Mahabubabad
-
ఆయుర్వేద సేవలు పొందాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్ నెహ్రూసెంటర్: ఆయుర్వేదం, హోమియోపతి, యునాని సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ స్నేహశ బరీష్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతిప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జీజీహెచ్లో శుక్రవారం ఆయుష్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంతో పాటు తదితర ప్రాంతాలోల్లో ఔషధ మొక్కలను నాటాలని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధంచేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, గురుకులాల్లో యోగా శిక్షణ కార్యక్రమం, గ్రామస్థాయిలో ఆయుర్వేద వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసే ఉద్దేశంతోనే ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. హోమియో వైద్య విధాన స్థాపకులు డాక్టర్ శామ్యూల్ హనిమాన్ జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ రవి రాథోడ్, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, హోమియో వైద్యులు చైతన్య, రామకృష్ణ, పి.కిరణ్కుమార్, వసుంధరదేవి, యునాని వైద్యులు బి.శంకర్, డీపీఎం శ్రవణ్ కుమార్, ఇందుమతి, పద్మ, అశోక్, సంజయ్, మోహన్ పాల్గొన్నారు. -
పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలు గుర్తించాలి
● డీఎంహెచ్ఓ రవిరాథోడ్ నెహ్రూసెంటర్: పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలను గుర్తించి వెంటనే వైద్య చికిత్స అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రవిరాథోడ్ అన్నారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో శుక్రవారం రాష్ట్రీయ బాల స్వస్థ్య, జిల్లా ఏర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. పోషకాహార లోపాలు, అభివృద్ధిఆలస్యం, ఇతర వ్యాధులను వెంటనే గుర్తించి ఇంటర్వెన్షన్ సెంటర్లో సమగ్ర వైద్య సేవలు, థెరఫీ సేవలు సమయానికి అందించవచ్చన్నారు. ఆర్బీఎస్కే టీమ్స్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పిల్లలకు ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమాల అమలులో పురోగతి, సమీక్షిస్తూ లోపాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని, సమన్వయంతో పని చేసి బాలల ఆరోగ్య సూచికలను మె రుగుపర్చాలని తెలిపారు. సమావేశంలో ప్రోగ్రాం అధికారి లక్ష్మీనారాయణ, కొప్పు డెమో ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పాత సంచుల
మిర్చి ధర రూ.20,410యాసంగి ధాన్యం కొనుగోళ్లకు గన్నీ బ్యాగుల సమస్యబూత్స్థాయి ఏజెంట్లను నియమించాలిమహబూబాబాద్ రూరల్ : ఓటరు సవరణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారికంగా పాల్గొనేందుకు ప్రతీ పోలింగ్ బూత్ పరిధిలో ఏజెంట్లను నియమించాలని టీపీసీసీ జిల్లా కోఆర్డినేటర్ ఎండి.అవేజ్, డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ అన్నారు. బీఎల్ఏల నియామక సన్నాహక సమావేశం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. త్వరలో జరగబోయే ప్రత్యేక ఓటరు సవరణకు సంబంధిత ఫారాలు, ప్రోఫార్మాల ప్రకారం బూత్ లెవెల్ ఏజెంట్లు విధులు నిర్వర్తించాలని సూచించారు. బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలిమహబూబాబాద్ రూరల్: విద్యార్థి దశ నుంచే చట్టాలపై ప్రాథమిక అవగాహన కలిగి ఉండడం వల్ల భవిష్యత్లో నేరాలకు దూరంగా ఉంటారని అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ రాజుకృష్ణ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మహబూబాబాద్ మండలంలోని రెడ్యాల ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు ప్రత్యేక న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్య జీవితంలో అవసరమయ్యే పలు కీలక చట్టాల గురించి వివరించారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండడం వల్ల తమ హక్కులను కాపాడుకోగలరని తెలిపారు. బాలలపై జరుగుతున్న లైంగిక వేధింపుల నిరోధక చట్టం, పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లో ర్యాగింగ్కు పాల్పడితే ఎదురయ్యే చట్టపరమైన చర్యలు, మాదక ద్రవ్యాలకు వ్యసనపరులు కావడంవల్ల కలిగే అనర్థాలు వివరించారు. పేదలు, అణగారిన వర్గాల కోసం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అందించే ఉచిత న్యాయ సేవలు, టోల్ ఫ్రీ నంబర్ల గురించి ప్రచారం చేయాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.వెంకన్న, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. పూలే ఉత్సవాల కమిటీ కన్వీనర్గా మల్లేశ్వర్ కేయూ క్యాంపస్: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్గా కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సంగని మల్లేశ్వర్ నియమితులయ్యారు. కమిటీలో 15మంది కన్వీనర్లు ఉండగా అందులో కేయూ నుంచి మల్లేశ్వర్ ఒకరు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బాలమాయదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. మల్లేశ్వర్ పూలే ఆశయ సాధన సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీవాదంతో ముందుకెళ్తున్నారు. నేడు, రేపు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు వరంగల్ స్పోర్ట్స్: ములుగు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నేడు, రేపు(11,12 తేదీల్లో) 11వ తెలంగాణ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా 552మంది క్రీడాకారులు, 28 మంది టెక్నికల్ అఫిషియల్స్, 20 మంది వలంటీర్లు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు త్వరలో జరగనున్న ఫెడరేషన్ కప్ జూనియర్, సీనియర్ జాతీయయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అంతర్జిల్లాల ఓపెన్ టు ఆల్ టెన్నీస్ పోటీలు.. వరంగల్ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ సుబేదారిలోని వరంగల్ క్లబ్ వేదికగా శని, ఆదివారాల్లో తెలంగాణ అంతర్ జిల్లాల స్థాయి ఓపెన్ టు ఆల్ టెన్నిస్ పోటీలను నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ జయసింహరెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పోటీలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, గండ్ర సత్యనారాయణ హాజరై ప్రారంభిస్తారని తెలిపారు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం మిర్చి క్వింటా ధర రూ.20,410 పలికింది. వ్యాపారులు 940 క్వింటాళ్ల (2,687 బస్తాలు) మిర్చిని కొనుగోలు చేశారు. మిర్చి క్వింటాకు గరిష్ట ధర రూ.20,410, మోడల్ ధర రూ.19,010, మినిమం ధర రూ.15,010 పలికినట్లు అధికారులు తెలిపారు. – మహబూబాబాద్ రూరల్పంచాయితీసాక్షి, మహబూబాబాద్: యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ప్రధానమైన గన్నీ బ్యాగుల సమస్య మాత్రం యాసంగి ధాన్యం కొనుగోలుకు ఆటంకంగా మారే అవకాశం ఉంది. గతంలో సగం కొత్తవి, సగం పాతవి దిగుమతి చేసుకునే వీలు ఉండేది. కానీ, ఇప్పుడు వివిధ కారణాలతో బ్యాగుల సరఫరాలో కొరత ఏర్పడే అవకాశం ఉందని గ్రహించిన అధికారులు మిల్లర్ల వద్ద నుంచి పాత సంచులు సేకరించే పనిలో ఉన్నారు. అయితే నాలుగైదు సంవత్సరాల నుంచి పాత బ్యాగులు తిరిగి ఇవ్వలేదని, ఇప్పుడు ఒకేసారి ఇవ్వమంటే ఎలా అని మిల్లర్లు అంటున్నారు. 65లక్షల గన్నీ బ్యాగులు అవసరం.. యాసంగిలో 1,71,780 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందుకుగాను రైతుల అవసరాలు, ప్రైవేట్ వ్యాపారులకు అమ్మకాలు పోగా 2,60,762 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు అంచనాలు వేశారు. ఈ లెక్క ప్రకారం 65,19,076 గన్నీ బ్యాగులు అవసరం. అయితే ఇందులో 35,20,301 గన్నీ బ్యాగులు కొత్తవి, 29,98,775 గన్నీలు పాతవి అవసరం ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు 5లక్షల గన్నీ బ్యాగులు పాతవి, 4,10,000 కొత్తవి అందుబాటులో ఉన్నాయి. మిగిలిన 31,10,301 కొత్తవి, 24,98.775 గన్నీలు పాతవి.. మొత్తంగా 56,09,076 గన్నీలు అవసరమని ప్రభుత్వానికి నివేదిక పంపించారు. పాత గన్నీలు ఇవ్వండి.. ధాన్యం సేకరణ కోసం పాత గన్నీ సంచులు తప్పనిసరిగా ఇవ్వాలని జిల్లా అధికారులు మిల్లర్లను ఆదేశించారు. 2016 నుంచి ఇప్పటి వరకు పాత గన్నీలు తిరిగి ఇవ్వలేదని మొత్తం కలిపి మిల్లర్లదందరూ 10లక్షల గన్నీ బ్యాగులు ఇస్తే కానీ యాసంగి సీజన్కు సరిపోవని వివరించారు. అయితే, ఇప్పటికే మొతాదుకు మించి ధాన్యం రావడం, సీఎంఆర్ ఒక వైపు.. ధాన్యం దిగుమతి మరోవైపు చేస్తున్నామని దీంతో సంవత్సరాల తరబడి గన్నీలు పక్కన వేయడంతో ఎలుకలు కొట్టడం, చెదలు పట్టిపోవడంతో పాత గన్నీలు లేకుండా పోయాయని మిల్లర్లు చెప్పినట్లు సమాచారం. అయితే బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, హరియాణా నుంచి కొత్త గన్నీలు రావడంలో జాప్యం అవుతుందని, పాత గన్నీలు ఇవ్వకపోతే కొనుగోళ్లు ఇబ్బంది అవుతుందని మిల్లర్లకు సర్దిచెప్పినట్లు తెలిసింది. దీంతో సంవత్సరాల తరబడి మూలకు వేసిన గన్నీలు ఇవ్వడం కుదరదు.. కానీ కనీసం అన్ని మిల్లులు కలిపి గత మూడు సీజన్లకు చెందిన గన్నీలు కలిపి 3లక్షల మేరకు తిరిగి ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. ఈ పరిస్థితిలో కొనుగోళ్లు ప్రారంభిస్తే గన్నీల కొరత ఉంటుందా.. అప్పటి వరకు కొత్త గన్నీలు వస్తాయా.. అనేది చర్చగా మారింది. అంబేడ్కర్ జయంతిని పండుగలా జరుపుకోవాలిమహబూబాబాద్ అర్బన్: జిల్లాలో ఈ నెల 14న భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలను పండుగలా జరుపుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి కె. శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కోర్టు సెంటర్లో ఈనెల 14న ఉదయం 9 గంటలకు అంబేడ్కర్ విగ్రహానికి నివా ళులర్పించి, కలెక్టరేట్ కార్యాలయంలో ఉత్సవ స మావేశం నిర్వహిస్తామన్నారు. దళిత, గిరిజన, వె నుకబడిన తరగతుల, మైనార్టీ సంక్షేమ శాఖ అధి కారులతో పాటుఇతర శాఖల అధికారులు, ప్రజా, కుల సంఘాల నాయకులు పాల్గొనాలని కోరారు. గ్యాస్ పోయి.. చిట్టు(ఊక) పొయ్యి వచ్చేకొత్తగూడ: గ్యాస్ సిలిండర్ల కొరత చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే, చిన్నచిన్న టిఫిన్ సెంటర్లు, టీ షాపుల నిర్వాహకులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఉపాధి కోల్పోకుండా నిలదొక్కుకుంటున్నారు. మండల కేంద్రంలోని ఓ టిఫిన్ సెంటర్ యజమాని వినూత్నంగా చిట్టు(ఊక) పొయ్యి ద్వారా టిఫిన్లు తయారు చేస్తున్నాడు. ఈపొయ్యి ద్వారా ఒకటి రెండు కట్టెలతో ఎక్కువ సమయం మంట వచ్చి పలు రకాల టిఫిన్లు తయారు చేయగలుగుతున్నాడు. పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ నుంచి తక్కువ సరఫరా పాత సంచులు ఇవ్వాలని ఆదేశించిన అధికారులు ఇవ్వలేమని అంటున్న మిల్లర్లు -
ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలి
● అదనపు కలెక్టర్ అనిల్కుమార్ మహబూబాబాద్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలని, కేంద్రాల నిర్వాహక ఏజెన్సీలకు ప్రభుత్వం కమీషన్ చార్జీలు విడుదల చేసిందని అదనపు కలెక్టర్ అనిల్కుమార్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం కమీషన్ చార్జీల చెక్కును సంబంధిత అధికారులకు అదనపు కలెక్టర్ అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్న ఏజెన్సీలకు 70 శాతం కమీషన్ చార్జీలు రూ.4,96,75,172ను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ధాన్యం కొనుగోళ్ల కోసం సుమారు 46 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు. యాసంగి సీజన్లో 3,62,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారన్నారు. దానిలో 2,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేశారన్నారు. కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో సివిల్ సప్లయీస్ డీఏం నర్సింహారావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
నాణ్యమైన మక్కలు తీసుకురావాలి
● డీఏఓ సరిత కేసముద్రం: రైతులు నాణ్యమైన మక్కలను కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని డీఏఓ సరిత అన్నారు. శుక్రవారం కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చుట్టుపక్కల మండలాల నుంచి అధిక సంఖ్యలో రైతులు మక్కలను తీసుకురావడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, మరో మూడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఎకరాకు 35 క్వింటాళ్లను ఖరీదు చేయాలని పలువురు రైతులు కలెక్టర్ను కోరారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరి ష్కారం అయ్యే విధంగా చూస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ వెంకన్న, స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ అమరలింగేశ్వర్రావు, సీఈఓ మల్లారెడ్డి, ఏఈఓ రాజేందర్ పాల్గొన్నారు. గడ్డిమందు విక్రయిస్తే కఠిన చర్యలు బయ్యారం: జిల్లాలోని ఎరువుల షాపుల్లో నిషేధిత గడ్డిమందు(పారాక్వాట్)ను విక్రయిస్తే సంబంధిత డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఏఓ సరిత హెచ్చరించారు. మండలంలోని బయ్యారం, గంధంపల్లి–కొత్తపేట గ్రామాల్లోని ఎరువుల షాపులను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. మండలంలోని కస్తూరినగర్, కంబాలపల్లి గ్రామాల్లోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను డీఏఓ పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహించాలన్నారు. -
పౌష్టికాహారమే లక్ష్యం..
మహబూబాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే ప్రధాన లక్ష్యంతో మహిళ అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్, పోషణ్ ట్రాకర్, ఆరోగ్యలక్ష్మి తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈమేరకు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. జిల్లాలో మంత్రి ధనసరి సీతక్క చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభించారు. 1,437 కేంద్రాలు జిల్లాలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాలు ఉన్నాయి. వాటి పరిధిలో 1,437 కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల పరిధిలో జీరో నుంచి ఆరు నెలలలోపు పిల్లలు 3,006 మంది, ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాలలోపు వారు 18,944మంది, మూడేళ్ల నుంచి ఆరు సంవత్సరాల లోపు పిల్లలు 18,938 మంది ఉన్నారు. గర్భిణులు 4,499మంది, బాలింతలు 2,732 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. తల్లీబిడ్డ ఆరోగ్యం, పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఆరోగ్యం, వారికి పౌష్టికాహారం ఇవ్వడం వంటి కార్యక్రమాలను అంగన్వాడీ టీచర్లు నిర్వహిస్తున్నారు. యాప్లలో వివరాల నమోదుతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పోషణ్ పక్వాడ పోస్టర్ ఆవిష్కరణ.. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ప్రధాన సమావేశ మందిరంలో ఈనెల 9న మంత్రి ధనసరి సీతక్క చేతుల మీదుగా పోషణ్ పక్వాడ కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాగా కార్యక్రమం విజయవంతం చేయడం అధికారులకు సవాల్గా మారింది. ఈనెల 9 నుంచి 23వ తేదీ వరకు..● ఈనెల 9 నుంచి 23వ తేదీ వరకు పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ● ఈనెల 9న కార్యక్రమం పోస్టర్ల ఆవిష్కరణ, కార్యక్రమం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు ● 10న అంగన్వాడీ కేంద్రాల్లో అమ్మమ్మ–నానమ్మ మాటల్లో పోషణ్ కథలు చెప్పించారు ● 11న గర్భిణులు, పిల్లల కోసం ప్రత్యేక పోషణ–ఆరోగ్య శిబిరాల నిర్వహణ కార్యక్రమాలు ● 13న వంటల పోటీలు, చిరుధాన్యాలను ఉపయోగించి వివిధరకాల ఆహారపదార్థాలు తయారు చేయడంపై ప్రదర్శన కార్యక్రమాలు ● 14న జంక్, ప్యాకేజ్డ్ ఆహారం వల్ల కలిగే నష్టాలపై అవగాహన సదస్సు, పోషకాహారంపై అవగాహన ర్యాలీ నిర్వహణ ● 15న పిల్లల అభివృద్ధి, మైలు రాళ్లను గుర్తించడానికి డ్రైవ్ నిర్వహించాలి ● 16న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు బాల్య దశ సంరక్షణ, విద్యపై అవగాహన కార్యక్రమం ● 17న తల్లి, శిశువు పరస్పర సంభాషణలు, ఆటల ఆధారిత అభ్యసన ప్రదర్శనలు ● 18న ఆట ఆధారిత అభ్యసన కార్యక్రమాల ప్రాముఖ్యతపై చర్చ ● 20న అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీస్కూల్ సంసిద్ధత కార్యకలాపాలు, లేదా గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం ● 21న పంఖుడి పోర్టల్పై అవగాహన కార్యక్రమాలు ● 22న పాఠశాలలు, అంగన్వాడీలు, పంచాయతీల్లో మొబైల్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలపై కౌన్సెలింగ్, సమావేశాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు ● 23న నో స్క్రీన్ అవర్, ఫ్యామిలీ ప్లే టైమ్ ప్రచారం, బహిరంగ ఆటలు, శారీరక కార్యకలాపాలు, క్రీడలు ఇతరత్రా కార్యక్రమాలు 15 రోజుల పాటు నిర్వహిస్తారు. ఆ కార్యక్రమాల ఫొటోలు, వీడియోలు తీసి పోర్టల్లో నమోదు చేస్తారు. విజయవంతం చేయాలి పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా కార్యక్రమం నిర్వహిస్తుంది. జిల్లాలో మంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం వల్ల మరింత బాధ్యతగా రాష్ట్రంలో జిల్లాను ముందంజలో ఉంచేందుకు తగు ఏర్పాట్లు చేశాం. ప్రధానంగా పౌష్టికాహారం అందించడం, ఆరోగ్యం, వ్యాయాయం, పరిశుభ్రత, ఇతరత్రా విషయాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యం. – సబిత, డీడబ్ల్యూఓ మంత్రి సీతక్క చేతుల మీదుగా పోషణ్ పక్వాడ కార్యక్రమం ప్రారంభం ఈనెల 9నుంచి 23వ తేదీ వరకు నిర్వహణ పోషకాహారం అందించేలా చర్యలు ప్రోగ్రాం విజయవంతంపై అఽధికారుల దృష్టి -
వినియోగదారుల సమస్యలు పరిష్కరించాలి
నెహ్రూసెంటర్: విద్యుత్శాఖ ఏఈలు ప్రతీ వారంలో మంగళ, గురు, శనివారాల్లో ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించి వినియోగదారుల సమస్యలు తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలని విద్యుత్శాఖ డైరెక్టర్ మధుసూదన్, చీఫ్ ఇంజనీర్ రాజు చౌహాన్ సూచించారు. విద్యుత్శాఖ మహబూబాబాద్ సర్కిల్ పరిధిలోని అధికారులతో శుక్ర వారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఓవర్లోడ్ ట్రాన్స్ఫార్మర్లు, 33 కేవీ ఫీడర్ల పనులు, మిగిలిన పనులన్నింటినీ ఈ నెలలో పూర్తి చేయాలని ఆదేశించారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే వెంటనే తనిఖీలు చేసి వాటిని మార్చాలని సూచించారు. వినియోగదారులకు అసౌకర్యం కలిగించకుండా అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. విద్యుత్ స్తంభాల నంబర్లను పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రజాబాట కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. సమీక్ష సమావేశంలో ఎస్ఈ విజేందర్రెడ్డి, డీఈలు, ఏడీఈలు, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. -
మహబూబాబాద్
శనివారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026మన ఊరును మనమే కాపాడుకోవాలి7● ఎస్పీ శబరీష్ తొర్రూరు రూరల్: మన ఊరును మనమే కాపాడు కోవాలని ఎస్పీ శబరీష్ అన్నారు. శుక్రవారం మండలంలోని చెర్లపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ మహేందర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మన ఊరు–మన బాధ్యత కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, పెద్దలందరూ ముందుకు వచ్చి సీసీ కెమెరా లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలన్నారు. మార్కెట్ చైర్మన్ హనుమాండ్ల తిరుపతిరెడ్డి, డీఎస్పీ కృష్ణ కిశోర్, ఎస్సైలు ఉన్నారు. -
బైక్లు ఢీకొని.. ఆరుగురికి గాయాలు
● నలుగురి పరిస్థితి విషమం కురవి : ద్విచక్రవాహనాలు (స్కూటీ, బైక్) ఢీకొన్న సంఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సీరోలు–కాంపల్లి మధ్య ప్రధాన రహదారిపై శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పిన్నిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన అన్నదమ్ములు ఇమ్మడి సిద్ధు, వినోద్ బైక్పై మరిపెడకు వెళ్తున్నారు. వినోద్కు సాఫ్ట్వేర్ జాబ్ రావడంతో హైదరాబాద్కు పంపించేందుకు బైక్పై వస్తున్నట్లు సమాచారం. సీరోలు మండలం రేకుల తండా గ్రామ పరిధిలోని రూప్లా తండాకు చెందిన తేజావత్ రెడ్డి, బాదావత్ చరణ్ స్కూటీపై రేకుల తండాలోని తేజావత్ నాగమణి, చరితను తీసుకొని కాంపల్లి వైపు వస్తున్నారు. ఈక్రమంలో కాంపల్లి వైపు వస్తున్న సోదరుల బైక్ను స్కూటీపై వెళ్తున్న వీరు ఢీకొట్టారు. దీంతో రెండు వాహనాలు కిందపడిపోవడంతో తేజావత్ రెడ్డి, బాదావత్ చరణ్, తేజావత్ నాగమణి, చరితతో పాటు సిద్ధు, వినోద్కు సైతం తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించడంతో ప్రాథమిక చికిత్స అనంతరం మానుకోటలోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. బాదావత్ చరణ్, తేజావత్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అలాగే మహబూబాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇమ్మడి సిద్ధు, వినోద్ పరిస్థితి బాగా లేకపోవడంతో వరంగల్కు తరలించారు. సీరోలు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గార్ల నుంచి వస్తున్న వారిలో ఒకరు హెల్మెట్ ధరించి ఉండగా ప్రమాదంలో రోడ్డు పక్కన పడిపోయింది. వేరే వాహనంపై ఉన్న నలుగురిలో ఎవరూ హెల్మెట్ పెట్టుకోలేదని తెలిసింది. కాంపల్లి–సీరోలు మధ్య ఉన్న రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి ప్రమాదం జరిగిందని కొందరు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీరోలు పోలీసులు తెలిపారు. అవగాహన కల్పించినా.. మార్పు శూన్యం ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా పోలీసులు ఎంతో ప్రచారం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అవగాహన కల్పించి హెల్మెట్ను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అయినా వాహనాలు నడిపే సమయంలో మరిచిపోయి ప్రమాదాల బారినపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న మార్పు రాకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. -
కవచ్ ట్రయల్ రన్ సక్సెస్
● కాజీపేట–పొత్కపల్లి స్టేషన్ల మధ్య టెస్ట్ కాజీపేట రూరల్ : కాజీపేట–పొత్కపల్లి రైల్వేస్టేషన్ మధ్య శుక్రవారం హైస్పీడ్ కారిడార్ ట్రయల్ రన్ సక్సెస్ అయిందని రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేట జంక్షన్ నుంచి ఉదయం కవచ్ ట్రయల్ రన్కు సంబంధించిన పరికరాలతో రెండు లోకోలతో ప్రారంభభమైన కవచ్ ట్రయల్ రన్ హసన్పర్తి, జమ్మికుంట, బిష్గిరిషరీఫ్, పొత్కపల్లి వరకు సాగింది. ఈ ట్రయల్ రన్లో రెండు లోకోల మధ్య ట్రాక్పై కొద్ది దూరంలో హెడ్ ఆన్ కొలిజన్ టెస్ట్, సైడ్ కొలిజన్ టెస్ట్ అనుకోకుండా జరిగే ప్రమాదాల నివారణ టెస్ట్, లోకో బ్రేక్ల టెస్ట్ జరిగిందని తెలిపారు. మరో రెండ్రోజుల పాటు ట్రయల్ రన్ ను ఉంటుందని వివరించారు. ట్రయల్ రన్ డీఎస్టీఈ ప్రా జెక్ట్ యుగేందర్, లోకో ఇన్స్పెక్టర్, ట్రాిఫిక్ ఇన్స్పెక్టర్, హెచ్బీఎల్ కంపెనీ బృందం ఆధ్వర్యంలో సాగిందన్నారు. కవచ్తో ప్రమాదాల నివారణ, భద్రత ఉంటుందని భవిష్యత్లో సేఫ్టి ఇంటిగ్రేటెడ్ లెవెల్ జీరో (సిల్–0) విధానంతో ఇంటర్నె ట్ ద్వారా సిగ్నల్స్ లేకుండా వ్యవస్థ కొనసాగనుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. కవచ్ ట్రయల్ రన్ ప్రారంభంలో కాజీపేట స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, సీనియర్ సెక్షన్ రిటైర్డ్ ఇంజనీర్ సిగ్నల్ ప్రాజెక్ట్ పీఎంఎస్ రామిండ్ల సారంగపాణి, టెలి ప్రాజెక్ట్ పీఎంఎస్ ఎం.సంపతి పాల్గొన్నారు. ఆటోమెటిక్ బ్లాక్ సిగ్నలింగ్ తనిఖీ కాజీపేట–బల్లార్షా మార్గంలో శుక్రవారం జమ్మికుంట నుంచి రామగుండం వరకు 20 కి.మీ. మేర చేపట్టిన నూతన ఆటోమెటిక్ బ్లాక్ సిగ్నలింగ్ (ఏబీఎస్) సిస్టంను దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ అధికారులు తనిఖీ చేశారు. సికింద్రాబాద్ నుంచి స్పీక్లో సీఎస్టీఈ ప్రాజెక్ట్ ఎం.కోటేశ్వర్రావు, డిప్యూటీ సీఎస్టీఈ ప్రాజెక్ట్ జి.కుమారన్, ఆధ్వర్యంలో తనిఖీ నిర్వహించారు. ఆటో మెటిక్ బ్లాక్ సిగ్నలింగ్ను ఈ నెల 16న ప్రాంభించన్నారు. ట్రాక్ పొడవునా ప్రతి కిలోమీటర్కు సిగ్నల్ పాయింట్ ఉంటుందని, స్టేషన్ మాస్టర్ ప్రతిసారి ట్రెయిన్కు సిగ్నల్ ఇవ్వనవసరం లేదని, కావల్సిన సమయంలో సిగ్నల్ ఆటోమెటిక్గా రిలీజ్ అవుతుందని రైల్వే అధికారులు తెలిపారు. -
మార్కెట్ సూపర్వైజర్లకు నోటీసులు
ఖిలా వరంగల్: వరంగల్ పాత లక్ష్మీపురం కూరగాయల మార్కెట్లో ప్లాట్ల కేటాయింపులో జరిగిన ఆవకతవకలు, రిజిస్టర్ మాయం కావడానికి కారుకులైన ఐదుగురు సూపర్వైజర్లకు అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. రాష్ట్ర మార్కెటింగ్ అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు గురువారం ఏనుమాముల వ్యవసాయ, కూరగాయాల మార్కెట్లను సందర్శించిన విషయం తెలిసిందే. కూరగాయాల మార్కెట్లో వ్యాపారులు, కమీషన్దారులకు 2021–2022లో కేటాయించిన ప్లాట్లు, తదితర వివరాలు నమోదు చేసిన రిజిస్టర్ మాయం కావడంపై లక్ష్మణుడు సీరియస్ అయ్యాడు. బాధ్యులైన సూపర్వైజర్లపై చర్యలు తీసుకోవాలని మార్కెట్ కార్యదర్శి మల్లేశాన్ని ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు శుక్రవారం ఐదుగురు సూపర్వైజర్లకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఏడు రోజుల్లో సమగ్రమైన వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో తదుపరి చర్యలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం. మార్కెట్ లైసెన్స్ జారీపై ఆరా? వరంగల్ ఏనుమాముల మార్కెట్కు చెందిన గాయత్రి చిల్లీస్ ట్రేడర్స్ యజమాని లడే తిరుపతి సుమారు రూ.2.30కోట్ల విలువైన మిర్చి కొనుగోలు చేసి పరారీ విషయం విదితమే..వరంగల్ చాంబర్ ఆఫ్కామర్స్ ప్రతినిధులు వినతి పై లడే తిరుపతిపై జేడీఎం లక్ష్మణుడు ఆరా తీసినట్లు సమాచారం. గతంలో జమ్మికుంట మార్కెట్లో మోసం చేసిన తీరు, గాయత్రి చిల్లీ ట్రేడర్పై పేరుతో లైసెన్స్ పొందిన తీరుపై అధికారులనుంచి నివేదికను కోరినట్లు తెలుస్తోంది. జమ్మికుంట మార్కెట్లో లైసెన్స్ జారీ చేసిన వ్యక్తి, వరంగల్ మార్కెట్లోలైసెన్స్ జారీ చేసిన కార్యదర్శి ఒక్కరే అనేది గుర్తించినట్లు తెలిసింది. లైసెన్స్ జారీ విధానంపై సమగ్ర నివేదికను అందజేయాలని ప్రస్తుత అధికారులను కోరినట్లు విశ్వసనీయ సమాచారం. ● రిజిస్టర్ మాయంపై అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు సీరియస్ -
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
హసన్పర్తి : నగరంలోని ఓ ఇంట్లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్, స్థానిక పోలీసులు దాడి చేసి 12 మందిని అరెస్ట్ చేశారు. వీరినుంచి సెల్ఫోన్లతో పాటు రూ.1.06 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు హనుమకొండ ఏసీపీ నర్సింహారావు తెలిపారు. శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. 56వ డివిజన్ గోపాలపురంలోని వేంకటేశ్వర కాలనీకి చెందిన గట్ల రాజేష్ ఇంట్లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు టాస్క్ఫోర్స్, స్థానిక పోలీసులకు సమాచారం అందగా దాడి చేసినట్లు పేర్కొన్నారు. అక్కడ ఓ వెబ్సైట్లో తమ ఫోన్లలో డబ్బులు పెట్టి క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. బెట్టింగ్కు పాల్పడుతున్న చింతగట్టుకు చెందిన గర్నపల్లి అరవింద్కుమార్, తూర్పుకోటకు చెందిన చిట్ల రాజేష్, దేవర వినయ్, జెట్టబోయిన కుమార్, చింతగట్టుకు చెందిన ముప్పారపు రాజేంద్రప్రసాద్, శ్రీపతిపల్లికి చెందిన వంగ శివకుమార్, బాషబోయిన శ్రీకాత్, ఈర్ల విఘ్నేష్, స్టేషన్ ఘన్పూర్ మండలం కొత్తపల్లికి చెందిన గంగుల అనిల్, బూర మధుకర్, పులిగిళ్ల రవీందర్ బాబుతో పాటు బెట్టింగ్ నిర్వహిస్తున్న రాజేష్ను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ నర్సింహారావు తెలిపారు. టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజు, కేయూ పోలీస్ ఇన్స్పెక్టర్ సుంకరి రవికుమార్, ఎస్సై నవీన్, ఆర్ఎస్సైలు భానుప్రకాశ్, సంతోష్, జె.రాజశేఖర్, సురేందర్, పి.సురేందర్, ఎన్.సాంబరాజు, ఏఏఓ సల్మాన్ పాల్గొన్నారు. వివరాలు వెల్లడించిన హనుమకొండ ఏసీపీ నర్సింహారావు -
సులభంగా డబ్బు సంపాదించాలని..
వరంగల్ క్రైం : సులభంగా డబ్బు సంపాదించాలని శివారు ప్రాంతాల్లోని సెల్ టవర్ల బ్యాటరీలు దొంగతనం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. శుక్రవారం కమిషనరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు. ముఠాలోని ఐదుగురిని హసన్పర్తి పోలీసులు అరెస్టు చేసినట్లు, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితులనుంచి రూ.1.98 లక్షల విలువైన 144 సెల్ టవర్ల బ్యాటరీలు, రూ.2.60 లక్షల నగదు, ట్రాలీలు, బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నల్లగొండ జిల్లాకు చెందిన కొంపల్లి గణేష్, బొంగరాల సుధాకర్, తన్నీరు శివాజీ, బీమనబోయిన నరసింహ, గడగోజు సురేష్ నిందితులుగా ఉన్నట్లు సీపీ తెలిపారు. ప్రధాన నిందితుడైన గణేష్ (డ్రైవర్), మిగిలిన ఇద్దరు సుధాకర్, శివాజీకి జనరేటర్ మరమ్మతు, సెల్ టవర్ పనుల్లో పరిజ్ఞానం ఉండటంతో ముఠాగా ఏర్పడి, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో సెల్ టవర్లకు వినియోగించే బ్యాటరీల చోరీలకు పాల్పడ్డారన్నారు. వీరు చోరీ చేసిన బ్యాటరీలను మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో విక్రయించగా వచ్చిన డబ్బుతో ముగ్గురు జల్సాలు చేసినట్లు పేర్కొన్నారు. వీరితో పాటు రాత్రివేళ చెరువుల్లో చేపల చోరీలకు పాల్పడే మిగతా సభ్యులు తోడవడంతో బ్యాటరీలు చోరీ చేసేందుకు అనుకూలమైన సెల్ టవర్లను గుర్తించి దొంగతనం చేసినట్లు సీపీ తెలిపారు. నిందితులు వరంగల్ కమిషనరేట్తోపాటు యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 13 సెల్ టవర్ బ్యాటరీలు చోరీకి పాల్పడినట్లు వెల్లడించారు. మార్చి 3న హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంతసాగర్ సెల్ టవర్ నుంచి 48 బ్యాటరీలు చోరీకి గురికావడంతో కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు శుకవ్రారం తెల్లవారుజామున చోరీ సొత్తును విక్రయించేందుకు దేవన్నపేట శివారులో ఔటర్ రింగ్రోడ్డు టోల్ గేట్ వద్ద వేచి ఉన్న ముఠాలోని ఐదుగురిని అరెస్టు చేశారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వివరించారు. అధికారులకు అభినందనలు నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, హసన్పర్తి ఇన్స్పెక్టర్ చేరాలు, ఎస్సైలు దేవేందర్, సుజీత్ రెడ్డి, కానిస్టేబుళ్లు క్రాంతి కుమార్, బావ్సింగ్, వెంకట స్వామి, భరత్తోపాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బందిని సీపీ అభినందించారు. సెల్ టవర్ల బ్యాటరీలు చోరీ నిందితుల అరెస్ట్, సొత్తు స్వాధీనం -
ఆటోను ఢీకొట్టిన టిప్పర్
● 23 మందికి గాయాలు వెంకటాపురం(ఎం) : కూలీలతో వెళ్తున్న ఆటోను వెనకనుంచి టిప్పర్ ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న 23 మంది మహిళలకు గాయాలయ్యాయి. ఎస్సై చల్లా రాజు కథనం ప్రకారం.. మండలంలోని వెల్తుర్లపల్లికి చెందిన మహిళలు శుక్రవారం ఉదయం కూలీ పనికి గణపురం వెళ్తున్నారు. మణుగూరు నుంచి భూపాలపల్లికి వస్తున్న టిప్పర్ ఆటోను ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తు న్న గుంటోజు సుగుణమ్మ, కాల్వచర్ల శ్రీలత, గోస్కుల సమ్మయ్య, కడారి ఒదెమ్మ, పొలం సారయ్య, రమాదేవిలకు తీవ్ర గాయాలైనట్లు ఎస్సై తెలిపారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో చికిత్స కోసం ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ సలీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు. మంత్రి సీతక్క పరామర్శ రోడ్డు ప్రమాదంలో గాయపడిన కూలీలను ములుగు ప్రభుత్వ ఆస్పత్రిలో మంత్రి సీతక్క పరామర్శించారు. క్షత్రగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆమె వైద్యులకు సూచించారు. -
28 నుంచి మే 5వ తేదీ వరకు నాన్ ఇంటర్లాకింగ్ పనులు
● 10 రైళ్లు రద్దు కాజీపేట రూరల్ : విజయవాడ డివిజన్లోని రాయనపాడు యార్డు రీమోడలింగ్తో చేపట్టిన నాన్ ఇంటర్లాకింగ్ వర్క్స్తో ఈ నెల 28వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు ప్రతి రోజు ప్రయాణించే పలు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం రైల్వే అధికారులు తెలిపారు. రద్దయిన రైళ్ల వివరాలు.. ఈ నెల 28 నుంచి మే 5వ తేదీ వరకు విజయవాడ–భద్రాచలం రోడ్ (67215) వెళ్లే ప్యాసింజర్, భద్రాచలం రోడ్–విజయవాడ (67216) వెళ్లే ప్యాసింజర్, విజయవాడ–డోర్నకల్ (67768) వెళ్లే ప్యాసింజర్, డోర్నకల్–విజయవాడ (67767) వెళ్లే ప్యాసింజర్ రైళ్లు రద్దు కానున్నాయి. మే 2 నుంచి 5వ తేదీ వరకు, కాజీపేట, వరంగల్ మీదుగా విజయవాడ–సికింద్రాబాద్ (12713) వెళ్లే శాతవాహన ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్–విజయవాడ (12714) వెళ్లే శాతవాహన ఎక్స్ప్రెస్, గుంటూరు–సికింద్రాబాద్ (17201) వెళ్లే గోల్కొండ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్–విజయవాడ (17202) వెళ్లే గోల్కొండ ఎక్స్ప్రెస్, గుంటూరు–సికింద్రాబాద్ (12705) వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్–గుంటూరు (12706) వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. లాకప్ డెత్పై విచారణ న్యూశాయంపేట : వరంగల్ జిల్లా గీసుకొండ పోలీస్ స్టేషన్లో 2003 మార్చి 7న కస్టడీలో ఉన్న పొలం వంశీకృష్ణ అనుమానాస్పద మృతిపై కలెక్టర్ మేజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో వరంగల్ ఆర్డీఓ సుమ శుక్రవారం విచారణ చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యులు తమ గోడును ఆర్డీఓకి వివరించారు. ఆ సమయంలో స్టేషన్లో ఉన్న ఇతర సాక్షులు, పోస్టుమార్టం తదితర నివేదికలను పరిశీలించి వారి వాంగ్మూలాలు సేకరించారు. ఈ నివేదికను కలెక్టర్కు సమర్పించనున్నట్లు ఆర్డీఓ తెలిపారు. -
ఎగువన జలకళ.. దిగువన వెలవెల
కన్నాయిగూడెం : నాడు జలకళను సంతరించుకున్న గోదావరి జీవనది.. నేడు నీరులేక సమ్మక్క సాగర్ బ్యారేజీ దిగువన ఇసుక మేటలు తేలి ఎడారిగా దర్శనమిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వ చ్చే నెలలో నీటి నిల్వలు పూర్తిగా తగ్గే పరిస్థితి ఉంది. దీంతో మండలంలో నీటి లభ్యత వనరుల్లో కొర త ఏర్పడుతుందని స్థానికులు చర్చించుకుంటున్నా రు. మండలంలోని తుపాకులగూడెం వద్ద ఉన్న స మ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద నీటిని నిల్వ చేయడంతో పైన మాత్రం జలకళ సంతరించుకుంది. దిగువ న కొంత నీరు మాత్రమే వస్తుండడంతో గోదావరి ప్రాంతం ఎడారిగా మారిపోయింది. దీంతో బ్యా రేజీ దిగువలోని గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. సమ్మక్క సాగర్ ఎగువన జలకళ.. వర్షాకాలంలో నీటి ప్రవాహంతో జలకళను తలపించిన గోదావరి ప్రాంతంలో ప్రస్తుతం నీరులేక ఇసుక మేటలు తేలాయి. ఎగువన ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద నీటి నిల్వతో బ్యారేజీ ప్రాంతం నిండుకుండను తలపిస్తుంది. కాగా గుట్టగంగారం వద్ద జె. చొక్కారావు ఎత్తిపోతల నుంచి నీటిని దిగువకు గొల్లబుద్ధారం రిజర్వాయర్కు నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఎగువ నుంచి తగ్గుతున్న ఇన్ఫ్లో.. తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీ లోకి ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లో క్రమంగా త గ్గుతోంది. వర్షాకాలంలో బ్యారేజీలోకి లక్షల క్యూసెక్కుల నీరు చేరినప్పటికి అది తగ్గుతూ.. ప్రస్తుతం 4,500 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అందులో బ్యా రేజీ గేట్లను ఎత్తి 3,086 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో పాటు దేవాదుల ఎత్తిపోతల నుంచి 1,414 క్యూసెక్కుల నీరు పంపింగ్ చేస్తు నీటిని దిగువకు ఎత్తిపోస్తున్నారు. రానున్న కాలంలో మిషన్ భగీరథకు నీటి కష్టాలు ఉంటాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. గోదావరి బ్యారేజీ దిగువన తేలిన ఇసుకమేటలు -
5.8 కిలోల గంజాయి పట్టివేత
మహబూబాబాద్ రూరల్ : అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకుని ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు మహబూబాబాద్ రూరల్ సీఐ ఎన్.అంజలి శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మానుకోట మున్సిపల్ పరిధిలోని శనిగపురం గ్రామం నుంచి మండలంలోని సోమ్లతండా గ్రామానికి వెళ్లే దారిలో సీసీఎస్ సీఐ హథీరాం, ఎస్సై కుష్ కుమార్, రూరల్ ఎస్సై వి.దీపిక, పోలీసులతో కలిసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో స్కూటీపై ముగ్గురు యువకులు వస్తుండగా పోలీసులు ఆపి విచారించారు. కాగా వారి వద్ద రూ.2.92 లక్షల విలువైన 5.840 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. కురవి మండలంలోని కంచర్లగూడెం గ్రామానికి చెందిన బానోత్ పవన్, నారాయణపురం గ్రామానికి చెందిన గుగులోత్ వినోద్ గంజాయిని శనిగపురం శివారు వీరారం తండాకు చెందిన బాదావత్ ప్రశాంత్, మానుకోట మండలంలోని దామ్యతండా జీపీ పరిధిలోని తోకబోడు తండాకు చెందిన నునావత్ రవీందర్, సీరోలు మండలం ఉప్పరిగూడెం గ్రామ శివారు తూకహాము తండాకు చెందిన మాలోత్ సందీప్నకు విక్రయించారు. వారు గంజాయిని అధిక ధరకు విక్రయించేందుకు జిల్లా కేంద్రానికి తీసుకు వస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రూరల్ ఎస్సై దీపిక ఫిర్యాదు చేయగా రూరల్ రెండో ఎస్సై రవికిరణ్ కేసు నమోదు చేశారు. పవన్, వినోద్ పరారీలో ఉండగా ప్రశాంత్, రవీందర్, సంతోష్ను రిమాండ్కు తరలించనున్నట్లు రూరల్ సీఐ అంజలి తెలిపారు. -
అనుమానాస్పద ంగా వివాహిత మృతి
● హత్య చేశారని బంధువుల ఆరోపణ? బచ్చన్నపేట : అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని ఆలింపూర్ గ్రామంలో శుక్రవారం జరిగింది. కాగా మహిళా మృతదేహం సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గుట్టల్లో లభ్యమైంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఆలింపూర్ గ్రామానికి చెందిన పటాన్ జరీనాకు (39) భర్త మృతి చెందడంతో ఆమె తన ఇద్దరు కుమారులతో కలిసి ఉంటున్నారు. కొన్నాళ్లు జనగామలో హోటల్ నిర్వహిస్తు జీవనం గడిపింది. ఇటీవల ఆలింపూర్కు వచ్చి ఉంటోంది. ఈక్రమంలో బుధవారం ఆమె ఆలింపూర్ నుంచి బయటికి వెళ్లి చుంచనకోట గుట్టల్లో శవమై తేలింది. గురువారం సాయంత్రం చేర్యాల పోలీసులు అనుమానాస్పద మహిళగా గుర్తించి సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. బంధువులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వెళ్లి చూసి మృతురాలు జరీ నాగా గుర్తించారు. కొంత మంది ఆమె తలపై బండరాళ్లతో కొట్టి హత్య చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. చేర్యాల పోలీసులు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జరీనా మృతితో ఆ లింపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వడదెబ్బతో మహిళ.. ఎల్కతుర్తి : కూలీ పనికి వెళ్లి ట్రాక్టర్లో ఇంటికి వస్తున్న ఓ మహిళ వడదెబ్బ తగిలి తీవ్ర అస్వస్థతకు గురై మార్గమధ్యలో మృతిచెందింది. ఈ సంఘటన ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్లో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ గ్రామానికి చెందిన బరిగెల శోభ (45) మండలంలోని కోతులనడుమ గ్రామానికి సీడ్ పనులకు వచ్చి ట్రాక్టర్లో తిరిగి వెళ్తోంది. కాగా మార్గమధ్యలో గోపాల్పూర్ వద్ద వడదెబ్బ తగిలి తీవ్ర అస్వస్థతకు గురై ట్రాక్టర్ ట్రాలీలోనే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం తెలు సుకున్న కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి న్యాయం కోసం ఆందోళన నిర్వహించారు. సమాచారం అందుకున్న ఎస్సై ప్రవీణ్కుమార్ సంఘటన స్థలా నికి చేరుకొని వారికి నచ్చజెప్పడంతో ఆందోళ న విరమించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం ఖిలా వరంగల్ : పట్టాలు దాటుతున్న ఓ వ్యక్తిని ప్రమాదవశాత్తు కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం నెక్కొండ మండలంలోని రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. వరంగల్ జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ సుదర్శన్ కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన చిట్యాల ఈశ్వర ప్రసాద్ (46) పుట్టుకతో చెవిటి, మూగ. వ్యక్తిగత పనిపై నెక్కొండకు చేరుకున్న అతడు అమ్మాపురం వెళ్తున్న క్రమంలో నెక్కొండ రైల్వే స్టేషన్ సమీప యార్డ్ వద్ద రైలు పట్టాలు దాటుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టడంతో ఈశ్వర ప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని అతని కుమారుడు సాయిరాంకు అప్పగించినట్లు జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ సుదర్శన్ తెలిపారు. -
సబ్ జైలులో మెగా హెల్త్ క్యాంప్
