Mahabubabad
-
మున్సి‘పాలన’ అస్తవ్యస్తం
డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీలో పాలన అస్తవ్యస్తంగా మారింది. ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పుడుతున్నారు. అయితే మున్సిపాలిటీ అధికారులు, పాలకవర్గం పట్టించుకోవడం లేదు. సమస్యలపై ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష పార్టీలు నోరు మెదపడం లేదు. దీంతో తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని ప్రజలు వాపోతున్నారు. నిత్యం తాగునీటి ఇబ్బందులు... మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డుల్లో ప్రజలు నిత్యం తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమృత్ పథకంలో భాగంగా పైప్లైన్ ఏర్పాటు కోసం తవ్వకాలు జరుపుతుండడంతో తరచూ పలు వార్డుల్లో తాగునీటి సరఫరా నిలిచి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రూ.15కోట్ల నిధులతో పట్టణంలోని పలు వార్డుల్లో చేపట్టిన డ్రెయినేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వకాలు జరపడంతో పైపులు పగిలి తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ఎండాకాలం నీటి సరఫరా సక్రమంగా జరగకపోవడంతో ప్రజలు వాటర్ ప్లాంట్లలో నీటిని కొనుగోలు చేస్తున్నారు. నత్తనడకన అభివృద్ధి పనులు.. ప్రస్తుతం అమృత్ పథకంతో పాటు రూ.15 కోట్ల నిధులతో చేపట్టిన డ్రెయినేజీ, సీసీ రోడ్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. అయితే నూతన రోడ్ల కోసం పాత రోడ్లను ధ్వంసం చేసి పనులు పూర్తి చేయకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ధ్వంసమైన రోడ్ల నుంచి దుమ్ము , ధూళి వస్తుండడంతో స్థానికులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. రోడ్లు వెడల్పు, డ్రెయినేజీ నిర్మాణాల కోసం కొంతమంది తమ ఇంటి ముందు స్థలాలు ఇచ్చేందుకు అభ్యంతరం తెలుపుతుండడంతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దుర్గంధం.. వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులు పలు కారణాలతో మధ్యలోనే నిలిపివేయడంతో మురుగునీరు, వ్యర్థాలు డ్రెయినేజీల్లో నిలిచి తీవ్ర దుర్గంధం వెదజల్లుతుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపాలిటీ సిబ్బంది పలు వార్డుల్లో చెత్త సేకరణతో పాటు డ్రెయినేజీల్లో చెత్త తొలగించే పనులు నిలిపివేయడంతో వీధులు, డ్రెయినేజీల్లో చెత్త, మురుగు పేరుకుపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. పట్టించుకోని పాలకవర్గం, మున్సిపల్ సిబ్బంది.. మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో ప్రజలు తాగునీరు, పారిశుద్ధ్యం, అస్తవ్యస్తమైన రహదారులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. పాలకవర్గం, మున్సిపాలిటీ సిబ్బంది పట్టించుకోవడం లేదు. నత్తనడకన సాగుతున్న అభివృద్ధి పనులతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా.. అధికారులెవరూ పనులను కనీసం పరిశీలించడం లేదు. వీధుల్లో తాగునీరు దొరకడం లేదంటూ ప్రజలు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లకు మొరపెట్టుకుంటున్నా.. వారు పట్టించుకోవడం లేదు. ప్రతిపక్ష పార్టీలైతే పత్తా లేకుండా పోయాయి. బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ సమస్యలపై నోరు మెదపడం లేదు. అధికారులు, మున్సిపాలిటీ పాలకవర్గం వెంటనే స్పందించి వార్డుల్లో పర్యటించి అభివృద్ధి పనులు సత్వరం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, తాగునీటి సరఫరా క్రమబద్ధీకరించి, పారిశుద్ధ్య సమస్య ను వెంటనే పరిష్కరించాలని మున్సిపాలిటీ ప్రజలు కోరుతున్నారు. నరకయాతన అనుభవిస్తున్నాం..ధ్వంసమైన రోడ్లు, డ్రెయినేజీల్లో నిలిచిన మురుగునీటితో నరకయాతన అనుభవిస్తున్నాం. అభవృద్ధి పనుల పేరుతో నెలల తరబడి పనులు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పైపులు పగిలి నీరు వృథాగా పోతూ తాగునీరందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. మున్సిపాలిటీ పాలకవర్గం, అధికారులు పట్టించుకోవడం లేదు. – ఎస్కె ఖాజా, కూరగాయల వ్యాపారి 1432 డోర్నకల్లో అరకొరగా తాగునీటి సరఫరా నత్తనడకన అభివృద్ధి పనులు పారిశుద్ధ్యం, ధ్వంసమైన రహదారులతో ఇబ్బందులు పత్తాలేని మున్సిపల్ అధికారులు, పాలకవర్గం -
బీమాతో కార్మికులకు ధీమా
మహబూబాబాద్ రూరల్ : కార్మికులు బీమా చేయించుకుని ధీమాగా బతకాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని (మే డే) పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో భవన నిర్మాణ రంగ కార్మికులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఆయన కార్మికులకు కార్డులు అందజేసి మాట్లాడారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడుమామిడాల సత్యనారాయణ, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వి.రాజ్ కృష్ణ, పలువురు పారా లీగల్ వలంటీర్లు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. మక్కల కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలినర్సింహులపేట: కొనుగోలు కేంద్రాల్లో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, మక్కల కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆమె సందర్శించి పరిశీలించారు. మక్కల కొనుగోళ్లు ఎలా జరుగుతున్నాయని రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులు ఇబ్బందులు పడుతున్నారని, త్వరగా కాంటాలు పెట్టాలని ఫోన్లో అధికారులతో మాట్లాడారు. రైతులు మక్కలు తీసుకొచ్చి నెల దాటుతున్నా ఇప్పటి వరకు కాంటాలు కాలేదని, ఎప్పుడు జరుగుతాయని అడిగారు. రైతులకు ఇబ్బంది లేకుండా త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమె వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించాలి వరంగల్ క్రైం: పోలీసుల వద్దకు వెళ్తే న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇన్స్పెక్టర్ల నుంచి ఏసీపీలుగా పదోన్నతి పొందిన గొర్ల సీతా రెడ్డి, బోలగాని శ్రీనివాస్గౌడ్, సార్ల రాజు శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ను సీపీ క్యాంపు కార్యాలయంలో కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పదోన్నతులతో పాటు బాధ్యతలు పెరుగుతాయని, నిరంతరం కింది స్థాయి అధికారుల పని తీరును పర్యవేక్షించడంతో పాటు వారికి దిశానిర్దేశం చేయాలని, పోలీస్ శాఖ గౌరవ మర్యాదలు పెంపొందించేలా విధులు నిర్వర్తించాలని సీపీ.. అధికారులకు సూచించారు. నైపుణ్యాలదే కీలక పాత్ర కేయూ క్యాంపస్: ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉద్యోగాల సాధనలో నైపుణ్యాలే కీలకపాత్ర పోషిస్తాయని కేయూ వీసీ ప్రతాప్రెడ్డి అన్నారు. కేయూలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో వివిధ బ్రాంచ్ల ఫైనల్ ఇయర్ విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్లలో వివిధ ఉద్యోగాలు సాధించారు. శుక్రవారం ఆయా విద్యార్థులకు పరిపాలనా భవనంలోని సెనేట్హాల్లో అభినందన సభ నిర్వహించారు. కళాశాలలోని ఫైనల్ ఇయర్ విద్యార్థినుల్లో సుమారు 250 మంది వివిధ కంపెనీల్లో ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు పొందగా వారిని అభినందించారు. కాజీపేట రైల్వే పిట్ లైన్ల తనిఖీ కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే పిట్ లైన్లను శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ (డీఆర్ఎం) గోపాలకృష్ణన్ తనిఖీ చేశారు. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలులో అధికా రుల బృందంతో కలిసి డీజిల్ షెడ్ వద్ద రైలు దిగి పిట్ లైన్లను తనిఖీ చేశారు. రైళ్ల నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఆర్ఎం డీజిల్ కాలనీలోని రైల్వే కమ్యూనిటీ హాల్, రైల్వే చిల్డ్రన్ పార్కును తనిఖీ చేశారు. ఈనెల 10న ప్రధాన మంత్రి మోదీ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వర్చువల్లో ప్రారంభించనున్న నేపథ్యంలో.. రైల్వే అధికారులు రైల్వే కమ్యూనిటీ హాల్లో ఉండేందుకు కావాల్సిన సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. అనంతరం ప్రత్యేక రైలులో డీఆర్ఎం కాజీపేట మీదుగా పెద్దపల్లి, నిజామాబాద్కు తనిఖీల నిమిత్తం వెళ్లారు. -
ఉత్తమ ఫలితాలకు ‘సాక్షి’
