breaking news
Mahabubabad
-
చావులోనూ వీడని బంధం..
దుగ్గొండి : 60 ఏళ్ల పాటు కలిసి ఉన్నారు. అన్యోన్య దంపతులుగా జీవనం గడిపారు. పిల్లలందరూ ఎవరికివారు బతుకుతున్నారు. కొంత కాలంగా వృద్ధాప్యంలో ఒకరికి ఒకరు తోడుగా ఉన్నారు. ఈ క్రమంలో పది రోజుల క్రితం భార్య అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి భర్త మనోవేదనకు గురవుతూ గురువారం కన్నుమూశాడు. ఈ ఘటన మండలంలోని తిమ్మంపేటలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పోశాల యాకయ్య, సారమ్మ (75) దంపతులు. సారమ్మ పది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి యాకయ్య (80) మనస్తాపానికి గురవుతున్నాడు. ఈ క్రమంలో సారమ్మ దశదిన కర్మ అనంతరం మరుసటి రోజు యాకయ్య తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. దీంతో పది రోజుల వ్యవధిలో తల్లిదండ్రులు ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మరణంలోనూ యాకయ్య, సారమ్మ దంపతుల బంధం వీడలేదని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. కాగా, ఈ దంపతులకు ఇద్దరు కుమారులు రాజేందర్, కృష్ణమూర్తి ఉన్నారు. పది రోజుల వ్యవధిలో దంపతులు మృతి కన్నీరుమున్నీరవుతున్న కుటుంబీకులు -
ఆడిందే ఆట!
పూర్తిస్థాయి అధికారులతోనే.. ఉమ్మడి జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు 162 చిట్ఫండ్ల పర్యవేక్షణకు పూర్తిస్థాయి అధికారులను నియమిస్తే తప్ప పాలన గాడిలో పడేలా లేదు. ప్రజలకు బాధలు తీరేలా లేవు. పదోన్నతుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్లకు పదోన్నతులు కల్పిస్తే పూర్తిస్థాయిలో అధికారులను నియమించే అవకాశం ఉంటుంది.కాజీపేట అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో రిజిస్ట్రేషన్ అండ్ చిట్స్ శాఖలోని ఉన్నతాధికారుల పాలన ఇన్చార్జ్ల చేతుల్లో కొనసాగుతోంది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా నిలిచే శాఖలో ఇన్చార్జ్ పాలనతో నిర్వహణ గాడి తప్పుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 13 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు 162 బ్రాంచ్లతో కూడిన చిట్ఫండ్ కార్యాలయాలపై పూర్తిస్థాయిలో పర్యవేక్షణ లేక కింది స్థాయి అధికారుల విధుల్లో అలసత్వం వహిస్తున్నారు. అడిగేవారు ఎవరూ లేకపోవడంతో ఆడిందే ఆటగా కొలువులు సాగిస్తున్నారు. ప్రజల బారులు.. ఉమ్మడి జిల్లాలోని 13 సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలతో పాటు చిట్స్, ఆడిటింగ్, కోర్టు కేసులు, ప్రొహిబిటెడ్, ల్యాండ్ కేసులు, డాక్యుమెంట్లలో తలెత్తిన సమస్యల పరిష్కారానికి నిత్యం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి ప్రజలు బారులు దీరుతుంటారు. ఇక్కడ పని చేస్తున్న జిల్లా రిజిస్ట్రార్ ఫణీందర్ను జూలైలో హైదరాబాద్తో పాటు మహబూబ్నగర్ ఇన్చార్జ్ రిజిస్ట్రార్గా బదిలీ చేశారు. దీంతో కరీంనగర్ జిల్లా రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్కుమార్ను ఉమ్మడి వరంగల్ ఇన్చార్జ్ నియమించారు. ఏడాది క్రితం ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్గా బదిలీపై వచ్చిన యామిని రెండు నెలల కాలవ్యవధిలో విధులు చేపట్టి నాటినుంచి నేటి వరకు లాంగ్ లీవ్లో వెళ్లిపోవడంతో ఇన్చార్జ్ చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పాలనే కొనసాగుతోంది. దీంతో చిట్స్లో పేరుకుపోయిన చిట్ఫండ్స్ లావాదేవీలతో పాటు ఫిక్స్డ్ డిపాజిట్ల విడుదల సైతం ప్రశ్నార్థకంగా మారింది. ఇన్చార్జ్ల చేతుల్లో రిజిస్ట్రేషన్ శాఖ ఉమ్మడి జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గాడి తప్పిన పాలన కిందిస్థాయి అధికారుల ఇష్టారాజ్యం పూర్తి స్థాయిలో అధికారులను నియమిస్తే సమస్యలు పరిష్కారం -
క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో గురువారం అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణగౌడ్ అధ్యక్షతన జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ (జావెలిన్, కిడ్స్) పోటీలకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. టోక్యో ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా జావెలిన్త్రోలో బంగారు పథకం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏటా ఆగస్టు 7వ తేదీన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జనగామలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. క్రీడలతో శారీరక ఆరోగ్యం, మానసికోల్లాసం కలుగుతుందన్నారు. అనంతరం అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెద్ది వెంకటనారాయణ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణకు జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందించిందన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి బైరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ నిర్వహణ కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్రెడ్డి, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి మనోజ్ కుమార్, కోశాధికారి ఆవుల అశోక్, నిర్వహణ కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, కిరణ్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు సుగుణాకర్, హనుమంతరావు, గజ్జెల్లి రాజు, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. 33 జిల్లాలు.. 6వందల మంది క్రీడాకారులు జనగామ జిల్లా కేంద్రం ధర్మకంచ మినీ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లె టిక్స్ పోటీలకు 33 జిల్లాల నుంచి 6 వందల మంది క్రీడాకారులు హాజరయ్యా రు. జావెలిన్ క్రీడతోపాట అండర్–8,10,12 విభాగాల్లో బాల, బాలికలకు పరుగు పందెం, అప్రోచ్ లాంగ్ జంప్ క్రీడలు నిర్వహించారు. అండర్–8 విభాగంలో బాల, బాలికలకు 1.60 మీటర్ల పరుగు పందెం, ఐదు మీటర్ల అప్రోచ్ లాంగ్ జంప్, అండర్–10 విభాగంలో బాల, బాలికలకు 2.60 మీటర్ల పరుగు పందెం, ఐదు మీటర్ల అప్రోచ్ లాంగ్ జంప్, అండర్–12 విభాగంలో బాల, బాలికలకు 3.60 మీటర్లు ఫైవ్ మీటర్స్ అప్రోచ్డ్ లాంగ్ జంప్, కిడ్స్ జావెలిన్ త్రో, అండర్–14 విభాగంలో బాల, బాలికలకు కిడ్స్ జావెలిన్త్రో, అండర్–16,18, 20 విభాగాల్లో యువతీ, యువకులకు జావెలిన్ త్రో పోటీలు నిర్వహించారు. చదువుతోపాటు ఆటల్లో రాణించాలి జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అట్టహాసంగా రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం 33 జిల్లాల నుంచి హాజరైన క్రీడాకారులు -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మామునూరు: వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట గ్రామానికి చెందిన గుండల కృష్ణ(45) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో పనికి వెళ్లి తిరిగి రాత్రి బైక్పై ఇంటికి బయలుదేరాడు. ముస్కులపల్లి బొడ్రాయి సమీపంలో వరంగల్ –ఖమ్మం జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీ సడెన్ బ్రేక్ వేయగా.. వెనుక ఉన్న బైక్.. లారీని ఢీకొంది. దీంతో బైక్పై నుంచి రోడ్డు మీద పడిన కృష్ణకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని హుటాహుటిన 108లో ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి తల్లి గుండల అమృతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మామునూరు ఇన్స్పెక్టర్ రమేశ్ తెలిపారు. కాగా, ఘటనా స్థలిని వరంగల్ ఈస్ట్ జోన్డీసీపీ అంకిత్ కుమార్ పరిశీలించారు. ప్రమాద స్థలాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. మామునూరు ఏసీపీ వెంకటేశ్, ఇన్స్పెక్టర్ రమేశ్, ఎస్సైలు కృష్ణవేణి, శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. జ్వరంతో మహిళ మృతి వెంకటాపురం(కె): జ్వరంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని కమ్మరిగూడెంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పర్శిక అరుణ(31) జ్వరంతో బాధపడుతూ మూడురోజుల క్రితం వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందింది. అయినా తగ్గకపోవడంతో ఏటూరునాగారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు పరీక్షలు నిర్వహించి డెంగీ జ్వరంగా నిర్ధారించి చికిత్స చేశారు. ఈ క్రమంలో గురువారం ఉదయం జ్వరం ఎక్కువ కావడంతో వెంకటాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. -
అదనపు కట్నం వేధింపులు..
● భర్తకు ఏడాది జైలు వరంగల్ లీగల్ : అదనపు కట్నం కోసం భార్యను వేధింపులకు గురిచేసిన ఘటనలో నేరం రుజువుకావడంతో భర్తకు ఏడాది జైలు శిక్ష, రూ.18 వేలు జరిమానా విధిస్తూ హనుమకొండ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శాంతిసోని గురువారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన దొనికల అనూషకు భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామానికి చెందిన గుడ్డేటి దిలీప్కుమార్తో 2020, నవంబర్ 11న వివాహం జరిగింది. వివాహ సమయంలో రూ.40 లక్షలు, 30 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. వివాహ అనంతరం కొద్ది రోజులు బాగానే చూసుకున్న దిలీప్కుమార్ కుటుంబీకులు తక్కువ కట్నం తెచ్చావంటూ అనూషను వేధించసాగారు. ఈ క్రమంలో ఉద్యోగ రీత్యా దిలీప్కుమార్.. భార్య అనుషాతో కలిసి 2021, జూలై 27న అమెరికా వెళ్లాడు. అక్కడ కూడా రూ. కోటి అదనపు కట్నం తీసుకురావాలని, లేనిపక్షంలో విడాకులు ఇస్తానని బెదించాడు. దీంతో అనూష.. దిలీప్కుమార్పై అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు మందలించి వదిలేశారు. అనంతరం 2022, జూలై 30న అనూష, దిలీప్కుమార్ ఇండియాకు తిరిగొచ్చారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లిన దిలీప్కుమార్ తల్లిదండ్రులు అనూషను తీసుకుని బయలుదేరారు. మార్గమధ్యలో అనూష తల్లిదండ్రులు తాత్కాలికంగా ఉంటున్న ఘట్కేసర్ వద్ద ఆమెను వదిలి వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో అనూష ప్రశ్నించడంతో ఆమె తల్లిదండ్రుల ఎదుటే ‘నీకు విడాకులు ఇస్తా’ అని చెప్పి దిలీప్కుమార్తోపాటు కుటుంబీకులు స్వగ్రామం వచ్చారు. ఈ విషయంపై అనూష తల్లిదండ్రులు పంచాయితీ నిర్వహించగా విడాకులు తీసుకుంటానని దిలీప్కుమార్ పెద్దల సమక్షంలో చెప్పాడు. దీంతో చేసిదేమీ లేక అనూష మహిళా పీఎస్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువుకావడంతో జడ్జి శాంతిసోని.. నేరస్తుడు దిలీప్కుమార్కు ఏడాది జైలు శిక్ష, రూ.18 వేల విధిస్తూ తీర్పు వెలువరించారు. -
బీసీలను మోసం చేస్తున్న ప్రభుత్వం
● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు జనగామ రూరల్: బీసీ బిడ్డలను కాంగ్రెస్ ప్రభుత్వం మో సం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అ ధ్యక్షుడు రామచందర్రావు విమర్శించారు. గురువారం జనగామలో నిర్వహించిన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం కాదని, మతపరమైన రిజర్వేషన్లకు మాత్రమే వ్యతిరేకమని స్ప ష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారా లేదా అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డి మాండ్ చేశారు. కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ నాటకాలు ఆడుతోందని, అక్రమాలపై విచారణను సీబీఐకి ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించారు. దీని వెనుక ఎవరికి ప్రయోజనం చేకూరుతుందో అర్థం అవుతోందన్నారు. బీఆర్ఎస్ను కాపాడేందుకే కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి బీజేపీని ఆదరించాలని కోరారు. ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రంలో అనేక పథకాలు అమలవుతున్నాయన్నారు. రాష్ట్ర నాయకులు మూర్తినేని ధర్మారావు, బూర నర్సయ్య గౌడ్, గుండె విజయరామారావు, ఉపాధ్యక్షుడు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, లేగ రామ్మోహన్రెడ్డి , ఉడుగుల రమేశ్, కేవీఎల్ఎన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్, మాజీ అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రీజన్స్ లేకుండా రిజెక్టు చేయొద్దు..
జనగామ: ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరమైన సమాచారం కోసం దరఖాస్తు చేసుకుంటే కారణం లేకుండా రిజెక్ట్ చేయొద్దని.. ఒక వేళ చేసినా కారణం చెప్పాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి.చంద్రశేఖర్రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి, కమిషనర్లు పీవీ శ్రీనివాసరావు, మొహిసినపర్వీన్, బోరెడ్డి అయోధ్యరెడ్డి, వైష్ణవి జనగామలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా.. డీసీపీ రాజమహేంద్రనాయక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్తో కలిసి రాష్ట్ర సమాచార కమిషన్కు ఘనస్వాగతం పలికింది. అనంతరం కలెక్టరేట్లో సమాచార హక్కు చట్టంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో చంద్రశేఖర్రెడ్డి మాట్లాడారు. ప్రజల కోరిన మేరకు చట్టం ద్వారా సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందన్నారు. అధికారులు, సిబ్బంది ఆర్టీఐకి ఎప్పుడూ భయపడొద్దన్నారు. ఈ చట్టం ద్వారా సమాచారం కోరిన 30 రోజుల వరకు సమయం ఉంటుందని, కారణం చూపకుండా గడువు దాటితే సంబంధిత అధికారి నుంచి పరిహారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రజలకు జవాబుదారి, పారదర్శకంగా ఉండాలన్నారు. దరఖాస్తుదారుడు సంతృప్తి చెందకపోతే అప్పీల్కు వెళ్లొచ్చన్నారు. గడువు లోగా సమాచారం ఇవ్వకపోతే స్టేట్ కమిషన్కు ఫిర్యాదు వెళ్తుందని, మొదటి అప్పీల్ జిల్లా అప్పీలేట్, రెండో అప్పీల్ స్టేట్ కమిషన్ వద్దకు వస్తుందన్నారు. సమాచారం ఇవ్వకపోవడంతో దరఖాస్తుదారుడు నష్టపోతే ఆ పరిహారాన్ని పీఐఓలు భరించాల్సి ఉంటుందన్నారు. జనగామ జిల్లాలో సహచట్టం ఫిర్యాదులు తక్కువగా వచ్చాయని ఆయన పేర్కొన్నారు. అయోధ్యరెడ్డి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ఏ లక్ష్యంతో తీసుకొచ్చారో, దానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం పని చేయాలని చెప్పారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా మాట్లాడుతూ జిల్లాలోని ప్రతీ కార్యాలయంలో సమాచార హక్కుచట్టం రిజిస్టర్లను నిర్వహించాలన్నారు. మూడు, ఆరు నెలలకు ఇచ్చే నివేదికలను నిర్ణీత సమయానికి అందజేయాలన్నారు. అంతకు ముందు ఆయా శాఖల అధికారుల అభిప్రాయాలను తెలుసుకుని వాటికి సలహాలు, సూచనలు అందించారు. అధికారులు ఆర్టీఐకి భయపడొద్దు రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి -
వైద్యం వికటించి మూడేళ్ల చిన్నారి మృతి
మరిపెడ రూరల్: ప్రథమ చికి త్స కేంద్రంలో వైద్యం వికటించి మూడేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉల్లెపల్లి గ్రామంలో గురువారం జ రిగింది. గ్రామస్తులు, బంధువుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొలిచెల్మ మల్సూర్, మహేశ్వరి దంపతులకు కూతురు మణిదీప (3)ఉంది. చిన్నారికి వరుసకు సోదరుడైన వ్యక్తికి గాయమైతే ఇటీవల మందులు తెచ్చి ఇంట్లో ఉంచారు. కాగా, బుధవారం సాయంత్రం మనిదీప ఇంట్లో ఆడుకుంటూ మందులు, ఆయింట్మెంట్ మిగింది. దీంతో బాలికకు వాంతులు అయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు మరిపెడలోని రవి క్లీనిక్ ప్రథమ చికిత్స కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ ఆర్ఎంపీ రవిబాబు పాపను పరీక్షించి చికిత్స అందించాడు. బాగానే ఉందని రాత్రి 8 గంటలకు ఇంటికి పంపించాడు. మళ్లీ రాత్రి 10 గంటల సమయంలో చిన్నారికి వాంతులు ఎక్కువ కావడంతో సదరు ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. ఇంజక్షన్ వేసి అర్ధరాత్రి ఇంటికి పంపాడు, అయితే తెల్లవారుజామున చిన్నారి ఉలుకుపలుకు లేకపోవడంతో తల్లిదండ్రులు మళ్లీ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా.. పాప ఆరోగ్య పరిస్థితి విషమించిందని, ఖమ్మం తీసుకెళ్లాలని సూచించారు. దీంతో వారు చిన్నారిని తీసుకొని ఖమ్మం వెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్ఎంపీ రవిబాబు నిర్లక్ష్య వైద్యం వల్లే పాప మృతి చెందిందని ఆగ్రహంతో ఉల్లెపల్లి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, బంధువులు అధిక సంఖ్యలో తరలివచ్చి రవి క్లీనిక్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆర్ఎంపీపై దాడికి యత్నించారు. దీంతో గంటపాటు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈక్రమంలో పోలీసులు ఆర్ఎంపీని పోలీస్ స్టేషన్కు తరలించారు. అయినప్పటికీ ఖమ్మం–వరంగల్ హైవేపై బైఠాయించి ధర్నా చేశారు. న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు. ఇదిలా ఉండగా తమకు బాబు పుట్టిన 18 ఏళ్ల తర్వాత మణిదీప పుట్టిందని తల్లి దండ్రులు బోరున విలపించారు. మహిళా ఉద్యోగులకు ఒక పూట సెలవుకేయూ క్యాంపస్: వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకొని కేయూ బోధన, బోధనేతర మహిళా ఉద్యోగులకు శుక్రవారం ఉదయం ఒక పూట సెలవు ప్రకటిస్తూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం సర్క్యులర్ జారీచేశారు. మహిళా ఉద్యోగుల అభ్యర్థన మేరకు సెలవు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. మరో పూట మధ్యాహ్నం యథావిధి గా విధులకు హాజ రుకావాలన్నారు. ● తెలిసీతెలియని వైద్యం చేసి పాపప్రాణం బలిగొన్న ఆర్ఎంపీ ● మరిపెడలోని రవి క్లీనిక్ ఎదుట బంధువుల నిరసన, ఉద్రిక్తత -
చేతిలోనే సమస్త సమాచారం..
ఖిలా వరంగల్: భారతీయ రైల్వే ప్రయాణికులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలు అందిస్తుంది. ఇందులో భాగంగా ట్రైన్లో ప్రయాణించాల్సిన వ్యక్తి ఇక నుంచి రైల్వే సేవలకు అటు ఇటు వెళ్లాల్సిన పనిలేదు. కావాల్సిన సమాచారమంతా కూర్చున్న చోటు నుంచే తెలుసుకునేలా అనేక యాప్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో యూటీఎస్, రైల్ వన్ యాప్ల ద్వారా ప్రయాణికులకు క్షణాల్లో మెరుగైన సేవలు అందుతాయి. దీనికి కావాల్సింది చేతితో స్మోర్ట్ ఫోన్ మాత్రమే. ఈ క్రమంలో ఈ రైలు యాప్లు ఎలాంటి సేవలు అందిస్తాయి.. ఎలా పొందాలనే అంశాలపై‘సాక్షి’ప్రత్యేక కథనం టికెట్కు ఇబ్బంది లేదు.. యూటీఎస్, రైల్ వన్ యాప్ల నుంచి టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు.అంతేకాదు అత్యవసరంగా అన్ రిజర్వుడ్ టికెట్ కూడా వెంటనే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ప్లాట్ ఫామ్ టికెట్ సైతం పొందొచ్చు. అలాగే, యాప్ల ద్వారా సాధారణ టికెట్ బుకింగ్, ప్లాట్ ఫామ్ టికెట్, నెలవారీ టికెట్, క్యాన్సలేషన్, టికెట్ హిస్టరీ, బుకింగ్ టికెట్ సమాచారం, ఆర్.వాలెట్, టికెట్ ప్రొఫైల్, టికెట్ ట్రాన్జాక్షన్, రైల్ లైవ్ లోకేషన్ మొత్తం యాప్ల ద్వారా సులభంగా తెలుసుకునేలా అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. రైళ్ల కోసం.. ఈ యాప్ల సేవలు అనేకం ఉన్నాయి. రైలు ప్రయాణం చేయాలనుకునే వారు రైల్ వన్, యూటీఎస్ యాప్ల ద్వారా వెళ్లాల్సిన ప్రాంతం, ఏ రైళ్లు అందుబాటులో ఉన్నాయని వెతికేందుకు సెర్చ్ ట్రైన్స్ బటన్ ఉంటుంది. ఏ ప్లాట్ ఫామ్పైకి రైలు వస్తుంది, కోచ్ పొజిషన్ ఎక్కడ ఉందో కూడా తెలుసుకోవచ్చు. రైలు ఎక్కడ ఉంది.. ఎప్పుడు వస్తుందని ట్రాక్ యువర్ ట్రైన్ ద్వారా తెలుసుకోవచ్చు. రిజర్వేషన్ స్థితి.. ఈయాప్ల్లో టికెట్ రిజర్వేషన్ స్థితిని తెలుసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. ముందస్తు రిజర్వేషన్ టికెట్ స్థితి, సీటు కన్ఫర్మేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. రైలు, రిజర్వేషన్ రద్దు, తదితర అంశాలనూ తెలుసుకోవచ్చు. సీటు వద్దకే ఆహారం.. రైలు ఎక్కగానే ప్రయాణికులకు ఆహారం ఆర్డర్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం ద్వారా వివిధ రైల్వే స్టేషన్లకు చేరుకునేందుకు ముందే నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకుంటే రైలులో సీటు వద్దకే తీసుకొచ్చి ఇస్తారు. సూచనలు, ఫిర్యాదులు.. ఏమైనా సూచనలు ఇవ్వాలనుకున్నా.. రైళ్లలో సమస్యలు తలెత్తినా ఫిర్యాదులు చేయడానికి రైల్ మదత్ విభాగం అందుబాటులో ఉంది. ఇందులో ఫిర్యాదు చేస్తే సమస్యలు పరిష్కారమవుతాయి. కాగా, వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి నిత్యం 80 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. నిత్యం సుమారు 8వేలకు పైగా మంది ప్రయాణిస్తుంటారు. ఫలితంగా ప్రతీ రోజు రైల్వేశాఖకు రూ.6లక్షలకు పైగా ఆదాయం సమకూరుతోంది. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. కూర్చున్న చోటే క్షణాల్లో వివరాలు అందుబాటులో రైల్వన్, యూటీఎస్ యాప్లు రైల్వే సమాచారం కోసం ఇక నుంచి ఎటు వెళ్లాల్సిన అవసరం లేదుడౌన్ లోడ్ ఇలా చేసుకోవాలి.. ఈ యాప్లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయాలి. తర్వాత మొబైల్ నంబర్ లేదా మెయిల్ ఐడీ ద్వారా రిజస్ట్రేషన్ చేసుకుని పాస్వర్డ్ పెట్టుకోవడం ద్వారా ఉపయోగంలోకి వస్తుంది. -
విపత్తులపై అప్రమత్తంగా ఉండాలి
నెల్లికుదురు: నిత్యం పరిసరాలను గమనిస్తూ ఒక్కసారిగా వచ్చే మెరుపు వరదలు, భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, అగ్నిప్రమాదం లాంటి విపత్తులపై అప్రమత్తంగా ఉండాలని జాతీయ విపత్తు ప్రతి స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) కమాండర్ భూపేంద్ర కుమార్ సూచించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వావిలాల, ఆలేరు, మదనతుర్తి, మునిగలవీడు, రావిరాల, రాజులకొత్తపల్లి తదితర ప్రాంతాల్లో సంబంధిత అధికారులతో కలిసి గురువారం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం పర్యటించింది. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి విపత్తులపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బృందం వివరించింది. కాగా, గత సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలకు రావిరాలలో కొట్టుకుపోయిన రోడ్డును విపత్తు బృందం, అధికారులు పరిశీలించారు. కార్యక్రమంలో విపత్తు బృంద సభ్యులు మురళీరాథోడ్, మోహన్రావు, మండల ప్రత్యేకాధికారి జినుగు మరియన్న, తహసీల్దార్ చందానరేశ్, ఎంపీఓ పద్మ, తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ భూపేంద్ర కుమార్ -
రికవరీ చేయట్లే!
ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగినట్లు సోషల్ ఆడిట్ ద్వారా నిర్ధారణ సాక్షి, మహబూబాబాద్: గ్రామీణ ప్రాంత పేదలకు పని కల్పించడమే ధ్యేయంగా కేంద్రం ప్రభుత్వం మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం అమలు చేస్తోంది. అయితే పనుల్లో జరిగిన అవకతవలపై సోషల్ ఆడిట్ నిర్వహించిన అధికారులు దుర్వినియోగమైన నిధుల రికవరీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నానరు. కాగా అక్రమార్కులకు పలువురు అధికారుల అండదండలు ఉన్నాయని, అందుకే రికవరీ చేయడం లేదనే విమర్శలు వస్తున్నారు. ఏడాదిలో రూ.65లక్షల అవకతవకలు గడిచిన ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో చేపట్టిన పనుల్లో రూ. 65లక్షల అవకతవకలు జరిగినట్లు తేలింది. జిల్లా వ్యాప్తంగా 1,41,774 కుటుంబాలు జాబ్కార్డు ద్వారా 2,51,040 మంది కూలీలు పనులు చేస్తున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 60శాతం కూలీలు, 40శాతం మెటీరియల్ నిష్పత్తిన రూ. 88.14కోట్ల విలువచేసే కూలీ పనులు, రూ. 39.82కోట్లు విలువచేసే మెటీరియల్ పనులు చేశారు. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ప్రతీ మండలంలోని ఎంపిక చేసిన గ్రామాల్లో పనుల తీరు, నిధుల వినియోగంపై సోషల్ ఆడిట్ టీమ్ పర్యటించింది. గ్రామ సభలు పెట్టి నివేదికను చదివారు. అయితే ఇందులో ఫీల్ట్ అసిస్టెంట్ స్థాయి నుంచి ఏపీఓ, ఎంపీడీఓ వరకు అక్రమాలకు సోషల్ ఆడిట్లో తేలింది. అక్రమార్కులకు అండగా.. ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకలపై నిజానిజాలు తేల్చాల్సిన కొందరు అధికారులు సదరు ఉద్యోగులు ఎలాంటి తప్పులు చేయలేదని నిర్ధారించారు. ఇందుకోసం అక్రమాలకు పాల్పడిన ఉద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకున్న విషయంపై జిల్లాలో చర్చగా మారింది. ఈ విషయంపై ఓ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు సదరు అధికారిపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం. అదే విధంగా మరికొన్న గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు చట్టసభలకు ఎన్నికై న నాయకుల ద్వారా ఒత్తిడి తెచ్చినట్లు విమర్శలు ఉన్నాయి. వెనకడుగు.. సోషల్ ఆడిట్ టీమ్ ఇచ్చిన నివేదిక ప్రకారం అవకతవకలకు పాల్పడిన బాధ్యుల నుంచి డబ్బులు రికవరీ చేయించాలి. కానీ జిల్లా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన సోషల్ అడిట్ ద్వారా రూ. 65,63,732 రికవరీకి రాశారు. ఇందులో ఇప్పటి వరకు రూ.3,98,959 మాత్రమే రికవరీ చేయగా.. రూ.61,55,773 రికవరీ చేయించాల్సి ఉంది. ఇందులో అత్యధికంగా కొత్తగూడ మండలంలో రూ.6,32,000 ఉండగా.. రూ.65,200 మాత్రమే రికవరీ చేశారు. అదే విధంగా నర్సింహులపేట మండలంలో రూ.6,15,378కి గాను రూ.15,100, మహబూబాబాద్ మండలంలో రూ. 6,10,542గానూ రూ.11,666 మాత్రమే రికవరీ చేశారు. రికవరీ వేగవంతం చేస్తాం ఉపాధి హమీ పథకంలో పనుల నిర్వహణ, నిధుల వినియోగంపై ఎప్పటికప్పుడు సోషల్ ఆడిట్ చేసేందుకు ప్రత్యేక టీమ్ ఉంటుంది. వారు నిర్ధారించిన అవకతవకల డబ్బుల రికవరీలో పలు కారణాలతో జాప్యం జరిగింది. తిరిగి వేగం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. –మధుసూదన్ రాజు, డీఆర్డీఓఉద్యోగుల వారీగా చేయాల్సిన రికవరీ హోదా పెండింగ్ రికవరీ ఫీల్డ్ అసిస్టెంట్ రూ. 10,79,245 పంచాయతీ సెక్రటరీ రూ. 11,19,245 టెక్నికల్ అసిస్టెంట్ రూ. 11,24,245 ఇంజనీరింగ్ విభాగం రూ. 10,74,245 కంప్యూటర్ ఆపరేటర్ రూ. 8,79,396 ఏపీఓ రూ. 4,39,698 ఎంపీఓ రూ. 4,39,698 మొత్తం రూ.61,55,772 అక్రమార్కులకు అండగా పలువురు అధికారుల చర్యలు తీసుకోకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యం -
మునిగలవీడులో కేంద్ర బృందం పర్యటన
నెల్లికుదురు: మండలంలోని మునిగలవీడు గ్రామ పంచాయతీ పరిధిలో గురువారం జాతీయ స్థాయి మానిటరింగ్ బృందం పర్యటించి, ఈజీఎస్ ద్వారా చేపట్టిన పనులను పరిశీలించింది. ఐకేపీ, ఐసీడీఎస్, వైద్య సేవలను బృందం సీనియర్ పరిశీలన అధికారి దామోదర్, పరిశీలన అధికారి అశ్విన్ గోపాల్ స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు, ఈజీఎస్ జాబ్ కార్డులు, మరుగుదొడ్ల నిర్మాణం తదితర అంశాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సింగారపు కుమార్, ఎంపీఓ పద్మ, మాజీ సర్పంచ్ నల్లాని నవీన్రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఎప్పుడు ఫోన్ వచ్చినా..
క్షతగాత్రులు, ఇతర వైద్య సహాయం అవసరమున్న వారు ఎప్పుడు ఫోన్ చేసిన అందుబాటులోనే ఉంటున్నాం. వెంటనే స్పందించి ఆస్పత్రులకు తరలించి సకాలంలో వైద్య సేవలు అందించేలా కృషి చేస్తున్నాం. అంబులెన్స్ ద్వారా ప్రజలకు అత్యవసర సమయాల్లో వైద్య సేవలు అందిస్తున్నాం. – జక్కుల వీరన్న, పైలెట్ ప్రాథమిక వైద్య సేవలు అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్స్కు సమాచారం రాగానే స్పందిస్తున్నాం. అంబులెన్స్లో ప్రాథమిక చికిత్స అందిస్తూ సైలెన్ బాటిల్ పెట్టడం, ఆక్సిజన్ వంటి సౌకర్యాలు అందజేస్తూ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నాం. సకాలంలో వైద్యం అందడంతో ప్రాణాలను కాపాడినట్లు అవుతుంది. – బంగారి, టెక్నీషియన్ అత్యవసర సమయాల్లో... ప్రభుత్వం, వైద్య అధికారులు సూచన మేరకు అంబులెన్స్ సేవలను విస్తృతంగా అందజేస్తున్నాం. అత్యవసర సమయాల్లో ప్రజలు అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. వైద్య సేవల కోసం సమాచారం ఇస్తే వెంటనే అంబులెన్స్ సంఘటన స్థలికి చేరుకుంటుంది. – బత్తిని మహేష్, 108 జిల్లా మేనేజర్ -
గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాలు
మహబూబాబాద్ అర్బన్: గ్రంథాలయాలు ఎందరినో ఉన్నతులుగా తీర్చిదిద్దే విజ్ఞాన కేంద్రాలు అని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్ నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం గ్రంథాలయ రీడింగ్ గదిని ప్రిన్సి పాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీరోజు విద్యార్థులు న్యూస్ పేపర్స్ చదవడం ద్వారా ప్రపచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు. పుస్తకాలు చదివి విజ్ఞానం పెంపొందించుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పేర్కొన్నారు. గ్రంథాలయ అధ్యాపకుడు రాజశేఖర్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, అధ్యాపకులు అనిల్ కుమార్, మసూద్ అహ్మ ద్, సాంబశివరావు, శ్రీనివాస్, హతీరాం ఉన్నారు. -
న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
మహబూబాబాద్ రూరల్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అందిస్తున్న లోక్ అదాలత్, ఉచిత న్యాయ సేవలను కక్షిదారులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎస్.శాలిని అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో కక్షిదారులు, న్యాయవాదులతో న్యాయ చైతన్య సదస్సు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోక్ అదాలత్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ఖర్చులేని సులభమైన పరిష్కార ప్రక్రియ లోక్ అదాలత్ అన్నారు. అదేవిధంగా ఇంతకుముందు కోర్టు వరకు రాని వివాదాలను న్యాయ సేవాధికార సంస్థ ప్రీ లిటిగేషన్ విధానంలో పరిష్కరిస్తుందని తెలిపారు. సుప్రీంకోర్టు, హైకోర్టులు ఆంగ్ల భాషలో వెలువరించిన తీర్పులను కృత్రిమ మేధ పద్ధతి ద్వారా ప్రాంతీయ భాషలోనికి అనువదించుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ఉన్నత న్యాయస్థానాల తీర్పులు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఈ అవకాశాన్ని న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ డి.నాగేశ్వరరావు, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ టి.సునీత తదితరులు పాల్గొన్నారు. -
తీజ్ను రాష్ట్ర పండుగగా గుర్తించాలి
హన్మకొండ: తీజ్ను రాష్ట్ర పండుగగా గుర్తించాలని మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. హనుమకొండ అశోక కాలనీలోని గిరిజన భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బంజారాలు జరుపుకునే పండుగల్లో అతి ముఖ్యమైనది తీజ్ అని అన్నారు. 9 రోజులపాటు ఆటపాటలతో అలసట నుంచి విముక్తి కావాలని, అందరూ బాగుండాలని జరుపుకుంటారన్నారు. పెళ్లికాని యువతలు ఎంతో భక్తితో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. బంజారాల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు గోర్ బంజార తీజ్ ఉత్సవ కమిటీ కృషి చేస్తోందని తెలిపారు. ఈ క్రమంలో హనుమకొండ అశోక కాలనీలోని గిరిజన భవన్లో ఈ నెల 12 నుంచి 21వ తేదీ వరకు గోర్ బంజార తీజ్ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని బంజారాలు అందరు ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం తీజ్ ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరించారు. సమావేశంలో గోర్ బంజార తీజ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు వినోద్ లోక్నాయక్, బాదావత్ బాలాజీనాయక్, ధరావత్ కిషన్ నాయక్, భూక్యా రాజునాయక్, డాక్టర్ చందునాయక్, మాలోత్ రమేశ్, భిక్షపతినాయక్, కిశోర్ నాయక్, నర్సింహానాయక్ పాల్గొన్నారు. మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ -
ఆకస్మిక తనిఖీ
గంగారం: మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం అదనపు కలెక్టర్ అనిల్కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. భూభారతి సమస్యలపై ఆరా తీశారు. సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. తల్లిపాలు బిడ్డకు శ్రేష్టం డీడబ్ల్యూఓ శిరీష కురవి: తల్లిపాలు బిడ్డకు శ్రేష్టమని డీడబ్ల్యూఓ శిరీష అన్నారు. మండలంలోని గుండ్రాతిమడుగు(విలేజి) గ్రామంలోని రైతు వేదికలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో గురువారం అన్నప్రాసన, సీమంతాలు, అక్షరభ్యాసం, వివిధ రకాల ఆహారపదార్థాల ఎగ్జిబిషన్ జరిగింది. ఈ సందర్భంగా డీడబ్ల్యూఓ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం చిన్నారులకు పౌష్టికాహా రం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ లక్ష్మి, సూపర్వైజర్ సుగుణ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. రాకపోకలకు అంతరాయం డోర్నకల్: బుగ్గవాగు పొంగడంతో గురువారం డోర్నకల్–లింగాల మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో కామెపల్లి మండల పరిధి లోని బుగ్గవాగు పొంగి రోడ్డుపై వరదనీరు ప్రవహించడంతో డోర్నకల్–కొత్తలింగాల మార్గంలో రాకపోకలు నిలిచాయి. వైద్యులు అందుబాటులో ఉండాలి గూడూరు: సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న దృష్ట్యా వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి సేవలందించాలని డీసీహెచ్ఎస్ చింత రమేశ్ అన్నారు. మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)ను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి పరిసరాలు, ఓపీ, ఇన్ పేషెంట్ వార్డులను పరిశీలించారు. సిబ్బంది సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ వీరన్ననాయక్ వైద్యులు, నర్సు, స్టాఫ్ నర్సుల కొరతపై వివరించారు. ముఖ్యంగా స్టాఫ్ నర్సు, నర్సులు అవసరమని, తొందరగా కేటాయించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. ఆయిల్ పామ్ సాగుతో ఆదాయం మహబూబాబాద్ రూరల్: ఆయిల్ పామ్ సాగుతో రైతులకు మంచి ఆదాయం వస్తుందని ఉద్యాన అధికారి శాంతిప్రియదర్శిని అన్నారు. జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమశాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ గెలల కత్తిరింపుపై మహబూబా బాద్ మండలంలోని కంబాలపల్లి గ్రామంలో గురువారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉద్యాన అధికారి ఆయిల్ పామ్ మొక్కల గెలల కత్తిరింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఈ కార్యక్రమంలో కళ్లెం జనార్దన్ రెడ్డి, కళ్లెం మధుకర్ రెడ్డి, ఏఈఓ రంజిత్, ఈజీ ఫాం టూల్స్ కంపెనీ ప్రతినిధులు రమేశ్, రాజు, తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ అధికారి కరుణాకర్, శ్రీకాంత్, కుమార్ డ్రిప్ కంపెనీ డీసీఓ అశోక్, ఎఫ్సీఓ నవీన్, జైన్ ఇరిగేషన్ కంపెనీ ప్రతినిధి క్రాంతికుమార్, కంబాలపల్లి ఆయిల్ పామ్ రైతులు పాల్గొన్నారు. -
కోటలో విదేశీయుల సందడి
ఖిలా వరంగల్: కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ కోటను గురువారం ఇటలీ దేశస్తులు సందర్శించారు. ఈ సందర్భంగా మధ్య కోటలోని కీర్తితోరణాల నడుమ ఉన్న అద్భుత శిల్ప సంపదతోపాటు ఖుష్మహల్, రాతి, మట్టికోట అందాలు, ఏకశిల గుట్ట, శృంగారపు బావిని తిలకించారు. శిల్పాల ప్రాంగణంలో నాటి శిల్పులు చెక్కిన అద్భుత శిల్ప సంపదను ఆసక్తిగా పరిశీలించారు. క్యూర్ కోడ్ను స్కాన్ చేసి కాకతీయుల చరిత్ర, విశిష్టత తెలుసుకున్నారు. కోట విశిష్టతను పర్యాటశాఖ గైడ్ రవియాదవ్ వారికి వివరించారు. ఆనాటి కట్టడాలు, శిల్ప సంపద అద్భుతంగా ఉందని కొనియాడారు. -
విధుల్లో చిత్తశుద్ధితో పనిచేయాలి
కేసముద్రం: అధికారులు విధుల్లో చిత్తశుద్ధితో పని చేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. గురువారం ఇనుగుర్తి మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాల, ఎస్సీ బాలుర హాస్టల్, పీహెచ్సీ, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీహెచ్సీ పరిధిలోని సబ్సెంటర్ల వారీగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని, అవసరం ఉన్నచోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, మాతా, శిశు మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా భూభారతి, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాల పరిసరాలను పరిశీలించి, మెనూ ప్రకారంగా భోజనం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ బాలుర హాస్టల్లో సౌకర్యాలను పరిశీలించారు. ఇదే హాస్టల్ భవనంలో తాత్కాలికంగా నడుస్తున్న ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ తరంగిణి, ఎంపీడీఓ హరిప్రసాద్, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో -
ఆపన్నహస్తం..
నెహ్రూసెంటర్: రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర సమయాల్లో 108అంబులెన్స్ సేవలు సంజీవనిగా మారుతున్నాయి. ఫోన్ రాగానే అంబులెన్స్ పైలెట్లు, ఈఎంటీలు వెంటనే స్పందించి ఆపదలో ఉన్నవారికి సకాలంలో వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నారు. కాగా, జిల్లాలో 21అంబులెన్స్లు, ఏడు 102 వాహనాలు, ఒక పార్థివ వాహనం, 3 పశుసంచార వాహనాలు, అత్యాధునిక నియోనెటల్ అంబులెన్స్ ప్రజలకు అందుబాటులోకి రాగా.. సేవలు అందుతున్నాయి. కాగా, మండలానికి ఒకటి చొప్పున అంబులెన్స్లు అందుబాటులో ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. గర్భిణులు, బాలింతలకు.. ప్రమాదాలకు గురైన వారితో పాటు అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారికి, గర్భిణులు, బాలింతలకు సైతం వైద్య సేవలు అందించేలా తోడ్పాటునందిస్తున్నారు. జూలై నుంచి ఇప్పటి వరకు సమారు 4వేల మందికి పైగా క్షతగాత్రులు, వైద్య సహాయం అవసరమైనవారు, గర్భిణులు, బాలింతలకు అంబులెన్స్ సేవలు అందించినట్లు అధికారులు తెలిపారు. కాగా, పురిటి నొప్పులతో గర్భిణులు అంబులెన్స్లోనే ప్రసవం జరిగిన సంఘటనలు ఉన్నాయి. సురక్షితంగా.. రోడ్డు ప్రమాదాల బాధితులను అంబులెన్స్లో వెంటనే ఆస్పత్రులకు తరలించడం, గర్భిణులను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లడం, బాలింతలను ఆస్పత్రి నుంచి ఇంటికి సురక్షితంగా తరలిస్తున్నారు. గత ఏడాదిగా 108 అంబులెన్స్ల ద్వారా 17,339మంది, 102 వాహనం ద్వారా 16,704 మందికి సేవలు అందించారు. హలో అంటే.. మేమున్నామంటూ ఆపదలో ఆపన్నహస్తం అందిస్తూ వైద్య సేవలు సకాలంలో అందించడంతో ప్రాణాలు నిలబడేలా చొరవ తీసుకుంటున్నారు. ముఖ్యంగా గోల్డెన్ అవర్ను దృష్టిలో పెట్టుకుని సత్వర చర్యలు చేపడుతున్నారు. రెండు నెలల్లో అంబులెన్స్ల ద్వారా తరలించిన బాధితులు క్షతగాత్రులకు అంబులెన్స్ల సేవలు సకాలంలో ఆస్పత్రికి తరలించి, వైద్య సహాయంనెల క్షతగాత్రులు గర్భిణులు, బాలింతలు మే 1944 1469 జూన్ 2027 2137 -
ఉపాధ్యాయుల పేట
సాక్షి, మహబూబాబాద్: ఆ ఊరు ఉపాధ్యాయులకు కేరాఫ్గా మారింది. ఎన్ని ఎకరాల భూములున్నా.. ఎంత పెద్ద కొలువు వచ్చే అవకాశం ఉన్నా.. ఈ ఊరి యువత మాత్రం బడి పంతులు ఉద్యోగానికే మొగ్గు చూపుతుంది. ఇప్పటి వరకు 200 మందికి పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. అందుకే మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటను ఉపాధ్యాయుల ఊరుగా చెప్పుకుంటారు. గ్రామ సర్పంచ్ చొరవతో.. స్వాతంత్య్రానికి ముందు నుంచే నర్సింహులపేట మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల ఉండేది. అప్పుడు ఉర్దూ మీడియంలో బోధన జరిగేది. ఆ రోజుల్లో ఖాజాం అలీ అనే ఉపాధ్యాయుడు పనిచేసేవారు. ఆ తర్వాత షేక్ హుస్సేన్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చేరారు. స్వాతంత్య్రం వచి్చన తర్వాత ఊరి పాఠశాలలో తెలుగు మీడియం బోధించడం మొదలు పెట్టారు. అయితే స్వాతంత్య్రం వచి్చన తర్వాత రెండో సర్పంచ్గా ఎన్నికైన నాయిని మనోహర్ రెడ్డి.. బడిపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఎస్సెస్సీ తర్వాత హెచ్ఎస్సీ కోర్సును ప్రవేశపెట్టారు.అది చదివిన వారు ఇంటర్ చేయకుండానే ఎస్జీబీటీ శిక్షణకు అర్హులు. అలా ఆ ఊరిలో హెచ్ఎస్సీ చదివిన వారు.. సర్పంచ్ వద్దకు వెళ్లి చెప్పడంతో అప్పుడు సమితి అధ్యక్షులకు ఉత్తరం రాసి పంపితే చాలు మరుసటి రోజు నుంచే ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరే వారు. ఇలా ఒక్కొక్కరుగా సమితిలో ఉద్యోగం చేరడం.. వారి తర్వాత తరం కూడా కాలానుగుణంగా ఉపాధ్యాయ వృత్తినే ఎంచుకొని చదవడం, ఉద్యోగాలు పొందడం పరిపాటిగా మారింది. ఇలా గ్రామంలోని కుటుంబాలకు కుటుంబాలే ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు. గ్రామంలో పుట్టి చదువుకున్నవారే కాకుండా గ్రామం, పరిసర ప్రాంతాల్లో పనిచేసిన ఉపాధ్యాయులు కూడా ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉండటం గమనార్హం. ప్రతీ డీఎస్సీలో ఉద్యోగం.. స్వాతంత్య్రానికి ముందు ఉర్దూ మీడియం, తర్వాత తెలుగు మీడియంలో సమితి పరిధిలో నియామకాల నుంచి ప్రస్తుతం ఉపాధ్యాయ ఉద్యోగం కోసం నిర్వహించే డీఎస్సీ వరకు ప్రతిసారి ఈ గ్రామానికి ఉపాధ్యాయ ఉద్యోగం తప్పకుండా వస్తుందనే నమ్మకం. 2024 డీఎస్సీలో కూడా నర్సింహులపేట గ్రామం నుంచి టీచర్లు, 15 మందికి గురుకుల టీచర్ ఉద్యోగం వచి్చంది. ఇప్పటికీ బీఈడీ, డీఈడీ, పీఈటీ, పండిట్, టైలరింగ్, డ్రాయింగ్, క్రాఫ్ట్ వంటి ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకొని డీఎస్సీ ఎప్పుడు పడుతుందా? అని ఎదురు చూసేవారు 50 మందికి పైగా ఉంటారు.మా కుటుంబం నుంచి పది మంది టీచర్లు.. మాది ఉమ్మడి కుటుంబం. మేం ఐదుగురం అన్నదమ్ములం. ఇందులో నలుగురం, మా బావ, మా పిల్లలు, అల్లుళ్లు మొత్తం పది మందిమి ప్రభుత్వ ఉపాధ్యాయులమే. మా ఇంట్లో ఫంక్షన్లు వస్తే అందరం ఉపాధ్యాయులమే కనిపిస్తాం. ఉపాధ్యాయులుగా పనిచేయడం అదృష్టంగా భావిస్తాం. – కొండ్రెడ్డి మల్లారెడ్డి, నర్సింహులపేటదొరవారి దగ్గరికి పోతే ఉద్యోగమే.. మా రోజుల్లో పంతులు ఉద్యోగం అంటే జీతం తక్కువ. అందుకోసం పెద్దగా పోటీ ఉండేది కాదు. మా ఊరి దొరవారు (సర్పంచ్ మనోహర్ రెడ్డి) ఉపాధ్యాయ ఉద్యోగం చేయాలని ప్రోత్సహించేవారు. చదువుకొని ఆయన దగ్గరికి పోతే పోస్టు పెట్టించే వారు. మా ఇంటి నుంచి ముగ్గురం అన్నదమ్ములం, మా అక్కకొడుకు, వాళ్ల పిల్లలు అందరూ ప్రభుత్వ ఉపాధ్యాయులమే. – దాసరోజు దక్షిణామూర్తి, నర్సింహులపేటటీచర్ ఉద్యోగం చేయాలన్న క్రేజీ మా ఊరిలో ఎంత చదివాం అన్నది ముఖ్యం కాదు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నామా లేదా అన్నదే ముఖ్యం. అందుకోసమే నేను, మా తమ్ముడు, మరదలు, ఇద్దరు కొడుకులు, కోడలు అంతా ప్రభుత్వ ఉపాధ్యాయులమే. ఏ ఉద్యోగం చేసినా లేని తృప్తి ఉపాధ్యాయ వృత్తిలో ఉంది. – గండి మురళీధర్, నర్సింహులపేటపూర్వం నుంచి అదే పద్ధతి గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎక్కువగా ఉంటారు. వారిని చూసినప్పుడల్లా తాము కూడా అదే కావాలని కోరుకుంటూ చదువుతారు. అందుకోసమే ఇంటర్ పూర్తి కాగానే డీఈడీ, డిగ్రీ పూర్తి కాగానే బీఈడీ పూర్తి చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతీ డీఎస్సీలో మా ఊరికి ఉద్యోగం తప్పకుండా వస్తుంది. – జినుకల వెంకట్రాం నర్సయ్య, నర్సింహులపేట -
పట్టువదలని కార్మికులు ..
