breaking news
Mahabubabad
-
రైతుల అరిగోస..
● టోకెన్ల కోసం రాత్రి నుంచే పడిగాపులు ● క్యూలైన్లో చెప్పులు, చెట్ల కొమ్మలుకేసముద్రం: యూరియా టోకెన్ల కోసం సోమవారం రాత్రి నుంచే రైతులు పడిగాపులు పడ్డారు. క్యూలో చెప్పులు, చెట్ల కొమ్మలను ఉంచారు. అలాగే సరిపడా యూరియా అందించాలంటూ రైతులు ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగిన సంఘటన కేసముద్రం మున్సిపాలిటీ, ఇనుగుర్తి మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. కేసముద్రంవిలేజ్ పీఏసీఎస్కు యూరియా వస్తుందనే సమాచారం మేరకు సోమవారం రాత్రి సొసైటీ వద్ద రైతులు పడిగాపులు పడ్డారు. దీంతో పోలీసులు చేరుకుని రాత్రి సమయంలో ఇక్కడ నిద్రిస్తే విష పరుగులు వస్తాయని నచ్చజెప్పి రైతులు పంపించారు. దీంతో తెల్ల వారుజామున 4 గంటలకు రైతులు సొసైటీ వద్దకు చేరుకుని క్యూలో నిల్చున్నారు. 222 బస్తాలకు టోకెన్లు ఇచ్చే క్రమంలో.. రైతులంతా ఒక్కసారిగా సెంటర్లోకి వెళ్లడంతో గందరగోళపరిస్థితి ఏర్పడింది. దీంతో సంఘటన స్థలానికి రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై మురళీధర్రాజు, తహసీల్దార్ వివేక్ చేరుకుని రైతులకు నచ్చజెప్పి పరిస్థితిని చక్కదిద్దారు. చివరకు 222 మందికి టోకెన్లు అందజేసి.. ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేశారు. అదే విధంగా ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద 222 బస్తాలకు గాను టోకెన్లు ఇవ్వగా, రైతులు క్యూలో తమ చెప్పులను, చెట్ల కొమ్మలను ఉంచి పడిగాపులు పడ్డారు. ఈ క్రమంలో అత్యధిక సంఖ్యలో వచ్చిన రైతుల తమకు సరిపడా యూరియా అందించాలంటూ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. సంఘటన స్థలానికి పోలీసులు, అధికారులు చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. అనంతరం వర్షం పడడంతో రైతు వేదిక లోపల రైతులను క్యూలో ఉంచి టోకెన్లు అందించారు. కాగా మహబూబాబాద్ ఏడీఏ శ్రీనివాసరావు సెంటర్ వద్దకు చేరుకుని, రైతులకు సూచనలు చేశారు. నానో యూరియాను పిచికారీ చేయాలని ఆయన సూచించారు. -
పాల ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తాం
● రాష్ట్ర డెయిరీ సూపరింటెండెంట్ దేవేందర్ తొర్రూరు రూరల్: పాల ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తామని రాష్ట్ర డెయిరీ సూపరింటెండెంట్ దేవేందర్ తెలిపారు. మండల శివారులోని పాల శీతలీకరణ కేంద్రాన్ని మంగళవారం రాష్ట్ర డెయిరీ అధికారులు సందర్శించారు. పాల సేకరణ, విక్రయాలు, పాడి రైతుల అభివృద్ధి తదితర అంశాలపై తొర్రూ రు డెయిరీ చైర్మన్ రాసాల సమ్మయ్యను అధికారులు అడిగి తెలుసుకున్నారు. తొర్రూరు పాల కేంద్రం భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రహరీ నిర్మి స్తామని, విజయ డెయిరీ పార్లర్ మంజూరు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అనంతరం చైర్మ న్ సమ్మయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వరంగల్ డీడీ శ్రావణ్కుమార్, రిటైర్డ్ అడిషనల్ కలెక్టర్ సుబ్బారావుతో కలిసి రాష్ట్ర డెయిరీ సూపరింటెండెంట్ మాట్లాడారు. పాడి పశువుల కొనుగోలు, బల్క్ మిల్క్ చిల్లింగ్ కేంద్రాలతో పాటు మార్కెటింగ్ సౌకర్యాలు, పార్లర్లు ఏర్పాటు చేసేందుకు సహకరిస్తామన్నారు. విజయ డెయిరీ పాల ఉత్పత్తులపై ప్రజలకు నమ్మకం ఉందని, దాన్ని నిలబెట్టుకుంటామన్నారు. కార్యక్రమంలో టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్కుమార్, మేనేజర్లు సురేష్, వెంకటనారాయణ, ప్రతినిధులు సుధాకర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, చంద్రమౌళి, సతీష్ పాల్గొన్నారు. -
వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి
మహబూబాబాద్: పెంపకందారులు గొర్రెలు, మేకలకు తప్పనిసరిగా పీపీఆర్ వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని జిల్లా పశువైద్య, సంవర్థక శాఖాధికారి కిరణ్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 26నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు టీకాలు వేస్తామన్నారు. జిల్లాలో 6,60,000 గొర్రెలు, మేకలు ఉన్నాయన్నారు. పీపీఆర్ అనే వ్యాధి వైరస్క్రిమి వల్ల వస్తుందన్నారు. వ్యాధి బారిన పడి న జీవాల్లో ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడం, ము క్కు నుంచి చీము, నోటి నుంచి సొంగకారడం వంటి వ్యాధి లక్షణాలు ఉంటాయన్నారు. దరఖాస్తుల ఆహ్వానంమహబూబాబాద్ అర్బన్: జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక కోసం అర్హులైన ప్రభు త్వ పాఠశాలలు, మోడల్ స్కూల్, కస్తూర్బాగాంధీ విద్యాలయం, ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ప్రతిపాదనలు మండల విద్యాశాఖ అధికారి ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రవీందర్రెడ్డి మంగళవారం తెలిపారు. అర్హులైన ఉపాధ్యాయులు తమ ప్రతిపాదనలు తగిన డాక్యుమెంట్స్తో ఈ నెల 29న సాయంత్రం 4గంటలలోపు మండల విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఉపాధ్యాయులపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు పెండింగ్లో లేవని, కోర్టు కేసులు లేవని ధ్రువీకరించి ఎంఈఓలు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. డిపో అభివృద్ధికి కృషి చేయాలినెహ్రూసెంటర్: మహబూబాబాద్ డిపో అభివృద్ధికి కృషి చేయాలని కరీంనగర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలోమన్ సూచించారు. మహబూబాబాద్ ఆర్టీసీ డిపోను మంగళవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా డిపోలోని మెయింటనెన్స్, సెక్యూరిటీ, గ్యారేజ్ విభాగాలను సందర్శించారు. బస్సుల మన్నిక, మెయింటనెన్స్ గురించి మెకానిక్లకు వివరించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ ఎం.శివప్రసాద్, సూపరింటెండెంట్ శ్రీమన్నారాయణ, ఎంఎఫ్ పాపిరెడ్డి, టీఐ శ్రీరాములు, ఏడీసీలు, ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. క్షయరహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం● డీఎంహెచ్ఓ రవి రాథోడ్ నెహ్రూసెంటర్: మానుకోటను క్షయ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతీ ఒక్కరు సహకరించాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో క్షయ వ్యాధిగ్రస్తులకు మంగళవారం యూపీహెచ్ఎస్లో పోషకాహారం అందజేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహారం అందించేందుకు అందరూ సహకరించాలని కోరారు. క్రమం తప్పకుండా పోషకాహారం తీసుకోవడం, మందులు వాడడం ద్వారా టీబీని జయించవచ్చని డీఎంహెచ్ఓ తెలిపారు. కార్యక్రమంలో యూపీహెచ్సీ డాక్టర్ మౌనిక, ప్రోగ్రాం అధికారి విజయ్కుమార్, తోట శ్రీనివాస్, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మైస నాగయ్య, సోమ య్య, వెంకటయ్య, జనార్దన్, రమణయ్య, నారాయణ, అరుణకుమారి, వెంకట్రెడ్డి, రత్నామాచారి, ప్రవీన్కుమార్, వైద్య సిబ్బంది, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు. ● నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ క్యాంపస్ను అన్ని రంగాల్లో అగ్రభాగంలో నిలుపుతూ, ప్రపంచ స్థాయిలో కీర్తి ప్రతిష్టలను నిలిపే భాగస్వాములుగా నూతన విద్యార్థులు నిలవాలని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. నిట్లో ప్రవేశం పొందిన యూజీ 1,245 మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు నిట్ వరంగల్ ఆడిటోరియంలో మంగళవారం ఓరియంటేషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఇందులో నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ ముఖ్య అతిథిగా పాల్గొని ‘సాంకేతిక విద్యకు మణిహారంగా నిలుస్తున్న నిట్ వరంగల్కు స్వాగతం’ అంటూ విద్యార్థులను ఆహ్వానించారు. విద్యతోపాటు మానవీయ విలువలను పెంపొందించుకుని సమాజంలో ఉత్తమ పౌరులుగా రాణించాలని అన్నారు. -
నత్తేనయం!
కొత్తగూడ: ఏజెన్సీ గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు నెరవేరడం లేదు. ముఖ్యంగా రోడ్ల నిర్మాణాల్లో తీవ్రం జాప్యం జరుగుతోంది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఏళ్లుగా పనులు సాగుతూనే ఉన్నాయి. అలాగే మరికొన్ని పనులు అటవీశాఖ అనుమతుల పేరిట కొర్రీలు పెట్టడంతో రోడ్ల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. కంకరపోసి వదిలేశారు. కాగా, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రతీ సమావేశంలో చెబుతున్నప్పటికీ.. పనుల్లో మాత్రం కదలిక రావడం లేదు. బ్రిడ్జి నిర్మించి రోడ్డు వేయడం ఆపేశారు.. కొత్తగూడ మండల కేంద్రం నుంచి సాదిరెడ్డిపల్లి, జంగవానిగూడెం, ముస్మి వైపునకు వెళ్లే ప్రధాన రహదారిపై కోటి రూపాయలతో బ్రిడ్జి నిర్మించారు. బ్రిడ్జి నుంచి రెండు వైపులా వంద మీటర్లు బీటీ రోడ్డు నిర్మించాలి. కానీ ఏడాదిగా పనులు చేపట్టడం లేదు. దీంతో మట్టి రోడ్డుపై గుంతలు పడి పూర్తిగా బురదమయంగా మారింది. ఇటు వైపునకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బిల్లులు రాకనే పనులు చేపట్టడం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నట్లు తెలిసింది. అదేవిధంగా కొత్తపల్లి నుంచి ఓటాయి క్రాస్రోడ్డు వరకు డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో వర్షం వచ్చిందంటే భారీ వాహనాలు రాకపోకలు సాగించడం లేదు. అటవీశాఖ అనుమతులు రాక.. అటవీశాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి బక్కచింతలపల్లి, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి ఈశ్వరగూడెం, చెరువుముందుతండా నుంచి దొరవారివేంపల్లి, గోవిందాపురం నుంచి పొగుళ్లపల్లి, నీలంపల్లి నుంచి పొగుళ్లపల్లి, ఆర్అండ్బీ రోడ్డు నుంచి కుందెనపల్లి గ్రామాల రోడ్ల పనులు నాలుగేళ్లుగా కంకరకే పరిమితమయ్యాయి. కొత్తపల్లి నుంచి దుబ్బగూడెం రోడ్డు సగం మాత్రమే పూర్తయింది. ఈరోడ్డు అనుమతుల కోసం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. పాత రోడ్ల విస్తరణను అటవీశాఖ అడ్డుకోవడంతో స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొత్తగూడ ఏజెన్సీలో ఏళ్లుగా పూర్తికాని రోడ్లు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో కొన్ని, అటవీశాఖ అడ్డంకితో మరికొన్ని నిలిచిపోయిన పనులు ప్రజలకు తప్పని ఇబ్బందులు -
గోమయ గణపతి
మహాగణపతి..మట్టి విగ్రహాలను పూజిద్దాం.. భావితరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందిద్దాం అనే గొప్ప సంకల్పంతో కొందరు భక్తులు ఏళ్లుగా మట్టి, గోమయ, పేపర్ వినాయక విగ్రహాలకే జై కొడుతున్నారు. మండపాల్లో ఆ విగ్రహాలను ప్రతిష్ఠించి పర్యావరణానికి హాని కలగని విధంగా పూజలు, అభిషేకాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ప్రారంభంకానున్న గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ విధంగా పూజలు నిర్వహిస్తున్న భక్తులు, పలు మండపాల నిర్వాహకులు, సేవా ట్రస్ట్లపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. శ్రీమహాలక్ష్మీ గణపతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కొలువుదీరనున్న గోమయ గణపతి మహబూబాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని వివేకానంద సెంటర్లో గల శ్రీ మహాలక్ష్మీ గణపతి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా గోమయ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు 11 రోజులపాటు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు ట్రస్ట్ సభ్యులు శ్రీరంగం రాధిక, ఎస్.వి నాగేశ్వర్రావు, శ్రీరంగం రాజేశ్వరి, రామారావు, సోమ రజిత, శ్రీనివాస్, సోమ సింధు, రాంబాబు ఏర్పాట్లు చేస్తున్నారు. 2008 నుంచి 2016 వరకు మట్టి విగ్రహాలు, 2017 నుంచి గోమయ వినాయక విగ్రహాలతో ఉత్సవాలు చేస్తున్నారు.● మట్టి, గోమయ విగ్రహాలకే జై కొడుతున్న భక్తులు.. ● ఏళ్లుగా నవరాత్రి ఉత్సవాల నిర్వహణ ● పర్యావరణానికి హాని కలగని విధంగా పూజలు నర్సంపేట: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా నర్సంపేటకు చెందిన వనప్రేమి అవార్డు గ్రహీత గోక రామస్వామి మొక్కల పెంపకంతోపాటు 40 సంవత్సరాలుగా మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసి పంపిణీ చేస్తున్నారు. అలాగే, గత సంవత్సరం నుంచి విత్తన గణపతులు తయారు చేస్తున్నారు. ప్రతీ విగ్రహంలో ఒక విత్తనం అమర్చుతున్నారు. తద్వారా నిమజ్జనం అనంతరం విత్తనం మొక్కగా రూపుదిద్దుకుని పెరిగి పండ్లు కాస్తాయని రామస్వామి తెలిపారు. ఈ విషయం తెలిసిన యునెస్కో అసోం ప్రతినిధులు రామస్వామికి శాంతిదూత అవార్డు అందజేసి సన్మానించారు. -
పర్యాటకుడిని సురక్షితంగా తీసుకొచ్చిన అధికారులు
వెంకటాపురం(కె): మండలంలోని వీరభద్రవరం గ్రామ సమీపంలోని ముత్యం ధార జలపాతం సందర్శనకు వెళ్లి అటవీ ప్రాంతంలో చిక్కుకున్న పర్యాటకుడిని అటవీశాఖ అధికారులు సురక్షితంగా తీసుకొచ్చారు. వరంగల్కు చెందిన అబ్రార్ సోమవారం బొగత జలపాతం సందర్శనకు వెళ్లాడు. తిరిగొచ్చే క్రమంలో కాలుకు గాయం కావడంతో నడవలేక అ టవీ ప్రాంతంలోనే చిక్కుకున్నాడు. దీంతో రాత్రి డ యల్ 100కు కాల్ చేసి వివరాలు తెలిపాడు. వి షయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు తెల్ల వారుజామున అబ్రార్ను గుర్తించి సురక్షితంగా తీసుకొచ్చారు. అనంతరం తల్లిదండులను పిలిచి వారి సమక్షంలో అబ్రార్కు కౌన్సెలింగ్ ఇచ్చి అప్పగించినట్లు అధికారులు తెలిపారు. -
కొనసాగుతున్న పంపింగ్
కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామపంచాయతీ పరిఽధిలో ఉన్న దేవాదుల జె. చొక్కారావు పంపింగ్ కొనసాగుతోంది. పంపింగ్ కొన్ని రోజుల నుంచి నిలిచింది. ఈ క్రమంలో మంగళవారం పంపింగ్ వద్ద ఉన్న మూడు ఫేజ్ల్లోని పది మోటార్లలో ఫేజ్ టులో– 2 , ఫేజ్ త్రీలో 2 మోటార్లను ఆన్ చేసి నీటిని దిగువన ఉన్న గొల్లబెద్దారం రిజర్వాయర్లోకి పంపింగ్ చేస్తున్నారు. నాలుగు మోటార్లతో 831 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పంపింగ్ వద్ద 78.30 మీటర్ల నీటిమట్టం కొనసాగుతోంది. సమ్మక్క సాగర్ బ్యారేజీలోకి ఎగువ నుంచి 3,17,480 క్యూసెక్కులు చేరుతుండడంతో 59 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 77.45 మీటర్ల నీటి మట్టం కొనసాగుతోంది -
ఒంటరి మహిళలే టార్గెట్
వరంగల్ క్రైం: రోడ్లపై ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి మెడలో నుంచి చైన్స్నాచింగ్తోపాటు ద్విచక్రవాహనాల చోరీకి పాల్ప డుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు సీపీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. నిందితుడి నుంచి రూ.23.5 లక్షల విలుౖవైన బంగారు ఆభరణాలు, మూడు ద్విచక్ర వాహనాలు, రూ.10 వేల నగదు, ఒక సెల్ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెర ప్రాంతానికి చెందిన మంతుర్తి హరీశ్ హైదరాబాద్లోని ఓ సిమెంట్ కంపెనీలో క్వాలిటీ టెక్నీషియన్గా పనిచేసేవాడు. కాగా, అదే కంపెనీలో పనిచేస్తున్న ఓ ఇంజనీర్ ఇంటిలో బంగారు గొలుసు చోరీ చేసి గోల్డ్లోన్ కంపెనీలో తాకట్టు పెట్టాడు. వచ్చిన డబ్బుతో నిందితుడు జల్సాలు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సంఘటనలో నిందితుడిని స్థానిక నేరెడ్మెట్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. బెయిల్పై విడుదలైన నిందితుడిలో ఎలాంటి మార్పు రాలేదు. మళ్లీ చైన్ స్నాచింగ్లకు పాల్ప డి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేసినట్లు సీపీ వివరించారు. నిందితుడు ముందుగా ద్విచక్ర వాహనాన్ని చోరీ చేస్తాడు. దానిపై వెళ్లి చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 10 చైన్ స్నాచింగ్లు, మూడు ద్విచక్ర వాహనాలు చోరీ చేశాడని పేర్కొన్నారు. అప్రమత్తమైన పోలీసులు.. చైన్ స్నాచింగ్లపై అప్రమత్తమైన పోలీసులు పక్కా సమాచారంతో మంగళవారం ఉదయం యాదవ్నగర్ క్రాస్ వద్ద తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంపై వస్తున్న నిందితుడు తప్పించుకొని పారిపోగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చైన్ స్నాచింగ్, ద్విచక్రవాహనాలను చోరీ చేసినట్లు అంగీకరించినట్లు ఆయన తెలిపారు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో హనుమకొండ రెడ్డి కాలనీలోని అద్దె ఇంటిలో పోలీసులు మిగిలిన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు సీసీ వివరించారు. అధికారులకు అభినందనలు.. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కబరిచిన క్రైం డీసీపీ గుణశేఖర్, క్రైం ఏసీపీ సదయ్య, హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, కేయూ, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, రాఘవేందర్, ఏఏఓ సల్మాన్ పాషా, సీసీఎస్ ఎస్సైలు రాజ్కుమార్, శివకుమార్, హెడ్కానిస్టేబుళ్లు అంజయ్య, జంపయ్య, కానిస్టేబు ళ్లు మధుకర్, చంద్రశేకర్, రాములు, నగేశ్ను పోలీస్ కమిషనర్ అభినందించారు. ఆభరణాలు, వాహనాలను చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్ట్ రూ.23.5 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం వివరాలు వెల్లడించిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ -
మంచం పట్టిన బాలికకు చేయూత..
కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ గ్రామానికి చెందిన చెవుగాని మహేశ్ కూతురు సుష్మ అనారోగ్యంతో 9 ఏళ్లుగా మంచం పట్టింది. దీంతో బాలిక కుటుంబ దీనస్థితిని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హైదరాబాద్లో ఆ బాలిక తండ్రికి మంగళవారం రూ.3లక్షల ఆర్థిక సాయం అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సుష్మ 9 సంవత్సరాల వయసులో దసరా పండుగకు అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. అక్కడ చీమల మందు కలిసిన చపాతీ తినడంతో తీవ్ర అనారోగ్యానికి గురైంది. అప్పటి నుంచి మంచానికే పరిమితమైంది. ఆర్థిక స్థోమత లేకపోవడంతో మహేశ్ తన కూతురును ఆస్పత్రుల్లో చూపించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల మహేశ్ తన కూతురి పరిస్థితిని గాంధీభవన్ మీడియాకు తెలుపగా వారు జగ్గారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన జగ్గారెడ్డి బాలిక తండ్రిని తన ఇంటికి పిలిపించుకుని, రూ.3లక్షల ఆర్థిక సాయం అందించారు. ‘నేనున్నా.. అధైర్యపడొద్దు’ అని భరోసా బాధిత కుటుంబానికి కల్పించారు. ఆ వెంటనే డాక్టర్ చంద్రశేఖర్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వమే వైద్య ఖర్చులను భరించేలా చూస్తానన్నారు. వైద్యఖర్చుల కోసం రూ.3 లక్షల అందజేసిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి -
కాజీపేట–బల్లార్షా మధ్య రైల్వే ఎన్ఐ వర్క్స్
కాజీపేట రూరల్: కాజీపేట సబ్ డివిజన్ పరిధిలోని హసన్పర్తి–ఉప్పల్–జమ్మికుంట,కాజీపేట–బల్లార్షా సెక్షన్లో ప్రీ ఇంటర్లాకింగ్ అండ్ నాన్ ఇంటర్లాకింగ్ ఆటోమెటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వర్క్స్తో పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు, పలు ప్యాసింజర్ రైళ్లు తాత్కాలిక రద్దు, మరికొన్ని రైళ్ల హాల్టింగ్ ఎత్తివేత, కొన్ని రైళ్లను రెగ్యులేషన్ చేసి నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ మంగళవారం తెలిపారు. ప్యాసింజర్ రైళ్ల రద్దు వివరాలు ఆగస్టు 29వ తేదీన కాజీపేట–సిర్పూర్టౌన్ (17003) ప్యాసింజర్, బల్లార్షా–కాజీపేట (17004) ప్యాసింజర్, బల్లార్షా– కాజీపేట (17036) ప్యాసింజర్, ఆగస్టు 28వ తేదీన కాజీపేట–బల్లార్షా (17035) ప్యాసింజర్లను రద్దు చేయనున్నారు. తాత్కాలిక రద్దు.. ఆగస్టు 29వ తేదీన భద్రాచలం రోడ్డు–బల్లార్షా (17033) సింగరేణి కాజీపేట–బల్లార్షా మధ్య రద్దు, సిర్పూర్టౌన్ –భద్రాచలం రోడ్డు (17034) సింగరేణి సిర్పూర్టౌన్ –కాజీపేట మధ్య రద్దు, ఆగస్టు 28వ తేదీన సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్నగర్ (17233) కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ కాజీపేట–సిర్పూర్కాగజ్నగర్ మధ్య రద్దు, ఆగస్టు 29వ తేదీన సిర్పూర్ కాగజ్నగర్–సికింద్రాబాద్ (17234) సిర్పూర్ కాగజ్నగర్ ఎక్స్ప్రెస్ను సిర్పూర్ కాగజ్నగర్–కాజీపేట మధ్య రద్దు చేసినట్లు తెలిపారు. తాత్కాలిక హాల్టింగ్ ఎత్తివేత.. ఆగస్టు 29వ తేదీన హైదరాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (17011) ఎక్స్ప్రెస్, సిర్పూర్కాగజ్నగర్–బీదర్ (17012) ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (12757) ఎక్స్ప్రెస్లకు ఉప్పల్, జమ్మికుంట రైల్వే స్టేషన్లలో తాత్కాలికంగా హాల్టింగ్ ఎత్తివేశారు. రెగ్యులేషన్ ట్రైన్స్.. ఆగస్టు 29వ తేదీన రక్సోల్–చర్లపల్లి (07006) ఎక్స్ప్రెస్ను 75 నిమిషాలు, లక్నో–ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ ఎక్స్ప్రెస్ (16094) ఎక్స్ప్రెస్ను 45 నిమిషాలు, సిర్పూర్కాగజ్నగర్–సికింద్రాబాద్ (12758) ఎక్స్ప్రెస్ను 30 నిమిషాల పాటు రెగ్యులేషన్ చేసి నడిపించనున్నట్లు సీపీఆర్వో తెలిపారు. నాలుగు ప్యాసింజర్ రైళ్లు రద్దు నాలుగు రైళ్ల తాత్కాలిక రద్దు -
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ..
ఐనవోలు: తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన మండలంలోని వనమాల కనపర్తిలో చోటు చేసుకుంది. ఎస్సై పస్తం శ్రీనివాస్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పులి యాదగిరి, నాగమ్మ దంపతులు ఈ నెల 22వ తేదీన ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికెళ్లారు. తిరిగి 25న సాయంత్రం సమయంలో ఇంటికి చేరుకున్నారు. ఇంటి తలుపులు తెరిచి తాళం పగులగొట్టి ఉండడాన్ని గమనించి అనుమానంతో లోపలికి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి ఉంది. అందులో భద్రపరిచిన 2 తులాల బంగారు గొలుసు, అరతులం ఉంగరం, 20 తులాల వెండి, రూ.10 వేల నగదు కనిపించలేదు. దీంతో చోరీకి గురైనట్లు గుర్తించి లబోదిబోమన్నారు. సుమారు రూ. 1.6లక్షల విలువైన వస్తువులు అపహరణకు గురయ్యాయని కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా క్లూస్ టీం ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. ● రూ. 1.6లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలు అపహరణ -
పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్మహబూబాబాద్ రూరల్: పెండింగ్ కేసుల పరిష్కారంలో పోలీసు అధికారులు మరింత చొరవ చూపాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. నెలవారీ నేర సమీక్ష సమావేశం మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బుధవారం నుంచి ప్రారంభమయ్యే గణేశ్ ఉత్సవాలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గంజాయి రవాణా, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, పేకాట స్థావరాలను గుర్తించి, కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా స్థానిక పాఠశాలలు, కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గ్రామాల్లో చిన్నచిన్న గొడవలు జరిగినప్పుడు వెంటనే తగిన చర్యలు తీసుకోవడం ద్వారా, పెద్ద నేరాలను నియంత్రించవచ్చని సూచించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో బీట్ సిస్టమ్ను మరింత మెరుగుపర్చాలన్నారు. షీటీం ద్వారా ఈవ్ టీజింగ్ వంటివి జరగకుండా అరికట్టాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు తిరుపతిరావు, కృష్ణకిశోర్, శ్రీనివాస్, డీసీఆర్బీ సీఐ సత్యనారాయణ, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి
హన్మకొండ: భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి సూచించారు. ప్రతీఒక్కరు విఽధిగా పనిచేస్తున్న చోటే ఉండాలని ఆదేశించారు. మంగళవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ఇతర శాఖల సమన్వయంతో వాగులు, వంకలు పొంగే ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లను గమనిస్తూ ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు లోడ్ మానిటరింగ్ చేస్తూ ఉండాలని, మెన్, మెటీరియల్ సిద్ధంగా ఉంచుకొని, అంతరాయం కలిగిన వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని అన్నారు. మొబైల్ యాప్లో వినాయక మండపాల వివరాలు నమోదు చేయాలని వివరించారు. ఎన్ని కిలోవాట్ల లోడ్ వినియోగిస్తున్నారో నమోదు చేయాలని, తద్వారా ట్రాన్స్ఫార్మర్పై ఎంత భారం పడుతుందో తెలుసుకునే అవకాశముంటుందన్నారు. గత ఏడాది దాదాపు 35,000 విగ్రహాలు నమోదయ్యాయని, ఈ ఏడాది 10 నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని వివరించారు. విద్యుత్ భద్రతపై ఉత్సవ నిర్వాహకులకు తెలియజేయాలని, సంబంధిత లైన్మెన్లు, లైన్ఇన్స్పెక్టర్లు, ఏఈల నంబర్లు కూడా ఇవ్వాలని సూచించారు. ఎత్తు ఎక్కువగా ఉన్న విగ్రహాల నిమజ్జన రూట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని, రోడ్ క్రాసింగ్స్ ఉన్న చోట్ల 11 మీటర్ల స్తంభాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. నిమజ్జనం చేసే చెరువులు, కుంటలను కూడా విధిగా పర్యవేక్షించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్వాహకులు వాట్సాప్ గ్రూపుల్లో ఉండాలని, ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 1912 నంబర్కు ఫోన్ చేయాలని నవరాత్రి ఉత్సవ నిర్వాహకులకు సీఎండీ సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్ టి.మధుసూదన్, సీఈలు సదర్లాల్, అశోక్, వెంకటరమణ, జీఎం మల్లికార్జున్ పాల్గొన్నారు. వినాయక మండపాలను యాప్లో అప్లోడ్ చేయాలి టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఎస్ఈలు, డీఈలతో వీడియో కాన్ఫరెన్స్ -
బోధనోపకరణాలతో విద్యాభ్యాసం సులభతరం
● కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్మహబూబాబాద్ అర్బన్: బోధనోపకరణాలతో విద్యార్థులకు విద్యాభ్యాసం సులభతరంగా ఉంటుందని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని అనంతారం మోడల్ స్కూల్లో మంగళవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి టీఎల్ఎం మేళాను నిర్వహించారు. కలెక్టర్ టీఎల్ఎంలను పరిశీలించి, వాటి ప్రత్యేకతలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులకు బోధన, ఉపాధ్యాయుల పనితీరును, మధ్యాహ్నం భోజనం, వసతుల గురించి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విద్యార్థులకు రోల్ మోడల్గా ఉండాలన్నారు. టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్తో విద్యార్థులకు ఎంతగానో ఉపయోగం ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు అభ్యసన సామగ్రిని ఉపయోగించడం ద్వారా విద్యార్థులకు అర్థవంతమైన బోధన అందుతుందన్నారు. ఉపాధ్యాయులు అంకితభావంతో విద్యాబోధన చేసి విద్యార్థులను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. డీఈఓ రవీందర్రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో 18 మండలాల నుంచి తెలుగు, ఇంగ్లిష్, గణితం, ఈవీఎస్లో 180 ఎగ్జిబిట్లను ఉపాధ్యాయులు ప్రదర్శించారన్నారు. జిల్లాస్థాయిలో ప్రదర్శించిన ఎగ్జిబిట్లలో 8 ఉత్తమ టీఎల్ఎంలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి బి. అప్పారావు, ఏఎంఓ ఆజాద్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
గణపతి మండపం ఏర్పాటులో అపశ్రుతి..
నెక్కొండ: గణపతి మండపం ఏర్పాటులో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డా డు. ఈ ఘటన మంగళవారం మండలంలోని నెక్కొండ తండాలో జరిగింది. తండాకు చెందిన బానోత్ పవన్ సెంట్రింగ్ కర్రలను మిషన్ (విద్యుత్ రంపం)తో కట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో రంపం అదుపు తప్పి పవన్ ఎడమ చేయికి తగలగా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మండప నిర్వాహకులు హుటాహుటినా హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పవన్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయని కుటుంబీకులు తెలిపారు. -
ఈసీజీ టెక్నీషియన్లపై దాడి
ఎంజీఎం : ఎంజీఎం ఆస్పత్రిలో ఈసీజీ టెక్నీషియన్లపై రోగితోపాటు ఆమె బంధువులు మంగళవారం రాత్రి దాడికి పాల్ప డ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ దేశాయిపేట ప్రాంతానికి చెందిన వివాహిత హా రికకు చాతీలో నొప్పి రావడంతో భర్త రాజేశ్, తండ్రి అరుణ్తో కలిసి చికిత్స నిమిత్తం ఎంజీఎంలోని క్యాజువాలిటీ విభాగానికి వచ్చింది. పరీక్షించిన వై ద్యులు ఈసీజీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దీంతో హారిక ఈసీజీ పరీక్షల కోసం క్యూలో ఉంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఓ రోగికి ఈసీజీ పరీక్ష నిర్వహించిన టెక్నీషి యన్లు మోబిన్, వసంత్కుమార్పై హారిక తోపాటు ఆమె భర్త, తండ్రి దాడికి పాల్ప డ్డారు. ఘటనను గుర్తించిన సెక్యూరిటీ సిబ్బందితో పాటు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గొడవను సద్దుమణిగించారు. కాగా, ఈఘటనపై తప్పు జరిగిందని హారికతోపాటు రాజేశ్, అరుణ్.. ఈసీజీ టెక్నీషియన్లను వేడుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. -
కాంగ్రెస్ ఖిల్లా.. వరంగల్ జిల్లా
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలిచి ఇక్కడే విజయోత్సవ సభ ● చెప్పి మరీ వర్ధన్నపేట, పాలకుర్తి ఎమ్మెల్యే సీట్లు గెలిచాం ● జనహిత పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్సాక్షి, వరంగల్: కాంగ్రెస్ ఖిల్లా.. వరంగల్ జిల్లా అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆనాడు అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు జరిగిన పాదయాత్రలో వర్ధన్నపేట శాసనసభ్యుడు అరూరి రమేష్, గొప్ప నాయకుడు అని చెప్పుకునే ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడిస్తామని చెప్పి మరీ ఆ సీట్లు కై వసం చేసుకున్నామన్నారు. జనహిత పాదయాత్రలో భాగంగా రాష్ట్ర పార్టీ వ్యవహరాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం నుంచి వర్ధన్నపేట టౌన్ అంబేడ్కర్ సెంటర్ వరకు సోమవారం రాత్రి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ సెంటర్లో జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. వరంగల్ జిల్లా అంటేనే రాజకీయాలకు అడ్డా అన్నారు. మరో మూడేళ్లు పాలన ప్రజలతో శభాష్ అనిపించుకొని 100 సీట్లతో అధికారంలోకి వచ్చాక ఇదే వర్ధన్నపేటలో విజయోత్సవ సభ చేస్తామని అన్నారు. మాజీ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ...‘ఓటు చోరీ బీజేపీ... ల్యాండ్ చోరీ బీఆర్ఎస్ పార్టీలను బ్యాలెట్ మీద బొంద పెట్టాలి. ఆ రెండు పార్టీలను రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పాతాళం లోతుకి పాతి పెట్టాలి. యూరియా మీద రెండు పార్టీలు దొంగ రాజకీయం చేస్తున్నాయి’ అని మండిపడ్డారు. ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, రాజేందర్ రెడ్డి, రాంచందర్ నాయక్, మురళీ నాయక్, గండ్ర సత్యనారాయణరావు, యశస్వనిరెడ్డిలు బీఆర్ఎస్, బీజేపీలపై దుమ్మెత్తిపోశారు. యూరియా విషయంలో కావాలనే కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ బద్నాం చేస్తోందన్నారు. యాత్రలో వేం నరేందర్ రెడ్డి, కొండా మురళీ, జంగా రాఘవరెడ్డి, ఎర్రబెల్లి రాజేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. కాగా, మంత్రి సీతక్క, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, కడియం శ్రీహరి ఈ యాత్రకు హాజరుకాకపోవడంపై కార్యకర్తలు చర్చించుకోవడం కనిపించింది. పార్టీ ఫిరాయించారంటూ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులిచ్చిన వారిలో ఉన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి అందుకే దూరంగా ఉండొచ్చనే గుసగుసలు వినిపించాయి. పాదయాత్రకు తరలొచ్చిన శ్రేణులు.. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ రెండో విడత జనహిత పాదయాత్రకు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో తరలిరావడంతో వర్ధన్నపేట మండలంలో కోలాహలం కనిపించింది. కాంగ్రెస్ నేతలు రాత్రి ఏడు గంటల ఐదు నిమిషా లకు ఇల్లంద చేరుకోగా ఆటపాటలతో కళాకారులు, బోనాలతో మహిళలు ఘనస్వాగతం పలికారు. వీరిరాకకు ముందే ఇల్లందలో కాంగ్రెస్ పార్టీ జెండా ను జిల్లా పార్టీ అధ్యక్షురాలు స్వర్ణ ఆవిష్కరించారు. అనంతరం 7.05 గంటలకు భారీ సంఖ్య లో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో కలిసి నేతలు దాదాపు మూడు కిలోమీటర్లు మేర పాదయాత్ర సాగించారు. సుమారు 8.24 గంటలకు వర్ధన్నపేట టౌన్లోని అంబేడ్కర్ సర్కిల్ చేరుకున్నారు. తప్పని తిప్పలు... ● ఇల్లంద నుంచి వర్ధన్నపేట వరకు జనహిత పాదయాత్ర ఉండడంతో పోలీసులు ట్రాఫిక్ని కట్రియాల నుంచి కొత్తపల్లి రోడ్డుకి డైవర్ట్ చేయగా భారీ ట్రాఫిక్ జామైంది. అంబులెన్స్ వాహనం కూడా ఆ ట్రాఫిక్లో చిక్కుకుంది. ● పాదయాత్ర జరిగే జాతీయ రహదారిలో గుంతలు పూడ్చకపోవడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడిచే సమయంలో ఇబ్బంది పడ్డారు. కొందరు అదుపుతప్పి కిందపడ్డారు. -
ఇంటినుంచే తపాలా సేవలు
ఖిలా వరంగల్ : ఆన్లైన్ సౌకర్యం లేని కాలంలో తపాలా శాఖ ప్రజలకు అ త్యుత్తమ సేవలు అందించింది.. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ కాల్ లెటర్ రావాలన్నా.. ఉద్యోగం వచ్చిందన్న సమాచారం తెలుసుకోవాలన్నా.. బంధుమిత్రులకు వర్తమానం, సంస్థలు, కార్యాలయాలకు ముఖ్యమైన ధ్రు వీకరణ పత్రాలు పంపాలన్నా.. ఒకప్పుడు పోస్టల్ సేవలు ప్రధాన ఆధారం. ప్రసుత్తం వినియోగదారుడు ఉన్న చోటు నుంచే తపాలా సేవలు పొందేలా అధునాతన సౌకర్యాలు కల్పించింది. ఇటీవల తీసుకొచ్చిన సాఫ్ట్వేర్తో సాంకేతిక అనుసంధానం చేసి దేశీయ, విదేశీయ లెటర్లు, పార్సల్ బుకింగ్, స్పీడ్ పోస్ట్ అన్నీ స్వీయ–సేవ పోర్టల్ వెబ్ ఆధారంగా పోస్టాఫీసుకు వెళ్లకుండానే ఇంటి నుంచే సులభంగా తపాలా సేవలు పొందవచ్చు. india post.gov.in /customer&eltservice/ login యూజర్ ఐడీ, మొబైల్ ఓటీపీ, కస్టమర్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా లెటర్లు, పార్సల్స్, స్పీడ్ పోస్ట్లు అన్ని ఇంటి వద్దే పొందొచ్చు. ఆన్లైన్ బుకింగ్ చేయగానే పోస్ట్మెన్ వినియోగదారుల ఇంటికి చేరుకుని స్పీడ్పోస్ట్ సేవలు, పార్సిల్స్ సేకరించి ఆన్లైన్ ట్రాకింగ్ విధానంతో గమ్యానికి చేరవేయనున్నారు. సేవలన్నీ ఒకే గొడుగు కిందికి.. తపాలా కార్యాలయాల ద్వారా అందించే సేవలన్ని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చింది. నూతన ఐటీ 2.0 పేరుతో కొత్త సాఫ్ట్వేర్తో డేటా భద్రతతోపాటు సిస్టమ్ స్పీడ్ సామర్థ్యం పెంచారు. వరంగల్ డివిజన్ ప్రధాన కార్యాలయ పరిధిలో వరంగల్, మహబూబాబాద్ హెడ్ పోస్టాఫీసులు ఉండగా.. 42 సబ్ పోస్టాఫీసులు, 362 గ్రామీణ పోస్టాఫీసులు ద్వారా వినియోగదారులు తపాలా సేవలు పొందుతున్నారు. రిజిస్టర్డ్ పోస్ట్ స్పీడ్ పోస్ట్లో విలీనం..! స్మార్ట్ ఫోన్లు, ఆన్లైన్ సౌకర్యాలు లేని రోజుల్లో రిజిస్టర్డ్ పోస్ట్ ప్రజల జీవితాలతో విడదీయరాని బంధాన్ని ఏర్పర్చుకుంది. ముఖ్యమైన పత్రాలు, వస్తువులను సురక్షితంగా, నమ్మకంగా పంపించడానికి ఇదే ప్రధాన మార్గంగా నిలిచింది. అయితే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ సేవలు నిలిపి వేస్తున్నట్లు భారత తపాలా శాఖ ప్రకటించింది. స్పీడ్ పోస్ట్లోకి రిజిస్టర్డ్ పోస్ట్ సేవలను విలీనం చేసి.. ఇంకా మెరుగైన సేవలు అందించనున్నది. సాంకేతిక వ్యవస్థతో అనుసంధానం స్వీయ–సేవ పోర్టల్ వెబ్ ఆధారిత బుకింగ్ సౌకర్యాలు 1 నుంచి రిజిస్టర్డ్ పోస్టుకు మంగళం.. స్పీడ్పోస్ట్లో విలీనం మారుతున్న కాలానికి అనుగుణంగా తపాలాశాఖ కూడా మారుతోంది. ప్రైవేట్ సంస్థలకు దీటుగా ఇప్పటికే ఎన్నో సేవలతో అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోస్టల్ శాఖ అంతే వేగంగా స్పీడ్ పోస్ట్ విధానానికి శ్రీకారం చుడుతోంది. బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న రిజిస్టర్డ్ పోస్ట్ సేవలను స్పీడ్ పోస్ట్లో కలుపుతున్నట్లు భారత తపాలా శాఖ ప్రకటించింది.అధునాతన పరిజ్ఞానంతో ఖాతాదారులకు ఆన్లైన్ సేవలు అందిస్తున్నాం. ప్రైవేట్కు దీటుగా సేవలు అందించాలన్న లక్ష్యంతో నూతన విధానం అమల్లోకి తెస్తున్నాం. 1వ తేదీనుంచి రిజిస్టర్డ్ పోస్ట్ సేవలన్నీ స్పీడ్ పోస్ట్లో విలీనం చేసి ఆన్లైన్ ట్రాకింగ్ ద్వారా సేవలు అందిస్తాం. ప్రజలు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ బుకింగ్ చేసిన ప్రతీ సేవను పది నిమిషాల వ్యవధిలో పోస్ట్మన్ మీ ఇంటికి చేరుకొని సేవలు అందిస్తారు. ఖాతాదారులు తమ ఇంటివద్ద తపాలా సేవలన్నీ పొందేలా చర్యలు తీసుకున్నాం. – రవికుమార్, తపాలాశాఖ, డివిజనల్ సూపరింటెండెంట్, వరంగల్ -
కమీషన్ డబ్బులు వెంటనే చెల్లించాలి
హన్మకొండ అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు పెండింగ్లో ఉన్న ఐదు నెలల కమీషన్ డబ్బులు వెంటనే చెల్లించాలని రేష న్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేష్బాబు డిమాండ్ చేశారు. సోమవారం సంఘం నాయకులతో కలిసి హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డికి రేషన్ డీలర్ల సమస్యలపై ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ సెప్టెంబర్ 5న బంద్ పాటించనున్నట్లు వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా డీలర్లకు కనీస గౌరవ వేతనం రూ.5 వేలు, కమీషన్ పెంపు, ఏ నెల కమీషన్ ఆ నెలలోనే చెల్లించాలని కోరారు. అలాగే, రేషన్ షాపులను మినీ సూపర్ మార్కెట్లుగా గుర్తించాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డిమల్ల హనుమండ్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, కోశాధికారి కిరణ్కుమార్, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, శ్రీనివాస్, రవీందర్, వెంకటేష్, రాము, మోహన్, నాయకులు నర్సయ్య, భానుచందర్,దామోదర్, వెంకటనారాయణ, తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 5న రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ -
దొంగ అరెస్ట్, రిమాండ్
● రూ.5.50లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం ఖిలా వరంగల్: దొంగను అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి రూ.5.50 లక్షల విలువైన 56.083 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు వరంగల్ జీఆర్పీ ఇన్స్పెక్టర్ పి. సురేందర్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వల్లపు గోపి(29) వరంగల్ ప్లాట్ ఫామ్పై సోమవారం అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో జీఆర్పీ పోలీసులు తనిఖీ చేయగా.. రూ.5.50 లక్షల విలువైన 56.083 గ్రాముల బంగారం లభ్యమైంది. అనంతరం విచారించగా ఇటీవల నెక్కొండ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల వద్ద చోరీ చేసినట్లు ఒప్పకున్నాడు. దీంతో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జీఆర్పీ సిబ్బంది రాము, రియాజోద్దిన్, నాగరాజు, ఏఎస్సై రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.నౌవేరా షేక్కు రిమాండ్వరంగల్ లీగల్: హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ (ఎం/ఎస్ హారా గోల్డ్ ఎగ్జిమ్ లిమిటెడ్) సీఈఓ నౌవేరా షేక్పై ఇంతేజార్గంజ్ పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కాగా సోమవారం పోలీసులు అరెస్ట్ చేసి జిల్లా ప్రధాన న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు. సెప్టెంబర్ 8వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి నిర్మలా గీతాంబ అదేశాలు జారీ చేశారు. హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ నౌవేరా షేక్ వరంగల్ చార్బౌలి ప్రాంతానికి చెందిన షాహేద్ పర్వీజ్తోపాటు మరో ఇద్దరు వ్యక్తులను ప్రలోభ పెట్టి పెద్ద మొత్తంలో బంగారంపై పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో వడ్డీ, లాభాలు అందిస్తామని తెలపడంతో ముగ్గురు బాధితులు రూ.33 లక్షలు చెల్లించారు. పెట్టుబడి అనంతరం వారికి సుమారు రూ.32వేలు మాత్రమే కంపెనీనుంచి రాగా విచారణలో మోసపోయామని నిర్ధారించుకొని 2021, జనవరి 14న బాధితుడు షాహేద్ పర్వీజ్ చేసిన ఫిర్యాదు మేరకు ఇంతేజార్గంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో 2021లో నౌవేరా షేక్కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతీ ఆదివారం సంబంధిత పోలీస్స్టేషన్లో హాజరుకావాలని, అలాగే ప్రతీ కోర్టు వాయిదాకు హాజరుకావాలని న్యాయమూర్తి షరతులు విధించారు. పలు వాయిదాలకు నిందితురాలు నౌవేరా షేక్ హాజరు కాకపోవడంతో జిల్లా కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ వారెంట్ మేరకు ఇంతేజార్గంజ్ పోలీసులు నిందితురాలిని సోమవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా సెప్టెంబర్ 8 తేదీ (14 రోజుల) వరకు జ్యుడీషియల్ రిమాండ్కు ఆదేశించారు. -
మరో పెళ్లికి అడ్డుగా ఉందని..
