International
-
ట్రంప్ చర్చల బూటకం అందుకే? ఇరాన్ స్పీకర్ సంచలన ప్రకటన
ఇరాన్పై దాడులకు ట్రంప్ తాత్కాలిక బ్రేక్ ప్రకటనపై ఇరాన్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలు పచ్చి బూటకమన్నారు. చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అమెరికా అధ్యక్షుడు ఇలాంటి నకిలీ వార్తలు సృష్టిస్తున్నారన్నారు.నిన్న( సోమవారం) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ ప్రకటించారు. తన ట్రూత్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ‘ఈ విషయాన్ని హ్యాపీగా తెలియజేస్తున్నాను. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇరాన్ గత 2 రోజులుగా పశ్చిమాసియాలో ఘర్షణలకు పూర్తి పరిష్కారం దిశగా ఫలప్రదమైన చర్చలు జరిపాయి. ఈ నిర్మాణాత్మక చర్చల ఆధారంగా. నేను మా యుద్ధ సైనికులను ఓ విషయం చెప్పాను. ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఎనర్జీ మౌలిక సదుపాయాలపై జరిగే అన్ని సైనిక దాడులను 5 రోజులపాటు వాయిదా వేయాలని ఆదేశించాను’ అని అన్నారు.అయితే ఈ వ్యాఖ్యలను ఇరాన్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ తీవ్రంగా ఖండించారు. ఆయన అధికారిక ఎక్స్ఖాతాలో పోస్ట్ చేస్తూ " అమెరికా అధ్యక్షుడు ఇరాన్తో చర్చలు జరిపాడనేది పూర్తిగా అవాస్తవం దీని వెనుక రెండు కారణాలున్నాయి. ప్రస్తుతం చమురు సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ధరలు తగ్గించడం. యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్న పరిస్థితులనుంచి ప్రజల దృష్టి మళ్లించడం"అని తెలిపారు.తమ దేశంపై జరిగిన దాడులకు పాల్పడిన వారికి కఠినమైన శిక్ష పడాలని ఇరాన్ ప్రజలు కోరుకుంటున్నారని గాలిబాఫ్ తెలిపారు. ఇరాన్ అంతా ఏకంగా ఉందని తామనుకున్న లక్ష్యం నెరవేరే వరకూ ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి తగ్గేదిలేదని స్పష్టం చేశారు. -
కుప్పకూలిన ఆర్మీ విమానం..110మంది సైనికులు
కొలంబియాలో విషాదం చోటు చేసుకుంది. టేకాఫ్ సమయంలో ఆర్మీ విమానం కుప్పకూలింది. పెరు సరిహద్దు సమీపంలో టేకాఫ్ అవుతుండగా ప్రమాదం జరిగింది. ఆ సమయంలో విమానంలో 110 మంది సైనికులున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. వివరాలు తెలుసుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. కొలంబియా సైన్యానికి చెందిన సి-130 అనే జెట్ అమెజాన్ ప్రాంతంలోని ప్యూర్టో లెగుయిజామో నుండి సైనికులను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది ఎప్పుడూ జరగకూడని భయంకరమైన ప్రమాదం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్ఫోర్స్ చీఫ్ జనరల్ మాట్లాడుతూ ప్రయాణ సమయంలో విమానంలో మొత్తం 125 మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు. వారిలో పెద్దసంఖ్యలో సైనికులున్నారని తెలిపారు. కాగా ఇప్పటివరకు వారిలో 57 మందిని గాయాలతో రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. అయితే ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యపై ఇప్పటి వరకూ స్పష్టత రాలేదు. -
ట్రంప్కు ఇండోనేషియా షాక్.. డబ్బులిచ్చేది లేదు?
పశ్చిమాసియా యుద్ధంతో సతమతమువుతున్న ట్రంప్కు ఇండోనేషియా షాక్ ఇచ్చింది. ఇటీవల గాజాలో శాంతి స్థాపన కోసం అమెరికా అధ్యక్షుడు ఏర్పాటు చేసిన 'బోర్డ్ ఆఫ్ పీస్' మిషన్కు ఎటువంటి ఆర్థిక మద్ధతు అందించలేదని తెలిపింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ప్రస్తుతం అనేక సమస్యలు వేదిస్తున్నాయి. ఇరాన్తో యుద్ధం కొద్దిరోజుల్లోనే ముగిద్దామనుకున్న ట్రంప్కు చుక్కెదురైంది. ఇరాన్ ఎంతకూ లొంగకపోవడంతో చేసేదేం లేక తాత్కాలిక విరామం ప్రకటించారు. ఇప్పుడు ఆయనకు మరో చిక్కు వచ్చి పడింది. ఇటీవల ట్రంప్ ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్ మిషన్లో చేరడానికి సభ్యత్వ రుసుమును చెల్లించేది లేదని ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో స్పష్టం చేశారు.ఆదివారం ఇండోనేషియా అధ్యక్షుడి ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రంప్ ఏర్పాటు చేసిన గాజా మిషన్ కోసం జకార్తా కేవలం ఎనిమిది వేల మంది శాంతి పరిరక్షక దళాలను మాత్రమే కేటాయించిందని ఎటువంటి సభ్యత్వ రుసుము చెల్లించేది లేదని తెలిపారు. కాగా ట్రంప్ ఏర్పాటు చేసిన గాజా మిషన్లో చేరినందుకు ఇండోనేషియా ముస్లిం ప్రజల నుంచి ప్రభోవో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో సభ్యత్వ రుసుము చెల్లించడానికి విముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో గాజా ప్రాంతాన్ని రాజకీయంగా, ఆర్థికంగా పూర్తిగా ప్రక్షాళన చేయడం కోసం బోర్డ్ ఆఫ్ పీస్ మిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
హార్మూజ్ తరంగాలపై భారత నావికుడి సాహసం..!
ఇది భారత నావికుడి సాహసం.. ఒకవైపు భీకర యుద్ధం. మరొకవైపు ఓ నౌక హార్మూజ్ జలసంధిని దాటిన వైనం. అయితే భారత నావికుడు అత్యంత ధైర్య సాహసాలతో దాన్ని హార్మూజ్ జలసంధి దాటించడమే కాదు.. భారత్కు తీసుకొచ్చాడు. లైబీరియా జెండాతో నమోదైన చమురు ట్యాంకర్ 'Shenlong ముంబై పోర్టు సమీపంలోని భారత జలాల్లోకి ప్రవేశించింది. ఈ నౌకకు భారతీయ కెప్టెన్ నాయకత్వం వహిస్తున్నాడు. సౌదీ అరేబియాలోని రాస్ తనూరా పోర్టు నుంచి ముడి చమురుతో బయలుదేరిన ఈ ట్యాంకర్ సురక్షితంగా భారత జలాలకు చేరుకుంది. సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, ఈ నౌక సురక్షితంగా ప్రయాణం పూర్తి చేసి ముంబై పోర్టు వైపు చేరుకోవడం ముఖ్యంగా భావించారు.అంతర్జాతీయ జలాల్లో ఇరాన్ నౌకాదళం ఏర్పాటు చేసిన భద్రతా వలయాన్ని ఒక భారతీయ నావికుడు ఛేదించుకుని మరీ అక్కడ నుంచి దాటి యావత్ ప్రపంచాన్ని ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అర్థరాత్రి చీకట్లో, తన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పక్కనపెట్టి, ప్రాణాలను పణంగా పెట్టి ముంబై తీరానికి చేరిన ఆ రహస్య నౌకకు సంబంధించి కొన్ని వివరాలు చూద్దాం. ఇరాన్ - ఒమన్ మధ్య ఉన్న హెూర్ముజ్ జలసంధి చాలా ముఖ్యమైన సముద్ర మార్గం, ఇది ప్రపంచ ముడి చమురు సరఫరాలో 20% వాటాను కలిగి ఉంది. కేవలం 33 మైళ్ల వెడల్పు గల ఈ ఇరుకైన జలమార్గం పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ లను కలుపుతుంది. సౌదీ అరేబియా , ఇరాక్ వంటి దేశాల నుండి ప్రతిరోజూ లక్షలాది బ్యారెళ్ల చమురు ప్రపంచానికి రవాణా చేయబడుతుంది. ముంబైలో ఓడ నిలిచిపోయిందిఅయితే, ఫిబ్రవరి 28న ఇరాన్ అధ్యక్షుడు ఘోమెద్ హత్య జరిగిన తర్వాత, నిరసనగా మార్చి 2 నుండి హెూర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ఆకస్మికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరగడానికి కారణమైంది. ప్రపంచవ్యాప్తంగా గ్యాస్, ఎరువులు, ఆహార ఉత్పత్తుల కొరతకు దారితీసింది. ఎందుకింత? మందుల కొరత కూడా ఏర్పడింది. అప్పుడు చైనా నౌకలను మాత్రమే అనుమతించింది. అంతా డార్క్ మోడ్..అటువంటి క్లిష్ట పరిస్థితిలో షెన్లాంగ్ ఓడ ఇరాన్ దిగ్బంధనాలను ఛేదించుకుని ముంబై ఓడరేవుకు చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక భారతీయ నావికుడు ఈ లైబీరియన్ నౌకను చాకచక్యంగా నడుపుతున్నాడు. ఇరాన్ నావికాదళం యొక్క నిఘా నుండి తప్పించుకోవడానికి, అతను నౌక యొక్క ఏఐఎస్ (ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్)ను నిలిపివేశాడు. అంతేకాకుండా, వారు అర్థరాత్రి నౌకలోని లైట్లన్నింటినీ ఆపివేసి, పూర్తి చీకటిలో ఈ ప్రమాదకరమైన కాలువను దాటారు. “డార్క్ మోడ్” (సిగ్నల్ ఆఫ్ చేసి) నడిపి ముంబై పోర్టుకు సురక్షితంగా చేర్చాడు.శభాష్ భారత నావికుడా.. ఈ భారీ ఓడ నుండి చమురు బ్యారెళ్లను ముంబైలో దించడానికి దాదాపు 38 గంటల సమయం పట్టింది. భారత నావికుడి ఈ ధైర్యసాహసాలు ఇరాన్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తాయి. కానీ, ఈ అర్థరాత్రి సంఘటనను మనం తిరిగి చూసుకున్నప్పుడు, ఇది అంతర్జాతీయ సముద్ర భద్రతలో భారతీయ నావికుల ధైర్యాన్ని, సాంకేతిక నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పినట్లుగా ఉంది. -
ట్రంప్ ప్రకటన.. ఒక్కసారిగా తగ్గిన చమురు ధరలు!
''ఇరాన్తో యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నాం, తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపేస్తున్నాం, మరో ఐదు రోజుల పాటు యుద్ధాన్ని నిలిపేస్తున్నాం'' చర్చలు జరుగుతున్నాయని అమెరిక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని క్షణాలకే చమురు ధరలు 13 శాతానికి పైగా పడిపోయాయి. ఇదే సమయంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 96 డాలర్లకు, అంటే 14 శాతం వరకు తగ్గింది.బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ సుమారు 17 డాలర్లు, అంటే 15 శాతం పడిపోయి, 1108 GMT సమయానికి బ్యారెల్కు 96 డాలర్ల సెషన్ కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) 13 డాలర్లు, అంటే సుమారు 13.5 శాతం పడిపోయి, సెషన్ కనిష్ట స్థాయి అయిన 85.28 డాలర్లకు చేరింది.అయితే.. ట్రంప్ పేర్కొన్నట్లు అటువంటి చర్చలు ఏవీ జరగలేదని ఇరాన్ ఖండించిన తర్వాత, చమురు ధరలు సుమారు 5 శాతం పెరిగి బ్యారెల్కు 101 డాలర్లకు చేరుకున్నాయి, కానీ మళ్లీ 100 డాలర్ల స్థాయి కంటే దిగువకు పడిపోయాయి.అమెరికా,ఇజ్రాయెల్ - ఇరాన్ సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి బ్రెంట్ క్రూడ్ ధరలు 60 శాతానికి పైగా పెరిగాయి. సంఘర్షణకు ముందు బ్యారెల్కు సుమారు 70 డాలర్లుగా ఉన్న ఈ ధరలు, ప్రధానంగా హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరాకు అంతరాయం కలగడం, గల్ఫ్ ప్రాంతంలోని ఇంధన కేంద్రాలపై జరిగిన దాడుల కారణంగా, సోమవారం నాటికి బ్యారెల్కు సుమారు 112 డాలర్లకు చేరుకున్నాయి. దీన్నిబట్టి చూస్తే.. కేవలం గత 30 రోజుల్లోనే ముడి చమురు ధరలు ఎంత గరిష్టాలకు చేరుకున్నాయో స్పష్టమవుతోంది.Trump announces he ordered to postpone strikes against Iranian energy infrastructure for 5 days pic.twitter.com/ELW18FLsAL— The Daily News (@DailyNewsJustIn) March 23, 2026 -
హార్మూజ్లో మన నౌకలకు ఇరాన్ ఎందుకు అనుమతిచ్చిందంటే?
ప్రపంచదేశాలు తనకు వ్యతిరేకమైతే.. ఇరాన్ ఉపయోగించే ఆయుధం ఒక్కటే.. అదే హార్మూజ్ జలసంధిని మూసివేయడం..! చరిత్రలో వెనక్కి వెళ్లి చూస్తే.. ఇది ఎన్నోమార్లు పునరావృతమైంది. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా తనపై దాడులు చేస్తున్న నేపథ్యంలో హార్మూజ్ని ఇరాన్ మూసివేసింది. దీంతో.. దక్షిణాసియా దేశాలు చమురు కోసం అతలాకుతలమవుతున్నాయి. భారత్లో కూడా ఎల్పీజీ కొరత తారస్థాయికి చేరుకుంది. అయితే.. ఉన్నఫళంగా హార్మూజ్ నుంచి భారత నౌకలను ఇరాన్ అనుమతించడానికి కారణమేంటి? దీని వెనక ఉన్న రహస్య అజెండా ఏంటి? అమెరికా, ఇజ్రాయెల్ను కాదని ఇరాన్కు భారత్ ఆ స్థాయిలో సహాయం చేసిందా?? ఈ ప్రశ్నలపై ఇప్పుడు ప్రపంచదేశాల్లో చర్చ సాగుతోంది.ఇరాన్ యుద్ధం మొదలవ్వగానే.. హిందూమహాసముద్రంలోని ఆ దేశ నౌకలను సైతం అమెరికా టార్గెట్ చేసుకున్న విషయం తెలిసిందే..! ఈ క్రమంలో శ్రీలంక తీరంలో ఉన్న ఓ ఇరాన్ నౌకను అమెరికా ధ్వంసం చేయగా.. భారీ సంఖ్యలో మరణాలు సంభవించాయి. క్షతగాత్రులకు శ్రీలంక సర్కారు ఆశ్రయం కల్పించింది.అయితే.. అదే సమయంలో భారత్లోని కొచ్చి తీరంలో కూడా ఓ ఇరాన్ నౌక ఉందనే విషయం ఎంతమందికి తెలుసు?? అప్పటికే కొచ్చి తీరంలో ఇరాన్కు చెందిన ఐరిస్ లావన్ అనే ఇరాన్ నేవీకి చెందిన ఓ యుద్ధ నౌక లంగర్ వేసింది. అమెరికా కూల్చేసిన ఐరిస్ దేనా అనే నౌకతోపాటు.. ఐరిస్ లావన్ గత నెల విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అండ్ ఎక్సర్సైజ్లో పాల్గొన్నాయి. కొచ్చి తీరానికి ఐరిస్ లావన్ అవి తిరిగి వచ్చే క్రమంలో ఐరిస్ దేనాను అమెరికా ధ్వంసం చేయగా.. ఐరిస్ లావన్ మాత్రం కొచ్చి తీరానికి చేరుకుంది. ఈ నెల 13న ఆ నౌకలోని సిబ్బంది భారత్ను శరణు కోరారు. స్వతహాగా శరణన్న వారికి ఆశ్రయం కల్పించే నైజమున్న భారత్ అందుకు ఓకే చెప్పింది. అంతేకాదు.. ఐరిస్ లావన్ నౌకలోని నావికులను ఇరాన్కు పంపే ఏర్పాట్లు చేసింది. అప్పట్లోనే ఈ నౌకకు భారత్ ఆశ్రయం కల్పించిందని తెలుసుకున్న అమెరికా నేవి, బ్రిటన్ రాయల్ నేవీ.. ఆ నౌక జోలికి వెళ్లకపోవడం గమనార్హం..! అదే సమయంలో తన నావికులకు ఆశ్రయం కల్పించినందుకు ఇరాన్ రాయబారి భారత్కు కృతజ్ఞతలు తెలిపారు.నౌకకు భారత్ భద్రత ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఐరిస్ లావన్ యుద్ధ నౌకలో ఏకంగా 140 మంది నౌకాదళ అధికారులు, సిబ్బంది, సహాయకులు ఉన్నారు. వారందరినీ ఇరాన్ యుద్ధ విమానాల్లో వారి దేశానికి సురక్షితంగా తరలించారు. పరిస్థితులు సద్దుమణిగేవరకు కొచ్చి తీరంలో ఉన్న యుద్ధ నౌకకు భద్రత కల్పించాలని ఇరాన్ కోరగా.. తమ వంతు ప్రయత్నం చేస్తామని భారత్ సమాధానమిచ్చింది. లంగరు వేసిన ఐరిస్ లావన్ను చిత్రీకరించిన ఓ జర్నలిస్టును కూడా పోలీసులు అరెస్టు చేశారు. దీన్ని బట్టి ఆ నౌకకు భారత్ ఎంతలా భద్రత కల్పిస్తుందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్కు ఇది ఓ పెద్ద సాయం. నౌకాదళాన్ని కాపాడుకోవడానికి భారత్ భారీ సహకారం అందించినట్లు ఇరాన్ భావించింది. అంతే.. భారత్ కూడా తన అవసరాల కోసం ఇరాన్ ముందు డిమాండ్లు పెట్టింది. శాంతియుతంగా ఉండే తమ దేశానికి వస్తున్న నౌకలను హార్మూజ్లో అనుమతించాలని కోరింది. దాంతో.. ఇరాన్ వెంటనే ఓ ప్రకటన చేసింది. భారత్తో పాటు.. ఈ యుద్ధంలో పాల్గొనని దేశాల నౌకలకు హార్మూజ్లో అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే.. ఇప్పటికి మాత్రం భారత్ నౌకలు మాత్రమే హార్మూజ్ మీదుగా ప్రయాణిస్తున్నాయి. -వెబ్డెస్క్ -
డొనాల్డ్ ట్రంప్ చేతులెత్తేశారా?
‘ఇరాన్తో యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నాం. తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపేస్తున్నాం. గత కొన్ని రోజులుగా వారితో చర్చలు జరుగుతున్నాయి. మరో ఐదు రోజుల పాటు యుద్ధాన్ని నిలిపేస్తున్నాం’ ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన.‘అదేమీ లేదు.. ట్రంప్ మాతో చర్చలు జరపలేదు.. అమెరికా భయపడింది. మాతో అమెరికా ఎటువంటి చర్చలు జరపలేదు. వారికి వారే యుద్ధం ఆపేశారు’ అని వెనువెంటనే ఇరాన్ ప్రకటనఅంతకుముందు చూస్తే.. ‘ 48 గంటలే ఇరాన్కు గడువు. ఇరాన్ లొంగిపోవాల్సిందే’ అంటూ ట్రంప్ ప్రకటన. ఈ మాట యుద్ధం మొదలైన దగ్గర్నుంచీ ఏదొక సందర్భంలో అమెరికా నోట వస్తూసే ఉంది. అధ్యక్షుడు ట్రంప్ కానీ, రక్షణమంత్రి పీట్ హెగ్సెత్ కానీ ఇరాన్ను వదిలే ప్రసక్తే లేదంటూ గాంభీర్యం ప్రకటించారు. వేటాడుతాం. మా శత్రువులు ఎవరైనా వదిలి పెట్టం. వెంటాడి వేటాడి చంపుతాం. ఎక్కడున్నా తుద ముట్టిస్తాం’ అంటూ రెచ్చిపోయి మాట్లాడారు. అదే సమయంలో ఇరాన్ కూడా ధీటుగానే బదులిస్తూ వచ్చింది. ‘ అంత సీన్ లేదు. లొంగిపోయే ప్రసక్తి అసలే లేదు. మేము ఆరు నెలల కాదు.. ఆరేళ్లైనా యుద్ధం చేస్తాం. ఆ సత్తా మాకు ఉంది. అమెరికా-ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకునే వరకూ మా పోరాటం ఆగదు’ అని ఇరాన్ స్ట్రాంగ్గానే కౌంటర్ల ఇస్తూ వచ్చింది. అంతే ధాటిగా యుద్ధం కూడా చేసింది.ఆ రెండూ ట్రంప్కు భయం పుట్టించాయా?ఇందుకు రెండు ఉదాహరణలు చెప్పుకోవచ్చు.. ఇందులో ఒకటి అమెరికా అధునాతన టెక్నాలజీ కల్గిన ఎఫ్-35 విమానాన్ని ఇరాన్ డ్రోన్ కూల్చేయగా, మరొకటి 4000 కి.మీ రేంజ్తో ఒక బాలిస్టిక్ మిసైల్ను అమెరికా నావికా స్థావరాలే లక్ష్యంగా ప్రయోగించడం. హిందూ మహాసముద్రంలోని డిగో గార్సియాలో ఉన్న అమెరికా-యూకే స్థావరం వైపు ఇరాన్ రెండు మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందట. ఇరాన్ నుండి డిగో గార్సియా సుమారు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉంది, అంటే దాడి చేసే పరిధి చాలా ఎక్కువ. ఆ రెండు ఘటనలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కచ్చితంగా భయం పుట్టించే ఉంటాయి. మనం ఎంతో అధునాతనం అనుకున్న ఎఫ్ 35 విమానం ఎలా కూలిపోయిందనేదనే విషయంపై అమెరికా కచ్చితంగా చర్చలు జరిపే ఉంటుంది. అదే సమయంలో నాలుగువేల కిలోమీటర్ల రేంజ్తో క్షిపణిని ఇరాన్ ప్రయోగించడమే అమెరికాను డైలమాలో పడేసిందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఈ రెండు సందర్భాలు కూడా ఇరాన్ సైనిక శక్తిని అమాంతం పెంచేశాయి. ఇరాన్ బహిరంగంగా ప్రకటించిన దానికి, వాస్తవానికి భిన్నంగానే యావత్ ప్రపంచానికి అనిపించింది. అయితే ఇప్పుడు ట్రంప్ ప్రకటనతో వాటికి బలం చేకూరనట్లయ్యింది. ఏమాత్రం ఇష్టం లేని యుద్ధంఅమెరికా-ఇజ్రాయెల్లు సంయుక్తంగా చేసిన యుద్ధం.. అమెరికా పౌరులకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇక్కడ అమెరికా పౌరులకే కాదు.. యావత్ ప్రపంచంలో ఎవ్వరికీ ఈ యుద్ధం ఇష్టం లేదు. యుద్ధంలో ఎవరు గెలిచినా.. నష్టపోయేది ప్రజలే కాబట్టి.. దీన్ని ఎవరూ స్వాగతించలేదు. ఇక్కడ గెలుపు విషయాన్ని పక్కన పెడితే, దీని వల్ల ఎన్నో కుటుంబాలు ప్రభావితం అవుతాయనేది అందరికి తెలుసు కానీ, మూడు దేశాల్లో(అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్) జరగాల్సిన విధ్వంసం ఇప్పటికే జరిగిపోయిన తర్వాత ట్రంప్ తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక్కడ ఆ యుద్ధానికి దిగిన ఆ మూడు దేశాలు తీవ్రంగా నష్టపోతే.. ప్రపంచ దేశాలపై కూడా ఎక్కువగానే ప్రభావం చూపింది. మళ్లీ శాంతి మంత్రం..మూడు వారాలకు పైగా భారీ విధ్వంసానికి కారణమైన ట్రంప్.. ఇప్పుడు శాంతి మంత్రం జపిస్తున్నారు. పశ్చిమాసియాలో శాంతి కోసం కృషి చేస్తాం అంటూ ప్రకటించేశారు. అంటే అందితే జట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకోవడమనేది ట్రంప్ నైజమనేది మరోసారి రుజువైంది. అప్పుడు వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురోను బంధించి తీసుకొచ్చిన ట్రంప్.. ఇప్పుడు ఇరాన్ విషయంలో ఆయనకు ఆయనే తగ్గిరనేది వాస్తవం. అంటే ఇరాన్ యుద్ధ సామర్థ్యం ఏమిటో ట్రంప్కు చిక్కలేదు. మరొకవైపు ఇరాన్ ప్రకటనలు కూడా భయం పుట్టించేంతగానే ఉన్నాయి. ఈ క్రమంలో ట్రంప్ వెనక్కి తగ్గారనేది వాస్తవం. ఇక్కడ ట్రంప్ వెనక్కి తగ్గారనడం కంటే కూడా అమెరికా తేలిపోయింది అనుకోవడం ఇప్పుడు మన వంతైంది. ఎప్పుడూ ప్రపంచ దేశాలకు బిల్డప్లు మీద బిల్డప్లు ఇచ్చే అమెరికా శక్తి ఏపాటిదో కూడా అందరికీ తెలిసిపోయింది. అమెరికాకు గట్టి కౌంటర్ ఇస్తే వాళ్లను వెనక్కి తగ్గేలా చేయడం పెద్ద కష్టమేం కాదు అనే విషయం ఇరాన్ రుజువు చేసిందనేది కాదనక తప్పదు. చివరకు చేసేదేమీ లేక ట్రంప్ ఇలా చేతులెత్తేసే.. మళ్లీ శాంతి మంత్రం జపిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అందుకు ఇరాన్ ప్రకటన కూడా బలం చేకూరుస్తుంది. తమతో చర్చలు ఏమీ జరపలేదని ఇరాన్ ప్రకటించడం కూడా ట్రంప్ డబుల్ గేమ్కు అద్దం పడుతోంది. -
భయపడి వెనక్కి తగ్గిన ట్రంప్ : ఇరాన్ కౌంటర్
ఇరాన్పై దాడులకు అయిదు రోజుల తాత్కాలిక విరామం ప్రకటించడంపై ఇరాన్ స్పందించింది. ఇంధన వసతులపై దాడులు, చర్చలు అంటూ ట్రంప్ ప్రకటనపై ఇరాన్ సంచలన సంచలన వ్యాఖ్యలు చేసింది. ట్రంప్ తాజా పోస్ట్పై స్పందిస్తూ, ఇరాన్ ప్రతీకార చర్యలకు పాల్పడుతుందనే భయంతోనే ట్రంప్ వెనక్కి తగ్గారని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది.టెహ్రాన్ గట్టి హెచ్చరికల నేపథ్యంలోనే ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి చేసే ప్రణాళికల నుండి డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారని కాబూల్లోని ఇరాన్ రాయబార కార్యాలయం తెలిపింది.మరోవైపు అసలు అమెరికా ఎలాంటి చర్చలు జరగలేదని ఇరాన్ ప్రకటించడం గమనార్హం. ఇటీవలి అమెరికా-ఇరాన్ చర్చల అనంతరం, తమ విదేశాంగ మంత్రి ఇరాన్ విదేశాంగ మంత్రితో ఫోన్లో మాట్లాడారని, ఈ సందర్భంగా మారుతున్న ప్రాంతీయ పరిస్థితి మరియు సమన్వయంపై చర్చించారని రష్యా తెలిపింది.మధ్యప్రాచ్యంలో మన శత్రుత్వానికి సంపూర్ణ పరిష్కారం కోసం గత రెండు రోజులుగా అమెరికా, ఇరాన్ దేశం మధ్య చాలా మంచి, ఫలవంతమైన సంభాషణలు జరిగాయని, చర్చలు ముగిసేవారు దాడులుండవని ట్రూత్ సోషల్లో చేసిన ఒకపోస్ట్లో ట్రంప్ ప్రకటించారు. ఇదీ చదవండి: చమురు, గ్యాస్ సమస్యలపై ప్రధాని మోదీ కీలక హామీకాగా ఫిబ్రవరి 28న ఇరాన్పై, అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా భీకర దాడులను ప్రారంభించాయి. మిస్పైళ్లతో విరుచుకు పడింది. ఈ దాడుల్లో అప్పటి ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనీ, అతని కుటుంబంలో చాలామంది దుర్మరణం పాలయ్యారు. దీంతో ఇరాన్ తీవ్ర ప్రతిఘటనకు దిగింది. అలా గత 24 రోజులుగా భీకర యుద్ధం సాగుతోంది. ఇంతలో మూసివేసిన హర్మోజ్ జలసంధిని 48 గంటల్లోగా తెరవాలని ఇరాన్కు డెడ్లెన్ విధించారు ట్రంప్. ఈగడువు మంగళవారం ఉదయంతో ముగియనుంది. ఇంతలోనే యుద్దానికి విరామం ప్రకటించడం దిగ్బ్రాంతి రేపింది. -
యుద్ధానికి తాత్కాలిక బ్రేక్: ట్రంప్ ప్రకటన
వాషింగ్టన్: ఇరాన్తో చేస్తున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై దాడులను తాత్కాలికంగా నిలిపేస్తున్నామన్నారు. టెహ్రాన్తో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్లో మీడియాలో పోస్టు చేశారు.ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై సైనిక దాడులను ట్రంప్ వాయిదా వేశారు. టెహ్రాన్తో ఫలవంతమైన చర్చలు జరిపినట్లు తెలిపారు. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభించిన విషయం తెలిసిందే. ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేస్తూ.. ‘ఈ విషయాన్ని హ్యాపీగా తెలియజేస్తున్నాను. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇరాన్ గత 2 రోజులుగా పశ్చిమాసియాలో ఘర్షణలకు పూర్తి పరిష్కారం దిశగా ఫలప్రదమైన చర్చలు జరిపాయి. ఈ నిర్మాణాత్మక చర్చల ఆధారంగా.. నేను మా యుద్ధ సైనికులను ఓ విషయం చెప్పాను. ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఎనర్జీ మౌలిక సదుపాయాలపై జరిగే అన్ని సైనిక దాడులను 5 రోజులపాటు వాయిదా వేయాలని ఆదేశించాను’ అని అన్నారు. -
ట్రంప్ 48 గంటల డెడ్లైన్ : ఏం జరగబోతోంది?
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ ప్రతిదారులు నేపథ్యంలో మధ్యప్రాచ్యంలోని ప్రస్తుత పరిస్థిలా ఆందోళన కరంగా పరిణమిస్తోంది. సముద్ర మార్గ ఇంధన వాణిజ్యం కోసం హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తిరిగి తెరవాలంటూ ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 48 గంటల గడువు, భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 5.14 గంటలకు ముగుస్తుంది. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం అత్యంత కీలకమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఇరాన్ను కోరారు. అటు తమ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి జరిగితే ఆ జలమార్గాన్ని పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది.ఇదీ చదవండి: చమురు, గ్యాస్ సమస్యలపై ప్రధాని మోదీ కీలక హామీమరోవైపు ట్రంప్ 48 గంటల గడుపు, చమురు కేంద్రాలపై దాడులు హెచ్చరికలపై స్పందించిన ఇరాన్ తమ తీరాలపై లేదా ద్వీపాలపై ఏ దాడి జరిగినా, తీరం నుండి తేలియాడే మందుపాతరలతో సహా అన్ని గల్ఫ్ ప్రవేశ మార్గాల్లో నావికా మందు పాతరలను మోహరిస్తామని ఉన్నత స్థాయి భద్రతా సంస్థ హెచ్చరించింది.ఈ నేపథ్యంలో ఈ దేశాల మధ్య శాంతి సంధి, కాల్పుల విరమణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ప్రపంచ ఇంధన మార్కెట్కు ధరల పరంగా మరిన్ని షాక్లు తగిలే ప్రమాదం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చమురు సరఫరా మరింత సంక్షోభంలో కూరుకుపోనుంది. ఇప్పటికే బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు సుమారు 110 డాలర్ల వద్ద ఉంది.ఇండియా పరిస్థితిఒకవేళ టెహ్రాన్, యుద్ధానికి ముందున్న సామర్థ్యంలో 50 శాతంతోనైనా ట్యాంకర్లను హోర్ముజ్ గుండా అనుమతిస్తే, కోట్లాది భారతీయ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు, కోట్లాది మంది పేదలకు ఊరట లభించినట్టే. ఇది ఇంధన ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి దోహదపడుతుంది. అలాగే బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళలలో జరగబోయే అత్యంత కీలకమైన ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీకి కూడా ఇది ఊపిరి పీల్చుకునే వెసులుబాటు కల్పించినట్టవుతుంది. ట్రంప్ హెచ్చరికను ఇరాన్ లక్ష్య పెట్టకపోతే, వివిధ విద్యుత్ ప్లాంట్లపై దాడి చేసి, వాటిని పూర్తిగా నాశనం చేస్తాను, మొదటగా అతిపెద్ద ప్లాంట్తో ప్రారంభిస్తాను అన్న ట్రంప్ అదే పాటిస్తే యుద్ధం మరింత ముదిరి హోర్ముజ్ గుండా రవాణా అయ్యే చమురు గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచి పోవచ్చు. ఇది ప్రపంచ ఇంధన సంక్షోభానికి దారితీస్తుంది. ధరలు ఆకాశాన్నంటుతాయి. ముఖ్యంగా ఆసియాలోని అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు నాశనమవుతాయి.మరోవైపు శత్రువులు కాని దేశాలకు హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించవచ్చని ఇందుకోసం టెహ్రాన్తో సమన్వయం చేసుకోవాలని ఇరాన్ రక్షణ మండలి ఆదేశించినట్లు బీబీసీ నివేదించింది. హోర్ముజ్ జలసంధిలో సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించే ప్రయత్నంలో 22 దేశాలు చేరాయినార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) అధిపతి ప్రకారం, హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానాన్ని నిర్ధారించేందుకు కనీసం 22 దేశాలు అంగీకారానికి వచ్చాయి. నాటో సైనిక కూటమి సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే వెల్లడించిన ప్రకారం, నాటో సభ్య దేశాలతో పాటు జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల వంటి భాగస్వామ్య దేశాలతో సహా 22 దేశాలు ఈ ఇరుకైన జలమార్గంలో నౌకాయాన స్వేచ్ఛనునిర్ధారించడానికి తమ చర్యలను సన్నిహితంగా సమన్వయం చేసుకోవడానికి అంగీకరించాయి. యుద్ధం ముగింపు గురించి మాట్లాడిన 24 గంటలలోపే ట్రంప్ ఈ బెదిరింపునకు పాల్పడటం, ఇరాన్ వైఖరితో ఈ యుద్ధం నుండి బయటపడే మార్గం లేదని భౌగోళిక రాజకీయ సైనిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఉగ్రదేశంలో ఇంధన సెగ
తీవ్ర ఆర్థిక సంక్షోభం, అడుగంటిపోతున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విలాసవంతమైన వాహనాల్లో ఉపయోగించే హై-ఆక్టేన్ బ్లెండెడ్ ఫ్యూయల్ (హెచ్ఓబీసీ) ధరను ఏకంగా లీటరుకు రూ.200 పెంచుతూ ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆమోద ముద్ర వేశారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ చమురు సరఫరాలో కీలకమైన హార్మూజ్ జలసంధి మూసివేత భయాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.ఆర్థిక క్రమబద్ధీకరణప్రధాని షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకున్నారు. దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ఈ చర్యలు అనివార్యమని ప్రభుత్వం పేర్కొంది. ఈ పెంపు ద్వారా ప్రభుత్వానికి నెలకు సుమారు 9 బిలియన్ పాకిస్థానీ రూపాయల (పీకేఆర్) ఆదాయం మిగులుతుందని, ఈ మొత్తాన్ని ప్రజలకు ఉపశమనం కలిగించే పథకాలకు మళ్లిస్తామని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.సాధారణ పెట్రోల్తో పోలిస్తే హెచ్ఓబీసీ ఫ్యుయెల్లో ఆక్టేన్ రేటింగ్ ఎక్కువగా ఉంటుంది. సాధారణ పెట్రోల్ ఆక్టేన్ సంఖ్య 87 నుంచి 92 మధ్య ఉంటే, హై-ఆక్టేన్ ఇంధనం 95 నుంచి 100 వరకు ఉంటుంది. కేవలం లగ్జరీ కార్లు, ఖరీదైన వాహనాలు వాడే ఉన్నత ఆదాయ వర్గాలపైనే ఈ పెరిగిన ధరల భారం పడుతుంది. తక్కువ, మధ్య ఆదాయ వర్గాలు ఉపయోగించే సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రస్తుతం అదనపు భారం వేయలేదు. ఈ నిర్ణయం వల్ల ఆర్టీసీ లేదా విమాన ప్రయాణ ఖర్చులపై తక్షణ ప్రభావం ఉండదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.సాధారణ పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితిఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో పాక్ ప్రభుత్వం ఇప్పటికే మార్చి 6న పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.55 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. మారిన ధరల ప్రకారం..ఇంధనం రకంపాత ధర (లీటరుకు)ప్రస్తుత ధర (లీటరుకు)పెట్రోల్రూ. 266.17రూ. 321.17డీజిల్రూ. 280.86రూ. 335.86 విమాన ప్రయాణికులకు షాక్ప్రభుత్వం సామాన్యుడిపై భారం పడదని చెబుతున్నప్పటికీ జెట్ ఇంధన ధరల పెరుగుదల ప్రభావం విమానయాన రంగంపై అప్పుడే మొదలైంది. పాకిస్థాన్లోని ఏఆర్వై మీడియా కథనం ప్రకారం, మార్చి 10 నుంచి పాకిస్థాన్ ఎయిర్లైన్స్ ఛార్జీలను భారీగా పెంచాయి. దేశీయ ప్రయాణం(కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ రూట్లు)పై టికెట్ ధరలు రూ.2,800 నుంచి రూ.5,000 వరకు పెరిగాయి. విదేశీ ప్రయాణాలపై రూ.10,000 నుంచి రూ.28,000 వరకు అదనపు భారం పడింది.ఇదీ చదవండి: మీ డబ్బు మీ కోసం పనిచేస్తుందా? -
New York: రన్వేపై ఫైర్ ట్రక్కును ఢీకొన్న ‘ఎయిర్ కెనడా’
న్యూయార్క్: అమెరికాలోని అత్యంత రద్దీగా ఉండే న్యూయార్క్ లాగార్డియా విమానాశ్రయంలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్కు చెందిన ఒక విమానం రన్వేపై గ్రౌండ్ వెహికల్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 100 మంది వరకూ ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. ఎయిర్ కెనడా సీఆర్జే (CRJ) ఫ్లైట్ ఏసీ 8646 విమానం రన్వే 04/22ను దాటేందుకు ప్రయత్నిస్తుండగా, అక్కడ నిలిపి ఉంచిన ‘ట్రక్ 1’ అనే ఫైర్ ఇంజిన్ను ఢీకొంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) అప్రమత్తమై, లాగార్డియా విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసింది. విమానాల రాకపోకలను నిలిపివేస్తూ ‘గ్రౌండ్ స్టాప్’ ఉత్తర్వులు జారీ చేసింది.ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో విమానం రన్వేపై కదులుతూ ఉన్నట్లు స్పష్టమవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలను చూస్తే.. విమానం ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విజువల్స్ను విమానయాన అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. గాయపడిన వారి సంఖ్య, పరిస్థితిపై ఎయిర్పోర్ట్ లేదా ఎయిర్ లైన్స్ వర్గాల నుండి స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది.ఈ ప్రమాదం కారణంగా లాగార్డియాలో విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాప్యం లేదా విమానాల దారి మళ్లింపుపై అధికారులు ఇంకా తుది నిర్ణయం ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. భద్రతా పరమైన చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. Reports of a serious incident at LaGuardia Airport in New York City, after Jazz Airlines Flight 646, a Canadair Regional Jet CRJ-900, collided with a firetruck while taxiing to Gate B48. pic.twitter.com/FPTayPzHAt— OSINTdefender (@sentdefender) March 23, 2026 -
ఇరాన్ నిర్ణయంపై ప్రపంచమంతా గగ్గోలు
టెహ్రాన్/న్యూఢిల్లీ: ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయలాంటి ‘హర్మూజ్ జలసంధి' (Strait of Hormuz) ఇప్పుడు ఇరాన్ ‘దందా’కు అడ్డాగా మారింది. యుద్ధం కారణంగా మూతపడిన ఈ మార్గంలో ప్రయాణించాలంటే ఒక్కో సరుకు రవాణా నౌక నుంచి ఇరాన్ ఏకంగా 2 మిలియన్ డాలర్లు (సుమారు రూ.18,76,57,000) వసూలు చేస్తోంది. ఈ విషయాన్ని ఇరాన్ పార్లమెంటరీ కమిటీ సభ్యుడు స్వయంగా వెల్లడించడం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. ఈ నిర్ణయంపై ప్రపంచ దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. యుద్ధ ఖర్చుల కోసమే ఈ ‘ఫీజు’ఇజ్రాయెల్, అమెరికా కూటమితో యుద్ధం ముదురుతున్న వేళ ఇరాన్ తన అధికారాన్ని చాటుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘యుద్ధం అంటే ఖర్చుతో కూడుకున్న పని. అందుకే హర్మూజ్ గుండా వెళ్లే నౌకల నుంచి ట్రాన్సిట్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించాం’ అని ఇరాన్ జాతీయ భద్రతా కమిటీ సభ్యుడు అలద్దీన్ బ్రౌజెర్డి స్పష్టం చేశారు. ఇది ఇరాన్ శక్తికి నిదర్శనమని ఆయన అభివర్ణించారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దెబ్బమార్చి మొదటి వారం నుండి హర్మూజ్ జలసంధి దాదాపుగా మూతపడింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే 20 శాతం చమురు, ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) ఈ జలమార్గం గుండానే వెళ్లాలి. రవాణా నిలిచిపోవడంతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అంతర్జాతీయ ఆంక్షల నడుమ ఉన్న ఇరాన్కు ఇలా కోట్లలో నగదు చెల్లించడం షిప్పింగ్ కంపెనీలకు పెద్ద సవాలుగా మారింది.ట్రంప్ అల్టిమేటం.. ఇరాన్ ప్రతిసవాల్మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యవహారంపై ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 48 గంటల్లోగా జలసంధిని పూర్తిగా తెరవాలని, లేనిపక్షంలో ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులు చేస్తామని అల్టిమేటం ఇచ్చారు. దీనికి ఇరాన్ కూడా ధీటుగానే స్పందించింది. తమపై దాడులు జరిగితే మధ్యప్రాచ్యంలోని కీలక ఇంధన కేంద్రాలను ధ్వంసం చేస్తామని, జలసంధిని శాశ్వతంగా మూసివేస్తామని హెచ్చరించింది.భారత నౌకలకు ఊరటఅయితే ఇరాన్ తన శత్రు దేశాల నౌకలను మాత్రమే అడ్డుకుంటామని చెబుతోంది. ఇప్పటికే భారత్కు చెందిన రెండు ఎల్పీజీ నౌకలకు ఇరాన్ అనుమతినిచ్చింది. పాకిస్తాన్ ఆయిల్ ట్యాంకర్ కూడా సురక్షితంగా ప్రయాణించింది. కానీ, గడిచిన కొద్ది రోజుల్లో జరిగిన దాడుల్లో ఒక భారతీయ నావికుడు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. -
ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాల్లో భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు?!
టెహ్రాన్: హర్మూజ్ జలసంధిని తెరవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో ఇరాన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రపంచ నౌకా రవాణాకు అత్యంత ప్రాధాన్యం కలిగిన హర్మూజ్ జలసంధిపై తన నియంత్రణను బలోపేతం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా, ఇరాన్ కొన్ని నౌకల నుండి భారీ రవాణా రుసుములు వసూలు చేయాలని నిర్ణయించింది. ఇరాన్ నిర్ణయంతో ప్రపంచ దేశాల్లో పెట్రోల్,డీజిల్తో పాటు ఇతర సహజ వనరుల ధరలు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం.. సాధారణంగా గల్ఫ్ దేశాల నుంచి చమురు నౌకలు జలసంధి గుండా ఉచితంగా ప్రయాణించే హక్కు ఉంది. కానీ తాజా పరిణామాల ప్రకారం, రానున్న రోజుల్లో ఈ స్వేచ్ఛా ప్రయాణం సాధ్యం కాకపోవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.ఇరాన్ ప్రభుత్వం హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే కొన్ని నౌకల నుండి 2 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.18.8 కోట్లు) వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ భారీ సుంకం ఇప్పటికే అమలు చేయబడిందని, ఇది ఆ కీలక జలమార్గాన్ని నియంత్రించేందుకు తీసుకుంటున్న కొత్త విధానానికి నిదర్శనమని పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ సభ్యుడు అలయెద్దీన్ బరూజెర్ది తెలిపారు.కొత్త సుప్రీం లీడర్ చర్యలుబరూజెర్ది ప్రకారం, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఇతర దేశాల జోక్యం లేకుండా పాలన సాగించేలా, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది.రవాణా రుసుము ఉద్దేశ్యం“జలసంధిని దాటే కొన్ని నౌకల నుండి రవాణా రుసుముగా 2 మిలియన్ డాలర్లు వసూలు చేయడం ఇరాన్ పట్టు సాధించే ప్రయత్నం కనబడుతోంది. యుద్ధానికి ఖర్చులు ఉంటాయి కాబట్టి సహజంగానే మనం హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే ఓడల నుండి రవాణా రుసుములు వసూలు చేయాలి’అని బరూజెర్ది వ్యాఖ్యానించారు.ప్రపంచ చమురు రవాణాలో సుమారు 20శాతం హర్మూజ్ జలసంధి గుండా జరుగుతుంది.ఇది పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ మధ్య ఉన్న సన్నని మార్గం. గల్ఫ్ దేశాల (సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఇరాక్, ఖతార్) నుంచి చమురు నౌకలు ఈ మార్గం గుండా ప్రపంచ దేశాలకు చేరతాయి. ఇప్పుడీ మార్గం ద్వారా వెళ్లే కొన్ని నౌకల నుంచి రవాణ రుసుము వసూలు చేయడం వల్ల సంబంధిత దేశాల్లో పెట్రోల్,డీజిల్తో పాటు ఇతర సహజ వనరుల ధరలు అమాంతం పెరగనున్నాయి. రవాణా ఖర్చులు పెరగడం వల్ల వాణిజ్య వ్యయం అధికమవుతుంది. ప్రపంచ మార్కెట్లలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. -
జపాన్ డేంజర్ బెల్: సముద్రంలో యుద్ధానికి సిద్ధం?
టోక్యో: ప్రపంచ దేశాలకు చమురు సరఫరా చేసే కీలకమైన ‘హర్మూజ్ జలసంధి’లో నెలకొన్న ఉద్రిక్తతలు జపాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపధ్యంలో సముద్ర మార్గంలో నౌకా దళ మైన్లు (Naval Mines) జపాన్కు ఆటంకం కలిగిస్తున్నాయి. వాటిని తొలగించేందుకు ఆ దేశం సిద్ధమవుతోంది. తమ దేశ మనుగడకు అత్యవసరమైన చమురు సరఫరాను పునరుద్ధరించేందుకు సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఎస్డీఎఫ్)ను రంగంలోకి దించే అంశాన్ని జపాన్ పరిశీలిస్తోంది.ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుజపాన్ దిగుమతి చేసుకునే ముడి చమురులో దాదాపు 90 శాతం ఈ హర్మూజ్ జలసంధి నుంచే వస్తుంది. నాలుగు వారాలుగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడమే కాకుండా, జపాన్ తన అత్యవసర నిల్వల నుంచి చమురును వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది జపాన్ ఆర్థిక వ్యవస్థకు జీవన్మరణ సమస్యగా మారింది.నిబంధనలు ఏం చెబుతున్నాయి?జపాన్ రాజ్యాంగం ప్రకారం విదేశాల్లో సైనిక బలగాలను మోహరించడంపై కఠినమైన ఆంక్షలు ఉన్నాయి. అయితే, 2015లో తీసుకువచ్చిన భద్రతా చట్టాల ప్రకారం.. దేశ మనుగడకు ముప్పు వాటిల్లితే లేదా సన్నిహిత భాగస్వామ్య దేశాల భద్రత దెబ్బతింటే సైన్యాన్ని పంపే వెసులుబాటు ఉంది. ఫుజి టీవీ కార్యక్రమంలో మాట్లాడిన విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొటెగి.. హర్మూజ్ జలసంధిని సురక్షితంగా ఉంచడం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని స్పష్టం చేశారు.అంతర్జాతీయ ఒత్తిడి ఇటీవల వాషింగ్టన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని సనే తకైచితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జలసంధిని పునరుద్ధరించేందుకు మిత్రదేశాల సహకారం అవసరమని ట్రంప్ కోరారు. మరోవైపు జపాన్ నౌకల రాకపోకల విషయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీతో కూడా చర్చలు జరుగుతున్నాయి. యుద్ధం పూర్తిగా ముగిసి, పరిస్థితులు శాంతించిన తర్వాతే మైన్లను తొలగించే ఆపరేషన్పై జపాన్ తుది నిర్ణయం తీసుకోనున్నదని సమాచారం. ఇది కూడా చదవండి: రైలు రంగుల్లో ‘ప్రాణ రక్షణ’.. ఇది తెలిస్తే జ్ఞానం రెండింతలు! -
మొజ్తబా ఎక్కడ?
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్న ప్రశ్న అమెరికా, ఇజ్రాయెల్లను వేధిస్తోంది. ఇరాన్ అగ్రనాయకత్వాన్ని దాదాపుగా అంతం చేసిన నేపథ్యంలో మొజ్తబా జాడ కోసం అవి తీవ్రంగా వెదుకుతున్నాయి. తండ్రి ఖమేనీ మరణానికి కారణమైన దాడిలో మొజ్తబా కూడా తీవ్రంగా గాయపడి రష్యాలో చికిత్స పొందుతున్నారని వార్తలు రావడం తెలిసిందే. ‘‘మొజ్తాబా క్షేమంగానే ఉండి ఉంటారు. ఇజ్రాయెల్కు తన జాడ తెలియొద్దనే బయటికి రావడం లేదు’’ అని ఇరాన్ వ్యవహారాల నిపుణుడు రజ్ జిమిత్ అభిప్రాయపడ్డారు. -
ఇరాన్పై దాడులను తాత్కాలికంగా నిలిపేస్తున్నాం: ట్రంప్
-
దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం
క్యాన్బెర్రా: దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం మార్చి 22, 2026న రాత్రి 8:57 సమయంలో నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం.. సముద్రంలోని 10 కిలోమీటర్ల లోతులో చోటుచేసుకుంది.ఈ భూకంపం తక్కువ లోతులో సంభవించడం వల్ల అదే ప్రాంతంలో చిన్నచిన్న భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. ఇవి సాధారణంగా ప్రధాన భూకంపం కంటే తక్కువ తీవ్రత కలిగి ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో గణనీయమైన నష్టాన్ని కలిగిస్తాయని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.రింగ్ ఆఫ్ ఫైర్పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న సర్కం-పసిఫిక్ సిస్మిక్ బెల్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద భూకంప ప్రాంతం. దీనిని ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని పిలుస్తారు. ప్రపంచంలోని 90శాతం భూకంపాలు ఈ ప్రాంతంలోనే సంభవిస్తాయి. -
గ్రీన్లాండ్ను ట్రంప్ నుంచి కాపాడతాం: ఇరాన్
టెహ్రాన్: గ్రీన్లాండ్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బారినుంచి కాపాడుతామంటూ ఇరాన్ ముందుకు వచ్చింది! పిలిస్తే చాలు, వచ్చి రక్షిస్తామని యూరోపియన్ యూనియన్ను ఉద్దేశించి పేర్కొంది. ‘‘గ్రీన్లాండ్ను స్వాదీనం చేసుకుంటామంటూ ఈయూను ట్రంప్ బెదిరించారు. వారు గ్రీన్లాండ్ను కాపాడుకోలేని పక్షంలో మాకు ఒక్క మాట చెబితే చాలు, ఆ ద్వాపానికి అండగా వస్తాం’’ అని ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు ఆదివారం పేర్కొన్నారు. ఇరాన్ మూసేసిన హార్మూజ్ జలసంధిని తెరిచేందుకు ముందుకు రావాలని ఈయూతో పాటు ఇతర దేశాలను ట్రంప్ కోరుతుండటం తెలిసిందే. కానీ ఇప్పటిదాకా సానుకూల స్పందన మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలోనే గ్రీన్లాండ్ విషయంలో ఈయూకు ఇరాన్ ఇలా ఆఫర్ ఇవ్వడం గమనార్హం. -
విమానం దిగుతూ తూలిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (79) ఆరోగ్య పరిస్థితిపై మళ్లీ సందేహాలు మొదలయ్యాయి. తాజాగా ఎయిర్ఫోర్స్ వన్ విమానం నుంచి కిందికి దిగే క్రమంలో తడబడ్డారు. రెయిలింగ్ను గట్టిగా పట్టుకొని చాలా జాగ్రత్తగా దిగుతూ కనిపించారు. ఈ వీడియో వైరల్గా మారింది. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న కురీ్చలో కూర్చోవడానికి కూడా ట్రంప్ ఇబ్బంది పడ్డారు. రెండు చేతులతో కురీ్చని గట్టిగా పట్టుకొని కూర్చున్నారు. మోకాళ్లు వంచేటప్పుడు ముఖం బిగుసుకుపోయి కనిపించింది. అయితే తాను భేషుగ్గా ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు. -
ఏమిటీ లిటిల్ ఇండియా?
ఇజ్రాయెల్పై ఆదివారం ఇరాన్ క్షిపణి దాడులతో అక్కడి డిమోనా నగరం ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. అక్కడ భారత సంతతి ప్రజలు ఎక్కువగా స్థిరపడ్డారు. వారి సంఖ్య 30 శాతం దాకా ఉంటుంది. అందుకే డిమోనాకు లిటిల్ ఇండియా అని పేరొచ్చింది. క్రీస్తుపూర్వం 175లో సెల్యూసిడ్ సామ్రాజ్యాన్ని ఏలిన ఆంటియోకస్–4 ఎపిఫానిస్ అరాచకాలకు తాళలేక కొందరు యూదులు భారత్లోని కొంకణ్ ప్రాంతానికి వలస వచ్చారని చరిత్ర చెబుతోంది. వారి సంతతి ముంబై, నవ్గావ్, పుణె, అహ్మదాబాద్ల్లో స్థిరపడింది. వీళ్లను బెనే ఇజ్రాయెల్(ఇజ్రాయల్ బిడ్డలు) అనేవారు. వారు గానుగ పట్టి నూనే తీసే వృత్తిలో, కిరాణా వ్యాపారాల్లో స్థిరపడ్డారు. 1948లో వీళ్ల జనాభా 20,000కు చేరింది. ఇజ్రాయెల్ స్వాతంత్య్రం ప్రకటించుకోవడంతో వారు స్వదేశం చేరి కొత్తగా నిర్మించిన డిమోనా సిటీలో స్థిరపడ్డారు. నగరంలోని 39,000 జనాభాలో భారత సంతతి వ్యక్తులు 7,500 దాకా ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి. భారత సంప్రదాయ వంటకాలు, సంస్కృతిని వాళ్లు డిమోనాకు పరిచయం చేశారు. సోన్పాప్డీ, గులాబ్జాం, పాప్డీ చాట్, భేల్పురీ వంటివి డిమోనాలో చాలా ఫేమస్. అక్కడ క్రికెట్ అభిమానులూ చాలా ఎక్కువ. అవిభాజ్య భారత్లో ముంబై సినీ పరిశ్రమలో యూదులు నటులుగా, నిర్మాతలుగా రాణించారు. ఇజ్రామిర్, సాల్మన్ మోసెస్, ఇనాక్ ఇసాక్ సతామ్కర్ తదితరులు బాలీవుడ్ అభివృద్ధికి పాటుపడ్డారు. అందుకే ఇజ్రాయెల్లో రెండో ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్’ను డిమోనాలోనే నిర్వహించారు. గత నవంబర్లో జరిగిన ఈ వేడుక సూపర్ హిట్టయింది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
యుద్దానికి కావాల్సినంత డబ్బుంది.. అమెరికా
ఇరాన్తో అమెరికా చేస్తున్న యుద్దం ఇప్పట్లో తెగేలా లేదు. తాజాగా అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ చేసిన వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. ఇరాన్తో యుద్ధానికి అమెరికా ప్రభుత్వం వద్ద కావాల్సినన్ని నిధులు ఉన్నాయని బెసెంట్ తెలిపారు. భవిష్యత్తులో సైన్యం అవసరాలకు అదనపు నిధులు అవసరం పడవచ్చని అన్నారు. యుద్దానికి నిధులు సమకూర్చేందుకు పన్నులు పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు. రక్షణ శాఖ 200 బిలియన్ డాలర్ల అదనపు నిధులు కోరిందని తెలిపారు. యుద్ధం మొదటి ఆరు రోజుల్లోనే 11 బిలియన్ డాలర్లు ఖర్చయ్యాయని వెల్లడించారు. బెసెంట్ వ్యాఖ్యల తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ సైన్యాన్ని మరింత బలపరిచారు. భవిష్యత్తులో కూడా నిధులు కొరత రాకుండా చూడాలని కోరారు. కాగా, ఈ ఏడాది (2026) అమెరికా రక్షణ బడ్జెట్ 840 బిలియన్ డాలర్లుకు ఆమోదించబడింది. -
డర్టీ బాంబు వేసేనా?
