breaking news
Mahabubabad
-
కిక్కు రాలే..!
సాక్షి ప్రతినిధి వరంగల్/కాజీపేట అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైన్స్ దరఖాస్తుల ఆదాయం ఈసారి గణనీయంగా తగ్గింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి శనివారం అర్ధరాత్రి దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించింది. దరఖాస్తులు, ఆదాయం రెండింతలు వస్తుందనుకున్న ప్రభుత్వ లక్ష్యం ఈసారి నెరవేరలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 294 వైన్స్కు 2023–25 టెండర్లలో 16,039 దరఖాస్తులతో 318 కోట్ల ఆదాయం వచ్చింది. 2025–27కు శనివారం చివరి తేదీగా మొదట ప్రకటించారు. రాత్రి 10 గంటల వరకు 9,754 దరఖాస్తులతో 292.4 కోట్ల ఆదాయం లభించింది. కాగా, గత టెండర్లతో పోల్చితే 6,285 దరఖాస్తులు, 28.16 కోట్ల ఆదాయం తగ్గింది. కాజీపేట ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని కడిపికొండ వైన్స్కు అత్యధికంగా 114 దరఖాస్తులు వచ్చాయి. భూపాలపల్లి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని మూడు వైన్స్లకు ఒక్కొక్క దరఖాస్తు మాత్రమే రావడం గమనార్హం. చివరి రోజు వరంగల్ అర్బన్లో 1,577, వరంగల్ రూరల్లో 910, జనగామలో 950, మహబూబాబాద్లో 735, భూపాలపల్లిలో 1,036 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ఫీజు పెంపుదలే కారణం.. వైన్స్ దరఖాస్తులకు నాన్ రీఫండబుల్గా గత టెండర్లలో దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉండగా.. ఈసారి రూ.3 లక్షలకు ప్రభుత్వం పెంచింది. దీంతో దరఖాస్తులు చేసేందుకు మద్యం వ్యాపారులు ఈసారి పెద్దగా ముందుకురాలేదు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం మందకొడిగా ఉండడంతో స్థిరాస్తుల కొనుగోళ్ల వైపు ఎవరూ మొగ్గు చూపడం లేదు.రూ.3 లక్షల నాన్ రీఫండ్ ఫీజుతో దరఖాస్తు చేసే బదులు రెండున్నర తులాల బంగారం కొనుగోళ్లకు మధ్య తరగతి కుటుంబాల వారు ఆసక్తి కనబరిచారు. రూ.320.7 కోట్ల టార్గెట్.. 2025–27 రెండేళ్ల కాలపరిమితితో వైన్స్కు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 25న టెండర్ల ప్రక్రియ ప్రకటించింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల చివరి తేదీ తొలుత నిర్ణయించారు. కాగా, అక్టోబర్ 18 చివరి రోజు వరకు కేవలం 9,754 దరఖాస్తులు, రూ.292.2 కోట్ల ఆదాయం వచ్చింది. గత టెండర్ల రూ. 320.7 కోట్ల ఆదాయ టార్గెట్ను దాటేందుకు ఈనెల 23 చివరి తేదీగా మరోఐదు రోజుల అవకాశం కల్పించింది. ఈనెల 27వ తేదీన లక్కీడ్రా తీయనున్నారు. కాగా, రూ.2 లక్షల నుంచి రూ. 3 లక్షల నాన్ రీఫండబుల్ ఫీజుతో దరఖాస్తుతో పాటు ఆదాయం పెరుగుతుందని వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. దీంతో ఖజానాకు ఆదాయం కిక్కు పొందేందుకు ప్రభుత్వం గడువు పొడిగించింది. జిల్లాల వారీగా 2023–25, 2025–27 సంవత్సరాల్లో దరఖాస్తులు, ఆదాయం వివరాలు జిల్లా వైన్స్ 2023–25 ఆదాయం 2025–27 ఆదాయం దరఖాస్తులు (రూ.కోట్లలో) దరఖాస్తులు (రూ.కోట్లలో) వరంగల్ అర్బన్ 67 5,859 117 3,012 90.3 వరంగల్ రూరల్ 57 2,938 58 1,826 54.7 జనగామ 50 2,492 49 1,587 47.6 మహబూబాబాద్ 61 2,589 51 1,672 50 .1 భూపాలపల్లి 59 2,161 43 1,657 49.7 మొత్తం 294 16,039 318 9,754 292.4ఉమ్మడి జిల్లాలో తగ్గిన వైన్స్ దరఖాస్తుల ఆదాయం 294 షాపులకు 9,754 అర్జీలు, రూ.292 కోట్ల రెవెన్యూ టెండర్ల గడువు 23 వరకు పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వందరఖాస్తుల స్వీకరణ మూడు రోజులే.. వైన్స్ టెండర్ల గడువును ఈనెల 23 వరకు పొడిగిస్తూ శనివారం అర్ధరాత్రి ప్రభుత్వం ప్రకటించింది. కాగా, ఐదు రోజులు పొడిగించినా ఆదివారం, సోమవారం దీపావళి సెలవులు ఉన్నాయి. కాగా, మూడు రోజులు మాత్రమే దరఖాస్తుల స్వీకరణకు సమయం ఉంది. -
భావప్రకటన స్వేచ్ఛ అందరి హక్కు..
హన్మకొండ: పత్రికా స్వేచ్ఛను హరించొద్దు. భావ ప్రకటన స్వేచ్ఛ అందరి హక్కు. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా ఉండే పత్రికలపై కక్షపూరితంగా వ్యవహరించడం తగదు. ఆంధ్రప్రదేశ్లో అక్కడి ప్రభుత్వం సాక్షి దినపత్రికపై కక్ష గట్టడం సరికాదు. ఎడిటర్, విలేకరులపై అకారణంగా, అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గం. వార్తలో లోపాలుంటే ఖండన ఇవ్వాలి. ఇలా కాకుండా నోటీసులు ఇచ్చి కేసులు పెట్టి వేధించడం అప్రజాస్వామికం. – ఏదునూరి రాజమొగిలి, బీసీ ఐక్య సంఘర్షణ సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి -
పాకాలలో పర్యాటకుల సందడి
ఖానాపురం: మండలంలోని పర్యాటక ప్రాంతమైన పాకాలలో పర్యాటకుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలి వచ్చారు. పాకాల అందాలను వీక్షించి లీకేజీ నీటిలో, పార్కులో సరదాగా గడిపారు. బోటింగ్ చేస్తూ సందడి చేశారు. రాష్ట్రస్థాయి బృంద గీతాల పోటీల్లో ప్రతిభ విద్యారణ్యపురి : హైదరాబాద్లోని కూకట్పల్లి పీఎన్ఎం హైస్కూల్లో భారత్ వికాస్ పరిషత్ కమిటీ ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి జాతీయ బృంద గీతాల పోటీల్లో ఓరుగల్లు విద్యార్థులు ప్రతిభ చూపారు. తెలంగాణ రాష్ట్రస్థాయి బృంద గీతాల పోటీల్లో 30 పాఠశాలల విద్యార్థులు పాల్గొనగా తెలుగు, జానపద విభాగం (రూరల్) వరంగల్లోని నాగార్జున ప్రైమ్ స్కూల్ విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించారు. విజేతలకు మెమోంటో, సర్టిఫికెట్లు అందజేశారు. పాఠశాల కరస్పాండెంట్ ఎ.వెంకటేశ్వర్లు, బీవీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సుధీర్కుమార్, జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, బాధ్యులు వెంకటరెడ్డి తదితరులు ఆదివారం అభినందించారు. వేయిస్తంభాల ఆలయంలో మాసశివరాత్రి పూజలు హన్మకొండ కల్చరల్ : రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల ఆలయంలో ఆదివారం మాసశివ రాత్రిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, శివకల్యాణం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠ అవధాని, అర్చకులు ప్రణవ్, సందీప్శర్మ ఉదయం ప్రభాతసేవ, ఉత్తిష్టగణపతికి ఆరాధన గరికపూజ, రుద్రేశ్వరుడికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేశారు. అనంతరం నాట్యమండపంలో రుద్రేశ్వరిదేవి, రుద్రేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించి కళశ స్థాపన, బాసికధారణ, యజ్ఞోపవితధారణ, పాదప్రక్షాళన, జిలకర బెల్లం, మాంగళ్యధారణ, అక్షతారోహణ, మహాహారతి జరిపి రుద్రేశ్వరిదేవి,రుద్రేశ్వరస్వామి వార్లకు కల్యాణోత్సవం నిర్వహించారు. సెలవురోజు కావడంతో అధికసంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించారు. ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. సిబ్బంది మధుకర్, రామకృష్ణ పాల్గొన్నారు. వనదేవతలకు భక్తుల మొక్కులు ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం అధికసంఖ్యలో తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి కల్యాణ కట్టలో పుట్టువెంట్రుకలు సమర్పించుకున్నారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మొక్కుల అన ంతరం భక్తులు మేడారం ఆర్టీసీ బస్టాండ్, చిలకలగుట్ట, సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు షెడ్లలో విడిది చేసి వంటా వార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. భక్తులు సన్మార్గంలో నడవాలి హన్మకొండ కల్చరల్ : భక్తులు సన్మార్గంలో నడవాలని సంగారెడ్డి జిల్లా బర్దిపూర్కు చెందిన దత్తగిరి పీఠాధిపతి డాక్టర్ సిద్ధేశ్వరానందరావు మహరాజ్ ఉద్బోంధించారు. ఆదివారం ఆయన భద్రకాళి దేవాలయాన్ని సందర్శించగా అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించి పూజలు చేసిన అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, తాంబూలం అందజేశారు. -
ఇబ్బందులకు గురిచేయడం సరికాదు..
వెంకటాపురం(కె): అధికారం ఉందనే అహంకారంతో జర్నలిస్టులు, మీడియా సంస్థను ఇబ్బందులకు గురిచేసేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం సరికాదు. జర్నలిస్టుల గళాన్ని అణచివేసేలా వ్యవహరిస్తున్న చర్యలు తక్షణమే మానుకోవాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని సాక్షి జర్నలిస్టులు, ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేయడం సరికాదు – పర్శిక సతీశ్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ -
కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి
మహబూబాబాద్: జిల్లాలో వరి కోతలు ప్రారంభం కాక ముందే వానాకాలం (ఖరీఫ్) కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ముందుగానే కేంద్రాల ఏర్పాటు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లు జరిగినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆపరేటర్లు, కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ పూర్తి చేసి అన్ని సిద్ధం చేసుకున్నారు. వచ్చే నెల మొదటి వారం నుంచే కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 242 కేంద్రాలు.. జిల్లాలో 242 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో 59 కేంద్రాలు, పీఏసీఎస్ 168, జీసీసీ 13, మెప్మా ఆధ్వర్యంలో 2 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పాత పద్ధతి ప్రకారమే ముందుగా ఏఈఓ తేమ శాతాన్ని పరిశీలించిన తర్వాతనే కేంద్రాలకు ధాన్యం తీసుకెళ్లాల్సి ఉంటుంది. రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్పుస్తకం, బ్యాంక్ఖాతా పుస్తకం జిరాక్స్లను కేంద్రాల నిర్వాహకులకు అందజేయాలి. వారు వివరాలను నమోద్ చేస్తారు. కామన్ రకం ధాన్యం క్వింటాకు రూ.2,369, గ్రేడ్–ఏ రకం క్వింటాకు రూ.2,389 మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. సన్నధాన్యానికి అదనంగా క్వింటాకు రూ. 500 బోనస్ను ప్రభుత్వం అందజేస్తుంది. సేకరణ లక్ష్యం.. జిల్లాలో 2,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, టెంట్, విద్యుత్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి పొరపాట్లు జరగొద్దని కలెక్టర్ హెచ్చరించిన నేపథ్యంలో ఏర్పాట్ల విషయంలో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతుల కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేయనున్నారు. శిక్షణ పూర్తి.. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 17న ఆపరేటర్లు, కేంద్రాల నిర్వాహకులకు నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ట్యాబ్లలో నమోదు ఆలస్యం కావొద్దని, కాంటాలు, తరలింపు వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. కలెక్టర్ అద్వైత్కుమర్ ఈనెల 15,16 తేదీల్లో కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. కొనుగోలు విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉండడంతో కేంద్రాల విషయంలో ఎలాంటి పొరపాటు జరగొద్దని అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. యూరియా కొరతతోనే రైతులు ఇబ్బందులు పడ్డ నేపథ్యంలో కొనుగోలు విషయంలో సమస్య రావొద్దని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ధాన్యం సేకరణకు త్వరలోనే ఏర్పాట్లు కొనుగోళ్లపై కలెక్టర్ పలుమార్లు సమీక్షలు నిర్వాహకులు, ఆపరేటర్లకు శిక్షణ పూర్తి 2,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంఅందుబాటులో 28లక్షల గన్నీ బ్యాగులు.. జిల్లాలో 28 లక్షల గన్నీ బ్యాగులు, 10,000 టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. జిల్లాలో 62 మిల్లులు ఉండగా బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చిన వారికి మాత్రమే ధాన్యం తరలిస్తామని వారు పేర్కొన్నారు. అయితే ఇంకా మిల్లుల కేటాయింపు జరగలేదు. ప్రధానంగా ట్యాబ్లలో నమోదు, కాంటాలు, ధాన్యం తరలింపు, 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. దీంతో సంబంధిత అధికారులంతా సమన్వయంతో పనిచేస్తున్నారు. వరి కోతలు ప్రారంభం కాకముందే అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. -
సీతంపేటలో ‘దీపావళి’ బతుకమ్మ
హసన్పర్తి: తెలంగాణ వ్యాప్తంగా దసరా ఉత్సవాలను పురస్కరించుకుని బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తే.. సీతంపేటలో మాత్రం దీపావళి సందర్భంగా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ గ్రామానికి చెందిన నేతకాని కులస్తులకు మాత్రమే ఈ వేడుకలు ప్రత్యేకం. మూడు రోజులపాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. రెండు వందల ఏళ్ల నుంచి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నేతకాని కులస్తులు పేర్కొన్నారు. గతంలో ఐదు రోజులపాటు కొనసాగిన ఈ ఉత్సవాలను మూడు రోజులకు కుదించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న నేతకాని కులస్తులు ప్రతీ దీపావళికి సీతంపేటకు వచ్చి ఉత్సవాల్లో పాల్గొంటారు. కోలాటాల మధ్య ఉత్సవాలు కొనసాగనున్నాయి. తొలిరోజు దేవతామూర్తుల ప్రతిమలు.. దీపావళి బతుకమ్మ వేడుక సందర్భంగా తొలి రోజు మంగళవారం చెరువు నుంచి మట్టిని తీసుకొచ్చి దేవతల ప్రతిమలను(ఎద్దులు) తయారు చేస్తారు. ఆ ప్రతిమలను ప్రత్యేక గదిలో ప్రతిష్ఠించి నైవేద్యాలు సమర్పిస్తారు. అనంతరం విశేష పూజలు నిర్వహిస్తారు. రెండో రోజు పురుషుల ఉపవాస దీక్షలు రెండో రోజు బుధవారం పురుషులు ఉపవాస దీక్ష చేపడుతారు.అనంతరం సాయంత్రం ఇళ్లల్లో ప్రతిష్ఠించిన దేవతా మూర్తుల ప్రతిమలను భారీ ప్రదర్శనగా తీసుకెళ్లి చెరువులో నిమజ్జనం చేస్తారు. అనంతరం చెరువు వద్ద ఉపవాస దీక్ష విరమిస్తారు. ఆతర్వాత చెరువు నుంచి జలం తీసుకొచ్చి ప్రత్యేక గదిలో పెట్టి పూజలు చేస్తారు. చివరి రోజుల బతుకమ్మ వేడుకలు మూడో రోజు గురువారం మహిళలు గౌరమ్మ(బతుకమ్మ)లను తయారుచేసి భారీ ప్రదర్శనగా బయలుదేరుతారు. మహిళలతో పాటు పురుషులు కూడా బతుకమ్మలు ఎత్తుకుని ముందుకు సాగడం ప్రత్యేకత. రేపటి నుంచి వేడుకలు ప్రారంభం మూడు రోజులపాటు సంబురాలు -
కానిస్టేబుల్ శ్రమ వృథా..
● గంటలోనే దూరమైన సంతోషం ● బైక్ పైనుంచి పడిన వ్యక్తి మృతి దంతాలపల్లి : ఓ వ్యక్తిని గంటపాటు కష్టపడి సీపీఆర్ చేసి బతికించిన కానిస్టేబుల్ శ్రమ వృథా అయ్యింది. బతికాడనుకున్న వ్యక్తిని మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మృతిచెందాడు. దీంతో గంటలోనే ఆ సంతోషం దూరమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పెద్దముప్పారం గ్రామానికి చెందిన తల్లాడి లక్ష్మయ్య, నాగమ్మ దంపతుల కు మారుడు ఉమేశ్ (42) పని నిమిత్తం బైక్పై ఆ దివారం సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం జి కొత్తపల్లి గ్రామానికి వెళ్తున్నాడు.ఈ క్ర మంలో మండలంలోని దాట్ల గ్రామ సమీపాన బైక్ అదుపు తప్పి కిందపడ్డాడు. ఇదే సమయంలో దంతాలపల్లి పీఎస్ కానిస్టేబుల్ కొయేడి శ్రీను ఓ కేసు విషయంలో దాట్లకు వచ్చాడు. ఈ క్రమంలో ఉమేశ్ బైక్ నుంచి పడ్డాడనే విష యం తెలిసింది. దీంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ఉమేశ్ను గంటపాటు కష్టపడి సీపీఆర్ చేసి బతికించా డు. అనంతరం మెరుగైన చి కిత్స కోసం 108లో ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా ఉమేశ్ మార్గమధ్యలో మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
అనుమానాస్పద స్థితిలో బీఆర్ఎస్ నాయకుడి మృతి
గీసుకొండ : గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ గొర్రెకుంటకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు ల్యాదేళ్ల రాజు(46) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆదివారం అతడి మృతదేహం ఇదే డివిజన్లోని మొగిలిచర్ల శివారులో కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి బంధువులు, గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ కథనం ప్రకారం.. గోనె సంచుల వ్యాపారం చేస్తున్న రాజు శనివారం మధ్యాహ్నం హసన్పర్తి పీఎస్లో పని ఉందంటూ ఇంటి నుంచి వెళ్లాడు. రాత్రి అయినా తిరిగి రాలేదు. మరుసటి రోజు అతడి మృతదేహం మొగిలిచర్ల శివారులోని శ్మశానవాటిక సమీపంలో లభ్యమైంది. తన భర్త అనుమానాస్పదంగా మృతి చెందాడని మృతుడి భార్య ప్రియాంక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పోలీసులు డాగ్ స్క్వాడ్తోపాటు మృతుడి సెల్ఫోన్ కాల్డేటా ఆధారంగా వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ పేర్కొన్నారు. కాగా, ఘటనాస్థలిని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సందర్శించి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం రాజు అంత్యక్రియలకు రూ. 50వేలు అందజేశారు. -
నేడు ‘దీపావళి’ పండుగ
మహబూబాబాద్ రూరల్ : జిల్లా వ్యాప్తంగా సోమవారం దీపావళి పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు.ఈమేరకు ఆదివారం మానుకోట పట్టణంలో కొనుగోళ్ల సందడి కనిపించింది. పూల దుకాణాల వద్ద ప్రజలు చామంతి, బంతి, కనకాంబరాలు, కాగడాలు, లిల్లీపూల దండలు, విడిపూలు కొనుగోలు చేస్తూ కనిపించారు. షాపుల నిర్వాహకులు ప్రత్యేకంగా గజమాలలు కూడా కట్టి సిద్ధంగా ఉంచారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో భక్తులు ప్రమిదలను కొనుగోలు చేశారు. సంప్రదాయం ప్రకారం భక్తులు భక్తిశ్రద్ధలతో తమ ఇళ్లలో ధనలక్ష్మి అమ్మవారు, కేదారేశ్వర స్వామివారి వ్రతాలను ఆచరించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. బాణసంచా కాల్చేందుకు సిద్ధమయ్యారు. -
గ్రామస్థాయి నుంచి బీసీ ఉద్యమం బలోపేతం
హన్మకొండ : బీసీ ఉద్యమాన్ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ అన్నారు. ఆదివారం హనుమకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బంద్ ఫర్ జస్టిస్ విజయవంతానికి కృషి చేసిన, సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. బీసీ బంద్ తెలంగాణ ఉద్యమం తరహాలో జరిగిందని, ఈ బంద్ బీసీ ఉద్యమానికి ఆరంభం మాత్రమేనన్నారు. బీసీ ఉద్యమాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లి బీసీలను చైతన్య పరుస్తామన్నారు. ఓటు మనదే.. సీటు మనదే.. రాజ్యాధికారం మనదే అనే నినాదంతో బీసీలందరినీ సంఘటితం చేస్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించేందుకు బీసీ జేఏసీ కృషి చేస్తోందన్నారు. సమావేశంలో బీసీ జేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా వర్కింగ్ చైర్మన్ దొడ్డపెల్లి రఘుపతి, వైస్ చైర్మన్లు దాడి మల్లయ్య యాదవ్, బోనగాని యాదగిరి గౌడ్, వైద్యం రాజగోపాల్, తమ్మల శోభారాణి, కోఆర్డినేటర్లు గాజు యుగంధర్ యాదవ్, తంగళ్లపల్లి రమేశ్, ప్రచార కార్యదర్శి అరేగంటి నాగరాజు గౌడ్, చాగంటి రమేశ్ పాల్గొన్నారు. టీఎస్ బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్ -
తల్లుల పోరాటం అందరికీ స్ఫూర్తి
గోదావరిలో యువకుడి గల్లంతువెంకటాపురం(కె): మండల పరిధిలోని ఆలుబాక గ్రామానికి చెందిన ఓ యువకుడు గోదావరి నదిలో గల్లంతయ్యాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పాషా గోదావరి లంకల్లో పుచ్చతోట సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం పుచ్చతోటను చూసి వచ్చేందుకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో గోదావరిలోని నీటి మడుగును దాటేక్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి లోతుకు వెళ్లి గల్లంతయ్యాడు. దీంతో పాషా కోసం గ్రామస్తులు నాటు పడవల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క, సారలమ్మ పోరాటం అందరికీ స్ఫూర్తి అని సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతులు అవధూతగిరి మహారాజ్, మహామండలేశ్వర్ డాక్టర్ సిద్ధేశ్వరానందగిరి మహారాజ్ అన్నారు. ఆదివారం అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పీఠాధిపతులు దేశ ప్రజల సుఖశాంతుల కోసం వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమ్మక్క, సారలమ్మ ధర్మం, ధైర్యం, త్యాగం నేటి తరానికి స్ఫూర్తి అన్నారు. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం జాతర ఉత్సవాల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు అభినందనీయమన్నారు. సమ్మక్క, సారలమ్మ స్ఫూర్తితో ప్రతీ ఒక్కరు తమ జీవితాన్ని ధర్మమార్గంలో నడిపితే సమాజంలో శాంతి, సౌభ్రాతత్వం నెలకొంటుందని తెలిపారు. కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, సూపరింటెండెంట్ విజయ్కుమార్, పూజారులు సిద్ధబోయిన ముణిందర్, జూనియర్ అసిస్టెంట్లు మధు, జగదీశ్వర్ పాల్గొన్నారు. 13 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్ దత్తగిరి పీఠాధిపతులు అవధూతగిరి, సిద్ధేశ్వరానందగిరి మహారాజ్ -
అకాలవర్షంతో తడిసిన మక్కలు
కేసముద్రం: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామంటే రైతులకు తిప్పలు తప్పడంలేదు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ఓపెన్యార్డులో ఆరబోసుకున్న మక్కలు ఆదివారం కురిసిన అకాల వర్షంతో తడిసిముద్దయ్యాయి. మక్కల్లో తేమ ఉండడంతో గత కొద్ది రోజులుగా ఓపెన్యార్డులో ఆరబోసుకున్నారు. తీరా మక్కల్లో తేమశాతం తగ్గేలోపు ఒక్కసారిగా అకాలవర్షం కురవడంతో మక్కలు తడిసిపోయాయి. కాగా, రైతుల వద్ద ఉన్న పరదాలు కప్పుకున్నప్పటికీ అడుగుభాగాలు తడిశాయి. వర్షంలో తడిసిన మక్కలను దగ్గరకు చేరుస్తూ, రైతులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. -
ఏడేళ్లకే నూరేళ్లు
● నీటిగుంతలో పడి బాలుడి మృతి నెల్లికుదురు: ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన జిల్లాలోని ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలో ఆదివారం జరిగింది. ఎస్సై కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉడుత సురేశ్ కుమారుడు సాత్విక్ (7) ఇంటి దగ్గర పిల్లలతో కలిసి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడిపోయాడు. గమనించిన సురేశ్ తమ్ముడు అనిల్ కుమారులు హర్ష, హర్ధిక్ తాత వెంకటమల్లుకు తెలిపారు. వెంటనే ఆయన గుంత దగ్గరకు నీటిలోకి దిగి సాత్విక్ను బయటకు తీశాడు. అప్పటికే బాలుడు నీటి గుంతలో పడి ఊపిరాడక మృతి చెందాడు. కూలి పనులకు వెళ్లి వచ్చిన బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మీడియా గొంతు నొక్కడం అప్రజాస్వామికం
● సాక్షి దినపత్రికపై ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు సరికాదు ● తక్షణమే కేసులను ఉపసంహరించుకోవాలి ● ప్రజాసంఘాల నాయకుల డిమాండ్ఏపీ ప్రభుత్వ వైఖరిని ఖండించాలి.. పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వార్తలు ప్రచురించినప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయని భావిస్తే న్యాయం పోరాటం చేయాలి. బెదిరింపులకు పాల్పడుతూ కేసులు పెట్టడం పత్రికా స్వేచ్ఛ హరించడమే. ఏపీ ప్రభుత్వ వైఖరిని ముక్తకంఠంతో ఖండించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. – ఆడెపు రవీందర్, అధ్యక్షుడు దేశాయిపేట రోడ్డు వర్తక సంఘం, వరంగల్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి మీడియా గొంతునొక్కడం అప్రజాస్వామికమని పలు ప్రజాసంఘాల నాయకులు అన్నారు. సాక్షి దినపత్రికపై దాడులు చేస్తూ, ఎడిటర్, విలేకరులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని పేర్కొన్నారు. బెదిరింపులకు పాల్పడుతున్న సర్కారు వైఖరిని ఖండించాలని పిలుపునిచ్చారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడడం దుర్మార్గమని అన్నారు. వేధింపులు మానుకోవాలి.. నెహ్రూసెంటర్: వాస్తవ కథనాలు ప్రచురించిన సాక్షి పత్రికపై, ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం, పోలీసులు వేధింపులు మానుకోవాలి. ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు చెప్పినట్లు అక్కడి పోలీసులు వ్యవహరిస్తున్నారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తే చూస్తూ ఊరుకోం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడడం సరికాదు. సాక్షి పత్రికపై దాడులు, పత్రికా స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. – గుగులోత్ భీమానాయక్, ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అక్రమ కేసులు వెనక్కి తీసుకోవాలినెహ్రూసెంటర్: సాక్షి దినపత్రిక ఎడిటర్పై పెట్టిన అక్రమ కేసులు, నోటీసులను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అక్రమ కేసులు పెట్టడాన్ని ఎమ్మార్పీఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. వాస్తవ కథఽనాల ద్వారా అక్రమాలను వెలికితీస్తే కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. పత్రికా స్వేచ్ఛను హరించే హక్కు ఏపీ ప్రభుత్వానికి లేదు. ఇప్పటికై నా సాక్షిపై అక్రమంగా పెట్టిన కేసులు, నోటీసులను వెనక్కి తీసుకోవాలి. –గుగ్గిళ్ల పీరయ్యమాదిగ, ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి -
ఇంటిలోని ఏమూలలోనూ చీకటి లేకుండా చూడాలి..
ఈ రోజు దీపతోరణాలు వెలిగించే ఆచారం ఉంది. అందుకే దీపావళి పండుగగా పిలుస్తారు. ఈరోజున శ్రీమహా లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి ఇంటింటికీ తిరుగుతుందని భావిస్తారు. అందుకే ప్రజలు శ్రీమహాలక్ష్మీదేవికి నీరాజనాలు పలుకుతూ తమ ఇంటిలోపల, వెలుపల దీపాలు వెలిగిస్తారు. ఈ రోజు మట్టి ప్రమిదలో నెయ్యి లేదా నూనె పోసి, ఒత్తులు వేసి దీపాలు వెలిగించడం సర్వశ్రేష్టం. దీపాల వరుసను వృక్షాకారంలో, స్వస్తిక్ ఆకారంలోనూ పేర్చి వెలిగిస్తే మరింత మంచిది. పురాతన శివాలయాలలో దీపదానం చేయడం దేవాలయాల్లో దీపాలు వెలిగించడం సంప్రదాయం. ఇంటిలోని ఏ మూలలోనూ చీకటిలేకుండా చూడాలి. -
పత్రికా స్వేచ్ఛను హరించడం తగదు..
స్టేషన్ఘన్పూర్: పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. సాక్షి మీడియాలో ఏపీ ప్రభుత్వం పోలీసులతో సోదాలు, దాడులు చేయిస్తూ పత్రికా స్వేచ్ఛను హరించడం అప్రజాస్వామికం. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభమైన పత్రికారంగంపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న దాడి అనాగరికం. పత్రికా స్వాతంత్య్రం అత్యంత కీలకం. సాక్షి మీడియాపై చంద్రబాబు ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదు. – మంగు జయప్రకాశ్, టీఎస్ యూటీఎఫ్ జనగామ జిల్లా ఉపాధ్యక్షుడు, స్టేషన్ఘన్పూర్ -
పర్యావరణహిత ‘దీపావళి’ని ఆహ్వానించాలి
మహబూబాబాద్ రూరల్: చెడుపై మంచి విజయం సాధించిన సందర్భంగా జరుపుకునే పండుగ దీపావళి. ఈ పండుగ పరామర్థం మానవ జీవితంలో ఆనందాలను నింపడమే.. అందుకే ఈ రోజున బాణసంచా పేల్చుతాం. అయితే దీపావళి వేడుకలను శబ్దకాలుష్యం లేకుండా దీపోత్సవంగా జరుపుకోవాలి. బాణసంచా కాల్చడం వల్ల బీపీ, తలనొప్పి, గుండెపోటు తదితర వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుందని చెప్పొచ్చు. కాలుష్య పొగను పీల్చితే ముక్కు, గొంతులో మంటలు ఏర్పడుతాయి. బాణసంచా పొగ కళ్లను మండించి నీరు తెప్పించడమేకాకుండా ఎరుపు రంగులోకి మారుస్తాయి. చెవులు ఒక్కోసారి పనిచేయడం మానేస్తాయి. అంతేకాకుండా చెవుడుకూడా వచ్చేప్రమాదం ఉంది. బాణసంచా కాలిస్తే అధిక రక్తపోటు, ఊపిరితిత్తుల వ్యాధులు, దగ్గు, తుమ్ములు, అస్తమా, ఉబ్బసం, అధికమవుతాయి. శ్వాస కష్టమవుతుంది. విషవాయువులు గర్భిణులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మానసికంగా సరిలేని వారు కూడా ఈ పండుగ రోజుల్లో భయం, ఒత్తిడికి గురవుతారు. భారీ ధ్వని కాలుష్యానికి వయసు పైబడిన వారు మరింత బాధపడుతారు. అందుకే ప్రతీ ఒక్కరూ పర్యావరణహిత ‘దీపావళి’ని జరుపుకోవాలని ఆశిద్దాం. -
రెండు గంటలు.. ఎఫ్ఓబీ పనులు
మహబూబాబాద్ రూరల్ : మానుకోట రైల్వే స్టేషన్ ప్రధాన కార్యాలయం ఎదుట ఆదివారం ఎస్కలేటర్, ర్యాంపుతో కూడిన 12 ఫీట్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా ప్రయాణికుల సౌకర్యార్థం నూతనంగా ర్యాంపు నిర్మాణ పనులు చేస్తుండగా దానికి అనుసంధానంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిని కూడా నిర్మించ తలపెట్టారు. కాగా దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు ప్రత్యేకంగా రెండు భారీ క్రేన్లను తెప్పి ంచారు. రైల్వే ఐఓడబ్ల్యూ జేకే వర్మ ఆధ్వర్యంలో రైళ్ల రాకపోకలు, ప్రయాణికులకు ఎలాంటి ఆటంకం కలగకుండా మెగా బ్లాక్ ద్వారా రెండు గంటల్లోనే 12 ఫీట్ల వెడల్పుతో కూడిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి పిల్లర్ల నిర్మాణ పనులు చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఎఫ్ఓబీ నిర్మాణ పనులు పూర్తయితే త్వరలోనే ప్రయాణికులకు ఎస్కలేటర్, ర్యాంపు అందుబాటులోకి రానున్నాయి. మెగా బ్లాక్ ద్వారా పనుల పూర్తికి చర్యలు భారీ క్రేన్ల సాయంతో ఎఫ్ఓబీ పిల్లర్ల ఏర్పాటు త్వరలో అందుబాటులోకి రానున్న ఎస్కలేటర్, ర్యాంపు -
ఏటీఎంలో నగదు కొల్లగొట్టేందుకు యత్నం
కాజీపేట: కాజీపేటలోని డీజిల్ కాలనీ ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఎస్బీఐ ఏటీఎం కేంద్రంలో శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి యత్నించి మిషన్ను ధ్వంసం చేశారు. ఏటీఎం మిషన్లో డబ్బులు ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తించిన దుండగులు ముఖాలకు ముసుగులు ధరించి.. వెంట తెచ్చుకున్న ఆయుధాలతో మిషన్ను ధ్వంసం చేశారు. ఎంత ప్రయత్నించినా డబ్బులు బయటకు వచ్చే బాక్స్ మాత్రమే ఓపెన్ అయ్యింది. దీంతో దుండగులు కోపంతో మిషన్ను ఇష్టం వచ్చినట్లుగా ధ్వంసం చేసి నిరాశతో పరారయ్యారు. ఉదయం వేళ డబ్బులు డ్రా చేయడానికి వచ్చిన వారు గమనించి 100 డయల్ చేసి ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి ఎస్బీఐ అధికారులతో పాటు సీఐ సుధాకర్రెడ్డి, ఎస్సైలు లవన్కుమార్, శివ క్రైం పార్టీ సిబ్బందితో చేరుకుని ఆధారాల కోసం ప్రయత్నించారు. రహదారులపై ఉన్న సీసీ కెమెరాలను జల్లెడపడుతున్నారు. ఇది స్థానిక దొంగల పనేనా? లేక ఇతర ప్రాంతాలకు చెందినవారెవరైనా చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏటీఎంలో దాదాపు రూ.7లక్షల వరకు నిల్వ ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎస్బీఐ బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. బైక్ అదుపు తప్పి వైద్యుడి మృతితరిగొప్పుల: బైక్ అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టడంతో ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ఒప్పిచెర్ల గ్రామానికి చెందిన మాచర్ల రవికిషోర్ (31) శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న రవికిషోర్ గురువారం తన స్వగ్రామం ఒప్పిచెర్లకు వెళ్లి కారంపూడిలో కొత్త బైక్ కొన్నాడు. శుక్రవారం అదే బైక్పై తిరిగి మంచిర్యాలకు వస్తున్న క్రమంలో రాత్రి 11 గంటల సమయంలో జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లి క్రాస్రోడ్ సమీపంలో మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో అతడి తల, ఛాతీ భాగంలో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య హిమబిందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై కాసర్ల రాజయ్య తెలిపారు. అప్పుల భారంతో రైతు ఆత్మహత్య పెద్దవంగర: భూ వివాదం, అప్పుల ఒత్తిడి తట్టుకోలేక మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం చిన్నవంగర గ్రామానికి చెందిన రైతు కూన నారాయణ (65) ఆత్మహత్య చేసుకున్నాడు. నారాయణ తనకున్న వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొంత కాలం క్రితం తన భూమిలో కొంత భాగాన్ని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి విక్రయించాడు. రిజిస్ట్రేషన్ పూర్తి కాకపోవడంతో భూమి వివాదం కొనసాగుతోంది. భూ సమస్యలతో పాటు కుటుంబ అవసరాలకు తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరగడంతో మానసికంగా ఆవేదనకు గురై పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు తొర్రూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యుల సూచనల మేరకు వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు శుక్రవారం మృతి చెందాడు. భార్య శశిరేఖ ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై ఎండీ హిదాయత్ అలీ తెలిపారు. కూతురు పెళ్లి చూడకుండానే కానరాని లోకాలకు వెంకటాపురం(ఎం): ఒక్కగానొక్క బిడ్డ పెండ్లి ఘనంగా చేద్దామనుకున్నాడు. ఎన్నెన్నో కలలు కన్నాడు. అందుకు తగిన ఏర్పాట్లలో లీనమయ్యాడు. ‘నవంబర్ 14న బిడ్డ పెళ్లి పెట్టుకున్న. తప్పక రావాలె. కార్డులు కొట్టిస్తాన. ఇంటికచ్చి పిలుస్త’ అని నవ్వుతూ కలిసిన వారందరికీ చెప్పుకున్నాడు. ఇంతలోనే కరెంటు తీగ ఆ తండ్రిని కాటేసింది. విద్యుత్ షాక్ రూపంలో మృత్యువు ముంచుకొచ్చింది. పెళ్లి జరగాల్సిన ఇంట విషాదం అలుముకుంది. వెంకటాపురం(ఎం) మండల కేంద్రానికి చెందిన రైతు కూరెళ్ల రాజయ్య(55) శనివారం విద్యుత్ షాక్తో మృతి చెందాడు. అతడికి ఇద్దరు సంతానం. కుమారుడు నరేశ్, కూతురు స్వాతి. బిడ్డ పెళ్లి చేసేందుకు నవంబర్ 7న నిశ్చితార్థం పెట్టుకున్నాడు. నవంబర్ 24న పెళ్లి తేదీని నిర్ణయించారు. ఏర్పాట్లలో భాగంగా మూడు రోజులుగా ఇంట్లో మరమ్మతులు చేయిస్తున్నాడు. అందులో భాగంగా.. శనివారం ఇంట్లోని వైర్లను సరిచేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. మరికొద్ది రోజుల్లో వైభవంగా పెళ్లి వేడుకలు జరగాల్సిన ఇంట్లో తండ్రి ఆకస్మికంగా మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నిండింది. కుటుంబ సభ్యులతో పాటు బంధువుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. ● మిషన్ తెరుచుకోకపోవడంతో దొంగలు పరార్ కరెంట్ షాక్తో తండ్రి మృతి మిన్నంటిన కుటుంబీకుల రోదనలు -
పాలన గాడిన పడినట్లేనా?