రామన్నపేట : మరో పెళ్లికి అడ్డుగా ఉందనే కారణంతో భర్త.. భార్యను చంపాడు. నిద్రిస్తున్న సమయంలో ఆమె ముఖంపై బెడ్షీట్ కప్పి ఊపిరాడకకుండా చేసి కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన వరంగల్ మట్టెవాడ పీఎస్ పరిధిలోని హంటర్ రోడ్డులో ఆదివారం చోటుచేసుకోగా, ఘటన జరిగిన 24 గంటల్లోనే పోలీసులు ఛేదించి నిందితుడిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసు వివరాలను వరంగల్ ఏఎస్పీ శుభం నాగ్రాలే వెల్లడించారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం దిర్శనపల్లి గ్రామానికి చెందిన బాదావత్ అశోక్ కూతురు గౌతమి(22)కి మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బాల్య తండాకు చెందిన బానోత్ గణేశ్తో ఈ ఏడాది మేలో వివాహం జరిగింది. గణేశ్కు కట్నకానుకల కింద రూ.2.5 లక్షల నగదు, రెండు తులాల బంగారంతోపాటు 150 గజాల స్థలాన్ని త్వరలోనే ఇస్తామని హామీ ఇచ్చి వివాహం జరిపించారు. గణేశ్ ఆటో నడుపుకుంటూ హంటర్ రోడ్డులోని పద్మావతి ఫంక్షన్ హాల్ సమీపంలో అద్దెకుంటున్నాడు. పెళ్లి అనంతరం నెల రోజుల వరకు బాగానే ఉన్న గణేశ్.. ఆటో నడుపుకోవడానికి అదనపు కట్నం కావాలని భార్య గౌతమిని వేధించసాగాడు. దీంతో గౌతమి తండ్రి అశోక్ రూ.లక్ష ఇవ్వగా గణేశ్ ఆ డబ్బుతో ఆటో కొనుగోలు చేశాడు. ఆటో నడుపగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. ఈ క్రమంలో మరోసారి డబ్బులు సరిపోవడం లేదంటూ గౌతమిని ఇబ్బందులకు గురిచేయడంతో మళ్లీ రూ.లక్ష ఇవ్వగా ఆ డబ్బులతో మేకలు కొనుగోలు చేసి స్వ గ్రామంలో తండ్రికి అప్పగించాడు. అప్పటి కూడా భార్యతో సక్రమంగా ఉండడం లేదు. ఈ క్రమంలో తనతో కలిసి పదో తరగతి చదువుకున్న అంజలి అనే యువతితో పరిచయం పెరిగింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించి తనకు అడ్డుగా ఉన్న భార్య గౌతమిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి భార్య నిద్రిస్తున్న క్రమంలో ఆమె ముఖంపై బెడ్షీట్ బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపాడు. అనంతరం ఏమీ తెలియనట్లు నటిస్తూ గౌతమి పిలిచినా పలకడం లేదని తన ఇంటి పక్కన ఉంటున్న పెద్దమ్మ కొడుకు కుమార్కు చెప్పాడు. కుమార్ దంపతులు వచ్చి చూసి గౌతమిని 108లో ఎంజీఎం తరలించారు. పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటన తర్వాత నిందితుడు తప్పించుకుని తిరుగుతున్న క్రమంలో సోమవారం వరంగల్ చౌరస్తా వద్ద పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు 24 గంటల్లో కేసు ఛేదించిన మట్టెవాడ ఇన్స్పెక్టర్ కరుణాకర్, ఎస్సై శివకృష్ణ, సిబ్బంది ఏఎస్పీ అభనందించారు. నిందితుడి అరెస్ట్ వివరాలు వెల్లడించిన వరంగల్ ఏఎస్పీ శుభం నాగ్రాలే -
సెల్ఫోన్ చోరీ చేసిన ఇద్దరి అరెస్ట్..
● నిందితుల్లో కానిస్టేబుల్ డోర్నకల్: రైలులో సెల్ఫోన్ చోరీ చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఖమ్మం జీఆర్పీ సీఐ ఎన్. అంజలి, డోర్నకల్ ఎస్సై సురేశ్ తెలిపారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 23న హైదరాబాద్లోని మణికొండ ప్రాంతానికి చెందిన బండి ప్రియాంక సింహపురి ఎక్స్ప్రెస్లో విజయవాడ వెళ్తోంది. ఈ క్రమంలో రైలు డోర్నకల్ చేరుకుంటున్న సమయంలో తన ఐఫోన్ చోరీకి గురి కావడంతో డోర్నకల్ జీఆర్పీ స్టేషన్లో అదే రోజు ఫిర్యాదు చేసింది. దీంతో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇందులో రాచకొండ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబు ల్ యరవండి రవీందర్తోపాటు అతడి బావమరిది మేకల నాగసాయిగా గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నిందితులు జల్సాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్నారని వారు పేర్కొన్నారు. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య ● పెద్దతండాలో ఘటన సంగెం: వ్యవసాయ పనులకు వెళ్లే విషయంలో దంపతుల మధ్య తలెత్తిన ఘర్షణతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సంగెం మండలం పెద్దతండాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన గుగులోత్ రవి(45), వినోద దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో వ్యవసాయ పనులకు వెళ్లే విషయంలో ఆదివారం ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. దీనిపై మనస్తాపం చెందిన రవి.. సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన భార్య వినోద 108లో హుటాహుటిన ఎంజీఎం తరలించగా అదే రోజు రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కూతురు మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. పాము కాటుతో రైతు మృతి కొత్తగూడ: పాము కాటుతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం మండలంలోని పోలారంలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బానోత్ చక్ర(44) తన పత్తి చేనులో నీరు పారిస్తుండగా పాము కాటు వేసింది. వెంటనే నర్సంపేట ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, ముగ్గురు కుమారులు ఉన్నారు. ప్రభుత్వం మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
జనహిత పాదయాత్ర
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పరిధి ఇల్లంద మార్కెట్నుంచి మండలకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్ వరకు సోమవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ జనహిత పాదయాత్ర నిర్వహించారు. వారి వెంట మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు, పార్టీ శ్రేణులు నడిచారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. అనంతరం అంబేడ్కర్ సెంటర్లో జరిగిన కార్నర్ మీటింగ్లో ముఖ్యనేతలు ప్రసంగించారు. – సాక్షి, వరంగల్ -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
● డీఈఓ రవీందర్రెడ్డికురవి: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని డీఈఓ రవీందర్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో సీరోలు, కురవి మండలాల టీఎల్ఎం మేళా కార్యక్రమాన్ని నిర్వహించగా ఆయన సందర్శించారు. విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ పాఠశాలలో టీఎల్ఎంను ఉపయోగిస్తూ బోధన చేయాలని సూచించారు. పిల్లలను ప్రభుత్వ బడిలోకి పంపించాలన్నారు. సీరోలు నుంచి 10, కురవి నుంచి 10 ఎగ్జిబిట్లు జిల్లా స్థాయికి ఎంపికయ్యాయి. ఎంఈఓలు ఇస్లావత్ లచ్చిరాంనాయక్, వాంకుడోత్ బాలాజీ నాయక్, సీఆర్పీలు వెంకన్న, ఉమారాణి, నవీన్, బీమా, మానస పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
● అదనపు కలెక్టర్ అనిల్కుమార్ మహబూబాబాద్: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని అదనపు కలెక్టర్ అనిల్కుమార్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనిల్కుమార్ మాట్లాడుతూ.. కాలుష్య నియంత్రణ కోసం మట్టితో తయారు చేసిన విగ్రహాలను ప్రతిష్టించుకోవాలన్నారు. కాలుష్య నియంత్రణ కోసం ప్రతీ ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి నర్సింహస్వామి, గ్రౌండ్ వాటర్ డీడీ సురేష్, డీపీఆర్వో రాజేంద్రప్రసాద్, కాలుష్య నియంత్రణ మండలి సైంటిస్టు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆందోళన చెందవద్దు కురవి: రైతులు ఆందోళన చెందవద్దని, యూరియా వస్తుందని అడిషనల్ కలెక్టర్ కె.అనిల్కుమార్ అన్నారు. సోమవారం యూరియా పరిస్థితిపై తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్షించారు. సొసైటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో 756.495 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని, గత ఏడాదితో పోలిస్తే 101.105 మెట్రిక్ టన్నుల యూరియాను అధికంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. యూరియా వస్తుందని, రైతులు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో మండల స్పెషల్ అధికారి నరసింహస్వామి, తహసీల్దార్ విజయ, ఏఓ నరసింహరావు, డీపీఆర్ఓ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. కొరత తీరుస్తాం గార్ల: జిల్లాలో త్వరలో యూరియా కొరత తీరుస్తామని అదనపు కలెక్టర్ అనిల్కుమార్ వెల్లడించారు. సోమవారం గార్లలోని పీఏసీఎస్ కార్యాలయంలోయూరియా పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యూలో రైతులకు ఇబ్బందులు లేకుండా తాగునీరు, నీడ పరదాలు వేయించాలని మండల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్, తహసీల్దార్ శారద, మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు, ఎస్సై ఎస్కె రియాజ్పాషా తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ వ్యాపారాలపై చర్యలు తీసుకోవాలి
మహబూబాబాద్ రూరల్: జిల్లాలో అక్రమ వ్యాపారాలను అరికట్టాలని కోరుతూ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్కు సోమవారం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఇటీవల గంజాయి రవాణా, గుట్కా, బెల్లం అమ్మకాలు, పీడీఎస్ బియ్యం, ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోందని, అక్రమ వ్యాపారాలకు బాధ్యులైన వారిపై ఉక్కుపాదంమోపి అణచివేయాలని విజ్ఞప్తి చేశారు. యూరియా సమస్య పరిష్కరించాలి మహబూబాబాద్: రైతులకు సరిపడా యూరియా సరఫరా చేసి సమస్య పరిష్కరించాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్కు ఆమె వినతి పత్రం అందచేశారు. ఈసందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. రైతులకు యూరియా సక్రమంగా పంపిణీ చేయాలని కొరత లేకుండా చూడాలన్నారు. రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య సమస్యల పరిష్కారమే లక్ష్యం నెహ్రూసెంటర్: ఆర్బీఎస్కే ద్వారా 0 నుంచి 18 సంవత్సరాల పిల్లల ఆరోగ్య సమస్యల పరిష్కారమే ధ్యేయంగా డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ (డైక్) ఏర్పాటు చేశామని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. జీజీహెచ్లోని డైక్, అసంక్రమిత వ్యాధుల చికిత్స కేంద్రాన్ని సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. పిల్లల్లో ఆరోగ్య సమస్యలను గుర్తించి చికిత్స అందించేలా, పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి సెంటర్ పని చేస్తుందన్నారు. ఆర్బీఎస్కే ద్వారా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను గుర్తించి డైక్ సెంటర్కు రెఫర్ చేయాలని సూచి ంచారు. అసంక్రమిత వ్యాధులను మొదటి దశలోనే గుర్తించి వైద్యం అందించేలా ఏర్పాట్లు చేయాలని, వైద్య సిబ్బంది రోగికి మెరుగైన వైద్యం అందించేలా చొరవ చూపాలన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ఆస్పత్రి ఆర్ఎంఓ జగదీశ్వర్, డెమో కొప్పు ప్రసాద్, డాక్టర్ సతీష్, డైక్ మేనేజర్ యగ్నేష్ పాల్గొన్నారు. అప్రమత్తంగా ఉండాలి తొర్రూరు: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో తెలిపారు. డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. జ్వరాల రికార్డుల నిర్వహణ పక్కాగా జరగాలని, ల్యాబ్ టెస్టులు తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలోని బెడ్లు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. పల్లె దవాఖానాల్లో ఆరోగ్య సిబ్బంది, పంచాయతీ సిబ్బందితో మాట్లాడి జ్వర పీడితుల వివరాలు సేకరించి తగిన వైద్యం అందించాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టేలా అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. కార్యక్రమంలో ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్సుగుణాకర్రాజు, వైద్యాధికారి జ్వలిత, వైద్యులు గిరిప్రసాద్, మీరాజ్, నందన, సీహెచ్ఓ విద్యాసాగర్, డీపీఎంఓ వనాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పీఏసీఎస్ తనిఖీ.. పట్టణ శివారులోని పీఏసీఎస్ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ సందర్శించారు. యూరియా విక్రయాల రిజిస్టర్ పరిశీలించారు. అమ్మకాలకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలన్నారు. పీఏసీఎస్ సీఈఓ మురళి, ఏఓ రాంనర్సయ్య, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కేడీసీలో జాతీయ సదస్సు కేయూ క్యాంపస్: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని మైక్రో బయాలజీ విభాగం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12న జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు సదస్సు కన్వీనర్ డాక్టర్ పి.పల్లవి సోమవారం తెలిపారు. ‘మైక్రోబియల్ ఫ్రంట్ టైర్స్ హార్మోసింగ్ జీనోమిక్స్ సింథటిక్ బయాలజీ అండ్ మైక్రోబయోమ్ ఇన్నోవేషన్స్’ అంశంపై ఈ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. -
రుచికరమైన భోజనం అందించాలి
● కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ మహబూబాబాద్ అర్బన్: విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసి, వంట, తరగతి గ దులు, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని వంట నిర్వాహకులను ఆదేశించారు. భోజనం సిద్ధం చేసే సమయంలో పలు జాగ్రత్తలు పాటించాలన్నారు. విద్యార్థులకు షెడ్యూల్ ప్రకారం ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు. సబ్జెక్ట్ల వారీగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను గుర్తించి డిజిటల్ తరగతులు, ఏఐ ద్వారా బోధన చేపట్టాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం గుమ్ముడూరు ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, స్వచ్ఛమైన తాగునీరు అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సోషల్ వెల్ఫ్ర్ డీసీఓ జాక్లిన్, పాఠశాల హెచ్ఎం హల్యానాయక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
నానో యూరియా వాడకంతో ప్రయోజనాలు
తొర్రూరు/చిన్నగూడూరు: పంటలకు నానో యూరియా వాడాలని డీఏఓ విజయనిర్మల తెలిపా రు. తొర్రూరు పీఏసీఎస్, చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి రైతువేదికలో సోమవారం యూరియా పంపిణీని వ్యవసాయాధికారులు పరిశీలించారు. వ్యవసాయ శాఖ సంచాలకులు విజయ్చంద్రతో కలిసి డీఏఓ నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎకరాకు 500 మిల్లీ లీటర్ల నానో యూరియా వేయడం వల్ల పంటకు కావాల్సిన నత్రజని సమర్థవంతంగా అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో తొర్రూరు తహసీల్దార్ శ్రీనివాస్, ఏఓ రాంనర్సయ్య, అదనపు ఎస్సై శివరామకృష్ణ, ఏఈఓలు ఆమని, జమున, మానస, దీపిక, వినయ్వర్మ, భరత్చంద్ర, పీఏసీఎస్ సీఈఓ మురళి, చిన్నగూడూరు మండల వ్యవసాయ అధికారి భాస్కర్, ఏఈఓ శిరీష, రైతులు పాల్గొన్నారు -
నోటిఫికేషనే తరువాయి..
సాక్షిప్రతినిధి, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి వేళయ్యిందా..? రిజర్వేషన్లు తేలకున్నా ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సిద్ధమవుతోందా..? ఈ మేరకు పార్టీ కేడర్, నాయకులకు సంకేతాలు అందాయా..? పీఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకు సెప్టెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడనుందా?.. జిల్లా ఉన్నతాధికారులను కూడా అప్రమత్తం చేశారా?... అంటే నిజమే అంటున్నాయి అధికార పార్టీ, అధికార వర్గాలు. నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడినా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం ఉండాలని సోమవారం కూడా జిల్లా కలెక్టర్లకు మౌఖికాదేశాలు అందాయన్న ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్లోనే నోటిఫికేషన్..?.. ఈ దిశగానే కసరత్తు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు ముగిసి దాదాపుగా రెండేళ్లు కావస్తోంది. దీనిపై ఇదివరకే ఈ సెప్టెంబర్ నెలాఖరులోగా ఎన్నికలు జరిపించాలన్న హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. వీటంన్నిటిని దృష్టిలో పెట్టుకుని వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికార పార్టీ నేతలు, సీఎం నిర్ణయించినట్లు ప్రచారం. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశం ఎటూ తేలకపోయినప్పటికీ.. పార్టీ పరంగా ఆ మేరకు అవకాశం కల్పించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు పార్టీ ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు చెబుతున్నారు. ఈ నెల 29న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలపై చర్చించి ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడినా.. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధ్దంగా ఉండాలని కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్, చీఫ్ సెక్రటరీల నుంచి ఆదేశాలు అందడంతో అందరూ అలర్ట్ అయ్యారు. రాజకీయ పార్టీల్లో మొదలైన సందడి.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. మొదట పేర్కొన్న విధంగానే ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీపీపీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తే ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో ఆరు జిల్లా ప్రజాపరిషత్లు, 75 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 778 ఎంపీటీసీ స్థానాలు 75 ఎంపీపీ స్థానాలను ప్రకటించి ఆ మేరకు పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. ఆ తర్వాత 1,708 గ్రామ పంచాయతీలు, 15,006 వార్డులకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికలు జరిపే విధంగా 15,021 పోలింగ్ కేంద్రాలను కూడా సిద్ధం చేసినట్లు అధికారులు ఇది వరకే ప్రకటించారు. కాగా, ఈ నెల 29న జరిగే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకునే కీలక నిర్ణయాలను బట్టి ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండగా.. రాజకీయ పార్టీల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల సందడి పెరిగింది. సెప్టెంబర్ మాసంలో ఎన్నికలు ఖాయమన్న ప్రచారం నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల టికెట్లపై పోటీ చేసేందుకు ఆశావహులు సై అంటున్నారు. కాగా, ఆయా పార్టీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలను కలిసి తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్లో ఇలా.. స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం సెప్టెంబర్ మొదటి వారంలో ప్రకటించే అవకాశం ‘స్థానిక’ంలో బీసీలకు 42 శాతం అవకాశం.. పార్టీ కేడర్కు కాంగ్రెస్ సంకేతాలు ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ.. ఆ తర్వాతే సర్పంచ్, ‘ప్యాక్స్’ల ఎన్నికలు ఉమ్మడి జిల్లాలో 6 జెడ్పీలు, 75 జెడ్పీటీసీ స్థానాలు.. జిల్లా కలెక్టర్లకూ సీఎస్ సమాచారం.. జిల్లా జెడ్పీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్ వార్డులు పోలింగ్ కేంద్రాలుహనుమకొండ 1 12 12 129 210 1,986 1,986 వరంగల్ 1 11 11 130 317 2,754 2,754 జేఎస్భూపాలపల్లి 1 12 12 109 248 2,102 2,102 మహబూబాబాద్ 1 18 18 193 482 4,110 4,110 ములుగు 1 10 10 83 171 1,520 1,535 జనగామ 1 12 12 134 280 2,534 2,534 06 75 75 778 1,708 15,006 15,021 -
వెంటాడుతున్న యూరియా కష్టాలు
మహబూబాబాద్ రూరల్ : యూరియా కష్టాలు రైతులను వెంటాడుతూనే ఉన్నాయి. మహబూబాబాద్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఎదుట సోమవారం యూరియా బస్తాల కోసం రైతులు ఎండలో సైతం క్యూలో నిలబడి తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. అనంతరం తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఈనెల 22న పేర్లు నమోదు చేయించుకున్న రైతులను క్రమపద్ధతిలో పిలుస్తూ జెడ్పీ సీఈఓ పురుషోత్తం, ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ తిరుపతిరెడ్డి, తహసీల్దార్ చంద్రరాజేశ్వరరావు, పీఏసీఎస్ చైర్మన్ నాయిని రంజిత్, సీఈఓ ప్రమోద్ యూరియా బస్తాలు పంపిణీ చేశారు. టౌన్ సీఐ మహేందర్ రెడ్డి, రూరల్ సీఐ సర్వయ్య ఆధ్వర్యంలో ఎసైలు శివ, సూరయ్య, మౌనిక, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. -
యూరియా కోసం చెప్పుల క్యూ
గూడూరు: యూరియా కోసం రైతులు ఎండలో నిలబడలేక చెప్పులను క్యూలో పెట్టిన సంఘటన మండలంలోని గాజులగట్టు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద ఆదివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి మొదటిసారిగా 110 బస్తాల యూరియా మంజూరైంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, సమీప తండా రైతులు ఉదయాన్నే చేరుకోగా.. 10 గంటలు దాటినా నిర్వాహకుడు కేంద్రం తెరవలేదు. దీంతో రైతులు తమ చెప్పులను క్యూగా పెట్టి, మండల వ్యవసాయ అధికారి, కేంద్రం నిర్వాహకుడికి ఫోన్ చేశారు. ఇదిలా ఉండగా, బస్తాల పంపిణీ కోసం కేంద్రం నిర్వాహకుడి మిషన్లో డీడీ నంబర్ను జిల్లా అధికారులు పంపించలేదు. ఈ విషయాన్ని వెంటనే ఏఓకు తెలుపగా, మధ్యాహ్నం నంబర్ పంపించారు. ఆ తర్వాత ఏఓ అక్కడ ఉండి రైతులకు బస్తాలు పంపిణీ చేయించారు. -
ప్రజాప్రతినిధులకు అవగాహన శూన్యం
● మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డోర్నకల్: జిల్లాలో యూరియా అవసరాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన లేదని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. డోర్నకల్లో ఆదివారం సత్యవతి రాథోడ్ విలేకరులతో మాట్లాడుతూ.. నాట్లు వేసే సమయంలో యూరియా కొరత రావడం ప్రజాప్రతినిధుల వైఫల్యానికి నిదర్శనమన్నారు. యుద్ధాల వల్ల యూరియా కొరత ఏర్పడిందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. పాలకులు విహారయాత్రల్లో తేలుతున్నారని, ప్రభుత్వ విప్ వీడియో సందేశాలు పంపుతూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. డోర్నకల్లో నల్లబెల్లం, గంజాయి, బియ్యం, గుట్కా, ఇసుక, మట్టి దందా జోరుగా సాగుతోందని ఆరోపించారు. పోలీసు అధికారులు ప్రజాప్రతినిధులకు డబ్బు ఇచ్చి పోస్టింగ్ తెచ్చుకుని, డబ్బు సంపాదన కోసం లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో గుడుంబా తయారీ, విక్రయాలు జోరుగా సాగుతున్నాయని, గుడుంబాతో అనేక కుటుంబాలు బలయ్యాయని తెలిపారు. మార్వాడీ గోబ్యాక్ నినాదం మూర్ఖత్వమని, కొంతమంది వారి స్వార్థం కోసం ఇలాంటి నినాదాలతో ప్రజల్లో అశాంతిని రేపేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. మార్వాడీలు దశాబ్దాలుగా మనలో ఒకరిగా కలిసి ఉన్నారని, మార్వాడీ గోబ్యాక్ నినాదాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మన్యుపాట్ని, యశోధర్జైన్, గౌస్, కందుల మధు, రాంభద్రం, సతీష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అప్రమత్తతే రక్ష
● వినాయక మండపాల ఏర్పాటులో నిబంధనలు తప్పనిసరి ● జాగ్రత్తలు పాటిస్తే విద్యుత్ ప్రమాదాల నివారణనెహ్రూసెంటర్: జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందడి నెలకొంది. కమిటీల ఆధ్వర్యంలో మండపాలు ఏర్పాటు చేయడంతో పాటు వినాయక విగ్రహాలను తీసుకొచ్చి ప్రతిష్టిస్తున్నారు. కాగా, ఉత్సవాల్లో ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ అధికారులు సూచిస్తున్నారు. గణపయ్య విగ్రహాలను మండపాలకు తరలించేటప్పుడు, తిరిగి నిమజ్జన సమయంలో విద్యుత్వైర్లకు తగలకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ వైర్లను సరిచేసేలా, గణపతి నిమజ్జనం సమయంలో రూట్లను పరిశీలించి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టేలా ఇప్పటికే విద్యుత్ ఉన్నతాధికారులు సిబ్బందికి సూచనలు చేశారు. మండపాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ● గణపతి మండపాలు ట్రాన్స్ఫార్మర్ దగ్గర, విద్యుత్ లైన్లు, వైర్ల కింద ఏర్పాటు చేయవద్దు ● అర్హత కలిగిన టెక్నీషియన్లతోనే లైటింగ్, వైరింగ్ చేయించుకోవాలి ● వైర్లు నాణ్యమైనవి ఉపయోగించాలి. ఎలాంటి జాయింట్స్ లేకుండా చూసుకోవాలి ● స్తంభాల నుంచి విద్యుత్ కనెక్షన్లను విద్యుత్ సిబ్బందితోనే తీసుకోవాలి ● ఇనుప స్తంభాలకు సపోర్టు లేకుండా వైర్లు తీసుకోవాలి ● సర్వీస్ వైర్లు, ఇతర విద్యుత్ వైర్లు నేలపై నుంచి తీసుకురావొద్దు ● త్రీ పిన్ ఫ్లగ్లనే ఉపయోగించాలి. ఎర్తింగ్ తప్పకుండా చేసుకోవాలి ● ఐరన్ వస్తువుల ద్వారా మండపాల ఏర్పాటు జరిగితే షార్ట్ సర్క్యూట్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ● మండపాలనికి ఒకటి మాత్రమే సర్వీస్ వైరు తీసుకోవాలి. మరొకటి తగిలించకూడదు ● ఇన్వర్టర్, జనరేటర్ ఉపయోగిస్తే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి ● గణపతి మండపాల్లో వినియోగించే ప్రతీ కరెంట్ సామగ్రికి ఎర్తింగ్ తప్పకుండా చేసుకోవాలి ● తడి చేతులతో స్విచ్ బోర్డులు, విద్యుత్ వైర్లను తాకొద్దు ● స్విచ్ బోర్డులు, విద్యుత్ పరికరాలు పిల్లలకు అందకుండా ఎత్తులో ఉంచాలి ● వినాయక నిమజ్జన రూట్లలో వైర్లు తగలకుండా విద్యుత్ అధికారులు తనిఖీలు చేసి క్లియరెన్స్ చేయాలి ● ఉత్సవ కమిటీలతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలి ● విద్యుత్ అత్యవసర వేళల్లో విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలి ● వైర్లు తెగిపడిన వెంటనే అధికారులకు లేదా 1912 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం అందించాలి -
ముగిసిన రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు
రెబ్బెన: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గోలేటి టౌన్షిప్లో కొనసాగుతున్న 71వ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ముగిశాయి. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆదిలా బాద్ మహిళ జట్టు విజేతగా నిలువగా పురుషుల వి భాగంలో వరంగల్ జిల్లా జట్టు విజయకేతనం ఎగురేసింది. సెమీఫైనల్తోపాటు ఫైనల్ పోటీలు నిర్వహించగా క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. ఫైనల్లో ఆదిలాబాద్ జిల్లా మహిళల జట్టు వరంగల్ జట్టుతో తలపడింది. పురుషుల విభాగంలో వరంగల్ జిల్లా క్రీడాకారులు రంగారెడ్డి జిల్లాతో తలపడ్డారు. పోటీలతో స్నేహభావం.. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల నిర్వహణతో వివిధ జిల్లాల క్రీడాకారుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తిరుపతి, బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్రెడ్డి, ఎస్వోటూజీఎం రాజమల్లు, బాల్బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు దుర్గయ్య, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.నారాయణరెడ్డి, ప్రధానకార్యదర్శి రఘునాథ్రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు రాజయ్య తదితరులు పాల్గొన్నారు. చాంపియన్గా ఆదిలాబాద్, వరంగల్ జట్లు -
మట్టి వినాయకా.. మనసా స్మరామి
కాజీపేట : వినాయక చవితి దేశవ్యాప్తంగా నిర్వహించుకునే పండుగ. ఈ క్రమంలో నవరాత్రి వేడుకలకు ఇప్పటికే విగ్రహాల తయారీలో కళాకారులు నిమగ్నమయ్యారు. ఎలాంటి విగ్రహం ఏర్పాటు చేసుకోవాలి. ఎంత ఎత్తులో ఉండాలని గణపతి మండపాల నిర్వాహకులు సన్నాహాలు మొదలుపెట్టారు. ఇంత వరకు బాగానే ఉంది. మరి ఎలాంటి విగ్రహాన్ని ఎంచుకుందాం..? పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఉండే మట్టి విగ్రహాలకు ప్రాధాన్యమిద్దామా..? ప్రకృతికి విఘాతం కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన వాటికి మొగ్గు చూపుదామా..? నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు మట్టి గణనాథుల వైపు ఆసక్తి చూపించాలని ఆశిస్తూ ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఇతర రాష్ట్రాలకు చెందిన కళాకారులు మట్టితో సైతం భారీ విగ్రహాలను తయారు చేస్తున్నారు. నాలుగేళ్లుగా వందల సంఖ్యలో పూర్తి సహజ రంగులతో రూపొందించి, వాటిని విక్రయిస్తూ తమవంతుగా పర్యావరణాన్ని కాపాడుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి కుటుంబ సభ్యులతో వలస వచ్చి వినాయక విగ్రహాల తయారీలో నిమగ్నమవుతున్నారు. మట్టి వినాయకులనే పూజించాలని కొంత కాలంగా ప్రచారం చేస్తుండడంతో సొంతంగా తయారు చేసి విక్రయించాలని నిర్ణయించుకున్నారు. మొదట పదుల సంఖ్యలో తయారు చేసి పండుగ రోజు విక్రయించే వారు. రెండేళ్ల నుంచి వారు చేస్తున్న మట్టి వినాయకులకు అనూహ్య స్పందన రావడంతో విగ్రహాల తయారీ విపరీతంగా పెరిగిపోయింది. చవితికి కొన్ని నెలల ముందుగానే పూర్తి సమయాన్ని విగ్రహాల తయారీకి కేటాయిస్తున్నారు. 4 నుంచి 9 అడుగుల ఎత్తును పెంచుకుంటూ విగ్రహాలను తయారు చేయడం ప్రారంభించారు. కొనుగోలు చేయడానికి ప్రజలు సైతం ముందుకు వస్తున్నారు. ఇక అప్పటి నుంచి మండపాల నిర్వాహకులు ఆర్డర్ ఇచ్చిన కొలతల ప్రకారం విగ్రహాలు రూపొందిస్తున్నారు. మహా రాష్ట్రలోని సిరొంచ నుంచి ప్రత్యేకంగా మట్టిని తీసుకొచ్చి రసాయనాలు లేని రంగులు వేస్తూ అందంగా తీర్చిదిద్దుతున్నారు. పర్యావరణాన్ని రక్షిద్దాం.. ప్రకృతిని బతికిద్దాం మొదలైన గణపతి నవరాత్రి ఉత్సవాల సందడి.. -
కాజీపేట రైల్వేడిపోకు పూర్వ వైభవం
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్లోని రన్నింగ్ డిపోకు త్వరలో పూర్వ వైభవం రానుంది. ఐదేళ్ల క్రితం వెలవెలబోయిన కాజీపేట జంక్షన్కు మహర్దశ పట్టనుంది. ఇటీవల సికింద్రాబాద్లో జరిగిన రన్నింగ్స్టాఫ్ రివ్యూలో రైల్వే అధికారులు కాజీపేట రన్నింగ్ డిపోను దృష్టిలో పెట్టుకొని దసరా కానుకగా కొత్తగా పోస్టులు ప్రకటించారు. 90 గూడ్స్ అసిస్టెంట్ లోకో పైలెట్లు, 90 అసిస్టెంట్ లోకో పైలెట్లు, 10 ప్యాసింజర్ అసిస్టెంట్ లోకో పైలెట్లను కలుపుకొని కొత్తగా 190 పోస్టులను అధికారులు అలాట్మెంట్ చేసినట్లు రైల్వే ట్రేడ్ యూనియన్ నాయకులు ఆదివారం తెలిపారు. గతంలో కాజీపేట జంక్షన్ నుంచి డోర్నకల్, విజయవాడ రైల్వే డిపోలకు రైల్వే క్రూ లింక్లు, లోకోపైలెట్లను తరలించి ప్రాధాన్యతను తగ్గించారని పేర్కొన్నారు. ఇప్పుడు కొత్త పోస్టులతో ఆ సమస్య లేకుండా పోయిందని వివరించారు. కాజీపేట నుంచి క్రూ లింక్లను తరలించి ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేయవద్దని గతంలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, రైల్వే నాయకులు రైల్వే జీఎం, డీఆర్ఎంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో నాటి రైల్వే జీఎం కాజీపేటకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కాజీపేటకు అలాట్ చేసిన కొత్త పోస్టులతో మొత్తం కాజీపేట రైల్వే రన్నింగ్ డిపో 720 మంది స్టాఫ్తో సికింద్రాబాద్ డివిజన్లో పెద్ద డిపోగా మారనుంది. బెల్లంపల్లి, డోర్నకల్తోపాటు ఇతర రైల్వే డిపోల్లో పనిచేస్తూ కాజీపేటకు రెక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్న వారు ఇక్కడికి బదిలీపై వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కాజీపేట రైల్వే డిపోపై ప్రత్యేక శ్రద్ధ.. వయా కరీంనగర్ మీదుగా భీమవరం–నాందేడ్కు సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఎక్స్ప్రెస్ రైలుకు కాజీపేట రైల్వే డిపోకు చెందిన క్రూ వారే (లోకోపైలెట్, అసిస్టెంట్ లోకోపైలెట్, ట్రైయిన్మేనేజర్–గార్డు) పనిచేసే అవకాశం ఉందని, అప్ అండ్ డౌన్ రూట్లో ఈ రైలుకు ఆరుగురు రన్నింగ్ స్టాఫ్ పనిచేస్తారని రైల్వే నాయకులు తెలిపారు. భవిష్యత్లో కరీంనగర్ మీదుగా నిజమాబాద్, నాందేడ్ వరకు ఎక్కువ రైళ్లను ప్రవేశపెట్టి నడిపించే క్రమంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కాజీపేట రైల్వే డిపోపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని పేర్కొన్నారు. రైల్వే నాయకుల హర్షం.. కాజీపేట రైల్వే డిపోకు కొత్తగా సికింద్రాబాద్ రైల్వే అధికారులు 190 ఎల్పీ, ఏఎల్పీల పోస్టులను మంజూరు చేసినందుకు కాజీపేట రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ లోకో రన్నింగ్ బ్రాంచ్ చైర్మన్ పాక రాజ్కుమార్, కాజీపేట రైల్వే మజ్దూర్ యనియన్ లోకోరన్నింగ్ బ్రాంచ్ సెక్రటరీ పి.సాయికుమార్ హర్షం వ్యక్తం చేశారు. దసరా కానుకగా కొత్త పోస్టులు ఇండెంట్ 190 ఎల్పీ, ఏఎల్పీ పోస్టులకు గ్రీన్సిగ్నల్ రన్నింగ్ స్టాఫ్ క్రూ రివ్యూలో నిర్ణయం ఫలించిన ఎంపీ, ఎమ్మెల్యే, రైల్వే నాయకుల కృషి -
ఉపాధ్యాయుడు రాజేందర్పై క్రిమినల్ కేసు
భూపాలపల్లి అర్బన్: జయశంకర్ భూపాలపల్లి జి ల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల సై న్స్ ఉపాధ్యాయుడు పెండ్యాల రాజేందర్పై క్రిమి నల్ కేసు నమోదు చేసినట్లు కలెక్టర్ రాహుల్శర్మ ప్రకటనలో తెలిపారు. రాజేందర్ మూడు రోజుల క్రితం పాఠశాలలో విద్యార్థులు తాగే ఆర్వో ప్లాంట్లో క్రిమిసంహారక మందు కలిపినట్లు నిర్ధారించా మని పేర్కొన్నారు. ఎంఈఓ దేవానాయక్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేట్టారు. ఇందులో ప్రస్తుత ప్రత్యేకాధికారి వెంకటనర్సయ్యపై వ్యక్తిగత విభేదాల కారణంగా పాఠశాల ప్రతిష్ఠను దెబ్బతీసేలా రాజేందర్ కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. కుట్రలో భాగంగా ఈ నెల 21వ తేదీన రాత్రి తాగునీటి ట్యాంకులో హానికర పురుగులమందు కలిపినట్లు విద్యార్థులు గమనించి పోలీసులకు తెలిపారన్నారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టి రాజేందర్ తాగునీటిలో విషం కలిపారని నిర్ధారించినట్లు తెలిపారన్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.. తాగునీటిలో క్రిమిసంహారక మందు కలిపిన ఘట నలో ఉపాధ్యాయుడు రాజేందర్ను అరెస్ట్ చేసినట్లు భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల ప్రాణాలకు ముప్పు కలిగించే ఈ తరహా దారుణ చర్యలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేలేదన్నారు. ఈ కేసులో ఇతరుల ప్రమేయం ఉందా అనే అంశాన్ని పరిశీలిస్తున్నామని, దర్యాపు పూర్తి స్థాయిలో కొనసాగుతోందన్నారు. సమావేశంలో సీఐ నరేశ్కుమార్, ఎస్సై సాంబమూర్తి పాల్గొన్నారు. -
ఆహ్లాదం.. ఆమడ దూరం!
● పార్కులో దెబ్బతిన్న పరికరాలు ● చిన్నారులు ఆడుకునేందుకు వసతులు కరువు ● మున్సిపాలిటీ పార్కు పరిస్థితి దయనీయంతొర్రూరు: ఆహ్లాదం పంచాల్సిన పార్కులు సమస్యలకు నిలయంగా మారాయి. ముఖ్యంగా తొర్రూరు పట్టణంలోని యతిరాజారావు పార్కు నిర్వహణ అధ్వానంగా మారింది. రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన చిన్నారుల క్రీడా పరికరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చిన్నారులు, మహిళలు, యువకులు, ఉద్యోగులు ఉదయం, సాయంత్రం పార్కులో వాకింగ్ చేస్తున్నారు. అయితే వ్యాయామం చేసేందుకు కనీస సదుపాయాలు లేవు. మూడేళ్ల క్రితం టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.2 కోట్లతో పార్కులో సౌకర్యాల కల్పనతో పాటు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. పిల్లలు ఆడుకునేందుకు, పెద్దలు వ్యాయామం, సేద తీరేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించారు. వీటి నిర్వహణ బాధ్యత మున్సిపాలిటీ నే చూడాల్సి ఉంటుంది. అయితే అధికారులు దృష్టి సారించకపోవడంతో పరికరాలు పాడయ్యాయి. పార్కు నిర్వహణ అధ్వానం.. మూడేళ్ల క్రితం యతిరాజారావు పార్కులో ఉద్యానవనం ఏర్పాటు చేశారు. విలువైన పూల మొక్కలు, గడ్డి జాతులు, రంగు రంగుల కళాకృతులు, కుర్చీలు, నీటిని వెదజల్లే ఫౌంటేన్తో పార్కు ఆహ్లాద వాతావరణం పంచేది. చిన్నారులకు క్రీడా పరికరాలతో ఆటవిడుపుగా ఉండేది. వ్యాయామం కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుండటంతో అధ్వానంగా మారాయి. పార్కులోని చిన్నారుల ఆట పరికరాలు, వ్యాయామ పరికరాలు నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారాయి. క్లైంబింగ్ ప్రేమ్తో పాటు పలు పరికరాలు తుప్పు పట్టాయి. ఫౌంటెన్ లైట్లు పగిలిపోయాయి. మూత్రశాలలకు నీటి సదుపాయం కల్పించకపోవడంతో నిరుపయోగంగా మారాయి. నిర్వహణ లేకపోవడంతో గడ్డి పెరిగి అధ్వానంగా మారింది. పాములు, విష పురుగులకు నివాసంగా మారింది. పార్కులోని జంతువుల బొమ్మలు దెబ్బతిన్నాయి. గ్రౌండ్లోని వాకింగ్ దారిలో మొక్కలు మొలిచి అధ్వానంగా మారింది. ఓపెన్ జిమ్ పరికరాలు తుప్పు పడుతున్నాయి. మరమ్మతులు చేపడతాం యతిరాజారావు పార్కులో అన్ని వసతులు కల్పిస్తాం. చిన్నారుల ఆట పరికరాలు విరిగిపోయాయి. వాటిని తిరిగి ఏర్పాటు చేస్తాం. ఉదయం, సాయంత్రం సమయాల్లో పార్కు తెరిచి ఉంచుతున్నాం. స్థానికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. వసతుల కల్పనపై కలెక్టర్కు విన్నవిస్తాం. – శ్యాంసుందర్, తొర్రూరు మున్సిపల్ కమిషనర్ -
ముఖం చూపించాల్సిందే..
● ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్తో ఉపాధ్యాయుల సతమతం ● పెరిగిన హాజరు శాతం, సెలవుల నమోదు ● ఇన్ సరే.. ఔట్ కనిపించని వైనం ● పర్యవేక్షణ పెంచుతామంటున్న అధికారులుసాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల్లో కొందరు సక్రమంగా విధులకు హాజరుకావడం లేదనే విమర్శలు ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లో అయితే అంతే సంగతులు అన్నట్లు చెప్పుకుంటారు. దీనిని అరికట్టేందుకు గతంలో బయోమెట్రిక్ పద్ధతిన హజరు నమోదు చేసేవారు. కొంతకాలం తర్వాత అది మూలనపడింది. దీంతో ఈ ఏడాది ముందుగా విద్యార్థుల హాజరుకోసం.. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఉపాధ్యాయుల హాజరు కోసం ఎఫ్ఆర్ఎస్(ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్)ను అమల్లోకి తీసుకొచ్చారు. ముఖం స్కాన్ చేస్తేనే హాజరు పడే విధంగా యాప్ ప్రవేశపెట్టారు. అయితే ఈ యాప్ ఉపయోగించడంలో కొందరు తడబాటు, మరికొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, మరికొందరు సతమతం అవుతున్నారు. ఏదీ ఏమైనా గతంలో పోలిస్తే జిల్లాలో ఉపాధ్యాయుల హాజరుశాతం పెరిగినట్లు స్పష్టం అవుతోంది. పెరిగిన ఉపాధ్యాయుల హాజరు ఎఫ్ఆర్ఎస్ వల్ల జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల హాజరుశాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలు కలిపి మొత్తం 898 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో విద్యార్థులు లేని పాఠశాలలు 148 ఉన్నాయి. ఇవిపోగా మిగిలిన 750 పాఠశాలల్లో అన్ని కేటగిరీల ఉపాధ్యాయులు, నాన్టీచింగ్ ఉద్యోగులు కలిపి మొత్తం 3,930 మంది పనిచేస్తున్నారు. గతంలో జిల్లాలో ఉపాధ్యాయుల హాజరు 65శాతం మేరకే ఉండేది. ఎఫ్ఆర్ఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత 80శాతానికి మించి నమోదు కావడం గమనార్హం. అదే విధంగా పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, కాంప్లెక్స్ హెచ్ఎంలతో సమన్వయం చేసుకుంటూ కొందరు నామమాత్రం సెలవులు పెట్టి నడిపించేవారనే ఫిర్యాదులు ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం ఎఫ్ఆర్ఎస్లో సెలవుల కాలం స్పష్టంగా కనిపించడంతో తప్పని సరిగా సెలవుల పెట్టాల్సి వస్తోంది. పెట్టిన సెలవు నమోదు అవుతుంది. ఇలా గతంలో జిల్లాలో రోజుకూ 100 నుంచి 150 మంది మేరకు సెలవులు పెట్టినట్లు ధ్రువీకరించగా ఇప్పుడు ఈ సెలవులు 300 నుంచి 350 వరకు నమోదు అవుతున్నాయి. దశల వారీగా మార్పులు ఎఫ్ఆర్ఎస్ ప్రవేశపెట్టిన తర్వాత గతం కన్నా ఉపాధ్యాయుల హాజరు శాతం పెరిగింది. అయితే కొన్ని లోటుపాట్లు ఉన్న విషయంపై విద్యాశాఖ పెద్దల సమక్షంలో చర్చ జరుగుతోంది. దశల వారీగా మార్పులు వస్తాయి. అప్పటి వరకు సాయంత్రం పర్యవేక్షణ పెంచుతున్నాం. –రవీందర్ రెడ్డి, డీఈఓఇటీవల జిల్లాలో ఉపాధ్యాయుల హాజరు వివరాలు మరింత మార్పు అవసరం.. ఉపాధ్యాయుల హాజరు నమోదు కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్ఆర్ఎస్లో మరిన్ని మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని విద్యాశాఖ ఉద్యోగుల్లో చర్చ. ప్రతీ ఉపాధ్యాయుడు ముందుగా తమ మొబైల్లో ఎఫ్ఆర్ఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. దానిలో పనిచేస్తున్న పాఠశాల లొకేషన్, ఉపాధ్యాయుడు ముఖం నమోదు చేయాలి. ఉదయం 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు పనిచేస్తున్న పాఠశాల లొకేషన్ వద్ద సెల్ఫొన్లో ఎఫ్ఆర్ఎస్ చేయాలి. అయితే మారుమూల ప్రాంతాలు ఎక్కువగా ఉన్న మహబూబాబాద్ వంటి జిల్లాలో సిగ్నల్ లేకపోవడం, లొకేషన్ సక్రమంగా చూపకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అదేవిధంగా ఉదయంతో పాటు సాయంత్రం 4:30 తర్వాత మరోసారి ఎఫ్ఆర్ఎస్ చేయాలి. కానీ ప్రస్తుతం అది కనిపించడం లేదు. నమోదు అయినట్లు చూపించడం లేదని సమాచారం. దీంతో ఉదయం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు సాయంత్రం వరకు ఉండేది.. ఉండనిది తెలియడం లేదని విద్యాశాఖ కార్యాలయ ఉద్యోగులు చెబుతున్నారు. తేదీ రిజిస్ట్రేషన్ హాజరు గైర్హాజరు సెలవు శాతం 18 3,852 3099 299 461 80.45 19 3,871 3,226 321 324 83.34 20 3,876 3,149 347 380 81.24 21 3,863 3,150 355 359 81.54 22 3,885 3,172 380 331 81.64 -
ఆర్ట్స్ కళాశాల డిగ్రీ సెమిస్టర్ల పరీక్షల ఫలితాల విడుదల
కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (అటానమస్)లో బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ మొదటి, రెండు, ఐదో (బ్యాక్లాగ్) సెమిస్టర్ పరీక్షల ఫలితాలను ఆదివారం ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి విడుదల చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 1,014మంది విద్యార్థులు హాజరుకాగా అందులో 355మంది (35శాతం)ఉత్తీర్ణులయ్యారని ప్రిన్సిపాల్ జ్యోతి తెలిపారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, ఆ కళాశాల పరీక్షల నియంత్రణాధికారి సుధీర్, అధ్యాపకులు గిరిప్రసాద్, శ్రీదేవి, నహిదాపర్వీన్, జితేందర్,రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పొలం గట్లే పిల్లలకు దారి..
మంచ్యతండా ప్రాథమిక పాఠశాల భవనంపొలం గట్లపై నడుస్తున్న పాఠశాల విద్యార్థులుమరిపెడ రూరల్: మారుమూల పల్లెలు, గిరిజన తండాల్లోని పలు పాఠశాలలు పొలాల మధ్య ఉండడంతో సరైన రహదారులు లేవు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు తిప్పలు తప్పడంలేదు. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబా బాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామ పంచాయ తీ పరిధిలోని మంచ్యతండాలో 20 ఏళ్ల క్రితం పొలాల మధ్య పాఠశాల ఏర్పాటు చేశారు. అందులోనే అంగన్వాడీ కేంద్రంతోపాటు పాఠశాల నిర్వహణ కొనసాగుతోంది. అంగన్వాడీ కేంద్రంలో 10 మంది చిన్నారులు, ప్రాథమిక పాఠశాలలో 20 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కాగా, గదిలో ఐదో తరగతి వరకు విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు బోధిస్తుండగా.. వరండాలో అంగన్వాడీ పిల్లల ఆలనా పాలన చూస్తున్నారు. కాగా దారి లేకపోవడంతో విద్యార్థులు, చిన్నారులు పొలం గట్ల మీదుగా పాఠశాలకు వెళ్లి, అదే గట్లపై మళ్లీ సాయంత్రం ఇంటికి వస్తున్నారు. ఉపాధ్యాయులు సైతం తమ ద్విచక్రవాహనాలను రోడ్డుపై నిలిపి, గట్ల వెంబడి పాఠశాలకు వెళ్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో పొలం గట్లు తడిసిపోయి పిల్లలు జారి కింద పడిపోతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇప్పటికై నా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలకు తక్షణమే అదనపు గదులతో పాటు, రహదారిని ఏర్పాటు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, మంచ్యతండా వాసులు కోరుతున్నారు. రహదారి లేని మంచ్యతండా పాఠశాల ఇరుకు గదిలోనే 30 మంది విద్యార్థులకు బోధన పట్టించుకోని విద్యాశాఖ అధికారులు -
ఓపెన్ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలి
విద్యారణ్యపురి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈవిద్యాసంవత్సరం 2025–26లో డిగ్రీ, పీజీ ప్రవేశాలు పొందాలని ఆ యూనివర్సిటీ స్టూడెంట్ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు కోరారు. డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశాల ప్రక్రియలో భాగంగా ఆదివారం వెంకటేశ్వర్లు ఆ యూనివర్సిటీ సెంటర్ ఫర్ స్టాఫ్ ట్రైనింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకటరమణతో కలిసి హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీల అధ్యయన కేంద్రాలను వేర్వేరుగా సందర్శిచారు. ప్రవేశాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు పొందే విద్యార్థులకు రిటైలర్స్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని వెల్లడించారు. విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 30 వరకు అడ్మిషన్లకు గడువు ఉందని తెలిపారు. పూర్తి వివరాలకు ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్లో చూడాలన్నారు. కేడీసీలో పోస్టర్ల ఆవిష్కరణ కేడీసీ కో–ఆర్డినేటర్ డాక్టర్ ఆలువాల సంజీవయ్య, అధ్యాపకులు బి.వెంకటగోపీనాథ్, ఎం.సదానందం, సురేశ్, పూర్ణచందర్ ఉన్నారు. -
గూడ్స్షెడ్కు భారీగా ఎరువులు
ఖిలా వరంగల్: వరంగల్ రైల్వేస్టేషన్ గూడ్స్షెడ్కు ఆదివారం కోరమండల్ కంపెనీకి చెందిన ఎరువులు భారీగా వచ్చాయి. 20:20:0:13 రకం 1844 మెట్రిక్ టన్నులు, 15:15:15 రకం 526 మెట్రిక్ టన్నులు, 16:20:0:13 రకం 319 మెట్రిక్ టన్నులు చేరాయి. కోరమండల్ ఎరువులను రికార్డుల ప్రకారం వ్యవసాయ అధికారులు విజ్ఞాన్, రవీందర్రెడ్డి పరిశీలించారు. కలెక్టర్ సత్యశారద, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ ఆదేశాల ప్రకారం కోరమండల్ ఎరువులను నిబంధనల ప్రకారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పీఏసీఎస్ గోదాంలు, ఫర్టిలైజర్ షాపులకు పంపించనున్నట్లు వ్యవసాయ అధికారి రవీందర్రెడ్డి తెలిపారు. అలాగే, సోమవారం ఆర్సీఎఫ్ కంపెనీకి చెందిన 1,319.12 మెట్రిక్ టన్నుల యూరియా నగరానికి రానుందని, దీంతో ఉమ్మడి జిల్లా రైతుల యూరియా కష్టాలు తీరనున్నాయని జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ పేర్కొన్నారు. -
ముగిసిన టేబుల్ టెన్నిస్ పోటీలు
హసన్పర్తి: నగరంలోని కిట్స్ ఇంజనీరింగ్ కశాశాల ఇండోర్ స్టేడియంలో రెండు రోజులపాటు నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు ఆదివారం ముగిశాయి. టేబుల్ టెన్నిస్ వెటరన్ క్రీడాకారుడు రమేశ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ క్రీడలతో క్రమశిక్షణ, స్నేహభావం పెంపొందుతుందన్నారు. అనంతరం విజేతలకు జ్ఞాపికలు అందజేశారు. టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హరీశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కిట్స్ కళాశాల ఏఓ డాక్టర్ రమేశ్రెడ్డి, టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ మోహన్రావు, టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్లు డాక్టర్ జైసింగ్ అజ్మీరా, సునీల్కుమార్, కార్యనిర్వాహక సభ్యులు రవికుమార్, వెంకటస్వామి, మహేశ్, డాక్టర్ ప్రభాకరాచారి తదితరులు పాల్గొన్నారు. -
సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలి
హన్మకొండ: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్ధల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య చేపట్టనున్న సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని ఆ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు బుట్టి శ్యాం యాదవ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని సంఘం కార్యాలయంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రంజిత్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పిందన్నారు. బీసీలకు రిజర్వేషన్ల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న బిల్లును ఆమోదం తెలిపేలా ఒత్తిడి పెంచాలన్నారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా ముందుకు వెళ్తే యుద్ధం చేస్తామన్నారు. సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు సోల్తి సారయ్య, నాయకులు బాబు యాదవ్, సౌగాని శ్రీనివాస్, బగ్గీ రాజు, సనత్ రాజేష్, తదితరులు పాల్గొన్నారు. -
బోదకాలు వ్యాప్తిని అరికట్టాలి
కొత్తగూడ: బోదకాలు వ్యాప్తిని అరికట్టేందుకు గ్రామస్తులు సహకరించాలని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి డాక్టర్ శిరీష కోరారు. మండలంలోని వేలుబెల్లిలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. బోదకాలు దోమ కాటు వల్ల వస్తుందన్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన మందులు ప్రతీ ఒక్కరు వేసుకోవాలని సూచించారు. మందుల వాడకం వల్ల ఎలాంటి దుష్ప్రభావం ఉండదని, వ్యాఽధి కారక క్రీములు ఉన్న వ్యక్తుల్లో కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడతాయని అవగాహన కల్పించారు. వాటి వల్ల ఎలాంటి ఇబ్బందులు రావన్నారు. మాజీ సర్పంచ్ వజ్జ వెంకటలక్ష్మి, గంగారం పీహెచ్సీ వైద్యాధికారి ప్రత్యూష, సుధీర్రెడ్డి, పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు. -
మతసామరస్యాన్ని పెంపొందించుకోవాలి
● డీఎస్పీ తిరుపతిరావు మహబూబాబాద్ రూరల్: వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ సమీపిస్తున్న తరుణంలో మత సామరస్యాన్ని పెంపొందించుకునేందుకు పీస్ కమిటీ సభ్యులు కృషి చేయాలని డీఎస్పీ తిరుపతిరావు కోరారు. జిల్లా శాంతి, సంక్షేమ కమిటీ (పీస్ కమిటీ) సభ్యులతో మహబూబాబాద్ టౌన్ పో లీస్ స్టేషన్లో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిరావు సజావుగా పండుగలు నిర్వహించుకోవడానికి తీసుకునే చర్యలపై చర్చించారు. పోలీసులకు ప్రజలు సహకారం అందించాలని, మత సామరస్యాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయాలని కోరారు. సమావేశంలో టౌ న్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి, ఎస్సైలు శివ, అశోక్, అలీం హుస్సేన్, సూరయ్య, మౌనిక పాల్గొన్నారు. -
పీహెచ్సీలకు నోడల్ అధికారి నియామకం
గార్ల: జిల్లాలోని 9 పీహెచ్సీలకు ప్రభు త్వ నోడల్ అధికారిగా గంధంపల్లి పీహెచ్సీ డాక్టర్ రాజ్కుమార్ను నియమిస్తూ శనివారం డీఎంహెచ్ఓ రవి రాథోడ్ ఉత్వర్వులు జారీచేశారు. జిల్లాలోని బ య్యారం, గార్ల, గంగారం, కొత్తగూడ, అయోధ్యపురం, గంధంపల్లి, కోమట్లగూడెం, తీగలవేణి, ముల్కనూరు పీహెచ్సీల పరిధిలో నిర్వహించే జాతీ య ఆరోగ్య మిషన్, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యక్రమాల అమలు తీరుతెన్నులను రాజ్కుమార్ పరిశీలించనున్నారు. విషజ్వరాలు, సీజనల్ వ్యాధులు ప్రభలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక నోడల్ అధికారి అవగాహన చర్యలు చేపట్టనున్నారు. -
ఆదివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2025
చాలెంజింగ్ విధులు...రాత్రిపూట విధులు నిర్వహించడం మహిళా పోలీసులకు చాలెంజింగ్ మారింది. బ్లూకోల్ట్ సిబ్బందితో సమానంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నిర్దేశించిన డ్యూటీని నిర్వహిస్తున్నారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న హాస్టళ్ల పరిసరాలను పరిశీలించడంతోపాటు బార్అండ్రెస్టారెంట్ల దగ్గర ఎదురయ్యే ఆకతాయిల గొడవలు మొదలు కొని, అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో బ్యాగులు, తదితర వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేయడం, రౌడీ షీటర్ల ఇళ్లను సందర్శించి ఉన్నారో, లేదో తెలుసుకోవడం, రాత్రి పూట నిర్వహించే వ్యాపారాలను బంద్ చేసి ఎక్కడా చిన్న ఘటన జరగకుండా చూసుకోవడం చేస్తున్నారు. దీంతోపాటు ఏదైనా లాఅండ్ఆర్డర్కు సంబంధించి పెద్ద సంఘటన జరిగితే వెంటనే బ్లూకోల్ట్ సిబ్బంది సహకారం తీసుకుని పరిష్కరిస్తున్నారు. పోలీస్స్టేషన్కు వెళ్లగానే చిరునవ్వుతో ఆహ్వానించే ఓ రిసెప్షనిస్ట్. అక్రమార్కుల తాట తీసే ఓ టాస్క్ఫోర్స్ టీం మెంబర్. ఇలా శాఖలోని అన్ని విభాగాల్లో ముందుంటున్నారు మహిళా పోలీసులు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో అందరూ సమానమే అనేలా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇన్నాళ్లు కొన్ని విధులకే పరిమితమైన వారంతా ఉన్నతాధికారుల నిర్ణయాలతో రోడ్డెక్కి విధులు నిర్వహిస్తున్నారు. ‘మీ భద్రతే మా బాధ్యత’ అంటూ రాత్రిళ్లు సైతం విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. – వరంగల్ క్రైండయల్ 100 కాల్స్ మొదలుకుని కష్టతరమైన ఫిర్యాదుల విచారణకు సైతం మహిళా పోలీసులు సై అంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పురుషులతో సమానంగా స్వీకరిస్తూ రంగంలోకి దిగుతున్నారు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా బ్లూకోల్ట్ విధుల్లో పురుషులతో కలిసి సమర్థంగా రాణిస్తున్నారు. రాత్రిపూట పెట్రోలింగ్ విధుల్లో భాగస్వామ్యమవుతున్నారు. మహిళా నేరస్తులను జైళ్లకు తరలించే క్రమంలో ఎస్కార్ట్గా, నేతల సభలకు షార్ట్ వెపన్లతో హాజరై సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారు. సాధారణంగా పోలీస్ స్టేషన్లలో రూల్కాల్ ఉదయం 9 గంటలకు చేపడుతున్నారు. అప్పటి నుంచి 2 గంటల వరకు విధులు నిర్వహించి.. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు డ్యూటీలో కొనసాగుతున్నారు. రాత్రి డ్యూటీ ఉన్నవారు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. రిసెప్షన్ విధులు నిర్వహించే మహిళలు ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు డ్యూటీలో ఉంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి 9 గంటల వరకు మరొకరు విధులు చేపడుతున్నారు. వీరికి 24 గంటల పాటు రెస్ట్ దొరుకుతుంది. మహిళా పోలీస్ అధికారులు అత్యంత హుషారుగా ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నారు. ఇందుకుగాను వేతనంతో పాటు 30 శాతం అదనంగా చెల్లిస్తారు. దీనికి తోడు ఉన్నత అధికారుల నుంచి విధులకు సంబంధించి ఎలాంటి ఒత్తిళ్లు లేకపోవడంతో ట్రాఫిక్ విధుల్లో మక్కువ చూపిస్తున్నారు. ప్రస్తుతం ట్రైసిటీ పరిధి ట్రాఫిక్ పోలీస్స్టేషన్లలో ఒక ఇన్స్పెక్టర్, ముగ్గురు ఏఎస్సైలు, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, ఏడుగురు కానిస్టేబుళ్లు, ఒకరు హోంగార్డు విధుల్లో కొనసాగుతున్నారు. పోస్టు సంఖ్య డీసీపీ 01సీఐ 02 ఎస్సై 24 ఏఎస్సై, హెడ్కానిస్టేబుళ్లు 245కానిస్టేబుళ్లు 352 హోంగార్డులు 70 -
యూరియా వినియోగం తగ్గించాలి
● ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు మహబూబాబాద్ రూరల్: యూరియా వినియోగాన్ని తగ్గించాలని వ్యవసాయశాఖ సహాయ సంచాలకుడు అజ్మీరా శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద యూరియా కోసం వచ్చిన రైతులను ఉద్దేశించి శ్రీనివాసరావు శనివారం మాట్లాడారు. యూరియాను అధిక మొత్తంలో వినియోగించి అనారోగ్యాల పాలుకావద్దన్నారు. జిల్లాకు ఇప్పటి వరకు 21,071.452. మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందన తెలిపారు. ఇఫ్కో కంపెనీ నుంచి ప్రభుత్వం 112 మెట్రిక టన్నుల యూరియా కేటాయించారని, ప్రైవేట్ డీలర్లకు 88 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు తెలిపారు. ఆదివారం ఆర్.సీ.ఎఫ్ కంపెనీ నుంచి 112 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్లకు 88 మెట్రిక్ టన్నులు కేటాయింపు చేస్తారని తెలిపారు. 500 ఎం.ఎల్ నానో యూరియా 50 కిలోల యూరియా బస్తాకు సమానమని వివరించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీసీఓ వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ చైర్మెన్ నాయిని రంజిత్, ఏఓ తిరుపతిరెడ్డి, తహసీల్దార్ చంద్రరాజేశ్వర్ రావు, టౌన్ సీఐ మహేందర్ రెడ్డి, పీఏసీఎస్ సీఈఓ ప్రమోద్ పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లాకు రెండు సీఓఈ కళాశాలలు
న్యూశాయంపేట : ఉమ్మడి వరంగల్ జిల్లాకు తెలంగాణ మైనారిటీ గురుకులాల విద్యాసంస్థలు(టెమ్రిస్) ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ (సీఓఈ) కళాశాలలు రెండు మంజూరయ్యాయి. ఈ మేరకు టెమ్రిస్ సెక్రటరీ షఫియుల్లా ఉత్తర్వులు జారీచేశారు. సీఓఈ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టెమ్రిస్ ఉమ్మడి జిల్లా కో–ఆరినేటర్ జంగా సతీశ్ శనివారం తెలిపారు. ఉమ్మడి జిల్లా మైనారిటీ కేటగిరీకి చెందిన (ముస్లింలు, క్రిస్టియన్లు, పార్సీలు, జైనులు, సిక్కులు)వారితోపాటు నాన్ మైనారిటీ కోటా కింద(ఎస్సీ,ఎస్టీ, బీసీ, ఓసీ) అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు అర్హులన్నారు. బాలికల కోసం ఒకటి(వరంగల్(జీ1) కేయూ క్రాస్), బాలుర కోసం ఒకటి (వరంగల్(బీ1) రంగశాయిపేట జక్కలొద్దిలో సీఓఈలు ఏర్పాటు కానున్నాయని తెలిపారు. దరఖాస్తులు సమర్పించడానికి ఈనెల 29 వరకు గడువు ఉందన్నారు. మరిన్ని వివరాలకు ములుగురోడ్డు పెద్దమ్మగడ్డ సమీపంలోని మైనారిటీ గురుకులాల ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతీయ సమన్వయాధికారి కార్యాలయం లేదా 7331170866, 7331107367 నంబర్లలో సంప్రదించాలన్నారు. ఏసీబీ వలలో డోర్నకల్ సీఐ, కానిస్టేబుల్డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ సీఐ బి.రాజేష్ బెల్లం కేసులో నిందితుడినుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా శనివారం ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. సీఐతోపాటు గన్మెన్ (కానిస్టేబుల్) రవిని అదుపులోకి తీసుకుని వరంగల్ ఏసీబీ కోర్టుకు తరలించారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్కు చెందిన ఓ వ్యాపారి కిరాణంతోపాటు బెల్లం వ్యాపారం నిర్వహిస్తున్నాడు. గత మే నెలతోపాటు ఈ నెల మొదటి వారంలో సదరు వ్యాపారి బెల్లం తరలిస్తుండగా డోర్నకల్ పోలీసులు పట్టుకుని బొలేరోతోపాటు ట్రాలీ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వేర్వేరుగా రెండు కేసులు నమోదు చేశారు. మొదటి కేసుకు సంబంధించి సీఐ.. నిందితుడికి నోటీసు జారీ చేయలేదు. ఈ నెల మొదటి వారంలో నమోదైన కేసులో నిందితుడు హైకోర్టునుంచి ముందస్తు బెయిల్ పొందాడు. సీఐ ఆదేశాల మేరకు గన్మెన్ రవి సదరు వ్యాపారికి ఫోన్ చేసి సీఐ రమ్మంటున్నాడని, రూ.50 వేల లంచం ఇవ్వాలని, లేకుంటే బెల్లం వ్యాపారం చేయనివ్వమని బెదిరించాడు. దీంతో సదరు వ్యాపారి ఈ నెల 21న ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో సీఐపై నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు శనివారం స్థానిక ఎస్సీ, బీసీ కాలనీలోని సీఐ ఇంటికి వెళ్లిన వ్యాపారి రూ.30 వేల నగదు ఇస్తుండగా రెడ్హ్యాండెడ్ పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. అనంతరం ఇంట్లో తనిఖీలు నిర్వహించి రూ.1,25,050 నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. సీఐతో పాటు గన్మెన్ రవిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు చెప్పారు. కేసు విచారణలో భాగంగా ఫిర్యాదుదారుడి పేరు గోప్యంగా ఉంచుతున్నట్లు తెలిపారు. దాడుల్లో డీఎస్పీతో పాటు సీఐలు ఎల్. రాజు, ఎస్. రాజు, ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు. ● ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం ● ఈనెల 29వ తేదీ వరకు గడువు బెల్లం కేసులో రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు సీఐ ఇంట్లో మరో రూ.1.25 లక్షల నగదు స్వాధీనం -
ఆటోమేటిక్ మీటరు రీడింగ్తో బిల్లింగ్ సులువు
హన్మకొండ: హెచ్టీ సర్వీస్ల బిల్లింగ్లో లోపాలు సవరించడానికి ఆటోమేటిక్ మీటరు రీడింగ్ ప్రక్రి య ప్రారంభించామని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. ఈ విధానాన్ని డిసెంబర్ నాటికి అన్ని సర్కిళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. శనివారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎండీ మాట్లాడుతూ ప్రస్తుతం కరీంనగర్, వరంగల్, హనుమకొండలో పనులు జరుగుతున్నాయన్నారు. మోడెం ద్వారా కచ్చితమైన సమాచారం వ స్తుందన్నారు. మీటరు స్థితి, విద్యుత్ వినియోగం, సరఫరా సమాచారం రియల్ టైంలో వస్తుందని తెలిపారు. ఇలా చేయ డం వల్ల పొరపాట్లకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. నవరాత్రి ఉత్సవ నిర్వాహకులు, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లు, ఎన్పీడీసీఎల్ సిబ్బందికి సూచనలు తెలిపే కరపత్రం రూపొందించామని, దీనిని 16 సర్కిళ్ల పరిధిలో మండపాల నిర్వాహకులకు అందజేయాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వి. మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈలు అశోక్ కుమార్, సదర్ లాల్, తిరుమల్ రావు, అశోక్, వెంకట రమణ, చరణ్ దాస్, జీఎంలు అన్నపూర్ణ, సురేందర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
విద్యార్థుల మేధస్సును వెలికితీయాలి
● కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మహబూబాబాద్ అర్బన్: విద్యార్థుల మేధస్సును వెలికితీయడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మానుకోట మున్సిపల్ పరిధిలోని అనంతారం బీ ఫార్మసీ బాలికల గురుకుల కళాశాలను శనివారం కలెక్టర్ పరి శీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నూతన టెక్నాలజీతో సబ్జెక్ట్ల వారీగా ఉపాధ్యాయులు విద్యాబోధన చేయాలన్నారు. అంకితభావంతో పనిచేస్తూ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన మెనూను ప్రకారం రుచికరమైన నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలన్నారు. వసతి గృహాల్లో వార్డెన్ హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, సీజనల్ వ్యాధుల వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులకు వేడి ఆహారాన్నే అందించాలని చెప్పారు. అనంతరం జిల్లా కేంద్రంలోని బాలికల పాఠశాలను సందర్శించారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, డిజిటల్ తరగతులను నిర్వహిస్తు విద్యార్థులను సైన్స్ టెక్నాలజీతోపాటు అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని, తరగతి గదులు, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్లు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. -
‘స్థానికం’లో విజయం మనదే..
హన్మకొండ చౌరస్తా: త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వందశాతం విజయ సాధించి తీరుతామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 25, 26 తేదీల్లో జిల్లాలో చేపట్టనున్న ‘జనహిత పాదయాత్ర’పై శనివారం హనుమకొండలోని డీసీసీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశానికి మంత్రులు లక్ష్మణ్, సీతక్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమీక్ష అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి లక్ష్మణ్ మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్కుమార్గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ చేపట్టిన జనహిత పాదయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు రోజులు కొనసాగుతుందన్నారు. మొదటి రోజు వర్ధన్నపేట మండలం ఇల్లంద మార్కెట్ నుంచి వర్ధన్నపేటలోని అంబేడ్కర్ సెంటర్ వరకు, రెండో రోజు వర్ధన్నపేట నుంచి ఫిరంగిగడ్డ ప్రభుత్వ పాఠశాల వరకు కొనసాగుతుందన్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ పాదయాత్ర ద్వారా ప్రజాప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ఫలాలను అందరికీ వివరించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. అభివృద్ధితో పాటు పార్టీ బలోపేతానికి మరింత చురుగ్గా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు ఠాకూర్, కేఆర్ నాగరాజు, యశస్వినిరెడ్డి, ఎంపీలు పోరిక బలరాంనాయక్, డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, టీపీసీసీ బాధ్యులు సత్యనారాయణ, ఈవీ శ్రీనివాస్, ధర్మారావు, ప్రభాకర్రెడ్డి, బత్తిని శ్రీనివాసరావు, మేయర్ గుండు సుధారాణి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్రెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు. మీతో కలిసి పనిచేస్తా.. సమీక్ష సమావేశానికి హాజరుకానీ మంత్రి కొండా సురేఖ.. జిల్లా ఇన్చార్జ్ మంత్రి లక్ష్మణ్కు ఫోన్ చేశారు. అనివార్య కారణాలతో తాను సమావేశానికి హాజరు కాలేకపోతున్నానని, ఉమ్మడి జిల్లాలో నిర్వహించే ప్రతీ కార్యక్రమానికి మీతో కలిసి పనిచేస్తామని తెలిపారు. వ్యక్తిగత కారణాలతో హాజరుకాని ఎమ్మెల్యేలు.. వ్యక్తిగత కారణాలతో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి సమీక్షకు హాజరు కాలేకపోతున్నట్లు సమాచారం చేరవేశారు. కాగా, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ, మురళీనాయక్, డిప్యూటీ స్పీకర్ రామచంద్రనాయక్ గైర్హాజరయ్యారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్కుమార్ జనహిత పాదయాత్రపై సమీక్ష -
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం మనదే
● రాష్ట్ర మంత్రులు లక్ష్మణ్, సీతక్క ● జనహిత పాదయాత్రపై సమీక్ష సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి సీతక్క, చిత్రంలో మంత్రి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు నాయిని, నాగరాజు, యశస్వినిరెడ్డి, ఠాకూర్, ఎమ్మెల్సీ సారయ్య, ఎంపీలు కావ్య, బలరాంనాయక్ తదితరులు ఈ నెల 25, 26 తేదీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపట్టనున్న జనహిత పాదయాత్ర విజయవంతానికి శనివారం హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రులు లక్ష్మణ్, సీతక్క హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థ ల ఎన్నికల్లో వందశాతం విజయం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. – హన్మకొండ చౌరస్తా -
మైనర్లపై అఘాయిత్యం నేరం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ మహబూబాబాద్ రూరల్: లైంగిక అఘాయిత్యం మైనర్ బాలుడిపై జరిగినా పోక్సో చట్టం పరిధిలోకి వస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. జిల్లాలో పోక్సో కేసుల నమోదు, విచారణ తదితర అంశాలపై జిల్లాస్థాయి అధికారుల సమావేశం న్యాయ సేవ సదన్లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ మాట్లాడుతూ.. సాధారణంగా మైనర్ బాలికలపై లైంగిక అఘాయిత్యం జరిగితేనే పోక్సో చట్టం వర్తిస్తుందని అపోహ సమాజంలో ఉందని, కానీ 18 సంవత్సరాలలోపు వయసున్న బాలబాలికలపై జరిగిన లైంగిక నేరాలన్నీ పోక్సో చట్టపరిధిలోకే వస్తాయని స్పష్టం చేశారు. పిల్లలకు సంబంధించి ప్రభుత్వం ఏ చట్టం చేసినా బాలలు మంచి వాతావరణంలో పెరగాలన్నదే ఆ చట్టాల ఉద్దేశమని తెలిపారు. బాలలపై లైంగిక నేరం జరిగినట్లు తెలిసినప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేయయనివారుకూడా ఈ చట్ట ప్రకారం శిక్షార్హులేనని వివరించారు. సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవా సంస్థ కార్యదర్శి ఎస్.శాలిని మాట్లాడుతూ.. పోక్సో చట్టం బాల్యవివాహాల నిరోధక చట్టాలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో కూడా వివిధ రకాల చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ రూపొందించిన లఘు చిత్రాలను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపెల్లి వెంకటయ్య, సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ డాక్టర్ నాగవాణి, సభ్యులు డేనియల్, అశోక్, జిల్లా బాలల సంరక్షణ అధికారి నరేష్, తదితరులు పాల్గొన్నారు. -
విద్యాశాఖలో పదోన్నతుల పండుగ
● జిల్లాలో 103 మంది ఎస్జీటీలకు పదోన్నతి ● కసరత్తు చేస్తున్న విద్యాశాఖ అధికారులుమహబూబాబాద్ అర్బన్: జిల్లాలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు సుధీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులకు ఎట్టకేలకు గ్రీన్సిగ్నల్ పడింది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్జీటీలుగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో 103 మంది స్కూల్ అసిస్టెంట్లుగా, వివిధ సబ్జెక్ట్ల్లో ప్రాథమిక పాఠశాల ప్రాధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి పొందనున్నారు. ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులు రిపోర్ట్ చేస్తే మిగతావాటిని భర్తీ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 103 మంది ఎస్జీటీల సీనియార్టీ ఆధారంగా ఖాళీల జాబితాను అధికారులు విడుదల చేశారు. నేడు (ఆదివారం) వెబ్సైట్లో పాఠశాలలను ఎంపిక చేసుకునే అవకాశం ఉపాధ్యాయులకు కల్పించారు. పదోన్నతుల కేటాయింపు ఇలా.. ఎస్జీటీ ఉపాధ్యాయుల నుంచి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు పొందే వారు సీనియార్టీ ఆధారంగా జిల్లా వ్యాప్తంగా 103 మంది ఉన్నారు. 14 మంది స్కూల్ అసిస్టెంట్లు జిల్లాలో ప్రిన్సిపాళ్లుగా పదోన్నతులు పొందారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్జీటీల ఉపాధ్యాయుల లిస్టు, సీనియార్టీ ప్రకారం వారికి వివిధ సబ్జెక్ట్ల వారీగా పదోన్నతులు కల్పిస్తాం. ప్రభుత్వ నింబధనలు మేరకు షెడ్యూల్ వచ్చాక పదోన్నతులు ప్రారంభిస్తాం. ఉపాధ్యాయులు పదోన్నతుల విషయంలో ఆందోళనలు చెందవద్దు. – డాక్టర్ రవీందర్రెడ్డి, డీఈఓ -
భీమునిపాదం..
ప్రకృతి సోయగం..ఎత్తైన గుట్టల నడుమ నుంచి జాలువారుతున్న జలపాతం గూడూరు: అదో అందమైన జలపాతం. ప్రకృతి రమణీయతను సంతరించుకున్న పచ్చని అటవీ ప్రాంతం. చుట్టూ గుట్టలు.. పక్షుల కిలకిలరావాలు.. గలగల పారే సెలయేటి సవ్వళ్లు.. గుట్టల నడుమ నుంచి సుమారు 70 అడుగుల ఎత్తు నుంచి దూకే జలధార. అదే పర్యాటకులను ఉల్లాస పరుస్తూ.. వారి మనసును కట్టిపడేస్తున్న భీమునిపాదం జలపాతం. పాండవులు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో గడిపినట్లు, ఈ జలపాతం పై భాగంలో భీముని పాదముద్ర ఉండడంతో భీమునిపాదం జలపాతంగా పేరుగాంచిందని స్థానికుల నమ్మకం. ప్రకృతి అందాల నడుమ పాలనురగల్లా జాలువారే ఈ జలపాతం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం శివారు కొమ్ములవంచ సమీప అటవీ ప్రాంతంలో ఉంది. జలపాతం పక్కనే దేవుళ్ల విగ్రహాలు.. భీమునిపాదం జలపాతం పక్కనే శివుడు, పాపాయ మ్మ, నాగదేవతల విగ్రహాలు ఉన్నాయి. జలపాతం నుంచి జాలువారిన నీరు సమీప భీమునిపాద చెరువులోకి చేరుతుంది. ఈ చెరువు నీటితోనే కొమ్ములవంచలో పంటలు పండుతాయి. ప్రతీ సంవత్సరం కొమ్ములవంచ గ్రామస్తులు మృగశిరకార్తె ప్ర వేశించిన మొదటి బుధవారం అక్కడ ఉన్న దేవతల విగ్రహాలకు పూజలు చేస్తారు. అలాగే, మహా శివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో ఇక్కడి విగ్రహాలకు పూజలు చేస్తారు. పర్యాటకులు కూడా జలపాతం కింద స్నానమాచరించి దేవతామూర్తుల విగ్రహాలకు మొక్కుకోవడం ఆనవాయితీ. రూ. 54 లక్షలతో అభివృద్ధి పనులు.. రిజర్వ్ ఫారెస్ట్, వన్యప్రాణి విభాగం పరిధిలోని ఈ జలపాతం సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటవీ శాఖ పలు చర్యలు చేపట్టింది. రూ. 54 లక్షలతో జలపాతం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. స్వాగత ద్వారం, పార్కు, స్విమ్మింగ్ ఫూల్, జలపాతం పైభాగంలో కూడా వాచ్ టవర్, కుర్చీలు, బెంచీలు, మంచినీరు, బాత్రూమ్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఎకో డెవలప్మెంట్ కమిటీ ద్వారా నిర్వహణ.. భీమునిపాద జలపాతం అభివృద్ధికి శ్రీకారం చుట్టి న అటవీశాఖ.. ఎకో డెవలప్మెంట్ కమిటీని ఏర్పా టు చేసి నిర్వహణ బాధ్యతలను వారికి అప్పగించింది. ఈ కమిటీలో అదే గ్రామానికి చెందిన వ్యక్తులను చైర్మన్, వైస్చైర్మన్గా, బీట్ అధికారిని పర్యవేక్షకుడిగా నియమించారు. పర్యాటకుల నుంచి రుసుం రూపేణ వసూలు చేసే మొత్తాన్ని నిర్వహణ ఖర్చు ల కోసం ఉపయోగిస్తున్నారు. ప్రతీ సంవత్సరం వ ర్షాకాలం ప్రారంభంతో నాలుగు నెలల పాటు జలపాత వీక్షణకు సందర్శకుల తాకిడి ఎక్కువ ఉంటుంది. ప్రతీ ఒక్కరి నుంచి రూ. 40 చొప్పున రుసుము వసూలు చేస్తున్నారు. అదే విధంగా బైక్, ఆటో, ఫో ర్, సిక్స్ వీలర్ వాహనాలకు టోకెన్ వసూలు చేస్తున్నారు. అయితే రెండు దశాబ్దాలుగా పర్యాటక కేంద్రంగా పేరుగాంచినా జాతీయ రహదారి నుంచి ఇ క్కడకు చేరుకోవడానికి రోడ్డు మాత్రం ఇబ్బందికరంగా ఉంది. ఇప్పటికై నా అటవీశాఖ అధికారులు స్పందించి జలపాతం వరకు బీటీ రోడ్డు వేయించాలని పలువురు పర్యాటకులు కోరుతున్నారు. మనసును కట్టి పడేస్తున్న ఆహ్లాదకర వాతావరణం ఆస్వాదిస్తున్న పర్యాటకులు.. టూరిజం కేంద్రంగా ఏర్పాట్లు ఎకో డెవలప్మెంట్ కమిటీతో నిర్వహణ భీమునిపాదం జలపాతం వరంగల్కు 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహబూబాబాద్ జిల్లా గూ డూరు మండల కేంద్రానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి మూడు మార్గాలున్నాయి. ఒక మార్గం నర్సంపేట నుంచి భూపతిపేట బస్టాండ్, సీతానగరం శివారు కొమ్ములవంచ మీదుగా, మరో మార్గం గూడూ రు, చంద్రుగూడెం, లైన్తండా, వంపుతండాల మీదుగా, ఇంకో మార్గం ములుగు జిల్లా కొత్తగూడ మండల కేంద్రం, కోలారం, బత్తులపల్లి, గోపాలపురం మీదుగా భీమునిపాదం జలపాతం చేరుకోవచ్చు. దట్టమైన అటవీ ప్రాంతం ఉన్న ఈ జలపాతం రెండు దశాబ్దాలుగా పర్యాటక కేంద్రంగా పేరుగాంచింది. పర్యాటకుల రద్దీ పెరుగుతున్న క్రమంలో అక్కడ మౌలిక సదుపాయాల ఏర్పాటుపై అటవీశాఖ దృష్టి సారించింది. -
ప్రజలు కులమతాలకతీతంగా జీవించాలి
కాజీపేట రూరల్ : ప్రజలు కులమతాలకతీతంగా కలిసి ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. కాజీపేట దర్గా ఉత్సవాలు ముగింపునకు మంత్రి లక్ష్మణ్కుమార్ ముఖ్య అతిథిగా హాజరుకాగా నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిసి ఫకీర్ల విన్యాసాలు తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చారిత్రక కాజీపేట దర్గా దీవెనలతో తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ ప్రసిద్ధిగాంచిన కాజీపేట దర్గా ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో జరుగుతాయన్నారు. అనంతరం దర్గా పీఠాధిపతి, తెలంగాణ రాష్ట్ర హజ్కమిటీ చైర్మన్ ఖుస్రూపాషా మాట్లాడుతూ దేశ నలుమూలల నుంచి పీఠాధిపతులు, కులమతాలకతీతంగా భక్తులు తరలొచ్చి దర్గాను దర్శించుకుని అల్లా దీవెనలు పొందారన్నారు. ఆకట్టుకున్న ఫకీర్ల విన్యాసాలు.. కాజీపేట దర్గా ముగింపు ఉత్సవంలో ఫకీర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్, పూణె నుంచి వచ్చిన ఫకీర్లు విన్యాసాలు చేపట్టారు. కార్యక్రమంలో ఉత్తర్ప్రదేశ్కు చెందిన దర్గా పీఠాఽధిపతి అబ్దుల్ రజాక్ బాబామలంగ్ మసుమన్ మదారి, మన్సూర్ బియాబానీ, ముస్లిం మతపెద్దలు, వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఇవి.శ్రీనివాస్రావు, కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ మోసస్, ఎస్సీసెల్ మాజీ అధ్యక్షుడు రామకృష్ణ, మాజీ కా ర్పొరేటర్ అబుబాకర్, సింగారపు రవిప్రసాద్, కందుకూరి పూర్ణచందర్, అరూరి సాంబయ్య, ఎం.డి. ఇంతియాజ్, లెంకలపల్లి శ్రీనివాస్, పోతరబోయిన శ్రీనివాస్, ఎస్.కె.సర్వర్, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి లక్ష్మణ్కుమార్ ముగిసిన కాజీపేట దర్గా ఉత్సవాలు పాల్గొన్న ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి, ఎమ్మెల్సీ సారయ్య -
మేడారం జాతరకు సమాయత్తం కావాలి
● ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ సోలమన్హన్మకొండ: మేడారం జాతరకు ఆర్టీసీ అధికారులు సమాయత్తం కావాలని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలమన్ సూచించారు. శనివారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయంలో కరీంనగర్ జోన్లోని రీజినల్ మేనేజర్ల సమావేశం నిర్వహించారు. ఇందులో 2026 జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరగనున్న మేడారం జాతరపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ 2024 మేడారం జాతరలో ట్రాఫిక్ జామ్తో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగిందన్నారు. దీనికి కారణం సొంత వాహనాలు విరివిగా రావడమేనని, ప్రైవేట్ వాహనాల నిర్లక్ష్య డ్రైవింగ్తో ట్రాఫిక్ జామ్ అయ్యి మహిళలు, పిల్ల లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని గుర్తు చేశారు. మేడారం భక్తులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని, దీనిపై అధికారులు విస్తృత ప్రచారం చేయాలన్నారు. భక్తుల సంఖ్యకనుగుణంగా బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం ఆర్ఎంలు డి.విజయభాను, బి.రాజు, భవానీ ప్రసాద్, ఎ.సరిరాం, డిప్యూటీ రీజినల్ మేనేజర్లు భాను కిరణ్, శ్రీ మహేశ్, భూపతిరెడ్డి, మధుసూదన్, ఈఈ బీఆర్ సింగ్, అకౌంట్స్ ఆఫీసర్ ఎ. రవీందర్, డిపో మేనేజర్లు ధరమ్ సింగ్, రవిచంద్ర, అర్పిత, శివకుమార్, శ్రీరాం ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
● అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో కేసముద్రం: ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశించారు. మున్సిపల్ పరిధిలోని గిరిజన గురుకుల బాలికల పాఠశాల, కల్వల జెడ్పీ హైస్కూల్, పీఎస్లను శనివారం ఆయన ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సబ్జెక్టులవారీగా విద్యాబోధన చేయాలన్నారు. మధ్యాహ్న భోజనం వండే సిబ్బంది తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం డైనింగ్ హాల్, కిచెన్షెడ్లు, మరుగుదొడ్లు, తరగతి గదులను, స్టోర్ రూమ్ను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, తహసీల్దార్ వివేక్, ఎంపీడీఓ క్రాంతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. క్లినిక్ను వినియోగించుకోవాలి● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శాలిని నెహ్రూసెంటర్: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్ సేవలను వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శాలిని అన్నారు. జీజీహెచ్లో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్ను శనివారం ఆమె ప్రారంభించిన మాట్లాడారు. మత్తు పదార్థాలు, డ్రగ్స్, గంజాయి, ఆల్కహాల్కు అలవాటు పడిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించి మంచిపౌరులుగా తీర్చిదిద్దడానికి క్లినిక్ ఉపయోగపడుతుందన్నారు. వ్యసనం ఒక తీవ్రమైన సమస్య అని పరిష్కారం కోసం డీ అడిక్షన్ సెంటర్ సాయం తీసుకోవడం ముఖ్యమని తెలిపారు. కార్యక్రమంలో జీజీహెచ్ ఆర్ఎంఓ డాక్టర్ జగదీశ్వర్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర సమితిలో నలుగురికి చోటు● రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా విజయసారథి నెహ్రూసెంటర్: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీ ఐ) రాష్ట్ర సమితిలోకి జిల్లా నుంచి నలుగురికి చోటు దక్కింది. పార్టీ రాష్ట్ర 4వ మహాసభలు మేడ్చల్ జి ల్లా గాజులరామారంలో 3 రోజుల పాటు నిర్వహించి నూతన సమితిని ఎన్నుకోగా జిల్లాకుచోటు కల్పించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బి.విజయసారథి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా బి.అజయ్సారథిరెడ్డి, నల్లు సుధాకర్రెడ్డి, కట్టెబోయి న శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బి.విజయసారథి మాట్లాడుతూ... పార్టీ రాష్ట్ర బాధ్యతలతో బాధ్యత పెరిగిందన్నారు. అవగాహన కల్పించాలి● డీఎంహెచ్ఓ రవిరాథోడ్ నెహ్రూసెంటర్: అంగన్వాడీలు హెచ్ఐవీ రహిత సమాజ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలని అందుకు గ్రామస్థాయి నుంచి క్షేత్రస్థాయిలో ప్రజలు, గర్భిణులకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. హెచ్ఐవీ, ఎయిడ్స్పై తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అంగన్వాడీ టీచర్లకు శనివారం మహబూబాబాద్లో ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ... గర్భస్థ శిశువుకు హెచ్ఐవీ సోకకుండా గర్భం దాల్చిన వెంటనే ప్రభు త్వ ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోవాలని సూ చించారు. గర్భిణులు అంగన్వాడీ సెంటర్లలో తప్పకుండా నమోదు చేసుకుని పౌష్టికాహారం అందించాలన్నారు. అనంతరం ఎయిడ్స్పై అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు విజయ్ కుమార్, సారంగం, డెమో ప్రసాద్, ఎంపీహెచ్ఈఓ లోక్య, క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ జ్యోతి, సీఎస్ఓ సారయ్య, ఎస్ఎస్కే మేనేజర్ రమేష్, ఐసీటీసీ కౌన్సిలర్ రమేష్ పాల్గొన్నారు. -
గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించాలి
కేయూ క్యాంపస్: గణేశ్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. శనివారం కాకతీయ యూనివర్సిటీలోని పరిపాలన భవనం సెనేట్హాల్లో కమిషనరేట్ పరిధిలోని హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల కలెక్టర్లు, జీడబ్ల్యూఎంసీ కమిషనర్, గణేశ్ ఉత్సవ కమిటీ, హిందూ ధర్మ పరిషత్, ముస్లిం మత పెద్దలతో నిర్వహించిన సమావేశంలో సీపీ మాట్లాడారు. గణేశ్ ఉత్సవాలు పోటీ తత్వంతో కాకుండా భక్తిభావంతో నిర్వహించాలని తెలిపారు. మండపాలకు విద్యుత్ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ శాఖ పోర్టల్లో వివరాలు న మోదు చేయాలని సూచించారు. గణేశ్ నిమజ్జనం, మిలాద్ – ఉన్ –నబీ ఒకేరోజు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో మతసామరస్యం దెబ్బతినకుండా ఒకరికొకరు సహకరించుకోవాలని కోరారు. హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ జిల్లాపరిధిలో 12 నిమజ్జనం ప్రదేశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకో వాలని కోరారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద మా ట్లాడుతూ నిమజ్జనం సందర్భంగా చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ జిల్లాలో 35 వరకు చెరువులు ఉన్నాయని, అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగుండా నిమజ్జనానికి చర్యలు చేపడుతామన్నా రు. వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్బాజ్పాయ్ మాట్లాడుతూ నిమజ్జనం ప్రదేశాల్లో వివిధ పనులను చేపట్టేందుకు రూ. 18లక్షలు కేటాయించామన్నారు. మున్సిపల్ పరిధిలోని చిన్న వడ్డేపల్లి, పద్మాక్షి టెంపుల్, వరంగల్ జిల్లా పరిధిలో 15, హనుమకొండ జిల్లా పరిధిలో 12 నిమజ్జన ప్రదేశాల్లో వివిధ పనులు చేపట్టనున్నామన్నారు. సమావేశంలో హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల అదనపు కలెక్టర్లు, డీసీపీలు, ఏసీపీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ మూడుజిల్లాల కలెక్టర్లు, జీడబ్ల్యూఎంసీ కమిషనర్తో సమన్వయ సమావేశం -
యూరియా వచ్చేసింది..