దేవరుప్పుల : ఇటీవల విడుదలైన పదో తరగతి వార్షిక ఫలితాల్లో అనేకమంది విద్యార్థులు మెరుగైన మార్కులు సాధించారు. విద్యార్థుల విజయంలో సాక్షి యాజమాన్యం అందించిన మెటీరియల్ ఎంతగానో దోహదపడిందని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. సాక్షి మెటీరియల్తో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు ఈసందర్భంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సులభతరంగా మెటీరియల్.. పదో తరగతి విద్యార్థులకు గణితం, ఫిజికల్ సైన్స్ పాఠ్యాంశాలపై కొంత ఆందోళన ఉంటుంది. ఈ భయాన్ని పోగొట్టేందుకు సాక్షి దినపత్రిక ప్రముఖ విద్యానిపుణులు, సీఎస్ఆర్ సంస్థ సౌజన్యంతో అత్యంత సులభమైన పద్ధతిలో మెటీరియల్ రూపొందించి విద్యార్థులకు అందించడంతో వారు ఉత్తమ మార్కులు సాధించారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు హైస్కూళ్లకు చెందిన అనేక మంది విద్యార్థులకు దాతల సాయంతో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా ఉచితంగా మెటీరీయల్ అందజేశారు. విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణతోపాటు సాక్షి దినపత్రిక పదో తరగతి పాఠ్యాంశాలపై సమగ్ర సమాచారం, మోడల్ పేపర్లను ప్రచురించింది. దీంతో విద్యార్థులు గతంకంటే మెరుగైన ఫలితాలను సులభంగా సాధించగలిగారు. టెన్త్ విద్యార్థులకు మెటీరియల్ అందించిన సాక్షి యాజమాన్యం వినియోగించుకున్న విద్యార్థులు మెరుగైన మార్కులతో ఉత్తీర్ణత -
కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
● అదనపు కలెక్టర్ అనిల్కుమార్ మహబూబాబాద్: ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అదనపు కలెక్టర్ అనిల్కుమార్ అన్నారు. కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం అంతర్జాతీయ కార్మిక దినో త్సవం సందర్భంగా మేడే వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. కార్మికుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన– ప్రగతి ప్రణా ళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా మేడే వేడుకలు నిర్వహించామన్నారు. ఈనెల 2 నుంచి 10వ తేదీ వరకు కార్మికశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. బాల కార్మికులకు సంబంధించిన ఫిర్యాధులపై తక్షణమే స్పందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో సహాయ కార్మిక కమిషనర్ రమేశ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
అక్రమంగా దత్తత తీసుకుంటే కఠిన చర్యలు
● కలెక్టర్ స్నేహ శబరీష్ మహబూబాబాద్: అక్రమంగా దత్తత తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్నేహశబరీష్ హెచ్చరించారు. మహిళా శిశు సంక్షేమశాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దత్తత సహాయక కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. దత్తతపై అవగాహన కల్పించడానికే కేంద్రం ఏర్పాటు చేశారన్నారు. అంతర్జాతీయ దత్తత, విదేశీ, బంధువుల నుంచి దత్తత తదితర విషయాలపై పూర్తిస్థాయిలో సిబ్బంది అవగాహన కల్పిస్తారన్నారు. పిల్లలను దత్తత తీసుకునే దంపతులు వాత్సల్య పోర్టల్ ద్వారా ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ డీడబ్ల్యూఓ శిరీష, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ నాగవాణి, బాలల రక్షా భవన్ కో ఆర్డినేటర్ రాజ్యలక్ష్మి, డీసీపీఓ కమలాకర్, బాలల సంరక్షణ అధికారులు నరేష్, వీరన్న తదితరులు పాల్గొన్నారు. -
మోదీ సభను విజయవంతం చేయాలి
వరంగల్ చౌరస్తా/ఖిలా వరంగల్: హైదరాబాద్లో మే 10న జరిగే ప్రధాని నరేంద్ర మోదీ జనాగ్రహ సభను విజయవంతం చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపెల్లి వెంకటరమణారెడ్డి కోరారు. వరంగల్ హంటర్ రోడ్డులో బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అధ్యక్షతన సత్యం కన్వెన్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడోసారి ప్రధానిగా ఎనికై న తర్వాత మొదటిసారి హైదరాబాద్కు వస్తున్నారని, ఇక్కడ అధికారం లేకపోయినా తెలంగాణ అభివృద్ధి కోసం రూ.7,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు మహిళా రిజర్వేషన్ బిల్లును విగిపోయే విధంగా చేయడం సిగ్గు చేటన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదని అబద్దపు ప్రచారం చేస్తున్నారని అన్నారు. గ్రీన్ ఫీల్డ్, యాదాద్రి గుట్టకు ఎంఎంటీఎస్, వరంగల్కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కాకతీయ మెగా టెక్స్ టైల్స్, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీకి నిధులు కేటాయించినట్లు గుర్తు చేశారు. తెలంగాణలో గ్రామ సచివాలయాలకు వీబీజీరామ్ ద్వారా నిధులు మంజూరు చేశారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మహిళల గోస తగులుతుందన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీలు జనార్ధన్ రెడ్డి, వన్నాల శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, రాష్ట్ర అధికార ప్రతినిధులు దశమంతరెడ్డి, వన్నాల వెంకటరమణ, చాడ శ్రీనివాస్ రెడ్డి, ఎడ్ల అశోక్ రెడ్డి, కంభపాటి పుల్లారావు, మల్లాడి తిరుపతి రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, రత్నం సతీష్ షా, జలగం రంజిత్, నరేష్, హరిశంకర్, ప్రభాకర్, రాణాప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి -
వడదెబ్బతో వేర్వేరు చోట్ల ముగ్గురి మృతి
పోతుగల్లులో.. మొగుళ్లపల్లి: వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పోతుగల్లులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం పోతుగల్లుకు చెందిన మునిగాల చందర్ (40) రోజువారీలాగే ఉదయం కూలీపనికి వెళ్లొచ్చాడు. అనంతరం సమీప బంధువు దుబ్యాల గ్రామానికి చెందిన సుజాత గురువారం వడదెబ్బతో మృతి చెందగా ఆమె అంత్యక్రియలకు హాజరై ఇంటికి వచ్చాడు. తీవ్రమైన ఎండలో ప్రయాణించడంతో వడదెబ్బకు గురై రాత్రి మృతి చెందాడు. కాగా మృతుడు చందర్కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చందర్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాన్ని సర్పంచ్ తిరుపతి పరామర్శించి రూ.4వేలు సాయం అందించారు. కళ్లెం గ్రామంలో.. లింగాలఘణపురం : మండలంలోని కళ్లెం గ్రామాని కి చెందిన కొమ్మరాజుల నర్సింహులు (55 ) వడదెబ్బతో శుక్రవారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింహులు రెండు రోజులుగా గ్రామంలో ఓ ఇంటి నిర్మాణ పనికి వెళ్తున్నాడు. శుక్రవారం ఉదయం పనికి వెళ్లిన నర్సింహులు ఒక్కసారిగా పడిపోయాడు. గమనించిన తోటి కూలీలు వెంటనే జనగామకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. వడదెబ్బతో చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. బండౌతపురంలో.. వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని బండౌతపురం గ్రామానికి చెందిన మరుపట్ల సోమయ్య(55) వడదెబ్బతో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బండౌతపురం గ్రామానికి చెందిన మరుపట్ల సోమయ్య కూలీ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. ఇందులో భాగంగా గురువారం కూలీ పనులకు వెళ్లాడు. ఎండ దెబ్బ తగిలి సాయంత్రం ఇంటికి వచ్చి తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. రాత్రి ఇంట్లో నిద్రపోయాడు. శుక్రవారం తెల్లవారు జామున నిద్రలేవకపోవడంతో కుటుంబ సభ్యులు చూడగా అప్పటికే మృతి చెందాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం వడదెబ్బతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. గతకొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో కొడుతున్న ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈక్రమంలో ఎండ తీవ్రతను తట్టుకోలేక ముగ్గురు మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. -
‘నీట్’కు పకడ్బందీ ఏర్పాట్లు
నిబంధనలు కఠినం.. ● అభ్యర్థులు అడ్మిట్ కార్డుతోపాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, 4x6 సైజ్ ఫొటో ఒకటి, ఏదైనా గుర్తింపుకార్డు వెంట తీసుకురావాలి. ● పెన్ను, పెన్సిల్ తీసుకురావొద్దు. వీటిని పరీక్ష కేంద్రాల్లోనే అందజేస్తారు. ● బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటారు. ● ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, వాచ్లు తీసుకురావొద్దు, ● మహిళలు బంగారు నగలు పెట్టుకొని రాకూడదు. ఒకవేళ పెట్టుకుని వస్తే కేంద్రం వద్ద తీసివేయిస్తారు. ● కాళ్లకు షూస్ ధరించకూడదు. జీన్స్లాంటివి గాకుండా ఇతర సాధారణ దుస్తులు ధరించి రావాలి. ● పారదర్శకంగా ఉండే వాటర్ బాటిల్స్ను తీసుకురావచ్చు. ● డయాబెటిక్ కలిగిన అభ్యర్థులుంటే వారు పండ్లు (అరటి, యాపిల్) తీసుకొని రావచ్చు. ● ప్రతి గదిలో, మెయిన్ గేట్వద్ద అందరికీ కనిపించేలా గడియారాలు ఏర్పాటు చేస్తారు. ఉమ్మడి జిల్లాలో పరీక్షకేంద్రాలు ఇలా.. ● వరంగల్ నిట్లో రెండు సెంటర్లు, హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీకళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో ఎడ్యుకేషన్), వరంగల్లో సీకేఎం కళాశాల, ఎల్బీ కళాశాల, కేంద్రీయ విద్యాలయం, యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాల, యూనివర్సిటీ పీజీ కళాశాల. ● జయశంకర్ భూపాలపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో), ప్రభుత్వ జూనియర్ కళాశాల. ● జనగామ జిల్లా కేంద్రంలోని ఏవీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెంబర్తిలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల విద్యాలయం. ● మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోగల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల. ● మహబూబాబాద్లో నీట్ నోడల్ ఆఫీసర్గా కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ ముఖేశ్కుమార్ వ్యవహరించనున్నారు. రేపు మధ్యాహ్నం 2నుంచి 5 గంటల వరకు నిర్వహణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 14 పరీక్ష కేంద్రాలు ఉదయం 11గంటల నుంచే సెంటర్లలోకి అనుమతి మధ్యాహ్నం 1–30గంటల తరువాత నో ఎంట్రీ హాజరుకానున్న 6,016మంది అభ్యర్థులు -
