breaking news
Mahabubabad
-
ఫొటో ఓటరు జాబితా ప్రదర్శన
మహబూబాబాద్: మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట పోలింగ్ స్టేషన్ల వారీగా ఫొటోలతో కూడిన ఓటరు జాబితాను శుక్రవారం ప్రదర్శించారు. ఈసందర్భంగా టీపీఎస్ ప్రవీణ్ మాట్లాడుతూ.. మానుకోట మున్సిపాలిటీ పరిరిధిలోని 36 వార్డుల్లో 88 పోలింగ్ స్టేషన్లతో జాబితా పూర్తి చేశామన్నారు. ఆ జాబితాను ప్రజలు సౌకర్యార్థం మున్సిపాలిటీ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం నోటీస్ బోర్డుపై ఏర్పాటు చేశామన్నారు. మేనేజర్ శ్రీధర్, సిబ్బంది సుధాకర్, రమేష్, నాగేశ్వర్రావు, మమ్ముట్టి, అమర్ ఉన్నారు. తొర్రూరు మున్సిపాలిటీలో.. తొర్రూరు: స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం ఫొటో ఓటరు జాబితాను ప్రకటించారు. 16 వార్డుల్లో మొత్తం 21,451 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో 19,100 ఓటర్లు ఉండగా ప్రస్తుతం 2,351 మంది ఓటర్లు పెరిగారు. దీనిలో పురుష ఓటర్లు 10,501 ఉండగా, మహిళా ఓటర్లు 10,942 మంది ఓటర్లు, ఇతరులు 8 మంది ఉన్నారు. ముసాయిదా ఓటరు జాబితా అనంతరం స్థానికులు, రాజకీయ పక్షాల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి తుది ఫొటో ఓటరు జాబితా రూపొందించినట్లు కమిషనర్ వి.శ్యాంసుందర్ తెలిపారు. ఓటరు జాబితాను ప్రజల సౌకర్యార్థం మున్సిపాలిటీ కార్యాలయంలో అందుబాటులో ఉంచనున్నామన్నారు. -
ఎన్పీడీసీఎల్కు ఇప్పాయి పవర్ అవార్డు
హన్మకొండ: నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ మరో అంతర్జాతీయ స్థాయి గుర్తింపును దక్కించుకుంది. ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఇప్పాయి) వారు ప్రకటించిన ‘ఇప్పాయి పవర్ అవార్డ్స్–2026’లో టీజీఎన్పీడీసీఎల్ ‘ఇన్నోవేషన్ అవార్డు’ను అందుకుంది. ఈ నెల 10వ తేదీన కర్ణాటకలోని బెల్గాంలో జరిగిన 26వ‘రెగ్యులేటర్స్– పాలసీమేకర్స్ రిట్రీట్’ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజనీర్ సురేందర్ ఈ అవార్డును అందుకున్నారు. కాగా శుక్రవారం హనుమకొండ, నక్కలగుట్టలోని కార్పొరేట్ కార్యాలయంలో సీఎండీ వరుణ్ రెడ్డికి చీఫ్ ఇంజనీర్ సురేందర్ ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా వరుణ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్పీడీసీఎల్లో ప్రవేశపెట్టిన వినూత్న సాంకేతిక పద్ధతుల వల్లే ఈ అవార్డు దక్కిందని తెలిపారు. -
మహాజాతరకు విద్యుత్శాఖ సిద్ధం
● ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి ఎస్ఎస్తాడ్వాయి: మేడారం మహాజాతరకు విద్యుత్శాఖ సిద్ధమైందని, పనులన్నీ తుదిదశకు చేరుకున్నాయిని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి పర్యటనతోపాటు మేడారంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఈనెల 18న జరగనున్న నేపథ్యంలో జాతరలో విద్యుత్శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను శుక్రవారం ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ భద్రత విషయంలో రాజీపడకుండా తొలిసారి కవర్డ్ కండక్టర్ ఏర్పా టు చేశామని తెలిపారు. కన్నెపల్లి సారలమ్మ ఆల యం వద్ద విద్యుత్ లైన్లను తనిఖీ చేసి ట్రాన్స్ఫార్మర్లన్నింటికీ ఫెన్సింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు . విద్యుత్ భద్రత దృష్ట్యా ఎల్టి లైన్లలో స్పేసర్స్ పెట్టడం జరిగిందని వివరించారు. దాదాపు 350 మంది సిబ్బంది జాతరలో విధులు నిర్వర్తిస్తున్నారని, ఏజెన్సీలు కూడా ఇందులో ఉంటారని తెలిపారు. అందరికి డ్యూటీ చార్జ్లు వేశామన్నారు. జాతరలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ముందుగానే అన్ని పనులు పూర్తి చేశామని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ ప్రాజెక్ట్ మోహన్రావు, చీఫ్ ఇంజనీర్ రాజు చౌహన్, ఎస్ఈ మల్చూరు, డీఈ నాగేశ్వర రావు, కన్స్ట్రక్షన్ ఏడీ సదానందం, సందీప్, డీఈ టెక్నికల్ భాస్కర్ పాల్గొన్నారు. -
గడ్డిమందు మరణాలపై స్పందన
సాక్షి, మహబూబాబాద్: గిరిజనులు, నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న మానుకోట జిల్లాలో క్షణికావేశం, అప్పులు కావడం, కుటుంబ కలహాలతో చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా గడ్డి మందు తాగి మరణించిన వారే ఎక్కువగా ఉన్నారు. గడ్డి మందును నిషేధించాలి.. లేదా మెరుగైన చికిత్సను అందుబాటలోకి తేవాలని నవంబర్ 10న ‘సాక్షి’ దినపత్రికలో ‘ప్రాణాలు తీస్తున్న గడ్డి మందు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. కాగా ఈ కథనం వెలువడిన నాటి నుంచి మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్ గడ్డి మందు అంశాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై రెండు నెలలుగా వివిధ స్థాయి అధికారులు, డాక్టర్లు, వ్యవసాయశాఖ అధికారులతో చర్చ జరిగింది. గడ్డి మందు నిషేధంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే అంతకన్నా ముందుగా గడ్డి మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసిన వారిని ఎలా రక్షించాలనే విషయంపై చర్చించినట్లు తెలిసింది. పైలెట్ ప్రాజెక్టుగా మానుకోట ఎంపిక ప్రధానంగా గ్లైఫోసెట్, పండిమిథాలిన్, ప్రిటిల్లాక్లోర్, నామినీ గోల్డ్, అల్మిక్స్ వంటి కలుపు మందులు తాగిన వారు బతకడం చాలా కష్టం. అయితే తాగిన రెండు గంటలలోపు ఆస్పత్రికి తరలించి వెంటనే ప్రత్యేక వైద్య చికిత్స అందజేయాలి. ప్రధానంగా పేషెంట్కు డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం ముందుగా మహబూబాబాద్ జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగాఎంపిక చేసినట్లు శుక్రవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో స్థానిక ఎమ్మెల్యే మురళీ నాయక్తో మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. వారం రోజుల్లో రెండు యూనిట్లు మంజూరు చేసి ప్రారంభించేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే మురళీ నాయక్ ‘సాక్షి’తో తెలిపారు. ఇలా చేయడం వల్ల కొందరి ప్రాణాలైన కాపాడవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. విన్నపాన్ని మన్నించి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వారిని రక్షించేందకు ప్రత్యేక చికిత్స అందిస్తున్న మంత్రి దామోదర రాజనర్సింహకు ఎమ్మెల్యే మురళీనాయక్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రిని కలిసి ఎమ్మెల్యే వివరణ స్పందించిన మంత్రి దామోదర రాజనర్సింహ పైలెట్ ప్రాజెక్టుగా మహబూబాబాద్ జిల్లా ఎంపిక ప్రభుత్వ ఆస్పత్రిలో రెండు ప్రత్యేక బెడ్స్ ఏర్పాటు -
వచ్చే బడ్జెట్లో రూ.70 కోట్లు కేటాయిస్తాం
● రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయానికి వచ్చే బడ్జెట్లో రూ.70 కోట్లు కేటాయించి అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని వీరభద్రస్వామిని గురువారం దర్శించుకున్నారు. ముందుగా వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికా రు. అక్కడి నుంచి త్రిశూల చౌరస్తాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కొత్తకొండ ఆలయ అభివృద్ధి కోసం రూ.70 కోట్లు ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపాదనలు ఇచ్చారని తెలిపారు. భద్రకాళి నుంచి బాసర వరకు ఆలయాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి సబ్కమిటీ వేయాలని మంత్రి శ్రీధర్బాబుకు తెలిపారన్నారు. భద్రకాళి ఆలయం, వేములవాడ ఆలయ మాడవీధుల నిర్మాణ పనులు, సమ్మక్క–సారలమ్మ ఆలయ పుణరుద్ధరణ పనులు జరుగుతున్నాయన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రూ.70 కోట్లతో దేవాలయానికి సంబంధించి ప్రాకారాలు, మూడ వీధులు, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు, అనుమతులు ఇచ్చి భక్తులకు ఉపయోగపడే విధంగా పూర్తి సహకరిస్తున్న మంత్రి సురేఖకు ధన్యవాదాలు తెలిపారు. వారి వెంట దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామాల సునీత, ఆలయ ఈఓ కిషన్రావు, కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్రెడ్డి, సీఐ పులి రమేష్, తదితరులు పాల్గొన్నారు. -
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనతో రోడ్డు ప్రమాదాలు
● ఎస్పీ శబరీష్ మహబూబాబాద్ రూరల్: రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనేనని ఎస్పీ శబరీష్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో రోడ్డు భద్రతా నియమాలపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలంటే ప్రతీఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. ప్రతీ వ్యక్తి సురక్షితంగా తన గమ్యస్థానానికి చేరుకోవడమేనని అరైవ్ అలైవ్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. ఇందుకోసం పోలీసు ఉద్యోగులు ముందుగా రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని జిల్లా పోలీసు కార్యాలయంలోని అన్ని విభాగాల సిబ్బందితో కలిసి రోడ్డు భద్రత పోస్టర్ ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఎస్పీ అడ్మిన్ గండ్రతి మోహన్, టౌన్ సీఐ మహేందర్ రెడ్డి, ఆర్ఐ భాస్కర్, ట్రాఫిక్ ఎస్సై అరుణ్ కుమార్, టౌన్ ఎస్సై ప్రశాంత్, జిల్లా పోలీసు కార్యాలయంలోని అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. -
సిర్పూర్కాగజ్నగర్లో కేరళ ఎక్స్ప్రెస్కు హాల్టింగ్
కాజీపేట రూరల్: న్యూఢిల్లీ–తిరువనంతపురం–న్యూఢిల్లీ మధ్య ప్రయాణించే కేరళ ఎక్స్ప్రెస్కు కాజీపేట సబ్ డివిజన్ పరిధిలోని సిర్పూర్కాగజ్నగర్ రైల్వేస్టేషన్లో నేటి(శనివారం)నుంచి దక్షిణ మధ్య రైల్వే హాల్టింగ్ కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ శుక్రవారం తెలిపారు. న్యూఢిల్లీ–తిరువనంతపురం సెంట్రల్ (12626) వెళ్లే కేరళ ఎక్స్ప్రెస్ సిర్పూర్కాగజ్నగర్కు సాయంత్రం 16:09 గంటలకు చేరుకుంటుంది. తిరువనంతపురం సెంట్రల్–న్యూఢిల్లీ (12625) వెళ్లే కేరళ ఎక్స్ప్రెస్ సిర్పూర్కాగజ్నగర్కు సాయంత్రం 17:14 గంటలకు చేరుకుంటుంది. జాతరకు వెళ్లొచ్చేలోపు చోరీ నెక్కొండ: సంక్రాంతి పర్వదినం, మేడారం జాతరను దృష్టిలో ఉంచుకొని పోలీసులు ముందస్తుగా హెచ్చరిక చేస్తున్నా.. తాళం వేసిన ఇళ్లను టార్కెట్ చేసిన దొంగలు తమపని తాము చేసుకెళ్తున్నారు. మండలంలోని అప్పల్రావుపేటలో ఓ కుటుంబం జాతర వెళ్లగా వారి ఇంట్లో దొంగలు తమచేతివాటం ప్రదర్శించారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన యాసం కుమారస్వామి తన పెద్ద కుమారుడైన సంజీవరాజ్ కుటుంబం సభ్యులతో కలిసి ఈ నెల 15న మేడారం జాతరకు వెళ్లాడు. ఉదయం అతని చిన్న కుమారుడు సంపత్రాజ్ వారి ఇళ్ల వద్దకు వచ్చి చూడగా ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. దీంతో పోలీసులకు ఆయన సమాచారమందించగా క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు. అదే రోజు రాత్రి ఇంటి తాళాలను గుర్తు తెలియని వ్యక్తలు పగలగొట్టి కుమారస్వామి ఇంట్లోని బీరువాను తెరిచారు. అందులోని నాలుగు తులాల బంగారం, 10 తులాల వెండి, రూ.20 వేలు అపహరించారు. సంజీవరాజ్ ఇంటి తలుపులు పగుల గొట్టినప్పటికీ చోరీ జరగలేదని ఎస్సై వివరించారు. సంపత్రాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.● 4 తులాల బంగారం.. 10 తులాల వెండి, రూ.20 వేల అపహరణ ● మండలంలోని అప్పల్రావుపేటలో ఘటన -
శరణు శరణు..
ఐలోని మల్లన్న ఐనవోలు: సంక్రాంతి సందర్భంగా ఐనవోలు మల్లన్న జా తర భక్తులతో హోరెత్తింది. భక్తులు వేలాదిగా తరలివచ్చా రు. శివసత్తులు భక్తి పారవశ్యంతో నెత్తిన బోనంతో నాట్యం చేస్తూ మొక్కులు తీర్చుకున్నారు. సంతానం కో సం కొందరు మహిళలు ఆలయం చుట్టూ వరం పట్టారు. స్వామివారికి ప్రత్యేక పూజలు మకర సంక్రాంతిని పురస్కరించుకుని స్వామివారికి ఆల య ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ ఆధ్వర్యంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, మహానివేదన, మంత్ర పుష్పం, తీర్థ ప్రసాద విని యోగంతోపాటు వేద పారాయణం చేశారు. అదేవిధంగా ఆలయ ఆవరణలో ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. మల్లన్నను దర్శించుకున్న ప్రముఖులు మకర సంక్రాంతి రోజు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్వామి వారిని దర్శించుకుని విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో త్వరలో సుపరిపాలన అందించే ప్రభుత్వం రావాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా మాజీ ఎంపీ సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, కొండేటి శ్రీధర్, మార్తినేని ధర్మారావు, నాయకులు రాజేశ్వర్రావు, కాళీ ప్రసాద్, ఎర్రబెల్లి ప్రదీప్రావు తదితరులు మల్లన్నను ద ర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కనుమ రోజు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్వామి వారిని దర్శించుకున్నారు. కార్యక్రమాల్లో సర్పంచ్లు గడ్డం రఘువంశీ, ఆడెపు స్రవంతి దయాకర్, నాయకులు పాల్గొన్నారు.మార్నేని వంశస్తుల పెద్ద రఽథం మార్నేని వంశస్తులు పెద్ద రథం నిర్వహించారు. టెస్కాబ్ మాజీ చైర్మన్, పెద్ద రథం నిర్వాహకుడు మార్నేని రవీందర్రావు ఇంటి నుంచి శిడిరథం (రాత్రి ప్రభ బండి) సాయంత్రం 6.30 గంటలకు బయల్దేరింది. ఆలయ ప్రాంగణంలోని తూర్పు ద్వారం వద్ద రథంలో వెంట తెచ్చిన పెట్టెను ఆలయంలోకి తీసుకెళ్లి మొక్కులు చెల్లించారు. రథం నిర్వాహకుడు మార్నేని రవీందర్రావును ఈఓ కందుల సుధాకర్, ఆలయ ధర్మకర్తలు శాలువాతో సత్కరించారు. పెద్ద రథం నిర్వహించిన మార్నేని వంశస్తులు బోనాలు, పట్నాలతో మొక్కులు తీర్చుకున్న భక్తులు -
టెన్షన్.. టెన్షన్!
నేడు వార్డుల వారీగా రిజర్వేషన్ ప్రకటించే అవకాశంసాక్షి, మహబూబాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ తుది దశకు చేరింది. ఇప్పటికే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు, సీట్ల కేటాయింపుపై రాష్ట్ర ఉన్నతాధికారుల మున్సిపాలిటీల వారీగా వార్డుల రిజర్వేషన్ల సంఖ్యను ప్రకటించారు. అయితే వార్డులకు రిజర్వేషన్ ప్రక్రియను జిల్లా ఉన్నతాధికారులు పూర్తి చేసి శనివారం ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ప్రక్రియ పూర్తి జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, కేసముద్రం, డోర్నకల్ మున్సిపాలిటీల్లో మొత్తం 98 వార్డులు ఉన్నాయి. ఇందులో 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీల జనాభాను లెక్కలోకి తీసుకున్నారు. ఇటీవల ప్రకటించిన బీసీ డెడికేషన్ కమిటీ ఇచ్చిన జాబితా ప్రకారం బీసీల జనాభాను ప్రామాణికంగా తీసుకున్నారు. వీటిని ఆధారంగా చేసుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సీట్లు కేటాయించి ప్రకటించారు. అయితే ఈ జాబితా ప్రకారం ఐదు మున్సిపాలిటీల అధికారులు, కలెక్టర్ కార్యాలయంలోని సిబ్బంది, జిల్లా ఉన్నతాధికారులు తుది జాబితాను తయారు చేసినట్లు తెలిసింది. ఈ జాబితాను శనివారం లేదా సోమవారం ప్రకటించే అవకాశం ఉందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. అయితే మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్ మాత్రం రాష్ట్ర స్థాయిలో కసరత్తు జరుగుతోందని, నోటిఫికేషన్కు ఒక రోజు ముందు ప్రకటించే అవకాశం ఉందని అధికారులు తెలుపు తున్నారు. ఆశావహుల్లో ఉత్కంఠ గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన వారు.. గెలిచి మళ్లీ పోటీలో నిలబడాలనే ఆలోచనతో వార్డుల్లో పనులు చేసిన వారితోపాటు.. ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు పోటీకి సిద్ధం అన్నట్లు ఎదురు చూసే ఆశావహులు రిజర్వేషన్ల ప్రకటనపై ఉత్కంఠగా ఉన్నారు. ఇప్పటికే కొందరు వార్డుల్లో తిరుగుతూ.. స్థానిక పెద్దమనుషులను కలిసి తాను పోటీలో ఉంటున్నానని, సహకరించాలని ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఇంతా చేసిన తమకు రిజర్వేషన్ అనుకూలంగా వస్తుందో రాదో అనే ఆలోచనతో కొట్టుమిట్టాడు తున్నారు. త్వరలో మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్ల ప్రకటన 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ బీసీ డెడికేషన్ జాబితా ప్రకారం బీసీలకు స్థానాల కేటాయింపుమున్సిపాలిటీల వారీగా రిజర్వేషన్లు..మున్సిపాలిటీ ఎస్టీ ఎస్సీ బీసీ జనరల్ మొత్తం జనరల్–మహిళ జనరల్–మహిళ జనరల్–మహిళ జనరల్–మహిళ మహబూబాబాద్ 04–03 03–02 03–03 10–08 36 డోర్నకల్ 02–02 02–01 00–00 04–04 15 మరిపెడ 03–03 01–00 00–00 04–04 15 తొర్రూరు 01–01 02–01 02–01 05–03 16 కేసముద్రం 02–01 01–01 02–01 05–03 16 మొత్తం 12–10 09–05 07–05 28–22 98 -
జాతర పనుల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేస్తే ఎంతటి వా రినైనా ఉపేక్షించేది లేదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను హెచ్చరించారు. మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి గురువారం ఆయన మేడారంలో ఆకస్మికంగా పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం హరిత హోటల్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈనెల 18న మేడారంలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని పచ్చదనంగా సుందరీకరించాలన్నారు. డివైడర్లలో సుందరీకరణ మొక్కలు నాటాలని, అవసరమున్న చోట కూలీల సంఖ్య పెంచాలని సూచించారు. సీఎం పర్యటన సందర్భంగా ఆలయ ప్రాంగణం, రాతి స్తంభాలను వివిధ రకాల పూలతో సుందరీకరించి, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పడిగాపూర్ హెలీపాడ్లో దిగిన మంత్రులు మేడారం జాతర అభివృద్ధి పనులను పరిశీలించేందుకు మంత్రులు పొంగులేటి, అడ్లూరి లక్ష్మణ్ మే డారానికి మూడు కిలోమీటర్ల దూరంలోని పడిగా పూర్ హెలిపాడ్ వద్ద హెలికాప్టర్లో చేరుకున్నారు. పడిగాపూర్ హెలిపాడ్లో దిగి నేరుగా గద్దెల ప్రాంగణానికి చేరుకున్నారు. గద్దెల ప్రాంగణంలోని ల్యాండ్ స్కేపింగ్, ప్రధాన ద్వారం సీసీ ఫ్లోరింగ్ పనులను పరిశీలించారు. సీఎం రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే ప్రాంగణ ప్రదేశాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, ఏఎస్పీ మానన్ భాట్, అదనపు కలెక్టర్ సంపత్రావు, ఆర్డీఓ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మేడారంలో అధికారులతో సమీక్ష -
మేడారం జనసంద్రం
ఎస్ఎస్ తాడ్వాయి : మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో శుక్రవారం రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు సమీప రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిషా, కర్ణాటక నుంచి భక్తులు వాహనాల్లో మేడారానికి లక్షలాదిగా తరలివచ్చారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచే భక్తుల రద్దీ మొదలవగా 11 గంటల వరకు మేడారం అంతా కిక్కిరిపోయింది. మేడారం వచ్చే రహదారులన్ని ప్రైవేట్ వాహనాలతో బారులుదీరాయి. జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద ఏర్పాటు చేసిన షవర్ల కింద స్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవార్ల దర్శనానికి క్యూ కట్టారు. ఉదయం 10 గంటల వరకు గద్దెల పైకి భక్తులను దర్శనం కోసం అనుమతించిన పోలీసులు అనంతరం రద్దీ పెరగడంతో గద్దెల గేట్లకు అమర్చిన గ్రిల్స్ బయటి నుంచి దర్శనానికి అనుమతించారు. దీంతో భక్తులు క్యూలో అమ్మవార్లను దర్శించుకున్నప్పటికీ చాలా మంది భక్తులు దారి తెలియక ఇబ్బంది పడ్డారు. సుమారు 5లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. వనమంతా భక్తుల సందడి మేడారం దర్శనాలకు వచ్చిన భక్తులు మొక్కుల అనంతరం వంటావార్పు కోసం సమీపంలోని వనాల్లో విడిది చేశారు. మేడారం ఆర్టీసీ బస్టాండ్ నుంచి తాడ్వాయి వచ్చే మార్గంలో సుమారు 6 కిలోమీటర్ల మార్గంలో, చుట్టూ పక్కల అటవీ మార్గాలు, నార్లాపూర్ చింతల్ క్రాస్, వెంగళాపూర్, చిలుకలగుట్ట, మేడారం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా భక్తుల సందడి కనిపించింది. పస్రా నుంచి మేడారానికి వచ్చే క్రమంలో 6 కిలోమీటర్ల మేర భక్తుల వాహనాలు బారులదీరడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు పస్రా నుంచి తాడ్వాయి మీదుగా వాహనాలు మళ్లించి ట్రాఫిక్కు నియంత్రించారు. భక్తుల తాకిడి పెరుగుతుందనే ముందస్తు అంచనాతో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మేడారానికి వచ్చే మా ర్గాల్లో ట్రాఫిక్ నియంత్రణకు 300 మందికి పైగా సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. ఎత్తు బంగారంతో భక్తురాలు అమ్మవార్లకు భారీగా మొక్కుల చెల్లింపు ఒకే రోజు 5 లక్షల మంది దర్శనం వనమంతా భక్తుల సందడే.. -
పోటెత్తిన భక్తజనం
ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి దేవాలయానికి గురువారం భక్తులు పోటెత్తారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన సుమా రు 75 ఎడ్లబండ్ల రథాలు, వేలేరు నుంచి వచ్చిన మేకల రథాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్, హనుమకొండ తదితర జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు జాతరకు తరలివచ్చి స్వామి వారికి మొక్కులు చెల్లించినట్లు ఆలయ ఈఓ పి.కిషన్రావు తెలిపారు. శుక్రవారం కనుమ ఉత్సవం సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారికి గణపతిపూజ, పుణ్యాహవచనం, మండప పూజ, నందీశ్వర పూజ, అభిషేకం, హా రతి, మంత్రపుష్పం, బలిహరణ నిర్వహించారు. సెంటల్ జోన్ డీసీపీ ధార కవిత స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. కాజీపేట ఏసీపీ ఆధ్వర్యంలో 450 మంది పోలీసులు, జాతర బందోబస్తు నిర్వహించారు. ఆలయ అర్చకులు రాంబాబు, రాజయ్య, వినయ్శర్మ, ఆలయ చైర్మన్ అశోక్ముఖర్జీ, భక్తులు పాల్గొన్నారు. కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం ప్రత్యేక ఆకర్షణగా ఎడ్లు, మేకల బండ్లు -
మానుకోటలో 101రకాల నోములు
మహబూబాబాద్ రూరల్ : తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ప్రత్యేకమైన వేడుకల్లో సంక్రాతి ఒకటి. ఈ సందర్భంగా నూతన కోడలు సెంటిమెంట్కు ప్రాధాన్యతనిస్తూ జిల్లా కేంద్రంలో ఓ కుటుంబం గురువారం 101 రకాల నోములు ఆచరించి మహిళలకు వాయినాలు ఇచ్చారు. బొడ్ల రామకృష్ణ, నర్మద దంపతుల కుమారుడు జశ్వంత్ సాయి భార్య స్వప్న (కొత్త కోడలు) గౌరీదేవి నోముతో పాటు 101 రకాల నోములను ఆచరించారు. నూతన వివాహితలకు సౌభాగ్యాన్ని, మంచి వైవాహిక జీవితాన్ని, సంతాన సాఫల్యాన్ని ఆశిస్తూ సంక్రాంతి పండుగ సందర్భంగా గౌరీదేవి నోము నిర్వహించామని వారు తెలిపారు. లాలి పాన్పు నోము, అక్కకు అటుకుల నోము, చెల్లెలికి శనిగల నోము, పంచాక్షరి నోము తదితర 101 నోములను భక్తిశ్రద్ధలతో ఆచరించారు. నోము అనంతరం 101 మంది ముత్తైదువులకు వాయినాలు, తీర్థ ప్రసాదాలు అందజేసి, విందు భోజనాలు ఏర్పాటు చేశారు. -
రైతన్న మొగ్గు
మహబూబాబాద్ రూరల్ : ఆధునిక వ్యవసాయంవైపు రైతులు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ ఖర్చు...ఎక్కువ లాభం కోసం సరికొత్తగా సాగు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. నారు పోయాలి.. నీరు పెట్టాలి.. కూలీలతో నాట్లు వేయించాలి.. ఇవన్నీ పాతతరం వరి సాగు పద్ధతి. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అన్నదాతలు నూతన పద్ధతులు అవలంభిస్తున్నారు. వరి సాగులో కూలీలు, యంత్రాల కొరత అధిగమించడానికి, పెట్టుబడి తగ్గించుకోవడానికి, అధిక దిగుబడి సాధించేందుకు సాంకేతిక పద్ధతులు వినియోగిస్తూ పంటలు సాగు చేస్తున్నారు. డ్రమ్ సీడర్, వెదజల్లే పద్ధతుల్లో రైతులు వరి సాగు చేపట్టి ఖర్చు తగ్గించుకుంటున్నారు. వర్షాధార, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో అమలు.. వెదజల్లే పద్ధతిలో విత్తనాలను నేరుగా పొలంలో వెదజల్లి వరి సాగు చేపడుతున్నారు. ముఖ్యంగా వర్షాధార, నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో విస్తృతంగా అమలు చేస్తున్నారు. ముఖ్య లక్షణాలు.. ● నర్సరీలు అవసరం ఉండదు. ● నాట్ల ఖర్చు, కూలీల అవసరం తగ్గుతుంది. ● తక్కువ సమయంలో పంట సాగు ● నీటి వినియోగం తక్కువ సాగు విధానం.. ● పొలాన్ని నున్నగా దున్ని సమతలంగా సిద్ధం చేయాలి. ● నాణ్యమైన విత్తనాలను ఎకరాకు సుమారు 20 నుంచి 25 కిలోలు వెదజల్లాలి. ● విత్తనం వెదజల్లిన తర్వాత తేలికపాటి నీరు ఇవ్వాలి. కలుపు నియంత్రణ.. ● విత్తిన 2 నుంచి 3 రోజుల్లో ప్రీఎమర్జెన్స్ కలుపు మందు వాడాలి. ● అవసరమైతే తర్వాత చేతితో లేదా పోస్ట్ ఎమర్జెన్స్ మందులతో కలుపు నియంత్రణ. ఎరువుల నిర్వహణ.. ● సిఫార్సు చేసిన మేరకు ఎరువులు వేయాలి. ● యూరియాను విడతలుగా ఇవ్వడం మంచిది. నీటి నిర్వహణ.. ● మొక్కల ప్రారంభ దశలో నీరు నిల్వగా ఉండకూడదు. ● మొక్కలు స్థిరపడిన తర్వాత తేలికపాటి నీరు నిలిపి ఉంచాలి. ప్రయోజనాలు.. ● ఖర్చు తగ్గి లాభం పెరుగుతుంది. ● వర్షం ఆలస్యమైనప్పుడు కూడా సాగు సాధ్యం. ● యాంత్రీకరణకు అనుకూలం. ● సరైన విత్తన మోతాదు, కలుపు నియంత్రణ, ఎరువుల సమతుల్య వినియోగం ఉంటే వెదజల్లే వరి సాగులో మంచి దిగుబడి పొందవచ్చు. జిల్లాలో ఐదు వేల ఎకరాల మేరకు సాగు.. జిల్లాలో 1,75,250 ఎకరాల్లో వరి సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు జిల్లాలోని వివిధ మండలాల పరిధిలో సుమారు ఐదు వేల ఎకరాల వరకు వెదజల్లే పద్ధతిలో రైతులు వరి సాగు చేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. డ్రమ్ సీడర్ ఎంతో మేలు.. యాసంగి సీజన్ వరిసాగు చేస్తున్న రైతులు డ్రమ్ సీడర్, వెదజల్లే పద్ధతులను అవలంభించడానికి సిద్ధమవుతున్నారు. డ్రమ్ సీడర్తో ఎంతో మేలు ఉంది. దీంతో తక్కువ ధర ఉండడంతో రైతులు డ్రమ్ సీడర్ను కొనుగోలు చేస్తున్నారు. డ్రమ్ సీడర్ విత్తనాలు వెదజల్లడంతో నిర్దిష్టమైన అంతరంలో సాళ్లు వస్తాయి. కలుపు తీసే సమయంలో ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది. సాధారణ పంట సాగుతో పోల్చితే డ్రమ్ సీడర్ విధానంతో 20 రోజుల ముందే పంట చేతికివస్తుంది. అదనంగా 3 నుంచి 4 బస్తాల దిగుబడినిస్తుంది. వినూత్న పద్ధతిలో చేపడుతున్న సాగు విధానాలపై రైతులు మొగ్గు చూపుతున్నారు.వెదజల్లే విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తున్న కేవీకే శాస్తవేత్తలు వెదజల్లే పద్ధతిలో వరిసాగు కోసం గొర్రు తోలుతున్న రైతు డ్రమ్ సీడర్, వెదజల్లే పద్ధతుల్లో వరి సాగుకు ఆదరణ తక్కువ ఖర్చుతో అన్నదాతల ఆసక్తి -
బ్లాక్లో యూరియా అమ్మితే డీలర్లపై చర్యలు
బయ్యారం: ఎరువుల దుకాణాల్లో యూరి యాను బ్లాక్లో అమ్మితే సదరు డీలరుపై శాఖాపరమైన చర్యలు తప్పవని డీఏఓ సరిత హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని కొత్తపేట గ్రామంలోని పలు ఎరువుల దుకా ణాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. దు కాణాల్లో స్టాక్ రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించి, రికార్డులు అప్డేట్గా ఉండేలా చూసుకోవాలని సూచించారు. రైతులకు యూరియా సక్రమంగా అందించాలని సూచించారు. ఆమె వెంట మండల వ్యవసాయ అధికారి, విస్తరణ అధికారులు ఉన్నారు. పోర్టల్ను సద్వినియోగం చేసుకోవాలిమహబూబాబాద్: ఇంటర్ ప్రవేశాలకు ప్రభుత్వం ఆన్లైన్ అడ్మిషన్స్ రిజిస్ట్రేషన్ పోర్టల్ను ఏర్పాటు చేసిందని, విద్యార్థులు సద్విని యోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ అనిల్కుమార్ అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం టీజీ ఎంఆర్ఐఈఎస్ ఆన్లైన్ అడ్మిషన్స్ రిజిస్ట్రేషన్ పోర్టల్ను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2026–27 విద్యాసంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్టియర్ బాలుర, బాలికల కోసం, ఐదో తరగతిలో అడ్మిషన్ల కోసం ఈ పోర్టల్ను వినియోగించాలన్నారు. రిజిస్ట్రేషన్ ఈనెల 16నుంచి వచ్చే నెల 28వ తేదీ వరకు ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ పాఠశాలలు, కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో డీఎంఎంఓ శ్రీనివాసరావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. గణతంత్ర వేడుకలకు ఆహ్వానంమహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి గ్రామానికి చెందిన రేపల్లె షణ్ముఖరావుకు దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొనాలంటూ ఆహ్వానం వచ్చింది. ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్లో నిర్వహించే తేనీటి విందు (ఎట్ హోం)కు ఆహ్వానం అందింది. షణ్ముఖరావు చిన్నతనం నుంచే గ్రామంలో రైతుల విద్యుత్ మోటార్లను మరమ్మతులు చేయడంతో పాటు తక్కువ ఖర్చుతో రైతులకు ఉపయోగపడే పలురకాల యంత్రాలను రూపొందించి, వారికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో వినూత్నంగా మోనో వీల్ వీడర్ వాహనాన్ని రూపొందించినందుకు గాను రాష్ట్రపతి భవన్లో ఎట్ హోం కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లభించింది. ఈమేరకు షణ్ముఖరావును హనుమాన్ దేవాలయ కమిటీ చైర్మన్ కొలిశెట్టి సత్యనారాయణ, సర్పంచ్ చీరిక వసంతఉపేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ కమటం యాకన్న, నీలం రమేష్, కొంపెల్లి సుధాకర్ రెడ్డి, మలికంటి రమేష్, కొంపెల్లి వాసుదేవరెడ్డి, జైపాల్ రెడ్డి, ఆర్మీ రాజేష్, కమటం వెంకన్న, కొల్లు వెంకట్ రెడ్డి, పప్పుల చామంతి తదితరులు అభినందించి ఘనంగా సన్మానించారు. మున్నేరు ప్రాజెక్ట్ నిర్మించాలి గార్ల: దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మున్నేరు ప్రాజెక్ట్ నిర్మించి ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని మున్నేరు జలసాధన కమిటీ కన్వీనర్ గంగావత్ లక్ష్మణ్నాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం గార్లలో కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఈ ప్రాంత రైతులకు ఒక్క చుక్క నీరు కూడా అందించలేని జీఓ నంబర్ 98ను ప్రభుత్వం వెంటనే రద్దు చేసి, గుంపెళ్లగూడెం గ్రామ సమీపంలో పెండింగ్లో ఉన్న మున్నేరు ప్రాజెక్ట్ నిర్మించేంత వరకు దశలవారిగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మున్నేరు ప్రాజెక్ట్ నిర్మించకుండా దుబ్బగూడెం సమీపంలో మున్నేరుపై డ్యామ్ నిర్మించి కాల్వ ద్వారా పాలేరు చెరువుకు నీటిని తరలిస్తే రైతులతో కలిసి ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. జలసాధన కమిటీ కోకన్వీనర్లు గౌని ఐలయ్య, కందునూరి శ్రీనివాసరావు, కట్టెబోయిన శ్రీనివాసరావు, జడ సత్యనారాయణ, విశ్వ, జి.సక్రు, రమేశ్, సత్యం, మురళి, షఫీ, రామారావు, రాధాకృష్ణ, వెంకన్న, మీగడ శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ఖోఖో చాంపియన్షిప్ పోటీలు
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ఖోఖో సంఘం నిర్వహించిన 58వ సీనియర్ నేషనల్ ఖోఖో చాంపియన్షిప్లో ఇండియన్ రైల్వే జట్టు విన్నర్గా నిలిచి చాంపియన్షిప్ను కై వసం చేసుకుంది. కాజీపేటలో ఈ నెల 10వ తేదీన ప్రారంభమైన నేషనల్ ఖోఖో పోటీలు 15వ తేదీన గురువారం ముగిశాయి. మహిళల ఫైనల్స్లో మహారాష్ట్ర జట్టు 23–22 స్కోర్తో ఒడిశాను ఓడించింది. ప్రియాంక ఇంగ్లే ఆల్ రౌండ్ ప్రతిభకు తోడు సంధ్య సుర్వస్తే డిఫెన్స్లో రాణించి స్వర్ణ పతాకాన్ని గెలిచారు. ఒడిషా జట్టులో అర్చప్రధాని, అర్చన మంగల్ మంచి ప్రతిభను కనబరిచారు. పురుషుల్లో ఇండియన్ రైల్వేస్ జట్టు సమష్టి కృషితో వరుసగా రెండోసారి చాంపియన్షిప్ సాధించింది. ఫైనల్లో రైల్వేస్ 26–21 స్కోర్తో మహారాష్ట్రను ఓడించింది. ఈ మ్యాచ్లో రైల్వేస్లోని అంతర్జాతీయ ఆటగాడు రాంజీకశ్యప్, మహేష్ షిండే, జగన్నాథ్ దాస్ రాణించగా, మహారాష్ట్రలోని ప్రతిక్ వైకర్, శుభంథోరట్, అనికేత్ చెంద్వానే మంచి నైపుణ్యం కనబరిచారు. పురుషుల విభాగంలో మూడు, నాల్గవ స్థానంలో కొల్హాపూర్, ఒడిషా, మహిళల్లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఢిల్లీ జట్లు నిలిచాయి. ఉత్తమ క్రీడాకారులు ఈ చాంపియన్షిప్లో ప్రతిష్టాత్మక ఏకలవ్య, రాణిలక్ష్మి అవార్డులతోపాటు బెస్ట్ ఆల్ రౌండర్ పురస్కార్లను రాంజీ కశ్యప్ (రైల్వేస్), సంధ్య సుర్వసే (మహారాష్ట్ర) అవార్డులు ప్రదానం చేశారు. బెస్ట్ డిఫెండర్లుగా ప్రతిక్ వైకర్(మహారాష్ట్ర), అర్చనప్రధాన్ (ఒడిశా) బెస్ట్ అటాకర్లుగా అభినందన్ పాటిల్ (రైల్వేస్) ప్రియాంక ఇంగ్లే (మహారాష్ట్ర)లు అవార్డులు అందుకున్నారు. వీరికి జ్ఞాపికలు, ప్రశంస పత్రాలు అందజేశారు. జంగా రాఘవరెడ్డి అన్నితానై ఆటగాళ్లకు ఏ లోటూ లేకుండా సౌకర్యాలు కల్పించినట్లు ఖోఖో సంఘం, ఫెడరేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ పోటీలో ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు భంవార్ సింగ్ పలాడ, ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఉప్కార్సింగ్ విర్క్, ఫెడరేషన్ టోర్నమెంట్స్ చైర్మన్ ఎం.ఎస్.త్యాగి, ఫెడరేషన్ ఎథిక్స్ కమిషన్ చైర్మన్ తెలంగాణ ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, తెలంగాణ, వరంగల్ జిల్లా అసోసియేషన్ల ప్రధాన కార్యదర్శులు నాతి కృష్ణమూర్తి, అర్జున అవార్డి శోభ నారాయణ్, తోట శ్యాంప్రసాద్, టెక్నీకల్ అఫీషియల్స్, రాజారపు రమేష్, కుసుమ సదానందం, సురేంద్ర విశ్వకర్మ పాల్గొన్నారు. పురుషుల విభాగంలో విజేత రైల్వేస్, రన్నర్గా మహారాష్ట్ర మహిళల విభాగంలో విన్నర్ మహారాష్ట్ర, రన్నర్ ఒడిశా -
గోదారంగనాథుల కల్యాణ వైభోగం
గోదారంగనాథుల కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు ఎమ్మెల్యే మురళీనాయక్, డీసీసీ అధ్యక్షురాలు ఉమను ఆశీర్వదిస్తున్న అర్చకులుమహబూబాబాద్ రూరల్ : జిల్లా కేంద్రంలోని వేణుగోపాలస్వామివారి దేవాలయంలో గోదారంగనాథుల కల్యాణోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. అర్చకులు ఆలయ ప్రాంగణంలో శోభాయమానంగా ఏర్పాటుచేసిన వేదిక, ఆదిశేషుడి వాహనంపై గోదారంగనాథులను కొలువుదీర్చి రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి,గోదాదేవి అమ్మవారి కల్యాణోత్సవాన్ని జరిపారు. ధనుర్మాసం సందర్భంగా పూజలు చేసి మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలంలో గోదారంగనాథుల కల్యాణం నిర్వహించామని అర్చకులు ముడుంబై లక్ష్మీనారాయణచార్యులు, సత్యంగౌతం మహారాజ్, దత్తుస్వామి తెలిపారు. మ్మెల్యే భూక్య మురళీనాయక్, డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారు, అమ్మవార్లకు పూజలు చేసి, ప్రజలందరిపై గోదారంగనాథుల అనుగ్రహం ఉండాలని వేడుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో కల్యాణోత్సవ పూజల్లో పాల్గొని స్వామి, అమ్మవారికి పూజలు చేశారు. అర్చకలు భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేసి, ఆశీర్వచనాలు చేశారు. కల్యాణం కోసం పూజించిన యువతులకు స్వామి వారి పూలమాలలను అందించారు. -
మల్లన్న.. మమ్మల్ని కాపాడు
ఐనవోలు: తెలంగాణలో ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో భోగి పర్వదినాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. బుధవారం వేలాది మంది భక్తులు మల్లన్న సన్నిధికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, శ్రీనివాస్, మధుకర్ శర్మ, వేద పారాయణ దారు గట్టు పురుషోత్తమశర్మ, విక్రాంత్ వినాయక్ జోషి పూజలు చేశారు. స్వామివారి గర్భాలయంలో అర్ధప్రాణ వట్టంపై కొలువైన నిర్వికార శ్వేతలింగానికి విభూధులతో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు.. మల్లికార్జునస్వామి ఉత్సవాల్లో భాగంగా భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, మర్రి రాజశేఖర్రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సతీమణి ఉషా హాజరయ్యారు. ప్రముఖులందరికీ ఆలయ మర్యాదలతో చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, ఈఓ కందుల సుధాకర్, అర్చకులు స్వాగతం పలికారు. వీరు స్వామివారికి ప్రత్యేక దపూజలు చేశారు. పెద్ద పట్నాలు వేసుకుంటున్న భక్తులు మల్లన్న ఆలయంలో భక్తులే పెద్ద పట్నాలు వేసుకునే సంస్కృతి క్రమక్రమంగా పెరుగుతోంది. గతంలో ఆలయం వద్ద టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ఒగ్గు పూజారులు పట్నాలు వేసేవారు. కానీ ఇటీవల పదుల సంఖ్యలో భక్తులందరూ 11 పలకల పెద్ద పట్నాలు వేస్తున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా గురువారం గర్భగుడిలో ప్రత్యేక పూజలు, మహన్యాస పూ ర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, మహానివేదన, మంత్ర పుష్పం, తదితర పూజలతోపాటు రాత్రి స్వామివారి రథోత్సవం, ప్రభబండ్లు తిరగడం లాంటి కార్యక్రమాలు ఉంటాయి. ఐనవోలుకు వేలాదిగా తరలొచ్చిన భక్తులు ఆలయంలో ఘనంగా భోగి ఉత్సవాలు పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు -
సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
● రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఎస్ఎస్ తాడ్వాయి : సీఎం రేవంత్రెడ్డి మేడారం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై బుఽ దవారం మేడారంలోని హరిత హోటల్లో కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ రా మ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 18న మేడారం చేరుకుని ఇక్కడే బస చేస్తారన్నారు. 19న సమ్మక్క, సారలమ్మ గద్దెలను ప్రారంభిస్తారన్నారు. సీఎంతో పాటు రాష్ట్ర స్థాయి యంత్రాంగం మొత్తం మేడారంలోనే ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని జిల్లాకు పేరు తీసుకురావాలని కోరారు. కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ సీఎం పర్యటనకు సంబంధించిన ప్రొటోకాల్, బందోబస్తు, వసతి, సాంస్కృతిక కార్యక్రమాలు, జాతర ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సీపీ, వీఐపీ ప్రొటోకాల్ బాధ్యతలను ఆర్డీఓ వెంకటేష్కు అప్పగించారు. ముఖ్యమంత్రి భద్రత, రూట్ మ్యాప్, పార్కింగ్, తదితర ఏర్పాట్లను ఎస్పీ రామ్నాథ్ కేకన్ పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ మహేందర్ జీ, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు పాల్గొన్నారు. పేకాట శిబిరంపై టాస్క్ఫోర్స్ దాడి ● రూ.2.39 లక్షల నగదు స్వాధీనం వరంగల్ క్రైం: పేకాట శిబిరంపై టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి 12 మందిని అరెస్టు చేసినట్లు ఏసీపీ మధుసూదన్ తెలిపారు. బుధవారం పక్కా సమాచారం మేరకు హనుమకొండ పోలీస్స్టేషన్ పరిధిలోని రెడ్డికాలనీలో చొప్పదండి రంజిత్ ఇంట్లో తనిఖీ చేయగా పేకాట ఆడుతున్న 12 మంది పట్టుపడినట్లు ఆయన తెలిపారు. నిందితుల నుంచి రూ. 2,39,660 నగదు, 12 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుపబడిన వారిలో కుమార్పల్లికి చెందిన గుంటపడి ప్రదీప్, రాయపురకు చెందిన జనగాం మల్లేష్, రెడ్డి కాలనీకి చెందిన చొప్పదండి రంజిత్, కుమార్పల్లికి చెందిన అనిశెట్టి మహేష్, మచిలీబజార్కు చెందిన అంబాటి రాజు, గుండ్లసింగారం చెందిన అలువాల ప్రవీణ్కుమార్, తేజావత్ సుమన్, కుమార్పల్లికి చెందిన వెల్దండి పూర్ణచందర్, చింతాకుల ప్రభాకర్, కాపువాడకు చెందిన దాడి వీరేశం, హనుమన్నగర్ చెందిన బొంత రాజు, బొక్కలగడ్డకు చెందిన గాండ్ల దేవేందర్లను అరెస్టు చేసి హనుమకొండ పోలీసులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. దాడుల్లో సీఐ రాజు, ఆర్ఎస్సై భానుప్రకాశ్ పాల్గొన్నారు. -
లోకల్ ఏరియాలో పాల్గొనడం మరిచిపోలేని అనుభూతి
తెలంగాణలోని కాజీపేటలో మొదటిసారి జాతీయ స్థాయి ఖోఖో క్రీడలు నిర్వహించడం ఆనందగా ఉంది. గౌహతిలో 2016లో 12 సౌత్ ఏషియన్ గేమ్లో బంగ్లాదేశ్పై ఇండియా గెలిచి గోల్డ్మెడల్ సాధించింది. అందులో నేను ఆల్ రౌండ్ ప్లేయర్గా ఉన్నా. 14 సీనియర్ నేషనల్స్, 8 సీనియర్ సౌత్ జోన్, అండర్–19, ఫెడరేషన్ కప్, అండర్ –14 నేషనల్స్, రూరల్ గేమ్స్ ఆడా. జూనియర్స్ సౌత్ జోన్స్ నేషనల్, ఆల్టిమేట్ ఖోఖో లీడ్లో ఫస్ట్ సీజన్ తెలుగు యోధాస్ జట్టులో వైస్ కెప్టెన్గా వ్యవహరించా. –బి.రంజిత్, తెలంగాణ జట్టు కోచ్, బొల్లికుంటఖోఖో పోటీలు ఉత్సాహం ఇస్తున్నాయి కాజీపేటలో జరుగుతున్న జాతీయస్థాయి ఖోఖో క్రీడలు ఉత్సాహం ఇస్తున్నాయి. ఇప్పటి వరకు గోవాలో జరిగిన నేషనల్ పోటీల్లో ఆడా. సీనియర్ నేషనల్స్లో ఆడా. కాజీపేటలో మొదటి సారి జాతీయస్థాయి క్రీడలు నిర్వహించడం సంతోషంగా ఉంది. –బిందు సాగర్, చౌటాపూర్, మెదక్ జిల్లా -
కాజీపేట పేరు మార్మోగుతోంది
జాతీయస్థాయి ఖోఖో క్రీడలతో కాజీపేట పేరు దేశ వ్యాప్తంగా మార్మోగుతోంది. ఈ పోటీలు ఉత్సాహం ఇస్తున్నాయి. ఇప్పటి వరకు అండర్–14, నేషనల్ సిల్వర్ మెడల్, నాలుగు జూనియర్స్ నేషనల్, మూడు ఖేలో ఇండియా, మూడు సీనియర్ నేషనల్స్, ఒక అల్టిమేట్ లీగ్ చేశా. –జి.సుధీర్కుమార్, తూముకుండ్ గ్రామం, మేడ్చల్ జిల్లామన ప్రాంతంలో ఆడడం ఆనందంగా ఉందినేషనల్ ఖోఖో పోటీలు సీరియస్గా ఆడుతున్నాం. ఇప్పటి వ రకు 6 నేషనల్స్లో ఆడా. అల్టి మేట్ డ్రాప్టింగ్ లిస్ట్లో ఉన్నా. ప్రస్తుతం కాజీపేట జరుగుతున్న పోటీలు అందరిలో ఉత్సాహం నింపుతున్నాయి. మన ప్రాంతంలో ఆడడం ఆనందంగా ఉంది. –గుమ్మడి చరణ్, ములుగు మండలం, జగ్గన్నగూడెం -
కొత్తకొండకు పోటెత్తిన భక్తజనం..
