Mahabubabad
-
ఈ ఆటో చాలా కూల్ గురూ.. సమ్మర్ స్పెషల్
ఆటో పైకప్పు నిండా పచ్చని పూల మొక్కలు, గడ్డి మొక్కలను పెంచాడు. మొక్కలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు నీరు పోస్తున్నాడు. ఆటో ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాడు. ప్రయాణికులకు చల్లదనాన్ని పంచేందుకు.. మహబూబాబాద్ మండలం దర్గా తండాకు చెందిన భూక్యా హ్యాంజ్యా అలియాస్ ఆటో అంజి వినూత్న ఆలోచనకు దృశ్య రూపమిది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్చెరువు ఎండింది.. చేప చిక్కింది మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నిజాం చెరువు నీరు అడుగంటిపోయింది. దీంతో కొద్దిపాటి నీటిలోని చేపలను మాధవాపురం గ్రామానికి వలస వచ్చిన సైబీరియన్ కొంగలు సునాయాసంగా వేటాడుతున్నాయి. కోరుకున్న చేపను కొంగలు పట్టేసుకుని గుటుక్కుమనిపిస్తున్నాయి. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్ కళ తప్పిన ప్రకృతి ఆకురాలే సమయం వచ్చేసింది. వానాకాలం, చలికాలంలో పచ్చదనంతో ప్రకృతి ప్రేమికులను మురిపించిన గుట్టలు.. ఇప్పుడు ఎండ తీవ్రతతో మాడిపోతున్నాయి. తీవ్రమైన ఎండలతో చెట్లు ఆకురాల్చి మోడువారి కనిపిస్తున్నాయి. రాత్రివేళ కార్చిచ్చుతో మంటల్లో కాలిపోతున్నాయి. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం శివారు, అంతర్గాం మార్గంలోని బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయ సమీపంలో ఎండిన చెట్లతో గుట్టలు బోసిపోయి కనిపించాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లిపైరు ఎండి.. పశువులకు తిండిహనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో ఎండల తీవ్రతకు భూగర్బ జలాలు అడుగంటిపోయాయి. బావులలో నీళ్లు తగ్గి పంటలకు సరిపడా సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. దిక్కుతోచని రైతులు కొంత పంటనైనా కాపాడుకుందామని నీరున్నంత వరకు పారించుకుని.. మిగతా పంటను మూగజీవాలకు వదిలేశారు. – ధర్మసాగర్ఎడ్లకు మేత.. గుండె కోత.. ఎస్సారెస్పీ కాలువ నీరు రాలేదు.. వ్యవసాయ బావిలో నీరు అడుగంటింది. పొట్టదశకు వచ్చిన వరి పైరు ఎండిపోతోంది. పంట చేతికొస్తే పెట్టుబడి కోసం తెచ్చిన అప్పు తీర్చుతామనే రైతు గంపెడాశ ఆవిరైపోయింది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మద్దిర్యాలకు చెందిన ఎండీ షరీఫ్.. తనకున్న నాలుగెకరాల్లో యాసంగి వరి వేశాడు. నీళ్లు అందక రెండెకరాల్లో పంట ఎండిపోయింది. దీంతో రైతు కుటుంబ సభ్యులు.. ఎండిన పైరును ఎద్దులకు మేతగా వినియోగిస్తూ ఇలా కనిపించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
బడ్జెట్పై సమాచారంతో సిద్ధంగా ఉండాలి..
● సమీక్షలో మేయర్, కమిషనర్ వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై ప్రతీ సభ్యుడు అడిగే ప్రశ్నలకు బాధ్యతాయుతంగా సమాధానాలు అందించాల్సిన బాధ్యత మీపై ఉందని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను హెచ్చరించారు. బుధవారం బల్దియా కార్యాలయంలో గురువారం 2025–26 బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మేయర్, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే వింగ్ అధికారులతో సమావేశమై దిశా నిర్దేశం చేశారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. అధికారులు ఆదాయ, వ్యయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ జోనా, సెక్రటరీ అలివేలు, బయాలజిస్ట్ మాధవరెడ్డి, ఇన్చార్జ్ సీపీ రవీందర్ రాడేకర్, హెచ్ఓలు రమేశ్, లక్ష్మారెడ్డి ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్ ఈఈలు తదితరులు పాల్గొన్నారు.గేట్లో రేవంత్కుమార్కు ఫస్ట్ ర్యాంక్వరంగల్: గేట్–2025 (అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగం)లో వరంగల్ దేశాయిపేటకు చెందిన కీర్తి రేవంత్కుమార్ జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. గేట్ పరీక్షలో 100 మార్కులకు 74.67 మార్కులు సాధించి మొదటి ర్యాంకు పొందాడు. రేవంత్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను స్థానికులు అభినందించారు. -
ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా
వరంగల్: కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నిర్మాణంలో భూములు కోల్పోయి నష్టపరిహారం రాని కొంతమంది రైతులు హనుమకొండలోని వరంగల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. మెగా టెక్స్టైల్ పార్కులో తమ భూములను తీసుకున్న రెవెన్యూ అధికారులు నష్టపరిహారం ఇప్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. తమ బాధను ఆర్డీఓ, కలెక్టర్ తెలిపేందుకు వచ్చామని, ఇప్పటిౖకై నా పరిహారాన్ని వెంటనే 15 రోజుల్లో చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. పురుగుల మందు డబ్బాతో వచ్చి ధర్నా చేయడంతో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కార్యక్రమంలో భూనిర్వాసితుల సంఘం నాయకుడు సముద్రాల యాకస్వామి తదితరులు పాల్గొన్నారు. పురుగుల మందు డబ్బాలతో భూనిర్వాసితుల ఆందోళన టెక్స్టైల్ పార్కులో భూములు కోల్పోయినా పరిహారం ఇవ్వలేదని ఆవేదన -
‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’తో మేలు
హన్మకొండ: ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ ద్వారా అనేక ప్రయోజనాలున్నాయని, ఇది దేశ భవిష్యత్ను మార్చే నిర్ణయమని బీజేపీ నేత, న్యాయవాది రావు అమరేందర్రెడ్డి అన్నారు. హనుమకొండ దీన్దయాళ్ నగర్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక – బీజేపీ దృష్టి కోణం’ అనే అంశంపై జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి అధ్యక్షతన బుధవారం వర్క్షాపు జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రతీ సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక ఎన్నిక జరుగుతుండడంతో అభివృద్ధికి ఆటంకం కలుగుతోందన్నారు. ఈక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవిద్ చైర్మన్గా, హోంమంత్రి అమిత్ షా, గులాంనబీ ఆజాద్, కశ్యప్ ఇలా అన్ని వర్గాల వ్యక్తులతో కమిటీ వేశారని గుర్తుచేశారు. ఆ కమిటీ నివేదిక ప్రకారం దేశంలో ఒకేసారి రాష్ట్ర, కేంద్ర ఎన్నికలు నిర్వహించి మూడు నెలల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి తర్వాత నాలుగున్నరేళ్ల పాటు ఎన్నికలు లేకుండా కేవలం పాలనపై దృష్టి కేంద్రీకరించవచ్చన్నారు. వర్క్షాపులో మాజీ మేయర్ డాక్టర్ టి.రాజేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, బీజేపీ హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, నాయకులు చాడ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ పగడాల కాళీప్రసాద్, దొంతి దేవేందర్రెడ్డి, కె.సంపత్రెడ్డి, సండ్ర మధు పాల్గొన్నారు. బీజేపీ నేత, న్యాయవాది రావు అమరేందర్ రెడ్డి -
దేవాదుల మోటార్లు నడిపించకుండానే పలాయనం
హన్మకొండ: దేవన్నపేటలో మోటార్లు నడిపించిన తర్వాత వరంగల్ నుంచి వెళ్తామని చెప్పిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెల్లారేసరికి పలాయనం చిత్తగించారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దుయ్యబట్టారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మంగళవారం హసన్పర్తి మండలం దేవన్నపేట పంప్ హౌజ్ వద్ద మంత్రులు పూజలు చేసి మోటార్లు ఆన్ చేసేందుకు ప్రయత్నించగా స్టార్ట్ కాలేదన్నారు. దీంతో మంత్రులు అధికారులపై మండిపడ్డారని ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు మాజీ సీఎం కేసీఆర్ను విమర్శించారన్నారు. దేవాదుల మెయింటెన్స్కు కాంట్రాక్టరకు ఏటా రూ.7 కోట్లు ఖర్చు అవుతుందని, ఇందులో 20 శాతం కమీషన్ ఇవ్వనందునే సర్కారు పెద్దలు బిల్లులు విడుదల చేయలేదని ఆరోపించారు. కాంట్రాక్టర్.. సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడంతో సమ్మె చేశారని, దీంతో మెయింటెన్స్ చేయలేదని వి వరించారు. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేసిన కడియం శ్రీహరి పార్టీలు మారడం, బిడ్డ ఎంపీ సీటు మీద దృష్టి సారించాడే తప్ప రైతుల ప్రయోజనాలు పట్టించుకోలేదన్నారు. త్వరలో బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు దేవాదుల పంపు హౌజ్ పర్యటన చేపడుతామన్నారు. సమావేశంలో టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, బీఆర్ఎస్ నా యకులు తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, పులి రజినీకాంత్, జోరిక రమేశ్, సల్వాజీ రవీందర్ రావు, నయీమొద్దీన్, బండి రజినీకుమార్, చాగంటి రమేశ్, పోలపల్లి రామ్మూర్తి, ఖలీల్, శ్రీకాంత్చారి, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి -
ఉపాధ్యాయుడికి నోటీస్ జారీ
తొర్రూరు రూరల్: మండలంలోని గుడిబండతండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుడు ఎస్. వినీల్కు సంజాయిషీ నోటీస్జారీ చేసినట్లు ఎంఈఓ మహంకాళి బుచ్చ య్య బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. పాఠశాలల తనిఖీల్లో భాగంగా గుడిబండతండా పాఠశాలను సైతం సందర్శించినట్లు చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పాఠశాలకు ఆలస్యంగా రావడంతో సంజాయిషీ కోరుతూ నోటీస్ జారీ చేసినట్లు చెప్పారు. సంబంధిత ఉపాధ్యాయుడు వినీల్ వెంటనే జిల్లా, మండల విద్యాశాఖ అధికారులకు వివరణ ఇవ్వాలని లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
వీసీని కలిసిన పోలీస్ కమిషనర్
కేయూ క్యాంపస్: వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ కేయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డిని బుధవారం యూనివర్సిటీలో కలిశారు. వీసీకి పుష్పగుచ్ఛం అందించారు. కాగా.. పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి వీసీ కె.ప్రతాప్రెడ్డి సన్మానించారు. అనంతరం వర్సిటీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఎర్రగట్టు జాతర ఆదాయం రూ.16,33,296హసన్పర్తి: ఎర్రగట్టు గుట్ట వేంకటేశ్వర స్వామి ఆలయ జాతర ఆదాయం రూ.16,33,296 వచ్చినట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ ఆరెల్లి వెంకటస్వామి, ఈఓ వెంకట్రావు తెలిపారు. దేవస్థానంలో హుండీలను బుధవారం లెక్కించగా ఆదాయ వివరాలను వారు వెల్లడించారు. వేలం ద్వారా రూ.6,22,500, కల్యాణం ద్వారా రూ.11,160, శీఘ్ర దర్శనం ద్వారా రూ.68,800, ప్రత్యేక దర్శనం ద్వారా రూ.1,92,450, అర్చనల ద్వారా రూ.60,700, విరాళాలు రూ.12,364, స్వామి వారి కట్నాలు రూ.6,859, కేశఖండనం ద్వారా రూ.40, గండదీపం ద్వారా రూ.36,232, హుండీ ఆదాయం రూ.5,88,225, తైబజార్ ఆదాయం రూ.33,966 వచ్చినట్లు వివరించారు. గత జాతర కంటే ఈసారి రూ.3,49,583 ఆదాయం ఎక్కువ వచ్చినట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ధర్మకర్తలు శీలం రమేశ్, కనపర్తి రాజు, సంతోశ్, సురేశ్, తదితరులు పాల్గొన్నారు.కేయూకు బ్లాక్ గ్రాంట్ రూ.145 కోట్లుకేయూ క్యాంపస్: తెలంగాణ ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కాకతీయ యూనివర్సిటీకి ఇచ్చే బ్లాక్గ్రాంట్ నిధులు సుమారు రూ.10 కోట్ల వరకు పెరిగాయి. ఈఆర్థిక సంవత్సరానికి (2025–26) బడ్జెట్లో బ్లాక్ గ్రాంట్ కింద గ్రాంట్ ఇన్ ఎయిడ్ అధ్యాపకుల, ఉద్యోగుల, పెన్షనర్ల వేతనాల కోసం రూ.114.62 కోట్లు కేటాయించారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల కోసం రూ.31 కోట్లు కేటాయించారు. కాగా.. ఈఆర్థిక సంవత్సరానికి వర్సిటీలో డెవలప్మెంట్ ఫండ్ కింద ప్రభుత్వం నిధులు కేటాయించింది. దీంతో మొత్తం రూ.145.62 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. గతేడాదితో పోలిస్తే రూ.10 కోట్ల వరకు పెరిగినట్లయింది. కాకతీయ యూనివర్సిటీ వీసీగా కె.ప్రతాప్రెడ్డి బాధ్యతలు స్వీకరించి కొన్ని నెలలవుతోంది. పలు మార్లు ప్రభుత్వ ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి యూనివర్సిటీకి బ్లాక్ గ్రాంట్ పెంచాలని, అభివృద్ధి పనులకు కూడా నిధులు కేటాయించాలని కోరారు. ప్రతిపాదనలు కూడా పంపారు. అందుకు వీసీ కృషి చేయడంతో కేటాయించిన నిధులు పెరిగినట్లు భావిస్తున్నారు. ఈసారి బడ్జెట్లో నిధులు పెరగడంతో అధికారులు, అధ్యాపకులు, ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మానుకోటలో మహిళ ఆత్మహత్యాయత్నంమహబూబాబాద్ రూరల్: తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి తనకు అన్యాయం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ బీపీ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం జరిగింది. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ మహిళ ఒక ఎస్సైతో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. కాగా.. ఆయన తాను పనిచేస్తున్న ప్రాంతంలో మరో మహిళతో సన్నిహితంగా ఉండగా.. పద్ధతి మార్చుకోమని చెప్పగా పట్టించుకోలేదని తెలిసింది. ఈ క్రమంలో సదరు మహిళ మానసిక వేదనకు గురై మానుకోటలోని జిల్లా పోలీసు కార్యాలయ సమీపంలో మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్థానికులు ఆమెను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా.. కాసేపటికే ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం. -
బడ్జెట్లో ఉమ్మడి వరంగల్కు నిధుల ప్రతిపాదనలు ఇలా..
బడ్జెట్ కేటాయింపుల్లో ప్రత్యక్షంగా ఉమ్మడి వరంగల్కు ప్రతిపాదించిన నిధుల వివరాలు ఇలా ఉన్నాయి. సాగునీటిరంగం కేటాయింపుల్లో జేఎస్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ నుంచి ఉమ్మడి ఏడు జిల్లాలకు విస్తరించి ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.2,685 కోట్లు ప్రతిపాదించింది. ఇందులో పనుల కంటే పెండింగ్ బిల్లుల చెల్లింపులకే ఎక్కువ ప్రాధాన్యం ఉండే అవకాశం ఉంది. ● ప్రస్తుతం 91 శాతం పనులు పూర్తయి.. భూసేకరణ జరగక అసంపూర్తిగా ఉన్న దేవాదుల ప్రాజెక్టు కోసం రూ.245 కోట్లు ఇచ్చారు. ఏఐబీపీ కింద రెండు పద్దుల్లో మరో రూ.58 కోట్లను పేర్కొన్నారు. ● స్మార్ట్సిటీ పనుల కోసం రూ.179.09 కోట్లు, ఎస్సారెస్పీ స్టేజ్–2కు రూ.25 కోట్లు, కాకతీయ యూనివర్సిటీకి రూ.50 కోట్లు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు రూ.50 కోట్లు కేటాయించారు. మామునూరు వెటర్నరీ సైన్స్ కళాశాలకు రూ.25 కోట్లు, కాళేశ్వరం టూరిజం సర్క్యూట్కు రూ.10 కోట్లు, టీఎస్ స్పోర్ట్స్ స్కూల్స్ కోసం వరంగల్, కరీంనగర్కు కలిపి రూ.41 కోట్లు ప్రతిపాదించారు. ● రామప్ప, పాకాలకు ఐదేసి కోట్ల రూపాయలు, లక్నవరానికి రూ.2 కోట్లు, మల్లూరువాగుకు రూ.కోటి, కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి రూ.2 కోట్లు బడ్జెట్లో ప్రకటించారు. -
అద్దం లేక అపాయం!
వాహనాలకు సైడ్ మిర్రర్ లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు ఈ ఘటనల్లో ద్విచక్రవాహనాలే ఎక్కువ నిర్లక్ష్యం.. అతివేగమే ప్రధాన కారణాలు నగరంలో పెరుగుతున్న యాక్సిడెంట్లు బైక్ అద్దాలపై అవగాహన పెంచాలంటున్న ప్రజలు..వాహనాలకు సైడ్ మిర్రర్లు తప్పనిసరి వాహనాలకు సైడ్ మిర్రర్ ఉంటే చాలా వరకు ప్రమాదాలు తగ్గుతాయి. నగరంలో చాలా ఘటనల్లో వెనుక వచ్చే వాహనాలు చూసుకోక పక్కకు తిప్పడం వల్లే ప్రమాదాలు జరిగాయి. ద్విచక్రవాహనాలతో పాటు ఆటోలు, కార్లు సైడ్ మిర్రర్లు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకుంటే ప్రమాదాలు నివారించవచ్చు. అంతేకాకుండా హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తే సురక్షితంగా గమ్యం చేరుకోవచ్చు. – శోభన్బాబు ఇన్చార్జ్ ఆర్టీఓ వరంగల్ ఖిలా వరంగల్ : ఏ వాహనానికైనా సైడ్ మిర్రర్ తప్పనిసరి.. వెనుక నుంచి వస్తున్న వాహనాలు కనిపించాలంటే అద్దం కచ్చితంగా ఉండాలి. అప్పు డే రోడ్డు ప్రమదాలు జరగవు. అయితే చాలా మంది అద్దం లేకుంటే ఏమవుతుందిలే అనుకుంటున్నారు. చిన్న పొరపాటే ప్రాణాల మీదికి తెస్తోంది. కేవలం అద్దం లేకపోవడంతోనే ఇటీవల పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. బైక్ అందం పాడు చేస్తుందని కొంత మంది అద్దాలు తీసేస్తున్నారు. ఫలితంగా వెనుక నుంచి వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాల సంభవిస్తున్నాయి. వీరిలో 80 శాతం మందికి సైడ్ మిర్రర్ లేకపోవడంతో అపరాధ రుసుం వేసినా మారడం లేదు. తమ వాహనాలకు అద్దం ఏర్పాటు చేసుకోవడం లేదు. రోజు ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు.. వరంగల్ జిల్లాతోపాటు నగరంలో రోజు ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిండు ప్రాణాలు గాల్లో కలుస్తూనే ఉన్నాయి. దీనికి ప్రధానం కారణం సైడ్ మిర్రర్ లేకపోవడమేనని తెలుస్తోంది. యువత బైక్కు అద్దాలు తీసి వాహనంపై అతివేగంగా ర్యాష్ డ్రైవింగ్, మద్యం మత్తు, సెల్ఫోన్ డ్రైవింగ్ కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. తొందరపాటు ఎందుకు? యువతలో హడావిడిగా బయల్దేరే వారే ఎక్కువ ఉంటున్నారు. సమయం మించి పోతుందనే ధోరణిలో వేగంగా వెళ్తుంటారు. అందుకే ప్రయాణంపై ముందస్తు ప్రణాళిక తప్పనిసరిగా ఉండాలి. హెల్మెట్తో లాభం.. ప్రమాదాల సమయంలో హెల్మెట్ వాహనదారులకు రక్షణ కవచంగా నిలుస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగి బైక్ నుంచి కిందపడిన సందర్భంలో తలకు గాయాలవ్వకుండా హెల్మెట్ నిలువరిస్తుంది. ద్విచక్రవాహనంపై ప్రయాణం చేస్తున్న సమయంలో దుమ్ము, ఎండ నుంచి హెల్మెట్ రక్షణగా ఉంటుంది. వేగం కన్నా ప్రాణం ముఖ్యమనే అంశం ప్రతీ వాహనదారుడు గుర్తుంచుకోవాలి. ర్యాష్ డ్రైవింగ్తో ప్రాణాలకు ముప్పు బాలురు, యువకులు డ్రైవింగ్ మీద అవగాహన లేక మితిమీరిన వేగంతో వాహనాలు నడపడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. యువత ద్విచక్రవాహనాలు నడిపే సమయంలో స్పీడ్ కంట్రోల్ చేసి నడిపితే క్షేమం. 18 నుంచి 20 సంవత్సరాల్లోపు యువకులు ఎక్కువగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దు యువత మద్యం తాగి మాకేం కాదులే అని వాహనాలు నడుపుతోంది. భారీ వాహనాలను వెనుక నుంచి అనుసరించడం, ఎదుటి వాహనాలను పట్టించుకోకుండా ఓవర్టేక్ చేయడం ప్రమాదకరం. వి న్యాసాలు చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. నిర్లక్ష్యం వద్దు.. రోడ్డుపై అప్పటి వరకు వరకు నెమ్మదిగా వెళ్తున్న వారు కూడా వెనుక నుంచి క్రాస్ చేసిన వారిని ఓవర్టేక్ చేయాలని దూసుకెళ్తారు. ఇందుకోసం వాహన వేగం పెంచుతున్నారు. ఇలాంటివి వద్దు. శిక్షణ లేకుండా వద్దు.. అత్యధిక శాతం మంది సరైన శిక్షణ లేకుండానే బైక్ నడుపుతున్నారు. ఇంటి వద్దకు వచ్చిన బైక్ను సరదాగా బయటకు తీయడం వంటివి చేసి తమకు బైక్ నడపడం వచ్చిందనే భ్రమలో రోడ్డు ఎక్కుతున్నారు. ఈవిషయంలో తల్లిదండ్రులే అప్రమత్తంగా ఉండాలి. సిగ్నల్స్ చూసుకోండి.. రహదారులపై వాహనాల సంఖ్య భారీగా పెరిగాయి. దీంతో కూడళ్ల వద్ద వాటిని నియంత్రించేందుకు సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వచ్చే వారికి ఈ విషయంపై సరైన అవగాహన ఉండడం లేదు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిపై అందరికీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. -
ఉత్పాదకతలో ఎంఎస్ఎంఈ పాత్ర కీలకం
హన్మకొండ: స్థూల ఉత్పాదకత, ఉపాధి కల్పనలో సూక్ష్మ, చిన్న, మధ్య, తరహా సంస్థ (ఎంఎస్ఎంఈ) కీలక భూమిక పోషిస్తోందని కామన్ వెల్త్ విజిటింగ్ ఫెల్లో యునైటెడ్ కింగ్డమ్, గ్లోబల్ అసోసియేషన్ ఫర్ ఎంఎస్ఎంఈఎస్ కో ఫౌండర్ ప్రొఫెసర్ హిమాచలం దాస రాజు అన్నారు. హనుమకొండ నయీంనగర్లోని వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాలలో ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ త్రో ఎంఎస్ఎంఈఎస్ అనే అంశంపై జాతీయ సెమినార్ బుధవారం జరిగింది. ఈసందర్భంగా రాజు మాట్లాడుతూ.. దేశ జీడీపీలో 30 శాతం, ఉద్యోగ కల్పనలో 40 శాతం, ఉత్పాదక రంగంలో 45 శాతం మేర సూక్ష్మ, చిన్న, మధ్య, తరహా సంస్థ దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ రాజేందర్, ప్రొఫెసర్ అమరవేణి, డాక్టర్ మహేందర్ కు మార్, వాగ్దేవి కళాశాల అకడమిక్ డైరెక్టర్ వాహినీ దేవి, ప్రిన్సిపాల్ ఎ.శేషాచలం, కాన్ఫరెన్స్ కన్వీనర్లు పి.సుగుణాకర్రెడ్డి, ప్రేమ్కుమార్, కో కన్వీనర్ ఎ.రజిని కుమార్, కోఆర్డినేటర్లు బి.కిశోర్ కుమార్, టి.అ నూష, సీహెచ్.కరుణ, బి.చంద్రకళనాయక్, శాంభవి, డాక్టర్ ఎం.అరవింద తదితరులున్నారు. -
ఎమ్మార్టీలో పదోన్నతి ఎప్పుడు?
హన్మకొండ: తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ఎమ్మార్టీ విభాగంలో పదోన్నతి కల్పించడంలో జాప్యం జరుగుతున్నా కొద్దీ.. ఉద్యోగుల్లో ఆందోళన పెరిగిపోతోంది. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధి 16 సర్కిళ్ల (జిల్లా)లో 16 ఎమ్మార్టీ డివిజన్లున్నాయి. ఈడివిజన్లలో అన్ని కేడర్లు కలిపి 285 పోస్టులున్నాయి. ఇందులో 220 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇందులో లైన్మెన్ పోస్టులు 47 ఖాళీగా ఉన్నప్పటికీ పదోన్నతి కల్పించి భర్తీ చేయడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలున్నాయి. టీజీ ఎన్పీడీసీఎల్లో ఎమ్మార్టీ విభాగానిది కీలక భూమిక. సబ్ స్టేషన్లు, డీటీఆర్ల నిర్వహణలో వీరి పాత్ర ముఖ్యమైంది. వీటితో పాటు సిటీ మీటర్స్, హెచ్టీ మీటర్స్, ఎల్టీ మీటర్స్ రోటేషన్ పద్ధతిలో పరీక్షిస్తుంటారు. సబ్స్టేషన్లలో పవర్ ట్రాన్స్ఫార్మర్ల మెయింటెనెన్స్ వీరిదే బాధ్యత. వీరు ఏ మాత్రం అలసత్వం వహించినా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగడమో.. నాణ్యమైన, మెరుగైన విద్యుత్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడమో జరుగుతుంటుంది. అదే విధంగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల లోపాలను సరిదిద్దేదీ ఈ విభాగ ఉద్యోగులే. విద్యుత్ శాఖలో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తున్న వీరిపై యాజమాన్యం అ నుసరిస్తున్న వివక్షతో వారంతా విసిగిపోతున్నారు. యాజమాన్యం పట్టించుకోవట్లేదు.. ఎమ్మార్టీలో జూనియర్ లైన్మెన్, టెస్టర్ గ్రేడ్–2 (లైన్మెన్), టెస్టర్ గ్రేడ్–1 (లైన్ ఇన్స్పెక్టర్), ఫోర్మెన్ గ్రేడ్–1 పోస్టులున్నాయి. ఆపరేషన్ విభాగంలో మాదిరిగా టెస్టర్ గ్రేడ్–1 తర్వాత సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ పోస్టులు సృష్టించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నా.. యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫోర్మెన్ గ్రేడ్–1 పదోన్నతి కల్పించే క్రమంలో అధికారులు వింత పోకడలు అవలంబిస్తున్నారు. అసలే పోస్టు లేని ఫోర్మెన్ గ్రేడ్–2గా డీగ్రేడ్ చేస్తూ ఏడాది తర్వాత ఫోర్మెన్ గ్రేడ్–1గా పదోన్నతి కల్పిస్తున్నారు. దీంతో ఒకే వ్యక్తికి ఒక సంవత్సరంలోనే నాలుగు ఇంక్రిమెంట్లు (రెండు పదోన్నతి) ఇస్తున్నారు. డీ గ్రేడ్ చేస్తున్న ఫోర్మెన్ గ్రేడ్–2 స్థానంలో సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ పోస్టును క్రియేట్ చేయాలని ఎమ్మార్టీ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఫోర్మెన్ గ్రేడ్–1, ఫోర్మెన్ గ్రేడ్–2 పదోన్నతి అంశంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఆశ్యర్యానికి గురి చేస్తోంది. ఫోర్మెన్ గ్రేడ్–1 పోస్టు భర్తీ చేస్తే ఫోర్మెన్గ్రేడ్–2 ఖాళీగా ఉంటుంది. ఫోర్మెన్ గ్రేడ్–2 భర్తీ చేస్తే ఫోర్మెన్ గ్రేడ్–1 ఖాళీగా ఉంటుంది. ఈరెండు పోస్టుల్లో ఒకే సారి ఉద్యోగుల భర్తీ కనిపించదు. ఖాళీగా టెస్టర్ గ్రేడ్–2 (లైన్మెన్) పోస్టులు ప్రమోషన్ కోసం జేఎల్ఎంల ఎదురుచూపులు20 ఏళ్ల వరకు పదోన్నతి లేదా?ఎమ్మార్టీ విభాగంలో ఆరేళ్ల నుంచి 20 ఏళ్ల వరకు పదోన్నతి పొందకుండా ఒకే పోస్టులో కొనసాగుతున్నామని ఎమ్మార్టీ ఉద్యోగులు వాపోతున్నారు. జూనియర్ లైన్మెన్లు టెస్టర్ గ్రేడ్–2 పదోన్నతి కోసం గత ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. టెస్టర్ గ్రేడ్–2 ఉద్యోగులు గ్రేడ్–1 కోసం 10 నుంచి 18 ఏళ్ల నుంచి, టెస్టర్ గ్రేడ్–1 నుంచి ఫోర్మెన్ పదోన్నతి కోసం 10 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. టెస్టర్ గ్రేడ్–2 నుంచి పదోన్నతికి అనువుగా పోస్టులు లేక పోవడంతో వీరికి అవకాశం దక్కడం లేదు. పైస్థాయిలో ఉన్న ఉద్యోగులు రిటైర్డ్ అయితేనే పోస్టు ఖాళీ అవుతుంది. అప్పుడే పదోన్నతికి అవకాశముంటుంది. ఈక్రమంలో ఈ పోస్టుల మధ్య కొత్త పోస్టులు క్రియేట్ చేస్తే పదోన్నతి చానల్ పెరుగుతుందని ఎమ్మార్టీ ఉద్యోగులు యాజమాన్యాన్ని కోరుతున్నారు. ఖాళీగా ఉన్న టెస్టర్ గ్రేడ్–2 పోస్టులు 47 ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయకపోవడంతో ఎన్పీడీసీఎల్ యాజమాన్యం అంతర్యమేంటో అర్థం కావట్లేదని ఉద్యోగులు వాపోతున్నారు. దీంతో ఉద్యోగిగా తమకు రావాల్సిన ప్రయోజనాలను కోల్పోతున్నామని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా తమకు పదోన్నతి కల్పించాలని ఎమ్మార్టీ ఉద్యోగులు కోరుతున్నారు. -
మహారాష్ట్రలో సమ్మయ్య బృందం ప్రదర్శన
దేవరుప్పుల: మహారాష్ట్రలోని సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ నాగ్పూర్ ఆధ్వర్యంలో అమరావతి విశ్వవిద్యాలయంలో బుధవారం తలపెట్టిన లోక్ మాన్య సమరోత్సాహం–2025లో పద్మశ్రీ గ్రహీత గడ్డం సమ్మయ్య బృందం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూకై లాస్ యక్షగాన నాటకం వేసి తెలంగాణ గ్రామీణ ప్రాంత సాంస్కృతిక కళా ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సమ్మయ్యను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందించారు. కార్యక్రమంలో గడ్డం రఘుపతి, శ్రీపతి, సోమరాజు, ప్రభాకర్, ముకుందం, మురళీకృష్ణ, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎంను దూషించిన కేసులో ఒకరి అరెస్ట్
నెల్లికుదురు: జిల్లాలోని ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామానికి చెందిన దర్శనం వెంకటయ్య హైదరాబాద్లో ఇటీవల ఓ యూట్యూబ్ చానల్లో సీఎం రేవంత్రెడ్డిని అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ మాట్లాడిన ఘటనలో అక్కడి సీసీఎస్ పోలీసులు బుధవారం అతడిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఈ మేరకు వెంకటయ్య భార్య దర్శనం లక్ష్మి, తల్లి ఇద్దమ్మ విలేకరులతో మాట్లాడుతూ వెంకటయ్య ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేస్తుండగా పోలీసులు వచ్చి ‘సీఎంను తిట్టినావట’ అంటూ తీసుకెళ్లారని తెలిపారు. వెంకటయ్య బీపీ, షుగర్తో బాధపడుతున్నాడని చెప్పినా పోలీసులు వినకుండా తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. నా భర్తను క్షేమంగా ఇంటి వద్ద వదిలిపెట్టాలని భార్య లక్ష్మి ప్రభుత్వాన్ని కోరింది. నా భర్తను క్షేమంగా వదిలిపెట్టాలి దర్శనం వెంకటయ్య భార్య లక్ష్మి -
మందులు వాడితే టీబీ వ్యాధి నయం
నెహ్రూసెంటర్: క్రమం తప్పకుండా మందులు వాడితే టీబీ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని, వ్యాధి నివారణపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ మురళీధర్ అన్నారు. వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో టీబీ నియంత్రణ దినోత్సవ పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. టీబీ వ్యాధిపై అవగాహన పెంచుకుని నయం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ విజయ్కుమార్, డాక్టర్ శ్రావణ్, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, హెచ్ఈ కేవీ రాజు, టీబీ ప్రోగ్రాం మేనేజర్ నీలిమాశ్వేత, కోఆర్డినేటర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఆశకార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలిమహబూబాబాద్: ఆశకార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం రూ.18,000 చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్ళి కుంట ఉపేందర్ డిమాండ్ చేశారు. బుధవారం సీఐటీయు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆశకార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కుంట ఉపేందర్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆశకార్యకర్తలకు ఇచ్చిన హామీ లను అమలు చేయాలన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఏఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన ఆశలకు ఎస్ఎన్ఎం పోస్టుల్లో ప్రమోషన్ కల్పించాలన్నారు. రూ.50 లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలని, టార్గెట్లు రద్దు చేయాలన్నారు. డిమాండ్లు పరిష్కరించాలని, లేని ఝెడల ఈ నెల 24న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నా యకులు నాగన్న, మల్లయ్య, ఉపేంద్ర, రమాదేవి, నళిని, స్వరూప, రమ, ఆసియా, విజయ, జయసుధ, నిర్మల తదితరులు పాల్గొన్నారు. పోలీస్స్టేషన్ తనిఖీనర్సింహులపేట: మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను బుధవారం ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణ, గదులను పరిశీలించిన అనంతరం రికార్డులను తనిఖీ చేశారు. మండలంలోని శాంతిభద్రతలు, కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసులు పెండింగ్ ఉండొద్దని, వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఆన్లైన్ బెట్టింగ్లు, సైబర్ నేరాలపై గ్రామాల్లో అవగాహన పెంచాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్, తొర్రూరు సీఐ గణేశ్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, సైబర్ క్రైం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై మాలోతు సురేశ్, సిబ్బంది పాల్గొన్నారు. నేడు బయ్యారంలో మంత్రి సీతక్క పర్యటనబయ్యారం: బయ్యారం మండలంలోని పలు గ్రామాల్లో గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క పర్యటించనున్నట్లు ఇల్లెందు ఎమ్మెలే కనకయ్య బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలోని గౌరారం వట్టేరు బ్రిడ్జి, కోడిపుంజులతండా–వినోభానగర్, బయ్యారం–కోటగడ్డ రహదారి నిర్మాణపనుల శంకుస్థాపనతో పాటు మొట్లతిమ్మాపురం బ్రిడ్జిని మంత్రి ప్రారంభిస్తారన్నారు. మంత్రితో పాటు ఎంపీ బలరాంనాయక్ తదితరులు పాల్గొంటారని ఎమ్మెల్యే చెప్పారు. -
ఆరు గ్యారంటీలకు బడ్జెట్లో ప్రాధాన్యం.. మహిళా పథకాలకు పెద్దపీట
అందరినోటా ఆరు గ్యారంటీలు.. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చేర్చిన ఆరు గ్యారంటీ పథకాలకు ఈ బడ్జెట్లోనూ అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో 8,77,173 మంది రైతులకు రైతుభరోసా పథకం ఈ ఏడాది కూడా అమలు కానుంది. ఒక కార్పొరేషన్, 9 మున్సిపాలిటీలు, 1,708 గ్రామపంచాయతీలుండగా మహాలక్ష్మి పథకం కింద సుమారు ప్రతి మహిళకు రూ.2.500 చొప్పున సుమారు 7.21 లక్షల మందికి అందే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సుల్లో వరంగల్ రీజియన్లో రోజుకు సగటున సుమారు 55 వేల మంది మహిళలు ఉచితంగా రాకపోకలు సాగించేందుకు ఢోకా లేదు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కనెక్షన్లపై రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకంలో 6,10,220 మంది లబ్ధిదారులకు కొనసాగనుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటికే 2.50 లక్షల మందిని రెవెన్యూ అధికారులు అర్హులుగా గుర్తించగా, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల లోపు కరెంట్ వాడిన 6,12,901 మందికి ఉచిత విద్యుత్ సౌకర్యం కలగనుంది. -
వేసవి దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి
మహబూబాబాద్: జిల్లాలో వేసవికాలం దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ ఆదేశించారు. కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో బుధవారం జిల్లాస్థాయి వాతావరణ మార్పుల టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వడదెబ్బ, ఎండ దెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఉపాధి హామీ పనుల వద్ద కూలీలు, మున్సిపల్, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పశుసంపద సంరక్షణకు తీసుకోవాల్సి జాగ్రత్తలను తెలియజేయాలన్నారు. అటవీశాఖ అధికారులు అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారి, ఆర్డీఓలు కృష్ణవేణి, గణేశ్, డీఆర్డీఓ మధుసూదన్ రాజు, డీఎంహెచ్ఓ మురళీదర్, మున్సిపల్ కమిషనర్లు నోముల రవీందర్, నరేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లక్ష్యాలు పూర్తి చేయాలి.. రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలు పూర్తిస్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో బుధవారం జిల్లాస్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పంట రుణాల పంపిణీకి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సబ్సిడీ రుణాల పంపిణీ విషయంలో జాప్యం చేయవద్దన్నారు. వీధి వ్యాపారులకు విరివిగా ముద్ర రుణాలతో పాటు స్టాండ్ ఆఫ్ ఇండియా రుణాలు అందించాలన్నారు. సమావేశంలో ఆర్బీఐ ఎల్డీఓ సాయి చరణ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణ మూర్తి, నాబార్డు ఏజీఎం చంద్రశేఖర్, డీఏఓ విజయనిర్మల పాల్గొన్నారు. కలెక్టర్ అౖద్వైత్కుమార్ సింగ్ -
గురువారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2025
-IIలోuరైతులు, రైతుకూలీలకు బీమా.. ఉమ్మడి వరంగల్లో 15,01,109 ఎకరాల్లో 4,33,229 మంది రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో 4,09,098 మంది రైతులకు బీమా సౌకర్యం కొనసాగనుంది. 9,02,099 ఎకరాలకు పంటల బీమా వర్తించనుంది. అలాగే, రైతు కూలీలకు బీమా వర్తింపజేసే ప్రతిపాదనలు తక్షణమే అమల్లోకి వస్తే.. ఉమ్మడి జిల్లాలో 18,45,326 మందికి ప్రయోజనం కలుగుతుంది. మహిళలకు పెద్దపీట ప్రతి మండలంలో మహిళలతో రైస్ మిల్లులు, మినీ గోదాముల ఏర్పాటు.. ఐకేపీ కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మహిళా రైస్ మిల్లుల్లో మిల్లింగ్ చేయిస్తాం, మహిళా స్వయం సహాయక సంఘాలకు మిల్లింగ్ చేసిన బియ్యాన్ని ఎఫ్సీఐకి సరఫరా చేసే బాధ్యత అప్పగిస్తామని ప్రకటించారు. దీంతో ఉమ్మడి వరంగల్లోని 48,717 మహిళా స్వయం సహాయక సంఘాల్లోని 8,76,906 మందికి లబ్ధి చేకూరనుంది. సంక్షేమం, ఐటీ, అభివృద్ధిపైన ఆశలు.. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మహిళా సంక్షేమం కోసం ఈసారి భారీ కేటాయింపులే జరిగాయి. అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా కలిగిన జిల్లాలో ఆ వర్గాలకు మేలు జరుగనుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎస్సీ సంక్షేమం కోసం రూ.40,232, ఎస్టీలకు రూ.17,169 కోట్లు కేటాయించడం పట్ల ఉమ్మడి వరంగల్కు ప్రాధాన్యం ఉంటుందంటున్నారు. ఐటీ, పరిశ్రమల రంగంపైన దృష్టి సారించిన నేపథ్యంలో రెండో నగరంగా వరంగల్ వృద్ధి చెందుతుందన్న ఆశాభావం కూడా వ్యక్తమవుతోంది. పీఎం మిత్ర నిధులతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉండగా, ఐటీ హబ్, టెక్స్టైల్ పార్కు, మడికొండ పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలపై ఆశలు రేకెత్తుతున్నాయి. ఎకో టూరిజానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిన నేపథ్యంలో ములుగు, జేఎస్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు మహర్దశ రానుంది. ● విద్య, వైద్య రంగాలకు కేటాయింపులపై భిన్నస్వరాలు ● అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ఎయిర్పోర్టు, ‘సూపర్’ ప్రస్తావన లేదు ● కాళేశ్వరానికి రూ.2,685 కోట్లు.. దేవాదులకు రూ.245 కోట్లు ● స్మార్ట్సిటీకి రూ.179కోట్లు, కేయూసీ, జీడబ్ల్యూఎంసీకి రూ.100 కోట్లు ● రామప్ప, పాకాలకు రూ.ఐదేసి కోట్లు.. ‘కాళోజీ’కి రూ.రెండు కోట్లే ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఊతం ● ఎకో టూరిజం ప్రస్తావన.. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఆశలు అసెంబ్లీలో ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన 2025–26 రాష్ట్ర బడ్జెట్లో ఉమ్మడి వరంగల్కు దక్కిన ప్రాధాన్యంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. రెండో రాజధానిగా హైదరాబాద్కు పోటీగా అభివృద్ధి చేస్తామంటున్న ప్రభుత్వం.. బడ్జెట్లో ఆ మేరకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో అభివృద్ధి, సంక్షేమ రంగాలకు చేసిన కేటాయింపుల్లోనే ఉమ్మడి వరంగల్కు ప్రయోజనాలు కలుగుతాయన్న మరో వాదన కూడా వినిపిస్తోంది. ముఖ్యమంత్రిగా మొదటిసారి వరంగల్ నగరంలో పర్యటించిన రేవంత్రెడ్డి.. నగరం అభివృద్ధి కోసం 8 అంశాలు ప్రాధాన్యంగా రూ.6,115 కోట్ల విడుదలకు ఉత్తర్వులు జారీ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఇన్నర్, ఔటర్ రింగు రోడ్లు, మామునూరు ఎయిర్పోర్టు తదితర అంశాలు అందులో ఉన్నాయి. వీటికి నేరుగా నిధులు ఇచ్చేలా ప్రతిపాదనలు చేసినట్లు బడ్జెట్లో కనిపించ లేదు. కాగా, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనిపించిందన్న చర్చ ఉంది. – సాక్షి ప్రతినిధి, వరంగల్విద్యారంగానికి మంచి రోజులు.. ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రోత్సహించడానికి ఈసారి రూ.23,108 కోట్లు కేటాయించింది. దీంతో సర్కారు చదువులకు ఇంకా మంచి జరగనుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. 20–25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మించ తలపెట్టిన ప్రభుత్వం ఇటీవల ఉమ్మడి జిల్లాకు రూ.1400 కోట్లతో ఏడింటిని మంజూరు చేసింది. ఈ బడ్జెట్తో ఈసారి ఆ స్కూళ్లు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అలాగే, వరంగల్లో మొత్తం 3,331 ప్రభుత్వ బడులు ఉండగా, అందులో 4,67,011 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రహరీలతోపాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈసారి నిధులు వెచ్చించే అవకాశం ఉంది. న్యూస్రీల్బడ్జెట్పై వివిధ వర్గాల అభిప్రాయాలు – వివరాలు IIలోu -
ఒకే దేశం.. ఒకే ఎన్నికతోనే అభివృద్ధి
మహబూబాబాద్ అర్బన్: ఒకే దేశం ఒకే ఎన్నికతోనే దేశాభివృద్ధి సాధ్యమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఒకే దేశం–ఒకే ఎన్నిక అనే అంశంపై సమావేశం నిర్వహించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే వ్యయం తగ్గుతుందన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న ప్రయత్నానికి ప్రతీ ఒక్కరు మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శ్యామ్సందర్శర్మ, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు వద్దిరాజు రామచంద్రరావు, నాయకులు గాదె రాంబాబు, కొనతం పెంటయ్య, చీకటి మహేశ్గౌడ్, పల్లె సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్కు పోటెత్తిన మిర్చి
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు భారీగా మిర్చి వస్తోంది. బస్తాలతో యార్డు నిండిపోవడంతో మార్కెట్ ప్రధాన ద్వారానికి తాళంవేసి క్రమక్రమంగా వాహనాలను సిబ్బంది లోనికి పంపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ స్థలం రైతుల అవసరాలకు సరిపోవడం లేదు. మిర్చి అధికంగా వచ్చినప్పుడు కొనుగోళ్లు బంద్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించి మార్కెట్ రేటుతో సంబంధం లేకుండా ధర తగ్గిస్తున్నారు. అటు తక్కువ ధరకు ఆమ్ముకోలేక ఇటు తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో మిర్చి కొనుగోలు చేసే వ్యాపారులే బయట ధరలు తగ్గించి రైతులను మోసం చేయడం గమనార్హం. ఈ తతంగం అంతా తెలిసిన అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 6,727 బస్తాల మిర్చి కొనుగోళ్లు.. వ్యవసాయ మార్కెట్ పరిధిలో బుధవారం తేజ రకం, తాలు రకం మొత్తంగా 6,727 బస్తాల మిర్చి కొనుగోళ్లు జరిగాయి. తేజ రకం 6,177 బస్తాలు (2,477 క్వింటాళ్లు), తాలు రకం 550 బస్తాలు (220 క్వింటాళ్లు)కొనుగోలు చేయగా తేజ రకం గరి ష్ట ధర క్వింటాకు రూ.13,639 పలుకగా కనిష్ట ధర రూ.9,500 పలికింది. తాలు రకం గరిష్ట ధర క్వింటాకు రూ.6,350 పలుకగా, కనిష్ట ధర రూ.5,020 పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు. రైతులు మిర్చి తీసుకురావద్దు... వ్యవసాయ మార్కెట్ యార్డుకు అధికంగా మిర్చి రావడం వల్ల అన్ని షెడ్లు నిండి ఖాళీ స్థలం లేదని ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ తెలిపారు. ప్రస్తుతం 6,500 బస్తాలు బిడ్డింగ్, కాంటా కావాల్సి ఉందని, రోజుకు ఏడు వేల బస్తాల వరకు మిర్చి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా మార్కెట్ యార్డులో గురు, శుక్రవారాల్లో కొనుగోళ్లు జరిపేందుకు 15 వేల మిర్చి బస్తాలు వచ్చి ఉన్నాయని, మొత్తం 21,500 మిర్చి బస్తాలు వచ్చాయని పేర్కొన్నారు. మార్కెట్ యార్డులో ఖాళీ స్థలం లేనందున బయట నుంచి యార్డులోకి మిర్చిని అనుమతించమని తెలిపారు. రైతులు తమ మిర్చిని తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు.యార్డుల్లో నిండిన బస్తాలు స్థలం సరిపోక రైతుల ఇబ్బందులు -
నీటిపారుదల రంగానికి మరిన్ని నిధులు కేటాయించాలి
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నీటి పారుదల రంగానికి మరిన్ని నిధులు కేటాయిస్తే బాగుండేది. ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాల్వల నిర్మాణం, భూసేకరణ వందశాతం జరగాలంటే నీటి పారుదల రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. 70 శాతం వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు నింపాలంటే ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టు సాగు పెంచాలంటే నిధుల కేటాయింపు అధికంగా ఉండాలి. –గోపు బాలశౌరెడ్డి, గుంటూరుపల్లి, నర్మెట, జనగామ జిల్లా -
సునీతావిలియమ్స్ భావితరాలకు స్ఫూర్తి..