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో కొన్నేళ్లుగా పలు సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోతున్నాయి. రెగ్యులర్ వీసీగా ఉస్మానియా యూనివర్సిటీ జువాలజీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పుడు వర్సిటీలోని వివిధ సమస్యలు పరిష్కారమవుతాయని అంతా భావించారు. కానీ, ఆయన ఏనిర్ణయం తీసుకోవడంలోనైనా, దృష్టికి వచ్చిన సమస్యకు పరిష్కారం చూపడంలోనైనా స్లో పాలన కొనసాగిస్తున్నారు. వీసీగా ప్రతాప్రెడ్డి బాధ్యతలను స్వీకరించి ఈనెల 19 (ఆదివారం)తో ఏడాది పూర్తవుతోంది. పాలనపై మిశ్రమ స్పందన వస్తోంది. ఈఏడాదిలో వీసీగా కేయూలో చేపట్టిన కార్యక్రమాలు, పరిష్కారానికి నోచుకున్న సమస్యలు, చేపట్టబోయే అభివృద్ధిపై ప్రత్యేక కథనం. పాఠాల బోధనేది? కేయూలో కొన్నేళ్లుగా వివిధ విభాగాల్లో, వివిధ వర్సిటీ కాలేజీల్లోనూ సరిగ్గా తరగతులు జరగడంలేదు. ఉన్న రెగ్యులర్ అధ్యాపకుల్లో కొందరు పరిపాలనా పదవుల్లో కొనసాగుతున్నారు. పాఠాల బోధనపై ఆసక్తి కనబర్చడంలేదు. కొందరు రెండు, మూడు, నాలుగు పదవుల్లోనూ కొనసాగుతుండడం బోధనపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. కాంట్రాక్టు, పార్ట్టైం అధ్యాపకుల్లోనూ కొందరు తరగతులు సరిగ్గా తీసుకోవడం లేదని, ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. కాగా, ఇటీవల వీసీ ప్రతాప్రెడ్డి బాటనీ విభాగాన్ని తనిఖీ చేయగా టీచింగ్, నాన్టీచింగ్ ఉద్యోగులు ఎవరూ లేరని గుర్తించారు. ఫార్మసీ కాలేజీకి వెళ్లగా, అక్కడ ప్రిన్సిపాల్, మరో ప్రొఫెసర్ ఉన్నారు. మిగతా పలువురు అధ్యాపకులు ఆసమయంలో విధుల్లో లేరని గుర్తించి ప్రిన్సిపాల్తో మాట్లాడినట్లు సమాచారం. వివిధ విభాగాల్లో ప్రాక్టికల్స్ కూడా మొక్కుబడిగానే చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ● ఈఏడాది జూలై 7న కేయూ 23వ స్నాతకోత్సవం నిర్వహించారు. ఆగస్టులో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ను విజయవంతంగా నిర్వహించారు. ● పలు సంస్థలతో ఎంఓయూలు చేపట్టారు. ● ఆరోపణలు వచ్చిన వారిపై కమిటీలు వేశారు. పలువురిపై చర్యలు తీసుకున్నారు. మరో రెండు మూడు నివేదికలపై ఇప్పటివరకు బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. ● గతంలోకంటే కేయూకు బ్లాక్గ్రాంటును ఈఆర్థిక సంవత్సరంలో కేయూకు బడ్జెట్ను రూ.145 కోట్ల వరకు పెంచడానికి వీసీ కృషి చేశారు. గత మూడునెలలుగా పెన్షనర్లకు ప్రభుత్వం పెన్షన్ను మంజూరు చేయడం లేదు. వర్సిటీ అంతర్గత నిధుల నుంచి చెల్లిస్తున్నారు. ● రూసా ప్రాజెక్టుల, సైన్స్ రీసెర్చ్ప్రాజెక్టుల పరిశోధనలకోసం సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ సెంటర్ భవనం, మహిళా హాస్టల్ భవనం, పద్మాక్షి మహిళా హాస్టల్లో నూతనంగా డైనింగ్ హాల్ నిర్మించబోతున్నారు. ● కేయూలోని మహిళా హాస్టళ్లన్నింటికీ కలిసి రూ.3.50 కోట్ల వ్యయంతో ప్రహరీ నిర్మించబోతున్నారు. ● కేయూ చుట్టూ ఉన్న భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు రూ.20 కోట్ల యూనివర్సిటీ నిధులతో 10.2 కిలోమీటర్ల మేర ప్రహరీ నిర్మించబోతున్నారు. ● కేయూ పీజీ హాస్టల్ డైనింగ్ హాల్ వద్ద మరో రూ.40 లక్షలు వెచ్చించి కిచెన్ షెడ్డును నిర్మించారు. దీన్ని త్వరలోనే వినియోగంలోకి తీసుకురావాల్సి ఉంది. వర్సిటీలో అడ్మిషన్లు పొందిన వారిలో కొందరికి వసతి కల్పించలేకపోతున్నారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు ఫస్ట్ ఇయర్లో ఎవరికీ హాస్టల్ వసతి కల్పించడం లేదు. మరో రెండు హాస్టళ్ల భవనాలు అవసరం ఉంది. న్యూపీజీ హాస్టల్ వద్ద రూ.2.50 కోట్ల వ్యయంతో డైనింగ్ హాల్ నిర్మించి మూడేళ్లవుతోంది. నేటికీ వినియోగంలోకి తీసుకురాలేదు. వర్సిటీ కాలేజీల్లో అధ్యాపకుల కొరత ఉంది. పార్ట్టైం లెక్చరర్లను నియమించాలనే డిమాండ్ ఉంది. ఇటీవల పాలకమండలి కూడా పార్ట్టైం లెక్చరర్ల నియామకానికి ఓకే చెప్పింది. రూ.4.50 కోట్లతో నిర్మించిన కె హబ్ను ఇప్పటి వరకు వినియోగంలోకి తీసుకు రాలేదు. పీవీ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయలేదు. రూసా ప్రాజెక్టు కింద రూ.45 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు నిధులు మంజూరయ్యాయి. వివిధ విభాగాల ప్రొఫెసర్లు ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉండగా.. ఇప్పటి వరకు చేపట్టలేదు. సూపరింటెండెంట్లకు అసిసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా పదోన్నతి కల్పించాల్సి ఉంది. నాలుగో తరగతి ఉద్యోగుల పోస్టులు 150 వరకు భర్తీ చేయాల్సి ఉంది. 1992 నుంచి రెగ్యులర్ బోధనేతర ఉద్యోగుల నియామకాలు లేవు. పార్ట్టైం లెక్చరర్లను కాంట్రాక్టు లెక్చరర్లుగా నియమించాలనే డిమాండ్ అలాగే ఉండిపోయింది. రెగ్యులర్ అధ్యాపకులు 77 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 15 ఏళ్లుగా నియామకాలు లేవు. కాకతీయ యూనివర్సిటీలోని దూరవిద్యాకేంద్రంలో అడ్మిషన్ల సంఖ్య పడిపోతోంది. ప్రవేశాలు పొందిన వారికి సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించడం లేదు. పరీక్షలు సకాలంలో నిర్వహించడం లేదు. కేయూ భూముల ఆక్రమణలు గుర్తించి స్వాధీనం చేసుకోవడం లేదు. కేయూ వీసీ ప్రతాప్రెడ్డి పాలనకు నేటితో ఏడాది పూర్తి వినియోగంలోనికి రాని కె హబ్, డైనింగ్ హాల్ కమిటీలు వేసి చర్యలు తీసుకోవడంలో జాప్యం కొన్నేళ్లుగా ఎక్కడి సమస్యలు అక్కడే.. వేధిస్తున్న రెగ్యులర్ అధ్యాపకుల కొరత -
వేగంగా సాంకేతికత అభివృద్ధి
● ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డిహసన్పర్తి: నేటి ఆధునిక యుగంలో సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోందని ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ ఎ.వరదారెడ్డి అన్నారు. అన్నాసాగరం శివారులోని సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వరదారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులు సృజనాత్మక శక్తిని పెంపొందించుకోవాలన్నారు. ప్రొఫెసర్ వెంకటనారాయణ మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ జీవితంలో కొత్త ప్రారంభమన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజశ్రీరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థినులు సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. ఈసందర్భంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి పట్టాలు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ సుదర్శన్, డాక్టర్ కుమారస్వామి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ శ్రీవాణి, ఏఓ వేణుగోపాల్, కార్యక్రమ కో–ఆర్డినేటర్లు ఝాన్సీరాణి, ఎస్.శ్వేత తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన నేషనల్ అథ్లెటిక్స్ మీట్
● హెప్టాథ్లాన్లో తెలంగాణకు గోల్డ్ వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మూడు రోజుల పాటు కొనసాగిన జాతీయస్థాయి 5వ అథ్లెటిక్స్ అండర్–23 చాంపియన్షిప్ పోటీలు శనివారం ముగిశాయి. చివరి రోజు జరిగిన పలు ఈవెంట్లలో పతకాల కోసం అథ్లెట్లు పోటీపడ్డారు. పోటీల ఏర్పాట్లను తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె.సారంగపాణి, అధ్యక్షుడు స్టాన్లీజోన్స్, డీవైఎస్ఓ గుగులోతు అశోక్కుమార్ పర్యవేక్షించారు. పోటీల నిర్వహణలో టెక్నికల్ అఫీషియల్స్, కోచ్లు వాసుదేవరావు, శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. చివరి రోజు జరిగిన పోటీల్లో మహిళల 800 మీటర్ల హెప్టాత్లాన్ విభాగంలో తెలంగాణ నుంచి కేతావత్ సింధు బంగారు పతకాన్ని సాధించింది. రికార్డులు బ్రేక్ మూడు రోజుల పాటు జరిగిన ఈ జాతీయ స్థాయి అథ్లెటిక్స్ మీట్లో పలువురు అథ్లెట్లు వివిద విభాగాల్లో పాత రికార్డులు బ్రేక్ చేసి కొత్త రికార్డులు సృష్టించారు. 100 మీటర్ల మహిళల విబాగంలో సుదీష్న హనమంత శివాంకర్ (మహారాష్ట్ర), 100 మీటర్ల మహిళల పరుగు విభాగంలో సాక్షి (గుజరాత్), డిస్కస్త్రో మహిళల కేటగిరీలో నిఖితకుమారి (రాజస్తాన్), పురుషుల 20వేల మీటర్ల రేస్వాక్లో సచిన్బొహారా(ఉత్తరాఖండ్), పురుషుల లాంగ్జంప్లో అనురాగ్ సీవీ (కేరళ), 400ల మీటర్ల పురుషుల హార్డిల్స్లో అర్జున్ ప్రదీప్ (కేరళ) కొత్త రికార్డులు సృష్టించారు. లాంగ్ జంప్ అనురాగ్ సీవీ తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు. 2024లో తన పేరు మీద ఉన్న 7.87 మీటర్ల పాత రికార్డు 8.08 మీటర్లతో కొత్త రికార్డును సృష్టించాడు. కాగా 400ల మీటర్ల పురుషుల హార్డిల్స్ విభాగంలో కేరళకు చెందిన అర్జున్ ప్రదీప్ రికార్డు బ్రేక్ చేశాడు. 2022లో యాషెస్ (కర్ణాటక) 50.89 పేరున ఉన్న పాత రికార్డును అర్జున్ప్రదీప్ 50.29 స్కోర్తో రికార్డు సృష్టించాడు. -
యాసంగికి సన్నద్ధం కావాలి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి ● ట్రాన్స్ కో, డిస్కం అధికారులతో సమీక్ష హన్మకొండ: యాసంగి సాగుకు సన్నద్ధం కావాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి విద్యుత్ అధికారులకు సూచించారు. హనుమకొండ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ట్రాన్స్కో సీఈలు, ఎస్ఈలు, ఎన్పీడీసీఎల్ ఎస్ఈలు, ఎస్ఏఓలతో శనివారం సమీక్ష నిర్వహించారు. డివిజన్లు, జిల్లాల వారీగా ప్రగతిని సమీక్షించారు. సమావేశంలో సీఎండీ వరుణ్రెడ్డి మాట్లాడుతూ.. ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి కొత్తగా నెలకొల్పే 220/33 కేవీ, 132/33 కేవీ కొత్త సబ్స్టేషన్ల నిర్మాణం, పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్ధ్యం పెంపు, డబుల్ సర్క్యూట్ లైన్లు, బే ఎక్స్టెన్షన్ ప్రతిపాదనలు పంపాలని, పురోగతిలో ఉన్న పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్త సబ్స్టేషన్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతులకు ట్రాన్స్కోకు లేఖలు రాయాలని సూచించారు. ట్రాన్స్ కో, ఎన్పీడీసీఎల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ట్రాన్స్ఫార్మర్ల ఫెయిల్యూర్లు తగ్గించాలని, రిపేర్లు పెంచాలన్నారు. వ్యవసాయ, కొత్త సర్వీసులు, టీజీఐ పాస్లో నమోదు చేసుకున్న సర్వీసులు త్వరగా మంజూరు చేయాలన్నారు. సమావేశంలో డైరెక్టర్లు వి.మోహన్రావు, వి.తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, చీఫ్ ఇంజనీర్లు టి.సదర్లాల్, కె.తిరుమల్రావు, అశోక్, రాజు చౌహన్, ట్రాన్స్ కో చీఫ్ ఇంజనీర్ శ్రీరామ్కుమార్ పాల్గొన్నారు. -
కోర్టులు.. న్యాయం పంచే పవిత్ర స్థలాలు
జనగామ: కోర్టులు న్యాయం పంచే పవిత్ర స్థలాలు అని, న్యాయం జరిగిందన్న నమ్మకంతో కక్షిదారులు కోర్టు నుంచి తిరిగి వెళ్లేలా చూడడం ప్రతీ న్యాయవాది బాధ్యత అని హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్ సేన్రెడ్డి అన్నారు. జనగామ మండలం చంపక్ హిల్స్ వద్ద రూ.81 కోట్ల నిధులతో నిర్మించనున్న నూతన కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి హైకోర్టు జడ్జిలు నామవరపు రాజేశ్వరావు, బీఆర్ మధుసూదన్రావు, సుద్దాల చలపతిరావుతో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. అంతకు ముందు ఆర్అండ్బీ అతిథి గృహంలో జిల్లా న్యాయమూర్తి బి.ప్రతిమ, కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా, రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిప్రసాద్ యాదవ్, తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తులు పోలీ సుల గౌరవ వందనం స్వీకరించారు. బాణాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు, సిద్ధాంతి క్రిమాచాచారి మంత్రోచ్ఛరణల నడుమ కోర్టు నూతన భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం హైకోర్టు జడ్జిలు మొక్కలు నాటి నీరు పోశారు. న్యాయవాదులు మెరుగైన పాత్ర పోషించాలి.. సిద్దిపేట రోడ్డులోని ఉషోదయ ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి మాట్లాడుతూ.. కేసుల పరిష్కారం విషయంలో న్యాయవాదులు ప్రావీణ్యతతో మరింత మెరుగైన పాత్ర పోషించాలన్నారు. కక్షిదారులకు సమగ్ర, ధర్మబద్ధ న్యాయం అందించడం న్యాయవాదుల ప్రధాన లక్ష్యమన్నారు. వరకట్న వేధింపులు, చెక్ బౌన్స్ కేసులు కుటుంబ తగాదాలు, భాగస్వామ్య కేసులు ఎక్కువగా వస్తున్నాయని, వీటిని త్వరతగతిన పరిష్కరించే అవకాశం ఉందని తెలిపారు. కేసుల పరిష్కారంలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మధ్యవర్తిత్వ ప్రక్రియలో న్యాయవాదులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. నూతన కోర్టు భవనం రెండేళ్లలో పూర్తవుతుందని కాంట్రాక్టర్ చెప్పారని, కానీ, 20 నెలల్లో ప్రారంభోత్సవం చేసుకుంటామనే నమ్మకం ఉందన్నారు. అనంతరం హైకోర్టు ఆద్వర్యంలో జనగామ, స్టేషన్ఘన్పూర్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ప్రతిమ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిప్రసాద్ యాదవ్, సీనియర్ సివిల్ జడ్జిలు సి.విక్రమ్, సుచరిత, ప్రిన్సిపల్ జూనిర్ సివిల్ జడ్జి శశి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి సందీప, సెకెండ్ క్లాస్ మెజిస్ట్రేట్ వెంకటరాం నర్సయ్య, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్ సేన్రెడ్డి నూతన కోర్టు భవన సముదాయానికి భూమిపూజ -
శిల్ప కళాసంపద మహాద్భుతం
ఖిలా వరంగల్: చారిత్రక వైభవాన్ని చాటే కాకతీయుల రాజధాని నిర్మాణం, నళ్లరాతితో తయారైన నాటి శిల్ప కళా సంపద మహాద్భుతంగా ఉందని టాంజానియా దేశ మిడ్ లెవెల్ సివిల్ సర్వెంట్ అధికారులు కొనియాడారు. హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీ (డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ)లో ప్రాఫెసర్, కోర్సు డైరెక్టర్ డాక్టర్ రావులపాటి మాధవి ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న టాంజానియా దేశానికి అధికారులు శనివారం సాయంత్రం ఖిలా వరంగల్ కోటను సందర్శించారు. కాకతీయలు కీర్తితోరణాల నడుమ ఉన్న అద్భుత శిల్ప సంపదతోపాటు ఖుష్మాహల్, రాతి, మట్టికోట అందాలు, ఏకశిలగుట్ట, శృంగారపు బావిని తిలకించారు. కాకతీయుల చరిత్ర, విశిష్టతను పర్యాటక శాఖ ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్యకిరణ్, కోట గైడ్ రవియాదవ్ వివరించారు. ఆనాటి కట్టడాలు, శిల్పకళా సంపద అద్భుతంగా ఉందని కొనియాడారు. అనంతరం వారు టీజీ టీడీసీ ఆధ్వర్యంలో నిర్వహించే సౌండ్ అండ్ లైటింగ్ షోను తిలకించారు. వారి వెంట ఎంసీహెచ్ఆర్డీ విజిట్ కో–ఆర్డినేర్ నందకిషోర్, కేంద్ర పురావస్తుశాఖ కోట ఇన్చార్జ్ శ్రీకాంత్, టూరిజం అభివృద్ధి సంస్థ మేనేజర్ అజయ్, రాజేశ్ తదితరులు ఉన్నారు. ● టాంజానియా దేశ సివిల్ సర్వెంట్లు -
ముగిసిన వేంకటేశ్వరుడి పవళింపు సేవ
గార్ల: మండలంలోని మర్రిగూడెం స్వామివారి బ్రహ్మోత్సవాల అనంతరం గార్ల దేవాలయంలో వేంకటేశ్వరస్వామి సమేత శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాల పవళింపు సేవ శనివారం ముగిసింది. ప్రత్యేకంగా పూలమాలలతో అలంకరించిన ఊయలలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పడుకోబెట్టి కొనసాగించిన పవలింపు సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి పారవశ్యం పొందారు. బ్రహ్మోత్సవాల ముగింపు అనంతరం మాజీ సర్పంచ్ గంగావత్ లక్ష్మ ణ్నాయక్ దంపతులు అర్చకులకు నూతన వస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అజ్మీరా బన్సీలాల్, వేమిశెట్టి శ్రీనివాస్, పరుచూరి కుటుంబరావు, ఎం.రాములు, మహిళా భక్తులు కవిత, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు. రామప్పలో విదేశీయుల సందడి వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీలో శిక్షణ పొందుతున్న టాంజనియా దేశానికి చెందిన 30 మంది అధికారులు సందర్శించారు. ప్రొఫెసర్, కోర్స్ డైరెక్టర్ డాక్టర్ రావులపాటి మాధవి ఆధ్వర్యంలో వారు రామప్ప ఆలయానికి చేరుకొని రామలింగేశ్వస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్ వారికి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని వారు కొనియాడారు. అనంతరం రామప్ప సరస్సును సందర్శించి సరస్సులో బోటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఎంసీహెచ్ఆర్డీ అధికారులు రవి, సాయికృష్ణ, నందకిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
పత్రికా స్వేచ్ఛను హరించొద్దు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించడం తగదని, ఉద్దేశపూర్వకంగా సాక్షి దినపత్రికపై దాడులు, ఎడిటర్, విలేకరులపై అక్రమ కేసులు బనాయించడం సరికాదని ఉద్యోగ, విద్యార్థి సంఘాల నాయకులు ఖండిస్తున్నారు. నిజాలను నిర్భయంగా రాస్తే అక్కడి పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య పత్రికలు వారధి అనే విషయాన్ని మర్చిపోవద్దని సూచిస్తున్నారు. అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. – సాక్షి నెట్వర్క్కేసుల నమోదు సరికాదు ములుగు రూరల్: సాక్షి కార్యాలయాలపై ఏపీ ప్రభుత్వం దాడులు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుంది. సమాజంలో జరుగుతున్న అక్రమాలను ప్రజలకు తెలియజేసే పత్రికలపై దాడులు, ఎడిటర్పై కేసులు నమోదు చేయడం సరికాదు. ఏపీ ప్రభుత్వం సాక్షి ఎడిటర్, రిపోర్టర్లపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. – పోలు రాజు, టీఎన్జీఓ ములుగు జిల్లా అధ్యక్షుడు కక్షసాధింపు చర్యలు మానుకోవాలి నెహ్రూసెంటర్: సాక్షి దినపత్రిక, ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలి. పత్రికా స్వేచ్ఛను హరిస్తే సమాజానికి మేలు జరగదు. జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం వల్ల సుపరిపాలన అనిపించుకోదు. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరికాదు. – ఎం.వివేక్, డీఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు దాడులను ఖండిస్తున్నాం.. జనగామ: ప్రభుత్వం చేసే మంచి, చెడులను ప్రజలకు తెలియజేస్తూ, మనకు దారి చూపించే పత్రికలపై ఏపీ సర్కార్ తీరు సరికాదు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి, జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేయడాన్ని ఖండిస్తున్నాం. సమాజంలో పత్రికలే మార్గదర్శకంగా ఉండి మనల్ని నడిపిస్తున్నాయి. –పెండెల శ్రీనివాస్, గ్రామ పరిపాలన ఆఫీసర్ రాష్ట్ర నాయకుడు, జనగామ ఏపీ ప్రభుత్వానికి ఇది మంచిది కాదు సాక్షి దినపత్రిక, ఎడిటర్పై అక్రమ కేసులు ఎత్తివేయాలి ఉద్యోగ, విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్ -
విధుల్లో నిజాయితీగా వ్యవహరించాలి
కేసముద్రం: పోలీసులు తమ విధుల్లో నిజాయితీ, క్రమశిక్షణ, ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని ఎస్పీ సుధీర్ రాంనాఽథ్ కేకన్ అన్నారు. కేసముద్రంలో ఇటీవల నూతనంగా ఏర్పాటైన సర్కిల్ పోలీస్స్టేషన్, కేసముద్రం, ఇనుగుర్తి పోలీస్స్టేషన్లను ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు. పోలీస్శాఖ ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, చట్టవ్యవస్థను కాపాడడంలో కట్టుబడి ఉందన్నారు. ముందుగా సిబ్బంది విధుల నిర్వహణ, రికార్డులను, పోలీస్ స్టేషన్ పరిసరాలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, సీఐ సత్యనారాయణ, కేసముద్రం ఎస్సై క్రాంతికిరణ్, ఇనుగుర్తి ఎస్సై కరుణాకర్, సిబ్బంది పాల్గొన్నారు. హుండీ లెక్కింపుగార్ల: మర్రిగూడెం వేట వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం శని వారం దేవాలయం ప్రాంగణంలో దేవాదాయశాఖ కార్యనిర్వాహక అధికారి సత్యనారాయణ పర్యవేక్షణలో ఆలయం హుండీలను లెక్కించారు. ఈమేరకు రూ.2,58,731 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ గూడూరు సంజీవరెడ్డి వెల్లడించారు. హుండీల లెక్కింపులో మల్లిబాబు, అశోక్, హరిలాల్, రాంసింగ్, కోట శ్రీను, అర్చకుడు అచ్చుతాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలి డోర్నకల్: మండల పరిషత్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల వివరాలను ఆన్లైన్లో సక్రమంగా నమోదు చేయాలని జెడ్పీ సీఈఓ పురుషోత్తం ఆదేశించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం ఉద్యోగుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను జెడ్పీ సీఈఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో ఆర్థికశాఖ ఆదేశాల మేరకు మండల పరిషత్ పరిధి లోని ఉద్యోగుల వివరాలను ఆన్లైన్లో తప్పులు లేకుండా సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు.ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, సీనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలి మహబూబాబాద్: పిల్లలకు మెనూ ప్రకారం ప్రకారం భోజనం పెట్టాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ న్యాయమూర్తి షాలిని సిబ్బందిని ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని బాలుర, బాలికల బాల సదనాలను ఆమె సందర్శించి మాట్లాడారు. పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. అనంతరం రిజిస్టర్లను తనిఖీ చేశారు. పిల్లలతో కలిసి దీపావళి సంబురాలు జరుపుకున్నారు. బాలికలకు స్వీట్స్, చాక్లెట్లు అందించి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలికల బాల సదనం సూపరింటెండెంట్ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వాయిదాపడిన పరీక్షల రీషెడ్యూల్ కేయూ క్యాంపస్: తెలంగాణ బంద్ నేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీ పరిధిలో వాయిదా పడిన వివిధ పరీక్షల నిర్వహణ తేదీలను రీ షెడ్యూల్ చేస్తూ పరీక్షల విభాగం అధికారులు శనివారం ప్రకటించారు. దూరవిద్య సీఎల్ఐఎస్సీ పరీక్షలను ఈనెల 24న, మూడేళ్ల లాకో ర్సు మొదటి, ఐదవ సెమిస్టర్ పరీక్షలు, ఐదేళ్ల లాకోర్సు ఐదవ, తొమ్మిదవ సెమిస్టర్ పరీక్షలను ఈనెల 21న నిర్వహిస్తామని పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐదేళ్ల ఎమ్మెస్సీ బఝెటెక్నాలజీ, కెమిస్ట్రీ నాల్గవ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 25న, ఎంటెక్ రెండవ సెమిస్టర్ పరీక్షను ఈనెల 31న నిర్వహించనున్నామని పేర్కొన్నారు. -
పది ప్రణాళిక ఏది?
● గత ఏడాది పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాకు మొదటి స్థానం ● ఇప్పటి వరకు ఊసేలేని కార్యాచరణ ● ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులుసాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వ పాఠశాలల పనితీరుకు పదో తరగతి ఫలితాలే ప్రామాణికంగా పరిగణిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొనే జిల్లా అధికారులు.. విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లడం కీలకంగా మారుతుంది. గత ఏడాది అధికారులు అమలు చేసిన ప్రత్యేక ప్రణాళిక మంచి ఫలితం ఇచ్చింది. పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలోనే మానుకోట జిల్లాను ప్రఽథమ స్థానంలో నిలిపింది. అయితే ఈ ఏడాది అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. విద్యాశాఖలో అధికారుల మార్పు, పలు పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లు రాకతోపాటు.. స్థానిక సంస్థల ఎన్నికల హడావుడిలో అధికార యంత్రాంగం నిమగ్నం కావడం.. వెరసి దీని ప్రభావం పదో తరగతి ఫలితాలపై పడే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది టాప్.. జిల్లా ఏర్పాటు తర్వాత మొదలైన కసరత్తు ఎట్టకేలకు గత ఏడాది మంచి ఫలితం ఇచ్చింది. పది ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా విద్యార్థులు టాప్లో నిలిచారు. 2022–23 విద్యా సంవత్సరంలో జిల్లా విద్యార్థులు 85.54శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 22వ స్థానంలో నిలిచారు. దీంతో ఫలితాలపై రాష్ట్ర ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులుగా సబ్జెక్టు టీచర్లు మొదలుకొని హెచ్ఎంలు, జిల్లా విద్యాశాఖ అధికారుల వరకు సంజాయిషీ ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత విద్యాసంవత్సరం కాస్త మెరుగు పడి రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచారు. అదే ఊపులో గత విద్యా సంవత్సరం 99.29 ఉత్తీర్ణత శాతంతో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. దీంతో పాటు ప్రతిష్టాత్మకమైన బాసర ట్రిపుల్ఐటీలో జిల్లాకు చెందిన 175 మంది విద్యార్థులు సీటు సాధించి ప్రభుత్వ పాఠశాలల సత్తా చాటారు. కనిపించని ప్రత్యేక ప్రణాళిక గత విద్యా సంవత్సరంలో పాఠశాలలు పునఃప్రారంభం నుంచే పదో తరగతి ఫలితాలపై ప్రత్యేక ప్రణాళికతో వెళ్లిన విద్యాశాఖ అధికారులు ఈ ఏడాది ఇప్పటి వరకు ఆ ఊసెత్తడం లేదు. కాగా గత ఉడాది దసరా సెలవుల తర్వాత నుంచి ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. దాతల సహకారంతో విద్యార్థులకు అల్పాహారం పెట్టారు. డిసె ంబర్లో సిలబస్ పూర్తి చేయడమే లక్ష్యంగా బోధన వేగవంతం చేశారు. డిసెంబర్లో మొదటి సగ భాగం సిలబస్తో ప్రత్యేకంగా రూపొందించిన అంశాలపై పరీక్షలు పెట్టారు. జనవరి మొదటి వారంలో సిలబస్ పూర్తి చేసి మిగిలిన సగం సిలబస్తో మరోసారి పరీక్షలు నిర్వహించారు. ఏఏఈ ఈఆర్టీ రూపొందించిన కరదీపికలతో పాటు, ప్రత్యేక పరీక్ష పత్రాలు తయారు చేసి పరీక్షలు నిర్వహించారు. కేజీబీబీ, మోడల్ స్కూల్స్తోపాటు, ప లు పాఠశాలల్లో వెనకబడిన విద్యార్థులకు వరంగ ల్, హనుమకొండ నుంచి సిలబస్లో ప్రావీణ్యం గలి గిన అధ్యాపకులను పిలిపించి ప్రత్యేక క్లాసులు చె ప్పించారు. దీంతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. అడ్డంకులను అధిగమిస్తేనే.. గత వైభవం చెదిరిపోకుండా, ఈ ఏడాది కూడా జిల్లా విద్యార్థులు రాష్ట్రంలోనే ఉత్తమ ఫలితాలు సాధించాలి. అయితే ఈ ఏడాదిలో కొందరు హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్ వచ్చింది. దీంతో కొన్ని పాఠశాలలకు కొత్తగా ఉపాధ్యాయులు వచ్చారు. గతంలో ప్రణాళికలు రూపొందించి అమలు చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి పదవీ విరమణ పొందారు. కొత్తగా వచ్చిన డీఈఓ ముందు స్టాఫ్, తర్వాత ఉపాధ్యాయులను అర్థం చేసుకోవడానికే సమయం పట్టింది. ఇదిలా ఉండగా.. స్థానిక సంస్థల ఎన్నికల హడాహుడితో ఉపాధ్యాయులు ట్రైనింగ్ పేరుతో తరచూ పాఠశాలలకు గైర్హాజరు కావడం.. ఉన్నతాధికారులు ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టడంతో అడ్డంకులు వస్తున్నాయి. ఇప్పటి కైనా ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తే ఉత్తమ ఫలి తాలు సాధించవ్చని విద్యావేత్తలు అంటున్నారు. విద్యా పరీక్ష ఉత్తీర్ణులు శాతం రాష్ట్రంలో సంవత్సరం రాసిన వారు స్థానం2021–22 9,204 8,421 91.49 20 2022–23 8,461 7,227 85.54 22 2023–24 8,178 7,738 94.62 12 2024–25 8,184 8,126 99.29 01 -
బంద్ విజయవంతం
ఆదివారం శ్రీ 19 శ్రీ అక్టోబర్ శ్రీ 2025 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని రోడ్డెక్కిన బడుగులు మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలు, కుల సంఘాలు ఉదయం నుంచి కదలని బస్సులు మూసివేసిన వ్యాపార సంస్థలుసాక్షి, మహబూబాబాద్/ నెట్వర్క్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ పిలుపు మేరకు శనివారం నిర్వహంచిన బంద్ విజయవంతమైంది. జిల్లాలో ఉదయం నుంచే బీసీ సంఘాల నాయకులు రోడ్డెక్కారు. వారికి మద్దతుగా జిల్లాలోని వామపక్ష పార్టీలతో పాటు, అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన నాయకులు మద్దతు ఇచ్చి బంద్లో పాలుపంచుకున్నారు. బంద్ ప్రభావంతో ఉదయం నుంచే ఆర్టీసీ బస్సులు డిపో నుంచి బయటకు రాలేదు. మధ్యాహ్నం వరకు వర్తక, వ్యాపార సంస్థలు మూసివేశారు. కదలని బస్సులు.. బంద్ను విజయవంతం చేసేందుకు జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు ఆర్టీసీ డిపోల వద్దకు కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, బీసీ సంఘాల జేఏసీ నాయకులు ఉదయమే చేరుకున్నారు. డిపోల నుంచి బస్సులు రాకుండా అడ్డుకున్నారు. పరిస్థితిని గమనించిన డిపో మేనేజర్లు మధ్యాహ్నం వరకు బస్సులు బయటకు తీయలేదు. దీంతో విషయం తె లియక ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. డోర్నకల్లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల కోసం చేపట్టిన బంద్ సంపూర్ణంగా జరిగింది. వ్యాపార సంస్థలు, పాఠశాలలు, పె ట్రోల్బంకులు మూతబడ్డాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీలతో పాటు విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించారు. మరిపెడలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు వేర్వేరుగా నిరసన వ్యక్తం చేశారు. మూడు దఫాలుగా రాస్తారోకో చేయడంతో మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. బయ్యారంలో బంద్ విజయవంతమైంది. బయ్యారం, గంధంపల్లి–కొత్తపేట గ్రామాల్లోని వ్యాపార, విద్యాసంస్థలు బంద్ సందర్భంగా మూతపడ్డాయి. అన్ని రాజకీయ పార్టీలతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు బయ్యారంలో రాస్తారోకో నిర్వహించారు. మానుకోట పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నెల్లికుదురు మండలంలో పార్టీలకు అతీతంగా నిర్వహించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. గూడూరులో ఉదయం 6 గంటలకు బీసీ జేఏసీ నాయకులతో పాటు మండలంలోని అన్ని బీసీ కుల సంఘాల నాయకులు బంద్కు మద్దతుగా తరలివచ్చారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టిన అనంతరం ప్రధాన బస్టాండ్, అంబేడ్కర్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఎన్హెచ్పై వంటావార్పు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. కురవి, సీరోలు మండలాల్లో బీసీ జేఏసీ బంద్కు ఎమ్మార్పీఎస్, తెలంగాణ ముదిరాజ్ సంఘం, తెలంగాణ గిరిజన సంఘం తదితర సంఘాలు మద్దతు పలికాయి. కురవి మండల కేంద్రంలో సీపీఐ, కాంగ్రెస్, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో నేరడ క్రాస్రోడ్డు వద్ద జాతీయ రహదారిపై, టీఆర్ఎస్, సీపీఎం ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై పెట్రోల్ బంక్ వద్ద రాస్తారోకో వేర్వేరుగా నిర్వహించారు. తొర్రూరులో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. వీరితో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీలు వేర్వేరుగా బంద్లో పాల్గొన్నాయి. ఆర్టీసీ డిపోలో బస్సులు బయటకు రాకుండా బీసీ జేఏసీ నాయకులు నిరసన తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరుగా ర్యాలీలు నిర్వహిస్తున్న క్రమంలో బస్టాండ్ సెంటర్లో ఎదురుపడడంతో రిజర్వేషన్ల విషయంలో కొంత వాగ్వాదం జరిగింది. కొత్తగూడలో వర్తక, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. బంద్కు సీపీఐ(ఎంఎల్), న్యూడెమోక్రసీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు తుడుందెబ్బ, ఎమ్మార్పీఎస్ మద్దతు తెలిపి బంద్లో పాల్గొన్నాయి. గార్ల పట్టణంలో బంద్ ప్రశాంతంగా ముగిసింది. వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్థలు, పాఠశాలలు బంద్ పాటించాయి. ఈ బంద్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొన్నారు. పెద్దవంగర మండల కేంద్రంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు వేర్వేరుగా బంద్లో పాల్గొని ర్యాలీలు, నిరసనలు చేపట్టారు. బంద్ నేపథ్యంలో వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలను మూసి వేయించారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో చిన్నగూడూరు మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. మండల కేంద్రంలోని వ్యాపారస్తులు, దుకాణా దారులు స్వచ్ఛందంగా బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కంకరబోర్డు ప్రభుత్వ పాఠశాలలో బంద్కు టీపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం మద్దుతు తెలిపింది. ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. కేసముద్రం, ఇనుగుర్తి మండల కేంద్రాల్లో బంద్ ప్రశాంతంగా జరిగింది. పలు దుకాణాలను స్వచ్ఛందంగా బంద్ చేశారు. కాగా వామపక్షపార్టీల ఆధ్వర్యంలో అంబేడ్కర్ సెంటర్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఆధ్వర్యంలో వేర్వేరుగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. దంతాలపల్లి మండల కేంద్రంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగి సింది. జాతీయ రాహదారిపై అన్ని పార్టీల నా యకులు వేర్వేరుగా రాస్తారోకో నిర్వహించారు. అంతకుముందు షాపులను బంద్ చేయించారు. -
అడవి విడిచి జనంలోకి
లొంగి పోయే ముందు ఆశన్నఛత్తీస్గఢ్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత వాసుదేవరావుసాక్షిప్రతినిధి, వరంగల్: దండకారణ్యంలో మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతోంది. బుధవారం ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట 61 మంది సహచరులతో ఆయుధాలతో లొంగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా మావోయిస్టు పార్టీ మరో కేంద్ర కమిటీ సభ్యుడు, డీకేఎస్జెడ్సీ ప్రతినిధి తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేశ్ శుక్రవారం అనుచరులతో అడవిబాటను వదిలారు. 208 మంది(110మంది మహిళలు, 98మంది పురు షులు)తో కలిసి 153 ఆయుధాలతో ఆయన జగ్దల్పూర్లో ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్, పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు. ప్రధానంగా దంతెవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్న ఇంద్రావతి ఏరియాను కేంద్రంగా ఏర్పాటు చేసుకుని ఆశన్న కార్యక్రమాలు కొనసాగించారు. ఛత్తీస్గఢ్లోని వివిధ ప్రాంతాల్లో భారీగా మావోయిస్టులు లొంగిపోయినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. చర్చల కోసం ప్రయత్నించి.. ఆపరేషన్ కగార్ ఉధృతం కావడం.. చాలామంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. ఈనేపథ్యంలో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట మార్చి 28న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఒక దశలో ఒకే అన్నప్పటికీ.. తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా నో చెప్పారు. ఆ తర్వాత మే నెలలో కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న చర్చలను ప్రతిపాదిస్తూ ఛత్తీస్గఢ్లోని ఓ మీడియా చానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు, ప్రజా సంఘాలు చొరవ చూపాలని ఆయన కోరారు. అయినప్పటికీ దండకారణ్యంలో పోలీస్ కూంబింగ్ కొనసాగి కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు అలియాస్ బస్వరాజ్ సహా పలువురు అగ్రనాయకులు, కేడర్ ఎన్కౌంటర్లలో మృతి చెందారు. ఇక చర్చల ప్రతిపాదనలతో ఫలితం లేదనే భావనతోపాటు పలు కారణాలతో లొంగుబాటును ఎంచుకున్న కేంద్ర కమిటీ నాయకులు మల్లోజుల వేణుగోపాల్, తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ రూపేశ్ సహచరులు, ఆయుధాలతో సరెండర్ అయ్యారు. మావోయిస్టు నేత తాతతో కలిసి పనిచేసిన ఆశన్న 1993–94లో అన్నసాగర్ ఏరియా డిప్యూటీ కమాండర్గా, కమాండర్గా పనిచేశారు. శేషగిరిరావు అలియాస్ గోపన్నతో కలిసి పనిచేసిన ఆయన నల్లగొండ జిల్లాలోనూ కొంతకాలం దళనేతగా ఉన్నారు. ఆతర్వాత అనతి కాలంలోనే 1999లో పీపుల్స్వార్ పార్టీ నాయకత్వం యాక్షన్ టీంకు ఇన్చార్జ్గా నియమించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలు కీలక యాక్షన్లకు ఆశన్న నాయకత్వం వహించినట్లు పోలీసు రికార్డులు నమోదయ్యాయి. 2000 సంవత్సరంలో అప్పటి హోం మంత్రి మాధవరెడ్డి కారును పేల్చి చంపిన ఘటనలో కీలకమని అప్పట్లోనే పోలీసులు ప్రకటించారు. 2003లో అలిపిరిలో చంద్రబాబు కాన్వాయ్ని క్లైమోర్మైన్ పేల్చిన ఘటనతోపాటు హైదరాబాద్ సంజీవరెడ్డినగర్లో ఐపీఎస్ అధికారి ఉమేశ్చంద్రను పట్టపగలే కాల్చిచంపిన ఘటనకు ఈయనే నాయకత్వం వహించినట్లు రికార్డులున్నాయి. ఆ తర్వాత నిర్బంధం పెరగడంతోపాటు ఉద్యమ నిర్మాణంలో భాగంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు, దండకారణ్యంలో వివిధ కేడర్లలో పనిచేసిన ఆశన్న కేంద్ర మిలటరీ కమిషన్కు కూడా కొంతకాలం ఇన్చార్జ్గా పనిచేసినట్లు ప్రచారం ఉంది. కాగా, దళ సభ్యుడి నుంచి కేంద్ర కమిటీ నేత వరకు ఎదిగి.. ఛత్తీస్గఢ్, సౌత్బస్తర్, మాడ్ డివిజన్లలో కీలకంగా వ్యవహరించిన ఆయన శుక్రవారం ఉద్యమ సహచరులతో కలిసి లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది.ఆశన్న అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం మాకు తెలియదు. ఆశన్న తండ్రి భిక్షపతిరావు ఆ కాలంలోనే హనుమాన్ గుడి నిర్మాణానికి గుంట భూమిని విరాళంగా ఇచ్చాడు. వాసుదేవరావు మావోయిస్టు పార్టీలో పనిచేసి జనజీవన స్రవంతిలో కలిసినందుకు గ్రామస్తులం సంతోషిస్తున్నాం. వాసుదేవరావును చూడాలని ఉంది. స్వగ్రామానికి వస్తే స్వాగతం పలుకుతాం. – గొర్రె రాజయ్య, నర్సింగాపూర్ భిక్షపతిరావుకు ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. అందులో వాసుదేవరావు పెద్దోడు, సహదేవరావు చిన్నోడు, సౌమ్య ఇద్దరి కంటే పెద్దది. చిన్నప్పుడే వాసుదేవరావు అన్నల్లోకి పోయిండని తెలుసు. అప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు. భిక్షపతిరావు చనిపోయాక వాళ్లు ఇక్కడ ఉండడం లేదు. ఇక్కడ పుట్టిన వాసుదేవరావు అన్నల్లో నుంచి బయటకు వచ్చిండని తెలిసింది. – గాజవేన ఓదెలు, నర్సింగాపూర్ ●కీలక దాడులకు వ్యూహకర్త ఆశన్న.. 25 ఏళ్ల వయసులో అజ్ఞాతంలోకి.. నాలుగున్నర దశాబ్దాలు అడవిలో.. దళసభ్యుడి నుంచి కేంద్ర కమిటీ వరకు ఆశన్న ఉద్యమ ప్రస్థానంతక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్నది ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలం లక్ష్మీదేవిపేట శివారు పోలోనిపల్లి (నర్సింగాపూర్) స్వగ్రామం. తల్లి సరోజన, తండ్రి భిక్షపతిరావు, తమ్ముడు సహదేవరావు, అక్క సౌమ్య. తండ్రి భిక్షపతిరావు 2012లో గొంతు కేన్సర్తో మృతిచెందగా, తమ్ముడు సహదేవరావు రైల్వేశాఖలో డ్రైవర్గా పనిచేస్తూ హనుమకొండలోని గోపాల్పూర్లో స్థిరపడినట్లు బంధువులు తెలిపారు. కాగా, వాసుదేవరావు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు లక్ష్మీదేవిపేట ప్రభుత్వ పాఠశాలలో చదివారు. అనంతరం కాజీపేటలోని సెయింట్గ్యాబ్రియల్ స్కూల్లో సెకండరీ విద్యనభ్యసించారు. భువనగిరిలో ఐటీఐ కూడా చేసిన ఆయన, కాకతీయ వర్సిటీలో డిగ్రీ చదువుతూ.. రాడికల్ స్టూడెంట్ యూనియన్కు (ఆర్ఎస్యూ) నాయకత్వం వహించారు. ఆతర్వాత పరిణామాల నేపథ్యంలో 25 ఏళ్ల వయసులో అజ్ఞాతంలోకి వెళ్లారు. 1991 నుంచి ఆర్ఎస్యూలో పని చేసి అజ్ఞాతంలోకి వెళ్లాక దళ సభ్యుడి నుంచి నాలుగున్నర దశాబ్దాల్లో కేంద్ర కమిటీ అగ్రనేత వరకు ఎదిగారు. -
వైఫల్యాలను ఎండగడితే కేసులా..
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే సాక్షి దినపత్రికపై, ఎడిటర్ ధనంజయరెడ్డిపై కేసులు నమోదు చేయడం సరికాదు. విచారణ, నోటీసుల పేరా సాక్షి పత్రికను ఇబ్బందులు పెట్టడం ఏపీ ప్రభుత్వం మానుకోవాలి. ప్రభుత్వం శాశ్వతం కాదని, అధికారం ఉందని కక్షసాధింపులకు పాల్పడితే ప్రజలే గుణపాఠం చెబుతారు. – బి.అజయ్సారథిరెడ్డి, సీపీఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్లీడర్ అక్రమ కేసులు ఎత్తివేయాలి.. సాక్షి దినపత్రిక, ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి. అక్రమాలు, అన్యాయాలను పత్రిక వెలికితీస్తూ ప్రజల పక్షాన నిలబడుతుంది. వాస్తవాలను రాస్తే అక్రమంగా కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడం సరికాదు. పత్రికా స్వేచ్ఛపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. – గుగులోత్ కిషన్నాయక్, గిరిజన సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు -
దాడులను ఖండిస్తున్నాం..
సాక్షి పత్రికకు నోటీసులు అందజేస్తూ, అక్రమ కేసులు బనాయిస్తూ ఏపీ పోలీసులు చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో పత్రికకు స్వేచ్ఛ ఉంటుంది. పత్రికా స్వేచ్ఛను కాలరాసే విధంగా వ్యవహరిస్తున్న ఏపీ ప్రభుత్వ తీరు మంచిది కాదు. – ఎండి. ఫరీద్, బీఆర్ఎస్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కక్షసాఽధింపు చర్యలు మానుకోవాలి సాక్షి దినపత్రిక, ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభు త్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలి. ప్రజాస్వామ్య విలువలను కాలరాసేలా ఏపీ ప్రభుత్వం, పోలీసుల తీరు ఉంది. ఇప్పటికై నా సాక్షి పత్రికపై చర్యలు మానుకుని ఏపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాడులు, అక్రమ కేసులకు పాల్పడితే ప్రజానీకం సహించదు. – మండల వెంకన్న, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు -
చికిత్స పొందుతున్న యువకుడి మృతి
ఐనవోలు: ప్రేమించిన యువతి తల్లిదండ్రులు మందలించారని మనస్తాపానికి గురైన యువకుడు పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రాంనగర్ గ్రామానికి చెందిన యాకర ప్రమీల– బాబుల చిన్న కుమారుడు యాకర హరిబాబు(27) డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల హరిబాబు ఓ యువతిని ప్రేమించాడు. విషయం తెలుసుకున్న సదరు యువతి తల్లిదండ్రులు హరిబాబును దూషించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన హరిబాబు ఈ నెల 12న రాంనగర్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు హరిబాబును ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతిచెందాడు. మృతుడి మేనమామ కలకోట రత్నం ఫిర్యాదు మేరకు యువకుడు ప్రేమించిన అమ్మాయి, వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ వెల్లడించారు. -
మార్కెట్ నిండా మక్కలు
● 11వేల బస్తాల రాక కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు మక్కలు పోటెత్తాయి. ఇటీవల మక్కల సీజన్ ప్రారంభం కాగా, శుక్రవారం అత్యధికంగా 11,016 బస్తాల మక్కలు అమ్మకానికి వచ్చాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి ట్రాక్టర్లలో తీసుకువచ్చిన మక్కలను షెడ్లలో పోసుకున్నారు. దీంతో షెడ్లు నిండిపోగా, మిగిలిన వారంత ఓపెన్యార్డుల్లో మక్కలను రాశులుగా పోసుకున్నారు. అధిక సంఖ్యలో మక్కలు రావడంతో వ్యాపారులు టెండర్లను ఆలస్యంగా వేశారు. మరోవైపు ఇ–నామ్ సర్వర్ మొరాయించడంతో గంటన్నర ఆలస్యంగా విన్నర్ జాబితా విడుదల అయింది. అనంతరం రాత్రి వరకు కాంటాలు, తొలకాలు జరి గాయి. దీంతో రైతులు రాత్రి వరకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కాగా మక్కలు క్వింటాకు గరిష్ట ధర రూ. 2,098 పలుకగా, కనిష్ట ధర రూ.1,850 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. మార్కెట్లకు సెలవులు.. మహబూబాబాద్ రూరల్: జిల్లాలోని కేసముద్రం, మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లకు ఈనెల 18, 19వ తేదీల్లో వారాంతపు సెలవులు కాగా, 20న నరకచతుర్దశి, 21న దీపావళి పండుగ సందర్భంగా సెలవులు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. తిరిగి 22న మార్కెట్లు పునఃప్రారంభం అవుతాయని తెలిపారు. రైతులు పంటలు నమోదు చేసుకోవాలికురవి: రైతులు సాగు చేసిన పంటలను నమోదు చేసుకోవాలని డీఏఓ విజయనిర్మల అన్నారు. శుక్రవారం మండలంలోని మొగిలిచర్ల గ్రామంలోని పత్తి పంటను పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పత్తిపంటపై కొత్తగా వచ్చిన కపాస్ కిసాన్ యాప్ను వినియోగించుకోవాలని సూచించారు. వ్యవసాయ విస్తరణాధికారులు పత్తి పంట వేసిన ప్రతీ రైతు పంటను నమోదు చేయాలని సూచించారు. పత్తి రైతులు సీసీఐకి అమ్మకం చేయాలంటే స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు. దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో ఏఓ గుంటక నరసింహారావు, ఏఈఓ రాజేశ్వరి, రైతులు చల్లగుండ్ల ప్రవీణ్, నీలం రమేశ్, చల్లగుండ్ల మాధవరావు, వీరభద్రాచారి, నామా రామారావు, ఏపూరి వీరన్న పాల్గొన్నారు. -
సబ్స్టేషన్ తనిఖీ
నర్సింహులపేట: మండలంలోని ముంగిమడుగు విద్యుత్ 33/11కేవీ సబ్స్టేషన్ను శుక్రవారం టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్స్టేషన్లో డేటా అక్విజేషన్ అండ్ కంట్రోల్, మానిటరింగ్ సిస్టమ్ పనులను పరిశీలించారు. సబ్స్టేషన్లో జరుగుతున్న పనులు నవంబర్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సిబ్బంది ఎల్సీ తీసుకొని పనులు చేయాలని సూచించారు. రైతులకు ఇబ్బంది లేకుండా పనులు చేయాలన్నారు. విద్యుత్ సిబ్బంది సక్రమంగా పని చేయాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. సబ్స్టేషన్, మండలంలోని సిబ్బంది ఇబ్బందులను సీఎండీకి వివరించారు. కార్యక్రమంలో ఎస్ఈ విజయేందర్రెడ్డి, డీఈలు రవి, సునీత, ఏఈ పాండు తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలిమహబూబాబాద్ రూరల్: దీపావళి పండుగను పురస్కరించుకొని స్పెషల్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు, గిఫ్ట్ లింకుల పేరుతో సోషల్ మీడియా, మెసేజ్లు, ఈ–మెయిల్, వెబ్సైట్ ద్వారా ప్రజలను మోసంచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ శుక్రవారం తెలిపారు. సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్లు సృష్టించి, బ్యాంక్ వివరాలు, ఓటీపీలు, యూపీఐ పిన్ నంబర్ తీసుకొని ఖాతాల్లోని డబ్బులను దోచుకుంటున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 1నుంచి ఇప్పటివరకు 390 మంది మోసపోయి రూ.8.5 లక్షల వరకు నష్టం కలిగిందని పేర్కొన్నారు. నకిలీ షాపింగ్ వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్రకటనల ద్వారా ప్రజలను ఆకర్షిస్తారన్నారు. ధ్రువీకరించిన వెబ్సైట్లు, అధికారిక యాప్స్ ద్వారానే కొనుగోలు చేయాలని, టెలిగ్రామ్ లేదా ఇతర లింకుల ద్వారా ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయవద్దని, ఎవరితో బ్యాంక్ వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్ నంబర్ పంచుకోవద్దని సూచించారు. ముందుగానే చెల్లింపులు చేయకుండా, క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయాన్ని వినియోగించుకోవాలని, ఎలాంటి మోసాలు జరిగినా.. వెంటనే 1930 నంబర్కు కాల్ చేయాలన్నారు. ప్రజావైద్య వ్యవస్థను పటిష్టం చేయాలినెహ్రూసెంటర్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ ప్రజా వైద్య వ్యవస్థను పటిష్టం చేయాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో శుక్రవారం పీహెచ్సీ వైద్యులు, సీనియర్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. వైద్య సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దన్నారు. కేంద్ర ప్రభుత్వ వైద్య కార్యక్రమాల అమలు, వెంటవెంటనే ఆన్లైన్ చేయాలని సూచించా రు. పీహెచ్సీలకు వచ్చిన ఫైనాన్స్ను మూడు, ఆరు నెలలకు ఓ మారు ఆడిట్ చేపించుకోవా లని తెలిపారు. సమన్వయంతో ఉద్యోగులు పని చేసినప్పుడే ప్రజాక్షేత్రంలో ప్రజల ఆరో గ్యాలను కాపాడవచ్చని తెలిపారు. సమావేశంలో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు కురవి: ఆయిల్పామ్ సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి జినుగు మరియన్న అన్నారు. శుక్రవారం సీరోలు మండలం తాళ్లసంకీస గ్రామంలో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సహకారంతో రైతు ప్రతాపని పుల్ల య్య ఆయిల్ పామ్ తోటలో ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ, వ్యవసాయ శాఖ, కృషి విజ్ఞాన కేంద్రం మల్యాల శాస్త్రవేత్తలతో ఆయిల్పామ్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మరియన్న మాట్లాడారు. కేవీకే శాస్త్రవేత్తలు బి.కాంతికుమార్, సుహాసిని, కోరమండల్ సీనియర్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ పి.భాస్కర్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్రెడ్డి, సీరోలు ఏఓ చాయారాజ్, ఏఈఓ రమేశ్, సీహెచ్.రాములు పాల్గొన్నారు. -
హైదరాబాద్–గోరఖ్పూర్ వీక్లీ రైళ్ల రద్దు
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే హైదరాబాద్–గోరఖ్పూర్–హైదరాబాద్ వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను నవంబర్ 28వ తేదీ నుంచి 2026 సంవత్సరం జనవరి 2వ తేదీ వరకు రద్దు చేస్తునట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ శుక్రవారం తెలిపారు. నార్త్ సెంట్రల్ రైల్వేలోని ఝాన్సీ రైల్వే స్టేషన్లో రైల్వే ట్రాక్, ప్లాట్ఫాం పనులు చేపడుతున్న కారణంగా రైళ్లను రద్దు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రైళ్ల రద్దు వివరాలు 2025 నవంబర్ 28వ తేదీ నుంచి 2026 జనవరి 2వ తేదీ వరకు హైదరాబాద్–గోరఖ్పూర్ (07075) వెళ్లే వీక్లీ ఎక్స్ప్రెస్, నవంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి 4వ తేదీ వరకు గోరఖ్పూర్–హైదరాబాద్ (07076) వెళ్లే వీక్లీ ఎక్స్ప్రెస్ను రద్దు చేస్తున్నట్లు సీపీఆర్వో తెలిపారు. -
కూలీల ఆటో బోల్తా.. ఏడుగురికి గాయాలు
● గిరిపురం క్రాస్ వద్ద ఘటనమరిపెడ రూరల్: ఎదురుగా వస్తున్న ట్రాలీ ఆటోను తప్పించబోయి కూలీల ఆటో బోల్తా పడింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురం క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి మరిపెడ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి గ్రామం నుంచి కూలీ పనుల నిమిత్తం 14 మంది ఆప్పి ఆటోలో సూర్యపేట జిల్లా నూతనకల్ మండలానికి మరిపెడ మండలం మీదుగా వెళ్తున్నారు. ఈ క్రమంలో గిరిపురం క్రాస్ రోడ్డు వద్ద మరిపెడ నుంచి గిరిపురం వైపు వస్తున్న ఓ ట్రాలీ ఆటో సడన్గా ఎదురు రావడంతో కూలీల ఆటో పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 14 మందిలో మంగమ్మ, మమత, అనసూర్య, మల్లయ్య, భిక్షమమ్మ, సుగుణమ్మతోపాటు మరొకరికి గాయాలు కాగా, ఇందులో ఒకరికి కాలు విరిగింది. దీంతో స్థానికులు గమనించి 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వడంతో చికిత్స నిమిత్తం క్షతగాత్రులను మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిమితికి మంచి ప్రయాణం ఏడుగురితో ప్రయాణించాల్సిన ఆటోలో పరిమితికి మించి 14 మందిని తరలించడంతో అదుపుతప్పి పల్టీ కొట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికై నా పోలీసులు స్పందించి అడ్డుగోలుగా ప్రయాణికులకు ఎక్కించుకుంటున్న ఆటోలను అదుపు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
రేస్వాక్లో రికార్డు బ్రేక్..