కార్మిక లోకానికి అండగా ఎర్రజెండా
నెహ్రూసెంటర్: కార్మిక లోకానికి ఎర్రజెండా అండగా నిలుస్తుందని సీపీఎం జిల్లా జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ అన్నారు. మే డేను పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలో సీఐటీయూ, సీపీఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సాదుల శ్రీనివాస్ మాట్లాడుతూ. కార్మికులు పోరాటాల ఫలితంగా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ తెచ్చిన నరేంద్ర మోదీ కార్మిక ద్రోహి అన్నారు. ఐక్య పోరాటాలతోనే కార్మిక హక్కులు సాధించుకుంటామని, మే డే స్ఫూర్తితో లేబర్ కోడ్స్ రద్దు కోసం కార్మికులు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చా రు. మున్సిపల్ వైస్ చైర్మన్, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సోమయ్య, ఆకుల రాజు, సీఐ టీయూ జిల్లా కార్యదర్శి రాజమౌళి, జిల్లా ఉపాధ్యక్షులు కుమ్మరి నాగన్న, రాజు పాల్గొన్నారు. మోదీకి పతనం తప్పదు.. నరేంద్ర మోదీకి వచ్చే ఎన్నికల్లో పతనం తప్పదని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి అన్నారు. మేడే సందర్భంగా శుక్రవారం సీపీఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మానుకోట పట్టణంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. విజయసారథి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో మోదీ పతనం తప్పదన్నారు. కార్మికులు, దేశ ప్రజలందరూ బీజేపీపై పోరాటానికి సిద్ధం కావాలన్నారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అజయ్సారథి రెడ్డి, పెరుగు కుమార్, రేసపల్లి నవీన్, వెంకన్న, మామిండ్ల సాంబలక్ష్మి, కట్లోజుపాండురంగ చారి పాల్గొన్నారు. లేబర్ కోడ్స్ రద్దు కోసం పోరాటాలు ర్యాలీలతో ఎరుపెక్కిన మానుకోట -
ఆర్టీఎం పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
● పదవీ విరమణ చేసిన అధికారులకు అవకాశం హన్మకొండ అర్బన్: హైదరాబాద్లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇనిస్టిట్యూట్ సూచనల మేరకు హనుమకొండ ట్రైనింగ్ సెంటర్కు రీజినల్ ట్రైనింగ్ మేనేజర్ల (ఆర్టీఎం) ఎంపిక కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. ఇటీవల పదవీ విరమణ చేసిన ఆర్డీఓ, పీడీ, డీఆర్డీఏ, డీడీ కేడర్కు చెందిన అధికారులు, పూర్వ వరంగల్ జిల్లాలో స్థిరనివాసం ఏర్పాటుచేసుకున్న వారు తమ దరఖాస్తులను శనివారం నుంచి 4వ తేదీ వరకు హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమర్పించవచ్చని పేర్కొన్నారు. బోధన, శిక్షణపై ఆసక్తి, నిబద్ధత కలిగి ఉండాలని తెలిపారు. సేవా రికార్డు నిర్దోషంగా ఉండడంతోపాటు కంప్యూటర్లపై తగిన పరిజ్ఞానం ఉండాలని కూడా స్పష్టం చేశారు. ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ.30వేల పారితోషికం అందజేయనున్నట్లు తెలిపారు. వివరాల కోసం కలెక్టరేట్ పరిపాలన అధికారి, హనుమకొండను సంప్రదించవచ్చని, ఫోన్ నంబర్ 92475 86909 ద్వారా సమాచారం పొందవచ్చని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణం జనగామ రూరల్ : వరంగల్– హైదరాబాద్ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యవసాయ రైతు మృతిచెందాడు. మండలంలోని పెంబర్తి గ్రామానికి చెందిన రైతు మేకల శ్రీనివాస్(55) శుక్రవారం తన ద్విచక్రవాహనంపై వ్యవసాయ బావి వద్దనుంచి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో బైపాస్ రోడ్డు క్రాస్ చేస్తుండగా హనుమకొండ వైపు నుంచి అతివేగంగా వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అదే కారులో చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ట్రాక్టర్పై నుంచి జారిపడి బాలుడి మృతి తొర్రూరు రూరల్: ట్రాక్టర్ పైనుంచి జారిపడి బాలుడు మృతి చెందిన ఘటన శుక్రవారం మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై జి.ఉపేందర్ తెలిపిన వివరాల మేరకు.. మానుకోట జిల్లా తొర్రూరు మండలంలోని కంఠాయపాలెం గ్రామానికి చెందిన చెట్టుపల్లి మహేష్, స్వరూప దంపతుల కుమారుడు ఆరుష్ అయాన్ (3) ట్రాక్టర్ పైకి ఎక్కించమని మారాం చేయగా తండ్రి ఎక్కించాడు. తండ్రి డ్రైవర్ సీట్లో ఉండగా కుమారుడు పక్కన కూర్చుని ఆడుకుంటున్న క్రమంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్పైనుంచి జారి సీసీ రోడ్డుపై పడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయమై స్పృహ కోల్పోయాడు. తండ్రి బైక్పై ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి తల్లి స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
రైతులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి
మహబూబాబాద్ రూరల్ : కాంగ్రెస్ ప్రభుత్వం వరి రైతులపై అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి అసలైన రైతు ద్రోహి అని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. మహబూబాబాద్ మండలంలోని ముడుపుగల్ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్సీ శుక్రవారం సందర్శించారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు. ప్రభుత్వం సకాలంలో వడ్లు కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆన్లైన్ ప్రక్రియ పేరుతో రైతులను గందరగోళానికి గురిచేస్తూ కాలయాపన చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో క్వింటాకు ఐదు కిలోల వరకు తరుగు తీస్తూ రైతుల పొట్ట కొడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, జెర్రిపోతుల వెంకన్న, బానోతు రవికుమార్, అజయ్, వెంకటాద్రి, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బయ్య లింగయ్య, కార్యదర్శి పోతులూరు చారి, వేముల కృష్ణ, జేరిపోతుల ఉపేందర్, మద్ది వెంకటరెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు -
ప్రాణం తీసిన భూ పంచాయితీ
కురవి: అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూమి పంచాయితీ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఈ ఘటనకు సంబంధించి కురవి ఎస్సై సతీష్ తెలిపిన వివరాలు ప్రకారం.. మానుకోట జిల్లా కురవి మండలంలోని నేరడ గ్రామానికి చెందిన చందు శ్రీను, చందు లింగయ్య(52) అన్నదమ్ములు. వీరి మధ్య కొంతకాలంగా భూ పంచాయితీ కొనసాగుతోంది. ఈక్రమంలో లింగయ్య గత నెల 22న కురవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం 24వ తేదీన పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరుగుతున్న క్రమంలో లింగయ్యపై అతని అన్న శ్రీను కుమారులతోపాటు మరికొందరు దాడిచేశారు. దీంతో తీవ్రగాయాలైన లింగయ్యను మానుకోటలోని ఓ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ శుక్రవారం మృతి చెందాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు.● తమ్ముడిపై అన్న, అతడి కుమారుల దాడి ● చికిత్స పొందుతూ మృతి ● ఐదుగురిపై కేసు నమోదు -
పేదల గుండెకు భరోసానవుతా..
మాది కరీంనగర్లోని జ్యోతినగర్. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కష్టపడి చవివా. మూడు గోల్డ్ మెడల్స్ సాధించా. ఐదున్నరేళ్లు కష్టడి పడి, పరీక్షల సమయంలో పన్నెండు గంటలు చదివా. పీజీ పూర్తి చేసిన తర్వాత సూపర్స్పెషలిస్ట్ కోర్సు చదివి, కార్డియాలజిస్ట్ కావాలని ఉంది. పేద ప్రజల గుండెలను భద్రంగా ఉంచుకోవాలని చెప్పడానికి అవకాశం రావాలని కోరుకుంటున్నా. జీవితంలో స్టేబుల్గా, బ్యాలెన్స్గా ఎప్పుడు ఎలా ఉండాలో కేఎంసీ నేర్పింది. – డాక్టర్ శివకోటి రోహన్ రాయ్, గోల్డ్ మెడలిస్ట్ కరీంనగర్ -
జనరల్ సర్జన్ అవుతా..