టెక్నాలజీకి హ్యుమన్ స్పిరిట్ తోడు టెక్నాలజీకి హ్యుమన్ స్పిరిట్ తోడవడంతోనే సునీతా విలియమ్స్ ధైర్యంగా పరిశోధనలకు అంతరిక్షంలోకి వెళ్లింది. ఎనిమిది రోజుల కోసం అంతరిక్షం వెళ్లి అక్కడే చిక్కుకుంది. 9 నెలలు వివిధ ప్రయోగాలు నిర్వహించింది. బుధవారం తెల్లవారుజామున క్షేమంగా భూమిపై ల్యాండ్ అయ్యింది. సునీతా విలియమ్స్ అంతరిక్ష పరిశోధనలు చేపట్టేందుకు యువ శాస్త్రవేత్తలకు దిక్సూచిగా నిలుస్తారు. –అబ్దుల్ అజిమ్, ఫిజిక్స్ ప్రొఫెసర్, నిట్భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతావిలియమ్స్ భావితరాలకు స్ఫూర్తి అని పలువురు సైన్స్ మాజీ అధికారులు, ప్రొఫెసర్లు అన్నారు. ప్రయోగాల నిమిత్తం 9 నెలల క్రితం అంతర్జాతీయ అంతరిక్షంలోకి వెళ్లిన సునీతావిలియమ్స్ బుధవారం తెల్లవారుజామున భూమిపై సురక్షింతగా ల్యాండ్ అయ్యారు. దీనిపై భారత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కాగా, సునీతావిలియమ్స్ 9 నెలల సమయంలో అంతరిక్షంలో 150కి పైగా ప్రయోగాలు నిర్వహించారు. –కాజీపేట అర్బన్ -
ఈఆర్సీకి సమస్యల గోడు
హన్మకొండ: విద్యుత్ నియంత్రణ మండలికి వినియోగదారులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్లో 2025–2026 ఆర్థిక సంవత్సరానికి సవరణ చేయబడిన రిటైల్ సప్లయ్ వ్యాపారానికి సమగ్ర ఆదాయ ఆవశ్యకత, ధరలు, క్రాస్ సబ్సిడీ సర్ చార్జీల ప్రతిపాదనలపై విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ ఆధ్యక్షతన బహిరంగ విచారణ జరిగింది. ఈ విచారణలో టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి.. సంస్థ ద్వారా వినియోగాదారులకు అందిస్తున్న సేవలు వివరించారు. విద్యుత్ చార్జీలు పెంచడం లేదని చెప్పారు. ఆధునిక సాంకేతికను వినియోగించి వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఎన్పీడీసీఎల్లో అమలు చేస్తున్న సాంకేతిక పద్ధతులు, సంస్థను వినియోగదారులకు చేరువ చేసిన విధానాన్ని పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బాధితులకు ఈఆర్సీ చైర్మన్ చేతుల మీదుగా చెక్కు అందజేత.. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఈదురుగడ్డకు చెందిన అంగిడి అనిత, రాజ్ కుమార్ దంపతుల ఇల్లు విద్యుదాఘాతంతో దగ్ధమైందని, ఈ ఘటనలో వారి కుమారుడు సాయి కుమార్(07) చనిపోయాడని, ఇంటి పైనుంచి విద్యుత్ లైన్ వెళ్లడం ద్వారానే ఈ ఘటన జరిగిందని భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధి జోగినిపల్లి సంపత్రావు ఈఆర్సీ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. బాధితులను ఈఆర్సీ ముందుంచి వారి బాధను వివరించారు. ఈ ఘటన జరిగి 5 నెలలవుతున్నా ఎలాంటి పరిహారం చెల్లించలేదని తెలిపారు. స్పందించిన ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ పరిహారం చెల్లించాలని సూచించారు. దీంతో బహిరంగా విచారణ సభలోనే ఈఆర్సీ చైర్మన్ చేతుల మీదుగా బాధితులు అనితా, రాజ్కుమార్ దంపతులకు రూ.5 లక్షల చెక్కు అందించారు. సీజీఆర్ఎఫ్ సేవలు విస్తృతం చేయాలి.. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్) సేవలను మరింత విస్తృతం చేయాలని ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్ అధికారులకు సూచించారు. దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. విద్యుత్ వినియోగదారులకు అందిస్తున్న సేవలకు ఎన్పీడీసీఎల్ యాజమాన్యాన్ని అభినందించారు. విద్యుత్ చార్జీలు పెరగవు.. టీజీ ఎన్పీడీసీఎల్ రెవెన్యూ లోటు రూ.10,393 కోట్లు. 2025–2026 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నిర్వహణకు రూ.19,814 కోట్ల ఆదాయం అవసరం కాగా, రూ.9,421 కోట్లు మాత్రమే ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. దీంతో రెవెన్యూ భారీ లోటు ఏర్పడనుంది. ప్రభుత్వం ఈ మేరకు రీయింబర్స్ చేయాల్సిన అవసరముంది. అదే విధంగా ఈ సంవత్సరం విద్యుత్ చార్జీల టారిఫ్ పెంపుపై ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు. దీంతో విద్యుత్ చార్జీలు పెరగవు. విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి భారం పడదు.చైర్మన్కు వివరించిన విద్యుత్ వినియోగదారులు సీజీఆర్ఎఫ్ సేవలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజ్ నాగార్జున్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
ఆటో డ్రైవర్కు ఏడాది జైలు
జనగామ: ఆటోను అజాగ్రత్తగా నడిపి ఇద్దరి మృతికి కారణమైన డ్రైవర్కు జనగామ కోర్టు ఏడాది కఠిన కారాగార శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది. సీఐ దామోదర్రెడ్డి కథనం ప్రకారం.. 2016లో నర్మెట మండలం కన్నెబోయినగూడెం నుంచి అదే గ్రామానికి చెందిన ధారావత్ టీక్యా, నర్మెటకు చెందిన శిరీష, ఆమె తల్లి కనకలక్ష్మితో పాటు మరో ఐదుగురు ఆటోలో జనగామకు బయలుదేరారు. లింగాలఘనపురం మండలం నెల్లుట్లకు చెందిన ఆటో డ్రైవర్ యోహాన్ అజాగ్రత్త, అతివేగం నడపడం వల్ల జనగామ మండలం గానుగుపహాడ్ దాటిన తర్వాత వాహనం పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో టీక్యా అక్కడికక్కడే మృతి చెందగా, కనకలక్ష్మికి తీవ్ర గాయాలు కావడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం తరలించే క్రమంలో మార్గమధ్యలో మృతి చెందింది. అప్పటి సీఐ ముస్కె శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా, అసిస్టెంట్ పీపీ కిరణ్ కుమార్ వాదించారు. కోర్టు కానిస్టేబుల్ టి.రవికుమార్, హెడ్ కానిస్టేబుల్ యాదగిరి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా, ఇరువురి వాదనలు విన్న జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జి.శశి.. నిందితుడు యోహాన్కు ఏడాది కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించినట్లు సీఐ తెలిపారు. నేడు మామిడి మార్కెట్ ప్రారంభంవరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్ పరిధి లక్ష్మీపురం ఫ్రూట్ మార్కెట్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తున్నందున ఈ ఏడాది మామిడి సీజన్ నిర్వహణ కోసం ఏనుమాముల ముసలమ్మకుంట పక్కనే మార్కెట్ స్థలంలో మామిడి మార్కెట్ను ఏర్పాటు చేస్తున్నారు. గురువారం ఉదయం రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు ఈమార్కెట్ను ప్రారంభించనున్నట్లు వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి గుగులోతు రెడ్డి తెలిపారు. కాగా.. కరోనా సాకుతో నాలుగేళ్ల క్రితం ధర్మారంలోని ఓ ప్రైవేట్ గోదాంలో మామిడి మార్కెట్ను ఓపెన్ చేసి ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా వ్యాపారులు ఇన్నాళ్లు కొనసాగించారు. దీంతో మార్కెట్ కమిటీ పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోయింది. ముసలమ్మకుంట పక్కన మార్కెట్కు సంబంధించిన 10 ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు అధికారుల నుంచి అనుమతులు రావడంతో మంత్రి చేతుల మీదుగా మామిడి మార్కెట్ను ప్రారంభిస్తున్నట్లు సమాచారం. -
విద్యకు ప్రాధాన్యమివ్వని బడ్జెట్
కేయూ క్యాంపస్: ప్రభుత్వ బడుల వసతుల కల్పనలో జాతీయ స్థాయిలో తెలంగాణ 32వ స్థానంలో ఉండగా.. నాణ్యమైన విద్య, సమర్థంగా బడుల నిర్వహణలో 27వ స్థానంలో ఉందని తెలంగాణ విద్యా కమిషన్తెలిపింది. అయితే ఆ స్థితిని మెరుగు పరిచేలా ప్రభుత్వం రెండో బడ్జెట్లో విద్యకు ప్రాధాన్యమివ్వలేదు. రూ. 3,04,965 కోట్లలో విద్యకు రూ.23,108 కోట్లు కేటాయించారు. ( 7.57 శాతం ) ప్రభుత్వ విద్యా సంస్థల అభిృద్ధికి ఏ మాత్రం సరిపోవు. –కడారి భోగేశ్వర్, టీపీటీఎఫ్ పూర్వ కార్యదర్శి -
స్వల్పంగా పెరిగినా సరిపోని కేటాయింపులు
భూపాలపల్లి అర్బన్: బడ్జెట్లో విద్యాశాఖకు గత ఏడాది కంటే రూ.1,816 కోట్లు స్వల్పంగా పెరి గినా సరిపోని కేటాయింపులు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న 15 శాతం హామీకి ఆమడ దూరంలో ఉంది. విద్యాశాఖ పరిధిలో ఉన్న 26,067వేల ప్రభుత్వ పాఠశాలలను గాలికొదిలేసి రెసిడెన్షియల్, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల గురించి మాత్రమే మాట్లాడుతోంది. విద్యారంగానికి కేవలం 7.57శాతం బడ్జెట్ కేటాయించడం శోచనీయం. – నక్క తిరుపతి, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు -
భారత రాజ్యాంగం.. సెక్యులర్ వ్యవస్థ
రాజ్యాంగ విలువలకు తిలోదకాలు రాజ్యాంగ వ్యవస్థను గత 75 సంవత్సరాలుగా ప్రజలు గౌరవిస్తున్నారని, రాజ్యాంగానికి లోబడి రాజ్య పాలన నిర్వహించాలని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త, హెచ్సీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ జి. హరగోపాల్ అన్నారు. కానీ నేడు పాలకులు రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య వ్యవస్థకు తిలోదకాలు ఇచ్చి సొంత ఎజెండాతో పాలన కొనసాగిస్తున్నారన్నారు.కేయూ క్యాంపస్ : భారత రాజ్యాంగం సెక్యులర్ భావాలతో కూడిన వ్యవస్థని, రాజ్యాంగం ఒక వ ర్గానిదో.. ఒక కులానిదో కాదని, దేశ ప్రజలందరిద ని తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రయ్య అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఎస్సీ, ఎస్టీ అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో ‘ 75 సంవత్సరాల భారత రాజ్యాంగం– మైలురా ళ్లు– సమస్యలు– సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు బుధవారం సాయంత్రం ముగిసింది. ఈ ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజంలో ప్రతీ వ్యక్తి భగవద్గీత, ఖురాన్, బైబిల్తోపాటు రాజ్యాంగాన్ని కూడా అధ్యయనం చేయాలన్నారు. అప్పుడే రాజ్యాంగం విలువలు, తమ హ క్కులేమిటో తెలుస్తాయన్నారు. సమసమాజ ని ర్మాణం కోసం రాజ్యాంగం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. దేశ ప్రజల హక్కులను రక్షించేది రా జ్యాంగమేనని, రాజ్యాంగాన్ని సమగ్రంగా రచించి న గొప్ప వ్యక్తి బి.ఆర్ అంబేడ్కర్ అన్నారు. దేశ ప్రజలు అంబేడ్కర్కు రుణపడి ఉండాలన్నారు. రాజ్యాంగం వైరుధ్యాలను పరిష్కరిస్తుందన్నారు. రాజ్యాంగానికి లోబడే వ్యవహరించాలి.. భారత రాజ్యాంగం ప్రపంచంలో గొప్పదని మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యుడు అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. చట్టసభల్లో అట్టడుగు వర్గాల వారు ప్రవేశించడానికి రాజ్యాంగంలో పే ర్కొన్న రిజర్వేషన్ విధానమే కారణమన్నారు. రా జ్యాంగానికి లోబడే ఎవరైనా వ్యవహరించాలేగాని రాజ్యాంగ పరిధి దాటి వ్యవహరిస్తే ప్రతికూల ప్ర భావాలు చూపుతాయన్నారు. అనంతరం కేయూ యూజీసీ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ ఆర్. మల్లికార్జున్ రెడ్డి, కేయూ ఎస్సీ,ఎస్టీ సెల్డైరెక్టర్, ఈ సెమినార్ డైరెక్టర్ తుమ్మల రాజమణి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్. నారాయణ మాట్లాడారు. లైబ్రరీ సైన్స్విభాగం అధిపతి రాధిక రాణి, వివిధ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రయ్య కేయూలో ముగిసిన జాతీయ సదస్సు -
ఈఆర్సీ చైర్మన్కు సమస్యలు విన్నవించిన వినియోగదారులు
బహిరంగ విచారణకు అధ్యక్షత వహించిన ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 17 జిల్లాల నుంచి వినియోగదారులు హనుకొండ కలెక్టరేట్కు చేరుకుని తమ సమస్యలను ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్కు సమస్యలు వివరించారు. వీరితో భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు వినియోగదారులకు జరుగుతున్న ఇబ్బందులు, కంపెనీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు అందించారు. ఆగ్రో బేస్డ్ పరిశ్రమలకు విద్యుత్ టారిఫ్లో రాయితీ ఇవ్వాలని వినియోగదారులు కోరారు. రాయితీ లేక ఈ రంగంలో పరిశ్రమలు రావడం లేదన్నారు. అదే విధంగా 2011లో ట్రాన్స్కో రాతపూర్వకంగా ఇచ్చిన ఆదేశాల మేరకు కాటన్ ఇండస్ట్రీస్ నడిపిస్తే ఆ తర్వాత జరిమానా విధించారని వాపోయారు. వడ్డీ విధిస్తూ ఎరియర్స్గా చూపిస్తున్నారని, 18 ఇండస్ట్రీస్కు రూ.15 నుంచి 30 లక్షల వరకు జరిమానా విధించారని, వీటిని రద్దు చేయాలని కోరారు. రైతులు తమ వ్యవసాయ మోటార్ల వద్ద ఓల్టేజీ తెలుసుకోవడానికి 20 ఆంప్స్ విద్యుత్ బల్బులు వాడుకునేందుకు అనుమతి ఉందని, అయితే న్యూట్రల్ వైర్ లేక వినియోగించుకోలేక పోతున్నామని, వ్యవసాయ సర్వీస్ లైన్లకు న్యూటల్ వైన్ వేయాలని కోరారు. అదే విధంగా పంట పొలాల మద్యన ఉన్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను రోడ్డు సౌకర్యం ప్రాంతానికి తరలించడానికి రైతులను డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని, దీనికి స్వస్తి పలికి సంస్థనే ఉచింతంగా తరలించాలని కోరారు. రైతులు మారినప్పుడు వ్యవసాయ సర్వీస్లో పేర్లు మార్చే విధానం సులభతరం చేయాలని కోరారు. చాలా గ్రామాలకు జూనియన్ లైన్మెన్లు, లైన్మెన్లు లేరని, వెంటనే నియమించాలని కోరారు. ఇళలపై నుంచి వెళ్తున్న విద్యుత్ లైన్లను ఎలాంటి చార్జీలు విధించకుండా మార్చాలని కోరారు. వినియోగదారులు ఇంకా చాలా సమస్యలు ఈఆర్సీ దృష్టికి తీసుకెళ్లగా వాటిని పరిష్కరించాలని ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్..టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిని ఆదేశించారు.టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 17 జిల్లాల నుంచి వినియోగదారులు హనుకొండ కలెక్టరేట్కు చేరుకుని తమ సమస్యలను ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్కు వివరించారు. వీరితో భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు వినియోగదారులకు జరుగుతున్న ఇబ్బందులు, కంపెనీ అభివృద్ధికి తీసుకోవాల్సి న చర్యలపై సలహాలు, సూచనలు అందించారు. ఆగ్రో బేస్డ్ పరిశ్రమలకు విద్యుత్ టారిఫ్లో రాయితీ ఇవ్వాలని వినియోగదారులు కోరారు. రాయితీ లేక ఈ రంగంలో పరిశ్రమలు రావడం లేదన్నారు. అదే విధంగా 2011లో ట్రాన్స్కో రాతపూర్వకంగా ఇచ్చిన ఆదేశాల మేరకు కాటన్ ఇండస్ట్రీస్ నడిపిస్తే ఆ తర్వాత జరిమానా విధించారని వాపోయారు. వడ్డీ విధిస్తూ ఎరియర్స్గా చూపిస్తున్నారని, 18 ఇండస్ట్రీస్కు రూ.15 నుంచి రూ.30 లక్షల వరకు జరిమానా విధించారని, వీటిని రద్దు చేయాలని కోరారు. రైతులు తమ వ్యవసాయ మోటార్ల వద్ద ఓల్టేజీ తెలుసుకోవడానికి 20 ఆంప్స్ విద్యుత్ బల్బులు వాడుకునేందుకు అనుమతి ఉందని, అయితే న్యూట్రల్ వైర్ లేక వినియోగించుకోలేక పోతున్నామని, వ్యవసాయ సర్వీస్ లైన్లకు న్యూటల్ ౖలైన్ వేయాలని కోరారు. అదే విధంగా పంట పొలాల మధ్య ఉన్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను రోడ్డు సౌకర్యం ఉన్న ప్రాంతానికి తరలించడానికి రైతులను డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని, దీనికి స్వస్తి పలికి సంస్థనే ఉచితంగా తరలించాలని కోరారు. రైతులు మారినప్పుడు వ్యవసాయ సర్వీస్లో పేర్లు మార్చే విధానం సులభతరం చేయాలని కోరారు. చాలా గ్రామాలకు జూనియన్ లైన్మెన్లు, లైన్మెన్లు లేరని, వెంటనే నియమించాలని కోరారు. ఇళ్ల పైనుంచి వెళ్తున్న విద్యుత్ లైన్లను ఎలాంటి చార్జీలు విధించకుండా మార్చాలని కోరారు. వినియోగదారులు ఇంకా చాలా సమస్యలు ఈఆర్సీ దృష్టికి తీసుకెళ్లగా వాటిని పరిష్కరించాలని ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్..టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిని ఆదేశించారు. -
హెల్త్ యూనివర్సిటీ వీసీ బాధ్యతల స్వీకరణ
ఎంజీఎం: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నూతన వైస్ చాన్స్లర్గా డాక్టర్ పీవీ నందకుమార్రెడ్డి బుధవారం అధికారికంగా తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్సిటీ ప్రతిష్టను పెంచేందుకు అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. అనంతరం వర్సిటీలోని పలు విభాగాలను పరిశీలించి సిబ్బందితో ముచ్చటించారు. నూతన వీసీగా బాధ్యతలు చేపట్టిన నందకుమార్రెడ్డికి రిజిస్ట్రార్ డాక్టర్ సంధ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ మల్లేశ్వర్, జాయింట్ రిజిస్ట్రార్ డాక్టర్ రమేశ్, అడ్మిషన్ కమిటీ మెంబర్ డాక్టర్ ప్రవీణ్కుమార్, డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ హేమంత్కుమార్, ఫైనాన్స్ ఆఫీసర్ ఖాలీద్, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. -
విద్యారంగానికి 7.57 శాతమే
కేయూ క్యాంపస్: ఈ సారి బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపుల్లో 1,816 కోట్లు పెరిగినా మొత్తం బడ్జెట్లో రూ. 3 లక్షల కో ట్లలో చూసినప్పుడు రూ. 23 వేల కోట్లు వర కు కేటాయించారు. 7.57 శాతమే కేటాయింపులు జరిగాయి. ఇందులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు అధి క నిధులు కేటాయించారు. స్వాగించాల్సిందే. కానీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మౌలిక సదుపాయాలు అమలు చేయాలంటే 15 శాతం నిధులు కేటాయించాల్సిండేది. –భీమళ్ల సారయ్య, విద్యావారధి సంస్థ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు -
సంక్షేమ బడ్జెట్..
కేయూ క్యాంపస్: 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఇందులో రాజీవ్ యువ వికాస్ పథకానికి రూ. ఆరువేల కోట్లు కేటాయించారు. దీని వల్ల యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. యంగ్ స్కిల్ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిటీ ఏర్పాటుతో సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. ఈ బడ్జెట్తో బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి సాధించడానికి అవకాశం కలుగుతుంది. –సురేశ్లాల్, ప్రొఫెసర్, కేయూ ఎకనామిక్స్ విభాగం -
భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం
ఖిలా వరంగల్ : మామునూరు ఎయిర్పోర్ట్ భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామని వరంగల్ ఆర్డీఓ సత్యపాల్రెడ్డి అన్నారు. మంగళవారం వరంగల్ నక్కలపల్లి , గాడిపల్లి గ్రామాల్లో తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు, ఆర్అండ్బీ, హార్టికల్చర్, ఇరిగేషన్ అధికారులు, రైతులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా సర్వే ద్వారా గుర్తించిన 253 ఎకరాల భూములతోపాటు బావులు, బోర్లును పరిశీలించారు. బోర్లు, బావుల నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని అంచనా వేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం ఆర్టీఓ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్వర్వుల ప్రకారం విమానాశ్రయం రన్వే విస్తీర్ణం కోసం 253 ఎకరాల భూమిని సేకరించే పనిలో ఉన్నామని, సర్వే ద్వారా నక్కలపల్లి, గాడిపల్లి గ్రామాల్లో 253 ఎకరాలను గుర్తించమన్నారు. భూమి విలువతోపాటు బావులు, బోర్లు విలువను సైతం పరిహారంలో చెల్లిస్తామని తెలిపారు. ప్రతీ రైతుకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామని, త్వరలో నివేదిక తయారు చేసి కలెక్టర్కు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల ఆర్ఐ ఆనంద్ కుమార్, సర్వేయర్ రజిత, ఇతర శాఖల సిబ్బంది, భూ నిర్వాసితులు పాల్గొన్నారు. శరవేగంగా రన్వే భూ సేకరణ పనులు వరంగల్ ఆర్డీఓ సత్యపాల్రెడ్డి నక్కలపల్లి, గాడిపల్లిలో బావులు, బోర్ల పరిశీలన -
వినియోగదారులతో సీఎండీ ముఖాముఖి
హన్మకొండ: విద్యుత్ వినియోగదారులతో టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. మంగళవారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి విద్యుత్ వినియోగదారులతో ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడారు. నూతనంగా సర్వీస్లు పొందిన గృహ, వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమల వినియోగాదారులకు స్వయంగా ఫోన్ చేసి వారితో సంభాషించారు. సర్వీస్ మంజూరు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కొత్త సర్వీస్ మంజూరులో జాప్యం జరిగిందా? కాల పరిమితికి లోబడి మంజూరు చేశారా? విద్యుత్ అధికారులు నిబంధనల మేరకు మంజూరు చేస్తున్నారా? అధికారులు ఎలా పని చేస్తున్నారు? వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు ఇతర సేవలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం వరుణ్ రెడ్డి మాట్లాడుతూ మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడానికి వినియోగదారుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు నేరుగా వారితో మాట్లాడానన్నారు. ఫీడ్ బ్యాక్ తీసుకోవడం, అభిప్రాయాలు తెలుసుకోవడం ద్వారా అవసరమైన మార్పులు తీసుకొచ్చే అవకాశముందన్నారు. అదే విధంగా సత్సంబంధాలు పెరుగుతాయన్నారు. వినియోగదారుల్లో కంపెనీపై విశ్వాసం, సేవల పట్ల నమ్మకం కలుగుతుందన్నారు. వినియోగాదారులకు నాణ్యమైన సేవలు అందించడానికి ప్రతీ ఉద్యోగి నిబద్దతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. -
మామిడి తోటల్లో జాగ్రత్తలు చేపట్టాలి
మహబూబాబాద్ రూరల్: మామిడి తోటలు సాగు చేస్తున్న రైతులు ప్రస్తుత తరుణంలో సరైన జాగ్రత్తలు చేపట్టి అధిక దిగుబడులు పొందాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి మరియన్న, జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం రైతు నేస్తం కార్యక్రమంలో అధికారులు, రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా యాసంగిలో మామిడి తోటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చీడపీడల నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలపై రైతులకు సూచనలు ఇచ్చారు. క్రాప్ బుకింగ్, పీఎం కిసాన్, రైతుబంధు, రైతు బీమా పథకాలపై జిల్లాలోని మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి తిరుపతిరెడ్డి, వ్యవసాయ అధికారి (టెక్నికల్) రాజు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి మరియన్న -
పనుల్లో వేగం పెంచాలి
మహబూబాబాద్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఉపాధి హామీ పనులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ మాట్లాడుతూ.. కూలీలు వంద శాతం పనులకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈజీఎస్లో జరుగుతున్న పనులు ఈనెల 31లోపు పూర్తి కావాలన్నారు. అధికారులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీసీలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, డీఆర్డీఓ మధుసూదన్, రాజు, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ -
సాంకేతిక లోపంతో నిలిచిన గూడ్స్..
● 2 గంటల పాటు ఆగిన పలు ఎక్స్ప్రెస్ రైళ్లు, ప్యాసింజర్లు ● తీవ్ర అసౌకర్యానికి గురైన ప్రయాణికులు డోర్నకల్/గార్ల: డోర్నకల్, మహబూబాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య గూడ్స్ ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తి మెయిన్ లైన్లో నిలిచింది. దీంతో మంగళవారం పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఉదయం 6 గంటల సమయంలో బొగ్గు లోడ్తో వరంగల్ వైపునకు వెళ్తున్న గూడ్స్ ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తి నిలిచింది. దీంతో డోర్నకల్లో కాకతీయ రైలు 2.10 గంటల వరకు నిలిచింది. గుండ్రాతిమడుగులో తమిళనాడు ఎక్స్ప్రెస్ 2.20 గంటలు, గార్లలో ఏపీ ఎక్స్ప్రెస్ 2.10 గంటల వరకు నిలిచిపోగా కోణార్క్ ఎక్స్ప్రెస్ డోర్నకల్ అవుట్ సిగ్నల్ వద్ద గంట పాటు, సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ పోచారం రైల్వే స్టేషన్లో రెండు గంటల పాటు నిలిచాయి. మహబూబాబాద్ వైపు నుంచి రిలీఫ్ రైలింజన్ వచ్చి గూడ్స్ను మహబూబాబాద్కు తరలించిన అనంతరం రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. రెండు గంటలకు పైగా రైళ్లు నిలవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్రిడ్జిపై స్తంభించిన రాకపోకలు.. డోర్నకల్: స్థానిక రైల్వే స్టేషన్లోని ఫుట్ఓవర్ బ్రిడ్జిపై మంగళవారం కొద్దిసేపు రాకపోకలు స్తంభించాయి. ఉదయం సింగరేణి, శాతవాహన రైళ్లు ఆలస్యంగా నడవడం, మహారాష్ట్రకు వెళ్తున్న కూలీలు బ్రిడ్జిపై తమ సామాన్లతో కూర్చోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో ఆర్పీఎఫ్ సిబ్బంది స్పందించి బ్రిడ్జికి ఇరుపక్కలా కూర్చున్న కూలీలను ప్లాట్ఫామ్లపైకి తరలించి రాకపోకలను పునరుద్ధరించారు. -
‘దేవాదుల’ గట్టెక్కించేనా?
