Mahabubabad
-
దోపిడీ ఉన్నంతకాలం పోరాటాలుంటాయి
హసన్పర్తి: దేశంలో దోపిడీ, కుల వివక్ష, ఆకలి ఉన్నంతకాలం రాజ్యాంగబద్ధంగా పోరాటాలు ఉంటాయని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అన్నారు. గతేడాది ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన బూర రాకేశ్ సంస్మరణ సభ గురువారం చింతగట్టులో జరిగింది. సమావేశానికి ప్రొఫెసర్ లక్ష్మణ్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాకేశ్ స్మారకస్థూపం నిర్మిస్తున్న క్రమంలో పోలీసుల చేపట్టిన చర్యలను తీవ్రంగా ఖండించారు. ఈసందర్భంగా తొలుత రాకేశ్ చిత్రపటానికి పూలమాల వేసినివాళులర్పించారు. అమరవీరుల బంధు మిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అంజమ్మ అధ్యక్షతన జరిగిన సభలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క నారాయణరావు, అమరవీరుల బంధు మిత్రుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మకుమారి, అభినవ్, శాంతక్క, భవాని, కవిత, అనిత, జయంత్, ఫణీకుమార్, రాకేశ్ కుటుబసభ్యులు పాల్గొన్నారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ -
నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
కేసముద్రం: పాఠశాల భవన నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని డీఈఓ సత్యనారాయణమూర్తి అన్నారు. గురువారం మండలంలోని అర్పనపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న పాఠశాల భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జూన్ 12న పాఠశాల పునఃప్రారంభం అవుతున్నందున విద్యార్థుల కోసం నాలుగు తరగతి గదులను సిద్ధం చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. డీఈఓ వెంట ఎంఈఓ కాలేరు యాదగిరి ఉన్నారు. ఏఐ లైఫ్ స్కిల్స్పై ఉచిత శిక్షణమహబూబాబాద్ అర్బన్: ఆర్టిిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) లైఫ్ స్కిల్స్పై నాలుగు రోజుల పాటు ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులతో పాటు డిగ్రీ ఆపైన చదివిన బీసీ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ స్టడీ సర్కిల్ ఇన్చార్జ్ డైరెక్టర్ మాడిశెట్టి నరసింహస్వామి గురువారం ఒక ప్రకనటలో పేర్కొన్నారు. నూతన సాంకేతికతను ప్రజలకు అందించడమే లక్ష్యంగా మ్యాజిక్ బస ఇండియా ఫౌండేషన్ అనే సంస్థ అనుసంధానంతో జూన్ 1నుంచి 4వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇస్తామని తెలిపారు. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతీ, యువకులు హనుమకొండలోని బీసీ స్టడీ సర్కిల్లో ఈ నెల 30వ తేదీ వరకు హాజరై దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 0870– 2571192 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు. 28న బక్రీద్మహబూబాబాద్ రూరల్ : ముస్లింలు బక్రీద్ వేడుకలను ఈనెల 28న నిర్వహించుకోవాలని జిల్లా ఇస్లాహే మాషిరా కమిటీ అధ్యక్షుడు మమ్మద్ ఇక్బాల్, జిల్లా మైనార్టీ నాయకుడు ఎండీ.హారుణ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 27న పెద్దల పండుగ జరుగుతుందని, 28న బక్రీద్ పండుగ నిర్వహించుకోవాలని, 29వ తేదీ రాత్రి స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి సందల్ (గంధం), కందిల్ ఊరేగింపు ప్రారంభిస్తారన్నారు. 30న ఈదులపూసపల్లిలోని హజరత్ సయ్యద్ ఇమాంషావలి దర్గాలో ఉర్సు ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జ్గా శ్రీకాంత్ గౌడ్ఇనుగుర్తి: తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ జిల్లా ఇన్చార్జ్గా ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామానికి చెందిన నలమాస శ్రీకాంత్ గౌడ్ను పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత గురువారం నియమించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్గౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో జిల్లా బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ అధినేత్రి కవితకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని ప్రతీ గ్రామంలో పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
నిబంధనలు పాటించాలి
● డీఎంహెచ్ఓ రవి రాథోడ్ నెహ్రూసెంటర్: ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలని డీఎంహెచ్ఓ బి.రవిరాథోడ్ అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని దీప్తి ఆస్పత్రి, పొనుగోటి, వెన్నెల, వీరభద్ర ఆస్పత్రులను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. రోగుల ప్రయోజనార్థం ప్రతీ సేవకు సంబంధించిన రుసుము, అందుబాటులో ఉన్న సౌకర్యాలను స్థానిక భాషతో పాటు ఆంగ్ల భాషలో స్పష్టంగా కనిపించే ప్రదేశంలో ప్రదర్శించాలన్నారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, బయోమెడికల్, పొల్యూషన్, తదితర అవసరమైన లైసెన్స్లను స్పష్టంగా కనిపించే ప్రదేశంలో ప్రదర్శించాలని తెలిపారు. అలాగే కన్సల్టెంట్ వైద్యుల జాబితాను స్పష్టంగా కనిపించే ప్రదేశంలో ప్రదర్శించాలని, అగ్నిమాపక శాఖ (112), పోలీస్ (100), అత్యవసర సేవ (108)ల మొబైల్ నంబర్లను సంస్థ ప్రాంగణంలో ప్రదర్శించాలన్నారు. నిబంధనలు పాటించకపోతే రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని హెచ్చరించారు. స్కానింగ్ సెంటర్లలో పరీక్షలు అనుమతి పొందిన రేడియాలజిస్టులు లేదా గైనకాలజిస్టులు మాత్రమే గర్భిణులకు స్కానింగ్ చేయాలని, లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని తెలిపారు. -
వడదెబ్బతో ఎనిమిది మంది మృతి
హసన్పర్తి/కేసముద్రం/బయ్యారం/ నెల్లికుదురు/ ఏటూరునాగారం/కురవి/మొగుళ్లపల్లి/రేగొండ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో గురువారం వడదెబ్బతో ఎనిమిది మంది మృతి చెందారు. హసన్పర్తి మండలం వంగపహాడ్కు చెందిన కౌలు రైతు పొన్నాల భరత్(34) తన రెండెకరాల వరి పంటను కోసిన అనంతరం జాతీయ రహదారి సమీపంలో ఆరబోశాడు. గురువారం ఆ ధాన్యాన్ని సంచుల్లో నింపుతున్న క్రమంలో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో తల్లిదండ్రులు ఉదయ, చేరాలు వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే భరత్ మృతి చెందినట్లు నిర్ధారించారు. అలాగే, కేసముద్రం మండలం కల్వలకు చెందిన గాదె కొమురమ్మ(90) రెండు రోజులుగా కొడుతున్న ఎండలకు అస్వస్థతకు గురైంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి మృతి చెందింది. మరోఘటనలో బయ్యారం మండలం ఇర్సులాపురం గ్రామానికి చెందిన కేస లచ్చమ్మ(90) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీనికి తోడు కొన్ని రోజులుగా ఎండవేడి పెరగడంతో అస్వస్థతకు గురై గురువారం మృతి చెందింది. అలాగే, నెల్లికుదురు మండలం హనుమాన్ నగర్తండాకు చెందిన గుగులోత్ అమృత (54) ఈ నెల 19న పెసరు పంటను తూర్పార పడుతూ అస్వస్థతకు గురైంది. కుటుంబీకులు వెంటనే వరంగల్లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. అలాగే, ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన మాదరి లక్ష్మి(85) ఎండలకు అస్వస్థతకు గురై గురువారం చనిపోయినట్లు మృతురాలి కుమారుడు రామయ్య తెలిపారు. అలాగే, కురవి మండలం రాజోలుకు చెందిన నల్ల లింగయ్య(70) రెండు రోజుల క్రితం మరిపెడలోని తన కూతురు ఇంటికి వెళ్లాడు. అక్కడ వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అలాగే, మొగుళ్లపల్లి మండలం పోతుగల్ గ్రామానికి చెందిన నాంపల్లి సక్కమ్మ(58) రోజుమాదిరిగానే గురువారం కూలీకి వెళ్లింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చే క్రమంలో వడదెబ్బతో మృతి చెందింది. అలాగే, రేగొండ మండలం భాగి ర్తిపేట గ్రామానికి చెందిన మహ్మద్ యాకుపాషా (45) గురువారం మేసీ్త్ర పనికి వెళ్లగా వడదెబ్బకు గురై చనిపోయాడు. -
ఔరా.. ఆకట్టుకునే ఆకృతులు
● కాగితపు పూలు, బొమ్మలు తయారు చేస్తున్న చిన్నారులు పరకాలలోని పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ (గర్ల్స్)లో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపులో ఉపాధ్యాయులు ఆర్ట్స్, క్రాఫ్ట్స్, సంగీతం, ఆటలు, మ్యాథ్స్, స్పోకెన్ ఇంగ్లిష్లో తర్ఫీదు ఇస్తున్నారు. దీంతో చిన్నారులు చక్కగా నేర్చుకుంటూ ఔరా అని పించుకుంటున్నారు. ప్రొజెక్టర్పై వచ్చే చిత్రలేఖనాలను చూసి కాగితాలతో పూలు, వివిధ ఆకృతలతో బొమ్మలు వేస్తున్నారు. వేసవిలో తమ పిల్లలు చూపిస్తున్న ప్రతిభపై తల్లిదండ్రులు ముచ్చటపడుతున్నారు. – పరకాలతాము తయారు చేసిన కాగితపు బొమ్మలతో చిన్నారులు -
డిమాండ్ల సాధనకు ఉద్యమించాలి
● తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి హన్మకొండ: న్యాయమైన డిమాండ్ల సాధనకు తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుల్తాన్ యాదగిరి పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండ వడ్డేపల్లి రోడ్లోని పల్లా రవీందర్ రెడ్డి భవన్లో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తమ్మల శోభారాణి అధ్యక్షతన ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమకారుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సుల్తాన్ యాదగిరి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమంలో లేరని, అందుకే ఉద్యమకారుల హామీలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. కుటుంబం మొత్తం రూ.లక్ష కోట్లు సంపాదించుకుందని, కుంభ కోణా లకు పాల్పడ్డారన్నారు. అందుకే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారన్నారు. మరో అతిథి తెలంగాణ ఉద్యమకారుడు కోల జనార్ధన్ మాట్లాడుతూ ఉద్యమకారులు అడ్డుకునే దుస్థితికి రావడానికి జేఏసీకి నా యకత్వం వహించిన కోదండరాం వంటి వారే కారణమన్నారు. తెలంగాణ ఉద్యమ నినాదాలే మన డి మాండ్లు కావాలన్నారు. సదస్సులో ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాజుల యాదగిరి, నాయకులు రవీందర్, చంద్రకళ, సుశీల, అరుంధతి, పద్మజ, విజయలక్ష్మి, అన్నపూర్ణ, విజయ, రాధిక, రమ, తదితరులు పాల్గొన్నారు. -
నేటినుంచి డిగ్రీ మొదటి, మూడో సెమిస్టర్ పరీక్షలు
● హాజరుకానున్న 43, 670 మంది విద్యార్థులు కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిఽధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ తదితర కోర్సుల (సప్లిమెంటరీ/ బ్యాక్లాగ్) పరీక్షలు ఈనెల 22 నుంచి నిర్వహించబోతున్నారు. వాస్తవంగా డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలు మే 7 నుంచి, మూడో సెమిస్టర్ పరీక్షలు మే 16 నుంచి నిర్వహిస్తామని తొలుత టైంటేబుల్ ప్రకటించారు. అయితే పలు కారణాలతో ఆయా పరీక్షలను వాయిదా వేసిన అనంతరం అధికారులు రీషెడ్యూల్ చేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి తిరుమలాదేవి గురువారం తెలిపారు. డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 22, 23, 25, 26, 28, 29, 30, జూన్ 1వ తేదీ వరకు నిర్వహిస్తామని వారు తెలిపారు. ఆయా తేదీల్లో పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించబోతున్నారు. ఇక డిగ్రీ మూడో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 22 ,23, 25, 26, 28, 29, 30, జూన్ 1, 2 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. మొదటి సెమిస్టర్ పరీక్షలకు 25,433 మంది, మూడో సెమిస్టర్ పరీక్షలకు 18,237మంది, మొత్తం 43,670 మంది విద్యా ర్థులు పరీక్షలు రాయబోతున్నారని వారు తెలిపారు.115 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఎండలతో విద్యార్థులకు ఇబ్బందులే.. ఓవైపు కొద్దిరోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవవుతున్నాయి. దీంతో మండుతున్న ఎండలతో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇబ్బంది పడనున్నారు. కాగా, ఎండల సమయంలో పరీక్షల నిర్వహణతో విద్యార్థులే కాదు విధుల్లో పాల్గొనే అధ్యాపకులు కూడా ఇబ్బందులు పడతారని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం బాధ్యులు గురువారం రిజిస్ట్రార్ వి.రామచంద్రం, పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్కు వినతిపత్రం సమర్పించారు. మొదటి, మూడో సెమిస్టర్ పరీక్షలను రీషె డ్యూల్ చేయాలని కోరారు. కానీ యథావిధిగా నిర్వహిస్తామని ఆ విభాగం అధికారులు స్పష్టం చేశారు. విద్యుత్ ఉద్యోగుల సందేహాలు తీర్చాలి హన్మకొండ : విద్యుత్ ఉద్యోగుల సందేహాలు నివృత్తి చేశాకే మూడో డిస్కం టీజీ ఆర్పీడీసీఎల్కు లై సెన్స్ జారీ చేయాలని తెలంగాణ విద్యుత్ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్కు సూచించింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్లో టీవీ జేఏసీ చైర్మన్ పి.శ్రీని వాస్, కన్వీనర్ మన్నె శశికుమార్ లేఖ అందించారు. తమ జేఏసీ ఆర్పీడీసీఎల్ ఏర్పాటును పూర్తిగా వ్యతిరేకించడం లేదని, అయితే ఉద్యోగుల హక్కులకు భద్రత కల్పించాలన్నారు. లైసెన్స్ జారీకి ముందు యాజమాన్యం పాత డిస్కంలు, ఉద్యోగ సంఘాల మద్య చట్టబద్ధమైన త్రైపాక్షిక ఒప్పంద చేసుకోవాలన్నారు. ప్రస్తుత డిస్కంలోని ఉద్యోగుల సీనియార్టీలో ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాలని, 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు ఉద్యోగంలో చేరి న వారందరికీ కోర్టు తీర్పు మేర కు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. -
ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలి
● ఎస్పీ శబరీష్ మహబూబాబాద్ రూరల్: ప్రజలతో మర్యాదగా వ్యవహరించడం వల్ల పోలీసు శాఖపై మరింత విశ్వాసం పెరుగుతుందని ఎస్పీ శబరీష్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆర్ముడ్ రిజర్వుడ్ సిబ్బందితో గురువారం పోలీసు దర్బార్ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలన్నారు. ఆర్ముడ్ రిజర్వుడ్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, వీఐపీ బందోబస్తు విధులు, ఎన్నికల డ్యూటీలు, ప్రజాభద్రత విధులు, ప్రత్యేక ఆపరేషన్లు, పండుగల సమయంలో బందోబస్తు బాధ్యతలను ఏఆర్ సిబ్బంది సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని అభినందించారు. సిబ్బంది సంక్షేమంపై జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. ఏఆర్ డీఎస్పీలు శ్రీనివాస్, విజయ్ ప్రతాప్, ఆర్ఐలు సోములు, భాస్కర్, అనిల్, నాగేశ్వరరావు, ఆర్ఎస్సైలు, ఎస్సైలు పాల్గొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి.. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ శబరీష్ అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని నెహ్రూసెంటర్, మదర్ థెరిస్సా సెంటర్లో పునరుద్ధరించిన ట్రాఫిక్ సిగ్నళ్ల పాయింట్లను గురువారం ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. -
సరస్వతీనదికి పుష్కరోత్సవం..
భూపాలపల్లి/కాళేశ్వరం: సరస్వతి అంతర్వాహిణి నదికి అంత్య పుష్కరాల పుష్కరోత్సవం ఆరంభమైంది. గురువారం నుంచి జూన్ 1వ తేదీ వరకు పుష్కరాలు జరగనున్నాయి. తెల్లవారుజామున మంగళహారతులతో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీస్వామి వారికి మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఆయన సతీమణి, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, ధార్మిక సలహాదారు గోవిందహరి, కమిషనర్ హనుమంతరావుతోపాటు హైకోర్టు జడ్జి నందా, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, మల్రెడ్డి రంగారెడ్డి స్వాగతం పలికారు. పుష్కరుడి ఆవాహ పూజాకార్యక్రమంలో పాల్గొన్న అనంతరం స్వామివారు త్రివేణి సంగమంలో పుష్కరుడికి ప్రత్యేక పూజలు చేసి చీర, సారె సమర్పించి పుష్కర స్నానాలు చేశారు. అనంతరం భక్తులు పుష్కర స్నానాలు చేశారు. పితృతర్పనాలు చేశారు. పిండప్రదాన పూజలు నిర్వహించారు. దీంతో పుష్కరిణి పులికించిపోయింది. మ్యూజియం ప్రారంభించిన గవర్నర్.. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్శుక్లా దంపతులు హైదరాబాద్ నుంచి నేరుగా కాళేశ్వరానికి సాయంత్రం 4 గంటలకు చేరుకున్నారు. వారికి మంత్రి శ్రీధర్బాబు, కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ రాహుల్శర్మ, ఐజీ అంబర్కిశోర్ఝా, ఎస్పీ సంకీర్త్ స్వాగతం పలికారు. త్రివేణి సంగమంలో పుష్కరిణిలో ప్రత్యేక కార్యక్రమాలతో నదీమాతకు పూజలు చేశారు. అనంతరం పుష్కర స్నానాలు చేశారు. అక్కడి నుంచి నేరుగా కాళేశ్వరాలయానికి చేరుకున్నారు. రాజగోపురం వద్ద గవర్నర్ దంపతులకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామికి అభిషేకం నిర్వహించారు. ఆశీర్వచన వేదిక వద్ద వారిని ఆలయ అధికారులు సన్మానించారు. గవర్నర్ దంపతులు.. కంచి పీఠాధిపతి వద్ద ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం కాళేశ్వరంలో రూ.1.20కోట్ల వ్యయంతో నిర్మించిన మ్యూజియాన్ని మంత్రి శ్రీధర్బాబు, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కంచి కామకోటి పీఠాధిపతితో కలిసి ప్రారంభించారు. మ్యూజియంలోని పురాతన శిల్పకళను తిలకించారు. కలెక్టర్ రాహుల్శర్మ తదితరులు ఉన్నారు. కనుల పండువగా గోదావరి హారతి.. సరస్వతీనది అంత్యపుష్కరాల్లో భాగంగా గురువారం మొదటి రోజు గోదావరి హారతిని కాశీ పండితులచే అట్టహాసంగా నిర్వహించారు. నవరత్నమాల హారతి విశిష్టతను భక్తులకు 45 నిమిషాలపాటు వివరించారు. ఏడుగురు పండితులు తొమ్మిది హారతులతో నయనానందకారంగా చేశారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భక్తజనం భారీగా తరలొచ్చారు. ఈ కార్యక్రమంలో కంచి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్రసరస్వతీస్వామి, గవర్నర్ శివప్రతాప్శుక్లా దంపతులు, మంత్రి శ్రీధర్బాబు, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ధార్మిక సలహాదారు గోవిందహరి, కలెక్టర్ రాహుల్శర్మ, ఐజీ అంబర్కిషోర్ఝా తదితరులు ఉన్నారు. ఉత్సవమూర్తుల జలవిహారం.. సరస్వతీనది అంత్య పుష్కరాల్లో భాగంగా హంసవాహనం(పడవ)లో తెప్పోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం రాత్రి ఉత్సవ మూర్తులను జలవిహారం చేయించారు. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శన.. పరంపర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దంపతులు వీక్షించి కళాకారులను అ భినందించారు. కళల పరిరక్షణ, అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉదయం 5: 43 గంటలకు ముహూర్తం ప్రకారం ఆవాహ పూజ మంత్రులు శ్రీధర్బాబు, సురేఖ, ఎమ్మెల్యేలు గండ్ర, మల్రెడ్డి హాజరు కంచి కామకోటి పీఠాధిపతిచే పుష్కర స్నానాలు ప్రారంభం గవర్నర్ దంపతులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, హైకోర్టు జడ్జి పూజలు రూ.1.20కోట్లతో నిర్మించిన మ్యూజియాన్ని ప్రారంభించిన గవర్నర్మొదటి రోజు భక్తులు అంతంతే..ఉదయం 11గంటల తర్వాత ఎండ తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో భక్తుల రాక తగ్గుముఖం పట్టింది. అధికారులు అంచనా వేసిన స్థాయిలో భక్తులు రాకపోవడంతో ఘాట్లు మధ్యాహ్నానికి నిర్మానుష్యంగా మారాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత వేడిగాలులు వీయడంతో భక్తులు పెద్దగా కనిపించలేదు. సుమారు 46–47 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవడంతోపాటు వడగాలులు కూడా తీవ్రంగా వీయడంతో భక్తులు, విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు, అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కర్చీఫ్లు, తలపాగాలు, చున్నీలు, చీర కొంగులు, స్కార్ఫ్లు కప్పుకొని ఎండ నుంచి రక్షణ పొందేందుకు ప్రయత్నం చేశారు. కొంత మంది నీడ పట్టునే సేదదీరాల్సి న పరిస్థితి ఏర్పడింది. ఐదు వేల మందే.. సరస్వతీనది అంత్య పుష్కరాలకు అధికారులు కనీసం రోజుకు రెండు లక్షల వరకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే రూ.30కోట్ల వ్యయంతో ఏర్పాట్లు చేపట్టారు. మొదటి రోజు సుమారు ఐదు వేల మంది వరకే భక్తులు పుణ్యస్నానాలు చేసి ఆలయంలో దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా రానున్న భక్తుల సంఖ్య తగ్గినట్లు చెప్పవచ్చు. రానున్న శని, ఆది, సోమవారాల్లో భక్తుల రద్దీ పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. అలాగే వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని వర్షాలు కురిస్తే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఏదీ ఏమైనా ఎండ తీవ్రతకు తోడు వడగాలులు వీయడంతో భక్తజనంతో బందోబస్తులో ఉన్న పోలీసులు, ఇతర శాఖల సిబ్బంది తట్టుకోలేకపోతున్నారు. -
అంత్య పుష్కరాలు ఆరంభం
కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో పుష్కరశోభ వెల్లివిరిసింది. గురువారం తెల్లవారుజామున 5.43 గంటలకు వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ సరస్వతినది అంత్యపుష్కరాలు ఆరంభమయ్యాయి. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి తొలిపుష్కరస్నానం ఆచరించారు. మొదటిరోజు ఎండ తీవ్రతతో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఆయన సతీమణి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు పుష్కరస్నానం ఆచరించారు. – భూపాలపల్లి/ కాళేశ్వరం తొలి పుష్కరస్నానం ఆచరించిన కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి ఎండతో తొలిరోజు భక్తుల పుష్కరస్నానాలు అంతంతే.. -
రాజీవ్గాంధీ ఆశయ సాధనకు పాటుపడాలి
● డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ మహబూబాబాద్ రూరల్ : దేశ సమగ్రత, శాంతి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు పాటుపడాలని డీసీసీ అధ్యక్షురా లు భూక్య ఉమ అన్నారు. రాజీవ్ గాంధీ 35వ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో గురువారం ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉమ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ వర్ధంతిని దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తున్న నేపథ్యంలో ప్రతి భారతీయుడు హింసకు వ్యతిరేకంగా, శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. నాయకులు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు . టీపీసీసీ ఎస్టీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ గుగులోతు వెంకట్ నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోత్ జ్యోతి, కౌన్సిలర్లు భాస్కర్, బొల్లు రాజు, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
స్నేహం..
అమ్మమ్మ చెప్పిన కథ ఒక రోజు ఇద్దరు స్నేహితులు పట్టణంలో ఉన్న వారి బంధువుల ఇంటికి వెళ్తున్నారు. అది అడవి మార్గం. దారిలో వారికి ఒక ఎలుగుబంటి కనిపించింది. దానిని చూసి పరుగెత్తుకుంటు ఒక చెట్టువద్దకు చేరారు. ఒకడు చెట్టు పైకి ఎక్కాడు. రెండో వానికి చెట్టు ఎక్కడం రావడం లేదు. రెండో వాడు వెంటనే ఒక ఉపాయం ఆలోచించి కదలకుండా కిందే పడుకున్నాడు. ఇంతలో ఎలుగుబంటి రానే వచ్చింది. శవంలా పడుకున్న వానిని వాసన చూసి శవమని వెళ్లిపోయింది. ఎలుగుబంటి దూరంగా వెళ్లిపోయిన తర్వాత చెట్టెక్కిన వాడు దిగి పడుకున్న వాని దగ్గరకు వచ్చి ‘మిత్రమా ఆ ఎలుగుబంటి నీ చెవిలో ఏం చెప్పింది’అని అడిగాడు. దానికి సమాధానంగా రెండో వాడు ‘ఆపదలో ఉన్న మిత్రుడికి సహాయపడని వానితో స్నేహం చేయరాదు అని చెప్పింది’అన్నాడు. అది విన్న మిత్రుడు సిగ్గుతో తల దించుకున్నాడు. –ఆత్మకూరు నీతి: ఆపదలో ఆదుకున్న వాడే నిజమైన మిత్రుడు -
వరంగల్ కోట అద్భుతం..
మేము చూసిన చారిత్రక ప్రదేశం..వరంగల్లోని పురాతన కాకతీయుల కోట బాగుందని డోర్నకల్లోని సాయినగర్కు చెందిన విద్యార్థులు చెబుతున్నారు. సాయినగర్కు చెందిన 5, 6, 7వ తరగతి చదువుతున్న సాత్విక, రిత్విక్, అక్షిత, అరుష్, సాహిత వేసవి సెలవుల్లో ఇటీవల వరంగల్లోని కోటను సందర్శించారు. కోటలోని వివిధ చారిత్రాక కట్టడాలను సందర్శించారు. కోటతో పాటు ఖుష్మహల్ నిర్మాణ శైలి ప్రాధాన్యం గురించి తెలుసుకున్న విద్యార్థులు.. వరంగల్ కోట అద్భుతంగా ఉందని తెలిపారు. –డోర్నకల్ -
మందగించిన తునికాకు సేకరణ!
బయ్యారం: ఏజెన్సీ ప్రాంత ప్రజలకు యాసంగి పంటగా పేరున్న తునికాకు సేకరణపై కూలీలకు ఆసక్తి తగ్గింది. ఒకప్పుడు కుటుంబం మొత్తం తునికాకు సేకరణ పనుల్లో నిమగ్నం అయ్యే పరిస్థితి ఉండగా ఇప్పుడు గ్రామాల్లో ఆ పరిస్థితి కానరావడం లేదు. దీంతో బయ్యారం అటవీశాఖ పరిధిలో బయ్యారం, గార్ల మండలాల్లో ఉన్న మూడు యూనిట్ల పరిధిలో గతంలో 2500మంది కార్మికులు ఆకు సేకరించగా ఈ ఏడాది 1300 మంది కార్మికులు తునికాకు సేకరణలో పాల్గొన్నారు. ఈయూనిట్ల పరిధిలో 28లక్షల కట్టల సేకరణ లక్ష్యంతో ఈనెల 2నుంచి తునికాకు సేకరణ పనులు ప్రారంభం కాగా కల్లాల మూసివేత వరకు 10.50లక్షల కట్టలను కార్మికులు సేకరించారు. పెరగని తునికాకు.... తునికాకు ఏపుగా పెరిగేందుకు గతంలో కార్మికులు అటవీప్రాంతంలో మోడెం కొట్టేవారు. ఇలా మోడెం కొట్టడం వల్ల తునికాకు ఏపుగా పెరిగి అవసరం మేరకు లభ్యం అయ్యేది. అయితే మోడెం పనులు చేయటం వల్ల అడవిలో అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయని అటవీశాఖాధికారులు మోడెం కొట్టే పనులను నిలుపుదల చేశారు. దీంతో తునికాకు దొరకక కూలీలు పనికి వెళ్లలేని పరిస్థితి వచ్చింది. మొగ్గు చూపని కార్మికులు.. ఏజెన్సీలో గతంలో వానాకాలం పంట తరువాత యాసంగిలో ఎలాంటి పంటలు పండేవి కావు. దీంతో వానాకాలం పంటలసాగు, పిల్లల చదువు ఖర్చులకు కుటుంబసభ్యులు మొత్తం తప్పనిసరిగా తునికాకు సేకరణ పనులకు వెళ్లారు. అయితే కొన్ని సంవత్సరాలుగా ఏజెన్సీలో పంటలసాగుకు నీటివనరులు ఏర్పడటంతోపాటు ఎన్ఆర్ఈజీఎస్ పనులు అందుబాటులో ఉండటంతో తునికాకు సేకరణ జరిపే కూలీల సంఖ్య ప్రతి ఏడాది తగ్గుతూ వస్తుంది. దీనికి తోడు ఎండల ప్రభావం అధికంగా ఉండటం వల్ల కూలీలు సేకరణకు వెళ్లడానికి వెనకాడుతున్నారు. బయ్యారం అటవీరేంజ్ పరిధిలో ఉన్న కంబాలపల్లి–ఏ, కంబాలపల్లి–బి, కంబాలపల్లి–సీ యూనిట్ పరిధిలోమొత్తం 60 తునికాకు సేకరణ కల్లాలు ఉండగా ఈ ఏడాది 23 కల్లాల్లోనే తునికాకు సేకరణ జరిగింది. యాసంగి పంటలు, ఎన్ఆర్ఈజీఎస్, ఎండల ప్రభావమే కారణం అంటున్న అధికారులు కట్టల సేకరణకు సగానికి పడిపోయిన కూలీల సంఖ్య -
గంజాయి పట్టివేత.. ఐదుగురిపై కేసు
నెల్లికుదురు: అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టుకుని స్వాధీనం చేసుకుని, వాహనం సీజ్ చేసిన సంఘటన మండల కేంద్రంలోని ఎంకేఆర్ గార్డెన్ సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుది. బుధవారంఎస్సై చిర్ర రమేష్ బాబు కలిసి కేసముద్రం సీఐ సత్యనారాయణ వివరాలను వెల్లడించారు. ఈనెల 19న రాత్రి ఎస్సై చిర్ర రమేష్బాబు పోలీసు సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న కారును ఆపి సోదాలు చేశారు. రూ.1,19,750 విలువ చేసే 2.395 కిలోల ఎండు గంజాయి ఉన్నట్లు గుర్తించామన్నారు. వారిని విచారించగా నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చిన్న కొత్తపల్లి గ్రామానికి చెందిన ఏదుల రాజ్కుమార్, మహబూబ్నగర్ జిల్లా అడ్డకల్ మండలం పాన్నకల్ గ్రామానికి చెందిన మాలెగోని ఆంజనేయులు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం దేహాల్గం గ్రామానికి చెందిన రామ్గోని రాజేష్, రాజ్, భద్రాచలానికి చెందిన రాజేష్ అని తెలిపరాఉ. ఈ ఐదుగురిపై కేసు నమోదు చేసి ముగ్గురుని అరెస్ట్ చేయగా ఇద్దరు రాజ్, రాజేష్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. సీఐ సత్యనారాయణ, ఎస్సై చిర్ర రమేష్ బాబు, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
కొనుగోలు కేంద్రాల్లో అవినీతిని అరికట్టాలి
మహబూబాబాద్: తేమ, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, కొనుగోలు కేంద్రాల్లో అవినీతిని అరికట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ కె.అనిల్కుమార్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఇబ్బందులు పెడుతున్న అఽధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేఽశారు. క్వింటాల్కు ఐదునుంచి పది కేజీలు తరుగు తేమ పేరుతో రైతులకు నష్టం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రామచంద్రరావు,. మహేష్, సతీష్, హిందూ భారతి, రేష్మా, తదితరులు పాల్గొన్నారు. మంత్రిని కలిసిన ఎమ్మెల్యే గార్ల: మండలంలోని రాంపురం నుంచి గుండ్రాతిమడుగు వరకు డబుల్ రోడ్డు బీటీ రహదారి నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని రోడ్డు ప్రతిపాదనల కాపీని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని బుధవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య కలిసి అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో పీఏసీఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్, ఎస్కె బుడాన్ ఉన్నారు. గుర్తూరులో గంగమ్మ జాతర తొర్రూరు రూరల్: మండలంలోని గుర్తూరు గ్రామంలో గంగపుత్ర సంఘం వారి ఆధ్వర్యంలో గంగమ్మ జాతరను కనుల పండువగా బుధవారం జరుపుకున్నారు. గంగపుత్ర కులస్తులంతా కుటుంబ సమేతంగా జలబిందెలతో వెళ్లి విగ్రహాలను శుద్ధి చేసి, డప్పుచప్పళ్లు, ఆటపాటలతో నృత్యాలు చేస్తూ ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో పిల్లి నాగరాజు, పిల్లి వెంకన్న, సింగరం కుమార్, సింగరం శ్రీనివాస్, సింగరం చందర్, సింగరం మురళి, పిల్లి ఐలయ్య, పిల్లి శ్రీను, సింగరం రాజు, పిల్లి ఉప్పన్న, సత్తయ్య, దయాకర్, రమేష్ పాల్గొన్నారు. చేపల వేటకు వెళ్లి విద్యుదాఘాతంతో మృతి డోర్నకల్: మండలంలోని బూరుగుపాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చేపలవేటకు వెళ్లి విద్యుదాఘాతంతో మృతిచెందాడు. బూరుగుపాడుకు చెందిన మాటలురాని చెరుకుపల్లి ఎర్రయ్య(40) బుధవారం మరో నలుగురితో కలిసి గ్రామ సమీపంలోని వాగు వద్దకు చేపల వేటకు వెళ్లాడు. విద్యుత్ తీగతో నీటిలో చేపలు పడుతున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. సీఐ చంద్రమౌళి ఆదేశాల మేరకు ఎస్సై వంశీధర్ ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అత్యాచారయత్నం.. కేసు నమోదు తొర్రూరు రూరల్: ఓ బాలికపై అత్యాచారయత్నం చేసిన ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్రెడ్డి బుధవారం తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తమ ఇంటి ముందు ఉన్న మామిడి చెట్టు వద్దకు వెళ్లి కిందపడిన మామిడి పండ్లు తీసుకుంటుంది. ఈక్రమంలో పున్నం నర్సయ్య అనే వ్యక్తి బాలికతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేసినట్లు తెలిపారు. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. కళాకారులను ఆదుకోవాలినెహ్రూసెంటర్: తెలంగాణ ఉద్యమంలో తమ పాటలు ద్వారా మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన తెలంగాణ కళాకారులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి, ప్రజానాట్య మండలి రాష్ట్ర సహాయ కార్యదర్శి కేతరాజు ఉప్పలయ్య అన్నారు. సంఘం జిల్లా మహాసభ బుధవారం వీరభవన్లో నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు కోసం కృషి చేసిన కళాకారులను ఆదుకోవాలని సూచించారు. హైదరాబాద్ ఈనెల 25, 26న జరిగే రాష్ట్ర మహాసభలకు జయప్రదం చేయాలని పిలుపిచ్చారు. కార్యక్రమంలో అజయ్ సారథి రెడ్డి, కట్లోజు పాండురంగాచారి, కేదాసు రమేష్, అజ్మీర వేణు పాల్గొన్నారు. -
పిల్లలపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలి
మహబూబాబాద్ అర్బన్: పిల్లలపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గుమ్ముడు ప్రభుత్వ బాలికల పాఠశాలో బుధవారం ప్రత్యేక అవసరాల విద్యార్థులకు సహాయ ఉపకరణాల పంపిణీ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జూన్లో సీఎం రేవంత్రెడ్డి మహబూబాబాద్ బొద్దుగొండ గ్రామంలో ఇంటిగ్రెటెండ్ స్కూల్ను రూ.200కోట్లను శంకుస్థాపనను చేయనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో 98మంది ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించి రూ.8లక్షల 56వేలతో వారికి వీల్చైర్లను పంపిణీ చేశామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. మేనరికం వివాహలతో పుట్టబోయే పిల్లలు దివ్యాంగులుగా పుడుతున్నారని, దీంతో మేనరికం వివాహాలకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ సత్యనారాయణమూర్తి, మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి, వార్డు కౌన్సిలర్లు, కాటభాస్కర్, పుచ్చకాయల సరిత, నిమ్మల మాధవి, బోల్లు రాజు, గాడిపల్లి చరణ్, దిలీప్, ఏసీజీఈ మందుల శ్రీరాములు, ఎంఈఓలు వెంకటేశ్వర్లు, బుచ్చయ్య పాల్గొన్నారు. ఎమ్మెల్యే మురళీనాయక్ -
బాధిత కుటుంబానికి ఆర్థికసాయం
కేసముద్రం: మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన గద్దల ప్రభాకర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఈమేరకు గ్రామ పంచాయతీ పాలకవర్గం, సిబ్బంది కలిసి బుధవారం బాధిత కుటుంబానికి రూ.25వేల ఆర్థికసాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఏర్పుల సునీతకుమారస్వామి, ఉప సర్పంచ్ ఆవుల ఐలయ్య, కార్యదర్శి వెంకన్న, వార్డు సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. మృతుడి బాల్య మిత్రులు రూ.18500 అందజేశారు. పెద్దవంగర: స్నేహితుడి తల్లి మృతి చెందడంతో విషాదంలో ఉన్న కుటుంబానికి చిన్ననాటి మిత్రులు అండగా నిలిచి ఆర్థికసాయం అందజేశారు. మండలంలోని వడ్డెకొత్తపల్లి గ్రామానికి చెందిన తడకమల్లు యాకయ్య తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న యాకయ్య చిన్ననాటి స్నేహితులు బుధవారం కలిసి కుటుంబానికి రూ.23వేల నగదును అందజేశారు. -
సంక్షిప్త సమాచారం
విద్యార్థి ఉద్యమకారులకు ప్రభుత్వం మేలు చేకూర్చాలి తొర్రూరు: ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన విద్యార్థి ఉద్యమకారులకు ప్రభుత్వం మేలు చేకూర్చాలని జేఏసీ ప్రతినిధులు కోరారు. డివిజన్ కేంద్రంలోని విశ్రాంతి భవనంలో బుధవారం తెలంగాణ విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో రాయిశెట్టి ఉపేందర్, పల్లె కుమార్, పంతం సురేందర్, బందు మహేందర్, వెల్తూరి మల్లేశం, ఎండీ అమీర్, వెలిశాల శ్యామ్ పాల్గొన్నారు. మాజీ మంత్రి పరామర్శ మరిపెడ రూరల్: మరిపెడ మండలం గుర్రప్పతండాకు చెందిన బీఆర్ఎస్ నాయకులు బానోతు వెంకన్న మాతృమూర్తి బానోతు రంగమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం రంగమ్మ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. వడదెబ్బతో వృద్ధుడికి అస్వస్థత పెద్దవంగర ఎండ తీవ్రతకు తాళలేక ఓ వృద్ధుడు పొలంలోనే కుప్పకూలిన సంఘటన మండల పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. 108 సిబ్బంది ఈఎంటీ వనజ, పైలట్ నవీన్ తెలిపిన వివరాల ప్రకారం. మండల కేంద్రానికి చెందిన కుక్కల వీరమల్లు రోజువారి వలే తమ వ్యవసాయ పనుల నిమిత్తం ఉదయం పొలం వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నం పొలంలో ఆకస్మాత్తుగా కుప్పకూలి పోయాడు. గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. అప్రమత్తమైన అంబులెన్స్ సిబ్బంది హూటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుడికి అవసరమైన ప్రాథమిక చికిత్స అందించి, పరిస్థితిని చక్కదిద్దుతూ వెంటనే తొర్రూరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం హన్మకొండకు రెఫర్ చేశారు. శంకర్నాయక్ జన్మదిన వేడుకలు నెహ్రూసెంటర్/నెల్లికుదురు/ఇనుగుర్తి/ మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేశారు. పలు చోట్లు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కనీస సౌకర్యాలు కల్పించాలి గార్ల: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి జి.సక్రు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. బుధవారం గార్ల సమీపంలోని గండిచెరువు, అప్పసముద్రం చెరువుల్లో ఉపాధి పనులను ఆయన సందర్శించారు. మంట వేడిమికి వ్యక్తి మృతి నర్సింహులపేట: మండలంలోని రామన్నగూడెం గ్రామంలో బుధవారం బూరగడ్ల వెంకన్న(54) వ్యవసాయ పొలం వద్ద గట్లకు మంట పెడుతున్న క్రమంలో మంటల వేడిమికి అపస్మారకసిత్థిలోకి వెళ్లి పడిపోయాడు. గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే వెంకన్నను చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్ష చేసి మృతి చెందినట్లు తెలిపారు. సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం కురవి: నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం వరంగా మారిందని కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు నారాయణ రాజేందర్కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో లబ్ధ్దిదారులకు టౌన్ సీఎంఆర్ఎఫ్ పథకం చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎర్ర నాగేశ్వర్రావు, బాలగాని శ్రీనివాస్, మోహన్రావు పాల్గొన్నారు. మరిపెడ రూరల్: సీఎంఆర్ఎఫ్ పేదలకు వరంఅని కాంగ్రెస్ పార్టీ ఎల్లంపేట గ్రామ అధ్యక్షుడు గండి వీరభద్రం అన్నారు మండలంలోని ఎల్లంపేటలో పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు బుధవారం అందజేశారు. -
అగ్నిప్రమాదంలో తోటలు దగ్ధం
డోర్నకల్: మండలంలోని అమ్మపాలెం గ్రామ శివారులో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో నిమ్మ, మామిడి, బొప్పాయి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గ్రామ శివారులో ఓ రైతు మొక్కజొన్న పంటకు సంబంధించి పంట కొయ్యలకు నిప్పంటుకుని సమీపంలోని తోటలకు మంటు ఎగబాకాయి. నున్న రమణకు చెందిన నిమ్మ, మామిడి తోటల్లోని చెట్లు మంటలకు కాలిపోయాయి. పక్కనే ఉన్న రైతు సాంక్రియాకు చెందిన బొప్పాయి తోట చుట్టూ మంటలు చెలరేగడంతో బొప్పాయిచెట్లతోపాటు పైపులు దగ్ధమయ్యాయి. మంటలతో రైతు వస్రాంకు చెందిన క్వింటా డ్రిప్ పైపులు, రమేష్కు చెందిన 60పైపులతో పాటు మూడెకరాల్లో డ్రిప్పులు దగ్ధమయ్యాయి. డోర్నకల్ నుంచి ఫైరింజన్ ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. ఫత్తేపురంలో అగ్నిప్రమాదం తొర్రూరు రూరల్: మండలంలోని ఫత్తేపురం గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం బుధవారం చోటుచేసుకుంది. గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో సుమారు 300వందల ఎకరాల విస్తీర్ణంలో మంటలు వ్యాప్తించడంతో విద్యుత్ వైర్లు, పైపులు, గడ్డి మోపులు మంటల్లో కాలిపోయాయి. సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని బాధిత రైతులు అశోక్, రమేష్ కోరారు. -
పుష్కరస్నానాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
● దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ హన్మకొండ కల్చరల్: కాళేశ్వరం త్రివేణి సంగమంలో నేటినుంచి జరిగే సరస్వతి అంత్య పుష్కరాల్లో పాల్గొనే భక్తులకు అన్ని సౌకర్యాలతో ఏర్పాట్లు పూర్తిచేశామని దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ మేరకు బుధవారం భద్రకాళి దేవాలయాన్ని మంత్రి సందర్శించారు. ఆలయ ఈఓ రామల సునీత, ప్రధానార్చకులు భద్రకాళి శేషు, ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్ బండారు శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు మంత్రిని ఘనంగా స్వాగతించారు. ఆదిశంకరులు, వల్లభగణపతి, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు జరుపుకున్నారు. మంత్రికి అర్చకులు తీర్థప్రసాదాలు, మహాదాశీర్వచనం అందజేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ గురువారం శ్రీశంకర విజయేంద్ర సరస్వతిస్వామీజీ పూజలు నిర్వహించి పుష్కరస్నానాలు ప్రారంభిస్తారని తెలిపారు. ప్రతిరోజూ సాయంత్రం గంగాహారతి, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని, ప్రజలు ప్రశాంతంగా పుష్కరస్నానాలు ఆచరించాలని కోరారు. -
టాలెంట్ హంట్ క్రికెట్ ఎంపికలు
మహబూబాబాద్ అర్బన్: గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారుల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టాలెంట్ హంట్ క్రికెట్ పేరుతో ఎంపికలను నిర్వహిస్తుందని జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.అజయ్సారథిరెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని సమ్మర్ క్యాంప్లో బుధవారం క్రికెట్ క్రీడాకారులతో సమావేశం నిర్వహించారు. 16నుంచి 36 సంవత్సరాల వరకు గల క్రికెట్ క్రీడాకారులకు ఓపెన్ ఎంపికలు నిర్వహించి అందులో పాల్గొనటానికి ఆన్లైన్ ద్వారా అవకాశం కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో క్రికెట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కోచ్ మెతుకు కుమార్, హాయ కోచ్ వినయ్, సాద్విత్రెడ్డి, సీనియర్ క్రీడాకారులు శ్రావణ్, అనిర్వేశ్, పరమేశ్వర్ పాల్గొన్నారు. -
హామీలు విస్మరించిన పాలకులు
గార్ల: ఎన్నికల హామీలను విస్మరించిన పాలకులకు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు జి. నాగయ్య అన్నారు. బుధవారం గార్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలు గడిచినప్పటికీ హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నారు. మొక్కజొన్న, వరిధాన్యం రైతులు బస్తాల కొరత వల్ల ధాన్యం కాంటాలు కాకపోవడంతో రైతులు నెలల తరబడి వేచి చూడలేక బయట ప్రైవేటు దళారులకు తక్కువ ధరకు అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, కందునూరి శ్రీనివాసరావు, మండల కార్యదర్శి అలవాల సత్యవతి, పెద్దవెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
పుష్కర స్నానం.. సకల పాపహరణం!