ఖిలా వరంగల్ : వరంగల్ రైల్వేస్టేషన్ గూడ్స్ షెడ్కు శనివారం ఇఫ్కో కంపెనీకి చెందిన 1,340.010 మెట్రిక్ టన్నుల యూరియా చేరింది. ఇఫ్కో కంపెనీ ప్రతినిధులతో కలిసి వ్యవసాయ అధికారులు రవీందర్రెడ్డి, విజ్ఞాన్ వ్యాగన్లోని యూరియాను పరిశీలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యూరియాను ఉమ్మడి జిల్లా పరిధిలోని ఫర్టిలైజర్ షాపులకు 40 శాతం, మార్క్ఫెడ్కు 60 శాతం పంపిస్తామని వారు తెలిపారు. అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి కాజీపేట : దర్గా కాజీపేటకు చెందిన చాడ శ్రీలేఖ (30) శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చె ందగా పోలీసులు కేసు నమోదు చేశారు. కాజీపేటకు చెందిన శ్రీలేఖకు దర్గా ప్రాంతానికి చెందిన చాడ శ్రావణ్కుమార్తో 2014లో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెళ్లయిన కొద్దికాలం అన్యోన్యంగా ఉన్నారు. అనంతరం మనస్పర్థలతో ఘర్షణ పడుతున్నారు. ఈ క్రమంలో శనివారం శ్రీలేఖ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందనే సమాచారం మేరకు కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. తమ కూతురు మృతిపై అనుమానాలు ఉన్నాయనే తల్లి చింతకింది లలిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. కడవెండిలో సురవరం జ్ఞాపకం.. దేవరుప్పుల : మండలంలోని కడవెండిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి యోధుడు దొడ్డి కొమురయ్య స్మారక భవన నిర్మాణంలో సీపీఐ పక్షాన కీలక పాత్ర పోషించిన ఆ పార్టీ జాతీయ నాయకుడు సురవరం సుధాకర్రెడ్డి భాగస్వామ్యం జ్ఞాపకం పదిలంగా ఉంది. నిర్బంధ కాలంలో దొడ్డి కొమురయ్య భవన్ ఏర్పాటు సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో నక్సల్స్ అనుబంధ పార్టీల సహకారంతో స్థల సేకరణకు శ్రీకారం చుట్టగా సీపీఐ భవన నిర్మాణంలో కీలక పాత్ర పోషించి సుధాకర్ రెడ్డి ప్రారంభోత్సవానికి వచ్చారు. ఈ తరుణంలో డీకే ఫౌండేషన్ ప్రతినిధులు సురవరాన్ని కలిసి ఫొటో దిగారు. ఇది చిరస్మరణీయమని ఫౌండే షన్ ప్రతినిధి అస్నాల శ్రీనివాస్ పేర్కొన్నారు. -
తెల్లవారకముందే లైన్లోకి..
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో యూరియా కష్టాలు కొనసాగుతు న్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి పీఏసీఎస్కు యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు శనివారం కార్యాలయం తీయకముందే ఆధార్ కార్డులు లైన్లో పెట్టి వేచి ఉన్నారు. డోర్నకల్ మండలం కస్నాతండా సమీపంలోని పీఏసీఎస్ కార్యాలయం ఎదుట రైతులు క్యూ కట్టారు. రైతులు భారీ సంఖ్యలో తరలిరావడంతో పోలీసుల సమక్షంలో యూరియా పంపిణీ చేశారు. గూ డూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహ కార సంఘం ఎదుట తెల్లవారు జామున 4 గంటలకే క్యూ లో నిలబడ్డారు. మహబూబాబాద్లో రైతులు మధ్యా హ్నం సమయంలో తమకు బస్తాలు వస్తాయో రావో అనే దిగులుతో ఏఓ తిరుపతి రెడ్డితో వాగ్వాదానికి దిగారు. కరీంనగర్ జిల్లాలో...కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్కెపల్లి సహకార సంఘం గోదాంకు శనివారం మధ్యాహ్నం లారీలో 230 బస్తాలు వచ్చాయి. 500 మందికి పైగా గోదాం వద్దకు చేరుకున్నారు. మహిళలు, వృద్ధులు క్యూలో నీరసించారు. సహకార సిబ్బంది ఒక్కరికి ఒక బస్తా చొప్పున టోకెన్లు ఇచ్చారు. శంకరపట్నం మండలం లింగాపూర్ గోదాంకు లారీ యూరియా వచ్చింది. 15 రోజుల క్రితం ఆధార్ కార్డు ఇచ్చిన వారికే టోకెన్లు ఇవ్వడంతో ఓ రైతు యూరియా ఇవ్వకుంటే షట్టర్ మూసివేస్తానని సిబ్బందితో వాదనకు దిగాడు.పోలీసు బందోబస్తుతో 450 బస్తాలను రైతులకు అందించారు. చిగురుమామిడి మండలం ఇందుర్తికి శనివారం యూరియా లోడ్ వచ్చింది. ఆదివారం పంపిణీ చేస్తామని నిర్వాహకులు చెప్పడంతో రైతులు తమ చెప్పులను క్యూలో విడిచి వెళ్లారు.300 బస్తాలు వచ్చాయి.. 102 మందికి పంపిణీశనివారం ఆత్మకూర్ పీఏసీఎస్ వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు క్యూ కట్టారు. మధ్యాహ్నం 3:30 గంటలకు 300 బస్తాలతో లోడ్ కావడంతో ఒక్కసారిగా ఎగబడ్డారు. పోలీసుల భద్రత మధ్య సాయంత్రం వరకు 102 మందికి పంపిణీ చేశారు.యూరియా కోసం నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) వద్ద రైతులు శనివారం తెల్లవారుజాము నుంచే వరుసలో నిల్చున్నారు. శుక్రవారం రాత్రి యూరియా లారీ లోడ్ వచి్చందన్న సమాచారంతో భారీగా తరలివచ్చారు. గోదాము తెరవకముందే వచ్చి వరుసలో నిలబడి నిరీక్షించారు. పోలీసుల బందోబస్తు నడుమ ఒక్కో రైతుకు ఒక బస్తా యూరియాను పంపిణీ చేశారు. -
ఏసీబీకి అడ్డంగా దొరికిన సీఐ..
సాక్షి, మహబూబాబాద్ జిల్లా: లంచం తీసుకుంటూ డోర్నకల్ సీఐ రాజేష్ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. బెల్లం వ్యాపారి నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా శనివారం రెడ్ హ్యండెడ్గా పట్టుబడ్డారు.ఓ అక్రమ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు బేతోలు ప్రాంతానికి చెందిన వ్యాపారి వద్ద సీఐ రాజేష్ రూ.50 వేలు డిమాండ్ చేయగా.. వ్యాపారి రూ.30 వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. వ్యాపారి ఏసీబీని ఆశ్రయించగా.. సీఐ ఇంట్లో వ్యాపారి నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సీఐ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. -
కుటుంబంలో చిచ్చు పెట్టిన సీరియల్..
బయ్యారం: పచ్చని కుటుంబంలో టీవీ సీరియల్ చిచ్చుపెట్టింది. సీరియల్ చూస్తూ తన ను పట్టించుకోవడంలేదని ఆవేదనకు గురైన భర్త.. భార్యతో ఘర్షణకు దిగాడు. దీంతో ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడాన్ని గమనించిన కొడుకు కూడా పురుగు మంది తాగాడు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజుల తండాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కోడిపుంజుల తండాకు చెందిన ధరావత్ రాజుకు మహబూబాబాద్ మండలం సాలార్ తండాకు చెందిన కవితతో పది సంవత్సరాల క్రితం రెండో విహమైంది.అప్పటికే కవితకు వివాహం జర గగా మున్న (11) అనే కుమారుడు ఉన్నాడు. కొడుకుతో సహా ఆమె రాజుతో కోడిపుంజులతండాలో ఉంటోంది. ఈ క్రమంలో ఆ జంటకు కుమార్తె భవ్యశ్రీ జన్మించింది. కాగా, గురువారం రాత్రి రాజు అన్నం పెట్టమని అడుగగా.. కవిత టీవీలో సీరియల్ చూస్తూ.. కొంత సమయం ఆగమని చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన రాజు భార్య కవితతో వాదనకు దిగి చేయి చేసుకోవడంతో వివాదం పెద్దదైంది. ఇరుగు, పొరుగువారు వచ్చి సర్దిచెప్పడంతో అప్పటికి వివాదం సద్దుమణిగింది.శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసు కుంటానని కవిత తమ వ్యవసాయబావి వద్దకు వెళ్లగా స్థానికులు ఆమెను అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చారు. తర్వాత రాజు వ్యవసాయబావి వద్దకు వెళ్లగా, ఇంట్లో ఉన్న కవిత గడ్డిమందు తాగింది. ఇది చూసి ఆమె కుమారుడు మున్న కూడా గడ్డిమందు తాగాడు. స్థానికులు ఈ విషయం గమనించి ఇద్దరినీ మహబూబాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. కాగా, బాలుడు మున్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు. -
నకిలీ మద్యం తయారీ ముఠా అరెస్ట్
మహబూబాబాద్ రూరల్ : నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాలోని ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారివద్ద నుంచి రూ.5 లక్షల విలువైన నకిలీ మద్యం, 60 లీటర్ల స్పిరిట్, 2 కార్లను స్వాధీనం చేసుకున్నామని మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. ఈ మేరకు టౌన్ పీఎస్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కిరణ్తో కలిసి వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా శాయంపేటకు చెందిన అల్లం రవీందర్ గతంలో మధ్యప్రదేశ్ నుంచి తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి ఎక్కువకు విక్రయించేవాడు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన ఆశీష్ ఠాకూర్తో పరిచయం ఏర్పడింది. అతడు కూడా రవీందర్ మాదిరి దొంగ మద్యం విక్రయించేవాడు. ఈ క్రమంలో ఖమ్మంకు చెందిన ఆర్ఎంపీ షేక్.సాబీర్ పాషా..రవీందర్కు పరిచయం కాగా ఇద్దరు కలిసి అక్రమంగా డబ్బులు సంపాదించాలకున్నారు. దీంతో ఆశీష్ ఠాకూర్ను కలిసి రూ.2.50 లక్షలు అందజేసి నకిలీ మద్యం తయారీకి కావాల్సిన స్పిరిట్ తెప్పించారు. వారందరికి వరంగల్ పెరికవాడకు చెందిన ములుగు రాజు, రాంతేజ, మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పెద్దకిష్టాపురానికి చెందిన ఓర్పు గోపాలకృష్ణ, జక్కుల రమేశ్ పరిచయమయ్యారు. ఆరుగురు కలిసి ఆశీష్ ఠాకూర్ పంపిన స్పిరిట్తో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ గోదాంలో నకిలీ మద్యం తయారు చేశారు. దానిని ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ ప్రాంతాల్లో విక్రయించాలన్నారు. ఈ క్రమంలో గురువారం గోపాలకృష్ణ, రమేశ్, సాబీర్ పాషా రెండు కార్లలో వచ్చి మద్యం తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉండగా పోలీసులు పట్టుకున్నారు. గోపాలకృష్ణ, సాబీర్ పాషా, రమేశ్, రవీందర్, రాజును అరెస్ట్ చేయగా రాంతేజ, ఆశీష్ ఠాకూర్ పరారీలో ఉన్నారని ఎస్పీ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ తెలిపారు. రూ.5 లక్షల విలువైన నకిలీ మద్యం, 60 లీటర్ల స్పిరిట్, 2 కార్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
బైక్, ఏటీఎం వ్యాన్ ఢీ..
గార్ల: బైక్, ఏటీఎం వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ మత్స్యకారుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన శుక్రవారం గార్ల మండలం తిర్లాపురం గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గార్ల మండల కేంద్రంలోని బెస్తబజారుకు చెందిన బాదం సురేందర్(48) మత్స్య కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బైక్పై ఖమ్మం వెళ్లి చేపల వలలు కొనుగోలు చేసి తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో తిర్లాపురం గ్రామ సమీపంలో గార్ల నుంచి డోర్నకల్ వెళ్తున్న ఏటీఎం వ్యాన్ ఎదురెదురుగా ఢీకొనడంతో సురేందర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై రవీందర్ తెలిపారు. కాగా, రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మత్స్య కార్మికుడు సురేందర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మత్స్యకార్మిక సంఘం గార్ల మండల అధ్యక్షుడు బాదం కుమారస్వామి డిమాండ్ చేశారు. మత్స్యకారుడి దుర్మరణం తిర్లాపురం సమీపంలో ఘటన -
పూలు అమ్మబోయి విగతజీవిగా మారి..
దేవరుప్పుల : ఓ హమాలీ బో నాల పండుగ సందర్భంగా పూ లు అమ్మబోయి విగతజీవిగా మారాడు. డ్రెయినేజీలో పడి మృతి చెందాడు. ఈ ఘటన దేవరప్పులలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన చిట్టబోయిన వీరయ్య(55) హమాలీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తన ఇద్దరు కూతుళ్లు పూలు, పండ్ల వ్యాపారం చేస్తుండగా వారికి చేదోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా సాయంత్రం సైకిల్పై పూలు అమ్మడానికి వెళ్లా డు. తిరిగి ఇంటికొచ్చే క్రమంలో ప్రమాదవశాత్తు ఎస్సీ కాలనీలోని డ్రెయినేజీలో పడి ఊపిరాడక మృతి చెందాడు. రాత్రి అయినా వీరయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులకు అనుమానం వచ్చింది. శుక్రవారం వెతుకుతున్న క్రమంలో వీరయ్య డ్రెయినేజీలో పడిపోయిన విషయం తెలిసింది. వెంటనే వెళ్లి చూడగా అప్పటికే మృతి చెంది కనిపించాడు. ఈ ఘటనపై మృతుడి భార్య ధనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సృజన్కుమార్ తెలిపారు. 92 దస్తావేజులకు ఈ–సైన్ రిజిస్ట్రేషన్ కాజీపేట అర్బన్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని పైలట్ ప్రాజెక్ట్లో ఎంపిక చేయగా గురువారం ఈ– సైన్ రిజిస్ట్రేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు. రెండో రోజు శుక్రవారం కాజీపేట వంద ఫీట్ల రోడ్డులోని వరంగల్ ఆర్వో కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్లు రామ నరసింహరావు,ఆనంద్ 92 దస్తావేజులకు ఈ–సైన్ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. కాగా, సర్వర్ సమస్యతో రాత్రి 8 గంటల వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగాయి.● డ్రెయినేజీలో పడి హమాలీ మృతి ● దేవరుప్పులలో ఘటన -
ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలి
విద్యారణ్యపురి: విద్యార్థినులు ఆధునిక సాంకేతికతను కూడా వినియోగించుకోవాలని, భవిష్యత్లో ఆర్థికస్వావలంబన సాధించే దిశగా చదువుకోవాలని వరంగల్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఇండియన్ పోలీస్ మెడల్ అవార్డు గ్రహీత ఎన్.రవి అన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ కాలేజీలో కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘రీసెంట్ ట్రెండ్స్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇన్ కెమికల్ అండ్ అలైడ్ సైన్సెస్ రీసెర్చ్’ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది ఈ సదస్సులోఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థి దశలోనే లక్ష్యంతో ముందుకెళ్లాలని విద్యార్థినులకు సూచించారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సీనియర్ ప్రొఫెసర్ లలితాగురుప్రసాద్ కీలకపోన్యాసం చేస్తూ రసాయన శాస్త్ర అనుబంధ శాస్త్ర పరిశోధనల్లో ఆధునిక సాంకేతికత కృత్రిమ మేధా.. సాంకేతికతలో వస్తున్న ఆధునిక పోకడల విశిష్టతను తెలియజేస్తుందన్నారు. సదస్సులో ఆ కళాశాల ప్రిన్సిపాల్ బి. చంద్రమౌళి, కేయూ సైన్స్విభాగాల డీన్ జి. హనుమంతు, కెమిస్ట్రీ విభాగం అధిపతి ఎన్.వాసుదేవరెడ్డి, కేయూ కెమిస్ట్రీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్లు సి.హెచ్. సంజీవరెడ్డి, వడ్డె రవీందర్ మాట్లాడారు. ఈ సదస్సులో సావనీర్ను అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జి. సుహాసిని, జాతీయ సదస్సు కన్వీనర్ ఎం.ప్రశాంతి, అధ్యాపకులు సురేశ్బాబు, ఉదయశ్రీ, బాలరాజు,జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈనెల 23న జాతీయసదస్సు ముగియనుంది. అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రవి -
ఉమ్మడి వరంగల్ జిల్లాకు భారీగా నిధులు..
హన్మకొండ: రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క చొరవతో తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ రాజ్(పీఆర్) శాఖ ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాకు భారీగా నిధులు కేటాయించింది. శుక్రవారం రూ.23.50 కోట్లు కేటాయించి విడుదల చేసింది. ఈ నిధులతో ఇంటిగ్రేడ్, మండల ప్రజాపరిషత్ కార్యాలయాల భవనాలు నిర్మించనున్నారు. ములుగు జిల్లాలో ఎస్ఈ కార్యాలయం నిర్మాణానికి రూ.1.50 కోట్లు, వరంగల్ జిల్లాలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.8 కోట్లు, మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో మహిళా స్వయం సహాయక సంఘాల భవనానికి రూ.2 కోట్లు, ములుగులో ముస్లిం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.1.50 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం పరిపాలన మంజూరు చేసింది. అదే విధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల, భూపాలపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయం, హనుమకొండ జిల్లా వేలేరు, దామెర మండల ప్రజా పరిషత్ కార్యాలయం నిర్మా ణం, ములుగు జిల్లా మల్లంపల్లి ఎంపీపీ కార్యాల యం, ములుగు జిల్లా ఏటూరునాగారంలో ముస్లిం కమ్యూనిటీ హాల్ నిర్మాణం, మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరులో ఎంపీడీఓ కార్యాలయం నిర్మాణానికి రూ.1.50 కోట్ల చొప్పున కేటాయిస్తూ నిధులు మంజూరు చేసింది. ఎన్హెచ్163 పనులు పూర్తి చేయాలి హన్మకొండ చౌరస్తా: నేషనల్ హైవే 163 పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో గడ్కరీని కావ్య మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యాదాద్రి–వరంగల్ జాతీయ రహదారి 163 (హైదరాబాద్–భూపాలపట్నం రోడ్) లో పెండింగ్లో ఉన్న సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. జాతీయ రహదారి నాలుగు లేన్లుగా విస్తరించినా కొన్ని గ్రామాల వద్ద సర్వీస్ రోడ్లు అనుసంధానం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిడిగొండ, రఘునాథపల్లి, ఛాగల్లు, స్టేషన్ఘన్పూర్, కరుణాపురం గ్రామాల వద్ద రోడ్డు ఉన్నా జనగామ నుంచి ఈ గ్రామాల మధ్యలో లింక్ లేకపోవడం సమస్యగా మారిందన్నారు. నేరుగా ప్రధాన రహదారి పైకి రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి..సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు ఇస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ కావ్య తెలిపారు. ● పీఆర్ శాఖకు రూ.23.50 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం కేంద్ర మంత్రి గడ్కరీని కోరిన ఎంపీ కావ్య -
రిమాండ్ మహిళా ఖైదీకి పోస్టుమార్టం
నర్సంపేట రూరల్ : రిమాండ్ మహిళాఖైదీకి ఫోరెన్సిక్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించారు. నర్సంపేట సబ్ జైలు రిమాండ్ మహిళా ఖైదీ పెండ్యాల సుచరిత (36) ఈనెల 21న మృతి చెందిన విషయం విధితమే. తొలుత నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, టౌన్సీఐ రఘుపతిరెడ్డి సమక్షంలో పంచనామా నిర్వహించారు. అనంతరం వరంగల్ కేఎంసీ ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సురేందర్, సిద్దిపేట మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ హెచ్ఓడీ శ్రీధరాచారి, కుత్బుల్లాపూర్ మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ హెచ్ఓడీ వసంత నాయక్తోపాటు నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, తహసీల్దార్ రవిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సుచరిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
దూరవిద్య డిగ్రీ పరీక్షలు ప్రారంభం
● 8 మంది విద్యార్థులు డీబార్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య డిగ్రీ బీఏ, బీకాం జనరల్, కంప్యూటర్స్, బీఎస్సీ ఫైనలియర్ విద్యార్థులకు ఇయర్వైజ్స్కీం (ఎక్స్, రెగ్యులర్) పరీక్షలు శుక్రవారం 14 కేంద్రాల్లో ప్రారంభమయ్యాయి. వరంగల్ ఏఎస్ఎం, ఎల్బీ కాలేజీ కేంద్రాల్లో కాపీయింగ్ చేస్తూ పట్టుబడిన విద్యార్ధులను డీబార్ చేసినట్లు అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజ తెలిపారు. ఏఎస్ఎం కాలేజీలో ఒకరు, ఎల్బీకాలేజీ కేంద్రంలో ఏడుగురు డీబార్ అయ్యారని తెలిపారు. ఇదిలా ఉండగా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్కాలేజీ కేంద్రాన్ని పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజ సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. అంతర్జాతీయ జూడో రెఫరీగా నాగరాజు మడికొండ: హనుమకొండ జిల్లా మడికొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల జూడో కోచ్ నాగరాజు అంతర్జాతీయ జూడో రెఫరీగా ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ దాసరి ఉమామహేశ్వరి తెలిపారు. ఇంటర్నేషనల్ జూడో ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు జోర్ధాన్ రాజధానిలో జూడో రెఫరీ పరీక్షలు జరిగాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోని హనుమకొండ జిల్లా కేంద్రానికి చెందిన నాగరాజు ఒక్కరే ఉత్తీర్ణత సాధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి మొదటిసారి అంతర్జాతీయ జూడో రెఫరీగా ఎంపికై న నాగరాజును ప్రిన్సిపాల్ దాసరి ఉమామహేశ్వరి అభినందించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ మడికొండ పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి, సాంఘిక సంక్షేమ విద్యా సంస్థల కార్యదర్శి అలుగ వర్షిణి, మల్టీజోనల్ ఆఫీసర్ అలివేలు, విద్యారాణి ప్రోత్సాహంతోనే ఈవిజయం సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల సిబ్బంది నాగరాజును అభినందించి సన్మానించారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య కేసముద్రం : అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన మండలంలోని ఇంటికన్నెలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గంధసిరి బొందయ్య (56) సుమారు రూ.5లక్షలకు పైగా అప్పు చేసి ఎకరంన్నర భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. మూడేళ్లుగా పంట దిగుబడి రాకపోవడంతో కొంతకాలంగా మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు గమనించి మానుకోట జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు మృతుడుకి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. -
వర్షపాతం.. సాధారణం
హన్మకొండ: ఇటీవల కురిసిన వర్షం ఉమ్మడి వరంగల్ జిల్లాలో లోటు పూడ్చింది. అప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో లోటు, సాధారణ వర్షపాతం ఉండగా ఇటీవలి అల్పపీడనం, వాయుగుండంతో వరంగల్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదు కాగా జనగామ, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలో సాధారణంగా నమోదైంది. జూలై 21 నుంచి 24వ తేదీ వరకు వరుసగా ఆరు రోజులు వర్షాలు కురిసినా సాధారణాన్ని మించలేదు. కొన్ని ప్రాంతాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. ఇదిలా ఉండగా ఈ నెల 8 నుంచి 19 వరకు కురిసిన భారీ వర్షాలు లోటు పూడ్చడంతోపాటు సాధారణ వర్షపాతం నమోదైంది. ఆయా జిల్లాలో కొన్ని మండలాల్లో భారీ వర్షం కురవగా, మరికొన్నింటిలో తేలికపాటి నుంచి మోస్తరు కురిసింది. దీంతో జిల్లా సగటు సాధారణ వర్షపాతంగా నమోదైంది. వ్యవసాయ పనులు ముమ్మరం.. ఈ వర్షంతో వ్యవసాయ పనులు ముమ్మరంగా సా గుతున్నాయి. ప్రధానంగా వరి నాట్లు ఊపందుకున్నాయి. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో చెరువులు, కుంటల్లోకి నీరు చేరగా, సాధారణంగా కురిసిన ప్రాంతాల్లో చెరువులు, కుంటల్లోకి పూర్తి స్థాయిలో నీరు చేరలేదు. ఈ నెల 21 వరకు ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురిసినా సాధారణాన్ని మించలేదు. వర్షాకాలంలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 843.4 మిల్లీ మీటర్లుగా కాగా ఇప్పటి వరకు 912 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో కన్నాయిగూడెం, వాజేడు మండలాల్లో లోటుగా ఉంది. ఏటూరుగానాగారం, వెంకటాపురం, మంగపేట మల్లంపల్లి మండలాల్లో సాధారణానికి మించి కు రిసింది. మిగతా మండలాల్లో సాధారణంగా నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. వర్షాకాలం ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 681.5 మి.మీ కాగా ఇప్పటి వరకు 651.9 మి.మీ కురిసింది. మహదేవ్పూర్, కాటారం మండలాల్లో లోటు వర్షపాతం, మిగతా మండలాల్లో సాధారణంగా నమోదైంది. మహబూబాద్ జిల్లాలోనూ సాధారణ వర్షపాతం నమోదైంది. వర్షాకాలం నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 567.9 మి.మీ కాగా ఇప్పటి వరకు 663 మి.మీ నమోదైంది. గూడూరు, కేసముద్రం, మరిపెడ, పెద్దవంగర మండలాల్లో సాధారణానికి మించి (ఎక్సెస్) కురిసింది. మిగతా మండలాల్లో సాధారణంగా నమోదైంది. జనగామ జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జిల్లా సాధారణ వర్షపాతం 448.6 మి.మీ కాగా ఇప్పటి వరకు 499.5 మి.మీ మాత్రమే కురిసింది. స్టేషన్ ఘనపూర్లో లోటు వర్షపాతం ఉండగా నర్మెట, జనగామ, లింగాలఘణపురం, దేవరుప్పుల, కొడకండ్లలో ఎక్సెస్ వర్షపాతం నమోదు కాగా మిగతా మండలాల్లో సాధారణంగా నమోదైంది. హనుమకొండ జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లాలో వర్షాకాలం నుంచి ఇప్పటి వరకు 567.2 మి.మీ సాధారణ వర్షపాతం కాగా ఇప్పటి వరకు 569.1 మి.మీ కురిసింది. భీమదేవరపల్లి, వేలేరు మండలాల్లో ఎక్సెస్ వర్షం కురిసింది. ఎల్కతుర్తి మండలంలో లోటు వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో సాధారణంగా కురిసింది. వరంగల్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలో వర్షాకాలం నుంచి ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 602.6 మి.మీ కాగా ఇప్పటి వరకు 756.9 మిల్లీమీటర్లు కురిసింది. వర్ధన్నపేటలో అతి అత్యధిక వర్షపాతం నమోదు కాగా, గీసుకొండ, దుగ్గొండి, ఖానాపురం, చెన్నారావుపేట, సంగెం, పర్వతగిరి, నెక్కొండ మండలాల్లో అత్యధికంగా కురిసింది. నల్లబెల్లి, నర్సంపేట, రాయపర్తి, ఖిలా వరంగల్, వరంగల్ మండలాల్లో సాధారణంగా కురిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంటల సాగు ముమ్మరమైంది. సాధారణాన్ని మించి పంటల సాగైంది. వరంగల్ జిల్లాలో.. వరంగల్ జిల్లాలో అన్ని పంటలు కలిపి సాధారణ సాగు 2,84,375 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 2,05,777 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 2,40,068 ఎకరాల్లో సాగైంది. హనుమకొండ జిల్లాలో .. హనుమకొండ జిల్లాలో సాధారణ సాగు మొత్తం 2,43,357 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 1,28,406 ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా 1,95,902 ఎకరాల్లో సాగైంది. మహబూబాబాద్ జిల్లాలో.. మహబూబాబాద్ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం మొత్తం 3,52,531 కాగా ఇప్పటి వరకు 2,31,294 ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా 3,39,982 ఎకరాల్లో సాగైంది. ములుగు జిల్లాలో.. ములుగు జిల్లాలో అన్ని పంటలు కలిపి మొత్తం సాధారణ సాగు విస్తీర్ణం 1,26,973 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 1,24,051 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా 86,653 ఎకరాల్లో సాగైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొత్తం సాధారణ సాగు విస్తీర్ణం 2,12,415 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 2,34,195 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా 1,92,244 ఎకరాల్లో సాగు చేశారు. జనగామ జిల్లాలో.. జనగామ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం మొత్తం 3,63,104 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 3,06,732 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా 2,67,111 ఎకరాల్లో సాగు చేశారు. అన్ని పంటలు కలిపి సాధారణ సాగు విస్తీర్ణం ఇలా.. అన్ని పంటలు కలిపి సాధారణ సాగు విస్తీర్ణంతో ఇప్పటి వరకు సాగైనా విస్తీర్ణం చూస్తే వరంగల్ జిల్లాలో 84.42 శాతం, హనుమకొండ జిల్లాలో 80.50, మహబూబాబాద్ జిల్లాలో 96.44, ములుగు జిల్లాలో 68.25, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 90.50 శాతం, జనగామ జిల్లాలో 73.56 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధాన పంటల సాగు ఇలా.. ప్రధాన పంటలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరి పంట సాధారణ సాగు విస్తీర్ణం 8,78,376 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 5,10,100 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా 6,89,635 ఎకరాల్లో సాగు చేశారు. మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం మొత్తం 64,906 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 63,375 ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా 95,979 ఎకరాల్లో సాగు చేశారు. పత్తి మొత్తం సాధారణ విస్తీర్ణం 5,79,863 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 5,91,372 ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా 5,00,412 ఎకరాల్లో సాగైంది. వరంగల్ జిల్లాలో అత్యధికం మిగతా జిల్లాల్లో సాధారణం ఊపందుకున్న పంటల సాగు -
పెన్షన్, జీపీఎఫ్పై అవగాహన ఉండాలి
● కలెక్టర్ స్నేహశబరీష్ హన్మకొండ అర్బన్ : విరమణ పొందే ఉద్యోగులు పెన్షన్, జీపీఎఫ్పై అవగాహన పెంపొందించుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో విశ్రాంత ఉద్యోగుల పెన్షన్, జీపీఎఫ్ సమస్యలపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ పెన్షన్, జీపీఎఫ్పై ఖజానా శాఖ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి పూర్తి తెలుసుకోవాలన్నారు. అనంతరం ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిట్, హైదరాబాద్ ఏజీ కార్యాలయ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ అభయ్ అనిల్ సొనార్కర్, నరేశ్కుమార్ మాట్లాడుతూ పెన్షన్, జీపీఎఫ్ సమస్యల పరిష్కారం కోసం ఆదాలత్ నిర్వహించామని, తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కారానికి బృందాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపు ఆర్డర్లు, జీపీఎఫ్ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. వరంగల్, హనుమకొండ డీఆర్ఓలు వై.వి గణేశ్, విజయలక్ష్మి, హనుమకొండ జిల్లా డీటీఓ శ్రీనివాసకుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లాల డీడీఓలు, పెన్షనర్లు, తదితరులు పాల్గొన్నారు. -
దర్గా ఉత్సవాలు షురూ..
భక్తులతో కిక్కిరిసిన కాజీపేట బియాబానీ దర్గా కాజీపేట: కాజీపేట బియాబానీ దర్గా ఉత్సవాలు షురూ అయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున సందల్ ముగియడంతో ఉర్సు లాంఛనంగా ప్రారంభమైంది. భక్తులతో దర్గా కాజీపేట పరిసర ప్రాంతాలు కిక్కిరిసి పోతున్నాయి. కులమతాలతీతంగా తరలొచ్చి దర్గాను దర్శించుకుని పూలు, చాదర్లు సమర్పించి మొక్కులు సమర్పించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సాయుధ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాగా, ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపించకపోవడంతో భక్తులు ప్రైవేట్ వాహనాల్లో ఇబ్బందులు పడుతూ దర్గా చేరుకుంటున్నారు. గురువారం అర్ధరాత్రి దాదాపు లక్షమందికిపైగా భక్తులు దర్గాను దర్శించుకున్నారని నిర్వాహకుల అంచనా. దేశంలోని 25 దర్గాల మత పెద్దలు బియాబానీ దర్గాను సందర్శించి పీఠాధిపతి ఖుస్రూపాషాను ఆశీర్వదించారు. దర్గాను దర్శించుకున్న ప్రజాప్రతినిధులు, అధికారులు.. బియాబానీ దర్గాను ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ స్నేహ శబరీష్, సీపీ సన్ప్రీత్సింగ్, అదనపు డీసీపీ రాయల ప్రభాకర్ రావు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అజీజ్ఖాన్, మాజీ కార్పొరేటర్ అబుబక్కర్ తదితరులు దర్శించుకున్నారు. లక్షమందికిపైగా సందర్శన.. చాదర్లు సమర్పించి మొక్కులు.. -
యూరియా కేటాయించకుండా బద్నాం చేసే కుట్ర
● పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కొత్తగూడ: రాష్ట్రానికి రావాల్సిన యూరియా కేటాయించకుండా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కుట్ర చేస్తున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. పనుల జాతర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలకేంద్రం అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మా ట్లాడుతూ.. యూరియా కేటాయింపు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుందన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెస్తూ, వినతులు ఇచ్చుకుంటూ కావాల్సి న కోటా సాధిస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్, రెండు లైన్ల రోడ్డు నిర్మాణం కోసం నివేదికలు పంపినట్లు తెలిపారు. పాకాల నుంచి గంగారం వరకు డబుల్ రోడ్డు మంజూరు చేయించి అటవీశాఖ అనుమతులతో పనులు చేయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సవ్ టొప్పొ, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఆర్డీఓ కృష్ణవేణి, డీఆర్డీఓ మధుసూదన్రాజు, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీపీఓ హరిప్రసాద్, సీడీపీఓ నీలోఫర్ అజ్మీ, తహసీల్దార్ రాజు, ఎంపీడీఓ రోజారాణి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
పంటలకు యూరియా అందించాలి
● మానుకోటలో రైతుల రాస్తారోకో ● మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎల్హెచ్పీఎస్ మహబూబాబాద్ రూరల్: పంటలకు యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో రైతులు శుక్రవారం రోడ్డెక్కి అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మానుకోటలోని పీఏసీఎస్ వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురుచూసిన రైతులకు అధికారులు యూరియా బస్తాలు ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో కంకరబోర్డు వాటర్ ట్యాంకు వద్ద ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న డీఏఓ విజయనిర్మల, డీఏఓ కార్యాలయ ఏడీఏ మురళి, పీఏసీఎస్ చైర్మన్ రంజిత్, తహసీల్దార్ చంద్రరాజేశ్వర్ రావు అక్కడికి వచ్చి రైతులతో మాట్లాడారు. వారు వినకుండా తమకు యూరియా బస్తాలు ఇచ్చేంతవరకు రాస్తారోకో విరమించేదిలేదని రోడ్డుపైనే బైఠాయించారు. ఎల్హెచ్పీఎస్, బీఆర్ఎస్ నాయకులు రైతుల రాస్తారోకోకు మద్దతు తెలుపగా.. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ హాజరై మాట్లాడారు. యూరియా కోసం రైతులు క్యూలో రోజుల తరబడి నిలబడాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. రాస్తారోకోలో బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లూనావత్ అశోక్, ఎల్హెచ్పీఎస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ బోడ లక్ష్మణ్, జిల్లా అధ్యక్షుడు అంగోత్ చందూలాల్, మూడు రవి, అజ్మీరా శ్రీనివాస్, బాలరాజు, రైతులు పాల్గొన్నారు. -
ఐదు గంటలు హైరానా..
● మరిపెడలోని వసతి గృహం నుంచి పారిపోయిన విద్యార్థిని ● భూపాలపల్లి బస్టాండ్లో ప్రత్యక్షంమరిపెడ: మరిపెడ పట్టణంలోని ఓ వసతి గృహం నుంచి ఉదయం పారిపోయిన విద్యార్థిని ఐదు గంటల తర్వాత మధ్యాహ్నం భూపాలపల్లి బస్టాండ్లో ప్రత్యక్షమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని బుద్ధారం గ్రామానికి చెందిన బంటు భానుశ్రీ మరిపెడలోని మహాత్మా జ్యోతిరావుపూలే బాలికల వసతి గృహంలో ఐదో తరగతి చదువుతోంది. కాగా, విద్యార్థిని శుక్రవారం ఉదయం అల్పాహారం తీసుకునే సమయంలో పాఠశాల వెనుక నుంచి కంచె దాటి పారిపోయింది. తోటి విద్యార్థినుల ద్వారా విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ అనిత వెంటనే మరిపెడ సీఐ రాజ్కుమార్కు ఫిర్యాదు చేశారు. సీఐ ఆదేశాల మేరకు ఎస్సై సతీష్ సిబ్బందితో కలిసి కూడళ్ల వద్ద సీసీ ఫుటేజీలను పరిశీలించగా.. విద్యార్థిని కార్గిల్ సెంటర్ మీదుగా మరిపెడ బస్ స్టేషన్ వైపునకు వెళ్లినట్లు గుర్తించారు. వెంటనే విద్యార్థిని కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసి వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి బస్టాండ్లో ఆరా తీశారు. మధ్యాహ్నం 2గంటలకు భూపాలపల్లి బస్టాండ్లో భానుశ్రీని గుర్తించినట్లు కుటుంబ సభ్యులు మరిపెడ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా తనకు హాస్టల్లో ఉండడం ఇష్టం లేదని రెండు రోజుల క్రితం తోటి విద్యార్థినులకు చెప్పినట్లు తెలిసింది. ఐదు గంటల వ్యవధిలోనే విద్యార్థిని ఆచూకీ కనుగొన్న సీఐ రాజ్కుమార్, ఎస్సై సతీష్ను పలువురు అభినందించారు. కాగా, వసతిగృహం చుట్టూ ప్రహరీ లేకనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు. -
పనుల జాతర షురూ..
● ఉపాధి హామీ పథకంలో గ్రామాలు, తండాల్లో అభివృద్ధి పనులు ● జిల్లాలో 456 పనులకు రూ.86.59కోట్ల నిధులుమహబూబాబాద్ అర్బన్: జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలు, మారుముల తండాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పనుల జాతర కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కూలీలకు పనులు కల్పించడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 2025–26 సంవత్సరానికి గానూ 456 పనులను గుర్తించారు. రూ.86.59 కోట్ల నిధులతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఆర్డబ్ల్యూస్ శాఖల సమన్వయంతో పనులు చేపడుతున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పలు పనులను ప్రారంభించగా.. మరిన్ని పనులకు శంకుస్థాపనలు చేశారు. పనులు ఇవే.. జిల్లాలో నూతనంగా అంగన్వాడీ, గ్రామపంచాయతీ భవనాలు, సెగ్రిగేషన్ షెడ్లు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్, ఇందిరా మహిళాశక్తి భరోసా కింద వ్యక్తిగత పశువుల పాక, గొర్రెలు, కోళ్ల షెడ్లు, పండ్ల తోటల పెంపకం, బావుల నిర్మాణం, వానపాముల ఎరువుల తయారీ కేంద్రం, అజోల్లా ఫిట్ నిర్మాణ పనులు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ రహదారుల నిర్మాణం, సీఆర్ఆర్ నిధులతో కొత్తగా చేపట్టే పనులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు శంకుస్థాపన చేస్తారు. కూలీల వివరాలు.. జిల్లా వ్యాప్తంగా 18 మండలాల పరిధిలో ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న కూలీలు మొత్తం 2,55,840 మంది ఉన్నారు. ఇందులో మహిళలు 1,33,915 మంది, పురుషులు 1,21,925 మంది ఉన్నారు. పనులు త్వరగా పూర్తి చేస్తాం జిల్లాలో ఉపాధి కూలీలకు పనులు కల్పించడం కోసం గ్రామాలు, తండాల్లో అంగన్వాడీ, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం, వివిధ పనులకు రాష్ట్ర ప్రభుత్వం పనులు జాతరను తీసుకువచ్చింది. ఈ పనులను డిసెంబర్ చివరి వరకు పూర్తి చేసి జిల్లా ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. –మధుసూదన్రాజు, డీఆర్డీఓ -
కష్టాలు వరుస కట్టాయి..
