breaking news
Mahabubabad
-
నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
కాశిబుగ్గ: వరంగల్లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. శుక్రవారం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి భవ న నిర్మాణ సముదాయం, మౌలిక వసతులు, విద్యుత్, పారిశుద్ధ్యం, తదితర పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణా లు పాటించకపోతే చర్యలు తీసుకోవా లని సూ చించారు. ముఖ్యంగా పనులను నిర్ధేశిత గడువులోగా పూర్తి చేసి, ఆస్పతిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆ దేశించారు. సమావేశంలో ఎంజీఎం సూపరింటెండెంట్ రాంకుమార్రెడ్డి, డి ప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజ నీర్ రాజకుమార్, ఎ న్పీడీసీఎల్ ఎస్ఈ ఆనందం, ఆర్ అండ్ బీ ఈఈ రాజేందర్, ఆర్డీఓ సుమ, ఎల్ అండ్ టీ ప్రాజెక్టు డైరెక్టర్ సర్వాణన్, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంజీఎం ఆర్ఎంఓ డాక్టర్ అశ్విని పాల్గొన్నారు.రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు జిల్లా జట్టు వరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 19 నుంచి 21వ తేదీ వర కు నిజామాబాద్ జిల్లా కర్నపెల్లిలో జరగనున్న రాష్ట్ర స్థాయి సబ్జూనియర్స్ సాఫ్ట్బాల్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టు శుక్రవారం బయల్దేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి వరంగల్ జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సాంబశివరావు హాజరై మాట్లాడారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అసోసియేషన్ బాధ్యులు రాజేందర్, సాంబమూర్తి, సుమలత, కోచ్ వినయ్ కుమార్, పీడీలు రాజు, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. వివాహిత ఆత్మహత్య మహబూబాబాద్ రూరల్ : మతిస్థిమితం లేని వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. టౌన్ ఎస్సై అంజమ్మ శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ పట్టణంలోని నారాయణ నగర్ కాలనీకి చెందిన జంగం సైదమ్మ కుమార్తె కీర్తి (29)ని పట్టణంలోని గుమ్మడూరు ప్రాంతానికి చెందిన కందుకూరి క్రాంతికుమార్కు ఇచ్చి 2018 మే 22వ తేదీన వివాహం జరిపించారు. వారికి ఇద్దరు మగపిల్లలు సంతానం. ఈక్రమంలో నాలుగు నెలల నుంచి కీర్తి ఎవరో పిలుస్తున్నారని, ఇంట్లో గట్టిగా అరుస్తూ ఉంటుంది.. నిరంతరం ఏదో ఆలోచిస్తూ ఉండేది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. 15 రోజుల నుంచి కీర్తి మందులు వేసుకోవడం మానేసింది.. ఆమె తల్లి సైదమ్మ, భర్త క్రాంతికుమార్ మందులు వాడాలని చెప్పినా వినలేదు. క్రాంతికుమార్ శుక్రవారం ఉదయం పిల్లలను పాఠశాలలో దింపేందుకు వెళ్లాడు. అదేసమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో కీర్త ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు తేల్చారు. తల్లి సైదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ● వరంగల్ కలెక్టర్ సత్యశారద ● సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల పరిశీలన -
ఎస్జీఎఫ్ ఎంపిక పోటీలు ప్రారంభం
● హాజరైన 800 మంది క్రీడాకారులు వరంగల్ స్పోర్ట్స్: 70వ పాఠశాల క్రీడల సమాఖ్య అండర్– 14, 17, 19 విభాగాల్లో బాలబాలికలకు వివిధ క్రీడాంశాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలను హనుమకొండలోని జేఎన్ఎస్ శుక్రవారం నిర్వహించారు. అండర్–14, 17 విభా గాల్లో షూటింగ్, స్కేటింగ్, హ్యాండ్ బాల్, గట్క, టేబుల్ టెన్నిస్, హాకీ, బాక్సింగ్లో ఎంపికలు నిర్వహించారు. అండర్–19 కేటగిరీలో హ్యాండ్బాల్, హాకీ, ఫుట్బాల్, బాస్కెట్బాల్, టేబుల్ టెన్నీస్, బేస్బాల్, గట్క, షూటింగ్లో ఎంపికలు నిర్వహించారు. ఇంటర్ ఆర్జేడీ గోపాల్, డీఐఈఓ శ్రీధర్ పోటీలను ప్రారంభించారు. 800 మంది క్రీడాకారు లు పాల్గొన్నట్లు ఎస్జీఎఫ్ అండర్–19 ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి శ్రీధర్, ఎస్జీఎఫ్ అండర్–14, 17 హనుమకొండ జిల్లా కార్యదర్శి వాసుదేవరావు తెలియజేశారు. ప్రభాకర్రెడ్డి, పార్థసారథి, బరుపాటి గోపి, కోట సతీష్ పాల్గొన్నారు. -
తప్పులను సరిచేసుకోండి
నోటీసులకు స్పందించండి..కలెక్టర్ స్నేహ శబరీష్ సాక్షి, మహబూబాబాద్: ప్రజాస్వామ్య దేశంలో 18 సంవత్సరాలు నిండిన వారందరికీ ఓటు హక్కు తప్పనిసరి. ఆస్తులు, అంతస్తులు, కులాలు, మతా లు, లింగ బేధాలకు అతీతంగా ఓటు హక్కు ఉంటుంది. తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటే ఆయుధం. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఓటుకు కావాల్సిన అర్హత ఉంటే దానికి భద్రత కల్పించి..స్వేచ్ఛగా ఓటు వేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది. ఓటు హక్కు పొందడానికి కా వాల్సిన అర్హత మీకుంటే.. ఓటు చేర్పులు, మార్పులు, సవరణలో పోకుండా కాపాడే బాధ్యత ప్రభుత్వానిది అని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్ ‘సాక్షి’తో మాట్లాడారు. సాక్షి: జిల్లాలో ఓటరు సవరణ ప్రక్రియ ఎలా సాగుతోంది..?కలెక్టర్: మూడు నెలల క్రితం ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి మ్యాపింగ్, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో మహబూబాబాద్ జిల్లా రాష్ట్రంలో ముందు వరుసలో ఉంది. జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో మొత్తం 4,94,935 మంది ఓటర్లు ఉన్నారు. వారందరినీ మ్యాపింగ్ చేశాం. అందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు అందజేశాం. అయితే ఇందులో చనిపోయిన వారు, ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ అయినవారు, రెండు చోట్ల ఓట్లు ఉండి ఒకే చోటుకు అప్షన్ ఇచ్చిన వారు మొత్తం 47,979 మంది ఓటర్లను తొలిగించాం. అయితే పొరపాట్లు, ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పలు తేడాలు ఉన్న 80వేల మంది ఓటర్ల ఓటును సరిచేసేందుకు నోటీసులు జారీ చేస్తున్నాం. సాక్షి: జిల్లాలో మీరు జారీ చేస్తున్న నోటీసులకు సరైన స్పందన రావడం లేదని ప్రచారం.. చిన్న చిన్న పొరపాట్లకు కూడా ఓట్లు తొలగించారని చెబుతున్నారు. ఇది నిజమేనా..?కలెక్టర్: మొత్తం 10 అంశాలను పరిగణలోకి తీసుకొని వాటిని సరిచేసేందుకు నోటీసులు ఇస్తున్నాం. 80,903 నోటీసులు సిద్ధం చేశాం. ఇందులో ఇప్పటివరకు 71,201 మందికి నోటీసులు జారీ చేశాం. ఇందులో 34వేల మంది ఓటర్ల వివరణ తీసుకున్నాం. వారి వద్ద ఉన్న ఆధారాలతో ఓటును సరిచేశాం. మిగిలిన 25వేల మంది హియరింగ్కు హాజరు కావాల్సి ఉంది. మరో 9,671 మందికి నోటీసులు జారీ చేయాల్సి ఉంది. చిన్నచిన్న తప్పులకు ఓటును తొలగిస్తున్నారని తప్పుడు ప్రచారం జరుగుతోంది. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని ప్రచారం చేసే మేము ఓటును ఎందుకు తొలిగిస్తాం.. వాటిని సరిచేసేందుకే నోటీసులు ఇస్తున్నాం. వివరణ తీసుకొని సరిచేస్తున్నాం. సాక్షి: నోటీసుల్లో ఏయే అంశాలకు సంబంధించిన పొరపాట్లు ఉన్నాయి..? వాటి సవరణకు ఏం చేయాలి..?కలెక్టర్: సవరణ జాబితాలో ఉన్న ఓటర్లలో మొత్తం 10 రకాలుగా విభజించి ఆయా అంశాల్లో తప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో తల్లిదండ్రులు–సంతానం మధ్య వయసు తేడా 15 సంవత్సరాల కంటే తక్కువ ఉండడం అంటే తల్లిదండ్రులు బిడ్డలకు మధ్య కనీసం 15సంవత్సరాల తేడా లేకుండా ఉండడంతో సవరణ జాబితాలో చేర్చారు. ఓటరు వయసు తల్లిదండ్రుల వయసు మధ్య 50 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉండడం, ప్రస్తుత ఓటరు జాబితా, గత జాబితాలో తండ్రి పేరు వేర్వేరుగా ఉండడం, దంపతుల ఇద్దరు సంతానాల మధ్య వయసు తేడా 9 నెలల కంటే తక్కువగా ఉండడం, తండ్రిగా పేర్కొన్న వ్యక్తి పేరుతో సంతానం ఆరుగురి కన్నా ఎక్కువగా ఉండడం, అదే విధంగా ఓటరు మ్యాపింగ్ చేసిన తల్లిదండ్రుల ఓట్లు చెల్లని జాబితాలో ఉండడంతో వారి సంతానం ఓట్లు మారే అవకాశం ఉందని సవరణ జాబితాలో చేర్చారు. ప్రస్తుత ఓటరు జాబితా, గతంలోని ఓటరు జాబితాతో పోల్చినప్పుడు పేర్లు వేర్వేరుగా ఉండడం.. వీటిని సవరించుకునేందుకు 1987కు ముందు పుట్టి ఉంటే ఆధార్ కార్డుతోపాటు 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక చూపిస్తే సరిపోతుంది. 1987–2004 మధ్య పుట్టి ఉంటే మీ గుర్తింపు కార్డుతోపాటు తల్లి, లేదా తండ్రి ఒకరి ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది. 2004 తర్వాత పుట్టి ఉంటే తల్లి, తండ్రి ఇద్దరి వివరాలతో కూడిన ఆధారాలు చూపిస్తే సరిపోతుంది. అనారోగ్యంతో బాధపడుతున్నవారు, దివ్యాంగులు, అందుబాటులో లేని వారు ఉంటే వారి కుటుంబ సభ్యుల ద్వారా వివరణ తీసుకొని సరిచేస్తున్నాం. సాక్షి: ఓట్లను తగ్గించేందుకే సవరణ ప్రక్రియ చేపడుతున్నారని ప్రచారం జరుగుతోంది..? మీరేమంటారు..? రాజకీయ పార్టీల మద్దతు ఎలా ఉంది..?కలెక్టర్: సవరణ ప్రక్రియ అంటే అర్థం కాని వాళ్లు చేసే ప్రచారం. తప్పులు సరిచేయడం, ఒకే వ్యక్తికి ఒకేచోట ఓటు ఉండాలనే నిబంధన మేరకే సవరణ జరుగుతుంది. అర్హత ఉన్న ఏ ఒక్కరి ఓటు కూడా పోదు.. అయితే నోటీసులకు స్పందించాలి. వివరణ ఇవ్వాలి. జిల్లాలో రాజకీయ పార్టీల నుంచి మంచి మద్దతు వస్తుంది. ఈ ప్రక్రియ మొదలైన నాటి నుంచి పలుమార్లు రాజకీయ పార్టీలతో సమీక్షలు నిర్వహించాం. వారు ఇచ్చే సూచనలు, సలహాలు, క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలకు పరిష్కారం మార్గం చూపుతున్నాం. నోటీసులు తీసుకున్నవారి వద్ద సరైన ఆధారాలు లేకపోతే నివాసం, ఇతర ధ్రువీకరణ పత్రాలు కొత్తగా తీసుకోవచ్చని చెప్పాం. ఈ విషయం అన్ని మండలాల తహసీల్దార్లకు తెలిపాం. సర్ ప్రక్రియ కోసం వచ్చిన దరఖాస్తులకు వెంటనే సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశించాం. అదే విధంగా 2026 అక్టోబర్ ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఫాం–6 ద్వారా దరఖాస్తు చేసుకుంటే కొత్తగా ఓటు హక్కు వస్తుంది. పోలింగ్ స్టేషన్ మార్పు, తప్పులు సరిచేయడం కోసం ఫాం–8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. చివరగా ఓటర్లందరికీ చేసే విన్నపం ఒక్కటే వయోజనులైన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండాలి. ఇందుకోసం మేం అందజేసే నోటీసులు తీసుకొని స్థానిక గ్రామ పంచాయతీ, వార్డు కేంద్రాల్లో ఉన్న అధికారులను కలవండి. మీ వద్ద ఉన్న ఆధారాలు చూపించండి.. మీ ఓటును సరిచేసుకోండి.. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామ్యులవ్వండి. పకడ్బందీగా ఓటరు సవరణ ప్రక్రియ అర్హత ఉన్నవారి ఓటు పోదు నోటీసులకు స్పందించి సమాధానం ఇవ్వాలి ఎస్ఐఆర్పై రాజకీయ పార్టీలతో సమీక్షలు ‘సాక్షి’ ఇంటర్వ్యూలో కలెక్టర్ స్నేహ శబరీష్ -
రూ.1.38 కోట్ల పాతనోట్లు స్వాధీనం
● 8మంది నిందితుల అరెస్ట్ కాజీపేట: కేంద్ర ప్రభుత్వం సుమారు పదేళ్ల క్రితం రద్దు చేసిన రూ.1.38 కోట్ల విలువ చేసే పాత కరెన్సీ నోట్లను రవాణా చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. హనుమకొండ జిల్లా కాజీపేట పోలీస్స్టేషన్ ఆవరణలో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కాజీపేట చౌరస్తాలో వాహనాల తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలోని వ్య క్తుల కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో సోదాలు చేశారు. దీంతో 2016లో ప్రభుత్వం రద్దు చేసిన రూ.500, రూ.వెయ్యి నోట్ల కట్టలు బయటపడ్డాయి. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ముల్లా అబ్బాస్ (47), మంచిర్యాల జిల్లా హాజీపూర్కు చెందిన బాసవేని మల్లేష్, కరీంనగర్జిల్లా జమ్మికుంటకు చెందిన తంగళ్ల కృష్ణమోహన్, సిద్దిపేటకు చెందిన కుక్కల సంపత్, హనుమకొండకు చెందిన రైనాకుల శ్రీధర్, పల్లపు రాజు, వరంగల్ కరీమాబాద్కు చెందిన మహంకాళి శ్యాంసుందర్, నెక్కొండ మండలం చంద్రుగొండకు చెందిన మాంకాల గణేష్లను అరెస్ట్ చేశారు. వీరిని విచారించగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి నోట్ల సరఫరాకు సహకరించినట్లు చెప్పారు. ఆ వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉండగా, పట్టుబడిన నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీపీ తెలిపా రు. సమావేశంలో సీఐ శ్యాంసుదర్, ఎస్సైలు మౌని క, శివ, తాళ్లపల్లి యాదగిరి, శ్రీనివాస్, సిబ్బంది సునిత, అశోక్కుమార్, శ్రీధర్, క్రాంతికుమార్, కుమారస్వామి, విష్ణు, వినయ్ పాల్గొన్నారు. -
కాజీపేట మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు
కాజీపేట రూరల్: కాజీపేట మీదుగా వరంగల్ నుంచి సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్నగర్ మధ్య ప్రయాణించే పలు రైళ్లు ఆపరేషన్ కారణాల వల్ల ఈ నెల 20వ తేదీన రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రద్దు చేసిన రైళ్ల వివరాలు సికింద్రాబాద్–వరంగల్ (67761) పుష్పుల్, వరంగల్–సికింద్రాబాద్ (67762) పుష్పుల్, సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్నగర్ (12757) ఎక్స్ప్రెస్, సిర్పూర్ కాగజ్నగర్–సికింద్రాబాద్ (12758) వెళ్లే ఎక్స్ప్రెస్ను రద్దు చేసినట్లు తెలిపారు. వరంగల్ మీదుగా 8 పండుగ ప్రత్యేక రైళ్లు వరంగల్ మీదుగా ఈ నెల 19 శనివారం నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు పండుగకు వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు కోసం 8 సర్వీస్లుగా ప్రయాగ్రాజ్–తిరుణెలివెళ్లి మధ్య ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా.. ఈ నెల 19 శనివారం నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు 4 సర్వీస్లుగా ప్రయాగ్రాజ్–తిరుణెలివెళ్లి (04171) మధ్య ప్రయాణించే ఎక్స్ప్రెస్లు వరంగల్కు చేరుకుని వెళ్తాయి. ఈ నెల 21వ తేదీ నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు 4 సర్వీస్లుగా తిరుణెలివెళ్లి–ప్రయాగ్రాజ్ (04172) మధ్య ప్రయాణించే ఎక్స్ప్రెస్లు వరంగల్కు చేరుకొని వెళ్తాయి. ఈ రైళ్లకు అప్ అండ్ డౌన్ రూట్లో మాణిక్పూర్, సంత, కట్నీ, జబల్పూర్, ఇటార్సీ, నాగ్పూర్, చంద్రాపూర్, బల్లార్షా, సిర్పూర్ కాగజ్నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కట్పాడి, జోలర్పెట్టాయ్, సేలేమ్, నమక్కల్, కౌసర్, దిండిగల్, మధురై, విరుదునగర్, సతర్, కోవిల్పట్టిలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. వరంగల్ మీదుగా 8 పండుగ ప్రత్యేక రైళ్లు -
విద్యుత్ బిల్లుల చెల్లింపు సులభతరం
నెహ్రూసెంటర్: విద్యుత్ వినియోగదారులు తమ బిల్లులను సులభంగా, వేగవంతంగా చెల్లించేందుకు విద్యుత్శాఖ డిజిటల్ చెల్లింపు విధానాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకువచ్చిందని మహబూబాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ దర్శన్కుమార్ శుక్రవారం తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో వినియోగదారులు ఇంటి వద్ద నుంచే తమ విద్యుత్ బిల్లులు చెల్లించుకోవచ్చని సూచించారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో వివిధ యాప్ల ద్వారా బిల్లులను చెల్లించుకోవచ్చన్నారు. అందుబాటులో ఉన్న డిజిటల్ సౌకర్యాలను వినియోగించుకుని సురక్షితంగా, సులభతరంగా విద్యుత్ బిల్లులు చెల్లించాలని వినియోగదారులను కోరారు. కేజీబీవీ టీచర్కు షోకాజ్ నోటీసుకురవి: మండలంలోని నేరడ కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలకు చెందిన టీచర్ సుహాసినికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు జీసీ ఈఓ గాయత్రి శుక్రవారం తెలిపారు. పాఠశాలలో వినాయక చవితి పర్వదినోత్సవం సందర్భంగా పిల్లలను కొట్టారనే ఆరోపణ నేపథ్యంలో ఇన్చార్జ్ డీఈఓ ఆదేశాల మేరకు షోకాజ్ నోటీసులు అందించినట్లు ఆమె తెలిపారు. హనుమకొండ కోర్టుకు ఎమ్మెల్యే రాంచంద్రునాయక్మరిపెడ రూరల్: ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్ శుక్రవారం హనుమకొండలోని కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల సమయంలో నమోదైన కేసుకు సంబంధించిన న్యాయ ప్రక్రియలో భాగంగా ఆయన కోర్టుకు హాజరైనట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే వెంట పలువు రు న్యాయవాదులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఉద్యోగ మేళాకు స్పందనమహబూబాబాద్ అర్బన్: జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ మేళాకు విశేష స్పందన లభించింది. జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన ఉద్యోగ మేళాకు జిల్లా నుంచి 65 మంది అభ్యర్థులు హాజరు కాగా.. ఇంటర్వ్యూ లు, స్కీనింగ్ పరీక్షలు నిర్వహించి 35మందిని ఎంపిక చేసినట్లు కళాశాల కరస్పాండెంట్ డోలి సత్యనారాయణ తెలిపారు. అభ్యర్థులకు ఐసీసీఐ బ్యాంక్ నియామక పత్రాల ఉత్తర్వులు అందజేసినట్లు పేర్కొన్నారు. ఐసీసీఐ బ్యాంక్ హెచ్ఆర్ మేనేజర్ సుబ్రియా, కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణప్రసాద్, ఉద్యోగ మేళా మేనేజర్ గణేష్, అభ్యర్థులు పాల్గొన్నారు. పేదల ఇళ్లను క్రమబద్ధీకరించాలి మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో జీఓ 58కింద 50నుంచి 70గజాల స్థలాల్లో నిరుపేదలు నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించాలని ఎమ్మెల్యే మురళీనాయక్ శుక్రవారం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. మున్సిపాలిటీ పరిధిలో గతంలో జీఓ 58 కింద నిరుపేదలు చిన్నచిన్న స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నారని, వారి ఇళ్లను రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ పట్టణానికి 1,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, మున్సిపాలిటీ పరిధిలో పేదలు ఇళ్ల నిర్మాణాని కి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎ మ్మెల్యే సభ దృష్టికి తీసుకెళ్లారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి అడ్డంకులు తొలగించా లన్నారు. అసంపూర్తి పంచాయతీ భవనాల కు అదనపు నిధులు మంజూరు చేయాలన్నా రు. ‘చట్టాలు అమలు చేయకపోతే ఉద్యమం’బయ్యారం: ఆదివాసీ ప్రాంతంలో ప్రత్యేక చట్టాలను అమలు చేయకపోతే ఉద్యమం చేస్తామని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్కుమార్ అన్నారు. ఐటీడీఏల ద్వారా ఆదివాసీలకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 21న తలపెట్టిన భద్రాచలం ఐటీడీఏ ముట్టడి కార్యక్రమం జయప్రదం చేయాలని శుక్రవారం మండలంలోని పలు ఆదివాసీ పల్లెల్లో పోస్టర్ ఆవిష్కరణ, సమావేశాలు నిర్వహించారు. బయ్యారంలోని కొమురం భీం విగ్రహం వద్ద ఇటీవల హత్యకు గురైన ఊకే శిరీష మృతికి కొవ్వొత్తులు వెలిగించి సంతాపం తెలిపారు. తుడుందెబ్బ నాయకులు పోలబోయిన వెంకటేశ్వర్లు, ఇల్లందు ఏఎంసీ ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, మొట్లతిమ్మాపురం సర్పంచ్ సాంబయ్య, బయ్యారం మాజీ సర్పంచ్ కవిత తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
బయ్యారం: ఇల్లందు–మహబూబాబాద్ ప్రధాన రహదారిపై శుక్రవారం రాత్రి ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టడంతో ఇరువురు ప్రయాణికులకు తీవ్రగాయాలు కాగా తృటిలో పెనుప్రమాదం తప్పింది. ప్రయాణికుల కథనం ప్రకారం.. పరకాల డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు 43 మంది ప్రయాణికులతో భద్రాచలం వెళ్తుంది. ఈ క్రమంలో బయ్యారం అలిగేరు బ్రిడ్జి సమీపంలో ఇల్లందు నుంచి మహబూబాబాద్ వైపు బొగ్గులోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బస్సుపైకి దూసుకొచ్చింది. ప్రమాదాన్ని పసిగట్టిన ఆర్టీసీ డ్రైవర్ వెంకటేశ్వర్లు బస్సును రోడ్డు కిందికి దింపడంతో కుడి వైపు చివరిభాగాన్ని ఢీకొట్టాడు. ఈ సమయంలో బస్సులో కిటికీ పక్కన కూర్చున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన కొలిపాక శ్రీనివాస్ చేయి విరగ్గా.. గార్ల మండలం సీతంపేటకు చెందిన ధరావత్ సరోజ తలకు బలమైన గాయమైంది. వారిని 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. వీరిలో శ్రీనివాస్ను మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్కు వైద్యులు రిఫర్ చేశారు. ప్రయాణికుల్లో 20 మందికి స్వల్పగాయాలు కాగా, వారిని ఇతర బస్సులో గమ్యస్థానాలకు పంపించారు. బస్సు డ్రైవర్పై లారీ డ్రైవర్ దాడి ఆర్టీసీ బస్సును నిర్లక్ష్యంగా ఢీ కొట్టి వెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు డ్రైవర్ స్థానికుల సాయంతో వెంబడించారు. ఈ క్రమంలో లారీని ఆపిన తర్వాత లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్పై దాడి చేసి గాయపర్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు లారీతోపాటు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరికి తీవ్ర, 20 మందికి స్వల్పగాయాలు ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెనుప్రమాదం -
దయాహృదయులు స్పందించారు..
వర్ధన్నపేట: మెడిసిన్లో సీటు వచ్చినా.. ఫీజు చెల్లంచే స్థోమత లేక ఆందోళనలో ఉన్న వర్ధన్నపేటకు చెందిన పేద విద్యార్థి అఖిలకు ‘ఆపన్న హస్తం అందించరూ..’ అనే శీర్షికన శుక్రవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి పలువురు దాతలు స్పందించారు. విద్యార్థిని చదువుకు తమవంతు సాయం అందించడంలో భాగంగా.. నీటిపారుదల ఇంజనీరింగ్ శాఖలో ప్రముఖ కాంట్రాక్టర్ గుజ్జ సుమన్రావు రూ. లక్ష, పట్టణంలోని వీరభధ్ర ఫిల్లింగ్ స్టేషన్ యాజమాన్యం రూ.25 వేలు, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో రూ.35 వేలు, టీపీసీసీ జిల్లా అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్రావు, ఆరోగ్య శాఖ అధికారి నెహ్రునాయక్, రాజమణి దంపతులు రూ.10 వేల చొప్పున అందించారు. వీరితోపాటు మరికొంతమంది తమకు తోచిన సాయం అందించారు. దీంతో తన చదువుకు సాయం అందించేందుకు ముందుకొచ్చిన దాతలకు, తన విషయంపై కథనం ప్రచురించిన సాక్షి దినపత్రికకు అఖిల కృతజ్ఞతలు తెలియజేసింది. ఆపన్న హస్తం అందించిన దాతలు సాక్షి, దాతలకు కృతజ్ఞతలు తెలిపిన మెడికల్ విద్యార్థిని -
గ్రాడ్యుయేట్ ఓటు.. దరఖాస్తు చేయకుంటే చేటు
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఓటరు జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల సంఘం తాజా షెడ్యూల్ను విడుదల చేయడంతో కసరత్తు మొదలైంది. ఇప్పటికే ఓటరుగా నమోదైన వారు సైతం మళ్లీ ఫారం–18 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పాత జాబితాలో పేరు ఉన్నదనే కారణంతో కొత్త జాబితాలో పేరు ఆటోమేటిక్గా కొనసాగదు. 2021లో 5.05 లక్షల మంది.. 2024 ఉప ఎన్నికలో తగ్గిన ఓటర్లు.. వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2021 మార్చిలో ఎన్నికలు జరిగాయి. అప్పటి జాబితాలో 5,05,565 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 3,32,634 మంది పురుషులు, 1,72,864 మంది మహిళలు, 67 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 1,81,313 మంది ఓటర్లు నమోదయ్యారు. ఆ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్రెడ్డి విజయం సాధించారు. కాగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గంనుంచి పల్లా రాజేశ్వర్రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో 2024లో ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఉప ఎన్నికలో తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. 2024 ఉప ఎన్నిక తుది ఓటరు జాబితాలో 4,61,806 మంది పట్టభద్ర ఓటర్లు ఉన్నారు. ఇందులో 2,87,007 మంది పురుషులు, 1,74,794 మంది మహిళలు, ఐదుగురు ఇతర ఓటర్లు ఉన్నారు. ఈసారి ఎంతమంది? 2021 ఎన్నికతో పోలిస్తే 2024 ఉప ఎన్నిక నాటికి ఓటర్ల సంఖ్య తగ్గింది. ఇప్పుడు మరోసారి కొత్తగా పట్టభద్రుల ఓటరు జాబితాను రూపొందించనుండడంతో ఈసారి ఎంతమంది అర్హులు దరఖాస్తు చేసుకుంటారు? తుది జాబితాలో ఓటర్ల సంఖ్య ఎంతకు చేరుతుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. అర్హత ఉన్న ప్రతీ పట్టభద్రుడు ఫారం–18 దరఖాస్తు చేయడం కీలకం. నవంబర్ 6 తర్వాత మిగిలిన ప్రక్రియ కొనసాగి, డిసెంబర్ 30న తుది ఓటరు జాబితా వెలువడనుంది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఓటర్ల నమోదుపై దృష్టి సారించిన ప్రధాన పార్టీలు.. పోటాపోటీగా నమోదు చేయించేందుకు వ్యూహరచనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2021 ఎన్నికలకంటే ఈసారి 15 నుంచి 25 శాతం వరకు ఓటర్లు పెరగవచ్చన్న చర్చ జరుగుతోంది. అవసరమైన అర్హతలు ఉండాలి.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు జాబితాను కొత్తగా రూపొందించనున్నారు. ఇందుకోసం అర్హులైన పట్టభద్రులు నిర్ణీత గడువులో ఫారం–18 సమర్పించాలి. గతంలో ఇదే నియోజకవర్గంలో ఓటు వేసినవారు, ప్రస్తుతం ఓటు ఉన్నవారు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుతో విద్యార్హతకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి. ఓటు హక్కు పొందేందుకు డిగ్రీ ఉంటే సరిపోదు. ఎన్నికల నిబంధనల ప్రకారం నిర్ణీత అర్హత తేదీ నాటికి పట్టభద్రుడై ఉండటంతోపాటు అవసరమైన అర్హతలతో గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎమ్మెల్సీ ఓటుకు మళ్లీ ‘ఫారం–18’ సమర్పించాల్సిందే ఈనెల 28న నోటీసు.. నవంబర్ 6 వరకు దరఖాస్తుల స్వీకరణ నవంబర్ 25న ముసాయిదా.. డిసెంబర్ 30న తుది జాబితా -
విద్యార్థుల్లో మేధాశక్తికి గణితం కీలకం
కేయూ క్యాంపస్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నప్పటికీ విద్యార్థుల్లో మేధాశక్తికి గణితం కీలకంగా ఉంటుందని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రామచంద్రం అన్నారు. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో శుక్రవారం గణితం విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి (ఎంటీటీఎస్) మ్యాథ్స్మెటిక్స్ ట్రైనింగ్ అండ్ టాలెంట్ సెర్చ్ ఓవర్చ్యూర్ –2026 ప్రోగ్రాంలో భాగంగా వివిధ జిల్లాలకు చెందిన డిగ్రీ విద్యార్థులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గణతాన్ని కేవలం ఒక పాఠ్యాంశంగా కాకుండా నిత్యజీవితంలో విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉపయోగపడే నైపుణ్యాలుగా భావించాలన్నారు. హైదరాబాద్లోని ఐఐటీ ప్రొఫెసర్ సుకుమార్ మాట్లాడుతూ ఆధునిక పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గణితాన్ని సులభతరంగా నేర్చుకోవచ్చని వివరించారు. కేయూ ఓఎస్డీ ఆచార్య వెంకట్రామ్రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రాథమిక గణితంలోని భావనలు, సూత్రాలపై అవగాహన ఎంతో అవసరమని అన్నారు. పోటీ పరీక్షలకు, ఉద్యోగాలు, ఆర్థిక వ్యవహారాల్లో గణిత పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సమావేశంలో యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జ్యోతి, యూనివర్సిటీలోని గణితం విభాగం అధిపతి డాక్టర్ బీఎస్ఎల్ సౌజన్య, ప్రోగ్రామ్ కన్వీనర్ డాక్టర్ నాగయ్య, గణిత విభాగం అధ్యాపకురాలు డాక్టర్ శ్రీలక్ష్మి, రవికుమార్, అంజన్రావు, డాక్టర్ మంజుల, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రెహమాన్ మాట్లాడారు. కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం -
విద్యుదాఘాతంతో రైతు మృతి
ఖానాపురం: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘన వరంగల్ జిల్లా ఖానాపురం మండలం దబ్బీర్పేట శివారులోని పంట పొలాల్లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేట మండలంలోని ఏనుగల్ తండాకు చెందిన భూక్య శ్రీనివాస్(40) మానుకోటలోని టీజీటీడబ్ల్యూఆర్డీసీ గర్ల్స్ కాలేజీలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో దబ్బీర్పేట శివారులో తనకున్న 2.20 గుంటల వ్యవసాయ భూమిలో మిరప తోట పెట్టేందుకు శుక్రవారం కూలీలను తీసుకెళ్లాడు. చేనులో నీరు పారించేందుకు మోటార్ ఆన్ చేయగా కరెంట్ లేదు. దీంతో సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి పరిశీలించగా ఫీజు తొలగిపోయి ఉండటాన్ని గమనించాడు. అధికారులకు సమాచారం ఇవ్వకుండానే ట్రాన్స్ఫార్మర్ ఫీజు సరిచేస్తుండగా.. మెయిన్ లైన్ విద్యుత్ తీగలకు తగలడంతో విద్యుత్షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన కూలీలు.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శ్రీనివాస్కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య సరోజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వడదెబ్బతో వృద్ధుడు.. ములుగు: వడదెబ్బకు గురై మేకల సమ్మయ్య(63) అనే వృద్దుడు గురువారం మృతిచెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగులోని నాయకపువాడకు చెందిన సమ్మయ్య కాలక్షేపం కోసం తోపుకుంట వైపుకు వెళ్లి వడదెబ్బకు గురై పడిపోగా, స్థానికులు గమనించి 108కు సమాచారం అందించారు. ఆపస్మారకస్థితిలో ఉన్న సమ్మయ్యను చికిత్స నిమిత్తం ములుగు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుటుంబాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ బానోతు రవిచందర్ పరామర్శించారు. -
కక్కుర్తి పడితే ఖతమే..!
సాక్షి, వరంగల్: దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు మ్యూల్ ఖాతాల కేంద్రంగా జరుగుతుండడంతో ఈ ఖాతాదారులపై కూడా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. చట్టబద్ధంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. దేశంలో 185 సైబర్ నేరాలకు సంబంధించి లావాదేవీలు జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్న ఖాతాలు వరంగల్లో ఉన్నట్టుగా ధ్రువీకరించిన కేసులో ఇప్పటికే వరంగల్ సైబర్ క్రైమ్, టాస్క్ఫోర్స్, మీల్స్ కాలనీ పోలీసులు అరెస్టు చేసిన 22 మంది సభ్యుల్లో ఏజెంట్లతోపాటు మ్యూల్ ఖాతాదారులుండడం కలవరానికి గురిచేస్తోంది. ముద్ర లోన్, ఇతర రుణాల కోసమంటూ డబ్బు అవసరమున్న విద్యార్థులు, రైతులు, కార్మికులను గుర్తించి బ్యాంక్ ఖాతా తెరిచి సంబంధిత పత్రాలు, ఏటీఎం కార్డు ఇస్తే కమిషన్ ఇస్తామంటూ నమ్మబలికి ఆ ఖాతాలను సైబర్ నేరాల కోసం వినియోగిస్తుండడం సంచలనం రేపుతోంది. దీంతో కమిషన్ కోసం కక్కుర్తి పడితే కటకటాలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కమీషన్ కోసం ఇతరులకు మీ అకౌంట్ ఇచ్చి అది నేరానికి ఉపయోగించినట్లు తేలితే ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు. ‘మ్యూల్ ఖాతా’ అంటే.. మోసపూరితంగా వచ్చిన డబ్బును సైబర్ నేరగాళ్లు నేరుగా తమ ఖాతాల్లోకి తీసుకోకుండా, ఇతరుల పేర్లతో తెరిచిన బ్యాంకు ఖాతాలను ఉపయోగిస్తారు. ఇలాంటి ఖాతాలను ‘మ్యూల్ అకౌంట్’గా పిలుస్తారు. నేరాల ద్వారా వచ్చిన డబ్బు ఈ ఖాతాల్లోకి చేరిన తర్వాత పలు ఖాతాలకు బదిలీ చేయడం, నగదుగా మార్చడం లేదా ఇతర మార్గాల్లో తరలిస్తారు. ప్రస్తుతం నమోదైన కేసులో కూడా ఇలాంటి ఖాతాలను సైబర్ నేరగాళ్లకు అందించే ప్రత్యేక నెట్వర్క్ ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మధ్యవర్తి, ఏజెంట్లుగా వ్యవహరించేవారికి ఖాతాకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు వస్తే అసలు ఖాతాదారుడికి రూ.6,000 నుంచి రూ.8,000 మధ్య ఇస్తున్నట్లు సమాచారం. సైబర్ ముఠాల మూడంచెల వ్యూహం.. ● ఎర: కేంద్ర ప్రభుత్వ ‘ప్రధానమంత్రి ముద్ర రుణం’ కింద రూ.50,000 ఇప్పిస్తామంటూ నకిలీ పత్రాలతో నమ్మిస్తారు. ● కమీషన్: బ్యాంక్లో మీతోనే అకౌంట్ ఓపెన్ చేయించి.. పాస్బుక్, ఏటీఎం, సిమ్ కార్డు తీసుకుని రూ.6,000 నుంచి రూ.8,000 చేతిలో పెడతారు. ● నేరం: ఆ అకౌంట్లను (మ్యూల్ ఖాతాలు) దేశవ్యాప్తంగా జరిగే కోట్ల రూపాయల ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ మోసాలు, నల్లధనాన్ని మళ్లించడానికి వాడుకుంటారు. ఆశపడి బ్యాంక్ ఖాతాలిస్తే నేరమే.. కేసులు, ఆపై జైలుకు తప్పదంటున్న పోలీసులు తాజాగా వరంగల్ పోలీసులు ఛేదించిన కేసు చెబుతున్నదిదే..మ్యూల్ ఖాతాదారులైతే మూల్యం చెల్లించాల్సిందే..ఏం చేయకూడదు? 1.రూ.50 వేల లోన్ ఆశ చూపే లోకల్ బ్రోకర్లు, అధికారిక బ్యాంకులనే ఆశ్రయించాలి. 2. కమీషన్ వస్తుందని ఆశపడి బ్యాంక్ పాస్బుక్, ఏటీఎం కార్డు, పిన్ ఇతరులకు ఇవ్వొద్దు. 3.మీ పేరు మీద తీసుకున్న సిమ్ అయిందని అనుమానం వస్తే వెంటనే ఇవ్వొద్దు. 4.నా అకౌంట్తో నేనేం మోసం చేయలేదు కదా అని నిర్లక్ష్యంగా ఉండొద్దు.ఏం చేయాలి? 1. రుణాల కోసం నేరుగా గుర్తింపు పొందిన మధ్యవర్తులను నమ్మొద్దు. 2.మీ ఆధార్, పాన్ కార్డులను దేనికై నా ఇస్తే,వాటిపై ఏ అవసరం కోసం ఇస్తున్నారో పెన్నుతో రాయాలి. 3.మీ ప్రమేయం లేకుండా అకౌంట్ ఓపెన్ కార్డును ఇతరులకు వాడుకోమని హోమ్ బ్రాంచ్కు వెళ్లి చెక్ చేయాలి. 4.సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేయాలి. -
న్యాయ సేవలు మరింత చేరువ
మరిపెడ రూరల్: మరిపెడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ కోర్టు నేడు(శనివారం) ప్రారంభం కానుంది. దీంతో ఈ ప్రాంత ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువ కానున్నాయి. కోర్టు ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా సీనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి, తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జి ధీరజ్ కుమార్ పరిశీలించారు. 16 ఏళ్ల నిరీక్షణకు తెర.. మరిపెడలో సివిల్ కోర్టు ఏర్పాటు కావడంతో స్థానిక ప్రజల చిరకాల డిమాండ్ నెరవేరింది. ఇప్పటివరకు సివిల్ వివాదాలు, ఇతర న్యాయపరమైన వ్యవహారాల కోసం సమీపంలోని తొర్రూరు, మహబూబాబాద్ కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇకపై మరిపెడలోనే కోర్టు అందుబాటులోకి రావడంతో ప్రజలకు ప్రయాణ భారం, సమయం, ఖర్చులు తగ్గనున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు న్యాయ సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. గెజిట్ అధికార పరిధి.. తెలంగాణ హైకోర్టు న్యాయ నోటిఫికేషన్ మేరకు మరిపెడలో కోర్టు ఏర్పాటుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఈ సంవత్సరం ఏప్రిల్ 17న విడుదలైంది. గెజిట్లో కోర్టు ఏర్పాటు, స్థానం, స్థానిక అధికార పరిధికి సంబంధించిన వివరాలు పేర్కొన్నారు. కాగా, మరిపెడ కోర్టులో మరిపెడ, నర్సింహులపేట, సీరోలు, చిన్నగూడూరు మండలాల ప్రజలకు న్యాయ సేవలు అందనున్నాయి. ముఖ్య అతిథులు వీరే.. కోర్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లను స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ వీసారపు ప్రగతిశ్రీపాల్రెడ్డితో కలిసి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి, తొర్రూ రు జూనియర్ సివిల్ జడ్జి ధీరజ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్ చేతుల మీదుగా కోర్టును ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు, జస్టిస్ బి.ఆర్. మధుసూదన్ హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మహబూబాబాద్ జిల్లా జడ్జి కె.మురళీమోహన్, తొర్రూరు బార్ అసోసియేషన్ ఆధ్యక్షుడు వి.వెంకటరత్నం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏజీపీ లింగాల శ్రీనివాస్, సీనియర్ అడ్వకేట్ వెంకటేశ్వర్లు, న్యాయవాదులు బానోతు లాలునాయక్, సైదులు, తేజావత్ శారదరవీందర్ నాయక్, భూక్య శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, శ్రీశైలం, మామిడాల మునేష్, చందు, స్థానిక సీఐ పవన్ కుమార్, ఎస్సీ గండ్రాతి సతీష్, రెవెన్యూ, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు. నేడు మరిపెడలో సివిల్ కోర్టు ప్రారంభం ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా సీనియర్ సివిల్ జడ్జి -
విద్యాభివృద్ధే లక్ష్యం
గూడూరు: విద్యాభివృద్ధే లక్ష్యంగా విద్యార్థులకు సేవలందిస్తున్నామని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యు డు జాటోతు హుస్సేన్నాయక్ అన్నారు. గెయిల్ ఇండియా లిమిటెడ్ కార్పొరేట్ సంస్థ అందించిన నిధులతో శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 9, 10వ తరగతి విద్యార్థినులకు ఉచితంగా 150 సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సంరద్భంగా హుస్సేన్నాయక్ మాట్లాడుతూ.. ఇప్పటికీ ఇంకా కొందరు పేద విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి నడుచుకుంటూ పాఠశాలలకు వస్తున్నారనే విషయం తెలుసుకొని సైకిళ్లు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తమ లక్ష్యాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో గెయిల్ సంస్థ ప్రతినిధులు వీర్ మురుగన్, కటియార్, అన్సారీ, మిత్ర హోలిస్టిక్ హెల్త్ సొసైటీ చైర్మన్ లక్ష్మి, ఎంఈఓ ఎ.సుజాత, తహసీల్దార్ నాగభవాని, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, రాసమల్ల వెంకటేశ్వర్లు, మేరెడ్డి సురేందర్, గుగులోతు రాంబాబు, ధర్మానాయక్ తదితరులు పాల్గొన్నారు. కేసముద్రంలో.. కేసముద్రం: మున్సిపాలిటీ పరిధి కేసముద్రం జెడ్పీహైస్కూల్ ఆవరణలో శుక్రవారం గెయిల్ ఇండియా లిమిటెడ్ కార్పొరేట్ సంస్థ సహకారంతో కేసముద్రంస్టేషన్, కేసముద్రంవిలేజ్, ఉప్పరపల్లి జెడ్పీ హైస్కూల్లకు చెందిన 9,10వ తరగతి విద్యార్థినులకు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్నాయక్ చేతులమీదుగా ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గెయిల్ ఇండియా ఈడీ ఆర్ఎస్ వీర్మురుగన్, జీఎం కటియార్, ఆసిఫ్, అన్సారీ, సీజీఎం హెచ్ఆర్ శ్రీదేవ్కాంత్, మిత్ర హోలిస్టిక్ హెల్త్ సొసైటీ ప్రతినిధి లక్ష్మి, తహసీల్దార్ వివేక్, సీఐ సత్యనారాయణ, ఎస్సై క్రాంతికిరణ్, ఎంఈఓ కాలేరు యాదగిరి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షుడు పొదిల నర్సింహరెడ్డి, పట్టణ కన్వీనర్ బోగోజు నాగేశ్వరాచారి, మండల అధ్యక్షుడు ఉప్పునూతల రమేశ్, భాస్కర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
కేయూలో న్యూపీజీ హాస్టల్ వద్ద ఘర్షణ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని న్యూపీజీ హాస్టల్ మెస్ వద్ద గురువారం రాత్రి తాగునీటిని వినియోగించుకునే సమయంలో ఇద్దరు విద్యార్థుల మధ్య తలెత్తిన వివా దం పరస్పర వాగ్వాదాల నుంచి చేయిచేసుకునేవరకు వెళ్లింది. ఇందులో ఓ విద్యార్థి సమాచారంతో అక్కడకు వచ్చిన నాన్బోర్డర్తోపాటు పలువురు మరో విద్యార్థిని కొట్టారని సమాచారం. విషయం తెలుసుకున్న కాకతీయ యూనివర్సి టీ పోలీసులు చేరుకుని విద్యార్థులకు సర్దిచెప్పేయత్నం చేశా రు. విద్యార్థిపై చేయిచేసుకున్న నాన్బోర్డర్పై ఓ విద్యార్థి చేయి చేసుకున్నాడని తెలిసింది. అయితే నాన్బోర్డర్ వచ్చి క్యాంపస్ విద్యార్థిని కొట్టడంపై కొందరు విద్యార్థులు శుక్రవారం కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం దృష్టికి తీసుకెళ్లారు. నాన్బోర్డర్ల సమస్యను పరిష్కరించి హాస్టల్ మెస్కు రాకుండా చూడాలని రిజిస్ట్రార్ను కోరారు. దీంతో వివాదానికి గల కారణాలపై రిజిస్ట్రార్ ఆరా తీశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న సీఐ రవికుమార్, ఎస్సై విజయ్ నాన్బోర్డర్లపై నిర్ణయం తీసుకుంటే తాము సహకరిస్తామని రిజిస్ట్రార్కు చెప్పారు. ఈవిషయంపై కేయూ రిజిస్ట్రార్ రామచంద్రంను సాక్షి వివరణ కోరగా ఇద్దరు విద్యార్థుల మధ్య మెస్ వద్ద వివాదం తలెత్తిందని తెలిపారు. నాన్బోర్డర్ల రాకతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుందన్నారు. పోలీసులు విచారణ జరిపి ఎవరిది తప్పనేది తేల్చి చర్యలు తీసుకుంటారని తనవద్దకు వచ్చినవారికి చెప్పినట్లు వివరించారు. కేయూ పోలీస్టేషన్ ఎస్సై విజయ్ను వివరణ కోరగా న్యూ పీజీ హాస్టల్ మెస్ వద్ద విద్యార్థుల మధ్య జరిగిన గొడవ సద్దుమణిగేలా చేశామని తెలిపారు. అయితే విద్యార్థులెవరూ పోలీస్టేషన్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదని తెలిపారు. మెస్వద్ద ఇద్దరు విద్యార్థుల మధ్య తలెత్తిన వైరం పోలీసుల రాకతో సద్దుమణిగిన వివాదం పరస్పర ఆరోపణలతో రిజిస్ట్రార్ దృష్టికి.. -
విద్యార్థులు ఇంగ్లిష్పై పట్టు సాధించాలి
డోర్నకల్: విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశించారు. స్థానిక ఎంపీపీఎస్, కేజీబీవీలను శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంపీపీఎస్లో విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ వారి సబ్జెక్ట్ పరిజ్ఞానం, చదవడం, రాయడంలో నైపుణ్యాన్ని పరీక్షించారు. లీప్ ప్రోగ్రాం ద్వారా ఆంగ్ల భాషా నైపుణ్యాల పెంపు కార్యక్రమాన్ని పాఠశాలల్లో అమలు చేయకపోవడంపై ఎంఈఓ ఆంగోత్ లక్ష్మాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు చురుకై న భాగస్వామ్య పద్ధతుల ద్వారా బోధించాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణ, తాగునీటి వసతి, పాఠశాల ఆవరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేజీబీవీని సందర్శించిన కలెక్టర్ రికార్డులతో పాటు విద్యార్థుల హాజరుశాతం పరిశీలించారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం, మధ్యాహ్న భోజనాన్ని అందించాలని ఆదేశించారు. బాలికల్లో విద్యా నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పాఠ్యాంశాలను వివరంగా అర్థమయ్యేలా బోధించాలని, ఆంగ్ల భాషపై పట్టు సాధించేలా ప్రతీ అంశాన్ని వివరంగా చెప్పాలని సూచించారు. ఇన్చార్జ్ డీఈఓ శ్రీరాములు, జీఈసీఓ గాయత్రి, ఎంఈఓ ఆంగోత్ లక్ష్మానాయక్, తహసీల్దార్ రాఘవరెడ్డి, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ ఎస్కె.మున్నీ, మున్సిపల్ వైస్చైర్పర్సన్ లావణ్యశ్రీనివాస్, మున్సిపాలిటీ మేనేజర్ నర్సింహమూర్తి ఉన్నారు. -
పాఠశాలలకు క్రీడా నిధులొచ్చాయ్..
సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ పాఠశాలలకు విడుదలైన క్రీడా నిధులను ఆయా పాఠశాలలు సద్వినియోగం చేసుకోవాలి. పరికరాలు కొనుగోలు చేసి పలు క్రీడల్లో రాణించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలి. – మందుల శ్రీరాములు, ఇన్చార్జ్ డీఈఓ మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు క్రీడల్లోనూ రాణించేలా ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాకు ఖేలో ఇండియా క్రీడా నిధులు రూ.59.10లక్షలు విడుదల చేశాయి. ఈ నిధులు నేరుగా పాఠశాల యాజమాన్య కమిటీ ఖాతాలో జమ అవుతాయి. ఈ నిధులతో క్రీడా పరికరాలు మాత్రమే కొనుగోలు చేయాలనే ఆదేశాలున్నాయి. ప్రాథమిక పాఠశాలలకు రూ.5వేలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు రూ.10వేల చొప్పున జమ అవుతా యి. రానున్న రోజుల్లో విద్యార్థులు రాష్ట్ర, కేంద్ర స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచేందుకు ఈ నిధులు దోహదపడనున్నాయి. జిల్లాకు రూ.59.10లక్షలు.. జిల్లాలో మొత్తం 742 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. రూ.59.10లక్షల నిధులు మంజూరయ్యాయి. జిల్లాలోని 360 ప్రాథమిక పాఠశాలలకు రూ.18 లక్షలు, 101 ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.19.10 లక్షలు, 96 ఉన్నత పాఠశాలలకు రూ.24 లక్షలు వచ్చాయి. 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రూ.2.25 లక్షలు, మోడల్, కేజీబీవీ స్కూల్, కళాశాలలకు రూ.4.75లక్షలు వచ్చాయి. అదేవిధంగా గ్రౌండ్ లేని 56 ప్రాథమిక పాఠశాలలకు రూ.4 వేల చొప్పున రూ.2.24లక్షలు, 13 ప్రాథమిక పాఠశాలలకు రూ.7,000 చొప్పున రూ.91వేలు, 11 ఉన్నత పాఠశాలలకు రూ.1.65లక్షలు, ఒక ప్రభుత్వ కళాశాలకు రూ.19,000 మంజూరయ్యాయి. 742 పాఠశాలలు.. 75 పాఠశాలలకు పీఈటీలు ప్రభుత్వ పాఠశాలల్లో పీఈటీల కొరత తీవ్రంగా వేధిస్తుండడంతో విద్యార్థుల సమగ్ర వికాసానికి, క్రీడా నైపుణ్యాల పెంపుదలకు ఆటంకం ఏర్పడుతోంది. పలు పాఠశాలల్లో పీఈటీ పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల మైదానాలు ఉన్నప్పటికీ ఆటలాడించే దిక్కులేక క్రీడా పీరియడ్లు నామమాత్రంగా మారుతున్నాయి. జిల్లాలో 742 పాఠశాలలకు 75 పాఠశాలల్లో మాత్రమే పీఈటీలు ఉండడం గమనార్హం. జిల్లాలోని 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఒక్క పీడీ కూడా లేరు. అయితే కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో రెగ్యులర్ పీఈటీల రిటైర్మెంట్కు అనుగుణంగా కొత్త నియామకాలు జరగకపోవడం, విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోస్టులను కేటాయించడం వల్ల చాలా హైస్కూళ్లలో పీఈటీ పోస్టులు రద్దవుతున్నాయి లేదా ఇతర స్కూళ్లకు బదిలీ అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఖాళీలను భర్తీ చేయకపోతే ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడారంగం మరింత వెనుకబడే ప్రమాదం ఉంది. ప్రాథమిక పాఠశాలలకు రూ.5 వేలు.. ప్రాథమికోన్నత, హైస్కూళ్లకు రూ.10 వేలు జిల్లాకు రూ.59.10లక్షలు మంజూరు -
కలలకు ‘పట్టా’భిషేకం !
కాజీపేట అర్బన్: కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఏళ్ల కల నెరవేరనుంది. విద్యార్థుల శ్రమ, అకుంఠిత దీక్షకు నేడు(శనివారం), రేపు (ఆదివారం) పట్టాభిషేకం జరగనుంది. నిట్ వరంగల్లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో 24వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యాంపస్లోని హోమీ బాబా సెమినార్హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ మాట్లాడుతూ.. విద్యార్థి జీవితంలో డిగ్రీ పట్టాల స్వీకరణ కీలక ఘట్టం అన్నారు. స్నాతకోత్సవం గురించి ఆయన తెలిసిన వివరాల ప్రకారం.. నిట్ 24వ కాన్వకేషన్–26లో రెండు రోజుల పాటు 1,997 మంది యూజీ, పీజీ విద్యార్థులు పట్టాలు అందుకోనున్నారు. తొలి రోజు శనివారం ఉదయం 10 గంటల నుంచి స్నాతకోత్సవం ప్రారంభం అవుతుంది. యూజీ విద్యార్థులు 930 మంది పట్టాలు స్వీకరిస్తారు. రెండో రోజు ఆదివారం పీజీ, పీహెచ్డీ విద్యార్థులు 1,067 మంది పట్టాలు అందుకుంటారు. ముఖ్య అతిథి టెక్సాస్ ఇండియా ఎండీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంతోశ్కుమార్ హాజరై పట్టాలు అందజేస్తారు. స్నాతకోత్సంలో నిట్ చైర్పర్సన్ సేయాంట్ సాఫ్ట్వేర్ కంపెనీ చైర్మన్, డాక్టర్ బీవీఆర్ మోహన్రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. ప్రతీ విభాగంలో టాపర్లకు గోల్డ్మెడల్, ఓవరాల్ టాపర్కు ఇన్స్టిట్యూట్ గోల్డ్మెడల్తో పాటు ఇంజనీరింగ్ రంగంలో ప్రత్యేక పరిశోధనలకు ‘ఇన్నోవేటివ్ అప్లికేషన్స్ ఆఫ్ ఆటోమెటిక్ కంట్రోల్ టెక్నాలజీస్ టు ఏవియేషన్ అండ్ ఏరో స్పేస్ ఇంజనీరింగ్’ అంశంపై పరిశోధనలకు డాక్టర్ పద్మనాభన్ కె.మీనన్కు, ‘డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ, అడ్వాన్సింగ్ ఇండియాస్ సెమీ కండక్టర్ అంబీషన్స్ త్రూ విజనరీ టెక్నాలజీ లీడర్ షిప్’ అంశంపై పరిశోధనలకు ఆనంద్ రామమూర్తికి గౌరవ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్డీ) పట్టాలు అందజేయనున్నారు. నిట్ వరంగల్లో నేడు, రేపు పట్టాల అందజేత స్వీకరించనున్న 1,997 మంది విద్యార్థులు విద్యార్థి జీవితంలో కీలక ఘట్టం : నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ -
ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం కీలకం
● ఎస్పీ శబరీష్ మహబూబాబాద్ రూరల్ : ప్రజాస్వామ్య పాలనలో ప్రజల సంక్షేమం, పారదర్శకత, జవాబుదారీతనం ఎంతో కీలకమని ఎస్పీ శబరీష్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ శబరీష్ గురువారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలోనే కొనసాగిందని గుర్తు చేశారు. అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో చేపట్టిన ఆపరేషన్ పోలో అనంతరం 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో కలిసిందని వివరించారు. ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీ ఒక్కరికి పారదర్శకంగా అందేలా ప్రజాపాలన వ్యవస్థ పనిచేస్తుందని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల రక్షణ పోలీసుల ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజలకు మరింత చేరువగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రతీ పోలీసు అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. -
కోర్టు ప్రారంభోత్సవం సజావుగా జరగాలి
● తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జి ధీరజ్ కుమార్ మరిపెడ రూరల్: మరిపెడలో నూతనంగా ఏర్పాటు చేయనున్న జూనియల్ సివిల్ కోర్టు ప్రారంభోత్సం సజావుగా జరిగేలా చూడాలని తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జి ధీరజ్ కుమార్ సూచించారు. మరిపెడ పట్టణంలో రేపు(శనివారం) నిర్వహించనున్న జూనియర్ సివిల్ కోర్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు, నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట తహసీల్దార్ కృష్ణవేణి, సీఐ పవన్ కుమార్, ఎస్సై గండ్రాతి సతీష్, ఏజీపీ లింగాల శ్రీనివాస్, సీనియర్ అడ్వకేట్ వెంకటేశ్వర్లు, న్యాయవాదులు బానోతు లాలు, తొనుకునూరి సైతులు, తేజావత్ శారదరవీందర్ నాయక్, శ్రీశైలం, శ్రీనివాస్, మామిడాల మునేష్ ఉన్నారు. -
రేవంత్కు ఖాసీం రజ్వీ గతే..
జనగామ : ఖాసీం రజ్వీకి పట్టిన గతే సీఎం రేవంత్రెడ్డికి పడుతుందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం జనగామ మండలం యశ్వంతాపూర్లోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గోబెల్స్ మాదిరి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అబద్ధాలను పదేపదే ప్రచారం చేస్తున్నారని, గోబెల్స్కు ఏ గతి పట్టిందో మంత్రికి కూడా అదే గతి పడుతుందన్నారు. భూ కబ్జాలపై మంత్రి పొంగులేటి.. తనపై చేసిన వ్యాఖ్యలపై ఆధారాలు బయటపెట్టాలని సవాల్ చేశారు. తన భూములను 22ఏ జాబితాలో చేర్చడంపై చట్టపరంగా పోరాడుతానన్నారు. రేవంత్, పొంగులేటి భూ దందాలపై ప్రజాగ్రహం తప్పదని హెచ్చరించారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేశ్రెడ్డి, నాయకులు, ప్రజా ప్రతినిధులు గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, ఇర్రి రమణారెడ్డి, బాల్దె సిద్ధిలింగం, పసుల ఏబేలు, గద్దల నర్సింగరావు, వెన్నెల రామకృష్ణ, రెహమాన్, పెద్దిరాజిరెడ్డి, ఉడుగుల కిష్టయ్య, సేవెల్లి మధు, అనిత, రేఖ, ఉల్లెంగుల సందీప్, రవి, అనిల్, సువార్త, మంజుల, పల్లవి, ముక్కెర కరుణకర్రెడ్డి, కొమ్ము రాజు, సిద్ధులు, అల్వాల ఎల్లయ్య, ప్రతాప్రెడ్డి, దావెర రాజు, మామిడాల రాజు తదితరులు ఉన్నారు. రేవంత్, పొంగులేటి భూ దందాలపై ప్రజాగ్రహం తప్పదు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి -
సుమంత్ రెడ్డి మృతితో సూరవీడులో విషాదం..
వెంకటాపురం(కె): ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం సూరవీడు గ్రామంలో విషాదం అలుముకుంది. సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు పరిధిలోని పెద్ద కంజర్ల గ్రామ చెరువులో శిరీష చారిటబుల్ ట్రస్ట్లో ఉంటూ చదువుకుంటున్న ఆరుగురు విద్యార్థులు బుధవారం గణపతి నిమజ్జనం కోసం వెళ్లి మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందులో సూరవీడుకు చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి సుమంత్ రెడ్డి(17) కూడా ఉన్నాడు. గ్రామానికి చెందిన బేరి ముత్యం రెడ్డి, లక్ష్మి దంపతులకు ముగ్గురు కూమారులు భాస్కర్ రెడ్డి, సుమంత్ రెడ్డి, హేమ సంజయ్ రెడ్డి ఉన్నారు. కాగా, సుమంత్రెడ్డి మృతదేహాన్ని కుటుంబీకులు హైదరాబాద్ నుంచి సూరవీడు తీసుకొచ్చి గురువారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. చేతికి అందొచ్చిన కుమారుడికి తల్లిదండ్రులు అంత్యక్రియలు చేయడం గ్రామస్తులను కంటతడి పెట్టించింది. -
ఆ నలుగురు ఎక్కడ..?
సాక్షిప్రతినిధి, వరంగల్: ఓరుగల్లు కేంద్రంగా సాగిన సైబర్ నేరాల వ్యవహారంలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వ్యక్తులు వరంగల్ పరిసరాల్లో మకాం వేసి.. స్థానికంగా పరిచయాలు పెంచుకుని సైబర్ నేరాలకు అవసరమైన మ్యూల్ బ్యాంకు ఖాతాల వ్యవహారానికి తెరలేపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు 22 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా.. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ కీలక నిందితులు నలుగురు ఎక్కడ? అనే చర్చ ఉత్కంఠ రేపుతోంది. ఉమ్మడి వరంగల్లో పలువురితో దోస్తానా.. అరెస్టయిన 22 మందిలో గణనీయమైన సంఖ్యలో ఉమ్మడి వరంగల్ ప్రాంతానికి చెందినవారే ఉండటం కేసులో కీలక అంశంగా మారింది. ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్లకు చెందిన నరేంద్ర హైల్, సంకల్ప్ ఖైతాన్, హషీమ్లు.. మరో నలుగురు వరంగల్లో మకాం వేశారు. వీరు హనుమకొండలోని భవానీనగర్లో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వరంగల్, హనుమకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు చెందినవారు ఈ జాబితాలో ఉన్నారు. కరీంనగర్కు చెందిన ఇద్దరు, ఇతర రాష్ట్రాలకు చెందిన ముగ్గురు కూడా ఉన్నారు. దీంతో బయట ప్రాంతాలనుంచి వచ్చిన వ్యక్తులకు స్థానికంగా ఎవరు సహకరించారు? పరిచయాలు ఎలా ఏర్పడ్డాయి? ఖాతాలు సమకూర్చడంలో ఎవరి పాత్ర ఎంత? అనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. రెండు ఠాణాల్లో కేసులు.. కూపీ లాగితే కదిలిన డొంక.. మ్యూల్ ఖాతాలు, సైబర్ లింకులు, నేరాలకు సంబంధించిన ఈ వ్యవహారంపై మొదట వరంగల్ సైబర్ క్రైమ్ పోలీస్స్టేషన్లో క్రైం నం.29/2026, ఆజంజాహీ మిల్స్ కాలనీ పోలీస్స్టేషన్లో క్రైం నం.672/2026గా కేసులు నమోదయ్యాయి. నిందితులపై బీఎన్ఎస్ 316(2), 318(4), 319(2), 338, 336(3), 351(2), 111 ఆర్/డబ్ల్యు 3(5) సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్ 66–సి, 66–డి కింద కేసులు నమోదు చేశారు. అక్కడినుంచే విచారణ చేపట్టిన పోలీసులు సాంకేతికత సహాయంతో అత్యంత గోప్యంగా నేరస్తుల కూపీ లాగారు. సైబర్ నేరాల్లో ఉపయోగించేందుకు బ్యాంకు ఖాతాలను సమకూర్చుకునే క్రమంలో స్థానికంగా పలువురిని సంప్రదించినట్లు కేసు వివరాలు సేకరించారు. ఈ కేసులో ఇప్పటికే 22 మందిని అరెస్టు చేసిన పోలీసులు.. మరో నలుగురి కోసం ఇతర రాష్ట్రాల్లో గాలింపు చేపట్టారు. కమీషన్ ఇస్తామనే ఆశ చూపడం.. ఖాతాలు/ బ్యాంకింగ్ వివరాలు సమకూర్చుకోవడం.. వాటిని నేర కార్యకలాపాలకు వినియోగించడం వంటి కోణాల్లో పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీలు, కొల్లగొట్టిన మొత్తానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆ దర్యాప్తు పూర్తయితే గాని తేలాల్సి ఉంది. రాష్ట్రాల సరిహద్దులు దాటిన నెట్వర్క్.. ఈ కేసులో నిందితుల వివరాలను పరిశీలిస్తే తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల అనుసంధానం కనిపిస్తోంది. బయట ప్రాంతాలనుంచి వచ్చిన వ్యక్తులు వరంగల్లో మకాం వేసి స్థానికులతో సంబంధాలు ఏర్పరచుకున్నారా? లేక స్థానికంగా ఉన్న వ్యక్తులను ఇతర రాష్ట్రాల నెట్వర్క్ సంప్రదించిందా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. అరెస్ట్ చేసిన వారినుంచి లభించిన సమాచారం, బ్యాంకు ఖాతాలు, డిజిటల్ ఆధారాలు, ఫోన్ కమ్యూనికేషన్ల ఆధారంగా నెట్వర్క్లోని మిగిలిన వ్యక్తులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పరారీలో ఉన్న నలుగురి ఆచూకీ లభిస్తే మ్యూల్ ఖాతాల వ్యవహారం వెనుక ఉన్న పూర్తి నెట్వర్క్, నగదు లావాదేవీలు, స్థానిక–అంతర్రాష్ట్ర సంబంధాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.ఓరుగల్లుకు ‘సైబర్’ లింకులు.. తిష్టవేసిన నేరస్తులు ఢిల్లీ, హరియాణా, ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి మకాం మ్యూల్ ఖాతాల బాగోతానికి శ్రీకారం ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురితో దోస్తానా కమీషన్ ఆశ చూపి కోట్లు కొల్లగొట్టే స్కెచ్ గుట్టు రట్టు చేసిన వరంగల్ పోలీసులు ఢిల్లీ, ఒడిశా, ఛత్తీస్గఢ్, యూపీకి పోలీసు టీమ్లుఇంతకీ సూత్రధారులు ఎక్కడఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్న ఖైతాన్ సుధాంశు, ఆమీర్ అలియాస్ జాన్, హేమరాజ్ బెహెరా, మహేష్ టాండీ ఇంకా పోలీసులకు చిక్కలేదు. వీరి ఆచూకీ కోసం ప్రత్యేక బందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు వెళ్లి నిందితులను పట్టుకొచ్చిన పోలీసులు.. పరారీలో ఉన్న నలుగురి కోసం కూడా ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాల్లో ఆరా తీస్తున్నట్లు వరంగల్ పోలీసు కమిషనర్ ఎన్.శ్వేత వెల్లడించారు. -
తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు
జనగామ రూరల్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను వక్రీకరించి మతవిద్వేషాలు, రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని చూస్తే ప్రజలు సహించబోరని, తెలంగాణ సాయు ధ రైతాంగ పోరాటం స్ఫూర్తిని ఎవరూ చెరిపివేయలేరని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం జనగామలోని కామాక్షి ఫంక్షన్ హాల్లో జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరుల బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కేవలం నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం మాత్రమే కాదని భూస్వామ్య దోపిడీ వెట్టిచాకిరీ, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో సామాన్యులు సాగించిన మహత్తర ప్రజాపోరాటమన్నారు. అంతకుముందు ప్రిస్టియన్ గ్రౌండ్ నుంచి కామాక్షి ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.డి అబ్బాస్, నాయకులు రాపర్తి రాజు, ఇర్రి అహల్య, సాంబరాజు యాదగిరి, రాపర్తి సోమయ్య, సింగారపు రమేశ్, బొట్ల శేఖర్, పుప్పాల శ్రీకాంత్, జోగు ప్రకాశ్, బూడిద గోపి, సుంచు విజేందర్, మునిగల రమేశ్, ఉపేందర్, బోడ నరేందర్, తదితరులు పాల్గొన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం -
ప్రజలు మెచ్చే పాలన
సాక్షి, మహబూబాబాద్: ప్రజలు కోరుకున్న ప్రజా ప్రభుత్వం వెయ్యిరోజులుగా ప్రజలు మెచ్చేలా పాలన అందిస్తూ ప్రజాశీస్సులతో ముందుకెళ్తుందని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రునాయక్ అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామచంద్రునాయక్ జాతీయ జెండాను ఎగురవేశారు. సైనికుల వందనం స్వీకరించిన అనంతరం ప్రసంగించారు. పేదలకు పెద్ద చదువులు పేదింటి బిడ్డలకు పెద్ద చదువులు దూరం కావొద్దనే ఆలోచనతో ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. విద్యా విధానంలో మార్పులు చేస్తూ నెల్లికుదురు, నర్సింహులపేట గ్రామాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేడ్ రెసిడెన్సియల్ స్కూల్స్ ద్వారా తెలంగాణ మట్టిబిడ్డలను అంతర్జాతీయ ప్రమాణాలతో బోధన జరిపే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు. పేదల చెంతకు పథకాలు ప్రజలకు ఏది అవసరమో గ్రహించి వారి ఇంటి ముంగిటికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు దీవిస్తున్నారని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా మొదటి దశలో 10,651 ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు. రెండో దశలో 4వేల ఇళ్లు మంజూరు చేసేందుకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని చెప్పారు. గుడిసెలు లేని రాష్ట్రం లక్ష్యంగా పూరి గుడిసె ఉన్నవారికి పక్కా ఇల్లు మంజూరు చేస్తున్నామని అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా సన్నబియ్యం, ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.10 లక్షల వరకు పెంపు వంటి పథకాలతో ప్రజాప్రభుత్వం విజయవంతంగా ముందుకెళ్తుందని తెలిపారు. ప్రతీ పథకం పేదలకు ఉపయోగపడేలా రూపొందించామని అన్నారు. వెయ్యిరోజుల పాలనలో మద్దతుగా నిలిచిన అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా, అన్ని వర్గాల ప్రజలకు రాంచందర్నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ స్నేహా శబరీష్, ఎస్పీ శబరీష్, డీఎఫ్ఓ లావణ్య, అదనపు కలెక్టర్లు అనిల్కుమార్, పురుషోత్తం, ఆర్డీఓ నాగలక్ష్మి, డీఆర్డీఓ మధుసూదన్ రాజు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల ముంగిటికి సంక్షేమ పథకాలు నారాయణపురం రైతుల్లో చిరునవ్వులు పేదింటి బిడ్డలకు పెద్ద చదువులు ప్రజాపాలన దినోత్సవంలో ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ఆనందంలో నారాయణపురం రైతులు తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన డివిజన్లతో రెవెన్యూ రికార్డుల్లో చోటు చేసుకున్న పొరపాటు కారణంగా నారాయణపురం రైతులు పది సంవత్సరాలుగా ఇబ్బందులు పడ్డారని విప్ అన్నారు. వారి సమస్యను ప్రతిష్టాత్మకంగా తీసుకొని రీ సర్వే నిర్వహించి 780 మంది రైతులకు 1,468.15 ఎకరాల భూమికి పట్టాదారు పాస్ పుస్తకాలు అందించామని అన్నారు. రైతులు సారం తెలిసి సాగుచేయాలని భూసార పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రైతు భరోసా, రైతు బీమా అందచేస్తూ రైతుల కష్టసుఖాల్లో ప్రభుత్వం పాలుపంచుకుంటుందని అన్నారు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా జిల్లాలో 17 క్లస్టర్లు ఏర్పాటు చేసి 2,125 మంది రైతులకు శిక్షణ ఇచ్చి అధునాత పద్ధతిలో సాగు చేసేలా ప్రోత్సహించామని చెప్పారు. మిషన్ వైవిద్య కార్యక్రమం ద్వారా ఆరుతడి పంటలైన పెసర 21వేల ఎకరాల్లో, 2,600 ఎకరాల్లో కంది సాగుచేసేలా రైతులను ప్రోత్సహించామని చెప్పారు. -
రైలొస్తేనే.. మేం వస్తాం
ఉద్యోగులు తమ కార్యాలయంలో ఏదైనా ప్రత్యేక సమావేశం లేదా.. కార్యక్రమం ఉన్నప్పుడు నిర్ణీత సమయంకంటే ముందు లేదా.. రెగ్యులర్ టైమ్కు ఆఫీస్కు రావాల్సిందే.. కానీ, మానుకోట కలెక్టరేట్ ఉద్యోగులు మాత్రం రైలు ఎప్పుడొస్తే.. ఆఫీస్కు అప్పుడే వస్తామంటున్నారు.. గురువారం ఉదయం 9:45 గంటలకు కలెక్టరేట్లో ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్రు నాయక్ ముఖ్య అతిథిగా ప్రజా పాలన దినోత్సవం ముగిసిన అరగంట తర్వాత సుమారు 11:15 గంటలకు కలెక్టరేట్ ఉద్యోగులు కార్యాలయానికి రావడం గమనార్హం. అదేంటని అడిగితే ‘మేము వరంగల్ నుంచి వస్తున్నాం.. కృష్ణ ఎక్స్ ప్రెస్ ఇప్పుడే వచ్చింది’అని సమాధానమిచ్చారు. – సాక్షి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
● కలెక్టర్ స్నేహశబరీష్ మహబూబాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సంబంధిత అధికారులతో గురువారం కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పూరిగుడిసెలో ఉన్న వారి వివరాలు సేకరించాలన్నారు. లబ్ధిదారులకు అవగాహన కల్పించి నిర్మాణాల్లో వేగం పెంచి త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా ఉద్యోగులు కూడా బాధ్యతాయుతంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించడంతోపాటు హెల్మెట్ ధరించాలన్నారు. 22 మంది హౌజింగ్ అధికారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. చిత్తడి నేలల పరిరక్షణకు చర్యలు జిల్లాలోని చిత్తడి నేలలు, చెరువులు, ఇతర జలాశయాల పరిక్షణ సమర్థవంతమైన నిర్వహణకు సంబంధిత అధికారులు సమన్వయంతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం జిల్లాస్థాయి చిత్తడి నేలల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ.. చిత్తడి నేలల సర్వే స్పష్టంగా చేసి సరిహద్దులు పెట్టాలన్నారు. ఆక్రమణలకు గురి కాకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయాలన్నారు. చిత్తడి నేలల ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం, హౌజింగ్ డీఈ అబ్దుల్ హకీమ్, రాజన్న పాల్గొన్నారు. -
డీఎస్పీ పదోన్నతుల్లో కదలిక!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : పోలీస్ శాఖలో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న డీఎస్పీల పదోన్నతుల వ్యవహారంలో తాజాగా కదలిక మొదలైంది. 1991, 1995, 1996 బ్యాచ్లకు చెందిన పలువురు డీఎస్పీలు అదనపు ఎస్పీలుగా పదోన్నతి పొందాల్సి ఉండగా.. సీనియారిటీ వివాదాలు, కోర్టు కేసులు, జోనల్ అంశాలు, ఇతర పరిపాలన కారణాలతో ప్రక్రియ సుదీర్ఘకాలంగా నిలిచిపోయింది. తాజాగా ఈ సమస్యకు సమగ్ర పరిష్కారం చూపేందుకు డీజీపీ సీవీ ఆనంద్ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇటీవల 1991, 1995, 1996 బ్యాచ్ల వరంగల్, హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ రేంజ్లకు చెందిన అధికారులతో సమావేశమైన ఆయన.. కేసుల ఉప సంహరణ తర్వాత పదోన్నతుల ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు పేర్కొనడంపై ఆ జాబితాలో ఉన్నవారిలో ఆశలు చిగురిస్తున్నాయి. ఉద్యోగ విరమణకు ముందే ప్రమోషన్? 1991, 1995, 1996 బ్యాచ్ల అధికారులు ప్రస్తు తం డీఎస్పీలుగా పనిచేస్తున్నారు. వీరిలో కొందరు ఇప్పటికే అదనపు ఎస్పీ స్థాయి పదోన్నతి కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు 1998 బ్యాచ్కు చెందిన కొంతమంది అధికారుల విషయంలోనూ పదోన్నతుల అంశం కొనసాగుతోంది. దీంతో ఒకేసారి సీనియారిటీ, అర్హత, ఖాళీలు, కోర్టు ఆదేశాలు వంటి అనేక అంశాలను పరిష్కరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పదోన్నతుల జాబితాలో పలువురు ఉన్నప్పటికీ ప్రస్తుతం అదనపు ఎస్పీ స్థాయిలో 37 పోస్టులు కోర్టు వ్యవహారాల కారణంగా ఖాళీగా ఉన్నాయని డీజీపీ సీవీ ఆనంద్ ఆ భేటీలో స్పష్టం చేశారు. పరస్పర విభేదాలు తమ కెరీర్పై ప్రభావం చూపకుండా చూడాలని సూచించారు. కోర్టుల్లో కొనసాగుతున్న కేసులను ఉపసంహరించుకుని, సీనియారిటీ–నిబంధనల ప్రకారం దశలవారీగా పదోన్నతులు కల్పించే మార్గానికి సహకరించాలని కోరారు. కేసుల ఉపసంహరణపై అధికారులు రెండు, మూడు రోజుల్లో తమ అభిప్రాయాలు తెలియజేస్తే ప్రక్రియ ముందుకు సాగనుంది.మల్టీజోన్ – 1లో పలువురికి చాన్స్.. కోర్టుల్లో పెండింగ్ కేసుల పరిష్కారం సుదీర్ఘకాలం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో సమస్యను సమగ్రంగా పరిశీలించేందుకు ఇప్పటికి కమిటీని ఏర్పాటు చేశారు. సీనియారిటీ, సర్వీస్ రూల్స్, జోనల్ అంశాలు, ఖాళీలు తదితరాలను పరిగణనలోకి తీసుకుని కసరత్తు చేస్తున్నారు. దీంతో ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో 1991,1995, 1996 బ్యాచ్లకు చెందిన పలువురు డీఎస్పీలకు అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతులు దక్కనున్నాయి. మొదట 1991 బ్యాచ్లో వరంగల్ కమిషనరేట్ పరిధిలో నలుగురు డీఎస్పీ/ఏసీపీలు, ఇక్కడే లూప్లైన్లోని ఓ డీఎస్పీ ఈ జాబితాలో ఉండగా.. ఒకరికి కేసుల వివాదం ప్రమోషన్కు ప్రతిబంధకం కానుందన్న చర్చ పోలీసుశాఖలో సాగుతోంది. దశలవారీగా ప్రమోషన్ల ప్రతిపాదన.. అడిషనల్ ఎస్పీలుగా ప్రమోషన్లు 1991, 1995, 1996 బ్యాచ్ల వారీగా జాబితా సీనియారిటీ, జోనల్ వివాదాలతో ఏళ్లుగా పెండింగ్ డీజీపీ భేటీ తర్వాత చిగురిస్తున్న ఆశలు మల్టీజోన్లో పలువురికి చాన్స్ -
ఆపన్నహస్తం అందించరూ!
వర్ధన్నపేట: పేద దళిత కుటుంబంలో జన్మించిన ఆ యువతి ఎలాంటి కోచింగ్ లేకుండా కష్ట పడి చదివి మెడిసిన్లో సీటు సాధించింది. అయితే ఫీజు చెల్లించలేని దుస్థితిలో ఉంది. ఫలితంగా సీటు క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. వర్ధన్నపేటకు చెందిన కొండేటి భాస్కర్, అనిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు సంతానం. ఇందులో రెండో కూతురు అఖిలకు పటాన్ చెరులోని మహేశ్వరి మెడికల్ కళాశాలలో సీటు వచ్చింది. అయితే రెక్కాడితే కాని డొక్కాడని ఆ కుటుంబానికి మెడిసిన్లో సీటు వచ్చిందని సంతోషించాలో లేక ఫీజు చెల్లించలేక బాధపడాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. మెడిసిన్లో జాయిన్ కావడానికి రూ. 2 లక్షలు చెల్లించాల్సి ఉంది. గడువు రేపు(19న) సాయంత్రం వరకు ఉంది. ఆ లోగా ఫీజు చెల్లిస్తేనే మెడిసిన్లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని అఖిల తండ్రి భాస్కర్ తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. ఈ క్రమంలో అఖిల ఫీజు చెల్లించడానికి దాతలు ముందుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. దాతలు 7207845872 నంబర్కు ఫోన్ పే లేదా ఎస్బీఐ వర్ధన్నపేట, అకౌంట్ నంబర్ 41698789301 (కొండేటి అక్షర)కు ఆర్థిక సాయం అందించాలని ఆ కుటుంబం వేడుకుంటుంది. పేదింటి విద్యాకుసుమానికి ఆర్థిక ఇబ్బంది మెడిసిన్లో సీటు సాధించినా ఫీజు చెల్లించలేని దుస్థితి -
బతికుండగానే మా డబ్బులు ఇప్పించండి..
హన్మకొండ చౌరస్తా: బతికుండగానే తమ డబ్బులు ఇప్పించండంటూ ఆర్టీసీ కార్మికులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల జేఏసీ నాయకులు లక్ష్మ య్య, మనోహర్, వెంకన్న, రవీందర్, సోమయ్య తెలిపారు. హనుమకొండ పబ్లిక్గార్డెన్లో గురువారం సుమారు 300 మంది విశ్రాంత ఉద్యోగులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని అనేకసార్లు బస్సు భవన్ దగ్గర నిరసన తెలిపామని, ఆర్టీసీ ఎండీకి పలుమార్లు వినతి పత్రాలు సమర్పించామన్నారు. అలాగే, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే వందలాదిమంది విశ్రాంత ఉద్యోగులు చనిపోయారని, వారి కుటుంబాల రోడ్డున పడ్డాయన్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ నెల 8న శాంతియుత నిరసన తెలపడానికి వెళ్తే వందలాది మందిని అరెస్ట్ చేశారన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చి, ఇప్పుడు నిర్భందించడం సరి కాదన్నారు. హైకోర్టు అడ్వకేట్ ఎం. మోహన్ రావు మాట్లాడుతూ ఇప్పటికే సుమారు 500 మంది ఆర్టీసీ కార్మికుల తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. దీంతో హైకోర్టు.. ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వానికి నాలుగు వారాల గడువిచ్చిందన్నారు. హనుమకొండ లేబర్ కోర్టు అడ్వకేట్ రమణ, జేఏసీ నాయకులు ఎంఎస్ రావు, రవీందర్ రెడ్డి, కె.ఎన్ రెడ్డి, సుధాకర్, ఈఎల్ నారాయణ, విశ్వనాథం, కోటగిరి వీరన్న, హయగ్రీవచారి తదితరులు పాల్గొన్నారు. హైకోర్టులో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల పిటిషన్ -
చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ
● సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య నెహ్రూసెంటర్: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటం, చరిత్రను బీజేపీ, ఆర్ఎస్ఎస్ వక్రీకరిస్తుందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య అన్నారు. సెప్టెంబర్ 17 సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో గురువారం తెలంగాణ సాయుధ పోరాట వార్సికోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతం భారత్లో విలీనమైనప్పటికీ దొరల నియంతృత్వ పాలన కొనసాగిందన్నారు. సాయుధ పోరాటంలో వేలాది మంది అమరులయ్యారని, రైతాంగ పోరాట స్ఫూర్తితో ఎర్రజెండా రాజ్యం కోసం పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. సభలో సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, సూర్నపు సోమయ్య, సమ్మెట రాజమౌళి, బానోత్ సీతారాంనాయక్, రావుల రా జు, దుడ్డెల రాంమూర్తి, చాగంటి భాగ్యమ్మ, కుమ్మరికుంట్ల నాగన్న, హేమానాయక్, లక్ష్మీనారాయణ, బానోత్ బాబు, పట్ల మధు పాల్గొన్నారు. మానుకోటలో సీపీఐ ర్యాలీ తెలంగాణ సాయుధ పోరాట దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథి అన్నారు. సెప్టెంబర్ 17 సాయుధ పోరాట దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం విజయసారథి మాట్లాడుతూ.. భారత్లో హైదరాబాద్ సంస్థానం విలీనం సందర్భంగా స్వాతంత్య్ర దినోత్సవంగా భావించాలన్నారు. సాయుధ పోరాటంలో పాల్గొనని బీజేపీ చరిత్రను వక్రీకరించి హిందూ, ముస్లిం పోరాటంగా ప్రజలను నమ్మించేందుకు యత్నిస్తుందన్నారు. కార్యక్రమంలో అజయ్సారథిరెడ్డి, నల్లు సుధాకర్రెడ్డి, పెరుగు కుమార్, రేషపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, మామిండ్ల సాంబలక్ష్మి, కట్లోజు పాండురంగాచారి, వరిపెల్లి వెంకన్న, నెల్లూరు నాగేశ్వర్రావు, మందు మహేందర్, రమేష్, నర్ర సంధ్యాశ్రావణ్ పాల్గొన్నారు. -
కబ్జాలు చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం
జనగామ: అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన భూ ఆరోపణలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్రావు తీవ్రంగా ఖండించారు. గురువారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం తనపై చేసిన ఆరోపణలు అసత్యమన్నారు. భూ కబ్జాలకు సంబంధించిన ఆధారాలు చూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. తన వారసత్వ భూములు విక్రయించి రాజకీయాల్లోకి వచ్చానే తప్ప, కబ్జాలకు పాల్పడలేదన్నారు. తనపై, బీఆర్ఎస్ నాయకులపై ఆరోపణలు చేయడం కాదు ధైర్యం ఉంటే సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్, హరీశ్రావు తదితర బీఆర్ఎస్ నాయకులు భూ వ్యవహారాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారనే భయంతోనే వారిని అసెంబ్లీకి రాకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత రేవంత్రెడ్డికి లేదన్నారు. తెలంగాణ కోసం పదవులకు రాజీనామా చేసేందుకు తాము సిద్ధపడిన సమయంలో రేవంత్రెడ్డి తప్పించుకుని పారిపోయారని ఆరోపించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు -
తగ్గిన పెసర ధర
కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఒక్కరోజు వ్యవధిలోనే క్వింటా పెసర్లకు ధర రూ.392 వరకు తగ్గింది. దీంతో పెసర రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క ఎల్నినో ప్రభావంతో సరైన వర్షాలు లేక అడపాదడపా పెసర పంటను పండించగా, తక్కువ దిగుబడి వచ్చింది. ఈ క్రమంలో పెసర్లకు మద్దతు ధర రూ.8,780 ఉండగా, మద్దతుకు లోబడే మార్కెట్లో వ్యాపారులు కొనుగోళ్లు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా బుధవారం కేసముద్రం మార్కెట్కు 471 బస్తాల పెసర్లు అమ్మకానికి రాగా.. క్వింటాకు గరిష్ట ధర రూ.8,011, కనిష్ట ధర రూ.5,869 పలికింది. గురువారం మార్కెట్కు 466 బస్తాల పెసర్లు అమ్మకానికి రాగా, గరిష్ట ధర రూ.7,619, కనిష్ట ధర రూ.3,119 పలకడం గమనార్హం. ఒక్కరోజు వ్యవధిలోనే క్వింటాకు ధర రూ.392 తగ్గడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు తమ ఇష్టానుసారంగా ధరలను నిర్ణయిస్తూ, తమను మోసగిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం మద్దతు ధరతో పెసర్ల కొనుగోలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ● ఒక్కరోజు వ్యవధిలోనే క్వింటాకు రూ.392 తగ్గింపు -
వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి
● చెరువులో చేపల వల చుట్టుకుని వ్యక్తి..దుగ్గొండి: స్నానం చేయడానికి చెరువులోకి దిగిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చేపల వల చుట్టుకుని అందులోనే మునిగి మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం దేశాయిపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నల్లబెల్లి రవి(44) ఈనెల 16న శంభయ్యపల్లికి చెందిన ఓ రైతు వద్దకు కూలీకివెళ్లాడు. పనిపూర్తయిన అనంతరం ఇంటికి వస్తూ దారిలో ఉన్న గణేశ్ చెరువులో స్నానం కోసం దిగాడు. ఈ సమయంలో నీటిలోనే ఉన్న పాత చేపల వల కాలుకు చుట్టుకుంది. దీంతో బయటకు రాలేక అందులోనే మునిగి చనిపోయాడు. సాయంత్రమైనా రవి ఇంటికి రాకపోవడంతో మృతుడి భార్య ప్రేమలత పలుచోట్ల వెతికినా ఫలితం కనిపించలేదు. గురువారం ఉదయం చెరువు సమీపంలోని కొంత మంది రైతులకు రవి మృతదేహం తేలి కనిపించడంతో కుటుంబీకులు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై రణధీర్రెడ్డి ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేటకు తరలించారు. మృతుడి భార్య ప్రేమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గుండెపోటుతో యువరైతు.. గుండె పోటుతో ఓ యువరైతు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని పీజీతండా గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన లావుడ్యా వెంకటేష్ (31) గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో గుండెలో నొప్పి రావడంతో కుటుంబీకులు ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. మృతుడికి భార్య మహిమ, కుమారుడు గణేశ్, కూతురు హన్సిక ఉన్నారు. విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ .. బచ్చన్నపేట : వైరు సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలి ఓ ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. ఈ ఘటన గురువారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రాపురంలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నాచగోని అజయ్కుమార్ (27) ప్రైవేట్ ఎలక్ట్రీషియన్గా పని చేసుకుంటూ జీవనం కొసాగిస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన పెరుమాండ్ల సిద్దయ్య వ్యవసాయ భూమి వద్ద కరెంట్ వైరు సరి చేయడానికి మరో ఎలక్ట్రీషియన్ కొండం రమేశ్తో కలిసి వెళ్లాడు. పొలంలో ఉండి పని చేస్తుండగా ఒక్కసారి వైరు తగిలి ఇద్దరికీ షాక్ వచ్చింది. దీంతో రమేశ్ ఎగిరి పక్కకు పడగా అజయ్కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ప్రభాకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతుడికి పెళ్లి అయిన మూడు నెలలకే భార్య మృతి చెందింది. ఇప్పటికి ఆరు నెలలు అవుతోంది. -
మాకు సోషల్ టీచర్ కావాలి..