సరస్వతి నవరత్న మాల హారతి ప్రత్యేకం కాళేశ్వరం: సరస్వతీనది అంత్యపుష్కరాల్లో ప న్నెండు రోజుల పాటు ప్రతీ రోజు రాత్రి 7:30 గంటలకు సరస్వతి నవరత్న మాల హారతి కార్యక్రమాన్ని కాశీ పండితులు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ప్రయాగ్రాజ్లో గంగా హారతిలో అనుభవం కలిగిన పండితులను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఈ హారతి దాదాపు 45 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఇందులో తొమ్మిది ప్రత్యేక హారతులు ఉన్నాయి. ఇవి సరస్వతి నవరత్నమాల స్తోత్రంతో సాగుతాయి. ప్రతీ హారతికి ఆధ్యాత్మిక, సామాజిక ప్రయోజనాలు ఉన్నట్లు పండితులు తెలిపారు.కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని గోదావరి, ప్రాణహిత నదులు, అంతర్వాహిని సరస్వతీనది మళ్లీ పుష్కర శోభ సంతరించుకుంది. బృహస్పతిలోకి మిథునరాశి ప్రవేశించినప్పుడు గతేడాది మే 15 నుంచి 26వ తేదీ వరకు 12 రోజులు సరస్వతీనది పుష్కరాలు ఘనంగా నిర్వహించారు. ఏడాది చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరాలుగా పిలుస్తారు. నేటి(గురువారం) నుంచి జూన్ 1వతేదీ వరకు సరస్వతీనది అంత్య పుష్కరాలు జరుగనున్నాయి. పిండ ప్రదానం: సాధారణంగా నదీస్నానాల్లో తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధ కర్మలు చేసి పితృదేవతలను తృప్తి పరిచి వారి ఆశీస్సులు అందుకోవడం శుభప్రధమని విశ్వసిస్తారు. నదికి వాయినాలు.. సుమంగళిగా జీవితాంతం ఉండాలని కోరుకుంటూ ఆడపడచులు పుష్కరాల సందర్భంగా నదీమాతల్లికి వాయినాలు సమర్పిస్తారు. చీర, రవిక, గాజులు, పసుపు, కుంకుమ, పుస్తె, మట్టెలను పూజించి నదిలోకి జారవిడుస్తారు. బ్రాహ్మణ జంటలు, ముతైదువులకు వాయినాలు అందజేసి ఆశీస్సులు తీసుకుంటారు. వీఐపీలకే స్పర్శ దర్శనం.. రూ.100 టికెట్ ద్వారా భక్తులు నేరుగా ప్రత్యేక దర్శనానికి వెళ్లొచ్చు. సాధారణ భక్తులు గర్భగుడి బయ టి నుంచి మండపం గుండా ఎత్తు మెట్ల నుంచి స్వా మివారిని దర్శించుకోవాలి. వీఐపీలకు స్పర్శ దర్శనానికి అనుమతి ఉంది. వేర్వేరుగా క్యూలైన్లు నిర్మించారు. ప్రత్యేకంగా ఆలయంలో 85 మంది వరకు అర్చక, డోలు, సన్నాయి, ఉద్యోగులను ఏర్పాటు చే శారు. 200మంది వరకు స్కౌట్స్, ఎన్సీసీ విద్యార్థు లు సేవలో పాల్గొనున్నారు. సామాన్య భక్తులకు 86 గదుల్లో 40 నాన్ ఏసీవి ఇవ్వనున్నారు. మిగతావి అధికారులకు కేటాయించారు. టెంట్సిటీలో డీలక్స్ రూమ్స్ రూ.3 వేలు, ప్రీమియం రూమ్స్ రూ.4వేలు, లగ్జరీ రూమ్స్ రూ.6 వే లు 24 గంటలకు అద్దెకు ఇవ్వనున్నారు. త్రివేణి సంగమం వ్యూ ఓంకార హారతి – సర్వ దోష నివారణ నాగ హారతి –సర్పదోష నివారణ, ఆరోగ్య ప్రదానం పంచ హారతి– దీర్ఘాయుష్షు సూర్య హారతి – రోగ నివారణ, ఆరోగ్య సమృద్ధి చంద్ర హారతి – పాడి పంటల పుష్టి, మనశాంతి నంది హారతి – ధర్మం, శక్తి, విద్య దానం సింహ హారతి – నాయకత్వం, ధైర్యం ప్రసాదనం కుంభ హారతి – సంపద, సుఖ ప్రాప్తి నక్షత్ర హారతి – నిర్మల మనస్సు, కీర్తి పొందడానికి.జలమే ఆధారం ఆది పుష్కరానికి ఎంతైతే పుణ్యమో.. అంత్య పుష్కరానికి అంతే పుణ్యం సరస్వతీనది అంత్యపుష్కరాలకు అంతా సిద్ధం..నదీస్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మాగ స్నానాలు, మంగళ స్నానాలు హిందూ సంప్రదాయంతో ముడిపడ్డాయి. అలాగే, తీర్థయాత్రలు అని పుణ్యక్షేత్రాల దర్శనం కూడా నీటితో ముడిపడిందే. శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు జలంతో ముడిపడి ఉన్నాయి. నదీ తీరంలో పితృకర్మలాచరించడం మోక్షదాయకమని పెద్దలు పేర్కొంటున్నారు. పితుృరులను ఉద్ధరించడానికి భగీరఽథుడు గంగానదిని భూమికి తీసుకొచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. నది స్నానాల్లో పుష్కర స్నానం పుణ్యఫలమని భక్తుల విశ్వాసం. -
వేసవి తాపానికి తాళం..
మేము చేసిన మంచి పని.. నేను గీసిన బొమ్మ..వేసవి శిక్షణ.. భవిష్యత్ రక్షణ ● తాటి ముంజలతో వేడి నుంచి ఉపశమం వేసవిలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇంటి నుంచి కాలు బయటపెట్టలేని పరిస్థితి. ఇదే సమయంలో ఎండవేడిమికి గొంతు ఆరిపోతోంది. ఫలితంగా ఐస్క్రీమ్, కూల్డ్రింక్స్ తాగాల్సి వస్తోంది. అయినా దాహం తీరని పరిస్థితి. అయితే గ్రామాల్లో పలువురు చిన్నారులు మాత్రం చల్లదనం కోసం తాటి వనం బాట పడుతున్నారు. అక్కడ లభించే ప్రకృతి ప్రసాదం తాటి ముంజలు తింటూ వేసవి తాపం నుంచి ఉపశమనం పొందుతున్నారు. –బయ్యారం/ఇనుగుర్తి -
జాబ్ క్యాలెండర్ అమలుచేస్తే మరింత ఆనందం
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలకు పదేళ్ల వయోపరిమితి పెంచడం శుభపరిణామం. జీఓలో ఈ పరిమితి ఒక్క సంవత్సరానికే పరిమితం చేయడం నిరుద్యోగులకు అన్యాయమే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్నూ జారీ చేయలేదు. మరీ ఒక సంవత్సరంలో ఎప్పుడు నోటిఫికేషన్లు వేస్తారు? ఎలా భర్తీ చేస్తారు. జీఓలో వయోపరిమితి కాలాన్ని మరో ఏడాది పెంచడంతో పాటు జాబ్ క్యాలెండర్ను వెంటనే అమలు చేస్తే మరింత ఆనందం. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా 2 లక్షల పోస్టులను భర్తీ చేయాలి. –శ్రీరామోజు సురేందర్, నిరుద్యోగి, మహబూబాబాద్ -
నిప్పుల కొలిమి..
పట్టణం గరిష్ట కనిష్ట మహబూబాబాద్ 44 27 తొర్రూరు 43 32 కేసముద్రం 44 31 డోర్నకల్ 43 32 మరిపెడ 44 29సాక్షి, మహబూబాబాద్: భానుడికి కోపం వచ్చింది. మూడు రోజులుగా ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం ఎండ తీవ్రత మరింత పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యా రు. ఉదయం తొమ్మిది గంటలకే ఇళ్లనుంచి బయటకు రాలేదు. 10గంటలకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. సాయంత్రం ఆరుగంటల తర్వా త కూడా ఎండవేడి తగ్గకపోవడంతో జ్యూస్ సెంటర్లు, సోడాబండ్ల వద్ద క్యూ కట్టారు. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ కేంద్రం నుంచి హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు భయపడుతున్నారు. ఉదయం నుంచే ఉగ్రరూపం.. జిల్లాలో బుధవారం ఉదయం 10గంటల వరకే ఎండ తీవ్రత అధికం కావడంతో ప్రధాన కూడళ్లు, రహదారులు నిర్మానుష్యంగా మారాయి. మానుకోట పట్టణంలోని కోర్టు, పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, మదర్ థెరిస్సా సెంటర్, కొత్తబస్టాండ్, జింకల సెంటర్, వైఎస్సార్ సెంటర్ ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారాయి.తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం మున్సి పాలిటీల్లో కూడా ప్రధాన రహదారుల్లో జనం కనిపించలేదు. రోడ్డు పక్కన డబ్బాలు, గంపల్లో పం డ్లు, కూరగాయలు, తోపుడు బండ్లు, బడ్డీకొట్లు, టీకొట్టు వ్యాపారులు ఎండ తీవ్రతను చూసి ఇళ్లకు వెళ్లిపోయారు. ఉపశమనం కోసం.. ఎండ తీవ్రత అధికం కావడంతో వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఐస్క్రీమ్, కూల్ డ్రింక్ షాపులు, సోడా బండ్లు, జ్యూస్ పాయింట్ల వద్ద గుంపులు గుంపులుగా కనిపించారు. అదే విధంగా కూలర్స్, ఫ్యాన్లు, ఏసీల మరమ్మతులతో పాటు కొత్తవి కొనుగోలు చేయడం కనిపించింది. బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లోని షాపుల్లో సేల్స్ పెరిగాయని వ్యాపారస్తులు చెప్పారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వైద్యారోగ్యశాఖ హెల్ప్లైన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, చలివేంద్రాలు, బస్టాండ్లు, జనసందోహ ప్రాంతాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. మరిన్ని రోజులు ఇలాగే.. మూడు రోజులుగా నిప్పుల కొలిమిలా ఎండల తీవ్రత ఉంది. ఇదే పరిస్థితి మరికొద్ది రోజులు ఉంటుందని వాతావణ కేంద్రం నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మహబూబాబాద్ ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎండలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సహాయక చర్యలు చేపలట్టాని కోరుతున్నారు. అయితే వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, బాలింతల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. జాగ్రత్తగా ఉండాలి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసరమైతేనే బయటకు రావాలి. సాయంత్రం 6గంటల వరకు ఇంట్లోనే ఉండేలా చూసుకోవాలి. ఉదయం ఎండకంటే సాయంత్రం ఎండ ప్రమాదకరం. బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. మంచినీరు, కొబ్బరి బొండాలు, ఓఆర్ఎస్ వంటివి తీసుకోవాలి. లిక్విడ్స్ ఉన్న ఆహారం తీసుకుంటే మంచిది. – శ్రీనివాస్, సూపరింటెండెంట్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, మహబూబాబాద్ జిల్లాలో భానుడి భగభగ ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి ఉదయం 10గంటలకే రోడ్లన్నీ నిర్మానుష్యం ఎండతాపం నుంచి రక్షణకు ఉరుకులు, పరుగులు -
బొడ్లాడలో విషాదఛాయలు..
దంతాలపల్లి : నిన్నటి వరకు స్నేహితులతో సరదాగా తిరుగుతూ, కు టుంబాల కోసం కష్టపడి న ముగ్గురు యువకులు క్షణాల్లో శవాలుగా మారడంతో మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బొడ్లాడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే ప్రమాదం మూడు కుటుంబాల ఆశలను చిదిమేసింది. చిన్నారుల కళ్లలో తండ్రి కోసం వెతుకులాట, నవ వధువు కళ్లలో ఆరని కన్నీళ్లు, తల్లిదండ్రులో గుండెల్లో తీరని శోకం మిగిల్చింది. ఈ దుర్ఘటనతో గ్రామమంతా దుఖఃసాగరంలో మునిగిపోయింది. మంగళవారం రాత్రి తొర్రూరు మండలం వెలికట్టె గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బొడ్లాడ గ్రామానికి చెందిన లింగమల్ల సతీశ్(28), అల్లి సంపత్ (23), పొట్టకార్ల వంశీ(21) మృతి చెందారు. దీంతో గ్రామం గుండెలవిసేలా రోదించింది. ఖమ్మం– వరంగల్ జాతీయ రహదారిపై బైక్పై వెళ్తున్న ముగ్గురు మరో వాహనాన్ని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో సతీశ్, సంపత్ అక్కడికక్కడే మృతి చెందారు. వంశీని 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. నిమిషంలో వ్యవధిలో ముగ్గురు కనిపించని లోకాలకు తరలడంతో గ్రామంలో తీరని విషాదం నెలకొంది. గ్రామస్తులను కంట తడిపెట్టించిన సతీశ్ మృతి.. లింగమల్ల సతీశ్ మృతి గ్రామస్తులను కంటతడి పె ట్టించింది. ఇప్పటికే భార్యను కోల్పోయిన సతీశ్ త న కూతురు సిరిచందన, (12 ఏళ్ల వయస్సు) కుమారుడు బిట్టు(10 ఏళ్ల వయస్సు)ను తల్లి లేని లోటు తెలియకుండా పెంచుతున్నాడు. కూతురు ఆ గ్రామ పాఠశాలలోనే ఆరు, కుమారుడు బిట్టు ఐదో తరగతి పూర్తి చేశారు. తల్లి లేకున్నా పిల్లలు ఆనందంగా ఉండాలని సతీశ్ కష్ట పడి పని చేసి వారిని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల కూతురుకు శారీ ఫంక్షన్ ఘనంగా చేశాడు. అయితే రోడ్డు ప్ర మాదంలో తండ్రి మృతి చెందడంతో ఆ పిల్లలు అనాథలయ్యారు. తండ్రి మృతదేహం మందు ఎంజరుగుతుందో తెలియక అమాయకంగా చూస్తున్న ఆ చిన్నారులను చూసి గ్రామస్తులు కన్నీరుపెట్టుకున్నారు. కుటుంబానికి పెద్దదిక్కు సంపత్.. అల్లి సంపత్ తండ్రి కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందడంతో తానే ఆ కుటుంబానికి పెద్దదిక్కుగా ఉ న్నాడు. తల్లితో కలిసి కూలి చేస్తూ వీలైనప్పుడు ట్రాక్టర్ డ్రైవర్గా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నా డు. తల్లి సైదమ్మ, తమ్ముడు ముఖేశ్, చెల్లి పూజ అ తడిపైనే ఆధారపడ్డారు. ప్రస్తుతం పెద్ద దిక్కపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. పాపం సంధ్య.. కురవి మండలం మాదాపురానికి చెందిన సంధ్య, సంపత్ కొన్నేళ్లుగా ప్రేమించున్నారు. నాలుగు నెల ల క్రితం సంధ్య తన తల్లిదండ్రులను ఎదురించి సంపత్ను వివాహం చేసుకుంది. ఈక్రమంలో పైళ్లె న నాలుగు నెలలకే భర్త మృతి చెందడంతో ఆ నవ వధువు కన్నీళ్లకు అవధులు లేకుండా పోయాయి. దిక్కు తోచని స్థితిలో వంశీ కుటుంబం.. పొట్టకార్ల వంశీ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటున్నాడు. తల్లి సావిత్రి, తండ్రి సుధాకర్తో కలిసి హైదరాబాద్ కూలీ చేస్తూ అండగా ఉంటున్నాడు. ఇటీవల ఇంటికి వచ్చిన వంశీ.. గ్రామంలోనే కూలీతోపాటు ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తున్నాడు. తన తమ్ముళ్ల విష్ణు, ముఖేశ్ కోసం కష్టపడే వంశీ మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. నిన్న, మొన్నటి వరకు కలిసిమొలిసి తిరిగిన ముగ్గురి స్నేహితులు ఒకేసారి మృతి చెందడంతో బొడ్లాడ గ్రామం కన్నీరుమన్నీరుగా విలపిస్తోంది. కాగా, పెద్ద దిక్కులను కోల్పోవడంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్నేహితుల మృతిలో కన్నీరుమున్నీరైన గ్రామం రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం కుటుంబాలకు పెద్ద దిక్కులను దూరం చేసిన దుర్ఘటన -
ఎరువుల డీలర్ల మండల అధ్యక్షుడిగా శ్రీనివాస్
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండల ఎరువులు, పురుగు మందులు, విత్తనాల అసోసియేషన్ అధ్యక్షుడిగా వక్కల శ్రీనివాస్ బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా తీగల ఉపేందర్ రావు, కోశాధికారిగా దూపటి వినయ్ ఎన్నికయ్యారు. అనంతరం మండల ఎరువులు, పురుగు మందులు, విత్తనాల అసోసియేషన్ బాధ్యులు టౌన్ సీఐ ఎల్.రఘుపతిరెడ్డిని మర్యాదపూర్వంగా కలిశారు. పాఠశాల అభివృద్ధికి కృషిమరిపెడ రూరల్: ప్రభుత్వ పాఠశాల అభివృద్ధితోపాటు గిరిజనతండా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పర్కజలతండా సర్పంచ్ బానోతు కొండయ్య అన్నారు. బుధవారం మండలంలోని పర్కజలతండా గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రాథమిక పాఠశాల ప్రహరీ నిర్మాణానికి సర్పంచ్ శంకుస్థాపన చేశారు. -
విద్యార్థులు భవిష్యత్పై దృష్టి సారించాలి
మహబూబాబాద్ అర్బన్: విద్యార్థులు లక్ష్యాలతో భవిష్యత్పై దృష్టి సారించాలని రూరల్ సీఐ ఎన్. అంజలి అన్నారు. జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల ప్రాంగణంలో బుధవారం ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అదంజేశారు. బాలికల జూనియర్ కళాశాలలో 958మార్కులు సాధించిన సుంకరి హిమబిందుకు రూ. 30వేలు, టైన్త్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్ధులకు రూ.1000నగదు అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ వెంకటేశ్వర్లు, వాకర్స్ అధ్యక్షుడు మల్లయ్య, ప్రధాన కార్యదర్శి శంభయ్య, కోశాధికారి మహిపాల్రెడ్డి, గౌరవ అధ్యక్షులు రవీంద్రగుప్త, ఉపాధ్యక్షులు ప్రసాద్, కార్యదర్శి గోవర్ధన్, ఆర్గనైజింగ్ సెక్రెటరి పమ్మిరాజు పాల్గొన్నారు. -
వడదెబ్బతో వృద్ధ్దుడి మృతి
కేసముద్రం: వడదెబ్బతో మహబూబాబాద్ జిల్లా కేసముంద్రం మండలం అర్పనపల్లికి చెందిన వృద్ధుడు నేరెళ్ల సోమయ్య(72) మృతి చెందాడు. సోమయ్య రెండు రోజులుగా ఉపాధి హా మీ పనికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో వడదెబ్బకు గురై మంగళవారం అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబీకులు మానుకోట జనరల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడని కుటుంబీకులు తెలిపారు. మృతుడికి భార్య ఉపేంద్ర ఉంది. ములుగులో పారిశుద్ధ్య కార్మికుడు.. ములుగు రూరల్: వడదెబ్బతో ములుగు మున్సిపాలిటీ పరిధి ప్రేమ్నగర్కు చెందిన పారిశుద్ధ్య కార్మికుడు బోడ సాంబయ్య(45) బుధవారం మృతి చెందాడు. ఉదయం పని ముగించుకుని ఇంటికెళ్లిన సాంబయ్య.. మధ్యాహ్నం మళ్లీ కార్యాలయానికి వచ్చి స్టాఫ్ రూంలో పడుకున్నాడు. చాలా సమయం వరకు బయటకు రాకపోవడంతో సహ కార్మికులు వెళ్లి చూడగా అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో వెంటనే ములుగు జనరల్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. -
మాదక ద్రవ్యాల నియంత్రణే లక్ష్యం
● ఎస్పీ శబరీష్ మహబూబాబాద్ రూరల్ : గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణ లక్ష్యంగా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని ఎస్పీ శబరీష్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు బుధవారం రాత్రి భారీ నాకాబందీ, ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అనుమానాస్పద వ్యక్తులపై పోలీసు అధికారులు, సిబ్బంది ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, అత్యవసర సేవల కోసం జిల్లా పోలీసు కంట్రోల్ రూం నంబర్ 87126 56999, అత్యవసర సహాయం కోసం డయల్ 100కు ఫోన్ చేయవచ్చన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టడం, రౌడీ షీటర్లు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టడం ప్రధాన లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టారన్నారు. కాగా, మహబూబాబాద్ సబ్ డివిజన్ పరిధిలో డీఎస్పీ తిరుపతిరావు, నలుగురు సీఐలు, 18 మంది ఎస్సైలు, 100 మంది పోలీసు సిబ్బందితో 1,985 వాహనాలను తనిఖీ చేయగా నంబర్ ప్లేట్లు లేని 74 వాహనాలను గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టారు. తొర్రూరు సబ్ డివిజన్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక నాకాబందీలో డీఎస్పీ కృష్ణకిశోర్, నలుగురు సీఐలు, 12 మంది ఎస్సైలు పాల్గొని 1,500 వాహనాలను తనిఖీ చేశారు. -
భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్ల ఏర్పాటు
మహబూబాబాద్ రూరల్: దక్షిణ మధ్య రైల్వే శాఖ భక్తులకు ఆధ్యాత్మిక యాత్రను అందించేందుకు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లు ఏర్పాటు చేసిందని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) మేనేజర్ పీ.వీ.వెంకటేష్ అన్నారు. మహబూబాబాద్ రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. మూడు ప్రత్యేక ప్యాకేజీలను భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లను హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈనెల 24న మొదటి విడత, జూన్ 16న రెండవ విడత, జులై 4న మూడో విడత యాత్రల ప్రత్యేక రైళ్లు భక్తులకు సేవలు అందించనున్నారని తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ద్వారా సందర్శించవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో మానిటర్లు సతీష్, ప్రశాంత్, ట్రావెల్ ఏజెంట్లు రేణుకుంట్ల గణేష్, సురేష్ పాల్గొన్నారు. -
ధరల పెంపును ఉపసంహరించుకోవాలి
నెహ్రూసెంటర్: పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వివేకానంద సెంటర్లో ధరల పెరుగుదలపై సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సాదుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల నిత్యావసర సరుకుల రేట్లు పెరిగాయన్నారు. ఆటో, లారీ, బస్సు చార్జీలు పెరిగి సామాన్యుడి జేబు కు చిల్లు పడుతోందన్నారు. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమా ండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సమ్మెట రాజమౌళి, రామ్మూర్తి, బానోత్ వెంకన్న, కుమ్మరికుంట్ల నాగన్న, తోట శ్రీనివాస్, చాగంటి భాగ్యమ్మ, ఎర్ర శ్రీనివాస్, మందుల మహేందర్, లాలయ్య, వార్డు కౌన్సిలర్ బానోత్ బాబు, గౌని వెంకన తదితరులు పాల్గొన్నారు. చేయూత పింఛన్ సర్వే పూర్తి చేయాలి మహబూబాబాద్: చేయూత పింఛన్ సర్వేను త్వరగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిశోర్ ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కిశోర్ సెర్ప్ సీఈఓ దివ్యతో కలసి కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి అధికారులతో పింఛన్ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈసందర్భంగా కిశోర్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనులను కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వీసీలో కలెక్టర్ స్నేహశబరీష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సంక్షేమ హాస్టళ్లకు నూతన భవనాలు నిర్మించాలి మహబూబాబాద్: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు నూతన భవనాలు నిర్మించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జ్యోతిబసు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్కు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా జ్యోతి బసు మాట్లాడుతూ.. శిథిలావస్థలో ఉన్న హాస్టళ్ల భవనాలకు కనీసం మరమ్మతులు చేయించాలన్నారు. సొంత భవనాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలన్నారు. సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించాలన్నారు. మోడల్ స్కూళ్లలో హాస్టళ్లు ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రాకేశ్, వంశీ, ఉపేందర్, వరుణ్, నర్మద, మనోజ్, మౌలానా తదితరులు పాల్గొన్నారు. పుష్కరాల్లో పటిష్ట భద్రత ● భూపాలపల్లి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్కాళేశ్వరం : నేటి నుంచి జూన్ 1వ తేదీ వరకు కాళేశ్వరంలో నిర్వహించనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున, వారికి అసౌకర్యం కలగకుండా పోలీస్ శాఖ తరఫున పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. బుధవారం ఆయన పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి బందోబస్తు ఏర్పాట్లపై వివరించారు. ముందుగా ట్రాఫిక్ నియంత్రణ, ఘాట్ల వద్ద భద్రత, పార్కింగ్ ప్రాంతాలు, హెలిపాడ్ భద్రత, క్యూ లైన్ల నిర్వహణ, పరిశీలించారు. అనంతరం ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ.. పుష్కరాల్లో తప్పిపోయిన వారి సహాయక కేంద్రాలు, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధంగా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలని సూచించారు. పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్, సీసీఎస్ టీమ్స్ ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1,000 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులు పోలీస్ శాఖకు సహకరించి సూచనలు పాటిస్తూ పుష్కరాలను సురక్షితంగా నిర్వహించుకోవాలని కోరారు. -
నోటిఫికేషన్లు ఆలస్యం చేయొద్దు..
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల వయోపరిమితి పెంచడం సంతోషమే. అయితే ఒక ఏడాదికే జీఓను పరిమితం చేయడం సరికాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీల అన్నింటిని గుర్తించి అన్ని నోటిఫికేషన్లు వెంటనే జారీ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల పట్టభద్రులు లక్షల సంఖ్యలో ఉన్నారు. వారి లక్ష్యం నెరవేరాలంటే భారీ నోటిఫికేషన్లు ఇవ్వాలి. ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటుతోంది..ఇంకా జాప్యం చేయొద్దు. –మనుబోతుల మల్లయ్య, ఎంఎస్సీ, బీఈడీ, నెక్కొండ -
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
● కలెక్టర్ స్నేహశబరీష్ మరిపెడ: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కేంద్రంలో ఇప్పటి వరకు వచ్చిన ధాన్యం వివరాలు, ప్రస్తుతం ఉన్న నిల్వ, మిల్లులు, గోదాములకు తరలించిన ధాన్యం వివరాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. గన్నీ సంచులు, టార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలని, లోడింగ్, అన్లోడింగ్లో వేగం పెంచాలని ఆదేశించారు. డీఆర్డీఓ మధుసూదన్రాజు, జిల్లా సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు, డీఏఓ సరిత, తహసీల్దార్ కృష్ణవేణి, పీఏసీఎస్ శాఖ అధికారి నరేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు. వేగవంతం చేయాలి.. డోర్నకల్: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. సీరోలు మండలం మన్నెగూడెం గ్రామ శివారులోని మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు, మిల్లులకు పంపిన ధాన్యం వివరాలతో పాటు ఇన్వార్డు, అవుట్ వార్డు రిజిస్టర్ను పరిశీలించారు. అనంతరం ఆమె రైతులు, సిబ్బందితో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మధుసూదన్రాజు, సహకారశాఖ అధికారి వెంకటేశ్వర్లు, డీఏఓ సరిత, సీరోలు తహసీల్దార్ పున్నంచందర్, ఎంపీడీఓ పాషా, పీఏసీఎస్ సీఈఓ సతీష్, డోర్నకల్ సీఐ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. -
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
నర్సింహులపేట: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతువేదికలో కల్యాణలక్ష్మీ చెక్కులను, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, బడుగు బలహీన వర్గాలు, రైతుల సంక్షేమం కోసం నిత్యం పని చేస్తుందన్నారు. అధికారులు అందుబాటులో ఉంటు ప్రజల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్థార్ రమేష్బాబు, ఎంఆర్ఐ అఖీల్, కాంగ్రెస్ మండల కమిటీ అధ్యక్షుడు జినుకుల రమేష్, దేవస్థానం చైర్మన్ జయపాల్రెడ్డి, అలువాల శ్రీనివాస్, దస్రూనాయక్, వెంకట్రెడ్డి, వెన్నం రవిందర్రెడ్డి, చిర్ర సతీష్, ఖాన్ పాల్గొన్నారు. దంతాలపల్లి: మండలకేంద్రంలోని బాలాజీ గార్డెన్లో బుధవారం ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు బాలాజీ, యాకన్న, రవి, చంద్రావతి, డీటీ శ్రీలత, ఆర్ఐ రాజు పాల్గొన్నారు. -
బాలుడికి ప్రాణభిక్ష పెట్టరూ!