● వీరబోనం తీసుకొచ్చిన దామెరుప్పుల వంశీయులు ● భోగి వేడుకలతో మొదలైన జాతరఎల్కతుర్తి: కొత్తకొండ వీరభద్రస్వామి జాతర బుధవారం భోగి వేడుకలతో ఊపందుకుంది. ఆనవాయితీ ప్రకారం దామెరుప్పుల వంశీయులు స్వామివారికి వీరబోనం సమర్పించారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి కోడె మొక్కులు చెల్లించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 10న స్వామి వారి కల్యాణంతో ప్రారంభం కాగా భోగి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలొచ్చి గుమ్మడికాయ, నారికేళాలు సమర్పించారు. ముందుగా గండదీపం వద్ద నూనె పోసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. శాలివాహన కులానికి చెందిన దామెరప్పుల వంశీలయులు ప్రత్యేకంగా అలకంరించిన ఎండ్లబండ్ల రథాల ద్వారా ఆలయానికి చేరుకొని వీరబోనం సమర్పించారు. అలాగే, కొందరు వాహనాలపై ప్రభలతో ఆలయానికి చేరుకున్నారు. జాతరకు భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. -
గుడిమెలిగె..ఆనందం కలిగె
ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో సమ్మక్క పూజారులు బుధవారం గుడిమెలిగె పండుగ ఘనంగా నిర్వహించారు. ఉదయమే సమ్మక్క గుడిని శుద్ధి చేశారు. గుడిలోని అమ్మవారి శక్తి పీఠం గద్దెను మట్టితో అలికారు. సమ్మక్క పూజారి (వడ్డె) కొక్కెక కృష్ణయ్య అడవి నుంచి తీసుకొచ్చిన గడ్డిని గుడి ఈశాన్యం మూలన ఉంచారు. అనంతరం సమ్మక్క పూజారి సిద్ధబోయిన ముణిందర్ ఇంటి నుంచి పూజారులు, ఆడపడుచులు పసుపు, కుంకుమ తీసుకుని డోలువాయిద్యాలతో గుడికి చేరుకున్నారు. గుడిలో పూజారులు అలికి సిద్ధంగా ఉంచిన తల్లి శక్తి పీఠం గద్దైపె ముగ్గులు వేసి అలకరించారు. గుడి ఆవరణలో ధ్వజ స్తంభం, గుమ్మం వద్ద ముగ్గులు వేశారు. అనంతరం పూజారులు శక్తి పీఠం గద్దె వద్ద ధూపపాదీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. అమ్మవారికి యాటను నైవేద్యంగా సమర్పించారు. గుడిమెలిగె పండుగతో తొలిఘట్టం మహాజాతర పూజ కార్యక్రమాల తంతు మొదలైనట్లు పూజారులు తెలిపారు. కన్నెపల్లిలోని ఆలయంలో సారలమ్మ పూజారులు గుడిమెలిగె పండుగ నిర్వహించారు. కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు మహేశ్, సిద్ధబోయిన స్వామి, వసంతరావు, పాపారావు, భోజరావు, జనార్ధన్, రానా రమేశ్, దూప వడ్డె నాగేశ్వర్రావు, దొబె బొక్కయ్య, తదితరులు పాల్గొన్నారు. గట్టమ్మ తల్లికి శుద్ధి పండుగ.. ములుగు రూరల్: ఆదివాసీ నాయకపోడు గట్టమ్మ పూజారుల ఆధ్వర్యంలో గట్టమ్మ తల్లికి (గుడిమెలిగె) బుధవారం శుద్ధి పండుగ నిర్వహించారు. గట్టమ్మ పూజారుల సంఘం అధ్యక్షుడు సదయ్య ఆధ్వర్యంలో పూజారులు, వారి కుటుంబ సభ్యులుతో కలిసి పూజలు నిర్వహించారు. అడవి నుంచి పాల పోరక తీసుకొచ్చి పందిరి వేశారు. పసుపు కుంకుమతో తల్లిని అలంకరించారు. నేటి నుంచి జాతర ప్రారంభమై సమ్మక్క, సారలమ్మ జాతరతో ముగుస్తుందని పుజారులు తెలిపారు. గట్టమ్మ ప్రధాన పూజారులు కొత్త లక్ష్మయ్య, అరిగెల సమ్మయ్య, ఆకుల మొగిలి, మోట్లపల్లి సరోజన, ఈర్పిరెడ్డి సారక్క, చిర్రా స్వరూప, ఆకుల రఘు, కొత్త రవి, నీలయ్య, సమ్మయ్య, అరిగెల సంజీవ, అచ్చరాజు, లక్ష్మణ్, మండపు అర్జయ్య, సురేశ్, రాజ్కుమార్, సారయ్య, స్రవంతి తదితరులు ఉన్నారు. ఆదివాసీ సంప్రదాయంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు శక్తి పీఠం గద్దెను అలంకరించిన ఆడపడుచులు నైవేద్యంగా యాట మొక్కు.. ధూపాదీపాలతో పూజలు -
మనగడ్డపై ఆడడం సంతోషంగా ఉంది
కాజీపేట రైల్వే స్టేడియంలో జరుగుతున్న 58వ జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. మన జిల్లా.. గడ్డ.. మన రాష్ట్ర జట్టుతో కలిసి ఆడడం ఆనందంగా ఉంది. ఇప్పటికి 13 నేషనల్స్లో ఆడా, 14వ నేషనల్ కాజీపేటలో ఆడుతున్నా. తెలంగాణ జట్టకు కెప్టెన్గా ఉండడం సంతోషంగా ఉంది. –న్యాతకాని రాకేశ్, తెలంగాణ కెప్టెన్, ఆత్మకూరు మండలం, నీరుకుళ్ల ఖోఖోకు మరింత ప్రాచుర్యం పెరిగింది కాజీపేట స్టేడియంలో జరుగుతున్న 58వ జాతీయస్థాయి సీనియర్ ఖోఖో పోటీలతో దేశవ్యాప్తంగా ఖోఖో క్రీడకు మరింత ప్రాచుర్యం పెరిగింది. ఇప్పటి వరకు ఒక సబ్జూనియర్, మూడు జూనియర్స్, మూడు ఖేలో ఇండియా, ఒక నేషనల్, రెండు సీనియర్ నేషనల్స్ ఆడా. ఢిల్లీలో జరిగిన వరల్డ్ కప్ క్యాంప్ చేశా. ఈ పోటీలు మన ప్రాంతంలో జరగడం ఆనందంగా ఉంది. –వి.జానకీరాం, కుల్కచర్ల, రంగారెడ్డి జిల్లా -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
హసన్పర్తి : పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్లోని ముజ్పార గ్రామానికి చెందిన ఫెరోజ్ షేక్, సుక్చంద్, యామీన్ ముఠాగా ఏర్పడి సులువుగా డబ్బులు సంపాదించడానికి ప్రణాళిక రూపొందించారు. దీనికి చోరీలే మార్గమని భావించారు. అనుకున్నదే తడువుగా తాళాలు వేసి ఉన్న ఇళ్లలో పట్టపగలే చోరీలకు పాల్పడి ఆ సొత్తును అమ్ముకుని జల్సాలు చేస్తున్నారు. ఇలా పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రాల్లోని పలు చోట్ల చోరీలకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించగా రెండు నెలల క్రితం విడుదలయ్యారు. అనంతరం డిసెంబర్ 17న తెలంగాణకు చేరుకుని నగరంలోని కేయూ పరిధిలోని పరిమళ, సప్తగిరి కాలనీల్లోని రెండిళ్లలో చోరీలకు పాల్పడ్డారు. మళ్లీ ఈనెల 10న గోపాలపురంలోని శివసాయి కాలనీలో చోరీలకు పాల్పడ్డారు. ఇక్కడ 15 తులాల బంగారం, 5తులాల వెండితో పాటు నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, క్రైం డీసీపీ బాలస్వామి, క్రైం ఏసీపీ సదయ్య, హనుమకొండ ఇన్చార్జ్ ఏసీపీ ప్రశాంత్, కేయూసీ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో విచారణ వేగవంతం చేపట్టారు. ఆ ముఠా మళ్లీ చోరీ చేయడానికి కేయూ జంక్షన్ వద్దకు వచ్చిందనే సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వారికి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారించగా నేరం అంగీకరించారు. దీంతో చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ తెలిపారు.● చోరీ సొత్తు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన సెంట్రల్ జోన్ డీసీపీ కవిత -
జాతీయ ఖోఖో జాతరలో మనోళ్లు..
కాజీపేట రూరల్ : తెలంగాణలో మొదటిసారి కాజీపేట రైల్వే స్టేడియంలో ఈ నెల 10వ తేదీ నుంచి 58వ సీనియర్ నేషనల్ ఖోఖో చాంపియన్షిప్ మెన్ అండ్ ఉమెన్ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి మెన్ అండ్ ఉమెన్ జట్లు ఆడుతున్నాయి. మెన్ జట్టులో వరంగల్ జిల్లా నుంచి ముగ్గురు, రంగారెడ్డి నుంచి నలుగురు, హైదరాబాద్ నుంచి నలుగురు, ఆదిలాబాద్ నుంచి ఒకరు, మెదక్ నుంచి ఒకరు, నల్లగొండ నుంచి ఒకరు, కరీంనగర్ జిల్లా నుంచి ఒకరు మొత్తం 15 మంది(జట్టు)ఆడుతున్నారు. ఈ జట్టకు కోచ్గా బొజ్జం రంజిత్, అసిస్టెంట్ కోచ్గా పి.ఆనంద్ కుమార్, మేనేజర్గా సతీశ్ వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో మన రాష్ట్రంలో జరుగుతున్న ఈ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని తెలంగాణ తరుఫున ఆడుతుండడం సంతోషంగా ఉందని క్రీడాకారులు పేర్కొంటున్నారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. చాంపియన్షిప్లో ఏకలవ్య అవార్డు గ్రహీతలు.. కాజీపేటలో జరుగుతున్న 58వ నేషనల్ సీనియర్ నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్లో మహారాష్ట్ర పూణెకు చెందిన ఏకలవ్య అవార్డు గ్రహీతలు ప్రతీక్ వైకర్, సుయాష్ గర్గటే పాల్గొంటున్నారు. వీరు పూణె జట్టు తరఫున ఆడుతున్నారు. వారి గురించి.. ● భారతదేశ అత్యున్నత పురస్కారం ఏకలవ్య అ వార్డు గ్రహీత ప్రతీక్ వైకర్ వరల్డ్కప్లో ఇండి యా ఖోఖో జట్టకు కెప్టెన్గా వ్యవహరించారు. 3 ఇంటర్నేషనల్, 12 సీనియర్ నేషనల్స్, అల్టిమె ట్ ఖోఖో తెలుగు యోధాస్కు కెప్టెన్గా ఉన్నా డు. 6 ఫెడరేషన్స్ నేషనల్ ఆడారు. లండన్లో జ రిగిన సౌత్ ఏషియా వరల్డ్కప్ కెప్టెన్గా ఉన్నారు. ● మరో ఏకలవ్య అవార్డు గ్రహీత సుయాష్ గర్గటే 4 ఏషియన్ చాంపియన్షిప్, ప్రపంచకప్లో ఇండియా టీమ్లో ఆడారు. 8 సీనియర్ నేషనల్స్, ఫెడరేషన్ కప్ ఆడారు. అల్టిమేట్లో ఖోఖో 2 సీ జన్లో ప్రాతినిథ్యం వహించారు. 3 నేషనల్స్, 2 ఫెడరేషన్ నేషనల్, 2 టెస్ట్ మ్యాచ్లు, ఇండియా–నేపాల్,ఇండియా–ఇంగ్లాండ్ మ్యాచ్లో ఆడారు. 58వనేషనల్ సీనియర్ పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు.. వివిధ జిల్లాల నుంచి ప్రాతినిథ్యం.. 15 మందితో జట్టు.. మెరుస్తున్న పలువురు ప్లేయర్లు -
మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు
సాక్షి,మహబూబాబాద్: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు మరో అడుగు పడింది. రిజర్వేషన్లు ఖరారు చేస్తూ బుధవారం రాత్రి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్లు ప్రకటించేందుకు రాష్ట్ర యూనిట్గా ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం మున్సిపాలిటీల్లోని వార్డుల రిజర్వేషన్లను ప్రకటించారు. కులాల వారీగా వార్డుల సంఖ్యను ప్రకటించిన అధికారులు, వార్డులకు రిజర్వేషన్ల కేటాయింపు బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించారు. ఆయా వార్డులను జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీల వారీగా కేటాయించనున్నారు. కాగా, 2011జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు కేటాయించగా, బీసీ రిజర్వేషన్ మాత్రం బీసీ డెడికేటెడ్ కమిషన్ ఆదేశాల మేరకు నిర్ణయించారు. అదేవిధంగా 2019 మున్సిపల్ చట్టం ప్రకారం జనరల్ మహిళా రిజర్వేషన్లు కేటాయించారు. కాగా సంక్రాంతి తర్వాత వార్డులకు రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయనున్నారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు కూడా వెలువడనున్నాయి. రిజర్వేషన్లు ఇలా.. మహబూబాబాద్ మున్సిపాలిటీ.. మహబూబాబాద్ మున్సిపాలిటీలో 36 వార్డులు ఉన్నాయి. ఇందులో ఎస్టీ జనరల్ 4, ఎస్టీ మహిళ 3, ఎస్సీ జనరల్ 3, ఎస్సీ మహిళ 2, బీసీ జనరల్ 3, బీసీ మహిళ 3, జనరల్ మహిళ 10, జనరల్ రిజర్వుడ్ 8 స్థానాలు కేటాయించారు. మరిపెడ మున్సిపాలిటీ.. మరిపెడ మున్సిపాలిటీలో మొత్తం 15వార్డులు ఉన్నాయి. ఎస్టీ మహిళ 3, ఎస్టీ జనరల్ 3, ఎస్సీ జనరల్ 1, జనరల్ మహిళ 4, జనరల్ 4 స్థానాలు కేటాయించారు. డోర్నకల్ మున్సిపాలిటీ.. డోర్నకల్ మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉన్నాయి. ఎస్టీ మహిళ 2, ఎస్టీ జనరల్ 2, ఎస్సీ జనరల్ 2, ఎస్సీ మహిళ 1, జనరల్ మహిళ 4, జనరల్ 4 స్థానాలు కేటాయించారు. కేసముద్రం మున్సిపాలిటీ.. కేసముద్రం మున్సిపాలిటీలో మొత్తం 16వార్డులు ఉన్నాయి. ఎస్టీ మహిళ 1, ఎస్టీ జనరల్ 2, ఎస్సీ జనరల్ 1, ఎస్సీ మహిళ 1, బీసీ జనరల్ 2, బీసీ మహిళ 1, జనరల్ మహిళ 5, జనరల్ 3 స్థానాలు కేటాయించారు. తొర్రూరు మున్సిపాలిటీ.. తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉన్నాయి. ఎస్టీ జనరల్ 1, ఎస్టీ మహిళ 1, ఎస్సీ జనరల్ 2, ఎస్సీ మహిళ 1, బీసీ జనరల్ 2, బీసీ మహిళ 1, జనరల్ మహిళ 5, జనరల్ 3 స్థానాలు కేటాయించారు. మహబూబాబాద్ పట్టణ వ్యూ కేటగిరీల వారీగా సంఖ్యను ప్రకటించిన అధికారులు రాష్ట్ర యూనిట్గా చైర్మన్ రిజర్వేషన్ -
వైభవంగా ‘గోదారంగనాఽథుల కల్యాణం’
కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు, భక్తులుకల్యాణం నిర్వహిస్తున్న అర్చకులుమహబూబాబాద్ రూరల్ : భోగి వేడుకల్లో భాగంగా పట్టణంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో బుధవారం గోదారంగనాథుస్వామి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు ముత్తేవి వెంకట కృష్ణప్రసాద్, సహ అర్చకుడు మారేపల్లి కౌశిక్ శర్మ వేద మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణం ఘనంగా జరిపించారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ ముఖ్య అతిథులుగా హాజరై స్వామి, అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. గోదారంగనాథుల అనుగ్రహంతో భక్తులు సుఖశాంతులతో జీవించాలని వేడుకున్నారు. కారక్రమంలో గోదా ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. పూజలు చేసిన ఎమ్మెల్యే మురళీనాయక్, డీసీసీ అధ్యక్షురాలు ఉమ -
ప్రజలు సుఖశాంతులతో జీవించాలి
మహబూబాబాద్: ప్రజలు సుఖశాంతులతో జీవించాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. జిల్లా కేంద్రంలోని మాలోత్ కవిత గృహంలో బుధవార భోగి వేడుకలను నిర్వహించారు. గంగిరెద్దుల విన్యాసాలు తిలకించారు. భోగి మంటలు వేసి సంతోషంగా గడిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు. అందరూ కలిసి పండుగలు జరుపుకుంటే సంతోషంగా ఉంటుందన్నారు సంక్రాంతి పండుగ మహిళలకు, రైతులకు అత్యంత ఇష్టమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్రెడ్డి, మురళీధర్రెడ్డి, వెంకన్న, మహబూబ్ పాషా, రామచంద్రారెడ్డి, లక్ష్మణ్, విజయ్, రాజేష్, రాము తదితరులు పాల్గొన్నారు. వీరన్న సన్నిధికి పోటెత్తిన భక్తులుకురవి: భోగి పండుగను పురస్కరించుకొని బుధవారం మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి సన్నిధికి భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది. స్వామి, అమ్మవారిని దర్శించుకునేందుకు బారులుదీరారు. మొక్కుల అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. కుటుంబమంతా ఒకచోట..డోర్నకల్: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి సంతోషంగా గడుపుతున్నారు. మండలంలోని వెన్నారం గ్రామానికి చెందిన 89 సంవత్సరాల మల్లం ప్రమీలకు ఐదుగురు కుమారులు ఉన్నారు. పాతికేళ్ల క్రితం ఆమె భర్త జగన్నాథం చనిపోగా.. పిల్లలు హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ప్రమీల వెన్నారంలో నివాసం ఉంటుండగా.. ఏటా కుమారులు, కోడళ్లు, వారి పిల్లలు సంక్రాంతికి స్వగ్రామానికి వచ్చి ఆనందంగా గడుపుతారు. కాగా బుధవారం ఆమె కుమారులు వీరేందర్, హరేందర్, సురేందర్, మహేందర్, దేవేందర్ తమ భార్యాపిల్లలతో సంక్రాంతి పండుగకు స్వగ్రామానికి వచ్చారు. దీంతో ప్రమీల స్వయంగా పిండివంటలు చేసిపెట్టింది. ఏటా సంక్రాంతికి వచ్చి ఆనందంగా గడుపుతామని ప్రమీల కుమారులు తెలిపారు. విద్యార్థులకు చదవడం, రాయడం నేర్పించాలిమహబూబాబాద్ అర్బన్: ప్రాథమిక దశలోనే విద్యార్థులకు చదవడం, రాయడం నేర్పించాలని డీఈఓ రాజేశ్వర్ ఉపాధ్యాయులకు సూచించారు. మానుకోట మున్సిపల్ పరిధిలోని మోడల్ స్కూల్లో ప్రీప్రైమరీ ఉపాధ్యాయులకు కృత్యాల ఆధారితంగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులకు పాటలు, నృత్యాలు, చిత్రలేఖనం, బొమ్మలు తయారు చేయడం నేర్పించాలని, వారిలో సృజనాత్మకతను పెంపొందించాలన్నారు. ప్రీప్రైమరీ పాఠశాలలను బలోపేతం చేయాలని, నాణ్యమైన విద్యనందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరీక్షల పర్యవేక్షణ అధికారి మందుల శ్రీరాములు, రిసోర్స్పర్సన్లు ప్రవీణ్కుమార్, నాగమునిఇ, యాదగిరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రోడ్డును కమ్మేసిన మంచు..కురవి: మండల కేంద్రంలో బుధవారం ఉదయం మంచుదుప్పటి కప్పుకుంది. కురవి–ఖమ్మం జాతీయ రహదారిపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపంచకుండా మంచు కమ్ముకుంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మంచు రెండు గంటల పాటు కమ్ముకుని ఉంది. -
నర్సరీ సాగు.. బహుబాగు
● ఆదర్శంగా నిలుస్తున్న బండి శ్రీనివాస్ సంగెం: వరంగల్ జిల్లా సంగెం మండలం ఆశాలపల్లికి చెందిన రైతు బండి శ్రీనివాస్ సేంద్రియ పద్ధతిలో వైవిధ్య పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. చాలా మంది రైతులు సంప్రదాయ పంటలు పత్తి, మొక్కజొన్న, వరి మాత్రమే సాగు చేస్తుండగా అందుకు భిన్నంగా శ్రీనివాస్ సేంద్రియ పద్ధతిలో వైవిధ్య పంటలు కూరగాయలు, సీతాఫలం, కీరదోస, వేరుశనగ, అపరాల్లో కంది, పెసర, బొబ్బెర, సజ్జలు సాగు చేస్తున్నాడు. ఈ పంట ఉత్పత్తులకు మార్కెట్లో ఎక్కువ ధర లభిస్తోంది. సేంద్రియ సాగు కోసం ఆవులు, గేదెలను పెంచుతూ వాటి ఎరువుతోచీడపీడల నివారణ చేస్తున్నట్లు రైతు శ్రీనివాస్ తెలిపారు.డోర్నకల్: మహబూబాబాద్ జిల్ల డోర్నకల్ మండలం ముల్కలపల్లికి చెందిన రైతు బొమ్మగాని నర్సింహరావు సాగులో ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నాడు. తెట్టెపాడుకు చెందిన నర్సింహారావు ముల్కలపల్లిలో ఇరువై ఏళ్లుగా నర్సరీ నిర్వహిస్తూ కూరగాయలు పండిస్తున్నాడు. సీజన్ ప్రారంభంలో కూరగాయల మొక్కలు పెంచి రైతులకు విక్రయిస్తున్నాడు. అనంతరం మిగతా కాలమంతా కూరగాయలు పండిస్తున్నాడు. కీరా, చిక్కుడు, టమాటా, సొర, బోడకాకరకాయ, తదితర కూరగాయలు సాగు చేస్తున్నాడు. మొక్కలకు ప్రత్యేక ట్రీగార్డు ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం, ఎలాంటి పురుగు మందులు వాడకుండా (సేంద్రియ) అధిక దిగుబడులు సాధిస్తున్నాడు. దీంతో జిల్లా వ్యవసాయ అధికారులు నర్సింహారావును అభినందించారు. ఆధునిక పద్ధతితో అధిక దిగుబడి సాధిస్తున్ననర్సింహారావు.. -
పిచ్చోడి చేతిలో రాయిలా సీఎం పాలన
మహబూబాబాద్/మహబూబాబాద్ అర్బన్: రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన జిల్లాలు అశాసీ్త్రయంగా ఉన్నాయని, మార్పులు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. పాలన సౌలభ్యం కోసం మాజీ సీఎం కేసీఆర్ నూతన జిల్లాలు ఏర్పాటు చేశారన్నా రు. జిల్లాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదన్నారు. మానుకోట మున్సిపాలిటీ అభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్ రూ.50 కోట్లు ప్రకటిస్తే, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నా రు. ఆ నిధులనే మళ్లీ ప్రకటించి కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపనలు చేస్తోందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, మా నుకోట మున్సిపాలిటీలో గులాబీజెండా ఎగురవేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ మాలోత్ కవిత, జెడ్పీ మాజీ చైర్పర్సన్ బిందు, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్, మున్సిపల్ మాజీ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, నాయకులు ఫరీద్, రవి, రంజిత్, రాజు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలిమహబూబాబాద్ రూరల్ : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పీ శబ రీష్ అన్నారు. ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్) ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధి లో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయి, హషీష్(నూనె)ను మంగళవారం దహ నం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, వినియోగంపై జిల్లా పోలీసు శాఖ కఠిన చర్యలు కొనసాగిస్తుందని పేర్కొన్నారు. జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ సమావేశం నిర్వహించి న్యాయస్థానం అనుమతితో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 242 కిలోల గంజాయి, 226 గ్రాముల హషీష్ను దహనం చేసినట్లు చెప్పారు. మహబూబాబాద్ టౌన్, డోర్నకల్, కేసముద్రం, కురవి, గూడూరు, గార్ల, మరిపెడ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులకు సంబంధించిన మాదక ద్రవ్యాలను వరంగల్ కాకతీయ మెడి వేస్ట్ యూనిట్ పరిధిలోని ప్రత్యేక యంత్రాల ద్వారా పూర్తిగా దహనం చేసి నాశనం చేశారన్నారు. గంజాయి సాగు, రవాణా, విక్రయాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రజాబాటకేసముద్రం: విద్యుత్ సమస్యల పరిష్కారానికి గ్రామాల్లో ప్రజాబాట చేపట్టినట్లు విద్యుత్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ విజయేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధి కేసముద్రంవిలేజ్లో ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం కేసముద్రంవిలేజ్, ఉప్పరపల్లిలో నిర్మిస్తున్న సబ్స్టేషన్ పనులు, మున్సిపాలిటీలో జరుగుతున్న విద్యుత్ పనులను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ఏడీఈ ఐలయ్య, ఏఈ రాజు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. పీఆర్టీయూ టీఎస్ జిల్లా నూతన కమిటీమహబూబాబాద్ అర్బన్: పీఆర్టీయూ టీఎస్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ మంగళవారం తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా బోడ రాంజీనాయక్, ప్రధాన కార్యదర్శిగా జన్ను రాజమౌళిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పులి దేవేందర్ మాట్లాడుతూ.. రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న డీఏలు, బకాయిలను విడుదల చేయాలని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం దిశగా నాయకులు పని చేయాలన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ టీఎస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రాచర్ల శ్రీనివాస్, వంగల్ జిల్లా అధ్యక్షుడు హర్షం సురేష్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కురమ పున్నంచందర్, వివిధ మండలాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. -
కొత్తకొండకు కడిపికొండ వీరబోనం
● భోగి రోజున సమర్పించనున్న దామెరుప్పుల వంశస్తులు ● 600 ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీకాజీపేట అర్బన్: సంక్రాంతి అనగానే పిండి వంటలు, ఇంటి ఎదుట రంగురంగుల ముగ్గులు, పతంగులుగుర్తుకువస్తాయి. కానీ, కాజీపేట మండలం కడిపికొండ గ్రామం ఇందుకు భిన్నంగా పండుగను జరుపుకుంటుంది. భోగి రోజున గ్రామంలోని (శాలివాహనులు) దామెరుప్పుల వంశస్తులు మాత్రం కొత్తకొండ జాతరలో వీరబోనం సమర్పించేందుకు ఎడ్లబండ్లను అందంగా అలకరిస్తారు. శివసత్తుల నృత్యాలు, మేళతాళాలతో ప్రత్యేకంగా నిలుస్తారు. ఈ మేరకు మంగళవారం దామెరుప్పుల వంశస్తులందరూ కొత్తకొండకు ఎడ్లబండ్లపై బయలుదేరారు. బుధవారం ఉదయం వరకు అక్కడికి చేరుకుని బోనం సమర్పిస్తామని తెలిపారు. వీరభద్రుడి ఆదేశాలతో వీరబోనం.. చరిత్ర ఆధారంగా 600 ఏళ్ల కిత్రం కొత్తకొండ గ్రామంలోని సావీరుకొండ అటవీ ప్రాంతానికి కడిపికొండ గ్రామానికి చెందిన దామెరుప్పుల వంశస్తులు ఎడ్లబండ్లలో జీవనోపాధికి కట్టెలు కొట్టుకోవడానికి వెళ్లేవారు. కట్టెలు కొట్టుకుని కాసేపు సేదదీరి భోజనం చేసి తిరుగు ప్రయాణానికి బయలుదేరేందుకు ప్రయత్నించగా ఎడ్లబండ్లు మాయమయ్యాయి. అడవి మొత్తం వెదికినా దొరకపోవడంతో అలసిపోయి ఓ చెట్టు కింద నిద్రించారు. అందులో ఒకరికి కొత్తకొండ వీరభద్రుడు ప్రత్యక్షమై సావీరుకొండపై వెలిసిన నాకు మీ వంశస్తులు వీరబోనం సమర్పించాలని కోరాడు. దీంతో నాటినుంచి భోగీ రోజున కొత్తకొండ జాతరలో కడిపికొండ దామెరుప్పుల వంశస్తులు వీరబోనం సమర్పిస్తున్నారు. -
ఆకట్టుకుంటున్న అమరుడి స్మారక స్తూపం
● స్తూపానికి ఎరుపు, పచ్చ రంగులు ఎస్ఎస్తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం సమీపంలోని ఊరట్టం జంక్షన్ వద్ద ఓ స్తూపం అందరినీ ఆకర్షిస్తోంది. సాధారణంగా అమరుల స్తూపానికి ఎరుపురంగువ వేస్తుంటారు. కానీ, పీపుల్స్వార్ పార్టీ కాలంలో నిర్మించిన ఈ స్తూపానికి ఎరుపు, పచ్చ రంగులతో అలంకరణ చేస్తున్నారు. జాతర పనుల్లో భాగంగా స్తూపానికి సిమెంట్తో ప్లాస్టింగ్ చేసి పచ్చ రంగు, చివరన ఎర్రరంగు వేయడం స్థానికులు, భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ స్తూపం మండల పరిధిలోని మేడారం సమీపంలో గల నార్లాపూర్ గ్రామానికి చెందిన మల్లెల సమ్మయ్య అలియాస్ బుట్టన్నది. ఆయన 22ఏళ్ల క్రితం జనశక్తి పార్టీలో చేరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చెల్పూరు సమీ పంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. స్మారకార్థం స్తూపాన్ని ఊరట్టం క్రాస్ వద్ద ఆయన బంధువులు నిర్మించారు. ప్రస్తుతం జాతర నేపథ్యంలో ఆదివాసీయోధుల పోరాట చరిత్రను ప్రతిబింబించేలా స్తూపానికి పచ్చ రంగు, చివరన ఎరుపురంగు వేస్తున్నట్లు తెలిసింది. -
ఏసీబీ జాయింట్ డైరెక్టర్ విచారణ
భూభారతి కుంభకోణంపైజనగామ: రాష్ట్రాన్ని కుదిపివేస్తున్న భూభారతి కుంభకోణంపై విచారణ చేసేందుకు మంగళవారం ఏసీబీ జా యింట్ డైరెక్టర్, కుంభకోణంపై ప్రభుత్వం నియమించిన హైలెవల్ కమిటీ మెంబర్ సింధూశర్మ(ఐపీఎస్) జనగా మ జిల్లా కేంద్రానికి వచ్చారు. వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్తో పాటు పీఎస్ల పరిధిలోని ఎస్హెచ్వోలతో సమావేశం నిర్వహించారు. భూభారతిలో జరిగిన అవినీతి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. స్లాట్ బుకింగ్ వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అక్రమాలకు సంబంధించి సమగ్ర విచారణ జరిపించి, అవినీతికి పాల్పడిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం. 19మంది రైతులకు నోటీసులు.. కొడకండ్ల: భూభారతి స్లాట్ బుకింగ్ కుంభకోణంలో రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యా రు. అక్రమార్కులు కొల్లగొట్టిన సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమ చేసి లోటును పూడ్చుకొనేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ 2025లో భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు మంగళవారం రెవెన్యూ అధికారులు నోటీసులు పంపారు. ఈ మేరకు తహసీల్దార్ కోల చంద్రమోహన్ను వివరణ కోరగా.. 19 మంది రైతులకు నోటీసులిచ్చినట్లు తెలిపారు. కుంభకోణంలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొని డబ్బును రికవరీ చేసుకోకుండా రిజిస్ట్రేషన్ చలాన్ డబ్బులను చెల్లించిన తమను బాధ్యులు చేస్తూ నోటీసులిచ్చి డబ్బులు కట్టాలనడమేంటని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
40 ఏళ్లుగా గంగిరెద్దులతోనే జీవనం..
డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం కన్నెగుండ్ల గ్రామంలో 40 శాతానికి పైగా కుటుంబాలు గంగిరెద్దులాటతోనే జీవనం గడుపుతున్నాయి. సుమారు 30 కుటుంబాలు దశాబ్దాల కాలంగా గంగిరెద్దులాట కొనసాగిస్తున్నాయి. గ్రామానికి చెందిన జానపాటి వెంకన్న.. ఇంటర్మీడియట్ చదువుతున్న తన కుమారుడు మహేశ్తో కలిసి డోర్నకల్ పరిసరాల్లో గంగిరెద్దును తిప్పుతూ భిక్షాటన చేస్తున్నాడు. సంవత్సరంలో సంక్రాంతి సమయంలో పదిహేను రోజులపాటు తమకు ఉపాధి దొరకుతుందని, మిగతా రోజుల్లో కూలీకి వెళ్తామని వెంకన్న చెబుతున్నాడు. గంగిరెద్దులాటకు ఆదరణ తగ్గుతుందని ఆయన పేర్కొన్నాడు. సంక్రాంతి సెలవుల్లో నాన్న వెంట తిరుగుతూ గంగిరెద్దును ఆడిస్తానని మహేశ్ తెలిపాడు. -
గాలిపటమా పద పద..
వరంగల్ ఎల్లంబజార్లో నిజాం కాలం నుంచి విక్రయాలుఖిలా వరంగల్: సంక్రాంతిని పురస్కరించుకొని అందరూ గాలిపటాలు ఎగురవేస్తుంటారు. ఈసారి ఈగల్, డోరేమాన్, లేడీబర్డ్, జాజ్, పందెం కోడి వంటి ఆకర్షణీయమైన పతంగులు కనువిందు చేస్తున్నాయి. నిజాం నవాబుల కాలం నుంచే వరంగల్ ఎల్లంబజార్లో పతంగులు విక్రయిస్తూ ఎన్నో కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్, గుజరాత్ నుంచి పతంగులను దిగుమతి చేసుకుంటున్నారు. 2017 నుంచి చైనా మాంజా విక్రయాలపై నిషేధం.. 2016లో జాతీయ ట్రిబ్యునల్ తీర్పుతో 2017 నుంచి చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై ప్రభుత్వాలు నిషేధం విధించాయి. అయినా కొందరు వ్యాపారులు దొంగచాటున విక్రయిస్తున్నారు. పోలీసులు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి మాంజాను స్వాధీనం చేసుకొని విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. నిజాం కాలం నుంచి అమ్ముతున్నాం.. వరంగల్ ఎల్లంబజార్లో నివాసం ఉంటాం. తాత ముత్తాతలు పతంగుల వ్యాపారం చేసేవారు. వంశపారంపర్యంగా నిజాం కాలం నుంచి పతంగులను అమ్ముతూ జీవనం సాగిస్తున్నాం. మా ఇద్దరు కుమారులు సైతం ఇదే వ్యాపారం చేస్తున్నారు. 30 రోజులు మాత్రమే సీజన్ ఉంటుంది. –చౌహాన్ సూరాజ్, వ్యాపారి, ఎల్లంబజార్, వరంగల్మా షాపునకు వందేళ్ల చరిత్ర.. సురాజ్ మాల్కు వందేళ్ల చరిత్ర ఉంది. ఈ షాపును నమ్ముకొని నా ఇద్దరు కుమారులు జీవనం సాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన యువత ఇక్కడి నుంచి హోల్సేల్, రిటైల్గా కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. –చౌహాన్చంద్, వ్యాపారి పెద్దల పర్యవేక్షణలోనే ఎగురవేయాలి. నాణ్యమైన గాలిపటాలు కొనుగోలు చేసి కాటన్ దారాలు మాత్రమే వాడాలి. చైనా, ఇతర మాంజాలు వాడొద్దు.భవనాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగురవేయొద్దు. జనావాసాలకు దూరంగా విశాలమైన మైదాన ప్రదేశంలోనే ఎగురవేయాలి. పైకి చూస్తే భవనంపై నుంచి కింద పడే ప్రమాదం ఉంది. పతంగులు విద్యుత్ తీగలు, స్తంభాలకు చిక్కినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కర్రలు, ఇనుప చువ్వలతో తీసే ప్రయత్నం చేయొద్దు. -
ఆ ఇంటికి ‘పెద్ద’రాయుడు..
నల్లబెల్లి: నల్లబెల్లి మండ ల పరిసర గ్రామాల్లో తిరుగుతూ గంగిరెద్దును ఆడించే పెద్ద వెంకటయ్యది మూడు తరాల చరిత్ర. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వృత్తే అతడికి జీవనాధారం. వెంకటయ్య దగ్గర ఉన్న గంగిరెద్దు పేరు పెద్దరాయుడు. తెల్లటి శరీరం, నుదుట ఎర్రని చుక్క, మెడలో గంటలతో అడుగు పెడితే పిల్లలందరూ చుట్టుముడుతారు. ‘పెద్దరాయుడిని మేము ఎద్దులా చూడము. మా కుటుంబంలో నా కన్న బిడ్డలా చూసుకుంటాం’అని పెద్ద వెంకటయ్య చెప్పుతుంటే ఆయన కళ్లలో గర్వం, ప్రేమ కనిపించాయి. పెద్దరాయుడు గురించి ఆయన మాటల్లో.. కఠినమైన శిక్షణ.. ప్రేమతోనే సాధ్యం ఒక ఎద్దును గంగిరెద్దుగా తీర్చిదిద్దడం వెనుక ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది. తిరుపతి కొండల్లో గురువు ప్రేమ సైగలతో శిక్షణ ఇస్తారు. డూడూ బసవన్న అంటే తల ఊపడం, కాళ్లతో తాళం వేయడం, యజమాని మాట ప్రకారం ఆశీర్వదించడం ఇవన్నీ నేర్పడానికి ఎంతో ఓర్పు ఉండాలి. ప్రతిరోజూ పెద్దరాయుడు (గంగిరెద్దు)కు స్నానం చేయించి ప్రత్యేకమైన ఆహారం అందిస్తూ కుటుంబ సభ్యులకంటే జాగ్రత్తగా కాపాడుకుంటున్నా. పండుగ సమయంలో గతంలో బియ్యం, ధాన్యం, కాసిన్ని డబ్బులు ఇచ్చేవారు. కానీ పట్టణీకరణ పెరగడం, ప్రజల్లో ఆసక్తి తగ్గడంతో ప్రస్తుతం ఆదరణ తగ్గింది. కుటుంబ పోషణతోపాటు ఎద్దు మేతకు కూడా ఇబ్బంది అవుతోంది. ప్రభుత్వం మమ్ముల్ని కళాకారులుగా గుర్తించి పింఛన్ ఇవ్వాలి. పశుపోషణకు సాయం చేస్తే ఈ కళను బతికించుకుంటాం. -
నిమిషమైతే ఇంటికి.. ఆ లోపే మృత్యుఒడికి
● టాటా ఏస్ను ఢీకొన్న లారీ.. ● కూరగాయల వ్యాపారి దుర్మరణం హసన్పర్తి : నిమిషమైతే ఇంటికి చేరే వాడు. ఆ లోపే మృత్యుఒడికి చేరాడు. లారీ .. టాటా ఏస్ వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఓ కూరగాయల వ్యాపారి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన హసన్పర్తి మండల కేంద్రంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హసన్పర్తికి చెందిన పెద్దోళ్ల శ్రీనివాస్(34) రోజూ ఉదయం టాటా ఏస్ వాహనంలో వరంగల్ మార్కెట్కెళ్లి కూరగాయలు కొనుగోలు చేసి ఇంటి వద్ద విక్రయిస్తుంటాడు. రోజుమాదిరిగానే మంగళవారం ఉదయం వరంగల్ మార్కెట్కెళ్లి కూరగాయలు కొనుగోలు చేసి తిరిగి హసన్పర్తికి పయనమయ్యాడు. హసన్పర్తి పాత కట్టల మిషన్ వద్దకు చేరుకోగానే కరీంనగర్ నుంచి హనుమకొండ వైపునకు ఎదురుగా వస్తున్న లారీ.. టాటా ఏస్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం తరలించారు. మృతుడి భార్య రమ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దేవేందర్ తెలిపారు. -
ఖోఖోలో మహారాష్ట్ర, రైల్వేస్ ముందంజ..