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కొనసాగుతున్న జాతీయస్థాయి 5వ అథ్లెటిక్స్ అండర్–23 చాంపియన్షిప్ పోటీల్లో అథ్లెట్లు శుక్రవారం అదే జోరు ప్రదర్శించారు. రెండో రోజు 30 ఈవెంట్లలో పోటీలు నిర్వహించగా 13 ఈవెంట్లలో ఫైనల్స్ పూర్తయ్యాయి. అథ్లెటిక్స్ పోటీల్లో 20వేల మీటర్ల పురుషుల రేస్వాక్లో ఆర్మీ విభాగానికి చెందిన సచిన్ బొహరా (1:26:59:83) నిమిషాలతో కొత్త రికార్డును సృష్టించాడు. 2022లో రాజస్తాన్కు చెందిన సంజయ్కుమార్ (1:27:14) నిమిషాల్లో చేరి విజేతగా నిలిచాడు. సరికొత్తగా ఆ రికార్డును బ్రేక్ చేయడం సంతోషంగా ఉందని సచిన్ తెలిపాడు. పోటీల ఏర్పాట్లను తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, అధ్యక్షుడు స్టాన్లీజోన్స్, డీవైఎస్ఓ గుగులోతు అశోక్కుమార్ పర్యవేక్షించారు. పోటీల నిర్వహణలో టెక్నికల్ అఫిషి యల్స్, కోచ్లు వాసుదేవరావు, శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులు.. మహిళల 20 వేల మీటర్ల రేస్వాక్లో మహిమాచౌదరి(రాజస్తాన్) గోల్డ్, ఆర్తి(హరియాణా) సిల్వర్, కోమల్పాల్(మధ్యప్రదేశ్) బ్రాంజ్ మెడల్ సాధించారు. పురుషుల 20 వేల మీటర్ల రేస్వాక్: సచిన్బోహ్రా(ఆర్మీ)గోల్డ్, రోషన్కుమార్(ఝార్ఖండ్) సిల్వర్, హిమాన్షుకుమార్(ఉత్తరాఖండ్) బ్రాంజ్, 100 మీటర్ల హార్డిల్స్ మహిళల విభాగం: ప్రంజాలిరాలిపాటి(మహారాష్ట్ర)గోల్డ్, అక్షిదాస్ (తమిళనాడు) సిల్వర్, శ్రీయారాజేష్(కర్ణాటక) బ్రాంజ్ మెడల్ కై వసం చేసుకున్నారు. డెకాథ్లాన్ పురుషుల విభాగం: కౌశల్కుమార్(మహారాష్ట్ర) గోల్డ్, అభిజిత్భోసలే(ఎయిర్ఫోర్స్) సిల్వర్, హరీశ్ ఎస్(తమిళనాడు) బ్రాంజ్ గెలుపొందారు. పురుషుల 1,500 మీటర్ల పరుగు: ప్రభుజోత్సింగ్(పంజాబ్) గోల్డ్, వికాష్(హరియా ణా) సిల్వర్, ఆకాశ్భాటి(ఉత్తరప్రదేశ్) బ్రాంజ్ మెడల్ సాధించారు. డిస్కస్త్రో పురుషుల విభాగం: ఉజ్జవల్(జేఎస్డబ్ల్యూ) గోల్డ్, నాగేంద్రఅన్నప్ప(కర్ణాటక)సిల్వర్, రితిక్(ఎన్సీఓఈ(పటియాల)బ్రాంజ్ మెడల్ సాధించారు. పురుషుల 400 మీటర్ల పరుగు : తరణదీప్సింగ్(పోలీస్స్పోర్ట్స్ కంట్రోల్) గోల్డ్, సేతుమిశ్రా(బిహార్)సిల్వర్, అంకుల్, ఎన్సీఓఈ(త్రివేండ్రం), బ్రాంజ్ పతకాలు సాధించారు. పోల్వాల్ట్ మహిళల విభాగం: కార్తీక వి( తమిళనాడు) గోల్డ్, నేఖ ఎల్దో ఎన్సీఓఈ(త్రివేండ్రం) సిల్వర్, విదువిజయ్కుమార్(తమిళనాడు) బ్రాంజ్ మెడల్ సాధించారు. 110 మీటర్ల హార్డిల్స్ పురుషుల విభాగం: క్రిషిక్ ఎం(ఐఏసీఎల్) గోల్డ్, రాహిల్సఖీర్(కేరళ) సిల్వర్, రతీష్దుహీషా(రిలయన్స్) బ్రాంజ్, లాంగ్జంప్ పురుషుల విభాగం: అనురాగ్ సీవీ(కేరళ)గోల్డ్, శారోన్దూస్(తమిళనాడు)సిల్వర్, ఆర్యన్చౌదరి (ఉత్తరప్రదేశ్) బ్రాంజ్, హైజంప్ పురుషుల విభాగం: శివ్భగవాన్(హరియాణా) గోల్డ్, సుదీప్(కర్ణాటక) సిల్వర్, ఎండీ అలీ(వెస్ట్బెంగాల్) బ్రాంజ్, షాట్పుట్ పురుషుల : అతుల్(రిలయన్స్) గోల్డ్, అనురాగ్సింగ్ (రైల్వేస్పోర్ట్స్) సిల్వర్, నిఖిలేశ్(హరియాణా) బ్రాంజ్, 400 మీటర్ల పరుగు మహిళల విభాగం: ఆయుష్(ఉత్తరప్రదేశ్) గోల్డ్, ప్రియ(కర్ణాటక) సిల్వర్, సండ్రామోల్సాబు ఎన్సీఓఈ(త్రివేండ్రం)బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్నారు.జేఎన్ఎస్లో రెండో రోజు అథ్లెట్ల సందడి 13 ఈవెంట్లలో పోటీలు పూర్తి -
‘సాక్షి’పై కక్షసాధింపు చర్యలు సరికాదు
నెహ్రూసెంటర్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘సాక్షి’ దినపత్రికపై కక్షసాధింపు చర్యలు, ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేయడం సరికాదని రాజకీయ, ప్రజా సంఘాలు, కుల, విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం చేపట్టిన నిసరన కార్యక్రమానికి పలు రాజకీయ పార్టీలు, ప్రజా, కుల, జర్నలిస్టు, విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. తహసీల్దార్ కార్యాలయం నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు ర్యాలీ ని ర్వహించి అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన ధ ర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నిజాలు నిర్భయంగా రాస్తున్న సాక్షి దినపత్రికపై అక్రమ కేసులు, వేధింపులు మానుకోవాలని డిమాండ్ చేశారు. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు ప్రజా స్వామ్యానికి గొడ్డలిపెట్టు అన్నారు. సాక్షి పత్రిక, ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులను ఖండిస్తున్నామని, తక్షణమే కేసులు ఎత్తివేయాలని డిమా ండ్ చేశారు. అధికారంలోకి రాకముందు ఒకలా, వ చ్చాక మరోలా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారని, తీరు మార్చుకోకుంటే ప్రజాకోర్టులో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం, బీఆర్ఎస్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, బీ ఎస్పీ, ఎమ్మార్పీఎస్, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఎల్హెచ్పీఎస్, జర్నలిస్టు సంఘాలు, అంబేడ్కర్ యువజన సంఘం, గిరిజన సంఘాల నాయకులు బి.అజయ్ సారథిరెడ్డి, పెరుగు కుమార్, చింతకుంట్ల వెంకన్న, సమ్మెట రాజమౌళి, మందుల మహేందర్, ఎండి.ఫరీద్, మండల వెంకన్న, హెచ్.లింగ్యా, సామ పాపయ్య, గుజ్జు దేవేందర్, దార్ల శివరాజ్, గుగ్గిళ్ల పీరయ్యమాదిగ, గుగులోత్ కిషన్నాయక్, డాక్టర్ వివేక్, గుగులోత్ సూర్యప్రకాశ్, శివ వర్మ, బోడ రమేశ్, గుగులోత్ భీమానాయక్, మంగీలాల్నాయక్, పట్ల మధు, చిత్తనూరి శ్రీనివాస్, మద్దినేని గుట్టయ్య, తప్పెట్ల వీరన్న, కుర్ర మహేశ్, బోడ లక్ష్మణ్, రేషపల్లి నవీన్, అడ్వకేట్స్ దర్శనం రామకృష్ణ, భూక్య మోహన్నాయక్, బనిశెట్టి వెంకటేష్, సోమారాపు వీరస్వామి, ఆవులదొడ్డి వెంకట్యాదవ్, రాసగొల్ల సత్యం, సాక్షి జర్నలిస్టులు ఈరగాని బిక్షం, అర్రం రమేశ్, బోనగిరి శ్రీనివాస్, ఇరుకుళ్ల కిరణ్కుమార్, చింతకుంట్ల యాకాంబ్రం, జిల్లెల మురళీమోహన్, గుంటి సురేశ్, పసునూటి వేణు, కై లా ప్రకాశ్, దూదికట్ల రామాచారి, విజయ్, సతీష్, పానుగంటి శ్రీనివాస్, కురవి ప్రభాకరాచారి పాల్గొన్నారు. మానుకోటలో ర్యాలీ, నిరసన.. గళమెత్తిన ప్రజానీకం పార్టీలు, ప్రజా, కుల, జర్నలిస్టులు, విద్యార్థి సంఘాల మద్దతు -
రామప్ప కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పాలి
వెంకటాపురం(ఎం): కాకతీయులు నిర్మించిన రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడంతో ప్రపంచస్థాయిలో రామప్పకు ప్రత్యేక గుర్తింపు లభించిందని, రామప్ప కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పాలని మాజీ డీజీపీ రతన్ వలంటీర్లకు పిలుపునిచ్చారు. రామప్పలో పది రోజులుగా జరుగుతున్న వరల్డ్ హెరిటేజ్ వలంటీర్ క్యాంపు శుక్రవారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ప్రొఫెసర్ పాండురంగారావు అధ్యక్షత వహించగా మాజీ డీజీపీ రతన్తోపాటు రాష్ట్ర ఆర్కియాలజికల్ అండ్ మ్యూజియం డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దేశంలోని 13 రాష్ట్రాల నుంచి 35 మంది, ఇరాన్ నుంచి ముగ్గురు వచ్చి శిక్షణ తీసుకోవడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ తయారు చేస్తుందన్నారు. 13వ శతాబ్దంలో కాకతీయులు రామప్ప ఆలయాన్ని అద్భుతంగా నిర్మించడంతోనే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిందన్నారు. అనంతరం కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ తరపున వలంటీర్లకు సర్టిఫికెట్లు, మెమోంటోలు అందజేశారు. కార్యక్రమంలో క్యాంపు కోఆర్డినేటర్ జనగాం శ్రీధర్రావు, ఆసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్యకిరణ్, గైడ్లు గోరంట్ల విజయ్కుమార్, తాడబోయిన వెంకటేష్, యోగా గురువు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మాజీ డీజీపీ రతన్ రామప్పలో ముగిసిన వరల్డ్ హెరిటేజ్ వలంటీర్ క్యాంప్ -
ఏసీబీ వలలో అవినీతి చేపలు
హన్మకొండ చౌరస్తా: హనుమకొండలోని ములుగు రోడ్ సమీపంలో గల వరంగల్ జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో అవినీతి చేపలను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఆఫీసుకు వచ్చిన మత్స్యకారుల్లో కలిసిపోయి అవినీతి చేపను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. సినిమా సీన్ను తలపించే ఘటనతో మత్స్యశాఖ కార్యాలయ సిబ్బందికి అసలు ఏం జరుగుతుందో అర్ధంకాక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు మత్స్యశాఖ ఉద్యోగుల్లో ప్రకంపనలు లేపాయి. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాధన్నపేట గ్రామ మత్స్యసహకార సంఘంలో నూతన సభ్యులను చేర్చుకోవడం కోసం 2023లో అప్పుటి ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్, ప్రస్తుతం జిల్లా మత్స్యశాఖ అధికారి నాగమణికి సొసైటీ తరఫున దరఖాస్తు చేశారు. ఏడాది క్రితం సొసైటీ ప్రెసిడెంట్ తమ ఫైల్ అప్రూవల్ ఎప్పడు అవుతుందని ఫీల్డ్ ఆఫీసర్ హరీశ్ను అడిగితే రూ.80 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇదే విషయాన్ని డీఎఫ్ఓ నాగమణి దృష్టికి తీసుకెళ్లగా ఆమె సైతం హరీశ్ చెప్పిన మొత్తాన్ని ఇస్తేనే పని అవుతుందని చెప్పారు. రెండు సంవత్సరాలుగా మత్స్యశాఖ అధికారి చుట్టూ తిరిగిన మాధన్నపేట సొసైటీ ప్రెసిడెంట్, సభ్యులు విసిగిపోయారు. దీంతో హనుమకొండలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించగా శుక్రవారం మత్స్యశాఖ కార్యాలయానికి వచ్చి.. ప్రణాళిక ప్రకారం ఫీల్డ్ ఆఫీసర్ హరీశ్కు సొసైటీ ప్రెసిడెంట్ రూ.50 వేలు, డైరెక్టర్ రూ.30 వేలు లంచం ఇస్తుండగా అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. హరీశ్ను విచారించగా తనకేమీ తెలియదని, జిల్లా మత్స్యశాఖ అధికారి నాగమణి తీసుకోమని చెబితేనే తీసుకున్నానని ఏసీ బీ అధికారుల ముందు చెప్పాడు. దీంతో ఫీల్డ్ ఆఫీ సర్ హరీష్, డీఎఫ్ఓ నాగమణి లను తదుపరి విచా రణ కోసం నేడు(శనివారం) ఏసీబీ కోర్టులో హాజ రుపరచనున్నట్లు డీఎస్పీ సాంబయ్య తెలిపారు. సొసైటీ సభ్యత్వం కోసం లంచం డిమాండ్ రూ.80 వేలు తీసుకుంటూ పట్టుబడ్డ ఫీల్డ్ ఆఫీసర్ వరంగల్ మత్స్యశాఖ ఆఫీసులో ఘటన -
బస్సు పోలీస్ స్టేషన్కు పోనివ్వండి
కురవి: ‘నా ఫోన్ పోయింది.. బస్సును పోలీస్ స్టేష న్కు పోనివ్వండి..’ అంటూ ఆర్టీసీ బస్సులో ఓ ప్ర యాణికుడు హల్చల్ చేశాడు. వివరాలిలా ఉన్నా యి.. శుక్రవారం ఓ యువకుడు ఖమ్మం వెళ్లేందుకు మానుకోట డిపో ఆర్టీసీ బస్సు ఎక్కాడు. కాసేటికి అతని సెల్ఫోన్ పోయిందని బస్సులో వెతికాడు. ఫోన్ దొరక్కపోవడంతో కండక్టర్, డ్రైవర్తో ఫోన్ పోయిందని బస్సును పోలీస్స్టేషన్కు తీసుకెళ్లాలని వాదించాడు. డ్రైవర్ బస్సును పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లగా.. తన ఫోన్ పోయిందని.. చెక్ చేయాలని ప్రయాణికుడు పోలీసులను కోరాడు. చెక్ చేయడం కుదరదని, ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామని తెలిపారు. కానీ, ప్రయాణికుడు ఫిర్యాదు చేయకుండానే వెళ్లిపోయాడు. సెల్ఫోన్ పోయిందని ప్రయాణికుడి హల్చల్ సముదాయించి పంపించిన పోలీసులు -
వైద్యం వికటించి మహిళ మృతి
పాలకుర్తి టౌన్: వైద్యం వికటించి మహిళ మృతి చెందిన సంఘటన గురువారం అర్ధరాత్రి జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని హరిత ప్రైవేట్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన ఆలకుంట్ల లక్ష్మి(58) గర్భసంచిలో గడ్డ ఉండడంతో పాలకుర్తిలోని హరిత ఆస్పత్రిలో జాయిన్ అయింది. దీంతో వైద్యపరీక్షలు చేసిన డాక్టర్లు బుధవారం రాత్రి గర్భసంచి ఆపరేషన్ చేశారు. గురువారం రాత్రి లక్ష్మి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో డాక్టర్లు హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. మార్గమధ్యలోనే లక్ష్మి మృతి చెందింది. దీంతో బంధువులు హరిత ఆస్పత్రి వద్దకు మృతదేహాన్ని తీసుకెళ్లారు. కాగా హరిత ఆస్పత్రి వద్ద సీఐ, నలుగురు ఎస్సైలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు మృతురాలి బంధువులతో మాట్లాడి రూ.8 లక్షలు పరిహరం ఇచ్చేలా రాజీకుదిరిచినట్లు సమాచారం. ఈ విషయంపై ఎస్సై పవన్కుమార్ను వివరణ కోరగా మృతురాలి భర్త ఆలకుంట్ల ఉప్పలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామకు తరలించినట్లు తెలిపారు. లక్ష్మి మృతికి వైద్యుల కారణం కాదని, కేవలం గుండెనొప్పితో చనిపోయినట్లు భర్త ఉప్పలయ్య ఫిర్యాదు చేశాడని ఎస్సై తెలిపారు . అర్ధరాత్రి ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట భారీగా పోలీసు బందోబస్తు -
వాహనాలు ఇలా.. చెత్త సేకరణ ఎలా!
తొర్రూరు: జిల్లాలోని మున్సిపాలిటీల్లో చెత్త తరలించే వాహనాల నిర్వహణ అధికారుల నిర్లక్ష్యంతో గాడితప్పింది. మరమ్మతులకు గురైన ట్రాక్టర్లు, ఆటో ట్రాలీలు గ్యారేజీకే పరిమితం అవుతున్నాయి. పట్టణాల్లోని ఆవాసాల నుంచి నిత్యం చెత్తను సేకరించే వాహనాలు మరమ్మతులకు గురైనా మున్సిపాలిటీ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. మరమ్మతులకు గురైన ఆటోలను మెకానిక్ షెడ్లకు పంపించి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాహనాలు మరమ్మతులకు గురికావడంతో పూర్తి స్థాయిలో చెత్త సేకరణ జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీల్లో రెండు చిన్న వార్డులకు ఒకటి చొప్పున, పెద్ద వార్డుల్లో ఒకటి చొప్పున చెత్త ట్రాక్టర్లను తిప్పుతున్నారు. వాహనాల కొరత కారణంగా పలు మున్సిపాలిటీల్లోని వార్డుల్లో రోజు విడిచి రోజు చెత్త సేకరణకు వస్తున్నారు. ఐదు మున్సిపాలిటీలు.. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. మహబూబాబాద్లో 36 వార్డులు ఉండగా 143 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. 33 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. తొర్రూరులో 16 వార్డులు, 60 మంది పారిశుద్ధ్య కార్మికులు 12 టన్నుల చెత్త, డోర్నకల్లో 15 వార్డులు, 30 మంది కార్మికులు, 3 టన్నుల చెత్త, మరిపెడలో 15 వార్డులు, 40 మంది పారిశుద్ధ్య కార్మికులు, 3 టన్నుల చెత్త, కేసముద్రంలో 16 వార్డులు, 60 మంది కార్మికులు, 16 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఐదు మున్సిపాలిటీల్లో సరిపడా వాహనాలు లేక చెత్త సేకరణ ప్రహసనంగా మారుతోంది. ఉన్న వాహనాలు మరమ్మతులకు గురవుతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఐదేళ్ల క్రితం కొనుగోలు.. జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో చెత్త సేకరణ వాహనాలను ఐదేళ్ల క్రితం కొనుగోలు చేశారు. వీటి నిర్వహణ సక్రమంగా లేక తరచూ మొరాయిస్తున్నాయి. మూలకు చేరిన ఆటోలు నెలల తరబడి మరమ్మతుల షెడ్డులోనే ఉంటున్నాయి. కొన్ని వాహనాలు తుప్పు పడుతున్నాయి. ఆయా వాహనాలు నడిపేందుకు ప్రత్యేకంగా డ్రైవర్లు లేరు. పారిశుద్ధ్య సిబ్బందిలో డ్రైవింగ్ వచ్చిన కొందరు వాటిని నడుపుతున్నారు. ఎప్పటికప్పుడు నిర్వహణ చేపట్టకపోవడంతో అవి మూలకు చేరుతున్నాయి. చెత్త సేకరణ సమయంలో ఎక్కడ నిలిచిపోతాయో అని భయపడాల్సిన దుస్థితి నెలకొందని సిబ్బంది పేర్కొంటున్నారు. పాత వాటికి మరమ్మతులతో పాటు కొత్తగా వాహనాల కొనుగోలుకు అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. క్రమం తప్పకుండా సేకరణ చెత్త సేకరించే ఆటోలు కొన్ని మరమ్మతుకు గురైనప్పటికీ సేకరణ పూర్తి స్థాయిలో జరుగుతోంది. మరమ్మతుకు గురైన వాహనాలను అందుబాటులోకి తెస్తున్నాం. పట్టణంలో పారిశుద్ధ్యం లోపించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. వ్యర్థాలను ఇష్టారాజ్యంగా పడేయకుండా చెత్త సేకరణకు వచ్చే వాహనాల్లో వేయాలి. పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. –వి.శ్యాంసుందర్, తొర్రూరు మున్సిపల్ కమిషనర్జిల్లాలో మున్సిపాలిటీల వారీగా వాహనాలు మున్సిపాలిటీ వార్డులు ఆటో రిక్షాలు ట్రాక్టర్లు మరమ్మతులు మహబూబాబాద్ 36 33 10 5 తొర్రూరు 16 6 4 2 డోర్నకల్ 15 3 3 3 కేసముద్రం 16 – 6 2 మరిపెడ 15 7 3 –మరమ్మతులకు గురవుతున్న వాహనాలు చెత్త సేకరణకు అవస్థలు తుప్పు పడుతున్న వెహికిల్స్ కాలనీల్లో పేరుకుపోతున్న వ్యర్థాలు -
వరంగల్ మార్కెట్కు సెలవులు
వరంగల్: వరంగల్ వ్యవసాయ మార్కెట్కు ఈనెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు సెలువులు ఉన్నందున మార్కెట్లో ఎలాంటి క్రయవిక్రయాలు జరగవని ఈవిషయాన్ని రైతులు, వ్యాపారులు, గుమస్తా, దడవాయి, కార్మికులు గమనించాలని మార్కెట్ కమిటీ కార్యదర్శి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 18వ తేదీ (శనివారం)వారంతపు యార్డు బంద్, 19న (ఆదివారం)వారంతపు సెలవు, 20న(సోమవారం) దీపావళి పండుగ(ప్రభుత్వ సెలవు), 21న (మంగళవారం) అమావాస్య కావడంతో వరసగా మార్కెట్ బంద్ ఉంటుందని, బుధవారం 22వ తేదీన మార్కెట్ పునఃప్రారంభం అవుతుందని తెలిపారు. రైతులు తమ పంట ఉత్పత్తులను సెలవు దినాల్లో మార్కెట్కు తీసుకురావొద్దని సూచించారు. కేయూ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా కేయూ క్యాంపస్: రాష్ట్రంలో బీసీ సంఘాలు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో నేడు(శనివారం) కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నిర్వహించాల్సిన వివిధ పరీక్షలను వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వర్సిటీ పరిధిలో నిర్వహించాల్సిన ఎల్ఎల్బీ, బీటెక్, ఎంఎస్సీ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఎంటెక్, దూరవిద్య ఎంఎల్ఐఎస్సీ పరీక్షలను వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. మిగితా పరీక్షలు టైంటేబుల్ ప్రకారం జరుగుతాయని విద్యార్థులు గమనించాలని తెలిపారు. పూర్తి వివరాలకోసం www.kakatiya.ac.inలో చూడాలని కోరారు. మణికంఠ కాలనీలో చోరీవరంగల్: వరంగల్ 14వ డివిజన్ ఏనుమాముల పోలీస్స్టేషన్ పరిధిలోని సుందరయ్యనగర్ మణికంఠకాలనీలో శుక్రవారం మధ్యాహ్నం ఓ ఇంటిలో చోరీ జరిగిందని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సమాచారం తెలిసిన వెంటనే సీఐ సురేశ్, డాగ్ స్క్వాడ్తో వెళ్లి ఇంటిని పరిశీలించినట్లు తెలిసింది. ఈవిషయమై సీఐని వివరణ కోరగా బంగారం, నగదు దోచుకుపోయినట్లు నిర్ధారణ అయ్యిందని, ఇంటి యజమాని లేకపోవడంతో ఎంతపోయిందన్న వివరాలు తెలియలేదన్నారు. బాధితుడు రాత్రి 7 గంటల వరకు ఫిర్యాదు చేయలేదు. తాళం వేసిన ఇళ్లనే దొంగలు టార్గెట్గా పెట్టుకున్నందున ఎవరైనా ఊరికి వెళితే సమాచారం అందించాలని సీఐ కోరారు. -
బాణసంచా వ్యాపారంలో భద్రత పాటించాలి
వరంగల్ క్రైం : బాణసంచా విక్రయ సమయాల్లో భద్రతా ప్రమాణాలను పాటించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ విక్రయదారులకు సూచించారు. దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ శుక్రవారం కమిషనరేట్ పరిధిలోని బాణాసంచా విక్రయదారులతో వరంగల్ పోలీస్ కమిషనర్ కమిషనరేట్ కార్యాలయములో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. బాణాసంచా విక్రయాలు చేసేవారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని, అ నుమతుల కోసం వ్యాపారస్తులు ముందుగా అగ్నిమాప క విభాగం అధికారుల నుంచి ఎన్ఓసీ పొందాలన్నారు. అలాగే వ్యాపారస్తులు స్థల యజమాని నుంచి అనుమతి పత్రాన్ని పొందాలన్నారు. రూ.800 ప్రభుత్వ బ్యాంక్ చలాన్ చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. విక్రయాలు జరిపే ప్రదేశంలో అగ్ని ప్రమాద నివారణకు వినియోగించే ఇసుక, నీరు, ఇతర అగ్ని ప్రమాద నిరోధక సాధనాలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. గత అనుభవనాలను దృష్టిలో ఉంచుకొని వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా బాణాసంచా వ్యాపారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే బాణాసంచా కాల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, పెద్దలు పిల్లల వద్ద ఉండాలన్నారు. సమావేశంలో డీసీపీలు షేక్ సలీమా, అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్, జిల్లా అగ్నిమాపక అధికారులు సుదర్శన్ రెడ్డి, రేమాండ్ బాబు, శ్రీధర్ రెడ్డి, అదనపు డీసీపీ రవి, ఏఎస్పీ శుభం, ఏసీపీ జితేందర్రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నర్సింహారావులు, ఇన్స్పెక్టర్లు, వ్యాపారస్తులు పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ -
మినీ బ్యాంకులో రూ.59 వేలు గోల్మాల్
నర్సంపేట రూరల్: ఎస్బీఐ మినీ బ్యాంక్ (వినియోగదారుల సేవా కేంద్రం)లో డబ్బులు గోల్మాల్ అయిన ఘటన చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన అడ్డగట్ల స్రవంతి.. గ్రామంలో పది సంవత్సరాలుగా ఎస్బీఐ మినీ బ్యాంక్ను నడిపిస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన ఆరెల్లి సాంబయ్య ప్రతి ఏడాది రూ.1,506 చొప్పున 21 సంవత్సరాలపాటు ఎల్ఐసీ ఇన్సూరెన్స్ను చెల్లించాడు. ఈ ఏడాది మార్చి 19వ తేదీన ఎల్ఐసీకి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు రూ.59,581 తన అకౌంట్లో జమ అయ్యాయి. నగదు జమ అయ్యాయా.. లేదా.. లేదా అని తెలుసుకునేందుకు స్థానిక ఎస్బీఐ మినీ బ్యాంక్కు వెళ్లాడు. వెళ్లినప్పుడల్లా మినీ బ్యాంక్ నిర్వాహకురాలు స్రవంతి వేలిముద్ర వేయించుకొని చెక్ చేసినట్లుగా నటించి డబ్బులు పడలేదని చెప్పడంతో వెనుదిరిగాడు. ఎన్నిసార్లు చెక్ చేసినా ఫలితం లేకపోవడంతో బాధితుడు బ్యాంక్కు వెళ్లి మినీ స్టేట్మెంట్ తీసుకోవడంతో బండారం బయటపడింది. మార్చి 19వ తేదీన ఎల్ఐసీకి సంబంధించి రూ.59,581 జమ అయ్యాయని తేలింది. మార్చి 23వ తేదిన రూ. 29 వేలు, ఏప్రిల్ 4వ తేదీన రూ.30 వేలు మొత్తం రూ. 59 వేలు డ్రా చేసినట్లు ఉండడంతో లబోదిబోమంటూ వెళ్లి మినీబ్యాంక్ నిర్వాహకురాలిని నిలదీశాడు. అప్పుడే వేలిముద్ర వేసి డబ్బులు డ్రా చేసుకున్నావని నిర్వాహకురాలు చెప్పడంతో సాంబయ్య అవాక్కయ్యాడు. నా డబ్బులు నాకు ఇప్పించాలని కోరుతూ బాధితుడు మినీబ్యాంక్ ఎదుట కుటుంబ సభ్యులతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్తులు వచ్చి మినీ బ్యాంక్ నిర్వాహకురాలిని నిలదీయగా ఏం చేసుకుంటారో.. చేసుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతుందని, తక్షణమే ఆమైపె చర్యలు తీసుకొని బాధితుడికి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇదే విషయమై ఎస్సై రాజేశ్రెడ్డిని వివరణకోరగా.. బాధితుడి నుంచి ఫిర్యాదు అందిందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. మినీబ్యాంక్ నిర్వాహకురాలు స్రవంతిని వివరణ కోరగా ఆరెల్లి సాంబయ్యకు ఎల్ఐసీ ఇన్సూరెన్స్ డబ్బులు రాగానే రెండు దఫాలుగా వేలిముద్ర వేసి రూ.59 వేలు డ్రా చేసి ఇచ్చానని, నగదు ఇచ్చే క్రమంలో మా బుక్లో సంతకాలు సైతం చేయించానని, కావా లనే డబ్బులు ఇవ్వలేదని సాంబయ్య తప్పుడు ఆరోపణలు చేస్తున్నడని చెప్పడం కొసమెరుపు. వేలిముద్ర పెట్టించుకుని స్వాహా చేసిన ఎస్బీఐ మినీ బ్యాంక్ ఆర్గనైజర్ లబోదిబోమంటున్న బాధితుడు -
కార్యకర్తల నిర్ణయం మేరకే అధ్యక్షుడి ఎంపిక
● ఏఐసీసీ అబ్జర్వర్ దెబాసిస్ పట్నాయక్బయ్యారం: కార్యకర్తల నిర్ణయం మేరకే ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని ఏఐసీసీ అబ్జర్వర్ దెబాసిస్ పట్నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని కోదండ రామచంద్రస్వామి ఫంక్షన్హాల్లో గురువారం నిర్వహించిన బయ్యారం, గార్ల మండలాలస్థాయి కాంగ్రెస్ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘటన్ సృజన్ అభియన్ కార్యక్రమం పేరుతో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ డీసీసీ అధ్యక్షుడి ఎంపికలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారన్నారు. డీసీసీ అధ్యక్ష పదవికి పోటీపడే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పార్టీలో సీనియార్టీ, అనుబంధ సంఘాలతో సమన్వయం, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే వారిని గుర్తించి పదవి ఇవ్వడం జరుగుతుందన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో ఘనవిజయం సాధించి రాహుల్గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పీసీసీ అబ్జర్వర్ ఎండి.అవేజ్, పీసీసీ కో–ఆర్డినేటర్ నాగులూరి అరుణ్కుమర్గౌడ్, డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్చందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీసీల రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేని పార్టీలు
హన్మకొండ: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్ప నపై ఏ రాజకీయ పార్టీకి చిత్తశుద్ధి లేదని తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ అన్నారు. గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఈ నెల 18న నిర్వహించనున్న బీసీ బంద్ విజయవంతంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య, కార్పొరేట్ రంగాలన్నీ అగ్రవర్ణాల గుప్పిట్లో ఉన్నాయని, ఈ బంద్ను విఫలం చేయాలని కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని విద్యా సంస్థలు, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు, హోటళ్లు, బస్సులు, ఆటోలు, షాపింగ్ మాళ్లు, ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆర్డినెన్స్ తీసుకొచ్చిన ప్రభుత్వం.. దానిని కాపాడుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. అనంతరం బీసీ బంద్ పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మరావు, ఆయా సంఘాల నాయకులు దొడ్డపల్లి రఘుపతి, దాడి మల్లయ్య యాదవ్, బోనగాని యాదగిరి గౌడ్, వైద్యం రాజగోపాల్, తమ్మేలా శోభారాణి, గడ్డం భాస్కర్, సంగాని మల్లేశ్వర్, ఆకారపు మోహన్, పల్లెపు సమ్మయ్య, బచ్చు ఆనందం, ఆడెపు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. రేపటి బీసీ బంద్ను విజయవంతం చేయాలి తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ నాయకుల పిలుపు -
ఏజెన్సీలో అరుదైన గద్దజాతి పక్షి ప్రత్యక్షం
● పొలాల్లో వాలిన నల్ల రెక్కల గాలిపటం (కపసి) వాజేడు: ఏజెన్సీ ప్రాంతంలో అరుదైన గద్దజాతి పక్షి కనిపించింది. ములుగు జిల్లా వాజేడు మండల పరిధి ఇప్పగూడెం గ్రామ సమీపంలోని పొలాల్లో నల్ల రెక్కల గాలిపటం (కపసి) పక్షి వాలింది. దీని శాసీ్త్రయనామం ఎలనల్ కెరులియస్. పొడవైన రెక్కలు కలిగిన రాప్టర్, ఇది ప్రధానంగా బూడిదరంగు లేదా తెలుపు రంగులో ఉంది. ఈ పక్షిని గ్రామస్తులు వింతగా చూడటంతోపాటు తమ సెల్ ఫోన్లలో ఫొటోలు తీసుకున్నారు. ఎర్రని కళ్లు, రెక్కలు విప్పగానే నెమలి రెక్కల వలే పెద్దగా ఉన్నాయి. ఈ పక్షి రాత్రి సమయంలో మనుషులు అరిచినట్లుగా అరుస్తున్నట్లు ఇప్పగూడెం గ్రామస్తులు తెలిపారు. ఈ పక్షిని అడవి రామదాసు అనికూడా పిలుస్తారని తెలుస్తుండగా, దీని ఆహారంలో మిడతలు, ఇతర పెద్ద కీటకాలు, బల్లులు, ఎలుకలు ఉంటాయని, ఇది రైతులకు మేలు చేకూర్చే పక్షిగా తెలిసింది. -
ఒలింపిక్స్ క్రీడల నిర్వహణకు కృషి
వరంగల్ స్పోర్ట్స్: భారత్లో 2036లో జరుగనున్న ఒలింపిక్స్ పోటీల్లో కొన్ని క్రీడలను తెలంగాణలో నిర్వహించేందుకు సీఎం రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మూడు రోజులు జరుగనున్న జాతీయస్థాయి 5వ అథ్లెటిక్స్ అండర్–23 చాంపియన్షిప్ గురువారం ప్రారంభమైంది. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ఎంపీ కావ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2026లో జరుగనున్న ఖేలో ఇండియా క్రీడా పోటీలను హైదరాబాద్లో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ రూ.3.50 కోట్ల వ్యయంతో స్టేడియంలో అభివృద్ధి పనులు చేపట్టామని, త్వరలో ఫ్లడ్లైట్లు ఇతర వసతుల కోసం మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు ప్రోత్సాహం అందిస్తున్నాయన్నారు. మెరుగైన శిక్షణ కోసం క్రీడాకారులు పట్టుదలతో ముందుకెళ్లాలన్నారు. అనంతరం 10వేల మీటర్ల పరుగులో విజేతలకు పతకాలు అందజేశారు. కార్యక్రమంలో హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ ఎర్రబెల్లి వరదరాజేశ్వర్రావు, కార్యదర్శి కె. సారంగపాణి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అజీజ్ఖాన్, తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య జేఎన్ఎస్లో నేషనల్ అథ్లెటిక్స్ మీట్ ప్రారంభం -
నాణ్యమైన భోజనం అందించాలి
● కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్కురవి: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. గురువారం మండలంలోని నేరడ గ్రామంలో మోడల్ స్కూల్, కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల ఆవరణలోని కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, టాయ్లెట్స్, స్టడీ రూమ్స్, తరగతి గదులు, స్టోర్ రూం, పరిసరాలను పరిశీలించారు. తరగతి గదిలో స్వయంగా పిల్లల విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. ఏఐ డిజిటల్ తరగతుల బోధించాలని సూచించారు. మెనూ ప్రకారం రుచికరమైన ఆహారం అందించాలన్నారు. ఆరోగ్య, మానసిక సమస్యలపై కౌన్సెలింగ్ ఇవ్వాలని, వసతి గృహంలో వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వసతి గృహాల పరిసరాలు, తరగతి గదులు, మరుగుదొడ్లు తదితర ప్రదేశాల్లో క్రమం తప్పకుండా శానిటేషన్ నిర్వహించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సంబంధిత శాఖల అధికారులు స్పెషల్ డ్రైవ్ ద్వారా పరిశీలన చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలుకు సిద్ధం చేయాలి మహబూబాబాద్: వానాకాలం ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్రాల్లో రైతుల సౌకర్యార్థం అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అనువైన ప్రదేశాల్లో కేంద్రాలను ఏర్పాటు చేయాలని, జిల్లా కేంద్రంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధాన్యం రవాణా విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అదనపు కలెక్టర్ అనిల్కుమార్, డీసీఓ వెంకటేశ్వర్లు, డీఏఓ విజయనిర్మల, ఆర్డీఓలు కృష్ణవేణి, గణేష్ ఉన్నారు. -
ప్రసవాల సంఖ్య పెంచాలి
డీఎంహెచ్ఓ రవిరాథోడ్ నెల్లికుదురు: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. గురువారం స్థానిక పీహెచ్సీని డీఎంహెచ్ఓ సందర్శించి వైద్య సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. సీజనల్ వ్యాధులు, ప్రసవాల సంఖ్య, వ్యాక్సినేషన్, టీబీ వ్యాధిపై గ్రామాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో ప్రసవాలపై ఆశకార్యకర్తలు, ఏఎన్ఎంలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ శారద, సీహెచ్ఓ శాంతమ్మ, సూపర్వైజర్లు వసంత కుమారి, సుల్తానా, ఏఎన్ఎంలు, ఆశకార్యకర్తలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఆశ్రమ పాఠశాల తనిఖీ బయ్యారం: మండలంలోని ఇర్సులాపురం గిరిజన ఆశ్రమ పాఠశాలను కొత్తగూడ ఏటీడబ్ల్యూఓ ఆర్.భాస్కర్రావు గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న మెనూతో పాటు వంటగదులు, టాయిలెట్లు, డార్మెటరీ హాల్ను ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా సమావేశం అయ్యారు. విద్యార్థ్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం బి.శోభన్బాబు, వార్డెన్ లాలయ్య తదితరులు పాల్గొన్నారు. పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం తొర్రూరు రూరల్: పౌష్టికాహారంతోనే గర్భిణులు, బాలింతలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని డీడబ్ల్యూఓ సబిత అన్నారు. గురువారం మండలంలోని వెలికట్ట గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం, సీమంతాలు నిర్వహించారు. ఈసందర్భంగా డీడబ్ల్యూఓ మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులతో పాటు ప్రతీ ఒక్కరు పాలు, గుడ్లు, ఆకుకూరలు తదితర పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ పూర్ణచందర్, సీడీపీఓ కమలాదేవి, ఏసీడీపీఓలు విజయలక్ష్మి, సంకీర్తన, డాక్టర్ ఫాతిమా ఫరా, సూపర్వైజర్లు మల్లీశ్వరి, శ్రీదేవి, గౌసియా, సునీత, శోభ, నాగమణి, అశోక్, జ్యోతి, టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం ● జిల్లా ప్రధాన న్యాయమూర్తిమహ్మద్ అబ్దుల్ రఫీ మహబూబాబాద్ రూరల్ : ఆరోగ్యమే మహాభాగ్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సౌజన్యంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో గురువారం సీపీఆర్పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ మాట్లాడుతూ.. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తికి పునర్జన్మనిచ్చే విధానమే సీపీఆర్ పద్ధతి అన్నారు. సీపీఆర్ వల్ల లయతప్పిన గుండెను తిరిగి పని చేయించేందుకు వీలుంటుందన్నారు. ఈ విధానంపై న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయవాదులు, కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లకు ప్రత్యక్ష పద్ధతిలో అవగాహన కల్పించడం మహాభాగ్యం అన్నారు. ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి శాలిని, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతిమురారి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కృష్ణతేజ్, జిల్లా కోర్టు ముఖ్య పరిపాలనాధికారి క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా కార్యాలయం జప్తుచేయండి
జనగామ: జనగామ జిల్లా వ్యవసాయశాఖ నిర్లక్ష్యంపై జిల్లా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తొమ్మిదేళ్లుగా బిల్లులు ఇవ్వకుండా కాలయాపన చేయడంపై ఆ శాఖ కార్యాలయ ఫర్నిచర్ జప్తునకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్, వెల్డింగ్ వర్క్స్ కంపెనీలో వ్యవసాయ సంబంధిత పరికరాలు తయారు చేస్తారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులకు రాయితీ పరికరాల సరఫరా కోసం సదరు యజమాని రాజిరెడ్డి కాంట్రాక్టు దక్కించుకున్నారు. కల్టివేటర్లు, ఫ్లవ్లు, రొటోవేటర్లు తదితర పరికరాలను తయారు చేసి జిల్లా వ్యవసాయ శాఖకు అందజేశారు. 2016–17 సంవత్సరం నాటికి వ్యవసాయ శాఖ యజమానికి రూ.5.25 లక్షల బిల్లు చెల్లించాల్సి ఉంది. అయితే అప్పటి అధికారులు బిల్లు చెల్లించకపోవడంతో కేంద్ర సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల శాఖ పరిధిలోని సమాధాన్ ప్లాట్ఫారమ్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై పరిశ్రమల శాఖ స్పందించి చెల్లింపునకు హామీ ఇచ్చినా వ్యవసాయ శాఖ బిల్లు విడుదల చేయలేదు. ఎన్నిసార్లు అధికారులు, ఉన్నతాధికారుల వద్ద తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో 2022 డిసెంబర్లో బాధితుడు జనగామ కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం ఈ ఏడాది ఆగస్టు 5న వ్యవసాయ శాఖ అధికారులు రూ.5.25 లక్షల బిల్లు, మూడింతల వడ్డీ కలుపుకుని రూ.13,19,428తో కలిపి మొత్తం రూ.18,44,928 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయినా చెల్లింపు జరగకపోవడంతో కోర్టు అటాచ్మెంట్ వారెంట్ జారీ చేసి కార్యాలయ సామగ్రిని జప్తు చేసుకోవాలని సూచించింది. దీంతో గురువారం కోర్టు ఫీల్డ్ అసిస్టెంట్ పూల్చంద్ సమక్షంలో యజమాని కలెక్టరేట్లోని వ్యవసాయ శాఖ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి అంబికాసోని, కలెక్టరేట్ ఏఓ శ్రీకాంత్ యజమానితో చర్చించి మూడు నెలల్లో బిల్లు మంజూరు చేయిస్తామని హామీ ఇవ్వడంతో ఆయన అంగీకారం తెలిపారు. ఈ విషయం పై డీఏఓ అంబికాసోని మాట్లాడుతూ తాను జిల్లాకు ఇటీవలే రావడంతో పెండింగ్ బిల్లుపై ఇప్పటివరకు సమాచారం లేదన్నారు. ఈ విషయం తన దృష్టిలో ఉంటుందని, మూడు నెలల్లో బిల్లులు చెల్లింపు జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జనగామ వ్యవసాయశాఖ అధికారులకు జిల్లా కోర్టు ఆదేశం కాంట్రాక్టర్కు చెల్లింపులు చేయకపోవడమే కారణం మూడు నెలల్లో చెల్లిస్తామని చెప్పిన జిల్లా అధికారులు -
వ్యవసాయ రంగానికి పెద్దపీట
హన్మకొండ: వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని వారి అవసరాలకు అనుగుణంగా సేవలందిస్తున్నట్లు వివరించారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో 2023 సంవత్సరంలో 31,550 రిలీజ్ చేయగా 2024 సంవత్సరంలో 39,693 సర్వీసులను రిలీజ్ చేశామని, 2025 (అక్టోబర్ 16 వరకు ) 34,306 సర్వీస్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. 2023తో పోల్చుకుంటే 2024 సంవత్సరంలో 8,143 సర్వీస్లు అఽధికంగా మంజూరు చేసినట్లు వివరించారు. ఇంకా మూడు నెలల సమయంలో ఉందని ఈలోపు గతంలోకంటే అధికంగా సర్వీస్లు మంజూరు చేస్తామన్నారు. విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి కొత్తగా లైన్లు వేయాల్సిన అవసరం లేని సర్వీసులను నెల రోజుల్లో మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు తమ వాటా చెల్లించాల్సి ఉన్న సర్వీసులను రెండు నెలలో మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ సర్వీస్ల మంజూరుపై కమర్షియల్ విభా గాధికారులు 16 సర్కిళ్ల అధికారులతో ప్రతీ వారం సమీక్ష నిర్వహిస్తున్నట్లు, మెటీరియల్ కొరత లేదని పేర్కొన్నారు. రైతులు మెటీరియల్ కొనాల్సిన అవసరం లేకుండా అవసరమైన మేరకు సరఫరా చేస్తున్నమని స్పష్టం చేశారు. సర్వీస్ల మంజూరులో ఇబ్బందులుంటే టోల్ ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయాలని కోరారు. విద్యుత్ కనెక్షన్ల జారీలో పారదర్శకత.. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల జారీలో మరింత పారదర్శకత తీసుకొచ్చామని, కొత్త కనెక్షన్ కోసం నమోదు చేసుకున్నప్పటి నుంచి సర్వీస్ రిలీజ్ అయ్యే వరకు ప్రతీ దశలోనూ మొబైల్ నంబర్కు తెలుగులో సమాచారం పంపిస్తున్నట్లు తెలిపారు. ఈమెస్సెజ్లో లింక్ కూడా పంపిస్తుండడంతో దాన్ని ఓపెన్ చేస్తే స్టేటస్ రిపోర్ట్ రైతులు తెలుసుకోవచ్చని సూచించారు. మెటీరియల్ త్వరితగతిన రిలీజ్ అయ్యేలా ఈ–స్టోర్ విధానాన్ని తీసుకొచ్చామని, పేపర్ పని లేకుండా ఆన్లైన్ ద్వారా బుక్ చేసి మెటీరియల్ డ్రా చేసుకునే సౌలభ్యం క్షేత్ర స్థాయి అధికారులకు కల్పించిందని, దీంతో రైతుల సర్వీ సుల మంజూరు వేగంగా జరుగుతుందని తెలిపా రు. ట్రాన్స్ఫార్మర్ల తరలింపునకు డిపార్ట్మెంట్ వా హనాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పొలం బాట ద్వారా రైతుల ముంగిటకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఇప్ప టి వరకు ఎన్పీడీసీఎల్ పరిధిలో 4,064 పొలం బాట కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. సత్వర సర్వీస్లు మంజూరు టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి -
ఐఎంఎల్ పాలసీ అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు
మహబూబాబాద్ రూరల్: ఐఎంఎల్ పాలసీ– 2025–27అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని విని యోగించుకోవాలని జిల్లా ఇన్చార్జ్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి ఆర్.ప్రవీణ్ కుమార్ కోరారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో గురువారం ఆయన ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఇప్పటి వరకు 243 దరఖాస్తులు వచ్చాయని, రెండు రోజుల గడువు మాత్రమే ఉన్నందువల్ల దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను సమర్పించాలని కోరారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తి అయిన తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ నెల 23 ఉదయం 11గంటలకు పట్టణంలోని ఏబీ ఫంక్షన్ హాల్లో లైసెన్సుల కోసం కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు ఉదయం 8గంటలకే ఫంక్షన్ హాల్కు చేరుకోవాలని, ఇందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేశామన్నారు. సమావేశంలో ఎకై ్సజ్ సీఐలు చిరంజీవి, బిక్షపతి, అశోక్ పాల్గొన్నారు. -
భర్తను కాపాడబోయి భార్య హతం
నల్లబెల్లి: ఇంటి స్థలం పంపకం, అప్పు వివాదానికి మద్యం మత్తు తోడుకావడంతో అన్నదమ్ముల మ ధ్య ప్రేమానుబంధం దూరమైంది. అన్నపై త మ్ముడు కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్ప డ్డాడు. ఈ సమయంలో తన భర్త ప్రాణం తీయొద్దని వదిన ప్రాధేయపడింది. అయినా కనికరించని మరిది.. వదినపై సైతం కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో భర్తను కాపాడిన భార్య.. తన ప్రా ణం వదిలింది. తీవ్రంగా గాయపడిన అన్న ప్రాణా పాయ స్థితిలో ఎంజీఎంలో చికిత్స పొందుతున్నా డు. ఈ విషాదకర ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కొండాపూర్లో జరిగింది. ఎస్సై గోవర్ధన్ కథనం ప్రకారం.. మేరుగుర్తి మల్లయ్య, సమ్మక్క దంపతులు బతుకుదెరువు నిమిత్తం 30 ఏళ్ల క్రితం నల్లబెల్లి నుంచి కొండాపూర్కు వలసవెళ్లారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు రమేశ్, సురేశ్ ఉ న్నారు. ఈ క్రమంలో ఇంటి స్థలం పంపకాల విషయంలో బుధవారం రాత్రి రమేశ్ తల్లి సమ్మక్కతో గొడవపడ్డాడు. అమ్మతో ఎందుకు గొడవ పడుతున్నావని తమ్ముడు సురేశ్ అన్న రమేశ్ను నిలదీశా డు. అలాగే, తన దగ్గర తీసుకున్న రూ.10 వేలు ఇవ్వడంలేదని మనసులో పెట్టుకుని మద్యం మత్తులో రమేశ్పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన రమేశ్ భార్య (సహజీవనం చే స్తున్న మహిళ) స్వరూప(35) అడ్డుకునేయత్నం చే సి బతిమాలాడింది. కానీ మద్యం మత్తులో ఉన్న సురేశ్ ఏమాత్రం కనికరం లేకుండా ఆమైపె కూడా కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడడంతో కుటుంబీకులు నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. రమేశ్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. దీంతో కొండాపూర్, నల్ల బెల్లిలో విషాదం అలుముకుంది. స్వరూప కుమారుడు శివకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అన్నపై తమ్ముడు కత్తితో దాడి.. అడ్డు వెళ్లిన వదినపై కూడా దాడికి పాల్పడడంతో మృతి కొండాపూర్లో విషాదం -
క్రీడాకారులకు గాయాలు.. 108లో ఎంజీఎంకు తరలింపు
జేఎన్ఎస్లో జరుగుతున్న అథ్లెటిక్స్ పోటీల్లో ఇద్దరు క్రీడాకారులు, ఒక టెక్నికల్ అఫీషియల్ గాయపడ్డారు. హరియాణ రాష్ట్రానికి చెందిన సోనూయాదవ్ లాంగ్జంప్ చేస్తుండగా ఎడమకాలు మణికట్టులో గాయమైంది. మరో క్రీడాకారిణి త్రివేణికి సైతం మణికట్టులో స్వల్ప గాయం కాగా అక్కడే విధుల్లో ఉన్న 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ఈఎంటీ చైతన్య, పైలెట్ కొండ తిరుపతి లు ఎంజీఎం తరలించారు. కాగా, టెక్నికల్ అఫీషియల్ శివకుమార్ కుడి చేయి మధ్య వేలుకు గాయం కాగా చికిత్స అందించారు. చాంపియన్షిప్లో భాగంగా మొదటి రోజు గురువారం 30 ఈవెంట్లలో పోటీలు నిర్వహించారు. ఉదయం 6 నుంచి 10: 30 గంటల వరకు, తిరిగి 12 నుంచి సాయంత్రం 6:30గంటల వరకు పోటీలు జరిగాయి. 30 ఈవెంట్లలో 11 ముగిశాయి. మిగిలిన ఈవెంట్లు శుక్రవారం కొనసాగుతాయి. 10,000 మీటర్ల పురుషుల పరుగు : రిజ్వాన్(ఇండోర్) ప్రఽథమ స్థానం, సచిన్యాదవ్(ఉత్తర్ప్రదేశ్) ద్వితీయ, శివాజీకాశీరామ్(కర్నాటక) తృతీయ స్థా నంలో నిలిచారు. 10000 మీటర్ల మహిళల విభాగం: లతికతల్వార్(రాజస్తాన్) ప్రథమ స్థానం, ఆర్తిపవారా(మహారాష్ట్ర) ద్వితీయ, భూష్రాగౌరి(మధ్యప్రదేశ్)తృతీయ స్థానం, షార్ట్ఫుట్ మహిళల విభాగం: సిమ్రాన్జిత్కౌర్(ఢిల్లీ) ప్రథమ స్థానం, ఝలక్చా హల్(ఉత్తర్ప్రదేశ్)ద్వితీయ,పూజకుమారి(ఎన్సీఓ పీ) తృతీయ స్థానం, హైజంప్ మహిళల విభా గం: సీమకుమారీ(ఉత్తర్ప్రదేశ్) ప్రథమ స్థానం, సారి కకుమావత్(రాజస్తాన్)ద్వితీయ, రింపల్కౌర్(పంజాబ్)తృతీయ స్థానం, డిస్కస్త్రో మహిళల విభా గం: నిఖితకుమారి(ఎన్సీఓపీ, ఆర్గనైజేషన్ ) మొదటిస్థానం, కిరణ్(రాజస్తాన్)ద్వితీయ, అఖిలరాజు(కేరళ)తృతీయ స్థానం, హ్యామర్త్రో పురుషుల వి భాగం: దినేశ్ ఎస్(తమిళనాడు) ప్రథమ స్థా నం, పవన్(రాజస్తాన్) ద్వితీయ, రాబిన్యాదవ్(ఉత్తర్ప్రదేశ్) తృతీయ స్థానం, పోల్వాల్ట్ విభాగం: కు మార్కుల్దీప్(జేఎస్డబ్ల్యూ,ఆర్గనైజేషన్) ప్రథమ, క వీన్రాజ్(తమిళనాడు)ద్వితీయ,రామ్రాజన్(రాజస్తాన్) తృతీయ స్థానం, 100మీటర్ల పరుగు మహిళ ల విభాగం: సుదీష్న(మహారాష్ట్ర) విజేత, సాక్షి(రిలయన్స్, ఆర్గనైజేషన్) ద్వితీయ, తమన్నా(త్రివేండ్రం) తృతీయ స్థానం, 100మీటర్ల పరుగు పురుషుల విభాగం: హరుత్యమ్జయరామ్(ఒడిశా) ప్రథమ, కుమార్(జార్ఖండ్)ద్వితీయ, రాట్మెల్గే(మహారాష్ట్ర) తృతీయ స్థానం, లాంగ్జంప్ మహిళల విభాగం: ముబాస్సిమ్(అంజుబాబీ, ఆర్గనైజేషన్) ప్రథమ, ఎంఎస్ సించానా(కర్నాటక)ద్వితీయ, వీఎం అభిరామ్(కేరళ)తృతీయ స్థానం, 1500 మీటర్ల పరుగు మహిళల విభాగం: వినీతగుర్జర్ (ఉత్తర్ప్రదేశ్) ప్రథ మ, లక్ష్మిప్రియకిసాన్(ఒడిశా) ద్వితీయ, భగవతిడియోరా(రాజస్తాన్)తృతీయ స్థానంలో నిలిచారు. -
‘కొండా’ వివాదం సమసినట్లేనా..?