సాక్షి, మహబూబాబాద్ / మిరుదొడ్డి / ఆత్మకూర్: యూరియా కోసం రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. సరిపడా స్టాక్ ఉందని అధికారులు చెబుతుండగా, టోకెన్లు ఇచ్చి వారం దాటినా యూరియా ఇవ్వడం లేదని రైతులు రోడ్డెక్కారు. పలుచోట్ల రైతులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పోలీస్ పహారా మధ్య యూరియా బస్తాలు, టోకెన్లు ఇచ్చారు. ⇒ మహబూబాబాద్లోని సర్వేపల్లి రాధాకృష్ణ సెంటర్లో శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. వందలాది మంది రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాలో రైతులకు మద్దతుగా ఎమ్మెల్సీ సత్య వతి రాథోడ్ పాల్గొన్నారు. చివరకు టోకెన్లు ఇచ్చి త్వరలో యూరియా అందజేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఆపై బందోబస్తు మధ్య టోకెన్లు పంపిణీ చేశారు.⇒ కురవి, సీరోలు మండల కేంద్రాల్లో యూరియా పంపిణీ కేంద్రం వద్దకు పెద్దఎత్తున రైతులు రావడంతో పోలీస్ పహారా మధ్య పంపిణీ చేశారు. ⇒ సకాలంలో యూరియా ఇవ్వడం లేదని కేసముద్రం మండలం బేరువాడ, దనసరి, ఇనుగుర్తి, డోర్నకల్ మండలం మన్నెగూడెం ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు దిగారు. ⇒ సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి పీఏసీఎస్కు శుక్రవారం యూరి యా లారీ వస్తుందని సమాచారం అందుకున్న పలు గ్రామాలకు చెందిన రైతులు అర్ధరాత్రి నుంచే క్యూ లైన్ కట్టారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి రైతులు చెప్పుల ను క్యూలో పెట్టి బయటకు వెళ్లారు. ఒకేసారి 3 వేల మంది రైతులు బారులు తీరడంతో టోకెన్లు ఇవ్వడంతో అధి కారులకు సైతం తిప్పలు తప్పలేదు. మొత్తానికి యూరి యా లారీ రావడంతో టోకెన్లు అందుకున్న రైతులకు రెండు బస్తాల చొప్పున యూరియా పంపిణీ చేశారు. ⇒ వనపర్తి జిల్లా ఆత్మకూర్లోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద రైతుల కుటుంబసభ్యులందరూ పడిగాపులు కాస్తు న్నారు. శుక్రవారం సొసైటీకి 700 బస్తాల యూరియా రాగా.. గురువారం టోకెన్లు తీసుకున్న 72 మంది అందజేశారు. శుక్రవారం మరో 70 మంది రైతులకు టోకెన్లు ఇచ్చారు. అయితే తమ వంతు ఎప్పుడు వస్తుందేమోనని తెల్లవారుజాము నుంచే రైతులు పీఏసీఎస్ కార్యాలయం వద్ద చెప్పులను క్యూలైన్లో పెట్టి ఎదురు చూస్తున్నారు. ఇంటివద్ద నుంచి భోజనం తెచ్చుకొని అక్కడే తింటున్నారు. అలసిపోయి చెట్టు నీడన నిద్రపోతున్నారు.టోకెన్ ఇచ్చి ఐదురోజులు..నాకున్న ఎకరంతోపాటు మూడు ఎకరాల పొలం మునాబాకు తీసుకు న్నా. పొలం నాటేసిన వెంటనే యూ రియా వేయాలి. నాటేసి నెలరోజు లైనా యూరియా వేయలేదు. యూరియా కోసం వస్తే వారం క్రితం టోకెన్లు ఇచ్చారు. ఇప్పటి వరకు బస్తా కూడా ఇవ్వలేదు. – అజ్మీర చక్రు, రోటిబండ తండా, మహబూబాబాద్అదును దాటితే ఇబ్బందే.. వరి, మొక్కజొన్న సాగు చేశా. వర్షా లు పడుతున్నాయి. ఇప్పుడు యూ రియా వేస్తేనే దిగుబడి వస్తుంది. ఐదురోజుల నుంచి ఇద్దరం తిరుగు తున్నా ఒక్క బస్తా దొరకలేదు. అదును దాటిన తర్వాత యూరియా వేసినా లాభం లేదు. పంట దిగుబడి తక్కువ వస్తుంది. – భూక్య హుస్సేన్, సికింద్రాబాద్ తండా, మహబూబాబాద్ -
‘నాకు, నీకు సంబంధం లేదు.. నీ చావు నీవు చావు’
మరిపెడ రూరల్: అత్తింటి వేధింపులతో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేటలో బుధవారం చోటు చేసుకోగా గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పాక వెంకన్న, ఉమ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. చిన్నకూతురు ప్రత్యూషను (24) ఐదేళ్ల క్రితం సూర్యాపేట జిల్లా మోతే మండలం జగ్గుగూడెం గ్రామానికి చెందిన పెరుగు పరశురాములుకు ఇచ్చి వివాహం జరిపించారు. ఇద్దరి కుమార్తెలకు వివాహం జరిపించి కట్న, కానుకల కింద చెరో ఒకరం వ్యవసాయ భూమిని రాసి ఇచ్చారు. ప్రత్యూష, పరశురాములు దంపతుల దాంపత్య జీవితం కొంతకాలం సజావుగా కొనసాగింది. ఈ క్రమంలో ప్రత్యూష అత్తగారి ఇంటి వద్ద మరిది పెత్తనంతో ఆ ఉమ్మడి కుటుంబంలో గొడవలు చోటు చేసుకున్నాయి. ఆ గొడవలు చిలికిచిలికి గాలివానలా మారి ప్రత్యూషను కట్నం కింద ఇచ్చిన భూమి అమ్మి డబ్బులు తీసుకురావాలని అత్తింటి సభ్యులు వేధింపులు మొదలు పెట్టారు. ఈ విషయంలో ఇటీవల అత్తామామ, మరిది, భర్త కలిసి ప్రత్యుషపై దాడికి దిగారు. అనంతరం ప్రత్యూషను భర్త పరశురాములు పది రోజుల క్రితం తల్లిగారి ఊరు ఎల్లంపేటలో బలవంతంగా వదిలి వెళ్లాడు. ఎంతకూ తీసుకెళ్లకపోవడంతో ప్రత్యూష ఫోన్లో భర్తను నిలదీసింది. దీంతో భర్త ‘నాకు, నీకు సంబంధం లేదు.. నీ చావు నీవు చావు’ అని తెగేసి చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన ప్రత్యూష ఈ నెల 19వ తేదీన ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నంచగా పక్కంటి వారు చూసి రక్షించే ప్రయత్నం చేశారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను కుటుంబీకులు 108లో ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ నెల 20 తేదీన మృతి చెందింది. మృతురాలి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతురాలికి 11 నెలల కుమార్తె ఉంది. ఈ ఘటనతో ఎల్లంపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ప్రాచీన భారతీయ విజ్ఞానాన్ని కొట్టిపారేయలేం..
కేయూ క్యాంపస్: ప్రాచీన భారతీయ విజ్ఞానాన్ని కొట్టిపారేయలేమని తిరువనంతపురం ఇస్పో ఎన్ఈఎస్ఎస్ ప్రొఫెసర్ ఎస్.వి.చలపతి అన్నారు. కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో గురువారం ‘డైమండ్స్ ఫ్రమ్ థేర్ బర్త్టూ ఎటర్నిటీ’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. భూగోళశాస్త్రం ఎంతో గొప్పదన్నారు. కృత్రిమ డైమండ్స్పై మోజుపెరిగినా సహజసిద్ధ మైన డైమండ్ విలువైందన్నారు. భారతీయ డైమండ్ మార్కెట్ ప్రపంచంలో చాలాపెద్దదన్నారు. ఇంజనీరింగ్ టెక్నాలజీలో నూతన ఆలోచనలకు పదును.. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త ఆలోచనలకు పదును పెట్టాలని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్ సి. రాఘవేంద్రరావు అన్నారు. ‘సుర్రోగేట్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ ఫర్ఇంజనీరింగ్ స్పేస్టెక్నాలజీ’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. అలాగే, ‘స్పేస్టెక్నాలజీ ఫర్ రూరల్ డెవలప్మెంట్’ అనే అంశంపై హైదరాబాద్లోని జీపీ బిర్లా సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ కె. మృత్యుంజయరెడ్డి.. స్పేస్ టెక్నాలజీలో వస్తున్న మార్పులను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కలుపు నివారణలో సాంకేతికత.. కలుపునివారణలో సాంకేతికత ప్రధాన భూమికపోశిస్తుందని ఇక్రిశాట్ సైంటిస్ట్ ప్రొఫెసర్ ఎ. నారాయణరావు అన్నారు. ‘క్లెమేట్ రిసిలిఎంట్ ఇంటిగ్రేటెడ్ విత్ మేనేజ్మెంట్’అనే అంశంపై ఆయన మాట్లాడారు. హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ కిశోర్నట్టి.. రసాయన, ఔషధ పరిశ్రమలో ఉపయోగించే ఉత్ప్రేరక సమ్మేళనాల ప్రభావ పాత్రను వివవరించారు. ముంబాయి బాబా అటమిక్ రీసెర్చ్సెంటర్ సైంటిస్ట్ డి. విద్యాసాగర్ మాట్లాడుతూ రేడియోలాజికల్ అత్యవసర పద్ధతులకు సిద్ధంగా ఉండాలన్నారు. బెంగుళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ప్రొఫెసర్ తిరుపతి.. మానవశరీరంలోని సమీకరణాలు, ప్రవేశ విలువలు, షరతుల గురించి వివరించారు. కేన్సర్ నివారణపై రిటైర్డ్ ప్రొఫెసర్ రామ్బాహు వివరించారు. ఆహార ఉత్పాదకతకు అత్యవసరమైన నత్రజని, భాస్వరం సమ్మేళనాలు వ్యవసాయం, వ్యర్థ పదార్థాల నిర్వహణలో సరైన విధంగా ఉపయోగించుకోకపోవడంతో పర్యావరణానికి సవాళ్లు ఎదురవుతున్నాయని న్యూఢిల్లీ ఇంద్రప్రస్త యూనివర్సిటీ ప్రముఖ్ వైజ్ఞానిక్ ప్రొఫెసర్ నందుల రఘరాం అన్నారు. ‘పోషకవనరుల నిర్వహణ –పర్యావరణం’ అనేఅంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. వ్యవసాయ పద్ధతులల్లో మార్పు తీసుకురావాలన్నారు. కృత్రిమం కంటే సహజసిద్ధ డైమండ్ విలువైనది తిరువనంతపురం ప్రొఫెసర్ ఎస్.వి. చలపతి -
ఏటీఎం గోడను ఢీకొట్టిన గూడ్స్ రైలు
ఖిలా వరంగల్: వరంగల్ రైల్వేస్టేషన్లో గూడ్స్ రైలు పార్కింగ్ కోసం గురువారం ఉదయం వెనక్కి ప్రయాణిస్తూ ఏటీఎం గోడను ఢీకొట్టింది. దీంతో ఎవరికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగపోవడం అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన తెలిసిన వెంటనే రైల్వేస్టేషన్ అధికారులు, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్గౌడ్, ఎస్సై వెంకటేశ్వర్లు, జీఆర్పీ ఇన్స్పెక్టర్ సురేందర్ ప్రమాద స్థలానికి చేరుకున్నారు. గూడ్స్ రైలు ఢీకొట్టిన ఏటీఎం గోడను పరిశీలించారు. రైలు వెనక్కి వెళ్తూ అకస్మాత్తుగా గోడను ఢీకొట్టిందన్నారు.490 మంది ఎస్ఏలకు హెడ్మాస్టర్లుగా పదోన్నతులువిద్యారణ్యపురి: మల్టీజోన్ –1 పరిధి వరంగల్ పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ పరిఽధిలోని 19 జిల్లాల్లోని 490మంది స్కూల్ అసిస్టెంట్లకు హెడ్మాస్టర్లు (గ్రేడ్–2) పదోన్నతులు కల్పించారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్లు పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఇందులో ప్రభుత్వ యాజమాన్య పరిధిలోని హైస్కూల్స్ కు 53మంది స్కూల్ అసిస్టెంట్లు హెడ్మాస్టర్లుగా, లోకల్బాడీ యాజమాన్యాల పరిధిలోని 437 మంది ఎస్ఏలు హెడ్మాస్టర్లుగా పదోన్నతి పొందారు. వీరు తమకు కేటాయించిన హైస్కూల్స్లో జాయిన్ అయ్యేందుకు 15 రోజుల సమయం ఉంటుంది. కానీ ఆయా స్కూల్ అసిస్టెంట్లు ఎక్కువశాతం మంది ఈ నెల 22న రిలీవ్ అయి వెంటనే హెడ్మా స్టర్లుగా జాయిన్ కానున్నారని సమాచారం.నేటినుంచి దూరవిద్య డిగ్రీ పరీక్షలుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య డిగ్రీ బీఏ, బీకాం జనరల్, కంప్యూటర్స్, బీఎస్సీ మొదటి, ద్వితీయ, ఫైనలియర్ ఎక్స్, రెగ్యులర్ విద్యార్థులకు ఈనెల 22 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు కేయూ అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజ గురువారం తెలిపారు. ఈనెల 22, 26, 30, సెప్టెంబర్ 3, 8,11 తేదీల్లో ఫైనలియర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. దూరవిద్య డిగ్రీ సెకండియర్ విద్యార్థులకు ఈనెల 23, 28,సెప్టెబర్ 1, 4, 9, 11, 17 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు, డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈనెల 25, 29,సెప్టెంబర్ 2, 6, 10, 15, 18వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని పద్మజ తెలిపారు. కేయూ దూరవిద్య కేంద్రం పరిధిలో 14 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 8,200 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారని పద్మజ తెలిపారు.కోతుల దాడిలో మహిళకు తీవ్ర గాయాలుకేసముద్రం: కోతుల దాడితో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం ఇనుగుర్తిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన కందునూరి మల్లికాంబ తన ఇంటి ఆవరణలో పనిచేస్తుండగా, ఒక్కసారిగా కోతులు ఆమైపె దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో మల్లికాంబ కాళ్లు, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. కోతుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా ప్రమాదవశాత్తు జారి పడడంతో చేయి విరిగింది. -
మూడు దశాబ్దాల న్యాయపోరాటం ఫలించింది
హన్మకొండ చౌరస్తా: క్రైస్తవ మిషనరీ ఆస్తుల పరిరక్షణ కోసం మూడు దశాబ్దాల పాటు సాగిన న్యాయపోరాటం ఫలించిందని హనుమకొండ సెంటనరీ బాప్టిస్టు చర్చి ప్రెసిడెంట్ తాళ్లపెల్లి విజయ్స్వరూప్ అన్నారు. హనుమకొండలోని మిషన్ ఆస్పత్రి ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేల కోట్ల విలువైన మిషనరీ ఆస్తులను కొందరు అక్రమంగా అమ్ముకున్నారని, ఆస్తుల పరిరక్షణ కోసం ముప్పై ఏళ్ల క్రితం డి. జయరాజ్ మరో నలుగురితో కలిసి న్యాయస్థానాన్ని ఆశ్రయించారన్నారు. మూడు దశాబ్దాల పోరాటం తర్వాత మద్రాస్ హైకోర్టు చారిత్రక తీర్పు వెలువరించిందన్నారు. 2,000 సంవత్సరం తర్వాత అక్రమంగా అమ్మిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు భవిష్యత్లో అమ్మేందుకు ఎవరికి హక్కు లేదంటూ తీర్పు వెలువరించిందన్నారు. కాగా, మిషనరీ ఆస్తుల పరిరక్షణకు జరిగిన న్యాయపోరాటంలో స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి సాయం మరవలేనిదని, ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాది రాంగోపాల్రావు, నెల్లూరుకు చెందిన క్రైస్తవులు అనిల్కుమార్, సునీల్కుమార్, సీబీసీ సెక్రటరీ క్రిష్టోఫర్రూబెన్, జాయింట్ సెక్రటరీ విద్యాకర్, ట్రెజరర్ విల్సన్ వినయ్కుమార్ పాల్గొన్నారు. సీబీసీ ప్రెసిడెంట్ విజయ్స్వరూప్ -
సైబర్ నేరస్తుడికి ఏడాది జైలు, జరిమానా
వరంగల్ క్రైం : ఓ సైబర్ నేరస్తుడికి హనుమకొండ జిల్లా మూడో అదనపు జూనియర్ ఫస్ట్ క్లాస్ కోర్టు జడ్జి.. ఏడాది 29 రోజుల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించినట్లు వరంగల్ సైబర్ క్రైం డీఎస్పీ కలకోట గిరికుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. జార్ఖండ్లోని జంఠారా జిల్లాకు చెందిన బిదూర్ మహాతో తరచూ ఆన్లైన్, చాటింగ్ మోసాలకు పాల్పడుతున్నాడు. మహాతోపై కమిషనరేట్ పరిధిలోని కేయూ పీఎస్లో 2, సుబేదారి పీఎస్లో 2, మిల్స్ కాలనీ పోలీస్స్టేషన్లో ఒక కేసు నమోదైంది. ఈ క్రమంలో ఇటీవల ఎస్బీఐ క్రెడిట్ కార్డు అధికారినంటూ నగరానికి చెందిన జూపాక అర్చనకు ఫోన్ చేసి రూ.63,837 బదిలీ చేయించుకుని మోసం చేశాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేయూ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా, విచారణ అధికారి చార్జ్షీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన న్యాయమూర్తి.. నేరం రుజువుకావడంతో నేరస్తుడు బిదూర్ మహాతోకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించినట్లు తెలిపారు. ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 నంబర్ లేదా cybercrime.gov.in అనే వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇలా ఫిర్యాదు చేయడం వల్ల కోర్టుల ద్వారా నిందితులకు శిక్ష పడడంతో పాటు మోసపోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంటుందని వివరించారు. -
తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ విజయవంతం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవంలోకి అడుగిడిన వేళ తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్, కాకతీయ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ విజయవంతమైందని తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (టాస్) అధ్యక్షుడు, హైదరాబాద్ సీసీఎంబీ మాజీ డైరెక్టర్ సి.హెచ్. మోహన్రావు అన్నారు. మూడురోజులుగా యూనివర్సిటీలో ‘ఇన్నోవేటివ్ స్కిల్ ఫర్ ఎంపవర్మెంట్ సైన్స్అండ్ టెక్నాలజీ ఫర్ ట్రాన్సాఫార్మింగ్ ఇండియా’ అనే అంశంపై నిర్వహించిన తెలంగాణ సైన్స్కాంగ్రెస్ గురువారం ముగిసింది. ఈ ముగింపు సభలో మోహన్రావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశాభివృద్ధిలో సైన్స్కీలకమన్నారు. ఈసభకు అధ్యక్షత వహించిన కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణ,స్పేస్, క్వాంటం పరిశోధన అంశాలు విద్యార్థులు, పరిశోధకుల్లో ఆసక్తి రేకిత్తించాయన్నారు. తెలంగాణ అకాడమీ సైన్సెస్ జనరల్ సెక్రటరీ ఎస్. సత్యనారాయణ మాట్లాడుతూ శాస్త్రసాంకేతిక పురోగతే లక్ష్యంగా తెలంగాణ అకాడమి పనిచేస్తుందన్నారు. కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం మాట్లాడుతూ శాస్త్రవేత్తల నూతన ఆవిష్కరణలపై దృష్టిపెట్టాలన్నారు. తెలంగాణ సైన్స్కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకట్రామ్రెడ్డి మాట్లాడుతూ 48 ఆహ్వానిత లెక్చర్స్, ఐదు ప్లీనరీలెక్చర్లు, 164 ఓరల్ ప్రజెంటేషన్లు, పోస్టర్ ప్రజెంటేషన్లు కొనసాగాయన్నారు. మొత్తం 780 మంది పరిశోధకులు తమ పరిశోధన పత్రాలు సమర్పించారన్నారు. టాస్ ఉపాధ్యక్షుడు సంజీవరెడ్డి, జాయింట్ సెక్రటరీ ప్రొఫెసర్ వడ్డె రవీందర్, ట్రెజరర్ ఎస్ఎంరెడ్డి, వివిధ డీన్లు బి. సురేశ్లాల్, జి. హనుమంతు, గాదె సమ్మయ్య, సదానందం తదితరులు మాట్లాడారు. ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్ ప్రసాద్ వందన సమర్పణ చేశారు. టాస్ అధ్యక్షుడు, సీసీఎంబీ మాజీ డైరెక్టర్ మోహన్రావు ముగిసిన సైన్స్ కాంగ్రెస్ -
మధ్యవర్తిత్వంతో వివాదాలు సులభంగా పరిష్కారం
వరంగల్ లీగల్ : మధ్యవర్తిత్వంతో వివాదాలు సులభంగా పరిష్కారమవుతాయని మీడియేషన్ అండ్ ఆర్బిట్రేషన్ సెంటర్ పాలకమండలి అధ్యక్షులు జస్టిస్ కె.లక్ష్మణ్, సభ్యులు జస్టిస్ జె.శ్రీనివాసరావు అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయా జిల్లాల న్యాయసేవాధికాసంస్థలు గుర్తించిన మధ్యవర్తిత్వం భావన, సాంకేతికతలపై సాధికారత పొందిన న్యాయవాదుల ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం గురువారం వరంగల్ టెన్ కోర్టు కాంప్లెక్స్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు వర్చువల్గా హాజరుకాగా తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి సి.హెచ్. పంచాక్షరి ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా రెండు పక్షాల వారికి సమయం, డబ్బు ఆదా అవడంతోపాటు శాంతి, సామరస్యంగా సమస్య పరిష్కారమవుతుందన్నారు. ఇది కక్షిదారుల చాలా ప్రయోజనం చేస్తుందన్నారు. అనంతరం శిక్షణ పొందిన న్యాయవాదులకు సభ్య కార్యదర్శి సి.హెచ్. పంచాక్షరి, వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వి.బి నిర్మలా గీతాంబ, డాక్టర్ కె.పట్టాభిరామ్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు నారాయణబాబు, మనీషా శ్రావణ్ ఉన్నమ్, వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయసేవాధికార సంస్థల కార్యదర్శులు సాయికుమార్, క్షమాదేశ్ పాండే, ఇతర న్యాయమూర్తులు, తదితరులు పాల్గొన్నారు. జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ జె.శ్రీనివాస్రావు -
దైవ దర్శనానికి వెళ్లొస్తూ అనంతలోకాలకు..
● రెండు బైక్లు ఎదురెదురుగా ఢీ.. ● వ్యక్తి దుర్మరణం బచ్చన్నపేట : దైవ దర్శనానికి వెళ్లొస్తూ ఓ వ్యక్తి అనంతలోకాలకు చేరాడు. రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో దుర్మర ణం చెందాడు. ఈ ఘటన జనగామ జిల్లా బ చ్చన్నపేట మండలం బండనాగారం సమీపంలో జరిగింది. ఎస్సై అబ్దుల్ హమీద్, మృతుడి కుటుంబ సభ్యులు కథ నం ప్రకారం.. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం మర్మాముల గ్రా మానికి చెందిన మలిపెద్ది సత్యనారాయణ (53) కిరాణా షాపు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం తన భార్య నాగలక్ష్మితో కలిసి తన బైక్పై కొడవటూరులోని సిద్ధేశ్వరాలయానికి వచ్చి పూజలు నిర్వహించారు. తిరుగు ప్రయాణంలో తన భార్య నాగలక్ష్మిని స్వగ్రామానికి చెందిన వారు కా రులో రాగా అందులో ఎక్కించాడు. బైక్పై ఒక్కడే స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన మురుగంటి రంజిత్కుమార్ బైక్పై బండనాగారం నుంచి బచ్చన్నపేటకు వెళ్తూ లక్ష్మాపూర్ కమాన్ వద్ద ఎదురుగా సత్యనారాయణ బైక్ను ఢీకొన్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సత్యనారాయణను చికిత్స నిమిత్తం సిద్దిపేటకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కొనసాగుతున్న వరద ఉధృతి కాళేశ్వరం: తెలంగాణ, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాలతో మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదుల ఉధృతి కొనసాగుతోంది. గురువారం కాళేశ్వరం వద్ద 12.180 మీటర్ల ఎత్తులో నీటిమట్టం పుష్కర ఘాట్లను తాకుతూ ప్రవహించింది. దిగువన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డ బ్యారేజీకి గోదావరి, ప్రాణహితల ద్వా రా 7.40లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రస్తుతం వరద ఉధృతి నిలకడగా కొనసాగుతోందని ఇరిగేషన్ ఇంజనీర్లు పేర్కొన్నారు. -
విషజ్వరంతో చిన్నారి మృతి
స్టేషన్ఘన్పూర్: విషజ్వరంతో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం కొత్తపల్లిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన జోగు శంకర్, సంధ్య దంపతులకు కుమార్తె సాత్విక (22 నెలల వయసు) సంతానం. ఒక్కగానొక్క కూతురు కావడంతో సాత్వికను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం చిన్నారికి తీవ్ర జ్వరం వచ్చింది. స్థానికంగా ఆర్ఎంపీలకు చూపించినా తగ్గకపోవడంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు విషజ్వరంగా గుర్తించి రక్తకణాలు తక్కువ ఉన్నాయని చెప్పి అడ్మిట్ చేసుకున్నారు. ఈక్రమంలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతిచెందింది. దీంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. రెండేళ్లకే నూరేళ్లు నిండాయా బిడ్డా అంటూ కూతురు మృతదేహం మీదపడి కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్నారి స్వాత్విక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కాగా, గ్రామంలో పారిశుద్ధ్య సమస్యపై పంచాయతీ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పలువురికి విష జ్వరాలు వస్తున్నా పట్టించుకోవడం లేదని పలువురు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ● కొత్తపల్లిలో విషాదఛాయలు -
యూరియా టోకెన్ల రగడ..
● రాత్రి వరకు టోకెన్లు ఇవ్వకపోవడంతో అధికారులపై రైతుల ఆగ్రహం ● బందోబస్తు మధ్య అధికారులను బయటకు పంపిన పోలీసులు మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ పట్టణంలోని పీఏసీఎస్ ఎదుట టోకెన్ల కోసం క్యూ లో నిల్చున్న రైతులకు నిరాశ తప్పలేదు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు టోకెన్లు ఇవ్వకపోవడంతో అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చే శారు. వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం మహబూబాబాద్ పీఏసీఎస్లో పోలీసు బందోబస్తు మధ్యసొసైటీ, వ్యవసాయశాఖ అధికారులు సోమ, మంగళ, బుధవారాల్లో టోకెన్లు ఇచ్చిన రైతులకు యూరియా బస్తాలను సరఫరా చేశారు. సుమారు 1,890 వరకు టోకెన్లు ఇవ్వగా 1,250 బస్తాల యూరియాను అందజేశారు. మిగిలిన రైతులకు శుక్రవారం స్టాక్ రాగానే అందజేస్తామని ఏఓ తిరుపతిరెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా టోకెన్ల కోసం ఉదయం నుంచి రాత్రి వరకు రైతులు క్యూలో ఉన్నారు. ఈ క్రమంలో టోకెన్లు ఇవ్వమని అధికారులు చెప్పారు. దీంతో ఆగ్రహించిన రైతులు వారిని కార్యాలయం నుంచి బయటకు రానివ్వలేదు. టోకెన్లు ఇచ్చేంతవరకు ఇక్కడి నుంచి కదిలేదిలేదని సొసైటీ ప్రధాన ద్వారం వద్ద రైతులు బైఠాయించారు. అయితే టౌన్, రూరల్ సీఐలు మహేందర్రెడ్డి, సర్వయ్య జోక్యం చేసుకుని పోలీసు బందోబస్తు మధ్య అధికారులను అక్కడి నుంచి పంపించారు. చేసేదేమీ లేక రైతులు ఇళ్లకు వెళ్లిపోయారు. -
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
గంగారం: గ్రామాల ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జాతీయ ఆరోగ్య మిషన్ కేంద్ర బృందం సభ్యులు డాక్టర్ వరుణ్ విజయ్, డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. గురువారం గంగారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం గ్రామాల్లో పర్యటించారు. ఎన్హెచ్ఎం పరిధిలో జాతీయ కార్యక్రమాలు క్షయ, కుష్ఠు, మలేరియా, డెంగీ, బోదకాలు వ్యాధి, ఇమ్యూనైజేషన్ టీకాలు, మాతాశిశు ఆరోగ్య సంరక్షణపై సమీక్ష నిర్వహించారు. సబ్ సెంటర్ల పరిధిలోని ప్రజలకు కార్యక్రమాలు చేరుతున్నాయా.. లేదా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో చేపడుతున్న పారిశుద్ధ్య పనులు, దోమల లార్వాల కట్టడికి తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించి, అనంతరం అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీపీఓ నిలో హన, పీహెచ్సీ వైద్యాధికారులు ప్రత్యూష, శ్రీకాంత్, ఆయుష్ వైద్యాధికారి సూర్యం, స్టాఫ్ నర్సు లక్ష్మి, హెచ్వీ రాణి, రాంబాబు, శ్రీరాములు, వనజ తదితరులు పాల్గొన్నారు. -
అంతులేని ఆదాయం.. పోస్టింగ్ కోసం పోటాపోటీ..
రవాణాశాఖలో అంతులేని ఆదాయం ఉండటంతో కొందరు అధికారులు పోటీపడీ పోస్టింగ్లు కొడుతున్నారు. కొందరు మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్లు ఇప్పుడు ఇన్చార్జ్ డీటీఓలుగా కూడా అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఇందులో కూడా కొన్నిచోట్ల సీనియర్లు తిరకాసు చేసి జూనియర్లను ముందుంచి తెరవెనుక అక్రమ ఆదాయమార్గాలపై చక్రం తిప్పుతున్నారు. హనుమకొండ డీటీఓ పోస్టు కూడా ఖాళీ అయిన సమయంలో వాస్తవానికి అదే కార్యాలయంలో సీనియర్గా ఉన్న 1994 బ్యాచ్కు చెందిన సీనియర్ ఎంవీఐ డీటీఓగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయితే తెరపైన కీలక పోస్టులో ఉండటం ఇష్టం లేక అత నే ఆ పోస్టుపై విముఖత చూపడంతో 2012 బ్యా చ్కు చెందిన ఒకరికి ఆ పోస్టు కట్టబెట్టి ఆ సీనియ ర్ ఎంవీఐ అన్నీ తానై చూస్తుండటం వల్లే మా మూళ్లు రెండింతలయ్యాయన్న ఆరోపణలు ఉ న్నాయి. ఇదిలాఉంటే ఇన్చార్జ్ల కోసం అన్ని జిల్లాల్లో పోటీ ఉంది.వరంగల్లో ఎంవీఐగా ఉన్న ఒకరు మహబూబాబాద్ ఇన్చార్జ్ డీటీఓగా వ్యవహరిస్తుండగా, పెద్దపల్లి ఎంవీఐగా ఉన్న ఓ అధికా రి ఆ పోస్టుతోపాటు ములుగు ఎంవీఐగా, ఇన్చార్జ్ డీటీఓగా వ్యవహరిస్తున్నారు. భూపాలపల్లిలో ఎంవీఐగా, ఇన్ఛార్జ్ డీటీఓగా ఒక్కరే చూస్తున్నారు. ఇలా.. ఏళ్లతరబడిగా ఉమ్మడి వరంగల్లో పాతుకుపోయిన కొందరు రవాణాశాఖ అధి కారు ల తీరుపై ఆ శాఖ ఉద్యోగులే చర్చించుకుంటున్నా రు. హైదరాబాద్ స్థాయిలో పైరవీలు చేసుకుంటూ కోరుకున్న పోస్టుల్లో కొనసాగుతున్నారంటున్నారు. కాగా,రవాణాశాఖలో పెచ్చుమీరుతున్న అవినీతిపై కొందరు అవినీతి నిరోధకశాఖ అ ధికా రులు కూడా ద్వంద్వ వైఖరితో ఉన్నారన్న చర్చ కూడా ఆశాఖలో జరుగుతోంది. వ్యక్తిగత పరిచయాల ఆధారంగా లెక్కకు మించిన అవినీతి జరి గినా ఆ కార్యాలయాలు,అధికారులపై ఉదా సీనంగా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
దోమల బెడద..
సాక్షి, మహబూబాబాద్: గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు సరిగా చేపట్టడం లేదు. దీంతో ఇళ్ల మధ్య మురుగు నీరు నిల్వ ఉండి దోమలు, ఈగలు వ్యాప్తి చెందుతున్నాయి. డ్రెయినేజీల్లో మురుగు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కాగా పంచాయతీ కార్మికులకు సక్రమంగా వేతనాలు రాకపోవడం, పంచాయతీ పాలకమండలి లేకపోవడం తదితర కారణాలతో పల్లెల్లో సరిగా పారిశుద్ధ్య పనులు చేపట్టడం లేదు. దీంతో ప్రజలు రోగాల బారిన పడి ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. డీజిల్ భారంతో ట్రాక్టర్ మూలకు.. పల్లెలను పచ్చగా, పరిశుభ్రంగా ఉంచేందుకు గత ప్రభుత్వం ప్రతీ గ్రామ పంచాయతీకి చెత్తను ఎత్తేందుకు ట్రాక్టర్లు, చెట్లకు నీళ్లు పోసేందుకు ట్యాంకర్లు కొనుగోలు చేసింది. ఇలా జిల్లాలో గతంలో ఉన్న 461 గ్రామ పంచాయతీల్లో 456 జీపీలకు ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. చిన్న చిన్న మరమ్మతులు చేసేందుకు కూడా నిధులు లేకపోవడంతో 395 ట్రాక్టర్లు మాత్రమే నడుస్తున్నాయి. 61 ట్రాక్టర్లు మూలన పడేశారు. పనిచేసే ట్రాక్టర్లు కూడా రోజు తీస్తే డీజిల్కు రూ. 500 మేరకు ఖర్చు అవుతోందని వారంలో ఒకటి, రెండు రోజులు మాత్రమే తీసి మూలన పెడుతున్నారు. దీంతో కాల్వల్లో తొలగించిన చెత్తా చెదారం రోడ్డు పక్కనే పడేయడం, చిన్నపాటి వర్షం వచ్చినా అంతా చెల్లాచెదురై దుర్వాసన వెదజల్లుతోంది. నిధుల లేమి.. గ్రామ పంచాయతీల పాలక మండలి పదవీకాలం ముగిసి ఏడాదిన్నర గడుస్తోంది. దీంతో గ్రామాలను పట్టించుకునే వారు కరువయ్యారు. సర్పంచ్లు ఉన్నప్పుడు గ్రామంలోని పారిశుద్ధ్య పనులకోసం ఏదో ఒక రూపంలో నిధులను తీసుకొచ్చి ఖర్చుచేసేవారు. కానీ ఇప్పుడు పంచాయతీ కార్యదర్శులే మొత్తం భారం మోయాల్సి వస్తోంది. గతంలో బ్లీచింగ్, ఇతర ముగ్గులు పోయడం, ట్రాక్టర్ డీజిల్, పండుగలకు చేసిన ఖర్చులు.. ఇలా మొత్తం ఒక్కో కార్యదర్శికి రూ. 3లక్షలకుపైగా అప్పు అయినట్లు పలువురు కార్యదర్శులు వాపోతున్నారు. దీంతో కొత్త అప్పులు ఇచ్చే వారు లేక ఈ ఏడాది వర్షాకాలం నుంచి అత్యధిక పంచాయతీల్లో బ్లీచింగ్, ఫాగింగ్ కోసం కిరోసిన్, కెమికల్ కొనుగోలు చేయలేదు. దీంతో దోమల నివారణ మొక్కుబడిగా మారింది. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయి. మెడికల్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. పనులు చేయిస్తున్నాం. పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు చెల్లించాం. బ్లీచింగ్, కిరోసిన్ కొనుగోలు చేసుకోవాలని సూచించాం. – హరిప్రసాద్, డీపీఓ పల్లెల్లో అస్తవ్యస్తంగా పారిశుద్ధ్య పనులు నిధుల లేమితో బ్లీచింగ్, ఫాగింగ్ బంద్ డీజిల్ లేక వారంలో ఒక్కరోజే ట్రాక్టర్తో చెత్త సేకరణ కార్యదర్శులపై అప్పుల భారం -
గణేశ్ ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి
● కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్మహబూబాబాద్: గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సంబంఽధిత అధికారులతో గణపతి ఉత్సవాల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పక్కా ప్రణాళికతో రూట్ మ్యాప్ ద్వారా గణేశ్ మండపాల ఏర్పాటు, విగ్రహాల ఎత్తు తదితర అంశాలు పరిశీలించాలన్నారు. శాంతి కమిటీలు, ఉత్సవ నిర్వహణ కమిటీలతో ముందస్తు సమావేశాలు నిర్వహించాలన్నారు. విద్యుత్ సరఫరా, అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, మెడికల్ క్యాంపుల కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో కూడా తగు ఏర్పాట్లు చేయాలన్నారు. నవరాత్రి ఉత్సవాల విజయవంతానికి కృషి చేయాలన్నారు. ప్రస్తుతం చెరువులు నిండి ఉన్నాయని, చిన్న పిల్లలు, ఈత రానివారిని నిమజ్జనానికి తీసుకెళ్లొద్దని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్కుమార్, ఆర్డీఓలు కృష్ణవేణి, గణేష్, డీఎస్పీ తిరుపతిరావు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. అవసరాల మేరకు కొనుగోలు చేయాలి కేసముద్రం: రైతులు ప్రస్తుత అవసరాల మేరకు యూరియా కొనుగోలు చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. గురువారం మండలంలోని కాట్రపల్లి గ్రామంలో ఎరువుల దుకాణం, మున్సిపాలిటీ కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల, జెడ్పీ హైస్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా గురించి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లాలో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయన్నారు. జిల్లాలో సరిపడా యూరియా ఎప్పటికప్పుడు సరఫరా అవుతుందని అన్నారు. ఈ మేరకు స్టాక్తో పాటు యూరియా కొనుగోలు వివరాలను పరిశీలించారు. అనంతరం మున్సిపాలిటీ కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల, జెడ్పీ హైస్కూల్ను తనిఖీ చేసి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. కిచెన్ షెడ్ పరిశీలించి విద్యార్థులకు రుచికరమైన, పరిశుభ్రమైన వేడివేడి ఆహార పదార్థాలను వడ్డించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వివేక్, ఏఓ వెంకన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సైన్స్కాంగ్రెస్..