మహబూబాబాద్ రూరల్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కేంద్రంలోని సబ్ జైలులో గురువారం మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జైలర్ మల్లెల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రజాపాలనలో భాగంగా సబ్ జైలులో ఖైదీలకు ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించామన్నారు. వైద్యాధికారుల సహకారంతో విచారణ ఖైదీలకు మొబైల్ ఎక్స్ రే మెషీన్లతో పరీక్షలు నిర్వహించామని, ఐదుగురు ప్రధాన డాక్టర్లతో సహా పెద్ద సంఖ్యలో టెక్నీషియన్లు, మెడికల్ వలంటీర్లు ఏకకాలంలో ప్రతి ఖైదీకి, జైలు సిబ్బందికి సైతం వైద్య సహాయం అందించారని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ జైలర్ పట్టెం భిక్షపతి, వడ్డెబోయిన శ్రీనివాస్, సిటిజన్ ఫోరం సభ్యులు శంతన్ రామరాజు, మెడికల్ ఆఫీసర్లు అర్జున్, అనిత, ప్రియాంక, కల్యాణి, మౌనిక, అన్నపూర్ణ, శివరాం, ల్యాబ్ టెక్నీషియన్లు, ఆశకార్యకర్తలు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అతివేగంతోనే ప్రమాదాలుమహబూబాబాద్: వాహనాల సంఖ్య పెరగడం, అతివేగంగా డ్రైవింగ్ చేయడమే ప్రమాదాలకు కారణమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు అన్నారు. హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ సచివాలయం నుంచి గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్–అలైవ్ కార్యక్రమం అమలుపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రోడ్డు భద్రతపై తగిన చర్యలను చేపడుతున్నప్పటికీ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయన్నారు. ఈ నెల 13 నుంచి 18వ తేదీవరకు రాష్ట్ర వ్యాప్తంగా అరైవ్– అలైవ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలన్నారు . వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ స్నేహ శబరీష్ , ఎస్పీ శబరీష్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వశాఖలో కొలువు సాధించిన శ్రావణ్ ఇనుగుర్తి: మండలంలోని చిన్ననాగారం గ్రామానికి చెందిన బైరు శ్రావణ్ కుమార్ బుధవారం సాయంత్రం ప్రకటించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫలితాల్లో ఆల్ ఇండియా 7,078వ ర్యాంకు, ఓబీసీలో 2,837వ ర్యాంకు సాధించారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వ శాఖ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో సూపరింటెండెంట్ పోస్టు సాధించారు. ఉద్యోగం సాధించిన శ్రావణ్ కుమార్ను గ్రామ ప్రజలు అభినందించారు. గ్రామస్థాయి నుంచి బలోపేతం కావాలి గూడూరు: తెలంగాణలో బీజేపీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వద్దిరాజు రాంచందర్రావు అన్నారు. మండలంలోని మచ్చర్ల శివారు తార్యతండాలోని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్నాయక్ గృహంలో గురువారం పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు ప్రారంభించి మాట్లాడారు. బూత్స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించాలన్నారు. బీజేపీ కార్యపద్ధతి, సైద్ధాంతిక పునాది, పార్టీ చరిత్ర, వికాసం తెలియజేయాలన్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు వెంకన్న, సురేందర్, పూనెం మణిచందర్, సర్పంచ్లు వీరన్న, కమల, కార్యకర్తలు పాల్గొన్నారు. వేయిస్తంభాల దేవాలయ అభివృద్ధికి నిధులు హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల దేవాలయం పునరుద్ధరణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం మరో విడత భారీ నిధులను మంజూరు చేయడంపై బీజీపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మ హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఆమె పలువురు నాయకులతో కలిసి వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించారు. కేంద్ర పురావస్తుశాఖ (ఏఎస్ఐ) ద్వారా ఇటీవల మంజూరైన రూ.14.44కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. -
హెచ్ఐవీ నివారణకు ముందస్తు పరీక్షలు
నెహ్రూసెంటర్: హెచ్ఐవీ, ఎయిడ్స్పై సమాజంలో అవగాహన పెంపు, ముందస్తు పరీక్షల చేయడం ద్వారా వ్యాధిని నివారించవచ్చని డీఎంహెచ్ఓ రవి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. హెచ్ఐవీపై భయం అవసరం లేదని, సరైన సమయంలో పరీక్షలు చేయించుకోవడం వల్ల వ్యాధిని నియంత్రించవచ్చని తెలిపారు. సమాజంలో ఉన్న అపోహలు, వివక్షను తొలగించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. హెచ్ఐవీ బాధితులు ప్రభుత్వ వైద్య సేవలన వినియోగించుకోవాలని సూచించారు. నర్సింగ్ విద్యార్థులు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ సిబ్బంది, సర్వోదయ యువజన స్వచ్ఛంద సంస్థ సభ్యులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. ప్రోగ్రాం అధికారి అర్జున్, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి ప్రసాద్, శ్రీనివాస్, దిశ సారంగం, రమేశ్, వీరస్వామి, శాంతరాజ్ పాల్గొన్నారు. -
నో
శుక్రవారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026హెల్మెట్ ఎంట్రీ జిల్లాలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి కానుంది. పోలీస్శాఖ ఆధ్వర్యంలో ప్రతీ పోలీస్స్టేషన్ పరిధిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కాగా, మహబూబాబాద్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లోకి హెల్మెట్ ధరించకుండా వచ్చే ద్విచక్ర వాహనదారులను అనుమతించలేదు. – సాక్షి స్టాఫ్ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్ -
విద్యుత్ కార్మికులను క్రమబద్ధీకరించాలి
తొర్రూరు: విద్యుత్ కార్మికుల సేవలను క్రమబద్ధీకరించాలని ఎన్పీడీసీఎల్ జేఏసీ చైర్మన్ ధరావత్ సికిందర్ అన్నారు. విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ గురువారం డివిజన్ కేంద్రంలోని విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయం ఆవరణలో రెండో రోజు సమ్మె చేపట్టారు. సికిందర్ మాట్లాడుతూ.. విద్యుత్ కార్మికులను రెగ్యులర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలదేనన్నారు. విద్యార్హతల ఆధారంగా కార్మికులను కన్వర్షన్ చేయాలని, ఆర్టిజన్లకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్ వర్తింపజేయాలన్నారు. అన్మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ డివిజన్ చైర్మన్ పసుపులేటి మధు, నాయకులు జ్యోతి, సంధ్య, హరీశ్, రామకృష్ణ, ఉపేందర్, సుదర్శన్, పాషా, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్ మహబూబాబాద్: వేసవిలో నీటి ఎద్దడి లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అఽధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో గురువారం తాగునీరు తదితర అంశాలపై సంబంఽధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మిషన్ భగీరఽథ నీరు క్రమం తప్పకుండా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని నీటి సరఫరా చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
మార్పునకు ప్రయత్నించండి
● కొత్తపేటలో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎస్పీ శబరీష్బయ్యారం: గ్రామాలు, పట్టణాలను ప్రశాంత నిలయాలుగా మార్చేందుకు ప్రతీ ఒక్కరు తమ వంతు ప్రయత్నం చేయాలని ఎస్పీ శబరీష్ అన్నారు. మండలంలోని కొత్తపేట పంచాయతీ కార్యాలయంలో గురువారం 24 సీసీ కెమెరాల ప్రారంభంతో పాటు హెల్మెట్తో మోటార్సైకిల్ ర్యాలీ నిర్వహించిన అనంతరం ఎస్పీ మాట్లాడారు. జిల్లాలోని పలు పంచాయతీల్లో హెల్మెట్ ధరించాలని గ్రామసభల్లో తీర్మానం చేయడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇదేవిధంగా గంజాయి నిర్మూలనకు గ్రామపంచాయతీలు వేదిక కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతీ ఒక్కరి ప్రాణం విలువైనదని, హెల్మెట్ లేకుండా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయన్నారు. గ్రామాల్లో ఎవరైనా గంజాయి తాగినట్లు అనుమానం వస్తే సంబంధిత పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు భవిష్యత్లో మరొకరు గంజాయి బారిన పడకుండా తమశాఖ చర్యలు తీసుకుంటుందన్నారు. పంచాయతీ పరిధి లో 24 చోట్ల సీసీ కెమెరాలను పెట్టించిన సర్పంచ్ ప్రవీణ్నాయక్ను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో గార్ల–బయ్యారం సీఐ రవీందర్, ఎస్సై తిరుపతి, సర్పంచ్ ప్రవీణ్నాయక్, ఉపసర్పంచ్ వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. గంజాయి సమాచారం ఇవ్వండి మహబూబాబాద్ రూరల్: యువత ఆరోగ్యం, భద్రత, భవిష్యత్ను కాపాడటానికి గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడానికి జిల్లా పోలీసు శాఖ కట్టుబడి ఉందని ఎస్పీ శబరీష్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ దుర్వినియోగం ఒక తీవ్రమైన సామాజిక సమస్య అని, ఇది నిశ్శబ్దంగా యువత జీవితాలను నాశనం చేస్తూ కుటుంబాలను బలహీనపరుస్తుందన్నారు. గంజాయి లాంటి మహమ్మారిని అరికట్టడానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. గంజాయి వినియోగదారులు లేదా సరఫరా చేసే వ్యక్తుల గురించి విశ్వసనీయ సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారికి రూ.5 వేల వరకు బహుమతి ఇస్తామని, వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామన్నారు. 87126 56999 నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. -
రైతులకు సహకరించాలి
● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ మహబూబాబాద్ రూరల్ : మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాల సమయాల్లో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేదిలేదంటూ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి దినపత్రికలో ‘మక్క రైతు చిత్తు’ అనే శీర్షికన గురువారం ప్రచురితమైన కథనంపై ఎమ్మె ల్యే స్పందించారు. మానుకోట వ్యవసాయ మార్కె ట్ యార్డును సందర్శించి మక్కల కొనుగోళ్ల తీరు ను పరిశీలించి సంబంధిత అధికారులతో మా ట్లాడారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండించి విక్రయించేందుకు తీసుకువస్తున్న రైతులకు మార్క్ఫెడ్ శాఖ అధికారులు సహకరించి సకాలంలో కొనుగో ళ్లు జరపాలన్నారు. రైతులు వ్యవసాయ మార్కెట్ యార్డులో పడిగాపులు పడకుండా ప్రత్యేక చొరవ తీసుకుని కొనుగోళ్లు నిర్వహించి ఆర్థికంగా నష్టపోకుండా చూడాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో రైతులు మొక్కజొన్నలు విక్రయించేలా అవగాహన కల్పించాలని సూచించారు. తేమ శాతం వచ్చిన వాటిని కొనుగోలు చేసి వెంటనే కాంటాలుపెట్టి తరలించాలన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోత్ జ్యోతి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, వైస్ చైర్మన్ మదన్ గోపాల్ లోయ, సెక్రటరీ సృజన్ బాబు, రైతులు, కాంగ్రెస్ నాయకులు అంబటి వీరభద్రం, మిట్టకంటి రామిరెడ్డి తదితరులు ఉన్నారు. -
పిల్లలకు పౌష్టికాహారం అందించాలి
మహబూబాబాద్: పిల్లలకు పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ను గురువారం మంత్రి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అంగన్వాడీ టీచర్లు, సూపర్ వైజర్లకు సెల్ఫోన్లు పంపిణీ చేశారు. కలెక్టర్ స్నేహ శబరీష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ములుగు జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ కింద అంగన్వాడీ కేంద్రాలకు పాలు సరఫరా చేస్తున్నామని, త్వరలో అన్ని జిల్లాలో సరఫరా చేస్తామన్నారు. కల్తీ సరుకులు కేంద్రాలకు సరఫరా అయితే వెంటనే తిరస్కరించాలన్నారు. తొలి ఒడి అమ్మ అయితే మలి ఒడి అంగన్వాడీ కేంద్రాలు అన్నారు. అమ్మ మాట–అంగన్వాడీ బాట నినాదాలకే పరిమితం కాకుండా ఆచరణలో అమలు చేయాలన్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఒక డే కేర్సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. వయోవృద్ధులు బాధల నుంచి ఉపశమనం పొందడానికి సెంటర్లు ఉపయోగపడుతాయన్నారు. కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పోషణ్ పక్వాడ కార్యక్రమం చేపట్టిందన్నారు. అంగన్వాడీ టీచర్లకు ఓపిక ఉండడం వల్ల అంత మంది పిల్లలను చూసుకోగలుగుతున్నారన్నారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ మాట్లాడుతూ.. తల్లీబిడ్డ బాధ్యత అంతా అంగన్వాడీలపైనే ఉందన్నారు. పని తీరును మెరుగుపర్చుకోవడానికే సెల్ఫోన్లు అందించినట్లు చెప్పా రు. వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ప్రతీ నెల వారికి రూ.10,000 ఇవ్వాలని, లేకపోతే వేతనంలో 15శాతం ఇచ్చే విధంగా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ.. నిరంతరం సేవచేసే భాగ్యం అంగన్వాడీలకు కలిగిందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె.అనిల్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ జ్యోతి, డీడబ్ల్యూఓ సబిత, తహసీల్దార్ చంద్ర రాజేశ్వర్, సీడీపీఓ శిరీష, కౌన్సిలర్లు చిదిరాల అరుణ, నిమ్మల మాధవి, సీనియర్ సిటిజన్లు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగులు డ్యూటీ వదిలి రోడ్డెక్కొద్దు ఉద్యోగులు డ్యూటీ వదిలి రోడ్డెక్కొద్దని, సమస్యలను వేరేవిధంగా పరిష్కరించుకోవాలని మంత్రి ధనసరి సీతక్క అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో గురువారం మంత్రి సీతక్కను కలిసి తమ సమస్యలు చెప్పుకోవడానికి అధిక సంఖ్యలో పంచాయతీ కార్యదర్శులు వచ్చారు. కాగా వారిలో కొంత మందిని మాత్రమే మంత్రిని కలిసే అవకాశం ఇచ్చారు. అయితే కాన్వాయ్ వద్దకు అధిక సంఖ్యలో పంచాయతీ కార్యదర్శులు రావడంతో.. ఆమె స్వయంగా వారి వద్దకు వెళ్లి మాట్లాడారు. ఇటీవల కలెక్టర్ పంచాయతీ కార్యదర్శులందరినీ డిప్యుటేషన్ పేరుతో దూరప్రాంతాలకు బదిలీ చేశారని, చిన్నపిల్లలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని పక్క మండలాలకు బదిలీ చేయాలని విన్నవించారు. మంత్రి స్పందించి దూర ప్రాంతాలకు కాకుండా పక్క మండలాలకు డిప్యుటేషన్ వేసేవిధంగా కలెక్టర్కు చెబుతానన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ నాయకులు శ్రీకాంత్, ప్రవీణ్, ఉమేష్, రాజేష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. త్వరలో అన్ని అంగన్వాడీ కేంద్రాలకు పాలు సరఫరా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అంగన్వాడీలకు సెల్ఫోన్ల పంపిణీ -
పైరవీల జోరు..
● సీనియారిటీ పక్కన పెట్టి ఎంపిక చేసినట్లు ఆరోపణలు ● పీపీఎల్ఎస్, రెమ్యునరేషన్ కోసం ఉపాధ్యాయుల ఆరాటంజనగణన ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల కోసం పైరవీ సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనగణన చేపడుతోంది. ఈమేరకు జనగణన విధులు నిర్వర్తించేందుకు ఉపాధ్యాయులు పోటీ పడుతున్నారు. వేసవిలో పనితో పాటు తగిన పారితోషికం, పీపీఎల్ఎస్ రావడంతో డ్యూటీలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని పైరవీలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వ నిబంధనలు పక్కన పెట్టి కొందరు మండల విద్యాశాఖ అధికారులు నియామకాలు చేపట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. మే 11నుంచి గణన ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అంచనా వేయడం మొదలైన అవసరాలకోసం ప్రతీ పది సంవత్సరాలకోసారి జనగణన చేస్తారు. అయితే 2021లో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా చేపట్టలేదు. తర్వాత వివిధ కారణాలతో జనగణన చేయలేకపోయారు. దీంతో వచ్చే మే నెల నుంచి గణన చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ముందుగా మే 11 నుంచి జూన్ 9 వరకు ఇంటింటికి వెళ్లి ఇంటినంబర్ మొదలుకొని, ఇంటినిర్మాణ పరిస్థితి, కుటుంబ సభ్యుల సంఖ్య, కులం, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, డ్రెయినేజీ ఇలా మొత్తం 33 అంశాల వివరాలు సేకరిస్తారు. వీటి ఆధారంగా 2027 ఫిబ్రవరిలో జనగణన చేస్తారు. ఇందుకోసం మూడు విడతల్లో శిక్షణ ఇవ్వనున్నారు. రెమ్యునరేషన్.. జనగణన కాలంలో పనిచేసిన వారికి పారితోషికంతో పాటు, పీపీఎల్ఎస్ ఇస్తారు. జిల్లాలోని 18 మండలాలు, 482 గ్రామ పంచాయితీలతోపాటు, ఐదు మున్సిపాలిటీల్లో ముందుగా ఇళ్ల సంఖ్యను, తర్వాత జనాభాను లెక్కించాలి. ఇందుకోసం 1,450మంది ఎన్యుమరేటర్లు, 252 మంది సూపర్వైజర్లు మొత్తం 1,702 మందిని నియమిస్తారు. వీరికి గణన చేసిన కాలం, శిక్షణ కాలంలో ఒక్కరికి రూ. 25వేల మేరకు పారితోషికం ఇవ్వడంతోపాటు 16కు పైగా ఆర్జిత సెలవులు(పీపీఎల్ఎస్) ఇస్తారు. అంటే ఈ సర్వేలో పాల్గొన్న ఒక్కొక్కరికి వారి స్థాయిని బట్టి రూ.75వేల నుంచి రూ.లక్ష వరకు వస్తుంది. దీంతో ఈ డ్యూటీలు చేసేందుకు ఉపాధ్యాయులు పోటీ పడుతున్నారు. పైరవీలు.. సర్వేలు, లెక్కలు చేయడంలో ఉపాధ్యాయులు అయితే కచ్చితంగా ఉంటుందనే నమ్మకం. ఇందులో భాగంగానే జనగణన కోసం కూడా ఉపాధ్యాయులనే ఎంపిక చేస్తున్నారు. అయితే జిల్లా ఉన్నతాధికారుల నుంచి మండలాల వారీగా తహసీల్దార్ల పర్యవేక్షణ ఉంటుంది. కాగా, మండలాల వారీగా ఉపాధ్యాయుల ఎంపికప్రక్రియను మండల విద్యాశాఖ అధికారులకు అప్పగించారు. అయితే జనగణన చేసేందుకు ఉపాధ్యాయులు పోటీ పడడంతో కొందరు ఎంఈఓలు తమకు అనుకూలమైన వారికి, పైరవీలు చేసిన వారికి డ్యూటీలు వేసినట్లు సమాచారం. ఇలా చేయడం వల్ల పలు మండలాల్లో సీనియర్లకు కాకుండా జూనియర్లకు జనగణన డ్యూటీలు పడడంతో ఉపాధ్యాయులు నివ్వెరపోతున్నారు. ఈ విషయంపై అర్హులకు డ్యూటీలు వేయాలని పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు జిల్లా ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రాలు కూడా అందజేశారు. నిబంధనలు విస్మరించి ఇష్టారాజ్యంగా డ్యూటీలు వేసిన ఎంఈఓలపై చర్యలు తీసుకోవాలని, అర్హులకు డ్యూటీలు వేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు. -
దేవాదులలో ఒక మోటార్ ఆఫ్
● పంపింగ్ నిలిపేసిన అధికారులు కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం జీపీ పరిధిలోని గుట్టలగంగారంలో గోదావరి నదిపై ఉన్న దేవాదుల జే. చొక్కారావు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులో ఒక మోటారును గురువారం ఉదయం పంపింగ్ నిలిపి వేశారు. ఎత్తిపోతల వద్ద 3 ఫేజ్లలో పది మోటార్లు ఉండగా అందులో ఫేజ్ –1లో రెండు, ఫేజ్–2లో రెండు, ఫేజ్ –3లో ఆరు మోటార్లు ఉన్నాయి. అందులో కొన్నిరోజుల నుంచి ఫేజ్–2లో ఒక మోటారు, ఫేజ్–3లో ఐదు మోటార్లు మొత్తం ఆరు మోట్లాతో పంపింగ్ను కొనసాగించిన ఇంజనీరింగ్ అధికారులు.. గురువారం ఫేజ్ –3లోని ఒక మోటారు పంపింగ్ను బంద్ చేశారు. ఐదు మోటార్లతో 1,414 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నట్లు అధికారుల లెక్కలు తెలుపుతున్నారు. ఐదు మోటార్లతో దిగువన ఉన్న భీంఘన్పుర్ రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోస్తున్నట్లు తెలుస్తోంది. వేసవి కావడంతో తాగు నీటి అవసరాల దృష్టితో దిగువన నీటివినియోగాన్ని బట్టి వివిధ మోతాదుతో నీటిని పంపింగ్ చేస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు -
వందశాతం అడ్మిషన్లు సాధించాలి
న్యూశాయంపేట : ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న తెలంగాణ మైనార్టీ గురుకులాల్లో వంద శాతం అడ్మిషన్లు సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ మైనార్టీ గురుకులాల విద్యాసంస్థ(టెమ్రిస్) డిప్యూటీ సెక్రటరీ జుబేదా బేగం తెలిపారు. గురువారం హనుమకొండ కేయూ క్రాస్లోని వరంగల్(జి1) బాలికల గురుకులంలో ఉమ్మడి వరంగల్ జిల్లా రీజినల్ కో–ఆర్డినేటర్ జంగా సతీశ్ అధ్యక్షతన ప్రిన్సిపాళ్లతో జరిగిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిండంతో పాటు నాణ్యమైన విద్యనందించే దిశగా ముందుకు సాగాలన్నారు. కార్పొరేట్ స్థాయిలో ఉన్న మైనార్టీ గురుకులాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో విజిలెన్స్ అధికారులు సయ్యద్ అక్బర్, మక్బూల్పాషా, కో–ఆర్డినేటర్ రుహీనా, ప్రిన్సిపాళ్లు భిక్షపతి, కృష్ణకుమారి, నీరజ, నీలిమాదేవి, శ్రీపాల, శ్రీనివాస్, శ్రీనివాస్రావు, రాజు, కుమార్, మాధవి, శ్రీలత, రిజ్వానా షమీమ్, అన్నపూర్ణ, శ్రీలత, రహీం, అనిల్ బాబు, కౌన్సిలర్ సర్వర్ ఘాజీ, సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు. టెమ్రిస్ డిప్యూటీ సెక్రటరీ జుబేదాబేగం -
వారసుడిగా చూపించాలని శిశువు అపహరణ
జనగామ: జనగామ ఎంసీహెచ్లో పసికందు అపహరణకు యత్నించి పట్ట్టుబడిన మహిళ తాళ్లపల్లి జ్యోతి అలియాస్ శాగ జ్యోతిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ తెలిపారు. గురువారం పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ సత్యనారాయణరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని రఘునాథపల్లి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన తాళ్లపల్లి రాజుతో జ్యోతికి వివాహం జరగ్గా, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 2021లో రాజు అనారోగ్యంతో మృతి చెందాడు. 2022లో శాగ సురేశ్తో జ్యోతి రెండో వివాహం చేసుకుంది. సురేష్కు మొదటి భార్య ద్వారా ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. గత ఆగస్టులో జ్యోతి గర్భవతి కావడంతో వైద్య పరీక్షలు చేయించుకుంది. లింగనిర్ధారణలో మళ్లీ ఆడశిశువు పుడుతుందని తేలడంతో భయంతో ఈ విషయం భర్తకు, తల్లిదండ్రులకు తెలియనివ్వకుండా జ్యోతి గర్భస్రావం చేసుకుంది. కానీ, తన భర్తను నమ్మించడానికి, కుటుంబానికి వారసుడిగా మగబిడ్డను చూపించాలనే ఉద్దేశంతో శిశువును అపహరించాలని ఆలోచించింది. ఈక్రమంలో గతంలో జనగామ ఎంసీహెచ్ ఆస్పత్రిలో చెకప్ కోసం వెళ్లినప్పుడు అక్కడి రద్దీని గమనించి సులభంగా శిశువును తీసుకెళ్లవచ్చని భావించింది. ఈ నెల8వ తేదీన సాయంత్రం జ్యోతి ఎంసీహెచ్లోని పిల్లల వార్డులోకి ప్రవేశించింది. అదే సమయంలో ఓ బాబు ఏడుస్తుండడాన్ని గమనించిన జ్యోతి డైపర్ మార్చాలంంటూ సెక్యురిటీ గార్డును నమ్మించి ఎస్ఎన్సీయూ వార్డులోకి వెళ్లింది. శిశువుకు ఫీడింగ్ ఇస్తానని చెప్పి ఆ బాబును చేతిలోకి తీసుకుని, ఓ ఆటోలో జనగామ వైపు బయల్దేరగా, ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా మారడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆమెను వెంటాడి పట్టుకున్నారు. అనంతరం బిడ్డను సురక్షితంగా చంపక్ హిల్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. జ్యోతి వైద్య పరీక్షలు చేయించుకోగా ఆడశిశువు పుడుతుందని తేలినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. ఆ స్కానింగ్ సెంటర్ ఎక్కడ? అనే విషయమై ఆమె నోరు మెదపలేదు. దీంతో జ్యోతిని రిమాండ్ చేసిన పోలీసులు, సమగ్ర విచారణ కోసం తిరిగి కస్టడీకి కోరారు. జనగామలో స్కానింగ్ తీశారా లేక ఇంకా ఎక్కడైనా చేయించారా? అన్న సంగతి విచారణలో తేలనుందని ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ తెలిపారు. సమావేశంలో ఎస్సైలు భరత్, రతీశ్, మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. పసికందును ఎత్తుకెళ్లేందుకు యత్నించిన కేసులో మహిళ రిమాండ్ వివరాలు వెల్లడించిన జనగామ ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ -
ఓటీ.. లూటీ
హన్మకొండ: ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరలో విధులు నిర్వహించిన ఆర్టీసీ ఉద్యోగులకు వరంగల్ రీజియన్ అధికారులు ఓవర్ టైమ్ (ఓటీ) విధులకు సరిగా చెల్లింపులు చేయకుండా ఆర్థిక నష్టం కలిగించారు. నిద్రహారాలు మాని విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు మొండిచేయి చూపారు. శ్రమకు సరైన చెల్లింపులు చేయకుండా దోపిడీకి పాల్పడ్డారు. మేడారం జాతరంటేనే మానసికంగా, శారీరకంగా శ్రమించాల్సి ఉంటుంది. సమయం అనేది లేకుండా విధులు నిర్వర్తించిన ఉద్యోగులను ఆర్థికంగా దెబ్బకొట్టారని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. రోజుకు 12 గంటలు పని.. ఫిబ్రవరి చివరలో జరిగిన మేడా రం మహాజాతరలో ఆర్టీసీ ఉద్యోగులు 6 నుంచి 8 రోజుల పాటు రోజుకు 12 గంటలు పని చేశారు. రోజుకు 8 గంట లు పని చేయాల్సి ఉండగా 12 గంటలు పని చేశారు. ఈ లెక్కన చేసినా ప్రతీ రోజు నాలుగు గంటలు ఓటీ చెల్లించాలి. అయితే ఇక్కడ కొందరు అధికారులు యాజమాన్యం మెప్పు కోసం ఖర్చులు తగ్గింపు చూపడానికి అత్యుత్సాహం చూపారని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. యాజమాన్యం మెప్పు కోసం ఉద్యోగుల పొట్ట కొట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. నచ్చిన లెక్కలు వేసుకున్న రీజినల్ ఆఫీస్ అధికారులు.. రాష్ట్రంలోని వివిధ డిపోల నుంచి డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, ఇతర ఉద్యోగులు మేడారం జాతరలో విధులు నిర్వర్తించారు. సరైన విశ్రాంతి గదులు, భోజనం లేకపోయినా, దోమల బెడద వంటి సమస్యలను ఎదుర్కొని సంస్థ కోసం పని చేస్తే తమకు ఆర్థికంగా ఎలా నష్టం చేస్తారని ఉద్యోగులు నిలదీస్తున్నారు. డిపో మేనేజర్లు ఉద్యోగి వారీగా పని చేసిన రోజులు, ఓటీ వివరాలు పక్కాగా పంపినా రీజినల్ కార్యాలయం అధికారులు వీటిని తోసిరాజని వారికి నచ్చిన లెక్కలు వేసుకుని నిండా ముంచారని ఉద్యోగులు బాధపడుతున్నారు. 7 నుంచి 8 రోజులకు 28 నుంచి 32 గంటల ఓటీకి మూడు నుంచి నాలుగు రోజులకు 12 నుంచి 16 గంటల ఓటీ మాత్రమే చెల్లించారని ఉద్యోగులు వివరించారు. మరికొందరికి భారీగా కోతలు విధించారని వాపోయారు. మేడారం జాతరలో ఓవర్ టైమ్కు సరిగ్గా చేయని చెల్లింపులు ఆర్టీసీ వరంగల్ రీజియన్ అధికారుల శ్రమ దోపిడీ నిద్రాహారాలు మాని పని చేసిన ఉద్యోగులకు చెల్లింపుల్లో కోతలు భగ్గుమంటున్న ఉద్యోగులుజాతర అడ్వాన్్స్గా ఒక్కో కార్మికుడికి రూ.5,000 చెల్లించగా, ఆ మొత్తాన్ని తిరిగి తీసుకున్నట్లు ఎంప్లాయి యాప్లోని పే స్లిప్లో చూపించారని, కానీ ఓటీ వివరాలు మాత్రం అందులో పేర్కొనలేదని ఉద్యోగులు తెలిపారు. ఓటీ వివరాలు పే స్లిప్లు చూపిస్తే ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత, నిరసన వ్యక్తమవుతుందనే భావించే అధికారులు ఓటీ వివరాలు చూపించలేదని తెలిపారు. ఇప్పటికై నా ఆర్టీసీ యాజమాన్యం, ఆర్టీసీ ఎండీ, ప్రభుత్వం స్పందించిన ఆర్టీసీ కార్మికులకు న్యాయంగా రావాల్సిన ఓటీ మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. -
వ్యాపారుల ఆందోళనతో నిలిచిన కొనుగోళ్లు
ఖిలా వరంగల్ : గాయత్రి మిర్చి యజమాని రూ.3కోట్లతో పరారైన విషయం విధితమే. ఈ ఘటనలో సదరు వ్యాపారిని చట్ట ప్రకారం శిక్షించి న్యాయం చేయాలని వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రధాన కార్యాలయం ఎదుట చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో గురువారం వ్యాపారులు ఆందోళన నిర్వహించారు. దీంతో మిర్చి, ఇతర కొనుగోళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విషయం తెలిసి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వ్యాపారులతో మాట్లాడి ఆందోళనను విరమింప చేశారు. అనంతరం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి మాట్లాడుతూ వ్యాపారుల నుంచి సుమారు రూ.3కోట్ల మిర్చి కొనుగోలు చేసి పరారైన గాయత్రి చిల్లీస్ యజమానిని చట్ట ప్రకారం శిక్షించి సహ వ్యాపారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చాంబర్స్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ ప్రతినిధులు వేద ప్రకాశ్, సాగర్ల శ్రీనివాస్, పూర్వ అధ్యక్షుడు కటకం పెంటయ్య, అడ్తి సెక్షన్ అధ్యక్షుడు లింగారెడ్డి, చంద్రమౌళి, అల్లెం సంపత్, కంచె సంపత్, రమేశ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రైతుల నిరసన.. వరంగల్ మార్కెట్లో గురువారం ఉదయం వ్యాపారులు ఆ ందోళన చేయడంతో క్రయవిక్రయాలు నిలిచాయి. ఉద యం పది గంటలు దాటినా కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో రైతులు నిరసనకు దిగారు. వెంటనే మార్కెట్ అధికా రులు, పోలీసులు .. వ్యాపారులు, రైతులతో చర్చలు జరిపా రు. ఆలస్యమైనా కొనుగోళ్లను యాథావిధిగా కొనసాగాయి. పోలీసుల అదుపులో మిర్చి వ్యాపారి?ఏనుమాముల పోలీస్లు గురువారం గాయత్రి మిర్చి వ్యాపారిని అదుపులో తీసుకున్నట్లు తెలిసింది. తమదైన శైలిలో విచారణ చేపడుతున్నట్లు సమాచారం. నిందితుడు గతంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఇలాగే వ్యాపారంలో మోసం చేసి ఐపీ పెట్టి వరంగల్కు మకాం మార్చినట్లు తెలిసింది. రూ.3కోట్లతో పరారైన గాయత్రి మిర్చి యజమాని న్యాయం చేయాలని ‘చాంబర్’ ఆధ్వర్యంలో నిరసన -
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ బీఏ (ఎల్) రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ల పరీక్షల షెడ్యూల్ను పరీక్షల విభాగం అధికారులు గురువారం విడుదల చేశారు. రెండో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20, 22, 24, 27, 29, మే1, 4, 6వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తామని కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు తిరుమలాదేవి, వెంకటయ్య తెలిపారు. నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 21,23, 25, 28, 30, మే 2, 5, 7, 11 తేదీల్లో, ఆరో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20, 22, 24, 27, 29, మే 1, 4, 6, 8, 12, 14తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. బ్యాక్లాగ్ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షల టైంటేబుల్ కూడా విడుదల చేశారు. డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఏ (ఎల్ ) పరీక్షల ఐదో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 21, 23, 25, 28, 30, మే 2, 5, 7, 11, 13 తేదీల్లో, మొదటి సెమిస్టర్ పరీక్షలు మే 7, 8, 11, 13, 15, 18, 20, 22 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తారు. మూడో సెమిస్టర్ పరీక్షలు మే 12, 14, 16, 19, 21, 23, 25, 26. 28 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటలవరకు నిర్వహిస్తామని పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. -
మొక్కజొన్న కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం
హన్మకొండ: మొక్కజొన్న కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు విమర్శించారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన శాసనమండలి సమావేశాల్లో మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని, మద్దతు ధర ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉద్యమించినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనమూ లేదని తూర్పారబట్టారు. మహబూబాబాద్ జిల్లాలో మక్కల కొనుగోళ్లకు 18 సెంటర్లకు అనుమతిస్తే 12 సెంటర్లలో కొనుగోళ్లు చేపట్టామని చెబుతున్నా ఒక్క కేసముద్రం మార్కెట్లో మాత్రమే కొంటున్నారని వివరించారు. ఈ జిల్లాలో 95వేల క్వింటాళ్లు ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేస్తే ప్రభుత్వం 101 క్వింటాళ్లు మాత్రమే కొన్నదన్నారు. హనుమకొండ జిల్లాలో 90 వేల ఎకరాల్లో సాగు చేస్తే నాలుగు సెంటర్ల ద్వారా, ములుగు జిల్లాలో 40 వేల ఎకరాల్లో సాగు చేస్తే నాలుగు సెంటర్లు, వరంగల్ జిల్లాలో 6 సెంటర్లు ఓపెన్ చేస్తే ఒక్క సెంటర్లో మక్కలు కొంటున్నారని వివరించారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు రెండు రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వంనుంచి స్పందన లేదని విమర్శించారు. గుండ్ల సింగారానికి చెందిన మృతిచెందిన అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ కుటుంబాన్ని ఆదుకోవాలని, భార్యకు ఉద్యోగం, రూ.50 వేల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. స మావేశంలో ‘కుడా’ మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, నాయకులు సంకు నర్సింగరావు, జోరిక రమేశ్, ఉడతల సారంగపాణి, తాళ్లపల్లి జనార్దన్గౌడ్, పులి రజినీకాంత్, నయీమొద్దీన్, కోటేశ్వర్ రావు, సదాంత్, పున్నం చందర్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు -
సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలి
ఆర్టిజన్ ఉద్యోగులకు టీఎస్ఈఈయూ–327 వరంగల్ జిల్లా కార్యదర్శి బుచ్చయ్య గౌడ్ హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ వరంగల్ జిల్లా కార్యదర్శి మచ్చిన బుచ్చయ్య గౌడ్ డిమాండ్ చేశారు. విద్యుత్ ఆర్టిజన్ల సమ్మె రెండో రోజు గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమ్మె శిబిరం వద్ద కొనసాగింది. దీనికి ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఆర్టిజన్లను అర్హతను బట్టి రెగ్యులర్ ఉద్యోగులుగా కన్వర్షన్ చేయాలన్నారు. టీఎస్ఈఈయూ–327 హనుమకొండ జిల్లా కార్యదర్శి చిట్ల ఓదెలు, టీఆర్పీఏయూ నాయకులు మహేశ్, వెంకటరమణ, ఉపేందర్, సాయి కృష్ణ, టీఎస్ఈయూ–1104 నాయకులు శ్రీకాంత్, హరిహరాచారి సమ్మెకు సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. ఆర్టిజన్ ఉద్యోగుల హనుమకొండ జిల్లా జేఏసీ చైర్మన్ కోరుకొప్పుల రాంబాబు, నాయకులు మట్ల భిక్షపతి, నల్ల రాంబాబు, గజ్జల కుమార్, గడ్డం ప్రభాకర్, గండికోట ప్రసాద్, వెంకట్, వరుణ్, పూర్ణాచారి, శ్రీధర్, మహేందర్, మానస, జ్యోతి పాల్గొన్నారు. ట్రాన్స్కో జోనల్ కార్యాలయం వద్ద... టీజీ ట్రాన్స్ కో ఆర్టిజన్ ఉద్యోగులు రెండో రోజు సమ్మెలో పాల్గొన్నారు. హనుమకొండ పెద్దమ్మగడ్డలోని ట్రాన్స్ కో జోనల్ కార్యాలయం వద్ద ఆర్టిజన్లు ధర్నా చేపట్టారు. టీఆర్వీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాడ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ట్రాన్స్ కో రాష్ట్ర కన్వీనర్ వడ్డేపల్లి శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. టీవీఏఈ జేఏసీ ట్రాన్న్స్కో రాష్ట్ర కన్వీనర్లు కందికొండ వెంకటేష్, భరత్, ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ ఐలయ్య, కన్వీనర్ రాజన్న, జనరల్ సెక్రెటరీ సునీల్, తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో 15 వేల అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ
మహబూబాబాద్: రాష్ట్రంలో త్వరలో 15 వేల అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తామని, దీంతో ఖాళీలు భర్తీ అవుతాయని మంత్రి సీతక్క తెలిపారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్లో అంగన్వాడీలకు సెల్ఫోన్లు పంపిణీ చేశారు. తర్వాత పోషణ్ పక్వాడ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గురువారం నుంచి ఈ నెల 23 వరకు నిర్వహించే పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. అంగన్వాడీలు, ఆశ కార్యకర్తల వేతనాల పెంపు విషయంపై దృష్టి పెట్టామన్నారు. కారుణ్య నియామకాల విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. పోలీస్ శాఖ మాదిరిగానే అంగన్వాడీలకు కూడా ఒకే రకమైన డిజైన్ యూనిఫామ్ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో 37 వేలసెల్ ఫోన్లు అంగన్వాడీలకు కేటాయించగా, మహబూబాబాద్ జిల్లాలో 1,368 మంది అంగన్వాడీలకు ఇచ్చామన్నారు. అంగన్వాడీల సమస్యల విషయంలో జిల్లా నుంచి 5 నుంచి పది మంది ప్రతినిధులు వస్తే సమయం ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు భూక్య మురళీనాయక్, కోరం కనుకయ్య, కలెక్టర్ స్నేహ శబరీష్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంజీఎం, కేఎంసీ వైద్యులకు సన్మానం
● రాష్ట్ర స్థాయి పురస్కారం అందుకున్న నేపథ్యంలో..కాశిబుగ్గ: ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్ర మం సందర్భంగా హెల్త్ వీక్లో భాగంగా నిర్వహించిన సమావేశంలో వరంగల్ ఎంజీఎం, కేఎంసీ ఆర్థోపెడిక్, నెఫ్రాలజీ విభాగాలకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తూ చేతుల మీదుగా రాష్ట్రస్థాయిలో ఉత్తమ సేవా పురస్కారం అందజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం కేఎంసీ ఎన్ఆర్ఐ భవనంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ సత్యశారద ఆర్ధోపెడిక్ విభాగం, నెఫ్రాలజీ విభాగాలకు చెందిన వైద్యులను సన్మానించారు. అఽధిక ఖర్చుతో కూడిన కీళ్ల మార్పిడి సర్జరీలు, నెఫ్రాలజీలో అధిక మందికి డయాలసిస్ వైద్య సేవలు అందించడం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు సంఽధ్యారాణి, వైవీ గణేశ్, డీఎంహెచ్ఓ సాంబశివరావు, కేఎంసీ ప్రిన్సిపాల్ సంధ్యరాణి, ఎంజీఎం సూపరింటెండెంట్ హరిశ్చంద్రారెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్ అనిల్ బాలరాజు, ఆర్థోపెడిక్ హెచ్ఓడీ రాంకుమార్రెడ్డి, నెఫ్రాలజీ వైద్యులు మల్లీశ్వర్, కుమారస్వామి పాల్గొన్నారు. -
మూగ బాలికను చితకబాదిన పినతల్లి
● ఎంజీఎంలో చికిత్స.. ఆస్పత్రిలోనే పినతల్లిపై కేసు నమోదు కాజీపేట : ఓ మూగ బాలికను పిన తల్లి చితకబాదింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సదరు బాలిక ఎంజీఎం చికిత్స పొందుతోంది. బాధితురాలి అమ్మమ్మ ఎండీ సుల్తానా కాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కాజీపేట 47వ డివిజన్ డీజిల్ కాలనీ ప్రాంతానికి చెందిన ఎండీ అబుబక్కర్ మొదటి భార్య మృతి చెందింది. ఈ దంపతులకు ఎస్కే పాషా సిద్దికా (13 సంవత్సరాల వయసు)సంతానం. సిద్దికా పుట్టు మూగ. దీంతో మంచి చెడులను అమ్మమ్మ వాళ్లు చూసుకునేవారు. ఈ క్రమంలో ఇటీవల అబుబక్కర్.. రజియా అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల అమ్మమ్మ ఇంటి నుంచి పండుగకు వచ్చిన సిద్దికాను మంగళవారం పినతల్లి చితకబాదడంతోపాటు శరీరంపై కాల్చింది. దీంతో తీవ్రంగా గాయపడి తల్లాడిల్లుతున్న బాలికను చూసి చలించిన అమ్మమ్మ వెంటనే ఎంజీఎంలో చేర్పించగా చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై సుల్తానా ఫిర్యాదు మేరకు ఎస్సై శివ బుధవారం ఎంజీఎం వెళ్లి వైద్యులతో చర్చించి పినతల్లి రజియాపై కేసు నమోదు చేశారు. కాగా, చైల్డ్వేల్ఫేర్ అధికారులు చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి వివరాలు సేకరించారు. గంజాయి, గంజాయి చాక్లెట్ల పట్టివేత ● ఏడుగురిపై కేసు నమోదు కాజీపేట : కాశీ నుంచి గంజాయి, గంజాయి చాక్లెట్లతో రైలులో కాజీపేటకు వచ్చిన ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం రాత్రి కాజీపేట పీఎస్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వరంగల్కు చెందిన కందగట్ల రాజేశ్ (ఆటో డ్రైవర్, కరీమాబాద్), ముద్దెన శివకుమార్ (మేసీ్త్ర, కరీమాబాద్), దేవులపల్లి నిఖిల్ (కరీమాబాద్), పిట్టల పవన్(కూలీ), రౌతు రవితేజ (ఫ్లైవుడ్ షాపు), కందగట్ల రవీందర్ (ఆటో డ్రైవర్), సయ్యద్ ఖాజాపాషా (ఏసీ మెకానిక్)లు మిత్రులు. వీరు కాశీ నుంచి గంజాయి, గంజాయి చాక్లెట్లతో కాజీపేటలో రైలు దిగి వెళ్తుండగా పెట్రోలింగ్లో ఉన్న ఎస్సై లవన్కుమార్ పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 30 గ్రాముల శుద్ధి చేసిన గంజాయి, 830 గ్రాముల చాక్లెట్లు, 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
సరుకు పెరిగింది.. ధర తగ్గింది
● ధరలు తక్కువగా నిర్ణయించారని రైతుల ఆందోళన మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్కు బుధవారం అధిక మొత్తంలో మిర్చి రాగా.. ధరలు తగ్గిపోయాయి. ఈమేరకు రైతులు ఆందోళనకు దిగి మార్కెట్ సిబ్బందితో వాగ్వాదం చేసి రోడ్డెక్కే ప్రయత్నం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మార్కెట్ సిబ్బంది రైతులకు లాట్ ఐడీలు కేటాయించిన తర్వాత వ్యాపారులు మిర్చి కొనుగోళ్లను ప్రారంభించారు. ఈ క్రమంలో ఎస్ఆర్ఆర్ సంస్థకు చెందిన వ్యాపారి మిర్చి కొనుగోళ్లు చేపట్టిన అనంతరం ధరలు నిర్ణయించే సమయంలో తక్కువగా వేశారని రైతులు ఆరోపించారు. కొంతమంది రైతులకు అధిక ధరలు నిర్ణయించగా.. మరి కొంతమందికి ధర తక్కువ నిర్ణయించి కొనుగోళ్ల లిస్టు ప్రకటించారని రైతులు ఆందోళన చేశారు. ఈమేరకు ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, సెక్రటరీ సుజన్ బాబు రైతులతో మాట్లాడి మంచి ధరతో కొనుగోళ్లు చేపట్టే విధంగా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
ముఖ గుర్తింపు హాజరు తప్పనిసరి
కేయూ క్యాంపస్: యూనివర్సిటీలో బోధన, బోధనేతర ఉద్యోగులకు ముఖ గుర్తింపు హాజరు తప్పనిసరిగా చేశామని, ఇక నుంచి వేతానాల చెల్లింపుతో ముఖగుర్తింపు హాజరు అనుసంధానం చేయబోతున్నామని కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి అన్నారు. బుధవారం కాకతీయ యూనివర్సిటీలోని సెనెట్హాల్లో యూనివర్సిటీ కాలేజీల ప్రిన్సిపాళ్లు, వివిధ విభాగా ల డీన్లు, విభాగాల అధిపతులు, బోర్డు ఆఫ్ స్డడీస్ చైర్మన్లతో నిర్వహించిన అవగాహన సమావేశంలో ప్రతాప్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అధ్యాపకులు, నాన్టీచింగ్ ఉద్యోగులకు సెలవుల మంజూరు అధికారం ప్రిన్సిపాళ్లకు ఉంటుందన్నా రు. ప్రతీ అధ్యాపకుడు, ఉద్యోగి నిర్దేశించిన సమయం ప్రకారం క్యాంపస్లో ఉండేల్సిందేనని స్పష్టం చేశారు.రాబోయే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు కూడా ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని అమలుచేయబోతున్నామని వెల్లడించారు. రిజిస్ట్రార్ వి.రామచంద్రం మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి లీవ్ల నిర్వహణను పూర్తిగాముఖ గుర్తింపు హాజరువిధానం ద్వారానే చేపడుతామన్నారు. ప్రారంభ దశలో వచ్చే సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరిస్తామన్నారు. కంప్యూటర్ సైన్స్ విభాగం అధిపతి రమ మాట్లాడుతూ యూనివర్సిటీ ప్రాంగణంలో వివిధ ప్రాంతాల్లో పది పరికరా లను ఏర్పాటుచేశామన్నారు. విభాగాల్లో మొబైల్ ఆధారిత అప్లికేషన్స్ అమలు చేసినట్లు తెలిపారు. త్వరలోనే పార్ట్టైం అధ్యాపకుల నమోదు ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుందన్నారు. కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి -
దాతలూ.. దయ చూపండి!