నేను బిహార్ నుంచి వచ్చినప్పటికీ కేఎంసీ నాకు ఎంతో నేర్పింది. ఇక్కడ పేషెంట్లకు ఇబ్బందవుతుందని తెలుగు భాష నేర్చుకున్నా. మా నాన్న పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్సై అయినప్పటికీ నన్ను డాక్టర్గా చూడాలనుకున్నారు. చదువుతో పాటు ఆటల్లోనూ రాణించా. తోటి విద్యార్థులు ఇక్కడ కుటుంబ సభ్యుల్లా అందరం కలిసి చదువున్నాం. కేఎంసీలో జీవితం విలువ తెలుసుకున్నా. భవిష్యత్లో ఎలా ఉండాలో ఇక్కడే శిక్షణ పొందినట్లుగా ఉంది. జనరల్ సర్జన్ అవ్వాలన్నది నా డ్రీమ్. – డాక్టర్ అంకిత్కుమార్, గోల్డ్ మెడలిస్ట్, బిహార్ -
రేవంత్ది దుష్టపాలన
హన్మకొండ: రేవంత్ది నీచ, దుష్టపాలన అని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనచారి విమర్శించారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు అని... రేవంత్ పాలనలో రెండు జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన చరిత్ర సమస్తం హీనం అని అన్నారు. కేసీఆర్ కొట్లాడి తెలంగాణ సాధించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారన్నారు. కాంగ్రెస్ తన పాత చరిత్రను పునరావృతం చేస్తోందని తూర్పారబట్టారు. సాగు, తాగు నీటిఎద్దడి ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలో సీఎం, మంత్రులు హామీల అమలు, పాలన గాలికొదిలేశారని విమర్శించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రైతు ద్రోహి రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. రైతుల పక్షాన కేటీఆర్ని తీసుకొచ్చి రైతు సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది కేసీఆర్ రైతు సభ నిర్వహిస్తామన్నారు. ఒక్క ఎమ్మెల్యే అయినా కొనుగోలు కేంద్రాలను సందర్శించారా.. అని ప్రశ్నించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ మొక్కజొన్న కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదన్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాతూ.. కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టేందుకు మే 6న వరంగల్లో బీఆర్ఎస్ రైతు సదస్సు నిర్వహిస్తుందన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, డీఎస్ రెడ్యా నాయక్, దాస్యం వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, వాసుదేవ రెడ్డి, జోరిక రమేష్, బడే నాగజ్యోతి, లక్ష్మణ్ రావు, హరి రమాదేవి, పులి రజినీకాంత్, నయీముద్దీన్, రాజ్ కిషోర్, జానకిరాములు, శ్యామ్ కుమార్ పాల్గొన్నారు. రైతు సదస్సు సభాస్థలి పరిశీలన వరంగల్ మహానగరంలో ఈ నెల 6న నిర్వహించనున్న రైతు సదస్సు కోసం హనుమకొండ హంటర్ రోడ్డులో స్థలాన్ని శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి -
వామ్మో.. మానుకోట
సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వ పనితీరుకు కొలమానంగా ఉండే విద్యాశాఖలో వింత పరిస్థితి నెలకొంది. ఎవరైనా పదోన్నతి ఇచ్చి జిల్లా అధికారిగా పనిచేయమంటే ఉత్సాహంగా విధుల్లో చేరుతారు. కానీ, మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికా రిగా పనిచేయాలంటే మాత్రం అధికారులు భయపడుతున్నారు. మేం ఇక్కడ పని చేయలేమని వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితిలో రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయంలో అడిషనల్ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న సత్యనారాయణమూర్తి మానుకోట విద్యాశాఖ అధికారిగా అదనపు బాధ్యతలు తీసుకోవడం చర్చగా మారింది. ఈ జిల్లాలో పనిచేయలేం.. మొదటి నుంచి మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేయాలంటే సహసమే అనే ప్రచా రం ఉంది. ఈమేరకు ఇప్పటి వరకు జిల్లాకు వచ్చిన నాగేశ్వర్రావు కొద్దికాలంలోనే పదవీ విరమణ పొందారు. తర్వాత వచ్చిన సోమశేఖర శర్మ తనదైన శైలిలో పనిచేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వచ్చిన రామారావు పనిచేసిన కాలంలో కార్యాలయంలో గొడవ లేని రోజు లేదు. దీనిలో భాగంగానే ఆయనను విద్యాశాఖ రాష్ట్ర కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో వచ్చిన రవీందర్ రెడ్డి గతంలో ఇక్కడ పనిచేసిన అనుభవంతో ఒక వైపు అకాడమిక్, మరోవైపు అడ్మినిస్ట్రేషన్ను సరిదిద్దారు. ఆయన ప్రయత్నం ఫలించి గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలిపారు. ఆయన పదవీ విరమణ పొందడంతో ఖాళీ అయిన డీఈఓ సీటుకు సరిగ్గా మూడు నెలల క్రితం సూర్యాపేట ఏడీగా పనిచేసిన దక్షిణామూర్తి బదిలీపై వచ్చారు. వచ్చిన కొద్దిరోజులు ఉత్సాహంగా పనిచేసిన ఆయన తర్వాత జిల్లా నుంచి ఎప్పుడు వెళ్దాం అనే పనిలోనే ఉన్నట్లు విద్యాశాఖ ఉద్యోగులు చెబుతున్నారు. ఇంకా సర్వీస్ ఉండగానే వీఆర్ఎస్ పెట్టుకొని వెళ్లిపోయారు. ఆయన స్థానంలో బాధ్యతలు తీసుకున్న ఏడీ రాజేశ్వర్ ఖమ్మం ఏడీగా బదిలీ అయ్యారు. ఆయన ఇక్కడ డీఈఓగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంలో.. ఏం జరిగిందో ఏమో కాని నేను పనిచేయలేను.. నా ఆరోగ్యం బాగాలేదని మూడు నెలలు సెలవు పెట్టి వెళ్లిపోయారు. నూతన డీఈఓగా సత్యనారాయణ మూర్తి ప్రస్తుతం జిల్లావిద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న రాజేశ్వర్ దీర్ఘకాలిక సెలవులపై వెళ్లారు. దీంతో ఏడీగా పని చేస్తున్న సత్యనారాయణమూర్తికి మానుకోట డీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. అయితే సత్యనారాయణ మూర్తి జనగామ జిల్లా ఏడీగా పనిచేసిన కాలంలో అక్కడి కలెక్టర్ రాష్ట్ర విద్యాశాఖకు బదిలీ చేశారు. కాగా ఆయన పనితీరు ఎలా ఉంటుందో అనేది జిల్లాలో చర్చగా మారింది. భయం ఎందుకంటే.. జిల్లా విద్యాశాఖ అధికారి దక్షిణామూర్తి ఉన్నట్టుండి వీఆర్ఎస్ పెట్టుకోవడంపై జిల్లా అధికారుల్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కార్యాలయంలోని ఉద్యోగులు రెండు వర్గాలుగా విడిపోవడం, సమయ పాలన పాటించకపోవడం.. కొందరు కో–ఆర్డినేటర్లు పనిచేయకుండా రాజకీయాలు చేయడం, అత్యవసర సమయాల్లో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఉండటం, తాము వచ్చిందే సమయం అన్నట్లు కార్యాలయానికి రావడం వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. దీనికి తోడు జిల్లాలోని కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో సమస్యలు తిష్ట వేయడంతో ప్రతీరోజు ఏదో ఒక సమస్య వస్తుంది. మరోవైపు నాన్టీచింగ్ ఉద్యోగుల కొరతతో విద్యార్థులకు సక్రమంగా భోజనం వండి పెట్టకపోవడం, అపరిశుభ్రమైన వాతావరణం, ఇదేంటి అని అడిగితే రాజకీయ పార్టీల నాయకుల నుంచి ఫోన్లు చేయించి బెదిరించిన సంఘటనలు ఉన్నట్లు ప్రచారం.. ఇన్ని సమస్యల మధ్య డీఈఓగా ఇక్కడ పని చేసేందుకు భయపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. డీఈఓగా పని చేసేందుకు అధికారుల ససేమిరా ఇప్పటికే పనిచేయలేమని తప్పుకున్న ముగ్గురు అధికారులు నూతన డీఈఓగా సత్యనారాయణ మూర్తి -
బాలలకు భరోసా ఎంతో అవసరం
కాశిబుగ్గ: ప్రస్తుత పరిస్థితుల్లో బాలలకు భరోసా కల్పించడం ఎంతో అవసరమని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా చైల్డ్ సేఫ్టీ అండ్ ప్రొడక్షన్– డ్రగ్స్ నో అనే అంశంపై ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమంలో మహిళా అభివృద్ది, శిశు సంక్షేమ శాఖ, వైద్యారోగ్య శాఖల సమన్వయంతో శుక్రవారం ఓ సిటీ స్టేడియంలో బాలభరోసా కార్యక్రమం ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. బాలల భరోసా కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని సూ చించారు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి పౌష్టికాహారం తీసుకోవా లని పేర్కొన్నారు. సరైన పోషణ ఉన్నప్పుడే పిల్లలు శారీరక, మానసిక ఆరోగ్యంగా ఎదుగుతారని తెలిపారు. బాలల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులకు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వరంగల్ కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, కార్పొరేటర్ ఓని భాస్కర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ ఆరోగ్య శిబిరం వద్ద ఉన్న ప్రత్యేక అవసరాల ఉన్న పిల్లల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వారికి తగిన వైద్య చికిత్సలు అందే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం స్టేడియంలో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపును ప్రారంభించారు. వివిధ రకాల క్రీడలను తిలకించారు. ఈసందర్భంగా మంత్రి కొండా సురేఖతోపాటు కలెక్టర్ సత్యశారద క్రికెట్ ఆడారు. రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ -
ఉపాధి హామీతో గ్రామీణులకు ఆర్థిక భరోసా
● రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ములుగు: ఉపాధి హామీ పథకంతో గ్రామీణ ప్రజలకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం మండలంలోని కేశవపూర్ గ్రామ సమీపంలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను మంత్రి సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా పలుగు, పార పట్టుకుని మంత్రి సీతక్క కూలీలతో కలిసి పనిచేశారు. కూలీల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ వారి పనితీరును అభినందించారు. అనంతరం కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసి, తీవ్ర ఎండల నేపథ్యంలో ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం సింగరకుంటపల్లిలో నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని సీతక్క ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, నాయకులు బైరెడ్డి భగవాన్రెడ్డి, చెన్నోజు సుర్యనారాయణ, బండి శ్రీనివాస్, సుమన్రెడ్డి పాల్గొన్నారు. -
వాణిజ్య పంటల సాగుపై అవగాహన కల్పించాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్ మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఉద్యానవన, ఆయిల్ పామ్ పంటల సాగు, ధాన్యం కొనుగోళ్లు కేంద్రాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు కూరగాయలు, వాణిజ్య పంటల సాగు చేపట్టి లాభాలు గడించాలన్నారు. మొక్కజొన్న, వరి కొయ్యలకు నిప్పుపెట్టి కాల్చకుండా చర్యలు తీసుకోవాలని, పొలంలో వాటిని సేంద్రియ ఎరువులుగా మార్చుకునే విధంగా చూడాలని, వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల విషయంలో సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించి రైతులకు మేలు జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, డీఏఓ సరిత, డీఆర్డీఓ మధుసూదన్రాజ్, ఏడీఏలు, ఏఓలు తదితరులు పాల్గొన్నారు. ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభిస్తాం.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్, కార్యదర్శి యోగితా రాణా అన్నారు. వారు హైదరాబాద్ నుంచి గురువారం విద్యా కార్యక్రమాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంరద్భంగా కలెక్టర్ శబరీష్ మాట్లాడుతూ.. 2026–27 విద్యా సంవత్సరం జిల్లాలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభిస్తామన్నారు. పాఠశాలల్లో విద్యుత్, మరుగుదొడ్లు, తదితర సౌకర్యాలు కల్పిస్తామని, ఇంటర్, పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో మే 11వ తేదీ నుంచి ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
శిక్షణ శిబిరాల జాడేది..?