కమలాపూర్ : బ్రెయిన్ ఫీవర్తో ఓ రెండేళ్ల బాలుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా అతని తల్లిదండ్రులు ప్రాణభిక్ష పెట్టే దాతల కోసం ఎదురు చూస్తున్నారు. ఆడుతూ, పాడుతూ సందడి చేయాల్సిన వేదాన్ష్ తమ కళ్లముందే నరకం అనుభవిస్తున్నాడని, దీనిపై దాతలు స్పందించి తమకు కుమారుడిని బతికించాలని వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ జిల్లా కమలాపూర్కు చెందిన పుల్లా సంధ్య, వెంకటేష్ దంపతుల రెండేళ్ల కుమారుడు వేదాన్ష్ కొద్ది రోజుల క్రితం బ్రెయిన్ ఫీవర్ బారిన పడ్డాడు. దీంతో అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని, అందుకు రూ.15 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన వేదాన్ష్ తల్లిదండ్రులు అంత డబ్బు సమకూర్చుకోలేక అల్లాడిపోతున్నారు. ఇప్పటికే తమకున్న కొద్దిపాటి భూమిని అమ్మి, తెలిసిన వారి వద్ద అప్పులు చేసి సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చుపెట్టారు. ఆపరేషన్కు అవసరమైన రూ.15 లక్షలు ఎలా సమకూర్చాలో తెలియక తల్లడిల్లిపోతున్నారు. దీనిపై దాతలు స్పందించి ఆర్థిక సాయం చేసి తమ కుమారుడి ప్రాణం కాపాడాలని వేడుకుంటున్నారు. బ్రెయిన్ ఫీవర్తో ప్రాణాపాయ స్థితిలో చిన్నారి ఆపరేషన్కు రూ.15 లక్షలు అత్యవసరం దాతల సాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు -
సరస్వతీఘాట్ను పరిశీలించిన మంత్రి శ్రీధర్బాబు
కాళేశ్వరం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని సరస్వతీఘాట్ వద్ద కొనసాగుతున్న ఏర్పాట్లను బుధవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. ఘాట్ పరిసర ప్రాంతాల్లో భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని, తాగునీరు, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు ఆలయ పరిసరాల్లో నిర్వహణ పనులు సక్రమంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు వేగంగా పూర్తిచేస్తున్నామని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. భక్తుల భద్రత కోసం తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. అంతకు ముందు రూ.2కోట్ల వ్యయంతో గత ప్రభుత్వ హయాంలో మేఘా కంపెనీ ఆధ్వర్యంలో నిర్మించిన గెస్ట్హౌస్ను మంత్రి ప్రారంభించారు. గ్రంథాలసంస్థ జిల్లా చైర్మన్ కోట రాజబాబు, సర్పంచ్ మోహన్రెడ్డి ఉన్నారు. -
గురువారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2026
త్రివేణి సంగమం వ్యూకాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతినదికి అంత్య పుష్కరాలు గురువారం (నేడు) ప్రారంభం కానున్నాయి. జూన్ 1 వరకు (12 రోజులు) నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం ఉదయం 5.43 గంటలకు నదికి విశేష పూజలతో వేదపండితులు పుష్కరున్ని ఆహ్వానిస్తారు. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతీస్వామి స్నానమాచరించి పుష్కరాలను ప్రారంభిస్తారు. శాస్త్రోక్తంగా జరిగే ఈ పూజలో మంథని ఽశాసనసభ్యుడు, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆయన సతీమణి దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సంకీర్త్, దేవస్థానం అధికారులు, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, సభ్యులు పాల్గొననున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలిరానున్నట్లు అధికారుల అంచనా. ఏర్పాట్లు ఇలా: ఈ పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్ల నిధులు మంజూరు చేసింది. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆర్టీసీ 3,360 ఆర్టీసీ బస్సులు నడపనుంది. మహిళలకు బస్సు ఉచితం కాగా, పురుషులకు అదనంగా రూ.50 వసూలు చేయనున్నారు. 4.36 ఎకరాల్లో తాత్కాలికంగా బస్టాండ్ ఏర్పాటు చేశారు. పీఠాధిపతుల విడిది కోసం త్రివేణి గెస్ట్హౌస్లో ఏర్పాట్లు చేశారు. 12 రోజులు రోజుకో పీఠాధిపతి పుష్కర స్నానాలు ఆచరించనున్నారు. ప్రతీ రోజు హోమాలు, కాశీ పండితులచే హారతి కార్యక్రమం, తెప్పోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి. ఈసందర్భంగా ఆలయాన్ని పూలతో అలంకరించారు. నేటి నుంచి వన్వే.. 250 ఎకరాల్లో 23 ప్రాంతాల్లో పోలీస్ శాఖ పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసింది. వరంగల్, కరీంనగర్, మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలకు మూడు వైపులా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం వన్వేను ఏర్పాటు చేశా రు. గురువారం నుంచి జూన్ 1 వరకు ఈ విధానం అమల్లో ఉండనుంది. వరంగల్ వైపు వాహనాలు బస్వాపూర్ మీదుగా కొయ్యూరు, గంగారం ఎక్స్రోడ్డు వయా దామెరకుంట, అన్నారం, మద్దులపల్లి కాళేశ్వరం వస్తాయి. కరీంనగర్ వైపు వాహనాలు గంగారం ఎక్స్రోడ్డు నుంచి దామెరకుంట మీదుగా అన్నారం, మద్దులపల్లి, కాళేశ్వరం వస్తాయి. తిరుగు ప్రయాణంలో కాళేశ్వరం మహదేవపూర్, కాటారం మీదుగా వెళ్లాలి. మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాల కోసం అంతర్రాష్ట్ర వంతెన వద్ద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. వాహనాల్లో వచ్చేవారికి ఘాట్ వద్దకు వెళ్లడానికి షటిల్ బస్సులు ఏర్పాటు చేశారు. స్థానిక ఆటోలకు అవకాశం కల్పించారు. కాళేశ్వరంలో నేటినుంచి జూన్ 1 వరకు అంత్య పుష్కరాలు తొలిపుష్కర స్నానం చేయనున్న కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతీస్వామి పూజల్లో పాల్గొననున్న మంత్రులు, అధికారులు లక్షలాదిగా తరలిరానున్న భక్తజనం నేడు గవర్నర్ శివప్రతాప్ శుక్లా రాక.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం హోమాలు, టెంట్ సిటీ, హారతి, తెప్పోత్సవం, పార్కింగ్ స్థలాల ఏర్పాటు నేడు గవర్నర్ రాక అంత్య పుష్కరాల మొదటి రోజు గవర్నర్ శివప్రతాప్ శుక్లా పుష్కర స్నానం చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో వీఐపీ ఘాట్లోని హెలిపాడ్లో దిగనున్నారు. అనంతరం సరస్వతీఘాట్ వద్ద పుష్కర స్నానం చేసి శ్రీకాళేశ్వరముక్తీశ్వరున్ని దర్శించుకోనున్నారు. సరస్వతీ ఘాట్లో జరిగే హారతి, తెప్పోత్సవంలో పాల్గొననున్నట్లు తెలిసింది. రాత్రి కాళేశ్వరంలోనే బస చేయనున్నట్లు అధికారులు తెలిపారు.ఆది పుష్కరానికి ఎంతైతే పుణ్యమో.. అంత్య పుష్కరానికి అంతే పుణ్యం -
అణగారిన వర్గాల కోసం పోరాటాలు
నెహ్రూసెంటర్: జిల్లా కేంద్రంలో గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు 50మంది సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.నాగయ్య సమక్షంలో మంగళవారం పార్టీలో చేరారు. నక్క సైదులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భాగంగా నాగయ్య మాట్లాడుతూ.. దేశంలో అణగారిన వర్గాల ప్రజల కోసం అనేకమైన ప్రజా పోరాటాలు నడిపిన చరిత్ర సీపీఎం పార్టీదన్నారు. అనంతరం పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఎస్వీ.రమ, పగిడిపాల తిరుపతమ్మ, ఈరెల్లి మల్లేశం, అడ్డూరు బ్రహ్మచారి, జల్లి మల్లేశం స్రవంతి, మన్యం మల్లేష్, జనగం వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు. -
సంక్షిప్త సమాచారం
కమిటీని స్వాగతిస్తున్నాం.. తొర్రూరు రూరల్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక పోరాటాలు చేసిన ఉద్యమకారులకు సంక్షేమ పథకాలు అందించేందుకు గుర్తింపు కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ముద్దసాని వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం డివిజన్ కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఉద్యమకారుల ఫోరం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో ఫోరం నాయకులు అనేపురం వెంకన్నగౌడ్, బౌరిశెట్టి అల్లబాబు, కొండ వెంకన్న, వాసిరెడ్డి నర్సింహరెడ్డి, కొదునూరి సధాకర్, వెల్పుల వెంకన్న, పంజాల బుచ్చిరాములు పాల్గొన్నారు.. పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రించాలి గార్ల: పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రిచకుంటే దేశంలో బీజేపీ పతనం తప్పదని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కట్టెబోయిన శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం గార్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో జంపాల వెంకన్న, జనార్దన్, తదితరులు పాల్గొన్నారు, విద్యార్థుల ప్రతిభ కురవి: టీజీఆర్జేసీ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో రాజోలు ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు ఉపాధ్యాయుడు దామోదర్ మంగళవారం తెలిపారు. పాఠశాలకు చెందిన అక్కాతమ్ముడు యలగం విష్ణుప్రియ, యలగం ఉదయ్ కిరణ్ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. నిధులు కేటాయించాలి తొర్రూరు: బంజరాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయాన్ని నిర్మించేందుకు వెయ్యి కోట్ల రూపాలయల నిధులను కేటాయించాలని ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాటోతు బాలునాయక్, లంబాడ జేఏసీ పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ ధరావత్ జైసింగ్ నాయక్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లో చేపట్టిన సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న నాయకులను మంగళవారం పోలీసులు అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. ఉద్యమకారుల ఫోరం ఉపాధ్యక్షుడిగా కొమరయ్య డోర్నకల్: తెలంగాణ ఉద్యకారుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడిగా డోర్నకల్కు చెందిన గుంటి కొమరయ్య నియమిస్తున్నట్లు ఉద్యమకారుల ఫోరం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నందగిరి రజినికాంత్, జిల్లా అధ్యక్షులుడు ముద్దసాని వెంకటేశ్వర్లు ప్రకటించారు. అదుపుతప్పి కారు బోల్తా.. కేసముద్రం: అదుపుతప్పి కారు బోల్తాపడిన సంఘటన మండలంలోని వెంకటగిరి గ్రామ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఇంటికన్నె నుంచి కేసముద్రం వైపు వస్తున్న కారు వెంకటగిరి సమీపంలో ఒక్కసారిగా అదుపుతప్పడంతో బోల్తా కొట్టి పంటభూమిలో పడిపోయింది. కారు డ్రైవర్కు స్వల్పగాయాలైనట్లు తెలిసింది. విద్యార్థికి సన్మానం మరిపెడ రూరల్: మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామానికి చెందిన నూక అశోక్ కుమారుడు నూక సిద్దు ఇటీవల విడుదల చేసిన 2026 ఎప్సెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 113వ ర్యాంక్ సాధించాడు. మంగళవారం మాజీ వైస్ ఎంపీపీ గాదె అశోక్రెడ్డి శాలువాతో ఘనంగా సత్కరించారు. భాస్కర్రెడ్డి మృతి పార్టీకి తీరనిలోటు మహబూబాబాద్ రూరల్: సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కమిటీ నాయకుడు, భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కన్మంత రెడ్డి భాస్కర్ రెడ్డి గుండెపోటుతో మంగళవారం మృతిచెందారు. మున్సిపాలిటీ పరిధిలోని ఈదులపూసపల్లి గ్రామంలో భాస్కర్ రెడ్డి అంతిమయాత్ర సందర్భంగా మదార్ అధ్యక్షతన జరిగిన సంతాపసభ నిర్వహించారు. కార్యక్రమంలో న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు కోమటిరెడ్డి అనంతరెడ్డి, నాయకులు పాయం చిన్నచంద్రన్న, ఆలకుంట్ల సాయిలు, రాంసింగ్ పాల్గొన్నారు. యువత క్రీడల్లో రాణించాలి పెద్దవంగర: యువత క్రీడల్లో రాణించాలని సర్పంచ్ బానోతు యమున రాజేష్ అన్నారు. మంగళవారం మండలంలోని రెడ్డికుంట తండాలో నిర్వహించిన క్రీడ పోటీలను ఆమె ప్రారంభించారు. వార్డు సభ్యులు బానోతు విక్రం, సీతారాం, భిక్షం, పరమేష్, సునిత, సుధాకర్, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు. జీవాల దాహార్తి తీర్చేందుకు వాటర్ట్యాంక్ల నిర్మాణం గార్ల: మండలంలోని పెద్దకిష్టాపురం సర్పంచ్ గంగావత్ రాంసింగ్ వేసవికాలంలో పశువులు, మూగజీవాల దాహర్తిని తీర్చేందుకు ఊరి చివర్లలో వాటర్ నిల్వ ట్యాంక్లు నిర్మించి నీళ్లు నింపాడు. సర్పంచ్ ఐడియా భేష్ అంటూ గ్రామస్తులు అభినందిస్తున్నారు. -
పోలీసుల తనిఖీలు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు డీఎస్పీ తిరుపతి రావు పర్యవేక్షణలో టౌన్, రూరల్ పోలీసులు మంగళవారం రాత్రి విస్తృతంగా నాకబంది తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతీ వాహనాన్ని ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేసి పరిశీలించారు. వాహనదారులు నిబంధనలు పాటించాలని, మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావొద్దని సూచించారు. ఈ తనిఖీల్లో టౌన్, రూరల్ సీఐలు రఘుపతిరెడ్డి, అంజలి, ఎస్సైలు షాకీర్, ఉమ, రాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టిన బైక్
రైతుల వద్ద వసూలు చేస్తున్న డబ్బులు ఎవరికి? బయ్యారం: మక్కల కాటా నుంచి రవాణా అయ్యే వరకు రైతును కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. బస్తాలు త్వరితగతిన పంపిస్తామని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు చెప్పి వారి వద్ద వసూలు చేస్తున్న డబ్బులు ఎవరిచేతికి చిక్కుతున్నాయనే ప్రశ్నలు పలువురిలో వ్యక్తం అవుతున్నాయి. సొసైటీ ఆధ్వర్యంలో బయ్యారంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో లారీ ఎక్కిన 50కేజీల బస్తాకు 10రూపాయల చొప్పున వసూలు చేస్తుండగా ఇదే సొసైటీ ఆధ్వర్యంలో ఉప్పలపాడులో ఏర్పాటు చేసిన కేంద్రంలో 50 కేజీల బస్తాకు 14రూపాయల చొప్పున వసూలు చేశారు. కాగా బస్తాకు వసూలు చేస్తున్న రూపాయలు ఎవరికి ఇస్తున్నారు అనే విషయంపై కేంద్రాల నిర్వాహకులు లారీ డ్రైవర్లకు ఇస్తున్నామని చెబుతుండగా లారీ డ్రైవర్లు తమకు ఇవ్వడం లేదని చెబుతుండడం గమనార్హం. ఈ డబ్బుల వసూళ్లపై జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి రైతులపై పడుతున్న అదనపుభారంను నిలుపుదల చేయాల్సిన అవసరం ఉంది. నెల్లికుదురు: ఆగిఉన్న ట్రాక్టర్ను మోటార్ సైకిల్ ఢీకొట్టిన ఘటనలో మోటార్ సైకిల్పై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని రామన్నగూడెం గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన బొర్ర పాషా, చందపాక జంపయ్య, రామకృష్ణ ముగ్గురు కలిసి సొంత పనులపై నెల్లికుదురుకు వెళ్లి తిరిగి రామన్నగూడెం వస్తున్నారు. రామన్నగూడెం చెరువు కట్టపై ఆగిఉన్న ట్రాక్టర్ను గమనించక రాత్రి సమయం కావడంతో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ను మోటార్ సైకిల్ ఢీకొట్టింది. ఈఘటనలో మోటార్ సైకిల్పై ఉన్న ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన గ్రామస్తులు ట్రాక్టర్పై గాయనడిన ముగ్గురిని నెల్లికుదురు వరకు తీసుకొచ్చి అక్కడ నుంచి చికిత్స కోసం 108 విహనంలో మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
గుడుంబా స్థావరాలపై దాడులు
మహబూబాబాద్ రూరల్/బయ్యారం: మహబూబాబాద్ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో గల బయ్యారం మండలంలోని బాల్యతండా, జగ్నతండా, జగ్గుతండా, బయ్యారం గ్రామంతోపాటు మానుకోట మండలంలోని బోడగుట్ట తండా గ్రామంలోని నాటు సారాయి స్థావరాలపై విస్తృత దాడులు నిర్వహించామని ఎకై ్సజ్ సీఐ జి.చిరంజీవి మంగళవారం తెలిపారు. మహబూబాబాద్ ఎకై ్సజ్ స్టేషన్, డీటీఎఫ్ హైదరాబాద్ ఎస్టీఎఫ్ టీం సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఆరుగురిపై కేసు నమోదు చేసి 18లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని, 600లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశామన్నారు. భూక్యా చమిలి, తేజావత్ రాజి, జినుక ఉపేందర్, కున్సోత్ సురేష్, భూక్య దేవిపై కేసు నమోదు చేశామని తెలిపారు. వీరిని బయ్యారం తహసీల్దార్ నాగరాజు ఎదుట భైండోవర్ చేశారు. ఈదాడుల్లో ఎకై ్సజ్ సీఐలు నీరజ, అశోక్ కుమార్, ఎస్టీఎఫ్ సీఐ నాగరాజు, ఎకై ్సజ్ ఎస్సై కిరీటి, సిబ్బంది పాల్గొన్నారు. -
పటిష్ట బందోబస్తు
భూపాలపల్లి: మూడు రాష్ట్రాల సరిహద్దులోని కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో ఈ నెల 21నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు నిర్వహించనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు తగిన ముందస్తు ఏర్పాట్లు చేశాం. అయితే గతంలో జరిగిన పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వన్ వే ఏర్పాటు చేశాం. ఆధునిక టెక్నాలజీతో కూడిన ఏఐ డ్రోన్ను సైతం వినియోగించబోతున్నాం. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వారి భద్రతే ప్రధాన ధ్యేయంగా పని చేసేందుకు పోలీస్శాఖ సిద్ధంగా ఉందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. అంత్య పుష్కరాల సందర్భంగా పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలపై ‘సాక్షి’కి తెలిపారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఏఐ డ్రోన్తో 5 కిలోమీటర్లు పర్యవేక్షణ.. పుష్కరాల సందర్భంగా ఈసారి అత్యాధునిక టెక్నాలజీని వాడుతాం. ఏఐ డ్రోన్ను వినియోగించి కాళేశ్వరం పోలీస్స్టేషన్ నుంచి చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో పర్యవేక్షిస్తాం. వాహనాలు, భక్తుల సంఖ్యను సైతం ఏఐ డ్రోన్ లెక్కిస్తుంది. తద్వారా భక్తుల ఇబ్బందులు, ట్రాఫిక్ సమస్యను ముందుగా నే గమనించి పరిష్కరించవచ్చు. ఇప్పటికే కాళేశ్వరంలో ఉన్న సీసీ కెమరాలు కాకుండా మరో 150 కెమెరాలను బిగించాం. కమాండ్ కంట్రోల్ రూంను కాళేశ్వరం ఠాణాలో ఏర్పాటు చేశాం. పుష్కర ఘాట్, దేవాలయ పరిసరాల్లో మరో మూడు డ్రోన్లతో నిత్య పర్యవేక్షణ ఉంటుంది. విధుల్లో సుమారు వేయి మందికి పైగా.. పుష్కరాల సందర్భంగా సుమారు వేయి మందికి పైగా పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. నాతో పాటు అదనపు ఎస్పీ, 12మంది డీఎస్పీలు, 25 మంది సీఐలు, 50 మందికి పైగా ఎస్సైలు, మరో 900 మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. అంచనాకు మించి భక్తుల సంఖ్య పెరిగితే పోలీసు సిబ్బందిని పెంచేందుకు సిద్ధంగా ఉన్నాం. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వన్ వే.. సరస్వతి అంత్య పుష్కరాలకు భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు వన్ వే ఏర్పాటు చేశాం. పెద్దపల్లి జిల్లా మంథని తది తర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు గంగారం ఎక్స్రోడ్ నుంచి అన్నారం, మద్దులపల్లి మీదుగా, హనుమకొండ, భూపాలపల్లి నుంచి వచ్చే వాహనాలు కాటారం మండలం బస్వాపూర్ నుంచి రుద్రారం మీదుగా గంగారం ఎక్స్రోడ్, అన్నారం మీదుగా కాళేశ్వరా నికి చేరుకోవాల్సి ఉంటుంది. తిరుగు ప్రయాణంలో కాళేశ్వరం నుంచి మహదేవపూర్ మీ దుగా కాటారం చేరుకున్నాక హనుమకొండ, కరీంనగర్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. వాహనాల పార్కింగ్కు సమస్య తలెత్తకుండా కాళేశ్వరానికి మూడు వైపులా సుమారు 250 ఎకరాల్లో 23 పార్కింగ్ పాయింట్లను ఏర్పాటు చేశాం. ఏఐ డ్రోన్తో పర్యవేక్షిస్తాం సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తి చేశాం వన్ వేకు వాహనదారులు సహకరించాలి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ -
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు
● కొనుగోళ్లను వేగవంతం చేయాలి ● కలెక్టర్ స్నేహ శబరీష్నర్సింహులపేట: ధాన్యం కొనుగోళ్లలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్నేహ శబరీష్ హెచ్చరించారు. మంగళవారం నర్సింహులపేటలో మక్కలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వశ్రాంతండాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఏ మేరకు కాంటాలు పెట్టారు.. ఎన్ని టన్నులు తరలించారు.. ఇంకా ఎంతవరకు మిగిలాయి, ఆలస్యానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు వివరాలు సక్రమంగా చెప్పకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీఎస్ సిబ్బంది నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తూ రికార్డులను సరిగా మెయింటెనెన్స్ చేయడం లేదని మండిపడ్డారు. వెంటనే పీఏసీఎస్ నిర్వాహకులు, వ్యవసాయశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే హెచ్చరించామని, ఇంకా కొన్నిచోట్ల పనితీరు మార్చుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నారని వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రవాణా విషయంలో ముందస్తుగా వాహనాలను సిద్ధం చేసుకొవాలన్నారు. హమాలీలను అధికంగా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు, సివిల్ సప్లయీస్ అధికారి రమేష్, మేనేజర్ నర్సింహరావు, తహసీల్దార్ రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
విషాదయాత్ర..
జనగామ: చార్ధామ్ యాత్రకు ఉత్తరాఖండ్ వెళ్లిన జనగామకు చెందిన ప్రముఖ వ్యాపారి, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు అరుగుల శ్రీనివాస్ (62) మృతి చెందారు. ఈ నెల 8వ తేదీన సిద్దిపేటకు చెందిన బంధువులతో కలిసి వెళ్లిన శ్రీనివాస్ కుటుంబం 10వ తేదీన కేదార్నాథ్ పుణ్యక్షేత్రానికి చేరుకుంది. యాత్రలో భాగంగా మంగళవారం ఉదయం కేదారినాథ్ దర్శనం ముగించుకుని ట్రావెల్ బస్సులో దిగువ ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఘా ట్ రోడ్డులో టీ తాగిన కొద్ది సేపటికే శ్రీనివాస్కు శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ వెంటనే సమీపంలోని జోష్మఠ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు చికిత్స అందించేలోపే చనిపోయినట్లు నిర్ధారించారు. పట్టణంలో విషాదం.. అరుగుల శ్రీనివాస్ మృతితో జనగామ పట్టణ వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. చైన్నెలో ఉన్న పెద్ద కూతురు, వరంగల్లో మరో కూతురు, జనగామలో ఉన్న కొడుకు సుశీల్ తమ కుటుంబాలతో కలిసి హుటాహుటినా కేదారినాథ్ బయలుదేరారు. రాత్రి 7 గంటల సమయంలో డెహ్రడూన్ చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా కేదారినాథ్ వైపునకు పయనమయ్యారు. కుటుంబీకుల నిర్ణయం మేరకు శ్రీనివాస్ అంత్యక్రియలు బుధవారం కేదారినాథ్లోనే నిర్వహించనున్నారు. ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు అరుగుల శ్రీనివాస్ మృతిపై జనగామ చాంబర్ అధ్యక్ష, గౌరవ అధ్యక్షులు పోకల లింగయ్య, పజ్జూరి గోపయ్య, రైస్ మిల్లర్స్ ప్రతినిధి పజ్జూరి జయహరి, ఆర్యవైశ్య సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి గట్టు వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య మహా సభ జిల్లా అధ్యక్షుడు గంగిశెట్టి ప్రమోద్ కుమార్, మాజీ అధ్యక్షుడు మహంకాళి హరిశ్చంద్రగుప్త, ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షులు బిజ్జాల నవీన్ కుమార్, శర్విరాల ఉపేందర్, బుద్దా రమేశ్, వ్యాపార వర్గాలు, రాజకీయ పార్టీల నాయకులు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు. శ్రీనివాస్ మృతి తీరని లోటని, అందరినీ కలచివేసిందన్నారు. చార్ధామ్ మార్గంలో ప్రముఖ వ్యాపారి శ్రీనివాస్ మృతి శోకసంద్రంలో కుటుంబీకులు జనగామలో విషాదం నేడు కేదారినాథ్లోనే అంత్యక్రియలు -
రైతుల సమస్యలపై అధ్యయనం చేస్తున్నాం
● రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు మేక సునీల్రెడ్డి ● ధాన్యం కొనుగోలు కేంద్రాల తనిఖీకురవి: రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై రైతు కమిషన్ అధ్యయనం చేస్తున్నదని, రైతుల సమస్యలను క్రోడికరించి పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు మేక సునీల్రెడ్డి(భూమిసునీల్) అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఐకేపీ, ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించి తనిఖీ చేశారు. రైతులను కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రాల్లోని రిజిస్టర్లను స్వయంగా పరిశీలించారు. మిల్లర్లు ధాన్యంలో కోత విధిస్తున్నారని పలువురు రైతులు ఆయనకు వెల్లడించారు. లారీలు సక్రమంగా రావడంలేదని రైతులు తెలిపారు. తరలింపు ఆలస్యమై కేంద్రాల్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ఆయనకు రైతులు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, ఇబ్బందులపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. రైతులకు కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలను త్వరలోనే కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతుల సమస్యలకు పరిష్కా రం వచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యం వెంటవెంటనే తరలించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట ఏపీఎం దుర్గారావు, ఏఓ నరసింహారావు, ఆర్ఐ లక్ష్మి, రైతులు మేక దామోదర్రెడ్డి, బత్తిని నరసయ్య, బెడద వీరన్న తదితరులు ఉన్నారు. -
తిరగని పంకా.. చూడరా ఈ వంకా!
తొర్రూరు: కొత్త విషయాలు నేర్చుకునేందుకు, ఉద్యోగార్థులు సన్నద్ధమయ్యేందుకు గ్రంథాలయం దోహదపడుతుంది. 10 రోజులుగా పట్టణంలోని గ్రంథాలయంలో ఫ్యాన్లు తిరగకపోవడంతో పాఠకులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం, సాయం వేళల్లో ఉక్కపోత భరించలేక ఆరుబయటే కూర్చుని పత్రికలు, పుస్తకాలు చదువుకుంటున్నారు. మరికొందరు లైబ్రరీకి వచ్చేందుకు విముఖత చూపుతున్నారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల లైబ్రేరియన్ పదవీ విరమణ పొందగా దీని ఆలనా పాలనా చూసే వారు కరువయ్యారు. జిల్లా గ్రంథాలయ సంస్థకు తాజాగా నూతన చైర్మన్ ఎన్నిక కావడంతో స్థానిక గ్రంథాలయంలో సమస్యలు పరిష్కారమవుతాయని పాఠకులు ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్లు మరమ్మతు చేసి పాఠకుల ఉక్కపోత కష్టాలు తీర్చాలని స్థానికులు కోరుతున్నారు. -
పుష్కర భక్తులకు సమగ్ర వైద్యసేవలు
కాళేశ్వరం : సరస్వతీనది అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు సమగ్ర వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వెద్యారోగ్యశాఖ డైరెక్టర్ రవీందర్ నాయక్ అన్నారు. మంగళవారం కాళేశ్వరాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఈ నెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న పుష్కరాల సందర్భంగా భక్తులకు అందించనున్న వైద్య సేవల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంత్య పుష్కరాలకు భారీగా వచ్చే భక్తులకు వైద్య శిబిరాల్లో అవసరమైన మందులు, సిబ్బంది, అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో భూపాలపల్లి, ములుగు, హనుమకొండ డీఎంహెచ్ఓలు మధుసూదన్, గోపాలరావు, అప్పయ్య, కాళేశ్వరం పీహెచ్సీ వైద్యాధికారి సుస్మిత, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ రవీందర్ నాయక్ -
రీల్స్.. రిలాక్స్..
● వేసవి సెలవుల్లో రీల్స్ చేస్తూ శభాష్ అనిపించుకుంటున్న అక్కాచెళ్లెళ్లు కాజీపేట : వేసవి సెలవుల్లో ఆరు బయట తిరగకుండా ఈ అక్కాచెళ్లెళ్లు వివిధ పాటలకు రీల్స్ చేస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. కాజీపేటకు చెందిన గౌని రసజ్ఞ గౌడ్, గౌని శరణ్య గౌడ్ సినిమా పాటలు, జానపద గేయాలను రీల్స్ చేస్తున్నారు. అనంతరం గౌని సిస్టర్స్ పేరుతో సోషల్ మీడియాలో అప్లో డ్ చేస్తున్నారు. ఆహ్లాదకరంగా ఉంటున్న ఈ రీల్స్ చూ స్తున్న వీక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొద్దికా లంగా తల్లిదండ్రులు స్రవంతి, ఫణీందర్ ప్రోత్సహిస్తుండడంతో అక్కాచెళ్లెళ్లు రీల్స్ చేస్తూ వేసవి సెలవులను స ద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు దాదాపు 26 పాటలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. వాటి కి వచ్చిన అభినందనలు చూసి మురిసిపోతున్నారు. -
సీహెచ్సీలో వైద్యుల కొరత
● ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్న ప్రజలు గార్ల: గార్లలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)లో వైద్యుల కొరత తీర్చి మండల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని మండల ప్రజలు కోరుతున్నారు. గార్ల సీహెచ్సీని ఏడేళ్ల క్రితం రూ.5కోట్లు వెచ్చించి 30పడకల ఆస్పత్రిని నిర్మించారు. కాని వైద్యుల ఖాళీలను భర్తీ చేయడంలో పాలకులు పట్టించుకోక పోవడంతో మండల ప్రజలకు ఆస్పత్రిలో సరైన వైద్యసేవలు అందడం లేదు. దీంతో మెరుగైన వైద్యసేవల కోసం మండల ప్రజలు ఖమ్మం, మహబూబాబాద్ పట్టణాల్లోని కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. ఏజెన్సీ మండలమైన గార్ల మండల ప్రజలకు ఈ ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. ఈ ఆస్పత్రికి క్యాడర్ స్ట్రెన్త్ లేక పోవడంతో గత ఏడాది వైద్యుల బదిలీల కౌన్సిలింగ్లో గార్ల ఆస్పత్రి కనిపించక పోవడంతో ఒక్క వైద్యుడు కూడా జాయిన్ కాలేదు. ఆస్పత్రిలో ఉన్న కొద్దిపాటి మంది డాక్టర్లు సైతం బదిలీల్లో వెళ్లిపోవడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో నలుగురు డాక్టర్లు మాత్రమే డిప్యుటేషన్పై వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. సకల సౌకర్యాలు ఉన్నా, అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నచందంగా సీహెచ్సీ తయారైంది. ఇప్పటికై నా సంబంధిత జిల్లా అధికారులు స్పందించి ఆస్పత్రిలో వైద్యుల ఖాళీలను భర్తీ చేసి మండల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని మండల ప్రజలు డిమాండ్ చేశారు.గార్లలో రూ.5కోట్లు వెచ్చించి నాటి ప్రభుత్వం సకల సౌకర్యాలతో 30పడకల ఆస్పత్రిని నిర్మించింది. కాని వైద్యుల పోస్టుల భర్తీని విస్మరించింది. ఏజెన్సీ మండలమైన గార్ల మండలంలో 90శాతం గిరిజనులు నివసిస్తున్నారు. ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు అందకపోవడంతో ఖమ్మం, మహబూబాబాద్ తదితర పట్టణాల్లోని కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి వైద్యం చేయించుకుంటూ ఆర్థికంగా చితికిపోతున్నారు. వెంటనే సీహెచ్సీలో ఖాళీగా ఉన్న వైద్యల పోస్టులను భర్తీ చేయాలి. – కందునూరి శ్రీనివాసరావు, గార్ల -
రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
● ఎమ్మెల్యే మురళీనాయక్ నెల్లికుదురు: సహకార సంఘం బలోపేతానికి, రైతాంగ సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని దానికి నిధర్శనమె నెల్లికుదురు మండల కేంద్రంలో డీసీసీ నూతన బ్యాంకు ఏర్పాటు అని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం నూతన డీసీసీ బ్యాంకును డీసీసీబీ జీఎం ఉషశ్రీ, డీసీఓ వెంకటేశ్వర్లు, డీడీఎం, సాయిరాం, ఏజీఎం స్వాతి, మేనేజర్ శోభన్లతో కలిసి బ్యాంకు సేవలను ప్రార ంభించారు. అనంతరం మండల కేంద్రంలోని రైతు వేదికలో 20మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పులి వెంకన్న, సొసైటీ చైర్మన్లు కాసం లక్ష్మిచంద్రశేఖరరెడ్డి, పొనుగోటి దేవేందర్రావు, గుండ వెంకన్న, నాయకులు ఎదళ్ల యాదవరెడ్డి, ప్రబాకర్ గౌడ్, సతీష్ పాల్గొన్నారు. -
వాహనాల తనిఖీ
గూడూరు: మండల కేంద్రంతో పాటు గ్రామాలలో నిత్యం అనుమానం కల్గితే తనిఖీలు చేపట్టాలని సీఐ వినయ్కుమార్ సిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలో మంగళవారం రాత్రి సిబ్బందితో వాహనాలను తనిఖీ చేశారు. మత్తు పదార్థాల నిర్మూలన అందరి బాధ్యత డోర్నకల్: సమాజానికి పెనుభూతంగా మారిన మత్తు పదార్థాల నిర్మూలనను అందరూ బాధ్యతగా భావించాలని డోర్నకల్ సీఐ ఈ.చంద్రమౌళి కోరారు. డోర్నకల్ రైల్వేస్టేషన్తోపాటు పలు ప్రాంతాల్లో మంగళవారం డాగ్ స్క్వాడ్తో కలిసి పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. కార్యక్రమంలో పోలీసులు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం గార్ల: జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్ఎఫ్బీఎస్) అర్హులైన లబ్ధిదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందాలని ఎంపీడీఓ మంగమ్మ మంగళవారం తెలిపారు. కుటుంబ పోషకుడు, పోషకురాలు 2017 ఏప్రిల్ 13 తర్వాత మరణించిన వారు ఈ పథకానికి అర్హులన్నారు. మీసేవా, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి ఈ పథకం ద్వారా రూ.20వేలు కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందని ఆమె వెల్లడించారు. దరఖాస్తును ఎంపీడీఓ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కిషన్నాయక్ మహబూబాబాద్: రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ సామాజిక ఉద్యమకారుడిగా గుగులోత్ కిషన్ నాయక్ ఎన్నికయ్యాడు. హైదరాబాద్లోని రెవెన్యూ భవన్ కార్యాలయంలోరాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇన్చార్జ్ ఎంపీడీఓగా అప్సర్ పాషా దంతాలపల్లి: మండల ఇన్చార్జ్ ఎంపీడీఓగా అప్సర్ పాషా మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎంపీడీఓ విజయ ఖమ్మం జిల్లా ముదిగొండ మండలానికి బదిలీ కావడంతో అప్సర్ పాషాకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఆదర్శ పాఠశాల విద్యార్థి ప్రతిభ నెల్లికుదురు: బాల్యం నుంచే భారత దేశ ఉన్నతిని చాటేందుకే ప్రేరణ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని ఆదర్శపాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ ఉపేందర్రావు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మండల కేంద్రానికి చెందిన సింగారం దీక్షిత్ జరాత్లోని వాడ్నగర్లో అనుభవ పూర్వక నేర్చుకునే కార్యక్రమానికి ఎంపికై వెళ్లి వచ్చినట్లు తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థిని ఉపాధ్యాయ బృందం అభినందించారు. వీఓఏల సమస్యలు పరిష్కరించాలి గూడూరు: ప్రభుత్వం వీఓఏల కనీస వేతనం రూ.20వేలు ఇస్తూ, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని మండల వీఓఏల సంఘం బాధ్యులు శ్రీలత, యాకయ్య కోరారు. జిల్లా కేంద్రంలో మంగళవారం మండల కేంద్రంలోని ఐకేపీలో వీఓఏలుగా పనిచేస్తున్న వారు ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అడిషనల్ కలెక్టర్, ఎమ్మెల్యే మురళీనాయక్కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో లక్ష్మణ్, శారద, వసంత, కుమారస్వామి, భాస్కర్ పాల్గొన్నారు. -
అత్తారింటికి వెళ్తూ అనంతలోకాలకు..
దుగ్గొండి/కాశిబుగ్గ: తన ఇంట్లో రాత్రి ఆనందంగా జన్మదిన వేడుకలు జరుపుకుని తెల్లవారుజామున కారులో అత్తారింటికి వెళ్తున్న ఓ యువకుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పుట్టిన రోజు ఆనందాన్ని భార్యాపిల్లలతో పంచుకోకముందే రోడ్డు ప్రమాదం కబలించింది. లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి వద్ద జరిగింది. దుగ్గొండి ఎస్సై రావుల రణధీర్రెడ్డి కథనం ప్రకారం.. వరంగల్ 20వ డివిజన్కు చెందిన వెల్దండి వరుణ్ ( 32) సోమవారం రాత్రి తన జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. మంగళవారం తెల్ల వారుజామున కారులో నర్సంపేటలో ఉన్న భార్యా పిల్లల దగ్గరికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో గిర్నిబావి వద్ద కొత్తగూడ మండలం ఓటాయి గ్రామం నుంచి మక్కలలోడుతో వస్తున్న లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వరుణ్ను స్థానికులు 108లో వరంగల్ ఎంజీఎం తరలించారు. చికిత్స ప్రారంభించిన కొద్ది సేపటికే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్సై తెలిపారు. కాగా, ఓ కార్ఖానా నడిపించుకుంటూ జీవనం కొనసాగిస్తున్న వరుణ్ మృతిచెందడంతో కుటుంబీకులు శోకసంద్రంలో మునిగారు. ఎదురెదురుగా ఢీకొన్న లారీ, కారు యువకుడి దుర్మరణం గిర్నిబావి వద్ద ఘటన -
నేను గీసిన బొమ్మ..