లింగాలఘణపురం : ‘దాతలు.. దయ చూపండి. నా కొడుకును కాపాడండి. నా పుత్రుడి ప్రాణం కోసం నేను కిడ్నీ ఇస్తా..కానీ ఆ అవయవ మార్పిడికి అయ్యే ఖర్చు భరించలేను. దీనిపై మనస్సున్న మహారాజులు స్పందించి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలి’ అని ఓ తల్లి చేతులెత్తి వేడుకుంటోంది. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం సిరిపురం గ్రామానికి చెందిన గండి సురేశ్ ట్రాక్టర్ మెకానిక్గా పని చేస్తున్నాడు. ఉన్నంతలో భార్య మౌనిక, కుమారుడు రిత్విక్, కూతురు సహస్ర, తల్లి ఉప్పలమ్మను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా బీపీ ఎక్కువై ఆస్పత్రికి వెళ్లాడు. వైద్యులు పరీక్షించి బీపీ ఎక్కువై కిడ్నీలపై ప్రభావం చూపిందని, పెద్ద దవాఖానాలకు వెళ్లాలని చెప్పడంతో పలు ఆస్పత్రులన్నీ తిరిగి వైద్యం చేయించుకున్నాడు. అయినా ఫలితం లేకుండా పోవడంతో కిడ్నీ మార్పిడి ఒక్కటే శరణ్యమని వైద్యులు చెప్పారు. దీంతో సురేశ్ తల్లి ఉప్పలమ్మ తన కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కాని మార్పిడికి అయ్యే వైద్యం ఖర్చులు సుమారు రూ.30 నుంచి 40 లక్షలు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో అంతా మొత్తం భరించలేనంటూ ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది. విరాళాల కోసం ప్రయత్నం.. సురేశ్ కిడ్నీ మార్పిడి కోసం స్నేహితులు, గ్రామస్తులు ముందుకొచ్చి విరాళాలు సేకరించే ప్రయత్నం మొదలు పెట్టారు. హైదరాబాద్లో స్థిరపడిన కొందరు గ్రామస్తులు కూడా ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. గ్రామస్తుల సాయం రూ.2.23 లక్షలు.. సిరిపురం డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో సేకరించిన రూ.2,23,950 ఆర్థిక సాయాన్ని బుధవా రం బాధితుడు సురేశ్కు అందజేశారు. సురేశ్ మా ట్లాడుతూ తనకు గ్రామస్తులు అందించిన సా యం ఎంతో గొప్పదన్నారు. ప్రత్యేకంగా బెల్లం వేణుగోపాల్, ప్రొఫెసర్ లక్ష్మినారాయణ,తదిత రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఫోరం సభ్యులు శ్రీనివాస్,రవీందర్, కుమారస్వామి పాల్గొన్నారు. నేను కిడ్నీ ఇస్తా.. ఆర్థిక సాయం చేసి ఆదుకోండి చేతులెత్తి వేడుకుంటున్న తల్లి కిడ్నీ సమస్యతో బాధపడుతున్న కుమారుడు -
మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
బయ్యారం: దంపతుల మధ్య జరుగుతున్న వివాదాలతో మనస్తాపం చెందిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఇర్సులాపురంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వట్టం లక్ష్మయ్య కూతురు అరుణ(35)కు ఇదే మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన ప్రసాద్తో పదేళ్ల క్రితం వివాహం జరగగా ఇరువురు సంతానం. ఈ క్రమంలో దంపతుల మధ్య అప్పుడప్పుడు వివాదాలు చోటుచేసుకుంటుండగా అరుణ మంగళవారం పుట్టింటికి వచ్చింది. తెల్లవారుజామున బాత్రూమ్కి వెళ్లి తన చీరతో ఉరేసుకుంది. బాత్రూమ్కి వెళ్లిన కుమార్తె బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి బుచ్చిరాములమ్మ తలుపులు కొట్టి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. తలుపులు పగులకొట్టిచూడగా అప్పటికే అరుణ మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి సోదరుడు నరేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. తాటిచెట్టుపైనుంచి పడి గీత కార్మికుడి మృతి ఐనవోలు: తాటిచెట్టుపై నుంచి పడి ఓ గీత కా ర్మికుడి మృతి చెందాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం వనమాల కనపర్తిలో చో టు చేసుకుంది. స్థాని కుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గట్టు రజినీకాంత్(25) గీత కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబానికి ఆసరా అవుతున్నాడు. ఈ క్రమంలో రోజుమాదిరిగానే బుధవారం తాటి చెట్టు ఎక్కుతున్న క్రమంలో ప్ర మాదవశాత్తు జారి పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడడంతో స్థానికులు, కుటుంబీకులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందా డు. దీంతో తల్లిదండ్రులు విజయ, నాగేశ్.. కు మారుడి మృతదేహం మీద పడి గుండెలవిసే లా రోదించారు. ఇది చూసిన గ్రామస్తులు కన్నీ టిపర్యాంతమయ్యారు. ప్రభుత్వం మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞ ప్తి చేశారు. కాగా, మృతుడు అవివాహితుడు. వడదెబ్బతో వ్యక్తి మృతి పర్వతగిరి:వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని కల్లెడలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యాసారపు యాకయ్య(55) మంగళవారం వ్యవసాయ పనుల నిమిత్తం బావి వద్దకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి చేరుకుని ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబీకులు స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్లోని ఓ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో బుధవారం తెల్లవారుజామున మార్గమధ్యలో మృతి చెందాడు. కాగా, నిరుపేద వర్గానికి చెందిన యాకయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
అంగన్వాడీలకు సెల్ఫోన్లు
మహబూబాబాద్: అంగన్వాడీ టీచర్లు, సూపర్ వైజర్లు, పోషణ్ అభియాన్ కోఅర్డినేటర్లకు ఐదేళ్లకోసారి సెల్ఫోన్లు పంపిణీ చేస్తున్నారు. కాగా, ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ఎట్టకేలకు ప్రభుత్వం జిల్లాకు సెల్ఫోన్లను సరఫరా చేసింది. వాటి పంపిణీకి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. గురువారం ముందుగా వయోవృద్ధుల కోసం ఏర్పా టు చేసిన మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్ను మంత్రి సీతక్క ప్రారంభిస్తారని, ఆతర్వాత సెల్ఫోన్లు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. 1,437 అంగన్వాడీ కేంద్రాలు.. జిల్లాలోని ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ల పరిధిలో 1,437 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. డోర్నకల్ ప్రాజెక్ట్ పరిధిలో డోర్నకల్, గార్ల, కురవి మండలాలు, గూడూరు ప్రాజెక్ట్ పరిధిలో గూడూరు, గంగారం, కొత్తగూడ మండలాలు, మానుకోట ప్రాజెక్ట్ పరిధిలో మానుకోట, కేసముద్రం, బయ్యారం మండలాలు, మరిపెడ ప్రాజెక్ట్ పరిధిలో చిన్నగూడూరు, దంతాలపల్లి, మరిపెడ, నర్సింహులపేట మండలాలు ఉన్నాయి. తొర్రూరు ప్రాజెక్ట్ పరిధిలో నెల్లికుదురు, తొర్రూరు, పెద్దవంగర మండలాలు ఉన్నాయి. వెంటాడుతున్న సిబ్బంది కొరత.. జిల్లాకు రెగ్యులర్ డీడబ్ల్యూఓ ఉండగా.. ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్ట్లకు గాను తొర్రూరు, గూడూరు సీడీపీఓ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇన్చార్జ్లకు బాధ్యతలు అప్పగించారు. అలాగే 1,437అంగన్వాడీ కేంద్రాలకు గాను 1,313 మంది టీచర్లు మాత్రమే ఉన్నారు. 954 మంది ఆయాలు ఉండగా.. మిగిలిన అన్ని పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. 58మంది సూపర్వైజర్లకు గాను 51 మంది మాత్రమే ఉన్నారు. ఆయా పోస్టుల ఖాళీలతో కేంద్రాల నిర్వహణ అంతంత మాత్రంగానే కొనసాగుతోంది. జిల్లాకు 1,368 సెల్ఫోన్లు.. 2019లో ఐసీడీఎస్ సిబ్బందికి సెల్ఫోన్లు అందజేశారు. కాగా, 2024లో ఇవ్వాల్సి ఉండగా.. ఏడాది ఆలస్యంగా ప్రస్తుతం అందజేస్తున్నారు. ఈమేరకు జిల్లాకు 1,368 సెల్ఫోన్లు సరఫరా చేశారు. సామ్సంగ్ కంపెనీకి చెందిన సెల్ ఫోన్తో పాటు చార్జర్, మొబైల్ పౌచ్, వాటర్ ప్రూ పౌచ్ మరొకటి సరఫరా చేశారు. ప్రధానంగా ఎన్హెచ్టీఎస్, పోషణ్ ట్రాకర్ యాప్లు అందుబాటులో ఉంటాయి. దానిలో గర్భిణులు, బాలింతలు, పిల్లల రిజిస్ట్రేషన్లు, రోజువారి హాజరు, కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ అన్ని నమోదు చేయాలి. హెల్త్, న్యూట్రిషన్, టీహెచ్ఆర్ ఇతర వివరాలు అన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. కాగా పాత సెల్ఫోన్లతో అంగన్వాడీలు ఇబ్బందులు పడ్డారు. నేడు పంపిణీ.. జిల్లా కేంద్రంలో గురువారం మందుగా మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్ను మంత్రి సీతక్క ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. ఆ తర్వాత కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో అంగన్వాడీలు, సూపర్వైజర్లకు కొత్త సెల్ఫోన్లు, సంబంధిత సామగ్రిని పంపిణీ చేస్తారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఏర్పాట్లు పూర్తి జిల్లాకు సరఫరా చేసిన సెల్ఫోన్లను గురువారం మంత్రి సీతక్క చేతుల మీదుగా పంపిణీ చేస్తాం. అందుకు ఏర్పాట్లు చేశాం. అలాగే మంత్రి మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్ను ప్రారంభిస్తారు. మంత్రితో పాటు ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించాం. కొత్త సెల్ఫోన్లతో అంగన్వాడీలకు చాలా వరకు యాప్లలో తలెత్తుతున్న సమస్యలు తీరుతాయి. అందరికీ సమాచారం ఇచ్చాం. – సబిత, డీడబ్ల్యూఓ జిల్లాకు 1,368 సరఫరా నేడు మంత్రి చేతుల మీదుగా పంపిణీ సిబ్బందికి తీరనున్న యాప్ కష్టాలు -
ఎకై ్సజ్శాఖలో బదిలీల సందడి
సాక్షి, మహబూబాబాద్: ఎకై ్సజ్శాఖలో బదిలీల ప్రక్రియ మొదలైంది. ముందు కానిస్టేబుళ్లు, తర్వాత ఎస్సైలు, ఆ తర్వాత సీఐ, ఇతర ఉన్నతాధికారుల బదిలీలు అనివార్యమనే సంకేతాలు రావడంతో ఆశాఖలో సందడి మొదలైంది. అయితే బదిలీలతో ఎక్కడికి వెళ్లాల్సి వస్తుందో అనే ఆందోళన వారిలో నెలకొంది. భద్రాద్రి జోన్ పరిధిలోకి బదిలీ.. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోనే బదిలీ లు ఉండేవి. దీంతో కుటుంబాలకు దగ్గరగా ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్న ఎకై ్సజ్శాఖ కానిస్టేబుళ్లకు ఇప్పుడు జోనల్ బదిలీల భయం పట్టుకుంది. జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు, గూడూరు సర్కిళ్లతో పాటు, డీటీఎఫ్ విభాగం పరిధిలో మొత్తం ఎనిమిది మంది హెడ్ కానిస్టేబుళ్లు, 36 మంది కానిస్టేబుళ్లు పనిచేస్తున్నారు. ఇందులో కొత్తగా నియామకమైన వారికి మినహా అందరికీ స్థాన చలనం తప్పదు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ములుగు, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాలతోపాటు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం పరిధిలోకి బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రక్రియ అంతా జిల్లాస్థాయి అధికారుల నుంచి ఉమ్మడి జిల్లా అధికారికి, అక్కడి నుంచి రాష్ట్ర ఉన్నతాధికారులకు చేరింది. ప్రక్రియ వేగవంతం చేసి వచ్చే సోమవారం వరకు కొత్త స్టేషన్లలో బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని ఎకై ్సజ్ శాఖలోని అధికారులు చెబుతున్నారు. తర్వాత అధికారులకు.. బదిలీ ప్రక్రియ కానిస్టేబుళ్లతోనే ఆగకుండా అన్ని విభాగాలకు చెందిన అధికారులకు కూడా ఉంటుందని ఆశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ముందుగా కానిస్టేబుళ్ల బదిలీ ప్రక్రియ ముగియగానే.. ఎస్సైలు, సీఐలు, ఈఎస్ మొదలైన వారి బదిలీ కూడా అనివార్యం. అయితే రెండు సంవత్సరాల సర్వీస్ నిబంధనల ఉండడంతో జిల్లాలో పనిచేస్తున్న అధికారుల్లో దాదాపుగా అందరూ బదిలీ కానున్నారు. వారి స్థానంలో కొత్త వారు రానున్నారు. కానిస్టేబుళ్ల బదిలీ జాబితా సిద్ధం భద్రాద్రి జోన్ పరిధికి వెళ్లేవారిలో కలవరం త్వరలో అధికారుల ట్రాన్స్ఫర్స్ఉంటాయని చర్చ -
తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు
గార్ల: గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయిన సమయంలో ప్రభుత్వ మంచినీటి పథకం బావులను క్లోరినేషన్ చేసిన తర్వాత ప్రజలకు తాగునీటి సరఫరా చేయాలని సూచించారు. ఉపాధి పనులకు వెళ్లిన కూలీలు వడదెబ్బకు గురికాకుండా ముందుస్తు జాగ్రత్త చర్యగా వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఆయా గ్రామాల ఏఎన్ఎంలు సరఫరా చేయాలని ఆదేశించారు. ఎండల తీవ్రత పెరిగిన దృష్ట్యా ఉదయం 10 గంటల లోపే ఉపాధి కూలీ లు పని ముగించుకొని ఇళ్లకు చేరుకోవాలన్నా రు. ఎంపీడీఓ మంగమ్మ, పీహెచ్సీ డాక్టర్ శివకుమార్, ఎంపీఓ శ్రీలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. మెడికల్ కాలేజీకి అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డునెహ్రూసెంటర్: మానుకోట ప్రభుత్వ మెడికల్ కాలేజీకి విశిష్ట గౌరవం దక్కింది. సెకండియర్ ఎంబీబీఎస్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి, పాసింగ్శాతంలో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు మెడికల్ కాలేజీకి అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. ఈమేరకు హైదరాబాద్లో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ చేతుల మీదుగా కాలేజీ ప్రిన్సిపాల్ వెంకట్ లకావత్ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ను మంత్రి అభినందిస్తూ, విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపర్చాలని సూచించారు. అధ్యాపకులు, సిబ్బంది కృషితో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని ప్రిన్సిపాల్ తెలిపారు. భవిష్యత్లో ఉత్తమ ప్రతిభను చాటేందుకు కృషి చేస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జనగణన విధులుమహబూబాబాద్ అర్బన్: జిల్లాలో జనగణన విధుల కేటాయింపులో కొంతమంది ఎంఈఓ లు నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బలాష్టి రమేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలో ని సంఘ కార్యాలయంలో బుధవారం ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జనగణన డ్యూటీల కేటాయింపులో నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. రిసోర్స్పర్సన్ పేరుతో పాఠశాల విధులకు దూరమవుతున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వార్షిక పరీక్షలు షురూ..మహబూబాబాద్ అర్బన్: జిల్లా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమైనట్లు డీఈఓ వి.రాజేశ్వర్ తెలిపారు. ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఈ నెల 18వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ నెల 23న తల్లిదండ్రుల స మావేశం నిర్వహించి విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేయాలన్నారు. ఈ నెల 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయన్నారు. ఉపాధ్యాయులు పరీక్షలను సజావుగా నిర్వహించాలన్నారు. ‘అనధికార గర్భస్రావాలు చేస్తే కఠిన చర్యలు’నెహ్రూసెంటర్: లింగ నిర్ధారణ, అనధికారిక గర్భస్రావాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ హెచ్చరించారు. గర్భధారణ పూర్వ, ప్రసవ పూర్వ రోగనిర్ధారణ పద్ధతులు, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టం నిబంధనలు, రికార్డుల నిర్వహణపై డీఎంహెచ్ఓ కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆడ శిశువు సంరక్షణ, లింగ నిర్ధారణ నిషేధం, గర్భస్థ శిశువు లింగ వివక్ష నివారణ, మహిళల ఆరోగ్య హక్కుల పరిరక్షణపై సమీక్షించారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ పూర్తిగా నిషేధమని, గర్భస్రావ సేవలు అర్హత కలిగిన వైద్యులతో, చట్టబద్ధత కలిగిన ప్రమాణాల ప్రకారమే నిర్వహించాలని సూచించారు. నిబ ంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. జీజీహెచ్ ఆర్ఎంఓ జగదీశ్వర్, ప్రోగ్రాం అధికారి సారంగం, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ నాగవాణి పాల్గొన్నారు. -
సోమేశ్వరస్వామి ఆలయంలో అద్భుతం..
● స్వామివారి సన్నిధిలో పాము ప్రత్యక్షం పాలకుర్తి టౌన్: యాథృశ్చికమో.. అద్భుతమో తెలియదు గాని. జనగామ జిల్లా పాలకుర్తి మండం కేంద్రంలోని శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి వారి ఆలయంలో నాగుపాము ప్రత్యక్షవుతోంది. రోజూ మధ్యాహ్నం స్వామివారికి నైవేద్యం సమర్పించి గుడి మూసిన అనంతరం ఆలయ మహా మండపంలోని గర్భగుడి ఎదుట ఉన్న నందీశ్వరుడి వద్ద వారం రోజులుగా ప్రత్యక్షమై పడగ విప్పి భక్తులకు కనిపిస్తోంది. దీంతో భక్తులు స్వామివారు పాము రూపంలో దర్శనమిచ్చారని భక్తిపారవశ్యానికి లోనవుతున్నారు. అయితే ఆలయ సిబ్బంది మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. కొంత సమయం తర్వాత పాము పక్కన ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్తోందని ఆలయ సిబ్బంది తెలిపారు. -
మక్క రైతు చిత్తు!
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో పత్తి పంట నవంబర్లో కురిసిన వర్షాలకు దెబ్బతింది. దీంతో రైతులు మొక్కజొన్న సాగు చేపట్టారు. యాసంగిలో 1,05,238 ఎకరాల్లో సాగు చేశారు. దీనికి తోడు గతంలో ఎకరానికి 25నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. ప్రస్తుతం 40 క్వింటాళ్ల మేరకు దిగుబడి వచ్చింది. అయితే ప్రభుత్వం మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలను అరకొరగా ఏర్పాటు చేయడం, అక్కడ రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. దీంతో చేసేదేమీ లేక రైతులు తక్కువ ధరకు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించి నష్టపోతున్నారు. అరకొరగా కొనుగోలు కేంద్రాలు.. జిల్లాలో మొక్కజొన్న సాగు పెరిగింది. దిగుబడి కూడా అంచనాకు మించి వచ్చింది. కానీ, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు మాత్రం ఆరకొరగానే ఉన్నా యి. గత వానాకాలం నాలుగు కేంద్రాలు ఉండగా.. ప్రస్తుతం వీటిని 16కు పెంచామని చెబుతున్న అధికారులు పూర్తిస్థాయిలో కొనుగోళ్లు ప్రారంభించలేదు. దీంతో కోసిన మొక్కజొన్నలు ఆరబోసి.. అకాల వర్షాలు, ఉరుములు, మెరుపులను చూస్తూ బిక్కు బిక్కుమంటున్నారు. పరిమితి పేరుతో కొర్రీలు.. రైతులు పండించిన ప్రతీ గింజను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతు న్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదు. జిల్లాలో మొత్తం సాగుచేసిన మొక్కజొన్నలో 50శాతం విత్తన కంపెనీలకు, మరో 25శాతం ప్రైవేట్ వ్యాపారులకు అమ్మకాలు పోను కేవలం 25శాతం మాత్రమే కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇందులో కూడా ఎకరానికి 26.5 క్వింటాళ్ల చొప్పున పంటల నమోదు ఆధారంగా కొంటామని కొర్రీలు పెడుతున్నారు. దీంతో అధిక దిగుబడి వచ్చిన రైతులతో పాటు, కౌలు రైతులు పంటలను అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ దోపిడీ.. మార్క్ఫెడ్ అధికారులు సకాలంలో మొక్కజొన్నలు కొనుగోలు చేయడంలేదు. దీనికి తోడు నిబంధనల పేరిట కొర్రీలు పెడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో క్వింటాకు రూ.2,400 చొప్పున కొనుగోలు చేయాలి. కానీ, అలా చేయకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు రంగ ప్రవేశం చేసి క్వింటాకు రూ.1,500 నుంచి రూ.1,800 మాత్రమే ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు. సరుకు ఎక్కువగా వస్తే ఈ ధర మరింత తగ్గించి కొంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై మార్క్ఫెడ్ అధికారులను వివరణ కోరగా పరిమితికి మించి మక్కల కొనుగోళ్ల అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు కొనుగోళ్లు చేపడుతామని చెప్పారు. అరకొరగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కొనుగోళ్లలో అధికారుల కొర్రీలు ప్రైవేట్గా విక్రయించుకుంటున్న రైతులు ఇదే అదునుగా దోచుకుంటున్న వ్యాపారులు -
పెద్దచెరువుపై చిన్నచూపు
బయ్యారం: కాకతీయుల కాలంలో నిర్మించిన బయ్యారం పెద్దచెరువును పాలకులు పట్టించుకోవ డం లేదు. గోదావరి జలాలు తరలించే ప్రతిపాదన వచ్చినప్పటికీ కొందరి స్వార్థం వల్ల మరోదారిలో ఖమ్మం జిల్లాకు తరలుతున్నాయి. అనేక సంవత్సరాలుగా బయ్యారం పెద్దచెరువుపై పాలకులు వివక్ష చూపుతున్నన్నారు. అయితే ప్రశ్నించాల్సిన ప్రజాప్రతినిధులు మౌనంగా ఉండడంతో బయ్యారం, గార్ల మండలాల రైతాంగం నష్టపోవాల్సి వస్తోంది. ఎన్ని కల సమయంలో బయ్యారం పెద్దచెరువును ప్రచా రాస్త్రంగా తీసుకుంటున్న రాజకీయపార్టీల నాయకులు ఆ తర్వాత తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే నిధులు.. స్వరాష్ట్రంలో నిల్.. కాకతీయరాణి బయ్యమాంబ పాలనలో గుట్టలను కట్టలుగా చేసుకొని బయ్యారం పెద్ద చెరువు నిర్మించారు. కాగా, రాష్ట్రంలో ఎక్కడ కరువు వచ్చిన బయ్యారం పెద్దచెరువుతో పాటు, గార్ల చెరువు రైతులకు మాత్రం పంటలు పండేవి. ఈ క్రమంలో 2006లో వచ్చిన భారీ వరదలతో చెరువుకట్టకు గండిపడింది. దీంతో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి చెరువుకట్ట నిర్మాణంతో పాటు కాల్వల లైనింగ్కు రూ.11కోట్లు మంజూరు చేశారు. అయితే అప్పటి ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో కట్టపనులు పూర్తి అయినప్పటికీ కాల్వల పనులు పూర్తికాలేదు. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ప్రతీ ఏడాది కాల్వల పూడికతీత పనులు తప్ప ఇతర పనులకు నిధులు విడుదల కాలేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపాదనలు తలకిందులు చేసి పాలేరుకు నీళ్లు.. బీఆర్ఎస్ సర్కారు హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2014లో భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం రోళ్లపాడు వద్ద సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో కేసీఆర్ మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం నుంచి రోళ్లపాడుకు గోదావరి జలాలను తీసుకొచ్చి రిజర్వాయర్ చేస్తామన్నారు. అక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా బయ్యారం పెద్దచెరువులోకి నీటిని తరలిస్తామని హామీ ఇచ్చారు. బయ్యారం పెద్దచెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా చేసి గ్రావిటీ కెనాల్ ద్వారా కురవి, డోర్నకల్ మండలాల మీదుగా పాలేరు నియోజకవర్గానికి నీరందిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనతో చెరువు ఆయకట్టు పరిధిలోని బయ్యారం, గార్ల మండలాల రైతుల్లో ఆనందం వ్యక్తమైంది. అయితే సీఎం స్వయంగా హామీ ఇచ్చినప్పటికీ అప్పటి ప్రభుత్వంలో ఖమ్మం జిల్లా మంత్రిగా ఉన్న ప్రస్తుత మంత్రి రోళ్లపాడుకు గోదావరిజలాలు రాకుండా చక్రం తిప్పి పాలేరుకు మరో దారిగుండా నీటిని తరలించే ప్రయత్నం చేయడంతో బయ్యారం, గార్ల మండలాల రైతులకు నిరాశే మిగిలింది. మభ్యపెడుతున్న నేతలు.. గత ఎన్నికలకు ముందు ప్రస్తుత ఎమ్మెల్యే కోరం కనకయ్య బయ్యారంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బయ్యారం పెద్దచెరువు అభివృద్ధిపై నిర్వహించిన దీక్షకు ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గోదావరిజలాలు తీసుకుస్తామని హామీ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా.. చెరువుకు నీటిని తీసుకొచ్చే అంశంపై ముందడుగు వేయలేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికై నా బయ్యారం పెద్దచెరువు అభివృద్ధిపై పాలకులు దృష్టిపెట్టాలని బయ్యారం, గార్ల మండలాల రైతులు కోరుతున్నారు. గోదావరి నీళ్లు తీసుకురావాలి.. చెరువు ఆయకట్టు చివరిలో మా భూమి ఉంది. రెండుసార్లు చెరువు నిండితేనే మా పంటలు పండుతాయి. ఒక్కో ఏడు వానలు పడకపోతే చివరిలో ఉన్న మా పంటలకు నీళ్లు రాక ఎండిపోతాయి. చెరువుకు గోదావరి నీళ్లు తీసుకొస్తే సాగు చేసిన పంటకు చివరితడి అందుతుందనే ధైర్యం వస్తుంది. – సపావట్ లక్ష్మణ్, సంగ్యాతండా బయ్యారం చెరువుకు గోదావరి నీళ్ల తరలింపులో నిర్లక్ష్యం ఎన్నికల సమయంలో హామీల పర్వం రిజర్వాయర్ చేస్తే బయ్యారం, గార్ల మండలాలు సస్యశ్యామలం -
హనుమకొండ సర్కిల్లో పదోన్నతులేవి?
హన్మకొండ : టీజీఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్లో 15 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు 15 నెలలుగా ఖాళీగా ఉంటున్నాయి. ఈ పోస్టులను పదోన్నతి ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్గా ప్రమోషన్ కల్పించడానికి డిపార్ట్మెంటల్ పదోన్నతి కమిటీ మార్చి 16న పదోన్నతికి కల్పిస్తూ జాబితాను సిద్ధం చేసింది. కొత్తగా ఎస్సీ వర్గీకరణ కావడంతో ఈ మేరకు గ్రూపుల వారీగా ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించడంపై వచ్చిన సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి హెచ్ఆర్డీకి క్లారిఫికేషన్ రాసినా ఆ విభాగం అధికారులు అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తుండడంతో 23 రోజులుగా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పదోన్నతి లభిస్తుందా లేదా? పదోన్నతి లభిస్తుందా లేదా అనే మీమాంసలో ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని అన్ని సర్కిళ్ల పదోన్నతి ప్రక్రియ పూర్తయినా ఒక్క హనుమకొండ సర్కిల్లో ముందుకు సాగడం లేదు. మొదట సర్కిల్ అధికారులు నిర్లక్ష్యం చేయగా ఆ తర్వాత ప్రధాన కార్యాలయంలోని హెచ్ఆర్డీ విభాగం తోడవ్వడంతో ఉద్యోగులు నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. పదోన్నతి కల్పించి పోస్టింగ్ ఇవ్వాల్సిన అధికారులు నాన్చివేత ధోరణి అవలంబిస్తుండడంపై ఉద్యోగ సంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికై నా పదోన్నతి కల్పించి పోస్టింగ్లు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 23 రోజులుగా ఉద్యోగుల ఎదురుచూపులు రిజర్వేషన్పై సందేహ నివృత్తికి యాజమాన్యానికి లేఖ స్పందించని టీజీ ఎన్పీడీసీఎల్ హెచ్ఆర్డీ విభాగం -
రామప్ప శిల్పకళ అద్భుతం..
వెంకటాపురం(ఎం): ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలం రామప్ప శిల్పకళ సంపద అద్భుతమని హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డలో శిక్షణ పొందుతున్న 70 మంది అసిస్టెంట్ సెక్షన్ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం చారిత్రక రామప్ప దేవాలయాన్ని సందర్శించి రామలింగేశ్వ ర స్వామి వారికి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్ తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం అందజేశారు. టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం గురించి వివరించారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఇమ్మడి భాస్కర్, ఆర్ఐ రమేశ్, పోలీసు సిబ్బంది భద్రు, శ్రీకాంత్, కోర్స్ డైరెక్టర్ కిరణ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, ఆనంద్ పాల్గొన్నారు. ప్రముఖ సినీనటుడు రాజేందర్ పూజలు.. రామప్ప దేవాలయాన్ని సాలార్, దేవర సినిమాల్లో విలన్గా నటించిన పులి రాజేందర్ కుటుంబ సభ్యులతో కలిసి రామప్ప ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రామలింగేశ్వర స్వామికి వారు పూజలు నిర్వహించారు. కొనియాడిన శిక్షణ అధికారులు -
రిటైర్మెంట్ ఫైల్పై సంతకానికి లంచం
గూడూరు: ఉత్తమ ఉపాధ్యాయుడిగా గతంలో అవార్డు పొందిన ఓ ప్రధానో పాధ్యాయుడి రిటైర్మెంట్ బెనిఫిట్ ఫైల్పై సంతకం చేసేందుకు లంచం తీసుకుంటూ ఓ ఇన్చార్జి ఎంఈఓ, స్కూల్ అసిస్టెంట్ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గూ డూరు మండలంలోని గుండెంగ శివారు వాగ్యతండా ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్న దయ్యాల రవీందర్ ఈ నెల 30న రిటైర్ కానున్నారు. తన రిటై ర్మెంట్ ప్రయోజనాల ఫైల్ను 3 నెలల ముందే హైద రాబాద్లోని ఆడిట్ ఆఫీసుకు పంపాల్సి ఉండటంతో అందుకోసం రవీందర్ అయోధ్యపురం జెడ్పీ హెచ్ఎస్ హెచ్ఎం, ఇన్చార్జి ఎంఈఓ జె.రవికుమార్ను సంప్రదించారు. అయితే ఫైల్పై సంతకా నికి రవికుమార్ రూ. 50 వేలు డిమాండ్ చేసి చివరకు రూ. 45 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. తొలివిడతగా బుధవారం రూ. 15 వేలు తీసుకోవడానికి సిద్ధమ య్యాడు. ఈ విషయాన్ని రవీందర్ వరంగల్లోని ఏసీబీ అధికారులకు తెలియజేశాడు. దీంతో వలపన్నిన ఏసీబీ అధికారులు.. బుధవారం అయోధ్యపురం పాఠశాలలో రవికుమార్, చంద్రమౌళి రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. విచారణ అనంతరం కేసు నమోదు చేసి గురువారం వరంగల్ ఏసీబీ కోర్టు ద్వారా కస్టడీకి తరలిస్తామని డీఎస్పీ సాంబయ్య తెలిపారు. -
ఆన్లైన్ మూల్యాంకనం వర్సిటీ చరిత్రలో మైలురాయి
● కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం ఆన్లైన్లో చేపట్టబోతున్నామని, ఇది యూనివర్సిటీ చరిత్రలో మైలు రాయి అని వీసీ కె. ప్రతాప్రెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం యూనివర్సిటీ ఆడిటోరియంలో డిగ్రీ కళాశాలల అధ్యాపకులనుద్దేశించి వీసీ మాట్లాడారు. పారదర్శకతకు ఆన్లైన్ మూల్యాంకనం ఎంతో దోహద పడుతుందన్నారు. పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ మాట్లాడుతూ ఆన్లైన్ మూల్యాంకనంతో ఫలితాలను త్వరితగతిన విడుదల చేయొచ్చన్నా రు. రిజిస్ట్రార్ వి. రామచంద్రం, ఓఎస్డీ బి. వెంకర టామ్రెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు తిరుమలాదేవి, వెంకటయ్య పాల్గొన్నారు. కాగా, ఆన్లైన్ మూల్యాంకన ప్రక్రియకు స్కాన్ చేసే సంస్థకు చెందిన ఎక్స్ఫర్ట్స్ డెమో ద్వారా ఎలా వాల్యుయేషన్ చేయాలో అధ్యాపకులకు వివరించారు. వసూల్ రాజాలపై ఆరాకాజీపేట అర్బన్: వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వసూల్ రాజాలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈనెల 2, 3 తేదీల్లో ఏసీబీ దాడుల్లో డాక్యుమెంట్ రైటర్స్ నుంచి ఆన్లైన్లో యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులో రూ.42 లక్షలు చేతులు మారినట్లు తేలిపోయింది. కాగా, ఒక వ్యక్తి ఫోన్లో ఇంత మొత్తంలో లావాదేవీలు ఉంటే సబ్ రిజిస్ట్రార్లు డాక్యుమెంట్ రైటర్లనే వసూల్ రాజాలుగా ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఏసీబీ అధికారులు సదరు వసూల్ రాజాలు, అక్రమ రిజిస్ట్రేషన్ కింగ్లను పట్టుకునేందుకు వరంగల్ ఆర్ఓ కార్యాలయంలో మంగళవారం పరిశీలించేందుకు రాగా కొందరు డాక్యుమెంట్ రైటర్లు తమ కార్యాలయాలు తెరవకుండా పరారీలో ఉన్నట్లు తెలుసుకుని వివరాలు సేకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
సెలవులొస్తే దిగులు!
తల్లిదండ్రులు లేని విద్యార్థుల ఆందోళనసాక్షి, మహబూబాబాద్: పాఠశాలల పిల్లలకు వేసవి సెలవులు అంటే చెప్పలేని ఆనందం. సెలవుల్లో ఎలా ఎంజాయ్ చేయాలనే ప్రణాళికలు వేసుకుంటున్నారు. అందుకు అనుగుణంగా వినోద, విహారయాత్రలు, ఊర్లకు వెళ్తుంటారు. అయితే ఇందుకు భిన్నంగా ఆయా విద్యాలయాల్లో చదివే తల్లిదండ్రులు లేని, తల్లి లేదా తండ్రి లేని వారు.. ఉన్నా వేరే ప్రాంతాలకు వలస వెళ్లి జీవించే కుటుంబాల పిల్లలకు మాత్రం వేసవి సెలవులు శాపంగా మారుతున్నాయి. తోటి విద్యార్థులు వెళ్తుంటే.. తాము ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి వారిది. దీంతో సెలవులు ఎందుకు ఇచ్చావు దేవుడా అంటూ ఆవేదన, ఆందోళన చెందుతున్నవారు ఉన్నారు. 4వేలకు పైగా పిల్లలు.. జిల్లాలో తల్లిదండ్రులు లేని వారు, తల్లి లేదా తండ్రి లేని విద్యార్థులు 4వేలకు పైగా ఉంటారని అంచనా. వీరందరూ జిల్లాలోని సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, మినీ గురుకులా లు, జ్యోతిరావుపూలే గురుకులాలు, మైనార్టీ, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో చదువుతున్నారు. అన్ని సొసైటీల్లో కలిపి19,188మంది పిల్లలు ఉన్నారు. ఇందులో500మంది ఆర్పన్స్, మరో 3,500కు పై గా సెమీ ఆర్పన్స్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నా రు. మొక్కుబడిగా క్యాంపులు.. అనాథ పిల్లల కోసం ప్రతీ వేసవిలో ప్రభుత్వం క్యాంపులు పెడుతోంది. అయితే ఈ క్యాంపుల్లో సరైన వసతులు ఉండకపోవడం, మెనూ సక్రమంగా పెట్టకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. క్యాంపుల్లో ఉన్న విద్యార్థులకు సంగీతం, చిత్రలేఖనం, పాటలు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా సంతోషాన్ని నింపాలని అధికారులు చెబుతున్నా.. అది ఆచరణకు నోచుకోవడం లేదు. అదే విధంగా క్యాంపుల్లో ఉన్న విద్యార్థులను వేసవిలో టూర్లకు తీసుకెళ్లడం, కొత్త ప్రదేశాలను చూపించి వారిలో ఆనందాన్ని నింపాల్సి ఉంది. కానీ, అలాంటి పరిస్థితి వేసవి క్యాంపుల్లో ఉండడం లేదని, అందుకోసమే క్యాంపులకు వెళ్లడం కన్నా.. దూరపు బంధువుల ఇళ్లకు వెళ్లి సెలవుల్లో తల దాచుకుంటున్నామని పిల్లలు అంటున్నారు. క్యాంపులకు సిద్ధమవుతున్నాం..ప్రతీ సంవత్సరం మాదిరిగానే కేజీబీవీల్లో చదివే బాలికలకోసం ప్రత్యేక సమ్మర్ క్యాంపులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే క్యాంపుల నిర్వహణ, వసతులతో పాటు మొదలైన ఏర్పాట్లు చేస్తాం. విద్యార్థినులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యాంపులు నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తాం. – రాజేశ్వర్, జిల్లా విద్యాశాఖ అధికారి హాస్టళ్లు ఖాళీ చేయాల్సిన దుస్థితి వేసవి సెలవుల్లో ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి క్యాంపులు ఏర్పాటు చేసినా అంతంతమాత్రంగా వసతులు అనాథ పిల్లలకోసం ప్రణాళిక ఖరారులో జాప్యంఖరారు కాని సమ్మర్ క్యాంపులు మరో పదిరోజుల్లో వేసవి సెలవులు మొదలు అవుతాయి. కానీ ఇప్పటి వరకు క్యాంపుల విషయం తేలలేదు. గత ఏడాది జిల్లాలోని 16 కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు గూడూరు కేజీబీవీలో క్యాంపు పెట్టారు. ఇప్పుడు ఎక్కడ క్యాంపు పెట్టే విషయంపై స్పష్టత రాలేదు. -
సీసీ కెమెరాల ఏర్పాటుతో రక్షణ: ఎస్పీ
గూడూరు: ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తే శాంతిభద్రతల పరిరక్షణ కల్పించినట్లేనని ఎస్పీ శబరీష్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించాలని తీర్మానం చేసిన పొనుగోడు గ్రామాన్ని సందర్శించారు. ఈమేరకు గ్రామంలో ఎన్ని ద్విచక్ర వాహనాలు ఉన్నాయి.. ఇప్పటి వరకు ఎంతమంది హెల్మెట్లు వినియోగిస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్కు చేరుకొని రికార్డులు, కేసుల వివరాలకు సంబంధించిన రిజిస్టర్లు పరిశీలించి, పలు సూచనలు చేశారు. అదే విధంగా మండలంలోని ప్రతీ జీపీ, మేజర్ గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అంగన్వాడీ టీచర్, ఆయా తొలగింపు!మరిపెడ రూరల్: గత ఏడాది మండలంలోని గిరిపురం గ్రామ పంచాతీయ పరిధి ఇటుకలగడ్డతండా అంగన్వాడీ కేంద్రంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై అప్పటి కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించారు. ప్రాథమిక విచారణ చేపట్టి బాధ్యులైన అంగన్వాడీ టీచర్, ఆయాలను విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకోవాలిమహబూబాబాద్ అర్బన్: ప్రజలు ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకోవాలని అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం మన ఇసుక వాహన పథకంపై అవగాహన కల్పించారు. జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా మైనింగ్ అధికారి, తహసీల్దార్లు, పంచాయతీ సెక్రటరీలకు ఇసుక వాహనం, ఆన్లైన్లో ఇసు క కేటాయింపులపై టెక్నికల్ అసిస్టెంట్ నరేష్ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అనిల్కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం సూచించిన ప్రకారం ఇకపై పూర్తిస్థాయిలో ఇసుక సరఫరా కోసం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలన్నారు. అందుకు మన ఇసుక వాహనం పథకంపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో అధికారులు వెంకటరమణ, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కామారం సబ్ సెంటర్కు రాష్ట్రస్థాయి అవార్డుగంగారం: ఉత్తమ వైద్యసేవలు అందించిన మండలంలోని కోమట్లగూడెం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలోని కామారం సబ్సెంటర్కు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తూ చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి అవార్డు ప్రదానం చేశారు. గర్భిణుల ముందస్తు నమోదు, ఏఎన్సీ పరీక్షలు, రోగనిరోధక టీ కాల కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసినందుకు అవార్డు అందజేశారు. సబ్సెంటర్ సిబ్బ ందిని డీఎంహెచ్ఓ రవి రాథోడ్ అభినందించారు. కేసముద్రం మార్కెట్కు కొత్త పసుపు కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు మంగళవారం కొత్త పసుపు అమ్మకానికి వచ్చింది. సీజన్ ప్రారంభంలోనే క్వింటా పసుపు ధర రికార్డు స్థాయిలో రూ.12వేలకు పైగా పలికింది. కాడి రకానికి చెందిన 35 బస్తాల పసుపు మార్కెట్కు అమ్మకానికి రాగా గరిష్ట ధర రూ.12,523, కనిష్ట ధర రూ.10,703 పలికింది. అదే విధంగా గోళా రకానికి చెందిన 16 బస్తాల పసుపు అమ్మకానికి రాగా, గరిష్ట ధర రూ.12,523, కనిష్ట ధర రూ.9,009 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. -
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
మహబూబాబాద్ రూరల్ : ప్రతీ ఒక్కరు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని డీఎంహెచ్ఓ రవి రాథోడ్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ మండలం కంబాలపల్లి పీహెచ్సీలో మంగళవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా డీఎంహెచ్ఓ హాజరై మాట్లాడారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తిని మనం ఎప్పటి నుంచో వింటున్నామని, ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, కలుషిత ఆహారం, మానసిక ఒత్తిడి వల్ల అనేక కొత్త కొత్త రోగాలు వస్తున్నాయన్నారు. ఆరోగ్య అలవాట్లు ఆచరించాలని, వారంలో 5 రోజులు కనీసం 30 నుంచి 60 నిమిషాలు వ్యాయామం చేయాలని, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకోవాలని, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ఆహారం, నీరు, గాలి కలుషితం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శారీరక ఆరోగ్యం గురించి మాత్రమే మనం ఆసక్తి చూపుతామని, మానసిక, సామాజిక స్థితుల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని అన్నారు. విజ్ఞానానికి అండగా నిలుద్దామని, ఆరోగ్యం కోసం కలిసి పనిచేద్దామని, అపోహలు, మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాన్ని వీడి, శాసీ్త్రయ, వైద్య విజ్ఞానాన్ని నమ్మడం ద్వారానే ప్రజా రోగ్యం సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి ప్రసాద్, ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ సుధీర్, ఆశా నోడల్ ఆఫీసర్ సక్కుబాయి, ఆరోగ్య విద్య బోధకులు కేవీ.రాజు, పురుషోత్తం, గీత, ఎంపీ హెచ్ఈఓ నరేశ్, సూపర్ వైజర్ సక్రి, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ రవి రాథోడ్ -
మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి
● ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మహబూబాబాద్ అర్బన్: రాష్ట్రంలో మొక్కజొన్న సాగు చేసిన రైతులు కనీస మద్దతు ధర లేక, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్సీ రవీందర్రావు మక్క రైతులకు జరుగుతున్న అన్యాయంపై కలెక్టర్ స్నేహశబరీష్కు వినతి పత్రం అందజేశారు. మొక్కజొన్న కొనుగోళ్లు తక్షణమే ప్రారంభించాలని, మద్దతు ధర లభించేలా చూడాలని అన్నా రు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, నాయకులు బానోతు రవి, జేర్రిపోతుల వెంకన్నగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డు సందర్శన.. మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డును ఎమ్మెల్సీ రవీందర్ రావు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు జరుగుతున్న అన్యాయం, సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు మొక్కజొన్నల కొనుగోళ్లను పరిశీలించామని తెలిపారు. మొక్కజొన్నలకు మద్దతు ధర లభించేలా చూసి, అన్నదాతలను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికై నా మొండివైఖరి వీడి, ప్రతి గింజనూ మద్దతు ధరతో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. -
కేఎంసీకి ఉత్తమ అవార్డులు
● మంత్రి చేతుల మీదుగా అందుకున్న ప్రిన్సిపాల్ సంధ్య రామన్నపేట : నగరంలోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ) మరోసారి తన ప్రతిభను చాటుకుంది. డయాలసిస్ సేవలు, మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా, కాళోజీ విశ్వవిద్యాలయం వీసీ రమేశ్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నరేంద్ర కుమార్ చేతుల మీదుగా కేఎంసీ ప్రిన్సిపాల్ సంధ్య సుంకరనేని అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సంధ్య మాట్లాడుతూ ఈ విజయానికి ఆర్థోపెడిక్ విభాగం అధిపతి రామకుమార్ రెడ్డి, నెఫ్రాలజీ విభాగం అధిపతి చాడా రమేశ్ సమర్థ నాయకత్వంతో పాటు వారి బృందాల నిరంతర శ్రమ ప్రధాన కారణాలుగా నిలిచాయని తెలిపారు. అలాగే, ఆస్పత్రి సూపరింటెండెంట్ హరీశ్ చంద్రారెడ్డి మార్గదర్శకం ఈ విజయానికి ఆధారంగా నిలిచిందన్నారు. ఈ గుర్తింపు కేఎంసీ వైద్యులు, సిబ్బంది అంకితభావానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. వాసు మృతదేహం లభ్యం కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాల ఈఈఈ విభాగం ఫైనలియర్ విద్యార్థి భూక్య వాసు(22) ఈనెల 5న ఈతకోసం కెనాల్లోకి వెళ్లి గల్లంతైన విషయం విధితమే. ఎన్డీఆర్ఎఫ్ బృందం రెండోరోజు మంగళవారం కూడా బోట్ ద్వారా గాలింపు చర్యలు చేపట్టగా మొగిలిచర్ల ప్రాంతంలో కెనాల్లో మృతదేహం లభ్యమైందని కేయూ సీఐ రవికుమార్ తెలిపారు. వాసు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించనట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. డోర్నకల్: వరంగల్ సమీపంలోని కాకతీయ కెనాల్లో ఈతకెళ్లి గల్లంతై చనిపోయిన బీటెక్ విద్యార్థి భూక్యా వాసు అంత్యక్రియలు మంగళవారం డోర్నకల్ మండలం చిమ్నాతండాలో ముగిశాయి. వాసు మృతదేహాన్ని తండాకు తీసుకొచ్చి తల్లి పార్వతి, సోదరుడు కార్తీక్.. అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, వాసు మృతితో చిమ్నాతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. సీకేఎం ఆస్పత్రిలో తనిఖీకాశిబుగ్గ: వరంగల్లోని సీకేఎం ప్రసూతి ఆస్పత్రిని అదనపు కలెక్టర్ వైవీ.గణేశ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ‘సాక్షి’లో మంగళవారం ‘సీకేఎంలో ఆగని మాముళ్ల దందా’ శీర్షికన ప్రచురితమైన కథనానికి కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ ప్రసూతి ఆస్పత్రిని సందర్శించారు. ఆయన నేరుగా లేబర్ రూంకు వెళ్లి డబ్బులు వసూళ్లపై ఆరా తీశారు. ఇలా ఎందుకు జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పేద రోగులకు అంకితభావంతో సేవలు అందించాలని ఆయన సూచించారు. దీనిపై కలెక్టర్ సీరియస్గా ఉన్నారని, మళ్లీ జరిగితే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. -
పంట మార్పిడితో అధిక ఆదాయం
మహబూబాబాద్ రూరల్: పంట మార్పిడితో అధిక ఆదాయం వస్తుందని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమశాఖ అధికారి మరియన్న అన్నారు. మహబూబాద్ రైతు వేదికలో మంగళవారం ఉద్యాన వలంటీర్లకు శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మరియన్న మాట్లాడుతూ.. వరి, పత్తి, మొక్కజొన్న, మిరప పంటలకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్, పండ్లు, కూరగాయలు, మునగ, పూలు, మల్బరీ, తేనెటీగల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం మొదలైన మార్కెట్ డిమాండ్ ఉన్న వాటిని సాగు చేసేందుకుగాను పలువురిని ఎంపిక చేసి ఇటీవల కొండా లక్ష్మ ణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇచ్చారని తెలిపారు. ఉద్యాన వలంటీర్లు కూరగాయలు, ఆయిల్ పామ్, మునగ, మల్బరీ తదితర మార్కెట్ డిమాండ్ ఉన్న పంటల సాగులో తోటి రైతులకు స్వచ్ఛందంగా సహాయ, సహకారాలు అందిస్తారన్నారు. ప్రభుత్వ రాయితీలు, కూరగాయల పందిళ్లు, మల్చింగ్, కోల్డ్ రూమ్స్, నిల్వ గిడ్డంగులు, షేడ్ నెట్ హౌజ్లు, ఆయిల్ పామ్ రాయితీ, మార్కెటింగ్ వసతులు, మల్బరీ రాయితీలు అందిస్తామని తెలిపారు. రైతులు నీటి, భూసార పరీక్షలు చేయించుకోవాలని, ప్రకృతి సేద్యం అవలంభించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సరిత, వ్యవవసాయ సహాయ సంచాలకుడు అజ్మీరా శ్రీనివాసరావు, మార్కెటింగ్ క్షేత్ర స్థాయి అధికారి జయపాల్, కేవీకే ఉద్యాన శాస్త్రవేత్త బి.క్రాంతికుమార్, ఆయిల్ ఫెడ్ జిల్లా ఇన్చార్జ్ రాములు, మండల వ్యవసాయ అధికారి నారెడ్డి తిరుపతిరెడ్డి, ఉద్యాన అధికారులు ఆర్.శాంతిప్రియ, ఎ.జే.శాంతిప్రియదర్శిని, రైతులు పాల్గొన్నారు. -
సమ్మెను విజయవంతం చేద్దాం..
హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు, అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, బిల్ కలెక్టర్లు, పీస్ రేట్ వర్కర్లందరూ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టారు. ముందుగా హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ నుంచి ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ మహాధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా వందలాదిగా ఆర్టిజన్ ఉద్యోగులు, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు, బిల్ కలెక్టర్లు, పీస్రేట్ వర్కర్లు తరలొచ్చారు. ఫలితంగా ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట ఉన్న ప్రధాన రహదారి విద్యుత్ కార్మికులతో నిండిపోయింది. ఉద్యోగుల నినాదాలతో దద్దరిల్లింది. తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రభుత్వమని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం పేద ఉద్యోగులైన ఆర్టిజన్, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్, బిల్ కలెక్టర్ల సమస్యలు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇంత మంది పేద ఉద్యోగులను రోడ్డు మీద పడేయడం సరికాదన్నారు. ఆర్టిజన్లను రెగ్యులర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలదేనన్నారు. వెంటనే ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీని చర్చలకు పిలిచి సమ్మెను నివారించాలన్నారు. సమ్మెకు పవర్ ఎంప్లాయీస్ జేఏసీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. టీఆర్వీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జాన్సన్ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగ సంఘాలన్నీ ఆర్టిజన్లకు మద్దతుగా ఏకమై సమ్మెకు వెళ్లేలా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నె శశికుమార్ మాట్లాడుతూ పీస్ వర్క్ కార్మికులకు సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ప్రకారం సమాన పనికి సమాన వేతనాలు అమలు చేయాలని, దశలవారీగా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఉద్యోగుల సంఘం–1535 నాయకుడు వజీర్ మాట్లాడుతూ విద్యుత్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు, టీఎస్ఈఈయూ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ మాట్లాడుతూ ఆర్టిజన్ల సమస్యలు న్యాయమైనవని, వాటిని పరిష్కరించాలన్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఎస్.సతీశ్ రెడ్డి, కన్వీనర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 8 నుంచి ఆర్టిజన్ ఉద్యోగులు, అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లందరూ సమ్మెలోకి రావాలని పిలుపునిచ్చారు. మహాధర్నాలో ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ చైర్మన్ ధరావత్ సికిందర్, రాష్ట్ర నాయకులు సాయిలు, శ్రీధర్ గౌడ్, చందర్ సింగ్, ప్రశాంత్, వెంకన్న, ఎ.శ్రీకాంత్, దమ్మ రవీందర్, అటికేటి రవీందర్, తదితరులు పాల్గొన్నారు.ఉద్యోగ సంఘాల నాయకుల పిలుపు టీజీఎన్పీడీసీఎల్ కార్యాలయం వద్ద ఆర్టిజన్ జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలొచ్చిన కార్మికులు సమ్మెకు మద్దతు ప్రకటించిన ఉద్యోగ సంఘాలు -
మహబూబాబాద్
బుధవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ7● శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్న 1 గంట వరకు శిక్షణ ఇస్తారు. థ్రెడింగ్, హెయిర్ కట్స్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వెడ్డింగ్ ఫేస్ప్యాక్స్, హెయిర్స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, ఐబ్రోస్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ – సెల్ప్ గ్రూమింగ్, ఫేషియల్స్, శారీ డ్రాపింగ్ వంటి వాటిల్లో శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఈనెల 8వ తేదీ నుంచి 13 తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రిజిస్ట్రేషన్లు స్వీకరిస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల 14 నుంచి మే 12వ తేదీ వరకు ఉదయం 10 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఉంటుంది. ● రిజిస్ట్రేషన్, శిక్షణ కోసం శ్రీ శైలీ బ్యూటీపార్లర్, ఓల్డ్ బస్డిపో దగ్గర, సర్క్యూట్ హౌజ్ రోడ్డు, హనుమకొండలో సంప్రదించాలి. ● మరిన్ని వివరాల కోసం 95055 14424, 94901 55215 నంబర్లలో సంప్రదించాలి. -
వైద్య సేవల్లో అలసత్వం వహిస్తే చర్యలు
● కలెక్టర్ స్నేహ శబరీష్ తొర్రూరు: జిల్లాలోని అన్నివర్గాల ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ హెల్త్ సెంటర్లు, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, వైద్యులు, సిబ్బంది పని తీరు, హాజరుశాతాన్ని పరిశీలించారు. అలాగే బాలికల గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుల పనితీరు, పాఠశాల నిర్వహణ, విద్యార్థుల సామర్థ్యాలపై ఆ రా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రతీ ఒక్కరికి వైద్య సేవలు నిరంతరం అందించాలని, అవసరమైతే వైద్య శిబిరాలను నిర్వహిస్తూ అన్నివర్గాల ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని సూచించారు. అనంత రం బాలికల గురుకుల పాఠశాలలో ఏఐ ద్వారా తరగతులు నిర్వహిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ గణేష్, డీసీఓ జయశ్రీ, ప్రిన్సిపాల్ రత్నమాల, ఆస్పత్రి వైద్యులు డాక్టర్ సుగుణాకర్రాజు, నందనాదేవి, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరాలి మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం పరిశ్రమలు–పెట్టుబడుల ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. టీఫ్రైడ్ తెలంగాణ ఐపాస్ వంటి పథకాలతో ఎస్సీ, ఎస్టీ యువతకు ఉపాధి అవకాశాలు క ల్పించి, ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలన్నారు. టీజీఐపాస్ చట్టం కింద వివిధ శాఖల నుంచి అనుమతులు పొందేందుకు 30యూనిట్లు రూ. 36.90 కోట్ల పెట్టుబడితో దరఖాస్తు చేసుకున్నట్లు తెలి పా రు. అందులో కొన్నింటి అనుమతులు మంజూరు అయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీమన్నారాయణరెడ్డి, విద్యుత్శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ విజయేందర్రెడ్డి, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారులు దేశీరాంనాయక్, శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు. -
‘బూత్ లెవెల్’ కసరత్తు!
సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఏ) నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రతీ బూత్కు ప్రత్యేక ఏజెంట్లను ఎంపిక చేస్తూనే.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్చార్జ్లను నియమిస్తూ కేడర్ను యాక్టివ్ చేయడంపై దృష్టి సారించింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పార్టీ కేడర్ ప్రజల్లోకి వెళ్లేలా బూత్స్థాయి కమిటీలను ఆచితూచి నియమిస్తోంది. ఇందుకోసం.. ఇతర జిల్లాలకు చెందిన సీనియర్లను ఉమ్మడి వరంగల్లోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్చార్జ్లుగా నియమించారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న సీనియర్లకు ఇతర జిల్లాల ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. కీలకంగా బీఎల్ఏలు.. రాబోయే ఎన్నికల్లో బూత్ లెవెల్ ఏజెంట్లు కీలకంగా వ్యవహరించేలా అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జ్లు కమిటీలు వేయాల్సి ఉంది. ప్రతీ బూత్కు 10–15 మంది యాక్టివ్ టీమ్తో బూత్ లెవెల్ ఏజెంట్లను ఎంపిక చేయాలనేది పార్టీ అధిష్టానం ఆదేశాలు. ఎంపికై న బీఎల్ఏలు ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేలా చూడాలి. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రతీ బూత్ను టార్గెట్గా తీసుకుని పనిచేస్తోంది. స్థానికంగా ప్రభావం ఉన్న యువకులు, సీనియర్ కార్యకర్తలను ఎంపిక చేసి.. ఓటర్లతో నేరుగా సంబంధాలు పెంచేలా బాధ్యతలు అప్పగించనున్నారు. ఓటర్ లిస్ట్లో లోపాల గుర్తింపు, సరిదిద్దే పనితో పాటు ‘బూత్ గెలిస్తేనే సీటు గెలుస్తాం’ అనే స్ట్రాటజీతో ముందుకెళ్లాలన్న పార్టీ అధిష్టానం సూచనల మేరకు అసెంబ్లీ ఇన్చార్జ్లు కేడర్కు మార్గనిర్దేశనం చేస్తున్నారు. బీఎల్ఏలు ప్రభుత్వ పథకాలు, పార్టీ హామీలపై అవగాహన, అసంతృప్త వర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు కేడర్కు సంకేతాలిచ్చారు. ఈనేపథ్యంలో బూత్ లెవెల్ ఏజెంట్ల కోసం కూడా పోటీ పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 12 సెగ్మెంట్లకు ఇన్చార్జ్లు వీరే.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్, మహబూబాబాద్, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధి 12 సెగ్మెంట్లకు ఇన్చార్జ్లను నియమించారు. జనగామకు బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తికి దుద్దిళ్ల శ్రీనివాస్, పరకాల, వరంగల్ పశ్చిమకు పల్లె శ్రీనివాస్గౌడ్కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేటకు మోతుకూరి ధర్మారావు, భూపాలపల్లి, ఎండీజావేద్ (ఆర్జీపీఆర్ఎస్), డోర్నకల్, మహబూబాబాద్కు ఎండీ.అవేజ్, నర్సంపేట, ములుగుకు నాగ సీతారాములును అసెంబ్లీ ఇన్చార్జ్లుగా నియమించారు. అదేవిధంగా జిల్లాకు చెందిన నాయకులు జంగా రాఘవరెడ్డికి నల్లగొండ, ఈవీ.శ్రీనివాస్రావుకు భువనగిరి, గాజర్ల అశోక్కు భద్రాచలం, కూచన రవళిరెడ్డికి పినపాక, ఇల్లెందు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. ‘సంస్థాగత’ంపై కాంగ్రెస్ ఫోకస్ బూత్ స్థాయి కమిటీలపై గురి 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్చార్జ్లు ఇతర జిల్లాలకు పార్టీ సీనియర్లు నియామక ఉత్తర్వులు జారీ చేసిన టీపీసీసీ చీఫ్ -
టెన్త్ స్పాట్ కేంద్రంలో టీచర్ల నిరసన
విద్యారణ్యపురి: గతేడాదిలో టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ చేసిన ఉపాధ్యాయులకు రెమ్యునరేషన్ చెల్లించాలని, ప్రస్తుతం చేస్తున్న స్పాట్ మూల్యాంకన ధరలను 50 శాతం పెంపుదల చేయాలనే తదితర డిమాండ్లతో టీటీజాక్, యూఎస్పీసీ, జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు హనుమకొండ జిల్లా కేంద్రం ఫాతిమా హైస్కూల్లోని టెన్త్ స్పాట్ కేంద్రంలో మంగళవారం నిరసన చేపట్టారు. ఈసందర్భంగా ఆయా ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు మాట్లాడుతూ 2024లో నిర్వహించిన కులగణనలో పాల్గొన్న ఉపాధ్యాయులకు పారి తోషికం ఇవ్వలేదని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కొన్నేళ్లుగా స్పాట్ మూల్యాంకనం చేసిన ఉపాధ్యాయులకు ఒకరోజు డీఏ తగ్గించి ఇస్తున్నారని ఆరోపించారు. ఆయా డిమాండ్లు పరిష్కరించకపోతే స్పాట్ మూల్యాంకన విధులు బహిష్కరిస్తారన్నారు. అనంతరం డీఈఓ, స్పాట్ క్యాంపు ఆఫీసర్ గిరిరాజ్ గౌడ్కు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఎం. తిరుపతిరెడ్డి, సి.హెచ్ రవీందర్ రాజు, కె. రాంబాబు, బి. రాజీబాపురావు, కె. శ్రీనివాసులు, గోవిందరావు, దేవేందర్రాజు, బద్దం సుదర్శన్రెడ్డి, రామాంజనేయులు, వి. రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. గత వాల్యుయేషన్ రెమ్యునరేషన్ ఇవ్వాలని డిమాండ్ -
ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలి
● డీజీపీ శివధర్ రెడ్డి వెంకటాపురం(కె): ప్రతీ ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కాపెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయ ఆవరణలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్, ఎలైవ్’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీజీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ద్విచక్రవాహన దారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలన్నారు. వెనుక కూర్చునే వ్యక్తులకు సైతం హెల్మెట్ ధరించి ప్రయాణించాలన్నారు. దీని వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగినా రక్షణ ఉంటుదన్నారు. కారు, ఇతర వాహనాలు నడిపే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నారు. సురక్షిత డ్త్రెవింగ్ చేయాలన్నారు. అనంతరం గ్రామస్తులకు హెల్మెట్లు అందజేశారు. ‘అరైవ్ ఎలైవ్’ కార్యక్రమ పోస్టర్లు ఆవిష్కరించారు. సీసీఎఫ్ఓ సువర్ణ, ఇంటెలిజెన్స్ ఐజీ విజయ్ కుమార్, సీఆర్పీఎఫ్ ఐజీ విక్రమ్, ఎస్బీ ఐజీ సుమతి, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, సీఐ ముత్యం రమేశ్, ఎస్సై తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు. -
వేయిస్తంభాల ఆలయ అభివృద్ధికి కృషి
● వరంగల్ ఎంపీ కడియం కావ్య, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని, జిల్లా అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు సాధిస్తామని వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వేయిస్తంభాల ఆలయాభివృద్ధికి, కల్యాణ మండపం పునరుద్ధరణ పనులకు కేంద్ర పురావస్తుశాఖ (ఏఎస్ఐ) ద్వారా రూ.14.44 కోట్ల్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. మంగళవారం ఆలయాన్ని ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి సందర్శించారు. ఆలయ ఈఓ అనిల్కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు వారిని ఆలయమర్యాదలతో స్వాగతించారు. పూజల అనంతరం ఉపేంద్రశర్మ ఆలయ నాట్యమండపంలో తీర్థప్రసాదాలు, మహాదాశీర్వచనం అందించారు. మంజూరైన నిధులు ఏ పనులకు వినియోగిస్తారనే విషయాలను కేంద్రపురావస్తుశాఖ జిల్లా అధికారి అజిత్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో సమావేశంలో ఎంపీ కావ్య మాట్లాడుతూ.. గతేడాది ఎమ్మెల్యేలతో కలిసి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను, కేంద్ర పురావస్తుశాఖ అధికారులను కలిసి వేయిస్తంభాల ఆలయానికి నిధులు మంజూరు చేయాల్సిందిగా ఐదుసార్లు మెమోరాండం సమర్పించామని తెలిపారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. నిధుల మంజూరు ఎంపీ నాయ కత్వంలో ఎమ్మెల్యేలంతా సాధించిన విజయమ న్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు కుమార్యాదవ్, నూర్జహాన్, తదితరులు పాల్గొన్నారు. -
బాలికను వేధించిన
నేరస్తులకు మూడేళ్ల జైలువరంగల్ లీగల్ : బాలికను వ్యంగ్య మాటలు, వెకిలి చేష్టలతో వేధింపులకు గురి చేస్తూ చంపుతామని బెదిరింపులకు పాల్పడిన ఘటనలో నేరం రుజువుకావడంతో హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం కనిపర్తి గ్రామానికి చెందిన పస్తం అరవింద్, తూర్పాటి రాజుకు మూడేళ్ల జైలు శిక్ష, రూ. 2 వేల చొప్పున జరిమానా విధిస్తూ హనుమకొండ జిల్లా మొదటి అదనపు కోర్టు జడ్జి బి.అపర్ణాదేవి మంగళవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కనిపర్తి గ్రామానికి చెందిన ఓ బాలిక 8వ తరగతి చదువుకుంటోంది. సదరు బాలిక పాఠశాలకు వెళ్తున్న సమయంలో, ఇంట్లో ఒంటరిగా ఉన్న సందర్భంలో అదే గ్రామానికి చెందిన అరవింద్, రాజు మానసికంగా వేధించేవారు. ఈ విషయాన్ని బాలిక తన తండ్రికి తెలియజేయగా గ్రామ పెద్ద మనిషి ద్వారా ఇరువురిని పిలిచి మందలించారు. అయినా వారి తీరులో ఎలాంటి మార్పు లేదు. ఈ క్రమంలో 2022, ఏప్రిల్ 27న బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అరవింద్, రాజు మరోసారి వచ్చి అదే రీతిలో ప్రవర్తించగా స్పందించింది. దీంతో ఈ విషయం ఎవరికై నా చెబితే చంపుతామని బెదిరించారు. ఈ ఘటనను బాలిక తన తండ్రికి చెప్పింది. దీంతో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కమలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు అరవింద్, రాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో నేరం రుజువుకావడంతో నేరస్తులు అరవింద్, రాజుకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి అపర్ణాదేవి తీర్పు వెలువరించారు. కేసును సీఐ పి.నవీన్, ఎస్సై ప్రవీణ్కుమార్ పరిశోధించగా, లైజన్ ఆఫీసర్ కె.పరమేశ్వరీ, భరోసా న్యాయ అధికారి సి.హెచ్ నీరజ విచారణ పర్యవేక్షించారు. సాక్షులను కానిస్టేబుల్ ఎం.హరీశ్ కోర్టులో ప్రవేశపెట్టగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.రాజమల్లారెడ్డి కేసు వాదించారు. -
పోలీస్ పహారాలో సర్వే
గార్ల: మహబూబాబాద్ జిల్లా గార్ల సమీపంలోని మున్నేరు వాగు నుంచి రూ.204 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మున్నేరు టు పాలేరు లింక్ కెనాల్ నిర్మాణం కోసం చేపట్టనున్న సర్వేను మంగళవారం 200 మంది పోలీసుల పహారా మధ్య ప్రారంభించారు. కాగా, ఈ ప్రాంతం నీటిని ఇక్కడికి ఇవ్వకుండా పాలేరుకు తరలిస్తే ఊరుకోబోమని రైతులు, మున్నేరు జలసాధన కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. అయితే వీరిని పోలీసులు సోమవారం అర్ధరాత్రి నుంచే ముందస్తు అరెస్ట్లు చేశారు. అనంతరం పోలీస్ బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. కాగా, మండలంలోని దుబ్బగూడెం సమీపంలోని పాకాల ఏటి నుంచి 140 మీటర్ల వెడల్పుతో కాల్వ వెళ్తుండడంతో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ నీళ్లు తమ భూములకు ఇవ్వకుండా ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తన నియోజకవర్గ రైతుల కోసం పాలేరు చెరువుకు నీరును తరలించడంపై మండిపడ్డారు. నాయకులను విడుదల చేయాలంటూ ధర్నా.. మున్నేరు జలసాధన కమిటీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ గార్లలో అఖిలపక్ష నాయకులు, రైతులు, స్థానికులు ధర్నా చేపట్టారు. అనంతరం పీఎస్కు వెళ్లి పోలీసులను వేడుకున్నా జలసాధన కమిటీ నాయకులను రాత్రి వరకు విడిచి పెట్టేది లేదని చెప్పారు. దీంతో పోలీసులు, అఖిలపక్ష నాయకుల మధ్య కాసేపు వా గ్వాదాలు చోటుచేసుకున్నాయి. కాగా, మున్నేరు జ లసాధన కమిటీ సభ్యుల్లో ఒకరైన జంపాల విశ్వ పీ ఎస్లో మౌనదీక్ష చేపట్టాడు. ఉదయం నుంచి ఏమి తినకుండా ఉండడంతో మధ్యాహ్నం కళ్లు తిరిగి స్పృహ కోల్పోయాడు. దీంతో వెంటనే పోలీసులు సీహెచ్సీకి తరలించి చికిత్స చేయించారు. భూములు ఇచ్చేది లేదంటున్న రైతులు.. మున్నేరు టు పాలేరు లింక్ కెనాల్ కోసం రెవెన్యూ అధికారులు తమ భూముల్లో సర్వే చేసినా ఇచ్చేది లేదని గిరిజన, గిరిజనేతర రైతులు పేర్కొంటున్నారు. ఎక్కడో ఉన్న పాలేరు రైతుల స్వలాభం కోసం తమ భూములు ఎందుకు ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం.. గార్ల సమీపంలో లింక్ కెనాల్ నిర్మాణ సర్వే పోలీసుల పహారా మధ్య చేయడం, అఖిలపక్ష నాయకుల ముందస్తు అరెస్ట్లు చేయడాన్ని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఖండించారు. లింక్ కెనాల్ భూసర్వే విషయంలో రైతులకు ఇష్టం లేకున్నా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన అఖిలపక్ష నాయకులను వెంటనే విడుదల చేయాలని, లింక్ కెనాల్ సర్వే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మున్నేరు ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్నారు. కొనసాగుతున్న మున్నేరు టు పాలేరు లింక్ కెనాల్ సర్వే మున్నేరు జలసాధన కమిటీ నాయకుల ముందస్తు అరెస్ట్ సర్వే ప్రాంతంలో 200మంది పోలీసుల మోహరింపు అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని అఖిలపక్ష నాయకుల ఆందోళన తమ భూములు ఇచ్చేది లేదంటున్న రైతులు -
పల్లె స్ఫూర్తి.. కావాలి దీప్తి!
మహబూబాబాద్ జిల్లా కురవిమండలం తిర్మలాపురం గ్రామంలోని జనాభా 765. గ్రామంలో 75 ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. గతంలో రోడ్డు ప్రమాదాల బారినపడి పలువురు మృతి చెందారు. మరోసారి గ్రామస్తులు ప్రమాదాలకు గురి కావొద్దని, ప్రమాదవశాత్తు పడినా తలకు గాయం కాకుండా ఉండేందుకు ద్విచక్ర వాహనం ఉన్న ప్రతీ ఒక్కరు హెల్మెట్ ధరించి వాహనం నడపాలని గ్రామ సభలో తీర్మానం చేశారు. గ్రామ సర్పంచ్ కనకటి అచ్చమ్మ తన సొంత డబ్బులతో అందరికీ హెల్మెట్లు కొనుగోలు చేసి అందజేశారు. ఇప్పుడు ఆ గ్రామంలో హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనం పడిపేవారు లేరు.సాక్షి, మహబూబాబాద్: నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా హెల్మెట్ వాడకంపై హైదరాబాద్ మహానగరంలో కూడా చాలామంది పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ మారుమూల పల్లెల్లో మాత్రం హెల్మెట్ తప్పనిసరని తీర్మానం చేసుకొని అమలుచేయడం విశేషం. మహబూబాబాద్ జిల్లాకు ఇటీవల వచ్చిన ఎస్పీ శబరీష్ రోడ్డు ప్రమాదాల నివారణకు వినూత్నంగా ఆలోచించారు. కొత్తగా ఎంపికైన గ్రామ సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్లతో గత నెల 17న జిల్లా కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేశారు. మన ఊరు–మన బాధ్యత పేరుతో చేపట్టిన కార్యక్రమం గురించి వివరించారు. సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్ల సలహాలు, సూచనలు తీసుకున్నారు. వారితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి పలుమార్లు మీటింగ్లు పెట్టి కార్యక్రమం ప్రాధాన్యత వివరించారు. దీంతో మూడు అంశాలపై ప్రతీ గ్రామంలో తీర్మానం చేశారు. ఈ ఫొటోలో ద్విచక్రవాహనదారుడికి పోలీసు హెల్మెట్ పెడుతున్న దృశ్యం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంకటగిరి గ్రామంలోనిది. సర్పంచ్ భూక్య జ్యోతి గ్రామ సభ నిర్వహించి ద్విచక్ర వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తీర్మానం చేశారు. గ్రామంలో 164 ద్విచక్ర వాహనాలు ఉండగా.. తీర్మానం చేసిన వెంటనే 93 మంది హెల్మెట్లు కొనుగోలు చేశారు. మిగిలిన 71 మందికి దాతల సహకారంతో పోలీసులు హెల్మెట్లు కొనుగోలు చేసి ఇచ్చారు. మొదటి విడత 36 పంచాయతీలు,15వార్డులు జిల్లాలో మొత్తం 482 గ్రామాలు, 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే అన్ని గ్రామాల్లో ఒకేసారి హెల్మెట్ధరించడం, గంజాయి నిర్మూలించడం, సీసీ కెమెరాల ఏర్పాటు వీలు కాదని గ్రహించారు. ముందుగా ప్రతీ మండలానికి రెండు గ్రామాల చొప్పున 36 పంచాయతీలు, ఐదు మున్సిపాలిటీల నుంచి 15 వార్డులను ఎంపిక చేసుకుని గ్రామ సభలు పెట్టి తీర్మానాలు చేశారు. ఇప్పుడు ఆయా గ్రామాలు, వార్డుల్లో ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్ ధరించి వాహనం నడిపేలా చర్యలు తీసుకున్నారు. గ్రామస్థాయి నుంచిమార్పురావాలని.. ప్రతీ సంవత్సరం రోడ్డు భద్రతావారోత్సవాలు, గంజాయి నిర్మూలన కార్యక్రమాలు, సీసీ కెమెరాల ఉపయోగంపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాం. అయితే గ్రామస్థాయి నుంచి మార్పు వస్తే ఇది శాశ్వతంగా ఉంటుందని భావించాం. కొత్తగా ఎంపికైన సర్పంచ్లు, వార్డుకౌన్సిలర్లతో సమావేశం పెట్టగా.. మంచిస్పందన వచ్చింది. మొదటి విడత ఎంపిక చేసిన గ్రామాల్లో వందశాతం హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతున్నారు.దశలవారీగా జిల్లా మొత్తం అమలయ్యేలా ముందుకెళ్తున్నాం. -
పెసర.. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి
హన్మకొండ : పత్తి తీసిన తర్వాత ఆ పంట మోడ్లను భూమిలో కలియదున్నిన తక్కువ పంట కాలపరిమితి కలిగిన పెసర సాగు చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందొచ్చని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోదన స్థానం సహ పరిశోధన సంచాలకుడు ఆర్.ఉమా రెడ్డి అన్నారు. వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానంలో పత్తి అనంతరం పెసర సాగుపై క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. వ్యవసాయ కళాశాల డీన్ రవీందర్ నాయక్, శాస్త్రవేత్తలు, వ్యవసాయ విద్య విద్యార్థులు, రైతులతో కలిసి ఉమా రెడ్డి పెసర పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెసర సాగుతో భూమిలోని నత్రజని శాతాన్ని పొంపొందించుకోవచ్చన్నారు. మార్కెట్లో పెసరకు డిమాండ్ ఉందని, ఈ నేపథ్యంలో లాభసాటిగా ఉంటుందన్నారు. రైతులు అపరాల సాగుపై దృష్టి సారించాలన్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు ఉమారెడ్డి -
సత్వరమే పరిష్కరించాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్ ● ప్రజావాణిలో 195 వినతులు ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ స్నేహశబరీష్ అఽధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్కుమార్ వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ దరఖాస్తును క్షుణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు. జిల్లాలో పనిచేస్తున్న అన్ని వి భాగాల జిల్లా అఽధికారులు ప్రతీ సోమవారం ని ర్వహించే ప్రజావాణికి తప్పక హాజరుకావాలని, లేకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పెండింగ్ దరఖాస్తులను కూడా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. ప్రజా వాణిలో 195 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓలు కృష్ణవేణి, గణేశ్, జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
అడ్డగోలు పేలుళ్లు!
మరిపెడ రూరల్: జిల్లాలోని మరిపెడ మండలంలోని పలు ప్రాంతాల్లో ఉన్న గుట్టలు, రాళ్లను తొలగించేందుకు అనుమతి లేకుండా పేలుడు పదార్థాలు (జిలెటిన్స్టిక్స్) వినియోగిస్తున్నారు. పేలుడు పదార్థాల కారణంగా శబ్దాలతో కూడిన విషవాయువులు వెలువడుతున్నాయి. దీంతో గుట్టల ప్రాంతంలోని అటవీ జీవులు, పక్షులకు ముప్పు ఏర్పడుతోంది. పేలుళ్ల శబ్దం, ధూళికి ప్రకృతి సమతౌల్యం దెబ్బతినడం వల్ల జీవవైవిధ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. దీంతో అటవీ జీవులు అంతరించే పరిస్థితి దాపురించిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, అడ్డుగోలుగా పేలుళ్లు జరుగుతున్నా.. సంబంధిత శాఖల అధికారులు చోద్యం చూస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. భద్రతా ప్రమాణాలు కరువు.. ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండానే పేలుడు పదార్థాల వినియోగం జోరుగా కొనసాగుతోంది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో పేలుడు పదార్థాలతో గుట్టలు, రాళ్లను తొలుస్తున్నారు. భూముల చదును, ప్లాట్లలో అడ్డు వచ్చిన రాళ్లను పగలగొట్టేందుకు కంప్రెషర్ ద్వారా బండరాళ్లుకు రంధ్రాలు తొలుస్తున్నారు. ఆ తర్వాత అనుమతులు లేకుండా కొనుగోలు చేసుకున్న పేలుడు పదార్థాలతో పేల్చేస్తున్నారు. చుట్టుపక్కల మూగజీవాలతో పాటు ప్రజలు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. నిత్యం ఏదో ఒకచోట యథేచ్ఛగా పేలుళ్లు జరుగుతున్నప్పకీ మైనింగ్ అధికారులు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.మరిపెడ నుంచి మహారాష్ట్రకు.. గత ఏడాది ఇక్కడి నుంచి మహారాష్ట్రకు పేలుడు పదార్థాలను ఆ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి కూలీ పనుల కోసం వచ్చి కొనుగోలు చేసుకుని వెళ్లాడు. అక్కడ పేలుడు పదార్థాలు పట్టుబడగా అవి మరిపెడ నుంచి సరఫరా అయినట్లు తేలింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) బృందం అధికారులు మరిపెడ మండంలోని భూక్యతండాలో ఓ అనుమానిత వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించారు. కాగా, వరంగల్కు చెందిన ఓ పేలుడు పదార్థాల వ్యాపారి మరిపెడ కేంద్రంగా వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధిత అధికారులతో ఉన్న సంబంధాలతోనే కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నట్లు పలు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి పేలుడు పదార్థాలపై నిఘా పెట్టి, నివారణ చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. అవరసమైతే నిబంధనలు అతిక్రమించిన వారిపై ఉక్కుపాదం మోపాలని అంటున్నారు. విచ్చలవిడిగా పేలుడు పదార్థాల వినియోగం గుట్టలు, రాళ్లు తొలగించేందుకు వాడకం అటవీ జీవులు, పక్షులకు ముప్పు జీవ వైవిధ్యంపై ప్రతికూల ప్రభావం గత ఏడాది మరిపెడలో ఎన్ఐఏ అధికారుల సోదాలు చోద్యం చూస్తున్న మైనింగ్ అధికార యంత్రాంగం.. -
26 కేజీల గంజాయి స్వాధీనం
● నలుగురి అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన పోలీసులు డోర్నకల్: రూ. 13.41 లక్షల విలువైన 26 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ సీఐ చంద్రమౌళి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఏర్పాటు చేసిన వి లేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎస్సై వంశీధర్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆదివారం పట్టణంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో బైక్పై ఇద్దరు, కారులో ముగ్గురు వెళ్తుండగా ఆపారు. బైక్పై ఓ బ్యాగు, కారులో రెండు బ్యాగులు తనిఖీ చేయగా గంజాయి లభించింది. పంచుల సమక్షంలో తూకం వేయగా 26 కిలోల బరువు ఉందని తేలింది. దీని విలువ రూ.31,41,450 ఉంటుంది. దీంతో తనిఖీల సమయంలో కారు నుంచి ఒకరు పారిపోగా నలుగురిని అరెస్ట్ చేసి గంజాయితో పాటు కారు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో హైదరాబాద్ నాగోల్ ప్రాంతానికి చెందిన వాంకుడోత్ వినోద్, ముసారాంబాగ్కు చెందిన మల్లెపు శశికాంత్, అంబర్పేటకు చెందిన పెంటెం చంద్రశేఖర్, బాపనపల్లి విజయకాంత్ ఉన్నారు. వీరు ఒడిశా వెళ్లి గంజాయి కొనుగోలు చేసి తిరిగొస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. ఫకీరాతండాలో గంజాయి నిల్వ చేసిన వ్యక్తి అరెస్ట్ నర్సింహులపేట: ఎండు గంజాయి నిల్వ చేసిన నర్సింహులపేట మండలం ఫకీరాతండాకు చెందిన నేతావత్ రూప్లాను అరెస్ట్ చేసినట్లు ఎ స్సై మాలోత్ సురేశ్ తెలిపారు. రూప్లా తన ఇంట్లో గంజాయి నిల్వ చే శాడనే సమాచారం మేరకు టాస్క్పోర్స్ సీఐ హథీరాం, ఎస్సై మాలోత్ సురేశ్ సంయుక్తంగా సోమవారం తనిఖీ చేశారు. ఇందులో సుమారు రూ. 2,40,000 విలువైన 4.8 కిలోల సరుకు లభించడంతో సీజ్ చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
ప్రజల ఆరోగ్యం.. ప్రభుత్వ బాధ్యత
హన్మకొండ చౌరస్తా: ప్రజల ఆరోగ్యం.. ప్రభుత్వ బాధ్యతని, అందుకు అనేక కార్యక్రమాలు చేపడుతోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 6 నుంచి 11వ తేదీ వరకు ఆరోగ్య వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఫుడ్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ నుంచి కాళోజీ జంక్షన్ వరకు సోమవారం నిర్వహించిన ర్యాలీని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యం, ఆహారం, తాగునీరు అంశాలపై ప్రజలు అవగాహనతోపాటు జాగ్రత్తలు తీసుకోవాలని, జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ అప్పయ్య, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్, ఫుడ్సేఫ్టీ అధికారి బ్రహ్మాజీ, ఆరోగ్య కేంద్రాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. ప్రతీ కాలనీని అభివృద్ధి చేస్తా నయీంనగర్: ఐదేళ్లలో ప్రతీ కాలనీని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. 54వ డివిజన్ అపూర్వ కాలనీలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాధాన్యత ఆధారంగా అభివృద్ధి పనులను వేగంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల హామీలను నెరవేరుస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో 54వ డివిజన్ కార్పొరేటర్ గుంటి రజిత, కాలనీ వాసులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి -
హత్య కేసులో నిందితుల అరెస్ట్
రేగొండ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన వ్యక్తి హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సోమవారం భూపాలపల్లి సీఐ నరేశ్ కుమార్ వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన కుర్రే చేరాలు (55)కు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో చేరాలు కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీంతో కుటుంబంలో విభేదాలు ఏర్పడి తరచూ గొడవలు జరిగేవి. కాగా, చేరాలు తన భార్యాపిల్లలతో కలిసి హైదరాబాద్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో పని నిమిత్తం వారం రోజుల క్రితం స్వగ్రామం వచ్చాడు. కానీ తిరిగి హైదరాబాద్కు వెళ్లకపోవడంతోపాటు ఫోన్లో స్పందించకపోవడంతో ఇద్దరు కుమారులు రామ్, లక్ష్మణ్ రేపాకకు చేరుకున్నారు. ఈ సమయంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ ఇంట్లో తండ్రి ఉండడాన్ని చూసి గొడ్డితో దాడికి పాల్పడి పరారయ్యాయి. తీవ్రంగా గాయపడిన చేరాలను స్థానికులు గమనిచి 108లో వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మండల కేంద్రంలో వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. వారి వద్ద నుంచి గొడ్డలి, ద్విచక్రవాహనం, 25 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా, కేసు ఛేదనలో ప్రతిభకనబర్చిన ఎస్సై సుధాకర్, సిబ్బందిని సీఐ నరేశ్కుమార్ అభినందించారు. వివరాలు వెల్లడించిన పోలీసులు -
నేడు డీజీపీ శివధర్రెడ్డి రాక
వెంకటాపురం(కె): ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలంలో నేడు డీజీపీ శివధర్రెడ్డి పర్యటించనున్నారు. మంగళవారం కర్రెగుట్టల్లో తడపల వద్ద బేస్ క్యాంపును ఆయన ప్రారంభించనున్నారు. ఈ మేరకు సోమవారం పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. కాపెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశ వేదిక వద్ద పోలీసులు డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలతో పరిశీలించారు. అనంతరం డీజీపీ కంటి వైద్యశిబిరం ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 10 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల రెండో, నాలుగో, ఆరో సెమిస్టర్ పరీక్షలను ఈనెల 10వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షలు రోజుకు రెండు విడతలుగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు నిర్దేశించిన సమయానికి ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షల టైంటేబుల్ షెడ్యూల్ను కూడా విద్యార్థులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. -
కలెక్టర్ ఉంటేనే సవ్యంగా..