● సమ్మర్ క్యాంపులు ఉన్నట్టా.. లేనట్టా? ● శిబిరాల ఏర్పాటులో నిర్లక్ష్యం ● సెలవుల నిమిత్తం ఊర్లకు వెళ్తున్న చిన్నారులు మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో గిరిజన, ఎస్సీ, మైనార్టీ సంక్షేమశాఖల ఆధ్వర్యంలో ఇప్పటికే సమ్మ ర్ క్యాంపులు ప్రారంభించారు. అయితే జిల్లా యు వజన క్రీడలశాఖ ఆధ్వర్యంలో మాత్రం క్యాంపులు ప్రారంభించలేదు. దీంతో చిన్నారులు క్రీడలకు దూరమవుతున్నారు. ఇప్పటికై నా శిక్షణ శిబి రాలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. క్రీడలకు పుట్టినిల్లులాంటిది.. మానుకోట జిల్లా క్రీడలకు పుట్టినిల్లులాంటిది. ఈ ప్రాంతం నుంచి అనేక మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు. అనేక మంది క్రీడాకారులు పీఈటీలు, పీడీలుగా, రైల్వే ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సాధించారు. కాగా, పిల్లలకు వేసవి సెలవులు ప్రారంభం అయ్యాయి. సొంత ఊళ్లకు, విహారయాత్రలకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే సెలవుల్లో వారి అభిరుచికి తగినవిధంగా క్రీడల్లో రాణించేలా సహాయపడాలి. క్రీడలతో ఉపయోగాలు.. క్రీడలు మానసికంగా, శారీరకంగా, సామాజికంగా ఎదగడానికి ఎంతగానో దోహదపడుతాయి. ఆటలు బాగా ఆడటం వల్ల శారీరక శ్రమ కలుగుతుంది. ఎముకలు, కండరాల పెరుగుదల, మంచి రక్త ప్రసరణ, పిల్లల వయసుకు తగ్గ బరువు, అలాగే మెదడు, గుండె చక్కగా పని చేస్తాయి. ఇలాంటి ప్రయోజనాలు ఉన్న క్రీడలపై అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. ప్రతీ సంవత్సరం జిల్లా క్రీడల శాఖల, మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలు సరైన సమయంలో ఏర్పాటు చేస్తే పిల్లలు, క్రీడాకారులు క్రీడలపై మక్కువ చూపి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉంది. కాగా, జిల్లా యంత్రాంగం వేసవి శిక్షణ శిబిరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పలువులు క్రీడాకారులు కోరుతున్నారు. సమ్మర్ క్యాంపుల్లో క్రీడలు ఇలా.. మున్సిపల్ పరిధిలోని సమ్మర్ క్యాంపులో బాస్కెట్ బాల్, తైక్వాండో, క్రికెట్, అథ్లెటిక్స్, హాకీ, స్విమ్మింగ్, షటిల్ బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్ తదితర క్రీడలు నిర్వహిస్తారు. అలాగే గ్రామాల్లో సమ్మర్ క్యాంపులో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, సాఫ్ట్బాల్, బాల్బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్ క్రీడలు నిర్వహిస్తారు. విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇస్తే జిల్లాకు మంచి పేరుప్రఖ్యాతులు తీసుకువస్తారని పలువురు క్రీడాకారులు అంటున్నారు. -
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
● మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు నెల్లికుదురు: గ్రామంలో రక్షిత మంచినీటి సరఫరా ప్లాంట్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని, గ్రామస్తులు సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు కోరారు. నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో గ్రామంలో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి సరఫరా ప్లాంట్, 10 సీసీ కెమెరాలను సర్పంచ్ గొడుగు జ్యోతి రామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం డీఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించడం, కారులో సీటుబెల్ట్ పెట్టుకుని డ్రైవింగ్ చేయాలని సూచించారు. మత్తు పదార్థాల కట్టడికి ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. యువత చెడు మార్గాలను వీడి సమాజంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో కేసముద్రం సీఐ సత్యనారాయణ, ఉపసర్పంచ్ వేశాల కృష్ణయ్య, నేషనల్ హైవే మేనేజర్ పట్టాబీ, పీఆర్ఓ ధారావత్ రవికుమార్, వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు. -
క్రీడా నైపుణ్యాలు పెంపొందుతాయి
10నెలలు తరగతి గదిలోనే కూర్చునే పిల్లల్ని సెలవుల్లో ఇంటికి పరిమితం చేయవద్దు. పిల్లలు చదువుతోపాటు నచ్చిన క్రీడలో ప్రావీణ్యం పొందేందుకు రోజు తప్పనిసరిగా గంట సమయం కేటాయించాలి. చిన్న వయసు నుంచే పిల్లలకు క్రీడలపై ఆసక్తి పెంచి ఏదో ఒక క్రీడా శిబిరానికి పంపాలి. సమ్మర్ క్యాంపులకు పంపిస్తే నైపుణ్యాలు పెరుగుతాయి. ఇటు క్రీడలు, అటు చదువుల్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. –బి.అజయ్సారథిరెడ్డి, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ● -
మేడిగడ్డ, అన్నారం బోర్హోల్స్ పనుల్లో వేగం పెంచాలి
కాళేశ్వరం: మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో బోర్హోల్స్ పనుల్లో వేగం పెంచాలని ఇరిగేషన్ కార్యదర్శి శ్రీధర్.. ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను గురువారం ఆయన కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మేడిగడ్డలో కొనసాగుతున్న బోర్హోల్స్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్ట్ల వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి పనులను వేగవంతం చేయాలని సూచించారు. సిబ్బంది కోసం గతంలో సీఆర్పీఎఫ్ పోలీసులు ఉపయోగించిన షెడ్లను పరిశీలించి విద్యుత్, నీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. అనంతరం అన్నారంలోని ఇరిగేషన్ కార్యాలయం వద్ద అదనపు సిబ్బంది వసతి కోసం గదులను పరిశీలించారు. అన్నారం బ్యారేజీ అప్ స్ట్రీమ్ను పరిశీలించి బోర్ హోల్స్ పనులను ప్రారంభించాలని ఆదేశించారు. ప్రాజెక్టులో సాంకేతిక పరిశీలన పనులను శుక్రవారం( నేడు) నుంచి ప్రారంభించాలని ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక పరీక్షలను దశల వారీగా చేపట్టాలని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు తక్షణమే పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా పరిశీలన పనుల్లో పాల్గొనే సిబ్బందికి అవసరమైన వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు. డ్రిల్లింగ్ పనులు చేపట్టేటప్పుడు గట్టి శిలా పొర వచ్చేంతవరకు కొనసాగించాలని సూచించారు. ప్రాజెక్టులో వివిధ దశల్లో సాంకేతిక పరీక్షలు నిర్వహిస్తూ పనుల నాణ్యతను నిర్ధారించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ సరఫరాను నిరంతరం అందుబాటులో ఉంచాలని, ప్రతిరోజూ ఇరిగేషన్ అధికారులు పనులను సమగ్రంగా పర్యవేక్షించాలని ఆయన తెలిపారు. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఈఎన్సీ రమేశ్ కుమార్, సీఈ శ్రీనివాస్ గుప్తా, ఈఈలు తిరుపతిరావు, డీఈఈ సతీశ్, రమేశ్ బాబు, తదితరులు పాల్గొన్నారు. -
వడదెబ్బతో కౌలు రైతు మృతి
నెక్కొండ : వడదెబ్బతో వరంగల్ జిల్లా నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామానికి చెందిన కౌలురైతు ఒర్రె మల్లయ్య (52) గురువారం మృతి చెందాడు. మల్లయ్య మండలంలోని దేవునితండా జీపీ పరిధి లోని దుబ్బతండాలో 4 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఇందులో రెండెకరాల్లో మొక్కజొన్న, మరో రెండు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. రెండు రో జులుగా మక్కల ఆరబెట్టేందుకు చేను వద్దకు వెళ్లా డు. ఈ క్రమంలో వడదెబ్బ తగలడంతో అక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య శోభ, కుమారు డు, కూతురు ఉన్నారు. దుబ్యాలలో మహిళా కూలీ.. టేకుమట్ల: వడదెబ్బతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం దుబ్యాలకు చెందా న మహిళా కూలీ సంగి సుజాత(38) మృతి చెందింది. రోజుమాదిరిగానే సుజాత గురువారం ఉదయం మొక్కజొన్న కంకిపొట్టు తీ సేందుకు వెళ్లింది. ఇంటికి వచ్చిన అనంతరం మ ధ్యాహ్నం అస్వస్థకు గురి కావడంతో చికిత్స నిమి త్తం చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, సుజాత కుటుంబాన్ని మాజీ ఎంపీటీసీ సంగి, బి.ఉమేందర్రావు పరామర్శించారు. -
స్వీయ జనగణన వివరాలు నమోదు చేయాలి
● అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ మహబూబాబాద్ అర్బన్: స్వీయ జనగణనలో ఇళ్లు, ప్రాథమిక సమాచార వివరాలు నమోదు చేయాలని అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం అన్ని శాఖ అధి కారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మే 11నుంచి ప్రారంభమయ్యే స్వీయ జనగణన సర్వే కార్యక్రమంలో సులభతరంగా తమ వివరాలను నమోదు చేయడం కోసం ముందస్తుగా స్వీయ జనగణన వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. జిల్లా పౌర సంబంధాలశాఖ కార్యాలయంలో ముందుగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు స్వీయ జనగణన కార్యక్రమం నిర్వహించి అవగాహస కల్పించామన్నారు. ప్రతీ ఒక్కరూ తమ వివరాలను బాఽ ద్యతాయుతంగా సమర్పించాలని కోరారు. కార్యక్రమంలో ముఖ్యప్రణాళిక అధికారి శ్రీనివాస్రావు, డీఎస్పీ తిరుపతిరావు, డీపీఆర్ఓ పసునూరి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
‘పౌరాణిక’ పునర్నిర్మాణ యజ్ఞం..