సాక్షిప్రతినిధి, వరంగల్ : సంచలనంగా మారిన మంత్రి కొండా సురేఖ దంపతులు, ఆమె కూతురు సుస్మిత వ్యాఖ్యల వివాదం సమసినట్లేనా.. ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోబోతుంది.. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని కొండా సురేఖ ఇంటికి టాస్క్ఫోర్స్ పోలీసులు ఎందుకు వెళ్లారు.. ఈ సందర్భంగా సుస్మిత చేసిన వ్యాఖ్యల పర్యవసానం ఏమిటి.. ఇంతకీ వివాదానికి కారణమైన మాజీ ఓఎస్డీ సుమంత్ ఎక్కడ.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టిలను కలిసిన సురేఖ.. కీలకమైన కేబినెట్ మీటింగ్కు ఎందుకు వెళ్లలేదు?.. ఇవన్నీ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్టాపిక్గా మారాయి. 48 గంటలుగా తాజా రాజకీయ పరిణామాలు వరంగల్ను హీటెక్కించాయి. సుమంత్ కోసం పోలీసులు.. కలకలం రేపిన సుస్మిత వ్యాఖ్యలు.. మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డిల మధ్య విభేదాలు పక్కన పెడితే... మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం టాస్క్ఫోర్స్ పోలీసులు వెళ్లడం.. అక్కడ సురేఖ కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు కలకలంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు తన తల్లిదండ్రులపై కుట్ర చేస్తున్నారంటూ సుస్మిత ఘాటైన విమర్శలు చేశారు. కొండా సురేఖ, మురళిలకు ఏం జరిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఆమె హెచ్చరించారు. దీంతో ఇటు కాంగ్రెస్ పార్టీలో.. అటు అధికారవర్గాల్లో ఆమె వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇదే సమయంలో వరంగల్లో మీడియాతో మాట్లాడిన కొండా మురళీధర్ సీఎం రేవంత్రెడ్డితో తమకు విభేదాలు లేవని, తనకు ఎమ్మెల్సీ కూడా ఇస్తామని చెప్పారన్నారు. సుస్మిత ఎక్కడ.. ఎప్పుడు.. ఏం మాట్లాడింది తనకు తెలియదని కొట్టిపారేశారు. మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం టాస్క్ఫోర్స్ పోలీసులు ఎందుకు వెళ్లారు? ఇంతకీ అతను ఎక్కడ ఉన్నాడు? ప్రభుత్వం తదుపరి ఏం చేయబోతుంది? అనే అంశాలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. కేబినెట్కు ఎందుకు వెళ్లలేదు.. అసలేం జరుగుతోంది..? రెండు రోజులుగా జరుగుతున్న వివాదాల నేపథ్యంలో గురువారం జరిగిన కీలకమైన మంత్రివర్గ సమావేశానికి మంత్రి కొండా సురేఖ హాజరుకాకపోవడం హాట్టాపిక్గా మారింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసిన కొండా సురేఖ, ఆమె కూతురు సుస్మిత.. టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్తో కూడా భేటీ అయ్యా రు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కూడా కలిసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. మీనాక్షి నటరాజన్, మహేశ్కుమార్ను కలిసిన కొండా సురేఖ.. 48 గంటల్లో జరిగిన పరిణామాలను వివరించినట్లు తెలిసింది. పార్టీపరంగా, కొందరు ప్రజాప్రతినిధుల వల్ల తమకెదురవుతున్న ఇబ్బందులను వారి దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా మీడియాతో మాట్లాడిన సురేఖ స్పష్టం చేశా రు. ఇదిలా ఉంటే.. మీనాక్షి నటరాజన్, మహేశ్కుమార్తో భేటీ అయిన సురేఖ, ఆ తర్వాత జరిగిన కేబినెట్ మీటింగ్కు హాజరుకాకపోవడం కొత్త వివా దానికి తెర తీసింది. అసలు కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మాట్లాడిన సురేఖకు వారు ఏమి భరోసా ఇ చ్చారు? అక్కడినుంచి కేబినెట్ మీటింగ్కు వెళ్లాల్సి న ఆమె ఎందుకు వెళ్లలేదు? కావాలనే వెళ్లలేదా? లేక ఎవరైనా వద్దని చెప్పారా? ఈ నేపథ్యంలో కొండా దంపతులకు ఏమైనా ప్రత్యేక వ్యూహం ఉందా? అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది..? అన్న అంశాలు అన్ని వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. హీటెక్కిన వరంగల్ రాజకీయాలు మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం ‘టాస్క్ఫోర్స్’.. కలకలం రేపిన కొండా సుస్మిత వ్యాఖ్యలు సీఎం రేవంత్రెడ్డితో విభేదాలు లేవన్న కొండా మురళి కేబినెట్ మీటింగ్కు హాజరుకాని మంత్రి సురేఖ..హాట్ టాపిక్గా తాజా పరిణామాలు -
సత్ఫలితాలు..
● బయోమైనింగ్ ప్లాంట్లో 80 శాతం చెత్త శుద్ధి ● పర్యావరణ పరిరక్షణలో భాగంగా డంపింగ్ యార్డులో ఏర్పాటు ● సిమెంట్ ముడి పదార్థాలతో పాటు ఎరువుల తయారీ హై జంప్ చేస్తున్న క్రీడాకారుడుపరుగు పోటీలో తలపడుతున్న మహిళా అథ్లెట్లులాంగ్జంప్ చేస్తున్న అథ్లెట్ ●మహబూబాబాద్: చెత్తను శుద్ధి చేయడంతో పాటు ముడి పదార్థాల తయారీ కోసం మానుకోట మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన బయో మైనింగ్ ప్లాంట్ సత్ఫలితాలు ఇస్తోంది. కాగా మున్సిపాలిటీలో పదేళ్లుగా పేరుకుపోయిన చెత్తలో 80శాతం క్లీన్ కావడంతో పాటు ఆదాయం సమకూరే ముడిపదార్థాలను తయారు చేస్తున్నారు. దీంతో పర్యావరణ సమస్య పరిష్కారంతో పాటు ఆదాయం వస్తోందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. కాగా బయోమైనింగ్ ప్లాంట్ నిర్వహణ బాధ్యతను కాంట్రాక్టర్కు అప్పగించారు. మున్సిపాలిటీలో 143మంది పారిశుద్ధ్య కార్మికులు.. మానుకోట మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్లో 205 మంది పని చేస్తున్నారు. వారిలో 143 మంది పారిశుద్ధ్య కార్మికులుగా పని చేస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రతీరోజు 33 టన్నుల చెత్త సేకరణ చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీ సమీపంలో, గాంధీపురం శివారులో డంపింగ్ యార్డుల్లో చెత్తను డంప్ చేస్తున్నారు. కాగా, 2022లో మానుకోట మున్సిపాలిటీకి బయోమైనింగ్ ప్లాంట్ మంజూరైంది. సిగ్నల్ కాలనీలో ప్లాంట్కు స్థలం కేటాయించగా.. స్వచ్ఛ భారత్ మిషన్ నిధులు రూ.1.20కోట్లతో నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్లాంట్ నుంచి తయారీ పదార్థాలు.. మానుకోట మున్సిపాలిటీలో ప్రతీరోజు 33 టన్నుల చెత్త సేకరణ జరుగుతోంది. ఇందులో ఒక టన్ను పొడి చెత్తను.. పొడిచెత్త సేకరణ కేంద్రం( డీఆర్సీ సెంటర్)కు తరలిస్తున్నారు. ఇందులో బాటి ళ్లు, అట్టాలు, సీసాలు, ప్లాస్టిక్ ఇతర వస్తువుల ను తరలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తద్వారా మున్సిపాలిటీకి ఆదాయం వస్తోంది. ఒక టన్ను తడి చెత్తను కంపోస్టు షెడ్డుకు తరలిస్తున్నారు. దీంతో ఎరువులు తయారు చేస్తున్నారు. ఆ ఎరువులను నర్సరీలకు, డివైడర్లలో ఉన్న మొక్కలను ఉపయోగిస్తున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. మిగిలిన 31 టన్నుల చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తుండగా దానిని బయోమైనింగ్ ప్లాంట్లో ఉపయోగిస్తున్నారు. ఆ చెత్త నుంచి ఆర్డీఎఫ్ ఇంధన పదార్థాలు, సిమెంట్ ముడి పదార్థాలు, బయో ఎరువులు తయారు అవుతున్నాయి. ఆ ఎరువుల్లో కెమికల్స్ ఎక్కువగా ఉన్నందున పండ్ల మొక్కలకు మినహా ఇతర అన్ని మొక్కలకు ఉపయోగించవచ్చని అధికారులు తెలిపారు. ఆర్డీఎఫ్ను కర్నూల్ జిల్లాలోని పలు సిమెంట్ కంపెనీలకు తరలిస్తున్నట్లు అధికారులు చెప్పారు. క్లీన్ క్లీన్.. బయో మైనింగ్ ప్లాంట్ వల్ల మానుకోట మున్సిపాలిటీ డంపింగ్ యార్డులోని చెత్త మొత్తం క్లీన్ అవుతోంది. ప్లాస్టిక్ కవర్లన్నీ ప్లాంట్లోనే శుద్ధి అవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణలో ప్లాంట్ దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు. మూడు నెలలకోసారి ఆర్డీఎంఏతో పాటు సంబంఽధిత అధికారులు ఆప్లాంట్ను పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి పంపిస్తున్నారు. గత నెల 25న ఆర్డీఎంఏతో పాటు అధికారులు ప్లాంట్ను సందర్శించి నిర్వహణ ఇతర అన్ని వివరాలు నమోదు చేసుకున్నారు. కాగా ఆ ప్లాంట్ సక్సెస్ కావడంతో ప్రభుత్వం త్వరలో జిల్లాలో మిగిలిన మున్సిపాలిటీల్లో కూడా ఏర్పాటు చేస్తుందని చెబుతున్నారు. బయో మైనింగ్ ప్లాంట్ సక్సెస్ మానుకోటలో ఏర్పాటు చేసిన బయో మైనింగ్ ప్లాంట్ సక్సెస్ అయ్యింది. మున్సిపాలిటీలోని డంపింగ్ యార్డుల్లో ఉన్న చెత్త దాదాపు క్లీన్ అయ్యింది. దాని నుంచి ఎరువులు తయారీ జరుగుతోంది. పర్యావరణ పరిరక్షణలో ప్లాంట్ చాలా దోహదపడుతోంది. – రాజేశ్వర్, మానుకోట మున్సిపల్ కమిసనర్ చెత్త సమస్య చాలా వరకు తీరింది 10 సంవత్సరాల చెత్తలో 80 శాతం క్లీన్ అయ్యింది. డంపింగ్ యార్డులో చెత్త సమస్య, ప్లాస్టిక్ కవర్ల సమస్య చాలా వరకు తీరింది. నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం కాంట్రాక్టర్కు అప్పగించింది. ఎరువులు, సీ అండ్ వేస్ట్ పదార్థాలు ఉపయోగపడుతున్నాయి. నూకల రాంచంద్రారెడ్డి పార్క్ నిర్మాణంలో ఉపయోగించారు. – గుజ్జు క్రాంతి, పర్యావరణ అధికారి -
రాష్ట్ర స్థాయి బాలికల వాలీబాల్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
వరంగల్ స్పోర్ట్స్: సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు జరుగనున్న ఎస్జీఎఫ్ అండర్–19 రాష్ట్ర స్థాయి బాలికల వాలీబాల్ పోటీలకు ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టును ఎంపిక చేశారు. గురువారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని వాలీబాల్ మైదానంలో ఉమ్మడి జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించారు. 120 మంది బాలికలు హాజరుకాగా, ఇందులో ప్రతిభ కనబరిచిన 12మందితో ఉమ్మడి జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు ఎస్జీఎఫ్ అండర్–19 జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్ తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్టు డాక్టర్ బరుపాటి గోపి, ఎస్జీఎఫ్ అండర్–19 మాజీ కార్యదర్శి డాక్టర్ కోట సతీశ్, పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ. ప్రభాకర్రెడ్డి, కార్యదర్శి దరిగి కుమార్, డీఎస్ఏ వాలీబాల్ కోచ్ బత్తిని జీవన్గౌడ్ పాల్గొన్నారు. ఎంబీఏ, ఎంసీఏలో స్పాట్ అడ్మిషన్లు కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్కళాశాల, సుబేదారిలోని యూనివర్సిటీ పీజీ కళాశాలలో ఈ విద్యాసంవత్సరం(2025–2026)లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మొదటి సంవత్సరంలో మిగిలిన సీట్లలో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఆ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఎస్. జ్యోతి, నర్సింహాచారి గురువారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఈ నెల 17నుంచి 21వ తేదీ వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4గంటల వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అన్ని విద్యార్హతల ఒరిజనల్ సర్టిఫికెట్లుతోపాటు ఆధార్, ఐసెట్ ర్యాంకు కా ర్డును తీసుకురావాలన్నారు. టీజీఐసెట్ 2025 అర్హత సాధించినవారు, అర్హతసాధించలేకపోయిన అభ్యర్థులు కూడా ఈ స్పాట్ అడ్మిషన్లకు అర్హులేనని వారు తెలిపారు. పూర్తి వివరాలకు టీజీఐసెట్.ఎన్ఐసీ.ఇన్ వెబ్సైట్లో చూడాలని కోరారు. కళాశాలల వారీగా మిగిలిన సీట్ల వివరాలు మార్గదర్శకాలు కూడా ఆ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బాటనీ హెచ్ఓడీతోపాటు కాంట్రాక్టు లెక్చరర్లకు షోకాజ్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ బాటనీ విభాగం అధిపతితోపాటు నలుగురు కాంట్రాక్టు లెక్చరర్లు, నలుగురు నాన్టీచింగ్ ఉద్యోగులకు షోకాజ్ నోటీస్లు జారీచేసినట్లు యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్ గురువారం తెలిపారు. ఇటీవల వీసీ ప్రతాప్రెడ్డి బాటనీ విభాగాన్ని తనిఖీ చేయగా ఆవిభాగ అధిపతితో సహా నలుగురు కాంట్రా క్టు లెక్చరర్లు, మరో నలుగురు నాన్టీచింగ్ ఉద్యోగులు విధుల్లో లేరనే విషయం వెల్లడైందన్నారు. దీంతో వారికి షోకాజ్ నోటీస్లు జారీచేసినట్లు తెలిపారు. ఇదిలాఉండగా గురువారం కేయూలోని అకడమిక్ కమిటీహాల్లో వీసీ ప్ర తాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం బాటనీ విభాగం అధిపతి, కాంట్రాక్టు లెక్చరర్లతో సమావేశం నిర్వహించినట్లు సమాచారం. విధుల్లో సమయపాలన పాటించాలనే విషయం, తరగతుల నిర్వహణ, తదితర అంశాలపై చర్చ సాగినట్లు తెలిసింది. -
బ్యాటరీ దొంగల ముఠా అరెస్టు
● వివరాలు వెల్లడించిన ఏసీపీ రవీందర్రెడ్డి నర్సంపేట రూరల్ : బ్యాటరీ దొంగల ముఠాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నర్సంపేట ఏసీపీ రవీందర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం నర్సంపేట పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పాలకుర్తికి చెందిన గుంజే సంపత్, గుంజే ప్రశాంత్, జఫర్గఢ్ మండలం తీగారం గ్రామానికి చెందిన గండికోట మహేశ్, బోసు సాంబరాజు ముఠాగా ఏర్పడ్డారు. నర్సంపేట మండలంలోని పలుగ్రామాల్లో అర్ధరాత్రి సమయంలో సోలార్ విద్యుత్ దీపాలకు ఉన్న బ్యాటరీలను అపహరిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున రాజుపేటలో బ్యాటరీలు చోరీ చేసేందుకు అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. ఇందులో రూ. 2.15 లక్షల విలువైన 38 బ్యాటరీలు లభించగా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. నర్సంపేట టౌన్ సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సైలు రవికుమార్, గూడ అరుణ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సీఎం రేవంత్రెడ్డికి ఘనస్వాగతం
సాక్షిప్రతినిధి, వరంగల్/కాజీపేట : వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని పరామర్శించేందుకు హనుమకొండకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాధవరెడ్డి తల్లి కాంతమ్మ ఇటీవల మృతి చెందగా కాజీపేట ప్రశాంత్ నగర్ సమీపంలోని పీజీఆర్ గా ర్డెన్లో బుధవారం మాతృయజ్ఞం నిర్వహించా రు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా హనుమకొండకు వచ్చారు. ఈ సందర్భంగా సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలోని హెలిపాడ్ వద్ద సీఎం రేవంత్రెడ్డికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, విప్ రాంచందర్నాయక్, ఎంపీలు పో రిక బలరాం నాయక్, డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, యశస్విని రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, పలువురు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచి రోడ్డు మార్గంలో పీజీఆర్ గార్డెన్లో కాంతమ్మ మాతృయజ్ఞం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంతమ్మ చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాధవరెడ్డి, తన కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం రేవంత్.. తిరిగి హైదరాబాద్ వెళ్లారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి స్వాగ తం, వీడ్కోలు సంధర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు పలువురు ఆయనను కలవగా, అందరినీ పేరుపేరున పలకరించి కుశలప్రశ్నలు వేశారు. ముఖ్యమంత్రి పర్యటన సంధర్భంగా పోలీసులు భారీభద్రత, బందోబస్తు ఏర్పాటు చేశారు. హెలిపాడ్ వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు మాతృయజ్ఞం వద్ద అందరిని పలకరించిన సీఎం రేవంత్రెడ్డి.. స్వాగతం, వీడ్కోలు సందర్భంగా కుశల ప్రశ్నలు.. మంత్రులతో కలిసి ఎమ్మెల్యే మాధవరెడ్డికి సీఎం పరామర్శ -
ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని కాపాడిన పోలీసులు
ఖిలా వరంగల్: వరంగల్ ఎస్ఆర్ఆర్తోట చిన్న బ్రిడ్జి వద్ద బుధవారం మధ్యాహ్నం ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించాడు. సమాచారం అందుకున్న హెడ్కానిస్టేబుల్ ఇస్మాయిల్.. అతడిని పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఓ యువకుడు ట్రాక్పై ఆత్మహత్యకు యత్నిస్తున్నట్లు డయల్ 100కు కాల్రాగా.. మిల్స్కాలనీ హెడ్కానిస్టేబుల్ ఇస్మాయిల్ క్షణాల్లో ఘటనాస్థలికి చేరుకున్నారు. మద్యం మత్తులో పట్టాలపై తిరుగుతున్న యువకుడిని క్షేమంగా పట్టుకుని వివరాలు సేకరించి పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా, ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని కాపాడిన హెడ్ కానిస్టేబుల్ ఇస్మాయిల్, కానిస్టేబుల్ నరేశ్ను ఇన్స్పెక్టర్ రమేశ్ అభినందించారు. -
పాత కార్లతో జాగ్రత్త..!
ఖిలా వరంగల్ : ఢిల్లీ వంటి మహా నగరాల్లో కాలుష్యం అధికమవడంతో పదిహేనేళ్లు దాటిన కార్లు, ట్యాక్సీలపై ఆంక్షలు విధిస్తున్నారు. ఈ తరుణంలో డీజిల్, పెట్రోల్ కార్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. వీటి విక్రయాలకు అక్కడ ప్రత్యేక మార్కెట్లు ఉంటాయి. కాగా,ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలువురు వ్యాపారులు తక్కువ ధరకు వాటిని అక్కడ కొనుగోలు చేసి సెకండ్ హ్యాండ్ కార్లంటూ విక్రయిస్తున్నారు. వరంగల్ నగరంలో రకరకాల పేర్లతో సుమారు 20 వరకు పాత కార్ల దుకాణాలు ఉన్నాయి. ఏటా సుమారు 1,500 నుంచి 2వేల లోపు కార్లు విక్రయాలు సాగుతున్నాయి. ఇవి కాక తెలిసిన వారు, మధ్యవర్తుల సహకారంతో తెచ్చుకునేవి మరో 1,000 వరకు ఉంటాయని తెలుస్తోంది. ధ్రువీకరణ పత్రాలు కీలకం.. వాహనం కొనుగోలు చేసే ముందు ఆర్సీ, బీమా, కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రాలు అఫిడవిట్ తీసుకోవాలి. వాహనంపై ఎలాంటి కేసులు లేవని పోలీసు శాఖ నుంచి ధ్రువీకరణ పత్రం పొందాలి. ఎన్ఓసీ పొందిన 15 రోజుల లోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేదంటే నెలవారీగా జరిమానా విధిస్తారు. వాహన కాల పరిమితి 15 ఏళ్లు, మోడల్, కంపెనీ(ఇన్వాయిస్) ధరను బట్టి రోడ్ ట్యాక్స్ విధిస్తారు. ఇంజిన్ ఆన్ చేసే సమయంలో ఆయిల్ పైకి ఎగజిమ్మినా లీకై నా, పొగవచ్చినా ప్రమాదమని గుర్తించాలి. గేర్ ఇంజిన్ సరి చూసుకోవాలి. టైర్లు సరిగా లేకపోతే మైలేజీ తగ్గుతుంది. వాహనాన్ని పసిగట్టొచ్చిలా.. వాహన అద్దాల చివర కంపెనీ పేరు, ఏడాది సంఖ్య ముద్రించి లేకపోతే మార్చారని గ్రహించాలి. డోర్ బాటమ్ ప్రాంతంలో రబ్బర్లు తీసి వాటిపై గుండీల ఆకారంలో అచ్చులుంటే ఎలాంటి మార్పు చేయలేదని అర్థం. కాళ్ల కింద డిక్కీ ప్రాంతంలో మ్యాట్లు ఎత్తి కింది వైపు దెబ్బతిందో లేదో చూసుకోవాలి. ప్రమాదం జరిగిన వాహనాలకు రంగులు వేసి బఫింగ్ చేస్తే పోల్చుకోవడం కష్టమవుతుంది. ధర తక్కువ అనుకుంటే పొరపాటే.. మన ఆసక్తే మోసానికి ఆయుధం అన్ని పత్రాలు సరిచూసుకోవాలంటున్న అధికారులు -
ఇన్చార్జ్లుగా పదోన్నతి..?
టీజీ ఎన్పీడీసీఎల్లో పోస్టుల కల్పనకు యాజమాన్యం సన్నద్ధంహన్మకొండ : తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీ ఎన్పీడీసీఎల్)లో పదోన్నతుల కల్పనకు యాజమాన్యం సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. పదోన్నతి అంశంపై హైకోర్టులో కేసు విచారణలో ఉండడంతో పాలన పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రెండేళ్ల నుంచి ఉన్నతస్థాయి పదోన్నతులకు అధికారులు సైతం ఎదురుచూస్తున్నారు. బీసీ, ఓసీ ఉద్యోగ సంఘాలు హైకోర్టుకు వెళ్లడంతో ఎలాంటి పదోన్నతి కల్పించకుండా స్టే రావడంతో తాత్కాలిక పదోన్నతి ప్రక్రియకు ఆటంకం కలిగింది. ఎస్సీ, ఎస్టీలకు వారి రిజర్వేషన్ కోటాకు మించి పదోన్నతి పొందారని, తమకు అన్యాయం జరుగుతోందని, రిజర్వేషన్ల ప్రక్రియ సమీక్షించి న్యాయం చేయాలని కోరుతూ బీసీ, ఓసీ ఉద్యోగ సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ కేసు విచారణలో ఉండగా తాత్కాలిక పదోన్నతి కల్పిస్తుండడంతో బీసీ, ఓసీ ఉద్యోగ సంఘాలు మరోసారి హైకోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చింది. హైకోర్టు తీర్పు ఆలస్యమవుతుండడంతో పదోన్నతి ద్వారా భర్తీ చేయాల్సిన ఉన్నత స్థానాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పాలనపరమైన సమస్యలు ఏర్పడుతున్నాయి. మరో వైపు సీనియర్లు పదోన్నతి వైపు ఎదురుచూస్తు యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో ఇన్చార్జ్ పదోన్నతి కల్పించాలని విద్యుత్ సంస్థల యాజ మాన్యాలు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఎన్పీడీసీఎల్లో ఇన్చార్జ్ పదోన్నతి కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. టీజీ ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లో ఒకేసారి పదోన్నతి ఉత్తర్వులు అందించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. పెరిగిన పోస్టులు.. టీజీ ఎన్పీడీసీఎల్లో ఏళ్లుగా వినియోగంలో లేని 216 అన్యూజ్డ్ పోస్టులు, ఖాళీగా ఉంటున్న 217 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను ప్రభుత్వం రద్దు చేసి నూతనంగా 339 పోస్టులను మంజూరు చేసింది. దీంతో కొత్తగా రెండు చీఫ్ ఇంజనీర్, ఒక జాయింట్ సెక్రటరీ, సూపరింటెండ్ పోస్టులు 4, జనరల్ మేనేజర్ ఒక పోస్టు, డివిజనల్ ఇంజనీర్ పోస్టులు 4, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు 4, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ పోస్టులు 6, అకౌంట్స్ ఆఫీసర్ ఒక పోస్టు, అసిస్టెంట్ అకౌంట్ రెండు పోస్టు, పర్సనల్ ఆఫీసర్ 4, సబ్ ఇంజనీర్ 16 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్ 16, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ 20, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ 32, సీనియర్ అసిస్టెంట్ 88, అసిస్టెంట్ లైన్మెన్ 48, ఆఫీస్ సబార్డినేట్ 80, వాచ్మెన్ 4, స్వీపర్ కమ్ గార్డెనర్, స్వీపర్, శానిటరీ ఆర్డర్లీస్ 6 పోస్టులు మంజూరయ్యాయి. ఇంజనీరింగ్ విభాగంలో భారీగా పదోన్నతులు పొందే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎస్ఈలు నలుగురికి చీఫ్ ఇంజనీర్గా, ఐదునుంచి ఏడుగురు డీఈలకు ఎస్ఈలుగా, ఏడీఈలకు 7నుంచి 10మందికి డివిజన్ ఇంజనీర్లుగా, ఏఈలు 80 నుంచి 90 వరకు అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లుగా పదోన్నతి లభించనుంది. వీటితో పాటు సబ్ ఇంజనీర్లకు ఏఈఈలుగా, సీనియర్ అసిస్టెంట్లకు జేఏఓలుగా, లైన్ ఇన్స్పెక్టర్లకు సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్లుగా, జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా, పర్సనల్ ఆఫీసర్లకు అసిస్టెంట్ సెక్రటరీలుగా, అదే విధంగా అకౌంట్స్ విభాగంలోనూ పదోన్నతులు కల్పించనున్నారు. ఈ మేరకు ఎన్పీడీసీఎల్ మానవ వనరుల విభాగం ఇప్పటికే సీనియారిటీ, ఆర్ఓఆర్ ప్రకారం ఉద్యోగాల వారీగా పదోన్నతి జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ వారంలో ఎప్పుడైనా ఇన్చార్జ్ పదోన్నతుల ఉత్తర్వుల వెలువడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పూర్తిస్థాయి పదోన్నతికి అడ్డంకిగా హైకోర్టులో కేసు ఖాళీగా ఉన్నతస్థాయి ఉద్యోగాలు -
విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకోవాలి
విద్యారణ్యపురి: విద్యార్థులు కంప్యూటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన నైపుణ్యాలను పెంచుకోవాలని, తద్వారా ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గుర్రం శ్రీనివాస్ తెలిపారు. కళాశాలలో కెరీర్ గైడెన్స్ సెల్, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో స్కిల్ ఇండియా డిజిటల్ పోటీల ఉచిత కోర్సులపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్, హనుమకొండ స్కిల్ ఇండియా హబ్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మేనేజర్ హరీశ్, శ్రావణి పాల్గొని స్కిల్ ఇండియా కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్ రజనీలత, కెరీర్ గైడెన్స్ సెల్ కన్వీనర్ డాక్టర్ యాకూబ్, కామర్స్ విభాగం అధిపతి డాక్టర్ జె.చిన్నా, అధ్యాపకులు బైరి శ్రీనివాస్, ఉమాదేవి, శివనాగ శ్రీను, అనిల్కుమార్, గంగిశెట్టి శ్రీనివాస్, నవీన్, బాలచందర్, మాధవ్ శంకర్, వందన, సునీత తదితరులు పాల్గొన్నారు. -
సీపీఆర్తో మనిషిని బతికించే అవకాశం
ఎంజీఎం: అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ వెంటనే చేయడం ద్వారా మనిషిని బతికించే అవకాశాలు పెరుగుతాయని కేఎంసీ స్కిల్ సెంటర్ నోడల్ ఆఫీసర్ చిలక మురళి అన్నారు. సీపీఆర్ వారోత్సవాల్లో భాగంగా కేఎంసీలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో బుధవారం సీపీఆర్పై అవగాహన నిర్వహించారు. ఈసందర్భంగా హాస్పిటల్లో ఉన్న అన్ని తరగతుల ఉద్యోగులు, పేషెంట్ బంధువులు, ఆటో డ్రైవర్లకు సీపీఆర్పై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ అనిల్ బాలరాజు, ఆర్ఎంఓ ప్రతాప్, డాక్టర్ రోషన్, అనస్తీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాస్ నాయక్, డాక్టర్ కరిష్మా తదితరులు పాల్గొన్నారు. కేఎంసీ స్కిల్ సెంటర్ నోడల్ ఆఫీసర్ మురళి -
విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలి
హన్మకొండ: వినియోగదారులకు అంతరాయాలు లేని మెరుగైన, నాణ్యమైన విద్యుత్ను అందించాలని అధికారులు, ఉద్యోగులకు టీజీ ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ టి.మధుసూదన్ సూచించారు. హనుమకొండ పెద్దమ్మగడ్డలోని ఎన్పీడీసీఎల్ వరంగల్ సర్కిల్ కార్యాలయంలో సర్కిల్ స్థాయి సమీక్ష సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ అంతరాయాలు, బ్రేక్ డౌన్స్పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రధానంగా వ్యవసాయానికి అంతరాయాలు లేని విద్యుత్ అందించాలని చెప్పారు. రెవెన్యూ వసూళ్లు వందశాతం సాధించాలన్నారు. సమావేశంలో ఆపరేషన్ –2 సీజీఎం రాజు చౌహాన్, వరంగల్ సర్కిర్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె.గౌతంరెడ్డి, డీఈలు ఎ.ఆనందం, ఎస్.మల్లికార్జున్, తిరుపతి, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సంజీవరావు, ఏడీఈ, ఏఈలు, ఏఏఓ, జేఏఓలు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ
హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు. బుధవారం హనుమకొండ నయీంనగర్లో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్గా వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ను రాష్ట్ర కమిటీ ప్రకటించింది. కాగా, వర్కింగ్ చైర్మన్గా దొడ్డిపల్లి రఘుపతి, వైస్ చైర్మన్లుగా దాడి మల్లయ్య, బొనగాని యాదగిరి గౌడ్, వైద్యం రాజగోపాల్, తమ్మెల శోభారాణి, కోఆర్డినేటర్లుగా తంగళ్లపల్లి రమేశ్, గాజ యుగంధర్ యాదవ్తో కమిటీ ఏర్పాటైందని చైర్మన్ వేణుగోపాల్ గౌడ్ తెలిపారు. ఈ నెల 18న నిర్వహించనున్న రాష్ట్ర బీసీ బంద్ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి ఖానాపురం: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని అశోక్నగర్లో చోటుచేసుకుంది. హెడ్కానిస్టేబుల్ జంపయ్య కథనం ప్రకారం.. నర్సంపేట మండలం ఇటుకాలపల్లి జీపీ పరిధిలోని నర్సింగాపురం గ్రామానికి చెందిన పల్లకొండ రాజేందర్(43) బైక్పై మంగళవారం రాత్రి ఖానాపురం మండలం అశోక్నగర్లో బంధువుల ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో సైనిక్స్కూల్ దాటిన తర్వాత బైక్ రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడింది. గమనించిన వాహనదారులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య సునీత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి కుమారుడు అభిషేక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ జంపయ్య తెలిపారు. బైక్లు ఢీకొని దొడ్లగడ్డ తండాలో చిన్నారి .. నర్మెట: రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన బుధవారం మండలంలోని దొడ్లగడ్డ తండాలో చోటు చేసుకుంది. తరి గొప్పులకు చెందిన చెన్నబోయిన శివుడు తన భార్య శైలజ, కూతురు శ్రీవిద్య(03)తో కలిసి బైక్పై జనగామ నుంచి తరిగొప్పులకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో బైక్ మండలంలోని దొడ్లగడ్డ తండాలో వీరిని ఢీకొంది. ఈ ఘటనలో శ్రీవిద్యకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో 108లో జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. దరఖాస్తు చేసుకోవాలి కాళోజీ సెంటర్: విద్యాశాఖలోని బోధన, బోధనేతర ఇబ్బందికి జీఓ 317 ప్రకారం ఇంటర్ లోకల్ క్యాడర్ తాత్కాలిక బదిలీలు, డిప్యుటేషన్ల కోసం ఈనెల 17 నుంచి 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఇ.నవీన్నికోలస్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. schooledu.telangana.gov.inలో దరఖాస్తు చేసి సంబంధిత కాపీలను ఆర్జేడీ, డీఈఓలకు సమర్పించాలని పేర్కొన్నారు. వివరాల కోసం 8523030307 సంప్రదించాలని సూచించారు. -
క్రీడాపండుగకు వేళాయె..
వరంగల్ స్పోర్ట్స్: క్రీడాపండుగకు వేళ అయ్యింది. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న 5వ ఓపెన్ నేషనల్ అండర్–23 అథ్లెటిక్స్ చాంపియన్షిప్ గురువారం నుంచి ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ ఎర్రబెల్లి వరదరాజేశ్వర్రావు తెలిపారు. హనుమకొండ జేఎన్ స్టేడియంలోని డీఎస్ఏ ఆఫీస్లో బుధవారం చాంపియన్షిప్ వివరాలు విలేకరులకు వెల్లడించారు. నేటి నుంచి (16 నుంచి 18వ తేదీ వరకు) మూడు రోజుల పాటు జరుగనున్న అథ్లెటిక్స్ పోటీల్లో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 937 మంది అథ్లెట్లు, 150 మంది టెక్నికల్ అఫీషియల్స్ పాల్గొంటారని తెలిపారు. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 25 మంది, 70మంది రాష్ట్ర సాంకేతిక అధికారులు, 25 మంది స్థానిక అధికారులు, 50మంది వలంటీర్లు పాల్గొంటారని వెల్లడించారు. చాంపియన్షిప్లో ప్రతీ ఈవెంట్ యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుందని, వివిధ ప్రదేశాల నుంచి డ్రాఫ్ట్ చేసిన టెక్నికల్ అఫీషియల్స్, ఏఎఫ్ఐ, ఫొటో ఫినిష్ అధికారులు, లైవ్ స్ట్రీమింగ్ బృందానికి హోటల్ వసతి కల్పించనున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య , హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు స్నేహశబరీష్, సత్యశారద, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్రెడ్డి అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభిస్తారని తెలిపారు. సమావేశంలో హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్, అథ్లెటిక్స్ సంఘం జిలా కార్యదర్శి సారంగపాణి పాల్గొన్నారు. నేటి నుంచి నేషనల్ అథ్లెటిక్స్ మీట్ హాజరుకానున్న 937 అథ్లెట్లు ఏర్పాట్లు పూర్తి చేసిన అసోసియేషన్ బాధ్యులు -
పార్టీ అభివృద్ధికి కృషిచేసే వారికి గుర్తింపు
● ఏఐసీసీ పరిశీలకుడు దేబాసిస్ పట్నాయక్మహబూబాబాద్ రూరల్ : కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడేవారికి గుర్తింపు లభిస్తుందని ఏఐసీసీ పరిశీలకుడు దెబాసిస్ పట్నాయక్ జి అన్నారు. మా నుకోట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన నియోజకవర్గ ముఖ్యనాయకులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. సమావేశంలో ఎమ్మె ల్యే మురళీనాయక్, డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్రెడ్డి, టీపీసీసీ పరిశీలకులు శ్రీకాంత్ యాదవ్, అవేజ్, టీపీసీసీ రాష్ట్ర కోఆర్డినేటర్ అరుణ్ కుమార్ గౌడ్, అజ్మీరా సురేష్, రవి పాల్గొన్నారు. అందరి అభిప్రాయాల మేరకే అధ్యక్షుడి ఎంపిక తొర్రూరు: డీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో పార్టీ శ్రేణులందరి అభిప్రాయాల మేరకే అధిష్టానానికి నివేదిక అందిస్తామని ఏఐసీసీ పరిశీలకుడు దేబాశిష్ పట్నాయక్ అన్నారు. డివిజన్ కేంద్రంలో బుధవారం పాలకుర్తి నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశం నిర్వహించారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు భరత్చందర్రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. దేశ ప్రజలకు కాంగ్రెస్ రాజ్యాంగాన్ని, ఓటు హక్కును అందిస్తే ఈ వ్యవస్థలను బీజేపీ నీరుగారుస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. డీసీసీ అధ్యక్షుడి ఎంపికలో నియోజకవర్గానికి ప్రాధాన్యమివ్వాలని కోరారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించుకుంటామన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ పరిశీలకులు ఎండీ అవేజ్, శ్రీకాంత్ యాదవ్, అరుణ్కుమార్గౌడ్, నాయకులు ము త్తినేని సోమేశ్వరరావు, మేకల కుమార్, పెద్దవంగర అధ్యక్షులు ముద్దసాని సురేష్ పాల్గొన్నారు. -
ప్రారంభమైన ఎస్జీఎఫ్ క్రీడలు
మహబూబాబాద్ అర్బన్: ఎస్జీఎఫ్ క్రీడలపై ‘తూతూ మంత్రంగా క్రీడా పోటీలు’ శీర్షికన బుధవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈమేరకు జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో బుధవారం మండల స్థాయి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు ఎస్జీఎఫ్ఐ కమిటీ సభ్యులు, పీడీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ శీలం వెంకటేవ్వర్లు హాజరై మాట్లాడుతూ.. క్రీడలతోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో తప్పనిసరిగా చదువుతోపాటు క్రీడలు నిర్వహించి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నారు. కార్యాక్రమంలో పీడీలు, పీఈటీలు చాంప్లానాయక్, పుష్పలలీ, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, నజీరుద్దీన్, శంకర్, రాజన్న, సుదర్శన్, ఇస్మాయిల్, రఘు పాల్గొన్నారు. -
సండ్ర కర్ర బంగారమే..
జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు రవాణాసాక్షి, మహబూబాబాద్ : మానుకోటలో దొరికే సండ్ర కర్ర ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ ఉండటం.. ఇక్కడ అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కుల కలప వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. ఇక్కడి కర్రకు ఖమ్మంలో ఎన్ఓసీ తీసుకొని సరఫరా చేస్తున్న విషయం బట్టబయలు కావడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అయితే ఖమ్మంలో పలువురు అధికారులు కలప స్మగ్లర్లకు సహకరించడంతో వారిపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో ఆ వ్యవహారంలో సంబంధం ఉన్న జిల్లా అధికారుల్లో దడ పుడుతుంది. కత్తా.. కాస్మొటిక్స్ తయారీ..! జిల్లాలోని ఫారెస్టు ఏరియా 1,279.38 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఇందులో మహబూబాబాద్, గూడూరు ఫారెస్టు డివిజన్లల్లో గంగారం, కొత్తగూడ, గూడూరు, బయ్యారం మండలాలతోపాటు, మహబూబాబాద్ డివిజన్లోని కేసముద్రం, జమాండ్లపల్లి మొదలైన ప్రాంతాలు అట వీ ప్రాంతంగా ఉన్నాయి. అయితే అటవీ ప్రాంతంతోపాటు, మైదాన ప్రాంతాల్లోని డోర్నకల్, కురవి, సీరోలు, నర్సింహులపేట, మరిపెడ మండలాల్లో సండ్ర కర్ర ఎక్కువగా ఉంది. అయితే ఇప్పటి వరకు సండ్ర కర్ర అంటే రొకలి బండలు, రోకళ్ల కోసం వినియోగించడం, కర్ర ఇనుప కడ్డీని పోలిన గట్టితనం ఉండటంతో పలువురు ఇళ్లకు నిట్టాడుగా ఉపయోగించడమే తెలుసు. అయితే హర్యానా, మహా రాష్ట్ర మొదలైన రాష్ట్రాల్లో పాన్లో వినియోగించే కత్తా తయారీ, కాస్మోటిక్స్, ఇతర రసాయనాల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. దీంతో ఫారెస్టు అధి కారులు నిర్దారించిన ధర టన్నుకు రూ.11 వేల ఉండగా.. ఇతర రాష్ట్రాల్లో టన్ను సండ్ర కర్రకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు పలుకుతుంది. ఎన్టీపీఎస్ యాప్తో.. ఏజెన్సీ ప్రాంతంలో చెట్లను నరకడం నేరం. అదే మైదాన ప్రాంతాల్లో రైతుల భూముల్లో ఉన్న చెట్లను నరికేందుకు పలు ఆంక్షలు ఉండేవి. అయితే రైతులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం నేషనల్ ట్రాన్సిస్ట్ పర్మిట్ సిస్టమ్(ఎన్టీపీఎస్)యాప్ తీసుకొచ్చింది. రైతు భూమిని రెవెన్యూ అధికారులు నిర్దారించిన పత్రాలను యాప్లో నమోదు చేసి చెట్టుకు రూ.500 చెల్లించడం. ఎక్కడ చెట్లు కొడుతున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయాలను పొందుపర్చాలి. అయితే ఆ వివరాలు సరి చూడకుండానే ఎన్ఓసీ వస్తుంది. దీనిని ఆసరాగా చేసుకొని సండ్ర కర్రకు బదులు నల్లతుమ్మ అని నమోదు చేసి అక్రమార్కులు రాజమార్గంలోనే కలపను జిల్లా దాటిస్తున్నారు. ఎవరైనా అడ్డు పడితే ఎన్ఓసీ చూపించడం, లేదా ఆమ్యామ్యాలు అప్పజెప్పి వెళ్తున్నట్లు సమాచారం. ఎన్టీపీఎస్ యాప్తో అక్రమ తరలింపు ఖమ్మంలో వెలుగు చూసిన జిల్లా కలప వ్యవహారం జిల్లా అధికారులపై ఆరా.. ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంఅక్రమార్కులకు అండగా.. జిల్లా నుంచి సండ్ర కర్రను రాజమార్గంగా ఇతర ప్రాంతాలకు తరలించడంలో అక్రమార్కులకు పలువురు ఫారెస్టు అధికారుల అండదండలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మైదాన ప్రాంతంలో ఉన్న టేకు, నవిలినార, సండ్ర చెట్లు ఏజెన్సీ వృక్షాలుగానే పరిగణిస్తారు. వీటిని నరికేందుకు ఫారెస్టు అధికారులు అనుమతి కావాలి. అయితే ఏజెన్సీ వృక్షాలను నరికి నల్లతుమ్మ, దుర్సెన మొదలైన పేర్లతో ఎన్టీపీసీలో అనుమతి తీసుకోవడం.. ఇది తెలిసినా పలువురు అధికారులు తమకేమీ పట్టనట్లు ఉండడంపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఇటీవల జిల్లాలోని కురవి, డోర్నకల్, సీరోలు, మరిపెడ ప్రాంతంలో కొట్టిన సండ్ర కర్రకు ఖమ్మం జిల్లా అదికారులు ఎన్ఓసీ ఇవ్వడం.. వారి బండారం బయటపడి సస్పెన్షన్కు గురికావడంతో జిల్లాలోని అక్రమార్కుల్లో భయం మొదలైంది. ఈ విషయం విచారణకోసం ఎన్ఫోర్స్మెంట్ టీమ్ జిల్లాలో తిరిగి సండ్ర కర్ర కోసిన ప్రాంతాల్లో పలువురిని ప్రశ్నించింది. దీంతో ఎప్పుడు ఎవరిపై వేటు పడుతుందోనని ఫారెస్టు అధికారుల్లో వణుకుపుడుతుంది.విచారణ చేపడుతున్నాం.. జిల్లా నుంచి సండ్ర కర్ర ఇతర ప్రాంతాలకు వెళ్లిన విషయంపై విచారణ జరుగుతుంది. డోర్నకల్, కురవి, సీరోలు, మరిపెడ మండలాల్లోని సండ్ర కర్ర కోసిన భూముల్లో పరిశీలన జరుగుతుంది. పలువురిని విచారణ చేసి.. జిల్లా అధికారుల పాత్రపై ఆరా తీస్తున్నాం. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం. – బత్తిని విశాల్, డీఎఫ్ఓ -
మక్క రైతుల పడిగాపులు
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్నలను విక్రయించేందుకు తీసుకొచ్చిన రైతులకు బుధవారం పడిగాపులు తప్పలేదు. ఈనాం విధానంలో కొనుగోళ్లు ప్రారంభించగానే సర్వర్ డౌన్ సమస్య తలెత్తడంతో సాయంత్రం నాలుగు గంటల వరకు విన్నర్ లిస్టు బయటకురాలేదు. దీంతో రైతులందరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు మార్కెట్లోనే పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొనుగోళ్ల అలస్యంతో బస్తాలు నింపడం, కాంటాలు పెట్టడంలో తీవ్ర జాప్యం జరిగి మొక్కజొన్నలు మార్కెట్ నుంచి లారీల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లలేదు. దీంతో రైతుల ట్రాక్టర్లు వ్యవసాయ మార్కెట్ ప్రధాన ద్వారం వద్ద నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. రాత్రి పొద్దుపోయే వరకు మార్కెట్ అధికారులు మొక్కజొన్నలను కాంటాలు పెట్టించి లారీల్లో తరలించి మార్కెట్ బయట ఉన్న మొక్కజొన్నల ట్రాక్టర్లను లోనికి అనుమతించారు. మార్కెట్ ఎదుట క్యూ కట్టిన మక్కల ట్రాక్టర్లు -
మరింత అంతరం !