మహబూబాబాద్: సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతీ సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మండలస్థాయిలో న్యాయం జరగకపోతే బాధితులు ప్రజా వాణికి వస్తున్నారు. దూరప్రాంతాల నుంచి ఆటోలు, ఇతర వాహనాల్లో వస్తున్నారు. దివ్యాంగులు అయితే ప్రత్యేకంగా ఆటోల్లో వచ్చి వినతులు ఇస్తున్నారు. అయితే కలెక్టర్ ఉంటేనే ప్రజావాణి సవ్యంగా సాగుతోంది. లేకుంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు ఇలా.. సోమవారం జరిగిన ప్రజావాణిలో ముందుగా అదనపు కలెక్టర్ అనిల్కుమార్, ఆర్డీఓ కృష్ణవేణి దరఖాస్తులు స్వీకరించారు. కలెక్టర్ స్నేహ శబరీష్ తన చాంబర్లో ఉన్నప్పటికీ.. పలు పనుల వల్ల కొంత ఆలస్యంగా వచ్చారు. ఆ సమయంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కలెక్టర్ లేకుంటే ప్రతీ ప్రజావాణి ఇలాగే సాగుతోంది. కొంతమంది సెల్ ఫోన్లో బిజీగా.. మరికొందరు ముచ్చట్లలో, ఇంకొంతమంది ఆఫీస్ పని చేసుకుంటూ ల్యాప్ టాప్ల్లో మునిగిపోయారు. షోకాజ్ నోటీస్లు ఇచ్చినా.. ప్రజావాణిలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్ మా ట్లాడుతూ.. కొంతమంది అధికారులకు షోకాజ్ నో టీస్లు ఇచ్చినా హాజరుకావడం లేదన్నారు. తదుపరి పరిణామాలకు మీరే బాధ్యత వహించాలన్నా రు. జిల్లాస్థాయి అఽధికారులు రాకుండా కిందిస్థాయి అధికారులను పంపిస్తున్నారు. కలెక్టర్ సీరియస్గా తీసుకుంటేనే ప్రజావాణి సమర్థవంతంగా జరుగుతుందని దరఖాస్తుదారులు అంటున్నారు. కలెక్టర్ వస్తేనే.. ప్రజావాణికి కలెక్టర్ స్నేహశబరీష్ వస్తేనే దరఖాస్తుదారులు అధిక సంఖ్యలో వచ్చి క్యూ కడుతున్నారు. కలెక్టర్కు దరఖాస్తు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఆమె కూడా ప్రతీ దరఖాస్తును క్షుణంగా పరిశీలించి సంబంధిత అధికారిని పిలిచి మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశిస్తున్నారు. దీంతో ప్రజా వాణి కొంతకాలంగా గాడిన పడుతోంది. పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని ప్రతీ ప్రజావాణిలో కలెక్టర్ ఆదేశించినా పూర్థిస్థాయిలో పరిష్కారం కాలేదు. ఇప్పటికే కొంతమందిపై వేటు.. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా కలెక్టర్ స్నేహ శబరీష్ జిల్లా కేంద్రంలో పలు కార్యాలయాలను సందర్శించారు. కార్యాలయాల నిర్వహణ తీరుపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల పీఆర్ ఈఈ విద్యాసాగర్ను సరెండర్ చేసిన విషయం విదితమే. ఆకస్మిక తనిఖీలతో కార్యాలయాల్లో అధికారులు సాయంత్రం 6గంటల వరకు ఉంటున్నారు. ఫైళ్లు ఇతరత్రా అన్ని క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. చాలా వరకు కార్యాలయాల్లో మార్పు కన్పిస్తోంది. జిల్లాలోని 406 మంది జీపీఓలకు డిప్యుటేషన్ వేశారు. మరికొంత అధికారులపై కూడా చర్యలు తీసుకున్నట్లు సమాచారం.జిల్లా పాలనాధికారి వస్తేనే ప్రజావాణిలో దరఖాస్తులు ఇస్తున్న ప్రజలు హాజరుకాని కొంతమంది జిల్లాస్థాయి అఽధికారులు షోకాజ్ నోటీస్లు ఇచ్చినా వీడని నిర్లక్ష్యం -
సంస్థ అభివృద్ధిలో ప్రతీ ఉద్యోగి కీలకం
హన్మకొండ : సంస్థ అభివృద్ధిలో ప్రతీ ఉద్యోగి కీలకమని హనుమకొండ కలెక్టర్, వరంగల్ డీసీసీబీ పర్సన్ ఇన్చార్జ్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో 2025–2026 ఆర్థిక సంవత్సరంలో వరంగల్ డీసీసీబీ అత్యుత్తమ ఫలితాలు సాధించిన నేపథ్యంలో సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు జ్ఞాపికలు అందించి అభినందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నిరార్థక ఆస్తుల నియంత్రణ సమర్థవంతంగా నిర్వహించారని, డిపాజిట్ మోబిలైజేషన్, రుణాల పంపిణీ, గోల్డ్లోన్ విభాగాల్లో నిర్దేశిత లక్ష్యాలు అధిగమించారన్నారు. సమిష్టి కృషితో ఈ విజయాన్ని సాధించినట్లు తెలిపారు. భవిష్యత్లోనూ ఇదే మాదిరి అంకితభావంతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాబార్డు డీడీఎంలు చంద్రశేఖర్, చైతన్య రవి, వరంగల్ డీసీసీబీ సీఈఓ వజీర్ సుల్తాన్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ విజయకుమారి, జనరల్ మేనేజర్ ఉషశ్రీ, డీజీఎం అశోక్, ఏజీఎంలు, 32 బ్రాంచ్ల మేనేజర్లు, సూపర్ వైజర్లు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ -
ఈవీఎంల భద్రతకు నూతన గోదాంలు
హన్మకొండ అర్బన్ : రాష్ట్రంలో ఈవీఎంల భద్రతను మరింత బలోపేతం చేయడానికి నూతన గోదాంలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం హనుమకొండ సుబేదారిలోని రెడ్ క్రాస్ సమీపంలో ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను భద్రపరిచేందుకు నిర్మించిన నూతన గోదాంను ప్రారంభించారు. అనంతరం గోదాంలో ఏర్పాటు చేసిన ఈవీఎంలు, వీవీప్యాట్ల నిల్వ గదులను పరిశీలించారు. భవన ప్రాంగణంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్తో కలిసి మొక్క నాటి నీరు పోశారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఈ గోదాం నిర్మాణం ప్రధాన ఉద్దేశం ఈవీఎంలను సురక్షితంగా నిల్వ చేయడం, అన్ని భద్రతా ప్రమాణాలను పాటించడమేనని తెలిపారు. గోదాంలో 24 గంటలపాటు భద్రతా ఏర్పాట్లు ఉంటాయని, పోలీస్ బందోబస్తు, సీసీటీవీ పర్యవేక్షణ వంటి చర్యలు అమల్లో ఉంటాయని వివరించారు. అలాగే రాష్ట్రంలో త్వరలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియకు ముందు మ్యాపింగ్ కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రతీ పోలింగ్ స్టేషన్ పరిధిలోని ఓటర్ల వివరాలను సరిచూసి వారి స్థానం గుర్తిస్తామన్నారు. ఈ ప్ర క్రియ విజయవంతం కావడానికి రాజకీయ పార్టీల సహకారం అవసరమన్నారు. సమావేశం అనంతరం సుదర్శన్ రెడ్డి, బిహార్ అదనపు సీఈఓ ప్రశాంత్ కుమార్ను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, అదనపు కలెక్టర్ ఎన్. రవి, ఆర్అండ్బీ ఈఈ సురేశ్ బాబు, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, కన్నం నారాయణ, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి -
రాజకీయాలకతీతంగా అభివృద్ధి
వేలేరు: రాజకీయాలకు అతీతంగా అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తానని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. సోమవారం మండలంలోని బండతండా, కమ్మరిపేట, వేలేరు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు, సీసీ రోడ్ల ప్రారంభం, చింతలతండాలో సీసీ రోడ్లు, జీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం వేలేరు రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. లబ్ధిదారులకు ఏమైనా సమస్యలంటే సర్పంచ్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్నారు. వేలేరు, చిల్పూరు మండలాలకు వచ్చే జూన్ చివరి నాటికి గండి రామారం లిఫ్ట్ –1 పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తానన్నారు. అనంతరం పలువురు రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు, మహిళా సంఘం సభ్యులకు డ్రోన్ అందజేశారు. తహసీల్దార్ హెచ్.కోమి, ఎంపీడీఓ లక్ష్మీ ప్రసన్న, ఏఓ కవిత, సర్పంచ్లు యాదగిరి, కిరణ్, అశోక్, మనోజ్, అనిత, అరుణ, మౌనిక, మానస, సాంబయ్య, రాజు, శ్రీనివాస్, ఎంపీఎం అనిత, మండల సమాఖ్య అధ్యక్షురాలు రేణుక, మాజీ ఎంపీపీ సమ్మిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కత్తి సంపత్, నాయకులు సద్దాం హుస్సేన్, రాజిరెడ్డి, లక్ష్మణ్ నాయక్, రణధీర్ రెడ్డి, సలీంమాలీక్, సునీల్, సంపత్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
నిధుల మంజూరుపై హర్షం
● కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ కడియం కావ్య హన్మకొండ చౌరస్తా : వేయిస్తంభాల ఆలయ కల్యాణ మండపం విస్తరణతో పాటు మిగిలిన పనులకు రూ.15 కోట్లు నిధులు మంజూరు చేయాలని గతేడాది వరంగల్ ఎంపీ కడియం కావ్య.. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎంపీ వినతిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం రూ.14.44 కోట్లు కేటాయించడంతో హర్షం వ్యక్తం చేశారు. చారిత్రక వేయిస్తంభాల ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రికి, పురావస్తు శాఖ అధికారులకు ఎంపీ కడియం కావ్య కృతజ్ఞతలు తెలిపారు. -
ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్ మహబూబాబాద్: ధాన్యం కొనుగోళ్ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో యాసంగి సీజన్లో 2,60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. అధికారులు సమన్వయంతో పని చేస్తూ కేంద్రాల్లో తగు ఏర్పాట్లు చేయాలన్నారు. వచ్చేవారం నుంచి కేంద్రాలను ప్రారంభించాలన్నారు. ధాన్యం రవాణా విషయంలో ముందస్తు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, సివిల్ సప్లయీస్ డీఎం నర్సింహరావు, డీసీఎస్ఓ రమేశ్ పాల్గొన్నారు. ఆరోగ్య సూత్రాలు పాటించాలి ప్రజలు ఆరోగ్య సూత్రాలు పాటించి వడదెబ్బ, వేసవి తాపం నుంచి రక్షించుకోవాలని, జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం వేసవి తీవ్రత, తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిమ్మరసం, మజ్జిగ, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ విద్యాసంస్థలు, జనసాంద్రత ప్రదేశాల్లో వైద్య శిబిరాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. విద్యాసంస్థల్లో పిల్లలకు తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. జిల్లాలోని ప్రజలకు వేసవికాలంలో ఆరోగ్య అవసరాల నిమిత్తం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్కుమార్ పాల్గొన్నారు. -
అకాల వర్షం.. వడగళ్ల్ల బీభత్సం
గంగారం: మండలంలోని మడగూడెంగ్రామంలో సోమవారం అకాల వర్షం కురిసింది. వడగళ్ల వాన కురవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంటలు దెబ్బతినే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మక్కల రక్షణకు రైతుల పాట్లు మహబూబాబాద్ రూరల్ : జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో పాటు వాతావరణం పూర్తిగా చల్లబడి ఈదురుగాలులు మొదలయ్యాయి. దీంతో రైతులు అప్రమత్తమై మహబూబా బాద్ వ్యవసాయ మార్కెట్లో ఆరబోసుకున్న మక్కల రాశులపై టార్పాలిన్లు కప్పుకున్నారు. ఏ సమయంలో వర్షం కురుస్తుందోనని రైతులు ఆందోళన చెందుతూ తమ వ్యవసాయ ఉత్పత్తుల వద్ద కాపలా ఉన్నారు. -
విద్యార్థుల ప్రాణభద్రతపై నిర్లక్ష్యం తగదు
● ఎస్పీ శబరీష్ మహబూబాబాద్ రూరల్: విద్యార్థుల ప్రాణ భద్రతపై ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని ఎస్పీ శబరీష్ స్పష్టం చేశారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పాఠశాలలు, కళాశాలల బస్సు డ్రైవర్లపై ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు సోమవారం నిర్వహించారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లతో సమన్వయం చేసుకుని బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ల అర్హతలు, వాహనాల భద్రతా ప్రమాణాలను సమగ్రంగా పరిశీలించారు. తనిఖీల సందర్భంగా డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించి, మద్యం తాగి వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే బస్సులకు సంబంధించిన అవసరమైన పత్రాలు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్, పర్మిట్ తదితర అంశాలను కూడా అధికారులు పరిశీలించారు. విద్యార్థులు ప్రయాణించే బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ సదుపాయాలు, అగ్నిమాపక పరికరాలు, ఇతర భద్రతా ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ శబరీష్ మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనం నడపడం ఒక తీవ్రమైన నేరమని, ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల బస్సుల డ్రైవర్లు మరింత బాధ్యతతో వ్యవహరించాలన్నారు. అన్ని విద్యాసంస్థలు తమ బస్సుల నిర్వహణ, డ్రైవర్ల ప్రవర్తన, భద్రతా ప్రమాణాలపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు. తల్లిదండ్రులకు కూడా తమ పిల్లలు ప్రయాణించే వాహనాల పరిస్థితిపై అవగాహన ఉండాలని సూచించారు. విద్యార్థుల భద్రతను కాపాడడంలో భాగంగా జిల్లా పోలీసు శాఖ ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. -
పరీక్షలకు వేళాయె
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ తదితర యాజమాన్యాల పరిధిలో ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు(వార్షిక పరీక్షలు) సమ్మెటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ–2) పరీక్షలు ఈనెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందుకు ఉమ్మడి జిల్లాలో సంబంధిత విద్యా శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్షల వేళలు ఇలా.. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు 6, 7 తరగతులకు ఆయా తేదీల్లో పరీక్షలు ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఉదయం 9గంటల నుంచి 11:45 గంటల వరకు నిర్వహించనున్నారు. 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. వాటిలో ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ పేపర్ పరీక్షలు మాత్రం ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రాలు మండలాలకు.. హనుమకొండ జిల్లాలో విద్యాశాఖ అధికారి కార్యాలయంలో డీసీఈబీ (జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు )నుంచి ఆయా తరగతుల ప్రశ్నపత్రాలు మండల కేంద్రాలకు పంపిణీ చేశారని డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్, డీసీఈబీ సెక్రటరీ బి.డాక్టర్ బి.రాంధన్ తెలిపారు. మండల కేంద్రాలల్లోని కస్టోడియన్ల నుంచి హెడ్మాస్టర్లకు ప్రశ్నపత్రాలు అందజేస్తున్నారు. ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లోని 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు అదేవిధంగా యాజమాన్యాల పరిధి పాఠశాలల్లోని 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు జిల్లా విద్యాశాఖలోని జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు (డీసీఈబీ) ప్రశ్నపత్రాలు అందజేస్తోంది. డీసీఈబీ అందజేసిన ప్రశ్నపత్రాలతోనే పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈపరీక్షల పర్యవేక్షణకు కస్టోడియన్లు మండల విద్యాశాఖ అధికారులు, జిల్లా కో–ఆర్డినేటర్లు, గజిటెడ్ స్థాయి డీసీఈబీ సభ్యులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఎప్పటికప్పుడు మూల్యాంకనం.. ఆయా పరీక్షలు సబ్జెక్టుల వారీగా నిర్వహించిన రోజునే సంబంధిత పాఠశాలల్లోని ఉపాధ్యాయులు మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. ఆయా మార్కులను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈనెల 23న పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి ప్రగతి పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. ఈనెల 24నుంచి జూన్ 11 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు ఉంటాయి. ఎస్ఏ–2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని హనుమకొండ డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్, హనుకొండ జిల్లా డీసీఈబీ సెక్రటరీ డాక్టర్ బి.రాంధన్ హెచ్ఎంలను ఆదేశించారు. రేపటి నుంచి విద్యార్థులకు ఎస్ఏ–2 పరీక్షలు ఏర్పాట్లు చేసిన అధికారులు -
పుష్కరాల పనులు
నిర్విరామంగా చేపట్టాలికాళేశ్వరం : సరస్వతీనది అంత్యపుష్కరాల పనులు రాత్రిపగలు అనే తేడా లేకుండా నిర్విరామంగా చేపట్టి మే మొదటి వారంలోగా పూర్తి చేసి ప్రారంభోత్సవాలు చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఆదేశించారు. మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు 12 రోజుల పాటు జరగనున్న సరస్వతీనది అంత్య పుష్కరాలకు ప్రభుత్వం ఇటీవల రూ.21.34కోట్లు మంజూరు చేయగా పలు పనులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సోమవారం కాళేశ్వరంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సంకీర్త్, ధార్మిక సలహాదారు గోవింద హరితో కలిసి సరస్వతీఘాట్, నిర్మాణంలో ఉన్న మ్యూజియం, అందులో ఏర్పాటు చేయనున్న విగ్రహాలు, సరస్వతీఆలయం వద్ద నిర్మిస్తున్న అక్షరాభ్యాస మండపం పనులు, వీఐపీ ఘాట్ వద్ద మకర, హంస తోరణాల పనులు పరిశీలించారు. అనంతరం ఈఓ కార్యాలయంలో సంబంధితశాఖ అధికారులతో శాశ్వత, తాత్కాలిక పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాత్కాలిక మరుగుదొడ్లు, సురక్షిత మంచినీరు ఏర్పాటు చేయాలని మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. సరస్వతీనది ఆది పుష్కరాల్లో వచ్చిన సమస్యలు పునరావృతం కాకుండా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలన్నారు. పారిశుద్ధ్యం పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. బస్టాండ్లో సౌకర్యాలు కల్పనకు ప్రతిపాదనలు పంపాలన్నారు. ఘాట్ వద్ద క్లాడింగ్, రైలింగ్ ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. లైటింగ్ లోకేషన్లు ఏర్పాటు చేయాలని దేవాదాయశాఖ ఇంజినీర్లకు సూచించారు. హెలిపాడ్, బారికేడ్లు ఏర్పాటుతో పాటు నదిలో భక్తులు భద్రతకు చర్యలు చేపట్టాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. 12 రోజుల పాటు హారతి కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఈఓ మహేశ్, అటవీశాఖ అధికారి నవీన్రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అధికారులతో కలిసి శైలజారామయ్యర్ శ్రీకాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. మే మొదటివారంలోగా ప్రారంభోత్సవాలు చేయాలి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ -
సివిల్స్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
హన్మకొండ కల్చరల్: ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో 2027 విద్యాసంవత్సరానికి సివిల్ సర్వీసెస్ రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ ఉచిత శిక్షణ అందించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోందని విద్యావేత్త, చమక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ మొహమ్మద్ ఆజం అలీ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనార్టీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు అర్హులన్నారు. దరఖాస్తుకు చివరి తేదీ 2026, మే 26 కాగా, ప్రవేశపరీక్ష 2026 జూన్ 6న దేశంలోని ఎంపిక చేసిన ప్రధాన నగరాల్లో ఉంటుందన్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. వివరాలకు http//admission.jmi.ac.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి ● హర్జ్యతండా వద్ద ఘటన గీసుకొండ : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి వరంగల్ జిల్లా గీసుకొండ మండలం హర్జ్యతండా వద్ద వరంగల్–నర్సంపేట రహదారిపై చోటు చేసుకుంది. గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ కథనం ప్రకారం..హైదరాబాద్ బహదూర్పూరకు చెందిన భూక్య రవి(36) బైక్పై నర్సంపేట వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో హర్జ్యతండా వద్ద ఎదురుగా నర్సంపేట వైపునకు వెళ్తున్న టాటా ఏస్ .. బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు టాటా ఏస్ డ్రైవర్ పొన్నం వంశీపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. వార్డు సభ్యురాలి ఆత్మహత్య ఖానాపురం : మండలంలోని బుధరావుపేటకు చెందిన ఓ వార్డు సభ్యురాలు సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల కథనం ప్ర కారం.. గ్రామానికి చెందిన ఒకటో వార్డు సభ్యురాలు గారె అనూష (28) సోమవారం గ్రామ పంచాయతీలో నిర్వ హించిన సమావేశానికి హాజరైంది. అనంతరం ఇంటికెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించినట్లు స్థానికులు తెలిపారు. మృతురాలికి భర్త రవికుమార్, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా, అనూష ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. చింతల్లో మనస్తాపంతో మహిళ.. ఖిలా వరంగల్ : భర్త మందలించాడనే కారణంతో ఓ మహిళ మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆదివారం రాత్రి వరంగల్ చింతల్లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చింతల్ ప్రాంతానికి చెందిన రత్న అనూష(30), సురేశ్ దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఈ క్రమంలో అనూషను భర్త మందలించడంతో మనస్తాపంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్మకు పాల్పడింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి ఆరెపెల్లి రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ సోమవారం తెలిపారు. -
గల్లంతైన విద్యార్థి కోసం గాలింపు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ కోఎ డ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న భూక్య వాసు ఆదివారం ఆ కళాశాల సమీపంలోని కెనాల్లో ఈత కొట్టేందుకు వెళ్లి గల్లంతైన విషయం విధితమే. దీంతో ఆ విద్యార్థి కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సోమవారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టింది. సాయంత్రం వరకు చేపట్టినా ఆచూకీ లభించలేదని ఆ కళాశాల హాస్టల్ జాయింట్ డైరెక్టర్ దయాకర్ సోమవారం రాత్రి తెలిపారు. కాగా, వాసు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ చిన్యాతండాకు చెందిన విద్యార్థి. ఇదిలా ఉండగా వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం, స్టూడెంట్స్ వెల్ఫేర్ అఫైర్స్ డీన్ ఇస్తారి ఘటనాస్థలికి వచ్చారు. కాగా, నేడు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మరోసారి కెనాల్లో గాలింపు ప్రక్రియ చేపట్టనుంది. -
డాక్యుమెంట్ రైటర్లపై ఏసీబీ నజర్!
కాజీపేట అర్బన్: వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈనెల 2, 3వ తేదీల్లో ఆకస్మికంగా మొదలైన తనిఖీలు 12 గంటల పాటు కొనసాగాయి. ఏసీబీ దాడుల్లో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు రామనరసింహారావు, ఆనంద్కు చెందిన ఖమ్మం, హనుమకొండలోని ఇళ్లలో ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో రూ.24,61,540 నగదు, 819.500 గ్రాముల బంగారం, 2.600 కిలోగ్రాముల వెండి, 30 లక్షల ఎఫ్డీ బాండ్లతోపాటు డాక్యుమెంట్ రైటర్ల నుంచి వసూళ్ల కోసం ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ వ్యక్తి ద్వారా రూ.42 లక్షల లావాదేవిల వివరాలను సేకరించారు. కాగా ఈ దాడుల్లో కార్యాలయం ఆవరణలోని 20 మంది డాక్యుమెంట్ రైటర్ల వద్ద నుంచి 70 దస్తావేజులు రూ.47,450 స్వాధీనం చేసుకున్నారు. మరుసటి రోజు కొందరు డాక్యుమెంట్ రైటర్లు కార్యాలయాలను తెరవలేదు. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవినీతికి మూలమైన డాక్యుమెంట్ రైటర్లపై ఏసీబీ నిఘా పెంచినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. లైసెన్స్ లేకున్నా వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సుమారు 200 మంది డాక్యుమెంట్ రైటర్లుగా చలామణి అవుతూ నెలకు రూ.లక్షలు సంపాదిస్తున్నారు. వీరు ఆన్లైన్లో లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ దాడులు.. గతఏడాది ఏసీబీ అధికారులు వరంగల్ ఆర్వో కార్యాలయంలోని జిల్లా రిజిస్ట్రార్ చాంబర్కు ఆనుకుని ఉన్న ఓ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిపై దాడి చేసేందుకు వచ్చినట్లే వచ్చి వెళ్లిపోయారు. కాగా సదరు ఉద్యోగి ఏసీబీ దాడుల నుంచి వెంట్రుక వాసలో తప్పించుకుని అదే కార్యాలయంలో మరో విభాగంలో విధులు నిర్వహిస్తున్నాడు. కాగా ఈ ఏడాది ఏసీబీ అధికారులు పక్కా ఫిర్యాదులు, సమాచారంతో దాడులు నిర్వహించి భారీ మొత్తంలో స్వాధీనపరచుకున్నారు. ఇదిలా ఉండగా.. చిట్స్ కార్యాలయంలో నిలిచిపోయిన ఎఫ్డీ రిలీజ్పై ఏసీబీ ఆరా తీస్తున్నట్లు సమాచారండాక్యుమెంట్ రైటర్ల ఆగడాలు ఇలా.. వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గతేడాది ఓ డాక్యుమెంట్ రైటర్ ఏకంగా కార్యాలయ సిబ్బంది అవతారమెత్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగమైన ఫొటోలను తీసే సెక్షన్లో దర్జాగా తిష్ట వేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశాడు. ఓ సామాజిక వర్గానికి చెందిన ఓ సంస్థ స్థలాన్ని ఓ సీనియర్ డాక్యుమెంట్ రైటర్ రిజిస్ట్రేషన్ చేయించడంతో గొడవ పీఎస్ వరకు వెళ్లింది. కాజీపేటలోని ఓ స్థలం విషయంలో ఇద్దరి మధ్య గొడవ ఉండడంతో కోర్టులో కేసు నమోదైంది. కానీ, ఓ డాక్యుమెంట్ రైటర్ మధ్యవర్తిత్వంతో ఏకంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయించా డు. దీంట్లో రూ.లక్షల్లో లావాదేవిలు జరిగిన ట్లు సమాచారం. కార్యాలయంలో సబ్రిజి స్ట్రార్ నిలదీయడంతో గొడవ చోటు చేసుకుంది. నగర చుట్టు పక్కన గల గ్రామాల్లో రియల్టర్స్ రూపొందించిన నాన్ లే అవుట్ ప్లాట్లకు నంబర్లు లేకున్నా.. ఓ డాక్యుమెంట్ రైటర్ రిజిస్ట్రేషన్లు సుమారు పదికి రిజిస్ట్రేషన్లు చేయించాడు. ఇక్కడితో ఆగకుండా నాన్ లే అవుట్ ఉంటే తీసుకురండి.. అంటూ ఇతర డాక్యుమెంట్ రైటర్లకు ఆఫర్ ఇస్తున్నాడు. ఖాళీ స్థలానికి ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోయినా పర్వాలేదు.. పక్క ఇంటి నంబర్ వేసి హౌజ్ అసెస్మెంట్లా క్రియేట్ చేసి ఓ డాక్యుమెంట్ రైటర్ తన ప్రత్యేకతను చాటుకుంటూ సబ్ రిజిస్ట్రార్కు ఆదాయవనరుగా మారడం గమనార్హం. వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇటీవల తనిఖీలు లైసెన్స్ లేకున్నా రూ.లక్షల్లో రైటర్ల అక్రమార్జన -
బీఎల్ఐఎస్సీ రెండో సెమిస్టర్ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య సీడీఓఈ బీఎల్ఐఎస్సీ రెండో సెమిస్టర్ రెగ్యులర్, ఎక్స్ విద్యార్థులకు ఈనెల 24నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 24, 27, 29 తేదీల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు కురవి: శుభాకార్యానికి వెళ్తున్న దంపతుల బైక్ను కారు ఢీకొనడంతో భార్యభర్తలకు ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన ఆదివారం రాత్రి కురవి శివారులోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల వద్ద ఖమ్మం జాతీయ రహదారిపై జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కురవి మండలం బలపాల శివారు లింగ్యాతండాకు చెందిన బానోత్ హరిచంద్–జ్యోతి దంపతులు బైక్పై తండా నుంచి మహబూబాబాద్ వయా వావిలాల గ్రామానికి వెళ్తున్నారు. ఈక్రమంలో కురవి శివారు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల సమీపంలోకి రాగానే కురవి నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో బైక్పైనుంచి ఇద్దరు కిందపడిపోయారు. హరిచంద్కు తీవ్రగాయాలు కాగా, భార్య జ్యోతికి స్వల్పగాయాలయ్యాయి. సంఘటన స్థలం వద్ద ఉన్న వ్యక్తులు 108 అంబులెన్స్కు సమాచారం అందించడంతో హుటాహుటీన అంబులెన్స్ చేరుకుంది. తీవ్రగాయాలైన భార్యాభర్తలు ఇద్దరిని ఈఎంటీ గాంధీ, పైలట్ రఫీలు అంబులెన్స్లో ఎక్కించి ప్రాథమిక చికిత్స అందించారు. మహబూబాబాద్లోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఇదిలాఉండగా.. బైక్ను ఢీకొట్టిన కారు ఆపకుండా వెళ్లిపోయింది. చికిత్స పొందుతున్న మహిళ మృతి బచ్చన్నపేట : దంపతుల మధ్య గొడవతో క్షణికావేశంలో మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందింది.ఈ సంఘటన మండలంలోని బసిరెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. తరిగొప్పుల మండలంలోని కనీలకుంట గ్రామానికి చెందిన దండు ఉప్పలమ్మ, కృష్ణమూర్తి దంపతుల మూడో కుమార్తె ప్రేమలతను (29) తొమ్మిదేళ్ల క్రితం బచ్చన్నపేట మండలం బసిరెడ్డిపల్లికి చెందిన పుప్పాల కర్ణాకర్తో వివాహం జరిపించారు. వీరికి కుమారుడు వర్షిత్, కూతురు నివీక్ష ఉన్నారు. ఐదు రోజుల క్రితం భార్యభర్తలు గొడవ పడగా క్షణికావేశంలో భార్య ప్రేమలత ఇంట్లోని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన భర్త కర్ణాకర్ బచ్చన్నపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అనంతరం మెరుగైన వైద్యంకోసం వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ప్రేమలత మృతిచెందింది. మృతురాలు తల్లి ఉప్పలమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెరువులో మునిగి వృద్ధుడి మృతి
పరకాల: చేపల పెంపకంలో భాగంగా చెరువులో మందు చల్లడానికి వెళ్లిన మత్స్యకారుడు మృత్యువాతపడిన ఘటన పరకాల మండలం నాగారం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం గ్రామానికి చెందిన పల్లెబోయిన రాములు(68) గ్రామానికి చెందిన కొందరు మత్స్యకారులతో కలిసి నాగారం గ్రామ శివారులోని కంజరకుంట చెరువులో చేపలకు మందువేయడానికి వెళ్లారు. ఈక్రమంలో రాములు చెరువునీటిలో మునిగి గల్లంతయ్యాడు. తోటి మత్స్యకా రులు పోలీసులకు సమాచారమందించగా రెస్క్యూ టీంతో కలిసి మూడు గంటలపాటు వెతికి మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం పరకాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. కోమట్లగూడెం గ్రామ శివారులో.. గంగారం : చెరువులో పడి ఒకరు మృతిచెందిన ఘ టన మహబూబాబాద్ జిల్లా కోమట్లగూడెం గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోమట్లగూడెం గ్రామానికి చెందిన బొల్లెపల్లి సారయ్య(51) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందాడు. చెరువులో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసుల కు సమాచారం అందించారు. ఎస్సై రవికుమార్ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వయంగా చెరువులోంచి బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం గూడూరుకు తరలించారు. సారయ్యకు భార్య, ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. -
గ్యాస్ కొరతను అధిగమించాను..
పొరుగు దేశాల్లో యుద్ధం నేపథ్యంలో నిత్యావసర సరుకులతోపాటు ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో హోటల్ నిర్వహణ కష్టంగా మారింది. ఖర్చులు పెరుగుతుండడంతో కొత్త మార్గం కోసం ఆలోచించాను. అప్పడు డీజిల్తో పని చేసే పొయ్యి తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. తక్కువ ఖర్చుతో రెండు రోజుల్లోనే తయారు చేసాను. లీటర్ డీజిల్ సాయంతో సుమారు రెండు గంటలపాటు పొయ్యి మండుతుంది. ఇప్పుడు ఖర్చు తగ్గింది. పని సులభమైంది. – గుండు, వసంత్, ఫాస్ట్ఫుడ్ హోటల్ నిర్వాహకుడు -
సాక్షి ఫొటోగ్రాఫర్లకు అవార్డుల ప్రదానం
హన్మకొండ కల్చరల్: తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్.. 2025 ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఉత్తమ వార్త చిత్రానికి వరంగల్ సాక్షి సీనియర్ ఫొటో జర్నలిస్ట్ పెద్దపెల్లి వరప్రసాద్ ఉత్తమ ఫొటో జర్నలిస్టు బహుమతి, జనగామ సాక్షి ఫోటోగ్రాఫర్ గోవర్ధనం వేణుగోపాల్ కన్సోలేషన్ బహుమతి అందుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్లోని తెలంగాణ మీడియా అకాడమీలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆదివారం వారికి అవార్డులు ప్రదానం చేశారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, దేవులపల్లి అమర్, విరాహత్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
అణగారిన వర్గాల కోసం పోరాడిన జగ్జీవన్ రామ్
హన్మకొండ: సామాజిక న్యాయం, సమానత్వం, అణగారిన వర్గాల సాధికారత కోసం జీవితాంతం పోరాడిన మహానేత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ అని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం జగ్జీవన్రాం జయంతిని నిర్వహించారు. ఈసంద్భంగా జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వరుణ్రెడ్డి మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్రా మ్ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా సామాజిక విప్లవానికి నాంది పలికిన మహానుభావుడని అన్నారు. అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం ఆయన చేసిన పోరాటం భారత రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, ప్రజాసేవకుడిగా, కేంద్ర మంత్రిగా ఆయన నిర్వహించిన పా త్ర దేశ నిర్మాణంలో కీలక మలుపు తిప్పిందన్నారు. సామాజిక అసమానతలను నిర్మూలించడమే లక్ష్యంగా ఆయన చూపిన దారిని ప్రతీ ఒక్కరు అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో సమానత్వాన్ని బలోపేతం చేయడం, ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా చూడడం అందరి బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్ రావు , వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, సీజీఎం రవీంద్రనాథ్, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం, జీఎంలు వేణు బాబు, గిరిధర్, ప్రభా వతి, అధికారులు కళాధర్ రెడ్డి, నీలారపు రాజేందర్, నాగేశ్వర్ రావు, దేవేందర్, రాధిక పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి -
వైద్యపరీక్షలకు వస్తూ కానరాని లోకాలకు..
మహబూబాబాద్ రూరల్ : వైద్య పరీక్షల కోసం వస్తూ రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతిచెందిన ఘటన మహబూబాబాద్ మండలంలోని మల్యాల గ్రామ శివారులో ఆది వారం చోటుచేసుకుంది. కురవి ఎస్సై సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. మానుకోట జిల్లా చిన్నగూడూరు మండలం మేగ్యతండాకు చెందిన భూక్యా నరేందర్, శిరీష (27) దంపతులు వైద్య పరీక్షల కోసం తమ నాలుగేళ్ల కుమారుడిని తీసుకుని ద్విచక్ర వాహనంపై మహబూబాబాద్ బయల్దేరారు. కురవి మండలంలోని రాయినిపట్నం మీదుగా మహబూబాబాద్ మండలం మల్యాల నుంచి వస్తున్నారు. ఈ క్రమంలో మల్యాల గ్రామ శివారులోని మూలమలుపు వద్ద ఓ కారు ఆగి ఉంది. వాహనానికి సంబంధించిన వ్యక్తి వెనుకకు చూసుకోకుండా కారు డోర్ తీయడంతో అటువైపుగా వస్తున్న నరేందర్, శిరీష వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో శిరీషకు తీవ్రగా యాలుకాగా సదరు కారు నిర్వాహకులు ఆమెను అదే కారులో మహబూబాబాద్లోని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందింది. శిరీష భర్త నరేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగించారు. జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఎంపిక నెల్లికుదురు: ఒరిస్సాలోని భువనేశ్వర్లో ఈ నెల 4 నుంచి 8 వరకు జరుగుతున్న రగ్బీ పోటీలకు 69వ ఎస్జీఎఫ్ అండర్ 17 బాలుర విభాగంలో మండలంలోని ఆలేరు ఉన్నత పాఠశాల విద్యార్థి బానోతు యశ్వంత్ పాల్గొంటున్నట్లు ఎంఈఓ రాందాస్ తెలిపారు. గత డిసెంబర్లో డోర్నకల్లో జరిగిన రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలో యశ్వంత్ ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని వెల్లడించారు. ● రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి -
కెనాల్లో ఇంజనీరింగ్ విద్యార్థి గల్లంతు
కేయూ క్యాంపస్: ఈత కోసం కెనాల్లో దూకిన ఇంజనీరింగ్ విద్యార్థి గల్లంతయ్యాడు. కేయూ పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిన్యాతండాకు చెందిన 22ఏళ్ల భూక్య వాసు కేయూ కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈఈఈ ఫైనల్ ఇయర్ చదువుతూ, యూనివర్సిటీలోని హాస్టల్లో ఉంటున్నాడు. ఆది వారం మధ్యాహ్నం 3–30 గంటలకు మరో ఇద్దరు విద్యార్థులు సందీప్, సాయితో కలిసి వాసు కళాశాల సమీపంలోని ఎస్సారెస్పీ కాల్వకు ఈతకు వెళ్లాడు. ఒకరితర్వాత ఒకరు కాల్వలో దూకి ఈత కొట్టి పైకి వచ్చారు. వాసు ఈదుకుంటూ దరికి వచ్చి చిన్నచెట్టుకొమ్మను పట్టుకోబోయి నీటి ప్రవాహంలో మునిగిపోయాడు. వెంటనే మిగిలిన ఇద్దరు విద్యార్థులు డయల్ 100, హాస్టళ్ల జాయింట్ డైరెక్టర్ దయాకర్కు ఫోన్ చేశారు. దయాకర్ పోలీ సులతోపాటు వాసు కుంటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.రమణ, పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, హాస్టళ్ల డైరెక్టర్లు సుమలత, శ్రీనివాస్, స్టూడెంట్స్ వెల్ఫేర్ అఫైర్స్ డీన్ మామిడాల ఇస్తారి, ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు, పలువురు విద్యార్థులు కెనాల్ వద్దకు వెళ్లారు. కేయూ పోలీస్స్టేషన్ సీఐ రవికుమార్ కూడా అక్కడికి చేరుకొని ఇద్దరు విద్యార్థులతో మాట్లాడి ఏం జరిగిందని అడిగి తెలుసుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి పరిశీలించారు. సాయంత్రం 6గంటల ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం వచ్చి కెనాల్లో తాడుతో కొక్కెం వేసి పరిశీలించింది. చీకటి పడడంతో ఇప్పుడు వెతకడం కష్టమని, సోమవారం ఉదయం వస్తామని వెళ్లిపోయారు. కాగా, వాసు తండ్రి కొంతకాలం కిత్రం మరణించాడు. తల్లి, సోదరుడు ఉన్నారు. ఈసంఘటన వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం దృష్టికి కూడా వెళ్లింది. కేసును నమోదు చేసి దరాప్యప్తు చేస్తున్నట్లు సీఐ రవికుమార్ తెలిపారు. గతంలో ఇద్దరు విద్యార్థుల మృతి.. కాకతీయ యూనివర్సిటీ కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాలలో చదవుతూ కెనాల్లో ఈతకోసం వెళ్లి గతంలో ఇద్దరు విద్యార్థులు మరణించారు. 2016 సంవత్సరంలో ఒకరు, 2022–2023 సంవత్సరంలో ఒకరు ఈతకోసం వెళ్లి చనిపోయారు. ఇప్పుడు మరో విద్యార్థి భూక్యా వాసు ఈతకోసం కెనాల్లో దూకి గల్లంతయ్యాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు విద్యార్థులు కెనాల్కు ఈతకు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. -
వినూత్నం.. డీజిల్ స్టవ్..!
పాలకుర్తి టౌన్: ‘అవసరమే ఆవిష్కరణకు మూలం’ అని మరోసారి నిరూపితమైంది. పెరిగిపోతున్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలతో బతుకు బండిని లాగలేక ఇబ్బంది పడుతున్న ఒక హోటల్ నిర్వాహకుడు, తన స్వయంకృషితో ఒక వినూత్న పరిష్కారాన్ని కనుగొన్నాడు. డీజిల్తో పని చేసే ప్రత్యేక స్టవ్ తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఫాస్ట్ఫుడ్ హోటల్ నడపుతున్న గుండు వసంత్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు ఆకాశాన్నంటుతుండడంతో హోటల్ నిర్వహణ భారంగా మారిందని ఆవేదన చెందాడు. దీనికి ప్రత్యామ్నాయంగా సుమారు రూ.1,300 ఖర్చుతో, రెండు రోజులపాటు శ్రమించి ఈ డీజిల్ పొయ్యిని రూపొంచాడు. ఈ వినూత్న పొయ్యిలో విద్యుత్తో నడిచే బ్లోయర్ను అమర్చారు. ఆ బ్లోయర్ మోటార్ ద్వారా వచ్చే గాలిని ఒక పైపు ద్వారా, డీజిల్ను మరో పైపు ద్వారా పొయ్యి వద్దకు పంపించి మంట వచ్చేలా అమర్చాడు. అవసరాన్ని బట్టి మంటను పెంచుకోడానికి లేదా తగ్గించుకోవడానికి వీలుగా బ్లోయర్లో రెగ్యులేటర్ కూడా అమర్చారు. సాధారణ గ్యాస్ సిలిండర్తో పోలిస్తే ఈ డీజిల్ పొయ్యి వల్ల ఖర్చు కూడా సగానికి పైగా తగ్గుతుందని వసంత్ చెబుతున్నారు. లీటర్ డీజిల్తో గంట నుంచి రెండు గంటలపాటు నిరంతరంగా పోయి మండుతుందని ఆయన తెలిపారు. వసంత్ ఆవిష్కరణను చూసిన మరి కొందరు హోటల్ నిర్వాహకులు తమ కోసం కూడా ఇలాంటి పొయ్యిలను తయారు చేయించుకోవడం విశేషం. సామాన్యుడి మేధస్సుతో పుట్టిన ఈ దేశీ ఆవిష్కరణ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.డీజిల్ సాయంతో వంట చేస్తున్న హోటల్ నిర్వాహకుడు ఆహా... వాట్ ఎన్ ఐడియా అంటున్న ప్రజలు గ్రామీణ ప్రాంతంలో ఆవిష్కృతమవుతున్న వినూత్న ఆలోచనలు -
ప్రాణాలమీదకు తెచ్చిన ‘యాప్’
హసన్పర్తి: యాప్ వ్యాపారం ప్రాణాలపైకి తీసుకొచ్చింది. వ్యాపారంలో నష్టం రావడంతో ఓ వ్యక్తి గొంతుపై కత్తి దూసుకెళ్లిన సంఘటన నగరంలోని గోపాలపురంలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన పొన్నం కార్తీక్, బిట్ల రాంచరణ్, మహర్షి 2025లో ‘లూపింగ్ యాప్’ వ్యాపారాన్ని ప్రారంభించారు. నష్టం రావడంతో ఆ వ్యాపారాన్ని మానేశారు. ఈ వ్యాపారంలో తను పెట్టిన రూ.3 లక్షలు ఇవ్వాలని కార్తీక్ తోటి భాగస్వామి రాంచరణ్పై ఒత్తిడి తీసుకొచ్చాడు. లావాదేవీల విషయమై పెద్దల సమక్షంలో మాట్లాడడానికి అంగీకరించారు. కాగా, ఆదివారం మధ్యాహ్నం బైక్పై వచ్చిన కార్తీక్ డబ్బుల విషయమై మాట్లాడుకుందామని రాంచరణ్ను ఎక్కించుకుని గోపాలపురం చెరువు కట్టపైకి తీసుకెళ్లాడు. కత్తితో గొంతు, ఇతర శరీర భాగాలపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు బాధితుడి తండ్రి శ్రీఽనాఽథ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. వ్యాపారంలో నష్టం రావడంతో గొడవ డబ్బులు ఇవ్వడం లేదని కత్తితో గొంతుపై దాడి -
కల్లు తాగిన కోతిలా సీఎం వ్యవహారం
హన్మకొండ: కల్లుతాగిన కోతిలా సీఎం రేవంత్రెడ్డి వ్యవహారశైలి ఉందని, రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలవుతున్నాయని సీఎం రేవంత్రెడ్డి చూపిస్తే హనుమకొండ చౌరస్తాలో ఉరేసుకుంటానని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లో ముఖ్యనేతగా ఉన్న విజయన్పై మాట్లాడేస్థాయి రేవంత్కి లేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత రాష్ట్రంలో పంటల దిగుబడి ఎలా ఉందో అందరికీ తెలుసని, రూ.లక్ష కోట్లు నీళ్లపాలయ్యాయని కాళేశ్వరంపై కేంద్ర మంత్రి విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. 2014కు ముందు తెలంగాణ వరి ఉత్పత్తిలో ఎక్కడో ఉండేదని, కాళేశ్వరం ప్రాజెక్టుతో 2023 నాటికి దేశంలోనే నంబర్ వన్ స్థాయికి ఎదిగిందన్నారు. గజ్వేల్లోని కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీ ఆఫీస్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో పెట్టుకుంటారా.. అని ప్రశ్నించారు. కడియం శ్రీహరి ఏ పార్టీకి చెందినవారో స్టేషన్ ఘన్పూర్ ప్రజలతో రెఫరెండం నిర్వహించాలన్నారు. మేడారంలో రూ.కోట్లు ఖర్చు పెట్టి చేసిన పనులు నాసిరకంగా ఉన్నాయని, రెండు టన్నుల రాయి పడడంతో గాయపడి వరంగల్ గార్డియన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి యువన్ను పరామర్శించినట్లు చెప్పారు. సీఎంతో సహా మంత్రులు క్యాంపు పెట్టింది వాటాల కోసమేనని అరోపించారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ.. కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని, ఈ సంఘటనను ఖండిస్తున్నట్లు చెప్పారు. జెడ్పీ మాజీ చైర్మర్ సాంబారి సమ్మారావు, నాయకులు బొంగు అశోక్, పులి రజనీకాంత్, తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, రామ్మూర్తి, జోరిక రమేష్, నయీముద్దీన్ పాల్గొన్నారు.ఆరు గ్యారంటీలు అమలు చూపిస్తే ఉరేసుకుంటా మేడారంలో నాసి రకం పనులు.. వాటాల కోసం మకాం శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి -
‘వేయిస్తంభాల’కు యునెస్కో గుర్తింపునకు కృషి
● ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల దేవాలయానికి యునెస్కో గుర్తింపు వచ్చేలా కృషి చేయాలని వేయిస్తంభాల దేవాలయం ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ కోరారు. ఈ మేరకు ఆదివారం వేయిస్తంభాల దేవాలయంలో ఆయన మాట్లాడుతూ వేయిస్తంభాల దేవాలయం అభివృద్ధికి, కల్యాణమండపం పునరుద్ధరణ పనులకు కేంద్రపురావస్తుశాఖ రూ.14.44కోట్లతో టెండర్ పిలువడంపై హర్షం వ్యక్తం చేశారు. అందుకు కృషి చేసిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, పురావస్తుశాఖ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. విదేశీ టూరిస్టులు, భక్తులు దేవాలయాన్ని సందర్శిస్తున్న సందర్భంలో దేవాలయం, కల్యాణమండపం చుట్టూ ఉన్న మట్టి, రాళ్లతో, ఎండతాకిడికి ఇబ్బందిపడుతున్నారని గడ్డితో గార్డెనింగ్ చేయాలని, పచ్చనిచెట్లతో, పూలమొక్కలతో సుందరీకరణ, లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో అర్చకులు ప్రణవ్శర్మ, విశ్వనాథ కాశీలింగాచారి, శ్రవణ్కుమార్, రుద్రేశ్వరసేవా సమితి సభ్యులు మామిడాల గణపతి, కట్ల రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
మార్పు ఏది?