సాక్షిప్రతినిధి, వరంగల్/హసన్పర్తి/ధర్మసాగర్: వేసవి ఎండల తీవ్రత.. అడుగంటుతున్న భూగర్భజలాలు.. దీంతో జనగామ, హనుమకొండ జిల్లాల్లోని నాలుగు నియోజకవర్గాల్లో అక్కడక్కడ పంట లు ఎండుతున్నాయి. చేతికందే దశలో దేవాదుల ప్రాజెక్టు పరిధిలో వరి పంటలు దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టు కింద 50 నుంచి 60వేల ఎకరాలకు సాగునీరందించేలా దేవాదుల ప్రాజెక్టు మూడవ దశలో భాగంగా దేవన్నపేటలో నిర్మించిన పంపుహౌస్ మోటార్లను జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రారంభించేందుకు మంగళవారం సాయంత్రం పంపుహౌస్కు చేరుకున్నారు. కానీ, మోటారు మరమ్మతుకు రావడం, ఆస్ట్రియానుంచి వచ్చిన బృందం చేపట్టిన రిపేర్లు పూర్తి కాకపోవడంతో మంత్రులు రాత్రి ఎన్ఐటీ గెస్టుహౌస్లో ఉన్నారు. అసెంబ్లీలో బుధవారం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో రాత్రి 11.30 గంటలకు హైదరాబాద్కు వెళ్లిపోయారు. హడావుడిగా సాగిన మంత్రుల పర్యటన.. దేవాదుల చివరి ఆయకట్టుకు సాగునీరందిచేందుకు యుద్ధప్రాతిపదికన ఖరారైన మంత్రుల టూర్ హడావిడిగా సాగింది. మొదట మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా హసన్పర్తి మండలం దేవన్నపేటకు పంప్హౌజ్కు చేరుకున్నారు. అక్కడినుంచి ధర్మసాగర్ రిజర్వాయర్లో నీరు పంపింగ్ అయ్యేలా మోటార్ ఆన్ చేయాల్సి ఉంది. అనంతరం ధర్మసాగర్ రిజర్వాయర్కు చేరుకుని అక్కడ పూజలు చేసి.. మీడియా సమావేశంలో మాట్లాడుతారనేది షెడ్యూల్. కానీ, అనుకున్న ప్రకారం దేవన్నపేటకు మంత్రులు చేరుకున్నప్పటికీ మోటార్ మొరాయించడంతో స్విచాన్ చేయకుండా అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధర్మసాగర్ రిజర్వాయర్ వద్ద వేసిన టెంట్లు, కుర్చీల వద్దే ప్రజలు, కార్యకర్తలు ఉండిపోయారు. చివరి నిమిషంలో మీడియా సమావేశం దేవన్నపేటలోనే ఉంటుందనడంతో ధర్మసాగర్ నుంచి దేవన్నపేటకు మీడియాతోపాటు నాయకులు, కార్యకర్తలు, అధికారులు వెళ్లాల్సి వచ్చింది. కాగా దేవన్నపేట పంపుహౌస్, ధర్మసాగర్ రిజర్వాయర్తో పాటు పలుచోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల పక్కన ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, మామిడాల యశస్విని రెడ్డి తదితరుల ఫొటోలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అధికారులపై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం దేవాదుల ప్రాజెక్టు దశలు ఎప్పుడు ప్రారంభమయ్యాయని, ఇతర అంశాలపై మంత్రులు అడిగిన ప్రశ్నలకు నీటిపారుదల శాఖ అధికారుల నుంచి సరైన సమాధానం లేదు. దీంతో వారిపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్ష కు సమాచారం లేకుండా వట్టి చేతులతో వస్తారా అని మండిపడ్డారు. చిన్న చిన్న సమస్యలతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, నీటిపారుదలశాఖ ము ఖ్య కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, బల్దియా కమిషనర్ అశ్వినీ తానాజీ వాక డే, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవారెడ్డి, కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, మేయర్ గుండు సుధారాణి, పీసీసీ మాజీ కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్, ఎన్ఎస్ యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు సురేందర్రెడ్డితోపా టు దేవాదుల ఉన్నతాఽధికారులు పాల్గొన్నారు. రాత్రి వరకు కాని మోటార్ మరమ్మతు చివరి ఆయకట్టు రైతుల్లో ఆందోళన హడావుడిగా సాగిన మంత్రుల పర్యటన ‘ధర్మసాగర్ రిజర్వాయర్’ కార్యక్రమం రద్దు దేవన్నపేట పంపుహౌస్కు హుటాహుటిన అధికారులు ఫేజ్–3 పనులపైనే దృష్టి... చేతికందే పంటలను కాపాడేందుకు మూడో ఫేజ్ పనులపై అధికారులు దృష్టి సారించారు. దేవన్నపేట పంపుహౌస్లో ప్రస్తుతం ఒక్కో మోటారు 800 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఇక్కడ మూడు మోటార్లు ఏర్పాటు చేయగా.. అందులో ఒక్కటి ఆన్చేసి జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో సుమారు 60వేల నుంచి 65వేల ఎకరాల వరకు సాగునీరు అందించడంపై దృష్టి పెట్టారు. మంగళవారం రాత్రి వరకు మోటారు మొరాయించడంతో ఈ యాసంగి పంట చేతికందే వరకు నీటి సరఫరా అవుతుందా? అన్న ఆందోళన ఆ నాలుగు నియోజకవర్గాల్లోని రైతుల్లో వ్యక్తమవుతోంది. -
లైంగిక దాడి కేసులో నిందితుడికి పదేళ్ల జైలు
కాటారం: మహాముత్తారం మండలానికి చెందిన ఓ వివాహితపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి పది సంవత్సరాల ఆరు నెలల కఠిన జైలు శిక్షతో పాటు రూ.1500 జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు మంగళవారం తీర్పు వెలువరించారు. మహాముత్తారం ఎస్సై మహేందర్కుమార్ కథనం ప్రకారం.. మహాముత్తారం మండలం మహబూబ్పల్లికి చెందిన అర్నేని నరేశ్ 2015లో ఓ వివాహిత రాత్రి ఒంటరిగా ఇంట్లో నిద్రిస్తుండగా ఆమైపె లైంగికదాడికి పాల్పడ్డాడు. సదరు మహిళ కేకలు వేయగా చుట్టు పక్కల వారు రావడంతో నరేశ్ పారిపోయాడు. మరుసటి రోజు వివాహిత ఈ విషయం తన భర్తకు చెప్పడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై వెంకటేశ్వరరావు.. నరేశ్పై కేసు నమోదు చేయగా అప్పటి సీఐ మహేశ్ చార్జ్షీట్ దాఖలు చేశారు. కొన్ని రోజులుగా కోర్టులో విచారణ కొనసాగగా డీఎస్పీ గడ్డం రామ్మోహన్రెడ్డి, సీఐ నాగార్జునరావు, ఎస్సై మహేందర్కుమార్ ఆధ్వర్యంలో సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణలో భాగంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ వాదనలు వినిపించగా నేరం రుజువైంది. దీంతో నరేశ్కు పదేళ్ల ఆరు నెలల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1500 జరిమాన విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు తీర్పు వెల్లడించారు. నిందితుడికి శిక్షపడేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన డీఎస్పీ, సీఐ, ఎస్సైతో పాటు సాక్షులను సకాలంలో ప్రవేశపెట్టిన కోర్టు సిబ్బందిని ఎస్పీ కిరణ్ఖరే అభినందించారు. హత్యాయత్నం కేసులో భర్తకు ఐదేళ్లు.. మహబూబాబాద్ రూరల్ : భార్యను అదనపు కట్నం కోసం వేధించడంతోపాటు ఆమెను హత్యచేయాలని ప్రయత్నించిన భర్తకు 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.7 వేలు జరిమానా విధిస్తూ మహబూబాబాద్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సి.సురేశ్ మంగళవారం తీర్పు వెలువరించారు. కోర్టు డ్యూటీ అధికారి, హెడ్ కానిస్టేబుల్ నెలకుర్తి అశోక్ రెడ్డి కథనం ప్రకారం.. మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గడ్డిగూడెం తండా గ్రామానికి చెందిన ధరావత్ రవికి మానుకోట జిల్లా కేంద్రంలోని శిఖార్ఖానా గడ్డకు చెందిన భవానితో 2017లో వివా హం జరిగింది. ఈ దంపతులకు ఆరు సంవత్సరాల కుమార్తె మహిమ ఉంది. భవానీని రవి, అతడి తల్లిదండ్రులు కాంతి, ఉమ్లా, ఆడపడుచు దంపతులు లక్ష్మి, విష్ణు అదనపు కట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేశారు. భర్త రవి ఉరేసి చంపే ప్రయత్నం చేయగా భవాని 2021 ఫిబ్రవరి 22వ తేదీన రూరల్ పో లీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి ఎస్సై చీర రమేశ్ బాబు కేసు నమోదు చేయగా విచారణ జరిపి అప్పటి ఎస్సై సి.హెచ్.నగేశ్ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ పక్షాన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సంతోషిణి, గణేశ్ ఆనంద్ కోర్టులో వాదనలు వినిపించగా ప్రస్తుత రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై దీపిక ఆధ్వర్యంలో కోర్టు డ్యూటీ అధికారి అశోక్రెడ్డి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. వాదనలు విన్న అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సి.సురేశ్.. రవికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.7 వేలు జరిమానా జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. -
విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దు
మహబూబాబాద్ రూరల్: పదో తరగతి విద్యార్థులు విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి సూచించారు. మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఎంశ్రీ వార్షికోత్సవం, పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఈఓ రవీందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. కంబాలపల్లి పాఠశాల జిల్లాలోనే ప్రాముఖ్యత కలిగి ఉన్నదని, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏ పో టీలు నిర్వహించినా ఈ పాఠశాల విద్యార్థులు తప్పనిసరిగా బహుమతి పొందుతారని అన్నారు. వివిధ సబ్జెక్టు టాలెంట్ టెస్టుల్లో కూడా బహుమతులు సాధిస్తారని తెలిపారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించి పాఠశాలకు పేరుతేవాలని, రాష్ట్ర స్థాయిలో జిల్లాను సింగిల్ డిజిట్కు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు స్పెషల్ టెస్టులు నిర్వహించడం ద్వారా మంచి ప్రోగ్రెస్ ఉంటుందని, ఉపాధ్యాయులు అందరి కృషి వల్ల ఈ సంవత్సరం మంచి ఫలితాలు వస్తాయని ఆకాంక్షించారు. కార్యక్రమములో ఎంఈఓ వెంకటేశ్వర్లు, హెచ్ఎం రమేష్ బాబు, మైస శ్రీనివాస్, వీరయ్య, విష్ణువర్ధన్, రామసహాయం శ్రీధర్ రెడ్డి, ఉప్పలయ్య, సోహెన్ బీ, శ్రీనివాసరావు, తిరుపతి, సతీష్ కుమార్, శిభారాణి, సోమేశ్వర్, ఝాన్సీ, మల్లారెడ్డి, వెంకటేశ్వర్లు, కృష్ణమూర్తి, వీరభద్రం, వెంకటేశ్వర్లు, యుంగేందర్, కవిత పాల్గొన్నారు. డీఈఓ రవీందర్రెడ్డి -
సామాజిక అభ్యున్నతికి దోహదం
భారత రాజ్యాంగం.. కేయూ క్యాంపస్ : భారత రాజ్యాంగం సామాజిక వ్యవస్థ అభ్యున్నతికి దోహదపడుతున్న విలువైన డాక్యుమెంట్ అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నారాయణ అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ‘75 ఏళ్ల భారత రాజ్యాంగం మైలు రాయి.. సమస్యలు– సవాళ్లు’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు మంగళవారం సెనేట్హాల్లో నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. భారతీయ సమాజం విభిన్న సంస్కృతుల జాతుల కలయిక అని, ఇండియాలో నివసించే వ్యక్తులందరూ రాజ్యాంగం పరిధిలో జీవిస్తున్నారన్నారు. సమసమాజ స్థాపనకు భారత రాజ్యాంగ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సెక్యులర్ భావాలతో రాజ్యాంగంలో పేర్కొన్న ప్రతీ ఆర్టికల్ దేశ ప్రజలందరికీ ఉపయోగపడుతుందన్నారు. మానవ అభివృద్ధికి విద్య దోహదం.. మానవ అభివృద్ధికి విద్య ఎంతో దోదపడుతుందని తెలంగాణ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య అన్నారు. బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు సమాజ అభ్యున్నతికి దోహదపడుతున్నాయన్నారు. భగవద్గీత, వేదాలు ఉపనిషత్తులు, అన్ని గ్రంథాలతోపాటు రాజ్యాంగాన్ని కూడా ప్రతి ఒక్కరూ చదవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అధిక నిధులు కేటాయించాలన్నారు. విద్య, వైద్యం ఉచితంగా అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాలు రావాలి.. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో విలువలు లేవని, దీనివల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరగడం లేదని, అందుకే ప్రత్యామ్నాయ రాజకీయాలు రావాలని కేయూ మాజీ రిజిస్ట్రార్ శ్రీనివాస్రెడ్డి అన్నారు. దేశంలో నిజాయితీ గల రాజకీయ వ్యవస్థ లేకుండా పోయిందన్నారు. సెక్యులర్ భావాలు కలిగిన వ్యవస్థ.. ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగ వ్యవస్థను కలిగిన భారతదేశంలో భిన్న సంస్కృతులు, ఆచార వ్యవహారాలు ఉన్నాయని, ముఖ్యంగా సెక్యులర్ భావాలతో కలిగిన వ్యవస్థ ఉందని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర గ్రంథాలయాల సంస్థ చైర్మన్ మహ్మద్ రియాజ్ అన్నారు. తెలంగాణలో రేవంత్రెడ్డి ప్రజాపాలనలో అనేక సమస్యల పరిష్కారానికి కృషి జరుగుతోందన్నారు. యూనివర్సిటీల్లో కూడా టీచింగ్ ఫ్యాకల్టీని నియమించబోతున్నారని వెల్లడించారు. అనంతరం కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి, కేయూ ఎస్సీ,ఎస్టీ సెల్ డైరెక్టర్, సెమినార్ డైరెక్టర్ తుమ్మల రాజమణి, ఓయూ ‘లా’ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ద్వారకానాథ్ మాట్లాడారు. కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, సైన్స్కోర్సుల డైరెక్టర్ బి. వెంకటగోపినాథ్, డాక్టర్ మేఘనరావు, డాక్టర్ ప్రగతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏపీ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ నారాయణ కేయూలో జాతీయ సదస్సు ప్రారంభం -
ప్రణాళిక ప్రకారం చదివితేనే విజయం
● గ్రూప్–1 టాపర్ తేజస్విని రెడ్డి విద్యారణ్యపురి: ప్రణాళిక ప్రకారం కష్టపడి చదివి తేనే పోటీ పరీక్షల్లో విజయం సాధ్యమని గ్రూప్ –1 టాపర్ జిన్నా తేజస్విని రెడ్డి అన్నారు. మంగళవా రం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెరీర్ గైడెన్స్ కౌన్సెలింగ్ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో తేజ స్వినిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సరైన ప్రణాళికతో సొంతంగా నోట్స్ రాసుకోవాలన్నారు. పోటీ పరీక్షల్లో తమకు ఏ సబ్జెక్ట్పై ఆసక్తి ఉందో దానిపైపట్టు సాధించేలా అందుకు సంబంధించిన పుస్తకాలు చదవవాలన్నారు. శాస్త్ర,సాంకేతిక అంశాలపై శిక్షణ నిపుణలు చల్లా నారాయణరెడ్డి, ఆ కళాశాల ప్రిన్సిపాల్ జి. రాజారెడ్డి, వైస్ప్రిన్సిపాల్ కె. రజనీలత, స్టాఫ్సెక్రటరీ ఎం. రవికుమార్,కెరీర్ అండ్ గైడెన్స్సెల్ కోఆర్డినేటర్ బి.కవిత, డాక్టర్ చి న్నా మాట్లాడారు. అనంతరం తేజస్వినిరెడ్డిని ప్రిన్సి పాల్ రాజారెడ్డి ఇతర అధ్యాపకులు సన్మానించారు. విద్యుత్ మోటారు ఆన్ చేస్తూ.. మృత్యుఒడికి ● షాక్కు గురై రైతు మృతి ● కొండపర్తిలో ఘటన ఐనవోలు: విద్యుత్ మోటారు ఆన్ చేస్తున్న క్రమంలో షాక్కు గురై ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని కొండపర్తిలో చోటు చేసుకుంది. ఎస్సై పస్తం శ్రీనివాస్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాల్నె రమేశ్ (45) వ్యవసాయంతో పాటు కులవృత్తి (గౌడ) కల్లు తీస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజు మాదిరిగానే వరి పంటకు నీరు పారించడానికి మంగళవారం ఉదయం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో స్టార్టర్ ద్వారా వ్యవసాయ మోటారు ఆన్ ఆన్ చేస్తుండగా ఎడమ చేతికి విద్యుత్ తీగ తగిలి షాక్కు గురై పక్కనే ఉన్న నీటి కాల్వలో పడి అక్కడికక్కడే మృతిచెందాడు. చుట్టుపక్కల రైతులు గమనించి మృతుడి భార్య, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తన భర్త మృతి విషయంలో ఎవరిపై ఎలాంటి అనుమానం లేదని మృతుడి భార్య శోభారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి వెంకటాపురం(కె): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈఘటన మంగళవారం రాత్రి మండల కేంద్రంలోని దుర్గమ్మ గుడి సెంటర్లో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన రాజా(58) దుర్గమ్మ గుడి సెంటర్ నుంచి నడుచుకుంటూ అంబేడ్కర్ సెంటర్ వైపునకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నవాబ్ పేటకు చెందిన ఉదయ్ కిరణ్ (30) ద్విచక్రవాహనంపై వేగంగా వస్తూ రాజాను ఢీకొన్నాడు. దీంతో రాజా అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే, ద్విచక్రవాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టి కిందపడడంతో ఉదయ్ కిరణ్ కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. -
వైద్యానికి నిధులు
జిల్లా ఏర్పాటుతోపాటు తలమాణికంగా ఉన్న మెడికల్, నర్సింగ్ కళాశాలల భవనాల నిర్మాణాలు మూడు సంవత్సరాలుగా కుంటి నడకనడుస్తున్నాయి. వీటిని పూర్తి చేసేందుకు ఈ బడ్జెట్లో నిధులు మంజూరు చేయాలి. అదేవిధంగా తొర్రూరు, మరిపెడ, కేసముద్రం మున్సిపాలిటీల్లో ఉన్న పీహెచ్సీలను సీహెచ్సీలుగా 100 పడకల స్థాయి పెంచుతున్నామని, నర్సింహులపేట, సీరోలు, పెద్దవంగర మండలాల్లో నూతన పీహెచ్సీలు మంజూరు చేశారు. కానీ మూడు సంవత్సరాలుగా నిధులు మంజూరు చేయలేదు. ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తే పేదలకు మెరుగైన ప్రభుత్వ వైద్యం అందే అవకాశం ఉంది. -
రామప్పలో అమెరికా దేశస్తులు
వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సుప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని మంగళవారం అమెరికాకు చెందిన షేమ్, ని సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప అందాలు బాగున్నాయని కొనియాడారు. సరిగమలు పలికే పొన్నచెట్టు శిల్పాన్ని మీటుతూ ముగ్ధులయ్యారు. రామప్ప శిల్పాలను తమ సెల్ఫోన్లో బంధించుకున్నారు. అనంతరం సరస్సు కట్టకు చేరుకొని సరస్సులో బోటింగ్ చేస్తూ అందాలను తిలకించారు. -
బుధవారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోuజిల్లాలో సాగునీటి వనరులు జిల్లాలోని 1,590 చెరువుల నీటితో మొత్తం 95,460 ఎకరాల భూమి సాగులో ఉంది. జిల్లాలోని ఎస్సారెస్పీ డీబీఎం 58, 59, 60 ద్వారా పాలకుర్తి, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలకు సాగునీరు అందుతోంది. ఇప్పటి వరకు జిల్లాలోని 403 చెరువులు మాత్రమే కాల్వల ద్వారానీరు నింపే అవకాశం ఉండగా.. 1,187 చెరువులు ఇప్పటికీ వర్షాధారంగానే ఉన్నాయి. అయితే జిల్లాలోని నాలుగు లక్షలకు పైగా ఎకరాల భూమి సాగుకు అనుకూలంగా ఉంది. కానీ, సరిపడా నీటి వనరులు లేక ప్రతీ ఏడా ది పంటలు ఎండుతున్నాయి. ఈ బడ్జెట్లో పాకాల వరకు వచ్చిన దేవాదులకు, జిల్లా నుంచి వెళ్లే సీతా రామ ప్రాజెక్టుల నీటిని లిప్టుల ద్వారా ఎగువన ఉ న్న చెరువులు నింపితే జిల్లాలోని గూడూరు, గంగా రం, కొత్తగూడ, గార్ల, బయ్యారం, మహబూబా బాద్ మండలాలకు సాగునీటి సమస్య తీరుతుంది. అరకొరగా సాగునీటి వసతి ● అసంపూర్తిగా వైద్యారోగ్యశాఖ భవనాలు ● పంట ప్రాసెసింగ్ యూనిట్లు లేక ఇబ్బందులు ● నేడు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో నేడు(బుధవారం) ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రవేశపెట్టే బడ్జెట్పై జిల్లా ప్రజలు ఆశగా ఉన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న పనులతోపాటు, పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి ఈ బడ్జెట్లోనైనా నిధులు కేటాయిస్తారేమోనని ఎదురుచూస్తున్నారు. – సాక్షి, మహబూబాబాద్విద్యాభివృద్ధికి నిధులు.. జిల్లా వ్యాప్తంగా 922 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఇందులో సగం పాఠశాలల్లో ఏదో ఒక సౌకర్యం లేకపోవడం, పలు పాఠశాలల్లో ప్రహరీ గోడలు, మూత్రశాలలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం మన ఊరు– మన బడి,ప్రస్తుత ప్రభుత్వం అమ్మ ఆద ర్శ పాఠశాలల పేరిట నిధులు మంజూ రు చేస్తున్నామని చెప్పారు. కానీ, ఏదీ సంపూర్ణంగా చేయలేదు. ఇందుకు నిధుల కొరతే కారణమని అధికారులు బాహాటంగానే చెబుతున్నారు. అదేవిధంగా జిల్లాలో సోషల్ వెల్ఫేర్తోపాటు అన్ని సంక్షేమలశాఖ ద్వారా 31 పాఠశాలలు ఉండగా ఇందులో 16 అద్దె భవనా ల్లోనే కొనసాగుతున్నాయి. వీటికి కొత్త భవనాలు నిర్మించేందుకు నిధులు కేటాయించాలి. కానరాని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు గిరిజనులు, ఆదివాసీలు ఎక్కువగా ఉన్న జిల్లాలో అత్యధిక మంది వ్యవసా యం, అటవీ సంపద మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రధానంగా వరి, మిర్చి, పసుపు, కూరగాయలు ఎక్కువగా పండించే రైతులు ఉన్నా వాటిని ప్రాసెసింగ్ చేసి లేదా.. నిల్వ చేసి విక్రయించే అవకాశం లేదు. దీంతో రైతులు తక్కువ ధరలకు ఉత్పత్తులను అమ్ముతున్నారు. అదేవిదంగా అడవిలో దొరికే ఇప్ప పువ్వు, తేనె, ఇతర ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసే యూనిట్లు పెట్టేందుకు నిధులు మంజూరు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. న్యూస్రీల్ -
సినీఫక్కీలో హరిబాబు కోర్టుకు..
న్యాయస్థానం వెనుక గేటు నుంచి రిమాండ్కు తరలింపు భూపాలపల్లి : సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో నిందితుడు హరిబాబు, అతడి పరారీకి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు కోర్టుకు తీసుకొచ్చి రిమాండ్కు తరలించారు. కోర్టుకు రాజలింగమూర్తి భార్య సరళ, బంధువులు రావడం.. అక్కడే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా ఉండడంతో సుమారు అరగంటపాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉదయం 9 గంటలకే కోర్టుకు.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన భూపాలపల్లి పట్టణానికి చెందిన రాజలింగమూర్తి గత నెల 19న హత్యకు గురి కాగా, ఈ హత్య కేసులో ఏ–8గా ఉన్న నిందితుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, అతడి పరారీకి సహకరించి, వెంటే ఉన్న ములుగు జిల్లాకు చెందిన వట్టే రమణయ్య, రమను ఏ–11, ఏ–12గా చేర్చిన భూపాలపల్లి పోలీసులు మంగళవారం ఉదయం 9 గంటలకే జిల్లా కేంద్రంలోని ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టులో హాజరుపర్చగా నిందితులకు జడ్జి ఎన్. రాంచందర్రావు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు నిందితులను ఖమ్మం జైలుకు తరలించారు. కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత.. కోర్టు వద్ద ఘర్షణ చోటు చేసుకునే అవకాశం ఉందని భావించిన పోలీసులు సినీ ఫక్కీలో హరిబాబు ను రిమాండ్కు తరలించారు. రమణయ్య, రమను కోర్టు ముందు గేటు ద్వారా తీసుకెళ్లారు. హరిబాబు ను మాత్రం వెనుక గేటు నుంచి తీసుకెళ్లి పోలీసు వాహనంలో రిమాండ్కు తరలించారు. విషయాన్ని గమనించిన సరళ, ఆమె బంధువులు.. హరిబాబు ను తమకు చూపించాలని పోలీసులను డిమాండ్ చేశారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులను సరళ నిలదీసింది. ఏ11, ఏ12కు బెయిల్? హరిబాబు పరారీకి సహకరించి, అతడి వెంట ఉన్న రమణయ్య, రమకు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు తెలిసింది. జమానతులు సమర్పిస్తే నేడు బెయిల్ రానున్నట్లు సమాచారం. ఆరుగురు నిందితుల కస్టడీకి పోలీసుల అప్పీలు.. హత్య కేసులో ఏ–1గా ఉన్న రేణికుంట్ల సంజీవ్, ఏ–2 పింగిలి సేమంత్, ఏ–3 మోరె కుమార్, ఏ–4 కొత్తూరి కిరణ్, ఏ–6 దాసారపు క్రిష్ణ, ఏ–8 కొత్త హరిబాబును విచారణ నిమిత్తం ఏడు రోజుల కస్టడీ కోసం పోలీసులు కోర్టులో నేడు పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. హరిబాబు బెయిల్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ.. కొత్త హరిబాబు పరారీలో ఉండి ఈ నెల 4వ తేదీన హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. మూడు, నాలుగుసార్లు వాదనలు జరగగా విచారణ మంగళవారం(నిన్న)కు వాయిదా పడగా అదే రోజున హరిబాబును పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో హరిబాబు తరపున లాయర్ ముందస్తుకు బదులు సాధారణ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా బుధవారం విచారణ జరగనున్నట్లు సమాచారం. ముగ్గురి అరెస్ట్.. రాజలింగమూర్తి హత్య కేసులో ప్రధాన నిందితుడు కొత్త హరిబాబుతో పాటు, అతడు పారిపోవడానికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ డి. నరేశ్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ములుగు జిల్లాకు చెందిన వట్టే రమణయ్య, రమ.. హరిబాబు పారిపోవడానికి సహకరించారని, ముగ్గురిని ఒకే దగ్గర అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. హరిబాబుతోసహా మరో ఇద్దరు సహాయకుల అరెస్ట్, కోర్టులో హాజరు కోర్టుకు వచ్చిన రాజలింగమూర్తి భార్య సరళ, బంధువులు నిందితుడిని చూపించాలని డిమాండ్ అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకుల నిలదీత .. అరగంటపాటు ఉద్రిక్తత హరిబాబు పరారీకి సహకరించిన ఇద్దరికి బెయిల్ మంజూరు? -
దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ఉండాలి
● అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో మహబూబాబాద్: దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం విద్యాశాఖ, అలింకో కంపెనీ ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు ఉచితంగా ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగులకు కల్పిస్తున్న పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. దివ్యాంగ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించడంతోపాటు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఈఓ రవీందర్రెడ్డి, సహిత విద్యా జిల్లా కోఅర్డినేటర్ ఆజాద్ చంద్రశేఖర్, ఏడీ రాజేశ్వరరావు, డీఎస్ఓ అప్పారావు, అలింకో కంపెనీ ఇంచార్జ్లు సురేష్, మోహిత్ తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంమహబూబాబాద్ అర్బన్/ మహబూబాబాద్: ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకానికి అర్హులైన యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీమన్నారాయణరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్న్షిప్కు ఎంపికై న యువకులకు నెలకు రూ.5వేల నుంచి రూ.6వేలు భత్యం అందుతుందని తెలిపారు. శిక్షణ 12 నెలలు కొనసాగుతుందని తెలిపారు. 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండి, కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి లేని వారికి అవకాశం ఉంటుందని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లమా, డిగ్రీ పూర్తి చేసి ఉండాలని, కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8 లక్షల లోపు ఉండాలని తెలిపారు. అర్హత కలిగిన వారు ఈనెల 31వ తేదీ వరకు pminternship.mca.gov.in వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 1800 116090 నంబర్ ద్వారా సంప్రదించాలని కోరారు. ఆహారం కల్తీ చేస్తే కఠిన చర్యలుడోర్నకల్: ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ రోహిత్ హెచ్చరించారు. స్థానిక మెయిన్ రోడ్డులోని హోటళ్లు, స్వీట్ హోమ్స్, బేకరీలు, జ్యూస్ పాయింట్లు, మిర్చి, బజ్జీ బండ్లలో మంగళవారం ఆయన ఆకస్మికంగా తని ఖీలు నిర్వహించారు. కల్తీ నూనెతో తయారు చేసిన బజ్జీలు, మిర్చీలను గుర్తించి కాల్వలో పడేశారు. హోటళ్లలో పరిశుభ్రత పాటించని ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. జ్యూస్ పాయింట్లు, స్వీట్ హోముల నుంచి ఆహార పదార్థాలు, జ్యూస్ నమూనాలు సేకరించారు. కల్తీ ఆహార పదార్థాలు విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూ.3.63 లక్షల విలువైన నల్లబెల్లం పట్టివేత మహబూబాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని గుండ్లకుంట కాలనీలో రూ.3.63 లక్షల విలువ గల తొమ్మిది క్వింటాళ్ల నల్లబెల్లం, 10 కిలోల పటిక, ఐదు లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నామని మహబూబాబాద్ టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ మంగళవారం తెలిపారు. జిల్లా కేంద్రంలో టౌన్ ఎస్సై కె.శివ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తుండగా విశ్వసనీయ సమాచారం వచ్చిందన్నా రు. దీంతో గుండ్లకుంట కాలనీ ప్రాంతానికి చేరుకు ని తనిఖీలు నిర్వహించగా నల్లబెల్లం, పటిక, గు డుంబా లభ్యమయ్యాయని తెలిపారు. టౌన్ ఎస్సై శివ ఫిర్యాదు మేరకు మరో టౌన్ ఎస్సై అలీమ్ హుస్సేన్ నల్లబెల్లం అక్రమ రవాణాకు సంబంధించి పెసర రమేశ్పై కేసు నమోదు చేశారన్నారు. -
మరమ్మతుల్లో చెరువులు, చెక్ డ్యాములు
గత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 55 చెరువు కట్టలు కొట్టుకుపోయాయి. 72 చెరువులకు గండ్లు పడ్డాయి. వీటితోపాటు, ఆకేరు, మున్నేరు, పాలేరు వాగులపై నిర్మించిన 42 చెక్ డ్యాముల్లో సగం మేరకు దెబ్బతిన్నాయి. రోడ్లు ధ్వంసం అయ్యాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతోపాటు కేంద్ర బృందం ఈ ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేశారు. తాత్కాలిక మరమ్మతుల పేరిట కొన్ని నిధులు మంజూరు చేసినా.. అవి సగం పనులకు కూడా సరిపోలేదు. ఈ బడ్జెట్లో నిధులు కేటాయించి చెరువులు, చెక్ డ్యామ్ల మరమ్మతులు చేస్తేనే సాగునీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుంది. -
నెల క్రితం ఇంటి నుంచి వెళ్లి.. శవమై కనిపించి..
● వడదెబ్బతో వ్యక్తి మృతి కేసముద్రం: నెల రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి.. సరైన ఆహారం లేక, వడదెబ్బకు గురై మృతి చెందాడు. ఈ ఘటన కేసముద్రంమున్సిపాలిటీ పరిధి ముత్యాలమ్మగుడి సమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై మురళీధర్రాజు కథనం ప్రకారం.. పెద్దవంగర మండలం ఉప్పరిగుడెం గ్రామానికి చెందిన దుంపల రాజు(48) నెలరోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. చుట్టుపక్కల, బంధువుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో సోమవారం మున్సిపాలిటీ పరిధి ముత్యాలమ్మగుడి సమీపంలో వ్యక్తి మృతదేహం కనిపించగా స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతుడు పెద్దవంగర మండలం ఉప్పరిగుడెంకు చెందిన రాజుగా గుర్తించారు. సరైన ఆహరం లేక, వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడి కుమారుడు సాయికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఎన్ని రోజులు తిరగాలి..
కలెక్టర్ సారూ చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు ● కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోతున్నాం ● ప్రజావాణిలో బాధితుల గోడుసాక్షి, మహబూబాబాద్: ‘మా సమస్యలు నేరుగా కలెక్టర్కే చెప్పుకుంటే పరిష్కారం అవుతాయని సంబురపడ్డాం. ప్రతీ సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజావాణి కోసం దూర ప్రాంతాల నుంచి వస్తున్నాం. దరఖాస్తులు కలెక్టర్ సర్, ఇతర పెద్ద సార్లకు ఇస్తున్నాం. మీ తహసీల్దార్, ఇతర అధికారులతో చెబుతాం.. మీ సమస్య పరిష్కారం అవుతుందని పెద్దసార్లు చెబుతున్నారు.. అక్కడికి వెళ్తే మమ్ముల్ని పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. దీంతో మళ్లీ కలెక్టర్ సార్ వద్దకు రావడం, మళ్లీ కింది స్థాయి అధికారుల వద్దకు వెళ్లడం మినహా మా సమస్య పరిష్కారం కావడం లేదు. కలెక్టర్, తహసీల్దార్, ఇతర అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగున్నాం.. కానీ ఏం లాభం లేకుండా పోయింది.. ఇంకా ఎన్ని రోజులు తిరగాలి’ అని సోమవారం గ్రీవెన్స్కు వచ్చిన పలువురు బాధితులు వాపోయారు. ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి మాకు పర్వతగిరి గ్రామంలో 2.20 ఎకరాల భూమి ఉండేది. దానిలో 9 గుంటలు ఎస్సారెస్పీ కాల్వ నిర్మాణం కోసం తీసుకున్నారు. అలాగే గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణంలో రెండు ఎకరాలు కోల్పోయాం. మిగిలిన 11 గుంటల భూమి సాగుకు అనుకూలంగా లేదు. ఉద్యోగంతో పాటు పరిహారం పెంచి ఇవ్వాలి. – మూలగుండ్ల కిరణ్కుమార్–దివ్య, దంపతులు, పర్వతగిరి -
ఘనంగా పుష్పయాగం, ఆరాధన పూజలు
మహబూబాబాద్ రూరల్: మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని అనంతాద్రి జగన్నాథ వేంకటేశ్వర స్వామివారి దేవాలయ 20వ వార్షికోత్సవంలో భాగంగా శ్రీపుష్పయాగం, ద్వాదశ ఆ రాధన, పవళింపు సేవ, ఆశీర్వచన పూజలు ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఆ లయ ప్రధాన అర్చకులు గొడవర్తి చక్రధరాచా ర్యులు పర్యవేక్షణలో గొడవర్తి శ్రీనివాసచా ర్యుల నిర్వహణలో సహ అర్చకులు విశ్వం, మట్టపల్లి విజయ్ కుమార్, గౌతమ్, చరణ్ పూజా కార్యక్రమాలు జరిపారు. శ్రీశక్రు, సోని యమ్మ సేవా సమితి వ్యవస్థాపకుడు, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ. శరత్, కుటుంబ సభ్యుల అధ్వర్యంలో సామూహిక అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గీతాంజలి స్కూల్ పక్షాన పొనగంటి రామకృష్ణ దంపతులు ద్వాదశ ఆరాధన ప్రసాదానికి విరాళం అందజేశారు. కార్యక్రమంలో నాయిని ప్రభాకర్ రెడ్డి, భక్తులు పాల్గొన్నారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా రమేశ్కుమార్ ఎంపికమరిపెడ రూరల్: మరిపెడ మండలం వీరారం గ్రామ పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న భూక్య రమేశ్కుమార్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. గత ఏడాది జూన్లో నిర్వహించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షల్లో రమేశ్నాయక్ ఉత్తీర్ణత సాధించారు. రమేశ్కుమార్ స్వగ్రామం మండలంలోని సోమ్లతండా కాగా ఆయనను తోటి ఉద్యోగస్తులు, మిత్రులు, గ్రామస్తులు అభినందించారు. తొర్రూరులో నలుగురు.. తొర్రూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష ఫలితాల్లో తొర్రూరు మండలం నుంచి నలుగురు ఎంపికయ్యారు. మడిపెల్లి గ్రామానికి చెందిన అబ్బనాపురి బ్రహ్మచారి, పత్తేపురం గ్రామానికి చెందిన అనిరెడ్డి మోహన్రెడ్డి, చెర్లపాలెం గ్రామానికి చెందిన హనుమాండ్ల ప్రదీప్రెడ్డి, ధర్మారపు రాజు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లుగా ఎంపికయ్యారు. ఉద్మోగాలు సాధించిన వారిని మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, బంధువులు, కుటుంబ సభ్యులు అభినందించారు. ఉద్యమకారులకు ప్రభుత్వ గుర్తింపు మహబూబాబాద్ రూరల్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తిస్తుందని ప్రముఖ కవి, గాయకులు గొడిశాల జయరాజ్ అన్నారు. తమ స్వస్థలమైన జిల్లా కేంద్రానికి వచ్చిన జయరాజ్ సోమవారం అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఘనపురపు అంజయ్య నివాసంలో విలేకరులతో మాట్లాడారు. అనంతరం గోడిశాల జయరాజును ఘనపురపు అంజయ్య, సుభాషిణి దంపతులు ఘనంగా సన్మానించారు. -
నేడు కోర్టు ముందుకు కొత్త హరిబాబు?
● అరెస్ట్ చూపించి కోర్టులో హాజరుపరుచనున్న పోలీసులు ● సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న సమయంలోనే పట్టుకున్న ఖాకీలు ● నిందితుడితో పాటు సహకరించిన మరో ఇద్దరు అదుపులోకి? భూపాలపల్లి: సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో ఏ8గా ఉన్న భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు కొత్త హరిబాబును నేడు(మంగళవారం) పోలీసులు అరెస్ట్ చూపించనున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గత నెల 19న రాజలింగమూర్తి దారుణ హత్యకు గురికాగా, ఈ కేసులో నిందితుడి(ఏ8)గా ఉన్న హరిబాబు పరారీలో ఉండగా పోలీసులు వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే హన్మకొండకు చెందిన అతడి సన్నిహితుడి క్రెడిట్ కార్డు తీసుకెళ్లి వినియోగించడంతో హరిబాబు శనివారం రాత్రి ఢిల్లీలో పట్టుబడగా కారులో భూపాలపల్లికి తీసుకురాగా సోమవారం తెల్లవారుజామున చేరుకున్నట్లు సమాచారం. అయితే సోమవారం హరిబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ఉన్న కారణంగా అరెస్ట్ చూపించలేదని తెలుస్తోంది. నేడు(మంగళవారం) జిల్లా కేంద్రంలో అరెస్ట్ చూపించి, కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టును ఆశ్రయించే యత్నం.. రాజలింగమూర్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కొత్త హరిబాబు ఈనెల 4న హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, బెయిల్ వచ్చే అవకాశం లేదని గమనించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు యత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే క్రెడిట్ కార్డు వినియోగం ఆధారంగా అతడిని పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. పోలీసుల అదుపులో మరో ఇద్దరు..? కొత్త హరిబాబుతో పాటు అతడికి పని మనుషులుగా, సహకరించిన మరో ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఢిల్లీలో హరిబాబును పోలీసులు పట్టుకోగా అక్కడే అతడికి సహకరించిన హైదరాబాద్కు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని సోమవారం తమదైన శైలిలో పోలీసులు విచారించినట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసులకు చిక్కకుండా ప్రాంతాలు మార్చి.. హత్య కేసులో నిందితుడిగా ఉన్న హరిబాబు, ఇద్దరు సహాయకులతో కలిసి ప్రాంతాలు మార్చి పోలీసులకు చిక్కకుండా ప్రయత్నించినట్లు సమాచారం. ఢిల్లీ, సిమ్లా, అమృత్సర్ లాంటి ప్రదేశాలను సందర్శించి చివరకు ఢిల్లీకి వచ్చి బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించే క్రమంలోనే పోలీసులకు చిక్కినట్లు తెలిసింది. -
వినియోగదారులకు మెరుగైన విద్యుత్ అందించాలి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి హన్మకొండ : విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ అందించాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన పనులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ లోడ్ పెరిగే అవకాశం ఉన్న అన్ని చోట్ల అన్ని సర్కిళ్ల పరిధిలో పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏ ర్పాటు చేశామన్నారు. ఇంటర్ లింకింగ్ పనులు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పా టు, వీసీబీల ఏర్పాటు, పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్ఈలను ఆదేశించారు. ఏప్రిల్లో పంట కోతలు పూర్తి కాగానే వ్యవసాయ సర్వీసుల త్వరితగతిన రిలీజ్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్ లాల్, టి.మధుసూదన్, సీఈలు తిరుమల్రావు, రాజు చౌహాన్, అశోక్, బీకం సింగ్, వెంకటరమణ, డీఈ అనిల్ కుమార్ పాల్గొన్నారు. పోక్సో కేసులో ఇద్దరికి జైలు గణపురం: పోక్సో కేసులో ఇద్దరికి జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ భూపాలపల్లి ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు సోమవారం తీర్పు వెలువరించారు. 2020 సంవత్సరంలో గణపురం మండలం దుబ్బపల్లికి చెందిన ఓ బాలికను అదే గ్రామానికి చెందిన మోతె రవీందర్ వేధించగా బాలిక ఈ విషయం తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయి తీ నిర్వహించారు. ఈ సమయంలో రవీందర్ భా ర్య సునీత.. బాలికను, ఆమె తల్లిదండ్రులను దూషి స్తూ వారిపై దాడి చేయగా బాలిక తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో అప్పటి ఎస్హెచ్ఓ ప్రభాకర్ పోక్సో కేసు నమోదు చేయగా అప్ప టి ఎస్సై సత్యనారాయణ రాజు చార్జ్షీట్ ఫైల్ చేశా రు. కోర్టు స్పెషల్ పీపీ విష్ణువర్ధన్ వాదనలు వినిపించారు. ప్రస్తుత సీఐ మల్లేశ్, ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో కోర్టు లైజనింగ్ అధికారి, ఏఎస్సై గాండ్ల వెంకన్న, కోర్టు కానిస్టేబుల్ శ్వేత సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువుకావడంతో భూపాలపల్లి ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు నింది తులకు సంవత్సరం జైలు, రవీందర్కు రూ.4,500, సునీతకు రూ.1,500 జరిమానా విధించారు. గంజాయి కేసులో ఒకరికి పదేళ్లు.. రేగొండ: గంజాయి కేసులో ఒకరికి పది సంవత్సరాల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తూ భూపాలపల్లి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు సోమవారం తీర్పు వెలువరించారు. పోలీ సుల కథనం ప్రకారం.. కొత్తపల్లిగోరి మండలం ని జాంపల్లి గ్రామానికి చెందిన వంగల రాజన్న ఇంట్లో గంజాయి ఉందనే సమాచారం మేరకు 2019లో అప్పటి ఎస్సై సధాకర్ సోదాలు నిర్వహించి 25 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అప్పటి సీఐ సాయిరమణ విచారణ చేపట్టి కేసు న మోదు చేశారు. అనంతరం చిట్యాల సీఐ పులి వెంకట్ చార్జ్షీట్ దాఖలు చేశారు. ప్రస్తుత సీఐ మల్లేశ్, ఎస్సై సందీప్కుమార్ ఆధ్వర్యంలో కోర్టు డ్యూ టీ అధికారి జ్యోతి.. సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా ప్రభుత్వ న్యాయవాది శ్రీనివాస్ వాదనలు విని పించారు. కేసు పూర్వాపరాలు విచారించిన జిల్లా ప్రధా న న్యాయమూర్తి నారాయణబాబు.. నిందితుడికి ప ది సంవత్సరాల జైలు శిక్ష రూ.లక్ష జరిమానా విధి స్తూ తీర్పు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. 20న జాబ్ మేళాహన్మకొండ అర్బన్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు ఈనెల 20న(గురువారం) జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా ఉపాధి కల్పనా అధికారి ఎం.మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో వర్చువల్ సెల్స్ ఎగ్జిక్యూటివ్, యాక్సిస్ బ్యాంక్లో బిజినెస్ డెవెలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ 20 పోస్టుల భర్తీకి ములుగు రోడ్డు ప్రభుత్వ ఐటీఐ బాయ్స్ క్యాంపస్లోని జిల్లా ఉపాఽధి కార్యాలయంలో ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. అభ్యర్థుల వయసు 18–35 ఏళ్ల లోపు ఉండాలని, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని, ఆసక్తి ఉన్న యువతీ యువకులు బయోడేటా, రెజ్యూమ్, విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో ఉదయం 11 గంటలకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 98488 95937 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. -
వర్సిటీల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
● కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి కేయూ క్యాంపస్ : రాష్ట్ర పరిధిలోని ప్రభుత్వ యూనివర్సిటీల అభివృద్ధికి, పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని, యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయొద్దని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్రెడ్డి అన్నారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో సోమవారం కేయూ సెనేట్హాల్లో ‘యూజీసీ నూతన నిబంధనలు, రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి’ అనే అంశంపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన మాట్లాడారు. యూజీసీ నూతన ముసాయిదాతో యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. అందుకే నూతన ముసాయిదాను వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో నాణ్యమైన విద్య బోధన జరగాలంటే సరిపడా అధ్యాపకుల నియామకాలు జరగాలన్నారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్, కేయూ రిటైర్డ్ ఆచార్యుడు కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్.. యూనివర్సిటీల అభివృద్ధికి ఇచ్చే నిధులు బాగా తగ్గించిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఇచ్చే యూజీసీ ఫెలోషిప్స్, స్కాలర్షిప్స్లో కోత విధించిందన్నారు. యూజీసీ నూతన ముసాయిదాతో యూనివర్సిటీల స్వయంప్రతిపత్తిని కాలరాయడమేనని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐఎంఏ న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి నున్న అప్పారావు, పీడీఎస్యూ జాతీయ నాయకుడు ఇ. విజయ్కన్నా, రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. సాంబ, రాష్ట్ర సహాయ కార్యదర్శి మిశ్రీన్సుల్తానా పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలి
మహబూబాబాద్: యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 432 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో 1,79,000 మెట్రిక్ టన్ను ల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందన్నా రు. కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ కాంటాలు, తాగునీరు తదితర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సాంకేతిక సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ధాన్యం సేకరించిన తర్వాత ఆలస్యం చేయకుండా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు. రైస్ మిల్లర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి, ఆర్డీఓలు కృష్ణవేణి, గణేష్, డీసీ ఓ వెంకటేశ్వర్లు, డీఏఓ విజయనిర్మల, డీసీఎస్ఓ ప్రేమ్కుమార్, సివిల్ సప్లయీస్ డీఎం కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో -
వేగంగా ‘అమృత్’ పనులు
మహబూబాబాద్ రూరల్: రైల్వే ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలనే లక్ష్యంతో మానుకోట రైల్వేస్టేన్ను అమృత్ భారత్ పథకానికి ఎంపిక చేసి రూ.39కోట్లు కేటాయించారు. ఈమేరకు అభివృద్ధి పనులు చకచక కొనసాగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వేశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరుగుతున్న పనులు పూర్తయితే రైల్వేస్టేషన్ రూపురేఖలు మారిపోనున్నాయి. ఈమేరకు రైల్వే ప్రయాణికులకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయి. పూర్తయిన పనులు.. రైల్వేస్టేషన్ మాస్టర్, డిప్యూటీ ఎస్ఎస్ ప్యానెల్ రూమ్, ఎస్ఎన్టీ, టీఐ రిలే రూమ్ భవన నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. వచ్చే నెల 18వ తేదీ వర కు ఆయా విభాగాల కార్యకలాపాలను ఆ భవనం నుంచే నిర్వహించనున్నట్లురైల్వే అధికారులు పేర్కొన్నారు. ఒకటో నంబర్ ప్లాట్ ఫారంపై పూర్తిస్థాయిలో మరుగుదొడ్లు, మూత్రశాలలు, ఉన్నత శ్రేణి ఏసీ విశ్రాంతి గది, రెండో తరగతి ఏసీ, సాధారణ వి శ్రాంతి గది నిర్మాణ పనులు పూర్తి చేశారు. అలాగే ఒకటో ప్లాట్ ఫారం వైపున ప్రధాన ద్వారం ప్రాంతంలో ఫెసాడ్ పనులు పూర్తయ్యాయి. ప్రయాణికుల అవసరాల మేరకు షెడ్ల నిర్మాణం చేపట్టారు. జరుగుతున్న పనులు.. రైల్వేస్టేషన్ 1, 2ప్లాట్ ఫారాలను రీ మోడలింగ్ చేస్తున్నారు. కొత్తగా 21 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఎస్కలేటర్, 4 లిఫ్టులు, ఒక ర్యాంపు నిర్మాణం చేయనుండగా.. గార్డెన్ ఆధునికీకరణ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఒకటో నంబర్ ప్లాట్ ఫారంపై పూర్తిస్థాయిలో షెడ్ల నిర్మాణం, మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణం చేయాల్సి ఉంది. రెండు ప్లాట్ ఫారాలపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రూ.39 కోట్లతో మానుకోట రైల్వేస్టేషన్ ఆధునికీకరణ అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు మెరుగైన వసతులు -
అడ్డదారి లైసెన్స్లకు చెక్
వాహనం సరిగా నడపగలిగితేనే లైసెన్స్.. లేదంటే అంతేస్మార్ టెస్ట్ ట్రాక్ ఏర్పాటుకు ప్రణాళికలు రెడీ ● ట్రాక్పై డ్రైవింగ్ పరీక్ష పద్ధతికి స్వస్తి ● ఉమ్మడి జిల్లాలో అన్ని ఆర్టీఏల్లో స్థలాల సేకరణకు చర్యలు ● ఇప్పటికే ఆయా కలెక్టర్లకు ఆర్టీఓల వినతి ఖిలా వరంగల్ : రహదారులపై ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా వాహనాలు. లక్షలాది సంఖ్యలో బైకుల.. వేలాది సంఖ్యలో కార్లు కనిపిస్తున్నాయి. అయితే వీటన్నింటినీ నడిపే వారికి లైసెన్స్ ఉందా అంటే.. కొందరికి మాత్రమే ఉంటోంది. మరికొందరికి ఉండడం లేదు. మరి ఉన్నవాళ్లయినా సక్రమంగా తీసుకున్నారా అంటే.. బ్రోకర్ల ద్వారా అడ్డదారుల్లో తీసుకుంటున్నారు. ఫలితంగా ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీంతో రవాణాశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి పాత విధానం ట్రాక్పై డ్రైవింగ్ పరీక్ష పద్ధతికి చెక్ పెడుతూ.. స్మార్ట్ సెన్సార్ కెమెరాల నిఘాతో అధునాతన ట్రాక్పై కొత్త పరీక్ష తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీని వల్ల అడ్డదారిలో లైసెన్స్లు తీసుకునే వాహనచోదకులకు చెక్ పడనుంది. అడ్డదారులు మూత! ప్రస్తుతం.. ప్రతి ఇంట్లో ద్విచక్రవాహనం తప్పని సరి అయ్యింది. కొన్ని ఇళ్లల్లో ఒకటికి మించి ఉంటున్నాయి. ఆర్థికంగా ఉన్న వారు కారు కూడా కలిగి ఉంటున్నారు. ఫలితంగా రోజు రోజుకూ వాహనాల కొనుగోళ్లు భారీగా పెరిగిపోతున్నాయి. అందుకు నిదర్శనమే రహదారులపై పెరిగిపోతున్న ట్రాఫిక్ జామ్. కొంత మంది డ్రైవింగ్పై పూర్తి అవగాహన లేకుండానే రోడ్డెక్కేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. మరి వాళ్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదా.. అంటే ఉంటుంది. కానీ అది అడ్డదారిలో తీసుకున్నదై ఉంటుంది. డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలపై పూర్తి అవగాహన లేకుండా వాహనాలతో రోడ్కెక్కడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని, అందుకు అడ్డదారుల్లో డ్రైవింగ్ లైసెన్స్లు పొందడమే కారణమని గ్రహించిన అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం కొత్త పరీక్ష ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు ఉన్న మ్యానువల్ పరీక్షను తీయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆధునికతకు చర్యలు.. తాజాగా వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను ఆధునీకరించాలని ఆర్టీఏ అధికారులు నిర్ణయించారు. అందుకోసం ప్రస్తుతం కొనసాగుతున్న పాత విధానం కంటే మరింత ప్రామాణికంగా డ్రైవింగ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆటోమేటిక్ స్మార్ట్ సెన్సార్ డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించేందుకు స్థలాల సేకరణలో అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో అడ్డదారిలో డ్రైవింగ్ లెసెన్స్ పొందడం కష్టమే.. వాహనం నడిపితేనే లైసెన్స్.. త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న కొత్త పద్ధతిలో రహదారులపై నిత్యం ఎదురువుతున్న ఇబ్బందులను డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్పై కృత్రిమంగా కల్పిస్తారు. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు తప్పని సరిగా పరీక్ష రాయాల్సిందే.. ట్రాక్ మీద వాహనం నడిపిన తర్వాతే లైసెన్స్ పొందుతారు. అయితే ట్రాక్ మీద వాహనం నడిపేటప్పుడు కంప్యూటర్లో రికార్డవుతుంది. ఏదైనా చిన్న తప్పు చేసినా పరీక్ష ఫెయిల్ అయినట్లే.. కొత్త పద్ధతులు ఇలా.. కొత్తగా ఆర్టీఏ అమలు చేయబోయే ఆటో మెటిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ పరీక్షలో 5 ట్రాక్లు ఏర్పాటు చేస్తారు. ముందు ‘హెచ్’ అనే ట్రాక్లో ఆర్టీఏ ప్రమాణాల్లో పేర్కొన్న విధంగా వాహనాన్ని రివర్స్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ‘ఎస్’ అనే ట్రాక్లో ఒక మూల నుంచి మరో మూలకు వాహనాన్ని టర్న్ చేయాలి. అలాగే ‘కే’ అనే ట్రాక్లో బాగా మలుపులు, ఎత్తు పల్లాలు, ఎత్తయిన ప్రదేశాలు, చిన్న లోయలు వంటింటి ఏర్పాటు చేస్తారు. ఆ ట్రాక్లో వాహనాన్ని నడిపి చివరిగా పార్కింగ్ చేసి చూపించాల్సి ఉంటుంది. అయితే ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కారు డ్రైవింగ్ చేసే వారు సీటు బెల్ట్ పెట్టుకోవాలి. ఈ ప్రక్రియ అంతా కంప్యూటర్లో రికార్డవుతుంది. వాహనాన్ని నడిపేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేసినా కంప్యూటర్లో రికార్డు అవుతుంది. ఏ చిన్న మిస్టేక్ చేసినా టెస్ట్లో ఫెయిల్ అయినట్లు చూపిస్తుంది. ఒక వేళ పరీక్షలో ఫెయిలైతే మరో నెల పాటు శిక్షణ తీసుకుని రమ్మంటారు. పూర్తిగా కంప్యూటరీకరణ కావడం వల్ల ఇక్కడ అధికారులను సిబ్బందిని మేనేజ్ చేసేందుకు ఏమాత్రం అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. బ్రోకర్లకు కూడా ఎలాంటి అవకాశం ఉండదని చెబుతున్నారు. దీంతో అడ్డదారుల్లో లైసెన్స్ పొందడం ఇక కష్టతరం కానుంది. ట్రాక్ స్థలం కోసం వినతిపత్రం అందజేశాం అధునాతన డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ కోసం వరంగల్ ఆర్టీఏకు 5 ఏకరాల భూమి అవసరం ఉంది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఇటీవల కలెక్టర్ను కలిసి స్థలం కావాలని కోరుతూ వినతిపత్రం అందజేశాం. కలెక్టర్ సానుకూలంగా స్పందించి స్థలం ఇప్పించేందుకు చర్యలు తీసుకున్నారు. – శోభన్బాబు, ఇన్చార్జ్ ఆర్టీఏ, వరంగల్ ఆయా జిల్లాల కలెక్టర్లకు వినతి.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లిలో రవాణాశాఖ కార్యాలయాలు ఉన్నాయి. ఇందులో వరంగల్లో తప్ప మరెక్కడా డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ లేదు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలో ఆధునిక డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ల కోసం వచ్చే వారికి వరంగల్ రవాణాశాఖ తనిఖీ అధికారులే పరీక్షలు నిర్వహించి లైసెన్స్లు అందజేసే పద్ధతి చాలాకాలం నుంచి కొనసాగుతోంది. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు వరంగల్ ఆర్టీఏకు 5 ఎకరాలు, మిగతా జిల్లాలో రోడ్డు పక్కాన 10 ఎకరాల స్థలాలు కావాలంటూ ఆర్టీఏ అధికారులు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఇటీవల వినతి పత్రాలు అందజేశారు. దీనిపై రెవెన్యూ అధికారులు కావాల్సిన స్థలాల కోసం పరిశీలిస్తున్నారు. -
దైవదర్శనానికి వస్తూ.. అనంతలోకాలకు
హసన్పర్తి: దైవదర్శనానికి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందగా మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి పరకాల–కిట్స్ కళాశాల ప్రధాన రహదారిలోని ముచ్చర్ల క్రాస్ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని ఖిలా వరంగల్ తూర్పుకోటకు చెందిన మేకల సుశాంత్(19), మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం పొక్కురు గ్రామానికి చెందిన తాండ్ర విజయ్(19), జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనా గ్రామానికి చెందిన సి.వర్ధన్ (18) స్నేహితులు. సుశాంత్ పరకాలలోని పాలిటెక్నిక్లో థర్డ్ ఇయర్ చదువుతుండగా, వర్ధన్ అదే కళాశాలలో పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ అభ్యసిస్తున్నాడు. విజయ్ మాత్రం పరకాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్నారు. వీరు ముగ్గురు అదే ప్రాంతంలోని బీసీ హాస్టల్ ఉంటూ చదువు కొనసాగిస్తున్నారు. రాత్రి 9.30 గంటలకు హాస్టల్ నుంచి జాతరకు.. ఆదివారం రాత్రి 9.30గంటలకు సుశాంత్, విజయ్, సి. వర్ధన్ పరకాల నుంచి బైక్పై ఎర్రగట్టు జాతరకు బయలుదేరారు. సుశాంత్ బైక్ నడుపుతుండగా, విజయ్, వర్ధన్ వెనుక కూర్చున్నారు. వీరితో పాటు మరికొంత మంది విద్యార్థులు కూడా వారి వెంట తమతమ బైక్లపై జాతరకు పయనమయ్యారు. సుశాంత్ నడుపుతున్న బైక్ ముచ్చర్ల శివారులోని జాతీయ రహదారి నిర్మాణ పనులు చేపడుతున్న ప్రాంతానికి చేరుకోగానే గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలింపు.. వెనుక నుంచి బైక్లపై వస్తున్న స్నేహితులు క్షతగాత్రులను 108లో ఎంజీఎం తరలించారు. అప్పటికే సుశాంత్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చికిత్స పొందుతూ విజయ్ సోమవారం తెల్లవారు ప్రాణాలు వదిలాడు. వర్ధన్ పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం తరలించారు. మృతుడు సుశాంత్ తండ్రి సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నుట్లు ఎస్సై దేవేందర్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల దుర్మరణం మరొకరికి తీవ్ర గాయాలు ముచ్చర్ల క్రాస్ సమీపంలో ఘటన -
అటవీ జంతువులను వేటాడిన కేసులో ఐదుగురి అరెస్ట్
● వివరాలు వెల్లడించిన అటవీ అధికారులు ఖానాపురం: అటవీ జంతువులను వేటాడిన కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఎఫ్ఆర్ఓ రవి కిరణ్, డీఆర్ఓ రీనా తెలిపారు. ఈ మేరకు సోమవారం నర్సంపేట రేంజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఖానాపురం మండలం చిలుకమ్మనగర్కు చెందిన మధు, సుమన్, పవన్ కుమార్, అశోక్ నగర్కు చెందిన యాకాంబ్రం, సురేశ్, కొత్తగూడ మండలం మొండ్రాయిగూడెంకు చెందిన లవన్ కుమార్ (బాబురావు) ఆదివారం చిలుకమ్మ నగర్ అటవీ ప్రాంతంలో కొండెగొర్రె, కనుజులను వేటాడి నర్సంపేట వైపునకు ఆటోలో తరలిస్తుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న విషయం విధితమే. ప్రమాద సమయంలో అటవీ జంతువుల మాంసం రోడ్డుపై పడేసి పరారీ కావడంతో విచారణ జరిపిన అధికారులు ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. అశోక్ నగర్కు చెందిన యాకాంబ్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. -
వినతులు వెంటనే పరిష్కరించాలి
అన్యాయం చేశారు.. పోలియో వల్ల మా కుమారుడు జీవన్ కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. తన పేరున స్వయం ఉపాధి కింద రూ.50వేల రుణం కోసం మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేశాం. ఈ విషయంలో సంబంధిత అధికారులు అన్యాయం చేశారు. కనీసం ఇంటర్వ్యూకు కూడా పిలువలేదు. ఈ విషయంలో విచారణ చేసి రుణం మంజూరు చేయాలి. –సురేశ్–శైలజ దంపతులు, ఇనుగుర్తి మహబూబాబాద్: ప్రజావాణిలో వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె.వీరబ్రహ్మచారి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో మాట్లాడుతూ.. పెండింగ్ వినతులను కూడా పరిష్కరించాలని, పరిష్కారం కాకపోతే, అందుకు గల కారణాలను తెలుపు తూ నివేదిక అందజేయాలన్నారు. సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం అనే విషయాన్ని అధికారులు గుర్తు పెట్టుకోవాలన్నారు. దరఖాస్తుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కాగా ప్రజావాణిలో 69 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, సీపీఓ సుబ్బారావు, సివిల్ సప్లయీస్ డీఎం కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో -
బకెట్తో నీరు తోడుతూ..