సాక్షిప్రతినిధి, వరంగల్ : అధికార కాంగ్రెస్ పార్టీలో అసలేం జరుగుతోంది.. మంత్రుల మధ్య అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయా.. జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ దంపతుల నడుమ అగాధం పెరిగిపోయిందా.. మేడారం టెండర్లపై ఇటీవల కాలంలో కొండా మురళి హైకమాండ్కు ఫిర్యాదు చేశారన్న ప్రచారం మరింత గ్యాప్ను పెంచిందా.. వరంగల్ రాజకీయాలపై పార్టీ, ప్రభుత్వం దృష్టి సారించిందా.. అంటే నిజమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల జరిగిన పరిణామాలే ఇందుకు తాజా ఉదాహరణలుగా చెబుతున్నారు. రోజురోజుకూ చినికి చినికి గాలివానగా మారుతున్న మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య విబేధాలపై ఇటు అధిష్టానం.. అటు ప్రభుత్వం సీరియస్గా స్పందించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివాదాస్పదంగా వ్యాఖ్యలు.. మంత్రులు, కొందరు ఎమ్మెల్యేల మధ్య రోజురోజుకూ అంతరం పెరుగుతోంది. రాష్ట్ర అటవీ, పర్యాటక, దేవాదాయశాఖల మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావుల వ్యాఖ్యలు పలుమార్లు వివాదాస్పదంగా మారాయి. కొద్ది రోజుల క్రితం ఓ ఎమ్మెల్యేపై చేసిన బాడిషేమింగ్ వ్యాఖ్యలు దుమారమే రేపాయి. ఆ తర్వాత తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారని కొండా దంపతులపై కొందరు ఎమ్మెల్యేలు అధిష్టానం వరకు వెళ్లారు. వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్రెడ్డి, గండ్ర సత్యనారాయణరావులు టీపీసీసీ చీఫ్, సీఎంలకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ అంశంపై టీపీసీసీ క్రమశిక్షణ సంఘం కొండా సురేఖ, కొండా మురళీధర్రా వులతో మాట్లాడింది. టీపీసీసీ చీఫ్, సీఎంల జోక్యంతో సద్దుమణిగినట్లే అనిపించినా.. అంతర్గతంగా ఇంకా రగులుతూనే ఉంది. ఇదే సమయంలో మేడా రం సమ్మక్క–సారలమ్మల గద్దెల పునరుద్ధరణ, ఇత ర అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిపై కొండా మురళి ఏఐసీసీ, టీపీసీసీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ ప్రచారంపై సంప్రదించిన మీడియా ప్రతినిధులతో ‘నేను ఇంట్లోనే ఉన్నాను.. ఎవరిని కలవలేదు, ఫిర్యాదులు కూ డా చేయలేదు’ అని మురళి స్పష్టం చేశారు. ఇవన్ని జరుగుతున్న సమయంలోనే మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్పై ప్రభుత్వం వేటు వేయడం, బుధవారం హనుమకొండకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని ఆమె కలవకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. వరుస వేట్లతో కలకలం.. అధికారుల మితిమీరినతనంపై చర్యల్లో భాగంగా ప్రభుత్వం.. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ పరి ధిలోని ఇద్దరు అధికారులపై వేటు వేసింది. వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ తూర్పులో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. నాయకుల బర్త్డే వేడుకలు జరపడం.. ఏ హోదా లేకున్నా ఎస్కార్టు ఇవ్వడంతోపాటు ఇతర కారణాలను చూపుతూ ఆయనపై ప్రభుత్వం బదిలీవేటు వేసింది. నందిరాంనాయక్ స్థానంలో ఐపీఎస్ అధికారి శుభం ప్రకాశ్ నాగర్లేకు ఏసీపీ బాధ్యతలు ఇచ్చారు. తాజాగా మంత్రి సురేఖ పేషీలో ఓఎస్డీగా పనిచేసే సుమంత్ను ఆ పదవినుంచి ప్రభుత్వం మంగళవారం తప్పించింది. 2023 డిసెంబర్నుంచి ఈ పదవీ బాధ్యతలు చూస్తున్న సుమంత్ అభివృద్ధి పనుల్లో మితిమీరిన జోక్యం.. ఇటీవల మేడారం పనుల వివాదానికి కూ డా కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. స్వయంగా సీఎం విచారణకు ఆదేశించి.. ఆరోపణలు నిజమేనని తేలడంతో వేటు వేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు ఘటనలు కొండా దంపతులు ప్రమేయం లేకుండా జరిగాయన్న ప్రచారం ఉండగా.. బుధవారం సీ ఎం పర్యటనకు హాజరు కాకపోవడంపైనా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. చాలా ఏళ్లుగా ఎమ్మె ల్యే దొంతి మాధవరెడ్డితో కొండా దంపతులకున్న రాజకీయ విబేధాలు, వైరం కారణంగానే సీఎం పర్యటనకు సురేఖ దూరంగా ఉన్నారని వారి అనుచరులు చెబుతున్నారు. కాగా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా మంత్రులు, కొందరు ఎమ్మెల్యేల మధ్య నెలకొ న్న అంతర్గత విభేధాలు, కుమ్ములాటలకు చెక్ పెట్టే దిశగా పార్టీ, ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఐదారు రోజుల్లో సమగ్ర నివేదికలు ఇవ్వాలన్న ఆదేశాల మేరకు నిఘావర్గాలు రంగంలోకి దిగి ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఓరుగల్లు కాంగ్రెస్లో తారస్థాయికి మంత్రుల మధ్య విబేధాలు వైరల్గా మారిన మంత్రి పొంగులేటిపై ఫిర్యాదుల ప్రచారం వివాదాస్పదంగా కొండా దంపతుల వ్యాఖ్యలు... సీరియస్గా తీసుకుంటున్న ప్రభుత్వం మొన్న ఏసీపీ, నేడు ఓఎస్డీ.. వేటు వేయడంపై దుమారం ముఖ్యమంత్రి పర్యటనకు దూరంగా కొండా దంపతులు జిల్లా రాజకీయాలపై ఇంటెలిజెన్స్ వర్గాల ఆరా...? -
మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు
● జిల్లా సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు మహబూబాబాద్ రూరల్ : ‘మక్కకు మద్దతేది’ శీర్షికన ఈ నెల 7వ తేదీన ప్రచురితమైన కథనానికి జిల్లా సహకార శాఖ అధికారులు స్పందించారు. ఇందులో భాగంగా జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఎనిమిది ప్రాంతాల్లో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని జిల్లా సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ధన్నసరి పీఏసీఎస్ పరిధికిలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్, కేసముద్రం పీఏసీఎస్ పరిధికి సంబంధించి విలేజి కేసముద్రంలో, గూడూరు పీఏసీఎస్ ఆధ్వర్యంలో గూడూరు మండల కేంద్రంలో, మహబూబాబాద్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో, బయ్యారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో బయ్యారం మండల కేంద్రంలో, గార్ల పీఏసీఎస్ ఆధ్వర్యంలో గార్ల మండల కేంద్రంలో, కొత్తగూడ పీఏసీఎస్ ఆధ్వర్యంలో పొగుళ్లపల్లి గ్రామంలో, తొర్రూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో తొర్రూరు మండల కేంద్రంలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన ఆదేశాలురాగానే మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని తెలిపారు. -
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
–8లోuనర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి దొంతి కాంతమ్మకు బుధవారం సీఎం రేవంత్రెడ్డి నివాళులర్పించారు. కాజీపేట ప్రశాంత్ నగర్ సమీపంలోని పీజీఆర్ గార్డెన్లో మాత యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించగా సీఎంతోపాటు మంత్రులు, ఉమ్మడిజిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ముందుగా కాంతమ్మ చిత్రపటం వద్ద పూలు చల్లి మాధవరెడ్డిని పరామర్శించారు. అంతకుముందు సీఎంకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. – సాక్షిప్రతినిధి, వరంగల్ మహబూబాబాద్: ఖరీఫ్ ధాన్యం కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు సంబంధిత అధికారులను ఆదేఽశించారు. బుధవారం వారు హైదరాబాద్ నుంచి మంత్రి వాకాటి శ్రీహరి, సీఎస్ రామకృష్ణారావుతో కలిసి ధాన్యం కొనుగోలు తదితర విషయాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలన్నారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్, అదనపు కలెక్టర్ అనిల్కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు ధాన్యం కొనుగోలు కేంద్రాల విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అధికారులను హెచ్చరించారు. మంత్రులతో వీడి యో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అౖద్వైత్కుమార్ సింగ్ కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో కొనుగోళ్లపై సమావేశం నిర్వహించారు. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. గన్ని బ్యాగులు, టార్పాలిన్లు, ఇతరత్రా అన్ని అందుబాటులో ఉంచుకోవాలని చెప్పా రు. జిల్లాలో ఐకేపీ 59, పీఏపీఎస్ 168, జీసీసీ 13, మెప్మా 2 మొత్తం 242 కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్లు పేర్కొన్నారు. కేంద్రాల వద్ద రైతుల కోసం తాగునీరు, వైద్యశిబిరాలు, తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. సమావేశంలో డీసీఓ వెంకటేశ్వర్లు, డీసీఎస్ఓ ప్రేమ్కుమార్, సివిల్ సప్లయీస్ డీఎం కృష్ణవేణి, డీఏఓ విజయనిర్మల, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు ఉత్తమ్, తుమ్మల కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ -
ఎమ్మెల్యే ‘దొంతి’కి మంత్రి శ్రీధర్బాబు పరామర్శ
నర్సంపేట: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సోమవారం రాత్రి పరామర్శించారు. ఎమ్మెల్యే మాధవరెడ్డి తల్లి దొంతి కాంతమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా మంత్రి శ్రీధర్బాబు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కేఆర్.నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, పీసీసీ కార్యదర్శి గాజర్ల అశోక్కుమార్గౌడ్, తదితరులు పాల్గొన్నారు. అలాగే, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మంగళవారం వేర్వేరుగా కాంతమ్మ చిత్ర పటం వద్ద నివాళులర్పించి ఎమ్మెల్యే మాధవరెడ్డిని పరామర్శించారు. -
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఖిలా వరంగల్ : పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, పేదింటి ఆడపిల్లల పెళ్లికి ప్రభుత్వం అందించే ఆర్థిక చేయూతను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈమేరకు మంగళవారం వరంగల్ 35వ డివిజన్ శివనగర్లోని సాయి కన్వెన్షన్ హాల్లో తహసీల్దార్లు శ్రీకాంత్, ఇక్బాల్ అధ్యక్షతన వరంగల్, ఖిలా వరంగల్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అలాగే, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తూర్పు నియోజకవర్గంలో ప్రతీ ఇంటికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. తూర్పులో 500 మందికి పైగా లబ్ధిదారులకు రూ.5,30,61,480 విలువైన కల్యాణాలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, రూ.35,37,700 విలువైన సీఎ రిలీఫ్ ఫండ్ చెక్కులతోపాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు ధ్రువ పత్రాలు అందజేశామని తెలిపారు. డీఆర్ఓ విజయలక్ష్మి, బల్దియా ఉప కమిషనర్ ప్రసన్నా రాణి, కార్పొరేటర్లు సోమిశెట్టి ప్రవీణ్, వేల్పుగొండ సువర్ణ, బైరబోయిన ఉమ, పోశాల పద్మ, చింతాకుల అనిల్, దిడ్డి కుమారస్వామి, కావేటి కవిత, పల్లం పద్మ, గుండు చందన ,నాయకులు శామంతుల శ్రీనివాస్, గోపాల నవీన్రాజు, మీసాల ప్రకాశ్ పాల్గొన్నారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ -
మల్లేశ్ అంత్యక్రియలు పూర్తి
దేవరుప్పుల : రిమాండ్ ఖైదీ వారాల మల్లేశ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. జైళ్ల శాఖ నిబంధనల మేరకు మంగళవారం పోస్టుమార్టం పూర్తి చేసిన అనంతరం మృతదేహాన్ని పోలీసుల నిఘాలో స్వగ్రామం సింగరాజుపల్లికి తరలించి అదేరోజు సాయంత్రం అంత్యక్రియలు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లికి చెందిన వారాల మల్లేశ్కు ఇదే గ్రామానికి చెందిన మిత్రుడు పడకంటి బ్రహ్మచారితో సరదాగా గొడవ జరిగింది. ఇందులో కర్ర తగిలి బ్రహ్మచారి చేయి విరిగింది. ఈ విషయమై పీఎస్లో కేసు నమోదు కాగా హాస్పిటల్ నివేదిక ఆధారంగా మల్లేశ్ను కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించింది. దీంతో మనస్తాపానికి గురైన మల్లేశ్ జనగామ సబ్ జైలులో బ్లీచింగ్ పౌడర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల వ్యూహాత్మకంతో ప్రశాంతంగా అంత్యక్రియలు.. రిమాండ్ ఖైదీ మల్లేశ్ ఆత్మహత్య తీరుపై గ్రామస్తులు కోపోద్రిక్తులై ఇప్పటికే జనగామ జైలు ఎదుట ఆందోళన చేపట్టిన విషయం విధితమే. ఈ తరుణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసుల వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో మల్లేశ్అంత్యక్రియలు ప్రశాంతంగా ముగిశాయి. వరంగల్ ఎంజీఎంలో ఉస్మానియా, గాంధీ, వరంగల్ కేఎంసీ వైద్య బృందం పర్యవేక్షణలో పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం జనగామ సీఐ సత్యనారాయణ రెడ్డి పర్యవేక్షణలో మల్లేశ్ మృతదేహాన్ని జనగామ మీదుగా కాకుండా ఇతర మార్గాల ద్వారా సింగరాజుపల్లికి తరలించగా కుటుంబీకులు అంత్యక్రియలు పూర్తి చేశారు. పాలకుర్తి సీఐ జానకీరామిరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ఎలాంటి ఆందోళనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. హైమా కుటుంబాన్ని ఆదుకునేది ఎవరు? మల్లేశ్ ఆత్మహత్యతో హైమ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్న మల్లేశ్, హైమా దంపతులకు ఇప్పటికే ఇద్దరు కూతుళ్లు కాగా ప్రస్తుతం హైమా మరోసారి గర్భం దాల్చింది. ఈ క్రమంలో మల్లేశ్ ఆత్మహత్యతో ఆ కుటుంబాన్ని ఆదుకునేది ఎవరని బంధువులు, గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం, అధికారులు స్పందించి హైమా కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ఇప్ప వీరారెడ్డి, సింగారపు రమేశ్, తదితరులు డిమాండ్ చేశారు. పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి మృతదేహం తరలింపు పోలీసుల నిఘాలో ముగిసిన దహన సంస్కారాలు -
బలపాల పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ
కురవి: మండలంలోని బలపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఔట్పేషెంట్ విభాగాన్ని సందర్శించి రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. పరిష్కారం కోసం సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం రికార్డులను పరిశీలించి, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సేవా ధోరణి, రికార్డు ల నిర్వహణ, ఔషధాల సరఫరా, శుభ్రత, వ్యాధి నివారణ చర్యలపై సమీక్ష జరిపారు. పీహెచ్సీకి వచ్చే రోగులతో మర్యాదగా, సేవాభావంతో వ్యవరించాలని ఆదేశించారు. పరిశుభ్రత, ల్యాబ్ సేవలు, మాతా,శిశు ఆరోగ్య సేవలు, వ్యాక్సినేషన్, ప్రజా ఆరోగ్య కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు. జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) కార్యక్రమాలను సమగ్రంగా అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక పీహెచ్సీ వైద్యాధికారిణి స్రవంతి, అనిల్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా..
నర్సంపేట రూరల్ : తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసి రి మాండ్కు తరలించినట్లు నర్సంపేట ఏసీపీ రవీందర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం నర్సంపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహబూ బాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మహ్మద్ ఇమ్రాన్, ఆర్టీసీ కాలనీకి చెందిన మాదాసు నవీన్, మాదాసు భార్గవి, భద్రాద్రికొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం కొండైగూడెం గ్రామానికి చెందిన కుంజా విజయ, పాల్వంచకు చెందిన బత్తుల రాజేశ్వరి ముఠాగా ఏర్పడి తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు. సెప్టెంబర్ 20న పాకాల సెంటర్లోని తాళం వేసి ఉన్న షాపులో నగలు అపహరించారు. అలాగే, ఆగస్టులో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రామాలయం దగ్గర రైల్వే క్వార్టర్స్లోని ఓ ఇంట్లో, అదే నెల రెండో వారంలో ఖానా పురం మండలం బుధరావుపేటలోని ఓ ఇంట్లోకి చోరీకి పాల్ప డ్డారు. అనంతరం అపహరించిన బంగారు, వెండి వస్తువులను విక్రయించేందుకు మహబూబాబాద్ నుంచి నర్సంపేట మీదుగా వరంగల్ వెళ్తున్నారు. ఇందులో మహమ్మద్ ఇమ్రాన్ ద్విచక్రవాహనంపై, మిగతా నలుగురు ఆటోలో వెళ్తున్నారు. ఈ సమయంలో వీరిపై అనుమానం కలగడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నారు. దీంతో వారి వద్ద నుంచి మొత్తం రూ. 4 లక్షల 30 వేల విలువైన ద్విచక్రవా హనం, ఆటో, 5 సెల్ఫోన్లు, బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని ఏసీపీ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సైలు రవికుమార్, గూడ అరుణ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్ట్ బంగారం, వెండి ఆభరణాలు, ఆటో, బైక్ స్వాధీనం వివరాలు వెల్లడించిన పోలీసులు -
బాలికలకు భరోసా..
విద్యారణ్యపురి : 2025–2026 విద్యాసంవత్సరంలో పీఎంశ్రీ పాఠశాలల్లో ఇక బాలికల సాధికారత, కౌమార దశ భద్రతాక్లబ్లు ఏర్పాటుచేసుకోవాల్సి ఉంటుంది. ఈమేరకు సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్నికోలస్ సంబంధిత జిల్లావిద్యాశాఖాఽధికారులను ఇటీవల ఆదేశించారు. దీంతో ఉమ్మడివరంగల్ జిల్లాలోని హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, ములుగు, జయశంకర్భూపాలపల్లి జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల్లో బాలికల సాధికారత, కౌమారదశ భద్రతాక్లబ్లు ఏర్పాటుచేయబోతున్నారు. ఈ క్లబ్ల ముఖ్య ఉద్దేశం ● బాలికలకు కౌమారదశలో ఆరోగ్యం, హైజిన్, లైంగిక అంశాలపై అవగాహన కల్పించడం. ● ఆర్థిక, న్యాయ,సైబర్ భద్రత, డ్రగ్స్, మానసిక ఆరోగ్యం, కేరీర్పై విద్యార్థినులకు శిక్షణ ● పాఠశాలల్లో ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ ఏర్పాటు, పోలీస్ లింకేజీతో బాల్యవివాహాలు, సైబర్ సమస్యలను గుర్తించి నివేదిక ఇవ్వడం లాంటి అంశాలు క్లబ్లు చేయాల్సి ఉంటుంది. కౌమారదశ భద్రత క్లబ్ నిర్మాణం.. ● జిల్లాల్లోని పీఎంశ్రీ పాఠశాలలో క్లబ్ నిర్మాణం ఇలా ఉంటుంది. ప్రతీతరగతి నుంచి ఇద్దరు విద్యార్థులు, (బాలుడు, బాలిక), ఒక మహిళా, ఒక పురుష ఉపాధ్యాయులు గైడ్గా ఉంటారు ● హెడ్మాస్టర్ క్లబ్చైర్మన్గా, స్థానిక పోలీస్కానిస్టే బుల్ బాహ్యసభ్యుడుగా ఉంటారు. ప్రతీపాఠశాలలో 14నుంచి 16 మంది సభ్యులు ఉండేలా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. పీఎంశ్రీపాఠశాలలో గ్రీవెన్స్బాక్స్లు పీఎంశ్రీపాఠశాలల్లో గ్రీవెన్స్బాక్స్లు ఏర్పాటుచేయాల్సింటుంది. బాలికల కోసం ప్రత్యేకంగా ఫిర్యాదులకు ఒకబాక్స్, సాధారణ ఫిర్యాదులకోసం మరొ బాక్స్ను ఏర్పాటు చే స్తారు. వేధింపులు, చైల్డ్ మ్యారేజ్, సైబర్మోసం వంటి సమస్యలను నివారించేందు కుగాను చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. క్లబ్ల ఏర్పాటు నేటినుంచి అమలులోకి.. పీఎంశ్రీస్కూళ్లలో ఈ క్లబ్ల ఏర్పాటు ఈనెల 15నుంచి అమలులోకి తీసుకురానున్నారు. నెలవారీగా ఏయే కార్యక్రమాలు చేపట్టాలనేది పలు అంశాలు ఉన్నాయి. అక్టోబర్లో బాలల లైంగిక దుర్వినియోగం, ఆరోగ్యం, ఆర్థిక సాక్షరతపై అవగాహన కల్పిస్తారు. నవంబర్లో న్యాయసాక్షరత, సైబర్ భద్రత, స్వీయరక్షణ, డిసెంబర్లో మానసిక ఆరోగ్యం, 2026 జనవరిలో జీవన నైపుణ్యాలు, బాల్యవివాహాలు, నేషనల్ గర్ల్స్ చైల్డ్డే పై అవగాహన కల్పిస్తారు. ఫిబ్రవరిలో కేరీర్ మార్గనిర్దేశంపై అవగాహన కల్పిస్తారు. పలు అంశాలు ఆన్లైన్లోకూడా సెషన్లు టీసాట్ ద్వారా నిర్వహిస్తారు. ఇందుకు కూడా షెడ్యూల్ ప్రకారం కొనసాగనుంది. తెలంగాణ రాష్ట్రంలో 658 పీఎంశ్రీ స్కూళ్లలో బాలికల భద్రత సురక్షిత వాతావరణం, సఫలీకరణకు దోహదపడే గర్ల్స్ చైల్డ్ ఎంపవర్మెంట్, అడోలోసెంట్ సేఫ్ట్టీ క్లబ్స్ (సీజీఈఏఎస్సీఎస్ ) ఏర్పాటుచేస్తారు. ప్రతీ పీఎంశ్రీ పాఠశాలకు రూ.15వేలు బాలకలసాధికారత, బాలికల కౌమారదశభద్రతాక్లబ్లను ఏర్పాటుచేస్తున్న ఆయాపీఎంశ్రీ పాఠశాలలకు ఒక్కో పాఠశాలకు రూ. 15వేల చొప్పున మంజూరు చేశారు.ఆయానిధులు ఎలా వినియోగించుకోవాలో కూడా ఆయాపాఠశాలల హెచ్ఎంలకు సమాచారం అందించారు. ఈనెల 15వరకు క్లబ్ ఏర్పాటు నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. పీటీఎం సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చించాల్సింటుంది. కలెక్టర్ ఆధ్వర్యంలో లైన్ డిపార్టుమెంట్లతో సమన్వయం జరగాల్సి ఉంటుంది. జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్, లింగసమానత్వం కోఆర్డినేటర్ పర్యవేక్షిస్తారు. ఈ క్లబ్ల నిర్మాణం జరిగే పీఎం శ్రీ స్కూళ్ల సంఖ్య జిల్లాల వారీగా ఇలా జిల్లా పాఠశాలల సంఖ్య హనుమకొండ 13 వరంగల్ 14 జనగామ 15 మహబూబాబాద్ 21 ములుగు 08 జయశంకర్ భూపాలపల్లి 07 పీఎంశ్రీ స్కూళ్లలో విద్యార్థినుల సాధికారత, కౌమారదశ భద్రతాక్లబ్లు ఏర్పాటు ఒక్కో పాఠశాలకు రూ. 15 వేల చొప్పున మంజూరు నేటి నుంచి అమలుకు ఉపక్రమణ -
వరంగల్కు నేడు సీఎం రేవంత్
● మధ్యాహ్నం 1 గంటకు హనుమకొండకు ● 2 గంటలకు తిరుగు పయనం ● ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని పరామర్శించనున్న సీఎంసాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బుధవారం వరంగల్ నగరానికి రానున్నారు. కాజీపేటలోని పీజీఆర్ గార్డెన్స్లో జరిగే నర్సంపేట శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ను విడుదల చేశారు. సీఎం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్లోని తన నివాసంనుంచి డాక్టర్ ఎంసీఆర్హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్ హెలిపాడ్కు బయలుదేరుతారు. 12.15 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 1.00 గంటలకు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలోని హెలిపాడ్కు చేరుకుంటారు. అక్కడినుంచి 1.05 గంటలకు కాజీపేట ప్రశాంత్నగర్లోని పీజీఆర్ గార్డెన్స్కు చేరుకుంటారు. 1.15 – 1.45 గంటల వరకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డిని పరామర్శించి ఆయన తల్లి ‘మాతృయజ్ఞం’ కార్యక్రమంలో పాల్గొంటారు. 1.45 గంటలకు పీజీఆర్ గార్డెన్నుంచి బయలుదేరి 2.00 గంటలకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరుగుపయనమవుతారు. భద్రతా ఏర్పాట్ల పరిశీలన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, పీజీఆర్ గార్డెన్స్ ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ బృందాలతో తనిఖీలు నిర్వహించారు. సీపీవెంట జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, రెవెన్యూ అధికారి వైవీ గణేష్, ఏసీపీలు పింగిళి ప్రశాంత్రెడ్డి, సత్యనారాయణ తదితరులు ఉన్నారు. -
తూతూమంత్రంగా క్రీడా పోటీలు
మహబూబాబాద్ అర్బన్: విద్యార్థులు ఆటల్లో రాణించాలంటే సరైన ప్రోత్సాహం ఉండాలి. అప్పుడే గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగి ప్రతిభ చూపేందుకు ఆస్కారం ఉంటుంది. ఈమేరకు ప్రభుత్వం ఏటా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) క్రీడా పోటీలను నిర్వహిస్తోంది. కాగా కరోనా కారణంగా మూడేళ్ల పాటు విద్యార్థులు క్రీడా ఎంపిక పోటీలకు దూరమయ్యారు. అయితే 2023–24 విద్యా సంవత్సరం నుంచి పాఠశాల స్థాయి క్రీడల నిర్వహణలో ఎస్జీఎఫ్ కమిటీ సభ్యులు, పీడీలు పూర్తిగా విఫలం చెందారు. తూతూ మంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు పాఠశాల స్థాయిలో కూడా క్రీడా పోటీలు నిర్వహించలేదు. క్యాలెండర్ ప్రకారం క్రీడల నిర్వహణలో విఫలం.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు క్యాలెండర్ ప్రకారం క్రీడల నిర్వహణలో విఫలమవుతున్నారు. జిల్లాలో 102 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా.. 15,497 మంది చదువుతున్నారు. అలాగే ఎనిమిది మోడల్ స్కూళ్లలో 4,749 మంది విద్యార్థులు, 16 కేజీబీవీల్లో 3,243 మంది, ఆరు సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో 3,055మంది, ఐదు ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో 2,898 మంది, ఏడు బీసీ వెల్ఫేర్ గురుకులాల్లో 3,569 మంది, ఐదు మైనార్టీ గురుకులాల్లో 1,108 మంది, ఐదు ట్రైబల్ ఈఎంఆర్ఎస్ గురుకులాల్లో 1,978 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్ 17,19 విభాగాల్లో ఆటల పోటీలు నిర్వహిస్తారు. కాగా, విద్యార్థులకు ఆగస్టు మొదటి, రెండో వారం వరకు మండల స్థాయిలో క్రీడా ఎంపిక పోటీలు పూర్తి చేయాలి. ఆగస్టు మూడోవారంలో జోనల్ స్థాయి, సెప్టెంబర్ రెండోవారంలో జిల్లా స్థాయిలో పూర్తి చేయాలి. సెప్టెంబర్ నాలుగో వారంలో రాష్ట్రస్థాయిలో పూర్తి చేసి, జాతీయ స్థాయి పోటీలకు పంపించాలి. అయితే అక్టోబర్ రెండో వారం గడుస్తున్నా ఎస్జీఎఫ్ పాఠశాల స్థాయి క్రీడలు నిర్వహించడం లేదు. దీంతో క్రీడాకారులు క్రీడలపై పట్టు కోల్పోతున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో జిల్లా క్రీడాకారులు రాణించలేకపోతున్నారు. ఎస్జీ ఎఫ్ కమిటీ సభ్యులు, జిల్లాలోని పీడీల నిర్లక్ష్యం వల్లే క్రీడా ఎంపిక పోటీలు నిర్వహించడం లేదని, ఒకవేళ నిర్వహిస్తే తూతూమంత్రంగా చేపడుతున్నారని పలువురు సీనియర్ క్రీడాకారులు వాపోతున్నారు. ఇప్పటికై నా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి క్యాలెండర్ ప్రకారం పాఠశాల స్థాయిలో ఎస్జీఎఫ్ క్రీడలు నిర్వహించాలని తల్లిదండ్రులు, సీనియర్ క్రీడాకారులు కోరుకుంటున్నారు. పాఠశాల స్థాయి నుంచి క్రీడా ఎంపికలు నిర్వహించాలి క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నాయి. పీడీలు పీఈటీలు విద్యార్థులకు పాఠశాల స్థాయినుంచే క్రీడా ఎంపికలు నిర్వహించాలి. ప్రస్తుతం జిల్లాలో ఎంపికలు నిర్వహించకుండానే నేరుగా జిల్లా స్థాయికి పాత క్రీడాకారులను తీసుకువచ్చి పోటీలు నిర్వహిస్తున్నారు. దీంతో జిల్లా క్రీడాకారులకు సాధన లేక వెనుకబడి పోతున్నారు. నూతన విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహిస్తే జాతీయస్థాయిలో రాణిస్తారు. – పద్మావతి, రిటైర్డ్ పీడీ, మానుకోట ● ఎస్జీఎఫ్ క్రీడా ఎంపిక పోటీల నిర్వహణలో నిర్లక్ష్యం ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు ఊసేలేదు పాఠశాల, మండల, జోనల్స్థాయిలో పోటీలు కరువు పట్టించుకోని విద్యాశాఖ అధికారులు -
పంట మార్పిడిపై అవగాహన కల్పించాలి
● వరంగల్ ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ ఆర్.ఉమారెడ్డి మహబూబాబాద్ రూరల్ : పంటల సరళీకరణ, పంట మార్పిడిపై రైతులకు కేవీకే శాస్త్రవేత్తలు అవగాహన కల్పించాలని వరంగల్ ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ ఆర్.ఉమారెడ్డి అన్నారు. మహబూబాబాద్ మండలంలోని మల్యాల కృషి విజ్ఞాన కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. కేవీకేలో నిర్వహిస్తున్న వివిధ శిక్షణ, అవగాహన కార్యక్రమాలు, క్షేత్ర దినోత్సవాల గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో వ్యవసాయ విస్తీర్ణం, పత్తిలో సగటు దిగుబడి, మిరప సాగు తగ్గడానికి కారణాలు, వరి, మొక్కజొన్న, జొన్న, పత్తి, వివిధ నూనె, పప్పు దినుసు పంటల సాగు వివరాలు అడిగి, జిల్లాలో సాగవుతున్న పంటల పరిస్థితులను గురించి ఆరాతీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారులు అంతర పంటల సాగు, పంట అవశేషాలను కలియదున్నడం, జీవన, రసాయన ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. యాసంగిలో నాణ్యమైన విత్తనంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్శనలో మల్యాల కేవీకే సమన్వయకర్త డాక్టర్ దిలీప్ కుమార్, శాస్త్రవేత్తలు క్రాంతికుమార్, సుహాసిని తదితరులు పాల్గొన్నారు. -
దీప్తి.. ఘనకీర్తి
● మరో గోల్డ్ మెడల్ సాధించిన భారత పారా అథ్లెట్ పర్వతగిరి: ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో జరుగుతున్న విర్ట్చూస్ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్–2025లో వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన పారా అథ్లెట్ జివాంజీ దీప్తి మరో గోల్డ్ మెడల్ సాధించారు. ఇటీవల టీ–20 విభాగంలో 400మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించగా, మంగళవారం జరిగిన 200మీటర్లపరుగు పందెంలో మరో గోల్డ్ మెడల్ సాధించింది. దీప్తి పలు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. దీనిపై తల్లిదండ్రులు, గ్రామస్తులు క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. బీసీ జేఏసీ ఉమ్మడి జిల్లా చైర్మన్గా వేణుగోపాల్ గౌడ్ హన్మకొండ: తెలంగాణ స్టేట్ బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్గా వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ను నియమించినట్లు ఆ జేఏసీ రాష్ట్ర కార్యనిర్వాహక చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బీసీ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న హనుమకొండ నయీంనగర్కు చెందిన వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ను ఈ పదవిలో నియమిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు. కాగా, బీసీలను రాజకీయంగా ఎదగకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అడ్డుకుంటున్న వారికి తగిన బుద్ధి చెబుతామని వేణుగోపాల్ గౌడ్ అన్నారు. తనను ఈ పదవిలో నియమించిన జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్య, కార్యనిర్వాహక చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ నారగోని, కోచైర్మన్లు రాజారాం యాదవ్, దాసు సురేశ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ గౌడ్కు కృతజ్ఞతలు తెలిపారు. పాత ఫీజులనే కొనసాగిస్తాం ● రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం కేయూ క్యాంపస్ : గత విద్యాసంవత్సరంలోని కామన్ సర్వీస్, పరీక్ష ఫీజులనే కొనసాగిస్తామని కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. కేయూ పరిధిలో 2025–26 విద్యాసంవత్సరానికి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ కోర్సుల (నాన్ ప్రొఫెషనల్) కామన్ సర్వీస్, పరీక్ష ఫీజులను పెంపుదలపై వివిధ విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో 2024–25లో ఉన్న ఫీజులనే కొనసాగిస్తామన్నారు. యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపా ళ్లు తమ కళాశాలల విద్యార్థులకు కూడా తెలియజేయాలని రిజిస్ట్రార్ కోరారు. చేపల వల కాలికి తట్టుకొని యువకుడి మృతి గార్ల : కాలికి చేపల వల తట్టుకొని చెరువులో పడి ప్రమాదవశాత్తు ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం మహబూబాబాద్ జిల్ల గార్ల మండలం గోపాలపురంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కాంపాటి ఉపేందర్ (32), అదే గ్రామానికి చెందిన నర్సయ్యతో కలిసి సమీపంలోని అప్పసముద్రం చెరువులో రాత్రివేళ చేపల వేటకు వెళ్లారు. అయితే ఇద్దరిలో నర్సయ్య ఒక్కడే ఇంటికి వచ్చి నిద్రించాడు. ఉదయమైనా ఉపేందర్ ఇంటికి రాకపోవడంతో మృతుడి తల్లి కోటమ్మ కుటుంబ సభ్యులతో కలిసి చెరువులో గాలించగా, ఉపేందర్ శవమై కనిపించాడు. మృతుడి కాళ్లకు చేపల వల చుట్టుకొని చనిపోయి ఉన్నాడు. మృతుడితో కలిసి వెళ్లిన నర్సయ్యను పోలీసులు స్టేషన్కు పిలిచి విచారించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని మృతుడి తల్లి ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్కే రియాజ్పాషా తెలిపారు. -
బడికి వెళ్లాలంటే.. బురద దాటాలి
● పాఠశాలలో కనీస మౌలిక వసతులు కరువు ● విద్యార్థులు, ఉపాధ్యాయుల అవస్థలుమరిపెడ రూరల్: చదువుతోనే సమాజంలో గుర్తింపు వస్తుంది. విద్యతోనే ఉన్నత శిఖరాలు చేరుకునే అవకాశం ఉంది. అలాంటి విద్యాబుద్ధులు నేర్చుకునే పాఠశాలకు కనీస రహదారి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు బురద రోడ్లపై నుంచి వెళ్లాల్సి దుస్థితి నెలకొంది. మరిపెడ మండలంలోని వీరారం గ్రామ రెవెన్యూ పరిధి అజ్మీరాతండా గ్రామ పంచాయతీ శివారు జీన్యతండా ప్రాథమిక పాఠశాలలో 17 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. కాగా తండా శివారులో ఉన్న పాఠశాలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు బురద రోడ్లు, చెట్ల పొదల నుంచి అవస్థలు పడుతూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాలు కురుస్తుండడంతో పిల్లలు జారీ బురదలో పడిపోతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ నిధుల ద్వారా పాఠశాలలో మరుగుదొడ్లు, ప్రహరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే మరుగుదొడ్లను సగం వరకు నిర్మించి మధ్యలో నిలిపివేశారు. కాగా, అధికారులు స్పందించి పాఠశాలలో కనీస మౌలిక వసతులు కల్పించాలని, రోడ్డు బాగుచేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, జీన్యతండా గిరిజన ప్రజలు కోరుతున్నారు. -
కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి
● పారదర్శకంగా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక ● ఏఐసీసీ పరిశీలకుడు దెబాసిస్ పట్నాయక్ జీ మహబూబాబాద్ రూరల్: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఏఐసీసీ పరిశీలకుడు దెబాసిస్ పట్నాయక్ జీ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం డీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశం నిర్వహించి, ఆశావహుల నుంచి దరఖాస్తులు, పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా దెబాసిస్ పట్నాయక్ జీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శ్రమించి బీఆర్ఎస్ అవీనితి, కుటుంబ పాలనను తరిమికొట్టారన్నారు. సామాజిక న్యాయం పాటించి, ఆశావహుల పేర్లను ఢిల్లీకి పంపిస్తామని తెలిపారు. పార్టీ కార్యకర్తల అభీష్టం మేరకే డీసీసీ అధ్యక్షుడి నియామకం జరుగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే వారికి పదవులు దక్కుతాయని, క్షేత్ర స్థాయిలో కార్యకర్తల అభిప్రాయ సేకరణ కోసమే తాము ఇక్కడికి వచ్చామని వెల్లడించారు. పారదర్శకంగా, నిస్పక్షపాతంగా, ప్రజాస్వామ్యయుతంగా డీసీసీ అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందని తెలిపారు. ఎన్నికై న డీసీసీ అధ్యక్షుడు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ పటిష్టత కోసం పనిచేయాలని సూచించారు. సమావేశంలో టీపీసీసీ పరిశీలకులు ఇందిరారావు, అవేజ్, శ్రీకాంత్, అరుణ్ కుమార్, షాద్నగర్, మానుకోట ఎమ్మెల్యేలు శంకర్, మురళీనాయక్, డీసీసీ అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి, సంవిధాన్ బచావో కమిటీ సభ్యుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డి, టీపీసీసీ ఓబీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల వీరన్నయాదవ్, నాయకులు ఘనపురపు అంజయ్య, గుగులోత్ దస్రునాయక్, అజ్మీరా సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
అథ్లెట్లకు అసౌకర్యం కలగొద్దు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా మూడు రోజులపాటు జరుగనున్న జాతీయస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్నకు హాజరయ్యే క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు అండర్–23 నేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ జరుగనున్న నేపథ్యంలో మంగళవారం ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి, మేయర్ సుధారాణి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ స్టేడియంలో ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు వెయ్యి మంది అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ మీట్ను విజయవంతంగా పూర్తి చేయాలని, క్రీడాకారులకు తాగునీరు, వైద్యం, పరిశుభ్రత, లైటింగ్ తదితర సౌకర్యాలను కల్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రబెల్లి వరదరాజేశ్వర్రావు, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్, ఎంహెచ్ఓ రాజిరెడ్డి, ఈఈ రవీందర్, డీఈ సారంగం, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి 16 నుంచి జాతీయస్థాయి అథ్లెటిక్స్ మీట్ జేఎన్ఎస్ను పరిశీలించిన ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్ -
అన్మ్యాన్డ్ వర్కర్ కుటుంబానికి ఆర్థిక సాయం
హన్మకొండ: విధి నిర్వహణలో ప్రాణం కోల్పోయిన టీజీ ఎన్పీడీసీఎల్ అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ గట్ల కరుణాకర్ రెడ్డి కుటుంబానికి ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. మహబూబాబాద్ మండలం ఈదులపూసలపల్లి గ్రామానికి చెందిన అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ గట్ల కరుణాకర్ రెడ్డి విధి నిర్వహణలో ప్రాణం కోల్పోయాడు. కాగా, మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో కరుణాకర్ రెడ్డి భార్య ప్రియాంకకు సీఎండీ రూ. 20 లక్షల బీమా చెక్కు అందించారు. కార్యక్రమంలో ఫైనాన్స్ డైరెక్టర్ వి.తిరుపతి రెడ్డి, న్యూఇండియా ఎష్యు రెన్సు కంపెనీ హనుమకొండ డివిజినల్ ఆఫీస్ సీనియర్ డివిజనల్ మేనేజర్ నాగభట్ల జ్యోతిర్మయి, మార్కెటింగ్ మేనేజర్ రాజేశ్, కాంట్రాక్టర్ సైదులు, తదితరులు పాల్గొన్నారు. -
మక్క రైతులకు తేమ కష్టాలు..