సోమవారం శ్రీ 6 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026మహబూబాబాద్: ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఇటీవల పీఆర్ ఈఈ విద్యాసాగర్ను కలెక్టర్ స్నేహ శబరీష్ సరెండర్ చేసినా ఆ కార్యాలయంలో పని చేసే అధికారులు, సిబ్బందిలో ఏమాత్రం మార్పు లేదు. ఎక్కువమంది అధికారులు, సిబ్బంది ఇతర పట్టణాల నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. గత నెల 31న కలెక్టర్ పీఆర్ ఈఈ కార్యాలయాన్ని సందర్శించారు. ఎక్కువ సమయం కేటాయించి అన్ని పరిశీలించారు. నిర్వహణపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. నిత్యం కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ.. ఈనెల 4వ తేదీన ముగ్గురు అధికారులు మినహా ఎవరూ కూడా 11గంటలలోపు కార్యాలయానికి రాలేదు. జిల్లా కేంద్రంలో పీఆర్ ఈఈ కార్యాలయం.. జిల్లా కేంద్రంలోని జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయం, ఉపకార్యనిర్వాహక ఇంజనీర్ కార్యాలయంలో 21మంది సిబ్బంది పని చేస్తున్నారు. స్టాఫ్ కాక ఈఈ కార్యాలయంలో ఈఈ, ఏడుగురు డీఈలు, 18మంది ఏఈలు విధులు నిర్వర్తిస్తున్నారు. కార్యాలయ పరిధిలో 18 మండలాలు ఉన్నాయి. అలాగే ఉప కార్య నిర్వాహక ఇంజనీర్ కార్యాలయంలో ఒక డీఈ, ఇద్దరు ఏఈలు, డీఎం, యూడీసీ, ఇద్దరు అటెండర్లు పని చేస్తున్నారు. డీఈ కార్యాలయ పరిధిలో మానుకోట, నెల్లికుదురు మండలాలు ఉన్నాయి. 31న కలెక్టర్ సందర్శన.. ప్రజాపాలన–ప్రగతిప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గత నెల 31న కలెక్టర్ స్నేహ శబరీష్ పీఆర్ ఈఈ కార్యాలయం సందర్శించారు. కాగా ఆ కార్యాలయంలో నిర్వహణపై తదితర విషయాలపై అఽధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయినా అధికారులు, సిబ్బందిలో మార్పు రాలేదు. ఈనెల 2న ఈఈ సరెండర్ పీఆర్ ఈఈగా పని చేసిన విద్యా సాగర్ను ఈనెల 2 పీఆర్ ఆర్డీకి కలెక్టర్ సరెండర్ చేశారు. గత ఆర్థిక సంవత్సరం జీపీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల భవనాలు, వీఓ భవనాల నిర్మాణాలు, సీసీ రోడ్ల నిర్మాణం కోసం ఎన్ఆర్ఈజీఎస్ రూ.49 కోట్లు కేటాయించింది. కాగా, వాటిలో రూ 4.50 కోట్ల బిల్లులు ఫైళ్లు క్లియర్ కాకపోవడంతో ఆ నిధులు మిగలడంతో పాటు పలు కారణాలతో సరెండర్ చేసినట్లు సమాచారం . పూర్తి కాని పనులు.. ఉపాధి హామీ నిధులతో 22 జీపీ భవనాలు మంజూరు కాగా.. కేవలం 14 వివిధ దశల్లో ఉండగా, 8 భవనాలు ప్రారంభం కాలేదు. అంగన్వాడీ భవనాలు 30మంజూరు కాగా.. 23 వివిధ దశల్లో ఉన్నాయి. ఏడు భవనాల పనులు ప్రారంభం కాలేదు. సీసీ రోడ్లు చాలా వరకు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఆ పనుల నిధులు, వాటి బిల్లుల క్లియరెన్స్లో జాప్యంతో ఈఈపై వేటు పడింది. అలాగే వీఓ భవనాలు 180 మంజూరు కాగా.. వాటిలో 9 వివిధ దశల్లో ఉండగా, మిగిలినవి పనులు ప్రారంభం కాలేదు. అయినా మారని సిబ్బంది.. కలెక్టర్ సందర్శన, ఈఈ సరెండర్ వంటి చర్యలు తీసుకున్నప్పటికీ సిబ్బందిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఈనెల 4న ఇన్చార్జ్ ఈఈ ఆదిత్య రాజ్ మాత్రమే సమయానికి హాజరయ్యారు. అలా గే ఉపకార్యనిర్వాహక ఇంజనీర్ కార్యాలయంలో ఇద్దరు మహిళా ఉద్యోగులు మాత్రమే హాజరయ్యా రు. చాలామంది సిబ్బంది వరంగల్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. ఇంటర్సిటీ రైలు లో వస్తున్నారు. దీంతో వారు ఆలస్యంగా ఉదయం 11.30 గంటలు కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఆవేదన.. ఈఈని సరెండర్ చేసిన తర్వాత అదేరోజు రాత్రి ఇన్చార్జ్ ఈఈ బాధ్యతలను కార్యాలయంలో డీఈ టెక్నికల్గా పని చేస్తున్న ఆదిత్యరాజ్కు అప్పగించారు. దీంతో మిగిలిన డీఈలు సీనియారిటీ ప్రకారం బాధ్యతలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం గైడ్లైన్స్ పాటించలేదని అంటున్నారు. మిగిలిన శాఖల్లో వణుకు.. ఈఈని సరెండర్ చేసిన తర్వాత మిగిలిన శాఖల అధికారుల్లో వణుకు ప్రారంభమైంది. ఆకస్మిక తనిఖీలు, 99 రోజుల పాలనలో భాగంగా ఫైళ్ల క్లియరెన్స్, గత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలు పూర్తి చేయని వారిలో, బిల్లుల క్లియరెన్స్ నిధుల విషయంలో తేడాలు ఉన్న వారు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కాగా, కలెక్టర్ చర్యలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పీఆర్ ఈఈ సరెండర్ అయినా అధికారులు, సిబ్బంది నిర్లక్ష్య వైఖరి సమయపాలన పాటించని వైనం బాధ్యతల కేటాయింపులో సీనియర్ల అసంతృప్తి -
మహనీయుల ఆశయాలు కొనసాగించాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్ మహబూబాబాద్/మహబూబాబాద్ అర్బన్: మహనీయుల ఆశయాలను కొనసాగించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో ఆదివారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ 119వ జయంతి నిర్వహించారు. బాబు జగ్జీవన్రామ్ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్రామ్ దేశానికి అమూల్యమైన సేవలు అందించారన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో చురుకుగా పాల్గొన్న గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు అని కొనియాడారు. మహనీయుల జీవిత చరిత్రను అధ్యయనం చేయాలన్నారు. యువత ఆయన బాటలో నడవాలన్నారు. ప్రతీ ఒక్కరికి ఉన్నత విద్యను అందించాలని ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం చేపట్టిందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ జ్యోతి, జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అఽధికారి శ్రీనివాసరావు, డీడబ్ల్యూఓ సబిత, ఆర్డీఓ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. -
‘లిఫ్ట్’ ప్లీజ్..
● డోర్నకల్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల ఇబ్బందులు ● లిఫ్ట్ ఏర్పాటు చేయాలంటున్న ప్రయాణికులు డోర్నకల్: డోర్నకల్ రైల్వే స్టేషన్లోకి ప్రవేశించేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే స్టేషన్లోని 2, 3, 4వ నంబర్ ప్లాట్ఫాంలపైకి ప్రయాణికులు ఫుట్ఓవర్ బ్రిడ్జి మీదుగా వెళ్తున్నారు. విజయవాడ, కొత్తగూడెం వైపు వెళ్లే రైళ్లతో పాటు వరంగల్ వైపు వెళ్లే కొన్ని రైళ్లు 2, 3, 4వ ప్లాట్ఫాంలపైకి వస్తుంటాయి. దీంతో ప్రయాణికులు తప్పనిసరిగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీదుగా ఈ ప్లాట్ఫాంలపైకి వెళ్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు ఫుట్ ఓవర్ బ్రిడ్జి మెట్లు ఎక్కడం, దిగడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లిఫ్ట్, పాత్ వే, ఎస్కలేటర్ సౌకర్యం లేకపోవడంతో తప్పనిసరిగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. లగేజ్, చంటి పిల్లలతో సకాలంలో రైలును అందుకునేందుకు ఫుట్ఓవర్ బ్రిడ్జి మెట్లు ఎక్కలేక అవస్థలు పడుతున్నారు. వర్షం పడిన సమయంలో బ్రిడ్జిపై నీరు చేరి ప్రయాణికులు జారిపడిన సందర్భాలు ఉన్నాయి. రైలు ఎటొస్తుందో తెలియదు.. వరంగల్ వైపు వెళ్లే శాతవాహన, గోల్కొండ, కృష్ణా, ఇంటర్సిటీ లాంటి రైళ్లు ఒకటో నంబర్ ప్లాట్ఫాం పైకి రావాల్సి ఉంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జి అవసరం లేకుండా నేరుగా ఒకటో నంబర్ ప్లాట్ఫాం పైకి వెళ్లవచ్చు. అయితే ప్రతీరోజు ఆ రైళ్లు వచ్చే సమయంలో ఒకటో నంబర్ ప్లాట్ఫాంపై గూడ్స్ రైళ్లు నిలిచి ఉంటున్నాయి. దీంతో ఆయా రైళ్లు రెండు లేదా మూడో నంబర్ ప్లాట్ఫాంపైకి వస్తున్నాయని మైక్లో అనౌన్స్ చేయడంతో ప్రయాణికులు పిల్లలు, లగేజ్తో హడావుడిగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీదుగా అవతలి ప్లాట్ఫాంపైకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరంగల్ వైపు వెళ్లే చాలా మంది ప్రయాణికులు రైలు ఏ ప్లాట్ఫారంపైకి వస్తుందో తెలియక ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై కూర్చుని రైలు కోసం వేచి చూస్తున్నారు. విజయవాడ, ఖమ్మం, కొత్తగూడెం వైపు వెళ్లే ప్రయాణికులు కచ్చితంగా ఫుట్ఓవర్ బ్రిడ్జి మీదుగా స్టేషన్ లోపలికి వెళ్లాలి. ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఎక్కలేని కొంతమంది ప్రయాణికులు 2, 3ప్లాట్ఫాంలకు వెళ్లేందుకు రైలు పట్టాలు దాటుతూ రైలు ఢీకొని మృతిచెందిన పడిన ఘటనలు చాలా ఉన్నాయి. కాగా, డోర్నకల్ రైల్వే స్టేషన్లో ఒకటి, మూడో ప్లాట్ఫాంలపై లిఫ్ట్లు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. లిఫ్ట్ల ఏర్పాటుతో తమ కష్టాలు తీరుతాయని అంటున్నారు. -
ఉద్యమకారుల హామీలను నెరవేర్చాలి
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని జేఏసీ కన్వీనర్ డోలి సత్యనారాయణ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో ఆదివారం ఉద్యమకారుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముందుగా అమరులైన ఉద్యమకారులు దేశెట్టి రామచంద్రయ్య, బాదరబోయిన రాఘవులు, తూము వెంకన్న, గుంజే హన్మంతు, భూక్య సత్యనారాయణకు నివాళులర్పించి, రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం డోలి సత్యనారాయణ మాట్లాడుతూ.. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పలు రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, కార్మిక, జర్నలిస్టు, కుల, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారన్నారు. ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు, అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, నిరుద్యోగులకు పింఛన్తో పాటు ఉద్యమ గుర్తింపు కార్డులు, మెడికల్ కార్డులు తక్షణమే అమలు చేయాలన్నారు. రాబోయే రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ముందే ఉద్యమకారుల హామీలను అమలు చేయాలని కోరారు. లేని యెడల భవిష్యత్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ కోకన్వీనర్ పిల్లి సుధాకర్, నియోజకవర్గాలు, మండలాల కన్వీనర్లు మేక సురేష్రెడ్డి, శంతన్రామరాజు, ఫరీద్, పరకాల రవీందర్, కృష్ణమూర్తి, గుగ్గిళ్ల పీరయ్య, రవికుమార్, లాలయ్య, రవి, కిషన్, దస్రునాయక్, లింగన్న, పాపన్న, దేవేందర్, వెంకన్న, అంబరీష, ఇమామ్, వెంకటేశ్వర్లు, సాయి, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యా కమిషన్వి ఏకపక్ష సిఫారసులు
తొర్రూరు: విద్యా కమిషన్ ఎవరినీ సంప్రదించకుండానే ఏకపక్షంగా సిఫారసులు చేసిందని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బాలాష్టి రమేశ్ అన్నారు. డివిజన్ కేంద్రంలో టీపీటీఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రమేశ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై కాకుండా ఉపాధ్యాయుల వేతనాలపై కమిషన్ నివేదిక ఇవ్వడం సరికాదన్నారు. ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతీసేలా కమిష న్ వ్యవహరించిందన్నారు. ఉద్యోగుల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పులిచింత విష్ణువర్ధన్రెడ్డి, ఉపాధ్యాయదర్శిని మాస పత్రిక సంపాదకుడు సూరం ఉపేందర్రెడ్డి, జిల్లా కార్యదర్శి రవీందర్రెడ్డి, మండల అధ్యక్షుడు కొండం జనార్దన్రెడ్డి, నాయకులు కొలుపుల శ్రీనివాస్, చింతల సురేష్, కుమారస్వామి, రమేశ్ పాల్గొన్నారు. డిప్యుటేషన్పై కార్యదర్శుల బదిలీ మరిపెడ రూరల్: మరిపెడ మండలంలోని పంచాయతీ కార్యదర్శులు డిప్యుటేషన్పై బదిలీ అయ్యారు. మండలంలోని 48 గ్రామ పంచాయతీలకు 31మంది పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తుండగా.. గత నెల తాళ్లఊకల్ కార్యదర్శి బదిలీ అయ్యాడు. దీంతో 30 మంది విధులు నిర్వర్తిస్తుండగా.. ఇద్దరిని మినహాయించి 28మందిని డిప్యుటేషన్పై బదిలీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. నేడు వారు విధుల్లో చేరనున్నట్లు అధికారులు తెలిపారు. సంకటహరచతుర్థి పూజలు హన్మకొండ కల్చరల్: రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో ఆదివారం సా యంత్రం సంకటహరచతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు సందీప్ శర్మ, ప్రణవ్, శ్రవణ్ ఉదయం 5 గంటల నుంచి ప్రభాతపూజలు, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం ఉత్తిష్టగణపతికి అభిషేకాలు చేశారు. మహా హారతి, మంత్రపుష్పం చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆదివారం సెలవు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. టెస్కోతోనే చేనేత వస్త్రాల ఖరీదుకు కృషి కాశిబుగ్గ: చేనేత వస్త్రాలను టెండర్ ద్వారా కాకుండా టెస్కో ద్వారానే ఖరీదు చేయడానికి కృషి చేస్తానని రాష్ట్ర జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు హామీ ఇచ్చారు. ఆదివారం కొత్తవాడకు చెందిన చేనేత సొసైటీ ప్రతినిధుల బృందం మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆధ్వర్యంలో మంత్రి తుమ్మలను కలిసి చేనేత సమస్యలు విన్నవించారు. గతంలో మాదిరిగానే బెడ్ షీట్లు, కార్పెట్లు ప్రభుత్వరంగ సంస్థ అయిన టెస్కో ద్వారానే కొనాలని, చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈసందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. చేనేత పరిశ్రమకు సంబంధించిన బెడ్ షీట్లు, కార్పెట్లు, ఇతర వాటిని టెండర్ ద్వారా కాకుండా, నేరుగా సొసైటీల నుంచి కొనేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. దీనిపై నేత కార్మికులు అధైర్యపడకూడదని, కార్మికులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈవిషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు గుండేటి నరేంద్రకుమార్, డాక్టర్ ఆడెపు రవీందర్, వడ్నాల నరేందర్, గోరంటల రాజు, ఎలగం భద్రయ్య, మెరుగు చిన్న భద్రయ్య, పంతగాని శ్రీనివాస్, కొలిపాక మదనయ్య, ఝెలగం సాంబయ్య, అడిగొప్పుల సంపత్, ఆడెపు రవి, ఎలగం వెంకటమల్లు, బూర వేణుమాధవ్, పిట్టరాములు, వలుస కిరణ్ పాల్గొన్నారు. -
ఆన్ సైట్ ఎఫ్ఐఆర్
● బాధితుల వద్దకు వెళ్లి సత్వర న్యాయం ● జిల్లా వ్యాప్తంగా 35 కేసులు నమోదు ● ఎస్పీ శబరీష్మహబూబాబాద్ రూరల్ : బాధితులకు సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో జిల్లా పోలీసులు అమలు చేస్తున్న ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ విధానం ఫలితాలు ఇస్తోంది. పోలీస్స్టేషన్కు రాలేని పరిస్థితుల్లో ఉన్న బాధితులు రావాల్సిన అవసరం లేకుండా, స్వయంగా పోలీసులు ఘటన స్థలాని వెళ్లడం లేదా బాధితుల వద్దకు వెళ్లి ఫిర్యాదు నమోదు చేయడం ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ విధానం ప్రత్యేకత. ప్రధాన అంశాలు.. ● మహిళలు, చిన్నారులపై నేరాలు ● లైంగిక నేరాలు (పోక్సో, అత్యాచారం తదితరాలు) ● ఎస్సీ/ఎస్టీ అఘాయిత్యాలు ● ఆస్తి సంబంధిత నేరాలు (చోరీ, దోపిడీ) వృద్ధులపై నేరాలు ● ప్రత్యేక చట్టాల కింద కేసులు (వరకట్నం, బాల్య వివాహాలు, ర్యాగింగ్ మొదలైనవి) ● పోలీస్స్టేషన్కు రాలేని పరిస్థితిలో ఉన్న బాధితులకు సంబంధించిన ఇతర నేరాలు ● ప్రత్యేకించి మహిళలు, వృద్ధులు, దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ నమోదు సేవ ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోంది. బాధితుల వద్దకే చేరుకుని ఫిర్యాదు నమోదు చేయడం ద్వారా సమయాన్ని ఆదా చేయడంతో పాటు, నేరాలపై వేగంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా 35 కేసులు.. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 35 ఆన్సైట్ ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేశారు. ఈ విధానం వల్ల బాధితులకు తక్షణ న్యాయం అందడమే కాకుండా, పోలీసు సేవలపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుంది. సత్వర న్యాయం అందించడమే లక్ష్యం బాధితులకు సత్వర న్యాయం అందించడమే పోలీస్శాఖ లక్ష్యం. ప్రజలకు చేరువగా ఉండే పోలీసింగ్ ద్వారా వారి సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నాం. జిల్లా ప్రజలు ఈ సేవను వినియోగించుకుని నిర్భయంగా ముందుకు వచ్చి పోలీసులను సంప్రదించాలి. ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ ద్వారా బాధితులకు తక్షణ న్యాయం అందడమే కాకుండా, పోలీసు సేవలపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుంది. – శబరీష్, ఎస్పీ -
గడ్డి మందు తయారీని నిలిపివేయాలి
మరిపెడ: గడ్డి మందు తయారీని నిలిపివేయాలని మరిపెడ ము న్సిపల్ చైర్పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్రెడ్డి అన్నారు. మరిపెడలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ.. గడ్డి మందు వాడకం వల్ల భూమిలో సారం తగ్గి దిగుబడి తగ్గుతుందన్నారు. ప్రభుత్వం నిషేధిత గడ్డి మందును తక్షణమే నిలిపివేయాలని కోరారు. నాయకులు కుడితి నర్సింహరెడ్డి, షేక్ తాజుద్దీన్, షేక్ నజీర్ పాల్గొన్నారు. అన్ని సౌకర్యాలు కల్పించాలిప్రజలకు, వినియోగదారులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని మరిపెడ మున్సిపాలిటీ చైర్పర్సన్ ప్రగతి శ్రీపాల్రెడ్డి అన్నారు. మరిపెడలో సంతను ఆమె ప్రారంభించి మాట్లాడారు. సంతలో తాగునీటి వసతి కల్పించాలన్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలుగకుండా ప్రభుత్వం నిర్మించిన మార్కెట్లో విక్రయాలు జరుపాలని వ్యాపారులకు సూచించారు. షేక్ ఖలీల్, ఖాదర్, సంత కాంట్రాక్టర్ మహ్మద్ వసీం, కౌన్సిలర్లు గుగులోతు నీలాలచ్చిరాం, మెరుగు రాము, భిక్షపతి, ఉపేందర్ ఉన్నారు. -
కాజీపేటను రైల్వే డివిజన్గా చేయాలి
● మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్కాజీపేట రూరల్: కాజీపేటను రైల్వే డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని, పోరాడి సాధించుకున్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని, చిరువ్యాపారులకు సముదాయాలు కట్టించాలని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాజీపేట మీడియా పాయింట్లో ఆయన శనివారం మాట్లాడుతూ అనేక అంశాలపై రైల్వే జీఎంను మాజీ ఎంపీ బి.వినోద్కుమార్, కాజీపేట బీఆర్ఎస్ నాయకులతో కలిసి గత మార్చి 9వ తేదీన కలిసి వినతిపత్రం ఇచ్చినట్లు గుర్తుచేశారు. కోచ్ఫ్యాక్టరీ నిర్మాణంలో ఇళ్లు, భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. కాజీపేట డివిజన్ ఏర్పాటు, కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుంటే ప్రధాని ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటామని వినయ్భాస్కర్ హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వేణు, నార్లగిరి రమేష్, కుమార్ కార్యకర్తలు పాల్గొన్నారు. -
యువకుడిపై పోక్సో కేసు నమోదు
మహబూబాబాద్ రూరల్ : బాలిక ను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మహబూబాబాద్ టౌన్ సీఐ మహేందర్ రెడ్డి శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ కొద్దిరోజుల క్రితం మహబూ బాబాద్ పట్టణానికి రాగా.. నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన డెకరేషన్ పనిచేసే యువకుడు చిలుకబత్తిని రంజిత్ పరిచయం చేసుకున్నాడు. బాలికను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి శారీరకంగా లోబరుచుకుని వెంట తీసుకెళ్లాడు. ఈ విషయమై బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించి, అతనిపై కిడ్నాప్, పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. చిట్యాలలో.. చిట్యాల: ప్రేమ పేరుతో మైనర్ను వేధింపులకు గురి చేసిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పోచంపల్లి సతీష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా దూత్పల్లి గ్రామానికి చెందిన బాణాల రాకేష్ కొంత కాలంగా ఓ మైనర్ను వేధిస్తూ ప్రేమించాలని వెంటబడుతూ.. బాలికకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తానని బెదిస్తున్నాడు. దీంతో బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితుడిని భూపాలపల్లి సెకండ్ అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరుచగా 14 రోజులు రిమాండ్ విధించారు. ఫేజ్ త్రీలో కొనసాగుతున్న పంపింగ్ ● ఒక మోటారు పంపింగ్ బంద్ కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం దేవాదుల ఎత్తిపోతల పథకంలో ఒక మోటారు పంపింగ్ను అధికారులు నిలిపివేశారు. జె.చొక్కారావు ఎత్తిపోతల వద్ద మూడు ఫేజ్లలో పది మోటార్లు ఉన్నాయి. అందులో ఫేజ్ త్రీలో ఐదు మోటార్లు, ఫేజ్ టూ లో ఒక మోటారుతో కొన్నిరోజులుగా నీటిని నిరంతరం దిగువకు ఎత్తిపోసిన అధికారులు శనివారం ఫేజ్త్రీలో ఒక మోటారు పంపింగ్ను నిలిపివేశారు. దీంతో రెండు ఫేజ్లలో ఐదు మోటార్లతో 1,414 క్యూసెక్కుల నీటి పంపింగ్ దిగువకు కొనసాగుతోంది. కాగా సమ్మక్క సాగర్ బ్యారేజీలోకి ఎగువ నుంచి 4,000 క్యూసెక్కుల నీరు చేరుతుండగా బ్యారేజీలోని గేట్లను ఎత్తి 2,586 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. -
కృత్రిమ మేధతో వేగంగా సేవలు
హన్మకొండ: కృత్రిమ మేధ వినియోగంతో విద్యుత్ రంగంలో సేవలు వేగంగా అందుతున్నాయని ఇంధన శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ అన్నారు. శనివారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అధ్యక్షతన ‘ఏ.ఐ హ్యాకథాన్’ పై అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నవీన్ మిట్టల్తోపాటు తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ పాల్గొన్నారు. సంస్థలోని అన్ని విభాగాలు నిర్వహిస్తున్న కార్యకలాపాలను ఏ.ఐ సాంకేతికతతో రూపొందించిన పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వివిధ విభాగాల్లో ఇప్పటికే చేపడుతున్న డిజిటల్ చర్యలు, భవిష్యత్లో అమలు చేయనున్న ఏఐ ఆధారిత పరిష్కారాలను నవీన్ మిట్టల్ సమగ్రంగా సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయ, నాణ్యమైన సేవలు అందించడమే టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన లక్ష్యమని, కృత్రిమ మేథ అమలు ఆ లక్ష్య సాధనలో కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. గతంలో రోజులు పట్టే పనులు ఇప్పుడు కేవలం నిమిషాల్లో పూర్తవుతున్నాయని చెప్పారు. డిజిటల్ టెక్నాలజీల వినియోగంతో వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని, ఫిర్యాదుల పరిష్కారం కూడా వేగవంతమైందన్నారు. భవిష్యత్లో ఏఐ వినియోగం మరింత విస్తరించి విద్యుత్ రంగాన్ని పూర్తిగా స్మార్ట్గా మార్చుతుందన్నారు. ప్రతి విభాగం తమ అవసరాలకు అనుగుణంగా కృత్రిమ మేథను వినియోగిస్తే అధిక ఫలితాలు సాధించవచ్చని సూచించారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వైపు అడుగులు వేస్తూ కృత్రిమ మేథ వినియోగం ద్వారా విద్యుత్ రంగంలో వేగం, ఖచ్చితత్వం, పారదర్శకత పెరిగి వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ఎన్పీడీసీఎల్ ముందుకెళ్తుందన్నారు. అనంతరం ఓగులాపూర్ 400 కేవీ మానవ రహిత సబ్ స్టేషన్ను సందర్శించారు. నిర్వహణ పద్ధతులు, అనుసరిస్తున్న విధానాలు, ఓల్టేజీ స్థాయిలు, తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈలు తిరుమల్ రావు, రాజు చౌహన్, సురేందర్, వెంకట రమణ, మాధవ రావు, అన్నపూర్ణ, సీజీఎంలు రవీంద్రనాథ్, కిషన్, జాయింట్ సెక్రెటరీ రమేష్, ట్రాన్స్ కో సీఈ శ్రీరామ్ కుమార్, డీఈ మహేష్ పాల్గొన్నారు. నవీన్ మిట్టల్ -
వ్యవసాయ రంగానికి ప్రభుత్వ ప్రాధాన్యం
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధర్మసాగర్: వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిస్తు న్న ఏకై క రాష్ట్రం తెలంగాణ అని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఎమ్మె ల్యే ప్రారంభించారు. వ్యవసాయ శాఖ ద్వారా లబ్ధి దారులకు సబ్సిడీ పై డ్రోన్, బేయిలర్స్ వంటి వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు. అనంతరం మండలంలోని 13 మంది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులు, 43 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. మక్కలు అమ్మిన 10 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని వెల్లడించా రు. ప్రస్తుతం వ్యవసాయ పనులకు కూలీలు దొరకడం లేదని కాబట్టి రైతులు వ్యవసాయ యాంత్రికరణ దిశగా ముందుకెళ్లాలని సూచించారు. వ్యవసాయ యాంత్రికరణ ద్వారా పెట్టుబడి తగ్గి రైతుకు లాభసాటిగా ఉంటుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ నియోజకవర్గానికి ఇవ్వనన్ని నిధులు స్టేషన్ ఘన్పూర్కు మంజూరు చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో కడియం శ్రీహరి మార్క్ అభివృద్ధి కనిపించాలన్నదే తన తాపత్రయమని చెప్పారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేసుకోవాలని, రాజకీయాలకు అతీ తంగా గ్రామాలను అభివృద్ధి చేసుందామని సర్పంచులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ అనిల్ కుమార్ పాల్గొన్నారు. -
వివాహిత ఆత్మహత్య
తొర్రూరు రూరల్: అనుమానంతో భర్త వేధించడాన్ని తట్టుకోలేని వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మానుకోట జిల్లా తొర్రూరు మండల పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన పనికెర అనూష(22) హరిపిరాల గ్రామానికి చెందిన పులిగుజ్జ సాయి ఆరేళ్ల క్రితం కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో ఇరు కుటుంబాల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరిగినా వారిరువురు విడిపోకుండా బంధానికి కట్టుబడ్డారు. కానీ, గత కొద్ది కాలంగా సాయి ప్రవర్తనలో మార్పు వచ్చి భార్యను అనుమానిస్తూ వేధించసాగాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరగగా భార్యపై భర్త చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన అనూష శనివారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనూష తండ్రి ఉప్పలయ్య ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కాగా, అనూషకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. చెరువులో మునిగి వ్యక్తి మృతి హసన్పర్తి: ఈతకోసం నీటిలోకి దిగిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు అందులో మునిగి ప్రాణాలు వదిలాడు. ఈసంఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధిలోని రెడ్డిపురంలోని కుంటలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మట్టెవాడకు చెందిన మహ్మద్ అబ్దుల్ సమద్(43) చిరు వ్యాపారి. ప్రతీ రోజు ఉదయం ఇంటి నుంచి రెడ్డిపురంలోని కుంటకు ఈతకు వచ్చేవాడు. రోజు మాదిరిగానే శనివారం కూడా ఈతకు వచ్చి నీటిలో మునిగి మృతిచెందాడు. అయితే చెరువులో తేలిఉన్న మృతదేహాన్ని స్థానికులు సాయంత్రం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ నిమిత్తం వరంగల్లోని ఎంజీఎంకు తరలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కల్యాణ్ తెలిపారు. కెనాల్లో పడి .. ఆత్మకూరు: ప్రమాదవశాత్తు కెనాల్లో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆత్మకూరు పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. దామెర మండలంలోని సీతారాంపురం గ్రామానికి చెందిన పెండ్లి ప్రభాకర్(41) శుక్రవారం సాయంత్రం బయటకు వెళ్లొస్తానని చెప్పి తిరిగి రాలేదు. ఇంటికి తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం దుర్గంపేట–సీతారాంపురం మధ్యలో కెనాల్లో పడి మృతిచెందిఉండడాన్ని గమనించారు. బహిర్భూమికి వెళ్లి కెనాల్లోకి వెళ్లగా ప్రమాదవశాత్తు మృతిచెందాడని ప్రభాకర్ భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు ఆత్మకూరు ఎస్సై సతీష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
శనిగరంలో శాతవాహనుల నాటి టెర్రకోట శిల్పం
● 2 వేల ఏళ్ల క్రితం నాటి బౌద్ధ యక్షిణి శిల్పంగా గుర్తింపు కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని శనిగరంలో శాతవాహనుల కాలం నాటి టెర్రకోట శిల్పం తల లభ్యమైంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉజ్జేతుల రాజు ఇచ్చిన సమాచారం మేరకు శనిగరం గ్రామ శివారులోని వాగు పరీవాహక ప్రాంతంలో చెక్డ్యాం పక్కన గట్టుమల్లు అనే రైతుకు చెందిన పంట పొలాల్లో శాతవాహనుల కాలం నాటి టెర్రకోట శిల్పం తల (సుమారు 2 వేల ఏళ్ల క్రితం నాటి బౌద్ధ యక్షిణి శిల్పం)ను గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర పరిశోధక బృందం సభ్యుడు దేవరం రమేష్ శర్మ తెలిపారు. ఈ శిల్పం కోటిలింగాల, ధూళికట్ట, చేర్యాల కొండపాకలో లభించిన టెర్రకోట శిల్పాలను పోలి ఉందని, ఇదొక యక్షిణి టెర్రకోట శిల్పమని, నుదుట బొట్టు, రెండు పాయలుగా కట్టిన సిగ, ఆభరణాలతో ఉన్న ఈ శిల్పం తల ఎత్తు 5 సెంటీమీటర్లు, వెడల్పు 3 సెంటీమీటర్లు ఉందని, తల వెనుక భాగం మట్టి పొరలు రాలిపోయి ఉందని వివరించారు. చక్కని పని తనంతో కూడిన ఈ టెర్రకోట శిల్పం శాతవాహనుల కాలం నాటి సాంస్కృతిక చిహ్నమని, తొలి చారిత్రక యుగానికి చెందిన ఈ అపురూప టెర్రకోట శిల్పం చారిత్రకంగా విశేషమైందని తెలిపారు. ఈ శిల్పం దొరికిన పంట పొలాల్లో మట్టి పూసలు, కుండ పెంకులు, టెర్రకోట శిల్పాల అవశేషాలు లభిస్తున్నాయని స్థానిక రైతులు చెబుతున్నారని, పురావస్తు శాఖ ఇక్కడ మరిన్ని పరిశోధనలు చేస్తే మరిన్ని ఆనవాళ్లు దొరికే అవకాశం ఉంటుందని రమేష్ శర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. -
ప్రాణాలపై పట్టింపేది..?
హన్మకొండ: విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది తమ ప్రాణాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. విద్యుత్ విధులు ప్రమాదకరమని తెలిసినా భద్రత కోసం వినియోగించాల్సిన పనిముట్లను వాడకుండా విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. విద్యుత్ మరమ్మతుల సమయంలో విద్యుత్ స్తంభంపై చేరుకున్నప్పుడు విధిగా టెస్టర్తో పరీక్షించాలి. ఎర్త్రాడ్ వాడాలి. చేతికి గ్లౌజ్లు వేసుకోవాలి. తలకు హెల్మెట్ ధరించాలి. అయితే విధుల్లో ఉన్న సిబ్బంది వీటిని వినియోగించడం లేదు. సబ్ స్టేషన్లు, వినియోగదారుల వివరాలు టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో 33/11 కేవీ సబ్ స్టేషన్లు 1,528 ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 3,51,115 ఉన్నాయి. గృహ వినియోగదారులు 48,23,874, వాణిజ్య, వ్యాపార వినియోగదారులు 6,32,457, ఎల్టీ పరిశ్రమలు 34,156, ఎల్టీ వ్యవసాయ సర్వీస్లు 13,96,285, ఇతరాలు 1,37,036 సర్వీస్లున్నాయి. హెచ్టీ పరిశ్రమలు 3,413, హెచ్టీ కమర్షియల్ 1,151, హెచ్టీ నీటిపారుదల 470, హెచ్టీ ఇతర సర్వీస్లు 268 ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉద్యోగులు 5,579 మంది, ఆర్టిజన్లు 3,457, అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు 1,382 మంది పని చేస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందే..విద్యుత్ ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం, సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి.. స్టీల్ నిచ్చెన, హెల్మట్, హ్యాండ్ గ్లౌజ్, ఎర్త్రాడ్, టెస్టర్ ఉద్యోగులు, సిబ్బందికి పంపిణీ చేశారు. భద్రతా ప్రమాణాలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని రూ.3వేల జరిమానా విధిస్తామని ఎన్పీడీసీఎల్ యాజమాన్యం హెచ్చరించినా.. ఉద్యోగులు, సిబ్బంది వాడడడం లేదు. సెక్షన్ స్థాయి అధికారి అసిస్టెంట్ ఇంజనీర్లు, ఫోర్మెన్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్, లైన్ ఇన్స్పెక్టర్లు క్షేత్ర స్థాయి సిబ్బందిచే వాటిని వాడేలా ప్రోత్సహించడంలో, వారిని ఆదేశించడంలో అలసత్వం వహిస్తున్నారు. ఫలితంగా విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లపైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. విద్యుత్ ప్రమాదాలపై అవగాహన టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ప్రతీ సర్కిల్లో డీఈ టెక్నికల్ను సేఫ్టీ ఆఫీసర్గా నియమించి ప్రమాదాలపై విద్యుత్ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఎల్సీ యాప్ను తీసుకొచ్చి విద్యుత్ లైన్ క్లియరెన్స్ను సులభతరం చేశారు. ఇన్ని సౌకర్యాలు కల్పించినా ఉద్యోగులు, సిబ్బంది నిర్లక్ష్యం వీడడం లేదు. ● ‘మార్చి 30న హనుమకొండ యాదవనగర్ సెక్షన్లో విద్యుత్ బకాయిల వసూళ్లు చేస్తున్న క్రమంలో సర్వీస్ డిస్కనెక్షన్ కోసం అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ పున్నం చందర్ నిచ్చేన సాయంతో విద్యుత్ స్తంభం ఎక్కి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.’ ఇక్కడే ఉన్న టీజీ ఎన్పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్, లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్ కూడా భద్రతా ప్రమాణాలు పాటించడంలో అలసత్వం వహించారు. అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్చే వాటిని ధరింపజేయడంలో విఫలమయ్యారు. భద్రతకు ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ప్రాధాన్యం సిబ్బందికి భద్రతా ఉపకరణాల పంపిణీ ఉపకరణాల వాడకంలో నిర్లక్ష్యం గాలిలో కలుస్తున్న ప్రాణాలు -
తెలంగాణ హెరిటేజ్ శాఖ, టార్చ్ ఒప్పందం
హన్మకొండ: సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ కోసం పనిచేస్తున్న వరంగల్కు చెందిన టీం ఆఫ్ రీసెర్చ్ ఆన్ కల్చర్ అండ్ హెరిటేజ్ (టార్చ్), రాష్ట్ర హెరిటేజ్ శాఖ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. శనివారం హైదరాబాద్లోని పురావస్తు శాఖ ప్రధాన కార్యాలయంలో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రంలోని పురాతన కట్టడాలు, ఆలయాలు, చారిత్రక కట్టడాలను నమోదు చేయడం, సంరక్షించడం, పునరుద్ధరించడం, ప్రోత్సహించడం ఈ ఒప్పందం లక్ష్యం. ఈ భాగస్వామ్యంతో రెండు సంస్థలు కలిసి వారసత్వ డాక్యుమెంటేషన్, డిజిటల్ రికార్డులు తయారు చేయడం, ఆలయాలు, చారిత్రక కట్టడాల సంరక్షణ, సంప్రదాయ కళలు, జానపదం, స్థానిక జ్ఞానాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపడతాయి. ఈ సందర్భంగా రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున్ రావు మాట్లాడుతూ.. పురావస్తు శాఖ, టార్చ్ సంస్థ మధ్య కుదిరిన ఈ ఒప్పందంపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ వారసత్వ సంరక్షణ, పరిరక్షణ, వెలుగులోకి రాని వారసత్వ ప్రదేశాల డాక్యుమెంటేషన్ను తమ పరిశోధనలు, పుస్తకాలు, ప్రదర్శనలు, డాక్యుమెంటరీల ద్వారా ప్రజలకు పరిచయం చేస్తున్న టార్చ్ సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. భవిష్యత్లో తెలంగాణలోని స్మారక కట్టడాల సంరక్షణలో ఇరు సంస్థలు పరస్పరం కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. టార్చ్ సంస్థ సెక్రటరీ అరవింద్ ఆర్య మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని కల్పించినందుకు హెరిటేజ్ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే పురావస్తు శాఖ ప్రాజెక్టుల్లో కూడా తాము పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ పగడం నాగరాజు, అసిస్టెంట్ డైరెక్టర్ మల్లు నాయక్, పురావస్తు శాఖ ఓఎస్డీ రాజు పాల్గొన్నారు. యాదవనగర్ సెక్షన్ ఏఈ లక్ష్మణ్ సస్పెన్షన్హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్, హనుమకొండ టౌన్ డివిజన్లోని యాదవనగర్ సెక్షన్ అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎం.లక్ష్మణ్ను యాజమాన్యం సస్పెండ్ చేసింది. సాక్షిలో శనివారం ప్రచురితమైన ‘అధికారులపై చర్యలుండవా’అనే కథనంపై సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, డైరెక్టర్లు.. స్పందించారు. హనుమకొండ సర్కిల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వెంటనే రిపోర్టు పంపాలని ఎస్ఈ పి.మధుసూదన్ రావును ఆదేశించారు. ఎస్ఈ రిపోర్టు మేరకు ఎం.లక్ష్మణ్పై సస్పెన్షన్ వేటు వేసింది. మార్చి 30న యాదవనగర్లో సెక్షన్లో జరిగిన ప్రమాదంలో అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ పున్నం చందర్ చనిపోయిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు ఆందోళన కూడా చేశారు. ఈ ఘటనలో భద్రతా ప్రమాణాలు పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని యాదవనగర్ సెక్షన్ లైన్ ఇన్స్పెక్టర్, లైన్మెన్ను ఈ నెల ఒకటిన సస్పెండ్ చేశారు. ఆ రోజు సెక్షన్ ఏఈ లక్ష్మణ్ స్థానికంగా ఉండి భద్రత పరికరాలు లేకుండానే విద్యుత్ స్తంభంపై ఎక్కించినట్లు తేలడంతో యాజమాన్యం తీవ్రమైన బాధ్యతారాహిత్యంగా భావించి అతన్ని సస్పెండ్ చేస్తూ శనివారం హెచ్ఆర్డీ చీఫ్ ఇంజనీర్ ఎం.మాధవరావు ఉత్తర్వులు జారీ చేశారు. వారసత్వ సంపద పరిరక్షణకు అంగీకారం -