● ఉపాధ్యాయుడి కోసం రోడ్డెక్కిన విద్యార్థినులు బయ్యారం: పాఠశాలలో ఖాళీగా ఉన్న సోషల్ టీచర్ పోస్ట్ను భర్తీ చేయాలని గురువారం బయ్యారం బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు గాంధీసెంటర్లో ఆందోళన చేపట్టారు. విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడిచినా తమకు సోషల్ టీచర్ ఏర్పాటు చేయకపోవడంతో చదువుకోలేక ఇబ్బందిపడుతున్నామని తెలిపారు. విద్యార్థుల ఆందోళన వద్దకు వచ్చిన ఎంఈఓ లక్ష్మణ్రావు త్వరలోనే టీచర్ను నియమించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే విద్యార్థినుల ఆందోళనతో బాలుర ఉన్నత పాఠశాలలో అదనంగా ఉన్న సోషల్ ఉపాధ్యాయుడిని ఎంఈఓ గురువారం బాలికోన్నత పాఠశాలకు డిప్యూటేషన్పై పంపించారు. దరఖాస్తు గడువు పొడిగింపు మహబూబాబాద్ అర్బన్: బీసీ మహిళల సాధికారత కోసం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుట్టుమిషన్ల దరఖాస్తు గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సాయిశ్రీజ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన మహిళలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. జాతీయ ఆర్ట్స్ ఎగ్జిబిషన్కు గంగారం కళాకారుడు గంగారం : బీహార్ రాష్ట్రంలోని శివాన్ జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జాతీయ స్థాయి ఆర్ట్స్ ఎగ్జిబిషన్కు మండలంలోని మడగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ కళాకారుడు చుంచ కుమారస్వామికి ఆహ్వానం లభించింది. జాతీయ స్థాయి తక్షశిల కలెక్టివ్ సంస్థ నిర్వహించే ఈ ప్రదర్శనలో పాల్గొనే అవకాశం రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తన కళాకృతులను జాతీయ వేదికపై ప్రదర్శించేందుకు కుమారస్వామి గురువారం బీహార్కు వెళ్లారు. తెలంగాణ తల్లి విగ్రహానికి అవమానం మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు గులాబీ రంగు పూశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు ఆ రంగును తుడిచేసి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈసందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ మాట్లాడుతూ రంగు పూసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పెద్దచెరువును సందర్శించిన భద్రతా నిపుణులు బయ్యారం: మండలంలోని బయ్యారం పెద్దచెరువును గురువారం సమగ్ర ఆనకట్ట భద్రతా మూల్యాంకణ నిపుణుల బృందం సందర్శించింది. కృష్ణా నది యాజమాన్య బోర్డు మాజీ చైర్మన్ శైలేష్కుమార్ ఆధ్వర్యంలోని బృందం సభ్యులు బయ్యారం పెద్దచెరువు తూములు, అలుగులను గురువారం పరిశీలించారు. భద్రతాపరంగా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సూచనలు చేశారు. ఈ బృందంలో సీడబ్ల్యూపీఆర్ఎస్ చీఫ్ రిసెర్చ్ ఆఫీసర్ బి.మురళీధర్, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఈశ్వర్చౌదరి, ఇరిగేషన్ ఈఈ వెంకట్రామ్, డీఈ నాగార్జునసాగర్, ఏఈఈలు అఖిల, శ్రీభరత్ తదితరులు పాల్గొన్నారు. -
బోరుమన్న బాలయ్యపల్లె
గీసుకొండ: బాలయ్యపల్లె బోరుమంది. తమ బిడ్డలను ఇద్దరిని నేరేడు చెరువు పొట్టన పెట్టుకుందని కన్నీరుమున్నీరైంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలోని పెద్ద కంజర్ల గ్రామంలోని నేరేడు చెరువులో బుధవారం వినాయక నిమజ్జనం చేయడానికి విద్యార్థులు వెళ్లగా ప్రమాదవశాత్తు ఆరుగురు నీట మునిగి మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఆరుగురు మృతుల్లో ఇద్దరు గీసుకొండ గ్రామ పరిధి (హామ్లెట్) బాలయ్యపల్లెకు చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. బాలయ్యపల్లెకు చెందిన రాగిరి లింగమూర్తి, అనిత దంపతులకు కూతురు, కుమారుడు గణేశ్(18) ఉన్నారు. గణేశ్ పాలిటెక్నిక్ డిప్లొమా ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన నల్ల అశోక్, ఉమ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సిద్దార్థ(17) పాలిటెక్నిక్ డిప్లొమా ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. వీరిద్దరు పెద్దకంజర్లలోని శిరీష చారిటబుల్ ట్రస్ట్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి నేరేడు చెరువులో లోతు ప్రాంతానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని పోలీసులు మృతుల బంధువులకు తెలుపడంతో వారు అదే రోజు రాత్రి అక్కడికి వెళ్లారు. గురువారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను సాయంత్రం గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామస్తులు విద్యార్థులకు కన్నీటి వీడ్కోలు పలికారు. కాగా, విద్యార్థులు మృతి చెందిన విషయం తెలుసుకున్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి దహన సంస్కారాల నిమిత్తం రూ. రూ.5 వేల సాయం అందించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిందని కాంగ్రెస్ పరకాల నియోజకవర్గ అధికార ప్రతినిధి చాడ కొమురారెడ్డి తెలిపారు. అలాగే, శిరీష చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు ఒక్కో కుటుంబానికి రూ. పది లక్షల సాయం అందించినట్లు తెలుస్తోంది. విద్యార్థులను కబళించిన నేరేడు చెరువు మృతుల్లో ఇద్దరు బాలయ్యపల్లె వాసులు -
కేదారి కుటుంబానికి మంత్రి పరామర్శ
హన్మకొండ: ఇటీవల అగ్నిప్రమాదంలో మృతి చెందిన లింగాల కేదారి దంపతుల కుటుంబాన్ని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యే నాయిని కోరిక మేరకు మంత్రి పొంగులేటి.. లింగాల కేదారి కుటుంబాన్ని పరామర్శించారు. ఉద్యమ కాలంలో కేదారి అందించిన సేవలను ఎమ్మెల్యే నాయిని.. మంత్రికి వివరించి ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున సహకారం అందించాలని కోరారు. స్పందించిన మంత్రి.. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆర్థిక సాయం అందించారు. 20న ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు స్క్రీనింగ్ టెస్ట్ హసన్పర్తి: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగార్థుల కోసం ఈనెల 20వ తేదీన నిర్వహించనున్న స్క్రీనింగ్ టెస్ట్కు పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. ప్రజాప్రతినిధులు, కలెక్టర్ సహకారంతో పోలీస్ ఉద్యోగానికి సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అందించేందుకు ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని వ రంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలకు చెందిన ఆసక్తి గల అభ్యర్థులు httpscœ/form,gle/eD2e5jNfebo5prg8 వెబ్సైట్లోవివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆదివారం (ఈనె20న) ఉద యం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్న ట్లు చెప్పారు. వరంగల్లోని సీకేఎం కళాశాల, హనుమకొండలోని ఎస్వీఎస్ కళాశాల, జనగామలోని సీజేఐటీ ఇంజనీరింగ్ కళాశాల, పరకాలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, నర్సంపేటలోని బిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెప్పారు. ఉద్యోగార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గంజాయి రవాణా కేసులో నేరస్తుడికి పదేళ్ల జైలు జనగామ రూరల్: గంజాయి రవాణా కేసులో నేరం రుజువు కావడంతో నేరస్తుడికి పదేళ్ల కఠి న కారాగార శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ జనగామ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ గురువారం తీర్పు వెలువరించారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆఫీసర్ (ఈ ఎస్) అంజిరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. జనగామ ఎకై ్సజ్ స్టేషన్ అప్పటి ఎస్సై సీహెచ్.జనార్దన్ 2023, అక్టోబర్ 30వ తేదీన రాత్రి సమయంలో పట్టణంలోని రైల్వే స్టేషన్లో ఓ బెంచ్పై కూర్చుని అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇందులో బిహార్కు చెందిన శంకర్ కుమార్ యాదవ్ వరంగల్ నుంచి ముంబా యికి 10 కిలోల ఎండు గంజాయి రవాణా చే స్తున్నట్లు నేరం ఒప్పుకున్నాడు. దీంతో జనగా మ ఎకై ్సజ్ పోలీసులు అతడిని వెంటనే అరెస్ట్ చేశారు. అనంతరం కేసు జిల్లా కోర్టులో విచారణకు వచ్చింది. కోర్టు లైజన్ ఆఫీసర్లు రమేశ్, శోభారాణి సమన్వయంతో కోర్టు కానిస్టేబుల్ సింధూజ సాక్షులను కోర్టులో ప్రవేశ పెట్టారు. జిల్లా కోర్టు పీపీ కాచరాజు హరి చంద్ర ప్రసాద్ కేసు వాదించి నేరస్తుడికి శిక్ష పడేలా చేశారు. -
ఆత్మగౌరవానికి సాక్ష్యం ‘ప్రజాపాలన’
హన్మకొండ: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, పోరాట పటిమకు ప్రజాపాలన దినోత్సవం సజీవ సాక్ష్యమని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధా న కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ జాతీ య పతాకాన్ని ఆవిష్కరించి గీతం ఆలపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తేదీ స్వాతంత్య్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజన్నారు. నిజాం పాలన, ఫ్యూడల్ వ్యవస్థ, రజాకార్ల అరాచకాల మధ్య తెలంగాణ ప్రజలు తలవంచకుండా తమ హక్కుల కోసం పోరాడారని తెలిపారు. 1930, 1940 దశకాల్లో కమ్యూనిస్టులు, ప్రజాసంఘాల నాయకత్వంలో సాగిన ఉద్యమాలు తెలంగాణ విముక్తి పోరాటానికి పునాది వేశాయన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. హైదరాబాద్ ప్రత్యేక సంస్థానంగా కొనసాగిందన్నారు. ప్రజల సుదీర్ఘ పోరాటంతో అప్పటి కేంద్ర హోం మంత్రి వల్లబాయి పటేల్ నాయకత్వంలో జరిగిన సైనిక ఆపరేషన్తో నిజాం పాలన ముగిసి హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో భాగమైందన్నారు. డైరెక్టర్లు వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, సీఈలు కె.తిరుమల్ రావు, అశోక్, అన్నపూర్ణ, వెంకటరమణ, గౌతమ్ రెడ్డి, మల్లికార్జున్, సీజీఎంలు చరణ్ దాస్, కిషన్, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం, జాయింట్ సెక్రటరీలు రమేశ్, శ్రీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. కేయూలో ప్రజాపాలన దినోత్సవం.. కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని పరిపాలన భవనం ఆవరణలో గురువారం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను వీసీ కె. ప్రతాప్రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ వి. రామచంద్రం, ఓఎస్డీ బి. వెంకట్రాంరెడ్డి, కేయూ పాలకమండలి సభ్యులు బి. సురేశ్లాల్, ఎం. సుదర్శన్, చిర్ర రాజు, ప్రిన్సిపాళ్లు టి. మనోహర్, నర్సింహాచారి, ఎస్. నర్సింహాచారి, అవెన్యూ ప్లాంటేషన్ ఇన్చార్జ్ బి. వెంకటగోపినాథ్ తదితరులు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి -
గురువారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
●● హనుమకొండలో అత్యధికంగా 1.27 లక్షల మంది.. ● మహబూబాబాద్లో 80,253.. భూపాలపల్లిలో మహిళా కార్మికుల వాటా అధికం ● తయారీ, వ్యాపారం, సేవారంగ సంస్థలు పరిగణనలోకి.. ● ఆరు జిల్లాల్లో 2.56 లక్షల అసంఘటిత సంస్థలు వరంగల్ డెస్క్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో అసంఘటిత రంగం పెరిగిపోయింది. వ్యవసాయేతర అసంఘటిత రంగంలో ఆరు జిల్లాల పరిధిలో కలిపి సుమారు 3.48 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నట్లు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) చేపట్టిన వార్షిక సర్వే అస్యూజ్–2025లో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ సర్వే నివేదికను వెల్లడించింది. ఈ నివేదికలో జిల్లాల వారీగా అసంఘటిత సంస్థలు, కార్మికుల వివరాలు పొందుపర్చారు. ఈ నివేదికలోని జిల్లాల అంచనాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాలను కలిపి రూపొందించినట్లు పేర్కొంది. అసంఘటిత సంస్థల్లో హనుమకొండ జిల్లా అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత మహబూబాబాద్ నిలిచింది. మొత్తం ఆరు జిల్లాల్లో కలిపి 2.56 లక్షల అసంఘటిత సంస్థలు ఉన్నట్లు అంచనా వేశారు. ఉమ్మడి వరంగల్లో అసంఘటిత కార్మికులు -
‘రవాణా భత్యం’ విడుదల
పాఠశాల లేని నివాస ప్రాంతంలోని విద్యార్థులకు రవాణా భత్యం నిధులను సమగ్రశిక్ష మంజూరు చేసింది. జిల్లాల వారీగా సమగ్ర చిత్రం ఇలా..1 నుంచి ఎస్ఏ–1 పరీక్షలు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు సమ్మిటివ్ అసెస్మెంట్ పరీక్షలు అక్టోబర్ 1 నుంచి నిర్వహించనున్నారు. అసంఘటిత సంస్థలు15,369ములుగు జనగామ వరంగల్ భూపాలపల్లి మహబూబాబాద్ హనుమకొండ13,971కార్మికులు38,26042,84128,72740,67835,90246,40135,59480,25356,7291,26,908హనుమకొండ85,144 -
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం
మహబూబాబాద్ రూరల్: సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శబరీష్ అన్నారు. గణే్శ్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మహబూబాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన సైబర్ సేఫ్ గణేశ్(వినూత్న థీమ్) విగ్రహాన్ని ఎస్పీ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసాల ద్వారా ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని, బ్యాంకు అధికారులు, పోలీసులు, ప్రభుత్వ అధికారుల పేరుతో ఫోన్ చేస్తే ఓటీపీ, పిన్, సీవీవీ, పాస్వర్డ్ వంటి వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించకూడదని సూచించారు. అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయకుండా, తెలియని వ్యక్తులకు యూపీఐ ద్వారా డబ్బులు పంపకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు. ఆన్లైన్ గేమ్స్, ఫేక్ ఇన్వెస్ట్మెంట్ ఆఫర్లు, రివార్డులు, లోన్ యాప్లు, కేవైసీ పేరుతో వచ్చే లింకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్కు ఫోన్ చేయాలని, అలాగే నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని తెలిపారు. అనతరం సైబర్ నేరాలపై అవగాహన పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో టౌన్ ఇన్చార్జ్ సీఐ అంజలి, ఎస్సై ఉమ, గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సైబర్ సేఫ్ గణేశ్ విగ్రహాన్ని సందర్శించిన ఎస్పీ శబరీష్ -
ప్రజాపాలన దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
మహబూబాబాద్లో జెండావిష్కరించనున్న ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాల పరిధిలోని ఆరు జిల్లా కేంద్రాల్లో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. ఆయా జిల్లా కేంద్రాల్లో ఉదయం 10గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రభుత్వ విప్ జాటోతు రాంచంద్రునాయక్ త్రివర్ణ పతాకం ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధశాఖల సిబ్బంది, ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. మెరుగైన విద్యుత్ సరఫరాకు చర్యలువిద్యుత్శాఖ ఎస్ఈ దర్శన్కుమార్ నెహ్రూసెంటర్: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రణా ళికతో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు విద్యుత్శాఖ ఎస్ఈ దర్శన్కుమార్ అన్నారు. విద్యుత్ పంపిణీలో మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. రెండు 33/11 కేవీ సబ్ స్టేషన్లు, రెండు అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 61 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. 37.25 కిలో మీటర్ల 33కేవీ విద్యుత్ లైన్లు, 68.58కిలోమీటర్ల 11కేవీలైన్లు, ఓల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు 600 కేవీఆర్ సామర్థ్యం గల రెండు కెపాసిటర్ బ్యాంకులు, ఒక బూస్టర్ ప్రారంభించామన్నారు. విద్యుత్ లైన్లను విస్తృతంగా తనిఖీ చేయడం, లూజులైన్లు గుర్తించడం, సరిచేయడం, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక పర్యవేక్షణ చర్యలను ముమ్మరం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అత్యవసర వేళల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడినా.. స్పందించేలా డివిజన్లో అత్యవసర స్పందన బృందాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. నేడు జిల్లాస్థాయి సైన్స్ సెమినార్మహబూబాబాద్ అర్బన్: మానుకోట మున్సిపల్ పరిధి అనంతారం మోడల్ స్కూల్లో నేడు (గురువారం) సైన్స్సెమినార్ నిర్వహిస్తున్నట్లు జిల్లా సైన్స్ అధికారి అప్పారావు బుధవారం ఒక ప్రకనటలో పేర్కొన్నారు. ఈ సైన్స్ సెమినార్కు 8, 9, 10వ తరగతుల విద్యార్థులు హాజరుకావాలని కోరారు. ఎరువుల అమ్మకాలపై సమీక్షమహబూబాబాద్ రూరల్: కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా ఎరువుల అమ్మకాలపై మానుకోట రైతు వేదిక కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.విజయచంద్ర డివిజన్ పరిధిలోని ఫర్టిలైజర్ డీలర్లకు ఎఫ్ఎఫ్ఎస్ యాప్ విధివిధానాలపై వివరించారు. కార్యక్రమంలో ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు, టెక్నికల్ ఏఓ జావీద్, మండల వ్యవసాయ అధికారి తిరుపతిరెడ్డి, జిల్లా ఫర్టిలైజర్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేమిశెట్టి సోమయ్య, మండల ఫర్టిలైజర్స్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వక్కల శ్రీనివాస్, డీలర్లు, రైతులు పాల్గొన్నారు. -
రజాకార్ల మారణకాండ
సాక్షి, మహబూబూబాద్/ డోర్నకల్: నాటి నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రజలు చిత్రహింసలు అనుభవించారు. అయితే ఓపిక నశించి తిరుగుబాటు చేసి ఎంతో మంది అమరులయ్యారు. కాగా, అన్ని పోరాటాల్లో మానుకోట భాగస్వామ్యం ఉన్నట్లే.. తెలంగాణ సాయుధ పోరులో నిజాం సైన్యానికి ఎదురొడ్డి ప్రాణాలు అర్పించిన వారు.. తెగబడి కలబడి.. రజాకార్లను ఊళ్ల నుంచి తరిమికొట్టిన వారు ఉన్నారు. నిజాం అరాచకాలను ఎండగడుతూ.. ప్రజల్లో చైతన్యం నింపిన వారి ఆచూకీ తెలపాలని కొందరిని, సాయుధులను పట్టుకొని ఒకేచోట 21మందిని కాల్చి చంపిన ఘటన జిల్లాలోని డోర్నకల్ మండలం పెరుమాళ్ల సంకీసలో జరిగింది. కాగా, ఈ ఘటనపై నేటికీ ప్రజలు పాటలు, కథల రూపంలో భావితరాలకు పోరాట చరిత్రను అందిస్తున్నారు. 21 మందిని పొట్టనపెట్టుకున్న రజాకార్లు.. డోర్నకల్ మండలం పెరుమాళ్ల సంకీస గ్రామంలో 78 ఏళ్ల క్రితం జరిగిన రజాకార్ల దాడులకు సంబంధించి బాధితులు, సాక్షులు ఒక్కొక్కరుగా మృతి చెందుతుండడంతో నాటి సాక్షాలు కనుమరుగవుతున్నాయి. 1948 సెప్టెంబర్ ఒకటో తేదీన రజాకార్ల దళాలు పెద్ద ఎత్తున పెరుమాళ్ల సంకీస గ్రామంపై దండెత్తి ఆడ, మగ, వృద్ధులు, పిల్లులు తేడా లేకుండా విచక్షణారహితంగా దాడులు చేశాయి. తెలంగాణ సాయుధ పోరాట దళాల ఆచూకీ చెప్పాలంటూ గ్రామస్తులందరినీ ఒకచోట చేర్చి కాల్పులు జరపడంతో 21మంది అమరులయ్యారు. అనేకమంది మహిళలపై అత్యాచారం చేసి ఆస్తులపై దాడులు చేశారు. నాటి ఘటనను గ్రామస్తులు నేటికీ చర్చించుకుంటున్నారు. నాటి ఘటనలో గాయపడ్డ వారు, ప్రత్యక్షంగా చూసినవారు ఒక్కొక్కరుగా చనిపోవడంతో చరిత్ర కనుమరుగవుతోంది. సంకీస గ్రామంలో 21మంది మృతుల జ్ఞాపకార్థంగా చెరువు వద్ద 21మంది పేర్లతో శిలాఫలకం, గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట స్మారక స్తూపం ఏర్పాటు చేశారు.సాయుధుల జాడ చెప్పాలని చిత్ర హింసలు ఆడ, మగ, వృద్ధులు, పిల్లలు తేడా లేకుండా దాడులు గ్రామ నడిబొడ్డున 21మందిపై తుపాకులతో కాల్పులు పెరుమాళ్ల సంకీస పాశవిక చర్య సాయుధ పోరుకు నిలువుటద్దం కథలు, పాటల రూపంలో నేటితరానికి చరిత్ర అందజేత -
వృద్ధురాలి హత్య.. కుమారుడు, కోడలు అరెస్ట్
పాలకుర్తిటౌన్ (దేవరుప్పుల ): ఓ వృద్ధురాలిని చంపి అనారోగ్యంతో మృతి చెందినట్లు సృష్టించేందుకు యత్నించిన దంపతుల (కుమారుడు, కోడలు)ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పాలకుర్తి సీఐ బి. సుమన్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం దేవరుప్పుల పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై ఊర సృజన్కుమార్తో కలిసి వివరాలు వెల్లడించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెరకు చెందిన పెందోట వెంకటేశ్వర్లు, భార్య వనితతో పాటు తన తల్లి ఉపేంద్రను తీసుకుని వృత్తి రీత్యా బంగారు ఆభరణాలు పని చేసేందుకు నాలుగు నెలల క్రితం ఇదే జిల్లా దేవరుప్పుల మండలం కడవెండికి వలస వచ్చారు. ఈ క్రమంలో కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నారు. ఈ తరుణంలో ఈ నెల 8 వ తేదీన ఉపేంద్రను అడ్డుతొలగించాలనే ఉద్దేశంతో దంపతులు ఆ వృద్ధురాలిని కొట్టి చంపారు. అనారోగ్యంతో చనిపోయిందని నమ్మబలుకుతూ అంత్యక్రియలు చేసేందుకు యత్నించారు. కాగా, మృతదేహంపై గాయాలు కనిపించడంతో బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించగా వారు మృతదేహాన్ని జనగామ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించారు. దీంతో హత్య విషయం ఎక్కడ బయటపడుతుందో అనే భయాందోళనకు గురైన నిందితులు.. కడవెండి సర్పంచ్ బాషిపాక రాములుకు జరిగిన విషయం వెల్లడించారు. దీంతో ఆయన నిందితులుగా భావిస్తున్న మృతురాలి కుమారుడు వెంకటేశ్వర్లు, కోడలు వనితను పోలీసులకు అప్పగించారు. ఈ విషయమై పాలకుర్తి సీఐ భరత్ ఆధ్వర్యంలో ఎస్సై ఊర సృజన్కుమార్ విచారణ చేపట్టి జనగామ కోర్డులో హాజరు పర్చగా నిందితులకు రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. వివరాలు వెల్లడించిన పోలీసులు -
ఆటో డ్రైవర్లకు బడ్జెట్ కేటాయించాలి
మహబూబాబాద్ అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ ఆటో డ్రైవర్ల యూనియన్(తాడు) గౌరవ అధ్యక్షుడు యాళ్ల మురళీధర్రెడ్డి అన్నారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు నలమాస సాయి ఆధ్వర్యంలో బుధవారం ఆటో డ్రైవర్లు మహార్యాలీ నిర్వహించి అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మురళీధర్రెడ్డి మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం వల్ల నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడిన ప్రతీ ఆటో డ్రైవర్ కుటుంబానికి ప్రభుత్వం రూ.10లక్షల నష్టపరిహారం చెల్లించాలని, ప్రతీ ఆటో డ్రైవర్కు రూ.12వేలు అందజేయాలన్నారు. ప్రత్యేక ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.1,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని, సబ్సిడీపై ఆటోలు అందించాలన్నారు. ఇళ్లు లేని ఆటో డ్రైవర్లకు స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల ఆగడాలను అరికట్టి వడ్డీ, స్లాబ్ సిస్టమ్ తొలగించాలన్నా రు. జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్, బస్టాండ్, ఏరి యాల్లో పార్కింగ్, ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వీరభధ్రయ్య, కోశాధికారి శ్యాంకుమార్, వివిధ మండలాల అధ్యక్షులు జానిమియా, సైదులు, మల్లేష్, నాగరాజు, సురేష్, యాకూబ్పాషా, విజయ్, రవి, శ్రీనివాస్, చంటి, వెంకటేష్, నారాయణ, ప్రభాకర్, గిరి బాలయ్య తదితరులు పాల్గొన్నారు. ఆటోయూనియన్ గౌరవ అధ్యక్షుడు మురళీధర్రెడ్డి -
నవోదయం.. భవిత బంగారం
ఖిలా వరంగల్: గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన, అల్పాదాయ వర్గాలకు చెందిన విద్యార్థులకు చక్కని అవకాశం కల్పిస్తోంది ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మామునూరు జవహర్ నవోదయ విద్యాలయం(జేఎన్వీ). ఇందులో సీటు లభిస్తే విద్యార్థి భవిత బంగారంగా మారుతుంది. ఈ క్రమంలో 2027–2028 విద్యా సంవత్సరంలో 9వ,11వ తరగతుల్లో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈనేపథ్యంలో ప్రవేశాలకు దరఖాస్తు ఎలా చేసుకోవాలి? విద్యాలయంలో లభిస్తున్న సదుపాయాలు,సౌకర్యాలు, రి జర్వేషన్లు తదితర వివరాలపై ‘సాక్షి’ కథనం 9వ తరగతికి ఇలా.. 2026–2027 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చ దువుతున్న విద్యార్థులు 9వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థి 01–05–2012 నుంచి 31–07–2014 మధ్య జన్మించి ఉండాలి. పరీక్ష తేదీ వరకు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 8వ తరగతి ఉత్తీర్ణత సాధించి విద్యా సంవత్సరం పూర్తి చేసి ఉండాలి. 11వ తరగతిలోకి.. 2026–2027 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 11వ తరగతి ప్రవేశానికి అర్హులు. 01–06–2010 నుంచి 31–07–2012 మధ్య జన్మించి ఉండాలి. జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న అదే జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి, విద్యా సంవత్సరం పూర్తి చేసి ఉండాలి. గ్రామీణ విద్యార్థులకు 75 శాతం సీట్లు మామునూరు నవోదయ విద్యాలయ ప్రవేశాల్లో గ్రామీణ విద్యార్థులకు 75శాతం, పట్టణ ప్రాంత విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయిస్తారు. విద్యార్థి తన చదువులో ఏదైనా భాగాన్ని పట్టణ, నగర ప్రాంతంలోని పాఠశాలలో చదివితే అర్బన్ అభ్యర్థిగా పరిగణిస్తారు. గ్రామీణ ప్రాంతంగా గ్రామ పంచాయతీ పరిధిలోని పాఠశాలలను, పట్టణ, నగర ప్రాంతంగా మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ పరిధిలోని పాఠశాలలను పరిగణిస్తారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల, బాలికలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఉచిత వసతి.. విద్య మామునూరు జవహర్ నవోదయ విద్యాలయం పూర్తిగా ఉచిత విద్యనందించే సహ విద్య, నివాస పాఠశాలలు, 6 నుంచి 12వ తరగతి వరకు సీబీఎస్ ఈ అనుబంధంతో ఎన్సీఈఆర్టీ పాఠ్య ప్రణాళిక ఆధారంగా విద్యాబోధన కొనసాగుతోంది. విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యం ఇస్తూ, 9వ తరగతి నుంచి హిందీ మాట్లాడే ప్రాంతాలు–మాట్లాడని ప్రాంతాల మధ్య విద్యార్థుల మైగ్రేషన్ విధానం అమలు చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తులుఅర్హత కలిగిన విద్యార్థులు నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్సైట్ https:// cbseitms.nic.in/2026/nvsix&9 ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 9వ, 11వ తరగతులకు ప్రత్యేకంగా దరఖాస్తు లింక్లు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని పీఎం పాఠశాల–జవహర్ నవోదయ విద్యాలయ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ టి.రమేశ్ కోరారు.మామునూరు జేఎన్వీలో 9వ, 11వ తరగతుల్లో ప్రవేశాలు ఖాళీ సీట్ల భర్తీకి లెట్రల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్–2027 సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఏప్రిల్ 10న ప్రవేశ పరీక్ష 9వ ,11వ తరగతుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లెట్రల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్–10 ఏప్రిల్ 2027న నిర్వహించనున్నారు. అర్హత ఉన్న విద్యార్థులు 30 సెప్టెంబర్, 2026 లోగా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలి. -
నేటినుంచి ఉద్యమకారుల ఓదార్పు యాత్ర
హన్మకొండ చౌరస్తా : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం త్యాగాలు, ఆత్మబలిదానాలు చేసిన ఉద్యమకారుల స్థితిగతులను తెలుసుకుని ప్రభుత్వానికి నివేదించేందుకు గురువారం (ఈనెల17) నుంచి ఓదార్పు యాత్రకు శ్రీకారం చుడుతున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్, ప్రముఖ న్యాయవాది గుడిమళ్ల రవికుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం హనుమకొండ కాకతీయ కాలనీలోని వేదిక కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మొదటి రోజు ఉదయం 10 గంటలకు వరంగల్లోని ఎస్బీఐ పక్కన గల తొలిదశ అమరవీరుడు చుంచు చంద్రమౌళి, షేక్ ఫకీర్ అలీ, ఆడెపు మార్కండేయ, గూడూరు వెంకటస్వామి జ్ఞాపకార్థం ఏర్పాటు చే సిన స్మారక జెండా వద్ద అమరులకు నివాళులర్పించనున్నట్లు తెలిపారు. 18,19,20 తేదీల్లో వరంగల్ జిల్లాలో అమరుల, ఉద్యమకారుల ఇళ్లకు వెళ్లి వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులు తెలుసుకుంటూ వివరాలు రికార్డు చేయనున్నట్లు తెలిపారు. ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదిన్నర పాటు కొనసాగుతుందని తెలిపారు. సమావేశంలో ఉద్యమకారుల ఓదార్పు యాత్ర రాష్ట్ర ఇన్చార్జ్ ఓడపెల్లి శ్యామకృష్ణ, తొలిదశ ఉద్యమకారుల రాష్ట్ర కన్వీనర్ టీఎన్ స్వామి, తొలిదశ ఉద్యమకారుడు కొండేటి నారాయణ రెడ్డి, ఎ.తిరుపతి రెడ్డి, తౌటం సమ్మయ్య, వరంగల్ జిల్లా ఓదార్పు యాత్ర ప్రచార కమిటీ సభ్యులు చాంద్ పాషా, చెన్నూరి నటరాజ్, ఇమ్మడిశెట్టి రాజు, మేకల కృష్ణ, అనుముల రమేశ్, మాధవీలత, మీడియా ఇన్చార్జ్ రాంపెల్లి శ్రీనివాసచారి, పద్మ , కిరణ్, చుంచు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుడిమళ్ల -
వీరుల త్యాగాలు విస్మరించొద్దు
తెలంగాణ సాయుధ పోరాట అమరుల జ్ఞాపకార్థం గ్రామంలో స్ఫూర్తి చిహ్నం ఏర్పాటు చేయాలి. తెలంగాణ సాయుధ పోరాటం, గ్రామంలో రజాకార్ల అరాచకాలు, 21మంది అమరుల త్యాగాలు భావితరాలకు తెలియాల్సిన అవసరం ఉంది. 21 మంది చంపిన ప్రదేశంలో ప్రభుత్వం స్మృతి చిహ్నం ఏర్పాటు చేయాలి. – శెట్టి వెంకన్న, సీపీఎం జిల్లా నాయకుడు, పెరుమాళ్లసంకీస త్యాగాలతోనే ఈ ప్రాంతం విముక్తి..రజాకార్లకు వ్యతిరేకంగా ప్రాణాలు అర్పించిన గడ్డ ఇది. తెలంగాణ విమోచన పోరాటంలో రజాకార్లకు వ్యతిరేకంగా మా బయ్యారం ప్రాంతవాసులు ఎంతోమంది తమ ప్రాణాలను అర్పించారు. వారి ప్రాణ త్యాగాలకు ఫలితంగా విముక్తి పొందిన తెలంగాణలో మొదటి అమరవీరుల స్తూపం బయ్యారంలోనే నిర్మించారు. – నందగిరి వెంకటేశ్వర్లు, వెంకట్రాంపురం, బయ్యారం -
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి
మహబూబాబాద్ అర్బన్ : రాష్ట్రంలో ప్రభుత్వ విద్య ను బలోపేతం చేయాలని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో బస్సు యాత్ర నిర్వహిస్తున్నామని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి అన్నారు. యాత్రలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని కంకరబోర్డు జెడ్పీహెచ్ఎస్ను పలువురు విద్యవేత్తలు సందర్శించారు. ఈ సందర్భంగా ఆకునూరి ము రళి మాట్లాడుతూ ఈ యాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బడులు స్థితి, పరిసరాలు, స్థలా లను పరిశీలిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మానుకోటలోని కంకరబోర్డు పాఠశాలను సందర్శించామన్నారు. ఈ పాఠశాలలో సరైన మౌలిక వసతులు, తరగతుల గదులు, మరుగుదొడ్లు, కిచెన్షెడ్ లేదన్నారు. అంతేకాకుండా ప్రహరీ లేకపోవడంతో పాఠశాల స్థలం ఆక్రమణకు గురవుతోందన్నారు. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ఇప్పటికై నా ప్రభుత్వ బడుల నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణకు చట్టాలు తీసుకురావా లని ఒత్తిడి చేయడం ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రొఫెసర్ పద్మజ షా, రిటైర్డ్ ఐఏఎస్లు ఎంవీ రెడ్డి, ఎం. చంపాలాల్, ప్రధాన వక్తలు ఎన్. రుమీనా, తమ్మినేని నిర్మల, సృజన యాదవ్, ము ప్పూరి కుమారన్న, నిఖిల్, విజయకృష్ణ, పాలకూరి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి -
అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో తెలంగాణ కోచ్గా రవీందర్
జనగామ రూరల్ : సెప్టెంబర్ 16 నుంచి 18వ తేదీ వరకు పాండిచ్చేరిలో జరగనున్న జాతీయ స్థాయి 37వ సౌత్ జోన్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్న్షిప్–2026 పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టుకు జనగామకు చెందిన బానోత్ రవీందర్ టీమ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. యువ అథ్లెట్లకు మెరుగైన శిక్షణ, పోటీ వ్యూహాలు, మానసిక ధైర్యం అందిస్తూ వారి అత్యుత్తమ ప్రదర్శనకు కోచ్ రవీందర్ మార్గనిర్దేశం చేయనున్నారు. ‘మక్క’కు మంచి ధర.. ● క్వింటాల్ రూ.2,775 ఖిలా వరంగల్ : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం మొక్కజొన్న పంటకు మంచి (అధిక) ధర పలికింది. క్వింటాల్కు రూ.2,775 పలికింది. దీంతో రైతు ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. వర్ధన్నపేటకు చెందిన సామల ఈశ్వర్ మార్కెట్కు తన మొక్కజొన్న పంట తీసుకొచ్చాడు. అడ్తిదారు.. సదరు రైతు మక్కలను మార్కెట్లో ఉంచగా ఖరీదుదారుడు క్వింటాల్కు రూ.2,775 ధరతో కొనుగోలు చేశాడు. దీంతో మంచి లాభం పొందానని రైతు ఆనందం వ్యక్తం చేశాడు. ఇద్దరిపై పోక్సో కేసు నమోదు బయ్యారం: మహబూబాబాద్ జిల్లా బయ్యా రం మండలంలోని వేర్వేరు గ్రామాలకు చెందిన ఇద్దరు బాలికలు గర్భం దాల్చారు. దీనికి కారణమైన ఇద్దరిపై పోలీసులు బుధవారం పోక్సో కేసులు నమోదు చేశారు. ఎస్సై ప్రశాంత్బాబు కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి భద్రాద్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలానికి చెందిన బాలికతో వివాహం జరపగా ఆమె గర్భం దాల్చింది. అదేవిధంగా మండలంలోని మరో గ్రామానికి చెందిన ఇరువురు మైనర్లు కొంతకాలంగా సహజీవనం గడుపుతుండగా బాలిక గర్భం దాల్చింది. ఈ ఘటనలపై ఐసీడీఎస్ సూపర్వైజర్ ఫిర్యాదు ఆధారంగా ఓ యువకుడు, బాలుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మేడిగడ్డకు కొనసాగుతున్న ఇన్ఫ్లో కాళేశ్వరం : మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో ప్రాణహిత నదికి వరద తాకిడి పెరిగి వరద ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమంలో కలిసి పుష్కరఘాట్ను తాకుతూ ప్రవహించింది. దీంతో కాళేశ్వరం వద్ద 6.450 మీటర్ల మేర ప్రవాహం దిగువకు చేరుతోంది. బ్యారేజీ వద్ద 1,08,500 క్యూసెక్కులు తరలిరాగా, బ్యారేజీలోని మొత్తం 85 గేట్లు ఎత్తి నీటిని అదేస్థాయిలో నీటిని దిగువకు తరలిస్తున్నారు. కాగా, మంగళవారం 94,640 క్యూసెక్కులు ప్రవా హం తరలొచ్చి దిగువకు తరలిపోయింది. సీనియర్ అసిస్టెంట్ ఆసిఫ్ సస్పెన్షన్ కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ మహ్మద్ ఆసిఫ్ను ఇటీవల సస్పెండ్ చేసినట్లు రిజిస్ట్రార్ వి. రామచంద్రం బుధవారం తెలిపారు. యూనివర్సిటీలోని ఓ విభాగానికి చెందిన విద్యార్థిని పట్ల అనుచితంగా, అసభ్యకరంగా ప్రవర్తించారనే ఆరోపణల ఫిర్యాదుతో కేయూలోని యాంటీ సెక్సువల్ హారాస్మెంట్ కమిటీతో విచారణ జరిపించామని తెలిపారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా మహ్మద్ ఆసిఫ్ను సస్పెండ్ చేసినట్లు రిజిస్ట్రార్ రామచంద్రం తెలిపారు. -
రాజకీయ నాయకులు సహకరించాలి
● కలెక్టర్ స్నేహశబరీష్ మహబూబాబాద్: జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియకు రాజకీయ పార్టీల ప్రతినిధులు అన్ని విధాలా సహకరించాలని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఐఆర్ ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 88,800 మందికి ఎస్ఐఆర్ నోటీసులు అందించినట్లు తెలిపారు. నోటీసులు స్వీకరించిన వారు గుర్తింపు కార్డుల జిరాక్స్లతో సంబంధిత పోలింగ్ కేంద్రాల వద్ద బూత్ లెవల్ అధికారులను సంప్రదించాలన్నారు. ఓటు భద్రతపై విస్తృత ప్రచారం చేసినట్లు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరి ఓటును తొలగించడం జరగదన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, నాయకులు సురేష్నాయుడు, మార్నేని వెంకన్న, విజయసారథిరెడ్డి, శ్యాంసుందర్శర్మ, రామారావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పకడ్బందీగా నిమజ్జన ఏర్పాట్లు మరిపెడ: పకడ్బందీగా గణపతి నిమజ్జన ఏర్పాట్లు చేపట్టాలని మరిపెడ మున్సిపల్ చైర్పర్సన్ వీసారపు ప్రగతిశ్రీపాల్రెడి ఆదేశించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని మాకుల పెద్ద చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం పట్టణంలోని 2వ వార్డు పరిధి చోక్లాతండాలో చేపట్టాల్సిన పారిశుద్ధ్య, అభివృద్ధి పనులను తండావాసులతో కలిసి ఆమె పరిశీలించారు. కమిషనర్ నరేష్రెడ్డి,ఉపేందర్, బాదావత్ రవి, వెంకట్లాల్, మణి, నాయకులు శతృనాయక్, నరేష్, వీరన్న, కస్నా నాయక్, సుమన్ పాల్గొన్నారు. -
యూపీఐ చార్జ్!
ప్రతీ రూ.2వేల పైబడి వ్యాపార చెల్లింపులపై 0.4శాతం ఎండీఆర్సాక్షి, మహబూబాబాద్: ఇప్పటి వరకు జీఎస్టీ, కొనుగోలు పన్ను, ఇతర చార్జ్లతోనే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆక్టోబర్ 15 నుంచి అమలు కానున్న యూపీఐ లావాదేవీలపై పన్ను విధింపు బాంబు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలపై పడుతుంది. అయితే పెద్ద మొత్తంలోనే కొనుగోళ్లపై ఈ భారం పడుతుందని ప్రకటించినా.. పరోక్షంగా మాత్రం అన్ని కొనుగోళ్లపై ప్రభావం ఉంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలపై పడే ఆర్థిక భారం సరైందికాదని, ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ప్రజా సంఘాలు, వినియోగదారుల సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో రోజుకూ రూ.100కోట్ల వ్యాపారం.. జిల్లా వ్యాప్తంగా ప్రతీరోజు రూ.100కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. ఇందులో ప్రధానంగా మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం, గూడూరు, బయ్యారం, గార్ల వంటి పెద్ద సెంటర్లతో పాటు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో కిరాణా వస్తువుల నుంచి గృహోపకరణాలు, మోటారు వెహికిల్స్, పంట ఉత్పత్తులు, దుస్తులు, మద్యం ఇలా అనేక రకాల లావాదేవీలు నడుస్తున్నాయి. అయితే ఇందులో రూ.10కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు ఉండే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రత్యక్షంగా జిల్లాపై రోజుకు రూ.4లక్షలకు పైగా భారం పరోక్షంగా ప్రతీ కొనుగోలుకు యూపీఐ చార్జీలు ప్రజలపై భారం పడుతుందంటున్న ఆర్థిక నిపుణులుయూపీఐ వడ్డనపై అంచనాలు.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మహబూబాబాద్ జిల్లాలో ఏ మేరకు ప్రభావం పడుతుందనేది చర్చగా మారింది. అయితే రైల్వే, టెలికం, గ్యాస్, పెట్రోలు వంటి వాటిపై వడ్డను ఉంటుందని చెబుతున్నారు. అదే విధంగా చిరు వ్యాపారులపై ప్రభావం ఉండదని అంటున్నారు. అయితే జిల్లాపై రోజుకూ రూ.4లక్షలకు పైగా భారం పడే అవకాశం ఉన్నట్లు లెక్కలు వేస్తున్నారు. పేరుకే చిరు వ్యాపారులు, ఇతర చిన్నచిన్న వ్యాపార సంస్థలపై ప్రభావం పడదని అంటున్నారని, అయితే పెద్ద వ్యాపారులపై పడిన భారాన్ని చిన్న వారిపై వేసే అవకాశం ఉంది. -
రజాకార్లతో పోరాడినందుకు గర్వపడుతున్న..