జనగామ: పట్టు చీర.. మహిళలు అమితంగా ఇష్టపడే వస్త్రం. చూడడానికి హుందాగా, అందంగా కని పించే చీర. వివాహాది, ఇతర శుభకార్యాల్లో కట్టుకోవడానికి మగువలు అత్యంత ఇష్టపడే చీర. అందుకే వస్త్ర ప్రపంచంలో పట్టుచీర మకుటం లేని మహారాణి. అయితే ఆ చీర తయారీ వెనుక నేతకార్మికుల కష్టం వెలకట్ట లేనిది. పట్టుదారం నుంచి రంగులు అద్దే వరకు చేతి వేళ్లనే ఆడిస్తూ అందమైన చీరను తయారు చేస్తున్నారు. యువకుల నుంచి వృద్ధుల వరకు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో పట్టు చీరలకు స్వర్గధామమైన పోచంపల్లి తర్వాత జనగామకు ప్రత్యేక స్థానం ఉంది. నేతకార్మికులు రోజుకు వెయ్యి పట్టు చీరలు తయారు చేస్తూ ఇక్కడి నుంచి దేశ, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే 30 నుంచి 45 రోజుల్లో ఎనిమిది చీరలు నేసే నేత కార్మికులకు పావలా లాభం వస్తే, రిటైల్ మార్కెట్లో వ్యాపారులు వేల రూపాయలు అర్జిస్తున్నారు. ఫలితంగా నేత కార్మికులు మాత్రం ఇంకా పూటగడవని స్థితిలోనే జీవనం గడుపుతున్నారు. ప్రభుత్వాలు సాయం చేసినా, చేయకున్నా దశాబ్దాలుగా కులవృత్తినే నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో నేడు(గురువారం) జాతీయ చేనేత దినో త్సవం. ఈ సందర్భంగా జిల్లాలో నేత కార్మికుల వివరాలు, సొసైటీలు, మరమగ్గాలు, ప్రభుత్వం సా యం, తదితర అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఉమ్మడి వరంగల్లో బచ్చన్నపేటలోనే మొదటి మగ్గం.. ఉమ్మడి వరంగల్ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో 1970–71 సంవత్సరంలో మొట్టమొదటి మగ్గం ప్రారంభించారు. నేత కార్మికులు రెండు నెలల పాటు మగ్గం నేస్తూ ఎనిమిది చీరల(వార్పు)ను తయారు చేసేవారు. ఒక్కో చీరకు రూ.20 లాభం తీసుకుని రూ.120కి పోచంపల్లికి చెందిన హోల్సేల్ వ్యాపారు లకు అమ్ముకునే వారు. అప్పటి వరకు వివిధ రంగాల్లో పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే కార్మికులు మగ్గం బాటపట్టారు. బచ్చన్నపేటలో మొదలైన పట్టుచీర తయారీ మండలంలోని అనేక గ్రామాలకు విస్తరించింది. ఏడాది తర్వాత జనగామలోని వీవర్స్ కాలనీ, లింగాలఘణపురం మండలం వడిచర్ల, కొత్తపల్లి తదితర మండలాల పరిధిలో మగ్గాలతో పట్టు చీరలు తయారు చేయడం మొదలు పెట్టారు. జనగామ జిల్లాలో 11 సొసైటీలు.. అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం జనగామ జిల్లాలో 11 సొసైటీలుండగా, 3వేల మంది నేత, అనుబంధ కార్మికులు, 17 వందల మగ్గాలు, 450 పవర్ లూమ్స్ ఉన్నాయి. జిల్లాలో నెలవారీగా 15 నుంచి 17 వందల వరకు సెమికతాన్, రాజ్కోట్, పాట్లిపళ్లు, రాజ్కోట్పేటి, బార్డర్ సాదా, బార్డర్డిజైన్, కాటన్ తదితర డిజైన్లకు సంబంధించి పట్టు చీరలు త యారు చేస్తున్నారు. రూ.5,500 నుంచి రూ.13వేల వరకు హోల్సేల్ మార్కెట్కు సరఫరా చేస్తున్నారు. రుణమాఫీకి నోచుకోని నేత కార్మికులు.. ప్రభుత్వం నేత కార్మికులకు రుణ సాయంతోపాటు నేతన్న పొదుపు, బీమా ద్వారా భరోసా కల్పిస్తోంది. జిల్లాలో రుణసాయం కోసం 679 మంది నేత కార్మికుల జాబితాతో జిల్లా కమిటీ అప్రూవల్ చేసి ప్రభుత్వానికి పంపించారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం నేత కార్మికుల రుణమాఫీ హామీ నేటికీ అమలుకు నోచుకోవడం లేదు. అలాగే, చేనేతబంధు పథకం అమలు కూడా అదే పరిస్థి నెలకొనడంతో కార్మికులకు ఎదురుచూస్తున్నారు. నేడు జాతీయ చేనేత దినోత్సవందశాబ్దాలుగా కులవృత్తిని నమ్ముకుంటున్న నేత కార్మికులు పోచంపల్లి తర్వాత పట్టు చీరకు నిలయం జనగామ ఇక్కడి నుంచి దేశ, విదేశాలకు ఎగుమతి బచ్చన్నపేటలో మొదలైన ‘మగ్గం’ చప్పుళ్లుజనగామ జిల్లాలో నేత కార్మికుడి ఇంట్లో, షోరూంలలో పట్టు చీరల ధరలు నేత కార్మికుడి ఇంట్లో షోరూంలో.. సెమికతాన్ రూ.5,500 రూ.8,000 రాజ్కోట్ రూ.8,500 రూ.10,500 పాట్లిపళ్లు రూ.9,000 రూ.14,000 రాజ్కోట్పేటి రూ.9,000 రూ.16,000 బార్డర్ సాదా రూ.5,000 రూ.7,000 -
కుక్క అడ్డొచ్చి ఆటో బోల్తా..
న్యూశాయంపేట: వరంగల్ దూపకుంట రోడ్డులోని గిరిప్రసాద్ నగర్ వద్ద కుక్క అడ్డు రావడంతో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో బాలికల మైనారిటీ గురుకులంలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో టీజీటీ ఉర్దూ టీచర్గా పనిచేస్తున్న అజ్మీరీబేగం(38) మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం.. దూపకుంట రోడ్డులోని మైనారిటీ బాలికుల గురుకులంలో పనిచేస్తున్న ఐదుగురు మహిళా ఉపాధ్యాయులు బుధవారం పాఠశాల సమయం పూర్తికాగానే ఇంటికెళ్లడానికి ఆటో ఎక్కారు. వీరితో పాటు మరో మహిళ కూడా ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో గిరిప్రసాద్నగర్ వద్దకు రాగానే కుక్క ఆటోకు అడ్డుగా వచ్చింది. దీంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయగా బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్తోపాటు ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108లో ఎంజీఎం తరలించారు. కాగా, డ్రైవర్ పక్కన కూర్చున్న అజ్మీరీ బేగానికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆటో డ్రైవర్కు తీవ్ర, నలుగురు టీచర్లు, మరో మహిళకు స్వల్ప గాయాలు కాగా ఎంజీఎం, ఇతర ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు కాలేదని మిల్స్కాలనీ పోలీసులు తెలిపారు. ● గురుకుల ఔట్సోర్సింగ్ టీచర్ మృతి ● డ్రైవర్తోపాటు మరో ఐదుగురికి గాయాలు -
సిబ్బంది భద్రతాప్రమాణాలు పాటించాలి
హన్మకొండ: విద్యుత్ సిబ్బంది భద్రతాప్రమాణాలు పాటించాలని, ఈ దిశగా అధికారులు దృష్టి సారించాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి సూచించారు. బుధవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్ఈ, డీఈ, ఏడీఈ, ఏఈ, ఎస్ఏఓ, ఏఏఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో సీఎండీ మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాలను పూర్తిగా తగ్గించాలన్నారు. ఈ దిశగా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న లూజు లైన్లు, వంగిన పోల్స్, తుప్పు పట్టిన స్తంభాలు, తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మన్ల గద్దెలను, లైన్ క్రాసింగ్, డబుల్ ఫీడింగ్ స్తంభాలను గుర్తించి వాటిని పరిష్కరించాలన్నారు. ప్రతీ వారం దీనిపై ఉన్నతాధికారులు సమీక్షిస్తూ పనులు పురోగతిలో ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ నెలాఖరు వరకు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందించే లైన్ పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సి.ఈలు బి.అశోక్ కుమార్, టి.సదర్ లాల్, కె.తిరుమల్ రావు, రాజు చౌహాన్, అశోక్, వెంకట రమణ, ఆర్.చరణ్ దాస్, జీఎంలు వేణుబాబు, కృష్ణ మోహన్, వాసుదేవ్, సత్యనారాయణ, అన్నపూర్ణ, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
ముంపుగ్రామాల్లో ఎన్డీఆర్ఎఫ్ పర్యటన
మరిపెడ రూరల్: గతేడాది ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో మండలంలోని సీతారాంతండా, ఉల్లెపల్లి, బాల్నిధర్మారం గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఈ గ్రామాల్లో గురువారం జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందం సభ్యులు స్థానిక అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ముందు గతేడాది జరిగిన విపత్తు గురించి ఆయా గ్రామాల ప్రజలను అడిగా తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ వరదలు వచ్చిన సమయంలో ధైర్యం కోల్పోకుండా ఒకరికొకరు సాయంగా ఉండాలన్నారు. తాళ్ల సాయంతో వరద ఉధృతి నుంచి బయటకొచ్చే వీలుగా అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం ప్రజలకు విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు మరిపెడ ఎంపీడీఓ వేణుగోపాల్రెడ్డి, ఎంపీఓ సోమ్లానాయక్, ఆర్ఐ శరత్చంద్ర, తదితరులు పాల్గొన్నారు. విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన -
లారీ, కారు ఢీ
గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేట సమీప వైకుంఠధామం ఎదుట 365 జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారు డ్రైవింగ్ చేస్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఎస్సై బి. గిరిధర్రెడ్డి కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఐరన్ షాపు యజమాని బూర అశోక్కుమార్గౌడ్ (55) కారులో మహబూబాబాద్ నుంచి నర్సంపేటకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో గూడూరు మండలం భూపతిపేట సమీపంలోని వైకుంఠధామం వద్ద నర్సంపేట నుంచి గూడూరు వైపున వస్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో కారు సగభాగం నుజ్జునుజ్జయి అశోక్కుమార్ గౌడ్ అక్కడిక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న మృతుడి కుటుంబీకులు, బంధువులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని బోరున విలపించారు. ఎస్సై గిరిధర్రెడ్డి రెండు గంటల పాటు శ్రమించి కారు సగభాగం వేరు చేసి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై గిరిధర్రెడ్డి తెలిపారు. అక్కడికక్కడే ఒకరు దుర్మరణం భూపతిపేట సమీపంలో ఘటన -
ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి
● ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా ఏటూరునాగారం: నిరుద్యోగులు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని గిరిజన భవన్లో ఐటీడీఏ ద్వారా మెగా జాబ్మేళా నిర్వహించారు. జిల్లా నుంచి 357 మంది, ఇతర జిల్లాల నుంచి 21 మంది హాజరు కాగా 77 మందిని వివిధ కంపెనీలు ఎంపిక చేయగా వారికి పీఓ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నిరుద్యోగులు తమకు సరైన ఉద్యోగం లేదని కాలాన్ని వృథా చేయొద్దన్నారు. అందుబాటులో ఉన్న ఉద్యోగం చేస్తూ లక్ష్యం వైపు పయనించాలన్నారు. ఉద్యోగానికి ఎంపికై న అభ్యర్థులు నిబద్ధతతో విధులు నిర్వర్తించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు, డీడీ పోచం, ఏఓ రాజ్కుమార్, ఎస్ఓ సురేశ్బాబు, కిశోర్, ప్రభాకర్, శ్రీనివాస్, కొండల్రావు, భిక్షపతి, పాపారావు, సరస్వతి, ఏపీఎంలు, సీసీలు, వివిధ కంపెనీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్ ● కిలో 300 గ్రాముల సరుకు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన సీఐ జానకిరామ్రెడ్డి పాలకుర్తి టౌన్: గంజాయి విక్రయిస్తున్న ము ఠాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పాలకుర్తి సీఐ వంగాల జానకిరామ్రెడ్డి తెలిపా రు. ఈ మేరకు బుధవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. స్టేషన్ ఘన్పూర్ మండలం కొత్తపల్లికి చెందిన వడ్లకొండ శబరి నాథ్, గోవిందా శ్రీనాథ్, సముద్రాల గ్రామానికి చెందిన గుండె నవీన్, పాలకుర్తి మండలం గూడూరుకు చెందిన గుగ్గిళ్ల ప్రవీణ్, గుండమల్ల సంపత్, లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన చిటూరి శ్యామ్, పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన బండారి అఖిల్ ముఠాగా ఏర్పడ్డారు. గంజాయి కొనుగోలు చేసి విద్యార్థులు, యువతకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో పాలకుర్తి శివారు కూసిగుట్ట సమీపంలో గంజాయి ముఠా ఉందనే సమాచారం మేరకు ఎస్సై దూలం వపన్కుమార్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. కేజీ 300 గ్రాముల ఎండు గంజాయి, ఒక బైక్, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
రైల్వే సమస్యలు పరిష్కరించాలి
● కేంద్ర మంత్రికి ఎంపీ, ఎమ్మెల్యేల వినతి కాజీపేట రూరల్ : న్యూఢిల్లీలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినివైష్ణవ్ను బుధవారం వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, కె.ఆర్.నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, శాసనమండలి సభ్యుడు బస్వరాజు సారయ్య కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని రైల్వే సమస్యలపై వినతి పత్రం అందజేశారు. కాజీపేట డివిజన్ ఏర్పాటు చేయాలని, కాజీపేట రైల్వే స్టేషన్ ఆవరణలో బస్స్టేషన్ నిర్మాణం కోసం స్థల సేకరణ, కాజీపేట అమృత్ భారత్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అనంతరం కాజీపేట బస్స్టేషన్ ఆవశ్యకతపై రైల్వే మంత్రికి వివరించి, ఇప్పటికే క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటించారని, ప్రజారవాణా దృష్ట్యా బస్టాండ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలపై రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించి ఆ అంశాలను పరిశీలించి నివేదికలు పంపించాలని అధికారులకు చెప్పారని ఎమ్మెల్యేలు తెలిపారు. ఆటోడ్రైవర్కు ఏడాది జైలు వరంగల్ లీగల్ : నిర్లక్ష్యంగా ఆటో నడిపి ఒకరి మృతికి కారణమమైన డ్రైవర్ మరుపట్ల తారయ్యకు ఏడాది జైలు శిక్ష, రూ.1,500 జరిమానా విధిస్తూ హనుమకొండ మొదటి మున్సిఫ్ కోర్టు జడ్జి చింతాడ శ్రావణ స్వాతి బుధవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. 2020, అక్టోబర్ 9న బీటెక్ విద్యార్థి బి.జశ్వంత్ బైక్పై హైదరాబాద్ నుంచి హనుమకొండ బయలుదేరాడు. మార్గమధ్యలో రాంపూర్ ఇండస్ట్రీయల్ ఏరియా జంక్షన్లో మడికొండ నుంచి వస్తున్న ఆటో నిర్లక్ష్యంగా కుడి వైపునకు ఉన్న ఇండస్ట్రీయల్ ఏరియా వైపుగా మళ్లించడంతో బైక్కు తగిలింది. దీంతో ఆటోలో ఉన్న ప్రయాణికులకు గాయాలు కాగా, బైక్ నడుపుతున్న బి.జశ్వంత్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు 108లో ఎంజీఎం తరలించారు. ఆటో డ్రైవర్ కాజీపేట రహమత్నగర్కు చెందిన మరుపట్ల తారయ్య అని తెలిసింది. అనంతరం జశ్వంత్ కుటుంబీకులు ఎంజీఎం వెళ్లేసరికి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు మడికొండ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువుకావడంతో జడ్జి శ్రావణ స్వాతి.. నేరస్తుడికి ఏడాది జైలు శిక్ష, రూ.1,500 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. కేసును పోలీస్ అధికారులు సీఐ కిషన్, ఎస్సై కుమారస్వామి, పరిశోధించగా లైజన్ ఆఫీసర్స్గా పరమేశ్వరి, కుమారస్వామి విచారణ పర్యవేక్షించారు. కానిస్టేబుల్ వీరగోని రాజేశ్, హోంగార్డు సదానందం సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. -
విద్య, ఆరోగ్యంతోనే ప్రజాశ్రేయస్సు
కేయూ క్యాంపస్ : అభివృద్ధి అంటే మౌలిక వసతులు, తలసరి ఆదాయం, స్థూల జాతీయ ఉత్పత్తియే కాదని, విద్య, ఆరోగ్య ద్వారానే ప్రజాశ్రేయస్సు సాధ్యమని, ఆ దిశగా రాష్ట్రాలు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)ఎకనామిక్స్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ డి. నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం కాకతీయ యూనివర్సిటీలోని సెనేట్హాల్లో డాక్టర్ జయశంకర్ స్మారకోపన్యాసం కార్యక్రమంలో ‘డెవలప్మెంట్ డిపార్టీస్ అండ్ ది ఫర్మార్మెన్స్ ఆఫ్ ది సోషల్ సెక్టార్ ఇన్ది సౌథర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియా’ అనే అంశంపై మాట్లాడారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ వివిధ రంగాల్లో వెనుకబాటులోనే ఉందన్నారు. విద్య, వైద్య శ్రేయస్సు ద్వారానే ఉత్పాదకత పెరుగుతుందన్నారు.బాలికలు, మహిళల్లో రక్తహీనత ఎక్కువ ఉందన్నారు.డాక్టర్ జయశంకర్ సామాజిక ప్రజాస్వామిక తెలంగాణను కలగన్నారన్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండాప్రకాశ్ మాట్లాడుతూ జయశంకర్ గొప్పమానవతావాది అన్నారు. తెలంగాణ స్వాప్నికుడు, విద్యావేత్త, దూరదృష్టిగల గొప్పవ్యక్తి అని కొనియాడారు. కేయూ విశ్రాంత కామర్స్ విభాగం ప్రొఫెసర్, మాజీ రిజిస్ట్రార్, జయశంకర్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ ఎ. శంకరయ్య మాట్లాడుతూ జయశంకర్ గొప్పపరిపాలనాదక్షుడన్నారు. అనంతరం కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి. రామచంద్రం, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వల్లాల పృథ్వీరాజ్ మాట్లాడారు. హెచ్సీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ నర్సింహారెడ్డి -
బీసీ రిజర్వేషన్లకు కేంద్రం చట్టం చేయాలి
హన్మకొండ : బీసీ రిజర్వేషన్లకు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని ప్రొఫెసర్ కంచె ఐలయ్య డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ప్రజాయుద్ధ నౌక గద్దర్ ద్వితీయ వర్ధంతి జరిగింది. ఈ కార్యక్రమంలో కంచె ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గద్దర్ స్ఫూర్తిని ఈతరం కొనసాగించాలన్నారు. దేశ సాంస్కృతిక చరిత్రలో గద్దర్ది చెరగని స్థానమని, ఆయన జీవించి ఉన్నంత కాలం ప్రజల కోసమే పాటుపడ్డారన్నారు. తొలి రోజుల్లో బుల్లెట్ను నమ్ముకున్న గద్దర్.. తర్వాత అంబేడ్కర్ మార్గంలోకి వచ్చి బ్యాలెట్ని నమ్మారన్నారు. ప్రధాని మోదీ బీసీ అయినా తన వర్గానికి కాకుండా అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. ముస్లింలను చూపిస్తూ కేంద్ర మంత్రులు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడడం సమంజసం కాదన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఎవరూ పోరాటం చేసిన స్వాగతిస్తామన్నారు. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ విముక్తి కోసం పాటుపడిన గద్దర్ కృషి మరువలేనిదన్నారు. గద్దర్ గళం ఫౌండర్ చైర్మన్ కొల్లూరి సత్తయ్య మాట్లాడుతూ వరంగల్తో పాటు ఉమ్మడి పది జిల్లా కేంద్రాల్లో గద్దర్ విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత పసునూరి రవీందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కన్నం సునీల్, మేడ రంజిత్ కుమార్, కాడపాక రాజేందర్, రామంచ శ్రీను, ప్రొఫెసర్ వీరస్వామి, ఆస్నాల శ్రీనివాస్, బండి మొగిలి, సాయిని నరేందర్, టి.ఎన్.స్వామి, మన్నే బాబురావు, రామంచ భరత్, తాళ్ల సునీల్ పాల్గొన్నారు. ప్రొఫెసర్ కంచె ఐలయ్య -
పూడికతీత పనుల్లో ఆలస్యం
బయ్యారం: జిల్లాలో ప్రధాన సాగునీటి వనరైన బయ్యారం పెద్దచెరువు అభివృద్ధిపై పాలకులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చెరువు నిండే వరకు ప్రేక్షకపాత్ర పోషించి.. ఆ తర్వాత కాల్వల పూడికతీత పనులు చేపడుతున్నారు. దీంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో నాట్లు దేవుడెరుగు వరినారును కాపాడుకోవడం రైతులకు కష్టంగా మారింది. కాగా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య గత నెల 27న చెరువు తూములను ఓపెన్ చేశారు. కాగా తూములు తెరిచి 11రోజులైనా బయ్యారం వరకు చెరువు నీరు చేరలేదు. సకాలంలో నాట్లు వేసుకుందామంటే నత్తనడకన సాగుతున్న కాల్వల పూడికతీత పనులతో వరినార్లు ముదిరి దిగుబడి తగ్గే పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. ఒకే పొక్లెయినర్తో ఎన్నిరోజులు.. బయ్యారం పెద్దచెరువు ఆయకట్టు పరిధిలోని రైతులకు సాగు నీరందించేందుకు పెద్దకాల్వ, తునికికాల్వ, పెరుగుబుడ్డి, గుండ్లోరి కాల్వలు ప్రధానమైనవి. ఈ కాల్వల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి బలహీనంగా ఉన్న చోట కట్టలు పటిష్టం చేసేందుకు నీటిపారుదలశాఖాధికారులు టెండర్ ద్వారా పనులు ప్రారంభించారు. సుమారు 12 కిలోమీటర్ల పొడవు ఉండే కాల్వల పూడికతీతకు కనీసం మూడు పొక్లెయినర్లు ఏర్పాటు చేస్తే త్వరితగతిన పనులు పూర్తయ్యేవి. అయితే ప్రస్తుతం ఒకే మిషన్తో పనులు చేపడుతుండడంతో మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్న మిషన్తో పాటు మరో మిషన్ ఏర్పాటు చేసి త్వరితగతిన పూడికతీత పనులు చేపట్టాలని, సకాలంలో సాగునీరు అందించాలని అధికారులను కోరుతున్నారు. వృథాగా సాగునీరు.. తూములు తెరిచినప్పటికీ కాల్వల పూడికతీత వల్ల నీటి ప్రవాహం ముందుకు సాగడం లేదు. దీంతో చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదు. ఇదిలా ఉండగా అలుగు ద్వారా వెళ్లే నీరు వృథా అవుతోంది. ఆ నీటిని ఆయకట్టుకు మళ్లీంచే అవకాశం లేకపోవడంతో అలిగేటిలో కలిసిపోతోంది. నీళ్లు వస్తే నాట్లు పడేవి.. చెరువు కాల్వలను ఇంతక ముందే బాగు చేస్తే చెరువు నిండిన వెంటనే పంట పొలాలకు నీళ్లు వచ్చేవి. అలుగు ద్వారా ఏటిలో పడుతున్న నీటిని కాల్వలకు విడుదల చేస్తే మా పొలాల్లో నాట్లు పడేవి. మా గుండ్లోరి కాల్వ బాగు చేసి చివరన ఉన్న బంజరతండాకు ఎప్పుడు నీరు ఇస్తారో తెలియని పరిస్థితి ఉంది. – బి.బిచ్చ, బంజరతండాఏటా సీజన్ ప్రారంభంలో బయ్యారం చెరువు కాల్వల మరమ్మతు 11రోజులక్రితం తూములు తెరిచిన ఎమ్మెల్యే బయ్యారం వరకు చేరని సాగునీరు ఎండుతున్న వరినారు మడులు -
దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి
గూడూరు: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) కె. అనిల్కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భూభారతి రెవెన్యూ సదస్సుల రిజిస్టర్లను పరిశీలించారు. ఎక్కడ ఎలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట సర్వే సక్రమంగా చేయాలని సూచించారు. తహసీల్ సందర్శన.. కేసముద్రం: ఇనుగుర్తి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ అనిల్కుమార్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. భూభారతి రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన 1,684 దరఖాస్తులలో సరైన పత్రాలు ఉండి, ఆమోదయోగ్యమైనవి కలెక్టర్కు పంపించాలని సూచించారు. ఈనెల 15వ తేదీలోగా దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ తరంగిణి, ఆర్ఐ బషీర్, సిబ్బంది పాల్గొన్నారు. అడిషనల్ కలెక్టర్ కె.అనిల్కుమార్ -
పల్లెల్లో ఆరోగ్య అవగాహనకు ప్రత్యేక చర్యలు
బయ్యారం: పల్లెల్లో ఆరోగ్య అవగాహన కోసం వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మలేరియా అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అమర్సింగ్ అన్నారు. బయ్యారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో బుధవారం బయ్యారం, గంధంపల్లి, కొత్తగూడ, ముల్కనూర్, కోమట్లగూడెం, గంగారం పీహెచ్సీల వైద్య సిబ్బందితో సీజనల్ వ్యాధులు, పైలేరియాపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది సమయానికి విధులకు హాజరుకావాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పైలేరియా వ్యాఽధిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ నెల 10నుంచి 25వ తేదీ వరకు ఆరు పీహెచ్సీల పరిధిలో ౖపైలేరియా నివారణపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వానాకాలంలో వచ్చే రోగాల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు తమశాఖకు సహకరించాలన్నారు. అనంతరం పీహెచ్సీలో రోగ నిర్ధారణకు ఉపయోగిస్తున్న టెస్టింగ్ కిట్లు, ఔషధాల లభ్యత, రిజిస్టర్ల నిర్వహణ, పోర్టల్లో ఎంట్రీ చేసే విధానాన్ని ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ రవిరాథోడ్, సబ్యూనిట్ ఆఫీసర్ రామకృష్ణతో పాటు ఆరు పీహెచ్సీల వైద్యులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. వ్యాధుల నివారణకు చర్యలు నెహ్రూసెంటర్: సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని మలేరియా అడిషనల్ డైరెక్టర్ అమర్సింగ్నాయక్ సూచించారు. జిల్లా ఆస్పత్రిలో బుధవారం సీజనల్ వ్యాధుల నివారణపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా ఆసుపత్రిలోని టీహబ్ డయాగ్నస్టిక్స్, బ్లడ్బ్యాంక్ పరిశీలించారు. ఈ నెల 10 నుంచి 25వరకు పైలేరియాపై ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ రవిరాథోడ్, ఆర్ఎంఓలు హర్షవర్ధన్, జగదీశ్వర్, ప్రోగ్రాం అధికారులు, వైద్యా అధికారులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. మలేరియా అడిషనల్ డైరెక్టర్ అమర్సింగ్ -
మహిళలు తయారుచేసిన ఉత్పత్తులను కొనాలి
మహబూబాబాద్ అర్బన్: స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రజ లు కొనుగోలు చేసి, వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. జిల్లా కేంద్రంలోని తొర్రూరు బస్టాండ్ సెంటర్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో తయారు చేసిన ఉత్పత్తుల స్టాళ్లను బుధవారం సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ఆదివాసీ కళాకారులు, గ్రామీణ పారిశ్రామికులు తయారు చేసిన ఉత్పత్తులు బాగున్నాయన్నా రు. ముఖ్యంగా ఇప్పుపువ్వు లడ్డూ, మిల్లెట్ బిస్కెట్స్, తేనె, చేతితో తయారు చేసిన జ్యూట్ బ్యా గులు చాలా బాగున్నాయన్నారు. ఈ నెల 4నుంచి నుంచి 8వ తేదీ వరకు ఈ ఉత్పత్తుల స్టాల్స్ ప్రదర్శించబడుతాయని, జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మార్జా మునవర్బేగ్, తహసీల్దార్ రాజేశ్వర్, మెప్మా పీడీ విజయకుమారి, అధికారులు శ్రీనాథ్, రఘుపతి తదితరులు పాల్గొన్నారు. ఆకస్మిక తనిఖీబయ్యారం: బయ్యారంలో ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సవ్ టొప్పో బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. బయ్యారంలోని బాలుర ఉన్నత పాఠశాలతో పాటు పీహెచ్సీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి పఠనాశక్తిని పరిశీలించారు. పీహెచ్సీలో నమోదవుతున్న వ్యాధుల వివరాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎంఈఓ దేవేంద్రాచారి తదితరులు ఉన్నారు. ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో -
ప్రకృతితో అనుబంధం
ప్రతీది ప్రకృతితో అనుబంధంగానే మా జీవన విధానం ఉంటుంది. మా పంటలు, కుటుంబాలతోపాటు, ఆడపిల్లకు సరైన వరుడిని కూడా ప్రకృతి అనుమతితోనే పొందాలన్నదే తీజ్ ఉద్దేశం. చిన్నతనంలో పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్లం.. ఇప్పటికీ తీజ్ ఉత్సవాల్లో పాల్గొనడం అంటే భలే ఇష్టం. – భూక్య ఉమ, మహబూబాబాద్అంతా మేరామా యాడీ దయ మా కుల దేవతలు సేవాలాల్, మేరామా యాడీ(గౌరీ దేవి)కి పూజలు చేసి తీజ్ పండుగను ప్రారంభిస్తాం. అంతా అమ్మవారే చూసుకుంటారని నమ్మకం. అందుకోసం గోధుమలు తెచ్చి నిష్టతో తొమ్మిది రోజులు పూజలు చేస్తాం. యువతులు పాటలు పాడుతూ.. ఆటలు ఆడడం సరదాగా ఉంటుంది. – జాటోత్ ఝాన్సీలక్ష్మి, గార్ల -
జయశంకర్ ఆశయాలను సాధించాలి
మహబూబాబాద్ అర్బన్: తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయాలను సాధించాలని ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి ఎం.నర్సిహస్వామి, జెడ్పీ సీఈఓ పురుషొత్తం, అధికారలు వెంకటేశ్వర్లు, కిరణ్కుమార్, సురేష్, మరియన్న, కిరణ్, వీరన్న, వెంకటరమణ, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో -
పిల్లలూ పాఠాలు అర్థమవుతున్నాయా..
