడిగా సైనిక విన్యాసాలు కూడా నిర్వహిస్తున్నాయి. గ్రీన్లాండ్కు మద్దతుగా ఆ రెండు దేశాలు అమెరికాతో తలపడే అవకాశాలు లేకపోలేదు. అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం వినాశనానికి దారితీయవచ్చు. మొదట కాల్పులు, తర్వాతే మాటలు గ్రీన్లాండ్పై ఎవరైనా దండయాత్ర చేస్తే కచి్చతంగా తిప్పికొడతామని డెన్మార్క్ హెచ్చరించారు. దురాక్రమణదారులపై తొలుత కాల్పులు జరుపుతామని, ఆ తర్వాతే చర్చిస్తామని పేర్కొంది. ఈ మేరకు డెన్మార్క్ ప్రభుత్వం తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేసింది. గ్రీన్లాండ్ విషయంలో అమెరికా దూకుడుగా ముందుకెళ్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, అమెరికాను ఢీకొట్టగల శక్తి డెన్మార్క్కు లేదు. వెనెజువెలా తరహా సైనిక ఆపరేషన్ను తట్టుకొనే బలం కూడా లేదు. అమెరికా భూభాగంలో డెన్మార్క్ పరిమాణం 0.44 శాతమే. సైనిక శక్తి అంతంతమాత్రమే. సైనిక సిబ్బంది వేల సంఖ్యలోనే ఉన్నారు. కానీ, నాటో సభ్యదేశాలపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. -
అమెరికాలో కాల్పులు.. ఆరుగురి మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. యూఎస్ఏలోని మిసిసిప్పిలోని ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురి మృత్యువాత పడ్డారు. కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నిందితుడు ఒక చోట కాకుండా వేరు వేరు చోట్ల కాల్పులకు తెగబడినట్లు సమాచారం. అమెరికా వార్తా సంస్థలు డబ్యూటీవీఏ, ఎన్బీసీ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. #BreakingNews: Indiscriminate shooting in the US once again: 6 people, including a child, killed in Mississippi; suspect arrested.#USAShooting #Mississippi #GunViolence #MassShooting pic.twitter.com/0BxUhFqICn— UPDATE ADDA (@UpdateAdda24x7) January 11, 2026 కాగా, ఇటీవల అమెరికాలో కాల్పుల ఘటనలు తీవ్రంగా పెరిగాయి. 2026 ప్రారంభం నుంచే మిసిసిప్పి, టెక్సాస్, డల్లాస్, హ్యూస్టన్ వంటి నగరాల్లో పెద్ద ఎత్తున కాల్పులు జరిగి, పలువురు మరణించగా, మరికొందరు గాయపడ్డారు.జనవరి 1, 2026 మిసిసిప్పి నైట్క్లబ్లో నూతన సంవత్సర వేడుకల సమయంలో కాల్పులు జరిగాయి. పలువురు గాయపడ్డారు.జనవరి 1, 2026 – డల్లాస్, టెక్సాస్ల్లో జరిగిన మరో కాల్పుల ఘటనలో అనేక మంది గాయపడ్డారు.జనవరి 1, 2026 – హ్యూస్టన్, టెక్సాస్ల్లో కొత్త సంవత్సరం మొదటి రోజే కాల్పులు చోటుచేసుకోవడం అమెరికాలో గన్ వైలెన్స్ సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తుంది. దాంతో అమెరికాలో గన్ నియంత్రణపై చట్టసభల్లో మళ్లీ చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. 2025లో అమెరికాలో హత్యలు, పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు కొంత తగ్గినా, గన్ వైలెన్స్ మాత్రం కొనసాగుతూనే ఉంది. 2026 మొదటి 10 రోజుల్లోనే 4 ప్రధాన కాల్పుల ఘటనలు నమోదు కావడం గమనార్హం. -
ట్రంప్ ఆశలు ఇక అడియాశలేనా?
గత ఏడాది(2025)లో నోబెల్ శాంతి బహుమతి పొందిన వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో ట్రంప్కు ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు బంధించిన నేపథ్యంలో, తన నోబెల్ పురస్కారాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు అంకితం ఇస్తున్నట్లు ఆమె ప్రకటించడం సంచలనం రేపింది.మచాడో నోబెల్ బహుమతిని ట్రంప్కు ఇచ్చేస్తారా అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ క్రమంలో నోబెల్ కమిటీ స్పందించింది. నోబెల్ బహుమతిని పంచుకోవడం, రద్దు చేయడం, బదిలీ చేయడం సాధ్యం కాదంటూ నార్వేజియన్ నోబెల్ కమిటీ తేల్చి చెప్పింది. ఒకసారి నోబెల్ ప్రకటించిన తర్వాత, ఆ నిర్ణయం శాశ్వతంగా ఉంటుందంటూ కమిటీ పేర్కొంది. కాగా, నోబెల్ శాంతి బహుమతిని అందుకునేందుకు తనకంటే అర్హుడు ఈ చరిత్రలో ఎవరూ లేరంటూ వ్యాఖ్యానించిన ట్రంప్.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. ఏమీ చేయకపోయినా ఆయనకు ఆ గౌరవం దక్కిందంటూ వ్యాఖ్యానించారు.వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడో అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో నోబెల్ గురించి శనివారం ట్రంప్ మరోసారి ప్రస్తావిస్తూ.. మాచాడో తన నోబెల్ బహుమతిని ఇవ్వాలనే ఆఫర్పై ఆమెతో చర్చిస్తానని తెలిపారు. వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలాస్ మదురో పట్టుబడి అమెరికాకు తరలించబడిన తర్వాత, అమెరికా–వెనిజులా ఉద్రిక్తతలు అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి. ఆమె రావాలని అనుకోవడం మంచిదేనంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. నా దృష్టి అంతా ప్రజల ప్రాణాలు కాపాడటం పైనే ఉందన్న ట్రంప్ యుద్ధాలను ఆపడం ద్వారా కోట్లాది మందిని రక్షించానంటూ మరోసారి గొప్పలు చెప్పుకున్నారు. -
ఆపరేషన్ మదురో: అంత ఈజీగా ఎలా పట్టుకెళ్లారంటే..
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అంత ఈజీగా ఎలా బంధించిందబ్బా?.. వారం గడిచినా కూడా ఈ ప్రశ్న ప్రపంచాన్ని వేధిస్తూ ఉండొచ్చు. అయితే ఇందుకు అమెరికా సైన్యం ఉపయోగించిన ట్రిక్ ఏమిటో ఇప్పుడు బయటకు వచ్చింది!. ముందుగా సైబర్ ఎటాక్ చేసి.. ఆ తర్వాత భౌతిక దాడులకు దిగిందట. అయితే అదేం ఆషామాషీగా జరగలేదు. అందుకోసం తెర వెనుక పెద్ద తతంగమే నడిచింది. అదెంటో చూసేద్దాం మరి.. వెనెజువెలాకు ఉన్న రష్యా తయారీ ఎస్-300 గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణి విధ్వంసక వ్యస్థలను అమెరికా అసలు అంత తేలికగా ఎలా చేధించగలిగింది?. సైబర్ దాడితో అమెరికా నిర్వీర్యం చేసిందా? రాడార్లను స్పూఫింగ్ చేసి మరీ కారకాస్లోకి చొచ్చుకుపోయాయా?..ఈ ప్రశ్నలకు అమెరికా సైబర్ నిపుణులు అవుననే సమాధానమిస్తున్నారు. అమెరికా సైనిక చర్య మొదలు కావడానికి.. అరగంట ముందు సైబర్ ఎటాక్తో అసలు తతంగం నడిచినట్లు వివరిస్తున్నారు.నెలల తరబడి నిఘా!అమెరికా సేనలు నెలల తరబడి వెనెజువెలా అధ్యక్షుడు మదురో నివాసంపై నిఘా పెట్టాయి. ఏ సమయంలో అతను ఏ గదిలో ఉంటాడు? పడక గదికి చేరుకునే మార్గాలేమిటి? రాత్రిళ్లు ఎంతమంది అంగరక్షకులుంటారు? నిఘా ఏ విధంగా ఉంటుంది? పనివాళ్లు, వంటవాళ్ల వివరాలు.. ఇలా అన్ని అంశాలపై సమాచారాన్ని సేకరించించాయి. నిజానికి వెనెజువెలాపై అమెరికా ఈ నెల 3న దాడులు జరిపినా.. కొన్ని నెలల ముందే క్షేత్రస్థాయిలో 90శాతానికి పైగా ఆపరేషన్ పూర్తి చేసిందట. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఆ వివరాలు కూడా అందాయని తెలుస్తోంది. అందులో దాడి మొదలు పెడితే.. ఎంత సమయంలో టాస్క్ పూర్తవుతుందో వివరించారట. అన్నీ ఓకే అనుకున్నాక ట్రంప్ పచ్చజెండా ఊపగానే.. అమెరికా సేనలు రంగంలోకి దిగాయి.అమెరికా సైబర్ కమాండ్ ద్వారా..సైబర్ ప్రపంచంలో అమెరికా తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ.. డొమైన్ సుప్రమసీగా కొనసాగుతోందని తెలిసిందే. వెనెజువెలాపై ఆపరేషన్లో భాగంగా.. కారకస్లోని మదురో నివాసంపై దాడికి అరగంట ముందే.. అమెరికా సైబర్ కమాండ్ కంట్రోల్ కేంద్రం యాక్టివేట్ అయ్యింది. సైబర్ కమాండ్ సిబ్బంది తొలుత వెనెజువెలా రాజధాని కారకస్కు విద్యుత్తు సరఫరా చేసే వ్యవస్థ (SCADA – Supervisory Control and Data Acquisition)పై సైబర్ ఎటాక్ చేశారు. దాంతో.. ఆ నగరం అంధకారంలో మునిగిపోయింది. ఆలస్యం చేయకుండా.. ఆ వెంటనే రక్షణ వ్యవస్థను టార్గెట్ చేశారు. రాడార్ స్పూఫింగ్ జరగడంతో.. అమెరికా సేనలు 150 యుద్ధ విమానాల్లో వెనెజువెలా సరిహద్దుల్లోకి ప్రవేశించినా ఒక్కటంటే ఒక్క రాడార్ కూడా పసిగట్టలేకపోయింది. దాంతో.. రష్యా సరఫరా అయిన ఎస్-300 గగనతల రక్షణ వ్యవస్థలు నిర్వీర్యంగా మారిపోయాయి. ఈ ఆపరేషన్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ‘‘మా ప్రత్యేక నైపుణ్యం కారణంగా.. కారకస్లో విద్యుత్తు నిలిచిపోయేలా చేశాం’’ అంటూ పోస్ట్ చేయడం తెలిసిందే. అంతేకాదు.. ఈ దాడి తర్వాత వెనెజువెలా కూడా తమ జాతీయ పవర్గ్రిడ్ (గురి డ్యామ్ నెట్వర్క్)ను అమెరికా టార్గెట్గా చేసుకుందని ప్రకటించింది. విద్యుత్తు నిలిచిపోవడం వల్ల వెనెజువెలా సైన్యం కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా పనిచేయలేదని తెలుస్తోంది.సైబర్ ఎటాక్ ఎలా చేశారంటే.. అమెరికా సైబర్ కమాండ్ ఈ దాడిలో విజయం సాధించడం ఒక్కరోజుతో జరిగిన పని కాదు. వెనెజువెలా పవర్గ్రిడ్ కార్పొరేషన్పై నిఘా ఏళ్ల తరబడిగా కొనసాగుతోందని ఇప్పుడు వెల్లడైంది. తొలుత.. కంప్యూటర్లు, విద్యుత్తు సరఫరా వ్యవస్థల్లో మాల్వేర్ను చొప్పించారు. ఈ మాల్వేర్ ద్వారా అమెరికా సైబర్ కమాండ్ విద్యుత్తు వ్యవస్థ కంట్రోలర్లలోకి చొరబడి.. ‘పింగ్’ చేశారు. అంతే.. యావత్ విద్యుత్తు వ్యవస్థ ఢమాల్ అయిపోయింది. మొత్తం కారకస్ నగరానికి విద్యుత్తు నిలిచిపోయింది. అయితే.. ఈ ఆపరేషన్కు అమెరికా తన సొంత మాల్వేర్ ‘నైట్రోజ్యూస్’, రష్యా తయారీ అయిన ‘ఇండస్ట్రియర్’ ఈ రెండు మాల్వేర్లను ఒకదాన్ని వాడినట్లు తెలుస్తోంది.అత్యంత చాకచక్యంగా..నిజానికి అమెరికా సేనలు పెద్ద ప్రమాదాలను దాటుకుంటూనే వెనెజువెలా గగనతలంలోకి ప్రవేశించాయి. ఎస్-300 గగనతల వ్యవస్థలు విద్యుత్తు నిలిచిపోగానే ఆగిపోయినట్లు సమాచారం. నిజానికి ఈ వ్యవస్థలు ఉన్న ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా ఉంటుంది. ఒకవేళ విద్యుత్తు సరఫరా జరగకపోతే.. డీజిల్ జనరేటర్లతో బ్యాకప్ చేస్తారు. అయితే..ఇందుకు ఐదు నిమిషాల దాకా సమయం పడుతుంది. అంటే.. ఈ ఐదు నిమిషాల వ్యవధిలోనే అమెరికా యుద్ధ విమానాలు సరిహద్దులను దాటి.. కారకస్కు రావాల్సి ఉంటుంది. సైబర్ కమాండ్ అధికారులు తమ పనిని పూర్తిచేయగానే.. అమెరికా విమానాలు వెనువెంటనే రంగంలోకి దిగాయి. అత్యంత చాకచక్యంగా జరిగిన ఈ రాడార్ల విషయంలో జరిగిన ఆపరేషన్ విషయాల్ని అమెరికా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డాన్ కెయిన్ కూడా ధృవీకరించడం గమనార్హం..!కలిసొచ్చిన సూటర్సాధారణంగా క్షిపణి వ్యవస్థలు సాఫ్ట్వేర్తో పనిచేస్తాయి. ఇక్కడే అమెరికా సూటర్ అనే టెక్నాలజీని వాడింది. ఒక్కసారి రాడార్ వ్యవస్థలకు విద్యుత్తు నిలిచిపోగానే.. అమెరికా సైబర్ కమాండ్ సూటర్ టెక్నాలజీ ద్వారా రాడార్ స్పూఫింగ్కు పాల్పడింది. అంటే.. రాడార్ సిగ్నళ్లను జామ్ చేసింది. ఫలితంగా సూటర్ రాడార్ నెట్వర్క్ యాక్టివేట్ అయ్యింది. దాంతో.. డీజిల్ జనరేటర్ల ద్వారా ఎస్-300 రక్షణ వ్యవస్థలను తిరిగి యాక్టివేట్ చేసినా.. అవి స్పూఫింగ్ ప్రభావంతో స్తబ్ధుగా ఉండిపోయాయి.భారత్ ఎంత వరకు సురక్షితం?వెనెజువెలా ఉదంతం తర్వాత.. ప్రపంచదేశాలు సందిగ్ధంలో పడ్డాయి. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో.. రష్యా అధినేత పుతిన్ను ఇలాగే కిడ్నాప్ చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు విన్నపాలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ అధినేత బెంజమిన్ నెతన్యాహును నిర్బంధించాలంటూ అమెరికా మిత్రదేశం పాకిస్థాన్ బహిరంగంగా కోరింది. అలాగే రష్యాతో చమురు వాణిజ్యం.. టారిఫ్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ విషయంలోనూ ట్రంప్ అసంతృప్తిగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో.. ఒకవేళ ఇలాంటి దాడులే ఒకవేళ భారత్పై జరిగితే ఎలా ఉంటుంది?.. ఐదేళ్ల క్రితం చైనా మాల్వేర్ కారణంగా మహారాష్ట్రలో గ్రిడ్ వైఫల్యం చెందిన విషయం తెలిసిందే..!. మనదేశంలో విద్యుత్తు వ్యవస్థలో చైనాకు చెందిన పరికరాలు, హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ను వాడుతున్న దాఖలాలున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా వాడినటువంటి మాల్వేర్ను జిత్తుల మారి చైనా కూడా జొప్పించి ఉంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి 2021లో మనదేశంలో పవర్ గ్రిడ్లలో మాల్వేర్పై మోదీ సర్కారు ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. లోపాలను ఇప్పటికే సరిచేసి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఆపరేషన్ సిందూర్ సమయంలోనే.. మన గగనతల రక్షణ వ్యవస్థలు ఎంతో ముందంజలో ఉన్నట్లు తేలింది. అంతెందుకు.. అమెరికాకు చెందిన ఎఫ్-35 ఫైటర్ జెట్ కోచి తీరంలో తచ్చాడితే.. మన వైమానికదళం వెంటనే గుర్తించి హెచ్చరికలు పంపింది. అత్యంత అధునాతన స్టెల్త్ విమానంగా అమెరికా తన ఎఫ్-35కు పట్టం కట్టింది. అలాంటి విమానాన్ని కూడా భారత్ గుర్తించడంతో.. సాంకేతికలోపాల పేరుతో తిరువనంతపురంలో నెలరోజులపాటు ఆ విమానాన్ని ల్యాండ్ చేసిన విషయం తెలిసిందే..! ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ అటు అఫెన్స్ లోనూ.. ఇటు డిఫెన్స్ లోనూ 99% కచ్చితత్వాన్ని కలిగి ఉందని, అమెరికా, రష్యా, ఇజ్రాయెల్కు కూడా ఇంతటి రికార్డు లేదని తేలింది. సైబర్ అలర్ట్ లో మన సెర్ట్ ఎంతో ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో వెనెజువెలా తరహా దాడుల విషయంలో భారత్ అత్యంత సురక్షితంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.:: హెచ్.కమలాపతిరావు -
బంగ్లాదేశ్లో మరో దారుణం
బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులు నానాటికీ పెరుగుతున్నాయి. ఇటీవలే ఇస్లాం వ్యతిరేఖ ఆరోపణలతో పలువురు హిందు మతానికి చెందిన వ్యక్తులుపై దాడి చేసి చంపిన సంగతి తెలిసిందే. తాజాగా సునాంఘంజ్ అనే జిల్లాలో జోయ్ మహాపాత్ర అనే యువకుడిపై దాడి చేసి అనంతరం విషం ఇచ్చి చంపినట్లు అక్కడి మీడియా కథనాలు తెలిపాయి.బంగ్లాదేశ్ హింసతో అట్టుడికిపోతుంది ఇటీవల అక్కడి స్టూడెంట్ లీడర్ ఉస్మాన్ హాదీ మృతితో హిందువులపై తిరిగి మెుదలైన దాడులు ఏమాత్రం శాంతించడం లేదు. గడిచిన 40 రోజుల్లోనే 12 మంది హిందువులు హత్యకు గురయ్యారంటే పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ దాడులకు స్పష్టమైన కారణం ఏమి లేకపోయినప్పటికే.. అక్కడి మత ఛాందసవాదులు హిందువులే టార్గెట్గా దాడులు జరుపుతున్నారనేది కాదనలేని సత్యంఈ నేఫథ్యంలో హత్యలను భారత్ పలుమార్లు ఖండించింది మైనార్టీలపై దాడులు అరికట్టాలని కోరింది. ఇటీవల ఆ దేశ మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియా అంత్యక్రియలకు సైతం భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ హాజరయి సంతాపం ప్రకటించారు.పరిస్థితులను కొంత అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడి మతఛాందస వాదులు విద్వేశాన్ని చిమ్మడం ఆపడం లేదు. తాజాగా సునాంఘంజ్ జిల్లాలో జోయ్ మాహాపాత్ర అనే హిందూ యువకునిపై అక్కడి అల్లరిమూకలు దాడి చేశాయి. అతనిని తీవ్రంగా కొట్టి అనంతరం విషం ఇచ్చాయి. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన మహాపాత్రను ఉస్మానీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ 2026 ప్రారంభమై పదిరోజుల కూడా కాకముందే బంగ్లాదేశ్లో నలుగురు హిందువులు హత్యకు గురయ్యారు. నూతన సంవత్సర వేడుకల వేళ షరియత్ పూర్ జిల్లాలో ఖోకన్ చంద్రదాస్ అనే వ్యక్తిపై దాడిచేసి చంపారు. జనవరి 5న హిందూ వార్త సంపాదకుడు రాణా కాంతి బైరాగిని కాల్చిచంపారు. అనంతరం నర్సింగి జిల్లాలో వ్యాపారి మణి చక్రవర్తి ప్రాణాలు తీశారు. తాజాగా మహాపాత్ర అనే యువకుడిని విషం ఇచ్చి చంపారు. బంగ్లాదేశ్లో ఇంత పెద్దఎత్తున హిందువులపై దాడులు జరగడం భారత్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. -
మదురో మాదిరే పుతిన్ను బంధించి పట్టుకొస్తారా?
ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా.. వెనెజువెలాపై సైనిక చర్యను చేపట్టిన ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను నిర్బంధించి తమ దేశానికి తీసుకొచ్చింది అమెరికా. ఈ ఘటనను పలు దేశాలు ఖండించగా.. ఇది తమ దేశ భద్రతకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, వెనెజువెలా మంచి కోసం కూడా చేశామంటూ డొనాల్డ్ ట్రంప్ తన చర్యను సమర్థించుకున్నారు. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విషయంలోనూ ఇలా చేస్తారా? అనే ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధంలో కాల్పుల విరమణ, శాంతి ప్రణాళిక ఒప్పందం కోసం ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. తొలినాళ్లలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ మీద మండిపడ్డ అగ్రరాజ్యం అధ్యక్షుడు.. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ మీద సాఫ్ట్ టోన్ ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే గత కొంతకాలంగా ఆ పరిస్థితి మారింది. పైగా వెనెజువెలా చమురు విషయంలో రష్యాకు సంబంధించిన షాడో ఫ్లీట్ సీజ్ నేపథ్యంలో.. అమెరికా-రష్యాల మధ్య వార్నింగ్ ఇచ్చుకునే స్థాయిలో పరిస్థితి చేరుకుంది. ఈ తరుణంలో.. వెనెజువెలా రాజధాని కారకస్పై జనవరి 3వ తేదీన అమెరికా వైమానిక దళాలతో మెరుపు దాడులు చేసి మదురోను బంధించిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ నేరాల అభియోగాలతో ఆయన్ని అమెరికా ఫెడరల్ కోర్టులు విచారణ చేస్తున్నాయి. ఈ పరిణామంపై అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. కొలంబియా అధ్యక్షుడా?, ఇరాన్ సుప్రీం లీడరా?అమెరికా అధ్యక్షుడి నెక్ట్స్ టార్గెట్ ఎవరై ఉంటారా? అనే చర్చా జోరందుకుంది. అమెరికా చమురు–గ్యాస్ కంపెనీల అధిపతులతో సమావేశంలో.. పుతిన్ను అలా బంధిస్తారా? అని మీడియా వేసిన ప్రశ్నకుగానూ ట్రంప్ సమాధానం ఇచ్చారు. పుతిన్ను పట్టుకోవడం అవసరం లేదు, కానీ నేను ఆయన విషయంలో చాలా నిరాశలో ఉన్నాను అని అన్నారు. ఇప్పటిదాకా తాను ఎనిమిది యుద్ధాలను ముగించానని, కానీ ఉక్రెయిన్ సంక్షోభాన్ని మాత్రం త్వరగా ఆపలేకపోయానని విచారం వ్యక్తం చేశారు. మరోవైపు... ఇదే అంశంపై పరోక్షంగా జెలెన్స్కీ కూడా స్పందించారు. మదురో అరెస్టు తర్వాత పుతిన్పై కూడా అమెరికా ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదంటూ వ్యాఖ్యానించారు. ఒక నియంతను(పుతిన్ను ఉద్దేశిస్తూ..) ఇలా ఎదుర్కోవాలంటే.. తర్వాత ఏం చేయాలో అమెరికాకు తెలుసు’’ అని వ్యాఖ్యానించారు.ఉక్రెయిన్పై రష్యా యుద్ధం 2022 ఫిబ్రవరి 24న మొదలైంది. అయితే యుద్ధ నేరాల ఆరోపణలతో ది హేగ్లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వ్లాదిమిర్ పుతిన్పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాధినేతగా పుతిన్కంటూ ఓ పేరుంది. అలాంటిది ఆయన్ని అంత తేలికగా నిర్బంధించడం అమెరికాకు కలలో కూడా సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం అంతర్జాతీయ విశ్లేషకుల నుంచి ఎదురవుతోంది. -
అమ్మాయిల నోట్లో సిగరెట్.. చేతిలో లైటర్..
టెహ్రాన్: ఇరాన్లో నిరసనలు పీక్ స్టేజ్కు చేరుకున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. మరోవైపు.. ఆందోళనల్లో యువతులు సిగరెట్లు తాగుతూ.. ఖమేనీ ఫొటోలను మంటల్లో కాల్చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.ఇరాన్లో సుప్రీం లీడర్ ఖమేనికి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలు 13వ రోజుకు చేరుకున్నాయి. ఖమేనీకి వ్యతిరేకంగా దేశం అంతా ఒక్కతాటిపైకి వచ్చింది. పెరుగుతున్న ధరలు, పడిపోతున్న కరెన్సీ విలువ, విదేశీ మారకం నిల్వలతో దేశం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో.. అక్కడ ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి ప్రజలు రోడ్డెక్కుతున్నారు. 1979 ఇరాన్ విప్లవం తర్వాత అంతటి స్థాయిలో మళ్లీ అక్కడ విప్లవ జ్వాలలు రగులుతున్నాయి.మరోవైపు.. మహిళలు తమ హక్కులపై పోరాటం చేస్తున్నారు. శుక్రవారం ఇంటర్నెట్ బంద్ చేయడం, అంతర్జాతీయ కాల్స్ నిలిపివేతతో ఆ ఆగ్రహ జ్వాలలై తారాస్థాయికి చేరాయి. హిజాబ్ (బురఖా) లేకుండా బయటకు రావద్దనే కఠిన నిబంధనలున్న దేశంలో.. స్కర్టులు, మిడ్డీలు వేసుకుని యువతులు, మహిళలు నిరసనల్లో పాల్గొంటున్నారు. అంతటితో ఆగకుండగా.. ఖమేనీ ఫొటోలను సిగరెట్లతో కాలుస్తున్న దృశ్యాలు.. ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పులు పెట్టే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. దీంతో, ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని ఏళ్లుగా ఉన్న సిగరెట్ నిషేధాన్ని కాదని.. ఏకంగా సుప్రీం లీడర్ ఫొటోతో సిగరెట్ అంటించుకోవడంపై చర్చ జరుగుతోంది. అక్కడి మహిళలు ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. An Iranian girl burns a picture of Ayatollah Khamenei and lights her cigarette, a new trend in Iran! Young Iranian women are leading the revolution against the Islamic regime.pic.twitter.com/UIFYHMPBGA— Dr. Maalouf (@realMaalouf) January 10, 2026అయితే, ఇరాన్లో సుప్రీం లీడర్ ఫొటోను కాల్చడం అక్కడి చట్టాల ప్రకారం పెద్ద నేరం. అది కూడా ఫొటోతో సిగరేట్ అంటించుకోవడం ఆ చట్టాల ప్రకారం క్షమించరాని నేరం. అయితే ఈ చర్య ద్వారా మహిళలు ప్రభుత్వానికి, భవిష్యత్ నాయకులకు స్పష్టమైన మెసేజ్ పంపినట్లు స్పష్టమవుతోంది. అక్కడి పురాతన చట్టాలను ధిక్కరిస్తున్నట్లు చెప్పకనే చెప్పారు. మహిళా హక్కులు, స్వేచ్ఛపై ఇస్లాం చట్టాలు విధిస్తున్న నిర్బంధాల గోడలను కూల్చేస్తున్నామని వాళ్లు.. అంత ధైర్యంగా.. తెగింపుతో ఈ విధంగా నిరసనలకు దిగారు. ఇదిలా ఉండగా.. ఖమేనీకి వ్యతిరేకంగా చేసే చర్యలను ఉపేక్షించేది లేదని అధికార వర్గాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ.. మహిళలు తిరస్కార ధోరణిలో ఇలాంటి చర్యలకు దిగటం.. మహిళలపై అణచివేతను ఎప్పటికీ సహించేది లేదని వాదనను బలంగా వినిపిస్తున్నట్లు ప్రపంచానికి సందేశం పంపుతున్నట్లు తెలుస్తోంది.Iranian women burning their hijabs in Tehran tonight. Protesters are also torching property linked to Islamic regime forces, including vehicles, mosques, and even their residences.This is a message not only to the regime, but for the who world to see#Iran #IranRevolution2026 pic.twitter.com/A910OUoJSL— acpcrf (@acpcrf) January 10, 2026ఇక, డిక్టేటర్ అంతం.. ఇస్లామిక్ రిపబ్లిక్ అంతం.. ఇది చివరి పోరాటం! పహ్లవి తిరిగి వస్తాడు! అంటూ నినాదాలతో ఇరాన్ మారుమోగిపోతోంది. అసలు ఎవరీ పహ్లవి గురించి నెట్టింట వెతుకులాట కనిపిస్తోంది. రేజా పహ్లవి(Reza Pahlavi).. ఇరాన్ను పాలించిన చివరి షా కుమారుడు. అమెరికాలో నివసిస్తూ ఇరాన్ ప్రజలను పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొనాలంటూ పిలుపునిచ్చాడు. ఇరాన్ను పహ్లవి రాజవంశం 1925 నుంచి 1979 వరకు పాలించింది. ఆ కాలంలో రాజులు వెస్ట్రన్ సూట్లలో కనిపిస్తూ దేశాన్ని పారిశ్రామీకరణ దిశగా నడిపించారు. మహిళలు హిజాబ్ లేకుండా, చిన్న స్కర్టులతో వీధుల్లో స్వేచ్ఛగా తిరిగేవారు. వీళ్ల పాలనలో.. టెహ్రాన్ నగరం అప్పట్లో మిడిల్ ఈస్ట్ పారిస్గా ప్రసిద్ధి చెందింది. అయితే, ఈ వెలుగుల వెనుక షా కఠిన పాలన, అవినీతి, పాశ్చాత్య శక్తుల ప్రభావం దాగి ఉండేది. చివరకు అవినీతి కారణంగా రాజవంశం గద్దె దింపబడిందని చరిత్ర చెబుతోంది.These Iranian women are showing their faces, no burkas, no fear...inside Iran....calmly smoking while burning a photo of Khamenei.That takes more courage than the entire Western left-wing feminist class combined.These women aren’t posting slogans or trying to run over law… pic.twitter.com/dZItOJzwzw— Flopping Aces (@FloppingAces) January 9, 2026 -
H-1B వీసా కొత్త ఫీజులు.. మార్చి 1 నుంచి అమల్లోకి!
అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్).. ప్రీమియం ప్రాసెసింగ్ సేవల ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఫీజులు 2026 మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. జూన్ 2023 నుంచి జూన్ 2025 వరకు నమోదైన ద్రవ్యోల్బణంను పరిగణలోకి తీసుకుని ఈ పెంపు చేసినట్లు యూఎస్సీఐఎస్ వెల్లడించింది.ఈ కొత్త మార్పులు ముఖ్యంగా ఉద్యోగ ఆధారిత, నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తులకు వర్తిస్తాయి. అమెరికాలో పని చేస్తున్న లేదా చదువుతున్న భారతీయులపై ఇవి గణనీయమైన ప్రభావం చూపనున్నాయి.పెరిగిన ఫీజుల వివరాలు➤ఫారమ్ I-129 (H-2B, R-1 వీసాలు) ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు 1,685 డాలర్ల నుంచి 1,780 డాలర్లకు పెరిగింది.➤ఫారమ్ I-129 (H-1B, L-1, O-1, P-1, TN వీసాలు) ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు 2,805 డాలర్ల నుంచి 2,965 డాలర్లకు పెరిగింది.➤ఫారమ్ I-140 (ఉపాధి ఆధారిత వర్గాలలోని విదేశీ కార్మికులు) ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు 2,805 డాలర్ల నుంచి 2,965 డాలర్లకు పెరిగింది.➤ఫారమ్ I-539 (వలసేతర స్థితిని పొడిగించడానికి లేదా మార్చడానికి), F-1, F-2 విద్యార్థులు.. J-1, J-2 ఎక్స్ఛేంజ్ విజిటర్లు.. M-1, M-2 వృత్తిపర విద్యార్థులకు ఫీజు 1,965 డాలర్ల నుంచి 2,075 డాలర్లకు పెరిగింది.➤ఫారమ్ I-765 (ఉద్యోగ అనుమతి - OPT, STEM-OPT) ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు 1,685 డాలర్ల నుంచి 1,780 డాలర్లకు పెరిగింది.పెరిగిన ఫీజుల ఆధారంగా వచ్చిన ఆదాయాన్ని.. ప్రీమియం ప్రాసెసింగ్ సేవల మెరుగుదలకు, దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయడానికి, పెండింగ్ కేసుల తగ్గింపుకు, మొత్తం USCIS సేవల నాణ్యత పెంపుకు వినియోగిస్తామని యూఎస్సీఐఎస్ స్పష్టం చేసింది.భారతీయులపై ఎక్కువ ప్రభావం!H-1B, L-1 వీసాల్లో భారతీయులు అత్యధికంగా ఉంటారు. ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్ పెండింగ్లలో కూడా ఇండియన్స్ వాటా ఎక్కువ. OPT, STEM-OPTలను ఉపయోగించే భారతీయ విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంది. ఉద్యోగ మార్పులు, వీసా పొడిగింపులు, ప్రయాణ ప్రణాళికల కోసం ప్రీమియం ప్రాసెసింగ్పై ఆధారపడేవారు ఎక్కువ. కాబట్టి ఫీజులు పెరిగితే.. ఈ ప్రభావం భారతీయుల మీద ఎక్కువగా ఉంటుంది.ఇదీ చదవండి: రూ. లక్ష ఖర్చుతో.. 5 సీటర్ ఎలక్ట్రిక్ కారు! -
పాకిస్థాన్లో హిందూ రైతు దారుణహత్య
పాకిస్థాన్లో దారుణం జరిగింది. ఆ దేశంలో నివసిస్తున్న ఓ హిందు రైతుని సర్ఫరాజ్ నిజామని అనే భూస్వామి కాల్చిచంపారు. దీంతో అక్కడి మైనార్టీ వర్గాలు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టాయి. భారత్లోమైనార్టీల హక్కులు కాలరాస్తున్నారని అక్కడి విదేశాంగశాఖ మంత్రి ప్రసంగించిన మరుసటి రోజే అక్కడి ఈ కాల్పులు జరగడం కలకలం రేపుతుంది. ఇటీవల కాలంలో ఇస్లామిక్ అధిపత్యం ఉన్న దేశాలలో హిందువులపై దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కొద్దిరోజుల క్రితం బంగ్లాదేశ్లో హిందువులపై తీవ్రస్థాయిలో హింస చేలరేగింది. అక్కడి స్టూడెంట్ లీడర్ మృతితో అక్కడి మత ఛాందస వాదులు చెలరేగిపోయారు. ఇస్లాం వ్యతిరేక ప్రచారాల నెపం మోపి అనేక మందిపై దాడి చేసిం చంపారు. వారి ఆస్తులను ధ్వంసం చేశారు. ఆ ఘటనను పూర్తిగా మరువక ముందే తాజాగా పాకిస్థాన్లో మరోసారి హిందూ రైతుని కాల్చిచంపారు.సింధూ ప్రావిన్సూకు చెందిన సర్ఫరాజ్ నిజమని అనే భూస్వామికి చెందిన భూమిని కైలాస్ కోల్హి అనే హిందూ రైతు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసే వారు. రెండురోజుల క్రితం కైలాస్ కోల్హి ఛాతిపై సర్ఫరాజ్ కాల్పులు జరిపాడు. దీంతో ఆ రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ రైతు మృతితో పాకిస్థాన్లోని మైనార్టీలు భగ్గుమన్నారు. పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. పాకిస్థాన్ మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ మాట్లాడుతూ "ఈ హత్య చాలా క్రూరమైంది. ఇది కేవలం ఒకవ్యక్తిపై దాడి కాదు మానవత్వంపై జరిగిన దాడి" అని ఆయన అన్నారు. కైలాస్ కోల్హిపై ఎందుకు కాల్పులు జరిపారో అనే వివరాలు తెలియాల్సి ఉంది. పాకిస్థాన్ మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ మాట్లాడుతూ "ఈ హత్య చాలా క్రూరమైంది. ఇది కేవలం ఒకవ్యక్తిపై దాడి కాదు మానవత్వంపై జరిగిన దాడి, నిందితున్ని వెంటనే అరెస్టు చేయాలి." అని ఆయన అన్నారు. కాగా మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలని తొలగించే పనులలో భాగంగా టర్కీగేట్ వద్ద ఫైజ్-ఇ-ఇలాహి మసీదు సమీపంలోని కట్టడాలను తొలగించారు.దీనిపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రిత్వశాఖ భారత్లో మైనార్టీల హక్కులు కాలరాస్తున్నారంటూ విమర్శలు చేసింది. అయితే ఈ వ్యాఖ్యలకు భారత ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. మైనార్టీలపై తరచుగా దాడులు చేసే దేశానికి ఈ వ్యాఖ్యలు చేసే హక్కులు లేదని విమర్శించింది. Badin SindhThe protest for the arrest of the killers of the martyred Kalash Kolhi is making history.Shiva Kachhi, Chairman of Pakistan Darawar Ittehad @PItehad is leading the historic protest sit-in.This was not just a protest—it was the cry of a wounded conscience.From… pic.twitter.com/uo9io9PAk0— Shiva Kachhi (دراوڙ)🇵🇰 (@FaqirShiva) January 9, 2026 -
భారత్కు వెనెజువెలా చమురు..?