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే స్టేడియంలో జరుగుతున్న 58వ జాతీయ సీనియర్ నేషనల్ ఖోఖో చాంపియన్షిప్లో రైల్వేస్, మహారాష్ట్ర ముందంజలో కొనసాగుతున్నాయి. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్లో మహిళల డిపెండింగ్ చాంపియన్ మహారాష్ట్ర 44–10 స్కోర్ తేడాతో ఉత్తరప్రదేశ్పై, పురుషుల డిఫెండింగ్ చాంపియన్షిప్ రైల్వేస్ 39–12 స్కోర్ తేడాతో పుదుచ్చేరిపై గెలిచి ప్రీ క్వార్టర్ ఫైనల్కు చేరాయి. మహిళల విభాగంలో 23–4 తేడాతో హరియాణపై కొల్లాపూర్, 26–21తో కేరళపై గుజరాత్, 27–18తో పశ్చిమ బెంగాల్పై కర్ణాటక, 19–12తో ఆంధ్రప్రదేశ్పై తమిళనాడు, 30–18తో విదర్భపై ఒడిశా, 25–12తో పంజాబ్పై ఎయిర్పోర్టు అఽథారిటీ ఆఫ్ ఇండియా, 35–16 తేడాతో రాజస్థాన్పై ఢిల్లీ గెలుపొంది ప్రీ క్వార్టర్ ఫైనల్కు చేరాయి. పురుషుల విభాగంలో.. 24–19 తేడాతో అతిథ్య తెలంగాణపై కర్ణాటక గెలుపొందింది. తొలి అర్ధభాగంలో కర్ణాటక 15–9 స్కోరు సాధించింది. కర్ణాటక జట్టులోని జి.సునీల్ 2.30 టైమింగ్ ఇవ్వడమే కాకుండా నాలుగు పాయింట్లు సాధించాడు. తెలంగాణ జట్టులోని టి.నిరీక్షణ్, 2.40, జైకుమార్ 1.40, జి.దినేశ్ 50 సెకండ్స్ ఆడారు. కెప్టెన్ రాకేశ్ సైతం 4 పాయింట్లు చేజింగ్లో సాధించాడు. క్వార్టర్ ఫైనల్లో తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్తో తలపడింది. మిగతా లీగ్ మ్యాచ్ల్లో 28–23 తేడాతో ఢిల్లీపై కేరళ , 27–21తో ఛత్తీస్గఢ్పై పశ్చిమ బెంగాల్, 28–25తో తమిళనాడుపై ఆంధ్రప్రదేశ్, 24–15తో ఉత్తరప్రదేశ్పై మహారాష్ట్ర , 29–22తో గుజరాత్పై కొల్లాపూర్, 25–11తో విదర్భపై ఒడిశా విజయం సాధించి ప్రీ క్వార్టర్ ఫైనల్కు చేరాయి. ముగిసిన మహిళల పోరాటం.. జాతీయ సీనియర్ ఖోఖో చాంపియన్షిప్లో అతి థ్య తెలంగాణ మహిళల జట్టు పోరాటం ముగిసింది. క్రీడాకారుల సమన్వయ లోపం, కీలక దశలో రాణించకపోవడంతో లీగ్ దశలో నిష్క్రమించింది. గ్రూప్ ‘డి’ విభాగంలో మొత్తం మూడు మ్యాచ్లు ఆడిన తెలంగాణ కేవలం ఒక మ్యాచ్ గెలిచింది. మంగళవారం ఉదయం పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్లో 36–4 స్కోరు సహా ఇన్నింగ్స్ తేడాతో తెలంగాణ మహిళల జట్టు విజయం సాధించింది. జట్టులోని కె.రుక్మిణి డిపెండింగ్లో 4–10 టైమింగ్ ఇవ్వడమే కాకుండా రెండు పాయింట్లు సాధించింది. కె.మహేశ్వరి రెండు టర్న్లలో 3.30, 2.50, ఎం.శ్రీలక్ష్మి 3,.30 టైమింగ్ ఇచ్చారు. అంతకుముందు తెలంగాణ రాజస్థాన్తో 202–22 స్కోరుతో కేవలం రెండు పాయింట్లు తేడాతో ఓటమి పొందింది. ఈ మ్యాచ్లో అఖిల రెండు మార్లు 2.30 టైమింగ్ ఇవ్వగా, అనూష 8 పాయింట్లు సాధించడం విశేషం. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో తెలంగాణ 14–21 తేడాతో పరాజయమైంది. ఈ మ్యాచ్లో అఖిల 2.20, శ్రీలక్ష్మి 2.20 టైమింగ్ ఇవ్వగా అనూష రెండు పాయింట్లు సాధించింది. భారత ఖోఖో సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఉప్కార్ సింగ్, తెలంగాణ ఖోఖో అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జంగా రాఘవరెడ్డి, నాతి కృష్ణమూర్తి, హనుమకొండ, హైదరాబాద్ జిల్లాల క్రీడల యువజన శాఖ అధికారులు గుగులోత్ అశోక్కుమార్, నడిపల్లి సుధాకర్రావు, సీనియర్ ఖోఖో కోచ్ యతిరాజ్, వరంగల్ జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తోట శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. లీగ్ల్లోనే నిష్క్రమించిన తెలంగాణ మహిళల జట్టు నేడు క్వార్టర్ ఫైనల్ -
పూలే, బుద్ధుడి విగ్రహాలు చైతన్యానికి ప్రతీకలు
● ప్రజాకవి, వాగ్గేయ కారుడు జయరాజ్పాలకుర్తి టౌన్ : సమాజంలో సమానత్వం, విద్య, మానవత్వ విలువలు పెంపొందించేందుకు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, గౌతమా బుద్ధుడి ఆలోచనలు మార్గదర్శకాలని ప్రజాకవి, వాగ్గేయ కారుడు జయరాజ్ అన్నారు. మంగళవారం మండలంలోని మల్లంపల్లిలో ఏర్పాటు చేసిన గౌతమ బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రి బాయిపూలే విగ్రహాలను అరుణోదయ విమలక్క, రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, గాయకుడు ఏపూరి సోమన్న , డాక్టర్ జిలుకర శ్రీనివాస్, తిరునహరి శేషుతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం చెరిపెల్లి ఆనంద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జయరాజ్ మాట్లాడుతూ గౌతమా బుద్ధుడు, జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి పూలే విగ్రహాలు కేవలం రాతి రూపాలు కావని, చైతన్యానికి ప్రతీకలన్నారు. పెట్టుబడిదారులు, పాలకులు ప్రకృతిని ఽధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. పాలకుర్తి పోరాటాల గడ్డ అన్నారు. మల్లంపల్లిలో మహానీయుల విగ్రహాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పోశాల వెంకన్న, తెలంగాణ శ్యాం, మచ్చ దేవేందర్, గుమ్మడిరాజుల సాంబయ్య,సాయిని నరేందర్, సుంకరి భిక్షపతి, బైరపాక జయాకర్, గంధం శివ, వీరదాసు వెంకటరత్నం, చింతం అశోక్, గిరగాని అజయ్, వంగాల సోమయ్య, గంగారపు విజయ్కుమార్, కొండ్రాతి సంపత్, పుర్మ రఘుపాల్రెడ్డి, పోశాల పవన్, చిట్యాల సంధ్యారాణి పాల్గొన్నారు. -
30 ఏళ్లుగా ఎద్దులతోనే వ్యవసాయం..
రేగొండ: ప్రస్తుత వ్యవసాయంలో ట్రాక్టర్ల పరుగులు.. పవర్ టిల్లర్ల ఉరుకులు.. కోత యంత్రాలే కనిపిస్తాయి. దుక్కి దున్నాలన్నా.. కలుపు తీయాలన్నా.. కోత కోయాలన్నా .. ఇలా ఏ పని చేయలన్నా యంత్రాలు రావాల్సిందే. వేలకు వేలు ఖర్చు చేయాల్సిందే. కానీ కొత్తపల్లిగోరి మండల కేంద్రానికి చెందిన ఆవుల రమేశ్ ఈ వ్యవసాయానికి పూర్తి భిన్నం. 30 సంవత్సరాలుగా ఎద్దులతోనే వ్యవసాయం చేస్తున్నాడు. భూమిని దున్నడం.. విత్తనం నాటడం.. కలుపు తీయడం, ఎరువును వ్యవసాయ క్షేత్రాలకు తరలించడం, ధాన్యం, పత్తి, మిర్చి పంటలను ఇళ్లకు తరలించడం వంటి పనులన్నీ ఎద్దులతోనే చేస్తున్నాడు. ఇటీవలే రూ.1.20 లక్షలతో కొత్త జోడెద్దులు తీసుకొచ్చాడు. వాటిని రాముడు, భీముడు పేర్లతో పిలుస్తున్నాడు. -
మున్సిపల్ ఎన్నికల్లో విజయం మనదే..
సాక్షి, మహబూబాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 70 శాతానికి మించి స్థానాలు గెలిచాం.. జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా విజయం మనదే.. ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా పోటీకి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీవాస్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళ వారం మానుకోట మున్సిపాలిటీలో రూ.70కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి శుంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణంలోని పీఎస్ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లాలో గత పాలకులు వేసిన శిలాఫలకాలు వెక్కిరిస్తున్నాయని, ఆర్భాటాల కోసం శంకుస్థాపనలు చేసి పనులు గాలికి వదిలేశారని ఆరోపించారు. అభివృద్ధి చేయని బీఆర్ఎస్కు ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదన్నారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి మా ట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మానుకోట జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని అన్నారు. ఎంపీ బలరాంనాయక్ మాట్లాడుతూ.. అందరూ కలిసికట్టుగా పనిచేసి మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలవాలని కోరా రు. ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ మాట్లాడుతూ.. మానుకోటతో పాటు డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీల్లో అత్యధిక మెజార్టీతో గెలిచేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. ఎమ్మెల్యే మురళీనాయక్ మాట్లాడుతూ.. మంత్రి శ్రీనివాస్రెడ్డి, వేం నరేందర్ రెడ్డిల ప్రత్యేక చొరవతో మానుకోట అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు. జిల్లాకు అత్యధిక నిధులు తీసుకొచ్చి.. ఆదర్శంగా మారుస్తున్నారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఉమా పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన శంకుస్థాపనలు.. మహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీలోని 17వ వార్డు పరిధి జ్యోతిబాపూలే కాలనీలో అంతర్గత రోడ్లు, సీసీ డ్రెయినేజీ పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఆరో వార్డు పరిధి బేతోలు గ్రామంలో అంతర్గత రోడ్లు, డ్రెయినేజీలు, 19 వార్డు పరిధి బందం చెరువు ట్యాంక్ బండ్ నిర్మాణం, అదే వార్డులో రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశా రు. 11, 23, 33 వార్డుల్లో అంతర్గత రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణ పనులకు మూడుకొట్ల సెంటర్లో శంకుస్థాపన చేశారు. నందన గార్డెన్, హస్తినాపు రం కాలనీల సమీపంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఉమా మురళీనాయక్, ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, ఆర్డీఓ కృష్ణవేణి, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, డీఈఈ ఉపేందర్, కాంగ్రెస్ నాయకులు అంజయ్య, ప్రవీ ణ్, రమేశ్, వెంకటేశ్వర్లు, ఓం నారాయణ లోయ, శ్రీనివాస్, చలమల నారాయణ, ఖలీల్, నర్సింహారావు, గిరిధర్ గుప్త, శ్యాం, దిలీప్ ఉన్నారు. -
సాగు..సంబురంగా
నెల్లికుదురు : ఆ రైతు ఆయిల్ పామ్ సాగులో అధిక దిగుబడి సాధిస్తున్నాడు. ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారుల సూచనతో 2021లో ఆరు ఎకరాల్లో ఈ పంట సాగు చేపట్టాడు. ఎకరాకు 11.5 టన్నుల దిగుబడి సాధించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. అతనే మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరుకు చెందిన రూపిరెడ్డి గోపాల్రెడ్డి. గతంలో పసుపు, మిర్చి పంటలు సాగు చేసి అధిక దిగుబడులు సాధించి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందాడు. అయితే ఆ పంటల ధరల తారుమారు, మార్కెటింగ్ లేక ఆదాయం రాలేదు. దీంతో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి మరియన్న, వ్యవసాయ అధికారుల సూచనల మేరకు ఆయిల్ పామ్ పంట సాగు చేపట్టాడు. 3 ఏళ్ల తర్వాత 2024–25 మధ్య పంట చేతికొచ్చింది. ఎకరాకు 11.5 టన్నుల దిగుబడి తీసి ఏటా రూ.13 లక్షల ఆదాయం పొందుతున్నాడు.జాతీయ స్థాయిలో ఇంత దిగుబడి ఇప్పటి వరకు ఏ రైతు సాధించలేదని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం 2025లో నిర్వహించిన మహా కిసాన్ మేళాలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. గోపాల్రెడ్డిని సన్మానించా రు. సాధారణంగా ఈ పంట ఎకరానికి 6 నుంచి 7 టన్నుల వరకే పంట చేతికొస్తుంది. అయితే అధి కారుల సూచనలు నిత్యం పరిగణనలోకి తీసుకుంటున్న గోపాల్రెడ్డి ఎకరాకు 11.5 టన్నుల దిగుబడి సాధిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు రైతులు సాగులో ప్రత్యేక పద్ధతుల్లో లాభాల పంటలు పండించి ఆదర్శంగా నిలుస్తున్నారు. రసాయన ఎరువుల మందుల వినియోగానికి ఫుల్స్టాప్ పెట్టి సేంద్రియ పద్ధతిలో సాగు చేపడుతున్నారు. అలాగే, వరి, మిరప, పత్తి తదితర సంప్రదాయ పంటలకు వీడ్కోలు పలికి వాటి స్థానంలో మార్కెట్లో అధిక ధర లభించే కూరగాయలు, పండ్ల, ఆయిల్ పామ్ వంటి వైవిధ్య సాగు చేపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మరికొందరు ఇప్పటికీ ఎద్దులతో వ్యవసాయం చేస్తున్నా రు. ఈ క్రమంలో సంక్రాంతి సందర్భంగా ఆ రైతులపై ‘సాక్షి’ ప్రత్యేకం కథనం. ఎకరాకు 11. 5 టన్నుల దిగుబడి సాధిస్తున్న గోపాల్రెడ్డి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రైతు -
కష్టపడే కార్యకర్తలకు ప్రాధాన్యం
● 26 డివిజన్లలో కాంగ్రెస్ జెండా ఎగరాలి ● వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి హన్మకొండ చౌరస్తా: ‘తెలంగాణలో కాంగ్రెస్ ప్ర భుత్వ ఏర్పాటుకు కష్టపడిన ప్రతీ కార్యకర్తను కా పాడుకుంటాం. పార్టీ కోసం భవిష్యత్లో సై తం కష్టపడే కార్యకర్తల సంక్షేమానికి అధిష్టానం ప్రాధాన్యం ఇస్తుంది’ అని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండలోని డీసీసీ భవన్లో సోమవారం వరంగల్ ప శ్చిమ నియోజకవర్గ స్థాయి పార్టీ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో రాబోయే కా ర్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన తీరుపై కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాని సూచించారు. గ్రూపు రా జకీయాలకు దూరంగా ఉండి, త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నియోజకవర్గంలోని 26 డివిజన్లలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఈవీ శ్రీనివాసరావు, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీని వాసరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, మామిండ్ల రాజు, పోతుల శ్రీమన్నారాయణ, వేముల శ్రీనివాస్, అనుబంధ సంఘాల నాయకులు విక్రమ్, సతీశ్, సరళ, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. -
వైద్యసేవల పరంగా సహకరిస్తాం..
● బాధిత కుటుంబానికి భరోసా కల్పించిన ఆరోగ్యశ్రీ ప్రతినిధులు రాయపర్తి : బాధిత కుటుంబానికి వైద్య పరంగా సహకరిస్తామని ఆరోగ్యశ్రీ టీమ్ లీడర్ కందికట్ల సంతోష్ తెలిపారు. మండలకేంద్రానికి చెందిన ఐత దాసుబాబు, లక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు భరత్ మూత్రపిండాలు ఫెయిలై చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై ‘సాక్షి’లో ‘దాతలు దయచూపండి’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై ఆరోగ్యశ్రీ బృందం స్పందించింది. భరత్ ప్రస్తుతం నిమ్స్లో చికిత్స పొందుతున్న క్రమంలో ఇంటికి వచ్చిన తర్వాత భవిష్యత్లో వైద్య సేవల పరంగా సహకరిస్తామని సంతోష్ తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ నిఖిల్స్వరూప్, జిల్లా మేనేజర్ విక్రమ్ ఆదేశాల మేరకు ఆరోగ్య మిత్ర జైపాల్రెడ్డితో కలిసి బాధిత కుటుంబాన్ని కలిసి భరోసా కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు సర్పంచ్ కందికట్ల స్వప్న, సామాజిక కార్యకర్త ఐత సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిష్టాత్మకంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు
● వీసీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మహబూబాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ పోరిక బలరాంనాయక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం, పురోగతిపై జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 79పాఠశాలలు మంజూరయ్యాయని, త్వరగా పూర్తయ్యేలా అధికారులు పాటుపడాలని సూచించారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో మాట్లాడుతూ.. జిల్లాలో మంజూరైన రెండు పాఠశాలల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పూర్తయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. వీసీలో జిల్లా నుంచి సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
ఘనంగా మాషూఖ్ రబ్బానీ ఉర్సు
ఖిలావరంగల్ : వరంగల్ కరీమాబాద్లోని హజ్రత్ మాషూఖ్ రబ్బానీ దర్గాలో 470వ సంధల్ (గంధం) ఉర్సు ఉత్సవాలు సోమవారం రెండోరోజు ఘ నంగా జరిగాయి. దర్గా పీఠాధిపతులు సయ్యద్షా హైదర్ హిలాల్యొద్దీన్ ఖాద్రీ, సయ్యద్ అలీషా ఖా ద్రీ ఆధ్వర్యంలో ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహించారు. మతాలకతీతంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది భక్తులకు తరలొచ్చి మాషూక్ రబ్బానీ సమాధిని దర్శించుకున్నారు. దీంతో దర్గా ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. దర్గాను దర్శించుకుంటే రోగాలు మాయమవుతా యని భక్తుల నమ్మకం. దీంతో వివిధ ప్రాంతాల నుంచి చేరుకున్న మానసిక రోగులు సైతం దర్గాను దర్శించుకోగా..పీఠాధిపతులు ఆశీర్వదించారు. సా యంత్రం 5గంటల నుంచి తెల్లవారుజాము వరకు ఖురాన్ పఠనంతోపాటు కర్ణాటకలోని బెంగుళూరు చెందిన ముస్లింలు ఉర్సు ఖవ్వాలీ నిర్వహించారు. దర్గా ఎదుట ఫకీర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్పొరేటర్ మరుపల్లి రవి, భక్తులు పాల్గొన్నారు. తప్పిపోయిన చిన్నారుల అప్పగింత.. ఏఎస్పీ శుభం ప్రకాశ్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ నేతృత్వంలో మాషూఖ్ రబ్బానీ దర్గా ఉర్సు ఉత్సవాల్లో పటిష్ట భద్రతాఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో పున్నేలుకు చెందిన సోఫియా, కరీమాబాద్ నానమియా తోటకు అన్సారా తప్పిపోగా.. ఇన్స్పెక్టర్ రమేశ్ వెంటనే సిబ్బందిని అలర్ట్ చేశారు. తప్పిపోయిన చిన్నారులను క్షణాల్లో పట్టుకుని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. రెండో రోజు కొనసాగిన ఉత్సవాలు మతాలకతీతంగా దర్గాను దర్శించుకున్న భక్తులు -
మహాజాతరకు 15 రోజులే..
ఎస్ఎస్తాడ్వాయి : మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు ఇంకా 15 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ తరుణంలో ముందస్తుగా అమ్మవార్లను దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు తరలొస్తున్నారు. సోమవారం కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. మొదట జంపన్నాగులో స్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెల వద్ద పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సంప్రదాయ ప్రకారం పూజారులు, దేవాదాయశాఖ అధికారులు డోలువాయిద్యాలతో బండా ప్రకాశ్కు స్వాగతం పలికారు. ప్రస్తుతం ముందస్తుగా పది రోజుల నుంచి 20 లక్షల మందిపైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. 14న గుడిమెలిగె పండుగ.. మేడారంలో ఈనెల 14 (బుధవారం) సమ్మక్క పూజారులు గుడిమెలిగె పండుగ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు నాలుగు రోజులు మహాజాతర జరగనుంది. గుడిమెలిగె పండుగ నిర్వహించిన వారం తర్వాత ఈనెల 21న మండమెలిగె పండుగ నిర్వహించనున్నారు. గుడిమెలిగె పండుగతో మహాజాతర పూజా కార్యక్రమాలకు అంకుర్పాణ జరగనుంది. జాతరకు రెండు వారాలు ముందుగా పూజారులు గుడిమెలిగె పండుగ నిర్వహిస్తారు. సమ్మక్క గుడిపై ఈశాన్యం దిక్కున కొత్త గడ్డి.. పూర్వకాలంలో గడ్డి గుడిసెలు ఉండేవి. గుడిసెలపై గడ్డి తొలగించి కొత్త గడ్డి కప్పడం, గోడలను మట్టితో పూసి ముగ్గులు వేయడం లాంటి పనులు చేసేవారు. కాలక్రమేనా గుడిసెల స్థానంలో భవనాలు నిర్మించారు. దీంతో పూజారులు గుడిని శుద్ధి చేస్తున్నారు. ఆడపడుచులు గుడిలోపల, బయట ముగ్గులతో అలంకరిస్తారు. అడవి నుంచి తీసుకొ చ్చిన కొత్త గడ్డిని సమ్మక్క గుడిపై ఈశాన్యం దిక్కున ఉంచుతారు. వనదేవతలకు భక్తుల మొక్కులు ఎల్లుండే గుడిమెలిగె పండుగ పది రోజుల నుంచి 20 లక్షల మందికిపైగా ముందస్తుగా తల్లులను దర్శించుకున్నట్లు అంచనా -
సౌత్జోన్ పోటీలకు కేయూ బాల్బ్యాడ్మింటన్ మెన్ జట్టు
కేయూ క్యాంపస్: చైన్నైలోని భారతీదాసన్ యూనివర్సిటీలో ఈనెల 14 నుంచి 17వతేదీ వరకు జరగనున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో కాకతీయ యూనివర్సిటీ పురుషుల జట్టు పాల్గొననున్నట్లు స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య సోమవారం తెలిపారు. ఈ జట్టులో ఎస్. అజయ్, కె. గణేశ్, యు. మోహన్, సి. పవన్ కల్యాణ్, బి. నవీన్, పి. రాజేశ్, పి. వికాస్, ఎం.డి. సయ్యద్ ఆదిల్, కె. సిద్దార్థ, ఎం. శ్రీహరి ఉన్నారు. ఈ జట్టుకు యూసీపీఈ కేయూ, ఖమ్మం ఫిజికల్ డైరెక్టర్ పి. మధు కోచ్ కమ్ మేనేజర్గా వ్యవహరిస్తున్నారని వెంకయ్య తెలిపారు. కేయూలో ఉమెన్స్ క్రికెట్ ఎంపికలు.. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి సోమవారం ఉమెన్స్ క్రికెట్ ఎంపిక పోటీలు నిర్వహించారు. కేయూ స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య, ఫిజికల్ డైరెక్టర్ కుమార్ ఆధ్వర్యంలో క్రీడాకారులను ఎంపిక చేశారు. వీరు చైన్నెలోని అన్నా యూనివర్సిటీలో నిర్వహించనున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో పాల్గొననున్నట్లు స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ వెంకయ్య తెలిపారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ అధ్యక్షుడు జె. సోమన్న, ఫిజికల్ డైరెక్టర్లు వెంకన్న, ఎర్ర సుమన్, అఫ్జల్, వెన్నెల, శ్వేత, సందీప్, గోపి, తదితరులు పాల్గొన్నారు. మానసిక దివ్యాంగురాలిపై లైంగికదాడి ● నిందితుడి అరెస్ట్, రిమాండ్ ఎల్కతుర్తి: మానసిక దివ్యాంగురాలిపై ఓ వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎల్కతుర్తి మండలంలోని ఓ గ్రామంలో ఈ నెల 8వ తేదీన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ మానసిక దివ్యాంగురాలు ఇంటివద్ద ఒంటరిగా ఉంది. గమనించిన దూరపు బంధువు హసన్పర్తి మండలం పెగడపల్లికి చెందిన పోలె పాక ప్రభాకర్.. దివ్యాంగురాలిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. వ్యవసాయ పనులకు వెళ్లి సా యంత్రం ఇంటికొచ్చిన తల్లిదండ్రులు ఆమె ప రిస్థితిని గమనించి అడగగా విషయం తెలిపింది. ఈ ఘటనపై బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ప్రభాకర్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ సోమవారం తెలిపారు. -
క్రీడాసంద్రం.. కాజీపేట రైల్వే స్టేడియం
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే స్టేడియం క్రీడాసంద్రంగా మారింది. ఇక్కడ జరుగుతున్న 58వ సీనియర్ నేషనల్ ఖోఖో చాంపియన్షిప్ మెన్ అండ్ ఉమెన్ పోటీల్లో దేశ నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు నువ్వా? నేనా? అన్నట్లు తలపడుతున్నారు. ఈ పోటీలు సోమవారం రెండో రోజుకు చేరుకున్నాయి. రెండో రోజు రాత్రి వరకు 64 జట్లు ఆడాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఖోఖో సంఘం ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ మొదటి సారి కాజీపేటలో జాతీయస్థాయి ఖోఖో పోటీలు నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో నేషనల్, స్టేట్ ఖోఖో ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు, టీమ్ మేనేజర్లు, రెఫరీలు, ప్రతినిధులు పాల్గొన్నారు. కాజీపేట రైల్వే స్టేడియం కళకళ.. తెలంగాణ రాష్ట్ర ఖోఖో సంఘం నిర్వాహకులు, ఫెడరేషన్ ప్రతినిధులు, రెఫరీలు, క్రీడాకారులతో కాజీ పేట రైల్వే స్టేడియం కళకళలాడుతోంది. ఈ పోటీలను నగరవాసులు, పలు ప్రాంతాలకు చెందిన క్రీ డా అభిమానులు తిలకించి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్–హైదరాబాద్ రూట్లో ఆర్టీసీ బ స్సులు, వివిధ ప్రైవేట్ వాహనాల్లో వెళ్లే ప్రయాణికులు, స్థానికులు కాజీపేట చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ ద్వారా క్రీడలను తిలకిస్తున్నారు. కాజీపేట చౌరస్తా, కాజీపేట రైల్వే స్టేషన్కు వెళ్లే ప్రధాన ద్వారం కాకతీయ కళాతోరణం, పరిసర ప్రాంతం మొత్తం క్రీడల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లతో సందడిగా మారింది. మొత్తంగా రాత్రి, పగలు క్రీడాకారుల ఆటలతో కాజీపేట రైల్వే స్టేషన్ కలర్ఫుల్గా కనువిందు చేస్తోంది. ఖోఖో క్రీడాకారులతో కళకళలాడుతున్న కాజీపేట రెండో రోజుకు చేరిన జాతీయ స్థాయి పోటీలు నువ్వా? నేనా? అన్నట్లు తలపడుతున్న క్రీడాకారులు చౌరస్తాలో ఎల్ఈడీ ద్వారా వీక్షిస్తున్న ప్రజలు -
కనులపండువగా గోదారంగనాథుల కల్యాణం
మహబూబాబాద్ రూరల్: ధనుర్మాస వ్రత మహోత్సవ పూజా వేడుకల్లో భాగంగా మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అనంతాద్రి జగన్నాథ వేంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గోదారంగనాథుల కల్యాణ వేడుకలను సోమవారం కనులపండువగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ నూకల రామచంద్రారెడ్డి–జ్యోతి దంపతులు, ఆలయ ప్రధాన అర్చకులు గొడవర్తి చక్రధరాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికలపై గోదాదేవి అమ్మవారు, రంగనాథ స్వామివారిని కొలువుదీర్చి సహ అర్చకులు శ్రవణకుమారాచార్యులు కల్యాణోత్సవం జరిపారు. నూతన కమిటీ ఎన్నికమహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దివ్యాంగుల హక్కు ల జాతీయ వేదిక జిల్లా నూతన కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా తేజావత్ హనుమంత్ నాయక్, ఉపాధ్యక్షులుగా మాలోతు శంకర్నాయక్, పి.వీరన్న, కోశాధికారులుగా పి.ఉపేందర్, టి.హుస్సేన్నాయక్, కార్యనిర్వాహక అధ్యక్షులుగా రాజ్కుమార్, సైదులు, లాలునాయక్, సుమన్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు హనుమంత్ నాయక్ మాట్లాడుతూ.. బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, దివ్యాంగులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని, రూ.6వేల పింఛన్ అందించాలన్నారు. కార్యక్రమంలో గౌరవ సలహాదారుడు అబ్బనపురి యాకయ్య తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలిమహబూబాబాద్ అర్బన్: విద్యార్ధులు, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఛీప్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ నాగేశ్వర్రావు అన్నారు. మానుకోట మున్సిపల్ పరిధిలోని అనంతారం నలంద డిగ్రీ కళాశాలలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో డ్రగ్స్పై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. యువశక్తి దేశానికి అంకితం కావాలని, చెడు మార్గాలకు దూరంగా ఉండాలన్నారు. ఎన్డీపీఎస్ చట్టప్రకారం డ్రగ్స్ కొనుగోలు చేసిన.. విక్రయించినా పదేళ్లు జైలు శిక్షపడుతుందన్నారు. ఇతర న్యాయ సేవలకు టోల్ఫ్రీ నంబర్ 15100లో ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ రాజ్కృష్ణ, ప్రిన్సిపాల్ కృష్ణప్రసాద్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. టెన్త్ ప్రీఫైనల్ టైంటైబుల్ విడుదల విద్యారణ్యపురి: టెన్త్ విద్యార్థులకు ఈఏడాది ఫిబ్రవరి 17 నుంచి 24వ తేదీ వరకు ప్రీ–ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు డీఈఓలను ఆదేశించారు. ప్రీ–ఫైనల్ పరీక్షల టైంటేబుల్ను కూడా ప్రకటించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫిబ్రవరి 17న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకెండ్ లాంగ్వేజ్, 19న థర్డ్ లాంగ్వేజ్, 20న మేథమెటిక్స్, 21న ఫిజికల్ సైన్స్, 23న బయాలాజికల్ సైన్స్, 24న సోషల్ స్టడీస్ నిర్వహించనున్నారు. ఈమేరకు సంబంధిత పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. రామప్ప హుండీ ఆదాయం రూ.6,71,954 వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రామప్ప దేవాలయ హుండీ కానుకలను సోమవారం లెక్కించారు. రూ.6,71,954 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ బిల్ల శ్రీనివాస్ తెలిపారు. దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ కుమారస్వామి సమక్షంలో హుండీ కానుకలను శ్రీవల్లి సేవా సమితి సభ్యులు లెక్కించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో తహసీల్దార్ గిరిబాబు, సర్పంచ్ చల్లగోండ రాజు, రామప్ప ఆలయ ప్రధాన పూజారి హరీశ్ శర్మ, అర్చకుడు ఉమాశంకర్, టూరిజం గైడ్లు విజయ్కుమార్, వెంకటేశ్ పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 13 శ్రీ జనవరి శ్రీ 2026
‘జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడికి టెలిగ్రామ్ లోకో సంస్థ పేరుతో పార్ట్ టైం ఉద్యోగానికి సంబంధించిన మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ లో ఉన్న లింకు ద్వారా ఖాతా సృష్టించి బ్యాంకు వివరాలు జత చేయమని సూచించగా ఆ విధంగా చేశాడు. అలా మూడు చోట్ల 20ప్రమోషన్లు పూర్తిచేస్తే లాభాలు వస్తాయని సైబర్ నేరగాళ్లు పేర్కొన్నారు. సదరు వ్యక్తి తన పేరు మీద ఒక ఐడీ క్రియేట్ చేసి యూనియన్ బ్యాంక్ ఖాతా ద్వారా రూ.10,000 పంపించగానే అతడి ఖాతాకు రూ.800 పంపించారు. అది నిజమని నమ్మిన సదరు వ్యక్తి మళ్లీ రూ.7,000 పంపించగా రూ.2,500 వచ్చాయి. మళ్లీ రూ. 10,000లతో పాటు అవతలి వ్యక్తుల స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఖాతాకు లగ్జరీ ప్రమోషన్ పేరుతో అదనంగా రూ.1,3500 పంపించాడు. ఆ వెంటనే మరో బ్యాంకు ఖాతా నుంచి రూ.63,000 పంపించాడు. తాను పంపిన మొత్తం డబ్బులు రాకపోవడంతో పాటు మళ్లీ లగ్జరీ ప్రమోషన్ వచ్చిందని పేర్కొని రూ. 50లక్షలు పంపమని చెప్పగా.. వెంటనే తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు మొత్తంగా రూ.1.30లక్షలు నష్టపోయాడు.’ ‘జిల్లా కేంద్రానికి చెందిన ఓ వృద్ధుడు ఫేస్బుక్లో పాత కాయిన్లు, నోట్లకు డబ్బులు వస్తాయని ఓ కంపెనీ పేరిట వచ్చిన ప్రకటను చూసి వారిని ఫోన్లో సంప్రదించాడు. తన వద్ద 10 రూపాయల పాత నోటు ఉందని చెప్పగా.. అవతల వ్యక్తులు రూ.22లక్షలు వస్తాయని చెప్పారు. అది నిజమని నమ్మిన సదరు వృద్ధుడు ప్రాసెసింగ్ ఫీజు కోసం తన ఫోన్ పే ద్వారా అవతలి వ్యక్తులకు రూ.750 పంపించాడు. ఆ విధంగా పలుమార్లు డబ్బులు పంపి ఆధార్ కార్డు వివరాలు కూడా తెలియజేశాడు. ఇలా అవతలి వ్యక్తులు పంపిన స్కానర్కు డబ్బులు పంపుతూ వచ్చాడు. 12 సార్లు మొత్తం రూ.20 లక్షలకు పైగా బదిలీ చేశాడు. అనంతరం అతడికి ఎలాంటి ఆర్థిక లాభం చేకూరకపోవడంతో తాను సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.’‘జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళా ఫోన్కు రెండు నెలల క్రితం ప్రధానమంత్రి ముద్ర లోన్ వస్తుందని లింక్ వచ్చింది. వెంటనే సదరు మహిళ ఆ లింకుపై క్లిక్ చేసి అందులో తన వివరాలను నమోదు చేసింది. బ్యాంకు, పాన్కార్డు నంబర్లు అప్లోడ్ చేయమని చెప్పగానే.. ఆవిధంగానే చేసింది. ఆ వెంటనే రూ.10లక్షల ముద్రలోన్ వస్తుందని అవతలి వ్యక్తి నుంచి సమాధానం వచ్చింది. ప్రాసెసింగ్ ఫీజు కోసం తన నంబర్కు ఫోన్ పే చేయమని అవతలి వ్యక్తి చెప్పగా.. సదరు మహిళ తన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా నుంచి రూ.15,900 పంపించింది. అనంతరం రూ.4985, మరోసారి రూ.9,999 పంపించింది. చెప్పినట్లు డబ్బులు పంపినా.. లోన్ రాకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించి సైబర్ పోర్టల్ 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. సదరు మహిళా మొత్తంగా రూ.30వేలకు పైగా నష్టపోయింది.’ -
ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
మహబూబాబాద్ రూరల్: సంక్షేమ పథకాలు నేరుగా రైతులకు చేరాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను తీసుకొచ్చింది. ప్రతీ రైతు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారి అవసరాల మేరకు ప్రభుత్వాలు సకాలంలో పథకాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈమేరకు రైతులందరూ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. సగానికి తక్కువే.. జిల్లాలో 1,93,033 పట్టాదారు పాసు పుస్తకాలు ఉండగా 94,794 మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించాయి. 98,239 పట్టాదారు పాసు పుస్తకాలు పెండింగ్లో ఉన్నాయి. ఫార్మర్ రిజిస్ట్రేషన్పై వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తూ సకాలంలో రైతులు తమ వివరాలు నమోదు చేయించుకోవా లని సూచిస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఎందుకంటే.. ● కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ పథకాలను సులభంగా పొందవచ్చు ● పీఎం కిసాన్ పథకానికి ఫార్మర్ ఐడీ తప్పనిసరి ● రైతు వివరాలు కచ్చితంగా నమోదు జరిగి పారదర్శకత పెరుగుతుంది ● బీమా, సబ్సిడీలు, రుణాలు, ప్రభుత్వ పథకాలు త్వరగా అందుతాయి ● ఒకే ఐడీతో లబ్ధి నేరుగా బ్యాంకు ఖాతాలోకి వస్తుంది ● భవిష్యత్ పథకాల ప్రయోజనాలు సులభం ● స్పష్టమైన గుర్తింపుతో మోసాలు తగ్గుతాయి అవసరమైన పత్రాలు ● ఆధార్ కార్డు నంబర్ ● భూమి పాస్ బుక్ వివరాలు ● ఆధార్ లింకై ఉన్న మొబైల్ నంబర్ తప్పనిసరిగా అవసరం రిజిస్ట్రేషన్ ఎక్కడ చేయించుకోవాలి ● రైతులు తమ దగ్గరలోని మీ సేవ కేంద్రాల్లో రూ.15 మాత్రమే (అన్ని పన్నులు కలుపుకుని) చెల్లించి నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ● రైతు వేదికలోని వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈఓ) ద్వారా కూడా ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ప్రస్తుతం రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వారికి ఉన్న భూమి పట్టాదారు పాసుపుస్తకాల ఆధారంగా అందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ పొందాలంటే మాత్రం రైతుల తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోని రైతులకు సమాచారం వచ్చిన వెంటనే సంబంధిత ఏఈఓల వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. లేనిపక్షంలో మీసేవ కేంద్రాల ద్వారా కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. రైతుల మేలు కోసం చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ను రైతులందరూ చేయించుకోవాలి. భవిష్యత్ లో రైతుల కోసం అమలు చేయనున్న పథకాల అమలు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారానే జరుగుతాయి. – బి.సరిత, జిల్లా వ్యవసాయ అధికారి కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ప్రామాణికం అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ అధికారులు ప్రతీ రైతు నమోదుచేసుకోవాలని సూచన -
వినతులు వెంటనే పరిష్కరించాలి
మహబూబాబాద్: ప్రజావాణిలో వచ్చిన వినతులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా.. ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, జెడ్పీ సీఈఓ పురుషోత్తం వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఇన్చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్ వినతులు కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజవాణిలో 66 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. నిత్యం తనిఖీలు చేపట్టాలి నెహ్రూసెంటర్: స్కానింగ్ సెంటర్లు, ఆస్పత్రులపై పర్యవేక్షణ పెంచి పోలీస్, మెడికల్ విభాగాల ఆధ్వర్యంలో నిత్యం తనిఖీలు చేపట్టాలని ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్వత్సల్ టొప్పో సూచించారు. సోమవారం కలెక్టరేట్లో గర్భస్త పూర్వ, పిండ లింగ నిర్ధారణ చట్టం–1994పై జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ, బాలికలపై వివక్షత, ఎంటీపీ చట్టంపై ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. అర్హత లేని ఆస్పత్రులు, వైద్యుల లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, కిట్స్ ద్వారా అబార్షన్కు ప్రయత్నిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ రవిరాథోడ్, కమిటీ సభ్యులు జగదీశ్వర్, డీఎస్పీ తిరుపతిరావు, డీపీఆర్ఓ రాజేంద్రప్రసాద్, ప్రోగ్రాం అధికారి సారంగపాణి, జిల్లా డిప్యూటీ మాస్మీడియా అధికారి కె.ప్రసాద్, రాజు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఇన్చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ప్రజావాణిలో 66 అర్జీలు -
మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. అదేవిధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యా సంస్థల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్మాణ పురోగతి, మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు. హనుమకొండ జిల్లా సన్నద్ధత.. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ హనుమకొండ జిల్లా పరిధిలో పరకాల మున్సిపాలిటీ ఉండగా, 22 వార్డులు ఉన్నాయని తెలిపారు. ఓటర్ల ముసాయిదా జాబితాను ఇప్పటికే ప్రదర్శించామని, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి అభ్యంతరాలు స్వీకరించినట్లు చెప్పారు. వాటి పరిష్కారం అనంతరం తుది ఓటర్ల జాబితా కూడా ప్రకటించినట్లు సీఎస్కు వివరించారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు, రిటర్నింగ్ అధికారుల నియామక ఉత్తర్వులు సిద్ధంగా ఉన్నాయని, మున్సిపల్ ఎన్నికలకు జిల్లా పూర్తిగా సిద్ధంగా ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. వీసీలో హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డా.కన్నం నారాయణతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ -
‘మల్లన్న’ జాతరకు వేళాయె..