పశ్చిమాసియా యుద్ధాన్ని ఇరాన్ మరో స్థాయికి తీసుకెళ్లనుందా? తన అమ్ములపొదిలోని వినాశకర డర్టీ బాంబును ప్రయోగించనుందా? ఈ ఆలోచనే పశ్చిమాసియా దేశాలను ఇప్పుడు వణికిస్తోంది! అంతేగాక, ఇరాన్ ఇప్పటికే ఓసారి ఈ బాంబును ప్రయోగించిందన్న వార్తలు వాటికి గుబులు పుట్టిస్తున్నాయి. డర్టీ బాంబు ప్రయోగిస్తే జరిగే దారుణాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తీవ్ర రేడియేషన్ ముప్పు సాంప్రదాయిక బాంబులతో భవనాలు తదితరాలు నేలమట్టమవుతాయి. ప్రాణ నష్టం జరుగుతుంది. కొందరు గాయాలతో బయటపడతారు. దూరంగా ఉన్న వాళ్లకు మాత్రం ఏ నష్టమూ జరగదు. కానీ డర్టీ బాంబు విషయం అలా కాదు. డ్రోన్లు, క్షిపణుల సాయంతో దాన్ని ప్రయోగిస్తే రేడియోధార్మిక అణువులు గాల్లో చెల్లాచెదురుగా వ్యాపిస్తాయి. ఆ గాలి పీల్చిన వారు తీవ్ర రోగాల బారిన పడతారు. ఆరోగ్యం మళ్లీ బాగుపడటం కల్ల. రేడియోధార్మిక పదార్థాలను దట్టించిన పేలుడు పదార్థాలనే డర్టీ బాంబుగా పిలుస్తారు. దాని దుష్పరిణామాలు కొన్ని మైళ్ల దాకా వ్యాపిస్తాయి. రేడియోధార్మిక పొడి, పెల్లెట్లున్న డర్టీ బాంబు (రేడియోలాజికల్ డిస్పర్సల్ డివైజ్–ఆర్డీడీ) పేలితే అక్కడి నీరు, గాలి, భూమి రేడియోధార్మిక పదార్థంతో కలుíÙతమవుతాయి. సాగు భూములు ఎందుకూ పనికి రాకుండా పోతాయి. ఆ గాలి పీల్చే, ఆ నీరు తాగే, ఆ భూమిని వాడేవారికి చర్మం, ఎముక మజ్జ, ఊపిరితిత్తుల సంబంధిత క్యాన్సర్లు సోకే ప్రమాదముంది. నేత్ర, హృదయ సంబంధ సమస్యలతో పాటు రేడియోషన్ సిండ్రోమ్ వంటి జబ్బుల బారిన పడతారు. పైగా ఈ బాంబు సృష్టించే సమస్యల పరిష్కారం తలకుమించిన భారమే అవుతుంది. లాస్ ఏంజెలిస్ వంటి నగరంపై ఒక్క డర్టీ బాంబు వేస్తే అక్కడ గాలి, జల వనరుల శుద్ధికి ఏకంగా లక్షన్నర కోట్ల రూపాయలు అవుతుందని 13 ఏళ్ల క్రితమే సదరన్ కాలిఫోరి్నయా యూనివర్సిటీ అంచనా వేసింది. ఈ లెక్కన గల్ఫ్ దేశాలపై ఇరాన్ డర్టీ బాంబులు వేస్తే జరిగే వినాశనం ఊహాతీతమే! తయారీ సులభమా? అవుననే చెప్పాలి. ప్రస్తుతం విస్తృతంగా వినియోగంలో ఉన్న వైద్య, వాణిజ్య ఉపకరణాల తయారీలో వాడే రేడియోధార్మిక మూలకాలతో డర్టీ బాంబును తయారు చేయొచ్చు. ఇందుకు రేడియోథెరపీలో వాడే సీసియం–137, స్మోక్ డిటెక్టర్లో వాడే అమేరిసియం–241, సర్జరీ ఉపకరణాలను శుద్ధి చేసే కోబాల్ట్–60 తదితరాల మిశ్రమాన్ని వాడతారు. ఇవిగాక ఇరాన్ వద్ద 60 శాతం శుద్ధి చేసిన 440 కిలోల యురేనియం నిల్వలున్నాయి. ‘‘దీనితో అణు బాంబు తయారు చేయలేకపోయినా డర్టీ బాంబును తేలిగ్గా రూపొందించవచ్చు. ఇరాన్ చిత్తుగా ఓడే పరిస్థితే వస్తే కచ్చితంగా డర్టీ బాంబులు ప్రయోగించవచ్చు’’ అని అమెరికా జాతీయ భద్రతా విశ్లేషకుడు ఒకరన్నారు. ఆ భయంతోనే ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్నట్టు భావిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇజ్రాయెల్ అణు కేంద్రమే లక్ష్యంగా... క్షిపణుల వర్షం
దుబాయ్/టెహ్రాన్/జెరూసలేం: పశ్చిమాసియా యుద్ధ జ్వాలలు నానాటికీ విస్తరిస్తున్నాయి. దాడులు, ప్రతిదాడులతో ఇరాన్, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు దద్దరిల్లిపోతున్నాయి. యుద్ధం ఆదివారం 23వ రోజుకు చేరుకుంది. నతాంజ్ అణు కేంద్రంపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైన్యం హెజ్బోల్లా మిలిటెంట్లతో కలిసి ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. నెగెవ్ ఎడారిలోని ఇజ్రాయెల్ ప్రధాన అణు పరిశోధన కేంద్రమే లక్ష్యంగా దాడులకు దిగింది. దాని సమీపంలోని అరాద్, డిమోనా పట్టణాలపై బాంబుల వర్షం కురిపించింది. వందల కిలోల వార్హెడ్లతో కూడిన బాలిస్టిక్ క్షిపణులను కూడా ప్రయోగించింది. ఈ ఘటనలో కనీసం 180 మందికిపైగా గాయపడినట్లు సమాచారం. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ దాడిలో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడంలో అత్యాధునిక ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఘోరంగా విఫలం కావడం గమనార్హం. ఇరాన్ దాడిలో ఎవరూ మరణించకపోవడం నిజంగా అద్భుతమేనని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. అరాద్లో ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ యుద్ధంలో అనుకున్న లక్ష్యం కచ్చితంగా సాధిస్తామని తేల్చిచెప్పారు. అంతర్జాతీయ సమాజం తమకు సహకరించాలని కోరారు. తద్వారా యుద్ధం మరింత తీవ్రతరం కావడం తథ్యమని సంకేతాలిచ్చారు. ఇరాన్ బాలిస్టిక్ మిస్సైళ్లు తమ డిఫెన్స్ వ్యవస్థలను ఛేదించుకుని ఎలా రాగలిగాయన్న దానిపై ఇజ్రాయెల్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం ఉత్తర ఇజ్రాయెల్లో వైమానిక దాడిలో ఒకరు మృతిచెందారు. ఈ దాడికి పాల్పడింది తామేనని లెబనాన్ హెజ్బొల్లా మిలిటెంట్లు ప్రకటించారు. ఆదివారం ఉదయం ఇజ్రాయెల్లో సైరన్ల మోతలు వినిపించాయి. టెల్ అవీవ్పై క్షిపణి దాడులు సౌదీ అరేబియా, యూఏఈ సహా ఇతర గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. ఇరాన్ ఆయుధాలను మధ్యలోనే కూల్చివేశామని ఆయా దేశాలు వెల్లడించాయి. ఇరాన్లోని అండిమెష్క్ సిటీ ఆసుపత్రిపై భారీ దాడి జరిగింది. రోగులు, వైద్యులను మరో నగరానికి తరలించారు. ఈ దాడికి ఇజ్రాయెల్ కారణమని భావిస్తున్నారు. హెజ్బోల్లా మిలిటెంట్లు తమ ఆయుధాలను ఇజ్రాయెల్ సరిహద్దుకు తరలిస్తున్నారు. లెబనాన్లోని ఖస్మియే వంతెనను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఉత్తర సరిహద్దుకు సమీపంలోని లెబనాన్ నివాసాలను ధ్వసం చేయాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ తమ సైన్యాన్ని ఆదేశించారు. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్కు ఇప్పటికే వెయ్యి మందికిపైగా మృతిచెందారు. 10 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. హెజ్బోల్లా గ్రూప్ వందలాది రాకెట్లను ఇజ్రాయెల్పై ప్రయోగించింది. ఇజ్రాయెల్లో కీలక నగరం టెల్ అవీవ్పై ఇరాన్ ఆదివారం బాలిస్టిక్ క్షిపణితో దాడికి దిగింది. ఈ దాడిలో పలువురు గాయపడినట్లు తెలిసింది. హార్మూజ్ నుంచి రాకపోకలు సాగించేందుకు కొన్ని దేశాల నౌకలకు తాజాగా అనుమతి లభించింది. ఇందులో భారత్, జపాన్, చైనా, పాకిస్తాన్, తుర్కియే చమురు నౌకలు ఉన్నాయి. ప్రపంచానికి పెనుముప్పు ఇరాన్: నెతన్యాహు ఇరాన్ వద్ద అత్యంత ప్రమాదకరమైన మారణాయుధాలు ఉన్నాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదివారం ఆరోపించారు. డీగో గార్సియా దీవిపై జరిగిన దాడిని ప్రస్తావించారు. సుదూరంలో ఉన్న యూరప్ దేశాలపైనా దాడి చేసే సామర్థ్యం ఇరాన్కు ఉన్నట్లు దీన్నిబట్టి తెలుస్తోందని అన్నారు. ప్రపంచానికి ఇరాన్ పెనుముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజలందరి బాగు కోసమే అమెరికాతో కలిసి తాము పోరాడుతున్నామని తేల్చిచెప్పారు. శనివారం రాత్రి రెండు పట్టణాలపై దాడులకు దిగడం అత్యంత దారుణమని మండిపడ్డారు. సాధారణ జనావాసాలను ఇరాన్ టార్గెట్ చేసిందన్నారు. ప్రజలను హత్య చేయాలన్నదే ఇరాన్ అసలు ఉద్దేశమని విమర్శించారు. అదృష్టవశాత్తూ ఈ దాడుల్లో ఎవరూ చనిపోలేదని వ్యాఖ్యానించారు.హార్మూజ్ను తెరవకుంటే వినాశనమే: ట్రంప్ హార్మూజ్ నుంచి నౌకల రాకపోలకు అడ్డంకులు సృష్టిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు. జలసంధిని 48 గంటల్లోగా పూర్తిగా తెరవాలని తేల్చిచెప్పారు. తమ మాట వినకపోతే ఇరాన్కు తగిన బుద్ధి చెప్తామని అన్నారు. ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలను, ఇతర సదుపాయాలను సర్వనాశనం చేస్తామని తేల్చిచెప్పారు. ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. తమ జోలికి రావొద్దని సూచించారు. తమ విద్యుత్ ప్లాంట్లు, మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే హార్మూజ్ను పూర్తిగా మూసివేస్తామని తేల్చి చెప్పారు. అంతేగాక గల్ఫ్లోని అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలతో పాటు అక్కడి మౌలిక సదుపాయాలను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) సెంటర్లను, నీటి శుద్ధి కేంద్రాలను కూడా నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. శత్రు దేశాలకు తప్ప ఇతర దేశాలకు హార్మూజ్ తెరిచే ఉంటుందని ఇరాన్ సీనియర్ అధికారి అలీ మౌసావీ స్పష్టం చేశారు. నౌకాయానానికి, నావికులకు తగిన భద్రత కలి్పంచే విషయంలో ఐక్యరాజ్యసమితికి సహకరిస్తామన్నారు. ప్రస్తుత సంక్షోభానికి అమెరికా, ఇజ్రాయెల్ కారణమని నిందించారు. గల్ఫ్ వ్యవస్థలను నేలమట్టం చేస్తాం: ఇరాన్ హార్మూజ్ నుంచి నౌకల రాకపోలకు అడ్డంకులు సృష్టిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు. జలసంధిని 48 గంటల్లోగా పూర్తిగా తెరవాలని తేల్చిచెప్పారు. తమ మాట వినకపోతే ఇరాన్కు తగిన బుద్ధి చెప్తామని అన్నారు. ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలను, ఇతర సదుపాయాలను సర్వనాశనం చేస్తామని తేల్చిచెప్పారు. ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. తమ జోలికి రావొద్దని సూచించారు. తమ విద్యుత్ ప్లాంట్లు, మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే హార్మూజ్ను పూర్తిగా మూసివేస్తామని తేల్చి చెప్పారు. అంతేగాక గల్ఫ్లోని అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలతో పాటు అక్కడి మౌలిక సదుపాయాలను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) సెంటర్లను, నీటి శుద్ధి కేంద్రాలను కూడా నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. శత్రు దేశాలకు తప్ప ఇతర దేశాలకు హార్మూజ్ తెరిచే ఉంటుందని ఇరాన్ సీనియర్ అధికారి అలీ మౌసావీ స్పష్టం చేశారు. నౌకాయానానికి, నావికులకు తగిన భద్రత కలి్పంచే విషయంలో ఐక్యరాజ్యసమితికి సహకరిస్తామన్నారు. ప్రస్తుత సంక్షోభానికి అమెరికా, ఇజ్రాయెల్ కారణమని నిందించారు. అమెరికా ఎఫ్–15నూ కూల్చేశాం: ఇరాన్ ముంబై: తమ గగనతలంలోకి అనుమతి లేకుండా ప్రవేశించిన అమెరికా యుద్ధ విమానం ఎఫ్–15ను హార్మూజ్ ద్వీపం సమీపంలో నేలకూల్చామని ఇరాన్ ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు ముంబైలోని ఇరాన్ కాన్సురేట్ జనరల్ తమ సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. ‘‘శత్రువుల ఎఫ్–15 ఫైటర్జెట్ మా గగనతలంలోకి ప్రవేశించి మా గగనతల రక్షణ వ్యవస్థకు సవాల్ విసిరింది. దీంతో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లోని భూతలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే క్షిపణులు ఆ విమానం పనిపట్టాయి. చివరకు అది నేలకూలింది’’ అని ఇరాన్ ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే విమానం పూర్తిగా ధ్వంసమైందా? పైలట్ చనిపోయాడా? వంటి వివరాలను వెల్లడించలేదు. ఇటీవల ఎఫ్–35 యుద్ధ విమానం మీద సైతం ఇరాన్ దాడి చేసింది. దీంతో అది వెనువెంటనే పశ్చిమాసి యాలోని స్థావరంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇరాన్ గగనతలంపై ఎప్పుడంటే అప్పుడు మేం విమానాలను చక్కర్లు కొట్టించగలం అంటూ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటలకే ఆరోజు ఎఫ్–35ను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. -
గాఢాంధకారంలో క్యూబా
క్యూబాలో మరోసారి జాతీయ విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. దేశవ్యాప్తంగా 10 మిలియన్లకు పైగా ప్రజలు విద్యుత్ లేకుండా చీకటిలో మగ్గారు. వారం వ్యవధిలో ఇలా జరగడం ఇది రెండోసారి. ఇలా జరగడానికి అమెరికా విధించిన ఇంధన ఆంక్షలు ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఈ నెలలో ఇప్పటికే మూడు ప్రధాన బ్లాక్ఔట్లు చోటు చేసుకున్నట్లు సమాచారం. బ్లాక్ఔట్కు నిరసనగా హవానాలో ప్రజలు గిన్నెలు, పాత్రలతో శబ్దాలు చేశారు. మోరాన్ పట్టణంలో కమ్యూనిస్టు పార్టీ కార్యాలయాన్ని దహనం చేశారు. ఈ సంక్షోభంపై క్యూబా ఎనర్జీ మంత్రి మాట్లాడుతూ.. జాతీయ విద్యుత్ వ్యవస్థ పూర్తిగా డిస్కనెక్ట్ అయ్యింది. మొదటి ప్రాధాన్యతగా ఆసుపత్రులు, నీటి సరఫరాకు విద్యుత్ పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.ఇదిలా ఉంటే, ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్ను క్యూబాపై పడింది. అధ్యక్షుడు మిగ్వెల్ డియాజ్-కనెల్ను తొలగించాలనే ట్రంప్ భావిస్తున్నారు. క్యూబాను స్నేహపూర్వకంగా స్వాధీనం చేసుకుంటే గౌరవంగా ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. మరోవైపు డియాజ్-కనెల్.. అమెరికా దాడులకు ఎదుర్కొనేందుకు ప్రజలను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. -
పారిస్ మేయర్గా ఎమ్మాన్యుయెల్
ఫ్రాన్స్ రాజధాని పారిస్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడగా, సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి ఎమ్మాన్యుయెల్ గ్రెగోయర్ విజయం సాధించారు. ఆయన, అదే పార్టీకి చెందిన మాజీ మేయర్ ఆన్ హిడాల్గో స్థానాన్ని భర్తీ చేస్తూ, కొత్త మేయర్గా ఎన్నికయ్యారు.గ్రెగోయర్, కన్సర్వేటివ్ ప్రత్యర్థి రషిదా దాతిపై స్పష్టమైన ఆధిక్యం సాధించారు. విజయం అనంతరం గ్రెగోయర్ మాట్లాడుతూ.. ఇది ఒక కొత్త పారిస్ విజయం. ఉత్సాహభరితమైన, ప్రగతిశీలమైన పారిస్ అని పేర్కొన్నారు. మేయర్గా ఎన్నికైన వెంటనే గ్రెగోయర్ సైకిల్పై నగర వీధుల్లో చక్కర్లు కొట్టారు. కాగా, ఫ్రాన్స్లో 1500 కమ్యూన్లలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. మేయర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు ఆరు సంవత్సరాల పదవీకాలానికి ఎన్నికయ్యారు. పారిస్తో పాటు మార్సెయ్, నీస్ వంటి ప్రధాన నగరాల్లో పోటీ తీవ్రంగా జరిగింది. ఫ్రాన్స్లో వచ్చే ఏడాది (2027) అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. -
హమ్మయ్య..ఆయన చనిపోయాడు..!
వాషింగ్టన్: అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్)కు దీర్ఘకాలం డైరెక్టర్గా పనిచేసిన రాబర్ట్ ఎస్ ముల్లర్(81) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ముల్లర్ తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబం శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దీనిపై, ట్రంప్ హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. ‘హమ్మయ్య..ఆయన చనిపోయారు. చాలా సంతోషంగా ఉంది. అమాయకులను ఆయన ఇక ఏమాత్రం బాధపెట్టలేరు’అంటూ సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ చేశారు. 2016 అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి ట్రంప్ ప్రచార బృందం రష్యాతో చేతులు కలిపినట్లు వచ్చిన ఆరోపణలపై న్యాయ శాఖ చేపట్టిన విచారణలో ముల్లర్ ప్రత్యేక న్యాయవాదిగా వ్యవహరించారు. రష్యా జోక్యం మాట వాస్తవమేననీ, కుట్ర పన్నినట్లు మాత్రం తగు ఆధారాలు లేవని ముల్లర్ తన నివేదికలో పేర్కొన్నారు. 2001లో అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ ఆయన్ను ఎఫ్బీఐ డైరెక్టర్గా నామినేట్ చేశారు. సెపె్టంబర్ 11 దాడులకు కేవలం వారం రోజులు ముందుగా డైరెక్టర్ బాధ్యతలను చేపట్టారు. దాదాపు 12 ఏళ్లపాటు ఆ పదవిలో కొనసాగిన ఆయన..ప్రపంచం నివ్వెరపోయిన రీతిలో చోటుచేసుకున్న ఉగ్రదాడుల నేపథ్యంలో ఎఫ్బీఐని భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే రీతిలో పూర్తి స్థాయిలో పటిష్టం చేశారు. -
శ్రీలంకలో ఇంధన మంటలు
కొలంబో: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం ఆదివారం ఇంధన ధరలను 25 శాతం మేర పెంచింది. ఈ పెంపు వారంలో రెండోసారి కాగా, మార్చి ఒకటో తేదీ తర్వాత మూడోసారి కావడం గమనార్హం. నూతన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో, కనీసం 20 శాతం మేర ఇంధన వినియోగం తగ్గుతుందని అంచనాలున్నాయి. ఆటో డీజిల్ లీటరు ధర ప్రస్తుతమున్న రూ.303 నుంచి 26.1 శాతం మేర పెరిగి రూ.382కు చేరుకుంది. సూపర్ డీజిల్ రూ.353 నుంచి రూ.443కు, కిరోసిన్ రూ.195 నుంచి 30.8 శాతం మేర పెరిగి రూ.255కు, అదేవిధంగా, పెట్రోల్ 25.6 శాతం మేర పెరిగి రూ.398కి చేరుకుంది. ఇంధన ధరలు ఆకాశాన్నంటుతుండటంతో దేశం 2022నాటి ఆర్థిక సంక్షోభాన్ని మరోసారి చవిచూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 1948లో స్వాతంత్య్రం పొందాక మొట్ట మొదటిసారిగా శ్రీలంక అప్పులు చెల్లించలేని స్థితిలో సార్వభౌమ డిఫాల్టర్గా ప్రకటించారు. ఇంధన ధరలు పెరిగిన కారణంగా 90 శాతం మేర బస్సులను తిప్పే పరిస్థితులు లేవని ప్రైవేట్ బస్సు సంస్థల నిర్వాహకులు ప్రకటించారు. ‘డీజిల్ ధరల్లో గతంలో ఎన్నడూ ఇంతభారీగా పెరగలేదు. ఇందుకు తగ్గట్లుగా కనీసం 15 శాతమైన ఛార్జీలను పెంచకుండా బస్సులను నడపలేం’అని ప్రైవేట్ బస్సు యజమానుల సంఘం అధ్యక్షుడు విజయరత్నే చెప్పారు. దేశంలోని బస్సు సర్వీసులను 65–75 శాతం మేర ప్రైవేట్ సంస్థలే నడుపుతున్నాయి. పెట్రోల్ ధర రూ.400 వరకు పెరిగితే ఆటోల్లో ఎవరు ప్రయాణిస్తారంటూ ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. పెంచిన ఇంధన ధరలతో పన్నుల రూపంలో ప్రభుత్వమే లాభపడుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాగా, ఇంధన ధరల పెరుగుదలతో దేశంలో ద్రవ్యోల్బణం 5–8 శాతం వరకు పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, లీటరు పెట్రోలుపై రూ.100, డీజిల్పై రూ.20 వరకు సబ్సిడీ ఇస్తున్నామని, దీనివల్ల ప్రభుత్వంపై నెలకు రూ.2 వేల కోట్ల మేర భారం పడుతోందని ప్రభుత్వం తెలిపింది. ఇంధన ధరలను పెంచకుంటే మరింత భారం మోయాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రజలు విద్యుత్ శక్తితో అవసరాలు తీర్చుకోవాలని, ఇంధన వాడకాన్ని తగ్గించుకోవాలని సూచించింది. ప్రభుత్వం ఇప్పటికే ఇంధన రేషనింగ్ అమలు చేస్తోంది. క్యూఆర్ కోడ్ సాయంతో వారానికి బైక్లకు 5 లీటర్లు, కార్లకు 15 లీటర్లు, బస్సులకైతే 60 లీటర్ల ఇంధనాన్ని మాత్రమే అందిస్తోంది.ఇంధన ఆదా కోసం ప్రతి బుధవారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కూడా ప్రకటించింది. -
13 గంటలు విమానంలోనే మహిళ మృతదేహం
లండన్: విమానం టేకాఫ్ తీసుకున్న గంటలోపే ఓ ప్రయాణికురాలు అకస్మాత్తుగా ప్రాణాలు విడిచింది. అయినప్పటికీ పైలట్లు ప్రయాణాన్ని కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నారు. అలా, ఆ మృతదేహం కనీసం 13.5 గంటలపాటు విమానంలో ఉండిపోగా, చెడు వాసనతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈ ఘటన ఆదివారం బ్రిటిష్ ఎయిర్ వేస్కు చెందిన విమానంలో చోటుచేసుకుంది. హాంకాంగ్ నుంచి టేకాఫ్ తీసుకున్న గంట సమయానికి విమానంలోని 60 ఏళ్ల ప్రయాణికురాలొకరు అనారోగ్యంతో చనిపోయారు. ఇలాంటి సందర్భాలను మెడికల్ ఎమర్జెన్సీగా భావించరాదన్న నియమాల ప్రకారం పైలట్లు ప్రయాణాన్ని కొనసాగించారు. మృతదేహాన్ని విమానం వెనుక భాగంలోని ఓ మూలన ఉంచారు. అక్కడ వేడిగా ఉండటంతో కొద్ది సేపటికే మృతదేహం నుంచి చెడు వాసన వస్తున్నట్లు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. హీత్రూ విమానాశ్రయంలో ల్యాండయ్యాక..విచారణ కోసం 45 నిమిషాలపాటు మొత్తం 331 మంది ప్రయాణికులు, సిబ్బందిని బయటకు వెళ్లనివ్వలేదు. -
దాడులు కొనసాగించండి.. అమెరికాను కోరిన ఇరాన్ మాజీ క్రౌన్ ప్రిన్స్
ఇరాన్ మాజీ క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లవి ఎక్స్లో చేసిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా ఉంది. రెజా ఆ పోస్ట్లో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్పై దాడులు కొనసాగించాలని అమెరికా, ఇజ్రాయెల్ను కోరారు. రెజా తన పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ కాదు. ఇరాన్ పౌర మౌలిక సదుపాయాలు ఇరాన్ ప్రజలకు మరియు స్వేచ్ఛాయుత ఇరాన్ భవిష్యత్తుకు చెందినవి. ఇస్లామిక్ రిపబ్లిక్ మౌలిక సదుపాయాలు అణచివేత, ఉగ్రవాద యంత్రాంగం మాత్రమే. ఇరాన్ కాపాడబడాలి. ఆ ప్రభుత్వాన్ని కూల్చివేయాలి.దేశాన్ని పునర్నిర్మించుకోవడానికి ఇరానీయులకు అవసరమయ్యే పౌర మౌలిక సదుపాయాలను కాపాడుతూ, ఆ ప్రభుత్వాన్ని మరియు దాని అణచివేత యంత్రాంగాన్ని లక్ష్యంగా చేసుకోవడం కొనసాగించాలని ట్రంప్ మరియు నెతన్యాహును కోరుతున్నాను.అమెరికా మరియు ఇజ్రాయెల్ మద్దతుతో, అన్నింటికంటే ముఖ్యంగా ఇరాన్ దేశభక్తుల త్యాగంతో ఇరాన్ స్వేచ్ఛా గడియ ఆసన్నమైంది. ఇరాన్ వర్ధిల్లాలి అని రెజా ఎక్స్లో రాసుకొచ్చాడు.కాగా, ఇరాన్ చివరి షా మహ్మద్ రెజా పహ్లవి పెద్ద కుమారుడైన ఈ రెజా పహ్లవి.. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ప్రవాసంలోకి వెళ్లి, ప్రస్తుతం అమెరికాలో తలదాచుకుంటున్నారు. రెజా ప్రస్తుత ఇరాన్ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆయన తరచూ అమెరికా దాడులకు మద్దతు ప్రకటిస్తూ, పాలన మార్పు జరిగితే తిరిగి ఇరాన్కు వెళ్లవచ్చని అనుకుంటున్నారు. -
ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు
ఉక్రెయిన్పై రష్యా దళాలు జరిపిన తాజా దాడుల్లో కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక అధికారుల సమాచారం ప్రకారం, గత 24 గంటల్లో నాలుగు ప్రాంతాల్లో దాడులు జరిగాయి. దక్షిణ నగరం జపోరిజ్జియాలో శనివారం ఒక నివాస గృహంపై డ్రోన్ దాడి జరగగా, ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు సహా ఎనిమిది మంది గాయపడ్డారు.సమీపంలోని డ్నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలో మరో ఇద్దరు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు. తూర్పు డోనెత్స్క్ మరియు దక్షిణ ఖెర్సన్ ప్రాంతాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. ఈ దాడులు జరుగుతున్న సమయంలో అమెరికా–ఉక్రెయిన్ ప్రతినిధులు ఫ్లోరిడాలో చర్చలు జరుపుతున్నారు. ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్దం మొదలైన తర్వాత రష్యా ఉక్రెయిన్పై విస్తృత దాడులు జరపడం ఇదే మొదటిసారి. కాగా, పశ్చియాసియాలో జరుగుతున్న యుద్దంలో ఉక్రెయిన్ అమెరికా-ఇజ్రాయెల్కు మద్దతు పలకగా.. రష్యా ఇరాన్ పక్షాన ఉంది. 2022లో మొదలై నేటికీ కొనసాగుతుంది..!రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్దం 2022లో మొదలై, నేటికీ కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ అనూహ్య ప్రతిఘటనతో ఇటీవలికాలంలో రష్యా దాడులను కాస్త తగ్గించింది. ఉక్రెయిన్ను ఆక్రమించాలనే ఉద్దేశంతో రష్యా ఈ యుద్దాన్ని మొదలుపెట్టింది. -
దెబ్బకు దెబ్బ తీస్తాం.. అమెరికాపై ఇరాన్ కౌంటర్ అటాక్
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్దం సవాళ్లు-ప్రతి సవాళ్ల మధ్య తారాస్థాయికి చేరింది. 48 గంటల్లో హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోతే ఇంధన కేంద్రాలను ఒక్కొక్కటిగా ధ్వంసం చేస్తామని అమెరికా వార్నింగ్ ఇవ్వగా.. ఇరాన్ తొలుత మొత్తబడినట్లే కనిపించి, ఆతర్వాత గట్టి కౌంటరిచ్చింది.ఇరాన్ శత్రు దేశాలకు చెందిన నౌకలు తప్ప, మిగతా అన్ని నౌకలు హర్మూజ్ జలసంధి ద్వారా వెళ్లవచ్చని ప్రకటించిన ఇరాన్.. అమెరికా మా ఇంధన కేంద్రాలపై దాడులు చేస్తే, హర్మూజ్ జలసంధి పూర్తిగా మూతపడుతుందని వార్నింగ్ ఇచ్చింది. అలాగే మధ్యప్రాచ్య మౌలిక సదుపాయాలను కోలుకోలేని విధంగా నాశనం చేస్తామని హెచ్చరించింది. అమెరికా 48 గంటల వార్నింగ్ ఇచ్చిన కొద్ది గంటల్లో ఇరాన్ మిలిటరీ ఈ ప్రకటన చేసింది. దీన్ని బట్టి చూస్తే, అమెరికా వార్నింగ్లకు ఇరాన్ బెదిరేలా కనిపించడం లేదు. దెబ్బకు దెబ్బ తీసేలా కనిపిస్తుంది. ఊపిరి పీల్చుకున్న ప్రపంచంహర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ తొలుత చేసిన ప్రకటన వల్ల ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకుంది. ముడి చమురు, సహజ వాయువు సరఫరా అంతరాయం లేకుండా కొనసాగుతుందనే నమ్మకం కలిగింది. ధరల పెరుగుదలపై ఆందోళనలు కూడా ఒకింత తగ్గాయి. అయితే ఇరాన్ తాజా ప్రకటన తర్వాత పరిస్థితి మొదటికొచ్చింది. -
ఒమన్లో పెను విషాదం
ఒమన్లో పెను విషాదం చోటు చేసుకుంది. రుస్తాక్ విలాయత్లోని అల్-హైమాలి ప్రాంతంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలై, ప్రాణాల కోసం పోరాడుతున్నారు. పాడుబడిన ఓ మట్టి భవనం కూలిపోవడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో చిన్నారులు భవనంలో ఆడుకుంటున్నట్లు స్థానికులు తెలిపారు.ఒమన్లో గతంలో కూడా పాడుబడిన భవనాలు, గోడలు కూలి ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం అక్కడి వారిని కలచివేసింది. గ్రామస్థులు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోపక్క ఒమన్ ఇరాన్ మిస్సైల్ దాడులతో సతమతమవుతుంది. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతిరోజు ఒమన్పై దాడులు చేస్తుంది. ఒమన్తో నేరుగా ఎలాంటి గొడవలు లేనప్పటికీ.. అమెరికా-ఇజ్రాయెల్కు మద్దతిస్తున్న కారణంగా ఇరాన్ దాడులు చేస్తుంది. ఫిబ్రవరి 28 నుంచి ఇజ్రాయెల్,అమెరికా-ఇరాన్ మధ్య యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. -
యుద్ధంలో ఎక్కడెక్కడ ఎన్నెన్ని మరణాలు సంభవించాయంటే?
అమెరికా, ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న ఇరాన్పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు వేల మరణాలు సంభవించాయి. యుద్ధం పశ్చిమాసియా అంతటా వ్యపించింది. ఆయా దేశాల్లో ప్రభుత్వాలు, సైన్యాలు, ఆరోగ్య విభాగాలు, రక్షణ సంస్థలు విడుదల చేసిన వివరాల ఆధారంగా మరణాల సంఖ్య ఎలా ఉందో చూద్దాం..ఇరాన్అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ (హెచ్ఆర్ఏఎన్ఏ) మార్చి 20న తెలిపిన ప్రకారం ఇరాన్లో దాదాపు 3,220 మంది మరణించారు. ఇందులో 1,398 మంది పౌరులు ఉన్నారు. వీరిలో 210 మంది పిల్లలు, 1,165 సైనిక సిబ్బంది ఉన్నారు.లెబనాన్ మరణాల సంఖ్య 1,024కి పెరిగిందని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది, ఇందులో 827 మంది పురుషులు, 79 మంది మహిళలు, 118 మంది పిల్లలు ఉన్నారు.ఇజ్రాయెల్ ఇరాన్ క్షిపణి దాడుల్లో యుద్ధం ప్రారంభం నుంచి 15 మంది పౌరులు మరణించారని ఇజ్రాయెల్ అత్యవసర సేవలు, అధికారులు తెలిపారు. ఇందులో 13 మంది ఇజ్రాయెల్ పౌరులు ఉన్నారు. సుమారు 260 మంది గాయపడ్డారు.వెస్ట్ బ్యాంక్ రామల్లా లోని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో ఇరాన్ క్షిపణి దాడుల్లో నలుగురు మహిళలు మరణించారు.గల్ఫ్ గల్ఫ్ దేశాల అధికారులు, అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపిన ప్రకారం ఇరాన్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి 28 మంది మరణించారు. కువైట్లో ఆరుగురు మరణించారు.యూఏఈలో ఎనిమిది మంది మృతి చెందారు.సౌదీ అరేబియాలో ఇద్దరు పౌరుల మృతి చెందారు.బహ్రెయిన్లో ఇద్దరు పౌరులు మరణించారు. ఇరాక్ యుద్ధం ప్రారంభం నుంచి ఇరాక్లో 68 మంది మరణించారని అధికారులు తెలిపారు.జోర్డాన్జోర్డాన్లో ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల శకలాలు పడటంతో దేశంలోని పలు ప్రాంతాల్లో 29 మంది గాయపడ్డారని భద్రతా అధికారులు తెలిపారు. గల్ఫ్లో ఏడుగురు అమెరికా సిబ్బంది మరణించినట్లు సెంట్రల్ కమాండ్ తెలిపింది. యుద్ధం ప్రారంభం నుంచి పశ్చిమాసియా అంతటా ఏడు దేశాల్లో సుమారు 200 మంది అమెరికా సైనికులు గాయపడ్డారని అమెరికా తెలిపింది. -
గజగజా వణికించే ఎఫ్-35ని ఇరాన్ సింపుల్గా ఇలా కొట్టింది..
టెహ్రాన్: ప్రపంచంలో అత్యంత ఆధునిక, అత్యంత ఖరీదైన ఫైటర్ జెట్గా పేరుగాంచిన ఎఫ్-35ను ఇరాన్ ఎలా గుర్తించింది, ఎలా పేల్చేసింది? ఎఫ్-35 శత్రు రాడార్లకు చిక్కదు. ఈ స్టెల్త్ యుద్ధ విమాన ధర రూ.700-1,000 కోట్ల మధ్య ఉంటుంది. అయినప్పటికీ, ఇరాన్ దాని పని పట్టింది.ఇరాన్కు ఇది ఎలా సాధ్యమైందన్న దానిపై పై పలు రకాల విశ్లేషణలు వస్తున్నాయి. తాజాగా, 44 సెకన్ల ఓ యానిమేటెడ్ క్లిప్ దీన్ని కొత్త కోణంలో విశ్లేషించి చూపించింది. రాడార్ సంకేతాలపై ఆధారపడకుండా ఇరాన్ ప్యాసివ్ ఇన్ఫ్రారెడ్ సెన్సర్లపై ఆధారపడి ఉండొచ్చు. అంటే, ఏదైనా వస్తువు నుంచి వెలువడే వేడి (ఉష్ణం)ని గుర్తించి, ఆ వేడి ఆధారంగా ఆ వస్తువు ఎక్కడ ఉంది? ఎలా కదులుతోంది? అనేది దీని ద్వారా గుర్తించొచ్చు. ఉదాహరణకు జెట్ ఇంజిన్ చాలా వేడిని విడుదల చేస్తుంది. ఆ వేడిని సెన్సర్లు గుర్తించి, ఆ జెట్ స్థానాన్ని తెలుసుకుంటాయి. దీంతో పైలట్లకు ఇరాన్ సైనికులు తమను గమనిస్తున్నారని తెలియకపోవచ్చు.ఇరాన్ ఎఫ్-16ను కూడా దెబ్బతీసినట్లు ప్రకటించింది. నిన్న ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ దేశ మధ్యభాగంపై ఇజ్రాయెల్కు చెందిన ఎఫ్-16 ఫైటర్ జెట్ను లక్ష్యంగా చేసుకున్నామని ప్రకటించాయి. “జయోనిస్టు పాలనకు చెందిన ఎఫ్-16 శత్రు ఫైటర్ జెట్ను ఉదయం 3.45 గంటలకు దెబ్బతీశాం” అని గార్డ్స్ తమ సెపా న్యూస్ వెబ్సైట్లో తెలిపాయి.ఇరాన్ మీడియా ఆకాశంలో పొగ కనిపిస్తున్న చిత్రాన్ని విడుదల చేసి, మరో విమానాన్ని లక్ష్యంగా చేసుకున్నామని తెలిపింది, కానీ అది ఏ రకమో లేదా ఇజ్రాయెల్దా, అమెరికాదా అన్నది కూడా వెల్లడించలేదు.ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ యానిమేషన్ వీడియో నిశ్శబ్ద ప్యాసివ్ గుర్తింపు సిద్ధాంతాన్ని చూపుతోంది. టెక్ వ్యాఖ్యాత ఫుర్కాన్ గోజుకారా ఎక్స్లో పంచుకున్న ఈ క్లిప్ ఈ విషయాన్ని వివరిస్తుంది. తరంగాలను విడుదల చేసే రాడార్ వ్యవస్థలతో భిన్నంగా, ప్యాసివ్ ఇన్ఫ్రారెడ్ వ్యవస్థలు నిశ్శబ్దంగా ఉండి, ముఖ్యంగా జెట్ ఇంజిన్ల నుంచి వచ్చే వేడిని గుర్తిస్తాయి.యానిమేషన్లో ప్రకాశించే గుర్తులు విమానం ప్రయాణ మార్గాన్ని చూపుతాయి, సెన్సర్లు ఎటువంటి హెచ్చరిక లేకుండా లక్ష్యాన్ని పట్టుకుంటాయి. ఏ సంకేతం ప్రసారం కాకపోవడంతో విమానంలో ఉన్న హెచ్చరిక వ్యవస్థలు అలర్ట్ ఇవ్వవు. యానిమేటెడ్ క్లిప్ ఇదే..Iran is brilliantly bypassing billion dollar stealth tech using passive detection systems. Instead of radar, they use advanced infrared sensors to track heat signatures. It emits no signal, giving US pilots zero warning they are being targeted. Absolute game changer. pic.twitter.com/YCXtYEjvKj— Furkan Gözükara (@FurkanGozukara) March 22, 2026 -
ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాలకు గుడ్న్యూస్!
టెహ్రాన్: ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. గల్ఫ్ దేశాల్లో అధికంగా లభించే సహజ వనరులు అయిన ముడి చమురు, సహజ వాయువు (గ్యాస్)తో పాటు ఇతర ఇంధన వనరుల నౌకలు హర్మూజ్ జలసంధి గుండా వెళ్లొచ్చని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది.శనివారం ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటన చేస్తూ.. ‘ఇరాన్ 48 గంటల్లో హర్మూజ్ జలసంధిని పూర్తిగా ఎలాంటి బెదిరింపులు లేకుండా తెరవాలి. లేదంటే ఇరాన్ అణు కేంద్రాలను ఒక్కొక్కటిగా ధ్వంసం చేస్తాం. పెద్ద దానితో మొదలు పెట్టి గట్టిగా ముగిస్తాం” అని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చలకు దారితీశాయి.ఈ నేపథ్యంలో హర్మూజ్ జలసంధి ఉద్రిక్తతలపై ఇరాన్ అధికారిక ప్రతినిధి అలీ మౌసావి స్పందించారు.‘ఇరాన్ శత్రు దేశాలకు చెందిన నౌకలు తప్ప మిగతా అన్ని నౌకలు హర్మూజ్ జలసంధి ద్వారా వెళ్లవచ్చు. మేము సముద్ర భద్రతను మెరుగుపరచడానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపారు. ఈ ప్రకటనతో ఇరాన్ ప్రత్యక్షంగా అమెరికా, దాని మిత్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమైంది.ఇరాన్ అధికారిక ప్రతినిధి అలీ మౌసావి చేసిన ప్రకటన ప్రపంచ దేశాలకు ఊరటనిచ్చింది. ఈ నిర్ణయం వల్ల గల్ఫ్ ప్రాంతంలో అధికంగా లభించే ముడి చమురు, సహజ వాయువు (గ్యాస్) వంటి ఇంధన వనరుల సరఫరా అంతరాయం లేకుండా కొనసాగుతుందనే నమ్మకం కలిగింది.ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఈ జలసంధి తెరవబడటం వల్ల చమురు ధరలు మరింత పెరుగుతాయనే ఆందోళనలు కొంతవరకు తగ్గాయి. ఇంధన సరఫరా నిలిచిపోతుందనే భయాలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లలో స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిణామం ఇతర దేశాలకు శుభపరిణామంగా భావించబడుతోంది, ఎందుకంటే ఇంధన సరఫరా కొనసాగడం వారి ఆర్థిక వ్యవస్థలకు ఊరటనిస్తుంది. -
ట్రంప్ వార్నింగ్ ఇవ్వగానే దాన్ని ముక్కలు ముక్కలు చేసిన ఇరాన్
టెహ్రాన్: హార్మూజ్ జలసంధిని 48 గంటల్లో తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలను పూర్తిగా నాశనం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక చేసిన వెంటనే ఇరాన్ మరింత అప్రమత్తమైంది. అమెరికాకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమానాన్ని పేల్చేసింది.‘హార్మూజ్ దీవి సమీపంలో, ఇరాన్ దక్షిణ తీరంపై అమెరికాకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమానాన్ని అడ్డగించాం. ఎఫ్-15 యుద్ధ విమానాన్ని మా గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయి’ అని ఇరాన్ మీడియా ప్రెస్ టీవీ ఎక్స్లో పేర్కొంది. ఆ యుద్ధ విమానాన్ని కూల్చేస్తున్నట్లు ఉన్న ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది.కాగా, అమెరికాకు చెందిన అతి భీకర ఎఫ్-35 యుద్ధ విమానాన్ని కూడా ఇరాన్ అతి తక్కువ ఖర్చుతో ఢీకొట్టినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఎఫ్-35 యుద్ధ విమానాల చరిత్రలో ఇటువంటిది మునుపెన్నడూ జరగలేదు. ఎఫ్-35 అత్యాధునిక, అతి ఖరీదైన యుద్ధ విమానం. ఇది శత్రు రాడార్లకు చిక్కదు. ఈ స్టెల్త్ యుద్ధ విమాన ధర రూ.700-1,000 కోట్ల మధ్య ఉంటుంది. ఇప్పుడు ఎఫ్-15 యుద్ధ విమానాన్ని కూడా కూల్చేశామని ఇరాన్ చెబుతూ ఆధారాన్ని కూడా పోస్ట్ చేసింది.మరోవైపు, యుద్ధం వేళ నిరాధార వార్తలు కూడా ప్రచారం అవుతున్నాయి. యూరప్పై ఇరాన్ క్షిపణులను ఎక్కుపెట్టిందని ఇటీవల ప్రచారం జరిగింది. అయితే, ఆ వార్తలకు ఎలాంటి ఆధారం లేదని యూకే తెలిపింది. యూరప్పై క్షిపణి దాడులకు ఇరాన్ ప్రణాళికలు వేసుకుంటోందని, అంతటి సామర్థ్యం ఇరాన్కు ఉందనడానికి కూడా ఎటువంటి ఆధారాలు లేవని బ్రిటన్ తెలిపింది.లండన్, పారిస్, బెర్లిన్ వంటి నగరాలను చేరే క్షిపణులు ఇరాన్ వద్ద ఉన్నాయని ఇజ్రాయెల్ రక్షణ దళాలు తెలిపిన తరువాత బ్రిటిష్ కేబినెట్ మంత్రి స్టీవ్ రీడ్ ఆ వాదనను తిరస్కరించారు. ఇరాన్ మీడియా పోస్ట్ చేసిన వీడియోAn enemy's F-15 fighter jet was shot down by Iranian air defense systems near Hormuz Island after being intercepted over the country’s southern coast.Follow: https://t.co/mLGcUTS2ei pic.twitter.com/x8kYuQGR6o— Press TV 🔻 (@PressTV) March 22, 2026 -
అమెరికాకు బలం తోడైంది?..ఇరాన్పై దాడికి సిద్ధమైన మరో దేశం!
టెహ్రాన్: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్పై యుద్ధం చేస్తున్న అమెరికా-ఇజ్రాయెల్కు బలం తోడైంది. హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ను కట్టడి చేసేందుకు ఇతర దేశాలు కలిసి రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపుకు యూకే కదిలి వచ్చింది. ప్రమాదకరమైన ఆయుధ సంపత్తితో యూకే యుద్ధనౌక హర్మూజ్ జలసంధిలో వాలిపోయింది. ఈ క్రమంలో న్యూక్లియర్ పవర్డ్ బ్రిటిష్ సబ్మెరైన్ ‘హెచ్ఎంఎస్ ఆన్సన్’హర్మూజ్ జలసంధి వద్దకు చేరుకున్నట్లు సమాచారం. ఇది ఉత్తర అరేబియన్ సముద్రంలో మోహరించినట్లు తెలుస్తోంది. ఇందులో తోమహాక్ క్షిపణులు, భారీ టోర్పిడోలు, శక్తివంతమైన ఆయుధ సంపత్తి ఉంది. ఇరాన్పై సైనిక చర్యలను తీవ్రతరం చేస్తామని అమెరికా హెచ్చరిస్తున్న తరుణంలో యూకే సబ్ మెరైన్ హర్మూజ్ జలసంధిలో మోహరించడం విశేషం. తాజా పరిణామంతో ఇరాన్పై యుద్ధం చేస్తున్న అమెరికా-ఇజ్రాయెల్కు మరింత బలం చేకూరినట్లువుతుంది. ఈ నౌక మార్చి 6న ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరం నుండి బయల్దేరిన యూకే సబ్మెరైన హర్మూజ్ జలసంధికి సమీపంలో ఉత్తర అరేబియా సముద్రంలో ఒక వ్యూహాత్మక స్థానంలో ఉండదనుందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అధునాతన ఆయుధాలతో కూడిన హెచ్ఎంఎస్ ఆన్సన్ నౌకలో 1,600 కిలోమీటర్ల పరిధి గల ‘టోమాహాక్ బ్లాక్ ఐవీ భూతల దాడి క్షిపణులు’, స్పియర్ఫిష్ హెవీవెయిట్ టార్పెడోలు’ అమర్చబడి ఉన్నాయి. హర్మూజ్ జలసంధి వద్ద పహారా కాస్తున్న ఇరాన్ యుద్ధనౌకలు దాడికి తెగబడితే.. వాటిని అరికట్టేందుకు ఇరాన్ మోహరించిన క్షిపణి స్థావరాలపై శక్తివంతమైన దాడులు చేసేందుకు వీలు కలగనున్నాయి. సీఎన్ఎన్ ప్రకారం.. హర్మూజ్ జలసంధిలోని నౌకలపై జరిగే దాడులతో సంబంధం ఉన్న ఇరాన్ క్షిపణి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడానికి ఈ యూకే సబ్మెరైన్ ఉపయోగపడనుంది. ఇరాన్పై యుద్ధంలో అమెరికా-ఇజ్రాయెల్కు మిత్రదేశాలు బలం చేకూరుస్తున్నాయి. యూకే, ఫ్రాన్స్, జర్మనీతో పాటు మరో ఆరు దేశాలు హర్మూజ్ జలసంధిలో భద్రత కోసం ముందుకు వచ్చాయి. -
ఖతార్లో కూలిన సైనిక హెలికాఫ్టర్
దోహ: ఖతార్ సైనిక హెలికాఫ్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియా ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ ఈ ప్రమాదం చోటు చేసుకోవడం విశేషం.ఖతర్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, సాధారణ విధుల్లో ఉన్న ఒక సైనిక హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా దేశపు సముద్ర జలాల్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ హెలికాప్టర్ ప్రమాదానికి ఇరాన్పై అమెరికా- ఇజ్రాయెల్ దాడులకు ఎటువంటి సంబంధం లేదని రక్షణ మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. ప్రమాదానంతరం గాలింపు, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. చనిపోయిన వారి వివరాల గురించి తెలియాల్సి ఉంది. -
మాకే 48 గంటల టైమ్ ఇస్తారా? రెచ్చిపోయిన ఇరాన్
టెహ్రాన్: హార్మూజ్ జలసంధిని 48 గంటల్లో తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలను పూర్తిగా నాశనం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికపై ఇరాన్ స్పందించింది. ట్రంప్కే తిరిగి వార్నింగ్ ఇచ్చింది. పశ్చిమాసియా అంతటా కీలక మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని చెప్పింది.“మా ఇంధన, ఎనర్జీ మౌలిక సదుపాయాలపై శత్రువులు దాడి చేస్తే.. పశ్చిమాసియాలో అమెరికాకు చెందిన ఆస్తులతో పాటు ఆయా దేశాల్లోని ఎనర్జీ, సమాచార సాంకేతిక, సముద్ర జల ఉప్పుతీత మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటాం” అని ఇరాన్ మిలిటరీ ఆపరేషనల్ కమాండ్ ఓ ప్రకటనలో తెలిపింది.కాగా, హార్మూజ్ భద్రతకు యూరోపియన్ దేశాలు, నాటో మిత్రదేశాలు, ఇతర దేశాలు సహకరించాలని ట్రంప్ కోరుతున్న విషయం తెలిసిందే. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. “48 గంటల్లో ఇరాన్ ఎలాంటి బెదిరింపులు లేకుండా పూర్తిగా హార్మూజ్ జలసంధిని తెరవకపోతే ఆ దేశ విద్యుత్ కేంద్రాలపై దాడి చేసి పూర్తిగా నాశనం చేస్తాం’’ అని అన్నారు.బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జోర్డాన్, ఇరాక్ దేశాల్లో పౌరులు, పౌర మౌలిక సదుపాయాలపై ఇరాన్ చేసిన దాడులను జీ7 విదేశాంగ మంత్రులు తీవ్రంగా ఖండించారు.“ఈ దేశాలపై ఇరాన్ చేసిన దాడులు ప్రాంతీయ, ప్రపంచ భద్రతకు ముప్పుగా నిలుస్తున్నాయి. ఇరాన్ తక్షణం, ఎలాంటి షరతులు లేకుండా అన్ని దాడులను నిలిపివేయాలని మేము పిలుపునిస్తున్నాం. సముద్ర మార్గాల రక్షణ, నౌకాయాన భద్రతకు సహకరించాల్సిందే. హార్మూజ్ జలసంధి సహా కీలక జలమార్గాలు, సరఫరా చైన్ భద్రత, ఎనర్జీ మార్కెట్ల స్థిరత్వం అవసరం” అని జీ7 విదేశాంగ మంత్రులు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో తెలిపారు.కాగా, ఇరాన్ ఇప్పటికే పలు దేశాలకు హార్మూజ్ జలసంధిని వినియోగించుకోవచ్చని అనుమతి ఇచ్చింది. పశ్చిమాసియా యుద్ధంలో పాల్గొనని దేశాలు హార్మూజ్ జలసంధిని వాడుకోవచ్చని, నౌకల ప్రయాణానికి ఇరాన్ సైన్యం అనుమతి తీసుకోవాలని, సమన్వయం చేసుకోవాలని పేర్కొంది. -
ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి.. ఇంట్లోకి దూసుకొచ్చిన క్షిపణి?
జెరూసలేం: ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఇరు దేశాల దాడులు, ప్రతి దాడులతో పశ్చిమాసియా దేశాల్లో నిప్పుల వర్షం కురుస్తోంది. తాజాగా,ఇరాన్ దక్షిణ ప్రాంతంలో నతాంజ్ అణు కేంద్రాన్ని లక్క్ష్యంగా ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేసింది. అందుకు ప్రతీకారంగా ఇరాన్..ఇజ్రాయెల్లోని డిమోనా, అరద్ నగరాలపై క్షిపణులతో విరుచుకు పడింది.ఇరాన్ జరిపిన క్షిపణ దాడుల్లో అనేక భవనాలు శిథిలయ్యాయి. క్షిపణుల దాడి సమయంలో ఇంట్లో ఉన్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ గుడుపుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోల్లో ఇరాన్ ప్రయోగించిన ఓ క్షిపణి ఇంటి పరిసర ప్రాంతాల్లోకి దూసుకొచ్చింది. ఆ సమయంలో ఇంటి తలుపులు,కిటికీల ఫ్రేములు ఎగిరిపోతుండగా..సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు అందులో ఉన్నాయి.ఏఎఫ్పీ ప్రకారం..ఇరాన్ క్షిపణి దాడుల్లో ఇజ్రాయెల్ అరద్ పట్టణంలో 84 మంది గాయపడగా, వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. కాగా, డిమోనాలో 33 మంది గాయపడ్డారు. డిమోనాలో బాంబు షెల్ కారణంగా తీవ్రంగా గాయపడిన వారిలో పదేళ్ల బాలుడు, 40 ఏళ్ల మహిళ కూడా ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రధాన అణు పరిశోధనా కేంద్రానికి డిమోనా కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో ఈ దాడులకు ప్రాముఖ్యత ఏర్పడింది. כדור אש יורד מהשמיים: תיעוד הפגיעה בדימונה@Itsik_zuarets pic.twitter.com/8R1G7lmDVW— כאן חדשות (@kann_news) March 21, 2026 -
మోజ్తాబా ఖమేనీ ఎక్కడ?.. ట్రంప్ బ్రీఫింగ్లలో హాట్టాపిక్!
టెహ్రాన్: రోమ్ తగలబడుతుంటే నీరో ఫిడేలు వాయించినట్టే… ఇరాన్ యుద్ధంలో మోజ్తాబా మౌనం. దేశం రగులుతున్నా కొత్త సుప్రీం లీడర్ ఒక్క బహిరంగ ప్రకటన చేయలేకపోవడం ఇప్పుడు ట్రంప్ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్లలో హాట్టాపిక్గా మారిందిఅమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్లో పరిస్థితులు తీవ్రంగా మారాయి. ఫిబ్రవరి 28న జరిగిన క్షిపణి దాడుల్లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టాడు. అయితే ఆయన ఆరోగ్యం, నాయకత్వ సామర్థ్యంపై అంతర్జాతీయ స్థాయిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.జెరూసలెం పోస్ట్ నివేదిక ప్రకారం, మోజ్తాబా తీవ్ర గాయాలతో బాధపడుతున్నారని, వాస్తవానికి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (IRGC) యుద్ధ వ్యూహాలను నడిపిస్తున్నాయని పేర్కొంది. అమెరికా నిఘా వర్గాల సమాచారం ప్రకారం, దాడుల్లో ఆయన ఒక కాలు కోల్పోయి, కాలేయం దెబ్బతిని ఆయన ఆరోగ్య పరిస్థి అంతంత మాత్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.మోజ్తాబా మౌనంమరో అమెరికా మీడియా సంస్థ యాక్సియోస్ ..ఇరాన్పై ముప్పేటా దాడి,ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీని ముట్టుబెట్టడం,ఇరాన్పై పైచేయి సాధించేలా యుద్ధ వ్యూహాల్ని రచిస్తున్నా మోజ్తాబా మౌనం.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ల సమయంలో చర్చనీయాంశంగా ఉంది. ఇరాన్ బాధ్యతలు ఎవరు నిర్వహిస్తున్నారో అమెరికా జాతీయ భద్రతా బృందం ఆరా తీస్తుందని ట్రంప్ వర్గంలోని ఓ కీలక వ్యక్తి చెప్పారని నివేదించింది మోజ్తాబా ఖమేనీ ఆరోగ్యం అంతంత మాత్రమే?అదే సమయంలో ఇజ్రాయెల్ ఇనిస్టిట్యూట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ నిపుణుడు రజ్ జిమ్మ్ట్ మోజ్తాబా ఆచూకీపై మీడియా యాక్సియోస్తో మాట్లాడారు. కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ప్రస్తుత భద్రతా పరిస్థితుల కారణంగా ప్రజల ముందుకు రావడం అసాధ్యం.క్షిపణి దాడుల్లో ఆయన గాయపడిన తీరు అలాంటిది. ఓ వీడియో రికార్డు చేసి ప్రజలకు సైతం సందేశం పంపించ లేకపోతున్నారని చెప్పారు.వరుస ప్రాణాలు కోల్పోతున్న ఇరాన్ అగ్రనాయకులు ఇదే సమయంలో ఇజ్రాయెల్–అమెరికా దాడుల్లో ఇరాన్ అగ్రనాయకులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. మార్చి 16న కమాండర్ ఘోలాంరెజా సోలేమానీ, మార్చి 17న భద్రతా వ్యూహకర్త అలీ లారిజానీ మరణించారు. ఈ పరిణామాలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి స్పందిస్తూ.. ఓ వ్యక్తి ఉండటం,లేకపోవడం ఇరాన్ రాజకీయ, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపదు. మేము పోరాటాన్ని కొనసాగిస్తాం.సుప్రీం లీడర్ కూడా వీరమరణం పొందినా, వ్యవస్థ తన పనిని కొనసాగించింది’ అని పేర్కొన్నారు.ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం, యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 1270 మంది మరణించారు. అమెరికా స్థావరాలపై ప్రతిదాడులు జరిపిన ఇరాన్, హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు విధించింది. ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాలో ఐదవ వంతు ఈ మార్గం ద్వారా జరుగుతుంది. నౌకలు ప్రయాణించలేకపోవడంతో ఇంధన సరఫరా తీవ్రంగా దెబ్బతింది. ఈ పరిణామాలు ఇరాన్ అంతర్గత రాజకీయాలపై మాత్రమే కాకుండా, ప్రపంచ ఇంధన మార్కెట్లపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. -
ఒమన్లో వరద బీభత్సం.. ముగ్గురు మృతి
మస్కట్/దుబాయ్: గల్ఫ్ ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అకాల వర్షాలు, ఆకస్మిక వరదలతో ఒమన్, యూఏఈ అతలాకుతలమవుతున్నాయి. ఒమన్లో వరద ఉధృతికి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ వారం పొడవునా వాతావరణం మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దక్షిణ అల్ బతినా గవర్నరేట్లోని ‘వాడి అల్ మావిల్’ వద్ద వరద ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది. వేగంగా వచ్చిన నీటి తాకిడికి మూడు వాహనాలు కొట్టుకుపోయాయి.ఈ ప్రమాదంలో చిక్కుకున్న ముగ్గురు మరణించినట్లు ఒమన్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సీడీఏఏ) తెలిపింది. సహాయక బృందాలు ఒకరిని ప్రాణాలతో కాపాడగలిగాయి. మస్కట్, అల్ బతినా తీర ప్రాంతాల్లో వరద నీటిలో చిక్కుకుపోయిన మరో 40 మందిని రెస్క్యూ టీమ్స్ సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. యూఏఈలో అల్పపీడన ప్రభావంతో వాతావరణం అస్థిరంగా మారింది. ముఖ్యంగా అబుదాబి, అల్ ఐన్, దుబాయ్ కారిడార్లో ఈ రాత్రి భారీ పిడుగులతో కూడిన వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఎన్సీఎం)అంచనా వేస్తోంది. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల వల్ల ధూళి మేఘాలు కమ్ముకొని, విజిబిలిటీ గణనీయంగా తగ్గుతోంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 20°C నుంచి 23°C మధ్య నమోదవుతున్నాయి. Significant flooding in Muscat, Oman’s port capital today...🌊 pic.twitter.com/ZBkEdqBBWj— Volcaholic 🌋 (@volcaholic1) March 21, 2026వారికి భారీ జరిమానాలువరదలను చూసేందుకు, ఫోటోలు తీసేందుకు వాగులు, వంకల దగ్గరకు వెళ్లే వారికి యూఏఈ హోం మంత్రిత్వ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవని స్పష్టం చేసింది. వరద కాలువలు లేదా డ్యామ్ల వద్ద గుమిగూడినా, ప్రవహిస్తున్న వాగుల్లోకి వాహనాలతో వెళ్లినా శిక్ష తప్పదని పేర్కొంది. కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘వాడి అల్ నహ్వా’, ‘అల్ హేయర్’ దృశ్యాలు వరద తీవ్రతకు అద్దం పడుతున్నాయి. మంగళవారం వరకూ కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణశాఖ అధికారులు సూచించారు.ఇది కూడా చదవండి: మరో చరిత్ర లిఖించిన ప్రధాని మోదీ -
రికార్డు సృష్టించిన పాక్.. ఏ విషయంలో తెలుసా?