తాటికాయల హెప్సిబా, ఐదో తరగతి, హిమ్మత్నగర్, జఫర్గఢ్ మండలం, జనగామ జిల్లా ఎ.ఆకాంక్ష, 1వ తరగతి, శ్రీ చైతన్య హైస్కూల్, కడిపికొండరొంపికుంట్ల లేక్ష్య, శంభునిపేట, వరంగల్అమ్మమ్మ చెప్పిన కథ భాష.. వ్యక్తిత్వానికి కొలమానంఅనగనగా ఒక రాజు. అతను ఓ రోజు తన మంత్రి, సైన్యాధిపతి, సేవకుడితో కలిసి అడవికి వేటకు వెళ్లాడు. వేటాడుతూ వేటాడుతూ అడవిలో ఒకరికొకరు తప్పిపోయారు. ఒక చెట్టుకింద నీడలో అంధుడైన ముసలి వ్యక్తి కూర్చుని ఉండగా రాజు చూశాడు. అప్పుడు రాజు అతని వద్దకు వెళ్లి ఓ సాదు మహారాజ్ ఎవరైనా ఇటువైపు వెళ్లారా అని అడిగాడు. అప్పుడు ఆ సాధువు మహారాజా అందరికంటే ముందు మీ సేవకుడు వెళ్లాడు. అతని వెనుక మీ సైన్యాధిపతి వెళ్లాడు. తర్వాత మీ మంత్రికూడా ఇంతకు ముందే వెళ్లాడు అని చెప్పగానే రాజు ఆశ్చర్యపోయాడు. సాధు మహారాజ్ మీకు కళ్లు కనిపించవు కదా వెళ్లింది సేవకుడు, సైన్యాధిపతి, మంత్రి అని ఎలా గ్రహించారు అని అడిగాడు. మరీ ముఖ్యంగా నేనే మహారాజును అని ఎలా గుర్తించారు అని ఆసక్తిగా అడిగాడు. అప్పుడు ఆ సాధువు ఇలా చెప్పాడు. నేను మీ నలుగురు మాట్లాడే పద్ధతిని బట్టి గుర్తించా. అందరికంటే ముందుగా వచ్చిన సేవకుడు నా ఎదురుగా వచ్చి నాతో ఏమిరా గుడ్డివాడా ఇటు ఎవరైనా వచ్చారా అని అడిగాడు. కొంత సేపటికి సైన్యాధిపతి వచ్చి ఓ సన్యాసి ఇటు ఎవరైనా వచ్చారా అని అడిగాడు. మరికొంత సేపటికి మీ మంత్రి వచ్చి సాధుజీ ఇటు ఎవరైనా వెళ్లారా అని అడిగాడు. ఇప్పుడు మీరు వచ్చి సాధు మహారాజ్ గారు ఇటు ఎవరైనా బాటసారి వచ్చి వెళ్లాడా అని అడిగారు. అందుకుని మహారాజా ఒక వ్యక్తి మాట ద్వారా అతని హూందాతనాన్ని అతని పదవి, అతడి ప్రతిష్ట ఏమిటో గుర్తించొచ్చు అన్నాడు. –దుగ్గొండి నీతి.. వ్యక్తి వ్యక్తిత్వం అతని భాష మీదే ఆధారపడి ఉంటుంది. వేసవి సెలవుల్లో బాలికలు ఖాళీగా ఉండకుండా పలు క్రీడలు, కళలు నేర్చుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా బొమ్మలు గీయడంపై ఆసక్తి చూపుతున్నారు. వివిధ రకాల చిత్రాలు గీస్తూ అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. -
అగ్నిప్రమాదంలో పామాయిల్ చెట్లు దగ్ధం
డోర్నకల్: మండలంలోని రావిగూడెం శివారులో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో జామాయిల్, పామాయిల్ చెట్లు దగ్ధమయ్యాయి. ముల్కలపల్లికి చెందిన రైతు సామినేని చినబాబురావు రావిగూడెం సమీపంలో తన వ్యవసాయ భూమిలో జామాయిల్, పామాయిల్ తోటలు సాగు చేస్తున్నాడు. మంగళవారం సమీప వ్యవసాయ భూముల్లో పంట కొయ్యలను దగ్ధం చేసేందుకు కొంతమంది నిప్పంటించగా మంటల వ్యాపించి పక్కనే ఉన్న పామాయిల్, జామాయిల్ తోటకు అంటుకుని కొన్ని చెట్లు దగ్ధమయ్యాయి. డోర్నకల్ నుంచి ఫైరింజన్ ఘటనాస్థలానికి చేరుకోగా సిబ్బంది మంటలను ఆర్పారు. ప్రమాదంలో సుమారు లక్ష రూపాయలకు నష్టం వాటిల్లింది. -
కబ్జాలకోట
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో కబ్జాల పర్వం కొనసాగుతోంది. వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. అది ప్రస్తుతం రికార్డులకే పరిమతమైంది. కబ్జాదారులు ఇప్పటికే 60శాతం ప్రభుత్వ భూములు కబ్జా చేసి విక్రయించి కోట్లు గడించారు. కాగా ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాలు లేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పలు చెరువులు, కుంటలకు స్వాహా చేస్తున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపాలిటీ అధికారుల మధ్య సమన్వయం లేక కబ్జాలకు చెక్ పెట్టలేకపోతున్నారు. చెరువులపైనే కన్ను.. జిల్లా కేంద్రం శివారులో ఎకరం భూమి కోట్లలో పలుకుతోంది. దీంతో కబ్జాదారులు చివరికి చెరువులు, కుంటలను కూడా వదలడం లేదు. జిల్లా కేంద్రంలోని ప్రధానంగా నిజాం చెరువు, కంబాలచెరువు, బంధం చెరువు, జనాల చెరువు, రాంబందు చెరువులు ఉన్నాయి. వీటిలో విచ్చలవిడిగా కబ్జాలు జరుగుతున్నాయి. నిజాం చెరువు చాలా వరకు కబ్జా.. జిల్లాకేంద్రంలోని నిజాం చెరువు సగం వరకు అన్యాక్రాంతమైంది. పలు కాలనీలు కూడా ఏర్పాటు అయ్యాయి. ఇరిగేషన్ అధికారులు కాసులకు కక్కుర్తి పడి ఎన్ఓసీ ఇవ్వగానే మున్సిపాలిటీ అధికారులు కూడా డబ్బులు తీసుకుని పర్మిషన్ ఇచ్చారు. అలాగే జనాల చెరువు శిఖం భూముల్లో పలు పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో పేదల కోసం కాలనీలు ఏర్పాటు చేశారు. ఆయా కాలనీల పక్కన ఉన్న చెరువుల భూముల్లో వెంచర్లు చేసి కబ్జాదారులు డబ్బులు దండుకున్నారు. నేటికీ రెండు చెరువుల్లో.. జిల్లా కేంద్రంలో ఉన్న బంధం చెరువు సగానిపై కబ్జాకు గురై కుంటగా మారింది. నేటికీ కబ్జాలు చేస్తున్నారు. బంధం చెరువు సమీపంలో గతంలోనే కబ్జా చేసి గృహ నిర్మాణం చేయగా.. మళ్లీ కొంత భూమిని చదును చేసి చుట్టూ రేకులతో ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఈ విషయంలో కౌన్సిలర్ చిదిరాల అరుణ.. కలెక్టర్, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన తర్వాత నిర్మాణ పనులను నిలిపివేసి కేసు పెట్టారు. బంధం చెరువుకు చెందిన కాల్వలు కబ్జాలకు గురయ్యాయి. ఆచెరువుకు సంబంధించిన పాషా వాగును కూడా కబ్జా చేసి.. అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. కలెక్టర్ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న కంబాలచెరువు సగం కబ్జాకు గురికాగా.. మిగిలిన చెరువులో కూడా మట్టి పోస్తుండగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నాయకులు ప్రజావాణిలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు! గత కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ పలుమార్లు అధికారులతో సమావేశాలు నిర్వహించి చెరువులకు హద్దులు నిర్ణయించి ఫెన్సింగ్ చేయాలని ఆదేశించారు. కానీ తూతూ మంత్రంగా సర్వే చేసి చేతులు దులుపుకున్నారు. ఈనెల 13 కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సీతక్క, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి అధికారులో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో వేం నరేందర్రెడ్డి మాట్లాడుతూ.. చెరువులు కబ్జా అవుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, కబ్జాలు జగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి కంబాల చెరువు, బంధం చెరువు శిఖం భూములతో పాటు బఫర్ జోన్ స్థలాలను కబ్జా చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చాం. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి. ఆ చెరువులపై చాలా కుటుంబాలు ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. – పిల్లి దశరథం, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పట్టణ కార్యదర్శి కేసులు పెడుతున్నాం..బంధంచెరువు, కంబాలచెరువులో కబ్జాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో సర్వే చేపట్టి కబ్జా చేస్తున్న వారిపై కేసులు పెడుతున్నాం. ఇరిగేషన్ అధికారుల సహకారం లేకపోవడంతో కబ్జాలు కట్టడి కావడం లేదు. వాస్తవానికి చెరువుల పరిరక్షణ పూర్తి బాధ్యత వారిదే. కాని వారు నిర్లక్ష్యం చేస్తున్నారు. – చంద్ర రాజేశ్వర్, తహసీల్దార్ -
మక్కలు పోవు
బుధవారం శ్రీ 20 శ్రీ మే శ్రీ 2026లారీలు రావు.. కొనుగోలు కేంద్రం తనిఖీకొత్తగూడ: మండలంలోని ఓటాయి మక్కల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం మండల ప్రత్యేకాధికారి, డీఈఓ సత్యనారాయణ మూర్తి తనిఖీ చేశారు. ఈసందర్భంగా కొనుగోలు కేంద్రంలోని వసతులు, మక్కల తరలింపు, నిల్వ అంశాలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు. విక్రయించిన రైతుల వివరాలు వెంట వెంటనే ఆన్లైన్లో పొందుపర్చాలని సూపర్వైసర్ రమేశ్ను ఆదేశించారు. ఆయన వెంట ఎంఈఓ గుమ్మడి లక్ష్మీనారాయణ ఉన్నారు. ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టి రైతుల నిరసననర్సింహులపేట: మండలంలోని వశ్రాంతండా ధాన్యం కొనుగోలు కేంద్రంలో నెల రోజులైనా కాంటాలు పెట్టడం లేదని, గన్నీ సంచులు రావడం లేదని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిరసిస్తూ మంగళవారం రైతులు ధాన్యం బస్తాలకు నిప్పు పెట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. నెల రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నామని, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో ధాన్యం బస్తాలు తడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటవెంటనే ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని కోరారు. నైపుణ్యాలు పెంపొందించుకోవాలిమహబూబాబాద్ అర్బన్: జీవితంలో ఏ రంగంలోనైనా విజయం సాధించడానికి నైపుణ్యాలు అత్యంత కీలకమైనవి జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ఓలేటి జ్యోతి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో యూత్ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. చదువుతోపాటు ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, తద్వారా భవిష్యత్ లక్ష్యాలను సులభంగా సాధించుకోవచ్చన్నారు. ప్రభుత్వ ఐటీఐ, ఐటీసీ కళాశాలల్లో నూతన కోర్సులు అందిస్తున్నారని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఓంకార్, ఉపాధి శాఖ జిల్లా అధికారి రజిత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో యాసంగిలో 1,05,238 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశారు. గతంలో ఎకరానికి 25నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. కానీ ఈ యాసంగిలో 40 క్వింటాళ్ల మేరకు దిగుబడి వచ్చిందని రైతులు చెబుతున్నారు. ఇలా జిల్లాలో మొత్తం 3.5లక్షల మెట్రిక్ టన్నుల మక్కలను రైతులు పండించారు. ఇందులో 25శాతం మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తారని భావించి ఆ మేరకే ఏర్పాట్లు చేశామని అధికారులు అంటున్నారు. అయితే రోజురోజుకూ కొనుగోలు కేంద్రాలకు కుప్పలు తెప్పలుగా మక్కలను తీసుకురావడంతో కొనుగోలు కేంద్రాల సంఖ్యను 25కు పెంచారు. ఇందుకు అనుగుణంగా రవాణా చేసేందుకు లారీలు సమకూర్చడంలో అధికారులు విఫలమయ్యారు. నెలల తరబడి నిరీక్షణ.. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన మక్కలు కాంటాలు పెట్టేవారు లేక కొన్ని రోజులు, కాంటాలు పెట్టిన బస్తాలను ఎక్కడికి పంపించాలో తెలియని పరిస్థితిలో కొన్ని రోజులు, వాహనాలు లేకపోవడంతో మరికొన్ని రోజులు ఇలా నెలల తరబడి కేంద్రాల్లోనే రైతులు నిరీక్షించాల్సి వస్తోంది. ఇప్పటి వరకు 82,360 మెట్రిక్ టన్నుల మక్కలు కాంటాలు పెట్టినా.. వాటిని దిగుమతి చేసేందుకు స్థలం లేదు. మార్క్ఫెడ్ అధికారుల నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడడం చూసిన కలెక్టర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి 600 మేరకు రైతుల ట్రాక్టర్ల ద్వారా పత్తి మిల్లులు, రైస్ మిల్లులు, ఫంక్షన్ హాల్స్ ఇలా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దిగుమతి చేయాలని ఆదేశించారు. దీంతో కొంత కదలిక వచ్చినా.. అత్యధిక సెంటర్లలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 50రోజులు గడిచినా రాని డబ్బులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మార్చి 27న ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 82,360 మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు చేశారు. అంటే క్వింటాకు రూ.2,400 చొప్పున రూ.197.6కోట్లు రైతులకు చెల్లించాలి. కానీ, ఇప్పటి వరకు ఒక్క రైతు ఖాతాలో కూడా డబ్బులు జమ కాలేదు. ఈ విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారు. అటు కొనుగోళ్ల జాప్యం, కొనుగోలు కేంద్రాల్లో డబ్బుల వసూళ్లు, అమ్మిన మక్కలకు డబ్బులు ఆలస్యం కావడంతో.. చాలామంది రైతులు మక్కలు తక్కువ ధరకు రూ.1500నుంచి రూ.1800 వరకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముతున్నారు. నెలల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే రైతుల పడిగాపులు కాంటాలు పెట్టినా రవాణా ఇబ్బందులు అన్లోడ్ కోసం తప్పని నిరీక్షణ విక్రయించి 50రోజులు దాటినా జమకాని డబ్బులు మానుకోట పట్టణంలో కొనసాగుతున్న ఆక్రమణలు చెరువులను కూడా వదలిన కబ్జాదారులు కనుమరుగువుతున్న కుంటలు చోద్యం చూస్తున్న సంబంఽధిత అధికారులు పదిరోజుల్లో కొనుగోళ్లు పూర్తి అంచనాకు మించి మక్కలు కొనుగోలు కేంద్రాలకు వచ్చాయి. ఇప్పటికే 82వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. మరో 20 వేల నుంచి 30వేలమెట్రిక్ టన్నుల మేరకు మక్కలు రావచ్చు. పది రోజుల్లో కొనుగోళ్లు పూర్తి అవుతాయి. డబ్బులు కూడా త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. –శ్యాం ప్రసాద్, డీఎం, మార్క్ఫెడ్, మహబూబాబాద్ -
వడదెబ్బతో రైతు మృతి
సంగెం : వడదెబ్బతో వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్లకు చెందిన రైతు గుండు వెంకటనర్సు(58) మృతి చెందాడు. వెంకటనర్సు సో మవారం మధ్యాహ్నం కాపులకనిపర్తి సొసైటీ కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్నల కాంటా వేయించి సా యంత్రం ఇంటికి చేరుకున్నాడు. అనంతరం అస్వస్థతకు గురికావడంతో మంగళవారం తెల్లవారుజామున వరంగల్ ఎంజీఎం తరలించి చికిత్స చేయిస్తుండగా ఉదయం మృతి చెందాడు. మృతుడికి భార్య స్వరూప, ఇద్దరు కూతుళ్లు శిరీష, అనుషా, కుమారుడు శ్రీకాంత్ ఉన్నారు. అన్నం పెట్టిన ఇంటికే కన్నంహసన్పర్తి: అన్నం పెట్టిన ఇంటికే ఓ ప్రబుద్ధుడు కన్నం వేశాడు. ఈ మేరకు మంగళవారం స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ మహేందర్ పత్రిక ప్రకటన విడుదల చేశారు. హసన్పర్తికి చెందిన రిటైర్డ్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ గుండమీది కోటేశ్వర్రావు ఇంటిలో ఇదే గ్రామానికి చెందిన కందుకూరి అశోక్ పనిమనిషిగా చేరాడు. అతని ప్రవర్తనలో మార్పును గమనించిన కోటేశ్వర్రావు తర్వాత పనినుంచి తొలగించాడు. కుటుంబపరిస్థితులు బాగాలేవని అశోక్ తిరిగి కోటేశ్వర్రావును ప్రాధేయపడడంతో మామునూరులోని వెటర్నరీ కాలేజీలో ఉద్యోగం ఇప్పించారు. ఉదయం ఉద్యోగానికి వెళ్తూ సాయంత్రం ఇంటిలో ఒంటరిగా ఉంటున్న కోటేశ్వర్రావు తల్లికి అశోక్ సాయం చేసేవాడు. 20రోజుల క్రితం కోటేశ్వర్రావు తల్లి మంగళసూత్రాన్ని దొంగిలించి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సా చేయడం ప్రారంభించాడు. కోటేశ్వర్రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. అశోక్పై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. చేసిన నేరాన్ని నిందితుడు అంగీకరించినట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్పారు. దీంతో అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. ● నిందితుడి అరెస్ట్.. రిమాండ్ -
పుష్కరాలకు విద్యుత్ ఏర్పాట్లు పూర్తి
హన్మకొండ: సరస్వతీనది అంత్య పుష్కరాలకు విద్యుత్ పనులు పూర్తయ్యాయి. ఈ నెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు పుష్కరాలు జరుగనున్నాయి. ఈ మేరకు భక్తులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ కాళేశ్వరంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నూతన లైన్ల నిర్మాణం, కొత్తగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసింది. విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో అవసరమైన చోట ఎత్తైన స్తంభాలు ఏర్పాటు చేశారు. 9 మీటర్ల ఎత్తు స్తంభాలు 152, 8 మీటర్ల ఎత్తు స్తంభాలు 330 ఏర్పాటు చేశారు. అయిదు కిలో మీటర్ల 11 కేవీ లైన్, 12 కిలో మీటర్ల ఎల్టీ లైన్ కొత్తగా నిర్మించారు. మొత్తం 18 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా నిర్వహణకు కోసం 16 కీలక ప్రాంతాల్లో 12 రోజుల పాటు రౌండ్ ది క్లాక్ పర్యవేక్షణ చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. మొత్తం 150 మంది విధులు.. సరస్వతీనది అంత్య పుష్కరాల్లో నలుగురు డివిజనల్ ఇంజినీర్లు, ఆరుగురు అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్లు, 13 మంది అసిస్టెంట్ ఇంజినీర్లు, 12 మంది సబ్ ఇంజినీర్లు, 13 మంది లైన్ ఇన్స్పెక్టర్లు, 9 మంది లైన్మెన్లు, 45 మంది అసిస్టెంట్ లైన్మెన్లు, తదితర సిబ్బంది కలిపి మొత్తం 150 మంది విధులు నిర్వర్తించనున్నారు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ విఫలమైతే విద్యుత్ అంతరాయం తలెత్తకుండా అదనపు ట్రాన్స్ఫార్మన్లను అందుబాటులో ఉంచారు. కీలక ప్రాంతాల్లో డబుల్ ఫీడింగ్ వ్యవస్థ.. దేవాలయం, టెంట్ సిటీ, వీఐపీ ఘాట్, మెయిన్ ఘాట్, హరిత హోటల్ తదితర కీలక ప్రాంతాలకు డబుల్ ఫీడింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఒక ఫీడర్లో అంతరాయం ఏర్పడితే మరో ఫీడర్ ద్వారా వెంటనే విద్యుత్ సరఫరా అందించేలా చర్యలు తీసుకున్నారు. అలాగే, బ్రేక్డౌన్ పరిస్థితుల్లో తక్షణ స్పందన కోసం కాళేశ్వరం, మహదేవపూర్, 132 కేవీ కాటారం సబ్స్టేషన్ వద్ద ప్రత్యేక బ్రేక్డౌన్ బృందాలను సిద్ధంగా ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు. భక్తులకు విద్యుత్ భద్రతా సూచనలు తెలిపేలా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. పుష్కర ఘాట్లు, రహదారులు, పూజామండపాల సమీపంలో ఎర్రపు, తెలుపు రంగుల హెచ్చరిక టేపులు, సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు.తెప్పోత్సవం పడవ రెడీ.. కాళేశ్వరం : కాళేశ్వరంలో 12 రోజులపాటు జరుగనున్న సరస్వతీనది అంత్య పుష్కరాలకు దేవాదాయశాఖ కాకినాడలో ప్రత్యేకంగా తెప్పోత్సవానికి హంసవాహన పడవను తయారు చేయించింది. ఆ పడవ మంగళవారం త్రివేణి సంగమానికి చేరుకుంది. 25 ఫీట్ల వెడల్పు, 30 ఫీట్ల పొడవుతో 40హెచ్పీ సామర్థ్యంతో 30 మంది కూర్చునేలా సిద్ధం చేశారు. 12 రోజల పాటు ఉత్సవ మూర్తులను ప్రత్యేక పూజలతో తిప్పనున్నారు.విద్యార్థిని ఆత్మహత్య ఏటూరునాగారం : అనారోగ్య సమస్యలతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబీకుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని తాళ్లగడ్డకు చెందిన పెండ్యాల భద్రయ్య స్వరూప దంపతుకు కూతురు శ్రీవల్లి(16) వేసవి సెలవుల్లో భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నారాయపురం గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. అక్కడ తరచూ అనారోగ్య సమస్యలు వస్తున్నాయని మదన పడుతూ సోమవారం ఎలుకల మందు తాగింది. ఈ విషయం గమనించిన తల్లి స్వరూప.. శ్రీవల్లిని ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కాగా, శ్రీవల్లి ఇటీవల టెన్త్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించింది.● సులభంగా లోపాలు గుర్తింపు, పరిష్కారం ● నెట్వర్క్ ప్రణాళికలో విప్లవాత్మక మార్పులు 18 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 150 మందితో నిరంతరాయ పర్యవేక్షణ -
విద్యుత్ లైన్ల జియో మ్యాపింగ్
హన్మకొండ: ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ విప్లవాత్మకమార్పులతో టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ముందుకు పోతోంది. మెరుగైన, నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ను అందించడమే లక్ష్యంగా అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ వినియోగదారులకు సేవలు అంది స్తోంది. ఈ క్రమంలో విద్యుత్ లైన్లలో తలెత్తే లోపాలు గుర్తించడం, వాటిని త్వరగా సరిదిద్దేందుకు నెట్వర్క్ ప్రణాళికలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ జీఐఎస్ (జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం) మ్యాపింగ్ చేపట్టింది. ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతోంది. టీజీ ఎన్పీడీసీఎల్లో మొత్తం 33 కేవీ ఫీడర్లు 708, 11 కేవీ ఫీడర్లు 7,047 ఉన్నాయి. ఇప్పటివరకు టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో 33 కేవీ 697 ఫీడర్లు, అలాగే 11 కేవీ ఫీడర్లు 2,822 జీఐఎస్ మ్యాపింగ్ పూర్తి అయ్యింది. 2,596 ఫీడర్ల జీఐఎస్ ప్రక్రియ చురుగఆ కొనసాగుతోంది. 1,629 ఫీడర్ల పనులు మొదలు పెట్టాల్సి ఉంది. స్కాడా నెట్వర్క్తో అనుసంధానం.. జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా విద్యుత్ వ్యవస్థకు సంబంధించిన విద్యుత్ స్తంభాలు, లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్ల వంటి అన్ని వివరాలు డిజిటల్ రూపంలో భౌగోళిక మ్యాప్పై పొందుపరుస్తున్నా రు. స్కాడా నెట్వర్క్తో అనుసంధానం చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యలు తలెత్తి, అంతరాయం కలిగినప్పుడు త్వరితగతిన పునరుద్ధరించడానికి ఎంతగానో దోహదపడుతుంది. జీఐఎస్తో విద్యుత్ లోపాలను సులభంగా గుర్తించవచ్చు. తద్వారా లోపాలను త్వరితగతిన పరిష్కరించవచ్చు. విద్యుత్ సరఫరా అంతరాయాలు తగ్గుతాయి. నెట్వర్క్ ప్రణాళిక, విస్తరణ పనులకు సమర్థవంతమైన డేటా అందుబాటులో ఉంటుంది. మరమ్మతు పనులు మరింత వేగవంతం.. జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా విద్యుత్ వ్యవస్థకు సంబంధించిన డిజిటల్ డేటాబేస్ రూపొందించడంతో పాటు వాటి నిర్వహణ, నిర్వహణ ప్రణాళికలు, మ రమ్మతులు మరింత వేగవంతంగా నిర్వహిస్తారు. ఈ వ్యవస్థ ద్వారా విద్యుత్ పంపిణీ నెట్వర్క్ను శాసీ్త్రయంగా ప్రణాళిక చేయడం, కొత్త లైన్లు, సబ్స్టేషన్ల ఏర్పాటు, లోడ్ ఫోర్కాస్టింగ్ వంటి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయనున్నారు.జీఐఎస్ మ్యాపింగ్తో విద్యుత్ లైన్లలో ఉత్పన్నమయ్యే లోపాలను త్వరగా పరిష్కరించవచ్చు. విద్యుత్ లైన్ల నిర్వహణ సులభంగా చేపట్టవచ్చు. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ముందుకు వెళ్తున్నాం. – కర్నాటి వరుణ్రెడ్డి, సీఎండీ, టీజీ ఎన్పీడీసీఎల్ -
నడువ దారిలేదు.. తాగునీరు లేదు!
మరిపెడ రూరల్: మండలంలోని బుర్హాన్పురం గ్రామ పంచాయతీ పరిధిలోని మహబూబాబాద్–సూర్యాపేట 365 జాతీయ రహదారి వెంట ఉన్న పల్లె దవాఖాన ప్రస్తుతం సమస్యలమయంగా మారింది. గ్రామీణ ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ దవాఖానా ఇప్పుడు కనీస మౌలిక వసతులు లేక ప్రజలకు భారంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దవాఖానాకు వెళ్లేందుకు సరైన రహదారి లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రి ముందు గుంతను తొవ్వి వదిలేయడం కారణంగా గుంత దాటిపోవాలంటే వృద్ధులు, గర్భిణీలు, బాలింతలకు కష్ట సాధ్యంగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో రోగులను తీసుకెళ్లేందుకు వాహనాలు కూడా చేరలేని పరిస్థితి నెలకుంది. రోగులకు తాగునీటి గోస ఆస్పత్రిలో తాగునీటి సౌకర్యం లేక రోగులు, వారి వంట వచ్చే కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. వైద్య సేవల కోసం వచ్చిన ప్రజలు నీటి కోసం బయటకు వెళ్లాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేక పోవడంతో వైద్యులు, సిబ్బంది అవస్థలు పడుతున్నారు. సుదూర ప్రాంతంలో ఆస్పత్రి ప్రధాన సమస్య ఏమిటంటే, ఈ పల్లెదవాఖాన గ్రామానికి సుమారు కిలోమీటరు దూరంలో ఉండటం, దీంతో నడవలేని వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులతో వచ్చే మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రవాణ సౌకర్యం లేక కొందరు వైద్య సేవలకు దూరమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మౌలిక సదుపాయాలు కల్పించాలి స్థానిక ప్రజలు పలుమార్లు అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా పరిష్కారం కనిపించలేదని అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు ప్రజలకు చేరువ కావాలంటే ముందుగా మౌలిక వసతులు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికై నా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి పల్లె దవాఖానకు సరైన రహదారి, తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేల చర్యలు తీసుకోవాలని బుర్హాన్పురం, పరిసర గ్రామాల ప్రజలు కోతున్నారు. అసౌకర్యాల మధ్య పల్లె దవాఖాన నరకయాతన పడుతున్న రోగులు పట్టించుకోని అధికారులు -
ఎదురుచూపులు
● అతిథి గృహ నిర్మాణంలో జాప్యం ● ఏళ్ల తరబడి భక్తులకు తప్పని తిప్పలు కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయ అతిథి గృహ నిర్మాణం చేపడుతారా లేదా? అని భక్తులు ఎదురుచూస్తున్నారు. ఏళ్ల నుంచి అతిథి గృహం నిర్మిస్తామని చెబుతున్న ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు ఆ పనులకు మాత్రం శ్రీకారం చుట్టడం లేదు. దీంతో భక్తులు గెస్ట్ హౌస్ నిర్మాణం జరుగుతుందా? లేదా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. నిధులు ఉన్నట్లు సమాచారం.. గెస్ట్ హౌస్ నిర్మాణానికి సంబంధించిన స్థలం సైతం అందుబాటులోనే ఉంది. గతంలో ఆలయానికి అనుబంధంగా ఉన్న కై లాస భవన స్థలం అందుబాటులో ఉంది. కై లాస భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో దాని స్థానంలో గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం గత సీఎం కేసీఆర్ ఇచ్చిన నిధులు ఉండేవి. అప్పుడు పనులు చేపట్టకపోవడంతో ఆ నిధులు వెనక్కి వెళ్లినట్లు ప్రచారం. అయితే ఆ నిధులు దేవాదాయ శాఖ వద్ద ఉన్నట్లు సమాచారం. ఆ నిధులకు తోడు మరిన్ని నిధులు సమకూర్చి గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటింది. అయినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. రెండేళ్ల నుంచి నూతన పాలకమండలి గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం ఏం చేస్తుందో భక్తులకు తెలియచేయాల్సిన బాధ్యత ఉంది.కై లాస భవన స్థలం అన్యాక్రాంతం? కై లాస భవన స్థలం గుట్టపై ఉంది. ఏళ్ల నుంచి ఆ గుట్టపై ఉన్న కై లాసభవనం ఉత్సవ విగ్రహంలా కనిపిస్తోంది. అయితే ఇప్పటికే చాలావరకు కై లాస భవన స్థలం అన్యాక్రాంతమైంది. చాలాఇళ్లు నిర్మాణం జరిగాయి. మరిన్ని ఇళ్లు నిర్మాణం అవుతున్నాయి. కాగా, దేవాదాయ , రెవెన్యూ శాఖల అధికారులు కై లాస భవన స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా చూసి ఆలయానికి ఉపయోగపడే గెస్ట్ హౌస్ నిర్మాణానికి సహకరించాలని భక్తులు కోరుతున్నారు. -
సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలి
గూడూరు: ఐకేపీలో పనిచేస్తున్న వీఓఏలను ప్రభుత్వం సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ వర్తింపజేయాలని మండల వీఓఏల సంఘం నాయకుడు బానోతు లక్ష్మణ్, దారం శ్రీలత డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఐకేపీ జాక్ పిలుపు మేరకు సమస్యల పరిష్కారం కోసం సమ్మె ప్రారంభించారు. యూనియన్ బ్యాంకు మేనేజర్ రవికుమార్, ఐకేపీ ఏపీఎం వీరయ్య, ఎస్సై గిరిధర్రెడ్డిలకు సమ్మె నోటీసు అందించారు. కార్యక్రమంలో వీఓఏలు బుర్ర శారద, గడీల వసంత, కుమారస్వామి, భాస్కర్, శ్రీలత, యాకయ్య పాల్గొన్నారు. -
గ్రంథాలయం.. విజ్ఞానభాండాగారం
నర్మెట ప్రభుత్వ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థిని శ్రీనిత్య గీసిన చిత్రంలో పాఠశాల ప్రత్యక్షమైన జ్ఞానదీపం, సరస్వతి అమ్మవారి రూపం, విద్య పవిత్రతను సూచిస్తోంది. హంస, పద్మం నిర్మలత, పవిత్రతకు సంకేతాలు. పుస్తకం, వీణ విద్య, కళ, సాంస్కృతిక విలువలు తెలియజేస్తున్నాయి. ప్రకృతి, చెట్లు, మేఘాలు సృజనాత్మకతతో పాటు జీవన సమతుల్యాన్ని చూపుతున్నాయి. మొత్తంగా ఈ చిత్రం విద్య, సంప్రదాయం, ప్రకృతి, సుస్వరం అన్నీ కలిసి అందమైన భావవ్యక్తీకరణగా కనిపిస్తోంది. –జనగామ ● మండల కేంద్రంలో అందరికీ అందుబాటులో లైబ్రరీ మండల కేంద్రంలో శాఖా గ్రంథాలయం అందరికీ అందుబాటులో ఉంది. అందులో పోటీ పరీక్షలకే కాకుండా శాస్త్ర సాంకేతిక, రాజకీయ, సాంస్కృతిక, సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలతోపాటు చిన్నారులకు ప్రత్యేక కథల పుస్తకాలు మొత్తం కలిసి సుమారు పదివేల వరకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా చిన్నారులకు గ్రామీణ ఆటలు, నీతి కథలు, బాలల బొమ్మలతో అనంతవిశ్వం, మహానుభావుల జీవిత చరిత్ర వంటి తక్కువ పేజీలతో ఆకర్షణీయంగా అందుబాటులో ఉన్నాయి. ఉదయం 8 నుంచి 11: 30 వరకు, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు చదువుకునే చిన్నారులకు గ్రంథాలయం తెరిచి ఉంటుంది. అంతేకాకుండా రూ.100 సభ్యత్వం తీసుకుని 15 రోజులు ఏదైనా పుస్తకం ఇంటికి తీసుకెళ్లి చదువుకుని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా జిల్లాలోని అన్ని మండలాల్లో శాఖ గ్రంథాలయాలు అందుబాటులో ఉంటాయి. –లింగాలఘణపురం ప్రస్తుత రోజుల్లో చదువుతోపాటు వివిధ రంగాల్లో బాలికలే రాణిస్తున్నారు. ముఖ్యంగా బొమ్మలు గీయడంలో అద్భుత ప్రతిభ కనబర్చుతున్నారు. ఇందులో భాగంగా మండలంలోని హిమ్మత్నగర్ ప్రభుత్వ పాఠశాల 5వ తరగతి విద్యార్థి జల్లెల వర్షిణి వివిధ రకాల బొమ్మలు గీస్తూ ప్రశంసలు అందుకుంటోంది. –జఫర్గఢ్ అతిగా ఆశపడితే ఉన్నది ఊడ్చుకుపోతుంది పేద తమ్ముడు ప్రతీ రోజు చేపలు పట్టి జీవనం సాగించేవాడు. ఒక రోజు అతడి వలలో బంగారు చేప చిక్కింది. వల నుంచి బయటకు తీయగానే ఆ చేప దేవతలాగే రూపం ధరించి, తనను నీటిలో వదిలినందుకు కృతజ్ఞతగా ‘తిరు గతి’ అనే వరాన్ని తమ్ముడికి ఇచ్చింది. ఆ తిరుగతి తిప్పుతూ ‘తిరుగవే తిరు గవే తిరుగతి, నా కోరిక తీరేదాకా తిరుగవే’ అని కోరితే ఆశించిన అన్నీ ప్రత్యక్ష మవుతాయని చేప తెలిపింది. తమ్ముడు ఆ వరాన్ని ఉపయోగించి తనకూ, తన కుటుంబానికి అవసరమైన అన్నీ సంపాదించాడు. కొద్ది కాలంలోనే అతను పేదవాడి నుంచి ధనవంతుడయ్యాడు. తమ్ముడు ధనవంతుడవడం చూసి పెద్ద అన్న లోభపడి, తన భార్య అనారోగ్యంగా ఉందని అబద్ధం చెప్పి తమ్ముడిని పిలిపించాడు. రాత్రికి తమ్ముడు నిద్రపోయిన తర్వాత అతని ఇంటికి దొంగచాటుగా వెళ్లి తిరుగతి చోరీ చేశాడు. చేపను దొంగిలించి పడవలో పరారవుతూ అతడు కూడా బంగారు చేప చెప్పిన మాటలతో ‘తిరుగవే తిరుగవే తిరుగతి, నాకు ఉప్పు కావాలి’ అని కోరాడు. వెంటనే చెరువంతా ఉప్పుతో నిండిపోవడంతో అతడు ఉన్న పడవ మునిగి పోయింది. లోభం మనిషిని నాశనం చేస్తుంది. ఇతరుల సంపాదించిన దానిపై కన్నేయకూడదు. ఉపకారానికి ఉపకారం చేయాలి, ద్రోహం కాదు. మా గురువు గారు చెప్పిన కథను.. ఆచరిస్తూ సమ్మర్ సెలవుల్లో నా స్నేహితులకు బోధిస్తున్నా. –జనగామనీతి: ఇతరుల సంపాదించిన సంపదపై ఆశపడకూడదు గురువు చెప్పిన కథతాను గీసిన చిత్రంతో వర్షిణి -
నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలి
గూడూరు: మండలంలోని పలు ఫర్టిలైజర్, పురుగు మందులు, విత్తన విక్రయదారులు రైతులకు నాణ్యమైనవి, కల్తీలేనివి అందించాలని సీఐ వినయ్కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన, ఎరువుల మందుల దుకాణ యజమాను(డీలర్)లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సీఐ ప్రతీ ఒక్కరు షాపునకు సంబంధించిన అనుమతులతోపాటు విక్రయించే ప్రతీ దానికి ఒరిజినల్ బిల్లులు రైతులకు ఇవ్వాలన్నారు. అదేవిధంగా నాణ్యమైనవి అందించాలని, ఎవరైనా ఎలాంటి తప్పిదాలకు పాల్పడినా చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎండీ అబ్దుల్మాలిక్, ఎస్సై గిరిధర్రెడ్డి పాల్గొన్నారు. -
‘ఉపాధి’కి ఫీల్డ్అసిస్టెంట్ల కొరత
డోర్నకల్: ఉపాధి పథకం అమలుకు ఫీల్డ్ అసిస్టెంట్ల కొరత ఇబ్బందిగా మారింది. దీంతో ఉపాధి పనుల గుర్తింపు, కూలీలకు పనులు కల్పించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మండలంలోని 26 గ్రామపంచాయతీల్లో సుమారు 9000 మంది కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొంటున్నారు. గ్రామాల్లో ప్రతీరోజూ చెరువు పూడికతీత, ఫీడర్ ఛానళ్ల మరమ్మతులు, గుట్టల చుట్టూ నీటి నిల్వ గుంతల తవ్వకం పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం 26గ్రామ పంచాయతీల్లో కేవలం ఆరుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. తక్కువ మంది ఉండడంతో ఒక్కొక్కరికి నాలుగు గ్రామాల చొప్పున విధులు కేటాయించారు. ఆరుగురిలో కొంతమంది అనారోగ్య సమస్యలతో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్లు పనిభారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాలు ఎక్కువ కావడంతో ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి పనుల వద్ద మేట్లపై ఆధారపడుతున్నారు. పట్టించుకోని కార్యదర్శులు.. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు ఉపాధి పథకాన్ని పట్టించుకోవడం లేదు. పథకం అమలులో భాగస్వాములు కావాల్సిన పంచాయతీ కార్యదర్శులు పథకంతో తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఫీల్డ్ అసిస్టెంట్లు లేని గ్రామాల్లో పని ప్రదేశాలకు పనులను పరిశీలించాల్సిన పంచాయతీ కార్యదర్శులు అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ గ్రహణం.. గ్రామాల్లో ఉపాధి పథకంలో రాజకీయ నేతలు ఉపాధి పనుల్లో జోక్యం చేసుకోవడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత ప్రభుత్వం, పంచాయతీ పాలకవర్గాలు నియమించిన మేట్లను ప్రస్తుత పాలకవర్గాలు తొలగిస్తుండటంతో గొడవలు జరుగుతున్నాయి. 40 నుంచి 60మందికి ఓ మేట్ విధులు విధులు నిర్వహించాల్సి ఉండగా ప్రస్తుతం 40మందికి పైగా మేట్లు విధులు నిర్వహిస్తున్నారు. అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించి ఉపాధి పనులు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఒకరికి నాలుగు గ్రామాల్లో బాధ్యతలు పట్టించుకోని జీపీ కార్యదర్శులు -
చదువుతోపాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి
మహబూబాబాద్ అర్బన్: విద్యార్ధులు చదువుతోపాటు క్రమశిక్షణ అలవర్చుకోవడం వల్ల జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కిరాణవర్తక సంఘం భవనంలో వాసవిమాత కార్పొరేషన్ ఆధ్వర్యంలో టెన్త్, ఇంటర్, జేఈఈ మెయిన్స్లో ప్రతిభ కనబర్చిన ఆర్యవైశ్య విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈసందర్భంగా డీఎస్పీ తిరుపతిరావు మాట్లాడుతూ.. విద్యార్థులకు క్రమశిక్షణ వ్యక్తిగత ఎదుగుదలకు విజయానికి ఎంతో దోహదపడుతుందన్నారు. ప్రతి విద్యార్థి శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. అనంతరం విద్యార్థులకు డీఎస్పీ, సీఐ అంజలి పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ సత్యనారాయణమూర్తి, ఆర్య్యవైశ్య కార్పొరేషన్ బాధ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. డీఎస్పీ తిరుపతిరావు -
ప్రజలను మోసగించిన మోదీ ప్రభుత్వం
కేసముద్రం: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్య ప్రజలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మోసగించిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అంబటి మహేందర్రెడ్డి విమర్శించారు. సోమవారం మండలంలోని మహముద్పట్నం గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు ప్రధాని మోదీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచకుండా, ఎన్నికల తర్వాత ధరలను పెంచి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపారన్నారు. కార్యక్రమంలో మహముద్పట్నం సర్పంచ్ కట్ల ఎల్లయ్య, సప్పిడిగుట్టతండా సర్పంచ్ బానోత్ భద్రు, భుక్యారాంతండా సర్పంచ్ జాటోత్ సోమీ, ఉపసర్పంచులు అమృత శ్రీనివాస్, దారావత్ మహేందర్, మిట్టగడుపుల యాకుబ్ పాల్గొన్నారు. పెట్రోల్ ధరలు తగ్గించాలి పెంచిన పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలంటూ సోమవారం మున్సిపాలిటీ పరిధి అంబేడ్కర్ సెంటర్లో సీపీఎం ఆధ్వర్యంలో ఆటోకు తాళ్లను కట్టి లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు బొబ్బాల యాకుబ్రెడ్డి, చాగంటి కిషన్, నీరుటి జలేందర్, జల్లె జయరాజ్ పాల్గొన్నారు. -
సందడిగా 2కే రన్ ప్రారంభం
డోర్నకల్: స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్ నుంచి పెద్ద చెరువు వరకు నిర్వహించిన 2కే రన్ సందడిగా సాగింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రారంభమైన 2కే మారథాన్ను మున్సిపల్ చైర్పర్సన్ కొండేటి రాజకుమారిహరినాథ్ ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి.నిరంజన్, మైస్ చైర్పర్సన్ మాదా లావణ్యాశ్రీనివాస్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. గార్ల: గార్లలో 2కే రన్ను సర్పంచ్ బానోత్ పార్వతి హతీరాం, ఎంపీడీఓలు ప్రారంభించారు. కార్యక్రమంలో బాస్కెట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ సూత్రపు జయశంకర్, పీడీ శ్రీను, కోచ్లు అలవాల పవన్సోమంత్, శంకర్, ప్రశాంత్ పాల్గొన్నారు. బయ్యారం: మండలకేంద్రంలో గాంధీసెంటర్ నుంచి ప్రారంభమైన 2కే రన్ బయ్యారంలోని పలు వీధుల్లో కొనసాగింది. ఎంపీడీఓ దీపిక, ఎంఈఓ లక్ష్మ ణ్రావు, సర్పంచ్ శాంతికిషన్నాయక్, ఉపసర్పంచ్ ఉమారంజిత్ పాల్గొన్నారు. ఇనుగుర్తి: మండల కేంద్రంలో తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ పార్థసారథి, ఎస్సై కరుణాకర్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ తమ్మడపల్లి కుమార్, మలిశెట్టి శోభన్, వాలీబాల్ కోచ్ కుటికంటి కిరణ్, పొన్న కవిత, వెంకన్న పాల్గొన్నారు. నెల్లికుదురు: మండల కేంద్రంలో 2కే రన్లో ఎస్సై చిర్ర రమేష్ బాబు, ఎంపీఓ పద్మ, సర్పంచ్ పులి వెంకన్న, వివిధ శాఖల అధికారు, యువకులు పాల్గొన్నారు. గూడూరు: మండల పరిషత్ కార్యాలయం నుంచి ప్రధాన బస్టాండ్ సెంటర్ వరకు 2కే రన్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ర్పంచ్ వాంకుడోతు సునీతకొమ్మాలునాయక్, ఎంఈఓ సుజాత, సీఐ వినయ్కుమార్, ఎస్సై గిరిధర్రెడ్డి, ఉప సర్పంచ్ చంటి స్వామి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కురవి: కురవి, సీరోలు మండల కేంద్రాల్లో మండల స్థాయి మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓలు వీరబాబు, గౌస్, ఎంఈఓ బాలాజీ, ఎస్సైలు సతీష్, సంతోష్, పీఈటీలు, పీడీలు, మాజీ క్రీడాకారులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. దంతాలపల్లి: ప్రగతి ప్రణాళికలో భాగంగా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన 2కే రన్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అప్సర్పాషా, ఎంఈఓ శ్రీదేవి, హెచ్ఎం వేణుమాధవరెడ్డి, సర్పంచులు, కార్యదర్శులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సంక్షిప్త సమాచారం
క్రీడల్లో రాణిస్తే ఉపాధి అవకాశాలు పెద్దవంగర: క్రీడల్లో రాణిస్తే ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎంపీడీఓ బి. వేణుమాధవ్ తెలిపారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు సీఎం కప్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. అనంతరం పాఠశాలలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు శ్రీరాం కార్తీక్, కన్నె నందినిలు ఎంపీడీఓ అభినందించారు. మంత్రిని తొలగించాలి నెహ్రూసెంటర్: నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ను మంత్రివర్గం నుంచి తొలగించాలని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రవి సోమవారం డిమాండ్ చేశాడు. నెలల తరబడి చదువుకుని పరీక్ష రాసిన విద్యార్థులకు తీవ్ర మానసిక వేదన మిగిలిందన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. హామీల అమలు కోసం ఉద్యమిస్తాం.. బయ్యారం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తమ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి అశోక్ అన్నారు. మండలంలోని కొత్తపేటలో సోమవారం నిర్వహించిన ఆ పార్టీ రాష్ట్ర స్థాయి జనరల్బాడీ సమావేశంను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. బయ్యారం పెద్దచెరువుకు గోదావరి నీటిని తరలించి పంటలకు నీరందించాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు పొమ్మయ్య, ఊక్లా, కవిత, దేవేందర్, అంజయ్య, రామచంద్రు పాల్గొన్నారు. కోతుల పట్టివేత గార్ల: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సోమవారం గార్ల పట్టణంలో సర్పంచ్ బానోత్ పార్వతి హతీరాం నెల్లూరు నుంచి కోతులను పట్టే వారిని పిలిపించి సుమారు 450 కోతులు పట్టించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఒక్కో కోతికి రూ.300 కోతులు పట్టేవాళ్లకు చెల్లిస్తున్నామన్నారు. తూము సరిగ్గాలేకనే నీళ్లు వృథా తొర్రూరు రూరల్: మండలంలోని అరిపిరాల గ్రామ పెద్ద చెరువు తూము సరిగ్గాలేకనే నీళ్లు వృథాగా పోతున్నాయని మత్స్య పారిశ్రామిక సంఘం నాయకులు అన్నారు. సోమవారం వారు మాట్లాడుతూ గ్రామంలోని కొంతమంది రాజకీయ నాయకులు మత్స్యకారులపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ చేపల కోసం చెరువు నీళ్లను వృథా చేస్తున్నట్లు ఆరోపించడం సరికాదన్నారు, భూములకు హద్దుల ఏర్పాటు నెల్లికుదురు: మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ భూములకు సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేసినట్లు దేవాదాయ శాఖ పరిశీలకులు నందనం కవిత అన్నారు. మండల కేంద్రంలోని దేవాలయ భూముల్లో సోమవారం సర్వే చేసి హద్దు రాళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ సర్వేయర్ పసునూరి అనిల్, జూనియర్ అసిస్టెంట్ శేఖర్ పాల్గొన్నారు. ఇద్దరికి జైలు ములుగు రూరల్: గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన ఇద్దరు వ్యక్తులకు 10 సంవత్సరాల జైలు శిక్ష , ఒక్కొక్కరికీ రూ.లక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఎస్పీవీ సూర్య చంద్రకళ తీర్పు వెలువరించినట్లు ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకన్ సోమవారం తెలిపారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పల్తియాతండాకు చెందిన పల్తియా శంకర్, వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామానికి చెందిన బూడిద శ్రీకాంత్లపై నేరం నిరూపణకావడంతో శిక్ష విధించారు. -
రైతుల ఆందోళన
తొర్రూరు రూరల్: మండలంలోని చీకటాయాపాలెం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రెవెన్యూ, పీఏసీఎస్ అధికారులతో వాగ్వివాదం చేసి రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా నాయకులు పసుమర్తి సీతారాములు, మంగళపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గన్నీ సంచులు, లారీలు లేక ధాన్యం కాంటాలు పెట్టకపోవడంతో వర్షం ఎప్పుడు వస్తుందో అని రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. గత నలభై రోజులుగా ధాన్యాన్ని కల్లాల్లోనే ఉంచుతూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు ఎండీ అంకూస్, నలమాస ప్రమోద్గౌడ్, కాలునాయక్, వెంకన్న పాల్గొన్నారు. గడ్డికట్టలు దగ్ధం కేసముద్రం: నిప్పంటుకుని రెండున్నర ఎకరాల గడ్డికట్టలు దగ్ధమైన సంఘటన మున్సిపాలిటీ పరిధి కేసముద్రంవిలేజ్లో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కేసముద్రంవిలేజ్కి చెందిన మాలోతు నరేష్ అనే రైతు తన రెండున్నర ఎకరాల గడ్డి కట్టలను పంటపొలంలో ఉంచాడు. ప్రమాదవశాత్తు గడ్డి కట్టలకు నిప్పంటుకుంది. సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. అప్పటికే 150 గడ్డికట్టలు దగ్ధమయ్యాయి. దీంతో రూ.15వేల నష్టం వాటిల్లింది. గుర్తుతెలియని వ్యక్తులు మొక్కజొన్న చొప్పకు నిప్పంటించారని, దీంతో గడ్డికట్టలు దగ్ధమయ్యాయని బాధిత రైతులు ఆరోపిస్తున్నాడు. -
ఎప్సెట్లో 95వ ర్యాంక్