● సంపులో పడి యువతి మృతి ● రాజవరంలో ఘటన చిల్పూరు: బకెట్తో నీరు తోడుతుండగా సంపులో పడి ఓ యువతి మృతి చెందింది.ఈ ఘటన మండలంలోని రాజవరంలో జరిగింది. ఎస్సై సిరిపురం నవీన్కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సామల స్వాతి (21) ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బకెట్తో సంపులో నీరు తోడుతోంది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి సదానందం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సోమవారం తెలిపారు. -
ఉల్లాసంగా బోధిస్తేనే ఉపయోగకరం
మహబూబాబాద్ అర్బన్/పెద్దవంగర/తొర్రూరు రూరల్/నెల్లికుదురు: ఉత్సాహంగా, ఉల్లాసభరితంగా బోధన సాగితేనే విద్యార్థులకు సులువుగా అర్థమవుతుందని ఎస్సీఈఆర్టీ ఫ్యాకల్టీ సభ్యుడు ఎస్ఎం.అహ్మద్ పేర్కొన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా కేంద్రం మానుకోటలోని కస్తూ ర్బాగాంధీ విద్యాలయం, పెద్దవంగరలోని జెడ్పీ ఉన్నత పాఠశాల, కేజీబీవీ, తొర్రూరు మండలంలోని అమ్మాపురం ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు, నెల్లికుదురు మండల కేంద్రంలోని కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలను జిల్లా కోఆర్డినేటర్ ఆజాద్ చంద్రశేఖర్తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీ లించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థులందరూ అభ్యసన ఫలితాలు సాధించేలా ప్రణాళికబద్ధమైన బోధన చేపట్టాలని, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉపయోగించాలని మార్గనిర్దేశం చేశారు. ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత డిజిటల్ పద్ధతుల్లో విద్యాబోధన చేపట్టాలని సూచించారు. కంప్యూటర్ పరిజ్ఞానంతో విద్యార్థుల సంఖ్య పెరిగేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓలు బుదారపు శ్రీనివాస్, మహంకాళి బుచ్చయ్య, జీసీడీఓ విజయకుమారి, కేజీవీబీ ప్రిన్సిపాల్ భవాని, ఎస్ఓ స్రవంతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. ఎస్సీఈఆర్టీ ఫ్యాకల్టీ సభ్యుడు ఎస్ఎం అహ్మద్ -
మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2025
ఉమ్మడి వరంగల్ జిల్లాలో టెన్త్ విద్యార్థుల వివరాలు– 8లోuఏడాదంతా చదివింది ఒక ఎత్తయితే.. దాన్ని పరీక్షల్లో ప్రజెంట్ చేయడం మరో ఎత్తు.. కొందరు విద్యార్థులు బాగా చదువుతారు. తీరా పరీక్ష సమయానికి మరిచిపోతుంటారు.. మరికొందరేమో ఎంత చదివినా హ్యాండ్ రైటింగ్ బాగోలేక మార్కులు కోల్పోతారు.. ఇంకొందరైతే పరీక్ష అంటే గాబరా పడిపోయి ప్రశ్నల కు సమాధానం తెలిసినా నిర్ణీత సమయంలో రాయలేకపోతారు.. ఇలా చాలా మంది విద్యార్థులు ఏదో ఒక సమస్యతో బాధపడేవారే. వీరంతా మంచి మార్కులు సాధించేందుకు, పరీక్షలను ఈజీగా రాసేందుకు సబ్జెక్టు నిపుణులు సూచనలిస్తున్నారు. ఈనెల 21 నుంచి పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. మంచి మార్కులు సాధించడానికి ఆయా సబ్జెక్టుల నిపుణులను ‘సాక్షి’ పలకరించింది. విద్యార్థుల కోసం వారు తమ సూచనలు, సలహాలు వెల్లడించారు. – మహబూబాబాద్ అర్బన్ మొత్తం విద్యార్థులు 42,262బాలికలు 20,600బాలురు 21,662ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలిపదో తరగతి వార్షిక పరీక్షలు మరో మూడ్రోజుల్లో ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలి. బాగా చదివాను.. పరీక్షలు బాగా రాస్తాను.. అనే భావనతో వెళ్లాలి. నెగెటివ్ ఆలోచనలను దరిచేర నీయొద్దు. గతంలో సాధించిన విజయాలను గుర్తు చేసుకోవాలి. టీవీ, సెల్ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు వహించాలి. ఫాస్ట్ఫుడ్, జంక్ఫుడ్ జోలికి వెళ్లొద్దు. సాత్విక ఆహారం తీసుకుంటే తొందరగా జీర్ణమవుతుంది. తగినంతగా నీరు తాగాలి. ఎవరైనా ఒత్తిడికి లోనైనా.. పరీక్షలంటే భయం కలిగినా 93911 17100, 94408 90073 నంబర్లకు ఫోన్ చేస్తే తగిన సూచనలిస్తాం. – పోగు అశోక్, తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వివరాలు 8లోu -
విద్యార్థుల్లో పెరుగుతున్న కంటి సమస్యలు
మహబూబాబాద్ అర్బన్/నెహ్రూసెంటర్: పాఠశాల స్థాయి విద్యార్థుల్లో కంటి సమస్యలు పెరుగుతున్నాయని డీఎంహెచ్ఓ మురళీధర్ అన్నారు. ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో ఇటీవల కంటి పరీక్షలు చేపట్టగా.. సోమవారం సమస్యలు ఉన్న విద్యార్థులకు ప్రభుత్వ ఆస్పత్రిలో కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 17 నుంచి 28వరకు కంటి పరీక్షలు నిర్వహించి, కంటి సమస్యలు ఉన్న 633మంది విద్యార్థులను గుర్తించామన్నారు. మొదటి విడతగా 274 మంది విద్యార్థులు కళ్లద్దాలు పంపిణీ చేశామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్బీఎస్కే ప్రోగ్రాం ఆఫీసర్లక్ష్మీనా రాయణ, ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ నర్సయ్య, నోడల్ అఽధికారి డాక్టర్ కుమార్, సబ్ యూనిట్ అధికారి రామకృష్ణ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమ్య, ఫార్మసిస్ట్ శ్రీలక్ష్మీ, ఏఎన్ఎం లావణ్య పాల్గొన్నారు. సీపీఆర్పై అవగాహన.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సీపీఆర్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ మురళీధర్, కళాశాల ప్రిన్సిపాల్ లీలా, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వరప్రసాద్, వైస్చైర్మన్ డాక్టర్ నెహ్రూ, కోశాధికారి వెంకట్రెడ్డి, డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ వరప్రసాద్, అశోక్, శిరీష, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ మురళీధర్ -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
● ఎలుకుర్తి క్రాస్ వద్ద ఘటన మడికొండ/చిల్పూరు: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి మడికొండ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా చిల్పూరు మండలం నష్కల్కు చెందిన చెగొండి వినయ్(22) తన స్నేహితుడు మామిండ్ల అరవింద్తో కలిసి ద్విచక్రవాహనంపై పెద్దపెండ్యాల నుంచి ధర్మసాగర్ వైపునకు వస్తుండగా ఎలుకుర్తి క్రాస్ వద్ద బొలెరో ఢీకొంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన వినయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అరవింద్ తీవ్ర గాయాలతో ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి సంపత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ కిషన్, చిల్పూరు ఎస్సై సిరిపురం నవీన్కుమార్ తెలిపారు. -
కళాశాలకు వెళ్లడం ఇష్టం లేక..
బయ్యారం: కళాశాలకు వెళ్లడం ఇష్టం లేక ఒక విద్యార్థి బల వన్మరణానికి పాల్ప డ్డాడు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని కాకతీయనగర్లో సోమవారం జరిగిన ఈ సంఘటనపై పోలీసుల కథనం ప్రకారం.. కాకతీయనగర్లో నివసించే అజ్మీరా అనంతరాములు కుమారుడు సాయిమహేశ్(19) సిద్దిపేటలోని ఒక కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఫిజియోథెరపీ చదువుతున్నాడు.హోలీ సందర్భంగా ఇంటికి వచ్చిన సాయిమహేశ్ తిరిగి కళాశాలకు వెళ్లడానికి ఇష్టం లేక.. ఇంట్లో ఎవ రూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ తిరుపతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.630.27 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
స్టేషన్ఘన్పూర్: జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో రూ.630.27 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్రెడ్డి సభావేదికపైనుంచే వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. విద్యాశాఖకు సంబంఽధించి జఫర్గఢ్ మండలం కోణాయిచలంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా సమీకృత రెసిడెన్షియల్ పాఠశాల సముదాయం, స్టేషన్ఘన్పూర్లో రూ.5.5 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వైద్యారోగ్యశాఖకు సంబంధించి రూ.45. 5 కోట్లతో వంద పడకల ఆస్పత్రి, ఆర్అండ్బీ శాఖకు సంబంధించి రూ.26 కోట్లతో స్టేషన్ఘన్పూర్లో సమీకృత డివిజనల్ కార్యాలయాల సముదాయం, ఇరిగేషన్కు సంబంధించి రూ.148.76 కోట్లతో దేవాదుల కాల్వ సీసీ లైనింగ్ నిర్మాణం, పీఆర్ శాఖ ఆధ్వర్యంలో రూ.38.5 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం, ప్రజాపాలన గ్రామసభ మోడల్ గ్రామాల్లో రూ.250 కోట్లతో 5వేల ఇందిరమ్మ ఇళ్లు, రూ.12 కోట్లతో ఐదు సబ్స్టేషన్లు, ఒక డీఈ కార్యాలయ నిర్మాణం, రూ.24 కోట్లతో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా తండాలకు రోడ్లు, బంజారా భవన్ నిర్మాణం, స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ అప్గ్రేడేషన్, రూ.35 కోట్లతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం తదితర పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల మాఫీ కింద ఉమ్మడి వరంగల్లో 48,717 సంఘాలకు రూ. 92 కోట్ల 74 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. అదేవిధంగా జనగామ జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద రూ.వంద కోట్ల 93 లక్షలు చెక్కులను మహిళా సంఘాల సభ్యులకు అందించారు. అదేవిధంగా జిల్లాలోని ఏడు మండలాలకు సంబంధించిన రూ.2.10 కోట్లతో మంజూరైన ఏడు ఇందిరా మహిళా శక్తి బస్సులను ప్రారంభించి వాటిని మహిళా సమాఖ్యలకు అప్పగించారు. -
‘టెన్నికాయిట్ ఉమెన్’ విజేత అఖిల
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రెండు రోజుల పాటు నిర్వహించిన 10వ రాష్ట్ర స్థాయి సీనియర్ మెన్ అండ్ ఉమెన్ టెన్నికాయిట్ చాంపియన్షిప్ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ఇందులో మహిళా విభాగంలో హనుమకొండ క్రీడాకారిణి జి. అఖిల విజయం సాధించింది. ద్వితీయ స్థానంలో వరంగల్ క్రీడాకారిణి బి. జ్యోతి నిలిచింది. వరంగల్ జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల ముగింపు వేడుకలకు ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి హాజరై విజేతలకు పతకాలు, ట్రోఫీలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ జేఎన్ఎస్లో టెన్నికాయిట్ కోర్టు నిర్మాణానికి కావాల్సిన నిధుల మంజూరుకు సహకరిస్తానన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టెన్నికాయిట్ అసోసియేషన్ కార్యదర్శి బీఎన్. వెంకటేశ్, శాట్ కోచ్ సద్గురు, అసోసియేషన్ హనుమకొండ, వరంగల్ జిల్లా కార్యదర్శులు అలువాల రాజ్కుమార్, గోకారపు శ్యాంకుమార్ తదితరులు పాల్గొన్నారు. ముగిసిన రాష్ట్ర స్థాయి పోటీలు..విజేతలు పురుషులు జిల్లా మహిళలు జిల్లా ఎండి. యాసిన్ మహబూబ్నగర్ జి. అఖిల హనుమకొండ సుజయత్ మహబూబ్నగర్ బి.జ్యోతి వరంగల్ డి. ప్రకాశ్ హనుమకొండ జి. నవ్య హనుమకొండ జి.మధు వరంగల్ జి.మమత మహబూబ్నగర్ -
‘రవాణా భత్యం’ మంజూరు..
విద్యారణ్యపురి : దూర ప్రాంతాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు ఎట్టకేలకు ఇటీవల రవాణా భత్యం మంజూరైంది. కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం నుంచి ప్రాథమిక పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు, 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న యూపీఎస్లో చదువుకునే వారికి, 5కిలో మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న హైస్కూల్లో చదివే విద్యార్థులకు ఈ రవాణా భత్యం అందజేస్తారు. ఒక్కో విద్యార్థికి రూ. 6 వేలు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2024–2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రతి నెల ఒక్కో విద్యార్థికి రవాణా భత్యం రూ. 600 చొప్పున పది నెలలకుగాను రూ. 6వేలు మంజూరు చేశారు. జిల్లాల వారీగా విద్యార్థుల సంఖ్య, మంజూరైన నిధుల వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లాలో.. ● హనుమకొండ జిల్లాలో సమగ్ర శిక్ష పరిధి పాఠశాలల్లోని 704 మంది విద్యార్థులకు రూ. 42లక్షల 24వేలు, పీఎంశ్రీ–1 స్కూళ్లలోని 112 మంది విద్యార్థులకు రూ.6లక్షల 72వేలు, పీఎంశ్రీ –2దశలోని స్కూళ్లలోని 50మంది విద్యార్థులకు రూ. 3లక్షలు మంజూరు చేశారు. ● వరంగల్ జిల్లాలో వివిధ పాఠశాలల్లోని 507మంది విద్యార్థులకు రూ. 30లక్షల 42వేలు, పీఎం శ్రీస్కూళ్లలో 47మంది విద్యార్థులకు రూ.2లక్షల 82వేలు మంజూరయ్యాయి. ● జనగామ జిల్లాలో వివిధ పాఠశాలల్లోని 661మంది విద్యార్థులకు రూ. 39లక్షల 66వేలు, పీఎంశ్రీ–1 స్కూళ్లలోని 78మంది విద్యార్థులకు రూ. 4లక్షల 68వేలు మంజూరయ్యాయి. ● ములుగు జిల్లాలో వివిధ పాఠశాలలకు చెందిన 380 మంది విద్యార్థులకు రూ. 22లక్షల 80వేలు , పీఎంశ్రీ –1 స్కూళ్లకు చెందిన 45మంది విద్యార్థులకు రూ. 2లక్షల 70వేలు, పీఎంశ్రీ –2 స్కూళ్లకు చెందిన 38 మంది విద్యార్థులకు రూ. 2లక్షల 28వేలు మంజూరయ్యాయి. ● మహబూబాబాద్ జిల్లాలో వివిధ పాఠశాలలకు చెందిన 443మంది విద్యార్థులకు రూ. 26లక్షల 58వేలు, పీఎంశ్రీ స్కూళ్లకు సంబంధించిన 30మంది విద్యార్థులు రూ. లక్షా 80 వేలు మంజూరయ్యాయి. ● జయశంకర్భూపాలపల్లి జిల్లాలో వివిధ పాఠశాలలకు చెందిన 367మంది విద్యార్థులకు రూ. 22లక్షల 2వేలు, పీఎంశ్రీ –1 కు సంబంధించిన స్కూళ్లకు చెందిన 64మంది విద్యార్థులకు రూ. 3లక్షల 84వేలు మంజూరయ్యాయి. ఒక్కో విద్యార్థికి రూ. 6వేలు త్వరలో అకౌంట్లలోకి.. -
సీఎం సభలో తెలంగాణ ఉద్యమ కళాకారుల నిరసన
స్టేషన్ఘన్పూర్: స్టేషన్ఘన్పూర్ మండలంలోని శివునిపల్లిలో ఆదివారం జరిగిన సీఎం రేవంత్రెడ్డి సభలో తెలంగాణ ఉద్యమ కళాకారులు నిరసన తెలిపారు. సభా వేదికపై సీఎం ప్రసంగిస్తుండగా కళాకారులు మట్టెడ కలవేని రాణి, పుష్ప తదితరులు తమకు ఉపాధి కల్పించాలని కోరుతూ ఫ్లెక్సీని ప్రదర్శించారు. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులు వారి వద్ద ఉన్న ఫ్లెక్సీని లాగేశారు. గమనించిన సీఎం వారిని వారించారు. కాగా, సీఎం ప్రసంగం అనంతరం ఉద్యమ కళాకారులు తమ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని నెట్టేశారు. ఈ క్రమంలో ఉద్యమ కళాకారులు, మహిళా పోలీసులకు మధ్య స్వల్ప పెనుగులాట జరిగింది. వారిని సభావేదిక నుంచి మహిళాపోలీసులు బలవంతంగా బయటకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు మాట్లాడుతూ తాము శాంతియుతంగా తమ సమస్యను సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు ఉమ్మడి జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చామని, పోలీసులు అత్యుత్సాహంతో తమపై దాడి చేశారన్నారు. ఈ దాడిలో ఫ్లెక్సీని చింపివేశారని, పుస్తెలతాడు తెంపారని, పుస్తెలతాడు లాకెట్తోపాటు ఒకరి గోల్డ్ రింగ్ పోయిందని వాపోయారు. తాము ప్రజాస్వామ్యయుతంగా సమస్యను తెలిపేందుకు వస్తే అడ్డుకోవడం సరికాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 550 మందికి ఉద్యోగ, ఉపాధి కల్పించారని, తెలంగాణ కోసం తాము పాటలు, ధూంధాంలతో ఉద్యమించామని, గుర్తించి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. కళాకారులు పరకాల రమ, పుష్పలత, అడ్డూరి అంజలి, అలేఖ్య, రాణి, రమ, లావణ్య తదితరులున్నారు. -
రేవంత్ టీ–20 మ్యాచ్ ఆడుతున్నారు
స్టేషన్ఘన్పూర్/జనగామ : అతిపిన్న వయసులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి.. ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు, వ్యక్తిగత దూషణలు ఎదుర్కొంటూ టెస్ట్, వన్డే మ్యాచ్లకు స్వస్తి పలికిన రేవంత్రెడ్డి.. పాలనలో టీ–20 మ్యాచ్ ఆడుతున్నారని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ఘన్పూర్ శివునిపల్లి రోడ్డులో ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభలో ఎమ్మెల్యే కడియం మాట్లాడారు. అభివృద్ధే ధ్యేయంగా రోజుకు 16 గంటలు పని చేస్తున్న రేవంత్రెడ్డి.. సవాళ్లు, ప్రతి సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజాపాలన సాగిస్తున్నారని కితాబిచ్చారు. స్టేషన్ఘన్పూర్ అభివృద్ధికి రూ.8 వందల కోట్లు మంజూరు చేసిన సీఎం రేవంత్రెడ్డికి అభినందనలు తెలిపారు. ఘన్పూర్లో అవినీతి, అక్రమ పాలన, పదవులు, పథకాలు అమ్ము కోవడం తప్ప గడిచిన పదిహేనేళ్లుగా అభివృద్ధి జరగలేదన్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లు ఎదుర్కొంటూ ప్రజాపాలన సాగిస్తున్నారు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
వాజ్పేయిని స్ఫూర్తిగా తీసుకోవాలి
హన్మకొండ: మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజ్పేయిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి సి.హెచ్.విద్యాసాగర్ రావు అన్నారు. ఆదివారం హనుమకొండ హంటర్ రోడ్డులోని ‘డి’ కన్వెన్షన్లో ‘అటల్ జీ యాదిలో’ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో సి.హెచ్.విద్యాసాగర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ 1975లో కరీంనగర్లో జరిగిన బహిరంగ సభలో ఆటల్ బిహారీ వాజ్పేయి ప్రసంగాన్ని నాటితరం నాయకులు, ప్రజలు ఇప్పటికీ గుర్తు చేస్తారన్నారు. ఆ యన ప్రసంగం ఆధ్యంతం ఆకట్టుకునేలా సాగేదన్నారు. హిందీ భాషలో పద బంధాలు కూర్చి, పేర్చి మాట్లాడేవారన్నారు. దేశంలో అన్ని పార్టీలు దేశహితం కోసం ఒకటిగా ఉండాలని ఆలోచించాలనేవారన్నారు.దేశంలో ప్రజాస్వామ్యం ఫరిడవిల్లాలని కోరుకునేవారన్నారు. ప్రధానిగా దేశంలో అనేక అభివృద్ధి పథకాలు చేపట్టారని వివరించారు. రాష్ట్రంలో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకుని అధికారంలోకి రావాలని, ఈ దిశగా పార్టీ శ్రేణులు శ్రమించాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ అత్యధిక సీట్లు కై వసం చేసుకోవాలన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి ఉత్సవాల ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ సీతారాం నాయక్ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాతో అటల్ బిహారి వాజ్పేయికి అవినాభావ సంబంధముందన్నారు. చాలాసార్లు పర్యటించారన్నారు. ఈ ప్రాంత వ్యక్తులు వాజ్పేయితో ఉన్న సంబంధాలు, ఫొటోలు, టెలిగ్రాంలు, శుభాకాంక్షలు వంటివి ఉంటే తమకు చేరవేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే టి.రాజేశ్వర్ రావు, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, పార్టీ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు కొలను సంతోశ్రెడ్డి, గంట రవికుమార్, నాయకులు కన్నెబోయిన రాజయ్య యాదవ్, మంద ఐలయ్య, నాగపురి రాజమౌళి గౌడ్, దేవేందర్ రెడ్డి, నిశిధర్ రెడ్డి, బలరాం, చాడ శ్రీనివాస్ రెడ్డి, రావుల కిషన్, చందుపట్ల కీర్తి, చాడ స్వాతి, ఆర్.పి.జయంత్లాల్, తదితరులు పాల్గొన్నారు. మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి సి.హెచ్.విద్యాసాగర్ రావు -
పేదలకు వరం సీఎం సహాయ నిధి
తొర్రూరు: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. తొర్రూరు, పెద్దవంగర, రాయపర్తి మండలాల లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆదివారం డివిజన్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. మొత్తం 104 మంది లబ్ధిదారులకు రూ.33.93 లక్షల విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న పేదలకు సీఎం సహాయ నిధి వరం లాంటిదని తెలిపారు. సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్న ప్రతీ కుటుంబానికి సీఎం రేవంత్రెడ్డి ఆర్థిక సహాయం అందిస్తూ పేదల పెన్నిధిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోతు హామ్యా నాయక్, నాయకులు గంజి విజయ్పాల్రెడ్డి, సోమ రాజశేఖర్, ముద్దసాని సురేష్, చిత్తలూరి శ్రీనివాస్, మేకల కుమార్, మొగుళ్ల లింగన్న, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. ● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
పోలీసులకు చిక్కిన కొత్త హరిబాబు?
భూపాలపల్లి: సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కొత్త హరిబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి పట్టణానికి చెందిన రాజలింగమూర్తి గత నెల(ఫిబ్రవరి) 19న రాత్రి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యకు పాల్పడిన, సహకరించిన ఏడుగురిని ఫిబ్రవరి 23న ఎస్పీ కిరణ్ ఖరే అరెస్ట్ చూపించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఏ–9గా ఉన్న పుల్ల నరేశ్ను ఈ నెల1వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ–8గా ఉన్న భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు కొత్త హరిబాబు, ఏ–10గా ఉన్న పుల్ల సురేశ్ కోసం నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. కాగా, కొత్త హరిబాబు ఈ నెల 4వ తేదీన ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. బెయిల్ పిటిషన్పై ప్రస్తుతం వాదనలు జరుగుతున్నాయి. నేడు(సోమవారం) సైతం హైకోర్టులో వాదనలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే హరిబాబును ప్రత్యేక టీం పోలీసులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. క్రెడిట్ కార్డు ఆధారంగా పట్టివేత.. రాజలింగమూర్తి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా చర్చానీయాంశం అయ్యింది. దీంతో హత్య కేసులో ఏ–8 నిందితుడిగా ఉన్న కొత్త హరిబాబును పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే మొబైల్ఫోన్ను వినియోగించకపోవడంతో అతడు ఎక్కడ ఉన్నాడనేది పోలీసులు గుర్తించలేకపోయారు. ఢిల్లీలో ఉన్నట్లు అనుమానించిన పోలీసులు కొద్ది రోజులుగా అక్కడ మకాం వేసి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే అతడు క్రెడిట్ కార్డును పలుచోట్ల వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. సమీప ప్రాంతాలపై నిఘా వేసి శనివారం రాత్రి హరిబాబును పట్టుకొని కారులో బయలుదేరి ఆదివారం రాత్రి భూపాలపల్లికి చేరుకున్నట్లు తెలిసింది. అర్ధరాత్రే అరెస్ట్ చూపించి, జడ్జి ఎదుట హాజరుపరిచి, జడ్జి ఆదేశాల మేరకు జైలుకు పంపించనున్నట్లు సమాచారం. ఇద్దరు మిలీషియా సభ్యుల లొంగుబాటు ఏటూరునాగారం: నిషేధిత సీపీఐ మావో యిస్టు పార్టీకి చెందిన ఇద్దరు మిలీషియా సభ్యులు లొంగిపోయినట్లు ములుగు జిల్లా ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపారు. ఆదివారం స్థానిక ఏఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులకు వివరాలు వెల్ల డించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన మావోయిస్టు పార్టీ సీఎన్ఎం సభ్యుడు మడవి కోస, మరో సభ్యురాలు మడకం సోడి అలియాస్ జోగి పార్టీ సిద్ధాంతాలు నచ్చక లొంగిపోయినట్లు పేర్కొన్నారు. వీరు పోలీసుల సమాచారాన్ని పార్టీ నాయకత్వానికి చేరవేయడంతోపాటు పలు విధ్వంసాలకు పాల్పడినట్లు చెప్పారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. స్వేచ్ఛగా జీవించేలా పోలీసులు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తారని వివరించారు. కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాస్, వెంకటాపురం సీఐ బండారి కుమార్, వెంకటాపురం ఎస్సై తిరుపతిరావు, సెకండ్ ఎస్సై నర్సింహ పాల్గొన్నారు.● రాజలింగమూర్తి హత్య కేసులో ఏ–8గా కేసు నమోదు ● క్రెడిట్ కార్డు వినియోగం ఆధారంగా పట్టుకున్న ప్రత్యేక టీం ● ఢిల్లీ నుంచి కారులో భూపాలపల్లికి తీసుకొచ్చిన పోలీసులు? -
రేవంత్ టీ–20 మ్యాచ్ ఆడుతున్నారు..
● సవాళ్లు, ప్రతి సవాళ్లు ఎదుర్కొంటూ ప్రజాపాలన సాగిస్తున్నారు ● స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రూ.630.27 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు సీఎం సభలో తెలంగాణ ఉద్యమ కళాకారుల నిరసన –8లో -
వైద్య, విద్యారంగానికి పెద్దపీట : మంత్రి సురేఖ
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల కుప్పతో సర్కారుపై ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం రేవంత్రెడ్డి వైద్య, విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందన్నారు. రాబోయే రోజుల్లో వరంగల్ను హైదరాబాద్తో సమానంగా అభివృద్ధి చేయాలని, అందుకు సీఎం రేవంత్రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఎన్నడూ తప్ప లేదని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. -
కాంగ్రెస్ అంటే సంక్షేమం, అభివృద్ధి : మంత్రి సీతక్క
కాంగ్రెస్ అంటే సంక్షేమం, అభివృద్ధికి కేరాఫ్ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఉపాధి, మహిళల అభివృద్ధి, పేదలకు కూడు, గూడు, గుడ్డ అందించే ప్రభుత్వం తమదన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 84వేల ఉద్యోగాలు కూడా ఇవ్వని దుస్థితి ఉంటే.. తాము అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలోనే 55 వేల పైచిలుకు ఉద్యో గాలు ఇచ్చి నిరుద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపామన్నారు. ఇందిరమ్మ పాలనలో సీఎం రేవంత్రెడ్డి పేదలకు సంక్షేమం అందిస్తుంటే, బీఆర్ఎస్, బీజేపీ కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నాయ ని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అంటేనే అవినీతి, అక్రమాల ప్రభుత్వంగా చరిత్రలో పేరు లిఖించుకుందని ఎద్దేవా చేశారు. బీజేపీ కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. -
సరఫరా చేస్తాం
డిమాండ్ ఎంతైనా..సత్వరమే లోపాల గుర్తింపు.. విద్యుత్ సరఫరాలో లోపాల్ని ఆన్లైన్ ద్వారా సత్వరమే గుర్తించి పరిష్కరించడానికి 11 కేవీ ఫీడర్లకు.. ఫీడర్ అవుటేజ్ మేనేజ్మెంట్ సిస్టం అమల్లోకి తీసుకురానున్నాం. విద్యుత్ లైన్లో ఎక్కడ లోపం ఏర్పడి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందో ఈటెక్నాలజీ ద్వారా ఆటోమేటిగ్గా తెలుసుకోగలుగుతాం. ఎక్కడ సమస్య ఉత్పన్నమైందో లోకేషన్తో కూడిన సమాచారం ప్రత్యేక యాప్ ద్వారా అధికారులకు తెలుస్తుంది. అధికారులు వెంటనే అప్రమత్తం కావడానికి ఈ సిస్టం ఉపయోగపడుతుంది. తద్వారా క్షేత్రస్థాయి ఉద్యోగుల ద్వారా సమస్య తలెత్తిన స్థలం వివరించి త్వరగా.. సమస్యను పరిష్కరించే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించవచ్చు. ప్రస్తుతం ఏదైనా సమస్య ఏర్పడితే ఆ లైన్ మొత్తం పరిశీలించాల్సి వస్తోంది. దీంతో చాలా సమయం తీసుకోవడంతో కాలయాపన జరుగుతోంది. ఫీడర్ అవుటేజ్ మేనేజ్మెంట్ సిస్టం అమల్లోకి తీసుకొస్తే సమయం ఆదా కావడంతో పాటు త్వరితగతిన మరమ్మతులు పూర్తి చేసి విద్యుత్ను పునరుద్ధరించగలుగుతాం.● వేసవిలో పెరగనున్న విద్యుత్ డిమాండ్ ● ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్న ఎన్పీడీసీఎల్ ● పైలెట్ ప్రాజెక్టుగా ఇండోర్ సబ్స్టేషన్ల నిర్మాణం ● టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి ● ‘సాక్షి’కి ఇంటర్వ్యూపేపర్ లెస్ వర్క్.. ఈ–స్టోర్స్ విధానం ద్వారా కావాల్సిన మెటీరియల్ ఆన్లైన్ ద్వారా రిజర్వ్ చేసుకుని కావాల్సిన సమయానికి మెటీరియల్ను పొందుతున్నాం. దీంతో పనులు త్వరితగతిన జరుగుతున్నాయి. పేపర్ పని లేకుండా ఆన్లైన్ ద్వారా బుక్ చేసి మెటీరియల్ డ్రా చేసుకునే సౌలభ్యం క్షేత్రస్థాయిలో అధికారులకు కలిగింది. తద్వారా రైతులకు, వినియోగదారులకు పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రతీ పనిలో అధునాతన సాంకేతిక పద్ధతులు అవలంబిస్తున్నాం. సాంకేతికపరంగా మరిన్ని అంశాలు జోడించి టీజీ ఎన్పీడీసీఎల్ యాప్ను 19 ఫీచర్లతో రూపొందించాం.హన్మకొండ: ‘వేసవిలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగనుంది. పెరుగుతున్న డిమాండ్ను ముందుగానే అంచనా వేసి ప్రణాళిక రూపొందించుకుని ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాం. ఈఏడాది ఫిబ్రవరి నుంచి డిమాండ్ పెరిగింది. రోజురోజుకూ పెరుగుతోంది. వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్ అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈనెల 11న (మంగళవారం) ఉదయం అత్యధికంగా 5,815 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ పెరిగింది. గతేడాది ఇదే రోజు 5,468 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. గతేడాదితో పోలిస్తే 347 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ పెరిగింది’ అని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అవన్నీ ఆయన మాటల్లోనే.. సాంకేతికతలో అభివృద్ధి.. ఎన్పీడీసీఎల్లో సాంకేతికతను అభివృద్ధి చేశాం. ప్రతీ పనిని ఆన్లైన్ ద్వారా చేస్తున్నాం. కొత్త సర్వీస్ కనెక్షన్లు, లైన్ షిఫ్టింగ్, ఫిర్యాదులు, దరఖాస్తుల స్థితిగతులు, చెల్లింపులు అన్నీ కూడా ఆన్లైన్ ద్వారా చేపడుతున్నాం. రైతులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఉండేలా.. ఎస్టిమేట్ వివరాలు తెలుగులో అందిస్తున్నాం. భారీ వర్షాలు, ఈదురు గాలులు, సాంకేతికంగా విద్యుత్ సమస్యల వల్ల ఏర్పడే అంతరాయాలను తగ్గించేందుకు.. ఎమర్జెన్సీ పవర్ రీస్టోర్ టీం వాహనాలను వాడుతున్నాం. ఇందులో అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉంటుంది. పాత సబ్స్టేషన్లను పునరుద్ధరిస్తున్నాం. సుదూర లైన్ల మధ్యలో ఏబీ స్విచ్లు పెడుతున్నాం. ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లు కూడా పెట్టాం. తద్వారా అంతరాయాలు త్వరితగతిన గుర్తించి పునరుద్ధరిస్తున్నాం. స్థల సమస్య జఠిలం.. కొత్త సబ్స్టేషన్ల నిర్మాణానికి స్థల సమస్య జఠిలంగా మారింది. ఈక్రమంలో స్థల సమస్యను ఎదుర్కొనేందుకు ఇండోర్ విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం. ముందుగా పైలెట్ ప్రాజెక్టులో భాగంగా హనుమకొండ, కరీంనగర్, ఖ మ్మం, నిజామాబాద్ నగరాల్లో ఒక్కో సబ్ స్టేషన్ను నిర్మించనున్నాం. ఈ సబ్స్టేషన్లు కొత్తవి కావడంతో ఈమేరకు ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇస్తాం. పూర్తిగా అండర్ గ్రౌండ్ కేబుల్ వాడతాం. ఈవ్యవస్థపై అవగాహన కోసం శిక్షణ ఇవ్వనున్నాం. హైదరాబాద్, ముంబాయి, ఢిల్లీలో ఇండోర్ సబ్ స్టేషన్లున్నాయి. ఇండోర్ సబ్ స్టేషన్లతో తక్కువ స్థలంలోనే సబ్స్టేషన్ నిర్మించుకుని వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించవచ్చు. -
15 ఏళ్ల అభివృద్ధి..15 నెలల్లోనే : వరంగల్ ఎంపీ కావ్య
స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో పదిహేనేళ్లలో జరగని అభివృద్ధిని కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా గెలిచిన 15 నెలల్లోనే రూ.8 వందల కోట్లు తీసుకొచ్చి చేస్తున్నారని, ఎమ్మెల్యే కడియం ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. బూటకపు గుజరాత్ మోడల్ కాకుండా, తెలంగాణ రాష్ట్రాన్ని దేశాన్ని మోడల్గా చేస్తున్న ముఖ్యమంత్రికి మనమంతా అండగా నిలవాలన్నారు. ఉమ్మడి వరంగల్ అంటే రేవంత్ రెడ్డికి ప్రత్యేక అభిమానమని, మామునూరుకు ఎయిర్ పోర్టు తీసుకొచ్చిన ఘనత సీఎం రేవంత్రెడ్డికే దక్కుతుందన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం ఢిల్లీకి వెళ్లి ఒత్తిడి చేస్తామన్నారు. -
హూన్యాతండాలో మహిళ హత్య
డోర్నకల్: డోర్నకల్ మండలం హూన్యాతండాలో ఓ మహిళ హత్యకు గురైంది. ఆమె భర్త తీవ్ర గాయాలతో అపస్మారకస్థితిలో చేరాడు. ఈ ఘటన ఆదివారం తండాలో కలకలం సృష్టించింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన భూక్యా బుజ్జి(51), రామా దంపతులు. వీరికి కుమారుడు అశోక్, కూతురు సౌందర్య ఉన్నారు. అశోక్ హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా, సౌందర్య హూన్యాతండా సమీపంలోని గార్ల మండలం పులిగడ్డ తండాలో భర్తతో నివాసం ఉంటుంది. శనివారం రాత్రి హోలీ వేడుకల్లో నృత్యం చేసిన బుజ్జి అనంతరం ఇంటికి వెళ్లింది. ఆదివారం ఉదయం ఇంటి నుంచి దంపతులు బయటకు రాలేదు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో రామా ఇంటి నుంచి తీవ్ర గాయాలతో బయటకు వచ్చి సమీపంలో పడిపోవడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా బజ్జి రక్తపు మడుగులో చనిపోయి ఉంది. డోర్నకల్ సీఐ బి.రాజేశ్, ఎస్సై గడ్డం ఉమ ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. తీవ్ర గాయాలతో అపస్మారకస్థితిలో ఉన్న రామాను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బుజ్జి హత్య విషయం తెలుసుకున్న కూతురు సౌందర్యతోపాటు చుట్టు పక్కల తండాలకు చెందిన ప్రజలు ఘటనాస్థలికి చేరుకున్నారు. మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు తండాకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోలీసులను వివరాలు అగిడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ బి.రాజేశ్ మాట్లాడుతూ దంపతులు బుజ్జి, రామా శనివారం రాత్రి గొడవ పడి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో బుజ్జికి గొంతుపై తీవ్ర గాయమై మృతి చెందిందన్నారు. రామాకు తీవ్ర గాయాలు కావడంతో అపస్మారకస్థితికి చేరుకుని ఇంటి నుంచి బయటకు వచ్చి పడిపోయాడన్నారు. స్థానికుల సమాచారంతో రామాను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. తీవ్ర గాయాలతో అపస్మారకస్థితిలో భర్త.. ఆస్పత్రికి తరలింపు దంపతులు గొడవ పడి పరస్పరం దాడి చేసుకున్నారంటున్న పోలీసులు కలకలం సృష్టించిన ఘటన -
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
మహబూబాబాద్ రూరల్: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎంపీ పోరిక బలరాంనాయక్ అన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని సోషల్ మీడియా కో ఆర్డినేటర్లకు ఐడీ కార్డులు, ఇన్సూరెన్స్ కాపీలు, డైరీలను ఎంపీ ఆదివారం అందజేశారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎంపీ బలరాంనాయక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను కాపాడుకుంటామని తెలిపారు. పార్లమెంట్ పరిధిలోని జిల్లా, నియోజకవర్గ, మండల కో ఆర్డినేటర్లకు టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్, టీజీటీఎస్ చైర్మన్ మన్నె సతీశ్కుమార్ సహకారంతో టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి అంబాల శివకుమార్ ఆధ్వర్యంలో ఐడీ కార్డులు, ఇన్సూరెన్స్ కాపీలు, డైరీలు అందజేశామని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, నిరుద్యోగులకు 55వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో బయ్యారం పీఏసీఎస్ డైరెక్టర్ జూలకంటి సీతారాంరెడ్డి, జిల్లా సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సామ మధుసూదన్ రెడ్డి, పినపాక, భద్రాచలం, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు డునుకు రాము, ప్రేమ్, గుగులోతు నవీన్, తవిశెట్టి రాకేష్, షేక్ ఖాజాపాషా, గుగులోతు రమేశ్, నాగేంద్రబాబు, నాళ్ల కిరణ్, మాలిక్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ పోరిక బలరాంనాయక్ -
పనులు చేపట్టేదెప్పుడో..?