మహబూబాబాద్ అర్బన్: పిల్లలూ.. సార్లు బో ధించే పాఠాలు అర్థమవుతున్నాయా అని రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ రాజీవ్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలను బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సమయానికి హాజరుకావాలని, విద్యార్థుల్లోని సామర్థ్యాలను వెలికితీయలన్నారు. మ్యూజిక్ పరికరాలను విద్యార్థులకు వినియోగించాలన్నారు. అనంతరం మున్సిపాలిటీ పరి ధిలోని అనంతారం మోడల్ స్కూల్ను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మా ట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమలో డీఈఓ రవీందర్రెడ్డి, రాష్ట్ర ఏఎంఓ జావీద్, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, జిల్లా కోఆర్డి నేటర్ ఆజాద్చంద్రశేఖర్, హెచ్ఎంలు వెంకటేశ్వర్లు, ఉపేందర్రావు ఉన్నారు.ఈ–పాస్ మిషన్ ద్వారానే అమ్మకాలు చేపట్టాలి కురవి: ఈ–పాస్ మిషన్ ద్వారానే ఎరువుల అమ్మకాలు చేపట్టాలని డీఏఓ విజయలక్ష్మి అన్నారు. బుధవారం మండలంలోని మోద్గులగూడెంలోని ఫౌల్ట్రీఫాంలో తనిఖీ చేశారు. ఎరువుల దుకాణాలు, గోదాంలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు యూరియా వాడకాన్ని తగ్గించాలని, నానో యూరియా వాడాలని సూచించారు. ఆమె వెంట ఏఓ నర్సింహారావు, సీఈఓ జితేందర్, శ్రీపాల్, రాధాకృష్ణ పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సు ఇంజన్లో పొగలుమహబూబాబాద్ రూరల్: హనుమకొండ నుంచి మహబూబాబాద్ పట్టణానికి వస్తున్న ఆర్టీసీ బస్సు కంబాలపల్లి గ్రామ సమీపంలోకి చేరుకోగానే ఇంజన్లో నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చిన సంఘటన బుధవారం జరిగింది. డ్రైవర్ వెంటనే స్పందించి బస్సును నిలిపివేసి ప్రయాణికులందరినీ కిందకు దింపాడు. ఆ బస్సు వెనుకాలే వస్తున్న నర్సంపేట డిపోకు చెందిన మరో బస్సులో ప్రయాణికులను ఎక్కించి మహబూబాబాద్ పంపించారు. ఇటలీ వాసులకు రాఖీలు కట్టిన ముస్లిం మహిళలుతొర్రూరు: అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి ముందస్తు వేడుకల్లో భాగంగా ముస్లిం మహిళలు విదేశీయులకు రాఖీలు కట్టి సమైక్యత చాటారు. బాల వికాస కార్యక్రమాలను తెలుసుకునేందుకు ఇటలీ దేశానికి చెందిన ప్రాన్సెస్కా, ఆల్బర్ట్లు బుధవారం తొర్రూరుకు వచ్చారు. అతిథులను చూసిన ముస్లిం మహిళలు షాహీన్ సుల్తానా, ఆసియాలు వారికి రాఖీలు కట్టి సోదరభావం చాటారు. ఇటలీ వాసులకు దుస్తులు, గాజులు బహూకరించారు. ఇటలీలోని క్యాథలిక్ యూనివర్సిటీలో పరిశోధక విద్యార్థులైన ప్రాన్సెస్కా, ఆల్బర్ట్లు 4 వారాలుగా భారత్లో బాలవికాస కార్యక్రమాలపై అధ్యయనం చేస్తున్నారు. -
స్టోన్ క్రషర్లపై ‘మైనింగ్’ కత్తి
రాయల్టీ, లీజు తదితర బకాయిదారులపై దృష్టి ● లీజు రద్దు చేసి టెండర్ల ద్వారా కేటాయించే యోచన ● ఆదాయం పెంచుకునే దిశగా ప్రభుత్వం కసరత్తు ● ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఏడు గ్రానైట్ క్వారీలు, క్రషర్లు ● ముగిసిన టెండర్ల ప్రక్రియ.. త్వరలో అర్హులకు కేటాయింపుమెటల్ క్రషర్ (ఫైల్) సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రానైట్ క్వారీలు, స్టోన్ క్రషర్ల అక్రమ దందాను అరికట్టేందుకు గనుల శాఖ సిద్ధమైంది. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన రాయల్టీని రూ.లక్షల్లో కాజేస్తున్న నిర్వాహకులపై కొరడా ఝుళిపించేందుకు కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో గ్రానైట్ క్వారీలు, రోడ్, స్టోన్ మెటల్ (కంకర) క్రషర్ల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు గనులశాఖ దృష్టి సారించింది. ఇందుకు ప్రభుత్వ భూముల్లో గుట్టలు, మైనింగ్కు అనువైన స్థలాలను గుర్తించి టెండర్ ద్వారా లీజుకు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. తొలి ప్రయత్నంగా రాష్ట్ర వ్యాప్తంగా 34 గ్రానైట్, స్టోన్ మెటల్ క్వారీలకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అక్రమాలకు ఇక అడ్డుకట్ట.. ఉమ్మడి వరంగల్లో సుమారు 360కి పైగా కంకర క్రషర్లు, 100కు పైగా గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. ఒక్క హనుమకొండ జిల్లాలోనే 29 బ్లాక్, 33 కలర్ గ్రానైట్, 64 స్టోన్ మెటల్, క్వార్ట్జ్, గ్రావెల్ క్వారీలు రెండు కలిపి 128 ఉన్నాయి. ఇందులో సగం వరకు రాజకీయ నాయకులు, వారి అనుచరులవే ఉన్నా యి. అనుమతి లేకుండా రాతి క్వారీలు నిర్వహిస్తు న్నా, అనుమతి తీసుకుని నిబంధనలు ఉల్లంఘించి ఫ్రాడ్ చేసినా రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.ఐదు లక్షల జరిమానా విధించే చట్టాలు చుట్టాలుగా మా రుతున్నాయి. కొన్నేళ్లుగా రూ.కోట్ల విలువ చేసే రా తి ఖనిజం కంకర,గ్రానైట్ రూపేణా దోపిడీకి గురైంది. తవ్వి తరలించిన దానికి.. ప్రభుత్వానికి రాయల్టీ కట్టే సమయంలో చూపించే లెక్కలకు పొంతన లేకపోగా.. 30నుంచి 50 శాతం వరకే చెల్లించిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిచోట్ల లీజు పరిమితి తీరి నా.. ఇంకా గ్రానైట్, కంకర క్వారీలు నడుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. క్వారీల్లో పేలుడుకు సంబంధించి ఇష్టారాజ్యంగా జిలెటిన్స్టిక్స్ను సరైన భద్రతా చర్యలు లేకుండా తరలిస్తున్నారు. రవాణా సమయంలో భారీ కుదుపులు వచ్చినా, ఎదురుగా ఏదైనా వచ్చి వాహనాన్ని ఢీకొన్నా భారీ పేలుడు జరిగే ప్రమాదం ఉంటుంది. అధికారుల తనిఖీలు సక్రమంగా లేకపోవడంతో అక్రమార్కులు సరైన భద్రతా వ్యవస్థ లేకుండానే జిలెటిన్స్టిక్స్ తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వీటన్నింటిపై సమీక్షలు చేసిన గనులశాఖ ప్రత్యేక బృందాలను నియమించి క్వారీల వారీగా లీజు అగ్రిమెంట్లు పరిశీలి స్తూ లీజు, రాయల్టీ బకాయిల లెక్కలు తీస్తోంది.మొదట ఏడు క్వారీలు.. ప్రభుత్వ స్థలాలు, గుట్టలను గుర్తించి గ్రానైట్, కంకర క్వారీలను టెండర్ల ద్వారా కేటాయించేందుకు శ్రీకారం చుట్టిన గనులశాఖ.. మొదట ఉమ్మడి జిల్లాలో ఏడు క్వారీల టెండర్లు ఈ నెల 12 ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. హనుమకొండ జిల్లా ఊరుగొండలో రెండు స్టోన్ మెటల్, రెండు కలర్ గ్రానైట్ క్వారీలు, ఆత్మకూరు మండలం పెద్దాపూర్లో బ్లాక్ గ్రానైట్ క్వారీలు ఈ టెండర్లలో ఉన్నాయి. వరంగల్ జిల్లా సంగెం మండలం లోహితలో కంకర క్వారీ, జనగామ జిల్లా చిల్పూరు మండలం శ్రీపతిపల్లిలో ఒకటి, జఫర్గఢ్ మండలం హిమ్మత్నగర్లో ఒకటి చొప్పున రెండు క్వారీలకు టెండర్లు ఆహ్వానించారు. కాగా, గనుల శాఖ నోటిఫికేషన్ మేరకు జూలై 17న డౌన్లోడ్ చేసుకుని ఈ నెల 6 వరకు టెండర్లు దాఖలు చేసే అవకాశం కల్పించారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వ భూముల్లో క్రషర్లు నడుపుతూ రాయల్టీ, లీజు డబ్బులు చెల్లించని 22 మందికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అలాగే, కంకర, గ్రానైట్ కోసం తీసిన రాయికి రాయల్టీ కట్టని వారు.. గనులశాఖకు సూచించిన క్యూబిక్ మీటర్లను మించి రాయి తీసి తనిఖీల్లో దొరికి పెనాల్టీ చెల్లించని వారికి కూడా నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. 10–15 రోజుల్లో సదరు నిర్వాహకులు స్పందించకుంటే ఆ లీజులు సైతం రద్దు చేసి టెండర్లు పిలిచే అవకాశం ఉంటుందని మైనింగ్శాఖ అధికారులు చెబుతున్నారు. -
గురువారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2025
– 8లోuసాక్షి, మహబూబాబాద్ : గిరిజన(లంబాడ) కన్నెపిల్లలు సంబురంగా జరుపుకునే పండుగ తీజ్. ఈ నెలలో పండుగను ప్రతీ గురువారం ఏదో ఒక తండాలో జరుపుకుంటారు. నేడు (గురువారం) ఉమ్మడిజిల్లాలోని పలు తండాలు తీజ్ పండుగకు ముస్తాబయ్యాయి. ప్రకృతి సిద్ధంగా శ్రావణంలో వర్షాలు కురవడంతో ఆకాశం నుంచి కిందికి వచ్చే ఎర్రని వర్ణం గల ఆరుద్ర పురుగులను కూడా తీజ్ అంటారు. ఆ అందమైన పురుగులు దేవుడు మనకోసం కిందికి పంపిస్తాడని, ఈ పురుగులు కనిపించినప్పుడు కన్నె పిల్లలు మనస్సులో కోరుకున్న కోరిక ఫలిస్తుందనేది గిరిజనుల నమ్మకం. మా తాండేరో జోత్ తీజ్ (తండాల్లో వెలుగు తీజ్) అంటూ పండుగకు సిద్ధమయ్యారు. ● తొమ్మిది రోజులపాటు నిష్టతో కన్నె పిల్లల పూజలు ● గిరిజన తండాల్లో తీజ్ సంబురాలు ● ఏడో రోజు ఢమోళీ కార్యక్రమం నిర్వహిస్తారు. ఢమోళీ చుర్మో(రొట్టెలు, బెల్లం కలిపిన ముద్ద)ను మేరామా భవానికి నేవైద్యం పెడతారు. ● ఎనిమిదో రోజు మట్టితో బంజారా ఆరాధ్య దైవాల ప్రతిరూపాలను తయారు చేస్తారు. అబ్బాయి(డోక్రా), అమ్మాయి(డోక్రీ)లుగా పేర్లు పెడతారు. వీటికి గిరిజన సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేస్తారు. ● తొమ్మిదో రోజు డప్పుచప్పుళ్లు, గిరిజన నృత్యాలతో అందరూ బుట్టల వద్దకు వెళ్తారు. తండా నాయక్ వచ్చి యువతులకు బుట్టలను ఇచ్చి ఆశీర్వాదం అందిస్తారు. ● లంబాడీల ఆరాధ్య దైవం తుల్జా భవానీ, సేవాబాయి, సీత్లాభవానీలకు పూజలు చేసి స్నానాలు ఆచరించి పవిత్రతతో పుట్టమట్టిని తెస్తారు. ● తీజ్ (గోధు మ మొలకలు) ఏపుగా పెరిగేందుకు ఆడపిల్లలు అడవికి వెళ్లి దుస్సేరు(ఫిలోణీర్ వేళ్లీ) తెస్తారు. ఈ తీగ లతో బుట్టలు అల్లుతారు. ● పెండ్లీడుకు వచ్చిన యువతి తనకు కావాల్సి న పెళ్లికొడుకు కోసం చేసే ఈ పండుగలో ముందుగా తల్లిదండ్రులు, తర్వాత పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. ముఖ్యంగా తండా పెద్ద నాయక్ అనుమతి పొందిన తర్వాత పండుగ తంతు మొదలుపెడతారు. సంప్రదాయ పాటలుమొదటి రోజు :చివరి రోజు :● లంబాడీ భాషలో బోరడీ ఝుష్కేరో అంటే రేగుముళ్లు గుచ్చడం. తీజ్ వేడుకల్లో భాగంగా నానబెట్టిన శనిగలకు యువతలు రేగుముళ్లు గుచ్చుతారు. బావ వరుస ఉన్న వారు కన్నెపిల్ల మనస్సు చెదిరేలా కదిలిస్తూ ఉంటారు. అప్పుడు రేగుముళ్లు శనిగలకు కాకుండా వారి చేతికి కూడా గుచ్చుకుంటాయి. దీనిని భరిస్తూ రేగుముళ్లు శనిగలకు గుచ్చడం ఈ తంతు ప్రత్యేకత. లాంబి లాంబియే లాంబడీ ఏకెరీయో... తోన కుణ బొరాయో తీజ్.. సేవాభాయ బొరాయో తీజ్.. (గునుగుపూల వలె ఎదుగుతవమ్మా.. నిను కొలిచే వారెవరమ్మా.. సేవాలాల్ మహరాజ్ అలికి కొలుస్తారమ్మా తీజ్..) అని పాడుతూ తొలిరోజు వేడుకలు జరుపుకుంటారు. తూ కతేతి ఆయోరే దుదియా తళవో.. మారో తీజేరో జోత్ లేయి చాలో.. డగేరేచాలో.. (ఎక్కడినుంచి వచ్చావో దుదియా చెరువు.. తొమ్మిది రోజులు పెంచుకున్న తీజ్ తండా వెలుగును తీసుకుని వెళ్తున్నావు) అంటూ పెళ్లికాని అమ్మాయిలు పాటలు పాడుతూ తీజ్ బుట్టలను చెరువులో నిమజ్జనం చేస్తారు. 9 -
చికిత్స పొందుతూ వ్యాపారి మృతి
● జూలై 31న రైలు ఎక్కబోతూ జారిపడడంతో తీవ్రగాయాలు ఖిలా వరంగల్: చార్మినార్ ఎక్స్ప్రెస్ ఎక్కబోతూ ఓ వ్యాపారి వరంగల్ రైల్వేస్టేషన్ ప్లాట్ఫామ్ వద్ద జారి పడి తీవ్రగాయాలు కాగా.. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందాడు. జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ రామన్నపేటకు చెందిన వ్యాపారి చందా జగదీశ్వర్(62) గత నెల 31న ఉదయం 8.30 గంటలకు వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి సికింద్రాబాద్కు వెళ్లేందుకు చార్మినార్ ఎక్స్ప్రెస్ ఎక్కబోతూ ప్రమాదవశాత్తు ప్లాట్ఫామ్ మధ్యలో పడిపోయాడు. దీంతో అతడికి తీవ్రగాయాలు కాగా.. రైల్వే జీఆర్పీ అధికారులు హుటాహుటిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం జగదీశ్వర్ మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి మృతుడి కుమారుడు అభిషేక్కు అప్పగించినట్టు జీఆర్పీ హెడ్కానిస్టేబుల్రాజు పేర్కొన్నారు. -
ప్రజాసమస్యలను పట్టించుకోని ప్రభుత్వాలు
ములుగు రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసమస్యలను పట్టించుకోవటం లేదని, ప్రభుత్వాలు మారుతున్న పేదరికం మాత్రం పోవడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో సీపీఐ జిల్లా మహాసభల సందర్భంగా బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ములుగు జిల్లాలో పేదరికం అధికంగా ఉందని, ఎలాంటి అభివృద్ధి లేకుండా పోయిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొద్దిమంది ఆస్తులు పెంచుకోవటం కోసమే పనిచేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలుచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జంపాల రవీందర్, అహ్మద్ పాషా, భిక్షపతి, రాజు, తోట మల్లికార్జునరావు, బండి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు -
ఇద్దరు విద్యుత్ ఉద్యోగుల సస్పెన్షన్
హన్మకొండ: అవినీతి ఉద్యోగులపై టీజీఎన్పీడీసీఎల్ యాజమాన్యం వేటువేసింది. ఖమ్మం సర్కిల్లోని తిరుమలయపాలెంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్ ఆర్.భాస్కరరావు, ఏఎల్ఎం యు.జగత్ జీవన్ అవినీతికి పాల్పడినట్లు విజిలెన్స్ విచారణలో వెల్లడి కావడంతో సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని యాజమాన్యం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. సర్కిల్ పరిధిలోని చింతల్తండా రైతులు కొత్త వ్యవసాయ సర్వీసుకు దరఖాస్తు చేసుకోగా, మంజూరు చేసేందుకు రూ.లక్ష డిమాండ్ చేశారు. తాము అంత మొత్తం చెల్లించుకోమని చెప్పి చివరకు రూ.90 వేలు అందించారు. ఈవిషయం యాజమాన్యం దృష్టికి రావడంతో విజిలెన్స్ విచారణ చేపట్టగా..రైతుల నుంచి రూ.90 వేలు తీసుకున్నట్లు వెల్లడైంది. దీంతో వారిని సస్పెండ్ చేసింది. ఎవరైనా అవినీతికి పాల్పడితే 92810 33233 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని యాజమాన్యం కోరింది. ఎస్జీటీల సర్టిఫికెట్ల వెరిఫికేషన్విద్యారణ్యపురి: స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల ప్రక్రియలో భాగంగా మంగళవారం హనుమకొండ డీఈఓ కార్యాలయంలో ఎస్జీటీల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగింది. హనుమకొండ జిల్లాకు సంబంధించి సీనియారిటీ తాత్కాలిక జాబితాను వెల్లడించడంతో 460మందిని సర్వీస్బుక్స్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు పిలిచారు. మొత్తం 8 కౌంటర్లను ఏర్పాటుచేసి పరిశీలన జరిపారు. 360మంది వరకు వెరిఫికేషన్కు హాజరయ్యారు. అందరి వెరిఫికేషన్ పూర్తయ్యాక మరోసారి సీనియారిటీ జాబితా వెల్లడిస్తారు. చేయూత పెన్షన్ సకాలంలో అందించాలిహన్మకొండ: చేయూత పెన్షన్లను ముఖ గుర్తింపు పద్ధతి ద్వారా సకాలంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందజేయాలని, ఈ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చేయూత పెన్షన్ రాష్ట్ర డైరెక్టర్ గోపాల్ రావు సూచించారు. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయ ఆడిటోరియంలో వరంగల్ జిల్లా ఎంపీడీఓలు, సెక్షన్ క్లర్కులు, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్లు, బిల్ కలెక్టర్లకు చేయూత పెన్షన్లపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో గోపాల్రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రతీ గ్రామపంచాయతీలోని రిజిస్టర్లో పెన్షన్ పంపిణీ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. మరణించిన పెన్షన్దారులను వెంటనే ఆన్లైన్నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సదస్సులో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యదేవి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ముంపు సమస్యను ఎదుర్కోవాలి
ఏటూరునాగారం/కన్నాయిగూడెం: వర్షాకాలంలో తలెత్తే ముంపు సమస్యలను ఎదుర్కొనేందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా సమాయత్తం కావాలని, గతంలో వరద ముంపుతో ప్రజలు పడిన ఇబ్బందులు పునరావృతం కావొద్దని రాష్ట్ర రెవెన్యూ (విపత్తు నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ములుగు కలెక్టర్ దివాకర టీఎస్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, ఏఎస్పీ శివం ఉపాధ్యాయతో కలిసి జిల్లాలోని కన్నాయిగూడెం మండలంలోని సమ్మక్క బ్యారేజీ నీటినిల్వలు, గేట్ల వివరాలను పరిశీలించారు. ఎగువ ప్రాంతాల నుంచి నీరు ఎంతవరకు వస్తుందని, ఏ మేరకు నీటిని విడుదల చేస్తారని ఆరా తీశారు. సమ్మక్క సాగర్ బ్యారేజీకి ఎగువన ఉన్న లక్ష్మీ, సరస్వతీ, ఎస్సారెస్పీతోపాటు ఎగువన ఉన్న నదులు, ఉపనదుల నుంచి బ్యారేజీలోకి చేరుతుందని దివాకర తెలిపారు. బ్యారేజీ వద్ద ఉన్న 59 గేట్లను ఎత్తి దిగువకు వదులుతున్నట్లు తెలిపారు. బ్యారేజీ ఎగువన దేవాదుల ఎత్తిపోతల వద్ద 10 మోటార్లు మూడు ఫేజ్లలో ఉన్నాయని, దిగువన ఉన్న రిజర్వాయర్ల నీటి వినియోగాన్ని బట్టి పంపింగ్ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అరవింద్ కుమార్ మాట్లాడుతూ..వరదల ముంపు నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు ప్రణాళికల్లో భాగంగా ముంపు ప్రాంతాలను గుర్తించడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో తాగునీరు కలుషితం కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అప్రమత్తంగా ఉన్నాం.. ఈసందర్భంగా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ..వర్షాకాలంలో తక్షణ చర్యలకు అవసరమైన సిబ్బందిని, వాహనాలను సిద్ధంగా ఉంచామన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్రూమ్, టోల్ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 80 పునరావాస కేంద్రాలను ముందస్తుగా గుర్తించామన్నారు. బెడ్ షీట్లు, ఆహారం అందించేలా ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఐటీడీఏ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24/7గా పనిచేసేలా చర్యలు చేపట్టినట్లు ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మహేందర్జీ, ఆర్డీఓ వెంకటేశ్, ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ దామోదర్సింగ్, ఏపీఓ వసంతరావు, ఇరిగేషన్ అధికారి అప్పలనాయుడు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముందస్తు ప్రణాళికలతో అధికారులు సిద్ధంగా ఉండాలి రాష్ట్ర రెవెన్యూ (విపత్తు నిర్వహణ)ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ కన్నాయిగూడెంలో సమ్మక్క బ్యారేజీ పరిశీలన ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో వరద ముంపుపై సమీక్ష -
ట్రాలీఆటో ఢీకొని చిన్నారి మృతి
కమలాపూర్: ట్రాలీఆటో ఢీకొని 15 నెలల చిన్నారి మృతిచెందింది. ఈఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండేడులో మంగళవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గుండేడుకు చెందిన కాలేశ శ్రీకాంత్, తిరుమల దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. కూతురు రిషిక ఇంటిముందు ఆడుకుంటుండగా హసన్పర్తికి చెందిన గుండమీది శ్రీనివాస్ అనే వ్యక్తి ట్రాలీఆటోకు మైక్ పెట్టుకుని పెద్ద శబ్దంతో అల్లం, వెల్లుల్లి అమ్ముకుంటూ.. అతివేగంగా ఆటో నడుపుకుంటూ వచ్చి రిషికను ఢీకొట్టాడు. ఈప్రమాదంలో రిషిక అక్కడికక్కడే మృతిచెందగా డ్రైవర్ పారిపోయాడు. అప్పటివరకు తమతో ఆడుకున్న రిషిక రోడ్డు ప్రమాదంలో విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రిషిక తండ్రి శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు గుండమీది శ్రీనివాస్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ హరికృష్ణ తెలిపారు. జ్వరంతో యువతి..వాజేడు: ఏజెన్సీలో జ్వరంతో బాధపడుతున్న ఓ యువతి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి చనిపోయింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా వాజేడు మండలం కోయవీరాపురం గ్రామానికి చెందిన ఉయిక దీపిక(22) కొన్ని రోజులుగా జ్వరంతో బాధ పడుతోంది. గత నెల 29న వాజేడు వైద్యశాలలో చేరగా పరీక్షలు చేసి రెండు రోజులు వైద్యం అందించారు. ప్లేట్లెట్లు తక్కువగా ఉన్నట్లు తెలపడంతో వెంటనే ఏటూరునాగారంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేరగా నాలుగు రోజులు వైద్యం చేశారు. కుడివైపున నొప్పి వస్తుందని దీపిక తెలపడంతో పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం వరంగల్ వెళ్లాలని సూచించారు. వరంగల్కు తరలించి వైద్యం అందిస్తుండగానే దీపిక సోమవారం రాత్రి మృతి చెందింది. దీపిక బీఈడీకి ప్రిపేర్ అవుతుంది. మృతురాలి తండ్రి రామారావు నాలుగు సంవత్సరాల క్రితం చనిపోగా, తల్లి దేవమ్మ, అన్న కలిసి దీపికను చదివిస్తున్నారు. ప్రమాదవశాత్తు వాగులో పడి వృద్ధుడు..కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం బూజునూర్పల్లికి చెందిన మామిడాల ఇంద్రారెడ్డి (60) అనే వృద్ధుడు సోమవారం సాయంత్రం ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందినట్లు ఇన్స్పెక్టర్ హరికృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..ఇంద్రారెడ్డి సోమవారం గొర్రుకొట్టడానికి వెళ్లి సాయంత్రం గొర్రును, ఎద్దులను కడగటానికి దగ్గరలో ఉన్న వాగు వద్దకు వెళ్లాడు. ఎద్దులను కడిగిన అనంతరం గొర్రు కడుగుతుండగా ప్రమాదవశాత్తు వాగులో పడిపోయాడు. రాత్రయినా ఇంద్రారెడ్డి ఇంటికి రాకపోవడంతో స్థానికులతో కలిసి కుటుంబసభ్యులు ఇంద్రారెడ్డి కోసం వెతికారు. వాగు వద్ద ఎద్దులు, గొర్రు, వాగులో ఇంద్రారెడ్డి మృతదేహం కనిపించింది. మృతుడి భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ హరికృష్ణ పేర్కొన్నారు. -
కేయూలో ఉద్రిక్తత
కామన్ మెస్లో విద్యార్థుల ఆందోళనకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో కామన్ మెస్ వద్ద విద్యార్థులు మంగళవారం ఆందోళనకు దిగారు. కామన్మెస్లో వంటచేసేందుకు లారీలో 13టన్నుల లోడ్ కట్టెలు రావాల్సిండగా ట్రాక్టర్లో తక్కువగా తీసుకురావడంతో మెస్ కమిటీ బాధ్యులు ప్రశ్నించారు. లారీలో 12నుంచి 13టన్నులు రావాల్సిన కట్టెలను ట్రాక్టర్లో తక్కువగా ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. ఈసందర్భంగా సంబంధిత సిబ్బందితోనూ, అక్కడున్న కేర్టేకర్తోనూ వాగ్వాదానికి దిగారు. జాయింట్ డైరెక్టర్ అక్కడికి చేరుకోగా డైరెక్టర్ రావాలని డిమాండ్ చేశారు. దీంతో సమాచారం అందుకున్న కేయూ హాస్టళ్ల డైరెక్టర్ ప్రొఫెసర్ ఎల్పీ రాజ్కుమార్ కామన్ మెస్ వద్దకు చేరుకోగా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. లారీలోడ్కు బదులుగా సంబంధిత కాంట్రాక్టర్ ట్రాక్టర్లో కట్టెలు పంపారని ఇలా మిగతా వాటిల్లోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. కూరగాయలు సరఫరా చేసేవారు కూడా తక్కువగానే తీసుకొస్తున్నారని, భోజనం నాణ్యతగా ఉండటంలేదన్నారు. కామన్ మెస్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ మెస్ కమిటీ బాధ్యులు పలువురు, విద్యార్థులు హాస్టళ్ల డెరెక్టర్తో వాగ్వాదానికి దిగారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. హాస్టళ్ల నిర్వహణకు కమిటీ కూడా ఉంటుందని వీసీ, రిజిస్ట్రార్ వద్దకు వచ్చి మాట్లాడాలని మెస్ కమిటీ బాధ్యులకు, విద్యార్థులకు డైరెక్టర్ సూచించారు. ఆందోళన సమాచారం అందుకున్న కేయూ పోలీస్స్టేషన్ సీఐ రవికుమార్, ఎస్ఐ రవీందర్ ఇతర పోలీస్ సిబ్బందితో అక్కడి వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. పోలీసుల సమక్షంలోనూ డైరెక్టర్తో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీస్ అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. యూనివర్సిటీ అధికారులతో మాట్లాడాలని సూచించగా వీసీని కలిసేందుకు వెళ్లారు. వీసీతో సమావేశం.. మెస్ కమిటీ బాధ్యులు, కొందరు విద్యార్థులు కేయూలోని పరిపాలనా భవనం వద్దకు వచ్చారు. కేయూ వీసీ ఆచార్య కే ప్రతాప్రెడ్డి మెస్ కమిటీ బాధ్యులతో అకాడమిక్ కమిటీహాల్లో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మెస్ కమిటీ బాధ్యులు మాట్లాడుతూ.. మెస్లో అవకతవకలకు పాల్పడుతుండడంతో భోజనం నాణ్యతగా ఉండటం లేదని ఆరోపించారు. సూపర్వైజర్ నిరంజన్రెడ్డి, కేర్టేకర్ రాజు, హాస్టళ్ల డైరెక్టర్ను తొలగించాలని డిమాండ్ చేశారు. దీనికి వీసీ స్పందిస్తూ.. కేర్టేకర్ రాజును, సూపర్వైజర్ నిరంజన్రెడ్డిని కామన్మెస్ విధుల నుంచి తొలగిస్తున్నట్లు విద్యార్థులకు తెలిపారు. హాస్టళ్ల డైరెక్టర్ను కూడా మార్చాలని విద్యార్థులు డిమాండ్ చేయగా..ప్రస్తుతం హాస్టళ్ల డైరెక్టర్గా బాధ్యతలను నిర్వర్తించేందుకు ఎవరూ ముందుకు రావటం లేదని, త్వరలోనే కామన్మెస్ వ్యవహారంపై అవసరమైతే ఓ కమిటీ నియమిస్తామని, హాస్టళ్ల డైరెక్టర్గా రాజ్కుమార్ కొనసాగుతారని తెలిపారు. ఏమైనా సమస్యలు తలెత్తితే రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. కట్టెల సరఫరా కాంట్రాక్టు రద్దు.. కాకతీయ యూనివర్సిటీ కామన్మెస్కు కట్టెలను సరఫరా చేసే కాంట్రాక్టర్ కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు కేయూ హాస్టళ్ల డైరెక్టర్ ఆచార్య ఎల్పీ రాజ్కుమార్ తెలిపారు. సంబంధిత కాంట్రాక్టర్కు సమాచారం ఇచ్చామన్నారు. 13 టన్నులు రావాల్సిన కట్టెలను తక్కువగా తీసుకొచ్చారని ఆరోపణ కూరగాయల సరఫరాలో కూడా అవకతవకలు.. భోజనం నాణ్యతగా ఉండటం లేదని కేర్టేకర్, డైరెక్టర్తో వాగ్వాదం పోలీసులు నచ్చజెప్పినా వినని విద్యార్థులు మెస్ కమిటీ బాధ్యులు, విద్యార్థులతో వీసీ సమావేశం కేర్టేకర్, సూపర్వైజర్లను తొలగిస్తున్నట్టు ప్రకటన -
రామప్ప హుండీ ఆదాయం రూ.5.58 లక్షలు
వెంకటాపురం(ఎం): ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని రామప్ప దేవాలయానికి గత మూడు నెలలల్లో రూ.5,58,506 హుండీ ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ బిల్ల శ్రీనివాస్ తెలిపారు. గత మూడు నెలలుగా భక్తులు, పర్యాటకులు హుండీలో వేసిన కానుకలను మంగళవారం లెక్కించారు. దేవాదాయశాఖ పరిశీలకులు కవిత ఆధ్వర్యంలో శ్రీభ్రమరాంబిక సేవా సమితి సభ్యులు హుండీ కానుకలను లెక్కించారు. కార్యక్రమంలో ఆలయ ఆర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్, జూనియర్ అసిస్టెంట్ సుధాకర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పరమశివుడి అలంకరణలో రామలింగేశ్వరస్వామి రామప్ప దేవాలయంలోని రామలింగేశ్వరస్వామి మంగళవారం పరమశివుడి అలంకరణలో పర్యాటకులకు, భక్తులకు దర్శనమిచ్చినట్లు ఆలయ ప్రధాన ఆర్చకుడు కోమల్లపల్లి హరీశ్శర్మ తెలిపారు. శ్రావణమాసం సందర్భంగా రామలింగేశ్వరస్వామికి రోజుకో అలంకరణ చేస్తున్నట్లు వెల్లడించారు. -
టీవీ రిపేర్ పేరుతో ఇంట్లో చోరీ
నడికూడ: టీవీ మరమ్మతు చేస్తానంటూ వచ్చి ఓ ఇంట్లో దొంగతనం చేసిన ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం వరికోల్ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పరకాల ఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గాలీబ్ రాజు తన భార్యతో సోమవారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లాడు. ఇంటివద్ద ఉన్న తల్లిదండ్రుల వద్దకు 11 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి వచ్చి ‘మీ కొడుకు టీవీ రిపేరు చేయమన్నాడు..’ అని చెప్పి ఇంట్లోకి వెళ్లాడు. టీవీ గదిలో ఉన్న బీరువా తాళం పగలకొట్టి రూ.లక్షా 38 వేల విలువ గల రెండు బంగారు ఉంగరాలు, ఒక జత కమ్మలు, మాటీలు, బంగారు చైన్, వెండి పట్టగొలుసు, నగదు రూ.11,000 చోరీ చేసి.. టీవీ రీపేర్ పూర్తయ్యిందని చెప్పి వెళ్లిపోయాడు. 20 నిమిషాల అనంతరం రాజు తల్లిదండ్రులు ఇంటి లోపలికి వెళ్లిచూడగా బీరువా పగలగొట్టి ఉండడం గమనించి తమ కుమారుడికి సమాచారం ఇచ్చారు. బాధితుడు రాజు మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. -
యూరియా వచ్చిందయా !
ఖిలా వరంగల్: యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఊరట లభించింది. మంగళవారం మధ్యాహ్నం వరంగల్ రైల్వేస్టేషన్లోని గూడ్స్షెడ్కు వ్యాగన్ చేరింది. ఉమ్మడి జిల్లాలోని రైతులకు అందించేందుకు ఆర్సీఎఫ్ కంపెనీకి చెందిన యూరియా 1,319.220 మెట్రిక్ టన్నులు వచ్చింది. ఈ యూరియాను మార్క్ఫెడ్కు 60శాతం, ఇతర ఫర్టిలైజర్స్కు 40శాతం కేటాయించారు. మార్క్ఫెడ్ అధికారులు ప్రధానంగా ఎక్కడ కొరత ఉందో ఆ ప్రాథమిక సహకార సంఘాలకు లారీల్లో తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ సీజన్లో కావాల్సిన యూరియా మొత్తంలో 60శాతం పైగా ఇప్పటికే చేరింది. తాజాగా వచ్చిన దానితో సమస్యలు తీరినట్లేనని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. రైతులు యూరియా దొరకదనే ఆపోహలకు గురికాకుండా ఒకటి, రెండు బస్తాలు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. వీటి అమ్మకాలు పూర్తయితే మరింత వచ్చే వీలుందని జిల్లా వ్యవసాయాధికారి అనురాధ తెలిపారు. ఎలాంటి ఇబ్బందులున్నా మండల వ్యవసాయ అధికారులను సంప్రదించాలన్నారు. దాదాపు అన్ని మండలాల్లో తగినన్ని నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. ఒకేసారి కొనుగోలు చేయడం, కొనుగోలు చేసిన మొత్తాన్ని ఒకేసారి చల్లలేరని, తీసుకున్న యూరియాను పంటకు ఎక్కువగా చల్లడం వల్ల నష్టాలు వస్తాయని చెప్పారు. రైతులు ఎకరానికి 25 కిలోలకు మించి వినియోగించొద్దని అధికారులు సూచించారు. రైల్వే గూడ్స్షెడ్కు చేరిన యూరియా వ్యాగన్ ఉమ్మడి జిల్లాకు 1,319.220 మెట్రిక్ టన్నులు కేటాయింపు అన్ని మండలాల్లో తగినంత యూరియా ఉంది: అధికారులు -
● ఆదరణ లేని ‘ఆకాంక్ష’..
కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్న దుకాణాలు జిల్లాలోని స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తుల ప్రదర్శన స్టాళ్లను ఆకాంక్ష పేరుతో జిల్లా కేంద్రంలోని తొర్రూరు బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేశారు. ఆదివాసీ కళాకారులు, గ్రామీణ పారిశ్రామికులు తయారు చేసిన జనపనార సంచులు, తేనె తదితర గిరిజన ఉత్పత్తులను ప్రదర్శించడం, అమ్మకాలు జరపడంతో పాటు ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసిన స్టాళ్లకు ఆదరణ కరువైంది. పూర్తిస్థాయిలో స్టాళ్లను ఏర్పాటు చేయడంలో సంబంధిత శాఖ అధికారులు విఫలమయ్యారు. అంతేకాక ఏర్పాటు చేసిన స్టాళ్లకు కూడా సరైన ప్రచారం లేక వెలవెలబోతున్నాయి. – సాక్షి, స్టాఫ్ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్ -
‘ఆరు’లోనే అర్హురాలైందట..!
● ఇందిరమ్మ ఇంటి కోసం వెళ్లిన మహిళకు వింత అనుభవం బయ్యారం: ఆరో తరగతి చదువుతున్న సమయంలో ఇందిరమ్మ ఇంటికి అర్హులరాలిని చేయడమే కాకుండా ఆమె పేరున రూ.22,350 నగదును ఖాతాలో జమ, రూ.7,500విలువైన సిమెంట్ బస్తాలు ఇచ్చినట్టు రికార్డుల్లో వెలుగు చూసింది. ఈ ఘటన బయ్యారం మండలంలో చర్చనీయాంశంగా మారింది. మండలంలోని బాలాజీపేటకు చెందిన గుగులోత్ లాలు కుమార్తె బేబి 2008వ సంవత్సరంలో ఆరో తరగతి చదివింది. 2014లో బేబికి బాల్యాతండాకు చెందిన వినోద్తో వివాహం జరిపించారు. బాల్యాతండాలో రేకుల ఇంట్లో ఉంటున్న బేబి కుటుంబం ఇటీవల ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంది. ఇంటి మంజూరుకు అన్ని అర్హతలు బేబికి ఉన్నప్పటికీ గృహనిర్మాణశాఖ వెబ్సైట్లో ఆమె ఫొటోతో చూపెడుతున్న వివరాలు ఇంటి మంజూరుకు అడ్డుగా మారాయి. 2008లో బేబి పేరున ఇల్లు మంజూరు కావడంతో పాటు గంధంపల్లిలోని ఎస్బీఐ బ్రాంచ్లో రూ.22,350 నగదు ఖాతాలో జమచేసినట్లు, రూ.7,500 విలువైన 50 సిమెంట్కట్టలు ఇచ్చినట్టు రికార్డులో ఉంది. చదువుకుంటున్న సమయంలో తనకు ఇల్లు ఇచ్చినట్టు రికార్డుల్లో తప్పుడు వివరాలు నమోదు చేయటం ఏమిటని బేబి వాపోతోంది. తన ఆధార్కార్డు ఫొటోను జగ్గుతండాకు చెందిన గుగులోత్ బేబి, హచ్చ పేరుకు అనుసంధానం చేసి ఇల్లును మంజూరైనట్టు గృహనిర్మాణశాఖ వెబ్సైట్లో నమోదు చేశారని, తనకు ఇల్లు మంజూరు చేయాలని బేబి పలుమార్లు జిల్లా ఉన్నతాధికారులను కలిసి వేడుకుంది. నాటి అధికారులు చేసిన తప్పుకు తాను బలవుతున్నానని, ఇప్పటికై నా అధికారులు పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తోంది. -
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
మహబూబాబాద్: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సామ మల్లారెడ్డి, టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిద్దోజు కవిత డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, అదే బాటలో ప్రస్తుత ప్రభుత్వం నడుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచినా.. సమస్యల పరిష్కారంలో చొరవ చూపడం లేదన్నారు. పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. ఇప్పటికై నా సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 23న హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద ధన్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. విద్యావ్యవస్థలో పర్యవేక్షణను పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు. -
తప్పని నిరీక్షణ
ఏడు నెలలుగా విడుదల కాని నిధులు.. వీధి వ్యాపారులకు 2024 డిసెంబర్ వరకు రుణాలు మంజూరు చేశారు. 2025 జనవరి నుంచి నేటి వరకు నిధులు విడుదల కాకపోవడంతో రుణాలు మంజూరు చేయలేదని అధికారులు తెలిపారు. దీంతో వీధి వ్యాపారుఉలు రుణాల కోసం బ్యాంకులు, మెప్మా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మెప్మాకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో వ్యాపారులకు సమాధానం చెప్పలేకపోతున్నామని అధికారులు అంటున్నారు. మహబూబాబాద్: రుణాల మంజూరు కోసం వీధి వ్యాపారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఏడు నెలలుగా మెప్మా కార్యాలయం, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని, అందుకే రుణాల మంజూరులో జాప్యం జరుగుతుందని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) అధికారులు చెబుతున్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పని చేస్తున్న మెప్మా డ్వాక్రా గ్రూపు మహిళలకు మాత్రం ఎప్పటికప్పుడు రుణాలు మంజూరు చేస్తూ వారి ఆర్థిక ప్రగతికి దోహదపడుతోంది. కాగా, గత సంవత్సరం డ్వాక్రాగ్రూపులకు రూ.72 కోట్ల రుణాలు చెల్లించి, లక్ష్యం పూర్తి చేశారు. వేల సంఖ్యలో వీధి వ్యాపారులు.. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో ఉన్న వీధి వ్యాపారుల వివరాలను నమోదు చేశారు. ● మానుకోట మున్సిపాలిటీ పరిధిలో 5,556 మంది వీధి వ్యాపారులు ఉన్నారు. తొర్రూరు 1,075మంది, మరిపెడ 1,230మంది, డోర్నకల్ లో 927మంది వీధి వ్యాపారులు ఉన్నారు. ఇటీవల కేసముద్రం మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయ్యింది. కాగా, ఆ వివరాలను నమోదు చేయలేదని అధికారులు తెలిపారు. వీధి వ్యాపారుల కు కేంద్రం రుణాలను మంజూరు చేస్తోంది. ● 2024 డిసెంబర్ వరకు మానుకోట మున్సిపాలిటీ పరిధిలో 5188 మందికి రూ.1,0000 చొప్పున రుణం మంజూరు చేసింది. అలాగే తొర్రూరులో 950మంది, మరిపెడలో 1166 మంది, డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో 907 మందికి రుణాలు మంజూరు చేసింది. ● అలాగే మానుకోట మున్సిపాలిటీ పరిధిలో 2016మందికి రూ .20,000 చొప్పున రుణం మంజూరు చేశారు. తొర్రూరులో 396మంది, మరిపెడలో 282మంది, డోర్నకల్లో 499 మందికి రుణాలు మంజూరు చేశారు. ● అదేవిధంగా మానుకోట మున్సిపాలిటీ పరిధి లో 567 మందికి రూ.50,000రుణం మంజూరు చేశారు. తొర్రూరులో 100మంది, మరిపెడలో 103మంది, డోర్నకల్లో 57 మందికి రుణాలను మంజూరు చేసింది. రుణాలతో మహిళా సంఘాల ఉపాధి.. వీధి వ్యాపారుల పరిస్థితికి భిన్నంగా డ్వాక్రా గ్రూపు సభ్యులు రుణాలు తీసుకొని వ్యాపారులు కొనసాగిస్తున్నారు. పచ్చళ్ల తయారీ, మగ్గం వర్క్స్, కిరాణ షాపు, టెంట్హౌస్, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఇతర వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికాభివృద్ధి చెందుతున్నారు. రుణాల మంజూరుకోసం వీధివ్యాపారుల ఎదురుచూపులు ఏడు నెలలుగా విడుదల కాని నిధులు డ్వాక్రా గ్రూపు రుణాల లక్ష్యం పూర్తి ఉపాధి పొందుతున్న మహిళలునిధులు మంజూరు కాలేదు.. తీసుకున్న రుణాలను డ్వాక్రా గ్రూపు సభ్యులు, వీధి వ్యాపారులు కూడా సకాలంలో చెల్లించాలి. చెల్లిస్తే మళ్లీ తీసుకున్న దాని కంటే అదనంగా రుణం మంజూరు అవుతుంది. కొత్త సంఘాల ఏర్పాటు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వీధి వ్యాపారులకు గత ఏడాది డిసెంబర్ వరకు రుణాలు మంజూరయ్యాయి. కొత్త రుణాలకు నిధులు మంజూరు కాలేదు. – విజయ, మెప్మా పీడీ -
నాణ్యమైన సేవలు అందించాలి
● అదనపు కలెక్టర్ అనిల్కుమార్ మహబూబాబాద్: వినియోగదారులకు నా ణ్యమైన, వేగవంతమైన సేవలు అందించాలని అదనపు కలెక్టర్ అనిల్కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో మంగళవారం జిల్లాలోని మీసేవ కేంద్రాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. అదనపు చార్జీలు వసూళ్లు చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తప్పిదాలు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. దరఖాస్తుదారులతో మర్యాదగా నడుచుకోవాలన్నారు. సమావేశంలో ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీకాంత్, సిబ్బంది రఘుపతి, రాకేశ్ శర్మ, అశోక్ కుమార్, మీసేవ కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు. పీఆర్టీయూ పోరాటాలతోనే పదోన్నతుల ప్రక్రియగార్ల: పీఆర్టీయూ పోరాటాల ఫలితంగా రాష్ట్రంలో ఉపాధ్యాయ పదోన్నతుల ప్రక్రియ ప్రారంభమైందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మిర్యాల సతీష్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని పలు పాఠశాలల్లో చేపట్టిన పీఆర్టీయూ సభ్యత్వ ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పీఆర్టీయూ ఆధ్వర్యంలో సీపీఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న హైదరాబాద్లో చేపట్టే ధర్నాలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పీఆర్టీయూ మండల అధ్యక్షుడు చింతనిప్పు రమేశ్, ప్రధాన కార్యదర్శి మహమూద్ అలీ, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ సురేందర్రెడ్డి, జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, రమేశ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలిమహబూబాబాద్: సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్ర కార్యదర్శి అలుగు వర్షిణి అన్నారు. మంగళవారం హైదరాబాద్నుంచి ఆమె సోషల్ వెల్ఫేర్ స్కూళ్లలో డైట్ కమిటీలు తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అలుగు వర్షిణి మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలన్నారు. హాస్టళ్లలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా భోజనం, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. వీసీలో జిల్లా నుంచి ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, అదనపు కలెక్టర్ అనిల్కుమార్, అధికారులు పాల్గొన్నారు. ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి ● బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ధర్మారావుకేసముద్రం: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 11ఏళ్లుగా సాధించిన ప్రగతి, చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు అన్నారు. మంగళవారం కేసముద్రంలో మహాసంపర్క్ అభియాన్లో భాగంగా ఇంటింటికీ బీజేపీ– ప్రతీ ఇంటికి పోలింగ్ బూత్ అధ్యక్షుడు అనే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ధర్మారావు మాట్లాడారు. ప్రధాని మోదీ పాలనలో సాధించిన విజయాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచందర్రావు, మండల అధ్యక్షుడు రమేశ్, జి ల్లా కౌన్సిల్ మెంబర్ నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగేశ్వరాచారి, నాయకులు వెంకట్రెడ్డి, ఉపే ందర్, మధుకర్, మహేందర్, వెంకటేష్ తదితరులు ఉన్నారు. -
ఎదురుచూపులు
బుధవారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2025– 10లోuసాక్షి, మహబూబాబాద్: ఆరోగ్య సమస్యలు, ఇతర కారణాలతో బిడ్డలను కనలేని తల్లిదండ్రులు పిల్లలను దత్తత తీసుకునేందుకు దరఖాస్తు చేసుకుంటున్నారు. మారిన పరిస్థితులు, చట్టాల అమలు నేపథ్యంలో దొడ్డిదారిన కాకుండా రాజమార్గంలో దత్తత తీసుకునేందుకు దరఖాస్తులు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కాగా జిల్లాలో ఆడపిల్లలు కావాలని ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. అయితే నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకున్న మూడేళ్ల తర్వాత ఆడపిల్లలను దత్తత ఇస్తారు. దీంతో దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. గతంలో గుట్టుచప్పుడు కాకుండా.. గతంలో పిల్లలను గుట్టుచప్పుడు కాకుండా దత్తత తీసుకునేవారు. ఈమేరకు మహబూబాబాద్, కురవి, తొర్రూరు, బయ్యారం మండలాలకు చెందిన పలు శిశు విక్రయాలు, అక్రమ దత్తతపై ఇప్పటికే కోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో సీ్త్ర, శిశు సంక్షేమశాఖ, వైద్యారోగ్య, పోలీసు మొదలైన శాఖలు సమన్వయంతో శిశువిక్రయాలు, అక్రమ దత్తతపై నిఘా పెట్టాయి. ప్రధానంగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత మరో కాన్పుకోసం ఎదురుచూసే తల్లిదండ్రులు, పోక్సో కేసుల్లో గర్భిణులు, ఇతర కారణాల వల్ల గర్భం దాల్చిన వారిపై దృష్టి పెట్టారు. ఇందుకోసం ఏఎన్ఎం, ఆశవర్కర్లు, అంగన్వాడీ టీచర్లను సమన్వయం చేయడంతో గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం జరిగే వరకు పర్యవేక్షించి పుట్టిన బిడ్డను తీసుకొని శిశుగృహకు సరెండర్ చేస్తున్నారు. అమ్మా అని పిలిపించుకోవాలని.. అమ్మా అని పిలిపించుకోవాలనే తపనతో ఏదోరకంగా శిశువును తెచ్చుకొని పెంచుకునే సందర్భంలో వచ్చే సమస్యలతో ఇబ్బంది పడడం కన్నా రాజమార్గంలో దత్తత తీసుకునేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. కాగా, జిల్లాలో దత్తత కోసం సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ(కారా) వెబ్సైట్లో 2015 నుంచి ఇప్పటివరకు 60 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 19 మంది దంపతులు 22 మంది పిల ్లలను తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా నుంచి 31 మంది వెయిటింగ్లో ఉన్నారు. కారా నిబంధనల ప్రకారం దత్తత తీసుకునే తల్లిదండ్రులు శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా, ఆర్థికంగా యోగ్యత కలిగి ఉండాలి. ప్రాణాంతకమైన వైద్య పరిస్థితి ఉండకూడదు, నేర చరిత్ర లేకుండా ఉండాలి. సింగిల్ పేరెంట్ పురుషుడు అయితే ఆడపిల్లను దత్తత ఇవ్వరు. శిశువుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెరిగే విధంగా రూపొందించిన నిబంధనల మేరకు దత్తత ఇస్తారు. జిల్లా నుంచి ఎక్కువ పిల్లల సరెండర్.. రకరకాల పరిస్థితుల్లో పిల్లలను పెంచుచోలేని కుటుంబాల నుంచి పిల్లలను సేకరించి శిశుగృహాలకు తరలించడంలో మహబూబాబాద్ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. బాలల పరిరక్షణ విభాగం, అంగన్వాడీ, ఆశవర్కర్లు, ఏఎన్ఎం ద్వారా ప్రతీ గ్రామంలో పిల్లలు వద్దనుకున్న, అక్రమ దత్తత తీసుకున్న వారిని గుర్తించి.. వారికి కౌన్సెలింగ్ నిర్వహించి 2018 నుంచి ఇప్పటి వరకు 38 మందిని సరెండర్ చేసుకున్నారు. అనంతరం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో వారిని కారా పోర్టల్ ద్వారా దత్తతకు పంపించారు. ఇలా జిల్లా నుం,ఇ సేకరించిన పిల్లలను ఇతర ప్రాంతాలకు దత్తత ఇవ్వడం, జిల్లాకు నుంచి వచ్చిన దరఖాస్తు దారులకు ఇతర ప్రాంతాల పిల్లలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే దత్తత తీసుకునేందుకు వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువ శాతం ఆడపిల్ల కావాలని వచ్చినవి ఉండడంతో దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. నిబంధనల మేరకు దత్తత.. పిల్లలు అవసరం లేదు అనుకునే వారు సమీపంలోని అంగన్వాడీ టీచర్, ఆశవర్కర్లకు చెబితే చాలు శిశువును తీసుకెళ్లి శిశుగృహంలో అన్ని వసతులతో పెంచుతాం. కారా నిబంధనల మేరకు దత్తత ఇస్తాం. శిశు విక్రయాలు, ఇతర మార్గాల ద్వారా దత్తత తీసుకోవద్దు. భార్యాభర్తల అంగీకారంతో దత్తత కోసం దరఖాస్తు చేసుకుంటే అన్ని అర్హతలను పరిశీలించి రాజమార్గంలో శిశువును తీసుకెళ్లి పెంచుకోవచ్చు. – శిరీష, డీడబ్ల్యూఓన్యూస్రీల్పిల్లల దత్తత కోసం దరఖాస్తులు ఆడపిల్లలు కావాలని అధికంగా వినతులు ‘కారా’ నిబంధనల మేరకు ప్రక్రియ దరఖాస్తుదారులకు తప్పని నిరీక్షణ శిశువిక్రయాలపై ప్రత్యేక నిఘాదత్తత తీసుకునే వారి వయసు, పిల్లల వయసు వివరాలు పిల్లల వయసు భార్యాభర్తలిద్దరిది కలిపి సింగిల్ పేరెంట్ 0– 2 సంవత్సరాలు 85 సంవత్సరాలు 40 సంవత్సరాలు 2–4 సంవత్సరాలు 90 సంవత్సరాలు 45 సంవత్సరాలు 4–8 సంవత్సరాలు 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు 8–18 సంవత్సరాలు 110 సంవత్సరాలు 55 సంవత్సరాలు -
సద్వినియోగం చేసుకోవాలి
తొర్రూరు: ప్రభుత్వ జూనియ ర్ కళాశాలల్లో ఉచిత విద్య, పు స్తకాలు అందిస్తున్నామని, వి ద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్మీడియట్ బో ర్డు జాయింట్ సెక్రటరీ వసుంధర దేవి అన్నారు. మంగళవారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన ఆమె రాష్ట్రంలోని 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించినట్లు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేర్పించాలని కోరారు. డోర్ టు డోర్ ప్రచారం ద్వారా అడ్మిషన్లు పెంచాలని అధ్యాపకులకు సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అరుణ, అధ్యాపకులు నారాయణ, సువర్ణ, ఉప్పలయ్య, నర్సయ్య, మల్లయ్య, రాజేశ్, అనిత, అలీ పాల్గొన్నారు. -
21న వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు
రామన్నపేట : వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నూతన పాలకవర్గ ఎన్నికకు ఈనెల 21న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎలక్షన్ ఆఫీసర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా సహకార అధికారి ఎం. వాల్యా నాయక్ తెలిపారు. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 8,11, 12 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ, 13న పరిశీలన, 14న నామినేషన్ల ఉపసంహరణ, తుది జాబితా, గుర్తుల కేటాయింపు, 21న పోలింగ్, పోలింగ్ అనంతరం ఫలితాలు ప్రకటిస్తామని వివరించారు. ఫలితాల ప్రకటన తర్వాత మూడు రోజుల్లో ఆఫీస్ బేరర్స్ ఎన్నికల ఉంటాయని పేర్కొన్నారు. బ్యాంక్ పాలకవర్గంలో మొత్తం 12 మంది సభ్యులకు గాను ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి ఒక స్థానం, మహిళా కేటగిరీకి రెండు స్థానాలు, ఓపెన్ కేటగిరీకి 9 స్థానాలు రిజర్వ్ చేసినట్లు తెలిపారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ కార్యక్రమం ఓ సిటీ రోడ్డులోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో, పోలింగ్, ఓట్ల లెక్కింపు ఏవీవీ కళాశాలలో జరుగుతుందని వివరించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అదుపు తప్పిన బైక్.. ఫర్టిలైజర్ నిర్వాహకుడి దుర్మరణంహసన్పర్తి: బైక్ అదుపు తప్పిన ఘటనలో ఓ ఫర్టిలైజర్ షాపు నిర్వాహకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధిలోని రామారం సమీపంలో సోమవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కమలాపూర్ మండలం శనిగరం గ్రామానికి చెందిన సాంబశివరావు(46) స్థానికంగా లక్ష్మీ పేరుతో ఫర్టిలైజర్ షాపు నిర్వహిస్తున్నాడు. సోమవారం వ్యక్తిగత పనుల నిమిత్తం శనిగరంనుంచి హనుమకొండ వైపునకు బయల్దేరాడు. రామారం వద్దకు చేరుకోగానే బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ఘటనలో సాంబశివరావు అక్కడకక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న కాకతీయ యూనివర్సిటీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. ఎంజీఎం మార్చురీలో భద్రపరిచిన సాంబశివరావు మృతదేహాన్ని ఫర్టిలైజర్ అసోసియేషన్ నాయకులు సందర్శించి నివాళులర్పించారు. సాంబశివరావు కుటుంబానికి తమ అసోసియేషన్ అండగా ఉంటుందని సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకన్న తెలిపారు. నివాళులర్పించిన వారిలో లెక్కల పున్నంచందర్రెడ్డి ఉన్నారు. -
చదువు.. క్రీడలు..
ఏషియన్ పారా తైక్వాండో పోటీల్లో రీసెర్చ్ స్కాలర్ కృష్ణవేణి ప్రతిభకేయూ క్యాంపస్: మలేషియాలో గత నెల30, 31తేదీల్లో నిర్వహించిన ఏషియన్ పారా తైక్వాండో చాంపియన్షిప్ పోటీల్లో కాకతీయ యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్మేనేజ్మెంట్ విభాగం పరిశోధకురాలు మాచర్ల కృష్ణవేణి కాంస్య పతకం సాధించారు. భారతదేశం తరఫున పాల్గొన్న ఆమె ఇండియన్ పారా తైక్వాండో ప్రెసిడెంట్ వీణ చేతులమీదుగా పతకం అందుకున్నారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్కు చెందిన ఎల్లగౌడ్ – హైమావతి దంపతుల కుమార్తె కృష్ణవేణి. తండ్రి ప్రైవేట్ డ్రైవర్గా పనిచేస్తుండగా, తల్లి గృహిణి. కృష్ణవేణి హనుమకొండ సుబేదారిలోని దివ్యాంగుల హాస్టల్లో ఉంటూ చదువుతున్నారు. మరోవైపు క్రీడల్లోనూ రాణిస్తున్నారు. తైక్వాండో పోటీలకు ఆన్లైన్లోనే ఈ.గణేష్ కోచింగ్ ఇస్తుండగా, జనగామలోని తైక్వాండో కోచింగ్ ఇనిస్టిట్యూట్లో శిక్షణ తీసుకుంటున్నారు. ఆర్థిక సహకారంతో ఏషియన్ పోటీలకు.. మలేషియాలో ఏషియన్ పారా తైక్వాండో చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనేందుకు మాచర్ల కృష్ణవేణికి ఆర్థికపరమైన సమస్య ఏర్పడగా కాకతీయ యూనివర్సిటీ నుంచి అధికారులు రూ.25వేలు అందజేశారు. కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికాలోని ప్రవాస భారతీయులు, ఆ అసోసియేషన్ వ్యవస్థాపకులు ఎన్.శ్రీనివాస్గౌడ్, డాక్టర్ గిరిగౌడ్, డాక్టర్ అతికం శ్రీనివాస్గౌడ్ కలిపి రూ.1.40లక్షలు అందించారు. దాతల ఆర్థికసాయంతో ఏషియన్ పారా తైక్వాండో పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొని ప్రతిభ చూపి కాంస్య పతకం సాఽధించిన కృష్ణవేణికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయ, జాతీయస్థాయి పోటీల్లోనూ.. గతేడాది 2024లో కాంబోడియాలో నిర్వహించిన అంతర్జాతీయ పారా త్రోబాల్ పోటీల్లోనూ బంగారు పతకం సాధించారు. అలాగే, గత మార్చిలో ఫస్ట్ ఏషియన్ పారా త్రోబాల్ చాంపియన్ షిప్లో కాంస్యపతకం సాధించారు. చిన్నప్పటినుంచి చదువుతోపాటు వివిధ క్రీడాపోటీల్లో పాల్గొంటున్న కృష్ణవేణి పారా సిట్టింగ్ వాల్బాల్లోనూ ప్రతిభ చూపుతున్నారు. 2021లో కర్ణాటక ఉడిపిలో జరిగిన జాతీ యస్థాయి సిట్టింగ్ వాలీబాల్ పొటీల్లో, 2024 మా ర్చిలో రాజస్థాన్లో జరిగిన జాతీయస్థాయి సిట్టింగ్ వాలీబాల్ పోటీల్లో, తమిళనాడు ఈరోడ్లో జరిగిన సిట్టింగ్ వాలీబాల్ పోటీల్లోనూ ప్రతిభ చూపారు. కృష్ణవేణి కామర్స్విభాగంలో పరిశోధకురాలు.. కాకతీయ యూనివర్సిటీలోనే కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో పీజీ కోర్సు చేశాక మూడేళ్లుగా ఇదే విభాగంలో పరిశోధకురాలుగా పీహెచ్డీ చేస్తున్నారు. ‘ప్రాబ్లమ్స్ ఆండ్ ప్రాస్పెక్టివ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్విస్ట్మెంట్ ఇన్ఇండియా ఏ స్టడీ’ అనే అంశంపై ఆ విభాగం ప్రొఫెసర్ నర్సింహాచారి పర్యవేక్షణలో పరిశోధన సాగిస్తున్నారు. అభినందించిన వీసీ, రిజిస్ట్రార్ క్రీడాకారిణి మాచర్ల కృష్ణవేణిని సోమవారం యూని వర్సిటీలో వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం శాలువా కప్పి సన్మానించారు. జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణవేణి క్రీడల్లో రాణిస్తూ పతకాలు సాధిస్తూ విశ్వవిద్యాలయానికి గర్వకారణంగా నిలుస్తున్నారన్నారు. ఇత ర విద్యార్థులకు ప్రేరణగా నిలిస్తున్నారన్నారు. కార్యక్రమంలో కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ పి.అమరవేణి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణవేణి, స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య, దివ్యాంగుల సెల్ డైరెక్టర్ డాక్టర్ ఎ.రాజు, తదితరులు పాల్గొన్నారు. అభినందించిన వీసీ, రిజిస్ట్రార్ -
దైవదర్శనానికి వెళ్లొస్తూ అనంతలోకాలకు..