డోర్నకల్: మండలంలోని ముల్కలపల్లికి చెందిన ధరంసోత్ తనుష్నాయక్ ఎప్సెట్ ఇంజనీరింగ్ విభాగం రాష్ట్రస్థాయిలో 95 ర్యాంక్ సాధించాడు. ముల్కలపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ధరంసోత్ వినోద్, రామలక్ష్మి దంపతుల కుమారుడు తనుష్నాయక్. గ్రామస్తులతోపాటు పలువురు ఉపాధ్యాయులు అభినందించారు. కరపత్రాల ఆవిష్కరణ మహబూబాబాద్ అర్బన్: జన్ భాగిదారి సబ్సే దూర్, సబ్సే పహ్లే వారోత్సవ అభియాన్ వాల్ పోస్టర్లను అడిషనల్ కలెక్టర్ పురుషోత్తం, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి దేశ రామ్ నాయక్ సోమవారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా అడిషనల్ కలెక్టర్ పురుషోత్తం మాట్లాడుతూ.. ఈనెల 18నుంచి ఈనెల 25వరకు జిల్లా వ్యాప్తంగా సబ్సే దూర్, సబ్సే పహ్లే వారోత్సవాలు నిర్వహించబడతాయన్నారు. బోనమెత్తిన మాజీ మంత్రి కురవి: మండలంలోని తన సొంత గ్రామమైన పెద్దతండాలో సోమవారం నిర్వహించిన బొడ్రాయి పండుగ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ కుటుంబ సభ్యులతో కలిసి గ్రామ దేవతకు భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించారు. ఇన్చార్జ్ జిల్లా జడ్జి పూజలు మహబూబాబాద్ రూరల్: వరంగల్ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న జే.మైత్రేయ మహబూబాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టుకు ఇన్చార్జ్ జడ్జిగా నియామకం అయ్యారు. ఈమేరకు జిల్లా జడ్జి మైత్రేయ అనంతాద్రి జగన్నాథ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపెల్లి వెంకటయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మామిడాల సత్యనారాయణ, జంగం సిద్ధార్థ పాల్గొన్నారు. డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం కొత్తగూడ: ప్రభుత్వం ఇటీవల నూతనంగ మంజూరు చేసిన కొత్తగూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం అయినట్లు ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ లక్ష్మణ్నాయక్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో క్యాన్వసింగ్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఏ, బీకాం కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ లైఫ్సైన్స్, ఫిసికల్ సైన్స్ కోర్సులు ప్రారంభం అవుతాయని తెలిపారు. అన్ని ఇంగ్లిష్ మాద్యమంలో ఉంటాయన్నారు. ప్రతీ కోర్సులో కేవలం 60మంది విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 99081 27796 నంబర్కు సంప్రదించాలని సూచించారు. న్యాయ సహాయాన్ని వినియోగించుకోవాలి మహబూబాబాద్ రూరల్: రైతులు ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయవాదులు వై.చెన్నమల్లారెడ్డి, వి.రాజ్ కృష్ణ పిలుపునిచ్చారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని సండ్రలగూడెం రైతువేదికలో రైతులకు వివిధ చట్టాలపై సోమవారం అవగాహన కల్పించారు. న్యాయపరమైన సలహాలు కావాల్సి వస్తే టోల్ ఫ్రీ నంబర్ 15100కు ఫోన్ చేసి ఉచిత సలహాలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో సండ్రలగూడెం సర్పంచ్ జక్క లక్ష్మయ్య, ఉపసర్పంచ్ పార్వతి, వార్డు సభ్యులు సుగుణ, పూలమ్మ, కారోబార్ పొడుగు విజయ్ పాల్గొన్నారు. మహాసభలను జయప్రదం చేయండి నెహ్రూసెంటర్: తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కేతరాజు ఉప్పలయ్య పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని వీరభవన్ వద్ద మహాసభల పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 25, 26 తేదీలలో హైదరాబాద్లో మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈనెల 20వ తేదీన సంఘం జిల్లా మహాసభను జయప్రదం చేయాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అజ్మీర వేణు, కేదాసు రమేష్, కట్లోజు పాండురంగాచారి పాల్గొన్నారు. -
3,360 బస్సులు.. 5,772 ట్రిప్పులు
హన్మకొండ: సరస్వతి అంత్య పుష్కరాల కు టీజీఎస్ ఆర్టీసీ సన్నద్ధమైంది. ఈ నెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల సంగమస్థలమైన పవిత్ర క్షేత్రం కాళేశ్వరంలో అంత్యపుష్కరాలు జరగనున్నాయి. ఈ పుష్కరాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం టీజీఎస్ ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. కాళేశ్వరంలోని 4.36 ఎకరాల్లో భక్తుల కోసం ప్రభుత్వం తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటు చేసింది. దేవాదాయ శాఖ చలువపందిళ్లు వేయించింది. మిషన్ భగీ రథ (ఆర్డబ్ల్యూఎస్) శాఖ తాగునీటి సౌకర్యం కల్పిస్తుంది. విద్యుద్దీకరణ పనులు ఆర్టీసీ చేపట్టింది. ఈ నెల 20 నాటికి కాళేశ్వరంలో ఆర్టీసీ బస్పాయింట్లో అన్ని ఏర్పాట్లు పూర్తికా నున్నాయని అధికారులు తెలిపారు. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్లు, ప్రయాణికుల కోసం వెయిటింగ్ షెడ్లు, సిబ్బంది విశ్రాంతి గదులు తాత్కాలిక బస్ స్టేషన్లో ఏర్పాట్లు చేశారు. ప్రతీ రోజు 125 బస్సులు, సెలవు రోజుల్లో 145 బస్సులు.. టీజీఎస్ ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు మొత్తం 3,360 బస్సుల ద్వారా 5,772 ట్రిప్పులు నడపాలని నిర్ణయం తీసుకుంది. వరంగల్ రీజి యన్లో మొత్తం 1,580 బస్సులు నడిపేలా ప్రణాళిక రూపొందించారు. వరంగల్ రీజియన్లోని 9 డిపోల నుంచి ప్రత్యేక బ స్సులు నడిపేలా కార్యాచరణ సిద్ధం చేశా రు. ప్రస్తుతం హనుమకొండ–కాళేశ్వరం మార్గంలో భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, హనుమకొండ, వరంగల్–1, వరంగల్–2 డిపోల ద్వారా 59 బస్సులు నడుస్తున్నాయి. పుష్కరాల సందర్భంగా ఈ నెల 21 నుంచి ప్రతీ రోజు 125 ప్రత్యేక బస్సులు, సెలవు రోజుల్లో రోజుకు 145 ప్రత్యేక బస్సులు నడిపించనున్నారు. ప్రతీ రోజు వరంగల్–1 డిపో 20 బస్సులు, వరంగల్–2 డిపో 25, హనుమకొండ 20, జనగామ 10, పరకాల 10, నర్సంపేట 10, తొర్రూరు 5, మహబూబాబాద్ డిపో నుంచి 5 బస్సులు నడపనున్నారు. పర్యవేక్షణ కోసం రెండు మొబైల్ టూవీలర్ పెట్రోలింగ్ పార్టీలను ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు వలంటీర్లను నియమించా రు. కాళేశ్వరం తాత్కాలిక బస్స్టేషన్ వద్ద క్యాంటీన్ సౌకర్యం కల్పిస్తున్నారు. ● సరస్వతి అంత్య పుష్కరాలకు ఆర్టీసీ సన్నద్ధం ● ఈనెల 21 నుంచి ప్రత్యేక బస్సులు ● కాళేశ్వరంలో 4.36 ఎకరాల్లో బస్పాయింట్ సరస్వతి అంత్య పుష్కరాలకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సురక్షిత, సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. భక్తులు ఆర్టీసీ బస్సుల్లోనే క్షేమంగా ప్రయాణించి మొక్కలు తీర్చుకోవాలి. ప్ర స్తుతం నడపనున్న బస్సులతో పాటు అవసరమైతే భక్తుల రాకను బట్టి అప్పటికప్పుడు ప్రత్యేక బస్సులు సమకూర్చి త్వరితగతిన చేరవేస్తాం. ఎస్.భవాని ప్రసాద్, ఆర్టీసీ వరంగల్ ఆర్ఎం -
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
కేసముద్రం: మక్క రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎప్పటికప్పుడు మక్కలను కొనుగోలు చేయాలని కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మక్కలను మార్కెట్ షెడ్లలో గోదాంలలో నెట్ వేయిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 3.69లక్షల బస్తాలను కొనుగోలు చేశామన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారం రోజుల్లో మక్కలను పూర్తిస్థాయిలో కొనుగోళ్లు జరిపేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్సై క్రాంతికిరణ్, స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ అమరలింగేశ్వర్రావు, ఏఓ వెంకన్న, సీఈఓలు మల్లారెడ్డి, ఎల్లయ్య, వల్లందాసు రవి పాల్గొన్నారు. -
ఎప్సెట్లో ‘షైన్’ విద్యాసంస్థల విజయభేరి
హన్మకొండ: టీజీ ఎప్సెట్ ఫలితాల్లో హనుమకొండలోని షైన్ విద్యాసంస్థల విద్యార్థులు విజయభేరి మోగించారు. తమ కళాశాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని షైన్ విద్యా సంస్థల చైర్మన్ మూగల కుమార్యాదవ్ తెలిపారు. రాష్ట్రస్థాయిలో 2,193, 2,772 ర్యాంకులతో కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ఫలితాలు సాధించినట్లు వివరించారు. రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉందన్నారు. అగ్రికల్చల్ కేటగిరీలో సీహెచ్.అజిత్ రెడ్డి 2,193వ ర్యాంక్, టి.హాసిని 2,772వ ర్యాంకు సాధించారని, ఇంజనీరింగ్లో ఎం.ప్రశాంతి 3,544, ఎం.దీక్షిత్ 3,969, జి.సిద్ధు 4,143, సీహెచ్.రూపశ్రీలక్ష్మి 5,433, ఆర్.సౌరభ్వర్మ 5,529వ ర్యాంకు సాధించారని వివరించారు. అగ్రికల్చర్ కేటగిరీలో 23 మంది విద్యార్థులు 20 వేల లోపు ర్యాంకులు, ఇంజనీరింగ్ కేటగిరీలో 31 మంది 20 వేల లోపు ర్యాంకులు సాధించారని తెలిపారు. అనుభవజ్ఞులైన ఆధ్యాపకులతో నిరంతర పర్యవేక్షణ, మోటివేషన్తో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడంతోనే ఈ విజయాలు సాధించారని కుమార్యాదవ్ చెప్పారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులను అభినందించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు మూగల రమ, ఆరూరి కవిత, ఐఐటీ కోఆర్డినేటర్ మూగల రమేశ్ యాదవ్, ప్రిన్సిపాళ్లు మారబోయిన రాజుగౌడ్, పి.శ్రీనివాస్, జి.ప్రశాంత్ పాల్గొన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలివిద్యారణ్యపురి: దివ్యాంగ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని హనుమకొండ డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ సూచించారు. హనుమకొండ సుబేదారిలోని ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవసరాల పిల్లలకు సోమవారం వివిధ ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆత్మవిశ్వాసంతో వైకల్యాన్ని కూడా జయించవచ్చన్నారు. జిల్లా సమ్మిళిత విద్య కోఆర్డినేటర్ ఇ.సుమాదేవి మాట్లాడుతూ భవిత కేంద్రాలకు వచ్చే ప్రత్యేక అవసరాల పిల్లలకు రవాణా చార్జీలు, ఇతర పాఠశాలలకు వచ్చేవారికి ఎస్కార్ట్ అలవెన్స్, కంటి చూపు తక్కువగా ఉన్న విద్యార్థులకు రీడర్ అలవెన్స్ వంటి సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. కార్యక్రమంలో 153 మందికి ఉపకరణాలు పంపిణీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా ప్లానింగ్ కోఆ ర్డినేటర్ బి.మహేశ్, జిల్లా అకడమిక్ మానిటరింగ్ కోఆర్డినేటర్ మన్మోహన్, హనుమకొండ ఎంఈఓ నెహ్రూ, జీసీడీఓ సునీత, అలీంకో ప్రతినిధి రాకేశ్, ఐఈఆర్పీలు, దివ్యాంగ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
రాజకీయ ఉనికి కోసమే విమర్శలు
ధర్మసాగర్: రాజకీయ ఉనికి కోసమే కొందరు విమర్శలు చేస్తున్నారని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. మండలంలోని ముప్పారం, నారాయణగిరి గ్రామాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి సోమవారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి, లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ నారాయణగిరి, ముప్పారం గ్రామాలకు రూ.3 కో ట్ల చొప్పున అభివృద్ధి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాటలు వేసిందని, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ చట్టంతోనే మహిళలు పాలనలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నా యకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. అసెంబ్లీలో కడియం శ్రీహరిని నిజాయితీ గల నాయకుడిగా సీఎం అభివర్ణించడం గర్వకారణమన్నారు. ఎమ్మెల్యే కృషితో నియోజకవర్గ అభివృద్ధికి రూ.1,400 కోట్లు నిధులు అందించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ నియోజక వర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో ఒక విప్లవాత్మకమైన ప్రయత్నం చేస్తామని, రెండో విడతలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో అవి నీతికి ఆస్కారం ఉండదని తేల్చిచెప్పారు. 32 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదని అన్నారు. తన వారసురాలిగా వరంగల్ ఎంపీ కడియం కావ్య కూడా నిజాయితీగా పనిచేస్తున్నారన్నారు. నారాయణగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తెలంగాణ మాడల్ స్కూల్గా అప్గ్రేడ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆయా కార్యక్రమాల్లో నారాయణగిరి సర్పంచ్ పుట్ట రేణు క, ముప్పారం సర్పంచ్ గుంటిపల్లి రేణుక, హౌసింగ్ పీడీ సిద్ధార్థనాయక్, పీఆర్ ఈఈ సైదులురెడ్డి, పీఆర్ డీఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య -
ఆధ్యాత్మికం ఉట్టిపడేలా ఏర్పాట్లు
కాళేశ్వరం : జయశంకర్ భూపాలపల్లి జి ల్లా కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరగనున్న సరస్వతీనది అంత్యపుష్కరాలకు ఆధ్యాత్మికతతో పాటు సాంస్కృతిక వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేయనున్నట్లు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు ఏనుగు నర్సింహారెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం కాళేశ్వరంలో పర్యటించి కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ కళాకారులతో పాటు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు భక్తులను ఆకట్టుకునేలా సంగీత, నృత్య, జానపదాలు వంటి కళా ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు సమయపాలనతోపాటు క్రమబద్ధంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని, వేదికలు, సౌండ్, లైటింగ్ తదితర ఏర్పాట్లు సమగ్రంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కార్యాలయ పరిపాలన అధికారి విజయ్, భూపాలపల్లి టీఎస్ఎస్ కళాకారుడు మైసా శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు నర్సింహారెడ్డి -
రక్తసిక్త రహదారులు..
ఇంటినుంచి బయలుదేరిన పది నిమిషాల్లోనే తండ్రీకొడుకులు మృత్యుఒడికి.. రఘునాథపల్లి: ఎండ ముదరక ముందే పొలం వద్దకు వెళ్లి పత్తి కట్టె తొలగించి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన తండ్రీకొడుకులు పది నిమిషాల్లోనే మృత్యుఒడికి చేరారు. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ఘటన సోమవారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కోమళ్ల–గోవర్ధనగిరి గ్రామాల మధ్య జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఎస్సై నరేశ్ కథనం ప్రకారం.. కోమళ్ల గ్రామానికి చెందిన అలావత్ బాలాజీ(46)కి గోవర్ధనగిరి సమీపంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఖరీఫ్లో వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు పత్తి కట్టెను తొలగించేందుకు ఇంటి నుంచి బయలుదేరుతున్నాడు. ఈ సమయంలో సెలవులు ఉండడంతో ఇంట్లోనే ఉన్న కుమారుడు నరేశ్ (23) తాను కూడా వస్తానని చెప్పడంతో ఇద్దరు కలిసి బైక్పై వ్యవసాయ భూమి వద్దకు వెళ్తున్నాడు. తండ్రి వాహనం నడుపుతుండగా కుమారుడు వెనుక కూర్చున్నాడు. ఈ క్రమంలో జనగామ నుంచి కుర్చపల్లికి న్యూ హోల్యాండ్ షోరూంకు చెందిన ట్రాక్టర్ డెమో నిర్వహించడానికి వెళ్తూ వెనుక నుంచి బైక్ను ఢీకొంది. దీంతో వాహనం నడుపుతున్న బాలాజీ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన నరేశ్ను వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య జ్యోతి, కుమార్తె శిరీష ఉన్నారు. భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. బీటెక్ ఫైనలియర్ పరీక్షలు రాసిన నరేశ్.. నరేశ్ ఇటీవల యశ్వంతాపూర్లోని క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియిర్ పరీక్షలు రాశాడు. సెలవులు కావడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. ఉదయం తండ్రి ఒక్కడే పొలం వద్దకు వెళ్తుండగా తాను వస్తానని చెప్పాడు. అయితే ఎండలో ఎందుకని తల్లిదండ్రులు వద్దన్నా వినలేదు. ఇంట్లో ఖాళీగా ఎందుకుండాలి.. నాన్న ఒక్కడే కష్టపడడం ఎందుకంటూ తండ్రితో కలిసి వెళ్లాడు. అమ్మా, చెల్లి నేను నాన్నకు తోడుగా ఉన్నా. తొందరగనే వస్తామంటూ వెళ్లిన 10 నిమిషాలకే మృతి చెందిన సమాచారం తెలియడంతో భార్య జ్యోతి, కుమార్తె శిరీష గుండెలవిసేలా రోదించారు. కారు.. బైక్ను ఢీకొన్న ఘటనలో దంపతులు నర్సంపేట రూరల్ : కారు.. బైక్ను ఢీకొన్న ప్రమాదంలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన సోమవారం రాత్రి నర్సంపేట పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని పాల్తియా తండాకు చెందిన బోడ రమేశ్ (35), పూలమ్మ (30) దంపతులు పని నిమిత్తం బైక్పై నర్సంపేట మీదుగా వరంగల్ వైపునకు వెళ్తున్నారు. ఈక్రమంలో నర్సంపేట పట్టణంలోని సర్వాపురం గ్రామ శివారులో నర్సంపేట – మహబూబాబాద్ 365 జాతీయ రహదారిపై కారు వెనుక నుంచి బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై అరుణ్ ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, మృతులకు కూతురు, కుమారుడు ఉన్నారు. రమేశ్, పూలమ్మ దంపతుల మృతితో పాల్తియాతండాలో విషాదం నెలకొంది. రమేశ్, పూలమ్మ మృతదేహాలుఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల రహదారులు రక్తసిక్తమయ్యాయి. సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కోమళ్ల–గోవర్ధనగిరి గ్రామాల మధ్య జాతీయ రహదారిపై ట్రాక్టర్.. బైక్ను ఢీకొన్న ప్రమాదంలో తండ్రీకొడుకులు, నర్సంపేట పట్టణంలోని 365 జాతీయ రహదారిపై కారు.. బైక్ను ఢీకొన్న ప్రమాదంలో దంపతులు చనిపోయారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. -
పేదలకు చేయూత అందించాలి
మహబూబాబాద్: పేదలకు చేయూతనందించాలని, రోటరీ క్లబ్ సేవలు మరింత విసృతం చేయాలని డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. రోటరీ క్లబ్ మానుకోట శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. సేవ చేయడంలోనే ఎంతో సంతృప్తి ఉంటుందన్నారు. మహిళా సాధికరతను కూడా రోటరీ క్లబ్ దృష్టిలో పెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో టౌన్ సీఐ రఘుపతి రెడ్డి, రోటరీక్లబ్ మానుకోట శాఖ అద్యక్షుడు కిషోర్ కుమార్, సరేందర్రెడ్డి, నాగేశ్వర్రావు విజయ్కుమార్, వెంకటేశ్వర్లు, నగేష్కుమార్, శంతన్రామరాజు, నాగేశ్వర్రావు పాల్గొన్నారు. -
బక్రీద్ను శాంతియుతంగా జరుపుకోవాలి
● వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్ హన్మకొండ అర్బన్ : బక్రీద్ పండుగను శాంతియుతంగా, పరస్పర గౌరవ భావాలతో నిర్వహించుకోవాలని, ఇందుకు ప్రజలు సహకరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ కోరారు. ఈ మేరకు సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, సత్య శారదతో కలిసి అధికారులు, పీస్ కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ వరంగల్, హనుమకొండ నగరాల్లో ప్రతీ పండుగను ప్రజలు సామరస్యంతో జరుపుకుంటారని, అదే స్ఫూర్తితో బక్రీద్ కూడా ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు. ప్రతీ మత భావోద్వేగాలను గౌరవించడం పోలీసు శాఖ బాధ్యతగా భావిస్తున్నామన్నారు. ప్రజలు పరస్పర సహకారంతో పండుగను నిర్వహించుకోవాలని సూచించారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా పరస్పర గౌరవంతో పండుగను జరుపుకోవాలని కోరారు. రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ అప్జల్ బియాబానీ ఖుస్రూ పాషా, డీసీపీలు అంకిత్ కుమార్, దారా కవిత, అదనపు కలెక్టర్లు రవి, సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ఈఏ అసోసియేట్ రాష్ట్ర అధ్యక్షుడిగా దేవదాస్
కాళోజీ సెంటర్: హైదరాబాద్లో ఇటీవల ఆర్ఈఏ (రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్) తెలంగాణ రాష్ట్ర సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కందుకూరి దేవదాస్ను అసోసియేట్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. హనుమకొండ నుంచి పి.సంజీవరెడ్డి, ఎ.సురేందర్, వరంగల్ నుంచి టి.రఘువీర్, ఎండీ మహబూబు అలీ, మహబూబాబాద్ నుంచి ఆర్వీ చలం జ.కిషన్, ఎస్.గోవర్ధన్, జనగామ నుంచి మిర్యాల రమేశ్కు రాష్ట్ర కార్యవర్గంలో స్థానం కల్పించినట్లు దేవదాస్ తెలిపారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల కోసం పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు. -
వ్యాయామంతో మెరుగైన ఆరోగ్యం
మహబూబాబాద్ అర్బన్: రన్నింగ్, వాకింగ్, వ్యాయామంతో మెరుగైన ఆరోగ్యం పొందవచ్చని ఎస్పీ శబరీష్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా యువజన క్రీడలశాఖ ఆధ్వర్యంలో సోమవారం 2కే రన్ నిర్వహించగా.. ఎస్పీ శబరీష్, మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి హాజరై జెండా ఊపి ప్రారంభించారు. మదర్థెరిస్సా సెంటర్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వ్యాయామం, క్రీడలతో యవతకు క్రమశిక్షణ, ఏకాగ్రత పెరగడంతో పాటు చదువులో ముందుంటారన్నారు. ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు వ్యాయామంతో ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత పొందుతారన్నారు. విద్యార్థులు, యువకులు క్రీడలపై ఆసక్తి పెంచుకొని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి ఓలేటి జ్యోతి, కోచ్లు వేలిశాల కుమారస్వామి, రాంబాబు, చాంప్లానాయక్, పీఈటీలు, పీడీలు, కాళోజీ వాకర్స్ అసోసియేషన్, ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ శబరీష్ -
ప్రజల మన్ననలు పొందాలి
బయ్యారం: విధి నిర్వహణలో పోలీసులు ప్రజల మన్ననలు పొందేవిధంగా పనిచేయాలని ఎస్పీ శబరీష్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్తో పాటు మక్కల కొనుగోలు కేంద్రం, నామాలపాడులో పోలీస్శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సోమవారం పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉండి స్టేషన్కు వచ్చే పిటిషనర్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. గ్రామాల వారీగా ఉన్న పోలీస్ ఆఫీసర్లు యాక్టివ్గా పనిచేసి అన్ని గ్రామాల పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వేసవికాలంలో చోరీలు జరిగే అవకాశాలు ఉండడం వల్ల ప్రజలకు జాగ్రత్తలు తెలియజేయాలన్నారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై దృష్టి సారించినిర్మూలనకు కృషి చేయాలన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ తిరుపతిరావు, గార్ల–బయ్యారం సీఐ రవీందర్, ఎస్సై ప్రశాంత్బాబు పాల్గొన్నారు. జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకోగూడూరు: మండలంలోని బొద్దుగొండ గ్రామం వద్ద ప్రధాన జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం మక్క రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో గంటపాటు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొనుగోలు కేంద్రంలో మక్కలు కాంటా పెట్టి నెలరోజులు దాటినా.. ఇప్పటి వరకు బస్తాలు తరలించలేదని రైతులు మండిపడ్డారు. ప్రతీరోజు రేపు మాపు తరలిస్తామంటూ నిర్వాహకులు తులెత్తేస్తున్నారని, వాతావరణ మార్పులతో మక్కలు తడిసి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు వస్తున్నాయన్నారు. ఇప్పటికై నా కలెక్టర్, అధికారులు, నిర్వాహకులు తమ మక్కలు ఇక్కడి నుంచి తరలించి, డబ్బులు తమ ఖాతాల్లో పడేలా చర్యలు చేపట్టాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై గిరిధర్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని కొనుగోలుదారులతో మాట్లాడి లారీలు వచ్చే ఏర్పాటు చేయడంతో ఆందోళన విరమించారు. ప్రత్యేక అలంకరణలో గణపేశ్వరుడు గణపురం: సోమవారం పర్వదినం సందర్భంగా గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్దఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు. అంత్య పుష్కరాలకు ముస్తాబు కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు 12 రోజుల పాటు జరుగు సరస్వతీనది అంత్య పుష్కరాలకు కాళేశ్వరాలయంతో పాటు పరిసరాలు ముస్తాబవుతున్నాయి. సోమవారం రాత్రి కాళేశ్వరం ఆలయ ప్రధాన ఆలయంతో పాటు శ్రీశుభానందదేవి, సరస్వతీఅమ్మవార్ల ఆలయాలతో పాటు ప్రకారాలకు రంగరంగుల విద్యుత్ దీపాలు అలంకరించారు. ఆలయం జిగేల్మంటుంది. ఏర్పాట్లు ఇలా.. కాళేశ్వరం ఆలయంలో క్యూలైన్లు, షామియానాలు, చలువ పందిర్లు వేశారు. ప్రసాద కౌంటర్లకు క్యూలైన్ ఏర్పాట్లు చేశారు. మెట్ల మార్గం నుంచి తోరణాలు ఏర్పాటు చేశారు. వంద గదుల వద్ద భారీ డార్మెటరీ హాలు ఏర్పాటు చేశారు. భక్తులు సేద తీరడానికి శ్రీరాజరాజేశ్వర వసతి గృహం వద్ద షామియానాలు వేశారు. నిరంతర విద్యుత్.. 12 రోజుల పాటు నిరంతర విద్యుత్ ఉంటుందని ఎన్పీడీసీఎల్ ఇన్చార్జ్ ఎస్ఈ భిక్షపతి తెలిపారు. పుష్కరాల కోసం ప్రత్యేకంగా 490 స్తంభాలు 16 కిలోమీటర్ల మేర కొత్త విద్యుత్ లైన్ వేశామని తెలిపారు. 12 ట్రాన్స్ఫర్మర్లు, 23 పార్కింగ్ ప్రాంతాల్లో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. -
టైలరింగ్ కోర్సులో శిక్షణ
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ల అందజేతసాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు టైలరింగ్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు మెథడ్ ఆఫ్ కట్టింగ్, మెథడ్ ఆఫ్ స్ట్రిచ్చింగ్, జుబ్బా, పెట్టికోట్, సారీ పెట్టికోట్, ప్లాజా, ఫ్రాక్, అంబ్రెల్లా ఫ్రాక్, వీ షేప్ ఫ్రాక్, స్లీవ్లేస్ ఫ్రాక్, అంబ్రెల్లా టాప్, క్రాస్ కట్ బ్లౌజ్, ఫిష్ అంబ్రెల్లా టాప్, కట్స్ టాప్, సాదా బ్లౌజ్, ప్రిన్స్కట్ బ్లౌజ్, కటోరి బ్లౌజ్, నార్మల్ బాటమ్, ఫ్రంట్ కుచ్చుల బాటమ్, సైడ్ కుచ్చుల బాటమ్.రిజిస్ట్రేషన్ ఫీజు : రూ.2,500/-వర్క్షాపు షెడ్యూల్ తేదీలు: 22–05–2026 నుంచి 21–06–2026 వరకు శిక్షణ సమయం : ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రిజిస్ట్రేషన్, శిక్షణ స్థలం వివరాలు : రేష్మా బోటిక్, ఇంటినంబర్: 10 –10– 34, మైసమ్మ వీధి, గిర్మాజీపేట, వరంగల్. ఫోన్ నంబర్ : 95330 12727, 95055 14424 -
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ను కలిసి మౌంటైనర్ యశ్వంత్
మరిపెడ రూరల్: మరిపెడ మండలం భూక్యతండాకు చెందిన పర్వతారోహకుడు భూక్య యశ్వంత్ నాయక్ న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధును సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంర్భంగా మౌంటైనర్ యశ్వంత్నాయక్ తన స్ఫూర్తిదాయకమైన పర్వతారోహణ ప్రయాణం, ఇప్పటి వరకు సాధించిన విజయాలు, అదేవిధంగా తన ప్రతిష్టాత్మకమైన ‘హర్ శిఖర్ పర్ తిరంగా’మిషన్ కింద చేపట్టనున్న భవిష్యత్ యాత్రలను లెఫ్టినెంట్ గవర్నర్కు వివరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాలపై భారతజాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటాలనే లక్ష్యంతో తాను కృషి చేస్తున్నట్లు తెలిపారు. యశ్వంత్నాయక్ సాధించిన విశేష విజయాలను అభినందించిన లెఫ్టినెంట్ గవర్నర్ భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ఆశీస్సులు తెలిపారు. సాహసం, పర్వతారోహణ రంగాల ద్వారా దేశానికి గుర్తింపు తీసుకురావడంలో యశ్వంత్ నాయక్ చూపుతున్న అంకితభావం, పట్టుదల, దేశభక్తి స్ఫూర్తిని గవర్నర్ ప్రశంసించారు. -
టీబీపై అవగాహన కల్పించాలి
నెహ్రూసెంటర్: టీబీ వ్యాధిపై ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో టీబీ సూపర్వైజర్లతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలనకు మరింత సమర్థవంతంగా పని చేయాలని సూచించారు. టీబీ అనుమానితుల గుర్తింపు, నిర్ధారిత రోగులకు చికిత్స, పర్యవేక్షణ అంశాలపై దృష్టి సారించాలని వైద్య సిబ్బంది ఆదేశించారు. టీబీ కార్యక్రమాల అమలు, లక్ష్యాలు, పనితీరుపై సమీక్షిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాల గురించి వివరించారు. సమావేశంలో డాక్టర్ అర్జున్, డెమో కొప్పు ప్రసాద్, అశోక్, సిబ్బంది ఎస్టీఎల్ఎస్లు, టీబీ సూపర్వైజర్లు, ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆత్మలకు పింఛన్!
మంగళవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2026జిల్లాలోని పింఛన్ లబ్ధిదారులు● ఎఫ్ఆర్సీతో గ్రామాల్లో గుట్టురట్టు ● పట్టణాల్లో ఏరివేసే పనిలో అధికార యంత్రాంగం వృద్ధ్యాప్యం: 43,109దివ్యాంగులు: 14,556వితంతు 39,967 వృద్ధ్యాప్యం: 43,109దివ్యాంగులు: 14,556వితంతు: 39,967సాక్షి, మహబూబాబాద్: చేయూత పింఛన్ల పంపిణీలో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. గత ఏడాది జూలై నుంచి ముఖ గుర్తింపు పద్ధతి(ఎఫ్ఆర్ఎస్ )ద్వారా పింఛన్ ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ పద్ధతిలో పింఛన్ ఇవ్వడం ప్రారంభించారు. అయితే గత ఏడాది మార్చిలో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 94,399 మంది పింఛన్దారులు ఉండేది. కాగా, ఎఫ్ఆర్ఎస్ పద్ధతిలో వరుసగా మూడు నెలలు పింఛన్ తీసుకోకపోతే పేరు తొలగించే ప్రక్రియ చేపట్టారు. దీంతో ఇప్పుడు పింఛన్దారుల సంఖ్య 91,597కు చేరింది. అంటే 2,702 మంది పింఛన్దారులను జాబితా నుంచి తొలగించారు. ఇందులో సగం మంది చనిపోయిన వారు ఉంటే.. మిగిలిన సగం పింఛన్లు బినామీలవి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. మున్సిపాలిటీల్లో వడపోత.. గ్రామీణ ప్రాంతాల్లో అయితే చనిపోయిన వ్యక్తిని సులభంగా గుర్తించవచ్చు. కానీ పట్టణాల్లో గుర్తించడం ఇబ్బందిగా ఉంటుంది. దీనికి తోడు జిల్లాలోని మున్సిపాలిటీల్లో పింఛన్ డబ్బులు బ్యాంకుల ద్వారా అందజేస్తున్నారు. ఇలా చేయడం వల్ల గుట్టు చప్పుడు కాకుండా చనిపోయిన వారి పింఛన్ డబ్బులు కాజేస్తున్నారు. జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ మండలాల్లో మొత్తం 12,569 మంది పింఛన్దారులు ఉన్నారు. ఇందులో వెయ్యిమంది చనిపోయిన వారి పింఛన్లు కొనసాగుతున్నాయని అంచనా. దీనిని సరిచేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఫేషియల్ రికగ్నిషన్ యాప్తో ముఖం, కళ్లు స్కాన్ చేసి లబ్ధిదారుడు సజీవంగా ఉన్నాడా.. లేడా అనేది నిర్ధారణ చేస్తున్నారు. ఈమేరకు అన్ని మున్సిపాలిటీల్లోని ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. నేరుగా పింఛన్దారుల వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఈనెలలో ప్రక్రియ పూర్తి చేసి వచ్చే నెల వరకు చనిపోయిన వారిపేర్లు తొలగించనున్నారు. అయితే పట్టణాల్లో ప్రతీనెల కాకుండా మూడు నెలలకోసారి ఎఫ్ఆర్ఎస్ తీసుకొని నిర్ధారించాలని సూచించారు. ప్రక్రియను వేగవంతం చేస్తున్నాంపింఛన్ పంపిణీలో చనిపోయిన వారి వివరాలను తొలగించేందుకు అధికార యంత్రాంగం నిమగ్నమైంది. గత ఏడాది జూలై నుంచి గ్రామీణ ప్రాంతాల్లో వడపోత ప్రక్రియ ద్వారా అసలైన లబ్ధిదారులను గుర్తించాం. పట్టణాల్లో ఈ గుర్తింపు ప్రక్రియ మొదలైంది. యాప్ద్వారా సదరు వ్యక్తి బతికే ఉన్నాడని నిర్ధారించుకున్న తర్వాతే పింఛన్ అందజేస్తారు. – మధుసూదన్ రాజు, డీఆర్డీఓ నేతకార్మికులు 359గీత కార్మికులు 2,809ఒంటరి మహిళలు 2,956ఇతరులు : 510మొత్తం: 1,04,266చనిపోయిన వారి పేరిట మంజూరు‘గత ఏడాది జిల్లాలోని నర్సింహులపేట మండలంలోని ఓ గ్రామంలో చనిపోయిన వారి పేరిట పింఛన్ డబ్బులు తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. ఏళ్ల తరబడి ఈ వ్యవహారం కొనసాగడం, అసలు మనిషే లేకుండా పింఛన్ పంపిణీ చేసినట్లు రికార్డుల్లో నమోదైనట్లు స్పష్టమైంది. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల వరకు ఫిర్యాదులు అందాయి. అయితే అధికారులు గుట్టుచప్పుడు కాకుండా బాధ్యుల నుంచి రికవరీ చేయించినట్లు తెలిసింది.’ ‘మహబూబాబాద్ పట్టణంలోని ఓ కాలనీకి చెందిన వ్యక్తి ఏడాది కిత్రం మరణించాడు. అయితే అతడి పేరున బ్యాంకులో నెలనెలా పింఛన్ డబ్బులు జమ అవుతున్నట్లు తెలిసింది. దీంతో అక్కడ ఉన్న ఉద్యోగి.. మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులతో కుమ్మకై ్క వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం.’ -
దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి
తొర్రూరు: ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని తొర్రూరు ఆర్డీఓ జి.గణేష్ అన్నారు. డివిజన్ కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి, స్థానికుల నుంచి 13 దరఖాస్తులు అందాయి. తొర్రూరు, పెద్దవంగర, నెల్లికుదురు, మరిపెడ, నర్సింహులపేట, దంతాలపల్లి, చిన్నగూడూరు మండలాలకు సంబంధించిన వారు ఫిర్యాదులు అందించారు. ఆర్డీఓ మాట్లాడుతూ.. ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతీ వినతిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఎల్పీఓ పుల్లారావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్రెడ్డి, ఏఎల్ఓ రవి, ఆర్డీఓ కార్యాలయ ఏఓ అనిల్కుమార్, ఎకై ్సజ్ ఎస్సై శంకర్, ఏడీఏ విజయ్చంద్ర, ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మీ, ఏఓ రాంనర్సయ్య, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫిర్యాదులు ఇలా... మున్సిపల్ కమిషనర్పై చర్యలు తీసుకోవాలి.. తొర్రూరు పట్టణంలోని అంబేడ్కర్ నగర్కు చెందిన మంగళపల్లి ప్రసాద్ మున్సిపాలిటీలో గత కొంత కాలంగా తాత్కాలిక కార్మికుడిగా పని చేస్తున్నాడు. 2015 ఆగస్టు నుంచితనను విధుల్లోకి రాకుండా కమిషనర్ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, రెండు మాసాల వేతనాలు సైతం నిలిపివేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. కుటుంబ తగాదాలను ఆసరా చేసుకుని తనను విధుల్లో చేరకుండా అడ్డుకుంటున్న కమిషనర్పై చర్యలు తీసుకోవాలని బాధితుడు ఆర్డీఓకు ఫిర్యాదు చేశాడు. డబుల్బెడ్రూం ఇల్లు ఆక్రమించారు.. పెద్దవంగర మండలం రాజమాన్సింగ్ తండా పంచాయతీ పరిధిలోని దేవుని బావితండాకు చెందిన గుగులోతు అస్లీకి 2018లో డబుల్ బెడ్రూం ఇల్లు ప్రభుత్వం కేటాయించింది. కాగా, పనులు కొన్ని పూర్తి చేయాల్సి ఉండగా దానిలోకి లబ్ధిదారు వెళ్లలేదు. దీంతో అదే తండాకు మరో వ్యక్తి సదరు ఇల్లును ఆక్రమించి అనధికారికంగా నివాసముంటున్నాడు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని లబ్ధిదారు కుమారుడు దినేష్ ఆర్డీఓకు ఫిర్యాదు చేశాడు. వినతులు వెంటనే పరిష్కరించాలిమహబూబాబాద్: ప్రజావాణిలో వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని ఆర్డీఓ కృష్ణవేణి అన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా ఆర్డీఓ ప్రతీ దరఖాస్తును స్వయంగా తీసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమస్యలు సత్వర పరిష్కారం కోసమే ప్రభుత్వం ప్రజావాణి నిర్వహిస్తుందన్నారు. పెండింగ్ వినతులను కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజావాణిలో 8 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కేసముద్రం మున్సిపాలిటీ పరిధి అమీనాపురం గ్రామంలోని హన్మంతరావుగర్ కాలనీలో పది గుంటల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని, దానిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని నాయకులు వినతి అందజేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి మర్రిపెల్లి మొగిలి, కుమారస్వామి తదితరులు ఉన్నారు. తొర్రూరు ఆర్డీఓ గణేష్ ప్రజావాణిలో 13 అర్జీల స్వీకరణ -
కొనుగోళ్లలో డబ్బులు వసూలు చేస్తే చర్యలు
మహబూబాబాద్: ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల నిర్వహణలో రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్నేహ శబరీష్ హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా.. కలెక్టర్ స్వయగా వినతులు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజాసమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ఎంతో ఆశతో వస్తున్నారని, దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి న్యాయం చేయాలని ఆదేశించారు. పెండింగ్ వినతులను కూడా త్వరగా పరిష్కరించాలన్నారు. రెండు మూడు రోజుల నుంచి రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోలు, తరలింపు జరుగుతుందన్నారు. అధికారులు అంకితభావంతో పని చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజావాణిలో 132 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం శివారు కంబాలచెరువులో అక్రమంగా మట్టి పోసి కబ్జా చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని అశోక్, దశరథం తదితరులు వినతిపత్రం అందజేశారు. అనంతరం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా యువజన క్రీడా వారోత్సవాల పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెట్టొద్దు కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రజావాణిలో 132 వినతులు -
ఆగని వన్యప్రాణుల వేట
కొత్తగూడ: జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో వన్యప్రాణుల వేట ఆగడం లేదు. వేసవికాలం వచ్చిందంటే వేటగాళ్లు పెట్రేగిపోతున్నారు. వాగులు, వంకలు ఎండిపోయి, అటవీ మొత్తం ఆకురాల్చి మోడులా మారింది. ఈక్రమంలో వన్యప్రాణులు ఆహారం, తాగునీరు లభించే కొత్తగూడ మండలంలోని గుంజేడు వాగు, గూడూరు మండలం భీమునిపాదం వాగు, ఖానాపురం మండలం పాకాల సరస్సు, గంగారం మండలం బొట్లశెలిమె లాంటి నీటివసతి వైపునకు వెళ్తుంటాయి. కాగా, వేటగాళ్లు వన్యప్రాణులు వెళ్లే దారిని గమనించి, అడ్డుగా విద్యుత్ వైర్లు అమర్చి హతమారుస్తున్నారు. మాంసాన్ని గుట్టుగా పట్టణ ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఘటనలు.. ఇటీవల పట్టణ ప్రాంతానికి వన్యప్రాణి మాంసం తరలిస్తుండగా ఓమాంసం ముద్ద కొత్తగూడ మండల కేంద్రంలో పడిపోయింది. దీనిపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేస్తుండగానే.. గుంజేడు జాతర సమీపంలో వన్య ప్రాణుల వేటకు అమర్చిన విద్యుత్ ఉచ్చుల్లో పడి గేదె మృతి చెందింది. వన్యప్రాణులను వేటాడి పట్టణ ప్రాంతాల్లో మాంసం విక్రయిస్తు పట్టుబడిన సంఘటనలు కోకొల్లలు. ఇంత జరుగుతున్నా అటవీశాఖ అధికారుల్లో ఉలుకు పలుకు లేకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి. నిర్లక్ష్యానికి నిదర్శనంగా అటవీశాఖ.. విధుల నిర్వహణలో అటవీశాఖ ఉద్యోగులు నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీస్ శాఖ తర్వాత అంతే భాద్యత కలిగిన అటవీశాఖ ఉద్యోగులు రోజూ పట్టణ ప్రాంతాల నుంచి వచ్చివెళ్తూ నామమాత్రపు విధులు నిర్వహించడం వల్లే వన్య ప్రాణుల వేట నిరాటంకంగా కొనసాగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి పూట తనిఖీలు, కూంబింగ్లు ఉండేవి.. అవేవి ఇప్పుడు కనిపించడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు రేంజర్, సిబ్బంది మధ్య సమన్వయ లోపం ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా వన్యప్రాణులను కాపాడేందుకు సంబంధిత శాఖ అధికారులు ఇకనైనా మేలుకోవాలని స్థానికులు అంటున్నారు. వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు వన్య ప్రాణులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎక్కడ వేటాడినట్లు తెలిసినా సంబంధిత సెక్షన్, బీట్ అధికారిపై చర్యలు తీసుకుంటాం. వన్యప్రాణుల వేటను అడ్డుకునేందుకు స్థానికుల సహకారం తీసుకుంటాం. సిబ్బంది స్థానికంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటా. –చంద్ర శేఖర్, ఎఫ్డీఓ ఏజెన్సీలో నిద్రావస్థలో అటవీ శాఖ వేసవిలో పెట్రేగిపోతున్న వేటగాళ్లు -
పంప్ ఆపరేటర్లను ఆదుకోవాలి
తొర్రూరు: అరకొర వేతనాలతో ఇబ్బంది పడుతున్న తమకు వేతనాలు పెంచి ఆదుకోవాలని మున్సిపాలిటీ పంప్ ఆపరేటర్లు కోరారు. వేతనాలు పెంచకపోవడాన్ని నిరసిస్తూ ఆదివారం డివిజన్ కేంద్రంలో మున్సిపాలిటీ పంప్ ఆపరేటర్లు విధులకు గైర్హాజరై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇరవై ఏళ్లుగా పని చేస్తున్నా వేతనాలు గొర్రెతోక బెత్తెడు అన్న చందంగా ఉన్నాయన్నారు. జీతం పెంచాలని మున్సిపాలిటీ అధికారులను వేడుకుంటున్నా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారన్నారు. మున్సిపల్ కమిషనర్ సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు. సెలవులు లేకుండా పని చేస్తున్నా పనికి తగ్గ గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు పెంచి ఆదుకోవాలని కోరారు. పంప్ ఆపరేటర్లు విధులకు గైర్హాజరు కావడంతో పట్టణంలో తీవ్ర నీటి సమస్య ఏర్పడింది. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ నీటి సమస్య తీరలేదు. కార్యక్రమంలో పంప్ ఆపరేటర్లు బొమ్మనబోయిన కుమార్, గురుకు యాకయ్య, జాటోతు ఠాగూర్, మంగళపల్లి నర్సయ్య, రెడ్డబోయిన రాజు, లాలు యాకయ్య పాల్గొన్నారు. -
ప్రజలపై పెట్రోల్ భారం సరికాదు
తొర్రూరు: ప్రజలపై పెట్రోల్ భారం మోపడం సరికాదని సీపీఎం జిల్లా నాయకుడు బొల్లం అశోక్, ఎండీ యాకూబ్ అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం డివిజన్ కేంద్రంలోని గాంధీ సెంటర్లో ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు విశ్రాంత ఉద్యోగుల సంఘ నాయకులు కంచర్ల వెంకటాచారి, నాయకులు జమ్ముల శ్రీను, మార్క సాంబయ్య, కొత్త వెంకట్రెడ్డి, క్రాంతికుమార్ పాల్గొన్నారు. మరిపెడ రూరల్: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని సీపీఐ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ డిమాండ్ చేశాడు. ఆదివారం మరిపెడ మండల కేంద్రంలోని 365 జాతీయ రహదారిపై సీపీఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యుడు ఎండీ అబ్దుల్ రశీద్, పట్టణ కార్యదర్శి పల్లెపాక యాకన్న, అంజి, నరేందర్ పాల్గొన్నారు. -
రౌడీషీటర్లు సత్ప్రవర్తన కలిగిఉండాలి
మహబూబాబాద్ రూరల్: శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సమాజంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు ప్రతీ ఒక్కరు చట్టాలను గౌరవించాలని టౌన్ సీఐ రఘుపతిరెడ్డి సూచించారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్పరిధిలోని రౌడీ షీటర్లకు ఆదివారం ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈసందర్భంగా సీఐ రఘుపతిరెడ్డి మాట్లాడుతూ.. రౌడీషీటర్లు తమ పాత నేర ప్రవర్తనలను పూర్తిగా విడనాడి, మంచి పౌరులుగా మారాలని సూచించారు. ఎవరైనా తిరిగి నేర కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో టౌన్ ఎస్సై రాంచరణ్, సిబ్బంది పాల్గొన్నారు. -
కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు
మహబూబాబాద్ అర్బన్: కలెక్టర్ కార్యాలయంలో విద్యా వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈదులపూసపల్లి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన ఆఫ్రాతబుసంను కలెక్టర్ స్నేహ శబరీష్, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావులు సన్మానించి నగదు బహుమతిని అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం పూజరి వీరయ్య, డీఈఓ సత్యరానాయణమూర్తి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఓంప్రకాష్, ప్రభాకఱ్, చాంప్లానాయక్, శ్రీనివాస్రావు, నాగరాజు పాల్గొన్నారు. మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మంచాల సాయిదీప్తి, మంచాల అభిరామ్ వేసవి శిబిరం ఆర్ట్, క్రాఫ్ట్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని హెచ్ఎం కె.గిరిజ, ఉపాధ్యాయుడు రామసహాయం శ్రీధర్ రెడ్డి ఆదివారం తెలిపారు. కలెక్టర్ స్నేహశబరీష్, మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోత్ జ్యోతి అభినందించారు. గార్ల: గార్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 464 మార్కులు సాధించి జిల్లా టాపర్గా నిలిచిన రావుక సిద్ధిజైన్ను కలెక్టర్ సన్మానించారు. రూ.10వేల నగదు ప్రోత్సాహకం అందజేత నెల్లికుదురు: మండలంలోని ఆలేరులో హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న జాతీయస్థాయి క్రీడాకారుడు బానోతు యశ్వంత్కు రూ.10వేల నగదు పోత్సాహకం కలెక్టర్ స్నేహా శబరీష్ చేతుల మీదుగా అందజేశారు. దంతాలపల్లి: మండల కేంద్రంలోని విద్యార్థులు శశికాంత్, రేష్మిత ఆర్ట్, క్రాప్ట్ పోటీల్లో ప్రతిభ కనబరిచినందుకు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసపత్రం అందుకున్నట్లు హెచ్ఎం వేణుమాధవరెడ్డి తెలిపారు. చిన్నగూడూరు: పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ జయ్యారం పాఠశాలకు చెందిన విద్యార్థిని జి.సౌజన్య ప్రతిభ కనబరిచి మండలస్థాయిలో ప్రథమస్థానం సాధించింది. కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసపత్రం అందుకున్నట్లు హెచ్ఎం ఉషశ్రీ తెలిపారు. -
ఆర్డీఓ కార్యాలయాల్లో అంతంతే..