● నేటి నుంచి మహోత్సవాలు ప్రారంభం.. ● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం ● పోలీసుల భారీ బందోబస్తుఐనవోలు: వందల ఏళ్ల చరిత్ర కలిగి ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఒకటిగా పేరొందిన హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లిఖార్జున స్వామి జాతరకు వేళ అయ్యింది. జాన పదుల జాతరగా కీర్తిపొందిన మల్లన్న జాతర మహోత్సవాలు నేడు (మంగళవారం) విఘ్నేశ్వర పూజ, ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 13, 14, 15, 16వ తేదీల్లో ప్రధాన జాతర జరగనుంది. ఈ క్రమంలో జాతరకు తరలిరానున్న లక్షలాది మంది భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన జాతర పనులు.. జాతర పనుల్లో భాగంగా క్యూ లైన్లు, చలువ పందిళ్లు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య పనులు, జల్లు స్నానాలు, సీ్త్రలు దుస్తులు మార్చుకునే గదుల ఏర్పాటు, వాటర్ ట్యాప్లు, ఈజీఎస్ నిధులతో మరుగుదొడ్ల నిర్మాణం, ఆలయం చుట్టూ లైటింగ్, సిరీస్ బల్బుల ఏర్పాటు తదితర పనులన్నీ తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. జాతర సమయంలో రెప్ప పాటు సమయం కూడా కరెంట్కు అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ ఏర్పాట్లు చేసింది. అలాగే, ఆర్డబ్ల్యూఎస్ శాఖ తాగునీరు, నీటి సరఫరాపై దృష్టి సారిచింది. ఐనవోలు పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది 24 గంటలు మూడు షిఫ్ట్లుగా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్టీసీ.. ఐనవోలు నుంచి హైదరాబాద్, వరంగల్, కాజీపేట, కొమురవెల్లి, వేములవాడ, యాదగిరి గుట్ట, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించింది. వరంగల్ బస్టాండ్ నుంచి జాతర నాలుగు రోజులు ప్రతీ 10 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. ఎండోమెంట్ శాఖ నుంచి 30 మంది, రెవెన్యూ శాఖ నుంచి 25 మంది, పంచాయతీ రాజ్ శాఖ నుంచి 150 మంది, జీడబ్ల్యూఎంసీ నుంచి 150 మంది, ఆలయం తరపు నుంచి 70 మంది అధికారులు, సిబ్బంది జారతలో విధులు నిర్వర్తించనున్నారు. జాతర నోడల్ ఆఫీసర్గా ఐనవోలు తహసీల్దార్ విక్రమ్ కుమార్ను నియమించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 6గురు సీఐలు, 42 మంది ఎస్సైలు, 70 మంది హోంగార్డులు, 250 మంది హెచ్సీలు, కానిస్టేబుళ్లతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 17 చెక్పోస్టులు, 17 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసి 206 సీసీ కెమెరాల నిఘాలో నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారు. అదేవిధంగా జాతర సమయంలో ఏర్పాటు చేసే రంగుల రాట్నం, జాయింట్ వీల్తోపాటు పలు వినోద కార్యక్రమాల పనులు పూర్తయ్యాయి. ఎండోమెంట్ శాఖ నుంచి చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా గౌరీశంకర్ నియమితులు కాగా ఆయన ఈఓ కందుల సుధాకర్తో కలిసి జాతర ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. డీసీపీ అంకిత్ కుమార్ సోమవారం జాతర, క్యూలైన్ల ఏర్పాట్లు పరిశీలించి ఎస్హెచ్ఓ శ్రీనివాస్కు పలు సూచనలు చేశారు. ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ రామాల సునీత జాతర ఏర్పాట్లను తనిఖీ చేసి ఈఓ సుధాకర్కు పలు సూచనలు చేశారు.జీడబ్ల్యూఎంసీ, పంచాయతీరాజ్ శాఖ నుంచి 15 ట్రాక్టర్లు, 4 టాటా ఏస్ వాహనాలు ఏర్పాటు చేసి నిరంతరం చెత్తను తరలించనున్నారు. 10 ట్యాంకర్ల ద్వారా భక్తులకు నీరు సరఫరా చేయనున్నారు. 4 మొబైలు టాయిలెట్లు, ఒక బస్సు టాయిలెట్, 2 ఫాగింగ్ మిషన్లు, ఒక స్వీపింగ్ మిషన్తోపాటు చెత్త పడేయడానికి 150 కుండీలను ఏర్పాటు చేస్తున్నారు. జల్లు స్నానాలకు గాను వంద బీఓటీలతోపాటు 5 చోట్ల మహిళలు దుస్తులు మార్చుకునే గదులు నిర్మించారు. కాగా, జాతరను సక్సెస్ చేయడానికి సుమారు వివిధ శాఖల నుంచి 2 వేల నాలుగు రోజుల పాటు 24 గంటలు పనిచేయనున్నారు. -
రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మేలు
కురవి: రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని డీఏఓ సరిత సూచించారు. సోమవారం సీరోలు మండలం కాంపల్లి రైతు వేదికలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ద్వారా అందే పథకాలు వర్తించాలంటే విధిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. పత్తి పంట తర్వాత వేసిన రైతు పెసర పంట క్షేత్రాన్ని సందర్శించారు. రైతులు పప్పు దినుసుల సాగుపై దృష్టి సారించాలని తెలిపారు. తాళ్లసంకీస రైతు వేదికలో యూరియా కూపన్ల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. కార్యమ్రంలో సీరోలు ఏఓ చాయారాజ్ తదితరులు పాల్గొన్నారు. కాంపల్లి రైతు వేదికలో మాట్లాడుతున్న డీఏఓ సరిత -
విద్యుత్ వినియోగదారులకు సంక్రాంతి లేఖలు
నెహ్రూసెంటర్: వినియోగదారులతో ప్రత్యక్ష సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు విద్యుత్ సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని విద్యుత్శాఖ ఎస్ఈ పి.విజయేందర్రెడ్డి సోమవారం తెలిపారు. గృహజ్యోతి లబ్ధిదారులు, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షల లేఖలను అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. సర్వీస్ కనెక్షన్ నంబర్తో వ్యక్తిగతంగా డిప్యూటీ సీఎం అడ్రస్ చేసిన లేఖలను విద్యుత్ అధికారులు నేరుగా లబ్ధిదారులకు అందజేస్తారన్నారు. 52,82,498 మంది గృహజ్యోతి లబ్ధిదారులు, 30,03,813 మంది వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు శుభాకాంక్షల లేఖలు పంపిణీ చేయనున్నట్లు ఎస్ఈ తెలిపారు. -
తుది ఓటరు జాబితా ప్రదర్శన
మహబూబాబాద్: మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సోమవారం తుది ఓటరు జాబితాను ప్రదర్శించారు. కాగా జిల్లాలోని మానుకోట ము న్సిపల్ ఓటరు జాబితాను కార్యాలయం నోటీసు బోర్డుపై ఏర్పాటు చేశారు. కమిషనర్ రాజేశ్వర్, టీపీఓ సాయిరాం, టీపీఎస్ ప్రవీణ్, మేనేజర్ శ్రీధర్ బృందం జాబితాను తయారు చేశారు. కాగా మున్సిపాలిటీలో 36వార్డుల్లో మొత్తం 65,712 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. గత ఎన్నికల్లో 57,828 మంది ఓటర్లు ఉండగా ప్రస్తుతం సంఖ్య పెరిగింది. డోర్నకల్ ఓటర్లు 1,0869మంది.. డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీ తుది ఓటరు జాబితాను సోమవారం ప్రకటించారు. మున్సిపల్ కమిషనర్ నిరంజన్ తుది ఓటరు జాబితాను విడుదల చేసి మున్సిపాలిటీ కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. 15 వార్డుల్లో 1,0869 మంది ఓటర్లు ఉన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డుల్లో 16 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. 2019 జనవరిలో జరిగిన మొదటి మున్సిపాలిటీ ఎన్నికల్లో వార్డుకు ఒక పోలింగ్ కేంద్రం చొప్పున 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 5వ వార్డులో ఎక్కువమంది ఓట్లు ఉన్నందున అదనంగా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 21,451మంది ఓటర్లు.. తొర్రూరు: తొర్రూరు మున్సిపాలిటీ తుది ఓటరు జాబితాను సోమవారం అధికారులు ప్రకటించారు. డివిజన్ కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ వక్కల శ్యామ్సుందర్ తుది ఓటరు జాబితా విడుదల చేశారు. మున్సిపాలిటీలోని 16 వార్డుల్లో మొత్తం 21,451 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో 19,100 ఓటర్లు ఉండగా ప్రస్తుతం 2,351 మంది ఓటర్లు పెరిగారు. మంగళవారం పోలింగ్ స్టేషన్ల వివరాల ముసాయిదా జాబితా ప్రచురించి వాటిని ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టి–పోల్ యాప్లో అప్లోడ్ చేయనున్నారు. ఈనెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతో పాటు ఫొటోతో కూడిన ఓటరు తుది జాబితా ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించనున్నారు. కేసముద్రంలో.. కేసముద్రం: కేసముద్రం మున్సిపాలిటీ తుది ఓటరు జాబితాను సోమవారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధి 16 వార్డుల్లో 15,945 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఇందులో 7,754 మంది పురుషు ఓటర్లు, 8,191 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మరిపెడలో.. మరిపెడ రూరల్: మరిపెడ మున్సిపాలిటీ తుది ఓటరు జాబితాను సోమవారం కమిషనర్ విజయానంద్ సిబ్బందితో కలిసి ప్రదర్శించారు. మున్సిపాలిటీలోని 15 వార్డుల్లో 13,687మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 6,709మంది పురుష ఓటర్లు, 6,978 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మున్సిపాలిటీల్లో జాబితాను విడుదల చేసిన అధికారులు మహిళా ఓటర్లే అధికం.. వారి తీర్పే కీలకం మున్సిపాలిటీల తుది ఓటరు జాబితా మున్సిపాలిటీ పురుష మహిళా ఇతరులు మొత్తం ఓటర్లు ఓటర్లు మానుకోట 31,550 34,121 41 65,712 డోర్నకల్ 5,160 5,709 0 1,0869 తొర్రూరు 10,501 10,942 8 21,451 కేసముద్రం 7,754 8,191 0 15,945 మరిపెడ 6,709 6,978 0 13,687 -
అపహరణకు గురైన బాలుడి అప్పగింత
కాజీపేట రూరల్ : కాజీపేటలో ఇటీవల అపహరణకు(కిడ్నాప్) గురైన బాలుడిని పోలీసులు సోమవారం తల్లిదండ్రులకు అప్పగించారు. గత డిసెంబర్ 28వ తేదీన బాలుడు కిడ్నాప్కు గురయ్యాడు. ఈ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బాలుడి ఆచూకీ తెలుసుకుని చైల్డ్ వెల్ఫేర్ సిబ్బందికి అప్పగించారు. అనంతరం పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ సిబ్బంది హనుమకొండ జిల్లా వేలేరు మండలం కమ్మరిపేట తండాకు చెందిన తల్లిందండ్రులు లావుడ్యా కన్నానాయక్, నర్సమ్మకు తమ కుమారుడిని అప్పగించారు. దీంతో వారు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. -
వాకింగ్తో మెరుగైన ఆరోగ్యం
మహబూబాబాద్ అర్బన్: ఆరోగ్యవంతమైన జీవితం కోసం ప్రతీరోజు 30నిమిషాలు వాకింగ్ చేయాలని డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో సోమవారం ఉషోదయ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వాకింగ్ పోటీలు నిర్వహించారు. డీఎస్పీ తిరుపతిరావు హాజరై పోటీలను ప్రారంభించి మాట్లాడారు. వయస్సుతో సంబంధం లేకుండా వాకింగ్ చేస్తే శరీరంలోని కొవ్వు తగ్గడమే కాకుండా ఆరోగ్యకరమైన బరువును మెయింటెన్ చేయవచ్చన్నారు. వాకింగ్తో గుండె జబ్బులను నివారించవచ్చని, బీపీ, షుగర్ను కంట్రోల్లో ఉంచుకోవచ్చన్నారు. అదేవింధంగా క్రమం తప్పకుండా గంటపాటు వాకింగ్ చేస్తే ఎముకల శక్తి మెరుగుపడుతుందని, కండరాలు బలంగా తయారవుతాయన్నారు. వాకింగ్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు పాలబిందెల మల్లయ్య, వసంత, మహిపాల్రెడ్డి, రామ్మూర్తి, వెంకటేశ్వర్లు, చంద్రయ్య, సోమన్న, పమ్మిరాజు, సర్వర్పాషా, షంశుద్దీన్, జార్జ్, వేణుగోపాల్, మునీర్, వెంకట్రెడ్డి, దేవిరెడ్డి, మల్లేశం, సీఐ సర్వయ్య, గౌరవ అధ్యక్షుడు బోనగిరి రవీందరగుప్త తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ తిరుపతిరావు -
సౌత్జోన్ టోర్నమెంట్కు హాకీ పురుషుల జట్టు
● కేయూ స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వెంకయ్య కేయూ క్యాంపస్: చైన్నెలోని సత్యభామ యూనివర్సిటీలో ఈనెల 12 నుంచి 16వ తేదీ వరకు జరగనున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ హాకీ టోర్నమెంట్లో కాకతీయ యూనివర్సిటీ పురుషుల జట్లు పాల్గొననున్నట్లు స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య ఆదివారం తెలిపారు. జట్టులో జి. ప్రవీణ్, యూ. అరవింద్, ఎస్. సుదర్శన్, ఎం. నగేశ్, సి. హెచ్ వంశీ, షేక్ సోహెల్ అబ్బాస్ , మహ్మద్ ఉస్మాన్ ఘని, వి. సందీప్ , ఎ. అఖిల్ , బి. అభినాష్, కె. నాగేంద్రబాబు, కె. జంగు, ఎ. మారుతి, బి. అఖిల్, జి. రాజు, ఎన్. మల్లేశ్, సయ్యద్ జునైద్ అహ్మద్ , కె. వెంకటేష్ ఉన్నారని వెంకయ్య పేర్కొన్నారు. ఈ జట్టుకు బొల్లికుంట వీసీపీఈ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ సయ్యద్ యాసిన్ కోచ్గా, హనుమకొండలోని కనిష్క డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కె. రాకేష్ మేనేజర్గా వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. -
ఉపాధి లభించడం లేదనే మనస్తాపంతో..
వ్యక్తి ఆత్మహత్య ● బచ్చన్నపేటలో ఘటన బచ్చన్నపేట : ఉపాధి లభించడం లేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేటలో జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసుల కతనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రానికి చెందిన చిట్టిమల్ల శివకృష్ణ (43)కు బచ్చన్నపేటకు చెందిన లావణ్యతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. శివకృష్ణ ఆలేరులో చేనేత పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వాడు. ఈ క్రమంలో కొంతకాలంగా ఉపాధి లభించకపోవడంతోపాటు ఆర్థిక కారణాలతో దంపతులు గొడవపడేవారు. ఆరు నెలల క్రితం లావణ్య.. భర్తతో గొడవపడి తల్లిగారి ఇల్లు బచ్చన్నపేటకు వచ్చింది. శివకృష్ణ అప్పుడప్పుడు బచ్చన్నపేటకు వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో ఆదివారం బచ్చన్నపేటకు ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు కేకలు వేయగా చుట్టు పక్కల వారు వచ్చి చూడగా అప్పటికే చనిపోయాడు. ఈ ఘటనపై భార్య లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మునిపల్లిలో రైలు కింద పడి ప్రైవేట్ టీచర్.. హసన్పర్తి: ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మునిపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నడికూడ మండలం చర్లపల్లికి చెందిన దూడ రాజు యాదవ్(32) చింతగట్టు క్యాంప్ స మీపంలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం బైక్ పై మునిపల్లిలోని రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్నాడు. గుర్తు తెలియని రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య పాల్ప డ్డాడు.. కాగా, రాజుయాదవ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. రైల్వే పోలీసులు మాత్రం త మకు ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
సర్పంచ్ల ఫోరం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కమలాకర్
చిన్నగూడూరు: సర్పంచుల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లి గ్రామ సర్పంచ్ గునిగంటి కమలాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం హైదరాబాద్లోని పంచాయతీరాజ్ చాంబర్లో ఏర్పాటు చేసిన తెలంగాణ సర్పంచ్ల సంఘం సమావేశంలో తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నట్లు కమలాకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సర్పంచ్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా కమలాకర్ తెలిపారు. మాషుక్ రబ్బానీ ఉర్సు ప్రారంభంఖిలా వరంగల్: వరంగల్ ఉర్సు కరీమాబాద్లోని హజ్రత్ సయ్యద్షా జలాల్ద్దీన్ జామలుల్ బహార్ మాషుక్ –ఏ–రబ్బానీ 470వ ఉర్సు దర్గా ఉత్సవాలు ఆదివారం రాత్రి ప్రారంభమయ్యాయి. దర్గా పీఠాధిపతులు నవీద్బాబా, ఉబేదాబాబా ఆధ్వర్యంలో పీఠాధిపతుల ఇంటి నుంచి అర్ధరాత్రి గంధం, చాదర్ను ఊరేగించారు. ముస్లిం మతపెద్దలు మాషూక్ రబ్బానీ దర్గా (సమాధి)కు గంధాన్ని సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భారీగా తరలివచ్చిన భక్తులు దర్గాపై గిలాఫ్, పూలు సమర్పించారు. రెండో రోజు సోమవారం ఉర్సు, మూడో రోజు బాదావ నిర్వహించనుందని పీఠాధిపతులు తెలిపారు. ముఖ్య అతిథిగా మంత్రి కొండా సురేఖ హాజరై దర్గాను సందర్శించి చాదర్, పూలు సమర్పించారు. ఆనంతరం పీఠాధిపతులతో కలిసి మంత్రి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. కార్పొరేటర్ మరుపల్లి రవి, ఎండీ ముగ్దుం, గోపాల నవీన్, మీసాల ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు. పేరిణి నాట్యకళను అందించాలి హన్మకొండ కల్చరల్: విద్యార్థులకు శాసీ్త్రయ, సంప్రదాయమైన పేరిణి నాట్యకళను అందించాలని ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ కేంద్ర పురస్కార అవార్డు గ్రహీత పేరిణి ధరావత్ రాజ్కుమార్ అన్నారు. వరంగల్ బ్యాంకు కాలనీలోని పేరిణి నృత్యాలయంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల యువ పేరిణి నాట్యాచార్యుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. అకాడమీ నిర్వాహకులు గజ్జెల రంజిత్ అధ్యక్షతన జరిగిన శిక్షణ శిబిరంలో రాజ్కుమార్ పాల్గొని నూతన పేరిణి గురువులకు మార్గనిర్దేశం చేశారు. కార్యక్రమం అనంతరం రాజ్కుమార్, నృత్యకౌముది అవార్డు గ్రహీతలు బండారి వైష్ణవి, తొడెన్గా సంతోష్యాదవ్, పేరిణి ఆధ్యాపకులను సన్మానించారు. కార్యక్రమంలో విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్యకళాశాల అధ్యాపకులు చాతరాజు నవ్యజ, అకాడమీ ఆధ్యక్షులు మోతుకూరి చంద్రకళ, రామకృష్ణ, అంజలి, రవితేజ, శ్రీజ, రాజేందర్ తదితరులు పాత్గొన్నారు. -
విద్యుత్ బిల్లు కలెక్షన్ ఏజెన్సీల సమస్యలు పరిష్కరించాలి
● టీఎస్ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్ బిల్ కలెక్షన్ ఏజెన్సీల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్ఈఈయూ)–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండ వడ్డేపల్లి రోడ్లోని టీఎస్ఈఈయూ కార్యాలయం పల్లా రవీందర్ రెడ్డి భవన్లో విద్యుత్ బిల్ కలెక్షన్ ఏజెన్సీల రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బిల్ కలెక్షన్ ఏజెన్సీలు, వాటి ప్రతినిధులు విద్యుత్ సంస్థల్లో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నారన్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా వీరి సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి బిల్ కలెక్షన్ ఏజెన్సీల ప్రతినిధులను ఆర్టిజన్లుగా గుర్తించాలన్నారు. కలెక్షన్ ఏజెంట్లకు వెంటనే సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఆర్టిజన్లుగా గుర్తించి వారిని ఆదుకోవాలని కోరారు. సమావేశంలో టీఎస్ఈఈయూ–327 రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం ఐలేశ్, ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు పి.మహేందర్ రెడ్డి, కార్యదర్శి కె.శ్రీనివాస్, నాయకులు రమేశ్ బాబు, యుగంధర్, కలెక్షన్ ఏజెంట్స్ సంఘం నాయకులు పాల్గొన్నారు. -
మేడారంలో ట్రాఫిక్ జామ్
ములుగు/ఎస్ఎస్తాడ్వాయి/వెంకటాపురం(కె): ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారానికి ఆదివారం భక్తులు భారీగా తరలిరావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో వేలాదిగా తరలిరావడంతో మేడారం–తాడ్వాయి మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీనికి తోడు మేడారంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు పలువురు మంత్రులు పర్యటించడంతో భక్తులకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. మేడారం బస్టాండ్ సమీపంలో పోలీసులు ప్రైవేట్ వాహనాలను వీఐపీ పార్కింగ్ వైపునకు మళ్లించడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. సుమారు 5 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. గోవిందరావుపేట మండలం పస్రా గ్రామం నుంచి నార్లాపూర్ వరకు వాహనాలు నిలిచిపోకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. జంపన్న వాగుకు చేరుకున్న వాహనాలను గద్దెల ప్రాంతానికి నేరుగా వెళ్లకుండా పలు ప్రాంతాల ద్వారా తరలించారు. అదేవిధంగా ములుగు గట్టమ్మ వద్ద భక్తుల సందడి నెలకొంది.జంపన్న వాగు వద్ద చిన్నారితో పాటు మరొకరు తప్పిపోయారు. మంత్రి సీతక్క, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు ఆ చిన్నారిని అప్పగించారు. -
కై ్లమాక్స్కు భూభారతి కుంభకోణం
జనగామ: భూభారతి పోర్టల్ స్లాట్ బుకింగ్ వ్యవహారం ప్రస్తుతం కై ్లమాక్స్ దశకు చేరింది. జనగామ జిల్లా పోలీసులు దర్యాప్తులో వేగంలో పెంచి, గ్రామస్థాయికి వెళ్లి కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. ఇంటర్నెట్ సెంటర్లు, మీ సేవ కేంద్రాల సంబంధిత నిర్వాహకులను విచారణకు పిలిపించి, స్లాట్ బుకింగ్ ప్రక్రియలో ఎవరెవరి పాత్ర ఉందనే అంశపై కూపీ లాగుతున్నారు. జనగామ జిల్లాలో చిల్పూరు, స్టేషన్న్ఘన్పూర్, కొడకండ్ల, జనగామ తదితర మండలాల్లో పెద్ద ఎత్తున స్లాట్ బుకింగ్ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే పూర్తిస్థాయి స్పష్టత కోసం దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. స్లాట్ బుకింగ్ వ్యవహారం అక్రమాలు ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. దీనిలో ప్రముఖులు కూడా భాగస్వాములై ఉండవచ్చన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ‘లైవ్’ చేసినట్టేనా ? సాధారణంగా ప్రభుత్వం ఏదైనా పోర్టల్ను అమల్లోకి తీసుకొచ్చినప్పుడు కనీసం రెండు నుంచి మూడు నెలలపాటు ట్రయల్ రన్ నిర్వహిస్తుందని మేధావులు అంటున్నారు. అయితే భూభారతి పోర్టల్ విషయంలో అలాంటి టెస్టింగ్ నిజంగా జరిగిందా, లేకుంటే టెస్టింగ్ను పక్కనపెట్టి కోడ్ను నేరుగా ‘లైవ్’ చేసినట్టేనా అన్న సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంలో పనిచేసే అనుభవజ్ఞులైన అధికారులకు కూడా ఇలాంటి లోపాలు తెలియకపోవడం ఆశ్చర్యకరమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. స్లాట్ బుకింగ్ ద్వారా న్యాయబద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న రైతులకు అధికారులు నోటీసులు జారీ చేయడం మరింత సంచలనం రేపింది. సదరు రైతులు రిజిస్ట్రేషనన్కు చెల్లించిన డబ్బులు మళ్లీ ఎలా రీఫండ్ అవుతాయి, ఎవరిని సంప్రదించాలంటూ అధికారుల వద్దకు వెళ్లినట్లు స మాచారం. ఇప్పటి వరకు జిల్లాలో 10 మంది రైతులకు నోటీసులు అందాయి. ఇక జిల్లా కేంద్రంలో మ రో 20 నుంచి 30 మంది, మొత్తం సుమారు 35 మంది వరకు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నా రు. అయితే దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పోర్టల్ను మానిటరింగ్ చేశారా? రాష్ట్ర వ్యాప్తంగా రోజూ ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి, ఎంత మొత్తంలో ప్రభుత్వానికి వెళ్తుందన్న వివరాలు స్పష్టంగా తెలియకుండానే వ్యవస్థ నడుస్తుండడంపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రభుత్వ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత కొంతకాలం మానిటరింగ్ చేస్తారు. భూభారతి విషయంలో అలాంటి పర్యవేక్షణ నిజంగా జరిగిందా లేదా అన్న ప్రశ్నలు సోషల్ మీడియా, ప్రజల్లోనూ తీవ్రంగా చర్చకు దారి తీస్తున్నాయి. భూభారతి స్లాట్ బుకింగ్ కుంభకోణం వెలుగులోకి రావడం, దానికి సంబంధించిన దర్యాప్తు వేగంగా ముందుకు సాగడం, రీఫండ్ పెండింగ్ దరఖాస్తులు భారీ సంఖ్యలో ఉండటంతో భూ రిజిస్ట్రేషన్ వ్యవస్థపై మరింత అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. మీసేవ, ఇంటర్నెట్ సెంటర్లపై నిఘా దర్యాప్తులో వేగం పెంచిన జనగామ పోలీసులు రోజువారీ రిజిస్ట్రేషన్ల డాటా లేకపోవడంపై అనుమానాలుభూభారతి స్లాట్ బుకింగ్ కుంభకోణంపై జరుగుతున్న దర్యాప్తు వేగంగా ముందుకు సాగుతోంది. నేడో రేపో పూర్తి వివరాలను పోలీసు ఉన్నతాధికారులు మీడియా ముందు ఉంచే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం జనగామ, కొడకండ్లకు చెందిన మీసేవ, ఇంటర్నెట్కు చెందిన నలుగురు నిర్వాహకులను పోలీసులు పిలిపించి ఎవరెవరు అప్రోచ్ అయ్యారని సమాచారం సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ధరణి, భూభారతి స్లాట్ క్యాన్సలేషన్కు సంబంధించిన పెండింగ్ రీఫండ్ దరఖాస్తులు సుమారు 31,314 ఉండడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.కాగా, భూభారతి స్లాట్ బుకింగ్ కేసులో జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాలకు చెందిన ఓ ఇంటర్నెట్ నిర్వాహకుడిని సైతం పోలీసులు తీసుకువెళ్లి విచారిస్తున్నారు. దీంతో ఈ సంఖ్య ఐదుగురికి చేరింది. ఇదిలా ఉండగా జనగామ జిల్లాలో అక్రమంగా చేసిన భూభారతి చలాన్లు 100 వరకు పెరిగినట్లు సమాచారం. 2022 నుంచే చలాన్ల వ్యవహారం కొనసాగుతున్నట్లు పోలీసుల విచారణలో ప్రాథమికంగా తేలినట్లు తెలుస్తుండగా, దీనిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. -
వరంగల్, హనుమకొండను ఒకే జిల్లాగా పునర్వ్యవస్థీకరించాలి
● నిరసన దీక్షలో పౌర సంఘాల నేతల డిమాండ్ హన్మకొండ: వరంగల్, హనుమకొండ జిల్లాలను ఒకే జిల్లాగా పునర్వ్యవస్థీకరించి అభివృద్ధి చేయాలని పలు పౌర సంఘాలు, ఆయా పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. రెండింటిని ఒకే జిల్లాగా ఏ ర్పాటు చేసి హైదరాబాద్కు దీటుగా వరంగల్ మహానగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం హనుమకొండలోని ఏకశిల పార్కు వద్ద తెలంగాణ ఉద్యమకారుల వేదిక, ఫోరం ఫర్ బెటర్ వరంగల్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో ఆయా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు మద్దతు పలికి మా ట్లాడారు. పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ అశాసీ్త్రయంగా విభజించిన హనుమకొండ, వరంగల్ జిల్లాలను కలిపి వరంగల్ జిల్లాగా ప్రకటించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ‘కుడా’ చైర్మన్ వెంకటరామిరెడ్డి, పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి (ఫోన్ ద్వారా సందేశం), మాజీ మేయర్ రాజేశ్వరరావు, సీపీఎం జిల్లా అధ్యక్షుడు జి.ప్రభాక ర్ రెడ్డి, నాయకుడు చుక్కయ్య, బీజేపీ నాయకుడు రావు అమరేందర్ రెడ్డి, న్యూ డెమోక్రసీ నాయకుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ వరంగల్, హనుమకొండ జిల్లాలను ఒకే జిల్లాగా ఏర్పాటు చేయడానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నమనేని జగన్మోహన్రావు, ఆయా సంఘాలు, పార్టీల నాయకులు సోమ రామమూర్తి, జిలుకర శ్రీనివాస్, సాయిని నరేందర్, బాబురావు, మల్లారెడ్డి, చాపర్తి కుమార్ గాడ్గే, సోమిడి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మార్వాడీ ఆడపడుచుల ఆత్మీయ కలయిక
మహబూబాబాద్ రూరల్ : మార్వాడీ సమాజ్ సభ్యులు వినూత్న కార్యక్రమానికి తెర తీశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఒకే సామాజిక వర్గానికి చెందిన ఆడపడుచులను ఒకే చోట కలిపారు. ఫలితంగా 20 ఏళ్ల వయసు నుంచి 90 ఏళ్ల గల ఆడపడుచులు ఒకే చోట ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ సమ్మేళనం రాష్ట్ర స్థాయిలో ఇదే ప్రథమమని నిర్వాహకులు చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మహేశ్వరి భవన్లో ఆదివారం ‘మార్వాడీ మానుకోట పరివార్ సమ్మేళన్.. బహెన్...భేటీయా’ పేరిట ఆడపడుచుల అపూర్వ ఆత్మీయ కలయిక నిర్వహించారు. దీనికి జిల్లా కేంద్రానికి చెందిన ఆడపడుచులు, వివాహాలు జరిగినవారు, ఇతర ప్రాంతాల్లో స్థిరపడినవారు, విద్యనభ్యసించేవారు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారు హాజరయ్యారు. ఇందులో భాగంగా దేశంలోని ఢిల్లీ, ముంబాయి, చైన్నె, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, ఇతర ప్రాంతాల నుంచి 130 మంది వరకు వచ్చి సమ్మేళనంలో పాల్గొన్నారు. మహబూబాద్ జిల్లా కేంద్రానికి చెందిన 200 మందికిపైగా మార్వాడీ సమాజ్ సభ్యులతో కలిసి తమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, యోగ క్షేమాలు, బంధువుల ముచ్చట్లతో ఆనందంగా గడిపారు. మొదట ఉదయం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఆడపడుచులకు ఘనంగా స్వాగతం పలికి జిల్లా కేంద్రంలో శోభాయాత్ర నిర్వహించి, మహేశ్వరి భవన్ వేదికగా సంబరాలు జరిపారు. సాంస్కృతిక ప్రదర్శనలు, క్రీడలు, ఆధ్యాత్మిక, భక్తి గేయాల ఆలాపనలు నిర్వహించారు. ఒకేచోట కలుసుకున్న 20 ఏళ్ల వయసు నుంచి 90 ఏళ్ల గల ఆడపడుచులు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఇదే ప్రథమం మానుకోట జిల్లా కేంద్రంలో సందడి -
చెరువులో పడి రైతు మృతి
ములుగు రూరల్: చెరువులో పడి ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన కాశిందేవిపేట జీపీ పరిధి రామయ్యపల్లిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వాంకుడోత్ బాల్య (56) వ్యవసాయ పనుల నిమిత్తం శనివారం ఉదయం చేను వద్దకు వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు పొలం సమీపంలోని కుంటలు, చెరువుల సమీప ప్రాంతాల్లో వెతకగా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం గ్రామ శివారులోని గాజులగుట్ట చెరువులో శవమై తేలాడు. చేను వద్దకు వెళ్లే క్రమంలో బహిర్భూమికి వెళ్లి చెరువులో పడి ఉంటాడని గ్రామస్తులు భావిస్తున్నారు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పంచనామా నిర్వహించారు. బాల్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
మున్సిపాలిటీ ఎన్నికల్లో సత్తాచాటాలి
మహబూబాబాద్ అర్బన్: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తాచాటలని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసేదేవరావు అన్నారు. ఆదివారం పలు మండలాలకు చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ఈకార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసేదేవరావు మాట్లాడారు. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయని, బీజేపీ నాయకులు కౌన్సిర్లుగా, చైర్మన్లుగా గెలిచి బీజేపీ జెండా ఎగరవేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ అని అభిప్రాయపడ్డారు. గ్రామ పంచాయతీ ఎన్ని కల్లో బీజేపీ ఓటింగ్ శాతం భారీగా పెరిగిందన్నా రు. జిల్లా అధ్యక్షుడు వల్లభూ వెంకటేశ్వరు, ప్రధానకార్యదర్శులు చీకటి మహేష్గౌడ్, గడ్డం అశోక్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్యామ్సుందర్శర్మ, జిల్లా కన్వీనర్ సింగారం సతీష్, జిల్లా ఉపాధ్యక్షులు చిలుకూరి వెంకన్న, ఓర్సు పద్మ, మేడి సురేందర్, కోశాధికారి జాటోత్ మోదీన్నాయక్, జిల్లా కార్యదర్శులు హిందూ భారతి, అశోక్, మమత, సందీప్, అజయ్కుమార్, రేష్మ పాల్గొన్నారు. కాళేశ్వరాలయంలో సందడి కాళేశ్వరం: సంక్రాంతి సెలవుల సందర్భంగా కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో ఆదివారం సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ముందస్తుగా మేడారంలో వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో కాళేశ్వరం చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో గోదావరి తీరం, ఆలయ పరిసరాల్లో భక్తుల కోలాహలం కనిపించింది. ● బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసేదేవరావు -
కోటగుళ్లలో ప్రత్యేక పూజలు
గణపురం: గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళా క్షేత్రం కోటగుళ్లలో ఆదివారం తొర్రూరు ఆర్టీఓ కార్యాలయం ఏఓ కుమ్మరికుంట్ల అనిల్కుమార్ కుటుంబ సభ్యులతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సందర్శనకు వచ్చిన ఆయనకు ఆలయ అర్చకులు నాగరాజు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ కోటగుళ్ల శిల్ప సంపద ఎంతో అద్భుతంగా ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 75 రకాల గుర్తులు తొర్రూరు: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నగర, మున్సిపాలిటీల్లో ఎన్నికల ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఓటరు తుది జాబితాను ప్రకటించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల సిబ్బంది శిక్షణకు సన్నాహాలు ప్రారంభమయ్యా యి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం గుర్తులను ప్రకటించింది. ఈ మేరకు 75 ర కాల గుర్తులున్నాయి. అభ్యర్థుల డిపాజిట్లనూ ఖరా రు చేశారు. మున్సిపాలిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,250, ఇతరులు రూ.2,500, కార్పొరేషన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.2,500, ఇతరులకు రూ.5 వేలుగా నిర్ణయించారు. మహారాష్ట్ర కూలీల సందడి.. డోర్నకల్: డోర్నకల్ రైల్వే స్టేషన్లో మహారాష్ట్ర కూలీలతో సందడి నెలకొంది. డోర్నకల్ మండలంతోపాటు కామెపల్లి, కారెపల్లి, ఖమ్మం, సూ ర్యాపేట, మధిర, కూసుమంచి తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రా ష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా పెద్ద సంఖ్యలో డోర్నకల్ రైల్వే స్టేషన్కు చేరుకుంటున్నారు. ఇక్కడి నుంచి రైతులు ఏర్పాటు చేసిన వాహనాల ద్వా రా గ్రామాలకు తరలివెళ్తున్నారు. సుమారు మూడు నెలలపాటు మహారాష్ట్ర కూలీలు మిరప తోటల్లో కాయకోత పనులు చేయనున్నారు. హేమాచలక్షేత్రంలో భక్తుల సందడి మంగపేట: రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరులోని శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం తదితర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రితో పాటు తదితర సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. -
ఒకేసారి 8వేల మంది భక్తుల దర్శనం
సోమవారం శ్రీ 12 శ్రీ జనవరి శ్రీ 2026ములుగు/ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో ఒకేసారి 8వేల మంది భక్తులు దర్శనం చేసుకునేలా మాస్టర్ప్లాన్ రూపొందించినట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. జాతర పనుల పురోగతిపై ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలోని హరిత హోటల్లో ఆదివారం ఆయన అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కలెక్టర్ దివాకర టీఎస్ తొలుత జాతర పనుల వివరాలను మంత్రులకు వివరించారు. ఈ నెల 15వ తేదీలోపు పనులు పూర్తిచేస్తామని వెల్లడించారు. స్వల్పంగా ఉన్న ఆర్అండ్బీ శాఖ పనులు గడువులోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈనెల 18న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మేడారానికి రానున్నారని, ఇక్కడే కేబినెట్ సమావేశం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారానికి ఆదివారం ప్రతి గంటకు సగటున వెయ్యి వాహనాలు చేరుకున్నాయని తెలిపారు. దాదాపు ఐదు లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని వెల్లడించారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ జాతర సమయంలో తొక్కిసలాట వంటి సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్ని శాఖల అధికారులతో పనుల పురోగతిని విడివిడిగా అడిగి తెలుసుకున్నారు. జాతర క్యూలైన్లకు సంబంధించిన పనుల పురోగతిని పంచాయతీ రాజ్ ఈఈ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ల్యాండ్ స్కేపింగ్ పనుల గురించి జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ వివరించారు. రవాణా ఏర్పాట్లపై ఆర్టీసీ డీఎం వివరాలు అందజేశారు. జాతర కోసం మొత్తం 3,600 బస్సులను 51 పాయింట్ల నుంచి నడుపుతున్నామని ఆయన తెలిపారు. గద్దెల సమీపంలోని టీటీడీ కల్యాణ మండపంలో 50 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేశామని డీఎంహెచ్ఓ వివరించారు. జాతర విధులకు మొత్తం 13 వేల మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నట్లు ఎస్పీ సుధీర్రాంనాథ్ కేకన్ వెల్లడించారు. మంత్రి సురేఖ, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఫైనాన్ ్స సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, దేవాదాయ శాఖ కమిషనర్ హరీశ్, ఐటీడీఏ పీఓ చిత్రమిశ్రా, అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్రావు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఆర్డీఓ వెంకటేశ్ పాల్గొన్నారు. 18న మేడారానికి సీఎం రేవంత్రెడ్డి రాక.. కేబినెట్ సమావేశం అధికారుల సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క -
చిన్నవయస్సు.. పెద్ద బాధ్యత
● సర్పంచ్లుగా ఎన్నికై న యువత ● గ్రామపాలనతో రాజకీయ రంగంలోకి.. ● తమ మార్క్ చూపేందుకు ప్రణాళిక ● నేడు జాతీయ యువజన దినోత్సవం యువత రాజకీయాల్లోకి రావాలి కురవి: ఈమె పేరు బానోత్ లావణ్య. డిగ్రీ వరకు చదువుకున్న ఈ 24 ఏళ్ల యువతి కురవి శివారు రేకుల తండా సర్పంచ్గా వివాహం జరిగిన ఐదు నెలలకే ఎన్నికై అందరి దృష్టిని ఆకర్షించారు. ఈమె భర్త బానోత్ వినోద్ అదే గ్రామంలో గత పాలకవర్గంలో ఉప సర్పంచ్గా పనిచేశాడు. గత సర్పంచ్ చంద్యానాయక్ అనారోగ్యంతో ఉన్నసమయంలో సర్పంచ్గా కూడా బాధ్యతలు నిర్వహించాడు. భర్త చేసిన మంచి పనులతోనే తన విజయం సాధ్యమైందని, మంచినీటి సౌకర్యం, డ్రెయినేజీల ఏర్పాటు, విద్యుత్ దీపాల వెలుగులు, పాఠశాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పాలకవర్గంతో కలిసి పాలన సాగిస్తాని చెబుతున్నారు.. ఈ యువసర్పంచ్. యువత రాజకీయాల్లోకి వచ్చి గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని లావణ్య ఈ సందర్భంగా పిలుపునిస్తున్నారు. యువకులు రాజకీయాల్లోకి రావాలి.. పాలనలో తమదైన ముద్రవేయాలని ప్రముఖుల ఉపన్యాసాల్లో వింటుంటాం. ఆ మాటలను కొందరు విని వదిలేస్తే.. వీరు మాత్రం ఆ దిశగా అడుగులు వేశారు. అందివచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకుని గ్రామ ప్రథమ పౌరులుగా ఎన్నికయ్యారు. చిన్న వయస్సులోనే పెద్ద బాధ్యతల్లో కొలువుదీరిన యువ సర్పంచ్లపై నేడు జాతీయ యువజన దినోత్సవం (స్వామి వివేకానంద జయంతి) సందర్భంగా ప్రత్యేక కథనం.గ్రామాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక..తొడేళ్లగూడెం గ్రామ సర్పంచ్గా విజయం సాధించడం ఆనందంగా ఉంది. 25 ఏళ్లకే భర్త సహకారంతో సర్పంచ్గా గెలవడం అదృష్టంగా భావిస్తున్నా. ఎన్నికల్లో నిలబడాలని నిర్ణయించుకున్న రోజే గ్రామాభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకున్నా. గ్రామంలోని పాఠశాలల అభివృద్ధి, వసతుల కల్పన, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం, తాగునీటి వసతుల కల్పనే లక్ష్యంగా పని చేస్తా. గ్రామాభివృద్ధికి యువత సహకారం అవసరం. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలి. – చౌడబోయిన కల్యాణి, సర్పంచ్, తొడేళ్లగూడెం, డోర్నకల్ పదవి ఉన్నా లేకున్నా ప్రజలతోనే..మరిపెడ రూరల్: మండలంలోని నీలికుర్తి సర్పంచ్ తొట్టి గౌతమ్ 30 ఏళ్ల వయస్సులోనే సర్పంచ్గా బాధ్యతలు చేట్టాడు. బీఫార్మసీ చేసిన గౌతమ్ ఉద్యోగం వైపు కాకుండా రాజకీయలవైపు అడుగులు వేసి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని సర్పంచ్గా విజయం సాధించాడు. గతంలో పదవి లేకున్నా ప్రజలకు సేవచేశానని ప్రస్తుతం పొందిన పదవితో ప్రజాసమస్యల పరిష్కారానికి మరింత కృషి చేసే అవకాశం వచ్చిందంటున్నాడు.. గౌతమ్. చదువుకున్న సర్పంచ్గా ప్రణాళికతో పనుల చేస్తానని చెబుతున్నాడు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ గ్రామాభివృద్ధికి సహకారం అందించాలని కోరుతున్నారు.. ఈయువ సర్పంచ్. విద్యతోనే అభివృద్ధి సాధ్యంకురవి: విద్యతోనే అభివృద్ధి సాధ్యమంటున్నారు.. మండలంలోని మోద్గులగూడెం శివారు బేగావత్ తండా యువసర్పంచ్ బేగావత్ సంతోష్. ఎంబీఏ వరకు చదువుకున్న 29 ఏళ్ల సంతోష్ నూతనంగా ఏర్పాటైన బేగావత్ తండాకు మొదటి సర్పంచ్ కావాలనే లక్ష్యంతో ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించాడు. తండాలో ఉన్న పాఠశాలను అభివృద్ధి చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా పనిచేస్తానని, పేదలకు సాయమందించడమే లక్ష్యమని సంతోష్ చెబుతున్నారు. గ్రామంలో తాగునీరు, అంతర్గత రోడ్లు, డ్రెయినేజీ, వీధిదీపాలు, మౌలిక సదుపాయాలకల్పనకు పాటుపడతానని, యువత విద్యపై దృష్టిసారించాలని సూచిస్తున్నారు. ఈ యువ సర్పంచ్. నా భర్త చేసిన సేవలే గెలిపించాయి మహబూబాబాద్ రూరల్: దర్గా తండా సర్పంచ్గా నా భర్త చేసిన సేవలే నన్ను ఈ విడతలో సర్పంచ్గా గెలిచేలా చేశాయి. నేను ఎంఏ సోషియాలజీ చదువుకున్నాను. గ్రామంలో విద్యకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, జీపీ శాశ్వత భవనం నిర్మాణానికి కృషి చేస్తా. అంతర్గత రోడ్లు, ఇంటింటికీ మరుగుదొడ్లు నిర్మిస్తా. అభివృద్ధిలో యువత భాగస్వామ్యమైతేనే గ్రామాలు ఆదర్శవంతంగా తయారవుతాయి. – గుగులోత్ సునీత, సర్పంచ్, దర్గా తండా గూడూరు: మండలంలోని బ్రాహ్మణపల్లి శివారు ఇప్పల్తండాకు చెందిన ధారావత్ కమల. బీటెక్ పూర్తి చేసింది. 24 సంవత్సరాల కమల ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తుండగా వచ్చిన సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి భర్త నరేష్ సహకారంతో విజయం సాఽ దించింది. కొత్తగా ఏర్పడిన గ్రామానికి సర్పంచ్గా ఎన్నికై నందుకు సంతోషంగా ఉందని.. గిరిజన తండాలు అభివృద్ధి చెందాలనుకునే తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెబుతుంది. రాజకీయ అనుభవం లేకున్నా, విద్యా పరిజ్ఞానంతో ప్రజాప్రతినిధిగా ముందుకెళ్తానంటుంది.. కమల. -
లారీ, బస్సు మధ్యలో చిక్కుకున్న కారు
ములుగు రూరల్: జాతరకు వస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన ఆదివారం మల్లంపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ నుంచి ములుగు వైపునకు వస్తున్న ఎలక్ట్రిక్ బస్సు మల్లంపల్లి బస్టాండ్ ప్రాంతంలో బ్యాటరీ సమస్య తలెత్తి నిలిచింది. హనుమకొండ నుంచి మేడారం వస్తున్న భక్తుల కారు ఆగి ఉన్న బస్సును ఓవర్టెక్ చేస్తున్న క్రమంలో వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు.. లారీ, బస్సు మధ్య చిక్కుంది. డ్రైవర్ చాకచక్యంగా లారీని నిలిపివేయడంతో కారులో ఉన్న వారికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. దీంతో జాతీయ రహదారిపై సుమారు గంట పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. మల్లంపల్లిలో రోడ్డు ప్రమాదానికి గురైన కారు -
రిజర్వేషన్లపై సందిగ్ధం
● అయోమయంలో ఆశావహులు ● రిజర్వేషన్లు మారుతాయని జోరుగా ప్రచారంమహబూబాబాద్: మానుకోట మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా రిజర్వేషన్లు మారుతాయని కొంత మంది మాజీ కౌన్సిలర్లు, అశావహులు అభిప్రాయపడుతున్నారు. కొంతమంది మాజీ కౌన్సిలర్లు మాత్రం రిజర్వేషన్లు మారవని ఒక వేళ మారితే అన్ని వార్డులు మారుతాయంటున్నారు. ఏది ఏమైనా రిజర్వేషన్లపై జిల్లాలో ఉత్కంఠ కొనసాగుతుంది. వార్డులతోపాటు చైర్మన్ రిజర్వేషన్పై కూడా స్థానికంగా చర్చ జరుగుతుంది. రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీల్లో సందిగ్ధత నెలకొంది, అధికారులు మాత్రం ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. ముసాయిదా ప్రకారం 65,851 మంది ఓటర్లు మానుకోట మున్సిపాలిటీ పరిధలో 36 వార్డులు ఉన్నాయి. గత ఎన్నికల ప్రకారం 57,828 మంది ఓటర్లు ఉన్నారు. కాగా ఈనెల 1 తేదీన ముసాయిదా ఓటరు జాబితాను ప్రదర్శించారు. ఆ జాబితా ప్రకారం ప్రకారం గతంలో కంటే 8,023 మంది ఓటర్లు పెరిగారు. గత ఎన్నికల్లో వార్డుల సంఖ్య పెరుగగా ఈ ఎన్నికల్లో ఓటర్లు పెరిగారు. అయితే పెరిగిన ఓటర్ల ప్రకారం వార్డుల సంఖ్య కూడా పెరుగుతుందా.. లేక ఉన్న వార్డుల్లోనే పెరిగిన ఓటర్లను సర్దుబాటు చేస్తారా.. అనే విషయంపై చర్చ జరుగుతుంది. కొత్తగా వార్డులు పెరిగే అవకాశం లేదని ప్రస్తుతం అంత సమయం లేదని అధికారులు చెబుతున్నారు. ఈనెల 10వ తేదీన తుది జాబితా ప్రదర్శించవాల్సి ఉండగా ఎన్నికల సంఘం ఈనెల 12నకు మార్పు చేసిన విషయం తెల్సిందే. ఓటరు జాబితాలో కూడా మార్పులు చేశారు. దాంతో ఓటర్ల సంఖ్యలో కూడా చాలా మార్పు వచ్చే అవకాశం ఉంది. రిజర్వేషన్ల మార్పుపై ప్రచారం వార్డుల రిజర్వేషన్లు మారుతాయని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఊదాహరణకు 17, 24, 26 వార్డులతోపాటు పలు వార్డులు ఎస్సీకి రిజర్వ్ అవుతాయని ప్రచారం జరుగుతుంది. దాంతో ఆయా వార్డుల్లో ఉన్న ఆశావహులు తెరపైకి వ చ్చి తమకే అవకాశం కల్పించాలని నాయకులను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. మాజీ కౌన్సిలర్లు వారి వార్డుల్లో మళ్లీ గెలవాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మార్పు ఎలా ఉంటుందో..? కొంత మంది మాజీ కౌన్సిలర్లు, ఆశావహులు తప్పనిసరిగా అన్ని వార్డుల్లో రిజర్వేషన్లు మారుతాయని మారకుంటే అన్ని వార్డులు మారవని భావిస్తున్నారు. కానీ గత ఎన్నికల సమయంలో జరిగిన రిజర్వేషన్ ప్రకారం పది సంవత్సరాలు ఒకే రకమైన రిజర్వేషన్లు ఉంటాయని సమాచారం. అయితే కొన్ని మున్సిపాలిటీలు గ్రేటర్లో కలవడం, కొన్ని కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు కావడంతో రిజర్వేషన్లు మారుతాయని భావిస్తున్నారు. ఆదేశాలు రాలేదంటున్న అధికారులు మున్సిపల్ అధికారులు, కమిషనర్ రాజేశ్వర్ మాత్రం రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి అదేశాలు రాలేదని చెబుతున్నారు. విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం రిజర్వేషన్లు ప్రస్తుత సమయంలో సాధ్యం కాదని అంటున్నారు. వార్డుల సంఖ్య పెంపు ఇతరత్రా ఏ విషయంలో ఎలాంటి ఆదేశాలు రాలేదని పేర్కోన్నారు. ఏదిఏమైనప్పటికీ ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వస్తేనే ఉత్కంఠకు తెరపడనుంది. -
పేదల గుండె ధైర్యం ఉపాధి హామీ పథకం
● డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ భూక్య ఉమ ● వీబీజీ రాంజీ బిల్లును నిరసిస్తూ నిరాహారదీక్షమహబూబాబాద్ రూరల్ : పేదల జీవనాధారమైన ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని నిర్వీర్యం చేయాలని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని, ఈజీఎస్ పేదల గుండె ధైర్యమని డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ భూక్య ఉమ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వీబీ జీ రాంజీ బిల్లును నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఆదివారం నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఉమ మా ట్లాడుతూ పేద ప్రజలకు ఉపాధి, భరోసా కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన చారిత్రాత్మక నిర్ణయం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అని గుర్తు చేశారు. కేంద్రం పేదల వ్యతిరేక ప్రభుత్వమని మరోసారి రుజువైందని ఆరోపించారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు తగ్గించడం, పనిదినాలు కుదించడం ద్వారా పేదల గుండెల్లో భయం నింపుతోందని విమర్శించారు. పేదల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పోరాడుతుందని, బీజేపీ తీసుకొచ్చే ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొడతామని స్పష్టం చేశారు. ఈజీఎస్ పథకాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంద ని, కేంద్రంలో అధికారంలోకి రాగానే పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజయ్య, రాజుగౌడ్, లక్ష్మీనారాయణ, ప్రవీణ్కుమార్, సురేష్, శ్రీనివాసరెడ్డి, ముసల య్య, సురేష్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి ఖోఖో పోటీలు షురూ
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే స్టేడియంలో ఆదివారం 58వ సీనియర్ జాతీయస్థాయి ఖోఖో చాంపియన్షిప్ మెన్ అండ్ ఉమెన్ క్రీడా పోటీలను మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, వాకిటి శ్రీహరి, పలురాష్ట్రాల ఖోఖో ఫెడరేషన్, అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ యువత ప్రపంచస్థాయి క్రీడాకారులుగా ఎదగాలని సూచించారు. దేశం మొత్తం కాజీపేట రైల్వే స్టేడియాన్ని చూస్తోందని, కాజీపేట నుంచి దేశానికి క్రీడాకారులను చూపిస్తున్న రాష్ట్ర ఖోఖో సంఘం ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డిని అభినందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం గ్రామీణ క్రీడలు ఖోఖో, కబడ్డీలు, క్రీడాకారులను ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు. ఖోఖో క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం పక్షాన స్వాగతం తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. క్రీడల శాక మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ కాజీపేటలో నిర్వహిస్తున్న ఖోఖో పోటీలను దేశం మొత్తం చూస్తోందన్నారు. యువత క్రీడల్లో రాణించాలని, ఖోఖో, కబడ్డీ ప్రపంచస్థాయి క్రీడలుగా ఎదిగేందుకు కృషిచేయాలని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చి 42 క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడలను పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఒలింపిక్ క్రీడాకారులుగా ఎదిగేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తోందని చెప్పారు. ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సుధాన్స్ మిట్టల్, జనరల్ సెక్రటరీ ఉప్కార్ సింగ్, ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎంఎస్.త్యాగి, గోవింద శర్మ, తెలంగాణ స్పోర్ట్స్ అడ్వైజర్ జితేందర్రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ స్పోర్ట్స్ చైర్మన్ ఎన్.శివసేనారెడ్డి తదితరులు మాట్లాడారు. జిల్లాలో స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం రూ.కోటిన్నర నిధులు విడుదల చేయాలని జంగా రాఘవరెడ్డి కోరగా క్రీడల మంత్రి హామీ ఇచ్చారు. అంతకు ముందు ఖోఖో పోటీల్లో పాల్గొనేందుకు పలు రాష్ట్రాల నుంచి వచ్చిన 1,500 మంది క్రీడాకారులు మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 2008లో ఒలింపిక్స్లో అర్చరీ క్రీడలో రాణించిన వర్ధినేని ప్రణీతను సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, జిల్లా అధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు. కాగా, ఉదయం నుంచి సాయంత్రం వరకు 34 ఖోఖో మ్యాచ్లు ఆడారు. పోటీలు రాత్రి వరకు కూడా కొనసాగాయి. కాజీపేట రైల్వే స్టేడియంలో ప్రారంభించిన మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, వాకిటి శ్రీహరి పాల్గొంటున్న పలు రాష్ట్రాలకు చెందిన 1,500 మంది క్రీడాకారులు -
ఖాకీల కారుణ్యం!