డోర్నకల్: డోర్నకల్లో బైపాస్ రోడ్డు పనులకు భూసేకరణ అడ్డంకిగా మారింది. గార్ల నుంచి డోర్నకల్ మీదుగా నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. గార్ల గేటు, రైల్వే ఆస్పత్రి, గాంధీసెంటర్, గండి సత్యనారాయణ మిల్లు, యాదవనగర్ మూలమలుపులు ఇరుకుగా, బ్యాంక్ స్ట్రీట్ నిత్యం రద్దీగా ఉంటుంది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురుకావడంతో బైపాస్ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. 2023లో.. రోడ్లు భవనాలశాఖ ఆధ్వర్యంలో రూ.6 కోట్ల నిధులతో బైపాస్ రోడ్డు నిర్మాణానికి 2023 అక్టోబర్ 2న అప్పటి ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ శంకుస్థాపన చేశారు. 90వ లెవల్ క్రాసింగ్ గార్ల గేటు నుంచి గొల్లచర్ల–డోర్నకల్ ఆర్ అండ్ బీ రోడ్డులోని సమ్మర్ స్టోరేజ్ సమీపాన ప్రస్తుతం ఉన్న బైపాస్ రోడ్డును అనుసంధానిస్తూ కొత్త బైపాస్ రోడ్డు వేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే నాటి నుంచి నేటి వరకు పనులు ప్రారంభం కాలేదు. భూసేకరణే అడ్డంకి... గార్ల గేటు వద్ద చేపట్టిన ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి సమ్మర్ స్టోరేజ్ సమీపంలోని ఆర్అండ్బీ రోడ్డు వరకు 1.7కిలోమీటర్ల మేర బైపాస్ రోడ్డు నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం కొంతమేర రోడ్డు ఉండగా.. మిగిలిన రోడ్డు కోసం 8ఎకరాల భూ సేకరణ చేపట్టాలని రెవెన్యూశాఖ అధికారులు గుర్తించారు. 28 మంది రైతుల నుంచి 8ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా ఇందులో 6 ఎకరాలు డోర్నకల్ పట్టణ పరిధిలో.. 2ఎకరాలు గార్ల మండలం బుద్ధ్దారం గ్రామ పరిధిలో ఉంది. రెవెన్యూ సిబ్బంది సర్వే నిర్వహించి సేకరించాల్సిన భూమిని గుర్తించి రైతులకు సమాచారం అందించగా ఒకరిద్దరు రైతులు భూమి ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడంతో రోడ్డు పనులు ప్రారంభం కాలేదు. భూమి అప్పగిస్తే.. రెవెన్యూ సిబ్బంది తమకు భూమి అప్పగిస్తే రోడ్డు పనులు ప్రారంభిస్తామని ఆర్ అండ్ బీ అధికారులు చెబుతున్నారు. కాగా భూసేకరణ పూర్తి చేసి బైపాస్ రోడ్డు పనులు ప్రారంభించాలని ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ గతంలో మహబూబాబాద్ ఆర్డీఓకు లేఖ రాశారు. ప్రస్తుతం ఉన్న బైపాస్ రోడ్డు భారీ వాహనాల రాకపోకలతో పూర్తిగా ధ్వంసం కావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా నూతన బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తయితే డోర్నకల్లో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అధికారులు వెంటనే స్పందించి భూసేకరణ పూర్తి చేసి బైపాస్ రోడ్డు పనులు పూర్తిచేయాలని స్థానికులు కోరుతున్నారు. బైపాస్ రోడ్డు పనులకు అడ్డంకిగా మారిన భూసేకరణ ముగింపునకు రైల్వే ఫ్లైఓవర్బ్రిడ్జి పనులు -
పోటీ పడేలా..
సోమవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2025హైదరాబాద్తో – 8లోuసభలో అభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డిబహిరంగ సభకు హాజరైన ప్రజలు, రిమోట్ ద్వారా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి, చిత్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య, ప్రజాప్రతినిధులున్యూస్రీల్ -
పదవీ విరమణ డబ్బుల పంపకాల్లో కుమారులతో ఘర్షణ
● మనస్తాపానికి గురై రిటైర్డ్ ఉద్యోగి బలవన్మరణం మహబూబాబాద్ రూరల్ : ఓ ప్రభుత్వ ఉద్యోగి పదవి విరమణ అనంతరం వచ్చిన డబ్బుల పంపకాల విషయంలో కుమారులతో జరిగిన ఘర్షణతో మనస్తాపానికి గురై ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. మహబూబాబాద్ టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని రామచంద్రపురం కాలనీలో నివాసం ఉండే ఏర్పుల వీరయ్య (63) పంచాయతీరాజ్ శాఖలో ఆఫీస్ సబార్డినేట్గా ఐదేళ్లక్రితం ఉద్యోగ విరమణ పొందారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఉద్యోగ విరమణ డబ్బులురాగా ఇటీవల కుమారులకు, ఆయనకు మధ్య పంపకాల విషయంలో మనస్పర్థలు ఏర్పడ్డాయి. వీరయ్య ఈ విషయాలను ఎవరికీ చెప్పుకోలేక తనకు తానుగా బాధపడుతూ వారం రోజుల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయాడు. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలోని వెంకటరమణ లాడ్జిలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం లాడ్జి నిర్వాహకులు వీరయ్య మృతిచెందిన విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలిపారు. టౌన్ ఎస్సై కే.శివ, హెడ్ కానిస్టేబుల్ దామోదర్ సంఘటన స్థలానికి చేరుకుని వీరయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించామని సీఐ పెండ్యాల దేవేందర్ తెలిపారు. -
ప్రభల తరలింపులో ఉద్రిక్తత..
● భారీగా తరలిరావడంతో గిర్నిబావిలో ట్రాఫిక్ జామ్ ● నిలువరించే ప్రయత్నంలో పోలీసుల లాఠీచార్జ్ ● పరుగులు తీసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ● ఐదుగురికి గాయాలు, బీఆర్ఎస్ ఆందోళన ● డీసీపీ అంకిత్ రాకతో పరిస్థితి అదుపులోకి.. సాక్షి, వరంగల్/దుగ్గొండి: వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల జాతరకు రాజకీయ ప్రభలు (బండ్లు) తరలుతుండగా దుగ్గొండి మండలం గిర్ని బావిలో ఉద్రిక్త పరిస్థితులు ఎదురయ్యాయి. ఒక్కసారిగా తరలిరావడంతో నిలువరించే ప్రయత్నంలో పోలీసులు లాఠీకి పని చెప్పారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ప్రభల ఎదుట పేలుస్తున్న షార్ట్ బాణాసంచా బోర్లా పడడంతో రోడ్డు పక్కల వారికి తగిలి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో బాంబుల పేలుడు శబ్ధం వినిపించడంతో ఫైరింగ్ జరుగుతుందని భ్రమపడిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాల కార్యకర్తలు పరుగులు తీశారు. దీంతో పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయగా పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు గాయపడ్డారు. ఒకానొక దశలో ఈ ఉద్రిక్త పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు వాటర్ కేనన్ ప్రయోగించబో యారు. చివరకు డీసీపీ అంకిత్ కుమార్ రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. జాతరకు స్వయంగా వాహనాలు, ప్రభలను పంపించారు. ఉద్రిక్తతకు ఎందుకు దారి తీసిందంటే.. జిల్లాలో ప్రసిద్ధి గాంచిన కొమ్మాల శ్రీలక్ష్మీనర్సింహాస్వామి జాతర సందర్భంగా నర్సంపేట నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీల ప్రభలు శనివారం ఉదయమే గిర్నిబావికి భారీగా చేరుకున్నాయి. కాంగ్రెస్ ప్రభలను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించగా, బీఆర్ఎస్ ప్రభలను మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, నన్నపునేని నరేందర్ ప్రారంభించారు. అయితే ఈ జాతరకు ప్రభలను ఈసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీగా తరలించాయి. ఏటా గిర్నిబావిలో బల ప్రదర్శన చేయడం పరిపాటిగా మారడంతో పోలీసులు మొదట కాంగ్రెస్ ప్రభలకు ఉదయం 4 నుంచి 11 గంటల వరకు సమయం ఇచ్చారు. అయితే కాంగ్రెస్ ప్రభలు భారీగా తరలిరావడంతో కొమ్మాల ఆర్చ్ నుంచి గిర్నిబావి వరకు బారులుదీరాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ ప్రభలను దుగ్గొండి, చాపలబండ , నర్సంపేట రోడ్లలో పోలీసులు నిలిపారు. ఇక తమకు కేటాయించిన సమయం దాటి పోయిందని బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డుకు చొచ్చుకొచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాలు ఒకరిపై ఒకరు కుంకుమ చల్లుకోవడం, వాటర్ బాటిళ్లు విసురుకోవడం, పోటాపోటీగా నినాదాలు చేసుకోవడంతో పోలీసులు బారికేడ్లు పెట్టారు. అయితే వేలాది మంది ఒక్కసారిగా బారికేడ్లు, చెక్పోస్టులు విరగగొట్టి రోడ్డుపైకి రావడంతో ఇరువర్గాలను నిలువరించే క్రమంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలోనే తొగర్రాయికి చెందిన యార శ్రీనివాస్పై పోలీసులు విచక్షణారహితంగా లాఠీలు ఝుళిపించడంతో గాయాలపాలయ్యాడు. కంచరకుంట్ల శ్రీనివాసరెడ్డి, సద్ది నర్సిరెడ్డి, మోడెం విద్యాసాగర్, తుమ్మలపెల్లి మహేందర్కు అధికంగా లాఠీ దెబ్బలు తగిలాయి. అయితే తమవారిపై ఎందుకు లాఠీచార్జ్ చేశారంటూ మహిళలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. పరిస్థితి ఇంకా చేజారుపోతుండడంతో వాటర్ కేనన్ ప్రయోగించే ప్రయత్నం చేశారు. ఏసీపీ కిరణ్కుమార్ తన ఏకే 47 గన్ లోడ్ చేసి ఫైర్ చేస్తానని బెదిరించే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులకు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అండగా నిలిచి ధర్నాలో పాల్గొన్నారు. సీఐ సాయిరమణ సర్ది చెప్పే ప్రయత్నం చేయగా పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం డీసీపీ అంకిత్కుమార్ ఘటనా స్థలికి చేరుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. నాలుగు గంటలుట్రాఫిక్కు అంతరాయం.. ప్రధాన రహదారిపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్ర భలు నిలిచిపోవడంతోపాటు జాతరకు వెళ్లి తిరుగుప్రయాణంలో వచ్చే ప్రభలు రెండు వైపులా ఉండడంతో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆర్టీసీ బస్సులను మచ్చాపురం నుంచి దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులకు కొంత ఇబ్బంది తప్పింది.గిర్నిబావి వద్ద కాల్పులు జరగలేదు వరంగల్ పోలీసు కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సాక్షి, వరంగల్: కొమ్మాల జాతర సందర్భంగా గిర్నిబావి ప్రాంతంలో ప్రభ బండ్లు వరుస క్రమంలో తరలివెళ్లే సమయంలో కొందరు అత్యుత్సాహం ప్రదర్శించడంతోపాటు అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసుల ఆదేశాలను పాటించకుండా ముందుకెళ్లే క్రమంలో పోలీసులకు ప్రభబండ్లను తరలించే వారి మధ్య తోపులాట మాత్రమే జరిగిందని వరంగల్ పోలీసు కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. అంతేకాని ఈ ఘటనలో ఎలాంటి పోలీస్ కాల్పులు జరగలేదన్నారు. కొన్ని ప్రచార మాధ్యమాల్లో ఈ ఘటనలో కాల్పులు జరిగినట్లు ప్రజలను ఆందోళన కలిగించేలా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజలకు ఆందోళన కలిగించే రీతిలో ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు అప్లోడ్ చేసినా, వార్తలు రాసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.ప్రమాదశాత్తు బావిలో పడి యువకుడి మృతి కొమ్మాల జాతరలో ఘటన గీసుకొండ: మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహాస్వామి జాతరలో శుక్రవారం రాత్రి ఓ యువకుడు ప్రమాదశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. పోలీసులు, మృతుడి భార్య కథనం ప్రకారం.. సంగెం మండలం పల్లార్లగూడ శివారు వీఆర్ఎన్ తండాకు చెందిన వాసరి అరుణ్కుమార్(31) తన స్నేహితుడు గుగులోత్ రాజుతో కలిసి కొమ్మాల జాతరకు వెళ్లాడు. జాతరలో భక్తుల తాకిడి అధికంగా ఉండడంతో ఇద్దరూ కలుసుకోలేక పోగా చీకట్లో దారి తెలియక అరుణ్కుమార్ ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడగా ఈత రాకపోవడంతో మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య శ్రావణి ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు గీసుకొండ ఇన్స్పెక్టర్ మహేందర్ శనివారం తెలిపారు. -
బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్రీడలు నిర్లక్ష్యం
వరంగల్ స్పోర్ట్స్ : బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడలను నిర్లక్ష్యం చేస్తే, స్వయంగా క్రీడాకారుడైన సీఎం రేవంత్రెడ్డి క్రీడల అభ్యున్నతికి నిధులు కేటాయిస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర 10వ టెన్నికాయిట్ చాంపియన్షిప్ పోటీలు శనివారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల ప్రారంభానికి ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం కప్ క్రీడాపోటీలు ఘనంగా నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా క్రీడాకారుల్లో నూతనోత్తేజం తీసుకొచ్చామన్నారు. క్రీడల అభివృద్ధి, క్రీడాకారుల సంక్షేమం కోసం తామెప్పుడు ముందుంటామన్నారు. టెన్నికాయిట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పీఎన్. వెంకటేశ్ మాట్లాడుతూ నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తున్న పోటీల్లో రాష్ట్రం నుంచి 300 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ఒలింపిక్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎండి. అజీజ్ఖాన్, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, సాట్ కోచ్ సద్గురు, టెన్నికాయిట్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ బీఆర్ అంబేడ్కర్, హనుమకొండ, వరంగల్ జిల్లాల కార్యదర్శులు అలువాల రాజ్కుమార్, గోకారపు శ్యాంకుమార్, కోశాధికారి జాహుర్, టెక్నికల్ అఫిషియల్స్ వై. సురేందర్, సలహాదారులు కె. జితేందర్నాథ్, జి. రవీందర్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి -
ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపాలి
● ఉద్యాన శాఖ వరంగల్ జిల్లా అధికారి సంగీత లక్ష్మి మామునూరు: రైతులు సంప్రదాయ పంటలు కాకుండా ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపాలని ఉద్యాన శాఖ వరంగల్ జిల్లా అధికారి సంగీత లక్ష్మి సూచించారు. మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రధాన శాస్త్రవేత్త రాజన్న ఆధ్వర్యంలో సుగంధ ద్రవ్యాల సంస్థ వరంగల్ సౌజన్యంతో సుగంధ ద్రవ్యాల సాగుపై మూడు రోజులుగా జరుగుతున్న శిక్షణ శనివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై రైతులకు పసుపు, మిరప, కూరగాయల విత్తనాలు పంపిణీ చేసి మాట్లాడారు. ఉద్యాన పంటల సాగును పంట మార్పిడిగా ఉపయోగించాలని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుందన్నారు. అంతకు ముందు సుగంధ ద్రవ్యాల పంట సాగు విధానాలపై శిక్షణ పొందిన రైతులకు ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సౌమ్య, రాజు, నాగరాజు, వేణుగోపాల్, హర్షరెడ్డి, సాయిచంద్, సుశ్రాత్, తదితరులు పాల్గొన్నారు. -
‘స్టేషన్’ అభివృద్ధికి రూ.800 కోట్లు
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి ● సీఎం సభాస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే, ఎంపీ, సీపీ, కలెక్టర్ స్టేషన్ఘన్పూర్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టితో పలు అభివృద్ధి పనులకు రూ.800 కోట్లు మంజూరు చేశారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని శివునిపల్లిలో వ్యవసాయ మార్కెట్ సమీపాన ఆదివారం నిర్వహించనున్న సీఎం బహిరంగ సభా స్థలిని ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ షేక్ రిజ్వాన్బాషా, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్తో కలిసి శనివారం పరిశీలించారు. అనంతరం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ లకు అనుగుణంగా నియోజవకర్గ అభివృద్ధే ఽధ్యేయంగా కాంగ్రెస్లో చేరానని, కేవలం పది నెలల్లోనే సీఎం రేవంత్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లి అభివృద్ధి పనులకు రూ.800 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి నేడు శంకుస్థాపన చేసిన వెంటనే పనులను ప్రారంభించి 18 నెలల్లోనే పూర్తి చేయిస్తామన్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన సీఎంకు కృతజ్ఞతగా నేడు 50వేల మందితో ‘కృతజ్ఞత సభ’ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న సీఎం రేవంత్ : ఎంపీ కావ్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ప్రధానంగా వరంగల్ అభివృద్ధికి ప్రత్యేక చొరవతో పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి లేని విధంగా స్టేషన్ఘన్పూర్కు ఏడాదిలోనే రూ.800 కోట్లు మంజూరు చేశారన్నారు. సభావేదికను పరిశీలించిన సీపీ.. సీఎం సభాస్థలి, సభావేదికను వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ పరిశీలించారు. సభాస్థలి వద్ద ఏర్పాట్లు, బందోబస్తు, పార్కింగ్, ట్రాఫిక్ తదితర అంశాలపై డీసీపీతో మాట్లాడారు. సీఎం సభ కోసం 800 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆయన వెంట డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీలు భీమ్శర్మ, అంబటి నర్సయ్య, సీఐలు జి.వేణు, శ్రీనివాస్రెడ్డి, ఎస్సైలు వినయ్కుమార్, శ్రావణ్, ఆర్డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు బెలిదె వెంకన్న, సీహెచ్.నరేందర్రెడ్డి, జూలుకుంట్ల శిరీశ్రెడ్డి, అన్నం బ్రహ్మారెడ్డి, బూర్ల శంకర్, నాగరబోయిన శ్రీరాములు, నీల గట్టయ్య, అంబటి కిషన్రాజ్, నీల శ్రీధర్, నీల వెంకటేశ్వర్లు, రాములు, పోశాల క్రిష్ణమూర్తి, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు. -
కేన్ ప్రాంతాన్ని రక్షించుకోవాలి
వెంకటాపురం(ఎం): రాష్ట్రంలోనే అరుదైన వృక్ష సంపద మండలంలోని పాలంపేట పరిధిలో ఉందని, కేన్ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని వరంగల్ ఆయుర్వేద కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ అనిశెట్టి శ్రీధర్ పేర్కొన్నారు. పరిశోధనలో భాగంగా శనివారం వృక్షశాస్త్ర పరిశోధకుడు, కేన్మ్యాన్ ఆఫ్ తెలంగాణ డాక్టర్ సుతారి సతీశ్, ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల అధ్యాపకురాలు అనంతలక్ష్మితో కలిసి కేన్ ప్రాంతాన్ని పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా ఉన్న ఏకై క కేన్ ప్రాంతం పాలంపేటలోనే ఉందన్నారు. కేన్ ప్రాంతంలో 125 జాతుల ఆయుర్వేద మందు మొక్కలు ఉన్నాయని, వివిధ రకాల రోగాలను నయం చేయడానికి వీటిని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. 51 ఎకరాల్లో ఉన్న కేన్ ప్రాంతాన్ని కాపాడుకుని ఆరోగ్య భారత్ను నిర్మించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం డాక్టర్ సతీశ్ మాట్లాడుతూ 51 ఎకరాల చుట్టూ ట్రెంచ్ కొట్టి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు. కేన్ ప్రాంతాన్ని కన్జర్వేషన్ రిజర్వ్ జోన్గా ప్రకటించి, కెనోపి వాక్ పేరుతో ఎకో టూరిజం అభివృద్ధి చేయాలన్నారు. కార్యక్రమంలో పరిశోధన బృందం సభ్యులు డాక్టర్లు నిఖిత, కృష్ణసాయి, ఆకాశ్, సుమ తదితరులు ఉన్నారు. వరంగల్ ఆయుర్వేద కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ అనిశెట్టి శ్రీధర్ -
టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్●
● ఈనెల 20 వరకు నామినేషన్ల ప్రక్రియ ● 28న ఓటింగ్.. కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్ ఎన్నికలకు యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి టి. మనోహర్ శనివారం నోటిఫికేషన్ జారీచేశారు. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీలు, ఆర్గనైజేషన్ –1, ఆర్గనైజేషన్ –2 (ఉమెన్), రిక్రియేషన్ పదవులకు ఒక్కో పదవికి నోటిఫికేషన్ ఇచ్చారు. మూడేళ్ల పదవి కాలానికి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అనంతరం స్క్రూటీని చేసి ఈనెల 21న నామినేషన్ల వివరాలు వెల్లడిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈనెల 22న మధ్యాహ్నం 3గంటల వరకు ఉంటుంది. తుదిగా అభ్యర్థుల జాబితా 22న సాయంత్రం 4. 30 గంటలకు వెల్లడిస్తారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు 24న గుర్తులు కేటాయిస్తారు. ఓటింగ్ ప్రక్రియ 28న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు క్యాంపస్లోని యూని వర్సిటీ కాలేజీలో ఉంటుంది. 29న సాయంత్రం ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడిస్తారు. కాగా, ఈ ఎన్నికల నోటిఫికేషన్తో కేయూ టెక్నికల్ స్టాఫ్ ఎంప్లాయీస్లో ఎన్నికల సందడి మొదలైంది. యూట్యూబ్ విలేకరిపై కేసు ఖిలా వరంగల్: నిజ నిర్ధారణ లేకుండా ఫొటోలతో సహా సామాజిక మధ్యమాల్లో ఓ కథనం పోస్టు చేసిన ఓ యూట్యూబ్ విలేకరిపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ వెంకటరత్నం తెలిపారు. ఓ యువతి విషయంలో పూర్తి సమాచారం లేకుండా.. కనీసం నిబంధనలు పాటించకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన క్లిప్పింగ్స్ ఆధారంగా సదరు విలేకరిపై శుక్రవారం రాత్రి కేసు నమోదైంది. శనివారం అతడిని పోలీసులు స్టేషన్లో విచారించినట్లు సమాచారం. సీకేఎంలో ఫెర్టిలిటీ ఓపీ సేవలు షురూఎంజీఎం: వరంగల్ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో శనివారం ఫెర్టిలిటీ ఓపీ సేవలను సూపరింటెండెంట్ షర్మిల ప్రారంభించారు. ప్రస్తుతం అందిస్తున్న గర్భిణులకు సేవలతో పాటు సంతాన భాగ్యం లేని దంపతులకు మరింత మెరుగైన ఓపీ వైద్యసేవలందించేందుకు ప్రత్యేక ఓపీ విభాగాన్ని ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. కలెక్టర్ ఆదేశాలతో ప్రత్యేక ఓపీ ప్రారంభించి ఔషధాలు సైతం ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. ఈసేవలు ప్రతీ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. సంతాన లేమితో ఇబ్బందులు పడుతున్న దంపతులు.. ఈ విభాగంలో నమోదు చేసుకుని ఉచిత వైద్యసేవలు పొందొచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎంఓలు మురళి, సత్యజిత్ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం రేవంత్రెడ్డి సభను అడ్డుకుంటాం
స్టేషన్ఘన్పూర్: ఎన్నికల ముందు పలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి.. ఆ హామీలను అమలు చేయకుండా నిరంకుశ పాలన సాగిస్తున్నారని, నేడు ఘన్పూర్లో నిర్వహించనున్న సీఎం ‘కృతజ్ఞత సభ’ అడ్డుకుంటామని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. అసెంబ్లీలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని అక్రమంగా సస్పెండ్ చేశారని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం అంబేడ్కర్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ జగదీశ్రెడ్డి అసెంబ్లీలో కేవలం ఆరు నిమిషాలు మాత్రమే మాట్లాడారని, రైతుల సమస్యలపై ప్రశ్నించిన జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేయడం అమానుషమన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కుతూ నియంతపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా పార్టీలు మారిన వారిని రాళ్లతో కొట్టాలని గతంలో చెప్పిన రేవంత్రెడ్డి.. ప్రస్తుతం కడియం శ్రీహరి నిర్వహించే సభకు ఎలా వస్తున్నారని ప్రశ్నించారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణుల కష్టంతో ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి దొడ్డిదారిన స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్లో చేరారని ఎద్దేవా చేశారు. కడియంకు ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి సభకు వెళ్లాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మారపాక రవి, ఆకుల కుమార్, మాచర్ల గణేశ్, తాటికొండ సురేశ్, కుంభం కుమార్, బంగ్లా శ్రీను, మునిగెల రాజు, మారెపల్లి ప్రసాద్, గుండె మల్లేశ్, గుర్రం శంకర్, శ్రీను, గాదె రాజు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య -
అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్
నయీంనగర్: రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులకు కచ్చితంగా అక్రిడిటేషన్ కార్డులు దక్కేలా తమ సంఘం కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ భరోసా ఇచ్చారు. శనివారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు గడ్డం రాజిరెడ్డి అధ్యక్షతన హనుమకొండ, వరంగల్ జిల్లాల కార్యవర్గ సమావేశంలో విరాహత్ అలీ మాట్లాడారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ల విషయంలో కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్రెడ్డి నేతృత్వంలో సీనియర్ పాత్రికేయులతో కూడిన కమిటీ నాలుగైదుసార్లు సమావేశమై కొత్త నిబంధనలు రూపొందించిందని, ఈ నేపథ్యంలో అక్రిడిటేషన్ల జారీలో జాప్యమైందని స్పష్టం చేశారు. జర్నలిస్టుల ఆరోగ్య పథకం, ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే డిమాండ్తో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) పోరాడుతోందన్నారు. ఇటీవల ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రులకు విన్నవించామని, ప్రభుత్వ ఉద్యోగులతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా జేహెచ్ఎస్ ప్రారంభించాలని కోరగా వారు సానూకూలంగా స్పందించారని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంనారాయణ, ఉపాధ్యక్షుడు గాడిపెల్లి మధు, వరంగల్, హనుమకొండ జిల్లాల బాధ్యులు ఎ.రాంచందర్, తోట సుధాకర్, దుర్గా ప్రసాద్, సీనియర్ నాయకులు దాసరి కృష్ణారెడ్డి, కంకణాల సంతోశ్, పి.వేణుమాధవ్, గ్రేటర్ వరంగల్ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య తదితరులు పాల్గొన్నారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ -
వైభవంగా శ్రీవారి కల్యాణం
మహబూబాబాద్ రూరల్: అనంతాద్రి శ్రీవారి 20వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అనంతాద్రి గుట్టపై వెలసిన స్వయంభూ జగన్నాథ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీవారి కల్యాణం శనివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ట్రస్టీ నూకల రామచంద్రారెడ్డి, జ్యోతి దంపతుల ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు గొడవర్తి చక్రధరాచార్యులు, గొడవర్తి శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో అష్టోత్తర శతనామపూజ, అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారికి యజ్ఞోపవీతధారణ చేసి, స్వామివారు, అమ్మవార్లకు జిలకర బెల్లంధారణ చేసి మధుపర్కం సమర్పణ అనంతరం కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. మానుకోటతోపాటు పలు ప్రాంతాలకు చెందిన భక్తులు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కల్యాణం అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. మాలె కాళీనాథ్, వసంతలక్ష్మి దంపతులు వెండి కిరీటాలు, దీక్షా వస్త్రాలు, బవిరిశెట్టి వంశీకృష్ణ, మాధవి పట్టువస్త్రాలు, బొల్లం యాకయ్యలింగం, భారతలక్ష్మి, నాగేశ్వరరావు, సరస్వతి, చందా కిరణ్ కుమార్, రవిశంకర్ ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టు సభ్యు డు నాయిని ప్రభాకర్రెడ్డి, వేమిశెట్టి యకాంబ్రం, పుల్లఖండం వేణుగోపాల్, మల్యాల రంగారావు, అ ర్చకులు అనిరుద్ ఆచార్యులు, విశ్వం, మట్టపల్లి వి జయ్, గౌతమ్, చరణ్, భక్తులు పాల్గొన్నారు. -
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
● అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి మహబూబాబాద్: జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు నీరు అందించాలని అదనపు కలెక్టర్ కె.వీరబ్రహ్మచారి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని అదనపు కలెక్టర్ చాంబర్లో శనివారం వ్యవసాయ, నీటి పారుదల శాఖ అధి కారులతో సాగు నీరు సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సాగు నీటి సరఫరా విషయంలో కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతున్నాయని, అలాంటివి జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. డీఏఓ విజయ నిర్మల, ఇరిగేషన్ శాఖ ఈఈ నర్సింహరావు, అధికారులు పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయం తనిఖీ నర్సింహులపేట: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని రెవెన్యూ రికార్డులు పరిశీలించారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. -
ఒంటిపూట బడులు షురూ
మహబూబాబాద్ అర్బన్: రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, గిరిజన ఆశ్ర మ పాఠశాలలో శనివారం నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. ఉదయం 7:45 వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలకు చేరుకొ గా ప్రార్థన ఉద యం 8 గంటలకు ప్రారంభించారు. మధ్యాహ్నం 12:30 గంటలకు బడులను నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టారు. అయితే జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో సుమారు 15 కిలోల అన్నం మిగలడంతో వంట నిర్వాహకులు మిగిలిన అన్నాన్ని బస్తాలో నింపారు. -
టెన్త్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
మహబూబాబాద్: టెన్త్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పదో తరగతి పరీక్షల నిర్వాహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగే పరీక్షలకు జిల్లాలో 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, మొత్తం 8,194 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. మాస్ కాపీంగ్కు తావు లేకుండా తగు ఏ ర్పాట్లు చేయాలన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె. వీర బ్రహ్మచారి, తొర్రూరు ఆర్డీఓ గణేష్, డీపీఓ హరిప్రసాద్ పాల్గొన్నారు. ఏఐ కోర్సు ప్రారంభం కురవి: సీరోలు మండల కేంద్రంతోపాటు చింతపల్లి, కొత్తూరు(సీ) గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కంప్యూటర్ కోర్సులను అడిషనల్ కలెక్టర్ లెనిన్వత్సల్ టొప్పో, జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రవీందర్రెడ్డి శనివారం ప్రారంభించారు. మూడు పాఠశాలల్లో కంప్యూటర్లను ప్రారంభించి మాట్లాడారు. ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు కంప్యూటర్పై అవగాహన పెంచడంతోపాటు, కృత్రిమ మేథను వివరించడం జరుగుతుందన్నారు. అనంతరం టెన్త్ విద్యార్థుల ప్రిపరేషన్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ ఆజాద్ చంద్రశేఖర్, జీ సీడీఓ విజయకుమారి డీఎస్ఓ బి.అప్పారావు, ఎంఈఓ లచ్చిరాం, హెచ్ఎంలు బి.శంకర్నాయక్, అ రుణ, బంగారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం గూడూరు: మండలంలోని మచ్చర్ల జెడ్పీహెచ్ఎస్లో శనివారం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ఆధారిత విద్యాబోధనను డీఈఓ రవీందర్రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో -
జగదీష్రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలి
● మున్సిపల్ మాజీ వైస్ చెర్మన్ వెంకన్న మహబూబాబాద్: మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం నెహ్రూసెంటర్లో ఆందోళన చేసి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ను అమలు చేయాలన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని, రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాయిని రంజిత్, తేళ్ల శ్రీనివాస్, జెరిపోతుల వెంకన్న, మార్నెని రఘు, అశోక్, నీలేష్రాయ్, రావిష్, లక్ష్మణ్, రాము, రాజేష్, అమీర్, తదితరులు పాల్గొన్నారు. సేంద్రియ సాగు ఆరోగ్యానికి మేలు● కేవీకే సీనియర్ శాస్త్రవేత్త ఉమారెడ్డి కొత్తగూడ: రైతులు సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం వల్ల లాభాలతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని కేవీకే సీనియర్ శాస్త్రవేత్త ఉమారెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. కేన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు నేడు గ్రామీణ ప్రాంతాల వరకు చేరుకోవడానికి కారణం విచ్చలవిడిగా రసాయనాలు వినియోగించడమేనన్నారు. రసాయనాల వినియోగంతో భూసారం పూర్తిగా దెబ్బతింటుందన్నారు. సేంద్రియ సాగుతో ఖర్చులు తగ్గడంతో పాటు దిగుబడిని పెంచవచ్చన్నారు. దొరవారివేంపల్లి, ఈశ్వరగూడెం గ్రామాల నుంచి సేంద్రియ సాగు చేసేందుకు ముందుకు వచ్చిన రైతులకు దేశవాలి ఆవులు, మేకలను ప్రభుత్వ సహకారంతో ఉచితంగా అందించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఉదయ్, పశు వైద్యాధికారి శ్రీకాంత్, ఏఈఓ రాజు పాల్గొన్నారు. అంతర్ జిల్లా దొంగ అరెస్ట్● 108 గ్రాముల బంగారం స్వాధీనం ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ తిరుపతిరావు మహబూబాబాద్ రూరల్: అంతర్ జిల్లా దొంగను అరెస్ట్ చేసి 108గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ఎన్.తిరుపతిరావు తెలిపారు. శనివారం టౌన్ పోలీస్స్టేషన్లో కేసు వివరాలు వెల్లడించారు. కురవి మండల ప్రాంతంలో సీసీఎస్ హతిరాం, ఎస్సైలు తాహెర్బాబా, గోపి సతీష్, సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుండగా కురవి బస్టాండ్ దగ్గర ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించగా అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. పగటి పూట ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి, కారేపల్లి మండలం మాదారం గ్రామానికి చెందిన పున్నెం రాజు గతేడాది జూలై నుంచి మార్చి వరకు సుమారు వివిధ జిల్లాల్లో 11 ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు నేరం ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి 108 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. అంతర్ జిల్లా దొంగని పట్టుకున్న సీసీఎస్ హతిరాం, ఎస్సైలు తాహెర్ బాబా, గోపి, కురవి ఎస్సై సతీష్, సిబ్బందిని జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అభినందించారు. డీఎస్పీ తిరుపతిరావు వారికి రివార్డులు అందజేశారు. ఈ సమావేశంలో మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
సర్వం సిద్ధం
‘సీఎం కృతజ్ఞత సభ’కునేడు ఘన్పూర్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన జనగామ: జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో సీఎం రేవంత్రెడ్డి నేడు(ఆదివారం) పర్యటించనున్నారు. రూ.700 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు వర్చువల్గా శంకుస్థాపనలు, అలాగే ప్రారంభోత్సవాలు చేయనుండగా.. సెల్ఫ్హెల్ప్ గ్రూపులకు రూ.100 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులను సీఎం చేతుల మీదుగా అందజేయనున్నారు. ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ సమీపాన ‘సీఎం కృతజ్ఞత సభ’కు సర్వం సిద్ధం చేశారు. బహిరంగ సభతోపాటు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేతృత్వంలో సీపీ సన్ప్రీత్ సింగ్, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, ఎంపీ కడియం కావ్య శనివారం పరిశీలించారు. శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు జఫర్గఢ్ మండలం కోణాయచలం సమీపాన రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెట్ స్కూల్(గురుకులం) కాంప్లెక్స్, రూ.146 కోట్లతో ఘన్పూర్ రిజర్వాయర్ నుంచి నవాబుపేట వరకు మెయిన్ కెనాల్ లైనింగ్, రూ.46కోట్ల వ్యయంతో ఘన్పూర్లో విద్యుత్ సబ్స్టేషన్ సమీపాన 100 పడల ఆస్పత్రి, రూ.26కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్(ప్రభుత్వ కార్యాలయాల సముదాయం), రూ.50 కోట్లతో పంచాయతీరాజ్ రహదారులు, రూ.26కోట్లతో అంతర్గత సీసీరోడ్లు, డ్రెయినేజీలు, రూ.250 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల(మొదటి విడత) నిర్మాణ పనులను సీఎం వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సెల్ఫ్హెల్ఫ్ గ్రూపులకు రూ.100కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులు అందజేస్తారు. అనంతరం సీఎం మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ను సందర్శిస్తారు. అలాగే ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకు మంజూరైన నాలుగు ఆర్టీసీ బస్సులను ప్రారంభిస్తారు. శంకుస్థాపనలకు సంబంధించి సభా వేదిక సమీపంలోనే ఒకే చోట శిలా ఫలకాలు ఏర్పాటు చేశారు. వీఐపీ, వీవీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. రెండు రూట్లలో తరలింపు సభకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో 50 వేల మందిని తరలించనున్నారు. ఇందుకు సంబంధించి వేలేరు, ధర్మసాగర్, స్టేషన్ఘన్పూర్, చిల్పూరు మండలాల నుంచి వచ్చే వారు ఘన్పూర్ టౌన్ మీదుగా.. జఫర్గఢ్, లింగాలఘణపురం, రఘునాథపల్లి మండలాల వారు ఇప్పగూడెం మీదుగా రానున్నారు. ఈ రెండు రూట్లలో పోలీసు నిఘా ఉంటుంది. శివునిపల్లి వ్యవసాయ మార్కెట్, విశ్వనాథపురం సమీపంలో రెండు చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. మూడు రోజులుగా బాంబు, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తుండగా, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ వర్గాలు నిరంతరం నిఘా ఉంచారు. సీఎం పర్యటన నేపథ్యంలో 850 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టనున్నారు. – 8లోu రూ.700 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మహిళా సంఘాలకు రూ.100 కోట్ల రుణాలు.. వ్యవసాయ మార్కెట్ సమీపంలో బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే కడియం, ఎంపీ కావ్య, అధికారులుసీఎం టూర్ షెడ్యూల్ ఇలా.. మధ్యాహ్నం 12.10 గంటలకు ఇంటినుంచి (హైదరాబాద్లో) బయలుదేరి బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. 12.25 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు 1 గంటకు స్టేషన్ఘన్పూర్ మండలం శివునిపల్లి హెలిపాడ్కు చేరుకుంటారు. 1.10 నుంచి 1.20 గంటల వరకు ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను పరిశీలించి, వివిధ గ్రూపులకు కేటాయించిన బస్సులను ప్రారంభిస్తారు 1.25 నుంచి 3 గంటల వరకు శివునిపల్లిలో ప్రజాపాలన కార్యక్రమాలు, కృతజ్ఞత సభలో పాల్గొంటారు. 3.10 గంటలకు శివునిపల్లి హెలిపాడ్ నుంచి బయలుదేరి 3.45 గంటలకు హెలికాప్టర్లో బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు.‘స్టేషన్’ అభివృద్ధికి రూ.800 కోట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి సీఎం రేవంత్రెడ్డి సభను అడ్డుకుంటాం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య -
విద్యుదాఘాతంతో యువరైతు మృతి
సంగెం: విద్యుదాఘాతంతో ఓ యువరైతు మృతి చెందిన విషాద ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వీఆర్ఎన్ తండాకు చెందిన గుగులోత్ సురేష్(27)కు భార్య రేణుక, ఇద్దరు కవలు మనోహర్, మణిదీప్, కూతురు మనీషా ఉన్నారు. వ్యవసాయం చేస్తూ కుటుంబపోషణ చేసుకుంటున్నాడు. తన ఎకరం భూమిలో మొక్కజొన్న పంట సాగు చేశాడు. శుక్రవారం మధ్యాహ్నం మొక్కజొన్నకు నీరు పారించేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. మోటార్ ఆన్చేస్తే పని చేయకపోవడంతో ఫ్యూజులు సరిగా ఉన్నాయా.. లే దోనని ఫ్యూజులు, స్టాటర్ ఉన్న బాక్స్లో చేయి పెట్టి తీసే క్రమంలో విద్యుత్షాక్కు గురై కేకలు వేసి పడిపోయాడు. పక్క చేనులో ఉన్న అదే తండాకు చెందిన గుగులోత్ రాజు వచ్చి సురేష్ను లేపబోయేసరికి అతనికి విద్యుత్ షాక్ తగిలింది. ఇద్దరు పడి కొట్టుకుంటుండగా మరో చేనులో ఉన్న రాజు వచ్చి దగ్గరలోని విద్యుత్ స్తంభంపై తీగలను తొలగించా డు. సురేష్ను ద్విచక్రవాహనంపై ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ముందుగా సురేష్ను కాపాడబోయిన రాజు తృటిలో ప్రా ణాలతో బయటపడ్డాడు. మృతుడి భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ పేర్కొన్నారు. విద్యుత్ మోటారు ఫ్యూజులు సరిచేస్తుండగా ఘటన -
రోడ్డుపై యువకుల న్యూసెన్స్
హసన్పర్తి: హోలీ రంగుల్లో మునిగితేలిన యువకులు చిత్తుగా మద్యం సేవించారు. ఎదురుగా వస్తున్న కారును ఆపారు.. కారు డ్రైవర్తో వాగ్వాదానికి దిగి.. అద్దాలు పగులగొట్టారు. 56వ డివిజన్ వివేకానంద కాలనీలో శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వివేకానంద కాలనీకి చెందిన ఓ కారు హనుమకొండ వైపునకు బయల్దేరింది. అప్పటికే చిత్తుగా మద్యం సేవించిన ఉత్తరప్రదేశ్కు చెందిన ఏడుగురు వలస కూలీలు ఆ కారు అడ్డగించారు. తమకు కారు తాళం చెవి ఇవ్వమని డిమాండ్ చేశారు. అందుకు కారు డ్రైవర్ నిరాకరించడంతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో మరో యువకుడు బండరాయిని కారు అద్దాలపైకి విసరడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. స్థానికులు ఆపడానికి ప్రయత్నించగా యువకులు మరింత రెచ్చిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని యువకులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఘటన సమయంలో కారులో డ్రైవర్తోపాటు కారు యజమాని(మహిళ) ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. తులసీ రెస్టారెంట్ అండ్ బార్ను తొలగించాని, నిత్యం మద్యంప్రియులు గొడవలు చేస్తుండడంతో ఇబ్బందిగా ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కారు ఆపి అద్దాలు పగులగొట్టి హల్చల్ -
భద్రాచలానికి గోటి తలంబ్రాలు
ఖానాపురం: మండల కేంద్రంలోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో గత తొంబై రోజులుగా గోటితో ఒలిచిన తలంబ్రాలకు పూజారి పర్వతపు శివప్రసాద్శాస్త్రి ప్రత్యేక పూజలు చేశారు. గోటితో ఒలిచిన తలంబ్రాలను భద్రాచలం సీతారామచంద్ర స్వామి కల్యాణమహోత్సవానికి తరలించారు. అక్కడ ఆలయంలో తలంబ్రాలతో కలిపి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మరికొన్ని తలంబ్రాలను తీసుకొచ్చి కల్యాణ వేడుకలను చేపట్టనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ గొల్లపూడి సుబ్బారావు తెలిపారు. గూడూరు: సీతారాముల కల్యాణోత్సవంలో ఉపయోగించే గోటి తలంబ్రాలను భక్తులు శుక్రవారం గూడూరు నుంచి భద్రాచలం చేర్చారు. శ్రీరామ నవమికి ముందు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు గోటితో ఒలిచిన బియ్యాన్ని తలంబ్రాల కోసం తరలిస్తారు. ఈ క్రమంలో గూడూరు మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీనారాయణస్వామి దేవాలయ ప్రాంగణంలో హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో గత నెల 24 నుంచి భక్తులు ధాన్యాన్ని గోటితో ఒలిచే కార్యక్రమం చేపట్టారు. హిందూ జాగరణ సమితి, సేవికా సమితి మహిళలు అందరూ కలిసి గోటి తలంబ్రాలను భద్రాచల రాములవారి దేవాలయానికి చేర్చారు. హోలీ పండుగ సందర్భంగా అక్కడ రంగులు చల్లుకొని సంబురాన్ని పంచుకున్నట్లు మహిళలు తెలిపారు. -
పట్టపగలే యువకుడి దారుణ హత్య
జఫర్గఢ్: తన వ్యవసాయ బావి వద్ద ఒంటరిగా ఉన్న యువకుడిని మరో గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు కత్తితో పొడిచి చంపిన ఘటన జనగామ జిల్లా జఫర్గఢ్ మండలంలోని తీగారం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. తీగారం గ్రామానికి చెందిన గోనె యాదగిరి– ఈశ్వరమ్మ దంపతుల చిన్న కుమారుడు గోనె ప్రవీణ్ (28) ఇంటి వద్దనే ఉంటూ తండ్రితో కలసి వ్యవసాయం చేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటి వద్ద భోజనం చేసిన అనంతరం ప్రవీణ్ నీళ్లు పెట్టేందుకు గ్రామ శివారులో ఉన్న తమ వరిపొలం వద్దకు వెళ్లాడు. అప్పటికే ఇదే మండలంలోని తమ్మడపల్లి (ఐ) గ్రామానికి ఆరుగురు యువకులు మూడు ద్విచక్రవాహనాలపై తీగారం గ్రామానికి చేరుకొని ప్రవీణ్ను అనుసరించారు. పొలం వద్ద ఒంటరిగా ఉన్న ప్రవీణ్పై ఒక్కసారిగా దాడి చేసి కత్తితో కడుపులో 5 పొట్లు పొడిచి అక్కడి నుంచి బైక్లపై పరారయ్యారు. కత్తిపొట్లకు గురైన ప్రవీణ్ పెద్ద పెట్టున అరవడంతో కొద్దిదూరంలో ఉన్న సమీప బంధువులు రక్తపు మడుగులో ప్రవీణ్ను స్థానికులు, కుటుంబ సభ్యుల సాయంతో స్టేషన్ఘన్పూర్కు తరలించారు. వైద్యుల సూచనల మేరకు హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా ప్రవీణ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, యువకుడి హత్యకు దారితీసిన కారణాలు తెలియరాలేదు. హోలీ పండుగ పూట గ్రామంలో యువకుడి హత్యతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. మృతుడి తండ్రి యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునన్నట్లు ఎస్సై రామ్చరణ్ వెల్లడించారు. తీగారంలో హోలీ రోజున ఘటన భయాందోళనకు గురైన గ్రామస్తులు -
బతుకుదెరువుకోసం వచ్చి..