నిజాం తొత్తు జాగీర్దార్ సైతం గార్లలో అజమాయిషీ చలాయిస్తూ దోపిడీ, దౌర్జన్యాలకు పాల్పడేవాడు. నాడు రజాకార్లకు హెడ్గా మిస్కిల్ సాబ్ వ్యవహరించేవాడు. గార్ల శివారు జీవంజిపల్లిలో రజాకార్లకు మిస్కిల్ సాబ్ రైఫిల్ ట్రైనింగ్ ఇచ్చేవాడు. రజాకార్లు పగలు గ్రామాల్లో ప్రదర్శన నిర్వహిస్తూ జిన్నికా హుకుం సే నెహ్రూకు జూకా దేంగే అంటూ నినాదాలు చేసేవారు. రజాకార్లు, నైజాం పోలీసులు రాంపురంలో బాలింతను చెరచడంతో పాటు దుబ్బగూడెం, ముల్కనూరు గ్రామాల్లో ప్రజలపై విచక్షణారహితంగా దాడులు చేశారు. ఈ దాడులు నన్ను ఉద్యమం వైపు నడిపించాయి. నాడు ఈ ప్రాంత ఉద్యమ కమాండర్గా పనిచేస్తున్న తుమ్మల శేషయ్య నాయకత్వంలో ముందుకు సాగాం. బండ్లగూడ వద్ద సేద తీరుతున్న మా దళానికి రజాకార్లకు మధ్య 1948 సంవత్సరంలో జరిగిన ఎదురుకాల్పుల్లో దామినేని వెంకటేశ్వరరావు, బుచ్చి మల్లు, మరికొందరు అమరులయ్యారు. – తోడేటి కొమురయ్య, గార్ల -
ప్రభుత్వం హామీలు నెరవేర్చాలి
మహబూబాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను వెంటనే అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కోశాఽధికారి రాములు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సాదుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సీఐటీయూ, అనుబంధ యూనియన్ల ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కరించాలని హైదాబాద్కు వెళ్లిన ఆశ వర్కర్లు, అంగన్వాడీలను అర్ధరాత్రి సైతం బస్సుల నుంచి దింపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 8,9వ తేదీల్లో చలో హైదరాబాద్ పిలుపునివ్వగా, దానిని భగ్నం చేసేందుకు ప్రభుత్వం పడరాని పాట్లు పడిందన్నారు. ఆశకార్యకర్తలకు కనీస వేతనం రూ.18,000 ఇవ్వాలని, పీఎఫ్ సౌకర్యం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రీప్రైమరీ విద్యను కొనసాగించాలన్నారు. హామీలు అమలు చేయకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు వెంకన్న, సమ్మెట రాజమౌళి, వీరన్న, నాగన్న, మల్లయ్య, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. -
గైడ్కు అన్ని అంశాలపై అవగాహన ఉండాలి
● టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ సూర్యకిరణ్ హన్మకొండ అర్బన్ : టూరిస్ట్ గైడ్ అన్ని అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్యకిరణ్ అన్నారు. ప్రభుత్వ మహిళా పింగిళి కళాశాలలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టూరిస్ట్ గైడ్ సర్టిఫికెట్ కోర్సులో భాగంగా బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా, ప్రధాన వక్తగా పాల్గొని మాట్లాడారు. ‘తెలంగాణ పర్యాటక సౌకర్యాలు, అభివృద్ధి–తెలంగాణ పర్యాటక ఉత్పత్తులు’ అంశంపై అవగాహన కల్పించారు. పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యత, సాంస్కృతిక ప్రదేశాలు, సందర్శకులకు మార్గదర్శకం అందించడంలో గైడ్ పాత్రను వివరించారు. రెండు రోజుల పర్యటనకు ముందుగానే ప్రణాళిక రూపొందించుకుని వాహనం, సమ యం, అవసరమైన వస్తువులు, సందర్శించాల్సిన ప్రాంతాలను నిర్ణయించుకోవాలన్నారు. కార్యక్రమానికి వైస్ ప్రిన్సిపాల్ జి. సుహాసిని అధ్యక్షత వహించారు. సర్టిఫికెట్ కోర్సు కన్వీనర్, చరిత్ర విభాగాధిపతి కొలిపాక శ్రీనివాస్, అధ్యాపకులు పి. నరేశ్, బి. జ్యోతి, విద్యార్థులు పాల్గొన్నారు. -
వినూత్న పరిశోధనకు పేటెంట్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ జూవాలజీ ప్రొఫెసర్ జి.షమిత, జువాలజీ విభాగం పూర్వ పరిశోధకురాలు మౌనిక, హైదరాబాద్లోని సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలోని మైక్రోబయాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గాయత్రి సంయుక్తంగా చేపట్టిన వినూత్న పరిశోధనకు పేటెంట్ లభించింది. సింథసిస్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ సిల్వర్ నానోపార్టికల్స్ ఫ్రమ్ గట్ బాక్టీరియా ఆఫ్ టస్సర్ సిల్క్వార్మ్ అనే ఆవిష్కరణకు భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ లభించిందని షమిత తెలిపారు. ఈ ఆవిష్కరణ ద్వారా టస్సర్ సిల్క్ వార్మ్కు సంభవించే వ్యాధులను నియంత్రించడంతోపాటు పట్టు ఉత్పత్తిని పెంచే అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం యూనివర్సిటీలో షమిత, పూర్వపరిశోధకురాలు మౌనికను వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం, ఓఎస్డీ బి.వెంకట్రాంరెడ్డి అభినందించారు. -
15రోజులుగా తాగునీటి సరఫరా బంద్
గార్ల: గార్ల పట్టణంలో 15 రోజుల నుండి తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా నాయకుడు శ్రీనివాసరావు మాట్లాడారు. ఇల్లెందు సమీపంలో మిషన్ భగీరథ పైపులైన్ లీక్ కావడంతో గార్ల పట్టణంలో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గార్ల పట్టణంలో వారంరోజుల క్రితం తాగునీటి సమస్య తీర్చాలని గ్రామసభలో ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టగా, సమస్య తీర్చుతామని హామీ ఇచ్చిన అధికారులు, ప్రజాప్రతినిధులు నేటికీ పట్టించుకోకపోవడం శోచనీయం అన్నారు. ఐద్వా, డీవైఎఫ్ఐ, సీఐటీయూ తదితర ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు. నాయకులు అంబటి వీరస్వామి, రామకృష్ణ, మౌనిక, కొండయ్య, ఐల య్య, సతీష్, నాగరాజు, అచ్చయ్య, వార్డుసభ్యుడు పూర్ణచందర్రావు, సాయి పాల్గొన్నారు. ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు -
సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి
● డీఏఓ విజయచంద్ర చిన్నగూడూరు: రైతులు సేంద్రియ వ్యవసాయంౖ వైపు మొగ్గు చూపాలని డీఏఓ విజయచంద్ర అన్నారు. మంగళవారం మండలంలోని జయ్యారం రైతువేదికలో ఏర్పాటు చేసిన రైతు నేస్తం కార్యక్రమంలో డీఏఓ పాల్గొన్నారు. గుండంరాజుపల్లి గ్రామానికి చెందిన రైతులకు సేంద్రియ వ్యవసాయ కిట్స్ అందజేశారు. డీఏఓ మాట్లాడుతూ... రైతులు జీవామృతం, గణామృతం వంటి సేంద్రియ ఎరువులు వాడితే అధిక దిగుబడులతో లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు. ఏఓ భాస్కర్, ఏఈఓ కీర్తి శిరీష, సర్పంచ్లు కమలాకర్, సైదులు, సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పారదర్శకంగా నిర్వహించాలి.. డిజిటల్ క్రాప్ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని డీఏఓ విజయచంద్ర అన్నారు. మంగళవారం మండల కేంద్రం శివారులో వలంటీర్లు నిర్వహిస్తున్న డిజిటల్ క్రాప్ సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వలంటీర్లకు పలు సూచనలు చేశారు. రైతుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. సర్వే ప్రక్రియలో ఎలాంటి తప్పులు తలెత్తకుండా సమర్థవంతంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. -
కొలువుదీరిన లంబోదరుడు..
మహబూబాబాద్ రూరల్: మహాగణపతి నవరాత్రి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు భక్తిశ్రద్ధలతో మండపాల వద్ద పూజలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో నిర్వాహకులు భక్తులను ఆకట్టుకునే విధంగా మండపాల సెట్టింగ్లు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో శ్రీమహాలక్ష్మి గణపతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గోమయ గణపతిని కొలువుదీర్చారు. అదే విధంగా జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలతో పాటు పలు గ్రామాల్లో కూడా మట్టిగణపతి విగ్రహాలు ఏర్పాటు చేశారు. మహేశ్వరి భవన్లో రంగు రంగుల మట్టి గణపయ్యను ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు డీఎస్పీలు తిరుపతిరావు, కృష్ణకిశోర్ ఆధ్వర్యంలో విస్తృత పోలీసు బందోబస్తు నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. వినాయక విగ్రహాలను పోలీసు అధికారులు జియో ట్యాగింగ్ చేశారు.● వైభవంగా గణపతి నవరాత్రులు ప్రారంభంవిస్తృత పోలీసు బందోబస్తు -
19న మరిపెడలో కోర్టు ప్రారంభం
మరిపెడ రూరల్: మరిపెడలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ కోర్టును ఈ నెల 19న ప్రారంభించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, మహబూబాబాద్ సీనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి తెలిపారు. మంగళవారం మరిపెడ ఆర్ అండ్ బీ అతిథి గృహంలో కోర్టు ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు, న్యాయవాదులతో ఆమె చర్చించారు. అనంతరం నూతన కోర్టు భవనం, పరిసరాలను పరిశీలించి ఏర్పాట్లపై సమీక్షించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణవేణి, మున్సిపల్ చైర్పర్సన్ ప్రగతి శ్రీపాల్రెడ్డి, జిల్లా బార్ అసోసియేషన అధ్యక్షుడు మామిడాల సత్యనారాయణ, కార్యదర్శి సిద్ధార్థ, న్యాయవాదులు తొనుకునూరి సైదులు, శ్రీనివాస్, మరిపెడ సీఐ పవన్కుమార్, ఎస్సైలు గండ్రాతి సతీష్, ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భవిత సెంటర్లో నమోదు చేయించాలిమహబూబాబాద్ అర్బన్: దివ్యాంగ పిల్లల వివరాలను తమ తల్లిదండ్రులు భవిత సెంటర్ నమోదు చేయించాలని జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి మందుల శ్రీరాములు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మంగళవారం దివ్యాంగుల ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మందుల శ్రీరాములు మాట్లాడుతూ.. భారత కృత్రిమ అవయవాల తయారీ సంస్థ ఆధ్వర్యంలో వచ్చే పరికరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో శారీరక వైకల్యంకలిగిన వారు 42 మంది, మానసిక వైకల్యం 29 మంది, వినికిడి లోపం 25 మంది, అంధత్వం 3, సెరిబ్రల్ పాలసీ సంబంధిత దివ్యాంగ విద్యార్థులు 34 మంది ఉన్నారని, మొత్తం 133 మంది ఉపకరణాలకు దరఖాస్తులు చేసుకున్నారని పేర్కొన్నారు. ప్రతీ విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలో నమోదు చేసుకోవాలన్నారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి మరిపెడ రూరల్: ప్రతీ ఒక్కరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని మరిపెడ మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతిశ్రీపాల్రెడ్డి అన్నా రు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని చైర్పర్సన్ సందర్శించారు. ప్రజలు తమ ఆరోగ్యంపై అవగాహన కలిగి, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మెరు గు రాము, వైద్యాధికారులు స్వామి, మంగ మ్మ, నాయకులు ఉపేందర్, సయ్యద్ సర్వర్పాషా, వాసవీ క్లబ్ మండల అధ్యక్షుడు గర్రెపల్లి నగేష్, భాసిత్ ఖాన్, ప్రేమ్సాగర్ తది తరులు పాల్గొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలినెహ్రూసెంటర్: ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు పీసీపీఎన్డీటీ చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించొద్దన్నారు. ఆస్పత్రుల్లోని పలు రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో పీఓఎంహెచ్ఎన్ డాక్టర్ విరాజిత, డాక్టర్ శివకుమార్, డెమో రాజ్కుమార్, మనోహర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. 29 పోస్టులకు 462 దరఖాస్తులుతొర్రూరు: తొర్రూరు ప్రాజెక్టు పరిధిలో 29 అంగన్వాడీ టీచర్ పోస్టులకుగాను 462 దరఖాస్తులు అందినట్లు సీడీపీఓ మంద రేష్మ తెలిపారు. డివిజన్ కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో మంగళవారం దరఖాస్తుల పరిశీలన కొనసాగింది. సీడీపీఓ మాట్లాడుతూ... తొర్రూరు ప్రాజెక్టు పరిధిలోని తొర్రూరు, పెద్దవంగర, నెల్లికుదురు మండలాల నుంచి అందిన దరఖాస్తుల్లో 180 దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని తెలిపారు. ఈ నెల 19 వరకు వెరిఫికేషన్ చేపడుతామన్నారు. కార్యక్రమంలో ఏసీడీపీఓ విజయలక్ష్మి, సూపర్వైజర్లు సుధ, జలగం సునీత, నార్లపురం సరిత పాల్గొన్నారు. -
ఓటరు జాబితాలో పేర్లు నిర్ధారించుకోవాలి
● కలెక్టర్ స్నేహశబరీష్ మహబూబాబాద్ రూరల్: ఓటరు జాబితాలో తమ పేరు నిర్ధారించుకోవడం ఓటర్లు బాధ్యతగా భావించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని అమనగల్, బలరాంతండా గ్రామాల్లో ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్లకు నిర్వహిస్తున్న హియరింగ్ కార్యక్రమాలను కలెక్టర్ మంగళవారం స్వయంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నోటీసులు అందిన ఓటర్లు తమ గుర్తింపు కార్డులతో కేటాయించిన తేదీల్లో హాజరై ఓటరు జాబితాలో తమ పేరు నిర్ధారణ చేసుకోవాలన్నారు. ప్రభుత్వ సెలవుల్లో సైతం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించడం జరిగిందని, ఇంకా ఎవరైనా మ్యాపింగ్ చేసుకోని వారు ఉంటే స్వచ్ఛందంగా వచ్చి తక్షణమే మ్యాపింగ్ చేసుకోవాలని సూచించారు. తద్వారా పారదర్శకమైన ఓటరు జాబితా తయారు చేయడం కోసం ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందన్నారు. డబుల్ ఓటింగ్, చనిపోయిన వారు, షిఫ్ట్ అయినవారు, మార్పులు, చేర్పులు, కొత్తగా ఓటరు నమోదు, తదితర కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇంకా సమయం ఉన్నందున ప్రతీఒక్కరు తమకు అందిన నోటీసుల ద్వారా తెలియజేసిన సమాచారంతో సంబంధిత పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటును భద్రపరచుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వర్, ఆమనగల్ సర్పంచ్ కోట విజయేందర్ తదితరులు ఉన్నారు. -
పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం
● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తొర్రూరు: పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం నిలుస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. మండల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, పేద కుటుంబాల ఆర్థిక భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా, అభివృద్ధి పనులు వేగవంతమయ్యేలా అధికారులు చొరవ చూపాలన్నారు. తాము ఆరు గ్యారంటీలు అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి పార్టీలకతీతంగా కొనసాగుతోందన్నారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలోని గ్రామాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ హయాంలోనే గిరిజనులకు న్యాయం
● మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్: కాంగ్రెస్ హయాంలో గిరిజనులకు అన్యాయం జరుగుతుందని, బీఆర్ఎస్ పాలనలో పూర్తిస్థాయిలో న్యాయం జరిగిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జనాభా ప్రాతిపదికన గిరిజనుల 6శాతం రిజర్వేషన్ను 10శాతం చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. తండాలను గ్రామపంచాయతీలుగా చేసి అభివృద్ధి చేశారని, కేసీఆర్ పాలన గిరిజనులకు స్వర్ణయుగం అని కొనియాడారు. గిరిజనులంతా కేసీఆర్కు రుణపడి ఉంటారన్నారు. ఈనెల 17న ప్రతీ తండాలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు, తదితర కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ మాట్లాడుతూ.. గిరిజనుల గుండెల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. 17న భారీ బహిరంగ సభ కూడా ఉంటుందని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కౌన్సిలర్లు తేజస్విని, నరేష్, నాయకులు అశోక్, బిక్కు తదితరులు పాల్గొన్నారు. -
కాస్త ఊరట..
కురిసిన వర్షంతో చెరువుల్లో జలకళరెండు రోజుల క్రితం కురిసిన వర్షాలతో చెరువుల్లో నీరు చేరింది. అయితే నీటిని ఆయకట్టు పంటలకు విడుదల చేయమని నీటిపారుదలశాఖ అధికారులు చెబుతుండడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. జిల్లాలో గతేడాది 4,561,36 ఎకరాల్లో పంటలు సాగు చేసే రైతులు ప్రస్తుతం 3,28,475 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. ఇందులో అత్యధికంగా పత్తి 91,916 ఎకరాల్లో సాగు చేయగా.. వరి 1,49,162 ఎకరాలు, మొక్కజొన్న 58,655 ఎకరాలు, 21,585 ఎకరాల్లో పెరస పంట సాగుచేశారు. అయితే ఇందులో పత్తి, మొక్కజొన్న పంటలు కాత పూత, పాలకంకి పోసింది. వీటికి ఇప్పుడు నీరు అత్యధికంగా కావాలి. లేకపోతే పంటలు చేతికి వచ్చే పరిస్థితి లేదు. ఈ వర్షంతో పత్తి మొదటి క్రాప్ వస్తుందని, మొక్కజొన్నకు మరో పదిరోజుల తర్వాత మరొక వర్షం పడితే చాలని రైతులు చెబుతున్నారు. అయితే చెరువులనే ఆధారంగా చేసుకొని వేసిన వరినాట్లు, ఇతర పంటలకు చెరువు నీరు విడుదల చేస్తేనే పంటలు పండుతాయి. లేకపోతే పెట్టుబడి కూడా వృథా అవుతుంది. ఇప్పటికే బయ్యారం మండలంలో చెరువు నీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తుండగా.. నీరు విడుదల చేసే ప్రసక్తే లేదని అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో తాగునీటికి వినియోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. చెరువులనే ఆధారంగా చేసుకొని ప్రతీ ఏడాది మాదిరిగానే ఇప్పుడు కూడా సాగుచేశామని, పంటలకు సరిపడా నీరు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. నీటి విడుదలకు ఎల్నినో అడ్డుసాక్షి, మహబూబాబాద్: ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది సరిపడా వర్షాలు కురవలేదు. అధికారులు ముందస్తు ప్రచారం నిర్వహించి ఆరుతడి పంటలు వేయాలని సూచించారు. దీంతో సగం పంటలే సాగుచేసిన రైతులకు.. పంటలు పండుతాయో లేదో అనే భయం పట్టుకుంది. పెట్టుబడులు మీద పడుతాయని ఆందోళన చెందారు. అయితే రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. భూగర్భ జలాలు పెరుగుతాయని ఆశ కలిగింది. మరో పెద్దవర్షం కురిస్తే వానాకాలం పంటలకు ఢోకా ఉండదని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చెరువులకు చేరిన నీరు.. జిల్లాలో మొన్నటి వరకు భారీ వర్షం కురవలేదు. చిరుజల్లులు, మోస్తరు వర్షాలే కురిశాయి. దీంతో గత ఏడాది వర్షాలకు వచ్చిన నీటి మట్టం కూడా అడుగంటిపోయింది. ఈ పరిస్థితుల్లో కురిసిన భారీ వర్షానికి జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువుల్లోకి నీరు చేరుకుంది. జిల్లాలో 1590 చెరువులు ఉన్నాయి. కాగా 25శాతం నీరు చేరినవి 398 చెరువులు, 50శాతం నీరు చేరినవి 723 చెరువులు, 75శాతం నీరు చేరినవి 273 చెరువులు ఉన్నాయి. అలాగే 190 చెరువులు వందశాతం నిండాయి. ప్రధానంగా కేసముద్రం, దంతాపల్లి, గార్ల, బయ్యారం, మహబూబాబాద్ మండలాల్లోని చెరువుల్లో ఎక్కువ మొత్తంలో నీరు చేరిందని అధికారులు చెబుతున్నారు. చెరువుల మత్తడి.. బయ్యారం: బయ్యారం మండలంలో ప్రధాన నీటివనరులైన బయ్యారం పెద్దచెరువు, తులారాం ప్రాజెక్టు, గౌరారం కట్టల్లోకి పూర్తి స్థాయి నీరు చేరడంతో మత్తడి దూకుతున్నాయి. ఆలస్యంగానైనా చెరువుల్లోకి నీరు చేరడంతో ప్రత్యామ్నాయ పంటల సాగుకు అనుకూలంగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. భూగర్భజలాలు పెరుగుతాయని అన్నదాతల్లో ఆశ చెరువుల్లోని నీటి విడుదలకు ఎల్నినో అడ్డంకి.. మరో భారీవర్షం కురిస్తేనే పంటలకు సరిపడా నీరు -
ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లకు 17న సెలవు
ఏటూరునాగారం : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, హనుమకొండ, జనగామ, వరంగల్ జిల్లాలోని ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లకు ఈనెల 17వ తేదీన సెలవు ఇస్తూ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గిరిజన సంప్రదాయ పండుగ ‘పెద్దల పండుగ’ ఈనెల 17న నిర్వహించుకునే అవకాశం ఉండడంతో వివిధ సంఘాల విజ్ఞప్తి మేరకు సెలవు ప్రకటించామని, ఈ సెలవును అక్టోబర్ 10వ తేదీ రెండో శనివారం వర్కింగ్ డేగా పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. పాఠశాలల హెచ్ఎలు, వార్డెన్లు ఈ ఉత్తర్వులను పాటించాలని ఆదేశించారు. మక్కలకు రికార్డు ధర● క్వింటాల్కు రూ.2,750 రేటు ఖిలా వరంగల్: వరంగల్ ఏనుమాముల వ్యవసా య మార్కెట్ యార్డులో మక్కలకు రికార్డు ధర పలికింది. ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు మార్కెట్కు వరుస సెలవులు రాగా.. మంగళవారం పునః ప్రారంభమైంది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామానికి చెందిన రాజారపు పోశాలు 18 బస్తాల మక్కలు మార్కెట్కు తీసుకొచ్చారు. మార్కెట్లోని ఓ వ్యాపారి క్వింటాల్కు రూ.2,750 ధర చెల్లించి కొనుగోలు చేశారు. దీంతో రైతు హర్షం వ్యక్తం చేశారు. ఈ సీజనల్లో మక్కలకు మంచి ధర రావడం ఇదే మొదటిసారి అని మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి ● మల్లక్పేటలో ఘటన పరకాల : విద్యుదాఘాతంతో ఓ వ్యవసాయ కూలీ మృతి చెందాడు. ఈ ఘటన పరకాల పట్టణంలోని మాదారం శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పరకాల మండలం మల్లక్పేట గ్రామానికి చెందిన రాసమల్ల కుమారస్వామి(50) పట్టణానికి చెందిన పిట్ట సమ్మయ్య వద్ద వ్యవసాయ కూలీ(పాలేరు)గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే మంగళవారం తెల్లవారుజామున చేను వద్దకు వెళ్లిన కుమారస్వామి.. మోటారుకు విద్యుత్ వైరు సరిచేస్తున్న క్రమంలో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు హరీశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనాథలైన అన్నాచెల్లి.. కుమారస్వామి మృతితో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. మూడేళ్ల క్రితం అనారోగ్యంతో తల్లి రజిత మృతిచెందగా మంగళవారం తండ్రి మృతిచెందాడు. దీంతో కూతురు అకిల, కుమారుడు హరీశ్ అనాథలయ్యారని, వీరిని యజమానితోపాటు ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
పోరాటాలతోనే హక్కులు సాధించుకోవాలి
● ఐద్వా జాతీయ కార్యదర్శి కనినికా ఘోష్ పాలకుర్తి టౌన్: పోరాటాలతోనే ప్రభుత్వాల మెడలు వంచి ప్రజలు తమ హక్కులు సాధించుకోవాలని ఐద్వా జాతీయ కార్యదర్శి కనినికా ఘోష్ పిలుపునిచ్చారు. బీజేపీ ‘సబ్ కా సాత్–సబ్ కా వికాస్’ నినాదాలను ఆచరణలో పెట్టకుండా ప్రచారానికే పరిమితమైందని విమర్శించారు. తెలంగాణ రైతాంగా సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా మంగళవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో వీరవనితల స్ఫూర్తి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఐద్వా జిల్లా కార్యదర్శి ఎండీ షబానా అధ్యక్షతన నిర్వహించిన సభలో జాతీయ ఉపాధ్యక్షురాలు ఎస్. పుణ్యవతితో కలిసి కనినికా ఘోష్ మాట్లాడారు. 1946 నుంచి 1951 వరకు సాగిన తెలంగాణ రైతాంగ పోరాటం దొరలు, భూస్వాములు, జాగీర్దాలు, నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిందన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజం స్ఫూర్తితో మహిళలు తమ హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ రైతాంగ పోరాటంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ పాత్ర లేదన్నారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణాజ్యోతి, టి.జ్యోతి, రాష్ట్ర సహాయ కార్యదర్శి బుగ్గవేటి సరళ, కె. ఆశలత, నలిగంటి రత్నమాల, రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి, బత్తుల హైమావతి, జిల్లా అధ్యక్షురాలు ఇ.వి అహల్య, తదితరులు పాల్గొన్నారు.పాలకుర్తిటౌన్ (దేవరుప్పుల) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘సబ్ కా సాత్’ నినాదాలకే పరిమితమవుతున్న క్రమంలో సమస్యల పరిష్కారం కోసం నేటి మహిళలు.. చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలని ఐద్వా జాతీయ కార్యదర్శి కనినికా ఘోష్ అన్నారు. వీరవనితల స్ఫూర్తి యాత్రలో భాగంగా మంగళవారం దేవరుప్పుల మండలం ధర్మాపురంలో దర్గ్యా నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం కామారెడ్డిగూడెంలో షేక్ బందగీ, కడవెండిలో తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య స్మారక స్తూపం, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. -
టీజీ ఎన్పీడీసీఎల్కు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులు
హన్మకొండ: విద్యుత్ పంపిణీలో స్మార్ట్గా సురక్షితంగా, మెరుగ్గా కృత్రిమ మేధస్సు (ఏఐ), డ్రోన్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికతలను విస్తృతంగా వినియోగిస్తునందుకు, వినియోగదారులకు అందించే మెరుగైన సేవలు, ఆపరేషనల్ ఎక్సలెన్స్లో ఉత్తమ పనితీరు కనబరుస్తునందుకు టీజీ ఎన్పీడీసీఎల్ రెండు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఈ నెల 9న బెంగళూర్లో టైమ్స్ అస్పైర్ ఆధ్వర్యంలో సౌత్ ఇండియా పీఎస్యూ – గవర్నెన్స్ ఎక్సలెన్స్ అవార్డును కంపెనీ సెక్రటరీ కె. వెంకటేశం అందుకున్నారు. ఈ నెల 10న న్యూఢిల్లీలో ది ఎకనామిక్స్ టైమ్స్ ఆధ్వర్యంలో అడాప్టింగ్ ఏఐ ఇన్ ఎనర్జీ అవార్డును చీఫ్ ఇంజనీర్ సురేందర్ అందుకున్నారు. ఈ అవార్డులను మంగళవారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డికి డైరెక్టర్లు, అధికారులు అందించారు. డైరెక్టర్లు వి.తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈ సురేందర్, కంపెనీ సెక్రటరీ వెంకటేశం పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు..
స్టేషన్ఘన్పూర్ : అజాగ్రత్తగా యూటర్న్ తీసుకుంటున్న ఆర్టీసీ బస్సును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ ఆయుర్వేద వైద్యుడు మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం జనగామ జిల్లా ఘన్పూర్ శివారు తాటికొండ ఎక్స్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి భార్య కవిత కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా చండూరు మండలం కస్తాల గ్రామానికి చెందిన శివరాత్రి వెంకటేశ్వర్ (53) హైదరాబాద్ ఎల్బీ నగర్లో నివాసం ఉంటూ ఆయుర్వేద వైద్య వృత్తి చేస్తున్నాడు. కాగా, ఆయుర్వేద వైద్యం నిమిత్తం ఈనెల 12న కారులో వరంగల్ వెళ్లాడు. అక్కడ పనిముగించుకుని తిరిగి 14న (సోమవారం) హైదరాబాద్ బయలుదేరాడు. ఈ క్రమంలో స్టేషన్ఘన్పూర్లో తాటికొండ ఎక్స్రోడ్డు వద్ద మంచుప్పుల, పాలకుర్తి నుంచి హనుమకొండ వైపునకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అజాగ్రత్తగా ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వకుండా సడన్గా రోడ్డు క్రాస్ చేస్తోంది. ఈ సమయంలో కారు.. బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వెంకటేశ్వర్కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రుడిని 108లో వరంగల్ ఎంజీఎం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ ఘటనపై ఆర్టీసీ బస్సు డ్రైవర్ కుమ్మరి ప్రభాకర్పై మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్కుమార్ మంగళవారం తెలిపారు. ఆయుర్వేద వైద్యుడి మృతి ఘన్పూర్లో ఘటన -
ఫిజియోథెరపీ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి
● అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్స్ రాష్ట్ర అధ్యక్షుడు పెరుమాండ్ల రామకృష్ణ హన్మకొండ : రాష్ట్రంలో ఫిజియోథెరపీ కౌన్సిల్ ఏ ర్పాటు చేయాలని తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్స్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ కోరారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండ వంద ఫీట్ల రోడ్లోని అట్టూ బ్యా లెన్స్ ఫిజియోథెరఫీ క్లినిక్లో నిర్వహించిన అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లా డారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక ఫిజియోథెరపీ విభాగాలు ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సుముఖంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో ఫిజియోథెరపీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, వైద్యులు, మెరుగైన వ్యవస్థ అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రత్యేక ఫిజియోథెరపీ కౌన్సిల్ ఏర్పాటు చేయడంతోపాటు ప్రతీ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ప్రత్యేక ఫిజియోథెరపీ విభాగాలు ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. ఈ దిశగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. అసోసియేషన్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ రాము, ఫిజియోథెరపిస్టులు డాక్టర్ శివరామకృష్ణ, వంశీ, క్రాంతి, ప్రకాశ్, సు రేశ్, రాజు మల్లేశ్, రాకేశ్, మధులత పాల్గొన్నారు. -
పొటాష్ బస్తాల్లో మట్టి..
● షాపు ఎదుట రైతుల ఆందోళన నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్లో విక్రయించిన కోరమండల్ పొటాష్ బస్తాల్లో మట్టి కలిసిందని సోమవారం మండలంలోని కొండాయిల్పల్లి గ్రామానికి చెందిన రైతు కొనుకటి రాజు నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న నల్లబెల్లి సర్పంచ్ నాగెల్లి జ్యోతి ప్రకాశ్, ఉప సర్పంచ్ గుమ్మడి వేణు, రైతులు మామిండ్ల మోహన్రెడ్డి, కొనుకటి వీరమల్లు, నాగెల్లి శ్రీనివాస్, వేల్పుల రవి.. గ్రోమోర్ సెంటర్ వద్దకు చేరుకుని సంఘీభావం తెలిపారు. బాధిత రైతు కథనం ప్రకారం.. రాజు గ్రోమోర్ సెంటర్లో ఈ నెల 12న కోరమండల్ కంపెనీకి చెందిన మూడు పొటాష్ బస్తాలు కొనుగోలు చేశాడు. అనంతరం పంటలో చల్లేందుకు సొమవారం తెరిచి చూడగా అందులో మట్టి ఉంది. దీనిపై గ్రోమోర్ నిర్వాహకులను నిలదీయగా పట్టించుకోకపోవడంతో షాపు ఎదుట ఆందోళన చేపట్టాడు. కాగా, మట్టి కలిసినట్లు అనుమానిస్తున్న పొటాష్ బస్తాల నుంచి నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపిస్తున్నట్లు ఏఓ బన్న రజిత తెలిపారు. నివేదికలో ఎరువు నాణ్యతపై స్పష్టత వస్తుందని, దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. -
విద్యార్థులూ.. తస్మాత్ జాగ్రత్త
కేయూ క్యాంపస్ : విద్యార్థులు పరీక్షల్లో వివిధ ప్రశ్నలకు జవాబులు చీటీలు చూసి రాసినా, లేదా పక్క విద్యార్థులు రాసిన ప్రతాలు చూసి రాసి పట్టుబడితే లేదా స్క్వాడ్ బృందాలు తనిఖీకి వచ్చినప్పుడు తాను కూర్చున ప్రాంతంలో నకలు చీటీ లభించినా మాల్ ప్రాక్టీస్ కింద బుక్ చేస్తుంటారు. ఒకరి బదులు మరొకరు పరీక్ష రాసి పట్టుబడినా డీబార్ చేయడమేగాకుండా పోలీసు కేసులు కూడా నమోదు చేస్తారు. ఇదిలా ఉండగా తెలిసోతెలియకోచేసే పొరపాట్లు కూడా మాల్ప్రాక్టీస్ కిందకే వస్తాయి. వద్దన్న చోట హాల్టికెట్ నంబర్ వేసినా ఆన్సర్షీట్ జవాబుపత్రాలు చించినా, వాల్యుయేటర్ గుర్తించేలా ఆన్సర్షీట్లలో తన గుర్తింపును వెల్లడించడం లాంటి పనులు కూడా మాల్ ప్రాక్టీస్ కిందకే వస్తుందనే విషయం ఎక్కువ శాతం మంది విద్యార్థులు తెలియదు. కాగా, కేయూలోని డిగ్రీ, పీజీ నాన్ప్రొఫెషనల్, వివిధ ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలకు సంబంధించి మాల్ప్రాక్టీస్ నిబంధనలు కఠినతరంగా ఉన్నాయి. దీనిపై విద్యార్థులకు అవగాహన ఉండాలి. ఫలితంగా పరీక్షల విషయంలో తస్మాత్ జాగ్త్రత్త అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే కొన్ని నెలల క్రితం డిగ్రీ వివిధ సెమిస్టర్ల పరీక్షల్లో కొందరు విద్యార్థులు తమ సబ్జెక్టుల పరీక్షల ఆన్సర్షీట్లలో తమకు వచ్చిన జవాబులు రాసినా ఒక్కోవిద్యార్థి ఒక్కో పేపర్ను చించివేశారు. వీరి ఫలితాలను పరీక్షల విభాగం అధికారులు మాల్ప్రాక్టీస్ కిందనే పరిగణించి నిలిపివేశారు. దీంతో ఇటీవల ఆయా విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసొచ్చి పరీక్షల విభాగం అధికారులను అడుగుతున్నారు. మాల్ ప్రాక్టీస్ కింద లెక్క గట్టి సెమిస్టర్లోని మిగతా సబ్జెక్టుల ఫలితాలు కూడా నిలిపివేయడంతో ఆందోళన చెందుతున్నారు. డిగ్రీ 5,6 సెమిస్టర్లలో 21మంది, 1,2,3,4 సెమిస్టర్లలో 105మంది విద్యార్థుల ఫలితాలు నిలిపివేత కేయూ పరిధిలోని డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ తదితర కోర్సుల్లో కొన్ని నెలల క్రితం 5,6 సెమిస్టర్ల పరీక్షలు జరగగా అధికారులు ఫలితాలు విడుదల చేశారు. 21మంది విద్యార్థులు తమ సబ్జెక్టుల ఆన్సర్షీట్లలో జవాబులు రాసినా ఒక్కో విద్యార్థి ఒక సబ్జెక్టులోని ఆన్సర్షీట్లో ఒక పేపర్ను చించి వేశారు. వారి ఫలితాలను మాల్ప్రాక్టీస్ కిందనే పరిగణించి పరీక్షల విభాగం అధికారులు నిలిపివేశారు. వారంతా డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులు కావడం గమనార్హం. అలాగే, 1,2,3,4 సెమిస్టర్ల పరీక్షల్లోనూ వివిధ సబ్జెక్టుల పరీక్షల్లో ఆన్సర్షీట్లలో 105మంది విద్యార్థులు తాము రాసే సబ్జెక్టులలో ఒక సబ్జెక్టులో మాత్రం ఒక్కో పేపర్ చించివేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆ 105మంది విద్యార్థుల జవాబుపత్రాలను మూల్యాంకనం చేయలేదు. మాల్ప్రాక్టీస్ కిందే పరిగణించి వారి ఫలితాలను నిలిపివేశారు. కాగా, సెమిస్టర్లకు సంబంధించిన సబ్జెక్టులన్నీ మాల్ప్రాక్టీస్ కింద పరిగణిస్తే ఆయా విద్యార్థులకు నష్టం కలగనుందని భావించి డిగ్రీ 1,2,3,4 సెమిస్టర్ల ఏ ఏ సబ్జెక్టులో ఆన్సర్షీట్లో పేపర్ను చించివేశారో ఆయా సబ్జెక్టులోనే ఫలితాలు నిలిపి మిగతా సబ్జెక్టుల ఫలితాలను వెల్లడించడానికి అఽధికారులు నిర్ణయించినట్లు సమాచారం.మాల్ప్రాక్టీస్ నిబంధనలు కఠినతరం ఆన్సర్షీట్లో పేపర్ చించినా మాల్ప్రాక్టీస్గానే పరిగణన డిగ్రీ 5,6 సెమిస్టర్లలో పేపర్ చించిన 21 మంది స్టూడెంట్స్ ఆ సెమిస్టర్లలో అన్ని సబ్జెక్టుల ఫలితాల నిలిపివేత 1,2,3,4 సెమిస్టర్లలో 105 మంది.. ఆందోళనలో విద్యార్థులుఆన్లైన్ మూల్యాంకనంతోనే గుర్తింపు.. ఈఏడాది నుంచే డిగ్రీ కోర్సుల పరీక్షల జవాబుపత్రాల ఆన్లైన్ మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు. జవాబుపత్రాల బుక్లెట్లను ఒకసంస్థ పరీక్షల విభాగంలోనే స్కాన్చేసి ఆన్లైన్లో అధ్యాపకులకు పంపారు. ఆన్సర్షీట్ 28 పేజీల బుక్లెట్గా ఉంటుంది. ప్రతీ పేపర్కు పేజీ నంబర్ బార్కోడ్ కూడా ఉంటుంది. అన్ని పేజీలు ఉంటేనే కంప్యూటర్ స్కాన్ చేస్తుంది. 126మంది విద్యార్థుల ఆన్సర్షీట్లో ఒక్కో పేపర్ తక్కువగా ఉండడంతో కంప్యూటర్లో స్కాన్ కాకపోవడంతో ఆయా బుక్లెట్ను తెరిచి చూసి పేపర్ చించివేసినట్లు గుర్తించారు. -
నలుగురు గంజాయి విక్రేతల అరెస్ట్
ఖిలా వరంగల్ : వరంగల్ శాకరాసికుంట కట్టపై నార్కొటిక్, మిల్స్కాలనీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో గంజాయి విక్రయ ముఠా పట్టుబడింది. వారి నుంచి 250 గ్రాముల ఎండు గంజాయి,139 మత్తు చాక్లెట్లు స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్ట్ చేసినట్లు మిల్స్కాలనీ ఎస్సై శ్రవణ్తెలిపారు. బిహార్కు చెందిన నలుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి యువతను లక్ష్యంగా చేసుకుని ఎండు గంజాయి, మత్తు చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు సోమవారం రాత్రి నార్కొటిక్, మిల్స్కాలనీ పోలీసులు సంయుక్తగా శాకరాసికుంట కట్టపై తనిఖీలు చేపట్టారు. ఇందులో బిహార్కు చెందిన పంచం కుమార్, సుమన్ కుమార్, వీరాజ్కుమార్, అఖిలేశ్ కుమార్ను అరెస్ట్ చేసినట్లు ఎస్సై శ్రవణ్ తెలిపారు. 250 గ్రాముల సరుకు, 139 మత్తు చాక్లెట్లు స్వాధీనం -
రేవంతన్నా.. అన్నదాతలను ఆదుకోండి
దుగ్గొండి:‘వర్షాలు మొహం చాటేశాయి.. వేసిన పంట భూమిలో సాగునీరు లేక ఎండిపోయింది. పంటకు తెచ్చిన అప్పు ముప్పుగా మారింది. బ్యాంక్ పంట రుణం కట్టమంటుంది. అప్పుల వాళ్లు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఆర్థికంగా నష్టపోయాం.. రేవంతన్నా ఆదుకోండి’ అంటూ వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం శివారులో ఓ మహిళా రైతు తన పంట భూమిలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. వెంకటాపురం గ్రామానికి చెందిన మహిళా రైతు కక్కెర్ల లక్ష్మీకి గ్రామ శివారులో ఎస్సారెస్పీ డీబీఎం–38 కాలువను ఆనుకుని 2.30 ఎకరాల భూమి ఉంది. దీనిలో పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈసారి ఎండాకాలం అనంతరం కొద్దిపాటిగా కురిసిన వర్షానికి పత్తి పంట వేసింది. మొలకలు వచ్చిన తర్వాత వానలు పడలేదు. సాగునీరు ఇవ్వాలంటే బావి ఎండిపోయింది. పక్కనే ఎస్సారెస్పీ కాలువ ఉన్నా నీరు విడుదల చేయడం లేదు. ఫలితంగా పత్తి చేను ఎండిపోయింది. మళ్లీ కురిసిన కొద్దిపాటి వర్షానికి పెసర, మొక్కజొన్న వేసింది. కొద్ది రోజులకే సాగునీరు లేక అవి ఎండిపోయాయి. దుక్కికి, పంటకు తెచ్చిన అప్పు మిగిలింది. బ్యాంక్లో క్రాప్లోన్ చెల్లించాలని బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నారు. అప్పు చెల్లించాలంటూ ఇచ్చిన వారు తిరిగిపోతున్నారు. చెల్లించడానికి చేతిలో చిల్లిగవ్వ లేదు. దీంతో ఆమె తన పంట పొలంలో అన్నదాతల కష్టాలు వివరిస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. ‘ప్రభుత్వం నుంచి సాయం కోసం ఎదురు చూస్తున్నాం.. వర్షాలు లేక అప్పుల్లో కూరుకుపోయాం. మాలాంటి రైతుల్ని కాపాడండి. అన్నం పెట్టే అన్నదాతల ప్రాణాలు కాపాడండి’ అంటూ ముద్రించిన ఈ ఫ్లెక్సీ అటుగా వెళ్లే రైతులను ఆకర్షిస్తోంది. పొలంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన మహిళా రైతు -
ఐసీఎంఆర్ గ్రాంట్లకు నేత్ర వైద్యశాల గుర్తింపు
కాశిబుగ్గ : వరంగల్లోని ప్రాంతీయ నేత్ర వైద్యశాల తొలిసారి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కు గ్రాంట్లకు గుర్తింపు పొందింది. 20 26 సంవత్సరానికి సంబంధించి వైద్యశాలకు చెందిన ముగ్గురు ఆప్తాల్మాలజీ జూనియర్ రెసిడెంట్ వై ద్యుల పరిశోధన ఽగ్రంథాలు ఎంపికయ్యాయి. ప్రొఫె సర్ డాక్టర్ వగ్గె శ్రీకుమార్ మార్గదర్శకంలో పరిశోధనలు చేస్తున్న జూనియర్ రెసిడెంట్లు డాక్టర్ గోగికర్ రమ్య, డాక్టర్ మాతం ప్రసన్నలక్ష్మి, డాక్టర్ దబ్బర హరిత సాయిలు సమర్పించిన దీసీస్లు ఎంపిక కా వడం విశేషం. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ఐ హాస్పిటల్లో తాను గైడ్ చేస్తున్న ముగ్గురు జూనియర్ వైద్యులు మొదటిసారి ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి ఆవిష్కరణలు భావితరాల వైద్యులకు మార్గదర్శకం నిలుస్తాయని పేర్కొన్నారు. కాగా, ముగ్గురు జూనియర్ రెసిడెంట్ వైద్యులు ఎంపిక కావడంపై హాస్పిటల్ సూపరింటెండెంట్ రవిశేఖర్, కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్దాస్.. గైడ్ డాక్టర్ శ్రీ కుమార్తో పాటు పరిశోధకులను అభినందించారు. ముగ్గురు రెసిడెంట్ వైద్యుల పరిశోధన గ్రంథాలు ఎంపిక -
అడవులు, వన్యప్రాణులను సంరక్షించాలి
గూడూరు: అడవులు, వన్యప్రాణుల సంరక్షణ ప్రతీఒక్కరి బాధ్యతని ఫారెస్టు జిల్లా అధికారులు శ్రీమన్నారాయణరెడ్డి, రాజేంద్రప్రసాద్ అన్నారు. గూడూరు మండలంలోని సీతానగరం శివారు కొమ్ములవంచ సమీప భీమునిపాదం జలపాత ప్రాంతంతో పాటు ములుగు జిల్లా కొత్తగూడ మండలంలోని గుంజేడు ముసలమ్మ దేవాలయాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ మనుగడకు, పర్యావరణ సమతుల్యతకు అడవులు, వన్యప్రాణులు అత్యంత కీలకమన్నారు. అడవులు స్వచ్ఛమైన గాలి, నీరు, వర్షాలు, ప్రాణవాయువును అందిస్తే, వన్యప్రాణులు ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో ప్రధాన పాత్రపోషిస్తాయన్నారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణపై ప్రజల్లో అవగాహణ కల్పించాలని, ప్రతీఒక్కరు ఇంటి పరిసర ప్రాంతాల్లో మొక్కలు పెంచాలన్నారు. ఎవరైన వన్యప్రాణులను చంపినా, ప్రాణ హాని కల్గించినా చర్యలుంటాయన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అడవులు, వన్యప్రాణుల సంరక్షణతో పాటు ఫారెస్టు శాఖ టెంపుల్ టూరిజం, జలపాత పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. గూడూరు ఎఫ్ఆర్వో జి. ప్రసాదరావు, సిబ్బంది పాల్గొన్నారు. ఫారెస్టు జిల్లా అధికారులు శ్రీమన్నారాయణరెడ్డి, రాజేంద్రప్రసాద్ -
తొమ్మిది రోజులు పండుగే..