● ఇటీవల మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు డయల్ 100కు కాల్ వచ్చింది. మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఉస్మాన్, కానిస్టేబుల్ నరేశ్ వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని యువకుడి ప్రాణాలు కాపాడారు. ● ఇటీవల నర్సంపేటకు చెందిన ఓ యువతి ప్రేమ విఫలమైందని ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. బస్టాండ్ వద్ద అనుమానం వచ్చి ఆ విషయాన్ని పసిగట్టిన బ్లూకోల్ట్స్ సిబ్బంది ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన కౌన్సెలింగ్ ఇచ్చి జీవితం గొప్పదనాన్ని తెలిపి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ● రాయికల్కు చెందిన ఓ యువతిని సైతం బ్లూకోల్ట్స్ సిబ్బంది కాపాడి కౌన్సెలింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. ● కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధి వడ్డేపల్లి చెరువు కట్టపై ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు సకాలంలో స్పందించి కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ● అదేవిధంగా తల్లిదండ్రులు మందలించారని మనస్తాపానికి గురైన ఓ యువతి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లోంచి వెళ్లి ఆత్మహత్యకు యత్నిస్తుండగా హనుమకొండ పోలీసులు కాపాడారు. ● ధర్మసాగర్కు చెందిన పల్లెపు శ్రీనివాస్ మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయోధ్యపురం రైల్వే ట్రాక్పై పడుకుని ఆత్మహత్యకు యత్నించాడు. రైల్వే కీమెన్ వేణు, సహకారంతో పోలీసులు అతడి ప్రాణాలు కాపాడారు. ● ఈనెల 5న (గత సోమవారం) గౌసియాబేగం అనే మహిళ తన మూడేళ్ల పాపతో మండిబజార్ ఏరియాలో నడిచి వెళ్తుండగా లోబీపీతో పడిపోయింది. అక్కడే విధుల్లో ఉన్న ఇంతేజార్గంజ్ ఎస్సై వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి మహిళను పోలీస్ వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.ప్రకృతి వైపరీత్యాలైనా. సభలు, సమావేశాలైనా.. పండుగైనా పబ్బమైనా మీ రక్షణ కోసమే మేమున్నాం అంటున్నారు పోలీసులు. ఆపత్కాలంలో ముందు వరుసలో నిలబడి సేవలందిస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నడవ లేని వృద్ధులను ఎత్తుకొని పోలింగ్ బూత్లకు తీసుకొచ్చారు. ఉమ్మడి జిల్లాలో భారీగా కురిసిన వర్షాలకు వరదలు ముంచెత్తి ఇళ్లలో చిక్కుకున్న వృద్ధులను, పిల్లలను కాపాడారు. విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్న బ్లూకోల్ట్స్ సిబ్బంది.. ఆత్మహత్య వైపు అడుగులు వేస్తున్న ఎంతో మందిని కాపాడి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. పోలీస్ వాహనంలో తరలించి.. ప్రాణాలు నిలబెట్టి మడికొండ పోలీస్ స్టేషన్ ఎదుట డివైడర్ను బైక్ ఢీకొట్టిన ఘటనలో యువకులు సాయిరాం, ఆకుల శశాంక్కు తీవ్ర రక్తస్రావమైంది. రోడ్డుపై పడి కొట్టుకుంటుండగా ఇన్స్పెక్టర్ పుల్యాల కిషన్ తన వాహనంలో బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడారు. రక్తపు మడుగులో పడి ఉన్న యువకులను చూసి స్థానికులెవ్వరూ ముందుకు రాలేదు. పోలీసులు చేసిన ఆ సేవ సోషల్ మీడియాలో వైరలైంది. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయకుడి నిమజ్జనం సమయంలో ఉర్సుగుట్టకు నిమజ్జనానికి వచ్చిన ఓ యువకుడు ట్రాక్టర్లో చేతులు కాళ్లు కొట్టుకుంటూ నురుగులు కక్కాడు. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఎస్సై శ్రవణ్, కానిస్టేబుల్ చందు ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. ఆత్మహత్యలను అడ్డుకుంటూ.. ప్రాణాలను నిలబెడుతూ కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగింత విపత్తులు, ప్రమాదాల సమయంలోనూ మేమున్నామంటూ.. ఆపద్బాంధవులుగా.. ఓరుగల్లు పోలీసులు వీరి సేవలకు సలాం అంటున్న ప్రజలు పసిగట్టి.. ప్రాణాలు కాపాడి -
వరిలో వెదజల్లే పద్ధతి ప్రయోజనకరం
● డీఏఓ సరిత గూడూరు: వెదజల్లే పద్ధతితో వరి సాగు చేస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని జిల్లా వ్యవసాయ అధికారి సరిత అన్నారు. మండలంలోని బొద్దుగొండ గ్రామంలో శనివారం మండల వ్యవసాయ అధికారి అబ్దుల్మాలిక్, విస్తరణాధికారి మనోజ్తో కలిసి వరి సాగు క్షేత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో సాగవుతున్న వరి పంటపై తెల్సుకొని, ఓ రైతు సాగు చేస్తున్న వెదజల్లే పద్ధతిలో మెలకువలపై పలు సూచనలు చేశారు. అనంతరం పలువురు రైతులకు వెదజల్లే పద్ధతిపై వివరించారు. ఈ విధానంతో కూలీల ఖర్చు, పెట్టుబడి ఆదా, విత్తన మోతాదు తగ్గుతుందని తెలిపారు. అదే విధంగా ప్రతీ రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. దీంతో కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ పథకాల లబ్ధి సులభంగా పొందవచ్చని తెలిపారు. యాసంగి పంట సాగు చేసే రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడొద్దని, అవసరమైన నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలి మహబూబాబాద్ రూరల్ : పట్టా కలిగిఉన్న ప్రతీ రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని డీఏఓ సరిత సూచించారు. జిల్లా కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో ఫార్మర్ రిజిస్ట్రీపై శనివారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ రైతులు నేరుగా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవచ్చని తెలిపారు. అలా వీలుకాని రైతులు వ్యవసాయ విస్తరణ అధికారుల వద్దకు వస్తే ఈ పక్రియను పూర్తి చేస్తారన్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులు కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ పథకాల లబ్ధి సులభంగా పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాధికారి తిరుపతిరెడ్డి, క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి పూజిత పాల్గొన్నారు. రైతులు ఆందోళన చెందవద్దుకేసముద్రం: యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భూక్య సరిత అన్నారు. మున్సిపాలిటీ పరిధి దన్నసరిలోని పీఏసీఎస్ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన యూరియా పంపిణీ విధానాన్ని ఆమె పరిశీలించి మాట్లాడారు. కేసముద్రం మండలంలో రెండు పీఏసీఎస్లు, ఆగ్రో రైతు సేవా కేంద్రం ప్రైవేట్ డీలర్ల ద్వారా 1,886 బస్తాల యూరియా పంపిణీ చేసినట్లు తెలిపారు. కేంధ్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు విశిష్ట గుర్తింపు ఐడీ కోసం సమీపంలోని మీసేవా సెంటర్లు, ఏఈఓలను సంప్రదించి ఫార్మర్ రిజస్ట్రేషన్ చేయించుకుని ఐడీ పొందాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఓ వెంకన్న, సీఈఓ మల్లారెడ్డి, ఏఈఓలు రాజేందర్, సాయిచరణ్, శ్రీనివాస్, రవివర్మ, లావణ్య పాల్గొన్నారు. -
కుష్ఠును తరిమేద్దాం
నెహ్రూసెంటర్: ప్రమాదకరమైన కుష్ఠువ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తుంది. వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం, వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నా.. కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిస్తుంది. కుష్ఠు నియంత్రణలో భాగంగా 2025 డిసెంబర్ 31వ తేదీ వరకు జిల్లాలో 885 బృందాలతో ఇంటింటి లెప్రసీ సర్వే చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లాలో 2,16,151 ఇళ్లను సర్వే చేసి 7,56,625 మందిని సర్వే బృందం పరీక్షించింది. ఇందులో 1,828 మందిని కుష్ఠువ్యాధి అనుమానితులుగా గుర్తించగా 10 లెప్రసీ కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 73 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కుష్ఠు లక్షణాలు.. చర్మంపై మచ్చలు, మొద్దుబారిన మచ్చలు ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా నివారించవచ్చని వైద్యులు తెలుపుతున్నారు. కుష్ఠువ్యాధి మచ్చలు ఎరుపు లేదా రాగి, గోధుమ రంగులో ఉండడంతోపాటు మచ్చలు ఏర్పడిన చోట ఎలాంటి స్పర్శ ఉండదు. వ్యాధి సోకిన వారిలో శరీరంలో ఎక్కడైన ఏర్పడవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపించినవారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సంప్రదించడం ద్వారా చికిత్స తీసుకుని నివారించ్చుకోవచ్చు. వ్యాధి తీవ్రత పెరిగే కొద్ది శరీరంలో అంగవైకల్యం వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా రెండేళ్ల పైబడిన వారందరికీ ఈ వ్యాధి సంక్రమించే ప్రమాదముంది. వ్యాధి కట్టడికి చర్యలు.. కుష్ఠు వ్యాధి నివారణకు జిల్లాలో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యచరణ చేట్టారు. సిబ్బంది ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించడం, అనుమానితులను పరీక్షించడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రజలందరికీ అవగాహన కల్పించడంతోపాటు ఆశా కార్యకర్తలు సర్వేలు నిర్వహించి అనుమానితులను గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిస్తున్నారు. వ్యాధి నిర్ధారణ జరిగితే ఉచితంగా వైద్య చికిత్సను అందించనున్నారు. పరీక్షలు చేయించుకోవాలి శరీరంపై స్పర్శ లేని మచ్చలు, ఎరువు, గోధుమరంగులో ఉంటే అనుమానితులు సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలి. కుష్ఠు నివారణపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. వ్యాధి నియంత్రణకు ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించి వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. – రవిరాథోడ్, డీఎంహెచ్ఓచాపకింద నీరులా వ్యాపిస్తున్న వ్యాధి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది -
ఊరెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించండి
మహబూబాబాద్ రూరల్ : సంక్రాంతి పండుగ సందర్భంగా అనేక మంది తమ స్వగ్రామాలకు ప్రయాణాలు చేస్తుంటారని, ఈ సమయంలో ఖాళీగా ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పండుగలకు ఊరెళ్ళేవారు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ డాక్టర్ శబరీష్ శనివారం సూచించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జిల్లాలో చోరీల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, రాత్రి వేళల్లో గస్తీని పటిష్టం చేశామని తెలిపారు. ఎస్పీ శబరీష్ సంక్రాంతి నేపథ్యంలో ప్రజలకు పలు సూచనలు -
నాటువేసి.. ధాన్యం తూర్పారపట్టి..
● విద్యార్థుల వినూత్న ప్రదర్శన ● సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహణ డోర్నకల్: వారంతా పాఠశాల విద్యార్థులే.. కానీ, అంతరించి పోతున్న కొన్ని పనులను వారి చిన్నారి చేతులతో చేసిచూపించి ఔరా.. అనిపించుకున్నారు. స్థానిక బ్రిలియంట్ పాఠశాలలో ముంద స్తు సంక్రాంతి వేడుకలను శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా చిన్నారులు నాటువేస్తూ.. ధాన్యాన్ని తూర్పారపడుతూ.. చాకిరేవులో బట్టలు ఉతుకుతూ.. కిరాణా సరుకులు విక్రయిస్తూ.. ఆస్పత్రిలో వైద్యం చేస్తూ, పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ, పోస్ట్మాన్గా విధులు నిర్వహిస్తూ, చేపలు విక్రయిస్తూ.. ప్రదర్శనలిచ్చారు. ఈ ప్రదర్శనలను వీక్షించిన విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు చిన్నారులను అభినందించారు. -
ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం
నెల్లికుదురు: ప్రజా ప్రభుత్వంతోనే తెలంగాణ అన్నివిధాలుగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ అన్నారు. మండలంలోని రాజులకొత్తపల్లి, రావిరాల గ్రామాల చెరువు కట్టల పునరుద్దరణ పనులకు సీఎం రేవంత్రెడ్డి రూ.1.97 కోట్లు మంజూరి చేయగా శుక్రవారం డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ భూక్య ఉమ, మండల నాయకులతో కలసి ఎమ్మెల్యే ప్రారంభించారు. మండలంలోని రాజులకొత్తపల్లి చెరువుకట్ట పునరుద్దరణ పనులతోపాటు కట్టపై చెట్లను తొలగించడం, తూముల మరమ్మతులకు రూ.1.45 కోట్లు, రావిరాల చెరువు కట్ట మరమ్మతులకు రూ.52 లక్షలు మొత్తం రెండు చెరువు కట్టల మరమ్మతులకు రూ.1.97కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. చెరువు కట్టల పునరుద్దరణ పనులను నాణ్యతగా చేపట్టాలని లేదంటే సంబంధిత అధికారుల సస్పెన్షన్ తప్పని హెచ్చరించారు. ఈ పనులను నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదళ్ల యాదవరెడ్డి, మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, యాయిని సత్యపాల్రెడ్డి, సర్పంచ్లు కొండ జనార్ధన్రెడ్డి, కత్తుల కల్యాణి యాకన్న, నాయకులు ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ -
కబడ్డీ కోచ్గా వరప్రసాద్
నర్సింహులపేట: హరియాణా రాష్ట్రంలోని పానిపట్లో జనవరి 12 నుంచి 16వ తేదీవరకు జరిగే 69వ అండర్–19 కబడ్డీ బాలుర క్రీడోత్సవాల్లో పాల్గొంటున్న తెలంగాణ జట్టుకు కోచ్గా మండలంలోని కొమ్ములవంచకు చెందిన తాళ్ల వరప్రసాద్ ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర కబడ్డీ జట్టుకు కోచ్గా ఎంపిక చేసినందుకు రాష్ట్ర ఎస్జీఎఫ్ బాధ్యులకు వరప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. వరప్రసాద్ ఎంపిక కావడంపై క్రీడాకారులు, బంధువులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. 1.780 కేజీల గంజాయి పట్టివేత మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి గ్రామ శివారు పెద్ద చెరువు కట్ట వద్ద ముగ్గురు యువకుల నుంచి 1.780 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని రూరల్ సీఐ సర్వయ్య శనివారం రాత్రి తెలిపారు. మహబూబాబాద్ రూరల్ పోలీసులు కంబాలపల్లి గ్రామంలో తనిఖీలు చేస్తుండగా చెరువు కట్ట సమీపంలో ముగ్గురు యువకులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారన్నారు. వారి వద్ద కిలో 780 గ్రాముల (రూ.85 వేల విలువ గల) గంజాయి లభ్యంకాగా ఆ గంజాయిని కలిగి ఉన్న హైదరాబాద్కు చెందిన కందుకూరి కేతన్ అలియాస్ బంటి, మానుకోట గిరిప్రసాద్ నగర్ కాలనీకి చెందిన నల్ల వరుణ్, జమాండ్లపల్లి గ్రామ శివారు చంద్రు తండాకు చెందిన బానోతు సునీల్ గా గుర్తించామని తెలిపారు. ముగ్గురు యువకులు తరచూ గంజాయి సేవించడంతోపాటు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. రూరల్ ఎస్సై దీపిక ఫిర్యాదు మేరకు ఏఎస్సై వెంకన్న కేసు నమోదు చేయగా ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని పేర్కొన్నారు. మూడు సెల్ ఫోన్లు సీజ్ చేశామని, మానుకోట ధర్మన్న కాలనీకి చెందిన బోడ వంశీ, బోడ కార్తీక్ పరారీలో ఉన్నారని సీఐ వెల్లడించారు. మేడారం భక్తులతో రామప్ప కళకళ వెంకటాపురం(ఎం) : మేడారం భక్తులతో రామప్ప ఆలయం కళకళ లాడుతోంది. సమ్మక్క–సారలమ్మల దర్శనానికి వెళ్లే భక్తులు రామప్ప ఆలయాన్ని చూసేందుకు వస్తుండడంతో రామప్ప కిక్కిరిసిపోతుంది. దీంతో పూజారులు గర్భగుడిలోకి భక్తులను అనుమతించకుండా ప్రదానం ద్వారం వద్దనే తీర్థప్రసాదాలు అందించి పంపిస్తున్నారు. వీకెండ్ కావడంతో శనివారం వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. నందీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. రామప్ప గార్డెన్లో ఆడుతూ ఉల్లాసంగా గడిపారు. రామప్ప సరస్సు వద్దకు వెళ్లి బోటింగ్ చేశారు. రామప్పను సందర్శించిన జిల్లా జడ్జి మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని మహబూబాబాద్ జిల్లా జడ్జి అబ్దుల్ రఫీ కుటుంబ సమేతంగా శనివారం సందర్శించారు. రామప్ప శిల్పకళా సంపదను గైడ్ వెంకటేష్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. శిల్పకళా సంపద బాగుందని కొనియాడారు. వనదేవతలకు ముందస్తు మొక్కులు ఎస్ఎస్తాడ్వాయి : మేడారంలో కొలువైన సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జంపన్న వాగులో షవర్ల కింద స్నా నాలు ఆచరించి, వనదేవతల గద్దెల వద్ద పసు పు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సుమారుగా 20వేల మంది భక్తులు అమ్మవార్ల ను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. కేయూ అథ్లెటిక్స్ జట్లు ఎంపిక కేయూ క్యాంపస్: బెంగళూరులోని రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్సైన్సెస్లో ఈనెల 10నుంచి ప్రారంభమై 14వ తేదీ వరకు కొనసాగనున్న ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సి టీ అథ్లెటిక్స్ టోర్నమెంట్కు కాకతీయ యూని వర్సిటీ అథ్లెటిక్స్ మెన్ అండ్ ఉమెన్ జట్లు పాల్గొనబోతున్నాయని స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య శనివారం తెలిపారు. పురుషుల జట్టులో ఎ.గౌతమ్, బి.రోషన్, డి.వివేక్చంద్ర, ఎస్.గోపిచంద్, సీహెచ్.వినయ్, ఆర్.అభినయ్, ఎం.అఖిల్, వి.గణేష్ ఉన్నారు. మహిళా జట్టులో ఎ.మైథిలి, బి.శృతి, సీహెచ్.కీర్తన ఉన్నారు. జట్లకు కేయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ డైరెక్టర్ ఎన్.సుమన్ మేనేజర్గా వ్యవహరిస్తారని వెంకయ్య తెలిపారు. -
అటుకులు.. అదుర్స్
రోజుకు క్వింటా వరకు..మా మిల్లులో రోజుకు క్వింటా ధాన్యం వరకు అటుకులుగా మార్చుతాం. దీని ద్వారా ఆదాయం లభి స్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ వరిపంట సీజన్ అయ్యే వరకు ఉంటాం. చుట్టూ పక్కల మండలాల నుంచి ఇ క్కడి వచ్చి తాజాగా అటుకులను పట్టించుకొని వెళ్తారు. తాజా నాటుఅటుకులు కొ నుగోలు చేసేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు. దీనికి డిమాండ్ బాగానే ఉంది. – మల్లికార్జున్, మిల్లు యజమాని, ఏటూరునాగారంఏటూరునాగారం : మార్కెట్, మార్ట్లకు వెళ్లి రెడీగా ఉన్న అటుకులు కొనుగోలు చేసి, నచ్చిన ఆహారాన్ని తయారు చేసుకొని తింటాం. అయితే అటవీ ప్రాంతాలకు చెంది ప్రజలు నాటురకం, సహజసిద్ధంగా తయారైన వాటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. జిల్లాలోని ఏటూరునాగారం మండల ప్రజలతో పాటు చుట్టు పక్కల గ్రామాల్లోని ప్రజలు నాటు అటుకులను తయారు చేసుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నారు. తయారీ విధానం.. ప్రస్తుతం వరిపంట చేతికి వచ్చే కాలం కావడంతో రైతులు, వ్యవసాయ కూలీలు ధాన్యాన్ని సేకరించి వాటిని 24 గంటల పాటు నీటిలో నానబెట్టి వడ కడతారు. నీరు ఒడిసిపోయిన తర్వాత మండల కేంద్రంలోని 7వ వార్డులో ఏపీకి చెందిన వారు నూతనంగా ఏర్పాటు చేసిన అటుకుల మిల్లు వద్దకు క్యూ కడుతున్నారు. అటుకులను తయారు చేసేందుకు ముందుగా ధాన్యం మేలి రకమైన ఇసుకను జోడించి ఒక పొయ్యి బట్టిలో కంచుడు (మూకుడు)లో వేపుతారు. వేయించిన వాటిని జల్లెడ పట్టి అటుకులు పట్టే మిషన్లో వేయడంతో ధాన్యం అంతా కూడా అటుకులుగా మారి బయటకు వస్తాయి. ఇలా అప్పటికప్పుడు తాజాగా ఉన్న అటుకలను ప్రజలు, మహిళలు వారి బస్తాల్లో నింపుకొని ఇంటికి తీసుకు వెళ్తున్నారు. కిలోకు రూ.15.. కిలో ధాన్యాన్ని అటుకులుగా మార్చినందుకు మిల్లు యజమాని కిలోకు రూ.15 వసూలు చేస్తున్నారు. అదే మిల్లు యజమానికి ధాన్యం అయితే కిలోకు రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు. ఇలా రోజుకు రూ.1,000 నుంచి రూ.2వేల వరకు ఆదాయం సంపాదిస్తున్నారు. ఈ మిల్లు కేవలం ఫిబ్రవరి 5 వరకు ఇక్కడ సీజన్ వరకు ఏర్పాటు చేశారు. మిల్లులో ఎప్పటికప్పుడు అటుకులను తాజాగా పట్టి ఇవ్వడం వల్ల ప్రజలు ఈ అటుకులను ఇష్టపడుతున్నారు. వీటితో అనేక రకాల ఆహార పదార్థాలు తయారు చేసుకోవడం ఇక్కడి వారి ప్రత్యేకత.ఇసుక, ధాన్యం వేరుచేస్తున్న యజమాని ధాన్యంతో సహజసిద్ధంగా తయారీ మక్కువ చూపుతున్న ఏజెన్సీ వాసులు -
జాతరలో వైద్యసేవల్లో ముందుండాలి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు సమష్టిగా పని చేయాలని హెల్త్ డైరెక్టర్ రవీందర్నాయక్ అన్నారు. ఈ మేరకు శనివారం మేడారంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు, జాతర ఇన్చార్జ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యాధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేసి జాతరలో వైద్య సేవల్లో ముందు వరుసలో నిలవాలని సూచించారు. ప్రణాళిక ప్రకారం అవసమైన మందులు, మంచాలు, శస్త్రచికిత్స పరికరాలను సమకూర్చుకోవాలని తెలిపారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ జాతరలో ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. జాతర సందర్భంగా 50 పడకల వైద్య సదుపాయం, 30 ఉచిత వైద్య శిబిరాలు, 40 ఎన్ రూట్ వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం టీడీడీ మండపంలో 50 పడకలతో ఏర్పాటు చేస్తున్న వైద్యశాలను పరిశీలించారు. సమావేశంలో డీఎంహెచ్ఓలు గోపాల్రావు, అల్లెం అప్పయ్య, డిప్యూటీ డీఎంహెచ్ఓ విపిన్కుమార్, జిల్లా ప్రోగ్రాం అధికారులు చంద్రకాంత్, రణధీర్, శ్రీకాంత్, సంపత్, డీపీఎంఓ సంజీవరావు, తదితరులు పాల్గొన్నారు. హెల్త్ డైరెక్టర్ రవీందర్నాయక్ -
ఇక.. వాహన రిజిస్ట్రేషన్ సులభం!
ఖిలా వరంగల్ : వాహన రిజిస్ట్రేషన్ కోసం ఇక నుంచి ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సిన పని లేదు. మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) మాదిరి శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చే బాధ్యతను షోరూం డీలర్లకు అప్పగించింది. ఇందు కోసం రవాణాశాఖ అన్ని ఏరాట్లు చేస్తోంది. ఈ ప్రక్రియ పదిహేను రోజుల్లో అమలయ్యే అవకాశముందని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. నాన్– ట్రాన్స్పోర్టు వాహనాలకు మాత్రమే.. నాన్– ట్రాన్స్ పోర్టు వాహనాలు బైక్, కార్లు రిజిస్ట్రేషన్ కోసం రవాణాశాఖకు వెళ్లి రోజంత పడిగాపులు కాయాల్సిన అవసరం ఇక లేదు. కేంద్ర మోటారు వాహన నియామాలు 1989లోని నియమం 48–(బీ) ప్రకారం అధికారిక ఆటో మొబైల్ డీలర్ ద్వారా విక్రయించిన పూర్తి నిర్మిత వాహనాలకు ఈ సౌకర్యం కల్పించారు. ఇందుకు గాను ప్రభుత్వం నుంచి గత నెల 19న కార్యాచరణ సూచనలు జారీ అయ్యాయి. ఉత్తర్వులు వెలువడిన పదిహేను రోజుల వ్యవధిలో డీలర్లు సాఫ్ట్వేర్ వ్యవస్థకు అవసరమైన మార్పులు వెంటనే చేసుకోవాల్సి ఉంటుందని రవాణాశాఖ పేర్కొంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరంగల్, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలో ఆరు ఆర్టీఏ కార్యాలయాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో ఇప్పటికే 8 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. రోజుకు 200 పైగా ద్విచక్రవాహనాలు, 20 నుంచి 30 వరకు కార్లు రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. 1,500 పైగా ఫిట్నెస్ అవుతాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ కంపెనీలకు సంబంధించిన ద్విచక్ర వాహనాలు షోరూంలు 82 ఉండగా కార్ల షోరూంలు 28 ఉన్నాయి. వీటితో పాటు సబ్ డీలర్ షోరూంలు ఉన్నాయి. రోజు 100 వరకు ద్విచక్రవాహనాలు, 5 నుంచి 10లోపు కార్లు విక్రయాలు అవుతాయని డీలర్లు చెబుతున్నారు. సమయం.. ఖర్చు ఆదా.. అన్ని పన్నులు షోరూం డీలర్లు ముందే వసూలు చేస్తున్నా తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రం మాత్రమే ఇచ్చేవారు. అన్ని పత్రాలు తీసుకుని రిజిస్ట్రేషన్కు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. ఈ సందర్భంలో రాకపోకలు, రవాణా ఖర్చులు, సమయం వృథా అయ్యేది. ముఖ్యంగా మధ్యవర్తుల ప్రమేయం ఎక్కువ ఉండేది. ఇకపై ఆ సమస్య తీరనుంది. డీలర్ల వద్దే శాశ్వత రిజిస్ట్రేషన్ కానుంది. ఫ్యాన్సీ సంఖ్య కావాలంటే అదనం.. ద్విచక్రవాహనం, కారుకు తాము కోరుకున్న నంబర్ లేదంటే ఫ్యాన్సీ సంఖ్య కావాలంటే తాత్కాలిక రిజిస్ట్రేషన్తోపాటు ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రవాణాశాఖ నిబంధనలు, అదనపు రుసుం చెల్లిస్తే కావాల్సిన సంఖ్యను రవాణాశాఖ అధికారులు కేటాయిస్తారు. ఇందుకోసం కొంత సమయం పడుతుంది. డీలర్లకే బాధ్యత అప్పగించిన ప్రభుత్వం ఆర్టీఏకు వెళ్లాల్సిన అవసరం లేదు వాహనదారుల్లో ఆనందం.. తీరనున్న ఖర్చులు, సమయం, రాకపోకల కష్టాలుకొత్త విధానం ఇలా.. వాహన షోరూంలో కొనుగోలు చేసిన వాహనాన్ని అఽధికారిక డీలరే శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయనున్నారు. అవసరమైన పత్రాలు (ఇన్వాయిస్, ఫారం 21, ఫారం–22, బీమా, చిరునామా రుజువు, వాహన ఫొటోలు మొదలైనవి) డీలర్ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ అవుతాయి. ఆ తర్వాత అప్లోడ్ చేసిన వాహన పత్రాలను రవాణాశాఖ అధికారి పరిశీలించి రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ) నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా వాహన యజమానికి పంపుతారు. ఈ విధానం అమలుతో ప్రజలకు సమయం ఆదా అవుతుంది. అలాగే, రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన పని తగ్గుతుంది. వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా పూర్తవుతుంది. అవసరమైతే రవాణాశాఖ అధికారులు వాహన షోరూంలను తనిఖీ చేస్తారు. దీని వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. -
ఘాట్రోడ్డులో ఆటో బోల్తా ..
● ఐదుగురు భక్తులకు గాయాలు పాలకుర్తి టౌన్: సోమేశ్వర లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ ఘాట్ రోడ్డులో శనివారం ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు భక్తులకు గాయాలయ్యాయి. హైదరాబాద్కు చెందిన 20 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు స్వామివారి దర్శనం కోసం ప్రత్యేక బస్సులో ఆలయం వచ్చారు. గుట్ట ఘాట్ రోడ్డు ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. తిరిగి ఆటోలో వస్తుండగా ఘాట్రోడ్డు మధ్యలో వాహనం బోల్తాపడి ఐదుగురు ఉపాధ్యాయులకు గాయాలయ్యాయి. వెంటనే ఆలయ అర్చకులు, సిబ్బంది స్పందించి క్షతగాత్రులను మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స నిర్వహించారు. సీఐ జానకీరాంరెడ్డి, ఎస్సై దూలం పవన్కుమార్ ప్రమాదం వివరాలు అడిగి తెసుకున్నారు. కాగా, సర్పంచ్ కమ్మగాని విజయ నాగన్న గౌడ్.. క్షతగాత్రులను పరామర్శించారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ ● 15 తులాల బంగారం, రూ.30 వేల నగదు అపహరణ హసన్పర్తి : తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన 56వ డివిజన్ గోపాలపురం శివసాయినగర్–1లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శివసాయినగర్–1కు చెందిన దాసరి గోపాలకృష్ణ ధర్మసాగర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అతని భార్య శ్రావణి కూడా ఉద్యోగి. శనివారం ఉదయం శ్రావణి ఉద్యోగానికి వెళ్లగా.. గోపాల కృష్ణ తన కూతురుని తీసుకుని స్కూల్కు వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి రాగా తలుపు ధ్వంసమై కనిపించింది. అనుమానంతో లోపలికి వెళ్లి బీరువాను పరిశీలించగా అందులో భ్రదపరిచిన సుమారు 15 తులాల బంగారు ఆభరణాలతోపాటు రూ.30వేలు నగదు కనిపించలేదు. దీంతో బాధితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందజేయగా ఇన్స్పెక్టర్ రవికుమార్ హుటిహుటినా ఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీసుల జాగీలాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం క్లూస్ టీమ్ సభ్యులు వేలిముద్రలు సేకరించారు. ఘటనాస్థలిని సందర్శించిన డీసీపీ సమాచారం అందుకున్న సెంట్రల్జోన్ డీసీపీ దార కవిత, సీసీఎస్ ఏసీపీ సదయ్య ఘటనా స్థలిని సందర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడారు. -
మరణంలోనూ వీడని స్నేహం..