సంగెం: బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఓ భవననిర్మాణ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో తనువు చాలించిన విషాద ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా జిగురుమల్లి మండలం పాలేటిపాడు గ్రామానికి చెందిన కోయ బంగారు బాబు(34) తన భార్య ఆదిలక్ష్మి, ఇద్దరు ఆడపిల్లలతో కలిసి పొట్టకూటి కోసం సంగెం మండల కేంద్రంలో కొన్నేళ్లుగా ఉంటూ.. భవన నిర్మాణ తాపీమేసీ్త్రగా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం పనిపై తిమ్మాపూర్ గ్రామానికి తోటి మేసీ్త్ర ఉలవపాడుకు చెందిన పులగర శివమణి అలియాస్ మణికంఠతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లి తిరిగి సంగెంకు వస్తున్నారు. ఈక్రమంలో వరంగల్ నుంచి నెక్కొండ వైపునకు అరటిగెలలు తీసుకొచ్చేందుకు ట్రేలతో వెళ్లుతున్న బోలేరో అతివేగంగా అజాగ్రత్తగా సబ్స్టేషన్ సమీపంలో.. వీరు ప్రయాణిస్తున్న బైక్ను ఎదురుగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బంగారు బాబుకు కుడి చేయి, కాలుకు, శివమణికి కుడి చేయి, కుడికాలుకు గాయాలయ్యాయి. 108 అంబులెన్స్లో వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో బంగారుబాబు మృతి చెందగా.. శివమణి చికిత్స పొందుతున్నాడు. మృతుడి భార్య ఆదిలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. ఎంజీఎంలో పోస్టుమార్టమ్ అనంతరం బంగారుబాబు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. కాగా, ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన బోలేరో వాహనం తప్పించుకుని వెళ్లగా సీసీ కెమెరాల సాయంతో ట్రేస్ చేశామని ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మేసీ్త్ర మృతుడిది ఏపీలోని ప్రకాశం జిల్లా పాలేటిపాడు -
18, 19 తేదీల్లో ఎంబీఏ అడ్మిషన్ల కౌన్సెలింగ్
విద్యారణ్యపురి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంబీఏ హాస్పిటిల్ అండ్ హెల్త్కేర్ మేనేజ్మెంట్(హెచ్హెచ్సీఎం) అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 18, 19 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఆ వర్సిటీ అభ్యాసక సహాయ సేవా విభాగం(ఎల్ఎస్ఎస్బీ) డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీ ప్రవేశ పరీక్ష, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టీజీఐసెట్లో అర్హత సాధించిన వారికి అవకాశం ఉందన్నారు. ఆసక్తి ఉన్న వారు అంబేడ్కర్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఆయా తేదీల్లో నిర్వహించే అడ్మిషన్ల కౌన్సెలింగ్కు అర్హత పరీక్ష, ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఒరిజనల్ సర్టిఫికెట్లు ఒకసెట్ జిరాక్స్ కాపీలు, రెండు పాస్పెర్ట్ ఫొటోలతో హాజరుకావాలని సూచించారు. అంబేడ్కర్ వర్సిటీ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుని ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ కాల్వలో పడి మహిళ మృతి పర్వతగిరి: ఎస్సారెస్పీ కాల్వలో కొట్టుకుపోయి మహిళ మృతి చెందిన ఘటన శుక్రవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని హట్యతండా శివారు ఎర్రకుంట తండాలో చోటు చేసుకుంది. ఎస్సై బోగం ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఎర్రకుంటతండాకు చెందిన బాదావత్ నేజి(78) గురువారం ఉదయం దుస్తులు ఉతకడానికి ఎస్సారెస్పీ కాల్వలోకి వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడి కొట్టుకుపోయింది. శుక్రవారం ఉదయం నెక్కొండ మండలం బొల్లికొండ తండా వద్ద ఎస్సారెస్పీ కెనాల్లో శవమై తేలి కన్పించింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. భూపాలపల్లి అటవీ గ్రామాల్లో మరో పులి ? భూపాలపల్లి రూరల్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని కమలూ పూర్, రాంపూర్ గ్రామాల మధ్య ఫార్టెస్టు అధి కారులు శుక్రవారం పులి పాదముద్రలు గుర్తించారు. కాటారం, మండలం జాదారావుపేట గ్రామ పంచాయతీ పరిధిలో రఘుపల్లి అటవీ ప్రాంతంలో చెరువుకట్టపై ఈ నెల 12న ఆవుదూడను చంపి తిన్నట్లు ఆనవాళ్లు లభించాయి. పాదముద్రలు వేరేనా..? శుక్రవారం కాటారం మండలం మేడిపలి, కొత్తపల్లి గ్రామాల మీదుగా భూపాలపల్లి మండలంలోని రాంపూర్, కమలాపూర్ అటవీ గ్రామాల మధ్య పులి అడుగుజాడలను ఫారెస్టు అధికారులు గుర్తించారు. కాటారం పులి పాదముద్రలు, ఈ పులి పాదముద్రలు సరిపోకపోవడంతో మరో ఆడ పులిగా అనుమానిస్తున్నారు. కాటారం మండలంలో మగ పులి, భూపాలపల్లి మండలలో ఆడ పులి తిరుగుతున్న నేపథ్యంలో భూపాలపల్లి అటవీ గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గ్రామస్తులకు పులి కనపడిన, అటవీలో ఉచ్చులు, విద్యుత్ తీగలు అమర్చి పులులకు ప్రమాదాన్ని కలిగించినా.. కఠిన చర్యలు తప్పవని ఫారెస్టు అధికారులు హెచ్చరిస్తున్నారు. -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి ● సభాస్థలి వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్ స్టేషన్ఘన్పూర్: జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో ఈనెల 16న నిర్వహించనున్న సీఎం సభకు సంబంఽధించిన ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలో శివునిపల్లిలో వ్యవసాయ మార్కెట్ సమీపాన నిర్వహించనున్న సీఎం రేవంత్రెడ్డి సభకు సంబంధించిన సభాస్థలాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ రిజ్వాన్ బాషా శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే పార్కింగ్ స్థలాలు, తాగునీటి సౌకర్యం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, సరిపడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇతర మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సీఎం సభను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రోహిత్సింగ్, పింకేష్కుమార్, డీసీపీ రాజమహేంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పట్టుదల, ఏకాగ్రతే వారధిగా ఉద్యోగ వేట సాగించిన ఉమ్మడి జిల్లాలోని పలువురు యువత తమ లక్ష్యాన్ని ఛేదించారు. కష్టానికి ప్రతిఫలాన్ని పొంది గెలుపుబావుటా ఎగురవేశారు. పేదరికం, ఆర్థిక ఇబ్బందులను ఎదిరించి ఉన్నత ఉద్యోగాలను కై వసం చేసుకుని సత్తా చాటారు. గ్రూప్–1, గ్రూ
చిరు వ్యాపారి బిడ్డకు మూడు ఉద్యోగాలు మహబూబాబాద్ అర్బన్: మానుకోట జిల్లా కేంద్రంలోని కేసముద్రం రోడ్డులో ఆర్టీసీ బస్టాండ్ వద్ద చిన్నహోటల్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్న డోలి వెంకటేశ్వర్లు –పద్మ దంపతులు. వారి కుమారై డోలి సంధ్య గ్రూప్–3లో 450 మార్కులకు 269.9 మార్కులతో 1,125 ర్యాంక్ సాధించింది. జోనల్ స్థాయిలో బీసీ(ఏ) మహిళల విభాగంలో 2వ ర్యాంక్ సాధించింది. అయితే ఇప్పటీకే గ్రూప్–4లో ఉన్నత ర్యాంకు సాధించిన సంధ్య మానుకోట మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్గా విధుల్లో కొనసాగిస్తోంది. అదేవిధంగా ఈ నెల 11న విడుదలైన గ్రూప్–2 ఫలితాల్లో సంధ్య 600 మార్కులకు 382.4 మార్కులతో 205 ర్యాంక్ సాధించింది. రాష్ట్రస్థాయిలో మహిళల విభాగంలో 16 స్థానం, బీసీ(ఏ)లో మహిళల విభాగంలో మొదటి ర్యాంక్ సాధించారు. గ్రూప్–2లో మంచి పోస్ట్ వస్తే ఆ ఉద్యోగంలో చేరుతానని చెబుతున్న సంధ్యను తల్లిదండ్రులు, స్నేహితులు అభినందించారు. గ్రూప్–3లో సత్తా చాటిన ప్రణీత్ కొడకండ్ల: గ్రూప్–2 ఫలితాల్లో ప్రతిభను చాటుకున్న కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన చెన్న ప్రణీత్ గ్రూప్–3 ఫలితాల్లో 285 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 395 ర్యాంక్ను సాధించి సత్తా చాటాడు. 2019లో సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తి చేసిన ప్రణిత్ సివిల్స్ సాధించాలనే సంకల్పంతో ఉండగా గ్రూప్స్ నోటిఫికేషన్లు రావడంతో వాటిపై దృష్టి సాఽరించాడు. గ్రూప్–4 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 55వ ర్యాంక్ సాధించి ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్న ప్రణీత్ గ్రూప్–2 ఫలితాల్లో 388 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 138వ ర్యాంక్ సాధించడమే కాకుండా గ్రూప్–3 ఫలితాల్లోనూ ప్రతిభను చాటుకున్నాడు. నిరుపేద పద్మశాలీ కుటుంబానికి చెందిన ప్రణీత్ ఉత్తమ ర్యాంక్ పొందడంపై తల్లిదండ్రులు చెన్న సోమనారాయణ నాగలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. రెండుకు మించి ఉద్యోగాలుగ్రూప్స్లో మెరిసిన యువత -
కౌలురైతు ఆత్మహత్యాయత్నం
● చికిత్స పొందుతూ మృతిచిట్యాల: అప్పుల బాధ తట్టుకోలేక కౌలు రైతు సూర కుమారస్వామి (40) పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాంచంద్రాపూర్ గ్రామానికి చెందిన సూర కుమారస్వామి నాలుగు సంవత్సరాల క్రితం గుంటూరుపల్లి గ్రామానికి వచ్చి నివాసం ఉంటున్నాడు. పెద్ద కుమార్తెకు పెండ్లి చేశాడు. మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని మిరప పంట వేశాడు. కుమార్తె పెండ్లికి తెచ్చిన అప్పుతోపాటు మూడు ఎకరాలలో వేసిన పంట సక్రమంగా పండకపోవడంతో రూ.12లక్షల వరకు అప్పులు అయ్యా యి. దీంతో గత నెల 19న పురుగుల మందు తాగా డు. కుటుంబసభ్యులు పరకాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం ఎంజీఎంకు తరలించారు. పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందినట్లు ఎస్సై ఈశ్వరయ్య పేర్కొన్నారు. మృతుడి భార్య మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వెంకటేశ్వర్లపల్లిలో..
రేగొండ: పంట చేనుకు నీరు పెట్టడానికి వెళ్లి విద్యుత్షాక్తో ఓ రైతు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండలంలోని వెంకటేశ్వర్లపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్వర్లపల్లికి చెందిన ఇట్టబోయిన రవి (49) గురువారం అర్ధరాత్రి తన వ్యవసాయ బోరు వద్ద కరెంటు మోటార్ను ఆన్ చేయడానికి వెళ్లి విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. శుక్రవారం ఉదయం అటువైపు వెళ్లిన రైతులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య రజిత, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్ కుమార్ తెలిపారు. -
కోచింగ్ లేకుండానే..
జనగామ రూరల్: జనగామ మండలం సిద్దంకి గ్రామానికి చెందిన సుంకరి కేదారేశ్వర్రెడ్డి ఎలాంటి కోచింగ్లేకుండానే ఇటీవల విడుదలైన గ్రూప్– 2 ఫలితాల్లో 112వ ర్యాంక్, గ్రూప్–3 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంక్ సాధించి సత్తాచాటాడు. సిద్దంకి గ్రామానికి చెందిన సుంకరి శ్రీనివాస్రెడ్డి కుమారుడు కేదారేశ్వర్రెడ్డి సివిల్ సప్లయీస్ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూనే గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యాడు. ఈ సందర్భంగా కేదారేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. ఎలాంటి కోచింగ్ లేకుండానే గ్రూప్– 2లో ఉత్తమ ర్యాంక్ రావడం సంతోషంగా ఉందన్నారు. కేదారేశ్వర్రెడ్డి రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
ముదిరాజ్ల సంక్షేమానికి కృషి
నెహ్రూసెంటర్: రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ల సంక్షేమానికి కృషి చేస్తానని తెలంగాణ ముదిరాజ్ కో–ఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రాంచంద్రాపురం కాలనీలో ముదిరా జ్, మత్స్యకారులతో కలిసి శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాజికవర్గాల బలోపేతం కోసం కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి చొరవ చూపుతున్నట్లు తెలిపారు. ఇటీవల జిల్లాలో కురిసిన అతిభారీ వర్షాల కారణంగా కోట్లాది రూ పాయల విలువైన మత్స్యసంపదను కోల్పోయి నష్టపోయిన ముదిరాజ్ మత్స్యకారులను ఆదుకునేందు కు కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో గల ముదిరాజ్ పెద్దలతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేలా సీ ఎం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. గత ప్రభు త్వ విధానాల వల్ల కోకాపేటలో ముదిరాజ్లకు ఇచ్చిన ముదిరాజ్ల ఆత్మగౌరవ భవన నిర్మా ణం స్థల వివాదం కారణంగా నిలిచిపోయిందన్నా రు. మహిళా మత్స్యకార్మికులకు ఆర్థిక భరోసా క ల్పించేలా కార్యచరణ రూపొందిస్తామన్నారు. సమావేశంలో తెలంగాణ ఫిషర్మెన్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొడుగు శ్రీనివాస్, తెలంగాణ మహజన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అల్లుడు జగన్, సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి దుండి వెంకటేశ్వర్లు, పిడుగు వెంకన్న, పెద్ది సైదులు, సందీప్, బాలాజీ, ఉప్పలయ్య, గోపాల్, వెంకన్న పాల్గొన్నారు. తెలంగాణ ముదిరాజ్ కో–ఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ -
ప్రజలకు ఉత్తమ సేవ అందిస్తా..
● గ్రూప్–3 26వ ర్యాంకర్ అజయ్కుమార్ చిట్యాల: ప్రజలకు ఉత్తమ సర్వీస్ అందిస్తానని గ్రూప్–2 స్టేట్ 43వ ర్యాంక్ సాధించిన నల్ల అజయ్ కుమార్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల తిర్మలాపూర్ గ్రామానికి చెందిన నల్ల కోంరయ్య–నీలమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దవాడైన అజయ్ కుమార్ ఒకటి నుంచి పదో తరగతి వరకు మండల కేంద్రంలోని కాకతీయ హైస్కూల్లో చదివాడు. ఇంటర్ హనుమకొండలోని శివానీ కాలేజీలో, బీటెక్ హైదరాబాద్లో చదివాడు. 2018లో కానిస్టేబుల్ ఉద్యోగం, 2024లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో ఇటీవల విడుదలైన గ్రూప్– 2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 43వ ర్యాంక్, కాళేశ్వరం జోన్లో 7వ ర్యాంక్ సాధించాడు. శుక్రవారం విడుదలైన గ్రూప్–3 ఫలితాల్లో స్టేట్ 26వ ర్యాంక్ సాధించాడు. గ్రూప్–2 ద్వారా వచ్చే ఉద్యోగాన్ని ఎంపిక చేసుకుని ప్రజలకు మెరుగైన సేవలందిస్తానని చెబుతున్నాడు.. అజయ్కుమార్. -
గ్రూప్–3లో స్టేట్ 57వ ర్యాంక్
బచ్చన్నపేట : మండల కేంద్రానికి చిమ్ముల అరుణ–మల్లారెడ్డి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరి కూతురు ప్రస్తుతం జనగామ మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తుండగా.. కుమారుడు చిమ్ముల రాజశేఖర్రెడ్డి శుక్రవారం వెలువడిన గ్రూప్–3 ఫలితాల్లో రాష్ట్ర స్థాయి 57వ ర్యాంక్ సాధించారు. గ్రూప్–2 ఫలితాల్లో 423.933 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి 8వ ర్యాంక్ సాధించాడు. గతంలో రాజశేఖర్రెడ్డి వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ప్రస్తుతం గ్రూప్స్లో ఉత్తమ ర్యాంక్లు సాధించడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
అప్రమత్తత తప్పనిసరి
శనివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2025 – 8లోu● వస్తు సేవల్లో మోసాలపై జాగ్రత్త అవసరం ● కొనుగోలు చేసే సమయంలో పరిశీలన ముఖ్యం నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం తొర్రూరు: నాణ్యమైన వస్తువులు, సేవలనూ పొందడం వినియోగదారుల హక్కు. కానీ ప్రస్తుత కాలంలో మోసాలు ఎక్కువైపోయాయి. చివరికి మనం తాగే పాలు, నీళ్లలో కూడా నాణ్యత లేకుండాపోతోంది. తూకాల్లో భారీగా తేడాలు ఉంటున్నాయి. వీటిపై ఎవరైనా ప్రశ్నిస్తే, నిలదీస్తే తప్ప న్యాయం జరగడం లేదు. ఈ తరహా మోసాలను అరికట్టాలంటే వినియోగదారులే మేల్కొనాల్సిన అవసరం ఉంది. తమ హక్కులపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాగా వినియోగదారులు మోసపోకుండా అండగా వినియోగదారుల రక్షణ చట్టం ఉంది. 1986 నుంచి ఇది అమలులో ఉండగా 2019లో మెరుగులుదిద్దారు. మార్పులతో ఏర్పడిన ఈ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కథనం. చట్టం గురించి.. ● 34 ఏళ్ల నుంచి ఉన్న చట్టంలో మార్పులు చేర్పులు చేసి కొత్తగా ఏర్పాటైన రక్షణ చట్టం–2019 జూలై 20, 2020 నుంచి అమల్లోకి వచ్చింది. ● వినియోగదారుల ఫిర్యాదులు వేగంగా పరిష్కరించుకోవడానికి ఇది దోహదం చేస్తుంది. ● నూతన చట్టం ప్రకారం సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) స్థాపించారు. దీని ద్వారా వినియోగదారుల హక్కులను ప్రోత్సహిస్తూ పరిరక్షిస్తున్నారు. ● వినియోగదారుల ఫోరంను వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్గా మార్చారు. ఎక్కడ ఫిర్యాదు చేయాలంటే.. ● వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్కటే ఉంది. ● నేరుగా ఫోన్లో ఫిర్యాదు చేసే వీలు ప్రస్తుతం లేదు. ● హనుమకొండ సుబేదారిలో కమిషన్ కార్యాలయం ఉంది. ● కమిషన్ కార్యాలయంలో వినియోగదారులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. సంబంధిత రశీదు, ఇతర ఆధారాలతో ఫిర్యాదు చేస్తే న్యాయం జరుగుతుంది. ● దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న టోల్ఫ్రీ నంబర్ 180042500333 కు ఫోన్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు. కొనుగోలు విషయంలో సూచనలు.. కొనుగోలు చేస్తున్న వస్తువులు, సేవలపై గరిష్ట పరిమాణం, ఏ గ్రేడ్కు చెందినవి, వాటిలో కలిపిన పదార్థాలు, రంగులు, రసాయనాలు, ఎలా ఉపయోగించారో తెలిపే ప్రకటనను వినియోగదారులు కచ్చితంగా గమనించాలి. మందులు, ఆహార పదార్థాల చట్టం ప్రకారం అన్ని ఆహార పదార్థాల ప్యాకేజీలపై విధిగా నికర మొత్తం లేబుల్స్పై చూపాలి. వస్తువు ధర, తయారీ తేదీ, గడువు తేదీ, తయారీదారు చిరునామా, వస్తువు బరువు ముద్రించి ఉండాలి. ఉత్పత్తులపై ముద్రించిన ఎంఆర్పీపై స్టిక్కర్ అంటించి దాని ధరను మార్చి అమ్మడం జరుగుతుంది. ఈ విషయంలో కచ్చితంగా గమనించాలి. అవగాహన అవసరం కొనుగోళ్ల సందర్భంలో వినియోగదారులు అవగాహన కలిగి ఉండాలి. ఏ వస్తువు, సరుకులు కొనుగోలు చేసినా విధిగా రశీదు తీసుకోవాలి. అన్యాయం జరిగితే నష్టం పరిహారం, న్యాయం పొందడానికి ఈ రశీదు ఉపయోగపడుతుంది. బాధితులు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తే వినియోగదారుల సమాచారం కేంద్రం ద్వారా న్యాయం లభిస్తుంది. –వింజమూరి సుధాకర్, వినియోగదారుల సమాచార కేంద్రం జిల్లా కన్వీనర్ ప్రశ్నించారు.. గెలిచారు జిల్లాలోని చిన్నగూడూరుకు చెందిన రైతు రావుల రాంరెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో ఓ కంపెనీకి చెందిన ఆడమగ వరి విత్తనాలు వేశాడు. అవి నాసిరకం కావడంతో పంట పూర్తిగా పోయింది. కంపెనీ ప్రతినిధులు స్పందించకపోవడంతో వినియోగదారుల సమాచార కేంద్రాన్ని ఆశ్రయించాడు. బాధిత రైతుకు ఆ కంపెనీ రూ.5.60 లక్షల నష్ట పరిహారం చెల్లించింది. నర్సింహులపేటకు చెందిన రైతు నరసింహారెడ్డి, దాట్ల గ్రామానికి చెందిన భూపాల్రెడ్డి కూడా ఇలాంటి కంపెనీల నుంచి రూ.7 లక్షల నష్టపరిహారం పొందారు. తొర్రూరు పట్టణానికి చెందిన పందెబోయిన సురేశ్ ప్రైవేటు చిట్ఫండ్ కంపెనీలో చిట్ వేశాడు. కాలపరిమితి పూర్తయినా డబ్బులు చెల్లించకపోవడంతో ఆయన వినియోగదారుల సమాచార కేంద్రాన్ని ఆశ్రయించాడు. సదరు సంస్థకు నోటీసులు అందించి చిట్టి డబ్బులు రూ.5లక్షలు ఇప్పించి బాధితులకు న్యాయం చేశారు. ఫిర్యాదు ఎలా చేయాలంటే... ఫిర్యాదు చేసే విధానం చాలా సులభం. అలాగే దానిపై స్పందన కూడా త్వరగా ఉంటుంది. తెల్ల కాగితంపై ఫిర్యాదు వివరాలు రాసి పంపవచ్చు. న్యాయవాది అవసరం లేదు. ఫిర్యాదుదారుడైనా, అతడి ఏజెంటైనా ఫోరంలో స్వయంగా ఫిర్యాదు చేయవచ్చు. అలా వీలు కాకపోతే పోస్టు ద్వారా కూడా పంపే వీలుంది. పరిహారాన్ని బట్టి ఫోరం.. రూ.20 లక్షల వరకు జిల్లా ఫోరంలో ఫిర్యాదు చేయాలి. రూ.20 లక్షల నుంచి రూ.కోటి వరకు రాష్ట్ర కమిషన్లో... రూ.కోటి మించిన పక్షంలో జాతీయ కమిషన్కు ఫిర్యాదు చేయాలి. కొనుగోలు చేసినా లేదా నష్టం జరిగిన నాటి నుంచి రెండేళ్ల లోపు ఫిర్యాదు చేయవచ్చు. ఆలస్యానికి తగిన కారణం తెలిపితే ఆపై సంవత్సరం కూడా ఫిర్యాదు చేయవచ్చు. -
పల్లెరోడ్లకు మహర్దశ
మహబూబాబాద్ అర్బన్: వర్షంపడితే చిత్తడిగా మారుతున్న పల్లె రోడ్లకు మహర్దశ పట్టనుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్, ములుగు, ఇల్లెందు, పాలకుర్తి నియోజకవర్గాల్లోని మండలాల్లో 641 సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.33.75కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ పనులను పంచాయతీరాజ్ శాఖకు అప్పగించగా.. ఈనెలాఖరు వరకు పూర్తి చేయాల్సి ఉంది. నెలాఖరులోగా.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో పనులు చేపట్టేందుకు నిధులు విడుదల చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ నిధులను ఈనెలాఖరు వరకు వినియోగించుకొని పల్లెల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టాలి. ఒక్కో సీసీ రోడ్డుకు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నిధులు కేటాయించారు. రూ.5లక్షల లోపు నిధులు టెండర్ లేకుండా.. ఆపై నిధులకు టెండర్లు పిలవాల్సి ఉంటుంది. కాగా పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలి.. లేకుంటే నిధులు వెనక్కి వెళ్లే పరిస్థితి ఉంటుంది. జిల్లాలో మంజూరైన పనులు, నిధులు.. రూ.33 కోట్ల నిధులు మంజూరు నెలాఖరులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాల్సిందే..మండలం పనులు మంజూరైన నిధులు మహబూబాబాద్ 49 రూ. 2.45కోట్లు నెల్లికుదురు 49 రూ. 2.45కోట్లు గూడూరు 45 రూ.2.30కోట్లు కేసముద్రం 47 రూ.2.20కోట్లు మరిపెడ 54 రూ.2.80 కోట్లు చిన్నగూడూరు 21 రూ.1.10కోట్లు నర్సింహులపేట 32 రూ.1.60కోట్లు దంతాలపల్లి 32 రూ. 1.60కోట్లు డోర్నకల్ 36 రూ.2.05కోట్లు కురవి 51 రూ.2.75కోట్లు తొర్రూరు 52 రూ.2.28కోట్లు పెద్దవంగర 37 రూ.1.75కోట్లు గార్ల 40 రూ.2కోట్లు బయ్యారం 43 రూ.2.15కోట్లు కొత్తగూడ 32 రూ.1.62కోట్లు గంగారం 21 రూ.1.05కోట్లు మొత్తం 641 రూ.33.75 కోట్లు -
అంబరాన్నంటిన హోలీ సంబురాలు
మహబూబాబాద్ రూరల్ : జిల్లాలో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. చిన్నారులు, యువతీ యువకులు పెద్దలు, వృద్ధులు వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించుకున్నారు. కులమతాలకు అతీతంగా పాల్గొని నృత్యాలు చేస్తూ రంగులు పూసుకుని హోలీ ప్రత్యేకతను చాటారు. ఆడిపాడి హోలీ సంబురాలు జరుపుకున్నారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో.. హోలీ పండుగ సందర్భంగా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పోలీసు ఉన్నతాధికారులతో కలిసి డీజే పాటలకు నృత్యాలు చేసి సిబ్బందిని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్, తొర్రూరు డీఎస్పీలు తిరుపతిరావు, కృష్ణకిశోర్, జిల్లా పోలీసు కార్యాలయంలోని వివిధ విభాగాల డీఎస్పీలు మోహన్, శ్రీనివాస్, విజయ్ ప్రతాప్, సీఐలు నరేందర్, చంద్రమౌళి, సత్యనారాయణ, దేవేందర్, సర్వయ్య, రవికుమార్, రాజేష్, సూర్యప్రకాష్, రాజ్ కుమార్, గణేష్, ఆర్ఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో వేడుకలు -
సభా వేదిక దేవన్నపేట!
సాక్షిప్రతినిధి, వరంగల్ : బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తలపెట్టిన రజతోత్సవ సభకు గ్రేటర్ వరంగల్ పరిధి దేవన్నపేట శివారును నాయకులు ఎంపిక చేశారు. 14 ఏళ్ల అవిశ్రాంత పోరాటాన్ని, పదేండ్ల పరిపాలనపై ఏడాది పాటు వేడుకలు నిర్వహించాలని భావించిన బీఆర్ఎస్.. వరంగల్ సభ ద్వారా ప్రారంభించాలని తలపెట్టింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ పరిధి ఉనికిచర్ల, బట్టుపల్లి, దేవన్నపేట ప్రాంతాల్లో మాజీ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో ముఖ్యనేతలు ఈనెల 10న స్థలపరిశీలన చేశారు. అయితే ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా.. సభకు హాజర య్యే జనం ఈజీగా వచ్చిపోయేలా ఉండాలని భా వించి శుక్రవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ ఎ మ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, దాస్యం వినయ్భాస్కర్, పెద్ది సుదర్శన్రెడ్డి, నన్నపునేని నరేందర్, ముఖ్యనేతలు ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ తదితరులతో కలిసి హరీశ్రావు స్థల పరిశీలన చేశారు. ఎన్హెచ్ పక్కన ఉండటంతో పాటు నలుమూలల నుంచి వాహనాల ద్వారా వచ్చిపోయేందుకు దేవన్నపేట అనువుగా ఉంటుందని భావించి అధి నేత కేసీఆర్ సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. చివరకు దేవన్నపేటను ఫైనల్ చేసినట్లుగా చెప్పా రు. స్థలపరిశీలన అనంతరం హరీశ్రావు సుమా రు గంటపాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో మాట్లాడారు. 15 లక్షల మందితో భారీ సభ నిర్వహించడానికి నాయకత్వం ఏర్పాట్లు చేస్తున్నది. సభ సక్సెస్ కోసం ఉమ్మడి వరంగల్కు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో కేసీఆర్ భేటీ కానున్నారని సమాచారం. బీఆర్ఎస్ రజతోత్సవ సభ స్థలం పరిశీలించిన మాజీ మంత్రి హరీశ్ తదితరులు సభ సక్సెస్కు త్వరలో కమిటీలు.. ఉమ్మడి జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ? -
రైల్వేస్టేషన్కు విద్యుత్కాంతులు
మహబూబాబాద్ రూరల్: అమృత్ భారత్ పథకంలో భాగంగా మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ఆధునికీకరణ పనులు జరుగుతున్నారు. పనులు పూర్తికానున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి రైల్వే స్టేషన్ ఒకటో నంబరు ప్లాట్ ఫాం వైపున ప్రధాన ద్వారం పరిసరాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించగా కొత్త శోభను సంతరించుకుంది. 18, 19 తేదీల్లో జాతీయ సదస్సు కేయూ క్యాంపస్: కేయూలోని ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఈనెల 18, 19 తేదీల్లో రెండు రోజులపాటు జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ‘75 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్–మైల్ స్టోన్స్ ఇష్యూస్ అండ్ చాలెంజెస్’ అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు కేయూ ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ టి.రాజమణి ఒక ప్రకటనలో తెలిపారు. సదస్సు ప్రారంభోత్సవానికి హైకోర్టు పూర్వపు జడ్జి, ప్రస్తుత మహాదాయి వాటర్ ట్రిబ్యూనల్ జడ్జి పీఎస్ నారాయణ, తెలంగాణ హ్యూమన్ రైట్స్ పూర్వపు చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం హాజరవుతారని పేర్కొన్నారు. ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలి.. హన్మకొండ: వినియోగదారులు ప్రశ్నించేతత్వాన్ని అలవాటు చేసుకోవాలని దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి అధ్యక్షుడు, సీసీఐ సీనియర్ సెక్రటరీ డాక్టర్ పల్లెపాడు దామోదర్ అన్నారు. వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హనుమకొండ ఎకై ్సజ్ కాలనీలో జిల్లా వినియోగదారుల సలహా సంఘం ఆధ్వర్యంలో వినియోగదారుల చైతన్య సదస్సు నిర్వహించారు. సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఏ వస్తువు కొన్నా.. ఒరిజినల్ బిల్లులు తీసుకోవాలన్నారు. ఉత్పత్తిదారుడు ఇచ్చే గ్యారెంటీ, వారంటీ కార్డులను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని సూచించారు. వస్తువుల్లో నాణ్యతా లోపం ఉన్నప్పుడు వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లో ఫిర్యాదు చేసి న్యాయం పొందాలన్నారు. నేడు, రేపు రాష్ట్రస్థాయి టెన్నికాయిట్ పోటీలు వరంగల్ స్పోర్ట్స్: తెలంగాణ రాష్ట్ర 10వ టెన్నీకాయిట్ మెన్ అండ్ ఉమెన్ చాంపియన్షిప్ ఈ నెల 15, 16వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు టెన్నికాయిట్ అసోసియేషన్ హనుమకొండ, వరంగల్ జిల్లాల కార్యదర్శులు అలువాల రాజ్కుమార్, గోకారపు శ్యాంకుమార్ తెలిపారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు 300 మంది క్రీడాకారులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఇందులో గెలుపొందిన జట్లు ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. శనివారం సాయంత్రం ప్రారంభంకానున్న పోటీలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, విశిష్ట అతిథిగా కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, మాజీ ఎంపీ పసునూరి దయాకర్, కాంగ్రె్స్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, హనుమకొండ ఏసీపీ దేవేందర్రెడ్డి తదితరులు హాజరవుతారని వారు వివరించారు. -
వంట మనిషి ఇంట్లోనే బడి
కేసముద్రం: విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండిపెట్టే వంట మనిషి ఇల్లే ప్రభుత్వ పాఠశాలగా మారింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పరిధిలోని బ్రహ్మంగారి తండాలో 2001లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. సొంత భవ నం లేక నాటి నుంచి తండాలోని పలువురి ఇళ్లను అద్దెకు తీసుకుంటూ ఉపాధ్యా యులు బడి నడిపిస్తూ వచ్చారు. మొదట్లో స్కూల్లో 60 మంది విద్యార్థులు ఉండగా.. అద్దె ఇళ్లలో కనీస సౌకర్యాలు లేక సంఖ్య తగ్గుతూ 18 మందికి చేరింది.ఇద్దరు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తి స్తున్నారు. గత ఏడాది బడి నడిపించడానికి తండాలో అద్దెకు ఇల్లు దొరకలేదు. దీంతో పిల్లల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్పథంతో మధ్యాహ్నం భోజ నం వండిపెట్టే వంటమనిషి వినోద తన ఇంట్లో పాఠశాల నడిపించడానికి అంగీకరించింది. ఇంటి ఆవరణలోని రేకుల షెడ్డుకు చుట్టూరా పరదా కట్టి పిల్లలకు విద్యా బోధన చేస్తున్నారు. ఎండతీవ్రతకు రేకుల షెడ్డు కింద కూర్చున్న పిల్లలు అల్లాడి పోతున్నారు. టాయిలెట్లు కూడా లేకపోవ డంతో ఇబ్బందులు పడుతు న్నారు. ఇదిలా ఉండగా ‘మన ఊరు– మన బడి’ కింద పాఠశాలకు భవనం మంజూరైనా పిల్లర్ల వరకే నిర్మాణం జరిగింది. -
కాజీపేట మీదుగా ‘భారత్ గౌరవ్’ స్పెషల్ ట్రైన్
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ మీదుగా ‘భారత్ గౌరవ్’ సప్త జ్యోతిర్లింగ దర్శన స్పెషల్ ట్రైన్ యాత్ర ప్రారంభం కానున్నట్లు ఐఆర్సీటీసీ జాయింట్ జనరల్ మేనేజర్ కిశోర్ గురువారం తెలిపారు. ఏప్రిల్ 8వ తేదీన ఐఆర్సీటీసీ సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర విజయవాడలో రాత్రి 9 గంటలకు ప్రారంభమై ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్, నిజామాబాద్, నాందేడ్ మీదుగా ఉజ్జయినికి చేరుతుందన్నారు. ఉజ్జయిని మహాకాళేశ్వర్, ద్వారకా, నాగేశ్వర్, సోమనాథ్, భీమశంకర్, త్రయంబకేశ్వర్, గృశ్నేశ్వర్ జ్యోతిర్లింగాలను సందర్శన చేస్తారని తెలిపారు. ఏప్రిల్ 18వ తేదీన తిరుగు ప్రయాణం ఉంటుందన్నారు. ఈ యాత్రలో భోజనం, హోటల్ గదులు, సెక్యూరిటీతో కూడిన ప్రయాణం ఉంటుందన్నారు. టికెట్ల ధర నాన్ ఏసీ రూ.20,980, థర్డ్ ఏసీ రూ.33,735, సెకండ్ ఏసి రూ.44,375 ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని తెలుగు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు ఐఆర్సీటీసీటీఓయూఆర్ఐఎస్ఎం.కం లేదా 928030712, 9281030749 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. పేద విద్యార్థి కష్టానికి దక్కిన ఫలితం కురవి: నాన్న చిన్న తనంలోనే చనిపోయాడు.. అమ్మ కూలీ పనులు చేసి కొడుకును చదివించింది. అమ్మ పడిన కష్టాన్ని చిన్న తనం నుంచే చూసిన కొడుకు క్రమశిక్షణతో చదువుకున్నాడు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రెండు ఉద్యోగాలను ఒకే సారి దక్కించుకుని తల్లి కలను నెరవేర్చడంతోపాటు తాను పడిన కష్టానికి తగిన ఫలితం పొందాడు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదనపల్లి శివారు బీబీనాయక్తండా జీపీ పరిధి భూక్య తండాకు చెందిన భూక్య పవన్. భూక్య పార్వతి, (వెంకన్న, లేట్) కుమారుడు పవన్ గురువారం విడుదలైన ఎస్సెస్సీ, సీజీఎల్ ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించాడు. ఎస్సెస్సీలో ఎంటీఎస్(మల్టీ టాస్కింగ్ స్టాప్), సీజీఎల్లో టాక్స్ అసిస్టెంట్(సీబీఐసీ సెంట్రల్బోర్డ్ ఆఫ్ టాక్స్స్ అండ్ కస్టమ్స్) ఉద్యోగాలు వచ్చాయి. పవన్ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బీబీనాయక్ తండా ప్రాథమిక పాఠశాలలో, 6 నుంచి 10 తరగతి వరకు చింతపల్లి జెడ్పీ హైస్కూల్, ఇంటర్మీడియట్ మహబూబాబాద్ ప్రభుత్వ కాలేజీ, డిగ్రీ మానుకోట నలంద కాలేజీలో చదువుకున్నాడు. 18 కిలోల ఎండు గంజాయి స్వాధీనం ● ఇద్దరు మహారాష్ట్ర వ్యక్తుల అరెస్ట్ వరంగల్: వరంగల్ రైల్వేస్టేషన్ వద్ద గురువారం మహారాష్ట్రకు చెందిన షేక్ సాధిక్, షేక్ మక్సుద్ వద్ద నుంచి రూ.9లక్షల విలువైన 18కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ షుకుర్ తెలిపారు. రైల్వే స్టేషన్ వద్ద రెండు బ్యాగులతో ఇద్దరు వ్యక్తులు పోలీస్ వాహనాన్ని చూసి పారిపోయే ప్రయత్నం చేయగా పటుకుని తనిఖీ చేయగా గంజాయి లభించిందన్నారు. విచారించగా వరంగల్ రైల్వే స్టేషన్లో అమ్మడానికి వచ్చినట్లు తెలిపారని, దీంతో వీరిద్దరిని అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
ప్రపంచ శాంతి కోసం ప్రార్థించాలి
కాజీపేట రూరల్ : ప్రపంచ శాంతి స్థాపనకు ప్రార్థించాలని ఓరుగల్లు పీఠకాపరి, విశాఖ అగ్రపీఠకాపరి బిషప్ ఉడుముల బాల అన్నారు. ఫాతిమామాత ఉత్సవాల ముగింపులో భాగంగా హనుమకొండ జిల్లా కాజీపేట కేథిడ్రల్ చర్చి ప్రాంగణంలో గురువారం బిషప్ ఉడుముల బాల సమిష్టి దివ్యబలిపూజ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి ప్రపంచయుద్ధాన్ని నిలిపివేసింది ఫాతిమామాతేనని, ఆమెను ప్రార్థించి శాంతి స్థాపనకు కృషి చేయాలని కోరారు. ఆఽధ్యాత్మికతో చేసే ప్రార్థన ఎన్నో ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నారు. ఫాదర్ ఆశీర్వాదం దివ్యబలిపూజతో ఉత్సవాలు ముగిశాయి. ఈ ఉత్సవాల సందర్శంగా నిర్వహించిన బైబిల్ క్విజ్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కేథిడ్రల్ చర్చి అధ్యక్ష, కార్యదర్శులు బొక్క దయాసాగర్, టామి, అల్లం ప్రకాశ్రెడ్డి, ఫాదర్లు కాసుమర్రెడ్డి, జి.అనుకిరణ్, కె.జోసెఫ్, విజయపాల్, తాటికొండ జోసెఫ్, జి.నవీన్, ఉత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కొడుకుపెళ్లి కావడం లేదని మనస్తాపంతో.. ఓరుగల్లు పీఠకాపరి బిషప్ ఉడుముల బాల ముగిసిన ఫాతిమామాత ఉత్సవాలు -
ఆగి ఉన్న ఆటోను ఢీకొన్న కారు..