మహబూబాబాద్ రూరల్/శాలిగౌరారం : శ్రీశైలం మల్లికార్జునస్వామి వారి దైవదర్శనానికి వెళ్లొస్తూ ఓ వ్యక్తి అనంతలోకాలకు చేరాడు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడిన ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన 365వ నంబర్ జాతీయ రహదా రిపై నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం మా ధారంకలాన్ గ్రామం వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఈ ప్రమాదంతో మహబూబా బాద్ జిల్లా కేంద్రంలోని బాబునాయక్ తండా, వినా యక తండా, పత్తిపాక ప్రాంతాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు, శాలిగౌరారం ఎస్సై సైదులు కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయకతండా, బాబు నాయక్ తండా, పత్తి పాక ప్రాంతాలకు చెందిన 14 మంది తాపీ మేసీ్త్రలు ఆదివారం ఉదయం ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో శ్రీశైలం మల్లికార్జునస్వామివారి దర్శనా నికి వెళ్లారు. దర్శనం అనంతరం వీరు తిరిగి స్వగ్రామానికి వస్తుండగా.. డ్రైవర్ గుండెపాక నవీన్ అతివేగం, అజాగ్రత్తగా నడుపుతూ 365వ నంబర్ జాతీయ రహదారిపై శాలిగౌరారం మండలం మాధారంకలాన్ గ్రామం వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఆటోను ఢీకొట్టాడు. దీంతో ట్రావెల్స్ బస్సు రహదారి పక్కన ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న బానోత్ మంగీలాల్(42) తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. బానోత్ రమేశ్, బానోత్ లాలు, భూక్య సర్వం, అంబోతు శ్రీను, గుగులోత్ నరేశ్, భూక్య వీరన్కు తీవ్రగాయాలు కాగా.. మరో ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే వారి కుటుంబీకులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను నల్లగొండ, నకిరేకల్, హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన లచ్చిరాం, నరేశ్ మహబూబాబాద్కు తరలించి ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మృతుడి భా ర్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్సై సైదులు తెలిపారు. బోల్తా పడిన ట్రావెల్స్ బస్సు.. ఒకరి మృతి 13 మందికి తీవ్ర గాయాలు నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలో ఘటన -
ఓవరాల్ చాంపియన్ ఖమ్మం
అండర్–16 బాలికల విజేత హనుమకొండ ముగిసిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలువరంగల్ స్పోర్ట్స్: అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ అథ్లెటిక్స్ అసోయేషన్ల ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రెండు రోజుల పాటు నిర్వహించిన 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు సోమవారం ముగిశాయి. అండర్–14, 16, 18, 20 బాలబాలికల విభాగంలో నిర్వహించిన పోటీల్లో 33 జిల్లాల నుంచి 1,400 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లు.. ఆయా జిల్లాల అథ్లెట్ల మధ్య హోరాహోరీగా సాగిన వివిధ పోటీల్లో ఖమ్మం జిల్లా ఓవరాల్ చాంపియన్షిప్ను కై వసం చేసుకుంది. అండర్–18 బాలుర కేటగిరీలో మహబూబ్నగర్, బాలికల అండర్–18 విభాగంలో ఖమ్మం, అండర్–16 బాలుర విభాగంలో రంగారెడ్డి, అండర్–16 బాలికల విభాగంలో హనుమకొండ జిల్లా విజేతలుగా నిలిచాయి. ముగింపు వేడుకలకు ఆర్యవైశ్య సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు గట్టు మహేశ్బాబు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు చాంపియన్షిప్ కోసం పోటీలో పాల్గొన్న ప్రతీ అథ్లెట్ విజేతే అన్నారు. పతకం సాధించలేదని ఆందోళన చెందకుండా, మరోసారి బరిలోకి దిగి లక్ష్యం సాధించాలన్నారు. -
తెల్లారేసరికి బూడిదే మిగిలింది!
టేకుమట్ల: షార్ట్ సర్క్యూట్తో ఓ బట్టల షాపులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో షాపు పూర్తిగా దగ్ధమై తెల్లారేసరికి బూడిదే మిగిలింది. దీంతో చేసేదేమీలేక బాధితులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో చోటుచేసుకుంది. ఈ ఘట నకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భ ద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన శ్రీని వాస్ 2012లో టేకుమట్ల మండల కేంద్రంలో బట్టల షాపును ప్రారంభించి ఇక్కడే స్థిరపడ్డాడు. ఈ క్ర మంలో ఆదివారం అర్ధరాత్రి 11 గంటలకు విద్యుత్ స్తంభంపైకి పాము ఎక్కడంతో షార్ట్ సర్క్యూట్ సంభవించి షాపులో మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన యజమాని శ్రీనివాస్ విద్యుత్ నిలిపి మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. దీంతో చేసేదేమీ లేక చుట్టుపక్కల వాళ్లను పిలిచి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. షాపు షెట్టర్ రాకపోవడంతో జే సీబీతో తొలగించారు. అలాగే, వెంటనే ఫైర్ ఇంజన్ కు సమాచారం అందించారు. అగ్నిమాపక అధికా రులు వచ్చేసరికే షాపు మొత్తం కాలి బూడిదైంది. మిగిలింది బూడిదే.. మండల కేంద్రంలో అర్ధరాత్రి మారుతి బట్టల షాపులో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఏ ఒక్క వస్తువు మిగులకుండా పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో రూ. 20 లక్షల నగదుతోపాటు షాపులో ఉన్న సుమారు రూ.30 లక్షల విలువైన స్టాక్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. వాటితో పాటు ఫర్నిచర్, కౌంటర్ ఏ ఒక్క వస్తువు కూడా మిగలకుండా కాలి బూడిదైంది. షాపు పైఅంతస్తులో ఉన్న కుటుంబ సభ్యులు ప్రమాద సమయంలో వెంటనే కిందికి రావడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ అగ్ని ప్రమాదంలో బూడిదే మిగిలిందని పొట్ట చేత పట్టుకుని మండల కేంద్రానికి వలస వచ్చిన శ్రీనివాస్తోపాటు కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎమ్మెల్యే గండ్ర పరామర్శ.. షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైన మండల కేంద్రంలోని మారుతి బట్టల షాపును ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సోమవారం పరిశీలించారు. అనంతరం బాధితులను పరామర్శించి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానన్నారు. ఎగసిపడిన మంటలతో ఏం చేయలేకపోయాం.. షార్ట్ సర్క్యూట్ సంభవించిన కొన్ని నిమిషాల్లోనే షాపులో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. మోటారు పైపు సాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. కళ్లముందే ఎగసిపడే మంటల్లో షాపు దగ్ధమవుతుంటే గుండెలు పగిలాయి. ఎంత ప్రయత్నించినా ఏం చేయలేకపోయా. ఫైర్ ఇంజన్ వచ్చేసరికి షాపు పూర్తిగా దగ్ధమైనది. ఇప్పుడు నాకు మిగిలింది బూడిదే. – శ్రీనివాస్, మారుతి బట్టల షాపు యజమాని బట్టల షాపులో అగ్నిప్రమాదం రూ. 50 లక్షల మేర ఆస్తి నష్టం అగ్ని ప్రమాదానికి కారణం పాము.. కన్నీరుమున్నీరవుతున్న బాధితులు -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
● వివరాలు వెల్లడించిన డీఎస్పీ తిరుపతిరావు మహబూబాబాద్ రూరల్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసినట్లు మహబూబాబాద్ డీఎస్పీ ఎన్.తిరుపతిరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం మహబూబాబాద్ టౌన్ పోలీసు స్టేషన్లో వివరాలు వెల్లడించారు. టౌన్ ఎస్సై కె.శివ సిబ్బందితో కలిసి నర్సంపేట బైపాస్లో వాహనాల తనిఖీ చేస్తుండగా బైక్పై వచ్చిన ఓ వ్యక్తి అనుమానాదాస్పదంగా కనిపించాడు. దీంతో పోలీసులు అతడిని ఆపగా, పారిపోయేందుకు యత్నించడంతో అదుపులోకి తీసుకుని విచారించి ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా (రాజమహేంద్రవరం జిల్లాకేంద్రం) గోకవరం మండలం ఎస్సీపేట దేవీచౌక్ గ్రామానికి చెందిన గొర్రెల చిన్నబాబుగా గుర్తించారు. చిన్నబాబు గత మే 31వ తేదీన డోర్నకల్లో ఓ బైక్, మహబూబాబాద్లోని రామచంద్రాపురంలో 4.5 గ్రాముల బంగారు, 8 గ్రాముల వెండి ఆభరణాలు, ఆర్టీసీ కాలనీలో 4 గ్రాముల వెండి ఆభరణాలు చోరీకి పాల్పడగా ఆ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వాటితోపాటు నర్సంపేట, కోదాడ పట్టణాల్లో కూడా రెండు చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో సీసీఎస్ సీఐ హతీరాం, రూరల్ సీఐ, టౌన్ ఇన్చార్జ్ సీఐ సర్వయ్య, ఎస్సై ప్రశాంత్, సివిల్, సీసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. -
వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య
కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపురం మండలం మర్రిపల్లిగూడెనికి చెందిన యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఇన్స్పెక్టర్ హరికృష్ణ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొమిరె నర్సింహులు పెద్ద కుమారుడు రాజ్కుమార్ (25) తల్లిదండ్రుల మాట వినకుండా స్నేహితులతో తిరుగుతున్నాడు. పని చేయకుండా ఎందుకు తిరుగుతున్నావని, ఏదైనా పని చేయమని తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన రాజ్కుమార్ ఆదివారం మద్యం తాగి అదే మత్తులో గడ్డి మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి విషయాన్ని బంధువులకు చెప్పాడు. వెంటనే నర్సింహులు తన బంధువులతో కలిసి రాజ్కుమార్ను వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. తల్లిదండ్రుల గొడవతో హోంగార్డు.. దుగ్గొండి : తల్లిదండ్రులు గొడవ పడుతున్నారని కల త చెందిన హోంగార్డు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బల్వంతాపురంలో జరిగింది. గ్రామానికి చెందిన దానం మల్లేశం, విజయ దంపతులు వ్యవసాయం చేస్తు జీవిస్తున్నారు. ఈ క్రమంలో పంటలు పండక రూ.6 లక్షల వరకు అప్పులయ్యాయి. ఆదివారం సాయంత్రం దంపతులు గొడవ పడ్డారు. హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న కుమారుడు నాగరాజు (34) ఇద్దరికి సమాధానం చెప్పలేక విరక్తి చెంది గడ్డిమందు తాగి నిద్రించాడు. సోమవారం ఉదయం శ్వాసతీసుకోవడం కష్టం కావడంతో తల్లిదండ్రులు నిలదీశారు. దీంతో తాను పురుగుల మందు తాగానని చెప్పడంతో వరంగల్ లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, నాగరాజు దుగ్గొండి పోలీ స్స్టేషన్లో పదేళ్లుగా హోంగార్డుగా విధులు నిర్వర్తించాడు. ఇటీవల బదిలీపై గీసుగొండకు వెళ్లాడు. మద్యానికి బానిసై.. ఉరేసుకుని.. జఫర్గఢ్ : మద్యానికి బానిసైన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం తీగారంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, ఎస్సై రామ్చరణ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అబ్బరబోయిన రాజు (39) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కొన్ని రోజులుగా మద్యానికి బానిసై ఏ పని చేయకుండా ఉంటున్నాడు. ఎందుకు తాగుతున్నావని తండ్రి వెంకటయ్య మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన రాజు.. వ్యవసాయ బావి వద్ద ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో పని చేయమని తండ్రి మందలించా డని గడ్డి మందుతాగి కుమారుడు, వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బల్వంతాపురం గ్రామంలో తల్లిదండ్రులు గొడవ పడుతున్నారని హోంగార్డు, జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం తీగారం గ్రామంలో మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. -
ఎండు గంజాయి పట్టివేత
చిన్నగూడూరు: అక్రమంగా తరలిస్తున్న 12.440 కేజీల ఎండు గంజాయిని పట్టుకుని ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. ఎస్సై వెల్లడించిన వివరాల ప్రకారం.. మండల కేంద్రం శివారు జయ్యారం క్రాస్ రోడ్డు సమీపంలో సోమవారం సాయంత్రం పోలీస్ సిబ్బందితో వాహనాల తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు బ్లూ కలర్ సూట్కేస్తో ఆటోకోసం ఎదురుచూస్తున్నారు. వారిని, వారి వద్ద ఉన్న సూట్కేస్ను తనిఖీ చేయగా సుమారు రూ.6 లక్షలు విలువ చేసే 12.440 కేజీల ఎండు గంజాయిని గుర్తించినట్లు తెలిపారు. వారిని విచారించి మండలంలోని మన్నెగూడెం గ్రామానికి చెందిన పిట్టల రమేష్, కురవి మండలంలోని సూదనపల్లి గ్రామానికి చెందిన ఎలమశెట్టి సాయికుమార్, మొగిలిచర్ల శివారు జగ్యాతండాకు చెందిన లునావత్ సుమన్ కలిసి ఎండు గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. గంజాయిని తమకు గుర్తు తెలియని వ్యక్తి పంపించాడని విచారణలో తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి గంజాయి సీజ్ చేసి రిమాండ్కు తరలించనున్నట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ వెల్లడించారు. ఇదిలా ఉండగా ముగ్గురిలో ఇద్దరు అధికార పార్టీకి చెందిన నాయకులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. రూ.6 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం -
● నిబంధనలా.. డోంట్ కేర్..!
‘ప్రభుత్వాలు విధించే నిబంధనలు ప్రజలకే కానీ.. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే మాకు వర్తించవు’.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కొందరు అధికారులు. ఏ వాహనమైనా కొనుగోలు చేయగానే రిజిస్ట్రేషన్ చేసి నంబర్ ప్లేట్ బిగించుకోవాలనేది ప్రభుత్వ నిబంధన. కానీ, మానుకోట జిల్లా మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ వాహనానికి నంబర్ ప్లేట్ లేకుండానే తిరుగుతుంది. సామాన్య వాహనదారులు ఏఒక్క నిబంధన పాటించకున్నా.. జరిమానా విధించే అధికారే ఇలా వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. – మహబూబాబాద్ అర్బన్ -
జానాల గుట్టకు ఎసరు..
మరిపెడ రూరల్: ఓ వ్యక్తి గుట్టకు రాళ్లు కొట్టుకుంటూ ఉపాధి పొందుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడని గ్రామస్తులు వదిలేశారు. ఇదే అదనుగా భావించిన ఆ వ్యక్తి సమీపంలోని మరో వ్యక్తితో కలిసి ప్రభుత్వ గుట్టుకే ఎసరు పెట్టాడు. గుట్టుచప్పుడు కాకుండా గుట్టరాళ్లను తొలగిస్తూ శిఖంలోని భూమిని సదనం చేస్తున్నారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో విషయం బట్టబయలైంది. ఇందుకు గ్రామంలో కొందరు ముడుపులు పుచ్చుకుని సహకరించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా.. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఓ దాత ప్రభుత్వానికి దానం మరిపెడ మండలం వీరారం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 301లో 29 ఎకరాల్లో జానాల గుట్ట కొంత భూమి కలిగి ఉంది. గ్రామానికి చెందిన భూస్వామి దామిడి రాములమ్మ సుమారు 20 ఏళ్ల క్రితం గ్రామాభివృద్ధి కోసం దానం చేశారు. దీనిని గ్రామస్తులు అప్పటి రెవెన్యూ అధికారుల ద్వారా ప్రభుత్వ ఆస్తిగా పరిగణించేలా ప్రభుత్వానికి భూమి పట్టా పాస్పుస్తకాలను అప్పగించారు. అప్పటి నుంచి ప్రభుత్వ భూమిగా పరిగణిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో గుట్ట సమీపంలో గ్రామస్తుల సౌకర్యార్ధంగా శ్మశానవాటిక, క్రీడాప్రాంగణం ఏర్పాటు చేశారు. జరిమానాతో సరి.. ఈ విషయం ఇటీవల గ్రామస్తులకు తెలియడంతో పెద్ద సంఖ్యలో గుట్ట వద్దకు చేరుకుని రాళ్లు తొలగిస్తున్న యంత్రాన్ని అడ్డుకున్నారు. రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి యంత్రాన్ని సీజ్ చేసి రూ.10 వేలు జరిమానా విధించి వదిలేసిట్లు తెలుస్తుంది. విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురి చేస్తున్న విషయం తెలిసిన స్థానిక రెవెన్యూ అధికారులు పెద్దగా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికై నా జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించి దాత ప్రభుత్వానికి దానం చేసిన భూమిని కబ్జాకు గురికాకుండా చూసి, ఆక్రమణకు యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. హద్దులు ఏర్పాటు చేయాలి ఇప్పటికే జానాల గుట్ట శిఖం భూమి కొంత కబ్జాకు గురైంది. ఓ దాత దానం చేసిన భూమిని కాపాడుకోవడంతో అధికారులు విఫలమయ్యారు. ఇప్పటికై నా రెవెన్యూ అధికారులు సర్వే చేయించి 29 ఎకరాల గుట్ట భూమికి హద్దులు గుర్తించాలి. – జెట్టి రాములు, వీరారం కబ్జాకు ప్రయత్నం గ్రామంలోని ఓ వ్యక్తి ఉపాధి నిమిత్తం 20 ఏళ్లుగా గుట్టకు పునాది రాళ్లు కొట్టుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గ్రామస్తులు సైతం చూసీచూడనట్లు ఉన్నారు. ఇదే అదనుగా భావించిన సదరు వ్యక్తి 15 మంది అనుచర బృందాన్ని ఏర్పాటు చేసుకుని రాళ్లు కొట్టిస్తూ ఉపాధికి బదులు రాళ్ల వ్యాపారం, కమీషన్లు తీసుకోవడం మొదలు పెట్టాడు. అంతటితో ఆగకుండా మరో వ్యక్తితో కుమ్మకై ప్రభుత్వ భూమి ఆక్రమణకు ప్లాన్ చేశాడు. అనుకున్నదే తడవుగా యంత్రాలతో గుట్ట శిఖంలోని పెద్ద రాళ్లను తొలగించడం మొదలు పెట్టారు. గుట్ట శిఖంలో ఉన్న ప్రభుత్వ భూమి చదును చేసి కబ్జాకు యత్నించారు. ఈ తతంగానికి గ్రామానికి చెందిన కొందరు ముడుపులు తీసుకుని సహకరించినట్లుగా వినికిడి.గుట్టుచప్పుడు కాకుండా బండరాళ్ల తొలగింపు ఓ వ్యక్తికి గుట్ట శిఖం భూమిని అప్పనంగా అప్పగించే ప్రయత్నం గ్రామస్తులు అడ్డుకోవడంతో విషయం బట్టబయలు -
మంగళవారం శ్రీ 5 శ్రీ ఆగస్టు శ్రీ 2025
– 8లోuఇష్టారీతిన కొనసాగుతున్న ఔషధ విక్రయాలు ● జిల్లాలోని మెడికల్ షాపులపై అధికారుల దాడులు ● అబార్షన్ కిట్లు అమ్ముతున్నారనే ఆరోపణలతో పలువురికి నోటీసులుసాక్షి, మహబూబాబాద్: గిరిజనులు, ఆదివాసీలు ఎక్కువగా ఉండడం.. నిరక్షరాస్యత తోడు కావడం.. డబ్బుల కోసం స్కానింగ్, అబార్షన్ చేసే డాక్టర్లు.. వెరసీ ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండానే జిల్లాలో మెడికల్ దందా ఇష్టారీతిన కొనసాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. దీని ఫలితంగా ప్రధానంగా జిల్లాలో సెక్స్ రేషియోలో వ్యత్యాసం ఎక్కువైంది. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఓ సర్వే ఆధారంగా ప్రతీ 1,000 పురుషులకు 836 మహిళలు మాత్రమే ఉండడం గమనార్హం. దీనిని రూపు మాపేందుకు వైద్యారోగ్య, పోలీస్, డ్రగ్స్ డిపార్టుమెంట్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాయి. జిల్లాలో మెడికల్ షాపులు, స్కానింగ్ సెంటర్లపై దాడులు నిర్వహిస్తున్నాయి. షోకాజ్ నోటీసుల జారీ.. ఆడపిల్లలను కడుపులోనే చిదిమేసే అబార్షన్ను కట్టడి చేసేందుకు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్టేషన్(డీసీఏ) సీరియస్గా తీసుకుంది. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా గర్భవిచ్ఛిత్తికి దోహదపడే మందుల విక్రయాల ఆరోపణలతో జూలై రెండో వారంలో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపులపై దాడుల నిర్వహించారు. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించిన దాడుల్లో మూడు షాపుల్లో విక్రయాలు జరుపుతున్నారనే అనుమానంతో ఆ షాపుల యజమానులకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. అదే విధంగా ప్రతీ నెల ఒక్కో అంశంపై మెడికల్ షాపుల తనిఖీలు నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది. ఇందులో అబార్షన్ కిట్లు, వివిధ రకాల మత్తు మాత్రలు, వెటర్నరీ మందులు మొదలైన వాటిని పరిశీలించనున్నట్లు సమాచారం. అబార్షన్లపై సీరియస్ అబార్షన్లకు కేరాఫ్గా పేరున్న మానుకోట జిల్లాలో కట్టడి చేసేందుకు అధికారులు సీరియస్గా వ్యవహరిస్తున్నారు. గతంలో ఢిల్లీకి చెందిన డాక్టర్ల బృందం జిల్లా కేంద్రంలోని స్కానింగ్ సెంటర్లను పరిశీలించింది. నిబంధనలు పాటించడంలేదని రెండు సెంటర్ల యజమానులకు నోటీసులు ఇచ్చి యంత్రాల ను సీజ్ చేసింది. అదే విధంగా కలెక్టర్, ఎస్పీ,జిల్లా సీ్త్ర శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రతీ నెల నిర్వహించే సీపీపీఎన్డీసీ సమావేశంలో భ్రూణ హత్యలు, నివారణపై సమీక్షలు నిర్వహించారు. ఇందులో మెడికల్ షాపుల యజమానులు, ఆర్ఎంపీ డాక్టర్ల ను భాగస్వామ్యులను చేసి నిబంధనల ప్రకారం న డుచుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. నిబంధనలు పాటించాల్సిందే.. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయించడం నేరం. ప్రధానంగా అబార్షన్ కిట్లు, మత్తు పదార్థాల విక్రయాలపై సహించేది లేదు. గత నెలలో జిల్లాలో మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించాం. నిబంధనలు పాటించని మూడు మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. – ఉమారాణి, డ్రగ్ ఇన్స్పెక్టర్, మహబూబాబాద్న్యూస్రీల్ఇష్టారాజ్యంగా విక్రయాలు.. మెడికల్ షాపుల్లో విక్రయించే టాబ్లెట్లు, ఇంజక్షన్లు, సిరప్లు వినియోగదారులకు విక్రయించాలంటే డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి. కానీ, మారుమూల ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రం వరకు అత్యధిక షాపుల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందుల విక్రయాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అయితే సాధారణ జ్వరం, తలనొప్పి, దగ్గు, డైజిన్ వంటి మందులే కాకుండా ప్రమాదకరమైన వాటిని కూడా డాక్టర్లతో సంబంధం లేకుండా విక్రయించడం ఆందోళనకలిగించే విషయం. ప్రధానంగా అబార్షన్కు దోహదపడే మెఫిఫ్రిస్టోన్, మీసోప్రోస్టాల్, నార్కోటిక్ డ్రగ్స్, ట్రమిడాల్, అల్ప్రాజోలమ్, డియాజిప్మా, నిట్రాజిప్మా, జోలీపిడమ్ వంటి మత్తుమందలు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
కాళేశ్వరాలయంలో శ్రావణ శోభ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలో శ్రావణశోభ నెలకొంది. సోమవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి గర్భగుడిలో ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందదేవి, శ్రీసరస్వతి అమ్మవార్ల దేవాలయంలో మహిళలు పూజలు నిర్వహించారు. సాయంత్రం గర్భగుడిలో భక్తులు లక్షపత్రి పూజలను ప్రత్యేక పూజా కార్యక్రమాలతో నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణలో ఆలయం మార్మోగింది. దీంతో భక్తుల సందడి కనిపించింది. -
బోదకాలు నివారణకు చర్యలు తీసుకోవాలి
మహబూబాబాద్: బోదకాలు నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. కలెక్టరేట్లోని కాన్పరెన్స్ హాల్లో సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సంబంధిత సిబ్బందితో బోదకాలు నివారణ, జాతీయ నులిపురుగుల దినోత్సవంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా లెనిన్ వత్సల్ టోప్పో మాట్లాడుతూ... జాతీయ కీటకజనిత వ్యాధుల నియంత్రణ, బోదకాలు నివారణ కార్యక్రమంపై ఈనెల 10 నుంచి 25 వరకు ప్రత్యేక కార్యచరణ తయారు చేయాలన్నారు. జిల్లాలోని మండల ప్రత్యేక అధికారులు సన్నాహక సమావేశాలు నిర్వహించి కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. ప్రత్యేకంగా అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థలు, రెసిడెన్షియల్ పాఠశాలలో, మోడల్ స్కూల్స్లో కార్యచరణ నిర్వహించి ఆ తేదీల్లో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వాలని టామ్ టామ్ నిర్వహించి కళా జాత బృందాలతో విస్త్రతంగా ప్రచారం చేయాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులలో అక్రమ లింగనిర్దారణ పరీక్షలు స్కానింగ్లు చేయకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ రవి రాథోడ్, డీఈఓ రవీందర్రెడ్డి, అన్ని విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో -
ఉధృతంగా పాకాలవాగు
గూడూరు: ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి మండల కేంద్రం సమీపంలోని నెక్కొండ– కేసముద్రం రహదారిలోని పాకాలవాగు సోమవారం ఉధృతంగా ప్రవహిస్తుంది. బ్రిడ్జికి ఆనుకొని నీటి ప్రవాహం కొనసాగుతోంది. నీట మునిగిన పంటపొలాలు కేసముద్రం: మండలంలోని నారాయణపురం, ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామాల్లో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పంటపొలాలు నీట మునిగాయి. ఈ ప్రాంతంలో చేపడుతున్న గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా నారాయణపురంలో చెరువు నుంచి వెళ్లే వరద నీటి ప్రవాహం వద్ద కల్వ ర్టు నిర్మించాల్సి ఉండగా అడ్డుగా రోడ్డు నిర్మాణం చేపట్టడంతో వరదనీరు పొలాల్లోకి చేరింది. సుమా రు 30 ఎకరాల్లో పొలాలు నీటమునగడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా కోమటిపల్లిలో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంలో భాగంగా కల్వర్టు చిన్నగా నిర్మించడంతో వరదనీరంతా చుట్టు పక్కల పంటపొలాలకు చేరడంతో నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. -
వినతులపై వెంటనే స్పందించాలి
మహబూబాబాద్: ప్రజావాణిలో ఇచ్చిన వినతులపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, అనిల్కుమార్ వినతులను స్వీకరించారు. ఈసందర్భంగా లెనిన్ వత్సల్ టొప్పో మాట్లాడుతూ.. పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు. పరిష్కారం సాధ్యం కాకుంటే కారణాలతో కూడిన నివేదిక అందజేయాలని అన్నారు. ఇదిలా ఉండగా.. సోమవారం మొత్తం 130 వినతులు వచ్చిన్నట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వినతులు ఇలా.. ● కొత్తగూడెం మండలం ఓటాయికి చెందిన సంగీత తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. ● నెల్లికుదురు మండలం రావిరాల గ్రామానికి చెందిన దివ్యాంగుడు గుండె వెంకన్న తనకు చార్జింగ్ సైకిల్ ఇప్పించాలని కోరాడు. ● గార్ల మండలం బుద్దారం గ్రామానికి చెందిన భూక్యా రాందాస్ 2020లో సీతారామ ప్రాజెక్ట్లో తన భూమి కోల్పోయినా.. పరిహారం రాలేదని ఇప్పించాలని వినతి పత్రం అందజేశారు. ● గార్ల మండలం మర్రిగూడేనికి చెందిన బానోత్ నవీన్ తన భూమి కొందరు ఆక్రమించుకుని అక్రమంగా పట్టాచేయించుకున్నారు. దీంతో పట్టా రద్దు చేసి న్యాయం చేయాలని కోరాడు. అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్టొప్పో ప్రజావాణిలో 130 వినతులు -
177 మంది చిన్నారులకు విముక్తి
ఆపరేషన్ ముస్కాన్ ద్వారా వరంగల్ క్రైం : ఆపరేషన్ ము స్కాన్ 11వ విడత ద్వారా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి లో వివిధ ప్రాంతాల్లో పనులు చేస్తున్న 177 మంది చిన్నారుల కు విముక్తి కల్పించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. గత నెలలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు బాలల సంరక్షణ వి భాగం, చైల్డ్ లైన్, కార్మిక శాఖతో కలిసి ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా కమిషనరేట్ పరిధిలోని హనుమకొండ, వరంగల్, జనగామ జి ల్లాల్లో వివిధ ప్రాంతాల్లో సంయుక్తంగా తనిఖీలు ని ర్వహించారన్నారు. ఇందులో బాల కార్మికులు, బడి మానేసిన 177 మంది బాలబాలికలను గుర్తించి వా రిని బాలల సంరక్షణ గృహానికి పంపించినట్లు సీపీ తెలిపారు. ఇందులో 149 మంది బాలలు, 28 మంది బాలికలు ఉన్నారన్నారు. బాలల సంరక్షణ గృహా నికి తరలించిన వారిలో తెలంగాణ , ఇతర రాష్ట్రాలకు చెందిన 97 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. మిగతా ఆరుగురిని వారి తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. చిన్నారులను పనిలో పెట్టుకున్న యజమానులకు రెండేళ్ల జైలు శిక్ష,రూ. 50 వేలు జరిమానా విధిస్తామన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ -
ఇల్లు, పింఛన్ ఇస్తేనే కిందికి దిగుతా!
మరిపెడ రూరల్: ఇందిరమ్మ ఇల్లు, పింఛన్ ఇవ్వలేదని ఓ వ్యక్తి సెల్టవర్ పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల గ్రామంలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాసనపల్లి రాములు అనే వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్లు లిస్టులో పేరు వచ్చింది. అయినా తనకు ఇల్లు మంజూరు చేయలేదని, అలాగే తనకు కన్ను కనిపించడం లేదని, దానికి పింఛన్కు దరఖాస్తు పెట్టుకున్న ఇవ్వడం లేదని రాములు ఆరోపించాడు. ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఇల్లు, పింఛన్ మంజూరు కాకపోవడంతో మనస్తాపం చెందిన రాములు గ్రామ శివారులో ఉన్న సెల్టవర్ పైకి నిరసన వ్యక్తం చేశాడు. గంట దాటినా అతడు సెల్టవర్ దిగకపోవడంతో అక్కడికి పెద్దసంఖ్యలో స్థానికులు చేరుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి రాములుకు నచ్చజెప్పారు. ఆదివారం కావడంతో అధికారులు ఎవరూ రారని, సోమవారం మాట్లాడి ఇల్లు, పింఛన్ మంజూరు చేయిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించి కిందకు దిగాడు. ఈ విషయంపై గ్రామ కార్యదర్శి మౌనికను వివరణ కోరగా..రాములకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైన విషయం వాస్తవమేనని, కానీ ఇంటి స్థలం విషయంలో వారి అన్నదమ్ముల మధ్య గొడవలు ఉండటంతో పెండింగ్లో పెట్టినట్లు తెలిపారు. అన్నదమ్ములు ఇంటి స్థలం పంచుకున్న తర్వాత రెండో విడతలో ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేస్తామని రాములుకు చెప్పినట్లు కార్యదర్శి పేర్కొన్నారు. లిస్ట్లో పేరున్నా మంజూరు చేయడం లేదని ఆరోపణ తానంచర్లలో సెల్టవర్ ఎక్కి వ్యక్తి నిరసన అధికారులతో మాట్లాడి మంజూరు చేయిస్తామని నచ్చజెప్పిన పోలీసులు -
ప్రాణం తీసిన ఈత సరదా
మంగపేట: స్నేహితుల దినో త్సవం విషాదం నింపింది. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు వాగులో మునిగి మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా మంగపేట మండలం బుచ్చంపేట గ్రామానికి చెందిన బూర్గుల రమేశ్, మణెమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు అభిషేక్(22) ఉన్నారు. అభిషేక్ డిగ్రీ వరకు చదివి ఇంటివద్ద ఉంటూ తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో ఆసరాగా ఉంటున్నాడు. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా గ్రామానికి చెందిన మిత్రులు కార్తీక్, రుత్విక్, దేవేందర్, మనీశ్, విశ్వతేజతో కలిసి సరదాగా గడిపేందుకు ఐదు కిలోమీటర్ల దూరంలోని జబ్బోనిగూడెం సమీపంలోగల గౌరారంవాగు గుండురాళ్ల ప్రాంతానికి ఈతకు వెళ్లారు. వాగులో దిగి నీటిలో మునిగిపోయిన అభిషేక్ స్నేహితులకు కనిపించలేదు. ఆందోళనకు గురైన వారు గుంతల్లో వెతికినా ఆచూకీ తెలియలేదు. వెంటనే విషయాన్ని గ్రామస్తులు, కుటుంబానికి సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు, గ్రామస్తులు, ఈతగాళ్లు వాగులో గాలించి అభిషేక్ మృతదేహాన్ని బయటకు తెచ్చారు. సంతోషంగా బయటకు వెళ్లిన ఒక్కగానొక్క కుమారుడు విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వాగులో మునిగి యువకుడి మృతి స్నేహితుల దినోత్సవంలో విషాదం -
అప్రమత్తతే ఆయుధం..
మహబూబాబాద్ రూరల్ : పంటలపై పురుగు మందులు పిచికారీ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేని పక్షంలో రైతులు, వ్యసాయ కూలీల ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉంది. పురుగు మందులు అత్యంత ప్రమాదకరం. ఈ క్రమంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణానికే ముప్పు అని గుర్తించాలి. పురుగు మందులు శరీరంలోకి వెళ్లినా, వాసన పీల్చినా ఆరోగ్యానికి హానికరం. రైతులు వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న, కూరగాయలు, పండ్ల తోటలకు కలుపు, చీడపీడల నివారణకు పురుగు మందులు పిచికారీ చేస్తున్నారు. పంటకు హాని జరుగుతుందన్న ఏమరుపాటులో జాగ్రత్తలు తీసుకోవడం మరచిపోతున్నారు. ఈ క్రమంలో ప్రాణాంతక రసాయన మందుల వినియోగం విషయంలో ఏమరుపాటు వద్దని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పురుగు మందులు పిచికారీ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. పరిమితికి మించి వినియోగం హానికరం.. పంటను ఆశించిన తెగుళ్లు, పురుగుల నిర్మూలనకు ఇష్టమొచ్చిన పురుగు మందులు చల్లితే ఉపయోగం ఉండదు. విష తీవ్రతలో తేడా ఉంటుంది. పిచికారీ చేసేసమయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా అస్వస్థతకు గురవుతారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, ఫెస్టిసైడ్స్ దుకాణాదారుల సూచనలు పాటించాలి. పరిమితికి మించి పంటలకు మందులు పిచికారీ చేస్తే మేలుకన్నా నష్టం ఎక్కువ జరుగుతుంది. జాగ్రత్త వహించకుంటే పంటకు మేలుచేసే సాలీడు, అక్షింతల పురుగులు మృత్యువాతపడతాయి. మిత్ర పురుగులు పొలంలో లేకుంటే పంటకు హానిచేసే పురుగుల ఉధృతి పెరుగుతుంది. అవసరమైన పరికరాలు వాడాలి.. పంటలకు పురుగుమందులు వాడడానికి వ్యవసాయశాఖ సూచించిన స్ప్రేయర్లనే వాడాలి. ముఖ్యంగా పంటలో మొక్కల స్థాయిని బట్టి స్ప్రేయర్లు ఉపయోగించాలి. పత్తిలో హ్యాండ్ స్ప్రేయర్, పవర్ స్ప్రే యర్ల కంటే తైవాన్ స్ప్రేయర్ల ద్వారా మొక్కలకు నేరుగా మందు పిచికారీ చేసే వీలుంటుంది. చేతులకు గ్లౌజ్లు, కళ్లద్దాలు, ముఖానికి మాస్క్, తలకు టోపీ లేదా రుమాలు తప్పనిసరిగా ధరించాలి. చేతి వేళ్లకు గోళ్లు పెంచుకోకూడదు. పత్తిలో అయితే కాళ్లకు బూట్లు ధరించాలి. ఉదయం, సాయంత్రం గాలి ఎదురుగా వచ్చేటప్పుడు పురుగుమందు పిచికారీ చేయొద్దు. గాలి వీస్తున్న వైపే వెళ్తూ పిచికారీ చేయాలి. పురుగు మందు పిచికారీ సమయంలో పొగ తాగొద్దు. పొగాకు ఉత్పత్తులు, గుట్కాలు తినొద్దు. చేతులు నోట్లో పెట్టుకోవడం, కళ్లు నలుచుకోవడంలాంటి పనులు అస్సలు చేయొద్దు. స్ప్రేయర్తోనే పిచికారీ చేయాలి.. ● పంట ఏపుగా ఉంటే చేతిపంపుతో కాకుండా స్ప్రేయర్ తోనే పిచికారీ చేయాలి. కొన్ని రకాల పురుగుమందులు మాత్రం పవర్ స్ప్రేయర్తో పిచికారీ చేయొద్దు. స్ప్రేయర్తో పిచికారీ చేస్తే మందు గాలిలో కలిసి ఇతర పంటలపై పడితే వంట నాశనమై పోతుంది. అందుకే వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి. అలాగే, గాయాలైన చేతులతో మందు పిచికారీ చేయొద్దు. పిచికారీ పూర్తయిన వెంటనే కాళ్లు, చేతులు సబ్బుతో కడుక్కోవాలి. తలస్నానం చేయాలి. ● పిచికారీ చేసే సమయంలో ప్రత్యేక దుస్తులు మా త్రమే ధరించాలి. వాటిని విడిచిన తర్వాత మిగతా దుస్తులతో కలిపి ఉతకొద్దు. పిల్లలకు పురుగుమందులను సాధ్యమైనంత దూరంగా ఉంచేలా జాగ్రత్త పడాలి. పిచికారీ అనంతరం వినియోగించిన పురుగు మందు డబ్బాలను గోతి తీసి పాతిపెట్టాలి.పురుగు మందులపై అవగాహన ఉండాలిపంటలను ఆశించే చీడపీడల నివారణకు ఉపయోగించే పురుగు మందులపై రైతులు అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా ఫెస్టిసైడ్ దుకాణాల్లో పురుగు మందులు నాలుగు రంగుల్లో లభ్యమవుతాయి. వీటిలో పుర్రె గుర్తుతో ఉన్న రంగు, ఆకుపచ్చ, నీలి, పసుపు రంగులతో కూడిన డబ్బాలు ఉంటాయి. పుర్రె గుర్తుతో కూడి ఎర్ర రంగు ఉంటే అత్యంత విషపూరితమని గుర్తించాలి. ఆకుపచ్చ రంగు చిహ్నంతో ఉంటే తక్కువ విషపూరితమని తెలుసుకోవాలి. బి.క్రాంతికుమార్, కోఆర్డినేటర్, మల్యాల కేవీకే నిర్లక్ష్యం వహిస్తే ప్రాణానికే ముప్పు పురుగు మందుల పిచికారీలో ఏమరుపాటు వద్దు రైతులకు అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు -
ముగ్గురు నకిలీ వైద్యులపై కేసు
నెక్కొండ: వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని ముగ్గురు నకిలీ వైద్యులపై కేసు నమోదు చేసినట్లు టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ నరేశ్కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం..గత మే 22న స్థానిక రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్ రుద్ర, లావణ్య, అమ్మ ఆస్పతుల్లో డీఎంహెచ్ఓ సాంబశివరావు తనిఖీలు చేపట్టిన విషయం తెలి సిందే. ఎటువంటి అర్హతలు లేకుండా ఆదర్శ వైద్యులుగా చెప్పుకుంటూ, క్లినిక్స్ నిర్వహిస్తున్నారని ఆ యన పేర్కొన్నారు. ప్రథమ చికిత్స కేంద్రాల ముసుగులో అశాసీ్త్రయ పద్ధతులలో యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, నొప్పి ఇంజెక్షన్లు వేయడం, ల్యాబ్ టెస్ట్లు నిర్వహించడం, సైలెన్లు పెట్టడం, ఆస్పత్రిలో బెడ్స్ ఏర్పాటు చేయడం వంటివి చేయడం ఆయా తనిఖీల్లో వెలుగులోకి వచ్చిందన్నారు. కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ డి.లాలయ్యకుమార్, చైర్మన్ డాక్టర్ కె.మహేశ్కుమార్ ఫిర్యాదు మేరకు ఎన్ఎంసీ చట్టం 34, 54, టీఎస్ఎంపీఆర్ చట్టం 22, బీఎన్ఎస్ 318, 319 ప్రకారం స్థానిక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నకిలీ వై ద్యులు లావణ్య ఫస్ట్ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు ఎం.రమేశ్, రుద్ర ఫస్ట్ ఎయిడ్ సెంటర్ బి.రవి, అ మ్మ ఫస్ట్ఎయిడ్ సెంటర్ డి.అశోక్పై కేసు నమోదు చేసినట్లు డాక్టర్ నరేశ్కుమార్ పేర్కొన్నారు. రేపటి వరకు సైన్స్ కాంగ్రెస్ రిజిస్ట్రేషన్ గడువు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఈనెల 19, 20, 21వ తేదీల్లో తెలంగాణ అకాడమీ సైన్స్, కాకతీయ యూనివర్సిటీ సంయుక్తంగా తెలంగాణ సైన్స్కాంగ్రెస్ నిర్వహించనున్నాయి. సైన్స్కాంగ్రెస్లో పాల్గొనేందుకు అధ్యాపకులు, పరిశోధకులు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈనెల 5 వరకు గడువు పొడిగించినట్లు తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, కేయూ ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ బి.వెంకట్రామ్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. ఇప్పటివరకు సైన్స్కాంగ్రెస్కు 658 అబ్స్ట్రాక్ట్లు రాగా 476మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆయన తెలిపారు. పేలిన లారీ టైరు.. ● అక్కడికక్కడే డ్రైవర్ మృతి ● వంగపహాడ్ సమీపంలో ఘటన హసన్పర్తి: టైరును పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు పేలింది. ఈ ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం యాదాద్రి–ఆరెపల్లి జాతీయ రహదారి మార్గమధ్యలోని వంగపహాడ్ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన పి. సాయిలు(40) షాబాద్ బండల లోడ్ లారీతో జాతీయ రహదారిపై ములుగు వైపునకు బయలుదేరాడు. అయితే వంగహాడ్ సమీపంలో లారీ ఆపి టైరును పరిశీలిస్తుండగా ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం తరలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఉత్సాహంగా చెస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీరామ్లైఫ్ ఇన్సూరెన్స్ సహకారంతో హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో ఆదివారం ఓపెన్ టు ఆల్ ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి చదరంగ(చెస్) పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి 50 మంది క్రీడాకారులు హాజరైనట్లు టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి పి. కన్నా తెలిపారు. సాయంత్రం వరకు సాగిన పోటీల్లో మొదటి మూడు రౌండ్లు ముగిసే సరికి షేక్రియాజ్, అభినవ్సాయి దామెర, నరిగె యశ్వంత్, రామా రిషిత్కుమార్ ముందంజలో ఉన్నట్లు తెలిపారు. -
క్రీడా హబ్గా వరంగల్..