ఏదో రకంగా వెనెజువెలాను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆ దేశా అధ్యక్షుడు మదురోను బంధించి, ఆపై పదవీ వీచ్యుతుడిని చేసి వెనెజువెలా పై ఆధిపత్యం కనబరిచింది అమెరికా. తమ దేశానికి మదురో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న ఒక నింద వేసి.. ఆయనపై నార్కో టెర్రరిస్టు ముద్ర వేసి జైల్లో ఉంచింది. అయితే ఇప్పుడు వెనెజువెలా చమురును ఎలా అమ్ముకోవాలనే యోచన చేస్తోంది ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం. భారత్ ఓకే అంటే వెనెజువెలా చమురును అమెరికా సరఫరా చేయడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని వైట్హౌస్ వర్గాలు వెల్లడించాయి. భారత్పై ట్రంప్ తంత్రం.. కుతంత్రం ఇదేనా?అసలు రష్యా చమురును బారత్ ఎందుకు ఆపాలనే దానిపై అమెరికా పెద్దలు స్పష్టంగా ఏమీ చెప్పరు. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపడానికనే ఒక కుంటిసాకు చెబుతూ వస్తున్నారు. ఉక్రెయిన్తో సుదీర్ఘ యుద్ధం నేపధ్యంలో రష్యా ఆర్థిక వ్యవస్థ కాస్త బలహీనపడింది. ఇప్పుడు ఆ దేశ చమురును భారత్ కొనుగోలు చేయకుండా ఆపేస్తే మరింత ఇబ్బందిని పుతిన్ ప్రభుత్వానికి చూపించాలనేది ట్రంప్ మరొక ఆలోచన అయి ఉండొచ్చు. అదే సమయంలో వెనెజువెలా చమురును భారత్కు సరఫరా చేసి క్యాష్ చేసుకోవచ్చు అనే ఉద్దేశమే ట్రంప్లో కనిపిస్తోంది. అందుకు 500 శాతం సుంకాలంటూ ట్రంప్ భయపెట్టే పనిపెట్టుకున్నారు. భారత్ ఎంత వరకూ భయపడుతుందో లేదో అనే విషయాన్ని పక్కన పెడితే, వెనెజువెలా చమురులో నాణ్యతపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ చమురును బయటకు తీసిన తర్వాత విక్రయాలు జరపడానికి అధికంగా శ్రమించాల్సి ఉంటుందని, అప్పుడు కానీ అందులో నాణ్యత రాదని అంటున్నారు. ఒకవేళ సాధారణ ప్రాసెస్లో వెనెజువెలా చమురును అమ్మకాలు జరిపితే మాత్రం మరింత కాలుష్యానికి కారణం అవుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. పడితే గిడితే.. మేమే బాగుపడాలి..!ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అంతా స్వార్తపూరితమే కనిపిస్తోందని కాదనలేని సత్యం. కాస్త పెద్ద దేశాల్ని సుంకాలతో భయపెట్టడం, చిన్న దేశాలపైకి యుద్ధం పేరుతో దాడి చేయడం జరుగుతుంది. ఇరాన్ మొదలుకొని ఇప్పటి గ్రీన్లాండ్ వ్యవహారంలో కూడా ట్రంప్ ఇదే ధోరణి అవలంభిస్తున్నారు. పైకి తానొక శాంతి ప్రభోధకుడిగా చెప్పుకుంటూ.. తానొక నియంత అని నిరూపించుకుంటూనే ఉన్నారు ట్రంప్. బాగుపడితే మేమే బాగుపడాలి.. మేము అగ్రజులం అనే దూర్త లక్షణం మాత్రం కనిపిస్తోంది. కొత్త కంట్రోల్డ్ ఫ్రేమ్ వర్క్ తర్వాత..ఇప్పటికే యూఎస్ఏ కఠినమైన ఆంక్షలతో చెలరేగిపోతోంది. తమ మాట వినేవారికి ఒక రకంగా, వినని వారికి మరో రకంగా ట్రీట్మెంట్ ఇస్తూనే ఉంది. ట్రంప్ పాలన చేపట్టిన తర్వాత ఆంక్షల పర్వమే కనిపిస్తోంది. భారత్కు వెనెజువెలా చమురును అమ్మడానికి కొత్త గవర్నెన్స్ను తీసుకొస్తామంటోంది వైట్హౌస్. కచ్చితమైన నియమాలతో ఉండే కంట్రోల్డ్ ఫ్రేమ్ వర్క్ తర్వాత భారత్కు వెనెజువెలా చమురును అమ్ముతామని తెలిపింది. భారత్ ఏమంటోందో చూడాలి..ఈ అంశంపై భారత్ ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి. ఇంకా భారత్కు చాన్స్ ఉందంటూ 500 శాతం సుంకాలపై అమెరికా వాణిజ్య కార్యదర్శి లుట్నిక్ స్పష్టం చేసిన తర్వాతే వెనెజువెలా చమురు అంశాన్ని అమెరికా తెరపైకి తీసుకొచ్చింది. అంటే వన్ బై వన్ ప్రణాళిక ప్రకారమే ట్రంప్ వ్యూహం సిద్ధం చేసినట్లు కనబడుతోంది. బలవంతంగా భారత్ చేత ఎంతో కొంత చమురును కొనుగోలు చేయించేందుకు అమెరికా సన్నద్ధమైందనేది వరుసగా జరుగుతున్న పరిణామాల్ని బట్టి అర్థమవుతోంది. భారత్కు రష్యాను ప్రధాన సరఫదారు..2022 తర్వాత భారత్కు రష్యా అతిపెద్ద చమురు సరఫరాదారుగా మారింది. రష్యా చమురు తక్కువ ధరలో లభిస్తోంది, అందుకే భారత్ ఎక్కువగా కొనుగోలు చేస్తోంది. 2025 నవంబర్లో భారత్ రష్యా నుంచి 7.7 మిలియన్ టన్నుల క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసింది. ఇది భారత మొత్తం చమురు దిగుమతుల్లో 35.1% వాటా కాగా, దాని విలువ 3.7 బిలియన్ యూఎస్ డాలర్లుగా ఉంది. భారత చమురు బిల్లు లో 34% భాగంగా ఉంది. జనవరి–అక్టోబర్ 2025లో రష్యా నుంచి దిగుమతులు గత సంవత్సరం కంటే 17.8% తగ్గాయి. అయితే అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా చమురు కొనుగోలు చేయడం తగ్గింది. ట్రంప్ ముందస్తు వ్యూహం కాక మరేమిటి.?మరి ఇప్పుడు అమెరికా.. భారత్తో వాణిజ్య ఒప్పందంలో కచ్చితంగా వెనెజువెలా చమురు అంశాన్ని లేవనెత్తడం ఖాయం. అమెరికా వరుస గేమ్ ప్లాన్స్ కూడా అందుకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ముందుగా త్వరలో 500 శాతం సుంకాలు పెంపు అనడం,, ఇంకా భారత్తో ఒప్పందానికి సమయం ఉందని అనడం, ఇప్పుడు వెనెజువెలా చమురును భారత్కు అమ్మడానికి సిద్ధంగా ఉన్నామంటూ అమెరికా వైట్హౌస్ వర్గాలు అనడం.. ఇవన్నీ కూడా ట్రంప్ ముందస్త వ్యూహం కాక మరేమిటి.?ఇదీ చదవండి:వెనెజువెలా చమురు.. అంత వీజీ కాదు ట్రంపూ! -
ఎలాగైనా గ్రీన్లాండ్ నాకు కావాలంతే..!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గ్రీన్లాండ్ను ఏదో రకంగా తమ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. తంత్రమో వేశో.. కుతంత్రం చేశో గ్రీన్లాండ్ను తమ భూభాగంలోకి కలిపేసుకోవాలని అనుకుంటున్నారు. ఒకవైపు గ్రీన్లాండ్పై కన్నేస్తే యుద్ధం తప్పదంటూ డెన్మార్క్ ఇప్పటికే హెచ్చరికల నేపథ్యంలో ట్రంప్ దీనిపై శరవేగంగా పావులు కదుపుతున్నారు. ట్రంప్ తాజా ఆదేశాల్ని బట్టి గ్రీన్లాండ్తో పోరు కోసం యూఎస్ సైన్యాన్ని సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. గ్రీన్లాండ్ను దక్కించుకునే క్రమంలో ఎవరైనా తమ మాట వింటే ఓకే.. లేకపోతే అమెరికా అంటే ఏమిటో చూపించాలని ఆ దేశ బలగాలకు దిశా నిర్దేశం చేశారు. గ్రీన్లాండ్ను సీజ్ చేయడానికి ఎంత సైనిక సాయం కావాలో అంతా వాడుకోవాలంటూ ఆర్మీకి సూచించారు ట్రంప్.గ్రీన్లాండ్ భూభామనేది చైనా, రష్యా ఆక్రమించుకోలేదని, డెన్మార్క్కు పరిధిలో ఉందనే విషయాన్ని గుర్తించుకోవాన్నారు. ‘ గ్రీన్లాండ్ కచ్చితంగా మన వశం కావాలి. ముందు గ్రీన్లాండ్న దక్కించకోవడానికి ఎన్ని సునాయాస ప్రయత్నాలు ఉన్నాయో అన్ని ట్రై చేద్దాం. ఒకవేళ అలా కాని పక్షంలో మన శక్తి ఏమిటో చూపించి దాన్ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది’ అంటూ సంకేతాలు పంపారు. ఖనిజ సంపదతో నిండిన ఆ ద్వీపాన్ని నియంత్రించడం అమెరికా జాతీయ భద్రతకు అత్యంత కీలకమని, ఎందుకంటే ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనా సైనిక కార్యకలాపాలు పెరుగుతున్నాయన్నారు. దాంతో గ్రీన్లాండ్ అనేది అమెరికా అత్యంత అవసరమని స్పష్టం చేశారు ట్రంప్.ఇది యుద్ధానికి సంకేతమా?2019లో ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంలోనే గ్రీన్లాండ్పై బేరసారాలు జరిపారు. అప్పుడు ప్రభుత్వానికి డబ్బు ఆఫర్ను ప్రతిపాదించారు ట్రంప్.. అయితే దాన్ని డెన్మార్క్ తిరస్కరించింది. కానీ రెండోసారి అధ్యక్షుడైన ట్రంప్ మరోసారి కూడా డబ్బును వెదజల్లడానికి సిద్ధమయ్యారు. ఈసారి డెన్మార్క్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి.. గ్రీన్లాండ్ ప్రజలకు భారీ ఆఫర్ను తెరపైకి తీసుకొచ్చారు. అక్కడ ఉండే వారికి ప్రతీ వ్యక్తికి 10 వేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల వరకూ ఇచ్చి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించాలని చూస్తున్నారు. ఇప్పుడు సైనిక చర్య ద్వారానైనా గ్రీన్లాండ్ తమది కావాలని అంటున్నారు ట్రంప్. తాజా ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికా-డెన్మార్క్ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని, ఏ క్షణమైనా ఇరు దేశాల మధ్య యుద్ధం తప్పకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
విద్యుత్ విప్లవం: వేలాడే వైర్లు.. భయపెట్టే ట్రాన్స్మీటర్లు కనుమరుగు
ప్రస్తుత ఆధునిక కాలంలో మనమంతా ప్రతీ పనికి, అవసరానికి విద్యుత్తుపైననే ఆధారపడుతున్నాం. అయితే ఆ విద్యుత్తును అందుకునేందుకు మనం వాడే వైర్లు, ప్లగ్లు మనకు చాలాసార్లు చికాకు కలిగిస్తుంటాయి. అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు అద్భుత ప్రయోగాలు చేస్తున్నారు. వైఫై (Wi-Fi) ద్వారా డేటా ఏవిధంగా గాలిలో ప్రయాణిస్తుందో, అదే తరహాలో విద్యుత్తును కూడా వైర్లు లేకుండా సరఫరా చేసే సాంకేతికతను వారు అభివృద్ధి చేస్తున్నారు.గాలి ద్వారా ప్రసారంఈ వైఫై తరహా విద్యుత్ ప్రాజెక్టులో ఫిన్లాండ్లోని ప్రఖ్యాత ‘ఆల్టో యూనివర్సిటీ’ కీలక పాత్ర పోషిస్తోంది. విద్యుదయస్కాంత క్షేత్రాలు (Electromagnetic Fields),‘రిజోనెంట్ కప్లింగ్’ అనే సాంకేతికతను ఉపయోగించి, గాలి ద్వారా విద్యుత్తును పంపవచ్చని ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు నిరూపించారు. దశాబ్దాల క్రితం నికోలా టెస్లా కలలుగన్న ఈ వైర్లెస్ విద్యుత్ కల, ఇప్పుడు ఫిన్లాండ్ శాస్త్రవేత్తల కృషితో సాకారం కానుంది.తక్కువ దూరాల్లో సమర్థవంతం ఆల్టో యూనివర్సిటీ గతంలోనే మ్యాగ్నెటిక్ లూప్ యాంటెన్నాల ద్వారా విద్యుత్ ప్రసారంపై ప్రయోగాలు చేసి విజయం సాధించింది. ఈ యాంటెన్నాల మధ్య ఏర్పడే శక్తివంతమైన ఐస్కాంత క్షేత్రం ద్వారా శక్తి ఒక చోటు నుండి మరో చోటుకు సులభంగా చేరుకుంటుందని గ్రహించారు. దీనివల్ల విద్యుత్ నష్టం (Energy Loss) చాలా తక్కువగా ఉంటుందని, తక్కువ దూరాల్లో ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.ప్రయోగాత్మక దశను దాటి.. ఇటీవల సోషల్ మీడియాలోను, అంతర్జాతీయ టెక్ వేదికలపై ఫిన్నిష్ శాస్త్రవేత్తలు కొన్ని వీడియోలను విడుదల చేశారు. ఇందులో ఎటువంటి వైర్ల సాయం లేకుండానే చిన్న చిన్న ఎలక్ట్రానిక్ వస్తువులు, బల్బులు, సెన్సార్లు పనిచేయడాన్ని గమనించారు. ఇది కేవలం ల్యాబ్ వరకే పరిమితం కాకుండా, ప్రయోగాత్మక దశ నుంచి ఆచరణాత్మక దశకు చేరుకుంటున్నదనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది.పరిశోధనలు ముమ్మరం అయితే ఈ సాంకేతికత ఇప్పుడున్న విద్యుత్ వైర్ల వ్యవస్థను ఇప్పటికిప్పుడే పూర్తిగా తొలగించలేదు. ప్రస్తుతం ఈ పద్ధతి కేవలం తక్కువ దూరాలకే పరిమితమైవుంది. ట్రాన్స్మీటర్ - రిసీవర్ మధ్య దూరం పెరిగే కొద్దీ విద్యుత్ ప్రసార సామర్థ్యం తగ్గిపోతుంది. దీనిని అధిగమించి, సుదూర ప్రాంతాలకు విద్యుత్తును పంపడంపై ప్రస్తుతం ఫిన్లాండ్లో పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి.మనిషి ఆరోగ్యంపై ప్రభావం?గాలిలో విద్యుత్ ప్రసారం చేయడం వల్ల మనుషులకు ఏమైనా ప్రమాదం ఉంటుందా? అనే కోణంలో కూడా ఆల్టో విశ్వవిద్యాలయ పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. మానవ కణజాలం ఈ తరంగాలకు ఎలా స్పందిస్తుందనే దానిని వారు పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఇది సురక్షితమని తేలితే, గుండెకు అమర్చే ‘పేస్ మేకర్’ వంటి వైద్య పరికరాలకు సైతం ఆపరేషన్ అవసరం లేకుండానే బయట నుండే వైర్లెస్ పద్ధతిలో ఛార్జ్ చేయవచ్చు.గ్రిడ్ వ్యవస్థకు తోడుగా..భారీ స్థాయిలో విద్యుత్తును ఒక నగరం నుండి మరో నగరానికి పంపడానికి ప్రస్తుతం, విద్యుత్ గ్రిడ్ వ్యవస్థను, వైర్లను వినియోగిస్తున్నాం. వైర్లెస్ విద్యుత్ అనేది ప్రస్తుతానికి సంప్రదాయ వ్యవస్థకు ప్రత్యామ్నాయం కాదు. కానీ ఒక అద్భుతమైన అదనపు వెసులుబాటు అని చెప్పిడంతో సందేహం లేదు. భవిష్యత్తులో మొబైల్ ఫోన్లు, రోబోట్లు, ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేయడానికి ఇది ఒక వరంగా మారనుంది.భవిష్యత్లో అందుబాటులోకి..పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ వైర్లెస్ విద్యుత్ సాంకేతికత సాధారణ ప్రజలకు అందుబాటులోకి రావడానికి మరికొన్ని ఏళ్ల సమయం పట్టనుంది. ప్రభుత్వాల నుండి అనుమతులు, భద్రతా ప్రమాణాలు, ఖర్చు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఫిన్లాండ్ చేస్తున్న ఈ ప్రయోగాలు భవిష్యత్లో మన జీవనశైలిని మరింత సులభతరం చేస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.ఇది కూడా చదవండి: పాక్లో హమాస్ - లష్కరే భేటీ.. వీడియో వైరల్ -
సరిహద్దులు చెరపొద్దు.. శాంతిని చంపొద్దు!