‘ఎల్టీటీ’లో సాంకేతిక లోపం..ఉత్సాహంగా కొనసాగుతున్నకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ స్వర్ణత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ ఉత్సాహంగా రెండు రోజు బుధవారం కొనసాగింది. ‘ఇన్నోవేటివ్ స్కిల్స్ ఫర్ ఎంపవర్మెంట్ సైన్స్అండ్ టెక్నాలజీ ఫర్ ట్రాన్సాఫార్మింగ్ ఇండియా’ అనే అంశంపై కొనసాగుతోంది. ఆకట్టుకున్న విద్యార్థుల ఎగ్జిబిట్లు.. శాసీ్త్రయ దృక్పథం పెంపొందించడంలో భాగంగా హైస్కూల్ స్థాయి విద్యార్థులను తెలంగాణ సైన్స్కాంగ్రెస్కు తీసుకొచ్చారు. ఆడిటోరియం వద్ద వివి ధ హైస్కూళ్ల విద్యార్థులు తమ ఎగ్జిబిట్లను ప్రదర్శించగా ఆకట్టుకున్నాయి. దృష్టికోణం మార్చే జీవనశైలి.. హైదరాబాద్ ఐఐసీటీ ప్రొఫెసర్ వర్దిరెడ్డి మనోరమ ‘ఎ సోజోమ్ ది బకేమ్ ఏ వే ఆఫ్ లైఫ్’ అనే అంశంపై మాట్లాడుతూ ఒక వ్యక్తి లేదా సమూహం తా త్కాలికంగా ప్రారంభించిన జీవన ప్రయాణం.. క్రమంగా వారి జీవిత విధానంగా మారిన విశేషకథనాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ఈ ప్రయాణం సాంస్కృతిక మార్పుల వైపు దారితీసిన మార్గాన్ని వివరిస్తుందన్నారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు.. ఆడిటోరియంలో బుధవారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ సాంప్రదాయ, జానపద నృత్యాలు ఆకట్టుకున్నాయి. కాగా, బుధవారం మొత్తం ఇన్వైటెడ్ లెక్చర్లు 23, ఓరాల్ ప్రజెంటేషన్లు 58, పోస్టర్ ప్రజెంటేషన్లు 40 జరిగాయి. నేడు ముగింపు సభ గురువారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సైన్స్కాంగ్రెస్ ముగింపు సభ నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ బి. వెంకట్రామ్రెడ్డి తెలిపారు. ముఖ్యఅతిథులుగా కడప యోగివేమన యూనివర్సిటీ మాజీ వీసీ ఎ. రామచంద్రారెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వవిద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా తదితరులు పాల్గొంటారని తెలిపారు. సమగ్రాభివృద్ధి లక్ష్యాలకు దోహదం.. సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్తో ఆకలి నిర్మూలన, ఆరోగ్యం, బాధ్యతాయుత ఉత్పత్తి, సమగ్రాభివృద్ధి లక్ష్యాలు సాధ్యమని హైదరాబాద్ జేఎన్టీయూ బయోటెక్నాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ ఉమ అన్నారు. రైస్లో జీనోమ్ ఎడిటింగ్ భవిష్యత్లో అధిక దిగుబడి వస్తుందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ హైదరాబాద్కు చెందిన సతేంద్రకె మంగ్రోథియా అన్నారు. స్వయం నియంత్రిత రక్షణ వ్యవస్థలో జాతీయ భద్రత, ఆర్థిక దృఢత్వం, గ్లోబల్ కనెక్టివిటీ కీలకమని ఇస్రో మాజీ డైరెక్టర్ పిచ్చైమణి అన్నారు. డాక్టర్ కిరణ్ కిశోర్ ‘ఎర్త్ అబ్జర్వేషన్ టూప్లానటరీ ఎక్స్ఫ్లోరేషన్ ఎ రిజిమ్ షిప్ట్ ఇన్స్పేస్ ప్రోగ్రామ్స్’ అనే అంశంపై మాట్లాడారు. సైన్స్ కాంగ్రెస్లో భాగంగా సెనేట్ హాల్లో విద్యార్థులకు యంగ్సైంటిస్ట్ల మీట్ నిర్వహించారు. యంగ్సైంటిస్ట్ అవార్డు పొందిన రామచంద్రరావు ఎల్లా.. క్వాంటం కంప్యూటింగ్పై విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. హైదరాబాద్ ఎన్జీఆర్ శాస్త్రవేత్త హర్షిత్రెడ్డి గంగుల అరుదైన భూకమతాల గురించి వివరించారు. వరంగల్ కేఎంసీ సైంటిస్ట్ బి.ఫణికాంత్ జోగం ప్రొటిన్ మార్పిడిపై సందేహాలను నివృత్తి చేశారు. తెలంగాణ అకాడమీ సైన్సెస్ బాధ్యులు సంజీవరెడ్డి, వడ్డె రవీందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అకాడమీ సైన్సెస్ అధ్యక్షుడు మో హన్రావు, జనరల్సెక్రటరీ సత్యనారాయణ, ట్రెజరర్ ఎస్ఎం రెడ్డి, జాయింట్ సెక్రటరీ వడె ్డరవీందర్, కేయూ వీసీ ప్రతాప్రెడ్డి, తది తరులు విద్యార్థులను అభినందించారు. ఇంటికన్నె రైల్వేస్టేషన్లో 2గంటలు నిలిపివేత కేసముద్రం: ఇంజిన్లో ఏర్పడిన సాంకేతికలోపంతో విశాఖపట్నం–ముంబాయి ఎల్టీటీ ఎక్స్ప్రెస్ రైలు బుధవారం కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వేస్టేషన్లో 2 గంటలు నిలిచింది. ముంబాయి వైపుకు బయలుదేరిన ఎల్టీటీ రైలు ఇంటికన్నె రైల్వేస్టేషన్ వద్ద ఉదయం 10 గంటల సమయంలో నిలిచింది. దీంతో చింతలపల్లి నుంచి ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంజిన్ తీసుకొచ్చి నిలిచిన ఎల్టీటీ ఎక్స్ప్రెస్కు అటాచ్డ్ చేశారు. అనంతరం 12 గంటల ప్రాంతంలో ఎల్టీటీని యథావిధిగా పంపించారు. సుమారు 2 గంటల పాటు ఎల్టీటీ ఎక్స్ప్రెస్ నిలవడంతో మహబూబాబాద్ రైల్వేస్టేషన్లో వందేభారత్ అర్ధగంట, గోల్కోండ ఎక్స్ప్రెస్ గంట, కేసముద్రంలో అర్ధగంట నిలిచింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆకట్టుకున్న విద్యార్థుల ఎగ్జిబిట్లు ఉమెన్స్, యంగ్ సైంటిస్ట్ల మీట్ సెనేట్హాల్లో ఉమెన్స్ సైంటిస్ట్ మీట్ నిర్వహించారు. హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ నేత్రవైద్యశాల ప్రొఫెసర్ గీతాకె వేముగంటి.. కేన్సర్ పురోగతిలో చిన్న ఎక్స్ట్రాసియిలర్ వేసికుల్స్ పాత్రపై వివరించారు. ఈవేసికుల్స్ ఇమ్యూన్ సిస్టమ్ను తప్పించుకునేలా పనిచేసి కేన్సర్ సెల్స్ రక్షణ పొందేలా చేస్తాయన్నారు. కేన్సర్పై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. డీఆర్డీఓ సైంటిస్ట్ టి. వెంకటమణి డీఆర్డీఓ సైన్స్అండ్టెక్నాలజీపరంగా జరుగుతున్న పరిశోధనల గురించి వివరించారు. నైపుణ్యాలు, ప్రతిభకలిగిన ఇంజనీరింగ్ విద్యార్థులకు డీఆర్డీఓ పరిశోధకులుగా అవకాశం కల్పిస్తామని తెలిపారు. -
వినాయక విగ్రహాల
రవాణాలో జాగ్రత్తలు తీసుకోవాలి..హన్మకొండ: వినాయక విగ్రహాల తయారీ, రవాణాలో జాగ్రత్తలు తీసుకోవాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. విగ్రహాల తయారీదారులు, నవరా త్రి ఉత్సవ నిర్వాహకులు విద్యుత్పై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ మేరకు బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీ డీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్లు సూపరింటెండెంట్ ఇంజనీర్లు, డీఈ, ఏడీఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ఈ నెల 27న వినాయక చవితి సందర్భంగా గణేశ్ విగ్రహాల తరలింపు జరుగుతుందని, దీనిపై విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. విగ్రహాలు తరలించే రహదారుల్లో విద్యుత్ నెట్వర్క్ పరంగా ఎలాంటి లోపం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. భక్తులు, నవరాత్రి ఉ త్సవ నిర్వాహకులు మండపాల వద్ద విద్యుత్ భద్రతా చర్యలు పాటించాలని కోరారు. అలాగే, ఆపరేటర్లతో సమావేశం నిర్వహించి స్తంభాలకు ఉన్న టీవీ కేబుల్, ఇంటర్నెట్ కేబుల్ తీగలు తొలగించాలని సూచించాలని ఆదేశించారు. ఆ కేబుళ్లు ప్రమాదకరంగా ఉండడంతో విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. విద్యుత్ లైన్ ఎక్కడైనా తెగి పడినా, ఇతర అత్యవసర పరిస్థితులు ఏర్పడినా వెంటనే 19 12కు గాని సమీపంలోని విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్ రెడ్డి, టి.మధుసూదన్, సీజీఎం అశోక్, జీఎం సురేందర్ పాల్గొన్నారు. మండపాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ● మండపాలకు విద్యుత్ సరఫరా కనెక్షన్ కోసం సామాన్యులు స్తంభాలు ఎక్కొద్దు. సంస్థ సిబ్బందితోనే విద్యుత్ కనెక్షన్ పొందాలి. ● ఐఎస్ఐ మార్క్ కలిగిన ప్రామాణిక విద్యుత్ తీగలను మాత్రమే వినియోగించాలి. ఎలాంటి జాయింట్ తీగలు వినియోగంచొద్దు. తగినంత కెపాసిటీ కలిగిన ఎంసీబీ తప్పనిసరిగా వాడాలి. ఇది విద్యుత్ ప్రమాదాల నుంచి రక్షణ ఇస్తుంది. ● మండపాల్లో విద్యుత్ సంబంధిత పనులు చేసేటప్పుడు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. విద్యుత్ తీగలు, స్తంభాలు, ఇతర ప్రమాదకర విద్యుత్ పరికరాల నుంచి పిల్లలను దూరంగా ఉంచాలి. ● ఒక వేళ ఎవరికై నా విద్యుత్ షాక్ తగిలితే వారికి వెంటనే వైద్య సహాయం అందించి, ఆ ప్రమాద సమాచారాన్ని సమీపంలోని విద్యుత్ సిబ్బందికి తెలపాలి. ● విద్యుత్ వైరింగ్లో ఎక్కడైనా అతుకులు ఉంటే వర్షాలు కురిసిన సమయంలో తేమతో షాక్ కలిగే అవకాశముంది. అందుకే మండప నిర్వాహకులు ప్రతీ రోజు తప్పనిసరిగా వైరింగ్ను క్షుణ్ణంగా పరిశీలించాలి. తయారీదారులు, ఉత్సవ నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలి టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి -
రైల్వే భద్రతపై ప్రత్యేక దృష్టి
● దక్షిణ మధ్య రైల్వే కన్స్ట్రక్షన్ చీఫ్ ఇంజనీర్ సునీల్ కుమార్ వర్మ మహబూబాబాద్ రూరల్ : దక్షిణ మధ్య రైల్వే భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి సారిస్తుందని దక్షిణ మధ్య రైల్వే కన్స్ట్రక్షన్ చీఫ్ ఇంజనీర్ సునీల్ కుమార్ వర్మ అన్నారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో జరుగుతున్న మూడో లైన్ నిర్మాణ పనులను రైల్వే ఉన్నతాధికారులు బుధవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ రైల్వే మూడో లైన్ నిర్మాణం పనుల్లో పర్యవేక్షణ లోపం లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు, సిబ్బందిని ఆదేశించామన్నారు. రైల్వే మూడో లైన్ నిర్మాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగవన్నారు. తనిఖీల్లో డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ కన్ స్ట్రక్షన్ శ్రీనివాస్, ఏఎక్స్ఈఎన్ కన్స్ట్రక్షన్ గంట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఈఈ మంగీలాల్పై రైతుల భగ్గు..
నీరవ్వమంటే రైతులను చులకన చేస్తూ మాట్లాడారు జనగామ రూరల్ : దేవాదుల ద్వారా సాగు నీరు విడుదల చేసి చెరువులను నింపాలని ఇరిగేషన్ అధికారులను వేడుకుంటే రైతులను చులకన చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని ఈఈ మంగీలాల్పై రైతులు భగ్గుమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జోరు వర్షాలు కురుస్తూ.. వాగులు, చెరువులు పొంగిపొర్లుతుంటే జనగామ మండల రైతులు మాత్రం తమకు దేవాదుల ద్వారా సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ బుధవారం జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించారు. ఓబు ల్కేశ్వాపూర్, పెద్దపహాడ్, పెద్దరామన్చర్ల, పసరమడ్ల, చౌదర్పల్లి, ఎల్లంల, పెంబర్తి, శామీర్పేట, సిద్దెంకి, ఎర్రగుంట తండాకు చెందిన వందలాది మంది రైతులు ఆందోళన చేపట్టారు. వారి కథనం ప్రకారం.. రెండు రోజుల క్రితం ఈఈ మంగీలాల్ వద్దకు వచ్చి కాళ్లు మొక్కుతాం సాగుకు నీరు విడుదల చేయాలని కోరితే నవ్వుతూ తమాషాగా మాట్లాడారని తెలిపారు. సుమారు 10 గ్రామాల పరిధిలో 4,500 పైగా ఎకరాల్లో వరి, 1,300 పైగా ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఒక్క చెరువులో కూడా నీరు లేదన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో నేల తడవడం తప్ప కుంటలో చుక్క నీరు రాలేదన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత వరి, పత్తి పంటలను కాపాడుకునేందుకు చెరువులు నింపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో నెలరోజుల నుంచి సాగు నీరు విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులను వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు పది గ్రామాల రైతులు కలిసి ఈఈ వద్దకు వస్తే దిక్కున్న చోట చెప్పుకో.. అవసరమైతే మంత్రి, సీఎం వద్దకు వెళ్లండంటూ తమపై దురుసుగా ప్రవర్తించారని, ఈ విషయంపై ప్రభుత్వం విచారణ జరిపించి ఆ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తూ సెక్షన్ ఆఫీసర్కు వినతిపత్రి అందించారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు వచ్చి రైతులను బుజ్జగించి రాస్తారోకోను విరమింపజేశారు. కాగా, ఏకంగా పది గ్రామాల రైతులు సాగునీటి కోసం ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కార్యక్రమంలో రైతులు జానెపల్లి జనార్దన్రెడ్డి, బడికె కిష్టస్వామి, ధర్మజయప్రకాశ్రెడ్డి, దూసరి ఉప్పలయ్య, వల్లాల మల్లేశం, కొప్పుల మధు, కొమ్ము జగదీశ్, మహేందర్ రెడ్డి, రావుల శ్రీనివాస్రెడ్డి, తదితర రైతులు పాల్గొన్నారు. పిచ్చి కుక్క దాడిలో పలువురికి గాయాలుకాజీపేట: హనుమకొండ జిల్లా కాజీపేటలోని 63వ డివిజన్లో బుధవారం ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసి పలువురిని తీవ్రంగా గాయపర్చింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బాపూజీనగర్, జూబ్లీమార్కెట్, విద్యానగర్ కాలనీ ప్రాంతాల్లో ఓ వీధి కుక్క ఒక్కసారిగా బాటసారులపై పడి కనిపించిన వాళ్లను కనిపించినట్లు గాయపర్చింది. ఇంట్లో ఆడుకుంటున్న రెండున్నర సంవత్సరాల బాలికను ఇష్టారీతిగా కరిచింది. వీరితో పాటు ఐదుగురు వ్యక్తులపై దాడి చేసింది. ఆ కుక్కను స్థానిక యువకులు కర్రలతో దాడిచేసి చంపేశారు. గాయపడిన బాధితులు సోమిడి అర్బన్ హెల్త్ సెంటర్కు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. కాళ్లు మొక్కుతామంటే నవ్వుతున్నాడు జనగామ, నర్మెట రహదారిపై రాస్తారోకో సాగుకు నీరు విడుదల చేయాలని డిమాండ్ -
ఉప్పొంగిన గోదావరి..
కాళేశ్వరం: తెలంగాణ, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. బుధవారం ఎగువన కడెం ప్రాజెక్టు నుంచి వరదనీరు గోదావరి మీదుగా తరలిరాగా, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా నుంచి ప్రాణహిత నది వరదతో కలిసి కాళేశ్వరం వద్ద ఉగ్రరూపం దాల్చింది. దీంతో పుష్కర ఘాట్ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం 104.11 మీటర్ల ఎత్తులో నీటిమట్టం చేరింది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయగా, చివరి హెచ్చరిక 104.75 మీటర్లు చేరితే జారీ చేస్తారు. ఈ వరద నీరు దిగువ మేడిగడ్డ వైపునకు తరలుతోంది. కాగా, కాళేశ్వరం వద్ద చివరి హెచ్చరిక చేరువకు వరద నీరు చేరడంతో గోదావరి వద్ద చిరు దుకాణాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ప్రాజెక్టుల్లో.. గోదావరి గుండా మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీ వద్ద 5.42లక్షల క్యూసెక్కుల వరద తరలి వస్తోంది. దీంతో బ్యారేజీలోని మొత్తం 66గేట్లు ఎత్తి నీటిని దిగువకు కాళేశ్వరం వైపునకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి మేడిగడ్డ బ్యారేజీలోకి 10.43లక్షల క్యూసెక్కులు తరలివస్తోంది. దీంతో మొత్తం 85గేట్లు ఎత్తి నీటిని దిగువకు తరలిస్తున్నారు. నీట మునిగిన పంటలు.. అన్నారం –మేడిగడ్డ బ్యారేజీ వరకు సుమారు 120 ఎకరాల్లో పత్తి, వరి పంటలు నీటముగినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. రాకపోకలు బంద్.. అన్నారం బ్యారేజీ గుండా వచ్చే వరదతో చండ్రుపల్లి వాగును బ్యాక్వాటర్ కమ్మేయడంతో రాకపోకలు నిలిచాయి. అన్నారం నుంచి చండ్రుపల్లి, నాగేపల్లి, మద్దులపల్లి వయా కాళేశ్వరం రహదారి స్తంభించింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. కాళేశ్వరం వద్ద 104.11 మీటర్ల ఎత్తులో నీటిమట్టం మొదటి హెచ్చరిక జారీ, చివరి హెచ్చరికకు చేరువ -
వ్యాపారి పరారీపై పోలీసుల ఆరా
● గ్రెయిన్ మార్కెట్లో విచారణ జనగామ: ఆన్లైన్ రమ్మీకి బానిసై.. మరో వైపు వ్యాపారంలో నష్టం వచ్చి రూ. కోటి అప్పు చేసి ఉడాయించిన వ్యాపారి ఆచూకీపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కొంత కాలంగా సూర్యాపేట రోడ్డులో చిల్లకాంటా ఏర్పాటు చేసుకుని వివిధ అపరాలు కొనుగోలు చేస్తూ నమ్మకంగా ఉన్న ఓ వ్యాపారి నాలుగు రోజుల క్రితం రాత్రికి రాత్రే పరారైన ఘటన విధితమే. ఈ మేరకు ఆ వ్యాపారి ఎక్కడికి వెళ్లారు..? ఆన్లైన్ రమ్మీ ఆటలో ప్రోత్సహించిందెవరు..? అనే కోణంలో పోలీసులు గ్రెయిన్ మార్కెట్లో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే, అప్పులిచ్చిన వారి వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఆన్లైన్ రమ్మీ గేమ్పై ఆందోళన ఆన్లైన్ రమ్మీ మహమ్మారి అనేక కుటుంబాలను రోడ్డున పడేస్తుందనే ప్రచారం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. సిద్దిపేట రోడ్డుని ప్రధాన కాలనీలతోపాటు శివారు ప్రాంతాల్లో కొంత మంది బూకీలు అడ్డావేసి ఆన్లైన్ రమ్మీ గేమింగ్ను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసు నిఘా పెద్దగా లేకపోవడంతో బూకీలు ఆడింది ఆట.. పాడింది పాటగా మారుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
అదుపు తప్పి కల్వర్టును ఢీకొన్న బొలెరో
లింగాలఘణపురం: బొలెరో వాహనం అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు దుర్మరణం చెందగా ఇద్దరు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన బుధవారం జనగామ – సూర్యాపేట జాతీయ రహదారి 365పై జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం వడిచర్ల సమీపంలో చోటు చేసుకుంది. లింగాలఘణపురం ఎస్సై శ్రావణ్కుమార్ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వడ్లపూడి గ్రామానికి చెందిన దద్దోలు సురేశ్ (35) తన భార్య దివ్య (32), కూతురు మోక్షజ్ఞ, కుమారుడు లోక్షణతో కలిసి స్వగ్రామం నుంచి బొలెరో వాహనంలో తాను పని చేసే కరీంనగర్కు బయలుదేరారు. ఈ క్రమంలో సురేశ్ నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడంతో వాహనం అదుపు తప్పి వడిచర్ల సమీపంలో కల్వర్టును ఢీకొంది. ఈ ఘటనలో దంపతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కూతురు, కుమారులకు స్వల్ప గాయాలు కావడంతో 108లో పోలీసులు జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు కరీంనగర్లోని ఓ గ్రానైట్ కంపెనీలో పని చేస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు చనిపోయినా ఏం జరిగిందో తెలియని స్థితిలో ఉన్న ఆ చిన్నాలను చూసి స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తల్లిదండ్రులు చనిపోయిన విషయం చెప్పలేక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. -
పరీక్షలు.. పది లక్షలు
నెహ్రూసెంటర్: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన టీ డయాగ్నొస్టిక్ సెంటర్ల ద్వారా ఆశించిన మేరకు సేవలు అందుతున్నాయి. జిల్లా ఆస్పత్రికి వచ్చే రోగులతో పాటు పీహెచ్సీలు, ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి తీసుకువచ్చే రక్త నమూనాలను పరీక్షించి ఫలితాలు వెల్లడిస్తున్నారు. 134 రకాల పరీక్షలు చేయడం ద్వారా రోగులు వైద్య సేవలు పొందుతున్నారు. కాగా 2021లో ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్ సెంటర్ ద్వారా ఇప్పటి వరకు 10లక్షలకు పైగానే పరీక్షలు చేసి ఫలితాలను వెల్లడించినట్లు అధికారులు తెలుపుతున్నారు. ప్రతీరోజు 1,500 పైగానే.. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితో పాటు 21 పీహెచ్సీలు, 3 సీహెచ్సీలు, బస్తీదవాఖానల నుంచి రక్త నమూనాలు టీ హబ్కు వస్తుంటాయి. ప్రతీరోజు 1,500పైగా రక్త నమూనాలను పరీక్షించి ఫలితాలు పంపిస్తున్నారు. సీజనల్ వ్యాధులు, జ్వరాలు పెరుగుతుండడంతో పరీక్షలు పెరుగుతున్నాయి. కచ్చితమైన పరీక్షలు నిర్వహిస్తూ ఫలితాలను ఆరు గంటల్లోపే అందజేస్తున్నారు. కాగా, ఫలితాల వెల్లడితో మానుకోట టీ డయాగ్నొస్టిక్ సెంటర్ రాష్ట్రంలో ముందంజలో ఉంది. ప్రత్యేక వాహనాల్లో.. పలు ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి రక్త నమూనాలను జిల్లా కేంద్రంలోని టీ డయాగ్నొస్టిక్ సెంటర్కు తరలిస్తారు. శాంపిళ్లను ప్రత్యేక డబ్బాల్లో భద్రపరిచి వాహనాల్లో తరలిస్తున్నారు. రోగుల ఆధార్, ఫోన్ నంబర్ల ఆధారంగా ఫలితాలను రోగుల మొబైల్కు మెసేజ్ పంపిస్తున్నారు. ప్రభుత్వ సేవల ద్వారా ఒక్కో రోగికి సుమారు రూ.2 నుంచి రూ.3 వేల వరకు డబ్బు ఆదా అవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల్లో అవసరమైన ప్రతీ ఒక్కరికి ఉచితంగా టీ డయాగ్నొస్టిక్ సెంటర్లో పరీక్షలు నిర్వహిస్తున్నాం. జీజీహెచ్తో పాటు పీహెచ్సీ రక్త నమూనాలు కూడా సెంటర్కు వస్తున్నాయి. రక్త నమూనాలను పరీక్షించి కచ్చితమైన ఫలితాలు వెల్లడిస్తాం. ఉచితంగా అందిస్తున్న సేవలను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. – శ్రీనివాసరావు, జీజీహెచ్, సూపరింటెండెంట్ టీ డయాగ్నొస్టిక్ సెంటర్లో రక్త పరీక్షలు అందుబాటులోకి 134 వైద్య పరీక్షలు రోగులకు కచ్చితమైన వ్యాధి నిర్ధారణ పది లక్షల పరీక్షల మార్కు దాటిన డయాగ్నొస్టిక్ సెంటర్ నెల టెస్టులు జూన్ 30,968 జూలై 39,878 ఆగష్టు(20 వరకు) 22,527 -
ముమ్మర తనిఖీలు
సాక్షి, మహబూబాబాద్: ఒక వైపు రైతులు యూరియా బస్తాల కోసం ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరుపుతున్నారు. ఈమేరకు అక్రమ విక్రయాలపై బుధవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘యూరియా పక్కదారి’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ స్పందించారు. జిల్లా వ్యాప్తంగా పీఏసీఎస్లతోపాటు ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి నిబంధనలు పాటించని తొమ్మిది ఫర్టిలైజర్ షాపుల లైసెన్స్లను సస్పెండ్ చేయించారు. జిల్లా వ్యాప్తంగా.. యూరియా పంపిణీలో అక్రమాలను కట్టడి చేసేందుకు బుధవారం కలెక్టర్ అద్వైత్ కుమార్ మహబూబాబాద్, మరిపెడ, కురవి మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులు, గోదాంల్లో నిల్వలు, స్టాక్ రిజిస్టర్ల వివరాలను పరిశీలించారు. మరిపెడ మండలం తానంచర్ల, దంతాలపల్లి మండల కేద్రంలోని ఫర్టిలైజర్ షాపులను అదనపు కలెక్టర్ అనిల్కుమార్, అదే విధంగా మండలాల్లో ఏడీఏ, ఏఓలు, తహసీల్దార్లు, ప్రత్యేకాధికారులు, టాస్క్ఫోర్స్ బృందాలు పర్యటించి ఫర్టిలైజర్ షాపుల్లో స్టాక్ను పరిశీలించారు. యూరియా పంపిణీని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్, అధికారులు మాట్లాడుతూ.. నిబంధనలు పాటించకుండా యూరియా విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూరియా పక్కదారిపై కలెక్టర్ ఆగ్రహం జిల్లా వ్యాప్తంగా ఫర్టిలైజర్ షాపుల తనిఖీ నిబంధనలు పాటించని తొమ్మిది షాపులపై చర్యలు లైసెన్స్ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన అక్రమ నిల్వలపై ప్రత్యేక దృష్టినిబంధనల ప్రకారం ఈ–పాస్లో నమోదు చేయకుండా యూరియా విక్రయాలు, అక్రమ నిల్వలు, రైతుల ఆధార్ నమోదు లేకపోవడం, అధిక రేట్లకు విక్రయాలు జరిపారనే ఆరోపణల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా తొమ్మిది ఫర్టిలైజర్ షాపుల లైసెన్స్లను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి తెలిపారు. నెల్లికుదురు మండలం నర్సింహులగూడెం స్టేజీ వద్ద గల శరత్ ఫర్టిలైజర్స్తోపాటు మహబూబాబాద్లోని సింగారం శ్రీరామలింగేశ్వర ఫర్టిలైజర్స్, డోర్నకల్ మండలంలోని బాలాజీ ఫర్టిలైజర్స్, వీరవెంకట సత్యనారాయణ ఫర్టిలైజర్స్, చిల్కోడులోని మణికంఠ ఫర్టిలైజర్స్, చిన్నగూడూరు మండలంలోని తేత జాశ్వినీ ఫర్టిలైజర్స్, మరిపెడ మండలంలోని వినయ్ ఫర్టిలైజర్స్, కురవి మండలంలోని శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్, రైతు మిత్ర ఫర్టిలైజర్ల లైసెన్స్లు సస్పెండ్ చేసినట్లు డీఏఓ తెలిపారు. -
నారాయణపురం రైతుల ఆందోళన
మహబూబాబాద్: ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారం తమ భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయాలని కేసముద్రం మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన సుమారు 250మంది రైతులు బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్వోబీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై రాస్తారోకో నిర్వహించగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. తర్వాత పోలీసుల అనుమతితో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైన ఆందోళన సాయంత్రం 4.30 గంటల వరకు సాగింది. కలెక్టరేట్లోని ఉద్యోగులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈక్రమంలో రైతులకు పోలీసుల మధ్య వాగ్వాదంతో పాటు స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఆతర్వాత మరో గేటు నుంచి ఉద్యోగులను పంపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. 60ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 1,827 ఎకరాల పట్టా భూములను 2017లో భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా అటవీ భూములుగా పేర్కొంటూ పట్టాలు రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంజాయ్మెంట్ సర్వే చేసి కొన్ని నెలలు గడుస్తున్నా నేటికీ పట్టాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 600 మంది రైతులు ప్రభుత్వ పథకాలను కోల్పోవాల్సి వస్తోందన్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు అందజేయాలని డిమాండ్ చేశారు. కాగా ధర్నా సమయంలో కె.రాంరెడ్డి అనే రైతు కండ్లు తిరిగి పడిపోగా వెంటనే పక్కకు కూర్చోబెట్టి నీళ్లు తాగించారు. సాయంత్రం 4.30 గంటల తర్వాత ధర్నా విరమించి అదనపు కలెక్టర్ అనిల్కుమార్కు వినతిపత్రం అందజేశారు. త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు. రూరల్ సీఐ సర్వయ్య ఆధ్వర్యంలో కేసముద్రం ఎస్సై మురళీధర్తో పాటు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో రైతులు దారావత్ రవి, లక్ష్మిపతి, శ్రీనివాస్, బిచ్యా, లచ్చు, లక్ష్మి, సరోజన, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో ర్యాలీ.. కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ రైతులు.. పోలీసుల మధ్య వాగ్వాదం -
ప్రభుత్వం మొద్దునిద్ర వీడి యూరియా అందించాలి
నెల్లికుదురు: ప్రభుత్వం మొద్దు నిద్రవీడి రైతులకు యూరియా అందించేవిధంగా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో రైతులకు యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. రైతులు యూరియా బస్తాలకోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని, పంటలకాలం దాటిపోతుంటే అధికార యంత్రాంగం ఏం చేస్తోందని ఆమె ప్రశ్నించారు. తక్షణమే ఎమ్మె ల్యే, ఎంపీ, కలెక్టర్ స్పందించి రైతుల పంటల కు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రెడ్డి, నాయకులు, రైతులు, మహిళా రైతులు పాల్గొన్నారు. అధికారుల కాళ్లు పట్టుకున్న రైతు!● యూరియా బస్తాలు ఇవ్వాలని వేడుకోలు తొర్రూరు: రైతులకు యూరియా కష్టాలు తప్ప డం లేదు. రైతులు కాళ్లు పట్టుకుని వేడుకున్నా అధికారులు కనికరించడం లేదు. యూరియా కోసం బుధవారం తొర్రూరులోని పీఏసీఎస్ కార్యాలయం ఎదుట రైతులు బారులుదీరారు. ఒక్కో ఆధార్ కార్డుపై రెండు బస్తాల యూరియా మాత్రమే పంపిణీ చేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా బస్తాల కోసం రైతులు స్థానిక పీఏసీఎస్ కార్యాలయం ఎదుట ఉదయం 5 గంటల నుంచే వేచి ఉన్నారు. యూరియా కొరతతో రెండు ఎకరాలున్న రైతులకు ఒకే బస్తా కేటాయించడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఓ రైతు అధికారి కాళ్లు మొక్కి యూరియా బస్తాలు ఇవ్వాలని వేడుకున్నాడు. తొర్రూరు ఆర్డీఓ గణేష్, డీఎస్పీ కృష్ణకిషోర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఏఓ రాంనర్సయ్యలు పీఏసీఎస్కు చేరుకుని రైతులతో మాట్లాడి సంయమనం పాటించాలని కోరారు. తొర్రూరులో రైతు అధికారుల కాళ్లు పట్టుకుని వేడుకోవడంపై బీఆర్ఎస్ రాష్ట్ర నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్రావు స్పందించారు. ‘కాంగ్రెస్ పాలనలో మళ్లీ పాత రోజులు వచ్చాయని, రైతులు యూరియా కోసం అధికారుల కాళ్లు మొక్కే దుస్థితి దాపురించింది. ఇది అత్యంత బాధాకరం’ అని హరీష్రావు ‘ఎక్స్’లో అన్నారు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలిగార్ల: మండలంలోని సీహెచ్సీకి వచ్చే రోగులకు వైద్యసిబ్బంది మెరుగైన వైద్యసేవలు అందించాలని డీసీహెచ్ఎస్ రమేష్ సూచించారు. బుధవారం సీహెచ్సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత ఆస్పత్రి లోని వైద్యులు, వైద్య సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరి శీలి ంచారు. ఆస్పత్రిలోని వార్డులను సందర్శించి వైద్యసేవలు ఎలా అందుతున్నాయని రోగుల ను అడిగి తెలుసుకున్నారు. రోగులకు నాణ్య మైన వైద్యసేవలు అందించాలన్నారు. సిబ్బంది విధుల్లో అంకితభావంతో పనిచేస్తూ, సమయపాలన పాటించాలన్నారు. సూపరింటెండెంట్ శ్రీధర్గౌడ్, డాక్టర్లు బాలునాయక్, రాజ్కుమార్ జాదవ్, హనుమంతరావు ఉన్నారు. -
ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
● కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్మహబూబాబాద్ రూరల్/కురవి/మరిపెడ రూరల్: డీలర్లు ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ హెచ్చరించారు. మహబూబాబాద్ పట్టణం, కురవి, మరిపెడ మండలాల్లోని ఫర్టిలైజర్ షాపులు, గోడౌన్లలో ఎరువుల నిల్వలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాకు నమోదును అధికారులతో కలిసి పరిశీలించి రైతులతో మాట్లాడారు. యూరియాను కొనుగోలు చేసేటప్పుడు రైతులు భూమి వివరాలు, ఆధార్ కార్డును పరిశీలించి ఇవ్వాల్సిందిగా వ్యాపారస్తులకు సూచించారు. ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేయాలన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం నుంచి జిల్లాకు కావాల్సిన మేరకు యూరియాను తెప్పిస్తామన్నారు. యూరియా బస్తాల పంపిణీపై రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు, పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయనిర్మల, ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శాఖల వారీగా నిధుల కేటాయింపు వివరాలు (రూ.కోట్లలో)
జిల్లా పంచాయతీరాజ్ కార్యాలయం 11.62ఇరిగేషన్, సీఏడీడీ 5.90రోడ్లు, భవనాలు 9.95ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ 8.57తాగునీరు, శానిటేషన్ ఆర్డబ్ల్యూఎస్ 15.15పంచాయతీరాజ్ 51.30అగ్నిమాపక 0.30పశుసంవర్థకం 0.30ఐఅండ్పీఆర్ 0.57గిరిజన సంక్షేమం(ఐటీడీఏ) 2.50టీజీ ఆర్టీసీ 5 టూరిజం 0.90 ఎన్పీడీసీఎల్ 5వైద్య ఆరోగ్య 1.07పోలీస్ 14.50అటవీ 0.50సీ్త్ర శిశు సంక్షేమ 0.25రెవెన్యూ శాఖ 14.38ఎండోమెంట్ 1.75మత్స్య 0.23ఎకై ్సజ్, ప్రొహిబిషన్ 0.25 -
వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలి
కేసముద్రం: వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. బుధవారం కేసముద్రం, ఇనుగుర్తి మండలాల్లోని కోరుకొండపల్లి, ధన్నసరి గ్రామాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం వ్యాప్తి చెందే సీజనల్ వ్యాధులపై ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. అవసరమైతే గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా పర్యవేక్షించాలన్నారు. అనంతరం రికార్డులను ఆయన పరిశీలించారు. ప్రోగ్రాం అధికారి సారంగం, సుధీ ర్రెడ్డి, మెడికల్ ఆఫీసర్ నంబీకిషోర్, ప్రసాద్ ఉన్నారు. డీఎంహెచ్ఓ రవిరాథోడ్ -
‘మేడారం–2026’ నిర్వహణకు రూ.150 కోట్లు
సాక్షిప్రతినిధి, వరంగల్/ఏటూరునాగారం: వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ కుంభమేళా, సమ్మక్క–సారలమ్మ మేడారం మహాజాతరకు భారీగా నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరకు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.150 కోట్లు మంజూరు చేస్తూ శాఖలవారీగా బడ్జెట్ను కేటాయించింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు రాష్ట్ర సీ్త్ర శిశుసంక్షేమ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్శాఖ మంత్రి ధనసరి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.ఆసియాఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది. ఈ జాతర తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. అందుకే మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరకు తరలివచ్చే భక్తుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసేందుకు నిధులు మంజూరు చేసింది. 2026 జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజులపాటు మహాజాతర నిర్వహించనున్నారు. ఇప్పటికే సమ్మక్క–సారలమ్మ పూజారులు జాతర తేదీలను ప్రకటించారు. తొలిరోజు జనవరి 28న సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు గద్దైపెకి చేరుకుంటారు. రెండో రోజు 29న సాయంత్రం 6 గంటలకు చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దె మీదకు తీసుకొస్తారు. మూడో రోజు జనవరి 30న సమ్మక్క సారలమ్మను భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. జనవరి 31న సాయంత్రం 6 గంటలకు సమ్మక్క, సారలమ్మ దేవతలు, గోవిందరాజు, పగిడిద్దరాజుల వనప్రవేశంతో జాతర ముగియనుంది.ఇతర రాష్ట్రాలనుంచి భక్తుల రాకమేడారం జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ క్రమంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.గత ఏడాది రూ.110 కోట్లుగత ఏడాది 2024 మహాజాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.110కోట్లు మంజూరు చేసి మేడారంలో పలు అభివృద్ధి పనులు చేసింది. భక్తుల సౌకర్యాలను మరింత పెంచేందుకు ఈసారి అదనంగా రూ.40 కోట్లు పెంచి రూ.150కోట్లు చేయడం గమనార్హం. 2022లో అప్పటి ప్రభుత్వం రూ.75 కోట్లను మేడారం జాతర నిర్వహణకు మంజూరు చేసింది. -
పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా చర్యలు
మహబూబాబాద్: పారిశుద్ధ్య సమస్య పరిష్కరిస్తామని మానుకోట మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్ అన్నా రు. మున్సిపాలిటీ పరిధిలో నామమాత్రంగా జరుగుతున్న పారిశుద్ధ్య పనులు, రోడ్లపై చెత్తాచెదారం, కాల్వలు శుభ్రం చేయకపోవడం తదితర విషయాలపై బుధవారం సాక్షి దినపత్రికలో ‘పడకేసిన పారిశుద్ధ్యం’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై కమిషనర్ స్పందించారు. ఈమేరకు పట్టణంలో పారిశుద్ధ్య సమస్య లేకుండా చూడాలని, ప్రధానంగా రోడ్లపై చెత్తాచెదారం తొలగించాలని, కాల్వలు శుభ్రం చేయాలని ఆదేశించారు. దీంతో కంకరబో డ్, రెడ్డి బజార్తో పాటు పలు కాలనీల్లో రోడ్లపై ఉన్న చెత్తాచెదారం తొలగించారు. ఏ క్యాబిన్ రోడ్డులో కాల్వలను సిబ్బంది శుభ్రం చేశారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజలు కూడా రోడ్లపై చెత్తాచెదారం వేయవద్దని, సిబ్బందికి సహకరించాలన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ కరుణాకర్, సిబ్బంది పాల్గొన్నారు. కమిషనర్ రాజేశ్వర్ -
అవే క్యూలు.. అవే కష్టాలు
సాక్షి, మహబూబాబాద్/సిద్దిపేట/తిప్పర్తి: పలు జిల్లాల్లో యూరియా కోసం రైతులు ఇంకా తిప్పలు పడుతూనే ఉన్నారు. మహబూబా బాద్లోని పీఏసీఎస్ వద్ద బుధవారం రైతులు క్యూలైన్లో నిలబడి నిరీక్షించారు. మహబూబాబాద్ మండలం సింగారంలో ఓ దుకాణ యజమాని రైతులకు నేరుగా విక్రయించినట్టు తేలడంతో అతడి లైసెన్స్ సస్పెండ్ చేశారు. చిన్నగూడూరు మండలం విస్సంపల్లిలోనూ ఓ మందుల దుకాణంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన అధికారులు ఆ షాప్ లైసెన్స్ను సస్పెండ్ చేశారు.నెల్లికుదురు సొసైటీ కార్యాలయం వద్ద రైతులు కుటుంబ సమేతంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి వర్షంలోనూ లైన్లో చెప్పులు పెట్టి ఎదురుచూశారు. తొర్రూరులోని పీఏసీఎస్ ఎదుట రైతులు బారులు తీరారు.ఈ క్రమంలో ఓ రైతు అధికారి కాళ్లు మొక్కి యూరియా బస్తాలు ఇవ్వాలని వేడుకున్నాడు.ఈ ఘటనపై మాజీమంత్రి హరీశ్రావు స్పందించారు.‘కాంగ్రెస్ పాలనలో మళ్లీ పాతరోజులు వచ్చాయని, రైతులు యూరియా కోసం అధికారుల కాళ్లు మొక్కే దుస్థితి దాపురించింది’అని ఎక్స్లో పోస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు పీఏసీఎస్ వద్ద కూడా రైతులు బారులుతీరారు. నల్లగొండ జిల్లా తిప్పర్తిలోని పీఏసీఎస్లోనూ రైతులు క్యూలో నిల్చున్నారు. వెనుక ఉన్నవారికి యూరియా దొరకక నిరుత్సాహంతో వెనుదిరిగారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటలో యారియా అందించాలని మహిళా రైతులు అధికారుల కాళ్లు మొక్కారు. -
కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
డోర్నకల్: జిల్లాలో యూరియా కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ హెచ్చరించారు. మంగళవారం డోర్నకల్లో పర్యటించిన ఆయన జెడ్పీహెచ్ఎస్, రెండు ఫర్టిలైజర్ దుకాణాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తనిఖీ నిర్వహించారు. జెడ్పీహెచ్ఎస్లో కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలని, పాఠశాల పరిసరాలు, కిచెన్షెడ్, మరుగుదొడ్లను శుభ్రంగా ఉచాలని ఆదేశించారు. ఏఐ, డిజిటల్ క్లాసుల ద్వారా విద్యార్థులకు నూతన టెక్నాలజీ గురించి వివరించాలని సూచించారు. ఆన్లైన్ ద్వారా రైతుల వివరాలు నమోదు చేస్తూ యూరియాను విక్రయించాలని, కృత్రిమ కొరత సృష్టించేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణాల్లో ఆన్లైన్ ఓపీ ఎంఎస్, ఫిజికల్ గోడౌన్ నిల్వలు, స్టాక్ వివరాలు కచ్చితంగా ఉండాలని ఆదేశించారు. నానో యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పీహెచ్సీలో ప్రసవాల సంఖ్య పెంచాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఏఓ విజయనిర్మల, మండల ప్రతేక అధికారి నర్సింహమూర్తి, తహసీల్దార్ ఇమ్మానీయల్, మున్సిపల్ కమిషనర్ నిరంజన్, ఎంపీడీఓ శ్రీనివాసనాయక్, ఏఓ మురళీమోహన్, సీఐ బి.రాజేష్, వైద్యాధికారి మేఘన తదితరులు పాల్గొన్నారు. -
వానలోనూ రైతుల క్యూ..
మహబూబాబాద్ రూరల్/గూడూరు/ కేసముద్రం/నర్సింహులపేట: రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. కొద్ది రోజుల నుంచి యూరియా కొరత నెలకొనడం.. పంటల సాగు ముమ్మరం కావడంతో రైతులు యూరియా కోసం ఎగబడుతున్నారు. అయితే సొసైటీలకు సరిపడా యూరియా రాకపోవడంతో చాలామంది రైతులు నిరాశతో వెనుదిరిగి వెళ్తున్నారు. మరికొంతమంది రైతులు ఆందోళన చేస్తున్నారు. మంగళవారం జిల్లావ్యాప్తంగా యూరియాకోసం రైతులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా క్యూలో నిల్చున్నారు. కాగా పోలీసు బందోబస్తు మధ్య టోకెన్లు తీసుకున్న రైతులకు అధికారులు యూరియా బస్తాలు అందజేశారు. ఎక్కడెక్కడ అంటే.. ● మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పీఏసీఎస్ ఎదుట రైతులు యూరియా కోసం బారులుదీరారు. గంటల తరబడి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గొడుగులు పట్టుకొని లైన్లో నిల్చున్నారు. కాగా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో పీఏసీఎస్ వద్దకు వచ్చి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు దీపిక, శివ, అశోక్, తిరుపతి, రవికిరణ్, మౌనిక, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. తహసీల్దార్ చంద్రరాజేశ్వర్ రావు, ఏఓ తిరుపతిరెడ్డి, ఏఈఓలు సాయిప్రకాశ్, రంజిత్, బాలాజీ, సొసైటీ సీఈఓ ప్రమోద్ సుమారు 1,500 మంది రైతులకు టోకెన్లు ఇచ్చి 888 మంది రైతులకు యూరియా బస్తాలు అందజేశారు. ● గూడూరు మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంలో ఉదయం నుంచే రెండువేల మంది రైతులు వర్షంలో గొడుగులు పట్టుకొని యారియా బస్తాల కోసం క్యూలో నిల్చున్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పీఏసీఎస్ను ఆకస్మికంగా తనిఖీ చేసి.. యూరియా బస్తాల పంపిణీపై ఆరా తీశారు. ప్రస్తుతం ఎన్ని బస్తాలు వచ్చాయని పీఏసీఎస్ చైర్మన్ చల్ల లింగారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. రైతులకు సరిపడా యూరియా అందజేయాలని.. కృత్రిమ కొరత సృష్టించొద్దని సూచించారు. యూరియాను వ్యవసాయేతర అవసరాలకు వినియోగించే వారిపై చర్యలు ఉంటాయని ఎస్పీ అన్నారు. యూరియా వచ్చేలా ప్రభుత్వం, అధికార యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్ నాగభవాని, డీసీఓ ఎన్వీ రావు, మండల వ్యవసాయ అధికారి ఎండి.అబ్దుల్మాలిక్ పాల్గొన్నారు. ● కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని కేసముద్రంవిలేజ్ పీఏసీఎస్, కల్వల, పెనుగొండ, ఉప్పరపల్లిలో యారియా బస్తాల కోసం రైతులు బా రులుదీరారు. యూరియా బస్తాలు వచ్చాయనే సమాచారంతో రైతులు, మహిళా రైతులు కొందరు చిన్నపిల్లలతో సెంటర్ల వద్దకు తెల్లవారుజామునే చేరుకున్నారు. అధిక సంఖ్యలో రైతులు రాగా, కొందరికే టోకెన్లు అందడంతో మిగిలిన రైతులు నిరాశతో వెనుదిరిగారు. ఆయా సెంటర్ల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కాగా అదనపు కలెక్టర్ అనిల్కుమార్ కల్వల, ఉప్పరపల్లి, కేసముద్రం పీఏసీఎస్ సెంటర్లను సందర్శించారు. యూరియా అందని రైతులు అధైర్యపడొద్దని, అందరికి సరిపడా యూరియా అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఏడీఏ అజ్మీ రా శ్రీనివాసరావు, రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై మురళీధర్రాజు, కరుణాకర్, ఏఓ వెంకన్న, డీటీ ఎర్రయ్య పాల్గొన్నారు. ● నర్సింహులపేట మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయానికి ఉదయం వందలాది మంది రైతులు యారియా కోసం వచ్చారు. అయితే యూరియా లేకపోవడంతో అంబేడ్కర్ సెంటర్లో మహబూబాబాద్కు వెళ్లే రోడ్డుపై సీపీఎం, సీసీఐ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేశారు. ఈక్రమంలో ఏఓ వినయ్కుమార్ వచ్చి పలు ఫర్టిలైజర్ షాపుల్లో ఉన్న యూరియాను రైతులకు తూతూ మంత్రంగా పంపిణీ చేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా యూరియా కోసం పాట్లు పీఏసీఎస్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు -
విలీన గ్రామాల్లో సమస్యల తిష్ట..