● వ్యక్తి దుర్మరణం.. భట్టుపల్లిలో ఘటన మడికొండ : కారు.. ఆగి ఉన్న ఆటోను ఢీ కొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కాజీపేట మండలం భట్టుపల్లి శివారులో జరిగింది. మడికొండ ఇన్స్పెక్టర్ కిషన్ కథనం ప్రకారం.. ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలకు చెందిన రాపోలు శ్రీనివాస్ (46)తన భార్య రమాదేవితో కలిసి వరంగల్కు వెళ్లి ఆటోలో స్వగ్రామానికి వస్తున్నారు. భట్టుపల్లి మూడుచింతల వద్ద ఆటోను ఆపి కూల్డ్రింక్ తాగుతుండగా వరంగల్ నుంచి వస్తున్న కారు.. ఆటోను ఢీకొంది. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారు ఆపకుండా వెళ్లడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఇన్స్పెక్టర్ కిషన్ సిబ్బందిని కడిపికొండ, తరాలపల్లి గ్రామాలకు పంపించి వెతికించారు. తరాలపల్లి వద్ద కారు ముందు భాగం ధ్వంసమై ఉండడం గమనించి అందులో ఉన్న దామెర మండలం పులుకుర్తికి చెందిన గుర్రాల దినేశ్ను అదుపులోకి తీసుకున్నారు. భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. -
మాజీ ప్రిన్సిపాల్కు షోకాజ్ నోటీస్ జారీ
కేయూ విద్యా కళాశాలలో అవకతవకలు ● రూ. 8 లక్షలకు పైగా మాజీ ప్రిన్సిపాల్ చేతివాటం ● గుట్టు రట్టు కావడంతో మళ్లీ అకౌంట్లో జమ ● షోకాజ్ నోటీస్ జారీ చేసిన రిజిస్ట్రార్కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ విద్యా కళాశాలలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని కొంతకాలంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. ఆ కళాశాలలో రెగ్యులర్ ప్రొఫెసర్లు ఉద్యోగ విరమణ పొందగా ఉన్న ఒక్క రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ విజయలత కొంత కాలం క్రితమే హైదరాబాద్లోని ఇఫ్లూ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్గా నియామకమైంది. దీంతో రెండున్నరేళ్ల క్రితం అదే కళాశాలలో పనిచేస్తున్న ఓ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్కు కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్గా, బీఓఎస్గా రెండు బాధ్యతలు అప్పగించారు. దీంతో అందొచ్చిన అవకాశాన్ని ఆసరా చేసుకున్న సదరు ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ అవకతవకలకు పాల్ప డుతున్నారని కొన్నినెలల క్రితమే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో యూనివర్సిటీ అధికారులు ఆయనను ఆ బాధ్యతల నుంచి తొలగించగా ఆయన మళ్లీ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో కళాశాలలోని బీఓ ఎస్ అకౌంట్లోని రూ. 8 లక్షలకుపైగా డబ్బును ప్రిన్సిపాల్, బీఓఎస్గా బాధ్యతలు నిర్వర్తించిన ఆ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ హాంఫట్ చేశారనే అంశం యూనివర్సిటీ అధికారుల దృష్టికి వెళ్లింది. ఆ విద్యా కళాశాలలో ప్రత్యేకంగా బీఓఎస్ అకౌంట్ కేయూ పరిధిలోని ఏ కాలేజీల్లో లేని విధంగా క్యాంపస్లోని విద్యా కళాశాలలో ప్రత్యేకంగా బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్( బీఓఎస్) పేర బ్యాంకులో అకౌంట్ తీసి వినియోగిస్తున్నారనే విషయం ఇప్పుడు వెల్లడియింది. ఏ నిధులు జమచేయిస్తున్నారనే విషయంపై స్పష్టత లేకున్నా మొత్తానికి అందులో రూ. 8లక్షలకు పైగా ఉండగా ఆ డబ్బును ప్రిన్సిపాల్గా, బీఓఎస్గా బాధ్యతలు నిర్వర్తించిన ఆ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ వినియోగించుకున్నారని తాజాగా వెలుగు చూసింది. మాజీ ప్రిన్సిపాల్ గుట్టు ఇలా రట్టు.. కేయూలో విద్యా కళాశాలలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ను ప్రిన్సిపాల్ బాధ్యతల నుంచి తొలగించాక ప్రొఫెసర్ వి. రామచంద్రంను ఆ కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్గా, ఇఫ్లూ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ విజయలతను విద్యా కళాశాల బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్పర్సన్గా నియమించారు. దీంతో ఆమె ఫిబ్రవరి 1న బీఓఎస్గా బాధ్యతలు స్వీకరించారు. బీఓఎస్ అకౌంట్ గురించి ఆమె.. సదరు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ను వివరాలు అడగగా తెలియజేసేందుకు జాప్యం చేశారు. దీంతో ఆమె.. వీసీ ప్రతాప్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. ఇటీవలే కేయూ సోషల్ సైన్స్డీన్ మనోహర్ను విద్యాకళాశాలకు ఇన్చార్జ్ ప్రిన్సిపాల్గా నియమించారు. దీంతో ఆయన బాధ్యతలు స్వీకరించాక ఆ కళాశాలలోని పలు అవకతవకలపై ఆరాతీసినట్లు సమాచారం. బీఓఎస్ అకౌంట్లోని డబ్బులు కూడా అప్పటి బీఓఎస్గా బాధ్యతలు నిర్వర్తించిన ఆ కాంట్రాక్టు ప్రొఫెసర్ వినియోగించుకున్నట్లు గుర్తించారని సమాచారం. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. దీంతో తనపై చర్యలు తీసుకుంటారని భావించిన అవతకవకలకు పాల్పడిన ఆ కాంట్రాక్టు ప్రొఫెసర్ కొద్దిరోజుల క్రితమే తాను బీఓఎస్ అకౌంట్ నుంచి తీసుకున్న డబ్బులను తిరిగి మళ్లీ కేయూ రిజిస్ట్రార్ ఫండ్ అకౌంట్లోకి జమచేశారు. ఈ విషయాన్ని ఇటీవల అధికారుల దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. బీఓఎస్ అకౌంట్ నిధులు వినియోగించుకోవాలంటే వీసీ అప్రూవల్ మేరకు వ్యయం చేయాల్సింటుంది. సొంతానికి వినియోగించుకోకూడదు. ఇప్పుడు వర్సిటీలో ఇది హాట్టాపిక్గామారింది. కేయూ విద్యాకళాశాల మాజీ ప్రిన్సిపాల్, కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్కు కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం రెండు రోజుల క్రితం షోకాజ్ నోటీస్ జారీచేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కాగా, సదరు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ వ్యవహారంపై అధికారులు విచారణ కమిటీ వేస్తారా లేదా అతడిపై చర్యలు తీసుకుంటారా అనే అంశం యూనివర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు రిజిస్ట్రార్ వి. రామచంద్రంను గురువారం ‘సాక్షి’ వివరణ కోరగా ఆ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ బీఓఎస్ అకౌంట్ రూ. 8.50లక్షలు నుంచి తీసుకున్నారనే విషయం వెలుగు చూసిందన్నారు. రూ. 8.75లక్షలు రిజిస్ట్రార్ ఫండ్ అకౌంట్లోకి జమచేశారని తన దృష్టికి వచ్చిందన్నారు. రూ. 25 వేలు వడ్డీ చెల్లించానని కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ చెబుతున్నారన్నారు. ఇప్పటికే షోకాజ్ నోటీస్ జారీచేశాం.. అతడు ఇచ్చే వివరణను బట్టి చర్యలు ఉంటాయన్నారు. -
టెక్నాలజీతో మార్పులు అనివార్యం
● కేయూ మాజీ వీసీ వెంకటరత్నం కేయూ క్యాంపస్: టెక్నాలజీతో మార్పులు అనివార్యమని, టెక్నాలజీని స్వాగతించినప్పుడే వ్యాపార సంస్థల మనుగడ సాధ్యమని కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ బి. వెంకటరత్నం అన్నారు. కేయూలోని కామర్స్అండ్బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో ‘న్యూహరిజన్స్ ఇన్కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ డ్యూరింగ్ 21ఫస్ట్ సెంచరీ చాలెంజెస్ అండ్ ఆపార్చునిటీస్’ అనే అంశంపై రెండురోజులుగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సు గురువారం సాయంత్రం ముగిసింది. ఈ ముగింపు సభలో వెంకటరత్నం ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఫైనాన్షియల్ సెక్టార్లో మార్పులు చాలా ప్రభావం చూపాయన్నారు. మార్పుతోపాటే వచ్చే అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు. అన్ని అడ్డంకులు ఎదుర్కొవాలన్నారు. వ్యాపార నిర్వహణ సులభమైనప్పటికీ విలువలతోకూడిన ఆ వ్యాపార ప్రపంచం అవసరమన్నారు. విద్యార్థులు నైపుణ్యాలపై దృష్టిసారించాలన్నారు. గౌరవ అతిథి కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం మాట్లాడుతూ డిజిటల్ మార్కెటింగ్ విస్తృత అవకాశాలు అందించిందన్నారు. ఇ–కామర్స్ లావాదేవీలు పెరిగాయన్నారు. ఉత్పాదకత, ఉద్యోగిత పెరిగిందన్నారు. వినియోగదారుడు కేంద్రంగా వ్యాపార వ్యవస్థ ఉందన్నారు. సదస్సులో ఆ కళాశాల ప్రిన్సిపాల్ పి. అమరవేణి, ఆచార్యులు నర్సింహాచారి, పి. వరలక్ష్మి, రాజేందర్, నిరంజన్, శ్రీనివాస్, ఎం. గిరిప్రసాద్ మాట్లాడారు. మోడరేటర్లుగా ఇ. రాజు, సాయిశరణ్, ఎం. కనకయ్య వ్యవహరించారు. -
హోలీ.. ఆనందాల కేళి
మహబూబాబాద్ రూరల్: హోలీ పండుగ అంటేనే సప్తవర్ణ శోభితం.. ప్రకృతిలో లభించే వివిధ రకాల చెట్ల పూలనుంచి తయారు చేసిన రంగులను చల్లుకుంటూ వసంత రుతువు ప్రారంభంలో చేసుకునే పండుగ. ఈ పండుగలో వివిధ కృత్రిమ రసాయనిక ఎరువులు వాడడం వల్ల దుష్ఫలితాలు కలిగే ప్రమాదం ఉంది. అందుకే రసాయన రంగులు పులుముకోకుండా సహజసిద్ధ కలర్లే చల్లుకుని పండగును ఆనందంగా జరుపుకోవాలని అధికారులు, పర్యావరణవేత్తలు కోరుతున్నారు. ● కృత్రిమ రంగు.. నలుపులో లెడ్ ఆకై ్సడ్ మూత్ర పిండాల వైఫల్యాలకు దారితీస్తుంది. ● కృత్రిమ ఆకుపచ్చ రంగు.. కాపర్ సల్ఫేట్ కంటి దురద, వాపు వైఫల్యాలకు దారితీస్తుంది. ● వెండి రంగు.. అల్యూమినియం బ్రోమైడ్ క్యాన్సర్ కారకం. ● నీలి రంగు.. పుసియన్బ్లూ చర్మ సంబంధ వ్యాధులు, మెర్క్యూరీ సల్ఫేట్ (ఎరుపు) క్యాన్సర్కు కారణమవుతాయి. ● పౌడర్లు, గులాల్.. లెడ్, బ్రోమియం, నికెల్, మెర్క్యురీ, కాపర్, జింక్, వినిడికి లోపం, ఎలర్జీ, ఆయసం మొదలగు దుష్పలితాలకు దారితీస్తాయి. ముఖ్యంగా యువత ఈ పండుగను సెలబ్రేట్ చేసుకునే తీరుతో ఆరోగ్యం మరింత దెబ్బతినే అవకాశం ఉంది. ఈ రంగులు చల్లుకుని చెరువులు, కుంటలు, సెలయేర్లలో స్నానాలు చేయడం వల్ల ఈ విషపూరిత రసాయనాలు అందులో కలిసి అనేక జీవజాతులు నాశనం అవుతున్నాయి. రంగులు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తతో వ్యవహరించాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల పట్ల మరీ జాగ్రత్తగా ఉండాలి. ● సహజ రంగుల తయారీ ఇలా.. ● ఎరుపు రంగు కోసం ప్రకృతిలో లభించే బీట్రూట్, మొదుగు పూలు, గులాబీ, మందారం వాడాలి. ● పసుపు రంగు కోసం పసుపు, ఆకుపచ్చ రంగు కోసం ఆకుకూరల మిశ్రమం ఇలా సహజ రంగులను వాడడం మనకే కాదు పర్యావరణానికి కూ డా మంచిది. ఇవి ఇంట్లోనే తయారు చేసుకోవ చ్చు. సహజ రంగుల్లో లభించే యాంటీ యాక్సిడెంట్లు చర్మవ్యాధులను నియంత్రించి, చర్మం మృదువుగా, తేజోవంతంగా తయారవుతుంది.రసాయన రంగులు వద్దు.. సహజసిద్ధ కలర్లే ముద్దు నేడు హోలీ పండుగ సహజ సిద్ధ రంగులు వాడాలి సహజ సిద్ధంగా తయారు చేసిన రంగులనే వాడాలి. ప్రజలు రసాయన రంగులు చల్లడం మానుకుని అనారోగ్యంగా ఉండాలి. హోలీ పండుగను పురస్కరించుకుని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతీ ఏడాది ప్రజల్లో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా నెహ్రూ సెంటరులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. – లింగంపల్లి దయానంద్, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కల్చరల్ సెక్రటరీ పర్యావరణాన్ని కాపాడాలి ప్రకృతిలో లభించే పూ లు, ఆకులు, ఇతరత్రా వా టితో తయారయ్యే రంగులను వినియోగించి ఆరో గ్యాన్ని కాపాడుకోవాలి. పర్యావరణాన్ని కూడా కా పాడిన వారమవుతాం. హోలీ వేడుకల్లో సహజరంగులనే వాడాలి. రసాయన రంగులు కళ్లలో పడితే కంటి చూపు దెబ్బతింటుంది. – వూరె గురునాథరావు, దిశ సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపకుడు -
అతిగా మద్యం సేవించి యువకుడి మృతి
గార్ల: అతిగా మద్యం సేవించి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం గార్ల సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. ఎస్సై ఎస్కె.. రియాజ్పాషా కథనం ప్రకారం.. ఏపీలోని అంబేడ్కర్ జిల్లాకు చెందిన మాకి శ్రీనివాస్(35) గార్ల మండలం బుద్దారం పంచాయతీ పరిధిలో కొనసాగుతున్న సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ వద్ద కూలీ పనులకు వచ్చాడు. నాలుగు రోజుల నుంచి పనికి వెళ్లకుండా.. భోజనం చేయకుండా నిత్యం మద్యం సేవిస్తున్నాడు. దీంతో నీరసంతో కుప్పకూలాడు. తోటి కూలీలు శ్రీనివాస్ను హుటాహుటిన 108లో గార్ల సీహెచ్సీకి తరలించారు. వైద్యులు పరీక్షించి శ్రీనివాస్ అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి తమ్ముడు నాగభూషణం ఫిర్యాదు మేరకు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. -
బస్సులో వెళ్లినా బతికేవారేమో!
ఖానాపురం: అమ్మా, పెద్దమ్మా.. బస్సులో వెళ్లినా బతికేవారేమో.. లోపలికి వెళ్తాం.. దేవాలయం వద్ద కారు ఆపమన్నప్పుడు ఆపినా బతికేవారేమో అంటూ మృతదేహాల మీద పడి కుమారులు, కుమార్తె రోదించిన తీరు పలువురిని కంటతడికి గురి చేసింది. టైర్ పగిలి కారు పల్టీకొట్టి డివైడర్ను ఢీకొన్న ప్ర మాదంలో ఇద్దరు వృద్ధురాళ్లు మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రం శివారులో చోటుచేసుకుంది. ఎస్సై రఘుపతి కథ నం ప్రకారం.. ఖిలావరంగల్కు చెందిన ఏసిరెడ్డి యశోద(80), బోలుగొడ్డు మాణిక్యమ్మ(78) అక్కాచెల్లెలు. కుటుంబ సభ్యులతో కలిసి మహబూ బాబాద్ జిల్లా కురవిలోని తమ బంధువుల ఇంట్లో జరిగిన దశదిన కర్మ కార్యానికి వెళ్లారు. కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కాచెల్లెలు బస్సులో వెళ్దామని అనుకున్నారు. ఇదే కార్యానికి వచ్చిన యశోద కుమారుడు రమేశ్ కారులో వెళ్దామని చెప్పాడు. దీంతో యశోద, మాణిక్యమ్మ కుమార్తె అనిత, కుమారుడు హరీశ్బాబు, మాణిక్యమ్మ కారులో బయలుదేరారు. కురవిలో దేవాలయం వద్ద ఆగుదామనుకున్నారు. కానీ ఆలస్యమవుతుందనే కారణంతో ఆగకుండా ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో ఖానా పురం మండలం ఐనపల్లి శివారులోని పెట్రోల్బంక్ వద్దకు రాగానే కారు వెనుక టైర్ పగిలింది. దీంతో అదుపుత ప్పి దూసుకెళ్లే క్రమంలో మరో టైర్ పగిలి పల్టీకొడుతూ జాతీయరహదారి పక్కన ఉన్న డివైడర్ను ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న అక్కాచెల్లెలతో పాటు కారు నడుపుతున్న రమేశ్, అనిత, హరీశ్బాబుకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్సై రఘుపతి ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో యశోద, మాణిక్యమ్మ మృతిచెందారు. మృతదేహాలను నర్సంపేట ఏసీపీ కిరణ్కుమార్, నర్సంపేట రూరల్ సీఐ సా యిరమణ, ఎస్సై రఘుపతి సందర్శించి వివరాలు సేకరించి పోస్టుమార్టం తరలించారు. మృతుల కుటుంబీకుల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రఘుపతి తెలిపారు. అక్కాచెల్లెలు మృతి చెందడంతో ఖిలావరంగల్లో తీవ్ర విషాదం నెలకొంది.మాణిక్యమ్మ(ఫైల్) టైర్ పగిలి డివైడర్ను ఢీకొన్న కారు అక్కాచెల్లెలు దుర్మరణం.. ముగ్గురికి స్వల్ప గాయాలు ఖానాపురంలో ఘటన -
కిడ్నీ పదిలమేనా..?
నెహ్రూసెంటర్: మానవ శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైనవి. వాటిని రక్షించుకుంటేనే జీవితం సాఫీగా సాగుతుంది. ఈమేరకు ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా బీపీ, షుగర్, అధికంగా పెయిన్కిల్లర్ టాబ్లెట్స్ విని యోగం, పాయిజన్ తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. బీపీ, షుగర్ కంట్రోల్ చేసుకోవడం, వ్యాయామం చేయడం, సరిపడా నీరు తాగడం వల్ల కిడ్నీ సమస్యలు తగ్గించుకోవచ్చని వైద్యులు తెలుపుతున్నారు. నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. బాధితులు.. జిల్లాలో 590పైగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నవారు ఉంటారని అధికారులు చెబుతున్నారు. కిడ్నీ సమస్యలున్న వారికి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా కిడ్నీలపై అవగాహన పెంచడంతో పాటు, వాటి ప్రాముఖ్యతను చెప్పేందుకు ప్రతి ఏడాది మార్చి రెండో గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పెరుగుతున్న రోగులు... మారుతున్న కాలానుగుణంగా ఆహారపు అలవాట్లు, టాబ్లెట్ల వినియోగం, అధికంగా మద్యం సేవించడం వంటివి కిడ్నీలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో జిల్లాలో బీపీ, షుగర్ బాధితులతో పాటు కిడ్నీ బాధితులు కూడా పెరుగుతున్నట్లు వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఒక్కరు ఏడాదికోసారి ఆరోగ్య పరీక్ష తప్పకుండా చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జీజీహెచ్లో డయాలసిస్ సేవలు... జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో 80 మంది కిడ్నీ బాధితులకు డయాలసిస్ సేవలను అందజేస్తున్నారు. ఇటీవల మరో అదనపు 5 బెడ్లను ప్రారంభించడంతో డయాలసిస్ సేవలు అందుతున్నాయి. దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే బాధితులకు కొంత ఉపశమనం దక్కింది. పెరుగుతున్న రోగుల దృష్ట్యా మరికొన్ని అదనపు బెడ్స్ అందించి బాధితులకు మెరుగైన సేవలు అందించాలని కోరుతున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి ప్రతీ ఒక్కరు తమ ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించాలి. ప్రతీ రోజు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. బీపీ, షుగర్ను అదుపు చేసుకోవాలి. చనిపోయేందుకు పాయిజన్ తీసుకున్న వారిలో అధికంగా కిడ్నీ సమస్యలు ఎదురవుతున్నాయి. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. – డాక్టర్ హరిప్రసాద్, మూత్ర పిండాల వైద్య నిపుణులు రోజురోజుకూ పెరుగుతున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ సేవలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న వైద్యులు నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం -
బైక్ను తప్పించబోయి.. ట్రాలీ ఆటో బోల్తా
నడికూడ/కమలాపూర్ : కూలీలను తరలిస్తున్న ఓ ట్రాలీ ఆటో..ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. ఈ ఘటనలో 22 మందికి గాయాలయ్యాయి. ఇందులో ఐదుగురికి తీవ్రంగా, మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదం బుధవారం హనుమకొండ జిల్లా నడికూడ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, పరకాల ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరుకు చెందిన 38 మంది పరకాల మండలం మల్లక్కపేటలో కూలీకి వెళ్లారు. పనులు ముగించుకుని మధ్యాహ్నం ట్రాలీ ఆటోలో తిరిగి స్వగ్రామం బయలుదేదారు. ఈ క్ర మంలో నడికూడ మండల కేంద్రం శివారులోని పెట్రోల్ పంపు వద్ద ఇదే మండలం చర్లపల్లికి చెందిన రావుల కొమురుమల్లు అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై ట్రాలీ ఆటోకు అడ్డు రావడంతో డ్రైవర్ అతడిని తప్పించబోయి డివైడర్ను ఢీకొన్నాడు. దీంతో ట్రాలీ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాలీ ఆటోలో ప్రయాణిస్తున్న 22 మంది కూలీలకు గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులందరినీ 108లో కమలాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం తీవ్ర గాయాలైన ఐదుగురితో పాటు స్వల్ప గాయాలైన 10 మందిని 108లో వరంగల్ ఎంజీఎం తరలించారు. కాగా, ఎంజీఎంలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పరామర్శించారు. ఈ సందర్భంగా మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. 22 మందికి గాయాలు నడికూడ మండల కేంద్రంలో ఘటన -
మానవ మేధస్సుతోనే అద్భుతాలు
కేయూ క్యాంపస్: మానవమేధస్సుతోనే అద్భుతా లు సృష్టించగలమని, కృత్రిమ మేధాను ఒక టూల్గా వినియోగించుకోవాలని కాకతీయ యూనివర్సి టీ వీసీ కె. ప్రతాప్రెడ్డి అన్నారు. బుధవారం కేయూలోని కామర్స్ అండ్ బిజినెస్మేనేజ్ మెంట్ కళాశాల ఆధ్వర్యంలో ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్ సహకారంతో రెండు రోజుల జాతీయ సదస్సు ప్రా రంభ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నా రు. ‘న్యూ హారిజన్స్ ఇన్కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ డ్యూరింగ్ 21 ఫస్ట్ సెంచరీ చాలెంజెస్ అండ్ ఆపార్చునిటీస్’ అనే అంశంపై వీసీ ప్ర తాప్రెడ్డి మాట్లాడుతూ మార్పు సహజమని, అయి తే టెక్నాలజీలో వస్తున్న మార్పులు వినియోగదారుడికి లాభకారిగా ఉండాలేగాని మోసగించేలా ఉండొద్దన్నారు. ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఘన్శ్యాంసోలంకి మాట్లాడుతూ వినియోగదారుడు టె క్నాలజీ వినియోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఏపీలోని గుంటూరులోని నాగార్జున యూ నివర్సిటీ కామర్స్ విభాగం డీన్ కె. శివరామ్ మా ట్లాడుతూ కృత్రిమ మేధా నేపథ్యంలో వ్యాపార వ్యవహారాల్లో విపరీత పరిణామాలు చోటు చేసుకుంటాయన్నారు. ఓయూ రిజిస్ట్రార్ జి. నరేశ్రెడ్డి, ఇండియన్ అకౌంటింగ్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షుడు వి. అప్పారావు, వరంగల్ జెన్పాక్ట్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ రమేశ్, ఇండియన్ అకౌంటింగ్ అ సోసియేషన్ ప్రధాన కార్యదర్శి సంజయ్ బయ్యని, సెమినార్ డైరెక్టర్ అమరవేణి మాట్లాడారు. ఈ సదస్సులో కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, సీడీసీ డీన్ పి.వరలక్ష్మి, ఎస్. నర్సింహాచారి, సదస్సు కన్వీనర్ ఫణీంద్ర, కోకన్వీనర్ బి. ప్రగతి తదితరులు పాల్గొన్నారు. ఈ సదస్సులో 70 పరిశోధన పత్రాల సమర్పించబోతున్నారు. నేటి సాయంత్రం ఈ సదస్సు ముగియనుంది. కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి -
మావోయిస్టు కొరియర్లు, మిలీషియా సభ్యుల అరెస్ట్
ఏటూరునాగారం : సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు కొరియర్లు, ఇద్దరు మిలీషియా సభ్యులను అరెస్ట్ చేసినట్లు ఏటూరునాగారం ఏఎస్పీ శివ ఉపాధ్యాయ తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని ఏఎస్పీ కార్యాలయంలో వారి అరెస్ట్ చూపించి వివరాలు వెల్లడించారు. వాజేడు పోలీసులు వాజేడు మండలం మురుమురు గ్రామం వద్ద ఈనెల 11వ తేదీన సాయంత్రం వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేయగా పేలుడు సామగ్రి, కార్డెక్స్ వైర్, డిటోనేటర్స్, టిఫిన్బాక్స్, బ్యాటరీలు, కొంత మెడిసిన్తోపాటు కొన్ని వస్తువులు లభించడంతో స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అదుపులోకి తీసుకుని విచారించారు. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన ఇల్లందుల విజయ్, తీగారం గ్రామానికి చెందిన ఈరెల్లి నాగరాజు సీపీఐ మావోయిస్టు పార్టీ కొరియర్లుగా, ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం పామునూరు గ్రామం బర్లగూడెం పంచాయతీకి చెందిన మడివి పాండు, మడవి బీమా మిలీషియా సభ్యులుగా పని చేస్తున్నారు. వీరు మావో యిస్టులకు నిత్యావసర వస్తువులు, ఐఈడీల తయారీలో ఉపయోగించే పేలుడు సామగ్రిని అందించేవారు. ఎప్పటికప్పుడు పోలీసుల కదలికలను పార్టీ కి చేరవేసే వారు. ఈ నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపారు. కార్యక్రమంలో వెంకటాపురం(కె) సీఐ బండారి కుమార్, వాజేడు, వెంకటాపురం ఎస్సైలు రాజ్కుమార్, తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు. వివరాలు వెల్లడించిన ఏఎస్పీ శివం ఉపాధ్యాయ -
భద్రకాళీనగర్లో చోరీ
హసన్పర్తి: 56వ డివిజన్ గోపాలపురం భద్రకాళీ నగర్లో చోరీ జరిగింది. దుండగులు రెండిళ్లలో సుమారు 26 తులాల బంగారు ఆభరణాలు, రూ. లక్ష నగదుతో పాటు తొమ్మిది లక్షల విలువైన బాండ్లు ఎత్తుకెళ్లారు. ఈ రెండు చోరీలు ఒకే కాలనీలో జరిగాయి. పోలీసుల కథనం ప్రకారం.. భద్రకాళీనగర్కాలనీకి చెందిన పాతి ధర్మయ్య, స్రవంతి దంపతులు ప్రభుత్వ అధ్యాపకులు. ధర్మయ్య ఖమ్మంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, స్రవంతి ఐనవోలులోని కస్తూర్బాలో విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం ధర్మయ్య ఖమ్మం, స్రవంతి ఐనవోలు వెళ్లారు. అరోజు రాత్రి ఖమ్మంలో జరిగిన బంధువుల పెళ్లికి ధర్మయ్య హాజరయ్యాడు. ఇంటర్ పరీక్ష ఉండడంతో స్రవంతి ఐనవోలులోనే ఉంది. బుధవారం ఉదయం ఇద్దరూ ఇంటికి వచ్చారు. తలుపు తాళాలు ధ్వంసమై కనిపించాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న సుమారు 20 తులాల బంగారం, రూ.లక్ష నగదుతోపాటు తొమ్మిది లక్షల రూపాయల విలువైన బాండ్ల మాయమయ్యాయి. అలాగే, అదే కాలనీకి చెందిన ఆకుల వెంకటేశ్వర్ల ఇంటిలో కూడా చోరీ జరిగింది. ఆరుతులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. నాలుగు నెలల క్రితం వెంకటేశ్వర్లు దంపతులు అమెరికాకు వెళ్లారు. విషయం తెలియగానే హైదరాబాద్లో ఉంటున్న వెంకటేశ్వర్ల కూతురు హుటాహుటిన గోపాలపురానికి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకుని సీసీ ఫుటేజీ పరిశీలించారు అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ఇన్స్పెక్టర్ సుంకరి రవికుమార్ తెలిపారు. 26 తులాల బంగారు ఆభరణాలు, రూ. లక్ష నగదు మాయం -
ఎరుపెక్కుతున్న ఏనుమాముల..