డోర్నకల్లోని అంబేడ్కర్ నగర్లో 1968 నుంచి వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అంబేడ్కర్నగర్కు చెందిన పెయింటర్ దుప్పటి నాగేందర్ చెరువు మట్టిని తెచ్చి వినాయక విగ్రహాన్ని తయారు చేయగా స్థానికులతో పాటు రైల్వే కాలనీకి చెందిన ఉద్యోగస్తుల కుటుంబాలతో కలిసి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి నవరాత్రులు ఘనంగా నిర్వహించేవారు. తొమ్మిది రోజులు పూజలతోపాటు కోలాటాలు నాటికల ప్రదర్శనలతో కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించేవారు. నిమజ్జనానికి రైల్వే బాక్సులు మోసుకెళ్లే తోపుడు బండిని వినియోగించి బండిపై విగ్రహాన్ని ఊరేగించి సమీపంలోని రైల్వే బావిలో నిమజ్జనం చేసేవారు. మొదట మట్టి విగ్రహం తోపుడు బండి డప్పుచప్పుళ్లు ఉండగా తర్వాత ఎడ్ల బండి, బ్యాండ్ మేళాలు వినియోగించారు. 58 ఏళ్లుగా క్రమం తప్పకుండా అంబేడ్కర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారు. ప్రస్తుతం వినాయక నవరాత్రి ఉత్సవాల కోసం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. -
పంటలకు ప్రాణం
బయ్యారం: వర్షంతో అలుగుపారుతున్న బయ్యారం పెద్దచెరువు సాక్షి, మహబూబాబాద్ : వర్షం వస్తుంది, చెరువులు నిండుతాయి. భూగర్భజలాలు సంవృద్ధిగా ఉంటాయని నమ్మకంతో పత్తి, మొక్కజొన్న, వరి పంటలను సాగు చేసిన రైతాంగం ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక ఎండిపోయే దశకు చేరుకున్నాయి. నీరులేక ఎండిపోతున్న పంటలను చూసిన అన్నదాతలు చేసేది ఏమీ లేక నిస్సాయంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో శనివారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో పంటలకు ప్రాణం పోసినట్లు అయింది. మరో పదిరోజుల పాటు పంటలకు ఢోకాలేదని రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షం.. గత కొద్దిరోజులుగా ఆకాశం మేఘావృతమై.. వెంటనే మబ్బులు తేలిపోతున్నాయి. అయితే శనివా రం ఉదయం మాత్రం ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా 455.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఇందులో అత్యధికంగా కేసముద్రం మండలంలో 76.3 మిల్లీమీటర్లు, బయ్యారం 41 మిల్లీ మీటర్లు నమోదు కాగా.. అత్యల్పంగా దంతాలపల్లి మండలంలో 18.8 మిల్లీ మీటర్లు నమోదు అయింది. దీంతో ప్రధానంగా ఆకాశ పంటల సాగు ఎక్కువగా ఉన్న ఏజెన్సీ ప్రాంతాలైన కొత్తగూడ, బయ్యారం, గంగారం ప్రాంతాల రైతులతోపాటు, మైదాన ప్రాంతాల పంటలకు ఈ వర్షం ఊపిరిపోసినట్లయింది. పంటలపై ఆశలు.. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో పంటలు సాగుచేయలేదు. ప్రభుత్వం చెప్పినట్లుగా వరి తగ్గించి ఆరుతడి పంటలు సాగుచేశారు. అయితే వాటికి సరిపడా నీళ్లులేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో మొత్తం 4,56 136 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసే రైతులు ఇ ప్పుడు 3,28,475 ఎకరాల్లో మాత్రమే సాగు చేశా రు. ఇందులో పత్తి 91,916 ఎకరాల్లో సాగుచేయగా.. వరి 1,49,162, మొక్కజొన్న 58, 655, 21,585 ఎకరాల్లో పెసర సాగుచేశారు. అయితే ఇందులో పత్తి, మొక్కజొన్న పంటలు కాత పూత, పాలకంకి పోసింది. వీటికి ఇప్పుడు నీరు అత్యధికంగా కావాలి. లేకపోతే పంటలు చేతికి వచ్చే పరిస్థితి లేదు. ఈ వర్షంతో పత్తి మొదటి క్రాప్ వస్తుందని, మొక్కజొన్నకు మరో పదిరోజుల తర్వాత మరొక వర్షం పడితే చాలని రైతులు చెబుతున్నారు. కురుస్తున్న వర్షాలతో పంటలకు ఊపిరిజిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం 4,56,136 ఎకరాలుపత్తి (ఎకరాల్లో) 91,916పెసర (ఎకరాల్లో) 21,585వరి (ఎకరాల్లో) 1,49,162మొక్కజొన్న (ఎకరాల్లో) 58,655 -
సమన్వయంతోనే వివాదాలకు పరిష్కారం
మహబూబాబాద్ రూరల్: ఇరుపక్షాల సమన్వయంతోనే వివాదాలు పరిష్కారం అవుతాయని, ప్రజల న్యాయ పీఠంగా లోక్ అదాలత్ దోహదపడుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.మురళీమోహన్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా న్యాయస్థాన సముదాయం ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ శనివారం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.మురళీమోహన్ ముఖ్యఅతిథిగా హాజరై కక్షిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ న్యాయ వ్యవస్థపై ప్రజలకున్న భారాన్ని తగ్గించడంతో పాటు, కేసులను త్వరగా, పరస్పర అంగీకారంతో పరిష్కరించే లక్ష్యంతో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతి మురారి, సీనియర్ సివిల్ జడ్జి శాలిని షాకెల్లి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి అర్వపల్లి కృష్ణతేజ, డీఎస్పీ తిరుపతిరావు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మామిడాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నిలిచిన దాంపత్య బంధంవివాహ బంధంలో ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు న్యాయ సేవాధికార సంస్థ ఉచిత న్యాయ సాయం అందిస్తుంది. అయితే, ఒక కేసులో న్యాయ సాయంతో పాటు మాట సాయం అందించిన సంస్థ ఓ దాంపత్య జీవితాన్ని నిలబెట్టింది లోక్ అదాలత్. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని జంగవారిగూడేనికి చెందిన నోముల రమణ, శ్రవణ్ వివాహం 2014లో జరిగింది. ఆ దంపతులకు కుమారుడు జన్మించిన తర్వాత కలహాలతో విడిపోయారు. దీంతో ఆమె భర్త నుంచి భరణం ఇప్పించడానికి, కేసు దాఖలు చేయడానికి ఉచిత న్యాయవాదిని నియమించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించింది. స్పందించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారీ ప్యానల్ న్యాయవాది రాజమణిని న్యాయ సహాయ న్యాయవాదిగా నియమించారు. న్యాయవాది భరణం కేసు కోర్టులో దాఖలు చేయగా విచారణ దశలో ఉన్న సమయంలో శ్రవణ్ ఒక ప్రమాదంలో గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న న్యాయ సహాయ న్యాయవాది రమణను కష్ట సమయంలో భర్త వద్దకు వెళ్లి సాయపడాలని కౌన్సెలింగ్ నిర్వహించింది. దీంతో రమణ పిల్ల వాడితో సహా భర్త వద్దకు చేరుకుంది. సేవలు చేయగా శ్రవణ్ త్వరగా కోలుకున్నాడు. తాను భార్యను దూరం చేసుకున్నా, ఆమె కష్ట సమయంలో తనను ఆదుకుందని భావించిన శ్రవణ్ బేషరతుగా రమణను తన వివాహ బంధంలోకి ఆహ్వానించాడు. సామరస్య పూర్వకంగా తమ సంసారాన్ని చక్కదిద్దుకున్న జంటను శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.మురళీమోహన్ అభినందించారు. 18,362 కేసులు పరిష్కారం మహబూబాబాద్ రూరల్/తొర్రూరు: జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు కోర్టుల్లో నిర్వహించిన లోక్ అదాలత్ సందర్భంగా 25 మోటారు వాహన ప్రమాద బీమా కేసులు, 11,465 ప్రీలిటిగేషన్ కేసులు పరిష్కరించారు. 5 బ్యాంకు లోన్ రికవరీ కేసులు పరిష్కరించి రూ.15 లక్షలు వసూలు చేశారు. 6,867 ఈపెట్టీ, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ చలాన్ల ద్వారా రూ.32 లక్షలు జరిమానాలు విధించారు. తొర్రూరు స్థానిక జూ నియర్ సివిల్ కోర్టులో నిర్వహించిన లోక్ అదా లత్లో 1,956 కేసులు పరిష్కరించారు. మొత్తం 18,362 కేసులను పరిష్కరించగా మోటారు వాహన ప్రమాద బీమా కేసుల్లో రూ.1.17 కోట్ల నష్ట పరిహారాన్ని బాధిత కుటుంబాలకు ఇన్సూరెన్సు కంపెనీల ద్వారా అందజేశారు. -
సాయిబాబా భజన నుంచి నవరాత్రి ఉత్సవాలు..
గ్రామానికి కొత్తగా వచ్చిన బ్యాంకు మేనేజర్ శర్మ ఇంట్లో ప్రతీ గురువారం సా యిబాబా భజన కార్యక్రమం నిర్వహించేవారు. ఇందులో భాగంగానే 1985లో తొలిసారిగా నర్సింహులపేట మండలకేంద్రంలోని బొల్లం గౌరయ్య ఇంటి ముందు అప్పాల వెంకన్న, జంపాల యాదగిరి, కొండబత్తిని జగదీశ్వర్, మండలం రవి, మొగులగాని యాదగిరితో కలిసి మట్టి వినాయకుడి విగ్రహం చేసి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. ఆ తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయులు దాసరోజు దక్షిణామూర్తి ఇంట్లో ప్రతిష్ఠించేవారు. చందాలు వేసుకొని వచ్చిన డబ్బులతో తెనాలి, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల నుంచి హరికథలు, బుర్రకథలు, నాటకాలు వేసేవారిని తీసుకొచ్చేవారు. ఇదే కొనసాగింపుగా నర్సింహులపేట చౌరస్తాలో అప్పటి నుంచి ఇప్పటివరకు వినాయక ఉత్సవాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఊరేగింపులో పెట్రమాక్స్లైట్లు పెట్టి ఊరేగించేవారు. ఇప్పుడు కాలం మారింది. డీజేలు, హైమాస్ట్ లైట్లతో ఆర్భాటంగా ఉత్సవాలు చేయాల్సి వస్తుందని భక్త బృందం సభ్యులు బొల్లం మోహన్రావు, జగదీశ్వర్, యాదగిరి చెబుతున్నారు. -
కొండా దంపతుల ఢిల్లీ బాట!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. శనివారం సాయంత్రమే వారు హనుమకొండలోని రాంనగర్ నివాసానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే కార్యకర్తలకు ఫోన్ చేసి సమావేశానికి హాజరు కావాలని కొండా మురళి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈసమావేశంలో నియోజకవర్గంలోని తాజా రాజకీ య పరిణామాలు, పార్టీ కార్యక్రమాలు, స్థానిక సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రానున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవడంతోపాటు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కీలక బాధ్యత అప్పగిస్తారా? సమావేశం అనంతరం కొండా సురేఖ ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈపర్యటనకు సంబంధించి అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది. ఢిల్లీలో పార్టీ సంస్థాగత వ్యవహారా లు, తెలంగాణ రాజకీయ పరిస్థితులు, వరంగల్ ప్రాంతంలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశముందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే, సురేఖకు కీలక బాధ్యత అప్పగించే అంశంపై పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన బాధ్యతను అప్పగించనున్నారా? లేక పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ప్రత్యేక పాత్ర కల్పించనున్నారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాలంటే ఢిల్లీ పర్యటన పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందేనని నాయకులు అంటున్నారు. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కొండా దంపతులతో మాట్లాడారు. ఈనేపథ్యంలో ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆ భేటీలో రాష్ట్ర రాజకీయాలు, పార్టీ పరిస్థితులు, కొండా దంపతుల రాజకీయ పాత్రపై చర్చ జరిగినట్లు సమాచారం. అప్పటి నుంచే సురేఖకు పార్టీపరంగా కొత్త బాధ్యత దక్కవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరోవైపు, కొండా దంపతులకు వరంగల్ జిల్లాలో ఉన్న రాజకీయ ప్రభావాన్ని పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటోందని వారి అనుచరులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు, కేడర్ను సమన్వయం చేసేందుకు సురేఖ సేవలను వినియోగించుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఇవన్నీ ప్రస్తుతానికి పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చలేనని, అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే అసలు విషయం స్పష్టమవుతుందని నాయకులు చెబుతున్నారు. దీంతో ఆదివారం రాంనగర్లో జరగనున్న కార్యకర్తల సమావేశం, అనంతరం కొండా సురేఖ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. సమావేశంలో కొండా దంపతులు చేసే వ్యాఖ్యలు, ఢిల్లీ పర్యటనపై వెల్లడించే వివరాలు, పార్టీ అధిష్టానంతో జరిగే చర్చలపై కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. -
మహబూబాబాద్
ఆదివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్ శ్రీ 20267మహబూబాబాద్ పట్టణంలో 1982వ సంవత్సరంలో చిదిరాల జయశంకర్ ఇంటి ముందు అప్పటి కొత్త బజార్ ఇప్పుడు నెహ్రూసెంటర్ ఏరియాలో తొలిసారిగా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని నివాసం ఉండే అన్ని వర్గాలకు చెందిన వారు చందాలు వేసుకొని మొత్తం రూ.5వేల పోగుచేశారు. వెదురు బొంగులు, అరటి, కొబ్బరి మట్టలతో మండపం తయారు చేసి మట్టి విగ్రహాలు పెట్టి పూజలు చేసే వారు. నవరాత్రులు వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, చింతామణి, హరిచంద్ర నాటకాలు, గౌరీ బుర్రకథ, హరికథలు చెప్పించేవారు. పట్టణ ప్రజలతోపాటు, సమీప ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు కూడా నవరాత్రులకు ఎడ్లబండ్లు, సైకిళ్లపై వచ్చి సాంస్కృతిక కార్యక్రమాలు చూసేవారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రముఖ ఆర్కెస్ట్రా జిత్మోహన్ మిత్ర, ఇంద్రజాల ప్రదర్శన కోసం బీవీ పట్టాభిరాం వంటి వారిని తీసుకొచ్చి ప్రదర్శనలు ఇప్పించేవారు. బంధం చెరువు, మున్నేరు వాగులో నిమజ్జనం చేసేవారు. ఇప్పుడు అంతా మారిపోయింది. -
ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడిగా చంటి
మహబూబాబాద్ అర్బన్: నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) మానుకోట జిల్లా అధ్యక్షుడిగా జిల్లా కేంద్రానికి చెందిన భల్లేం చంటి శనివారం నియామకయ్యారు. ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ జిల్లాలో ఎన్ఎస్యూఐ మరింత బలోపేతం చేస్తామన్నారు. తన నియామకానికి సహకారించిన జాతీయ అధ్యక్షుడు వినోద్జాఖర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు యాదవపల్లి వెంకటస్వామి, ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యేలు భూక్య మురళీనాయక్, జాటోతు రామచంద్రునాయక్, డీసీసీ అధ్యక్షుడు భూక్య ఉమలకు కృతజ్ఞతలు తెలిపారు. డోర్నకల్: స్థానిక రైల్వే జంక్షన్ పరిధిలో జరుగుతున్న విద్యుదీకరణ పనులను శనివారం దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ జీవీ మల్లిఖార్జునరావు తనిఖీ చేశారు. ప్రత్యేక రైలులో డోర్నకల్ రైల్వే స్టేషన్కు చేరుకున్న ఆయన మూడవ లైన్కు సంబంధించి ఓహెచ్సీ లైన్తో పాటు యార్డులోని ఓహెచ్సీ లైన్ తనిఖీ చేశారు. ఆయన వెంట రైల్వే ఉన్నతాధికారులు ఉన్నారు. కేసముద్రం/గూడూరు: విద్యావ్యవస్థలో అంతర్జాతీయ స్థాయి ఉత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘టీచర్స్ ఎక్స్పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్’కు జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. కేసముద్రం మండలం కల్వల జెడ్పీ హైస్కూల్కి చెందిన హెచ్ఎం బండారు నరేందర్, నెల్లికుదురు మండలంలోని పీఎం శ్రీ పాఠశాలలో సోషల్ స్టడీ టీచర్గా పనిచేస్తున్న ఎం.ఎ. అంజుమ్సుల్తానా ఎంపికయ్యారు. ఫిన్లాండ్, జపాన్, సింగపూర్, వియత్నాం, చైనా దేశాల్లో అమలవుతున్న ఆధునిక విద్యా విధానాలు, విద్యార్థుల అభ్యసన నైపుణ్యాల అభివృద్ధి, అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను పరిశీలించి, వాటిలో ఉపయోగకరమైన అంశాలను మన విద్యావ్యవస్థలో అమలు చేసేందుకు ఈ విదేశీ విద్యా పర్యటన దోహదపడుతుందన్నారు. ఈనెల చివరి వారంలో విదేశి పర్యటన ఉండనుంది. ఎంపికై న ఉపాధ్యాయులకు ఉపాధ్యాయబృందంతో పాటు, పలువురు అభినందనలు తెలిపారు. -
అటవీ అమరుల సేవలు చిరస్మరణీయం
● జిల్లా అటవీశాఖ అధికారి బి.లావణ్య మహబూబాబాద్ రూరల్: విధి నిర్వహణలో అసువులుబాసిన అటవీ అధికారులు, సిబ్బంది సేవలు చిరస్మరణీయమని జిల్లా ఆటవీశాఖ అధికారి బి.లావణ్య అన్నారు. అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా ఆటవీ శాఖ అధికారికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో అటవీ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ లావణ్య మాట్లాడుతూ.. అడవుల సంరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అన్నారు. జిల్లా అధికారులు, సిబ్బంది అడవుల సంరక్షణకు పాటుపడుతున్న సందర్భంలో ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డివిజనల్ అటవీ అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, మానుకోట, బయ్యారం, తొర్రూరు ఎఫ్ఆర్ఓలు సురేష్, రవికిరణ్, విజయలక్ష్మి, స్ట్రైకింగ్ ఫోర్స్ ఎఫ్ఆర్ఓ మంగీలాల్, డీఆర్ఓలు, ఎఫ్ఎస్ఓలు, ఎఫ్బీఓలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
కేయూకు నేడు పనిదినం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లోని విభాగాలు, కార్యాలయాలు, వర్సిటీ కాలేజీలు, వర్సిటీ పరిధిలోని కళాశాలలకు ఈనెల 12న పనిదినంగా పరిగణిస్తున్నారు. గత నెల 28న రాఖీఫౌర్ణమిని పురస్కరించుకొని రిజిస్ట్రార్ రామచంద్రం సెలవు ప్రకటించిన విషయం విధితమే. ఆ సెలవుకు బదులుగా శనివారం పనిదినంగా పరిగణిస్తూ రిజిస్ట్రార్ సర్క్యులర్ జారీచేశారు. మద్యానికి బానిసై ఉపాధ్యాయుడి మృతి పర్వతగిరి: మద్యానికి బానిసై ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం బోడ భీమానాయక్ (45) పర్వతగిరిలోని ఎస్టీ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన కొంతకాలంగా అతిగా మద్యం సేవిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యం తాగి పాఠశాలకు రావొద్దని ఆయనకు హెచ్ఎం చెప్పారు. దీంతో సదరు టీచర్ ఇంట్లోనే ఉంటున్నాడు. కల్లెడ గ్రామంలోని తన నివాసంలో భీమానాయక్ గురువారం రాత్రి అతిగా మద్యం తాగి మృతి చెందాడు. శుక్రవారం ఉదయం గమనించిన భార్య అరవింద.. పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. రేషన్ బియ్యం నిల్వలపై టాస్క్ఫోర్స్ దాడి ఖిలా వరంగల్: ఓ ఇంట్లో అక్రమంగా నిల్వచేసిన రేషన్ బియ్యం నిల్వలపై టాస్క్ఫోర్స్ అధికారులు దాడిచేసి రూ.1,27,500 విలువైన 35 క్వింటాళ్ల సన్నబియ్యం, 2వేల గన్నీ బ్యాగులు, వేయింగ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి తెలిపారు. వరంగల్ లేబర్ (క్రిస్టియన్) కాలనీలో ఆటోడ్రైవర్ గోవిందుల గణేష్.. పలు కాలనీల్లో సంచరించి ప్రజల వద్ద తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేసి ఓ ఇంట్లో నిల్వచేసి ఇతర వ్యాపారులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు టాస్క్ఫోర్స్ అధికారులకు సమాచారం అందింది. ఏసీపీ మధుసూదన్ ఆదేశాల మేరకు గణేష్ ఇంటి పై టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి తన సిబ్బందితో కలిసి దాడిచేసి రేషన్ బియ్యాన్ని స్వాఽ దీనం చేసుకుని అతడిపై కేసు నమోదు చేశాడు. త దిపరి చర్యల కోసం మిల్స్కాలనీ పోలీస్స్టేషన్కు కే సును అప్పగించినట్లు ఇన్స్పెక్టర్ వివరించారు. కా ర్యక్రమంలో ఎస్సై ఉప్పలయ్య, సిబ్బంది పాల్గొన్నారు. పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ దాడి ఖిలా వరంగల్: ఇంట్లో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్పోర్స్ అధికారులు దాడి చేసి రూ.21,990ల నగదు, ఐదు సెల్ఫోన్లు, ప్లేకార్డులు స్వాధీనం చేసుకుని ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.శ్రీధర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ శివనగర్లోని నోతి శ్రీను ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్కు సమాచారం అందింది. ఈ మేరకు శ్రీను ఇంటిపై టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.శ్రీధర్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం దాడిచేసి పెరకవాడకు చెందిన తోట రాజు, శివనగర్కు చెందిన చావళ్ల రాజేష్, చావళ్ల సతీష్, బొల్లం సతీష్, సూదం సందీప్, ములుగు విజయ్ను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి, వారి నుంచి రూ. రూ.21 990నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, ప్లేయింగ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ వివరించారు. తదిపరి చర్యల నిమిత్తం కేసును మిల్స్కాలనీ పోలీసులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. దాడిలో ఎస్సై వీరస్వామి, కానిస్టే బుళ్లు సంతోష్రెడ్డి, రాధిక పాల్గొన్నారు. -
మంటల్లో కాలిపోతున్న ఆదాయం
● డంపింగ్ యార్డులో వేరు చేయని వ్యర్థాలు ● నిరుపయోగంగా సెగ్రిగేషన్ షెడ్లు ● ఆదాయం కోల్పోతున్న మున్సిపాలిటీతొర్రూరు మున్సిపాలిటీ సమాచారంనిత్యం సేకరించే చెత్త: 15 టన్నులు చెత్త సేకరణ ఆటోలు: 6జనాభా 30 వేలుతొర్రూరు: అధికారులు, పాలకుల నిర్లక్ష్యం వల్ల లక్షల ఆదాయం మంటల్లో కాలిపోతోంది. మున్సి పాలిటీకి ఆదాయం తెచ్చి పెట్టాల్సిన ప్లాస్టిక్ వ్యర్థాలు అగ్నికి ఆహుతవుతున్నాయి. గృహాల నుంచి పారిశుద్ధ్య సిబ్బంది ట్రాక్టర్లు, ట్రాలీల ద్వారా సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నా.. సెగ్రిగేషన్ షెడ్లో చెత్తను వేరు చేయని కారణంగా నిరుపయోగంగా మారుతున్నాయి. దాని స్థానంలో చెత్తను తగులబెట్టడం ద్వారా వెలువడుతున్న పొగ, విష వాయువులు ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. కాలుష్యం పెరుగుతోంది. ప్రత్యామ్నాయంగా బయోమైనింగ్ (చెత్తను వనరుగా మార్చే) విధానం అమలుకు నోచుకోకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. వ్యర్థాలను వేరు చేస్తేనే.. తొర్రూరు పట్టణంలో 16వార్డులు ఉండగా 60 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. రోజు సుమారు 15 టన్నుల చెత్త సేకరిస్తున్నారు. దానిని పట్టణ శివారులోని హచ్చుతండా సమీపంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. పట్టణంలో 30 వేల జనాభా ఉండగా అందుకు సరిపడా సిబ్బంది లేకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ ఇబ్బందిగా మారింది. తడి, పొడి చెత్త సేకరణ పకడ్బందీగా చేపట్టాలని భావించినా క్షేత్రస్థాయిలో అమలుకు ఆటంకం కలుగుతోంది. ప్రజలు తడి, పొడి వ్యర్థాలన్ని ఒకే డబ్బాలో పోసి సిబ్బందికి అందజేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు డంపింగ్ యార్డుకు అలాగే తరలిస్తున్నారు. యార్డులో పెద్ద ఎత్తున వ్యర్థాలు పేరుకుపోయి అనేక అనర్థాలకు దారితీస్తోంది. సేకరించిన వ్యర్థాలను పునర్వినియోగం చేసి ఎరువులు ఉత్పత్తి చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీదే. నిత్యం సేకరించే చెత్త నుంచి సేంద్రియ ఎరువు తయారు చేయాలి. దాన్ని విక్రయించి సంపద సృష్టించాలి. ఈ మేరకు రూ.6 నుంచి రూ.10 లక్షలు ఒక్కో సెగ్రిగేషన్ షెడ్డుకు వెచ్చించి మూడు కేంద్రాలు నిర్మించారు. కొద్ది రోజులకే వాటిని నిరుపయోగంగా మార్చారు. సెగ్రిగేషన్ షెడ్లలో తడి, పొడి చెత్త, ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వంటి వస్తువులు, గాజు సీసాలు రీ సైక్లింగ్ చేసి విక్రయిస్తే మున్సిపాలిటీకి ఆదాయం సమకూరుతుంది. డంపింగ్ యార్డు ఖాళీగా మారుతుంది. వర్మీ కంపోస్టు ద్వారా తడి చెత్తను ఎరువుగా మారిస్తే ఉద్యాన తోటలు, నర్సరీలకు సరఫరా చేసే అవకాశం ఉంటుంది. ఒక కిలో రూ.5 నుంచి రూ.10 వరకు విక్రయించవచ్చు. టన్నుకు మించి తీసుకువెళ్తే రూ.3వేల వరకు విక్రయించే వీలుంది. కానీ ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇదే అదనుగా ప్రైవేట్ వ్యక్తులు ప్లాస్టిక్తో పాటు అవసరమైన వస్తువులు ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. బయట విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కానరాని బయో మైనింగ్.. మున్సిపాలిటీలో బయో మైనింగ్ ఏర్పాటు లేక చెత్త గుట్టలుగా పేరుకుపోతోంది. ఇది ఏర్పాటైతే చెత్తను ప్రాసెసింగ్ చేయనున్నారు. దీంతో తయారయ్యే ఎరువు పంట పొలాలకు బలాన్నిస్తుంది. కంపోస్టబుల్ పదార్థాలు సిమెంట్ పరిశ్రమల్లో వాడకానికి అవసరమవుతాయి. ఇన్నర్ట్ మెటీరియల్ను భారీ గుంతలు పూడ్చేందుకు ఉపయోగించవచ్చు. చెత్త నుంచి ఈ ప్రాసెసింగ్ పూర్తయితే ఆ స్థలం ఖాళీ అవుతుంది. శుద్ధి అవుతుంది. దీనిపై ఎలాంటి ముందడుగు లేకపోవడంతో చెత్త పేరుకుపోతోంది. స్వచ్ఛ పట్టణంగా మారుస్తాంతొర్రూరును స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. నిత్యం చెత్త సేకరణ చేపడుతున్నాం. బయో మైనింగ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపుతాం. చెత్త నుంచి ఎరువు తయారు చేసేందుకు కృషి చేస్తాం. –వక్కల శ్యామ్సుందర్, మున్సిపల్ కమిషనర్ పారిశుద్ధ్య సిబ్బంది 60 వార్డులు 16డంపింగ్ యార్డు పొగ...తండాపై పాగా డంపింగ్ యార్డు హచ్చుతండా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. యార్డు నుంచి దుర్వాసన వస్తుండడంతో తండా వాసులు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో నిత్యం పోగవుతున్న టన్నుల కొద్ది వ్యర్థాలతో పర్యావరణం కలుషితమవుతోంది. పేరుకుపోయిన వ్యర్థాలు కుళ్లిపోయి రసాయనాలు విడుదల చేయడంతో దుర్వాసన వెదజల్లుతోంది. చెత్తకు సిబ్బంది నిప్పు పెడుతుండడంతో మంటలు చెలరేగి తండావాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనిపై పలుమార్లు గిరిజనులు ఆందోళనలు చేపట్టారు. -
సీఎం సహకారంతో నియోజకవర్గ అభివృద్ధి
తొర్రూరు: సీఎం రేవంత్రెడ్డి సహకారంతో పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని సీఎం కార్యాలయ ంలో శుక్రవారం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి, సంబంధిత అంశాలపై చర్చించారు. పెండింగ్లో ఉన్న పలు పనులకు నిధులు పెంచాలని కోరా రు. దానికి సీఎం సానుకూలంగా స్పందించారు. నేడు జాతీయ లోక్ అదాలత్ మహబూబాబాద్ రూరల్ : జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించేందుకు అంతా సిద్ధం చేశామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి శుక్రవారం తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.మురళీమోహన్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో నాలుగు లోక్ అదాలత్ బెంచ్లు, తొర్రూరులో ఒక లోక్ అదాలత్ బెంచ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రధాన న్యాయమూర్తి కె.మురళీమోహన్ ఇతర అతిథులతో కలిసి ప్రారంభిస్తారన్నారు. లోక్ అదాలత్ విజయవంతానికి అందరు సహకరించాలని, కక్షిదారులు సమయానికి హాజరై కేసుల నుంచి విముక్తి పొందాలని కోరారు. ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు నర్సింహులపేట: రైతులకు ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని డీఏఓ విజయచంద్ర హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని పెద్దనాగారం, నర్సింహులపేట, నర్సింహులపేట స్టేజీ, జయపురం గ్రామాల్లోని ఎరువుల షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జయపురంలో పంటల నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు ఎరువులతో పాటు ఏమైనా మందుల లింక్పెడితే చర్యలు తప్పవని డీలర్లను హెచ్చరించారు. స్టాక్ రిజిస్టర్, బిల్లుల పుస్తకాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఏఓ వినయ్కుమార్, ఏఈఓ కల్యాణి, రైతులు పాల్గొన్నారు. సబ్స్టేషన్ పరిశీలన ఇనుగుర్తి: మండలంలోని చిన్నముప్పారం గ్రామంలోని విద్యుత్ సబ్స్టేషన్ను సీఈ గౌతమ్ రెడ్డి శుక్రవారం పరిశీంచారు. గ్రామంలో ఎదురవుతున్న లో–ఓల్టేజ్ సమస్యపై ఆరా తీశారు. విద్యుత్ సరఫరా తీరులో సమస్యలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. డీఈ కృష్ణ, ఏడీఈ అశోక్, ఏఈ సాగర్, ఎల్ఐ లక్పతి, ఎల్ఎం పరమేశ్, ఏఎల్ఎం రాజశేఖర్ తదితర విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. అంగవైకల్యం ప్రతిభకు అడ్డు కాదు మహబూబాబాద్ అర్బన్: అంగవైకల్యం ప్రతిభకు అడ్డు కాదని జిల్లా ఇన్చార్జ్ డీఈఓ మందుల శ్రీరాములు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక అవసరాల విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక అవసరాల పిల్లలను ప్రతీ మంగళవారం తప్పనిసరిగా హెల్త్సెంటర్కు తీసుకురావాలన్నారు. వారి ప్రతిభను తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్ఓ అప్పారావు, ఐఈ కోఆర్డినేటర్ వంగ సురేష్, జీఈసీఓ గాయత్రి, ఏఎంఓ వెంకటేశ్వర్లు, ప్రభుత్వ వైద్యరాలు డాక్టర్ సౌమ్య, జిల్లా లీగల్సెల్ అడ్వైజర్ రాజ్కుమార్, ఆర్పీలు అనిల్, కపిల్, మమత, భిక్షపతి, రామకృష్ణ, ఐఈఆర్పీలు సతీష్, రమేష్, రవి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణహితంగా జరుపుకోవాలి
● అదనపు కలెక్టర్ అనిల్కుమార్ మహబూబాబాద్ అర్బన్: వినాయక చవితి పండుగను పర్యావరణహితంగా జరుపుకోవాలని అదనపు కలెక్టర్ అనిల్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో మట్టి గణపయ్య విగ్రహాలను అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ ఫారిస్తో తయారు చేసిన విగ్రహాల వల్ల జల వనరులు కలుషితమై పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. ప్రతీ ఒక్కరు బాధ్యతగా మట్టి విగ్రహాలనే పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ అధికారి సాయిశ్రీజ, డీపీఆర్వో రాజేందర్ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నూతన చట్టాలపై అవగాహన అవసరం
● కమాండెంట్ ఎన్వీ సత్య శ్రీనివాస్రావు మామునూరు: మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక, సాంకేతికత పరిజ్ఞానం, క్రిమినల్ చట్టాలపై సిబ్బంది అవగాహన పెంచుకోవాలని టీజీ ఎస్పీ నాలుగో బెటాలియన్ కమాండెంట్ ఎన్వీ సత్య శ్రీనివాస్రావు సూచించారు. వరంగల్ మామునూరు టీజీఎస్పీ నాలుగో బెటాలియన్లో ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్సై రాధిక ఆధ్వర్యంలో నూతన చట్టాలపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రతీ పోలీసు నూతన చట్టాలపై పూర్తిపట్టు సాధించాలన్నారు. 2024, జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారత సాక్ష్య అధినియమం (బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్, బీఎన్ఏ) కీలక అంశాలు, పాత ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో వచ్చిన చట్టాల్లో నేరాలు – శిక్షలు, నేర విచారణ విధానం, సాక్ష్యాధారాలు, నిబంధనలపై సత్యశ్రీనివాస్రావు అవగాహన కల్పించా రు. కార్యక్రమంలో ఏసీ రాజేందర్, ఆర్ఐలు కార్తీక్, రవి, సర్వర్, రాజ్కుమార్, కృష్ణ పాల్గొన్నారు. -
మల్బరీ సాగుతో రైతులకు ఆదాయం
గంగారం: మల్బరీ సాగుతో రైతులు నికర ఆదాయం పొందవచ్చని సెరీకల్చర్ జాయింట్ డైరెక్టర్ అనసూయ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నా పట్టు– నా అభిమానం 2.0 కార్యక్రమంలో భాగంగా మల్బరీ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అనసూయ మాట్లాడుతూ.. రైతులు పంటల మార్పిడి ద్వారా మార్కెట్లో డిమాండ్ ఉన్న మల్బరీ సాగు చేపట్టి ఎకరానికి రూ. 2లక్షల ఆదాయం పొందాలన్నారు. క్లస్టర్ స్థాయిలో సామూహికంగా మల్బరీ సాగు చేపట్టాలని, దీనికి కోతులు, దొంగల బెడద లేదన్నారు. ఒక సంవత్సరంలో 5 నుంచి 6 పంటలు తీసుకొవచ్చని, ఎక్కువస్థాయిలో ఎరువులు అవసరం లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి మరియన్న, కేంద్ర స్కిల్స్ బోర్డు శాస్త్రవేత్త సురేష్, అధికారి రాము, ఐకేపీ ఏపీఎం ఉపేందర్, మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు ఈసం జ్యోతి, ఆస్పిరేషన్ బ్లాక్ కోఆర్డినేటర్ శ్రీనాఽథ్, మండల వ్యవసాయాధికారి వేణు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. -
వన్యప్రాణులను చంపితే జైలుశిక్ష
● ఎఫ్ఆర్వో జి.ప్రసాదరావు గూడూరు: అటవీ జంతువులను వేటాడి చంపిన వారికి కఠినమైన జైలుశిక్ష ఉంటుందని ఎఫ్ఆర్వో జి.ప్రసాదరావు హెచ్చరించారు. పందిని చంపిన ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా, మాంసం విక్రయించిన ఇద్దరిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఎఫ్ఆర్వో తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 5వ తేదీన బయ్యారం మండలం జప్రాబాద్ తండాకు చెందిన గుగులోతు గౌరీశంకర్.. మట్టెవాడ సమీప అడవిలో అడవి పందిని చంపి, మాంసం పట్టుకొని వస్తూ పెట్రోలింగ్లో ఉన్న సిబ్బందిని చూసి మాంసం వదిలేసి పరారయ్యాడు. ఈక్రమంలో విచారణ చేపట్టగా మట్టెవాడకు చెందిన గుండెబోయిన హరీష్, బానోతు సురేష్ 4 కిలోల మాంసాన్ని రూ.వెయ్యికి గౌరీశంకర్ వద్ద తీసుకున్నట్లు తేలింది. ఈనెల 9న వారిద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రసాదరావు చెప్పారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా 15 రోజుల జైలు విధించినట్లు వివరించారు. కార్యక్రమంలో ఫారెస్టు సిబ్బంది మహేందర్, చాణక్య తదితరులు పాల్గొన్నారు. -
కార్మికులకు సంక్షేమబోర్డు ఏర్పాటు చేయాలి
నెహ్రూసెంటర్: భవన నిర్మాణరంగంలో పని చేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేయాలని టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి రవి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్మాణరంగంలో లక్షలాది మంది కార్మికులు గుర్తింపు లేకుండా ఉన్నారని, వారందరికీ సంక్షేమ ఫలాలు అందించాలన్నారు. 55 సంవత్సరాలు నిండిన కార్మికులకు పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వెంకన్న, ఉప్పలయ్య, కొమురయ్య, పి.రాజు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
పొద్దు పొడిస్తేనే మోటారు నడిచేది
హన్మకొండ: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తి ఆగమవుతున్న అన్నదాతలను అప్రకటిత విద్యుత్ కోతలు వేధిస్తున్నాయి. పొద్దు పొడిస్తే కాని త్రీఫేజ్ సరఫరా చేయలేని దుస్థితిలో విద్యుత్ పంపిణీ సంస్థ ఉంది. జల విద్యుత్ ఉత్పత్తి తగ్గడంతో పాటు అవసరాల మేరకు థర్మల్ పవర్ ఉత్పత్తి సామర్థ్యం లేకపోవడంతో సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పీక్ అవర్ సాయంత్రం 6 గంటల తర్వాత విద్యుత్కు భారీ డిమాండ్ ఉండడంతో ఆ సమయంలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. సోలార్ విద్యుత్ సమయంలోనే వ్యవసాయానికి త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తున్నారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే గత రెండు, మూడు నెలలుగా త్రీఫేజ్ సరఫరా చేస్తున్నారు. నగరాలు, ప్రధాన పట్టణాలకు మాత్రం 24 గంటల పాటు నిరంతరాయంగా సరఫరా జరుగుతోంది. గ్రామాల్లో సమస్య తీవ్రం ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్య జఠిలంగా మారింది. పొద్దు పొడిచి సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఎప్పుడు అవుతుందో అప్పుడే త్రీఫేజ్ సరఫరా చేస్తున్నారు. దీంతో ఒక సమయపాలన అంటూ లేకుండా విద్యుత్ సరఫరా జరుగుతోంది. సూర్యోదయాన్ని బట్టి ఉదయం 7 నుంచి 7.30 గంటలకు త్రీఫేజ్ సరఫరా మొదలవుతోంది. తిరిగి సూర్యాస్తమయానికి త్రీఫేజ్ సరఫరా నిలిచిపోతోంది. దీంతో గ్రామాల్లో సాయంత్రం 5.30, 6 గంటల నుంచి ఉదయం 7 నుంచి 7.30 గంటల వరకు సింగిల్ ఫేజ్ సరఫరా జరుగుతోంది. ఈ విషయమై పలువురు విద్యుత్ అధికారులతో మాట్లాడగా సోలార్ పవర్ ఉత్పత్తి అవుతున్న సమయంలోనే వ్యవసాయానికి త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. అయితే, విద్యుత్ కోతలపై అధికారులు మాట్లాడేందుకు సాహసించడం లేదు. రైతులు, ఇతర వినియోగదారుల నుంచి కాల్స్ వస్తున్నాయని, వారికి ఏదో సమస్య ఉందని సర్దిచెప్పుతున్నామని, నేరుగా కోతలు విధిస్తున్నామని చెప్పలేక పోతున్నామని అంటున్నారు. గ్రిడ్పై భారం పడుతుండడంతో ఒక్కోసారి 133/33 కేవీ సబ్స్టేషన్ నుంచి 33/11 కేవీ సబ్ స్టేషన్లకు విద్యుత్ సరఫరా పూర్తిస్థాయిలో నిలిపివేస్తున్నారు.అప్రకటిత విద్యుత్ కోతలతో రైతుల అవస్థలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే త్రీఫేజ్ విద్యుత్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి సమయంలోనే త్రీఫేజ్ సరఫరా 18 గంటల నుంచి 10 గంటలకు సరఫరా కుదింపు18 జిల్లాల్లో పంటల సాగు వివరాలు (ఎకరాల్లో) పంటలు ఈ ఏడాది గతేడాది 64,26,574 68,12,574 వరి 32,98,891 29,41,203 మొక్కజొన్న 3,84,891 3,68,906 పప్పు దినుసులు 2,02,877 2,82,664 పత్తి 22,23,201 24,00,532 గత 10 రోజులుగా టీజీ ఎన్పీడీసీఎల్లో విద్యుత్ డిమాండ్ చూస్తే కనిష్ఠంగా 5,178 మెగావాట్ల నుంచి ఈనెల 9న గరిష్ఠంగా 6,948 మెగావాట్లు నమోదైంది. ఇందులో టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో 2,131 మెగావాట్లు సోలార్ విద్యుత్ ఉంది. ఎన్పీడీసీఎల్లో 3,444.97 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగానికి సరిపడా సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. ఈ సమయంలోనే వ్యవసాయానికి త్రీఫేజ్ సరఫరా చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రాత్రి 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు త్రీఫేజ్ సరఫరా చేసేవారు. తర్వాత రాత్రి ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా జరిగేది. రోజుకు 17, 18 గంటల పాటు త్రీ ఫేజ్ సరఫరా జరిగేది. కొద్ది రోజులు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సరఫరా చేశారు. ఇప్పుడు 9 లేదా 10 గంటలు మాత్రమే విద్యుత్ ఇస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఒక రోజు, ఉదయం 7.30 గంటల నుంచి మరో రోజు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు మాత్రమే త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా జరుగుతోందని అంటున్నారు -
కేయూలో చోరీకి విఫలయత్నం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని బిల్డింగ్ డివిజన్ కార్యాలయంలో చోరీకి గుర్తుతెలియని వ్యక్తి గురువారం రాత్రి విఫలయత్నం చేశాడు. ఉద్యోగుల కథనం ప్రకారం.. ఇద్దరు కేయూ ఉద్యోగులు శుక్రవారం ఉదయం కార్యాలయానికి వచ్చి తాళంతీసి లోపలకు వెళ్లగా గదుల్లో టేబుల్ డెస్క్లు చిందరవందరగా పడి కనిపించాయి. దీంతో వెంటనే వారు కేయూ అభివృద్ధి అధికారి వై.వెంకయ్యకు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి చూసి రిజిస్ట్రార్, కేయూ పోలీస్టేషన్ సమాచారం అందించారు. దీంతో రిజిస్ట్రార్ వి.రామచంద్రం, కేయూ ఎస్సై కల్యాణ్కుమార్ చేరుకుని పరిశీలించారు. మెట్ల మార్గంలో కార్యాలయంలోకి దొంగ వెళ్లినట్లు గుర్తించారు. వివిధ గదుల్లోని టేబుల్స్ డెస్క్లను నిందితుడు తెరిచి చూశాడు. అయితే, ఓ టేబుల్ డెస్క్లోని పెన్డ్రైవ్ను మాత్రం చోరీచేశాడు. అందులో వివిధ ఫైళ్లకు సంబంధించిన సమాచారం ఉందని తెలుస్తోంది. అలాగే, సూపరింటెండెంట్ గదిలోకి వెళ్లి అందులోని టేబుల్ డెస్క్లో వెతికాడు. ఓ బీరువాలోని అన్ని వస్తువులను బయటికి తీసి టేబుల్పై పెట్టాడు. తర్వాత కేయూ అభివృద్ధి గదిలోకి వెళ్లి లైట్లు వేసుకొని ఏసీ కూడా ఆన్ చేసుకున్నాడు. అయితే దొంగ ఏ వస్తువులను కూడా చోరీచేయలేదు. పెన్డ్రైవ్ మాత్రం చోరీ చేశాడు. కాగా, యూనివర్సిటీ భూముల కీలక డాక్యుమెంట్లు, వివిధ కీలక ఫైళ్లను చోరీ చేసేందుకు వచ్చాడ అనే అనుమానాలు వ్యక్తవుతున్నాయి. చోరీచేసింది ఒక్కడా లేక ఇద్దరు ముగ్గురా అన్నది తెలియలేదు. కేయూ అభివృద్ధి అధికారి ప్రొఫెసర్ వై.వెంకయ్య ఫిర్యాదు మేరకు కేయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు. అయితే, బిల్డింగ్ డివిజన్ ఆఫీస్ ప్రాంతంలో ఎక్కడా సీసీ కెమెరాలు లేవు. ఇప్పటికే ఆడిటోరియంలో రెండుసార్లు చోరీలు జరిగాయి. కేయూలో సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. అలాగే, కేయూ పోలీసుల పెట్రోలింగ్ కూడా ఉంటుంది. అయినా యూనివర్సిటీలో చోరీలు మాత్రం ఆగడం లేదు. బిల్డింగ్ డివిజన్ కార్యాలయంలో ఘటన ఓ పెన్డ్రైవ్ అపహరణ -
రైస్ మిల్లర్ల సమస్యలు
పరిష్కరించే వరకు ఐక్యపోరాటంహన్మకొండ: రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించే వరకు ఐక్య పోరాటం కొనసాగిద్దామని రైస్ మిల్లర్లు పిలుపునిచ్చారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ పిలుపు మేరకు హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద ఉమ్మడి వరంగల్ జిల్లా రైస్ మిల్లర్లు శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు రైస్ మిల్లర్లు మాట్లాడుతూ మిల్లుల ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సర్క్యులర్ మిల్లులకు శరాఘాతంగా మారిందన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ ఆకస్మిక దాడులను వెంటనే నిలిపివేయాలని కోరారు. గత రెండు నెలలుగా రన్నింగ్ మిల్లర్లపై నమోదైన కేసులను భేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమంలో హనుమకొండ రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేన్ అధ్యక్షుడు పెద్ది ప్రవీణ్కుమార్, సెక్రటరీ రాధికా ప్రదీప్, ట్రెజరర్ లక్ష్మణ్రావు, వైస్ ప్రెసిడెంట్ నూక సంతోష్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు గోనెల రవీందర్, సెక్రటరీ బూరల సత్యనారాయణ, ట్రెజరర్ కోటేశ్వర్రావు, మిల్లర్లు తోట సంపత్కుమార్, దేవునూరి అంజయ్య, పెద్ది వెంకటనారాయణ గౌడ్, ఇరుకుల్ల రమేష్, రాజు శ్రీనివాసరావు, జైపాల్రెడ్డి, దుబ్బా రమేష్, మూధవ శంకర్, యగందర్, దామెదర్, తదితరులు పాల్గొన్నారు. -
ఇక యూజర్ చార్జీలు
మహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీలో కార్మికుల సంఖ్య తక్కువగా ఉండడంతో పాటు వాహనాల తరచూ మరమ్మతుల బారిన పడుతుండడంతో పారిశుద్ధ్య సమస్య వెంటాడుతోంది. అయితే సమస్య పరిష్కారం కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా కమర్షియల్ ప్రాంతాల్లో యూజర్ పన్నులు వసూలు చేసేందుకు నోటీసులు సిద్ధం చేస్తున్నారు. ఈ విధానం అమలు కోసం రెండు కొత్త ట్రాక్టర్ల కొనుగోలు చేసేందుకు కౌన్సిల్లో తీర్మానం చేశారు. 141మంది మాత్రమే.. మానుకోట మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా లక్ష వరకు జనాభా ఉంది. కాగా, జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెరగడం లేదు. సీడీఎంఏ ఆదేశాల ప్రకారం ఆదాయం పెంచుకుని కార్మి కుల సంఖ్య పెంచుకోవాలి. అయితే ఆదాయం అంతంతే ఉండడంతో కార్మికుల సంఖ్యపెంపుపై దృష్టి పెట్టడం లేదు. మున్సిపాలిటీలో 143మంది కార్మికులు ఉండగా.. ఇటీవల ఇద్దరు మృతి చెందగా ప్రస్తుతం 141మంది మాత్రమే ఉన్నారు. ఇదిలా ఉండగా 141మందిలో ప్రతీరోజు పలు కారణాలతో 15 నుంచి 20 హాజరు కావడం లేదు. అలాగే ఉన్న వారిలో 8 మంది వీఐపీ ఇళ్లలో పని చేస్తున్నారు. దీంతో సమస్య తీవ్రంగా మారింది. వాహనాల రిపేర్లు.. మున్సిపాలిటీలో కాల్వలు శుభ్రం చేసే మిషన్, రోడ్డు స్వీపింగ్ మిషన్, వైకుంఠరథం, 14 మూడు చక్రాల ఆటోలు, 19నాలుగు చక్రాల ఆటోలు, 11 ట్రాక్టర్లు ఉన్నాయి. ప్రతీరోజు 33 టన్నుల చెత్త సేకరిస్తున్నారు. రెండు చెత్త డంపింగ్యార్డులు ఉన్నా యి. సుమారు రూ.86లక్షలతో కొనుగోలు చేసిన కాల్వలు శుభ్రం చేసే మిషన్, రోడ్డు స్వీపింగ్ మిషన్ నిర్వహణపై అవగాహన లేక వాడడం లేదు. ఉన్న వాహనాల్లో సగానికిపైగా తరచూ మరమ్మతులతో షెడ్డులకే పరిమితమవుతున్నాయి. పలు వార్డులకు వారానికి రెండుసార్లే.. పట్టణంలోని 22వ వార్డుతో పాటు పలు వార్డులకు వారానికి రెండుసార్లు మాత్రమే చెత్త సేకరణ వాహనాలు వెళ్తున్నాయి. కాగా, ఆ వార్డుల ప్రజలు రోడ్లపై చెత్త వేస్తున్నారు. దీంతో పారిశుద్ధ్య సమస్య జఠిలమైంది. కేవలం కమర్షియల్ సెంటర్లలో మాత్రమే రోజుకు రెండుసార్లు చెత్త సేకరిస్తున్నారు. కమర్షియల్పై నజర్.. కమర్షియల్ ప్రాంతాల్లో ఎక్కువ చెత్త వేసే సంస్థలపై అధికారులు దృష్టిపెట్టారు. ఆయా సంస్థల నుంచి యూజర్ చార్జీల పేరుతో ప్రతీనెల అదనంగా పన్నులు వసూలు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా సుమారు 59 ఆస్పత్రులు, 35 హోటళ్లు, 3 సినిమా థియేటర్లు, 2 ప్రైవేట్ హాస్టళ్లు, కర్రీ పాయింట్లు, బార్లు, రెస్టారెంట్లపై దృష్టి పెట్టారు. పన్నులు ఇలా.. బెడ్స్ లేని చిన్న ఆస్పత్రి అయితే నెలకు రూ.1000, బెడ్స్తో ఉన్న ఆస్పత్రి రూ.3000, సినిమా థియేటర్ రూ.1500, హోటలు రూ.400, టిఫిన్ సెంటర్ రూ.250, ప్రైవేట్ హాస్టల్ రూ.600, రెస్టారెంట్ రూ.500, బార్ అండ్ రెస్టారెంట్లకు రూ.1000గా నిర్ణయించారు. కర్రీ పాయింట్లు, ఇతర షాపులకు కూడా నిర్ణయించారు. నోటీసులు జారీ.. మున్సిపల్ అధికారులు నోటీసులు తయారీ చేస్తున్నారు. వాటిని రెండు రోజుల్లో అందజేసి వచ్చే నెల నుంచి యూజర్ చార్జీలు వసూలు చేయనున్నారు. తద్వారా వచ్చిన ఆదాయంతో రెండు ట్రాక్టర్ల ఈఎంఐ చెల్లిస్తామని అధికారులు భావిస్తున్నారు. యజమానులు సహకరించాలి యూజర్ చార్జీల విషయంలో డాక్టర్లు, హోటళ్ల యజమానులు అందరూ సహకరించాలి. దీంతో ఆదాయం కొంత పెరగడంతో పాటు వాహనాల సంఖ్య పెరుగుతుంది. దీంతో పాటు బాధ్యత కూడా పెరుగుతుంది. కొత్త ట్రాక్టర్లకు ఈఎంఐ వెసులుబాటవుతుంది. – వినోద్కుమార్, కమిషనర్ కమర్షియల్ ప్రాంతాల్లో చెత్తసేకరణకు అదనపు వసూలు మానుకోట మున్సిపాలిటీ ఆదాయం పెంపుపై దృష్టి నోటీసుల తయారీలో సిబ్బంది నిమగ్నం -
పంటలకు నిరంతర విద్యుత్ సరఫరా
● విద్యుత్ శాఖ ఎస్ఈ దర్శన్ కుమార్మరిపెడ రూరల్: రైతుల పంటలకు అంతరాయాలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించాలని జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ దర్శన్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మరిపెడ మండలంలోని ఎల్లంపేట సబ్ స్టేషన్ను ఆయన సందర్శించారు. రైతుల ధర్నాకు గల కారణాలను అధికారును అడిగి తెలుసుకున్నారు. లైన్ల మరమ్మతులు, కెపాసిటర్ బ్యాంకులు, ఇంటర్లింగ్ లైన్ల పనులను త్వరితగతిన పూర్తి చేసి నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో ఏడీఈ శ్రీనివాసరావు, ఏఈలు పాండునాయక్, రూబీనా, సిబ్బంది పాల్గొన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలి చిన్నగూడూరు: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ దర్శన్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సబ్స్టేషన్ సందర్శించారు. విద్యుత్ సరఫరాను తీరును పరిశీలించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
మళ్లీ గెలుస్తారా..?!