వాటికన్ సిటీ: ప్రపంచ దేశాల విదేశాంగ విధానంపై పోప్ లియో–14 సంచలన వ్యాఖ్యలు చేశారు. సార్వ¿ౌమ దేశాలపై బలప్రయోగం చేస్తూ.. తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలనుకునే దేశాల తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ చట్టాలను, ప్రపంచ శాంతిని కొన్ని దేశాలు ‘పూర్తిగా తుంగలో తొక్కుతున్నాయని’ఆయన ధ్వజమెత్తారు. యుద్ధం ‘ఫ్యాషన్’అయిపోయింది.. ‘ప్రస్తుతం యుద్ధం చేయడం మళ్లీ ఒక ఫ్యాషన్గా మారిపోయింది. దేశాల మధ్య యుద్ధ కాంక్ష విపరీతంగా పెరుగుతోంది’.. అని పోప్ ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ దేశాల రాయబారులతో జరిగిన వార్షిక సమావేశంలో ఆయన ఈ ప్రసంగం చేశారు. వెనిజువెలాలో నికోలస్ మదురోను గద్దె దించడానికి అమెరికా జరిపిన సైనిక చర్య, ఉక్రెయిన్పై రష్యా కొనసాగిస్తున్న యుద్ధం వంటి పరిణామాల నేపథ్యంలో పోప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బలప్రయోగ దౌత్యంపై ఆందోళన చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునే సంప్రదాయ దౌత్యం పోయి, ఇప్పుడు బలప్రయోగం లేదా మిత్రదేశాల కూటములతో బెదిరించే ‘బల ప్రయోగ దౌత్యం’రాజ్యమేలుతోందని ఆయన మండిపడ్డారు. ఆయుధాల ద్వారా శాంతిని స్థాపించాలనుకోవడం భ్రమ అని, ఇది కేవలం సొంత ఆధిపత్యాన్ని చాటుకోవడానికి చేసే ప్రయత్నమేనని పోప్ స్పష్టం చేశారు. ఇది ప్రపంచ శాంతికి పునాది అయిన చట్టబద్ధమైన పాలనను తీవ్రంగా దెబ్బ తీస్తుందని హెచ్చరించారు.శాంతియుత పరిష్కారం కనుగొనాలి వెనిజువెలాలో.. ప్రజల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని శాంతియుత రాజకీయ పరిష్కారం కనుగొనాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్లో తక్షణమే కాల్పుల విరమణ జరగాలని, శాశ్వత పరిష్కారం కోసం అంతర్జాతీయ సమాజం వెనకడుగు వేయకూడదని కోరారు. ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదానికి ‘ద్వి–దేశ పరిష్కారం’ఒక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు. పాలస్తీనియన్లకు తమ సొంత గడ్డపై జీవించే హక్కు ఉందని నొక్కి చెప్పారు. కేవలం విదేశాంగ విధానమే కాకుండా గర్భస్రావం, సరోగసీకి వ్యతిరేకంగా క్యాథలిక్ చర్చి వాణిని వినిపిస్తూనే.. ఐక్యరాజ్యసమితి వంటి బహుళపక్ష వేదికలు బలహీనపడుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా వాటికన్ దౌత్యపరమైన ప్రసంగాలు ఇటాలియన్ లేదా ఫ్రెంచ్ భాషల్లో సాగుతాయి. అయితే, ఈసారి పోప్ లియో తన ప్రసంగంలోని అధిక భాగాన్ని ఆంగ్లంలో కొనసాగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. -
తీవ్రవాదుల గుప్పిట్లో యూనస్ ప్రభుత్వం
తిరువనంతపురం: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు, నోబెల్ విజేత మొహమ్మద్ యూనస్పై ప్రవాస రచయిత్రి తస్లీమా నస్రిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో యూనస్ ప్రభుత్వం మత ఛాందసవాదులతో చేతులు కలిపిందని ఆరోపించారు. ఆ దేశంలో విభజన శక్తులకు అధికారాన్ని కట్టబెడుతోందని ఆమె మండిపడ్డారు. కేరళ శాసనసభ ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ పుస్తకోత్సవంలో ‘శాంతి కోసం పుస్తకం’అనే అంశంపై ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. నోబెల్.. శాంతికి కొలమానం కాదు ‘నోబెల్ శాంతి బహుమతి అనేది శాంతికి కొలమానం కాదు.. అధికారం మాత్రమే దాన్ని నిర్ణయిస్తుంది’.. అని తస్లీమా వ్యాఖ్యానించారు. గతంలో హెన్రీ కిసింజర్, ఆంగ్ సాన్ సూకీ వంటి వారు నోబెల్ పొందినా, వారి హయాంలోనూ మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయని ఆమె గుర్తు చేశారు. సూకీ మానవత్వం కంటే అధికారానికే ప్రాధాన్యమిచ్చి రోహింగ్యాల ఊచకోతను అడ్డుకోలేకపోయారని విమర్శించారు. బంగ్లా మైనారిటీల దుస్థితిపై ఆవేదన బంగ్లాదేశ్ ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని, ముస్లిం మత ఛాందసవాదులు మైనారిటీలపై (ముఖ్యంగా హిందువులపై) దాడులు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సెక్యులర్ విద్యాసంస్థలు, సైన్స్ అకాడమీలను నిర్మించాల్సింది పోయి, కేవలం ఓట్ల రాజకీయం కోసం గత ప్రభుత్వాలు మసీదులు, మదరసాలను భారీగా నిర్మించాయని విమర్శించారు. ఇవే జిహాదీలను తయారు చేసే కేంద్రాలుగా మారాయని ఆమె దుయ్యబట్టారు. రక్షణ లేని హిందూ మహిళలు బంగ్లాదేశ్లో హిందూ మహిళలకు కనీస చట్టపరమైన రక్షణ లేదని, బహుభార్యాత్వం, విడాకులు, ఆస్తి హక్కుల విషయంలో వివక్ష కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు. దీని కోసం ఉమ్మడి పౌర స్మృతి అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్లో అవామీ లీగ్ను నిషేధించి, జమాత్–ఏ–ఇస్లామీ వంటి శక్తులు పుంజుకోవడం ఆందోళనకరమన్నారు. జమాత్ అధికారంలోకి వస్తే ‘షరియా చట్టం’అమలవుతుందని, అప్పుడు మహిళలు, మైనారిటీల పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని తస్లీమా హెచ్చరించారు. భారత లౌకికత్వం భేష్ భారతదేశంలో మైనారిటీల పరిస్థితి బంగ్లాదేశ్పై ప్రభావం చూపుతోందా?.. అన్న ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. ‘భారత్కు దీంతో సంబంధం లేదు. 1947 నుండి బంగ్లాలో హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. భారత్ ఇప్పటికీ లౌకిక దేశంగానే ఉంది, కానీ బంగ్లాదేశ్ 1980లలోనే ఇస్లాంను అధికారిక మతంగా మార్చుకుని లౌకికత్వాన్ని కోల్పోయింది’.. అని ఆమె స్పష్టం చేశారు. బంగ్లాదేశ్లో మతాతీత రాజకీయాలు మళ్లీ రావాలంటే.. రాబోయే ఎన్నికలు పారదర్శకంగా జరగాలని, లౌకికవాద పారీ్టలే అధికారంలోకి రావాలని తస్లీమా నస్రిన్ ఆకాంక్షించారు. -
నిరసనలను కఠినంగా అణచివేస్తాం
దుబాయ్: ఇరాన్లో ప్రజాందోళనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. కరెన్సీ విలువ దారుణంగా పడిపోవడంతో జనం నిత్యావసరాలను సైతం కొనుగోలు చేయలేని పరిస్థితి దాపురించింది. ఈ పరిస్థితుల్లో సుప్రీం నేత అలీ ఖమేనీ(86) గద్దె దిగాలంటూ పది రోజులుగా నిరసనలు కొనసాగుతుండటం తెల్సిందే. సుప్రీం నేత అలీ ఖమేనీ శుక్రవారం తన నివాసం వెలుపల చేరిన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన శాంతియుతంగా నిరసనలు దిగిన ప్రజలపై హింసాత్మక చర్యలకు దిగితే వారికి మద్దతుగా నిలబడతామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన బెదిరింపుపై మండిపడ్డారు. ఇరానియన్ల రక్తంతో చేతులు తడుపుకున్నారంటూ ట్రంప్నుద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోసమే కొందరు వీధుల్లోకి వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరుల వ్యవహారాల గురించి ఆలోచించడానికి బదులుగా ట్రంప్ తన దేశం గురించి ఆలోచించడం మంచిదని సలహా ఇచ్చారు. ఇరాన్ యువరాజు పిలుపుగురు, శుక్రవారాల్లో వీధుల్లోకి వచ్చి ఖమేనీ పాలనపై నిరసన వ్యక్తం చేయాలని ఇరాన్ మాజీ రాజకుటుంబ వారసుడు, చివరి షా కుమారుడు రెజా పహ్లావి ప్రజలకు పిలుపు ఇచ్చారు. దీంతో, రాజధాని టెహ్రాన్ వాసులు గురువారం రాత్రి పనికిరాని వస్తువులతో వీధుల్లో మంటలు వేశారు. ఖమేనీ పాలనను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. రెజా పహ్లావి తిరిగి రావాలని డిమాండ్ చేశారు. జనం పెద్ద సంఖ్యల్లో వీధుల్లోకి తరలివచ్చి ర్యాలీలు చేపట్టిన వీడియోలు, ఫొటోలు ఆన్లైన్లో ప్రత్యక్షమవడంతో ప్రభుత్వం ఇంటర్నెట్, ఇంటర్నేషనల్ ఫోన్కాల్స్పై నిషేధం విధించింది. దీంతో, ఆందోళనల తీవ్రత బయటి ప్రపంచానికి తెలియడం లేదు. అయితే, ఇప్పటి వరకు ఇరాన్ వ్యాప్తంగా జరిగిన నిరసనల్లో కనీసం 62 మంది చనిపోయారని, మరో 2,500 మందిని అధికారులు నిర్బంధంలోకి తీసుకున్నారని అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిట్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. -
USA: మరో షిప్ సీజ్!
వాషింగ్టన్: వెనెజువెలాకు రాకపోకలు సాగిస్తున్న చమురు నౌకలను అదుపులోకి తీసుకునే ధోరణిని అమెరికా కొనసాగిస్తూనే ఉంది. ఆ దేశానికి చెందినదిగా భావిస్తున్న ఒలీనా అనే మరో నౌకను దిగ్బంధించినట్టు అమెరికా సైన్యం శుక్రవారం వెల్లడించింది. కరీబియన్ సముద్ర జలాల్లో శుక్రవారం తెల్లవారుజామున యూఎస్ మెరీన్స్, నేవీ సంయుక్తంగా ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్టు తెలిపింది. దీన్ని హోంలాండ్ సెక్యూరిటీ విభాగం పర్యవేక్షించినట్టు వెల్లడించింది. అమెరికా సైనిక హెలికాప్టర్ ఆ నౌకపై దిగుతున్న, సైనిక సిబ్బంది డెక్పై సోదాలు సాగిస్తున్న ఫుటేజీని యూఎస్ సదరన్ కమాండ్ విడుదల చేసింది. వెనెజువెలాకు చెందినవంటూ అమెరికా అదుపులోకి తీసుకున్న ఐదో నౌక ఇది. గత మూడు రోజుల్లో మూడో నౌక. అయితే ఇది నిజంగా ఆ దేశానిదేనా అన్న ప్రశ్నలకు సైనిక అధికార ప్రతినిధి నేరుగా బదులివ్వలేదు. -
మాట్లాడితేనే ట్రేడ్ డీల్!
న్యూయార్క్/న్యూఢిల్లీ: అమెరికా, భారత్ మధ్య అత్యంత కీలకమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు ఎటూ తేలడం లేదు. ఇరుపక్షాలు తరచుగా సమావేశమై చర్చిస్తున్నా అడుగు ముందుకు పడట్లేదు. కొన్ని ముఖ్యమైన అంశాలపై అమెరికా ప్రభుత్వం ఒత్తిడి పెంచుతున్నా భారత్ ఒప్పుకోకపోవడంతో చర్చలు అసంపూర్తిగానే ముగుస్తున్నాయి. ఒప్పందం వాయిదా పడుతూ వస్తోంది. అయితే, ఇరుదేశాల మధ్య ట్రేడ్ డీల్ కుదరకపోవడం వెనుక గల అసలు కారణాన్ని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ బయటపెట్టారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడకపోవడం వల్లనే ఒప్పందం కుదరడం లేదని తేల్చిచెప్పారు. లుట్నిక్ గురువారం ‘ఆల్–ఇన్ పాడ్కాస్ట్’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. మోదీ నేరుగా ట్రంప్కు ఫోన్ చేసి మాట్లాడితే ఒప్పందం త్వరగా కుదురుతుందని, ఆ అవకాశం ఇప్పటికీ ఉందని స్పష్టంచేశారు. ‘‘ఇండియా గురించి మీకొక సంగతి చెప్పాలి. మేము మొదట యూకేతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాం. రెండు శుక్రవారాల్లోగా తుది నిర్ణయానికి రావాలని సూచించగా, యూకే అందుకు అంగీకరించింది. ఎందుకంటే గడువు దాటితే స్టేషన్ను వదిలేసి రైలు మరో దేశానికి వెళ్లిపోతుందని చెప్పాం. అనుకున్నట్లుగానే గడువులోగా యూకేతో ఒప్పందం కుదిరింది. బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్.. ట్రంప్కు ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత డీల్ పట్టాలకెక్కింది. మా అధ్యక్షుడు ట్రంప్ నిచ్చెన మెట్ల తరహాలో ఒక దేశం తర్వాత మరో దేశంతో ఒప్పందానికి వస్తున్నారు. తొలుత వచ్చినవారికే తొలి ప్రాధాన్యత దక్కుతుంది. అందరికంటే ముందు వచ్చినవారితోనే గొప్ప డీల్ కుదురుతుంది. రెండో మెట్టుపై ఉంటే బెస్టు డీల్ ఉండదు. యూకే తర్వాత ఒప్పందం ఎవరితో ఉంటుందని ట్రంప్ను చాలామంది అడిగారు. ఆయన కొన్ని పేర్లు చెప్పారు. ఇండియా పేరును రెండుసార్లు బహిరంగంగా ప్రస్తావించారు. అనంతరం మేము ఇండియా ప్రతినిధులతో మాట్లాడాం. మీకు మూడు శుక్రవారాల దాకా గడువు ఉందని చెప్పాం. గడువులోగా ఏదో ఒకటి తేల్చాల్సిన బాధ్యత ఇండియాపైనే ఉండగా, వారు స్పందించలేదు. ట్రేడ్ డీల్పై చాలాదేశాలతో నేను ప్రత్యక్షంగా చర్చించా. కానీ, ఇది అచ్చంగా ట్రంప్ డీల్. నిర్ణయం తీసుకోవాల్సింది ఆయనే కదా! అందుకే ట్రంప్తో నేరుగా మాట్లాడాలని ఇండియా ప్రతినిధులకు సూచించా. మోదీతో మాట్లాడించాలని చెప్పా. ఎందుకో తెలియదుగానీ ఈ విషయంలో భారత్ చాలా అసౌకర్యంగా ఉన్నట్లు కనిపించింది. ట్రంప్తో మోదీ మాట్లాడలేదు. మూడు శుక్రవారాలు ముగిశాక ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాంతో వాణిజ్య ఒప్పందాలను ప్రకటించాం’’ అని లుట్నిక్ తెలియజేశారు. భారత్ ఇప్పుడిప్పుడే దారిలోకి వస్తోంది ‘‘ఇతర దేశాల కంటే ముందే భారత్తో వాణిజ్య ఒప్పందం కుదరుతుందని మేము భావించాం. అలా జరగకపోవడంతో ఇంతకముందు అంగీకరించిన ఒప్పందాన్ని వెనక్కి తీసుకున్నాం. దానిపై ఇప్పుడు ఆలోచించడం లేదు. మరోవైపు చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. డీల్కు సిద్ధంగా ఉన్నట్లు భారత్ మాకు తెలియజేసింది. మూడు వారాల క్రితమే వెళ్లిపోయిన రైలు కోసం ఎదురు చూస్తారా? అని భారత్ను ప్రశ్నించా. కొన్నిసార్లు డోలాయమాన పరిస్థితి ఉండొచ్చు. ఊగుడు బల్లపై భారత్ ఇప్పుడు రాంగ్సైడ్లో ఉంది. ఇతర దేశాలు మాతో ఇప్పందాలకు ముందుకొస్తున్నాయి. త్వరగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. భారత్ ఇప్పుడిప్పుడే దారిలోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. యూకే తర్వాత ఇండియాతోనే ఒప్పందం చేసుకోవాలని నేను ఆశించా. ఆ దిశగానే చర్చలు నిర్వహించా. త్వరలోనే భారత్ నిర్ణయం తీసుకుంటుందన్న విశ్వాసం ఉంది. ప్రతి దేశానికీ అంతర్గతంగా ప్రతికూల రాజకీయ పరిస్థితులు ఉంటాయి. వాటిని అధిగమించాల్సి ఉంటుంది. విదేశాలతో ఒప్పందాలకు పార్లమెంట్ ఆమోదం పొందడం సంక్లిష్టమైన విషయం’’ అని లుట్నిక్ తేల్చిచెప్పారు. అది నిజం కాదు: భారత్ ట్రంప్తో మోదీ మాట్లాడకపోవడంతోనే వాణిజ్య ఒప్పందం కుదరలేదంటూ అమెరికా మంత్రి లుట్నిక్ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైస్వాల్ శుక్రవారం ఖండించారు. రెండు దేశాలకు ప్రయోజనం చేకూరేలా ఒప్పందాన్ని కుదుర్చుకోవడంపై భారత్ ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. 2025లో మోదీ, ట్రంప్ ఎనిమిదిసార్లు మాట్లాడుకున్నారని, వేర్వేరు కీలక అంశాలపై చర్చించుకున్నారని గుర్తుచేశారు. ట్రేడ్ డీల్ విషయంలో ట్రంప్తో మోదీ మాట్లాడలేదనడం పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. రెండు దేశాల ప్రతినిధుల మధ్య గత ఏడాది ఫిబ్రవరి 13 నుంచి చర్చలు కొనసాగుతూనే ఉన్నాయని వివరించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి భారత్ కట్టుబడి ఉందన్నారు. పలు సందర్భాల్లో ఒప్పందానికి చాలా సమీపంలోకి వచ్చినట్లు రణ«దీర్ జైస్వాల్ తెలిపారు. ట్రేడ్ డీల్ త్వరలో కుదురుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. -
ఆరు దశాబ్దాల ఎడారి జీవితం.. ఆ జ్ఞాపకాలే ఖరీదంటోన్న మలయాళీ.!
ఐదు దశాబ్దాల క్రితం గల్ఫ్లోని ఎడారిలో జీవితాన్ని ప్రారంభించిన మలయాళీ ముహమ్మద్ కుంజి (77). మత్స్యకారులైన పొన్నిచి ముసాన్, ఒలకోన్ సారా దంపతుల కుమారుడైన కుంజి 21 సంవత్సరాల వయసులో దుబాయ్కు ఓడ ఎక్కాడు. అతని తండ్రి సంపాదన అంతంత మాత్రమే కావడంతో అతని కుటుంబం ఆకలి కూడా తీర్చలేకపోయేవాడు. మడాయిలోని ముత్తోంలోని కొవ్వప్పురానికి చెందిన పొన్నిచి ముసాన్ ఇక జీవించడానికి అతనికి వేరే మార్గం లేకపోవడంతో.. ఐదవ తరగతిలో చదువు మానేసి బీడీ కార్మికుడిగా పనికి వెళ్లేవాడు.కానీ అతని సోదరుడు ముస్తఫా మాత్రం మొదట దుబాయ్కి వెళ్ళాడు. ముస్తఫా అక్కడ టీ దుకాణం నడుపుతున్నాడు. తన సోదరులను దుబాయ్కు తీసుకువస్తేనే కుటుంబంలో పేదరికం తొలగిపోతుందని తెలిసుకున్న ముస్తఫా.. వీసా వచ్చాక ముహమ్మద్ కుంజిని అక్కడికి రమ్మని కోరాడు. అలా మహమ్మద్ కుంజి మార్చి 3, 1967న దుబాయ్లో అడుగుపెట్టాడు.అలా మహమ్మద్ కుంజిని దుబాయ్ తీసుకువచ్చాడు ముస్తఫా. అక్కడికి వెళ్లిన కుంజి టీ, స్వీట్లు తయారు చేయడం నేర్చుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. అలా ఉదయం ఆరు గంటలకు ప్రారంభమయ్యే వ్యాపారం.. రాత్రి తొమ్మిది గంటల వరకు కొనసాగేది. తాను సంపాదించిన దానిలో కొంత భాగాన్ని నేను దాచుకునేవాడు. ఇంట్లో ఆకలితో అలమటిస్తున్న నా తండ్రి, తల్లి, తోబుట్టువుల కోసం పంపేవాడు. అప్పట్లో తమ అదృష్టాన్ని వెతుక్కుంటూ దుబాయ్కు వచ్చిన వారిలో ఎక్కువ మంది మలయాళీలు, బలూచిస్తానీలే ఎక్కువ. కుంజి దుబాయ్లో తొమ్మిది సంవత్సరాలు పనిచేశాజు.అప్పట్లో దుబాయ్ కరెన్సీ దిర్హామ్కి మన డబ్బుల్లో 2 రూపాయలు. ఆ తర్వాత 1976లో అబుదాబి పోలీస్ ఉద్యోగం వచ్చింది. పోలీస్ శాఖలో వంటవాడిగా కెరీర్ ప్రారంభించాడు. అప్పట్లో కుంజి జీతం 900 దిర్హామ్లు. అలా జీతం నుంచి కొంత మొత్తాన్ని ఆదా చేసుకుని మిగిలిన మొత్తాన్ని ఇంటికి పంపేవాడినని తెలిపారు. అప్పుడు కేవలం ఉత్తరాల ద్వారానే కమ్యూనికేషన్ ఉండేది. పనిలో భాగంగా ఒక చిన్న ప్రమాదం జరగడంతో నా ఉద్యోగాన్ని కోల్పోయి టీ అమ్మడం మొదలుపెట్టాను. నాకు ఉద్యోగం వచ్చే వరకు అది కష్టమైన పని. ఆ తర్వాత 1987లో అబుదాబి సైన్యంలో ఉద్యోగం. అక్కడ కూడా నా ఉద్యోగం వంట. జీతం 1800 దిర్హామ్లు. అప్పుడు ఇంటికి ఎక్కువ డబ్బు పంపగలిగానని కుంజి వెల్లడించారు. నేను మొదట మా ఊరికి వచ్చినప్పుడు, నేను కోటీశ్వరుడిననని నా కుటుంబం, స్థానికులు చాలా ఆశలు పెట్టుకునేవారని తెలిపారు.నేను అబుదాబి సైన్యంలో చేరిన తర్వాత వివాహం చేసుకున్నానని తెలిపారు. నేను అప్పట్లో గల్ఫ్ గురించి చెబితే ప్రజలు నన్ను నమ్మలేదు. అప్పట్లో అరబ్బులకు కూడా చిన్న ఇళ్లే ఉండేవి. మేమందరం చిన్న గుడిసెలలో నివసించామని.. స్నానం చేయడానికి గాడిదలపై టిన్ డబ్బాల్లో తెచ్చిన నీటికి డబ్బు చెల్లించాల్సి వచ్చేదన్నారు. కేవలం ప్రతి నాలుగైదు రోజులకు నీరు వస్తుందన్నారు. కుటుంబ ఉత్తరం కోసం వేచి ఉన్న సమయం చాలా బాధాకరంగా ఉండేదని అన్నారు.నేను రాడో వాచ్ను 1987లో కొన్నాను. లడఖ్లో ఉద్యోగం వచ్చినప్పుడు నా మొదటి జీతంతో కొన్నానని తెలిపారు. ఈ వాచ్ ధర 2025 దిర్హామ్లని వెల్లడించారు. ఈ గడియారం నా గల్ఫ్ జీవితాన్ని గుర్తు చేస్తుందని అన్నారు. అప్పటి నుండి, నా కుటుంబం. ఈ గడియారం నాతోనే ఉన్నాయని తెలిపారు. ఒకరోజు నేను ఒక గడియార దుకాణానికి వెళ్లి రాడో వాచ్ ధర ఎంత అడిగా.. అర మిలియన్ రూపాయలు అన్నారు. కానీ నాకు, దాని విలువ కంటే జ్ఞాపకాలే చాలా రెట్లు ఎక్కువ అనిపించిందన్నారు.నా వయస్సు 60 సంవత్సరాల వరకు అబుదాబిలో పనిచేశానని.. తరువాత నా ప్రవాసాన్ని ముగించానని కుంజి వెల్లడించారు. నా కుమార్తెలు ఆయేషా, అమీనా వివాహం చేసుకున్నారు. మనదేశానికి తిరిగి వచ్చి ఎలక్ట్రికల్ వస్తువులు అమ్మే దుకాణాన్ని ప్రారంభించానని తెలిపారు. నేను ఖాళీగా ఉన్నప్పుడు, గల్ఫ్ జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని.. అప్పుడు ఈ గడియారాన్ని ఎల్లప్పుడూ చూస్తానని పేర్కొన్నారు. -
బైక్ ప్రమాదాల్లో 9 మందికి గాయాలు.. ఎక్కడంటే?