పాకిస్థాన్కు తన చేస్తున్న పనులకు తగిన గౌరవం లభించింది. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో మెుదటి స్థానానికి చేరుకొని రికార్డు సృష్టించింది. గత కొన్ని సంవత్సరాలుగా టాఫ్ ప్లేసులో ఉన్న ఈ దేశం ఇప్పుడు ఏకంగా మెుదటి స్థానానికి చేరుకొని అశాంతికి కేరాఫ్ అడ్రస్గా నిలిచింది.పాకిస్థాన్ గురించి ప్రపంచానికి తెలియజేయడానికి భారత్ ఇంతకాలం శాయశక్తులా ప్రయత్నిస్తూ వచ్చింది. దాయాది దేశం కపటబుద్దిని ఉగ్రవాదులకు కల్పిస్తున్న అండదండలను అంతర్జాతీయ వేదికలపై ప్రపంచ దేశాలకు తెలియజేసింది. అయినప్పటికీ పాక్ తన వక్రబుద్ధిని మార్చుకోకుండా భారత్పై విషం చిమ్ముతూ వచ్చింది. కాగా తాజాగా విడుదలైన గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ - 2026లో పాకిస్థాన్ మెుదటి స్థానం దక్కించుకుంది. దీంతో ఆదేశంలో ఉగ్రవాదం ఏ స్థాయిలో ఉందో అంతర్జాతీయ సమాజానికి తేటతెల్లమయ్యింది. కాగా గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో భారత్ 13వ స్థానంలో నిలిచింది. గత ఏడాది కాలంగా దేశంలో ఉగ్రవాద ఘటనలు 44 శాతం తగ్గాయని పేర్కొంది. క్రితంతో పోలిస్తే 2025లో ఉగ్రవాద మరణాలు 28 శాతం తగ్గాయి. ఉగ్రదాడుల సంఖ్య 22శాతం తగ్గి 2,944కు చేరుకుంది. 81 దేశాలలో పరిస్థితి మెరుగుపడగా 19 దేశాలలో పరిస్థితి మరింత దిగజారింది. అదే సమయంలో ప్రాశ్చాత్య దేశాలలో ఉగ్రవాద దాడులు 280 శాతం పెరిగాయి.టెర్రరిజం అరికట్టడానికి ప్రహార్అయితే భారత్ ఉగ్రవాదాన్ని సమూళంగా అణిచివేయడానికి తగిన చర్యలు తీసుకుంటుంది. ఫిబ్రవరి 23న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 'ప్రహార్' పేరుతో మెట్ట మెుదటి జాతీయ ఉగ్రవాద నిరోధక విధానాన్ని విడుదల చేసింది. దేశంలో ఉగ్రవాదాన్ని నిరోధించే విధంగా ఈ విధానం చర్యలు తీసుకోనుంది. ఇండెక్స్ ఏ ఆధారంగా?గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ నాలుగు ప్రధానాంశాల ఆధారంగా గుర్తిస్తారు. సంవత్సరంలో ఆ దేశంలో జరిగిన ఉగ్రదాడుల సంఖ్య, మరణాలు, గాయపడిన వారి సంఖ్య, బందీలుగా చిక్కుకున్నవారు తదితర అంశాల ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు. -
సముద్రంలో రేసింగ్ లెజెండ్ గల్లంతు
మాల్దీవులు: భారత మోటార్ స్పోర్ట్స్ రంగంలో విషాదం నెలకొంది. ఐదుసార్లు ఇండియన్ నేషనల్ ర్యాలీ ఛాంపియన్గా నిలిచిన లెజెండరీ డ్రైవర్ హరిసింగ్ (59), మాల్దీవుల్లో జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతయ్యారు. గడచిన 48 గంటలుగా గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ ఆయన ఆచూకీ లభించకపోవడంతో, ఆయన మృతి చెంది ఉండవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.అసలేం జరిగింది?శుక్రవారం ఉదయం వావు అటోల్లోని ఫెలిధూ ద్వీపం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ సింఘానియాకు చెందిన యాచ్తో అనుసంధానమై ఉన్న ఒక హై-స్పీడ్ బోటు అదుపుతప్పి సముద్రంలో బోల్తా పడింది. ఆ సమయంలో బోటులో హరిసింగ్, సింఘానియాతో పాటు మరో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు గౌతమ్ సింఘానియాతో సహా ఐదుగురిని సురక్షితంగా బయటకు తీశాయి. అయితే హరిసింగ్, బోటు కెప్టెన్ మాత్రం సముద్ర అలల ఉధృతికి కొట్టుకుపోయారు.పగడపు దీవుల్లో చిక్కుకున్నారా?మాల్దీవుల నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ (MNDF) కోస్ట్ గార్డ్ బృందాలు మూడవ రోజు కూడా ముమ్మరంగా గాలిస్తున్నాయి. సముద్ర గర్భంలోని పగడపు దీవుల (Coral Reef) మధ్య హరిసింగ్ చిక్కుకుని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ ఆయన ప్రాణాలతో తిరిగి వస్తారన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈ విషాద వార్త తెలియగానే హరిసింగ్ కుమారుడు మివాన్ సింగ్ మాల్దీవులకు చేరుకున్నారు.భారత రేసింగ్ చరిత్రలో..హరిసింగ్ కేవలం ఒక రేసర్ మాత్రమే కాదు.. భారత మోటార్ స్పోర్ట్స్ రంగానికి ఒక మార్గదర్శిగా నిలిచారు.1990లలో వరుసగా ఐదుసార్లు జాతీయ ర్యాలీ ఛాంపియన్గా నిలిచి రికార్డు సృష్టించారు. ప్రతిష్టాత్మక ఆసియా జోన్ ర్యాలీ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న తొలి భారతీయునిగా నిలిచారు. ప్రస్తుతం జేకే టైర్ మోటార్ స్పోర్ట్ హెడ్గా ఉంటూ, పలువురు యువ రేసర్లకు శిక్షణనిస్తున్నారు. హరిసింగ్ కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు యుద్ధప్రతిపాదికన కొనసాగుతున్నాయి.ఇది కూడా చదవండి: ఎన్నికల విధుల ఒత్తిడి.. నదిలో దూకిన ఉపాధ్యాయుడు -
ట్రంప్ ఎఫెక్ట్.. యుద్ధంలోకి మరో దేశం?
పశ్చిమాసియా యుద్ధంలో మరో దేశం దిగనుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. బ్రిటిష్కు చెందిన ఓ అణు జలాంతర్గామిని అరేబియా సముద్రంలో మోహరించినట్లు డేలీ మెయిల్ కథనం పేర్కొంది. దీనితో ఈ క్షణాన్నైనా ఇరాన్పై దాడులు చేసే అవకాశం ఉందని సమచారం.నాటో దేశాలపై ట్రంప్ ఇటీవల తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. హార్మూజ్ జలసంధి విషయంలో అవి స్పందించడం లేదని వారంతా పిరికి వాళ్లన్నారు. అమెరికా లేని నాటో ఏందుకు పనికి రాదని పేపర్ పులి లాంటిదని అభివర్ణించారు. ఈ సందర్భాన్ని గుర్తు పెట్టుకుంటామని హెచ్చరిస్తూ తన అధికారిక సోషల్ మీడియా గ్రూప్లో పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ స్పందించినట్లు తెలుస్తోంది.బ్రిటన్ అరేబియా సముద్రంలో ఒక అణుశక్తితో నడిచే జలాంతర్గామిని మోహరించిందని డైలీ మెయిల్ కథనం పేర్కొంది. ఈ సబ్మెరైన్లో టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులను దాడికి సిద్ధంగా ఉంచిందని తెలిపింది. హెచ్ఎంఎస్ ఆన్సన్ అనే జలంతార్గామి మార్చి 6న ఆస్ట్రేలియా నుంచి బయిలుదేరిందని అరేబియా సముద్రంలోని పరిస్థితులను వివరించేందుకు ప్రతి 24 గంటలకోకసారి హెచ్ఎంఎస్ ఆన్సన్ ఉపరితలానికి వస్తున్నట్లు డైలీమెయిల్ కథనం ప్రచురించింది.కాగా బ్రిటన్, అమెరికాకు చెందిన ద్వీపం డీగో గార్సియాపై దాడి చేసింది. నాలుగువేల కిలోమీటర్ల దూరంలోని టార్గెట్పై అటాక్ చేసింది. ఇరాన్పై దాడికి డీగో గార్సియా ద్వీపం ఉపయోగించుకోవచ్చని బ్రిటన్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. కాగా ఇప్పుడు బ్రిటన్ సైతం నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. -
ఇజ్రాయెల్కు బిగ్ షాక్!.. ఇరాన్ పవర్ఫుల్ అటాక్
జెరూసలేం: ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. పరస్పర దాడులతో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రం టార్గెట్గా ఇరాన్ భీకర క్షిపణి దాడులు చేసింది. దీంతో, ఇజ్రాయెల్కు భారీ నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఇక, ఇరాన్ దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ హెచ్చరికలు జారీ చేశారు.ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణి దాడులతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రం సమీపంలోని డిమోనా, అరద్ ప్రాంతాలపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. అయితే, డిమోనా ప్రాంతంలో ఇజ్రాయెల్కు కీలకమైన అణు కేంద్రం ఉండటం వల్ల భద్రతా ఆందోళనలు పెరిగాయి. ఇక, ఈ ఘటనలో పిల్లలు సహా 100మందికి పైగా గాయపడినట్లు ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. ఈ సందర్బంగా ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ స్పందించింది. ఇరాన్ క్షిపణులు నేరుగా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడి చేశాయని పేర్కొంది. దీని వల్ల అరుద్, డిమోనా ప్రాంతాలు ధ్వంసమయ్యాయని, 100 మందికిపైగా గాయపడ్డారని తెలిపింది. దీనిని ఉగ్రవాద చర్య, యుద్ధ నేరంగా అభివర్ణించింది. MAJOR IRANIAN ATTACK..Israel’s most secretive nuclear siteIn Dimona is on fire‼️Widely believed to be a nuclear research and weapons-related facility. pic.twitter.com/t6MSGsSAR2— Earth Hippy 🌎🕊️💚 (@hippyygoat) March 21, 2026 నెతన్యాహు హెచ్చరిక.. మరోవైపు ఇరాన్ క్షిపణి దాడిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. గాయపడిన వారికి తక్షణ సహాయం అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నెతన్యాహు..‘ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన కఠిన సమయం. గాయపడిన వారందరికీ ప్రార్థనలు చేస్తున్నాం. అన్ని రంగాల్లో శత్రువులను ఎదుర్కొంటాం. శత్రువులపై అన్ని రంగాల్లో ప్రతిదాడులు కొనసాగిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో పనిచేస్తున్న అత్యవసర సేవా బృందాలకు నెతన్యాహూ అభినందనలు తెలిపారు. ప్రజలు ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటించాలని పిలుపునిచ్చారు. అలాగే, దాడి జరిగిన ప్రాంతం నుంచి సుమారు 150 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.ఇరాన్ ఝలక్.. ఇజ్రాయెల్పై దాడుల నేపథ్యంలో ఇరాన్ ఐఆర్జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ అధిపతి మేజర్ జనరల్ సయ్యద్ మజీద్ మూసావి స్పందించారు. ఇజ్రాయెల్ గగనతలం రక్షణ లేకుండా ఉంది. ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతాల ఆకాశంపై ఇరాన్ మిసైల్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఇకపై జరగబోయే దాడులు అమెరికా-ఇజ్రాయెల్ కమాండర్లను ఆశ్చర్యపరుస్తాయని అన్నారు. కొత్త వ్యూహాలతో ముందుకు వస్తున్నట్లు పేర్కొన్నారు.Video shows the moment an Iranian missile struck Dimona in southern Israel, home to the country’s nuclear facility. Nearly 50 people have been injured. Iran had warned it would target the area if the US and Israel pursued regime change in Tehran. pic.twitter.com/cPkzWskiw6— Al Jazeera Breaking News (@AJENews) March 21, 2026 -
ట్రంప్ షాకింగ్ పోస్ట్.. ‘అతని చావుతో సంతోషం’
వాషింగ్గన్: ఎప్పుడూ సంచలనాలకు అడ్డాగా నిలిచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు తీవ్ర స్థాయిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడవి ప్రపంచవ్యాపంగా పెనుదుమారాన్ని రేపుతున్నాయి. అమెరికా గూఢచారి సంస్థ ఎఫ్బీఐ (ఎఫ్బీఐ) మాజీ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్ (81) కన్నుమూశారు. అతని మరణంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించిన తీరు అందరినీ ఆశ్యర్యపరుస్తోంది. ఒకప్పుడు తనపై వచ్చిన రష్యా సంబంధాల ఆరోపణలను విచారించిన ముల్లర్ మరణంపై ట్రంప్ అత్యంత కఠినమైన పదజాలంతో వ్యాఖ్యలు చేశారు.విద్వేషానికి పరాకాష్టముల్లర్ మరణవార్త తెలిసిన వెంటనే ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ వేదికగా.. ‘రాబర్ట్ ముల్లర్ చనిపోయారు. మంచిదైంది.. ఆయన చనిపోయినందుకు నేను సంతోషిస్తున్నాను. ఇకపై ఆయన అమాయకులను బాధించలేరు’ అంటూ పోస్ట్ చేశారు. గతంలో ముల్లర్ చేపట్టిన దర్యాప్తును ట్రంప్ పదేపదే ‘విచ్ హంట్’ (రాజకీయ కుట్ర)గా అభివర్ణించేవారు. తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ముల్లర్పై ఆయనకున్న తీవ్ర విద్వేషాన్ని బయటపెట్టాయి.ఎఫ్బీఐలో కొత్త ఉత్సాహంముల్లర్ తన 12 ఏళ్ల పదవీ కాలంలో ఎఫ్బీఐ రూపురేఖలను మార్చివేశారు. 2001లో అమెరికాపై జరిగిన సెప్టెంబర్ 11 దాడులకు వారం రోజుల ముందే ఆయన బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకు కేవలం నేర పరిశోధన సంస్థగా ఉన్న ఎఫ్బీఐని, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత ముల్లర్కే దక్కుతుంది. రిపబ్లికన్ ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్ హయాంలో నియమితులైన ఆయన, రెండు ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్షుల కింద పనిచేశారు.ట్రంప్.. ఆయన 34 మంది స్నేహితులు..2013లో పదవీ విరమణ చేసిన ముల్లర్, 2017లో మరోమారు వార్తల్లోకి నిలిచారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రచార బృందానికి, రష్యాకు మధ్య ఏవైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా అనే అంశంపై దర్యాప్తు చేయడానికి ఆయన ‘స్పెషల్ కౌన్సిల్’గా నియమితులయ్యారు. దాదాపు 22 నెలల పాటు సాగిన ఈ విచారణలో ట్రంప్ సన్నిహితులతో సహా 34 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. 2019లో ఆయన సమర్పించిన 448 పేజీల నివేదికలో.. ట్రంప్ బృందానికి రష్యాతో సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నప్పటికీ, అది నేరపూరిత కుట్ర అని చెప్పడానికి తగిన ఆధారాలు లేవని ముల్లర్ తేల్చారు. అప్పటి నిబంధనల ప్రకారం సిట్టింగ్ ప్రెసిడెంట్పై క్రిమినల్ చర్యలు తీసుకోలేకపోయినప్పటికీ, ట్రంప్ దర్యాప్తును అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలను ఆయన తన నివేదికలో వెల్లడించారు. ముల్లర్ కుటుంబ సభ్యులు ఆయన ధృవీకరిస్తూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.ఇది కూడా చదవండి: ప్రపంచం షాక్..‘అరిరంగ్’తో బీటీఎస్ విశ్వరూపం -
అఫ్గానిస్తాన్లో భూకంపం
అఫ్గానిస్థాన్ని స్వల్ప వ్యవధిలో రెండు భూకంపాలు కుదిపేశాయి. ఉత్తర ప్రాంతంతో పాటు రాజధాని కాబూల్, ఫైజాబాద్ సమీపంలో భూమి కంపించింది. ఈ భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5, 4.6గా రికార్డయింది. అయితే ఈ భూకంప తీవ్రతకు ఏమైనా ప్రాణ, ఆస్తినష్టం సంభవించిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది.అయితే భూకంప తీవ్రతకు కొన్ని చోట్ల నివాసాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దీంతో ప్రజలంతా భయభ్రాంతులకు గురై రోడ్లమీదకి వచ్చారు. కాబుల్ సమీపంలోని డే సబ్జా, ఖాదిర్ ఖిల్, భక్తియారన్ వంటి ప్రాంతాలపై దీని ప్రభావం పడింది.కాగా ఆఫ్ఘనిస్తాన్ లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 4 లేదా అంతకంటే తీవ్రతతో వరుసగా భూమి ప్రకపించడం ఈ మధ్య కాలంలో చాలా సార్లు జరిగింది.కాగా ప్రస్తుతం అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ మధ్య యుద్ధం నడుస్తుంది. కాబూల్పై పాక్ పెద్దఎత్తున దాడులకు తెగబడుతుంది. కొద్దిరోజుల క్రితం ఆదేశంలోని ఒక ఆసుపత్రిపై పాక్ మిసైళ్లతో దాడి చేసింది. ఈ దుర్ఘటనలో వందల సంఖ్యలో రోగులు ప్రాణాలు కోల్పోయారు. -
యుద్ధం వేళ కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర సర్కారు
ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ ప్రతీకార దాడులు.. -
ప్రపంచం షాక్..‘అరిరంగ్’తో బీటీఎస్ విశ్వరూపం
నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ప్రపంచ పాప్ సంగీత సామ్రాజ్య అగ్రగామి, కే-పాప్ సంచలనం బీటీఎస్ మళ్లీ స్టేజ్ పైకి వచ్చేసింది. శనివారం దక్షిణ కొరియా రాజధాని సియోల్లోని గ్వాంగ్హ్వామున్ స్క్వేర్లో జరిగిన బీటీఎస్ కంబ్యాక్ కన్సర్ట్ ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. నెట్ఫ్లిక్స్ ఎక్స్క్లూజివ్గా ప్రసారమైన ఈ మెగా ఈవెంట్కు వేలాది మంది పోలీసులు రక్షణగా నిలవగా, లక్షలాది మంది అభిమానులు (ARMY) తమ అభిమాన హీరోలను చూసి పరవశించిపోయారు. ‘అన్యోంగ్హాసెయో!’.. మేము మళ్లీ వచ్చేశాం" అంటూ బ్యాండ్ లీడర్ ఆర్ఎం పలికిన మాటలు సీయోల్ వీధుల్లో ఉవ్వెత్తున మారుమోగాయి.సరికొత్త రికార్డుల వేటలో..దక్షిణ కొరియాలో తప్పనిసరి అయిన సైనిక సేవను గ్రూప్లోని ఏడుగురు సభ్యులు (ఆర్ఎం, జిన్, సుగా, జె-హోప్, జిమిన్, వి, జంగ్ కుక్) విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత జరిగిన మొదటి పూర్తిస్థాయి కన్సర్ట్ ఇది. శుక్రవారం విడుదలైన వీరి ఐదవ ఆల్బమ్ ‘అరిరంగ్’ మొదటి రోజే ఏకంగా 40 లక్షల కాపీలు అమ్ముడై రికార్డు సృష్టించింది. తన కాలికి గాయం అయినా దానిని లెక్కచేయకుండా ఆర్ఎం చేసిన పర్ఫార్మెన్స్ అభిమానులను భావోద్వేగానికి గురిచేసి, కన్నీరు పెట్టించింది.గ్వాంగ్హ్వామున్ వేదికగా సంగీత సంగమంచారిత్రక గ్వాంగ్హ్వామున్ స్క్వేర్, గ్యోంగ్బోక్ ప్యాలెస్ నేపథ్యంగా పర్పుల్, ఎరుపు, నీలం రంగుల వెలుగుల్లో ఈ వేడుక అద్భుతంగా సాగింది. కొరియా జానపద గీతం ‘అరిరంగ్’ పేరుతో రూపొందించిన ఈ ఆల్బమ్, విడిపోవడం, తిరిగి కలవడంలో ఉండే ఆవేదన, ఆనందాన్ని ప్రతిబింబిస్తుంది. ‘మేము ఎవరమో, మళ్లీ ఎలా కలిసి వచ్చామో ప్రపంచానికి చూపించాలనుకున్నాం’ అని ఆర్ఎం ఈ సందర్భంగా ఉద్వేగంగా పేర్కొన్నారు.పోలీసు వలయంలో సీయోల్!2022 హాలోవీన్ విషాదం తర్వాత ప్రభుత్వం భద్రత విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించింది. కన్సర్ట్ కోసం సమీపంలోని సబ్వేలు, బస్సు సర్వీసులను నిలిపివేసి, చుట్టుపక్కల భవనాలను కూడా సీల్ చేశారు. 22,000 మంది ‘అదృష్టవంతులు’ గ్యాలరీల్లో కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించగా, బయట వేలాది మంది భారీ స్క్రీన్ల ముందు ఆనందంగా ఊగిపోయారు.పాత జ్ఞాపకాలు.. కొత్త ఊపిరిగంట పాటు సాగిన ఈ ప్రదర్శనలో "‘బేబీ టు బాడీ’, "స్విమ్" లాంటి కొత్త పాటలతో పాటు, గ్లోబల్ హిట్స్ అయిన ‘డైనమేట్’, ‘బట్టర్’ పాటలకు అభిమానులు స్టెప్పులేశారు. ‘కొన్నేళ్ల క్రితం బూసాన్ కన్సర్ట్లో మా కోసం వేచి ఉండమని అడిగాం.. ఆ మాట నిలబెట్టుకుని ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ జిన్ భావోద్వేగానికి లోనయ్యారు. చలిని కూడా లెక్కచేయకుండా వచ్చిన అభిమానులను చూసి సభ్యులు స్టేజ్ పైనే కన్నీటి పర్యంతమయ్యారు.ముందుంది గ్లోబల్ టూర్ఈ కన్సర్ట్ కేవలం ప్రారంభం మాత్రమే! ప్రపంచవ్యాప్తంగా అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లో సుమారు 82 ప్రదర్శనలతో కూడిన భారీ గ్లోబల్ టూర్ కు బీటీఎస్ సిద్ధమైంది. కే-పాప్ చరిత్రలో ఇదొక ‘రెండవ స్వర్ణయుగం’ అని సాంస్కృతిక విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కే-పాప్ క్రేజ్ను ఈ కంబ్యాక్ మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయమని అంటున్నారు.ఇది కూడా చదవండి: ఐదు వేల ఏళ్ల ఫ్యాషన్.. అప్పటికీ, ఇప్పటికీ.. -
ఇరాన్కు ట్రంప్ 48 గంటల డెడ్లైన్.. లేకపోతే ?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు భారీ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే 48 గంటల్లోగా హర్మూజ్ జలసంధిని తెరిచి వాణిజ్య రవాణాకు ఎటువంటి అవాంతరాయం కలగకుండా చూడాలన్నారు. లేకపోతే యుఎస్ఏ సంయుక్త రాష్ట్రాలు గతంలో ఎన్నడూ చూడని విధంగా దాడి చేస్తాయని తెలిపారు.పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమై నాలుగు వారాలు గడుస్తున్నా ఉద్రిక్తతలు ఇంకా చల్లారడం లేదు కాదు కదా మరింత పెరుగుతున్నాయి. నిన్న( శనివారం) ఇరాన్ తన ప్రాంతానికి 4వేల కిలోమీటర్ల దూరంలోని డిగో గార్సియా దీవిలోని అమెరికా స్థావరంపై దాడి చేసి అందరిని షాక్కు గురిచేసింది. దీంతో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి.తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. " 48 గంటల్లోగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోతే అమెరికా ఆ దేశంలోని అన్ని పవర్ ప్లాంట్లపై దాడికి తెగబడుతుంది. వాటిలో అతిపెద్దదానిపై మెుదటగా దాడి చేస్తుంది". అని తన ట్రూత్ పోస్టులో రాసుకొచ్చారు.అయితే నిన్న ట్రంప్ యుద్ధంపై భిన్నంగా స్పందించారు. అమెరికా యుద్ధం విషయంలో ఇదివరకే తన లక్షాలను చేరుకుందని కనుక సైనిక చర్యను తగ్గించే విషయంలో ఆలోచిస్తున్నామన్నారు. కాగా ఈ రోజు మరోసారి ఇరాన్కు హెచ్చరికలు జారీ చేశారు. -
భక్తిశ్రద్ధలతో రంజాన్
న్యూఢిల్లీ/దుబాయ్/భోపాల్/శ్రీనగర్: రంజాన్ పర్వదినాన్ని శనివారం దేశవ్యాప్తంగా ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈద్గాలు, మసీదుల ప్రాంగణాలు, స్టేడియంలు, బహిరంగ ప్రాంతాలు, విశాల మైదానాల్లో పెద్దసంఖ్యలో జనం ముస్లింలు ఒకేచోటకు చేరుకుని సామూహికంగా నమాజ్ చేశారు. శాంతి, సౌభ్రాతృత్వం, సోదరభావం మరింత వెల్లివిరియాలని కోరుకున్నారు. ముస్లిం సోదరుల ఆతీ్మయ ఆలింగనాలతో ఆ ప్రాంతాలన్నీ పర్వదిన శోభను సంతరించుకున్నాయి. పాత ఢిల్లీ మొదలు జమ్మూకశ్మీర్ దాకా చాలా ప్రాంతాల్లో ముస్లింలు తమ బంధువుల ఇళ్లకు వెళ్లి పరస్పరం పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోదీ మొదలు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, విపక్ష నేతల దాకా ముఖ్యనేతలంతా దేశవ్యాప్తంగా ముస్లింలకు ఈద్–ఉల్–ఫితర్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు నాయకులంతా తమ సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్ట్లు పెట్టారు. ఢిల్లీలోని ప్రఖ్యాత జామా మసీదుతోపాటు ఫతేపురీ మసీదు, సీలాంపూర్, ఓఖ్లా, నిజాముద్దీన్ మసీదుల్లో పెద్దసంఖ్యలో ముస్లింలు ప్రార్థనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పెద్దసంఖ్యలో ఢిల్లీ పోలీస్, పారా మిలటరీ బలగాలు శాంతియుతంగా పండుగ జరిగేలా చూసుకున్నాయి. జమ్మూకశ్మీర్లోనూ పండగను ముస్లింలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. శ్రీనగర్లో దాల్ సరస్సు సమీపంలో పురాతన హజ్రత్బల్ మసీదు ఆవరణలో భారీసంఖ్యలో ముస్లింలు ప్రార్థనలుచేశారు. అయితే వరసగా ఏడో ఏడాదీ శ్రీనగర్ ఓల్డ్ సిటీ జామామసీదులోకి ఈద్ ప్రార్థనలకు స్థానికులను స్థానికయంత్రాంగం అనుమతి ఇవ్వలేదు. లక్నోలోని అయి‹Ùబాగ్ ఈద్గాలో జరిగిన ప్రార్థనల్లో క్రైస్తవ, సిక్కు నేతలు సైతం పాల్గొనడం విశేషం. కోల్కతాలోని రెడ్రోడ్లో వార్షిక ‘ప్రార్థనా సమూహం’ కార్యక్రమంలో భారీసంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. ‘‘ఈద్–ఉల్–ఫితర్ వేళ అందరికీ శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి అంతటా మరింతగా సోదరభావం, కరుణ విస్తరించాలి. ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి. ఈద్ ముబారక్’’అని ప్రధాని మోదీ శనివారం తన ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్చేశారు. పలుచోట్ల యుద్ధవ్యతిరేక నిరసనలు రంజాన్ జరుపుకునే ఇరానియన్లపై బాంబుల వర్షం కురిపిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్లను తప్పుబడుతూ జమ్మూకశ్మీర్లోని బుద్గామ్, బందీపొరా, రాజస్తాన్లోని సిఖార్, అజీ్మర్, మధ్యప్రదేశ్లోని భోపాల్ తదితర ప్రాంతాల్లో షియా ముస్లింలు నల్ల బ్యాడ్జీలు, పాత దుస్తులు ధరించి నిరసన ర్యాలీలు చేపట్టారు. అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలు చేశారు. నిరసనగా కొన్ని మసీదులపై నల్లజెండాలను ఎగరేశారు. ఇరాన్ సుప్రీంనేత, షియా ముస్లింల కీలక నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీని చంపేసినందుకు సంతాపసూచికగా మధ్యప్రదేశ్లో కొన్ని చోట్ల షియా ముస్లింలు ఈద్కు దూరంగా ఉండిపోయారు. భోపాల్లోని ప్రసిద్ధ ఇమామ్బారాలో ఖమేనీ భారీ కటౌట్ను పెట్టారు. అయితే కొన్ని చోట్ల మాత్రం సున్నీ వర్గీయులు వేడుకలు జరుపుకోవడం గమనార్హం.టెహ్రాన్లో భారీ ప్రదర్శనలు, ప్రార్థనలు రంజాన్ను పురస్కరించుకుని ఇరాన్ రాజధాని టెహ్రాన్లో భారీ సంఖ్యలో జనం మసీదులు, బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలుచేశారు. యుద్ధం ముగిసిపోవాలని కోరుకున్నారు. ‘‘అయతొల్లా అలీ ఖమేనీ లేకుండా ఈద్ ప్రార్థనలు జరగడం నన్నెంతో కలిచివేస్తోంది. ఇటీవల మరణించిన జనరల్ అలీ మొహమ్మద్ నయీనీ కోసం సైతం ప్రార్థనలుచేశాం’’ అని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్(ఐఆర్జీసీ) అధికార ప్రతినిధి చెప్పారు. అమెరికా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించారు. -
అమెరికా మాపై దాడిచేస్తే మేం భారత్పై బాంబులేస్తాం
న్యూఢిల్లీ: కరడుగట్టిన ఛాందసవాదం, వితండవాదానికి పాకిస్తాన్ చిరునామా అని ఆ దేశ మాజీ దౌత్యవేత్త అబ్దుల్ బాసిత్ మారోమారు నిరూపించారు. భారత్ మీద తమ అంతులేని విద్వేషాన్ని తన వాచాలత్వం ద్వారా బాసిత్ మరోమారు రుజువుచేసుకున్నారు. పశ్చిమాసియా యుద్ధం దక్షిణాసియాకు విస్తరించి అమెరికాగనక పాకిస్తాన్పై దాడి చేస్తే ప్రతిగా అమెరికాపై దాడిచేయాల్సిందిపోయి భారత్పై బాంబులేస్తామని బాసిత్ అత్యంత నిర్లక్ష్యంగా మాట్లాడారు. దీంతో పాకిస్తాన్ దౌత్యవర్గాల్లోనూ జిహాదీవాదం ఒంటబట్టించుకున్న వితండవాదులకు కొదవలేదని భారత్ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. సీఎన్ఎన్–న్యూస్18తో జరిగిన ఒక చర్చావేదికలో బాసిత్ మాట్లాడారు. ‘‘యుద్ధంలో ఇరాన్పై ఇజ్రాయెల్ పైచేయి సాధిస్తే ఆ తర్వాత సమీపంలో ఉన్న పాకిస్తానే ఇజ్రాయెల్కు తదుపరి లక్ష్యంకావొచ్చు. ఇజ్రాయెల్ చెప్పుడుమాటలు వినే అమెరికాకు అప్పుడు పాకిస్తాన్ అణుకార్యక్రమాలు రుచించకపోవచ్చు. అప్పుడు పాకిస్తాన్పై అమెరికా దాడులు చేయొచ్చు. ఇలా జరగడానికి అవకాశం లేదు. కానీ ఒకవేళ దాడి చేస్తే ప్రతిదాడి చేసే సత్తా పాకిస్తాన్కు ఉంది. అయితే ప్రతిదాడి కోసం అమెరికా ప్రధాన భూభాగం లేదా గల్ఫ్ లేదా ఇజ్రాయెల్పై మేం దాడిచేయడం కష్టమవుతుంది. అవన్నీ మాకు సుదూరంగా ఉన్నాయి. సమీప లక్ష్యం మీదే మేం దాడిచేయగలం. అలాంటి సమీప లక్ష్యం ఒక్క భారత్ మాత్రమే. ఏమాత్రం ఆలస్యంచేయకుండా ముంబై, న్యూఢిల్లీలపై దాడులుచేస్తాం. తర్వాత ఏం జరుగుతుందనే దానితో మాకు సంబంధంలేదు. అప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం’’అని అన్నారు. ‘‘మాపై దాడులు జరుగుతున్నప్పుడు మాకు కనిపించే ఏకైక మార్గం ఇండియానే. భారత్లోని మెట్రోపాలిటన్ నగరాలపై దాడులు చేస్తాం’’అని అన్నారు. దీంతో భవిష్యత్లో అమెరికాతో సంబంధాలు చెడిపోతే దాని విపరిణామాలను భారతే ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నట్లు బాసిత్ మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శత్రుదేశం(అమెరికా)పై ఎదురుదాడి చేసే దమ్ములేక పొరుగుదేశంపై బాంబులేసే నిస్సహాయ పాకిస్తాన్ వైఖరి బాసిత్ మాటలతో బహిర్గతమైందని అంతర్జాతీయ రాజకీయవిశ్లేషకులు తప్పుబడుతున్నారు. ‘‘బాసిత్ వ్యాఖ్యలను తేలిగ్గా కొట్టేయడానికి వీల్లేదు. సైన్యం కనుసన్నల్లో నడిచే పాక్ ప్రభుత్వాల కుటిలనీతిలో నిర్లజ్జ నియమాలు ఎలా ఉంటాయో బాసిత్ మాటలు తేటతెల్లం చేస్తున్నాయి. యుద్ధం దక్షిణాసియాకు విస్తరిస్తే పాకిస్తాన్ పట్ల మనం ఇంకెంత అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని బాసిత్ మాటలు హెచ్చరిస్తున్నాయి’’అని భారత నిఘా వర్గాలు సూచించాయి. -
పండుగ రోజు పెను విషాదం.. ఆసుపత్రిపై దాడిలో 64 మంది మృతి
ఈద్ అల్-ఫితర్ రోజు సూడాన్లోని ఓ ఆసుపత్రిపై (ఈస్ట్ దార్ఫూర్లోని ఎడ్ దాయిన్) సైన్యం జరిపిన డ్రోన్ దాడిలో 64 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 89 మంది గాయపడ్డారు. మృతుల్లో 13 మంది పిల్లలు, ఏడుగురు మహిళలు (ముగ్గురు గర్భిణులు), 44 మంది పురుషులు ఉన్నారు.ఈ దాడిలో ఆసుపత్రి శస్త్రచికిత్స విభాగం పూర్తిగా నేలమట్టమైంది. అత్యవసర చికిత్స భవనం తీవ్రంగా దెబ్బతింది. ప్రసూతి ఆపరేషన్ థియేటర్ పైకప్పు ధ్వంసం కాగా.. ఆసుపత్రి తలుపులు, కిటికీలు పగిలిపోయాయి. దాడి తర్వాత ఆసుపత్రి మూసివేయడటంతో లక్షలాది మంది అత్యవసర వైద్య సేవలకు దూరమయ్యారు. ఇటీవలికాలంలో ఎడ్ దాయిన్ ఆసుపత్రిపై జరిగిన మూడో వైమానిక దాడి ఇది.కాగా, సూడాన్లో 2023 నుండి కొనసాగుతున్న అంతర్యుద్ధం 2026 నాటికి మరింత తీవ్రమైంది. సూడాన్ సైన్యం (SAF), రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య జరుగుతున్న ఈ ఘర్షణల్లో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ఆఫ్రికా ఖండంలోనే అత్యంత పెద్ద మానవ సంక్షోభాల్లో ఒకటిగా మారింది. -
విస్తరిస్తున్న యుద్ధ క్షేత్రం?
మూడు వారాలకు పైగా ప్రధానంగా పశ్చిమాసియాకే పరిమితమైన యుద్ధ రంగాన్ని మరింత విస్తరించేందుకు ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలు కలవరపరుస్తున్నాయి. తన భూభాగానికి ఏకంగా 4,000 కి.మీ. దూరంలో హిందూ మహాసముద్రంలో ఉన్న అమెరికా–బ్రిటన్ సంయుక్త స్థావరం డీగో గార్సియాపై దాడి రక్షణ నిపుణులనే నివ్వెరపరిచింది. తద్వారా అమెరికా సైనిక స్థావరాల్లో తనకు అందరానివంటూ ఏవీ లేవని ఇరాన్ చాటిచెప్పినట్టయింది. గార్షియా స్థావరంపైకి అది ప్రయోగించిన రెండు క్షిపణుల్లో ఒకటి విఫలం కాగా మరోదాన్ని ఎస్ఎం–3 ఇంటర్సెప్టర్తో కూల్చేసినట్టు అమెరికా చెబుతోంది. కాకపోతే ఇరాన్ క్షిపణుల రేంజ్, సామర్థ్యం అమెరికా ఇప్పటిదాకా భావిస్తున్న దానికంటే చాలా ఎక్కువేనని ఈ దాడితో రుజువైంది. ఇరాన్ క్షిపణుల రేంజ్ మహా అయితే 2,000 కి.మీ. మాత్రమేనని అమెరికా చెబుతూ వస్తోంది. ఇరాన్ కూడా వాటిని ఎన్నడూ ఖండించలేదు. కానీ ఆ దేశం చడీచప్పుడూ లేకుండా క్షిపణి సామర్థ్యాన్ని పెంచుకుంటూ వస్తోందనేందుకు తాజా దాడులు నిదర్శనమంటున్నారు. వ్యూహాత్మకంగా కీలకం హిందూ మహాసముద్రం నడి»ొడ్డున ఉన్న చాగోస్ ద్వీపసమూహంలో డీగో గార్సియా అంతర్భాగం. అక్కడి 60 దీవుల్లో ఇదే అతి పెద్దది. 1960ల్లో ఇక్కడి 2,000 పై చిలుకు మూలవాసులను బ్రిటన్ బలవంతంగా ఖాళీ చేయించింది. 1971 నుంచీ ఈ దీవి అమెరికాకు అతి కీలక సైనిక స్థావరంగా మారింది. అప్పట్లో వియత్నాం మొదలుకుని అనంతర కాలంలో ఇరాక్, అఫ్గానిస్తాన్పై అమెరికా సాగించిన యుద్ధాల్లో ఈ స్థావరమే కీలక పాత్ర పోషించింది. ప్రత్యర్థి దేశమైన చైనా కార్యకలాపాలపై నిశితమైన నిఘాకు కూడా అగ్ర రాజ్యానికి వీలు కలి్పస్తూ వస్తోంది. ప్రస్తుతం ఈ దీవిలో మోహరించిన 2,500 మంది సైనికుల్లో అత్యధికులు అమెరికన్లే. భారీ బాంబర్లు, నిఘా విమానాలతో పాటు కీలకమైన సైనిక మౌలిక సదుపాయాలన్నీ డీగో సొంతం. అణ్వస్త్ర సామర్థ్యంతో కూడిన బీ–2 స్పిరిట్ బాంబర్ యుద్ధ విమానాలను కూడా గతేడాది ఆ దీవిలో అమెరికా మోహరించింది. ఇరాన్ తాజా దాడుల నేపథ్యంలో అక్కడ అత్యాధునిక మిసైల్ డిఫెన్స్ వ్యవస్థలను మోహరించడం కూడా తప్పేలా లేదు. అదే జరిగితే అమెరికాకు ఇప్పటికే తడిసిమోపెడవుతున్న యుద్ధ వ్యయం మరింత పెరగడం ఖాయం. ఈ కోణం నుంచి చూస్తే ఇరాన్ దాడి ప్రాధాన్యం సంతరించుకుందన్నది రక్షణ రంగ నిపుణుల అభిప్రాయం. ‘‘శనివారం నాటి దాడి ద్వారా యుద్ధక్షేత్రాన్ని గల్ఫ్ నుంచి హిందూ మహాసముద్రానికి విస్తరించడంలో ఇరాన్ సఫలమైంది. అంతేకాదు, దక్షిణ యూరప్ దాకా ఏ లక్ష్యాన్నైనా ఛేదించగల బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యం తనకు సమకూరిందంటూ హెచ్చరిక సంకేతాలు పంపింది’’అని వారంటున్నారు. తాజా యుద్ధానికి సంబంధించి హిందూ మహాసముద్రంలో జరిగిన రెండో ఘటనగా ఇరాన్ క్షిపణి దాడులు నిలిచాయి. ఆ దేశ యుద్ధ నౌక ఐఆర్ఐఎస్ దేనాను శ్రీలంక తీర సమీపంలోని సముద్ర జలాల్లో జలాంతర్గామి దాడి ద్వారా అమెరికా ముంచేయడం తెలిసిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డీగో గార్సియా పైఇరాన్ దాడులు!
దుబాయ్/వాషింగ్టన్/మాస్కో: పశ్చిమాసియాలో యుద్ధ తీవ్రత ఏ మాత్రమూ తగ్గడం లేదు. ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ యుద్ధం శనివారంతో నాలుగో వారంలోకి ప్రవేశించింది. రోజంతా ఇరు వర్గాలూ తీవ్రస్థాయిలో పరస్పర దాడులకు పాల్పడ్డాయి. హిందూ మహాసముద్రంలో మారుమూలన ఉన్న డీగో గార్సియా దీవిలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ అనూహ్యంగా దాడులకు దిగింది. వాటిపైకి రెండు క్షిపణులను ప్రయోగించి అగ్ర రాజ్యానికి ఒక్కసారిగా షాకిచి్చంది! ఒక క్షిపణి మార్గమధ్యంలోనే కుప్పకూలగా మరోదాన్ని ఎస్ఎం–3 ఇంటర్సెప్టర్తో అడ్డుకున్నట్టు అమెరికా పేర్కొంది. తమ క్షిపణుల గరిష్ట సామర్థ్యం 2,000 కి.మీ. మాత్రమేనని ఇరాన్ ఇప్పటిదాకా చెబుతూ రావడం తెలిసిందే. అలాంటిది తన భూభాగానికి ఏకంగా 4,000 కి.మీ. దూరంలో ఉన్న డీగో దీవిపైకి క్షిపణులు ప్రయోగించగలగడం తీవ్ర కలకలం రేపింది! డీగో గార్సియా అమెరికా, బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరం. యూఎస్ బాంబర్ యుద్ధ విమానాలు ఆ దీవిని వాడుకునేందుకు బ్రిటన్ అంగీకరించిన మర్నాడే దానిపై ఇరాన్ దాడికి ప్రయతి్నంచడం విశేషం. మరోవైపు ఇరాన్లోని ప్రధాన అణు శుద్ధి కేంద్రమైన నతాంజ్పై ఇజ్రాయెల్ మరోసారి భారీగా క్షిపణి, బాంబుల వర్షం కురిపించింది. అక్కడి నిర్మాణాలను భారీగా నష్టపరిచినట్టు ప్రకటించింది. వచ్చేవారం ఇరాన్పై దాడుల తీవ్రత మరింత పెరగడం ఖాయమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ప్రకటించారు. అమెరికాతో కలిసి ఇరాన్పై మరింతగా విరుచుకుపడతామని హెచ్చరించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అందుకు విరుద్ధంగా స్పందించారు. ‘‘ఇరాన్పై దాడుల ద్వారా ఆశించిన లక్ష్యాలన్నింటినీ దాదాపుగా చేరుకున్నాం. ఆ దేశ వైమానిక, నావిక, క్షిపణి వ్యవస్థలన్నింటినీ నేలమట్టం చేసేశాం. కనుక దానిపై సైనిక చర్య తీవ్రతను క్రమంగా తగ్గించే యోచన ఉంది’’అని చెప్పుకొచ్చారు. కాకపోతే కాల్పుల విరమణకు మాత్రం అమెరికా సిద్ధంగా లేదంటూ మెలిక పెట్టారు! ఈ మేరకు ట్రూత్ సోషల్లో ట్రంప్ తాజాగా పోస్టులు పెట్టారు. అయితే యుద్ధానికి పూర్తిస్థాయిలో, శాశ్వతంగా ఫుల్స్టాప్ పెట్టడం మినహా మరే చర్యలూ ఆమోదయోగ్యం కాబోవంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కుండబద్దలు కొట్టారు. టెహ్రాన్ ఉక్కిరిబిక్కిరి శనివారం ఇజ్రాయెల్ శర పరంపరగా చేసిన దాడులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ అల్లాడిపోయింది. నగరంలో పలు ప్రాంతాల్లో భారీగా మంటలు, పొగ కని్పంచాయి. దేశవ్యాప్తంగా పలు ఇతర నగరాలపైనా భారీ స్థాయిలో దాడులు కొనసాగాయి. నతాంజ్ అణు కేంద్రంపై తాజా దాడుల తర్వాత రేడియేషన్ లీకేజీ నమోదు కాలేదని ఇరాన్కు చెందిన మిజాన్ వార్తా సంస్థ పేర్కొంది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచీ నతాంజ్పై ఇజ్రాయెల్, అమెరికా ఇప్పటికే పలుమార్లు దాడులు జరిపాయి. మరోవైపు లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై కూడా ఇజ్రాయెల్ దాడులు తీవ్రస్థాయిలో కొనసాగాయి. రాజధాని బీరూట్లో పలు ప్రాంతాలు పేలుళ్లతో దద్దరిల్లాయి. ఇరాన్లో దాడుల మధ్యే ప్రజలు ఈదుల్ ఫితర్ జరుపుకున్నారు. ఇరాన్ ముమ్మర దాడులు ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ ముమ్మరంగా ప్రతి దాడులకు దిగింది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని మౌలిక సదుపాయాలు, చమురు వ్యవస్థలే లక్ష్యంగా ఇరాన్ వందలాదిగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. దాంతో ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, జెరూసలేంతో పాటు పలు నగరాల్లో భారీగా జనం బంకర్లకేసి పరుగులు తీశారు. క్షిపణి శకలాలు పడి టెల్ అవీవ్లో ఒక కిండర్గార్టెన్ స్కూలు ధ్వంసమైంది. అయితే ఎవరూ గాయపడలేదు. తమ తూర్పు ప్రాంతంలోని చమురు క్షేత్రాలపైకి దూసుకొచ్చిన 20కి పైగా డ్రోన్లను అడ్డుకున్నట్టు సౌదీ అరేబియా ప్రకటించింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో నిఘా విభాగం ప్రధాన కార్యాలయం డ్రోన్ దాడిలో దెబ్బతింది. ఈ ఘటనలో ఒక అధికారి కూడా మరణించినట్టు ఇరాక్ ధ్రువీకరించింది. డీగో దీవిపై ఇరాన్ దాడి యత్నాన్ని బ్రిటన్ తీవ్రంగా ఖండించింది. అది అత్యంత నిర్లక్ష్యపూరిత చర్య అంటూ నిరసించింది. వాణిజ్య నౌకలపై, గల్ఫ్లోని చమురు వ్యవస్థలపై ఇరాన్ దాడులను యూఏఈ, బహ్రెయిన్, బ్రిటన్, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, ఆ్రస్టేలియాతో సహా 22 దేశాలు తీవ్రంగా ఖండించాయి. వీటికి తక్షణం తెర దించడమే గాక హార్మూజ్ జలసంధిని వెంటనే తెరవాలని సంయుక్త ప్రకటనలో కోరాయి. నతాంజ్ అణు కేంద్రంపై దాడులను రష్యా తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమంటూ మండిపడింది. ఖర్గ్లో నౌకపై ఇజ్రాయెల్ దాడి అమెరికా తర్వాత ఇజ్రాయెల్ కూడా ఇరాన్కు ఆయువుపట్టు వంటి ఖర్గ్ దీవిపై గురి పెట్టింది. శనివారం ఇజ్రాయెల్ సైన్యం ప్రయోగించిన క్షిపణి ఖర్గ్ దీవిలో ఒక నౌకను తాకింది. అయితే దాడి సమయంలో సదరు నౌక ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు దక్షిణ ఇరాన్లోని బుషెహర్ విమానాశ్రయంలో ప్రయాణికుల టరి్మనల్ భవనం కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో భారీగా దెబ్బతింది. ఖర్గ్పై దాడులకు ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించక తప్పదని ఇరాన్ హెచ్చరించింది.ఇజ్రాయెల్పైకి అది ప్రయోగించిన ఒక క్షిపణి జెరూసలేంలోని చారిత్రక అల్ అక్సా మసీదుకు అతి సమీపంలో పడింది.డీగోపై దాడికి స్పేస్ టెక్నాలజీ దన్ను! తమ క్షిపణుల గరిష్ట రేంజ్ 2,000 కి.మీ. మాత్రమేనని ఇప్పటిదాకా చెబుతూ వచ్చిన ఇరాన్, తాజాగా అందుకు రెట్టింపు దూరంలో ఉన్న డీగో దీవిపై దాడి చేయడం తీవ్ర కలకలానికే దారితీసింది. ఇందుకు వీలుగా తమ క్షిపణుల రేంజ్ను పెంచుకునేందుకు సీమోర్గ్ స్పేస్ రాకెట్ టెక్నాలజీని ఇరాన్ వాడుకున్నట్టు అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ కథనం పేర్కొంది. కాకపోతే ఆశించిన స్థాయిలో కచ్చితత్వాన్ని సాధించడంలో మాత్రం ఇరాన్ విఫలమైందని అభిప్రాయపడింది. -
గాజాలో కన్నీటి శోకాల మధ్య 'మదర్స్ డే'
మధ్యప్రాచ్యంలో చాలా ప్రాంతాలు మదర్స్ డేను (మార్చి 21) ఘనంగా జరుపుకుంటున్న వేళ, గాజాలో (పాలస్తీనా) మాత్రం తల్లులు తమ కోల్పోయిన పిల్లలను గుర్తు చేసుకుంటూ శోకసంద్రంలో మునిగిపోయారు. పిల్లలు తమ తల్లులు లేని మదర్స్ డేను ఎదుర్కొన్నారు. గాజాలో మదర్స్ డే తల్లులు, పిల్లలకు శోకదినంగా మారింది. సమాధుల వద్ద తల్లులు తమ పిల్లల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ గడిపిన వైనం ప్రపంచం మొత్తాన్ని కంటితడి పెట్టిస్తుంది. యుద్ధం (ఇజ్రాయెల్తో) కారణంగా గాజా మహిళలు, పిల్లలు ఎదుర్కొంటున్న బాధ అంతర్జాతీయ సమాజానికి గంభీరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. పిల్లలను కోల్పోయిన తల్లుల ఆక్రందనలు ప్రపంచం నలుమూలలకు వినపడుతూ ఉన్నాయి.శవాలు కూడా అప్పగించలేదు..!గాజా సిటీలోని ఒక టెంట్లో కూర్చున్న ఎమ్ రామి దావ్వాస్ అనే మహిళ తన ముగ్గురు కుమారులను ఇజ్రాయెల్ దాడుల్లో కోల్పోయిన జ్ఞాపకాలను పంచుకుంది. వారిలో ఇద్దరి శరీరాలను ఇప్పటికీ తమకు అప్పగించలేదని వాపోయింది. మదర్స్ డే రోజున నా కుమారులు నాకు పూలు, బహుమతులు తెచ్చేవారు. వారు నా జీవితానికి వెలుగులు అనుకుంటూ ఆమె కన్నీటిపర్యంతమయ్యింది.వెక్కివెక్కి ఏడ్చింది..!14 ఏళ్ల మారమ్ తన తల్లిని ఇజ్రాయెల్ వైమానిక దాడిలో కోల్పోయింది. నాకు డబ్బు లేకపోయినా, తల్లికి చిన్న బహుమతి కొనేదాన్ని అని గుర్తు చేసుకుంటూ వెక్కివెక్కి ఏడ్చింది.64,000 మంది పిల్లల మృతిUNICEF అంచనాల ప్రకారం, 2023 అక్టోబర్ నుండి గాజాలో 64,000 మంది పిల్లలు ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారు. Amnesty International నివేదిక ప్రకారం, ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో మహిళలు, పిల్లలే అధికం. యుద్దం కారణంగా గాజాలో ప్రసూతి, మాతృ, శిశు ఆరోగ్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.సీస్ ఫైర్ తర్వాత కూడా దాడులుగతేడాది అక్టోబర్లో ఇజ్రాయెల్ సీస్ ఫైర్ ప్రకటించింది. అయినా దాడులు కొనసాగిస్తుంది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా పాలస్తీనా వ్యాప్తంగా ఇప్పటివరకు 72,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. -
అమెరికా తర్వాత మనమే..