మహబూబాబాద్: కలెక్టరేట్లో జరిగే ప్రజావాణిలో దరఖాస్తులు చాలా వరకు పెండింగ్లో ఉండడం, సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజల్లో ఆసక్తి తగ్గుతుంది. ప్రభుత్వం ఆర్డీఓ కార్యాలయాలలో కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టింది. దానికి ప్రజల నుంచి ఆసక్తి కనబడడం లేదు. అందుకు నిదర్శనమే చేపట్టిన నాటి నుంచి జరిగిన రెండు ప్రజావాణిల్లో దరఖాస్తుల సంఖ్య అంతంత మాత్రమే ఉంది. దరఖాస్తుదారుల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. రెండు ప్రజావాణిల్లో ఇప్పటి వరకు 60దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. రెండు ఆర్డీఓ కార్యాలయాల్లో.. కలెక్టర్ కార్యాలయంతోపాటు ఆర్డీఓ కార్యాలయాల్లో కూడా ప్రజావాణి నిర్వహించాలని ఈనెల 4వ తేదీ నుంచి జిల్లాలోని మానుకోట, తొర్రూరు ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రజావాణిని అధికారులు నిర్వహిస్తున్నారు. మానుకోట ఆర్డీఓ కార్యాలయం పరిధిలో మానుకోట, కేసముద్రం, ఇనుగుర్తి, డోర్నకల్, కురవి, సీరోలు, బయ్యారం, గార్ల, గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాలు ఉన్నాయి. తొర్రూరు ఆర్డీఓ కార్యాలయం పరిధిలో తొర్రూరు, నెల్లికుదురు, పెద్దవంగర, నర్సింహులపేట, మరిపెడ, దంతాలపల్లి, చిన్నగూడూరు మండలాలు ఉన్నాయి. మానుకోటలో అంతంత మాత్రమే ఆర్డీఓ కార్యాలయాలలో ప్రజావాణికి పెద్దగా స్పందన లేదు. డివిజన్ స్దాయి అధికారులు సకాలంలో హాజరైనా వినతులు ఇచ్చేందుకు పెద్దగా రావడం లేదు. దీంతో అఽధికారులు ఖాళీగా కూర్చోవాల్సి వస్తుంది. వారి కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. కలెక్టర్ కార్యాలయం జిల్లా కేంద్రంలో ఉండడంతో కలెక్టర్కు ఇస్తేనే న్యాయం జరుగుతుందని, కలెక్టరేట్ వెళ్లడంతో ఆర్డీఓ కార్యాలయాలలో పెద్దగా స్పందన లేదు. కలెక్టర్కు ఇస్తేనే పరిష్కారం కావడం లేదని అలాంటి ఆర్డీఓలకు ఇస్తే ఫలితం ఉంటుందా అనే ఆలోచనతో ఆర్డీఓ కార్యాలయాలకు ప్రజలు పెద్దగా రావడం లేదు. దరఖాస్తుదారుల కోసం అధికారుల ఎదురుచూపు రెండు ప్రజావాణిల్లో వచ్చిన వినతులు 60మాత్రమే -
లక్ష్యాన్ని ఎంచుకుని చదవాలి
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని నూకల రామచంద్రారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం విద్యా వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో కళాశాలలో చదువుతున్న వివిధ విశ్వవిద్యాలయంలో సీట్లు సాధించిన విద్యార్థులను సంఘ సంస్కర్త నాగేంద్రను ప్రిన్సిపాల్ బి.లక్ష్మణ్నాయక్, అధ్యాపకులు సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, అధ్యాపకులు అన్నపూర్ణ, సుమలత, ఐక్యూసీ కోఆర్డినేటర్ అనిల్కుమార్, మసూద్ఆహ్మద్, సాంబశివరావు, వినోద్ కుమార్ పాల్గొన్నారు. బయ్యారం: పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను విద్యావారోత్సవాల్లో భాగంగా ఆదివారం బయ్యారంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు లక్ష్మినారాయణ, రామేశ్వరరావు, రవిందర్, లక్ష్మయ్య, శ్రీనివాసరావు, విజయ తదితరులు పాల్గొన్నారు. కేసముద్రం: ప్రతీ విద్యార్థి లక్ష్యాన్ని ఎంచుకుని చదవాలని అప్పుడే భవిష్యత్లో ఉన్నతస్థాయికి ఎదుగుతారని కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి అన్నారు. మండలంలోని కల్వల జెడ్పీహైస్కూల్కి చెందిన సహస్ర(561), నవ్య(558), అనూష(554) విద్యార్థినులు పదిలో మార్కులు సాధించారు. ఆదివారం విద్యార్థినులను సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ వేల్పుల సుజాత, రాంచంద్రయ్య, హెచ్ఎం బండారు నరేందర్, గండి శ్రీనివాస్, మోడెం రవీందర్గౌడ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి
నెహ్రూసెంటర్: దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు సాగించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కె.అనంతరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యదర్శి మదార్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలో జిల్లాస్థాయి సదస్సు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వరంగ సంస్థలను మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కుట్రలు చేస్తుందన్నారు. దేశంలో పెరుగుతున్న ధరలను నియంత్రించాల్సిన పాలకులు సామాన్య ప్రజలకు అధిక భారాలు మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సదస్సులో ఏఐకేఎంఎస్జిల్లా కార్యదర్శి బండపల్లి వెంకటేశ్వర్లు, ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు బి.రాంసింగ్, పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి పోలూరి శ్రీనివాసరావు,కె.భాస్కర్రెడ్డి, యాకయ్య, రాజు, మౌలానా పాల్గొన్నారు. -
బాధిత కుటుంబానికి ఆర్థికసాయం
కేసముద్రం: మండలంలోని కల్వల గ్రామానికి చెందిన కందిపాటి రాము అనే యువకుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో నిరుపేదరికంలో మగ్గుతున్న ఆ కుటుంబంలో పెద్దదిక్కు కోల్పోవడంతో, భార్య త్రివేణి, మూడేళ్ల కూతురు గాయత్రి, నాలుగు నెలల కుమారుడు వేదాంశ్ పరిస్థితి దయనీయంగా మారింది. ఈక్రమంలో గ్రామానికి చెందిన బొగ్గుల రాజేష్ తన మిత్ర బృందం కలిసి పలువురు దాతల సహకారంతో, హైదరాబాద్కు చెందిన ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ సిబ్బంది కలిసి మొత్తంగా రూ.5.64లక్షలను జమ చేశారు. ఆదివారం కల్వల గ్రామపంచాయితీ ఆవరణంలో కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి రూ.5.64లక్షల ఫిక్స్డ్ బాండ్ను(ఇద్దరు పిల్లల పేరున) అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ వేల్పుల సుజాతరాంచంద్రయ్య, బొగ్గుల రాజేష్, బొగ్గుల హేమలత, కందిపాటి రాజు, ఆరెపు అనూప్, ఇస్సంపల్లి ఉదయ్, తదితరులు పాల్గొన్నారు. -
కారు ప్రమాదంలో పాడి గేదెలు మృతి
గూడూరు: మండలంలోని బొద్దుగొండ వద్ద జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు పాడి గేదెలు మృతిచెందాయి. వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా నుంచి మేడారానికి నలుగురు వ్యక్తులు కారులో బయలుదేరారు. బొద్దుగొండ ఎన్హెచ్ 365 జాతీయ రహదారిపై గుంతలు వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న పాడి గేదెల పైకి దూసుకెళ్లింది. ఈప్రమాదంలో రెండు పాడి గేదెలు అక్కడికక్కడే మృతిచెందాయి. కారులో ఉన్న నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. వారిని మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెల్సుకున్న ఎస్సై గిరిధర్రెడ్డి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
చేపల కోసం చెరువు ఖాళీ
తొర్రూరు రూరల్: మండలంలోని అరిపిరాల గ్రామంలోని చెరువులో చేపలు పట్టేందుకు నీటిని ఖాళీ చేస్తున్నారు. దీంతో వేసవిలో తాగునీటి సమస్య తలెత్తనున్నాయని గ్రామ రైతులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో ఉన్న నీటిని రాత్రి వేళల్లో దొంగచాటున చేపల కాంట్రాక్టర్ సంబంధిత నీటి పారుదల, పంచాయతీ, రెవెన్యూ శాఖ అధికారులతో కుమ్మకై తూమును తొలగించడం ద్వారా పెద్ద మొత్తంలో చెరువులోని నీళ్లన్ని వృథాగా పోతున్నాయి. ఇప్పటికి అనేకసార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు. ఇప్పటికై నా చెరువులో నుంచి వృథాగా పోతున్న నీటిని వెంటనే నిలిపివేసి వేసవిలో గ్రామంలోని ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
ఆధ్యాత్మిక వేడుకలు
మరిపెడ రూరల్: మరిపెడ పట్టణంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం భక్తి, సంప్రదాయం, సామాజిక హితం కలిసిన ఆధ్మాత్మిక వేడుక ఘనంగా జరిగింది. వెంపటి సూజాత ఆధ్వర్యంలో మహిళలు నిర్వహించిన అమ్మవారికి ఒడి నింపే కార్యక్రమంలో లలితా సహస్రనామ పారాయణం, లింగార్చన, భజనలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకుడు అభినవ వేదమంత్రాలతో పూజలు నిర్వహించగా, ఆలయ చైర్మన్ దారా నాగరాజు పాల్గొన్నారు. మహిళల ఐక్యత, సేవాభావం, దైవభక్తి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పనులు పూర్తిచేయాలి మరిపెడ రూరల్: తాగునీటి పైపులైన్, డ్రెయినేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో 3వ వార్డులో జరుగుతున్న తాగునీటి పైపులైన్, డ్రెయినేజీ వ్యవస్థ పనులను ఆయన పరిశీలించారు. పైపులైన్ పనులను తక్షణమే పూర్తి చేసి నీటి సరఫరా అందించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట కౌన్సిలర్ పానుగోలు రాములు, సిబ్బంది పాల్గొన్నారు. మంత్రి సీతక్కను కలిసిన నూనావత్ రాధ మహబూబాబాద్ రూరల్: జిల్లాకు చెందిన నూనావత్ రాధ ఇటీవల తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియామకమయ్యారు. ఈసందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను హైదరాబాదులోని మంత్రి నివాసంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 21వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్, సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని మంత్రి సీతక్కను రాధ ఆహ్వానించారు. ఎస్సీకాలనీలో నీటి ఎద్దడి మహబూబాబాద్: ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించాలని నాయకులు ఖాదర్బాబా, గద్దపాటి సంతోష్ డిమాండ్ చేఽశారు. మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని బేతోల్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో కాలనీ వాసులు ఆదివారం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో మిషన్భగీరథ పైపులైను పూర్తిస్థాయిలో ఉందన్నారు. కాలనీలో కనెక్షన్లు ఇవ్వకపోవడంతో నీటిసరఫరా లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పీరయ్య, రాజు, శ్రీను, ఉమా, పద్మ, నాగలక్ష్మి, రేణుక పాల్గొన్నారు. బడిబాట ఇనుగుర్తి: మండల కేంద్రంలోని చిన్నముప్పారం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు బడిబాట కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ రూపొందించిన ప్రత్యేక ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాయిలీ భవాని శేఖర్, హెచ్ఎం వెంకట్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. వాలీబాల్ క్రీడాకారులకు చేయూత ఇనుగుర్తి: మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరానికి ఆదివారం తెలంగాణ క్రీడా పోలీస్ టీం కోచ్ ఓరుగంటి మురళీ, ప్రొఫెసర్ ఓరుగంటి మధు సోదరులు కలిసి క్రీడాకారులకు రూ.15వేల విలువైన షోల్డర్ బ్యాగులు, వాటర్ బాటిల్స్, న్యాప్కిన్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కోచ్ కూటికంటి కిరణ్, గాడుదుల మధు, రహీం, శ్రీనివాస చారి పాల్గొన్నారు. -
ఎయిడ్స్ మృతులకు ఘన నివాళి
నెహ్రూసెంటర్: అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్లైట్ స్మారక దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్ కారణంగా మృతి చెందిన వారికి ఆదివారం హెచ్ఐవీ ఎయిడ్స్, ఎస్ఎస్కే ఆధ్వర్యంలో జీజీహెచ్ నుంచి నెహ్రూసెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ప్రోగ్రాం అధికారి డాక్టర్ అర్జున్ మాట్లాడుతూ.. హెచ్ఐవీతో బాధపడుతున్న వారికి మద్దతుగా నిలబడేందుకు, సమాజంలో వారి పట్ల ఉన్న వివక్షతను, అపోహాలను తొలగించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో దిశా సీఎస్ఓ సారయ్య, ఐసీటీసీ కౌన్సిలర్ రమేష్, ఎస్ఎస్కే మేనేజర్ రమేష్, కౌన్సిలర్ సరస్వతి, స్టాఫ్నర్సు జ్యోతి, గౌతమి పాల్గొన్నారు. -
బొమ్మలపెండ్లి
మేము గీసిన చిత్రాలు..పేరు: ముద్ద నక్షత్ర పాఠశాల : న్యూఇరా, 6వ తరగతి గ్రామం: బయ్యారంచిన్ని చిన్ని బొమ్మలకు పెండ్లండి మీరంతా రారండి రారండి కొబ్బరాకు పందిరి వేసినాము పందిరికి తోరణాలు కట్టినాము రంగు రంగుల పూలన్నీ మాలకట్టి పందిరికి ముస్తాబు చేసినాము అదిగదిగో వచ్చింది బుజ్జిబొమ్మ పెండ్లి బొట్టు పెట్టుకొని నవ్వింది పట్టుచీర కట్టుకొని మురిసింది పూలజడ వేసుకొని మెరిసింది చిట్టి చిట్టి పీటపై కూర్చుంది బిడియంతో తలవంచి చూసింది పట్టుపంచె పెళ్లికొడుకు వచ్చాడు తాళి కట్టి తలంబ్రాలు పోసినాడు మేళాలు తాళాలు మోగాయి పిల్లలంతా చప్పట్లు కొట్టారు బుజ్జిబుజ్జి బొమ్మల పెండ్లండి ఎంతెంతో ఘనముగా జరిగింది. పద్మ త్రిపురారి, తెలుగు పండిట్, జనగామ(బాలగేయం) -
ముగిసిన జిల్లాస్థాయి చదరంగం పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా చదరంగం సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి అండర్– 11 చదరంగం పోటీలు ఆదివారం ముగిశాయి. బాలుర విభాగంలో అద్విత్ అనిశెట్టి, శ్రేయాన్ రామ్ శివరాత్రి, జక్కం గౌరిక్సాయి, రేయాన్స్రాయ్, బాలికల విభాగంలో సాన్విక పెన్డ్రు, ఆద్య అనిశెట్టి, బెగావత్ రీతిక, ధరావత్ ఆరుషి విజేతలుగా నిలిచారు. మాస్టర్జీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఏఓ నాగరాజు హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నారులు చదరంగంలో జిల్లా, రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని సూచించారు. నిర్వహణ కార్యదర్శి కన్నా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 40 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులు జూన్ 19, 20, 21న హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్బిటర్స్ ప్రేమ్సాగర్, రజనీకాంత్, పవన్ తదితరులు పాల్గొన్నారు. -
బీరు సీసా, కత్తులతో దాడి..
● ముగ్గురికి గాయాలుహసన్పర్తి : బీరుసీసాలు, కత్తితో దాడి చేసిన ఘ టనలో ముగ్గురికి గాయాలయ్యాయి. హసన్పర్తి మండలం వంగపహాడ్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హసన్పర్తి మండలం వంగపహాడ్లో మూడురోజులుగా బీర న్న ఉత్సవాలు సాగుతున్నాయి. ఈక్రమంలో ఆది వారం రాత్రి గ్రామానికి చెందిన రుషికేషన్పై అదే ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు రాకేశ్ బీరు సీసా, కత్తులతో దాడి చేశాడు. అడ్డు వచ్చిన రుషికేశ్ తండ్రి కుమారస్వామి, మామ భిక్షపతిపై కూడా దాడి చేయగా స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా, క్షతగాత్రులను నగరంలో ని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వ్యక్తిగత కక్షలతో దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సైబర్ మోసం.. మహబూబాబాద్ రూరల్ : ఫోన్ పే స్కానర్ పనిచేయడం లేదని ఓ గుర్తుతెలియని వ్యక్తి చెప్పిన మా టలు నమ్మిన ఓ గృహిణి.. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. మహబూబాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన గృహిణికి జరిగిన ఈ మోసం వివరాలను రూరల్ ఎస్సై పి.రాజు ఆదివారం వెల్ల డించారు. మహబూబాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన గృహిణికి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. తన బ్యాంకు ఖాతాకు సంబంధించి ఆమె ఫోన్ పే వినియోగిస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీన ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి తన ఫోన్ పే స్కానర్ పనిచేయడంలేదని చెప్పడంతో పాటు మరో వ్యక్తి సెల్ నంబర్ చెప్పి ఫోన్ పే ద్వారా రూ.8,860 పంపమని చెప్పగా బాధితురాలు పంపింది. మరోసారి రూ.8,860, రూ.17,720, రూ.8,860 ఇలా మొత్తం నాలుగు దఫాలుగా రూ.44, 300 పంపింది. ఆ తర్వాత కూడా నేరగాళ్లు మరోసారి డబ్బు పంపమని కోరగా బాధితులు ప్రశ్నించింది. దీంతో గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు వెంటనే సైబర్ క్రైమ్ నంబర్ 1930 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. అదేవిధంగా మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పిచ్చుకల దాహార్తి తీరుసున్నా..
నా పేరు బొగ్గారపు సహర్షిత్. నేను పాలకుర్తిలో ఉంటా. రోజురోజుకూ పెరుగుతున్న ఎండల నేపథ్యంలో పిచ్చుకలు దాహార్తి తీర్చుకోవడానికి వృథా ప్లాస్టిక్ బాటిల్ను నీటి తొట్టిగా మార్చి ప్రతీ రోజు నీరు పోస్తున్నా. పిచ్చుకలు వచ్చి నీరు తాగుతుంటే మా నాన్న నాగరాజు, అమ్మ దివ్య జ్యోతి నన్ను అభినందిస్తున్నారు. దీంతో నాకు చాలా ఆనందం కలుగుతోంది. అలాగే, ఖాళీ సమయంలో పర్యావరణ ప్రకృతిని చిత్రాలు గీస్తూ మా చెల్లి శ్రీహర్షిణితో కూడా గీయిస్తున్నా. చెస్, క్యారం ఆటలు నేర్పిస్తున్నా. ఇంట్లో అమ్మ చెప్పే కథలు వింటూ కాలక్షేపం చేస్తున్నా. –జనగామ -
అంత్య పుష్కరాలకు సీఎం రేవంత్కు ఆహ్వానం
కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈనెల 21నుంచి జూన్ 1వ తేదీ వరకు జరగనున్న సరస్వతీనది అంత్యపుష్కరాలకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కమిషనర్ ఎం. హనుమంతరావు ఆదివారం రాత్రి హైదరాబాద్లో ఆహ్వాన పత్రిక అందజేశారు. సోమవారం గవర్నర్ శివప్రతాప్శుక్లాకు ఆహ్వాన పత్రిక అందజేస్తారని ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్జేసీ రామకృష్ణారావు, ఆలయ ఈఓ మహేశ్, ఉపప్రధాన అర్చకులు ఫణీంద్రశర్మ, వేదపారయనదార్ వైకుంఠ పాండా, జూనియర్ అసిస్టెంట్ దూది శ్రీనివాస్ పాల్గొన్నారు. -
టీజీ ఎప్సెట్లో ‘ఎస్ఆర్’ విద్యార్థుల ప్రతిభ
విద్యారణ్యపురి: టీజీ ఎప్సెట్–2026 ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఎ.వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోష్రెడ్డి తెలిపారు. టీజీ ఎప్సెట్ బైపీసీ విభాగం రాష్ట్రస్థాయిలో వి.సాహ్యు 14వ ర్యాంకు సాధించారని వారు పేర్కొన్నారు. అదేవిధంగా కె.జీవన్ కుమార్ 91వ ర్యాంకు, కె.ఆశ్రిత 262వ ర్యాంకు, ఆర్.శ్రావణి 298వ ర్యాంకు సాధించారని వివరించారు. ఎంపీసీ విభాగంలో జి.యువన్చంద్ర 299వ సాధించారని వారు తెలిపారు. అలాగే, టీజీఎప్సెట్లో జె.శ్వేత 351వ ర్యాంకు, జె.గురుమోహన్చరణ్ 369వ ర్యాంకు, ఎన్.అవినాష్ 408వ ర్యాంకు, ఎన్.శివకల్యాణి 413వ ర్యాంకు, పి.సంజన 414వ ర్యాంకు, వై.సాత్విక్ 476వ ర్యాంకు, ఆర్.నిరూప్రెడ్డి 515వ ర్యాంకు, కె.జాహ్నవి 610వ ర్యాంకు, సి.హెచ్ అర్నవ్ 628వ ర్యాంకు, కె.ధీరజ్ 654వ ర్యాంకు సాధించారని వివరించారు. భవిష్యత్లో మరింత అత్యుత్తమైన ర్యాంకులు సాధించేలా తీర్చిదిద్దుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. గత 50 ఏళ్లలో పటిష్టమైన ప్రణాళికతో హైస్కూల్, జూనియర్ కాలేజీ, ఎంసెట్, ఐఐటీల్లో విద్యనందిస్తూ రాష్ట్ర, జాతీయస్థాయి పోటీపరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని చెప్పారు. ఈఏడాది జేఈఈ మెయిన్–2026లో ఉత్తమ ఫలితాలు సాధించారని వారు తెలిపారు. ‘రెజోనెన్స్’ విద్యార్థుల సత్తా.. హన్మకొండ: టీజీఎప్సెట్లో వరంగల్లోని రెజోనెన్స్ విద్యా సంస్థల విద్యార్థులు సత్తా చాటారు. ఆదివారం తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ టీజీ ఎప్సెట్ ఫలితాలు విడుదల చేసింది. ఇందులో తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని రెజోనెన్స్ విద్యా సంస్థల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి తెలిపారు. డి.స్నితిక 753వ ర్యాంకు, సి.హెచ్.భువనేశ్వరి 878, డి.సంజన 925, ఎ.రితిక 982వ ర్యాంకు సాధించిందని వివరించారు. వీరు రాష్ట్రంలోని ఉన్నత శ్రేణి కళాశాలల్లో ప్రవేశాలు పొందబోతున్నారన్నారు. వీరితో పాటు 291 మంది విద్యార్థులు 10 వేలలోపు ర్యాంకులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు. డైరెక్టర్లు లెక్కల మహేందర్ రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, సీఏఓ లెక్కల రమ్య, డీన్ బి.ఎస్.గోపాల్ రావు, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. ‘శివాని’ విద్యార్థుల విజయకేతనం హసన్పర్తి: టీజీఎప్సెట్–2026 ఫలితాల్లో శివాని కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. కళాశాలకు చెదిన బి. స్వామి (150 ర్యాంకు), ఎన్.చరణ్య(2,426 ర్యాంక్),కె.సౌందర్య(3,649 ర్యాంకు),ఎ.నవ్య(4,435 ర్యాంక్),ఎ. రత్యా(4,838 ర్యాంకు), జి. పూజిత(5744ర్యాంక్),పి. యశస్విని(6475 ర్యాంక్),ఇ. శ్రీశాంతి వర్మ(6863 ర్యాంక్),ఎం. ఐశ్వర్య (7,166 ర్యాంకు),ఇ. క్రిష్ణజా(7,840 ర్యాంకు),బి.అంజన శ్రీ (8,548 ర్యాంకు),ఎన్.జశ్వంత్ (9,018 ర్యాంకు),డి.సాయి కార్తీకేయ(9,114 ర్యాంకు), సి.హెచ్. అన్వేష్ (1,0318 ర్యాంకు),పి. సహస్ర శ్రీ(1,0997 ర్యాంకు) సాఽధించినట్లు శివాని కళాశాల కరస్పాండెంట్ తాళ్లపల్లి స్వామి తెలిపారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ తాళ్లపల్లి స్వామి, కళాశాల ప్రిన్సిపాళ్లు జి. సురేందర్రెడ్డి ,వి. చంద్రమోహన్, డైరెక్టర్లు టి.రాజు, ఎన్. రమేష్, ఎ. మురళీధర్, వి. సురేశ్, ఎస్.సంతోష్రెడ్డి అభినందించారు. ‘ఇన్స్పైర్’ విద్యార్థుల ప్రభంజనం హసన్పర్తి : టీజీఎప్సెట్ ఫలితాల్లో హనుమకొండజిల్లా హసన్పర్తి మండలం ఎర్రగట్టుగుట్ట క్రాస్లోని ఇన్స్పైర్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృషించారు. కళాశాలకు చెందిన పి. యోగి రాజ్ (1,190 ర్యాంకు), పి.సాయిప్రియ (6,994ర్యాంకు),ఎస్.అర్చన(8,389ర్యాంకు),టి. సాయి శ్రేష్టిత(9,614ర్యాంకు)సాధించినట్లు కళాశాల చైర్మన్ తీగల భరత్గౌడ్ తెలిపారు. ఈసందర్భంగా అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్ తీగల భరత్గౌడ్, ప్రిన్సిపాల్ సుంకరి శ్రీరాంరెడ్డి, డైరెక్టర్లు తీగల రాజ్కుమార్, కోటిచింతల మమతకుమారి, లాడే శివ అభినందించారు. -
వడదెబ్బతో మాజీ ఎంపీటీసీ మృతి
గీసుకొండ: వడదెబ్బతో వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ సభ్యురాలు దౌడు కోమల(60) ఆదివారం మృతి చెందారు. ఎండలో బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన ఆమె కింద పడి అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతి చెందినట్లు ఆమె కుమారుడు భరత్ తెలిపారు. కోమల 2019–2024 మధ్య కాలంలో ఎంపీటీసీగా పని చేశారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కోమల మృతిపై గ్రామస్తులు, పలువురు కాంగ్రెస్ నాయకులు సంతాపం తెలిపారు. చెరువులో పడి వ్యక్తి .. గీసుకొండ: గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచర్లలో చెరువులో పడి అదే గ్రామానికి చెందిన అల్లం మహేశ్వర్(42) అనే వ్యక్తి మృతి చెందాడు. గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ కథనం ప్రకారం.. కూలి పని చేసే మహేశ్యర్ ఆదివారం మధ్యాహ్నం కాలకృత్యాలు తీర్చుకోవడానికి చెరువు వైపునకు వెళ్లాడు. ఈ క్రమంలో కాలు జారి చెరువులో పడి నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందాడు. మృతుడి భార్య రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. -
రైతన్నా.. రంగు తెలుసుకో!
ఖిలా వరంగల్: పంటల్లో చీడపీడల నివారణకు రైతులు వివిధ రకాల పురుగు మందులు వినియోగిస్తుంటారు. మందు డబ్బాలపై పలు రంగుల స్టిక్కర్ల గుర్తులు ఉంటాయి. మందు ఎంత విషపూరితమో ఆ రంగులు సూచిస్తాయి. చాలామంది వీటిని గమనించకుండా పిచికారీ చేసి అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పటికై నా రైతులు మందు డబ్బాలపై ఎరుపు, నీలం, ఆకుపచ్చ, పుసుపు రంగులను చూసి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు, వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఎరుపు (అత్యంత ప్రమాదకరం) డబ్బా లేదా కవర్పై ఎరుపు రంగు, దానిపై ఎముకలు, పుర్రె గుర్తులు ఉంటే అత్యంత విష పూరితమైన ముందుగా పరిగణిస్తారు. ఇది శరీరంలోకి ఏ విధంగా వెళ్లినా ప్రాణాపాయం తప్పదు. నీలం (మధ్యస్థ ప్రమాదం) ఈ రకమైన మందులు మధ్యస్థ విషపూరిత స్థాయిని సూచిస్తాయి. డబ్బాలపై డేంజర్ అని రాసి ఉంటుంది. వీటిని పిల్లలు, పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలి. ఆకుపచ్చ (తక్కువ ప్రమాదకరం) వీటి విష తీవ్రత పైన పేర్కొన్న మూడింటి కంటే తక్కువ ఉంటుంది. ప్రమాదకరం (హెచ్చరిక) అని రాసి ఉంటుంది. తక్కువ ప్రమాదకరమైనా సురక్షితమైన పద్ధతిలోనే ఈ మందులను వినియోగించాలి. పసుపు (ఎక్కువ విషపూరితం) ఈ పసుపు రంగు మందు కూడా ఎక్కువ విషపూరితమైనదే. వీటిపై పాయిజన్ అని రాసి ఉంటుంది. పీల్చినా, చర్మంపై పడినా తీవ్రమైన అనారోగ్యం కలిగించే అవకాశం ఉంది. విష తీవ్రతను ఇలా గుర్తించండి డబ్బా కలర్ బట్టి మందు తీవ్రత పిచికారీలో జాగ్రత్తలు తీసుకోవాలి వైద్యులు, వ్యవసాయాధికారుల సూచన -
ఆగిన అన్నదాత గుండె
● ధాన్యం కొనుగోలు కేంద్రంలో అస్వస్థతకు గురై మృతి ● అలంకానిపేటలో ఘటన నెక్కొండ: రైతు కష్టానికి విలువ లేదు.. పండించిన పంటను తీసుకునే నాథుడు లేడు.. రోజులకొద్ది రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. నిర్వాహకుల పట్టింపులేమితో రైతులు ఆందోళనలకు గురై ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతు గుండె ఆగిన సంఘటన ఆదివారం జరిగింది. గ్రామస్తులు, తోటి రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గాజుల పెద్ద వెంకటేశ్వర్ (65) యాసంగి పంటగా నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న, మూడు ఎకరాల్లో వరి సాగు చేశాడు. నెక్కొండ మక్కల కొనుగోలు కేంద్రంలో ఇబ్బందులు వస్తున్నాయని తెలియడంతో సంగెం మండలం కాపులకనపర్తి కొనుగోలు కేంద్రానికి 15 రోజుల క్రితం 100 క్వింటాళ్ల మక్కలు తీసుకెళ్లాడు. అలాగే, గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి నాలుగు రోజుల క్రితం 60 క్వింటాళ్ల ధాన్యం తీసుకెళ్లాడు. ఇలా రోజుల తరబడి రెండు చోట్ల రైతు పెద్ద వెంకటేశ్వర్ పంటలను అమ్మేందుకు పడరానిపాట్లు పడుతున్నాడు. ఉదయం కొనుగోలు కేంద్రానికి వచ్చి ధాన్యం ఆరబెడుతుండగా గుండెలో నొప్పి అంటూ అస్వస్థతకు గురయ్యాడు. తోటి రైతులు వెంటనే అప్రమత్తమై సీపీఆర్ చేశారు. చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మృతువాత పడ్డాడు. మృతుడికి భార్య నాగలక్ష్మి, కుమారులు వేణు, విజయ్, కుమార్తె కర్ణ ఉన్నారు. రైతు కుటుంబానికి నష్టపరిహారం అందించాలని స్థానికులు కోరుతున్నారు. -
నాణ్యతాప్రమాణాలతోనే న్యాక్ గుర్తింపు
● కేయూ వీసీ ఆచార్య కె. ప్రతాప్రెడ్డి కేయూ క్యాంపస్: ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలతోనే న్యాక్ గుర్తింపు లభిస్తుందని కాకతీయ యూనివర్సిటీ కె.ప్రతాప్రెడ్డి అన్నారు. కాకతీయ యూనివర్సిటీలోని ఐక్యూఏసీ ఆధ్వర్యంలో ‘ఉన్నత విద్యలో నాణ్యత హామీ, న్యాక్ గుర్తింపు’ అనే అంశంపై గూగుల్మీట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హైదరాబాద్ నుంచి హాజరై మాట్లాడారు. ఉన్నత విద్యాసంస్థల అభివృద్ధి, నాణ్యతాప్రమాణాల సాధనలో న్యాక్ గుర్తింపు అనేది అత్యంత కీలకమన్నారు. నూతన న్యాక్ మూల్యాంకన విధానం, పారదర్శకత, జవాబుదారీతనం, ఫలితాధారిత విశ్లేషణకు అధిక ప్రాధాన్యమిస్తుందన్నారు. పరిపాలనా ప్రక్రియగా కాకుండా నిరంతర పురోగతికి దోహదపడే సాధనంగా భావించాలని సూచించారు. కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం మాట్లాడుతూ న్యాక్ గుర్తింపు సాధనలో ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రధానవక్త ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఓఎస్డీ ఆచార్య ఆర్వీఎస్ఎస్ఎన్ రవికుమార్ న్యాక్ గుర్తింపు ప్రక్రియలో ఎదురయ్యే సవాళ్లను వివరించారు. డేటా సేకరణ కేంద్రాల ఏర్పాటు, ప్రతి అధ్యాపకుడికి వ్యక్తిగత వెబ్పేజీల రూపకల్పన, పేటెంట్లు, పరిశోధనా ప్రచురణలు, స్వయం పోర్టల్ వినియోగం, పూర్వవిద్యార్థుల భాగస్వామ్యం వంటి అంశాలను తెలిపారు. కేయూ ఐక్యూఏసీ డైరెక్టర్ ఆచార్య నర్సింహాచారి కార్యక్రమ లక్ష్యాలు, కాకతీయ యూనివర్సిటీ నాణ్యతాభివృద్ధిలో న్యాక్ గుర్తింపు, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రాముఖ్యత గురించి చెప్పారు. కేయూ ఓఎస్డీ ఆచార్య బి. వెంకట్రాంరెడ్డి మాట్లాడారు. యూనివర్సిటీలోని పలు విభాగాల అధిపతులు, యూనివర్సిటీ కళాశాలల ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధులకు భరోసా..