లింగాలఘణపురం : మరణంలోనూ వారి స్నేహం వీడలేదు. ఆనందంగా పుట్టిన రోజు వేడుకలకు వెళ్లొస్తున్నారు. ఈ సమయంలో మృత్యువు కాటేసింది. కారు.. బైక్ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరూ దుర్మరణం చెందారు. ఈ ఘటనతో వనపర్తిలో విషాదం నెలకొంది. చావులోనూ వారి స్నేహబంధం వీడిపోలేదని పలువురు గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. ఎస్సై శ్రావణ్కుమార్ కథనం ప్రకారం.. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం వనపర్తి మర్రితండాకు చెందిన బానోత్ మోతీరామ్(55), దరిపల్లి నర్సింహులు(43) ప్రాణ స్నేహితులు. ఎక్కడికై నా ఇద్దరు కలిసే వెళ్తారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి జనగామలోని ఓ ఫంక్షన్ హాల్లో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మనవడి పుట్టిన రోజు వేడుకలు జరగగా ఇద్దరు వేర్వేరుగా వెళ్లారు. వేడుక పూర్తయిన అనంతరం తిరిగి మరో వ్యక్తి బానోత్ నర్సింహులుతో కలిసి ముగ్గురు బైక్పై వనపర్తికి బయలుదేరారు. ఈ క్రమంలో జనగామ– సూర్యాపేట రోడ్డుపై నవాబుపేట వద్ద రాత్రి 11.30 గంటల ప్రాంతంలో జమ్మికుంట నుంచి సూర్యాపేట వెపునకు కారులో వెళ్తున్న జమ్మికుంటకు చెందిన కర్నె శ్రీకాంత్.. బైక్ను వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మోతీరామ్, నర్సింహులును 108లో జనగామ జనరల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో వ్యక్తి బానోత్ నర్సింహులు చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. క్రూజర్లో వస్తే బతికేటోడేమో.. వనపర్తి నుంచి జనగామలోని ఫంక్షన్ హాల్కు క్రూజర్లో వెళ్లిన దరిపల్లి నర్సింహులు తిరిగి అదే వాహనంలో వస్తే బతికేటోడంటూ కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఫంక్షన్లో స్నేహితుడు మోతీరామ్ కలవడంతో అక్కడే ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. అనంతరం ఇద్దరం కలిసి బైక్పై వెళ్దామని నిర్ణయించుకున్నారు. అప్పటికే ముందుగా బానోత్ నర్సింహులుతో బైక్పై వచ్చిన మోతీరామ్ సరేనంటూ ముగ్గురు కలిసి ఫంక్షన్ హాల్ నుంచి బయలుదేరారు. మరో ఐదు కిలో మీటర్లులో స్వగ్రామానికి చేరుకునే సమయంలోనే నవాబుపేట వద్ద కారు.. బైక్ను ఢీకొంది. వచ్చిన వాహనంలోనే తిరిగి వెళ్తే ప్రాణాలు పోయేవి కావంటూ కొందరూ కంటతడి పెట్టారు. దరిపల్లి నర్సింహులుకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మోతీరామ్కు కొడుకు ఉండగా కూతురు పదిహేనేళ్ల క్రితం డెంగీతో చనిపోగా ఆమె విగ్రహాన్ని మర్రితండాలో ఏర్పాటు చేసి అందులోనే ఆమెను చూసుకుంటున్నాడు. పెద్ద మనిషిగా అందరికీ చేదోడువాదోడుగా ఉండే మోతీరామ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తండాలో విషాదం నెలకొంది. నర్సింహులు(ఫైల్) మోతీరామ్(ఫైల్) పుట్టిన రోజు వేడుకలకు వెళ్లొస్తూ మృత్యుఒడికి.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరి స్నేహితుల దుర్మరణం నవాబుపేట వద్ద ఘటన.. వనపర్తిలో విషాదం -
ఒకేచోట స్నేహితుల అంత్యక్రియలు
గార్ల: వారిద్దరు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ఎక్కడికెళ్లినా ఇద్దరు కలిసే వెళ్లేవారు. ఆడినా, పాడిన ఒకే చోట. విద్యభ్యాసం కూడా ఒకే చోట. అలా ఇద్దరు కలిసి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. అక్కడ గత నెల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందారు. మరణంలోనూ వారి స్నేహం వీడలేదు. చివరికి అంత్యక్రియల్లోనూ వారి స్నేహ బంధం వీడలేదు. ఇద్దరికి ఒకే దహన సంస్కారాలు నిర్వహించారు. దీంతో మరణంతోపాటు అంత్యక్రియల్లోనూ వారి బంధం విడిపోలేదని కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన పుల్లఖండం నాగేశ్వరరావు, ముల్కనూరు గ్రామానికి చెందిన కడియాల కోటేశ్వరరావు కూతుళ్లు మేఘనరాణి, భావన చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఒకే పాఠశాల, ఒకే కళాశాలలో విద్యనభ్యసించారు. ఉన్నత చదువు(ఎంఎస్) కోసం తమ తల్లిదండ్రులను ఒప్పించి కోసం అమెరికా వెళ్లారు. అక్కడ కూడా ఒకే గదిలో ఉండేవారు. ఎంఎస్ పూర్తి చేసిన వీరికి మరో 2 నెలల్లో అమెరికాలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ క్ర మంలో క్రిస్మస్ సెలవుల్లో స్నేహితులతో కలిసి కాలిఫోర్నియా సమీపంలో గల అలబామ హిల్స్ తిలకించేందుకు గత నెల 28వ తేదీన కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కారు బోల్తా పడడంతో అక్కడికక్కడే మృతిచెందారు. అమెరికాలోని ఎన్నారైల సహకారంతో శనివారం మృతదేహాలు స్వగ్రామాలకు చేరుకున్నాయి. ఇద్దరి తల్లిదండ్రులు అంగీకారంతో ముల్కనూరులో ఒకే చోట పక్కపక్కనే అంత్యక్రియలు పూర్తి చేశారు. శోకసంద్రంలో గార్ల, ముల్కనూరు గ్రామాలు.. మేఘనారాణి, భావన మృతదేహాలు స్వగ్రామాలకు చేరుకోగానే గ్రామస్తులు వందలాదిగా తరలొచ్చి బోరున విలపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య.. మేఘనారాణి, భావనకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వ్యాపారులు దుకాణాలు మూసివేసి స్వచ్ఛందంగా అంతిమయాత్రలో పాల్గొన్నారు. గార్ల పుర వీధుల్లో అంతిమయాత్ర నిర్వహించిన అనంతరం ముల్కనూరులో ఇద్దరి మృతదేహాలకు ఒకే ప్రాంతంలో అంత్యక్రియలు పూర్తిచేశారు. ముల్కనూరులో మేఘనారాణి, భావన దహన సంస్కారాలు పూర్తి శోకసంద్రంలో రెండు గ్రామాలు కన్నీటి వీడ్కోలు పలికిన కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు -
జలగలంచ అటవీ అందాలు రమణీయం
ఎస్ఎస్తాడ్వాయి: జలగలంచ అటవీ అందాలు రమణీయంగా ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. శనివారం జలగలంచ వాగు ప్రాంతంలో అటవీశాఖ ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్ను కలెక్టర్ దివాకర్ టీఎస్, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పట్టణాలు, కాలుష్యానికి దూరంగా ఉన్న జలగలంచ అడవిలో పర్యాటకులు సరదాగా గడపాలన్నారు. ఊటీ, కొడైకెనాల్కు దీటుగా ములుగు జిల్లాలో ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు ఉన్నాయన్నారు. బొగత జలపాతం, పస్రా–తాడ్వాయి మధ్య బ్లాక్ బైర్రీ ఐలాండ్, తాడ్వాయి హట్స్ వద్ద సఫారీ వంటి పర్యాటక కేంద్రాలు పర్యాటకులను ఆకర్షిస్తూ ప్రాచుర్యం పొందాయన్నారు. అనంతరం మంత్రి సీతక్క, అధికారులు జంగిల్ సఫారీ వాహనంలో తిరిగి జలగలంచ అడవి అందాలను వీక్షించారు. ఎత్తైన గుట్టపై ఏర్పాటు చేసిన మంచె పైనుంచి అడవి అందాలను వీక్షించిన మంత్రి సీతక్క.. ప్రకృతి సోయగాలకు ఫిదా అయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క -
నకిలీ ఉద్యోగాల ముఠా గుట్టురట్టు
ఆదిలాబాద్టౌన్: ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న ముఠా గుట్టును ఆదిలాబాద్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆదిలాబాద్ వన్టౌన్లో కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ముఠా వివరాలను శనివారం ఆదిలాబాద్లోని ఏఆర్ హెడ్క్వార్టర్స్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. నిందితుల్లో వరంగల్ గిర్మాజీపేటకు చెందిన అనంత ఈ–సొల్యూషన్ సీఈవో జిట్టబోయిన మధుకిరణ్, హనుమకొండలోని జఫర్గడ్కు చెందిన మాదాసి సుధాకర్, గోదావరిఖనిలోని కల్యాణ్నగర్కు చెందిన నమ్మని సతీశ్లను అరెస్టు చేయగా, హైదరాబాద్కు చెందిన సుజాత ఠాకూర్, లావణ్య పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరు 2013లో అనంత ఈ–సొల్యూషన్ పేరిట కంపెనీ స్థాపించి ఔట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించారని తెలిపారు. విద్యాంజలి 2.0 పథకం ద్వారా డబ్బులు దుర్వినియోగం చేయాలని, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే సీఎస్ఆర్ నిధులు కాజేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని నకిలీ నియామక ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. ఆయా జిల్లాల్లో ఏజెంట్లను నియమించి పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.2.50లక్షల వరకు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 240 మంది నిరుద్యోగులను మోసం చేశారని తెలిపారు. మూడు నెలలపాటు వేతనం అందించిన తర్వాత వేతనం రాకపోవడంతో బాధితులు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశారని తెలిపారు. వారికి సహకరించిన ఏజెంట్లను ఇదివరకే జిల్లాలోని పలు పోలీసుస్టేషన్లలో కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వివరించారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన వన్టౌన్ సీఐ సునీల్కుమార్, ఐటీ కోర్ ఆర్ఎస్సై గోపీకృష్ణలను ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, ఎస్సైలు గోపికృష్ణ, నాగనాథ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. నకిలీ నియామక ఉత్తర్వులు ఇస్తూ మోసం ముగ్గురి అరెస్ట్.. పరారీలో ఇద్దరు వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ ఎస్పీ ఆదిలాబాద్తోపాటు పలు జిల్లాల్లో బాధితులు -
షోరూంలోనే రిజిస్ట్రేషన్
డీలర్ వద్దే వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాత్కాలిక , శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన అన్ని పత్రాలు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ పత్రాలు పరిశీలించి ఆమోదం తెలుపుతాం. పదిహేను రోజుల్లో కొత్త సాఫ్ట్వేర్ వచ్చాక ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. –శోభన్బాబు, ఎంవీఐ, ఆర్టీఓ, వరంగల్ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కొత్త వాహనాలు తీసుకున్న తర్వాత చాలా మంది రిజిస్ట్రేషన్ల కోసం ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలిక , శాశ్వత రిజిస్ట్రేషన్ విషయంలో డీలర్లు బాధ్యతగా వ్యవహరిస్తారు. ఆర్టీఏలో గంటల కొద్ది వేచి ఉండే శ్రమ తగ్గింది. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. గాదె, స్వరూప్రెడ్డి, హనుమకొండ -
అనుబంధ రంగాలపై దృష్టి సారించాలి
మహబూబాబాద్ రూరల్ : రైతులు వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి సారించి ఆర్థికంగా బలోపేతం కావాలని వరంగల్ ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ డాక్టర్ ఉమారెడ్డి సూచించారు. శుక్రవారం మహబూబాబాద్ మండలంలోని మల్యాల కృషి విజ్ఞాన కేంద్రంలో సాంకేతిక సలహా సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఉమారెడ్డి హాజరై మాట్లాడారు. వానాకాలం వరి సాగు అనంతరం రెండో పంటగా పెసర, మినుము, బొబ్బెర, జనుమును సాగుచేసుకోవాలని సూచించారు. మల్యాల కేవీకే సమన్వయకర్త డాక్టర్ దిలీప్ కుమార్ కేవీకేలో జరుగుతున్న విస్తరణ, శిక్షణ, అవగాహన కార్యక్రమాలు, విత్తనోత్పత్తి, నిర్వహించిన వివిధ కార్యక్రమాలపై సమావేశంలో తెలియజేశారు. జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి మరియన్న, జిల్లా వ్యవసాయ అధికారి సరిత మాట్లాడుతూ.. యూరియాను మోతాదుకు మించకుండా వాడాలని పేర్కొన్నారు. ఆయిల్ పామ్, కూరగాయల సాగుతో రైతులు లాభం పొందాలని సూచించారు. కేవీకే శాస్త్రవేత్త క్రాంతికుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం వరి తర్వాత పొద్దుతిరుగుడు, పెసర, మినుము, జనుము సాగు చేయాలని వివరించారు. మరో శాస్త్రవేత్త సుహాసిని మాట్లాడుతూ.. ఉద్యాన పంటల సాగులో భాగంగా బంతిపూలు, కూరగాయల పంటల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వేసవి తీగజాతి కూరగాయల సాగును తెలియజేశారు. ఈ సమావేశంలో డీఈ నాముని, శివకృష్ణ, అభ్యుదయ రైతులు, అంగన్వాడీ సూపర్వైజర్లు పాల్గొన్నారు. వరంగల్ ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ డాక్టర్ ఉమారెడ్డి -
వారసత్వ సంపద దేశానికి గర్వకారణం
● హిమాచల్ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాకూర్ హన్మకొండ క ల్చరల్ : వారసత్వ స ంపదలు దేశానికి గర్వకారణ మని, ప్రతి భారతీయుడు దేశ సంస్కృతి, చరిత్రను తెలుసుకుని కాపాడుకోవాలని హిమాచల్ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాకూర్ పేర్కొన్నారు. శుక్రవారం హనుమకొండలోని చారిత్రక రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయాన్ని మంత్రి రోహిత్ ఠాకూర్ దంపతులు సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ వారిని ఆలయ మర్యాదలతో స్వాగతించారు. వారు రుద్రేశ్వరస్వామి వారికి పంచామృతాభిషేకం చేశారు. అనంతరం అర్చకులు ఆలయ నాట్యమండపంలో తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. ఆలయ స్తంభాల్లో చెక్కిన శిల్పకళను, సూదిపట్టే రంధ్రాలను, తలకిందుల చాప, మనిషి, కల్యాణ మండపం పరిశీలించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ కార్యక్రమాలను పరిశీలించేందుకు ఐఏఎస్లతో కలిసి ఇక్కడికి వచ్చానని తెలిపారు. దేవాలయాన్ని సందర్శించిన వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులను వారి చదువు, బోధనా పద్ధతులు, ఫలితాలు తదితర ఆంశాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి ఫొటో తీయించుకున్నారు. ఈఓ అనిల్కుమార్, సిబ్బంది మధుకర్, అర్చక, ఉద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డీవీఆర్ శర్మ పాల్గొన్నారు. -
మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
ఎస్ఎస్తాడ్వాయి : మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సూచించారు. శుక్రవారం పార్టీ నేతలతో కలిసి ఆయన అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం ఎత్తు బంగారం మొక్కుగా చెల్లించి, జాతర అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రాంచందర్రావు మాట్లాడుతూ.. జాతర సమీపిస్తున్న తరుణంలో ఇంకా అభివృద్ధి పనులు పూర్తి కాలేదని పేర్కొన్నారు. ఇప్పటికి 50శాతం పనులు కూడా పూర్తి కాలేదని ఆయన విమర్శించారు. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో పనులు వేగవంతంగా చేపట్టి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడారం జాతర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించాలని, రెండో పంట సాగు చేయకుండా నష్టపోతున్న రైతులు పరిహారం అందించాలని రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావును స్థానిక నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వీరేందర్, గౌతంరావు, జిల్లా ఇన్చార్జ్ నరేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భాస్కర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బలరాం, కార్యదర్శి భర్త పురం నరేష్, సమ్మక్క పూజారి సిద్దబోయిన సురేందర్, వనవాసీ కల్యాణ పరిషత్ జిల్లా కార్యదర్శి సంతోష్కుమార్ పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు -
డిజిటల్ లైబ్రరీతో సులభంగా సమాచారం
● ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం.మధుసూదన్ విద్యారణ్యపురి : డిజిటల్ లైబ్రరీతో సమాచార సేకరణ సులభతరమైందని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం.మధుసూదన్ పేర్కొన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో లైబ్రరీ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అకడమిక్ లైబ్రరరీస్ నావిగేటింగ్ చాలెంజెస్ లెవరేజింగ్ అపార్చునిటీస్’ అనే అంశంపై రెండ్రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. ఈ సభలో మధుసూదన్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పరిశోధనలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ను ఉపయోగించాలన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ హైదరాబాద్ అసిస్టెంట్ డైరెక్టర్ కోటేశ్వర్రావు మాట్లాడుతూ డిజిటలైజేషన్ చేసిన గ్రంథాలయాలు పూర్వ వైభవాన్ని పొందుతున్నాయని వివరించారు. ఈ సభలో ద్రవిడ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ అంజయ్య, పింగిళి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.సుహాసిని, సదస్సు కన్వీనర్ డాక్టర్ బి.యుగేందర్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. నేడు గార్లకు రానున్న భావన, మేఘన మృతదేహాలు● ముల్కనూరులో ఒకేచోట అంత్యక్రియలు గార్ల : అమెరికాలో డిసెంబర్ 28వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గార్ల మండలానికి చెందిన భావన, మేఘనరాణి మృతిచెందారు. కాగా శనివారం వారి మృతదేహాలు స్వగ్రామానికి రానున్నట్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గంగావత్ వెంకన్న శుక్రవారం తెలిపారు. ఎల్కేజీ నుంచి టెన్త్, ఇంటర్, ఇంజనీరింగ్ ఒకేచోట చదివారు. ఉన్నత చదువుల కోసం ఇద్దరు అమెరికాలో ఒకే రూమ్లో ఉండి విద్యనభ్యసిస్తున్నారు. అమెరికాలో క్రిస్మస్ సెలవులు రావడంతో కారులో విహారయాత్రకు వెళ్లి వారు మృతిచెందారు. వీరిద్దరి మృతదేహాలను ఒకేచోట ముల్కనూరు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు తల్లిదండ్రులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. 14రోజులుగా వీరి తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు చూపరులకు కంటతడి పెట్టిస్తుంది. తక్కువ ధరకే మొబైల్ అంటూ.. ● ఖాతా నుంచి రూ.86 వేలు మాయం ● పెద్దవంగరలో సైబర్ మోసంపెద్దవంగర : యూట్యూబ్ షార్ట్స్ వీడియోను నమ్మిన ఓ యువకుడు సైబర్ మోసానికి బలయ్యాడు. ఖరీదైన మొబైల్ ను తక్కువ ధరకే ఇస్తామన్న ఆకర్షణీయమైన ఆఫర్ చూసి సెల్ఫోన్ వస్తుందని నమ్మిన అతడు సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి నగదు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన మండల పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై ప్రమోద్ కుమార్ గౌడ్ కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రానికి చెందిన శ్రీరాం సాయివెంకట్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. డిసెంబర్ 31న మొబైల్లో యూట్యూబ్ షార్ట్స్ వీడియోలు చూస్తుండగా ఖరీదైన ఫోన్ అతి తక్కువ ధరకే వస్తోందన్న ప్రకటన కనిపించింది. అది నిజమని నమ్మిన సాయివెంకట్ అందులోని నంబర్కు మిస్డ్కాల్ ఇచ్చాడు. వెంటనే అవతలి నుంచి నిందితులు వాట్సాప్లో చాటింగ్ ప్రారంభించారు. మార్కెట్లో రూ.95 వేల విలువ చేసే సెల్ఫోన్ను కేవలం రూ.9,500కే ఇస్తామని సాయివెంకట్ను నమ్మించారు. ముందుగా రూ.899లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని కోరడంతో బాధితుడు ఈ నెల 7న వారు పంపిన క్యూఆర్ కోడ్ ద్వారా ఫోన్ పే చేశాడు. ఎప్పుడైతే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేశాడో అప్పటి నుంచి అతడి మొబైల్ సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లింది. బాధితుడి ప్రమేయం లేకుండానే అతడి బ్యాంకు ఖాతా నుంచి పలు విడతలుగా రూ.86,700 డెబిట్ అయ్యాయి. మోసపోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కార్డుతో కట్టడి..
యూరియా అధిక నిల్వలకు అవకాశం లేకుండా చర్యలుపంటల నమోదు, ఎరువుల యాజమాన్యం కార్డు సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో వానాకాలం సీజన్ నుంచి యూరియా బస్తాల కోసం ఇబ్బందులు పడుతున్న రైతులకు కాస్త ఊరట కలగనుంది. అవసరానికి మించి కొనుగోలు చేసే వారికి అడ్డుకట్ట వేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు రైతులకు ప్రత్యేక కార్డులు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్డులతో రైతులు సాగుచేసిన పంటల ఆధారంగా.. వ్యవసాయశాఖ సూచన మేరకు యాసంగిలో యూరియా బస్తాలు అందజేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. రైతులకు కార్డుల పంపిణీ.. పంటల సాగుకు అనుగుణంగా యూరియా పంపిణీ చేసేందుకు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేకంగా తయారు చేసిన కార్డులు పంపిణీ చేస్తున్నారు. పంటల నమోదు, ఎరువుల యాజమాన్యం పేరుతో ముద్రించిన 2.24లక్షల కార్డులను జిల్లా వ్యాప్తంగా రైతులకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. స్థానికంగా ఏఈఓలు నమోదు చేసిన పంటల వివరాలతో పాటు.. విత్తనాలు కొనుగోలు చేసిన కూపన్ ఆధారంగా ఎరువులు ఇస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన విధంగా ఎకరానికి వరికి మూడు బస్తాలు, మిర్చికి ఆరు బస్తాలు, మొక్కజొన్నకు ఐదు బస్తాల చొప్పున అందజేస్తున్నారు. అయితే ఈ బస్తాలు మూడు విడతలుగా రైతులకు అందిస్తారు. యూరియా తీసుకునే సమయంలో కార్డును చూపించి.. ఏ పంటలు ఎన్ని ఎకరాలు వేశారు. ఎన్ని బస్తాలు ఇవ్వాల్సి ఉంటుంది.. ఇప్పుడెన్ని ఇస్తున్నాం.. ఇంకా ఈ సీజన్లో ఎన్ని బస్తాలు ఇవ్వాలి అనే వివరాలు పొందుపరుస్తున్నారు. పంటల నమోదు, ఎరువుల యాజమాన్యం కార్డుల పంపిణీ విత్తనాల కొనుగోలు బిల్లు ఆధారంగా కేటాయింపు వరికి మూడు, మక్కకు ఐదు, మిర్చికి ఆరు బస్తాలు మూడు విడతలుగా రైతులకు పంపిణీకౌలు రైతులకు ఇబ్బంది..పంటల సాగు వివరాల ప్రకారం యూరియా అందజేస్తున్న వ్యవసాయశాఖ అధికారులు కౌలు రైతుల విషయంలో స్పష్టత ఇవ్వడం లేదని పలువురు కౌలు రైతులు చెబుతున్నారు. అయితే పంటల నమోదు, ఓటీపీలు భూమి యజమానికి వెళ్తున్నాయని, దీంతో తమ పంటలు సక్రమంగా నమోదు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా పంపిణీలో ఏఈఓల రికార్డులు కూడా ప్రమాణికంగా తీసుకొని క్షేత్రస్థాయిలో పంటల నమోదు చేయాలని, అప్పుడు అక్కడ ఉన్న కౌలు రైతులను గుర్తించి వారికి యూరియా అందజేయాలని కోరుతున్నారు. -
యూరియా పంపిణీ పరిశీలన
కురవి: మండల కేంద్రంలోని ఎఫ్ఎస్సీఎస్ కేంద్రం వద్ద రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో శుక్రవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. గ్రామాల వారీగా యూరియా పంపిణీ చేస్తున్నారని రైతులు ఆయనకు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు యూరియా రాలేదని ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ప్రతీరోజు సొసైటీల ద్వారా, ఏఆర్ఎస్కేల ద్వారా యూరియా పంపిణీ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీఏఓ సరిత, ఏఓ గుంటక నరసింహరావు, ఎంపీడీఓ వీరబాబు, సొసైటీ బాధ్యుడు జితేందర్, ఏఈఓలు పాల్గొన్నారు. -
వెంటాడిన మృత్యువు..
● రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, నలుగురికి తీవ్రగాయాలు ఏటూరునాగారం : సంక్రాంతి పండుగకు ఇంటి వచ్చిన కుమార్తెలతో కలిసి కొద్ద్ది నిమిషాల్లో థియేటర్లో సంతోషంగా సినిమా చూడాల్సిన తండ్రి, కూతుర్లను మృత్యువు వెంటాడి విడదీసింది. శుక్రవారం మండలంలోని రోహిర్ పంచాయతీ పరిధి 163 జాతీయ రహదారిపై భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో కారును టోషన్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాజేడు మండలానికి చెందిన కాకర్లపుడి వీరభద్రరాజు (వినోద్) (49) అక్కడికక్కడే మృతిచెందా డు. సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చిన తన కుమార్తెలు మేఘన, మధురిమ, తమ్ముడు మనోజ్, మరో బంధువు వత్సవాయి బుచ్చి గోపాలరాజు వర్మతో కలిసి వీరభద్రరాజు టీఎస్ ఎఫ్ 2799 నంబరు గల కారులో ఏటూరునాగారం వెళ్తున్నారు. ఈ క్రమంలో ఏటూరునాగారం వైపు నుంచి వస్తున్న ఏపీ 12 ఎల్ 2715 నంబరుగల టోషన్ వాహన డ్రై వర్ జాకీర్ హుస్సేన్ మద్యం మత్తులో అజాగ్రతగా నడిపి రాంగ్రూట్లో ఎదురుగా వచ్చి వీరి కారును ఢీకొట్టాడు. దీంతో కారు ముందు భాగంగా నుజ్జునుజ్జయింది. కారు నడుపుతున్న వీరభద్రరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. కారులోని మే ఘన, మధురిమతోపాటు మనోజ్, బుచ్చి గోపాలవర్మ తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే 108 వాహనంలో ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మృతుడి తమ్ముడు మనోజ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న ట్లు సమాచారం. అప్పటి వరకు ఎంతో ప్రేమగా మాట్లాడిన తమ తండ్రి కళ్లముందే ప్రాణం కోల్పో యి విగత జీవిగా పడి ఉండడాన్ని చూసి కుమార్తెలు రోదించిన తీరు చూపరులను కలిచి వేసింది. వి షయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలా న్ని పరిశీలించి మృతుడి తమ్ముడు వెంకట సత్యనరసింహరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజ్కుమార్ తెలిపారు. -
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
● వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం : ప్రతీ వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా నగర ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలతో పాటు హెల్మెట్ ప్రాధాన్యంపై అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీపీ హాజరై ర్యాలీని ప్రారంభించి, అధికారులు, సిబ్బందితో కలిసి హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ హనుమకొండ చౌరస్తా, ములుగు రోడ్, ఎంజీఎం, పోచమ్మ మైదానంలోని ఎస్ఆర్ కళాశాల వరకు కొనసాగింది. అనంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మాట్లాడారు. గతేడాది వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల కారణంగా 450కు పైగా మృత్యువాత పడ్డారని, అలాగే 9 లక్షల మంది వాహనదారులకు హెల్మెట్ ధరించని కారణంగా జరిమానాలు విధించామన్నారు. అనంతరం ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని విద్యార్థులచేత ప్రతిజ్ఞ చేయించారు. ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, వరంగల్ ఏఎస్పీ శుభం, అదనపు డీసీపీలు ప్రభాకర్ రావు, శ్రీనివాస్, సురేష్ కుమార్, ఏిసీపీలు సత్యనారాయణ, ప్రశాంత్ రెడ్డి, సురేంద్ర, నాగయ్య, జాన్ నర్సింహులతో పాటు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సీతారెడ్డి, వెంకన్న, సుజాత, నగరానికి చెందిన ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, ఎస్సెలు, పోలీసులు, యువత ర్యాలీలో పాల్గొన్నారు. -
వనదేవతల ఘనకీర్తి!
ప్రపంచ స్థాయికి సాక్షి ప్రతినిధి, వరంగల్/ములుగు/ఎస్ఎస్ తాడ్వాయి : భక్తుల కొంగు బంగారం, కోరిన కోరికలు తీర్చే సమ్మక్క–సారలమ్మలు, వనదేవతల ఘన కీర్తి ప్రపంచ స్థాయికి చాటి చెప్పేలా ఈసారి మహాజాతర నిర్వహించనున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క పేర్కొన్నారు. గిరిజన ఆదివాసీ సంప్రదాయాలు, చరిత్ర ఆధారాలు, పూజారుల అంగీకారంతో చేపట్టిన పునరుద్ధరణ పనులతో మేడారం ఆలయం ప్రపంచ చరిత్రలో ప్రత్యేక మైలురాయిగా నిలుస్తోందన్నారు. శుక్రవారం ఎస్ఎస్తాడ్వాయి మండలం మేడారం హరిత హోటల్లో మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్తో కలిసి మీడియా ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ..ఆదివాసులు మూల పురుషులుగా ఉన్నారని, ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహాజాతరలో గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, గొట్టు గోత్రాలు, ఆచారాలు ప్రతిబింబించేలా ఉంటాయన్నారు. రూ.251 కోట్లతో అభివృద్ధి పనులు.. తెలంగాణ ప్రభుత్వం రూ.251కోట్ల నిధులతో చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో మేడారం జాతర నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. రూ.101 కోట్లతో శాశ్వత నిర్మాణాలు, రూ.150 కోట్లతో మేడారం మాస్టర్ ప్లాన్, జాతర నిర్వహణ పనులు చేపట్టినట్లు వివరించారు. ప్రతి రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెల వెలుగుల్లో గిరిజనుల డోలు వాయిద్యాల నడుమ జిల్లా అధికారుల గౌరవ వందనంతో వనదేవతలు గద్దెలపైకి రావడంతో భక్తజనం పులకరిస్తారని పేర్కొన్నారు. ఈ మహాద్భుత ఘట్టం కోసం కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. జాతరలో మహిళా సంఘాల సభ్యులకు ప్రాధాన్యం ఇస్తూ వారికి బొంగు చికెన్, ఇప్పపువ్వు లడ్డు ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేయించినట్లు సీతక్క వివరించారు.ఈ సమావేశంలో ములుగు ఆర్డీఓ వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా మహాజాతర మేడారం మహాజాతరను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. సుమారుగా 21 ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఒకే బృందంగా పనులు చేపట్టారు. 90 శాతంకు పైగా పనులు పూర్తయ్యాయి. సంక్రాంతి నుంచి అధికార యంత్రాంగం జాతర మోడ్లో ఉంటుంది.జాతర సమయంలో 30వేల మంది సిబ్బంది, జాతర అనంతరం 6వేల మంది విధులు నిర్వహించేలా ప్లాన్ చేశాం. జాతర ప్రాంతాన్ని 8 జోన్లుగా, 42 సెక్టార్లుగా విభజించి ప్రతి జోన్లో 8 మంది, ప్రతి సెక్టార్లో 30–40 మంది అధికారులు ఉండేలా డ్యూటీలు వేశాం. – దివాకరటీఎస్, కలెక్టర్, ములుగు బందోబస్తుకు 11వేల మంది పోలీసులుజాతర సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తాడ్వాయి–మేడారం, పస్రా–మేడారం రోడ్లవెంట ప్రతి 2 కిలోమీటర్లకు ఒక చెక్పోస్ట్ను ఏర్పాటు చేస్తున్నాం. జాతర నిర్వహణకు సుమారు 20మంది ఐపీఎస్లు, ఇతర అధికారులు, పోలీసులు కలిపి 11వేల మంది సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తున్నాం. భక్తులకు సేవలు అందించడానికి స్థానిక యువత సిద్ధంగా ఉన్నారు. జాతర పరిసరాలను 450 సీసీ టీవీ, 20 ప్రత్యేక డ్రోన్స్ నిఘాతో పర్యవేక్షణ.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గద్దెల ప్రాంగణంలో భక్తుల రద్దీని పర్యవేక్షిస్తారు. – రాంనాథ్ కేకన్, ఎస్పీ, ములుగుచరిత్రలో ప్రత్యేక మైలురాయిగా మేడారం రూ.251కోట్లతో ఏర్పాట్లు.. అవసరమైతే మరిన్ని నిధులు మేడారం అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి వనదేవతల మహాజాతరకు అన్ని ఏర్పాట్లు.. మీడియాతో రాష్ట్ర మంత్రి సీతక్క మేడారం సమీపంలోని కన్నెపల్లిలో గల సారలమ్మ ఆలయాన్ని రాష్ట్ర మంత్రి సీతక్క శుక్రవారం పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టిన ఏర్పాట్లను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్తో కలిసి ఆమె పరిశీలించి అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. కన్నెపల్లి సారలమ్మ ఆలయాన్ని రంగులతో సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఆలయం వద్ద భక్తుల కోసం తాగునీటి ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అనంతరం జంపన్నవాగులో జరుగుతున్న పనులను పరిఽశీలించి త్వరగా పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. -
వనదేవతల ఆర్చ్లకు ఐరన్ గేట్లు
ఎస్ఎస్తాడ్వాయి : మేడారంలోని సమ్మక్క–సారలమ్మల సాలహారం చుట్టూ ఆర్చ్ ద్వారాలకు ఐరన్ గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆర్చ్ స్తంభాలపై పీటీ బీమ్లను ఏర్పాటు చేసిన అనంతరం గేట్లు బిగిస్తున్నారు. కోట్లాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకునే నేపథ్యంలో భక్తుల రద్దీ నియంత్రణ, దర్శనాలు సాఫీగా జరిగేలా ఐరన్ గేట్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గద్దెల ప్రాంగణంలో క్యూలైన్.. వనదేవతల గద్దెల ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం స్టీల్ క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. టీటీడీ కల్యాణ మండపం, పోలీసు కమాండ్ కంట్రోల్ రూం దారిలోని క్యూలైన్ల ద్వారా భక్తులు ఆలయంలోకి ప్రవేశించి గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్యూలో రానున్నారు. క్యూలోకి ప్రవేశించే ముందు ఎంట్రెన్స్లో కొబ్బరి కాయలు కొట్టేందుకు స్టాండ్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. క్యూలో వచ్చిన భక్తులు గద్దెల లోపలకి వెళ్లి అమ్మవార్లకు మొక్కలు చెల్లించుకోనున్నారు. -
‘పది’లో మెరుగైన ఫలితాలు సాధించాలి
బయ్యారం: పదో తరగతి వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని డీఈఓ రాజేశ్వర్ అన్నారు. మండలంలోని జగ్గుతండాలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వసతి గృహం నిర్వహణ, సదుపాయాలను పరిశీలించారు. అనంతరం తరగతి గదులను సందర్శించి విద్యార్థ్ధులతో మాట్లాడి వారి అభ్యసన స్థాయిని అంచనా వేశారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. ఏసీజీఈ మందుల శ్రీరాములు, ఎస్ఓ నీలిమ పాల్గొన్నారు. ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలి గంగారం: పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేలా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని డీఈఓ రాజేశ్వర్ అన్నారు. మండలం కేంద్రంలోని కేజీబీవీని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయు ల హాజరుశాతం, వసతి గృహాల నిర్వహణ, ఆరో గ్యం, శుభ్రత, సదుపాయాలు, భోజనశాల, వంటగది, హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం పాఠశాల రికార్డులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఏసీజీఈ మందుల శ్రీరాములు, ఎస్ఓ సుజాత, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కేజీబీవీ ఆకస్మిక తనిఖీ కొత్తగూడ: మండలంలోని పోలారం కస్తూర్బాగాంధీ పాఠశాలను డీఈఓ రాజేశ్వర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వసతుల గురించి తెలుసుకున్నారు. సోలార్ వాటర్ హీటర్ పని చేయకపోవడం వల్ల చన్నీటిస్నానం చేయలేకపోతున్నామని విద్యార్థులు తెలిపారు. ఆర్ఓ వాటర్ ప్లాంట్ బిగించి ప్రారంభించలేదని, తదితర సమస్యలు డీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. ప్లాంట్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని డీఈఓ తెలి పారు. జిల్లాలోని అన్ని కేజీబీవీల్లో సోలార్ వాటర్ హీటర్లు పని చేయడం లేదని వాటి స్థానంలో కొత్తవి బిగించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు. అనంతరం పాఠశాల రికార్డులు పరిశీలించారు. ఆయన వెంట ఎస్ఓ సౌమ్య ఉన్నారు. -
లబ్ధిదారులను ఇబ్బందిపెడితే చర్యలు
● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ మహబూబాబాద్ రూరల్ : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదా రులను ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ హెచ్చరించారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఎంపీడీఓలతో జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదోడి చిరకాల కోరిక సొంతింటి కల అని, రేవంత్ రెడ్డి సర్కారు అర్హులకు ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తోందన్నారు. లబ్ధిదారులకు నిబంధనల ప్రకారం వెనువెంటనే బిల్లులు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతీ లబ్ధిదారుడికి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు న్యాయం జరగాలని, ఫైళ్లను పెండింగ్లో పెట్టకుండా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా పర్యవేక్షణ పెంచాలని, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు పూర్తిస్థాయిలో చేరాలంటే అధికారులు బాధ్యతతో పనిచేయాలని పేర్కొన్నారు. సమావేశంలో హౌసింగ్ పీడీ, డీఈ, ఏఈలు, నియోజకవర్గ పరిధిలోని ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన
బయ్యారం: మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్ శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కేంద్రం నిర్వాహకులతో మాట్లాడుతూ.. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కాంటాలు పెట్టి మిల్లులకు తరలించాలని సూచించారు. ఆయన వెంట ఏఈఓ ఫయాజ్, నిర్వాహకులు గణేశ్, జనార్దన్ రెడ్డి ఉన్నారు. 12న జాబ్ మేళామహబూబాబాద్: జిల్లా ఉపాధిశాఖ ఆధ్వర్యంలో ఈనెల 12న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రజిత శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీరామ్లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్గా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జాబ్మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. మానుకోట, కేసముద్రం, గూడూరు, మరిపెడ, సీరోలు, కుర వి, గార్ల, బయ్యారం, చిన్నగూడూరు మండలాల్లో పనిచేయడానికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉండి 20నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు వారు అర్హులన్నారు. ఈనెల 12న ఉదయం 10.30నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు కార్యాలయంలో జాబ్మేళా ఉంటుందని, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. పూర్తి వివరాల కోసం కార్యాలయంలో సంప్రదించాలన్నారు. డోర్నకల్ ఎఫ్ఆర్వోగా విజయలక్ష్మిడోర్నకల్: డోర్నకల్ ఇన్చార్జ్ ఎఫ్ఆర్వోగా విజయలక్ష్మి శుక్రవారం నియమితులయ్యారు. ఇక్కడ పని చేసిన ఎఫ్ఆర్వో రేణుక సండ్ర కర్ర అక్రమ రవాణా వ్యవహారంలో ఇటీవల సస్పె ండ్ అయ్యారు. ఆమె స్థానంలో తొర్రూరు ఎఫ్ ఆర్వో విజయలక్ష్మి నియమితులయ్యారు. ట్రెస్సా జిల్లా అధ్యక్షుడిగా సునీల్మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెస్సా) జిల్లా నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా సునీల్, ప్రధాన కార్యదర్శిగా ఫిరోజ్, అసోసియేట్ అధ్యక్షుడిగా రాజేశ్వర్రావు, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్, బాలకిషన్, కోశాధికారిగా కృష్ణ ప్రసాద్తో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. అంగన్వాడీ సెంటర్లనుపరిశుభ్రంగా ఉంచాలిడోర్నకల్: అంగన్వాడీ కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుతూ పిల్లల భద్రతపై శ్రద్ధ వహించాలని డీడబ్ల్యూఓ సబిత కోరారు. మండలంలోని అమ్మపాలెం రైతువేదిక భవనంలో శుక్రవారం నిర్వహించిన డోర్నకల్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలను ఉదయం 9నుంచి సాయంత్రం 4గంటల వరకు తెరిచి ఉంచాలని, టీచర్లు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం ప్రీ స్కూల్ కార్యక్రమాలు, పోషణ సేవలు నిర్వహించాలని, బీఎల్ఓలుగా నియమితులైన వారు తహసీల్దార్ ఆదేశాల ప్రకారం విధులు నిర్వర్తించాలని సూచించారు. సీడీపీఓ లక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. -
కార్మికుల భద్రతపై పట్టింపేది..?