ఎడారి ఇసుక దీవుల్లో బైక్ రైడింగ్ చేయడమంటే అందరికీ సరదానే. కానీ అదే సరదా ఇప్పుడు ప్రాణాల మీదకు తెస్తోంది. ఇటీవల అబుదాబి ఎడారి ఇసుక దిబ్బలలో బైక్ నడుపుతుండగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో దాదాపు 9 మంది గాయపడ్డారు. గత గురువారం ఒక్కరోజే ఏడు వేర్వేరు ప్రమాదాల్లో బైక్ రైడింగ్ చేస్తున్న వ్యక్తులు గాయపడ్డారని అబుదాబి పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. మితిమీరిన వేగం, భద్రతా నియమాలను పాటించకపోవడం వల్లే ప్రమాదాలు సంభవించాయని పోలీసులు నిర్ధారించారు.ఎడారిలో బైక్ రైడింగ్కు వెళ్లే పిల్లలతో తల్లిదండ్రులు తప్పనిసరిగా వెళ్లాలని పోలీసు అధికారులు ఆదేశించారు. జనావాసాలు లేని ఇసుక ప్రాంతాలలో పిల్లలు నిర్లక్ష్యంగా బైక్లు నడపకుండా నిరోధించడానికి తల్లిదండ్రుల సహకారం చాలా అవసరమన్నారు. హెల్మెట్ లేకపోవడం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల పెద్ద ప్రమాదాలు సంభవిస్తాయని అధికారులు హెచ్చరించారు.ఎడారిలో రహదారి నియమాలు అందరికీ సమానంగా వర్తిస్తాయని ట్రాఫిక్, పెట్రోల్స్ డైరెక్టరేట్ డైరెక్టర్ బ్రదర్ మహమూద్ యూసఫ్ అల్ బలూషి అన్నారు. బైక్ రైడర్లు హెల్మెట్, తగిన భద్రతా దుస్తులను ధరించాలని కోరారు. బయలుదేరే ముందు బైక్ టైర్లు, లైట్లు పని చేస్తున్నాయో లేదో నిర్ధారించుకోవాలని సూచించారు. ప్రథమ చికిత్స వస్తు సామగ్రి,అనుమతి కలిగిన భద్రతా పరికరాలను తీసుకెళ్లడం చాలా అవసరమని తెలిపారు. రద్దీగా ఉండే ప్రాంతాలలో వేగాన్ని తగ్గించాలని, ట్రాఫిక్ సిగ్నల్స్ సూచించిన లేన్లలో మాత్రమే ప్రయాణించాలని వాహనదారులకు గుర్తు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిని పట్టుకోవడానికి పోలీసులు అంతర్గత రోడ్లు, హైవేలపై నిఘాను కఠినతరం చేశామని హెచ్చరించారు. -
ఇరాన్లో ఉద్రిక్తతలు.. జోక్యం చేసుకోవాలంటూ ట్రంప్కు విజ్ఞప్తి
ఇరాన్లో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం నడుస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు ఖమేనీ పాలనపై ప్రజల ఆగ్రహం ఉధృతమవుతోంది. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్గా ఎదిగిన అయతొల్లా అలీ ఖమేనీ పాలన పట్ల ఇరాన్ ప్రజలు తీవ్ర స్థాయిలో అసంతృప్తితో రగిలిపోతున్నారు. గత 12 రోజులుగా ప్రధాన నగరాల్లో కొనసాగుతున్న ఆందోళనలు.. శుక్రవారం ఇంటర్నెట్ బంద్ చేయడం, అంతర్జాతీయ కాల్స్ నిలిపివేతతో ఆ ఆగ్రహ జ్వాలలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్లో కొనసాగుతున్న నిరసనలలో మరణాల సంఖ్య 62కి పెరిగింది.ఈ నేపథ్యంలోనే ఇరాన్ విషయంలో జోక్యం చేసుకోవాలని ట్రంప్కు రెజా పహ్లవి విజ్ఞప్తి చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్లో నిరసనలు చెలరేగుతున్న ఇరాన్ దివంగత రాజు బహిష్కృత కుమారుడు రెజా పహ్లవి కోరడం హాట్ టాపిక్గా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మిస్టర్ అమెరికా ప్రెసిడెంట్.. దయచేసి ఇరాన్ ప్రజలకు సహాయం చేయడానికి జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలంటూ కోరాడు.మరోవైపు నిరసనకారులను కఠినంగా శిక్షిస్తామని ఇరాన్ న్యాయవ్యవస్థ చీఫ్ హెచ్చరించారు. ఇరాన్ న్యాయవ్యవస్థ చీఫ్ ఘోలాంహోస్సేన్ మొహ్సేని-ఎజెయ్ శిక్షను అమలు చేయడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ప్రకటన నిరసనకారులపై మరింత కఠినమైన చర్యలు తీసుకునేందుకు వీలు కల్పించనుంది. ఇప్పటికే ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్, టెలిఫోన్, విదేశీ దేశాలతో కమ్యూనికేషన్ను నిషేధించింది.నిరసనల మధ్య ఖమేనీ ప్రసంగంటెహ్రాన్లో అశాంతి మధ్య.. సుప్రీం లీడర్ ఖమేనీ అమెరికా సమస్యలపై దృష్టి పెట్టాలని ట్రంప్కు సూచించారు. నిరసనకారులు మరొక దేశ అధ్యక్షుడిని సంతోషపెట్టడానికి తమ దేశాన్ని నాశనం చేస్తున్నారని ఖమేనీ అన్నారు. దేశం విదేశీ కిరాయి సైనికులను సహించదని ఖమేనీ స్పష్టంగా పేర్కొన్నారు. నిరసనలపై ఇరాన్ రాష్ట్ర టీవీ ఒక నివేదికలో ఇజ్రాయెల్ మరియు అమెరికన్ "ఉగ్రవాద ఏజెంట్లు" హింసను ప్రేరేపించారని నిందించిన తర్వాత సుప్రీం లీడర్ ప్రకటన వచ్చింది.Mr. President, this is an urgent and immediate call for your attention, support, and action. Last night you saw the millions of brave Iranians in the streets facing down live bullets. Today, they are facing not just bullets but a total communications blackout. No Internet. No…— Reza Pahlavi (@PahlaviReza) January 9, 2026 -
పాక్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. వెనెజువెలా అధ్యక్షుడి తరహాలోనే..!
పాకిస్తాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి ఏకంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను కిడ్నాప్ చేయాలని కోరారు. ఇటీవల వెనెజువెలా అధ్యక్షుడిని ఎత్తుకెళ్లిన తరహాలోనే నెతన్యాహును కూడా అపహరించాలని ట్రంప్కు విజ్ఞప్తి చేశారు. అమెరికాతో పాటు టర్కీ కూడా ఈ పని చేయగలదని ఇజ్రాయెల్ను రెచ్చగొట్టేలా ఖవాజా ఆసిఫ్ మాట్లాడారు. మానవత్వానికి పెద్ద నేరస్తుడిగా నెతన్యాహూను అభివర్ణించాడు.తాజా ఇంటర్వ్యూలో ఆసిఫ్ మాట్లాడుతూ.. చరిత్రలో ఎక్కడా జరగని దురాగతాలు గాజాలో పాలస్తీనియన్లపై జరిగాయన్నారు. గాజాలో పాలస్తీనియన్లపై జరిగిన దారుణాలకు చరిత్రలో ఏ దురాగతాలు సరిపోలడం లేదని పేర్కొన్నారు. గత 4-5 వేల సంవత్సరాల్లో పాలస్తీనియన్లకు నెతన్యాహు చేసినంత నష్టం ఎవరూ చేయలేదని.. మానవత్వంలో అతిపెద్ద నేరస్తుడని అన్నారు. ప్రపంచంలో ఇంతకుమించిన పెద్ద నేరస్తుడిని ఎక్కడా చూడలేదన్నారు.అయితే మరోవైపు గాజాలో ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్లో భాగంగా పాక్ సైనికులు గాజాకు వెళ్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనిపై భారత్లోని ఇజ్రాయిల్ రాయబారి రూవెన్ అజార్ మాట్లాడారు. పాకిస్తాన్ సైన్యం గాజాలో ఉండటంపై ఇజ్రాయెల్ సంతోషంగా లేదని అన్నారు. హమాస్, లష్కరేతోయిబా మధ్య సంబంధాలు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. -
ఇరాన్ వీధుల్లో మిడ్డీలు, స్కర్టులు!
మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్గా ఎదిగిన అయతొల్లా అలీ ఖమేనీ పాలన పట్ల ఇరాన్ ప్రజలు తీ..వ్ర స్థాయిలో అసంతృప్తితో రగిలిపోతున్నారు. గత 12 రోజులుగా ప్రధాన నగరాల్లో కొనసాగుతున్న ఆందోళనలు.. శుక్రవారం ఇంటర్నెట్ బంద్ చేయడం, అంతర్జాతీయ కాల్స్ నిలిపివేతతో ఆ ఆగ్రహ జ్వాలలై తారాస్థాయికి చేరాయి. మిడ్డీలు, స్కర్టులు వేసుకున్న అమ్మాయిలు.. ఖమేనీ ఫొటోలను సిగరెట్లతో కాలుస్తున్న దృశ్యాలు.. ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పులు పెట్టే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. డిక్టేటర్ అంతం.. ఇస్లామిక్ రిపబ్లిక్ అంతం.. ఇది చివరి పోరాటం! పహ్లవి తిరిగి వస్తాడు! అంటూ నినాదాలతో ఇరాన్ మారుమోగిపోతోంది. అసలు ఎవరీ పహ్లవి గురించి నెట్టింట వెతుకులాట కనిపిస్తోంది. రేజా పహ్లవి(Reza Pahlavi).. ఇరాన్ను పాలించిన చివరి షా కుమారుడు. అమెరికాలో నివసిస్తూ ఇరాన్ ప్రజలను పెద్ద ఎత్తున నిరసనల్లో పాల్గొనాలంటూ పిలుపునిచ్చాడు కూడా. 👉ఇరాన్ను పహ్లవి రాజవంశం 1925 నుంచి 1979 వరకు పాలించింది. ఆ కాలంలో రాజులు వెస్ట్రన్ సూట్లలో కనిపిస్తూ దేశాన్ని పరిశ్రమీకరణ దిశగా నడిపించారు. మహిళలు హిజాబ్ లేకుండా, చిన్న స్కర్టులతో వీధుల్లో స్వేచ్ఛగా తిరిగేవారు. వీళ్ల పాలనలో.. టెహ్రాన్ నగరం అప్పట్లో మిడిల్ ఈస్ట్ పారిస్గా ప్రసిద్ధి చెందింది. అయితే, ఈ వెలుగుల వెనుక షా కఠిన పాలన, అవినీతి, పాశ్చాత్య శక్తుల ప్రభావం దాగి ఉండేది. చివరకు అవినీతి కారణంగా రాజవంశం గద్దె దింపబడిందని చరిత్ర చెబుతోంది.👉ఇరాన్లో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం, ఖమేనీ పాలనపై ప్రజల ఆగ్రహం ఉధృతమవుతోంది. ఇదే సమయంలో, గతంలో పహ్లవి రాజవంశం కాలంలో ఇరాన్ స్వేచ్ఛ, ఆధునికతతో ప్రసిద్ధి చెందిందని, కానీ కఠిన పాలన, అవినీతి కారణంగా రాజవంశం గద్దె దింపబడిందని చరిత్ర చెబుతోంది.👉పహ్లవి వంశం రాజవంశ రక్తంలో కాకుండా యుద్ధరంగంలో పుట్టింది. రేజా ఖాన్ అనే సాధారణ నేపథ్యం కలిగిన సైనిక అధికారి.. 1921లో బ్రిటిష్ అధికారుల సహకారంతో కుట్ర చేసి అధికారంలోకి వచ్చాడు. 1925లో క్వాజర్ వంశాన్ని గద్దె దించి.. మజ్లిస్ ఆయనను షాగా ఎన్నుకుంది. ఆ సమయంలో పహ్లవి అనే బిరుదు స్వీకరించి.. ఆధునికీకరణ, సెక్యులర్ జాతీయత లక్ష్యాలతో కొత్త రాజవంశాన్ని ప్రారంభించాడు.👉పహ్లవి రాజవంశ పాలనలో.. వెస్ట్రన్ కల్చర్ మేఘాలు ఇరాన్ను ఆవరించాయి. హిజాబ్ నిషేధంతో.. మహిళలు పాశ్చాత్య శైలి దుస్తులకు అలవాటు పడ్డారు. సంస్కరణల పేరిట ఆంగ్ల విద్య ప్రవేశపెట్టడం, జాతీయ బ్యాంకు, రైల్వే వ్యవస్థ, కేంద్ర పాలన బలపరచడం వంటి సంస్కరణలు చేశారు. అయితే.. రాజకీయ అణచివేత, పత్రికా స్వేచ్ఛను కాలరాయడం విమర్శలకు తావిచ్చింది. 👉రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీతో ఆయన సాన్నిహిత్యం కారణంగా.. 1941లో బ్రిటిష్-సోవియట్ దళాలు ఇరాన్పై దాడి చేసి ఆయనను రాజీనామా చేయించాయి. ఆయన స్థానంలో కుమారుడు మొహమ్మద్ రేజా పహ్లవి షాగా అయ్యాడు. బలహీన సింహాసనం, విభజిత దేశం, పెరుగుతున్న జాతీయవాదం 22 ఏళ్ల రేజాకు వారసత్వంగా లభించాయి. అదే సమయంలో.. ఇరాన్ చమురు బ్రిటిష్ AIOC కంపెనీ ఆధీనంలో ఉండటం ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలిగించింది. దీంతో.. 1951లో పార్లమెంట్ మొహమ్మద్ మోసాదేఘ్ను ప్రధానిగా ఎన్నుకుంది. ఆయన చమురు పరిశ్రమను జాతీయికరణ చేయడంతో బ్రిటన్, అమెరికా ఆగ్రహించాయి. 1953లో CIA “ఆపరేషన్ అజాక్స్” ద్వారా మోసాదేఘ్ను గద్దె దించి, పహ్లవిని తిరిగి సంపూర్ణ అధికారంతో షాగా తిరిగి కూర్చోబెట్టింది. ఇది పహ్లవి సంపూర్ణ రాజ్యాధికారానికి, అమెరికా ప్రభావానికి ఆరంభంగా నిలిచింది. 👉1960లో.. మొహమ్మద్ రేజా షా వైట్ రివల్యూషన్ పేరుతో సంస్కరణలు చేపట్టాడు, భూసంస్కరణలు (జమీందారుల శక్తి తగ్గించడం), మహిళలకు ఓటు హక్కు, గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత, ఆరోగ్య కార్యక్రమాలు, పారిశ్రామికరణ, సైన్యం బలోపేతం చేయడంలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు. ఫలితంగా ఇరాన్లో ఆర్థిక వృద్ధి, పట్టణీకరణ, మధ్యతరగతి పెరుగుదల చోటు చేసుకున్నాయి.👉పాశ్చాత్య సంస్కృతి (ఫ్యాషన్, సినిమాలు) వేగంగా వ్యాపించినప్పటికీ కొన్ని ప్రతికూల పరిస్థితుల ఏర్పడడాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వలస వచ్చినవారు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడ్డారు. రాజకీయ పార్టీలను నిషేధించారు. సావక్ SAVAK అనే షా రహస్య పోలీస్.. విపక్షాన్ని అణచివేసింది.ఆ సమయంలో మతాధికారి అయతొల్లా రుహొల్లా ఖోమేనీ 1964లో షా పాశ్చాత్యీకరణను విమర్శించి ప్రవాసంలోకి వెళ్లాడు.👉ఈలోపు.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అసమానతలు, అధికారవాద పాలన, అన్ని కలగలిపి 1978లో భారీ నిరసనలకు దారితీశాయి. శక్తివంతమైన సైన్యం ఉన్నప్పటికీ, షా పూర్తి బలప్రయోగం చేయడానికి వెనుకాడాడు. 1979 జనవరిలో షా దేశం విడిచి పారిపోయాడు. ఇదే అదనుగా ఫిబ్రవరి 1న ఖోమేనీ ప్రవాసం వీడాడు. ఇరాన్ ప్రజలు ఆయనకు సాదర స్వాగతం పలికారు. కొన్ని వారాల్లోనే పహ్లవి రాజవంశం కూలిపోయి, ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్గా మారింది. మొహమ్మద్ రేజా షా 1980లో ఈజిప్టులో ప్రవాసంలో ఉండగానే మరణించాడు. రేజా పహ్లవి ఈ విప్లవం తర్వాత అమెరికాలో స్థిరపడి.. ఇరాన్లో ప్రజాస్వామ్య మార్పు కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నాడు.👉షా యొక్క అధికారవాద పాలనను మరిచిపోయిన ఇరానీయులు, ముఖ్యంగా ఆ పరిస్థితుల రుచేంటో చూడని యువత.. పహ్లవి కాలాన్ని స్వేచ్ఛలు, ఆర్థిక సౌభాగ్యం, అంతర్జాతీయ ప్రతిష్ఠ కారణంగా గర్వంగా పీలవుతోంది. అదే సమయంలో ప్రవాసంలో ఉన్న షా కుమారుడు రేజా పహ్లవి మళ్లీ ఖమేనీ ఆధ్వర్యంలోని ధార్మిక పాలనకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయంగా ఎదిగాడు.👉1979 విప్లవం సమయంలో రేజా పహ్లవి వయసు కేవలం 18. పాశ్చాత్య దేశాల్లో చదువుకున్న ఆయన.. ఇరాన్లో సెక్యులర్ ప్రజాస్వామ్యం కోసం దశాబ్దాలుగా ప్రచారం చేస్తున్నారు. ఆయన పిలుపు తర్వాత ఇరాన్లో ఖమేనీ వ్యతిరేక నిరసనలు ఊపందుకున్నాయి. దీంతో.. ఇరాన్ ప్రజలు మళ్లీ క్రౌన్ ప్రిన్స్ వైపు మొగ్గుచూపుతారనే సంకేతాలు అందుతున్నాయి. 👉ప్రవాసంలో ఉన్న ఇరాన్ క్రౌన్ ప్రిన్స్ రేజా పహ్లవి వచ్చే వారం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మార్-ఎ-లాగోలో జరగనున్న Jerusalem Prayer Breakfast కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం జనవరి 12న జరగనుంది. లాత్వియా పార్లమెంట్ ప్రతినిధులు, బ్రెజిల్ ఎంపీ ఎడ్వార్డో బోల్సోనారో కూడా పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ దశలో పహ్లవిని కలవడం సరైనది కాదని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అలాగే పహ్లవి తనను రాజ్యాధికారంలో కాకుండా రాజ్యాంగ పరిరక్షణలో ఉండే రాజవంశానికి మద్దతుదారుడిగా పేర్కొన్నారు. “మిలియన్ల ఇరానీయులు స్వేచ్ఛ కోరుతున్నారు, కానీ ప్రభుత్వం అన్ని కమ్యూనికేషన్ లైన్లను కట్ చేసింది”.. :::ఖమేనీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ పహ్లవి ఎక్స్లో చేసిన ఓ పోస్ట్ రేజా పహ్లవి ప్రొఫైల్- రేజా పహ్లవి (జననం అక్టోబర్ 1960) ఇరాన్ చివరి షా మొహమ్మద్ రేజా పహ్లవి పెద్ద కొడుకు- 1979 ఇరాన్ విప్లవంలో రాజ్యాన్ని గద్దె దింపిన తర్వాత ఆయన కుటుంబం ప్రవాసంలోకి వెళ్లింది.