వరంగల్ స్పోర్ట్స్: భవిష్యత్లో వరంగల్ క్రీడాహబ్గా మారుతుందని వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు అన్నారు. ఆదివారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరగనున్న పోటీలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 1,400 మంది అథ్లెట్లు హాజరయ్యారు. అండర్–14, 16, 18, 20 బాలబాలికల విభాగాల్లో నిర్వహించే పోటీలను వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు సీఎం రేవంత్రెడ్డి ముందుకొచ్చారన్నారు. ఈ ఏడాది నుంచే క్రీడా పాఠశాలలో తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. రేవంత్రెడ్డి సర్కారు విద్య, వైద్యం, వ్యవసాయంతో పాటు క్రీడారంగంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఎమ్మెల్యేల మందరం కలిసికట్టుగా జిల్లా క్రీడాభివృద్ధి, వసతుల కల్పన కోసం కృషి చేస్తున్నామన్నారు. అనంతరం 5కే మీటర్ల పరుగు పందెంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన అథ్లెట్లకు పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, నాగరాజు జేఎన్ఎస్లో అట్టహాసంగా అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం హాజరైన 1,400 మంది అథ్లెట్లు -
ఈచదువు నాతోని అయితలే.. చనిపోతున్నా
నయీంనగర్/వరంగల్ క్రైం: ‘ఈ చదువు నాకు అర్థం ఐతలే. ఎంత కష్టపడ్డా రావట్లేదు. మీకు చెప్తే మీరు అర్థం చేస్కుంటలేరు. నాకు టెన్షన్ ఐతాంది. మైండ్ వోతాంది. నేను చదువుకుందాం అనుకున్న గ్రూపు మీరు ఒప్పుకోలె. మీకిష్టమైన గ్రూపు నాతోని ఐతలే. ఏం అర్థం కాక మధ్యలో నలిగిపోతున్న. ఇంత తక్కువ మార్కులు వస్తుంటే మీరు తట్టుకోలేరు. అందుకే చనిపోతున్నా’ అంటూ ఇంటర్ విద్యార్థి ఉసురు తీసుకుంది. ఆ తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చింది. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన మిట్టపల్లి కుమార్, కవిత దంపతులు పెద్ద కుమార్తె శివాని. ఈఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేర్పించారు. మరో మూడు రోజులైతే ఆమె పుట్టిన రోజు రాబోతోంది. ఇంతలోనే ఈ ఘటన జరగడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. హనుమకొండ జిల్లా నయీంనగర్లోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న మిట్టపల్లి శివాని(17) ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. తెల్లవారుజామున నాలుగు గంటలకు స్నానానికి వెళ్లిన ఆమె ఎంతసేపయినా కనిపించకపోవడంతో.. ఆమె స్నేహితురాలు కళాశాల సిబ్బందికి విషయం తెలిపింది. అనంతరం శివానిని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న శివాని తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి సంఘాలు శివాని మృతికి యాజమాన్యమే కారణమని కళాశాల ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తండ్రి మిట్టపల్లి కుమార్ మాట్లాడుతూ.. తెల్లవారుజామున నాలుగు గంటలకు ఘటన జరిగితే తనకు 8:50 గంటలకు కాల్ చేశారని.. తమ అనుమతి లేకుండా శివానిని ఆస్పత్రికి తరలించారన్నారు. తన కూతురుకు తెలుగు రాకపోయినా తెలు గులో సూసైడ్ నోట్ ఎలా రాస్తుందని ప్రశ్నించారు. కళా శాల సిబ్బంది వేధింపులతోనే తమ కూతురు ఆత్మహత్య కు పాల్పడిందని, సూసైడ్నోట్ కూడా కళాశాల యాజమాన్యం సృష్టించిందని ఆరోపించారు. హనుమకొండ సీఐ మచ్చ శివకుమార్, ఎస్సై కిశోర్కుమార్ పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. శివాని తండ్రి మిట్టపల్లి కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హనుకొండ ఇన్స్పెక్టర్ ఎం.శివకుమార్ తెలిపారు. కంటతడి పెట్టించిన సూసైడ్ నోట్ ‘మమ్మీ.. చెల్లిని బాగా చదివించండి. మంచి కాలేజీలో మంచి గ్రూప్ తీసుకోమను. నాలాగా అర్థం కాని చదువు వద్దు. దాన్ని మంచిగా చదివించి మీరు మంచిగా ఉండండి. కాలేజీలో జాయిన్ చేసే ముందు ఎవరినైనా కొంచెం అడిగి జాయిన్ చేయండి. చెల్లి నువ్వు కూడా మంచిగా చదువుకోవే.. ఆ చదువు నాకు అర్థం ఐతలే. మీకు చెప్తే మీరు అర్థం చేస్కుంటలేరు. నాకు మొత్తం టెన్షన్ ఐతాంది. మైండ్ వోతాంది. మీరు చెప్పిన చదువు నాతోని ఐతలే. నేను చదువుదాం అనుకున్న చదువుకు మీరు ఒప్పుకోలే. చివరికి నాకు చావే దిక్కు అయ్యింది. ఏం అర్థం కాక మధ్యలో నలిగిపోతున్న. ఈసంవత్సరం అంటే మీరు ఫీజు కట్టారని ఏదోలా కింద మీద పడి ఉన్న. ఇగ నాతోని కాదు. నేను వెళ్లిపోతున్న నాకు ఇంత తక్కువ మార్కులు రావడం నేను, మీరు తట్టుకోలేరు. అందుకే చనిపోతున్నా. అందరూ జాగ్రత్త. మంచిగా ఉండండి. ఈఒక్క సంవత్సరం కూడా మీకోసమే చదివిన. అయినా నాతోని అయితలే. ఎంత కష్టపడ్డా రావడం లేదు. అందరూ జాగ్రత్త’ అని శివాని రాసిన సూసైడ్ నోట్ చదివిన వారందరూ కంటతడి పెట్టుకున్నారు. అర్థం కాని చదువు.. ఆగిన జీవితం ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం పుట్టిన రోజుకు మూడు రోజుల ముందే తనువు చాలించిన విద్యార్థిని -
అధికారుల నిర్లక్ష్యం!
సోమవారం శ్రీ 4 శ్రీ ఆగస్టు శ్రీ 2025– 8లోuసాక్షి, మహబూబాబాద్: ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం 25శాతం రాయితీ కల్పించింది. కాగా, సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ ఉద్యోగులు చెప్పిన మాటలు విని ఫీజులు చెల్లించిన వారు ఇప్పుడు ప్రొసీడింగ్స్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అప్పుడు అన్నీ బాగానే ఉన్నాయని డబ్బులు తీసుకున్న అధికారులు ఇప్పు డు రకరకాల కొర్రీలు పెడుతూ.. ప్రొసీడింగ్స్ ఇవ్వ డం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. క్రమబద్ధీకరణ అవుతుందని.. ఎల్ఆర్ఎస్ ఫీజులో 25శాతం రాయితీ కల్పించి నెలరోజుల గడువు ఇచ్చారు. ఇది 2020 డిసెంబర్ 31 వరకు రూ.1000 చెల్లించి రశీదులు తీసుకున్న వారికే వర్తింపజేశారు. ఈమేరకు మహబూబా బాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ మున్సి పాలిటీల పరిధిలో 26,001 మంది రూ.1000 చెల్లించి రశీదులు తీసుకున్నారు. అయితే ఇందులో ప్రభు త్వ నిబంధనల మేరకు నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 20,586 దరఖాస్తులు ఎల్ఆర్ఎస్ చెల్లించుకునేందుకు అర్హత ఉందని అధికారులు చెప్పారు. దీంతోపై నాలుగు మున్సిపాలిటీల పరిధిలో భూ యజమానులకు ఆయా మున్సిపాలిటీల్లోని ఉద్యోగులు ఫోన్లు చేయడం, ఫ్లెక్సీలు పెట్టి అవగాహన కల్పించారు. రూ.16.49 కోట్ల ఆదాయం.. ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్న మహబూబాబాద్ జిల్లా కేంద్రంతోపాటు తొర్రూరు, డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీల్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఎల్ఆర్ఎస్కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కార్యాలయాలకు వెళ్లి కొందరు, ఆన్లైన్ ద్వారా మరికొందరు ఫీజులు చెల్లించారు. ఇలా మహబూబాబాద్ మున్సిపాలిటీలో రూ.11.60కోట్లు, తొర్రూరు రూ.4కోట్లు, డోర్నకల్ రూ. 50లక్షల, మరిపెడ రూ. 99లక్షల ఆదాయం వచ్చింది. ప్రొసీడింగ్స్లో జాప్యం మున్సిపల్ అధికారులు మూడు దశల్లో పరిశీలన చేసి మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అన్ని సక్రమంగా ఉన్నాయని చెప్పిన తర్వాతనే భూ క్రమబద్ధీకరణకు ఫీజు తీసుకున్నారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు కలిపి మొత్తం 20,586 మంది డబ్బులు చెల్లించారు. ఇందులో 6,708 మంది రూ.16,49,60,000 చెల్లించారు. ఇందులో 2,571 మందికి మాత్రమే ప్రొసీడింగ్స్ ఇవ్వగా 4,137 మంది మున్సిపాలిటీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఫీజులు చెల్లించడంతో తమ భూమికి ఎలాంటి ఇబ్బందులు రావని భావించిన యజమానులకు మున్సిపల్ అధికారులు ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలోని కొందరు ఉద్యోగులు ప్రొసీడింగ్ వెంటనే ఇవ్వాలంటే తమకు ముడుపులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం. అదే విధంగా ఎల్ఆర్ఎస్ చలాన్లు చెల్లించిన తర్వాత ఇప్పుడు భూమి విలువలో తేడా పడిందని.. కొత్త లెక్కల ప్రకారం చూస్తే మరిన్ని డబ్బులు చెల్లించాలని చెబుతున్నట్లు యజమానుల అంటున్నారు. ఇప్పటికే డబ్బులు చెల్లించామని ఇప్పుడు మళ్లీ డబ్బులు అంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు చెల్లించిన తమకు ప్రొసీడింగ్లు వెంటనే ఇచ్చేలా ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలని ఇళ్ల స్థలాల యజమానులు కోరుతున్నారు. న్యూస్రీల్ మున్సిపాలిటీల్లోని ఎల్ఆర్ఎస్ వివరాలుమున్సిపాలిటీ అర్హత పొందిన ఫీజు ప్రొసీడింగ్ దరఖాస్తులు చెల్లించినవి ఇచ్చినవిమహబూబాబాద్ 12,304 4044 1004 తొర్రూరు 6,181 2015 1267 మరిపెడ 1,228 427 78 డోర్నకల్ 873 222 222 మొత్తం 20,586 6,708 2,571ఎల్ఆర్ఎస్ కోసం డబ్బులు చెల్లించి ఎదురుచూపులు ప్రొసీడింగ్స్ కోసం కార్యాలయాల చుట్టూ ఇళ్ల స్థలాల యజమానుల ప్రదక్షిణ కొర్రీలు పెడుతూ కాలయాపన చేస్తున్న ఉద్యోగులు -
‘స్థానిక’ం తర్వాతే..
డీసీసీలకు కొత్త సారథులు!? ● బ్లాక్, మండల అధ్యక్షులు కూడా యథాతథం ● పునరాలోచనలో పార్టీ అధిష్టానం ● నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఓకే.. త్వరలో డైరెక్టర్ పోస్టుల నియామకం ● అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు.. నగరాల్లో ఐదు కావాలన్న ఎమ్మెల్యేలు ● ఇటీవలే ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశం సాక్షిప్రతినిధి. వరంగల్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అన్ని స్థాయిల్లో సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఇందుకోసం ఆ పార్టీ అధిష్టానం తరచూ సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి నుంచి కేడర్ కదిలించేందుకు కార్యాచరణ అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మండల, బ్లాక్, జిల్లా కాంగ్రెస్ కమిటీలు వేయాలని మొదట భావించింది. ఏప్రిల్ 24 నుంచి జిల్లాల వారీగా ఇన్చార్జ్ల ద్వారా సమావేశాల ఏర్పాటు చేసి ఆశావహుల పేర్లను కూడా సేకరించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్గా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టడం.. పార్టీ పరంగా కొత్త మార్గదర్శకాలను రూపొందించడంతో సంస్థాగత కమిటీల ప్రస్తావన మరుగున పడింది. ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీతోపాటు సంస్థాగత కమిటీలపై చర్చ జరుగుతుండగా.. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మార్పులు, చేర్పులు మంచిది కాదన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, రాష్ట్రస్థాయి కమిటీలకు డైరెక్టర్ల కోసం మాత్రం ఎమ్మెల్యేల ద్వారా పేర్లను సేకరించారు. పదవులకు ప్రామాణికం 2017 కటాఫ్.. మహిళలకు ప్రాధాన్యం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ హైదరాబాద్లో ఇటీవల ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ నుంచి జిల్లా ఇన్చార్జ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావడంతోపాటు సంస్థాగత, నామినేటెడ్ పదవులపైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా నియమించేందుకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు పేర్లు ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలకు సంబంధించి 24 మంది పేర్లను ఎమ్మెల్యేలు సూచించాల్సి ఉంది. వరంగల్ అర్బన్ ప్రాంతాల్లో రెండింటితో సరిపెట్టలేమని, ఐదు వరకు ఇవ్వాలని ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లగా.. పరిశీలిస్తామన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా రాష్ట్రస్థాయి డైరెక్టర్లతోపాటు జిల్లాస్థాయి నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండేలా చూడాలని, 2017 సంవత్సరం కంటే ముందు నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకు కూడా మొదటి దఫాలోనే అవకాశం ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. కష్టపడే నాయకులు, కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నదని, ప్రజాప్రతినిధులు సీనియర్లను ఎంపిక చేయాలని మీనాక్షి సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు నియోజకవర్గాల వారీగా అర్హులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇదే సమయంలో సీనియర్లు, ఆశావహులు పదవుల కోసం మళ్లీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పరిశీలనలో ఉన్న డీసీసీ ఆశావహుల పేర్లు ఇవే... వాస్తవానికి జిల్లా కాంగ్రెస్ కమిటీలను మే నాటికి పూర్తి చేయాలని అధిష్టానం భావించింది. ఈ మేరకు ఏప్రిల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను కలుపుకుని డీసీసీల నియామకానికి జిల్లాకు ఇద్దరు చొప్పున పరిశీలకులను నియమించింది. మే 20 నాటికి డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని భావించి కసరత్తు చేశారు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే సంస్థాగత కమిటీలు వేయాలని అధిష్టానం భావిస్తే జిల్లాల వారీగా ఆశావహుల జాబితాను మరోసారి పరిశీలించి ఖరారు చేసే అవకాశం ఉందని సీని యర్లు చెబుతున్నారు. ఇదే జరిగితే జిల్లాల వారీగా ఒక్కసారి పరిశీలిస్తే హనుమకొండ డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఉండగా.. ఆయన కాదంటే సీనియర్ల స్థానంలో బత్తిని శ్రీనివాస్, ఇనుగాల వెంకట్రాం రెడ్డి, పింగిళి వెంకట్రాంనర్సింహారెడ్డిలలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణనే కొనసాగించాలన్న ప్రతిపాదన వచ్చినా.. రాజకీయ సమీకరణలు మారితే నమిండ్ల శ్రీనివాస్, గోపాల నవీన్రాజ్, కూచన రవళిరెడ్డి పేర్లు వినిపించాయి. మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షుడి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న జె.భరత్చందర్రెడ్డినే కొనసాగిస్తారన్న చర్చ ఉండగా.. ఇక్కడి నుంచి వెన్నం శ్రీకాంత్రెడ్డి, నునావత్ రాధ కూడా ఆశిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే, డోర్నకల్, మహబూబాబాద్, ఎమ్మెల్యేలు రామచంద్రునాయక్, మురళీనాయక్తోపాటు సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి నిర్ణయం కీలకంగా కానుంది. జయశంకర్ భూపాలపల్లి డీసీసీ అధ్యక్షుడిగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, చల్లూరి మధు తదితరుల పేర్లు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి జనగామ డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా.. ఈయనను మార్చితే హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగాపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, లకావత్ ధన్వంతి పేర్లు పరిశీలించారు. ములుగు జిల్లాకు కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్కే మళ్లీ అవకాశమన్న ప్రచారం జరుగగా.. మంత్రి ధనసరి సీతక్క కుమారుడు సూర్య, మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేందర్గౌడ్, బాదం ప్రవీణ్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. -
హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలి
కొత్తగూడ: హక్కుల సాధనకు ఆదివాసీలంతా ఐక్యంగా ఉద్యమించాలని తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగబోయిన రవి సూచించారు. మండల కేంద్రంలో జరిగిన ఆదివాసీ సంఘాల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓవైపు అక్రమ వలసలు, మరో వైపు ప్రభుత్వాల అలసత్వంతో ఆదివాసీలు తమ అస్తిత్వం కోల్పోయే ప్రమాదం ఉందని, అన్ని సంఘాలు సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. మన ఐక్యతకు ఈనెల 9న జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సం వేదిక కావాలని అన్నారు. అందుకు అందరూ కలిసి వచ్చి భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలన్నారు. పలు ఆదివాసీ సంఘాల నాయకులు సందీప్దొర, సతీష్, వెంకన్న, నాగేశ్వర్రావు, లక్ష్మీనారానయణ, ప్రశాంత్, ఉద్యోగ సంఘాల నాయకులు సిద్దబోయిన బిక్షం, సుంచ సారయ్య, కల్తి ఎల్లయ్య, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. విద్యలో అంతరాలు తొలగించాలి కేయూ క్యాంపస్: విద్యలో అంతరాలు తొలగించాలని ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ‘విద్యలో అంతరాలు–అసమానతలు తొలిగిపోయేది ఎలా’ అంశంపై హనుమకొండలోని యూనివర్సిటీ న్యాయ కళాశాలలో ఆదివారం నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు. విద్యారంగంలో ప్రైవేటీకరణతోనే అంతరాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాఽథమిక, మాధ్యమిక విద్యాసంస్థలు దిక్కులేనివిగా తయారయ్యాయని తెలిపారు. ఇంజనీరింగ్లో రూ.45 వేల నుంచి రూ.1,51,600 వరకు ఫీజులు ఉన్నాయని వివరించారు. ఇందుకు ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, తెలంగాణ ఉద్యమకారుల వేదిక చైర్మన్ కె. వెంకటనారాయణ మాట్లాడుతూ ప్రపంచీకరణతో విద్యారంగంలో అంతరాలు బాగా పెరిగిపోయయన్నారు. ఈ అంతరాలు పోవాలంటే ప్రగతిశీల భావాలున్న ప్రజాశ్రేణులను ఐక్యం చేసి పాలకవర్గాలపై పోరాటం చేయడమే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. పౌరస్పందన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధేశ్యాం మాట్లాడుతూ 1980 నుంచే విద్య వ్యాపార సరుకుగా మారిందన్నారు. పలువురు వక్తలు మాట్లాడుతూ విద్యలో అంతరాలు పోవాలంటే ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ సంఘాలు బాధ్యుల లక్ష్మారెడ్డి, రామమూర్తి, శ్రీధర్గౌడ్, విజయకుమార్, వీరస్వామి, రాజిరెడ్డి, పెండెం రాజు, రవీందర్రాజు, శ్రీధర్రాజు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి : సీపీ సన్ప్రీత్సింగ్ వరంగల్ క్రైం: రిటైర్డ్ పోలీసులు, ఉద్యోగులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. పోలీస్ కమిషనరేట్లో సుదీర్ఘ కాలం విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ చేసిన ఏఎస్సై వీవీఎల్ఎన్ మూర్తి, హెడ్కానిస్టేబుల్ జె.కేశవ్, కానిస్టేబుల్ ఎం.ఎల్లయ్య, నాలుగో తరగతి ఉద్యోగి కె.యాదయ్యను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రిటైర్డ్ అధికారుల సేవలు నేటితరం పోలీసులకు అదర్శమని, ప్రశాంత వాతావరణానికి మీ సేవలే కారణమని పేర్కొన్నారు. అదనపు డీసీపీ, శ్రీనివాస్, ఆర్ఐలు నాగయ్య, సతీశ్, ఆర్ఎస్సై శ్రవణ్, రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నేడు కన్నెపల్లి పంపు హౌస్ సందర్శన కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంపు హౌస్ను నేడు (సోమవారం) బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సందర్శించనున్నారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆధ్వర్యంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, కోరుకంటి చందర్, దాసరి మనోహర్రెడ్డి, రసమయి బాలకిషన్, వోడితల సతీష్బాబు, సుంకే రవిశంకర్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి రానున్నారు. -
చి‘వరి’కి నీరందేనా?
డోర్నకల్: నిండుగా మున్నేరు వాగు.. దానికి అనుసంధానంగా సుమారు 12కిలోమీటర్ల పొడవుతో కట్టుకాల్వ నిర్మాణం.. సుమారు 2,000 ఎకరాల ఆయకట్టు పారుతోంది. డోర్నకల్, అమ్మపాలెం తహసీల్దార్ బంజర, పాపటపల్లి తదితర గ్రామాలకు చెందిన రైతులు వందల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. అయితే పిచ్చి మొక్కలు, చెట్లు మొలిచి కట్టుకాల్వ చివరి ఆయకట్టుకు సాగు నీరందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరు కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు.. కట్టుకాల్వలో కొంతకాలం క్రితం సుమారు 6 కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు చేపట్టారు. మున్నేరువాగుకు డోర్నకల్ వైపు కట్టుకాల్వకు నీటిని విడుదల చేసేందుకు రెండు షట్టర్లు ఏర్పాటు చేసి వాగు నిండుగా ఉన్న సమయంలో షట్టర్లు తెరిచి కాల్వకు నీటిని విడుదల చేస్తున్నారు. వానాకాలంలో సుమా రు రెండు వేల ఎకరాల్లో రైతులు ప్రధాన పంటగా వరితో పాటు ఇతర పంటలు సాగు చేస్తున్నారు. చివరి ఆయకట్టుకు చేరని నీరు.. పలు కారణాల వల్ల కట్టుకాల్వ చివరి ఆయకట్టుకు నీరందక పంటలు ఎండి రైతులు నష్టపోతున్నారు. మున్నేరువాగు వద్ద రెండు షట్టర్లు ఉండగా ఒక షట్టర్ డోర్తో పాటు పైభాగంలో డోర్ తెరిచే పరికరాలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. దీంతో ప్రస్తుతం ఒకే షట్టర్ను తెరిచి నీటిని విడుదల చేస్తున్నారు. కాల్వలో చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగి నీటి ప్రవాహానికి అడ్డుగా మారాయి. కిలోమీటర్ల మేర చెట్లు, గడ్డి, పిచ్చి మొక్కలు పెరగడంతో నీటి ప్రవాహం ముందుకు సాగడం లేదు. మున్నేరువాగు నుంచి సుమారు కిలోమీటరు దూరంలో కాల్వ నీటి ప్రవాహం కోసం చిన్నపాటి టన్నెల్ నిర్మాణం చేశారు. సక్రమంగా నిర్మాణం చేపట్టకపోవడం, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కాల్వ నిండి నీరు రోడ్డు మీదుగా తిరిగి మున్నేరువాగులోకి ప్రవహిస్తోంది. అలాగే కాల్వకు అక్కడక్కడా గండ్లు పడడంతో నీరు వృథాగా పోతోంది. ఆ గ్రామాలకు అందని నీరు.. చివరి ఆయకట్టు గ్రామాలైన తమసీల్దారు బంజర, సీతారాంపురం తదితర గ్రామాల రైతుల భూములకు నీరందడం లేదు. ప్రస్తుతం కట్టుకాల్వ ప్రారంభంలో నిండుగా ప్రవహిస్తుండగా తహసీల్దారు బంజర సమీపంలో కాల్వలో చుక్క నీరు కనిపించదు. కట్టుకాల్వ నీటిని నమ్ముకుని పంటలు సాగు చేస్తున్న ఆయకట్టు చివరి రైతుల పంటలు చేతికందే దశలో ఎండిపోతున్నాయి. ఏటా వానాకాలం ముందు కట్టుకాల్వలో చెట్లు తొలగించి శుభ్రం చేయాలని, పూర్తిస్థాయి కాల్వకు సిమెంట్ లైనింగ్ పనులు చేపట్టాలని అధికారులను వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదంటూ రైతులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కాల్వ పూర్తిస్థాయి మరమ్మతు పనులు చేపట్టాలని కోరుతున్నారు. మరమ్మతులు చేపట్టాలి మున్నేరువాగు నుంచి 12 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కట్టుకాల్వకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి. చాలా చోట్ల చెట్లు, పిచ్చి మొక్కలు పెరగడంతో కాల్వకు గండ్లు పడి చివరి ఆయకట్టుకు సాగు నీరందడం లేదు. –వేల్పుల వెంకన్న, రైతు, తహసీల్దారు బంజర చెట్లు, పిచ్చిమొక్కలతో పూడుకుపోయిన కట్టుకాల్వ మున్నేరువాగు వద్ద తెరుచుకున్న ఒకే షట్టర్ చివరి ఆయకట్టు రైతుల ఆందోళన -
ఉత్తమ బోధన.. మెరుగైన సౌకర్యాలు
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో దోస్త్ ద్వారా అడ్మిషన్లకు అవకాశం కల్పించారు. కాగా జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రైవేట్కు దీటుగా ఇంగ్లిష్ మీడియంలో బోధన చేపడుతున్నారు. మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో జిల్లా కేంద్రంలో డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంతో ఏటా అడ్మిషన్ల సంఖ్య పెరుగుతోంది. కళాశాల అభివృద్ధి.. జిల్లాలోని తొర్రూరు, కేసముద్రం, మరిపెడ, గార్ల, మానుకోటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో 1983లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్ట్స్ గ్రూపులతో ప్రారంభమైంది. ప్రస్తుతం కళాశాలలో 575 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కళాశాల అభివృద్ధిపై అధ్యాపకులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అత్యాధునిక టెక్నాలజీతో కంప్యూటర్ ల్యాబ్, ఇంగ్లిష్ లెర్నింగ్ ల్యాబ్, సైన్స్, బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు తరగతి గదుల్లో సీసీ కెమెరాలు, డిజిటల్ తరగతులు, స్మార్ట్ బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే కళాశాలలో మంచి వాతావరణం, ఆహ్లాదాన్ని అందించేందుకు మొక్కలు నాటిసంరక్షించే బాధ్యతలు చేపడుతున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రత్యేక చొరవతో ఇంగ్లిష్లో బోధన జరుగుతోంది. దీంతో గత సంవత్సరం నుంచి విద్యార్థుల అడ్మిషన్లు భారీగా పెరిగాయి. అంతేకాకుండా క్రీడలు, పీజీ సెట్ ర్యాంకుల్లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరస్తున్నారు. కళాశాలలోని కోర్సులు.. బీఏ (హెచ్ఈపీ), బీకాం కంప్యూటర్స్, జనరల్, బీఎస్సీ (ఎంపీసీ), బీఎస్సీ (ఎంపీసీఎస్), బీఏ (హెచ్పీసీఏ), బీఎస్సీ (బైపీసీ), బీఎస్సీ (బీజెడ్సీ) కోర్సులు ఉన్నాయి. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో బోధన కొనసాగుతోంది. కాగా, న్యాక్లో 2.98 పాయింట్లతో జాతీయ స్థాయిలో మానుకోట డిగ్రీ కళాశాల బి–ప్లస్ప్లస్ గ్రేడ్ గుర్తింపు పొందింది. కళాశాల నుంచి చాలా మంది విద్యార్థులు పలు క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలతో విద్య మానుకోట డిగ్రీ కళాశాలలో అన్ని కోర్సులను తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తున్నాం. ఇక్కడ చదివిన విద్యార్థులు దేశంలోని పలు యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో సీట్లు సాధించారు. పేద విద్యార్థులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒక వరంలాంటిది. బాలికలకు ప్రత్యేకంగా బీసీ బాలికల హాస్టల్ డిగ్రీ కళాశాల ఆవరణలోనే కలెక్టర్ చొరవతో ఏర్పాటు చేశాం. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ కళాశాలలోనే చేర్పించాలి. – లక్ష్మణ్నాయక్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అధ్యాపకుల ప్రోత్సాహంతోనే ర్యాంకు సాధించా.. ప్రతీ సబ్జెక్టులో సందేహాలు ఉంటే వెంటనే అధ్యాపకులు నివృత్తి చేసేవారు. ఎప్పటి సిలబస్ అప్పుడే పూర్తి చేసేది. కళాశాల అధ్యాపకుల ప్రోత్సాహంతో నేను బ్యాచ్లర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ)లో 28వ ర్యాంకు సాధించాను. –యాప శిరీష, కళాశాల విద్యార్థిని డిగ్రీ కళాశాలల్లో దోస్త్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ జిల్లా కేంద్రంలోని డిగ్రీ కాలేజీలో ఇంగ్లిష్ మీడియంలో బోధన అత్యాధునిక టెక్నాలజీతో కంప్యూటర్, సైన్స్ ల్యాబ్ల ఏర్పాటు -
రుద్రేశ్వరున్ని దర్శించుకున్న రాష్ట్ర జైళ్ల శాఖ డీజీపీ
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయాన్ని తెలంగాణ జైళ్ల శాఖ డీజీపీ సౌమ్యమిశ్రా ఆదివారం సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు మంగళవాయిద్యాలతో స్వాగతించారు. ఆమె ముందుగా ఉత్తిష్ట గణపతిని దర్శించుకుని రుద్రేశ్వరస్వామికి లఘన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించుకున్నారు. అనంతరం ఆలయ నాట్యమండపంలో ఉపేంద్రశర్మ తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను వరంగల్ జిల్లాలో పనిచేసినప్పుడు చాలా సార్లు వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించినట్లు తెలిపారు. స్వామివారిని దర్శించుకుంటే కొంత మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. అనంతరం భద్రకాళి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. -
హేమాచలక్షేత్రంలో సండే సందడి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు హేమాచలక్షేత్రానికి ఆదివారం భక్తులు వేలాది గా తరలివచ్చారు. ఆదివారం సెలవురోజు కావడంతో ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ తదితర సుదూర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి వంటి ప్రాంతాల నుంచి తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకుని ఆలయ సమీపంలోని చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వామివారిని దర్శించుకుని తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. ఆలయ పూజారులు స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించి స్వామివారిని నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి భక్తుల గోత్రనామాలతో అర్చనలు జరిపించారు. స్వామి వారి విశిష్టత, ఆలయ చరిత్రను వివరించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిలతైలాభిషేకం పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకన్నారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిత్య అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తుల స్తోమత మేరకు నిత్య అన్నదాన కార్యక్రమ నిర్వహణకు విరాళాలను అందజేశారు. -
డ్రగ్స్పై అవగాహనకే ప్రహరీ క్లబ్లు
విద్యారణ్యపురి: రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు డ్రగ్స్పై అవగాహన కల్పించేందుకే ప్రభుత్వం ప్రహరీక్లబ్లను ఏర్పాటు చేస్తున్నట్లు హనుమకొండ డీఈఓ డి.వాసంతి తెలిపారు. శనివారం హనుమకొండ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లకు, ప్రధానోపాధ్యాయులకు ప్రహరీక్లబ్ల ఏర్పాటు, మాదద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడానికి భీమారంలోని స్కిల్స్టోర్క్ స్కూల్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో డీఈఓ మాట్లాడారు..పాఠశాల హెచ్ఎం చైర్మన్గా, ఓ ఉపాధ్యాయుడు వైస్చైర్మన్గా, ప్రతీ తరగతి నుంచి ఒక బాలుడు, ఒక బాలిక చొప్పున ఆరు నుంచి పదో తరగతి వరకు ప్రహరీ క్లబ్ కమిటీ ఉంటుందన్నారు. యాంటీడ్రగ్స్ నార్కొటిక్స్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. పాఠశాలల సమీపంలో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తే వెంటనే 1908కు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సైకియాట్రిస్ట్ డాక్టర్ ప్రహసిత్, జిల్లా కమ్యూనిటీ మొబలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి, ఆచార్యులు రవికుమార్, ఎంఈవో శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో స్పాట్ అడ్మిషన్లు హనుమకొండ జిల్లాలోని కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లకు 4న అవకాశం కల్పించామని డీఈఓ వాసంతి తెలిపారు. ముల్కనూరు కేజీబీవీలో 22, ధర్మసాగర్ సీఈసీలో 15, ఎల్కతుర్తిలో 48, హసన్పర్తి సీఈసీలో 14, శాయంపేట బీపీసీలో 20, వేలేరు కేజీబీవీలో 33 సీట్లకు స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ముల్కనూరు మోడల్ స్కూల్లో 158, కళాశాలలో 49, ఎల్కతుర్తి మోడల్ స్కూల్లో 234, కళాశాలలో 47, కమలాపూర్ మోడల్ స్కూల్లో 311 సీట్లు, కళాశాలలో 18 సీట్లు భర్తీకి అవకాశం కల్పించామన్నారు. ఆసక్తిగల విద్యార్థులు మార్కుల జాబితాలు, ఆధార్ కార్డు, టీసీతో సంబంధిత పాఠశాలల ప్రిన్సిపాళ్లను కలిసి అడ్మిషన్లు పొందాలన్నారు. హనుమకొండ డీఈఓ వాసంతి -
నైపుణ్యంతోనే ప్రజలకు న్యాయం
మామునూరు: పోలీస్ అధికారులు విధుల్లో ఉత్తమ నైపుణ్యం ప్రదర్శించినప్పుడే ప్రజలకు సరైన న్యాయం లభిస్తుందని డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. వరంగల్ మామునూరు పోలీస్ శిక్షణ కళాశాల పరేడ్ గ్రౌండ్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సీపీ సన్ ప్రీత్సింగ్ పర్యవేక్షణలో మూడు రోజులుగా నిర్వహించిన తెలంగాణ పోలీస్ 2వ డ్యూటీ మీట్–2025 శనివారం ముగిసింది. ఈ ముగింపు వేడుకలకు డీజీపీ జితేందర్, జైళ్ల శాఖ డీజీపీ డాక్టర్ సౌమ్యమిశ్రా ముఖ్యఅతిథులుగా హాజరై డ్యూటీ మీట్ విజేతలకు ట్రోఫీలు, షీల్డ్లు ప్రదానం చేశారు. ఈ పోటీల్లో అత్యధిక మెడల్స్ సాధించిన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించగా డీజీపీ ట్రోఫీ అందజేశారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ రాష్ట్ర పోలీసు సిబ్బంది ఇదే స్ఫూర్తితో రాబోయే జాతీయ స్థాయి డ్యూటీ మీట్కు సిద్ధం కావాలని, లక్ష్యం ఎంచుకుని కఠోర సాధన చేసి మరిన్ని పతకాలు సాధించాలని ఆకాక్షించారు. పోలీస్ అధికారులు క్రమ శిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలన్నారు. అనంతరం జైళ్ల శాఖ డీజీపీ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ రెండోసారి వరంగల్లో రాష్ట్ర స్థాయి డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు. తాను ఎస్పీగా ఉన్న సమయంలో నిర్వహించిన డ్యూటీ మీట్ గుర్తుకు వస్తోందని పేర్కొన్నారు. పోటీల్లో అధికారుల సత్తా .. రాష్ట్ర స్థాయి రెండో పోలీస్ డ్యూటీ మీట్–2025లో ఓవరాల్ చాంపియన్ షిప్ ట్రోఫీని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అందుకుంది. సైంటిఫిక్ ఎయిడ్, యాంటీ సబటేజ్ చెక్, కంప్యూటర్ అవేర్నెస్, డాగ్ స్క్వాడ్, ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫీ, వీడియో గ్రఫీలకు సంబంధించి 25 విభాగాల్లో పోటీలు జరగగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 4 ట్రోఫీలు, 17 పతకాలు కై వసం చేసుకుంది. ఇందులో 6 గోల్డ్ మెడల్స్, 7 సిల్వర్, 4 బ్రాంజ్ (కాంస్య) మెడల్స్ ఉన్నాయి. సైంటిఫిక్ ఎయిడ్ టు ఇన్విస్టిగేషన్ పోటీల్లో సైబరాబాద్ కమిషనరేట్ ప్రథమ స్థానం, హైదరాబాద్ కమిషనరేట్ ద్వితీయ స్థానం, భద్రాచలం జోన్ తృతీయ స్థానం, యాంటీ సబటేజ్ చెక్లో ఇంటెలిజెన్స్ ప్రథమ స్థానం, సైబరాబాద్ కమిషనరేట్ ద్వితీయ స్థానం, డాగ్ స్క్వాడ్ కాంపీటిషన్లో సీఐడీ హైదరాబాద్ ప్రథమ స్థానం, ఇంటెలిజెన్స్ (ఐఎస్డబ్ల్యూ) ద్వితీయ స్థానం, బెస్ట్ డాగ్లో కాళేశ్వరం జోన్ ప్రథమ స్థానం, కంప్యూటర్ అవేర్నెస్, ఫొటోగఫీ పోటీల్లో ఐటీ అండ్ సీ హైదరాబాద్ ప్రథమ స్థానం, ఇంటెలిజెన్స్ హైదరాబాద్ ద్వితీయ స్థానం, వీడియో గ్రఫీ పోటీల్లో సైబరాబాద్ కమిషనరేట్ ప్రథమ స్థానం, హైదరాబాద్ కమిషనరేట్ ద్వితీయ స్థానం సాధించి పతకాలు అందుకున్నాయి. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా పోలీసు కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్రెడ్డి, సీఐడీ డీఐజీ నారాయణనాయక్, వరంగల్, హనుమకొండ జిల్లా కలెక్టర్లు సత్యశారద, స్నేహ శబరీశ్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబూబాద్ జిల్లా ఎస్పీలు కిరణ్ ఖరే, సుధీర్ రామ్నాథ్ కేకన్, పీటీసీ ప్రిన్సిపాల్ ఇంజారపు పూజ, టీజీ ఎన్పీడీజీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, బల్దియా కమిషనర్చాహత్ బాజ్పాయ్, డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి కఠోర సాధనతోనే విజయాలు డీజీపీ డాక్టర్ జితేందర్ ముగిసిన రాష్ట్ర స్థాయి 2వ పోలీస్ డ్యూటీమీట్–2025 అతిఽఽథులకు గౌరవ వందనం .. రాష్ట్ర స్థాయి 2వ పోలీస్ డ్యూటీ మీట్–2025 ముగింపు వేడుకల్లో 450 మంది అధికారులు, సిబ్బంది జెండాలు చేతబూని డీజీపీ జితేందర్రెడ్డి, జైళ్ల శాఖ డీజీపీ సౌమ్య మిశ్రాకు గౌరవ వందనం సమర్పించారు. -
వరంగల్ జిల్లాలో ‘మిషన్ తేజస్’
విద్యారణ్యపురి: సమగ్రశిక్ష తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్నికోలస్ అనుమతితో వరంగల్ జిల్లాకు చెందిన ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థి గుండు అనిరుధ్ ఆధ్వర్యంలో మిషన్ తేజస్ (తెలంగాణ జ్ఞాన ఆవిష్కరణ సంకల్పం) నూతన ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించి ఆ స్కూళ్లను స్మార్ట్ ఇన్నోవేషన్గా మార్చేందుకు దోహదపడుతుంది. ప్రభుత్వానికి లేదా పాఠశాల విద్యాశాఖకు ఎలాంటి ఆర్థిక బాధ్యత ఉండొద్దనే నిబంధనతో ఈ కార్యక్రమానికి అనుమతినిస్తూ సమగ్రశిక్ష రాష్ట్ర డైరెక్టర్ అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ఆ ప్రాజెక్టు అడిషనల్ డైరెక్టర్ ఎం. రాధారెడ్డి ఈనెల 1న ప్రొసీడింగ్ జారీ చేశారు. ఈ మిషన్ ప్రారంభదశలో వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారికి జిల్లాలోని 10 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి అమలు చేయాలని పేర్కొన్నారు. సంబంధిత ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు, ప్రతీ విద్యార్థి భద్రత,సైబర్ భద్రతాపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఆమోదం లభించింది. శనివారం అనిరుధ్ తన తండ్రితో కలిసి వరంగల్ జిల్లా డీఈఓ మామిడాల జ్ఞానేశ్వర్ను కలిశారు. త్వరలోనే 10 ప్రభుత్వ పాఠశాలలను ఎంపికచేసే అవకాశం ఉంది. మిషన్ రూపకర్త వరంగల్ కుర్రాడు గుండు అనిరుధ్ -
జ్వరంతో చిన్నారి మృతి
నర్సంపేట: జ్వరంతో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన చెన్నారావుపేటలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన బట్టి సంతోష్, సరిత దంపతుల కూ తురు మాన్య(2) వారం రో జులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. దీంతో కు టుంబీకులు చిన్నారిని న ర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆ స్పత్రికి తీసుకెళ్లి చికిత్స చే యించాయి. శనివారం పరిస్థి తి విషమంగా ఉండడంతో మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు చిన్నారి మృతదేహం మీద పడి గుండెలవిసేలా రోదించారు. -
చిత్తశుద్ధి నిరూపించుకోవాలి
బీసీ రిజర్వేషన్లపై మల్హర్: తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోందించిన బీసీ రిజర్వేషన్ల పెంపు తీర్మానాన్ని ఆమోదించి కేంద్రం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మండలంలోని తాడిచర్ల సొసైటీ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం అడ్డుపడుతుందని ఆరోపించారు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ కోసం కేబినెట్లో నిర్ణయించి ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్కు పంపామని, కానీ గవర్నర్ నుంచి ఎలాంటి ఆమోదం లభించలేదన్నారు. బీసీ బిల్లు, ఆర్డినెన్స్ ఆమోదంలో జాప్యానికి నిరసనగా 5, 6, 7 తేదీల్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అప్పుడు బీసీ రిజర్వేషన్ చట్టం చేయలేదన్నారు. ఇప్పుడు మాత్రం మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే నిందారోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, తాడిచర్ల గ్రామానికి చెందిన దండు రమేశ్ను ఎన్ఆర్ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్గా నియమించడం దళితులకు దక్కిన గౌరవమని వెల్లడించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ఇప్ప మొండయ్య, మాజీ ఎంపీపీ మల్హల్రావు, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయిత రాజిరెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ మల్క సూర్యప్రకాశ్రావు, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు -
భగ్గుమన్న భూ తగాదాలు..
పాలకుర్తి టౌన్ : మూడు ఇంచుల స్లాబ్ ఇంటి నిర్మాణం వద్ద మొదలైన మాటలు ఘర్షణకు దారి తీశాయి. దాయాదులు పరస్పరం దాడులు చేసుకోవడంతో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం రాత్రి జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి శివారు సుతారి తండాలో జరిగిన భూ దగాదాలు ఉద్రిక్తతకు దారి తీశాయి. బాధితుల కథనం ప్రకారం.. తండాకు చెందిన వాంకుడోతు సక్రు, రంగమ్మ దంపతులు తమ ఇంటి నిర్మాణం కొనసాగిస్తుండగా అదే తండాకు చెందిన దాయాదులు బాలు, రామోజీ, శ్రీకాంత్, సంతోష్, యాకు, భాస్కర్ కర్రలు, గొడ్డళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో దంపతులతో సహా తమ ఐదుగురు కుమార్తెలు, వారి పిల్లలు మొత్తం పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఈ ఘటనపై స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా పోలీసులు స్పందించపోవడంతో బాధితులు అదే రోజు రాత్రి పాలకుర్తి సీఐ కార్యాలయానికి వచ్చారు. అయితే సీఐ అందుబాటులో లేకపోవడంతో పాలకుర్తి ఎస్సై పవన్కుమార్.. కొడకండ్ల ఎస్సై రాజుతో మాట్లాడి పంపించారు. కాగా, కొడకండ్ల ఎస్సై రాజు తమను పట్టించుకోకుండా దురుసుగా ప్రవర్తించారని, దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. మూడు ఇంచుల స్లాబ్ ఇంటి నిర్మాణంలో ఘర్షణ పరస్పర దాడులు.. పది మందికి తీవ్రగాయాలు సుతారి తండాలో ఘటన -
ఎన్సీసీతో క్రమశిక్షణ
● కమాండెంట్ కల్నల్ ఎస్ఎస్ రామదురై కేయూ క్యాంపస్: ఎన్సీసీతో క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని కమాండెంట్ కల్నల్ ఎస్ఎస్ రామదురై అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో గత నెల 24 నుంచి నిర్వహిస్తున్న ఎన్సీసీ పదో తెలంగాణ బెటాలియన్ వరంగల్ గ్రూప్ క్యాంపు శనివారం సాయంత్రం ముగిసింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల ఎన్సీసీ కేడెట్లు పాల్గొన్నారు. న్యూఢిల్లీలో వచ్చే ఏడాది జనవరి 26న రిపబ్లిక్డే పరేడ్లో పాల్గొనేందుకు ఇక్కడ ఎన్సీసీ కేడెట్లకు శిక్షణ ఇచ్చారు. ఇందులో 120 మందిని ఎంపిక చేశారు. అందులో డ్రిల్, బెస్ట్ క్యాడెట్స్, కల్చరల్, ఫ్లాగ్ఏరియా విభాగాల్లో ఎంపిక చేశారు.కార్యక్రమంలో క్యాంపు ఆడమ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ రవిసునారే, కెప్టెన్ డాక్టర్ పి.సతీశ్, కెప్టెన్ డాక్టర్ ఎం. సదానందం, సుబేదారిమేజర్ జైరామ్సింగ్, రవీందర్, సందీప్, రాధాకృష్ణ, రాజమాణిక్యం తదితరులు పాల్గొన్నారు. తెగిన చెక్డ్యాంలు.. వృథాగా పోతున్న నీరునర్సింహులపేట : మండలంలోని జయపురం, ముంగిమడుగు శివారులోని ఆకేరు వాగుపై నిర్మించిన చెక్డ్యాంలు తెగిపోయాయి. ఈ చెక్డ్యాంలు తెగి ఏడాది దాటుతున్నా మరమ్మతు చేయకపోవడంతో నీరు వృథాగా పోతోంది. వీటితో పాటు కొమ్ములవంచలో ఆకేరు వాగుపై నిర్మించిన ఆనకట్ట గేట్ల లీకేజీతో నీరు నిల్వకుండా వాగులోకి వెళ్తోంది. ఫలితంగా వాగు చుట్టు ఉన్న బొజ్జన్నపేట, రామన్నగూడెం, జయపురం, ముంగిమడుగు, కొమ్ములవంచ గ్రామాల్లో సుమారు 900 నుంచి 1000 ఎకరాల్లో సాగుకు నీరులేక రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. కాగా, తెగిన చెక్డ్యాంలపై ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా స్పందించి చెక్డ్యాంలకు మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు. అప్పుల బాధతో ఆత్మహత్యాయత్నం.. ● చికిత్స పొందుతున్న కూలీ మృతి గీసుకొండ: అప్పుల బాధతో ఆత్మహత్యాయ్నతాని కి పాల్పడిన ఓ కూలీ.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన గీసుకొండలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన చినగారి భాస్కర్(43) కూలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం ఇంటి నిర్మాణం చేపట్టగా అప్పు అ య్యింది. దీంతో అప్పు తీర్చలేని స్థితితోపాటు కు టుంబాన్ని పోషించలేక గత నెల 25న గడ్డి మందు తాగగా వరంగల్ ఎంజీఎం తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు గీసుకొండ ఇన్స్పెక్టర్ మహేందర్ తెలిపారు. -
చిరంజీవులుగా జీవిద్దాం..