కేసముద్రం: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామంటే రైతులకు గోస తప్పడంలేదు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు రైతులు వారం కిత్రం మక్కలను తీసుకొచ్చారు. అయితే మక్కలలో తేమ ఉందని, తాము కొనుగోలు చేయలేమని వ్యాపారులు తెలపడంతో రైతులు ఓపెన్ యార్డుల్లో ఆరబోసుకున్నారు. తీరా తేమశాతం తగ్గేదశలో సోమవారం కురిసిన వర్షంతో మక్కలు తడిసిముద్దయ్యాయి. దీంతో మంగళవారం ఆరబెట్టుకుంటూ రైతులు ఇబ్బందులు పడ్డారు. ఇదే అదును గా కొందరు వ్యాపారులు ధర తగ్గించి కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారు. రోజుల తరబడి పడిగాపులు పడలేక కొందరు రైతులు వ్యాపారులు పెట్టిన ధర క్వింటాకు రూ.1,800నుంచి రూ.2వేల లోపు అమ్ముకుంటూ నష్టపోతున్నారు. కాగా మంగళవారం 5వేల బస్తాలు అమ్మకానికి రాగా, క్వింటాకు గరిష్ట ధర రూ. 2,176, కనిష్ట ధర రూ.1,829 పలికినట్లు అధికారులు తెలిపారు. -
దూది రైతు దిగాలు
బుధవారం శ్రీ 15 శ్రీ అక్టోబర్ శ్రీ 2025మహబూబాబాద్ రూరల్ : అధిక వర్షాలు రైతన్నలను తీవ్రంగా వేధిస్తున్నాయి. జిల్లాలో కురిసిన వర్షాలతో పత్తి పంటలు దెబ్బతిన్నాయి. పూత, కాత రాలిపోతుండగా.. కాయలు పగిలిన పత్తి మసకబారిపోతోంది. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 85,270 ఎకరాల్లో పంట సాగు చేయగా.. సుమారు 30 నుంచి 35 వేల ఎకరాల్లో పంటకు నష్టం చేకూరినట్లు సమాచారం. 85,270 ఎకరాల్లో సాగు పత్తి పంట సాగు సీజన్ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులు, అనంతరం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కర్షకులను నష్టాలకు గురిచేస్తున్నాయి. జిల్లాలో 85,270 ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాల వల్ల పత్తి పంట పూత, కాత రాలిపోవడంతో పాటు ఎర్రబారుతోంది. వాతావరణంలో వస్తున్న మార్పు ల కారణంగా పత్తి చేలలో తేమ శాతం అధికమై, వర్షపు నీరు నిలిచి తీరని నష్టం జరుగుతోంది. ప్రస్తుతం పూసిన పత్తి అధిక వర్షాలతో నల్లబారుతోంది. కాగా, అధిక వర్షాలతో ఎకరాకు ఐదు క్వింటాళ్ల మేరకు కూడా దిగుబడి వచ్చే అవకాశం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి ఎకరానికి రూ.45 వేల వరకు పెట్టుబడి పెట్టామని, అది కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. దీపావళికి అంతంత మాత్రమే.. ఏటా దసరా పండుగ వరకు కొత్త పత్తి మార్కెట్కు వస్తుంది. అయితే ప్రస్తుతం వర్షాల వల్ల చేలలో ఉన్న పత్తిని రైతులు ఏరలేకపోతున్నారు. వర్షాలు తగ్గితే పత్తిని ఏరి దీపావళి తర్వాత మార్కెట్కు తరలించే అవకాశం ఉంది. అదికూడా తక్కువ మొత్తంలోనే విక్రయానికి వచ్చేలా ఉందని మార్కెట్ అధికారులు భావిస్తున్నారు. పత్తి పంటను ఆశించిన తెగులు అధిక వర్షాలతో పత్తి పంటకు నష్టం జిల్లాలో 85,270 ఎకరాల్లో సాగు చేలల్లో నిలిచిన వర్షపు నీటితో ఎర్రబారుతున్న మొక్కలు అధికంగా రాలుతున్న పూత, కాత ఆందోళన చెందుతున్న కర్షకులు రాలుతున్న పూత, కాత.. భారీ వర్షాల వల్ల భూమిలో తేమశాతం అధికం ఉండడంతో పత్తి పూత, కాత క్రమక్రమంగా రాలిపోతున్నాయి. పత్తి పంటకు రసం పీల్చే పురుగులు, ఆకుముడత, పండాకు తెగులు, తెల్ల దోమ, పచ్చ దోమ, నల్లి వంటి తెగుళ్లు అధికమయ్యాయి. పత్తి పూత, కాత పిందే రాలిపోవడంతో కాయలు పనికి రాకుండా తయారవుతున్నాయి. వ్యవసాయ అధికారులు, కేవీకే శాస్త్రవేత్తల సూచనల మేరకు పంటలకు మందులు పిచికారీ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
90 రోజుల్లో జాతర అభివృద్ధి పనులు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనులను 90 రోజుల్లో పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం మేడారంలోని హోటల్ హరితలో మేడారం అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. మేడారం మహా జాతర సమీపిస్తున్న నేపథ్యంలో తల్లుల గద్దెల పునరుద్ధరణ, అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించామన్నారు. భక్తుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మేడారం ప్రాంతాన్ని శాశ్వతంగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే గద్దెల ప్రాంగణ అభివృద్ధికి ప్రభుత్వం రూ.101 కోట్లు మంజూరు చేసిందని, మరో రూ. 71 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం జంపన్నవాగుకు ఇరువైపులా పది వేల మంది సేదదీరేందుకు షెడ్ల్లు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మేడారంలో అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి పొంగులేటికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సకాలంలో పనులను పూర్తిచేయాలని సూచించారు. గతంలో జంపన్న వాగుపై వంతెన నిర్మాణం కేవలం 45 రోజుల్లో పూర్తయిందని, అదే మాదిరి ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పనులు కూడా నాణ్యతాప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా పూర్తి చేయాలని ఎంపీ పోరిక బలరాం నాయక్ అన్నారు. అంతకుముందు మంత్రులు పొంగులేటి, సీతక్క, ఎంపీ బలరాంనాయక్, కలెక్టర్ దివాకర, ఎస్పీ శబరీశ్.. అమ్మవార్ల గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనులు పరిశీలించారు. కాగా, మంత్రులు పొంగులేటి, సీతక్కను పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు అమ్మవార్ల వస్త్రాలతో సన్మానించి ప్రసాదం అందజేశారు. ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, డీఎఫ్ఓ రాహూల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, ఆర్డీఓ వెంకటేష్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, మేడారం ఈఓ వీరస్వామి పాల్గొన్నారు. అన్ని హంగులతో గద్దెల ప్రాంగణాన్ని ఆధునికీకరిస్తాం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిములుగు: మేడారం సమ్మక్క, సారక్క జాతర అభివృద్ధి పనుల్లో భాగంగా సోమవారం మేడారంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క.. అధికారులతో నిర్వహించిన సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరుకాకపోవడం హాట్ టాపిక్గా మారింది. సొంత శాఖకు చెందిన మంత్రి లేకుండానే సమీక్ష సమావేశం కొనసాగడం చర్చనీయాంశమైంది. 2026 జనవరి 28 నుంచి జరిగే మహాజాతరకు ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది. అయితే తనకు తెలియకుండానే అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నారని, దేవాదాయ శాఖ పనుల్లో మంత్రి శ్రీనివాస్రెడ్డి పాత్ర ఏంటని మంత్రి సురేఖ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. మేడారంలో జరిగిన పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పర్యటనకు, సమీక్ష సమావేశానికి మంత్రి సురేఖ హాజరుకాకపోవడం విభేదాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. కాగా, ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు రావడంతో సకాలంలో మేడారం పనులు పూర్తయ్యేనా అని పలువురు చర్చించుకుంటున్నారు. -
బాలికలకు స్వీయరక్షణలో శిక్షణ
విద్యారణ్యపురి: పీఎంశ్రీ పాఠశాలల్లో అనేక సదుపాయాలు కల్పిస్తున్నారు. ముఖ్యంగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్లు ఏర్పాటవుతున్నాయి. తాజాగా స్వీయ రక్షణ కోసం బాలికలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఒక్కో పాఠశాలకు రూ.30వేలు మంజూరయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో ఎంపిక చేసిన పీఎంశ్రీ స్కూళ్లకు ఈ నిధులు మంజూరయ్యాయి. పీఎంశ్రీ పాఠశాలల్లో చదువుతున్న బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ఈ శిక్షణ ఉండనుంది. శిక్షణ ద్వారా బాలికలు అత్యవసర పరిస్థితుల్లో తమను తాము రక్షించుకునేందుకు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. కుంగ్ఫూ, కరాటే, జూడో, కలరియపట్టు తదితర ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ ఇవ్వనున్నారు. నడ్జెస్, కిక్స్పంచ్ల వంటి ప్రాథమిక శిక్షణ పద్ధతులను నేర్పిస్తారు. ప్రతీ సెషన్లో వార్మప్, నైపుణ్య శిక్షణ, ప్రదర్శన, కూల్డౌన్ భాగాలు ఉంటాయి. ప్రతీ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) ఆధ్వర్యంలో (పర్యవేక్షణ)ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ సహాయంతో ట్రైనర్లను ఎంపిక చేస్తారు. మహిళా ట్రైనర్లకు ప్రాధాన్యం ఇస్తారు. లేనిపక్షంలో పురుష ట్రైనర్లను నియమించుకోవాల్సింటుంది. బాలికలకు ఈ శిక్షణ పాఠశాల సమయంలోనే ఉంటుంది. ప్రతీ పాఠశాలలో పీఈటీ, పీడీ, ఇతర ఉపాధ్యాయుని పర్యవేక్షణలో శిక్షణ కొనసాగించాల్సి ఉంటుంది. ప్రతీ పీఎంశ్రీ పాఠశాలకు రూ.30వేల చొప్పున నిధులు మంజూరు చేశారు. ట్రైనర్కు ప్రతీనెల రూ.10వేల గౌరవ వేతనం చెల్లించాల్సింటుంది. మొత్తంగా 72 సెషన్లు నిర్వహించాలి. మూడు నెలలపాటు వారానికి 6 రోజుల శిక్షణ లేదా ఆరు నెలలపాటు వారానికి మూడు రోజుల శిక్షణ ఇవ్వాల్సింటుంది. బాలికలకు ఈ స్వీయ రక్షణ శిక్షణ 25 సెషన్ల అనంతరం ప్రాక్టికల్గా మూల్యాంకనం నిర్వహిస్తారు. గ్రూప్ ఏ (6, 7తరగతులు), గ్రూప్ బీ (8, 9తరగతులు)గా విభజించి ఫిజికల్ డైరెక్టర్ పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభావంతులైన విద్యార్థులకు డిజిటల్ సర్టిఫికెట్లు (1వ, 2వ, 3వ స్థానం) అందజేస్తారు. 72 సెషన్ల షెడ్యూల్ మూల్యాంకన విధానం, పాఠశాలల జాబితా అనుబంధంగా జారీ చేస్తారు. ఇదిలా ఉంటే పీంఎశ్రీ ప్రాథమిక పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం లేదు. పీఎంశ్రీ పాఠశాలల్లో అమలుకు నిధులు మంజూరు ఒక్కో పాఠశాలకు రూ.30వేలు కరాటే, కుంగ్ఫూ, జూడోలో ట్రైనింగ్ త్వరలో శిక్షకుల నియామకం.. మహిళలకు ప్రాధాన్యంజిల్లా స్కూళ్లు హనుమకొండ 13 వరంగల్ 14 మహబూబాబాద్ 21 జనగామ 15 జేఎస్ భూపాలపల్లి 07 ములుగు 08 -
ఉచ్చులో పడి దుప్పి మృత్యువాత
● విశ్వనాథపురంలో ఘటనస్టేషన్ఘన్పూర్: మండలంలోని విశ్వనాథపురంలో సోమవారం ఉచ్చులో పడి ఓ మచ్చల దుప్పి మృత్యువాత పడింది. ఎఫ్ఆర్ఓ రావుల కొండల్రెడ్డి కథనం ప్రకారం.. గ్రామ సమీపంలోని నమిలిగొండ గుట్టల అటవీప్రాంతం నుంచి వచ్చిన ఓ మచ్చల దుప్పి ఆదివారం సాయంత్రం పశువులతో కలిసి తిరుగుతూ గ్రామస్తులకు కనిపించింది. ఈ క్రమంలో అడవి పందుల నుంచి తమ పంటలను రక్షించేందుకు రైతులు ఏర్పాటు చేసిన ఉచ్చు లేదా వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో పడి ఉండొచ్చు. దీంతో వైరు మెడకు చుట్టుకుంది. అయితే ఉచ్చు నుంచి తప్పించుకుని విశ్వనాథపురం ఎస్సీ కాలనీ వరకు రాగా అక్కడ పెద్ద కట్టెకు వై రు చిక్కుకుంది. దీంతో మెడకు ఉన్న వైరు బిగుసుకోవడంతో ఊపిరా డక మృత్యువాత పడింది. దీనిపై గ్రామస్తుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించి పశువైద్యులతో పోస్టుమార్టం చేయించి దుప్పి కళేబరాన్ని పూడ్చిపెట్టామని ఎఫ్ఆర్ఓ తెలిపారు. ఆయన వెంట ఎఫ్ఎస్ఓ జరీనా, ఎఫ్బీఓ రవి తదితరులున్నారు. -
పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి
ఎంజీఎం : కాకతీయ వైద్య కళాశాల ఆవరణలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆరు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించి ఇతర అన్ని సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ యూనైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాద నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం యూనియన్ ఆధ్వర్యంలో ఆస్పత్రి ఎదుట ఉద్యోగులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సింగ్ ఆఫీసర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసీ ఆఫీసర్లు, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లు, పీఆర్ఓలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇతర సిబ్బందికి 6 నెలల వేతనాలు పెండింగ్లో ఉండడంతో కుటుంబాలు గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఇటీవల కేఎంసీ ప్రిన్సిపాల్, ఎంజీఎం సూపరిండెంట్లకు వినతులు అందజేశామన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో ఈనెల16 నుంచి దశల వారీగా పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యూనియన్ జిల్లా కార్యదర్శి సుధాకర్, ఆస్పత్రి సిబ్బంది శోభ, సంధ్య, భానురేఖ, విక్రమ్, కోమల, రేష్మ, లావణ్య, మౌనిక, స్రవంతి, హిమబిందు,శ్రావణి తదితరులు పాల్గొన్నారు. -
రిమాండ్ ఖైదీ మల్లేశ్ పోస్టుమార్టం వాయిదా
జనగామ/దేవరుప్పుల : ఓ కేసులో రిమాండ్ ఖైదీగా జైలు శిక్ష అనుభవిస్తున్న వారాల మల్లేశ్ అనే వ్యక్తి మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం విధితమే. అయితే అతడి మృతిపై నిగ్గు తేల్చే ప్రత్యేక పోస్టుమార్టం సోమవారం జరగాల్సి ఉండగా ఆ ప్రక్రియ మంగళవారానికి వాయిదా పడింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజుపల్లిలో గత నెల 23వ తేదీన పడకంటి బ్రహ్మచారి అనే వ్యక్తిని ఇదే గ్రామానికి చెందిన వారాల మల్లేశ్ కర్రతో కొట్టడంతో అతడి చేయి విరిగింది. ఈ విషయమై బ్రహ్మచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 8వ తేదీన మల్లయ్యను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా జనగామ సబ్జైలుకు రిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే శనివారం జైలు మూత్రశాలకు వెళ్లిన మల్లేశ్ అక్కడ బ్లీచింగ్ పౌడర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ వరంగల్లో మృతి చెందాడు. ఈ విషయమై మృతుడి కుటుంబ సభ్యులు సబ్జైలు ఎదుట ధర్నా చేపట్టారు. ఎన్హెచ్ఆర్ఎ పర్యవేక్షణలో సముచిత న్యాయం చేస్తుందన్న భరోసాతో ఆందోళన విరమించగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంలో భద్రపర్చారు. కాగా సోమవారం జనగామ కోర్టు ఫస్ట్క్లాస్ సివిల్ జూనియర్ జడ్జి శశి ఎంజీఎంను సందర్శించి తదుపరి చర్యలపై సమీక్షించారు. జైలు కస్టడీలో ఉన్న మల్లయ్య మృతిపై సమగ్ర విచారణ కోసం ఉన్నతస్థాయి వైద్యుల సమక్షంలో పోస్టుమార్టం చేయాల్సి ఉంది. అయితే ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల సీనియర్ ప్రొఫెసర్ల పర్యవేక్షణలో కేఎంసీ ప్రొఫెసర్లు పోస్టుమార్టం చేయాలనే నిబంధనలతో మంగళవారానికి వాయిదా పడింది. మల్లేశ్ మృతిపై అనుమానాలు.. ఓ సాధారణ కేసులో ఏకంగా రిమాండ్ కావడంతో తీవ్ర మనస్తాపం చెందడమేగాక జైలుకెళ్లిన ఆయన కు కౌన్సెలింగ్ లోపం కూడా మల్లేశ్ ఆత్మహత్యాయత్నానికి దారి తీసిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. జైలుకెళ్లే క్రమంలో మానసిక ఒత్తిళ్లకు గురయ్యే నిందితులపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. నిందితులు ఆత్మహత్యలకు పాల్పడే వనరులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మల్లేశ్ ప్రమాదకరం కానీ బ్లీచింగ్ పౌడర్ తాగి ఆత్మహత్యకు యత్నించారంటే నమ్మశక్యంగా లేదని పలువురు పేర్కొంటున్నారు. ఒక వేళ తాగి అపస్మారక పరిస్థితిలోకి వెళ్లిన ఆయనను మధ్యాహ్నం 12 గంటలకు జనగామ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారని, అయితే మెరుగైన వైద్యం అందించడంతో యంత్రాంగం వైఫల్యం పొందారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా మృతుడి భార్య హైమా న్యాయ పో రాటానికి గ్రామస్తులు, ప్రజాసంఘాలు బాసటగా నిలుస్తున్న క్రమంలో అంత్యక్రియలు జరిగే వరకూ ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ముంద చూపుతో పోలీసు యంత్రాంగం జనగామ సబ్జైలు, సింగరాజుపల్లిలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎంజీఎంను సందర్శించిన జనగామ కోర్టు ఫస్ట్క్లాస్ సివిల్ జూనియర్ జడ్జి -
కేయూ, హార్ట్ఫుల్నెస్ ఎంఓయూ
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ, హైదరాబాద్లోని హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ మధ్య సంవత్సర కాలానికి అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదురింది. ఈ మేరకు సోమవారం కేయూలోని అకడమిక్ కమిటీహాల్లో హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధి డాక్టర్ ఆదిత్య, కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం పరస్పరం ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా కేయూ వీసీ ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు విలువలతోకూడిన విద్యతోపాటు వారిలో జీవన నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందన్నారు. ధ్యానం, యోగా, పొలారిటీ టెక్నిక్స్, డి ఆడిక్షణ్ శిక్షణ, శాస్త్రసాంకేతికత, కమ్యూనిటీ వెల్ఫేర్ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి. మనోహర్, సైన్స్ డీన్ ప్రొఫెసర్ జి. హనుమంతు, డీన్ స్టూడెంట్స్ ఆఫైర్స్ మామిడాల ఇస్తారి, కేయూ అభివృద్ధి అధికారి ఎన్.వాసుదేవరెడ్డి, కేయూ యూజీసీ కోఆర్డినేటర్ ఆర్. మల్లికార్జున్రెడ్డి, మహిళా ఇంజనీరింగ్ కళా శాల ప్రిన్సిపాల్ కె. భిక్షాలు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కోలశంకర్ తదితరులు పాల్గొన్నారు. కేయూ, నాస్కమ్ కంపెనీ ఎంఓయూ..తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ (నాస్కమ్) సంస్థతో కాకతీయ యూనివర్సిటీ సంవత్సర కాలానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సోమవారం కాకతీయ యూనివర్సిటీలోని పరిపాలనభవనంలో నాస్కమ్ ప్రతినిధులు సతీశ్కుమార్, బొజ్జమ్ ప్రవీణ్కుమార్, కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం ఒప్పందాలపై సంతకాలు చేసి పరస్పరం మార్పుకున్నారు. ఈ సందర్భంగా కేయూ వీసీ ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ ఈ ఒప్పందం ద్వారా విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలు అభివృద్ధి చేయడం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దడం, నూతన సాంకేతికతపై శిక్షణ ఇస్తామన్నారు. కేయూ మహిళాఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. భిక్షాలు, ప్రొఫెసర్ ఆర్. మల్లికార్జున్రెడ్డి, డాక్టర్ సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు. ధ్యానం, యోగా, నాయకత్వ లక్షణాలకు ప్రాధాన్యం -
ముగిసిన రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హనుమకొండలోని డీఎస్ఏ బాక్సింగ్ హాల్లో రెండు రోజులపాటు నిర్వహించిన అండర్–19 బాలబాలికల రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. ముగింపు వేడుకలకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పతకాలు అందజేసి మాట్లాడారు. జాతీయ స్థాయిలోనూ పతకాలు సాధించి తెలంగాణ ఖ్యాతిని చాటాలన్నారు. ఎస్జీఎఫ్ అండర్–19 జిల్లా కార్యదర్శి వెలిశెట్టి ప్రశాంత్కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 500 మంది మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. ఇందులో విజేతలుగా నిలిచిన 15మంది బాలికలు, 13 మంది బాలురు ఈ నెల 28 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు అరుణాచల్ ప్రదేశ్లో జరుగనున్న ఎస్జీఎఫ్ఐ జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పోతుల శ్రీమన్నారాయణ, మాజీ కార్పొరేటర్ మంచాల స్వామిచరణ్, పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు శీలం పార్థసారథి, అండర్–19 జిల్లా కార్యదర్శి ఎన్. శ్రీధర్, భూపాలపల్లి డీవైఎస్ఓ సి.హెచ్. రఘు, పీఈటీల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. సుధాకర్, తదితరులు పాల్గొన్నారు. -
అడవి పందిని ఢీకొన్న బైక్ ..
● వాహనం అదుపు తప్పి వ్యక్తికి తీవ్రగాయాలు ● చికిత్స పొందుతూ మృతి కాళేశ్వరం: బైక్ ..అడవి పందిని ఢీకొంది. ఈ ప్ర మాదంలో వాహనం అ దుపు తప్పడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందా డు. ఈ ఘటన మహదేవపూర్ మండలం అంబటిపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాటారం మండలం నస్తురుపల్లికి చెందిన పులాల మల్ల య్య(40) ఈనెల10న అంబటిపల్లికి వెళ్లాడు. తిరిగి రాత్రి తన బైక్పై స్వగ్రామం వస్తున్నా డు. మార్గమధ్యలో సూరారం సబ్ స్టేషన్ వద్ద అడవి పంది అడ్డొచ్చి బైక్ను ఢీకొంది. ఈ ఘ టనలో మల్లయ్య తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందా డు. మృతుడి భార్య పులాల ప్రమీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ‘మిషన్’ సిమెంట్ దిమ్మెను ఢీకొని మరొకరు.. ఎస్ఎస్తాడ్వాయి: బైక్.. మిషన్ భగీరథ వా టర్ ట్యాంక్ సిమ్మెంట్ దిమ్మెను ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం మండలంలో ని ఒడ్డుగూడెం సమీపంలో చోటు చేసుకుంది. మండలంలోని లింగాలకు చెందిన ఊకే సార య్య(30), ఆగబోయిన మల్లయ్య బైక్పై ఈనె ల 12న లింగాల నుంచి మేడారం వెళ్లారు. సో మవారం ఉదయం లింగాలకు బయలుదేరా రు. ఈ క్రమంలో వాహనం అదుపుతప్పి ఒడ్డుగూడెం సమీపంలో రోడ్డు పక్కన మిషన్ భగీ రథ వాటర్ ట్యాంక్ సిమ్మెంట్ దిమ్మెను ఢీకొంది. దీంతో సారయ్య అక్కడికక్కడే మృతి చెందగా మల్లయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై మృతుడి సోదరుడు సమ్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్రెడ్డి తెలిపారు. -
కాజీపేట మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు
● నేటి నుంచి 18వ తేదీ వరకు అమలు కాజీపేట రూరల్/డోర్నకల్ : డోర్నకల్–పాపట్పల్లి మధ్య చేపట్టిన ఎన్ఐ (నాన్ ఇంటర్ లాకింగ్) పనుల కారణంగా ఈ నెల 14 నుంచి (మంగళవారం) 18వ తేదీ వరకు కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే పలు ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు కాజీపేట రైల్వే స్టేషన్ మేనేజర్ రవీందర్ సోమవారం తెలిపారు. కొన్ని రైళ్లను రద్దు, దారి మళ్లింపు, పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపారు. సికింద్రాబాద్–విజయవాడ (12713/12714) శాతవాహన ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్–గుంటూరు (12705 /12706) ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, కాజీపేట–డోర్నకల్, డోర్నకల్–కాజీపేట (67765/67766) పుష్పుల్ రైళ్లను అప్ అండ్ డౌన్ రూట్లో రద్దు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా సికింద్రాబాద్–గుంటూరు (17201/17202) గోల్కొండ ఎక్స్ప్రెస్ కాజీపేట–సికింద్రాబాద్ వరకే ప్రయాణించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 16, 17వ తేదీల్లో భువనేశ్వర్–ముంబాయి–భువనేశ్వర్ (11020/11019) కోణార్క్ ఎక్స్ప్రెస్ను వయా గుంటూరు మీదుగా, ఈ నెల 16,18వ తేదీన కాకినాడ–షిర్డీ, షిర్డీ–కాకినాడ (17205 /17206) షిర్డీ ఎక్స్ప్రెస్లను వయా నల్లగొండ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా దారి మళ్లించి నడిపిస్తున్నట్లు స్టేషన్ మేనేజర్ తెలిపారు. 19న ఉమ్మడి జిల్లా స్థాయి ఖోఖో ఎంపిక పోటీలు వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ నెల 19వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి మహిళలు, పురుషుల ఖోఖో ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఖోఖో అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి తోట శ్యామ్ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు 19న ఉదయం జేఎన్ఎస్లోని ఖోఖో మైదానం వద్ద ఉదయం 9గంటలకు హాజరు కావాలన్నారు. ఇందులో ఎంపికై న క్రీడాకారులతో కూడిన జట్లు నవంబర్ 7 నుంచి 11వ తేదీ వరకు పెద్దపల్లిలో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటాయని తెలిపారు. ఇతర వివరాలకు 98492 10746 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు వాయిదావరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో మూడు రోజులపాటు (13 నుంచి 15వ తేదీ వరకు) జరగాల్సిన అండర్–19 బాలబాలికల క్రీడా ఎంపిక పోటీలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–19 ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షం కారణంగా క్రీడా ఎంపికలను వాయిదా వేసినట్లు తెలిపారు. తిరిగి దీపావళి పండుగ అనంతరం నిర్వహిస్తామని, ఆయా తేదీలను సైతం ముందస్తుగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈదుకుంటూ వెళ్లి విద్యుత్లైన్ మరమ్మతుగార్ల: మండల కేంద్రంలోని పెద్దచెరువులో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి పిడుగుపడి మెయిన్ విద్యుత్లైన్ తీగలు తెగి నీటిలో పడ్డాయి. దీంతో సోమవారం సేరిపురం, బాలాజీతండా పంచాయతీలో విద్యుత్ సరఫరా నిలిచింది. కాగా, విద్యుత్ ఏఈ మహేంద్రబాబు ఆదేశాల మేరకు లైన్మెన్ సుధాకర్, కాంట్రాక్ట్ ఉద్యోగి యుగంధర్ చెరువులో ఈదుకుంటూ స్తంభం వరకు వెళ్లి మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దీంతో వారిని పలువురు అభినందించారు. -
వ్యసనాలకు దూరంగా ఉండాలి
వరంగల్ స్పోర్ట్స్: విద్యార్థులు మొబైల్ ఫోన్లు, మత్తు పదార్థాల వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆర్జేడీ ఎ. గోపాల్ అన్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సోమవారం రాష్ట్ర స్థాయి కబడ్డీ విజేతల అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు విద్య, క్రీడలు రెండు దోహదపడుతాయన్నారు. మూడు రోజుల పాటు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్–19 కబడ్డీ పోటీల్లో బాలుర జట్టు విజేతగా నిలవగా, బాలికల జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఖ్యాతిని నిలబెట్టిన కబడ్డీ క్రీడాకారులను అభినందించారు. ఎస్జీఎఫ్ఐ అండర్–19 ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీఐఈఓ శ్రీధర్సుమన్, సంగెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మాధవరావు, ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమన్యాలు సత్యనారాయణ రెడ్డి, మూగల కుమార్యాదవ్, కొత్త కృష్ణారెడ్డి, ఫిజికల్ డైరెక్టర్లు బరుపాటి గోపి, కోట సతీశ్, పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ. ప్రభాకర్రెడ్డి, కార్యదర్శి దరిగె కుమార్, తెలంగాణ రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ బాధ్యడు మర్కాల యాదిరెడ్డి, డీఎస్ఏ కోచ్లు జీవన్గౌడ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్జేడీ ఎ. గోపాల్ రాష్ట్ర స్థాయి కబడ్డీ విజేతలకు అభినందన సభ -
నాలుగు రైళ్ల దారి మళ్లింపు
కాజీపేట రూరల్: దానాపూర్–బెంగళూరు–దానాపూర్ మధ్య ప్రయాణించే సూపర్ఫాస్ట్ రైళ్ల సర్వీస్లకు అక్టోబర్ 13 నుంచి 16వ తేదీ వరకు కాజీపేట, సికింద్రాబాద్, గుంతకల్, ధర్మవరం స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు రైల్వే అధికారులు ఆదివారం తెలిపారు. దారి మళ్లించిన రైళ్లు ఇవే.. ఈ నెల 13న దానాపూర్–ఎస్ఎంవీవీ బెంగళూరు (03251) ఎక్స్ప్రెస్, ఈ నెల 15న ఎస్ఎంవీటీ బెంగళూరు–దానాపూర్ (03252) ఎక్స్ప్రెస్, ఈ నెల 14న దానాపూర్–ఎస్ఎంవీటీ బెంగళూరు (03259) ఎక్స్ప్రెస్, ఈ నెల 16న ఎస్ఎంవీటీ బెంగళూరు–దానాపూర్ (03260) సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు వరంగల్, విజయవాడ, ఒంగోలు, గూడూరు, పెరంబూర్, కటిపాడి, జోలర్పెట్టయ్, బంగారపేట్, వైట్ఫీల్డ్ మీదుగా కాకుండా వయా బల్లార్షా, కాజీపేట, సికింద్రాబాద్, సులేహలీ వెస్ట్, గుంతకల్, ధర్మవరం మీదుగా వెళ్లనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ తెలిపారు. -
గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణం గొప్ప వరం
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని పునర్నిర్మించడం గొప్ప వరమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం మేడారంలో తల్లుల గద్దెల ప్రాంగణ విస్తీర్ణ పనుల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి భారీ స్థాయిలో నిధులు కేటాయించి మేడారం తల్లుల గద్దెల ప్రాంగణాన్ని పునర్నిర్మాణం చేస్తున్నారన్నారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల, వంశ చరిత్ర చిత్రాలతో గద్దెల ప్రాంగణాన్ని పునర్నిర్మించే కార్యక్రమంలో మంత్రిగా తాను, పూజారులు, జిల్లా అధికారులు భాగస్వాములు కావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణం చుట్టూ కొత్త సాలహారం నిర్మాణం పూర్తయిన తర్వాతే పాత సాలహారాన్ని తొలగించనున్నట్లు తెలిపారు. జాతర సమయం దగ్గర పడుతున్న తరుణంలో పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేసేందుకు జిల్లా అధికారయంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్పీ శబరీశ్, డీఎస్పీ రవీందర్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి సీతక్క -
శిల్ప కళా సౌందర్యం మహాద్భుతం
వెంకటాపురం(ఎం)/ ఖిలా వరంగల్: కాకతీయుల నిర్మాణాలు, శిల్ప కళా సౌందర్యం మహాద్భుతంగా ఉందని వరల్డ్ హెరిటేజ్ వలంటీర్లు అన్నారు. వరల్డ్ హెరిటేజ్ క్యాంపెయిన్లో భాగంగా రామప్పలో శిక్షణ పొందుతున్న వలంటీర్లు ఆదివారం పలు ఆలయాలను సందర్శించారు. రేగొండ పరిధిలోని పాండవుల గుట్ట, వరంగల్లోని వేయిస్తంభాల గుడి, ఖిలా వరంగల్తో పాటు పలు పర్యాటక ప్రదేశాలను పరిశీలించారు. ఆలయాల విశిష్టత గురించి ప్రొఫెసర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాటి కాకతీయుల కట్టడాలు, శిల్ప సంపద బాగుందని, వీటిని సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో క్యాంపు కోఆర్డినేటర్ శ్రీధర్రావు, ప్రొఫెసర్ పాండురంగారావు, టూరిజం అసిస్టెంట్ ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్యకిరణ్, తదితరులు పాల్గొన్నారు. -
వావ్.. వరంగల్
‘హైఫై’గా ఓరుగల్లు రైల్వే స్టేషన్వరంగల్ రైల్వేస్టేషన్ సాక్షి, వరంగల్/ఖిలా వరంగల్: వరంగల్ రైల్వే స్టేషన్ ఆధునిక సదుపాయాలతో ప్రయాణికులకు సాదర స్వాగతం పలుకుతోంది. అమృత్భారత్ పథకంలోభాగంగా రూ.25.41కోట్ల వ్యయంతో కాకతీయుల కళావైభవం ఉట్టిపడేలా పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఫలితంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ఏమాత్రం తీసిపోకుండా ఈ రైల్వే స్టేషన్లో కార్పొరేట్ సదుపాయాలు అందుబాటులోకి వ చ్చాయి. కాకతీయుల తోరణం, రెండు స్తంభాలపై రెండు ఏనుగులు, విశాలమైన ఫుట్ఓవర్ బ్రిడ్జి, శి ల్ప కళా సంపద ఉట్టిపడేలా ఎలివేషన్, ర్యాంపులు, ల్యాండ్ స్కేపింగ్, టికెట్ కౌంటర్, ప్లాట్ఫామ్ లతో పాటు గోడలకు ఇరువైపులా కళాకృకతులు, నూతన హంగులతో వెయిటింగ్ హాళ్లను తీర్చిదిద్దారు. ఫలితంగా ఐదేళ్ల క్రితం స్టేషన్లో ఉన్న సదుపాయాలతో పోలిస్తే ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీతోకూడిన అభివృద్ధితోపాటు సదుపాయాలు కల్పించారు. స్వచ్ఛభారత్లో ఇప్పటికే ఉత్తమ అవార్డు.. వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి, ఆదాయంలో దూసుకెళ్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్లున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఉమ్మడి జిల్లాల ప్రజలు ఎక్కువ వరంగల్ రైల్వే స్టేషన్ను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఉన్నతాధికారులు ప్రయాణికుల సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యమినిస్తున్నారు. ఇందులో భాగంగా మూడు ప్లాట్ ఫామ్లతోపాటు స్టేషన్ పరిసరాలు పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నారు. ఈ చర్యలతో స్వచ్ఛ భారత్లో వరంగల్ రైల్వేస్టేషన్కు ఉత్తమ అవార్డు లభించింది. స్టేషన్ ఎదుట, ప్లాట్ఫామ్ల మధ్య పచ్చదనం కోసం గ్రీనరీ, పలు రకాల మొక్కలు పెంచుతున్నారు. వీటిని విధిగా సంరక్షిస్తుండడంతో రైల్వే స్టేషన్ ప్రాంగణం పచ్చగా కళకళలాడుతోంది. ఏఏ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయంటే.. వృద్ధులు, మహిళలు, పిల్లలు మెట్లు ఎక్కడానికి, దిగడానికి ఇబ్బంది పడకుండా లిఫ్ట్లు, ఎస్కలేటర్లు సౌకర్యాలు కల్పించారు. ఒకటి, రెండు, మూడో నంబర్ ప్లాట్ఫామ్ల మధ్య ఆరు లిఫ్ట్లు, ఏడు ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. ఫలితంగా లగేజీతో వచ్చే ప్రయాణికులకు ఇవి ఎంతో ఉపశమనం కలిగిస్తున్నాయి. రైల్వేస్టేషన్ ప్లాట్ఫామ్పై మినరల్ వాటర్ లీటర్ కేవలం రూ.5కే సరఫరా చేస్తున్నారు. ప్లాట్ ఫామ్లపై పలుచోట్ల మొబైల్ ఫోన్ల చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఇంటర్నెట్ కోసం వైఫై సదుపాయం అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికులకు వీవీఐపీ, ఏసీ, నాన్ ఏసీ వెయింటింగ్ హాళ్లు, ప్లాట్ఫామ్పై స్టీల్ కుర్చీలు, గద్దెలు, సిమెంట్ బెంచీలు, విశాలమైన టికెట్ బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. స్టేషన్ ఆవరణ, ప్లాట్ఫామ్లు పరిశుభ్రంగా ఉంచడానికి పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఇందులోభాగంగా ప్రయాణికులు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పలు చోట్ల డస్ట్ బిన్లు అందుబాటులో ఉంచారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు రుచికరమైన భోజనంతోపాటు రైల్ కోచ్లో ఆహారం తిన్నామన్నా అనుభూతి కలిగించేలా రైల్ కోచ్ హోటల్నే ఏర్పాటుచేశారు. సమీప ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో పాటు సిటీవాసులు ఇక్కడ రుచికరమైన టీ,టిఫిన్, భోజనం చేసి ఎంజాయ్ చేస్తున్నారు. మరికొందరు రైల్వే స్టేషన్ ఎదుట గార్డెనింగ్, పురాతన డీజిల్ రైలు ఇంజన్ చూస్తూ సేదదీరుతూ కనిపిస్తున్నారు. ఓవైపు కాకతీయ కళావైభవం.. ఇంకోవైపు కార్పొరేట్ హంగులు ప్రయాణికులకు అందుబాటులో ఏసీ, నాన్ ఏసీ వెయింటింగ్ హాళ్లు లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, ర్యాంపులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి రూ.5కే మినరల్ వాటర్ ఇంటర్నెట్ కోసం వైఫై.. పరిశుభ్రత, పచ్చదనానికి ప్రాధాన్యంప్రయాణికుల నుంచి ఆదరణ పెరుగుతోంది..వరంగల్ రైల్వేస్టేషన్కు ప్రతీరోజు సుమారు 24 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వీరి ద్వారా వార్షిక ఆదాయం 2024–2025లో సుమారు రూ. 82 కోట్లు ఉంది. ఈ నేపథ్యంలో ఆదాయాన్ని ఇంకా పెంచుకునే దిశగా ఆలోచించి ప్రయాణికులకు కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పించాం. ఇందులోభాగంగా స్టేషన్ ప్రాంగణంలో లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, వైఫై, టికెట్ బుకింగ్ కౌంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రతీ ప్లాట్ఫామ్పై లిఫ్ట్, ఎస్కలేటర్ను ఏర్పాటు చేశాం. స్టేషన్ ప్రధాన ప్రవేశ మార్గాన్ని, రిజర్వేషన్ టికెట్ బుకింగ్ కౌంటర్లను అధునాతనంగా తీర్చిదిద్దాం. ఇక్కడి నుంచి ఉన్నత శ్రేణి తరగతుల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. – సారయ్య, స్టేషన్ మేనేజర్, వరంగల్ -
నేడు మేడారానికి మంత్రి పొంగులేటి రాక
ఎస్ఎస్తాడ్వాయి: రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సోమవారం మేడారానికి రానున్నారు. సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణంలో సాలహారం నిర్మాణ పనులతోపాటు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం మేడారంలోని హరిత హోటల్లో జిల్లా అధికారులతో అమ్మవార్ల ఆలయ పునర్నిర్మాణ పనులు, జాతర ఏర్పాట్లపై మంత్రి పొంగులేటి సమీక్షించనున్నారు. మంత్రి సీతక్క కూడా హాజరు కానున్నారు. డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లింపునకు 23వ తేదీ వరకు గడువు కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీబీఎం బీఎస్సీ, బీ ఓకేషనల్, బీసీఏ, బీహెచ్ఎం అండ్ సీటీ (రెగ్యులర్ అండ్ బ్యాక్ లాగ్ ) కోర్సుల మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షల పరీక్ష ఫీజు అపరాధ రుసుము లేకుండా ఈనెల 23వ తేదీవరకు చెల్లించేందకు గడువు ఉందని కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు తిరుమలాదేవి, వెంకటయ్య తెలిపారు. రూ. 50 అపరాధ రుసుముతో ఈనెల 25వతేదీ వరకు చెల్లించొచ్చని తెలిపారు. ఆయా కోర్సుల ఫీజులు, తదితర వివరాలు సంబంధిత కేయూ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ పరీక్షలు నవంబర్–డిసెంబర్లో నిర్వహించనున్నారు. -
చిన్న తగాదా ప్రాణం తీసింది
జనగామ: రిమాండ్ ఖైదీ.. టాయిలెట్లో ఉన్న బ్లీచింగ్ పౌడర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. దేవరుప్పుల మండలం సింగరాజుపల్లికి చెందిన వారాల మల్లయ్య (42), అదే గ్రామానికి చెందిన పడకంటి బ్రహ్మచారి మధ్య గత నెల 23వ తేదీన స్నేహపూరిత వాతావరణంలో చిన్న తగాదా చోటు చేసుకుంది. ఆ ఘటనలో మల్లయ్య కర్రతో కొట్టగా, బ్రహ్మచారి చెయ్యి విరగడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి మల్లయ్యను ఈ నెల 8వ తేదీన కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో మల్లయ్యను అదే రోజు సాయంత్రం జనగామ సబ్జైల్కు పంపించారు. చిన్న తగాదాకు పోలీసులు కేసు నమోదు చేసి తనను జైలుకు పంపించారని మల్లయ్య తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. నాలుగు రోజులుగా సబ్జైలులో ఉంటున్న మల్లయ్య ఈ నెల11వ తేదీన ఉదయం అందరి ఖైదీల్లాగే టిఫిన్ చేసేందుకు బయటకు వచ్చాడు. అనంతరం సబ్జైలు ప్రాంగణంలో ఉన్న టాయిలెట్లోకి వెళ్లి అందులో ఉన్న బ్లీచింగ్ పౌడర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి స్వయంగా జైలు అధికారులకు చెప్పాడు. వెంటనే జైలు అధికారులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి (సుమారు మధ్యాహ్నం 12.40 నిమిషాలకు)కి తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ ఈ నెల12న మృతి చెందాడు. సబ్ జైలు ఎదుట ఆందోళన.. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బాధితులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో సబ్ జైలు ఎదుట ఆందోళన చేపట్టారు. రూ.50 లక్షల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతుడికి భార్య హైమ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విచారణకు రానున్న ఎన్హెచ్ఆర్సీ బృందం జనగామ సబ్ జైలులో రిమాండ్ ఖైదీ మృతి ఘటనలో నేషనల్ హ్యుమన్ రైట్స్ కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) బృందం ఆధ్వర్యంలో విచారణ జరుపనున్నారు. ఇందుకు సంబంధించి వారికి లేఖ సైతం వెళ్లినట్లు సమాచారం. సబ్ జైలులో బ్లీచింగ్ పౌడర్ తాగిన రిమాండ్ ఖైదీ చికిత్స పొందుతూ మృతి -
బీసీలకు సముచిత స్థానం కల్పించాలి
హన్మకొండ: టీపీసీసీ త్వరలో చేపట్టనున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకాల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం సముచిత స్థానం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసిందని గుర్తుచేశారు. ఇందులో భాగంగా సంస్థాగతంగా నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ పదవుల్లో బీసీలకు సరైన వాటా కల్పించాలన్నారు. రాష్ట్రంలో 33 జిల్లాల్లో 17 డీసీసీ అధ్యక్ష పదవులు, వరంగల్ ఉమ్మడి 6 జిల్లాల్లో 3 డీసీసీ అధ్యక్ష పదవులను బీసీలకు కేటాయించి మాట నిలుపుకోవాలని ఏఐసీసీ, టీపీసీసీని కోరారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ కమిటీకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. కేయూ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల కళాశాలల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల అసోసియేషన్ అధ్యక్షుడిగా జె.సోమన్న (ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల) ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కె.సునీల్రెడ్డి (బొల్లికుంట వీసీపీఈ ఫిజికల్ డైరెక్టర్), ఉపాధ్యక్షులుగా పి.అజయ్, ఎస్.కుమారస్వామి, బి.రమేశ్, జి.సునీత, కోశాధికారిగా ఎస్.కిరణ్కుమార్గౌడ్, సంయుక్త కార్యదర్శులుగా ఎం.కుమారస్వామి, కె.మధుకర్, బి.వెంకట్రామ్, జె.జేత్యాతోపాటు కార్యవర్గసభ్యులను ఎన్నుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా మహ్మద్ కరీం వ్యవహరించారు. నాలుగేళ్ల పాటు ఈ కార్యవర్గం కొనసాగుతుంది. అనుమానాస్పద స్థితిలో అంగన్వాడీ టీచర్ మృతి మహబూబాబాద్ రూరల్ : ఓ అంగన్వాడీ టీచర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన మహబూబాబాద్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని బెస్తబజారు ప్రాంతంలో నివాసం ఉండే బానోత్ మాధవి (42) జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీలో అంగన్వాడీ టీచర్గా పని చేస్తోంది. భర్త కృపాకర్ చాలా కాలం క్రితం మృతిచెందగా ఆమెకు కుమార్తె షారోనిదీప్తి ఉంది. ప్రతీ ఆదివారం తల్లీకుమార్తెలు చర్చికి వెళ్తారు. ఆదివారం ఉదయం కూడా కుమార్తె యథావిధిగా చర్చికి వెళ్లింది. మధ్యాహ్నం తల్లి మాధవికి ఫోన్ చేస్తే ఆమె నుంచి ఎలాంటి స్పందనరాలేదు. మూడు గంటల తర్వాత కుమార్తె ఇంటికి వచ్చి చూడగా తల్లి ఉరేసుకుని కనిపించింది. దీనిపై టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డికి సమాచారం ఇవ్వగా టౌన్ ఎస్సై అలీమ్ హుస్సేన్ ఘటనాస్థలికి చేరుకుని మాధవి మృతదేహాన్ని కిందకు దింపారు. మృతురాలు మాధవి శరీరంపై పలుచోట్ల గాయాలుండగా తన తల్లి మృతిపై తనకు అనుమానం ఉందని కుమార్తె షారోనిదీప్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
294 వైన్స్.. 258 దరఖాస్తులు!
కాజీపేట అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైన్స్కు దరఖాస్తు చేసేందుకు మద్యం వ్యాపారులు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 11 వరకు 294 వైన్స్కు కేవలం 258 దరఖాస్తులు రావడం గమనార్హం. సగటున ఒక వైన్స్కు ఒక దరఖాస్తు కూడా రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం వైన్స్ టెండర్ల దరఖాస్తు ఫీజు రూ.2 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచింది. దీంతో మద్యం వ్యాపారులు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. మరో వైపు దీపావళి బాణసంచా అమ్మే వ్యాపారుల్లో సగం మంది మద్యం వ్యాపారం చేస్తారు. రూ.3 లక్షలు పెట్టి బాణసంచా విక్రయిస్తే రూ.6 లక్షలు వస్తాయి కదా.. ఇక మద్యం దరఖాస్తులు ఎందుకు అని వారు అనుకుంటున్నట్లు సమాచారం. కాగా, మూలిగే నక్కమీద తాటికాయ పడ్డ చందంగా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. వైన్స్కు బదులు ఓటర్లకు సమర్పించుకుంటే ఎన్నికల్లో నైనా నెగ్గుతామంటూ దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు. 23న లక్కీడ్రా.. వైన్స్కు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 18 చివరి తేదీగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దరఖాస్తుకు గడువు 6 రోజులు మాత్రమే మిగిలింది. అక్టోబర్ 23వ తేదీన లక్కీ డ్రా ద్వారా వైన్స్ కేటాయిస్తారు. 2023–25లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 15,926 దరఖాస్తులకు రూ.318 కోట్ల ఆదాయం వచ్చింది. కానీ, ఈసారి 30 వేల దరఖాస్తులు, రూ.500 కోట్ల ఆదాయం రావాలని పెట్టుకున్న టార్గెట్ను కనీసం చేరుకుంటారా లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏ జిల్లాలోనూ సెంచరీ దాటని అర్జీలు రూ.3 లక్షల ఫీజు, దీపావళి, స్థానిక ఎన్నికల ఎఫెక్ట్ దరఖాస్తు చేసుకోవడానికి మిగిలింది ఇక 6 రోజులేఉమ్మడి వరంగల్ జిల్లాలో వైన్స్లు, దరఖాస్తుల వివరాలు.. జిల్లా వైన్స్ దరఖాస్తులు వరంగల్ అర్బన్ 67 89 వరంగల్ రూరల్ 57 49 జనగామ 50 34 మహబూబాబాద్ 61 57 భూపాలపల్లి 59 29 -
ఉద్యోగులు నైపుణ్యం పెంపొందించుకోవాలి
హన్మకొండ: ఉద్యోగులు నైపుణ్యం పెంపొందించుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి అ న్నారు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి ప ర్యటనలో ఆదివారం వరంగల్ రీజియన్ను సందర్శించారు. హనుమకొండలోని వరంగల్ రీజియన్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిపోల వా రీగా ప్రగతిని సమీక్షించారు. ఆర్ఎం డి.విజయభాను, డిప్యూ టీ ఆర్ఎంలు, డిపో మేనేజర్లు డిపో వారీగా కార్యక్రమాలు, వస్తున్న ఆదాయం, తిరుగుతున్న కిలో మీటర్లు తదితర వివరాలు ఎండీకి వివరించారు. అనంతరం హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ను పరిశీలించారు. వరంగల్–1 డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన డ్రైవర్లు, కండక్టర్లకు ప్రగతి చక్రం పురస్కారాలు అందించారు. అనంతరం మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీకి ప్రయాణికులే దేవుళ్లన్నారు. వారిని ఆదరించి మర్యాదగా ప్రవర్తిస్తూ ఆక్యుపెన్షీ రేషియో పెంచుకోవాలన్నారు. ప్రజలకు సేవ చేయడం మన బాధ్యత అన్నారు. ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను స్ఫూర్తిగా తీసుకుని మిగతావారు పోటీ పడి పని చేయాలన్నారు. వ్యయం తగ్గించడంతోపాటు ఆదాయం పెంపుపై దృష్టి సారించాలన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వరంగల్ నగరానికి 100 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయన్నారు. వరంగల్ రీజియన్ పనితీరు బాగుందని కితాబు ఇచ్చారు. టెండర్లలో అక్రమాలు జరిగాయని విలేకరుల ఆయన దృష్టికి తీసుకెళ్లగా పరిశీలించి రుజువైతే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ పి.సోల్మన్, ఆర్ఎం డి.విజయభాను, డిప్యూటీ ఆర్ఎంలు కేశరాజు భానుకిరణ్, మహేశ్, డిపో మేనేజర్లు, అద్దె బస్సుల యజమానులు పాల్గొన్నారు. ప్రయాణికులే సంస్థకు దేవుళ్లు ప్రజలకు సేవలందించడం మన బాధ్యత ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి -
ఘనంగా గజవాహన సేవ
గార్ల: మండలంలోని మర్రిగూడెం వేట వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం ఏడోరోజు స్వామివారికి దోపోత్సవం, గజవాహన సేవ, చక్రస్నానం కార్యక్రమాలను వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ ఘనంగా నిర్వహించారు. వేంకటేశ్వరస్వామి సమేత శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన గజవాహనంపై ప్రతిష్టించి దేవాలయం చూట్టూ మేళతాళాల నడుమ ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో స్వామివారికి దోపోత్సవం, దేవాలయం ప్రాంగణంలోని కోనేటిలో స్వామివారికి చక్రస్నానం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ గూడూరు సంజీవరెడ్డి, మాజీ ఆలయ చైర్మన్ భూక్య కస్నానాయక్ దంపతులు, మాజీ ఎంపీపీ లాలునాయక్, రాములు, చిరంజీవి, మల్సూర్, అర్చకులు రామాయణం అచ్చుతాచార్యులు, గోవింద్చార్యులు, రఘువెంకట రామస్వామి తదితరులు పాల్గొన్నారు. ఓరుగల్లును మరువలేను ఖిలా వరంగల్: చారిత్రక ప్రసిద్ధిగాంచిన ఓరుగల్లుతో అనుబంధం మరువలేను. తన హృదయంలో ఓరుగల్లుకు ప్రత్యేక స్థానం ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మధుర జ్ఞాపకాన్ని ఆదివారం మరోసారి గుర్తు చేసుకున్నారు. 17 ఏళ్ల క్రితం వరంగల్ ఎస్పీగా ఉన్న సమయంలో తన సతీమణితో కలిసి చారిత్రక ఖిలా వరంగల్ కోటను సందర్శించారు. ‘కోటలో ఖాకీబాస్’ శీర్షికతో అప్పుడు సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇలా వరంగల్ నగరంపై తనకు ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేశారు. నేటి నుంచి క్రీడా ఎంపిక పోటీలు వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు అండర్–19 బాలబాలికల క్రీడా ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–19 ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి రోజు వాలీబాల్, యోగా, టగ్ఆఫ్వార్, త్రోబాల్, టేబుల్ టెన్నిస్, మకంబ్, సాఫ్ట్టెన్నిస్, బీచ్వాలీబాల్, తంగ్తా మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్, సాఫ్ట్బాల్, అథ్లెటిక్స్, షూటింగ్, స్క్వాష్, రగ్బీ క్రీడలు, రెండో రోజు (14వ తేదీన) హ్యాండ్బాల్, చెస్, రెజ్లింగ్, షటిల్ బ్యాడ్మింటన్, హాకీ, బెల్డ్ రెజ్లింగ్, సైక్లింగ్ రోడ్, సైక్లింగ్ ట్రాక్, స్కేటింగ్, బేస్బాల్, లాన్టెన్నిస్, బాల్ బ్యాడ్మింటన్, తైక్వాండో, 15వ తేదీన క్రికెట్, క్యారమ్స్, కరాటే, సెపక్తక్రా, కురేష్, కలరిపాయట్టు, ఫెన్సింగ్, పవర్లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, బాక్సింగ్, ఖోఖో క్రీడాంశాల్లో ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వనదేవతలకు మొక్కులు ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆదివారం సెలవురోజు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు ప్రైవేటు వాహనాల్లో మేడారానికి తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి తల్లుల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఎత్తు బంగారం, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కోళ్లను, యాటలను అమ్మవార్లకు మొక్కుగా సమర్పించారు. సుమారుగా పదివేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. భక్తులు వేల సంఖ్యలో తరలిరావడంతో అమ్మవార్ల గద్దెల ప్రాంగణం సందడిగా మారింది. -
దారిపొడవునా మక్కలు..