- రేజా పహ్లవి అమెరికాలో పైలట్ శిక్షణ పొందారు, తరువాత USCలో రాజకీయ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు.- ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో ఫైటర్ పైలట్గా సేవ చేయాలని ప్రయత్నించినా, ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వం ఆయనను తిరస్కరించింది.అధికారం వద్దంటూనే,. - ఆయన తనను “ప్రజాస్వామ్యానికి మార్పు కోసం జాతీయ మార్గదర్శి”గా పేర్కొంటున్నారు.- ఇరాన్లో జరుగుతున్న నిరసనల్లో ప్రజలు “పహ్లవి తిరిగి వస్తాడు”, “ఖమేనీ గద్దె దింపబడతాడు” అంటూ నినాదాలు చేస్తున్నారు.- ఆయన నాలుగు దశాబ్దాలుగా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కోసం పోరాడుతున్నారని మద్దతుదారులు చెబుతున్నారు.- ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాధినేతలు, పార్లమెంట్ సభ్యులు, విద్యార్థి సంఘాలతో సమావేశమై ఇరాన్ ప్రజల పరిస్థితిని వివరించారు.- ఆయన Washington Postలో రాసిన వ్యాసంలో, ఇస్లామిక్ రిపబ్లిక్ “1979 తర్వాత ఎప్పుడూ లేనంత బలహీనంగా, విభజితంగా ఉంది” అని పేర్కొన్నారు.- “నేను అధికారాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేను, కానీ ప్రజాస్వామ్య మార్పు కోసం మార్గదర్శకుడిగా బాధ్యత వహిస్తాను” అని ఆయన అన్నారు.- ఆయన US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ధన్యవాదాలు తెలుపుతూ, “ప్రపంచ స్వేచ్ఛా నాయకుడు”గా అభివర్ణించారు.- అయితే ట్రంప్, “ఇప్పుడే ఆయనను కలవడం సరైనది కాదు” అని వ్యాఖ్యానించారు.- 2023లో ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహును కలవడం వివాదాస్పదమైంది. -
స్వీపర్గా నెలకు రూ.లక్ష : ఇండియన్ టెకీ ఇంట్రస్టింగ్ స్టోరీ
ఇండియాలో ఐటీ ఉద్యోగులకు కష్టాలు. రష్యాలో కార్మికులకు కొరత. ముఖ్యంగామునిసిపల్ మరియు ప్రజా నిర్వహణ సేవల రంగంలో రష్యా తీవ్ర కార్మిక కొరతను ఎదుర్కొంటోంది. అందుకే భారతదేశానికి చెందిన కొంతమంది పొట్టచేత పట్టుకొని అక్కడికి వాలిపోయారు. ఏం చేశామన్నది కాదు ముఖ్యం, గౌరవంగా ఎలా బతుకున్నామనేదే ముఖ్యం అని చాటి చెప్పారు. వీరిలో రైతులు, చిన్న చిన్న వ్యాపారస్తులుతోపాటుఒక టెకీ కూడా ఉండటం విశేషం. వీరంతా రష్యాలో వీధులను శుభ్రం చేసే ఉద్యోగంలో చేరారు. నెలకు జీతం ఎంతో తెలుసా?రష్యన్ మీడియా సంస్థ ఫోంటాంకా ప్రకారం భారతదేశానికి చెందిన 26 ఏళ్ల ముఖేష్ మండల్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. వృత్తిరీత్యా నిపుణుడే. కానీ ఇక్కడ ఉద్యోగం లేదు. అందుకే సెయింట్ పీటర్స్బర్గ్లో వీధులను శుభ్రం చేసే పని కోసం కొన్ని నెలల క్రితం రష్యాకు వెళ్లిన 17 మంది భారతీయుల బృందంలో అతనూ ఒకడిగా మారిపోయాడు. ఇలా వెళ్లిన వారి వయస్సు 19 నుండి 43 సంవత్సరాల మధ్య .గత కొన్ని వారాలుగా, ముఖేష్ మండల్, ఇతర భారతీయ కార్మికులు నగరంలో పారిశుధ్య పనులకు బాధ్యత వహించే కొలోమ్యాజ్స్కోయ్అనే రహదారి నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో నగర రహదారులను శుభ్రం చేస్తున్నారు. వీరికి ఆహారం, దుస్తులు వసతి, రవాణాను ఖర్చులు భరిస్తుంది. ప్రతీ కార్మికుడికి నెలకు సుమారు 100,000 రూబుళ్లు సుమారుగా రూ. 1.1 లక్షల వేతనం. ఇదీ చదవండి: వీధి కుక్కల బెడద: నటి షర్మిలకు సుప్రీం స్ట్రాంగ్ కౌంటర్వీరంతా భారతదేశంలో విభిన్న వృత్తిపరమైన నేపథ్యాల నుండి వచ్చారు. కొందరు రైతులు కాగా, మరికొందరు తమ సొంత చిన్న వ్యాపారాలను నడిపినవారు. ఈ బృందంలో మాజీ వెడ్డింగ్ ప్లానర్లు, డ్రైవర్లు , ఆర్కిటెక్ట్లు కూడా ఉన్నట్లు సమాచారం. తన ప్రస్తుత పాత్ర గురించి ఫోంటాంకాతో మాట్లాడుతూ, మండల్ తనకు టెక్నాలజీ రంగంలో పనిచేసిన అనుభవం ఉందని ముఖేష్ చెప్పాడు.మండల్ మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం చేశారా లేదా మైక్రోసాఫ్ట్ టెక్నాలజీలను ఉపయోగించే సంస్థలలో పనిచేశాడా చేస్తే ఎంతకాలం పనిచేశాడు అనేదానిపై క్లారిటీ లేదు. స్థానిక మీడియాతో తన నిర్ణయం దీర్ఘకాలిక కెరీర్ ప్లాన్స్కంటే ఆర్థిక అవసరాల వల్లే తీసుకున్నానని మండల్ వెల్లడించారు వీధులను శుభ్రపరిచే పనిని చేపట్టడం గురించి అడిగినప్పుడు, “నేను భారతీయుడిని, ఒక భారతీయుడికి ఉద్యోగం ముఖ్యం కాదు. పనే దైవం. మీరు ఎక్కడైనా పని చేయవచ్చు, మరుగుదొడ్డిలో, వీధిలో, ఎక్కడైనా. ఇది నా ఉద్యోగం, నా కర్తవ్యం ,బాధ్యత, దీనిని సాధ్యమైనంత గొప్పగా చేయడమే’’ అని చెప్పాడు. అంతేకాదు తనకు తా రష్యాలో శాశ్వతంగా స్థిరపడాలనే ఉద్దేశ్యం లేదని కూడా చెప్పాడు. ఏడాది కాలం రష్యాలో ఉండి, కొంత డబ్బు సంపాదించి, ఆపై స్వదేశానికి తిరిగి వెడతాను అని వివరించారు. ఇదీ చదవండి: 498 ఏ, పొరిగింటి మహిళకు షాక్ : ఇలా కూడా కేసు పెట్టొచ్చా? టీనేజ్ లవర్స్ : 40 ఏళ్లకు 60లలో మళ్లీ పెళ్లి -
ఎక్స్ గ్రోక్ యూజర్లకు బిగ్ షాక్
ఎడాపెడా గ్రోక్ను వాడేస్తున్న యూజర్లకు ఎక్స్ పెద్ద షాకే ఇచ్చింది. బూతు కంటెంట్ వివాదం నేపథ్యంలో గ్రోక్ చాట్బాట్పై పరిమితులు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై కేవలం సబ్స్క్రైబర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.ఎక్స్ ఫ్లాట్ఫారమ్లో(పూర్వపు ట్విటర్)లో ‘గ్రోక్’ కృత్రిమ మేధ చాట్బాట్ వినోదం కోసం తీసుకొచ్చారు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, సమాచారం అందజేయడం.. తొలినాళ్లలో నవ్వులు పూయిచింది ఇది. అయితే రాను రాను గ్రోక్ వికృత రూపం దాల్చింది. గ్రోక్లో అశ్లీల, అసభ్యకర, అభ్యంతరకర దృశ్యాల రూపకల్పనకు దుర్వినియోగం అవుతుండటంపై పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ప్రముఖులతో పాటు సాధారణ ప్రజల ఫొటోలను అశ్లీల, అసంబద్ధ ప్రాంప్ట్లతో ఎడిట్లు చేస్తున్నారు పలువురు యూజర్లు. అటు గ్రోక్ కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా తన పని తాను చేసుకుంటూ పోయింది. ఈ అంశంపై పలు దేశాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఇటు భారత ప్రభుత్వం సైతం సీరియస్ అయ్యింది. వివరణ కోరుతూ ఎక్స్కు నోటీసులు కూడా జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిన నేపథ్యంలో ఎక్స్ చర్యలు చేపట్టింది. ఈ చాట్బాట్లోని ఇమేజ్ జనరేషన్ ఫీచర్పై పరిమితులు విధించింది. అయితే.. గ్రోక్ (Grok) అనేది xAI రూపొందించిన AI అసిస్టెంట్. ఇది 2023 చివర్లో మొదటి వెర్షన్గా వచ్చింది. అప్పటి నుంచి పలు అప్డేట్లు, కొత్త వెర్షన్లు విడుదలయ్యాయి. 2025 చివర్లో Grok 4.1 Thinking విడుదల కాగా, 2026 జనవరి నాటికి Grok ఇప్పటికే X ప్లాట్ఫారమ్లో భాగమైంది.తీవ్ర విమర్శల వేళ ఇకపై Grok (గ్రోక్) చాట్బాట్ ఫీచర్ Xలో కేవలం సబ్స్క్రైబర్లకే అందుబాటులో ఉండనుంది. ఫ్రీ యూజర్లకు యాక్సెస్ నిలిపివేయడం మొదలుపెట్టింది. గ్రోక్ను ఉపయోగించాలంటే ఎక్స్ ప్రీమియం X Premium లేదా ప్రీమియం ఫ్లస్ Premium+ ప్లాన్ తీసుకోవాలి. ప్రీమియం ప్లాన్ ధర నెలకు రూ.650 ( 8 డాలర్లు), ప్రీమియం ఫస్ల్ ధర నెలకు రూ.1,300 (16 డాలర్లు)గా ఉంది. సంవత్సరం ప్లాన్ ప్రీమియం ధర రూ.6,800, ప్రీమియమ్ ఫ్లస్ ప్లాన్ ధర రూ.13,600గా ఉంది. అయితే ప్రీమియం వెర్షన్లో అందుబాటులో ఉండడమూ ఆందోళన కలిగించే అంశమే కదా అని అంటున్నారు పలువురు. -
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు
లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. దక్షిణ ప్రాంతంలోని హెజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఆక్రమణ దళాలు (IOF) వైమానికదాడులు జరుపుతున్నాయి. నష్టం వివరాలు తెలియరావాల్సింది. అయితే తాజా పరిణామాలతో ఇజ్రాయెల్-హోజ్బొల్లా ఘర్షణలు మళ్ల తీవ్రతరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు దక్షిణ లెబనాన్లోని పలు ప్రాంతాల్లో హెజ్బొల్లా షెల్టర్లను టార్గెట్ చేశాయి. సాజ్, అల్-రయ్హాన్, మౌంట్ అల్-రఫీ ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగాయని తెలుస్తోంది. దీర్ అల్-జహ్రాని, హౌమిన్ అల్-ఫౌఖా ప్రాంతాల గగనతలంలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాల సంచారం కనిపించిందని తెలుస్తోంది. మరోవైపు.. దీర్ అల్-జహ్రాని–హౌమిన్ అల్-ఫౌఖాలోని లోయపై బాంబుదాడి జరిగింది. ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు దక్షిణ లెబనాన్లోని క్ఫార్ఫిలా, రూమైన్, మౌంట్ రయ్హాన్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తాజా దాడులతో స్పష్టమవుతోంది. అటు వాది హమిలా ప్రాంతాన్ని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నట్లు సమాచారం. హెజ్బొల్లాకి చెందిన మిసైల్ ప్లాట్ఫారమ్లు, ఆయుధ గిడ్డంగులు ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించుకుంది. 2024లో అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన సీజ్ఫైర్ తర్వాత కూడా ఇజ్రాయెల్ 10,000కిపైగా ఉల్లంఘనలు జరిపిందని UNIFIL (United Nations Interim Force in Lebanon) గణాంకాలు చెబుతున్నాయి. లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఆవున్ తాజా దాడులను తీవ్రంగా ఖండిస్తూ.. ఇవి ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయన్నారు. లెబనాన్లోని పలు గ్రామాల ప్రజలను తక్షణ ఖాళీ చేయమని హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్ చర్యలను ఖండిస్తూ.. ఐక్యరాజ్య సమితి కూడా ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. -
ఆయన్ని సంతోషపెట్టేందుకు ఇరాన్ పరువు తీయొద్దు
తన పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ స్పందించారు. విదేశీ శక్తుల చేతుల్లో కిరాయి సైనికుల్లా వ్యవహరించే వారిని సహించబోమంటూ ఆందోళనకారుల్ని హెచ్చరించారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు కూడా చురకలు అంటించారు. శుక్రవారం ఇరాన్ ఆందోళనలపై ఓ వీడియో మేసేజ్లో ఖమేనీ స్పందిస్తూ..మన దేశ వీధులను పాడుచేసి.. మరో దేశ అధ్యక్షుడిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారి కోసం రోడ్డెక్కి దేశ పరువు తీయొద్దు. విదేశీ శక్తుల చేతుల్లో కిరాయి సైనికుల్లా వ్యవహరించే వారిని ఇస్లామిక్ రిపబ్లిక్ సహించబోదు అని వార్నింగ్ ఇచ్చారు. తన మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలియజేసిన ఆయన.. ఈ సమయంలో ఇరాన్ యువత ఏకతాటిపై నిలవాల్సిన అవసరం ఉందని, అప్పుడే ఎలాంటి శత్రువునైనా ఇరాన్ ఎదుర్కొగలుగుతుందని అభిప్రాయపడ్డారు.మీ సంగతి చూస్కోండినిరసనకారులపై కాల్పులు జరిపితే చూస్తూ ఊరుకోబోమని ట్రంప్ పదే పదే ఇరాన్ను హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖమేనీ, అగ్రరాజ్యం అధ్యక్షుడికి చురకలంటించారు. ఇతర దేశాలకు నీతులు చెప్పే ముందు సొంత దేశంపై దృష్టిపెట్టాలంటూ ట్రంప్కు ఖమేనీ హితవు చెప్పారు.ఖమేనీ గద్దె దిగాలంటూ ఇరాన్ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో జరుగుతున్న ఆందోళనలు.. గత కొద్దిరోజులుగా తీవ్రతరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆయన దేశం విడిచిపారిపోయారంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే ఇరాన్ ప్రభుత్వం వాటిని ఖండించినా.. ఖమేనీ మాత్రం అధికారికంగా ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయన ఆశ్రయం కోసం మాస్కోకు వెళ్లారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే.. ఊహాగాలను తెర దించుతూ ఇవాళ ఆయన ఇరాన్ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. 2026 ఆర్థిక బడ్జెట్పై అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ప్రసంగం సమయంలో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఆర్థిక సంక్షోభంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, తారాస్థాయికి చేరుకున్న నిరుద్యోగ సమస్య, కరెన్సీ విలువ పడిపోవడం,వీటికి తోడు రాజకీయ స్వేచ్ఛకు భంగం కలగడంతో.. ఇరాన్ వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. టెహ్రాన్, మష్హాద్, ఇస్ఫహాన్ వంటి నగరాల్లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా, ఇరాన్లో నూతన సంస్కరణలను డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున ప్రజలు రోడ్డెక్కి నినాదాలు చేశారు.డిసెంబర్ 28న మొదలై.. 27 ప్రావిన్సుల్లో 250కి పైగా ప్రాంతాలకు నిరసనలు విస్తరించాయి. ఆందోళనకారుల్ని అణచివేసేందుకు భద్రతా బలగాలు.. టియర్ గ్యాస్, షాట్గన్స్, వాటర్ కేనన్లు ప్రయోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. గత 12 రోజులుగా జరుగుతున్న ఈ ఆందోళనల్లో ఇప్పటిదాకా 35 మంది మరణించారు. వీళ్లలో నలుగురు చిన్నారులు, ఇద్దరు భద్రతా సిబ్బంది ఉన్నారు. సుమారు 1,200 మందికి పైగా అరెస్టు అయ్యారు. భారీగా ప్రజా ఆస్తులకు నష్టం వాటిల్లింది. పరిస్థితి తీవ్రతరం కావడంతో ఇంటర్నెట్ సదుపాయాన్ని నిలిపివేసింది ఇరాన్ ప్రభుత్వం. నిరసనకారులను విదేశీ శక్తుల కిరాయి సైనికులుగా అభివర్ణిస్తూ, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. -
గ్రీన్లాండ్ నేలపై కరెన్సీ నీడలు!