వరంగల్ మార్కెట్కు పెద్దఎత్తున తరలొస్తున్న మిర్చివరంగల్: ఆసియా ఖండంలోనే అతిపెద్దయిన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఎర్రబంగారం పెద్ద ఎత్తున తరలివస్తోంది. తెలంగాణే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్న మిర్చి పంటతో మార్కెట్ ఎరుపెక్కుతోంది. మిర్చి సీజన్ డిసెంబర్లో ప్రారంభం కాగా ఫిబ్రవరి నుంచి ఊపు అందుకుంది. ఈ క్రమంలో ఈ నెల 11వ తేదీన (మంగళవారం) సుమారు 85వేల బస్తాల వరకు వచ్చినట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి. మార్చి 10వ తేదీ నాటికి 12,64, 243 బస్తాల్లో 5,05,005 క్వింటాళ్లు వచ్చింది. తేజ, వండర్హాట్, యూఎస్ 341, డీడీ, దీపిక, దేశీ, సింగిల్ పట్టీ, 1048, తాలు, ఎల్లో మిర్చితో పాటు సుమారు 20 రకాల పంట ఉత్పత్తులు కొనుగోలు చేసే వ్యాపారులు వరంగల్ మార్కెట్ పరిధిలో ఉన్నారు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రైతులు వరంగల్ మార్కెట్కు తమ పంటను తీసుకొస్తారు. వరంగల్ మార్కెట్ పరిధిలో 25 కోల్డ్స్టోరేజీలు ఉండగా ఈఏడాది మరో రెండు అందుబాటులోకి వచ్చాయి. ఈకోల్డ్స్టోరేజీల్లో సుమారు 26 లక్షల బస్తాలు నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. గిట్టుబాటు ధరలు లభించని పక్షంలో మార్కెట్ తీసుకొచ్చిన మిర్చిని ఈ కోల్డ్స్టోరేజీల్లో నిల్వ చేసుకునే సౌకర్యం ఉంది. దీంతో రైతులు వరంగల్ మార్కెట్కు అన్నిరకాల మిర్చి పంటను తరలిస్తారు. కాగా, సీజన్ చివరి నాటికి మార్కెట్కు 12 లక్షల క్వింటాళ్లు మిర్చి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.సీజన్ చివరి నాటికి మార్కెట్కు మరింత సరుకు రైతులు మిర్చి సా గు చేసినా తెగుళ్లు, ఇతర కారణాలతో పలు ప్రాంతాల్లో పంట దిగుబడులు తగ్గాయి. ఈ కారణంతోనే మార్కెట్కు గతేడాది కంటే కొంత వరకు తక్కువ వచ్చింది. సీజన్ చివరి నాటికి మార్కెట్కు గతేడాది వచ్చినంత సరుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. –గుగులోత్ రెడ్డి, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి, వరంగల్ సోమవారం నాటికి 12,64,243 బస్తాల్లో 5,05,005 క్వింటాళ్ల రాక ఖమ్మం మార్కెట్కు తరలిన ‘తేజ’ రకం? ఈ సీజన్ చివరి నాటికి 12 లక్షల క్వింటాళ్ల మిర్చి వస్తుందని అధికారుల అంచనా 2022–23 2023–24 2024–25 బస్తాలు క్వింటాళ్లు బస్తాలు క్వింటాళ్లు బస్తాలు క్వింటాళ్లు డిసెంబర్ 19,265 7,704 55,882 22,422 1,23,463 48,671 జనవరి 1,32,564 53,025 3,07,439 1,24,163 2,28,293 91,341 ఫిబ్రవరి 6,23,169 2,49,267 6,71,920 2,68,769 5,79,553 2,31,819 -
మానసిక ఆరోగ్యంపై బయోటెక్నాలజీ ప్రభావం
కేయూ క్యాంపస్ : మానవుడి మానసిక ఆరోగ్యంపై బయోటెక్నాలజీ ప్రభావం ఉంటుందని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వి. రామచంద్రం అన్నారు. కేయూలోని జూవాలజీ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల నుంచి నిర్వహిస్తున్న జాతీయ సదస్సు బుధవారం ముగిసింది. ఈ ముగింపు సభలో రిజిస్ట్రార్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సైకాలజీ, ఇమ్యూనాలజీ కలిసి పనిచేస్తేనే మానసికంగా ధైర్యంగా ఉండే వ్యక్తుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని మానసిక శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారన్నారు. బయోటెక్నాలజీ ద్వారా అభివృద్ధి చేస్తున్న కొత్త ఔషధాలు, థెరఫీలు,డిప్రెషన్ యాంగైజటీ, న్యూరోడిజెనరేటివ్ వ్యాధుల (పార్కిన్సన్,అల్జీమర్స్) చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయన్నారు. జున్యు ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మేటిక్స్ ద్వారా వ్యక్తిగత ఆరోగ్య డేటా అందుబాటులోకి రావడం ప్రైవసీ ఎథికల్ (నైతిక ) సమస్యలకు దారితీస్తుందన్నారు. ఇది వ్యక్తుల మానసిక స్థితిపై ఎలా ప్రభావం చూపుతుందనే అంశంపై సమగ్రపరిశోధనలను సమాజ అభివృద్ధికి, మానవ ఆరోగ్యపెంపునకు ఉపయోగపడేలా అన్వయించాలన్నారు. నూతన ఆవిష్కరణల కోసం శాస్త్రవేత్తలు, సైకాలజిస్టులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ జాతీయ సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ వై. వెంకయ్య, హైదరాబాద్ ఎన్ఐఎన్ ప్రొఫెసర్ రాజేందర్, యూనివర్సిటీ కాలేఈ ప్రిన్సిపాల్ టి. మనోహర్, యూజీసీ కోఆర్డినేటర్ ఆర్. మల్లికార్జున్రెడ్డి, దూరవిద్య కేందం డైరెక్టర్ బి. సురేశ్లాల్, జువాలజీ విభాగం అఽధిపతి జి. షమిత, ప్రొఫెసర్లు ఈసం నారాయణ, మామిడాల ఇస్తారి పాల్గొన్నారు. వందకుపైగా పరిశోధన పత్రాలు సమర్పించారు. కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం -
‘సుగంధ శ్రీ’ ని వినియోగించుకోవాలి
మామునూరు: రైతులు ‘సుగంధ శ్రీ’ పథకాన్ని వినియోగించుకోవాలని ఆ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ విజిష్ట సూచించారు. ఖిలావరంగల్ మండలం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో కేవీకే కోఆర్డి నేటర్ రాజన్న ఆధ్వర్యంలో సుగంధ ద్రవ్యాల సంస్థ వరంగల్ సౌజన్యంతో మూడు రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 1.67 లక్షల ఎకరాల్లో సుగంధ ద్రవ్యాల సాగు చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగు విస్తీర్ణం, అలాగే నాణ్యత ప్రమాణాలను పెంచాలన్నారు. మిరప, పసుపు, అల్లం వంటి పంటలు సాగు చేయాలని పేర్కొన్నారు. అనంతరం సుగంధద్రవ్యాల సంస్థ రూపొందించిన బుక్ లెట్ను ఆవిష్కరించారు. సమావేశంలో శాస్త్రవేత్తలు రాజు, వేణుగోపాల్, ఉద్యాన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. సుగంధ ద్రవ్యాల సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ విజిష్ట -
గురువారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోuజిల్లాలో విద్యుత్ ప్రసరించే తీగలతో చేపలను వేటాడుతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదమని తెలిసినా విద్యుత్తో చెలగాటమాడుతూ మృతి చెందుతున్నారు. కాగా విద్యుత్ ప్రమాదాలపై ప్రజలకు అవగాహన లేకపోవడం, విద్యుత్ తీగలతో చేపలు పడుతున్న విషయం తెలిసినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఇటీవల ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నా.. ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. – సాక్షి, మహబూబాబాద్చేపల వేటకు విద్యుత్ తీగల వినియోగం ● కరెంట్ షాక్తో పలువురి మృతి ● అడవి జంతువుల వేటలో మరికొందరు.. ● విద్యుత్ ప్రమాదాలపై కొరవడిన అవగాహన విద్యుత్ వైర్లతో చేపలు పడుతూ చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఫిబ్రవరి 12న నర్సింహులపేట మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన దండి ఉప్పలయ్య(45) చేపలు పట్టేందుకు వెళ్లి తెల్లవారేసరికి విద్యుత్ షాక్తో విగత జీవిగా మారాడు. దీంతో ఆయన కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. మార్చి 4న మరిపెడ మండలం పురుషోత్తమాయిగూడెం స్టేజీ వద్ద నివాసం ఉండే జర్పుల కోట–అరుణ దంపతుల కుమారుడు శశి(20) చేపల వేటకు వెళ్లి తాను పట్టుకున్న విద్యుత్ వైర్లు తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే మార్చి 8న నెల్లికుదురు మండలం పెద్దతండాకు చెందిన బాదావత్ శేఖర్(21), భూక్య రాములు(45) విద్యుత్ వైర్లతో చేపలు పట్టేందుకు వెళ్లారు. చేపలకోసం పెట్టే విద్యుత్ వైర్లు తగలడంతో ఒకరిని కాపాడబోయి మరొకరు ఇద్దరు చనిపోయారు. ఈ ఘటనలు బయటకు తెలిసినవి మాత్రమే.. గుట్టుచప్పుడు కాకుండా శవాలను తీసుకెళ్లి అంత్యక్రియలు చేస్తున్న ఘటనలు చాలా ఉన్నాయని ప్రచారం. ఆయా మండలాల్లో.. జిల్లాలో నర్సింహులపేట, చిన్నగూడూరు, గూడూరు, నెల్లికుదురు, మరిపెడ, కురవి, సీరోలు మండలాల్లో తరచూ విద్యుత్ వైర్లు తగిలి మృత్యువాతపడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు చెబుతున్నారు. వీటితోపాటు గూడూరు, బయ్యారం, కొత్తగూడ, గంగారం మండలాల్లో పంట చేలను అడవి జంతువుల నుంచి కాపాడుకునేందుకు రైతులు విద్యుత్ వైర్ల ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు. అలాగే జంతువులు సంచరించే ప్రాంతాల్లో వేటగాళ్లు విద్యుత్ వైర్లు అమర్చుతారు. కాగా గత ఏడాది ఆవిద్యుత్ వైర్లకు తగిలి ఎనిమిది మంది మృతి చెందినట్లు విద్యుత్శాఖ అధికారులు తెలిపారు. అవగాహన లేకనే .. విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు ఆశాఖ వ్యవసాయ సీజన్ ప్రారంభం జూన్ మొదటివారంలో విద్యుత్ భద్రతా వారోత్సవాలు, విద్యుత్ వినియోగదారుల సమావేశాలు, ప్రమాదాల నివారణకోసం అవగాహన కార్యక్రమాలు, పొలం వద్దకే వెళ్లి రైతులతో మమేకమై విద్యుత్ వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అయితే జిల్లాలో కొన్నిచోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. మరికొన్ని చోట్ల మొక్కుబడిగా చేపడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈమేరకు జనాలకు విద్యుత్ ప్రమాదాలపై అవగాహన ఉండడం లేదు. ఈ క్రమంలో విచ్చలవిడిగా విద్యుత్ వైర్లు అమర్చి చేపలు, అడవి పందులను పట్టే సమయంలో జనాలు మృత్యువాత పడుతున్నారు. సమావేశంలో మాట్లాడుతున్న దేవేందర్ న్యూస్రీల్రెండేళ్లలో విద్యుత్ షాక్తో మరణించిన మనుషులు, జంతువులు సంవత్సరం మనుషులు జంతువులు మొత్తం 2023-24 37 74 1112024-25 29 81 110అవగాహన కార్యక్రమాలు పెంచుతాం.. చేపలు, అటవీ జంతువుల వేటకు విద్యుత్ వైర్లను వినియోగించి ప్రమాదాలు కొని తెచ్చుకోవడం, చనిపోవడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన ప్రమాదాలకు కారణాలు తెలుసుకొని ఆయా ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతాం. పోలీస్, రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారులతో చర్చించి తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం. – నరేశ్, ఎస్ఈ, మహబూబాబాద్ -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
మహబూబాబాద్ రూరల్ : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన బుధవారం రాత్రి మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారు సాలార్ తండా వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కురవి మండలం సూదనపల్లికి చెందిన బొల్లెబోయిన సంపత్ (26) జిల్లా కేంద్రంలోని రైస్ మిల్లులో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. ఉదయం ఇంటి నుంచి జిల్లా కేంద్రానికి వచ్చిన సంపత్.. సాయంత్రం తన ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా సాలార్ తండా వద్ద రోడ్డు ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు 108లో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు సంపత్ అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కాగా, సంపత్ తండా వద్ద రోడ్డుపై పశువు అడ్డంరాగా దానిని తప్పించబోయే క్రమంలో అదుపు తప్పి పడిపోయి తీవ్రగాయాలపాలయ్యాడని కొందరు పేర్కొనగా.. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అతడిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతోనే మృతి చెందాడని ఆరోపించారు. ఘటనా స్థలిని టౌన్ సీఐ దేవేందర్, టౌన్ ఎస్సైలు విజయకుమార్, అలీమ్ హుస్సేన్ సందర్శించారు. మృతుడికి భార్య అఖిల, ఇద్దరు కుమారులు ఉన్నారు. సాలార్ తండా వద్ద ఘటన -
తేనెటీగలను పరిరక్షించుకోవాలి
గూడూరు: ప్రస్తుతం తేనె వినియోగం పెరిగిందని, తేనెటీగలు అంతరించిపోకుండా పరిరక్షించుకోవాలని డాక్టర్ సునీత అన్నా రు. మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం నేషనల్ బి బోర్డు ఆర్థిక సహకారంతో శాసీ్త్రయ తేనెటీగల పెంపకంపై రైతులకు జిల్లాస్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులు నువ్వులు, ఆవాలు, కుసుమ, కంది పొలాల్లో తేనెటీగల పెట్టెలను అమర్చి లాభాలను పొందవచ్చన్నారు. వినియోగదారులకు స్థానికంగా నాణ్యమైన, స్వచ్ఛమైన తేనె దొరుకుతుందన్నారు. అంతటా తేనె వినియోగం పెరిగిందని, ఉత్పత్తి జరగడంలేదన్నారు. అందుకే ప్రభుత్వం కూడా తేనెటీగల పెంపకం, ఉత్పత్తిని ప్రోత్సహిస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త పి.రజనీకాంత్, గూడూరు డివిజన్ అటవీశాఖ అధికారి చంద్రశేఖర్, డీఏఓ విజయనిర్మల, ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు, ఏఓ అబ్దుల్మాలిక్, ఏఈఓ వినయ్, శ్రీనేచురల్ హానీ ఫౌండర్ సంజన, రైతులు పాల్గొన్నారు. -
కనుల పండువగా
ఫాతిమామాత ఊరేగింపు..కాజీపేట రూరల్ : ఫాతిమామాత తిరునాళ్ల మహోత్సవంలో రెండో రోజు బుధవారం ఫాతిమామాత స్వరూపంతో మహా రథప్రదక్షిణ ఊరేగింపు కనుల పండువగా జరిగింది. ఫాతిమాకేథిడ్రల్ ప్రాంగణంలో బుధవారం రాత్రి ఓరుగల్లు పీఠకాపరి, విశాఖ అగ్రపీఠకాపరి బిషప్ ఉడుముల బాల ఫాతిమామాత స్వరూపం 24 ఫీట్ల రథయాత్రకు ప్రత్యేక ప్రార్థన , దూపం వేసి ఊరేగింపును ప్రారంభించారు. అనంతరం చర్చి ప్రాంగణం నుంచి ఫాతిమా మెయిన్ రోడ్, దర్గా వీధుల గుండా ఊరేగింపు కొనసాగిస్తూ తిరిగి చర్చి ప్రాంగణం వరకు సాగింది. ఇక్కడ బిషప్ ఉడుములబాల దివ్య ప్రసాద ఆశీర్వాదంతో ఊరేగింపు ముగిసింది. చర్చి ప్రాంగణంలో భక్తుల కొవ్వొత్తుల ప్రదర్శనతో ఫాతిమామాతను వేడుకున్నారు. ఈ సందర్భంగా బిషప్ ఉడుముల బాల సందేశమిస్తూ ప్రజలందరిపై ఫాతిమామాత దీవెనలు, ఆశీర్వాదాలు ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వేడుకుంటున్నట్లు తెఇపారు. కర్నూల్ పీఠం ఫాదర్ జెరువా జోజిరెడ్డి దివ్యబలిపూజను సమర్పించారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో ఫాదర్ కాసు మర్రెడ్డి, కె.జెసెఫ్, టి.జోసెఫ్, జి.అనుకిరణ్, తదితరులు పాల్గొన్నారు. ఫాతిమామాతకు భక్తుల ప్రార్థనలు.. ఫాతిమామాత గుహ వద్ద తిరునాళ్ల మహాత్సవానికి తరలి వచ్చిన భక్తులు ప్రార్థనలు చేశారు. కొబ్బరి కాయలు కొట్టి కొవ్వొత్తులు వెలిగించి, కానుకలు వేసి తమ కోర్కెలు కోరుకున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులతో ఫాతిమానగర్ ప్రాంతం ఎటు చూసిన సందడిగా మారింది. కేథిడ్రల్ చర్చి నుంచి సాగిన మహా రథప్రదక్షిణ ప్రదక్షిణలో సందేశమిచ్చిన బిషప్ ఉడుముల బాల -
విద్యాసంస్థలు, పరిశ్రమల కలయికతోనే నూతన ఆవిష్కరణలు
● సైయంట్ వ్యవస్థాపకుడు డాక్టర్ బీవీ.మోహన్రెడ్డి కాజీపేట అర్బన్ : విద్యాసంస్థలు, పరిశ్రమలు కలిసి పనిచేసిన తరుణంలోనే నూతన ఆవిష్కరణలకు నాంది పలకవచ్చని సైయంట్ కంపెనీ వ్యవస్థాపకుడు డాక్టర్ బీవీ.మోహన్రెడ్డి తెలిపారు. నిట్ వరంగల్లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో బుధవారం ఏర్పాటు చేసిన ఇండస్ట్రీ–అకాడమీ ఇన్నోవేషన్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రతి విద్యార్థి పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు కంప్యూటర్ జ్ఞానం, కమ్యూనికేషన్, సెన్సార్లు, డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై పరిజ్ఞానం పెంపొందించుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా 47 సంస్థలకు చెందిన 80 వివిధ పరిశ్రమల నిపుణులు ఆవిష్కరించిన ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, ప్రొఫెసర్లు శిరీష్ సోనావానే, సుభాష్ చంద్రబోస్, తదితరులు పాల్గొన్నారు. గ్రూప్–2లో మహిళా విభాగంలో సాయిచందనకు 9వ ర్యాంకుకమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్కు చెందిన మిల్కూరి రవీందర్, అరుణ దంపతుల కూతురు సాయిచందన ఇటీవల విడుదలైన గ్రూప్–2 ఫలితాల్లో మహిళా విభాగంలో 9వ ర్యాంకు సాధించింది. 386.11 మార్కులు సాధించిన సాయిచందన జనరల్ కేటగిరీలో రాష్ట్ర స్థాయిలో 162వ ర్యాంకు సాధించింది. ఇప్పటికే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్న సాయిచందన కుటుంబం ప్రస్తుతం కాజీపేటలో నివాసం ఉంటోంది. కాగా, సాయిచందన గ్రూప్–1లో కూడా 453 మార్కులు సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సర్వే రెమ్యునరేషన్ చెల్లించాలి వరంగల్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గత నవంబర్లో నిర్వహించిన సమగ్ర కుటుంబ కులగణన సర్వేలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లుగా విధులు నిర్వర్తించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వెంటనే రెమ్యునేషన్ చెల్లించాలని టీపీటీఎఫ్, జీటీఏ జిల్లా అధ్యక్షులు యూ.అశోక్, టి.ప్రకాశ్గౌడ్ డిమాండ్ చేశారు. నాలుగు నెలలు గడిచినా రెమ్యునరేషన్ చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ వరంగల్ కాశిబుగ్గలోని కార్పొరేషన్ సర్కిల్ కార్యాలయం ఎదుట బుధవారం సాయంత్రం నిరసన తెలిపారు. నిరసన ప్రదర్శనలో బాలవద్దిరాజు, కే.ఉమేశ్, హరిప్రసాద్, కృష్ణమూర్తి, అశోక్, సునీల్కుమార్, సిద్దేశ్వర్, జోసెఫ్, శ్రీధర్, శ్రీవాణి, జ్యోతి, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు. -
రైతులకు అందుబాటులో ఉండాలి
మహబూబాబాద్ రూరల్: వ్యవసాయ అధికారులు రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల అన్నారు. మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి క్లస్టర్ పరిధిలోని సండ్రలగూడెం రైతు వేదికను డీఏఓ విజయనిర్మల బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. రిజిస్టర్లను తనిఖీ చేశారు. రైతులకు అందుబాటులో ఉంటూ యాసంగిలో వివిధ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ తిరుపతిరెడ్డి, వ్యవసాయ సాంకేతిక అధికారి రాజు, ఏఈఓ రంజిత్ కుమార్ పాల్గొన్నారు. పరిష్కారం చూపాలి గూడూరు: రైతు వేదికలో రైతులకు పంటల సాగు, చీడపీడల నిర్మూలనకు అవసరమైన పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల అధికారులకు సూచించారు. మండలంలోని బొద్దుగొండ రైతు వేదికను బుధవారం ఆమెతో పాటు మహబూబాబాద్ ఏడీఓ శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించిన వివరాల రిజిస్టర్ను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఓ అబ్దుల్మాలిక్, బొద్దుగొండ ఏఈఓ మనోజ్కుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
కేయూ క్యాంపస్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి క్షమాదేశ్పాండె అన్నారు. బుధవారం హనుమకొండలోని సుబేదారి యూ నివర్సిటీ ‘లా’ కళాశాలలో సెమినార్హాల్లో నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళలు.. మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మహిళలకు అవకాశాలు వస్తే పురుషులకు తీసిపోకుండా సమానంగా ఎ దుగుతారన్నారు. మహిళలు న్యాయం రంగంలో నూ ప్రతిభ చాటాలన్నారు. అనంతరం ఆ కళాశాల ప్రిన్సిపాల్ సుదర్శన్ మాట్లాడారు. న్యాయకళాశాల అధ్యాపకులు ఎడ్ల ప్రభాకర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. క్షమాదేశ్పాండెను సన్మానించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ క్షమాదేశ్పాండె -
రాజశేఖర్రెడ్డికి 8వ ర్యాంకు
బచ్చన్నపేట : జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రానికి చిమ్ముల రాజశేఖర్రెడ్డి గ్రూప్–2 లో రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు సాధించారు. చిమ్ముల అరుణ– మల్లారెడ్డి దంపతులు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. కూతు రు ప్రస్తుతం జనగామ మండలంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నది. కుమారుడు చిమ్ముల రాజశేఖర్రెడ్డి గ్రూప్–2 ఫలితాల్లో 423.933 మా ర్కులు సాఽధించి రాష్ట్ర 8వ ర్యాంక్ సాధించారు. గ తంలో రాజశేఖర్రెడ్డి వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి పదవులకు కూడా ఎంపికయ్యారు. ఉన్నతమైన లక్ష్యంతో కష్టపడి చదివి రాష్ట్ర ర్యాంకుసాధించడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
పులకించిన కొండపర్తి
ఎస్ఎస్తాడ్వాయి: మండల పరిధిలోని దత్తత తీసుకున్న కొండపర్తి గ్రామానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మ మంగళవారం రావడంతో గిరిజనుల్లో ఆనందం వెల్లివెరిసింది. ఆయన కూడా ఆదివాసీలతో మేమకమయ్యారు. రాష్ట్ర మంత్రి సీతక్కతో కలిసి గవర్నర్ కొండపర్తికి రావడంతో ఆదివాసీల నృత్యాలు, డోలువాయిద్యాలు, మంగళహారతులతో మహిళలు ఘనస్వాగతం పలికారు. ముందుగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి సీతక్కతో కలిసి గ్రామంలో ఏర్పాటు చేసిన కొమురంభీం, బిర్సాముండా విగ్రహాలను ఆవిష్కరించారు. పాఠశాలలోని డిజిటల్ క్లాస్ ప్రొజెక్టర్, కారంపొడి, మసాలా యూనిట్లతో పాటు కుట్టు మిషన్ కేంద్రాలను ప్రారంభించారు. మధ్యాహ్నం 12.10 గంటలకు కొండపర్తికి వచ్చిన గవర్నర్ 1.40 గంటల వరకు గ్రామస్తులతో గడిపారు. అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామానికి గవర్నర్ రావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు గవర్నర్ చేతుల మీదుగా బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం గవర్నర్ను మేడారం జాతర చైర్మన్ అరెం లచ్చుపటేల్, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, తాడ్వాయి మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్దొర గజమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్జీ, ఆర్డీఓ వెంకటేశ్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వీరభద్రం, అధికారులు పాల్గొన్నారు. గవర్నర్కు సన్మానం.. జిల్లా పర్యటనకు వచ్చిన గవర్నర్ ఆర్అండ్బీ గెస్ట్హౌస్కు చేరుకుని విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్కు మంత్రి సీతక్క, కలెక్టర్ దివాక ర పూలమొక్క అందించి శాలువాలతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. కొండపర్తిని దత్తత తీసుకోవడం గొప్ప విషయం: మంత్రి సీతక్క దట్టమైన అటవీ ప్రాంతంలోని కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకోవడం గొప్ప విషయమని మంత్రి సీతక్క అన్నారు. ఆ గ్రామాన్ని బయట ప్రపంచంతో సంబంధం లేకుండా అనుసంధానం చేస్తూ స్థానిక ఉత్పత్తులను అందించడం ద్వారా మహిళలు వ్యాపారవేతలుగా ఎదగాలన్నారు. 40 కంపెనీలు దిశ స్వచ్ఛంద సంస్థ సహకారంతో జిల్లాలోని వంద పాఠశాలలను దత్తత తీసుకున్నట్లు వివరించారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి : దాన కిశోర్, గవర్నర్ కార్యాలయ ప్రధాన కార్యదర్శి కొండపర్తిని అభివృద్ధి చేసి పర్యావరణ పరిరక్షణ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని గవర్నర్ కార్యాలయ ప్రధాన కార్యదర్శి దాన కిశోర్ అన్నారు. ప్రతీ కుటుంబానికి ఆదాయం చేకూరేలా ఐకమత్యంతో ముందుకుసాగాలని సూచించారు. మిర్చి, పసుపు, మసాలా యూనిట్లకు మార్కెటింగ్ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా సౌకర్యం కల్పిస్తామన్నారు. అమ్మవార్లకు మొక్కుల చెల్లింపు కొండపర్తికి వచ్చిన గవర్నర్ మంత్రి సీతక్కతో కలిసి వనదేవతలను దర్శించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు, గోవిందరాజు, పగిడిద్దరాజులను దర్శించుకున్నారు. గవర్నర్ 74 కిలోల ఎత్తు బంగారం (బెల్లం) అమ్మవార్ల మొక్కుగా సమర్పించారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ డాక్టర్ శబరీశ్, రిజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి, అసిస్టెంట్ కమిషనర్ రావుల సునీత, మేడారం ఈఓ రాజేంద్రం, సూపరింటెండెంట్ క్రాంతికుమార్, సిబ్బంది ఉన్నారు. ఆదివాసీలతో మమేకమైన గవర్నర్ జిష్ణుదేవ్వర్మకు ఘనస్వాగతం పలు ఉపాధి యూనిట్ల ప్రారంభోత్సవం భారీ పోలీసు భద్రత నడుమ సాగిన పర్యటన -
కిక్కిరిసిన రైల్వేస్టేషన్
డోర్నకల్: డోర్నకల్ రైల్వేస్టేషన్ మంగళవారం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. 2వేల మందికి పైగా మహారాష్ట్రకు చెందిన కూలీలు తరలిరావడంతో రైల్వేస్టేషన్ జనసంద్రమైంది. మూడు నెలల క్రితం మిరప తోటల్లో కాయకోత పనులకు మహా రాష్ట్ర నుంచి వేలాదిగా కూలీలు తరలివచ్చారు. రైళ్ల ద్వారా డోర్నకల్ స్టేషన్కు చేరుకుని ఇక్కడి నుంచి మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ, కృష్ణా జిల్లాలకు తరలివెళ్లారు. కాయకోత పనులు పూర్తి కావడంతో కొద్ది రోజుల నుంచి కూలీలు డోర్నకల్ మీదుగా మహా రాష్ట్రకు తిరిగి వెళ్తున్నారు. పది రోజులుగా సింగరేణి రైలులో ప్రతీరోజు 500 నుంచి 1000మందికి పైగా తరలివెళ్తున్నారు. మంగళవారం 2వేల మందికి పై గా కూలీలు రైల్వే స్టేషన్కు వచ్చారు. కాగా సింగరేణి రైలులో కొత్తగూడెం, కారెపల్లి స్టేషన్లలో అధిక సంఖ్యలో కూలీలు ఎక్కడంతో డోర్నకల్కు చేరుకునే సమయనికే రైలు కాలు పెట్టలేనంత రద్దీగా మారింది. డోర్నకల్లో కూలీలు రైలు ఎక్కేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో కొంతమంది ఘర్షణ పడి కొట్టుకున్నారు. ఆర్పీఎఫ్ సిబ్బంది రైలును కొద్దిసేపు నిలిపి కూలీలను ఎక్కించే ప్రయత్నం చేశారు. సగం మందికి పైగా రైలు ఎక్కలేకపోవడంతో తర్వాత వచ్చిన శాతవాహన, గోల్కొండ రైళ్లలో పంపించారు. మహారాష్ట్రకు కూలీల తిరుగుప్రయాణం -
గ్రూప్– 2 ఫలితాల్లో ఓరుగల్లు అభ్యర్థుల ప్రతిభ
కొందరు ఒకపక్క ఉద్యోగం చేస్తూనే ఉన్నతస్థాయికి వెళ్లాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడ్డారు. అనుకున్న లక్ష్యం సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గ్రూప్–2 ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు ర్యాంకులు సాధించారు. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఉన్న సమయంలోనే ప్రణాళికాబద్ధంగా చదవడం, విషయాన్ని అర్థం చేసుకుని పోటీ పరీక్షల్లో రాయడం ద్వారా ర్యాంకులు సాధించవచ్చని ఆయా అభ్యర్థులు అంటున్నారు.– సాక్షి నెట్వర్క్ప్రణీత్ ప్రతిభ..కొడకండ్ల: మండల కేంద్రంలోని నిరుపేద పద్మశాలి కుటుంబానికి చెందిన ప్రణీత్ 388 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 138వ ర్యాంకు సాధించారు. సోమనారాయణ–నాగలక్ష్మి మూడో కుమారుడు ప్రణీత్ 2019 హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తిచేసిన తర్వాత కోచింగ్ తీసుకుని గ్రూప్స్ పరీక్షలు రాశారు. డిసెంబర్లో వెలువడిన గ్రూప్–4 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 58వ ర్యాంకు సాధించి ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. కాగా గ్రూప్–1 పరీక్షలోనూ 380 మార్కులు సాధించారు.ముల్కలపల్లి యువకుడు ఉపేందర్..డోర్నకల్: గ్రూప్–2 ఫలితాల్లో ముల్కలపల్లికి చెందిన మేకల ఉపేందర్ ప్రతిభ కనబరిచారు. గ్రామానికి చెందిన మేకల రమణయ్య–రమణమ్మ దంపతుల కుమారుడు ఉపేందర్ ప్రస్తుతం మహబూబాబాద్ కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్గా విదులు నిర్వర్తిస్తూ గ్రూప్–2 పరీక్షలు రాశారు. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో ఉపేందర్ 423.119 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో టాప్–10లో 9వ స్థానంలో నిలిచారు. ప్రతిభ చాటిన ఉపేందర్ను గ్రామస్తులు అభినందించారు.మెరిసిన సంధ్య..మహబూబాబాద్ అర్బన్: మానుకోట జిల్లా కేంద్రంలోని డోలి వెంకటేశ్వర్లు–పద్మ దంపతుల కుమార్తె డోలి సంధ్య గ్రూప్–2లో రాష్ట్రస్థాయిలో 205 ర్యాంకు సాధించారు. 600 మార్కులకు 382.4 మార్కులు వచ్చాయి. అత్యధిక మార్కులు సాధించడంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అభినందించారు.ఉద్యోగం చేస్తూ..భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కాసింపల్లి గ్రామానికి చెందిన శనిగరపు ప్రవీణ్కుమార్ రాష్ట్రస్థాయిలో 76వ ర్యాంకు సాధించారు. నిరుపేద కుటుంబానికి చెందిన శనిగరపు రాధ–భద్రయ్య దంపతుల రెండో కుమారుడు ప్రవీణ్కుమార్. తల్లి రాధ అంగన్వాడీ హెల్పర్గా, తండ్రి భద్రయ్య సింగరేణి సంస్థలో కాంట్రాక్టు స్వీపర్గా పనిచేస్తున్నారు. ప్రవీణ్కుమార్ బీటెక్ పూర్తి చేసి 2019లో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం సాధించి గణపురం మండలంలోని కర్కపల్లిలో విధులు నిర్వహించారు. 2021లో వీఆర్ఓ ఉద్యోగం సాధించి 6 నెలలపాటు మహదేవపూర్ మండలం అంబటిపల్లిలో పనిచేశారు. అదే సంవత్సరంలోనే గ్రూప్–4 పరీక్షలో ప్రతిభ కనబరిచి హైదరాబాద్లోని జీఎస్టీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేశారు. సీనియర్ అసిస్టెంట్గా పదోన్నతి పొంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఉద్యోగం చేస్తూనే గ్రూప్–2 పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో 76వ ర్యాంకు, కాళేశ్వరం జోన్ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు.గిరిజన ఆణిముత్యం శ్రీకాంత్గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మారుమూల ఏజెన్సీ గ్రామం జంగుతండాకు చెందిన మూడు భద్రు కుమారుడు శ్రీకాంత్ గ్రూప్–2 ఫలితాల్లో ఎస్టీ కేటగిరీలో ప్రతిభ కనబరిచారు. ఎస్టీ కేటగిరీలో ప్రథమ, జోనల్ వైస్ ఓపెన్ కేటగిరీలో మూడో ర్యాంకు, రాష్ట్రస్థాయిలో 38వ ర్యాంకు సాధించినట్లు శ్రీకాంత్ తెలిపారు. గతంలో గ్రూప్–4 సాధించి రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేస్తున్నట్లు, గ్రూప్–3 లో కూడా మంచి మార్కులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీకాంత్ను మాజీ సర్పంచ్ అరుణమంగీలాల్నాయక్, మాజీ ఎంపీటీసీ గీతాఅమరేందర్రెడ్డి, తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు సన్మానించారు. -
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
మహబూబాబాద్ అర్బన్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కంకరబోడ్ జెడ్పీహెచ్ఎస్ను ఎమ్మెల్సీగా గెలిచిన అనంతరం మొదటిసారి మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. పీఆర్టీయూ ఉపాధ్యాయులకు కంకరబోడ్ పాఠశాల పవిత్రమైందని, చామల యాదగిరి ఇదే పాఠశాలలో పీఆర్టీయూ సంఘాన్ని స్థాపించారన్నారు. 2003 డీఎస్సీ అభ్యర్థులకు పాత పెన్షన్ వర్తింపు, పెండింగ్ బకాయిల విడుదల, కేజీవీబీ, ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ వర్తింపు, మ్యూచువల్ బదిలీలు, గురుకుల, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డిని ఉపాధ్యాయులు సన్మానించారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సంకా బద్రినారాయణ, ప్రధాన కార్యదర్శి మిర్యాల సతీశ్రెడ్డి, పాఠశాల హెచ్ఎం కోట్యానాయక్ తదితరులు ఉన్నారు. -
అనంతాద్రీశుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అనంతాద్రి శ్రీజగన్నాథ వేంకటేశ్వరస్వామి ఆలయ 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్టీ నూకల రామచంద్రారెడ్డి, జ్యోతి దంపతులు, ట్రస్ట్ సభ్యుల పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు గొడవర్తి చక్రధరాచార్యులు ఆధ్వర్యంలో శ్రీవిశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవచనం, రక్షా బంధనం, మృత్సంగ్రహణం, ఋత్విక్ కరణం, అంకురారోహణం, వైనతేయ ఆదివాస హోమం, నివేదన, తీర్థ ప్రసాద గోష్టి పూజలు నిర్వహించారు. నాయిని ప్రభాకర్ రెడ్డి, కాళీనాథ్, శ్రీనివాస్ అచార్యులు, అనిరుద్ధ ఆచార్యులు, విశ్వం తదితరులు పాల్గొన్నారు. నేడు విశ్వక్సేన యజ్ఞం... బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవతో పూజలు మొదలవుతాయని నిర్వాహకులు తెలిపారు. సేవా కాలం, వేద విన్నపం, తీర్థ ప్రసాద గోష్టి అనంతరం ద్వారాతోరణ, ధ్వజ కుంభారాధన, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ట, మూర్తి కుంభారాధన, మూలమంత్ర హవనం పూజలు జరుగుతాయన్నారు. శ్రీవిశ్వక్సేన యజ్ఞం నిర్వహించి ధ్వజారోహణం ద్వారా గరుడ ప్రసాదం భక్తులకు అందజేస్తారని, సంతానార్థులు ఆలయానికి వచ్చి గరుడ ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి అనుగ్రహం పొందాలని వారు పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటల నుంచి విష్ణు సహస్రనామ పారాయణం ఉంటుందని, ద్వారా తోరణ, ధ్వజకుంభారాధన, చతుస్థానార్చన, నిత్యాహవనం, నిత్య పూర్ణాహుతి, దేవతాహ్వానం, నివేదన, బలిహరణ, వేద విన్నపం, తీర్థప్రసాదం పంపిణీ ఉంటుందన్నారు. -
బైక్ను ఢీకొన్న కారు..
నల్లబెల్లి: జాతీయ రహదారిపై ఓ కారు అతివేగం, అజాగ్రత్తగా వస్తూ వెనుక నుంచి బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మంగళవారం నల్లబెల్లి మండలం బజ్జుతండా బస్ స్టేజీ వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎస్సై గోవర్ధన్ కథనం ప్రకారం.. మండలంలోని నారక్కపేటకు చెందిన మాడుగుల రజిత, శ్రీను దంపతుల కుమారుడు అజయ్(22) డిగ్రీ వరకు చదువుకున్నాడు. నర్సంపేటలో ట్రాక్టర్ మెకానిక్గా పనిచేస్తూ కుటుంబ పోషణలో తల్లిదండ్రులకు ఆసరా అవుతున్నాడు. అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు జన్ను అజయ్తో కలిసి తన ద్విచక్రవాహనంపై నారక్కపేట, లచ్చిరెడ్డి కుంట మీదుగా నల్లబెల్లికి వెళ్లే క్రమంలో బజ్జుతండా బస్ స్టేజీ వద్ద జాతీయ రహదారిపైకి చేరుకున్నాడు. ఈ క్రమంలో హనుమకొండ సుబేదారికి చెందిన కాసోజు శ్రీనివాస్ కారులో నర్సంపేట నుంచి నల్ల బెల్లి వైపునకు అతివేగంగా వస్తూ వెనుక నుంచి ద్విచక్రవాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అజయ్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. జన్ను అజయ్కి తీవ్రంగా, కారు డ్రైవర్ శ్రీనివాస్కు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్సై గోవర్ధన్ సిబ్బంది కలిసితో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పతికి తరలించారు. అజయ్ మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకుని బోరున విలపించారు. అజయ్ మృతితో నారక్కపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి తల్లి రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు. కాగా, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలయి శ్రీనివాస్.. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.3 వేలు ఆర్థిక సాయం అందించారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాల అశోక్, తదితరులు పాల్గొన్నారు. పాఠశాల బస్సును ఢీకొని ఏటూరునాగారంలో మరొకరు.. ఏటూరునాగారం: మండల కేంద్రంలోని సినిమా థియేటర్ ప్రదేశంలోని యూ టర్న్ వద్ద స్కూల్ బస్సును ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. ఏఎస్సై సుబ్బారావు కథనం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం ఎస్వీవీ పాఠశాలకు చెందిన ఏపీ 36 టీఏ 7266 గల పాఠశాల బస్సు డ్రైవర్ యూటర్న్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన శెట్టి నరేశ్(38) బస్సు వెనుక నుంచి ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. బైక్ అదుపు తప్పి స్కూల్ బస్సును ఢీకొన్నాడు. దీంతో తీవ్రగాయాలు కావడంతో 108లో ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి భార్య అమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పేర్కొన్నారు. యువకుడి దుర్మరణం, మరొకరికి గాయాలు బజ్జుతండా బస్ స్టేజీ వద్ద ఘటన -
ఫీజుల కోసం ఫలితాల నిలిపివేత
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ అకడమిక్ డీన్కు ఇంకా 84 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఫీజులు చెల్లించలేదు. దీంతో యూనివర్సిటీ పరిధిలోని ఆయా కాలేజీల విద్యార్థుల ఫలితాలు వెల్లడించడం లేదు. ఫలితంగా ఆయా విద్యార్థులు తాము ఉత్తీర్ణ సాధించామా?లేదా? ఏమైనా సబ్జెక్టుల్లో తప్పామనే అంశం తెలియక లబోదిబోమంటున్నారు. 53,728 మంది ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ బీఎస్సీ, బీసీఏ బి ఓకేషనల్ కోర్సులకు సంబంఽధించి మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ల పరీక్షల ఫలితాలు ఈనెల 4న విడుదల చేసిన విషయం విధితమే. అయితే యూనివర్సిటీలోని డీన్ అకడమిక్కు ఫీజులు చెల్లించకపోవడతో తొలుత 121 కళాశాలల ఫలితాలు నిలిపివేశారు. వారంలో కొన్ని ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఫీజులు చెల్లించాయి. దీంతో వాటి ఫలితాలు విడుదల చేశారు. కేయూ పరిధిలో 304 (ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ గురుకుల కళాశాలలు ఉండగా) అందులో మంగళవారం వరకు 84 ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు యూనివర్సిటీ డీన్ అకడమిక్కు వివిధ రకాల ఫీజులు చెల్లించలేదు. దీంతో ఆయా కళాశాల విద్యార్థుల ఫలితాల నిలిపివేత కొనసాగుతోంది. రీవాల్యుయేషన్ గడువు కూడా.. డిగ్రీ సెమిస్టర్ల పరీక్షల ఫలితాలు ఇచ్చాక 10 నుంచి 15 రోజులపాటు రీవాల్యుయేషన్కు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇప్పటికే ఫలితాలు విడుదల చేసిన కాలేజీల విద్యార్థులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఫలితాలు విడుదల కాని విద్యార్థులు రీవాల్యుయేషన్ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు వారంలో ఈ గడువు కూడా ముగియబోతుంది. దీంతో విద్యార్థులు నష్టపోయే పరిస్థితి నెలకొని ఉంది. డిగ్రీ 2,4,6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపునకు షెడ్యూల్.. డిగ్రీ కోర్సుల 2, 4, 6వ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఇటీవలే పరీక్షల విభాగం అధికారులు షెడ్యూల్ ఇచ్చారు. ఆయా సెమిస్టర్ల పరీక్షలు ఏప్రిల్ చివరి వారంలో నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ఫీజులు కూడా ప్రైవేట్ యాజమాన్యాల విద్యార్థులు చెల్లించాల్సింటుంది. అయితే 1,3,5 ఫలితాల కోసం నిరీక్షిస్తున్న విద్యార్థులు కూడా ఆయా సెమిస్టర్ల పరీక్షల ఫీజులు చెల్లించాల్సింటుంది. ఇంకా చెల్లించని 84 కళాశాలలు 53,728మంది విద్యార్థుల నిరీక్షణ ముగుస్తున్న రీవాల్యుయేషన్ గడువు మరోవైపు డిగ్రీ 2,4,6 సెమిస్టర్ల ఫీజు కూడా.. -
వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు ప్రోత్సహించాలి
● రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయ వీసీ జ్ఞానప్రకాశ్ మామునూరు: వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయ వీసీ జ్ఞానప్రకాశ్ అన్నారు. ఈమేరకు మంగళవారం ఖిలా వరంగల్ మండలం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్త, కోఆర్డినేటర్ రాజన్న ఆధ్వర్యంలో శాసీ్త్రయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు మేకలు, పవర్ వీడర్స్ పంపిణీ చేసి మాట్లాడారు. వేసవిలో పశువుల మేత నిమిత్తం పాతర గడ్డి తయారీ విధానంపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విస్తరణ అధికారి కిషన్ కుమార్, అటారీ ప్రతినిధి ఎఆర్. రెడ్డి, ఉమారెడ్డి, దిలీప్కుమార్, బాలాజీ, బ్యాంకు మేనేజర్ రాజు, జిల్లా మత్స్యశాఖ అధికారి నాగమణి, ఉద్యానశాఖ అధికారి సంగీత లక్ష్మి, డాక్టర్ అమ్రేశ్వరి, శాస్త్రవేత్తలు అరుణ్, సౌమ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. మిర్చి రైతులకు అండగా ఉంటాం●● మార్కెటింగ్ శాఖ జేడీ ఉప్పల శ్రీనివాస్ మహబూబాబాద్ రూరల్ : మిర్చి క్రయవిక్రయాల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని, వారికి అండగా ఉండి కొనుగోళ్లు సకాలంలో జరిగేలా చర్యలు తీసుకుంటా మని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వరంగల్ సంయుక్త సంచాలకుడు ఉప్పల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోళ్లను తనిఖీ చేశారు. రెండు, మూడు రోజుల నుంచి మిర్చి అధికంగా రావడం, మార్కెట్ యార్డులో రైతుల సమస్యలపై వారితో మాట్లాడి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయపాలన పాటిస్తూ సకాలంలో కొనుగోళ్లు జరిపించి రైతులు ఇబ్బందులుపడకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఎప్పటికప్పుడు మిర్చి కొనుగోళ్ల అంశాలపై పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్, కార్యదర్శి షంషీర్, సూపర్వైజర్ రమేశ్ పాల్గొన్నారు. -
గ్రూప్–1 ర్యాంకర్ తేజస్వినికి సన్మానం
శాయంపేట : మండలంలోని తహరాపూర్ గ్రామానికి చెందిన జిన్నా విజయపాల్ రెడ్డి హేమలత దంపతుల కూతురు తేజస్విని రెడ్డి సోమవారం విడుదలైన గ్రూప్–1లో ఫలితాల్లో 532.5 మార్కులు సాధించింది. దీంతో తేజస్వినిని గ్రామ మాజీ ఎంపీటీసీ కొమ్ముల భాస్కర్ మంగళవారం సన్మానించారు. కాగా, తేజస్విని రెడ్డి 2019లో మొదటి ప్రయత్నంలోనే గ్రూప్–2లో మండల పంచాయతీ అధికారి పోస్టు సాధించింది. మొదటి పోస్టింగ్ నేలకొండపల్లి, రెండో పోస్టింగ్ టేకుమట్ల, ప్రస్తుతం రేగొండలో ఉద్యోగం చేస్తోంది. ఉద్యోగం చేస్తూనే గ్రూప్–1కు సొంతంగా సన్నద్ధమైంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో గ్రూప్–1లో 532.5 మార్కులు సాధించానని, డిప్యూటీ కలెక్టర్ పోస్టును ఎంపిక చేసుకుంటానని తేజస్విని రెడ్డి తెలిపారు. నూతన ఆలోచనలతో ముందుకు సాగాలి ● లీడ్ బిడ్ మేనేజ్మెంట్ జీఎం శివభాస్కర్ హసన్పర్తి : ప్రతీ విద్యార్థి నూతన ఆలోచనలతో ముందుకు సాగాలని లీడ్ బిడ్ మేనేజ్మెంట్, ఆర్పీఎల్ జీఎం, ఇండియా సర్వీసెస్ జీఎం శివ భాస్కర్ నేతి అన్నారు. హసన్పర్తి మండలం అన్నాసాగరం శివారులోని ఎస్సార్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న వార్షిక మేనేజ్మెంట్ ఫెస్ట్ ‘వ్యూహ–2025’ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఈకార్యక్రమానికి శివభాస్కర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని సూచించారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) కొత్త మార్గాలు తెరుస్తోందన్నారు. ఎస్సార్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ దీపక్ గార్గ్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను మెరుగు పరచడానికి ఇలాంటి వేదికలు దోహదపడుతాయన్నారు. విద్యార్థులు టెక్నాలజీ మేనేజ్మెంట్ వైపు దృష్టి సారించాలన్నారు. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పుకనుగుణంగా నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నారు. తొలుత ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్లర్ ఎ.వరదారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం సమన్వయకర్త డాక్టర్ సుమన్, వివిధ విభాగాల అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు. 61 మహిళా శక్తి అద్దె బస్సులుహన్మకొండ: ఆర్టీసీ వరంగల్ రీజియన్కు 61 మహిళా శక్తి అద్దె బస్సులు కేటాయించారని ఆర్టీసీ ఆర్ఎం డి.విజయభాను తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ బస్సులను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ఇందిరా మహిళ శక్తి మిషన్–25ను సీఎం ప్రారంభించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా.. మండల మహిళా సమాఖ్యల ద్వారా ఆర్టీసీకి అద్దె బస్సులు అందిస్తున్నట్లు తెలిపారు. -
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
జనగామ: స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశం హాల్లో కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఆర్డీఓ వెంకన్నతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ 14వ తేదీ వరకు సీఎం పర్యటనకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేయాలన్నారు. సభకు వచ్చే రూట్లు, వాహనాల పార్కింగ్ స్థలాలను గుర్తించడంతో పాటు రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉండాలన్నారు. కలెక్టర్ రిజ్వాన్బాషా మాట్లాడుతూ సీఎం పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో మున్సిపల్ కమిషనర్ రవీందర్, ఏసీపీ భీంశర్మ, డీఆర్డీఓ వసంత, డీఏంహెచ్ఓ మల్లికార్జున్రావు, డీపీఓ స్వరూప, గృహనిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వేణుమాధవ్, అధికారులు పాల్గొన్నారు. సీఎం సభాస్థలి పరిశీలన స్టేషన్ఘన్పూర్: మండలంలోని శివునిపల్లిలో ఈనెల 16న నిర్వహించనున్న సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభకు సంబంధించిన సభాస్థలాన్ని అదనపు కలెక్టర్ రోహిత్సింగ్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సభా స్థలం వద్ద చేపడుతున్న పనులను పరిశీలించారు. సీఎం సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ డీఎస్ వెంకన్న, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్ఐలు శ్రీకాంత్, సతీష్ ఉన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలి పనుల్లో వేగం పెంచండి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలెక్టరేట్లో సమీక్ష