బయ్యారం: పొట్టకూటి కోసం పిల్లాపాపలతో పొరుగు రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు ఇటుకబట్టీల్లో మగ్గుతున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి బతుకీడుస్తున్నారు. కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన యాజమాన్యాలు తాత్కాలిక షెడ్లు వేసి తమ పనులు పూర్తి చేసుకుంటున్నారు. వసతిపై దృష్టి సారించాల్సిన కార్మికశాఖాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో ప్రతీ ఏడా ది వలస కార్మికులు దుర్భర జీవితం గడుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేస్తున్న అధికారులు, యజమానులు ఆ తర్వాత కార్మికులను వదిలేస్తున్నారు. ఇటుకబట్టీల్లో ఒడిశా, ఛత్తీస్గఢ్ కార్మికులు.. ఇటుకబట్టీల్లో పనిచేసేందుకు స్థానికంగా కార్మికుల కొరతతో యజమానులు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొస్తుంటారు. గంధంపల్లి, కొత్తపేట, నామాలపాడు గ్రామాల పరిధిలో సుమారు 50 ఇటుకబట్టీలు కొనసాగుతుండగా వీటిలో దాదాపు 2 వేల మంది కార్మికులు పనులు చేస్తున్నారు. వీరందరూ తాము పనిచేసే బట్టీల వద్ద యజమానులు ఏర్పాటు చేసిన తాత్కాలిక నివాసాల వద్దే కుటుంబాలతో జీవిస్తూ పనుల్లో నిమగ్నమవుతారు. అన్నీ ఆరుబయటనే.. ఇటుకబట్టీల వద్ద కార్మికులు, వారి పిల్లలకు మరుగుదొడ్లు అందుబాటులో ఉండవు. వీటితో పాటు మహిళా కార్మికులు స్నానాలు చేసేందుకు సైతం గదులు ఏర్పాటు చేయకపోవడంతో వారు బట్టీల సమీపంలో ఉన్న బోర్లు, ఏటి ప్రాంతంలో ఆరుబయటనే స్నానాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ప్రాణాలు పోతున్నా.. ఇటుకబట్టీల వద్ద ఏర్పాటు చేసిన నివాసాలు విషపురుగులకు నిలయంగా మారాయి. వీటితో పాటు అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్తీగలతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మూడేళ్ల క్రితం ఒక బట్టీ వద్ద రాత్రి వేళ నిద్రిస్తున్న సమయంలో కార్మికుడి కుమార్తెకు విషపురుగు కుట్టడంతో మరణించింది. రెండు సంవత్సరాల క్రితం ఒక బట్టీలో విద్యుత్ కనెక్షన్లు సరిగా లేక ఒక కార్మికుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇలా వెలుగులోకి రాకుండా మరణించిన కార్మికుల మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా వారి స్వస్థలాలకు పంపించిన ఘటనలు గతంలో ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. మామూలుగానే వదిలేస్తున్న అధికారులు.. కార్మికులకు యజమానులు కనీస వసతులు కల్పించడంతో పాటు వారికి చట్టపరమైన వేతనాలు, సెలవులు తదితర సౌకర్యాలను కల్పించేవిధంగా కార్మికశాఖాధికారులు కృషి చేయాల్సి ఉంటుంది. అయితే ఆ శాఖాధికారులు కేవలం యజమానులతో సమావేశాలు పెట్టి చేతులు దుపులుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు కార్మికులకు కనీస వసతులను కల్పించేలా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇరుకుగదుల్లో విషపురుగుల నడుమ నివాసం ఆరుబయటనే కాలకృత్యాలు దుర్భర జీవనం గడుపుతున్న ఇటుకబట్టీ కార్మికులు -
హెల్మెట్ ధరిస్తే అభినందన
మహబూబాబాద్ రూరల్ : హెల్మెట్ ధరించిన వారికి చాక్లెట్ ఇచ్చి అభినందించారు.. ధరించని వారికి పువ్వు ఇచ్చి పెట్టుకోవాల్సిందిగా అభ్యర్థించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని నెహ్రూసెంటర్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సీనియర్ సివిల్ జడ్జి శాలిని షాకెల్లి ప్రత్యేక శిబిరం నిర్వహించి వాహనదారులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె హెల్మెట్ ధరించిన వారికి చాక్లెట్ ఇచ్చి అభినందనలు తెలిపారు. అలాగే హెల్మెట్ ధరించని వారికి పారా లీగల్ వలంటీర్ల ద్వారా పువ్వు ఇప్పిస్తూ హెల్మెట్ పెట్టుకోవాల్సిందిగా అభ్యర్థించారు. అనంతరం మార్కెట్ సెంటర్లో వాహనదారులకు రోడ్డు నియమాలపై అవగాహన కల్పించి మాట్లాడారు. దూర ప్రాంతాలైతేనే హెల్మెట్ ధరిస్తామని, దగ్గర ప్రాంతాలకు అవసరం లేదనే భ్రమను వాహనదారులు తొలగించుకోవాలన్నారు. వాహనం నడుపుతున్న అన్నివేళల్లో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు సాయిచరణ్, వెంకటరెడ్డి, ట్రాఫిక్ ఎస్సై అరుణ్ కుమార్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కృష్ణ, పారా లీగల్ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. పెట్టుకోకుంటే అభ్యర్థన వినూత్న కార్యక్రమం చేపట్టిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ -
క్రీడల్లో గెలుపోటములు సహజం
ఏటూరునాగారం : క్రీడల్లో గెలుపు, ఓటమి సహజమని క్రీడాకారులు ఓటమిని రేపటి గెలుపుకోసం స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఐటీడీఏ పీఓ చిత్రమిశ్రా పేర్కొన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని కొమురం భీమ్ మినీ స్టేడియంలో మూడ్రోజుల పాటు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు శుక్రవారం ముగిశాయి. పోటీల్లో గెలుపొందిన విజేతలకు పీఓ చిత్రమిశ్రా షీల్డులు అందజేసి అభినందించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని కోరారు. వాలీబాల్ అండర్–14 విభాగంలో.. ● బాలుర విభాగంలో ఉట్నూర్–1 జట్టు మొదటి స్థానం సాధించింది. భద్రాచలం రెండో స్థానంలో ఏటూరునాగారం జట్టు మూడో స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో.. ● భద్రాచలం జట్టు ప్రథమ, ఏటూరునాగారం జట్టు ద్వితీయ, ఉట్నూర్–1 మూడో స్థానం కై వసం చేసుకున్నారు. వాలీబాల్ అండర్–17.. ● బాలుర విభాగంలో భద్రాచలం జట్టు మొదటి స్థానం, ఏటూరునాగారం రెండో స్థానం, ప్లేన్ ఏరియా ఐ మూడోస్థానంలో విజయం సాధించింది. బాలికల విభాగంలో.. ● ఉట్నూర్ జట్టు ప్రథమం, భద్రాచలం జట్టు ద్వితీయ, ఏటూరునాగారం తృతీయ స్థానంలో నిలిచింది. ఖోఖో అండర్–17 బాలుర విభాగంలో.. ● ఉట్నూర్–1జట్టు ప్రథమ స్థానం, ఏటూరునాగారం ద్వితీయ స్థానం, భద్రాచలం మూడో స్థానాన్ని కై వసం చేసుకుంది. బాలికల విభాగంలో.. ● ఉట్నూర్ జట్టు–2 ప్రథమ స్థానం, భద్రాచలం ద్వితీయ, ఏటూరునాగారం తృతీయ స్థానంలో విజయం సాధించారు. కబడ్డీ అండర్–17 బాలుర.. ● భద్రాచలం జట్టు మొదటి స్థానం, ప్లేన్ ఏరియా జట్టు–1 రెండో స్థానం, ఏటూరునాగారం మూడో స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో.. ● భద్రాచలం జట్టు ప్రథమ, ప్లేన్ ఏరియా జట్టు–2 ద్వితీయ, ఏటూరునాగారం జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. కబడ్డీ అండర్–14 బాలుర.. ● ప్లేన్ ఏరియా జట్టు మొదటి స్థానం, ఉట్నూర్ జట్టు–1 రెండో స్థానం, ఏటూరునాగారం జట్టు మూడో స్థానంలో విజయం సాధించింది. బాలికల విభాగంలో.. ● భద్రాచలం జట్టు ప్రథమ, ఏటూరునాగారం జట్టు ద్వితీయ, ఉట్నూర్–1 తృతీయ స్థానంలో విజయం సాధించింది. ● అథ్లెటిక్స్లో షాట్పుట్, వంద మీటర్ల పరుగు పందెం, అండర్ –17 బాలికల విభాగంలో చెస్ తదితర పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ దబ్బగట్ల జనార్దన్, దేశిరాం , ఏటీడీఓ, ఏసీఎంఓ, స్పోర్ట్స్ అధికారులు, భీమ్లా, పార్ధసారధి, రమేష్, కిష్టు, కొమ్మాలు, ఆదినారాయణ, శ్యామలత, వివిధ పాఠశాలల పీజీహెచ్ఎంలు, కన్వీనర్లు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ చిత్రమిశ్రా ముగిసిన రాష్ట్రస్థాయి గిరిజన క్రీడాపోటీలు -
బీసీ ఉద్యోగుల జోలికి వస్తే తోలుతీస్తా
హన్మకొండ : బీసీ విద్యుత్ ఉద్యోగుల జోలికి వస్తే తోలు తీస్తానని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. శుక్రవారం వరంగల్ ఉర్సులోని ఓ ఫంక్షన్ హాల్లో తెలంగాణ బీసీ విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ నిర్వహించారు. ఈ సభలో ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతిబా పూలే, సావిత్రి బాయి పూలే చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్ల అమలుకు చేపట్టిన బంద్ విజయవంతం కావడంతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందన్నారు. బీసీ విద్యుత్ ఉద్యోగుల్లా అన్ని ప్రభుత్వ శాఖల్లో బీసీ ఉద్యోగులు సంఘం ఏర్పాటు చేసుకుని ఏకం కావాలన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, సంస్థఽల్లోని కాంట్రాక్ట్, ఆర్టిజన్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్ మాట్లాడుతూ.. విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ కమిటీ ఏర్పాటు చేసి ఏప్రిల్ 1నుంచి నూతన వేతనాలు అమలు చేయాలన్నారు. ఈ మహాసభలో సంఘం 2026 నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ను ఆర్.కృష్ణయ్య ఆవిష్కరించారు. నాయకులు నీలారపు రాజేందర్, నాగెళ్లి సదానందం, జి.బ్రహ్మేంద్ర రావు, ఎం.విజయ్కుమార్, ప్రేమ్ కుమార్, పి.యాదగిరి,బొబ్బిలి మురళి, ఎం.అశోక్ కుమార్, మారం శ్రీనివాస్, రంగు సత్యనారాయణ, నాగవెల్లి ప్రసాద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య -
ల్యాబ్ల నిర్వహణకు నిధులు
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సైన్స్ ల్యాబ్ల నిర్వహణకు ఇంటర్ బోర్డు నిధులు విడుదల చేసింది. త్వరలో ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్కో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రూ.50 వేల చొప్పున.. జిల్లాలోని పది కాలేజీలకు రూ.5లక్షలు విడుదల చేసింది. ఈ నిధులతో ల్యాబ్ల్లో అవసరమైన పరికరాలు, ఇతర సౌకర్యాలు సమకూర్చుకోవాలని సూచించింది. అలాగే ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ, కెమికల్స్, ఇతర వస్తువుల కొనుగోలు కోసం నిధులను వినియోగించుకోనున్నట్లు ఇంటర్ విద్యాశాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో 8257 విద్యార్థులు.. జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్పై మరింత కట్టుదిట్టమైన నిఘా పెట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. గత విద్యా సంవత్సరం సీసీ కెమెరాలు అమర్చి, కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించగా.. ఈసారి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో జనరల్ గ్రూప్ ఇంటర్ ఫస్టియర్లో 3,148 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 3,100 మంది, ఒకేషనల్ ఫస్టియర్లో 998 మంది విద్యార్థులు, ఒకేషనల్ ద్వితీయ సంవత్సరంలో 1,011 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2నుంచి 21వ తేదీ వరకు ఉదయం, సాయంత్రం నిర్వహిస్తారు. వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25నుంచి మార్చి15వ తేదీ వరకు సీసీ కెమెరాల నిఘాలో జరగనున్నాయి. డిపార్ట్మెంటల్ అధికారులతో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయనున్నారు. కాగా ఆయా కళాశాలల విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షలకు విడుదల చేసిన నిధులను సక్రమంగా ఖర్చు చేస్తారో లేదో వేచి చూడాలి. సీసీ కెమెరాల మధ్య ప్రాక్టికల్ పరీక్షలు ప్రాక్టికల్ సామగ్రి, రసాయనాల కొనుగోలుకు ఇంటర్ బోర్డు జిల్లాలోని 10కళాశాలలకు రూ.5లక్షలు విడుదల చేసింది. కలెక్టర్ అ నుమతితో వారం రోజుల్లో ప్రాక్టికల్ సామగ్రిని కొనుగోలు చేసి విద్యార్థులకు ఉపయోగించాలి. గత ఏడాది మాదిరిగానే సీసీ కెమెరాలు మధ్య ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. – సీహెచ్. మదార్గౌడ్, డీఐఈఓ ఇంటర్ ప్రాక్టికల్స్కు రూ.ఐదు లక్షలు మంజూరు ఒక్కో ప్రభుత్వ కళాశాలకు రూ.50వేల చొప్పున విడుదల జిల్లాలో 8,257మంది విద్యార్థులు -
యూరియా కొరత లేదు
జిల్లాలో యాసంగి సీజన్లో రైతులు సాగుచేసిన పంటలకు సరిపడా యూరియా అందుబాటులో ఉంది. రైతులు ఆందోళన చెందాల్సి న అవసరం లేదు. ఈ సీజన్లో 59వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని 112 ప్రభుత్వ ఆగ్రోస్, రైతు సేవా సమితి, పీఏసీఎస్ మొదలైన వాటితోపాటు 439 ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపులకు యూరియా సరఫరా చేశాం. రైతుకు నచ్చిన చోటుకు వెళ్లి యూరియా తీసుకునే అవకాశం కల్పించాం. కౌలు రైతుల విషయంలో కూడా ఏఈఓలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. పంటల సాగును పరిశీలించి యూరియా అందించేలా చర్యలు తీసుకుంటారు. – బి. సరిత, డీఏఓ -
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
● ఇద్దరి పరార్, మూడు బైక్ల స్వాధీనం జనగామ: బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని జనగామ పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరార్ అయ్యారు. శుక్రవారం సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామానికి చెందిన నిందితుడు చర్లపల్లి కార్తీక్, అతని బంధువులు హుజూరాబాద్కు చెందిన దండుగుల వెంకటేష్, నల్లబెల్లికి చెందిన(ప్రస్తుత నివాసం మూసాపేట్) హేమంత్లతో కలిసి ఇటీవల హైదరాబాద్లో కూలిపని చేస్తూ బతుకుతున్నారు. కూలి పనితో వచ్చిన డబ్బులను జల్సాలు, చెడు వ్యసనాల కోసం ఖర్చు చేస్తూ మేడారం జాతర సమయంలో మోటార్ సైకిళ్లు సులభంగా దొంగిలించవచ్చని ప్లాన్ వేసుకున్నారు. ఈ నెల 3వ తేదీన హైదరాబాద్ నుంచి మేడారం వైపు వెళ్తున్న ముగ్గురు బీబీనగర్ టోల్ప్లాజా, జనగామ మండలం పెంబర్తి గ్రామం సమీపంలో మరో మోటార్ సైకిల్ను దొంగిలించారు. హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్న బైక్ను అక్కడే వదిలి వెళ్లారు. రఘునాథపల్లిలో ఓ ఇంటి బయట పార్కింగ్ చేసిన స్కూటీ దొంగిలించి, మూడు ద్విచక్రవాహనాలపై మేడారం జాతరకు వెళ్లి, తిరిగి బయల్దేరారు. ఈ క్రమంలో వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, సీఐ సత్యనారాయణెడ్డి పర్యవేక్షణలో పెంబర్తి వై జంక్షన్ వద్ద ఎస్సై నర్సయ్య తనిఖీ చేస్తున్న క్రమంలో ముగ్గురు పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు వెంబడించి కార్తీక్ను పట్టుకోగా, హేమంత్, వెంకటేష్ ఇద్దరూ తమ వద్ద ఉన్న రెండు బైక్లను వదిలేసి పరారయ్యారు. విచారణలో కార్తీక్ చేసిన నేరాలను ఒప్పుకోగా, మూడు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ప్రతిభ కనబరిచిన సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సై నర్సయ్య, కానిస్టేబుళ్లు సాగర్, కృష్ణ, అనిల్, రమేశ్ను వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ అభినందించారు. -
క్రీడలతో మానసికోల్లాసం
ఏటూరునాగారం: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ దబ్బగట్ల జనార్దన్ అన్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని కొమురం భీం మినీస్టేడియంలో కొనసాగుతోన్న తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ 6వ రాష్ట్రస్థాయి క్రీడలకు గురువారం డీడీ జనార్ధన్ హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అండర్ –14, అండర్–17 విభాగాలకు చెందిన బాలిబాలికలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, టెన్నికాయిట్, చెస్, క్యారమ్స్, ఆర్చరీ, అథ్లెటిక్స్ తదితర క్రీడలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని మూడు ఐటీడీఏలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి 1,500 మంది గిరిజన బాలబాలికలు హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. నేడు ఫైనల్స్ నిర్వహించనున్నారు. కార్యక్రమంలో పీడీలు ఆదినారాయణ, శ్యామలత, కిట్టు, ఉపాధ్యాయుడు మైపతి సంతోష్, నల్లబో యిన కోటయ్య, బానోతు శ్రీనివాస్, పీఈటీలు పాల్గొన్నారు. విజేతల గెలుపు ఇలా.. ● వాలీబాల్ అండర్ –14 బాలుర భద్రాచలం జట్టుపై ఏటూరునాగారం జట్టు విజయం సాధించింది. ● వాలీబాల్ అండర్ –17 బాలుర విభాగంలో ఉట్నూరు 2 జట్టుపై ఉట్నూరు 1 జట్టు విజయం పొందింది. ● ఖోఖో అండన్ –17 విభాగంలో బాలుర ప్లేన్ ఏరియా 2పై భద్రాచలం జట్టు విజయం సాధించగా బాలికలు ప్లేన్ ఏరియా 1 పై ఉట్నూరు 1 గెలిచింది. ● అథ్లెటిక్స్లో షాట్ఫుట్లో మొదటి బహుమతి ఉట్నూరు జోన్ 1 నుంచి ఇంద్రాబాబు, రెండో బహుమతి ఉమేష్ భద్రాచలం గెలుపొందారు. పరుగు పందెం ● వంద మీటర్ల పరుగు పందెంలో అండర్ –17 విభాగంలో ఉట్నూర్ 1కు చెందిన ఇంద్రాబాబు మొదటి బహుమతి దక్కించుకున్నాడు. రెండో బహుమతి లోకేష్ (భద్రాచలం), మూడో బహుమతి మనోజ్ (ఉట్నూరు) గెలుపొందారు. ● వంద మీటర్లు అండర్ –17 బాలికల విభాగంలో బి.నవ్యశ్రీ(ఏటూరునాగారంజోన్), శైలజ (ఉట్నూరు) రెండో స్థానం, మూడో స్థానం శృతి హాసన్ (భద్రాచలం జోన్) గెలుపొందారు. ● చెస్లో అండర్ –14 బాలికల విభాగంలో లహరిక (ఏటూరునాగారంజోన్), నందిని (ఊట్నూరు 1), విమల (ఉట్నూరు 1) గెలుపొందారు. డిప్యూటీ డైరెక్టర్ దబ్బగట్ల జనార్దన్ కొనసాగిన రాష్ట్రస్థాయి గిరిజన క్రీడలు -
ఆదివాసీ సంప్రదాయాలకు అద్దం పట్టాలి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతర గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించాలని సీఎంఓ ప్రిన్సిపా ల్ సెక్రటరీ శ్రీనివాసరాజు అన్నారు. సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా గద్దెల పునఃప్రారంభోత్సవం ఉంటుందని తెలిపారు. గురువారం మేడారం ఐటీడీఏ గెస్ట్ హౌస్లో కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్రమిశ్రా, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్తో కలిసి ఆయన అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్షి నిర్వహించారు. జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగనుందని, సుమారు 3 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ దివాకర్ వివరించారు. రహదారులు, పార్కింగ్ సెల్ఫోన్ నెట్వర్క్, భద్రత ఏర్పాట్లపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. మేడారంలో నాలుగు రోజులపాటు జరిగే జాతర ఉత్సవాల్లో అమ్మవార్ల పూజ కార్యక్రమాల ను వివరించారు. జాతర పరిసరాలను 8 జోన్లుగా విభజించామని, ప్రతి జోన్లో 8 మంది అధికారులు ఉంటారని, 42 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశామని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతూ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని అదేశించారు. పార్కింగ్కు సంబంధించిన సమాచారం భక్తులకు సులభంగా అందుబాటులో ఉండేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఆర్డీఓ వెంకటేష్, ఈఓ వీరస్వామి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సీఎంఓ ప్రిన్సిపాల్ సెక్రటరీ శ్రీనివాసరాజు మేడారం జాతర నిర్వహణపై సమీక్ష -
సమగ్ర రిపోర్ట్ వచ్చాకే బిల్లుల చెల్లింపు
వరంగల్ అర్బన్: సమగ్ర రిపోర్ట్ అనంతరమే బిల్లులు చెల్లిస్తామని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ స్పష్టం చేశారు. గురువారం బల్దియా పరిధి 44వ డివిజన్లో శానిటేషన్ ఇంజనీరింగ్ పనులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 44వ డివిజన్ భట్టుపల్లిలో నిర్మాణం పూర్తి చేసిన సీసీ రోడ్ల బిల్లుల చెల్లింపు కోసం కమిషనర్ కొలతలు వేసి పరిశీలించారు. మొత్తం నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత తనిఖీలు చేపట్టాలని, సమగ్ర రిపోర్ట్ వచ్చిన తర్వాతే బిల్లు తీసుకురావాలని కమిషనర్ అధికారులకు సూచించారు. అనంతరం అమ్మవారిపేటలో చిన్న మేడారం జాతర జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. గద్దెల ప్రాంతంలో లైటింగ్ తదితర ఏర్పాట్లను బల్దియా తరఫున చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎఫ్ఎస్టీపీ ప్రాంతంలో 150 కేఎల్డీ సామర్థ్యంతో నిర్మిస్తున్న ప్లాంట్ను ప్రత్యక్షంగా పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. శాయంపేటలోని ఆర్–1 రోడ్డును పరిశీలించారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఈఈ రవికుమార్, డీఈ రవికిరణ్, ఏఈ రామన్న, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ చాహత్ బాజ్పాయ్ -
రైల్వే స్టేడియంలో ఖోఖో పోటీల ఏర్పాట్ల పరిశీలన
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే స్టేడియంలో ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు జరిగే 58వ సీనియర్ జాతీయ ఖోఖో చాంపియన్షిప్–2026 పురుషులు, మహిళల టోర్నమెంట్కు సంబంధించిన ఏర్పాట్లను గురువారం తెలంగాణ ఆయిల్ ఫెయిడ్ చైర్మన్, తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి పరిశీలించారు. రైల్వే స్టేడియంలో నిర్వహించే ఖోఖో పోటీలకు ఎలాంటి ఇబ్బందిలేకుండా చూడాలని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ అసోసియేషన్ సెక్రటరీ కృష్ణమూర్తి, వరంగల్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్యామ్, తెలంగాణ రెఫరీ బోర్డు చైర్మన్ కె.సదానందం, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇన్స్టాలో వేధింపులు.. టెక్నాలజీతో అరెస్ట్ కాజీపేట అర్బన్: మడికొండ పోలీస్స్టేషన్ పరిధిలో ని భట్టుపల్లి గ్రామానికి చెందిన యువతిని ఇన్స్టా గ్రామ్లో వేధిస్తున్న అదే గ్రామానికి చెందిన వ్యక్తి పోలీసుల అడ్వాన్స్ టెక్నాలజీతో దొరికిపోయాడు. మడికొండ ఇన్స్పెక్టర్ కిషన్ గురువారం తెలిపిన వివరా ల ప్రకారం.. డిసెంబర్ 16వ తేదీన భట్టుపల్లి గ్రా మానికి చెందిన యువతి తనకు కాబోయే భర్తతోపా టు అతని స్నేహితులకు తన గురించి అశ్లీల ఫొటోలు, వీడియోలు పంపిస్తూ వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అడ్వాన్స్ టెక్నాలజీతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు భట్టుపల్లి గ్రామానికి చెందిన జక్కుల వంశీని నిందితుడిగా గుర్తించారు. కాగా వంశీ గతంలో యువతిని ప్రేమి స్తున్నానని వెంటపడడంతో నిరాకరించింది. దీంతో యువతికి కుదిరిన పెళ్లి సంబంధం చెడగొట్టేందుకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నా డు. నిందితుడు ముందస్తు జాగ్రత్తగా తన వైఫై నుంచి కాకుండా ఇతరుల వైఫై నుంచి మెసేజ్ చేసే వాడు. కానీ, పోలీసులు సాంకేతికతతో పట్టుకున్నా రు. కార్యక్రమంలో ఎస్సై రాజ్కుమార్, ఐటీ కోర్ ఎ స్సై సతీష్, ఏఏఓ సల్మాన్పాషా, సీసీపీఎస్ కానిస్టేబుల్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలతో భవిష్యత్ నాశనం ● డీసీపీ కవిత హన్మకొండ: మాదక ద్రవ్యాలతో భవిష్యత్ నాశనం అవుతుందని వరంగల్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత అన్నారు. అనంతసాగర్లోని సుమతిరెడ్డి మహిళ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపా ల్ రాజశ్రీ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ‘మాదక ద్రవ్యాలు వినాశం చేస్తాయి.. సంస్కృతి చైతన్యాన్ని కలిగిస్తుంది..’ అనే నినాదంతో డ్రగ్స్కు వ్యతిరేకంగా హనుమకొండలో కళాశాల విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ కవిత మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగత సమస్య మాత్రమే కాదని సమాజాన్ని నిశ్శబ్దంగా కుంగదీసే సమస్య అని అన్నారు. మత్తు పదార్ధాలు యువత భవిష్యత్ను ఆరోగ్యాన్ని, కు టుంబ జీవనాన్ని నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సుమతి రెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ రాజశ్రీ రెడ్డి మాట్లాడుతూ.. విద్యాసంస్థలు కేవలం విద్యాబోధనకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో విలువలు పెంపొందించాలని, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత అలవర్చుకునేల తీర్చిదిద్దాల్సిన అవసరముందన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్, కళాశాల ఏఓ వేణుగోపాల స్వామి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
నాణ్యమైన భోజనం అందించండి..
కేయూ క్యాంపస్: తమకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీలోని మహిళా హాస్టల్ మెస్ విద్యార్థినులు గురువారం ఆందోళనకు దిగారు. పరిపాలనాభవనాన్ని ముట్టడించారు. అన్నంలో పురుగులు, మేకులు, సీస పెంకులు కూడా వస్తున్నాయని, భోజనం నాణ్యతగా ఉండటంలేదని, అన్నం కూడా సరిపడా పెట్టడంలేదని ఆరోపించారు. మెస్లోనికి కుక్కలు కూడా వస్తున్నాయని తెలిపారు. తమకు పెట్టాల్సిన భోజనం వేరే మెస్కు తరలిస్తున్నారని ఆరోపించారు. ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య రాజేందర్, స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ విభాగం ప్రొఫెసర్ ఆచార్యులు మామిడాల ఇస్తారి తదితరులు తమకు సమస్యలు వివరించాలని కోరగా.. తమ సమస్యల పరిష్కారానికి వీసీ వచ్చి హామీఇవ్వాలని నిరసన కొనసాగించారు. అనంతరం పరిపాలనాభవనంలోనికి చొచ్చుకొని వెళ్లి వీసీ చాంబర్లో నిరసన తెలిపారు. స్పందించిన వీసీ.. హాస్టళ్ల డైరెక్టర్ రాజ్కుమార్, జాయింట్ డైరెక్టర్లు, కేర్టేకర్లను పిలిపించి అకాడమిక్ కమిటీహాల్లో సమావేశం ఏర్పాటుచేసి విద్యార్థినులతో మాట్లాడించారు. అనంతరం విద్యార్థులు.. పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని వీసీకి అందజేశారు. ఏబీవీపీ కేయూ అధ్యక్షుడు హరికృష్ణ, బాధ్యులు మాధవరెడ్డి, మెరుగు సాయికుమార్, విజయ్, క్రాంతి, రాజు తదితరులు పాల్గొన్నారు. కేయూ మహిళా హాస్టల్ విద్యార్థినుల ఆందోళన పరిపాలనాభవనం ముట్టడి -
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు
విద్యారణ్యపురి: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని వరంగల్ నిట్ ప్రొఫెసర్ ఆనంద్ కిశోర్ అన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో లైబ్రరీ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో డిజిటల్ ట్రాన్సర్మేషన్ ఇన్ అకాడమిక్ లైబ్రరీస్ నావిగేటింగ్ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ సైన్స్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ లక్ష్మణ్రావు కీలకోపాన్యాసం చేస్తూ అత్యాధునికమైన డిజిటలైజేషన్ను పాఠకులకు మరింత చేరువచేయాలన్నారు. ఓయూ విశ్రాంత ప్రొఫెసర్ సుదర్శన్రావు, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ మధుసూదన్, వరంగల్ నిట్ ప్రొఫెసర్ శ్రీనివాస్రావు మాట్లాడారు. సదస్సుకు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చంద్రమౌళి అధ్యక్షత వహించగా, సదస్సులో 75 పరిశోధన పత్రాలతో కూడిన సావనీర్ను అతిథులు ఆవిష్కరించారు. కార్యకమంలో లైబ్రరీ సైన్స్ విభాగం అధిపతి యుగేందర్, అధ్యాపకులు సురేష్బాబు, అరుణ, సుజాత, మధు, శ్రీనివాస్, లక్ష్మీకాంతం, జ్యోతిర్మయి, లకన్సింగ్, సువర్ణ, రాజేశ్వరి తదతరులు పాల్గొన్నారు. వరంగల్ నిట్ ప్రొఫెసర్ ఆనంద్కిశోర్ -
సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
హన్మకొండ: సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సులు నడుపాలని టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. వరంగల్ రీజియన్లో మొత్తం 650 ప్రత్యేక బస్సులు నడిపేలా ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ నెల 9 నుంచి 13 వరకు ప్రత్యేక బస్సులు నడిపేలా ఆర్టీసీ వరంగల్ రీజియన్ అధికారులు కార్యాచరణ రూపొందించారు. ప్రధానంగా హనుమకొండ–హైదరాబాద్ ఉప్పల్ మధ్య ప్రత్యేక బస్సులు నడపనున్నారు. దీంతోపాటు నర్సంపేట, మహబూబాబాద్, తొర్రూరు, జనగామ, పరకాల, భూపాలపల్లి నుంచి కూడా ఉప్పల్కు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా బస్సులు సమకూర్చి ట్రాఫిక్ను క్లియర్ చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా గమ్యస్థానాలకు చేరవేసేందుకు అధికారులు, సూపర్ వైజర్లు 24 గంటలపాటు బస్ స్టేషన్లలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ ఉప్పల్ బస్ పాయింట్ వద్ద ప్రయాణికుల కోసం తాత్కాలిక షెల్టర్ ఏర్పాటు చేశారు. తాగు నీటి సౌకర్యం, ప బ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. తిరుగు ప్ర యాణం కోసం ఈ నెల 16 నుంచి 20 వరకు ప్రత్యే క బస్సులు నడపనున్నారు. ప్రత్యేక బస్సుల్లోను మహాలక్షి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పించింది. 650 సర్వీసులు నడిపేలా ప్రణాళిక -
వైద్యవిద్యార్థుల పరిశోధనలు పెరగాలి
ఎంజీఎం: వైద్యవిద్యార్థుల పరిశోధనలు పెరగాలని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రమేష్రెడ్డి అన్నారు. కాకతీయ మెడికల్ కాలే జీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య అధ్యక్షతన ఎన్ఆర్ఐ పూర్వ విద్యార్థులు డాక్టర్ సుజిత్, డాక్టర్ వేణు, డాక్ట ర్ అనుపమల నేతృత్వంలో నిర్వహిస్తున్న క్రితి 3.0 ఈవెంట్ను గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ డాక్టర్ రమేష్ రెడ్డి మాట్లాడు తూ.. వైద్య విద్యార్థుల్లో పరిశోధన దృక్పథం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. యూనివర్సిటీ స్థాయిలో పరిశోధన కార్యకలాపాలకు పూర్తి స్థాయిలో ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చా రు. అనంతరం వీసీ డాక్టర్ రమేష్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య సుంకరనేని, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాంకుమార్ రెడ్డి, బోధన సిబ్బంది, నిర్వాహకులు కలిసి విద్యార్థులు ఏర్పాటు చేసిన మెడ్ ఎక్స్పోను సందర్శించారు. ఈవెంట్ మొదటి రోజు పేపర్ ప్రెజెంటేషన్లు, సర్జికల్ స్కిల్స్ వర్క్షాప్, జియోపార్డీ, మెడ్ ఎగ్జిబిషన్ వంటి కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. దేశవ్యాప్తంగా 1,000 మందికి పైగా వైద్యవిద్యార్థులు పాల్గొన్నారు. నేడు (శుక్రవారం) సింపోజియం, పోస్టర్ ప్రెజెంటేషన్లు, సీఎంఈ ప్రసంగాలు, సర్జికల్ స్కిల్స్ వర్క్షాప్లు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాళోజీ యూనివర్సిటీ వీసీ రమేష్ రెడ్డి -
అప్రమత్తంగా వ్యవహరించాలి
● జిల్లా జడ్జి మహ్మద్ అబ్దుల్ రఫీ మహబూబాబాద్ రూరల్: జిల్లాలో బాల్య వివాహాలు జరగకుండా పోలీసు, రెవెన్యూ, సంక్షేమశాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ పిలుపునిచ్చారు. ‘బాల్ వివాహ్ ముక్త్ భారత్’ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా పోలీసు, రెవెన్యూ అధికారులతో జిల్లా కోర్టులో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు నిఘా విభాగానికి అన్ని రకాల సమాచారాలు వస్తుంటాయని, బాల్యవివాహాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. బాల్య వివాహాల గురించి సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. వివాహం జరిగిన తర్వాత సమాచారం వస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. బాల్యవివాహాలు లేదా పోక్సో చట్టానికి సంబంధించి బాధిత బాలికలు పాఠశాలల్లో వివక్షకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. గుర్తుతెలియని వాహనాల వల్ల జరిగే ప్రమాదాల్లో బాధితులకు నష్టపరిహారం చెల్లించేలా పోలీసు అధికారులు న్యాయ సేవా సంస్థ సహాయం తీసుకోవాలన్నారు. సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శాలిని మాట్లాడుతూ.. నామాలపాడు, కొత్తగూడ ప్రాంతాల్లోని ఇటుక బట్టీల్లో తల్లిదండ్రులతో నివసిస్తున్న పిల్లల చదువులు, పౌష్టికాహారం విషయంలో శ్రద్ధ తీసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారిని కోరారు. న్యాయమూర్తులు స్వాతి మురారి, కృష్ణతేజ్, ఎం.ధీరజ్ కుమార్, అదనపు కలెక్టర్ అనిల్ కుమార్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కిరణ్, డీఈఓ రాజేశ్వర్ రావు, జిల్లాలోని పోలీసు స్టేషన్ల స్టేషన్ హౌస్ ఆఫీసర్లు పాల్గొన్నారు. -
ముచ్చటగా మూడోసారి!
మహబూబాబాద్: మానుకోట.. మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిన తర్వాత ఇప్పటి వరకు రెండుసార్లు ఎన్నికలు జరిగాయి. త్వరలో మూడోసారి ఎన్నికలు జరగనున్నాయి. కాగా, ఈ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకం కావడంతో నాయకులు సవాల్గా తీసుకున్నారు. గత ఎన్నికల్లో వార్డుల సంఖ్య పెరుగగా.. ఈసారి ఓటర్ల సంఖ్య పెరిగింది. ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థి చైర్మన్గా.. మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థి చైర్మన్ కాగా.. మూడోసారి ఆ పీఠంపై రెండు ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. కాగా, ఈనెల 10ను తుది జాబితా విడుదల చేయాల్సి ఉండగా.. దానిని ఈనెల 12వ తేదీకి ఎన్నికల సంఘం అధికారులు మార్చారు. 2014లో మొదటిసారి ఎన్నికలు.. మానుకోట మేజర్ గ్రామపంచాయతీ 2011 అక్టోబర్ 3న మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. 2011 అక్టోబర్ 3వ తేదీ నుంచి 2014వరకు ఇన్చార్జ్ పాలన సాగింది. 2014 మే నెలలో ఎన్నికలు జరుగగా.. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్–సీపీఐ పొత్తు పెట్టుకోగా.. కాంగ్రెస్ ఒంటరిగా.. సీపీఎం–టీడీపీ పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో నిలిచాయి. కాగా, కాంగ్రెస్కు 7, బీఆర్ఎస్కు 7, సీపీఎం 5, సీపీఐ 3, టీడీపీ 3, స్వతంత్రులు 3 వార్డుల్లో గెలుపొందారు. చైర్పర్సన్గా కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూక్య ఉమా మురళీనాయక్, వైస్ చైర్మన్గా సీపీఎం అభ్యర్థి సూర్నపు సోమయ్య బాధ్యతలు స్వీకరించారు. 2019 జూలై 3న పాలక మండలి గడువు ముగిసింది. 2020లో ఎన్నికలు.. రెండోసారి 2020 జనవరి 22న మున్సిపల్ ఎన్నికలు జరుగగా.. అదే నెల 25న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు విడుదల చేశారు. ఈమేరకు బీఆర్ఎస్ 19, కాంగ్రెస్ 10, సీపీఐ 2, సీపీఎం 2, స్వతంత్రులు 3వార్డుల్లో గెలుపొందారు. చైర్మన్ పదవి జనరల్కు రిజర్వ్ కావడంతో అదే నెల 27న చైర్మన్గా బీఆర్ఎస్ అభ్యర్థి పాల్వాయి రామ్మోహన్రెడ్డి, అదే పార్టీకి చెందిన వైస్ చైర్మన్గా మహ్మద్ ఫరీద్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆతర్వాత మధ్యలో వైస్ చైర్మన్పై అవిశ్వాసం పెట్టగా.. ఆ పార్టీకే చెందిన మార్నేని వెంకన్న వైస్ చైర్మన్ అయ్యారు.12న ఓటరు తుది జాబితా.. త్వరలో మానుకోట మున్సిపాలిటీ ఎన్నికలు గత ఎన్నికల్లో పెరిగిన వార్డులు.. ప్రస్తుతం పెరిగిన ఓటర్లు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార కాంగ్రెస్ చైర్మన్ రిజర్వేషన్పై ఉత్కంఠ ఈనెల 12న తుది ఓటరు జాబితాత్వరలో మూడోసారి.. జిల్లాలోనే అతిపెద్దదైన మానుకోట మున్సిపాలిటీపై అందరూ దృష్టి పెట్టారు. ప్రస్తుత్తం 36 వార్డులు ఉండగా.. ఈనెల 1న విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం 65,851 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో 57,828 మంది ఓటర్లు ఉండగా 8,023 మంది పెరిగారు. కాగా, ఎన్నికలు కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకం కావడంతో ఆ పార్టీ నాయకులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కాగా, చైర్మన్ రిజర్వేషన్పై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈనెల12న ఓటరు తుది జాబితా విడుదల చేసిన తర్వాత ఎన్నికల కోలాహలం మొదలవ్వనుంది. ఇప్పటికే పార్టీల వారీగా ముఖ్య నా యకులతో సమావేశాలు నిర్వహించి, వార్డుల వా రీగా ఆశావహుల వివరాలు తీసుకుంటున్నారు.ఓటరు జాబితా హెడ్యూల్ ప్రకారం ఈనెల 10న ఓటరు తుది జాబితా తయారు చేసి ప్రదర్శించాలి. కాగా బుధవారం మళ్లీ విడుదల చేసిన గైడ్ లైన్స్ ప్రకారం ఈనెల 12న ఓటరు తుది జాబితా ప్రదర్శించనున్నట్లు అధికారులు చెప్పారు. మున్సిపల్ చట్టం–2019లో సవరించిన సెక్షన్–195ఏ ప్రకారం వార్డుల వారీగా ఓటరు తుది జాబితా ప్రదర్శిస్తా రు. 13న పోలింగ్ స్టేషన్ల వివరాల ముసాయిదా జాబితా, 16న పీఎస్ వివరాలతో పాటు ఫొటోతో కూడిన ఓటరు తుది జాబితా ప్రదర్శించాలని ఆదేశాలు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. -
విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
● సీఎం కప్ టార్చ్ ర్యాలీలో ఎమ్మెల్యే మురళీనాయక్ మహబూబాబాద్: విద్యార్థులు, యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఎమ్మెల్యే మురళీనాయక్ ముఖ్యమంత్రి కప్ టార్చ్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. క్రీడల్లో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందజేస్తోందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, డీఈఓ రాజేశ్వర్, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి జ్యోతి, క్రీడాకారులు పాల్గొన్నారు. -
పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీని కాపాడండి
● ఝాన్సీరెడ్డిపై అసమ్మతి నేతల ఫిర్యాదు తొర్రూరు రూరల్: పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని కాపాడాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ను అసమ్మతి నేతలు కోరారు. తొర్రూరు మండలానికి చెందిన అసమ్మతి నాయకులు గురువారం కాంగ్రెస్ నాయకురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డిపై హైదరాబాద్లో ఫిర్యా దు చేశారు. ఈ సందర్భంగా తొర్రూరు మార్కెట్ చైర్మన్ హనుమాండ్ల తిరుపతిరెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్రావు మాట్లాడుతూ.. గత అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలను పార్టీ నాయకురాలు ఝాన్సీరెడ్డి విస్మరిస్తూ, తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఆమె పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నట్లు ఆరోపించారు. ఝాన్సీరెడ్డి తప్పుడు విధానాల వల్లే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సగం సర్పంచ్ స్థానాలను సైతం కాంగ్రెస్ పార్టీ గెలువ లేదన్నారు. ఇప్పటికై నా పాత, కొత్త తేడా లేకుండా నాయకులు, కార్యకర్తలందరినీ కలుపుకొని ముందుకెళ్తేనే రాబోయే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలుస్తుందని, లేకుంటే ఒక్క స్థానం కూడా రాదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు రామసహాయం కిశోర్రెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్ హనుమాండ్ల నరేందర్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంచు సంతోష్, సర్పంచ్లు ధర్మారపు మహేందర్, కొమురవెల్లి లింగమూర్తి, నలుగురి రామలింగం, నాయకులు మేర్గు మల్లేశంగౌడ్, హనుమాండ్ల నరేందర్రెడ్డి, దేవరకొండ శ్రీనివాస్, తమడపల్లి సంపత్, బిజ్జాల వరప్రసాద్, సహదేవ్, మహేశ్, రాకేశ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
కక్షిదారు వద్దకే జడ్జి..
● మానవత్వం చాటిన న్యాయమూర్తి ధీరజ్కుమార్ తొర్రూరు: ఓ సివిల్ కేసులో కోర్టుకు వచ్చిన బాధితురాలు నడవలేనిస్థితిలో ఉండడంతో న్యాయమూర్తి ఆమె దగ్గరికే వచ్చారు. ఈ ఘటన తొర్రూరులో గురువారం జరిగింది. ఓ సివిల్ కేసులో కక్షిదారురాలిగా ఉన్న పద్మ అనే మహిళ తొర్రూరు సివిల్ కోర్టుకు వచ్చింది. ఆమె తన కాళ్లు పనిచేయక అనారోగ్యంతో ఉండి కోర్టు భవనంపైకి వెళ్లే పరిస్థితి లేదు. సమాచారం తెలుసుకున్న జడ్జి ధీరజ్కుమార్ ఆమె వద్దకే వచ్చి కేసు వివరాలు తెలుసుకున్నారు. తక్షణమే కేసును పరిష్కరించాలని సంబంధిత పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. -
మెనూ పాటించడం లేదు
● ఎల్లంపేట హైస్కూల్ విద్యార్థుల నిరసనమరిపెడ రూరల్: పాఠశాలలో మధ్యాహ్న భోజనం మెనూ పాటించకుండా నీళ్లచారు, ఉడికి ఉడకని అన్న ం వడ్డిస్తున్నారని మండలంలోని ఎల్లంపేట జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు స్కూల్ ఎదుట రోడ్డుపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన స్నేహశీలి మహిళా సంఘం వంట ఏజెన్సీ నిర్వాహకులు మధ్యాహ్న భోజనం వండి వడ్డిస్తున్నారని, అయితే మెనూ పాటించడం లేదని ఆరోపించారు. ఇదేమిటని ప్రశ్నిస్తే దురుసుగా సమాధానం చెప్పుతున్నారని విద్యార్థులు వాపోయారు. పాఠశాలలో 150మంది విద్యార్థులకు 50నుంచి 60మంది మాత్రమే భోజనం చేస్తున్నారని, మిగిలిన విద్యార్థులు బాక్స్ తెచ్చుకుంటున్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, ఎంఈఓ అనితాదేవి, తహసీల్దార్ కృష్ణవేణి, ఎంపీఓ సోమ్లనాయక్ పాఠశాలకు చేరుకుని విద్యార్థులను సముదాయించారు. మెనూ పాటించడంతో పాటు నాణ్యమైన భోజనం, గుడ్డు అందించేలా వంట నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఎంఈఓకు గ్రామస్తులతో కలిసి విద్యార్థులు వినతిపత్రం అందజేశారు. కాగా వంట ఏజెన్సీ నిర్వాహకులపై ఎంఈఓ, తహసీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన భోజనం వడ్డించాలని, లేని క్రమంలో కొత్త ఏజెన్సీని నియమించేలా వంట నిర్వాహకుల నుంచి రాత పూర్వకంగా ఒప్పంద పత్రం తీసుకున్నారు. -
రూ.2వేల కోట్లతో వరంగల్ అభివృద్ధి
ఖిలా వరంగల్/హన్మకొండ/హన్మకొండ కల్చరల్: రూ.2వేల కోట్లతో వరంగల్ జిల్లాను అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు అన్నారు. సంక్షేమాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన, కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారని ఆయన విమర్శించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్.రాంచందర్ రావు రెండు రోజులపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన చేపట్టారు. దీనిలో భాగంగా గురువారం హనుమకొండకు వచ్చిన ఆయనకు కాజీపేటలోని కడిపికొండ బ్రిడ్జి వద్ద పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఇక్కడి నుంచి పార్టీ శ్రేణులు భారీ ర్యాలీగా వరంగల్లోని భద్రకాళి ఆలయానికి చేరుకున్నారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడినుంచి బయలుదేరి హనుమకొండ హంటర్రోడ్ నందిహిల్స్ వద్దకు చేరుకుని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వేద బాంక్వెట్హాల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇక్కడే మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత వరంగల్కు ర్యాలీగా బయలుదేరారు. అనంతరం శాంతినగర్లోని రాజశ్రీ గార్డెన్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత మొదటిసారి వరంగల్ పర్యటనలో భాగంగా భద్రకాళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నానని తెలిపారు. కాజీపేట కోచ్ఫ్యాక్టరీ నిర్మాణం, మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణ పనులు మోదీ ఆధ్వర్యంలో పూర్తవుతాయని చెప్పారు. హెల్త్ యూనివర్సిటీ కూడా కేంద్ర ప్రభుత్వ చొరవతో ఏర్పడిందని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ కావాలంటే డబుల్ ఇంజన్ సర్కారు రావాల్సిందేనని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని ఆయన కోరారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎం.గౌతం రావు, తూళ్ల వీరేందర్ గౌడ్, వేముల అశోక్, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, కొండేటి శ్రీధర్, ఎం.ధర్మారావు, వన్నాల శ్రీరాములు, డాక్టర్ రాజేశ్వర్రావు, మాజీ ఎంపీ సీతారాంనాయక్, నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు, కుసుమ సతీశ్, మల్లాడి తిరుపతిరెడ్డి, రఘునాఽరెడ్డి, డాక్టర్ వన్నాల వెంకటరమణ, ఎన్.వి.సుభాష్, డా.పగడాల కాళీ ప్రసాద్, గుండె గణేష్, ఒంటేరు జైపాల్, ఎడ్ల అశోక్ రెడ్డి, దిలీప్ నాయక్, చాడ స్వాతి, గుజ్జల వసంత, రావుల కోమల, అభినవ్ భాస్కర్, ఎండీ రఫీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్, కాంగ్రెస్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు నాయకులు, కార్యకర్తల ఘనస్వాగతం -
మాస్టర్ ట్రైనర్ల ఎంపికలో పారదర్శకత పాటించాలి
మహబూబాబాద్: మాస్టర్ ట్రైనర్ల ఎంపికలో పారదర్శకత పాటించాలని పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు సతీష్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఽశ్రీధర్ అన్నారు. యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పోకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన జీపీ ఎన్నికల శిక్షణలో స్కూల్ అసిస్టెంట్లు మాస్టర్ ట్రైనర్లుగా వ్యవహరించారన్నారు. రాబోయే మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల శిక్షణ విధుల నుంచి వారిని మినహాయించాలన్నారు. మార్చిలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమవుతాయని, ఉన్నత పాఠఽశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న స్కూల్ అసిస్టెంట్లను మాస్టర్ ట్రైనర్లుగా నియమిస్తే విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు. పదో తరగతి విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను మాస్టర్ ట్రైనర్లుగా నియమించాలన్నారు. కార్యక్రమంలో మహేశ్, లింగన్న, వెంకట్రెడ్డి, కరుణాకర్, హల్యా, నాగరాజు పాల్గొన్నారు. యూరియా కోసం ఆందోళన వద్దు మహబూబాబాద్ రూరల్: జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మహబూబా బాద్ నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులతో యూరియా పంపిణీపై స్థానిక రైతు వేదికలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతీ మండలానికి సరిపడా యూరియా సరఫరా చేస్తున్నారని తెలిపారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తూ రైతులకు యూరియాను సకాలంలో అందించాలని ఆదేశించారు. సమావేశంలో డీఏఓ బి.సరిత, ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు, ఏఓలు, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి: ఎస్ఈమహబూబాబాద్ రూరల్ : విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని విద్యుత్ శాఖ ఎస్ఈ విజయేందర్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ మండలంలోని మాధవాపురం గ్రామంలో విద్యుత్శాఖ అధికారులు గురువారం ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో సమస్యల గురించి తెలుసుకోవడానికి విద్యుత్ అధికారులు ప్రజా బాట కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. ప్రజలు తమ విద్యుత్ సమస్యలను తెలియజేస్తే పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజా బాటలో భాగంగా విద్యుత్ సమస్యల గురించి తెలుసుకుని తుప్పు పట్టిన స్తంభాలను మార్చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంపటి రమేష్, ఉప సర్పంచ్ మద్ది వెంకటరెడ్డి, విద్యుత్ రూరల్ ఏడీఈ ప్రశాంత్, రూరల్ ఏఈ పీక వెంకటేష్, సిబ్బంది వీరాచారి, కుదురుపాక వివేక్, వీరభద్రం, సత్యనారాయణ, సంపత్ పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం మహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మూడు నెలల పాటు బాలికలకు సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ నిమిత్తం అర్హులైన శిక్షకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రాజేశ్వర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ఎంపీయూపీఎస్ స్కూల్స్–9, హైస్కూల్స్– 92, మొత్తం 101 పాఠశాలల బాలికలను సెల్ఫ్ డిఫెన్స్కు ఎంపిక చేశామని, దరఖాస్తులు ఈ నెల 9నుంచి 12వ తేదీ వరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పిచాలన్నారు. శిక్షకులకు నెలకు రూ.5వేల చొప్పున 3 నెలలు గౌరవ వేతనం చెల్లిస్తామన్నారు. శిక్షణ కోసం మహిళా శిక్షకులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని, మహిళలు లేకపోతే పురుష శిక్షకులను ఎంపిక చేస్తామన్నారు. పూర్తి వివరాలకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. -
రోడ్డు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించండి
మహబూబాబాద్ అర్బన్: రోడ్డు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి జైపాల్రెడ్డి అన్నారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఫాతిమా హై స్కూల్లో గురువారం ప్రైవేట్ పాఠశాలల బస్సుల డ్రైవర్లు, ఆటో డ్రైవర్లకు లయన్స్ క్లబ్ సహకారంతో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ వాహన డ్రైవర్ ట్రాఫిక్ రూల్స్ పక్కాగా పాటించాలని, వాహనా లను ఓవర్టేక్ చేసే సమయంలో నిబంధనలు పాటించాలన్నారు. డ్రైవర్లు తమ ఆరోగ్యంపై ప్రత్యే క శ్రద్ధ వహించాలన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ వినియోగించొద్దని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. పాఠశాలల బస్సులు క్రమం తప్పకుండా ఫిట్నెస్ ఉండే విధంగా నిత్యం తనిఖీలు చేసుకోవాలన్నారు. వాహనాల్లో ఫైర్ సేఫ్టీ పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని, అకస్మాత్తుగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరిం చాలన్నారు. ఫైర్ అధికారి టి.మోహన్రావు, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు సాయిచరణ్, వెంకట్రెడ్డి, ట్రాఫిక్ ఎస్సై అరుణ్కుమార్, డీపీఆర్ఓ రాజేందర్ప్రసాద్, వైద్యాధికారులు మౌనిక, నర్మద ఉన్నారు. -
గంజాయి సాగు చేస్తే జైలుకే..