వీలైతే యుద్ధం.. లేకపోతే శాంతి మంత్రం.. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లో గత కొంతకాలంగా చూస్తూ వస్తున్న యాంగిల్స్. అయితే ఆయనలో ‘బిజినెస్మ్యాన్’ కూడా ఉన్నాడండి. తాను అనుకున్న దానిని ఏదో రకంగా దక్కించుకోవడమే ఈ బిజినెస్ సూత్రం. వీలేతై దేన్నైనా కొనేయడం. మనం షేర్లు కొన్నట్లు డెన్మార్క్లో భాగమైన గ్రీన్లాండ్ను కొనేయడానికి సిద్ధమవుతున్నారు ట్రంప్. అక్కడ 6 వందల బిలియన్ డాలర్లు వెచ్చించి ఆ ప్రాంతాన్ని సొంతం చేసుకోవడానికి సన్నద్ధమయ్యారు. ఎలాగైనా గ్రీన్లాండ్ను తమది అనిపించుకోవాలనే పట్టుదలతో ఉన్న ట్రంప్.. ఇక డానిష్ దేశానికి డబ్బు ఆశ చూపుతున్నారు. గ్రీన్లాండ్ నేలపై కరెన్సీ నీడను పరచడానికి ట్రంప్ శరవేగంగా పావులు కదుపుతున్నారు. నేటి ప్రపంచంలో డబ్బుతో అసాధ్యం కానిది ఏదీ లేదని నమ్మేవాళ్లలో ఒకరైన ట్రంప్.. డబ్బు అనే వలతో స్వేచ్ఛను బందించే యత్నం చేస్తున్నారు. ఈ మేరకు గ్రీన్లాండ్ (Greenland) ప్రజలకు డొనాల్డ్ ట్రంప్ భారీ ఆఫర్ చేశారు. స్వచ్ఛందంగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేస్తే ఆరు వందల బిలియన్ డాలర్లు చెల్లిస్తానని ప్రకటించారు ట్రంప్. ఇలా అక్కడ ప్రజల్ని ముందుగా ఖాళీ చేయించే యత్నం చేస్తున్నారు. ఈసారి గ్రీన్లాండ్ ప్రజలే టార్గెట్..గ్రీన్లాండ్ అంటే అమెరికాకు అమితమైన ఆసక్తి. అందులోనూ ఈ దీవిపై ట్రంప్నకు ఆసక్తి మరీ ఎక్కువ. 2019లో ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంలోనే గ్రీన్లాండ్పై బేరసారాలు జరిపారు. అప్పుడు ప్రభుత్వానికి డబ్బు ఆఫర్ను ప్రతిపాదించారు ట్రంప్.. అయితే దాన్ని డెన్మార్క్ తిరస్కరించింది. కానీ రెండోసారి అధ్యక్షుడైన ట్రంప్ మరోసారి కూడా డబ్బును వెదజల్లడానికి సిద్ధమయ్యారు. ఈసారి డెన్మార్క్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి.. గ్రీన్లాండ్ ప్రజలకు భారీ ఆఫర్ను తెరపైకి తీసుకొచ్చారు. అక్కడ ఉండే వారికి ప్రతీ వ్యక్తికి 10 వేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల వరకూ ఇచ్చి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించాలని చూస్తున్నారు. ఒకవేళ ట్రంప్ చూపే ఆశకు గ్రీన్లాండ్లో ఉండే వాళ్లు సిద్ధమైతే మాత్రం.. ఆ ప్రాంతాన్ని సునాయాసంగానే ట్రంప్ దక్కించుకునే అవకాశం ఉంటుంది. డబ్బు వలలో స్వేచ్ఛ బందీ కానుందా?గ్రీన్లాండ్పై ట్రంప్ వ్యూహం మార్చడంతో డెన్మార్క్కు అంతా గందరగోళంగా ఉంది. డెన్మార్క్ నుంచి గ్రీన్లాండ్ను వేరు చేయడానికి చూస్తున్న ట్రంప్ను ఎదుర్కోవడానికి ఏం చేయాలనే యోచనలో ఉంది డెన్మార్క్ ప్రభుత్వం. ట్రంప్ ప్రకటించిన ఆఫర్కు గ్రీన్లాండ్ ప్రజలు లొంగితే ఇక తాము ప్రత్యక్ష యుద్ధంలోకి దిగకతప్పదనే భయం పట్టుకుంది. అగ్రరాజ్యం అమెరికా ఎదిరించి నిలబడటం అంత ఈజీ కాదని డెన్మార్క్కు తెలుసు. పోని వేరే దేశాలేమైనా సాయం చేస్తాయంటే అది ఎంతవరకూ జరుగతుందో అనేది చూడాలి. రష్యా, చైనా (China) వంటి దేశాలు డెన్మార్క్కు సాయం చేస్తే తప్పితే, గ్రీన్లాండ్ను కాపాడుకోవడం డెన్మార్క్కు అత్యంత కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు. ప్రత్యేకమైన దీవి ఇది.. ఉత్తర అమెరికా, యూరప్ ఖండాలక ఇది సరిగ్గా మధ్యలో ఉంటుంది. ప్రధానంగా ఖండాంతర క్షిపణులు మందస్తు హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటుకు ఇది అనువైనది. అమెరికా సైన్యానికి వ్యూహాత్మకమైన ప్రాంతంగా కూడా ఉపయోగపడుతుంది. రష్యా నావికా దళంపై అమెరికా ఎప్పుడూ కన్నేసి ఉంచడానికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. యూరప్, ఉత్తర అమెరికా ఖండాలకు అది సరిగ్గా మధ్యలో ఉంటుంది. దాంతో అమెరికా సైన్యానికి వ్యూహాత్మకంగా ఈ ప్రాంతం చాలా కీలకం. అంతేగాక ఖండాంతర క్షిపణుల ముందస్తు హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటుకు కూడా ఇది అత్యంత అనువైనది. వాయవ్య గ్రీన్లాండ్లోని పిటుఫిక్లో అమెరికాకు ఇప్పటికే సైనిక స్థావరముంది. ఇక్కడి నుంచి రష్యా నావికా దళ కదలికలపై అమెరికా అనునిత్యం స్పష్టంగా కన్నేసి ఉంచవచ్చు కూడా.ఖనిజాల సంపదకు పెట్టింది పేరు.. అత్యంత అరుదైనవిగా ప్రకటించిన 34 ఖనిజాల్లో గ్రాఫైట్, లిథియం వంటి ఏకంగా 25 ఖనిజాలు గ్రీన్లాండ్లో అపారంగా ఉన్నట్టు తేలింది. అమెరికా ఈ ఖనిజాల కోసం చాలాకాలంగా చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. చైనాపై విధించిన భారీ టారిఫ్లను కూడా అంతే వేగంగా ట్రంప్ వెనక్కు తీసుకోవడానికి ఈ ఖనిజాల ఎగుమతిపై డ్రాగన్ నిషేధం విధించడమే ప్రధాన కారణం. గ్రీన్లాండ్ తమకు చిక్కితే ఇకపై ఆ ఖనిజాల కోసం చైనాను బెదిరించే దురవస్థ ఉండదన్నది ట్రంప్ యోచనగా ఉంది. ఈ దీవి 7 దశాబ్దాల క్రితమే డెన్మార్క్లో భాగంగా మారింది. కాకపోతే 2019లో గ్రీన్లాండ్కు విస్తృత స్వయం పాలిత ప్రాంతంగా గుర్తింపు లభించింది. ప్రపంచంలోనే అతిపెద్ద దీవిగా ఉన్న గ్రీన్లాండ్.. డెన్మార్క్ నియంత్రణలోనే ఉంది. ప్రస్తుత గ్రీన్లాండ్ జనాభా కూడా లక్ష లోపే ఉంది. వారి జనాభా సుమారు 57 వేలు ఉండొచ్చని అంచనా.. -
అలస్కాలో ‘గుంటూరు విద్యార్థి’ అదృశ్యం
అలాస్కా: అమెరికాలోని అలాస్కాకు ఒంటరిగా బయలుదేరిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థి అదృశ్యం కావడం మిస్టరీగా మారింది. ప్రకృతి అందాలను తిలకించడానికి వెళ్లి.. మంచు కొండల మధ్య ఆచూకీ లేకుండా పోయాడు. గుంటూరు జిల్లా అద్దంకికి చెందిన హరి కరసాని హ్యూస్టన్లో నివాసం ఉంటున్నారు. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో హరి డిసెంబర్ 22, 2025న ఒంటరిగా అలాస్కా పర్యటనకు వెళ్లారు.అక్కడ హీలీ పట్టణంలోని ఔరోరా డెనాలి లాడ్జ్లో బస చేశారు జనవరి 4 నాటికి తిరిగి వస్తానని తన రూమ్మేట్స్కు కూడా సమాచారం ఇచ్చారు. అయితే, డిసెంబర్ 30న చివరిసారిగా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడిన హరి.. ఆ మరుసటి రోజు డిసెంబర్ 31 హోటల్ నుంచి చెక్-ఔట్ కాగా.. అప్పటి నుండి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది.డిసెంబర్ 31న ఆయన హోటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక క్యాబ్ సర్వీస్ వాడినట్లు సమాచారం. హరికి డ్రైవింగ్ రాకపోవడంతో ఆయన క్యాబ్లు, స్థానిక రవాణాపైనే ఆధారపడ్డారు. హోటల్ నుంచి బయలుదేరిన హరి ఆ క్యాబ్లో ఎక్కడికి వెళ్లారు? ఆ డ్రైవర్ ఎవరు? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిసెంబర్ 31 తర్వాత డెనాలి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల ఫారన్హీట్ వరకు పడిపోయాయని, హరి గురించి ఎలాంటి సమాచారం లభించలేదని అతని స్నేహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మోదీ ఫోన్ చేయలేదని.. ట్రంప్ సుంకాల ఆంక్షలు!
భారతపై 500 శాతం సుంకాలకు రెఢీ అవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కసు మరోసారి బయటపడింది. ఇప్పటికే వరస సుంకాలతో భారత్న ఇరకాటంలో పెట్టడానికి యత్నించిన ట్రంప్.. త్వరలో 500 శాతం సుంకాల భారాన్ని వేసే దిశగా పావులు కదుపుతున్నాడు. అయితే దీనిపై ట్రంప్కు అత్యంత సన్నిహితుడు , అమెరికా వాణిజ్య కార్యదర్శి లట్నిక్ తొలిసారి పెదవి విప్పారు. ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. అమెరికాతో భారత్ బంధం ఈ రకంగా మారడానికి గల కారణాలు వెల్లడించారు. ‘యూఎస్తో వాణిజ్య ఒప్పందంలో భాగంగా భారత ప్రధాని మోదీ ఎటువంటి ఫోన్ చేయలేదు. ట్రంప్కు ఫోన్ చేసి వాణిజ్య ఒప్పందం గురించి మోదీ ఏమీ మాట్లాడలేదు. భారత్-అమెరికాల వాణిజ్య ఒప్పందానికి తానొ డీల్ను సిద్ధం చేశాను. అయితే అది తుదిరూపం దాల్చలేదు. ఎందుకంటే భారత్ ప్రధాని మోదీ నుంచి మాకు ఎటువంటి ఫోన్ రాలేదు’ అందుకే సుంకాలన అత్యధికంగా విధించాలని ట్రంప్ సిద్ధమయ్యారు అని వెల్లడించారు. ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి దేశాలతో వచ్చే వారం అనేక వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోతున్నాం. కానీ భారత్తో ఒప్పందం వాటి కంటే ముందే పూర్తవ్వాల్సింది.ఇతర దేశాల కంటే ముందే భారత్తొ ఒప్పందం పూర్తవ్వాల్సింది. నేను వారితో ఎక్కువ శాతం చర్చలు జరిపాను’ అని లట్నిక్ తెలిపారు.BIG BREAKING: India trade deal isn't done because PM Modi did not call Trump, claims US Commerce Secretary Lutnick"I set the deal up. But you had to have Modi call President Trump. They (India) were uncomfortable with it. So Modi didn't call." pic.twitter.com/gFiUGGaJRl— Shashank Mattoo (@MattooShashank) January 9, 2026 కాగా, ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని త్వరగా ముగించాలన్న పట్టుదలతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో టారిఫ్ బాంబు సిద్ధం చేశారు. అమెరికా హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా రష్యా నుంచి చౌక ధరకు చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై ఏకంగా 500% టారిఫ్లు విధించడానికి ఉద్దేశించిన బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రష్యా నుంచి చమురు ఎవరూ కొనకుండా ఆంక్షలు విధించబోతున్నారు. ఆంక్షలను ఉల్లంఘించే దేశాలపై సుంకాల మోత మోగనుంది. ఈ మేరకు రూపొందించిన బిల్లుపై అమెరికా కాంగ్రెస్లో త్వరలోనే ఓటింగ్ జరగనుంది. అక్కడ ఆమోదం పొందితే భారత్, చైనా ఉత్పత్తులపై 500 శాతం సుంకాలు విధించే అధికారం ట్రంప్కు లభిస్తుంది. -
47 ఏళ్ల నుంచి చచ్చిపోతూనే ఉన్నాను..!
ఇరాన్లో నిరసనల పర్వం తారాస్థాయికి చేరింది. ఇజ్రాయిల్తో యుద్ధం అనంతరం ఇరాన్లో రాజకీయ సంక్షోభం ప్రబలింది. ప్రధానంగా ఇరాన్ సుప్రీంలీడర ఆయుతుల్లా ఖమేనీ నేతృత్వంలో ఇరాన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్లాడుతండటంతో ఆ దేశ ప్రజల ఒక్కసారిగా రోడ్లపైకి పెద్ద ఎత్తున వచ్చి నిరసన బాట పట్టారు. ఇక ఖమేనీ శకం అయిపోయిందని, తక్షణమే ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. తమకు స్వేచ్ఛ జీవితం లేదని, ఇరాన్లో చచ్చి బతుకుతున్నామని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 47 ఏళ్లగా చచ్చిపోయే ఉన్నాను..ఒక మహిళ తడిసిన రక్తంతో పెద్ద పెద్దగా అరుస్తూ ఖమేనీ ప్రభుత్వంపై తన నిరసనను వ్యక్తం చేసింది. ఆమె నాలుకపై రక్తం కారుతున్న దృశ్యాలు అత్యంత బాధాకరంగా కనిపిస్తున్నాయి. ‘ నేను 47 ఏళ్లుగా చచ్చిపోయే ఉన్నాను.. ఇంకా భయమెందుకు. ఇంకా కొత్తగా చచ్చిపోయేదేముంది’ అంటూ పెద్దగా కేకలు పెడుతూ నిరసన వ్యక్తం చేయడం అక్కడ ఖమేనీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతకు అద్దం పడుతోంది. నియంత ఇక లేడు.. ఇస్లామిక్ రిపబ్లిక్ కూడా ఉండదు..! ఇరాన్ నియంతగా పేరు గాంచిన ఖమేనీ ఇక లేడని, ఆయనకు చెందిన ఇస్లామిక్ రిపబ్లిక్ పార్టీ కూడా ఇక ఇరాన్లో ఉండదని ప్రజలు తమ నిరసన గళం విప్పారు. తాము ఖమేనీ పాలనలో నలిగిపోయే ఉన్నామని, ఇక ఆ పరిపాలన వద్దంటూ కదం తొక్కుతున్నారు. ఖమేనీ స్వచ్ఛదందగా రాజీనామా చేస్తే ఓకే కానీ ఒకవేళ అలా జరగని పక్షంలో తామే గద్దె దింపుతామని హెచ్చరిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ ఆంక్షలు ఇబ్బంది పెడుతున్నా.. ప్రజా ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. I’m not afraid. I’ve been dead for 47 years this is the voice of a woman in Iran who is fed up with the Islamic republic.47 years ago, the Islamic Republic took our rights and turned a nation into hostages.Today people have nothing left to lose, they rise.Iran is rising. pic.twitter.com/GAawmynE0C— Masih Alinejad 🏳️ (@AlinejadMasih) January 8, 2026 ఇదీ చదవండి:ఇరాన్లో ఉధృతమైన ‘స్వేచ్ఛా’ స్వరం -
ఇరాన్లో ఉధృతమైన ‘స్వేచ్ఛా’ స్వరం
ఇరాన్ సుప్రీంలీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ తక్షణమే పదవి నుంచి దిగిపోవాలంటూ ఆ దేశంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తమకు స్వేచ్ఛ కావాలంటూ ప్రజలు రోడ్లపై నిరసన బాట మరింత ఉధృతంగా మారింది. గత వారం రోజులుగా చేస్తున్న వారి నిరసన అంతకంతకూ ప్రభుత్వంపై వ్యతిరేకతను చాటిచెబుతూ తీవ్రతరమయ్యింది. అమెరికా డాలర్తో ఇరానియన్ రియాల్ విలువ భారీగా పడిపోవడం, తద్వారా ధరలు ఎగబాకడం, జీవన వ్యయం పెరిగిపోవడం పట్ల జనం అసంతృప్తితో రగిలిపోతున్నారు. దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి, ప్రభుత్వ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఆరు రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇది మరో ‘జెన్జీ’ కానుందా?ఇది క్రమంగా జెన్జీ(Gen-Z) ఉద్యమంగా రూపుదాలుస్తుండడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. పెరుగుతున్న జీవన వ్యయం, క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ, భద్రతా బలగాల కఠిన చర్యలపై ఆగ్రహంతో ఇరానీయులు వీధుల్లోకి వచ్చి, పాలక ధార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఈ నిరసనల దృష్ట్యా ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ , అంతర్జాతీయ టెలిఫోన్ కాల్స్ ను నిలిపివేసింది. దీనిపై భద్రతా బలగాలు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించగా, ప్రజలు ‘స్వేచ్ఛ, స్వేచ్ఛ’ అనే నినాదాలతో తమ నిరసనను మరింత ఉధృతం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో యువత చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రధాన నగరాలు అట్టుడికిపోతున్నాయి. ప్రభుత్వ వాహనాలను దహనం చేస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్లోని ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందిన ఇరాన్ ప్రవాస యువరాజు రెజా పహ్లవి ఇచ్చిన పిలుపు మేరకు కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. Iranians have had enough.They want the regime to fall pic.twitter.com/31pKHpNZD2— Visegrád 24 (@visegrad24) January 9, 2026 ఫహ్లవి పిలుపుతో మరింత ఉధృతం..పహ్లవి గురువారం, శుక్రవారం స్థానిక సమయం రాత్రి 8 గంటలకు నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో తెహ్రాన్లోని పలు ప్రాంతాలు నినాదాలతో మార్మోగాయి. ఆయన ఇచ్చిన పిలుపుతో నిరసనలు మరింత ఉధృతంగా మారాయి. అమెరికాలో ఉన్న పహ్లవి తిరిగి రావాలని ఇరాన్ ప్రజల ఆశాభావంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రవాసంలో ఉన్న పహ్లవి తప్పకుండా తిరిగి వస్తారని ఆయన మద్దతుదారులు అంటున్నారు. Another video from Dolat Street in #Tehran, capital city of #Iran, shows protesters chanting slogans against the Islamic regime and expressing support for #RezaPahlavi, the leader of Iran’s revolution. #IranProtests pic.twitter.com/AO1SmFq9DT— Babak Taghvaee - The Crisis Watch (@BabakTaghvaee1) January 9, 2026 ట్రంప్తో కలిసి పని చేయండి.. పాలనను గాడిలో పెట్టండిఖమేనీతో పాటు, యూరోపియన్ నాయకులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కలసి పాలనను గాడిలో పెట్టాలని వాగ్దానం చేయాలని పహ్లవి డిమాండ్ చేశారు. ‘ ‘ఇరాన్ ప్రజలతో మళ్లీ సంబంధాలు ఏర్పడేలా అన్ని సాంకేతిక, ఆర్థిక, దౌత్య వనరులను వినియోగించమని నేను వారిని కోరుతున్నాను, తద్వారా వారి స్వరం మరియు సంకల్పం వినబడేలా, కనిపించేలా అవుతుంది. నా ధైర్యవంతమైన సహచరుల స్వరాలు మూగబారనివ్వకండి’ అని తెలిపారు. BREAKING:The people of Tehran are burning down regime buildings right now. The crowd is MASSIVE. pic.twitter.com/V5j6nwbLb4— 𝐍𝐢𝐨𝐡 𝐁𝐞𝐫𝐠 ♛ ✡︎ (@NiohBerg) January 8, 2026 -
డొనాల్డ్ ట్రంప్ మాస్టర్ ప్లాన్.. అమెరికా చేతికి గ్రీన్లాండ్!