జనగామ : జనగామ చరిత్రలో మరుగునపడిన పౌరాణిక పద్యరంగాన్ని తిరిగి వెలుగులోకి తీసుకొస్తూ నెల్లుట్ల ఫౌండేషన్ గతేడాది తొలి అడుగు వేసింది. అర్ధశతాబ్దం క్రితం వరకు కళాజీవుల ఊపిరి పీల్చిన ఈ రంగాన్ని మళ్లీ పునరుద్ధరించాలనే సంకల్పంతో ఫౌండేషన్ ప్రారంభించిన ప్రయాణం నేటికి ప్రాంతీయ సంస్కృతికి చారిత్రక మలుపు తీసుకొచ్చిందని చెప్పాలి. ఏడాదిలో 25 పౌరాణిక నాటకాల ప్రదర్శనలు.. ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 365 రోజుల్లో ఏకంగా 25 పౌరాణిక పద్యనాటక ప్రదర్శనలు విజయవంతంగా నిర్వహించారు. ఇటీవల జరిగిన బాసర, నిర్మల్ ప్రదర్శన ఈ ప్రయాణానికి మైలురాయిగా నిలిచింది. ఏ ఒక్క ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థ ఆర్థిక సాయం లేకుండానే స్నేహితులు, కళాభిమానుల సహకారమే ఆధారంగా ఫౌండేషన్ లక్షల రూపాయలు వెచ్చించి ఈ సేవా కార్యక్రమాన్ని ముందుకు నడిపింది. సంస్కృతి పరిరక్షణలో నెల్లుట్ల రవీందర్ రావు పాత్ర ఈ ఉద్యమానికి ప్రధాన కళాకారుడిగా నిలిచిన నెల్లుట్ల రవీందర్ రావు పాత్ర కీలకం. మరుగునపడిపోతున్న భారతీయ సంప్రదాయ కళలను, పౌరాణిక పద్య నాటక సంప్రదాయాన్ని నిలబెట్టడమే ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశంగా పని చేస్తోంది. సమాజానికి విలువల పరిరక్షణ అవసరమైన ఈ కాలంలో ఈ సేవ చేయడం ఆనందంగా ఉందని రవీందర్రావు అన్నారు. ఈ పునర్నిర్మాణ యజ్ఞంలో అండగా నిలిచిన అనేక మంది కళాకారులు, సంగీత సృజనకర్తలు, పుర ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలను ఆదరించే జనగామలో పౌరాణిక పద్యరంగ పునరుద్ధరణలో నెల్లుట్ల ఫౌండేషన్ వినిపిస్తున్న సాంస్కృతిక ఘంటాభేరి, భవిష్యత్లో మరెన్నో కళాప్రదర్శనలకు వేదిక కానుంది. పద్యరంగ పునర్జన్మకు నెల్లుట్ల ఫౌండేషన్ ప్రస్థానం ఏడాదిలో 25 నాటకాల ప్రదర్శనలు పునద్ధరించిన రంగస్థలంపై రవీందర్రావు నాయకత్వం -
‘భగీరథ’ గుంతలో పడి చిన్నారి మృతి
బచ్చన్నపేట : అభం శుభం తెలియని ఓ చిన్నారి అధికారుల నిర్లక్ష్యానికి బలైంది. మిషన్ భగీరథ పైపులు మార్చడానికి తీసిన గుంతలో పడి మృతి చెందింది. ఈ ఘటన గురువారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలింపూర్లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎలికట్టె కవిత, శ్రీనివాస్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు దక్షిత, మోక్షిత(04) ఉన్నారు. దక్షిత ఒకటో తరగతి చదువుతుండగా, మోక్షిత అంగన్వాడీ కేంద్రానికి వెళ్తుంది. కవిత గ్రామంలో అంగన్వాడీ ఆయాగా పని చేస్తుంది. ఈ క్రమంలో ఇద్దరు కూతుళ్లను పాఠశాల గేటు పక్కన నిలబెట్టి అంగన్వాడీ కేంద్రానికి వెళ్లింది. ఈ సమయంలో మోక్షిత గేటు పక్కనే ఉన్న మిషన్భగీరథ గుంతలో పడింది. గమనించిన దీక్షిత తల్లి వద్దకు వెళ్లి చెప్పగా కవిత వెంటనే వచ్చి మోక్షితను బయటకు తీసింది. అనంతరం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే చిన్నారి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించా రు. వెంటనే చిన్నారి మృతదేహంతో గ్రామంలో బచ్చన్నపేట– చేర్యాల జాతీ య రహదారిపై ఆందోళన నిర్వహించారు. మిషన్ భగీరథ అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే చిన్నారి మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 రోజుల క్రితం తీసిన గుంతను పూడ్చకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ ఆందోళన విరమి ంచేది లేదని భీష్మించారు. ఈ విషయం తెలుసుకున్న నర్మెట సీఐ అబ్బయ్య, బచ్చన్నపేట ఎస్సై శ్రీకాంత్ హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. మిషన్ భగీరథ కాంట్రాక్టర్లను పిలిచి న్యాయం చేస్తామని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. మోక్షిత మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, సర్పంచ్ పాకాల నాగలక్ష్మి, మాజీ సర్పంచ్ నరెడ్ల బాల్రెడ్డి, మాజీ ఎంపీటీసీ మసూద్, పలు పార్టీల నేతలు మిషన్ భగీరథ అధికారులు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.● ఇరిగేషన్ కార్యదర్శి శ్రీధర్ ● ఆయా బ్యారేజీల పరిశీలన ఆలింపూర్లో ఘటన న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తుల ఆందోళన -
చక్కని ఆదాయ మార్గం
హన్మకొండ : జాతీయ, రాష్ట్ర రహదారులు, ప్రధాన నగరాల్లో రోడ్డు పక్కన మీకు స్థలం ఉందా? ఉంటే మీకో శుభవార్త. తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్ కో) ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకునే అద్భుత అవకాశం కల్పించింది. దీని ద్వారా 200 గజాల స్థలం ఉంటే చాలు ఈవీ చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసుకుని స్థిర ఆదాయం పొందొచ్చు. దీనికి ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది. రెడ్కో వెబ్సైట్లో ఈనెల 3వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. ప్రైవేట్ వ్యక్తుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం.. కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం ఈ –డ్రైవ్ స్కీమ్లో భాగంగా తెలంగాణలో ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. వాహనాల రద్దీ ఉన్న రోడ్డుకు పక్కన 200 చదరపు గజాల స్థలం కలిగి ఉంటే యజమానులు ఈవీ చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది. రాష్ట్రంలో ఈవీ చార్జింగ్ మౌలిక వసతులను అభివృద్ధి చేయడంలో భాగంగా ప్రైవేట్ వ్యక్తుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఈవీ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు.. రోజురోజుకూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఈ క్రమంలో వాహనదారులు చార్జింగ్ ఖర్చయి మార్గమధ్యలో ఇబ్బందులు పడకుండా జాతీయ, రాష్ట్ర రహదారులతోపాటు నగరాల్లోనూ ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు రెడ్కో నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్, వరంగల్, సంగారెడ్డి, కరీంనగర్, నల్లగొండ వంటి ప్రధాన నగరాలు, పట్టణాల్లో ప్రైవేట్ వ్యక్తులకు ఈవీ చార్జింగ్స్టేషన్ల ఏర్పాటుకు అవకాశం కల్పించింది. స్టేషన్ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయల వ్యయంలో 80 శాతం రాయితీ అందించనున్నారు. దీంతో పెట్టుబడి భారం గణనీయంగా తగ్గించుకోవచ్చు. చార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకు అవసరమైన విద్యుత్ లైన్ నిర్మాణ వ్యయం, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు వ్యయంలో ప్రభుత్వం 80 శాతం రాయితీ అందిస్తుంది. చార్జింగ్ మిషన్, షెడ్ నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చులు స్టేషన్ ఏర్పాటు చేసుకునే వారు భరించాలి. దరఖాస్తు ఇలా చేసుకోవాలి.. ఆసక్తి కలిగిన వారు రెడ్కో వెబ్సైట్లో ఇ మొబిలిటీలోకి వెళ్లి క్లిక్ చేయాలి. ఇక్కడ పీఎం ఈ డ్రైవ్పై క్లిక్ చేయగానే పబ్లిక్ ఈవీ చార్జింగ్ స్టేషన్స్ అండర్ కాంపోనెంట్ సి ఆఫ్ పీఎం ఇ డ్రైవ్ స్కీమ్ దరఖాస్తు కనిపిస్తుంది. ఆన్లైన్లో ఈ దరఖాస్తులో వివరాలు నమోదు చేయడంతోపాటు భూమి యాజమాన్య పత్రాలు, దరఖాస్తుదారు గుర్తింపు పత్రాలు, భూమి ఎక్కడ ఉందనే ఫొటోలు, లేఅవుట్ వివరాలు, విద్యుత్ కనెక్షన్ సమాచారం వంటి పత్రాలు అప్లోడ్ చేయాలి. దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అవకాశం రోడ్డు పక్కన 200 గజాల స్థలం ఉంటే చాలు.. ఆసక్తి ఉన్న వారి నుంచి రెడ్కో దరఖాస్తుల ఆహ్వానం ఈనెల 3వ తేదీ దరఖాస్తుకు చివరి గడువు ఎలాంటి డిపాజిట్, రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు -
క్షేత్రస్థాయి సిబ్బందికి రక్షణ కల్పించాలి