మహబూబాబాద్ రూరల్ : మొక్కజొన్న కోతలు జరుగుతుండడంతో మహబూబాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రధాన రహదారులన్నీ మక్కలతో దర్శనమిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి మొక్కజొన్న పండించిన రైతులు మక్కలను ప్రధాన రహదారులపై ఆరబోసుకుంటున్నారు. క్రయవిక్రయాల సందర్భంలో తేమశాతం సమస్య రాకుండా ఉండేందుకు మక్కలను రోడ్లపై ఎండలో ఆరబోసుకుంటున్నామని తెలిపారు. దీంతో రోడ్లన్నీ బంగారు వర్ణంలో చూపరులకు కనువిందు చేస్తున్నాయి. కిలోమీటర్ల పొడవునా మొక్కజొన్నలను ఆరబోస్తుండగా వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఆమెకు సుస్తీ!
సోమవారం శ్రీ 13 శ్రీ అక్టోబర్ శ్రీ 2025● జిల్లాలో స్వస్త్ నారీ.. సశక్తి పరివార్ కార్యక్రమం అమలు ● మహిళలకు ప్రత్యేక పరీక్షల నిర్వహణ ● సీ్త్రలు పలురకాల వ్యాధులతో బాధపడుతున్నట్లు వెల్లడిఆమెకు సుిస్తీ!సాక్షి, మహబూబాబాద్: ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు అంటారు. ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండే విధంగా సేవలు అందిస్తారు. మహబూబాబాద్ లాంటి మారుమూల ప్రాంతాలు ఎక్కువగా ఉన్న జిల్లాలో మహిళలలు ఇంటి పనికే పరిమితం కాకుండా పురుషులతో సమానంగా వ్యవసాయ పనులు చేస్తారు. దీంతో వారి ఆరోగ్యంపై పట్టింపు ఉండదు. దేశవ్యాప్తంగా మహిళలు వివిధ రకాల బారిన పడి ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టింది. స్వస్త్ నారీ.. సశక్తి పరివార్ కార్యక్రమం ద్వారా జిల్లాలోని మహిళలకు ఆర్యోగ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ద్వారా వివిధ రకాల వ్యాధుల బారిన పడి మహిళలు ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడించారు. మోదీ పుట్టిన రోజు నుంచి.. గాంధీ జన్మదినం వరకు.. మహిళలకు ఆరోగ్య విషయం తెలుసుకునేందుకు జిల్లాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు సెప్టెంబర్ 17 నుంచి జాతిపిత మహాత్మాగాంధీ పుట్టిన రోజు అక్టోబర్ 2 వరకు క్యాంపులు నిర్వహించారు. జిల్లాలోని 21 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, గూడూరు, మరిపెడ, తొర్రూరు, గార్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ప్రత్యేక క్యాంపులు పెట్టి మహిళలకు పరీక్షలు నిర్వహించారు. ఇందులో జనరల్ మెడిసిన్, గైనకాలజిస్టు, పిల్లల వైద్యులు, సైకియాట్రిస్ట్లు, డెంటల్, చర్మ, ఈఎన్టీ, ఎంఎస్ సర్జన్ మొదలైన డాక్టర్లు క్యాంపుల్లో పాల్గొన్నారు. 1,56,134 మంది మహిళలకు పరీక్షల స్వస్త్ నారీ.. సశక్తి పరివార్ కార్యక్రమంలో భాగంగా 94 ప్రధాన క్యాంపులతో పాటు ఇంటింటి సర్వేలు, ఆస్పత్రుల్లో పరీక్షలు ఇలా మొత్తం 1498 క్యాంపులు నిర్వహించారు. ఇందులో మొత్తం 1,56,134 మంది మహిళలను పరీక్షించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పరీక్షల్లో బీపీ, షుగర్, కేన్సర్, గర్భస్థ సమస్యలు, రక్తహీనత, టీబీ, హెచ్బీ, సికిల్సెల్, ఇతర వ్యాధులతో బాధపడుతున్నట్లు అనుమానించి 1,21,492మందిలో బీపీ, షుగర్, రక్త హీనతను నిర్ధారించారు. మిగిలిన వారికి పూర్తిస్థాయి వ్యాధి నిర్ధారణ చేసేందుకు షాంపిల్స్ ల్యాబ్స్కు పంపించారు. అయితే ఇందులో నాన్ కమ్యూనికేబుల్ వాధ్యులు బీపీ, షుగర్, రక్త హీనతతో బాధపడుతున్నవారికి స్థానికంగా అందుబాటులో ఉన్న మాత్రలు ఇచ్చారు. మిగిలిన వారి జాబితా తయారు చేసి మెరుగైన చికిత్స అవసరమని ఉన్నతాధికారులకు నివేదిక అందజేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే కొన్ని చోట్ల డాక్టర్లు అంకితభావంతో పరీక్షలు నిర్వహించగా.. మరికొందరు మాత్రం మొక్కుబడిగా క్యాంపులు పెట్టి ఊహాజనితమై నంబర్లు పంపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ద్వారా గుర్తించి రోగులకు మెరుగైన చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ●పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాం ప్రభుత్వం నిర్దేశించిన అంశాలకు అనుగుణంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వరకు జిల్లా వ్యాప్తంగా స్వస్త నారీ.. సశక్తి పరివార్ కార్యక్రమాన్ని నిర్వహించాం. పీహెచ్సీలు, సీహెచ్సీలు, యూపీహెచ్సీలు అన్ని ఆస్పత్రుల్లో క్యాంపులు పెట్టి మహిళలకు పరీక్షలు నిర్వహించాం. నివేదికను ఉన్నతాధికారులకు అందించాం. – రవి రాథోడ్, జిల్లా వైద్యాధికారి -
మంత్రుల తీరు సిగ్గుచేటు
● మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డోర్నకల్: ప్రజా సమస్యలను గాలికొదిలేసి అంతర్గత పోరుతో సతమతమవుతున్న రాష్ట్ర మంత్రుల తీరు సిగ్గుచేటని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. డోర్నకల్లో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్పై ప్రజలు అయోమయానికి గురవుతన్నారని, ప్రజాప్రతినిధులు లేక గ్రామాల్లో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని తెలిపారు. రాష్ట్ర మంత్రులు గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్తో పాటు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మధ్య ఆధిపత్య పోరుపై ప్రజలు మండిపడుతున్నారని అన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్కు బీఆర్ఎస్ కట్టుబడి ఉందని, కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్తో బీసీలను మోసం చేస్తూ వారి మనోభావాలను దెబ్బతీస్తుందని అన్నారు. బీసీ రిజర్వేషన్తో పాటు ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటుండగా మంత్రులు కమీషన్ల కోసం కొట్టుకుంటున్నారని అన్నారు. మంత్రుల వర్గపోరు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతుందన్నారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం కావడంతో ప్రజలు బీఆర్ఎస్వైపు చూస్తున్నారని తెలిపారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ చేరెడ్డి బిక్షంరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సతీష్కుమార్గౌడ్, తవ్వా వరలక్ష్మి, మన్యుపాట్ని, బోయిన వెంకన్న, బోడ శ్రీను, బాలాజి, కందుల మధు తదితరులు పాల్గొన్నారు. -
కార్యకర్తల అభిప్రాయంతోనే డీసీసీ ఎన్నిక
● ఏఐసీసీ పరిశీలకుడు దేబాసిస్ పట్నాయక్ పాలకుర్తి టౌన్: కార్యకర్తల అభిప్రాయ సేకరణతోనే డీసీసీ ఎన్నిక ఉంటుందని ఏఐసీసీ పరిశీలకుడు దేబాసిస్ పట్నాయక్ అన్నారు. డీసీసీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సంఘటన్ సృజన్ అభియాన్ తెలంగాణ కార్యక్రమం పేరిట ఆదివారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ పరిశీలకులు షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య, ఎండీ అఫిజ్, శ్రీకాంత్యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ పరిశీలకుడు దేబాసిస్ పట్నాయక్ మాట్లాడుతూ.. కార్యకర్తల నుంచి ప్రజానాయకులను ఎంపిక చేయడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం అన్నారు. ప్రతి జిల్లాలో స్థానిక నాయకులతోనే నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఆసక్తి గల ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజల మనసులో ఉన్న నిజమైన ప్రజాస్వామ్యానికి ప్రతీక అన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కొమ్మురి ప్రతాప్రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు లకావత్ లక్ష్మీనారాయణనాయక్, కొమ్మురి ప్రశాంత్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, ఎర్రబెల్లి రాఘవరావు, గంగు కృష్ణమూర్తి, కుమారస్వామి, శ్రీరాములు నాయకుల పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్ష పదవికి ఝాన్సీరెడ్డి దరఖాస్తు జనగామ డీసీసీ అధ్యక్ష పదవి కోసం ఆ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి దరఖాస్తును నియోజకవర్గ నాయకులు ఏఐసీసీ అబ్జర్వర్ పట్నాయక్, టీపీసీసీ పరిశీలకులకు అందజేశారు. -
కారాఘోరం!
సాక్షిప్రతినిధి, వరంగల్: ● వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన పెండ్యాల సుచరిత (36) సబ్జైలులో రిమాండ్ ఖైదీగా ఉండి మృతి చెందారు. సుబేదారి పోలీస్స్టేషన్లో నమోదైన ఓ కేసులో ఆమెను ఆగస్టు 13న నర్సంపేట సబ్ జైలుకు తరలించారు. సబ్జైలులో అనారోగ్యానికి గురైన ఆమెను నర్సంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆగస్టు 21న మృతి చెందింది. ● జనగామ సబ్జైలులో ఆత్మహత్యాయత్నం చేసిన ఓ ఖైదీ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగారాజుపల్లికి చెందిన వరాల మల్లేశ్ (42) హత్యాయత్నం కేసులో జనగామ సబ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి మల్లేశ్ నీటిలో బ్లీచింగ్ పౌడర్ కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన అధికారులు ఖైదీని వరంగల్లోని ఎంజీఎం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ...ఖైదీల్లో పరివర్తన తీసుకురావాల్సిన కారాగారాలు సహజ మరణాలు, ఆత్మహత్యలకు వేదికలవుతున్నాయి. నేరాలు, నేరస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండగా.. ఓ వైపు జైళ్ల కుదింపు, మరోవైపు విచారణలు, శిక్షలు, విడుదల లేక ఖైదీలతో కారాగారాలు కిటకిటలాడుతున్నాయి. కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన అధికారులు సబ్జైళ్లలో రకరకాల పనులు చేయిస్తూ వేధిస్తుండడమే ఖైదీల మృతికి కారణంగా చెబుతున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే జైళ్లలో ఖైదీలకు ఆత్మహత్యకు కారకాలయ్యే వస్తువులను దూరంగా సిబ్బంది ఉంచాలి. వాటిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఖైదీల ఆత్మహత్యాయత్నం ఘటనలు పునరావృతం అవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. అయితే, జైలులో అంతా నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే సామర్థ్యానికి మించి జిల్లా, సబ్జైళ్లలో ఖైదీలను ఉంచి.. ఆ మేరకు బడ్జెట్, సౌకర్యాలు, అధికారులు, సిబ్బంది లేక నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోందన్న చర్చ జరుగుతోంది. సిబ్బంది, ఎస్కార్ట్ కొరతతో నెలల తరబడి విచారణలు వాయిదా పడి జైళ్లనుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఫలితంగా జిల్లా, సబ్జైళ్లలో ఓ వైపు సహజ మరణాలు, మరోవైపు ఆత్మహత్యాయత్నాలు, ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయన్న చర్చ జరుగుతోంది. ఖైదీలు పెరుగుతున్నా.. మారని పరిస్థితులు ఖైదీల సంఖ్య పెరుగుతున్నా.. అందుకు అనుగుణంగా జైళ్ల పరిస్థితి మారడం లేదు. నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) ఇటీవల విడుదల చేసిన ‘ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా–2023’లో ఇవే అంశాలను ప్రస్తావించింది. ఈ లెక్కల ప్రకారం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగే అయినప్పటికీ.. రాష్ట్రంలో అన్ని రకాల జైళ్లు కలిపి 50 ఉండగా.. అన్నింట్లో సామర్థ్యాన్ని మించి ఖైదీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్లో వరంగల్ సెంట్రల్ జైలుతోపాటు పరకాల, జనగామ, మహబూబాబాద్, నర్సంపేట సబ్జైళ్లలో కలిపి సుమారు 680 మంది ఖైదీలు ఉండాలి. వరంగల్ సెంట్రల్ జైలు కూల్చివేసే నాటికి ఒక్క ఆ జైలులోనే వెయ్యి మంది వరకు ఉన్నట్లు రికార్డులున్నాయి. 2021లో సెంట్రల్ జైలు ఎత్తివేయగా.. నర్సంపేట సబ్జైలును కూడా రద్దు చేశారు. వీటి స్థానంలో మామునూరు ఒక ఓపెన్ ఎయిర్ జైలును ప్రతిపాదించారు. నర్సంపేట సబ్జైలు స్థానంలో మహిళల ప్రత్యేక జైలు ఏర్పాటు చేశారు. జనగామ, మహబూబాబాద్, నర్సంపేట, పరకాలతోపాటు ఓపెన్ ఎయిర్ జైలు కలిపితే.. వాటిలో ఖైదీల సామర్థ్యం 50 నుంచి 80 లోపలే. ఆమేరకు పెట్టుకుని ఇతర ఖైదీలను ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్ జైళ్లకు తరలించాల్సి ఉండగా.. ఉమ్మడి వరంగల్లోని పోలీస్స్టేషన్లలో నమోదైన వివిధ కేసుల్లో విచారణ ఖైదీలు, శిక్షలు పడిన వారు సుమారు 300 మంది జిల్లాల్లోని జైళ్లలోనే ఉంటుండడంతో అవి కిక్కిరిసిపోతున్నాయి. సహజ మరణాలకు అనేక కారణాలు.. సబ్జైలులో సహజ మరణాలకు అనారోగ్యమే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ముందుగా ఉన్న ఆరోగ్య సమస్యలు, జైలులో సరైన వైద్య సంరక్షణ లేకపోవడం, జైలు వాతావరణం వల్ల వచ్చే ఒత్తిడి వంటి కారణాల వల్ల మరణాలు తరచూ సంభవిస్తాయంటున్నారు. జైలు, పోలీసు కస్టడీలో మరణాలకు గుండె జబ్బుల వంటివి సాధారణంగా కనిపిస్తాయని వైద్య నిపుణుల అభిప్రాయం. జైళ్లలో ఖైదీల సహజ మరణాలు, ఆందోళనకరంగా ఆత్మహత్యలు జైళ్ల కుదింపుతో ఇబ్బడిముబ్బడిగా విచారణ ఖైదీలు కరువైన ఉన్నతాధికారుల పర్యవేక్షణ సంచలనంగా జనగామ సబ్జైలు ఖైదీ ఆత్మహత్య..చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ప్రాణాంతకమే.. వాంతులు, విరేచనాలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ముందుగా ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు ఖైదీల మరణానికి కారణం కావొచ్చు. జైలులో సరైన వైద్య సంరక్షణ అందుబాటులో లేకపోతే చిన్న ఆరోగ్య సమస్యలు కూడా తీవ్రమై ప్రాణాంతకంగా మారుతాయి. జైలులోని ఒత్తిడితో కూడిన వాతావరణం కూడా ఖైదీల ఆరోగ్య పరిస్థితిని క్షీణింపజేసి మరణానికి దారితీస్తుంది. అయితే, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా ఇవి తేలుతాయి. – డాక్టర్ కేశవులు, మానసిక వైద్య నిపుణుడు -
అధికంగా వసూలు!
● మీసేవ కేంద్రాల్లో దోపిడీ ● కొంతమంది నిర్వాహకులు రెట్టింపు రుసుము వసూలు ● నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణ మహబూబాబాద్: జిల్లలో కొంతమంది మీసేవ కేంద్రాల నిర్వాహకులు దరఖాస్తుదారుల నుంచి అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. తీసుకోవాల్సిన రుసుము కంటే రెట్టింపు.. ఆపైన వసూలు చేస్తూ దరఖాస్తుదారులను అర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కేంద్రాల్లో ధరల పట్టికలు మచ్చుకై నా కనిపించడం లేదు. కొంత మంది నిర్వాహకులు రుసుము స్లిప్లు ఇవ్వడం లేదు.. ఇస్తే తమ బండారం బయట పడుతుందని జాగ్రత్త పడుతున్నారు. ప్రభుత్వం దరఖాస్తును బట్టి కమీషన్ చెల్లిస్తున్నప్పటీ కాసులకు కక్కుర్తి పడి అధికంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పర్యవేక్షణ లేకనే నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సేవలు ఇవే.. మీసేవ కేంద్రాల్లో ప్రధానంగా కులం, ఆదాయం, నివాసం, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనన, మరణ ధ్రువీకరణ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ల కోసం, రేషన్ కార్డులు ,అగ్రికల్చర్ ల్యాండ్ విలువ, అగ్రికల్చర్ ఇన్కమ్ తదితర సర్టిఫికెట్ల కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటారు. అలాగే ఓపెన్ సైట్లో భాగంగా స్కాలర్ షిప్, భూభారతి, ఉద్యమం రిజిస్ట్రేషన్ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం)దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో డ్వాక్రా గ్రూపు రుణాల కోసం ఉద్యమం రిజిస్ట్రేషన్ తప్పనిసరి కావడంతో మీసేవ కేంద్రాల్లో క్యూ కడుతున్నారు. రెట్టింపు కంటే ఎక్కువగా.. కులం, ఆదాయం, నివాసం, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ తదితర సర్టిఫికెట్ల రుసుము రూ.45 ఉంది. కానీ కొంత మంది నిర్వాహకులు రూ.100పైగా తీసుకుంటున్నారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలకు రూ. 95 ఉండగా రూ.200 వరకు వసూలు చేస్తున్నారని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డు దరఖాస్తు రుసుము రూ.45 ఉండగా రూ.100, లేబర్ కార్డు రెన్యూవల్ కోసం రూ.110 ఉండగా రూ.300 నుంచి రూ.400 వరకు వసూలు చేస్తున్నారు. ఈ దందా ఎక్కువ జిల్లా కేంద్రంలోనే జరుగుతోంది. మీ సేవ కేంద్రాలకు వరం డ్వాక్రా గ్రూపు రుణాల విషయంలో ఉద్యమం రిజిస్ట్రేషన్ తప్పనిసరి కావడంతో మీసేవ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఓపెన్ సైట్ అయినా ప్రతీ విషయంలో మీసేవ కేంద్రాలకు వెళ్లడం అలవాటుగా మారింది. అది నిర్వాహకులకు వరంగా మారింది. దీంతో రూ.100కు బదులు.. రూ.300 నుంచి రూ.400 వసూలు చేస్తున్నారు. కాగా, జిల్లా కేంద్రంలోని సర్వే పల్లి రాధాకృష్ణన్ సెంటర్లోని మీసేవ కేంద్రంలో రెట్టింపు కంటే అదనంగా వసూలు చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ కేంద్రంతో పాటు తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని కేంద్రం, మున్సిపాలిటీ రోడ్డులో, ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ సమీపంలోని మీసేవ కేంద్రంపై అధిక రుసుము వసూలు చేస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. పూర్తిగా సీజ్ కాదనే నమ్మకంతో.. నిబంధనలకు విరుద్ధంగా రుసుము వసూలు, ఇతర విషయాల్లో ఫిర్యాదు చేస్తే అధికారులు కేంద్రాన్ని తనిఖీ చేసి విచారణ చేపట్టి మొదటి హెచ్చరికగా రూ.2,000 జరిమానా విధిస్తారు. రెండోసారి ఫిర్యాదు వస్తే విచారణలో నిజమని తేలితే రెండో హెచ్చరికగా రూ.5000 జరిమానా విధిస్తారు. మూడోసారి కూడా కోద్ది రోజులు మాత్రమే షాపు సీజ్ చేసే అధికారం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆ నిబంధనలతో నిర్వాహకులు అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారు. అధికంగా వసూలు చేస్తే చర్యలు మీసేవ కేంద్రాల్లో నిర్ణయించిన రుసుము మాత్రమే తీసుకోవాలి. అధికంగా వసూలు చేయవద్దు. తప్పని సరిగా రుసుము స్లిప్ ఇవ్వాలి. కేంద్రాల్లో ధరల బోర్డులు ఏర్పాటు చేయాలి. నిబంధనలు అతిక్రమిస్తే ముందుగా రెండుసార్లు జరిమానా విధించి ఆతర్వాత కేంద్రాన్ని సీజ్ చేస్తాం. –ప్రశాంత్, ఈ–డిస్ట్రిక్ మేనేజర్ -
బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి
మహబూబాబాద్ అర్బన్: బూత్స్థాయిలో బీజేపీని బలోపేతం చేయాలని జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో కొరివి మండలం నారాయణపురం గ్రామపంచాయతీ నుంచి శనివారం పలువురు యువతను బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సంస్థాగతంగా బలంగా ఉన్నప్పుడే ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. రానున్న ఎన్నికల్లో కమలం జెండా ఎగురవేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు, యువకులు పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్యామ్, రామచందర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం అశోక్, నాయకులు సతీష్, నరేష్ నాయక్, సందీప్, నారాయణపురం గ్రామపంచాయతీ యువకులు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు -
ఖోఖో అభివృద్ధికి విశేష కృషి
వరంగల్ స్పోర్ట్స్: ఖోఖో క్రీడాభివృద్ధికి 15 ఏళ్లుగా విశేష కృషి చేస్తున్నామని, అత్యున్నత స్థాయిలో కల్పిస్తున్న వసతులను క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని తెలంగాణను దేశంలో మొదటి స్థానంలో నిలపాలని ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎథిక్స్ కమిషన్ కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర, ఉమ్మడి వరంగల్ జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అన్నారు. ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు కర్ణాటకలో జరుగనున్న సీనియర్ మెన్ అండ్ ఉమెన్ సౌత్జోన్ ఖోఖో పోటీల్లో పాల్గొనే తెలంగాణ జట్ల ఎంపిక పోటీలను శనివారం హనుమకొండలోని జేఎన్ఎస్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వచ్చే ఏడాది జనవరిలో కాజీపేటలో జాతీ యస్థాయి సీనియర్ ఖోఖో పోటీలు నిర్వహిస్తుట్లు తెలిపారు. ఖోఖో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట శ్యామ్ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా శిక్షణ శిబి రానికి ఎంపికై న వరంగల్ కరీమాబాద్కు చెందిన ఖోఖో క్రీడాకారిణి నవ్యశ్రీ ని రాఘవరెడ్డి సన్మాంచారు. కార్యక్రమంలో తెలంగాణ ఖోఖో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనాతి కృష్ణమూర్తి, హ్యాండ్బాల్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. పవన్కుమార్, పీఈటీల సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కేకేఎఫ్ ఇండియా ఎథిక్స్ కమిషన్ కన్వీనర్ రాఘవరెడ్డి -
త్వరలో టీహబ్తో కేహబ్ ఒప్పందం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కేహబ్ హైదరాబాద్లోని టీహబ్తో త్వరలో అవగాహన ఒప్పందం చేయబోతున్నామని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. కాకతీయ యూనివర్సిటీ ఫార్మా అలుమ్ని గోల్డెన్జూబ్లీ ఉత్సవాలు శనివారం హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని వెల్లడించారు. వరంగల్ వంటి ద్వితీయ శ్రేణి నగరాలను ఆవిష్కరణలు, ఇంక్యుబేషన్ స్టార్టప్లకు హాబ్లుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ రూసా వంటి సంస్థల మద్దతుతో విశ్వవిద్యాలయం ఫార్మసీ కాలేజీ మరింత అభివృద్ధి సాధిస్తోందన్నారు. వందలాది మంది పరిశోధకులు పీహెచ్డీలు పూర్తిచేసి వివిధ స్థాయిల్లో ఉన్నారన్నారు. అనంతరం మంత్రులు, వీసీ, పూర్వ విద్యార్థులు సావనీర్, రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. కేయూ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ జె. కృష్ణవేణి కేయూ ప్రస్తుత, పూర్వ ఆచార్యులు పాల్గొన్నారు. ఈనెల 12న కూడా ఉత్సవాలు కొనసాగనున్నాయి. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి శ్రీధర్బాబు వెల్లడి -
మృత్యువుతో పోరాడి ఓడిన చిన్నారి
● 60 రోజులుగా చికిత్స పొందుతున్న నిహాన్సిక మృతి చిల్పూరు: ఓ చిన్నారి 60 రోజు లుగా మృత్యువుతో పోరాడి ఓ డింది. రెండు నెలల క్రితం వేడినీళ్ల బకెట్లో పడగా శరీరం మొ త్తం కాలింది. దీంతో తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శనివారం కన్నుమూసింది. దీంతో ఆ కుటుంబంతోపాటు గ్రామంలో విషాదఛాయలు అ లుముకున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పల్లగుట్ట జీపీ పరిధిలోని సయ్యద్హుస్సే న్ పల్లికి చెందిన దాసరి కుమార్యాదవ్, చైతన్య దంపతులు. వీరికి కూతురు నిహాన్సి క(3) ఉంది. ఈ క్రమంలో రెండు నెలల క్రితం రోజు మాదిరి గానే తల్లి చైతన్య కూతురికి స్నానం చేయించేందుకు వేడినీళ్లను బకెట్లో పోసి చల్లనీళ్ల కోసం వెళ్లింది. ఈ సమయంలో ఆడుకుంటూ వచ్చిన నిహాన్సిక ఒక్కసారిగా వేడినీళ్ల బకెట్లో పడింది. నీరంతా ప డడంతో శరీరం మొత్తం కాలింది. వెంటనే తల్లిదండ్రులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆ స్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. వరి పొలానికి నీళ్లు పారించేందుకు వెళ్లి.. ● బావిలో పడి మహిళారైతు మృతి మహబూబాబాద్ రూరల్ : వరి పొలానికి నీరు పారించేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఓ మహిళా రైతు మృతి చెందింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి మహబూబాబాద్ మండలం తోకబోడు తండా పరిధిలో చోటుచేసుకుంది. కురవి ఎస్సై జి.సతీశ్ కథనం ప్రకారం.. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి సాంక్రియా తండాకు చెందిన నూనావత్ విజయ (39)కు మండలంలోని తోకబోడు తండా శివారులో ఎకరం వ్యవసాయ భూమి ఉంది. అందులో వరి పంట సాగు చేస్తుండగా, పొలానికి నీరు పారించడానికి శుక్రవారం మధ్యాహ్నం వెళ్లి రాత్రి పొద్దుపోయే వరకూ ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు, తండా వాసులు ఆమె ఆచూకీ కోసం గాలించి వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి పరిశీలించారు. అక్కడ ఆమె చెప్పులు, టవల్ కనిపించాయి. దీంతో బావిలో వెతకగా విజయ మృతదేహం కని పించింది. ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అగ్నిమాపక సిబ్బంది సాయంతో బావి నుంచి విజయ మృతదేహాన్ని బయటకుతీశారు. మృతురాలి కుమారుడు శ్రీరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా కురవి హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వారికి అప్పగించారు. ఎమ్మెల్యే ‘దొంతి’కి పరామర్శ హన్మకొండ చౌరస్తా: నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, సీత క్క పరామర్శించారు. ఇటీవల మాధవరెడ్డి తల్లి కాంతమ్మ మృతి చెందారు. శనివారం హనుమకొండలోని దొంతి నివాసంలో కాంతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాధవరెడ్డిని పరామర్శించిన వారిలో విప్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్యేలు నాగరాజు, సత్యనారాయణరావు, ఎంపీ బలరామ్నాయక్, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ జంగా రాఘవరెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎంపీ రాజయ్య, ‘కు డా’ చైర్మన్ వెంకట్రామ్రెడ్డి, పీసీసీ బాధ్యుడు ప్రభా కర్రెడ్డి, తదితరులు ఉన్నారు. -
రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలు షురూ
వరంగల్ స్పోర్ట్స్ : హనుమకొండలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ బాక్సింగ్ హాల్లో శనివారం పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–17 రాష్ట్ర స్థాయి బాలబాలికల బాక్సింగ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. జాతీయ స్థాయిలో పతకం సాధించిన క్రీడాకారులకు తన వంతుగా రూ.50వేలు న గదు పురస్కారం అందజేస్తానన్నారు. రెండు రోజుల పాటు జరుగనున్న పోటీలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 130 మంది బాలురు, 150 మంది బాలికలు హాజరైనట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి వెలిశెట్టి ప్రశాంత్కుమార్ తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈ నెల 28 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు అరుణాచల్ప్రదేశ్లో జరుగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలి పారు. అనంతరం బాక్సింగ్లో ఎన్ఐఎస్ పూర్తి చేసిన ఖమ్మంకు చెందిన క్రీడాకారిణి మానసను సన్మానించారు. కార్యక్రమంలో మామునూరు పీటీసీ సీఐ కాశీరాం, ఒ లింపిక్స్ సంఘం జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి మంచాల స్వామిచరణ్, తెలంగాణ పీఈటీల సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శీలం పార్ధసారథి, కె. మల్లారెడ్డి, ఎస్జీఎఫ్ అండర్–19 జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్, భూపాలపల్లి డీవైఎస్ఓ రఘు, ఇండియా బాక్సింగ్ కోచ్ ఆనంద్భాస్కర్ పాల్గొన్నారు. భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం● కుటుంబ కలహాలే కారణం? కాళేశ్వరం: మహదేవపూర్ మండలం బొమ్మాపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు శనివారం పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ కలహాలే కారణమని సమాచారం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ములకల రాజేశ్వరి, కిరణ్లకు నాలుగు నెలల కిందట ప్రేమవివాహం జరిగింది. కాగా, ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో శనివారం భార్యాభర్తలిద్దరూ పురుగులమందు తాగగా స్థానికులు గమనించి మహదేవపూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజేశ్వరిని భూపాలపల్లికి , కిరణ్ను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు. ఈ విషయమై ఎస్సై పవన్కుమార్ను సంప్రదించగా భార్యాభర్తలు పురుగుల మందు తాగిన విషయం తన దృష్టికి వచ్చిందని, కానీ, ఎలాంటి ఫిర్యాదూ రాలేదని తెలిపారు. -
రెండున్నర కిలోల గంజాయి స్వాధీనం
మహబూబాబాద్ రూరల్ : గంజాయి అమ్ముతున్న, సేవిస్తున్న ఐదుగురు యువకులను అరెస్టు చేసి, రెండున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు మహబూబాబాద్ టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి శనివారం రాత్రి వెల్లడించారు. పట్టణంలో టౌన్ ఎస్సై మౌనిక తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. స్థానిక నిజాం చెరువుకట్ట సమీపంలో ఐదుగురు యువకులు అనుమానాస్పదంగా ఉండి, పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. తోకబోడు తండాకు చెందిన లూనావత్ రవీందర్, అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంతానికి చెందిన భూక్య వినోద్, కాకతీయ కాలనీకి చెందిన లావుడ్య పవన్, భవానీ నగర్ తండాకు చెందిన భూక్య కుమార్, జగ్య తండాకు చెందిన భూక్య సాయిరాం గా గుర్తించి విచారణ చేసినట్లు తెలిపారు. వీరారం తండాకు చెందిన బాదావత్ ప్రశాంత్ భద్రాచలం, అరకు ప్రాంతాల నుంచి గంజాయిని తక్కువ ధరకు తెచ్చి తమకు విక్రయించేవాడని ఐదుగురు యువకులు ఒప్పుకున్నారు. అతని వద్ద గంజాయి కొనుగోలు చేసి వినియోగించడంతోపాటు ఇతరులకు విక్రయిస్తున్నట్లుగా అంగీకరించినట్లు తెలిపారు. యువకుల వద్ద తనిఖీ చేయగా.. చిన్నచిన్న పొట్లాలుగా కట్టిన సుమారు రూ.1,27,500 విలువైన రెండున్నర కిలోల గంజాయి లభించిందన్నారు. ఐదుగురు యువకుల వద్ద నుంచి ద్విచక్ర వాహనం, 5 సెల్ఫోన్లు సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించామని సీఐ తెలిపారు. విక్రయ, వినియోగదారుల అరెస్టు వివరాలు వెల్లడించిన సీఐ గట్ల మహేందర్ రెడ్డి -
ఈవీ బస్సులు..
గుదిబండగానేడు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి రాక టీజీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి ఆదివారం వరంగల్ పర్యటనకు వస్తున్నారు. ఆర్టీసీ ఎండీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నాగిరెడ్డి తొలి పర్యటన వరంగల్ రీజియన్లో కొనసాగనుంది. వరంగల్ రీజియన్ పరిస్థితులపై ఈ పర్యటనలో అధ్యయనం చేసి అధికారులకు అవసరమైన సూచనలు ఇవ్వనున్నారు. ఎండీ పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బస్పాయింట్ల వద్ద ఏ రూట్ బస్సులు నిలుపుతారో వివరాలతో కూడిన స్టిక్కర్లు అంటించారు. హన్మకొండ: ఎలక్ట్రిక్ బస్సులు(ఈవీ).. టీజీఎస్ ఆర్టీసీకి గుదిబండగా మారాయి. తరచూ వైఫల్యాలతో ప్రయాణికులతోపాటు ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఎప్పుడు? ఎక్కడ? ఆగుతుందో తెలియని పరిస్థితుల్లో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల తీరు ఉందని ఉద్యోగులు మొత్తుకుంటున్నారు. ప్రతీ రోజు 10 నుంచి 20 బస్సులు మరమ్మతులకు గురవుతున్నాయని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. మరమ్మతులు చేసేందుకు అవసరమైన విడిభాగాలు అందుబాటులో లేక రోజుల తరబడి నిరుపయోగంగా ఉంటున్నాయి. ఫలితంగా బస్సులు అందుబాటులో లేక విధులకు వచ్చే కండక్టర్లకు నిరీక్షణ తప్పడం లేదు. రోజంత డిపోలోనే నిరీక్షించి డ్యూటీ లేకుండానే తిరిగి వెళ్తున్నారు. మరుసటి రోజు వస్తే ఆ రోజు కూడా డ్యూటీ ఉంటుందో లేదో తెలియని దుస్థితి టీజీఎస్ ఆర్టీసీ వరంగల్–2 డిపోలో నెలకొందని ఉద్యోగులు మొత్తుకుంటున్నారు. వెయిటింగ్తో విసిగి వేసారి పోతున్నామని కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని వారు వాపోయారు. ట్రాఫిక్ విధులు నిర్వహించే ఓ అధికారి తీరుతో మానసికంగా కృంగిపోతున్నామని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు. అవసరాలకు సెలవు ఇవ్వాలని కోరితే ససేమిరా అంటోందని వారు వాపోతున్నారు. కాగా, యాజమాన్యం సంస్థ అవసరాల కోసం సీనియర్ ఉద్యోగులకు అసిస్టెంట్ డిపో క్లర్క్ (ఏడీసీ)లుగా పదోన్నతి కల్పించింది. ప్రతీ డిపోలో అవసరం మేరకు ఏడీసీ (కంట్రోలర్)లను నియమించింది. వారు అందుబాటులో ఉన్నా.. కంట్రోలర్ను కాదని కండక్టర్కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కండక్టర్ బుకింగ్ బాధ్యతలు అప్పగించడంపై ఉద్యోగ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. యాజమాన్యం అదనపు బాధ్యత (ఓడీ)లను రద్దు చేసినా వరంగల్–2 డిపోలో అదనపు బాధ్యతతో కండక్టర్ను తీసుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కార్బన్ ఉద్గారాలను భారీగా తగ్గించి స్వచ్ఛమైన రవాణ వ్యవస్థను నిర్మించడానికి ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా వరంగల్ రీజియన్కు మొత్తం 112 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించగా, జేబీఎం ఎకోలైఫ్ సంస్థ 112 బస్సులు సరఫరా చేసి నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుంది. టీజీఎస్ ఆర్టీసీతో కలిసి బస్సులు నడపుతోంది. మొత్తం 112 బస్సుల్లో ఇందులో సూపర్ లగ్జరీ 21, డీలక్స్ 22, ఎక్స్ప్రెస్ బస్సులు 69 ఉన్నాయి. వీటిని హనుమకొండ నుంచి హైదరాబాద్, నిజామాబాద్, ఏటూరునాగారం, సూర్యాపేట, సిద్దిపేట, కాళేశ్వరం, ఖమ్మం రూట్లలో నడుపుతున్నారు. అయితే ఈ బస్సులు తరచూ మరమ్మతులకు గురవుతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతీ రోజు 10 బస్సులకు తగ్గకుండా ఫెయిలవుతున్నాయి. ప్రతీ రోజు 15 వేల కిలో మీటర్లు రద్దవుతుందని అధికారులు తెలిపారు. తరచూ మరమ్మతులకు గురవుతున్న పరిస్థితి బస్సులు అందుబాటులో లేక విసిగిపోతున్న కండక్టర్లు రోజంతా నిరీక్షించి ఇంటికెళ్తున్న ఉద్యోగులుజేబీఎం బస్సులపై ఆర్టీసీ ఉదాసీనత..ఆర్టీసీ అద్దె బస్సులు మరమ్మతుకు గురై ఒక్క రోజు నడపకుంటే రూ.2 వేలు జరిమానా విధిస్తున్న ఆర్టీసీ.. జేబీఎం బస్సులు పదుల సంఖ్యలో నిలిచిపోతున్నా ఎలాంటి జరిమానా విధించకుండా ఉదాసీనత ప్రదర్శిస్తోంది. ఉద్యోగాలు రాక ఉపాధి కోసం ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన బస్సులు నడుపుతున్న వారికి మాత్రం జరిమానా విధిస్తూ కార్పొరేట్ కంపెనీలకు వత్తాసు పలుకుతూ అన్ని విధాలా సహకరిస్తోందనే విమర్శలు, ఆరోపణలు వినిపిస్తున్నాయి. అద్దె చెల్లింపులోనూ ఆ బస్సుల యజమానులకు ఆర్టీసీ వివక్ష చూపుతోంది. జేబీఎం బస్సులకు కిలో మీటర్కు రూ.39.90 చొప్పున చెల్లిస్తుండగా, ప్రైవేట్ అద్దె బస్సులకు రోజు తిరిగే కిలో మీటర్లను బట్టి రూ.6 నుంచి రూ.15 వరకు చెల్లిస్తోంది. అద్దె ఎక్కువ మొత్తంలో చెల్లిస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు నడవకున్నా చూసీచూసినట్లు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యత లేని బస్సులతో డ్రైవర్లు నష్టపోతున్నారని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. బస్సు బాడీ డ్యామేజీ అయితే డ్రైవర్ల నుంచి రూ.వేలల్లో వసూలు చేస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. -
రైతుల ఆర్థిక ప్రగతికి మరింత కృషి
జనగామ రూరల్: వ్యవసాయ రంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన’ పథకం జిల్లా రైతుల్లో ఆశలు నింపుతోంది. దేశ వ్యాప్తంగా వంద జిల్లాలను ఈ పథకం కింద ఎంపిక చేయగా, తెలంగాణ నుంచి నాలుగు జిల్లాలు జనగామ, నారాయణ పేట, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలను గుర్తించారు. ఈ మేరకు శనివారం ప్రధాన మంత్రి మోదీ ఈ పథకాన్ని వర్చువల్గా ప్రారంభించగా, జనగామ కలెక్టరేట్లో కలెక్టర్ రిజ్వాన్ బాషా, ఎమ్మెల్యే రాజేశ్వర్రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఉత్పాదకతలో మార్పులు తీసుకొచ్చేలా కేంద్రం నూతన పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం అమలు కానుందన్నారు. జనగామకు ప్రత్యేక ప్రాధాన్యం వర్ష ఆధారిత పంటల ఉత్పత్తి ప్రాంతంగా ప్రసిద్ధిగాంచిన జనగామ జిల్లాలో ఈ పథకం మొక్కజొన్న, పత్తి, ధాన్యం, మిర్చి వంటి పంటలకు కొత్త దారులు తెరుస్తుందని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు. జిల్లాలోని రైతు ఉత్పత్తిదారుల సంస్థల ద్వారా పంటల ప్రాసెసింగ్ యూనిట్లు, ప్యాకేజింగ్ కేంద్రాలు, మార్కెట్ లింకులు ఏర్పాటు చేయనున్నారు. దీంతో రైతులకు మధ్యవర్తుల అవసరం తగ్గి ఉత్పత్తికి తగిన ధర లభించే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం ప్రారంభం తెలంగాణలో జనగామతోపాటు మరో మూడు జిల్లాలకు అవకాశం వర్చువల్గా పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ పాల్గొన్న కలెక్టర్ రిజ్వాన్ బాషా, ఎమ్మెల్యే రాజేశ్వర్రెడ్డి, అధికారులు -
అంతర్జాతీయ స్థాయిలో ‘ఎస్సార్’కు ర్యాంకింగ్
హసన్పర్తి: ప్రపంచ ప్రఖ్యాత టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్ఈ) వరల్డ్ ర్యాంకింగ్లో ఎస్సార్కు చోటు దక్కింది. ఇటీవల విడుదల చేసిన ర్యాంకింగ్–2026లో 801–1000 శ్రేణిలో నిలిచింది. ఈ మేరకు శనివారం అన్నాసాగరంలోని ఎస్సార్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చాన్స్లర్ ఎ.వరదారెడ్డి మాట్లాడారు. తెలంగాణలో అంతర్జాతీయ ర్యాంకింగ్ సాధించిన ఏకై క యూనివర్సిటీ ఎస్సార్ అని చెప్పారు. బో ధన, పరిశోధన, సైటెషన్స్, అంతర్జాతీయ దృష్టి కోణం, ఇండస్ట్రీ ఇన్కమ్ వంటి ఐదు ప్రధాన విభాగాల ఆధారంగా 17 సూచిక ద్వారా ఈ ర్యాంకింగ్ను ప్రకటించినట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 5లక్షల యూనివర్సిటీలుండగా, ఐదు ఏళ్ల వయసు కలిగిన ఎస్సార్ గుర్తింపు పొందడం సంతోషకరంగా ఉందన్నారు. కల సాకారమైంది.. తాను నెలకొల్పిన విద్యాసంస్థ ప్రపంచంలోనే గుర్తింపు సాధించాలనే తన కల సాకారమైందని ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్లర్, ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ ఎ. వరదారెడ్డి ఆనందం వ్యక్తం చేశా రు. ఇటీవల వెలువడిన ఎన్ఐఆర్ఎఫ్–2025 ర్యా కింగ్లో ఎస్సార్ యూనివర్సిటీ విభాగంలో 91 స్థా నం సాధించినట్లు చెప్పారు. విశ్వవిద్యాలయ విభాగంలో 101–150 శ్రేణిలో నిలిచినట్లు చెప్పారు. 2026 ఎడిషన్ జెడ్డా (సౌదీ అరేబియా)లో జరిగిన వరల్డ్ అకడమిక్ సందర్భంగా విడుదలచేసిన ర్యాంకింగ్లో అమెరికా మొదటి స్థానంలో చోటు దక్కించుకోగా, భారతదేశం రెండో స్థానంలో నిలిచిందన్నారు. ఇందులో ఓవరాల్ విశ్వవిద్యాలయ విభాగంలో ఎస్సార్ 28 స్థానంలో, ప్రైవేట్ యూనివర్సిటీల్లో 10వ స్థానంలో చోటు దక్కించుకుందన్నారు. వైస్ చాన్స్లర్ దీపక్ గార్గ్ మాట్లాడుతూ బలమైన విద్యా ప్రతిపాదిక, అంతర్జాతీయ దృష్టి కోణానికి ర్యాంకింగ్ నిదర్శనంగా పేర్కొన్నారు. సమావేశంలో ప్రో వైస్ చాన్స్లర్ డాక్టర్ మహేశ్, ప్రొఫెసర్ రమణారావు, రిజిస్ట్రార్ డాక్టర్ అర్చనారెడ్డి, డీన్ ప్రొఫెసర్ పి.వి.రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు. కల సాకారమైంది ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్లర్ వరదారెడ్డి -
అంగన్వాడీల్లో అవస్థలు
మహబూబాబాద్: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు అవస్థల నడుమ కొట్టుమిట్టాడుతున్నాయి. ఏడు నెలలుగా అంగన్వాడీ కేంద్రాల అద్దె బిల్లులు రాక అంగన్వాడీ టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయలు, గ్యాస్ బిల్లులు కూడా పెండింగ్లోనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక పిల్లలు, గర్భిణులు, బాలింతలకు తిప్పలు తప్పడంలేదు. దీనికితోడు సిబ్బంది కొరతతో కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పర్యవేక్షణ లోపంతో కొంతమంది టీచర్లు సమయపాలన పాటించడం లేదు. 1,435 కేంద్రాలు జిల్లాలోని ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ల పరిధిలో 1,435 కేంద్రాలు ఉన్నాయి. డోర్నకల్ ప్రాజెక్ట్ పరిధిలో డోర్నకల్, గార్ల, కురవి, గూడూరు ప్రాజెక్ట్ పరిధిలో గూడూరు, గంగారం, కొత్తగూడ మండలాలు, మానుకోట ప్రాజెక్ట్ పరిధిలో మానుకోట, బయ్యారం, కేసముద్రం, మరిపెడ ప్రాజెక్ట్ పరిధిలో చిన్నగూడూరు, దంతాలపల్లి, మరిపెడ, నర్సింహులపేట, తొర్రూరు ప్రాజెక్ట్ పరిధిలో నెల్లికుదురు, తొర్రూరు, పెద్ద వంగర మండలాలు ఉన్నాయి. ఆ కేంద్రాల్లో జీరో నుంచి ఆరు నెలల లోపు పిల్లలు 3,604 మంది ఏడు నెల నుంచి మూడు సంవత్సరాలలోపు పిల్లలు 20,295 మంది, మూడేళ్ల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు 16,181 మంది ఉన్నారు. 452 కేంద్రాలు అద్దె భవనాల్లోనే.. 1,435 కేంద్రాల్లో 452 కేంద్రాలు అద్దె భవనాల్లో, 339 కేంద్రాలు సొంత భవనాల్లో, అద్దె లేకుండా (ప్రీరెటెండ్ ) భవనాల్లో 644 కేంద్రాలు కొనసాగుతున్నాయి. 732 సెంటర్లలో మరుగుదొడ్లు లేవు. 703 కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం లేదు. 397 కేంద్రాల్లో తాగు నీటి సౌకర్యం లేక టీచర్లు, ఆయాలు, చిన్నారులు, బాలింతలు, గర్భిణులు ఇబ్బందిపడుతున్నారు. ఏడు నెలల అద్దె బిల్లులు పెండింగ్లోనే.. ఈఏడాది జనవరి, ఫ్రిబవరి నెలల అద్దె బిల్లులు మాత్రమే వచ్చాయని అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల బిల్లులు సైతం ఏడు నెలలుగా రాలేదని, నెలల తరబడి గ్యాస్ బిల్లులు పెండింగ్లో ఉంటున్నాయని చెబుతున్నారు. ఖాళీ చేయాలంటున్న యజమానులు నెలల తరబడి అద్దె బిల్లులు పెండింగ్లో ఉండడంతో ఇళ్ల యజమానులు ఖాళీ చేయాలంటున్నారు. ప్రతీరోజు ఏదో ఒకటి చెప్పి కేంద్రాలను నిర్వహిస్తున్నామని వాపోతున్నారు. ఎప్పుడు ఇచ్చేది తెలియకపోవడంతోపాటు వారికి సమాధానం చెప్పలేక ఇబ్బందిపడాల్సి ఉంటుందని అంగన్వాడీ టీచర్లు వాపోతున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా.. బిల్లుల పెండింగ్ విషయంలో ఫైళ్లు పరిశీలించి ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్తా.. ఈ మధ్యనే జిల్లాకు బదిలీపై వచ్చాను. అన్ని విషయాలను తెలుసుకుని సమస్యలు పరిష్కరిస్తా. టీచర్లు సమయ పాలన పాటించాలి. మోనూ ప్రకారం భోజనం, పౌష్టికాహారం అందించాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. – సబిత, జిల్లా సంక్షేమాధికారి పెండింగ్లోనే కేంద్రాల అద్దె బిల్లులు సెంటర్లలో కనీస సౌకర్యాలు కరువు వేధిస్తున్న సిబ్బంది కొరత సమయ పాలన పాటించని పలువురు టీచర్లు692 పోస్టులు ఖాళీగానే.. 116మంది టీచర్లు, 576 ఆయా పోస్టులు మొత్తం 692 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. 58 మంది సూపర్వైజర్లకు 46 మంది మాత్రమే ఉన్నారు. ఖాళీలతో పర్యవేక్షణ సక్రమంగా లేకుండా పోయింది. దీంతో కొంతమంది టీచర్లు సమయపాలన పాటించడం లేదు. కొంత మంది టీచర్లకు మరో కేంద్రం ఇన్చార్జ్ ఇవ్వడంతో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. -