పెట్టుబడి మోసాలు, డిజిటల్ అరెస్ట్, నకిలీ జాబ్ ఆఫర్స్.. తీరు ఏదైనా సైబర్ మోసాలు ఇప్పుడు నిత్యకృత్యం అయ్యాయి. ఇంటర్నెట్ వినియోగం అధికం అవుతున్న కొద్దీ నేరాల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాలకు అత్యధికంగా గురవుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచిందంటే ముప్పు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సైబర్ నేరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సైబర్ నేరగాళ్ల లక్ష్యంగా ఉన్న దేశాల్లో అమెరికా తర్వాత భారత్ నిలిచింది. భారత్లో ఆంగ్లం మాట్లాడే డిజిటల్ వినియోగదారులు అధికంగా ఉండటం, ఆన్లైన్ ఆర్థిక లావాదేవీలు వేగంగా విస్తరిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణమని అమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం మెటా పేర్కొంది. ప్రస్తుతం ఈ ముఠాలు ఒక ప్రొఫెషనల్ వ్యాపార సంస్థల తరహాలో అత్యంత వ్యవస్థీకృతమై పనిచేస్తున్నాయని తెలిపింది.వీరు తమ లక్ష్యిత వ్యక్తులను గుర్తించడానికి, భారీ స్థాయిలో మోసాలకు పాల్పడటానికి సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్ఫామ్స్, ఇతర డిజిటల్ సాధనాలను ఉపయోగిస్తున్నారని 2026 ప్రథమార్థానికి సంబంధించిన అడ్వర్సరియల్ థ్రెట్ రిపోర్ట్లో వెల్లడించింది. – సాక్షి, స్పెషల్ డెస్క్కోట్లాది ఖాతాలకు చెక్.. కంపెనీ విధానాలను ఉల్లంఘించిన, అలాగే మోసాలు, మోసపూరిత పద్ధతులు అవలంబించిన వ్యక్తులు, ప్రమాదకరమైన సంస్థలకు చెందిన 15.9 కోట్ల పైచిలుకు అడ్వరై్టజింగ్ ఖాతాలను, 1.09 కోట్ల కంటే ఎక్కువ ఫేస్బుక్, ఇన్స్టా్రగామ్ ఖాతాలను, 6,00,000 ఫేస్బుక్ పేజీలను 2025లో తొలగించినట్టు మెటా ప్రకటించింది. గత ఏడాది మోసపూరిత అడ్వరై్టజింగ్ ఖాతాల్లో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రాకముందే 92% తొలగించినట్టు తెలిపింది. కొత్త తరహా మోసాలు.. ప్రజల బలహీనమైన పరిస్థితులను, మానసిక ఆందోళనను ఆసరాగా చేసుకుని కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని మెటా తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి తక్కువ ధరలో అద్దె ఇళ్ల కోసం వెతికే వారిని లక్ష్యంగా చేసుకుని నకిలీ అద్దె ఇళ్ల ప్రకటనలను పోస్ట్ చేసే నెట్వర్క్లను పరిశోధకులు కనుగొన్నారు. మరో కలవరపరిచే ధోరణి ఏమంటే నకిలీ అంత్యక్రియల లైవ్స్ట్రీమ్ మోసాలు. ఇందులో అంత్యక్రియల సేవా నిర్వాహకులుగా నటిస్తూ ఇటీవల మరణించిన వారి కుటుంబ సభ్యులను సైబర్ నేరగాళ్లు సంప్రదిస్తారు. లేని స్మారక సేవలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని చెప్పి అందుకు డబ్బులు వసూలు చేస్తున్నారని మెటా తెలిపింది.సులభంగా నేరాలు.. భారత్లో సైబర్ నేరాలకు సంబంధించిన ఆర్థిక నష్టాలు భారీగా పెరిగాయి. 2024లోనే అంచనా వేసిన నష్టాలు రూ.22 వేల కోట్లు దాటాయి. ఇది సైబర్ దాడుల తీవ్రతను నొక్కిచెబుతోంది. ప్రస్తుతం అనేక ఫిషింగ్ మోసాలు ఏఐ ద్వారా రూపొందించిన సందేశాలతో జరుగుతున్నాయి. దీనివల్ల వాటిని గుర్తించడం మరింత కష్టతరంగా మారుతోంది. జెనరేటివ్ ఏఐ వల్ల మోసగాళ్లకు నేరం చేయడం సులభతరమైంది.ఏఐ ఆధారిత యాప్స్తో.. వాస్తవికమైనవిగా భ్రమించేలా సందేశాలను, నకిలీ ప్రొఫైల్స్ను, అత్యంత క్లిష్టమైన ఫిషింగ్ వెబ్సైట్స్ను సృష్టించడానికి నేరగాళ్లు ఏఐని ఉపయోగిస్తున్నారు. డీప్ఫేక్ సాంకేతికత అసలైన కంటెంట్కు, మార్చిన కంటెంట్కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కనుగొనడం మరింత క్లిష్టతరం చేసింది. అశ్లీల చిత్రాలను రూపొందించే ఏఐ ఆధారిత యాప్స్ వెల్లువెత్తడం కూడా ఒక పెద్ద ముప్పుగా మారింది. ఈ సాధనాలతో వ్యక్తుల సమ్మతి లేకుండా నకిలీ నగ్న చిత్రాలను సృష్టిస్తున్నారు. వీటి ద్వారా వ్యక్తుల గోప్యతకు, వ్యక్తిగత భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగి స్తున్నారు. వీటిని బహిర్గతం చేస్తామంటూ బెదిరించి వేధింపులకు, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇటువంటి యాప్స్ను అరికట్టడానికి, వీటిని ప్రచారం చేసే లక్షలాది ప్రకటనలను తొలగించామని, ఆ సేవలను ప్రోత్స హించే అనేక ఖాతాలు, నెట్వర్క్లపై కఠిన చర్యలు తీసుకున్నామని మెటా నివేదించింది.ఆగ్నేయాసియా నుంచి.. భారతీయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్న అనేక నెట్వర్క్లు ఆగ్నేయాసియాలోని మయన్మార్, కంబోడియా, లావోస్ వంటి ప్రాంతాల్లో వ్యవస్థీకృత స్కామ్ కేంద్రాల నుంచి పనిచేస్తున్నాయి. మోసగాళ్ల ముఠాలు ఒకే చోట స్థిరంగా ఉండటం లేదు. వీరు నిరంతరం తమ ప్రాంతాలను మారుస్తూనే మోసపూరిత విధానాలను మరింత మెరుగుపరుస్తున్నారని మెటా వెల్లడించింది. -
అత్యంత భారీ వరదలు.. హవాయి అతలాకుతలం
అమెరికా రాష్ట్రం హవాయి గత రెండు దశాబ్దాల్లో అత్యంత భారీ వరదలను ఎదుర్కొంటోంది. వరదల కారణంగా ఈ ప్రాంతం అతలాకుతలమైంది. వేలాది మంది ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఓహావు దీవిలోని ఓ ఆనకట్ట కూలిపోవచ్చని అధికారులు హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గాలులు గంటకు 100 మైళ్ల వేగంతో వీచాయి. ఈ వరదలను గడిచిన 20 ఏళ్లలో అత్యంత భారీ వరదలుగా అధికారులు పేర్కొన్నారు. అదృష్టవశాత్తు ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. విమానాశ్రయాలు, పాఠశాలలు, రహదారులు, ఆసుపత్రులు, ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. కోనాలో అనే తక్కువ ఒత్తిడి వాతావరణ వ్యవస్థ కారణంగా ఈ వరదలు సంభవించాయని గుర్తించారు. ఇది హవాయి దీవులపై తేమతో నిండిన గాలులను లాగి, భారీ వర్షాలు, ఆకస్మిక వరదలను తెచ్చింది. హోనలూలు అత్యవసర నిర్వహణ విభాగం మరిన్ని ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేసింది. మావి, మోలోకై, బిగ్ ఐలాండ్లకు కూడా వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. రహదారులు మూసివేయబడ్డాయి. ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. ఈ వరదల కారణంగా ఇప్పటికే బిలియన్ డాలర్ల మేర నష్టం సంభవించిదని అంచనా. 2023లో లహైనా అగ్నిప్రమాదాల తర్వాత, ఇప్పుడు వరదలతో హవాయి మరోసారి ప్రకృతి విపత్తు భారాన్ని మోస్తోంది. -
ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులు.. 24 గంటల్లో ఐదు సార్లు..!
ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులు ముమ్మరం చేసింది. తమ ప్రధాన అణు శుద్ధి కేంద్రం నతాంజ్పై దాడికి ప్రతీకారంగా డిమోనా నగరంపై వరుస క్షిపణి దాడులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలోని ఈ నగరంపై ఇరాన్ 24 గంటల్లో ఐదు సార్లు దాడులు జరిపింది. ఈ దాడుల్లో కనీసం 39 మంది గాయపడినట్లు తెలుస్తుంది. ఓ మూడు అంతస్తుల భవనం పూర్తిగా కూలిపోయినట్లు సమాచారం. వరుస దాడులతో డిమోనా నగరం ఉలిక్కిపడింది. ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. డిమోనా నగరం ఇజ్రాయెల్కు అత్యంత భద్రత కలిగిన ప్రాంతం. అయినా ఇరాన్ ఈ ప్రాంతంపై దాడులు చేయడం ఆందోళన కలిగిస్తుంది. డిమోనాకు ఇజ్రాయెల్ అణు సౌకర్యం ఉన్న ప్రదేశంగా గుర్తింపు ఉంది. దీంతో అమెరికా సైతం ఈ దాడుల తర్వాత హడలెత్తిపోతుంది.కొద్ది గంటల ముందే ఇరాన్ హిందూ మహా సముద్రంలోని యూఎస్-యూకే సైనిక స్థావరం డిగో గార్సియాను టార్గెట్ చేసింది. రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ ప్రయోగించిన ఈ క్షిపణులు 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను రీచ్ కావడంతో శత్రువులు బెంబేలెత్తిపోతున్నారు. -
వారిని రంగంలోకి దించుతా.. ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
ఇవాళ జరిగిన కాంగ్రెస్ (పార్లమెంట్) సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్ధి పార్టీ (డెమోక్రాట్లు) సభ్యులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. విమానాశ్రయ భద్రతకు అవసరమైన నిధులను వెంటనే ఆమోదించకపోతే ICE (Immigration and Customs Enforcement) సిబ్బందిని దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో నియమిస్తానని హెచ్చరించారు. ICE ఏజెంట్లు గతంలో ఎన్నడూ చూడని విధంగా భద్రతా తనిఖీలు చేపట్టి, అక్రమ వలసదారుల అరెస్టు చేస్తారని అన్నారు. ముఖ్యంగా సోమాలియా వలసదారులను లక్ష్యంగా చేసుకుంటారని తెలిపారు. వారు మిన్నెసోటా రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపిస్తూ, స్థానిక డెమోక్రాట్ నాయకులపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఇల్హాన్ ఒమర్ అనే మహిళా సభ్యురాలిని అవినీతిపరురాలిగా ఆరోపించారు.ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అమెరికా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. సాధారణంగా విమానాశ్రయ భద్రత Transportation Security Administration (TSA) పరిధిలో ఉంటుంది. అయితే ICE ఏజెంట్లను అక్కడికి పంపడం అనేది అసాధారణ చర్య. ICE ఏజెంట్లు ఇమిగ్రేషన్ అమలు, సరిహద్దు భద్రత, అక్రమ వలసదారుల నియంత్రణ వంటి పనుల్లో ఉంటారు. TSA స్థానంలో ICE ఏజెంట్లు భద్రతా తనిఖీలు చేపడితే ప్రయాణికుల అనుభవం పూర్తిగా మారవచ్చు.కాగా, కాంగ్రెస్లో విమానాశ్రయ భద్రతా నిధులపై డెమోక్రాట్లు, రిపబ్లికన్ల (ట్రంప్ పార్టీ) మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ట్రంప్ తాజా హెచ్చరికను డెమోక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. -
లష్కర్-ఎ-తయిబా కీలక ఉగ్రవాది దారుణ హత్య
పాకిస్తాన్లోని లష్కర్-ఎ-తయిబా (LeT) ప్రధాన కార్యాలయం వద్ద దారుణ హత్య జరిగింది. భారత్లో అనేక ఉగ్రదాడుల్లో నేరుగా ప్రమేయం ఉన్న LeT మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మొహమ్మద్ బిలాల్ అరీఫ్ సలఫీని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తొలుత కాల్పులు జరిపి, ఆతర్వాత కత్తులతో పొడిచి హతమార్చారు. సలఫీ.. మసీదులో నమాజ్ పూర్తి చేసుకొని బయటికి రాగానే దుండగులు అటాక్ చేశారు.సలఫీ LeTలో కీలక నేత అని, భారత్లో అనేక దాడుల రూపకల్పనలో భాగస్వామిగా ఉన్నాడని భారత భద్రతా సంస్థలు గుర్తించాయి. ఈ హత్య LeTలో అంతర్గత విభేదాలను సూచిస్తుంది. కాగా, లష్కర్-ఎ-తయిబా పాకిస్తాన్లో స్థాపించబడిన ఉగ్రవాద సంస్థ. ఈ ఉగ్రమూక భారత్లో అనేక దాడులకు పాల్పడింది. 2008 ముంబై దాడులు సహా అనేక రక్తపాతాల్లో LeT పాత్ర నిరూపితమైంది. -
మనీలాండరింగ్ కేసులో దోషిగా తేలిన భారత సంతతి జడ్జి
భారతీయ మూలాలున్న ఓ కౌంటీ జడ్జి అమెరికాలో మనీ లాండరింగ్ కేసులో దోషిగా తేలాడు. టెక్సాస్ రాష్ట్రంలోని ఫోర్ట్ బెండ్ కౌంటీ జడ్జి కేపీ జార్జ్ ప్రచార నిధులను వ్యక్తిగత ఖర్చులకు వాడినట్లు జ్యూరీ నిర్ధారించింది. దీంతో ఆయనపై మూడో స్థాయి ఫెలనీ కేసు నమోదైంది. టెక్సాస్ చట్టం ప్రకారం ఈ నేరానికి రెండు నుండి పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు 10,000 డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ప్రాసిక్యూటర్లు వెల్లడించిన వివరాల ప్రకారం.. జార్జ్ తన ప్రచార ఖాతా నుండి 46,000 డాలర్లకు పైగా మొత్తాన్ని వ్యక్తిగత ఖాతాలకు బదిలీ చేసి గృహ సంబంధిత చెల్లింపులు, వ్యక్తిగత అవసరాలకు వినియోగించారు. ఆయన తరఫు న్యాయవాదులు ఈ మొత్తాన్ని ప్రచారానికి ఇచ్చిన వ్యక్తిగత రుణాల రీయింబర్స్మెంట్గా చూపించే ప్రయత్నం చేశారు. అయితే, జ్యూరీ గంటల తరబడి జరిపిన విచారణ అనంతరం ఆయనను దోషిగా తేల్చింది. శిక్షను జూన్ 16న ఖరారు చేయనున్నట్లు ప్రకటించింది.తీర్పు వెలువడిన వెంటనే పోలీసులు జార్జ్ను కోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన బెయిల్పై విడుదలయ్యారు. అమెరికా చట్టాల పరంగా, జార్జ్ దోషిగా తేలిన వెంటనే పదవి నుంచి తొలగింపుకు అర్హుడు. అయితే అధికారికంగా శిక్ష విధించే వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. -
యుద్ధం ఆగాలంటే.. మోదీతో ఇరాన్ అధ్యక్షుడు ఏమన్నారంటే?
టెహ్రాన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పేజెష్కియన్ శనివారం ఫోనులో మాట్లాడుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మసూద్ పేజెష్కియన్ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణకు పరిష్కారం రావాలంటే ముందుగా అమెరికా, ఇజ్రాయెల్ తమ సైనిక చర్యలను నిలిపివేయాలని చెప్పారు. అలాగే ప్రాంత స్థిరత్వం కోసం బ్రిక్స్ మరింత ముఖ్యమైన పాత్ర పోషించాలని కోరారు.ఇద్దరు నేతల మధ్య టెలిఫోన్ సంభాషణలో ద్వైపాక్షిక సంబంధాలు, అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చ జరిగినట్టు పేజెష్కియన్ పేర్కొన్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న సైనిక దాడులను ఆయన ప్రస్తావించారు.ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా దాడులను నిలిపివేయడం, ప్రాంతీయ, గ్లోబల్ స్థిరత్వాన్ని కాపాడటం కోసం బ్రిక్స్ స్వతంత్ర పాత్ర పోషించాలని పేజెష్కియన్ కోరారు. భారతదేశం ప్రస్తుతం బ్రిక్స్కు అధ్యక్ష హోదాలో ఉన్న నేపథ్యంలో ఈ విషయాన్ని ఇరాన్ అధ్యక్షుడు ప్రస్తావనకు తెచ్చారు.పశ్చిమాసియా దేశాల మధ్య ప్రాంతీయ భద్రతా వ్యవస్థ ఏర్పాటును కూడా పేజెష్కియన్ ప్రతిపాదించారు. విదేశీ జోక్యం లేకుండా శాంతి, స్థిరత్వం సాధించాలని సూచించారు.ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రకటనలో బ్రిక్స్ గురించి ప్రస్తావించలేదు. అయితే, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గత వారం ఇరాన్తో జరిగిన సంభాషణల్లో బ్రిక్స్ అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలిపారు.ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీతో తాను ఇటీవల ఫోన్లో మాట్లాడినట్లు జైశంకర్ చెప్పారు. “ఇరాన్ విదేశాంగ మంత్రితో మరోసారి మాట్లాడాను. ద్వైపాక్షిక అంశాలు, బ్రిక్స్ సంబంధిత విషయాలపై చర్చించాం” అని తెలిపారు.హామీలు అవసరం: పేజెష్కియన్ ఘర్షణ తగ్గాలంటే ముందుగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు వెంటనే ఆగాలని, భవిష్యత్తులో దాడులు జరగవన్న హామీలు అవసరమని ఇరాన్ అధ్యక్షుడు పేజెష్కియన్ అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ చర్యలను ఆయన అమానుషం, అనైతికం అని పేర్కొన్నారు.ఇరాన్ యుద్ధం ప్రారంభించలేదని, అన్యాయంగా ఇజ్రాయెల్-అమెరికా దాడులు ప్రారంభించాయని మోదీకి పేజెష్కియన్ తెలిపారు. అణు చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ దాడులు జరిగాయని అన్నారు. ఈ దాడుల్లో ఉన్నత స్థాయి నాయకులు, సైనికాధికారులు, పౌరులు మరణించారని, పాఠశాల పిల్లలు కూడా బలయ్యారని తెలిపారు. ప్రజా మౌలిక వసతులపై కూడా దాడులు జరిగినట్టు చెప్పారు. మినాబ్ ప్రాంతంలో ఒక పాఠశాలపై దాడి జరిగి 168 మంది పిల్లలు మరణించారని పేర్కొన్నారు. ఈ దాడి సమీప దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల నుంచి జరిగినట్టు ఆరోపించారు. -
ఆమెతో చాలామంది లవ్లో పడ్డారు.. కానీ!
ఆమెతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ కలిసి నడిచారు.. రష్యా అధ్యక్షుడు కలిసి ఫోటోలు దిగారు. మెలానియా ట్రంప్ కలిశారు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా సమావేశమయ్యారు. చివరకు వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను కూడా బంధించారు. ఇలా రూపకల్పన చేసిన ఆ మహిళకు మిలియన్ సంఖ్యలో ఫాన్స్ వచ్చిపడ్డారు. కానీ అసలు వాస్తవం ఏంటంటే..కృత్రిమ మేధస్సుతో (AI) రూపొందించిన చిత్రాల్లో జెసికా ఫోస్టర్ అనే మహిళ ఒకటి,. ఆమె ఉనికిలో లేదు.. కానీ ఏఐ జనరేటెడ్ టెక్నాలజీ ఆమెను రూపొందించి ఇలా ప్రపంచానికి పరిచయం చేశారు. . ఆమెకు సోషల్ మీడియాలో ఒక ఫ్యాన్స్ పేజ్ కూడా క్రియేట్ చేయబడింది. అమెరికా ఆర్మీ సైనికురాలిగా చూపించారు. ఆమెను ‘అమెరికా ఫస్ట్’అజెండాకు సేవలందిస్తున్న అసాధారణ జీవితం గడుపుతున్న మహిళగా చిత్రీకరించారు. హోర్ముజ్ జలసంధిలో యుద్ధనౌకపై హీల్స్ వేసుకుని నిలబడి ఉండటం.. ప్రసంగాలు ఇవ్వడం, ఇతర మహిళా సైనికులతో పిల్లో ఫైట్స్ చేయడం, ప్రపంచంలోని ప్రసిద్ధులైన వ్యక్తులను కలవడం ఇలా అన్నీ ఆమెతో చిత్రీకరించారు.ఆమెకు యువత ఫిదా..!ఆమెను చూసిన నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆమె ఏఐ జనరేటెడ్ మహిళలా లేదు. దివి నుంచి దిగివచ్చిన ఒక అందమైన కన్యలా ఉంది. అందుకే యువత ఆమెకు ఫిదా అయ్యారు. లవ్ ఎమోజీలతో ఆమెకు మెస్సేజ్లు పెట్టారు. ఆమె ఎంత అందంగా" ఉందో అని వ్యాఖ్యానిస్తూ, ఆమె అమెరికా ఫస్ట్ సందేశాన్ని ప్రశంసించిన వారిలో చాలా మంది పురుషులు తమ ప్రొఫైల్ చిత్రాలలో ఆమెనే పెట్టుకున్నారట. ఆమె కొన్ని ఫోటోలకు 30,000 కంటే ఎక్కువ లైక్లు రాగా, ఆమె నిజమైన వ్యక్తి కాదనే విషయం తెలియక లేదా పట్టించుకోక, వినియోగదారులు కామెంట్లను హార్ట్-ఐస్ ఎమోజీలతో నింపేశారు. లక్షల్లో ఫ్యాన్ ఫోలోయింగ్, 30 వేలకు పైగా లైక్లు ఆమె ఫోటోలకు వచ్చాయని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ప్రస్తుతం ఆమె కోసం సృష్టించిన అకౌంట్లను డిలీట్ చేశారు. ఇది నిజంగా పిచ్చే..!ఇలా ఏఐ సృష్టికి మనుషులు మోసపోవడం నిజంగానే వారి పిచ్చికి అద్దం పడుతుందని మాజీ ఇల్లినాయిస్ రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు ఆడమ్ కిన్జింగర్ ట్వీట్ చేశారు. జెసికా పోస్టర్ అనేది అమెరికా ఆర్మీ సైనికురాలు కాదు.. ఏఐ చేత సృష్టించబడిన మహిళ. ప్రజలు కామెంట్లు, ఏమి చెబుతున్నారో చూస్తే ఏఐతో ఇలా మోసపోతారా అనిపిస్తోంది’ అని ఆయన కామెంట్ చేశారు. -
ఇరాన్కు అంత సామర్థ్యం ఉందా?.. అలా అయితే వణుకే!
ఇరాన్.. అమెరికా-ఇజ్రాయెల్లు సంయుక్తంగా చేస్తున్న యుద్ధాన్ని ఎదుర్కోంటుంది. ఈ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై దాదాపు మూడు వారాలు అయ్యింది. అయినా ఇప్పటికీ ఏ ఒక్కరూ కూడా వెనక్కి తగ్గలేదు. తొలుత ఇరాన్పై యుద్ధానికి దిగినప్పుడు ఆ దేశాన్ని సులువుగానే అదుపులోకి తేవొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకొని ఉంటారు. కానీ ఆ అంచనా తప్పని ట్రంప్కు ఈపాటికి అర్థమై ఉంటుంది. అందుకే హార్మూజ్ జలసంధి భద్రత విషయంలో పలు దేశాల సాయాన్ని కూడా కోరారు. అదే సమయంలో అమెరికా అత్యాధునిక ఎఫ్-35 విమానం.. ఇరాన్ దెబ్బకు కుప్పకూలిపోయింది. ఎటువంటి రాడార్ వ్యవస్థలకు చిక్కకుండా దాడి చేసే అత్యంత ఖరీదైన యుద్ధ విమానం కుప్పకూలిపోవడం ట్రంప్కు కచ్చితంగా మింగుడు పడని అంశం. దీన్ని కాసేపు పక్కకు పెడితే ఇప్పుడు ఇరాన్ మరో భయాన్ని కూడా పుట్టించిందనేది మరో వార్త. అమెరికా-యూకే స్థావరం వైపు ఇరాన్ రెండు మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది మరింత ఉద్రిక్తతలకు తావిస్తోంది. హిందూ మహాసముద్రంలోని డిగో గార్సియాలో ఉన్న అమెరికా-యూకే స్థావరం వైపు ఇరాన్ రెండు మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందట. ఇరాన్ నుండి డిగో గార్సియా సుమారు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉంది, అంటే దాడి చేసే పరిధి చాలా ఎక్కువ. అసలు ఇరాన్ గతంలో ప్రకటించిన దానికి ఇది రెట్టింపు సామర్థ్యం కల్గి ఉందని అర్థం. అంతకముందు ఇరాన్ తమ బాలిస్టిక్ క్షిపణుల రేంజ్ 2,000 కిలోమీటర్లు అని బహిరంగంగానే చెప్పింది. మరి ఇప్పుడు ఈ ట్విస్ట్ ఏమిటో అర్థం కావడం లేదు.ఇరాన్ గోప్యత పాటిస్తుందా?ఇరాన్ ఏమైనా అత్యాధునిక టెక్నాలజీతో క్షిపణులను తయారు చేసిందా.. లేక ఎక్కడ నుంచైనా కొనుగోలు చేసిందా అనేది చిక్కు ప్రశ్న. ఇరాన్ అప్రకటిత క్షిపణుల సామర్థ్యం అంత ఉంటే భవిష్యత్లో పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. నిజంగానే ఇరాన్ ఆ రేంజ్తో దాడికి దిగితే ప్రపంచానికి తెలియని సామర్థ్యం అనేది ఆ దేశం వద్ద ఉన్నాయని అర్థం చేసుకోవాలి. తన వాస్తవ దాడి పరిధిపై శత్రువులకు స్పష్టత లేకుండా చేయడం ద్వారా, ఇరాన్ పరోక్షంగా పైచేయి సాధించడానికి కూడా సహాయపడుతుంది. ఈ అస్పష్టత అమెరికా, యూకేల ప్రణాళికలను సైతం క్లిష్టతరం చేస్తుంది. ఇది ఇజ్రాయెల్కే కాదు.. గల్ఫ్ దేశాలకు కూడా భయం పుట్టించేది అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. డియాగో గార్సియా ఒక చిన్నస్థావరం కాదు.. ఇది అమెరికా ప్రపంచ శక్తి ప్రదర్శనకు ఒక అత్యంత విలువైన కేంద్రం. ఇది ఒక కీలకమైన లాజిస్టిక్స్. అమెరికా యుద్ధ ప్రణాళికకు కూడా ఇది వేదికగా పనిచేస్తుంది. ఇది అమెరికా భారీ బాంబర్లు, నిఘా విమానాలకు నిలయంగా చెబుతారు.మరి ఆ స్థావరాన్ని ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడం అనేది శత్రువు ఇంతకుముందు ఊహించిన దానికంటే ఇరాన్ క్షిపణుల పరిధి చాలా ఎక్కువ అని చూపే ఒక ముఖ్యమైన ముందడుగుగా ఇరాన్ వార్తా సంస్థ ఒకటి అభివర్ణించింది.ఇదీ చదవండి:ఇరాన్ ‘ఉండేలు దెబ్బ’! -
ఆయిల్పై అమెరికా అంచనా.. ఇరాన్ క్లారిటీ
అంతర్జాతీయ చమురు విఫణిలో నెలకొన్న అనిశ్చితిని తొలగించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు ఇరాన్ షాక్ ఇచ్చింది. తమ వద్ద అంతర్జాతీయ సరఫరాకు సరిపడా అదనపు ముడి చమురు నిల్వలు లేవని ఇరాన్ స్పష్టం చేసింది. ఆంక్షల సడలింపు ద్వారా ఇరాన్ నుండి పెద్ద ఎత్తున చమురు సరఫరా జరుగుతుందని, తద్వారా ధరలు తగ్గుతాయని అమెరికా చేసిన వ్యాఖ్యలను ఇరాన్ తోసిపుచ్చింది.అమెరికా ప్రకటన - ఇరాన్ వివరణమార్చి 20 నాటికి నౌకల్లో లోడ్ చేసిన ముడి చమురుపై అమెరికా ఇటీవల స్వల్పకాలిక ఆంక్షలను సడలించింది. ఏప్రిల్ 19 వరకు అమల్లో ఉండే ఈ మినహాయింపు ద్వారా సుమారు 140 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ చమురు మార్కెట్లోకి వస్తుందని, తద్వారా పెరుగుతున్న ధరలకు అడ్డుకట్ట వేయవచ్చని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఆశాభావం వ్యక్తం చేశారు.అయితే, ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ విడుదల చేసిన ప్రకటన ఈ అంచనాలను తలకిందులు చేసింది. "ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేయడానికి ఇరాన్ వద్ద అదనపు ముడి చమురు లేదా మిగులు నిల్వలు లేవు. అమెరికా ట్రెజరీ సెక్రటరీ వ్యాఖ్యలు కేవలం కొనుగోలుదారులలో భరోసా నింపడానికి, మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేయడానికి చేసిన ప్రయత్నంలా కనిపిస్తున్నాయి."మంటలు పుట్టిస్తున్న ముడి చమురు ధరలుపశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి గుండా సాగే రవాణాపై ఆందోళనల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 120 డాలర్ల మార్కును తాకింది. ఈ తరుణంలో ఇరాన్ నుండి అదనపు సరఫరా ఉండదని తెలియడంతో మార్కెట్ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
యుద్ధం వేళ ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం వేళ ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఈద్, నౌరూజ్ శుభాకాంక్షలు తెలిపారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్ చేయడం ఇది రెండో సారి. పశ్చిమాసియాలో పరిస్థితులపై చర్చించారు. పశ్చిమాసియాలో కీలక మౌలిక వసతులపై జరిగిన దాడులను ఖండించారు. అవి ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసి, ప్రపంచ సరఫరా గొలుసులకు ఆటంకాలు కలగజేస్తాయని అన్నారు. ఈద్ పశ్చిమ ఆసియాకు శాంతి, స్థిరత్వం, సమృద్ధి తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.మరోవైపు, ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, ప్రతిదాడులను మరింత తీవ్రం చేసుకుంటూ పోతున్నాయి. ఈ వారం ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తీవ్రత మరింతగా పెరుగుతుందని రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ సైనిక అధికారులతో సమీక్ష సమయంలో చెప్పారు.టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పత్రిక తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్ ఉగ్ర పాలనపై ముందుండి దాడులను కొనసాగించేందుకు ఇజ్రాయెల్ కట్టుబడి ఉందని కాట్జ్ తెలిపారు. ఇజ్రాయెల్ భద్రతకు, అలాగే అమెరికా ప్రయోజనాలకు పశ్చిమాసియాలో ఉన్న ప్రతి ముప్పును తొలగించే వరకు ఆగబోమని అన్నారు. యుద్ధ లక్ష్యాలన్నీ సాధించే వరకు తాము ఆగబోమని ఆయన పేర్కొన్నారు.ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ ఏ మాత్రం వెనక్కు తగ్గకపోతుండడంతో ఆందోళన రోజురోజుకీ పెరుగుతోంది. చమురు, గ్యాస్ నిక్షేలపై ఆయా దేశాలు దాడులు చేస్తుండడంతో చమురు ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో దాడులు ఆపాలని, చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని అనేక దేశాలు కోరుతున్నాయి. Spoke with President Dr. Masoud Pezeshkian and conveyed Eid and Nowruz greetings. We expressed hope that this festive season brings peace, stability and prosperity to West Asia.Condemned attacks on critical infrastructure in the region, which threaten regional stability and…— Narendra Modi (@narendramodi) March 21, 2026 -
హార్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన
టెహ్రాన్: హార్మూజ్ జలసంధి మీదుగా నౌకలను సురక్షితంగా వెళ్లనిస్తున్నామని ఇరాన్ మరోసారి తెలిపింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘హార్మూజ్ జలసంధి తెరిచే ఉంది. ఇరాన్తో ఆయా దేశాలు సంప్రదిస్తే సరిపోతుంది. మేము ఈ జలసంధిని మూసివేయలేదు. మా శత్రువుల నౌకలను మాత్రమే వెళ్లనివ్వడం లేదు. ఇతర దేశాల నౌకలు ఈ జలసంధి ద్వారా వెళ్లవచ్చు. సంప్రదింపులు జరిపితే వారి నౌకలను సురక్షితంగా వెళ్లనిస్తాం’ అని అబ్బాస్ అరాఘ్చీ తెలిపారు. కాగా, నాటో మిత్రదేశాలు, ఆసియా పసిఫిక్ ప్రాంత దేశాలు ఈ యుద్ధంలో చేరాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరుతున్నారు. శుక్రవారం ఆయన ట్రూత్ సోషల్లో ఈ మేరకు ఓ పోస్టు చేశారు.నాటో సభ్యదేశాలను పేపర్ టైగర్స్ అని పిలిచారు, అలాగే చమురు ధరలు పెరుగుతుండడం ఆయా దేశాలకు నచ్చడం లేదని విమర్శించారు. అయినప్పటికీ, హార్మూజ్ జలసంధిని తెరవడానికి ఏర్పాటు చేద్దామనుకుంటున్న కూటమిలో చేరడానికి ఆ దేశాలు ఆసక్తి చూపడం లేదని అన్నారు. ట్రంప్ దాదాపు ఏడు రోజుల క్రితం పలు దేశాల మద్దతు కోరారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో ఏడు దేశాల పేర్లను పేర్కొన్నారు. అప్పటి నుంచి ఒత్తిడి పెంచుతున్నారు.బాగ్దాద్లో డ్రోన్ దాడి ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని మంసూర్ ప్రాంతంపై డ్రోన్ దాడి జరిగింది, ఆ డ్రోన్లలో ఒకటి ఇరాక్ గూఢచారి భవనాన్ని లక్ష్యంగా చేసుకుందని ఇరాక్ తెలిపింది. ఆ భవనంలో ఇరాక్ భద్రతా సంస్థ పని చేస్తోందని చెప్పింది. అది ఇరాక్లో అమెరికా సలహాదారులతో కలిసి పని చేస్తోందని వివరించింది. -
పాకిస్తాన్ 30 విమానాలకు తప్పిన ప్రమాదం..
లాహోర్: పాకిస్తాన్ ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెనుప్రమాదం తప్పింది. ఇరాన్ వార్జోన్లోకి ప్రవేశించకుండా గత రెండు రోజుల్లో 30 విమానాలను సురక్షితంగా దారి మళ్లించినట్లు సంబంధిత అధికారులు శుక్రవారం వెల్లడించారు.కాగా, ఇవన్నీ ప్యాసింజర్ విమానాలే. ఒకవేళ వార్జోన్లోకి ప్రవేశించి ఉంటే వాటిపై దాడి జరిగే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. బుధవారం, గురువారం ప్రతికూల వాతావరణం కారణంగా పాక్కు చెందిన 30 ప్యాసింజర్ విమానాలు ఇరాన్ గగనతలంలోకి ప్రశించే పరిస్థితి ఏర్పడింది. లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు కరాచీలోని ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ వాటిని దారి మళ్లించారు. డేంజర్ జోన్లోకి వెళ్లకుండా తప్పించారు. ఈ విమానాలు సౌదీ అరేబియా, దుబాయ్తోపాటు ఇతర దేశాల నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. -
యుద్ధంపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు
మధ్య ప్రాచ్యంలో యుద్ధం ఉద్రిక్తమవుతున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్కు తమ దేశం అందిస్తున్న నిఘా సమాచారాన్ని ఆపేస్తామన్నారు. అయితే దానికి ప్రతిగా ఉక్రెయెన్కు అమెరికా అందిస్తున్న సహాయాన్ని నిలిపివేయాలని షరతు పెట్టారు. ఒక వేళ కీవ్కు మద్దతు ఉపసంహరించుకోకుంటే టెహ్రాన్కు రష్యా సహాయం కొనసాగుతుందన్నారు. అయితే ఇరాన్కు రష్యా మద్దతు ఇస్తుందని ఊహగానాల నేపథ్యంలో ఇదివరకే పుతిన్ వివరణ ఇచ్చారు. తమ మిత్ర దేశమైన ఇరాన్కు సంపూర్ణ మద్ధతు ఇస్తామని ప్రకటించారు. టెహ్రాన్కు మాస్కో అండగా ఉంటుందని ప్రకటించారు. ఇరాన్ నూతన సుప్రీంగా ఎన్నికైన ముజ్తాబా ఖమేనీ శుభాకాంక్షలు తెలిపారు. కాగా యుద్ధంలో రష్యా ఇరాన్కు సహకరిస్తుందని అమెరికా గతంలో ఆరోపించింది. ఈ నేపథ్యంలో పుతిన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ ప్రకటనపై అమెరికా ఏవిధంగా స్పందిస్తుందో వేచిచూడాలి. -
యుద్ధంపై వెనక్కి తగ్గిన ట్రంప్..?
పశ్చిమాసియాలో యుద్ధ తీవ్రత నానాటికీ తీవ్రతరమవుతున్న సంగతి తెలిసిందే. యుద్ధం మెుదలై 20 రోజులు దాటుతున్నా ఇరువర్గాలు శాంతించడం లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై యుద్ధం ఆపే విషయం ఆలోచిస్తున్నామన్నారు.అమెరికా, ఇజ్రాయెల్ చేసిన చర్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రెండు దేశాల దాడులను తిప్పికొడుతూ ఇరాన్ పెద్దఎత్తున ప్రతిదాడులు చేయడంతో చమురు సప్లై చైన్ దెబ్బతింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ కొరత ఏర్పడుతుంది. ఈ సంక్షోభ పరిస్థితులకు ట్రంప్ కారణమని ప్రపంచ దేశాలు ఆయనపై గుర్రుగా ఉన్నాయి. చమురు సంక్షోభాన్ని తెరదించడానికి IEA అత్యవసర చమురు నిల్వల విడుదలకు అనుమతిచ్చినా ప్రస్తుతం ఏర్పడ్డ చమురు కొరతకు అది ఏ విధంగానూ సరిపోదు. ఈ నేపథ్యంలో ట్రంప్ యుద్ధంపై కీలక ప్రకటన చేశారు.తన సోషల్ మీడియా పోస్ట్లో " ఇరాన్లో మేము అనుకున్న లక్ష్యాలు చేరుకోవడానికి చాలా దగ్గరవుతున్నాం. దీంతో మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక ప్రయత్నాలను ముగించే విషయాన్ని పరిశీలిస్తున్నాం" అని ట్రంప్ పోస్ట్ చేశారు.. అయితే ఇది వరకే పలు మార్లు ఇరాన్ రక్షణ వ్యవస్థ చాలా దెబ్బతిందని దాని పనైపోయిందని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి ఇలా వ్యాఖ్యానించారు.కాగా ఇరాన్ విషయంలో ట్రంప్ అంచనా పూర్తిగా విఫలమైంది. టెహ్రాన్ని చాలా సులువుగా ఓడించవచ్చు అని ట్రంప్ భావించారు. అయితే ఇరాన్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై విరుచుకవడుతుంది. హర్మూజ్ క్లోజ్ చేసి చమురు సప్లైని బ్రేక్ చేసింది. అంతేకాకుండా అమెరికా ఫైటర్ జెట్ F-35 పై అటాక్ చేసింది. అంతేకాకుండా ఖతార్ లోని ప్రపంచంలోని అతి పెద్దదైన ఎల్ఎన్జీ ప్లాంట్పై దాడి చేసింది. ఈ పరిస్థితులు చూస్తుంటే టెహ్రాన్ ఎక్కడా తగ్గే ఆలోచనలో ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ ఉద్రిక్తతల వేళ ట్రంప్ పోస్ట్ ఆసక్తిగా మారింది."We are getting very close to meeting our objectives as we consider winding down our great Military efforts in the Middle East with respect to the Terrorist Regime of Iran..." - President Donald J. Trump pic.twitter.com/YBG9l492Kf— The White House (@WhiteHouse) March 20, 2026 -
ఇరాన్ దూకుడు.. యూఎస్-యూకే సైనిక స్థావరంపై దాడి
టెహ్రాన్: ఇరాన్ యుద్ధం కొత్త వ్యూహాలతో యూ టర్న్ తీసుకుంటోంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ దూకుడు పెంచింది. తాజాగా ఇరాన్.. హిందూ మహాసముద్రంపైకి రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే,ఈ క్షిపణులను ఎప్పుడు ప్రయోగించారనే విషయం తెలియాల్సి ఉంది.వివరాల మేరకు.. ఇరాన్ హిందూ మహా సముద్రంలోని యూఎస్-యూకే సైనిక స్థావరం డిగో గార్సియా టార్గెట్ చేసింది. ఇందులో భాగంగా రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను తాకలేదని తెలుస్తోంది. అయితే, ఒకటి మాత్రం మార్గ మధ్యలోనే విఫలమైందని, మరొకదాన్ని తమ దేశం అడ్డుకుందని అమెరికా అధికారులను ఉటంకిస్తూ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ క్షిపణులను ఎప్పుడు ప్రయోగించారన్న దానిపై స్పష్టత లేదు. ఈ దాడులపై ఇరాన్ కూడా స్పందించకపోవడం గమనార్హం.ఇదిలా ఉండగా.. ఇరాన్తో యుద్ధం ముగించే విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై సైనిక చర్యను క్రమంగా తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అయితే, కాల్పుల విరమణకు మాత్రం తాను సిద్ధంగా లేనని పేర్కొన్నారు. అలాగే, క్షిపణి సామర్థ్యాలను, వైమానిక, నావికా వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఆ దేశం మరోసారి అణ్వాయుధాలను తయారుచేయకుండా అమెరికా చూసుకుంటుందన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే.. తాము తగినవిధంగా స్పందిస్తామని హెచ్చరించారు. ఇక, అమెరికా దాని మిత్ర దేశాలకు భద్రత కల్పించిందని ట్రంప్ అన్నారు. ‘ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ సహా పశ్చిమాసియాలోని మిత్ర దేశాలకు అత్యున్నత స్థాయిలో రక్షణ కల్పిస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు. -
ఇరాన్తో యుద్ధం.. భారీ ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ట్విస్ట్ ఇచ్చారు. హర్మూజ్ జలసంధి రక్షణ బాధ్యతను అమెరికా మోయాల్సిన అవసరం లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో యుద్ధం ఆపాలని అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడిని ట్రంప్ కొట్టిపారేశారు.వైట్హౌస్ నుంచి ఫ్లోరిడాలోని పామ్ బీచ్కు బయలుదేరే ముందు ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ..‘హార్మూజ్ జలసంధి రక్షణ బాధ్యతను అమెరికా మోయాల్సిన అవసరం లేదు. ఆ మార్గం ద్వారా ప్రయోజనం పొందే దేశాలు కొంతైనా చొరవ చూపాలి. యుద్ధం నేపథ్యంలో ఈ మార్గం ద్వారా లబ్ధి పొందుతున్న చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు రంగంలోకి దిగాలి. మాకు హార్ముజ్ జలసంధితో పనిలేదు లేదు. కానీ యూరప్, కొరియా, జపాన్, చైనా వంటి దేశాలకు ఇది చాలా అవసరం. చైనా తన ఇంధన అవసరాల్లో 90 శాతం, జపాన్ 95 శాతం ఈ మార్గం ద్వారానే లబ్ధి పొందుతున్నాయి. ఆ దేశాలే కొంచెం శ్రమించి, ఈ మార్గం రక్షణలో భాగం కావాలి’ అంటూ వ్యాఖ్యానించారు.#WATCH | On the US-Israel vs Iran conflict, US President Donald Trump says, "We can have dialogue, but I don't want to do a ceasefire. You don't do a ceasefire when you're literally obliterating the other side... we're not looking to do that."(Source: US Network Pool Via… pic.twitter.com/4Y5AUK4jG0— ANI (@ANI) March 20, 2026యుద్ధం ఆగదు.. మరోవైపు.. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా,ఇజ్రాయెల్ విజయం వైపు దూసుకుపోతున్నాయని ట్రంప్ తెలిపారు. ఇరాన్ సైనిక వ్యవస్థను అమెరికా ఇప్పటికే తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. ఇరాన్ వైమానిక వ్యవస్థలను ధ్వంసం చేశామని, సైనిక పరంగా ఆ దేశం పని అయిపోందని వ్యాఖ్యానించారు. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని సాధించకుండా చూడటమే తమ అంతిమ ధ్యేయమని చెప్పారు. అలాగే, యుద్ధం ఆపాలని అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడిని ట్రంప్ కొట్టిపారేశారు. తాము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ కాల్పుల విరమణ మాత్రం చేయబోం. శత్రువును పూర్తిగా తుడిచిపెడుతున్న సమయంలో యుద్ధం ఆపే ప్రసక్తే లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటో మిత్రదేశాలపై ట్రంప్ విమర్శలుఇరాన్ యుద్ధంలో చేరనందుకు నాటో మిత్రదేశాలపై ట్రంప్ విమర్శలు చేశారు. పిరికివాళ్లను గుర్తుపెట్టుకుంటామంటూ హెచ్చరించారు. హార్మూజ్ జలసంధిని తెరిపించేందుకు నాటో దేశాలు రాకపోవడంపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. తన 'ట్రూత్ సోషల్' ప్లాట్ఫారమ్లో ఆయన నాటోను "పేపర్ టైగర్" అని విమర్శించారు. అమెరికా సహాయం లేకుండా నాటో ఏమీ చేయలేదని, ఇరాన్ వంటి దేశాల ముప్పును అడ్డుకోవడంలో వారు పిరికితనం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. అంతకుముందు జలసంధి తెరిపించేందుకు నాటో దేశాలను ట్రంప్ సైనిక సహాయం కోరారు. అయితే, అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ను నాటో దేశాలు పట్టించుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇరాన్ క్షిపణ శక్తిపై భీకర దాడులు
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. -
ఇరాన్పై యుద్ధం.. వ్యూహం మారుస్తున్న అమెరికా!
ఇరాన్పై పరిమిత భూతల దాడుల దిశగా అమెరికా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వారం రోజులుగా ఈ దిశగా పలు సంకేతాలిస్తూ వస్తున్నారు. జపాన్ సమీపంలోని సముద్ర జలాల్లో ఉన్న విమానవాహక యుద్ధ నౌక యూఎస్ఎస్ ట్రిపోలీని అమెరికా యుద్ధ ప్రాతిపదికన గల్ఫ్కు తరలిస్తోంది. 31వ మరైన్ ఎక్స్పెడిషనరీ యూనిట్కు చెందిన 2,500 మంది సిబ్బంది అందులో ఉన్నారు.దీంతో ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా పోరు నిర్ణాయక దశకు చేరుతున్నట్టు కనిస్తోంది. ముఖ్యంగా ఇంధనపరంగా ఇరాన్కు గుండెకాయ వంటి ఖర్గ్ దీవిని స్వాధీనం చేసుకోవడం, హార్మూజ్ జలసంధిపై నియంత్రణ సాధించి నౌకల రవాణాను వీలైనంత త్వరగా పునరుద్ధరించడం భూతల దాడుల ముఖ్య లక్ష్యాలు కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం వాటా ఉన్న హార్మూజ్ను ఇరాన్ మూసేయడంతో అంతర్జాతీయగా కల్లోలం రేగుతున్న విషయం తెలిసిందే. అమెరికా దాడుల్లో ఇరాన్ నావికా దళం చాలావరకు బలహీనపడిపోయింది. కనుక తక్కువ రిసు్కతోనే హార్మూజ్ను అదీనంలోకి తీసుకోవచ్చన్నది ట్రంప్ ఆలోచనగా తెలుస్తోంది. దీంతోపాటు ఖర్గ్ దీవిని కూడా స్వాధీనం చేసుకుంటే ఇరాన్కు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఇరాన్ చమురు ఎగుమతుల్లో ఏకంగా 90 శాతం ఖర్గ్ నుంచే జరుగుతాయి.ఖర్గ్ను అధీనంలోకి తెచ్చుకుంటే హార్మూజ్ గుండా నౌకల రాకపోకలకు అంగీకరించేలా ఇరాన్ను ఒప్పించొచ్చన్నది పెంటగాన్ వ్యూహకర్తల భావన. అంతేగాక ఇరాన్కు ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతులకు చెక్ పెడితే దానికి యుద్ధాన్ని కొనసాగించలేని పరిస్థితి తలెత్తుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.భూతల దాడులకు దిగే పక్షంలో పనిలో పనిగా ఇరాన్ చేతుల్లో ఉన్న 450 కిలోల పై చిలుకు శుద్ధి చేసిన యురేనియం నిల్వలను కూడా ఎలాగైనా స్వా«దీనం చేసుకోవాలని అమెరికా తలపోస్తోంది. తద్వారా ఇరాన్ అణ్వస్త్ర కార్యకలాపాలకు శాశ్వతంగా తెర దించొచ్చని భావిస్తోంది. కానీ అదంత తేలిక కాదన్నది నిపుణుల అభిప్రాయం. ‘‘ఖర్గ్ దీవి ఇరాన్ ప్రధాన భూభాగానికి 25 కి.మీ. దూరంలో ఉన్నందున దానిపై దాడి, స్వాదీనం అంత కష్టం కాకపోవచ్చు. కానీ యురేనియం నిల్వల విషయం అలా కాదు. అవి ఇరాన్ ప్రధాన భూభాగంలోనే ఉండి ఉంటాయి’’ అని వారంటున్నారు. -
హార్వర్డ్ వర్సిటీపై ట్రంప్ సర్కార్ దావా
వాషింగ్టన్: అమెరికాలో ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కోర్టులో దావా వేసింది. వర్సిటీ క్యాంపస్లో యూదు వ్యతిరేక ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను అణచివేయడంలో హార్వర్డ్ యాజమాన్యం విఫలమైందంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. వర్సిటీ యాజమాన్యాన్ని కోర్టుకు లాగడం చర్చనీయాంశంగా మారింది. హార్వర్డ్కు ఇచ్చే నిధులను నిలిపివేయడం, ఇప్పటిదాకా ఇచి్చన సొమ్మును తిరిగి వసూలు చేసుకోవడం ట్రంప్ సర్కారు ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ మేరకు అమెరికా న్యాయ శాఖ శుక్రవారం మసాచుసెట్స్ ఫెడరల్ కోర్టులో లాసూట్ దాఖలు చేసింది. విద్యాసంస్థల ప్రాంగణాల్లో జాతి వ్యతిరేక కార్యక్రమాలను సహించే ప్రసక్తే లేదని దావాలో తేల్చిచెప్పింది. బాధ్యులపై చర్యలు తీసుకోకతప్పదని పేర్కొ ంది. పన్నుచెల్లింపుదారుల సొమ్మును హార్వర్డ్కు కట్టబెట్టామని పేర్కొంది. యూనివర్సిటీ నిర్వహణ కోసం బిలియన్ల డాలర్ల ధనం ఇచి్చనట్లు గుర్తుచేసింది. ఉద్రిక్తతలకు కారణమైన హార్వర్డ్ నుంచి ఆ సొమ్మును తిరిగి రాబట్టుకోవాల్సిన అవసరం ఉందని న్యాయ శాఖ అభిప్రాయపడింది. అయితే, ఈ దావాపై హార్వర్డ్ యాజమాన్యం ఇంకా స్పందించలేదు. -
కుమార్తెతో కలిసి కిమ్ సైనిక స్థావరాల సందర్శన
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తె కిమ్ జు ఏతో కలిసి మరోసారి సైనిక స్థావరాలను సందర్శించారు. ఒక ఆధునిక యుద్ధ ట్యాంక్ను నడిపారు. నల్లటి తోలు జాకెట్లు ధరించిన తండ్రీకూతుళ్లు, ట్యాంక్ హ్యాచ్ నుంచి బయటకు వచ్చి నవ్వుతూ కనిపించారు. తన కుమార్తెను పక్కన కూర్చోబెట్టుకుని శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. డ్రోన్లు లక్ష్యాలను ఛేదించడం, సైనికులు రైఫిల్ షూటింగ్ చేయడం వంటి ప్రత్యక్ష సైనిక వ్యాయామాలను దగ్గరుండి పర్యవేక్షించారు. 420 కిలోమీటర్ల పరిధిలోని శత్రువులను కూడా గురిపెట్టే లక్ష్యంతో ఈ డ్రిల్ జరిగినట్లు సమాచారం. ట్యాంక్ యూనిట్లు, పదాతి దళాలతో కూడిన కాల్పులు, ఇతర విన్యాసాలను కిమ్ పర్యవేక్షించారని, యుద్ధ సన్నాహాలను పూర్తి చేయాలని పిలుపునిచ్చారని అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) తెలిపింది. కిమ్ జు–ఏ 2022 నుంచే తన తండ్రితో కలిసి హై–ప్రొఫైల్ సైనిక కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. గత వారమే తండ్రీకూతుళ్లిద్దరూ ఒక తేలికపాటి ఆయుధ కర్మాగారాన్ని సందర్శించారు. పిస్టల్స్తో కాల్పులు జరిపారు. పలు రాకెట్ ప్రయోగ వ్యవస్థల ప్రత్యక్ష కాల్పుల పరీక్షను వీక్షించారు. అంతేకాదు కిమ్ జు–ఏ గత సెపె్టంబర్లో తన తండ్రితో కలిసి చైనాకు వెళ్లింది. నూతన సంవత్సర వేడుకల్లోనూ పాల్గొంది. ఈ వరుస చర్యల నేపథ్యంలో కిమ్ జోంగ్ ఉన్ ఆమెను త్వరలోనే తన వారసురాలిగా ప్రకటించనున్నారని దక్షిణ కొరియా గూఢచార సంస్థ కూడా అంచనా వేసింది. ఇది తదుపరి వారసురాలు ఆమె కావచ్చనే ఊహలకు బలం చేకూరుస్తోంది. మరోవైపు ఈ సైనిక విన్యాసాలు కేవలం ప్రదర్శన మాత్రమే కాకుండా, అమెరికా, ఇతర దేశాలకు యుద్ధానికి సిద్ధమనే హెచ్చరికగా భావిస్తున్నారు. -
నన్ను చంపడానికి ఇజ్రాయెల్ ప్రయత్నించింది: రష్యన్ జర్నలిస్ట్
బీరుట్: ఇజ్రాయెల్ తనను చంపడానికి ప్రయత్నించిందని రష్యన్ జర్నలిస్ట్ స్టీవ్ స్వీనీ ఆరోపించారు. ఆ దేశం చేస్తున్న యుద్ధ నేరాలు బయటికి రావొద్దని ఉద్దేశపూర్వకంగానే తనపై దాడి చేసిందన్నారు. గురువారం లెబనాన్లోని అల్–ఖస్మియా వంతెన సమీపంలో చిత్రీకరణ చేస్తుండగా ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో స్వీనీ, అతని కెమెరామెన్ అలీ రిదా గాయపడ్డారు. అనంతరం ఇద్దరూ స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందారు. వైద్యులు స్వీనీ చేతి నుంచి శకలాలను తొలగిస్తున్న వీడియోను రిదా పంచుకున్నారు. అనంతరం, స్వీనీ శుక్రవారం ఇజ్రాయెల్పై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘వంతెనలను లక్ష్యంగా చేసుకోవడం, 10 లక్షల మందిని బలవంతంగా ఖాళీ చేయించడం, నక్బా కంటే పెద్ద ఎత్తున జరుగుతున్న జాతి ప్రక్షాళన చర్యపై దక్షిణ లెబనాన్లో నేను రిపోరి్టంగ్ చేస్తుండగా ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసి నన్ను చంపడానికి ప్రయతి్నంచింది’అని రష్యన్ టెలివిజన్ నెట్వర్క్ ఆర్టీలో కరస్పాండెంట్గా పనిచేస్తున్న ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. చిత్రీకరణకు లెబనీస్ సైన్యానికి ఎలాంటి సమాచారం లేకుండా, ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండా దాడి చేసిందని మండిపడ్డారు. ఇది ఇజ్రాయెల్ యుద్ధ నేరాలను నమోదు చేస్తున్న జర్నలిస్టుల గొంతు నొక్కే ప్రయత్నమని స్వీనీ ఆరోపించారు. రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా ఈ దాడిని ఖండించారు. గాజాలో 200 మంది జర్నలిస్టుల హత్య తరహాలోనే ఇది జరిగిందని, ప్రెస్ జాకెట్లు ధరించిన జర్నలిస్టులపై దాడిని ప్రమాదవశాత్తుగా జరిగిందని చెప్పలేమని అన్నారు. రాకెట్ ముఖ్యమైన వ్యూహాత్మక సైనిక స్థావరంపై కాకుండా, రిపోర్ట్ చిత్రీకరిస్తున్న ప్రదేశంపై పడిందని, అంతర్జాతీయ సంస్థల నుంచి స్పందన కోసం రష్యా ఎదురుచూస్తోందని ఆమె తెలిపారు. అయితే, దాడి జరిగిన ప్రాంతం నుంచి పౌరులు వెళ్లిపోవాలని తాము పదేపదే హెచ్చరికలు జారీ చేశామని, తగినంత సమయం ఇచి్చన తర్వాతే క్షిపణిని ప్రయోగించామని ఇజ్రాయెల్ తెలిపింది. -
దక్షిణ కొరియాలో ఘోర అగ్నిప్రమాదం
సియోల్: దక్షిణ కొరియాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. వాహనాల విడిభాగాల ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో కనీసం 53 మంది గాయపడ్డారు. వారిలో 24 మంది పరిస్థితి విషయంగా మారింది. డెడ్యోక్ జిల్లాలోని డెజియోన్ నగరంలో శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మరో 14 మంది జాడ గల్లంతయ్యింది. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. మధ్యాహ్నం 1.17 గంటలకు ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ప్రమాదానికి కారణం ఏమిటన్నది ఇంకా గుర్తించలేదు. మంటల తీవ్రతకు ఫ్యాక్టరీ నేలమట్టమైంది. కొందరు ఫ్యాక్టరీ పై నుంచి దూకడంతో గాయాలపాలయ్యారు. లోపలున్న వారు పొగ పీల్చి అస్వస్థతకు గురయ్యారు. ఫ్యాక్టరీలో రసాయనాల నిల్వలుండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. -
ఎక్కడున్నా వదలం!