సాక్షి, మహబూబాబాద్: ఇప్పట్లో ఎన్నికలు లేకున్నా ప్రజల నాడి తెలుసుకునేందుకు రాజ కీయ పార్టీలు సర్వే బాట పట్టినట్లు సమాచారం. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నియోజకవర్గాల వారీగా ప్రతీ మూడు నెలలకోసారి ఈ ఏడాది సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే రెండు సర్వేలు పూర్తి కాగా, తాజాగా అన్ని నియోజకవర్గాల్లో సర్వే చేస్తున్నట్లు తెలిసింది. ఈ సర్వేలో ఇప్పటి వరకు ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది.. సంక్షేమ పథకాలు అందుతున్నాయా.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పనితీరు గతంలో ఎలా ఉండేది.. ఇద్దరిలో ఎవరు, ఏ ప్రభుత్వం బెటర్.. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి, ఏ నేత బరిలో ఉంటే ఓటేస్తారు.. అంటూ సుమారు పదిహేను వరకు ప్రశ్నలు అడుగుతున్నట్లు చర్చ. ప్రతికూల, అనుకూల పరిస్థితులు.. ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా మరికొందరు చేయించుకున్న సర్వేలో ప్రతికూల, అనుకూల పరిస్థితులు ఎదురయ్యాయి. వీటి ఆధారంగానే జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేల్లో కొందరి పరిస్థితి బాగాలేదని, పద్ధతి మార్చుకోవాలని, ప్రజల్లో ఉండాలని, చేసిన పనులు, సంక్షేమ పథకాలపై ప్రచారం చేసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం హెచ్చరించినట్లు తెలిసింది. అదే విధంగా ఓడిపోయినంత మాత్రాన ప్రజలకు దూరంగా ఉండవద్దని, ప్రభుత్వ వైఫల్యాలు, హామీల విస్మయం, ప్రజా సమస్యలే ఎజెండాగా తీసుకొని ప్రజల్లోనే ఉండాలని, నియోజకవర్గాల్లో క్యాడర్ను కాపాడుకున్నవారికే భవిష్యత్ ఉంటుందని బీఆర్ఎస్ అధినాయకులు చెప్పినట్లు తెలిసింది. మళ్లీ గెలుస్తాం కాంగ్రెస్.. అధికారం మాదే బీఆర్ఎస్ అంతర్గతంగా ఎలా ఉన్నా.. బహిర్గతంగా మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచామని.. మళ్లీ గెలుపు మాదే అని కాంగ్రెస్ క్యాడర్ చెబుతోంది. గత ఎన్నికలకు భిన్నంగా తీర్పు ఉంటుందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అదే విధంగా గెలిచిన నాటి నుంచి కింది క్యాడర్ను పెద్దగా పట్టించుకోకపోవడం, కొందరికే ప్రాధాన్యం ఇవ్వడం వంటి విమర్శలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు.. గత కొద్దిరోజులుగా కార్యకర్తల దగ్గరకు వెళ్లడం, మీ మేలు మర్చిపోను, మరోసారి గెలిపించాలి.. మీ సహకారం కావాలి అని నాయకులతో మమేకమై మాట్లాడుతున్నట్లు కార్యకర్తలు చెబుతున్నారు. కొంతకాలం మౌనంగా ఉన్న ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు కూడా వేగం పెంచడం, అనుచరులతో తరచూ సమావేశాలు ఏర్పాటు చేయడం, క్యాడర్తో మాట్లాడడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. డీలిమిటేషన్పై ఆశతో ప్రధాన నాయకులు ఒక వైపు అఽధికార, ప్రతిపక్ష నాయకుల పనితీరుపై సర్వేలు నిర్వహించడం, పంథాలు మార్చుకొని వ్యవహరిస్తుంటే.. అధికార, ప్రతిపక్ష పార్టీల్లోని ప్రధాన నాయకులు మాత్రం డీలిమిటేషన్పై ఆశలు పెట్టుకొని ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు అర్థం అవుతోంది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు, ఎంపీ, ఓ ప్రధాన నాయకుడు జనరల్ స్థానాలతోపాటు, ఎస్టీ స్థానంలో తమ వారసులను రాజకీయ అరంగేట్రం చేయించేందుకు స్థానిక క్యాడర్తో టచ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే విధంగా బీఆర్ఎస్లోని మాజీ మంత్రులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీ, యువజన నాయకులు, డాక్టర్లు కూడా తమతోపాటు, తమ కుటుంబ సభ్యులు, వారసులకు అవకాశం రావాలంటే డీలిమిటేషన్ కావాలని.. ఎలా అయితే లాభం అనే కోణంలో అనుచరులతో చర్చలు పెడుతున్నారు. ఇప్పుడే ఇలా రాజకీయ చర్చలు వేడెక్కితే.. రాబోయే రోజుల్లో మరింత వేడి పుంజుకుంటుందని స్పష్టం అవుతుంది. మున్ముందు ఏం జరుగుతుందో.. ఏ పార్టీ నుంచి ఎవరూ పోటీకి సిద్ధం అవుతారో.. ఎవరికి ఏ అవకాశం వస్తుందో అనేది వేచి చూడాల్సిందే. ఎమ్మెల్యేల పనితీరుపై మొదలైన చర్చ ఎవరు బెటర్ అని ప్రశ్నలు వేసి ఆరా డీలిమిటేషన్పై ఆశతో ప్రధాన నాయకులు జోరందుకున్న రాజకీయ చర్చలు -
మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి
● వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత హన్మకొండ అర్బన్: మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసు శాఖతో పాటు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత అన్నారు. ప్రతీ కుటుంబానికి డ్రగ్స్ వ్యతిరేక సందేశాన్ని చేరవేయాలనే లక్ష్యంతో సంఘమిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో సంఘమిత్ర కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు సంఘమిత్రలో చేరి తమ పరిధిలోని ప్రతి కుటుంబానికి మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని కోరారు. డ్రగ్స్, గంజాయి వినియోగం, విక్రయం, సరఫరాకు సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకు అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు విలువైన సమాచారానికి తగిన బహుమతి అందిస్తామని తెలిపారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో మహిళా స్వయం సహాయక సంఘాలు, పట్టణ స్థాయి సమాఖ్యల సభ్యులు కీలక పాత్ర పోషించాలని కోరారు. సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో మహిళల పాత్ర కీలకమని చెప్పారు. అనుమానాస్పద వ్యక్తులు, ప్రదేశాల సమాచారాన్ని పోలీసులకు అందించాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన కల్పించే నాటికను ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల విద్యార్థినులు ప్రదర్శించారు. కార్యక్రమంలో ట్రైనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ శేషాద్రి, డీఆర్డీఏ పీడీ శ్రీను, మెప్మా పీడీ రాజేశ్వర్, ఏసీపీలు నర్సింహరావు, ప్రశాంత్రెడ్డి, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, అధికారులు పాల్గొన్నారు. కాగా, వివిధ మహిళా సంఘాలకు చెందిన సుమారు వెయ్యిమంది సభ్యులు పాల్గొన్నారు. -
యూత్ కాంగ్రెస్కు కొత్త ఇన్చార్జ్లు
సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ (టీపీవైసీ)లో సంస్థాగత మార్పులు చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలకు కొత్త ఇన్చార్జ్లను నియమించారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాలకు పలువురు నేతలకు బాధ్యతలు అప్పగించారు. వరంగల్ జిల్లాకు ముచల సాయి మనోజ్కుమార్ యాదవ్ను సెక్రటరీ ఇన్చార్జ్గా, హనుమకొండ జిల్లాకు పాడాల రాహుల్ను జనరల్ సెక్రటరీ ఇన్చార్జ్ గా నియమించారు. ఈ రెండు జిల్లాల వ్యవహారాలను రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరిప్రసాద్ రూపవత్ పర్యవేక్షించనున్నారు. జనగామ జిల్లాకు జనరల్ సెక్రటరీగా చంద్రిక దుబ్బక, మహబూబాబాద్ జిల్లాకు జనరల్ సెక్రటరీగా అలువాల కార్తీక్, సెక్రటరీగా అశ్విన్ ఏకేలను నియమించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహిపాల్ ఒరుగంటి, ములుగు జిల్లాకు బండిగ రాకేష్కు బాధ్యతలు అప్పగించారు. క్షేత్రస్థాయిలో సమన్వయం.. కొత్తగా నియమితులైన ఇన్చార్జ్లు తమ పరిధిలోని జిల్లా, అసెంబ్లీ, మండల స్థాయి కమిటీలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర అధ్యక్షుడు నియామక ఉత్తర్వులో సూచించారు. నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు. యువతను పెద్దఎత్తున పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో యూత్ కాంగ్రెస్ సంస్థాగతంగా బలోపేతం చేయడంపై కొత్త బాధ్యులు దృష్టి సారించనున్నారు. ఉమ్మడి వరంగల్లో ఏడుగురు రాష్ట్ర నేతలకు బాధ్యతలు వరంగల్, హనుమకొండ జిల్లాలపై ప్రత్యేక దృష్ట్టి -
లింగనిర్ధారణ చట్టరీత్యా నేరం
● డీఎంహెచ్ఓ రవిరాథోడ్ నెహ్రూసెంటర్: గర్భస్త లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లను గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీసీపీఎన్డీటీ చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. లింగ నిర్ధారణ చేస్తే, చట్టాన్ని ఉల్లంఘిస్తే మూడు సంవత్సరాల జైలు, 50 వేల జరిమానా విధిస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ వీరాజిత, డెమో రాజ్కుమార్, మనోహర్, అనిల్, ప్రశాంత్ పాల్గొన్నారు. అవగాహన శిబిరాలు నిర్వహించాలి.. హెచ్ఐవీపై అవగాహన శిబిరాలు నిర్వహించాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు క్యూర్కోడ్ పద్ధతిలో డ్రాయింగ్, పోస్టర్ పద్ధతిలో హెచ్ఐవీపై అవగాహన కల్పించాలన్నారు. హెచ్ఐవీ నివారణపై ప్రజలు, విద్యార్థుల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. సమావేశంలో డాక్టర్ అర్జున్, జ్యోతి, ఎంఎల్హెచ్పీలు తదితరులు పాల్గొన్నారు. -
రీ సర్వేను పారదర్శకంగా చేపట్టాలి
● తొర్రూరు ఆర్డీఓ గణేష్ నెల్లికుదురు: జిల్లాలో భూ రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని తొర్రూరు ఆర్డీఓ గణేష్ సర్వే అధికారులకు సూచించారు. మండలంలోని రామానుజాపురం గ్రామంలో వారం రోజలుగా చేపడుతున్న సర్వేను ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నితీష్, తహసీల్దార్ చంద నరేష్తో కలిసి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో మొత్తం భూమి నిర్ధారణ, హద్దులు, ప్రభుత్వ భూములు, కుంటలు, చెరువులు, గ్రామంతో పాటు రైతులు సాగు చేస్తున్న భూముల వివరాలు ఆర్డీఓ అడిగి తెలుసుకున్నారు. భూ హక్కుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వే చేపడుతున్నట్లు చెప్పారు. సాగు చేసుకునే రైతులకు నూతన సర్వే నంబర్లు కేటాయించేందుకు సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్తులు, ఇతర ప్రభుత్వ భూముల వివరాలను సక్రమంగా నమోదు చేయాలన్నారు. రీ సర్వే ప్రక్రియలో ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు, సమస్యలను పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలన్నారు. ఈ సర్వేకు రైతులు, గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డీఐ సురేందర్, సర్వేయర్లు, జీపీఓలు పాల్గొన్నారు. -
దొడ్డిదారిలో నియామకాలు!
సాక్షి, మహబూబాబాద్: జిల్లా వైద్యారోగ్యశాఖలో మెరిట్ జాబితాను పక్కన పెట్టి.. ముడుపులు ఇచ్చిన వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు. కాగా, తమకు అన్యాయం జరిగిందని పలువురు మెరిట్ అభ్యర్థులు ఉన్నతాధికారులను ఆశ్రయించడంలో మళ్లీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడుతున్నారు. దీంతో మెరిట్ జాబితాలో ఉద్యోగం వచ్చిన వారు నిర్భయంగా ఉండగా.. అక్రమమార్గంలో నియామకమైన వారు తమ ఉద్యోగం కాపాడుకునేందుకు పైరవీలు మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో బయటపడిన అక్రమ నియామకాలు నూతన జిల్లా ఏర్పాటు తర్వాత అన్ని విభాగాల్లో ఉద్యోగ నియామకాలు జరిగాయి. ప్రధానంగా వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో వందలాది ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశారు. ఇందులో మూడో ఏఎన్ఎం, స్టాఫ్ నర్సులు, డైక్ సెంటర్, టీబీ సెంటర్లలో నియామకాలతో పాటు పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సబ్సెంటర్లను ఏర్పాటు చేసి ఎంఎల్హెచ్పీలను నియమించారు. కాగా మూడో ఏఎన్ఎం, స్టాఫ్ నర్సు, డైక్ సెంటర్, టీబీ విభాగంలో ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. పలువురు అధికారులు ఒక్కో ఉద్యోగానికి రూ.లక్ష నుంచి రూ. 2లక్షల వరకు తీసుకొని పోస్టులను భర్తీ చేశారు. వీటిపై ఫిర్యాదులు రాగా.. డైక్ సెంటర్లో సైకాలజీ పోస్టుకోసం ఎంపిక చేసిన వ్యక్తి సర్టిఫికెట్ సరైనది కాదని తేలడంలో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసి తొలగించారు. అతడి స్థానంలో మెరిట్ అభ్యర్థిని నియమించారు. అదేవిధంగా టీబీ విభాగంలో సీనియర్ ట్యూబర్క్లోసెస్ ల్యాబ్ సూపర్వైజర్ పోస్టుల్లో ఇద్దరిపై ఫిర్యాదులు రాగా సర్టిఫికెట్లు పరిశీలించి వారిని తొలగించారు. ఎంఎల్హెచ్పీల నియామకాల్లో.. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జిల్లాలో 140 సబ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లలో పనిచేసేందుకు మిడ్లెవల్ నర్సింగ్ ప్రొవైడర్స్ను నియమించారు. వీరి నియామకం కోసం జీఎన్ఎం నుంచి ఎంబీబీఎస్ వరకు విద్యార్హతలు పేర్కొన్నారు. అయితే ఇందుకోసం మొత్తం 500మందికి పైగా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. నియామకం పూర్తయిన తర్వాత 28 మంది వేరే ఉద్యోగాలు రావడంతో వెళ్లిపోయారు. ప్రస్తుతం పని చేస్తున్నవారిలో తక్కువ మార్కులు సాధించిన వారికి ఉద్యోగాలు ఇచ్చారని జిల్లాలోని అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పెద్దగా స్పందించలేదు. దీంతో వైద్యారోగ్యశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడంతో అన్ని సర్టిఫికెట్లు పరిశీలించి అనర్హులపై వేటు వేయాలని ఆదేశించారు. దీంతో రెండు రోజులు గా ఎంఎల్హెచ్పీల నియామక ఫైల్ తీసి సర్టిఫికెట్లు పరిశీలిస్తున్నారు. టెన్త్, ఇంటర్, టెక్నికల్ సర్టిఫికెట్లు, మార్కుల జాబితాను పరిశీలించి సంతకాలు తీసుకుంటున్నారు. సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నాం.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని డిప్యూటీ డీఎంహెచ్ఓలు, డీపీఓ, ఇతర జిల్లా అధికారులు మొత్తం ఐదుగురితో కమిటీ వేసి రోజుకు 20 మంది చొప్పున అందరి సర్టిఫికెట్లు పరిశీలిస్తున్నాం. ఒరిజినల్ సర్టిఫికెట్లు పరిశీలించి జిరాక్స్ కాపీపై సదరు ఉద్యోగి సంతకం తీసుకుంటున్నాం. పరిశీలన పూర్తయిన తర్వాత జిల్లా అధికారుల సూచనతో ఉన్నతాధికారులకు తుది నివేదికను పంపిస్తాం. – రవిరాథోడ్, డీఎంహెచ్ఓ ఎంఎల్హెచ్పీల సర్టిఫికెట్లను పరిశీలిస్తున్న అధికారులు ఆరోగ్యశాఖలో గతంలో ఎస్టీఎల్ల నియామకాల్లో తేటతెల్లం ప్రస్తుతం ఎంఎల్హెచ్పీల భర్తీపై ఫిర్యాదులు ఉన్నతాధికారుల ఆదేశాలతో కదిలిన ఫైల్ సర్టిఫికెట్ల పరిశీలనలో అధికారులు అక్రమార్కుల్లో భయం.. -
బోగస్ ఓటర్లు లేని జాబితా రూపొందించడమే లక్ష్యం
● కలెక్టర్ స్నేహశబరీష్ కురవి: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బోగస్ ఓటర్లు లేని ఓటరు జాబితాను రూపొందించడమే లక్ష్యమని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. గురువారం మండలంలోని మొగిలిచర్ల, తాఠ్యతండాలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ నోటీసులు, వివరాల నమోదు కార్యక్రమాన్ని ఆమె స్వయంగా పరిశీలించారు. మొగిలిచర్ల పోలింగ్ బూత్ నంబర్ 60, 61, 62లలో 310 మందికి, తాఠ్యతండాలో పోలింగ్ బూత్ నంబర్ 66లో 287 మందికి నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండిన అర్హులైన యువత నుంచి కొత్త ఓటు హక్కు నమోదుకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఓటరు వివరాల్లో తప్పుల సవరణ, నియోజకవర్గం మార్పు లేదా ఎపిక్ కార్డు మార్పుల కోసం ఫారం–8 దరఖాస్తులను పరిశీలించారు. అనర్హులు, మరణించిన లేదా శాశ్వతంగా వేరే ప్రాంతాలకు తరలివెళ్లిన వారి పేర్ల తొలగింపుపై అభ్యంతరాలను పరిశీలిస్తామని తెలిపారు. బూత్ లెవల్ ఏజెంట్ల భాగస్వామ్యంతో ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమలో తహసీల్దార్ విజయ, ఎంపీడీఓ వీరబాబు పాల్గొన్నారు. భూముల పరిశీలనకురవి: మండల కేంద్రంలో ఐకేపీ భవనం సమీపంలోని 177 సర్వే నంబర్ భూములను గురువారం అదనపు కలెక్టర్ అనిల్కుమార్ పరిశీలించారు. ఇటీవల దైద భద్రయ్య, ఇరుగు వెంకన్న తదితరులు 177 సర్వే నంబర్లోని ఫ్రభుత్వ భూములను కాపాడాలని, సమగ్ర సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈమేరకు అదనపు కలెక్టర్ అనిల్కుమార్ సంఘటన స్థలానికి వచ్చి తనిఖీ చేశారు. ఫిర్యాదుదారులు దైద భద్రయ్య, ఇరుగు వెంకన్న 177 సర్వేనంబర్లో ప్రభుత్వ భూమిని సర్వే చేసి హద్దులు పెట్టాలని సూచించారు. అలుగు, కట్ట విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. గతంలో డీఐతో సర్వే చేయించామని తహసీల్దార్ విజయ అదనపు కలెక్టర్కు తెలిపారు. ఎక్కడి వరకు హద్దులు పెట్టారని అడిషనల్ కలెక్టర్ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఫిర్యాదుదారులు జోక్యం చేసుకుని 177 సర్వే నంబర్ భూమి ఎంత వరకు ఉందో అదనపు కలెక్టర్కు చూపించారు. సమగ్ర సర్వే చేస్తే నిజాలు వెల్లడవుతాయని తెలిపారు. దీంతో అనిల్కుమార్ మాట్లాడుతూ.. సర్వేయర్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీతో సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తామని తెలిపారు. ఫొటోగ్రాఫర్ డప్పు యానికి పురస్కారంమహబూబాబాద్ రూరల్ : జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్ డప్పు యానికి అమెరికా పురస్కారం లభించింది. ఏఎన్ఐయూ గిరిజనుల జీవన శైలిపై డప్పు యాని తీసిన ఫొటోలకు అమెరికాలోని ఇమేజ్ కొలీగ్ సొసైటీ అత్యున్నత, అరుదైన పురస్కారాన్ని అందజేసింది. ప్రపంచ వ్యాప్తంగా బ్రిటిష్ రాయల్ ఫొటోగ్రఫీ సొసైటీ (లండన్), ఫొటోగ్రఫీ సొసైటీ ఆఫ్ అమెరికా (అమెరికా), ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డీ లా ఆర్ట్ ఫొటోగ్రఫీ (ఫ్రాన్స్)తో పాటు ఇమేజ్ కొలీగ్ సొసైటీ (అమెరికా) సంస్థలు నిర్వహించే అంతర్జాతీయ స్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో ఒడిశా రాష్ట్రంలో బొండా గిరిజనుల జీవనశైలి అంశంపై డప్పు యాని తీసిన చిత్రాలతో కూడిన డాక్యుమెంటరీకి ఏఐసీఎస్ సర్టిఫికెట్ ప్రకటించారు. ఈమేరకు ఏఐసీఎస్ హానర్ (యూఎస్ఏ) ప్రముఖ సినిమా డైరెక్టర్ బోయపాటి శ్రీను చేతుల మీదుగా డప్పు యాని అవార్డు స్వీకరించారు. ఫోటోగ్రాఫర్లు, మిత్రులు, మహబూబాబాద్ ఫొటో అండ్ వీడియో వెల్ఫేర్ అధ్యక్షుడు తోట సుభాష్, గౌరవ అధ్యక్షులు దుంపేటి లక్ష్మణ్, శంకర్, వంశీ, రాకేష్, రఘుపతి తదితరులు డప్పు యానిని అభినందించారు. -
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శం
● అదనపు కలెక్టర్ అనిల్కుమార్ మహబూబాబాద్: చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ప్రతీ ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ అనిల్కుమార్ అన్నారు. కలెక్టరేట్లో గురువారం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణలో చాకలి ఐలమ్మ చేసిన త్యాగాలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆమె చూపిన ధైర్య సాహసాలు, స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. స్పార్క్ ఫేస్ ఆఫ్ ఇండియా–26కు నిట్ డైరెక్టర్ ఎంపిక కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీని ఇండియా స్పార్క్ సంస్థ ఇండియా స్పార్క్ ఫేస్ ఆఫ్ ఇండియా–26కు ఎంపిక చేసి గురువారం సత్కరించింది. 2023వ సంవత్సరం నుంచి నిట్ వరంగల్ డైరెక్టర్గా, 30 ఏళ్ల నుంచి విద్యా పరిశోధన రంగాల్లో వివిష్ట ప్రతిభ కనబరుస్తున్న నిట్ డైరెక్టర్ను ఇండియా స్పార్క్ ఫేస్ ఆఫ్ ఇండియా–26కు ఎంపిక చేసినట్లు ఇండియా స్పార్క్ సంస్థ సీఈఓ రూపా తంతి తెలిపారు. -
నల్లా ఉంది.. నీరు రాదు!
కేసముద్రం: ఇంట్లో నల్లా ఉంది.. కానీ నీరు మాత్రం రావడం లేదు. ఒకవైపు మంచినీటి బావుల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడం, మరోవైపు భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో కేసముద్రం మున్సిపాలిటీ ప్రజలు తాగునీటి కోసం గోస పడుతున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో వేసవిని తలపించేలా తాగునీటి కష్టాలు ఇప్పుడే మొదలయ్యాయి. 16తాగునీటి బావులు.. మున్సిపాలిటీ పరిధిలో 16వార్డుల్లోని పట్టణ ప్రజల తాగునీటి సరఫరాకు 16 బావులు, 18 ఓవర్ హెడ్ట్యాంక్లు ఉన్నాయి. అయితే కేసముద్రంవిలేజ్, సబ్స్టేషన్తండా, కేసముద్రంస్టేషన్లోని పలు వార్డుల్లో కొద్ది రోజులుగా నల్లాలు బంద్ అయ్యా యి. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో చెరువుల్లో నీళ్లు లేక, అన్ని మంచినీటి బావుల్లో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. మరోవైపు మిషన్ భగీరథ నీటి సరఫరా పది రోజులుగా నిలిచిపోయింది. నల్లాలు బంద్ కావడంతో, తాగునీరు లేక, మరోవైపు కనీస అవసరాలు తీర్చుకోలేక పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ బావుల వద్దకు.. మున్సిపాలిటీ పరిధి సబ్స్టేషన్తండాలో సోలార్ పంపుసెట్ ద్వారా వస్తున్న తాగునీటిని ప్లాస్టిక్ బాటిళ్లలో పట్టుకుంటున్నారు. దుస్తువులు ఉతుక్కోవడం, గృహ అవసరాల నిమిత్తం వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. సుమారు 15 రోజులుగా నల్లాలు బంద్ కావడంతో తాగునీటి కోసం గోస పడుతున్నట్లు తండావాసులు వాపోతున్నారు. మరికొన్ని చోట్ల బావుల్లో జలాలు అడుగంటిపోవడం, మూడురోజులకు ఒకసారి బావుల్లో నీళ్లు ఊరడంతో నల్లానీరు సరఫరా చేస్తున్నారు. ఇప్పటికై నా తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు వేడుకుంటున్నారు. చాలా గోస పడుతున్నాం.. 15రోజులుగా నల్లానీళ్లు రావట్లేదు. మంచి నీళ్ల కోసం సోలార్ పంపు దగ్గరకు వెళ్తున్నాం. ఇక దుస్తువులు ఉతుక్కోవడానికి నీళ్లు లేక దూరంగా ఉన్న బావుల వద్దకు పోతున్నాం. భగీరథ నీళ్లు కూడా బంద్ అయ్యాయి. నీళ్లు లేక చాలా గోస పడుతున్నాం. వానాకాలంలో ఇంత ఇబ్బంది ఎన్నడూ రాలేదు. –గుగులోతు విజయ, సబ్స్టేషన్తండా మంచినీటి సమస్య పరిష్కరిస్తాం బావుల్లో భూగర్భజలాలు అడుగంటి పోవడం, భగీరథ నీరు రాకపోవడంతో మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్య తలెత్తింది. ఇప్పటికే నీళ్లు ఉన్న బావులను గుర్తించి, తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే అన్ని వార్డుల ప్రజలకు నీటి సమస్యను పరిష్కరిస్తాం. –ఉదయ్, మున్సిపల్ ఏఈ, కేసముద్రం కేసముద్రం మున్సిపాలిటీలో తాగునీటికి కటకట భగీరథ నీళ్లు రాక.. బావుల్లో నీళ్లు లేక నల్లాల బంద్తో పట్టణ ప్రజల అవస్థలు వేసవిని తలపిస్తున్న వానాకాలం -
నవరాత్రోత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
● ఎస్పీ శబరీష్ మహబూబాబాద్ రూరల్: గణేష్ నవరాత్రోత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ శబరీష్ అన్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. గణేష్ విగ్రహాల ఏర్పాటు, నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలపై సమీక్షించామని తెలిపారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసే గణేష్ విగ్రహాల సంఖ్య, నిర్వాహకుల వివరాలను కచ్చితంగా నమోదు చేసుకోవాలన్నారు. గణపతి విగ్రహాల ఏర్పాటుకు సంబంధించిన దరఖాస్తులను ఆన్లైన్ పోర్టల్ ద్వారా స్వీకరించి, అనుమతుల ప్రక్రియను పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతీ విగ్రహం వివరాలను జియో ట్యాగింగ్ చేయడంతో పాటు పోలీస్స్టేషన్ పరిధిలోని విగ్రహాలపై పూర్తి సమాచారం అందుబాటులో ఉంచాలన్నారు. ప్రజల రాకపోకలకు, ట్రాఫిక్కు అంతరాయం కలిగే విధంగా ప్రధాన రహదారులను బ్లాక్ చేసి విగ్రహాలను ఏర్పాటు చేయకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. మండపాల వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్, అగ్ని ప్రమాదాలు జరగకుండా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతీ మండలంలో ఉన్న గణేష్ నిమజ్జన ప్రాంతాల వివరాలను ముందుగానే సేకరించి, ఆయా ప్రాంతాలను అధి కారులు స్వయంగా పరిశీలించాలని ఆదేశించారు. నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా ముందస్తు ప్రణాళికతో బందోబస్తు చర్యలు చేపట్టాలన్నారు. నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలకు అనుమతిలేదని, నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. క్రీడలతో పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంపు గూడూరు: క్రీడలతో క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని ఎస్పీ శబరీష్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్ గురువారం ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జోనల్స్థాయి క్రీడా పోటీలు, ఎంపికల కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే క్రీడలు ఆడడం వల్ల నాయకత్వ లక్షణాల పెంపొందడంతో పాటు శారీరక, మానసికోల్లాసానికి దోహదపడుతాయని తెలిపారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సూ చనలను పాటిస్తూ, నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు. సైబర్ మోసాలు, మాదకద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, ఎంఈఓ సుజాత, సర్పంచ్ వాంకుడోతు సునీత, సీఐ వినయ్కుమార్, ఎస్సై రమేష్బాబు, పీడీలు పాల్గొన్నారు. -
అద్దె భవనం.. అరకొర వసతులు
● ప్రైవేట్ భవనంలో కొనసాగుతున్న ఏకలవ్య గురుకుల మోడల్ స్కూల్ ● విద్యార్థులకు తప్పని ఇబ్బందులు ● పట్టించుకోని అధికారులు మహబూబాబాద్ అర్బన్: ఏకలవ్య గురుకుల మోడల్ స్కూల్ విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. అద్దె భవనంలో నిర్వహణ, ఆపై అరకొర వసతుల నడుమ విద్యనభ్యసిస్తున్నారు. గూడూరు ఏకలవ్య గురుకుల మోడల్ స్కూల్.. జిల్లా కేంద్రంలోని ఓ అద్దె భవనంలో కొనసాగుతోంది. దీంతో సరైన వసతులు లేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అరకొర వసతులతో.. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల భవనంలో 2019లో గూడూరు ఏకలవ్య గురుకుల మోడల్ స్కూల్ను ప్రారంభించారు. భవనానికి నెలకు అద్దె రూ.2.25లక్షలు చెల్లిస్తున్నారు. మొత్తం 419మంది విద్యార్థులు ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు చుదువుతున్నారు. పదకొండు తరగతి గదులు ఉన్నాయి. ప్రతీ తరగతికి రెండు సెక్షన్ల చొప్పున మొత్తం 60మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే సరిపడా తరగతి గదులు లేక విద్యార్థులను ఇతర ప్రాంతాల పాఠశాలలకు తరలించి విద్యాబోధన చేస్తున్నారు. గదుల కొరత.. అద్దె భవనంలో సరిపడా తరగతి గదులు లేక.. 7, 8వ తరగతికి చెందిన కొంతమంది విద్యార్థులను బయ్యారం మండలం నామాలపాడు ఏకలవ్య గురుకుల పాఠశాల, కొత్తగూడ గురుకుల పాఠశాలకు తరలించి విద్యాబోధన కొనసాగిస్తున్నారు. తరగతి గదులే డార్మెటరీలు.. విద్యార్థులు తరగతి గదులే డార్మెటరీలుగా మార్చుకుంటున్నారు. పగలు చదువుకోవడం, రాత్రి పడుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఏడుగురికి ఒక బాత్రూమ్ ఉండాలి. కానీ, 30 మంది విద్యార్థులకు ఒకటి చొప్పున బాత్రూమ్లు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సరిపడా మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక విద్యార్థుల బాధలు వర్ణణాతీతం. అలాగే క్రీడా మైదానం ఇరుకుగా ఉంది. మినరల్ వాటర్ ప్లాంట్ లేక బయటనుంచి తాగునీరు కొనుగోలు చేస్తున్నారు. నత్తనడకన పనులు.. ప్రభుత్వం గూడూరు మండల కేంద్రంలో పాఠశాల కోసం నూతన భవనం మంజూరు చేయగా.. నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకుని శాశ్వత భవనాలు త్వరగా నిర్మించి సకల సౌకర్యాలు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.నూతన భవనం అందుబాటులోకి తీసుకురావాలిఅద్దె భవనంలో విద్యార్థులకు సరైన తరగతి గదులు లేక డిజిటల్ విద్యను పూర్తిస్థాయిలో అందిచలేకపోతున్నాం. ప్రభుత్వం చొరవ తీసుకొని గూడూరులో చేపడుతున్న భవన నిర్మాణ పనులు పూర్తి చేసి, వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నాం. –రమేష్, ఏకలవ్య గురుకుల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి ఏకలవ్య గురుకుల మోడల్ స్కూల్ అద్దె భవనంలో కొనసాగడంతో సరైన వసతులు లేక విద్యార్థులకు తరచూ విష జ్వరాలు వస్తున్నాయి. ఫుడ్పాయిజన్ వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. స్కూల్కు స్టాఫ్ నర్సును ఏర్పాటు చేసి విద్యార్థులకు మెరుగైన ఆరోగ్యంతో పాటు నాణ్యమైన విద్య అందించాలి. –బోనగిరి మధు, పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి -
నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు
హసన్పర్తి : ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత అధికారులకు సూచించారు. వరంగల్ పోలీస్ కమి షనరేట్ పరిధిలో నమోదైన నేరాలు, పెండింగ్ కేసు ల దర్యాప్తు పురోగతి, నిందితుల అరెస్టులు, సాక్ష్యాధారాల సేకరణ, కోర్టు కేసుల ప్రగతి తదితర అంశాలపై గురువారం కమిషనరేట్ కార్యాలయంలో డీసీపీలు, ఏసీపీలు, సంబంధిత పోలీసు అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను గుర్తించి, వా టి దర్యాప్తు ఏ దశలో ఉందనే అంశంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పెండింగ్ కేసుల్లో నిందితులు పరారీ లో ఉంటే ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏ ర్పాటు చేసి, అందుబాటులో ఉన్న సాంకేతిక పరి జ్ఞానాన్ని వినియోగిస్తూ త్వరితగతిన అరెస్టు చేయాలని సూచించారు. మహిళలు, చిన్నారులపై నేరా లు, ఆస్తి, సైబర్ నేరాల దర్యాప్తును పారదర్శకంగా, చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలన్నారు. ప్రతీ పోలీస్ స్టేషన్ అధికారి తమ పరిధిలో గణపతి నవరాత్రులు ప్రశాంత వాతావరణం నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిధిలో మ త్తుపదార్థాల నియంత్రణలో ప్రతిభ కనబరుస్తున్న డ్రగ్ కంట్రోల్ అధికారులు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపి రివార్డులు అందజేశారు. డీసీపీలు అంకిత్ కుమార్, దార కవిత, రాజమహేంద్ర నాయక్, కిషన్ సింగ్, అదనపు డీసీపీలు ప్రభాకర్ రావు, బాలస్వామి, సురేష్ కుమార్ శ్రీనివాస్, పోలీసు అధికారులు పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత -
విద్యుత్ ఆల్టైం రికార్డు
హన్మకొండ: విద్యుత్కు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతుంది. వర్షాకాలంలో వేసవిని మించిపోతోంది. ఎల్నినో ప్రభావంతో వాతావరణలో ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. వర్షాలు కురువకపోవడంతో వాతావరణం చల్లబడలేదు. ఎండలు మండుతుండడంతో ఉక్కపోత పెరిగింది. దీంతో ఉక్కపోతనుంచి ఉపశమనం కోసం విద్యుత్ ఉపకరణాలు వినియోగం కొనసాగుతోంది. విద్యుత్ వినియోగం గణనీయంగా పెరగడంతో డిమాండ్ సైతం పెరిగింది. ఈ డిమాండ్ నిలకడగా కాకుండా ప్రతీరోజు పెరుగుతూ రికార్డులు బ్రేక్ చేస్తోంది. టీజీ ఎన్పీడీసీఎల్లో అధికశాతం వ్యవసాయానికి, గృహ అవసరాలు, వ్యాపార వాణిజ్య అవసరాలు, చిన్న చిన్న పరిశ్రమలకు విద్యుత్ వినియోగిస్తారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో పరిశ్రమలు పెద్దగా లేవు. అయినా విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. వానాకాలంలో ఈ నెల 9న వేసవినిమించి రికార్డు స్థాయిలో 6,948 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైంది. అంతకుముందు మార్చి 27న నమోదైన 6,574 మెగావాట్ల డిమాండ్ అత్యధికం. దీన్ని బ్రేక్ చేస్తూ ఈ నెల 9న రికార్డు స్థాయిలో నమోదైంది. రాష్ట్రంలో గరిష్టంగా 19,543 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. మార్చిలో అత్యధికంగా నమోదైన 18,548 మెగావాట్ల డిమాండ్ను అధిగమించి ఇప్పుడు ఆల్టైం రికార్డు నమోదైంది. అదే విధంగా ఈ నెల 4న అత్యధికంగా 88.958 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. 5వ తేదీన 83.292 మిలియన్ యూనిట్లు, 6న 84.792, 7న 84.441, 8న 88.708, 9న 88.548 మిలియన్ యూనిట్లు విద్యుత్ను వినియోగించారు. గతేడాది వానాకాలంలో సెప్టెంబర్ 8న అత్యధికంగా 80.707 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగించగా, ప్రస్తుత వా నాకాలంలో ఈ నెల 4న అత్యధికంగా 88.958 మి లియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ముఖం చాటేసిన వర్షాలు.. ప్రస్తుత వర్షాకాలంలో వర్షాలు ముఖం చాటేశాయి. దీంతో పంటలు పూర్తిగా భూగర్భజలాలపై ఆధారపడి సాగు చేశారు. మోటార్లు వాడుతుండడంతో వి ద్యుత్ వినియోగం పెరిగింది. వరి పంటతో పాటు మెట్ట పంటలకు తడులు ఇస్తున్నారు. టీజీ ఎన్పీడీసీ ఎల్ పరిధిలోని 18 జిల్లాల్లో అన్ని పంటలు కలిపి ఈ వానాకాలంలో 64,26,574 ఎకరాల్లో సాగు చేశా రు. గతేడాది యాసంగిలో 68,12,574 ఎకరాల్లో సాగు చేశారు. వ్యవసాయ అవసరాలతో పాటు గృహ, వాణిజ్య, ఇతర విభాగాల్లోను వినియోగం పెరిగింది. దీంతో విద్యుత్కు డిమాండ్ పెరిగింది. టీజీ ఎన్పీడీసీఎల్లో 6,974 మెగావాట్ల గరిష్ట డిమాండ్ రాష్ట్రంలో 19,543 మెగావాట్ల గరిష్ట డిమాండ్ 4న విద్యుత్ వినియోగం 88.958 మిలియన్ యూనిట్లుఉమ్మడి జిల్లాలో ఈ 6నుంచి 9వ తేదీ వరకు విద్యుత్ వినియోగం వివరాలు (మిలియన్ యూనిట్లలో) జిల్లా 6 7 8 9 హనుమకొండ 6.33 5.96 6.14 5.83 వరంగల్ 4.144 4.21 4.183 4.374 జనగామ 4 4.24 4.32 4.6 మహబూబాబాద్ 4.123 3.52 3.82 3.95 భూపాలపల్లి 2.48 2.67 2.95 3.12 ములుగు 2.71 2.96 3.32 3.33విద్యుత్ డిమాండ్ (మెగావాట్లలో)జిల్లా 6 7 8 9 హనుమకొండ 303.76 313.74 315.84 314.23 వరంగల్ 277.39 304.21 300.72 312.6 జనగామ 345.02 354.10 367.59 374.75 మహబూబాబాద్ 392.7 381.21 395,25 427.14 భూపాలపల్లి 152.5 144.80 193.73 202.23 ములుగు 161.11 164.53 179.34 193.49 -
అభివృద్ధి పనుల్లో నాణ్యత ఉండాలి
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల్లో నాణ్యత ఉండాలని వీసీ కె. ప్రతాప్రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం రిజిస్ట్రార్ వి రామచంద్రం, వివిధ విభాగాల ఆచార్యులతో కలిసి యూనివర్సిటీ క్యాంపస్లో పద్మాక్షి మహిళా హాస్టల్ భవనంలో నిర్మిస్తున్న డైనింగ్ హాల్, క్యాంటీన్ పక్కన రోడ్డు వద్ద నిర్మిస్తున్న సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్సెంటర్ భవనం నిర్మాణం, ఇంజనీరింగ్ కళాశాల సెమినార్హాల్, కంప్యూటర్ సెంటర్ పరిశీలించారు. ఆయా పనులు నాణ్యతతోపాటు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అలాగే, కెహబ్లో కొనసాగుతున్న పనుల పురోగతిని పరిశీలించి పలు సూచనలు చేశారు. రూసానోడల్ అధికారి ఆర్. మల్లికార్జున్రెడ్డి, పూర్వ అభివృద్ధి అఽధికారి ఎన్.వాసుదేవరెడ్డి, అభివృద్ధి అధికారి వై. వెంకయ్య, యూనివర్సిటీ ఇంజనీర్ శంకరయ్య, పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, హాస్టళ్ల డైరెక్టర్ పి. శ్రీనివాస్, కేయూ అవెన్యూప్లాంటేషన్ ఇన్చార్జ్ బి. వెంకటగోపినాథ్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ రమణ, పబ్లికేషన్ సెల్ విభాగం అసిస్టెంట్ రిజిస్ట్రార్ నర్సింహాచారి తదితరులు పాల్గొన్నారు. కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి -
బంగారం తాకట్టులో ఉన్నట్లు నకిలీ పత్రం సృష్టించి మోసం
హన్మకొండ చౌరస్తా: బంగారం తాకట్టులో ఉందని నకిలీ పత్రం సృష్టించి ఓ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీని మోసం చేసిన నిందితులను గురువారం హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ కొత్తూరుజెండా ప్రాంతానికి చెందిన ఏలిమి సంతోష్ హనుమకొండ మిషనరీ ఆస్పత్రి పక్కన ఎటుజెడ్ కాంప్లెక్స్లో శ్రీమాన్ కోఆపరేటివ్ క్రెడిట్ యూనియన్ చైర్మన్గా కొనసాగుతున్నాడు. ములుగుకు చెందిన వడ్డేపల్లి రంజిత్ ఆన్లైన్ బెట్టింగ్లతో ఆర్థికంగా నష్టపోయాడు. వీరద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి సుమారు 640 గ్రాముల బంగారం శ్రీమాన్ కోఆపరేటివ్ క్రెడిట్ యూనియన్లో తాకట్టులో ఉన్నట్లు చూపిస్తూ నకిలీ రసీదు తయారు చేసి నమ్మించారు. అయితే బంగారాన్ని ప్రత్యక్షంగా పరిశీలించకుండానే ఓ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధి తన బ్యాంకు నుంచి ఆర్టీజీఎస్ ద్వారా రూ.59.30 లక్షలు శ్రీమాన్ కోఆపరేటివ్ క్రెడిట్ యూనియన్ ఖాతాకు బదిలీ చేశారు. అనంతరం నకిలీ తాకట్టు పత్రమని తెలుసుకున్న సదరు గోల్డ్ కంపెనీ ప్రతినిధులు పోలీసులకు చెబుతామని హెచ్చరించారు. దీంతో నిందితులు ఖాతాలోని నగదును ఇతర అవసరాలకు మళ్లించారు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, ప్లెడ్జ్(తాకట్టు) కాపీని స్వాధీనం చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ వెల్లడించారు. అంతేకాకుండా ఈ మోసంలో ఇంకెవరికై నా ప్రమేయం ఉందా, ఇదే తరహాలో ఇతర గోల్డ్ ఫైనాన్స్ సంస్థలను మోసం చేశారా అనే కోణాల్లో కూడా విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఇద్దరు నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన పోలీసులు -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
ఖిలా వరంగల్: వరంగల్ ఆరెపల్లి శివా రు ములుగు రోడ్డుపై అగ్రికల్చర్ క ళాశాల సమీపంలో ఈనెల 8న తెల్ల వారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నల్లగుట్ట తండాకు చెందిన వాంకుడోతు అశోక్ (25) ఫొటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. అశోక్, సోనియా దంపతులు హనుమకొండలోని జులైవాడలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఈనెల 7న ఫొటో షూట్ ఉందని చెప్పిన అశోక్.. తన స్నేహితుడు సోహెల్ అంబులెన్స్లో వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి రాలేదు. ఉదయం సోనియా భర్త అశోక్కు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో భర్త కనిపించడం లేదని 8వ తేదీన సోనియా సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈక్రమంలో గురువారం ఉదయం ఆరెపల్లి గ్రామ శివారు అగ్రికల్చర్ కళాశాల సమీపాన బైక్ పడిపోయి ఉండగా.. ఓ యువకుడు మృతి చెంది ఉన్నాడని సోనియాకు ఓ వ్యక్తి కాల్ చేసి చెప్పాడు. దీంతో ఆమె వెంటనే ఘటనాస్థలికి చేరుకుని భర్త అశోక్ మృతదేహంగా గుర్తించింది. ఫొటో షూట్కు వెళ్లి తిరిగి బైక్పై వస్తున్న క్రమంలో రోడ్డు పక్కన గ్రానెట్ను ఢీకొని మృతి చెందినట్లు రోదిస్తూ తెలిపింది. ఈ ఘటనపై మృతుడి భార్య సోనియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏనుమాముల ఇన్స్పెక్టర్ జవ్వాజి సురేశ్ తెలిపారు. భువనగిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వనపర్తి యువకుడు.. లింగాలఘణపురం : బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్ వెళ్లి ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ కుటుంబ సమస్యలపై గ్రామానికి వచ్చిన యువకుడు.. తిరిగి బైక్పై హైదరాబాద్ వెళ్తుండగా భువనగిరి ఎల్లమ్మగుడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం వనపర్తి గ్రామానికి చెందిన గండి రామయ్య, మరియా దంపతులు కుమారుడు యశ్వంత్(23) హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నా డు. గ్రామంలో భూమి పంపకాలు, ఇతర కుటుంబ విషయాలపై మాట్లాడుకునేందుకు హైదరాబాద్ నుంచి ఈ నెల 8న గ్రామానికి వచ్చాడు. పని పూర్తయిన అనంతరం బుధవారం బైక్పై తిరిగి హైదరాబాద్ వెళ్తున్నాడు. భువనగిరిలో ఆటో తగలడంతో కిందపడ్డాడు. ఈ ఘటనలో తలకు తీవ్ర గా యాలయ్యాయి. వెనుక కొద్ది దూరం తేడాతో బైక్పై వస్తున్న మృతుడి చిన్నాన్నా, ఇతర కుటుంబ సభ్యులు గాయాలై రోడ్డుపై పడిన యశ్వంత్ను గుర్తించి వెంటనే సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. దీంతో ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. చికిత్స పొందుతున్న హోంగార్డు మృతి మామునూరు: వరంగల్ – ఖమ్మం జాతీ య రహదారిపై టీజీఎస్పీ నాలుగో బెటా లియన్ వద్ద రోడ్డు దాటుతున్న నాలుగో బెటాలియన్ హోంగార్డు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం చెన్నారానికి చెందిన గట్టి కొప్పుల సుధాకర్ (56)ను కా రు ఢీకొంది. దీంతో అతనికి తీవ్ర గాయాలు కాగా, ఎంజీఎంలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతుడికి భార్య మంగమ్మ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. రోడ్డు పక్కన మృతదేహం ఆలస్యంగా గుర్తింపు సుబేదారి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు -
లైసెన్స్ లేకుండా ఔషధాల నిల్వలు
జనగామ రూరల్: చెల్లుబాటయ్యే డ్రగ్ లైసెన్స్ లేకుండా ఔషధాలను నిల్వ చేసి విక్రయిస్తున్న అర్హ త లేని గ్రామీణ వైద్యుడి(ఆర్ఎంపీ)పై గురువారం క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు జిల్లా ఔషధ ని యంత్రణ శాఖ అధికారి బాలకృష్ణ తెలిపారు. జనగామ మండలం ఎర్రగొల్లపహాడ్లో నిర్వహించిన తనిఖీల్లో విక్రయానికి నిల్వ ఉంచిన 40 రకాల ఔషధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి అంచనా విలువ రూ.2,1 0,540గా ఉంటుందని వెల్లడించారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు వరంగల్ జోన్ సహాయ సంచాలకులు రాజ్యలక్ష్మి పర్యవేక్షణలో జనగామ, భూపాలపల్లి జిల్లాల డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఏలె బాలకృష్ణ, పి.పావని సహకారంతో గ్రామానికి చెందిన ఆర్ఎంపీ పన్నీరు రమేశ్ ఇంట్లో తనిఖీ నిర్వహించారు. ఇందులో చెల్లుబాటయ్యే డ్రగ్ లైసెన్స్ లేకున్నా నిల్వ చేసిన 40 రకాల మందులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో యాంటీ బయోటిక్స్, స్టెరాయిడ్స్, రక్తపోటు నియంత్రణ మందులు, ఇతర ఔషధాలు, యాంటీ అల్సర్ మందులు, దగ్గు సిరప్లు, నొప్పి నివారణ మందులు తదితర ఔషధాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం రమేశ్పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు వివరించారు. తెలిపారు. లైసెన్స్ లేకుండా ఔషధాలు నిల్వ చేయడం, విక్రయించడం చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు. రూ.2.10 లక్షల విలువైన మందులు స్వాధీనం అర్హత లేని గ్రామీణ వైద్యుడిపై కేసు -
ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేయాలి
● రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు శ్వేత పాలకుర్తి టౌన్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు కృషి చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు, ఐలమ్మ మునిమనువరాలు చిట్యాల శ్వేత అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో గురువారం ఐలమ్మ 41వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి చిట్యాల శ్వేత పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశ్ముఖ్ల ఆగడాలను ఎదురించిన వీరనారి ఐలమ్మ అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ(ఎంఎల్)లిబరేషన్, రజక సంఘం నాయకులు పోగు శ్రీనివాస్, పసునూరి నవీన్, చిట్యాల సోమన్న, గుమ్మడిరాజుల సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు. కుమారుడిని దూరం చేశారని.. ● మనస్తాపంతో మహిళ ఆత్మహత్య పాలకుర్తి టౌన్ (దేవరుప్పుల) : కుమారుడిని తననుంచి దూరం చేశారని మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యయత్నానికి పాల్పడగా, చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది. ఈ ఘటన జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చౌడూరులో జరిగింది. దేవరుప్పుల హెడ్ కానిస్టేబుల్ రాజేందర్ కథనం ప్రకారం.. చౌడూరుకు చెందిన అమృతం ఆంజనేయులు కూతురు సునీత (28)కు 8 సంవత్సరాల క్రితం హైదరాబాద్కు చెందిన నల్ల సాయి అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ఒక సంవత్సరం తర్వాత బాబు జన్మించాడు. బాబు పుట్టిన కొన్ని రోజుల తర్వాత భర్త చనిపోయాడు. దీంతో పెద్ద మనుషులు ఆ బాబును మృతురాలి అత్తంటి వారు తీసుకునేలా తీర్మానం చేశారు. అప్పటినుంచి ఆమె బాబు కోసం మనోవేదనకు గురవుతూ ఉండేది. ఈ క్రమంలో సునీతకు 2024 సంవత్సరం డిసెంబర్లో దేవరుప్పుల మండలం మున్పహాడ్కు చెందిన నల్ల సతీశ్తో వివాహం జరిగింది. అయినా తన కుమారుడు లేడని మనస్తాపం చెందుతూనే ఉండేది. ఈ క్రమంలో తన తల్లిగారి ఊరు చౌడూరులో ఈ నెల 8వ తేదీన మాత్రలు వేసుకుని అపస్మారక స్థితిలో వెళ్లింది. గమనించిన ఆమె తండ్రి అమృతం ఆంజనేయులు వెంటనే వరంగల్ హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటనపై మృతురాలి మేనమామ గుడెల్లి సోమన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెడ్ కానిస్టేబుల్ రాజేందర్ తెలిపారు. ప్రాణం తీసిన చేపల వేట.. ● కుంటలో పడి యువకుడి మృతి కాజీపేట అర్బన్ : చేపల వేట ఓ యువకుడి ప్రాణం తీసింది. ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందాడు. ఈ ఘటన గురువారం కాజీపేట మండలం అమ్మవారిపేట కుంట వద్ద చోటు చేసుకుంది. మృతుడి తల్లి రోండ్ల రమ కథనం ప్రకారం.. కడిపికొండకు చెందిన రోండ్ల రమ కుమారుడు వెంకటేష్రెడ్డి(26) కూలీ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ తరచూ చేపలు పట్టేవాడు. రోజు మాదిరిగానే ఈనెల 8వ తేదీన కూలీకి వెళ్లాడు. అదే రోజు రాత్రి 9 గంటలకు ఫోన్ చేయగా ఇంటికి వస్తున్నట్లు తెలిపి రాలేదు. ఉదయం వరకు వేచి ఉండి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. ఆచూకీ కోసం తిరుగుతుండగా గురువారం రమ బంధువు శ్రీనివాస్రెడ్డి వచ్చి వెంకటేష్రెడ్డి బైక్ అమ్మవారిపేట కుంట వద్ద ఉందని తెలిపాడు. దీంతో తల్లి రమ అక్కడి వెళ్లి చూడగా వెంకటేష్రెడ్డి కుంటలో పడి చనిపోయాడు. చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోయి ఉంటాడని, తమకు ఎవరిపై అనుమానం లేదని తెలిపింది. ఈ ఘటనపై మడికొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పొలానికి నీరు పారించేందుకు వెళ్లి..