మార్కెట్లోకి ఎక్స్టర్, వెర్నా కార్లు విడుదల
రామన్నపేట: వరంగల్ ములుగు రోడ్డులోని హేమ హ్యూందాయ్ కార్ షోరూంలో ఎక్స్టర్, వెర్నా నూతన కార్లను ఎస్బీఐ ఆర్ఎం అబ్దుల్ రహీం, హెచ్డీఎఫ్సీ మేనేజర్ జి.రమేష్, షోరూం మేనేజింగ్ డైరెక్టర్ యుగంధర్ శనివారం మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా షోరూం ఎండీ యుగంధర్ మాట్లాడుతూ.. న్యూ ఎక్స్టర్ కొత్త బోల్డ్ డిజైన్ స్పోర్టీ లుకింగ్, సేఫ్టీ ఫ్యూచర్లు, సిక్స్ ఎయిర్బ్యాగ్స్, డాస్ కెమెరా వంటి అధునాతన ఫ్యూచర్ల కలిగి ఉందని తెలిపారు. అలాగే వెర్నా ప్రీమియం డిజైన్, పవర్ఫుల్ పర్మామెన్స్, లెవెల్–2 అడాస్, బూట్ స్పేస్, 8 వే డైవర్ సీట్ అడ్జెస్ట్మెంట్ కలిగి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్, పృథ్వీ, మేనేజర్ మహేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆరు గ్యారంటీల అమలులో సర్కారు విఫలం
కాశిబుగ్గ: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను అమలు చేయడంతో పూర్తిగా విఫలమైందని, తెలంగాణకు చెందిన డబ్బులను ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు తరలిస్తున్నారని మాజీ మంత్రి, ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. వరంగల్ ఓ సిటీలోని ఎర్రబెల్లి ప్రదీప్రావు క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి పాలన సాగిస్తుందన్నారు. తెలంగాణకు సంబంధించిన నిధులను ఎన్నికలు జరుగే పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు పంపిస్తున్నారని ఆరోపించారు. రైతులకు రైతు బంధు ఎకరానికి రూ.12 వేలు ఇస్తామని చెప్పి, ఒక ఎకరానికే పరిమితమయ్యారన్నారు. మహిళలకు ఇస్తామన్న రూ.2,500, పెన్షన్ పెంపు అడ్రస్ లేకుండా పోయిందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలను పరిష్కరించకుండా, వ్యక్తిగత చర్చలకే పరిమితం చేశారని ఆరోపించారు. అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు మాట్లాడుతూ.. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పేరుతో నిధుల దుర్వినియోగం జరుగుతుందన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ మేయర్ తక్కెళ్లపల్లి రాజేశ్వర్రావు, వన్నాల శ్రీరాములు, బొడిగె శోభ, ఎడ్ల అశోక్రెడ్డి, వంగాల సమ్మిరెడ్డి, డాక్టర్ కాళీప్రసాద్, రత్నం సతీష్షా, రంజిత్, తిరుపతిరెడ్డి, వెంకట్గౌడ్ పాల్గొన్నారు. తెలంగాణ డబ్బులు ఎన్నికల రాష్ట్రాలకు తరలింపు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ -
మామిడికి ముసుగు
సాక్షి, మహబూబాబాద్: ఈ ఏడాది ఎన్నడూ లేనివిధంగా మామిడి చెట్లు విరగపూసాయి. చెట్లకు ఆకులు కనిపించకుండా మొత్తం పూతే కనిపిస్తే చెట్టు విరిగిపోయే విధంగా కాపు వస్తుందని రైతులు సంబురపడ్డారు. అయితే వారి సంతోషం ఎంతసేపు నిలువలేదు. మాయదారి మంగు రోగంతో పూత రాలిపోయింది. కాత తేలిపోయింది. ఇటువంటి పరిస్థితిలో కాసిన కాయలు మంచి కలర్ వచ్చి మార్కెట్లో అధిక రేటు పలకాలంటే కవర్లు తొడుగితే ఫలితం ఉంటుందంటున్నారు ఉద్యాన వన శాఖ అధికారులు. గతంలో మంచి ఫలితం మామిడికాయలకు పిందె దశలో కవర్లు తొడుగితే ఫలితం ఉంటుందని చెబుతున్నారు రైతులు. జిల్లాలో 15 వేల ఎకరాల్లో పండ్ల తోటలు ఉన్నాయి. ఇందులో పలువురు రైతులు, వివిధ సంస్థల ఆధ్వర్యంలో గతేడాది జిల్లాలోని తొర్రూరు, దంతాలపల్లి, మరిపెడ, గార్ల మొదలైన మండలాల్లో సుమారు 20 మంది రైతులతో ఈ ప్రయోగం చేయించారు. సాధారణ మామిడి పండ్లతో పోలిస్తే కవర్లు కట్టి పెంచిన పండ్లు ఆకర్షనీయమైన రంగు రావడంతో 50శాతం రేటు అధికంగా పెట్టి వినియోగదారులు కొనుగోలు చేశారని రైతులు చెబుతున్నారు. రసాయనాల ప్రభావం తక్కువ కవర్లు తొడిగి పెంచిన మామిడి పండ్లపై తోటపై పిచికారీ చేసే రసాయనాల ప్రభావం తక్కువగా ఉంటుంది. పండుపై ఈగలు, దోమలు, మంగు వంటి శిలీంధ్రాల ప్రభావం కూడా తక్కువే. కవర్ కాయ తొడిమకు కాకుండా చెట్టు కాండానికి కట్టడంతో వడగండ్ల వాన, గాలి దుమారం వచ్చినా.. కాయ రాలిపోకుండా ఉంటుంది. ఎకరానికి రూ.10వేల ప్రోత్సాహకం కవర్లు కట్టి కాయలను పెంచడం మూలంగా మంచి ఫలితాలు రావడంతో ప్రభుత్వం దీనిని ప్రోత్సహించేందుకు పూనుకుంది. ఇందుకోసం ఎకరానికి రూ.10వేల చొప్పున రైతులకు ప్రోత్సాహకం అందిస్తుంది. జిల్లావ్యాప్తంగా 15వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా ఇందులో ఈ ఏడాది 200 ఎకరాలకు ప్రోత్సాహకం అందించనున్నట్లు జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. మామిడికాయలకు కవర్ల తొడుగు ఆకర్షణీయమైన రంగుతో పండ్లు రసాయనాల ప్రభావం తక్కువ వడగళ్ల వాన, గాలి దుమారం నుంచి రక్షణ ఎకరాకు రూ.10వేల ప్రోత్సాహకం -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
● జిల్లా వ్యవసాయశాఖ అధికారి సరిత నర్సింహులపేట: ఎరువుల షాపు డీలర్లు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి.సరిత హెచ్చరించారు. శనివారం మండలకేంద్రంలోని ఎరువుల షాపులను, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం, కోరమాండల్ ఇంటర్నేషనల్ షాపులను ఆకస్మికంగా సందర్శించి స్టాక్ రిజిస్టర్, బిల్లులు, లైసెన్స్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడారు. ఎరువులను ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు అమ్మినా, బ్లాక్లో అమ్మినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో పారాక్వాట్ మందును నిషేధించామని, ఎరువుల డీలర్లు అమ్మితే చర్యలు తప్పవన్నారు. అనంతరం పామాయిల్, వరి పొలంను పరిశీలించారు. రసాయన ఎరువులను తగ్గించి, పశువుల ఎరువులను వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ వినయ్కుమార్, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. -
రైతులకు ఇబ్బందులు కలగొద్దు
● కలెక్టర్ స్నేహశబరీష్ మహబూబాబాద్ రూరల్: రైతులకు ఇబ్బందులు కలగకుండా సకాలంలో మొక్కజొన్న కొనుగోళ్లు జరపాలని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డును కలెక్టర్ స్నేహశబరీష్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్దతు ధర కల్పిస్తూ కొనుగోళ్లలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కనీస మద్దతు ధర రూ.2,400 చెల్లించాలని, రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి ఈనామ్ విధానం ద్వారా కొనుగోలు చేయాలన్నారు. పెసర్లు, మినుములు, వేరుశనగ, తదితర పంటలవైపు దృష్టిమరల్చేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కాగా ఎకరానికి వచ్చిన దిగుబడి మొత్తం కొనుగోలు చేసేలా ఆదేశించాలని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. కలెక్టర్ వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, వైస్ చైర్మన్ మదన్ గోపాల్ లోయ, వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ సుజన్ బాబు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సరిత, ఏడీఏ శ్రీనివాసరావు, మార్కెటింగ్ శాఖ డీఎం వెంకటేశ్వర్లు, ఏఓ తిరుపతిరెడ్డి, ప్రమోద్ కుమార్, ఏఎంసీ డైరెక్టర్లు తదితరులు ఉన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పారదర్శకంగా నిర్వహించాలి మహబూబాబాద్:స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎలక్టోరల్ అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎలక్టోరల్ అఽధికారి సుదర్శన్రెడ్డి సంబంఽధిత ఉన్నతాధికారులతో కలిసి ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా సుదర్శన్రెడ్డి మాట్లాడారు. వీసీలో కలెక్టర్ స్నేహ శబరీష్, ఆర్డీఓలు కృష్ణవేణి, గణేష్, పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలి డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతీఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం డ్రగ్స్ నిర్మూలనపై సంబంధిత అధికారులతో సమావేఽశం నిర్వహించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేసి డ్రగ్స్ రహిత సమాజానికి కృషి చేయాలన్నారు. -
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
మహబూబాబాద్ రూరల్: పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర కార్యదర్శి ముబిన్ అహ్మద్ డిమాండ్ చేశారు. న్యాయశాఖ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద శనివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నిక ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. ఓపీఎస్ను అమలు చేయకపోతే నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పోలేపల్లి శ్రీనివాస్, ఉద్యోగులు ఫిరోజ, నాగముని, ఆవునూరి రవి, రఫీక్, కొప్పుల నాగరాజు, రవీందర్, రాంజీనాయక్, బలాష్టి రమేష్, సింగు రమేష్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిడాల సత్యనారాయణ, జంగం సిద్ధార్థ, న్యాయవాదులు పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శులకు డిప్యుటేషన్లుమహబూబాబాద్: జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల డిప్యుటేషన్ ప్రక్రియపై కసరత్తు జరుగుతుందని గత నెల 16వ తేదీన ‘డిప్యుటేషన్లపై కసరత్తు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం విధితమే. ఈనెల 4న (శని వారం) కలెక్టర్ స్నేహ శబరీష్ జిల్లాలోని 406 మంది పంచాయతీ కార్యదర్శులకు డిప్యుటేషన్ల జాబితా విడుదల చేసినట్లు డీపీఓ హరిప్రసాద్ తెలిపారు. అయితే గైడ్లైన్స్ పాటించకుండా దూరంగా వేశారని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం కలెక్టర్ను కలిసి విన్నవించారు. దరఖాస్తుల గడువు పెంపుమహబూబాబాద్ అర్బన్: ఎస్సీ కార్పొరేషన్ స్వయం ఉపాధి రుణాల గడువు ఈ నెల 8వ తేదీ వరకు పొడిగించినట్లు ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వహక సంచాలకులు కె. శ్రీనివాస్ శని వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన షెడ్యూల్డ్ కులాలకు చెందిన యువతీయువకులు, నిరుద్యోగులు స్వయం ఉపాధి పథకాలకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో దరఖాస్తులు పూర్తి చేసుకున్న అభ్యర్థులు తమ హార్డ్ కాపీలను, ధ్రువపత్రాలను పట్టణంలోని వారు మున్సిపాలిటీ కార్యాలయం, గ్రామీణ ప్రాంతంలోని వారు సంబంధిత ఎంపీడీఓ కార్యాలయంలో అందించాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా షెడ్యూల్ కులముల కార్యాలయంలో సంప్రదించాలన్నారు. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం దరఖాస్తు..మహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీలో నాలుగు కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ టి.రాజేశ్వర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మున్సిపల్ పరిపాలనలో ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన వారి నుంచి ఇద్దరికి అవకాశం ఉంటుందని, వారిలో ఒకరు మహిళకు అవకాశం ఉంటుందన్నారు. మైనార్టీస్ నుంచి ఇద్దరికి అవకాశం ఉండగా వారిలో ఒకరికి మహిళకు అవకాఽశం ఉంటుందన్నారు. రెండు కేటగిరిలో ఉండగా పరిపాలన ప్రత్యేక పరిజ్ఞానం కేటగిరిలో దరఖాస్తు చేసుకునే వారు ఓటరు జాబితాలో ఓటు ఉండాలని, 21 సంవత్సరాలు నిండి ఉండాలన్నారు. ఈనెల 5 నుంచి 11వ తేదీ వరకు మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
మహబూబాబాద్ రూరల్: రైతులు, అణగారిన వ ర్గాల అభివృద్ధి, విద్య, వైద్యం, సంక్షేమానికి ఇందిర మ్మ ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుందని ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కా ర్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఓ గార్డెన్లో క ల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చె క్కులు శనివారం పంపిణీ చేసి, సన్నబియ్యం లబ్ధి దారులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పేదల అభివృద్ధికి అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకై క రాష్ట్రం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. మహబూబాబాద్ ని యోజకవర్గంలోని 92 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధిలో భాగంగా ప్రజలకు మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. సన్న బియ్యం పథకం ద్వారా ఏప్రిల్, మే, జూన్, మూడు నెలలకు సంబంధించిన రేషన్ను ఒకేసారి పంపిణీ చేస్తున్నామన్నారు. కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు జిల్లాలోని అర్హులైన ప్రతీ ఒక్కరికి అందించి వారి అభ్యున్నతికి కృషి చేయడానికి జిల్లా యంత్రాంగం ముందుంటుందన్నారు. అనంతరం సన్నబియ్యం లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు. ఈ సమావేశంలో డీసీఎస్ఓ రమేష్, ఆర్డీఓ కృష్ణవేణి, మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ జ్యోతి, వైస్ చైర్మన్ సూర్నపు సోమయ్య, వార్డు కౌన్సిలర్లు, తహసీల్దార్లు చంద్రరాజేశ్వర్ రావు, వివేక్, నాగభవాని, నరేష్, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్ సన్నబియ్యం లబ్ధిదారులతో సహపంక్తి భోజనం, చెక్కుల పంపిణీ -
జనగణనకు కసరత్తు
మహబూబాబాద్: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల కల్పన, ప్రణాళికలు రూపొందించే విషయంలో జనాభా గణాంకాలు కీలకం. ప్రస్తుతం జన గణనపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే జిల్లా, మండల స్థాయి అధికారులకు శిక్షణ పూర్తి చేశారు. జిల్లాలో 7,74,000 జనాభా 2011 లెక్కల ప్రకారం 7,74,000 జనాభా ఉన్నట్లు సీపీఓ అధికారులు తెలిపారు. మళ్లీ 2021 జన గణన జరగనుండగా కోవిడ్, పలు కారణాలతో గణన ఆసల్యమైనట్లు అఽధికారులు పేర్కొన్నారు. జన గణన విషయంలో గత నెల 15, 16, 17 తేదీల్లో కలెక్టరేట్లో జిల్లా, మండల స్థాయి అధికారులకు శిక్షణ పూర్తి చేశారు. జిల్లాలో ఎన్యుమరేటర్లు 1,450 మంది, సూపర్వైజర్లు 252 మంది (మొత్తం 1,702) జన గణనలో పాల్గొననున్నారు. వారికి ఇప్పటికే గణనకు సంబంధించిన బుక్లెట్స్, ఇతర విషయాలపై మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పించారు. అలాగే కిందిస్థాయి సిబ్బందికి ఈనెల 18వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు మండల స్థా యిలో శిక్షణ ఉంటుంది. మే నెలలో ఇళ్ల సర్వే.. ఈ ఏడాది మే 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు ఇళ్ల సర్వే జరుగుతుంది. 2027 ఫిబ్రవరి, మార్చి నెలలో జన గణన చేస్తారు. 2027 మే నెలలో జిల్లా జనాభా స్పష్టత వస్తుంది. డిజిటల్ విధానంలో.. ఈసారి నూతనంగా డిజిటల్ విధానంలో జనగణన జరగనుంది. మొబైల్ ఫోన్లో యాప్ను డౌన్లోడ్ చేసుకుని వివరాలు నమో దు చేస్తారు. అయితే జనగణన విధులు నిర్వర్తించే వారికే యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఇస్తారు. డిజిటల్ విధానంలో సర్వే మరింత వేగవంతం కానుంది. నిబంధనల మేరకు జనగణన.. జనగణన శాఖ నుంచి వచ్చిన నిబంధనల మేరకు జన గణన ప్రక్రియ నిర్వహిస్తున్నాం. ఇప్పటికే జిల్లా, మండల స్థాయి అధికారులకు శిక్షణ పూర్తి చేశాం. జనగణనకు ప్రజలు సహకరించాలి. – అశోక్, జిల్లా ఉపగణాంక అధికారి జిల్లా, మండల స్థాయి అధికారులకు శిక్షణ పూర్తి ఎన్యుమరేటర్లు 1,450, సూపర్ వైజర్లు 252 మంది.. జిల్లాలో 2011 లెక్కల ప్రకారం 7,74,000 మంది జనాభా ఈసారి డిజిటల్ విధానంలో సర్వే -
హెచ్పీవీ వ్యాక్సినేషన్ను సద్వినియోగం చేసుకోవాలి
మరిపెడ రూరల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బాలికలకు ఉచితంగా పంపిణీ చేసే హెచ్పీవీ వ్యాక్సినేషన్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నాగేశ్వర్రావు అన్నారు. శనివారం మరిపెడ మండలకేంద్రంలోని పీహెచ్సీలో వారం రోజులుగా నిర్వహిస్తున్న హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మున్సిపాలిటీ కౌన్సిలర్ మేరుగు రాముతో కలిసి పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం ఆఫీసర్ మాట్లాడుతూ మహిళల్లో వచ్చే గర్భాశయ కేన్సర్ నివారించడంలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ అద్భుతంగా పనిచేస్తుందన్నారు. 14–15 ఏళ్ల బాలికలకు ఈ వ్యాక్సినేషన్ పంపిణీ అందేల వారి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గుగులోతు రవి, డాక్టర్ పూజిత, పీహెచ్ఎన్ఓ మంగమ్మ, స్టాఫ్ నర్సు పద్మ, చైతన్య, రత్న, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నాగేశ్వర్రావు -
కేయూ దూరవిద్య సీఎల్ఐఎస్సీ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య సీడీఓఈ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మెషన్ సైన్స్ సీఎల్ఐఎస్సీ రెగ్యులర్ అండ్ ఎక్స్ అభ్యర్థులకు ఈనెల 15వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ తెలిపారు. ఈనెల 15, 17, 20, 22, 24 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు జరగుతాయని వారు తెలిపారు. బీఎల్ఐఎస్సీ పరీక్షలు... కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య (సీడీఓఈ /ఎస్డీఎల్సీఈ) బీఎల్ఐఎస్సీ ఇయర్వైజ్ ఎక్స్ అభ్యర్థులకు ఈనెల 15వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ తెలిపారు. ఈనెల 15, 17, 20, 22, 24, 27, 29 తేదీల్లో పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జనగామ టు నేపాల్ ● ద్విచక్రవాహనంపై 5,300 కిలో మీటర్లు ప్రయాణించిన యువకుడు జనగామ రూరల్: జనగామ పట్టణానికి చెందిన మోర్తాల దీపక్ జనగామ నుంచి నేపాల్ హిమాలయాల వరకు 5,300 కిలోమీటర్లు అంతర్జాతీయ బైక్ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు. నేపాల్లోని అత్యంత ఎత్తయిన మార్గాలు 13,100 అడుగుల ఎత్తులో ఉన్న అప్పర్ ముస్తాంగ్, లోయర్ ముస్తాంగ్ వంటి హై అల్టిట్యూడ్ ప్రాంతాలను విజయవంతంగా చేరుకున్నాడు. ఇన్నర్ లైన్ బైక్ పర్మిట్ తీసుకుని ఈ ప్రత్యేక ప్రాంతాలను సందర్శించడంతోపాటు నేపాల్ రాజధాని ఖట్మాండ్ను సందర్శించాడు. విద్యుదాఘాతంతో మహిళ మృతి నడికూడ: విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం వరికోల్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సనుగోజు వనమాల(46) తనకున్న పిండిగిర్నిని స్టార్ట్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై పడిపోయింది. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా, 108 సిబ్బంది పైలట్ రాము, ఈఎన్టీ స తీష్ ఘ టనా స్థలానికి చేరుకుని వనమాలను పరీక్షి ంచి అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. తాడిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి బచ్చన్నపేట: ప్రమాదవశాత్తు తాడి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కట్కూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కోల సత్యనారాయణ (57) రోజూ మాదిరిగానే తాటి కల్లు తీసేందుకు వెళ్లాడు. రాత్రి 10 గంటలు దాటినా ఇంటికి రాకపోవడం.. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు తాడి చెట్లు వద్దకు వెళ్లి పరిశీలించగా.. తాడి చెట్టు కింద చనిపోయి పడి ఉన్నాడు. పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సత్యనారాయణకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. -
వంట నూనె.. ధరల మంట
లీటర్ ఆయిల్ ధరలు(రూ.లలో) ఇలా.. నూనె నెల క్రితం ప్రస్తుతం సన్ ఫ్లవర్ 150 175–180 వేరుశనగ 155 180–185 పామాయిల్ 130 150–155తొర్రూరు: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా నిత్యావసర సరుకుల ధరలు మండుతున్నాయి. ఇప్పటికే గ్యాస్ ధర పెరిగి అందుబాటులో లేకుండా పోగా.. తాజాగా వంట నూనెల ధరలకు రెక్కలొచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వంట నూనె సలసల కాగుతోంది. యుద్ధం సాకుగా చూపి కొందరు వ్యాపారులు వంట నూనెల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో వాటి ధరలు అమాంతం పెంచేశారు. నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా కిలో ధర 22 శాతం పెరిగింది. గత నెల 10న పొద్దుతిరుగుడు వంట నూనె లీటర్ ప్యాకెట్ రూ.140 నుంచి రూ.145 ఉండేది. 15 కిలోల డబ్బా రూ.2,200 వరకు విక్రయించేవారు. యుద్ధం ప్రారంభమైన రెండో వారం నుంచి లీటర్ ప్యాకెట్ ధర రూ.180కు చేరింది. 15 కిలోల డబ్బా రూ.2,700 నుంచి రూ.2,00కు పెరిగింది. పామాయిల్ లీటర్ ప్యాకెట్ రూ.130 నుంచి రూ.155కు ఎగబాకింది. జిల్లాలో రోజు ఆరు వేల లీటర్ల వంట నూనె అమ్మకాలు జరగుతాయి. పెంచి అమ్ముతున్న ధరల వల్ల వినియోగదారులపై రోజుకు రూ.70 వేలు అదనంగా భారం పడుతోంది. పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో మరో రూ.2అదనంగా వసూలు చేస్తున్నారు. చౌక దుకాణాల ద్వారా గతంలో రాయితీపై పామాయిల్ అందించేవారు. ప్రభుత్వం నూనె అందించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. యథేచ్ఛగా కల్తీ... ధరలు పెరగడంతో కల్తీ పెత్తనం చేస్తోంది. హోటళ్లు, బజ్జీ కొట్ల వారు తక్కువ ధరకు దొరికే కల్తీ నూనెను కొనుగోలు చేస్తున్నారు. పామాయిల్ నూనెను హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు, బజ్జీ కొట్ల నిర్వాహకులతో పాటు పేద, మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా వాడతాయి. మొక్కుబడిగా నియంత్రణ కమిటీలు.. నిత్యావసర వస్తువులను బ్లాక్ మార్కెట్కు తరలించినా, అధిక ధరలకు అమ్మినా మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ఉన్న నియంత్రణ కమిటీలు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. అవన్నీ మొక్కుబడిగా మారాయి. అధికారులు వీటిపై దృష్టి సారించడం లేదు. హోల్సేల్ వ్యాపారాలు, పెద్ద దుకాణాలను తనిఖీ చేస్తే ఎక్కువ ధరలకు అమ్మకుండా నియంత్రణలో ఉంటారు. ఇతర వస్తువులపై ప్రభావం పడకముందే యంత్రాంగం చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. కిలోకు రూ.20 నుంచి రూ.30వరకు పెరుగుదల సామాన్యులపై అదనపు భారం మార్కెట్లో యథేచ్ఛగా కల్తీ నూనెలు పట్టింపులేని అధికారులునూనె కొనడం భారంగా మారింది నెల రోజుల్లో రూ.20 నుంచి రూ.30 వరకు నూనె ధరలు పెరగడంతో కొనడం కష్టంగా ఉంది. ఇలా ధరలు పెరిగితే మాలాంటి పేదలు ఎలా కొనుగోలు చేస్తారు? ప్రభుత్వం ఆలోచన చేసి ధరలు తగ్గించాలి. –బాద నాగమణి, గృహిణిధరలు నియంత్రించాలి వంట నూనెల ధరలు తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నియంత్రించే యంత్రాంగం ఉన్నా వ్యాపారులు ఇష్టారీతిన పెంచుతున్నారు. వంట నూనెల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలి. –మధుకర్రావు, వెలికట్ట -
మానవాళి రక్షణకు యేసుక్రీస్తు ప్రాణత్యాగం
● సంగాల పాల్సన్ రాజ్ ధర్మసాగర్: ప్రపంచ మానవాళి రక్షణకు యేసుక్రీస్తు సిలువలో ప్రాణత్యాగం చేశారని క్రీస్తుజ్యోతి మినిస్ట్రీస్ కరుణాపురం ఫౌండర్, ప్రవక్త, రెవ.సంగాల పాల్సన్ రాజ్ అన్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురంలోని క్రీస్తుజ్యోతి మందిరంలో శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా సొసైటీ ఆఫ్ క్రైస్ట్ జనరల్ సెక్రటరీ రెవ.డాక్టర్ జయప్రకాశ్ గోపు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్సన్ రాజ్ మాట్లాడారు. యేసుక్రీస్తు సిలువ త్యాగం గొప్పదన్నారు. సిలువపై మరణించిన రోజు గంభీరమైన, నిరుపమానమైన ప్రేమకు నిదర్శనమని అన్నారు. సిలువలో యేసుక్రీస్తు పలికిన మొదటి మాటలో క్షమాపణ, రెండో మాట రక్షణ, మూడో మాట సంబంధం, నాల్గవ మాట వేదన, ఐదో మాట శరీర శ్రమ, ఆరవ మాట విజయం, ఏడో మాట సమర్పణ అని ఈ ఏడు మాటలు మానవాళి మార్గదర్శనమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్రదర్స్ పౌల్, ప్రదీప్, సందీప్, సత్యం, వినయ్, బెంజమిన్, యోసోఫ్ లు ఏడు మాటలపై వివరించారు. వేలాది భక్తులు పాల్గొన్నారు. -
లాభదాయకం.. కౌజు పిట్టల పెంపకం
● వ్యవసాయానికి అనుబంధంగా అనువైన పరిశ్రమ ● లాభాలు గడిస్తున్న రైతు దుగ్గొండి: మాంసాహార ప్రియులు కొత్త రుచులు ఆస్వాదిస్తున్నారు.. ఈక్రమంలో మటన్, చికెన్, చేపల స్థానంలో కౌజు పిట్టలు చేరుతున్నాయి. పోషకాలు పుష్కలంగా ఉండే కౌజు పిట్టల మాంసానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇదే కోవలో అభ్యుదయ రైతులు వ్యవయానికి అనుబంధంగా కౌజు పిట్టల పెంపకం చేపట్టి లాభాలు గడిస్తున్నారు. నేటి పరిస్థితులలో దినదినాభివృద్ధి చెందుతున్న చిన్నతరహా పరిశ్రమ కౌజు పిట్టల పెంపకం. వీటిని క్వయిల్ పక్షులని, జపనీస్ పక్షులని పిలుస్తారు. బాయిలర్ కోళ్లతో పోలిస్తే ఒక కోడిని పెంచే స్థలంలో 8నుంచి 10 పక్షులను పెంచవచ్చు. 4 వారాలు పెంచితే ఒక్కో పక్షి 150 నుంచి 180 గ్రాములకు బరువు తూగుతుంది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు బీరం శ్రీనివాసరెడ్డి తనకున్న 4 ఎకరాల వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ అనుబంధంగా ఇంటి వద్ద ఉన్న కొద్దిపాటి స్థలంలో కౌజు పిట్టలను పెంచుతున్నాడు. రూ.50 వేలు ఖర్చు చేసి షెడ్డు నిర్మించుకుని 800 కౌజు పిట్టలను పెంచుతున్నాడు. సాధారణ బాయిలర్ కోళ్లకు అందించే దానానే ఈ పిట్లలకు సైతం ఉపయోగిస్తున్నాడు. 40 రోజుల పెంపకం పూర్తి కాగానే జత పిట్టలను రూ.120కి విక్రయిస్తున్నాడు. ఒక్కో పిట్టను పెంచడానికి సుమారు రూ.30 ఖర్చు చేస్తున్నాడు. రెండు పిట్టలకు రూ.60 ఖర్చు పోగా రూ.60 లాభం పొందుతున్నాడు. 40 రోజుల్లో రూ.30 వేల నుంచి రూ.40 వేలు సంపాదిస్తున్నాడు. స్వయంగా ఇంక్యూబేటర్ల తయారీ కౌజు పిట్టలతోపాటు 100 నాటు కోళ్లను పెంచుతున్నాడు.. రైతు శ్రీనివాసరెడ్డి. కౌజు పిట్టల నుంచి సేకరించిన గుడ్లను ఇంక్యూబేటర్లో ఉంచి పిల్ల లను ఉత్పత్తి చేస్తున్నాడు. తనకు అవసరం ఉన్న పిల్లలను ఉంచుకుని మిగిలిన పిల్లలను ఒక్కో పి ల్లకు రూ.10 చొప్పున విక్రయిస్తూ లబ్ధిపొందుతున్నా డు. ఇందుకు గాను తానే స్వయంగా అతి తక్కువ ఖర్చుతో ఇంక్యూబేటర్ తయారు చేసుకున్నాడు. థర్మాకోల్ షీట్లు, రెండు విద్యుత్ బల్బులు, వేడిని కొలిచే యంత్రాలతో రూ.3 వేలు మాత్రమే ఖర్చు చేసి ఇంక్యూబేటర్ తయారు చేశాడు. ఇలా 8 ఇంక్యూబేటర్లు స్వయంగా తయారు చేసుకున్నాడు. కౌజు గుడ్లనుంచి రోజుకు 80 పిల్లలను ఉత్పిత్తి చేస్తున్నాడు. 18 రోజుల్లో గుడ్లనుంచి పిల్లలు ఉత్పత్తి అ వుతున్నాయి. ఇక నాటు కోడి గుడ్ల నుంచి 21 రోజు లకు పిల్లలు ఉత్పత్తి అవుతున్నాయి. నాటు కోడి పి ల్లలను ఒక్కోటి రూ.35 చిప్పున విక్రయించి అదన పు ఆదాయం గడిస్తున్నాడు. ఇలా వ్యవసాయానికి అనుబంధంగా శ్రీనివాసరెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగికి స రి సమానంగా నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేలు సంపాదిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. కుటీర పరిశ్రమలతో లాభాలు..ప్రస్తుతం వ్యవసాయం లాభసాటిగా లేదు. అలా అని వ్యవసాయాన్ని వదిలే పరిస్థితి లేదు. కావున వ్యవసాయానికి అనుబంధంగా చిన్న తరహా కుటీర పరిశ్రమలతో లాభాలు పొందవచ్చు. నేను కౌజు పిట్టలు, నాటు కోళ్ల పెంపకాన్ని గత నాలుగేళ్లుగా కొనసాగిస్తున్నాను. వ్యవసాయంలో యాసంగిలో మాత్రమే మొక్కజొన్న వేస్తున్నాను. నెలకు రూ.40వేల నుంచి రూ.50 వేల వరకు ఆదాయం పొందుతున్నాను. యువత మార్కెట్లో డిమాండ్ ఉన్న కౌజు పిట్టలు, నాటు కోళ్ల పెంపకంతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాలవైపు వస్తే ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. – బీరం శ్రీనివాసరెడ్డి, తిమ్మంపేట -
ఆన్లైన్ మూల్యాంకనం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల డిగ్రీ పరీక్షల జవాబుపత్రాలను ఇక నుంచి ఆన్లైన్లోనే వాల్యుయేషన్ చేయనున్నారు. జవాబు పత్రాలను స్కానింగ్ చేసి ఆన్లైన్లో వాల్యుయేషన్ ప్రక్రియ చేపట్టే పనులను ఓ సంస్థకు అప్పగించారు. ఇదిలా ఉండగా.. పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల జవాబుపత్రాల వాల్యుయేషన్ను ఇప్పటికే ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. కేయూ పరిధిలో త్వరలో నిర్వహించబోయే డిగ్రీ కోర్సుల 2, 4, 6 సెమిస్టర్ల పరీక్షలు, అలాగే మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ల పరీక్షల జవాబుపత్రాలను ఇక ఆన్లైన్ వాల్యుయేషన్ ప్రక్రియ చేపట్టాలని పరీక్షల విభాగం అధికారులు నిర్ణయించారు. ఈనెల 20నుంచి ఆయా పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు. ఎక్కడినుంచినైనా వాల్యుయేషన్.. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలల అధ్యాపకులు కాకతీయ యూనివర్సిటీలోని పరీక్షల విభాగానికి వచ్చి డిగ్రీ పరీక్షల జవాబుపత్రాలు వాల్యుయేషన్ చేసేవారు. అయితే దూరప్రాంతాల నుంచి ప్రధానంగా ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి అధ్యాపకులు రావడంలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవారే ఎక్కువగా మూల్యాంకనంలో పాల్గొంటున్నారు. మూల్యాంకనంలో పాల్గొన్నవారికి ఒక బుక్లెట్కు కొంత రెమ్యూనరేషనల్ చొప్పున చెల్లించడంతోపాటు టీఏ, డీఏ చెల్లిస్తున్నారు. ఇక నుంచి ఏ జిల్లాకు చెందిన అధ్యాపకులైనా ఎక్కడ నుంచైనా కంప్యూటర్ ద్వారా వాల్యుయేషన్ చేయొచ్చు. పరీక్షల విభాగం నుంచి సబ్జెక్టులవారీగా జవాబుపత్రాలను స్కాన్ చేసి సంబంధిత వెబ్సైట్లో పొందుపరుస్తారు. ఎగ్జామినర్లుకు పాస్వర్డ్ను అందజేస్తారు. ఓటీపీతో నిబంధనల ప్రకారం ఎన్ని పేపర్లు అందుబాటులో ఉంచాలో అన్ని పేపర్లు మాత్రమే అందుబాటులో ఉంచుతారు. తద్వారా ఎగ్జామినర్లు తమకు అనుకూలంగా ఉన్న ప్రదేశం నుంచే వాల్యుయేషన్ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. వాల్యుయేషన్ ఎలా కొనసాగుతుందో సబ్జెక్టులవారీగా నియామకమయ్యే చీఫ్ ఎగ్జామినర్లు ఆన్లైన్లోనే పర్యవేక్షిస్తారు. అన్ని పేజీలు చూస్తేనే సబ్మిట్ ప్రతీ సబ్జెక్టు బుక్ లెట్ 28 పేజీల వరకు కూడా ఉంటుంది. ఎగ్జామినర్ అన్ని పేజీలను చూసి మార్కులు వేస్తేనే సబ్మిట్ ఆప్షన్ వస్తుంది. ఒక పేజీ చూడకున్నా సబ్మిట్ కాదు. 3 నిమిషాల సమ యం గడిస్తే సబ్మిట్కు అవకాశం ఉంటుంది. మాన్యువల్ పద్ధతిలో ఒక ఎగ్జామినర్ వాల్యుయేషన్ చేసిన జవాబుపత్రాల్లో ఒకటి రెండు పేపర్లు సీఈ పరిశీలిస్తారు. ఇదే విధానం ఆన్లైన్లో కూడా కొనసాగించనున్నట్లు తెలిసింది. ఎగ్జామినర్లు తప్పులు చేస్తే చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. విద్యార్థికి వచ్చిన మొత్తం మార్కులు ఆన్లైన్లోనే అప్లోడు చేస్తారు. ఎగ్జామినర్లు వారికి అనుకూలంగా ఉన్న ప్రాంతం నుంచి వాల్యుయేషన్ చేస్తుండడంతో ఇక టీఏ, డీఏలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓ సంస్థకు స్కానింగ్ ప్రక్రియ అప్పగింత ఎక్కడినుంచైనా వాల్యుయేషన్కు అవకాశం ఈనెల 6 నుంచి అవగాహన సమావేశాలు జవాబుపత్రాల వాల్యుయేషన్లో అవకతవకలకు చోటులేకుండా ఉండేందుకు ఎగ్జామినర్ వినియోగించే కంప్యూటర్ లేదా ల్యాప్ట్యాప్కు వెబ్ కెమెరాను అమర్చుకోవాలనే నిబంధనలు విధించారు. తద్వారా ఎగ్జామినర్ కాకుండా ఇతరులు వాల్యుయేషన్ చేసే అవకాశం లేకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. అయితే ఎగ్జామినర్లు వెబ్ కెమెరా ఏర్పాటుకు అంగీకరిస్తారా.. లేదా అనేది వేచిచూడాలి. అధ్యాపకులకు అవగాహన సమావేశాలు కేయూ పరిధిలోని డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, ఎగ్జామినర్లకు ఆన్లైన్ వాల్యుయేషన్పై అవగాహన కల్పించేందుకు ఈనెల 6నుంచి 10వ తేదీ వరకు పరీక్షల విభాగం అధికారులు సమావేశాలు నిర్వహించనున్నారు. సంబంధిత జవాబు పత్రాలు స్కాన్చేసే సంస్థతోపాటు ఎక్స్పర్ట్స్ ఎలా వాల్యుయేషన్ చేయాలో నిబంధనలను ఎగ్జామినర్లకు వివరించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ తెలిపారు. ఈ నెల 6న ఉమ్మడి ఖమ్మం జిల్లా కళాశాలల అధ్యాపకులకు ఖమ్మం పీజీ కళాశాలలో, ఈనెల 7న ఉమ్మడి వరంగల్ జిల్లా కళాశాలల అధ్యాపకులకు యూనివర్సిటీలోని ఆడిటోరియంలో, 8న మంచిర్యాల, 10న నిర్మల్, ఆదిలాబాద్ కేంద్రాల్లో అధ్యాపకులకు అవగాహన సమావేశాలు నిర్వహించనున్నారు. ఈమేరకు ఇప్పటికే అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశిస్తూ పరీక్షల విభాగం అధికారులు లేఖలను పంపారు. అంతేగాకుండా ప్రతి కళాశాలనుంచి సబ్జెక్టులవారీగా అధ్యాపకుల వివరాలను పరీక్షల విభాగానికి పంపాలని కోరినట్లు సమాచారం. నూతన విధానంలో కేయూ డిగ్రీ జవాబుపత్రాల వాల్యుయేషన్ -
సత్యమార్గంలో నడవాలి
మహబూబాబాద్ రూరల్: ప్రజల రక్షణ కోసం యేసుక్రీస్తు సిలువ వేయబడ్డారని, క్రీస్తు చూపిన సత్యమార్గంలో నడవాలని వరంగల్ మేత్రాసనం పాలనాధికారి ఫాదర్ డి.విజయ్పాల్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్లోని ఫాతిమమాత దేవాలయం ఆధ్వర్యంలో గుడ్ఫ్రైడేను పురస్కరించుకుని పరిశుద్ధ మహా సిలువ యాత్ర కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఫాదర్ డి.విజయ్పాల్రెడ్డి హాజరై ప్రసంగించారు. పవిత్ర శుక్రవారం యేసుక్రీస్తు సిలువ వేయబడిన రోజుగా జరుపుకుంటామన్నారు. సిలువ నుంచి కారిన రక్తంతో ప్రజల పాపాలన్నీ కడిగివేయబడ్డాయని తెలిపారు. ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. మొదటగా ఫాతిమా కమ్యూనిటీ హాల్ను ఫాదర్ దుగ్గింపుడి విజయ్ పాల్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఫాతిమామాత దేవాలయ విచారణ గురువు ఫాదర్ వట్టి సైమన్ రెడ్డి, శనిగపురం ఏసుగుట్ట గురువులు ఫాదర్ పాల్ రాజ్, ఫాదర్ పీటర్, ఫాదర్ జోసెఫ్, ఫాదర్ క్రీస్తు, కేసముద్రం చర్చి విచారణ గురువు ఫాదర్ శ్రావణ్, క్రీస్తు ఆరాధకులు పాల్గొన్నారు. వరంగల్ మేత్రాసనం పాలనాధికారి విజయ్పాల్రెడ్డి -
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు
స్టేషన్ఘన్పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ రైల్వేస్టేషన్ వద్ద గురువారం మధ్యాహ్నం గంజాయి తరలిస్తున్న ఒరిస్సాకు చెందిన సత్యరంజన్ బారెల్, దీప్తి మాయిస్వైన్లకు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ట్రెయినీ ఐపీఎస్ మనీషానెహ్రా తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మనీషానెహ్రా వివరాలు వెల్లడించారు. స్థానిక రైల్వేస్టేషన్ వద్ద ఎస్సై రాజేష్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా సత్యరంజన్, దీప్తి ఇద్దరు ఐదు బ్యాగులతో అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా పట్టుకుని తనిఖీ చేశారు. దీంతో వారి వద్ద 46.4 కిలోల గంజాయి లభించగా స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ నుంచి ముంబైలోని దాదర్కి రైలులో తరలించి విక్రయించేందుకు వెళ్తున్నట్లు నిందితులు అంగీకరించారు. నిందితుల వద్ద గంజాయితోపాటు రెండు మొబైల్ ఫోన్లు, రూ.2,690, రైలు టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ట్రెయినీ ఐపీఎస్ తెలిపారు. సమావేశంలో సీఐ వేణు, ఎస్సై రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
బండికి.. దండిగా!
శనివారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ఓరుగల్లు రైల్వేకు నిధుల వరద దొడ్డి కొమురయ్య స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి ● అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో మహబూబాబాద్: దొడ్డి కొమురయ్య స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్, అధికారులు దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన త్యాగాలు చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాసరావు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి రహిత గ్రామంగా తీర్చిదిద్దుకోవాలినెల్లికుదురు: గంజాయి రహిత గ్రామంగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత గ్రామస్తులందరిపై ఉందని ఎస్పీ శబరీష్ అన్నారు. మండలంలోని రామన్నగూడెం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన మన గ్రామం–మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా దాతల సహకారంతో అందించిన హెల్మెట్లను ఎస్పీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ వాహనదారుడు హెల్మెట్ కొనుగోలు చేయడమే కాదు.. వాహనంపై వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. గ్రామస్తులంతా ఏకతాటిపై ఉంటూ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తి చేసుకోవాలన్నారు. గంజాయి రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతీ ఒక్కరు శ్రమించాలన్నారు. మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు, కేసముద్రం సీఐ సత్యనారాయణ, ఎస్సై చిర్ర రమేష్ బాబు, సర్పంచ్ బండి శ్రీనివాస్ ఉన్నారు. పీఆర్ ఈఈ విద్యాసాగర్ సరెండర్ మహబూబాబాద్: పంచాయతీరాజ్ శాఖ ఈఈ విద్యాసాగర్ను కలెక్టర్ స్నేహ శబరీష్ పీఆర్ఆర్డీ కార్యాలయానికి సరెండర్ చేశారు. వెంటనే ఆ కార్యాలయంలో పని చేస్తున్న డీఈ టెక్నికల్ ఆదిత్యరాజ్కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు ఆయన బాధ్యతలు చేపట్టారు. గత ఆర్థిక సంవత్సరం ఉపాధి హామీ నిధులు రూ.49 కోట్లు కేటాయించగా మార్చి 31వరకు అందులో రూ 4.50 కోట్లు మిగలడంతో కలెక్టర్ ఈఈని సరెండర్ చేసినట్లు సమాచారం. జనాభా గణాంకాలు కీలకం మహబూబాబాద్: ప్రభుత్వ అభివృద్ధి–సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు, ప్రణాళికలు రూపొందించడానికి జనాభా గణాంకాలు కీలకమని జనాభా లెక్కల శాఖ డైరెక్టర్ భారతి హోలికేరి అన్నారు. కలెక్టరేట్లో మాస్టర్ శిక్షణ అధికారులకు జనాభా గణనపై శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో అధికారులు పక్కాగా సర్వే నిర్వహించి జనాభా గణన చేయాలన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సాక్షిప్రతినిధి, వరంగల్: దక్షిణ మధ్య రైల్వే పరిధి ఉమ్మడి వరంగల్ జిల్లాకు భారీగా నిధులు కేటాయించారు. 2026–27 రైల్వే బడ్జెట్ (పింక్ బుక్)లో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ ప్రాంతాలకు భారీగా నిధులు, ప్రాజెక్టులు కేటాయించారు. ముఖ్యంగా రైల్వే మౌలిక సదుపాయాల కల్పన, క్వాడ్రప్లింగ్ (నాలుగు లైన్లు), సర్వేలు, నిర్మాణంలో ఉన్న మూడో లైన్ పూర్తి, స్టేషన్ల ఆధునికీకరణకు ఈ బడ్జెట్ పెద్దపీట వేసింది. దక్షిణ మధ్య రైల్వేశాఖ కేటాయింపులతో కూడిన పింక్బుక్ శుక్రవారం విడుదల కాగా, అధిక నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తమవుతోంది. కొత్త లైన్లు, డబ్లింగ్ పనులు.. భారీగా నిధులు ఉమ్మడి వరంగల్ మీదుగా వెళ్లే ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు నిధుల కేటాయింపు జరిగింది. కొత్త లైన్లు, డబ్లింగ్, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. ● కాజీపేట–విజయవాడ మధ్య 219.64 కి.మీ.పొడవైన మూడో లైన్, విద్యుద్దీకరణ పనుల కోసం రూ.1,955.27 కోట్లు మంజూరు చేశారు. ● కాజీపేట–బల్లార్షా వరకు 201.04 కి.మీ. పొడవైన మూడో లైన్ పనులకు రూ.2,063.03 కోట్లు ఇచ్చారు. ● నష్కల్ (పెండ్యాల) – హసన్పర్తి నడుమ 24.55 కి.మీ. బైపాస్ లైన్ నిర్మాణానికి రూ.465.29 కోట్లు మంజూరయ్యాయి. ● భద్రాచలం రోడ్ – డోర్నకల్ వరకు 54.65 కి.మీ సెక్షన్ పనుల కోసం రూ.770.12 కోట్లు కేటాయించారు. ● కాజీపేట – బల్లార్షా మెయిన్ లైన్ను పెద్దపల్లి–కరీంనగర్ లైన్తో అనుసంధానించే 2.169 కి.మీ. బైపాస్ లైన్ కోసం రూ.36.99 కోట్లు కేటాయించారు. ● ఘన్పూర్–సూర్యాపేట (పాలకుర్తి మీదుగా) 170 కి.మీ. కొత్త లైన్ సర్వేకు నిధులిచ్చారు. ● బీజాపూర్–వరంగల్కు 288 కి.మీ.ల కొత్త లైన్ కోసం సర్వేకు కూడా అనుమతి ఇచ్చారు. ● క్వాడ్రప్లింగ్ (నాలుగు లైన్ల) సర్వేలకు కూడా నిధులు ఇచ్చారు. రైల్వేస్టేషన్లకు ‘అమృత్ భారత్’ హంగులు ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’ కింద ప్రధాన స్టేషన్ల అభివృద్ధికి నిధులు కేటాయించారు. ఇందులో భాగంగా.. వరంగల్ స్టేషన్ తూర్పు వైపు ఎంట్రీ అభివృద్ధి, బుకింగ్ ఏరియా, కాన్ కోర్స్ మెరుగుదల కోసం రూ.4.50 కోట్లిచ్చారు. వరంగల్ స్టేషన్లో 12 మీటర్ల వెడల్పు గల కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్ఓబీ) కోసం రూ. 13.24 కోట్లు, కాజీపేట స్టేషన్ ఆధునికీకరణకు రూ.18.73 కోట్లు (జనగామ, యాదాద్రితో కలిపి) కేటాయించారు. కాజీపేటలో 12 మీటర్ల వెడల్పు గల ఎఫ్ఓబీ కోసం రూ.9.78 కోట్లు, ప్లాట్ఫామ్ 4–5 వరకు ఎఫ్ఓబీ విస్తరణ, లిఫ్టులు, ఎస్కలేటర్ల కోసం రూ.13.93 కోట్లు మంజూరు చేసినట్లు పింక్బుక్లో పేర్కొన్నారు. మహబూబాబాద్ – జనగామ స్టేషన్లలో 12 మీటర్ల వెడల్పు గల ఎఫ్ఓబీలు, ర్యాంప్ల నిర్మాణం కోసం రూ.44.34 కోట్లు, జనగామ గూడ్స్ షెడ్ సౌకర్యాల మెరుగుదలకు రూ. 6.24 కోట్లు ఇచ్చారు. అలాగే భద్రత పనుల కింద వరంగల్ – చింతలపల్లి లెవల్ క్రాసింగ్ 63 ఏ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.25.58 కోట్లు, కాజీపేట – వరంగల్ ఎల్సీ 61 వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి కోసం రూ. 24.65 కోట్లు, రఘునాథపల్లి – ఇప్పగూడ ఎల్సీ 44 వద్ద 2–లేన్ రైల్వే ఓవర్ బ్రిడ్జి, సబ్వే కోసం రూ.12.83 కోట్లు, డోర్నకల్ – మణుగూరు మార్గంలో కారేపల్లి – సింగరేణి కొలీరీస్ మధ్య వివిధ లెవల్ క్రాసింగ్ల వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టనున్నట్లు పింక్బుక్లో పేర్కొన్నారు. నీళ్లు లేక ఎండిపోతున్న వరిపొలాన్ని పరిశీలిస్తున్న అధికారులు, రైతులుగార్ల సమీపంలో అడుగంటిన పాకాల ఏరుగార్ల: పాకాల ఏరు అడుగంటింది. నీళ్లు లేక బండలు తేలి ఎండిపోయి కనిపిస్తోంది. దీంతో పరీవాహక ప్రాంతంలో సాగు చేసిన వరి పంటలు ఎండిపోతున్నాయి. కాగా పాకాల ఏటిలోకి ఎస్సారెస్పీ లేదా నర్సంపేట సమీపంలోని పాకాల చెరువు జలాలను వదిలి తమ పంటలను కాపాడాలని గార్ల, బయ్యారం, డోర్నకల్ మండలాల రైతులు కోరుతున్నారు. డిసెంబర్లో సమృద్ధిగా నీరు.. డిసెంబర్లో పాకాల ఏటిలో నీరు సమృద్ధిగా ఉండడంతో గార్ల, బయ్యారం, డోర్నకల్ మండలాల పరిధిలోని పరీవాహక ప్రాంత ఆయకట్టు రైతులు 2వేల ఎకరాల్లో వరిపంట సాగు చేశారు. మరో నెల రోజుల్లో పంట చేతికొస్తుంది. ఈక్రమంలో పాకాల ఏటిలో నీళ్లు అడుగంటిపోవడంతో రైతులు ఆందో ళన చెందుతున్నారు. ఇప్పటికే వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి వరిపంట సాగు చేశామని, పైరు ఎండిపోతుందేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సారెస్పీ లేదా నర్సంపేట సమీపంలోని పాకాల చెరువు నీటినైనా పాకాల ఏటిలోకి వదిలిపెట్టాలని కోరుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత జిల్లా ఇరిగేషన్ అధికారులు స్పందించి ఎస్సారెస్పీ నీటిని పాకాల ఏటికి మళ్లించేలా చర్యలు చేపట్టి తమ పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.పాకాల ఏరు ఎండిపోతోంది.. పాకాల ఏటి పరీవాహక ప్రాంతంలో నాకున్న 6 ఎకరాల్లో వరిపంట సాగు చేశాను. ప్రస్తుతం ఏటిలో నీళ్లులేక ఎండిపోయే దశకు చేరింది. జిల్లా ఇరిగేషన్ అధికారులు స్పందించి ఎస్సారెస్పీ నీళ్లు పాకాల ఏటిలోకి విడుదల చేయాలి. లేకపోతే వరి పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. – పి.సంజీవరెడ్డి, రైతు, గార్ల వరి పంటలను కాపాడాలి..గార్ల సమీపంలోని పాకాల ఏరు నీరు లేక అడుగంటి పోయింది. నర్సంపేట సమీపంలోని పాకాల చెరువు నీటిని విడుదల చేసి ఈ ప్రాంతంలో సాగుచేసిన వరిపంటలను కాపాడేందుకు జిల్లా ఇరిగేషన్ అధికారులు స్పందించాలి. – ఏనుగంటి మల్లేశం, రైతు, గార్లలైన్ కి.మీ నిధులు భూపాలపల్లి–కాజీపేట (హసన్పర్తి) 64 1.60 హసన్పర్తి–కరీంనగర్ 62 1.55 డోర్నకల్–గద్వాల (సూర్యాపేట, నల్లగొండ మీదుగా) 296 7.40 కాజీపేట–సికింద్రాబాద్ 120 2.40 కాజీపేట–విజయవాడ 220 4.40 కాజీపేట–బల్లార్షా 234 4.68 వరంగల్–సికింద్రాబాద్ 38 0.75 కాజీపేట–విజయవాడ మూడో లైన్కు రూ.1,955 కోట్లు కాజీపేట–బల్లార్షాకు రూ.2,063 కోట్లు నష్కల్–హసన్పర్తికి రూ.465.29 కోట్లు క్వాడ్రప్లింగ్, కొత్త రైల్వే సర్వేల కోసం కేటాయింపులు కాజీపేట జంక్షన్ నుంచే పలు మార్గాలు పీఓహెచ్కు రూ.521.36 కోట్లు.. ‘అమృత్ భారత్’ కింద స్టేషన్లకు కొత్త హంగులు 2026–27 రైల్వే బడ్జెట్ (పింక్బుక్)లో భారీగా నిధులు నీరులేక బండలు తేలిన పాకాల ఏరు వరి పంటలకు అందని నీరు ఆందోళన చెందుతున్న రైతాంగం ఎస్సారెస్పీ లేదా పాకాల చెరువు జలాలు వదలాలని విజ్ఞప్తి -
కాజీపేట పీఓహెచ్కు రూ.521 కోట్లు
రైల్వే బడ్జెట్ (పింక్ బుక్)లో కాజీపేటను కీలక మెయింటెనెన్స్ హబ్గా మార్చేందుకు పెద్దపీట వేశారు. కాజీపేట పీరియాడికల్ ఓవరాలింగ్ (పీఓహెచ్) వర్క్ షాప్ కోసం రూ. 521.36 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కాజీపేటలో 24–కోచ్ల నిడివి గల క్యాంటెక్ డిజైన్ పిట్ లైన్ల కోసం రూ.17.81 కోట్లు ఇచ్చారు. కాజీపేట డీజిల్ లోకో షెడ్ సామర్థ్యం పెంపు (ఎలక్ట్రిక్ లోకోలను ఉంచేందుకు) కోసం రూ.30.95 కోట్లు, ఎలక్ట్రిక్ లోకో షెడ్ సామర్థ్యం పెంపు (125 నుంచి 175 లోకోలకు) రూ. 21.68 కోట్లు, ఎలక్ట్రిక్ లోకో షెడ్ విస్తరణ (175 నుంచి 300 లోకోలకు)కు రూ. 22.56 కోట్లు చొప్పున కేటాయించారు. -
తల్లీ కూతుళ్ల మృతిపై భిన్నకోణాల్లో దర్యాప్తు
ఐనవోలు: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని పున్నేలు శివారు స్విమ్మింగ్ పూల్లో పడి తల్లీకూతుళ్లు మృతి చెందిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కేవలం అబార్షన్కు ఒప్పుకోకపోవడంతోనే భర్త అజారుద్దీన్ హత్యకు పాల్పడి ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగా చిత్రీకరించాడా.. లేదా.. మరేదైనా హత్యకు దారితీశాయా అనే కోణంలో కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. అజారుద్దీన్ భార్యతోపాటు తమ్ముడి భార్య కూడా ఇటీవల గర్భవతి కాగా వారికి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించినట్లు సమాచారం. అయితే అజారుద్దీన్ భార్యకు ఆడపిల్ల, తమ్ముడి భార్యకు మగ పిల్లాడుగా తెలియడంతో అదే రోజు కుటుంబంలో చర్చ జరిగిందని, అక్కడే అజారుద్దీన్ భార్యకు గర్భం తొలగించాలని పట్టుపట్టి చివరికి ఆమె వినకపోవడంతో ప్లాన్ ప్రకారం హతమార్చాడని పోలీసులు భావిస్తున్నారు. అసలు గర్భధారణ సమయంలో లింగ నిర్ధారణ వీరికి ఎలా తెలుస్తోంది.. ఇంతకుముందు రెండుసార్లు ఎక్కడ అబార్షన్ చేయించారు. సహకరించేది ఎవరు అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ప్లాన్ ప్రకారం చేసిన హత్యగా ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు భార్య, కూతుర్లను అజారుద్దీన్ ఏవిధంగా హతమార్చి ఉంటాడో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నట్లు సమాచారం. నిందితుడితోపాటు ఆయన తల్లిదండ్రులు, తమ్ముడిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతుండగా మరి కొంతమందిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. పాపం.. పసి పిల్లలు తల్లి, కూతుర్ల మృతిలో ముక్కుపచ్చలారని పసి పిల్లలు చేసిన తప్పేంటని అభం శుభం తెలియని పసి పిల్లలు బలయ్యారంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. గ్రామంలో స్థితి మంతమైన కుటుంబం కావడంతో పసి పిల్లల సంరక్షణకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవని, చలాకీగా ఉండే అమాయక పసిపిల్లలు మృతిచెందారనే అంశం అటు వారు చదివే పాఠశాలలోనూ. ఇటు గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రేరేపించిన అంశాలపై పోలీసుల ఆరా -
మాజీ మావోలు బూర్జువా పార్టీలతో కలవొద్దు
న్యూశాయంపేట: ఇటీవల లొంగిపోయిన మాజీ మావోయిస్టులు బూర్జువా పార్టీలతో కలవొద్దని, వారంతా వామపక్ష ఉద్యమంలో భాగం కావాలని సీపీఐ పార్టీ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కే.నారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండకు వచ్చిన ఆయన బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 40 ఏళ్ల పాటు వారి జీవితాలను త్యాగం చేశారని అలాంటి వారికి సరైన స్వేచ్ఛ, గౌరవాన్ని ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. గౌరవంగా, ప్రజాస్వామ్య బద్ధంగా ఉండటానికి సీపీఐ వారికి అండగా ఉంటుందని చెప్పారు. నక్సలైట్లను జనజీవన స్రవంతిలో కలవాలని మొదట కోరింది తమ పార్టీనే అన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో హిడ్మాలాంటి నక్సలైట్లను వందల మందిని ప్రభుత్వం ఎన్కౌంటర్ చేయిందని ఆరోపించారు. ఇటీవల పార్లమెంట్లో కేంద్ర మంత్రి అమిత్షా కమ్యూనిస్టులు, మావోయిస్టులపై తన అక్కసును వెల్లగక్కారాని అన్నారు. గద్దర్ను నక్సలైట్ అన్నారని, అదే గద్దర్ చనిపోతే ప్రధాని మోదీ సంతాప లేఖను పంపారని గుర్తుచేశారు. కేంద్రం చేపట్టిన ఎస్ఐఆర్ను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇటీవల క్రిష్టియన్ మతంతో చేరితే ఎస్సీ కులం హోదా రద్దు అవుతుందని వచ్చిన తీర్పు సరికాదని, ఏ మతంలో చేరినా మనిషి కులం ఎన్నటికీ మారదన్నారు. దేశంలో ఫెడరల్ వ్యవస్థను కేంద్రం ధ్వంసం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై క్రమంగా అసంతృప్తి పెరుగుతుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్రావు, కే.భిక్షపతి, కరుణాకర్, లింగారెడ్డి, వెంకట్రాజం, జ్యోతి, స్టాలిన్, టీ.భిక్షపతి, భిక్షపతి, రాజమౌళి, శ్రీనివాస్, రవి, సాదానందం పాల్గొన్నారు. సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ -
ఇంటి స్థలం పంపకాల్లో ఘర్షణ
మహబూబాబాద్ రూరల్ : ఇంటి స్థలం పంపకాల్లో తలెత్తిన ఘర్షణ కారణంగా మనస్తాపానికి గురైన ఓ యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ మండలంలోని బలరాం తండా గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బలరాం తండా గ్రామానికి చెందిన పెద్దపులి ఫకీర, బుల్లి కుటుంబానికి అతడి తమ్ముడు పెద్దపులి రవి, బుజ్జి కుటుంబానికి మధ్య ఇంటి స్థలం విషయంలో కొద్దిరోజుల క్రితం ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో పెద్దపులి రవి, బుజ్జి దంపతుల పెద్ద కుమారుడు రాజేష్ (21) ని అతడి పెద్దమ్మ పెద్దనాన్న బుల్లి, ఫకీర, సోదరీ సరిత తిట్టారు. దీంతో మనస్తాపానికి గురైన రాజేష్ గురువారం సాయంత్రం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. ఈ విషయంపై రూరల్ ఎస్సై దీపికను వివరణ కోరగా మృతుడి తల్లి బుజ్జి వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని తెలిపారు. గడ్డి మందు తాగి యువకుడి ఆత్మహత్య -
సమస్యల పరిష్కారానికి గ్రామసభ
● కలెక్టర్ స్నేహ శబరీష్ ఇనుగుర్తి: క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారానికి గ్రామ సభ బలమైన వేదిక అని కలెక్టర్ స్నేహ శబ రీష్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భా గంగా సర్పంచ్ తమ్మడవల్లి కుమార్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పఽథకాలు అర్హులకు చేరేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామ స్థాయిలోనే సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యసదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తు న్నట్లు తెలిపారు.రైతు భరోసా, గృహ జ్యోతి, మహా లక్ష్మి వంటి పఽథకాలు ప్రజలకు చేరేలా అధికారులు కృషి చేస్తున్నారన్నారు. వాణిజ్య పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని, ఆయిల్ పామ్ సాగు లాభదాయకంగా ఉందన్నారు. అంతర పంటల సాగుతో రైతులకు అధిక దిగుబడులు వస్తాయని తెలిపారు. నానో యూరియాపై ప్రత్యేక దృష్టి పెట్టి క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ పార్థసారథి, ఎంఈఓ రూపారాణి, దిశ కమిటీ మెంబర్ గుజ్జునూరి బాబురావు, వివిధ శాఖల అధికా రులు పాల్గొన్నారు. -
ప్రాణరక్షణ కోసమే హెల్మెట్
● ఎస్పీ శబరీష్ కేసముద్రం: వాహనాదారులు తమ ప్రాణ రక్షణ కోసం హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఎస్పీ శబరీష్ అన్నారు. గురువారం మండలంలోని వెంకటగిరి గ్రామంలో నిర్వహించిన మన గ్రామం–మన బాధ్యత కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. పోలీసుల పిలుపు మేరకు గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్దలు ముందుకు రావ డం, ద్విచక్రవాహనాలు కలిగిన వారంతా హెల్మెట్లు కొనుగోలు చేయడం సంతోషకరమన్నారు. అదే విధంగా గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, గంజాయి రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఆయన అన్నారు. డీఎస్పీ తిరుపతిరావు, సీఐ సత్యనారాయణ, ఎస్సైలు క్రాంతికిరణ్, నరేష్, గ్రామ సర్పంచ్ భూక్య జ్యోతి, పవన్, ఉపసర్పంచ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. శాంతియుత వాతావరణంలో ముందుకు సాగాలి కురవి: ప్రజలంతా శాంతియుత వాతావరణంలో ముందుకు సాగాలని, హెల్మెట్ తమ శరీరంలో అంతర్భాగం కావాలని ఎస్పీ శబరీష్ సూచించారు. గురువారం మండలంలోని తిర్మలాపురం గ్రామ సర్పంచ్ కనకటి అచ్చమ్మ ఆధ్వర్యంలో హెల్మెట్ లేకుంటే తమ గ్రామంలోకి నో ఎంట్రీ అంటూ ఫ్లెక్సీలతో తయారు చేసిన ముఖద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తీర్మానం చేయడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, గంజాయి, డ్రగ్స్ వంటివాటిని గ్రామంలోకి రానివ్వమని చెప్పడం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, సీఐ అంజలి, ఎస్సై గండ్రాతి సతీష్, గ్రామ పాలకమండలి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
గడ్డి మందు బ్యాన్
శుక్రవారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సాక్షి, మహబూబాబాద్: ప్రతీ రైతు ఇంట్లో గడ్డి మందు ఉండటం సహజం. అయితే అప్పుల బాధలు, ఇంట్లో చిన్న చిన్న గొడవలు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలతో క్షణికావేశంలో గడ్డి మందు తాగితే అంతే సంగతులు. ప్రాణా లపై ఆశలు వదలుకోవాల్సిందే. లక్షల రూపాయలు ఖర్చుచేసినా.. ఫలితం ఉండదు. ఈ మహమ్మారితో ప్రాణాలు పోవడమే కాదు.. కుటుంబం కూడా లక్షల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిన సంఘటనలు జిల్లాలో కోకొల్లలు. ఈ విషయాలను వివరిస్తూ ‘సాక్షి’ దినపత్రికలో గత ఏడాది నవంబర్ నుంచి వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. వీటిపై ప్రజాప్రతినిధుల స్పందన, ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమేయంతో ఎట్టకేలకు గడ్డి మందు అమ్మకాలను బ్యాన్ చేస్తున్నట్లు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరణించిన వారు.. జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో పురుగుల మందు తాగుతున్న వారే అధికం. ఐదేళ్లలో 905 మంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో 800మందికి పైగా గ్లైఫోసెట్, పండిమిథాలిన్, ప్రిటిల్లాక్లోర్, నామినీ గోల్డ్, ఆల్మిక్స్ వంటి గడ్డి మందులు తాగిన ఘట నలు ఉన్నాయి. గడ్డిమందు తాగిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. చనిపోయే వరకు మాట్లాడుతూ ఉంటారు. దీంతో కుటుంబ సభ్యులు పేషెంట్ను బతికించుకునేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేసి, ఆస్తులు అమ్ముకొని అప్పుల పాలైనా ప్రాణాలు కాపాడలేని సంఘటనలు ఉన్నాయి. ఇంతటి ప్రమాదకరమైన ఈ గడ్డి మందు రైతుల ఇళ్లలో ఎక్కడ పడితే అక్కడ పెట్టడం.. ఫర్టిలైజర్ షాపు యజమానులు ఎవరికి పడితే వారికి విక్రయాలు జరపడంతో అందుబాటులో ఉంటుంది. ఆవేశంతో మందు తాగి ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ మందు ప్రభావంతో పంటలు కూడా విషతుల్యం అవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అధికంగా గడ్డి మందు వినియోగించి పండించిన పంటలు తింటే క్యాన్సర్ వంటి వ్యాధుల వారిన పడే అవకా శం ఉందని అంటున్నారు. ఇంతటి ప్రమాదకరమైన గడ్డి మ ందు విక్రయాలే కాదు.. త యారీనే నిషేధించా లని ప్రజా సంఘాలు, డాక్టర్లు కో రారు. అసెంబ్లీలో చర్చ.. వ్యవసాయమే ఆధారంగా జీవించే వారు అధికంగా ఉన్న మహబూబాబాద్ వంటి జిల్లాలో ఆత్మహత్యలు చేసుకునే వారిలో.. అత్యధికంగా గడ్డి మందు తాగిన వారు ఉన్నారు. ఈ విషయంపై మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ అసెంబ్లీలో వివరించారు. అంతటితో ఆగకుండా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతోపాటు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా గడ్డి మందు మరణాల విషయం తీసుకెళ్లారు. దీంతో స్పందించిన సీఎం, మంత్రులతోపాటు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు గడ్డి మందు నిషేఽధించాలనిమక్తకంఠంతో చెప్పారు. దీంతో ఎట్టకేలకు గడ్డి మందు పారాక్వాట్ డైక్లోరైడ్ అమ్మకాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘సాక్షి’ వరుస కథనాలపై అసెంబ్లీలో చర్చపెట్టిన ఎమ్మెల్యేలు పారాక్వాట్ అమ్మకాలను నిషేధించాలని ఆరోగ్యశాఖ మంత్రికి వినతి చలించిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల అసెంబ్లీలో తీర్మానం, రాష్ట్రంలో అమ్మవద్దని ఆదేశాలు హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజలు సంవత్సరాలు మృతుల సంఖ్య 14 10 14–18 69 19–30 382 31–45 426 46–60 283 60 కిపైగా 97 -
గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు
● జీజీహెచ్లో ప్రత్యేక హెల్ప్డెస్క్ ప్రారంభం నెహ్రూసెంటర్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జీజీహెచ్లో ప్రత్యేక హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్ఓ రవిరాథోడ్, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. జీజీహెచ్లో గురువారం ప్రత్యేక హెల్ప్డెస్క్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆస్పత్రికి వచ్చిన గర్భిణులకు అవసరమైన సూచనలు, పరీక్షలు, వైద్య సేవలపై సమాచారం అందించడమే హెల్ప్డెస్క్ ప్రధాన లక్ష్యమన్నారు. హెల్ప్డెస్క్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని, 79931 54429 నంబర్ సంప్రదించి సమాచారం పొందవచ్చన్నారు. 102 అంబులెన్స్ సేవలు అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులు, తల్లిశిశువుకు సహాయం అందజేస్తుందని పేర్కొన్నారు. గర్భిణులు సురక్షిత ప్రసవం కోసం సేవలను వినియోగించుకోలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అఽఽధికారి సారంగం, ఆర్ఎంఓ డాక్టర్ జగదీశ్వర్, డాక్టర్ రాధిక, శశిజోత్స్న, డాక్టర్ సంజయ్, మీడియా అధికారి కొప్పు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బాబు జగ్జీవన్రామ్ జయంతి నిర్వహించాలి మహబూబాబాద్ అర్బన్: భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబుజగ్జీవన్ రామ్ జయంతి పండుగలా జరుపుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులా ల అభివృద్ధిశాఖ అధికారి కె. శ్రీని వాస్రావు గురువారం తెలిపారు. ఈనెల 5న ఉయదం 9గంటలకు జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ పాలబజార్ సమీపంలో బాబుజగ్జీవన్రామ్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పి ంచాలని, సభావేదిక కలెక్టర్ కార్యాలయంలో ఉంటుందని, అన్ని కుల సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులు, అధికారులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కొరారు. దళిత కాలనీలో గ్రామసభకురవి: గ్రామం ఆవిర్భవించి సుమారు 40 ఏళ్లు కావొస్తుంది.. సాధారణంగా గ్రామసభలు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జరుగుతుంటాయి.. అందుకు భిన్నంగా మండలంలోని కొత్తూరు(సీ)లో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం గ్రామసభ దళితకాలనీలో జరగడం విశేషం. కొత్తూరు(సీ) సర్పంచ్గా గిరిజన మహిళ బాదావత్ చిన్ని విజయం సాధించిన తర్వాత ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామసభను దళిత కాలనీలో నిర్వహించి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. దళిత కాలనీలో జరిగిన గ్రామసభకు అధికారులు హాజరయ్యారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను పంచాయతీ కార్యదర్శి అశోక్ చదివి వినిపించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిన్ని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలను ప్రజలకు అందిస్తామని, గ్రామాన్ని ప్లాస్టిక్రహిత గ్రామంగా తయారు చేయాలని, ప్లాస్టిక్ను నిషేధిస్తున్నట్లు తీర్మానం చేశారు. అంగన్వాడీ సిబ్బంది శ్రీదేవి, ద్రౌపది, ఏఎన్ఎం జ్యోతి, లైన్మెన్ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నేడు కేయూలో దొడ్డి కొమురయ్య జయంతి కేయూ క్యాంపస్: తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 99వ జయంతిని శుక్రవారం కాకతీయ యూనివర్సిటీలోని పరిపాలన భనంలో నిర్వహించనున్నట్లు బీసీ సెల్ డైరెక్టర్ డాక్టర్ బొడిగ సతీశ్ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం, పాలకమండలి సభ్యులు పాల్గొంటారని పేర్కొన్నారు. -
మొబైల్ వ్యసనాన్ని తగ్గించుకోవాలి
హన్మకొండ: విద్యార్థులు మొబైల్ వ్యసనాన్ని తగ్గించుకోవాలని ఎస్బీఐ వరంగల్ రీజినల్ మేనజర్ అ బ్దుల్ రహీం షేక్ అన్నారు. హనుమకొండ నయీంనగర్లోని వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాలలో ఎంబీఏ విద్యార్థులకు మంత్ర 2కే26 జాతీయస్థాయి సద స్సు గురువారం నిర్వహించారు. ఎంబీఏ డైరెక్టర్ ప్రొఫెసర్ కృష్ణమాచార్య అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు. విద్యార్థులు విషయ పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. కేయూ ప్రొఫెసర్ వరలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు కార్పొరేట్ అవసరాలకు తగ్గట్టుగా మైండ్ సెట్ మార్చుకోవాలని సూచించారు. ప్రొఫెసర్ అమరవేణి మాట్లాడుతూ ఎంబీఏ స్టూడెంట్స్ లీడర్షిప్ క్వాలి టీస్ పెంపొందించుకోవాలని కోరారు. మంత్ర 2కే26 కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర ప్రాంతాల నుంచి 300కు పైగా ఎంబీఏ విద్యార్థులు పాల్గొన్నా రు. పలు పోటీలు నిర్వహించి విజేతలకు నగదు బహుమతి, సర్టిఫికేట్లు అందజేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బాధ్యులు, విద్యార్థులను వాగ్దేవి కళాశాలల వ్యవస్థాపకుడు సీహెచ్ దేవేందర్రెడ్డి, అకడమిక్ డైరెక్టర్ సీహెచ్ వాహిని దేవి, విభా సీఈఓ విశ్వంబర్రెడ్డి అభినందించారు. మంత్ర 2కే26 కన్వీనర్ డాక్టర్ బి.కిశోర్ కుమార్, ఎంబీఏ విభాగం అధిపతి డాక్టర్ ఎస్.మహేందర్ కుమార్, సీనియర్ ప్రొఫెసర్ కె.రాజి రెడ్డి, ప్రొఫెసర్ కొనాటి రాజిరెడ్డి, అధ్యాపకులు పి.సుగుణాకర్రెడ్డి, ఎ.రజిన్కుమార్, టి.అనూష, డి.ప్రేమ్కుమా ర్, సీహెచ్.కరుణ, బి.చంద్రకళ నాయక్, ఎస్.శాంభవి, ఎం.అరవింద, సీహెచ్ స్వాతి, కె.వెంకటేశ్వర్లు, సీహెచ్ శ్రీకాంత్ వర్మ, విద్యార్థులు పాల్గొన్నారు . ఎస్బీఐ రీజినల్ మేనేజర్ అబ్దుల్ రహీం షేక్ -
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
కాజీపేట అర్బన్ : కాజీపేట వంద పీట్ల రోడ్డులోని వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గురువారం ఏసీబీ ఆకస్మిక తనిఖీ కలకలం రేపింది. ఈ తనిఖీలకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం 3.30గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్యాలయ షెట్టర్లు, తలుపులను మూసివేసి జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్ రామనరసింహారావు, జాయింట్–2 సబ్ రిజిస్ట్రార్ ఆనంద్లను విచారించారు. పలు దస్తావేజులను క్షణ్ణంగా పరిశీలించి, జిల్లా రిజిస్ట్రార్, చిట్స్ సహాయ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ లు చేశారు. కార్యాలయంలో 204 దస్తావేజులు డబ్బులు ఇస్తేనే ఇస్తామని సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ భూక్రయదారులను వేధిస్తున్నాడనే ఫిర్యాదు మేర కు దాడులు నిర్వహించారు. తనిఖీ సమయంలో 20 మంది డాక్యూమెంట్ రైటర్లు 70 డాక్యూమెంట్లతో కార్యాలయం లోపల ఉండడంతో వారి వద్ద నుంచి రూ.45,500 స్వాధీనపరచుకున్నారు. డాక్యూమెంట్ రైటర్ల ఫోన్లను పరిశీలించగా సబ్ రిజిస్ట్రార్లు.. డాక్యూమెంట్ రైటర్ల మధ్య నగదు లావాదేవిలకు సంబంధించిన మేసేజ్లను గుర్తించారు. భూక్రయదారులు నేరుగా కార్యాలయానికి వచ్చినా స్పందించడం లేదని డాక్యూమెంట్ రైటర్లతో రావాలని తెలుపుతున్నట్లు నిర్ధారించారు. రిజి స్ట్రేషన్ కార్యాలయంలో ఫిర్యాదుల మేరకు దర్యాప్తు కొనసాగించి కేసు నమెదు చేస్తామని సాంబయ్య వెల్లించారు. ఇదిలా ఉండగా.. ఆర్వో రిజిస్ట్రేషన్ కా ర్యాలయంలోని చిట్స్ సహాయ రిజిస్ట్రార్ కార్యాలయంలో సహాయ రిజిస్ట్రార్, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లతోపాటు ఓ ప్రైవేట్ వ్యక్తి కార్యకలాపాలను కొనసాగిస్తుంటారు. కాగా గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య బృందం కార్యాలయాన్ని తనిఖీ చేసేందుకు వెళ్లగా కార్యాలయంలోని రిజిస్ట్రర్లో సంతకాలు చేసిఉన్నా.. ఎవరూ లేకపోవడంతో సహాయ రిజిస్ట్రార్ను పిలిపించి పలు పత్రాలు పరిశీలించారు. వివరాలు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ సాంబయ్య -
ఆర్టిజన్ జేఏసీని చర్చలకు పిలవాలి
హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్లను చర్చలకు పిలవా లని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టీఆర్వీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు కే.వీ.జాన్సన్ అన్నా రు. హనుమకొండలోని ట్రాన్స్కో వరంగల్ జోనల్ కార్యాలయం వద్ద గురువారం తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ ఆధ్వర్యంలో వంటావార్పు, ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించగా.. జాన్సన్ సంఘీబావం తెలిపి మాట్లాడారు. ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేయడానికి విద్యుత్ ఉద్యోగ సంఘాలు అండగా నిలుస్తాయన్నారు. తెలంగాణ ఇంజనీర్స్ అసోసియేషన్ ట్రాన్సో కో అధ్యక్షుడు సంపత్ రావు గారు మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ఆర్టిజన్ కార్మికులు ప్రమాదకరమైన విధులు నిర్వహిస్తూ సంస్థ అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టిజన్ జేఏసీ ట్రాన్స్కో విభాగం రాష్ట్ర కన్వీనర్ కందికొండ వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీఆర్వీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాడ దేవేందర్ రెడ్డి, తెలంగాణ పవర్ డిప్లమో ఇంజనీర్స్ అసోసి యేషన్ నాయకుడు పుల్యాల రాజిరెడ్డి, తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ సుంకు సతీష్ రెడ్డి, కన్వీనర్ సింగిరెడ్డి చంద్రారెడ్డి చంద్ర సింగ్, వెంకన్న నాయక్, సికిందర్, భరత్, శ్రీనాథ్, ఐలయ్య, రాజన్న, సునీల్, జనార్ధన్, జయచందర్, సృజన, రాజేష్ నాయక్, రంగారావు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాల్సిందే..: ఆర్టిజన్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ సతీష్ రెడ్డి ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ చైర్మన్ సుంకు సతీష్ రెడ్డి, కన్వీనర్ చంద్రారెడ్డి అన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని సర్కిల్ కార్యాలయ ఆవరణలో గురువారం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో వంటావార్పు, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 7న హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. సమస్యలు పరిష్కరించకుంటే ఈ నెల 8 నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని టీ ఎస్ఈఈయూ–327 హనుమకొండ, వరంగల్ జి ల్లా కార్యదర్శులు చిట్ల ఓదేలు, బుచ్చయ్య గౌడ్ సంఘీభావం తెలిపారు. ఆర్టిజన్ జేఏసీ హనుమకొండ జిల్లా చైర్మన్ రాంబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జేఏసీ ఎన్పీడీసీఎల్ కంపెనీ చైర్మన్ సికింద న్, నాయకులు చంద్ర సింగ్ ఠాగూర్ పాల్గొన్నారు. టీఆర్వీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జాన్సన్ -
జాతర చూసేందుకు వెళ్లి..
చిల్పూరు: జాతర చూసేందుకు వెళ్లి వాగులో పడి ఇద్దరు బాలురు మృతిచెందిన సంఘటన జనగామ జిల్లా చిల్పూరు మండలం నష్కల్ గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, ఎస్సై సిరిపురం నవీన్కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని వంగాలపల్లి గ్రామానికి చెందిన గూటం ప్రవీణ్–హరిత దంపతుల కుమారుడు అఖిలానంద (14) ఎనిమిదో తరగతి, నూనె సదానందం–స్వప్న దంపతుల కుమారుడు మనోజ్కుమార్ (13) స్థానికంగా ఏడో తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ స్నేహితులు. ఒంటిపూట బడులు కావడంతో మధ్యాహ్నం పాఠశాల నుంచి ఇంటికి వెళ్లారు. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నష్కల్ గ్రామంలోని రామాలయం దగ్గర జరుగుతున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను చూసేందుకు సాయంత్రం ఇద్దరు కలిసి సైకిల్పై వెళ్లారు. అనంతరం రామాలయం వెనుక ఉన్న ఆకేరు వాగు వద్దకు వెళ్లారు. అక్కడ సైకిల్ కడుగుతున్న సమయంలో రైతులు వాగు దాటేందుకు ఏర్పాటు చేసుకున్న తెడ్డు కనిపించింది. దానిపై సైకిల్ పెట్టి ఇద్దరు కూర్చుని కొద్ది దూరం వెళ్లారు. అదిఒక పక్కకు ఒరగడంతో సైకిల్తో పాటు ఇద్దరు నీటిలో పడిపోయారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇద్దరు ఒకరిని ఒకరు గట్టిగా పట్టుకుని నీటిలో మునిగి మృతి చెందారు. కొద్దిసేపటికి కొందరు రైతులు అటుగా వెళ్తుండగా వాగు ఒడ్డుకు చెప్పులు కనిపించాయి. అనుమానంతో వాగులో గాలించగా నీటిలో మునిగిన సైకిల్తోపాటు వారి మృతదేహాలు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని చిన్నారుల మృతదేహాలను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మనోజ్కుమార్(ఫైల్) , అఖిలానంద (ఫైల్) ఆకేరు వాగులో పడి ఇద్దరు బాలుర మృతి జనగామ జిల్లా వంగాలపల్లిలో విషాదం -
ఆటలాడుకున్న అరుగే సమాధి!
చెన్నారావుపేట: ఆటలాడుకున్న ఇంటి అరుగే ఆ చిన్నారులకు సమాధిగా మారింది. ఈ హృదయ విదారక సంఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోడమాణిక్యం తండాలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బోడమాణిక్యం తండాకు చెందిన బోడ స్రవంతి, ప్రవీణ్ దంపతులు హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి కుమారులు కార్తీక్, కౌశిక్ ఉన్నారు. రాఘవేంద్ర కాలనీలో స్రవంతితోపాటు ఇద్దరు పిల్లలు మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. బుధవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను స్వగ్రామం బోడమాణిక్యం తండాకు తీసుకొచ్చారు. ముగ్గురి మృతదేహాలను పూడ్చిపెట్టేందుకు బంధువులు ప్రవీణ్ ఇంటి ఎదుట గుంతలు తీశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వారి కళ్లలో కారం చల్లి ఇద్దరు పిల్లల మృతదేహాలను ఈ గుంతలో పూడ్చిపెట్టారు. అనంతరం స్రవంతి మృతదేహాన్ని సమీపంలోని వారి పత్తిచేనులో దహనం చేశారు. ప్రవీణ్ ఇంటి ఎదుట సమాధి చేసిన చిన్నారుల మృతదేహాలు మళ్లీ తీసే ప్రసక్తే లేదని తండావాసులు తెగేసి చెబుతున్నారు. కాగా, మూడు రోజులుగా కొనసాగిన ఉద్రిక్త పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఇదిలా ఉండగా.. స్థానిక సర్పంచ్ ఉమామోహన్ గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. బోడమాణిక్యం తండాలో పిల్లల మృతదేహాల పూడ్చివేత -
ప్రియుడి మృతిని తట్టుకోలేక యువతి ఆత్మహత్య
నర్మెట: ప్రేమించిన యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో మనస్తాపానికి గురైన యువతి సైతం బలవన్మరణానికి పాల్పడిన ఘటన జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాలకు చెందిన తరిగొప్పుల హారిక (22) అదే గ్రామానికి చెందిన అనుముల రాకేష్ రెడ్డి ప్రేమించుకుని ఏడాదికాలంగా హైదరాబాద్లో నివాసముంటూ మూడు నెలల క్రితం గ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలో విషయం తల్లిదండ్రులకు చెప్పడంతోపాటు తాము పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. కొద్దిరోజులు దూరంగా ఉండాలని, అనంతరం పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు సూచించడంతో వారు వేర్వేరుగా ఉంటున్నారు. ఈక్రమంలో గత నెల 28న రాకేష్ రెడ్డి (25) గడ్డి మందు తాగి చికిత్స పొందుతూ 30న మృతి చెందాడు. దీంతో యువతిని తల్లిదండ్రులు నర్మెటలోని అమ్మమ్మ కొన్నె లక్ష్మి వద్ద వదిలి వెళ్లారు. కాగా, అప్పటికే ప్రియుడు మృతిచెందడంతో మనస్తాపంతో ఉన్న యువతి గురువారం మధ్యాహ్నం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి కవిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై నగేష్ తెలిపారు. గుట్కాల పట్టివేతవరంగల్ క్రైం: హనుమకొండ టైలర్స్ స్ట్రీట్లోని శివం కిరాణా స్టోర్లో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కాలు, పొగాకు ఉత్పత్తులను గురువారం పట్టుకున్నట్లు హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ తెలిపారు. వీటి విలువ సుమారు రూ.4.70 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. నిందితుడు రాజ్పుత్ చేతన్ నిషేధిత పొగాకు ఉత్పత్తులను ఇతర ప్రాంతాల నుంచి తెప్పించి ఇక్కడ పలు షాపుల వారికి అమ్ముతున్నట్టు విచారణలో వెల్లడైందని వివరించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. దాడుల్లో ఎస్సై కిశోర్, బ్లూకోల్ట్స్ సిబ్బంది మహిపాల్, తిరువర్ధన్ పాల్గొన్నారు. స్పాట్ కేంద్రం పరిశీలన విద్యారణ్యపురి: కాజీపేట ఫాతిమా హైస్కూల్లో టెన్త్ పరీక్షల జవాబుపత్రాల స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం రాష్ట్ర అబ్జర్వర్ శ్రీనివాసాచారి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాన్ని సందర్శించారు. ఉపాధ్యాయులు జవాబుపత్రాలు మూల్యాంకనం చేస్తున్న ప్రక్రియను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాల్యుయేషన్ చేస్తున్నప్పుడు సెల్ఫోన్లు వినియోగించొద్దని ఉపాధ్యాయులకు సూచించారు. సెల్ ఫోన్ వినియోగిస్తూ స్పాట్ వాల్యుయేషన్లో పాల్గొంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. క్యాంపు ఆఫీసర్గా డీఈఓ ఎల్వీ గిరిరాజ్ గౌడ్ వ్యవహరిస్తున్నారు. సరిపడా ఉపాధ్యాయులు మూల్యాంకనం విధుల్లో పాల్గొంటున్నారని సంబంధిత అధికారులు అబ్జర్వర్ శ్రీనివాసాచారికి తెలిపారు. -
వార్డుసభలతో అర్హులకు లబ్ధి
● మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ జ్యోతి మహబూబాబాద్: అర్హులకు లబ్ధి చేకూర్చడానికే ప్రభుత్వం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా వార్డు సభలు నిర్వహిస్తుందని మున్సిపల్ చైర్ప్సన్ గుగులోత్ జ్యోతి అన్నారు. మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని 36వార్డులకు సంబంధించి 8చోట్ల వార్డు సభలు నిర్వహించారు. హౌజింగ్ బోర్డు కాలనీలో 4,5,17,18 వార్డులకు సంబంధించిన వార్డు సభ నిర్వహించారు. ఈసందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. పేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, గృహజ్యోతి తదితర పథకాలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ రాజేశ్వర్, వార్డు కౌన్సిలర్లు గుగులోత్ నరేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. భాగస్వాములు కావాలి.. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని ఆర్డీఓ కృష్ణవేణి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏఎంఏ హాల్లో మున్సిపాలిటీలోని 8,19,20,33,34,35 వార్డులకు సంబంధించిన వార్డు సభ నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అజయ్సాథిరెడ్డి, గద్డె నీరజారాణి, చిదిరాల అరుణ, బానోత్ పార్వతి తదితరులు పాల్గొన్నారు. 1,323 క్వింటాళ్ల మిర్చి విక్రయం మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో 1,323 క్వింటాళ్ల మిర్చి విక్రయం జరిగిందని ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, సెక్రటరీ సుజన్ బాబు గురువారం తెలిపారు. మహబూబాబాద్ మండలంతో పాటుగా చుట్టుపక్కల మండలాలకు చెందిన రైతులు 3,781 బస్తాల మిర్చి విక్రయానికి తీసుకొచ్చారు. వ్యాపారులు కొనుగోలు చేసిన అనంతరం గరిష్ట ధర క్వింటాకు రూ.19,520, కనిష్ట ధర రూ.18,550 పలికిందని వారు పేర్కొన్నారు. -
యూనిఫాం ఇండెంట్ల రద్దు
టెండర్ల ద్వారా కొనుగోలుకు విద్యాశాఖ సన్నాహాలుకాశిబుగ్గ: తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యా సంచాలకులు, ఎక్స్అఫీషియో రాష్ట్ర సంచాలకులు, సమగ్ర శిక్ష హైదరాబాద్ తరఫున ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన యూనిఫాం క్లాత్ కోసం టెస్కోకు ఇచ్చిన ఇండెంట్ను ఉపసంహరించుకోవడంతో రాష్ట్రంలోని పవర్లూం, చేనేత సహకార సంఘాలు చతికిలపడనున్నాయి. దీనిపై ఆధారపడిన వేలా దిమంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టెస్కోకు ఇచ్చిన రూ.105.54 కోట్ల ఆర్డర్ను విద్యాశాఖ రద్దు చేసుకోవడంతో సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన కార్మికులు పనులు లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉంది. దశాబ్దాలుగా యూనిఫాం సరఫరా.. నాలుగైదు దశాబ్దాల నుంచి ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లకు అవసరమైన ఏకరూప దుస్తులు, కార్పెట్లు, బెడ్షీట్లు చేనేత సహకార సంఘాలు సరఫరా చేస్తూ చేనేత కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. నేతన్నల ఉత్పత్తులను టెస్కో ద్వారా ఖరీదు చేసి ప్రభుత్వ సంస్థలకు అమ్మకాలు చేస్తుంటారు. అయితే ఈ ఏడాది కొత్తగా టెండర్ విధానం ద్వారా చేనేత ఉత్పత్తులను కూడా కొనుగోలు చేస్తామని ఉన్నతాధికారులు ప్రకటించడంతో కార్మికులకు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో సంఘాల నాయకులు హైకోర్టును ఆశ్రయించి కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తున్న టెండర్ విధానం రద్దు చేయాలని విన్నవించారు. చేనేత కార్మికుల ఉపాధి దృష్టిలో పెట్టుకుని రెండు వారాల్లో చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించినా కార్మికులకు నిరాశే మిగిలింది. విద్యాశాఖ ఆకస్మిక నిర్ణయంతో ఆందోళన.. ఈ పరిస్థితిలో తాజాగా విద్యాశాఖ 2026–2027 విద్యా సంవత్సరానికి సంబంధించి 1 నుంచి 12వ తరగతి వరకు, ప్రీప్రైమరీ చదువుతున్న 20,02,689 మంది విద్యార్థుల రెండు జతల యూనిఫాం తాత్కాలిక ఇండెంట్ను రద్దు చేసి, కొనుగోలు ప్రక్రియను ప్రారంభించొద్దని టెస్కోను అభ్యర్థించింది. దీంతో చేనేత జౌళిశాఖ అధికారులు సైతం పీపీ ఆర్డర్లను రద్దు చేసి, లివరీ యూనిఫాం క్లాత్ రకాల ఉత్పత్తిని తక్షణమే నిలిపివేయాలని గురువారం రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాతోపాటు కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల పవర్లూం, చేనేత సహకార సంఘాలకు ఆదేశాలు జారీ చేశా రు. దీనివల్ల ఇప్పటికే వివిధ శాఖల నుంచి రావా ల్సిన రూ.200 కోట్ల ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయి. గోదాముల్లో కొనుగోలు చేసిన ఉత్పత్తులు నిల్వ ఉండడం, మిల్లుల్లో వస్త్రాలు తయారు చేస్తుండడం వంటి పరిస్థితుల్లో ఉన్నతాధికారుల ఆకస్మిక నిర్ణయం నేతన్నలను నిరాశకు గురిచేస్తోంది. వస్త్రాల ఉత్పత్తి నిలిపివేయాలంటూ చేనేత జౌళిశాఖ ఉత్తర్వులు లబోదిబోమంటున్న పవర్లూమ్, చేనేత సహకార సంఘాలు ఉపాధి కోల్పోతామని నేత కార్మికుల ఆందోళనప్రభుత్వ అధికారులు తీసుకున్న నిర్ణయం వల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి అవకాశాలు కోల్పోతారు. 2026–27 విద్యా సంవత్సరంలో రూ.105.54 కోట్ల విలువైన ఆర్డర్లు రద్దు చేయడం వల్ల రాష్ట్రంలోని 393 చేనేత సంఘాల్లోని వేలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోనున్నారు. టెండర్ విధానం వల్ల కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలకు కాంట్రాక్టులు అప్పగిస్తే సామాన్య నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. టెస్కో ద్వారా కొనుగోళ్లు లేకపోవడంతో కార్మికులు పనులకు దూరంగా ఉండాల్సి వస్తుందని, దీనివల్ల ప్రభుత్వ పథకాలు కూడా వర్తించవని వాపోతున్నారు. తక్షణమే సీఎం జోక్యం చేసుకుని టెండర్ విధానానికి స్వస్తి పలికి, గతంలో మాదిరిగా టెస్కో ద్వారా కొనుగోలు చేసి నేతన్నలను ఆదుకోవాలని విజ్ఙప్తి చేశారు. ఈ మేరకు వరంగల్లో గురువారం జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు చేనేత సంఘాల ప్రతినిధులు మొరపెట్టుకున్నారు. -
19 గ్యాస్ సిలిండర్లు సీజ్
రామన్నపేట : నగరంలోని ఇంతేజార్గంజ్ పోలీస్స్టేషన్ పరిధి శ్రీకృష్ణకాలనీలో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను అక్రమంగా వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నారనే పక్కా సమాచారంతో గురువారం దాడులు చేసి 19 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ వెల్లడించారు. వీటి విలువ సుమారు రూ.47,500 ఉంటుందని తెలిపారు. నిందితుడు లహరి ఫుడ్ క్యాటరింగ్ యజమాని సంతోష్కుమార్ను అదుపులోకి తీసుకొని తదుపరి విచారణ నిమిత్తం ఇంతేజార్గంజ్ పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో టాస్క్ఫోర్స్ సీఐ జి.బాబులాల్, ఏఎస్సై కె.సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు. కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ కోర్సుల (బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ) 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు, డిగ్రీ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు అపరాధ రుసుంలేకుండా ఈనెల 4వ తేదీ వరకు ఉందని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రూ.50 అపరాధ రుసుంతో ఈనెల 9వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుంచి 2, 4, 5, 6వ సెమిస్టర్ల పరీక్షలు నిర్వహించే యోచనలో పరీక్షల విభాగం అధికారులు ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఆయా పరీక్షల టైం టేబుల్ విడుదల చేయనున్నట్లు తెలిసింది. పుట్టెడు దుఃఖంతో పది పరీక్షకు హాజరుస్టేషన్ఘన్పూర్: కన్నతండ్రి మృతిచెందిన బాధను దిగమింగుకొని ఓ విద్యార్థి పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన దేవరాయ సాంబయ్య (47), సంధ్య దంపతులకు కుమారుడు చరణ్, కుమార్తె పావని ఉన్నారు. చరణ్ స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి, పావని తొమ్మిదో తరగతి చదువుతున్నారు. చరణ్ పదో తరగతి వార్షిక పరీక్షలను మండలంలోని నమిలిగొండ శివారు మాడల్స్కూల్ సెంటర్లో రాస్తున్నాడు. అయితే అనారోగ్యంతో బాధపడుతూ చరణ్ తండ్రి సాంబయ్య బుధవారం మృతిచెందాడు. చరణ్ దుఃఖాన్ని దిగమింగుకుని గురువారం జరిగిన భౌతికశాస్త్రం పరీక్షకు హాజరయ్యాడు. అనంతరం స్వగ్రామం తాటికొండకు వెళ్లి తండ్రి అంత్యక్రియలు చేశాడు. ఇంటి వద్ద తండ్రి మృతదేహం ఉన్నా బాధను దిగమింగుకుని పరీక్ష రాసిన చరణ్ను పలువురు ఓదార్చారు. -
సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు
గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన వారి విషయం నేను డాక్టర్గా నేరుగా చూశాను. ఈ మందు తాగిన వ్యక్తి చనిపోగా.. లక్షల రూపాయల ఖర్చుతో కుటుంబం కూడా అప్పుల పాలు అవుతుంది. ఈ విషయంపై అసెంబ్లీలో పలుమార్లు మాట్లాడాను. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులను కలిసి తీవ్రతను చెప్పాను. వారు స్పందించి అసెంబ్లీలో తీర్మానం చేయడం.. గడ్డి మందు అమ్మకాలు నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సంతోషకరం. సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు. – మురళీనాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే గడ్డి మందు అమ్మకాలు నిషేధంగడ్డి మందు పారాక్వాట్ డైక్లోరైడ్ తాగి ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ విషయంపై స్పందించిన రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులు అమ్మకాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో తయారీ, నిల్వ, అమ్మకాలు, వాడకం, కొనుగోళ్లపై నిషేధం ఉంది. కావునా రైతులు, వ్యాపారులు గమనించాలి. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – బి. సరిత, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అమ్మకాల నిషేధం సంతోషకరం రైతుల కుటుంబాలను చిన్నాభిన్నం చేసే గడ్డి మందు పారాక్వాట్ డైక్లోరైడ్ అమ్మకాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సంతోషకరం. శాశ్వతంగా నిషేధించాలి. ఉత్తర్వులు అమలు అయ్యేలా చూడాలి. – డాక్టర్ వివేక్, డీఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు -
కాజీపేటలో చైన్స్నాచింగ్
కాజీపేట: పట్టణంలో బుధవారం మధ్యాహ్నం చైన్స్నాచింగ్ జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడ నుంచి దుండగులు పుస్తెల తాడు అపహరించారు. బాధితురాలి కథనం ప్రకారం.. ఐలోని ధనలక్ష్మి వ్యక్తిగత పనులు పూర్తి చేసుకున్న అనంతరం నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. ఈ సమయంలో బైక్పై వెనుక నుంచి వచ్చిన దుండగులు ఆమె మెడలోంచి 3 తులాల పుస్తెలతాడును లాక్కెళ్లారు. దీంతో బాధితురాలు కేకలు వేయగా స్థానిక యువకులు నిందితులను పట్టుకోవడానికి యత్నించగా తప్పించుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసు అధికారులతో పాటు క్రైం పార్టీ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని విచారణను వేగవంతం చేశారు. జల్లెడ పడుతున్న పోలీసులు.. నిందితుల ఆచూకీ కోసం పోలీసులు అన్ని రహదారులపై ఉన్న సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నా రు. ఇటీవల పట్టణంలో రెండు దఫాలుగా చైన్ స్నా చింగ్లకు పాల్పడిన ముఠాకు సంబంధం ఉండి ఉంటుందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మహిళ మెడలో నుంచి 3 తులాల పుస్తెలతాడు అపహరణ రంగంలోకి క్రైం పార్టీ పోలీసులు