దుబాయ్: పశి్చమాసియా యుద్ధం చినికి చినికి గాలివానగా మారుతోంది. ఇజ్రాయెల్–అమెరికా రాజేసిన యుద్ధ జ్వాలలను ప్రపంచమంతటికీ విస్తరించేందుకు ఇరాన్ ప్రయతి్నస్తోంది. శుక్రవారం ఆ దిశగా స్పష్టమైన సంకేతాలిచి్చంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలు, ప్రఖ్యాత విడిది కేంద్రాలన్నింటినీ ఇకపై దాడులకు లక్ష్యంగా చేసుకుంటామంటూ తీవ్ర హెచ్చరికలు జారీచేసింది. ‘‘పార్కులు, విడిది, పర్యాటక కేంద్రాల వంటివేవీ మా శత్రువులకు ఇకపై సురక్షితం కాదు. ప్రపంచవ్యాప్తంగా వాటన్నింటినీ లక్ష్యాలుగా చేసుకుంటాం’’ అని ఇరాన్ సైనిక ఉన్నతాధికారి అబుల్ ఫజల్ షెకార్చీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దుబాయ్ తదితర గల్ఫ్ ప్రాంతాల్లోని ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రాలపై దాడులు తప్పవన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు రంజాన్ పర్వదినం సందర్భంగా కూడా ఇరాన్ నెమ్మదించలేదు. గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలపై దాడుల తీవ్రతను మరింతగా పెంచింది. కువైట్లో రెండు రిఫైనరీలపై డ్రోన్ దాడులకు దిగింది. దాంతో రోజుకు ఏకంగా 7.3 లక్షల బ్యారెళ్ల చమురు శుద్ధి చేసే మినా అల్ అహ్మదీ రిఫైనరీలో పలు యూనిట్లు మంటల్లో చిక్కాయి. వాటిని ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కువైట్లోని మైనా అబ్దుల్లా చమురు క్షేత్రం కూడా దాడులకు గురైంది. ఈ రెండు క్షేత్రాలపై గురువారం కూడా ఇరాన్ దాడులు చేయడం తెలిసిందే. సౌదీ అరేబియా, బహ్రెయిన్, దుబాయ్ల్లో కూడా భారీ బాంబుల మోతలతో దద్దరిల్లిపోయాయి. ఈ నేపథ్యంలో తన గడ్డపై ఉన్న ఇరాన్ సంస్థలన్నింటినీ మూసేయాలని దుబాయ్ నిర్ణయించుకుంది. ఇజ్రాయెల్లో హైఫాలో ఉన్న అతి పెద్ద చమురు శుద్ధి కేంద్రంపై కూడా ఇరాన్ భారీగా దాడులు చేసింది. దాంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. జెరూసలేం, టెల్ అవీవ్తో పాటు దేశవ్యాప్తంగా దాడులు కొనసాగాయి.బాలిస్టిక్ క్షిపణి తయారీ సామర్థ్యాన్ని కోల్పోయానన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటనను ఇరాన్ ఖండించింది. ఇప్పటికీ భారీ సంఖ్యలో క్షిపణులను తయారు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. గురువారం తన గగనతలంలో అమెరికాకు చెందిన ఎఫ్–35 యుద్ధ విమానంపై చేసిన దాడికి సంబంధించి వీడియో క్లిప్పింగ్ను కూడా విడుదల చేసింది. ఈ అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్లు దాడికి గురికావడం వాటి చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం! ఇరాన్పై బాంబుల వర్షం పర్షియా నూతన సంవత్సరం ‘నౌరోజ్’ నాడు ఇరాన్పై ఇజ్రాయెల్ ముమ్మర దాడులు కొనసాగాయి. రాజధాని టెహ్రాన్తో పాటు పలు దేశవ్యాప్తంగా నగరాలు పేలుళ్లతో దద్దరిల్లిపోయాయి. టెహ్రాన్లోని బసీజ్ గ్రూప్ ప్రధాన కార్యాలయంపైనా బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్లోని సౌత్ పార్స్ సహజవాయు క్షేత్రంపై ఇక దాడులు చేయబోమని నెతన్యాహు ప్రకటించారు. గల్ఫ్కు మరో మూడు యుద్ధ నౌకలను తరలించాలని అమెరికా నిర్ణయించింది. సిరియాపైనా దాడులు ఇజ్రాయెల్ తన దాడులను లెబనాన్తో పాటు సిరియాకూ విస్తరించింది. స్వెయ్డాతో పాటు దేశవ్యాప్తంగా పేలుళ్లు జరిగినట్టు సిరియా ప్రభుత్వ వార్తా సంస్థ వెల్లడించింది. అక్కడి డ్రౌజ్ మైనారిటీలను కాపాడేందుకే ఈ చర్యకు దిగినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది.వారి భ్రమలు వీడాయి: మొజ్తబా ఇరాన్ నాయకత్వాన్ని, అగ్ర నేతలను చంపినంత మాత్రాన ప్రభుత్వం తలకిందులైపోతుందని ఇజ్రాయెల్, అమెరికా భ్రమించాయని సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ ఎద్దేవా చేశారు. వాటిప్పుడు భ్రమలు వీడాయన్నారు. శత్రువుల రక్షణ కవచాలను ఛేదించాలని ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. యుద్ధం మొదలై మూడు వారాలైనా వాళ్లు గొప్ప ధైర్యస్థైర్యాలు చూపుతున్నారంటూ కొనియాడారు. పర్షియన్ నూతన సంవత్సరం ‘నౌరోజ్’ సందర్భంగా మొజ్తబాను ఉటంకిస్తూ ఇరాన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆయన బతికే ఉన్నారంటూ ఒక వీడియోను కూడా విడుదల చేసింది. అందులో ఆయన పలువురికి మత బోధలు చేస్తూ కని్పస్తున్నారు. అది ఎప్పటి వీడియో అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. యుద్ధం మొదలైనప్పటి నుంచీ మొజ్తబా ఇప్పటిదాకా బహిరంగంగా కని్పంచకపోవడం తెలిసిందే. తండ్రి అయతొల్లా ఖమేనీ తదితరులను పొట్టన పెట్టుకున్న ఇజ్రాయెల్ దాడిలో ఆయన కూడా తీవ్రంగా గాయపడ్డట్టు వార్తలొస్తూనే ఉన్నాయి.నాటో దేశాలు పిరికిపందలు: ట్రంప్ వాషింగ్టన్: నాటో దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వాటిని పిరికిపందలుగా అభివరి్ణంచారు. అమెరికా లేకుంటే నాటో కూటమి కేవలం కాగితం పులిగా మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు. ‘‘చమురు ధరలు పెరుగుతున్నాయంటూ నాటో దేశాలు ఫిర్యాదు చేస్తున్నాయి. హార్మూజ్ జలసంధిని తెరిపిస్తే పరిష్కారమయ్యే చిన్న సమస్య అది. పైగా వాటికి పెద్దగా రిస్కు కూడా లేని వ్యవహారం. కానీ అందుకు ముందుకు రమ్మంటే మాత్రం ముఖం చాటేస్తున్నాయి. నాటో దేశాల ఈ పిరికిపంద చర్యను గుర్తు పెట్టుకుంటాం’’ అంటూ హెచ్చరించారు.ఐఆర్జీసీ అధికార ప్రతినిధి మృతి ఇరాన్ సైన్యం అధికార ప్రతినిధి అలీ మొహమ్మద్ నైనీ శుక్రవారం ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారు. ఇజ్రాయెల్కు సర్ప్రైజ్ ఇస్తామంటూ ప్రకటనలు చేసిన గంటల వ్యవధిలోనే దాడులకు బలయ్యారు. అంతకు కొద్దిసేపటి ముందే ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటనను కూడా నైనీ ఎద్దేవా చేశారు. ఇరాన్ యురేనియం శుద్ధి, బాలిస్టిక్ క్షిపణి ఉత్పత్తి కార్యకలాపాలను ఇకపై ఎంతమాత్రమూ కొనసాగించజాలదన్న నెతన్యాహు వ్యాఖ్యలను దుయ్యబట్టారు.హార్మూజ్ వద్ద ఇరాన్ నౌకలపై బాంబులు హార్మూజ్ను తెరిపించే ప్రయత్నాలకు అమెరికా ఎట్టకేలకు శ్రీకారం చుట్టింది. దాని సమీపంలోని పలు ఇరాన్ నావికా దళ లక్ష్యాలను శుక్రవారం ధ్వంసం చేసినట్టు అమెరికా సైన్యం ప్రకటించింది. దాడులకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను విడుదల చేసింది. ఇరాన్ నావికా, సైనికోత్పత్తి సదుపాయాలతో పాటు మిసైల్ లాంచర్ వ్యవస్థలను కూడా పూర్తిగా ధ్వంసం చేయడంపైనే దృష్టి పెట్టినట్టు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. హార్మూజ్ సుంకం! రూ.18 కోట్లు చెల్లించిన ఓ నౌక ముందుగా ప్రకటించినట్టుగానే హార్మూజ్ జలసంధిని దాటేందుకు నౌకల నుంచి ఇరాన్ సుంకం వసూళ్లు ప్రారంభించింది. ఇందుకోసం ఒక చమురు నౌక రూ.18 కోట్ల పై చిలుకు మొత్తం చెల్లించినట్టు లాయిడ్స్ లిస్ట్ శుక్రవారం వెల్లడించింది. అంతేగాక హార్మూజ్ గుండా తాను అనుమతించిన నౌకల రవాణాకు పకడ్బందీగా నమోదు వ్యవస్థను కూడా రివల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. -
గర్భిణికి వర్క్ ఫ్రమ్ హోమ్ నిరాకరణ.. కంపెనీకి 188 కోట్ల జరిమానా
నిండు గర్భిణి అయిన ఉద్యోగికి వర్క్ ఫ్రమ్ హోమ్కు నిరాకరించిన ఓ కార్పొరేట్ కంపెనీకి అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో గల హామిల్టన్ కౌంటీ కోర్డు భారీ జరిమానా విధించింది. ఆఫీస్కు రావాలని యాజమాన్యం ఒత్తిడి చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లిన సదరు ఉద్యోగి.. నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిచ్చింది. హై రిస్క్తో జన్మించిన శిశువు కొన్ని గంటలకే మరణించడంతో సంస్థను బాధ్యురాలిగా తేల్చిన కోర్డు.. ఉద్యోగికి భారీ పరిహారం చెల్లించాలని ఆదేశించింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. చెల్సీ వాల్ష్ అనే మహిళ ఓహియో రాష్ట్రంలోని Total Quality Logistics అనే కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. 2021లో ఆమె గర్భధారణ సమయంలో హై రిస్క్ ఉంటుందని డాక్టర్లు ముందే చెప్పారు. కదలికలు తగ్గించుకొని, తప్పనిసరి అనుకుంటే ఇంటి నుంచే పని చేయాలని సూచించారు. దీంతో వాల్ష్, కంపెనీని వర్క్ ఫ్రం హోమ్ అనుమతి కోరింది. కానీ అందుకు వారు తిరస్కరించారు. ఆఫీసుకు రావాలని ఒత్తిడి చేశారు. ఆప్షన్ లేక లీవ్ పెట్టాలని వెళ్లిన ఆమె.. అదే రోజు సమస్య తలెత్తడంతో ఆసుపత్రిలో చేరి, 20 వారాల 6 రోజుల వయసున్న శిశువుకు జన్మనిచ్చింది. హై రిస్క్పై జన్మించిన శిశువు కొన్ని గంటలకే మరణించింది. కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ నిరాకరించడం వల్లే ఈ విషాదం జరిగిందని వాల్ష్ కోర్టును ఆశ్రయించగా, తీర్పు ఆమెకు అనుకూలంగా వచ్చింది. శిశువు మరణానికి సంస్థను బాధ్యురాలిగా తేల్చిన కోర్టు.. ఉద్యోగికి 22.5 మిలియన్ డాలర్ల (రూ. 188 కోట్లు) పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే, కోర్టు తీర్పుతో ఏకీభవించని కంపెనీ యాజమాన్యం.. పై కోర్టుకు వెళ్లింది. -
యుద్దంలోకి మరో దేశం.. అమెరికాకు మద్దతుగా..!
హర్మూజ్ జలసంధిలో నౌకాయానాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ క్షిపణి స్థావరాలపై దాడులు చేసేందుకు యూకే ప్రభుత్వం అమెరికాకు అనుమతిచ్చింది. ఇరాన్పై దాడులకు తమ సైనిక స్థావరాలను వినియోగించుకోవచ్చని యూకే ప్రధాని కియర్ స్టార్మర్ ప్రకటన విడుదల చేశారు.ఇరాన్పై యుద్దంలో యూకే మద్దతు తెలిపినా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసంతృప్తిగానే ఉన్నారు. యూకే తమ సాయాన్ని ప్రకటించడంతో ఆలస్యం చేసిందని పెదవి విరిచారు. తమకు మిత్ర రాజ్యమైన యూకే ఈ ప్రకటనను చాలా ముందే చేసుండాల్సిందని అన్నారు.యూకే అమెరికాకు మద్దతివ్వడంపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి తీవ్రంగా స్పందించారు. అమెరికాకు మద్దతిచ్చి స్టార్మర్ బ్రిటిష్ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టాడని అన్నారు. బ్రిటిష్ ప్రజల్లోని చాలా మంది, అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధంలో పాల్గొనాలని కోరుకోవడం లేదని తెలిపారు. అమెరికా ఎంతమంది మద్దతు కూడగట్టుకున్నా, ఇరాన్ తన స్వీయరక్షణ హక్కును వినియోగిస్తుందని స్పష్టం చేశారు.యూకే తాజా నిర్ణయంతో ఇరాన్పై ఒత్తిడి మరింత పెరిగింది. ఇప్పటికే ఉక్రెయిన్ కూడా అమెరికాకు మద్దతు తెలిపింది. శత్రువుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఇరాన్ ఇంకెనాళ్లు యుద్దం కొనసాగించగలదో చూడాలి. -
ఎయిర్ ఇండియా భారీ తప్పిదం
భారతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఓ భారీ తప్పిదం చేసింది. ఓ ఫ్లైట్కు బదులు మరో ఫ్లైట్ను వినియోగించి ప్రయాణికులకు విస్మయకర అనుభవాన్ని మిగిల్చింది. సొంతంగానూ భారీ ఆర్దిక నష్టాన్ని మూటగట్టుకుంది.పూర్తి వివరాల్లోకి వెళితే.. మార్చి 20న ఉదయం 11:34 గంటలకు ఢిల్లీ నుంచి AI185 సర్వీస్ నంబర్తో బోయింగ్ 777-200LR విమానం ప్యాసింజర్లతో కలిసి వాంకోవర్కు (కెనడా) బయల్దేరింది. అయితే నాలుగు గంటల ప్రయాణం తర్వాత ఈ విమానం తప్పుడు విమానం అని అధికారులు గుర్తించారు.వాస్తవానికి ఈ సర్వీస్లో బోయింగ్ 777-300ER మోడల్ విమానం వాంకోవకర్కు వెళ్లాలి. అయితే ఆపరేషనల్ తప్పిదం కారణంగా 777-300ER మోడల్కు బదులు 777-200LR విమానం వాంకోవర్కు టేకాఫ్ అయ్యింది.చైనా గగనతలంలోకి ప్రవేశించాక అధికారులు తమ తప్పిదాన్ని గుర్తించారు. కెనడాకు వెళ్లేందుకు 777-300ER మోడల్కు మాత్రమే అనుమతి ఉందని, తాము ప్రయాణిస్తున్నది 777-200LR మోడల్ అని నాలుక కరుచుకున్నారు. దీంతో వెంటనే విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించారు. మొత్తం 7 గంటలు 54 నిమిషాల ప్రయాణం తర్వాత విమానం తిరిగి ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. విషయం తెలిసి ప్రయాణికులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఎయిర్ ఇండియాపై అసంతృప్తిని వెల్లగక్కారు. ప్రయాణికులకు క్షమాపణలు చెప్పిన సంస్థ.. మరుసటి రోజు సరైన విమానం ఏర్పాటు చేసి ప్రయాణాన్ని కొనసాగించింది. అప్పటివరకు ప్రయాణికులకు ఉచిత హోటల్ వసతి, ఇతర సదుపాయాలు కల్పించింది.ఈ ఘటన ఎయిర్ ఇండియాకు భారీ ఆర్థిక నష్టాన్ని కలిగించింది. బోయింగ్ విమానానికి ఒక్క గంటలో 8–9 టన్నుల ఇంధనం ఖర్చు అవుతుంది. దాదాపు ఎనిమిది గంటల ప్రయాణం వల్ల వందల టన్నుల ఇంధనం వృథా అయ్యింది. దీని వల్ల భారీ ఆర్దిక నష్టం చవిచూడటంతో పాటు సంస్థ ప్రతిష్టను దిగజార్చుకుంది. -
లెబనాన్పై విరుచుకుపడిన ఇజ్రాయెల్.. 20 మంది మృతి
లెబనాన్పై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. తాజాగా జరిగిన వైమానిక దాడుల్లో కనీసం 20 మంది మృతి చెందినట్లు, 57 మంది గాయపడినట్లు ఆ దేశ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకటించింది. తాజా మారణహోమంతో మార్చి 2 నుంచి ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన లెబనాన్ వాసుల సంఖ్య 1021కి చేరింది.కాగా, మార్చి 2న లెబనాన్ ఉగ్రమూక హిజ్బుల్లా.. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్దం మధ్యలోకి కాలు దూర్చింది. ఇరాన్కు మద్దతుగా దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్పైకి రాకెట్లు ప్రయోగించింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్, లెబనాన్లోని అనేక ప్రాంతాలపై విస్తృత వైమానిక దాడులు ప్రారంభించింది. వాస్తవానికి 2024, నవంబర్ 27న ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే లెబనాన్ ఉగ్రమూక హిజ్బుల్లా ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇజ్రాయెల్ను టార్గెట్ చేసింది. -
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్.. అన్నదమ్ముల్లా కలిసి ఉండండి: ఖమేనీ పిలుపు
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో నలిగిపోతున్న ఇరాన్.. పక్క దేశాల పంచాయితీని చక్కబెడతానని ముందుకొచ్చింది. ఆ దేశ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ 1405వ పర్షియన్ నూతన సంవత్సరం "నౌరూజ్" సందర్భంగా ఇచ్చిన సందేశంలో పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కలిసి ఉండాలని పిలుపునిచ్చారు.మా తూర్పు దేశాలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మాకు అత్యంత సన్నిహితమైనవి.. ఇరు దేశాలు సోదరుల్లా మెలగండి.. ముస్లింల ఐక్యత కోసం పరస్పర సంబంధాలను మెరుగుపర్చుకోండి.. అవసరమైతే నేను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. మొజ్తబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ అయ్యాక పాక్-ఆఫ్ఘన్ ఘర్షణలపై చేసిన తొలి బహిరంగ వ్యాఖ్యలు ఇవి. ఇటీవలికాలంలో ఇరాన్ విదేశాంగ మంత్రి పలుమార్లు ఇదే అంశాన్ని ప్రస్తావించినా, కాబూల్–ఇస్లామాబాద్వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. కాగా, గతకొంతకాలంగా పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య అనధికారిక య్దుదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని ఒమర్ డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్పై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సంఖ్యలో గాయపడ్డారు. ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారంతా వైద్య సాయం పొందుతున్న రోగులని ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది.అయితే పాక్ మాత్రం ఈ ఆరోపణను తీవ్రంగా ఖండిస్తూ.. తాము కేవలం ఉగ్రవాద మౌలిక వసతులు మరియు సైనిక స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని వెల్లడించింది. ఈ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అయితే, సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ దేశాల విజ్ఞప్తి మేరకు ఇరు దేశాలు ఈద్ అల్-ఫితర్ సందర్భంగా తాత్కాలికంగా యుద్ధ విరమణకు అంగీకరించాయి. -
శత్రువు ఓడిపోయింది.. ఇరాన్ సుప్రీం లీడర్ సంచలన ప్రకటన
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సంచలన ప్రకటన చేశారు. పర్షియన్ నూతన సంవత్సరం "నౌరూజ్" సందర్భంగా విడుదల చేసిన రాతపూర్వక సందేశంలో "శత్రువు ఓడిపోయిందంటూ.." ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా–ఇజ్రాయెల్ దాడుల మధ్య ఇరాన్ ప్రజలు ఐక్యతను ప్రదర్శిస్తున్నారని ప్రశంసించారు. తన తండ్రి, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి తర్వాత మొజ్తబా ఖమేనీ మొదటిసారి ప్రజలకు రాతపూర్వక సందేశాన్ని విడుదల చేశారు.ఈ సందేశంలో ఖమేనీ ఇలా రాసుకొచ్చారు. మతపరమైన, సాంస్కృతిక, రాజకీయ భిన్నతలు ఉన్నప్పటికీ ప్రజలు ఒకటిగా నిలిచారు. ఈ ఐక్యత వల్లే శత్రువు ఓటమి చెందిందని పేర్కొన్నారు. అమెరికా–ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ ప్రజలను భయపెట్టి ప్రభుత్వాన్ని కూలదోయాలని భావించారు. ఇది వారు చేసిన భారీ తప్పిదమని త్వరలోనే తెలుసుకుంటారు.శత్రువులు ఇరాన్ నాయకత్వాన్ని హతమార్చడం ద్వారా ప్రజల్లో భయం, నిరాశ కలిగించి దేశాన్ని విభజించాలనుకున్నారు. ఇలా జరగకపోగా, శత్రువులలోనే విభేదాలు పుట్టాయి. ప్రాంతీయ పరిణామాలపై కూడా ఆయన స్పందించారు. టర్కీ, ఒమాన్పై జరిగిన దాడులకు ఇరాన్ బలగాలు బాధ్యులు కాదని తెలిపారు. అవి ఫాల్స్ ఫ్లాగ్ చర్యలు అని, పొరుగు దేశాల మధ్య విభేదాలు సృష్టించడమే శత్రువుల లక్ష్యమని అన్నారు.ఆఫ్ఘనిస్తాన్–పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఘర్షణలపై కూడా ఖమేనీ స్పందించారు. ఇరు దేశాల మధ్య సయోధ్యకు తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్-పాక్ సోదరుల్లా మెలగాలని.. ముస్లింలు ఐక్యతతో ఉండాలని పిలుపునిచ్చారు. కాగా, ఈద్ అల్-ఫితర్ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్-పాక్ తాత్కాలికంగా యుద్ధ విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. -
జర్నలిస్టు పైకి మిసైల్.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
లెబనాన్లో రష్యాకు చెందిన ఓ స్వీనీ అనే జర్నలిస్టు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అక్కడి జరుగుతున్న దాడులను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో అక్కడి నుంచి రిపోర్టింగ్ చేస్తున్నారు. అంతలోనే ఓ మిసైల్ అతని వైపుగా దూసుకొచ్చింది. ఇది గమనించిన జర్నలిస్టు అక్కడి నుంచి పక్కకు దూకారు. దీంతో ఆ రాకెట్ అక్కడే పేలింది.ఈ దుర్ఘటనలో జర్నలిస్టుతో పాటు కెమెరామెన్కు గాయాలయ్యాయి. దీంతో వారు వెంటనే అక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్లారు. ఈ మిసైల్ అటాక్ జరిగిన ప్రాంతంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటన లైవ్లో రికార్డయ్యింది. లెబనాన్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు ఈ వీడియో ప్రతిబింబిస్తుంది.Being a journalist in this modern day war is among hundred ways to die😰A missile strikes insanely close to him pic.twitter.com/ymUOhS5OEf— Cypher (@patocypher) March 19, 2026 -
పశ్చిమాసియా మరింత ఉద్రిక్తం
పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గల్ఫ్ దేశాలకు రక్షణగా ఉక్రెయిన్ నేరుగా రంగంలోకి దిగింది. ఆ దేశానికి చెందిన 200 మందికి పైగా నిపుణుల బృందాన్ని సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, యుఏఈ దేశాలకు పంపింది. త్వరలోనే మరికొంత మందిని అక్కడికి పంపుతామని జెలెన్ స్కీ ప్రకటించారు. పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ను ఇరాన్కు చెందిన షాహిద్ డ్రోన్లు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. 30$ఖర్చుతో ఇరాన్ తయారు చేసిన డ్రోన్లను కూల్చడానికి అమెరికా దాదాపు 3.7 $ మిలియన్లు ఖర్చు చేయాల్సివస్తుంది. దీంతో ఉక్రెయిన్ సొంతంగా తయారు చేసిన అతితక్కువ ఖరీదైన డ్రోన్లతో వీటిని అడ్డుకుంది. ఈనేపథ్యంలో కీవ్ సాయం కోసం గల్ఫ్ దేశాలు ఎదురుచూస్తున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ" ప్రస్తుతం ఇరాన్లో జరుగుతున్న యుద్ధం మాకు దూరమైందేమి కాదు. రష్యా, ఇరాన్కు సహకరిస్తున్నందున ఈ యుద్ధంలో ఉదాసీనంగా ఉండే హక్కు మాకుందని మేము భావించడం లేదు. అని కొద్దిరోజుల క్రితం లండన్ పార్లమెంటులో జెలెన్స్కీ మాట్లాడారు. కాగా అంతకు ముందే ఉక్రెయిన్పై ఇరాన్ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది. తమ శత్రు దేశాలకు సహకరిస్తోన్న ఉక్రెయిన్ పై నేరుగా దాడి చేస్తామని హెచ్చరించింది. అమెరికాతో చేతులు కలిపి తమకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించింది. అయితే వీటిని జెలెన్స్కీ పెడచెవిన పెట్టినట్లు కనిపిస్తోంది.షాహిద్ డ్రోన్ల ప్రత్యేకతషాహిద్ డ్రోన్లను ఇరాన్ తయారు చేస్తుంది. ఆ దేశానికి చెందిన 'షాహిద్ ఏవియేషన్ ఇండస్ట్రీస్ ,ఇరాన్ విమానయాన పరిశ్రమల సంస్థ (HESA) వీటిని సంయుక్తంగా వీటిని రూపొందిస్తాయి. 'సూసైడ్' డ్రోన్లుగా ఇవి ప్రసిద్ధి చెందిన ఈ డ్రోన్లు తక్కువ ఖర్చుతో తయారవుతాయి. లక్ష్యాన్ని చేరుకున్నాక వాటంతట అవే పేలిపోతాయి.అయితే రష్యా సైతం ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో ఇదే తరహా డ్లోన్లను రూపొందించింది. దీంతో వీటిని అడ్డుకునేలా ఉక్రెయిన్ తన సాంకేతికతను ఏర్పాటు చేసుకుంది. ఇదివరకూ ఉక్రెయిన్ 44,700కు పైగా షాహెద్ తరహా డ్రోన్లను కూల్చివేసింది. కేవలం గత నెలలోనే దాదాపు 3,238 షాహెద్ తరహా డ్రోన్లను నేలమట్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డ్రోన్ల దాడితో ఉక్కిరిబిక్కిరవుతున్న గల్ఫ్ దేశాలని రక్షించడానికి ఉక్రెయిన్ ఒప్పుకుంది. అయితే వీటికోసం జెలెన్స్కీ తగిన మెుత్తంలో డబ్బు డిమాండ్ చేశారు. -
అమెరికా ఒత్తిడికి లొంగలేదు..: శ్రీలంక
అమెరికాకు దెబ్బ దెబ్బ మీద తగులుతోంది. పశ్చిమాసియా యుద్ధంలో భాగంగా హోర్మూజ్ జలసంధి భద్రతకు సహకరించాలన్న అభ్యర్థనను ఇప్పటికే పలు దేశాలు తిరస్కరించగా, అమెరికా నుంచి వచ్చిన రెండు యుద్ధ విమానాలకు శ్రీలంక సైతం అనుమతి ఇవ్వలేదట. మార్చి 4, 8 తేదీల్లో ఎర్ర సముద్రం నుంచి రెండు అమెరికా యుద్ధ విమానాలకు తమ భూభాగంలోకి అనుమతి ఇవ్వాలన్న అమెరికా విజ్ఞప్తిని శ్రీలంక తిరస్కరించినట్లు ఆ దేశ అధ్యక్షుడు అనురా కుమార దిసనాయకే స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పార్లమెంట్ వేదికగా ఆయన వెల్లడించారు. ఈ తీవ్ర యుద్ధ పరిస్థితుల నడుమ తాము ఒత్తిడికి తలొగ్గకుండా అమెరికా యుద్ధ విమానాలకు తమ భూభాగంలోకి అనుమతికి నిరాకరించినట్లు ఆయన పేర్కొన్నారు. తాము ఎట్టిపరిస్థితుల్లోనూ ఒత్తిడికి తలొగ్గమనే విషయాన్ని దిసనాయకే ఈ సందర్భంగా తెలిపారు. ‘యుద్ధం విషయంలో మేము తటస్థ వైఖరితో ఉన్నాం. మాకు చాలా ఒత్తిడులు వచ్చాయి. కానీ వాటికి తలొగ్గలేదు. అమెరికా యుద్ధ విమానాలకు శ్రీలంక మట్టల అంతర్జాతీయ విమానాశ్రయంలో అనుమతించాలనే రిక్వస్ట్ అమెరికా నుంచి వచ్చింది. అయినా మేము వాటిని సున్నితంగా తిరస్కరించాం. ఈ యుద్ధంలో మా భాగస్వామ్యం లేదు. అందుకే అమెరికా యుద్ధ విమానాలను మా భూభాగంలో నిలుపుదల చేస్తామంటే వద్దని కచ్చితంగా చెప్పేశాం. జిబౌటి బేస్ నుండి ఎనిమిది యాంటీ-షిప్ క్షిపణులతో రెండు యుద్ధ విమానాలను మట్టల అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకురావాలని అమెరికా కోరింది. కానీ మేము అనుమతించలేదు’ అని అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధంలో శ్రీలంకను లాగకుండా ఉండాలనే ఉద్దేశాన్ని అమెరికాకు స్సష్టంగా చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదీ చదవండి:ఇరాన్ ‘ఉండేలు’ దెబ్బ -
ఇరాన్ ‘ఉండేలు దెబ్బ’!
ప్రపంచాన్ని ఒంటి చేత్తో జయించిన జగదేకవీరుడు... ఇంటి ముందు మురుగు కాల్వలో పడి దిక్కుమాలిన చావు చచ్చినట్టుంది... ప్రస్తుతం ఎఫ్-35 యుద్ధవిమానం దుస్థితి! ఎఫ్-35ల చరిత్రలో ఇదే ఘోరాతి ఘోరం. ఇంత ఘోరం మునుపెన్నడూ లేదు. ఈ వార్త విన్నాక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోట మాట వచ్చి ఉండదు. ఎఫ్-35... అమెరికా అమ్ములపొదిలోని అత్యాధునిక, అతి ఖరీదైన యుద్ధవిమానం. శత్రు రాడార్లకు సైతం చిక్కదు-దొరకదని అమెరికా ఘనంగా చెప్పే ఈ ‘స్టెల్త్’ ఫైటర్ జెట్ ఒక్కోదాని ధర వేరియంట్ ఆధారంగా రూ.700-1,000 కోట్ల మధ్య ఉంటుంది.యుద్ధవిమానాల పోరాట చరిత్రలో దీని సరిసాటి మరో విమానం నేటి వరకు లేదని చెబుతారు. ఎఫ్-35ను చూసుకుని అమెరికాకు మహా గర్వం. అమెరికా నుంచి ఎఫ్-35 విమానాలను కొనుగోలు చేసిన ఇతర దేశాలు కూడా రక్షణ పరంగా ఎంతో భరోసాతో కనిపిస్తాయి. నిజమే గానీ... అదంతా నిన్నటిదాకా మాత్రమే. ఇరాన్ వైమానిక బలగాలను వెంటాడి, వేటాడి నిర్వీర్యం చేసినట్టు ట్రంప్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. కానీ అదే దుర్బల ఇరాన్ రక్షణ దళాలు కొట్టిన ఉండేలు దెబ్బకు ‘ఎఫ్-35 లైట్నింగ్ 2’ అంతటి గండభేరుండం సైతం గతీదారి లేక పశ్చిమాసియాలోని ఓ స్థావరంలో అత్యవసరంగా కిందికి దిగాల్సొచ్చింది. పైలట్ క్షేమనేనని, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని అమెరికా ప్రకటించింది. కాదు కాదు... తమ ప్రతాపానికి ఎఫ్-35 యుద్ధవిమానం కూలిపోయిందనేది ఇరాన్ వాదన. ప్రపంచంలో ఎఫ్-35ను దెబ్బకొట్టిన తొలి దేశం తామేనని ఇరాన్ ప్రకటించుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ఫలితంగా క్షీణదశలో, పతనావస్థలో ఉన్న ఇరాన్ వైమానిక దళం అత్యంత అధునాతన ఎఫ్-35ను పిట్టను కొట్టినట్టు ఎలా కొట్టగలిగింది? ఇప్పుడిదే అందరిలో మెదులుతున్న సందేహం. ఇరాన్ ఎయిర్ ఫోర్స్ పనైపోయిందని భావించి అతి ధీమాతో సదరు ఎఫ్-35 ఫైటర్ జెట్ మధ్య ఇరాన్ మీదుగా ఎగురుతుండగా ఈ నెల 19న ఆ ఘటన చోటుచేసుకుంది. దీనిపై అమెరికా నుంచి ప్రకటన వెలువడేలోపే... పుండు మీద కారం చల్లినట్టు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) వెంటనే ప్రతిస్పందించింది. ఎఫ్-35ను తాము ఎలా ట్రాక్ చేసింది, ఎలా అడ్డుకున్నదీ తెలిపే ఫుటేజిని ప్రదర్శించింది. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 15 దేశాలు ఎఫ్-35 యుద్ధ విమానానికి చెందిన పలు వేరియంట్లను వినియోగిస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్వేతసౌధ సందర్శన సందర్భంగా... వీటిని మన దేశానికి కూడా విక్రయిస్తామని ట్రంప్ ప్రతిపాదించారు. దానిపై భారత్ ఇంతవరకు సుముఖత తెలుపలేదు.స్టెల్త్ ఆధునికతకు నాటు దెబ్బ!శత్రు దేశాల రాడార్లు పసిగట్టకుండా ప్రయాణించడానికంటూ ప్రత్యేకంగా డిజైన్ చేసినవే స్టెల్త్ విమానాలు. ఎఫ్-35 స్టెల్త్ యుద్ధవిమానాన్ని ఇరాన్ ఎలా ఢీకొట్టిందనే అంశంపై రక్షణ రంగ నిపుణుడు సందీప్ ఉన్నితన్ స్పందించారు. ‘స్టెల్త్ సాంకేతికత’ను ఆ పేరుతో పిలవటమే సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాడారుకు స్టెల్త్ విమానం అస్సలు కనిపించదని కంపెనీ బ్రోచర్లు చెబుతాయి గానీ... ఆ విమానాన్ని గుర్తించడానికి ఇతర మార్గాలున్నాయని, గురువారం ఎఫ్-35 విషయంలో అదే జరిగిందని సందీప్ చెప్పారు. ఎఫ్-35 లక్ష్యంగా ఇరాన్ ఏ క్షిపణులు ప్రయోగించిందో కచ్చితంగా తెలియనప్పటికీ... అది ప్రత్యేకించి ‘358 విమాన విధ్వంసక క్షిపణి’ గానీ లేదా ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే స్వల్పశ్రేణి క్షిపణి గానీ అయివుండొచ్చని అభిప్రాయపడ్డారు. ‘358 క్షిపణి’ని ‘ఎస్ఏ-67’గా కూడా వ్యవహరిస్తారు. ఇది పరారుణ సెన్సర్ అమర్చిన ఓ మిసైల్. తక్కువ ఎత్తులో నిదానంగా ప్రయాణించే డ్రోన్లు, విమానాలు, హెలికాప్టర్లను ఇది లక్ష్యంగా చేసుకుంటుంది. అయితే ఎఫ్-35 నిదానంగా ప్రయాణించే జెట్ కాదు. ఇరాన్ గతంలో అమెరికన్ ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లను లక్ష్యంగా చేసుకుని ‘358 క్షిపణి’ని ప్రయోగించింది. యెమెన్ హౌతీలకు కూడా ఇరాన్ ఈ క్షిపణులను సరఫరా చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన గత నెల 28 నుంచి ఇప్పటివరకు అమెరికా డజనుకు పైగా ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లను కోల్పోయింది. ‘358 క్షిపణి’లోని పరారుణ సెన్సర్... ఎఫ్-35 జెట్ వెలువరించే వేడిని గుర్తించి ఉంటుందని, తద్వారా దాన్ని లక్ష్యంగా చేసుకుని ఉంటుందని సందీప్ ఉన్నితన్ విశ్లేషించారు. రాడార్ కంటపడకపోయినా పరారుణ వర్ణపటం (ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్) రీత్యా ఎఫ్-35 తప్పించుకోలేదని అన్నారు. ఎఫ్-35 అనేది ఒకేఒక ఇంజిన్ ఉండే జెట్. ఎగిరేటప్పుడు అది అమిత వేడిని వెలువరిస్తుంది. రాడార్ వాడకుండానే ఇన్ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాక్ (ఐఆర్ఎస్టీ) వ్యవస్థ సాయంతో వేడిని గుర్తించి దాని ఆధారంగా విమానాన్ని ట్రాక్ చేయవచ్చని వివరించారు. గురువారం బహుశా అదే జరిగివుంటుందని అభిప్రాయపడ్డారు. 20 రోజుల పోరాటం తర్వాత తాము ఇరాన్ వైమానిక బలగాల వెన్ను విరిచినట్టు అమెరికా, ఇజ్రాయెల్ చాటుకుంటున్నాయి. ఆ ప్రాతిపదికనే అమెరికా తమ బి-1, బి-2 బాంబర్లను మోహరించింది. ‘స్టెల్త్’ సామర్థ్యం లేని ఈ బాంబర్లను శత్రు దేశపు గగనతలంపై సంపూర్ణ ఆధిక్యం లభించినట్టు తెలిశాక మాత్రమే అమెరికా సహజంగా మోహరిస్తుంది. ఎఫ్-35ను సైతం దెబ్బ కొట్టగలిగాయంటే ఇరాన్ వైమానిక బలగాలు క్రియాశీలంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. - జమ్ముల శ్రీకాంత్ -
అమెరికాకు పాకిస్థాన్ పెను సవాల్!
వాషింగ్టన్: ప్రపంచంలోని పలు దేశాలు అమెరికాకు సవాలు విసురుతున్నాయి. ఇరాన్ ఇప్పటికే అణ్వాయుధ కార్యక్రమాన్ని కొనసాగిస్తుందనే అనుమానంతో అమెరికా ఆ దేశంపై ఒత్తిడి పెంచింది. ఇప్పుడు పాకిస్థాన్ కూడా అదే తరహా అణ్వాయుధ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తోందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ అంశంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోందని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ తన ఆత్మరక్షణ కోసం పెద్ద ఎత్తున క్షిపణులను అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం పలు అగ్రదేశాల నుంచి ఆర్థిక సహాయం పొందుతోందని సమాచారం. తయారీ పూర్తయిన తర్వాత ఆయా దేశాలకు క్షిపణులు, ఇతర అణ్వాయుధాలను అందజేస్తోందని నివేదికలు సూచిస్తున్నాయి.యూఎస్ నిఘా సంస్థల ప్రకారం, పాకిస్థాన్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఉన్న షాహిన్-3 క్షిపణి 2750 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించగలదు. అయితే ఇది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి కాదు. ఖండాంతర క్షిపణులు కనీసం 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేరగలగాలి. అణు నిరోధక శక్తిలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్ తన అణు ఆయుధ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసినట్లు సమాచారం. అమెరికా నుంచి పాకిస్థాన్ దూరం సుమారు 12,000 కిలోమీటర్లు. అంతటి దూరాన్ని ఛేదించే క్షిపణులను పాకిస్థాన్ అభివృద్ధి చేస్తోందనే విషయం అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది.యాన్యువల్ థ్రెట్ అసెస్మెంట్ - 2026 నివేదికలో అమెరికా, ప్రపంచంలోని పలు దేశాలు అణ్వాయుధాలను తయారు చేస్తున్నాయని పేర్కొంది. అందులో పాకిస్థాన్, రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ వంటి దేశాలను ప్రస్తావించింది. ముఖ్యంగా పాకిస్థాన్ అణ్వాయుధ కార్యక్రమం అంతకంతకూ విస్తరిస్తోందని హైలైట్ చేసింది. -
అమెరికాకు భారీ ఎదురుదెబ్బ.. ఇరాన్ టార్గెట్ సక్సెస్
వాషింగ్టన్: ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఇరాన్ సైతం ప్రతిదాడులు చేస్తోంది. ఇందులో భాగంగా అమెరికాకు ఇరాన్ గట్టి షాకులే ఇస్తోంది. తాజాగా ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికా ఐదోతరం ఎఫ్-35 లైట్నింగ్2 యుద్ధ విమానంపై దాడి చేశామని ఇరాన్ ప్రకటించడం సంచలనంగా మారింది. ఇరాన్ ప్రకటనపై అమెరికా సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ స్పందిస్తూ దాడి నిజమేనని అంగీకరించారు. దీంతో, అమెరికాకు ఎదురుదెబ్బ తగిలింది.వివరాల మేరకు.. అమెరికాను టార్గెట్ను చేసిన ఇరాన్ గురువారం (మార్చి 19న) ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్పై ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ)దాడులు చేసింది. తెల్లవారుజామున 2.50 గంటలకు సెంట్రల్ ఇరాన్ ప్రాంతంలో ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్పై అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ ద్వారా దాడి చేశామని ఐఆర్జీసీ వెల్లడించింది. ఈ సందర్భంగా సదరు యుద్ధ విమానం కూలిపోయే అవకాశాలే చాలా ఎక్కువని, కానీ దాడి తర్వాత దానికి ఏం జరిగిందనే విషయం తమకు తెలియదని పేర్కొంది. ప్రస్తుతం దానిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. ఇక, ఇప్పటివరకు అమెరికా, ఇజ్రాయెల్ డ్రోన్లను సైతం 125కుపైగా కూల్చామని చెప్పింది. ఈ వివరాలను ఐఆర్జీసీ తమ అధికారిక వెబ్సైట్ వేదికగా గురువారం విడుదల చేసింది.అమెరికా రియాక్షన్..ఇరాన్ ప్రకటనను అమెరికా సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ అంగీకరించారు. ఈ సందర్బంగా తమ ఎఫ్-35 యుద్ధ విమానం ఒకటి పశ్చిమాసియాలోని ఓ వైమానిక స్థావరంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయిందని వెల్లడించారు. అయితే యుద్ధ విమానంతో పాటు పైలట్ సురక్షితంగానే ఉన్నారని తెలిపారు. ఇరాన్ సైన్యం ఉపరితలం నుంచి గగనతలం దిశగా వరుస మిస్సైళ్లను సంధించాకే, ఎఫ్-35 యుద్ధ విమానం అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అమెరికా నిర్ణయాత్మక శక్తి ఎఫ్-35 యుద్ధ విమానాలే అంటూ వైట్హౌస్ మార్చి 17న ఒక ట్వీట్ చేసింది. ఈ పోస్ట్ చేసిన రెండు రోజుల్లోనే ఒక ఎఫ్-35 ఫైటర్ జెట్పై ఇరాన్ దాడి చేయడం గమనార్హం. దీన్నిబట్టి ఇరాన్కు చెందిన గగనతల రక్షణ వ్యవస్థలలో కొత్త అప్గ్రేడ్లు జరిగి ఉండొచ్చని రక్షణ రంగ పరిశీలకులు భావిస్తున్నారు.ట్రంప్నకు వరుస షాక్లుపశ్చిమాసియా యుద్ధంలో ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు అమెరికా వాయుసేనకు ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. వీటిని కొన్ని ఇరాన్ వల్ల జరగుగా.. మరికొన్ని సాంకేతిక పొరపాట్లు కారణమయ్యాయి. కువైట్ దేశానికి చెందిన గగనతల రక్షణ వ్యవస్థలు పొరపాటున జరిపిన ఫైరింగ్లో ఏకంగా మూడు ఎఫ్-15 ఈగల్ యుద్ధ విమానాలు కూలిపోయాయి. కానీ ఆ విమానాల్లోని ఆరుగురు అమెరికన్ సిబ్బంది సేఫ్గా బయటపడ్డారు. గత వారమే ఇరాక్లోని పశ్చిమ ప్రాంతంలో కేసీ-135 స్ట్రాటో ట్యాంకర్ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు అమెరికన్ సిబ్బంది చనిపోయారు. అయితే, ట్యాంకర్ విమానం ఎందుకు కూలిపోయింది అనేది ఇప్పటికీ గుర్తించలేకపోయారు. -
హర్మూజ్ను తెరిచేందుకు అమెరికా సంచలన నిర్ణయం!
వాషింగ్టన్: అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధిపై పట్టు తెచ్చుకునేందుకు అమెరికా ‘ఆపరేషన్ హర్మూజ్’ ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో భాగంగా, ఇరాన్కు చెందిన ఆస్తులను గుర్తించి వాటిని ధ్వంసం చేస్తామని అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ ప్రకటించారు.అమెరికా ఇప్పటికే ఏ-10 వార్హాగ్ దాడి విమానాలు, ఏహెచ్-64 అపాచీ హెలికాప్టర్లు, యూఎస్ఎస్ బాక్సర్ ఎఫ్-35 జెట్లను రంగంలోకి దించింది. వీటితో పాటు నాలుగు వేల మంది సైనికులను హర్మూజ్ జలసంధిలో మోహరించింది.ఇరాన్ ఏర్పాటు చేసిన క్షిపణి లాంచర్లు, డ్రోన్లు, సీమైన్స్, పడవలు, మందుపాతరలను ధ్వంసం చేయడానికి అమెరికా చర్యలు ప్రారంభించింది. తక్కువ ఎత్తులో ఎగిరే అపాచీ హెలికాప్టర్లను కూడా వినియోగిస్తోంది. సీమైన్స్ తొలగించడానికి వారం రోజుల సమయం పట్టవచ్చని సమాచారం.జనరల్ కెయిన్ ప్రకారం, హర్మూజ్ జలసంధి అణువణువును అమెరికా జల్లెడ పట్టనుంది. ఇరాన్కు చెందిన 120కి పైగా నౌకలు, 44 మందుపాతర నౌకలు, ఇతర ఆయుధ కేంద్రాలను గుర్తించి వాటిని ధ్వంసం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. -
‘మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామనే’.. ఇరాన్పై అమెరికా యుద్ధంపై ట్రంప్
వాషింగ్టన్: సర్ప్రైజ్ చేద్దామనే ఇరాన్పై యుద్ధం చేస్తున్న విషయాన్ని మిత్ర దేశాలతో పంచుకోలేని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్, జపాన్ ప్రధానమంత్రి సనాఏ టకాఇచి మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల గురించి ప్రశ్నించగా, ట్రంప్ అనూహ్యంగా 1941లో జపాన్ చేసిన పెర్ల్ హార్బర్ దాడిని ప్రస్తావించారు.ఇరు దేశాల ద్వైపాక్షి సమావేశంలో ఓ జపాన్ జర్నలిస్ట్.. ట్రంప్ను ఇలా ప్రశ్నించారు. ఇరాన్పై దాడి చేసే ముందు అమెరికా తన యూరప్,ఆసియా మిత్రదేశాలకు సమాచారం ఎందుకు ఇవ్వలేదు? అని అడిగారు. అందుకు ట్రంప్ స్పందిస్తూ.. ‘మేము దాడి చేయడానికి ముందు ఎక్కువ సంకేతాలు ఇవ్వదలుచుకోలేదు. మేం సర్ ప్రైజ్ ఇవ్వాలనుకున్నాం. సర్ప్రైజ్ ఇవ్వడం జపాన్కు తెలిసినట్లుగా మరే ఇతర దేశానికి తెలియదు. పెర్ల్ హార్బర్ గురించి మీరు మాకు(అమెరికాకు) చెప్పలేదే!’అని వ్యాఖ్యానించారు.ఇరాన్పై దాడి విజయవంతమైందని, మొదటి రెండు రోజుల్లోనే 50శాతం కంటే ఎక్కువ లక్ష్యాలను ధ్వంసం చేశామన్నారు. మేము ముందే చెప్పి ఉంటే అది సర్ప్రైజ్గా ఉండేది కాదని చెప్పారు. ‘ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలతో అక్కడి వాతావరణం గంభీరంగా మారింది. దీనితో ఒక జర్నలిస్ట్ ట్రంప్ను ప్రశ్నించే ప్రయత్నం చేశారు. వెంటనే ట్రంప్ ‘నేను కాదు, జపాన్ ప్రధాని టకాఇచి మాట్లాడాలి’ అన్నారు. అందుకు టకాఇచి ‘పర్లేదు, మీరు మాట్లాడండి’ అని సమాధానమిచ్చారు. ట్రంప్ ‘మీ ఇంగ్లీష్ చాలా బాగుంది. నేను మీ భాష నేర్చుకోలేదు, కానీ తప్పక నేర్చుకుంటాను’ అంటూ టకాఇచితో నవ్వులు పూయించారు.’ రెండో ప్రపంచ యుద్ధంలోపెర్ల్ హార్బర్ దాడి 1941 డిసెంబర్ 7న జరిగింది. ఆ దాడిలో 2,390 మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారు. తదుపరి రోజు అమెరికా జపాన్పై యుద్ధం ప్రకటించింది. అదే రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా ప్రవేశానికి కారణమైంది.పశ్చిమాసియా యుద్ధంపై జపాన్ ఆందోళన ఇక జపాన్ ప్రధాని టకాఇచి పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రపంచం తీవ్రమైన భద్రతా పరిస్థితిని ఎదుర్కొంటోంది. గ్లోబల్ ఎకానమీ కూడా పెద్ద దెబ్బ తినబోతోంది. కానీ ప్రపంచ శాంతి సాధించగల వ్యక్తి మీరు మాత్రమే’ అని ట్రంప్ను ప్రశంసించారు. ఇరాన్ చేసిన దాడులు, హర్మూజ్ జలసంధి మూసివేతను ఖండించారు. అందుకు, ట్రంప్ స్పందిస్తూ శాంతి కోసం జపాన్ సైతం ముందుకు రావాలని కోరారు. -
ఇరాన్ యుద్ధం ముగింపు.. నెతన్యాహు సంచలన ప్రకటన
జెరూసలేం: ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు యుద్ధం విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ దశాబ్దాలుగా నిర్మించుకున్న క్షిపణి, డ్రోన్ వ్యవస్థలను ఇజ్రాయెల్ రక్షణ దళాలు ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఇరాన్ సైనిక శక్తి ప్రస్తుతం నామమాత్రంగా మిగిలిందని నెతన్యాహు తెలిపారు. ప్రజలు అనుకున్న దాని కంటే ముందే ఇరాన్ యుద్ధం ముగుస్తుందని స్పష్టం చేశారు.ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం జెరూసలేంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నెతన్యాహు..‘ఇరాన్పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్ 20 రోజులు పూర్తి చేసుకుంది. ఇరాన్ పాలకుల అణ్వాయుధ కలలను, క్షిపణి సామర్థ్యాన్ని నాశనం చేసే లక్ష్యంతో ఇజ్రాయెల్ చేపట్టిన 'ఆపరేషన్ రైజింగ్ లయన్' అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. మేము విజయం సాధిస్తున్నాం. ఇరాన్పై యుద్ధం ప్రజలు అనుకుంటున్న దానికంటే త్వరగానే ముగిసే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం ఇరాన్ను ఎవరు నడుపుతున్నారో నాకు ఖచ్చితంగా తెలియదు. మొజ్తబా ఖమేనీ కనిపించలేదు. అగ్రస్థానం కోసం పాకులాడుతున్న వారిలో అంతర్గతంగా చాలా ఉద్రిక్తతలు ఉన్నాయని మనం చూస్తున్నాం.యురేనియం శుద్ధి చేయలేరు.. ఇరాన్ సైనిక యంత్రాంగం ప్రస్తుతం అతలాకుతలమైంది. ఇరాన్ రక్షణ వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలాయి. ఇరాన్ దశాబ్దాలుగా నిర్మించుకున్న క్షిపణి, డ్రోన్ వ్యవస్థలను ఇజ్రాయెల్ రక్షణ దళాలు ధ్వంసం చేశాయి. కేవలం ఆయుధాలను ధ్వంసం చేయడమే కాకుండా, వాటిని తయారు చేసే పారిశ్రామిక పునాదులను కూడా ఇజ్రాయెల్ లక్ష్యం చేసుకుంది. ఇరాన్ గర్వపడే బాలిస్టిక్ క్షిపణి నిల్వలు అగ్నికి ఆహుతయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్ అణు మౌలిక సదుపాయాలపై కూడా దాడులు జరిగాయి. దీంతో, ఇరాన్ అణ్వాయుధ దేశంగా ఎదగకుండా అడ్డుకోగలిగాం. ఇరాన్ ఇకపై యురేనియం శుద్ధి చేయలేని స్థితిలో ఉంది. బాలిస్టిక్ క్షిపణులు తయారు చేయలేదు’ అని చెప్పుకొచ్చారు.దాడుల వెనుక మూడు లక్ష్యాలు.. అలాగే, ఇరాన్పై సైనిక చర్య వెనుక మూడు స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయని నెతన్యాహు వివరించారు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడం, బాలిస్టిక్ క్షిపణి ముప్పును సమూలంగా నిర్మూలించడం, 47 ఏళ్లుగా అణిచివేతకు గురవుతున్న ఇరాన్ ప్రజలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునేలా పరిస్థితులను కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ఇదే సమయంలో ఇరాన్ ఆకాశాన్ని రక్షించే వైమానిక రక్షణ వ్యవస్థలు ఇప్పుడు నిరుపయోగంగా మారాయి. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలంలో స్వేచ్ఛగా విహరిస్తున్నాయని చెప్పారు. ఇరాన్ నౌకాదళం సముద్ర గర్భంలో కలిసిపోయిందన్నారు. కాస్పియన్ సముద్రంలో ఉన్న వారి నౌకాదళ విభాగంపై కూడా ఇజ్రాయెల్ విరుచుకుపడిందని ఆయన వెల్లడించారు. ఇరాన్ సైనిక నాయకత్వం మధ్య సమన్వయం దెబ్బతిన్నదని తెలిపారు.ట్రంప్పై ప్రశంసలు.. అమెరికాతో సంబంధాలపై నెతన్యాహు స్పందిస్తూ..‘ట్రంప్ నాయకత్వంలో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య సమన్వయం అమోఘం. ప్రపంచంలోనే అత్యుత్తమమైన రెండు వైమానిక దళాలు, అత్యుత్తమ నిఘా సంస్థలు కలిసి పనిచేస్తే అద్భుతాలు జరుగుతాయి’ అని చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ అమెరికాను యుద్ధంలోకి లాగుతోందన్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ట్రంప్ ఎప్పుడూ అమెరికా ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారని, ఆయనను ఎవరూ ప్రభావితం చేయలేరని వ్యాఖ్యానించారు. -
ఇరాన్ కీలక అధికారి మృతి
ఇరాన్, ఆమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతోంది... -
ఇరాన్పై యుద్ధం.. ట్రంప్నకు భారీ ఊరట
లండన్: హార్మూజ్ జలసంధి నుంచి క్షేమంగా రాకపోకలు సాగించడానికి తమ వంతు సహకారం అందిస్తామని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ ప్రకటించాయి. ఈ విషయంలో సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాయి. ఈ మేరకు గురువారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.ఈ సందర్భంగా హార్మూజ్లో నౌకలపై ఇరాన్ సైన్యం చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం, హార్మూజ్లో నౌకల రాకపోలపై ఆంక్షల నేపథ్యంలో ఇంధన మార్కెట్లు స్థిరంగా కొనసాగేందుకు చర్యలు చేపట్టబోతున్నట్లు స్పష్టంచేశాయి. ఈ విషయంలో సమన్వయంతో పని చేస్తామని తెలిపాయి. హార్మూజ్లో చమురు, గ్యాస్ నౌకల రాకపోకలకు ఎలాంటి అవాంతరాలు ఉండకూడదని తేల్చిచెప్పాయి. ఇందుకోసం తమ ప్రయత్నాలు తాము చేస్తామని వివరించాయి. ఇంధన ఉత్పత్తి దేశాలతో కలిసి పని చేస్తామని పేర్కొన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన ఉత్పత్తి మరింత పెరగాలని, తద్వారా మార్కెట్లపై ఒత్తిడి తగ్గుతుందని వెల్లడించాయి.ఇరాన్పై ఫిబ్రవరి 28న దాడులు ప్రారంభమయ్యాయి. అందుకు ప్రతీకారంగా హార్మూజ్లో చమురు, గ్యాస్ నౌకల రాకపోకలపై ఇరాన్ ఆంక్షలు విధించింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ కొరత ఏర్పడింది. చమురు, గ్యాస్ సరఫరా చేసే నౌకలు, పౌర మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు చేయడం అత్యంత హేయమని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ మండిపడ్డాయి. చమురు నౌకలతో ఇరాన్కు ముప్పు ఉంటుందా? అని ప్రశ్నించాయి. ఇకనైనా దాడులు ఆపాలని, హార్మూజ్ జలసంధిని ఇరాన్ను డిమాండ్ చేశాయి. ఇంధన సరఫరాకు అడ్డంకులు సృష్టిస్తే ప్రపంచవ్యాప్తంగా శాంతి భద్రతలకు ముప్పు ఏర్పడుందని ఆందోళన వ్యక్తంచేశాయి. NEW: The UK alongside France, Germany, Italy, the Netherlands and Japan expresses readiness to contribute to appropriate efforts to ensure safe passage through the Strait of Hormuz 👇 https://t.co/KeCAbEbdWy pic.twitter.com/uqtRF394En— British Embassy Washington (@UKinUSA) March 19, 2026 -
వీధిలో పాన్ ఉమ్మినందుకు రూ.3.5 లక్షల జరిమానా
లండన్: బహిరంగ ప్రాంతాల్లో పాన్ ఉమ్మినందుకు లండన్లో ఇద్దరు భారతీయులకు దాదాపు రూ.3.48 లక్షల(2,800 డాలర్ల) జరిమానా విధించారు. మొదట విధించిన 100 పౌండ్ల జరిమానాను చెల్లించకపోవడం, కోర్టుకు గైర్హాజరవడంతో ఆగ్రహించిన బ్రెంట్ సిటీ అధికారులు పెద్ద మొత్తంలో జరిమానా విధించారు. లండన్ శివార్లలో ఉన్న ప్రాంతం బ్రెంట్. ఇది లండన్లోని అత్యంత చైతన్యవంతమైన ప్రాంతం. పాన్ ఉమ్మడం వల్ల నగరం రోడ్లు పాడవుతున్నాయి. ఈ మరకలను శుభ్రపరచడానికి నగర కౌన్సిల్కు భారమైంది. పాన్ మరకలను శుభ్రపరచడానికి కౌన్సిల్ ఏడాదికి 30,000 పౌండ్లు ఖర్చు చేస్తోంది. ఇది పౌరులపై పన్ను భారం మోపుతుండటంతో నగర కౌన్సిల్ దీనికి వ్యతిరేకంగా జీరో–టాలరెన్స్ ప్రచారాన్ని ప్రారంభించింది. అయితే ఎడ్జ్వేర్ పట్టణ నివాసి అయిన అక్షిత్ భద్రే పటేల్ 2025 జూన్లో స్థానిక మెట్రో స్టేషన్ సమీపంలోని కింగ్స్బరీ రోడ్డుపై పాన్ ఉమ్మినందుకు నార్త్ వెస్ట్ లండన్ మెజిస్ట్రేట్స్ కోర్టు జరిమానా విధించింది. పటేల్ కోర్టు విచారణకు హాజరు కాలేదు. తనకు విధించిన జరిమానా 100 పౌండ్లు చెల్లించలేదు. రూయిస్లిప్ శివారు ప్రాంత నివాసి అయిన హితేష్ పటేల్ వెంబ్లీ హిల్ రోడ్డుపై పాన్ ఉమ్మినందుకు జరిమానా విధించింది. మొదటి కేసు తరహాలోనే ఈయనా కోర్టుకు హాజరుకాలేదు. జరిమానా చెల్లించలేదు. దీంతో జరిమానా పది రెట్లు పెరిగింది. లండన్లోని బ్రెంట్, దాని పొరుగునే ఉన్న హారోతో సహా పలు ప్రాంతాల్లో పాన్ ఉమ్మివేయడంపై ఆందోళనల నేపథ్యంలో కౌన్సిల్ ఈ కఠిన చర్యలు చేపట్టింది. ‘మా వీధులను పాడుచేసే వారిని మేం అస్సలు సహించబోం. మేం విధించే ప్రతి జరిమానా ఒక స్పష్టమైన సందేశం. మీరు మా వీధులను పాడు చేస్తే మేం మిమ్మల్ని పట్టుకుంటాం. దానికి మీరు మూల్యం చెల్లించాల్సిందే’ అని కౌన్సిలర్ కృపా షెత్ అన్నారు. -
శాంతిదూత డొనాల్డ్ ట్రంప్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జపాన్ మహిళా ప్రధాని సనే తకాయిచి ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచంలో శాంతిని నెలకొల్పే సామర్థ్యం ఆయనకు ఉందని చెప్పారు. ట్రంప్ను శాంతిదూతగా అభివరి్ణంచారు. హార్మూజ్ జలసంధిలో చమురు నౌకల రక్షణకు యుద్ధ నౌకలను పంపించడానికి జపాన్ ముందుకు రాలేదంటూ రుసరుసలాడుతున్న ట్రంప్ ఆగ్రహాన్ని చల్లార్చేందుకు ప్రయతి్నంచారు. అమెరికా అధ్యక్షుడితో సంబంధాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామంటూ సంకేతాలిచ్చారు. తకాయిచి గురువారం వైట్హౌస్లో డొనాల్డ్ ట్రంప్తో సమావేశమయ్యారు. పశ్చిమాసియా యుద్ధంపై వారు చర్చించుకున్నట్లు సమాచారం. ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాలు చేపట్టడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తకాయిచి స్పష్టంచేశారు. తకాయిచి నాయకత్వాన్ని ట్రంప్ కొనియాడారు. ఆమె బహుళ ప్రజాదరణ కలిగిన శక్తివంతురాలైన నేత అంటూ ప్రశంసించారు. ఇరాన్పై యుద్ధంలో అమెరికాకు జపాన్ అందించే సాయంపై వారు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఈ యుద్ధంలో జపాన్ సహకారాన్ని ట్రంప్ కోరుతున్నారు. షెడ్యూల్ ప్రకారం డొనాల్డ్ ట్రంప్ త్వరలో చైనాలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనకు ముందుకు ఆయన జపాన్ ప్రధానమంత్రితో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. -
సోషల్ మీడియాతో సంతోషం ఆవిరి!