కేసముద్రం: పొలానికి నీరు పారించేందుకు వెళ్లిన ఓ రైతు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో జారిపడి మృతి చెందాడు. ఈ ఘటన గురువారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం బోడమంచ్యాతండాజీపీ శివారు గుడితండా సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గుడితండాకు చెందిన బోడ సూర్య(42) తనకున్న వ్యవసాయభూమిలో వరిపంట సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో పంటకు నీరు పారించేందుకు వ్యవసాయబావి వద్దకు వెళ్లి మోటారు ఆన్ చేశాడు. అనంతరం బావిలో నీరు అడుగంటి మోటారు శబ్దం వచ్చింది. దీంతో బావి వైపునకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి అందులో పడ్డాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం మానుకోట జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య అనిత, ఇద్దరు కుమారులు ఉన్నారు. ● బావిలో జారిపడి రైతు మృతి ● గుడితండాలో ఘటన -
కొత్త అధికారులు.. పాత సమస్యలు
సాక్షి, మహబూబాబాద్: మానుకోట.. గుడుంబా, బెల్లం వ్యాపారం, కల్తీ మద్యం అమ్మకాలకు చిరునామాగా ఉంటుంది. కాగా, గతంలో పనిచేసిన అధికారులకు జిల్లా పరిస్థితిపై అవగాహన ఉండడంతో ఎక్కడ ఏం జరుగుతుందో పసిగట్టేవారు.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు లక్ష్యాలు పూర్తి చేసేవారు. అయితే మూడు నెలల క్రితం కిందిస్థాయి అధికారులు, వారం రోజుల క్రితం జిల్లాలోని మిగిలిన అధికారులందరూ ఒకేసారి బదిలీ అయ్యారు. దీంతో మొత్తం కొత్త అధికారులు వచ్చి విధుల్లో చేరారు. ఈ క్రమంలో జిల్లాలో గుడుంబాను అరికట్టడం, బెల్లం అమ్మకాలను అడ్డుకోవడం వారికి సవాల్గా మారింది. అందరూ ఒకేసారి బదిలీ.. జిల్లాలోని ఎకై ్సజ్శాఖలో సుదీర్ఘకాలం పనిచేసిన అధికారులంతా ఒకేసారి బదిలీ అయ్యారు. మూ డు నెలల క్రితం జిల్లాలోని 42 మంది కానిస్టేబుళ్లు బదిలీ అయ్యారు. ఇక్కడ పనిచేసిన కానిస్టేబుళ్లు ఖమ్మం, భూపాలపల్లి, వరంగల్ ప్రాంతాలకు బదిలీపై వెళ్లగా.. ఆయా ప్రాంతాల్లో పనిచేసిన వారు ఇక్కడికి వచ్చారు. అదే విధంగా గ్రూప్–1 ఫలితాలు విడుదలైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పోస్టింగ్స్ ఇచ్చే క్రమంలో అప్పటికే విధుల్లో ఉన్న ఉన్నవారిని బదిలీ చేశారు. దీంతో జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బదిలీ కాగా భద్రాద్రి కొత్తగూడెం నుంచి కరంచంద్ ఇక్కడికి వచ్చారు. ఆయన ఇక్కడ సర్దుకోకముందే వారం రోజుల క్రితం జిల్లాలోని నలుగురు సీఐలు, ఐదుగురు ఎస్సైలు బదిలీ అయ్యారు. ఈక్రమంలో జిల్లాపై అవగాహన లేని అధికారులు ఇక్కడికి వచ్చారు. గుడుంబా, కల్తీ మద్యం కట్టడికి ఆరాటం గుడుంబా, కల్తీ మద్యం, బెల్లం అమ్మకాలను కట్టడి చేసేందుకు జిల్లా ఎకై ్సజ్ అధికారులు ఆరాటపడుతున్నారు. కొత్తగా అధికారులకు జిల్లాపై పూర్తిస్థాయిలో అవగాహన వచ్చేవరకు సమష్టి తనిఖీలు చేసేందుకు ఆశాఖ సిద్ధమైంది. జిల్లా అధికారులు రోజువారీగా చేసే దాడులతోపాటు వారంలో రెండు సార్లు జనరల్ రైడ్స్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది. దీంతో అసిస్టెంట్ కమిషనర్, జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్, స్థానిక సీఐ ఇతర అధికారులు నాలుగు వాహనాల్లో తండాలను చుట్టిముట్టి వస్తున్నారు. ఈ దాడులతో మంచి ఫలితాలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నా.. వాళ్లు తనిఖీలు వెళ్లే సమాచారం ముందస్తుగా తెలిసిపోతుందని, అందుకోసమే ఆశించిన స్థాయిలో బెల్లం, గుడుంబా పట్టుబడడం లేదనే ప్రచారం జరుగుతోంది. కాగా, జిల్లాకు కొత్తగా వచ్చిన ఎకై ్స జ్ అధికారులకు ఇక్కడ పరిస్థితిని చక్కబెట్టడం సవాల్గా మారింది. దాడులు ముమ్మరం చేస్తున్నాంగుండుబా, నల్లబెల్లం, కల్తీ మద్యం అమ్మకాలను కట్టడి చేసే ందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. వారంలో రెండు రోజులు జనరల్ రైడ్ చేస్తున్నాం. పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేయడం, జరిమానా విధించడం వంటి చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో బెల్లం రవాణా, గుడుంబా తయారీకి పాల్పడితే సహించేది లేదు. – కరంచంద్, జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ఎకై ్సజ్శాఖలో అంతా కొత్త ముఖాలే గుడుంబా, కల్తీ మద్యం కట్టడికి ఆరాటం జిల్లా పరిస్థితులపై అవగాహన లేక ఇబ్బందులు తనిఖీలు చేసినా పట్టుబడని అక్రమ వ్యాపారులు -
ఘట్కేసర్ నుంచి కాజీపేట వరకు మల్టీట్రాకింగ్ పనులు
కాజీపేట రూరల్ : పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ఆధారంగా దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ జోన్లో రైల్వే కనెక్టివిటీ పెంచేందుకు కేంద్రం ప్రభుత్వం త్వరలో ఘట్కేసర్ నుంచి కాజీపేట వరకు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్ పనులు ప్రారంభించనుంది. అజాదీకా అమృత్ మహోత్సవ్ మల్టీట్రాకింగ్ ప్రాజెక్ట్లో భాగంగా ఘట్కేసర్ నుంచి కాజీపేట జంక్షన్ వరకు 110 కి.మీ. మేర పనులు చేపట్టేందుకు త్వరలో టెండర్ పిలవనుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ బుధవారం తెలిపారు. ప్రధాని మోదీ అధ్యక్షతన క్యాబినెట్ ఈ ప్రాజెక్ట్ను ఆమోదించినట్లు పేర్కొన్నారు. 2029–30 వరకు ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయనున్నట్లు తెలిపారు. రూ.10,021 కోట్లతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ఇండియన్ రైల్వే నెట్వర్క్లో ట్రాక్ విస్తరణ 540 కి.మీ, మేర పెంచేందుకు కేంద్రం నిర్ణయించిందని వివరించారు. యాదాద్రి వరకు వచ్చిన 3వ లైన్ నిర్మాణం, మల్టీట్రాకింగ్లో భాగంగా కాజీపేట–ఘట్కేసర్ వరకు ఉన్న 2 లైన్ల సామర్థ్యాన్ని 3,4 లైన్లు పెంచునుంది. దీంతో కాజీపేట వరకు నాలుగు లైన్ల నిర్మాణం కానుంది. రవాణ సౌలభ్యం, ఉద్యోగాలు, పర్యాటక అనుసంధానం పెంపొందించేందుకు కేంద్రం ఈ ప్రాజెక్ట్ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. యాదగిరిగుట్ట (యాదాద్రి), భువనగిరి బోంగిర్కోట, సురేంద్రపురి, స్వర్ణగిరి ఆలయం వంటి ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. ఈ ప్రాజెక్ట్తో ప్రజలు, వ్యాపారులు, పర్యాటక రంగానికి ప్రయోజనం కలగనుంది. తెలంగాణ రైల్వే అభివృద్ధికి భారీ ఊతం తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోవడంపై వరంగల్ ఎంపీ కడియం కావ్య బుధవారం హర్షం వ్యక్తం చేశారు. గతంలో కేంద్ర రైల్వే మంత్రిని కలిసి మల్టీట్రాకింగ్ పనులు చేపట్టాలని కోరామన్నారు. ఈ మేరకు ఘట్కేసర్, కాజీపేట మధ్య 110 కి.మీ. మేర మల్టీట్రాకింగ్ ప్రాజెక్ట్కు ఆమోదం లభించిందన్నారు. ఈ ప్రాజెక్ట్తో పర్యాటక రంగం అభివృద్ధితో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయన్నారు. దీనిపై రాష్ట్ర ప్రజల తరుఫున ప్రధాని మోదీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు ఎంపీ కావ్య కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ప్రారంభించనున్న కేంద్ర ప్రభుత్వం -
సన్న వరి వంగడాల ఆన్లైన్ తప్పనిసరి
మహబూబాబాద్ రూరల్ : వానాకాలం–2026 సీజన్కు సంబంధించి ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఏడు రకాల సన్న వరి వంగడాల ఆన్లైన్ నమోదు ప్రక్రియ నేటి(గురువారం)తో ముగియనుంది. నమోదు చేసిన వివరాలను పౌర సరఫరాల విభాగానికి పంపుతామని, నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రాధాన్యతతో పాటు, క్వింటాకు రూ.500 బోనస్ పొందే అర్హత ఉంటుందని వ్యవసాయ అధికారులు స్పష్టం చేశారు. విత్తన వివరాల నమోదు.. డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేసిన రైతుల వివరాలను సంబంధిత డీలర్లే పోర్టల్లో నమోదు చేయాలి. సొంత, ఇతర రైతుల విత్తనాలు.. సొంత విత్తనాలు లేదా తోటి రైతుల నుంచి విత్తనాలు పొంది సాగు చేస్తున్న రైతులు సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అధికారుల ధ్రువీకరణ.. వ్యవసాయ శాఖ ఏఈఓలు నమోదు ప్రక్రియను పూర్తి చేయగా.. ఏఓలు 100శాతం వివరాలను ధ్రువీకరించాల్సి ఉంటుంది. కాగా, నమోదు, ధుృవీకరణ ప్రక్రియ అంతా నేటితో పూర్తి కావాలి. ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని కోల్పోకుండా గ్రామపంచాయతీలు, రైతు వేదికలు, వాట్సాప్ గ్రూపుల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాం. సన్న వరి వంగ డాలు సాగు చేసిన రైతులందరూ వెంటనే తమ వివరాలు నమోదు చేయించుకోవాలి. – ఎస్.విజయచంద్ర, డీఏఓ వరి వంగడాలు ఆన్లైన్ చేసే విధాన చిత్రం నేటితో ముగియనున్న గడువు -
ఎంఎల్హెచ్పీల సర్టిఫికెట్ల పరిశీలన
నెహ్రూసెంటర్: వైద్య ఆరోగ్యశాఖలో ఎంఎల్హెచ్పీ వైద్యుల సర్టిఫికెట్లను ఆ శాఖ అధికారులు బుధవారం పరిశీలించారు. జిల్లాలో రెండేళ్లక్రితం ఎంఎల్హెచ్పీల రిక్రూట్మెంట్ జరిగింది. అయితే అప్పుడు అవకతవకలు జరిగాయని ఫిర్యాదు రాగా మరోసారి సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా, ఎంఎల్హెచ్పీ ఉద్యోగాల భర్తీలో సుమారు 95మందికిపైగా ఉద్యోగాలు సాధించారని, వారందరి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయాలని ఆదేశాలు వచ్చాయని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ తెలిపారు. సర్టిఫికెట్ల పట్ల అనుమానం కలిగితే సంబంధిత బోర్డు ద్వారా తెలుసుకుంటామని డీఎంహెచ్ఓ వివరించారు. కాగా, గతంలో నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగం పొందిన వారిని విధుల నుంచి తొలగించిన సంఘటనలు ఉన్నాయి. అలాగే పోస్టు లేకుండానే ఉద్యోగం ఇచ్చిన ఘటనలు ఉన్నాయి. నియామకంలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదు -
జారీలో జాప్యం
మానుకోట మున్సిపాలిటీలో సక్రమంగా అమలు కాని సిటిజన్ చార్ట్మహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీలో సిటిజన్ చార్ట్ సక్రమంగా అమలు కావడం లేదు. సిటిజన్ చార్ట్ బోర్డులో 21రకాల సర్టిఫికెట్లు, అనుమతులు ఇచ్చే గడువు పొందుపర్చి ఉంటాయి. ఈమేరకు దరఖాస్తుదారులు ప్రశ్నిస్తారని, వాదిస్తారని అధికారులు బోర్డు కనపడకుండా మూలన ఏర్పాటు చేశారు. అలాగే ప్రక్రియ అంతా ఆన్లైన్ కావడంతో అధికారులు పలు దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. దీంతో లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. సర్టిఫికెట్లు, అనుమతుల కోసం దరఖాస్తుదారులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. 21 అంశాలు.. సిటిజన్ చార్ట్ బోర్డులో 21 అంశాలు నమోదై ఉంటాయి. ఇంటి నంబర్కు 15 రోజుల్లో అనుమతి ఇవ్వాలి. మ్యుటేషన్కు 15 రోజులు, ఖాళీస్థలం పన్ను, 15 ట్రేడ్లైసెన్స్లకు వెంటనే, నల్లా కనెక్షన్కు 14 రోజులు, జనన, మరణ ధ్రువ పత్రాలు 21రోజులు, బై నంబర్లకు 15 రోజుల్లో సరిఫికెట్లు జారీ చేయాలి. ఆ బోర్డులో పొందుపర్చిన విధంగా గడువు లోపు సర్టిఫికెట్లు జారీ చేయాల్సి ఉంది. రెండు ఇళ్ల అనుమతులు మాత్రమే పెండింగ్.. ఆన్లైన్ ప్రక్రియ కావడంతో ఏ సెక్షన్కు సంబంధించిన దరఖాస్తులు పెండింగ్లో లేవని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. కేవలం రెండు ఇళ్ల అనుమతులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ట్రేడ్ లైసెన్స్, ఇంటి నంబర్ల విషయంలో పెద్ద సమస్య ఉందని, వాటి మంజూరులో మాత్రమే ఆలస్యమవుతుందని చెబుతున్నారు. చాలా వరకు తిరస్కరణ.. ఆన్లైన్ ప్రక్రియ కావడంతో సంబంధిత ఉన్నతాధికారులతో సమస్య ఉంటుందని చాలా దరఖాస్తులను పలు కారణాలతో తిరస్కరిస్తున్నారు. దీంతో పెండింగ్లో ఉన్నట్లు కనిపించడం లేదు. అన్ని గడువులోగా క్లియర్ చేస్తున్నాం సర్టిఫికెట్లు, అనుమతుల తదితర విషయాల్లో వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తున్నాం. ప్రస్తుతం ఏమీ పెండింగ్లో లేవు. ఇంటి నంబర్ల విషయంలో ఆచితూచి అనుమతులు ఇవ్వాల్సి వస్తోంది. ఇంటి నంబర్ల సమస్య మాత్రం ఉంది. – ఎం.వినోద్కుమార్, మున్సిపల్ కమిషనర్ సకాలంలో అందని సర్టిఫికెట్లు మున్సిపల్ కార్యాలయం చుట్టూ ప్రజల ప్రదక్షిణలు ఆన్లైన్ ప్రక్రియలో అధికారుల జిమ్మిక్కులు పలు కారణాలతో దరఖాస్తుల తిరస్కరణ లక్ష జనాభా.. మానుకోటకు సమస్యల కోటగా పేరుంది. ప్రభుత్వ భూమి ఎక్కువగా ఉండడంతో సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ స్థలాల్లో అధిక సంఖ్యలో గృహాల నిర్మాణాలు జరిగాయి. అనుమతులు, ఇంటి నంబర్ల మంజూరు విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా 65,712 మంది ఓటర్లు ఉన్నారు. ఉద్యోగం, విద్య, వ్యాపారం రీత్యా మానుకోటలో నివాసం ఉండే వారితో కల్పితే లక్ష జనాభా దాటుతుంది. -
గర్భాలయ నిర్మాణానికి కనిపించని గట్టినేల
కాళేశ్వరం : రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ఆలయ పునర్నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. రూ.198 కోట్ల వ్యయంతో నిర్మాణాల పనులు ముమ్మరమయ్యాయి. విజయ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీశుభానందాదేవి అమ్మవార్ల ఆలయాల పునాది పనులు, ప్రాకారాల కాంక్రీట్ పనులు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ఆలయం గర్భగుడికి పునాది కోసం 12 ఫీట్ల మేర లోతు మట్టి తీసినప్పటికీ గట్టినేల తగలలేదు. మరో రెండు ఫీట్ల మేర తవ్వినా గట్టి మట్టి రాలేదని తెలిసింది. దీనికితోడు 1978–83 మధ్య కాలంలో నిర్మించిన పాత ఆలయానికి సంబంధించిన జోడు లింగాలు (కాళేశ్వరముక్తీశ్వరుడు) పావట్టం గోడలకు ఉన్న పునాది మట్టి దక్షిణం వైపునకు కూలుతుండడంతో ఇసుకను సంచుల్లో నింపి సపోర్టుగా అమర్చారు. ఈవిషయమై అధికారులు కాంట్రాక్టర్ తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనిపై ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు తర్జనభర్జన పడుతున్నారని సమాచారం. గట్టి మట్టి లేకపోవడంతో కాంట్రాక్టర్.. పునాది కోసం ఇసుక పోసి సిమెంట్ కాంక్రీట్తో పనులు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నిర్మాణ పనులను బుధవారం ఎస్ఈ రమేష్ బాబు, డీఈ దేవేందర్ పరిశీలించారు. -
ఎయిడ్స్ నియంత్రణలో సమన్వయంతో పనిచేయాలి
గీసుకొండ : ఎయిడ్స్ నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి. రాజారెడ్డి సూచించారు. బుధవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ఐసీటీసీ సిబ్బంది మరింత చురుగ్గా పనిచేసి హెచ్ఐవీ స్క్రీనింగ్ శాతాన్ని పెంచాలని ఆదేశించారు. జిల్లాకు చెందిన హెచ్ఐవీ కేసులు ఇతర ప్రాంతాల్లో నమోదుకాకుండా గుర్తించి ఇక్కడే వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. ఎన్జీఓలు ప్రజల్లో ఎయిడ్స్పై అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ఐఈసీ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. హెచ్ఐవీ నిర్ధారణ అయిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచాలని, వారికి అవసరమైన కౌన్సెలింగ్, చికిత్సను ఏఆర్టీ కేంద్రాల ద్వారా నిరంతరం అందించాలని సూచించారు. హనుమకొండ జిల్లా ప్రోగ్రాం అధికారి మధన్ మోహన్ రావు, డీపీఎం స్వప్న మాధురి, డేటా మేనేజర్ కమలాకర్, డిప్యూటీ డెమో ఎస్. వెంకటేశ్వర్లు, వివిధ ఎన్జీఓల ప్రతినిధులు, ఐసీటీసీ, ఏఆర్టీ సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వరంగల్ డీఎంహెచ్ఓ రాజారెడ్డి -
విద్యార్థులు సైన్స్పై పట్టు సాధించాలి
మహబూబాబాద్ అర్బన్: విద్యార్థులు చదువుతో పాటు సైన్స్పై పట్టు సాధించాలని జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి మందుల శ్రీరాములు అన్నారు. మానుకోట మున్సిపల్ పరిధిలోని అనంతారం మోడల్ స్కూల్లో బుధవారం జిల్లాస్థాయి సైన్స్ డ్రామా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మందుల శ్రీరాములు మాట్లాడుతూ.. విద్యార్థులు శాసీ్త్రయ అంశాలు, సామాజిక స్పృహ కలిగి నాటక ప్రదర్శనలు చేయడం అభినందనీయమన్నారు. విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధ్యాయులు పాఠశాలస్థాయి నుంచే విద్యార్థులను వివిధ రంగాల్లో తీర్చిదిద్దాలన్నారు. అనంతరం విజేతలకు ప్రశంసపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, పాఠశాల ప్రిన్సిపాల్ ఉపేందర్రావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పేదలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యంగూడూరు: మారుమూల ప్రాంతాల పేదలకు వైద్య సేవలందించడమే లక్ష్యమని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని సీహెచ్సీ ఆవరణలో బుధవారం ఓఎన్జీసీ సంస్థ సహకారంతో అందించిన రూ.కోటి విలువైన నాలుగు అంబులెన్స్లను ఆయన ప్రారంభించారు. మహబూబాబాద్కు రెండు అంబులెన్స్లు, నెల్లికుదురుకు ఒకటి, గూడూరుకు ఒకటి కేటాయించారు. సీహెచ్సీ సూపరింటెండెంట్ వీరన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ రవిరాథోడ్, తహసీల్దార్ నాగభవాని, ఓఎన్జీసీ హెచ్ఆర్ ఎం.శ్రీనివాస్గౌడ్, ఓఎన్జీసీ ఏఎస్ఎం కేవీకే రాజురావు, సాత్విక్, రూరల్ అండ్ యూత్ ఇంటిగ్రేటెడ్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు లింగాల సుధీర్రెడ్డి, మేరెడ్డి సురేందర్ తదితరులు పాల్గొన్నారు. బీసీ హాస్టల్ ఆకస్మిక తనిఖీనర్సింహులపేట: మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ను బుధవారం సాయంత్రం మండల ప్రత్యేకాధికారి, డీపీఓ రేవంత్ ఆకస్మికంగా తని ఖీ చేశారు. హాస్టల్లో వసతులు, తాగునీరు, మరుగుదొడ్లు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు వండుతున్న వంటను పరిశీలించి, స్టాక్ రిజిస్టర్ను తనిఖీ చేశారు. హాస్టల్ సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఆదేశించారు. అనంతరం నోట్బుక్స్, బెడ్సీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఎల్పీఓ పుల్లారావు, ఎంపీడీఓ రాంప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. మార్కెట్కు సెలవులుమహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు పరిధిలో నాలుగు రోజులపాటు క్రయవిక్రయాలు బంద్ ఉంటాయని ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ బుధవారం తెలిపారు. శుక్రవారం అమావాస్య, శని, ఆదివారాలు వారాంతపు సెలవులు, ఈనెల 14న వినాయక చవితి సందర్భంగా వ్యవసాయ మార్కెట్ బంద్ ఉంటుందన్నారు. మళ్లీ మంగళవారం నుంచి మార్కెట్ పరిధిలో క్రయవిక్రయాలు యథా విధిగా జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. మల్బరీ సాగుపై రైతులకు అవగాహన కేసముద్రం: మండలంలోని కోరుకొండపల్లి గ్రామంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ ఆధ్వర్యంలో ‘నా పట్టు–నా అభిమానం 2.0’ కార్యక్రమంలో భాగంగా మల్బరీ సాగు, పట్టు పురుగుల పెంపకంపై బుధవారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కేంద్ర సిల్క్బోర్డు కర్టాటక రాష్ట్రానికి చెందిన మైసూర్ శాస్త్రవేత్త జె.శ్రీకాంత్నాయక్, సహాయ పట్టు పరిశ్రమ అధికారి కె.సురేశ్ మాట్లాడుతూ.. పంట మార్పిడి ద్వారా మార్కెట్లో డిమాండ్ ఉన్న మల్బరీసాగు చేపట్టి, ఎకరానికి రూ.2లక్షల మేరకు ఆదాయం పొందవచ్చన్నారు. ప్రతీ గ్రామంలో కనీసం 50ఎకరాల్లో మల్బరీ సాగు చేయాలని రైతులకు వారు సూచించారు. -
తెలంగాణ జీవన విధానానికి నిలువుటద్దం ‘కాళోజీ’
హన్మకొండ: తెలంగాణ భాష, యాస, సంస్కృతి, జీవన విధానానికి కాళోజీ నారాయణరావు నిలువుటద్దమని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో కాళోజీ నారాయణరావు జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ విగ్రహానికి సీఎండీ, డైరెక్టర్లు, అధికారులు పూలమాల వేసి నివాళుర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల జీవితాలు, వారి సమస్యలను తన రచనల ద్వారా ప్రతిబింబిస్తూ సామాజిక చైతన్యానికి కృషి చేసిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు అన్నారు. ఆయన తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. డైరెక్టర్లు వి.తిరుపతి రెడ్డి, సి.ప్రభాకర్, సి.ఈలు అన్నపూర్ణ, మల్లికార్జున్, సీజీఎంలు చరణ్ దాస్, కిషన్, వేణుబాబు, జీఎంలు హేమంత్ కుమార్, వెంకట కృష్ణ, అనిల్ రెడ్డి, జయరాజ్, విజేందర్ రెడ్డి, బాబురావు, అమర్నాథ్, శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
భూసర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్ బయ్యారం: భూసర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మండలంలోని గంధంపల్లి రెవెన్యూ గ్రామంలో కొనసా గుతున్న భూసర్వేను బుధవారం కలెక్టర్ పరిశీలించారు. అనంతరం సర్వే బృందాలు నిర్వహిస్తున్న రోవర్ల వినియోగం, హద్దుల గుర్తింపు, డిజిటల్ మ్యాపింగ్ ప్రక్రియ, ఫీల్డ్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ సర్వే బృందంతో మాట్లాడుతూ.. సరిహద్దు వివాదాలకు తావులేకుండా భూ యజమానుల సమక్షంలోనే కచ్చితమైన కొలతలు నిర్వహించాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ రికార్డులను పారదర్శకంగా నమోదు చేయాలన్నారు. నిధులు విడుదల చేయాలని వినతి.. కొత్తపేట పంచాయతీ పరిధిలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన మోటారు, పైపులైన్కు నిధులు విడుదల చేయాలని కలెక్టర్కు సర్పంచ్ ప్రవీణ్నాయక్ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, సర్వేయర్ శివ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాగొంతుక ‘కాళోజీ’
● కేయూ వీసీ ప్రతాప్రెడ్డికేయూ క్యాంపస్: ప్రజాకవి కాళోజీ.. ప్రజాగొంతుకని, అన్యాయాన్ని ప్రశ్నించిన ఆయన కలం నేటి తరానికి కూడా స్ఫూర్తి అని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్రెడ్డి అన్నారు. బుధవారం కేయూ పరిపాలన భవనం ప్రాంగణంలో నిర్వహించిన కాళోజీ నారాయణ రావు జయంతి సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాళోజీ వ్యక్తి కాదని, ప్రజాశక్తి అన్నారు. సామాజిక చైతన్యం రగిలించారన్నారు. కాళోజీ ఆలోచనలు, సిద్ధాంతాలు కేవలం తెలంగాణలోని ఓరుగల్లు ప్రాంతానికే పరిమితం కాలేదని, ఆయన రచనలు ప్రజల వాణిగా నిలిచా యని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి కాళోజీ రచనలు, ఆలోచనలు స్ఫూర్తినిచ్చాయన్నారు. తొలుత కాళోజీనారాయణ రావు చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఓఎస్డీ బి. వెంకట్రాంరెడ్డి, కేయూ పాలకమండలి సభ్యులు బి. సురేశ్లాల్, డాక్టర్ చిర్రరాజు, ఆచార్యులు పి. మల్లారెడ్డి, జి. హనుమంతు, డాక్టర్ సోమయ్య, డాక్టర్ సదాశివ్, డాక్టర్ మామిడి లింగయ్య పాల్గొన్నారు. -
రైస్ మిల్లర్లు సమ్మెలో పాల్గొనాలి
మహబూబాబాద్: జిల్లాలోని రైస్మిల్లర్లు మిల్లింగ్ కార్యకలాపాలను నిలిపివేసి సమ్మెలో పాల్గొనాలని రైస్మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వోలం కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. అసోసియేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ స్నేహ శబరీష్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వోలం కృష్ణమూర్తి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమ్మెలో జిల్లా రైస్మిల్లర్లు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. అధికారులు సీఎంఆర్ విషయంలో ఫిజికల్ వెరిఫికేషన్ చేసి వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. ఒత్తిడి లేకుండా ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా సీఎంఆర్ డెలివరీ చేయడానికి అవకాశం కల్పించాలన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రైస్ మిల్లర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. -
నత్తనడకన ‘ఇన్స్పైర్’..
విద్యారణ్యపురి : అన్ని యాజమాన్యాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్, యూపీఎస్లు, ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, గురుకులాల్లోని విద్యార్థుల్లో శాసీ్త్రయ, వైజ్ఞానిక ఆలోచనలు, సృజనాత్మకతను ప్రోత్సహించి వారిని భావిశాఽస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది ‘ఇన్స్పైర్ మనాక్’ అవార్డ్స్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 2026–2027 విద్యాసంవత్సరంలో విద్యార్థుల నుంచి నామినేషన్లు ఆహ్వానించే ప్రక్రియ ఈ ఏడాది జూలై 15 నుంచి ప్రారంభమైంది. నామినేషన్ల సమర్పణకు ఈనెల 15వ తేదీవరకు గడువు ముగియనుంది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో నామినేషన్ల లక్ష్యం చేరుకోలేదు. ఐదు జిల్లాల్లో నామినేషన్ల సమర్పణ నత్తనడకనే కొనసాగుతోంది. అర్హులు వీరే.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇన్స్పైర్ మనాక్ పురస్కారాలు పొందేందుకు అర్హులుగా ఉన్నారు. ఒక్కో పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టుల వరకు పంపొచ్చు. అందుకు ఉపాధ్యాయులు నామినేషన్లను సంబంధిత వెబ్సైట్లో హెచ్టీటీపీ//డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇన్స్పైర్అవార్డ్స్– డీఎస్టీ .గౌట్.ఇన్ సమర్పించాల్సింటుంది(నమోదు చేయాల్సింటుంది) ఎంపికై తే రూ. 10 వేల చొప్పున అందజేత నామినేషన్ ఇన్స్పైర్కు ఎంపికై తే దానిని పంపిన విద్యార్థికి రూ. 10 వేల చొప్పున ప్రోత్సాహకం ఇస్తారు. విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా జమచేస్తారు. తొలుత జిల్లా స్థాయిలో ఆతర్వాత ఎంపికై న వారికి రాష్ట్రస్థాయిలో,అందులో ఎంపికై తే జాతీయ స్థాయి వరకూ విద్యార్థులు తమలోని వైజ్ఞానిక ప్రతిభను ప్రధర్శించే వీలు కలుగుతుంది. అలాంటి ఇన్స్పైర్కు విద్యార్థులను ప్రోత్సహించి నామినేషన్లు నమోదు చేయించడంలో సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లా స్సైన్స్ అధికారులు కూడా తమ జిల్లాలో ఇన్స్పైర్పై సంబంధిత ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. అయినా వివిధ జిల్లాలో విద్యార్థుల నుంచి నామినేషన్ల నమోదు ప్రక్రియ ఇంకా నత్తనడకనే సాగుతోంది. జిల్లాల వారీగా వివరాలు.. జిల్లా పేరు స్కూళ్ల నామినేషన్ల నామినేషన్ల సంఖ్య టార్గెట్ మొత్తం హనుమకొండ 395 1,975 223 వరంగల్ 344 1.720 212 జనగామ 195 975 187 ములుగు 112 560 48 జేఎస్భూపాలపల్లి 131 655 83 మహబూబాబాద్ 233 1,165 1,044టార్గెట్కు దూరంగా ప్రాజెక్టుల నామినేషన్లు ప్రస్తుతం ఒక్క మహబూబాబాద్ జిల్లానే టాప్ మిగతా ఐదు జిల్లాలు లక్ష్యం చేరేనా ? ఈనెల 15వ తేదీ వరకే గడువు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇన్స్పైర్ మనాక్ పురస్కారాలకు విద్యార్థుల నుంచి నామినేషన్లను నమోదు చేసుకున్న సంఖ్యను ఈనెల 8వ తేదీ వరకు పరిశీలిస్తే ఆరు జిల్లాలు కూడా టార్గెట్ చేరుకోలేదు. కానీ మహబూబాబాద్ జిల్లా మాత్రం 1,044 నామినేషన్తో రాష్ట్రంలోనే టాప్గానే నిలిచింది. ఈజిల్లాకు టార్గెట్ మాత్రం 1,165 చేయాల్సింది. లక్ష్యానికి దగ్గరగానే ఉంది. మిగతా ఐదుజిల్లాలు హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, జయశంకర్ భూపాలపల్లిలో మాత్రం నత్తనడకనే లక్ష్యానికి బహు దూరంగానే ఉన్నాయి. ఇప్పటికై నా సంబంధిత జిల్లాల ఉపాధ్యాయులు చొరవ తీసుకుని విద్యార్థులను ప్రోత్సహిస్తూ నామినేషన్ల నమోదుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా సైన్స్ అధికారులు కోరుతున్నారు.గత విద్యాసంవత్సరంలో 2025–2026లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు 433 ఇన్స్పైర్ అవార్డులు లభించాయి. ఆయా విద్యార్థులకు రూ 10వేల చొప్పున బ్యాంకు ఖాతాలో డబ్బులు జమఅయ్యాయి. ఆయా విద్యార్థులకు ఈఏడాది నవంబర్–డిసెంబర్లో ప్రతీజిల్లాలోనూ జిల్లాస్థాయి ఇన్స్పైర్ ఎగ్జిబిట్స్ ప్రాజెక్టుల ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ విద్యాసంవత్సరంలో 2026–2027లో ఎన్ని లభిస్తాయో వేచి చూడాల్సిందే. -
సీజీఆర్ఎఫ్ వరంగల్ చైర్మన్గా మాధవరావు
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్) వరంగల్ చైర్మన్గా కె.మాధవ రావు బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు చైర్మన్గా కొనసాగిన వేణుగోపాలాచారి పదవీ కాలం రెండు నెలల క్రితం ముగిసింది. అనంతరం టీజీ ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం కమర్షియల్ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్ నాగప్రసాద్కు సీజీఆర్ఎఫ్ చైర్మన్గా అదనపు బాధ్యతలు అప్పగించగా ఇప్పటి వరకు కొనసాగారు. కాగా, పూర్తి స్థాయిలో కె.మాధవ రావును నియమిస్తూ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేయగా ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కాగా, మాధవ రావుకు టీజీ ఎన్పీడీసీఎల్ జాయింట్ సెక్రటరీలు కె.రమేష్, ఎన్.శ్రీకృష్ణ, జీఎంలు గిరిధర్, పి.మనోహర స్వామి, ఎం.హేమంత్ కుమార్, శ్రీనివాస్ రావు, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఎట్టకేలకు దూరవిద్య ఎక్స్ అభ్యర్థులకు డిగ్రీ పరీక్షలుకేయూ క్యాంపస్: ఎట్టకేలకు కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య (ఎస్డీఎల్సీఈ ) ఎక్స్ అభ్యర్థులకు డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీఎస్సీ వార్షిక పరీక్షల టైంటేబుల్ను ఆ విభాగం అధికారులు బుధవారం విడుదల చేశారు. ఈఏడాది జనవరిలోనే ఆయా ఎక్స్ అభ్యర్థుల నుంచి దూరవిద్యాకేంద్రంలో సంబంఽధిత అధికారులు ఫీజులు తీసుకున్నా పరీక్షల నిర్వహణలో జాప్యం చేశారు. దీంతో ఆ అభ్యర్థులు కొంతకాలంగా నిరీక్షిస్తున్నారు. ఎట్టకేలకు పరీక్షల టైంటేబుల్ను విడుదల చేశారు. ఈనెల 21 నుంచి మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. ఈనెల 21,23, 25, 28, 30, అక్టోబర్ 3, 6 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. డిగ్రీ కోర్సుల సెకండియర్ పరీక్షలు ఈనెల 22, 24, 26, 29, అక్టోబర్ 1,5, 7వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారని కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజా తెలిపారు. ఫైనలియర్ వార్షిక పరీక్షలు ఈనెల 21,23, 25, 28, 30, అక్టోబర్ 3, 6, 8 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తారని తెలిపారు. చెక్ బౌన్స్ కేసులో ఒకరి రిమాండ్ మహబూబాబాద్ రూరల్ : చెక్ బౌన్స్ కేసులో ఒకరికి రిమాండ్ విధిస్తూ మహబూబాబాద్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అర్వపల్లి కృష్ణతేజ బుధవారం తీర్పు వెలువరించారు. కేసు వివరాలను న్యాయవాది ఎస్.కె.పాషా వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తట్టుపల్లి గ్రామానికి చెందిన సంగిరెడ్డి ఉపేంద్రమ్మ కుమారుడు రామ్మోహన్ రెడ్డి తనకు పరిచయం ఉన్న తొర్రూరు మండల కేంద్రానికి చెందిన బాధావత్ కిషన్కు రూ.4.69 లక్షలు నగదు అప్పుగా ఇచ్చారు. ఈ క్రమంలో కిషన్ తన పేరు మీద ఒక చెక్కును ఉపేంద్రమ్మ పేరిట రాసిఇవ్వగా ఆమె కొంతకాలానికి దానిని తన బ్యాంకు ఖాతాలో జమ చేసింది. చెక్కు ఇచ్చిన వ్యక్తి ఖాతాలో సరిపోను డబ్బులు లేకపోవు. దీంతో ఆ చెక్కు తిరస్కరణకు గురికాగా బాధితురాలు ఉపేంద్రమ్మ మహబూబాబాద్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఆమె పక్షాన న్యాయవాది పాషా వాదించగా ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన బాదావత్ కిషన్ పేరు మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఇందులో భాగంగా కిషన్ కోర్టులో రీకాల్ పిటిషన్ దాఖలు చేయగా దానిని అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అర్వపల్లి కృష్ణతేజ తిరస్కరించి అతడికి రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించారు. -
ఉద్యోగాల పేరుతో మోసం..