మహబూబాబాద్ అర్బన్: మానుకోట మున్సిపాలిటీలో ఈదులపూసపల్లి, జమాండ్లపల్లి, ముత్యాలమ్మగూడెం, గాంధీపురం, అనంతారం, బేతోలు, రజాలీపేట, శనిగపురం గ్రామాలతో పాటు తండాలు విలీనమయ్యాయి. ఆయా కాలనీల్లో వీధి కుక్కలు, కోతులు స్వైరవిహారం చేస్తున్నాయి. సరైన సైడ్ డ్రెయినేజీలు లేక మురుగునీరు, దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆయా కాలనీల్లో ఎక్కడ చూసినా చెత్తా చెదారం పేరుకుపోయి అపరిశుభ్రంగా మారాయి. కాలనీ శివారులోని కుంటల్లో నీరు నిల్వ ఉండి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో దోమలు, ఈగలకు ఆవాసాలుగా మారాయి. ఇప్పటికై నా జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి విలీన గ్రామాలు, పలు కాలనీల్లో సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. -
పడకేసిన పారిశుద్ధ ్యం
మహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు నామమాత్రంగా జరుగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రోడ్లపై చెత్తాచెదారం తొలగించడం లేదు. దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారి పందులు స్వైర విహారం చేస్తున్నాయి. కాల్వలు శుభ్రం చేయకపోవడంతో మురుగు నీరు నిల్వ ఉండి దోమలు విపరీతంగా పెరిగి రోగాల బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాటిన లక్ష జనాభా.. మానుకోట మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులు ఉండగా.. 68,889 మంది జనాభా, 57,828 మంది ఓటర్లు ఉన్నారు. విద్యా, ఉద్యోగం, వ్యాపారం రీత్యా మానుకోటలో నివాసం ఉండే వారితో కలిపి లక్ష జనాభా దాటుతుంది. 25,000 పైగా గృహాలు ఉన్నాయి. అవుట్ సోర్సింగ్లో 205 మంది పని చేస్తుండగా.. వారిలో 143 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. ట్రాక్టర్లు 11, మూడు చక్రాల ఆటోలు 14, నాలుగు చక్రాల ఆటోలు 19ఉండగా.. ప్రతీరోజు 33 టన్నుల చెత్త సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సిగ్నల్కాలనీ శివారులో ఒక చెత్త డంపింగ్ యార్డు, గాంధీపురం గ్రామ శివారులో మరో డంపింగ్ యార్డు ఉన్నాయి. పర్యవేక్షణ కోసం శానిటరీ ఇన్స్పెక్టర్లు.. మానుకోట మున్సిపాలిటీలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో కూడా ఆకస్మికంగా పారిశుద్ధ్య పనులను తనిఖీ చేస్తున్నారు. పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా పాత బజార్కు ఒకరు, కొత్తబజార్కు ఒకరు శా నిటరీ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. వారితో పాటు జవాన్లు, ఇన్చార్జ్లను నియామకం చేశారు. అయినా పర్యవేక్షణ మాత్రం సక్రమంగా లేదు. కమిషనర్ పనుల ను ఏమాత్రం పర్యవేక్షించడం లేదు. దీంతో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. ప్రధాన రహదారుల్లో మాత్రమే ప్రతీరోజు పనులు చేస్తున్నారు. శివారు కాలనీల్లో మాత్రం నామమాత్రంగా పనులు చేస్తున్నారు. ప్రతీరోజు వార్డుల్లో వాహనాలు రావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. చెత్తాచెదారం.. రోడ్లపై చెత్తాచెదారం రోజుల తరబడి ఉండిపోతుంది. పలు ప్రాంతాల్లో 15 రోజులు దాటినా చెత్తాచెదారం తొలగించడం లేదు. దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారి పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. వాటితో పాటు దోమల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. కాగా కాల్వలను నెలకు ఒకసారి కూడా శుభ్రం చేయడం లేదు. హోటళ్ల సంఖ్య పెరగడంతో.. జిల్లా కేంద్రంలో ఫంక్షన్ హాల్స్ పాటు హోటళ్ల సంఖ్య పెరిగింది. వాటినుంచి చెత్తాచెదారం ఎక్కువగా వస్తోంది. ట్రాక్టర్ వాటి వద్దకు వెళ్లగానే వెంటనే నిండుతుంది. దీంతో ఇళ్ల నుంచి చెత్త సేకరించడం లేదు. కాగా హోటళ్లకు కమర్షియల్ పన్ను కేటాయించి ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేయవచ్చని సిబ్బంది చెబుతున్నారు. కమిషనర్ ప్రత్యేక దృష్టి పెట్టి ఆ సమస్య పరిష్కరించవచ్చు. అలాగే సరిపడా సిబ్బంది, వాహనాలు లేకపోవడం కూడా సమస్యగా మారింది. సీజనల్ వ్యాధులు.. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. దీంతో రోగులు ఆస్పత్రుల బాట పడుతున్నారు. కాగా మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, దోమల సంఖ్య తగ్గించేందుకు ఫాగింగ్తో పాటు ఆయిల్ బాల్స్ వేయాలని స్థానికులు కోరుతున్నారు.మానుకోటలో రోడ్లపై చెత్తాచెదారం అపరిశుభ్రంగా సైడ్ డ్రెయినేజీలు పందుల స్వైరవిహారం, దోమల బెడద రోగాల బారిన ప్రజలు -
పచ్చడి మెతుకులు.. నీళ్లచారు..
మహబూబాబాద్ అర్బన్: సంక్షేమ హాస్టళ్లలో మెనూ పాటించడం లేదు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో హాస్టళ్ల సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరి స్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ఎస్సీ సంక్షేమ బాలుర హాస్టల్లో మంగళవారం ఉదయం టిఫిన్కు బదులు పచ్చడితో అన్నం వడ్డించారు. అదేవిధంగా పోస్ట్మెట్రిక్ కళాశాల హా స్టల్లో కూడా విద్యార్థులకు టిఫిన్కు బదులు నీళ్లచారుతో అన్నం అందించారు. దీనిపై వార్డెన్లను వి వరణ కోరగా విద్యార్థులే అన్నం పెట్టాలని, టిఫిన్లు వద్దని అంటున్నారని వారు తెలిపారు. కాగా, టిఫిన్లు రుచిగా లేకపోవడంతోనే అన్నం పెట్టమని అడుగుతున్నామని విద్యార్థులు తెలిపారు. -
వీరభద్రస్వామి హుండీ ఆదాయం రూ.63.77లక్షలు
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి హుండీల ఆదాయం రూ.63,77,826 వచ్చినట్లు ఆలయ ఈఓ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం వీరభద్రస్వామి ఆలయంలోని హుండీల్లో 2025 మార్చి 25నుంచి 2025 ఆగస్టు 18వ తేదీ వరకు భక్తులు సమర్పించుకున్న కానుకలను పర్యవేక్షణాధికారి సంజీవరెడ్డి, ఆలయ చైర్మన్ కొర్ను రవీందర్రెడ్డి సమక్షంలో లెక్కించారు. వీరభద్రస్వామి హుండీ ద్వారా రూ.48,48,078, భద్రకాళి హుండీ ద్వారా రూ.15,29,748 వచ్చినట్లు తెలిపారు. 78 అమెరికా డాలర్స్, 100 సౌతాఫ్రికా ర్యాండ్లు, 10 ఇంగ్లండ్ పౌండ్లు వచ్చినట్లు వివరించారు. మహబూబాబాద్కు చెందిన శ్రీ లక్ష్మీ శ్రీనివాస సేవాట్రస్ట్, మణుగూరుకు చెందిన శ్రీదుర్గ శివసాయి సేవా ట్రస్ట్, శ్రీవారి ట్రస్ట్ భక్త మండలి సభ్యులు లెక్కింపు చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు బాలగాని శ్రీనివాస్, చిన్నం గణేష్, శక్రునాయక్, ఉప్పలయ్య, జనార్దన్రెడ్డి, సోమ్లా నాయక్, వెంపటి శ్రీను పాల్గొన్నారు. రైల్వే సహాయమంత్రిని కలిసిన ఎంపీడోర్నకల్/గార్ల: ఢిల్లీలో రైల్వేశాఖ సహాయ మంత్రి రవినీత్సింగ్ను మహబూబాబాద్ ఎంపీ పొరిక బలరాంనాయక్ మంగళవారం కలిశారు. డీఆర్యూసీసీ సభ్యుడు బర్పుల లచ్చిరాంనాయక్తో కలిసి వెళ్లి డోర్నకల్, గార్ల రైల్వే స్టేషన్లలో నెలకొన్న సమస్యలు, కల్పించాల్సిన వసతుల గురించి చర్చించారు. రెండు స్టేషన్లలో పలు రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. సమస్యల పరిష్కారంపై సహాయమంత్రి సానుకూలంగా స్పందించారని డీఆర్యూసీసీ సభ్యుడు లచ్చిరాంనాయక్ తెలిపారు. వైద్య సేవలపై నిర్లక్ష్యం తగదుగూడూరు: పల్లె దవాఖానాల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి సేవలందించాలని డీఎంహెచ్ఓ రవి రాథోడ్ అన్నారు. మండలంలోని భూపతిపేట ఆయుష్మాన్ ఆరో గ్య మందిరాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఔషధాల నిల్వ రిజిస్టర్, సిబ్బంది రోజువారి రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలకు వైద్య సేవలపై పలు సూచనలు చేశారు. వర్షాకాలం సందర్భంగా సీజనల్ జ్వరాలు వస్తున్నాయని, మందులు అందుబాటులో ఉంచుకోవాలని, ఎప్పటికప్పుడు నిల్వ ఉండేలా జాగ్రత్త పడాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉప మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలినెహ్రూసెంటర్: విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను తొలగించాలని, వినాయక చవితి సందర్భంగా విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ డీఈ పి.విజయ్ అన్నారు. విద్యుత్శాఖ సీఎండీ వీడియో కాన్ఫరెన్స్లో మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ.. ఎత్తైన విగ్రహాలు ఉన్నందున ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్లను సరి చేసుకోవాలన్నారు. కేబుల్ వైర్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ఆపరేటర్లు కేబుల్ వైర్ల రీ అలైన్మెంట్ చేసుకోవాలని సూచించారు. వినాయక విగ్ర హాల నిమజ్జన రూట్లు, మండపాలు పరిశీలించి విద్యుత్ సమస్యలు ఉంటే విద్యుత్ అధికారులు పరిష్కరించాలన్నారు. విద్యుత్శాఖ సీఎండీ ఆదేశానుసారం గణేశ్ విగ్రహాల తయారీ కేంద్రాలను పరిశీలించామని డీఈ తెలిపారు. కార్యక్రమంలో డీఈటీ హీరాలాల్ ఉన్నారు. రైల్వేగేట్ మూసివేతమహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ పట్టణంలోని ఏ క్యాబిన్ రైల్వేగేట్ను ట్రాక్ మరమ్మతుల నిమిత్తం మూసివేస్తున్నామని అధికారులు మంగళవారం తెలిపారు. ఈనెల 21వ తేదీ ఉదయం 6 గంటల వరకు మూడో లైన్ నిర్మాణ పనులు జరుగుతాయన్నారు. రైల్వే గేట్ వైపునకు వచ్చే పాత, కొత్త బజార్ల రహదారి మార్గాలు కూడా బంద్ ఉంటాయన్నారు. ప్రజలు, వాహనదారులు రైల్వే అధికా రులకు సహకరించాలని కోరారు. -
యూరియా పక్కదారి!
సాక్షి, మహబూబాబాద్/ నెల్లికుదురు: ఒక వైపు యూరియా బస్తాల కోసం రైతులు కుస్తీ పడుతుంటే.. మరోవైపు రాత్రికిరాత్రే లారీలోడు యూరియా అధిక ధరలకు అమ్మకాలు జరిపారు. ఈ తతంగమంతా తమకేమీ తెలిదన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు వ్యవహరించడం.. కంటితుడుపు చర్యలతో సరిపెట్టే ప్రయత్నం చేస్తున్న సంఘటన నెల్లికుదురు మండలంలో జరిగింది. ఈ–పాస్లో నమోదు చేయకుండా.. రైతులకు కావాల్సిన యూరియా వివరాలను మండల వ్యవసాయశాఖ అధికారి నుంచి ఏడీఏ, డీఏఓలు ధ్రువీకరించిన తర్వాత.. ప్రభుత్వానికి ఇండెంట్ పంపుతారు. వచ్చిన మొత్తం యూరియాలో 60శాతం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్, ఆగ్రోస్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా విక్రయిస్తారు. మిగిలిన 40శాతం ప్రైవేట్ వ్యాపారుల ద్వా రా అమ్మకాలు జరుపుతారు. అయితే వచ్చిన స్టాక్ వివరాలను ముందుగా ఈ–పాస్ పోర్టల్లో నమోదు చేయాలి. తర్వాత రైతు వారీగా ఆధార్, పట్టాదారు పాస్పుస్తకం చూసి వేలి ముద్రలు లేదా ఫోన్లో ఓటీపీ ద్వారా రైతును నిర్ధారించి అమ్మకాలు చేయాలి. అయితే అదేమీ లేకుండా నెల్లికుదురు మండలం నర్సింహులగూడెం గ్రామంలోని శరత్ ఫర్టిలైజర్ షాప్ యజమాని సోమవారం రాత్రి వచ్చిన 333 బస్తాల యూరియా లోడును గుట్టుచప్పుడు కాకుండా బస్తా రూ.350 చొప్పున అమ్మకాలు చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. అధికారుల ఆదేశాలు బేఖాతర్ యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్న విషయంపై కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సీరియస్గా తీసుకొని ప్రతీరోజు ఉదయం, సాయంత్రం అధికారులతో సమీక్షలు నిర్వహించారు. మండల ప్రత్యేకాధికారి, తహసీల్దార్, వ్యవసాయశాఖ అధికారి పర్యవేక్షణతో యూరియా అమ్మకాలు చేపట్టాలని ఆదేశించారు. రైతుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని ఎస్పీ, ఇతర పోలీసు అధికారులు పర్యవేక్షణ చేసి యూరియా అమ్ముతున్నారు. అయితే నెల్లికుదురు మండలంలో సోమవారం చోటుచేసుకున్న సంఘటన జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలను బుట్టదాఖలు చేసినట్లు స్పష్టం అవుతోంది. ఈ వ్యవహారంలో వ్యవసాయశాఖ అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. సోమవారం రాత్రి యూరియా లారీ వచ్చి తెల్లవారేసరికి విక్రయాలు జరిగినా.. ఈ విషయం రైతులు ఫిర్యాదు చేసినా అధికారులు ఆలస్యంగా స్పందించిన తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా యూరియా అమ్మకాలు చేసిన ఫర్టిలైజర్ షాపు యజమానితో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్య తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా యూ రియా అమ్మకాలు చేసి న నర్సింహులగూడెం గ్రామ ఫర్టిలైజర్ షాపు యజమానిపై చర్యలు తీసుకుంటున్నాం. ముందుగా షాపు లైసెన్స్ సస్పెండ్ చేశాం. నిబంధనల ప్రకారం యూరియా విక్రయాలు జరపకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. –అజ్మీరా శ్రీనివాసరావు, ఏడీఏ, మహబూబాబాద్గుట్టుచప్పుడు కాకుండా రాత్రికిరాత్రే అమ్మకాలు ఈ–పాస్ పోర్టల్లో నమోదు చేయకుండా విక్రయాలు రైతుల వివరాలు లేవు.. అమ్మకాల జాబితా లేదు నెల్లికుదురు మండలంలో సంఘటన వ్యవసాయశాఖ అధికారుల పాత్రపై అనుమానాలు -
కాళేశ్వరంలో వరద ఉధృతి
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులకు వరద ఉధృతి పెరుగుతోంది. మంగళవారం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 10.680మీటర్ల ఎత్తులో నీటిమట్టం పెరిగి దిగువకు తరలిపోతుంది. ఎగువన కడెం, ఎల్లంపల్లినుంచి గోదావరి మీదుగా అన్నారం బ్యారేజీ వద్ద ఇన్ఫ్లో 1.21లక్షల క్యూసెక్కులను 66 గేట్లు ఎత్తి దిగువకు కాళేశ్వరం వైపుకు తరలిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో 6.65లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఎగువ గోదావరి, ప్రాణహిత నదుల గుండా తరలి వస్తుంది. దీంతో బ్యారేజీలోని మొత్తం 85గేట్లు ఎత్తి నీటిని దిగువకు ఔట్ఫ్లో రూపంలో తరలిస్తున్నారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య కాటారం: పంట సాగు కోసం అప్పు తెచ్చి పెట్టుబడి పెడితే వర్షాలకు పంట సరిగా లేదని పెట్టుబడి తిరిగి చేతికి రాదనే మనోవేదనతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకుషాపూర్లో చోటు చేసుకుంది. బాధిత కు టుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం.. బొల్లి బాపు(38), దేవక్క దంపతులు తమ ఎకరం భూమిలో వ్యవసాయం, ఇతరులకు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఏడాది బాపు తన ఎకరం భూమిలో పత్తి పంట సాగు చేసి రూ.70 వేలు పెట్టుబడి కోసం అప్పు చేశాడు. వర్షా ల కారణంగా పత్తి పంట దెబ్బతిన్నది. దీంతో పెట్టుబడి చేతికి రాలేని పరిస్థితి ఉందని బాపు తీవ్ర మనో వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో బాపు వ్యవసా య పనుల నిమిత్తం రూ.1.20 లక్షలు పెట్టి ఎద్దుల ను కొనుగోలు చేయగా రూ.40 వేలు చెల్లించి మిగి తా రూ.80 వేలకు సదరు యజమానిని సమయం కోరాడు. సోమవారం ఎద్దులు విక్రయించిన వ్యక్తి తనకు డబ్బులు అత్యవసరమని ఇంటికి రాగా పది రోజులకు ఇస్తానని చెప్పి పంపించాడు. ఈనేపథ్యంలో పెట్టుబడి కోసం తెచ్చిన అప్పు రూ.70 వేలు, ఎద్దుల బాకీ రూ.80 వేలు చెల్లించే దారిలేకపోవడంతో తీవ్రమనోవేదనతో సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య దేవక్క గమనించి కేకలు వేయగా చుట్టు పక్కల వారు వచ్చి బాపును చికిత్స నిమిత్తం భూపాలపల్లిలోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాపు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్యతోపాటు పిల్లలు గ్రీష్మా, రిషివర్ధన్, అఖిల్ ఉన్నారు. దేవక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఒంటరి జీవితం గడపలేక..గార్ల: 10 ఏళ్ల క్రితం తండ్రి, 2 ఏళ్ల క్రితం తల్లి మృతి చెందడంతో మనోవేదనకు గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మానుకోట జిల్లా గార్ల మండలంలోని పినిరెడ్డిగూడెం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పినిరెడ్డిగూడేనికి చెందిన గుగులోత్ మేఘన (17) హైదరాబాద్లో హాస్టల్లో ఉంటూ ఇంటర్ చదువుతుంది. రాఖీ పండుగ సందర్భంగా ఇంటికి వచ్చిన యువతి అమ్మనాన్న చనిపోవడంతో మానసికంగా కృంగిపోయింది. అన్నతోపాటు, బాబాయి కుమారులకు రాఖీ కట్టిన అనంతరం ఇంటికి చేరిన ఆమె తన ఆలనాపాలనా చూసుకునే తల్లిదండ్రులు లేరని బాధపడుతూ బాత్రూమ్ క్లీనర్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన బంధువులు బైక్పై గార్ల సీహెచ్సీకి తీసుకొచ్చి ప్రథమచికిత్స అనంతరం ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి సైలెన్తోనే బైక్పై తీసుకెళ్తుండగా మార్గమధ్యలో వచ్చిన 108 అంబులెన్స్లో తరలించారు. వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతిచెందింది. మేఘన సోదరుడు వెంకటేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రియాజ్పాషా వెల్లడించారు.● యువతి ఆత్మహత్యాయత్నం ● చికిత్స పొందుతూ మృతి -
విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలి
ములుగు రూరల్: వినియోగదారులకు విద్యుత్ అంతరాయం కలుకుండా చూడాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం ములుగు డివిజన్ విద్యుత్శాఖ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి సేవలు అందించాలని అన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ అధికారులు పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు. ఇంటర్లింక్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కన్నాయిగూడెం వరకు ఇంటర్లింక్ పనులను విస్తరింపచేయాలని అన్నారు. నూతనంగా నిర్మిస్తున్న 33/11కేవీ సబ్స్టేషన్ల పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. విద్యుత్ ఉద్యోగులు మొరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. టీజీఎన్పీడీసీఎల్ టోల్ ఫ్రీ నంబర్కు 1912కు సమస్యలు తెలియజేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్ఈ మల్చూర్నాయక్, డీఈ నాగేశ్వర్రావు, డీఈ సదానందం, ఏడీఈ సందీప్, తదితరులు పాల్గొన్నారు. -
నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి
జనగామ: జనగామ జిల్లాలో నీటి సంరక్షణ పెంచే దిశగా చేపట్టిన ఇంకుడు గుంతల నిర్మాణం సత్ఫలితాలు ఇచ్చిందని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. జలశక్తి అభియాన్లో భాగంగా రాజస్థా న్, తెలంగాణ రాష్ట్రంనుంచి జనగామ జిల్లా కలెక్టర్లతో మంగళవారం మంత్రిత్వశాఖ–జాతీయ జలమిషన్ డైరెక్టర్ అర్చన వర్మ ఆధ్వర్యంలో 49వ ఎడిషన్ వాటర్ సిరీస్ వెబ్నార్ సందర్భంగా జలశక్తి అభియాన్ ప్రగతిపై ఢిల్లీ నుంచి వర్చువల్గా వీడి యో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. జనగామ కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో జలసంరక్షణపై దృష్టి సారించడంతో వ్యవసాయ రంగంలో అధిక దిగుబ డులు సాధించడంతోపాటు వ్యవసాయేతర రంగా ల ఉత్పత్తులపై పట్టు సాధించామన్నారు. ఇంటింటికి ఇంకుడుగుంత నినాదంతో ఉద్యమంలా చేపట్టిన కార్యక్రమంతో ఐదు మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగినట్లు తెలిపారు. వరిసాగులో అత్యధి క దిగుబడి సాధించగా, ఇదే స్ఫూర్తితో వరికి ప్రత్యామ్నాయంగా పామాయిల్ సాగుపై ఫోకస్ పెట్టిన ట్లు తెలిపారు. 7వేల ఎకరాలకు పైగా పామాయిల్ తోటల సాగు లక్ష్యాన్ని చేరుకోగలిగినట్లు చెప్పారు. దేవాదుల ద్వారా ప్రాజెక్టులు, చెరువులకు నీటిని నింపినట్లు చెప్పారు. రెండేళ్లుగా మత్స్యకారులు చేపల పెంపకంతోపాటు మార్కెటింగ్ పరంగా రూ.300కోట్ల నుంచి రూ.350 కోట్ల మేర వ్యాపారంతో సాధికారత సాధించారన్నారు. అనంతరం అర్చన వర్మ మాట్లాడుతూ జనగామ జిల్లా పురోగాభి వృద్ధికి కృషి చేస్తున్న కలెక్టర్తోపాటు జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. 49వ ఎడిషన్ వాటర్ సిరీస్ వెబ్నార్లో కలెక్టర్ రిజ్వాన్ బాషా ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రోగ్రాం -
విద్యుత్ స్తంభాలపై కేబుల్స్ తొలగించాలి
హన్మకొండ : విద్యుత్ స్తంభాలకు ఉన్న వైర్లను తొలగించాలని ఏడాది కాలంగా కేబుల్ ఆపరేటర్లకు సూచించినా పెడచెవిన పెడుతున్నారని, అన్ని సర్కిళ్ల ఎస్ఈలు ప్రత్యేక శ్రద్ధ కనబర్చి వాటిని తొలగించాలని టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజర్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి ఆదేశించారు. హనుమకొండలోని టీజీఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ స్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లతో విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనికి అనుగుణంగా కేబుల్ వైర్లు రీ–అలైన్మెంట్ చేసుకోవాలని కేబుల్ ఆపరేటర్లకు సూచించారు. స్పందించకపోతే వాటిని తొలగించాలని ఎస్ఈలు, డీఈలకు సూచించారు. ప్రజల భద్రత ముఖ్యమని అన్నారు. ఒక పద్ధతి ప్రకారం కేబుల్ వైర్లు అమర్చుకోవాలని సూచించారు. అధికారులు వినాయక విగ్రహాల తయారీ కేంద్రాలను సందర్శించి ప్రమాదభరితంగా ఉన్న విద్యుత్ లైన్లను క్రమబద్దీకరించాలన్నారు. అధిక ఎత్తులో ఉన్న వినాయక విగ్రహాల తరలింపు సమయంలో విద్యుత్ లైన్లకు తాకకుండా లైన్లను డీస్కనెక్ట్ చేయాలని సూచించారు. వినాయక నిమజ్జన రూట్లను తనిఖీ చేయాలని చెప్పారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తూ పండుగలను విజయవంతం చేయాలన్నారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి -
గంజాయి వ్యాపారం చేస్తున్న తండ్రీకొడుకులు
● 1.4కిలోల ఎండు గంజాయి స్వాధీనం ● తండ్రి అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన ఎస్సై రమేష్బాబు నెల్లికుదురు: తండ్రీకొడుకులు కలసి అక్రమంగా విక్రయించేందుకు తరలిస్తున్న ఎండు గంజాయిని మానుకోట జిల్లా నెల్లికుదురు పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. క్రాస్ రోడ్ వద్ద ఉదయం పెట్రోలింగ్ చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతన్ని విచారించగా.. జనగామ జిల్లా కొడకండ్ల మండలం రేగులకు చెందిన కేలోత్ చందా (కేలోత్ చందూలాల్) తన చిన్న కొడుకు కేలోత్ నవీన్తో కలసి తక్కువ ధరకు రాజమండ్రి నుంచి గంజాయి తీసుకొచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తేలింది. దీంతో అతని వద్ద ఉన్న రూ.70 వేల విలువ చేసే 1.4కిలో గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చందాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై వెల్లడించారు. -
ఆవిష్కరణలు దేశానికి ఆదర్శం
కేయూ క్యాంపస్: విద్యార్థులు, యువత ఆవిష్కరణలు దేశానికి ఆదర్శమని డీఆర్డీఓ మాజీ చైర్మన్, కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ సలహాదారు డాక్టర్ సతీష్రెడ్డి అన్నారు. కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవం సందర్భంగా తెలంగాణ అకాడమీ సైన్సెస్, కాకతీయ యూనివర్సిటీ సంయుక్తంగా మూడు రోజులపాటు నిర్వహించే తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ మంగళవారం క్యాంపస్లోని ఆడిటోరియంలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సతీష్రెడ్డి మాట్లాడుతూ.. ఇన్నోవేటివ్ స్కిల్స్ అండ్ ఎంపవర్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ థీమ్తో సైన్స్ కాంగ్రెస్ నిర్వహండం అభినందనీయమన్నారు. ప్రతి రాష్ట్రంలో ఐఐటీ, ఐఐఎం, ఎఐఎంఎస్, నిట్స్ సెంట్రల్ యూనివర్సిటీలు ఉండడం వల్ల అనేకమంది విద్యార్థులు ఆవిష్కరణలు, పరిశోధనాపత్రాల ప్రచురణలో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందన్నారు. ప్రస్తుతం 75శాతం విద్యార్థులు విదేశాలనుంచి తిరిగి వచ్చి మాతృభూమిలో ఆవిష్కరణలు చేస్తున్నారన్నారు. ఇంజనీరింగ్ పూర్తిచేసిన 90శాతం మంది ఉద్యోగాలు పొందుతున్నారన్నారు. తమ గ్రామం నుంచి తానొక్కడే ఇంజనీరింగ్ పూర్తి చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ప్ర స్తుతం 1.75మిలియన్ స్టార్టప్స్ వచ్చాయన్నారు. ఏ గ్రామం, ఏ కుటుంబం నుంచి వచ్చామనేది ము ఖ్యంకాదని ఏ ఆలోచన దృక్పథంతో ముందుకెళ్తున్నామన్నదే ముఖ్యమన్నారు. యువత మైండ్సెట్ మారాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ సాంకేతికతతో పోటిపడే మనస్తత్వం రావాలన్నారు. యువతకు ఆలోచనలే కీలకం డీఆర్డీఓ మాజీ చైర్మన్, భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ సలహాదారు సతీష్రెడ్డి కేయూలో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ ప్రారంభం కాకతీయ యూనివర్సిటీలోని ఆడిటోరియం వద్ద సెరికల్చర్ విద్యార్థుల పట్టుపురుగుల ప్రదర్శన ఆకట్టుకుంది. డాక్టర్ సుజాత విశిష్టతను వివరించారు. మల్బరీ నాన్మల్బరీ గూడిపట్టు చీలుకులపై బోధన, పెంపకం, పరిశోధనపై నిర్వహించే అంశాలపై వివరించారు. ఇదిలా ఉండగా.. సెనెట్హాల్లో విద్యార్థులు, సైంటిస్టులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ వెంకటేశ్వర్రావు, విజ్ఞాన్ప్రసాద్, రామచంద్రయ్య, లక్ష్మారెడ్డి, కోఆర్డినేటర్గా ఆచార్య జ్యోతి పాల్గొన్నారు. టీబీ నియంత్రణకు నూతన ఔషధాలు టీబీ నియంత్రణకు నూతన ఔషధాల అభివృద్ధి తప్పనిసరి అని హైదరాబాద్ సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ కె నందుకూరి వెల్లడించారు. తెలంగాణ సైన్స్ కాంగ్రెస్లో ‘టీబీ మెకానిస్టిక్ ఇన్సైట్స్ ఇన్ టూ హౌది పాజిటివ్ పాథోజెన్ సర్వైవ్స్ ఇన్ది హోస్ట్’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. ట్యూబర్కులోసిస్కు కారణమైన మైక్రోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ (ఎంటీబీ)లో ఔషధ నిరోధకత పెరుగుతుందన్నారు. -
పంటలను కాపాడుకోండిలా...
డోర్నకల్: వారం రోజులుగా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాలతో పంటలలో నీరు నిల్వ ఉండి మొక్కలు వదలడం, నారు దిశలో నీటి నిల్వతో మొక్కలు, వేర్లు కుళ్లిపోయే అవకాశం ఉంది. అధిక నీటి నిల్వతో ఎండుతెగులుతో పాటు ఇతర చీడపీడలు సోకే అవకాశాలు ఉన్నందున పలు జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పత్తి: ● సాధ్యమైనంతవరకు వర్షపు నీటిని తొలగించాలి. ● ఎరువుల యాజమాన్యంలో 15 నుంచి 20 కిలోల యారియా, 20 కిలోల మ్యూరెట్ ఆఫ్ పోటాష్ను వర్షం తగ్గాక వేసుకోవాలి. ● భూమిలో తేమ అధికంగా ఉంటే వేర్లు పోషకాలను తీసుకునే అవకాశం లేకపోవడంతో పైపోటుగా 20 గ్రాముల పోటాషియం నైట్రేట్ను పిచికారీ చేసుకోవాలి. ● తేమ వల్ల వేరుకుళ్లు రాకుండా కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములను లీటర్ నీటితో కలిపి లేదా కార్బెండైజమ్ మూడు గ్రాములను లీటర్ నీటితో కలిపి మొక్క మొదళ్లలో పోయాలి. వరి: ● వరికి సంబంధించి ప్రస్తుతం నాట్లు కొనసాగుతున్నందున వర్షపు నీరు నిలవకుండా కాలువల ద్వారా తొలగించాలి. ● నారు దశలో ఉంటే వర్షాలు తగ్గిన తర్వాత నారుమడి కొరకు 19:19:19 పోషకాన్ని 10 గ్రాములు, కార్బైండైజమ్, మార్కోజెమ్లను 2.5 గ్రాములను నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ● నాటు వేసేవారు ప్రతీ 2.3 మీటర్లకు 20 సెంటీమీటర్ల మేర కాలిబాటలు తీయడం వల్ల పైరుకు గాలి, వెలుతురు సోకి చీడపీడల ఉధృత్తి తగ్గుతుండటంతోపాటు ఎరువులు చల్లడానికి, సస్యరక్షణ చర్యలకు ఉపయోగపడుతుంది. మిరప: ● మిరప నారుమడి దశలో ఉన్నందున వర్షపు నీటిని కాలువల ద్వారా తీసివేయాలి. నీటి నిల్వలు ఉంటే నారుకుళ్లు, ఎండుతెగులు సోకే అవకాశం ఉంది. నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ను లీటర్ నీటితో కలిపి మొక్క మొదలు తడిసేలా వేయాలి. మొక్కజొన్న: ● వర్షాలతో పంటలో చేరిన నీటిని తొలగించాలి. ● నేల ఆరిన తర్వాత 19:19:19 లేదా 13:0:45 ఎరువును పైపాటుగా పిచికారీ చేయాలి. ● నేల ఆరిన తర్వాత అంతర్కృషి చేసుకుని అడుగు భాగంలో ఎరువులు వేసుకోవాలి. ● ఇతర ఆరుతడి పంటల్లో వరదనీటిని తొలగించి అంతరకృషి చేసి పైపాటుతోపాటు అడుగు భాగంలో రసాయన ఎరువులను వేసుకోవాలి. చీడపీడలను గుర్తించిన వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. రాబోయే రోజుల్లో వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నందున పంటలలో కాల్వలు ఏర్పాటు చేసుకోవాలి. విద్యుత్ తీగలు, మోటార్లు, స్టార్టర్ల ఏర్పాటులో పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్ తీగలను నేరుగా తాకవద్దు. వర్షంపడే సమయంలో చెట్ల క్రింద నిలబడకుండా ఇంటికి వెళ్లిపోవాలి. వరుస వానలతో వ్యవసాయ భూముల్లో నిలుస్తున్న నీరు ఆందోళనలో అన్నదాతలు జాగ్రత్తలు పాటించాలంటున్న శాస్త్రవేత్తలు -
వరిపొలంలో పడి రైతు మృతి
మామునూరు: ఒరాలు చెక్కుతూ అకస్మాత్తుగా లోతైన వరి పొలం బురుదలో ప్రమాదవశాత్తు పడడంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ 17వ డివిజన్ గాడిపెల్లికి చెందిన అమ్మ నవీన్(36) ఇంటి పక్కనే ఉన్న వరి పొలంలో ఒరాలు చెక్కేందుకు వెళ్లాడు. ఇంటిలో జరుగుతున్న ఓ ఫంక్షన్కు హాజరయ్యేందుకు మధ్యాహ్నం నవీన్ భార్య ఇందుమతి ఫోన్ చేయగా రింగ్ ఆవుతున్నా.. లిఫ్ట్ చేయలేదు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి పొలం వద్దకు వెళ్లగా నవీన్ బురదలో పడి మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న మామునూరు ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడి భార్య ఇందుమతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
బస్తా కోసం కుస్తీ !
సాక్షి, మహబూబాబాద్ : వానాకాలం పంటల సాగు కాస్తా ఆలస్యంగా ప్రారంభమైనా.. ఎట్టకేలకు సాగు అంచనా దిశగా ముందుకు సాగుతోంది. అయితే రోజుల తరబడి వేచి ఉంటే తప్పా బస్తా యూరియా దొరికే పరిస్థితి లేదు. దీంతో విసిగి వేసారిన రైతులు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన దుస్థితి వచ్చింది.. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాల్సిన అధికారులు సరఫరా లేదని చేతులెత్తేస్తుండడంతో రైతులు అసహనానికి గురవుతున్నారు. పెరుగుతున్న సాగు.. ఈ సీజన్లో వర్షాలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో పత్తిసాగు కాస్తతగ్గి.. మొక్కజొన్న సాగు పెరిగింది. వరి సాగు ఇటీవల వర్షాలతో పుంజుకు ంది. ఈ వానాకాలం సీజన్లో 4,29,790 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని అంచనాలు వేశారు. ఇందులో పత్తి 84,854 ఎకరాలకుగాను 78,797 ఎకరాలు, మొక్కజొన్న 52,249 ఎకరాలకు 57,264 ఎకరాల్లో సాగు చేశారు. వరి 2,21,282 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేయగా ఇప్పటి వరకు 1,78,309 ఎకరాల్లో సాగైంది. ఈ నెలాఖరు వరకు మరో 50 వేల ఎకరాల్లో నాట్లు వేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు మొత్తం 4,21,301 ఎకరాల్లో పంటలు సాగు చేయాల్సి ఉండగా 3,20,054 ఎకరాల్లో సాగుచేశారు. పెరిగిన వినియోగం.. తగ్గిన సరఫరా రోజు రోజుకు యూరియా వాడకం పెరుగుతూ వస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం ప్రణాళికలో పేర్కొన్న విధంగా సరఫరా చేయడం లేదు. వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం వరి, పత్తిలో ఎకరానికి రెండ బస్తాల యూరియా వేయాల్సి ఉండగా నాలుగు బస్తాలు వినియోగిస్తున్నారు. మొక్కజొన్నకు ఎకరానికి 2 నుంచి 3 బస్తాలు వేయాల్సి ఉండగా 4 నుంచి 8 బస్తాల యూరియా వాడుతున్నారు. సరఫరా మాత్రం అందుకు తగ్గట్టుగా లేదు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు జిల్లాకు 29,701 మె ట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటి వరకు 17,901 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. జిల్లాకు సరఫరా కావాల్సిన యూరియా కన్నా 11,800 మెట్రిక్ టన్నులు తక్కువగా వచ్చింది. తప్పని నిరీక్షణ సకాలంలో యూరియా వేస్తేనే పంట ఏపుగా పెరుగుతుంది. దీంతో రైతులు పీఏసీఎస్, ఆగ్రోస్ ఇతర కేంద్రాల చుట్టూ తిరిగినా దొరకడం లేదు. పట్టాదారు పాస్ పుస్తకం తీసుకెళ్లి క్యూలో పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షించినా చివరకు బస్తా యూరియా దొరకడం కష్టంగా మా రింది. ఆరోజు స్టాక్ అయిపోతే.. మరుసటి రోజు ఉదయం నుంచి మళ్లీ క్యూ కట్టాల్సి వస్తుంది. ఇలా ఒక్క బస్తా యూరియా కోసం కుస్తీ పట్టి మూడు రోజులు తిరిగితే కానీ యూరియా దొరకడం లేదు. దీంతో విసిగి వేసారిన రైతులు ఆందోళన చేయడం, నిరసనలు చేసే పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా సోమవారం రైతుల ఆందోళనలు ఇలా.. ● మహబూబాబాద్ రూరల్: మానుకోట పీఏసీఎస్ ఎదుట సోమవారం 1000 నుంచి 1200 మంది రైతులు యూరియా కోసం తెల్లవారుజామున నుంచి ఎదురుచూశారు. కేవలం ఒక లారీలో 444 బస్తాలు మాత్రమే రావడంతో ఒకరికి ఒకటి చొప్పున ఇచ్చారు. మిగిలిన రైతులకు ఒకటి రెండు రోజుల్లో తెప్పించి పంపిణీ చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా.. రైతులకు అవసరమైన మేరకు యూరియా అందజేయాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నల్లపు సుధాకర్ డిమాండ్ చేశారు. ● తొర్రూరు: యూరియా సరిపడా అందించడం లేదంటూ సోమవారం డివిజన్ కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం ఎదుట రైతులు నిరసన తెలిపారు. యూరియా కావాలంటే ప్రైవేట్ షా పుల యజమానులు ఇతర ఎరువులు కొనాలని లింకు పెడుతున్నారని వాపోయారు. ● నెల్లికుదురు: సోమవారం యారియా బస్తాలు వస్తాయని రైతులకు చెప్పిన సొసైటీ అధికారులు తీరా.. ఉదయం సొసైటీ వద్దకు అన్నదాతలు వచ్చిన తర్వాత ఈరోజు బస్తారు రావడంలేదని చెప్పారు. దీంతో రైతులు నెల్లికుదురు మహబూ బాబాద్ ప్రధాన రహదారిపై బైటాయించారు. ● గూడూరు: రైతులు ఉదయం 5 గంటలకే పీఏసీఎస్ కార్యాలయం చేరుకున్నారు. గంట సేపు రైతులు వేచిఉన్న తర్వాత ఈరోజు యూరియా రాదని సిబ్బంది చెప్పడంతో రైతులంతా జాతీయ రహదారిపైకి చేరుకొని బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ● నర్సింహులపేట: యూరియా ఎదురు చూస్తున్న రైతులకు సోమవారం యూరియా రావడంలేదని తెలిసి పీఏసీఎస్ కార్యాలయం ఎదుట, అంబేడ్కర్ సెంటర్లో రోడ్డుపై బైఠాయించారు. బీజేపీ మండల నాయకులు సైతం సొసైటీ వద్ద ఆందోళన చేశారు. సొసైటీలో యూరియా రాకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు ఇతర ఎరువులు కొనుగోలు చేస్తేనే యూరియా ఇస్తున్నారని రైతులు వాపోయారు. ● నెహ్రూసెంటర్: రైతుల పంటలకు అవసరమైన యూరియా వెంటనే సరఫరా చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారఽథి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో సోమవారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లాకు వచ్చిన యూరియా (మెట్రిక్ టన్నుల్లో) అవసరంలో సగమే సరఫరా ఆందోళన బాటపట్టిన అన్నదాతలు రైతు సంఘాలు, పార్టీల మద్దతునెల కావాల్సింది సరఫరా ఏప్రిల్ 542 4,237 మే 434 1,780 జూన్ 2,710 2,917 జూలై 10,840 5,241 ఆగస్టు 15,175 3,726 మొత్తం 29,701 17,901(ఇప్పటి వరకు) -
ఖాళీ బిందెలతో నిరసన
కేసముద్రం : వారంరోజులుగా తాగునీరు రాక ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కేసముద్రంవిలేజ్ శివారు చైతన్యనగర్ కాలనీలో సోమవారం ఖాళీ బిందెలతో మహిళలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండల అధ్యక్షుడు కొమ్ము నాగరాజు, కాలనీవాసులు మాట్లాడుతూ.. చైతన్యనగర్ కాలనీలో వారంరోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయిందని, ఈ విషయంపై పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తాగునీటిని అందించాలని వారు డిమాండ్ చేశారు. కొమ్ము రమాదేవి, మౌనిక, కలమ్మ, దివ్య, పద్మ, ఎల్లమ్మ, వల్లందాసు ఎల్లమ్మ, అమృత, సంగీత పాల్గొన్నారు. -
యూరియా సరఫరా చేయాలి
మహబూబాబాద్ రూరల్ : తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన 3.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ హౌస్ ఎదుట తెలంగాణ కాంగ్రెస్ల ఫోరం ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. ఈ నిరసనలో ఎంపీ పోరిక బలరాంనాయక్ పాల్గొని మాట్లాడారు. యూరియా పంపిణీపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి విన్నవించినా.. యూరియా కొరతను తీర్చలేదన్నారు. మంగళవారం పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇస్తామని తెలిపారు. మకర్ ద్వార్ వద్ద నిరసన తెలపనున్నామని, రైతుల హక్కుల కోసం కాంగ్రెస్ పోరాడుతుందని తెలిపారు. పార్లమెంట్ హౌస్ బయట నిరసన తెలిపిన ఎంపీ బలరాంనాయక్ -
హరియాణా విద్యార్థినికి మొదటి అడ్మిషన్
నెహ్రూసెంటర్: మహబూబాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 2025–26 విద్యాసంవత్సరానికిగాను ఆల్ ఇండియా కోటలో హరియా ణాకు చెందిన వైభవిసోని ఎంబీబీఎస్లో మొద టి అడ్మిషన్ పొందారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ వెంకట్ లకావత్ విద్యార్థినికి సోమవారం అడ్మిషన్ పత్రం అందజేశారు. దరఖాస్తుల ఆహ్వానం తొర్రూరు: స్థానిక కస్తూర్భా బాలికల విద్యాలయంలో ఇంటర్లో ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులో అతిథి అధ్యాపక పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రత్యేకాధికారి శైలజ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నర్సింగ్లో ఎంఎస్సీ, బీఎస్సీ చేసిన మహిళలు అర్హులని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన వారు ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇతర వివరాలకు ఫోన్ నంబర్ 63010 71295 ద్వారా సంప్రదించాలని కోరారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తాచాటాలి మహబూబాబాద్ అర్బన్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుని సత్తా చాటాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు వల్లభూ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం నూతన జిల్లా కమిటీ సభ్యులతో స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు పోటీలో ఉంటారని తెలిపారు. నూతన జిల్లా కమిటీ సభ్యులు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు చీకటి మహేష్, గడ్డం అశోక్, మదన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్యామ్సుందర్శర్మ, చెల్పూరి వెంకన్న, సురేందర్, నరసింహారెడ్డి, పద్మ, దేవిక, సింగారపు సతీష్, ఇందుభారతి, నాగరాజు, మణిచందన, అశోక్, విష్ణువర్ధన్, సందీప్, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు. జాతీయస్థాయి కరాటే పోటీల్లో పతకాలు మహబూబాబాద్ అర్బన్: జాతీయ స్థాయి కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో మోడల్ స్కూల్ విద్యార్థినులు పతకాలు సాధించారని పాఠశాల ప్రిన్సిపాల్ ఉపేందర్రావు తెలిపారు. పతకాలు సాధించిన మానుకోట మున్సిపల్ పరిధిలోని అనంతారం మోడల్ స్కూల్ బాలికలను ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఉపేందర్రావు మాట్లాడుతూ.. ఇటీవల జనగామ జిల్లాలో నిర్వహించిన 4వ జాతీయ స్థాయి ఓపెన్ కరాటే చాంపియన్ షిప్ పోటీలో పాఠశాల నుంచి పాల్గొన్న బాలికలు 7 బంగారు పతకాలు, రెండు రజత పతకాలు సాధించారని తెలిపారు. కోచ్ జావిద్, పీడీ సింధువర్మ చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో కరాటే పతకాలు పొందిన విద్యార్థినులు కీర్తన, విష్టవి, రూబిన, నిహరిక, రిశ్విత, దీపా, పావని, గీత, భార్గవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సమ్మక్క సాగర్ 59 గేట్లు ఎత్తివేత కన్నాయిగూడెం: మండల పరిధిలోని తుపాకులగూడెం గ్రామ పరిధిలోని సమ్మక్క సాగర్ బ్యారేజీకి గోదావరి వరద క్రమేపీ పెరుగుతూ వస్తోంది. బ్యారేజీలోకి ఎగువన ఉన్న సరస్వతీ, లక్ష్మి బ్యారేజీ నుంచి 4,98,280 క్యూసెక్కుల నీటి ప్రవాహం సమ్మక్క సాగర్ బ్యారేజీలోకి వచ్చి చేరుతోంది. దీంతో బ్యారేజీ 59 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ నీటిమట్టం సామర్ధ్యం 83 మీటర్లు కాగా ప్రస్తుతం 80.30 మీటర్ల నీటిమట్టం ఉంది. -
జాతీయ విపత్తులపై విద్యార్థులకు అవగాహన
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని నూకల రామచంద్రారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం జాతీయ విపత్తులపై విద్యార్థులకు ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో పదో బెటాలియన్ టీం కమాండ్ ఇన్స్పెక్టర్ భూపేంద్ర కుమార్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. భూకంపాలు, రైలు ప్రమాదాలు, భారీ వర్షాలు సంభవించినప్పుడు ప్రాణనష్టం జరగకుండా ప్రమాదబారిన పడిన వారిని రక్షించాలని, పోలీసు, అంబులెన్స్, అగ్నిమాపక దళం వంటి వివిధ అత్యవసర సేవలను వినియోగించుకోవాలన్నారు. ఆకస్మాత్తుగా మంటలు, వరదలు, అగ్ని, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అప్రమత్తంగా ఉండి బాధితులకు సాయం అందించాలని తెలిపారు. లేదంటే 100, 108, 101, ఫైర్ ఇతర నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ బి.లక్ష్మణ్నాయక్, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. -
విషజ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి
నెహ్రూసెంటర్: సీజనల్ వ్యాధులు డెంగీ, మలేరియా, టైపాయిడ్, చికెన్గున్యా వంటి విష జ్వరాలు ప్రభలే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అద్వైత్ కుమార్సింగ్ సూచించారు. సోమవారం ఆయన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, రోగులకు అందించే ఆహారం రుచికరంగా ఉండాలని తెలిపారు. ఆస్పత్రిలో అత్యవసర సేవలతోపాటు కావాల్సిన మందులను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా పీహెచ్సీలు, సీహెచ్సీలు, సబ్ సెంటర్లలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైన చోట వైద్య శిబిరాలు నిర్వహిస్తూ పంచాయతీరాజ్, మున్సిపల్, అన్ని విభాగాల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పని చేయాలని సూచించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఆర్ఎంఓ జగదీశ్ ఉన్నారు. కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ -
విద్యార్థులకు సాంకేతిక బోధన చేయాలి
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఉపాధ్యాయులు బోధన చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రవీందర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఉపాధ్యాయులకు డిజిటల్ లిట్రసి, ఏఐ పై సోమవారం శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ రవీందర్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నవీన పద్ధతుల్లో విద్యబోధనను ప్రవేశపెడుతుందని తెలిపారు. సాంకేతిక అక్షరాస్యత, ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ విద్యా బోధన చేసేందుకు రాష్ట్రస్థాయిలో ఐదుగురు ఉపాధ్యాయులకు శిక్షణ అందించామన్నారు. వారు జిల్లాలో 60 కాంప్లెక్స్ పాఠశాల స్థాయి నుంచి ఇద్దరు ఉపాధ్యాయుల చొప్పున మొత్తం 120 మంది ఉపాధ్యాయులకు జిల్లాలో ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో దాగిఉన్న సృజ నాత్మకతను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ ఆజాద్ చంద్రశేఖర్, విద్యాశాఖ అధికారులు సంతోష్, అప్పారావు, ఏఎస్సీ, డీఆర్పీలు సంపత్, అశోక్, జగన్, యాదగిరి, విక్టోరియా తదితరులు పాల్గొన్నారు. డీఈఓ రవీందర్రెడ్డి -
సర్వాయి పాపన్న పోరాటం స్ఫూర్తిదాయకం
మహబూబాబాద్: సర్దార్ సర్వాయి పాపన్న పోరాటం స్ఫూర్తిదాయకమని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్టొప్పో అన్నారు. సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమాన్ని కలెక్టరేట్లో సోమవారం అధికారికంగా నిర్వహించారు. ఈసందర్భంగా పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం లెనిన్ వత్సల్ టొప్పో మాట్లాడుతూ.. గొప్ప పోరాటయోధుడు సర్దాయి సర్వాయి పాపన్న అని కొనియాడారు. సామాన్య కుటుంబంలో జన్మించి ఆదర్శంగా నిలిచిన మహోన్నతవ్యక్తి అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, బీసీ వెల్ఫేర్ అధికారి నర్సింహస్వామి, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో -
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
మహబూబాబాద్: రైతులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మ ల నాగేశ్వర్రావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెక్రటేరియట్ నుంచి సీఎస్ రామకృష్ణారావుతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సోమవారం వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా యూరియా కొతర, ఎరువుల లభ్యతపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. యూరియా, ఎరువుల కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. వీడియోకాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, అధికారులు పాల్గొన్నారు. యూరియా వినియోగంపై అవగాహన కల్పించాలి : కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అన్నారు. కలెక్టరేట్లోని వీడియో కాన్పరెన్స్ సమావేఽశ మందిరం నుంచి జిల్లాలోని అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులతో కలెక్టర్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ఆన్లైన్ ద్వారా మాత్రమే యూరియా అమ్మకాలు చేపట్టాలన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకరు యూరియా అమ్మకాలు చేపట్టాలన్నారు. వర్షాలు, వరదలు పెరిగే అవకాశం ఉన్నందున జిల్లా వ్యాప్తంగా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మాట్లాడుతూ.. జిల్లాలో రైతులకు ఇబ్బంది కలుగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవన్నారు. వీసీలో డీఏఓ విజయనిర్మల, డీసీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు -
మెకానికల్ వాకింగ్ రోబోట్..