హెల్సింకీ: ఆధునిక కాలంలో అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియా యువతలో సంతోషాన్ని ఆవిరి చేస్తోంది. లేనిపోని ఆందోళనకు కారణమవుతోంది. ప్రధానంగా పశి్చమ దేశాల్లో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్కు చెందిన వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ గురువారం విడుదల చేసిన ‘వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్–2026’ఇదే విషయం వెల్లడించింది. గ్యాలప్ విశ్లేషణ సంస్థ, ఐక్యరాజ్యసమితి సస్టెనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ భాగస్వామ్యంతో ఈ నివేదిక రూపొందించారు. అధ్యయనంలో భాగంగా 147 దేశాల్లో లక్షల మందిని ప్రశ్నించారు. వారి అభిప్రాయాలు సేకరించారు. ప్రపంచంలో ఫిన్లాండ్ అత్యంత సంతోషంగా ఉన్న దేశమని నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో ఫిన్లాండ్ వరుసగా తొమ్మిదోసారి అగ్రస్థానం దక్కించుకోవడం విశేషం. ఈసారి టాప్–10 జాబితాలో ఫిన్లాండ్తోపాటు ఐస్లాండ్, డెన్మార్క్, స్వీడన్, నార్వే తదితర దేశాలకు స్థానం దక్కింది. అగ్రరాజ్యం అమెరికాకు 23, కెనడాకు 25, బ్రిటన్కు 29వ ర్యాంకు లభించింది. భారత్కు 116వ ర్యాంకు దక్కింది. నివేదికలోని కీలక అంశాలివీ.. → కోస్టారికా దేశం 2023లో 23వ స్థానంలో ఉండగా, 2026లో నాలుగో ర్యాంకు దక్కించుకుంది. → ఏమాత్రం సంతోషంగా లేని దేశాల్లో అఫ్గానిస్తాన్, సియెర్రాలియోన్, మలావీ నిలిచాయి. → అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల్లో 25 ఏళ్లలోపు యువత సోషల్ మీడియాకు బానిసగా మారుతోంది. ఫలితంగా వారు వాస్తవ ప్రపంచానికి దూరంగా జీవిస్తున్నారు. సంతోషానికి దూరమవుతున్నారు. → మనుషులు సంతోషంగా ఉండాలంటే కుటుంబ బంధాలకు విలువ ఇవ్వడం చాలా ముఖ్యం. సామాజికంగా ఇతరులతో స్నేహ సంబంధాలు మెరుగుపర్చుకోవాలి. → సామాజిక జీవితాల్లో నాణ్యత, స్థిరత్వం ఉన్న దేశాల్లో ప్రజలు సంతోషంగా ఉంటున్నట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జాన్ ఎమ్మానుయేల్ డీ నెవ్ చెప్పారు. లాటిన్ అమెరికా దేశాల్లో కుటుంబ బంధాలు, సామాజిక సంబంధాలు బలంగా ఉంటాయని వెల్లడించారు. అందుకే అక్కడి ప్రజలు సంతోషంగా జీవిస్తున్నట్లు స్పష్టంచేశారు. → ఫిన్లాండ్తోపాటు ఉత్తర యూరోపియన్ దేశాలు సంతోషంగా ఉండడానికి కారణం ఏమిటన్నది పరిశీలిస్తే.. అక్కడి సంపద, ఆ సంపద పంపిణీలో సమానత్వం, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వాలు ఉండడం, ఆర్థిక విపత్తుల నుంచి ప్రజలను కాపాడేందుకు చర్యలు చేపట్టడం, ఆరోగ్యకరమైన జీవన శైలి, ప్రజల ఆయుర్దాయం ఎక్కువగా ఉండడం వంటివి కనిపిస్తాయి. -
ఇరాన్ మిస్సైల్ ప్లాంట్ను నేలమట్టం చేసిన అమెరికా
ఇరాన్లోని కరాజ్ నగరంలో ఉన్న సర్ఫేస్-టు-సర్ఫేస్ క్షిపణి తయారీ కేంద్రాన్ని అమెరికా దళాలు పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఆ దేశ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకటించింది. ఈ కేంద్రం బాలిస్టిక్ క్షిపణులు అసెంబుల్ చేయడానికి ఉపయోగించబడేదని.. అమెరికన్లు, పొరుగు దేశాల వాణిజ్య నౌకాయానానికి ముప్పు కలిగిస్తుండిందని CENTCOM పేర్కొంది. అమెరికా వైమానిక దళం నిర్వహించిన ఈ దాడిలో కరాజ్ ప్లాంట్ పూర్తిగా నేలమట్టమైంది. CENTCOM విడుదల చేసిన ఏరియల్ ఫోటోలు ఆ సదుపాయం పూర్తిగా ధ్వంసమైందని చూపిస్తున్నాయి. ఈ ప్లాంట్ ఇరాన్ క్షిపణి సామర్థ్యానికి కీలకమైన కేంద్రంగా ఉండింది.Prior to Operation Epic Fury, the Iranian regime used the Karaj Surface-to-Surface Missile Plant to assemble ballistic missiles that threatened Americans, neighboring countries, and commercial shipping. The photo dated March 1, 2026, shows the plant prior to U.S. strikes. The… pic.twitter.com/QEs5toZQpX— U.S. Central Command (@CENTCOM) March 19, 2026కరాజ్ ప్లాంట్ పూర్తిగా నిరుపయోగం కావడం వల్ల ఇరాన్ సైనిక సామర్థ్యం మరింత బలహీనపడే అవకాశం ఉంది. అలాగే గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకాయానానికి కూడా ముప్పు తగ్గుతుంది. ఇదిలా ఉంటే, ఇజ్రాయెల్-అమెరికా ఎన్ని దెబ్బలు కొట్టినా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తూనే ఉంది. అమెరికా హెచ్చరికలు బేఖాతరు చేస్తూ గల్ఫ్ దేశాల ఇంధన సముదాయాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతుంది.సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై దాడులకు ప్రతిగా ఇరాన్ ఖతర్లోని ఎల్ఎన్జీ ప్లాంట్పై క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడిలో ఎల్ఎన్జీ ప్లాంట్ భారీగా దెబ్బతింది. ఈ దాడులు ఇంధన ధరలను పెంచి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఇప్పటికే హర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యం కొనసాగుతుండటంతో ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు ప్రభావితమవుతోంది. -
ట్రంప్కు ఎవరైనా చెప్పగలరా..? నెతన్యాహు
అమెరికాను ఇరాన్ యుద్ధంలోకి తాము లాగామన్న ఆరోపణలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఖండించారు. ప్రెసిడెంట్ ట్రంప్కు ఇలా చేయండని ఎవరైనా చెప్పగలరా అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఇరాన్పై యుద్దాన్ని అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్తంగా ప్రారంభించాయని అన్నారు.యుద్దం ప్రారంభానికి ముందు అమెరికా–ఇరాన్ మధ్య అణు కార్యక్రమంపై చర్చలు సాగుతున్నాయని.. ఇరాన్ ముందుగా దాడి చేస్తుందని భావించి, తానే ముందస్తు చర్యలు తీసుకున్నానని ట్రంప్ స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. అలాగే ఇరాన్ గ్యాస్ ఫీల్డ్పై దాడి విషయంలో అమెరికాకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, ఇజ్రాయెల్ ఒంటరిగానే ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. ఈ దాడికి ఖతర్కు కూడా ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై ఇజ్రాయెల్ దాడిని ట్రంప్ ఖండించిన తర్వాత నెతన్యాహు ఈ ప్రకటన చేశారు.కాగా, ఇజ్రాయెల్ ఇటీవలే ఇరాన్ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై దాడులు చేసింది. ఇందుకు ప్రతీకారంగా ఇరాన్ ఖతర్లోని ఎల్ఎన్జీ ప్లాంట్పై క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడిలో ఎల్ఎన్జీ ప్లాంట్ భారీగా దెబ్బతింది. ఈ దాడులు ఇంధన ధరలను పెంచి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఇప్పటికే హర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యం కొనసాగుతుండటంతో ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు ప్రభావితమవుతోంది.ఈ పరిణామాలతో ఓ మెట్టుదిగినట్లు కనిపిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై దాడి చేయడం ముమ్మాటికి తప్పేనని తెలిపింది. భవిష్యత్తులో సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై దాడులు చేయరాదని ఇజ్రాయెల్ను కోరింది. ఈ అభ్యర్ధన మేరకు నెతన్యాహు సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై దాడులు నిలిపేస్తామని ప్రకటించారు. -
ఇంధన వనరులపై దాడులా?
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో కీలక ఇంధన వనరులపై దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ‘‘ప్రపంచమంతటినీ ఎంతగానో కలతకు గురి చేసే అంశమిది. ఇప్పటికే ఒడిదొడుకుల్లో ఉన్న అంతర్జాతీయ ఇంధన మార్కెట్ను ఈ దాడులు మరింతగా దెబ్బ తీస్తాయి’’అంటూ ఆందోళన వెలిబుచ్చింది. ఇరాన్లోని సౌత్ పార్స్ చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్ దాడి, ప్రతీకారంగా ఖతర్లోని ఎల్ఎన్జీ క్షేత్రం రస్ లఫాన్తో పాటు సౌదీ అరేబియాలో అతి పెద్ద చమురు క్షేత్రమైన ఆరాంకోపైనా ఇరాన్ దాడులు కలకలం రేపడం తెలిసిందే. ఇవి భారత్ను తీవ్రంగా కలచివేసినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. పౌర సదుపాయాలు, ఇంధన వనరులపై దాడులు కూడదని భారత్ ముందునుంచీ చెబుతూనే వస్తోందని గుర్తు చేశారు. వాటికి తక్షణం తెర దించాలని గురువారం మీడియా సమావేశంలో ఆయన సూచించారు. భారత ఎల్ఎన్జీ దిగుమతుల్లో 40 శాతానికి పైగా ఖతర్ నుంచి వస్తుండటం తెలిసిందే. దాడులు గర్హనీయం: మోదీ పశ్చిమాసియా తాజా పరిణామా లపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వెలిబుచ్చా రు. ఈ విషయమై పలువురు దేశాధినేతలతో ఆయన వేర్వేరుగా సంభాషించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిఖ్, మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, జోర్డాన్ రాజు అబ్దుల్లా–2తో ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాలో తాజా పరిస్థితులను గురించి వారితో లోతుగా చర్చించారు. ఇంధన వ్యవస్థలపై దాడులు తీవ్రంగా గర్హనీయమన్నారు. ఉద్రిక్తతలకు తక్షణం తెర దించి శాంతి, సుస్థిరత పాదుగొల్పేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. హార్మూజ్ జలసంధి గుండా సురక్షిత నౌకాయాన్ని తక్షణం పునరుద్ధరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. వీటన్నింటికీ దౌత్యం, మధ్యవర్తిత్వమే మార్గాలని స్పష్టం చేశారు. ఆ దిశగా జరిగే ప్రయత్నాలకు భారత్ అన్నివిధాలా మద్దతుగా నిలుస్తుందని మోదీ స్పష్టం చేశారు. అధినేతలతో చర్చలు ఫలప్రదంగా సాగినట్టు ఎక్స్ పోస్టుల్లో ఆయన వెల్లడించారు. పశ్చిమాసియా విషయమై ఆందోళనలతో వారంతా ఏకీభవించినట్టు తెలిపారు. ‘‘అబ్దుల్లా–2, తారిఖ్తో చర్చల సందర్భంగా జోర్డాన్, ఒమన్ ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపా. ఇంధన వనరులపై దాడులను ఖండించా’’అని తెలిపారు. గత ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఒమన్, జోర్డాన్ అధినేతలతో మోదీ సంభాషించడం ఇది రెండోసారి.పాక్ నైజమే అంత: భారత్న్యూఢిల్లీ: అణ్వాయుధాల వ్యాప్తికి, అధునాతన క్షిపణి వ్యవస్థల విస్తరణకు పాకిస్తాన్ గుట్టుచప్పుడు కాకుండా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉందంటూ ఒక నివేదికలో అమెరికా నిఘా వర్గాలు వెలిబుచ్చిన ఆందోళనతో భారత్ ఏకీభవించింది. ‘‘ఇలాంటి వేషాలు పాక్కు కొత్త కాదు. ఆ దేశం నైజమే అంత’’ అంటూ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్«దీర్ జైస్వాల్ గురువారం ఎద్దేవా చేశారు. ‘‘ప్రపంచానికి పాక్ ఎంత ప్రమాదకరమో అందరికీ తెలుసు. అమెరికా నివేదిక ఆ వాస్తవాన్ని మరోసారి అందరి ముందూ ఉంచంది’’ అని అభిప్రాయపడ్డారు. -
ఇరాన్ ఆయువుపట్టు.. సౌత్ పార్స్
సౌత్ పార్స్. ఇరాన్ ఇంధన అవసరాలు తీర్చే అత్యంత కీలకమైన సహజవాయువు క్షేత్రం. తాజాగా ఈ క్షేత్రంపై అమెరికా దాడి చేయడంతో ఇరానియన్లకు ఒక్కసారిగా విద్యుత్ కష్టాలు వచ్చిపడ్డాయి. శీతాకాలంలో ఇళ్లను వెచ్చగా ఉంచే హీటింగ్ వ్యవస్థలు మొదలు పరిశ్రమల్లో ముడిసరుకు దాకా ఇదే సౌత్ పార్స్ నుంచి సరఫరా అయ్యే సహజవాయువునే ఇరాన్లో ఉపయోగిస్తున్నారు. దీంతో సౌత్ పార్స్ క్షేత్రం ఇరాన్కు ఎంతటి కీలకమైందనే అంశం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. వేల కిలోమీటర్లలో విస్తరించి.. పర్షియన్ గల్ఫ్లో ఉన్న ఈ సహజవాయు క్షేత్రం ప్రపంచంలోనే అతిపెద్దది. ఇది ఇరాన్లోని అసలూయే నగరానికి సమీపంలో పర్షియన్ గల్ఫ్ సముద్రతీరంలో ఏకంగా 9,700 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఐదు దశాబ్దాల క్రితం ఇక్కడ సహజవాయువు నిల్వలను తొలిసారిగా కనుగొన్నారు. ఇంతటి భారీ నిల్వలను సొంతంగా ప్రాసెసింగ్ చేసి, నిల్వ చేసి, వ్యాపారంచేసే శక్తిసామర్థ్యాలు ఇరాన్కు లేవు. దీంతో పొరుగుదేశం ఖతర్ను సాయం కోరింది. దీంతో ఖతర్, ఇరాన్లు సంయుక్తంగా గ్యాస్ఫీల్డ్ను అభివృద్ధి చేశాయి. ఇరాన్ ప్రధానభూభాగం వైపు ఉన్న క్షేత్రాన్ని సౌత్ పార్స్గా, మిగతా క్షేత్రాన్ని నార్త్ ఫీల్డ్గా పిలుస్తున్నారు. నార్త్ ఫీల్డ్ను ఖతర్ నిర్వహిస్తోంది. మొత్తం సహజవాయు క్షేత్రంలో 33 శాతం భూభాగాన్నే సౌత్ పార్స్గా పిలుస్తారు. దీని మీదనే అమెరికా దాడిచేసింది. ఇరాన్ 80 శాతం దేశీయ నేచురల్ గ్యాస్ అవసరాలను సౌత్ పార్స్ క్షేత్రమే తీరుస్తోంది. అమెరికా, రష్యా, చైనా తర్వాత ద్రవరూప సహజవాయువును అత్యధికంగా ఉపయోగిస్తున్న దేశం ఇరానే. ఇరాన్ ఈ క్షేత్రంలో తయారైన లిక్విడ్ నేచురల్ గ్యాస్(ఎల్ఎన్జీ)తోనే దేశవ్యాప్తంగా విద్యుత్ను తయారుచేస్తోంది. శీతాకాలంలో గడ్డకట్టే చలి నుంచి రక్షణ కోసం ఇళ్లను వేడిచేసే హీటింగ్వ్యవస్థలకు ఈ గ్యాసే ప్రాణాధారం. ఇరాన్ పరిశ్రమల్లో ముడిపదార్థంగానూ ఇదే గ్యాస్ అక్కరకొస్తోంది. దేశ ఇంధన జీవనాడిగా మారిన సౌత్ పార్స్పై అమెరికా దాడులతో ఇరాన్ ఇంధన కష్టాలు అనూహ్యంగా పెరిగిపోయాయి. తమ ప్రాణాధార వ్యవస్థ మీదనే దాడులు జరగడంతో ఇరాన్ ఇకపై మరింతగా దాడులతో చెలరేగిపోయే ప్రమాదముందని ఇంధన నిఘా సంస్థ ‘మాంటెల్ న్యూస్’లో భౌగోళిక రాజకీయ విశ్లేషకుడు ఆండ్రిస్ కాలా చెప్పారు. కొంత ఎల్ఎన్జీని ఇరాక్కూ ఇరాన్ సరఫరాచేస్తోంది. వాస్తవానికి ఎల్ఎన్జీని ఎగుమతి చేసేందుకు ఇరాన్ మూడు ప్రాజెక్టులను తీసుకొచ్చినా అమెరికా అంతర్జాతీయ ఆంక్షల కారణంగా అవి కార్యరూపం దాల్చలేదు – సాక్షి, నేషనల్ డెస్క్ -
రస్ లఫాన్.. ఇండియాకు కీలకం
ఖతర్ పాలకుల దార్శనికతకు ప్రత్యక్ష రూపమే రస్ లఫాన్ సహజవాయు క్షేత్రం. వేల కోట్ల రూపాయల పెట్టుబడితో అత్యంత అధునాతన సాంకేతికతతో సృష్టించిన అతిపెద్ద సహజవాయు ప్రాసెసింగ్ కర్మాగారంగా ‘రస్ లఫాన్ ఇండ్రస్టియల్ సిటీ’ ప్రఖ్యాతిగాంచింది. ఖతార్, ఇరాన్ మధ్యలోని పర్షియన్ గల్ఫ్ సముద్రగర్భంలో సహజవాయు నిక్షేపాలను కనుగొనేందుకు 1996లో రస్ లఫాన్ ఇండ్రస్టియల్ సిటీని నిర్మించారు. వీళ్ల ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. 1970 దశకంలో అపార సహజవాయు నిక్షేపాలను ఇక్కడి సముద్రగర్భంలో కనుగొన్నారు. ఇరాన్తో కలిసి గ్యాస్క్షేత్రాన్ని అభివృద్ధిచేసి ఖతర్ తన వాటాగా నార్త్ ఫీల్డ్ను తీసుకుంది. దీనినే నార్త్ డోమ్ అని కూడా పిలుస్తారు. ప్రపంచ 20 శాతం ద్రవరూప సహజవాయు అవసరాలను రస్ లఫాన్ క్షేత్రమే తీరుస్తోంది. తమ అ«దీనంలోని 900 ట్రిలియన్ల ఘనపు చదరపు అడుగుల (టీసీఎస్ఎఫ్) మేర సహజవాయువును రస్ లఫాన్ కాంప్లెక్స్ ద్వారా ఖతార్ ప్రాసెస్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇక్కడే భారీ నౌకలను నిలిపేందుకు వీలుగా ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ నౌకాశ్రయాన్ని నిర్మించారు. దీంతో సీఎన్జీ కంటైనర్ షిప్లు నేరుగా ప్రాసెసింగ్ ప్లాంట్ల దాకా వచ్చి సరుకు నింపుకుని పయనమవుతాయి. ఇక్కడి నుంచి డజన్లకొద్దీ దేశాలకు ఎల్ఎన్జీ ఎగుమతి అవుతోంది. ఖతర్కు కాసుల వర్షం కురిపిస్తున్న ఈ నేచురల్ గ్యాస్ ఫీల్డ్ ప్రత్యక్షంగా భారత ద్రవరూప సహజవాయువు అవసరాలను తీరుస్తోంది. దోహా నగరానికి 80 కిలోమీటర్ల దూరంలోని ఈ పారిశ్రామిక నగరమే భారత 45 శాతం లిక్విడ్ నేచురల్ గ్యాస్ అవసరాలను తీరుస్తోంది. ఖతర్ ఆర్థికవ్యవస్థ పునాదులను పెకళించేందుకు ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలు పరోక్షంగా భారత్కు కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఎరువులు, సీఎన్జీ, పీఎన్జీ అంతా ఇక్కడే.. భారత్లో దాదాపు 45 శాతం ఎరువుల తయారీ, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ), పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) అవసరాలు తీరాలంటే రస్ లఫాన్ క్షేత్రం నుంచి ద్రవరూప సహజవాయువు రావాల్సిందే. భారత్లో 34 శాతం ఎరువుల తయారీతోపాటు వాహనాల్లో సీఎన్జీకి, గృహావసరాలు తీర్చే పీఎన్జీకి రస్ లఫాన్ నుంచి దిగుమతి చేసుకునే ద్రవరూప సహజవాయవునే ఉపయోగిస్తున్నారు. పరిశ్రమల్లో పెట్రోరసాయనాల తయారీకి సైతం ఇదే ఎల్ఎన్జీ అవసరం. కొంతమేర భారత విద్యుత్ అవసరాలనూ ఇదే గ్యాస్ తీరుస్తోంది. అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచి పోలిస్తే భారత్ రస్ లఫాన్ క్షేత్రం నుంచి ఎల్ఎన్జీ దిగుమతి చేసుకోవడమే అత్యంత చవకైన వ్యవహారం. అందుకే భారత్ దీనిపైనే అధికంగా ఆధారపడుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దాడులు నిలిపివేస్తాం.. నెతన్యాహు ప్రకటన
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థన మేరకు ఇరాన్ గ్యాస్ ఫీల్డ్పై దాడులను నిలిపివేస్తామని ప్రకటించారు. తాజాగా జెరూసలేంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ట్రంప్ ఇరాన్ గ్యాస్ ఫీల్డ్పై దాడులను నిలిపి వేయమని కోరారు. మేము ఆయన అభ్యర్థనను గౌరవిస్తున్నామని అన్నారు. ఇరాన్ గ్యాస్ ఫీల్డ్పై దాడి విషయంలో అమెరికాకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, ఇజ్రాయెల్ ఒంటరిగానే ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. అలాగే ఈ దాడికి ఖతర్కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై ఇజ్రాయెల్ దాడిని ట్రంప్ ఖండించిన తర్వాత నెతన్యాహు ఈ ప్రకటన చేశారు.ఇజ్రాయెల్ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఖతర్లోని ఎల్ఎన్జీ ప్లాంట్పై క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడిలో ఎల్ఎన్జీ ప్లాంట్ భారీగా దెబ్బతింది. ఈ దాడులు ఇంధన ధరలను పెంచి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఇప్పటికే హర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యం కొనసాగుతుండటంతో, ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు ప్రభావితమవుతోంది.ఈ పరిణామాలతో ఓ మెట్టుదిగినట్లు కనిపిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై దాడి చేయడం ముమ్మాటికి తప్పేనని తెలిపింది. భవిష్యత్తులో సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై దాడులు చేయరాదని ఇజ్రాయెల్ను కోరింది. ఈ అభ్యర్ధన మేరకే నెతన్యాహు దాడులు నిలిపేస్తామని ప్రకటించారు.సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై ఇజ్రాయెల్ దాడులను ఆపాలని కోరిన ట్రంప్.. ఇరాన్కు సైతం తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్ దాడి చేసిందని ఖతర్పై మరోసారి దాడి చేస్తే ఊహకందని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రూత్ వేదికగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. -
రస్ లఫాన్ క్షేత్రంపై ఇరాన్ దాడులు!
దుబాయ్: పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ ఇంధన భద్రతను నానాటికీ పెను ప్రమాదంలోకి నెడుతోంది. ఇరాన్లోని సౌత్ పార్స్ సహజవాయు క్షేత్రంపై చేసిన ఇజ్రాయెల్ దాడి తీవ్ర విపరిణామాలకు దారి తీస్తోంది. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్ గురువారం గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలన్నింటికీ నిప్పు పెట్టే ప్రయత్నం చేసింది! ఖతర్, సౌదీ అరేబియా, కువైట్, అబుదాబి సహా పలుచోట్ల చమురు, సహజవాయు క్షేత్రాలపై ఎడాపెడా క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా పెను కల్లోలం చెలరేగింది. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఎల్ఎన్జీ క్షేత్రమైన ఖతర్లోని రస్ లఫాన్ ఇరాన్ దాడుల్లో భారీగా దెబ్బ తిన్నది. అక్కడి ఉత్పత్తి కేంద్రాల్లో 17 శాతం మేరకు బుగ్గిపాలైనట్టు ఖతర్ ప్రకటించింది. ‘‘ఇది అంచనాలకు అందనంతటి భారీ నష్టమిది! దీన్నుంచి కోలుకునేందుకు కనీసం మూడు నుంచి ఐదేళ్ల సమయం, రూ.2.4 లక్షల కోట్ల (26 బిలియన్ డాలర్ల) నిధులు అవసరం!’’ అని ఖతర్ ఎనర్జీ సీఈఓ సాద్ అల్ కాబి పేర్కొన్నారు! భారత ఎల్ఎన్జీ అవసరాలను సగానికి సగం రస్ లఫాన్ క్షేత్రమే తీరుస్తోంది. దాంతో ఈ దాడి ప్రభావం మనపై తీవ్రంగా ఉండనుంది!! సౌదీ అరేబియాలో ఎర్రసముద్ర తీరంలో రేవు పట్టణం యన్బులో ఉన్న సమ్రెఫ్ చమురు కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడికి దిగింది. అరాంకోలో భాగమైన ఆ క్షేత్రంలో భారీగా మంటలు చెలరేగాయి. నష్ట తీవ్రతను అంచనా వేస్తున్నట్టు సౌదీ రక్షణ శాఖ పేర్కొంది. ‘‘ఇరాన్ తీరుతో విసిగిపోయాం. మా ఓపికకూ హద్దుంటుంది! పరిస్థితి చేయి దాటితే ఇరాన్పై యుద్ధంలోకి మేమూ ప్రవేశించాల్సి వస్తుంది’’ అంటూ సౌదీ రాకుమారుడు, విదేశాంగ మంత్రి ఫైసల్బిన్ ఫర్హాన్ అల్ సౌద్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘‘తిరుగులేని ఆయుధ సామర్థ్యం, యుద్ధ సన్నద్ధత సౌదీ, దాని భాగస్వామ్య దేశాల సొంతం. అవసరమైతే వాటిని ఇరాన్పై ప్రయోగించేందుకు ఏమాత్రమూ వెనకడబోమని గుర్తుంచుకుంటే మంచిది’’ అని హితవు పలికారు. ఇరాన్ డ్రోన్లు కువైట్లో కూడా అల్ అహ్మదీ, మైనా అబ్దుల్లా చమురు క్షేత్రాలకు, యూఏఈ, అబుదాబిల్లోనూ పలు సహజవాయు కేంద్రాలకు నష్టం కలిగించాయి. తమ ఇంధన వ్యవస్థలపై దాడులకు దిగి ఇజ్రాయెల్ దిద్దుకోలేనంత పెద్ద తప్పు చేసిందని ఇరాన్ ఐఆర్జీసీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ‘‘నిజానికి పొరుగు దేశాల ఇంధన క్షేత్రాలపై దాడులు చేసే యోచనే మాకు లేదు. కానీ మా ఇంధన వ్యవస్థలపై ఇజ్రాయెల్, అమెరికా దాడులతో యుద్ధం మరో స్థాయికి చేరింది. అందుకే గల్ఫ్ దేశాల ఇంధన వ్యవస్థలపై మేమూ దాడులకు దిగాం. మా ఇంధన వ్యవస్థలపై మరోసారి దాడులు జరిగితే గల్ఫ్ దేశాల్లోని సదరు వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసి తీరతాం’’ అంటూ హెచ్చరించింది! రస్ లఫాన్పై దాడుల పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దానిపై మళ్లీ దాడికి దిగితే కనీవినీ ఎరగని స్థాయి దాడులతో సౌత్ పార్స్ సహజవాయు క్షేత్రాన్ని పూర్తిగా బుగ్గిపాలు చేసేస్తామని ఇరాన్ను తీవ్రంగా హెచ్చరించారు. సౌత్ పార్స్పై ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేయబోదని అధ్యక్షుడు హామీ ఇచ్చారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండిస్తూ 12 అరబ్, ఇస్లామిక్ దేశాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. ‘‘దాడులను ఇరాన్ తక్షణం మాను కోవాలి. లేదంటే స్వీయరక్షణ చేసుకునే హక్కు గల్ఫ్ దేశాలకు ఉంటుంది’’ అని హెచ్చరించాయి. నౌకలు, ఇంధన వ్యవస్థలపై ఇరాన్ దాడులను జపాన్తో పాటు పలు యూరప్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. రస్ లఫాన్పై దాడికి నిరసనగా ఇరాన్ దౌత్య కార్యాలయంలోని అధికారులంతా 24 గంటల్లోపు దేశం వీడాలని ఖతర్ ఆదేశించింది. తాజా పరిణామాలో చమురు ధరలు మరింతగా భగ్గుమన్నాయి. గురువారం బ్యారెల్ ధర 119 డాలర్ల దాకా ఎగబాకింది! ఇరాన్ జలాంతర్గాములు ఖతం! ఇరాన్ జలాంతర్గాములన్నింటినీ ధ్వంసం చేసినట్టు అమెరికా ప్రకటించింది. ఆ దేశం వద్ద ఉన్న 11 జలాంతర్గాములనూ బుగ్గిపాలు చేసినట్టు రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. ఇరాన్ పౌర, సైనిక నేతలందరినీ లక్ష్యం చేసుకున్నట్టు స్పష్టం చేశారు. హార్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ పడవలపై అమెరికా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించినట్టు అమెరికా ప్రకటించింది. ఇరాన్ భూగర్భ ఆయుధ నిల్వ కేంద్రాలపై 5,000 పౌండ్ల బరువైన భారీ బాంబులు వేసినట్టు జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ వెల్లడించారు. మరోవైపు, కాస్పియన్ సముద్రంలో పలు ఇరాన్ లక్ష్యాలపై తొలిసారి దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఒక నౌకాశ్రయం, పలు నౌకలు, కమాండ్ సెంటర్పై క్షిపణుల వర్షం కురిపించినట్టు వెల్లడించింది. అంతేగాక టెహ్రాన్తో సహా ఇరాన్వ్యాప్తంగా ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడుల పరంపర గురువారం కూడా తీవ్రస్థాయిలో కొనసాగింది. కొన్ని వందల లక్ష్యాలను క్షిపణులు, బాంబులతో ధ్వంసం చేసినట్టు ఇరు దేశాలు ప్రకటించాఇయి. ఇజ్రాయెల్పైనా దాడులు ఇజ్రాయెల్పై కూడా ఇరాన్ గురువారం ఎడాపెడా దాడులకు దిగింది. దాంతో జెరూసలేం, టెల్ అవీవ్తో పాటు పలు నగరాల్లో జనం భారీ సంఖ్యలో బంకర్లకేసి పరుగులు తీశారు. చాలాచోట్ల భవనాలు భారీగా దెబ్బ తిన్నాయి. ఉత్తర ఇజ్రాయెల్లో కీలకమైన విద్యుత్ గ్రిడ్ బాగా క్షిపణి దాడుల్లో దెబ్బ తిన్నట్టు ఇంధన మంత్రి ఎలీ కోహెన్ చెప్పారు. హైఫియా నగరంలో చమురు రిఫైనరీకి కూడా దాడుల్లో నష్టం జరిగింది. అక్కడినుంచి భారీగా పొగ వెలువడుతున్న దృశ్యాలను ఇజ్రాయెల్ మీడియా ప్రసారం చేసింది. లెబనాన్లో 1,000 దాటిన మృతులు లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. తమ దేశంలో ఇప్పటిదాకా మృతుల సంఖ్య 1,000, నిర్వాసితుల సంఖ్య 10 లక్షలు దాటినట్టు ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. లెబనాన్లో 500 మందికి పైగా హెజ్బొల్లా ఉగ్రవాదులను మట్టుపెట్టినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. పొంచి ఉన్న ఇంటర్నెట్ సంక్షోభం సముద్ర ఇంటర్నెట్ కేబుళ్లను ఇరాన్ కత్తిరిస్తుందా?ఇప్పటికే పశి్చమాసియాలో అమెరికా మిత్రదేశాలపై మిస్సైళ్లతో దాడిచేస్తున్న ఇరాన్ ఇకపై హార్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న సముద్రగర్భ ఇంటర్నెట్ భారీ కేబుళ్లను కత్తిరిస్తుందా? అనే ప్రశ్న ఇప్పుడు ఆయా కేబుళ్లపై ఆధారపడిన దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. నిజంగానే ఇరాన్ కేబుళ్ల కత్తిరింపు పర్వానికి తెరలేపితే మళ్లీ కేబుళ్ల పునరుద్ధరణకు వారాలు లేదా నెలల సమయం పడుతుందని అంతర్జాతీయ కేబుల్ నెట్వర్క్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ డిజిటల్ గుండెకు ఈ సముద్రకేబుళ్లను కవాటాలుగా చెప్పొచ్చు. పలు దేశాల బ్యాంకింగ్, ఆర్థిక లావాదేవీలు, మెయిళ్లు, కృత్రిమమేధ సేవలు, వీడియో కాల్స్కు సంబంధించిన డేటా మొత్తం ఈ కేబుళ్ల ద్వారానే బదిలీ అవుతోంది. యూరప్, ఆసియా, ఆఫ్రికా దేశాల మధ్య ఇంటర్నెట్ వారధులుగా ఈ సముద్ర కేబుళ్లు ఖ్యాతిగాంచాయి. హార్మూజ్, ఎర్ర సముద్రం గుండా దాదాపు 17 భారీ ఇంటర్నెట్ కేబుళ్లు వెళ్తున్నాయి. ఏఏఈ–1, ఫాల్కన్, ‘గల్ఫ్ బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ కేబుల్ సిస్టమ్’, ‘టాటా–టీజీఎన్ గల్ఫ్ కేబుల్’వంటి పలు కేబుళ్లు పర్షియన్ గల్ఫ్ జలాల గుండా వెళ్తున్నాయి. ఇవన్నీ భారత విదేశీ డేటా కనెక్షన్లకు కీలకం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాల్లో పెద్ద డేటా సెంటర్లను నెలకొల్పేందుకు అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థలు వేలకోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నాయి. ఇక్కడి డేటా సెంటర్లను విదేశాల్లోని వినియోగదారులు, మార్కెట్లతో అనుసంధానించి గల్ఫ్దేశాలను భవిష్యత్లో ఏఐ కేంద్రాలుగా మార్చాలని ఆశిస్తున్నాయి. వీటికి ఇవే కేబుళ్లు ప్రాణాధారం. ఇప్పుడు ఈ కేబుళ్లను ఇరాన్ సముద్ర మందుపాతరలతో నాశనంచేస్తే వెంటనే పునరుద్ధరించడం కష్టం. కొత్త కేబుళ్లు అమర్చేందుకు ప్రత్యేక నౌకలు పర్షియన్ గల్ఫ్ జలాల్లో అడుగుపెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడున్న ఉద్రిక్త పరిస్థితుల్లో అవి రావడం దాదాపు అసాధ్యం. దీంతో పునరుద్ధరణ పనులు ఆగిపోయి వారాలు లేదా నెలల తరబడి ఈ మార్గంలో డిజిటల్ లావాదేవీలు, డేటా బదిలీ ఆగిపోయే ప్రమాదముందని కేబుల్ సేవాలరంగ సంస్థ ‘టెలీజియోగ్రఫీ’లో నిపుణుడు అలాన్ మౌల్దీన్ చెప్పారు. ఇరాన్పై యుద్ధం కోసం... రూ.18.5 లక్షల కోట్లుపెంటగాన్ అభ్యర్థన వాషింగ్టన్: ఇరాన్పై యుద్ధం నిమిత్తం ఏకంగా మరో రూ.18.5 లక్షల కోట్ల (200 బిలియన్ డాలర్ల) అదనపు నిధులు కావాలని అమెరికా అంచనా వేసింది! వాటిని విడుదల చేయాల్సిందిగా కాంగ్రెస్ను పెంటగాన్ అభ్యరి్థంచింది. ఈ మేరకు వైట్హౌస్కు ఇప్పటికే లేఖ పంపినట్టు వాషింగ్టన్ పోస్ట్ వార్తా సంస్థ నివేదించింది. దీనిపై మీడియా ప్రశ్నలకు రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ నేరుగా బదులివ్వలేదు. దుష్ట నిర్మూలనకు నిధులు కావాల్సిందేనంటూ సరిపెట్టారు. ఇంత భారీ నిధులకు కాంగ్రెస్ ఆమోదం అనుమానమే.దీనిపై ట్రంప్ సర్కారుకు చట్టసభ నుంచి పలు ప్రశ్నలు ఎదురవడం ఖాయమని భావిస్తున్నారు. యూఏఈ నుంచి ‘యాపిల్’ ఔట్?పశి్చమాసియా ఉద్రిక్తతల కారణంగా దిగ్గజ సంస్థ యాపిల్ తన ఐఫోన్ల నిల్వ కేంద్రాన్ని యూఏఈ నుంచి తరలిస్తోంది. యాపిల్కు భారత్లో భారీ ఐఫోన్ తయారీ కేంద్రమున్న విషయం తెలిసిందే. వాటిని అమెరికాకు రవాణా చేసే క్రమంలో దుబాయ్ అతి పెద్ద నిల్వ కేంద్రంగా ఉపయోగపడుతోంది.గల్ఫ్కు భారత యుద్ధనౌకలు హార్మూజ్ను దాటేందుకు ఎదురుచూస్తున్న తన నౌకల రక్షణ నిమిత్తం భారత్ మరిన్ని యుద్ధ నౌకలను గల్ఫ్ తీరానికి తరలిస్తోంది. నావికాదళం ఇప్పటికే ఆరుకు పైగా యుద్ధ నౌకలను మోహరించినట్టు తెలుస్తోంది. హార్మూజ్ వద్ద 22 భారత నౌకలు చిక్కుబడి ఉండటం తెలిసిందే. వీటిలో సగానికి పైగా చమురు, ఎల్పీజీ నిల్వలతో కూడినవే.అమెరికా విమానం కూల్చివేత! ఇరాన్ గురువా రం అమెరికా ఎఫ్–35 యుద్ధ విమానాన్ని కూల్చేసినట్టు తెలుస్తోంది! ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచీ అగ్ర రాజ్య ఫైటర్ జెట్ను ఇరాన్ కూల్చడం ఇదే తొలిసారి కావడం విశేషం. మరోవైపు, ఇరాన్పై అణ్వస్త్ర దాడికి అమెరికా యోచన చేస్తోందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. -
మైనర్లపై వేధింపులు.. అమెరికాలో తెలుగు యువకుడి అరెస్ట్
అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్రంలో మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని ఆన్లైన్ వేధింపులకు పాల్పడుతున్న ముఠాను శాంటా ఫే పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేయగా, అందులో ఒకరు తెలుగు రాష్ట్రాలకు చెందిన 26 ఏళ్ల బల్కం నాగరాజుగా గుర్తించారు. పోలీసుల ప్రత్యేక విభాగం (Special Victims Unit) ఆన్లైన్లో మైనర్లుగా నటిస్తూ ఈ అండర్కవర్ ఆపరేషన్ చేపట్టారు. పోలీసులు నాగరాజును అదుపులోకి తీసుకుంటున్న వీడియో సోషల్మీడియాలో వైరలవుతోంది.నాగరాజుపై అమెరికా చట్టాల ప్రకారం కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇలాంటి కేసులు అమెరికాలో అత్యంత కఠినంగా పరిగణించబడతాయి. మైనర్లకు సంబంధించిన నేరాలు అక్కడి చట్టవ్యవస్థలో చాలా తీవ్రమైనవిగా భావించబడతాయి. ఇలాంటి కేసులో ఇరుక్కుంటే, అది కేవలం అరెస్టుతో ముగియదు. బెయిల్ దొరకడం చాలా కష్టం. దీర్ఘకాలికంగా విచారణలు కొనసాగుతాయి. వీసా రద్దు, డిపోర్టేషన్, శాశ్వత నిషేధం వంటి పరిణామాలు ఎదురవుతాయి. భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది. -
ఇదీ ఏఐ ప'వార్'!
సాక్షి, స్పెషల్ డెస్క్: ఉక్రెయిన్ మొదలు పశ్చిమ ఆసియా వరకు జరుగుతున్న యుద్ధాలలో సైన్యాలు కేవలం డేటా విశ్లేషణకే పరిమితం కాకుండా తమ లక్ష్యాలను వేగంగా గుర్తించడానికి, కదన రంగ సమాచారాన్ని విశ్లేషించడానికి, మిషన్ ప్లానింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడుతున్నాయి. అత్యంత శక్తివంతమైన ఆయుధంగా కొత్త సాంకేతికత ఉపయోగ పడుతోంది. దీనివల్ల కేవలం తెర వెనుక ఉండి సమాచారా న్ని విశ్లేషించే స్థాయి నుండి నేరుగా యుద్ధ రంగంలోకి ఏఐ ప్రవేశించినట్టయింది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డేటా ప్రకారం.. 2024లో ప్రపంచ సైనిక వ్యయం 9.4% పెరిగి రికార్డు స్థాయిలో 2.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. సైనిక ఖర్చులో ఇంతటి భారీ పెరుగుదల ఇదే మొదటిసారి. ప్రభుత్వా లు ఏఐ ఆధారిత ఆయుధాలు, సైబర్ వార్ఫేర్ సిస ్టమ్స్, శాటిలైట్స్, అటానమస్ డ్రోన్ల కోసం బిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు చేస్తున్నాయి. 2015 నుండి 2024 మధ్య సైనిక వ్యయం 37% పెరగడం గమనార్హం. దేశాల వారీగా సైనిక, ఏఐ వ్యయాలు..1. అమెరికా: మొత్తం బడ్జెట్ 997 బిలియన్ డాలర్లు (జీడీపీలో 3.40%). 2026 బడ్జెట్లో యుద్ధ పరికరాల కొనుగోళ్లు, పరిశోధన కోసం 384 బిలియన్ డాలర్లు కేటాయించారు. అటానమస్, మానవరహిత వ్యవస్థల కోసం ప్రత్యేకంగా 9.8 బిలియన్ డాలర్లు కేటాయించారు.2. చైనా: మొత్తం బడ్జెట్ 314 బిలియన్ డాలర్లు (జీడీపీలో 1.70%). 2024లో పరిశోధన కోసం చేసిన ఖర్చు 785.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది మొదటిసారి అమెరికా కంటే ఎక్కువ. బైడూ, అలీబాబా వంటి పౌర సంస్థల ఏఐ సాంకేతికతను నేరుగా సైనిక వ్యవస్థల్లోకి అనసంధానిస్తున్నారు. మిలిటరీ గ్రేడ్ ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి కంప్యూట్ క్లస్టర్ల కోసం 70 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నారు.3. రష్యా: మొత్తం బడ్జెట్: 149 బిలియన్ డాలర్లు (జీడీపీలో 6–7%). ఏఐ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టితో 10 ఏళ్ల కాలానికి రక్షణ రంగ ఆధునీకరణ ప్రణాళికను ప్రవేశపెట్టింది.4. భారత్: మొత్తం బడ్జెట్: 93.5 బిలియన్ డాలర్లు (జీడీపీలో 2.40%). పరిశోధన, అభివృద్ధి కోసం రూ.29,100 కోట్లు కేటాయించారు. డీఆర్డీఓ, ఇండియన్ నేవీ కలిసి ‘మిషన్ సుదర్శన్ చక్ర’అనే ఏఐ ఆధారిత వాయు రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాయి.యుద్ధ రంగంలో కృత్రిమ మేధ వినియోగం..1. ఇజ్రాయెల్–గాజా సంఘర్షణ: ది గోస్పెల్ (హబ్సొరా): ఇది ఒక ఆటోమేటెడ్ టార్గెట్ సిస్టమ్. మానవ మేధస్సు కంటే 50 రెట్లు వేగంగా భవనాలను, మౌలిక సదుపాయాలను గుర్తించగలదు. లావెండర్: సోషల్ మీడియా సంబంధాలు, సమాచారం ఆధారంగా తీవ్రవాదులుగా అనుమానిస్తున్న వ్యక్తులను గుర్తించడానికి దీనిని ఉపయోగిస్తారు. వేర్ ఈజ్ డాడీ?: లావెండర్ గుర్తించిన వ్యక్తులు వారి ఇళ్లకు, నిర్దేశిత ప్రాంతానికి చేరుకున్నప్పుడు సైనిక అధికారులకు సమాచారం ఇచ్చే ట్రాకింగ్ సాధనం. స్మార్ట్ షూటర్స్: డ్రోన్లను అడ్డుకోవడంలో సహాయపడే ఏఐ ఆధారిత గన్–సైట్స్. 2. ఉక్రెయిన్–రష్యా యుద్ధం: అటానమస్ డ్రోన్లు: రష్యన్ జీపీఎస్ జామింగ్ను అధిగమించి లక్ష్యాలను గుర్తించి దాడి చేయడానికి వీటిని వాడుతున్నారు. మానవరహిత భూ వాహనాలు: సామాగ్రి సరఫరా, సైనికుల తరలింపు, ప్రత్యక్ష యుద్ధం కోసం ఆయుధాలు కలిగిన రోబోలను రంగంలోకి దించారు. డెల్టా సిస్టమ్: ఇది ఉక్రెయిన్ ప్రధాన యుద్ధరంగ కంప్యూటర్ వ్యవస్థ. ఉపగ్రహాలు, డ్రోన్లు, క్షేత్రస్థాయి నివేదికల నుండి వచ్చే భారీ డేటాను విశ్లేషించి అధికారులకు రియల్ టైమ్ లక్ష్యాల జాబితాను అందిస్తుంది. 3. వెనిజులానికోలస్ మదురోను పట్టుకోవడానికి కారకాస్లో జరిగిన దాడులను సమన్వయం చేయడానికి ఆంథ్రోపిక్ క్లౌడ్ ఏఐని (పలాంటిర్ ఐటీ కంపెనీ ద్వారా) యూఎస్ మిలిటరీ ఉపయోగించినట్లు నివేదికలు చెబుతున్నాయి. 4. ఇరాన్ (ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ): కేవలం ఒక్క వారంలోనే 3 వేల కంటే ఎక్కువ లక్ష్యాలను గుర్తించడానికి ప్రాజెక్ట్ మావెన్, క్లౌడ్ ఏఐని ఉపయోగించారు. -
హ్యాపినెస్లో భారత్ స్థానం ఎంతో తెలుసా..?
వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్ 2026 మార్చి 19న విడుదలైంది. ఈ నివేదికలో ఫిన్లాండ్ వరుసగా తొమ్మిదో ఏడాది ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా నిలిచింది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ రూపొందించిన ఈ నివేదికలో జీవన సంతృప్తి, సామాజిక మద్దతు, అవినీతి తక్కువ స్థాయిలు వంటి అంశాలు ప్రధానంగా పరిగణించబడ్డాయి.ఫిన్లాండ్ తరువాతి స్థానాల్లో ఐస్లాండ్ రెండో స్థానంలో, డెన్మార్క్ మూడో స్థానంలో నిలిచాయి. లాటిన్ అమెరికా దేశమైన కోస్టా రికా నాలుగో స్థానాన్ని సాధించడం విశేషం. ఇది ఆ దేశానికి ఇప్పటివరకు వచ్చిన అత్యుత్తమ ర్యాంక్. స్వీడన్, నార్వే, నెదర్లాండ్స్, ఇజ్రాయెల్, లక్సెంబర్గ్, స్విట్జర్లాండ్ వరుసగా టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. భారత్ ఎక్కడ..?ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన 147 దేశాల జాబితాలో భారత్ 116 స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఈసారి రెండు స్థానాలు మెరుగుపడింది. 2025లో ఈ జాబితాలో భారత్ 118 స్థానంలో ఉండింది.చిట్టచివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్అతి తక్కువ సంతోషకరమైన దేశాల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ చిట్టచివరి స్థానంలో నిలిచింది. ఆ దేశం 147వ స్థానానికి పరిమితం కాగా.. దానికి ముందు స్థానాల్లో నియెర్రా లియోన్, మాలావీ, జింబాబ్వే, బోట్స్వానా వంటి దేశాలు ఉన్నాయి.అమెరికాలో సంతోషం క్రమంగా తగ్గిపోతుంది..!వరల్డ్ హ్యాపినెస్ రిపోర్ట్ 2026లో అమెరికా 23వ స్థానంలో నిలిచింది. గత కొద్ది రోజులుగా ఈ జాబితాలో అమెరికా ర్యాంక్ క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. 2022లో 15వ స్థానంలో ఉండిన ఆ దేశం.. నాలుగేళ్లు తిరిగేసరికి 8 స్థానాలు దిగజారి 23వ స్థానానికి పడిపోయింది.ఈ జాబితాలో అమెరికా సహా ఇంగ్లీష్ మాట్లాడే దేశాలు ఒక్కటి కూడా టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయాయి. నార్డిక్ దేశాలు మళ్లీ అగ్రస్థానాలను ఆక్రమించాయి. ఈ దేశాల్లో సామాజిక మద్దతు, సమానత్వం, ప్రజాస్వామ్య విలువలు, తక్కువ అవినీతి వంటి అంశాలు ప్రజల సంతోషాన్ని పెంచుతున్నాయని నిర్ధారించబడింది. కోస్టా రికా లాంటి దేశాలు పర్యావరణ పరిరక్షణ, సామాజిక ఐక్యత, సాంస్కృతిక విలువలతో సంతోష సూచీలో గణనీయమైన పురోగతి సాధించాయి. అమెరికా, భారత్ వంటి పెద్ద దేశాలు సంతోష సూచీలో వెనుకబడటానికి ఆర్థిక ఒత్తిళ్లు, సామాజిక విభజన, రాజకీయ అస్థిరత వంటి అంశాలు కారణంగా కనిపిస్తున్నాయి. ఈ నివేదికలో సోషల్ మీడియా, టెక్నాలజీ ప్రభావం వెల్బీయింగ్పై ఎలా ఉందో ప్రత్యేకంగా విశ్లేషించారు. -
అంత్యక్రియల్లో డ్రోన్ దాడి.. 17 మంది మృతి
సూడాన్లో కొనసాగుతున్న అంతర్యుద్ధం పొరుగు దేశమైన చాద్లోకి వ్యాపించింది. మార్చి 19న జరిగిన ఘటనలో సూడాన్ నుంచి ప్రయోగించిన ఓ డ్రోన్ చాద్లోని టైన్ పట్టణంలో 17 మంది ప్రాణాలను బలిగొంది. స్థానిక నివాసి తెలిపిన వివరాల ప్రకారం.. ఒక ఇంటి వద్ద అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో రెండు పేలుళ్లు సంభవించాయి. వాటి ధాటికి అంత్యక్రియలకు హాజరైన పలువురితో పాటు సమీపంలో ఆడుకుంటున్న పిల్లలు కూడా బలయ్యారు.చాద్ ప్రభుత్వం ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. సూడాన్పై త్వరలోనే ప్రతీకారం తీసుకుంటామని ప్రకటించింది. ఆ దేశ అధ్యక్షుడు మహమత్ ఇడ్రిస్ డెబీ, రాత్రి అత్యవసర సమావేశం నిర్వహించి, సూడాన్ దాడులకు తక్షణమే బదులివ్వాలని సైన్యాన్ని ఆదేశించారు. అవసరమైతే వారి భూభాగంలోనూ ఆపరేషన్లు చేపట్టాలని అన్నారు.మరోవైపు సూడాన్ పారామిలటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) ఈ దాడితో తమకు సంబంధం లేదని ప్రకటించింది. ఈ దాడి సూడాన్ సైన్యం పనేనని వారు ఆరోపించారు. కాగా, సూడాన్లో సైన్యం మరియు RSF మధ్య యుద్ధం 2023 ఏప్రిల్లో ప్రారంభమైంది. ఇప్పటివరకు లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 1.2 కోట్లకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారిలో దాదాపు 10 లక్షల మంది చాద్లోకి శరణార్థులుగా చేరారు. చాద్.. సూడాన్కు సరిహద్దు దేశం. -
దుబాయ్లో ఈద్ వేడుకలు.. కార్మికులకు కార్లు, బంగారు కడ్డీలు
దుబాయ్లోని కార్మికులకు ఈ ఏడాది ఈద్ అల్ ఫితర్ (రంజాన్) వేడుకలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) ఆధ్వర్యంలో మార్చి 20, 21 తేదీల్లో రెండు రోజులపాటు వర్చువల్ ఈవెంట్ నిర్వహించబడుతోంది. ‘ఈద్ అల్ ఫితర్… లెట్స్ సెలబ్రేట్ టుగెదర్’ అనే థీమ్తో జరుగుతున్న ఈ కార్యక్రమం కార్మికుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ వేడుకల్లో పాల్గొనే వారికి కార్లు, బంగారు బార్లు, విమాన టికెట్లు, మొబైల్ ఫోన్లు వంటి విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పించబడుతోంది. మొదటి రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు, రెండవ రోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమం దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఉప ప్రధాని, రక్షణ మంత్రి మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ అయిన షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాల మేరకు నిర్వహించబడుతోంది. దుబాయ్ అభివృద్ధి ప్రయాణంలో కార్మికులు పోషిస్తున్న కీలక పాత్రకు కృతజ్ఞతగా, సమాజంలో ఐక్యతను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. కార్మికులు విస్తృతంగా పాల్గొనేలా ‘బ్లూ కనెక్ట్’ అనే ప్రత్యేక డిజిటల్ ప్లాట్ఫారమ్ ద్వారా ఈ వేడుకలు ప్రసారం చేయబడతాయి. ఇందులో వీడియోలు, ఇంటరాక్టివ్ గేమ్స్, పోటీలు వంటి విభిన్న వినోదాత్మక కంటెంట్ అందుబాటులో ఉంటుంది. GDRFA దుబాయ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ ఒబైద్ ముహైర్ బిన్ సురూర్ మాట్లాడుతూ.. ఈ వేడుకల ద్వారా కార్మికుల కృషిని గౌరవించడం, వారి దైనందిన సహకారాన్ని గుర్తించడం మా లక్ష్యం. ఈద్ ఆనందాన్ని వారితో పంచుకోవడం ద్వారా దుబాయ్ స్థిరమైన అభివృద్ధి ప్రయాణంలో వారి పాత్రను వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నామని అన్నారు. -
ట్రంప్ మాత్రమే ప్రపంచ శాంతిని సాధించగలరు.. జపాన్ ప్రధాని
పశ్చిమాసియాలో యుద్దం పతాకస్థాయికి చేరిన వేల జపాన్ ప్రధాన మంత్రి సనాఏ తకాఇచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ మాత్రమే ప్రపంచ శాంతిని సాధించగలరని ఆకాశానికెత్తారు. వాషింగ్టన్లోని వైట్ హౌస్లో ట్రంప్తో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రపంచం తీవ్రమైన భద్రతా సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ భారీగా దెబ్బ తినే పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు. ఈ కఠిన పరిస్థితుల్లో శాంతి సాధనకు అవసరమైన ధైర్యం, దృఢ సంకల్పం ట్రంప్ వద్ద మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజం తరఫున ఈ సందేశాన్ని ట్రంప్కు అందిస్తున్నట్లు తెలిపారు.ఇదే సందర్భంగా తకాఇచి ఇరాన్తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండిస్తున్నామని అన్నారు. హర్ముజ్ జలసంధి మూసివేత విషయంలో ఇరాన్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడటం అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ సమావేశం ద్వారా జపాన్, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందనే సంకేతాలు వెలువడ్డాయి. జపాన్, ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు ప్రధాన మిత్రదేశంగా ఉంది. పెరుగుతున్న చైనా ప్రభావం, ఉత్తర కొరియా అణు పరీక్షలు, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు వంటి అంశాల నడుమ రెండు దేశాలు మరింత దగ్గరగా పనిచేయాల్సిన అవసరాన్ని పెంచుతున్నాయి. తకాఇచి వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై విస్తృత చర్చకు దారితీశాయి. ప్రపంచ శాంతి సాధనలో ట్రంప్ను ఏకైక నాయకుడిగా అభివర్ణించడం అమెరికా వ్యతిరేకులకు మింగుడుపడటం లేదు. ఈ వ్యాఖ్యలు ఇతర ప్రపంచ నాయకుల పాత్రను తగ్గించి చూపుతున్నాయనే విమర్శలూ వినిపిస్తున్నాయి. జపాన్ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ స్పందించారు. రెండు దేశాల మధ్య స్నేహం, భాగస్వామ్యం ప్రపంచ శాంతి సాధనలో కీలకమని అన్నారు. జపాన్ ఎల్లప్పుడూ అమెరికాకు విశ్వసనీయ మిత్రదేశమని పేర్కొన్నారు. మేము కలిసి పనిచేస్తే ఏ సమస్యనైనా ఎదుర్కొనగలమని ధీమా వ్యక్తం చేశారు. -
హార్మూజ్ సముద్రగర్భ కేబుళ్లను దెబ్బతీస్తే..?