● న్యాయ సేవల కేంద్రానికి పెరుగుతున్న దరఖాస్తులు ● సమస్యల పరిష్కారంతో సీనియర్ సిటిజన్ల హర్షం మహబూబాబాద్: జిల్లాలోని సీనియర్ సిటిజన్ల కోర్టు కేసుల పరిష్కారం కోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ సేవల కేంద్రానికి మంచి స్పందన వస్తోంది. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా న్యాయ సేవల కేంద్రంలో దరఖాస్తులు పెరుగుతున్నాయి. కాగా, సమస్యల పరిష్కారంతో దరఖాస్తుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్లో న్యాయ సేవల కేంద్రం.. 2025 నవంబర్ 24వ తేదీన కలెక్టరేట్లో న్యాయ సేవల కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణిలో సీనియర్ సిటిజన్ల నుంచి కోర్టు కేసుల దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు న్యాయ సేవల కేంద్రంలో పారా లీగల్ వలంటీరు అందుబాటులో ఉండి న్యాయ సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఐదు నెలల్లో కేంద్రానికి వందకుపై దరఖాస్తులు వచ్చాయి. తీసుకున్న దరఖాస్తుపై స్పందిస్తూ పూర్తి వివరాలు తీసుకుని ప్రభుత్వ న్యాయవాది ద్వారా నోటీసులు ఇచ్చి న్యాయం చేస్తున్నారు. ప్రధానంగా వృద్ధ దంపతుల మెయింటెనెన్స్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఈమేరకు వారికి న్యాయం జరిగేలా చూస్తున్నారు. నా కొడుకులు ఇబ్బంది పెడుతున్నారు.. నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక్కొక్కరికి మూడు ఎకరాల చొప్పున ఇచ్చాను. నాకు ఎకరం 10గంటల భూమి ఉంది. దానిని అమ్ముకునే విషయంలో ఇబ్బందులు పెడుతున్నారు. నన్ను సక్రమంగా చూసుకోకపోగా ఇబ్బంది పెడుతున్నారు. కేసు వేసి న్యాయం చేయాలని అన్ని పత్రాలను కేంద్రంలో ఇచ్చాను. –బోనగిరి చిన్న రాములు, ఉప్పరపల్లి, కేసముద్రం -
పాఠ్య పుస్తకాలొచ్చాయ్
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్య పుస్తకాలను సరఫరా చేసింది. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. కాగా, అప్పటి వరకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉండనున్నాయి. ఇదిలా ఉండగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచేందుకు టీచర్లు కృషి చేస్తున్నారు. పాఠశాలల పునఃప్రారంభం.. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. కాగా ప్రతీ విద్యార్థికి సమయానికి పుస్తకాలను అందజేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈమేరకు జిల్లాకు 2,86,290 పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. గత విద్యా సంవత్సరం మాదిరిగానే ప్రస్తుతం కూడా పాఠ్యపుస్తకాలపై సీరియల్ నంబర్లు ముద్రించి విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. విద్యార్థుల ఆధార్కార్డు నంబర్ను అనుసంధానం చేసుకుని, పుస్తకంపై ఉన్న సీరియల్ నంబర్ను రిజిస్టర్లో నమోదు చేసుకుని, ఆధార్కార్డు, సీరియల్ నంబర్ను ఆన్లైన్లో పొందుపరుస్తారు. అలాగే జూన్ 4నుంచి జూన్ 12వ తేదీ వరకు బడిబాట నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రతీ పాఠశాలకు రూ.వెయ్యి చొప్పున నిధులు ఇచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మండలాల వారీగా పాఠ్యపుస్తకాలు పంపిణీ.. జిల్లావ్యాప్తంగా 18 మండలాలు ఉన్నాయి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1,00090 మంది విద్యార్థులు ఉన్నారు. కాగా, ఆయా మండలాల ప్రభుత్వ పాఠశాలలకు ఆర్టీసీ కార్గో బస్సుల ద్వారా పాఠ్య పుస్తకాలు తరలిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూమీడియం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజేస్తారు. సకాలంలో విద్యార్థులకు అందజేస్తాం ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాఠశాలల్లో నూతన అడ్మిషన్ల కోసం తమవంతు బాధ్యతగా తీసుకుని విద్యార్థులను చేర్పించాలి. ఆర్టీసీ కార్గో బస్సుల ద్వారా ప్రతీ మండలానికి పుస్తకాలను రవాణా చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశం పొందిన ప్రతీ విద్యార్థికి పాఠ్యపుస్తకాలను సకాలంలో అందజేస్తాం. ఇప్పటికే జిల్లాకు పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. – సత్యనారాయణమూర్తి, జిల్లా విద్యాశాఖ అధికారిజిల్లాకు చేరిన 2,86,290 పాఠ్యపుస్తకాలు 73శాతం మాత్రమే రాక ప్రభుత్వ పాఠశాలల్లో 1,00,090 మంది విద్యార్థులు జూన్ 12న బడుల పునఃప్రారంభంమండలం పాఠశాలలు విద్యార్థులు బయ్యారం 84 4,089 చిన్నగూడూరు 13 1,126 దంతాలపల్లి 31 3,500 డోర్నకల్ 55 6,970 గంగారం 34 1,010 గార్ల 60 3,527 గూడూరు 93 5731 ఇనుగుర్తి 23 1,673 కేసముద్రం 67 6,801 కొత్తగూడ 61 3,611 కురవి 60 4,948 మానుకోట 140 23,782 మరిపెడ 84 9,276 నర్సింహులపేట 44 2,762 నెల్లికుదురు 54 3,288 పెద్దవంగర 31 2080 సీరోలు 27 1,724 తొర్రూరు 71 14,192 మొత్తం 1,032 1,00,090 -
ముదిరిన ముసలం
సోమవారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2026సాక్షి, మహబూబాబాద్: జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఏడాదిపాటు పాలకవర్గాలు లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. అయితే పాలక వర్గాల ఏర్పా టు తర్వాత కూడా ఒక్క అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నతీరుగా పాలన సాగుతోంది. పాలక మండలి, చైర్మన్లు, కమిషనర్లు, ఉద్యోగుల మధ్య సమన్వయం కొరవడింది. ఈ వివాదం చివరకు ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దల వద్దకు వెళ్లింది. కమిషనర్లపై ఆరోపణలు.. జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం మున్సిపాలిటీల్లోని పలువురు చైర్మన్లు, కౌన్సిలర్లు కమిషనర్లపై ఆరోపణలు చేసినట్లు తెలిసింది. మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ తీరుపై చైర్మన్ అసహనం వ్యక్తం చేయడం, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పనిలో జాప్యం, అందరిని కలుపుకునిపోకపోవడంతో తరచూ వివాదాలు వస్తున్నాయని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. డోర్నకల్, మరిపెడ మున్సిపల్ కమిషనర్లు కుర్చీలకే పరిమితమై ఉంటున్నారని, పట్టణాల్లో సమస్యలను పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. తొర్రూరు మున్సిపల్ కమిషనర్ తమను లెక్క చేయడం లేదని కౌన్సిలర్లు ఆరోపణలు చేస్తున్నారు. ఉద్యోగులను చిన్నచూపు చూడటం, విధుల్లో నుంచి తొలగించడం వంటి సంఘటనలతో మున్సిపాలిటీ వివాదాలకు నిలయంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. కేసముద్రం మున్సిపాలిటీ సభ్యులను సమన్వయం చేయాల్సిన కమిషనర్ ఏకపక్షంగా ఉంటున్నారని, తీర్మానాలు చేసే విషయంలో కూడా తమను లెక్కలోకి తీసుకోవడం లేదని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కొత్తవారిలో దూకుడు.. మున్సిపాలిటీల్లో కొత్తగా ఎన్నికై న కొందరు కౌన్సిలర్లు, పలువురు చైర్మన్ల దూకుడు స్వభావంతో సమస్యలు వస్తున్నాయనే చర్చ జరుగుతోంది. వార్డుల్లోని పనులు, భవన నిర్మాణాల అనుమతులు, ఇతర సమస్యల పరి ష్కారం కోసం వార్డు సభ్యులు కమిషనర్లు, ఉద్యోగులపట్ల దురుసుగా ప్రవర్తించడ ం, చైర్మన్లకు బదులు కుటుంబ సభ్యులు పెత్తనం చెలా యించడం ఇబ్బందిగా ఉందని ఉద్యోగులు అంటున్నా రు. కొందరు కౌన్సిలర్లు వివాదాల్లో తలదూర్చడం, వాటిని ఉద్యోగులకు ఆపాదించి తాము అనుకున్నట్లు చేయాలని ఒత్తిడి తెస్తున్నారని విమర్శలు ఉన్నాయి. మున్సిపాలిటీల్లో పాలకమండలి, ఉద్యోగుల మధ్య సమన్వయ లోపం మాట వినడం లేదని చైర్మన్ల గగ్గోలు చైర్మన్ల పెత్తనం ఎక్కువైందని ఉద్యోగుల అసహనం ఎమ్మెల్యేల వద్దకు వెళ్లిన వివాదం ఎమ్మెల్యేల వద్దకు వివాదాలు.. మున్సిపాలిటీల్లో చోటుచేసుకున్న సంఘటనలపై కౌన్సిలర్లు, చైర్మన్లు స్థానిక ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నట్లు తెలిసింది. కమిషనర్, ఉద్యోగులు తమను లెక్క చేయడం లేదు.. ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారు. ఇలా అయితే తమకే కాకుండా పార్టీకి కూడా చెడ్డపేరు వస్తుందని చెప్పినట్లు సమాచారం. పద్ధతి మార్చుకొమని చెప్పండి.. లేకపోతే కొత్తవారిని నియమించమని కోరినట్లు తెలిసింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యేలు మున్సిపల్ కమిషనర్లు, ఉద్యోగులను పిలిపించి మాట్లాడినట్లు తెలిసింది. ప్రజాప్రతినిధులను గౌరవించాలని, మీ పరిధిలో ఉన్న పనులు వెంటనే చేయాలని, పూర్తికాని పనులపై ఒత్తిడి తెస్తే నాకు చెప్పండి అని ఇరువర్గాలకు చెప్పినట్లు సమాచారం. సమన్వయంతో, ప్రవర్తన మార్చుకొని అందరూ కుటుంబంలా ఉండాలని హితవు పలికినట్లు తెలిసింది. -
ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలను నిలిపివేయాలి
● 20న మెడికల్ షాపుల బంద్ నెహ్రూసెంటర్: ఆన్లైన్ ద్వారా జరుగుతున్న మెడిసిన్ విక్రయాలను నిలిపివేయాలని ఈ నెల 20న మెడికల్ షాపుల సమ్మె నిర్వహిస్తున్నట్లు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పేరాల సంపత్రావు తెలిపారు. సమ్మె పోస్టర్లను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆన్లైన్ ద్వారా జరుగుతున్న నకిలీ, మోసపూరిత మందుల విక్రయాలను అరికట్టాలని డిమా ండ్ చేశారు. భారీ డిస్కౌంట్ పేరుతో ప్రజలను ఆకర్షిస్తూ కొన్ని ఆన్లైన్ సేవలు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. అర్హత కలిగిన ఫార్మసిస్టులు లేకుండా మందుల విక్రయం జరగడం ఆరోగ్యానికి ప్రమాదకరమన్నారు. సమ్మెలో దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల నిర్వాహకులు పాల్గొంటున్నారని, అత్యవసర సేవలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు అవసరమైన మందులను ముందుగానే కొనుగోలు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సోమ పురుషోత్తం, బెజగం రాజు, రంగారెడ్డి, రామకృష్ణారావు, మురళి, రవి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులపైనే విద్యార్థుల భవిష్యత్
● ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మహబూబాబాద్: ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపైనే విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో ఆదివారం విద్యావారోత్సవాల్లో భాగంగా పది తరగతి, ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి డీఈఓ సత్యనారాయణమూర్తి అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ రవీందర్రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యతోనే ఉన్నతస్థాయికి ఎదుగుతామని, సమాజంలో గౌరవం ఉంటుందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాలన్నారు. అంకితభావంతో పని చేసి విద్యాభివృద్ధికి పాటుపడాలన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ.. విద్యాభివృద్ధికి ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ జ్యోతి, కౌన్సిలర్ నీరుటి హైమా, డీఐఈఓ మదార్ పాల్గొన్నారు. -
బదిలీల భయం!
● ఎంజీఎంలో పాతుకుపోయిన ఉద్యోగులు ● స్థానచలనం తప్పదా? ● ఉన్నతాధికారి పోస్టుకు డిమాండ్ కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఉన్నతాధికారి నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకు బది లీల ఫీవర్ పట్టుకుంది. ప్రభుత్వం బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జాయినింగ్ పీరియడ్ లెక్కలు వేసుకుంటూ సర్వీస్ బుక్లతో కుస్తీ పడుతున్నారు. డీఎంఈ కార్యాలయంలో పలుకుబడి ఉపయోగించుకుంటూ బదీలీల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది యూనియన్ పేరు చెప్పుకుంటూ ఆఫీస్ బేరర్లుగా బదిలీల నుంచి మినహాయింపు, కోరుకున్న చోటకు వెళ్లేందుకు ఎవరికి వారే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 40 శాతం ఉద్యోగులకు బదిలీలకు అవకాశం ఉండడంతో నాలుగేళ్ల సర్వీస్ దాటిన వారందరికీ బదిలీల గండం ఏర్పడింది. ఇక్కడే తిష్ట.. ఎంజీఎంలో కొంతమంది ఉద్యోగులు బదిలీల నుంచి తప్పించుకుంటున్నారు. ప్రమోషన్లు సైతం వదులకుని ఇక్కడే తిష్ట వేస్తున్నట్లు తెలుస్తోంది. జూని యర్ అసిస్టెంట్ క్యాడర్లో ఉన్న ఉద్యోగులు అకౌంట్ టెస్ట్ పాస్ కాకపోవడం వల్ల ఎంజీఎంలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఓ ఉద్యోగి అయితే జాయినింగ్ నుంచి ఇక్కడే విధులు నిర్వహిస్తున్నారు. దా దాపు మూడు దశాబ్దాల నుంచి పని చేస్తున్నా మళ్లీ బదిలీ నుంచి మినహాయింపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, మినిస్టీరియల్ విభాగం నుంచి ఐదుగురు ఉద్యోగులు బది లీలు సిద్ధంగా ఉన్నారు. ఇక పెద్దాస్పత్రి పెద్ద పోస్ట్ అయిన సూపరింటెండెంట్ పోస్ట్ కోసం ఎంజీఎంలో పనిచేసిన ఉన్నతాధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్లో ఎంజీఎం ఆస్పత్రిని 24 అంతస్తుల భవనంలోకి మార్చే అవకాశం ఉండడంతో పెద్ద పోస్టు కోసం భారీగా పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. రావాలన్నా.. పోవాలన్నా భయమే! ఎంజీఎంలో పనిచేస్తున్నవారు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు జంకుతుండగా, ఇతర జిల్లాల్లోని అధికా రుల్లో కొందరు ఎంజీఎం అంటే వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆస్పత్రిలో గతంలో జరిగిన అవకతవకలపై తరచూ పత్రికల్లో రావడంతో వామ్మో, ఎంజీఎం మాకొద్దు అంటూ ఇక్కడ ఉ ద్యోగం చేయడానికి జంకుతున్నట్లు తెలుస్తోంది. ప్ర స్తుతం ఎంజీఎంలో సూపరింటెండెంట్గా పని చే స్తున్న డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి మంచిర్యాలలో సూపరింటెండెంట్ పోస్టులో ఉండగా, ఎంజీఎంలో ఇన్చార్జ్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్నా రు. డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి బదిలీపై ఇతర ఆస్పత్రికి వెళ్లి, తిరిగి ఎంజీఎంలో ఇన్చార్జ్గా కొనసాగడానికి ప్రత్యేక ఆర్డర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఈ పోస్టు కోసం ఎంజీఎంలోనే సూపరింటెండెంట్గా విధులు నిర్వహించిన చంద్రశేఖర్, గోపాల్రావు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా పని చేస్తున్న డాక్టర్ సంధ్య కేఎంసీతో పాటు కాళోజీ యూనివర్సిటీలో కూడా పనిచేశారు. అయి తే ఆమె బదిలీ కావడానికి అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ నుంచి ఆఫీస్ బేరర్ లెటర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈపోస్టు కోసం మహబూబాబాద్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న డాక్టర్ శ్రీనివాస్ కూడా తన వంతు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. -
వీరన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు క్యూలో బారులుదీరారు. మొక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. సర్కారు నిర్లక్ష్యంతో ధాన్యం కొనుగోళ్లలో జాప్యంతొర్రూరు: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లె కుమార్, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకుడు కొలుపుల శంకర్ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం డివిజన్ కేంద్రంలోని ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలను బీజేపీ నాయకులు సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి రోజుల తరబడి ఎదురుచూస్తున్నారని, కాంటాలు ఆలస్యం చేయడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. లారీలు, గన్నీ సంచుల కొరత తీర్చి కొనుగోళ్ల వేగం పెంచాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ అర్బన్ అధ్యక్షుడు పైండ్ల రాజేష్, నాయకులు నడిగడ్డ సందీప్, అలిసేరి రవిబాబు, మంగళపల్లి యాకయ్య, గంధం రాజు, సాయి ముఖేష్, విజయ్కుమార్, భరత్, నవీన్ పాల్గొన్నారు. వీఆర్ఏ వారసుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా యాకయ్య పెద్దవంగర: వీఆర్ఏ వారసుల సంఘం జిల్లా నూతన కమిటీ అధ్యక్షుడిగా మండలానికి చెందిన నీరటి యాకయ్య ఏకగ్రీవంగా ఎన్ని కయ్యారు. మండలంలోని కొరిపల్లి గ్రామానికి చెందిన ఆయన 10 ఏళ్లుగా వీఆర్ఏగా విధులు నిర్వర్తిస్తున్నాడు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వివిధ మండలాల వీఆర్ఏల సమక్షంలో ఈ ఎన్నిక చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న వీఆర్ఏ వారసుల ఉద్యోగాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. ఉద్యోగాలు వచ్చే వరకు వీఆర్ఏ వారసుల తరఫున నిరంతరం పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. గోదావరిలో ప్రముఖులకు దారి కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వీవీఐపీల కోసం సరస్వతీఘాటు తీరం నుంచి త్రివేణి సంగమంలోని నీటి వరకు వెళ్లడానికి బారికేడ్లు ఏర్పాటు చేసి మధ్యలో మట్టిరోడ్డు వేశారు. దానిపైన మ్యాట్లు రానున్నాయి. అక్కడే కంటెయినర్లు ఏర్పాటు చేస్తున్నారు. బయో టాయిలెట్లు, జల్లు స్నానాలకు ఏర్పాటు చేస్తున్నారు. కుడి, ఎడమ వైపున సాధారణ భక్తులు స్నానాలకు వెళ్లేందుకు షమియానాలు, మ్యాట్లు వేయనున్నారు. తీరం నుంచి రెండు ద్వారాల ద్వారా భక్తులు తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేపట్టారు. 15 చెక్పోస్టుల ఏర్పాటు సరస్వతీనది అంత్యపుష్కరాలకు పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తారనే అధికారుల అంచనాతో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు వివిధ మార్గాల వద్ద 15 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. 21 నుంచి వన్వే అమలులోకి రావడంతో చెక్పోస్టుల వద్ద ట్రాఫిక్ ఆంక్షలు ప్రారంభం కానున్నాయి. శివ కల్యాణ మండపంలో హోమాలు ఈనెల 21నుంచి జూన్ 1వ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు హోమాలు నిర్వహించడానికి దేవాదాయశాఖ శివ కల్యాణ మండపంలో ఏర్పాట్లు చేస్తుంది. హోమాల కోసం భారీ మంచుకొండల మాదిరిగా డెకరేషన్ సెట్టింగులు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా అచలాపురానికి చెందిన వేదపండితులు హోమాది పూజలు నిర్వహించనున్నారు. చివరి మూడు రోజులు రుద్రయాగం నిర్వహించడానికి శృంగేరి పీఠం నుంచి వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారని ఆలయ వర్గాలు తెలిపాయి. -
పసిగట్టి.. పట్టించి
వాసన ద్వారా గంజాయి, డ్రగ్స్ను పట్టిస్తున్న జాగిలాలు‘కొద్దిరోజుల క్రితం కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో గంజాయి రవాణా అవుతుందనే సమాచారం మానుకోట పోలీసులకు అందింది. అప్రమత్తమైన పోలీసులు శిక్షణ ఇచ్చిన జాగిలాన్ని తీసుకొని ఖమ్మం రైల్వేస్టేషన్లో ఆ రైలు ఎక్కి తనిఖీ చేసుకుంటూ వచ్చారు. ఒక డబ్బాలో ఉన్న సీటుపై పెట్టిన బ్యాగును పసిగట్టిన జాగిలం ట్రైనర్కు సంకేతాలు ఇచ్చింది. దీంతో తనిఖీ బృందం బ్యాగు ను విప్పి చూడగా.. అందులో 10కిలోల గంజాయి ప్యాకెట్ బయట పడింది.’సాక్షి, మహబూబాబాద్: గతంలో పోలీసు జాగిలా లను దొంగలు, హత్యచేసిన వారిని గుర్తించడం కోసం వినియోగించేవారు. మారిన కాలం, సాంకేతికత ఆధారంగా ఇప్పుడు జాగిలాల ద్వారా ఎక్స్ప్లోజివ్(పేలుడు పదార్థాలు)లను గుర్తించి నిర్వీర్యం చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్, నార్కోటిక్స్ రవాణా, వినియోగం గుట్టు రట్టు చేసేందుకు జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి జిల్లాలకు పంపించారు. అనుమానం వచ్చిన చోటుకు జాగిలాన్ని తీసుకెళ్తే వాసన పసిగట్టి.. గుట్టు రట్టు చేయడం సులభతరం అవుతోంది. జిల్లాకు ఆరు జాగిలాలు.. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు, అక్రమ రవాణా, మత్తు పదార్థాలు, మందు పాతరలు, బాంబుల బెదిరింపులు మొదలైన సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు వాటిని ఛేదించేలా జాగి లాలను సిద్ధం చేశారు. ఇందుకోసం జిల్లాకు ఆరు జాగిలాలు, వాటి ట్రైనర్స్ సిద్ధంగా ఉన్నారు. ఇందులో ఒక జాగిలం నేరస్తుల వస్తువులు, వస్త్రాలు, రక్తపు మరకలు, ఇతర ఆనవాళ్ల వాసన చూసి నేరస్తుల కదలికలను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది. నాలుగు జాగిలాలకు మందు పాతరలు, పేలుడు పదార్థాలు, బాంబులను పసిగట్టేందుకు శిక్షణ ఇచ్చారు. మిగిలిన ఒక జాగిలానికి నార్కోటిక్స్ శిక్షణ ఇచ్చారు. ఇది గంజాయి, కొకై న్, ఇతర డ్రగ్స్ను గుర్తించడానికి దోహదపడుతోంది. ఇతరులకు ఇబ్బంది లేకుండా.. పోలీసుల తనిఖీలు చేయాల్సి వచ్చినప్పుడు.. ఎవరు మంచివారో..ఎవరు నేరస్తులో ముందే తెలియదు. దీంతో అందరిని తనిఖీలు చేస్తే మంచి వారు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అలాగని తనిఖీ చేయకుంటే.. వాళ్లే నేరస్తులు అయ్యే అవకాశం ఉండొచ్చు. ఇటువంటి పరిస్థితిలో జాగిలాన్ని రంగంలోకి దింపి నేరస్తులను పట్టుకుంటున్నారు జిల్లా పోలీసులు. ప్రధానంగా జిల్లాలో గంజాయి సాగు, రవాణా, వినియోగం ఎక్కువగా ఉందనే నివేదికలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో వాటిపై ఉక్కుపాదం మోపేందుకు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, అనుమానిత ప్రాంతాలు, కొరియర్ సెంటర్లు, కిళ్లీ కొట్లు మొదలైన ప్రాంతాలకు జాగిలాన్ని పంపించి తనిఖీలు చేయడం.. వాసన పసిగట్టిన జాగిలం అక్రమ రవాణా గుట్టు రట్టు చేయడం సులభం అవుతోంది. అదే విధంగా వినియోగించిన వారిని కూడా పసిగట్టడం.. యువత గంజాయిని వినియోగించే ప్రాంతాలను గుర్తించేందుకు జాగిలాలు ఉపయోగపడుతున్నాయి. గంజాయి నిర్మూలనలో భాగమే.. మానుకోటను మత్తు పదార్థాలు వినియోగం లేని జిల్లాగా మార్చాలన్నదే పోలీసుల లక్ష్యం. ఇందుకోసం ఇప్పటికే ప్రజలను చైతన్య పరుస్తున్నాం. అయినా పూర్తి స్థాయిలో గంజాయి నిర్మూలన కావడం లేదు. జిల్లాలో శిక్షణ పొందిన జాగిలాలతో మత్తు పదార్థాల రవాణా గుట్టు రట్టు చేసే పనిలో ఉన్నారు. ఏ మూలన దాచిపెట్టినా పసిగట్టి పట్టిస్తుంది. ప్రజలు సమాచారం ఇస్తే చాలు.. అంతా మేం చూసుకుంటాం. – శబరీష్, ఎస్పీ మత్తుపదార్థాల అక్రమ రవాణా అడ్డుకట్టకు ప్రత్యేక శిక్షణ జనసంచార ప్రాంతాలు, చెక్పోస్టులు, రైల్వేస్టేషన్ల వద్ద తనిఖీలు ఇతరులకు ఇబ్బందులు లేకుండా ఛేదన -
కేయూలో రాష్ట్రస్థాయి హ్యాకథాన్
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్రెడ్డి.. రూసానోడల్ అధికారి ఆర్. మల్లికార్జున్రెడ్డితో కలిసి శనివారం హైదరాబాద్లో రాష్ట్ర ఐటీ శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేయూలోని కెహబ్, హైదరాబాద్లోని టిహబ్తో కుదిరిన అవగాహన ఒప్పందం (ఎంఓయూ) గురించి మంత్రికి వివరించారు. అలాగే, ఈఏడాది జూలైలో కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి హ్యాకథాన్ నిర్వహణ కార్యాచరణను వివరించి ఆహ్వానించారు. ఇందుకు మంత్రి అంగీకారం తెలిపారు. తెలంగాణ యువతలో ఆవిష్కరణ, ఇంక్యూబేషన్, స్టార్టప్ సంస్కృతి, పారిశ్రామిక నైపుణ్యాల అభివృద్ధికి కాకతీయ యూనివర్సిటీ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని మంత్రి తెలిపారని వీసీ పేర్కొన్నారు. హైదరాబాద్ తర్వాత రెండో స్థాయి నగరాల్లో స్టార్టప్ కార్యాకలాపాలకు వరంగల్ కేంద్రంగా ఎదగాలని, కెహబ్ తెలంగాణ ఆవిష్కరణలకు ప్రముఖ కేంద్రంగా రూపుదిద్దుకోవాలని మంత్రి ఆకాంక్షించారని వీసీ ప్రతాప్రెడ్డి తెలిపారు. మంత్రి శ్రీధర్బాబును ఆహ్వానించిన వీసీ కె. ప్రతాప్రెడ్డి -
డెంగీ నిర్మూలనకు అవగాహన కల్పించాలి
● డీఎంహెచ్ఓ రవిరాథోడ్ నెహ్రూసెంటర్: క్షేత్రస్థాయిలో డెంగీ వ్యాధి నిర్మూలనకు వైద్య సిబ్బంది విస్తృతంగా అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ రవి రాథోడ్ సూచించారు. జాతీయ డెంగీ నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. డెంగీ ప్రజారోగ్యానికి పెను సమస్యగా మారిందని, ప్రజలు, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా కృషి చేస్తేనే నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. డెంగీకి ఇప్పటివరకు కచ్చితమైన ఔషధం, టీకా అందుబాటులో లేవని, రక్షణ చర్యలు పాటిస్తేనే మేలు అన్నారు. డెంగీ సోకిన వారిని కుట్టిన దోమలు ఇతరులను కుట్టినప్పుడు వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. డెంగీ బారిన పడినవారు తప్పనిసరిగా దోమ తెరల్లోనే నిద్రించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్ రెడ్డి, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, డీపీఎంఓ వాల్య, సబ్ యూనిట్ ఆఫీసర్ గోపిచంద్, ఎంపీహెచ్ఈఓ తోట శ్రీనివాస్, హెల్త్ సూపర్వైజర్ ఫహీముద్దీన్, కౌన్సిలర్ రమేష్ పాల్గొన్నారు. -
విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
● డీఈఓ సత్యనారాయణమూర్తి తొర్రూరు: విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకోవాలని డీఈఓ సత్యనారాయణమూర్తి అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా శనివారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ‘ఆర్ట్, క్రాఫ్ట్–కల్చరల్ డే’ కార్యక్రమం నిర్వహించారు. హెచ్ఎం జెల్ల లక్ష్మీనారాయణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో డీఈఓ మాట్లాడుతూ.. నైపుణ్యాలు పెంపొందించుకోవడం ద్వారా అవకాశాలు లభిస్తాయన్నారు. విద్యతో పాటు ఇతర అంశాలపై పట్టు సాధించాలన్నారు. సంస్కృతి, కళలపై ఆసక్తి అవసరమన్నారు. నాణ్యమైన బోధన, మెరుగైన మౌలిక సదుపాయాలు, డిజిటల్ లెర్నింగ్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం బలోపేతం చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఏసీజీఈ శ్రీరాములు, ఏఎస్సీ సంతోష్, ఎంఈఓ బుచ్చయ్య, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మిరియాల సతీష్రెడ్డి, హెచ్ఎంలు వెంకటేశ్వర్లు, శ్రీనుబాబు, వీరన్న తదితరులు పాల్గొన్నారు. -
విద్య, వైద్యరంగాల్లోనూ ఏఐ కీలకపాత్ర
కేయూ క్యాంపస్: విద్య, వైద్యరంగాల్లోనూ కృత్రిమ మేధస్సు(ఏఐ) కీలక పాత్ర పోషిస్తుందని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వి. రామచంద్రం అన్నారు. శనివారం కాకతీయ యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో సెనెట్హాల్లో రీజనల్ స్థాయి ఏఐ కాన్క్లేవ్ –2026 పై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కృత్రిమ మేధస్సు విద్య, వైద్యం, వ్యవసాయం, పాలన, తదితర రంగాల్లో విప్లవాత్మ మార్పులు తీసుకొస్తుందన్నారు. ముఖ్యంగా వ్యాధుల నివారణలో సీఎన్ఎన్, ఆర్ఎన్ఎన్ , ఎల్ఎస్టీఎం వంటి డిప్ లెర్నింగ్ విధానాలు కీలకంగా మారాయని తెలిపారు. ఏఐ వినియోగంలో నైతికత, పారదర్శకత, సామాజిక బాధ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆ కంప్యూటర్ సైన్స్ విభాగం అధిపతి , కేయూ పాలకమండలి సభ్యురాలు బి. రమ మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు భవిష్యత్లో విస్తృత ఉద్యోగావకాశాలను సృష్టించనున్నదన్నారు. విద్యార్థులు , అధ్యాపకులు ఏఐకి సంబంధించిన నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ శక్తివంతమైన సాధనం.. ఈ సదస్సులో ప్రధానవక్తగా వరంగల్ నిట్ ఆచార్యుడు రామలింగస్వామి మాట్లాడుతూ ప్రగతిశీల తెలంగాణ కోసం విద్య, ఆవిష్కరణలు, పరిశోధన అభివృద్ధి చెందుతున్న సాంకేతక రంగాలను భవిష్యత్లో మలచడంలో కృత్రిమ మేధస్సు శక్తివంతమైన సాధనమన్నారు. కృత్రిమ మేధస్సు అధ్యాపకులకు ప్రత్యామ్నాయం కాదన్నారు. బోధనను మరింత శక్తివంతంగా చేసే సాధనని అభిప్రాయపడ్డారు. సదస్సులో కేయూ ఓఎస్డీ బి. వెంకట్రామ్రెడ్డి, కేయూ ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఎన్. రమణ, కె. భిక్షాలు మాట్లాడారు. కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం -
శరీరదాన అంగీకారం అభినందనీయం
కాశిబుగ్గ: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 36 మంది తమ కుటుంబ సభ్యుల సహకారంతో శరీరదానం చేస్తామని అంగీకారం తెలుపుతూ హామీ పత్రాలు అందజేశారు. శనివారం తెలంగాణ నేత్ర అవయవ శరీరదాతల అసోసియేషన్ ద్వారా కేఎంసీ ప్రిన్సిపాల్ సంధ్య, అనాటమీ హెచ్ఓడీ శశికాంతకు ఆ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సంధ్య మాట్లాడుతూ కుటుంబ సభ్యుల సమక్షంలో తమ మరణాంతరం శరీరదానం చేస్తామని అంగీకార పత్రాలు ఇవ్వడం అభినందనీయమన్నారు. శరీరదాతల ఆలోచన విధానం ఇతరులకు స్ఫూర్తిగా ఉంటుందన్నారు. శరీర దానం చేయడానికి ముందుకు వచ్చేవారు 8790548706, 9490133650 నంబర్లను సంప్రందించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఉపేందర్రెడ్డి, ఉపాధ్యక్షురాలు పద్మ, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కె.మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పి.వేణు, అనాటమీ సిబ్బంది ప్రేమ్కుమార్, యాదగిరి పాల్గొన్నారు. కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య -
పెట్రో ధరలు తగ్గించాలి
మహబూబాబాద్: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యదర్శ బి.విజయసారథి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో శనివారం సీపీఐ ఆధ్వర్యంలో దిచక్రవాహనాలకు తాళ్లు కట్టి లాగడంతో పాటు రిక్షాలపై గ్యాస్ సిలిండర్లు పెట్టి వినూత్నంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా విజయసారథి మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెంచి పేదలపై తీవ్రభారం మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన చట్టాలు చేస్తూ దేఽశ ప్రజలపై సవతితల్లి ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో రైతులు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలు తగ్గించకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్సారథి రెడ్డి, నాయకులు రేషపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, పాండురంగాచారి, సాంబలక్ష్మి, ఉప్పలయ్య, శ్రావణ్, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. -
చేతిపంపులకు మరమ్మతు
డోర్నకల్: మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో శనివారం చేతిపంపులకు సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టారు. ఇటీవల నిర్వహించిన ‘సాక్షి ఫోన్ ఇన్ ’కార్యక్రమంలో భాగంగా చెడిపోయిన చేతిపంపులకు మరమ్మతు చేయించాలని మున్సిపల్ చైర్పర్సన్ రాజకుమారికి స్థానికులు మొర పెట్టుకున్నారు. దీనిపై స్పందించిన ఆమె చేతి పంపులకు వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. బ్రాహ్మణకుంట, శాంతినగర్, పాతడోర్నకల్, బాపూజీనగర్ తదితర ప్రాంతాల్లోని చేతిపంపులకు మరమ్మతులు చేయడంతో పాటు బోర్లలో ఫ్లషింగ్ పనులు నిర్వహించారు.19న ఎకై ్సజ్ వాహనాల వేలంమహబూబాబాద్ రూరల్: గుడుంబా, బెల్లం సరఫరా చేస్తూ వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు ఈనెల 19న ఉదయం 11గంటలకు మహబూబాబాద్ ఎకై ్సజ్ స్టేషన్ ఆవరణలో బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నామని ఎకై ్సజ్ సీఐ చిరంజీవి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎకై ్సజ్ శాఖ వరంగల్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు, జిల్లా అధికారి కిరణ్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న వాహనాల వేలంపాటలో పాల్గొనే వారు పూర్తి వివరాల కోసం మహబూబాబాద్ ఎకై ్సజ్ స్టేషన్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. వాహన ధరలో 50 శాతం డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, వేలంపాటలో ఏర్పాటు చేసిన వాహనాల వివరాలు మహబూబాబాద్ స్టేషన్ ఆవరణలో నోటీసు బోర్డుపై ఉన్నాయని తెలిపారు. అత్యవసర సేవలందించడమే లక్ష్యంగూడూరు: ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన 108, 102 వాహనాలు ప్రజలకు అత్యవసర సేవలు అందిస్తున్నాయని ప్రోగ్రాం మేనేజర్ నజీరుద్దీన్, జిల్లా మేనేజర్ బత్తిని మహేష్గౌడ్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం 108, 102 వాహనాలను వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్లో ఉన్న పలు రికార్డులను, వారు అందించిన ఉచిత సేవ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఏ సమయంలోనైనా ప్రజల నుంచి ఫోన్ రాగానే సేవలందించడానికి సిద్ధంగా వెళ్లాలని సూచించారు. ఎలాంటి నిర్లక్ష్యం చేసినా సహించేది లేదన్నారు. కార్యక్రమంలో ఈఎంటీలు హన్మంతు, సుప్రియ, పైలెట్లు అనిల్, ప్రశాంత్, షేక్ మహబూబ్పాషా పాల్గొన్నారు. నీట్ పేపర్ లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలిమహబూబబాబాద్ అర్బన్: నీట్ పేపర్ లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఏస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వెలుగు శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో ఏఐఏస్ఎఫ్ జిల్లా నాయకులు నీట్ విడుదల చేసిన ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వెలుగు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. 2026–నీట్ పేపర్ లీకేజీ అంత్యత దారుణమని, 23 లక్షలకు పైగా విద్యార్థుల భవిష్యత్తో చెలగాటమాడిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలన్నారు. పరీక్షలను సరిగా నిర్వహించలేని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి మేక వెంకటేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు సీలువేరు వికాస్, వరుణ్కుమార్, కల్యాణ్, నవీన్, హర్షవర్ధన్రెడ్డి, సాయి, విశాల్, హాసన్, దీపిక, కీర్తి, దివ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆక్సిజన్ అందకే చేపలు మృత్యువాత
● నీటి కాలుష్యం తోడై రూ.30 లక్షల నష్టం కాశిబుగ్గ: వరంగల్ దేశాయిపేటలోని చిన్న వడ్డేపల్లి చెరువులో ఆక్సిజన్ అందకే ఇటీవల రూ.30 లక్షల విలువైన చేపలు మృత్యువాత పడినట్లు అధికారులు చెబుతున్నారు. వేసవి తీవ్రత, నీటిశాతం తక్కువ కావడం, దీనికి తోడు చెరువులోని నీరు కలుషితం కావడంతోనే చేపలు చనిపోయినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. మత్స్యకారులు వేసవిని దృష్టిలో ఉంచుకుని ముందుగానే చేపలు పట్టుకుంటే నష్టం జరిగేది కాదని జిల్లా మత్యశాఖ అధికారి శ్రీపతి తెలిపారు. చెరువు పరిధిలో దేశాయిపేట, కాశిబుగ్గ, మట్టెవాడ పరిధిలో 200 మంది మత్స్యకారులు ఉన్నట్లు పేర్కొన్నారు. మండలంలో 711 చెరువులు ఉన్నాయని, చిన్న వడ్డేపల్లి చెరువులో పరిధిలో కూడా ఆరు ఉన్నాయని వివరించారు. ఈ చెరువుల్లోని చేపలకు ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. అయినా చిన్నవడ్డేపల్లి చెరువులోని నీటి పరిస్థితి తెలుసుకోవడానికి వరంగల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎన్విరాన్మెంట్ శాస్త్రవేత్త శనివారం మూడు చోట్ల శ్యాంపిల్స్ సేకరించి తీసుకెళ్లారని చెప్పారు. దీని నివేదిక ఆధారంగా వాస్తవాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. -
సాంస్కృతిక సంబురాలు..