వాషింగ్టన్ డీసీ: ‘గ్రీన్లాండ్ మాక్కావాల్సిందే. అమెరికా భద్రత దృష్ట్యా ఇది అత్యంత కీలకం. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదంటూ’నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందుకోసం సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగిస్తున్నారు.ఇందులో భాగంగా.. ట్రంప్ ప్రభుత్వం గ్రీన్లాండ్లో నివసిస్తున్న మొత్తం 57వేల మంది జనాభాలో ఒక్కొక్కరికి పదివేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల వరకు వెచ్చించేందుకు సిద్ధమైంది. మొత్తంగా 53 వేల కోట్లు ఖర్చు పెట్టనున్నారు.వారికి డబ్బులు ఇవ్వడమే కాదు గ్రీన్లాండ్ నుంచి అమెరికాకు తరలి వెళ్లేలా ఏర్పాట్లు చేయనున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల, ట్రంప్ గ్రీన్లాండ్ను కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుగుణంగానే గ్రీన్లాండ్ వాసులకు ఈ మొత్తాన్ని ముట్టజెప్పనున్నారు. నగదు చెల్లింపులతో పాటు దౌత్య ఒప్పందాలు, సైనిక శక్తి వినియోగం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. ఎందుకంత ఆసక్తి? గ్రీన్లాండ్పై ట్రంప్ ఆసక్తి వెనక బోలెడన్ని కారణాలున్నాయి. యూరప్, ఉత్తర అమెరికా ఖండాలకు అది సరిగ్గా మధ్యలో ఉంటుంది. దాంతో అమెరికా సైన్యానికి వ్యూహాత్మకంగా ఈ ప్రాంతం చాలా కీలకం. అంతేగాక ఖండాంతర క్షిపణుల ముందస్తు హెచ్చరికల వ్యవస్థ ఏర్పాటుకు కూడా ఇది అత్యంత అనువైనది. వాయవ్య గ్రీన్లాండ్లోని పిటుఫిక్లో అమెరికాకు ఇప్పటికే సైనిక స్థావరముంది. ఇక్కడి నుంచి రష్యా నావికా దళ కదలికలపై అమెరికా అనునిత్యం స్పష్టంగా కన్నేసి ఉంచవచ్చు కూడా.అపార ఖనిజ నిల్వలు గ్రీన్లాండ్ అపారమైన ఖనిజ, చమురు, సహజవాయు నిల్వలకు ఆలవాలం. అత్యంత అరుదైనవిగా ప్రకటించిన 34 ఖనిజాల్లో గ్రాఫైట్, లిథియం వంటి ఏకంగా 25 ఖనిజాలు గ్రీన్లాండ్లో అపారంగా ఉన్నట్టు తేలింది. విద్యుత్ వాహనాల తయారీలో ఇవి చాలా కీలకమన్నది తెలిసిందే. అమెరికా ఈ ఖనిజాల కోసం చాలాకాలంగా చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. చైనాపై విధించిన భారీ టారిఫ్లను కూడా అంతే వేగంగా ట్రంప్ వెనక్కు తీసుకోవడానికి ఈ ఖనిజాల ఎగుమతిపై డ్రాగన్ నిషే«ధం విధించడమే ప్రధాన కారణం. గ్రీన్లాండ్ తమకు చిక్కితే ఇకపై ఆ ఖనిజాల కోసం చైనాను బెదిరించే దురవస్థ ఉండదన్నది ట్రంప్ యోచన. ఇక గ్రీన్లాండ్లో చమురు, సహజవాయు నిల్వలు కూడా అపారంగా ఉన్నా, పర్యావరణ కారణాల రీత్యా వాటి వెలికితీతపై నిషేధం కొనసాగుతోంది. ఆ ప్రాంతాన్ని ఆక్రమించి వాటిని కూడా సొంతం చేసుకోవాలన్నది ట్రంప్ వ్యూహం.అతి పెద్ద ద్వీపం గ్రీన్లాండ్ (Greenland) ప్రపంచంలోనే అతి పెద్ద దీవి. 1953లో డెన్మార్క్లో భాగంగా మారింది. అయితే 2009లో దానికి విస్తృత స్వయంపాలిత ప్రతిపత్తి దక్కింది. దాని ప్రకారం గ్రీన్లాండ్వాసులు రిఫరెండం ద్వారా పూర్తి స్వాతంత్య్రం పొందవచ్చు కూడా. కాకపోతే అదిప్పటికీ డెన్మార్క్ నియంత్రణలోనే ఉంది. ఇంతా చేస్తే గ్రీన్లాండ్ జనాభా కేవలం 57 వేలు! -
ట్రంప్ ఉపసంహరణ తంత్రం
వాషింగ్టన్: తమ అగ్రరాజ్య ఆధిపత్యాన్ని ధిక్కరిస్తున్న దేశాలపైకి సైన్యాన్ని నడిపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. 66 అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం సంబంధిత మెమోరాండంపై సంతకం చేశారు. ఆయా సంస్థల అవసరం ఇకపై లేదని, అవి అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా పని చేస్తున్నాయని ట్రంప్ తేలి్చచెప్పారు. ఇందులో ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు, పలు ఇతర సంస్థలతోపాటు భారత్, ఫ్రాన్స్ సారథ్యంలోని ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ ఉంది. వాటితో అమెరికాకు ఎలాంటి సంబంధం ఉండబోదని ట్రంప్ స్పష్టంచేశారు. తమ జాతీయ ప్రయోజనాలు, భద్రత, ఆర్థిక ప్రగతి, సార్వ¿ౌమత్వానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న సంస్థల్లో సభ్యత్వం కొనసాగించడం, భాగస్వామిగా పనిచేయడం, ఆర్థిక సాయం అందించడం అర్థంలేని పని అని అన్నారు. అమెరికా పట్ల దురుద్దేశాలతో వ్యవహరిస్తున్న సంస్థలకు తమ నిధులు ఎందుకివ్వాలని నిలదీశారు. అమెరికా సభ్యత్వం ఉపసంహరించుకున్న వాటిలో ఐరాస సంస్థలు 31, ఇతర సంస్థలు 35 ఉన్నాయి. అంతర్జాతీయ సంస్థల నుంచి ఉపసంహరణ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని సంబంధిత ఎగ్జిక్యూటివ్ డిపార్టుమెంట్లు, ఏజెన్సీలను ట్రంప్ ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని చెప్పారు. ట్రంప్ను తప్పుపట్టొద్దు: రూబియో మరికొన్ని అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికా తప్పుకొనే అవకాశాలు మెండుగా ఉన్నాయని, ట్రంప్ ఆ దిశగా ఆలోచన చేస్తున్నారని విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచి్చన హామీని ట్రంప్ అమలు చేస్తున్నారని, ఆయనను తప్పు పట్టాల్సిన పనిలేదని అన్నారు. అమెరికాను వ్యతిరేకించే శక్తులకు నిధులు ఇవ్వడం ఆపేస్తానంటూ ట్రంప్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ‘అమెరికా, అమెరికన్స్ ఫస్ట్’ అనేదే తమ నినాదం, విధానమని ఉద్ఘాటించారు. అమెరికా ప్రజల రక్తం, స్వేదం, కష్టార్జితాన్ని మరెవరికో ధారపోయడం కొనసాగదని రూబియో పేర్కొన్నారు. ఇప్పటికే బిలియన్ డాలర్ల సొమ్ము విదేశాలకు తరలిపోయిందని, అమెరికా ప్రజలే నష్టపోయారని తెలిపారు. తమ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ, దెబ్బకొట్టాలని చూస్తున్న సంస్థలకు నిధులిచ్చే ప్రసక్తే లేదని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి మైక్ వాల్జ్ స్పష్టంచేశారు. సౌర కూటమికి ఎదురుదెబ్బ? అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్ఏ) నుంచి తప్పుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. సౌర విద్యుత్, సౌర ఇంధన వనరులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రతికూల వాతావరణ మార్పులను, దు్రష్పభావాలను అరికట్టాలన్న లక్ష్యంతో ఈ కూటమి ఏర్పాటైంది. భారత్, ఫ్రాన్స్ ఇందుకు సంయుక్తంగా చొరవ తీసుకున్నాయి. 2015లో పారిస్లో జరిగిన కాప్–21 సదస్సు సందర్భంగా కూటమిని ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయం భారత్లోనే ఉంది. ప్రస్తుతం 90కి పైగా దేశాలకు ఐఎస్ఏలో సభ్యత్వం కల్పించారు. 2030 నాటికి ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలన్నది కూటమి లక్ష్యం. ముఖ్యమైన దేశం అమెరికా ఉపసంహరించుకోవడంతో ఐఎస్ఏ ఉద్దేశం నీరుగారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక రకంగా ట్రంప్ నిర్ణయం సౌర కూటమికి ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. ఏయే సంస్థల నుంచి.. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్, సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్(ఉక్రెయిన్), యూఎన్ డిపార్టుమెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్, యూఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఎకనామిక్ కమిషన్ ఫర్ ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరీబియన్, యూఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, యూఎన్ పాపులేషన్ ఫండ్ తదితర సంస్థల నుంచి తాము ఉపసంహరించుకుంటున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. -
అమెరికా దాడిలో 100 మంది మృతి
కరాకస్: గత శనివారం శత్రు దుర్భేద్యమైన సైనిక స్థావరంపై విచక్షణారహితంగా బాంబులేసి అధ్యక్షభవనంలో చొరబడి అధ్యక్షుడు నికొలస్ మదురో దంపతులను ఎత్తుకెళ్లిన అమెరికా బలగాలు జరిపిన దాడిలో ఏకంగా 100 మంది ప్రాణాలు కోల్పోయారని వెనెజువెలా అంతర్గత మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. కొత్త అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ సారథ్యంలోని వెనెజువెలా ప్రభుత్వం ఈ మరణాల సంఖ్యను అధికారికంగా వెల్లడించడం ఇదే తొలిసారి. తమ అధ్యక్షుడిని అమెరికా సైన్యం చేతికి చిక్కకుండా రక్షించుకునే క్రమంలో మదురో అంగరక్షకుల్లో చాలా మంది వీరమరణం పొందారని వెనెజువెలా అధికారులు ప్రకటించారు. ‘‘ అమెరికా మెరుపుదాడి వేళ మా సైన్యం, అమెరికా సైనికుల మధ్య జరిగిన కాల్పులు, ఘర్షణాత్మక వాతావరణంలో మదురో కాలికి గాయమైంది. మదురో భార్య సిలియా ఫ్లోరెస్ తలకు బలమైన గాయమైంది’’ అని అంతర్గత మంత్రి డియాస్డాడో క్యాబెల్లో చెప్పారు. వెనెజువెలా ఆర్మీ ఇప్పటికే 23 మంది మృతుల పేర్లను తమ వెబ్సైట్లో ప్రచురించడం తెల్సిందే. వెనెజువెలా సైనిక, పౌర అవసరాలు తీర్చేందుకు ఆ దేశానికి పంపించిన తమ సైనికులు 32 మంది చనిపోయారని క్యూబా ఇప్పటికే ప్రకటించింది. మరణించిన తమ సైనికుల అంత్యక్రియలను వెనెజువెలా సైన్యం బుధవారం కరాకస్ నగరంలో అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. నేషనల్ గార్డ్ సభ్యులు, మృతుల కుటుంబసభ్యులు, బంధువులు, వందలాది మంది స్థానికులు దారిపొడవునా మృతులకు ఘననివాళులర్పించారు. మృతులను స్మరిస్తూ అధ్యక్షురాలు డెల్సీ ఏడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించారు. ‘‘ వెనెజువెలా ఏనాటికీ శత్రుదేశం ఎదుట తలవంచదు. ఘన చరిత్ర, వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఈ దేశమూ ఆ పనిచేయదు’’ అని మంత్రి క్యాబెల్లో వ్యాఖ్యానించారు. -
అగ్రరాజ్యానికి వార్నింగ్.. ఆ రూల్ ప్రకారమే దాడి చేస్తాం..!
అగ్రరాజ్యం అమెరికాను డైన్మార్క్ హెచ్చరించింది. గ్రీన్ల్యాండ్ను ఆక్రమించినట్లయితే దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. మా ఆదేశాలు లేకుండానే సైనికులు కాల్పులు జరుపుతారని డెన్మార్క్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. తమ సైనికులు ముందుగా కాల్పులు జరిపిన తర్వాతే ప్రశ్నలు అడుగుతారని డానిష్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 1952 నాటి ఆర్మీ ఎంగేజ్మెంట్ రూల్స్ ప్రకారం ఇదే జరుగుతుందని వెల్లడించింది. ఈ రూల్ ప్రకారం సైనికులు ఉన్నతాధికారుల ఆదేశాల కోసం వేచి ఉండకుండా దురాక్రమణదారులపై దాడి చేస్తారని తెలిపింది.నాటో భూభాగమైన గ్రీన్ల్యాండ్ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రయత్నాలు ప్రారంభించడంతోనే డెన్మార్క్ ఈ ప్రకటన చేసింది. ఈ ఆర్కిటిక్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా పరిశీలిస్తున్న ఎంపికల్లో సైనిక శక్తి ఒకటిగా పేర్కొంది. కాగా.. ఇటీవల వెనిజువెలా అధ్యక్షుడు మదురోను అమెరికా నిర్భంధించాక పలు దేశాలు అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.దీనిపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ.. "గ్రీన్ల్యాండ్ను స్వాధీనం చేసుకోవడం అమెరికాకు జాతీయ భద్రతా ప్రాధాన్యత. ఆర్కిటిక్ ప్రాంతంలో మన ప్రత్యర్థులను అరికట్టడానికి అవసరమని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ఈ కీలకమైన విదేశాంగ విధాన లక్ష్యాన్ని సాధించడానికి సరైన ఎంపికలను పరిశీలిస్తున్నాం. యుఎస్ మిలిటరీని ఉపయోగించడం ఎల్లప్పుడూ ఒక ఎంపిక." అని అన్నారు.వచ్చే వారం డెన్మార్క్, గ్రీన్ల్యాండ్ అధికారులతో సమావేశం కావాలని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. ఓ నివేదిక ప్రకారం ట్రంప్ సైనిక బలప్రయోగం కాకుండా ఆ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. ఇంతలోనే అమెరికా అధికారులతో సమావేశాన్ని డెన్మార్క్ స్వాగతించింది. దీనిని ఒక ముఖ్యమైన చర్చగా పేర్కొంది. -
చైనా కంపెనీకి జాక్పాట్.. దుబాయ్లో అనుమతులు..!
చైనీస్ టెక్ కంపెనీ అయిన అపోలో గో అరుదైన ఘనత సాధించింది. దుబాయ్లో డ్రైవర్లెస్ కార్ల పరీక్షకు అనుమతి పొందిన ఏకైక కంపెనీగా నిలిచింది. దుబాయ్ రోడ్లు, రవాణా అథారిటీ (RTA) పూర్తి డ్రైవర్లెస్ పరీక్ష అనుమతిని మంజూరు చేసింది. దీంతో డ్రైవర్ సీటులో వ్యక్తి లేకుండా వేగంగా వెళ్లే కార్లు దుబాయ్ రోడ్లపై కనిపించనున్నాయి.కాగా.. 2026 మొదటి అర్ధభాగం నాటికి వాణిజ్య ప్రాతిపదికన పూర్తిగా డ్రైవర్లెస్ టాక్సీ సేవలను ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా దుబాయ్ రోడ్లపై వెయ్యికి పైగా వాహనాలను ప్రవేశపెట్టనున్నారు. ఈ వినూత్న సాంకేతికత సజావుగా సాగేందుకు వీలుగా దుబాయ్లోని మిడిల్ ఈస్ట్లో మొట్టమొదటి 'ఇంటెలిజెంట్ ఆపరేషన్స్ హబ్'ను కూడా కంపెనీ ప్రారంభించింది. వాహన నిర్వహణ, భద్రతా తనిఖీలు, నిపుణుల శిక్షణ అన్నీ ఈ హబ్లో నిర్వహిస్తారు.2030 నాటికి దుబాయ్ మొత్తం ట్రాఫిక్లో 25 శాతం డ్రైవర్లెస్ వాహనాలుగా మార్చాలనే పాలకుల నిర్ణయానికి ఈ చర్య ప్రోత్సాహకంగా ఉంటుందని భావిస్తున్నారు. ఆధునిక రవాణా వ్యవస్థలను వేగంగా అవలంబిస్తున్న దుబాయ్ పరిస్థితి వారి సాంకేతికతకు ఉత్తమంగా సరిపోతుందని చైనాకు చెందిన బైడు ఉపాధ్యక్షుడు వాంగ్ యున్పెంగ్ అన్నారు.కాగా.. గత మార్చిలో ఆర్టీఏతో కుదుర్చుకున్న ఒప్పందం తర్వాత కంపెనీకి జూలైలో టెస్ట్ లైసెన్స్ మంజూరు చేశారు. సురక్షితమైన, సమర్థవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేలా స్మార్ట్ ట్రాన్స్పోర్టేషన్ రంగంలో ప్రపంచ మోడల్గా మారాలని దుబాయ్ లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే నెలల్లో దుబాయ్లో రద్దీగా ఉండే వీధుల్లో డ్రైవర్లెస్ కార్లు పరీక్షించనున్నారు. -
నెస్లే ఉత్పత్తులపై గల్ఫ్లో హై అలెర్ట్
చిన్నపిల్లల ఫుడ్ బ్రాండ్ అయిన నెస్లేపై గల్ఫ్ దేశాలు అప్రమత్తమయ్యాయి. మార్కెట్లో ఉన్న నెస్లే బేబీ ఫుడ్ ఉత్పత్తులలో కొన్నింటిలో ప్రాణాంతక బ్యాక్టీరియా ఉందన్న ఆరోపణలతో వాటిని రీకాల్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నెస్లే ఉత్పత్తులను రీకాల్ చేస్తున్నారు. యూరప్ ప్రారంభమై ఆఫ్రికా, ఆసియా, అమెరికాలకు వ్యాపించిన ఈ సంక్షోభంలో యుఎఇతో సహా గల్ఫ్ దేశాలు ఇప్పుడు హై అలర్ట్ ప్రకటించాయి. ఈ చర్యలకు కారణం ముడి పదార్థాలలో ఒకదానిలో ‘బాసిల్లస్ సిరస్’ అనే బ్యాక్టీరియా ఉండటమేనని తెలుస్తోంది. గల్ఫ్ దేశాల హెచ్చరిక..యూఏఈతో పాటు, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్ దేశాలు కూడా ఈ ఉత్పత్తులపై ప్రజలను హెచ్చరించాయి. సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ, ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నెస్లే బేబీ ఫుడ్ ప్యాకెట్లను ఉపయోగించవద్దని సూచించాయి. కువైట్లో రేషన్ కార్డుల ద్వారా అందింంచే వాటిలో ఈ ఉత్పత్తులు చేర్చలేదని అధికారులు స్పష్టం చేశారు.అసలు బాసిల్లస్ సెరియస్ అంటే ఏమిటి?ఈ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే 'సిరిలైడ్' అనే విషం పిల్లల శరీరంలోకి ప్రవేశిస్తే తీవ్రమైన వాంతులు, విరేచనాలు, అధిక అలసట, కడుపు నొప్పికి కారణమవుతుంది. ఇప్పటివరకు ఎటువంటి అనారోగ్యాలు రానప్పటికీ.. కంపెనీ, ప్రభుత్వాలు ముందుజాగ్రత్తగా ఉత్పత్తులను ఉపసంహరించుకుంటున్నాయి.నెస్లే వివరణ..ఒక ప్రధాన సరఫరాదారు నుంచి అందుకున్న ముడి పదార్థాలలో (అరాకిడోనిక్ యాసిడ్ ఆయిల్) సమస్య కనుగొన్నట్లు నెస్లే తెలిపింది. ఉత్పత్తులను తిరిగి ఇచ్చి డబ్బు వాపసు పొందే సౌకర్యాన్ని కూడా కంపెనీ కల్పించింది. అనుమానం ఉన్నవారు కంపెనీ హెల్ప్లైన్ నంబర్ను సంప్రదించవచ్చు. ఆ ఉత్పత్తులను దుకాణాలు ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల నుండి తొలగిస్తున్నట్లు తెలిపింది. ఇంట్లో ఈ ఉత్పత్తులు ఉన్నవారు వెంటనే వాటిని నాశనం చేయాలని.. లేదంటే పిల్లలకు ఇవ్వకుండా దుకాణాలకు తిరిగి ఇవ్వాలని స్థానిక ఆరోగ్య శాఖ ప్రజలకు సూచించింది.