లాభదాయక పంటలు సాగు చేయాలి
మహబూబాబాద్ రూరల్ : రైతులు లాభదాయకమైన పంటలను సాగుచేయాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల అన్నారు. ప్రధాని మోదీ పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని వర్చువల్ విధానంలో శనివారం ప్రారంభించగా మానుకోట రైతు వేదికలో వ్యవసాయ అధికారులు, రైతులు వీక్షించారు. ఈ సందర్భంగా డీఏఓ విజయనిర్మల మాట్లాడుతూ.. దేశంలో వ్యవసాయ ఉత్పాదన, సాంద్రత, రుణ పరపతి తక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం, రైతుల ఆదాయం రెట్టింపు, వ్యవసాయంలో వస్తున్న మార్పులను రైతులకు తెలియజేయడం, లాభదాయక పంటలను ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఆరేళ్లపాటు పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం కొనసాగుతుందని, ఎంపిక చేసిన జిల్లాల్లో మొదటి విడతగా ప్రారంభించారన్నారు. సంప్రదాయ వ్యవసాయ విధానాలతోపాటు ఆధునిక పద్ధతులను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో ఏడీఏలు అజ్మీరా శ్రీనివాసరావు, విజయచంద్ర, మరిపెడ ఆత్మ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి, జిల్లాలోని అన్ని మండలాల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు. డీఏఓ విజయనిర్మల పీఎం ధన్ ధాన్య కృషి యోజన ప్రారంభం -
విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించాలి
గార్ల: సాధించాలనే పట్టుదల, సంకల్పం, సరైన ప్రణాళిక, శారీరక సుఖాలను త్యాగం చేసే గుణం, ఆచరించేతత్వం ఉంటే అమ్మాయిలు అద్భుత ఫలాలను పొందవచ్చని జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి సూచించారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలికల చట్టాలపై గార్ల కస్తూర్బాగాంధీ పాఠశాలలో ఆమె విద్యార్థినులకు అవగాహన కల్పించారు. తొలుత గార్లలో కమ్యూనిటీ మీడియేషన్ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. లక్ష్యం మాత్రమే ఉంటే సరిపోదని తగిన శ్రమ అవసరమని అన్నారు. 18 సంవత్సరాల వయస్సు లోపల ఉన్న బాలికలపై అసభ్యంగా ప్రవర్తిస్తే పోక్సో చట్టం కఠినంగా శిక్షిస్తుందన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ద్వా రా శిక్షణ పొందిన కమ్యూనిటీ మీడియేటర్లు తమ వద్దకు వచ్చిన కమ్యూనిటీ వివాదాలను పరిష్కరించడంలో చురుకై న పాత్ర పోషించాలని కోరారు. ఈ రోజుల్లో జనాభా పెరిగిన నిష్పత్తిలో కోర్టుల సంఖ్య పెరగకపోవడంతో, ప్రత్యామ్నాయ పద్ధతుల్లో కేసులను పరిష్కరించడానికి కమ్యూనిటీ మీడియేషన్ కేంద్రాలు స్థాపిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా కేంద్రాలను ఓపెన్ చేశామని అవి విజయవంతంగా నడుస్తున్నందున, జిల్లాలో తొలిసారి గార్లలో ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ శారద, ఎంపీడీఓ మంగమ్మ, ఎస్సై రియాజ్పాషా, లాయర్లు జంపాల విశ్వ, కృష్ణారెడ్డి, కమ్యూనిటీ మీడియేటర్స్ అలువాల రామకృష్ణ, గిన్నారపు మురళి, పుట్టల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. గార్ల మండలం మర్రిగూడెం వేట వెంకటేశ్వరస్వామిని శనివారం జిల్లా జూనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి దర్శించుకున్నారు. జడ్జి వెంట ఆలయం ఈఓ సంజీవరెడ్డి, ఎస్సై రియాజ్పాషా, కుటుంబరావు ఉన్నారు. జిల్లా జూనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి గార్లలో తొలి కమ్యూనిటీ మీడియేషన్ కేంద్రం ప్రారంభం -
– వెంకటాపురం(ఎం)
ఆదివారం శ్రీ 12 శ్రీ అక్టోబర్ శ్రీ 2025నీటిలో తేలియాడే ఇటుకలు.. నల్లరాతి స్తంభాలు.. సరిగమలు పలికే శిల్పం.. భూకంపాలను తట్టుకునే ఆలయం.. ఓరుగల్లుకు చరిత్ర అందించిన అతిగొప్ప వరం రామప్ప. యునెస్కో గుర్తింపుతో ఈఆలయ గొప్పదనం విశ్వవ్యాప్తమైంది. ఇప్పుడు ఆ కట్టడం ప్రపంచ దేశాలకు ఆదర్శమవుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు, చరిత్రకారులు వారి వారి దేశాల్లో రామప్పను పోలిన కట్టడాలు నిర్మించడంలో భాగస్వాములవుతున్నారు. అంతేకాకుండా ఓరుగల్లులోని వివిధ ప్రాంతాల్లో నిర్మించిన అద్భుత కట్టడాలను పరిచయం చేస్తూ వాటి గొప్పదనాన్ని ప్రపంచ నలుమూలలకు తెలిసేలా వరల్డ్ హెరిటేజ్ క్యాంపు వివిధ దేశాల వలంటీర్లకు శిక్షణ ఇస్తోంది. ఈ క్యాంపు ప్రత్యేకతలే ఈ ఆదివారం ‘సాక్షి’ స్పెషల్ స్టోరీ. వలంటీర్లకు రామప్ప ఆలయ శిల్పాల ప్రత్యేకతలను వివరిస్తున్న టూరిస్ట్ గైడ్వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఏటా అక్టోబర్లో వివిధ దేశాల వలంటీర్లకు శిక్షణ ఇస్తోంది. గత నాలుగేళ్లుగా రామప్పలో క్యాంపు కొనసాగుతుండగా.. ప్రస్తుతం ఈనెల 8న క్యాంపు ప్రారంభమైంది. 12 రాష్ట్రాలకు చెందిన 35 మందితో పాటు ఇరాన్ దేశానికి చెందిన మరో ముగ్గురు శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నారు. ఈనెల 17తో హెరిటేజ్ క్యాంపు ముగియనుంది. రామప్ప ఖ్యాతిని విస్తరిస్తా.. శిక్షణ శిబిరంలో నేర్చుకున్న మెళకువలతో రామప్ప ఖ్యాతిని విస్తరించేందుకు కృషి చేస్తా. మ్యూజియంలో పని చేయడానికి, మ్యూజియానికి వచ్చిన ప్రజలకు చారిత్రక కట్టడాల గురించి వివరించేందుకు ప్రయత్నం చేస్తా. ఆలయంలోని ఆర్కిటెక్చర్ చాలా డిఫెరెంట్గా బాగుంది. – హమీద్ దాస్, కోల్కతాఇండియా కల్చర్ నచ్చి వచ్చాను.. ఇండియా కల్చర్ అంటే చాలా ఇష్టం. గతంలో కెన్యా, ఇరాన్ హెరిటేజ్ క్యాంపులో పాల్గొన్నా. రామప్పలో హెరిటేజ్ క్యాంపు వాటి కంటే బాగుంది. పర్సనల్గా ఇండియా కల్చర్పై ప్రాజెక్ట్ తీసుకుని ఇక్కడి పాఠాలను అనుభవంగా తీసుకుంటా. రామప్ప టెంపుల్ వండర్ ఫుల్. – నియూషా, ఇరాన్ -
బావిలో పడి ఇద్దరు చిన్నారుల మృతి
కొత్తగూడ: పిల్లలిద్దరు అన్నాచెల్లెలి కుమారులు. దసరా పండుగకు తాతమ్మ ఇంటికి వచ్చారు. ఇంట్లో వాళ్లు ఓ చావు కార్యక్రమానికి వేరే ఊరికి వెళ్లారు. మధ్యాహ్న సమయంలో చిన్నారులిద్దరు బహిర్భూమి కోసం సమీపంలోని బావి వద్దకు వెళ్లారు. అందులో దిగిన చిన్నారులకు లోతు తెలియక ప్రమాదవశాత్తు ఒకరితర్వాత మరొకరు మునిగి చనిపోయారు. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో నివాసం ఉంటున్న ఇటుకాల నర్సయ్య–స్వాతి దంపతుల కుమారుడు రితిక్(10), ములుగు జిల్లా పులిమడుగు గ్రామానికి చెందిన అనిత– శ్రీనివాస్ దంపతుల కుమారుడు జతిన్(09)లు దసరా సెలవులకు ఎంచగూడెంలోని తాతఅమ్మ ఇటుకాల సారయ్య–నర్సమ్మ వాళ్ల ఇంటికి వచ్చారు. వరంగల్ జిల్లా అశోక్నగర్లో బంధువు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు ఆ బాలురిద్దరిని ఇంటి వద్ద వదిలివెళ్లారు. మధ్యాహ్నం సమయంలో రితిక్, జతిన్లు కలిసి బహిర్భూమికి సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందారు. చావుకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి వద్ద చిన్నారులు కనిపించకపోవడంతో వెతకడం ప్రారంభించగా బావిగడ్డపై సమీపంలో పిల్లల చెప్పులు కనిపించాయి. అనుమానంతో వెతకడంతో ముందుగా రితిక్ మృతదేహం లభించింది. విషయం తెలుసుకున్న కొత్తగూడ ఎస్సై రాజ్కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని జతిన్ మృతదేహన్ని బయటకు తీయించారు. అన్నా చెల్లెలి కుమారులు... అనిత, నర్సయ్యలు అన్నాచెల్లెళ్లు. అనిత కుమారుడు జతిన్, నర్సయ్య కుమారుడు రితిక్లు వరుసకు బావాబామ్మర్దులు. ఇటీవల కురిసిన వర్షాలకు బావిగడ్డ నానడం.. అందులోకి దిగిన జతిన్, రితిక్లు బావిగడ్డ జారడంతో ఈత రాకపోవడంతో మునిగి చనిపోయినట్లు భావిస్తున్నారు. పిల్లల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పండుగ కోసం వచ్చి పరలోకాలకు వెళ్లారని, బావాబామ్మర్దులు ఒకరిని కాపాడేందుకు మరొకరు చనిపోయారంటూ గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇద్దరు పిల్లల మృతితో ములుగు జిల్లా పులిమడుగు, వరంగల్ జిల్లా నర్సంపేట, మహబూబాబాద్ జిల్లా ఎంచగూడెం గ్రామాల్లో విషాదం నెలకొంది. బహిర్భూమికి వెళ్లగా ప్రమాదం మృతులు అన్నాచెల్లెలి కుమారులు దసరా పండుగకు తాతమ్మ ఇంటికి.. మూడు గ్రామాల్లో విషాదం -
డిజిటల్ హుండీల ఏర్పాటు
ఎస్ఎస్తాడ్వాయి : మేడారంలోని సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద భక్తులు ఆన్లైన్లో కానుకల చెల్లింపునకు తాడ్వాయి కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో పూజారులతో కలిసి శుక్రవారం డిజిటల్ హుండీలు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకునేందుకు మేడారానికి భక్తులు బుధ, గురు, శుక్ర, ఆదివారాల్లో వేల సంఖ్యలో వస్తున్నారు. వారు ఇబ్బంది పడకుండా గూగుల్, ఫోన్ పే ఆన్లైన్ చెల్లింపుల కోసం కెనరా బ్యాంక్ అధికారులు క్యూఆర్ స్కాన్ కోడ్ డిజిటల్ హుండీ అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ లకావత్ సునీల్కుమార్ మాట్లాడుతూ.. క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా భక్తులు సమర్పించిన కానుకలు సమ్మక్క–సారలమ్మ ఖాతాలో నేరుగా జమవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారులు కొక్కెర కృష్ణయ్య, ఎండోమెంట్ జూనియర్ అసిస్టెంట్ జగదీశ్వర్ పాల్గొన్నారు. -
కేఎంసీలో వైట్కోట్ సెరిమనీ
ఎంజీఎం : కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో 2025–26 విద్యాసంవత్సరానికి గాను ఎంబీబీఎస్ విద్యార్థులకు వైట్ కోట్ సెరిమనీ ఎన్ఆర్ఐ ఆడిటోరియంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య సుంకరనేని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథులుగా ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్, చికాగో(కేఎంసీ పూర్వ విద్యార్థి) డాక్టర్ సురేష్ రెడ్డి, సీనియర్ అలుమ్నస్ డాక్టర్ వీ.ఎల్.ఎన్.రావు హాజరయా ్యరు. ఈ సందర్భంగా వారు వైద్య వృత్తి ప్రాధాన్య త, సేవా దృక్పథం, నైతిక విలువలౖ పె విద్యార్థుల కు వివరించారు. అనంతరం ప్రి న్సిపాల్ విద్యార్థులతో హిప్పోక్రటిక్ ప్రమాణం చేయించారు. ఎంజీ ఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ పాల్గొన్నారు. -
బ్రోకర్ మాటల్లో నేర్పరి సీఎం రేవంత్
హన్మకొండ: బ్రోకర్ మాటలు మాట్లాడడంలో సీఎం రేవంత్ రెడ్డి నేర్పరి అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం హనుమకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్లు సాధ్యం కాదని జీఓ–9 తీసుసుకువచ్చి బీసీలను మోసం చేశారని ధ్వజమెత్తారు. మాటలతో కాంగ్రెస్ అగ్ర నాయకత్వాన్ని, ప్రజలను మోసం చేసి సీఎం అయ్యారని విమర్శించారు. యూరియా కొరతతో ప్రజలు కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో తరిమి కొట్టే పరిస్థితి నెలకొందని, దీంతోపాటు హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిసి వారి దృష్టి మళ్లించేందుకు బీసీ రిజర్వేషన్ల డ్రామాను ముందుకు తీసుకువచ్చాడని దుయ్యబట్టారు. కేంద్రంలో, రాష్ట్రంలో 55 ఏళ్లు అధికారంలో ఉండి కాంగ్రెస్ ఎందుకు బీసీలకు రిజర్వేషన్లు పెంచలేదని ప్రశ్నించారు. రాష్ట్రాలకు రిజర్వేషన్లు నిర్ణయించే అధికారం ఇవ్వాలని అనడం నేరమని, అడిగిన వారిని జైల్లో పెట్టాలని గతంలో రేవంత్ మాట్లాడిన వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సీఎం రేవంత్ ఒక్క మీటింగ్ పెట్టలేదని, మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేదని, దీన్ని బట్టి వీరికి ఎన్నికలు జరగవని ముందే తెలుసని అర్థమవుతుందన్నారు. బీసీలను సీఎం రేవంత్, కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాలని, తాము కూడా మద్దతుగా వస్తామన్నారు. అంతకుముందు కాంగ్రెస్ బాకీ కార్డులను ఆవిష్కరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్ కుమార్, శంకర్ నాయక్, డాక్టర్ తాటికొండ రాజయ్య, నాయకులు జోరిక రమేష్, చింతల యాదగిరి, చల్ల వెంకటేశ్వర్ రెడ్డి, బండి రజనీకుమార్, రామ్మూర్తి, పాలకుర్తి, వర్ధన్నపేట నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు -
సికింద్రాబాద్–కాజీపేట మధ్య 3వ, 4వ రైల్వేలైన్
110 కి.మీ నిర్మాణానికి రంగం సిద్ధం రూ.2,837 కోట్ల వ్యయ అంచనా కాజీపేట రూరల్ : రైల్వేశాఖ సికింద్రాబాద్–కాజీపేట మధ్య 3వ, 4వ రైల్వే లైన్ నిర్మాణానికి రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు రూ.2,837 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ (ఘట్కేసర్) నుంచి కాజీపేట వరకు 110 కి.మీ.తో మేడ్చల్, యాదాద్రి, జనగామ, హనుమకొండ జిల్లాలను కలుపుతూ 3వ, 4వ రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు శుక్రవారం రాత్రి రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే బల్లార్షా నుంచి కాజీపేట వరకు అక్కడక్కడ చిన్న చిన్న బిట్ వర్క్స్ తప్ప 3వ లైన్ నిర్మాణం పూర్తయ్యింది. కాజీపేట–సికింద్రాబాద్ మధ్య 3వ లైన్ కావాల్సి ఉంది. కొత్తగా చేపట్టనున్న 3, 4వ లైన్ నిర్మాణ ప్రాజెక్ట్ కాలం 4 ఏళ్లు పట్టనుంది. ముఖ్యంగా ఈ మార్గంలో బొగ్గు, సిమెంట్ ఉత్పత్తి రవాణాలో రైళ్ల ట్రాఫిక్ తగ్గుతుంది. ప్రస్తుతం 110 కి.మీ.వేగంతో రైళ్లు వెళ్తుండగా, 3, 4వ రైల్వే లైన్ మార్గాలు పూర్తయితే గంటకు 130 కి.మీ.వేగంతో రైళ్లు ప్రయాణించనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతోపాటు ప్రస్తుతం సికింద్రాబాద్–కాజీపేట వరకు ఉన్న రైళ్ల సమయంలో అరగంట తగ్గుతుందని భావిస్తున్నారు. -
పెన్షనర్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి
హన్మకొండ అర్బన్ : రిటైర్డ్ పెన్షనర్లకు వెంటనే బెనిఫిట్స్ చెల్లించాలని శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ సీతారాం మాట్లాడారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 2024,మార్చి నుంచి రిటైర్డ్ అయిన పెన్షనర్లకు బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. పెన్షనరీ బెనిఫిట్స్ రాక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు.వైఎస్ రాజశేఖర రెడ్డి ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత వైద్యం పొందుతున్నామని, ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకం రూపొందించి సత్వరం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండ్యాల బ్రహ్మయ్య, జె.ప్రభాకర్ రెడ్డి, నారాయణగిరి వీరన్న, వన్నాల రాజమల్లు, సుధాకర్, శంకరయ్య, మండువ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. నిరసన అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందించారు. -
రైల్వే కార్మికులకు మెరుగైన వైద్యం
కాజీపేట రూరల్ /డోర్నకల్ : రైల్వే కార్మికులకు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు రైల్వే శాఖ నిరంతరం కృషి చేస్తోందని దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపాల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ (పీసీఎండీ) డాక్టర్ నిర్మలారాజారాం అన్నారు. కాజీపేట రైల్వే ఆస్పత్రిని శుక్రవారం సికింద్రాబాద్ డివిజన్ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ (సీఎంఎస్) డాక్టర్ నారాయణస్వామితో కలిసి వారు సందర్శించి తనిఖీ చేశారు.అలాగే సకల వసతులతో డోర్నకల్లో పునః నిర్మించిన రైల్వే ఆస్పత్రిని డీఆర్ఎం డాక్టర్ గోపాలకృష్ణణ్, డీఆర్యూసీసీ సభ్యులు ఖాదర్, రైల్వే చీఫ్ మెడికల్ సూపరిండెంటెంట్ నారాయణ స్వామి, రైల్వే ఆస్పత్రి డాక్టర్ సునీల్ కుమార్ కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైల్వే ఆస్పత్రి నుంచి కార్మికులకు అన్ని రకాల మెరుగైన వైద్యం అందించేందుకు నగరంలో మూడు రెఫరల్ ఆస్పత్రుల నుంచి వైద్యం అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఏకశిల ఆస్పత్రి ఆధ్వర్యంలో సీపీఆర్ డెమోను డాక్టర్ ఆసిఫ్ ఇక్బాల్ నిర్వహించగా ఆమె అభినందించారు. రైల్వే ఆస్పత్రి హాల్లో డాక్టర్లు నిరంజన్రావు, నరేందర్ హిర్వాని, యాకూబ్, దీరజ్, హరిబాబులతో సమావేశమై పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో మొక్క నాటారు. రైల్వే నాయకుల వినతులు కాజీపేట రైల్వే ఆస్పత్రిని తనిఖీ చేసేందుకు వచ్చిన డాక్టర్ నిర్మలారాజారాంకు రైల్వే మజ్దూర్ యూనియన్ అన్ని బ్రాంచీల కోఆర్డినేటర్ నాయిని సదానందం, రైల్వే సంఘ్ సీడబ్ల్యూఎస్సీ మెంబర్ సాదినేని వెంకటనారాయణ, ఎస్సీ,ఎస్టీ నాయకులు బి.వీరన్న, కెఎన్.రావు, ఆర్.కుమార్, బి.జక్రియ ఆధ్వర్యంలో వైద్య సమస్యలను పరిష్కరించి, ఆస్పత్రిని అప్గ్రేడ్ చేయాలని వేర్వేరుగా వినతి పత్రాలు అందజేశారు. దక్షిణ మధ్య రైల్వే పీసీఎండీ డాక్టర్ నిర్మలారాజారాం -
నియామకమెప్పుడో..!
హన్మకొండ : టీజీ ఎన్పీడీసీఎల్లో చేపట్టిన సబ్ ఇ ంజనీర్ల నియామకంలో అన్యాయానికి గురైన తమ ను ఎప్పుడు విధుల్లోకి తీసుకుంటారని అభ్యర్థుల ను ఎదురు చూస్తున్నారు. యజమాన్యం చేసిన త ప్పిదాలు, అక్రమాలకు ఏడేళ్లుగా 24మంది అభ్యర్థులు నియామకాల కోసం నిరీక్షణ తప్పడం లేదు. ఈ క్రమంలో దిగువ కేడర్ ఉద్యోగులకు సబ్ ఇంజనీర్లుగా కన్వర్షన్కు అవకాశం కల్పించడంతో పోస్టులన్ని వారిచే భర్తీ చేస్తే తమకు పోస్టులు లేకుండా పోతా యని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తగ్గిన పోస్టుల సంఖ్య.. టీజీ ఎన్పీడీసీఎల్లో 497 సబ్ ఇంజనీర్ల భర్తీకి 2018, మే 24న నోటిఫికేషన్ విడుదల చేశారు. అదే ఏడాది జూలై 8న రాత పరీక్ష నిర్వహించి, ఆగష్టు 31న ఫలితాలు ప్రకటించారు. మెరిట్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు ఒరిజనల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సెప్టెంబర్ లో పాత సర్కిల్ వారీగా వేర్వేరు తేదీల్లో కాల్ లెటర్ పంపించారు. నోటిఫికేషన్లో పేర్కొన్న 497మందికి కాకుండా 427 మందికి మాత్రమే కాల్ లెటర్ పంపి, 70 పోస్టులు తగ్గించారు. అదే సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో తాత్కాలికంగా నియామక ప్రక్రియ నిలిపివేశారు. కోడ్ తర్వాత డిసెంబర్లో మరోసారి సర్టిఫికెట్ల పరిశీలనకు రావాలని కాల్ లెటర్ పంపారు. దీంతో మరో 24 పోస్టులు తగ్గించారని అర్హులైన అభ్యర్థులు తెలిపారు. ముందు కాల్ లెటర్ అందుకుని రెండోసారి రాని అభ్యర్థులు వెంటనే హైకోర్టును ఆశ్రయించగా అందరికీ తిరిగి జారీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు అధికారులు 427 మందికి కాల్లెటర్ పంపి పోస్టులు భర్తీ చేశారు. అయితే ఇక్కడ కోర్టు ఆదేశాలతో కాల్ లెటర్ పొందిన 24 మందిని పక్కన పెట్టారు. తాము అధికారులను ఈ విషయమై సంప్రదిస్తే కోర్టు కాల్ లెటల్ మాత్రమే జారీ చేయమని చెప్పిందని, ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పలేదంటూ తప్పించుకున్నారని అభ్యర్థులు వాపోయారు. అక్రమంగా నియామకాలు.. సబ్ ఇంజనీర్ రిక్రూట్మెంట్లో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు టీజీ ఎన్పీడీసీఎల్ యజమాన్యానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీజీ ఎన్పీడీసీఎల్ పాత పాలక మండలిని రద్దు చేసింది. ఐఏఎస్ అధికారి కర్నాటి వరుణ్ రెడ్డిని చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా, సీనియర్ సీజీఎంలను ఇన్చార్జ్ డైరెక్టర్లుగా నియమించింది. ఈ కమిటీ రాగానే అభ్యర్థులు సీఎండీని కలిసి వినతి పత్రం అందించి తమకు జరిగిన నష్టాన్ని వివరించారు. దీనికి తోడు ప్రజాపాలనలో ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు విచారణకు చేపట్టారు. టీజీ పీఎస్ఎస్సీకి చెందిన ఒకరు, టీజీ ఎస్పీడీసీఎల్, టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి ఇద్దరేసి అధికారులతో ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. నియామకాల ప్రక్రియ మొత్తాన్ని వడపోసి చివరకు అక్రమాలు జరిగినట్లు తేల్చింది. 24 మంది నియామకాలు అక్రమంగా జరిగినట్లు, అర్హత లేని వారిని నియమించినట్లు విచారణ కమిటీ తేల్చింది. దిగువ కేడర్కు సబ్ ఇంజనీర్లుగా అవకాశం ఆందోళనలో అన్యాయానికి గురైన 24 మంది అభ్యర్థులు అక్రమాలను గుర్తించిన ప్రత్యేక కమిటీ427 సబ్ ఇంజనీర్ పోస్టుల్లో 24 మంది అనర్హులను భర్తీ చేశారు. అర్హులైన 24 మందిని పక్కన పెట్టారని విచారణ కమిటీ తేల్చింది. అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్న 24 మందికి యాజమాన్యం నోటీసులు జారీ చేసింది. దీంతో కోర్టును ఆశ్రయించగా వారు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా న్యాయంగా ఉద్యోగాలు దక్కాల్సిన వారు మాత్రం యాజమాన్యం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మరో వైపు ఖాళీగా ఉన్న సబ్ ఇంజనీర్ల పోస్టులు అర్హత ఉన్న దిగువ కేడర్ ఉద్యోగులను కన్వర్షన్ ద్వారా భర్తీ చేస్తుండడంతో నష్టపోయిన అభ్యర్థులు తమ భవిష్యత్ ఏంటనే ఆలోచనలో పడ్డారు. వయోభారం మీద పడుతుండడంతో అభ్యర్థులు రోజు రోజుకూ కృంగిపోతున్నారు. ఇప్పటికై నా తమకు జరిగిన అన్యాయాన్ని, నష్టాన్ని గమనించి వెంటనే తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని సబ్ ఇంజనీర్ అభ్యర్థులు కోరుతున్నారు. -
బీసీ రిజర్వేషన్లపై అగ్రవర్ణాల కుట్ర
నయీంనగర్ : స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీఓ–9పై హైకోర్టు స్టే విధించడాన్ని బీసీ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ నేతృత్వంలో శుక్రవారం కేయూ జంక్షన్లో రాస్తారోకో, ధర్నా చేపట్టారు. అనంతరం జీఓ–9కి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు, హై కోర్టులను ఆశ్రయించిన రెడ్డి జాగృతి సంఘం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరీ రవికృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లు పెంచిన ప్రతిసారీ కింది నుంచి పై కోర్టుల వరకు వేదికగా చేసుకొని రిజర్వేషన్ వ్యతిరేకులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కోర్టులు కూడా బీసీలకు న్యాయం చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ ఆమోదం ఉంటే బీసీ రిజర్వేషన్లకు కోర్టులో స్టే వచ్చేది కాదని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటోందన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీసీ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ఎందుకు బాధ్యత తీసుకోలేదని ప్రశ్నించారు. బీజేపీ గల్లీలో ఒక మాట ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతూ.. బీసీలను తప్పు దోవ పట్టిస్తూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం సిగ్గుచేటన్నారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టు ఇచ్చిన స్టే అగ్రవర్ణాల కుట్ర అని అన్నారు. వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ.. రెడ్డి కులస్తులంతా బీసీ వ్యతిరేకులేనని, బీసీ సమాజమంతా రెడ్డి కులస్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లపై రెడ్డి జాగృతి పిటిషన్లు అధర్మమని, బీసీ రిజర్వేషన్లు ధర్మమన్నారు. బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించొద్దని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ నిరసనలో నాయకులు సాయిని నరేందర్, కందికొండ వేణుగోపాల్, బోనగాని యాదగిరి గౌడ్, తాడిశెట్టి క్రాంతి, గడ్డం భాస్కర్, బచ్చు ఆనందం, వైద్యం రాజగోపాల్, దాడి మల్లయ్య యాదవ్, పద్మజాదేవి, శోభారాణి, సుమన్ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో రెడ్డి జాగృతి దిష్టిబొమ్మ దహనం -
వైద్యవిద్యకు ఆర్థికసాయం అభినందనీయం
● కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ నందకుమార్ రెడ్డి హన్మకొండ: వైద్య విద్యలో ప్రవేశం సాధించి ఫీజు చెల్లించే ఆర్థిక స్థోమత లేని విద్యార్థులకు నీట్–మెడికో పేరెంట్స్ అసోసియేషన్ అండగా నిలిచి చేయూతనందించడం అభినందనీయమని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ పి.వి.నందకుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో నీట్–మెడికో పేరెంట్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. సమావేశంలో వైద్యవిద్యలో ప్రవేశం పొందిన 10 మంది విద్యార్థులకు మొత్తం రూ.2.70 లక్షలు వైస్ చాన్స్లర్ డాక్టర్ పి.వి.నందకుమార్రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ కె.నాగార్జునరెడ్డి చేతుల మీదుగా ఆర్థిక సాయం అందించారు. వైస్ చాన్స్లర్ మాట్లాడుతూ.. ఫీజు చెల్లించే స్థోమత లేని 30 మంది విద్యార్థులకు నెలకు రూ.3,500 వచ్చే ఏర్పాట్లు చేస్తానన్నారు. ప్రభుత్వ కళాశాలల్లో బుక్స్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తానన్నారు. నీట్–మెడికో పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లోజు సత్యనారాయణచారి, సభ్యులు రావుల మధు, ఆకుల భాస్కర్, నరేందర్, యాదగిరి, కందిమల్ల జితేందర్, ఇందిర, రోజా, బాబు రావు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
యువకుడికి పాముకాటు..
● చికిత్స పొందుతూ మృతి బచ్చన్నపేట : పాముకాటుతో చికిత్స పొందుతున్న ఓ యువకుడు శుక్రవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని బోనకొల్లూర్ గ్రామానికి చెందిన దయ్యాల పద్మ–కనకయ్య దంపతుల కుమారుడు రాకేశ్ (19) ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఈ నెల 4వ తేదీన వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన రాకేశ్కు పాముకాటు వేసింది. అయితే పాము కనిపించకపోవడంతో తేనెటీగ కుట్టిందని అదే రోజు గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జనంలో పాల్గొని భోజనం చేసి పడుకున్నాడు. మరుసటి రోజు కాలు తిమ్మిరిగా ఉండడంతో జనగామ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్లోని ఎంజీఎంకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో బాధిత కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
‘డ్రీమ్బిగ్’ ఆడియో ఆవిష్కరణ
హన్మకొండ చౌరస్తా : వరంగల్ నగరానికి చెందిన ఫిజియోథెరపిస్టు రావుల రామకృష్ణ నిర్మించిన ‘డ్రీమ్ బిగ్’ సినిమా ఆడియో, వీడియో ఆవిష్కరణ శుక్రవారం హనుమకొండలోని ఓ హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఫిజియోథెరపిస్టుల అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి సామాజిక భావాలు ఉన్న సినిమాలను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు.ఆలోచనలు గొప్పగా ఉంటేనే విజయం తథ్యమని వివరించారు. భవిష్యత్లో భావితరాలకు ఉపయోగపడే సినిమాలను తీయాలని, తమవంతు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. ఫిజియోథెరపిస్టు ఒక డైరెక్టర్గా సినీ రంగంలో అడుగుపెట్టి ఎన్నో మంచి సినిమాలు నిర్మించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఒడితల రాము, శివరామకృష్ణ, సురేష్, ప్రకాశ్, క్రాంతికుమార్, రాజమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక.. డీసీసీ అధ్యక్షుల ఎంపిక!
సాక్షిప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై అధిష్టానం దృష్టి సారించింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీఓ 9, ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు స్టే ఇవ్వడంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆరు వారాలపాటు నిలిచిపోగా.. ఈలోగా ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న జిల్లా కాంగ్రెస్ కమిటీల ఖరారుపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు శనివారం (ఈ నెల 11వ తేదీ) నుంచి 18వ తేదీ వరకు డీసీసీ అధ్యక్షుల రేసులో ఉన్న ఆశావహుల నుంచి జిల్లాల వారీగా దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఢిల్లీ, ఇతర ప్రాంతాలనుంచి శుక్రవారం హైదరాబాద్కు చేరుకున్న ఏఐసీసీ పరిశీలకులు శనివారం నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వేదికగా దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలకు నేడు ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు... వాస్తవానికి పార్టీ సంస్థాగత నిర్మాణం, పటిష్టత కోసం మూడు నెలల కిందటే ఏఐసీసీ కమిటీలు వేసింది. ఉమ్మడి వరంగల్కు ముగ్గురు ఏఐసీసీ పరిశీలకులతోపాటు ఒక్కో జిల్లాకు ఇద్దరు నుంచి ముగ్గురు టీపీసీసీ పరిశీలకులను నియమించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్లు పరిశీలకులతో భేటీ అయి పలు సూచనలు చేశారు. ఏఐసీసీ పరిశీలకులు నబజ్యోతి పట్నాయక్ (హనుమకొండ, వరంగల్), జాన్సన్ అబ్రహం (ములుగు, జేఎస్ భూపాలపల్లి), దేబాసిస్ పట్నాయక్ (జనగామ)లు దరఖాస్తులు, డీసీసీ ఎన్నికలను పరిశీలించనున్నారు. అదే విధంగా టీపీసీసీ పరిశీలకులుగా హనుమకొండ, వరంగల్ జిల్లాలకు గాలి అనిల్కుమార్, దుర్గం భాస్కర్, మక్సూద్ అహ్మద్, గుంజ రేణుకా నారాయణలు, ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాలకు జంగా రాఘవరెడ్డి, అఫ్సర్ యూసుఫ్ ఝహి, ఇ.సుబ్బారావు, ఎ.సంజీవ్ ముదిరాజ్లు, జనగామ, మహబూబాబాద్లకు కె.శంకరయ్య (ఎమ్మెల్యే), ఎండీ అవేజ్, పీసరి మహిపాల్ రెడ్డి, కె.శ్రీకాంత్జాదవ్, జువ్వాడి ఇందిరారావులు పరిశీలకులుగా వ్యవహరించనున్నారు. జిల్లాల వారీగా కార్యాలయాల్లో డీసీసీ ఆశావహులనుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. పోటాపోటీగా ఆశావహులు... ● డీసీసీ కోసం పోటీపడే వారి సంఖ్య జిల్లాల్లో చాంతాడులా పెరుగుతోంది. ● ఇప్పుడున్న డీసీసీ అధ్యక్షులు మార్పు తధ్యమనుకుంటే కొత్తగా హనుమకొండ జిల్లా నుంచి కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, జంగా రాఘవరెడ్డి, ఈవీ శ్రీనివాస్రావు, బట్టి శ్రీనివాస్, పింగిళి వెంకట్రాం నర్సింహారెడ్డి, బొమ్మనపల్లి అశోక్రెడ్డి, కట్ల శ్రీనివాస్లతోపాటు మరి కొంతమంది దరఖాస్తు చేసుకుంటారనే ప్రచారం ఉంది. ● వరంగల్ నుంచి ఇప్పుడున్న అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నమిండ్ల శ్రీనివాస్, ఎంపీ ఆనంద్, బొంపెల్లి దేవేందర్రావు, గోపాల నవీన్రాజ్, నల్గొండ రమేష్, నర్సంపేట మాజీ ఎంపీపీ టి.రవీందర్రావు, పిన్నింటి అనిల్రావు తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. ● జయశంకర్ భూపాలపల్లి డీసీసీ కోసం మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, చల్లూరి మధులతోపాటు ఎనిమిది మంది వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ● జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి స్థానంలో హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, బండ శంకర్, లకావత్ ధన్వంతి, లక్ష్మీనారాయణలతోపాటు పలువురు ఆశావహులు సిద్ధమయ్యారు. ● ములుగు జిల్లాలో ప్రస్తుత అధ్యక్షుడు పైడాకుల అశోక్, సూర్య(మంత్రి సీతక్క కుమారుడు)ల మధ్య ఇప్పటికే పొసగడం లేదు. ఇక్కడినుంచి సూర్య సీరియస్గానే ఆశిస్తున్నారు. పైడాకుల అశోక్, కుంజ సూర్య, మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేందర్ గౌడ్, బాదం ప్రవీణ్ తదితరలు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ● మహబూబాబాద్లో ఇప్పుడున్న జె.భరత్చంద్రా రెడ్డి, వెన్నం శ్రీకాంత్రెడ్డి, నునావత్ రాధలతోపాటు ఏడెనిమిది మంది పేర్లు వినిపిస్తున్నాయి. ● ఏదేమైనా దరఖాస్తుల ప్రక్రియ 18న ముగియగానే ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు, సీఎం, టీపీసీసీ దృష్టికి జాబితాను తీసుకెళ్లనున్నారని సమాచారం. అనంతరం జిల్లా ఇన్చార్జ్లు, ఇన్చార్జ్ మంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సంప్రదింపులు జరిపి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్, మహిళ.. ఇలా సామాజిక కోణాలను దృష్టిలో పెట్టుకుని నవంబర్ మొదటి వారంలో అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. డీసీసీ కోసం దరఖాస్తులు చేసుకోండి... జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ మొదలైందని, ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణలు శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో కోరారు. ఏఐసీసీ పరిశీలకులు వస్తున్న సందర్భంగా దరఖాస్తుతోపాటు పార్టీకి చేసిన సేవలు, అనుభవం, గతంలో నిర్వర్తించిన బాధ్యతలు తదితర వివరాలను స్పష్టంగా పేర్కొని బయోడేటా శనివారం మధ్యాహ్నంలోపు మీమీ జిల్లాల అధ్యక్షులకు అందజేయాలని తెలిపారు. ‘సంస్థాగత’ ఎన్నికలపై దృష్టి సారించిన కాంగ్రెస్ నేడు జిల్లాలకు ఏఐసీసీ, టీపీసీసీ పరిశీలకులు ఆశావహులనుంచి దరఖాస్తులు స్వీకరణ 11 నుంచి 18 వరకు ఈ ప్రక్రియ ఆ తర్వాత సీఎం, టీపీసీసీ చీఫ్తో పరిశీలకుల భేటీ నవంబర్ మొదటి వారంలో డీసీసీ అధ్యక్షుల జాబితా? పోటాపోటీగా దరఖాస్తులతో సిద్ధమైన ఆశావహులు -
కలెక్టరేట్కు చేరిన ఎన్నికల సామగ్రి
మహబూబాబాద్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ విడుదల చేసిన జీఓ 9పై హైకోర్టు స్టే ఇవ్వడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల అధికారులు మాత్రం ఎన్నికల ఎప్పు డు వచ్చినా సిద్ధంగా ఉండేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా కలెక్టరేట్లో ఎన్నికల సామగ్రిని సిబ్బంది భద్రపరిచారు. మెరుగైన వసతులు కల్పించాలి మహబూబాబాద్ రూరల్ : డోర్నకల్ రైల్వే ఆస్పత్రిలో మెరుగైన వసతులు కల్పించాలని కోరుతూ పీసీఎండీ నిర్మలరాజారాం, డీఆర్ఎం గోపాలకృష్ణన్, సీఎంఎస్ నారాయణస్వామికి మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మజ్దూర్ యూనియన్ వరంగల్ బ్రాంచ్ సెక్రటరీ ఆవుల యుగంధర్ యాదవ్, డోర్నకల్ బ్రాంచ్ సెక్రటరీ అంజయ్య మాట్లాడుతూ.. సుమారు 10 వేలకుపైగా ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలు, 400లకుపైగా హై రిస్క్ వర్క్ చేసే లోకో పైలెట్లు, సీ అండ్ డబ్ల్యూ ఉద్యోగులు డోర్నకల్ రైల్వే ఆస్పత్రి పరిధిలో ఉన్నారని తెలిపారు. ఆస్పత్రిలో గైనకాలజీ డాక్టర్, అదనపు సిబ్బంది, ల్యాబ్, ట్రాలీ ఎక్స్ రే, పీఎంఈ పరీక్ష కేంద్రం, ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నారు. ఇతర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సుందరయ్య, నవజీవన్, శ్రీనివాస్, కరణ్ సింగ్, సీ.ఎస్.కె.యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మానసిక రోగులను గౌరవించాలి నెహ్రూసెంటర్: మానసిక రోగులను గౌరవిస్తూ వారి భావాలను అర్థం చేసుకోవాలని ప్రభుత్వ ఆస్పత్రి ఆర్ఎంఓ జగదీశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎంఓ మాట్లాడుతూ.. మానసిక రోగుల భావాలను అర్థం చేసుకుని, వారికి అవసరమైన సపోర్టు ఇవ్వాలన్నారు. మత్తు పదార్థాలకు బానిసలైన మానసిక రోగులు, పరిణామాలు, విముక్తి పొందే పద్ధతులపై షార్ట్ఫిలీం ప్రదర్శించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది, రోగులు తదితరులు పాల్గొన్నారు. వేయిస్తంభాల గుడిలో సంకటహర చతుర్థి పూజలు హన్మకొండ కల్చరల్: రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల ఆలయంలో శుక్రవారం సాయంత్రం సంకటహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేద పండితులు గంగు మణికంఠశర్మ, అర్చకులు పెండ్యాల సందీప్శర్మ, పానుగంటి ప్రణవ్, శ్రవణ్ ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించుకున్నారు. సాయంత్రం సంకటచతుర్థిని పురస్కరించుకుని దేవాలయంలోని ఉత్తిష్ట గణపతికి జల, క్షీర, పంచామృతాభిషేకం నవరస సుగంధ ద్రవ్యాలతో, హరిద్రాకుంకుమ జలాలతో అభిషేకాలు నిర్వహించారు. గణపతికి ఇష్టమైన గరికతో అష్టోత్తర శతనామాలు పఠిస్తూ షోఢశోపచార పూజలు నిర్వహించారు. మహా హారతి మంత్రపుష్పం జరిపి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులు అధికసంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు. -
ఆందోళన కలిగిస్తున్న సిజేరియన్లు
● డీఎంహెచ్ఓ రవి రాథోడ్ నెహ్రూసెంటర్: రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాలు గణనీయంగా పెరిగాయని, ఇది ఆందోళన కలిగించే అంశమని డీఎంహెచ్ఓ రవి రాథోడ్, జీజీహెచ్ ప్రొఫెసర్ శశిజ్యోశ్న అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ బృందం సిజేరియన్లపై నిఖ్మ ప్రైవేట్ ఆస్పత్రిలో శుక్రవారం ఆడిట్ నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 22 శాతం నుంచి 45 శాతానికి సిజేరియన్ ఆపరేషన్లు పెరిగాయని, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 58 శాతం నుంచి 92 శాతానికి పెరిగినట్లు తెలిపారు. జిల్లాలో సీ–సెక్షన్ ప్రసవాలు అధికంగా జరుగుతున్న తీరుపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆడిట్ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి సారంగం, డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ ప్రత్యూష, డెమో ప్రసాద్, కేవీ రాజు, హెచ్ ఈ అనిల్కుమార్, లోక్య, మనోహర్ పాల్గొన్నారు. పొగాకు వినియోగంతో మరణాలు.. పొగాకు వినియోగం వల్ల ఏటా దేశంలో 13.5లక్షల మరణాలు సంభవిస్తున్నాయని డీఎంహెచ్ఓ రవి రాథోడ్ అన్నారు. జాతీయ యువజన పొగాకు రహిత క్యాంపెయిన్ కార్యక్రమాన్ని డీఎంహెచ్ఓ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు నాగేశ్వర్రావు, సారంగం, లక్ష్మీనారాయణ, ఇన్చార్జ్ ఏఓ శ్రవణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నిధులేవి?
శనివారం శ్రీ 11 శ్రీ అక్టోబర్ శ్రీ 2025రైతు వేదికలకు● మూడేళ్లుగా బిల్లుల చెల్లింపు నిలిపివేత ● నిర్వహణలో తప్పని ఇబ్బందులు ● కనీస సదుపాయాలు కరువుమహబూబాబాద్ రూరల్ : జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు వేదికల నిర్వహణ భారంగా మారింది. మూడేళ్లుగా బిల్లులు రాకపోవడంతో అధికారులకు ఇబ్బందులు తప్పడం లేదు. రైతులకు పంటల సాగు, వ్యవసాయానికి సంబంధించిన సాంకేతికత, ఎరువుల వినియోగం, విత్తనాల ఎంపిక, చీడపీడల నివారణ, కలుపు, క్రిమిసంహారక మందుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్కెట్ సమాచారం వంటి అంశాలపై అవగాహన కల్పించడానికి రైతుల వేదికలను ఏర్పాటు చేశారు. అయితే నిధుల కొరత కారణంగా పర్యవేక్షణ ఇబ్బందికరంగా మారింది. సౌకర్యాలు కరువు.. కొన్నిచోట్ల రైతు వేదికలు జనావాసాలకు దూరంగా ఉన్నాయి. దీంతో మహిళా వ్యవసాయ విస్తరణ అధికారి ఒక్కరే ఉండడానికి భయపడుతున్నారు. కాగా నిధులు రాకపోవడంతో తాగునీరు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు లేవు. దీంతో రైతు వేదికలకు రావడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. కేవలం ఐదు నెలల వరకే డబ్బులు.. జిల్లాలో రైతు వేదికల పర్యవేక్షణ కోసం నెలకు రూ.9వేల చొప్పున ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ 2022లో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు మాత్రమే మెయింటెనెన్స్ నిధులు వచ్చాయి. అప్ప టి నుంచి ఇప్పటి వరకు 3 సంవత్సరాలుగా బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి. కాగా, రైతు వేదికల మెయింటెనెన్స్ బిల్లులు ప్రతీనెల చెల్లిస్తే నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా రైతులకు అత్యుత్తమైన సేవలు అందించే ఆస్కారం ఉంటుంది. ఏఈఓలపై భారం.. రైతు వేదికల నిర్వహణ నిధులు విడుదల కాకపోవడంతో ఏఈఓలపై భారం పడుతోంది. ప్రతీ రైతు వేదికలో అన్ని పనులు వారే చూసుకోవాల్సి వస్తోంది. పంటలకు సంబంధించి ఎప్పటికప్పుడు రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడం, సాగులో సమస్యలు తలెత్తితే పరిష్కరించడం, పీఎం కిసాన్ కేవైసీ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, రైతు విశిష్ట సంఖ్య నమోదు, పంటల నమోదు, రైతుబంధు, రైతు బీమా నమోదు, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మట్టి నమూనాల సేకరణ తదితర పనులు చేస్తున్నారు. ఇవి కాకుండా రైతు వేదిక నిర్వహణ బాధ్యతలు వారికి భారంగా మారాయి. ఇతర సిబ్బంది లేకపోవడంతో ఏఈఓలే ఉదయం వచ్చి రైతు వేదికను ఊడ్చుకుంటున్నారు. ఏమైనా కార్యక్రమాలు జరిగినప్పుడు కుర్చీలు వేయడం, ఇతర ఏర్పాట్లు చేయటం, టీ, స్నాక్స్ ఇవ్వడం, సమావేశం మొత్తం పూర్తయ్యే వరకు దగ్గరుండి సేవలు చేయాల్సి వస్తోంది. మరుగుదొడ్ల నిర్వహణ, తాగునీరు, విద్యుత్, ఇతర మరమ్మతులకు ఏఈఓలు సొంతంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో జీపీ అధికారులు, సిబ్బందిని అడిగితే వారు పట్టించుకోవడంలేదని ఏఈఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి నివేదించాం నిధుల కొరత వల్ల రైతు వేదికల పర్యవేక్షణకు ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యంలో నిధుల విడుదలపై ప్రభుత్వానికి నివేదిక అందజేశాం. రైతులకు సేవలు అందించే విషయంలో సమస్యలు తలెత్తకుండా నిధులు మంజూరు కాగానే చెల్లింపులు చేస్తాం. – ఎం.విజయనిర్మల, జిల్లా వ్యవసాయ అధికారి సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ మండలం రైతు వేదికలుచిన్నగూడూరు 2 దంతాలపల్లి 3 డోర్నకల్ 4 కురవి 7 సీరోలు 4 మరిపెడ 10 నర్సింహులపేట 3 పెద్దవంగర 3 తొర్రూరు 6మండలం రైతు వేదికలుబయ్యారం 5 గంగారం 4 గార్ల 4 గూడూరు 5 కేసముద్రం 5 ఇనుగుర్తి 2 కొత్తగూడ 5 మహబూబాబాద్ 6 నెల్లికుదురు 4