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా ఇరాన్పై సాగిస్తున్న యుద్ధం మూడవ వారంలోకి ప్రవేశించిన తరుణంలో మరో కొత్త అంశం ఆందోళన రేకెత్తిస్తోంది. . ఇరాన్ ఇప్పటికే హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించి ప్రపంచ చమురు సరఫరాకు సవాల్ విసురుతుండగా, ఇప్పుడు కీలకమైన సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరిస్తే ఏమటనే ఆందోళన వ్యక్తమవుతోంది. పలు దేశాలకు కమ్యూనికేషన్ కలపడానికి ఇంటర్నెట్ కేబుళ్లు హార్మూజ్ జలసంధి గుండా వెళ్తాయి. చమురు సంస్థలను లక్ష్యంగా చేసుకుని ప్రస్తుతం ఇరాన్పై దాడులు సాగిస్తున్న తరుణంలో మరి ఆ దేశం హోర్ముజ్ జలసంధి ఇంటర్నెట్ కేబుళ్లను నిలిపివేస్తే పరిస్థితి ఏమిటి? అనేది పలుదేశాలను పట్టి పీడిస్తోంది. టెహ్రాన్ లక్ష్యం ఇంటర్నెట్ను నిలిపివేస్తుందా? అనేది ఇప్పుడు తలెత్తున్న ప్రశ్న.మరొకవైపు ఎర్ర సముద్రంలోని బాబ్ ఎల్-మండేబ్పై కూడా ఇరాన్ ప్రాక్సీ హౌతీలు దాడి చేయవచ్చనే భయాలు ఉన్నాయి. ప్రపంచ డిజిటల్ జీవనాధారాలు కూడా సముద్రగర్భ కేబుళ్ల రూపంలో ఈ మార్గాల గుండానే వెళ్తాయి. ఇది యూరప్-ఆసియా వాణిజ్యానికి అత్యంత కీలకం. ఇక్కడ కేబుల్స్ను కట్ చేస్తే ఆ ప్రాంతాల వాణిజ్యంతో పాటు ఇంటర్నెట్కు కూడా విఘాతం ఏర్పడుతుంది. అటు హోర్ముజ్ జలసంధి, ఇటు ఎర్ర సముద్రంలోని ఇంటర్నెట్ కేబుల్స్ను ఇరాన్ కానీ, ఇరాన్కు మద్దతిచ్చే హౌతీలు కానీ కట్ చేస్తే మాత్రం చాలా దేశాల్లో ఇంటర్నెట్కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, ఎర్ర సముద్రంలో యెమెన్కు చెందిన హౌతీ గ్రూపులు ప్రయాణిస్తున్న నౌకలపై కాల్పులు జరుపుతుండటంతో, ఆ ఇరుకైన జలమార్గం కూడా ప్రమాదకర ప్రాంతంగా మారింది.పూర్తిగా ఆగదు.. కానీ ఇరాన్ హోర్ముజ్ సముద్ర మార్గంలోని అండర్సీ కేబుల్స్ను కత్తిరిస్తే ప్రపంచ ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోదు, కానీ తీవ్రమైన అంతరాయాలు ఏర్పడతాయి. ఇంటర్నెట్ వేగం తగ్గడం, కొన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం పడే అవకాశం ఉంది. కారణం ఏమిటంటే, గ్లోబల్ డేటా ట్రాఫిక్కు అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ, హోర్ముజ్, బాబ్ ఎల్-మండెబ్ వంటి చోక్ పాయింట్స్ చాలా కీలకమైనవిగా ఉన్నాయి. మొత్తంగా, ఇరాన్ హోర్ముజ్ లేదా బాబ్ ఎల్-మండెబ్ వద్ద కేబుల్స్ను దెబ్బతీస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ నెమ్మదిస్తుంది,హోర్ముజ్ అండర్సీ కేబుల్స్ ప్రాముఖ్యతహోర్ముజ్ సముద్ర మార్గం: ఆసియా, యూరప్, మధ్యప్రాచ్యాన్ని కలిపే ప్రధాన ఫైబర్-ఆప్టిక్ కేబుల్స్ ఇక్కడ గుండా వెళ్తాయి.95% అంతర్జాతీయ డేటా ట్రాఫిక్ సముద్రపు కేబుల్స్ ద్వారానే జరుగుతుంది.భారతదేశం: పశ్చిమ దిశలో వెళ్లే ఇంటర్నెట్ ట్రాఫిక్లో మూడో వంతు హోర్ముజ్ మీద ఆధారపడి ఉంటుంది. -
మీకు భీకరమైన దాడి ప్యాకేజ్ని చూపించబోతున్నాం: యూఎస్ఏ
పశ్చిమాసియా యుద్ధం మొదలై ఇప్పటికే మూడు వారాలు కాగా, ఈ పరిస్థితి ఇప్పట్లో కొలిక్కి వచ్చే అవకాశం కనబడుట లేదు. అటు అమెరికా-ఇజ్రాయెల్లు సంయుక్తంగా ఇరాన్పై దాడి తీవ్రతను పెంచగా, ఇరాన్ కూడా అదే స్థాయిలో బదులిస్తోంది. ఈ యుద్ధం విషయంలో ఏ ఒక్క వర్గము వెనక్కి తగ్గడానికి ఆసక్తి చూపడం లేదు. ఆ యుద్ధం కారణంగా ప్రపంచంలో ఇప్పటికే పలు రకాల సంక్షోభ పరిస్థితులు చోటు చేసుకోగా, ఇంకా యుద్ధ తీవ్రత ముదిరితే ఎటువైపుకు వెళుతుందోననే ఆందోళన ప్రజల్లో కనబడుతోంది. అయితే నాయకుల్లో మాత్రం ఎటువంటి భయం కనపడకపోగా, యుద్ధాన్ని మేము ముగిస్తాం( మేమెంటో చూపిస్తాం) అంటే మేము ముగిస్తాం అని ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అమెరికా రక్షణమంత్రి పీట్ హెగ్సెత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇరాన్కు మరొకసారి తామేంటో చూపిస్తామని, అందుకు సిద్ధంగా ఉండాలని ముందుగా హెచ్చరికలు జారీ చేశారు. ‘ఈరోజు(గురువారం) ఇరాన్ మరో భీకర యుద్ధాన్ని చూడబోతోంది. అది కూడా ఒక భారీ యుద్ధ ప్యాకేజ్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఇరాన్లో 7,000 కంటే ఎక్కువ లక్ష్యాలపై అమెరికా దాడి చేసింది. గురువారం అత్యంత పెద్ద యుద్ధ ప్యాకేజ్ను ఇరాన్కు చూపించబోతున్నాం. అది మునుపటి దానితో సమానంగా ఉంటుంది. కానీ అది మీ ఊహకు అందదు. మా సామర్థ్యాలు పెరుగుతున్నాయి, ఇరాన్వి తగ్గుతున్నాయి, ఇప్పటికే ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు సమూలంగా ధ్వంసమయ్యాయి’అని పేర్కొన్నారు. -
‘సౌత్ పార్స్’ : ప్రపంచం మొత్తానికి పదేళ్లపాటు, షాకింగ్ నిజాలు
ఇరాన్పై అమెరికా- ఇజ్రాయెల్ ప్రకటించిన యుద్ధం, మధ్యప్రాచ్య సంక్షోభాన్ని మరింత ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంది. ఇరాన్లోని సౌత్ పార్స్ (South Pars) గ్యాస్ ఫీల్డ్పై ఇజ్రాయెల్ దాడి తీవ్ర ఉద్రిక్తతను రేపింది. ప్రపంచ ఇంధన సరఫరా , ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత రాజేస్తోంది. అసలు సౌత్ పార్స్ అంటే ఏమిటి? ఇది ఎందుకు అంత కీలకం? తెలుసుకుందాం.ఇజ్రాయెల్ అమెరికా సహకారంతో ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రమైన ఇరాన్లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై భారీ దాడి చేసింది. ఈ దాడి ఇరాన్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. "నియంత్రించలేని పరిణామాలు" ఉంటాయని హెచ్చరించిన ఇరాన్ అన్నంత పనీ చేస్తోంది.ఈ దాడికి ప్రతీకారంగా గల్ఫ్ ప్రాంతంలోని చమురు, గ్యాస్ క్షేత్రాలపై పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది.ఇదీ చదవండి: చిలుక జ్యోతిష్యుడిని నమ్మి నిండా మునిగిన ఐటీ అధికారిప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ నిక్షేపంఅరేబియా గల్ఫ్ సముద్ర తీరంలో ఉన్న ఈ గ్యాస్ ఫీల్డ్ ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు నిక్షేపాల్లో ఒకటి. దీనిని ఇరాన్, ఖతార్ దేశాలు పంచు కుంటున్నాయి. అయితే ఇరాన్లో ఉన్న భాగాన్ని 'సౌత్ పార్స్' అని పిలుస్తారు. అలాగే ఖతార్ భాగాన్ని 'నార్త్ ఫీల్డ్' అని పిలుస్తారు.ఈ రెండింటి సామర్థ్యం సుమారు 1,800 ట్రిలియన్ క్యూబిక్ అడుగుల గ్యాస్. ఇది ప్రపంచం మొత్తానికి పదేళ్ల పాటు సరిపోయేంత భారీ నిక్షేపం. సౌత్ పార్స్ కేవలం ఇంధన వనరు మాత్రమే కాదు, ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది వెన్నెముక వంటిది. అందుకే ఇరాన్కు అంత ముఖ్యం. అంతేకాదు ఇరాన్ ఉపయోగిస్తున్న మొత్తం సహజ వాయువులో సుమారు 80శాతం ఈ ఒక్క ఫీల్డ్ నుంచే వస్తుంది. విద్యుత్ ఉత్పత్తి, గృహాలు, పరిశ్రమల నిర్వహణకు ఇదే ప్రధాన ఆధారం. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ చిన్నదైనప్పటికీ, ప్రపంచంలో అత్యధికంగా గ్యాస్ వినియోగించే దేశాల్లో ఇరాన్ ఒకటి.ఇదీ చదవండి: నో జీన్స్, నో టీషర్ట్స్, నో పార్టీవేర్ : ఉద్యోగులకు కొత్త డ్రెస్ కోడ్ప్రభావం ఎంత?ఈ గ్యాస్ ఫీల్డ్కు ఏదైనా అంతరాయం కలిగితే, ఇరాన్ అంతటా విద్యుత్ సంక్షోభం ఏర్పడటమే కాదు, దాని ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. గత కొన్నేళ్లుగా ఇరాన్ ఇప్పటికే ఇలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఈ దాడి అంతర్జాతీయంగా ఇంధన ధరల పెరుగుదలకు కూడా దారితీస్తోంది. ఇంతపెద్ద గ్యాస్ క్షేత్రంలో అగ్నిప్రమాదం సంభవించడంతో, సరఫరా గొలుసుకు అంతరాయం తప్పదనే ఆందోళన పెరుగుతోంది. ప్రస్తుతం, గ్యాస్ కంటే చమురు ధరలు వేగంగా పెరుగుతుండటం గమనార్హం. ఈ పరిణామాలు ప్రపంచ మార్కెట్లను కూడా కుదిపేస్తున్నాయి.ఇదీ చదవండి: 8 ఏళ్ల కూతుర్ని రైలుకిందికి తోసేసి కాపాడొద్దంటూ గగ్గోలు -
రగిలిపోతోన్న ఇరాన్ సైన్యం
పశ్చిమాసియా యుద్ధం అప్డేట్స్ ఇరాన్కు ఈరోజు చుక్కలు చూపెడతాంఇరాన్ మరోసారి భీకర దాడులను ఎదుర్కోవాల్సి వస్తుందిపశ్చిమాసియా యుద్ధాన్ని మేమే ముగిస్తాంమేము మా లక్ష్యాన్ని పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నాంఅమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్దేశంలో ఎల్పీజీ కొరత ఆందోళనకరంగానే ఉంది: కేంద్రంప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాంబ్లాక్ మార్కెటింగ్ అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాంనిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా ఆరు వేల ప్రాంతాల్లో తనిఖీలుతెలంగాణలో వెయ్యి ప్రాంతాల్లో దాడులు, 2300 సిలిండర్లు సీజ్ప్రజలు ఎల్పీజీకి బదులు పీఎన్జీ కనెక్షన్లు తీసుకోవాలికిరోసిన్, బొగ్గు పొయ్యిలను కూడా వాడాలని కేంద్రం సూచన ఇరాక్లోనూ దాడులు చేస్తున్న ఇరాన్ ఇరాక్లోని ఎర్బిల్ విమానాశ్రయం సమీపంలో పేలుడు ఇరాక్లో ఇరాన్ మద్దతు ఉన్న మిలీషియాపై అమెరికా దాడులుసుల్తాన్ ఆఫ్ ఒమన్కు భారత ప్రధాని మోదీ ఫోన్ఒమన్పై ఇరాన్ దాడులను ఖండించిన మోదీపశ్చిమాసియా యుద్ధానికి చర్చలతోనే పరిష్కారం గల్ఫ్లోని చమురు కేంద్రాలే లక్ష్యం గల్ఫ్ దేశాలపై కొనసాగుతున్న ఇరాన్ భీకర దాడులు ఇరాన్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి దీంతో రగిలిపోతోన్న ఇరాన్ సైన్యంగల్ఫ్లోని చమురు కేంద్రాలే లక్ష్యంగా దాడులుమినాఅల్-అహ్మదీ రిఫైనరీపై దాడికువైట్లోని మినాఅల్-అహ్మదీ రిఫైనరీపై డ్రోన్ దాడిపక్కనే ఉన్న మినా అబ్దుల్లా రిఫైనరీకి అంటుకున్న మంటలుఖతార్లోని రాస్ లాఫాన్ చమురు కేంద్రంపై ఇప్పటికే దాడిఅమెరికా స్థావరాలపైనా ఇరాన్ దాడులు -
భయపెడుతున్న ఇరాన్.. అణు కేంద్రమా? ఖాళీ ప్రదేశమా?
టెహ్రాన్: ఇరాన్లోని ఇస్ఫహాన్ భూగర్భ కాంప్లెక్స్లో ఇరాన్ కొత్త యురేనియం సుసంపన్నత కేంద్రాన్ని (uranium enrichment site) అభివృద్ధి చేసినట్లు సమాచారం. అయితే, ఈ కొత్త కేంద్రం పని చేస్తోందా? లేదా? అది కేవలం ఒక "ఖాళీ ప్రదేశమా" అన్నది నిర్ధారించలేకపోతున్నామని ఐక్యరాజ్యసమితి అణు పర్యవేక్షణ సంస్థ (IAEA) తెలిపింది. ఆ కేంద్రం ఎంత ఆధునికమైనదో స్పష్టంగా తెలియదన్న ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోసీ.. పలు సందేహాలున్నాయన్నారు.పర్యవేక్షణ సంస్థకు అక్కడ తనిఖీ చేసే అవకాశం దక్కితేనే వీటికి సమాధానం దొరుకుతుందని పేర్కొన్నారు. అది భూగర్భంలో ఉందని.. కానీ మేము ఇంకా ఆ ప్రదేశాన్ని పరిశీలించలేదని తెలిపారు. ట్రంప్ పరిపాలన అధికారులతో చర్చలు జరపడానికి వాషింగ్టన్ సందర్శించిన గ్రోసీ ఈ సందర్భంగా విలేకరులతో చెప్పారు. ఒకవేళ ఇది పూర్తయితే, ఇరాన్లో ఇది నాలుగో యురేనియం సుసంపన్నత ప్లాంట్ అవుతుందన్నారు.ప్రస్తుతం ఇరాన్ వద్ద సుమారు 440 కిలోల 60 శాతం సుసంపన్నం చేసిన యురేనియం ఉన్నట్లు IAEA అంచనా వేస్తోంది. దీనిని 90 శాతానికి (ఆయుధాల తయారీకి అవసరమైన స్థాయికి) చేర్చగలిగితే, అది అణు ఆయుధ తయారీకి సిద్ధమైనట్లే.. ఇది సుమారు 10 అణు బాంబుల తయారీకి సరిపోతుంది. అయితే దీనికి పట్టే కాలాన్ని లెక్కించడం కష్టమని అధికారులు గతంలోనే స్పష్టం చేశారు.గత ఏడాది 2025 జూన్లో ఐక్యరాజ్యసమితి బృందం దానిని పరిశీలించడానికి ఇస్ఫహాన్ వెళ్లాల్సి ఉంది. అయితే, ఇజ్రాయెల్తో 12 రోజుల యుద్ధం ప్రారంభమైన తరుణంలో ఆ అణు కాంప్లెక్స్పై దాడి జరగడంతో ఆ పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఐఏఈఏ బృందం తమ పర్యటనను రద్దు చేసుకోవాల్సి రావడంతో, అక్కడ సెంట్రిఫ్యూజ్ల అమరిక మొదలైందా? లేదా? అన్నది తెలియడం లేదు. "మేము అక్కడికి తిరిగి వెళ్లగలిగినప్పుడు మాత్రమే స్పష్టత లభిస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు.తమకు అణుబాంబు తయారీ ఉద్దేశం లేదని ఇరాన్ చెబుతున్నప్పటికీ, అది బాంబు తయారీకి చాలా దగ్గరగా చేరుకుందనే కారణంతో అమెరికా, ఇజ్రాయెల్లు దాడులు చేస్తున్నాయి. అమెరికా దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని నాశనం చేశాయని అధ్యక్షుడు ట్రంప్ గతంలో ప్రకటించినప్పటికీ, ఐఏఈఏ మాత్రం అణు ఆయుధ కార్యక్రమంపై తమ వద్ద ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లేవని తెలిపింది. -
ఖతార్ గ్యాస్ కేంద్రంపై దాడి..
న్యూఢిల్లీ: అంతర్జాతీయ చమురు, గ్యాస్ మార్కెట్లలో ఆందోళన పెరిగింది. ఖతార్లోని అతిపెద్ద ఎల్ఎన్జీ ప్లాంట్ రాస్ లాఫ్ఫాన్పై ఇరాన్ క్షిపణి దాడి చేసిన విషయం తెలిసిందే. అమెరికా-ఇజ్రాయెల్ తమపై చేసిన దాడులకు ప్రతిగా ఇరాన్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ దాడి చేసింది. అలాగే, అమెరికా ఆస్తులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది. అదే సమయంలో ఇంధన సదుపాయాలపై దాడులు చేస్తుండడంతో భారత్ వంటి దేశాలకు కూడా ఆందోళన కలిగిస్తోంది. చమురు, గ్యాస్ వంటి ఇంధన వనరులు ఉన్న దేశాలు ఇరాన్ తీరుపై అసంతృప్తితో ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ఫ్యాక్టరీపై దాడి జరిగిన వెంటనే అక్కడ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ప్రపంచంలో అత్యధికంగా ఎల్ఎన్జీ ఉత్పత్తి చేసే దేశాల్లో ఖతార్ ఒకటి. అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఖతార్పై ఇరాన్ దాడి మొదటి సారికాదు. మార్చి మొదటి వారంలో ఖతార్ గ్యాస్ క్షేత్రాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. దీంతో ఖతార్ ఎనర్జీ ఉత్పత్తిని నిలిపింది. ఖతార్ గ్యాస్ క్షేత్రాలు, రాస్ లాఫ్ఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్పై ఇరాన్ చేసిన క్షిపణి దాడులు.. ఇరాన్ సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ చేసిన దాడికి ప్రతిగా జరిగినవని సమాచారం.ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైన యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ నాయకత్వంపై వరుస దాడులు చేశాయి. తాజా దాడిలో గూఢచారి విభాగం అధిపతి ఎస్మాయిల్ ఖతిబ్ హతమయ్యాడు. ఇరాన్లో వేల సంఖ్యలో మరణాలు జరిగినట్లు సమాచారం. అయినప్పటికీ ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు కొనసాగిస్తోంది. ప్రపంచ ఇంధన సరఫరాలను తగ్గిస్తోంది.భారత్పై ప్రభావం ఈ పరిస్థితులు భారత్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారత్ తన సహజ వాయువు అవసరాల్లో సుమారు 50 శాతం అంతర్జాతీయ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇందులో సుమారు 20 శాతం ఖతార్ నుంచే వస్తుంది.“భారత్ తన సహజ వాయువు అవసరాల్లో 50% విదేశీ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తుంది. అందులో సుమారు 40% ఎల్ఎన్జీ ఖతార్ నుంచి వస్తుంది. అంటే మొత్తం దిగుమతుల్లో దాదాపు 20 శాతం కతార్ నుంచే. భారత్ గ్యాస్ వినియోగాన్ని తగ్గించాల్సి వస్తుంది. ముఖ్యంగా పరిశ్రమలు, విద్యుత్ రంగంలో వినియోగం తగ్గించాలి” అని ఇంధన ఆర్థిక నిపుణుడు కిరిట్ పారిఖ్ తెలిపారు.ప్రస్తుతం భారత్ రోజువారీ సహజ వాయువు వినియోగం 189 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు. ఇందులో 97.5 మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు దేశీయంగా ఉత్పత్తి అవుతుంది.గత వారం నాటికి 47.4 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సరఫరా అంతరాయం ఏర్పడింది. ఇది దిగుమతుల్లో భాగం. ఫోర్స్ మజ్యూర్ పరిస్థితుల వల్ల ఈ అంతరాయం జరిగింది. దీంతో ప్రభుత్వ గ్యాస్ సంస్థలు ఇతర సోర్సుల నుంచి ఎల్ఎన్జీ కోసం ఆర్డర్లు ఇచ్చాయి. -
అమెరికాలో డ్రోన్ల కలకలం.. హై అలర్ట్లో వాషింగ్టన్
వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్లో డ్రోన్లు కలకలం సృష్టించాయి. అత్యంత కీలక సైనిక స్థావరం ‘ఫోర్ట్ మెక్నైర్’ (Fort McNair) వద్ద గుర్తు తెలియని డ్రోన్లు తిరుగుతుండటం అమెరికా యంత్రాగాన్ని హడలెత్తిస్తోంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్లు నివసించే ప్రాంతంలో డ్రోన్లు కనిపించడం అగ్రరాజ్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో వైట్హౌస్ అత్యవసర చర్యల్లోకి దిగింది.యుద్ధ మేఘాల మధ్య..ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతున్న తరుణంలో ఈ డ్రోన్ల సంచారం అమెరికాను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు పంపారు? అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. భద్రతా పరమైన ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో అమెరికా తన విదేశీ రాయబార కార్యాలయాలను హై అలర్ట్లో ఉంచడంతో పాటు, స్వదేశంలోని పలు సైనిక స్థావరాలను లాక్డౌన్ చేసింది.ట్రంప్ మాస్ వార్నింగ్మరోవైపు, ఇరాన్ గ్యాస్ క్షేత్రాలపై ఇజ్రాయెల్ దాడులకు దిగడంతో పశ్చిమాసియా రగిలిపోతోంది. దీనికి ప్రతీకారంగా ఖతార్లోని ఇంధన ప్లాంట్లపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. ఖతార్పై మళ్లీ దాడికి దిగితే, ఇరాన్ ఇంధన వనరులను పూర్తిగా నేలమట్టం చేస్తామని హెచ్చరించారు.మండిపోతున్న చమురు ధరలుఈ యుద్ధ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది. ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఏకంగా 5 శాతం పెరిగి, మరింత భారంగా మారింది. చమురు రవాణాకు కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ మార్గంలో రాకపోకలు నిలిచిపోవడంతో ఇంధన సంక్షోభం తలెత్తే అవకాశం కనిపిస్తోంది. ఈ భీకర పోరులో ఇప్పటివరకు ఇరాన్లో 1,300 మంది, లెబనాన్లో 960 మంది, అమెరికా సైనికులు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. క్షిపణి దాడుల కారణంగా ఖతార్లోని కీలక గ్యాస్ ప్లాంట్లు భారీగా దెబ్బతిన్నాయి.ఇది కూడా చదవండి: గల్ప్కు మరిన్ని భారత యుద్ధ నౌకలు -
అమెరికాకు ఇరాన్ ఝలక్.. ఖతార్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: పశ్చిమాసియాలో పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటోంది. తాజాగా ఖతార్, యూఏఈలోని అమెరికా నిర్వహిస్తున్న ఇంధన క్షేత్రాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. మళ్లీ ఇలాంటి దాడులు జరిగితే ఇరాన్పై గతంలో మునుపెన్నడూ చూడనంత శక్తితో దాడి చేస్తామని హెచ్చరించారు.అయితే, సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్స్పై ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తీవ్రంగా ప్రతిస్పందించింది. ఖతార్ ఆర్థిక వ్యవస్థకు పునాది అయిన రస్ లాఫాన్ ఎల్ఎన్జీ కేంద్రంపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. రస్ లాఫాన్ దాడి తరువాత తెల్లవారుజామున పలు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ కేంద్రాలు కూడా క్షిపణి దాడులకు గురయ్యాయని ఆ దేశ ప్రభుత్వ రంగ సంస్థ ఖతార్ ఎనర్జీ తెలిపింది. దీంతో భారీ అగ్నిప్రమాదాలు సంభవించి మరింత నష్టం వాటిల్లిందని పేర్కొంది. అగ్నిప్రమాదాలపై అత్యవసర సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. దాడిలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని ఖతార్ ఎనర్జీ ధృవీకరించింది. అనంతరం, ఇరాన్ రాయబారులు 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఖతార్ ప్రభుత్వం ఆదేశించింది.కాగా, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. మూడు అగ్నిప్రమాదాల్లో రెండింటిని పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం తెలిపింది. ఇంకా కూలింగ్, భద్రత చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. మరోవైపు.. ఇరాన్ చర్యలపై ఖతార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ దాడులను ఖతార్ తీవ్రంగా ఖండించింది. పౌర ప్రాంతాలు, కీలక మౌలిక సదుపాయాలపై దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని పేర్కొంది. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఇలాంటి దాడులు ఉద్రిక్తతలను మరింత పెంచుతాయని ఖతార్ హెచ్చరికలు జారీ చేసింది.ట్రంప్ వార్నింగ్.. ఇరాన్ దాడులపై డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. మళ్లీ ఇలాంటి దాడులు జరిగితే ఇరాన్పై గతంలో మునుపెన్నడూ చూడనంత శక్తితో దాడి చేస్తామని హెచ్చరించారు. పార్స్ గ్యాస్ క్షేత్రం మొత్తాన్ని విధ్వంసం చేస్తామని పేర్కొన్నారు. ఇరాన్ శాంతియుతంగా ఉంటే, ఇకపై సౌత్ పార్స్ మీద ఎటువంటి దాడులు జరగవని ఆయన హామీ ఇచ్చారు. తాను ఆ స్థాయి హింస, వినాశనాన్ని కోరుకోవడం లేదని పేర్కొన్నారు. -
ఇజ్రాయెల్ తప్పు చేసింది : డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: పశ్చిమాశియా దేశాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇజ్రాయెల్ ఇరాన్ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై దాడి చేయగా, ప్రతీకారంగా ఇరాన్ ఖతర్లోని ఎల్ఎన్జీ ప్లాంట్పై క్షిపణులు ప్రయోగించింది. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్.. సౌత్ పార్స్గ్యాస్ ఫీల్డ్పై దాడి చేయడం ముమ్మాటికి తప్పే. ఇజ్రాయెల్ దాడి చేసిందని మీరు ఖతర్పై దాడి చేస్తే ఉపేక్షించబోమంటూ ట్రంప్ టూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఇజ్రాయెల్ ఇకపై దాడులు చేయదని, కానీ ఇరాన్ ఖతర్పై మళ్లీ దాడి చేస్తే అమెరికా స్వయంగా ఇరాన్ గ్యాస్ ఫీల్డ్ను పూర్తిగా ధ్వంసం చేస్తుందని స్పష్టం చేశారు. ఇరాన్ ఖతర్తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని హబ్షన్ గ్యాస్ ఫెసిలిటీ, బాబ్ ఫీల్డ్లపై కూడా దాడులు జరిపింది. ఈ దాడులు గల్ఫ్ దేశాలను తీవ్ర ఆందోళనలోకి నెట్టాయి. ఇరాన్ చర్యలతో ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హర్మూజ్జలసంధి ప్రమాదంలో పడినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో జరిగిన పరిణామాలపై ఆగ్రహంతో ఇరాన్లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ అనే ప్రధాన కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో కేంద్రంలోని ఒక చిన్న భాగమే దెబ్బతింది. ఈ ప్రత్యేక దాడి గురించి అమెరికాకు ఎలాంటి సమాచారం లేదు. ఈదాడికి ఖతర్కు ఏవిధమైన సంబంధం లేదు. ఈ దాడి జరగబోతుందని ఖతర్కు తెలియదు’అని పేర్కొన్నారు. తాజా పరిణామం అంతర్జాతీయ మార్కెట్లపై పడింది. బ్రెంట్ క్రూడ్ ధరలు మరో 5 శాతం పెరిగి బ్యారెల్కు 108 డాలర్లకు చేరాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చమురు ధరలు దాదాపు 50 శాతం పెరిగాయి. ఇది దిగుమతులపై ఆధారపడే దేశాలకు, ముఖ్యంగా భారత్పై సైతం ఆర్థిక భారాన్ని మోపే అవకాశం ఉంది. మొత్తం మీద, ఇరాన్పై అమెరియా-ఇజ్రాయెల్ యుద్ధం సహజవనరుల భద్రతను కుదిపేస్తోంది. ఖతర్, యూఏఈపై దాడులు, అమెరికా హెచ్చరికలు, చమురు ధరల పెరుగుదల పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అస్థిరత వైపు నెడుతున్నాయని ఆర్థిక నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పాకిస్తాన్కు షాకిచ్చిన అమెరికా.. యుద్దం వేళ ట్విస్ట్!
వాషింగ్టన్: దాయాది దేశం పాకిస్తాన్పై అమెరికా నిఘా విభాగం చీఫ్ తులసీ గబ్బార్డ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు అత్యంత భారీ అణు ముప్పును కలిగించే దేశాలలో పాకిస్తాన్ కూడా ఒకటి అంటూ బాంబు పేల్చారు. ఇదే సమయంలో రష్యా, చైనా, ఉత్తరకొరియా, ఇరాన్ దేశాలు.. అధునాతన క్షిపణి ప్రయోగ వ్యవస్థలను చురుకుగా అభివృద్ధి చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఆయా దేశాలతో ప్రపంచానికి ముప్పు పొంచి ఉందని వ్యాఖ్యలు చేశారు. అమెరికా నిఘా విభాగం చీఫ్ తులసీ గబ్బార్డ్ తాజాగా ఓ సమావేశంలో మాట్లాడుతూ.. పెరుగుతున్న ప్రపంచ భద్రతా ముప్పులపై తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఈ సందర్బంగా తులసీ గబ్బార్డ్..‘చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా, పాకిస్తాన్ వంటి దేశాలు అణ్వాయుధాలు, సంప్రదాయ పేలోడ్లతో కూడిన అనేక రకాల కొత్త రకాల సాంప్రదాయ క్షిపణి ప్రయోగ వ్యవస్థలపై పరిశోధనలు చేస్తున్నారు. అలాగే, అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తున్నాయని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికాకు అత్యంత భారీ అణు ముప్పును కలిగించే దేశాలలో ఇరాన్, చైనా, రష్యా, ఉత్తర కొరియాలతో పాటు పాకిస్తాన్ కూడా ఒకటి. ఈ దేశాలు అమెరికాను చేరగలిగే అణు సామర్థ్యం ఉన్న క్షిపణులను అభివృద్ధి చేస్తున్నాయి. అమెరికాను వాటి పరిధిలోకి తీసుకువస్తున్నాయి’ అని సంచలన ఆరోపణలు చేశారు.టార్గెట్ అమెరికా.. అంతేకాదు, మారుతున్న భౌగోళిక రాజకీయ కూటములను హైలైట్ చేస్తూ ఉత్తర కొరియా.. రష్యా, చైనాలతో తన భాగస్వామ్యాలను బలోపేతం చేసుకుంటోందని అన్నారు. ఇది అమెరికా శత్రువుల మధ్య సమన్వయ సైనిక సామర్థ్యాలపై ఆందోళనలను పెంచుతోందని ఆమె పేర్కొన్నారు. ఇదే సమయంలో అమెరికాపై దాడి చేయగల క్షిపణుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఉంటుందని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయని అన్నారు. ప్రస్తుత అంచనా ప్రకారం సుమారు 3,000 ఉండగా.. 2035 నాటికి ఈ సంఖ్య 16,000 దాటుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.పాక్ పీఎం షరీఫ్ ఇలా.. అయితే, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ప్రశంసలు కురిపిస్తున్న వేళ తులసీ గబ్బార్డ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. కాగా, 2025లో గాజా పీస్ సమ్మిట్లో షరీఫ్ ట్రంప్పై ప్రశంసలు కురిపించారు. “మ్యాన్ ఆఫ్ పీస్” అని పిలుస్తూ.. ఆయన భారత్–పాకిస్తాన్ మధ్య అణు యుద్ధాన్ని నివారించారని పేర్కొన్నారు. ఆయన ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి అర్హుడని కూడా అన్నారు.ఇరాన్ యుద్ధంపై..మరోవైపు, ఇరాన్తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంపై ఆమె స్పందిస్తూ..‘ఇరాన్పై అధ్యక్షుడు ట్రంప్ చర్యలను సమర్థిస్తున్నాను. గత 20 రోజులుగా భీకర దాడులు చేస్తున్నా.. సుప్రీం లీడర్ ఖమేనీ సహా కీలక నాయకులు, అధికారులు మరణించినా ఇరాన్ మాత్రం పోరాటం ఆపలేదు. యుద్ధంలో భారీ నష్టం జరిగినా.. ఇరాన్లో ప్రభుత్వం చెక్కుచెదరలేదు. కానీ, చాలా వరకు ఇరాన్ బలహీనపడిందని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇరాన్ సైనిక శక్తి తగ్గినా ఇంకా ప్రమాదకరమే’ అని ఆమె తెలిపారు. -
పాకిస్థాన్లో రిపబ్లిక్డే వేడుకలు రద్దు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 23న జరగాల్సిన రిపబ్లిక్ డే వేడుకలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ప్రకటన ప్రకారం.. కొనసాగుతున్న గల్ఫ్ చమురు సంక్షోభం, పెరుగుతున్న ప్రపంచ చమురు ధరలు, అలాగే ప్రభుత్వం ప్రకటించిన పొదుపు చర్యల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సాధారణంగా జరిగే సైనిక కవాతు, 31-గన్ సెల్యూట్, సాంస్కృతిక కార్యక్రమాలు ఈసారి జరగవు. దాని బదులుగా, కేవలం జెండా ఆవిష్కరణ మాత్రమే నిర్వహించబడుతుంది. అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, శాఖలు ఈ సందర్భాన్ని నిరాడంబరంగా, గౌరవప్రదంగా పాటించాలని ఆదేశించారు.ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా తలెత్తిన తీవ్ర ఇంధన సంక్షోభం, ఆర్థిక అస్థిరతను ఎదుర్కోవడానికి ప్రభుత్వం మార్చిలో పొదుపు చర్యలకు దిగిందని, వాటిలో భాగంగానే రిపబ్లిక్ డే వేడుకలను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. -
గల్ప్కు మరిన్ని భారత యుద్ధ నౌకలు
న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలల నడుమ భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మరింతగా ముదురుతుండటంతో కీలక చమురు రవాణా మార్గాలను కాపాడుకునేందుకు భారత నౌకాదళం రంగంలోకి దిగింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్కు మరిన్ని యుద్ధనౌకలను తరలిస్తోంది.ఏడుకు చేరిన యుద్ధ నౌకలుపశ్చిమ ఆసియా ఉద్రిక్తతల వల్ల ప్రపంచ దేశాలకు 20 శాతం ముడి చమురు సరఫరా చేసే హార్మూజ్ జలసంధి ప్రస్తుతం మూతపడింది. ఈ క్రమంలో భారత చమురు నౌకలకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా సురక్షితంగా స్వదేశానికి చేర్చేందుకు నౌకాదళం తన యుద్ధ నౌకల మోహరింపును మరింతగా పెంచుతోంది. ప్రస్తుతం అక్కడ మూడు యుద్ధనౌకలు ఉండగా, తాజాగా చేపట్టిన అదనపు మోహరింపుతో ఈ సంఖ్య ఏడుకు చేరనుంది.నౌకాదళం అభయంషిప్పింగ్ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం జలసంధికి పశ్చిమ దిశలో సుమారు 22 భారతీయ నౌకలు చిక్కుకుపోయాయి. అయితే భారత నౌకాదళం పహారా నడుమ ఇప్పటికే కొన్ని నౌకలు క్షేమంగా చేరుకున్నాయి. గత వారం ‘శివాలిక్’, ‘నందా దేవి’ అనే రెండు ఎల్పీజీ క్యారియర్లు 92,712 మెట్రిక్ టన్నుల గ్యాస్తో భారత తీరానికి చేరుకున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని ఫుజైరా పోర్ట్ నుండి బయలుదేరిన ఒక చమురు ట్యాంకర్ను కూడా భారత యుద్ధనౌక సురక్షితంగా ఎస్కార్ట్ చేసింది.ఏమిటీ ‘ఆపరేషన్ సంకల్ప్’?భారత నౌకాదళం 2019 నుండి ‘ఆపరేషన్ సంకల్ప్’ పేరుతో గల్ఫ్ ఆఫ్ ఒమన్లో తన ఉనికిని చాటుతోంది. సముద్ర మార్గంలో భారత వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశ్యం. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుండి నౌకాదళం తన పహారాను మరింత కఠినతరం చేసింది. దీనికితోడు 2008 నుండి గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో కొనసాగుతున్న సముద్రపు దొంగల వ్యతిరేక గస్తీ కూడా నిరంతరాయంగా కొనసాగుతోంది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో భారత ఇంధన భద్రతకు ఎటువంటి అడ్డంకులు కలగకుండా, నౌకాదళం గల్ఫ్ ప్రాంతంలో నిరంతర నిఘా ఉంచుతోంది.ఇది కూడా చదవండి: 80 వేల టన్నుల చమురుతో భారత్కు ‘జగ్ లాడ్కీ’ -
కెనడాలో వారం వ్యవధిలో.. ముగ్గురు భారత సంతతి వ్యక్తులు హత్య
అట్టావా: కెనడాలో జాతి విద్వేష ఘటనలపై భారతసంతతి వాసులు ఆందోళన చెందుతున్నారు. వారం వ్యవధిలో భారతసంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. మార్చి 14వ తేదీన అల్బెర్టా ప్రావిన్స్లో బీరీందర్ సింగ్(22) లెడుక్ ప్రాంతంలో వాహనంలో ఉండగా కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోయాడు. మార్చి 13వ తేదీన సాస్కాట్చెవాన్లోని నార్త్ బ్యాటిల్ ఫోర్డ్లో దేవీందర్ సింగ్(31), అదే రోజు ఫోర్ట్ సెయింట్ జాన్ వద్ద జరిగిన గొడవలో గుర్కిరీట్ మనోచా(31) మృతి చెందారు. ‘ఆ రోజు మధ్యాహ్నం సమయంలో లెడుక్ వద్ద కారులో బీరీందర్తో కలిసి కారులో ఉన్నాం. అంతలోనే ఓ పికప్ కారు మా పక్కన వచ్చి ఆగింది. అందులోని వ్యక్తులు మాపై కాల్పులు జరిపారు. తూటాలు తగిలి కారు స్టీరింగ్ వద్ద ఉన్న బీరీందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇది జాతి విద్వేష ఘటనే అనుకుంటున్నాం’అని బీరీందర్ స్నేహితుడు తెలిపారు. మారుమూల, జన సంచారం అంతగా లేని ప్రాంతాలకు వెళ్లడం ప్రమాదకరమన్నారు. కాగా, దేవీందర్ హత్యపై దర్యాప్తు జరుగుతోందని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్(ఆర్సీఎంపీ) తెలిపింది. రెండో ఘటన. బ్రిటిష్ కొలంబియాకు చెందిన గుర్కిరీట్ సింగ్ మనోచా మేనేజ్మెంట్ డిగ్రీ చదువుకునేందుకు ఫోర్ట్ సెయింట్ జాన్కు మకాం మార్చాడు. ఈ నెల 13న చార్లీలేక్ బోట్ క్యాంపు వద్ద రాత్రి 11 గంటల సమయంలో జరిగిన గుర్తు తెలియని వ్యక్తులతో తలెత్తిన ఘర్షణలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు వచ్చే సరికే చనిపోయి ఉన్నాడు. ఇతడి సొంతూరు భారత్లోని ఉజ్జయిని. కాగా, గుర్కిరీట్తో ఘర్షణ పడిన వ్యక్తులెవరనే దానిపై పోలీసులు ఒక స్పష్టతకు రాలేదు. రాత్రి వేళ, అదీ జన సంచారం తక్కువగా ఉండే చోటుకావడంతో దర్యాప్తు నెమ్మదిగా సాగుతోందని నేర విభాగం తెలిపింది. మూడో ఘటన..మార్చి 13వ తేదీన ఉదయం 8గంటల వేళ క్యాబ్ డ్రైవర్ దేవీందర్ సింగ్కు హిచింగ్ పోస్ట్ మోటెల్ నుంచి పిలుపు వచ్చింది. అక్కడికి వెళ్లాక అతడిపై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అతడిని తుపాకీతో కాల్చి పరారయ్యారు. తీవ్ర గాయాలతో దేవీందర్ మృతి చెందాడు. దుండగులను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనతో భారత సంతతి క్యాబ్ డ్రైవర్లు తీవ్రంగా భయపడుతున్నారని దేవీందర్ పనిచేసే క్రౌన్ క్యాబ్ సంస్థ యజమాని హరీశ్ కొరాఠ్ తెలిపారు. కొందరు క్యాబ్ డ్రైవింగ్ మానేశారన్నారు. -
స్వచ్ఛందంగా దేశం వీడితే 2,600 డాలర్లు బోనస్
వాషింగ్టన్: అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు పంపించేందుకు డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాజాగా స్వచ్ఛందంగా అమెరికాను విడిచి స్వదేశం వెళ్లాలనుకుంటున్న అక్రమ వలసదారులకు ఆర్థిక ప్రో త్సాహాన్ని మరింత పెంచింది. భారత్ సహా ఇతర దేశాల నుంచి వచ్చిన లక్షలాది మంది అక్రమ వలసదారులు స్వదేశానికి వెళ్లడానికి ఉచిత విమాన ప్రయాణంతో పాటు 2,600 డాలర్ల నిష్క్రమణ బోనస్ అందిస్తోంది. ఈ మేరకు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) విభాగం పోస్టర్లను ఎక్స్లో పోస్టు చేసింది. ముఖ్యంగా భారత్, చైనా, కొలంబియా దేశస్థులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. గతంలో బహిష్కరణకు గురైన తర్వాత అమెరికాను విడిచి వెళ్లలేని వారిపై విధించిన జరిమానాలతో సహా కొన్ని శిక్షలను కూడా ఈ పథకం కింద మాఫీ చేయనున్నట్లు డీహెచ్ఎస్ వెల్లడించింది. గతంలో బహిష్కరణకు గురైన తర్వాత అమెరికాను విడిచి వెళ్లని వారిపై విధించిన జరిమానాలతో సహా కొన్ని శిక్షలను ఈ పథకం కింద మాఫీ చేయనున్నట్లు డీహెచ్ఎస్ వెల్లడించింది. ఈ పథకాన్ని ఒక ‘చారిత్రాత్మక అవకాశం’గా అభివర్ణించింది. నమోదు చేసుకుని, దేశం విడిచి వెళ్లేందుకు అర్హత పొందిన వారిపై ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీసీ) ఎలాంటి చర్యలు తీసుకోదని తెలిపింది. ఈ ప్రక్రియలో నమోదు కావడానికి వలసదారులు కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) యాప్ను ఉపయోగించాలని డీహెచ్ఎస్ సూచించింది. జనవరి 2025లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 22 లక్షలకు పైగా అక్రమ వలసదారులు దీని ప్రయోజనాన్ని పొందారని వెల్లడించింది. ఒక వ్యక్తిని బలవంతంగా దేశ బహిష్కరణ చేయడానికి 18,245 డాలర్లు ఖర్చవుతోంది. 2,600 డాలర్ల ప్రోత్సాహంతో సీబీపీ హోమ్ యాప్ ద్వారా స్వచ్ఛందంగా దేశం నుంచి వెళ్లడానికి అయ్యే ఖర్చు కేవలం 5,100 డాలర్లు అవుతుంది. దీనివల్ల 13వేల డాలర్లకు పైగా ఆదా అవుతుందని డీహెచ్ఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘అక్రమ వలసదారులు సీబీపీలో నమోదు చేసుకోవడం వల్ల వారు తమ పని, చదువు ఇతర వ్యక్తిగత విషయాలను ముగించుకుని చట్టబద్ధంగా తమ తిరుగు ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు’ అని తెలిపింది. గతేడాది మేలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు నిష్క్రమణ బోనస్గా 1,000 డాలర్లు అందించింది. కొత్త సంవత్సరం రాకముందే దేశం విడిచి వెళ్లాలని నిర్ణయించుకుంటే ఈ బోనస్ను మూడు రెట్లు పెంచి 3,000 డాలర్లుగా చేసింది. ఈ సంవత్సరం జనవరిలో 2,600 డాలర్లుగా నిర్ణయించింది. -
భారత్కు చేరిన జగ్ లడ్కీ
అహ్మదాబాద్/హాంకాంగ్: యుద్ధమయ హార్మూజ్ గుండా మరో ముడిచమురు రవాణా నౌక క్షేమంగా భారత నౌకాశ్రయానికి చేరుకుంది. భారతీయ జెండాతో ‘జగ్ లడ్కీ’నౌక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఫుజైరా పోర్ట్లో 80,886 మెట్రిక్ టన్నుల ముడిచమురు నింపుకుని హార్మూజ్ గుండా ప్రయాణించి బుధవారం గుజరాత్లోని ముంద్రా పోర్ట్కు చేరుకుందని ఆ పోర్ట్ నిర్వహణ సంస్థ ‘అదానీ పోర్ట్స్’ప్రకటించింది. ఇదే ఫుజైరా పోర్ట్పై ఇరాన్ ఇటీవల క్షిపణి దాడులు చేసింది. అయినాసరే పోర్ట్నుంచి సరకు ఎగుమతి నిరాటంకంగా కొనసాగుతోంది. సోమవారం హార్మూజ్ గుండా బయల్దేరి 46,500 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ సరకుతో ‘నందా దేవి’నౌక వచి్చన మరుసటి రోజే మరో సరకు రవాణా నౌక సురక్షితంగా భారత్కు రావడం విశేషం. 274.19 మీటర్ల పొడవుండే జగ్ లడ్కీ నౌక గరిష్టంగా 1,64,716 టన్నుల సామర్థ్యతో ప్రయాణించగలదు. భారత చమురు దిగుమతులకు సంబంధించి హార్మూజ్ జలసంధి అత్యంత కీలకం. దీని గుండానే భారత్కు దాదాపు 40–50 శాతం చమురు వస్తోంది. హార్మూజ్ను దాటిన 89 నౌకలు హార్మూజ్ గుండా సరకు రవాణా నౌకల రాకపోకలపై ఇరాన్ నిషేధం విధించినా సరే సిగ్నళ్లను నిలిపేసి, లైట్లను ఆర్పేసి ‘డార్క్ మోడ్’లో ఎవరి కంటా పడకుండా కొన్ని నౌకలు ఇదే మార్గం గుండా ప్రమాదకరరీతిలో ప్రయాణం కొనసాగిస్తున్నాయి. అయితే మిత్రదేశాలకు చెందిన నౌకలపై ఇరాన్ దాడులకు పాల్పడట్లేదని తెలుస్తోంది. భారత్, పాకిస్తాన్ జెండాతో ప్రయాణిస్తున్న నౌకలు సైతం సురక్షితంగానే ప్రయాణం పూర్తిచేస్తున్నాయి. యుద్ధం మొదలయ్యాక మార్చి ఒకటో తేదీ నుంచి మార్చి నెల 15వ తేదీదాకా 89 సరకు రవాణా నౌకలు హార్మూజ్ గుండా విజయవంతంగా ప్రయాణించాయని సముద్రమార్గ ప్రయాణాల డేటా సంస్థ ‘లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్’బుధవారం ప్రకటించింది. ఈ 89 నౌకల్లో ఐదింట ఒకవంతు నౌకలకు ఇరాన్తో సంబంధం ఉందని, చైనా, గ్రీస్ జెండాలున్న నౌకలూ సులభంగానే హార్మూజ్ను దాటేశాయని ‘లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్’పేర్కొంది. చైనాకు బదులు భారత్కు బయల్దేరిన 7 నౌకలు రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోళ్లపై అమెరికా తాత్కాలికంగా ఆంక్షల సడలింపు ప్రకటించిన నేపథ్యంలో మోదీ సర్కార్ మళ్లీ రష్యాచమురు కొనుగోళ్ల పర్వానికి తెరలేపింది. దీంతో రష్యా నుంచి చైనాకు బయల్దేరిన ఏడు ముడిచమురు రవాణా నౌకలు సముద్రమార్గం మధ్యలోనే దిశ మార్చుకుని భారత్కు ప్రయాణం మొదలెట్టడం విశేషం. జనవరి చివరివారంలో రష్యా నుంచి బయల్దేరి బాలి్టక్ సముద్రజలాల్లో ప్రయాణించిన మధ్యశ్రేణి ముడిచమురునౌక ‘ఆక్వా టైటాన్’వాస్తవానికి చైనాలోని రిజావో పోర్ట్కు వెళ్లాలి. కానీ అది ఇటీవల దిశ మార్చుకుని భారత్ దిశగా వెళ్తోందని, మార్చి 21వ తేదీకల్లా న్యూ మంగళూరు పోర్ట్లో లంగరు వేస్తుందని నౌకల ట్రాకింగ్ సంస్థ ‘ఓర్టెక్సా లిమిటెడ్’పేర్కొంది. ‘సూయిజ్మ్యాక్స్ జోయూజోయూ ఎన్’నౌక సైతం దిశ మార్చుకుని భారత్కు వస్తోందని మార్చి 25వ తేదీకల్లా గుజరాత్లోని జామ్నగర్ సిక్కా పోర్ట్కు చేరుకుంటుందని తెలిపింది. -
ఇంధన కేంద్రాలే టార్గెట్
దుబాయ్/టెహ్రాన్: పశ్చిమాసియాలో చమురు, సహజ వాయువు కేంద్రాలే యుద్ధ క్షేత్రాలుగా మారిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఇంధన ధరలు మండిపోతున్నప్పటికీ ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. యుద్ధం బుధవారం 19వ రోజుకు చేరుకుంది. ఇరాన్లో అతిపెద్ద సహజ వాయువు క్షేత్రమైన ‘సౌత్ ఫార్స్’పై ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడికి దిగింది. ఇక్కడ నిత్యం 100 మిలియన్ క్యూబిక్ మీటర్ల నేచురల్ గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. ఇజ్రాయెల్ దాడిలో భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇరాన్ సైతం గల్ఫ్ అరబ్ దేశాల్లోని ఇంధన కేంద్రాలపై విరుచుకుపడింది. సౌదీ అరేబియాలో చమురు క్షేత్రాలు అధికంగా ఉన్న తూర్పు ప్రావిన్స్పై భారీగా క్షిపణులు ప్రయోగించింది. కువైట్, బహ్రెయిన్, ఖతార్, యూఏఈపైనా క్షిపణులు, డ్రోన్లతో నిప్పుల వర్షం కురిపించింది. ఆయా దేశాల్లో ఆయిల్, గ్యాస్ మౌలిక సదుపాయాలను, పెట్రోకెమికల్ కేంద్రాలను ధ్వంసం చేయడం తథ్యమని హెచ్చరించింది. వాటి శాటిలైట్ ఫొటోలు విడుదల చేసింది. అక్కడ పనిచేస్తున్న కారి్మకులు, స్థానికులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది. పశ్చిమాసియా తాజా పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు ధర 108 డాలర్లకు చేరుకుంది. యుద్ధం మొదలైన తర్వాత ఏకంగా 40 శాతం పెరిగింది. పెట్రో ఉత్పత్తుల ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇంధన ధరలు పెరుగుతున్న కొద్దీ అమెరికాపై ఒత్తిడి పెరగడం తథ్యమని, తద్వారా యుద్ధం నుంచి అమెరికా సైన్యం నుంచి విరమించుకొనే అవకాశం ఉందని ఇరాన్ అంచనా వేస్తోంది. ఇజ్రాయెల్లో రైల్వే స్టేషన్పై దాడి ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో రైల్వే స్టేషన్పై ఇరాన్ సైన్యం దాడికి పాల్పడింది. దాంతో దేశవ్యాప్తంగా రైల్వే సేవలు నిలిచిపోయాయి. ఈ దాడిలో ప్రాణనష్టం జరగలేదు. పౌర మౌలిక సదుపాయాలను నేరుగా టార్గెట్ చేయడం సంచలనాత్మకంగా మారింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని దౌత్య కార్యాయాలపైనా ఇరాన్ దాడికి పాల్పడింది. ఇరాన్ ప్రయోగించిన రెండు డ్రోన్లను సౌదీ అరేబియా సైన్యం కూలి్చవేసింది. ఇక్కడ అమెరికా ఎంబీసీతోపాటు ఇతర దేశాల దౌత్యకార్యాలయాలు ఉన్నాయి. రియాద్లో బుధవారం సాయంత్రం భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని అమెరికా ఎంబసీసై రెండో రోజు బుధవారం కూడా దాడి జరిగింది. ఇరాక్లోని అమెరికా స్థావరాలపై నిత్యం దాడులు జరుగుతున్నాయి. ఇరాన్లో స్వీడన్ పౌరుడికి ఉరి ఇరాన్ దక్షిణ ఫార్స్ ప్రావిన్స్లోని లారెస్తాన్ కౌంటీలో ఉన్న కోర్టు సముదాయంపై భారీ దాడి జరిగింది. ఈ ఘటనలో కనీసం 8 మంది మరణించారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్లో ఇప్పటిదాకా 1,300 మందికిపైగా బలయ్యారు. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్కు గూఢచారిగా పని చేస్తున్నాడన్న ఆరోపణలతో ఓ వ్యక్తిని ఇరాన్ ప్రభుత్వం ఉరితీసింది. ఇరాన్లోని కీలక ప్రాంతాల సమాచారాన్ని మొస్సాద్కు చేరవేస్తున్నాడని అతడిపై ఆరోపణలు వచ్చాయి. అతడు స్వీడన్ జాతీయుడని తెలిసింది. తమ పౌరుడికి ఉరిశిక్ష విధించడాన్ని స్వీడన్ విదేశాంగ శాఖ ఖండించింది. లెబనాన్లో హెజ్»ొల్లా మిలిటెంట్లను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తోంది. బుధవారం రాజధాని బీరూట్లో అపార్టుమెంట్లపై క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో పది మందికిపైగా జనం మరణించారు. మిలిటెంట్ కార్యకలాపాల కోసం హెజ్»ొల్లా పెద్ద ఎత్తున ధనం నిల్వ చేసుకున్న అపార్ట్మెంట్ను నేలమట్టం చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. 5 వేల పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులు హార్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ మిస్సైల్ కేంద్రాలను ధ్వంసం చేయడానికి అమెరికా సైన్యం 5 వేల పౌండ్ల(2,268 కిలోలు) బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించింది. ఈ విషయాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ ప్రాంతంలో ఇరాన్ యాంటీ–షిప్ క్రూయిజ్ మిస్సైళ్లు విదేశీ నౌకలకు ముప్పుగా మారాయని, అందుకే శక్తివంతమైన బాంబులు ప్రయోగించినట్లు స్పష్టంచేసింది. ఇరాన్ మంత్రి ఖతీబ్ మృతి ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ నిఘా వ్యవహారాల మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ మరణించారు. మంగళవారం రాత్రి దాడుల్లో అతడు హతమైనట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కట్జ్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చూస్తారంటూ పేర్కొన్నారు. ఖతీబ్ మరణాన్ని ఇరాన్ అధికారిక టీవీ చానల్ సైతం ధ్రువీకరించింది. ఇది దారుణ హత్యాకాండ అని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పందించారు. ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్తోపాటు గల్ఫ్ దేశాలపై దాడులకు దిగింది. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ సమీపంలో ఇద్దరు మరణించారు. మంగళవారం ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అత్యున్నత అధికారులు అలీ లారిజానీ, ఘోలమ్ రెజా సులేమానీ మరణించిన సంగతి తెలిసిందే. లారిజానీ మృతిపట్ల ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) రగిలిపోతోంది. సెంట్రల్ ఇజ్రాయెల్పై బహుళ వార్హెడ్లతో కూడిన క్షిపణులు ప్రయోగించింది. 2.6 లక్షల మంది భారతీయులు వెనక్కి న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం మొదలయ్యాక అక్కడి నుంచి ఫిబ్రవరి 28వ తేదీన తర్వాత ఇప్పటిదాకా 2.6 లక్షల మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారని భారత విదేశాంగ శాఖ బుధవారం ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని వేర్వేరు నగరాల్లోని విమానాశ్రయాల నుంచి భారతీయుల తరలింపు కోసం 70 విమానాలు నడుస్తున్నట్లు విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి(గల్ఫ్) అసీమ్ ఆర్.మహాజన్ చెప్పారు. యూఏఈ పరిధి నుంచి భారతీయులను రప్పించడంపై యూఏఈ అధ్యక్షుడు షేక్మొహమ్మెద్ బిన్ జయేద్ అల్ నహ్యాల్లో ప్రధాని మోదీ మంగళవారం టెలిఫోన్ సంభాషణ జరిపారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్దీర్ జైశ్వాల్ వెల్లడించారు. యుద్ధం మొదలయ్యాక ఇరునేతలు మాట్లాడుకోవడం ఇది రెండోసారి.చిక్కుకున్న లక్షల టన్నుల చమురు, ఎల్పీజీ న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం కారణంగా లక్షల టన్నుల మేర ముడిచమురు సహా పలు రకాల సరుకులు భారత్కు రాకుండా పర్షియన్ గల్ఫ్ సముద్రజలాల్లో నౌకల్లో చిక్కుకుపోయాయి. ఈ వివరాలను భారత నౌకాయాన మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రాజేశ్ కుమార్ సిన్హా బుధవారం వెల్లడించారు. ‘‘16.7 లక్షల టన్నుల ముడిచమురు, 3.2 లక్షల టన్నుల ఎల్పీజీ, దాదాపు 2 లక్షల టన్నుల ద్రవరూప సహజవాయువు 22 భారతీయ జెండా ఉన్న సరుకు రవాణా నౌకల్లో ఉండిపోయాయి. ఈ నౌకలన్నీ పర్షియన్ గల్ఫ్ నుంచి హార్మూజ్ గుండా భారత్కు రావాల్సి ఉంది. యుద్ధం కారణంగా ప్రయాణం మొదలుపెట్టలేక గల్ఫ్లోనే ఉండిపోయాయి. 22 నౌకల్లోని 611 మంది భారతీయ నావికులు క్షేమంగానే ఉన్నారు. అన్ని దేశాలకు సంబంధించి దాదాపు 500 నౌకలు పర్షియన్ గల్ప్లో ఆగిపోయాయి. వీటిల్లో 108 చమురు, 166 చమురు ఉత్పత్తులు, 104 రసాయన ఉత్పత్తుల ట్యాంకర్లు, 52 రసాయన ట్యాంకర్లు, 53 ఇతర రకాల నౌకలు, కొన్ని డ్రెడ్జర్లు, ఖాళీ నౌకలు ఉన్నాయి’’అని సిన్హా పేర్కొన్నారు. -