హన్మకొండ: క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న విద్యుత్ సిబ్బందికి రక్షణ కల్పించాలని తెలంగాణ విద్యుత్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ పి.శ్రీనివాస్, కన్వీనర్ మన్నె శశికుమార్ టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్న వా రిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఒక ప్రకట నలో కోరారు. టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ రూరల్ డివిజన్ పరిధి కాపుల కనపర్తి సెక్షన్ రామచంద్రాపురంలో బకాయి విద్యుత్ బిల్లుల వసూళ్లకు వెళ్లిన విద్యుత్ సిబ్బందిని ఓ వినియోగదారుడు భయభ్రాంతులకు గురి చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. జేఎల్ఎం జన్ను మధుమోహన్ ఇంటికి వెళ్లి బకాయిదారు డు అసభ్యపదజాలంతో దూషించి కుటుంబీకులను భయభ్రాంతులకు గురి చేశాడని వివరించారు. అంతటితో ఆగకుండా మధుమోహన్పై దాడి చేసేందుకు లో హిత, కాపుల కనపర్తి సబ్ స్టేషన్లకు వెళ్లి వెతికాడని, కనిపించకపోవడంతో సబ్ స్టేషన్లోని సిబ్బందిని బెదిరించాడని తెలిపారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జేఎల్ఎం మధుమోహన్ కుటుంబానికి నైతిక మద్దతు ఇవ్వడంతో పాటు రక్షణ కల్పించాలన్నారు. దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి తెలంగాణ విద్యుత్ జేఏసీ విజ్ఞప్తి -
8న ఉమ్మడి జిల్లా జాబ్మేళా
హన్మకొండ అర్బన్ : ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఈనెల 8న నిర్వహించనున్న జాబ్ మేళా పోస్టర్ను గురువారం హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ నగరంలోని నాక్ సెంటర్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సమీపంలో ఈ మేళా ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ రంగానికి చెందిన పలు ప్రముఖ సంస్థలు పాల్గొని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని వివరించారు. ఉద్యోగార్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, బయోడేటాలతో హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
క్యాన్సర్ కట్టడే లక్ష్యం
● కొనసాగుతున్న హెచ్పీవీ వ్యాక్సినేషన్ ● టార్గెట్ 6,687, వ్యాక్సిన్ పంపిణీ 976 ● అవగాహన లేమితో బాలికలు టీకాలకు దూరంనెహ్రూసెంటర్: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం హెచ్పీవీ (హ్యూమన్పాపిల్లోమా వైరస్) వ్యాక్సినేషన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈమేరకు మార్చి 8న ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మొ త్తంగా జిల్లాలో 6,687 మంది 14 ఏళ్ల బాలికలను గుర్తించి వారికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. కాగా, జిల్లాకు 1,513 డోసుల వ్యాక్సిన్ చేరగా.. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 976 మందికి వ్యాక్సినేషన్ చేశారు. అవగాహన లేమితో.. హెచ్పీవీ వ్యాక్సినేషన్పై పూర్తి అవగాహన లేకపోవడం, మొదటి విడత కావడంతో వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. పూర్తిస్థాయిలో బాలికలకు, తల్లిదండ్రులకు హెచ్పీవీ వ్యాక్సిన్ ప్రభావం, పనితీరును వివరిస్తే ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యశాఖ సిబ్బంది కిందిస్థాయి నుంచి అవగాహన కల్పించడం ద్వారా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకునేలా వీలుకలుగుతుంది. 14 ఏళ్ల వయసు గల బాలికలు 6,687.. హెచ్పీవీ వ్యాక్సిన్ 14 ఏళ్ల బాలికలకు ముందస్తు క్యాన్సర్ నివారణ కోసం ప్రభుత్వం ప్రారంభించింది. అయితే జిల్లాలో 14 ఏళ్ల బాలికలు 6,687 మంది ఉన్నట్లు గుర్తించారు. మొదటి దశలో 1,513 హెచ్పీవీ వ్యాక్సిన్లు రాగా.. ఇప్పటి వరకు 976 మాత్రమే పంపిణీ చేశారు. వ్యాక్సిన్లు పూర్తి కాగానే మరికొంత ఇండెంట్ను అధికారులు కోరనున్నారు. ప్రతీ ఒక్కరికి వ్యాక్సినేషన్.. హెచ్పీవీ వ్యాక్సిన్ అనేది ముందస్తు క్యాన్సర్ నివారణ కోసం వేస్తున్నాం. వ్యాక్సిన్పై ఎలాంటి అపోహలు వద్దు. వ్యాక్సినేషన్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 14 ఏళ్ల బాలికలకు పూర్తిగా వ్యాక్సినేషన్ చేస్తాం. – జి.లక్ష్మీనారాయణ, పీఓ, ఇమ్యూనైజేషన్ -
హ్యాండ్బాల్ చాంపియన్ తమిళనాడు
వరంగల్ స్పోర్ట్స్ : తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహించిన 41వ సౌత్జోన్ మెన్ అండ్ ఉమెన్ చాంపియన్షిప్ పోటీలు ముగిశాయి. ఆరు రాష్ట్రా ల నుంచి పాల్గొన్న జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. గురువారం జరిగిన ఫైనల్లో పురుషుల విభాగంలో తమిళనాడు, తెలంగాణ జట్టు తలపడ్డాయి. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో 32–22 గోల్స్తో తమిళనాడు విజేతగా నిలిచింది. ఆతిథ్య తెలంగాణ రన్నరప్గా నిలిచింది. మహిళల విభాగంలో తమిళనాడు, కేరళ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో తమిళనాడు విజయం సా ధించింది. రెండో స్థానంలో కేరళ నిలవగా, ఆతిథ్య తెలంగాణ జట్టు మూడో స్థానంలో నిలిచింది. ము గింపు వేడుకలకు షైన్ విద్యా సంస్థల చైర్మన్ మూ గల కుమార్, హనుమకొండ డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ హాజరై విజేతలకు ట్రోఫీ, పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి పోటీలతో క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుందన్నారు. టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి, తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్కుమార్ మాట్లాడుతూ ఈ పోటీలకు సహకరించిన రెఫరీ, అధికారులు, పీఈటీలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సాంబశివరావు, తెలంగాణ జూడో అసోసియేషన్ ప్రెసిడెంట్ బైరబోయిన కై లాస్యాదవ్, ఖోఖో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి తోట శ్యామ్ప్రసాద్, హ్యాండ్బాల్ అసోసియేషన్ బాధ్యులు బసరవేణి లక్ష్మణ్గాయు, తిరుమల్రెడ్డి, పుల్లయ్య, శంకర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. పురుషుల విభాగంలో రన్నరప్ తెలంగాణ మహిళల విభాగంలో మూడో స్థానం.. -
రైతు డిక్లరేషన్ అమలులో ప్రభుత్వం విఫలం
● ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు హన్మకొండ : రైతు డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు విమర్శించారు. గురువారం హన్మకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ పేరిట రేవంత్రెడ్డి తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని తీసుకొచ్చి వరంగల్లో సభ పెట్టారన్నారు. అయితే రెండేళ్లు పూర్తయిన రైతు డిక్లరేషను అమలు చేయలేదని దుయ్యబట్టారు. రైతు భరోసా రూ.15 వేలు ఇస్తామని రెండుసార్లు ఎగ్గొట్టారన్నారు. రైతులకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని వివరించేందుకు వరంగల్లో ఈనెల 6న రైతు సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని, ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ధ్వజమెత్తారు. మాజీ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య మాట్లాడుతూ రెండున్నరేళ్లలో రాష్ట్రంలో 813 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రాజకీయ లబ్ధికోసం సీఎం రేవంత్రెడ్డి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ‘కుడా’ మాజీ చైర్మన్ మర్రియాదవ రెడ్డి, సీనియర్ నాయకుడు భరత్ కుమార్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు యాదగిరి, సారంగపాణి, రమేశ్, నాయకులు నయిమొద్దీన్, వేణు, రజినీకాంత్, రవీందర్ రావు, వెంకన్న, శ్రీధర్, రాజు, సుమిత్ జోసఫ్, గౌస్ ఖాన్, ఇస్మాయిల్, రజినీకుమార్, తదితరులు పాల్గొన్నారు. -
గ్రామపంచాయతీ స్థలం పరిశీలన