కాజీపేట : ఇన్కాం ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈమేరకు బుధవారం కాజీపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ శ్యాంసుందర్తో కలిసి వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన పాత నేరస్తుడు మెట్టు ప్రవీణ్కుమార్ జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఐటీ శాఖలో తనకున్న పరిచయాల ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకున్నాడు. గతంలో చాలా మందికి ప్రత్యేక కేటగిరీ కింద ఉద్యోగాలు ఇప్పించినట్లు ఫోర్జరీ పత్రాలు చూపించి నమ్మించే వాడు. నిరుద్యోగుల వద్ద రూ.లక్షల్లో వసూలు చేసి వారిని నమ్మించడానికి మెడికల్ టెస్ట్లు, పోలీస్ వెరిఫికేషన్ లాంటి పనులు చేసేవాడు. దాదాపు 10 మంది నిరుద్యోగుల వద్ద రూ.85లక్షల నగదు, 4 తులాల బంగారం, విద్యార్హత సర్టిఫికెట్లు తీసుకున్నాడు. అయితే బాధితులు ఉద్యోగాల కోసం అడగగా కాలయాపన చేయడంతోపాటు డబ్బులు కూడా ఇవ్వడం లేదు. దీంతో పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని నిజామాబాద్లో అరెస్ట్ చేసి వరంగల్ తీసుకొచ్చారు. నిందితుడి నుంచి కారు, ల్యాప్టాప్, రూ.2 లక్షల నగదు, రెండు ఫోన్లతోపాటు ఐదుగురు బాధితులకు సంబంధించిన విద్యార్హత సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి అరెస్ట్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన సీఐ శ్యాంసుందర్, ఏఏఓ సల్మాన్ పాషా, ఎస్సైలు మౌనికా రెడ్డి, శివకుమార్, తాళ్లపల్లి యాదగిరి, క్రైం పీసీలు వి.క్రాంతికుమార్, జి.కుమారస్వామిని ఏసీపీ అభినందిస్తూ నగదు పురస్కరాలు అందజేశారు. కాగా, ప్రవీణ్కుమార్పై రాష్ట్రంలోని దాదాపు 8 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నిందితుడి అరెస్ట్, రిమాండ్ వివరాలు వెల్లడించిన పోలీసులు -
ప్రేమ జంటలను బెదిరించి.. యువకుడిని చంపి
మామునూరు: నిర్మానుష్య ప్రాంతాల్లో ఏకాంతంగా ఉండే ప్రేమ జంటలను బెదిరించి, వీడియోలు తీసి డబ్బులు వసూలు చేస్తున్న ముఠా.. ఓ ఘర్షణలో యువకుడిని దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసింది. అడ్డు వచ్చిన మరో యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్కుమార్ తెలిపారు. బుధవారం వరంగల్ మామునూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మామునూరు ఏసీపీ వెంకటేష్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పర్వతగిరి ఇన్స్పెక్టర్ సంతోష్తో కలిసి వివరాలు వెల్లడించారు. వరంగల్ తిమ్మాపురం శివారు మంగలమ్మ కుంటకు చెందిన పాత నేరస్తుడు సామల పవన్, ఆర్టీఏ జంక్షన్ శ్రీసాయినగర్కు చెందిన పాత నేరస్తుడు ఈద జానకీరామ్, పెన్షన్పూర్కు చెందిన కారు డ్రైవర్ ముద్దెపాక మనోజ్, వరంగల్ శంభునిపేటకు చెందిన ఎస్డీ హుస్సేన్ కొంత కాలంగా ముఠాగా ఏర్పడ్డారు. భట్టుపల్లి, అమ్మవారిపేట శివారు ప్రాంతాల్లో బైక్లపై సంచరిస్తూ ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసేవారు. ఈక్రమంలో ఆగస్టు 30న భట్టుపల్లి రోడ్డు వద్ద ఓ ప్రేమ జంటను బెదిరించి వీడియో తీయడంతో వివాదం మొదలైంది. దీనిపై ఆ జంటకు సంబంధించిన యువకుడి స్నేహితుడు, తిమ్మాపురం గ్రామానికి చెందిన రోహిత్ను ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు నేరస్తులు బెదిరించి మద్యం, డబ్బులు డిమాండ్ చేశారు. దీనిపై రోహిత్, అతని బావమరిది మేకల గిరిధర్, నిందితులకు ఫోన్లో గొడవలు జరిగాయి. ఈక్రమంలో సెప్టెంబర్ 4న రాత్రి ఇరువర్గాలు బెస్తం చెరువు వెళ్లే దారిలో ఎదురుపడ్డాయి. కత్తితో పొడిచి హత్య.. పథకం ప్రకారం కత్తితో వచ్చిన నిందితులు ఘర్షణ కు దిగారు. దీనిపై రోహిత్, గిరిధర్ తమ స్నేహితు డు తిమ్మాపురం గ్రామానికి చెందిన మేకల గౌతమ్(27)కు సమాచారం ఇచ్చారు. దీంతో మేకల గౌత మ్.. సాయి, సంతోష్తో కలిసి హుటాహుటిన ఘట నాస్థలికి చేరుకుని ఘర్షణ ఆపుతున్నాడు. ఈసమయంలో కోపోద్రెకులైన సామల పవన్, ముద్దెపాక మనోజ్ కత్తితో గౌతమ్పై దాడి చేయగా అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అడ్డువచ్చిన రోహిత్పై కూడా దాడి చేయడంతో అతడికి తీవ్ర గాయమైంది. అనంతరం నిందితులు పరారయ్యారువాహన తనిఖీలో పట్టుబడి.. వరంగల్ ఆర్టీఏ జంక్షన్ వద్ద మామునూరు పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. ఈ సమయంలో పోలీసులను చూసి తప్పించుకునేందుకు యత్నించిన నలుగురు నిందితులు పవన్, జానకీరామ్, మనోజ్, హుస్సేన్ను అరెస్ట్ చేసి వారి నుంచి ఐదు సెల్ఫోన్లు, రెండు బైక్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. కాగా, మామునూరు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పర్వతగిరి ఇన్స్పెక్టర్ సంతోష్, ఎస్సైలు ప్రవీణ్, నిస్సార్ పాషా, హరిశంకర్, సిబ్బందిని ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్,ఏసీపీ వెంకటేష్ అభినందించారు. గౌతమ్ హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్ కుమార్ -
బైక్ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం
ఆలేరురూరల్/స్టేషన్ఘన్పూర్ : బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందారు. ఈ ఘటన హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ శివారులో బుధవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రాగిబావి గ్రామానికి చెందిన రాంపాక శ్రీధర్(23) హైదరాబాద్లోని నేరేడ్మెట్లో హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లోని మోడల్ కాలనీకి చెందిన కలకోటి నివాస్(22) కూడా పెయింటింగ్ పనిచేస్తూ అదే హాస్టల్లో ఉంటున్నాడు. శ్రీధర్, నివాస్ స్నేహితులు. వారిద్దరు బుధవారం తెల్ల వారుజామున హైదరాబాద్ నుంచి స్టేషన్ ఘనపూర్కు బైక్పై వెళ్తుండగా.. మార్గమధ్యలో హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ఆలేరు పట్టణ శివారులోని భాను మెస్ సమీపంలోకి రాగానే గుర్తుతెలియని వాహనం బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీధర్, నివాస్ అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాల్ని ఆలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు శ్రీధర్ తండ్రి పాపయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్ఓ ఉదయ్కిరణ్ తెలిపారు. ఇద్దరు యువకుల దుర్మరణం మృతుల్లో ఒకరు ఘన్పూర్ వాసి -
గురువారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
కాళోజీ ఆశయాలను అనుసరించాలి● కలెక్టర్ స్నేహశబరీష్ ● కలెక్టరేట్లో ఘనంగా ప్రజాకవి జయంతి మహబూబాబాద్: ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఆశయాలను ప్రతీ ఒక్కరు అనుసరించాలని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. కలెక్టరేట్లో బుధవారం తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా కాళోజీ నారాయణరావు జయంతి నిర్వహించారు. ప్రజాకవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల జీవనాన్ని, సామాజిక స్పృహను తన కవిత్వంలో ప్రతిబింబించిన మహోన్నత వ్యక్తి కాళోజీ నారాయణరావు అని కొనియాడారు. బహుభాషా కోవిదుడిగా కాళోజీ నిలిచారన్నారు. సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాటం చేసి చరిత్రలో నిలిచిపోయారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, అధికారులు పాల్గొన్నారు. ప్రజాకవి చూపిన మార్గంలో నడవాలి● ఎస్పీ శబరీష్ మహబూబాబాద్ రూరల్: ప్రతీ ఒక్కరు ప్రజాకవి కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలని, ఆయన చూపిన ప్రజాసేవ మార్గంలో నడవాలని ఎస్పీ శబరీష్ పిలుపునిచ్చారు. కాళోజీ నారాయణరావు 110వ జయంతి (తెలంగాణ భాషా దినోత్సవం) సందర్భంగా బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కాళోజీ నారాయణరావు చిత్రపటానికి ఎస్పీ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల హక్కుల కోసం, అన్యాయాలపై నిరంతరం పోరాడిన యోధుడు కాళోజీ నారాయణరావు అని కొనియాడారు. ఆయన జీవితం నేటి సమాజానికి, ముఖ్యంగా యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. కాళోజీ తెలంగాణ భాషకు, సాహిత్యానికి చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా ఆయన జయంతిని ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో అభినందనీయమని తెలిపారు. -
నాడు గవాయి.. నేడు గడ్డం ప్రసాద్పై వివక్ష
కాజీపేట అర్బన్ : సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్, దళితుడైన బీఆర్ గవాయిపై నాడు, రాష్ట్రశాసనసభ స్పీకర్ దళితుడైన గడ్డం ప్రసాద్పై కుల వివక్ష కొనసాగుతూనే ఉందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలోని ఓ ఫంక్షన్హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన ఎమ్మార్పీ ఎస్, ఎమ్మెస్పీ జాతీయ సదస్సులో మంద కృష్ణ మాదిగ మాట్లాడారు. భారతీయ సమాజాన్ని పట్టిపీడిస్తున్న కుల, వర్ణ, మత, లింగ, వివక్షలను ని ర్మూలించడమే మన లక్ష్యమన్నారు. 30ఏళ్ల సుదీర్ఘ ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితమే ఏపీ, తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని, ఆరోగ్యశ్రీ పథకం, వికలాంగులు, వృద్ధులు, వితంతు పెన్షన్లు వ చ్చాయన్నారు. అక్టోబర్ 7న ఏపీ అమరావతిలో 1,200 మండల కమిటీలతో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగను గజమాలతో సత్కరించారు. ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్సీ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ -
పుట్టిన కొద్దిసేపటికే శిశువు మృతి
జనగామ: జనగామ చంపక్హిల్స్ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో పట్టణంలోని వీవర్స్ కాలనీకి చెందిన గర్భిణి శ్రావణి మగ శిశువుకు జన్మనివ్వగా, కొద్దిసేపటికే మృతి చెందాడు. అయితే ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఎంసీహెచ్ ఎదుట ఆందోళన చేపట్టారు. మృత శిశువు తండ్రి ఆరెళ్ల సురేశ్ విలేకరులతో మాట్లాడారు. ప్రసవం కోసం తన భార్య శ్రావణిని శనివారం ఎంసీహెచ్లో చేర్పించామన్నారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు వైద్యులు శస్త్రచికిత్స చేయగా మగ శిశువు జన్మించారన్నారు. అనంతరం శిశువు గుండె స్పందన తక్కువగా ఉందని గుర్తించిన ఆస్పత్రి సిబ్బంది వెంటనే అంబులెన్స్లో వరంగల్ ఎంజీఎం తరలించారన్నారు. ఎంజీఎం వైద్యులు శిశువును పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారన్నారు. అయితే శిశువు మృతికి వైద్యల నిర్ల్యక్షమే కారణమని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు మంగళవారం ఎంసీహెచ్ వద్ద నిరసన తెలిపారు. శిశువు పుట్టిన సమయంలో తమకు సరిగా సమాచారం ఇవ్వలేదని, ఆస్పత్రిలోని సీసీ కెమెరా ఫుటేజీని చూపించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న జనగామ సీఐ ఆస్పత్రికి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వైద్యుల నిర్లక్ష్యం లేదు.. శిశువు మృతికి సంబంధించి ఎలాంటి నిర్లక్ష్యం లేదని ఎంసీహెచ్ సూపరింటెండెంట్ శంకర్ తెలిపారు. తల్లి గర్భంలోనే శిశువు మెడకు పేగులు చుట్టుకోవడంతో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో శస్త్ర చికిత్స చేసి శిశువును రక్షించేందుకు వైద్యులు ప్రయత్నించారని చెప్పారు. పుట్టిన తర్వాత శిశువుకు శ్వాస అందకపోవడంతో సీపీఆర్ చేసి, బాక్స్లో ఉంచి కుటుంబ సభ్యులతో కలిసి అంబులెన్స్లో ఎంజీఎంకు తక్షణమే తరలించినట్లు వివరించారు. పరిస్థితి విషమించడంతో శిశువు మృతి చెందాడని తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం అనే ఆరోపణల్లో వాస్తవం లేదని, కుటుంబ సభ్యులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని స్పష్టం చేశారు. నిర్లక్ష్యం చేశారంటూ ఎంసీహెచ్ ఎదుట కుటుంబీకుల ఆందోళన -
ధిక్కార స్వరం ‘కాళోజీ’
7నెహ్రూసెంటర్లో షాపుల ఎదుట రోడ్లపై వాహనాల పార్కింగ్ తన భావాలకే కాదు శరీరానికీ మరణం లేదని నిరూపించిన వ్యక్తి కాళోజీ. నిజాం పాలన వ్యతిరేక ఉద్యమం, తదనంతరం తొలి, మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించిన అక్షర యోధుడు. ప్రజల భాషలో ఉండే ఆయన కవితలు.. పూర్తిగా తెలంగాణ మాండలికంతో సాగే రచనలు జనాల గుండెలను అలల తాకేవి. నేడు ఆయన జయంతి. తెలంగాణ భాషా దినోత్సవం కూడా. ఉద్యమాలతో ముడిపడిన జీవితం నిరంతరం పోరాటాల బాటే.. నేడు ప్రజాకవి జయంతి -
ఎమ్మెల్సీ తాతా మధును సస్పెండ్ చేయాలి
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా మహబూబాబాద్ రూరల్ : అసెంబ్లీ స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని మదర్ థెరిస్సా సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం నిరసన చేపట్టారు. ఈక్రమంలో మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. అదే సమయంలో కేసీఆర్ దిష్టిబొమ్మకు నిప్పు పెట్టగానే కాంగ్రెస్ నాయకుడిపై నిప్పురవ్వలు పడ్డాయి. వెంటనే ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో చేపట్టి మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ తాతా మధుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఎస్టీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకటనాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లంకొండ శ్రీనివాస్, నాయకులు ఎడ్ల రమేష్, ఎండి,హారుణ్, కౌన్సిలర్లు సల్వాది దిలీప్, బోడ రవికుమార్, నిమ్మల మాధవి శ్రీని వాస్, బానోత్ పార్వతిభాస్కర్, పద్మం ధనలక్ష్మిప్రవీణ్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అజ్మీరా సురేష్ నాయక్, అర్బన్ ఎస్టీ సెల్ చైర్మన్ తేజావత్ శంకర్, లింగాల వీరభద్రం, గిరిధర్ గుప్తా, సప్పిడి రంజిత్, గపూర్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. -
రామప్ప గర్భగుడిలోకి గోదావరి జలాలు!
వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ములుగు జిల్లా వెంకటాపుం(ఎం) మండలం రామప్ప దేవాలయంలోని రామలింగేశ్వరస్వామి వారికి అభిషేకం కోసం గోదావరి జలాలు అందించేందుకు అధికారులు కృషి చేస్తున్నట్లు తెలిసింది. గర్భగుడికి చెందిన సోమసూత్రం మూసుకపోవడంతో కేంద్ర పురావస్తుశాఖ అధికారులు శ్రమించి ఇటీవల పునరుద్ధరించారు. రామలింగేశ్వరస్వామి వారిని పంచామృతాలతో అభిషేకం చేస్తే ఆ ద్రవం బయటకు వెళ్లేలా మూడు ఇంచుల స్టీల్ పైపు అమర్చారు. ఈక్రమంలో అధికారులు మరో అడుగు ముందుకు వేసి గర్భగుడిలో నిరంతరం నీరు ఉండేలా బయట నుంచి పైపులను గర్భగుడిలోకి తీసుకెళ్లారు. ఒక పైపును నీటి కోసం అమర్చి గర్భగుడిలో నల్లా ఏర్పాటు చేశారు. మరో పైపును గర్భగుడిలో విద్యుత్ సౌకర్యం కోసం ఏర్పాటు చేశారు. దేవాదుల పైపులైను ద్వారా రామప్ప సరస్సులోకి గోదావరి జలాలు వస్తుండగా, ఇక్కడి నుంచి ఎగువ ప్రాంతాలకు నీటిని తరలించడమే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలకు తాగునీటిని సైతం సరఫరా చేస్తున్నారు. గోదావరి జలాలతో రామలింగేశ్వరస్వామికి అభిషేకం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో రామప్ప ఆలయం శివారు నుంచి వెళ్తున్న తాగునీటి పైపులైన్కు కనెక్షన్ ఇచ్చి గర్భగుడిలోకి ఆ నీటిని అందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. స్వామివారికి అభిషేకం చేసేందుకు నల్లా ఏర్పాటు -
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
● టీఎస్యూఈఈయూ నేతల విజ్ఞప్తి హన్మకొండ : విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఈశ్వర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలువాల స్వామి కోరారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్ ఉద్యోగులు, అన్మ్యాన్డ్ వర్కర్ల సమస్యలు వివరించి పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగదారుల సంఖ్య, కొత్త కనెక్షన్లు, సెక్షన్ కార్యాలయాల పరిధి, రోజువారీ పనిభారం నిరంతరం పెరుగుతున్నా అందుకనుగుణంగా ఆపరేషన్, మెయింటెనెన్స్ సిబ్బంది సంఖ్య పెరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా సిబ్బంది కొరతతో పని ఒత్తిడి పెరుగుతోందన్నారు. దీనిపై స్పందించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరారు. టీఎస్ఈఈయూ టీజీ ఎన్పీడీసీఎల్ అధ్యక్షుడు జి.ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి బొల్లి వెంకటరాజు, ప్రతినిధులు ఎల్.శ్రీనివాస్, సుదర్శన్ వర్మ, కుసుమ శ్రీనివాస్, సురభి శ్రీకాంత్, రాచకొండ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
● నీరుకుళ్లలో ఘటన ఆత్మకూరు: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్లలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వెన్నపు లక్ష్మయ్య(55) వ్యవసాయ పెట్టుబడులు, కుటుంబ అవసరాలకు అప్పులు చేశాడు. అలాగే, భార్య అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో పంట దిగుబడి లేకపోవడం, అప్పులు తీర్చలేక కనిపించకపోవడంతో కొన్ని రోజులుగా మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం పంటకు పురుగు మందు పిచికారీ చేస్తానని చేను వద్దకు వెళ్లాడు. కాసేపటి తర్వాత చేను వద్దనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా గమనించిన సమీప రైతులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. దీంతో వారు 108లో వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. -
వీఆర్ విద్యార్థికి కాళోజీ పురస్కారం
హన్మకొండ కల్చరల్ : వరంగల్కు చెందిన ప్రముఖ కవి, కాళోజీ ఫౌండేషన్ కార్యదర్శి వీఆర్ విద్యార్థికి ప్రజాకవి కాళోజీ–2026 పురస్కారం వరించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నేడు (సెప్టెంబర్ 9) కాళోజి జయంతి సందర్భంగా నేడు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరగనున్న ఆయన జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రుల చేతులమీదుగా వీఆర్ విద్యార్థి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. విద్యార్ధి చిన్నప్పటినుంచి కాళోజీకి వ్యక్తిగతంగా దగ్గరివాడిగా, ఆయన అభిమానిగా, మిత్రమండలి సభ్యునిగా, వరవరరావులాంటి ఉగ్రమూర్తుల మిత్రుడిగా ఉన్నారు. కాళోజీ బడిలోనే కవిత్వం ఓనమాలు దిద్దుకున్నారు. యుద్ధంనుంచి శాంతిప్రవాహంలా సాగిన ఆయన కవితాయాత్రలో అలలు, పలకరింత, ఘర్మసముద్రం, మంచుమైదానం, ఖండాంతర , యుద్ధం, తుపాకీ శాంతి, తదితర కవితా సంకలనాలు వెలువరించారు. విద్యార్థి గురించి.. వీఆర్ విద్యార్థి అసలు పేరు రాములు. పుట్టిన ఊరు వరంగల్లోని గవిచర్ల. భారతవైమానిక దళంలో పనిచేస్తున్న క్రమంలో రెండుసార్లు యుద్ధాల్లో పాల్గొన్నారు. అంతకన్నముందు కవిత్వంతో పెనవేసుకుపోతూ విద్యార్ధి కలం పేరుతో తన జీవితాన్ని సాహిత్యంలోకి మలుచుకునే క్రమంలో వీఆర్ విద్యార్థిగా మారారు. ఐదు దశాబ్దాలనుంచి తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేస్తున్నారు. ఆయనకు వచ్చిన అవార్డులు.. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తిపురస్కారం, వానమామలై వరదాచార్య పురస్కారం, వరంగల్ సాంస్కృతిక మండలి వారిచే తెలుగు భాషా విశిష్ట పురస్కారం, దాశరథి– ద్వానా సాహిత్య పురస్కారం, యునైటెడ్ ఫోరం ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వారిచే జాషువా పురస్కారం తదితర పురస్కారాలు అందుకున్నారు. పలువురి హర్షం.. విద్యార్థికి అవార్డు రావడంపై కేంద్ర సాహిత్య అవార్డు గ్రహిత అంపశయ్య నవీన్, కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ళ రామశాస్త్రి, విశ్రాంతాచార్యులు బన్న అయిలయ్య, కవులు పొట్లపల్లి శ్రీనివాసరావు, బిల్ల మహేందర్, వల్లంపట్ల నాగేశ్వరరావు, నెల్లుట్ల రమాదేవి, నిధి, రామా చంద్రమౌళి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. సంతోషంగా ఉంది..ప్రభుత్వం కాళోజీ పురస్కారం ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఇది కాళోజీ ఫౌండేషన్కు వచ్చినట్లుగా భావిస్తున్నా. కాళోజీ ప్రజలగురించి ప్రజల భాషలో కవిత్వం రాశారు. నగీషిల కవితలు రాయలేదు. పెద్ద ఉపన్యాసాన్ని సైతం కవిత్వంలా మల్చగలగడం కాళోజీ ప్రత్యేకత. వేమనలా నిజాల్ని కవితలలో పొందుపరిచారు. ఆయన జీవితమే ఉద్యమం. – వీఆర్ విద్యార్థి, కవి ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం నేడు హైదరాబాద్లో ప్రదానం హర్షం వ్యక్తం చేసిన అంపశయ్య నవీన్, కవులువీఆర్ విద్యార్థి -
సెల్లార్లు ఏర్పాటు చేయాలి
సెల్లార్ లేకుండా బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణం చేయడం వల్లే ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. కనీసం పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటు చేయలేదు. పలుచోట్ల సెల్లార్ల్లో షాపులు ఏర్పాటు చేశారు. వాటిని కూల్చివేయాలి. తొర్రూరు బస్టాండ్ సెంటర్ వద్ద రోడ్డు మధ్యలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. – మేక విజయభాస్కర్రెడ్డి, వాహనదారుడు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నాంనెహ్రూసెంటర్, మదర్థెరిస్సా సెంటర్తో పా టు రైల్వేస్టేషన్ ప్రాంతంలో రోడ్లపై వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. దీంతో రైల్వే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. – కుమారస్వామి, స్థానికుడు నోటీసులు ఇస్తాంసెల్లార్లు లేని బహుళ అంతస్తుల భవనాలకు నోటీసులు ఇస్తాం. సెల్లార్లోని షాపులను తొలగించి పార్కింగ్కు కేటాయిస్తాం. సెల్లార్ లేని భవన యజమానులు పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని నోటీసులు ఇస్తాం. సెల్లార్ లేదా పార్కింగ్ లేకుండా కొత్తగా బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులు ఇవ్వం. – సంతోష్, టీపీఎస్● -
ధిక్కార స్వరం ‘కాళోజీ’..
15 ఏళ్ల వయస్సు నుంచే ఉద్యమాలు.. 1914, సెప్టెంబర్ 9వ తేదీన రంగారావు, రమబాయి దంపతులకు కాళోజీ జన్మించారు. కాళోజీ పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ. మడికొండలో ప్రాథమిక విద్య, హనుమకొండ, హైదరాబాద్ల్లో ఉన్నతవిద్యనభ్యసించారు. 15 సంవత్సరాల వయస్సు నుంచే రాజకీయ ఉద్యమాలు, కవితా, రచనావ్యాసంగాల్లో మునిగిపోయారు. ఆర్య సమాజం, ఆంధ్రమహాసభ, నిజాంస్టేట్కాంగ్రెస్లో ఉంటూ నైజాం వ్యతిరేక పోరాటంలో పనిచేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1958 నుంచి 1960 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా, ఆంధ్ర సారస్వత పరిషత్, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో సభ్యుడిగా, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాళోజీ సోదరుడు రామేశ్వరరావు ఉర్దూ సాహిత్యంలో గొప్పకవి. షాద్ కలం పేరుతో రచనలు చేసే వారు. రామేశ్వరరావును పెద్దకాళోజీగా పిలిస్తే, నారాయణరావును చిన్న కాళోజీగా పిలిచేవారు. అలాగే, కా ళోజీ సతీమణి రుక్మిణి.. కాళోజీ ఉద్యమాలు, అరెస్ట్లు నేపథ్యంలో ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకున్నారు. సందర్భానికి స్పందించి రాసే రచయిత కాళోజీ.. కాళోజీ జీవితం నిజాం పాలనకు వ్యతిరేకంగా జరి గిన స్వాతంత్రోద్యమం, ఆ తర్వాత తెలంగాణతో ముడిపడి ఉంది. ఉద్యమకార్యాచరణలో స్పందించే అవసరం ఏర్పడినప్పుడు కాళోజీ తన కవితల ద్వారా విజృంభించారు. కాళోజీ కవితలు ప్రజలతో మాట్లాడుతున్నట్లుగానే ఉండేవి. 1942లో నిజాం రాష్ట్రంలో తెలుగు ప్రజలు తమ మాతృభాషైన తెలుగుపై నిరాదరణతో ఉండడం చూసి స్పందించి, ఏ భాషరా నీది యేమి వేషమురా? /ఈ భాష ఈవేష మెవరి కోసమురా?/ ఆంగ్లమందున మాటలాడ గలుగగనే/ ఇంతగా గుల్కెదవు ఎందుకోసమురా?/ అన్యభాషలు నేర్చి ఆంధ్రంబురాదంచు/ సకిలించు ఆంధ్రుడా ! చావవెందుకురా? అంటూ అలాంటి వారిని అపహస్యం చేశారు. 1944లో జనగామ ప్రాంతంలో జరిగిన దౌర్జన్యాలను నిరసిస్తూ నవయుగంబున నాజీవృత్తుల/ నగ్న నృత్య మింకెన్నాళ్లు? / పోలీసు అండను దౌర్జన్యాలు/ పోషణబొందె దెన్నాళ్లు? / దమననీతిలో దౌర్జన్యాలకు/ దాగిలిమూతలు ఎన్నాళ్లు? / కంచెయె చేనును మేయుచుండగా / కాంచకుండుటింకెన్నాళ్లు ? అంటూ ప్రశ్నించారు. 1946లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించినప్పుడు, ప్రజాసంస్థపై పగసాధించిన/ ఫలితం తప్పక బయటపడున్ / నిక్కుచునీల్గే నిరంకుశత్వము/ నిల్వలేక నేలను గూలున్ / చిలిపి చేష్టకై చిల్లి పొడిచినను / స్థిరమగు కట్టయు శిధిలగున్ / .. అంటూ హెచ్చరించారు. 1946లోనే వరంగల్ కోటలో మొగిలయ్య హత్య జరిగింది. మరొకచోట బాలున్ని పొడిచారు. శిక్ష చంపిన వారికి వేయాల్సిందిపోయి జెండా ఎగురేసిన వారినే శిక్షించారు. కాళోజీకి కూడా ఆరునెలల పాటు దేశబహిష్కరణ శిక్షవిధించారు. ఈ సందర్భంగా ఇక్కడి ఘటనలపై విచారణ చేయాడానికి వచ్చిన ప్రధాని సర్ మీర్జాఇస్మాయిల్ను కాళోజీ తన కవితద్వారా ప్రశ్నించారు.కాళోజీ తెలంగాణ మాండలికంలోనే తన కవితలు, ధిక్కారస్వరం వినిపించేవారు. ఏటా కాళోజీ జన్మదినమైన సెప్టెంబర్ 9వ తేదీని తెలంగాణ భాషా (మాండలిక) దినోత్సవంగా జరుపుకోవాలని 2014, సెప్టెంబర్ 9న నిట్ వరంగల్లో జరిగిన నారాయణరావు 100వ జయంతి సభలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఆయనది ఉద్యమాలతో ముడిపడిన జీవితం నిరంతరం పోరాటాల బాటే.. నేడు ప్రజాకవి జయంతిహన్మకొండ కల్చరల్ : ప్రజాకవి కాళోజీ నారాయణరావు.. ధిక్కార స్వరానికి మారుపేరు. నిజాంపాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్రోద్యమం, ఆ తర్వాత తొలి, మలిదశల్లో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. తెలంగాణలో జరిగిన అనేక ఉద్యమాలతో ఆయన జీవితం పెనవేసుకుంది. జీవించి ఉన్న కాలంలో ప్రజాస్వామిక ఉద్యమాల్లో ఎలా పాలుపంచుకున్నారో చనిపోయిన తర్వాత కూడా ఆయన భావాలు ప్రజాస్వామ్యవాదులు, కళాకారులకు స్ఫూర్తిని అందించాయి. తన భావాలకే కాదు శరీరానికీ మరణంలేదని నిరూపించిన వ్యక్తి కాళోజీ. ఈ క్రమంలో నేడు( బుధవారం) ప్రజాకవి జయంతి (తెలంగాణ భాషా దినోత్సవం). ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం -
సమన్వయంతో వేడుకలు నిర్వహించాలి
● కలెక్టర్ స్నేహశబరీష్ మహబూబాబాద్: జిల్లాలో వినాయక నిమజ్జన వేడుకలను అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో వినాయక నిమజ్జనం, తదితర అంశాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిమజ్జన ఘాట్ల వద్ద పోలీస్శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సమస్మాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించడంతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా ఉంచాలన్నారు. ఎస్పీ శబరీష్, అదనపు కలెక్టర్ అనిల్కుమార్, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలిఈవీఎం గోడౌన్ వద్ద భద్రతా సిబ్బంది ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్నేహశబరీష్ ఆదేశించారు. కలెక్టరేట్ దగ్గరలో ఉన్న ఈవీఎం గోడౌన్ను త్రైమాసిక తనిఖీల్లో భాగంగా మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భద్రతా సిబ్బంది షిఫ్ట్ల వారీగా కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. రికార్డులు, భద్రతా ఏర్పాట్లు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. తనిఖీలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నితీష్కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సవరణ పారదర్శకంగా జరగాలి కేసముద్రం: ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా జరగాలని కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. మంగళవారం మండలంలోని పెనుగొండ, ఉప్పరపల్లి, కోరుకొండపల్లి గ్రామాల్లో చేపడుతున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఉప్పరపల్లి సమీపంలోని తండాలో కొనసాగుతున్న సమగ్ర భూస ర్వే ప్రక్రియను, సర్వే బృందాలు నిర్వహిస్తున్న రోవర్ల వినియోగం, హద్దుల గుర్తింపును ఆమె పరిశీలించారు. అనంతరం కోరుకొండపల్లిలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ సెంటర్లను తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ వివేక్, ఎంఈఓ కాలేరు యాదగిరి, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలి
పెద్దవంగర: భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ అనిల్ కుమార్ అధికారులను అదేశించారు. మంగళవారం మండలంలోని పోచారం గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ తహసీల్దార్ వినోద్ కుమార్ను సర్వే వివరాలపై ఆరా తీయగా.. గ్రామంలో 821 ఎకరాల భూమి ఉన్నట్లు తెలిపా రు. ఇందులో ఆబాది, పీఆర్రోడ్డు, ఎస్సారెస్పీ కాల్వ, చెరువు తదితరు భూములు ఉన్నట్లు వివరించారు. ఇప్పటి వరకు 253 ఎకరాల సర్వే చేసినట్లు తెలిపారు. ఈ నెలాఖరులోగా ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు, భూ వివరాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, రికార్డులతో సరిపోల్చి నమోదు చేయాలని అడిషనల్ కలెక్టర్ సూచించారు. ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నితీష్, ఏడీ శ్రీనివాస్, సర్వేయర్ ఉపేందర్ పాల్గొన్నారు. -
మార్కెట్కు వరుసగా సెలవులు
ఖిలా వరంగల్ : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు వరుసగా నాలుగు రోజులు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ చైర్ పర్సన్ ఎర్రప్రియాంక మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 11న అమావాస్య, 12, 13 వారాంతం, 14న వినాయక చవితి పండుగ సందర్భంగా (ప్రభుత్వ సెలవు) సెలవు ఉంటుందన్నారు. మార్కెట్ తిరిగి 15వ తేదీన పునః ప్రారంభమవుతుందన్నారు. రైతులు దీనిని గమనించాలని కోరారు. సెలవుల్లో మార్కెట్కు సరుకులు తీసుకొచ్చి ఇబ్బందులకు గురికావొద్దని చైర్ పర్సన్ పేర్కొన్నారు. 16న డాక్ అదాలత్ ఖిలా వరంగల్: వరంగల్ డివిజన్ తపాలాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 16న ఉదయం 11 గంటలకు డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఆ శాఖ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. లైంగికదాడి నిందితుడి అరెస్ట్ మహాముత్తారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలానికి చెందిన ఓ బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కాటారం డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రెండు రోజుల క్రితం భూపాలపల్లి మండలం రాజీవ్నగర్ గ్రామానికి చెందిన కురుసం రమేశ్.. మహాముత్తారం మండలానికి చెందిన ఓ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు అనంతరం నిందితుడు రమేశ్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారించగా నేరం ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు. మంత్రి సీతక్కను కలిసిన ‘కుడా’ చైర్పర్సన్ నయీంనగర్: హైదరాబాద్లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని మంగళవారం ‘కుడా’ చైర్ పర్సన్ గుండు సుధారాణి మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ‘కుడా’ చైర్ పర్సన్ సుధారాణికి మంత్రి, ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. -
ఏకలవ్య స్కూల్ విద్యార్థులకు అస్వస్థత
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని గూడూరు ఏకలవ్య మోడల్ స్కూల్కు చెందిన 19 మంది విద్యార్థులు అస్వస్థతతకు గురై ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో సోమమంగళవారాల్లో చికిత్స పొందారు. పలు విద్యార్థి సంఘాల నాయకుల కథనం ప్రకారం.. గురుకుల పాఠశాల విద్యార్థులు ఆదివారం ఉదయం టిఫిన్ (పూరి), మధ్యాహ్నం చికెన్తో భోజనం చేశారు. అయితే ఫుడ్ పాయిజన్ కావడంతో వాంతులు, విరేచనాలయ్యాయి. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందారు. కాగా, ఈ ఘటనపై సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాల నాయకులు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆర్సీఓ నారాయణనాయక్.. మోడల్ స్కూల్ను సందర్శించి ప్రిన్సిపాల్ రమేశ్ను వివరణ అడిగారు. విద్యార్థులను చిన్న సమస్యలతో ఆస్పత్రికి తరలించామన్నారు. అంతేకాని తమ గురుకుల పాఠశాలలో ఎలాంటి ఫుడ్పాయిజన్ కాలేదన్నారు. అనంతరం ఆర్సీఓ నారాయణనాయక్, సీఐ అంజలి, విద్యార్థి సంఘాల నాయకులు మధ్యాహ్నం భోజనం పరిశీలించి విద్యార్థులతో పాటు భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆర్సీఓ మాట్లాడుతూ పూర్తి స్థాయిలో విచారణ చేశామని, విద్యార్థులకు ఎలాంటి ఫుడ్పాయిజన్ జరగలేదన్నారు. జిల్లా ఆస్పత్రిలో చికిత్స ఫుడ్ పాయిజన్ అయ్యిందని విద్యార్థి సంఘాల ఆరోపణ -
నిట్ 24వ స్నాతకోత్సవానికి వేళాయె..
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్లో ఈనెల 19, 20 తేదీల్లో 24వ స్నాతకోత్సవం (కాన్వొకేషన్) నిర్వహించనున్నట్లు యాజమాన్యం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. యూజీ, పీజీ, పీహెచ్డీ పూర్తి చేసిన 2,350 మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలను అందుకోనున్నారు. తొలిరోజు యూజీ (బీటెక్), రెండో పీజీ(ఎంటెక్), పీహెచ్డీ విద్యార్థులు పట్టాలు అందుకోనున్నారు. ముఖ్య అతిథిగా టెక్సాస్ ఇన్స్ట్రూమెంట్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్కుమార్ హాజరుకానున్నారు.● 19, 20 తేదీల్లో కాన్వొకేషన్ వేడుకలు ● హాజరుకానున్న టెక్సాస్ ఎండీ సంతోష్కుమార్ -
డబుల్ బెడ్రూం ఇళ్ల పరిశీలన
మరిపెడ: మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ సమీపంలో జర్నలిస్టుల కోసం నిర్మించిన డబుల్బెడ్రూం ఇళ్లను అదనపు కలెక్టర్ పురుషోత్తం పరిశీలించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద మౌలిక వసతులు కల్పించాలని స్థానిక మున్సిపల్ కమిషనర్ నరేశ్రెడ్డికి సూచించారు. నివాసగృహాల మధ్య పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించాలని కమిషనర్ను ఆదేశించారు. తాగునీరు, రోడ్డు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. రైతులు మంచి ఆదాయం పొందాలికొత్తగూడ: రైతులు ప్రణాళికతో పంటలు సాగు చేసి ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన ఆదాయం పొందాలని రాష్ట్ర పట్టు పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ అనసూయ సూచించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఎకరం పొలంలో మల్బరీ సాగు చేసి పట్టు పురుగుల పెంపకంతో లక్షల్లో ఆదాయం పొందవచ్చన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్కు తగినట్లు పట్టు ఉత్పత్తి లేదన్నారు. మల్బరీ సాగు వల్ల పంట మా ర్పిడి జరుగుతుందన్నారు. తద్వారా భూమిలో సారం పెరుగుతుందన్నారు. ఆసక్తి కలిగిన రైతులకు పట్టు పురుగుల పెంపకంలో శిక్షణ ఇచ్చి, మల్బరీ సాగు, పట్టు పురుగుల పెంపకానికి ప్రభుత్వ ప్రోత్సాహం అందే విధంగా చూస్తామని అన్నారు. అనంతరం కేంద్ర స్కిల్ బోర్డు కర్నాటక రాష్ట్రానికి చెందిన శాస్త్రవేత్త శ్రీకాంత్ రైతుల సందేహాలను నివృత్తి చేసి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి మరియన్న, సెరీకల్చర్ అధికారి సురేష్, మండల వ్యవసాయాధికారి ఉదయ్, ఉద్యానశాఖాధికారి శాంతి ప్రియదర్శిని, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. ఐకేపీ అకౌంటెంట్ సస్పెన్షన్బయ్యారం: బయ్యారంలోని ఐకేపీ కార్యాలయంలో అకౌంటెంట్గా పనిచేస్తున్న శోభపై మంగళవారం సస్పెన్షన్ వేటు వేశారు. కార్యాలయంలో జరిగిన జనరల్బాడీ సమావేశానికి హాజరైన డీఎంబీ శ్రీకాంత్.. రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, గ్రామసంఘాలకు నిబంధనలకు విరుద్ధంగా రుణాలు ఇవ్వడంతో పాటు ఇతర లోపాలను గుర్తించారు. ఈ మేరకు అకౌంటెంట్ను సస్పెండ్ చేశారు. వినాయక చవితి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలినెహ్రూసెంటర్: వినాయకచవితి వేడుకల్లో భాగంగా మండపాలు, అలంకరణ, నిమజ్జన సమయంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని విద్యుత్శాఖ ఎస్ఈ దర్శన్కుమార్ సూచించారు. పట్టణంలోని గణేశ్ మండపాలను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండపాల్లో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలపై నిర్వాహకులకు వివరించారు. గణేష్ మండపాల్లో విద్యుత్ కనెక్షన్లు అధికారికంగా తీసుకోవాలని సూచించారు. విద్యుత్ నియమ నిబంధనలు పాటిస్తూ వేడుకలు నిర్వహించుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈటీ హీరాలాల్, ఏఈ వెంకటేష్ పాల్గొన్నారు. -
ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి
మహబూబాబాద్: అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడికి సీఎం రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని నెహ్రూసెంటర్లో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా సత్యవతి రాఽథోడ్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డికి కౌంట్డౌన్ ప్రారంభమైందని, తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీలలో మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగినా మంత్రి సీతక్క స్పందించకపోవడం దారుణమన్నారు. మంత్రి పదవి నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేస్తే కూడా స్పందించలేదని, దీంతో ఆమెకు మహిళల పట్ల ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, మహిళలపై పోలీసులు దాడులు చేయడం సబబు కాదన్నారు. మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు సీఎం క్షమాపణ చెప్పకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు పాల్వాయి రామ్మోహన్రెడ్డి, భరత్కుమార్రెడ్డి , మార్నేని వెంకన్న, పర్కాల శ్రీనివాస్రెడ్డి, గద్దె రవి, యాళ్ల మురళీధర్రెడ్డి, నాయిని రంజిత్, అశోక్, నీరజా, రాజ్కుమార్, రఘు, లింగన్న పాల్గొన్నారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడి హేయమైన చర్య మాజీ మంత్రి సత్యవతి రాథోడ్