ఉత్తర కొరియా ఎన్నికల్లో 'కిమ్' ప్రభంజనం.. అన్ని సీట్లలో గెలుపు
మార్చి 15న జరిగిన ఉత్తర కొరియా అధ్యక్ష ఎన్నికల్లో కింగ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని అధికార వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఏకంగా 99.93 శాతం ఓట్లతో, పోటీ చేసిన 687 స్థానాల్లోనూ గెలిచి, తిరుగులేని విజయం సాధించింది. కిమ్ పార్టీకి వ్యతిరేకంగా కేవలం 0.07 శాతం ఓట్లు మాత్రమే రావడం చర్చనీయాంశమైంది. గెలుపొందిన సభ్యుల్లో 70 శాతం కొత్త వారు కావడం మరో విశేషం. వీరిలో కిమ్ సోదరి కిమ్ యో-జోంగ్ కూడా ఉన్నారు. కిమ్కు అత్యంత సన్నిహితుడు జో యోంగ్-వోన్కు కీలక పార్లమెంటరీ పదవికి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ గెలుపు తర్వాత కిమ్ దక్షిణ కొరియాతో సంబంధాలను శత్రుత్వంగా నిర్వచించేలా రాజ్యాంగ సవరణ చేయవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రతిపక్షం లేకపోవడానికి కారణం- ఉత్తర కొరియాలో ఎన్నికల ప్రక్రియ మొత్తం కిమ్ కనుసన్నల్లోనే నడుస్తుంది.- ప్రతి నియోజకవర్గంలో ఒకే అభ్యర్థి ఉంటాడు. పోటీ చేసేందుకు అభ్యర్ది కూడా ఉండడు. - ఓటర్లు అభ్యర్థిని తిరస్కరించే అవకాశం ఉన్నా, బహిరంగ ఓటింగ్ విధానం కావడంతో వ్యతిరేక ఓటు వేయడం ప్రమాదకరంగా ఉంటుంది. మొత్తంగా ఈ ఎన్నికల ఫలితాలు కిమ్ నియంతృత్వాన్ని మరోసారి ప్రపంచానికి చాటాయి. ఇక్కడ చీమ చిట్టుక్కుమన్నా, కిమ్కు తెలిసే జరగాలి. వ్యవస్థలన్నీ కిమ్ చేతుల్లోనే ఉంటాయి. పౌరులు తినే తిండి దగ్గరి నుంచి కట్టుకునే బట్ట వరకు అన్నీ కిమ్ నియంత్రణలోనే ఉంటాయి. పౌర హక్కులు అనేవి ఉత్తర కొరియాకు వర్తించవు. అంతలా కిమ్ నియంతృత్వం కొనసాగుతుంది. -
వెనిజులా అధ్యక్షురాలి సంచలన నిర్ణయం
వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. 11 ఏళ్ల పాటు రక్షణ మంత్రిగా పని చేసిన జనరల్ వ్లాదిమిర్ పడ్రినోను పదవి నుంచి తప్పించింది. అతడి స్థానంలో జనరల్ గుస్తావో గోంజాలెజ్ లోపెజ్ను నియమించింది.2014 నుంచి రక్షణ మంత్రిగా ఉన్న పడ్రినో మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోకు అత్యంత సన్నిహితుడు. ఈ మార్పు వెనిజులా రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. మాజీ అధ్యక్షుడు మదురో ముద్రను క్రమంగా తొలగించే ప్రయత్నంగా భావించబడుతోంది. రోడ్రిగెస్ ప్రభుత్వం సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్న సంకేతంగా పరిగణించబడుతోంది.పడ్రినోపై అవినీతి ఆరోపణలతో పాటు, నిరసనకారులపై హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని అభియోగాలు ఉన్నాయి. అయినా రోడ్రిగెస్ పడ్రినోను దేశానికి విశ్వాసపాత్రుడైన సైనికుడిగా అభివర్ణిస్తూ, త్వరలో కొత్త బాధ్యతలు అప్పగిస్తామని తెలపడం కొసమెరుపు. కొత్త రక్షణ మంత్రి గుస్తావో గోంజాలెజ్ లోపెజ్ విషయానికొస్తే.. ఇతను గతంలో వెనిజులా ఇంటెలిజెన్స్ చీఫ్గా పని చేశారు. ఇటీవల అతను ప్రభుత్వ చమురు సంస్థ PDVSAలో కీలక పాత్ర పోషించారు. ఇతనిపై కూడా మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఈ ఏడాది జనవరి 3న అమెరికా సైనిక దాడి చేసి మదురో, అతని భార్య సిలియా ఫ్లోరెస్ను చెరలోకి తీసుకుంది. ఆతర్వాత తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగెస్ను నియమించింది. తదనంతరం మదురో ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు ఒక్కొరిగా రాజీనామాలు చేశారు. రోడ్రిగెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక వందలాది రాజకీయ ఖైదీలను విడుదల చేసి, సాధారణ అమ్నెస్టీ చట్టాన్ని ఆమోదించింది.ట్రంప్ ఒత్తిడిఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వెనిజులా చమురు మరియు గనుల రంగాన్ని విదేశీ పెట్టుబడులకు తెరవాలని ఒత్తిడి చేస్తున్నారు. అమెరికా ఇప్పటికే వెనిజులా చమురు విక్రయాలపై నియంత్రణ సాధించిందని ట్రంప్ ప్రకటించారు. కారాకాస్లోని అమెరికా రాయబార కార్యాలయం ఏడు సంవత్సరాల విరామం తర్వాత ఇటీవలే మళ్లీ ప్రారంభమైంది. -
ఒక్కసారిగా పెరిగిన చమురు ధరలు
ఇరాన్ సౌత్ పార్స్ గ్యాస్ఫీల్డ్పై ఇజ్రాయెల్ దాడి తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 5 శాతం పెరిగి 108.66 డాలర్లకు చేరింది. US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ (WTI) 2.5 శాతం పెరిగి 98.65 డాలర్లకు చేరింది. బ్రెంట్–WTI మధ్య ధర తేడా 2019 తర్వాత ఇదే అత్యధికం. కాగా, బుషెహర్ ప్రావిన్స్ తీరంలో ఉన్న ప్రపంచంలోనే అతి పెద్ద గ్యాస్ఫీల్డ్ "సౌత్ పార్స్" సదుపాయాలు దాడికి గురయ్యాయి. ఈ దాడులను ఇజ్రాయెల్ చేసింది. ఈ దాడుల తర్వాత ఇరాన్.. ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలోని ఆయిల్–గ్యాస్ సదుపాయాలపై ప్రతీకార దాడులు చేస్తామని హెచ్చరించింది.హెచ్చరించిన విధంగానే ఇరాన్ ఖతార్లోని రాస్ లాఫాన్ గ్యాస్ ఫెసిలిటీపై బాలిస్టిక్ మిసైళ్లతో దాడులు చేసింది. దీంతో ఆ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అధికారులు మంటలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా చమురు, సహజ వాయువు ఎగుమతులకు తీవ్ర అంతరాయం ఏర్పాడింది. రోజుకు 7–10 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తి తగ్గినట్లు అంచనా. ఇది ప్రపంచ డిమాండ్లో 7–10 శాతం తగ్గుదల. చమురు–గ్యాస్ ధరలు ఎక్కువ కాలం ఇలాగే పెరుగుతూ పోతే ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగి, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదముంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్న అమెరికాఅమెరికా ప్రభుత్వం ఇంధన సరఫరా సమస్యను ఎదుర్కొనేందుకు జోన్స్ యాక్ట్ నిబంధనలను 60 రోజుల పాటు సడలించింది. అలాగే, వెనిజులా ప్రభుత్వ చమురు సంస్థ PDVSAతో కొన్ని లావాదేవీలకు అనుమతి ఇచ్చింది. -
పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ విరమణ
పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ మధ్య తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందం జరిగింది. ఈద్ అల్-ఫితర్ సందర్భంగా యుద్ధాన్ని ఐదు రోజుల పాటు నిలిపివేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. పాకిస్తాన్ సమాచార మంత్రి అట్టౌల్లా తరార్ ప్రకటన ప్రకారం.. ఈ విరమణ మార్చి 19వ తేదీ అర్థరాత్రి నుండి మార్చి 24వ తేదీ అర్థరాత్రి వరకు కొనసాగుతుంది. ఈ మధ్యలో ఏదైనా సరిహద్దు దాడి, డ్రోన్ దాడి లేదా ఉగ్రవాద ఘటన జరిగితే ఆపరేషన్లు వెంటనే మరింత తీవ్రతతో పునఃప్రారంభమవుతాయి. ఈ నిర్ణయం సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ దేశాల విజ్ఞప్తి మేరకు తీసుకున్నది. కాగా, ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని ఒమర్ డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్పై పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సంఖ్యలో గాయపడ్డారు. ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారంతా వైద్య సాయం పొందుతున్న రోగులని ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది. అయితే పాక్ మాత్రం ఈ ఆరోపణను తీవ్రంగా ఖండిస్తూ.. తాము కేవలం ఉగ్రవాద మౌలిక వసతులు మరియు సైనిక స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని వెల్లడించింది. ఈ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబాన్లు దురాండ్ లైన్ వెంబడి పాకిస్తాన్ సైన్యంపై ఆపరేషన్ ప్రారంభించారు. -
హెచ్చరించిన విధంగానే ఇరాన్ దాడి
గంటల వ్యవధిలో ముగ్గురు కీలక నేతలను కోల్పోయిన ఇరాన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతుంది. వార్నింగ్ ఇచ్చిన విధంగానే గల్ఫ్ దేశాలపై దాడులను ప్రారంభించింది. ఇందులో భాగంగా సౌదీ అరేబియా రాజధాని రియాద్పై నాలుగు బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించింది. అయితే వీటిని సౌదీ రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకుంది.సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. రియాద్ వైపు ప్రయోగించబడిన నాలుగు బాలిస్టిక్ మిసైళ్లు విజయవంతంగా అడ్డుకోబడ్డాయి.మిసైళ్లను అడ్డుకునే ప్రక్రియలో ఏర్పడిన శకలాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పడ్డాయి. అయితే ఇందులో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని స్పష్టం చేసింది. కాగా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ గూఢచార మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్, ఆ దేశ కీలక సైనికాధికారి అలీ లారిజానీ, ఐఆర్జీసీకి చెందిన బసిజ్ పారామిలటరీ ఫోర్స్ కమాండర్ జనరల్ ఘోలమ్రెజా సులేమానీ మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికా-ఇజ్రాయెల్ దళాలు బుషేర్ ఫ్రావిన్స్లోని ఇరాన్ నేచురల్ గ్యాస్ ఫీల్డ్ అయిన సౌత్ పర్స్పై కూడా దాడులు చేశాయి. వీటికి ప్రతీకారంగానే ఇరాన్ గల్ఫ్ దేశాల ఇంధన స్థావరాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. -
త్వరలోనే మూల్యం చెల్లించుకుంటారు: ఖమేనీ
తమ కీలక సైనికాధికారి లారిజానీ హత్యపై ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా స్పందించారు. ప్రతి రక్తపు బొట్టుకు ఓ లెక్క ఉంటుంది, లారిజానీ హంతకులు త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకుంటారని డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ వర్గాలు లారిజానీ హత్యను ధృవీకరించిన ఒక రోజు తర్వాత మొజ్తబా ఖమేనీ ఓ ప్రజా ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఇజ్రాయెల్, అమెరికాపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. లారిజానీ మరణ వార్త చాలా బాధించింది. అతను విలువలకు కట్టుబడి ఉన్న వ్యక్తి. ఇరాన్ రాజకీయ వ్యవస్థలో ప్రత్యేక స్థానమున్న నాయకుడు. అలాంటి వ్యక్తిని హత్య చేసి ఇజ్రాయెల్, అమెరికా చాలా పెద్ద తప్పు చేశాయి. లారిజానీ హత్య ఇస్లాం వ్యతిరేకుల ద్వేషాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ప్రతి రక్తపు బొట్టుకు ఓ లెక్క ఉంటుంది. లారిజానీ హంతకులు త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకుంటారని మొజ్తబా ఖమేనీ హెచ్చరించారు.కాగా, అలీ లారిజానీ దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి కుడి భుజం లాంటి వ్యక్తి. కొద్ది గంటల ముందు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో లారిజానీ సహా ఐఆర్జీసీకి చెందిన బసిజ్ పారామిలటరీ ఫోర్స్ కమాండర్ జనరల్ ఘోలమ్రెజా సులేమానీ మృతి చెందారు. వీరిద్దరి మరణాన్ని ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. వీరిని హతమార్చాక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. లారిజానీ, సులేమానీని గ్యాంగ్స్టర్ (అయతొల్లా అలీ ఖమేనీ) అసిస్టెంట్లుగా పేర్కొన్నారు. -
మేము ఇలా చేశామనుకో.. అంటూ ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్: ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధంలో తమకు మద్దతు ఇవ్వడంలో వెనుకంజ వేసిన మిత్రదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు చేశారు. ఇరాన్ ప్రభుత్వాన్ని పూర్తిగా కూల్చేస్తే లేదా అంతం చేస్తే ఏమవుతుందో అని తాను ఆలోచిస్తున్నానని చెప్పారు. అమెరికా సైనికంగా ఇరాన్పై దాడి చేసి, అక్కడి ప్రస్తుత పాలనా వ్యవస్థనే పూర్తిగా తొలగిస్తే పరిస్థితి ఎలా మారుతుందో అన్న భావనను వ్యక్తం చేస్తూ ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.హార్మూజ్ జలసంధిపై మిత్రదేశాలు స్పందించడం లేదని ట్రంప్ అన్నారు. హార్మూజ్ జలసంధిని “సో కాల్డ్ స్ట్రైట్” అని పేర్కొన్నారు. ఆ మార్గంపై అసలు అమెరికా ఆధారపడదని, వేరే దేశాలే ఆధారపడతాయని చెప్పారు.ఇరాన్ను ఉగ్రవాద దేశం అంటూ ట్రంప్ పలు వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లోని ప్రస్తుత ప్రభుత్వ పాలనలో మిగిలిన వాటిని కూడా తాము పూర్తిగా ధ్వంసం చేస్తే ఏమవుతుందోనని తాను ఆలోచిస్తున్నాని చెప్పారు. అలాగే, హార్మూజ్ జలసంధి మార్గంపై ఆధారపడే దేశాలు దాన్ని రక్షించుకునే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. ఆ జలసంధి బాధ్యతను అమెరికాకు ఇవ్వకుండా ఆ పని చేయాలని మిత్రదేశాలకు చెప్పారు. అమెరికా ఇలా వెనక్కి తగ్గితే, ప్రస్తుతం సాయం చేయని మిత్రదేశాలు కూడా వెంటనే కదిలి హార్మూజ్ను కాపాడుకునే బాధ్యతల్లో పాల్గొనాల్సి వస్తుందని ట్రంప్ అంటున్నారు.కాగా, పశ్చిమాసియా ఘర్షణ మధ్య ఇరాన్పై అమెరికా సైనిక చర్యల్లో కలిసి పాల్గొనడానికి కొన్ని నాటో దేశాలు నిరాకరించాయి. నాటో దేశాలపై కూడా ట్రంప్ మంగళవారం తీవ్ర విమర్శలు చేశారు. “మా నాటో మిత్రదేశాలు ఇరాన్పై సైనిక చర్యల్లో పాల్గొనాలనుకోవడం లేదని అమెరికాకు తెలియజేశాయి. అయినా, ఇరాన్కు అణ్వాయుధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదని దాదాపు ప్రతి దేశం అంగీకరించింది” అని ఆయన పోస్టులో పేర్కొన్నారు. -
ఇరాన్కు భారీ షాక్ : రెండు రోజుల్లో ముగ్గురు
గత 19 రోజులుగా భీకరంగా సాగుతున్న ఇరాన్ యుద్ధంలో ఇరాన్కు వరుసగా ఎదురు దెబ్బలు తగులు తున్నాయి. తాజా దాడుల్లో ఇరాన్ గూఢచార మంత్రిఇ స్మాయిల్ ఖతీబ్ మరణించారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ప్రకటించారు. అయితే, ఖతీబ్ మరణాన్ని ఇరాన్ ఇంకా ధృవీకరించలేదు.అదనపు అనుమతులు తీసుకోకుండా, ఏఇతర సీనియర్ ఇరాన్ అధికారినైనా చంపేందుకు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని కాట్జ్ ప్రకటించారు. రెండు రోజుల్లో ఇరాన్ ముగ్గురు కీలక వ్యక్తులను కోల్పోయింది. మంగళవారం ఇరాన్ భద్రతా దళాల అధిపతి అలీ లారిజానీ, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ స్వచ్ఛంద బసిజ్ దళాధిపతి ఘోలమ్రెజా సోలేమానీని హత మార్చింది. ఇదీ చదవండి: రూ. 4 కోట్లు : హరీష్ పరిస్థితి వద్దు, దంపతుల కన్నీరు మున్నీరుకాగా ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ మొదలు పెట్టిన దాడుల్లో ఇరాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. ఆయన స్థానంలో, ఆయన కుమారుడు 56 ఏళ్ల మోజ్తాబా ఖమేనీ అత్యున్నత లీడర్గా ఎంపికయ్యారు. మరోవైపు ఈ దాడిలో మోజ్తబా కూడా తృటిలో ప్రమాదంనుంచి తప్పించుకున్నారని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. (బిడ్డల కోసం...గుండెల్ని పిండేసే అమ్మ కథ!) -
నేపాల్లో కుప్పకూలిన హెలికాప్టర్ , వీడియో వైరల్
ఖాట్మాండు : తూర్పు నేపాల్లోని ఖోటాంగ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ కూలిపోయిన ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఒకరు గాయపడినట్టు తెలుస్తోంది. బలమైన గాలులు లేదా ల్యాండింగ్ సమయంలో పేరుకుపోయిన దుమ్ము కారణంగా ఇది కూలిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. కొండ ప్రాంతంలో హెలికాప్టర్ ల్యాండ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా, అది అకస్మాత్తుగా బోల్తా పడింది. పల్టీలు కొడుతూ చివరకు దాని తోక భాగం ఒక పర్వత గోడను ఢీకొట్టడంతో హెలికాప్టర్ ముక్కలై పోయింది. ఎయిర్ డైనాస్టీకి చెందిన ఈ హెలికాప్టర్, ఖాఠ్మండు నుండి ఐదుగురు ప్రయాణికులతో కలిసి ఒక మృతదేహాన్ని తరలిస్తుండగా పొలంలో కూలి పోయిందని అధికారులు ప్రకటించారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగ లేదనీ, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఖోటాంగ్ జిల్లా ముఖ్య అధికారి రేఖా కండెల్ తెలిపారు.#WATCH : A helicopter crashed into farmland in Khotang district, Nepal, on Wednesday while transporting a body from Kathmandu to a nearby village.#Nepal #HelicopterCrash #Khotang #AviationNews #Kathmandu #AirIncident pic.twitter.com/PytLvBRj93— upuknews (@upuknews1) March 18, 2026 హెలికాప్టర్లోని ఒక ప్రయాణికుడు గాయపడగా, పైలట్ సబిన్ థాపా, ఇతర ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని హెలికాప్టర్ కంపెనీ వెల్లడించింది. గాయపడిన వ్యక్తికి సాయం చేసేందుకు అదనపు హెలికాప్టర్ను పంపించామని తెలిపింది. -
బిడ్డల కోసం...గుండెల్ని పిండేసే అమ్మ కథ!
ప్రపంచంలో అందమైన మహిళ గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగానే ఉంటుంది. కానీ బాహ్య సౌందర్యానికే అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ప్రపంచంలో, బిడ్డలకోసం ఎంతో అవమానాన్ని నెత్తిన వేసుకున్న మహిళ గురించి తెలుసుకుంటే హృదయం ద్రవించక మానదు. కుటుంబ పోషణ కోసం 'ప్రపంచంలోనే అత్యంత వికారమైన మహిళ' అన్న బిరుదును స్వీకరించిన సాహసి పేరు మేరీ ఆన్ బెవాన్. తన పిల్లల ఆకలి తీర్చడం కోసం తన ఆత్మగౌరవాన్ని సైతం పణంగా పెట్టి ఈ తల్లి గొప్ప పోరాటమే చేసింది. ఇంతకీ ఎవరా మాతృమూర్తి? ఎందుకు వికారమైన మహిళగా మారింది తెలుసుకుందాం పదండి..!1874లో లండన్లోని న్యూహామ్లో పేద కుటుంబంలో జన్మించింది మేరీ ఆన్ బెవాన్, నర్సింగ్ కోర్స్ చదివి 1894లో నర్సుగా మారింది. ఆ తరువాత థామస్ బెవాన్ అనే వ్యక్తిని ప్రేమిం వివాహం చేసుకుంది. ఈ దంపతులకు నలుగురు పిల్లలు కలిగారు. జీవితం ఎంతో సాఫీగా సాగిపోతున్న తరుణంలో 32 ఏళ్ల మేరీ జీవితంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వైద్యులకు పెద్దగా తెలియని అక్రోమెగాలీ(Acromegaly) అనే అరుదైన వ్యాధి మేరీకి సోకింది. దీంతో కుటుంబమంతా ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురైంది. అంతుచిక్కని వ్యాధి - వికృత రూపంమేరీకి అక్రోమెగాలీ సోకడంతో, శరీరంలో వింత మార్పులు మొదలయ్యాయి. ముఖంలోని ఎముకలు, కండరాలు ఉబ్బి, సాధారణం కంటే మూడు రెట్లు పెద్దవిగా మారాయి. చేతులు, కాళ్లు పెద్దవిగా పెరగడం ప్రారంభించాయి. దవడ కిందికి సాగిపోయి ముఖం ఆకారం మారిపోయింది ముక్కు వెడల్పుగా మారింది. కేవలం ఐదేళ్ల వ్యవధిలోనే, ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తన మునుపటి 'అందమైన' రూపానికి ఏమాత్రం పోలిక లేకుండా పోయింది.శరీరంలో గ్రోత్ హార్మోన్ అధికంగా విడుదలవ్వడం వల్ల వచ్చే సమస్య. ఇది ఇలా కొనసాగుతుండగానే దురదృష్టం మరోసారి వెంటాడింది. 1914లొ ఆమె భర్త థామస్ మరణించాడు. ఫలితంగా నలుగురు పిల్లలతో మేరీ ఒంటరిదైపోయింది.ఇదీ చదవండి: రూ. 4 కోట్లు : హరీష్ పరిస్థితి వద్దు, దంపతుల కన్నీరు మున్నీరుపిల్లల కోసం తల్లి మనసు ఆరాటంరూపం మారిపోవడంతో ఆమెకు ఎక్కడా పని దొరకలేదు. ప్రజలు ఆమెను చూసి నవ్వుతుంటే, మరికొందరు భయపడేవారు. పిల్లలకు తిండి పెట్టడమే కష్టమైన తరుణంలో, 1920వ దశకంలో "ప్రపంచంలోనే అత్యంత వికృతమైన మహిళ కావాలి - భారీ వేతనం ఇవ్వబడును." అనే ఒక ప్రకటన చూసింది: కుటుంబానికి సహాయపడే బహుమతి డబ్బును గెలుచుకోవాలనే ఆశతో పోటీకి దిగింది. ఆమె ప్రయత్నాలు ఫలించాయి, ఆమె ఆ పోటీలో గెలిచి 'ప్రపంచంలోనే అత్యంత వికారమైన మహిళ'గా పేరు పొందింది. ఎన్నో ఫ్రీక్ షో లలో చేరింది. వేదికపై నిలబడితే జనం ఎగతాళి చేసేవారు. కానీ ఆ తర్వాత ప్రసిద్ధ షోమాన్ పి.టి. బర్నమ్ పిలుపు మేరకు ఆమె అమెరికాకు వెళ్లి కోనీ ఐలాండ్లో ప్రదర్శనలు ఇచ్చింది.అలా త్వరలోనే సర్కస్లో స్పెషల్ ఎట్రాక్షన్గా మారిపోయింది. 1933లో చనిపోయే వరకు కోనీ ఐలాండ్లోని డ్రీమ్ల్యాండ్ సైడ్షోలో 'ఫ్రీక్ షో' ప్రదర్శకురాలిగా పనిచేసింది.మేరీ ఆన్ బెవాన్ 1933, డిసెంబరు 26న లో తన 59వ ఏట కన్నుమూసింది. తన రూపంతో జీవితాంతం ఎన్నో అవమానాల్ని మోసింది. కానీ ఆ అవమానాల నుండి వచ్చిన డబ్బుతోనే తన బిడ్డల కడుపు నింపింది. వారిని గౌరవప్రదంగా పెంచి పెద్ద చేసిన విద్యావంతుల్ని చేసింది.తన పిల్లల భవిష్యత్తు కోసం, బిడ్డలుఆకలితో అలమటించకూడదని మేరీ పోటీలో పాల్గొంది. ఆ పోటీలో ఆమె గెలిచి అవమానకరమైన కిరీటాన్ని జీవితాంతం మోసింది. కానీ అది ఒక తల్లిగా ఆమె మనసును ఎంతగా గాయపరిచిందో ఊహించగలమా? కానీ వాటన్నింటినీ అధిగమించి పిల్లల్నిప్రయోజకుల్ని చేయడమే కాదు, అక్రోమెగలీతో బాధపడే చాలా మందికి మేరీ స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలిచింది. లోకం దృష్టిలో ఆమె కేవలం ఒక "వికృత మనిషి" కానీ పిల్లల దృష్టిలో తమను ప్రాణప్రదంగా కాపాడుకున్న "అమ్మ". చరిత్రలో "అత్యంత అందమైన మనసున్న తల్లి"గా నిలిచిపోతుంది. ఏమంటారు? -
మరో ఐదు అగ్రదేశాల్లో యుద్ధం.. భారీగా ఎత్తున సైన్యం మోహరింపు?
బీజింగ్: ప్రపంచంలో యుద్ధాల కాలం కొనసాగుతోంది. ఇప్పటికే ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. ఈ వరుస దాడులతో పశ్చిమాసియాలో నిప్పుల వర్షం కురుస్తున్న ఈ సమయంలో.. ఆ యుద్ధం ఆసియా దేశాల వైపు మళ్లినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. తైవాన్పై చైనా, జపాన్, దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు చేస్తున్నట్లు సమాచారం. ఇరాన్లోని ఘర్షణను పరిష్కరించేందుకు అమెరికాపై పరోక్ష ఒత్తిడి తెచ్చే ప్రయత్నమా, లేక నిజమైన దాడులకు ఈ దేశాలు సిద్ధమవుతున్నాయా అన్నది చర్చనీయాంశంగా మారింది.చైనా ఆకాంక్షల నేపథ్యంలో తైవాన్పై దాడి చేయడానికి సన్నద్ధమవుతోందని తెలుస్తోంది. ఇరాన్పై అమెరికా,ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న సమయంలోనే చైనా.. తైవాన్ను చుట్టుముట్టింది. ఇప్పటివరకు 26 చైనా యుద్ధ విమానాలు, ఏడు యుద్ధ నౌకలు తైవాన్ చుట్టూ మోహరించాయి. తైవాన్ సరిహద్దుల్లో చైనా సైన్యం ఇంత భారీ స్థాయిలో మోహరించడం చరిత్రలో ఇదే మొదటిసారి కావడంతో ఆసియా దేశాల్లో ఆందోళనలు,భయాలు మొదలయ్యాయి. -
‘నేను బ్రతికే ఉన్నాను మైక్’ : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ
జెరూసలేం: ఇరాన్ జరిపిన దాడిలో తాను మరణించాడని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఖండిస్తూ వస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఆరోగ్యం, ఉనికి గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెతన్యాహు స్వయంగా ఒక వీడియోను షేర్ చేశారు.ఆ వీడియోలో ఆయన అమెరికా రాయబారి మైక్ హకబీతో కలిసి నడుస్తూ మాట్లాడుతున్నారు. ‘నేను బతికే ఉన్నాను మైక్’ అంటూ నెతన్యాహూ చమత్కరించారు. హకబీ కూడా సరదాగా స్పందిస్తూ, ‘మీ ఆరోగ్యం గురించి డొనాల్డ్ ట్రంప్ నన్ను పంపించారు. మీ క్షేమసమాచారం తెలుసుకోమన్నారు’ అని వ్యాఖ్యానించారు.నెతన్యాహూ స్వయంగా వీడియో విడుదల చేసి తన ఆరోగ్యం బాగానే ఉందని, తాను బతికే ఉన్నానని స్పష్టం చేశారు. హకబీతో సరదా సంభాషణలో ఆయన ‘అవును, మైక్. నేను బతికే ఉన్నాను’ అని సమాధానం ఇచ్చారు.వీడియోలో సరదా మాటల మధ్య ఇరాన్ నాయకత్వంపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల ప్రస్తావన కూడా వచ్చింది. ఈ రోజు, నేను పంచ్ కార్డ్పై ఉన్న రెండు పేర్లను చెరిపేశాను అని నెతన్యాహూ వ్యాఖ్యానించారు. మొత్తం మీద, ఈ వీడియోతో నెతన్యాహూ మరణం పుకార్లకు ముగింపు పలికారు. అయితే సోషల్ మీడియాలో ఆయనపై వస్తున్న అసత్య కథనాలు ఇంకా చర్చనీయాంశంగానే ఉన్నాయి.నెతన్యాహూ మరణంపై సోషల్ మీడియాలో పుకార్లు మాత్రం ఆగలేదు. కేఫ్లో కాఫీ తాగుతున్న వీడియోలు, ప్రజలతో మాట్లాడుతున్న క్లిప్లు, చేతులు ఊపుతూ అభివాదం చేస్తున్న దృశ్యాలు ‘పాతవి. ఇదంతా ఏఐ సృష్టి ’అంటూ ప్రచారం చేస్తున్నారు. ‘ఆయన చేతిలో ఐదు వేళ్లు కాదు, ఆరు వేళ్లు ఉన్నాయి’ అంటూ వింత వాదనలు కూడా వైరల్ అవుతున్నాయి. Crossing names off the list is good - doing it shoulder to shoulder with our American friends is even better.Good to see Ambassador @GovMikeHuckabee. Always a pleasure.🇮🇱🇺🇸 pic.twitter.com/FZrZN03IZI— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) March 17, 2026 -
డాలర్ ఆధిపత్యానికి గండి!
పశ్చిమాసియాలో ముదురుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు ప్రపంచ భౌగోళిక రాజకీయాలతోపాటు అంతర్జాతీయ ఆర్థిక ముఖచిత్రాన్ని కూడా వేగంగా మారుస్తున్నాయి. ప్రపంచ చమురు సరఫరాకు కీలకంగా ఉన్న హర్మూజ్ జలసంధి కేంద్రంగా సాగుతున్న ఈ పరిణామాలు అమెరికా డాలర్ ఏకఛత్రాధిపత్యానికి సవాలు విసురుతున్నాయి.డీ-డాలరైజేషన్ వేగవంతం?హర్మూజ్ జలసంధి గుండా ప్రపంచంలోని 20% పైగా చమురు రవాణా జరుగుతుంది. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి ఇరాన్, దానికి మద్దతు ఇచ్చే కొన్ని దేశాలు చమురు వ్యాపారాన్ని డాలర్లకు బదులు చైనా కరెన్సీ ‘యువాన్’లో జరపాలని యోచిస్తున్నాయి.అంతర్జాతీయ వాణిజ్యంలో 80% పైగా చమురు లావాదేవీలు డాలర్లలోనే జరుగుతాయి. ఇప్పుడు యువాన్ వైపు మొగ్గు చూపడం వల్ల డాలర్కు ఉన్న గ్లోబల్ డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. యుద్ధం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతింటే సురక్షితమైన కరెన్సీగా డాలర్ను కాకుండా ప్రత్యామ్నాయాల వైపు దేశాలు చూడటం అమెరికా ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక నష్టం కలిగిస్తుంది.భారత రూపాయిపై ప్రభావంప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఈ కరెన్సీ మార్పుల ప్రభావం భారత రూపాయిపై ద్వంద్వ ప్రభావం చూపే అవకాశం ఉంది.చైనా ఆధిపత్యం పెరగడంఅంతర్జాతీయ చమురు మార్కెట్లో యువాన్ పట్టు సాధిస్తే అది ఆసియాలో చైనా ఆర్థిక శక్తిని మరింత పెంచుతుంది. భారత్కు చైనాతో సరిహద్దు వివాదాలు, వాణిజ్య పోటీ ఉన్న నేపథ్యంలో మన పొరుగు దేశం కరెన్సీ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా మారడం భారత్ వ్యూహాత్మక ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంది.ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ లావేదేవీలు సర్వసాధారణం. ఒకవేళ యువాన్ వాడకం పెరిగితే భారత్ తన చమురు దిగుమతుల కోసం యువాన్ను భారీగా కొనాల్సి ఉంటుంది. దీనివల్ల మార్కెట్లో యువాన్కు డిమాండ్ పెరిగి రూపాయి విలువ దానికి సాపేక్షంగా తగ్గే ప్రమాదం ఉంది. దాంతో మన విదేశీ మారక నిల్వలలో డాలర్ల కంటే యువాన్ నిల్వలను ఎక్కువగా ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇతర ప్రభావిత అంశాల గురించి కింద చూద్దాం.ఇదీ చదవండి: ప్రకృతి వ్యవసాయం.. అనివార్యం! -
ఇజ్రాయెల్ టు జపాన్.. అంతటా ఉగాది పచ్చడి క్రేజ్
ఉగాది అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ‘ఉగాది పచ్చడి’. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు.. ఇలా ఆరు రుచుల సమ్మేళనంతో జీవిత పాఠాన్ని నేర్పే ఈ పచ్చడి మన తెలుగు వారికే ప్రత్యేకం అనుకుంటాం. అయితే ఈ ఆచారం కేవలం మన దగ్గరే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ‘జీవిత సారాన్ని’ తినిపించే సంప్రదాయాలు ఉన్నాయనే సంగతి మీకు తెలుసా? అవేంటో ఒకసారి చూద్దాం!ఇజ్రాయెల్ ‘సెడర్ ప్లేట్’: చేదు జ్ఞాపకంయూదుల ‘పాసోవర్’ పండుగలో వడ్డించే ‘సెడర్ ప్లేట్’ మన ఉగాది పచ్చడికి గట్టి పోటీ ఇస్తుంది. ఇందులో ‘మారోర్’ అనే చేదు ఆకును తింటారు. ఇది వారి పూర్వీకులు పడ్డ కష్టాలను గుర్తుచేస్తుంది. అదే ప్లేట్లో ‘చరోసెట్’ అనే పండ్లు, గింజల తీపి మిశ్రమం ఉంటుంది. అంటే కష్టం (చేదు) తర్వాత సుఖం (తీపి) వస్తుందని చెప్పడమే దీని ఉద్దేశం. ఇది మన వేపపువ్వు, బెల్లం కాంబినేషన్ మాదిరిగానే ఉందనుకుంటున్నారా?జపాన్ 'ఓసేచి': బాక్సుల్లో భవిష్యత్తుజపనీయులు కొత్త సంవత్సరంలో ‘ఓసేచి ర్యోరి’ అనే ప్రత్యేక వంటకాల బాక్సును పంచుకుంటారు. ఇందులో ఒక్కో పదార్థానికి ఒక్కో అర్థం ఉంటుంది. నల్ల సోయా చిక్కుళ్లు తింటే ఆరోగ్యం, చేప గుడ్లు తింటే సంతాన ప్రాప్తి అని వారి నమ్మకం. మన ఉగాది పచ్చడిలో మామిడి వగరు లాగే, వారు కూడా ప్రకృతి ఇచ్చే ప్రతి పదార్థాన్ని ఒక ఆశీర్వాదంగా జపనీయులు భావిస్తారు.ఇరాన్ 'హఫ్త్-సీన్': ఏడు వస్తువులు.. ఏడు పాఠాలు!పర్షియన్ కొత్త సంవత్సరం ‘నౌరూజ్’ సమయంలో ఇరానీయులు ‘హఫ్త్-సీన్’ అనే టేబుల్ను ఏర్పాటు చేస్తారు. ఇందులో ‘ఎస్’ అక్షరంతో మొదలయ్యే ఏడు పదార్థాలు ఉంటాయి. వెల్లుల్లి ఆరోగ్యానికి, వినెగర్ సహనానికి ప్రతీక అని చెబుతారు. మన పచ్చడిలో చింతపండు పులుపు ఎలాగో, అక్కడ వినెగర్ అలా అన్నమాట. ఈ సంప్రదాయం వెనుక ఉన్న లోతైన అర్థం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.చైనా ‘లాబా గంజి’: ఎనిమిది రకాల అదృష్టంచైనీయులు ‘లాబా’ పండుగ నాడు ఎనిమిది రకాల ధాన్యాలు, పండ్లతో చేసిన గంజిని తాగుతారు. ఇది కేవలం ఆకలి తీర్చడానికే కాదు, రాబోయే ఏడాది అంతా అదృష్టం కలిసిరావాలని చేసే ఒక ప్రార్థన. మన ఉగాది పచ్చడిలో కొత్త బెల్లం ఎలాగైతే కొత్త ఆశలను చిగురింపజేస్తుందో, ఈ లాబా గంజి చైనీయులకు అంతటి పవిత్రమైనది.మహారాష్ట్ర 'పంఛరస': అదే సంప్రదాయంమన పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో గుడి పడ్వా రోజున ‘పంఛరస’ పేరుతో వేపపువ్వు, బెల్లం, ఉప్పు, జీలకర్ర కలిపిన లడ్డూలను తింటారు. పేరు వేరైనా పరమార్థం ఒక్కటే. జీవితం అంటే కేవలం తీపి మాత్రమే కాదు, అన్ని రుచులను సమానంగా స్వీకరించాలని ఈ వంటకం మనకు గుర్తు చేస్తుంది. ఈ పోలికలను చూస్తుంటే ‘వసుదైక కుటుంబం’ అనే భావన మనలో కలుగుతుంది.రుచులు వేరైనా భావం ఒక్కటేమనిషి ఏ దేశంలో ఉన్నా, ఏ భాష మాట్లాడుతున్నా జీవితంలోని ఒడిదుడుకులను ఆహారం ద్వారా అర్థం చేసుకోవడం ఒక అందమైన సంప్రదాయం. ఉగాది పచ్చడి అయినా, పాసోవర్ చేదు ఆకులైనా.. కష్టాన్ని భరిస్తూ సుఖాన్ని వెతుక్కోవడమే అసలైన విజయం. అందుకే ఈ ఏడాది ఉగాది పచ్చడి తీసుకునేటప్పడు దానిలోని ‘ప్రపంచవ్యాప్త తత్వాన్ని’ గుర్తుచేసుకోండి. ఇది కూడా చదవండి: విచ్చలవిడి ‘యూజర్ల’పై ప్రభుత్వం ఉక్కుపాదం -
హార్మూజ్ వద్ద అమెరికా భయానక దాడులు.. ఇరాన్కు భారీ నష్టం?
వాషింగ్టన్: ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఇరాన్ సైతం ప్రతిదాడులు చేస్తోంది. ఇలాంటి తరుణంలో హార్మూజ్ జలసంధి విషయంలో అమెరికా ఫుల్ ఫోకస్ పెట్టింది. జలసంధిని తిరిగి తెరిచేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ కీలక జలమార్గం సమీపంలోని ఇరాన్ క్షిపణి స్థావరాలపై అమెరికా సైన్యం దాడులు చేసింది.అమెరికా సైన్యం తాజాగా హార్మూజ్ జలసంధి వద్ద ఉన్న ఇరాన్ క్షిపణి స్థావరాలపై అత్యంత శక్తివంతమైన బాంబులతో దాడి చేసింది. జలసంధి సమీపంలోని ఇరాన్ తీరప్రాంతంలో పటిష్టంగా ఉన్న ఇరాన్ క్షిపణి స్థావరాలపై పలు 5,000-పౌండ్ల డీప్ పెనెట్రేటర్ బాంబులను ప్రయోగించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ స్థావరాల్లోని ఇరాన్ నౌకా విధ్వంసక క్రూయిజ్ క్షిపణులు జలసంధిలో అంతర్జాతీయ నౌకాయానానికి ముప్పుగా పరిణమించాయి అని చెప్పుకొచ్చింది.Hours ago, U.S. forces successfully employed multiple 5,000-pound deep penetrator munitions on hardened Iranian missile sites along Iran’s coastline near the Strait of Hormuz. The Iranian anti-ship cruise missiles in these sites posed a risk to international shipping in the… pic.twitter.com/hgCSFH0cqO— U.S. Central Command (@CENTCOM) March 17, 2026అమెరికా, ఇజ్రాయెల్ తమ దేశంపై చేస్తున్న యుద్ధానికి ప్రతీకారంగా, ప్రపంచ చమురులో ఐదో వంతు ప్రవహించే హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన తర్వాత ఈ బాంబు దాడి జరిగింది. ఈ దిగ్బంధనం సముద్ర రవాణాను తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో, ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల పెరుగుదలకు కారణమైన విషయం తెలిసిందే. అయితే, జలసంధిపై ఇరాన్ ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేసింది. యుద్ధంలో పాల్గొనని దేశాలకు చమురు సరఫరా చేసే నౌకలకు అనుమతిస్తున్నట్టు తెలిపింది.శక్తివంతమైన బాంబు..2022లో ఎయిర్ ఫోర్స్ టైమ్స్ నివేదిక ప్రకారం, బంకర్ బస్టర్ అని పిలవబడే ఈ బాంబుల ఖరీదు సుమారు $288,000. అయినప్పటికీ, గత సంవత్సరం ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా వేసిన 30,000 పౌండ్ల (13,600 కిలోల) బాంబుల కంటే ఇవి తక్కువ శక్తివంతమైనవి. ఇవి సాధారణ బాంబులతో ధ్వంసం చేయలేని భూగర్భ బంకర్లు, కాంక్రీట్ కట్టడాలు వంటి గట్టి నిర్మాణాలను ఛేదించడానికి ఉపయోగిస్తారు.🇺🇸🇮🇷The U.S. unleashed the Massive Ordnance Penetrator, the 30,000-pound bomb.A.K.A. the bunker buster.This thing is engineered to slam through up to 200 feet of the toughest reinforced concrete before turning "buried and safe" into a myth…#iran #usa #dubai https://t.co/wtMI4obSkg pic.twitter.com/loQFtjDCIr— PROXY (@PROXY0b) March 14, 2026బాంబుల లక్షణాలుబరువు: సుమారు 2,267 కిలోలు (5,000 పౌండ్లు).రకం: బంకర్ బస్టర్, అంటే భూగర్భంలో ఉన్న గట్టి నిర్మాణాలను ఛేదించే బాంబు.ఉపయోగం: క్షిపణి సైలోలు, కమాండ్ సెంటర్లు, బలమైన రక్షణ గల స్థావరాలను ధ్వంసం చేయడం.వాహక విమానాలు: భారీ బాంబర్లు లేదా ప్రత్యేకంగా సిద్ధం చేసిన యుద్ధ విమానాలు.ట్రంప్ హెచ్చరిక..మరోవైపు..నాటో మద్దతు లేకపోయినా ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధి త్వరలోనే భద్రతలోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్తితుల్లో కూడా ఎక్కువ సమయం పట్టదు అని తెలిపారు. ఈ విషయంలో తమకు ఎవరి సాయం అవసరం లేదని, ఒంటరిగానే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. హార్మూజ్ భద్రతపై అమెరికా చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఇరాన్ తీర ప్రాంతాలపై అమెరికా దాడులు తీవ్రతరం అయ్యాయని ట్రంప్ వెల్లడించారు. పశ్చిమాసియా దేశాలు.. ముఖ్యంగా ఇజ్రాయెల్ అమెరికాకు మద్దతు ఇస్తున్నాయని చెప్పారు. ఈ సహకారం భద్రతా చర్యలకు కీలకమని తెలిపారు. అమెరికా సైన్యం రంగం ప్రవేశం చేస్తే వియత్నాం తరహా యుద్ధం జరుగుతుందని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి చేసిన హెచ్చరికలను కూడా ట్రంప్ తోసిపుచ్చారు. తనకు ఎలాంటి భయం లేదని, దేనికీ కూడా భయపడేది లేదని స్పష్టం చేశారు -
టార్గెట్ తప్పలేదు.. ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి హతం
మరింత భీకరంగా పశ్చిమాసియా యుద్ధం కొనసాగుతుంది. ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు బుధవారం నాటికి 19వ రోజుకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ ఒత్తిడి పెరుగుతూనే ఉంది. అందుకు తాజా పరిణామాలు ఈ ఉద్రిక్తతలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ పరిస్థితులు పశ్చిమాసియా దేశాల భద్రతా సమీకరణాలను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి -
నైజీరియాలో ఆత్మాహుతి దాడులు.. 23 మంది మృతి
మైదుగురి: నైజీరియాలోని ఈశాన్య నగరం మైదుగురి సోమవారం రాత్రి ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లింది. ఈ ఘటనల్లో కనీసం 23 మంది చనిపోగా, మరో 108 మంది గాయాలపాలయ్యారు. బోర్నో రాష్ట్ర రాజధాని అయిన మైదుగురిలోని బోధనాస్పత్రి ప్రధాన ద్వారం వద్ద రాత్రి 7.30 గంటల ప్రాంతంలో మొదటి పేలుడు సంభవించింది. కొద్ది నిమిషాల వ్యవధిలోనే అక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని అత్యంత రద్దీగా ఉండే మార్కెట్, వ్యాపార కూడలి అయిన పోస్టాఫీస్ వద్ద వరుస పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ మూడు ఘటనలను ఆత్మాహుతి దాడులుగా అనుమానిస్తున్నట్లు బోర్నో పోలీసు విభాగం ప్రతినిధి కెన్నెత్ తెలిపారు.వీటికి బాధ్యత వహిస్తున్నట్లు ఎవరూ ప్రకటించుకోలేదు. అయితే, జిహాదీ గ్రూపు బోకో హరామ్పైనే అనుమానాలున్నాయి. మైదుగురి నగర శివార్లలో తీవ్రవాదుల దాడులను సైన్యం తిప్పికొట్టిన 24 గంటల వ్యవధిలోనే ఆత్మాహుతి దాడులు చోటుచేసుకోవడంపై ప్రజల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో షరియా నిబంధనలను అమలు చేయాలంటూ ఈ గ్రూపు 2009 నుంచి హింసాత్మక ఘటనలకు దిగుతోంది. ఐఎస్ తదితర గ్రూపులను కలుపుకుని, వేలాది మంది సాయుధులు కలిగిన బోకో హరామ్ అత్యంత ప్రమాదకరంగా మారింది. ఇటీవలి కాలంలో ఈ గ్రూపు సైనిక స్థావరాలపై దాడులు తీవ్రతరం చేసింది. పలువురు ఉన్నతాధికారులను, సైనికులను చంపడంతోపాటు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని లూటీ చేసింది. -
ఇరాన్-రష్యా రెండూ ఒకటే.. 'ద్వేష సోదరులు': జెలెన్స్కీ
ఇరాన్, రష్యాపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డ్రోన్ యుద్ధం వల్ల కలిగే ప్రమాదాలపై లండన్లోని వెస్ట్ మినిస్టర్లో మాట్లాడుతూ.. ఇరాన్-రష్యా ప్రభుత్వాలను ద్వేషంలో సోదరులుగా అభివర్ణించారు. ఇరాన్ తయారు చేసిన షాహెడ్ ‘కామికాజే’ డ్రోన్లు రష్యాకు విక్రయించబడుతున్నాయని, అవి ఉక్రెయిన్పై దాడుల్లో ఉపయోగించబడుతున్నాయని వివరించారు. రష్యా చమురుపై ఆంక్షలను సడలించడం ప్రమాదకరమని, మాస్కోపై ఒత్తిడి కొనసాగించడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. జెలెన్స్కీ తన ప్రసంగంలో మధ్యప్రాచ్య యుద్ధాన్ని ఉక్రెయిన్లో జరుగుతున్న దీర్ఘకాలిక యుద్ధంతో అనుసంధానిస్తూ.. ఉక్రెయిన్ ఇప్పుడు ఆధునిక యుద్ధంలో పయనీకులుగా మారిందని, తమ అనుభవాన్ని మిత్రదేశాలతో పంచుకోవచ్చని అన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ చౌకగా తయారయ్యే ఇంటర్సెప్టర్ డ్రోన్లను ఉపయోగించి రష్యా దాడులను ఎదుర్కొంటోందని తెలిపారు.ప్రస్తుతం 201 మంది ఉక్రెయిన్ సైనిక నిపుణులు మధ్యప్రాచ్యంలో ఉన్నారని, మరో 44 మంది అక్కడికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని, వీరంతా ఇరాన్ డ్రోన్లను ఎదుర్కొనే విధానాలను మిత్రదేశాలకు బోధిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే, రక్షణ మంత్రి జాన్ హీలీ, ప్రతిపక్ష నాయకులు, 60 మంది ఎంపీలు, లార్డులు పాల్గొన్నారు. -
యుద్ధనౌకలను పంపబోం
వాషింగ్టన్: అగ్రరాజ్యం పిలుపిస్తే అందరూ కట్టకట్టుకుని వస్తారని కలలుగన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు భంగపాటు ఎదురైంది. హార్మూజ్ జలసంధి గుండా నౌకలు వెళ్తే తగలబెడతామని హెచ్చరిస్తున్న ఇరాన్కు మనందరి యుద్ధనౌకలు, యుద్ధవిమానాలతో బదులివ్వాలంటూ నాటోలోని సభ్యదేశాలు, ఇతర మిత్రదేశాలకు పిలుపునిచ్చిన ట్రంప్కు ఎలాంటి సానుకూల స్పందనా రాలేదు. పైగా చైనా షరతులు విధించి ట్రంప్కు మరింత కోపం తెప్పించింది. యుద్ధంలో భాగస్వాములు కాబోమంటూ మిత్రదేశాలు ముఖంచాటేయడంతో ట్రంప్ తీవ్ర అసహనానికి గురయ్యారు. అసలేం జరిగింది? గట్టున కూర్చుని ఇరాన్ చేస్తున్న బెదిరింపులకు భయపడకుండా హార్మూజ్ వద్దకు తక్షణం యుద్ధ నౌకలను పంపాల్సిందిగా చైనా, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా సహా ఏడు దేశాలకు ట్రంప్ విజ్ఞప్తి చేశారు. దీనిపై నాటో దేశాలు, మిత్రదేశాల నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. దీనిపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ మాట్లాడారు. ‘‘ఇప్పటికిప్పుడు యుద్ధనౌకలు, డ్రోన్లు పంపే ఆలోచనే లేదు. అమెరికా, యురోపియన్ యూనియన్, గల్ఫ్లోని మిత్రదేశాలతో చర్చించాకే బ్రిటన్ ఏదైనా నిర్ణయం తీసుకుంటుంది’’అని అన్నారు.‘‘అసలు పశ్చిమాసియా యుద్ధంలో నాటోకు ఎలాంటి సంబంధం లేదు. శక్తివంత అమెరికా నేవీ యుద్ధనౌకలు చేయలేని పనిని యురోపియన్ యుద్ధనౌకలు పూర్తిచేయగలవా?’’అని జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పోస్టోరియస్ అన్నారు. ‘‘పరిస్థితి కాస్తంత సద్దుమణిగాకే చమురునౌకలకు రక్షణగా మా యుద్ధనౌకలను పంపగలం’’అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ తెగేసి చెప్పారు. జలసంధిలో జలసమాధి కావాలా? ‘‘ఇప్పటికప్పుడు యుద్ధనౌకలను పంపే ఆలోచన మాకు లేదు. పశ్చిమాసియాకు సంబంధించిన యురోపియన్ యూనియన్ నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండబోవు. హార్మూజ్ జలసంధిని తెరపించడం కోసం మేం జలసమాధి కావాలా? మా దేశాలపై బాంబుదాడులు అవసరమా?’’అని ఐరోపా సమాఖ్య విదేశాంగ విధానాల విభాగ చీఫ్ కాజా కల్లాస్ తెగేసి చెప్పారు. ‘‘ముందుగా ఇరువైపులా సైనిక చర్యలను తక్షణం ఆపేయాలి. దాడుల పర్వానికి తెరదించాలి. ఆ తర్వాతే యుద్ధనౌకలను పంపడంపై ఆలోచిస్తాం.యుద్దం ఇలాగే కొనసాగితే చమురు సంక్షోభం, ఆ తర్వాత ఆర్థిక సంక్షోభం తప్పవు’’అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ చెప్పారు. ‘‘పార్లమెంట్ ఆమోదం లేకుండా యుద్ధనౌకలను హార్మూజ్కు పంపడం కుదరదు. కొరియన్ల భద్రత, ముడిచమురు రావాణామార్గాల రక్షణే మాకు ముఖ్యం’’అని దక్షిణ కొరియా రక్షణ మంత్రి అహన్గుయీ బాక్ చెప్పారు. ‘‘ఎస్కాట్గా యుద్ధనౌకలను పంపాలని మాకు ఎవరి నుంచీ అభ్యర్థన రాలేదు’’అని జపాన్ నూతన మహిళా ప్రధాని సనాయీ తకైచీ అన్నారు. మార్చి 19వ తేదీన ఆమె వాషింగ్టన్లో ట్రంప్తో భేటీకాబోతున్న వేళ అమెరికా ప్రతికూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎవరి సాయం అక్కర్లేదు: ట్రంప్ సాయుధ సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆగ్రహం మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో మంగళవారం ఒక పోస్ట్పెట్టారు. ‘‘ఇరాన్ ఉగ్రరాజ్యంపై దాడులకు మాతో కలిసి రాబోమని తాజాగా నాటో సభ్యదేశాలు చావుకబురు చల్లగా చెప్పాయి. నాటో దేశాల రక్షణ కోసం అమెరికా ప్రతి ఏటా వందల బిలియన్ డాలర్లను ధారపోసింది. ఇరుగుపొరుగు దేశాలుగా ఉన్న నాటో సభ్యదేశాలు మేం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటాయని భ్రమించా. కానీ వాళ్లు మాకు ఏ రకంగానూ ఉపయోగపడట్లేరు. వాస్తవానికి ఇప్పటికే అమెరికా ఇరాన్ను అన్ని విధాలుగా దెబ్బకొట్టింది. ఇప్పుడు మాకు నాటో నుంచి ఎలాంటి సాయం అక్కర్లేదు. గతంలోనూ వాళ్లు మాకు సాయం చేయలేదు. జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణకొరియాలదే అదే తీరు. మాకు ఎవరి సాయం అక్కర్లేదు’’అని అన్నారు.