వెంకటాపురం(ఎం) : మనిషి మరణించిన తర్వాత మట్టిగానో.. బూడిదగానో మారే అవయవాలను దానం చేస్తే మరొకరికి ప్రాణం పోసినట్లే. అంతేకాకుండా అవయవాలను దానం చేసిన మనిషి కూడా చిరంజీవిగా జీవించినట్లే. చావుకు సమీపంలో ఉన్న వ్యక్తిని బతికించగల గొప్ప కార్యమిది. ఈ క్రమంలో అవయదానంపై సమాజంలో ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. అవయవదానం కొత్తేమీ కాదు. కన్నప్ప సాక్షాత్తు ఈశ్వరుడికే తన కన్ను దానం చేశాడు. మన మధ్య కూడా అలాంటి దానకర్ణులు ఉన్నారు. విలువైన అవయవాలను మట్టిపాలు చేసే బదులు ఇంకొకరికి దానం చేస్తే వారి ఆయుష్షు పెంచిన వారమవుతామని వైద్యులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆయువు పోయినా.. అవయదానంతో ఊపిరిపోద్దాం.. రండి.. అవయదానం చేద్దాం.. మరణించినా మరో వ్యక్తిలో జీవించే ఉందాం.. అంటూ అవయవాల దానంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు ఏటా ఆగష్టు 3న జాతీయ అవయవదాన దినోత్సవం నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. చనిపోయిన తర్వాత దానం చేసే అవయవాలు.. మనిషి మరణానంతరం కళ్లు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్, జీర్ణ వ్యవస్థలోని ప్యాంక్రియాస్, పేగులు దానం చేయొచ్చు. అయితే రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి తలకు రక్త సరఫరా నిలిచిపోయిన, తీవ్రంగా గాయపడిన వారు బ్రెయిన్ డెడ్ అని నిర్ధారణ అయిన తర్వాత మాత్రమే అవయవాలను సేకరిస్తారు. ఎనిమిది మందికి పునర్జన్మ.. చనిపోయిన వ్యక్తి నుంచి ఎనిమిది మందికి అవయవాలను దానం చేసే వీలుంది. గుండె, మూత్రపిండాలు, కళ్లు, పాంక్రియాస్, ఊపిరితిత్తులు, కాలేయం, పేగులు, ఎముకల్లోని మజ్జ, ఇతరులకు మార్పిడి చేసే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కిడ్నీ, కాలేయం, ఎముక మజ్జ బతికుండగానే దానం చేయొచ్చని పేర్కొంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో.. తెలంగాణ నేత్ర శరీర అవయవదానం సంస్థ ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు 228 మంది నుంచి కళ్లు, 158 పార్థివదేహాలు, 126 మంది నుంచి అవయవాలు సేకరించారు. 30 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ సంస్థ ద్వారా నిర్వాహకులు ప్రజలకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో గుర్తింపు పొందిన ఈ సంస్థ దేశంలోనే ఆర్గాన్ డోనేషన్లో రెండో స్థానంలో ఉంది. మరణిస్తూ మరొకరికి ప్రాణంపోద్దాం.. అవయవదానంపై సమాజంలో పెరుగుతున్న అవగాహన నేడు జాతీయ అవయవదాన దినోత్సవం -
కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న స్నేహితులు
స్నేహితం.. సేవే అభిమతం తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1984–85 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆపదలో స్నేహితులకు ఆర్థిక చేయూతనిస్తూ ఆసరాగా నిలుస్తున్నారు. తీవ్ర అనారోగ్యం బారిన పడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మిత్రుడు చాట్ల సంపత్ను బతికించాలని రూ.1.3 లక్షలు సమీకరించి చికిత్స అందించారు. అదేవిధంగా కంఠాయపాలెం గ్రామానికి చెందిన ఆర్ఎన్ చారి అనారోగ్యం బారిన పడి ఆర్థికంగా చితికిపోగా.. గుర్తించిన మిత్రులు రూ.50 వేలు జమ చేసి అందించారు. పదో తరగతి మిత్రుడు నాగేశ్వరావు ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తుండగా.. బస్సు ప్రమాదంలో అతడి కాళ్లు విరిగాయి. ఆరు నెలలు డ్యూటీ లేకుండా ఇంట్లోనే ఉండడంతో అతడి కూతురు చదువుకు ఫీజు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో మేమున్నామంటూ సహచర పదో తరగతి మిత్రులు రూ.70 వేలు అందించారు. ● ఆర్థికంగా ఆదుకుంటున్న పూర్వ విద్యార్థులు ● ఆదర్శంగా నిలుస్తున్న ఉమ్మడి జిల్లా దోస్తులు నేడు ఫ్రెండ్షిప్ డేలింగభేదాలకు అతీతం.. కులమతాలకు వ్యతిరేకం.. కష్టాల్లో గుండె నిబ్బరం. రంగుల కలలను రంగరించే ప్రత్యేక లోకం. అదే స్నేహ బంధం దృగంతాలను చుట్టి రావాలన్నా.. అంబరాన్ని అందుకోవాలన్నా.. సందర్భమేదైనా జిందగీలో దోస్తానా అనేది ఉంటే.. దిల్.. జిగేల్ అనాల్సిందే! అలాంటి స్నేహ మాధుర్యానికి నేడు (ఆదివారం) స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ అక్షర రూపం ఇచ్చింది. కలిసి నడుస్తున్న బాల్యమిత్రులు.. దేవరుప్పుల: బడికెళ్లే వయసు నుంచి బతుకుదెరువు వరకు కలిసే నడుస్తున్నారు జనగామ జిల్లా దేవరుప్పుల మండలం నీర్మాలకు చెందిన కొత్త జలంధర్రెడ్డి, కూతాటి నర్సింహులు. వీరు పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. ఉన్నత చదువులు చదవకపోయినా ఆ ప్రాంత వామపక్ష భావజాలంతో ఇరువురు పలు ప్రజాస్వామిక ఉద్యమాల్లో చురుగ్గా పనిచేశారు. రాజకీయ, సామాజిక ఉద్యమాల్లో రాణిస్తూ ఆఖరికి బతుకుదెరువు కోసం సైతం ఇరువురు వ్యాపారంలోనూ కలిసే పనిచేస్తున్నారు. ఆదర్శంగా నిలుస్తున్నారు. స్నేహితుల సంఘం! గీసుకొండ: గ్రేటర్ వరంగల్లోని 16వ డివిజన్ ధర్మారంలోని కోట మెసమ్మ తల్లి పరపతి సంఘం (స్నేహితుల సంఘం) ఆదర్శంగా నిలుస్తోంది. 2014 ఆగస్టు 15న తొమ్మిది మంది స్నేహితులు కలిసి ఏర్పాటు చేసిన సంఘంలో ప్రస్తుతం 24 మంది సభ్యులున్నారు. రూ. 50 లక్షల టర్నోవర్తో సంఘం లావాదేవీలు నిర్వహిస్తోంది. అవసరం ఉన్నసభ్యులకు 0.5 వడ్డీతో రుణాలిస్తున్నారు. సంఘ సభ్యులెవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.లక్ష సాయం అందిస్తున్నారు. ఏటా ఫ్రెండ్ షిప్ డే రోజున సంఘ వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. కోటమైసమ్మ తల్లికి గొర్రెలను బలిచ్చి విందు చేసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు.ఆడపిల్లలకు ఆర్థిక చేయూత ఖానాపురం: మండల కేంద్రంలోని హైస్కూల్లో 1996–97లో విద్యార్థులు పదో తరగతి పూర్తి చేసుకున్నారు. వీరంతా మూడేళ్ల క్రితం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకున్న సమయంలో వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేసుకున్నారు. వీరితో పాటే 6 నుంచి 9వ తరగతి చదివిన వారిని సైతం ఇదే గ్రూప్లో యాడ్ చేసుకున్నారు. ప్రస్తుతం సుమారు 50 మందితో గ్రూప్ సాగుతోంది. గ్రూపులో ఎవరికి ఏ కష్టమొచ్చినా తామున్నామనే భరోసాను కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 14 మంది స్నేహితుల కుమార్తెలకు వివాహ సమయంలో ఆర్థిక సాయం అందించారు. -
‘భూ భారతి’తో భూసమస్యలు పరిష్కారం
గార్ల: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ ద్వారా రైతుల భూ సమస్యలు పరిష్కారమవుతాయని రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు, భూభారతి రూపకర్త భూమి సునీల్ అన్నారు. సాగు న్యాయ యాత్రలో భాగంగా శనివారం గార్ల సమీపంలోని ఓ రైతు పత్తి పంటను ఆయన క్షేత్రస్థాయిలో సందర్శించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి చట్టంపై సిబ్బందికి వివరించారు. ఈసందర్భంగా ఆయనను తహసీల్దార్ సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు రాంరెడ్డి గోపాల్రెడ్డి, భూదాన్ బోర్డు మాజీ చైర్మన్ గున్నా రాజేందర్రెడ్డి, వ్యవసాయశాఖ కమిషన్ చైర్మన్ ఓఎస్డీ హరిప్రసాద్, మాజీ ఏఎంసీ చైర్మన్ భూక్యా నాగేశ్వరరావు, లీఫ్ సంస్థ ప్రతినిధులు తదితరులున్నారు. ఎల్టీఆర్ చట్ట పరిధిలోనే భూమార్పులు బయ్యారం: ఏజెన్సీ ప్రాంతంలో అమల్లో ఉన్న ఎల్టీఆర్ చట్టానికి లోబడే కొత్త చట్టంలో భూమార్పులు ఉంటాయని రైతు కమిషన్ సభ్యులు భూమి సునీల్ అన్నారు. సాగున్యాయ యాత్రలో భాగంగా శనివారం బయ్యారంలోని రైతువేదికలో ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడారు. భూభారతి చట్టం ప్రకారం భూమి ఉన్న ప్రతిరైతుకు పట్టాదారు పాస్బుక్ వస్తుందన్నారు. రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు భూమి సునీల్ -
బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్
హన్మకొండ: సమాజానికి సేవ చేయాలనే సదుద్దేశంతో 10 మందితో మొదలైంది బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్. ప్రస్తుతం వేయి మందితో నడుస్తోంది. ఆర్థిక సమస్య కారణంగా ఎవరూ చదువు మధ్యలోనే ఆపవద్దనే లక్ష్యంతో ఈ ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు ప్రభుత్వ ఉపాధ్యాయుడు పులి దేవేందర్, డిప్యూటీ తహసీల్దార్ పతంగి భాస్కర్తో పాటు మరికొంత మంది మిత్రులు. 2020లో మొదలైన ఈ ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పేద విద్యార్థులకు ఆర్థికసాయం, పాలిసెట్ బుక్స్ పంపిణీ, పోటీ పరీక్షల పుస్తకాలు, మెటీరియల్ అందజేత, తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఆర్థిక సహాయం. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు భరోసా కల్పిస్తూ వారికి ఆర్థిక చేయూతనందిస్తూ ముందుకుసాగుతోంది. -
ఆదివారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2025
– 8లోu3. నీకు ఎంతమంది నిజమైన ఫ్రెండ్స్ ఉన్నారు? A) ఇద్దరికి మించి B) ఒకరు211. ఫ్రెండ్ షిప్ అంటే..మీ దృష్టిలో A) అవసరాలు తీర్చేది B) కల్మషం లేనిది84స్నేహం అంటే మనుషుల్ని కలిపే వారధి. కష్టసుఖాలను పంచుకునే ఓ అనుభూతి. కష్టం వచ్చిందంటే నేనున్నానంటూ ‘చేయి’ అందించే ఓ రూపం.. ప్రపంచంలో ప్రతీ బంధానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు. బంధువులు సహజంగా లభిస్తారు. కానీ స్నేహితులు మాత్రం మనం మన చేతిగా ఎంచుకునే బంధం. అలాంటి అపూర్వమైన అనుబంధాన్ని గుర్తుచేసుకునే రోజు స్నేహితుల దినోత్సవం. ఈ నేపథ్యంలో స్నేహబంధంపై ఉమ్మడి వరంగల్ జిల్లా యువత మనోగతంపై ‘సాక్షి’ సర్వే నిర్వహించింది. ఇప్పటికీ, ఎప్పటికీ కల్మషం లేనిది స్నేహబంధమని చెప్పుకొచ్చారు. ప్రతీ ఒక్కరికి జీవితంలో ఇద్దరికంటే ఎక్కువ స్నేహితులుండాలని, అప్పుడే ఏదైనా ఆపద వస్తే అండగా ఉంటారని చెప్పారు. 36992. ఫ్రెండ్షిప్ కూడా.. కలుషితం అయ్యిందా? 4. నీ ఫ్రెండ్కు ఇచ్చేస్థానం? A) అమ్మ, నాన్న, ఫ్రెండ్ B) నాన్న, అమ్మ, ఫ్రెండ్ A● ఇద్దరికి మించి స్నేహితులు అవసరం ● అమ్మానాన్న తర్వాత ఫ్రెండ్కే ప్రాధాన్యం ● ఉమ్మడి వరంగల్ జిల్లా యువత మనోగతంA) లేదుB) అవును2932C) ఫ్రెండ్, అమ్మ, నాన్న 6159న్యూస్రీల్– సాక్షి నెట్వర్క్ -
కేసుల పరిష్కారానికి చొరవ చూపాలి
మహబూబాబాద్ రూరల్: పోలీస్ స్టేషన్లు, కోర్టుల్లో కేసులను మీడియేషన్ ద్వారా పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. సెప్టెంబర్లో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్, రెవెన్యూ, పోలీస్ అధికారులతో పెండింగ్ కేసుల పరిష్కారంపై జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ మాట్లాడుతూ.. 90 రోజుల మీడియేషన్ కార్యక్రమం ద్వారా పెద్ద మొత్తంలో కేసుల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. క్రిమినల్ కేసులను త్వరగా పరిష్కరించాలంటే జైల్లోని ఖైదీలను కోర్టులో సకాలంలో హాజరుపర్చాలని సూచించారు. పెండింగ్ వారెంట్లు త్వరగా క్లియర్ చేయాలని, సాక్ష్యులను సరైన సమయంలో హాజరుపర్చాలన్నారు. విచారణ అధికారులు తమ విచారణల్ని త్వరగా ముగించి కోర్టుకు సహకరించాలని పేర్కొన్నారు. సెప్టెంబర్ 13న జరుగనున్న జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పెద్ద మొత్తంలో కేసులు పరిష్కరించాలని ఆదేశించిన మేరకు 90 రోజుల మీడియేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సమయంలో పోలీస్ స్టేషన్లలోకానీ, కోర్టుల్లోకానీ కేసులను మీడియేషన్ల ద్వారా పరిష్కరించుకోవాలని పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టిందన్నారు. సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి శాలిని, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతిమురారి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కృష్ణతేజ్, తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జి ధీరజ్కుమార్, అదనపు కలెక్టర్ అనిల్కుకుమార్, జిల్లా కోర్టు ముఖ్య పరిపాలనాధికారి క్రాంతికుమార్, తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ మీడియేషన్ ద్వారా కేసుల పరిష్కారం -
ఆడపిల్లల్లో స్నేహితుడిని చూసుకుంటూ..
కేసముద్రం: బాల్యమిత్రుడు మృతి చెందాడు. అతని ఇద్దరు కూతుళ్లు అనాథలయ్యారు. ఆ ఆడబిడ్డల్లో స్నేహితుడిని చూసుకుంటున్నారు కేసముద్రంలోని ఎస్వీవీ హైస్కూల్కు చెందిన 1996–97 ఎస్సెస్సీ బ్యాచ్ మిత్రులు. మండలంలోని వెంకటగిరి గ్రామానికి చెందిన గాండ్ల అశోక్కు ఇద్దరు కుమార్తెలు. మొదటి భార్యకు కూతురు పుట్టగానే ఆమె మృతిచెందింది. ఆతర్వాత రెండో వివాహం చేసుకున్నాడు. కాగా.. రెండో భార్యకు మరో కూతురు జన్మించగానే అశోక్ చనిపోయాడు. తండ్రిని కోల్పోయిన ఆ ఇద్దరు చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారింది. స్పందించిన ఎస్సెస్సీ బ్యాచ్ పూర్వవిద్యార్థులు ఆ ఇద్దరు ఆడపిల్లల పేరుమీద సుకన్య సమృద్ధి యోజన కింద ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు. ఏటా రూ.45వేల ఫీజు చెల్లిస్తూ పెద్దకూతురు శివానిని(6వ తరగతి) నర్సంపేటలోని ఓప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నారు. వారి చదువుకున్నంత కాలం ఆ తాము చదివిస్తామని బాల్యమిత్రులు చెబుతున్నారు. -
గిరిజనులు హక్కుల కోసం ఉద్యమించాలి
గూడూరు: రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం తెలంగాణ గిరిజనులు పాలక ప్రభుత్వాలపై ఉద్యమించాలని తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీర రామ్మూర్తినాయక్, సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి అన్నారు. స్థానిక అంగడి మైదానం నుంచి శనివారం ర్యాలీగా బయల్దేరి మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపానికి చేరుకున్నారు. అక్కడ గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు లావుడ్యా రామునాయక్ అధ్యక్షతన టీజీఎస్ జిల్లా 2వ మహాసభ నిర్వహించారు. ఈసందర్భంగా రామునాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడితే గిరిజనుల తలరాతలు మారుతాయనుకున్నా, కలలు అలాగే మిగిలిపోయాయన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ తండాలను జీపీలుగా ఏర్పాటు చేశారు కానీ.. నిధులు కేటాయించక ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుగా పరిస్థితి మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆదివాసీ గ్రామాలపై, ఆదివాసీలపై ఊచకోత విధిస్తూ, అటవీ ప్రాంత గ్రామాలను ఖాళీ చేసే కుట్రలు పన్నుతోందన్నారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన ట్రైకార్ రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయాలని, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో గిరిజన గ్రామాలు, తండాలను అభివృద్ధి చేయాలని కోరారు. హక్కులు కల్పించకపోతే ప్రభుత్వాలపై పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీ జీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్యనాయక్,అజయ్సారఽథి,మాలోతు రవీందర్నా య క్, బానోతు లింగ్యానాయక్, పద్మ పాల్గొన్నారు. టీజీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మూర్తి నాయక్ గిరిజన సమాఖ్య జిల్లా మహాసభ -
ప్రాణాలు ఫణం.. పనే ఆధారం!
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధి మూడో లైన్ నిర్మాణ పనులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా అనంతారం వైపునకు వెళ్లే మార్గంలో మూడో లైన్ రైల్వే పనుల్లో హెవీ వాట్స్ ఓహెచ్ఈ వైర్ కనెక్షన్ పనులు చేసే కార్మికులు పడుతున్న శ్రమ వర్ణనాతీతం. ప్రాణాలు ఫణంగా పెట్టి వైర్లపై నడుస్తూ కార్మికులు పని చేస్తుండడాన్ని ‘సాక్షి’ క్లిక్మనిపించింది. పారదర్శకంగా ఉపాధ్యాయుల పదోన్నతులు● డీఈఓ రవీందర్రెడ్డి మహబూబాబాద్ అర్బన్: పీఎస్హెచ్ఎంలకు, ఎస్ఏ ఉపాధ్యాయుల పదోన్నతులు పారదర్శకంగా కొనసాగిస్తున్నామని డీఈఓ ఏ.రవీందర్రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో శనివారం పీఎస్హెచ్ఎంల, ఎస్ఏల ఉపాధ్యాయుల సర్టిఫికెట్లను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 254 మంది ఉపాధ్యాయుల సర్టిఫికెట్లను పరిశీలించామని, సోషల్ 62 మంది, ఇంగ్లిష్ 46 మంది, బయోసైన్స్ 32 మంది. మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్తో 36 మంది, పీఎస్హెచ్ఎంల 78 మంది సర్టిఫికెట్లను పూర్తి స్థాయిలో పరిశీలించామన్నారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా విద్యాశాఖ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు, సీనియార్టీ లిస్ట్ ప్రకారం పదోన్నతులు వస్తాయన్నారు. సిల్వర్ మెడల్ అందుకున్న అదనపు కలెక్టర్మహబూబాబాద్: హైదారాబాద్లోని రాజ్భవన్లో శనివారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా మానుకోట అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో సిల్వర్ మెడల్ అందుకున్నారు. జిల్లాలోని గంగారం మండలంలో ఉపాధి పనుల కొలతల్లో 6 పారా మీటర్లతో ఉత్తమ ప్రతిభ కనబర్చి 5 సూచికలు సాధించినందుకు రాష్ట్ర స్థాయిలో నీతి ఆయోగ్ కార్యక్రమానికి మానుకోట కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్కు ప్రభుత్వం సిల్వర్ మెడల్ ప్రకటించింది. దాంతోపాటు పలు కార్యక్రమాల్లో వందశాతం ఫలితాలు సాధించినందుకు ఈమెడల్కు ఎంపిక చేశారు. కలెక్టర్ అద్వైత్ కుమార్సింగ్ మెడల్ అందుకోవాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్టొప్పో హాజరై మెడల్ అందుకున్నారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యూరియా అధికంగా వినియోగిస్తే హానిమహబూబాబాద్ రూరల్: రైతులు తగిన మోతాదులో యూరియా వాడాలని మల్యాల కేవీకే ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ బి.క్రాంతికుమార్, జిల్లా వ్యవసాయ అధికారి ఎం.విజయ నిర్మల అన్నారు. మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణంలోని రైతు వేదిక కార్యాలయంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఆన్లైన్ ద్వారా ప్రధానమంత్రి మోదీ 20వ విడత పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమాన్ని రైతులు వీక్షించారు. ప్రధానమంత్రి 9.70 కోట్ల మంది రైతులకు రూ.20,500 కోట్లు ఆన్లైన్ ద్వారా రైతుల ఖాతాల్లోకి జమ చేసినట్లు పేర్కొన్నారు. నానో యూరియా, నానో డీఏపీ వాడకాన్ని పెంచాలని, రైతులు బావుల మోటార్లకు పీఎం కుసుం స్కీంను వినియోగించుకోవాలని సూచించారు. ఉద్యాన శాస్త్రవేత్త ఎల్.సుహాసిని పసుపు సాగులో రైతులకు పలు సూచనలిచ్చారు. మల్యాల కేవీకే ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ బి.క్రాంతికుమార్, మండల వ్యవసాయ అధికారి ఎన్.తిరుపతిరెడ్డి, ఏఈఓలు సాయిప్రకాశ్, రంజిత్ కుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి
హన్మకొండ: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సిగ్గుంటే ఇప్పటికై నా రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు తీర్పుపై బీఆర్ఎస్కు చెంపపెట్టు అని, కాంగ్రెస్ నాయకులు వక్రభాష్యం పలుకుతున్నారని విమర్శించారు. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. ఈ చట్టంపై గౌరవం ఉంటే ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లు స్పీకర్ పెండింగ్లో ఉంచడం సరికాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం తెలిపిందన్నారు. స్పీకర్కు నైతికత ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ సమాంతర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారన్నారు. సమావేశంలో ‘కుడా’ మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, నాయకులు జోరిక రమేశ్, తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, పులి రజినీకాంత్, రవీందర్ రావు, నయీముద్దీన్, బండి రజినీకుమార్, పోలెపల్లి రామ్మూర్తి, బొల్లికొండ వీరేందర్, బుద్దె వెంకన్న, మూటిక రాజు, రమేశ్, శ్రీకాంత్ చారి, మహేందర్, సతీశ్, దేవమ్మ, గౌస్ఖాన్, జేకే పాల్గొన్నారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు -
పంట మార్పిడి విధానంతో రైతులకు మేలు
మహబూబాబాద్ రూరల్: రైతులు పంట మార్పిడి విధానాన్ని అలవర్చుకోవాలని, సేంద్రియ ఎరువుల వాడకాన్ని అలవాటు చేసుకోవాలని డీఏఓ ఎం.విజయనిర్మల అన్నారు. ఐసీఏఆర్, ఐఐఎంఆర్ షెడ్యూల్డ్ తెగల ఉప ప్రణాళిక ఆర్థిక సహకారంతో మహబూబాబాద్ మండలంలోని మల్యాల జేవీఆర్ ఉద్యాన పరిశోధన స్థానం ఆధ్వర్యంలో శుక్రవారం ఉద్యాన రైతులకు శిక్షణ ఏర్పాటు చేసి ఉచితంగా పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. ముందుగా కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ముద్రించిన మిరప పంటలో నల్ల తామర పురుగుల సమగ్ర యాజమాన్యం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఏఓ విజయనిర్మల మాట్లాడుతూ.. ఎరువుల వాడకం తగ్గించి, సహజ వ్యవసాయాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి జినుగు మరియన్న మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ పంట సాగు విధానం, ప్రభుత్వ సబ్సిడీ వివరాలు, పంటతో వచ్చే లాభాల గురించి రైతులకు వివరించారు. రైతులు ప్రభుత్వ రాయితీలను వినియోగించుకోవాలని తెలిపారు. జేవీఆర్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త, అధిపతి కత్తుల నాగరాజు, కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ క్రాంతికుమార్, శాస్త్రవేత్త ప్రశాంత్ మాట్లాడారు. మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులను సాధించిన పలువురు రైతులను శాస్త్రవేత్తలు, అధికారులు సన్మానించారు. సమావేశంలో కేవీకే శాస్త్రవేత్త సుహాసిని, మల్యాల ఉద్యాన కళాశాల టీచింగ్ అసోసియేట్స్ డాక్టర్ పరమేశ్వర్, డాక్టర్ అశోక్, రైతులు పాల్గొన్నారు. డీఏఓ ఎం.విజయనిర్మల -
సాంకేతిక పురోభివృద్ధి..
టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న టీజీ ఎన్పీడీసీఎల్హన్మకొండ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ మండలి (టీజీఎన్పీడీసీఎల్) సాంకేతిక పురోభివృద్ధిలో దూసుకెళ్తోంది. నూతన సాంకేతికను అందిపుచ్చుకుంటూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా దిశగా పరుగులు పెడుతోంది. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీగా కర్నాటి వరుణ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించింది. ప్రధానంగా బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివిన వరుణ్ రెడ్డి టెక్నాలజీలో తన అనుభవాన్ని జోడిస్తూ ఆన్లైన్ సేవలను వినయోగదారుల ముందుకు తీసుకొచ్చారు. ఫలితంగా మునుపెన్నడూ లేని విధంగా కంపెనీలో టెక్నాలజీకి అత్యంత ప్రాధాన్యం పెరిగింది. 17 జిల్లాల పరిధి కలిగి ఉన్న టీజీ ఎన్పీడీసీఎల్ 72.35 లక్షల మంది వినియోగదారులకు సేవలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో టీజీఎన్పీడీసీఎల్లో ప్రవేశపెట్టిన టెక్నాలజీపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. సైది.. సైఫీ.. సిస్టమ్ ఆవరేజ్ ఇంటరప్షన్ డ్యూరేషన్ ఇండెక్స్ (సైది) అనగా వినియోగదారులకు ఎదురయ్యే సగటు అంతరాయ వ్యవధిని, సిస్టమ్ ఆవరేజ్ ఇంటరప్షన్ ఫ్రిక్వెన్షీ ఇండెక్స్ (సైఫీ) అనగా సగటు అంతరాయాల సంఖ్యని విద్యుత్ అంతరాయాలకు కొలమానంగా తీర్చిద్దిదడం. సగటున వినియోగదారుడికి ఎన్ని సార్లు జరిగిన అంతరాయంపై రియల్ టైం డేటాను క్రోడీకరించి వాస్తవ గణాంకాల ఆధారంగా విశదీకరించి అంతరాయాలు జరగకుండా సత్వర చర్యలు తీసుకుని అంతరాయాలను కనిష్ట స్థాయికి తీసుకొచ్చారు. సైది, సైఫీ ద్వారా తరచూ విద్యుత్ అంతరాయాలు జరిగే ఫీడర్లపై దృష్టి సారించి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. హైపర్.. ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలు, ఈదురు గాలులు సంభవించిన సమయంలో అతి తక్కువ సమయంలో విద్యుత్ పునరుద్ధరణ చేపట్టడానికి ‘హైపర్’ అనే కార్యాచరణను రూపొందించారు. ఉద్యోగులు పని చేసే చోట నివాసముండి, సిబ్బంది, సామగ్రిని సమీకరించుకోవడం, సమాచార సేకరణ చేరవేయడం, పటిష్ట వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా విద్యుత్ సరఫరాను వేగంగా పునరుద్ధరించడం హైపర్ ఉద్దేశం. ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్ల ఏర్పాటు వినియోగదారులకు అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రత్యామ్నాయ లైన్ల నిర్మాణం చేపట్టారు. ప్రకృతి వైపరీత్యాలు, మెయింటెనెన్స్, ఇతరత్రా ఏదేని కారణాలతో ఒక లైన్లో సమస్య ఉత్పన్నమైతే మరో లైన్ ద్వారా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ లైన్లు వేశారు. ప్రధానంగా 33/11 కేవీ సబ్ స్టేషన్ల మధ్య ఈ ఇంటర్ లింక్ లైన్లు వేశారు. ఫలితంగా ఒక సబ్ స్టేషన్లో సమస్య ఉంటే మరో సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది. రియల్టైం మానిటరింగ్ సిస్టమ్.. వినియోగదారులకు మరింత మెరుగైన విద్యుత్ అందించడానికి రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం ఎంతో దోహదపడుతుంది. ఇందులో రియల్ టైంలో కచ్చితమైన సమాచారం పొందడం ద్వారా వేగంగా చర్యలు చేపట్టొచ్చు. ఫీడర్ల పర్యవేక్షణ, త్వరితగతిన ప్రతిస్పందించడం ద్వారా అంతరాయాలు గణనీయంగా తగ్గుతాయి. రియల్ టైంలో విద్యుత్ అంతరాయ సమాచారాన్ని ఫీల్డ్ సిబ్బందికి అందించి అతి తక్కువ సమయంలో సరఫరాను పునరుద్ధరించడం దీని ద్వారా సాధ్యం. ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లు.. విద్యుత్ సరఫరా వ్యవస్థలో 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్లలో తలెత్తే సాంకేతిక లోపాలు వెంటనే తెలుసుకునేందుకు పొడవాటి విద్యుత్ లైన్లలో ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ లైన్లో లోపం జరిగిన వెంటనే అధికారులకు సమాచారం వెళ్తుంది. లోపం ఏ ప్రాంతంలో తలెత్తిందో స్పష్టంగా తెలియడం ద్వారా వేగంగా ఆ లోపాన్ని సరిచేసి తక్కువ సమయంలో విద్యుత్ను పునరుద్ధరిస్తారు. దీని ద్వారా విద్యుత్ అంతరాయాల సమయాన్ని గణనీయంగా తగ్గించొచ్చు. ఇ–స్టోర్.. పేపర్ విధానంలో మెటీరియల్ విడుదలకు ఆలస్యమవుతుండడంతో ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఇ–స్టోర్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ విధానంలో సంబంధిత సెక్షన్ ఏఈ పనికి కావాల్సిన మెటీరియల్ స్టాక్ ఉందో సాఫ్ట్వేర్లో పరిశీలిస్తారు. అవసరమైన స్టాక్ను రిజర్వ్ చేసుకుంటాడు. రిజర్వ్ చేసుకున్న మెటీరియల్ తాలూకు సమాచారం సంబంధిత ఏడీఈకి, తర్వాత స్టోర్స్కు ఆన్లైన్ ద్వారా వెళ్తుంది. మెటీరియల్ స్వీకరించే అధికారికి ఏ రోజు మెటీరియల్ విడుదల చేస్తారో ఆ తేదీని, సమయాన్ని ఎస్ఎంఎస్, సాప్ మెయిల్ రూపంలో సమాచారం చేరవేస్తారు. దీంతో నిర్ణీత సమయానికి స్టోర్స్కు చేరుకుని మెటీరియల్ తీసుకుంటారు. తద్వారా అధికారుల చుట్టు తిరగాల్సిన అవసరముండదు. సమయం ఆదా అవుతుంది. వ్యయప్రయాసలు తగ్గుతాయి. వినియోగదారులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా ముందుకు అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా దిశగా పరుగులు..వాట్సాప్ చాట్బాట్ విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలు అధికారులకు తెలియజేసేందుకు యాజమాన్యం వాట్సాప్ చాట్ బాట్ను తీసుకొచ్చింది. ఇందులో ముందు వినియోగదారులు తమ మొబైల్ నుంచి వాట్సాప్లో 7901628348 నంబర్కు చాట్ చేయగానే అందులో రిజిస్టర్ కంప్లైంట్, ట్రాక్ కంప్లైంట్, చాట్ విత్ ఏజెంట్ అని వస్తుంది. అందులో రిజిస్టర్ కంప్లైంట్ ఎంటర్ చేయగానే విత్ యూనిక్ సర్వీస్ నంబర్, విత్ అవుట్ యూనిక్ సర్వీస్ నంబర్, ప్రీవియస్ మెను వస్తుంది. ఇలా విత్ యూనిక్ సర్వీస్ నంబర్ ఎంటర్ చేయగానే వినియోగదారుడి సర్వీస్ వివరాలు వస్తాయి. ఈ వివరాలను ఓకే చేయగానే కంప్లైంట్కు సంబంధించిన వివిధ రకాలు మెనులో కనపిస్తాయి. ఇందులో కంప్లైంట్కు సంబంధించి సబ్ టైప్ లేదా చాట్ విత్ ఏజెంట్ వస్తుంది. ఇలా ఏజెంట్తో చాట్ చేయొచ్చు లేదా కంప్లైంట్ నమోదు చేయొచ్చు.ఎల్సీ యాప్.. విద్యుత్ ప్రమాదాల నివారణ, వినియోగదారులకు సత్వర సేవలు అందించేందుకు ఎల్సీ యాప్ను ప్రవేశపెట్టారు. మరమ్మతుల సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేసేందుకు, పునరుద్ధరణకు సమాచారం ఇచ్చేందుకు ఎల్సీ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎల్సీయాప్ ద్వారా మానవతప్పిదాలకు అవకాశముండదు. తద్వారా విద్యుత్ ప్రమాదాలు తగ్గుతాయి. -
ఆదాయం ఘనం..
శనివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2025– 8లోuమహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. రైతులు అధికంగా సరుకులు తీసుకొస్తే స్థలం సరిపోవడం లేదు. దీంతో ఆలస్యంగా వచ్చిన వాహనాలను మార్కెట్ బయటనే ఉంచి, మరుసటి రోజు లోనికి అనుమతిస్తున్నారు. ఆదాయం ఉన్నప్పటికీ.. వసతులు కల్పన, అభివృద్ధి లేకపోవడంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరుకులు అధికంగా వస్తే అంతే సంగతులు.. దశాబ్దాల క్రితం 9.30 ఎకరాల స్థలంలో మార్కెట్ నిర్మాణం చేపట్టారు. కాగా గత వార్షిక సంవత్సరంలో అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులు కలిపి 6,96,373 బస్తాల క్రయవిక్రయాలు జరిగాయి. 5వేల బస్తాల నిల్వ సామర్థ్యం కలిగిన మార్కెట్ యార్డులో సీజన్ సమయంలో 25 వేల బస్తాల నుంచి 30 వేల బస్తాల వరకు వస్తుంటాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణం సరిపోకపోవడంతో సరుకులు అధికంగా వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నా యి. చిన్నపాటి వర్షం వస్తే కూడా రైతులు తమ సరుకులను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. కాగా ప్రభుత్వం 25 నుంచి 30 ఎకరాల భూమిని కేటాయిస్తే వ్యవసాయ మార్కెట్ కా ర్యకలాపాలు సాఫీగా సాగుతాయి. లక్ష్యానికి మించి ఆదాయం.. వ్యవసాయ మార్కెట్ పరిధిలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి మించి ఆదాయం సమకూరుతోంది. గత వార్షిక సంవత్సరానికి సంబంధించి రూ.7.94 కోట్లు లక్ష్యం కాగా రూ.8.65 కోట్ల మేరకు ఆదాయం వచ్చింది. ఏటా ఇదే విధంగా అధిక ఆ దాయం వస్తున్నప్పటికీ అభివృద్ధి పనుల్లో మాత్రం వెనకడుగు వేస్తున్నారు. సిబ్బంది కొరతతో ఇబ్బందులు.. వ్యవసాయ మార్కెట్లో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. మొత్తం 14 పోస్టులకుగాను ప్రస్తుతం సెక్రటరీ, సూపర్ వైజర్, ఇద్దరు ఏఎంఎస్ పనిచేస్తుండగా ఐదు అటెండర్, టైపిస్టు, ఏఎంఎస్, ఎల్డీసీ, అసిస్టెంట్ సెక్రటరీ, వాచ్మెన్ పోస్టులు ఖాళీ గా ఉన్నాయి. 25మంది సెక్యూరిటీ గార్డులు అవసరం ఉండగా ప్రస్తుతం ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఆరుగురు మహిళలు, 12 మంది పురుషులు విధులు నిర్వహిస్తుండగా.. ఏడు సెక్యూరిటీగార్డు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మార్కెట్లో క్రయవిక్రయాలన్నీ ఇ–నామ్ పద్ధతిలో కొనసాగుతుండగా ఆన్లైన్ తక్ పట్టీలు, పేమెంట్ ఇంటిగ్రేషన్ పనులను ఇద్దరు డీఈఓలు మాత్రమే చేపడుతుండగా.. డాటా ఎంట్రీ ఆపరేటర్ల కొరత వేధిస్తోంది. ట్రెజరీలో రూ.12 కోట్ల నిల్వ.. వ్యవసాయ మార్కెట్ ట్రెజరీలో రూ.12 కోట్ల మేరకు నిల్వ ఉన్నట్లు సమాచారం. ఆ డబ్బులతోనైనా మార్కెట్ ప్రాంగణంలో మౌలిక వసతులు, అభివృద్ధి పనులను చేపట్టాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ మార్కెట్కు అనుసంధానంగా రెండువైపులా 18 షాపింగ్ కాంప్లెక్స్ షెటర్లు ఉండగా వాటిల్లో వ్యాపారస్తులు తక్కువ మంది మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మిగతా షెటర్లన్నీ కూడా అద్దెకు ఇచ్చినప్పటికీ అవి కూడా అరకొర అద్దెలతో నిర్వహణ కొనసాగుతోంది. వాటికి టెండర్లు ఖరారు చేయడంలో సంబంధిత పాలకమండలి, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శిఽథిలావస్థకు చేరిన ఏఎంసీ కార్యాలయ భవనం న్యూస్రీల్ మానుకోట వ్యవసాయ మార్కెట్లో సమస్యల తిష్ట అధికంగా సరుకులు వస్తే సరిపోని స్థలం శిథిలావస్థలో కార్యాలయాల భవనాలు వసతులు లేక రైతన్నల ఇబ్బందులు శిఽథిలావస్థలో భవనాలు.. వ్యవసాయ మార్కెట్ కార్యకలాపాలు నిర్వహించే భవనం శిథిలావస్థకు చేరింది. దీంతో ఆ భవనం పక్కనే ఉన్న మార్కెట్ షాపింగ్ కాంప్లెక్ భవనంలో వ్యవసాయ మార్కెట్ పాలక వర్గం, అధికారులు, సిబ్బంది తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఈ మేరకు శిథిలావస్థ భవనం స్థానంలో కొత్త భవనం నిర్మించాల్సి ఉంది. అలాగే రైతుల అవసరాల నిమిత్తం మరో నూతన కవర్ షెడ్డు నిర్మించాల్సి ఉంది. రెండు విశ్రాంతి భవనాలు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో రైతులు, హమాలీలు, దడవాయిలకు నిలువ నీడ కరువైంది. -
పదేళ్లలో చేయలేనిది రెండేళ్లలో చేసిచూపాం
కొత్తగూడ: పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనులు రెండేళ్లలో ప్రజా ప్రభుత్వం చేసి చూపిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర,శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఓటాయి క్రాస్రోడ్డు సమీపంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టకుండా బీఆర్ఎస్ నాయకులు స్వలాభం కోసం తాత్కాలిక పనులు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో సకాలంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టి అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. దివంగత ముఖ్య మంత్రి రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చిందని, మళ్లీ ఇప్పుడు సీంఎ రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో జారీ చేశామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో మాత్రమే సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రానికి యూరియా సరఫరా చేయడంలో కేంద్రం మొండి చేయి చూపినా కొత్తగూడ మండలానికి సరిపోను సరఫరా అయ్యే విధంగా చూస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. కొందరు బీఆర్ఎస్ నాయకులు కావాలని బద్నాం చేసేందుకు యత్నిస్తున్నారని, వారి మాటలు నమ్మవద్దని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారికి మహిళా సంఘాల ద్వారా ప్రత్యేక రుణాలు ఇప్పించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎంపికై న వారు వెంటనే ఇంటి పనులు ప్రారంభించాలని సూచించారు. కొత్తగూడ, గంగారం మండలాలకు ఇప్పటికే వెయ్యి ఇళ్లు మంజూరయ్యాయని, మరో 200ఇళ్ల మంజూరు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ముందుగా గుంజేడు ముసలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీతక్క ఆలయ అభివృద్ధి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్క -
చేతులు, కాళ్లను చున్నీతో కట్టి.. మరో చున్నీతో మెడ బిగించి..