● ఎస్పీ శబరీష్మహబూబాబాద్ రూరల్ : గంజాయి సాగు చేస్తే జైలు శిక్ష తప్పదని ఎస్పీ శబరీష్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి సాగుకు అడ్డుకట్ట వేసేందుకు సీసీఎఎస్, స్పెషల్ పార్టీ పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా పరిధిలో గంజాయి సాగు చేస్తున్న ప్రాంతాలను గుర్తించేందుకు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. డ్రోన్ల ద్వారా వ్యవసాయ భూములు, అటవీ, కొండ ప్రాంతాలు, దూర గ్రామ ప్రాంతాలపై పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. పాత గంజాయి నేరస్తులు, గంజాయి విక్రయించే వ్యక్తులు, అక్రమ రవాణా మార్గాలు, గంజాయి నిల్వ చేసే ప్రాంతాలు, విక్ర య కేంద్రాలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. గంజాయి సాగు, అక్రమ రవాణా లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం ఎవరికై నా తెలిస్తే, భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. వారి వివరాలను పూర్తి గా గోప్యంగా ఉంచుతామని హామీ ఇస్తూ, ప్రజల సహకారంతోనే గంజాయి రహిత జిల్లా సాధ్యమవుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని నర్సింహులపేట పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ వ్యవసాయ ప్రాంతంలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న క్రమంలో సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి జైలుకు తరలించినట్లు తెలిపారు. -
ఉత్తమ ఫలితాలు సాధించాలి
● డీఈఓ రాజేశ్వర్ రావు నర్సింహులపేట: పదో తరగతి విద్యార్థులు ఇష్టపడి చదవి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఈఓ రాజేశ్వర్రావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని హైస్కూల్, కేజీబీవీ, ఆశ్రమ పాఠశాలలను సందర్శించి తనిఖీ చేశారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి, ఎలా చదువుతున్నారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వి ద్యార్థులకు సూచించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీ టుగా ఎక్కువ మార్కులు వచ్చేలా బోధించడంతో పాటు పరీక్షలు నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పిల్లలకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. హైస్కూల్, కేజీబీవీలో మధ్యాహ్న భోజనం పరిశీలించారు. కేజీబీవీలో పిల్లలతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ రామ్మోహన్రావు, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, మందుల శ్రీరాములు, ప్రిన్స్పాల్ స్వప్న, సీఆర్పీ జక్కి రవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
5 గంటలు..15 అంశాలు
ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సుదీర్ఘ సమీక్షసాక్షిప్రతినిధి, వరంగల్/హన్మకొండ అర్బన్ : ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి మంత్రి ధనసరి సీతక్కతో కలిసి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి బుధవారం హనుమకొండలోని కలెక్టరేట్(ఐడీఓసీ)లోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. సుమారు ఐదు గంటలకుపైగా జరిగిన సమావేశంలో సీఎం సలహాదారు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ఆరు జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధానంగా మా మునూరు ఎయిర్పోర్టు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, వరద నీటి కాల్వల వ్యవస్థ, పారిశుద్ధ్యం, ఇన్నర్ రింగ్ రోడ్డు, భద్రకాళి మాడవీధులు, భద్రకాళి చెరువు పూడికతీత పనులు, రెండు పడక గదుల ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, యూరి యా, వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రి య, యాసంగి సంసిద్ధత ఇలా మొత్తం 15అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఇళ్ల సమస్యకు 15 రోజుల్లో పరిష్కారం.. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పెండింగ్లో ఉన్న సమస్యలను 15 రోజు ల్లో పరిష్కరించాలని గృహ నిర్మాణశాఖ ఎండీ వీపీ గౌతమ్ను ఆదేశించారు. పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టిన గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, అలాగే వాటికి చెల్లింపులు చేయాలన్నారు. ఏప్రిల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఇప్పటికే ముఖ్య మంత్రి ప్రకటించారని, రెండు పడకల గదుల ఇళ్ల (2– బీహెచ్కే) ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలన్నారు. ఈనెల 20వ తేదీలోగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేసి మౌలి క సదుపాయాల పనులు పూర్తిచేయాలన్నారు. గ్రా మీణ ప్రాంతాల్లో రెండు పడకల గదులకు లబ్ధిదా రుల ఎంపిక ప్రక్రియను ఈనెల 31లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ స్థాయిలో నగర అభివృద్ధి వరంగల్ను హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేయడానికి సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క(అనసూయ) అన్నారు. ఆదివాసీ లకే కాకుండా కోట్లాదిమంది గిరిజనేతరులకు ఇలవేల్పులైన మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెలతో పాటు ఆలయ ప్రాంగణం పునరుద్ధరణకు సీఎం ప్రత్యేకంగా నిధులు కేటాయించి పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, దొంతి మాధవరెడ్డి, భూక్య మురళీనాయక్, గండ్ర సత్యనారాయణరావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్య శారద, రాహుల్, రిజ్వాన్ బాషా షేక్, అద్వైత్ కుమార్, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మాడవీధుల పనుల పరిశీలన హన్మకొండ కల్చరల్: నగరంలోని భద్రకాళి దేవాలయంలో కొనసాగుతున్న మాడవీధుల నిర్మాణ పనులను బుధవారం ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి మంత్రి పొంగులేటి పరిశీలించారు. మాడ వీధుల మ్యాప్ను చూసి త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. దేవాలయం మీద రాజకీయం చేస్తున్న వారికి ఒకటే చెబుతున్నామని, అభివృద్ధి కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్న విషయాన్ని గమనించాలని హితవు పలికారు. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలన్నారు. మాడవీధులకు ఖర్చు చేసే ప్రతీ పైసాకు లెక్క చెప్పాలని అధికారులను ఆదేశించారు. పాల్గొన్న మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, మామునూరు ఎయిర్పోర్టుపై స్పష్టత అభివృద్ధి, సంక్షేమ పథకాలు పరుగులు పెట్టాలని అధికారులకు ఆదేశం నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరికపెండింగ్ పనులను పరుగులు పెట్టించాలని మంత్రి పొంగులేటి.. కలెక్టర్లు, అధికారులకు సూచించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు రెండో దశ పనుల కోసం రూ.305 కోట్లతో చేపట్టే భూసేకరణ త్వరగా జరిగేలా చూడాలని ఆదేశించారు. రూ.30కోట్లతో భద్రకాళి మాడవీధుల పనులు జరుగుతున్నాయని, పూజారుల నివాస గదులు, సత్రం పనులు కొనసాగుతున్నాయన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అన్ని పనులు మార్చి 31 నాటికి పూర్తిచేయాలని, సీఎం రేవంత్రెడ్డి ఆసుపత్రిని ప్రారంభిస్తారన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా మామునూరు ఎయిర్పోర్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశామని మంత్రి పొంగులేటి తెలిపారుఉమ్మడి జిల్లాలో అభివృద్ధి, సంక్షేమంపై సాగిన సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి పలువురిని మందలించారు. బాగా పనిచేసిన అధికారులను ప్రశంసించారు. మామునూరు ఎయిర్పోర్టుకు నిర్ణీత సమయంలో భూసేకరణ పూర్తి చేసినందుకు వరంగల్ కలెక్టర్ సత్యశారద, రెవెన్యూ అధికారులను అభినందించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో రాష్ట్రంలో జనగామ ముందంజలో ఉందని ఆ జిల్లా కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్, సంబంధిత అధికారులను ప్రశంసించారు. ఐఅండ్పీఆర్ శాఖ, పౌరసంబంధాలశాఖ డీఈఈ పనితీరు బాగా లేదన్నారు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ విషయంలో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని, అధికారుల పనితీరు బాగా లేకపోవడం వల్లే నిత్యం ఆ జిల్లా పతాక శీర్షికలకు ఎక్కుతుందని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ను ఉద్దేశించి అన్నారు. -
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
● డీఎస్పీ కృష్ణ కిశోర్ పెద్దవంగర: విద్యార్థులు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిశోర్ అన్నారు. సైబర్ జాగృతి దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మండలంలోని చిన్నవంగర కస్తూర్బాగాంధీ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. డీఎస్పీ కృష్ణ కిశోర్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న సైబర్ మోసాలతో పాటు డిజిటల్ అరెస్టు వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలకు గురైన వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫోన్ చేయడం ముఖ్యమని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 వినియోగంపై వివరించారు. మహిళలు, చిన్నారులకు సంబంధించిన నేరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చట్టపరమైన రక్షణ అంశాల గురించి చెప్పారు. అనంతరం రోడ్డు భద్రతలో భాగంగా మండల కేంద్రంలోని ఎస్సై ప్రమోద్ కుమార్ గౌడ్ హెల్మెట్ ప్రాముఖ్యతపై వాహనదారులకు అవగాహన కల్పించారు. పోలీస్ సిబ్బంది సుధాకర్, హరీశ్, విద్యార్థులు పాల్గొన్నారు. -
మేడారానికి ఆర్టీసీ సర్వీసులు
నెహ్రూసెంటర్: మేడారం మహాజాతరకు మహబూబాబాద్ నుంచి ప్రత్యేక బస్సులను నడిపించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఈ నెల 9నుంచి మేడారం జాతరకు డిపో నుంచి బస్సులు నడపనున్నారు. ప్రతీరోజు ఉదయం 6గంటల నుంచి బస్సులు బయలుదేరుతాయని అధికారులు తెలిపారు. మేడా రం జాతర, సంక్రాంతి పండుగ వస్తుండడంతో ఆర్టీసీ ఇటు భక్తులు, అటు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు, బస్సుల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. మొత్తంగా మేడారం జాతరకు 130 ప్రత్యే బస్సులను రద్దీకి అనుగుణంగా నడిపించనున్నారు. సంక్రాంతి వేళ ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ‘మహాలక్ష్మి’ ద్వారా ఉచిత ప్రయాణం.. మేడారం జాతరకు వెళ్లే మహిళా భక్తులు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం చేసేలా ఆర్టీసీ అనుమతినిచ్చింది. వనదేవతల జాతరకు రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించకుండా ఆర్టీసీ బస్సుల ద్వారా జాతరకు వెళ్లి తిరిగి రావా లని అధికారులు సూచిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు నేరుగా వనదేవతల గద్దెల వద్దకు చేరుకోనున్నాయి. కాగా, మానుకోట నుంచి జాతరకు పెద్దలకు రూ.260, పిల్లలకు రూ.160గా టికెట్ ధరలను ఆర్టీసీ నిర్ణయించింది. సంక్రాంతికి సన్నద్ధం.. మేడారం జాతరతో పాటు ఈ నెలలో సంక్రాంతి పండుగ వస్తుండడంతో ఆర్టీసీకి మరింత ప్రయాణికుల రద్దీ పెరగనుంది. ప్రస్తుతం ప్రతీ రోజు డిపో నుంచి 35 వేల మంది ప్రయాణికులను చేరవేస్తుండగా.. ఈ సంఖ్య ఈ నెలలో మరింత పెరగనుంది. డిపోలో 74 బస్సులు ఉండగా ప్రయాణికుల తాకిడి పెరిగితే ఇతర డిపోల నుంచి బస్సులను తరలించనున్నారు. సంక్రాంతి ప్రత్యేక బస్సులను ఈ నెల 10నుంచి నడిపించనున్నారు. సద్వినియోగం చేసుకోవాలి మేడారం జాతరకు వెళ్లే మహిళా భక్తులు ఆర్టీసీ బస్సుల ద్వారా ఉచితంగా ప్రయాణించవచ్చు. మహబూబాబాద్ డిపో నుంచి బస్సులను మేడారం జాతరకు ఏర్పాటు చేశాం. అదే విధంగా రానున్న సంక్రాంతి పండుగ వేళ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడపనున్నాం. భక్తులు, ప్రయాణికులు ఆర్టీసీ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలి. –వి.కల్యాణి, డిపో మేనేజర్, మానుకోట రేపటి నుంచి జాతరకు బస్సులు ప్రారంభం సంస్థకు కలిసొచ్చిన జాతర, సంక్రాంతి సీజన్ రద్దీకి అనుగుణంగా బస్సుల ఏర్పాటుకు కసరత్తు -
సీసీ కెమెరాల నిఘా
● వ్యవసాయ మార్కెట్లో 28 ఏర్పాటు మహబూబాబాద్ రూరల్ : రైతుల వ్యవసాయ పంట ఉత్పత్తుల రక్షణ నిమిత్తం మానుకోట వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలోని పలు ప్రాంతాల్లో నూతనంగా సీసీ కెమెరాల (నిఘా నేత్రాలు) ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, సెక్రటరీ సుజన్ బాబు ఆధ్వర్యంలో నూతనంగా 28 అధునాతన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించే పని మొదలుపెట్టారు. యార్డు పరిధిలో రైతులకు అందిస్తున్న సేవల్లో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని వారు పేర్కొన్నారు. నారాయణపురం భూముల రీ సర్వేకు గెజిట్ విడుదలకేసముద్రం: మండలంలోని నారాయణపురం గ్రామానికి సంబంధించిన భూములను లెక్కించి అర్హులైన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రీ సర్వేకు గెజిట్ విడుదల చేసింది. 2017లో నెల్లికుదురు మండల పరిధిలోని చిన్నముప్పా రం రెవెన్యూ గ్రామం నుంచి నారాయణపురం విడిపోయి కేసముద్రం మండలంలో కలిసింది. ఈ క్రమంలో పలువురు రైతుల పట్టాభూములు ధరణి పోర్టల్ రికార్డుల్లో అడవి భూములుగా నమోదైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తమ భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు అందించాలని పలుమార్లు రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో అధికారులు ఎంజాయిమెంట్ సర్వే నిర్వహించారు. కొంతమంది రైతులకు పాసు పుస్తకాలు అందించినప్పటికీ మరికొంత మందికి రాకపోవడంతో ప్రభుత్వ పథకాలకు, రుణాలకు దూరమై తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నారాయణపురం గ్రామ భూముల రీ సర్వే నిర్వహించాలని బుధవారం ప్రత్యేకంగా గెజిట్ను విడుదల చేసింది. గ్రామ సరిహద్దులు నిర్ణయించి అధికారులు సర్వే నిర్వహించనున్నారు. -
గిరిజన విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
ఏటూరునాగారం: కొమురం భీంను స్ఫూర్తిగా తీసుకుని గిరిజన విద్యార్థులు క్రీడల్లో రాణించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఏటూరునాగారం ఐటీడీఏ ఆధ్వర్యంలో బుధవారం అండర్ –14, 17 విభాగాల్లో 6వ రాష్ట్రస్థాయి (భద్రాద్రి కొత్తగూడెం, ఊట్నూరు, మన్ననూరు, ఏటూరునాగారం ఐటీడీఏలు, 10 ప్లేన్ ఏరియాలు) గిరిజన క్రీడలను ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడాకారులు స్నేహపూర్వకంగా ఆడాలన్నారు. గిరిజన విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించడానికి వ్యాయామ ఉపాధ్యాయులు, ఐటీడీఏ పాలన అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. అందుకు కావాల్సిన సహకారం అందిస్తానని తెలిపారు. విద్యార్థులు ఆరోగ్యంగా, మానసికంగా ధృడంగా ఉండాలంటే క్రీడలు ఎంతో ముఖ్యమన్నారు. ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా మాట్లాడుతూ ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని గిరిజన క్రీడాకారులు ఈ పోటీల్లో రాణించి పేరు తీసుకురావాలన్నారు. కాగా, అండర్– 14 విభాగంలో 600 మీటర్ల పరుగు పందెంలో జోన్ –2(ఏటూరునాగారం)కు చెందిన చరణ్ మొదటి స్థానం, జోన్ –1(భద్రాచలం)కు చెందిన సోను రెండో, ధీరజ్ మూడో స్థానం సాధించి బహుమతులు అందుకున్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్తోపాటు ఇతర క్రీడలూ ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ జనార్దన్, డీటీడీఓలు, ఏటీడీఓలు, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఏటూరునాగారంలో 6వ రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడలు ప్రారంభం -
కాజీపేట మీదుగా సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాజీపేట మీదుగా సికింద్రాబాద్– సిర్పూర్కాగజ్నగర్, హైదరాబాద్ దక్కన్– విజయవాడ మధ్య 8 ప్రత్యేక రైళ్లను నపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ బుధవారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్ నగర్ మధ్య.. జనవరి 9, 10వ తేదీల్లో హైదరాబాద్–సిర్పూర్ కాగజ్నగర్ (07469) ఎక్స్ప్రెస్, జనవరి 9, 18వ తేదీల్లో సిర్పూర్కాగజ్నగర్–హైదరాబాద్ (07470) ఎక్స్ప్రెస్ కాజీపేటకు చేరుకుని వెళ్తాయి. జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లతో ప్రయాణించే ఈ రైళ్లకు సికింద్రాబాద్, చర్లపల్లి, భువనగిరి, ఆలేరు, జనగా మ, ఘన్పూర్, కాజీపేట, ఉప్పల్, జమ్మికుంట, ఓదెల, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, రవీంద్రఖని, మందమర్రి, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. హైదరాబాద్–విజయవాడ మధ్య.. జనవరి 9, 10వ తేదీల్లో హైదరాబాద్ దక్కన్–విజయవాడ (07471) ఎక్స్ప్రెస్, జనవరి 9, 18వ తేదీల్లో విజయవాడ–హైదరాబాద్ దక్కన్ (07472) ఎక్స్ప్రెస్ కాజీపేట, వరంగల్కు చేరుకుని వెళ్తాయి. జనరల్ సెకండ్క్లాస్ కోచ్లతో ప్రయాణించే ఈ రైళ్లకు సికింద్రాబాద్, చర్లపల్లి, జనగామ, ఘన్పూర్, కాజీపేట, వరంగల్, నెక్కొండ, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. వరంగల్ మీదుగా ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వరంగల్ మీదుగా చర్లపల్లి–తిరుచనూరు, చర్లపల్లి–తిరుచనూరు మధ్య రెండు వారాంతపు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు కాజీపేట రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. జనవరి 22వ తేదీన చర్లపల్లి–తిరుచనూరు (07140) వీక్లి ఎక్స్ప్రెస్, జనవరి 25వ తేదీన తిరుచనూరు–చర్లపల్లి (07141) వీక్లి ఎక్స్ప్రెస్ వరంగల్కు చేరుకుని వెళ్తాయి. ఈ రైళ్లకు బొల్లారం, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుంటూరు, నంద్యాల, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట స్టేషన్లలో హాల్టింగ్ కల్పించారు. సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ మధ్య నాలుగు ట్రైన్లు హైదరాబాద్ దక్కన్–విజయవాడ మధ్య నాలుగు.. -
బస్సుల కండీషన్పై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి
హన్మకొండ: మేడారం జాతరలో బస్సుల వైఫల్యం లేకుండా కండీషన్పై మెయింటెనెన్స్ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని టీజీఎస్ ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలోమన్ సూచించారు. బుధవారం వరంగల్ ములుగు రోడ్లోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో హైదరాబాద్, సికింద్రాబాద్, మహబూబ్నగర్ రీజియన్ల ట్రాఫిక్, మెయింటెనెన్స్ ఇన్చార్జ్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతరలో భక్తులకు రవాణాపరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ పటిష్ట చర్యలు చేపట్టిందన్నారు. వాహనాలు బ్రేక్ డౌన్ అయితే ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రమాదం ఉందని, ఈ క్రమంలో బస్సులు ఫెయిల్ కాకుండా మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. బ్రేక్డౌన్ కాకుండా బస్సులను సిద్ధం చేయాలన్నారు. ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ దర్శనం విజయభాను, డిప్యూటీ మేనేజర్ కేశరాజు భాను కిరణ్, ఏటీఎం ఎం.మల్లేశయ్య, డిపో మేనేజర్ రవి చంద్ర, పర్సనల్ ఆఫీసర్ పి.సైదులు, అకౌంట్స్ ఆఫీసర్ ఎల్.రవీందర్, తదితరులు పాల్గొన్నారు భూ తగాదా.. అన్నను చంపిన తమ్ముడు వర్ధన్నపేట: భూ తగాదా నేపథ్యంలో అన్నను చంపిన తమ్ముడిని అరెస్ట్ చేసినట్లు వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య తెలిపారు. బుధవారం వర్ధన్నపేట ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపురం గ్రా మానికి చెందిన కొండ వీరస్వామి(62)కు తన తమ్ముడు వెంకన్నతో 30 ఏళ్లుగా భూ తగాదా జరుగుతోంది. ఈ క్రమంలో ఈనెల 5న వీరస్వామి తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాడు. అక్కడ తన మరో తమ్ముడు లక్ష్మయ్య పొలంలో ఉన్నాడు. స మీపంలోని మడుగులో చేపలు పడదామని లక్ష్మ య్యకు చెప్పి వీరస్వామి ముందు వెళ్లాడు. చేపలు పడుతున్న సమయంలో వీరస్వామి చిన్న త మ్ముడు, నిందితుడు వెంకన్న తన అన్న ఒంటరిగా ఉండడం గమనించి ఇదే అదనుగా భావించాడు. అక్కడే ఉన్న పారతో వీరస్వామిని దారుణంగా కొట్టి చంపి పరారయ్యాడు. మరో సోదరుడు లక్ష్మ య్య కుండ పట్టుకుని మడుగు వద్దకు వచ్చి చూడగా వీరస్వామి కనిపించలేదు. దీంతో అక్కడే వెతుకుతున్న క్రమంలో మడుగులో విగత జీవిగా పడి ఉన్నాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారైన వెంకన్నను బుధవారం రాయపర్తి బస్టాండ్ వద్ద పట్టుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. దీంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు.కాగా, 24 గంటల్లోనే కేసును ఛేదించి నిందితుడిని పట్టుకున్న సీఐ శ్రీనివాసరావు, రాయపర్తి ఎస్సై రాజేందర్ను సిబ్బందిని వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్, ఏసీపీ నర్సయ్య అభినందించారు. ● ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలోమన్ నిందితుడి అరెస్ట్, రిమాండ్ వివరాలు వెల్లడించిన ఏసీపీ నర్సయ్య -
రేపు బీసీ విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ
హన్మకొండ : తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర మహాసభను ఈ నెల 9న వరంగల్లో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ శాఖ (16 జిల్లాల పరిధి) కా ర్యదర్శి నీలారపు రాజేందర్ తెలిపారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘాన్ని 2006లో స్థాపించినట్లు చెప్పారు. సంఘం స్థాపించి 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా వరంగల్లో శుక్రవారం రాష్ట్ర మహాసభను నిర్వహిస్తున్నామన్నారు. ఈ మహాసభకు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎంపీ ఈటల రాజేందర్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొంటా రని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న వి ద్యుత్ ఉద్యోగులు తరలొచ్చి ఈ మహాసభను విజ యవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహాసభ పోస్టర్ ఆవిష్కరించారు. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ పెరుమాండ్ల సత్యనారాయణ, బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఎన్పీడీసీఎల్ కంపెనీ శాఖ అధ్యక్షుడు నాగిళ్ల సదానందం, నాయకులు చంద్రమౌళి, సత్యనారాయణ, సర్వేశ్వర్, ప్రసాద్, కృష్ణ, రాజు, తదితరులు పాల్గొన్నారు. బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఎన్పీడీసీఎల్ కంపెనీ శాఖ కార్యదర్శి రాజేందర్ -
తెగులు.. దిగులు
కాళోజీ సెంటర్ : మిర్చి.. రైతు ఇంటా సిరులు కురిపించే పంట. ఎర్రబంగారంగా పిలిచే ఈ పంట రైతుకు అధిక ఆదాయం అర్జించి పెడుతుంది. అందుకే అన్నదాతలు ఈ పంట సాగుకు మొక్కు చూపుతారు. అయితే ప్రస్తుతం మిర్చి రైతుకు తెగులు దిగులు పుట్టిస్తోంది. నల్ల తామర, తెల్ల దోమ పురుగు మిరప పంటను ఆశించి తీవ్ర స్థాయిలో నష్టపరుస్తోంది. దీనిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపడితే పంట నష్టపోకుండా అధిక దిగుబడి పొందొచ్చని జిల్లా ఉద్యన, పట్టు పరిశ్రమ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు అన్నదాతలకు పలు సలహాలు, సూచనలు అందజేస్తున్నారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. మిర్చి పంటను ఆశిస్తున్న నల్ల తామర సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తేనే అధిక దిగుబడి రైతులకు ఉద్యాన,పట్టు పరిశ్రమ శాఖ అధికారుల సూచనలు -
ముగిసిన పీడీఎస్యూ రాష్ట్ర మహాసభలు
వరంగల్: ప్రగతిశీల ప్రజాస్వా మ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) 23వ రాష్ట్ర మహాసభలు బుధవారం ముగిశాయి. ఈ సందర్భంగా పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ప్రచురించిన ‘మళ్లీ డి టెన్షన్ గుది బండే’, ‘సంక్షోభంలో విద్యారంగం’ అనే రెండు పుస్తకాలను పీడీఎస్యూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడపంగి నాగరాజు గత మహాసభ నుంచి నేటి వరకు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమాల నివేదికలను హాజరైన సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహాసభల ఆహ్వాన సంఘం నాయకులు రాచర్ల బాలరాజు, గంగుల దయాకర్, ఎలకంటి రాజేందర్, బండి కోటేశ్వరరావుతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుర్రం అజయ్, మర్రి మహేశ్, తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదులకు లోకల్ కోర్టు మంచివేదిక
పెద్దవంగర: విద్యుత్ వినియోగదారులు నేరుగా తమ ఫిర్యాదులు తెలియజేసేందుకు లోకల్ కోర్టు మంచి వేదిక అని టీజీ ఎన్సీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్పర్సన్ ఎన్వీ వేణుగోపాల చారి అన్నారు. మండలంలోని చిన్నవంగర విద్యుత్ సబ్స్టేషన్లో బుధవారం విద్యుత్ వినియోగదారుల కోసం లోకల్ కోర్టును నిర్వహించారు. పలు సమస్యలపై రైతుల నుంచి 12 దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం వేణుగోపాల చారి మాట్లాడారు. విద్యుత్ వినియోగదారుల సమస్యలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు లోకల్ కోర్టులను ఏర్పాటు చేశామని తెలిపారు. వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలియజేసేందుకు ఇది మంచి వేదికని, అందిన ప్రతీ దరఖాస్తును నిబంధనల మేరకు పరిశీలించి పరిష్కరించాలని విద్యుత్ అధికారులను అదేశించారు. కార్యక్రమంలో టెక్నికల్ మెంబర్ రమేష్, ఫైనాన్స్ మెంబర్ దేవేందర్, ఇండిపెండెంట్ మెంబర్ రామారావు, డీఈ రవి, ఏడీఈ చలపతిరావు, ఏఈ మహేష్, పెద్దవంగర ఏఈ రమేష్ బాబు, సబ్ఇంజనీర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. విజయవంతం చేయాలి మహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ నెల 20న జరగనున్న తల్లిదండ్రుల సమావేశం విజయవంతం చేయాలని డీఐఈఓ మదార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇంటర్ విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం తల్లిదండ్రులు–అధ్యాపకుల ఆహ్వాన పోస్టర్ను డీఐఈఓ మదార్, ప్రిన్సిపాళ్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ.. ఇంటర్ వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో పిల్లల భవిష్యత్, ఒత్తిడి తగ్గించడానికి సలహాలు, సూచనలు తె లుసుకోవడానికి మెగా తల్లిదండ్రుల సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశానికి తల్లిద ండ్రులు తప్పక హాజరకు కావాలని కోరా రు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల జిల్లా అధ్యక్షుడు పొక్కుల సదానందం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నయీమ్, ప్రిన్సిపాల్ డీపీ గణేష్, అధ్యాపకులు నాగిరెడ్డి, షాహిద్, శివకుమార్, ప్రేమ్శేఖర్, సారయ్య, రాజశేఖర్ పాల్గొన్నారు. డోర్నకల్ ఎఫ్ఆర్ఓ రేణుక సస్పెన్షన్ డోర్నకల్: అటవీశాఖ డోర్నకల్ రేంజ్ అధికారి పి.రేణుక సస్పెండ్ అయ్యారు. కొద్ది నెలల క్రితం రేంజ్ పరిధిలో సండ్ర కర్ర అక్రమ తరలింపు వ్యవహారంపై అటవీశాఖ ఉన్నతాధికారులు విచారణ జరిపారు. ఈ నివేదిక ఆధారంగా ఎఫ్ఆర్వో రేణుకను సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సి.సువర్ణ ఆదేశాలు జారీ చేశారు. గత సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో డోర్నకల్, కురవి మండలాల నుంచి సండ్ర కర్రను సేకరించి తరలిస్తుండగా ఖమ్మం జిల్లా చింతకాని ప్రాంతంలో అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో వారు విచారణ జరిపి గత అక్టోబర్లో డోర్నకల్, కురవి సెక్షన్ అధికారులను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై ఎఫ్ఆర్ఓ రేణుకను కూడా బాధ్యురాలిని చేస్తూ ఆమెను కూడా సస్పెండ్ చేస్తున్నట్లు ఈ నెల 4వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. పర్మిట్ ట్యాంపరింగ్పై విచారణ.. జిల్లాలో కర్ర తరలింపునకు సంబంధించిన అనుమతి పత్రాలు ట్యాంపరింగ్ జరిగిన ఘటనపై అటవీశాఖ అధికారులు విచారణ జరి పినట్లు సమాచారం. మరిపెడ మండలంలోని ఓ గ్రామంలో కర్ర కొనుగోలు చేసి మహబూబా బాద్లో కొన్నట్లు పత్రాలు సృష్టించినట్లు గుర్తించిన అధికారులు హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన ఓ ఆన్లైన్ సెంటర్ నిర్వాహకుడిని విచారించినట్లు సమాచారం. హాస్టల్లో ప్రవేశాలు రద్దు చేసుకోవాలి కేయూ క్యాంపస్: కేయూలో రెండో పీజీ చేస్తున్న విద్యార్థులు హాస్టల్లో ప్రవేశాలను రద్దు చేసుకోవాలని కేయూ హాస్టళ్ల డైరెక్టర్ ఆచార్య ఎల్పీ రాజ్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో కోరా రు. డబుల్ పీజీ చదివే విద్యార్థులకు వర్సిటీ నిబంధనల ప్రకారం హాస్టల్ వసతి, మెస్ సదుపాయం ఇవ్వకూడదని గతంలోనే స్పష్టమై న ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొందరు నిబంధనలు ఉల్లంఘంచి హాస్టళ్లలో ప్రవేశాలు పొందిన ట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. తమ హాస్టళ్లలో ప్రవేశాన్ని ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు రద్దు చేసుకోకపోతే తామే రద్దు చేస్తామని తెలిపారు. హాస్టల్ డిపాజిట్ కూ డా తిరిగి ఇవ్వమని, కళాశాల ప్రవేశం సైతం ర ద్దుకు చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. -
పొత్తు పొడిచేనా?
సాక్షి, మహబూబాబాద్: ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట మానుకోట. సాయుధ పోరాటం మొదలుకొని.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషి ంచారు. పేదలకు ఇళ్లు, కార్మికులు, కర్షకుల హక్కు ల కోసం అనునిత్యం పోరాటాలు చేసిన ఘనత ఈ ప్రాంత కమ్యూనిస్టులకు దక్కింది. అందుకోసమే దొరలు, భూస్వామ్యులను ఎదిరించి ప్రజల అండతో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర కీలక పదవులు అలంకరించిన చరిత్ర ఉంది. అయితే క్రమంగా కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గుతూ వస్తోంది. ఈ పరిస్థితిలో పార్టీల ప్రతిష్టను కాపాడాలంటే ఇతర పార్టీలతో పొత్తులు అనివార్యమని కామ్రేడ్స్ అంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతూనే.. పొత్తుల విషయంపై కసరత్తు ప్రారంభించారు. కాంగ్రెస్తో సీపీఐ దోస్తీ.. సార్వత్రిక ఎన్నికల నుంచే సీపీఐ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తోంది. దీనికి ఫలితంగానే రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు. సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సుధాకర్ రెడ్డికి మరిపెడ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఈమేరకు మున్సిపల్ ఎన్నికల్లోనూ సముచిత స్థానం ఉంటుందని సీపీఐ నాయకులు చెబుతున్నారు. పార్టీ బలం ఎక్కువగా ఉన్న మహబూబాబాద్లో గత మున్సిపల్ ఎన్నికల్లో 12 వార్డుల్లో పోటీ చేసి రెండు గెలిచామని, మిగిలిన చోట్ల కూడా స్వల్ప ఓట్లతో ఓటమిపాలయ్యామని పార్టీ నాయకులు అంటున్నారు. ఈ సారి మహబూబాబాద్లో 18 వార్డులతో పాటు, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం మున్సిపాలిటీల్లో రెండేసి స్థానాల్లో సీపీఐ పోటీ చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఈ పోటీ ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇప్పటికీ ఇంకా స్పష్టత ఇవ్వడం లేదు. పొత్తు ఉంటే ఉండవచ్చు.. కానీ వారు అడిగినన్ని వార్డులు ఇచ్చే పరిస్థితి ఉండబోదని ఆ పార్టీలోని కొందరు కీలక నాయకులు చెబుతున్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇరు పార్టీల మధ్య పొత్తు విషయంపై స్పష్టత రానుంది. సీపీఎం దారెటు..? ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో స్నేహపూర్వక పొత్తు, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకోసం ప్రచారం.. సర్పంచ్ ఎన్నికల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అడుగులు వేసిన సీపీఎం మున్సిపల్ ఎన్నికల్లో ఏపార్టీతో పొత్తు పెట్టుకోవాలి అనే విషయంపై కసరత్తు ప్రారంభించింది. కాంగ్రెస్, సీపీఐ పొత్తులు ఉంటాయనే సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఎం పొత్తు పెట్టుకుంటే ఆశించినన్ని వార్డులు ఇచ్చే పరిస్థితి కనిపిండం లేదు. గత మున్సిపల్ ఎన్నికల్లో మానుకోట మున్సిపాలిటీల్లో ఎనిమిది స్థానాల్లో పోటీచేసిన సీపీఎం రెండు స్థానాల్లో గెలిచింది. మిగిలిన స్థానాల్లో కొన్నింటిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు కూడా మానుకోటలో 10 వార్డులతోపాటు, తొర్రూరు, మరిపెడ, కేసముద్రం, డోర్నకల్ మున్సిపాలిటీల్లో రెండు వార్డులకు తగ్గకుండా పోటీలో ఉండేందుకు సమాయత్తం అవుతున్నారు. అయితే సీపీఎంతో పొత్తుకు జిల్లాలోని ఇరు పార్టీల నాయకులు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే.. రాష్ట్రంలో ఆ పార్టీ బీజేపీతో జతకంటే అవకాశం ఉందనే ఊహగానాల నేపథ్యంలో సిద్ధాంతపరమైన విభేదాల వల్ల బీఆర్ఎస్తో కలిసి పోటీచేసే అవకాశం లేదు. అదే విధంగా కాంగ్రెస్లోని ఓ పెద్దనాయకుడు ఇటీవల వామపక్ష పార్టీలతో పొత్తుపెట్టుకొని మున్సిపల్ ఎన్నికలకు వెళ్తామని చెప్పిన మాటలు కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే కమ్యూనిస్టులు గెలిచే స్థానాలు తక్కువగా ఉన్నా.. వారి ఓట్లతో ఇతర పార్టీలను ఓడించడం, గెలిపించే సత్తా ఉన్నట్లు కామ్రేడ్స్ అంటున్నారు. చైర్మన్ పదవులు దక్కించుకునేందుకు కమ్యూనిస్టులతో పొత్తు కీలకంగా ఉంటుందని ఉభయ కమ్యూనిస్టుల వాదన. ఈ పరిస్థితిలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. మున్సిపల్ ఎన్నికలపై కామ్రేడ్స్ కసరత్తు పొత్తులు అనివార్యంగా కమ్యూనిస్టుల ఎత్తుగడలు కాంగ్రెస్తో దోస్తీకి సీపీఐ సిద్ధం సీపీఎం పొత్తుపై సందిగ్ధం -
ప్రజాఉద్యమాలతోనే సామాజిక మార్పు
కేయూ క్యాంపస్: ప్రజా ఉద్యమాలతోనే సామాజిక మార్పు సాధ్యమని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బి.ఎస్. రాములు అన్నారు. కాకతీయ యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ విభాగం, తెలుగు విభాగం సంయుక్తంగా ‘తెలంగాణ చరిత్రలో ప్రజా ఉద్యమాలు 1969–2025’ అనే అంశంపై బుధవారం కేయూ సెనేట్హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యవక్తగా మాట్లాడారు. ప్రజా ఉద్యమాలు చైతన్య ప్రక్రియలన్నారు. అనంతరం కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ సమాజ హిత ఉద్యమాలను స్వాగతించాలన్నారు. ప్రజల అవసరాల నుంచి పుట్టినవే ఉద్యమాలన్నారు. కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య మనోహర్, స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ విభాగం ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి, తెలుగు విభాగం ఇన్చార్జ్ అధిపతి మామిడి లింగయ్య, కేయూ పాలకమండలి సభ్యుడు చిర్రరాజు, స్టూడెంట్స్ యూత్ వెల్ఫేర్ ఆఫీసర్లు సి.హెచ్ రాధిక, నిరంజన్, తెలుగు విభాగం అధ్యాపకులు సదాశివ్, బానోతు స్వామి పాల్గొన్నారు. కాగా, ప్రజా ఉద్యమాలు అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ రాములు -
ఉపాధి కోల్పోయాం..
డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో ఉపాధి హామీ పథకం రద్దు కావడంతో ఉపాధి కోల్పోయామని సిగ్నల్తండా, రాజుతండాకు చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. డోర్నకల్ మున్సిపాలిటీని గ్రామపంచాయతీగా మార్చాలని డిమాండ్ చేస్తూ బుధవారం సిగ్నల్తండా, రాజుతండాకు చెందిన మహిళలు గాంధీ సెంటర్లో ఆందోళనకు దిగారు. మున్సిపాలిటీ ఏర్పాటుతో తాము ఉపాధి కోల్పోయామని, వ్యవసాయ యాంత్రీకరణ, ఇతర రాష్ట్రాల కూలీలతో పనులు కూడా దొరకడం లేదంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, మహిళలు నాలుగు గంటల పాటు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. సీఐ చంద్రమౌళి, ఎస్సై వంశీధర్తో పాటు మున్సి పల్ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు నచ్చజెప్పడంతో మహిళలు ఆందోళన విరమించారు. -
పెరటి కోళ్ల పెంపకం..
చక్కటి ఆదాయ మార్గం.. ఖిలా వరంగల్ : దళిత మహిళారైతుల ఆదాయ మార్గం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అటారీ షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ పథకం ద్వారా గ్రామీణ, నగర శివారు ప్రాంతాల్లో పెరటి కోడి పిల్లలు పంపిణీ చేస్తోంది. ఫలితంగా దళిత మహిళా రైతులు, ఇతర కుటుంబాలు నెలకు రూ.10 వేలు కంటే అధిక ఆదాయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో పెరటికోళ్లలో రకాలు, పెంపకంతో వచ్చే ఆదాయంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. కాగా, ఈ పథకంపై మామునూరు పీవీ నరసింహరావు పశువైద్య విశ్వవిద్యాలయంలోని కృషి విజ్ఞాన కేంద్రం అవగాహన కల్పిస్తోంది. దశల వారీగా ఆదాయం.. నాటుకోడి ఏడాదికి మూడుసార్లు పొదుగుతుంది. నాలుగు నెలలకు ఒకసారి మూడు వారాల పాటు గుడ్డు పెడుతుంది. ఏడాదికి 40–45 కోడిగుడ్లు పె డుతుంది. పొదిగిన సమయంలో 12–15 గుడ్లు పె డుతుంది. ఇందులో 10–12 పిల్లలుగా రూపాంతరం చెందుతాయి. కోడి పొదుగు ప్రారంభించిన తర్వాత మూడు వారాల్లో గుడ్లు పిల్లలుగా రూపుదిద్దుకుంటాయి. ఒక కోడి ఏడాదికి 40 గుడ్లు పెడితే 36 పిల్లలుగా రూపాంతరం చెందుతాయని పశుసంవర్థశాఖ శాస్త్రవేత్తలు తెలిపారు. 36 పిల్లలు కోళ్లుగా ఎదగడానికి రెండు నెలల సమయం పడుతుంది. ఒక్కొ నాటు కోడిని రూ.400 నుంచి 500 వరకు అ మ్ముతున్నారు. 14 పిల్లల్లో 50 శాతం ఆడ(పెట్ట లు ), 50 శాతం మగ (పుంజులు) ఉంటాయి. పెంప కం దారులు పుంజులు అమ్మి పెట్టలను పెంచుకుంటే దినదినాభివృద్ధి చెంది కోళ్లతోపాటు గుడ్లు సంఖ్య పెరిగి దశల వారీగా ఆదాయం పెరుగుతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. కోళ్ల పెంపకం దారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కోడికి రక్షణగా చిన్న గంప లేదా ఇనుప కుందెన ఏర్పాటు చేసుకుంటే కుక్కలు, పిల్లుల బెడద ఉండదు. మహిళలు, వృద్ధులు ఈ పెంపకంపై దృష్టి సారిస్తే ఆదాయం పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని కేవీకే శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంటి ఆవరణ, ఖాళీ స్థలం చుట్టూ పెన్సింగ్ వేసి రక్షణ కల్పిస్తే వందల సంఖ్యలో కోళ్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంట్లోని వ్యర్థ పదార్థాలను కోళ్లకు దాణాగా ఉపయోగించుకోవచ్చు. వైద్యుల సలహాలు తీసుకుంటే వ్యాధులు బారిన పడకుండా కోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అభివృద్ధి చెందిన నాటుకోళ్ల గుడ్లు బరువు 50 నుంచి 60 గ్రాములు.. కోళ్లలో రెండు రకాలు ఉన్నాయి. నాటుకోళ్లు, అభివద్ధి చెందిన నాటుకోళ్లు. నాటు కోళ్ల ఏడాదికి మూడు సార్లు పొదుగుతుంది. నాలుగు నెలలకు ఒకసారి గుడ్లు పెడుతాయి. అభివృద్ధి చెందిన నాటుకోళ్లల్లో రాజశ్రీ, గ్రామ ప్రియ, వనరాజా, కడక్ నాథ్ వంటి రకాలు ఉన్నాయి. ఈ రకం కోళ్లు ఏడాదికి 180–240 గుడ్లు పెడుతాయి. ఈ రకం కోళ్లలో పొదిగే స్వభావం తక్కువ ఉంటుంది. రెండు నెలలు కోడిగుడ్లు పెడుతాయి. ఒక్కొక్క గుడ్డు బరువు 50 నుంచి 60 గ్రాములు ఉంటుంది. యంత్రాల ద్వారా కోడి పిల్లల తయారీ.. అభివృద్ధి చెందిన కోళ్ల రకాలను మెరుగుపర్చడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ రకం కోళ్లు ఏడాదికి 180 నుంచి 240 గుడ్లు పెడుతాయి. తద్వారా రైతులకు అధిక ఆదాయం వస్తుంది. అందుకే కృత్రిమ కోడి పిల్లల తయారీపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి సక్సెస్ అయ్యారు. ఇంక్యుబేటర్ (పొదిగే యంత్రం)లో గుడ్లు పెడితే 21 రోజుల తర్వాత పిల్లలుగా రూపాంతరం చెందుతాయి. 21 రోజుల తర్వాత పిల్లలను బయటకు తీసి పెంచుకోవాలి. ఇంక్యుబేటర్ రూ.10వేలు నుంచి రూ.40 వేల వరకు ఉంది. చిన్న ఇంక్యుబేటర్లో 4 డజన్లు (48) పిల్లలు తయారయ్యే అవకాశం ఉంది. దళిత మహిళారైతులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చేయూత వందశాతం సబ్సిడీతో కోడిపిల్లలు పంపిణీ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన -
విద్యుత్ పనులు 10లోపు పూర్తి చేయాలి
హన్మకొండ : మేడారం జాతర విద్యుత్ సరఫరా పనులను ఈ నెల 10వ తేదీలోపు పూర్తి చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ములు గు ఎస్ఈ, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ జాతరను దృష్టిలో ఉంచుకుని నార్లాపూర్లో కొత్తగా నిర్మిస్తున్న 33/11 కేవీ సబ్ స్టేషన్ పనులు పూర్తి చేసి ఈ నెల 16న చార్జ్ చేయాలన్నారు. అలాగే, గట్టమ్మ ఆలయం వద్ద కొత్తగా నిర్మిస్తున్న 33/ 11 కేవీ సబ్ స్టేషన్ పనులు ఈ నెల 20 వరకు పూర్తి చేసి వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మేడారంలోని పార్కింగ్ స్థలా ల్లో పనులన్నీ పూర్తి చేయాలన్నారు. ఇప్పటి వరకు వివిధ సామర్థ్యం గల ట్రాన్స్ఫార్మర్లు 170 వరకు ఏర్పాటు చేశామన్నారు. అవసరం మేరకు బిగించాల్సిన ట్రాన్స్ఫార్మర్ పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ (ప్రాజెక్టస్) వి.మోహన్ రావు, డైరెక్టర్ (ఆపరేషన్) టి.మధుసూదన్, చీఫ్ ఇంజనీర్ కె.రాజు చౌహాన్, ములుగు ఎస్ఈ ఎ.ఆనందం, డి.ఈ.లు పి.నాగేశ్వర రావు, రాజు, సదానందం, ఈఈ (సివిల్) వెంకట్ రామ్, ఏడీఈలు రాజేశ్, వేణుగోపాల్, సందీప్ పాటిల్, తదితరులు పాల్గొన్నారు. 16న నార్లాపూర్ 33/11 కేవీ సబ్ స్టేషన్ చార్జ్ చేయాలి పార్కింగ్ స్థలాల్లో విద్యుత్ పనులు త్వరగా పూర్తి చేయాలి టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి -
వందశాతం సబ్సిడీపై పంపిణీ
దళిత మహిళా రైతుల ఆదాయాన్ని పెంచడానికే కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఐసీఏఆర్ అటారీ షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక కింద మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా పెరటి కోడి పిల్లలను పంపిణీ చేస్తున్నాం. పెంపకంపై అవగాహన కల్పించి మహిళలకు ఆదాయ మార్గాలు చూపుతున్నాం. అభివృద్ధి చెందిన కోళ్ల జాతిలోని రాజశ్రీ, గ్రామ ప్రియ, వనరాజా, కడక్ నాథ్ పిల్లలను 100శాతం సబ్సిడీపై అందజేస్తున్నాం. దీంతో షెడ్యూల్ కులాల మహిళలు మంచి ఆదాయం పొందుతున్నారు. – డాక్టర్ బిందు మాధురి, కోఆర్డినేటర్, కేవీకే, వరంగల్