హన్మకొండ చౌరస్తా : ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం హనుమకొండ ప్రభుత్వ పాఠశాల ఆవరణలోని జిల్లా బాలభవన్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బాలభవన్ సూపరింటెండెంట్ డి. ఝాన్సీ , మృదంగం ఇన్స్ట్రక్టర్ల నేతృత్వంలో పిల్లలకు కళలు, చేతపనులు, సాంస్కృతిక అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలు గీసిన చిత్రలేఖనం, గణపతి ప్రార్థన, కోలాటం, బృంద నృత్యం, మృదంగ వాయిద్య ప్రదర్శన ఆకట్టుకుంది. జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక విద్యా వారోత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు ఝాన్సీ తెలిపారు. -
మహాభారతం, రామాయణం వింటున్న..
నా పేరు కూర హర్షిత్. నేను వేసవి సెలవుల్లో హైదరాబాద్ నుంచి జనగామలోని మా అమ్మమ్మ, తాతయ్య తాటిపల్లి సుజాత, ఉమాపతి ఇంటికి వచ్చా. సెలవుల్లో రోజూ తాతయ్యతో కలిసి ఈత నేర్చుకోవడానికి స్విమ్మింగ్ ఫూల్ వెళ్తున్నా. ఇంటి వద్ద అమ్మమ్మ మహాభారతం, రామాయణ ఇతిహాసాల ముఖ్య అంశాలు, చిన్న కథలు చెబుతూ నాతో మళ్లీ చెప్పిస్తున్నారు. తీరిక సమయంలో డ్రాయింగ్ వేస్తున్నా. తాతయ్యతో కలిసి ఆటలాడుతూ కాలక్షేపం చేస్తున్నా. ఈ వేసవిలో మన సంప్రదాయాలను ఎన్నో నేర్చుకుంటున్నా. –జనగామ -
పొదుపు.. భవిష్యత్ మదుపు!
ఖిలా వరంగల్: అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దేశంలో విదేశీ మాదకద్రవ్య వినియోగం తగ్గించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దిగుమతి చేసుకున్న బంగారం, ఎరువులు, ఇంధనం, వంట నూనె, ఇతర సరుకుల వాడకం విషయంలో పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ వీటి వినియోగం ఎక్కువగా పెరిగింది. ఇదేపరిస్థితి కొనసాగితే భవిష్యత్లో ఇబ్బందులు తప్పేలా లేవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రధాని సూచనను మన ఇంటినుంచే ఆచరిద్దాం. దీనివల్ల వ్యక్తిగత ప్రయోజనంతో పాటు దేశానికి మేలు జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో ప్రధాన ఖర్చులు.. ఆదాపై ఈ ఆదివారం ‘సాక్షి’ సండే స్పెషల్.. నూనె వాడకమూ ఎక్కువే.. ఇళ్లలో వంటలకు వాడే నూనెకు భారీగా వెచ్చిస్తున్నారు. నలుగురు కుటుంబ సభ్యులున్న ఇంటిలో నెలకు నగటున ఐదు లీటర్లు వాడుతున్నారు. నెల రోజులకు ఇప్పటికీ చూస్తే ఒక్కో ప్యాకెట్కు రూ.25కు పైగా ధరలు పెరిగాయి. అతిగా వంట నూనె వాడితే శరీరానికి విటమిన్లు, మంచి కొవ్వు, కేలరీలు అందవు. హార్మోన్ల అసమతుల్యతతో ఎక్కువ మంది ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధుల బారినపడుతున్నా వినియోగం తగ్గించడం లేదు. ఉమ్మడి జిల్లాలో సుమారు 38.20 లక్షల కుటుంబాలు ఉండగా నెలకు 1.90 కోట్ల లీటర్ల నూనె వాడుతున్నట్లు అంచనా. ప్రధాని పిలుపు మేరకు అందులో 10 శాతం తగ్గించినా 19 లక్షల లీటర్లు ఆదా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. బంగారం చూసుకుని కొందాం.. వివాహాలు, ఇతర శుభకార్యాలకు స్వర్ణాభరణాలు కొనడం అలవాటుగా మారింది. ఈ విషయంలో నియంత్రణ పాటిస్తే కచ్చితంగా ప్రయోజనం కలుగుతుంది. ప్రధానంగా వరంగల్ నగరంలో 210కుపైగా షాపులు, మిగిలిన జిల్లాల్లో మరో 200 షాపులు ఉన్నాయి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా సగటున రోజుకు 6 కిలోల బంగారు నగల అమ్మకాలు సాగుతున్నట్లు వ్యాపారుల అంచనా. ఈ విషయంలో కొంత పొదుపు పాటించాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ధరలు పెరగడంతో 80 శాతం కొనుగోళ్లు తగ్గిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇంధనం ఆదా చేద్దామా.. పశ్చిమాసియా పరిణామాలు ఇంధన వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు తమ కాన్వాయిలో వాహనాలను తగ్గించుకునేలా తీసుకున్న నిర్ణయం స్ఫూర్తిగా నిలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో 7,82,314 వాహనాలు ఉన్నాయి. దీంతో సగటున నెలకు 19 లక్షల లీటర్ల పెట్రోల్, 7 లక్షల లీటర్ల డీజిల్ వినియోగమవుతోంది. ఒక ద్విచక్రవాహనం ఇంధనం కోసం సగటున నెలకు రూ.మూడు వేలు వెచ్చించాల్సి వస్తోంది. ఇది ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం.. నెలవారీ నిత్యావసర సరుకుల కొనుగోలుకు సమానంగా ఉంటుంది. ఖరీదైన వాహనాలను విని యోగిస్తే ఇంధన వ్యయం ఎక్కువ. బైక్లపై వెళ్లడం కంటే కాలినడకన, సైకిళ్ల మీద వెళ్తే కొంత ఇంధనాన్ని ఆదా చేసినట్లే. ఎరువుల మోతాదు మించొద్దు.. పంటలకు మోతాదుకు మించి ఎరువులు వాడుతున్నారు. అధికారుల సిఫార్సు మేరకు ఎకరాకు మూడు దశల్లో 75 కిలోల యూరియా వినియోగించాల్సి ఉండగా.. జిల్లాలో 225 కిలోల కంటే ఎక్కువ ఉపయోగిస్తున్నట్లు వ్యవసాయ అధికారులే చెబుతున్నారు. దీంతో నేలసారం తగ్గడమే కాకుండా చీడ పీడలు వ్యాపించి సాగు వ్యయం గణనీయంగా పెరుగుతుంది. ఖరీఫ్లో జిల్లా వ్యాప్తంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు సాగువుతుండగా.. నిబంధనల ప్రకారం 41 వేల మెట్రిక్ టన్నుల యూరియా వేయాలి. ఈ ప్రకారం రసాయన ఎరువులు వేస్తే విదేశీమారక ద్రవ్యం వినియోగం తగ్గడంతో పాటు సాగుపరంగా ఎదురయ్యే ఇబ్బందులూ తీరుతాయి. ప్రధాని మోదీ సూచనను మన ఇంటి నుంచే ఆచరిద్దాం..విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడానికి పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలి. ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి. – ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపు వంట నూనెల వాడకం తగ్గిస్తే.. ఇంటి ఖర్చులో అధిక ఆదా అవసరమైతేనే బైక్, కారు.. కాలినడక ఆరోగ్యానికి మంచిది దిగుమతి వస్తువుల వినియోగాన్ని తగ్గిస్తే మేలు -
బైక్ను ఢీకొన్న ట్రాక్టర్..
మరిపెడ రూరల్ : బైక్ను ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ కార్పెంటర్ మృతి చెందాడు. ఈ ఘటన మహబూ బాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్లలో సూర్యాపేట–మహబూబాబాద్ 365 జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం కొప్పొల్ గ్రామానికి చెందిన పర్వతం నరేశ్ (36) మరిపెడలో కార్పెంటర్ షాపు నిర్వహిస్తున్నాడు.శనివారం సాయంత్రం పని ముగించుకుని బైక్పై స్వగ్రామం వెళ్తున్నాడు. ఈ క్రమంలో తానంచర్ల గ్రామంలోని గంగభవాని ఆలయ రహదారి నుంచి మొక్కజొన్న లోడ్తో హైవే మీదికి వచ్చిన ట్రాక్టర్.. బైక్ను ఎదురుగా ఢీకొంది. దీంతో ద్విచక్రవాహనంతోపాటు నరేశ్ ట్రాక్టర్ ట్రాలీ కింద ఇరుక్కుకోవడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గండ్రాతి సతీశ్ తెలిపారు. నర్మెట(తరిగొప్పుల) : రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం జనగామ జిల్లా తరిగొప్పుల మండలం సోలీపురంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అల్ద రాంచరణ్ (16) తల్లి తారమ్మ, అక్క సాత్విక, మేనకోడలు ప్రియాన్షి, అల్లుడు రిషిని తీసుకుని బైక్పై అమ్మమ్మగారిల్లు కూటిగల్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం కూటిగల్కు చెందిన సిరిగిరి రాహుల్ మిత్రుడితో కలిసి బైక్పై ఎదురుగా వచ్చి సోలీపురం కట్టమైసమ్మ గుడి సమీపంలో రాంచరణ్ వాహనాన్ని ఢీకొన్నాడు. దీంతో రాంచరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తారమ్మ, సాత్విక, ప్రియాన్షి, రిషి, రాహుల్కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి పెద్దనాన్న కుమారుడు హరీశ్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై గుగులోత్ శ్రీదేవి తెలిపారు.● కార్పెంటర్ మృతి..తానంచర్లలో ఘటన ● మృతుడు సూర్యాపేట జిల్లా వాసి -
ఉద్యాన పంటల సాగు లాభదాయకం
నెల్లికుదురు: ఆయిల్ పామ్, ఉద్యాన పంటల సాగు లాభదాయకమని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి జినుగు మరియన్న సూచించారు. శనివారం మండల కేంద్రానికి చెందిన మహిళా రైతు పి.సరస్వతి మల్బరీ పంట క్షేత్రపర్యటన చేశారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు, ప్రభుత్వం సబ్సిడీ అందించే పంటలు ఆయిల్ పామ్, ఉద్యాన, కూరగాయలు, పండ్లు, పూలు, మల్బరీ, పుట్టగొడుగులు, తేనెటీగల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించామని, ఎరువులు, పురుగు మందులు అవసరం లేని మల్బరీ సాగుతో ఎకరానికి రూ.2లక్షల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు. క సెరీకల్చర్ అధికారి రాజయ్య, రైతు జనార్దన్ పాల్గొన్నారు. -
వారికి ఎదురుచూపులే..!
హన్మకొండ: తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్లోకి వెళ్లేందుకు ఆప్షన్లు ఇచ్చిన వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. ఈ నెల 13న బదిలీ నియామకాలు చేపట్టనున్నట్లు మార్గదర్శకాల్లో పొందుపరిచినా ఆచరణలో రాష్ట్ర ఇంధన శాఖ, టీజీ ఆర్పీడీసీఎల్ యాజమాన్యం వైఫల్యం చెందిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆప్షన్ ఇచ్చిన అధికారులు, ఉద్యోగుల్లో ఆందోళన, ఉత్కంఠ నెలకొంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 8వ తేదీలోపు రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ సంస్థలు.. టీజీ జెన్కో, టీజీ ట్రాన్స్కో, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్ నుంచి ఇంజనీర్లు, పర్సనల్ విభాగం అధికారులు, అకౌంట్స్ విభాగం అధికారులు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉద్యోగులు రైతు డిస్కంకు వెళ్లేందుకు ఆప్షన్ ఇచ్చారు. ఇందులో ఒక్క టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి 1,252 మంది ఆప్షన్ ఇచ్చారు. ఆప్షన్లో పొందుపరిచిన వివరాలు సరైనావా కాదా అని ఈ నెల 12న వెరిఫికేషన్ చేసి తుది జాబితాను ఆయా సర్కిల్లు ఆర్పీడీసీఎల్కు పంపాయి. అధికారిక షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13న బదిలీ నియామకాలు చేపట్టాల్సి ఉండగా, అనూహ్యంగా ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. 15న మాతృ సంస్థ నుంచి రిలీవ్ అయి 18న ఆర్పీడీసీఎల్లో రిపోర్టు చేయాలి. 19న ఆర్పీడీసీఎల్ పరిధిలో పోస్టింగ్లు ఇవ్వాలి. 25న పోస్టింగ్ పొందిన స్థానంలో జాయిన్ కావాలి. అయితే ఇప్పటి వరకు బదిలీ నియామకాలు చేపట్టలేదు. ఇది మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది. బదిలీ నియామకాల అమలుపై మల్లగుల్లాలు.. బదిలీ నియామకాల అమలుపై ఇంధన శాఖ, టీజీఆర్పీడీసీఎల్ మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వారిని పలు సందేహాల వెంటాడుతున్నాయి. ఇంజనీర్స్ అసోసియేషన్లు, ఉద్యోగ సంఘాల నుంచి పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి దృష్టికి అసోసియేషన్లు, సంఘాలు తీసుకెళ్లాయి. పారదర్శకంగా నియామకాలు చేపట్టాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తుది నిర్ణయంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. భవిష్యత్లో ఎలాంటి సమస్య తలెత్తకుండా బదిలీ నియామకాలు చేపట్టాలనే ఆలోచనలో ఆర్పీడీఎల్ యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తుంది. పోస్టుల భర్తీ, సీనియార్టీ లెక్కింపు వంటి అంశాలపై పీటముడి రాష్ట్రంలో ప్రస్తుతమున్న నాలుగు విద్యుత్ సంస్థల నుంచి ఆసక్తి కలిగిన అధికారులు, ఉద్యోగుల నుంచి టీజీ ఆర్పీడీసీఎల్ ఆప్షన్లు కోరిన విషయం విధితమే. అయితే ఇక్కడ ఓ చిక్కు వచ్చింది. నాలుగు విద్యుత్ సంస్థల నుంచి అధికారులు, ఉద్యోగులను ఏ నిష్పత్తిలో, ఏ కంపెనీ నుంచి ఎంత మంది చొప్పున తీసుకోవాలి? రిజర్వేషన్ రోస్టర్ అమలు... పోస్టుల భర్తీ, సీనియార్టీ లెక్కింపు వంటి అంశాలపై పీటముడి వీడడం లేదు. ఆప్షన్ ఇచ్చిన వారిలో రిజర్వేషన్ రోస్టర్ అమలు మేరకు ఆ కేటగిరీ ఉద్యోగులు అందుబాటులో లేకపోతే ఏం చేయాలనే సందిగ్ధతలో ఇంధన శాఖ, టీజీ ఆర్పీడీసీఎల్ యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా సంస్థల నుంచి ఆప్షన్లు రావడంతో సీనియార్టీ లెక్కింపు కూడా సమస్యగా మారనుంది. ఈ నేపథ్యంలో బదిలీ నియామకాల ప్రక్రియపై అనిశ్చితి కొనసాగుతోంది. అధికారుల నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు ఉద్యోగుల్లో ఉత్కంఠ పరిస్థితి కనిపిస్తోంది.ఆర్పీడీసీఎల్ వెళ్లడానికి ఈనెల 8న ఆప్షన్లు, 12న వెరిఫికేషన్ ప్రక్రియలు పూర్తి 13న బదిలీ నియామకాలు చేపట్టాల్సి ఉండగా కాలయాపన సాగుతున్న ప్రక్రియ.. బదిలీలపై పలు సందేహాలు ఎటూ తేల్చుకోలేకపోతున్న ఇంధన శాఖ, ఆర్పీడీసీఎల్ కొనసాగుతున్న అనిశ్చితి ఆందోళనలో అధికారులు, ఉద్యోగులు -
బంగారం కొనలేకపోతున్నాం..
ె పెరిగిన ధరల దృష్ట్యా సామాన్య, మధ్య తరగతి మహిళలం బంగారం కొనలేక పోతున్నాం. వివాహ సమయాల్లో పుట్టింటి కానుకగా అందించిన ఆభరణాలతో సరిపెట్టుకుంటున్నాం. ప్రధాని మోదీ హైదరాబాద్లో ప్రకటించిన విధంగా ఏడాది వరకు బంగారాన్ని కొనకుండా వేచిచూస్తాం. దీంతోనైనా దేశానికి మేలు కలగడంతోపాటు ధరలు దిగివస్తాయని ఆశిస్తున్నా. – గోనె లత, కరీమాబాద్ రోడ్డు వరంగల్ అవసరమైతేనే బైక్ తీస్తున్నా.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయి. సామాన్యులపై భారం పడింది. ఏ చిన్న పనికి కూడా వాహనంపై వెెళ్లడమే ప్రజలకు అలవాటుగా మారింది. పెరిగిన ధరలను చూస్తే చిన్న పనులకు బైక్, కారు రోడ్డు ఎక్కించడం సామాన్యులకు భారమే. అత్యవసరం అనుకుంటేనే కారు, బైక్ తీయాలని సూచిస్తున్నా. ఇంటి నుంచి ఎక్కడికై నా సైకిల్ మీద లేదా నడిచి వెళ్తున్నా. దీంతో నాకు ఆరోగ్యంతోపాటు డబ్బులు ఆదా అవుతున్నాయి. – మచ్చిక రాజు, వరంగల్ సేంద్రియ పద్ధతి పాటిస్తున్నాం.. సేంద్రియ సాగు విధానాన్ని పాటిస్తున్నాం. తప్పని పరిస్థితుల్లో యూరియాను పంటలకు వాడుతున్నాం. నూతన పద్ధతులు ఎన్ని పాటించినా ఎకరాకు ఒక బస్తా యూరియా వేస్తే పచ్చదనంతోపాటు పంట ఎదుగుదల కనిపిస్తుంది. అధికారులు ప్రత్యేక చొరవ చూపి ఖరీఫ్ సీజన్లో యూరియా కొరత లేకుండా చూడాలి. – పులి మంజుల, మహిళా రైతు, లింగగిరి -
ప్రేమోన్మాది ఘాతుకం
జడ్చర్ల: ప్రేమించడం లేదని ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో శనివారం పట్టపగలు గుర్తు తెలియని ఓ యువకుడు (30) యువతిని కత్తితో విచక్షణారహితంగా తల, మెడపై పొడవడంతోపాటు గొంతు కోయడంతో యువతి అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలి మృత్యువాత పడింది. వివరాలు ఇలా.. బాదేపల్లి పట్టణంలోని ఎర్రసత్యం కాలనీకి చెందిన వైష్ణవి (23) పోలేపల్లి సెజ్లోని ఎస్వీకేఎం స్కూల్లో రిసెప్షనిస్ట్గా విధులు నిర్వర్తిస్తోంది.శనివారం విధులు ముగించుకొని సాయంత్రం 5.30 గంటల సమయంలో కాలనీలో నడుచుకుంటూ ఇంటికి వెళుతున్న సమయంలో గుర్తు తెలియని ఓ యువకుడు యువతిని వెంటాడి తన వెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో దాడి చేశాడు. ఆ యువకుడు పారిపోతున్న సమయంలో స్థానికులు గమనించి వెంటాడి పట్టుకుని కాళ్లు చేతులు తాళ్లతో కట్టి వేసి చితకబాదారు. రాళ్లతో తలపై దాడి చేయడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడకు వచి్చన 108 అంబులెన్స్లో యువతిని వైద్యచికిత్స కోసం జడ్చర్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు.అయితే అప్పటికే యువతి మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. అయితే దాడికి పాల్పడిన యువకుడిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తుండగా స్థానికులు పోలీసులను దరిచేరకుండా అడ్డుకున్నారు. తోపులాటలు, వాగ్వివాదం, కేకలు చోటు చేసుకున్నాయి. చివరకు తీవ్రంగా గాయపడిన యువకుడిని పోలీస్ వాహనంలో జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి తరలించారు. అయితే యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో పాటు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో యువకుడి వివరాలు లభ్యం కాని పరిస్థితి ఏర్పడింది. కాగా నిందితుడు హైదరాబాద్కు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. మరో రెండు నెలల్లో పెళ్లి.. ఎర్రసత్యం కాలనీలో నివాసం ఉంటున్న రాంచంద్రయ్యకు భార్య శ్రీలత, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో హతురాలు వైష్ణవి పెద్ద కూతురు. ఈమెకు ఇటీవల పెళ్లి నిశ్చయమైందని కుటుంబ సభ్యులు తెలిపారు. వచ్చే నెలలో నిశ్చితార్థం, మరో రెండు నెలల్లో వివాహం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈలోగా ఈ దారుణం జరిగిందని వారు కన్నీటిపర్యంతం అయ్యారు. మరో వంద అడుగులు వేసి ఉంటే తమ ఇంట్లోకి వచ్చేదని, ఇంతలోనే దారుణ హత్యకు గురైనట్లు వారు పేర్కొన్నారు.దాడి చేసిన యువకుడు ఎవరో తమకు తెలియదని, అతడిని ఎప్పుడూ చూడలేదని తెలిపారు. హత్య చేసి పారిపోతుండగా యువకుడిని పట్టుకున్న స్థానికులు అతని గురించి ఆరా తీశారు. రెండేళ్లుగా ప్రేమ పేరుతో తనను మోసం చేసిందని, తన డబ్బులు తీసుకుందని నిందితుడు పేర్కొ న్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ మేరకు కేసు నమో దు చేసుకు ని దర్యాప్తు చేస్తున్నామని సీఐ కమలాకర్ తెలిపారు. యువకుడి వివరాలు ఇంకా తెలియలేదని చెప్పారు. -
విద్యుత్ షాక్తో బాలుడి మృతి
పర్వతగిరి: మామిడితోటలో కాయలు కోస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో బాలుడు మృత్యువాతపడిన ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం సేట్రాంతండాకు చెందిన నేనావత్ సంతోష్(15) ఇటీవల పదో తరగతి పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యాడు. ఇదిలాఉండగా.. అదేజిల్లా మద్దిరాల మండలానికి చెందిన సురేష్ అనే వ్యక్తి పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన సంపెల్లి వెంకటేశ్వర్రావు మామిడితోట లీజుకు తీసుకుని సంతోష్ను మామిడి కాయలు కోసేందుకు తీసుకొచ్చాడు. శుక్రవారం మామిడి కాయలు కోసే క్రమంలో 11కేవీ విద్యుత్ వైర్లు తగిలి సంతోష్ కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు వర్ధన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మామిడితోట మధ్యలో నుంచి 11కేవీ విద్యుత్ వైర్లు ఉన్నప్పటికీ చెట్లకొమ్మలు తొలగించడంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు ఎల్సీ తీసుకోకుండా తోట యజమాని, కౌలుదారు మామిడి కాయలు కోయించడంతో బాలుడు మృతి చెందాడు. బంధువుల ఆందోళన.. వర్ధన్నపేటలోని మార్చురీ వద్ద మృతుడి తల్లిదండ్రులు విజయ రాజు శోకసంద్రంలో మునిగిపోగా.. బంధువులు మార్చురీ వద్ద ఆందోళన చేపట్టారు. తగిన న్యాయం చేస్తామని పర్వతగిరి సీఐ రాజగోపాల్ వారికి నచ్చజెప్పినా వారువినలేదు. బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా అడ్డుకున్నారు. కాగా మృతుడికి అక్క రాజేశ్వరి, తల్లిదండ్రులు ఉన్నారు.● మామిడి కాయలు కోస్తుండగా ప్రమాదం ● మృతుడు సూర్యాపేట జిల్లా వాసి -
గోదాములకు మక్కల తరలింపు
మహబూబాబాద్ రూరల్: ప్రభుత్వ సూచనలు, కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు షెడ్లలో ఉన్న మక్కల బస్తాలను ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం శుక్రవారం గోదాముల్లోకి తరలింపజేశారు. షెడ్లలో సుమారు 30 వేల బస్తాల మక్కలు ఉండగా హమాలీలు, కూలీలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి లారీలు, ట్రాక్టర్ల ద్వారా గోదాముల్లో నిలువచేసే ప్రక్రియను మొదలుపెట్టారు. మొదటిరోజు సుమారు మూడు వేల బస్తాల వరకు గోదాముల్లోకి తరలించగా.. రెండు, మూడు రోజుల్లో మిగిలిన బస్తాలను తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ కార్యదర్శి సుజన్ బాబు, పీఏసీఎస్ కార్యదర్శి ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
స్మారక స్తూపం కూల్చివేత
హసన్పర్తి: హసన్పర్తి మండలం చింతగట్టులో మావోయిస్ట్ నేత బూర రాకేష్ పేర నిర్మిస్తున్న స్మారక స్తూపాన్ని పోలీసులు శుక్రవారం కూల్చివేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడాది క్రితం ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో చింతగట్టుకు చెందిన మావోయిస్ట్ కీలక నేత బూర రాకేష్ మృతిచెందాడు. కుటుంబసభ్యులకు పార్ధివదేహాన్ని సైతం అప్పగించలేదు. దీంతో అతని జ్ఞాపకార్థం స్తూపం నిర్మించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. వర్ధంతి సందర్భంగా స్తూపం ఏర్పాటు చేయాలని భావించినా.. పోలీసుల ఒత్తిడితో కుటుంబసభ్యులు వెనక్కి తగ్గారు. అనంతరం శుక్రవారం చింతగట్టులోని తమ ఇంటి ఎదుట స్తూపం నిర్మాణ పనులు ప్రారంభించారు. సమాచారం అందుకున్న కాకతీయ యూనివర్సిటీ పోలీసులు జేసీబీ సాయంతో నిర్మాణంలో ఉన్న స్తూపాన్ని కూల్చివేశారు. రాకేష్ తల్లిదండ్రులు స్వరూప, బూర బాబు, సోదరుడు బూర రంజిత్, వదిన బూర రేఖతో పాటు నిర్మాణ పనులు చేపడుతున్న ముగ్గురు మేసీ్త్రలను కూడా అరెస్ట్ చేశారు. మధ్యాహ్నం 3గంటల వరకు పోలీస్స్టేషన్లో ఉంచిన తర్వాత సాయంత్రం తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. మావోయిస్టు రాకేష్ పేరిట స్తూపం నిర్మాణం మేసీ్త్రలను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు -
అమ్మచెప్పిన కథ
మంచి స్నేహం జనగామ: ఒక కాల్వ ఒడ్డున ఒక చీమల పుట్ట ఉండేది. ఆ పుట్టలో ఎన్నో చీమలు నివాసం ఉండేవి. ఒక పావురం దాహం తీర్చుకోడానికి కాల్వ దగ్గరకు ప్రతీ రోజు వచ్చేది. చీమలు ఆ పావురంతో స్నేహం చేయడం మొదలు పెట్టాయి. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఆ సంవత్సరం వర్షాలు బాగా కురిశాయి. చెరువులు, నదులు పొంగి పొర్ల సాగాయి. చీమల పుట్ట దగ్గరలో ఉన్న కాల్వ నిండా నీళ్లు వచ్చాయి. వర్షాలు ఇంకా తగ్గలేదు. రోజురోజుకూ కాల్వ నీటిమట్టం పెరిగిపోసాగింది. చీమల పుట్ట నీటిలో మునిగిపోతుంది. ఇది గమనించిన పావురం.. చీమలను కాపాడి ఒడ్డుకు చేరుస్తుంది. ఆతర్వాత అక్కడే ఉన్న చెట్టుకు పావురం గూడు కట్టుకోగా, చీమలు మరో పుట్టను ఏర్పాటు చేసుకుని స్నేహాన్ని కొనసాగిస్తాయి. నీతి: ఒక మంచి స్నేహం చేస్తే కష్టకాలంలో ఎలాంటి సహాయం దొరుకుతుందో ఈకథ ద్వారా తెలుసుకోవచ్చు. – శ్రీనిత్య, 8వ తరగతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నర్మెట -
కళలపై లోతైన అధ్యయనం చేయాలి
హన్మకొండ కల్చరల్: కళలపై పరిశోధకులు, లోతైన అధ్యాయనం చేయాలని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య వెలుదండ నిత్యానందరావు అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వరంగల్ హంటర్ రోడ్డులోని తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో సాహిత్య, కళాత్మక సదస్సు నిర్వహించారు. వీసీ నిత్యానందరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ప్రముఖ సాహితీవేత్త గన్నమరాజు గిరిజామనోహర బాబు, తెలుగు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు, ప్రజాపాలన నోడల్ అధికారి, విశ్వవిద్యాలయం ఆచార్యులు బి.హెచ్ పద్మప్రియ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజామనోహర్ బాబు మాట్లాడుతూ.. భాష, అలంకారాలు, పద ప్రయోగం, వాక్య నిర్మాణం వంటి అంశాలను వివరించారు. వీసీ నిత్యానందరావు మాట్లాడుతూ.. తెలుగు విశ్వవిద్యాలయం అభివృద్ధికి కృషి జరుగుతోందని పరిశోధనా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. వరంగల్ జానపద గిరిజన విజ్ఞాన పీఠం ఆస్థిత్వాన్ని కాపాడే దిశగా అభివృద్ధి చేస్తామని అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు మాట్లాడుతూ.. వీసీ ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. పరిశోధన పత్రాలను సమర్పించే పరిశోధక విద్యార్థులు నాణ్యమైన విషయ విజ్ఞానాన్ని సేకరించి భవిష్యత్ తరాలకు అందించాలని సూచించారు. జానపద గిరిజన విజ్ఞాన పిఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న మాట్లాడుతూ విశ్వవిద్యాలయ వీసీ, రిజిస్ట్రార్లు పీఠానికి తగిన సదుపాయాలు కల్పించారని తెలిపారు. అంతకుముందు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహిహీత డాక్టర్ ఎండీ రాజ్మహ్మద్ పీఠం లైబ్రరీకి 216 పుస్తకాలు ఉచితంగా అందజేయగా.. అతన్ని సన్మానించారు. విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థులు పత్ర సమర్పణ చేయగా.. విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. సదసుసలో కవుల రామాచంద్రమౌళి, వల్పపైడి, పరీక్షల నియంత్రణాధికారి ఆదిలక్ష్మి, అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ వనజా ఉదయ్, డాక్టర్ రత్నశ్రీ డిప్యూటీ రిజిస్ట్రార్ బాలోజినాయక్, ఏఆర్ శ్రీకాంత్, సూపరింటెండెంట్ రంగారావు, జూనియర్ అసిస్టెంట్ అమీర్ అలీఖాన్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు శ్రీమంతుల దామోదర్, బాసాని సురేష్, చూరేపలి రవికుమార్, అబ్బు గోపాల్రెడ్డి, గంపా సతీష్ పాల్గొన్నారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వీసీ నిత్యానందరావు వరంగల్ జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో సాహిత్య, కళాత్మక సదస్సు -
థియేటర్ ఆర్ట్స్ డిపార్టుమెంట్ను ఏర్పాటుచేయాలి
కేయూ క్యాంపస్: కళాకారులు, కళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, కాకతీయ యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ విభాగం ఏర్పాటు చేయాలని మహబూబాబాద్ మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. చేతన కళావేదిక ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కాకతీయ యూనివర్సిటీలోని ఎస్డీఎల్సీఈ గ్రౌండ్లో నిర్వహించిన కాకతీయ కళల జాతర కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాకతీయులు ఆనాడు ప్రజలకు సుపరిపాలనతోపాటు కళలు, అద్భుతమైన శిల్పకళ, నృత్యాలు, సంగీతానికి ఎంతో ప్రాధాన్యమిచ్చారని తెలిపారు. ముఖ్యంగా పేరిణీ నృత్యం కాకతీయుల కాలంలో విలసిల్లిన నృత్యప్రదర్శన అని గుర్తు చేశారు. కాకతీయల కాలంలో తవ్వించిన గొలుసుకట్టు చెరువులు నేటికీ ఉపయోగపడుతున్నాయని తెలిపారు. కాకతీయ యూనివర్సిటీలో కాకతీయుల కళా జాతర నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. కళాకారులకు కళలపై అభిరుచి కలగాలంటే థియేటర్ ఆర్ట్స్ సబ్జెక్టుగా యూనివర్సిటీలో విభాగం ఏర్పాటుచేయాలని అందుకు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. జాతీయ స్థాయి పార్టీలో ఉన్నందున విభాగం ఏర్పాటు జరిగేలా తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. థియేటర్ ఆర్ట్స్ విభాగం ఏర్పాటుచేస్తే ఎంతో మంది కళాకారులు తయారవుతారన్నారు. కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడు డాక్టర్ చిర్ర రాజు మాట్లాడుతూ.. కాకతీయు కాలంనాటి శిల్పకళ అద్భుతమైందన్నారు. కాగా పేరిణీ నృత్యంతోపాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతలను అలరించాయి. బీజేపీ నాయకురాలు రావు పద్మ, జబర్దస్త్ ఫేమ్ వెంకీ, రాజమౌళి, లక్ష్మణాచారి, బోలేశావలి, చేతన కళావేదిక కన్వీనర్ నాగేశ్వర్రావు, బాధ్యులు శ్యామ్, దేవేందర్, కళాకారులు, తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ సీతారాంనాయక్ కేయూలో ఘనంగా కాకతీయ కళల జాతర అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు -
లారీల ఆలస్యం.. పేరుకుపోయిన ధాన్యం
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలు సకాలంలో రాకపోవడంతో కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలు పేరుకుపోతున్నాయి. మండలంలోని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొనగా.. లారీల యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సకాలంలో లారీలను కొనుగోలు కేంద్రాలకు పంపకపోవడం వల్ల సమస్య తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. రైతుల నుంచి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వందల కొద్ది బస్తాల ధాన్యాన్ని కొనుగోలు చేసి కాంటా పెట్టారు. అయితే లారీలు రాక మిల్లులకు తరలించకుండా కనిపిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు బతిమిలాడితే తప్ప లారీలు వచ్చే పరిస్థితి ఉండటంలేదని సమాచారం. -
కార్యవర్గం ఎన్నిక
హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నె శశి కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్లో జరిగిన యూనియన్ టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ శాఖ (18 సర్కిళ్ల పరిధి) జనరల్ బాడీ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. అధ్యక్షుడిగా గుగులోతు రాందాస్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈది వెంకటరమణ, ప్రధాన కార్యదర్శిగా రావుల రమణారెడ్డితోపాటు పలువురిని కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. -
టీజీ ఆర్పీడీసీఎల్ ఏర్పాటు వేగిరం
హన్మకొండ: తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ పూర్తి స్థాయిలో ఏర్పాటుకు పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుత విద్యుత్ సంస్థల నుంచి ఆసక్తి కలిగిన వారి నుంచి ఆప్షన్లు కోరగా ఈ నెల 8వ తేదీ నాటికి ఉద్యోగులు ఆప్షన్లు ఇచ్చారు. వీరికి బదిలీ నియామక ప్రక్రియ పూర్తి చేసి పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. ఆస్తుల పంపిణీ వేగిరం వ్యవసాయ సర్వీస్లు, లిఫ్ట్ ఇరిగేషన్, మిషన్ భగీరథ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్, సీవరేజ్ బోర్డు, మున్సిపల్ వాటర్ కనెక్షన్ విత్ సఫరేట్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్లు టీజీ ఆర్పీడీసీఎల్లోకి వస్తాయి. ఈ మేరకు గృహ సర్వీస్లు వ్యవసాయ సర్వీస్లు కలిసి ఉన్న విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను వేరు చేయడంతోపాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల గుర్తింపు ప్రక్రియను విద్యుత్ పంపిణీ కంపెనీలు వేగిరం చేశాయి. లైసెన్స్ జారీ కావడానికి ముందే ఆస్తుల పంపిణీ పూర్తి చేయాలని టీజీ ఆర్పీడీసీఎల్, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆస్తుల పంపిణీలో భాగంగా వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల గుర్తింపు ప్రక్రియ మొదలు పెట్టారు. సంబంధత సెక్షన్ ఏఈతోపాటు, సెక్షన్లోని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉద్యోగులు వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల గుర్తింపు పనిలో బిజీ అయ్యారు. ట్రాన్స్ఫార్మర్ల నమోదుకు ప్రత్యేక యాప్ టీజీ ఆర్పీడీసీఎల్కు బదిలీ అయ్యే విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల నమోదు కోసం ప్రత్యేక యాప్ను రూపొందించినట్లు తెలిసింది. ఈ యాప్లో వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్ల ఫొటోలు ఆప్లోడ్ చేస్తారు. మూడు రకాల ఫొటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్లింత్తో సహా ట్రాన్స్ఫార్మర్ ఫొటో, ట్రాన్స్ఫార్మర్ ఎంబోసింగ్, ట్రాన్స్ఫార్మర్ కంపెనీ నేం ప్లేట్ ఫొటోలు వేర్వేరుగా అప్లోడ్ చేయాలి. ఫీడర్ పేరు, ట్రాన్స్ఫార్మర్ కంపెనీ పేరు, ట్రాన్స్ఫార్మర్ నంబర్, కంపెనీ నంబర్, వ్యవసాయ సర్వీస్లు వంటి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. వ్యవసాయంతోపాటు ఇతర సర్వీస్లు ఒకే ట్రాన్స్ఫార్మర్పై ఉంటే వీటిని వేరు చేయాల్సిన బాధ్యత కూడా ప్రస్తుత డిస్కంలదే. వ్యవసాయ సర్వీస్లు వేరు చేస్తూ ప్రత్యేకంగా అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం ద్వారా వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లన్ని టీజీ ఆర్పీడీసీఎల్కి వెళ్లనున్నాయి. 25వ తేదీ వరకు గడువు వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ల గుర్తింపు ప్రక్రియ, యాప్లో అప్లోడ్ ఈ నెల 25లోపు పూర్తి చేయాలని మూడు డిస్కంల సీఎండీలు.. ఎస్ఈ, డీఈలు, ఏడీఈలకు సూచించారు. సరిపడా సిబ్బంది లేకపోవడంతో నిర్ణీత గడువులోగా చేయలేమని అధికారులు చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఆర్పీడీసీఎల్కు అప్షన్ కోరడంతో చాలా మంది మూడో డిస్కంకు వెళ్లేందుకు ఆప్షన్ ఇచ్చారు. వీరిని ఆ డిస్కంలోకి తీసుకుంటే మరింత ఉద్యోగుల కొరత ఏర్పడనుందని ఈ క్రమంలో గడువులోగా వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ల గుర్తింపు, యాప్లో అప్లోడ్ ప్రక్రియ పూర్తి కాదని డివిజన్, సబ్ డివిజన్, సెక్షన్ స్థాయి అధికారులు చెబుతున్నారు. కనీసం రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుందన్నారు. మొదలైన వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ల గుర్తింపు గృహ, వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ల ప్రత్యేక ఏర్పాటు ప్రత్యేక యాప్లో ఫొటో సహా నమోదు ఈ నెల 25 నాటికి ప్రక్రియ పూర్తి చేసేలా కార్యాచరణ -
రోడ్డు ప్రమాదంలో ఐటీడీఏ అధికారి మృతి
ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏలో స్టాటిస్టికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న మాదాసు సురేష్బాబు (41) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబంతో భద్రాచలంలో నివాసముంటున్న సురేష్ శుక్రవారం బంధువుల ఇంటికి వెళ్తూ భద్రాచలం సమీపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటపాక మండలం నెల్లిపాక వద్ద గేదెలను ఢీకొని మృతి చెందినట్లు సమాచారం. భద్రాచలంలో ఐటీడీఏ ఎస్ఓగా పనిచేస్తూ ఏటూరునాగారం ఐటీడీఏకు గత ఏడాది బదిలీపై వచ్చిన సురేష్.. గిరిజనుల సమస్యపై స్పందిస్తూ వారి మన్ననలను పొందారు. సురేష్బాబుకు భార్య, పిల్లలు ఉన్నారు. ఏటూరునాగారం ఐటీడీఏలో ఎస్ఓగా పనిచేస్తున్న సురేష్బాబు -
చిందులేస్తున్న చిన్నిపాదాలు
హన్మకొండ: వేసవి సెలవుల్లో సెల్ఫోన్లు, టీవీలకు మాత్రమే పరిమితం కాకుండా తమలోని అభిరుచికి పదునుపెడుతూ నృత్యంలో శిక్షణ పొందుతున్నారు. పలువురు విద్యార్థినులు. తమ చిన్ని పాదాలతో చిందులు వేస్తూ నృత్యంలో మెలకులు నేర్చుకుంటున్నారు. హనుమకొండ హౌజింగ్ బోర్డు కాలనీలోని సెయింట్ పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో నృత్య గురువు రుద్రవేణు ఇస్తున్న శిక్షణకు హాజరవుతూ తమలోని టాలెంట్కు పదును పెడుతున్నారు ఈ చిన్నారులు. ప్రతీ రోజు ఉదయం.. భరత నాట్యం, కూచిపూడిలో శిక్షణ పొందుతున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు నృత్య గురువు రుద్రవేణు. నృత్యంలో బాలికల శిక్షణ వేసవి సెలవుల్లో చిన్నారులకు ప్రత్యేక తరగతులు