ఖిలా వరంగల్ : ప్రేమించి పెళ్లి చేసున్నాం.. అన్ని మర్చిపోయి సంతోషంగా జీవిద్దామని భార్యను ప్రాధేయపడినా.. మనసు మార్చుకోకపోవడంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన గురువారం రాత్రి వరంగల్ ఏనుమాముల పోలీస్ స్టేషన్ పరిధి బాలాజీ నగర్లోని కమ్మల గుడి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. ఉత్తర్ప్రదేశ్కు చెందిన రితేష్ సింగ్ ఠాకూర్ అలియాస్ పడ్డు ఆరేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం వరంగల్ వచ్చి కమ్మల గుడి వద్ద నివాసముంటూ ఐస్క్రీమ్ వ్యాపారం కొనసాగిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం రితేష్ సింగ్ ఠాకూర్ను ఏనుమాముల రోడ్డులోని లక్ష్మీ గణపతి కాలనీకి చెందిన ఎండి. మహబూబ్ కుమార్తె రేష్మా సుల్తానా ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు సురాజ్, సరస్వతి ఉన్నారు. దంపతులు ఐస్ క్రీమ్ వ్యాపారం నిర్వహించుకుంటూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఆరునెలల క్రితం రేష్మా సుల్తానాకు ఉత్తర్ప్రదేశ్కు చెందిన సన్నీతో పరిచయం ఏర్పడింది. సన్నీ, రితేష్ సింగ్ ఇద్దరు ఉత్తర్ ప్రదేశ్ వాసులు కావడంతో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. సన్నీ తరచూ ఇంటికి రావడంతో రేష్మా సుల్తానా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం రితేష్ సింగ్కు తెలియడంతో భార్యను మందలించాడు. తర్వాత తమ నివాసాన్ని శాంతినగర్కు మార్చాడు. మూడు రోజుల క్రితం రేష్మా సుల్తానా బాలాజీ నగర్లోని తల్లి ఇంటికి వచ్చింది. ఆ వెంటనే భర్త రితేష్ సింగ్ కూడా వచ్చి సన్నీని మర్చిపో.. సంతోషంగా జీవిద్దామని రేష్మా సుల్తానాకు సర్ది చెప్పాడు. అనంతరం జూలై 30న తన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయగా.. ఆమె గర్భవతి అని నిర్ధారణ అయ్యింది. దీంతో భార్యపై కోపం పెంచుకున్నాడు. అనంతరం జూలై 31న రాత్రి 8 గంటలకు రేష్మా సుల్తానా తల్లి ఇంట్లో లేని సమయంలో రితేష్ సింగ్.. భార్యతో గొడవ పడి ఆమె చేతులు, కాళ్లను చున్నీతో కట్టి, మరో చున్నీతో మెడకు బిగించి ఉరివేసి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు రేష్మా సుల్తానా తల్లి ఇంటికి వచ్చి చూడగా.. కుమార్తె చనిపోయి కనిపించింది. సమాచారం అందుకున్న ఏనుమాముల ఇన్స్పెక్టర్ సురేశ్ ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి హత్యకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతురాలి సోదరుడు యాకూబ్పాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ జే.సురేశ్ తెలిపారు. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త వివాహేతర సంబంధమే కారణం ఏనుమాముల బాలాజీనగర్లో ఘటన -
విద్యుదాఘాతంతో జీపీ కార్మికుడి మృతి
వెంకటాపురం(కె): విద్యుదాఘాతంతో ఓ జీపీ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం బీసీ మర్రిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. బీసీ మర్రిగూడెం గ్రామపంచాయతీ కార్మికుడు విజయ్(33) శుక్రవారం శాంతినగర్లోని ప్రభుత్వ పాఠశాలో ఫ్యాన్ బిగిస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన గ్రామస్తులు విజయ్ను వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య జఫర్గఢ్: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి.. ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం తీగారంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, ఎస్సై రామ్చరణ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ముక్కమాల భిక్షపతి (55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల వరి నారు విక్రయించిన విషయంలో దంపతుల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. దీంతో భిక్షపతి అప్పటి నుంచి వ్యవసాయ బావి వద్దే ఉంటున్నాడు. ఈక్రమంలో మనస్తాపానికి గురైన భిక్షపతి.. శుక్రవారం వ్యవసాయ బావి వద్ద ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామ్చరణ్ తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కిడ్నాపర్ల కోసం ఒడిశాకు పోలీసు బృందం గీసుకొండ : మండలంలోని ధర్మారం బస్టాండ్ సమీపంలో గురువారం సాయంత్రం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని కై టెక్స్ కంపెనీలో పని చేస్తున్న వివాహిత రింకిమల్లి కిడ్నాప్కు గురైన విషయం తెలిసిందే. కిడ్నాపర్లు ముందు రెక్కీ నిర్వహించి ప్లాన్తో సదరు వివాహితను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. కారులో వచ్చి కిడ్నాప్ చేసిన అనంతరం దుండగులు నర్సంపేట వైపునకు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే కిడ్నాప్నకు పాల్పడి వారు సదరు వివాహితభర్తతో పాటు ముగ్గురు కుటుంబ సభ్యులే అని పోలీసులు నిర్ధారించారు. వారి ఆచూకీ కోసం ఎస్సై కూడిన పోలీసు బృందాన్ని శుక్రవారం ప్రత్యేకంగా ఒడిశాకు పంపించినట్లు గీసుకొండ సీఐ మహేందర్ తెలిపారు. ఇదిలా ఉండగా.. రింకిమల్లి విషయంలో కై టెక్స్ కంపెనీ ప్రతినిధులు ఆమె ఆచూకీ కోసం పలుమార్లు సెల్ఫోన్ ద్వారా ప్రయత్నించగా ఆమె వారితో మాట్లాడి తన భర్తే తనను తీసుకుని వెళ్తున్నాడని, ఇందులో కిడ్నాప్ ఏమీ లేదని రింకిమల్లి బదులిచ్చినట్లు సమాచారం. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత అసలు విషయం తెలిసే అవకాశం ఉంది. -
పిల్లలకు తల్లిపాలు మాత్రమే తాగించాలి
నెహ్రూసెంటర్: అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఆరు నెలల పిల్లలకు తల్లిపాలు మాత్రమే తాగించాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ సూచించారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆయన తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. కాన్పు జరిగిన కొద్ది రోజుల పాటు తల్లిపాలు చిక్కగా, పసుపు రంగులో ఉంటాయని, ముర్రుపాలలో ప్రొటీన్లు, రోగ నిరోధనశక్తి అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. ముర్రుపాలు బిడ్డకు సంజీవని వంటిదని, అమృతంతో సమానమన్నారు. ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం అత్యంత ప్రయోజనకరమన్నారు. సబ్ సెంటర్ ఆకస్మిక తనిఖీ నర్సింహులపేట: మండల కేంద్రంలోని పీహెచ్సీ సబ్ సెంటర్ను శుక్రవారం డీఎంహెచ్ఓ రవిరాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలు, సీజనల్ జ్వరాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తప్పవన్నా రు. తండాలు, కాలనీల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. -
బీసీల్లో సామాజిక విప్లవం వస్తుంది
కేయూ క్యాంపస్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో పాలకులు నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారని, ఆ వాటా సాధించుకునేందుకు బీసీల్లో సామాజిక విప్లవం వస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం తెలంగాణ పూలే ఆశయ సాధన సమితి (పాస్), నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఎన్బీసీడబ్ల్యూఏ) ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీలోని దూరవిద్యకేంద్రంలో నిర్వహించిన బీసీ ఇంటలెక్చువల్స్ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాకతీయ గడ్డ నుంచే తెలంగాణ రాష్ట్రసాధన తరహాలో బీసీ రిజర్వేషన్ల కోసం బీజేపీపై ఉద్యమం చేయాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు న్యాయం చేయడం కోసం చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నామన్నారు. ఆ పార్టీ బీసీ కులగణన చేపట్టి 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉపక్రమించిందన్నారు. అయితే బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుకు రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే కేంద్ర ప్రభుత్వం మూడునెలలుగా ఆమోదించకుండా జాప్యం చేస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ బీజేపీ తోడుదొంగలేనన్నారు. బీఆర్ఎస్కు బీసీలపై ప్రేమ ఉంటే కరీంనగర్లో 8న జరగబోయే బీఆర్ఎస్ బీసీ శంఖారావం సభకు ముందు ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బీసీని నియమించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎన్బీసీడబ్లూఏ బాధ్యుడు చలమల్లా వెంకటేశ్వర్లు, ‘పాస్’ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సంగనిమల్లేశ్వర్, రాష్ట్ర ఉద్యమకారులవేదిక చైర్మన్ కె. వెంకటనారాయాణ, ‘కుర్తా’ జనరల్ సెక్రటరీ వడ్డెరవీందర్, ‘పాస్’ జిల్లా అధ్యక్షుడు శాస్త్రి, వివిధ సంఘాల బాధ్యులు బాబుయాదవ్, చందా మల్ల య్య, గడ్డం కృష్ణ, ఆకుతోట శ్రీనివాస్, తిరునహరిశేషు, తదితరులు పాల్గొన్నారు. కాగా, బీసీ సంఘాల ప్రతినిధులు ఈ సదస్సు నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించాలని సదస్సు తీర్మానించింది. ఆ లేఖను రాష్ట్రపతికి ట్విటర్ ద్వారా పంపినట్లు సంగని మల్లేశ్వర్ తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ -
రైల్వేస్టేషన్లలో మెరుగైన వసతులు
● డీఆర్ఎం గోపాలకృష్ణన్ మహబూబాబాద్ రూరల్ : ప్రయాణికుల అవసరాల మేరకు రైల్వే స్టేషన్లలో మెరుగైన వసతులు కల్పిస్తామని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ గోపాలకృష్ణన్ అన్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి, నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైలులో మహబూబాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్న డీఆర్ఎం.. నిర్మాణ పనులు పరిశీలించి గడువులోగా పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. డీఆర్ఎంను కలిసిన ఎమ్మెల్యే.. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో కొత్త బజారు వైపున నాలుగో ప్లాట్ ఫామ్ నిర్మించాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్.. డీఆర్ఎం గోపాలకృష్ణన్ను కోరారు. అలాగే, రైల్వే స్టేషన్లో మౌలిక వసతులు కల్పించాలని, రైల్వే మెయింటెనెన్స్ వర్క్ షాపుతో పాటు గ్రాండ్ ట్రంక్, ఏపీ, తమిళనాడు, వందేభారత్, ఎల్టీటీ, గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆపాలని, అండర్ పాస్ నిర్మించాలని కోరారు. అలాగే, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మహ్మద్ ఫరీద్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ఇందుభారతి, ఇస్లాహే మాషిరా అధ్యక్షుడు ఎక్బాల్ కూడా డీఆర్ఎంను కలిసి మానుకోట రైల్వే స్టేషన్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. రైల్వే స్టేషన్ తనిఖీ.. డోర్నకల్: డోర్నకల్ రైల్వేస్టేషన్ను శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ గోపాలకృష్ణన్ తనిఖీ చేశారు. ప్రత్యేక రైలులో డోర్నకల్ చేరుకున్న డీఆర్ఎం రైల్వే స్టేషన్లోని ప్లాట్ఫామ్లను తనిఖీ చేశారు. అనంతరం గూడ్స్ యార్డులోని సీ అండ్ డబ్ల్యూ డిపోను తనిఖీ చేశారు. డీఆర్యూసీసీ సభ్యులు ఖాదర్, వర్తక సంఘం ప్రముఖులు కాలా మహేందర్జైన్ తదితరులు రద్దయిన ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని, పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు డోర్నకల్లో హాల్ట్ కల్పించాలని కోరుతూ డీఆర్ఎంకు వినతిపత్రం అందజేశారు. -
ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలి
చిన్నగూడూరు: ప్రజల ఆరోగ్యం, విద్యార్థుల చదువుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్, ఉగ్గంపల్లి పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలో రికార్డులను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలను పెంచి, అబార్షన్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతీ ఇంటికి తిరిగి ఆరోగ్య సర్వే నిర్వహించి, వివరాలు సేకరించాలన్నారు. ఇన్పేషెంట్, ఔట్ పేషెంట్ వివరాల రిజిస్టర్లను పరిశీలించి, పీహెచ్సీలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న విద్య, ఆహారం తదితర అంశాలపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదిలో విద్యార్థుల చదువు సామర్థ్యాలను పరీక్షించారు. ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని సూచించారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల అడ్మిషన్లు, హాజరుశాతం గణనీయంగా పెరిగినందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంపత్కుమార్, ఎంపీడీఓ యాకయ్య, ఎంపీఓ రజని, డాక్టర్ ప్రవీణ్కుమార్, ఇన్చార్జ్ హెచ్ఎం రెహమాన్, ఉపాధ్యాయులు, వైద్యసిబ్బంది తదితరులు ఉన్నారు. అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో -
నేడు సిల్వర్ మెడల్ స్వీకరించనున్న కలెక్టర్
మహబూబాబాద్: జిలాలో పలు కార్యక్రమాలు వందశాతం పూర్తి చేసినందుకు కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ శనివారం అవార్డు అందుకో నున్నారు. ఈమేరకు శుక్రవారం కలెక్టరేట్ అధి కారులు వివరాలు తెలిపారు. 2024 జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో నిర్వహించిన సంపూర్ణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మొదటి త్రైమాసికం ఏఎన్సీలో గర్భిణులు వందశాతం నమోదయ్యారు. అలాగే బ్లాక్లో డయాబెటిస్ పరీక్షలు వందశాతం నిర్వహించారు. అదేవిధంగా జిల్లాలోని గంగారం మండలం ఆరు పారామీటర్లతో ఉత్త మ ప్రతిభకనబర్చి ఐదు సంతృప్త సూచికలు సాధించినందుకు రాష్ట్రస్థాయిలో నీతి ఆయోగ్ కలెక్టర్కు సిల్వర్ మెడల్ ప్రకటించింది. ఈమేరకు నేడు హైదరాబాద్ రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. బాలల హక్కులను కాపాడాలి మహబూబాబాద్ రూరల్: బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం కావడంతో ఎస్పీ శుక్రవారం మాట్లాడారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు. ఆపరేషన్ ముస్కాన్ 11వ విడతలో జిల్లా వ్యాప్తంగా 40 మంది బాలబాలికలను గుర్తించామన్నారు. తెలంగాణ నుంచి 23 మంది బాలురు, ముగ్గురు బాలికలు, ఇతర రాష్ట్రాల నుంచి 13 మంది బాలురు, ఒక బాలిక ఉందన్నారు. 40 మందిలో ఆరుగురు బాలురు, ఒక బాలికను తల్లిదండ్రులకు అప్పగించామని, 30 మంది బాలురు, ముగ్గురు బాలికలను షెల్టర్ హోంలకు పంపించమన్నారు. జిల్లా వ్యాప్తంగా చిన్న పిల్లలను పనిలో పెట్టుకున్న 20 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. ఎవరైనా బాలలను పనిలో పెట్టుకున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా బాల కార్మికులను వారి తల్లిదండ్రులకు అప్పగించిన ప్రత్యేక బృందాల సభ్యులను ఎస్పీ అభినందించారు.విద్యార్థులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు మహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని వసతి గృహాల్లోని విద్యార్థులపై ఉద్యోగులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారి ఎం. నరసింహస్వామి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్సీ వసతి గృహంలో శుక్రవారం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వార్డెన్లు, నాలుగో తరగతి సిబ్బందికి వ్యక్తిగత పరిశుభ్రత, భోజనంపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహస్వామి మాట్లాడుతూ.. పిల్లలకు భోజనం తయారు చేయడంలో ఎలాంటి పొరపాట్లు చేయవద్దన్నారు. అనంతరం వైద్యుడు కొప్పు ప్రసాద్, మెడికల్ ఆఫీసర్ మౌనిక మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని మరుగుదొడ్లు, విద్యార్థుల గదులు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కార్యాచరణ పక్కాగా అమలు చేయాలి తొర్రూరు: వందరోజుల కార్యాచరణను పక్కాగా అమలు చేయాలని సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ నారాయణరావు అన్నారు. స్థానిక మున్సిపాలిటీలో 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ తీరును శుక్రవారం పర్యవేక్షించారు. ప్లాస్టిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, హరితహారం తది తర అంశాలపై ఆరా తీశారు. అమృత్ పథ కం కింద నిర్మిస్తున్న నీటి ట్యాంకును పరిశీలించారు. కమిషనర్ వక్కల శ్యాంసుందర్తో కలిసి సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ మాట్లాడుతూ.. సీ జనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పను లు సక్రమంగా చేపట్టాలన్నారు. చెత్తను వేరు చేయడం, ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నర్సరీల్లోని మొక్కలు నాటేందుకు స్థలాలు ఎంచుకోవాలన్నారు. సెప్టెంబర్ 9వరకు 100 రోజుల కార్యాచరణ కొనసాగించాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. చెత్తను వేరు చేయడం, పరిశుభ్రత, ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రజల కు అవగాహన కల్పించాలన్నారు. డెంగీ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏఈ రంజిత్కుమార్, మేనేజర్ స్వామి, శానిటరీ ఇన్స్పెక్టర్ దేవేందర్ ఉన్నారు. -
హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష
వరంగల్ లీగల్ : ఓ మహిళ తనను వివాహం చేసుకోమని కోరగా కోపోద్రిక్తుడై ఆమైపె కిరోసిన్ పోసి నిప్పంటించి చంపిన ఘటనలో నేరం రుజువుకావడంతో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం జమస్తాపురం గ్రామానికి చెందిన నేరస్తుడు చిన్నపాక అనిల్కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ వరంగల్ రెండో అదనపు జిల్లా కోర్టు జడ్జి మనీషా శ్రావణ్ ఉన్నవ్ శుక్రవారం తీర్పు వెలువరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.సంతోషి కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్కు చెందిన పార్వతితో చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపహాడ్కు చెందిన సింగారపు బాబుకు వివాహం జరిగింది. కొన్ని సంవత్సరాల అనంతరం బాబు అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. దీంతో పార్వతి రంగశాయిపేటలో అద్దెకుంటూ కూలీ చేసుకుంటూ జీవించేది. పక్కనే అద్దెకుంటున్న చిన్నపాక అనిల్తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయమై పార్వతి సోదరులు పలుమార్లు హెచ్చరించినా ఇరువురిలో మార్పు రాలేదు. దీంతో పార్వతిని తన తండ్రి స్వగ్రామం ఊకల్కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో పార్వతి తండ్రి మృతి చెందడంతో అనిల్ ఊకల్కు రావడం ప్రారంభించాడు. 2015, జూన్ 7న ఊకల్కు వచ్చిన అనిల్ను తనను వివాహం చేసుకోవాలని పార్వతి నిలదీసింది. దీంతో కోపోద్రిక్తుడైన అనిల్.. పార్వతిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. పార్వతి కేకలు విని చుట్టూ పక్కల వారు రాగా అనిల్ పరారయ్యాడు. పార్వతిని 108లో ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై పార్వతి సోదరుడు వెంకన్న.. రాయపర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు.. నేరం రుజువుకావడంతో అనిల్కు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ జడ్జి మనీషా శ్రావణ్ ఉన్నవ్ తీర్పు వెలువరించారు. కేసును పోలీస్ అధికారులు ఎస్.శ్రీనివాస్, ఆర్.సంతోష్ పరిశోధించగా లైజన్ ఆఫీసర్ హరికృష్ణ పర్యవేక్షణలో హెడ్కానిస్టేబుల్ సోమనాయక్, కానిస్టేబుల్ అనిల్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. -
స్కూళ్లలో ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ షురూ
జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా (పెద్దపల్లి మినహా) ప్రభుత్వ పాఠశాలల్లో బోధనచేసే టీచర్లకు ఫేషి యల్ అటెండెన్స్(ఎఫ్ఆర్ఎస్) నమోదు శుక్రవారం నుంచి ప్రారంభమైంది. రాష్ట్రంలో ఉమ్మడి వరంగ ల్ జిల్లాలోని ఆరు జిల్లాల ర్యాంకులు (శాతం) వి డుదల చేశారు. వరంగల్–8, హనుమకొండ–16, మహబూబాబాద్–26, జనగామ–27, ములుగు–29, భూపాలపల్లి–33వ స్థానంలో నిలిచాయి. మొబైల్ ఫోన్లో విద్యార్థితోపాటు ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బందికి సంబంధించి ఒకే లాగిన్లో వేర్వేరుగా అటెండెన్స్ తీసుకునే అవకాశం కల్పించారు. కొంతకాలంగా విద్యార్థులకు ఫేషియల్ అటెండెన్స్ విధానం కొనసాగుతుండగా.. కొత్తగా టీచర్లకు అమలు చేస్తున్నారు. ఉదయం 9.05 గంటలకు, సాయంత్రం 4.15 గంటల తర్వాత టీచర్లు, స్టాఫ్ ఫేషియల్ అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. కాగా, అటెండెన్స్ తీసుకునే సమయంలో రిజిస్ట్రేషన్ తర్వాత ఫొ టో అప్లోడ్ అయ్యేందు కు అరగంట సమ యం పట్టిందని పలువు రు ఉ పాధ్యాయులు తెలిపా రు. సాంకేతిక సమస్య ఇ లాగే కొనసాగితే అటెండె న్స్ కోసమే సమయం వృథా చేయాల్సి వస్తోందని వారు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో ఎఫ్ఆర్ఎస్ నమోదు వివరాలు..జిల్లా పాఠశాలలు టీచర్లు మొదటిరోజు రిజిస్ట్రేషన్ శాతం ర్యాంకు వరంగల్ 534 3,211 2,085 64.93 08 హనుమకొండ 472 2,987 1,883 63.04 16 మహబూబాబాద్ 768 3,859 2,231 57.81 26 జనగామ 459 2,773 1,572 56.69 27 ములుగు 337 1,557 832 53.44 29 జేఎస్.భూపాలపల్లి 414 1,927 901 46.76 33 -
ఓరుగల్లు ఖ్యాతి.. జాతీయస్థాయికి
హన్మకొండ కల్చరల్ : ఓరుగల్లు ఖ్యాతి జాతీయస్థాయిలో మారుమోగింది. ‘ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మతీరు కొంగులోనా దాసిపెట్టి కొడుకుకు ఇచ్చేప్రేమ వేరు’.. అంటూ పొద్దుపొడిచినప్పటినుంచి పల్లెటూరి బంధాలు, అనుబంధాలు, వాతావరణాన్ని వినసొంపుగా పాటరూపంలో బలగం సినిమాకు అందించిన కాసర్ల శ్యామ్కు శుక్రవారం బెస్ట్ లిరిక్స్ కేటగిరిలో నేషనల్ అవార్డు ప్రకటించారు. హనుమకొండలోని బ్రాహ్మణవాడకు చెందిన కాసర్ల శ్యామ్ జానపద పాటలు పాడటం, రాయడంలో నేర్పరి. ఈ నేపథ్యంలో జిల్లావాసికి అవార్డు రావడంతో పలువురు కళాకారులు, జిల్లావాసులు హర్షం వ్యక్తం చేశారు. ఎంతో సంతోషంగా ఉంది.. నేషనల్ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ముందుగా బలగం టీముకు ధన్యవాదాలు తెలుపుతున్నా. పాటకు భీమ్స్ సంగీతంపాటు మంగ్లీ, రామ్ మిర్యాల వాయిస్లు తోడుకావడం వల్ల సంపూర్ణత్వం వచ్చింది. చిన్నతనంలో పల్లెటూర్లు తిరిగాను. పాట వింటేనే పల్లెటూరి జీవనం గుర్తుకు వచ్చేలా రాయాలని అనుకున్నా. తెలంగాణ పల్లెటూర్లలో నివసించే ప్రజలు తెల్లవారుజాము 4గంటలకే లేచి, వారు చేసే పనులు, మనుషుల మధ్య ప్రేమానుబంధాలను గుర్తు చేసుకుంటూ పాట రూపంలో రాశా. –కాసర్ల శ్యామ్, పాటల రచయిత జిల్లావాసి కాసర్ల శ్యామ్కు నేషనల్ అవార్డు ఉత్తమ లిరిక్రైటర్గా గుర్తింపు హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లావాసులు -
34 రైళ్ల సర్వీస్ల పొడిగింపు
కాజీపేట రూరల్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే చర్లపల్లి–పట్నా ప్రత్యేక రైళ్ల సర్వీస్లను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ శుక్రవారం తెలిపారు. పొడిగింపు రైళ్ల వివరాలు.. ఆగస్టు 4వ తేదీ నుంచి సెప్టెంబర్ 29వ తేదీ వరకు పట్నా–చర్లపల్లి (03253) పట్నా ఎక్స్ప్రెస్ ప్రతీ సోమ, బుధవారాల్లో 17 రైళ్ల సర్వీస్లు, ఆగస్టు 6వ తేదీ నుంచి ఆక్టోబర్ 1వ తేదీ వరకు చర్లపల్లి–పట్నా (07255) పట్నా ఎక్స్ప్రెస్ ప్రతీ బుధవారం 9 రైళ్ల సర్వీస్లు, ఆగస్టు 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 26వ తేదీ వరకు చర్లపల్లి–పట్నా (07256) పట్నా ఎక్స్ప్రెస్ ప్రతీ శుక్రవారం 8 రైళ్ల సర్వీస్లను పొడిగించి నడిపిస్తున్నట్లు తెలిపారు. హాల్టింగ్ స్టేషన్లు.. కాజీపేట మీదుగా చర్లపల్లి–పట్నా అప్ అండ్ డౌన్ రూట్లో ప్రయాణించే రైళ్ల సర్వీస్లకు సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, బెల్లంపల్లి, సిర్పూర్కాగజ్నగర్, బల్హార్షా, నాగ్పూర్, గోండియా, దుర్గ్, రాయ్పూర్, బిలాస్పూర్, జర్సుగూడ, రూర్కెలా, హథియా, రాంచీ, బొకారో స్టీల్ సిటీ, గోమ్, కోడేమా, గయా, జెహన్బాద్ స్టేషన్లో హాల్టింగ్ కల్పించారు. ఈ రైళ్లకు 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ అండ్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ల సౌకర్యం కల్పించారు. -
రామప్ప నుంచి లక్నవరానికి నీటి కాల్వ
గోవిందరావుపేట: రామప్ప నుంచి లక్నవరం వరకు నీటి కాల్వ ఏర్పాటు చేస్తామని, తద్వారా రైతులకు ఏడాదిలో రెండు పంటలకూ నీరు అందే అవకాశం ఉంటుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం మండలంలోని లక్నవరం సరస్సు నీటిని కలెక్టర్ దివాకర టీఎస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణితో కలిసి పంట కాల్వ లకు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సాగునీటి వనరుల విస్తరణకు ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందన్నారు. గ్రామాల అభివృద్ధికి కాకతీయులు చెరువులు తవ్వించి సాగు, తాగునీరు అందించేవారన్నారు. వారి స్ఫూర్తితోనే గ్రామీణాభివృద్ధికి ప్రణాళికతో పని చేస్తున్నామన్నారు. చెరువులో నీరు ఉంటే గ్రామం పచ్చగా ఉంటుందని, అదే స్ఫూర్తితో రైతులకు నీటి కొరత లేకుండా పని చేస్తున్నామన్నారు. రైతు సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ నారాయణ, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ● తద్వారా రెండు పంటలకూ సాగు నీరు ● రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క -
నైపుణ్యాలతోనే శాఖాపరమైన గుర్తింపు
ఖిలా వరంగల్: పోలీసులు విధి నిర్వహణతోపాటు నైపుణాలను పెంపొందించుకుంటేనే శాఖాపరమైన గుర్తింపు లభిస్తుందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ మామునూరు పోలీస్ శిక్షణ కళాశాల పరేడ్ గ్రౌండ్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్లో భాగంగా శుక్రవారం రెండో రోజు జరిగిన పోటీలను సీపీ ప్రారంభించి మాట్లాడారు. పోలీస్ డ్యూటీ మీట్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి మానసిక ఒత్తిడి దూరమై ప్రశాంతత లభిస్తుందన్నారు. పోలీసుల నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఇలాంటి పోటీలు దోహదపడుతాయన్నారు. శనివారం సాయంత్రం 5గంటల ముగింపు వేడుకలు జరగనున్నాయని, ముఖ్యఅతిఽథిగా డీజీపీ జితేందర్తోపాటు విశిష్ట అతిథిగా జైళ్ల విభాగం డీజీపీ డాక్టర్ సౌమ్య మిశ్రా హాజరవుతున్నట్లు తెలిపారు. కాగా, డ్యూటీ మీట్ విజయవంతానికి కృషి చేస్తున్న అదనపు డీసీపీలు రవి, సురేశ్కుమార్, శ్రీనివాస్తోపాటు ఇతర అధికారులను సీపీ అభినందించారు. ఉత్కంఠగా కొనసాగుతున్న పోటీలు.. రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. నువ్వా? నేనా అన్నట్లు విజయం కోసం పోటీ పడుతున్నారు. ప్రధానంగా బాంబ్ డిస్పోజల్, పోలీస్ జాగిలాలకు సంబంధించి నాలుగు విభాగాలు,కంప్యూటర్, వీడియో గ్రఫీ, సైంటిఫిక్ ఎయిడ్ విభాగాల్లో పోటీలు జరిగాయి. మోహన్ కృష్ణకు బంగారు పతకం.. రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పీఆర్ఓ మన్నవ మోహన కృష్ణ ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ విభాగంలో బంగారు పతకం సాధించారు. కాగా, ఆయనను సీపీ సన్ప్రీత్ సింగ్ అభినందించారు. ఆటా..పాట డ్యూటీమీట్లో భాగంగా సాయంత్రం విందు అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో సీపీ తన సహచరులతో కలిసి పా టలకు స్టెప్పులేసి అందరినీ అలరించారు. పోటీలతో మానసిక ఒత్తిడి దూరం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్సింగ్ -
‘కాసం’ ప్రజాపోరాటాలు చిరస్మరణీయం
● నేడు నీర్మాలలో కృష్ణమూర్తి వర్ధంతి దేవరుప్పుల : భూమి కోసం..భుక్తి కోసం..బానిస బంధాల విముక్తి కోసం కొనసాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రంగా కాసం కృష్ణమూర్తి చేపట్టిన ప్రజాపోరాటాలు చిరస్మరణీయం. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం నీర్మాలకు చెందిన కాసం కృష్ణమూర్తి గ్రామాల్లో భూస్వాములు, దేశ్ముఖ్ల పెత్తందారి వ్యవస్థపై ఎదురుదిరిగారు. తన తుదిశ్వాస వరకూ సీపీఎం అనుబంధ ఉమ్మడి రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడిగా అనేక విరోచిత పోరాటాలు చేపట్టారు. కాసం వారసత్వాన్ని అందిపుచ్చుకునే క్రమంలో శుక్రవారం నీర్మాలలో ఆయన వర్ధంతి సభ నిర్వహించనున్నారు. ఈ సభను జయప్రదం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి ఇంటి వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. ఫ్యూడల్, రాచరిక పాలన, కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించి దళాలుగా ఏర్పడి ఈ ప్రాంత భూస్వాములు, దేశ్ముఖ్లను తరిమిన మహావీరుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత కాసం కృష్ణమూర్తి అన్నారు. కార్యక్రమంలో నాయకులు పయ్యావుల భిక్షపతి, గడ్డం యాదగిరి, కున్సోత్ మాలు, రెడ్డిరాజుల నారాయణ, జాటోత్ శ్రీను నాయక్, గోడిశాల రాములు, కాసర్ల యాదిరెడ్డి, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు . -
ట్రైనీ సర్వేయర్లకు న్యాయం చేయాలి
హన్మకొండ అర్బన్: ట్రైనీ లైసెన్స్డ్ సర్వేయర్ సిస్టమ్ (ఎల్ఎస్ఎస్)కు ఇటీవల నిర్వహించిన పరీక్షలో సమయానికి మించి ప్రశ్నాపత్రం ఉండడంతో తమకు అన్యాయం జరిగిందని ట్రైనీ ఎల్ఎస్ఎస్లు వాపోయారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలని కోరుతూ హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డికి గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ థియరీ ప్రశ్నాపత్రంలో ఇంగ్లిష్, తెలుగులో విభిన్నంగా ప్రశ్నలు రావడం, ప్రశ్నాపత్రాల్లో టోపో డిటెయిల్స్లో జరిగిన తప్పుల కారణంగా థియరీ ప్రశ్నాపత్రంలో సమాధానాలు రాయడానికి సమయం సరిపోలేదని పేర్కొన్నారు. తాలిమ్ (తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్) మెటీరియల్ ప్రకారం 100 శాతం థియరీ – ప్రాక్టికల్స్ను జిల్లా శిక్షణ కేంద్రంలో అధికారులు, అధ్యాపకులు నేర్పించారని, అయినప్పటికీ ప్రశ్నలు మెటీరియల్ నుంచి ఇవ్వకుండా అన్యాయం చేశారని వాపోయారు. ఈ క్రమంలో మళ్లీ పరీక్షలు నిర్వహించాలని, జవాబు పత్రాలలో పేజీలను పెంచాలని, ప్లాటింగ్లో ప్రింటింగ్ క్లారిటీగా ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. -
ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ చేపట్టాలి
రామన్నపేట : నగరంలోని ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ పక్కగా చేపట్టాలని కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. గురువారం హనుమకొండ ఏషియన్ షాపింగ్ మాల్ ప్రాంతంలోని డబుల్ బెడ్రూంలను, 35వ డివిజన్ వరంగల్ పుప్పాలగుట్ట వాటర్ ట్యాంక్ వద్ద శానిటేషన్ అండర్ డక్ట్ ప్రాంతం, చింతల్ బ్రిడ్జి వద్ద గల ప్రజా మరుగుదొడ్లను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా మరుగుదొడ్ల నిర్వహణ సమర్థవంతంగా చేపట్టేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పుప్పాల గుట్ట ప్రాంతంలో పర్యటించి సిబ్బంది ఫే స్ అటెండెన్స్ను పరిశీలించారు. పారిశుద్ధ్య సిబ్బందితో ఆమె మాట్లాడుతూ.. విధులు నిర్వహించే తీ రుతోపాటు ఒక్కపూట భోజనం సరిపోతుందా..? రెండు పూటల అందించాలా..? అని అడిగి తెలుసుకున్నారు. శివనగర్లో అసంపూర్తిగా ఉన్న డక్ట్ను పరిశీలించిన కమిషనర్ వేగవంతంగా పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఎంహెచ్ఓ రాజేశ్, హెచ్ఓ లక్ష్మారెడ్డి, డీఈలు రాజ్కుమార్, రంగరావు పాల్గొన్నారు. పరిశీలన.. నయీంనగర్: గ్రేటర్ పరిధిలోని ఉనికిచర్ల కుడా లే ఔట్ స్థలం, స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని గురువారం కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) వైస్ చైర్పర్సన్ చాహత్ బాజ్పాయ్.. అధికారులతో కలిసి పరిశీలించారు. ఆమెవెంట పీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీంరావు, ఏపీఓ రామ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ● బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ -
డబ్బుల వసూళ్లకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్
చిట్యాల: మావోయిస్టు ముసుగులో డబ్బుల వసూళ్లకు పాల్పడిన వ్యక్తిని గురువారం అరెస్ట్ చేసి కో ర్టులో హాజరుపరిచినట్లు సీఐ మల్లేశ్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లికి చెందిన పల్లెపాటి గోపాల్రావు మద్యం, పేకాటకు బానిసయ్యాడు. అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో మావోయిస్టు పేరుతో ఓ లేఖను సృష్టించాడు. అనంతరం పది రోజుల క్రితం చిట్యాల మండలం శాంతినగర్ శివారులోని శ్రీ లక్ష్మీనర్సింహ రైస్ మిల్లు యజమాని శేఖరయ్యకు ఫోన్ చేసి మీతో మాట్లాడాలని చెప్పి మావోయిస్టు పార్టీ ఇచ్చినట్లు ఓ కవర్ అందించాడు. అందులో పార్టీ కోసం రూ.25 లక్షలు చందా రూపకంగా ఇవ్వాలని ఉంది. అలాగే, ప్రస్తుతం రూ. లక్ష ఇవ్వాలని, లేనిపక్షంలో చంపేస్తానని బెదించాడు. వారం రోజుల్లో రూ.25 వేలు ఇవ్వాలని, లేకపోతే చంపుతానని హెచ్చరించాడు. దీంతో రైస్మిల్లు యజమాని శే ఖరయ్య బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి అప్రమత్తయ్యారు. ఈ క్రమంలో గురువారం డబ్బులు తీసుకోవడానికి వస్తున్న గోపాల్రావును కై లాపూర్ క్రాస్ వద్ద పోలీసులు ఆపి విచారించగా నిజం ఒప్పుకున్నాడు. దీంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. మావోయిస్టుల పేరుతో ఎవరైనా చందాల వసూళ్లకు పాల్పడితే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై శ్రావన్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
గమ్యంపై గురిపెడితే విజయం..
మామునూరు: ఏకాగ్రతతో గమ్యంపై గురిపెడితే విజయం సొంతమవుతుందని తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ అన్నారు. పోలీస్ అధికారులు తమ వృత్తిలో నైపుణ్యం సాధించేందుకు డ్యూటీ మీట్లు ఎంతో దోహదపడుతా యని పేర్కొన్నారు. విధుల నిర్వహణలో తెలంగాణ పోలీస్ దేశంలోనే బెస్ట్ అని కొనియాడా రు. వరంగల్ మామునూరు పోలీస్ శిక్షణ కళాశాల పరేడ్ గ్రౌండ్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో రెండో తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్–20 25 గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. తె లంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్, అ డిషనల్ డీజీ మహేశ్ భగవత్ ముఖ్య అతిథులుగా హాజరై డ్యూటీ మీట్ను ప్రారంభించారు. రాష్ట్రంలో ని ఉమ్మడి పది జిల్లాలకు చెందిన 450 మంది పైగా 18 టీమ్లు హాజరుకాగా.. పోలీసులు జెండాలు చేతబూని అతిథులకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ మాట్లాడుతూ నేర దర్యాప్తుతోపాటు అన్ని విభాగాల్లో దేశంలోనే తెలంగాణ మొదటి రెండు స్థానాల్లో నిలవడం హర్షణీయమన్నారు. 69వ ఆలిండియా డ్యూటీ మీట్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం అభినందనీయం.. ఇటీవల జరిగిన 68వ జాతీయ స్థాయి డ్యూటీ మీట్లో తెలంగాణ పోలీసులు 18 పతకాలు సాధించడం అభినందనీయమని అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ అన్నారు. జాతీయ స్థాయిలో సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని పథకాలు సాధించేందుకు కృషి చేయాలని తెలిపారు. అంతకు ముందు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్.. తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహణను వివరించారు. 450 మందికిపైగా పోలీస్ అధికారులు, సిబ్బంది హాజరు.. వరంగల్ మామునూరు పీటీసీలో గురువారం నుంచి ఆగస్ట్ 2వ తేదీ వరకు జరగనున్న పోలీస్ డ్యూటీ మీట్–2025 అట్టహాసంగా ప్రారంభమైంది. రా ష్ట్రంలోని ఏడు జోన్లతోపాటు సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్లు, సీఐడీ, ఇంటెలిజె న్స్, యాంటీ నార్కొటిక్ బ్యూరో, సైబర్ సెక్యూరిటీ వింగ్, జీ.ఆర్.పీ, ఐటీ అండ్ టీ, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ విభాగాలకు చెందిన సుమారు 450 మందికిపైగా పోలీస్ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. సైంటిఫిక్ ఎయిడ్ ఇన్విస్టిగేషన్, యాంటీ సబటేజ్ చె క్, కంప్యూటర్ అవేర్నెస్, డాగ్ స్క్వాడ్ కాంపీటిష న్, ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ, వీడియో గ్రఫీలకు సంబంధించి 25 విభాగాల్లో పోటీలు ప్రారంభమయ్యా యి. సీఐడీ డీఐజీ నారాయణ నాయక్, ఎస్పీ రాంరె డ్డి, డీసీపీలు అంకిత్కుమార్, సలీమా, రాజమహేంద్రనాయక్, పీటీసీ ప్రిన్సిపాల్ ఇ.పూజ, కమాండెంట్లు రాంప్రకాశ్, రామకృష్ణ, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.జెండాను ఆవిష్కరిస్తున్న అభిలాష్ బిస్త్ విధుల్లో తెలంగాణ పోలీస్ దేశంలోనే బెస్ట్ వృత్తిలో నైపుణ్యం సాధించేందుకు డ్యూటీ మీట్ దోహదం 69 ఆలిండియా డ్యూటీ మీట్లో సత్తా చాటాలి తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ అట్టహాసంగా పోలీస్ డ్యూటీ మీట్–25 ప్రారంభం -
రూ. 5లక్షల విలువైన గంజాయి పట్టివేత
తరిగొప్పుల: జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లి క్రాస్ వద్ద రూ. 5లక్షల విలువైన 10కిలోల గంజాయిని పట్టకున్నట్లు సీఐ అబ్బయ్య తెలిపారు. ఈ మేరకు గురువారం తరిగొప్పుల పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎస్సై శ్రీదేవి సిబ్బందితో కలిసి అక్కరాజుపల్లి క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒడిశాలోని గంజాం జిల్లా సూర్య నాగ గౌరీ శంకర్ రోడ్డుకు చెందిన సంతోష్ పాండా, పున్నాత్ గ్రామానికి చెందిన శివరాం డాక్వా ఆటోలో అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో ఆటోను ఆపి తనిఖీ చేయగా రూ.5 లక్షల విలువైన 10 కిలోల గంజాయి లభించింది. కాగా, శివరాం డాక్వా పోలీసులను చూసి పారిపోగా సంతోష్ పాండాను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు చేసినట్లు సీఐ అబ్బయ్య తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్సై కాసర్ల రాజయ్య,సిబ్బంది పాల్గొన్నారు. ఒకరి అరెస్ట్, రిమాండ్.. మరొకరి పరారీ వివరాలు వెల్లడించిన పోలీసులు -
వైద్యం కోసం వచ్చి అనంతలోకాలకు..