కేసముద్రం: కేసముద్రం స్టేషన్ జెడ్పీ హైస్కూల్కి చెందిన 8వ తరగతి విద్యార్థులు గణేష్, కల్యాణ్, పవన్, అరవింద్ మెకానికల్ వాకింగ్ రోబోట్ తయారు చేసి, సోమవారం ప్రదర్శించారు. పీఎంశ్రీకి ఎంపికై న ఈ పాఠశాలకు ఇటీవల అటల్ టింకరింగ్ ల్యాబ్(ఏటీఎల్) మంజూరైంది. ఈ మేరకు ల్యాబ్కు త్రీడీ ప్రింటర్స్, ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్స్ వంటి పలు పరికరాలు వచ్చాయి. గైడ్ టీచర్ విజయ్ చందర్, మధు సహకారంతో విద్యార్థులు రోబోట్ అసెంబ్లింగ్ చేయడం నేర్చుకున్నారు. కాగా, మెకానికల్ వాకింగ్ రోబోట్ నడుస్తుంటే తోటి విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. తయారు చేసిన కేసముద్రం స్టేషన్ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు -
సీడీఎఫ్ పనులు వేగవంతం
మహబూబాబాద్: ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గానికి రూ.10 కోట్ల స్పెషల్డవలప్మెంట్ ఫండ్ విడుదల చేసింది. దాంతో నియోజకవర్గంలోని పలు సమస్యలతోపాటు తాగు నీరు, విద్యకు సంబంధించిన పనులు చాలా వరకు పూర్తి చేశారు. నిబంధనల ప్రకారం పలు పనులకు నిధులు కేటాయించారు. ఈనిధుల విడుదలతో ఎమ్మెల్యేలకు కొంత ఊరట లభించినట్లైంది. జిల్లాలో ఐదు నియోజకవర్గాలు జిల్లా పరిధిలో ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ, మానుకోట, డోర్నకల్ నియోజకవర్గాలు మాత్రమే పూర్తిస్థాయిలో ఉన్నాయి. నియోజకవర్గాలకు 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.10 కోట్ల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. సీపీఓ శాఖ నుంచి ఆ పనులకు సంబంధించిన నిబంధనలను ఎమ్మెల్యేలకు అందచేశారు. ఖర్చు చేయాల్సింది ఇలా.. రూ 6.50 కోట్లు అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సి ఉంది. రోడ్డులు, డ్రెయినేజీ, వాకింగ్ ట్రాక్, విద్యుత్ దీపాలు ఇతరత్రా పనులు చేయొచ్చు. కోటి రూపాయలు మాత్రం తాగు నీటికి మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంది. రూ.రెండు కోట్లు ఎడ్యుకేషన్కు ఖర్చు చేయాలి. రూ.50 లక్షలు ప్రభుత్వ కార్యాలయాలకు ఖర్చు చేయాలనే నిబంధనలను ప్రభుత్వం రూపొందించింది. ఈ నిధుల ఖర్చు, పనులపై ఎమ్మెల్యేలదే పూర్తి అధికారం. బ్యాలెన్స్ రూ.2.50 కోట్లు మానుకోట నియోజకవర్గంలో రూ.6.50 కోట్ల పనుల్లో 143 పనులు పూర్తి చేఽశారు. మానుకోట మున్సిపాలిటీ పరిధిలో కూడా రోడ్డులు, డ్రెయినేజీలు, వాకింగ్ ట్రాక్ పనులు చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర) ఎన్టీఆర్ స్టేడియంలో వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. గ్రామాల్లో కూడా అవే పనులు చేశారు. చాలా వరకు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. 143 పనులకు గాను రూ.5.37 కోట్లు ఖర్చు అయినట్లు సీపీఓ అధికారులు పేర్కొన్నారు. ఇంకా రూ.1.13 లక్షల బ్యాలెన్స్ ఉందని తెలిపారు. తాగు నీటికి సంబంధించి కోటి రూపాయలతో పనులు పూర్తి చేశారు. ఎడ్యుకేషన్కు రూ.2కోట్లలో రూ.66 లక్షల పనులు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల రూ.50 లక్షల్లో రూ.45 లక్షల పనులు చేశారు. మొత్తం పనులు 189 చేయగా రూ.7.48 కోట్లు ఖర్చు అయ్యాయని రూ.2.52 కోట్ల బ్యాలెన్స్ ఉందని సీపీఓ అధికారులు తెలిపారు. డోర్నకల్లో.. డోర్నకల్ నియోజకవర్గంలో రూ.6.50 కోట్ల పనుల్లో రూ.6.44 కోట్ల పనులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. తాగు నీటికి సంబంధించి కోటి రూపాయల పనులు పూర్తి చేశారు. ఎడ్యుకేషన్ రూ.రెండు కోట్లలో 45 పనులు పూర్తి చేశారు. బ్యాలెన్స్ లేదు. ప్రభుత్వ కార్యాలయాల రూ.50 లక్షల్లో రూ.35 లక్షల పనులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. రూ.15 లక్షల బ్యాలెన్స్ ఉంది. మొత్తం 254 పనులు చేయగా రూ.9.79 కోట్ల ఖర్చు అయినట్లు అధికారులు తెలిపారు. మరో రూ.21 లక్షల బ్యాలెన్స్ ఉంది. మళ్లీ ఎదురుచూపు 2025–26 సీడీఎఫ్ నిధుల కోసం ఎమ్మెల్యేలు ఎదురుచూస్తున్నారు. అవి విడుదలైతే నియోజకవర్గాల్లో పెండింగ్ పనులు చేయొచ్చనే ఆలోచనలో ఉన్నారు. ప్రజలు చిన్న చిన్న సమస్యలు చెప్పినప్పుడు వెంటనే ఎమ్మెల్యేలు పరిష్కరించేందుకు మళ్లీ విడుదల చేసే నిధులు ఉపయోగపడుతాయి. 80 శాతం పనులు పూర్తి తీరిన పలు సమస్యలు -
ఎన్డీలో మరో సంక్షోభం..
బయ్యారం: ఒకప్పుడు ఇల్లందు నియోజకవర్గాన్ని పెట్టనికోటగా మార్చుకున్న న్యూడెమోక్రసీ(ఎన్డీ)లో మరో సంక్షోభం తలెత్తింది. ఫలితంగా కాలక్రమేణా వస్తున్న చీలికలతో ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చింది. తాజాగా న్యూడెమోక్రసీ (చంద్రన్నవర్గం) రాష్ట్ర కార్యదర్శి అశోక్.. కొందరు నాయకులతో కలిసి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ విషయం సంచలనంగా మారింది. అయితే చంద్రన్న వర్గానికి రాజీనామా చేసినా తాము న్యూడెమోక్రసీగానే కొనసాగుతామని అశోక్ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో మరో విప్లవగ్రూపు ఆవిర్భవించినట్లు భావించొచ్చు. బయ్యారంలోని వీబీటీ ఫంక్షన్హాల్లో నిర్వహించిన ఖమ్మం–వరంగల్ ఏరియా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర కమిటీ కార్యదర్శి స్థాయిలో పనిచేస్తున్న పెద్దచంద్రన్న వ్యక్తిగత నిర్ణయాలు, విప్లవేతర పనులు పార్టీ మనుగడకే ప్రమాదకరంగా మారాయన్నారు. ఈ క్రమంలో పార్టీ కమిటీల సమావేశాలకు తగిన సమయం ఇవ్వలేని స్థితి ఏర్పడడంతో చంద్రన్నవర్గానికి రాజీనామా చేశామన్నారు. ప్రస్తుతం ప్రజాసమస్యల పరిష్కారంపై విప్లవ సంస్థలు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉండడంతో తాము భవిష్యత్లో విప్లవ సంస్థల ఐక్యతకు అనుకూలంగా ఉంటామన్నారు. చంద్రన్నవర్గానికి రాజీనామా ప్రకటించిన వారిలో భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం జిల్లా కార్యదర్శులు ఊక్లా, శ్రీనివాస్, రాష్ట్ర, జిల్లా నాయకులు మదార్, కోటమ్మ, పాపారావు, వెంకటేశ్వర్లు, హనుమంతరెడ్డి, భాస్కర్రెడ్డి, చిన్నలింగయ్య, షర్పొద్దీన్, వెంకన్న, నర్సిరెడ్డి, కవిత, బాలయ్య, రాంసింగ్, దేవేందర్ తదితరులున్నారు. ప్రజాపంథా నుంచి చీలికలు.. చీలికలుగా.. ఇల్లందు నియోజకవర్గంలో కొన్ని దశాబ్దాల క్రితం ప్రజాపంథా విప్లవగ్రూపు బలమైన పునాది ఏర్పర్చుకుంది. ఆ పార్టీ తరఫున గుమ్మడి నర్సయ్య ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుపెట్టారు. ఆ తర్వాత ప్రజాపంథా పార్టీ పేరును న్యూడెమోక్రసీగా మార్చారు. కాలక్రమేణా ఆ పార్టీలో వచ్చిన సిద్ధాంత విభేదాలతో న్యూడెమోక్రసీ రాయల, చంద్రన్న వర్గాలుగా విడిపోయింది. అనంతరం రాయలవర్గంలో ఏర్పడిన చీలికలో ఒక వర్గం మాస్లైన్(ప్రజాపంథా) పార్టీని ఏర్పాటు చేయగా మరోవర్గం న్యూడెమోక్రసీ( యతీంధ్రకుమార్వర్గం)గా కొనసాగుతోంది. ఆ తర్వాత చంద్రన్నవర్గంలో ఏర్పడిన చీలికలో బయటకు వచ్చిన నాయకులు యతీంధ్రకుమార్ వర్గంలో చేరగా తాజాగా అశోక్ నాయకత్వంలో ఏర్పడిన చీలికవర్గం తాము న్యూడెమోక్రసీగానే కొనసాగుతామని ప్రకటించడంతో ఇప్పటికే రాష్ట్రంలో రెండు న్యూడెమోక్రసీలు ఉండగా కొత్తగా మరోటి ఏర్పడనుంది. రానున్న రోజుల్లో కొత్తగా ఏర్పడే న్యూడెమోక్రసీ మరోవర్గంలో విలీనమవుతుందా లేక పార్టీగా కొనసాగుతుందా అనే అంశం భవిష్యత్లో తేలనుంది. ఇప్పటికే వర్గాలుగా చీలిపోయిన విప్లవ పార్టీలో మరో చీలిక చంద్రన్న వర్గానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర కార్యదర్శి అశోక్ న్యూడెమోక్రసీగానే కొనసాగుతామని ప్రకటన -
మేడిగడ్డకు కొనసాగుతున్న వరద
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో గోదావరి, ప్రాణహిత నదుల వరద కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి కొనసాగుతోంది. సోమవారం ఉదయం నుంచి తెలంగాణ, మహారాష్ట్ర వ్యాప్తంగా వర్షం కురుస్తుండడంతో వరద నిలకడగా ఉంది. కాళేశ్వరం త్రివేణి సంగమం 8.540 మీటర్ల ఎత్తులో నీటిమట్టం తరలుతోంది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద 4.70లక్షల క్యూసెక్కులు తరలివస్తోంది. దీంతో అదే స్థాయిలో బ్యారేజీలోని మొత్తం 85 గేట్లు ఎత్తినీటిని దిగువకు వదులుతున్నారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద వరద -
కొండపల్లిలో తాత్కాలికంగా హాల్టింగ్ ఎత్తివేత
● అక్టోబర్ నుంచి అమల్లోకి..కాజీపేట రూరల్ : ఫుట్ ఓవర్ బ్రిడ్జి మరమ్మతు కారణంగా కాజీపేట జంక్షన్, వరంగల్ మీదుగా ప్రయాణించే పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు అక్టోబర్ నుంచి కాజీపేట–విజయవాడ మధ్య గల కొండపల్లి రైల్వే స్టేషన్లో తాత్కాలికంగా హాల్టింగ్ ఎత్తివేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ సోమవారం తెలిపారు. తాత్కాలికంగా హాల్టింగ్ ఎత్తివేసిన రైళ్లు ఇవే.. అక్టోబర్ 19 నుంచి నవంబర్ 11వ తేదీ వరకు మచిలీపట్నం–బీదర్ (12749) డైలీ ఎక్స్ప్రెస్, బీదర్–మచిలీపట్నం (12750) డైలీ ఎక్స్ప్రెస్, గుంటూరు–సికింద్రాబాద్ (17201) డైలీ గోల్కొండ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్–గుంటూరు (17202) డైలీ గోల్కొండ ఎక్స్ప్రెస్, అక్టోబర్ 18 నుంచి నవంబర్ 17వ తేదీ వరకు తిరుపతి–ఆదిలాబాద్ (17405) డైలీ కృష్ణాఎక్స్ప్రెస్, ఆదిలాబాద్–తిరుపతి (17406) కృష్ణాఎక్స్ప్రెస్, అదేవిధంగా అక్టోబర్ 19 నుంచి నవంబర్ 18వ తేదీ వరకు విజయవాడ–భద్రాచలం(67215) ప్యాసింజర్, భద్రాచలం–విజయవాడ (67216) ప్యాసింజర్, విజయవాడ–డోర్నకల్ (67768) ప్యాసింజర్లకు కొండపల్లిలో తాత్కాలికంగా హాల్టింగ్ ఎత్తివేసినట్లు సీపీఆర్వో ఎ. శ్రీధర్ తెలిపారు. -
బాలికపై లైంగికదాడికి పాల్పడిన నేరస్తుడికి ఇరవై ఏళ్ల జైలు
వరంగల్ లీగల్: బాలికపై లైంగికదాడికి పాల్పడిన నేరస్తుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 15 వేల జరిమానా విధిస్తూ ఒకటో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి అపర్ణాదేవి సోమవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలం బయ్యారం చిన్న తండాకు చెందిన ఓ మహిళ బతుకుదెరువు నిమిత్తం కాజీపేట డీజిల్ కాలనీ ప్రాంతానికి వచ్చి ఇక్కడే మొక్క జొన్న కంకులు కాల్చి విక్రయించి కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఈమెకు నలుగురు కూతుళ్లు ఉండగా ముగ్గురికి పెళ్లిళ్లు అయ్యాయి. చిన్న కూతురు ఏడో తరగతి వరకు చదువుకుని ఇంటి వద్దే ఉంటుంది. అప్పుడప్పుడు తల్లి వద్దకు వచ్చి పనులు చేస్తూ చేదోవాదోడుగా ఉండేది. ఈక్రమంలో పర్వతగిరి మండలం అన్నారం తండా చెందిన వాంకుడోత్ చంద్రుడు.. ఆ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. 2022, డిసెంబర్ 15న రాత్రి ఫోన్ చేసి బాలికకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం సదరు బాలికను రోడ్డుపై వదిలేసి వెళ్లాడు. ఈవిషయమై ఎవరికై నా చెబితే నీవు నాతో తీసుకున్న ఫొటోలు అందరికీ చూపిస్తానని భయపెట్టాడు. ఈ ఘటనపై బాలిక తల్లి కాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి సీఐ మహేందర్ రెడ్డి కేసు నమోదు చేసి కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రస్తుత ఇన్స్పెక్టర్ వై.సుధాకర్రెడ్డి, కోర్టు కానిస్టేబుల్ ఏరుకొండ సుధాకర్, కోర్టు లైజన్ ఆఫీసర్, ఏఎస్సై పరమేశ్వరి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి అపర్ణాదేవి.. నేరస్తుడు వాంకుడోత్ చంద్రుడుకు 20 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.15 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు ● 11 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు ● కొత్తగట్టు సింగారం స్టేజీ వద్ద ఘటనశాయంపేట : ఆగి ఉన్న లారీని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం మండలంలోని కొత్తగట్టు సింగారం స్టేజీ వద్ద చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు డ్రైవర్, పోలీసుల కథనం ప్రకారం.. టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన ఎం.డి గౌసోద్దీన్ భూపాలపల్లి ఆర్టీసీ డిపోలో బస్సు డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం శివారులో ఓ లారీని రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా నిలిపి ఉంచారు. ఇదే సమయంలో హనుమకొండ నుంచి కాళేశ్వరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి లారీని ఢీకొంది. దీంతో బస్సు ముందు భాగం దెబ్బతినడంతోపాటు ప్రయాణికులు రాజయ్య, సరోజన, వెంకటమ్మ, సౌజన్య, చంద్రయ్య, శశివరుణ్, ఎల్లమ్మ, పవిత్ర, ఉమారాణి, పోషక్క, అమూల్యకు స్వల్ప గాయాలు కావడంతో 108లో ఎంజీఎం తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై జక్కుల పరమేశ్ సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని ప్రమాద వివరాలు సేకరించారు. అనంతరం బస్సు డ్రైవర్ గౌసోద్దీన్ ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ అబ్దుల్ ఖాయమ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనలో ప్రయాణికులకు స్పల్ప గాయాలై పెనుప్రమాదం నుంచి తప్పించుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ దాడి ఖిలా వరంగల్: పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ అధికారులు దాడి చేసి రూ.12 970 నగదు, 4 మొ బైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సార్ల రాజు తెలిపారు. వరంగల్ ఏనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న బొందుగుల అఖిల్, జడల సాగర్, నమిండ్ల కర్ణాకర్, ఇమ్మడి హర్షపై కేసు నమోదు చేసి తదుపరి చ ర్యల నిమిత్తం ఏ నుమాముల పో లీస్ స్టేషన్కు కేసు ను అప్పగించిన ట్లు ఇన్స్పెక్టర్ రా జు వివరించారు. -
పర్యాటకంలో ములుగును
ప్రథమ స్థానంలో నిలుపుతాములుగు రూరల్: పర్యాటక రంగంలో ములుగు జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క అన్నారు. ఈ మేరకు సోమవారం మండలంలోని ఇంచర్ల నిర్మిస్తున్న ఎకో ఎత్నిక్ విలేజ్, పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రామప్ప, లక్నవరం అభివృద్ధితో పాటు పర్యాటకులను ఆకర్షించేలా ఇతర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. రామప్ప, లక్నవరం, మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర, బొగత జలపాతం, బ్లాక్ బెర్రీ, దట్టమైన అటవీ ప్రాంతాల్లో పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. జాతీయ రహదారికి సమీపంలో రూ. 37 కోట్లతో పర్యాటక స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్, హ్యాపీ థియేటర్ ఏర్పాటు చేస్తామన్నారు. రామప్పలో రూ. 13 కోట్లతో ఐలాండ్ పనులు చేపడుతామన్నారు. అనంతరం రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్రెడ్డి మాట్లాడుతూ ములుగు జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్జీ, గ్రంథాల య సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, టూరిజంశాఖ అధికారి శివాజీ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. క్రెంచ్ కేంద్రంలో పిల్లలకు సంరక్షణ.. క్రెంచ్ కేంద్రంలో పిల్లలకు సంరక్షణ ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం మండలంలోని జగ్గన్నపేటలో అదనపు కలెక్టర్ మహేందర్జీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్తో కలిసి అంగన్ వాడీ, డే కేర్ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క -
పాపన్న గౌడ్ జయంతి రసాభాస
హన్మకొండ: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమం రసాభాసగా సాగింది. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో ఆధికారికంగా పాపన్న గౌడ్ జయంతిని నిర్వహించింది. కలెక్టర్ స్నేహ శబరీష్ పాల్గొనకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ బీసీ సంఘాల నాయకులు ఆందోళనకు దిగా రు. బీసీ సంఘం నాయకులు బొనగాని యాదగిరి గౌడ్, సుందర్ రాజ్ యాదవ్, ఇతర బీసీ నాయకులు మాట్లాడుతూ కలెక్టర్.. బీసీల పట్ల చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్ రావాల్సిందేనని అక్కడున్న అధికారులతో గొడవకు దిగారు. ఈ క్రమంలో జయంతి వేడుకలు ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకేనని, కార్యక్రమం ముగిసిందని, ప్రజావాణి నిర్వహించాల్సి ఉందని అధికారులు తెలపగా, తాము కలెక్టరేట్ ముందు రోడ్డుపై జయంతి జరుపుకుంటామని, ఈ ఫొటోలు, సమాచారం సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపుతామని హెచ్చరించారు. గొడవ పెద్దదవుతుందని తెలియడంతో కలెక్టర్ స్నేహ శబరీష్ కాన్ఫరెన్స్ హాల్కు చేరుకుని పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దీంతో బీసీ సంఘాల నాయకులు శాంతించారు. సోమవారం గ్రీవెన్స్ ఉన్నందున ప్రజలకు ఇబ్బంది కలగరాదని ఉద్దేశంతో ఆలోగా కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పామని, ఏదైనా విషయం ఉంటే రాతపూర్వకంగా ఇవ్వండని బీసీ సంఘాల నాయకులకు కలెక్టర్ సూచించినట్లు సమాచారం. అనంతరం బీసీ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.వి. గణేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ కె.నారాయణ, జిల్లా బీసీ సంక్షేమాధికారి లక్ష్మణ్, బీసీ సంఘాల నాయకులు చిర్ర రాజు, శ్యామ్ యాదవ్, జనగామ శ్రీనివాస్ గౌడ్, మార్క విజయ్ గౌడ్, రామస్వామి గౌడ్, బూర విద్యాసాగర్, మౌనిక, తది తరులు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ రాకపోవడంపై బీసీల అసహనం -
వాగులో పడి మహిళ మృతి
ఎస్ఎస్తాడ్వాయి : వాగులో పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం కాల్వపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సొగలం గౌరమ్మ(45) మతిస్థిమితం కోల్పోయింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కుటుంబీకులు తలుపులు తెరిచి నిద్రించారు. సోమవారం ఉదయం నిద్ర లేచి చూడగా గౌరమ్మ కనిపించలేదు. దీంతో ఆమె ఆచూకీ కోసం గాలించగా ఇంటి సమీపంలో ఉన్న తూముల వాగులో పడి మృతి చెంది కనిపించింది. రాత్రి సమయంలో మూత్ర విసర్జనకు వెళ్లి వాగులో పడి మృతి చెందిందనే కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్రెడ్డి తెలిపారు. -
యూరియా వచ్చేసింది..
● వ్యాగన్లో రైల్వే గూడ్స్ షెడ్కు చేరిన యూరియా ● మార్క్ఫెడ్, ఫర్టిలైజర్ షాపులకు సరఫరా ఖిలా వరంగల్ : వరంగల్ రైల్వేస్టేషన్లోని గూడ్స్ షెడ్కు సోమవారం యూరియా చేరింది. దీంతో యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఊరట లభించింది. ఉమ్మడి జిల్లాలోని రైతులకు అందించేందుకు 1500.750 మెట్రిక్ టన్నుల క్రిబ్కో కంపెనీకి చెందిన యూరియా వచ్చింది. ఈ యూరియాను మార్క్ఫెడ్కు 60 శాతం, ఇతర ఫర్టిలైజర్ షాపులకు 40 శాతం కేటాయించారు. సోమవారం ఉదయం నుంచే వరంగల్ గూడ్స్ షెడ్ నుంచి ఉమ్మడి జిల్లాలోని పీఏసీఎస్, ఫర్టిలైజర్ షాపులకు తరలించే ప్రక్రి య ప్రారంభించామని వ్యవసాయ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. గూడ్స్షెడ్ నుంచి లారీలో తరలిస్తున్న యూరియా -
స్వర్ణోత్సవంలోకి కేయూ..
యూనివర్సిటీ ఆవిర్భవించి 49 వసంతాలు పూర్తి కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ.. నిత్య చైతన్య దీప్తిగా ఉంటూ ఎంతో మంది విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దిన చదువులమ్మ ఒడి. అంతేకాకుండా ఉద్యమాల గడ్డ.. పోరాటాల అడ్డగా పేరొందింది. ఈ క్రమంలో యూనివర్సిటీ మంగళవారం 50వ వసంతంలోకి అడుగిడబోతోంది. రాష్ట్రంలో ఉస్మానియా తర్వాత ప్రతిష్టాత్మక యూని వర్సిటీగా కేయూ గుర్తింపు పొందింది. న్యాక్ ఏప్లస్ గ్రేడ్ సాధించి విద్యార్థుల ప్రాధాన్య యూనివర్సిటీగా మారింది. ఈ నేపథ్యంలో ఈనెల 19వ తేదీతో 49 సంవత్సరాలు పూర్తిచేసుకుని స్వర్ణోత్సవంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రస్థానం, ఇక్కడ నెలకొన్న సమస్యలు, కావాల్సిన సదుపాయాలపై ‘సాక్షి’ ప్రత్యేకథనం. తొలుత ఓయూ పీజీ సెంటర్గా.. తొలుత ఉస్మానియా యూనివర్సిటీ పీజీ సెంటర్గా 1968లో ప్రారంభమైంది. 1976 ఆగస్టు 19న కాకతీయ యూనివర్సిటీ ఆవిర్భవించింది. ఈ 49 ఏళ్లలో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దింది. ఎంతో మంది వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. అయితే ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన కేయూ.. నేడు అనేక సమస్యలతో సతమవుతోంది. పాఠాలు బోధించేందుకు వివిధ విభాగాల్లో రెగ్యులర్ ప్రొఫెసర్ల కొరత ఉంది. ఒకప్పుడు కేయూలో సీనియర్ ప్రొఫెసర్లతో విద్యతోపాటు పరిశోధనలు విస్తృతంగా జరిగేవి. ఇది అంతా గతం. తెలంగాణ ఆవిర్భావంతో యూనివర్సిటీ అభివృద్ధిలో పయనిస్తుందని భావించారు. కానీ సమస్యలు పరిష్కారం కాకపోగా గత ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చి ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసిందని విద్యావేత్తలు ఆరోపిస్తున్న విషయం విధితమే. కేయూ నిధుల లేమితో ఇంకా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. నాలుగు విభాగాలతో మొదలై.. 28 విభాగాల వరకు.. కాకతీయ యూనివర్సిటీ తొలుత నాలుగు విభాగాలతో మొదలై అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం 28 విభాగాలతో కొనసాగుతోంది. మూడు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోని 11 జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, అటానమస్ డిగ్రీ కళాశాలలు 211 ఉండగా, యూనివర్సిటీ పీజీ కళాశాలలు 74, ఇంజనీరింగ్ 6, ఫార్మసీ 25, ఎడ్యుకేషన్ 41, ఫిజికల్ ఎడ్యుకేషన్ 3, ‘లా’ కళాశాలలు 3, ఎంబీఏ 24, ఎంసీఏ 7, హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలు 3 ఉన్నాయి. ఇటీవల కేయూ పరిధిలోని కొత్తగూడెం మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీని ఎర్త్ యూనివర్సిటీగా ఏర్పాటు చేసిన విషయం విధితమే. బోధన అంతంత మాత్రమే.. కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులకు బోధన అంతంతమాత్రంగానే ఉంటుంది. రెగ్యులర్ అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్లు కలిపి 77 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో కొందరికి రెండు, మూడు, నాలుగైదు పరిపాలన పదవులు కూడా ఉండడంతో వారు బోధనపై అంతగా దృష్టిసారించడం లేదనే ఆరోపణలున్నాయి. కొన్ని విభాగాల్లో ఒక్క రెగ్యులర్ అధ్యాపకుడు కూడా లేరు. ఉదాహరణకు తెలుగు, పొలిటికల్ సైన్స్, విద్యా, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలు, సైకాలజీ, జర్నలిజం విభాగాలున్నాయి. ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బాటనీలో విభాగాల్లో ఒక్కొక్కరే రెగ్యులర్ ప్రొఫెసర్ ఉన్నారు. కాంట్రాక్టు, పార్ట్టైం లెక్చరర్లతోనే బోధన.. కేయూలో 176 మంది వరకు కాంట్రాక్టు లెక్చరర్లు,183 మంది వరకు పార్ట్టైం లెక్చరర్లు ఉన్నారు. అయినా వివిధ విభాగాలు, యూనివర్సిటీ కాలేజీలో వర్క్లోడ్కు అనుగుణంగా ఇటీవలే పేపర్వైజ్గా విద్యాబోధనకు తాత్కాలిక పద్ధతిలో కొందరిని నియమించారు. వేధిస్తున్న అధ్యాపకుల కొరత.. కేయూలో ప్రధానంగా రెగ్యులర్ అధ్యాపకుల కొరత వేధిస్తోంది. అన్ని విభాగాలు కలిపి (అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్) 409 పోస్టుల మంజూరు ఉండగా ప్రస్తుతం 77మంది అధ్యాపకులే ఉన్నారు. పీజీ సెంటర్లను పట్టించుకునే వారేరి? కేయూ పరిధిలోని పీజీ సెంటర్లను పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. 2012–2013లో ఏర్పాటు చేసిన మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాలోని పీజీసెంటర్లులో ఒక్క రెగ్యులర్ లెక్చరర్ లేరు. ప్రిన్సిపాల్ కూడా లేరు. పేరుకు యూనివర్సిటీలోని వైస్ ప్రిన్సిపాల్కే ఇన్చార్జ్ అని ఇస్తున్నారు. కానీ వారు కూడా వెళ్లడం లేదు. బోధించేవారు అంతంత మాత్రమే. దీంతో అడ్మిషన్ల సంఖ్యతగ్గిపోతోంది. నిర్మల్ పీజీ సెంటర్ ఇప్పటికే మూతపడిందని భావిస్తున్నారు. ఖమ్మం పీజీ సెంటర్లో కూడా రెగ్యులర్ అధ్యాపకుల కొరత ఉంది. ఫీజుల భారం.. మూడేళ్లక్రితం కేయూలోని పీజీ, ప్రొఫెషనల్ ఎస్ఎఫ్సీల్లో అదనపు సీట్లు పెంచడంతోపాటు ఫీజులు కూడా భారీగా పెంచారు. అయితే ప్రభుత్వ నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఫీజురీయిబర్స్మెంట్ కింద వర్సిటీకి రూ. 50కోట్లకు పైగానే బకాయిలు రావాల్సి ఉందని సమాచారం. విద్యార్థుల ప్రధాన సమస్యలు.. కేయూలో ఎస్ఎఫ్సీలను రెగ్యులర్గా మార్చాలని విద్యార్థులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అలాగే, విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హాస్టళ్ల భవనాలు సరిపడాలేకపోవడంతో విద్యార్థులు బయట ప్రైవేట్గా ఉంటుండడంతో ఆర్థిక భారం పడుతుంది. క్యాంపస్లోని రెండు ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ రెగ్యులర్ అధ్యాపకుల నియమించాల్సింది. ఇంజనీరింగ్ విద్యార్థినులకు హాస్టల్ వసతి అవసరం ఉంది. మౌలిక వసతులకు రూ. 300 కోట్లతో ప్రతిపాదనలు.. కాకతీయ యూనివర్సిటీ 50 వసంతంలోకి అడుగిడబోతుంది. దీంతో వచ్చే ఆగస్టు వరకు గోల్డెన్జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నాం. యూనివర్సిటీలో అకడమిక్, నాణ్యమైన పరిశోధనల పరంగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అడుగులు వేయబోతున్నాం. ఇందులో భాగంగా యూనివర్సిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 300 కోట్లతో ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపాం. – కె.ప్రతాప్రెడ్డి, వీసీ, కేయూ నేడు 50వ వసంతంలోకి.. న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ సాధించినా సమస్యలే వేధిస్తున్న రెగ్యులర్ అధ్యాపకుల కొరత బోధన, పరిశోధనలపై తీవ్ర ప్రభావం పీజీ సెంటర్లను పట్టించుకునే నాఽథుడు కరువునాన్ టీచింగ్ ఉద్యోగుల పోస్టులు కూడా వెకెన్సీలు గెజిటెడ్ ఆఫీసర్స్ ఉద్యోగుల పోస్టులు 29కి 22మంది పనిచేస్తున్నారు. ఎన్జీఓ కేడర్ ఉద్యోగుల పోస్టుల మంజూరు 240 ఉండగా 115 వెకెన్సీలుగా ఉన్నాయి. క్లాస్ ఫోర్త్ ఎంప్లాయీస్ పోస్టులు మంజూరు 225 ఉండగా 78 మంది పనిచేస్తున్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులు 507మంది పనిచేస్తున్నారు. కాగా, ఉద్యోగులకు ఫేస్రికగ్నైషన్ హాజరు వచ్చే నెలలో అమలు చేయాలని వీసీ ప్రతాప్రెడ్డి నిర్ణయించారు. -
ప్రజలు చేపల వేటకు వెళ్లొద్దు
తొర్రూరు రూరల్: వర్షాల నేపథ్యంలో ప్రజలు చేపల వేటకు వెళ్లొద్దని తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్ కోరారు. మండలంలోని కంఠాయపాలెం, మడిపల్లి, గుర్తూరు గ్రామాల పరిధిలోని లో లెవల్ కల్వర్టులను పరిశీలించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు చేపల వేటకు, పశువులను ఏరులు, చెరువుల్లోకి తీసుకెళ్లవద్దన్నారు. లో లెవల్ కల్వర్టుల వద్ద అకస్మాత్తుగా వరద ఉదృతి పెరిగే అవకాశం ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. రాత్రి వేళల్లో ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. వర్షాల సమయంలో రైతులు, ప్రజలు అత్యవసరమైతేనే బయటికి రావాలన్నారు. పాఠశాలలకు వెళ్లే పిల్లలపై జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో సీఐ గణేష్, ఎస్సై ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. నేటి ప్రజావాణి రద్దు మహబూబాబాద్: కలెక్టరేట్లో ఈనెల 18న జరిగే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆదివా రం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు నేపథ్యంలో జిల్లాలో రెడ్ అలర్ట్ ఉన్నందున జిల్లా అధికారులను ప్రత్యేకాధికారులగా నియమించామన్నారు. దీంతో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలు గమనించాలని సూచించారు. శాంతియుతంగా గణేశ్ నవరాత్రులు జరుపుకోవాలి మహబూబాబాద్ రూరల్ : ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదివారం తెలిపారు. రాష్ట్ర పోలీసు వెబ్సైట్లో జిల్లాలో గణేశ్ మండపాల నిర్వహణ, విగ్రహాల ఏర్పాటు, ఊరేగింపులకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఆన్లైన్ సమాచారమనేది మండపం నిర్వహణకు సంబంధించిన సమాచారం కోసమేనని, ఈ సమాచారం ద్వారా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత, బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులువుగా ఉంటుందన్నారు. పోలీస్ శాఖ ఆన్లైన్ ద్వారానే అనుమతి మంజూరు చేస్తుందని, ఆ తరువాతనే వినాయక మండపాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. గణేష్ మండపాల పూర్తి బాధ్యత మండపాల నిర్వాహకులదేనని, ప్రతీ మండపం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. గణేశ్ మండపాల నిర్వాహకులు కమిటీ వివరాలు, బాధ్యుల వివరాలు, ఫోన్ నంబర్లను మండపంలో ఏర్పాటు చేయాలని సూచించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలని సూచించారు. గణేశ్ మండపంలో 24 గంటలు ఒక వలంటీరు ఉండే విధంగా నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మండపాల వద్ద అనుమానాస్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు వ్యక్తులు కనిపించినట్లుయితే తక్షణమే డయల్ 100కుగానీ లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సాక్షి ఫొటోగ్రాఫర్లకు రాష్ట్రస్థాయి అవార్డులు హన్మకొండ కల్చరల్/జనగామ: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సాక్షి ఫొటోగ్రాఫర్లను రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపిక చేశారు. వరంగల్కు చెందిన సాక్షి సీనియర్ స్టాఫ్ ఫొటో గ్రాఫర్ పెద్దపల్లి వరప్రసాద్, జనగామ ఫొటోగ్రాఫర్ గోవర్ధనం వేణుగోపాల్ ఉత్తమ వార్త చిత్రాల పోటీల్లో బహుమతులకు ఎంపికయ్యారు. తెలంగాణ స్టేట్ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో వారికి అవార్డులు ప్రదానం చేయనున్నారు. రామప్ప శిల్పకళ అద్భుతం వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళ సంపద అద్భుతమని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ సామ్ కోషి కొనియాడారు. మండలంలోని రామప్ప దేవాలయాన్ని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తులు సందర్శించారు. ఈ సందర్భంగా రామప్ప రామలింగేశ్వరస్వామిని శ్రీనివాస్రావు దర్శించుకోగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. -
ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి
మహబూబాబాద్: భారీ వర్షాలు, వరదల వల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ధనసరి సీతక్క అధికారులను ఆదేశించారు. ఆదివారం ములుగు నుంచి ఆమె వర్షాలు, వరదల పరిస్థితిపై కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అధికారులు, సంబంఽధిత సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు. ప్రాణ, అస్తి నష్టం జరగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు. చెరువులు, వాగులు, కుంటల వద్దకు ప్రజలు వెళ్లవద్దని, చేపల వేటకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలన్నారు. వరదల కారణంగా తాత్కాలిక మరమ్మతులు చేసిన చెరువులు, కుంటల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, శాశ్వత పనుల కోసం ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో మాట్లాడుతూ.. జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామన్నారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండేవిధంగా ఆదేశాలు జారీ చేశామన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ఆందోళన పరిస్థితులు లేవన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్రునాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్ మాట్లాడుతూ.. రైతులకు సరిపడా యూరియా అందించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్అనిల్కుమార్, ఎస్పీ సుదీర్ రాంనాథ్ కేకన్, ఆర్డీఓ కృష్ణవేణి, అన్ని మండలాల ప్రత్యేక అదికారులు పాల్గొన్నారు. వీసీలో మంత్రి ధనసరి సీతక్క -
అధికారులు నివేదికలు అందించాలి
మరిపెడ రూరల్: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.అనిల్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం శివారు ఆకేరు వాగు బ్రిడ్జి, నెర్రెలుబారిన ఎడ్జెర్ల పెద్ద చెరువును ఆయన ఇరిగేషన్ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మండలంలోని సమస్యాత్మక ప్రాంతాలను తనిఖీ చేస్తూ ఎప్పటికప్పుడు నివేదికలను అందజేస్తున్నామన్నారు. విపత్తు నివారణ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. మండల ప్రత్యేక అధికారి కిరణ్కుమార్, తహసల్దార్ కృష్ణవేణి, ఎంపీడీఓ వేణుగోపాల్రెడ్డి, ఇరిగేషన్ ఏఈ శ్రీకాంత్, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. అప్రమత్తత అవసరం బయ్యారం: అధికారులందరూ అప్రమత్తంగా ఉండి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అనిల్కుమార్ సూచించారు. మండలంలోని నామాలపాడు లోలెవల్ వంతెన, బయ్యారం పెద్దచెరువు అలుగులు, సత్యనారాయణపురం సమీపంలో నీటమునిగిన లోలెవల్ బ్రిడ్జిని ఆదివారం పరిశీలించారు. అదేవిధంగా డీఎస్పీ తిరుపతిరావు బయ్యారం పెద్దచెరువు అలుగులను పరిశీలించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ విజయలక్ష్మి, గార్ల–బయ్యారం సీఐ రవికుమర్, ఎస్సై తిరుపతి, ఇరిగేషన్ ఏఈ అఖిల తదితరులు ఉన్నారు.