జనగామ: వ్యవసాయ పొలంలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ రైతు వైద్యం కోసం వచ్చి ఆస్పత్రిలో మృతిచెందాడు. ఈ ఘటనకు వైద్యుడి నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మృతుడి కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. గురువారం జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బసంతాపురం గ్రామానికి చెందిన రైతు ఎం.ప్రభాకర్రెడ్డి(47) గత నెల 26వ తేదీన వ్యవసాయ పొలం దున్నుతున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ తీగ తెగిపడడంతో ట్రాక్టర్ అదుపు తప్పి కింద పడ్డాడు. ఈ ఘటనలో ట్రాక్టర్ కేజ్వీల్స్ అతడి రెండు కాళ్లపై వెళ్లడంతో వెంటనే జనగామలోని ‘అజంతా’ ఆస్పత్రికి తీసుకొచ్చారు. డాక్టర్ బాలాజీ పరీక్షించి.. ప్రభాకర్రెడ్డి కాలుకు ఇన్ఫెక్షన్ ఉందని, తగ్గే వరకు సర్జరీ వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. అనంతరం బుధవారం ఇంటికి తీసుకెళ్లాలని చెప్పగా పరిస్థితి విషమంగా ఉంటే ఎలా తీసుకెళ్లాలని కుటుంబీకులు సదరు వైద్యుడిని నిలదీయగా ఆస్పత్రిలోనే ఉండమన్నాడు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున ప్రభాకర్రెడ్డి మృతిచెందాడు. దీంతో డాక్టర్ నిర్లక్ష్యంతోనే ప్రభాకర్రెడ్డి మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. కాలు ఇన్ఫెక్షన్కు గురైతే మరో ఆస్పత్రికి రెఫర్ చేయకుండా, ఐదు రోజులుగా ఆ ఆస్పత్రిలోనే ఉంచుకోవడంతోనే పరిస్థితి విషమించి ప్రభాకర్ రెడ్డి మృతి చెందాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కాగా, ఈ ఘటనపై డాక్టర్ బాలాజీ మాట్లాడుతూ పేషెంట్కు షుగర్, వీడీఆర్ఎల్ పాజిటివ్, ఇన్ఫెక్షన్, మోకాళ్ల వాపులు ఉండడంతో తగ్గే వరకు సర్జరీని వాయిదా వేసినట్లు చెప్పారు. అంతలోనే గుండెపోటుతో మృతి చెందాడని, ఇందులో తమ తప్పులేదని తెలిపారు. ఆస్పత్రిలో రైతు మృతి డాక్టర్ నిర్లక్ష్యమే కారణమంటూ బాధితుల ఆందోళన జనగామ జిల్లా కేంద్రంలో ఘటన -
నిధుల వినియోగంపై విచారణ చేపట్టాలి
● సీఐడీకి తెలంగాణ క్రికెట్ సంఘం ఫిర్యాదువరంగల్ స్పోర్ట్స్ : బీసీసీఐ నుంచి హెచ్సీఏ ద్వారా ఆయా జిల్లాలకు విడుదలయ్యే నిధుల వినియోగంపై విచారణ చేపట్టాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వరంగల్ జిల్లా కార్యదర్శి తాళ్లపెల్లి జయపాల్ గురువారం సైబరాబాద్లోని సీఐడీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పది సంవత్సరాలుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పేరుతో రాష్ట్రంలోని జిల్లా సంఘాల ఖాతాల్లో రూ. 12 కోట్లు జమ చేశారని పేర్కొన్నారు. అందులో ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్నగర్, నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శులు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాలని సీఐడీ అధికారులను కోరారు. హత్యాయత్నం కేసులో వ్యక్తికి ఐదేళ్ల జైలు, జరిమానా దంతాలపల్లి: హత్యాయత్నం కేసులో నేరస్తుడికి ఐదేళ్ల జైలు, రూ.10వేల జరిమానా విధిస్తూ మహబూబాబాద్ జిల్లా కోర్టు గురువారం తీర్పువెలు వరించింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన ఏరుకొండ నరేశ్ అదే గ్రామానికి చెందిన పోలోజు సునీతపై 2023 సంవత్సరంలో కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై సునీత కుమారుడు యాకాంబ్రం ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై జగదీశ్ కేసు నమోదు చేసి మహబూబాబాద్ జిల్లా కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. వాదోపవాదల అనంతరం నేరం రుజువు కావడంతో నేరస్తుడు నరేశ్కు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 10వేలు జరిమానా విధిస్తూ జిల్లా కోర్టు సీనియర్ సివిల్ జడ్జి, అసిస్టెంట్ సెషన్స్ జడ్జి షాలిని షాకెల్లి తీర్పు వెలువరించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, నేరస్తుడికి శిక్ష పడేలా కృషి చేసిన పీపీ గణేశ్ ఆనంద్, ఎస్సై జగదీశ్, ఎస్సై రాజు, కోర్టు కానిస్టేబుల్ మంగీలాల్ను ఎస్పీ సుధీర్రామ్నాథ్ కేకన్ అభినందించారు. -
వరంగల్ అబ్బాయి.. అమెరికా అమ్మాయి
● ఖండాంతరాలు దాటిన ప్రేమపెళ్లి రామన్నపేట : వరంగల్ అబ్బాయి, అమెరికా అమ్మాయి ప్రేమ వివాహం గురువారం నగరంలోని వెంకటేశ్వర గార్డెన్లో ఇరుకుటుంబాల సమక్షంలో వైభవంగా జరిగింది. వరంగల్లోని పోచమ్మమైదాన్కు చెందిన డాక్టర్ అశోక్, సునీత దంపతుల కుమారుడు రితేశ్, అమెరికాలోని పీట్స్బర్గ్కు చెందిన జూలియాన్ మనస్సులు కలవడంతో పెద్దలను ఒప్పించి బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కాగా, అమెరికా అమ్మాయి అయినా అచ్చ తెలుగు సంప్రదాయ పద్ధతిలో వివాహం జరగడంపై అతిథులు ఆనందం వ్యక్తం చేశారు. డీఈఓకు సన్మానం విద్యారణ్యపురి : న్యాస్ (పరాక్)లో హనుమకొండ జిల్లాను ఉత్తమస్థానంలో నిలిపినందున జూలై 30వ తేదీన హైదరాబాద్లో ఎంసీఆర్హెచ్ఆర్డీలో నిర్వహించిన జిల్లాల విద్యాశాఖాధికారుల సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారురు కె.కేశవరావు, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగి తారాణా.. డీఈఓ వాసంతిని సన్మానించారు. కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్ పాల్గొన్నారు. కేయూ ఇన్చార్జ్ ఫైనాన్స్ ఆఫీసర్గా హబీబుద్దీన్కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ ఇన్చార్జ్ ఫైనాన్స్ ఆఫీసర్గా డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ మహ్మద్ హబీబుద్దీన్ నియమితులయ్యారు. ఈమేరకు కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఫైనాన్స్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తించిన తోట రాజయ్య ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ఇన్చార్జ్ ఫైనాన్స్ ఆఫీసర్గా హబీబుద్దీన్కు బాధ్యతలు అప్పగించారు. హబీబుద్దీన్ కేయూలో 1988లో చిరు ఉద్యోగిగా చేరి అసిస్టెంట్ రిజిస్ట్రార్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగం చేసుకుంటూనే సోషియాలజీలో డాక్టరేట్ పొందారు. నేడు (శుక్రవారం) రిజిస్ట్రార్ హబీబుద్దీన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. జిల్లాలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలి కాజీపేట రూరల్: జిల్లాలో హెల్త్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని జిల్లాకు చెందిన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, బలరాంనాయక్ను గురువారం కలిసి వినతి పత్రాలు అందజేశారు. గతేడాది కేంద్రం తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి, వరంగల్కు రెండు వెల్నెస్ సెంటర్లు మంజూరైనట్లు తెలిపారు. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లి సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని కిషన్రెడ్డి హామీ ఇచ్చినట్లు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నేత సదానందం తెలిపారు. -
సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నం
కేయూ క్యాంపస్: రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో సీఎం రేవంత్రెడ్డి విఫలమయ్యారని ఏబీఎస్ఎఫ్ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు కాకతీయ యూనివర్సిటీ మొదటి గేట్ వద్ద సీఎం దిష్టిబొమ్మ దహనానికి గురువారం యత్నించారు. కేయూ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ రవికుమార్, సిబ్బంది అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏబీఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మంద నరేశ్ మాట్లాడుతూ విద్యార్థులకు ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీఎస్ఎఫ్ నాయకులు విజయ్, నందు, విష్ణు, పీటర్, శ్రీకాంత్, పవన్, అరవింద్, నవీన్, తరుణ్, గణేశ్, వంశీ, గోవింద్, సమ్మయ్య, సూర్యసాయి తదితరులు పాల్గొన్నారు. -
నిద్రిస్తున్న ఆరేళ్ల బాలుడి మెడపై కత్తితో దాడి
కేసముద్రం: ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి నిద్రిస్తున్న ఓ ఆరేళ్ల బాలుడి మెడపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో కోశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఉపేందర్, శిరీష దంపతులకు మనీష్, మోక్షిత్ ఇద్దరు కుమారులున్నారు. ఉపేందర్ తన తల్లిదండ్రులైన ఎల్లయ్య, మంగమ్మతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా, నానమ్మ (మంగమ్మ) పక్కన పడుకున్న మనీష్ అనే ఆరేళ్ల బాలుడి మెడకు ఒకవైపు, వీపుభాగంలో గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో కోశారు. దీంతో ఆ బాలుడు ఏడుస్తుండగా నిద్రలేచిన మంగమ్మ తన మనుమడిని దగ్గరకు తీసుకుని చూసింది. మనీష్ మెడభాగంపై గాయమై తీవ్రంగా రక్తస్రావం అవుతుండటంతో కేకలు పెట్టింది. దీంతో కుటుంబ సభ్యులతోపాటు, చుట్టుపక్కలున్న వారు నిద్రలేచి మనీష్ను స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. అక్కడినుంచి మానుకోట జనరల్ ఆస్పత్రికి తరలించారు. బాలుడి మెడపై కత్తిగాటుతో పొడవుగా పడటంతో 8 కుట్లు పడ్డాయి. కాగా, ఇంటికి రెండు దర్వాజలు ఉండగా, ఒక దర్వాజ తలుపులకు బేడం లేదని, దీంతో ఇంట్లోకి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి ఉంటారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. సంఘటన స్థలానికి ట్రైనీ ఎస్సై నరేష్ సిబ్బందితో చేరుకుని విచారణ చేపట్టారు. రూరల్ సీఐ సర్వయ్య మానుకోట జనరల్ ఆస్పత్రికి చేరుకుని విచారణ చేశారు. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా ఉపేందర్, శిరీష దంపతుల చిన్నకుమారుడైన నిహన్ (యేడాదిన్నర బాలుడు) 7 నెలల క్రితం నీటిసంపులో పడి మృతిచెందాడు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు మనీష్ను మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు సూచించారు. మెడభాగంలో కోసిన గుర్తుతెలియని వ్యక్తులు తీవ్రరక్తస్రావం అవుతుండటంతో ఆస్పత్రికి తరలింపు మహబూబాబాద్ జిల్లాలో ఘటన -
మల్లన్నను దర్శించుకున్న పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్
ఐనవోలు: ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి వారిని తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ దర్శించుకున్నారు. గురువారం తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్–2025 సందర్భంగా మామునూరు పీటీసీకి వచ్చిన ఆమె ఐనవోలు మల్లన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అభిషేకంతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను అర్చకుడు నరేశ్ శర్మ వివరించారు. వేదపండితులు వేదాశీర్వచనం చేయగా స్వామి వారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రంతో అర్చకులు సన్మానించినట్లు ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు తెలిపారు. కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ ప్రకాశ్, మామునూరు ఏసీపీ ఎన్. వెంకటేష్, పర్వతగిరి ఇన్స్పెక్టర్ బి. రాజగోపాల్, ఎప్హెచ్ఓ శ్రీనివాస్, ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకుడు మధుకర్ శర్మ, వేదపారాయణ దారులు గట్టు పురుషోత్తమ శర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, నరేశ్, మధు, శ్రీనివాస్, దేవేందర్ పాల్గొన్నారు. -
విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
మహబూబాబాద్ రూరల్: విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి గ్రామంలోని పీహెచ్సీ, జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పీహెచ్సీలోని రికార్డులు, సిబ్బంది హాజరు వివరాలు,క్షేత్రస్థాయిలో ఆరోగ్య సర్వే, నివేదికల రిజిస్టర్లను తనిఖీ చేసి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా సెంటర్ పరిధిలోని సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ ఆరోగ్య సర్వే నిర్వహించి, వారి వివరాలను సేకరించాలని, అవసరం ఉన్నచోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, మాతా, శిశు మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న విద్య, మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై ఉ పాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పించిన డైట్ మెనూ ప్రకారం ప్రతీ ఒక్కరికి మంచి భోజనం అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట వైద్యాధికారి సాగర్, హైస్కూల్ హెచ్ఎం ఉప్పలయ్య, ఉపాధ్యాయులు ఉన్నారు. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ -
ఘనంగా తీజ్ వేడుకలు
కేసముద్రం: కేసముద్రం మున్సిపాలిటీ పరిధి సబ్స్టేషన్తండాలో గురువారం గిరిజనులు తీజ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ హాజరై గిరిజనులతో కలిసి నృత్యాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల సాంస్కృతిక వైభవానికి తీజ్ పండుగ ప్రతీకగా నిలుస్తుందన్నారు. అంతకు ముందు తాళ్లపూసపల్లిలో రూ.10లక్షలతో చేపట్టే సీసీ రోడ్డు పనులు, కేసముద్రంస్టేషన్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అజ్మీరా సురేష్నాయక్, బండారు వెంకన్న, బాదావత్ పవన్ నాయక్, పోలెపాక నాగరాజు, ఎండీ.అయూబ్ఖాన్, బాలునాయక్, తరాల వీరేష్, బీల్యానాయక్, సాంబయ్య పాల్గొన్నారు. హాజరైన ఎమ్మెల్యే మురళీనాయక్ -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
బయ్యారం: ప్రజాపాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. మండల కేంద్రంలోని గురువారం నూతన రేషన్కార్డులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ప్రతీ పేదవాడికి ఇందిరమ్మ ఇంటితో పాటు రేషన్కార్డులు వస్తాయని, ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు. పేదల నుంచి సంపన్నుల వరకు ఒకే రకమైన బియ్యం తినాలనే ఉద్దేశంతో రేషన్షాపుల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
కృత్రిమ కొరత సృష్టించొద్దు
మహబూబాబాద్ రూరల్: రైతులకు పంటల సాగు కు సరిపడా ఎరువులు సరఫరా చేస్తున్నామని, కృత్రిమకొరత సృష్టిస్తే చర్యలు తప్పవని డీఏఓ అజ్మీరా శ్రీనివాసరావు హెచ్చరించారు. మహబూ బాబాద్ పట్టణంలోని ఎరువులు, పురుగుల మందుల దుకాణాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లోని ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్, ఈ–పాస్ మిషన్ బ్యాలెన్స్ వివరాలు, స్టాక్ బోర్డులను పరిశీలించారు. రైతులకు అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని, డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎరువుల నిల్వలు, ధరల పట్టిక రైతులకు కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో వరినాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, ఎరువుల కొరత లేదని పేర్కొన్నారు. మండల వ్యవసాయ అధికారి నారెడ్డి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. నీరు నిల్వలేకుండా చూడాలి గూడూరు: వర్షాల నేపథ్యంలో నాటు వేసిన వరి పొలం, కంకి దశలో ఉన్న మొక్కజొన్న పంటల్లో మురుగు నీరు నిల్వ లేకుండా చూడాలని డీఏఓ అజ్మీరా శ్రీనివాసరావు అన్నారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్ గోడౌన్లో గురువారం యూరియా నిల్వల రిజిస్టర్లను పరిశీలించారు. రైతుకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందన్నారు. అనంతరం అప్పరాజ్పల్లి, గోవిందాపురం గ్రామాల్లో మండల వ్యవసాయాధికారి ఎండీ.అబ్దుల్మాలిక్తో కలిసి మొక్కజొన్న పంటలను పరిశీలించారు. కంకి దశకు చేరుకుంటున్న మొక్కజొన్న చేలలో నీరు ఉండకుండా చూడాలని, లేకుంటే మొక్క పసుపు రంగులోకి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఈఓ మనోజ్కుమార్, రైతులు పాల్గొన్నారు. -
నేరాల నియంత్రణే లక్ష్యం
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మహబూబాబాద్ రూరల్: నేరాల నియంత్రణే లక్ష్యంగా పోలీసు అధికారులు, సిబ్బంది పనిచేయాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో గురువారం నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు సాంకేతిక ఆధారాలతో కూడిన ఆధునిక పద్ధతులను అమలు చేయాలని, పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నా రు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించడానికి కేసులను దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో వేగవంతమైన విచారణ జరపాలన్నారు.సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్, లోన్ యాప్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటినుంచే తగిన కార్యాచరణ ప్రారంభించాలన్నారు. ఉత్తమ పనితీరు కనబరచిన అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసపత్రాలు అందజేశారు. డీఎస్పీలు తిరుపతిరావు, కృష్ణకిశోర్, సైబర్ క్రైమ్ డీఎస్పీ శ్రీని వాస్, ఎస్బీ, డీసీఆర్బీ, సీసీఎస్ సీఐలు చంద్రమౌళి, సత్యనారాయణ, హతీరాం ఎస్సైలు పాల్గొన్నారు. -
రైల్వే స్టేషన్లో కుక్కలు.. కోతులు
డోర్నకల్: డోర్నకల్ రైల్వే స్టేషన్లో నిత్యం కోతులు, కుక్కలతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కోతులు రైళ్లు వచ్చి వెళ్లే సమయాల్లో ప్రయాణికులపై దాడి చేస్తూ ఆహార పదార్థాలు ఎత్తుకెళ్తున్నాయి. ఫుట్ఓవర్ బ్రిడ్జిపై కోతులు గుంపులుగా బైఠాయిస్తుండడంతో ప్రయాణికులు స్టేషన్లోకి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైల్వే అధికారులు స్పందించి స్టేషన్లో కుక్కలు, కోతుల సంచారాన్ని అరికట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. నేటి నుంచి విశ్వస్తన్య పోషణ వారం మహబూబాబాద్: ప్రతీ సంవత్సరం ఆగస్టు మొదటివారం విశ్వస్తన్య పోషణవారంగా నిర్వహిస్తున్నామని ఇన్చార్జ్ డీడబ్ల్యూఓ శిరీష గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈనెల 1నుంచి 7వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రాధాన్యత ఇవ్వండి–నిలకడైన మద్దతు–వ్యవస్థలను సృష్టించండి అనే నినాదంతో ముందుకెళ్తామన్నారు. తల్లిపాల ప్రాధాన్యతను విస్తృతంగా ప్రచారం చేస్తామని చెప్పారు. తల్లీబిడ్డ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే లక్ష్యంగా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి మహబూబాబాద్: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని డీపీఆర్వో రాజేంద్రప్రసాద్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని డీపీఆర్వో కార్యాలయంలో సాంస్కృతిక సారథి కళాకారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీపీఆర్వో మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వహణ, ఇందిరమ్మ ఇళ్ల పథకం, రైతుబంధు, రైతు భరోసా, రుణమాఫీ తదితర పథకాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. జిల్లా, రాష్ట్రస్థాయి సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్నారు. సమావేశంలో రాము, సాంస్కృతిక సారథి సభ్యులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి● డీఎంహెచ్ఓ రవిరాథోడ్ నెల్లికుదురు: మండలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా చర్యలు చేపట్టి, అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ రవిరా థోడ్ ఆదేశించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం వైద్యులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి గ్రామాల వారీగా డెంగీ, మలేరియా ఇతర వ్యాధులపై తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్వవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఆస్పత్రిలో సమయపాలన పాటించి రోగులకు సరైన వైద్య సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శారద, సీహెచ్ఓ శాంతమ్మ, సూపర్వైజర్లు వసంతకుమారి, షహీన్ సుల్తానా, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంమహబూబాబాద్ అర్బన్: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో డే స్కాలర్ ప్రవేశాల కోసం అర్హులైన గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన ఉపసంచాలకులు గుగులోతు దేశీరాం నాయక్ గురువారం తెలిపారు. నేటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు కలెక్టరేట్లోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు ఫారాలు తీసుకొని, అన్ని ధ్రువీకరణ పత్రాలను జత చేసి ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు కార్యాలయంలో అందజేయాలన్నారు. ఈ నెల 12న కలెక్టరేట్లో ఉదయం 11గంటలకు లక్కీడ్రా ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు. 1–06–2018 నుంచి 31–05–2019 మధ్య జన్మించిన వారు మాత్రమే అర్హులన్నారు. పూర్తి వివరాలకు కొత్తగూడెం, మహబూబాబాద్ గిరిజన కార్యాలయాలను సంప్రదించాలన్నారు. -
ఎస్ఏలకు హెచ్ఎంలుగా పదోన్నతులు
విద్యారణ్యపురి: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ప్రభుత్వ, జిల్లా పరిషత్లలోని స్కూల్ అసిస్టెంట్లకు హెడ్మాస్టర్లుగా (గ్రేడ్–2), ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతుల కల్పించేందుకు గురువారం సాయంత్రం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ షెడ్యూల్ జారీచేశారు. పదోన్నతుల కౌన్సెలింగ్ ప్రక్రియ మొత్తం 10రోజుల వ్యవధిలో పూర్తికానుంది. మల్టీజోన్–1పరిధిలో.. పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ (వరంగల్) పరిధిలో మల్టీజోన్–1 ఉంటుంది. ఈ జోన్లో మొత్తం 19 జిల్లాలున్నాయి. అందులో ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాలున్నాయి. స్కూల్ అసిస్టెంట్లు హెడ్మాస్టర్ గ్రేడ్–2 పదోన్నతులకు సంబంధించి 490 పోస్టులు ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారం. విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి ఖాళీలు, సీనియారిటీ జాబి తాలను తెప్పించుకున్నారు. కాగా, ఆయా జాబి తాలను కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం వెల్లడించనున్నారు. హనుమకొండ జిల్లాలో.. హనుమకొండ జిల్లాలో 179మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు (ఎస్జీటీ)లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభించే అవకాశం ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. జిల్లాలో 119మంది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు క్లియర్ వేకెన్సీలుండగా, 60మంది స్కూల్ అసిస్టెంట్లకు హెడ్మాస్టర్లుగా పదోన్నతులు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అరైజింగ్ ఖాళీలు కలుపుకుని 179మంది వరకు ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో కొద్దిరోజులుగా పదోన్నతుల ప్రక్రియకు వేకెన్సీలు, సీనియారిటీ రూపకల్ప నపై కసరత్తు కొనసాగింది. షెడ్యూల్ ఇలా.. ● 2న పీఎస్, ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్–2 హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలకు సంబంధించిన వివరాలను డీఈఓ వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలి. అలాగే.. పదోన్నతుల కోసం ఎస్ఏ, ఎస్జీటీల తాత్కాలిక సీనియార్టీ జాబితాను ప్రదర్శించాలి. ● 3న ఇరువురికి సంబంధించి అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. ● 4, 5వ తేదీల్లో సీనియార్టీలపై అభ్యంతరాలను పరిష్కరించి, ఆర్జేడీ, డీఈవీ వెబ్సైట్లో ప్రదర్శించాలి. ● 6న గ్రేడ్–2 హెచ్ఎంల పదోన్నతి కోసం ఎస్ఏలకు వెబ్ ఆప్షన్ చేసుకునే అవకాశం కల్పించారు. ● 7వ తేదీన ఎస్ఏలకు గ్రేడ్–2 పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. ● 8, 9వ తేదీల్లో పదోన్నతుల ఆర్డర్ వచ్చిన గ్రేడ్–2 హెచ్ఎం పేర్ల ప్రదర్శన, ఎస్జీటీల సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల పరిష్కారం, తుది జాబితా ప్రకటన చేస్తారు. ● 10న ఎస్జీటీ వెబ్, ఎడిట్ ఆప్షన్, 11న కలెక్టర్ ఆదేశాల అనంతరం పదోన్నతి పొందిన టీచర్లకు ఉత్తర్వుల కాపీలు అందిస్తారు.ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా.. పది రోజుల్లోనే ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి మల్టీజోన్–1 పరిధిలో 490 హెడ్మాస్టర్ పోస్టుల ఖాళీలు.. -
అసలేం జరుగుతోంది?
అదనపు కలెక్టర్ సందర్శనమరిపెడ తహసీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి దరఖాస్తులను ఆయన పరిశీలించారు. తహసీల్దార్, ఆర్డీఓ స్థాయిలో పరిష్కారం కానీ సమస్యలైతే కలెక్టర్ లాగిన్కు నివేదించాలని సూచించారు. తహసీల్దార్ కృష్ణవేణి ద్వారా పలు విషయాలు తెలుసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వీడి భూ భారతి సమస్యలు పరిష్కరించేలా ప్రతీ ఒక్కరు కృషి చేయాలని సూచించారు. మరిపెడ/మరిపెడ రూరల్: తహసీల్దార్ కార్యాలయాన్ని వరుసగా కలెక్టర్, అదనపు కలెక్టర్ల సందర్శనతో అసలు ఏం జరుగుతుందని ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల కిందస్థాయి ఉద్యోగి (యూడీసీ) విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో పాటు.. తోటి ఉద్యోగుల వేతనాలు చేయడంలో చేతివాటం ప్రదర్శిస్తుందని సదరు ఉద్యోగిపై తహసీల్దార్ కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా తహసీల్దార్ కూడా భాభారతి రిజిస్ట్రేషన్లో కొందరు ఉద్యోగుల సహకారంతో అదనంగా వసూళ్లకు పాల్పడుతున్నారని, ఐదుగురు ఉద్యోగులపై యూడీసీ కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అనంతరం పెండింగ్ పనులన్నీ పక్కకు పెట్టి చెప్పా పెట్టకుండా యూడీసీ కార్యాలయం నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే వరుసగా ఉన్నతాధికారులు తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఏం జరిగిందనే కోణంలో ఆరా తీసినట్లు సమాచారం. మరోసారి గురువారం తహసీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ సందర్శించి సదరు యూడీసీకి షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు తెలిసింది. రైతులు, ప్రజల సమస్యలు పరిష్కారించాల్సిన తహసీల్దార్ కార్యాలయ అధికారులు, సిబ్బంది అందినకాడికి దోచుకోవడమే కాక, ఒకరిపై మరొకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవడం ఏమిటని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. కాగా, అధికారులు మాత్రం ఈ విషయాలను ధ్రువీకరించడం లేదు. మరిపెడ తహసీల్లో అధికారుల సందర్శనతో ఉద్యోగుల భయాందోళన ఓ యూడీసీకి షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు సమాచారం -
వేగంగా ఇందిరమ్మ ఇళ్లు!
సాక్షి, మహబూబాబాద్: పేదవాడి సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పుంజుకుంది. ఇళ్ల మంజూరు, ప్రొసీడింగ్, పనుల ప్రారంభంలో రాష్ట్రంలో మొదటి రెండు స్థానాల్లో ఖమ్మం, యాదాద్రిభువనగిరి జిల్లాలు ఉండగా.. తర్వాత స్థానంలో మానుకోట నిలిచింది. పనుల్లో వెనుకబడిన జిల్లాను ముందు వరుసకు తీసుకొచ్చిన కలెక్టర్, అధికారుల బృందాన్ని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ అభినందనలు తెలుపుతూ ఉత్తరం రాశారు. మందకొడిగా మొదలై.. ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లాలోని 18 మండలాల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 1,89,065 దరఖాస్తులు, మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీల పరిధిలో 28,526.. మొత్తంగా 2,17,591దరఖాస్తులు వచ్చాయి. వీటిని మండలాలు, గ్రామాల వారీగా విభజించి టీమ్ సభ్యులు ప్రత్యేకంగా తయారు చేసిన యాప్ ద్వారా ఆధార్కార్డు, రేషన్ కార్డు నంబర్లు సరిచూసుకుంటూ.. సొంత స్థలం ఉందా.. ఇల్లు ఉందా.. ఉంటే ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు. అద్దె ఇంట్లో ఉంటున్నారా.. మొదలైన వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అక్కడే ఇంటి యజ మాని, ఇల్లు ఫొటో తీసి అప్లోడ్ చేశారు. ఆ దరఖాస్తుల నుంచి లబ్ధిదారుల జాబితా తయారు చేశారు. అయితే ముందుగా విడుదల చేసిన జాబితాలో అర్హుల పేర్లు లేవని పలు గ్రామాల్లో ఆందోళనలు జరిగాయి. దీంతో మరోసారి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించగా ఒక్క ఇందిరమ్మ ఇళ్ల కోసమే 30,116 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే అర్హుల జాబితాను మూడు విభాగాలుగా విభజించారు. మొదటి జాబితాలో ఇంట స్థలం ఉండి, ఇల్లు లేని వారికి ఇవ్వడం, రెండో జాబితాలో ఇల్లు, స్థలం లేకుండా ఉన్నవారికి, మూడో విడతలో ఉమ్మడి కుటుంబంగా ఉన్న వారికి కొత్త ఇల్లు మంజూరుగా విభజించారు. జిల్లాలో ఈ ప్రక్రియ మందకొడిగా సాగింది. పుంజుకున్న వేగం.. మొదట ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, ప్రొసీడింగ్ మందకొడిగా సాగింది. ఈక్రమంలో మంత్రి ధనసరి సీతక్క, ఎమ్మెల్యేలతోపాటు ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహించారు. పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ను ఆదేశించారు. ఈక్రమంలో ఇళ్ల నిర్మాణాల్లో ఎందుకు ఆలస్యం అవుతుందని కారణాలు తెలుసుకున్నారు. గృహ నిర్మాణ శాఖ అధికారులతోపాటు ప్రతీ మండలానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించారు. వీరు స్థానిక ఎంపీడీఓలు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ.. లబ్ధిదారుల ఎంపిక, నిర్మాణ పనుల్లో వేగం పెంచారు. జిల్లాలో హౌసింగ్ ప్రాజెక్టు అధికారి లేక ఇబ్బంది అవుతుందని రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో మాట్లాడి పీడీని నియమించేలా చేశారు. దీంతో జిల్లాలో మొత్తం 10,651 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 9,720 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్లు ఇచ్చారు. ఇందులో 7,338 ఇళ్లు ప్రారంభించారు. అందరి సహకారంతో ముందుకు.. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, నిర్మాణాల్లో వేగం పెంచాలని కలెక్టర్ ప్రతీరోజు సమావేశాలు నిర్వహించారు. ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్టును తీసుకోవడంతో వేగం పెరిగింది. ప్రజాప్రతినిదులు, ప్రత్యేకాధికారులు, మండల అధికారుల సహకారంతో ముందుకెళ్తున్నాం. మిగిలిని ఇళ్లు కూడా త్వరగా గ్రౌండింగ్ చేసి నిర్మాణాల్లో వేగం పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. – వి. హనుమ, పీడీ, హౌసింగ్జిల్లాలో వేగం పుంజుకున్న నిర్మాణాలు నిత్యం ప్రత్యేకాధికారుల సందర్శన గ్రౌండింగ్లో రాష్ట్రస్థాయిలో మూడో స్థానం జిల్లా బృందానికి స్టేట్ హౌసింగ్ డైరెక్టర్ అభినందనలు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల వివరాలు మంజూరైన ఇళ్లు : 10,651ప్రొసీడింగ్ అందజేసినవి : 9,720ప్రొసీడింగ్ ఇవ్వాల్సినవి : 931నిర్మాణాలు ప్రారంభించినవి : 7,338బేస్మెంట్ లెవల్ : 2,986రూప్ లెవల్ : 81స్లాబ్ వేసినవి : 17రాష్ట్రంలో మూడో స్థానం ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్లో ఖమ్మం, యాదా ద్రి భువనగిరి జిల్లాలు మొదటి రెండు స్థానాల్లో ఉండగా మానుకోట మూడో స్థానంలో నిలించింది. ఇందుకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ పేరిట కలెక్టర్ అద్వైత్కుమార్కు అభినందనలు తెలుపుతూ ఉత్తరం రాశారు. గ్రౌండింగ్లో జిల్లాను ముందు వరుసలో నిలి పేందుకు చేసిన కృషి, టీం వర్క్ బాగుందని పే ర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి వందశాతం గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని ఆదేశించారు. -
ఉపాధి పనులు కుది‘రాయి’!
నెల్లికుదురు: మహబూబాబాద్ జిల్లాలో భారీగా నిర్వహిస్తున్న గ్రానైట్ క్వారీలతో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. పలు మండలాల్లో గ్రానైట్ క్వారీ పరిశ్రమలు కొనసాగుతున్నాయి. 40 ఏళ్లుగా అంతర్జాతీయంగా పేరుగాంచిన మెడివెస్ట్ గ్రానైట్, గాయత్రి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్.. జిల్లాలోని ఇనుగుర్తి మండలం చిన్ననాగారం, మీఠ్యతండా, కేసముద్రం మండలం తీగలవేణి, అర్పపల్లి గ్రామాల్లో క్వారీలను నిర్వహిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాల్లో విస్తరించిన 50 గ్రానైట్ క్వారీ పరిశ్రమల్లో.. ఎంతో మందికి ఉపాధి దొరుకుతోంది. మేనేజర్ నుంచి వాచ్మన్ వరకు స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాలు ఒడిశా, అస్సాం, బిహార్ రాష్ట్రాల నుంచి వేలాది మంది ఉద్యోగులు, కార్మికులకు ఉపాధి దొరుకుతోంది. జిల్లాలో ఖరీదైన గ్రానైట్ మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని చిన్ననాగారం, కేసముద్రం మండలం అర్పనపల్లి, తీగలవేణి, కేసముద్రం, నెల్లికుదురు మండలం ఎర్రబెల్లిగూడెం గ్రామ పరిధిలో నిర్వహిస్తున్న క్వారీల నుంచి తీస్తున్న బ్లాక్ గ్రానైట్ సిరులు కురిపిస్తోంది. ఇది ఖరీదైన గ్రానైట్గా పేరొందింది. ఈ గ్రానైట్ను హైదరాబాద్ నుంచి విదేశాలకు తరలిస్తున్నారు. కాగా రాజ్యసభ సభ్యుడు, గాయత్రి గ్రానైట్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ వద్దిరాజు రవిచంద్ర కూడా దేశ, విదేశాలకు నల్ల గ్రానైట్ను ఎగుమతి చేస్తున్నారు. యంత్రాల విడిభాగాలతో ఉపాధి భూగర్భం నుంచి గ్రానైట్ ఖనిజ సంపద తీయడానికి ఉపయోగించే యంత్రాల విడిభాగాలను సరఫరా చేస్తూ కూడా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. గ్రానైట్ బండలను లారీల ద్వారా హైదరాబాద్కు తరలిస్తారు. అక్కడ పెద్ద పెద్ద యంత్రాలతో టైల్స్గా కట్ చేయడం, పాలిష్ చేసి విదేశాలకు సరఫరా చేయడం వరకు అంతా ఉపాధి లభిస్తుంది. గ్రానైట్ క్వారీల పరిధిలోని గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. పదేళ్లుగా గ్రానైట్ క్వారీలోనే.. పదేళ్లుగా ఇనుగుర్తి మండలం మీఠ్యతండా గ్రానైట్ క్వారీలోనే ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నా. క్వారీ ద్వారా ఉపాధితోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. క్వారీ ద్వారా ఎంతోమంది ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. గ్రానైట్ క్వారీలు నిర్వహించడానికి నిర్వాహకులు ఎంతో శ్రమించాలి. – గుండాల శోభన్, చిన్ననాగారం సూపర్వైజర్గా పనిచేస్తున్నా ఒక క్వారీలో సూపర్వైజర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. క్వారీల్లో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి క్వారీలో ఉపాధి కల్పిస్తున్నారు. మా పరిధిలో 30 ఏళ్లుగా గ్రానైట్ క్వారీలను నడుపుతున్నారు. – గుగులోత్ రాజేందర్, ఇనుగుర్తి మండలం మీఠ్యతండాఉమ్మడి వరంగల్ జిల్లా గ్రానైట్ నాణ్యమైనదిపాతికేళ్లుగా గ్రానైట్ ఫీల్డ్లోనే సూపర్వైజర్గా పనిచేస్తున్నా. ఉమ్మడి వరంగల్ జిల్లాలో లభించే గ్రానైట్ నాణ్యతలో దేశంలోనే ప్రథమస్థానంలో ఉంది. జిల్లాలో తీసే గ్రానైట్ సంపదకు భలే డిమాండ్ ఉంది. – రావులపల్లి రవికుమార్, సూపర్వైజర్, మెడివెస్ట్ గ్రానైట్, కేసముద్రం -
వేగంగా.. సులువుగా..
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల దర్శనం భక్తులకు సులువుగా కల్పించేందుకు అధికారులు, పూజారులు సమాలోచనలు చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, డీఎస్పీ రవీందర్, ఈఓ వీరస్వామి, సమ్మక్క– సారలమ్మ, గోవిందరాజు, పగిడ్దిరాజుల పూజారులతో కలిసి అమ్మవార్ల గద్దెల ప్రాంగణాన్ని సందర్శించారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను వరుస క్రమంలో చేయడం వల్ల భక్తులకు సులువుగా దర్శనం కలుగుతుందన్న ఆలోచనపై పూజారులతో చర్చించారు. ఆర్కిటెక్ట్ బృందం రూపొందించిన మాస్టర్ప్లాన్, అధికారులు తయారు చేసిన మ్యాప్లను పూజారులకు కలెక్టర్ వివరించారు. అంతిమ నిర్ణయం పూజారులదే.. ఆర్కిటెక్ట్ బృందం రూపొందించిన మాస్టర్ప్లాన్ వల్ల అమ్మవార్ల దర్శనంలో భక్తులకు ఇబ్బందులు తల్తెత్తుతాయనే అభిప్రాయాన్ని పూజారులు అధికా రులకు వివరించారు. కానీ, అధికారులు సమ్మక్క– సారలమ్మ గద్దెల పక్కన వరుస క్రమంలో గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను ఉంచడంపై పూజారులు సమాలోచనతో సానుకూల నిర్ణయానికి వచ్చారు. సారలమ్మ ఎంట్రెన్స్ గేట్ను సుమారుగా 20 ఫీట్ల దూరం విస్తరించి వరుస క్రమంలో గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలను ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని పూజారులు కొంతమేరకు ఏకీభవించారు. నలుగురు దేవతలు వరుస క్రమంలో ఉండడం వల్ల టీటీడీ కల్యాణ మండపం ద్వారా, ఆర్టీసీ బస్టాండ్ క్యూలైన్ ద్వారా వచ్చే భక్తులకు రెండు వైపులా దర్శనం సులువుగా ఉంటుందని భావిస్తున్నారు. అదేవిధంగా రెండు వైపులా క్యూలైన్ల ద్వారా గద్దెల ప్రాంగణంలోకి వచ్చిన భక్తుల్లో ఒకేసారి పదిమంది వెళ్లేలా వెడల్పాటి మరో క్యూలైన్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వివరించారు. కాగా, గద్దెల మార్పుపై రెండుమూడు రోజుల్లో పూజారులతో చర్చించి అభిప్రాయాన్ని వెల్లడిస్తామని గోవిందరాజు పూజారి.. అధికారులకు తెలిపారు. మొక్కుల చెల్లింపులో ఇబ్బంది లేకుండా.. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, ఎత్తు బంగారం, ఒడిబియ్యం, కానుకల చెల్లింపులో భక్తులు ఇబ్బందులు పడకుండా చేపట్టాల్సిన ఏర్పాట్లపై కూడా అధికారులు పరిశీలించారు. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజును వరుస క్రమంలో భక్తులు దర్శనం చేసుకునే సమయంలో పూజారులు సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద క్యూలైన్ లోపల ఉండి భక్తులు సమర్పించిన ఎత్తు బంగారం తీసుకుని తిరిగి ప్రసాదం అందించడంతోపాటు మొక్కు బంగారాన్ని ఎప్పటికప్పుడు బయటకు తరలించే మార్గాలను పరిశీలించారు. నాలుగు గద్దెలు వరుసక్రమంలో ఉంటే వీఐపీ, వీవీఐపీల దర్శనం సమయంలోనూ సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా వీవీఐపీలు అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం నేరుగా హెలిపాడ్ ప్రదేశానికి వెళ్లేలా సారలమ్మ ఎగ్జిట్ గేట్నుంచి ఐరన్తో ఫ్లైవర్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తే మరింత సులువుగా ఉంటుందని సమాలోచన చేశారు. పూజారులు తమ నిర్ణయాన్ని త్వరగా తెలిపితే పదిహేను రోజుల్లో పనులు మొదలు పెడతామని కలెక్టర్ దివాకర టీఎస్ చెప్పారు.షెడ్యూల్ ప్రకారం దర్శనం పాస్లు.. ఈసారి మహాజాతరలో షెడ్యూల్ ప్రకారం వీఐపీ, వీవీఐపీలు, అధికారులు, మీడియాకు దర్శనం పాస్లు జారీ చేయాలనుకుంటున్నారు. అందరికీ ఒకేసారి పాస్లు జారీ చేయడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఈసారి జాతరకు ముందుగా నాలుగైదు తేదీల్లో పాస్లు జారీ చేయడంతో ఇబ్బందులు తప్పుతాయని అధికారులు భావిస్తున్నారు. జాతర నాలుగు రోజుల్లో ఎమ్మెల్యే, ఆపైస్థాయి వారికి పాస్లు జారీ చేసే ఆలోచన చేస్తామని కలెక్టర్ తెలిపారు. అంతేకాకుండా సమ్మక్క మ్యూజి యం, సారలమ్మ ఎంట్రెన్స్నుంచి జంపన్నవాగు ఆర్అండ్బీ రోడ్డు వరకు దారిని విస్తరించాలని పూజారులు కలెక్టర్ను కోరారు. కాగా, రోడ్డును కూడా కలెక్టర్..ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు.భక్తులు వనదేవతలను దర్శించుకునేలా సమాలోచనలు మేడారంలో పూజారులతో కలిసి గద్దెల ప్రాంగణాన్ని పరిశీలించిన కలెక్టర్ పూజారులదే ఫైనల్ నిర్ణయం -
తగ్గిన పశు సంపద!
మహబూబాబాద్: గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పశుసంపద అత్యంత కీలకం. శాస్త్ర, సాంకేతికంగా ఎంతో పురోగతి సాధించినప్పటికీ.. దేశంలో అధికశాతం వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. ఈ క్రమంలో వ్యవసాయంతో పాటు పశుపోషణ అనేది కీలకంగా మారింది. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఐదేళ్లకోసారి పశు గణన చేపడుతోంది. దీనిలో భాగంగా గత ఏడాది అక్టోబర్లో ప్రారంభమైన పశుగణన ఈ ఏడాది ఫిబ్రవరిలో పూర్తి కావాలి. కానీ చాలా ఆలస్యంగా ప్రస్తుతం పూర్తి చేశారు. కాగా ఐదేళ్లక్రితంతో పోలిస్తే పశువుల సంఖ్య తగ్గినట్లు సమాచారం. 45 పశువైద్యశాలలు.. జిల్లాలో మొత్తం 45 పశు వైద్యశాలలు ఉన్నాయి. వాటిలో ఏరియా వెటర్నరీ వైద్యశాలలు (ఏవీహెచ్) 3, ప్రైమరీ వెటర్నరీ వైద్యశాలలు (పీవీసీ) 23, సబ్ సెంటర్లు 16 ఉన్నాయి. కాగా 2019లో పశుగణన చేశారు. అప్పుడు అన్ని రకాల పశువులు కలిసి 11,85,568 ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. తగ్గుదల.. జిల్లాలో గత గణనలో 11,85,568 పశువులు ఉన్నట్లు తేలింది. ప్రస్తుత గణనలో 8,40,114 పశువులు ఉన్నట్లు సమాచారం. ఈమేరకు పశువుల సంఖ్య తగ్గింది. కాగా, పశువుల సంఖ్య భారీగా తగ్గడంతో ఆసంఖ్యను జిల్లా పశు వైద్య, సంవర్థక శాఖ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. యాప్లో నమోదు చేసిన సంఖ్య తమకు కూడా తెలియదని, రాష్ట్ర ప్రభుత్వానికి వివరాలు పంపించామని, గణనపై వెరిఫికేషన్ జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. గృహాలు, పశువుల సంఖ్య విషయంలో రీ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుందని పశువుల సంఖ్యను బహిర్గతం చేయవద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే పశుగణన వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తుందని, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం వెల్లడిస్తుందని చెబుతున్నారు. మందులు, దాణా.. పశుగణనలో తేలిస సంఖ్య ఆధారంగా వ్యాక్సిన్లు, మందులు, దాణా సరఫరా అవుతుంది. వ్యాధులు, హైరిస్క్ ప్రాంతాలకు వ్యాక్సిన్లు, మందులు అదనంగా సరఫరా అవుతాయని అధికారులు పేర్కొన్నారు. పశువుల సంఖ్య తగ్గితే సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయా లేదా ఏదైనా సమస్య ఉందా.. తెలియదు కానీ గణన పూర్తి చేసిన తర్వాత సంఖ్యను బహిర్గతం చేయడం లేదు. సంఖ్య గోప్యంగానే ఉంటుంది జిల్లాలో పశుగణన పూర్తయింది. కానీ యాప్లో నమోదు చేయడం వల్ల ఆ సంఖ్య తెలియదు. సంఖ్య బహిర్గతం చేయవద్దని ఆదేశాలు ఉన్నాయి. గణన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రీ వెఫికేషన్ చేస్తుంది. తర్వాత వివరాలు కేంద్రానికి పంపిస్తారు. కేంద్రం రెండు నెలల తర్వాత పశువుల సంఖ్య జిల్లాల వారీగా ప్రకటిస్తుంది. రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉంది. – డాక్టర్ కిరణ్కుమార్, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారిజిల్లాలో ఎట్టకేలకు పశుగణన పూర్తి ఐదు సంవత్సరాల క్రితం 11,85,568 పశువులు ప్రస్తుతం 8,40,114 పశువులు ఉన్నట్లు సమాచారం సంఖ్య ఆధారంగా వ్యాక్సిన్లు, మందులు, దాణా సరఫరాప్రస్తుతం గణన పూర్తి.. జిల్లాలో 23 మంది డాక్టర్లు సూపర్ వైజర్లుగా, 76 మంది గోపాల మిత్రలు, పారాస్టాఫ్ ఎన్యుమరేటర్లుగా పశుగణన చేపట్టారు. డాక్టర్లు గణనను పర్యవేక్షించారు. ప్రతీ ఇంటికి ఎన్యుమరేటర్లు వెళ్లి పశువుల సంఖ్య తెలుసుకొని ప్రత్యేక యాప్లో నమోదు చేశారు. పశువులతో పాటు రైతు పేరు, ఇంటి నంబర్, ఫోన్ నంబర్ ఇతర వివరాలు తెలుసుకొని సంబంధిత పోర్టల్లో నమోదు చేశారు. -
మానుకోటను కాషాయకోటగా మార్చాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు నాయకులు బహూకరించిన కరవాలాన్ని ప్రదర్శిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావుస్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి మానుకోటను కాషాయకోటగా మార్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు అన్నారు. బుధవారం ఆయన జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి హాజరై మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో మానుకోట గడ్డపై బీజేపీ జెండాను ఎగురవేయాలని కోరారు. – సాక్షి, మహబూబాబాద్/మహబూబాబాద్ అర్బన్– 8లోu -
సత్వరమే సమస్యలు పరిష్కరించాలి
● అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ పెద్దవంగర: ప్రజలు అందించే అర్జీలపై తక్షణమే స్పందించి, సమస్యలు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షలో తహసీల్దార్ మహేందర్ వివరాలిచ్చారు. మండల వ్యాప్తంగా 1029 దరఖాస్తులు వచ్చాయని, అందులో సాదాబైనామా మినహా వివిధ కేటగి రీలలో 191 భూ సమస్యలు పరిశీలించినట్లు తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడారు. భూభారతిలో వచ్చిన ప్రతీదరఖాస్తును ప్రాధాన్యతగా తీసుకొని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. భూ సంబంధిత పాత సమస్యలపై మరింత వేగంగా స్పందించాలన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ లష్కర్, జూని యర్ అసిస్టెంట్ల్ పర్వీనా, అయ్యప్పరెడ్డి, రోహి త్ రాజు, రికార్డు అసిసెంట్లు అశోక్, పాషా, తరుణి, స్వరూప తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తులను పరిష్కరించాలి తొర్రూరు: రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన భూభారతి దరఖాస్తులను వేగవంతంగా పరి ష్కరించాలని అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ అన్నారు. బుధవారం డివిజన్ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. భూ భారతి దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, డీటీ నర్సయ్య, ఆర్ఐ నజీముద్ధీన్, సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ స్థాయి క్రీడల్లో విద్యార్థుల ప్రతిభతొర్రూరు: జాతీయ స్థాయి క్రీడల్లో స్థానిక మైనార్టీ బాలికల గురుకులం విద్యార్థులు సత్తా చాటారు. ఇటీవల ఢిల్లీ, మధ్యప్రదేశ్, నల్లగొండలో జాతీయ స్థాయి హాకీ, షూటింగ్బాల్, గాట్క క్రీడలు నిర్వహించారు. ఎస్జీఎఫ్ఐ అండర్–17 విభాగంలో పాఠశాలకు చెందిన బి.నందిని (హాకీ), ఎం.నందిని, డి.అక్షయ, బి.దీక్ష(షూటింగ్బాల్), జి.పల్లవి, ఎండీ సమ్రీన్(గాట్క) పాల్గొని ప్రతిభ కనబర్చారు. ఈమేరకు హైదరాబాద్లోని జింఖానా మైదా నంలో నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులను మైనార్టీ గురుకులాల ఉపాధ్యక్షుడు పహీముద్దీన్ ఖురేషీ, సెక్రటరీ షఫీ ఉల్లా సత్కరించారు. బుధవారం డివిజన్ కేంద్రంలోని పాఠశాలలో ప్రిన్సిపాల్ పసునూరి వనజ విద్యార్థులను, వ్యాయామ ఉపాధ్యాయులు ఉమ, కల్యాణిని అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల కోఆర్డినేటర్లు నజియా తహసీన్, నుస్రత్ కౌసర్, సునీత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బోనాల పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలితొర్రూరు: బోనాల పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి కోరారు. డివిజన్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం పట్టణంలో బోనాల పండుగ నిర్వహణపై చర్చించారు. పురోహితులు ఓలేటి యాదగిరి ఆచార్యులు, స్థానిక నాయకులు చర్చించి ఆగస్టు 6న తొర్రూరులో బోనాల పండుగ జరుపుకోవాలని నిర్ణయించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బోనాల పండగ తెలంగాణ సంస్కృతికి నిదర్శనమని, స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పండుగ జరుపుతామన్నారు. భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నా రు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు, పెదగాని సోమయ్య, ధరావత్ రాజేష్నాయక్, మంగళపల్లి రామచంద్రయ్య, చాపల బాపురెడ్డి, సుంచు సంతోష్, సోమ రాజశేఖర్, గుండాల నర్స య్య, సురేందర్రెడ్డి, దొంగరి శంకర్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
మరిపెడ: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అన్నారు. మరిపెడ మున్సిపాలిటీలోని పీహెచ్సీ, తహసీల్దార్ కార్యాలయం, జెడ్పీ హైస్కూల్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య ఆరో గ్య, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేకాధికారులు హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, శానిటేషన్పై దృష్టి పెట్టాలన్నా రు. వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. ప్రతీ ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ పరిశీలించాలన్నారు. సాధారణ ప్రసవాలను ప్రో త్సహించాలన్నారు. అనంతరం పాఠశాలను సందర్శించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీ లించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమ య్యే రీతిలో భోధన చేయాలన్నారు. మెనూ ప్రకా రం భోజనం అందించాలన్నారు. తహసీల్దార్ కా ర్యాలయాన్ని తనిఖీ చేసి, సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ కృష్ణవేణి ఉన్నారు. ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాలి మహబూబాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాలని కలెక్టర్ అౖద్వైత్కుమార్సింగ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పు రోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులు చిత్తశుద్ధితో పని చేసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలన్నారు. ఉచిత ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారులు త్వరగా మార్కింగ్ చేసుకుని బేస్మెంట్ నిర్మాణం పూర్తయ్యేలా చూడాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. విపత్తుల నిర్వహణకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్కుమార్, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. సద్వినియోగం చేసుకోవాలి ఆధునిక సాంకేతికతపై యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లను సద్విని యోగం చేసుకోవాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఏటీసీకి సంబంధించిన ప్రచార పత్రాలను కలెక్టర్ ఆవి ష్కరించారు. ఏటీసీలో ఈ సంవత్సరం తరగతులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, కళాశాల ప్రిన్సిపాల్ బాబు, శిక్షణాధికారి ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు. -
సమర్థవంతంగా నేర పరిశోధనలు
మహబూబాబాద్ రూరల్: మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ అందుబాటులోకి రావడంతో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి మరింత సమర్థవంతంగా, వేగవంతంగా నేర పరిశోధనలు చేయడం సాధ్యమవుతుందని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. జిల్లా పోలీస్ శాఖకు కేటాయించిన మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ను ఎస్పీ బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంతకుముందు జిల్లాస్థాయిలో ప్రాంతీయ ప్రయోగశాల అందుబాటులో లేకపోవడంతో దర్యాప్తు ప్రక్రియలో కొన్ని పరిమితులు ఉండేవన్నారు. ప్రస్తుతం మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ ద్వారా నేర స్థలాలకు వెంటనే చేరుకుని, ఆధారాలను సేకరించడానికి వీలు ఉంటుందన్నారు. దర్యాప్తులో వేగం, కచ్చితత్వం ఉంటుందన్నారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ సత్యనారాయణ, ఆర్ఐ భాస్కర్, ఫింగర్ ప్రింట్ ఎస్సై శివకుమార్ పాల్గొన్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
తీజ్ పండుగను ఘనంగా జరుపుకోవాలి
నెహ్రూసెంటర్: తీజ్ పండుగను బంజారాలు ఘనంగా నిర్వహించుకోవాలని డాక్టర్ నెహ్రూనాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ వెంకన్ననాయక్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో సేవాలాల్ సేన సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో ఉన్న 16 కోట్లకు పైగా ఉన్న బంజారాలు అందరూ ఒకే భాష, ఒకే సంస్కృతి, సంప్రదాయాలు పాటిస్తున్నారని, ఆగస్టు మొదటి శుక్రవారం మొదలుకుని పదో రోజు కఢావో ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు. సంఘం నాయకులు మాలోత్ సురేష్, డాక్టర్ వీరన్న, భూక్య స్రవంతి, రాంబాబు, బోడ రమేష్, బాదావత్ సురేష్, బాబులాల్, సురేష్, రాజ్కుమార్, స్వాతి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్యులు, సిబ్బంది స్థానికంగా ఉండాలి
గార్ల: వైద్యులు, వైద్య సిబ్బంది స్థానికంగా ఉంటూ రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశించారు. బుధవారం స్థానిక సీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. కొంతమంది వైద్యులు ఎందుకు విధులకు హాజరు కాలేదని డ్యూటీలో ఉన్న డాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. అందరూ కచ్చితంగా విధులకు హాజరు కావాలని ఆదేశించారు. ఏడాది క్రితం పోస్టుమార్టం గది నిర్మించారని, ఇక్కడే మృతదేహాల పోస్టుమార్టం నిర్వహించాలని సీపీఎం జిల్లా, మండల నాయకులు అడిషనల్ కలెక్టర్కు విన్నవించారు. బాలికల ఆశ్రమ పాఠశాల తనిఖీ.. గార్లలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. పాఠశాల వసతిగృహంలోని కిచెన్షెడ్, సరుకుల స్టోర్రూంలను పరిశీలించారు. పిల్లలకు నాణ్యమైన, రుచికరమైన వేడివేడి ఆహారం అందించాలని వార్డెన్ను ఆదేశించారు. అనంతరం తరగతి గదులకు వెళ్లి విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట డీటీ సంజీవ, పంచాయతీ కార్యదర్శి అజ్మీరా కిషన్ తదితరులు ఉన్నారు. అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో -
క్రమశిక్షణతోనే అత్యున్నత స్థాయికి..
హసన్పర్తి : క్రమశిక్షణతోనే అత్యున్నత స్థాయికి చేరుకుంటారని ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్లర్ ఎ.వరదారెడ్డి అన్నారు. ఎస్సార్ యూనివర్సిటీ ప్రవేశం పొందిన బీటెక్ విద్యార్థులకు బుధవారం ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరదారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విజయం కోసం సులువు మార్గాలు ఉండవన్నారు. విద్యార్థులు కష్టపడి చదివితేనే లక్ష్యం సాధ్యమన్నారు. యూనివర్సిటీ వీసీ దీపక్ గార్గ్ మాట్లాడుతూ నాలుగేళ్ల విద్యాకాలంలో స్వీయ అభివృద్ధి–స్వీయ పరిచయంపై దృష్టిసారించాలన్నారు. కరికులం సంస్కరణలు, పరీక్ష విధానంలో మార్పులు, ఎలక్టివ్ ఛాయిస్లు, గేమిఫికేషన్, మెంటరింగ్ విధానాల గురించి వివరించారు. ఎస్సార్ యూనివర్సిటీలో ఓపెన్ డోర్ పాలసీ అమలులో ఉందన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అర్చనారెడ్డి, ప్రొఫెసర్ డాక్టర్ వి.మహేశ్, డాక్టర్ రామ్దేశ్ముఖ్, డైరెక్టర్లు శేషగిరావు, శరత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్లర్ వరదారెడ్డి