దంతాలపల్లి: మండలంలోని తూర్పుతండా జీపీ స్థలాన్ని గురువారం డీఆర్డీఓ మధుసూదన్ రాజ్ పరిశీలించారు. గత ప్రభుత్వం హయాంలో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిన తూర్పుతండాకు పంచాయతీ భవన నిర్మాణం కోసం తండాకు చెందిన రాములు 14 గుంటల భూమిని దానంగా ఇచ్చారు. అయితే ప్రస్తుతం వేరే స్థలంలో నూతనంగా మంజూరైన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం చేట్టారు. కాగా రాములు తాను ఇచ్చిన స్థలంలో భవన నిర్మాణం చేపట్టకుండా వేరే స్థలంలో నిర్మించారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు తూర్పుతండాలో డీఆర్డీఓ స్థల పరిశీలన చేశారు. ఈమేరకు రెండు స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలు, గ్రామ పంచాయతీ తీర్మానాలను తీసుకెళ్లినట్లు సమాచారం. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోట్యా, ఏఎంసీ వైస్ చైర్మన్ బట్టునాయక్, ఎంపీడీఓ విజయ, ఎంపీఓ అప్సర్పాషా, కార్యదర్శి మమ త, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రం తొర్రూరు: కార్మిక హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆలకుంట్ల సాయిలు అన్నారు. డివిజన్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో గురువారం ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో మేడే కరపత్రాలను ఆవిష్కరించారు. సాయిలు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలను అమలుచేస్తూ సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల హక్కులను హరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడే వేడుకలను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు గూడూరు శ్రీను, సీతారాములు, నరేష్, గోపాల్, సురేష్, మొగిళి, బాలాజీ, పాపిరెడ్డి, ఎల్లాగౌడ్ పాల్గొన్నారు. గజ్జెల రంజిత్కు ‘నాట్యఘృణి’ అవార్డు హన్మకొండ కల్చరల్: అంతర్జాతీయ నాట్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ శాసీ్త్రయ నృత్య కళాకారుల సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో వరంగల్కు చెందిన పేరిణి నాట్య గురువు గజ్జెల రంజిత్కు నాట్యఘృణి అవార్డు ప్రదానం చేశారు. ఈ మేరకు బుధవారం ఆంధ్రప్రదేశ్ కాకినాడలోని దంటు కళాక్షేత్రంలో జరిగిన అంతర్జాతీయ నాట్య దినోత్సవ వేడుకల్లో గత 28 ఏళ్లుగా పేరిణి, ఆంధ్రనాట్యం, శాసీ్త్రయ నృత్య విద్యలో మెళకువలు నేర్పుతూ విద్యార్థులను కళా కారులుగా తీర్చిదిద్దుతూ, సంప్రదాయ బాణీలను పెంపొందిస్తూ నాట్యకళకు చేస్తున్న కృషికిగాను నిర్వాహకులు గజ్జెల రంజిత్కు నాట్యఘృణి అవార్డు ప్రదానం చేశారు. శోభాయమానం.. పుష్పయాగం హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో శ్రీభద్రకాళిభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో చివరిరోజు గురువారం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తిని పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. చూర్ణోత్సవం జరిపి చక్రతీర్థోత్సవం నిర్వహించి తిరిగి చక్రాన్ని అమ్మవారి సన్నిధికి చేర్చారు. అనంతరం పూర్ణాహుతి, బలిహరణ, ధ్వజావరోహణంతో ఉత్సవాలు సమాప్తం చేశారు. అమ్మవారికి పుష్పయాగం అమ్మవారికి శతఘటాభిషేకం జరిపి రాత్రి స్నపనమందిరంలో అమ్మవారికి వేదపండితులు మంత్రోచ్ఛరణ చేస్తుండగా రంగురంగుల గులాబీలు, మల్లెలు, లిల్లీలు, విరజాజులు, బంతులు, చామంతులు, కనకాంబరాలు తదితరపూలతో ఘనంగా పుష్పయాగం నిర్వహించారు. -
ఫెయిలవుతానన్న భయంతో విద్యార్థిని ఆత్మహత్య
● ఫలితాల్లో పాస్.. కన్నీటి పర్యంతమైన తల్లిదండ్రులు దుగ్గొండి: పదో తరగతి పరీక్షలు సరిగా రాయలేదు. ఫెయిల్ అయితే తల్లిదండ్రులు తిడతా రనే భయంతో అధిక మోతా దులో నిద్రమాత్రలు మింగి బా లిక ఆత్మహత్య చేసుకుంది. తీ రా బుధవారం వెలువడిన ఫలితాల్లో పాస్ అయింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ ఘటన గత నెల 21న జరగగా ఆలస్యంగా గురువారం వెలుగులోకి వ చ్చింది. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మల్లంపల్లికి చెందిన తెప్ప భిక్షపతి–సుమలత దంపతుల కూ తురు నవ్య(17) నర్సంపేట మండలం గురిజాల లోని తన పెద్దమ్మ వద్ద ఉండి చదువుకుంది. స్థానిక పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన నవ్య పరీక్షలు సరిగా రాయలేదని అమ్మా, నాన్నలు మందలి స్తారనే భయంతో గత నెల 21న బీపీ మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుంది. తీరా ఫలితాలు రా గా 336 మార్కులతో పాసైంది. గురువారం దశదిన కర్మ కావడంతో తల్లిదండ్రులు, బంధువులంతా నవ్య పరీక్షల భయం, పాసైన తీరును తలచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మనస్తాపంతో యువకుడు.. మహబూబాబాద్ రూరల్: కు టుంబ తగాదాలతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూ బాబాద్ మండలం బలరాం తండా గ్రామానికి చెందిన కేలోత్ శేఖర్ (26)కు జిల్లా కేంద్రం శివారు సాలార్ తండాకు చెందిన సౌజన్య తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. శేఖర్ ఖాళీగా తిరుగుతుండడంతో సౌజన్య పలుమార్లు మందలించేది. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఇద్దరి మ ధ్య వాగ్వాదం జరగగా సౌజన్య తన కుమారుడిని తీసుకుని పుట్టింటికి వెళ్లగా కుమార్తె శేఖర్ వద్దే ఉంది. దీంతో శేఖర్ అర్ధరాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి బావుసింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నట్లు రూరల్ హెచ్సీ మధుసూదన్ గురువారం తెలిపారు. -
మెరుగైన విద్యుత్ సరఫరాకు కృషి
● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ మహబూబాబాద్ రూరల్: నూతనంగా నిర్మించే సబ్ స్టేషన్ ద్వారా రైతులు, ప్రజలకు నిరంతరాయంగా మెరుగైన విద్యుత్ సరఫరా జరుగుతుందని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని సోమ్ల తండా గ్రామ పంచాయతీ పరిధిలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించే 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణంతో ఉమ్మడి పర్వతగిరి జీపీ పరిధిలోని గ్రామాలు, తండాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతుందన్నారు. కన్నతల్లి, సొంత ఊరును మరువొద్దని, తన స్వగ్రామమైన సోమ్లతండాను తన గుండెల్లో పెట్టుకుంటానని, జన్మనిచ్చిన స్వస్థలానికి సేవచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా అని అన్నారు. గ్రామంలో సబ్ స్టేషన్ ఏర్పాటుతో పాటు, రూ.20 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టి స్వగ్రామ రుణం తీర్చుకున్నానన్నారు. విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్న రైతులు, ప్రజలకు ఇకనుంచి ఎలాంటి సమస్యలు ఉండవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచులు ఇస్లావత్ సుజాతబాలాజీ, చల్ల అనితవెంకన్న, గుగులోత్ ఈశ్వరీరవి, విద్యుత్ శాఖ ఎస్ఈ విజయేందర్ రెడ్డి, డీఈలు కోటేశ్వర్ రావు, సునీతాదేవి, హీరాలాల్, ఏడీఈలు ప్రశాంత్, ఐలయ్య, వరప్రసాద్, రూరల్ వెంకటేష్, ఎంపీడీఓ రఘుపతిరెడ్డి, తహసీల్దార్ చంద్రరాజేశ్వర్ రావు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
ఉపాధికి ఊతం
మహబూబాబాద్: నిరుద్యోగులు, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. ప్రధానంగా యువతను పారిశ్రామికవేత్తలుగా మార్చాలని, వారి ద్వారా పలువురికి ఉపాధి కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో పరిశ్రమలశాఖ ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇస్తోంది. బ్యాంక్ల ద్వారా రాయితీ రుణాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తోంది. దీంతో పరిశ్రమల స్థాపనకు జిల్లాలో యువత ముందుకు వస్తోంది. ఇచ్చిన టార్గెట్ను అధికారులు పూర్తి చేసి లక్ష్యం నెరవేస్తున్నారు. కలెక్టరేట్లోనే జిల్లా పరిశ్రమల కేంద్రం.. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పరిశ్రమల కేంద్రం ఏర్పాటు చేశారు. జీఎం (జనరల్ మేనేజర్) సీనియర్ అసిస్టెంట్ పని చేస్తున్నారు. ఐపీఓ పోస్టు ఖాళీగా ఉంది. ఈశాఖ ద్వారా 2025–26 ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం పూర్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాల ద్వారా పరిశ్రమలకు రాయితీ కల్పిస్తున్నాయి. జిల్లాలో 940 పరిశ్రమలు ఉండగా.. వాటిలో ఎక్కువగా రైలు మిల్లులే ఉన్నాయి. టీఎస్ ఐపాస్ ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో 65 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈమేరకు ప్రభుత్వం నుంచి రూ.114 కోట్ల సబ్సిడీ వారికి మంజూరు చేశారు. వాటితో 530మంది ఉపాధి పొందుతున్నారు. పథకాలు ఇలా.. గత ఆర్థిక సంవత్సరం 2025–26లో టీ–ఫ్రైడ్ పథకం ద్వారా ఎస్సీలకు 14 యూనిట్లు మంజూరు చేసి రూ.1.27 కోట్ల రాయితీ అందించారు. ఎస్టీలకు 115 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసి అందుకు రూ.6.87 కోట్ల రాయితీ కల్పించారు. జనరల్లో 2 పరిశ్రమలు మంజూరు చేసి రూ.36 లక్షల సబ్సిడీ కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఐఐడీఆర్ పథకం ద్వారా జనరల్కు రెండు పరిశ్రమలను మంజూరు చేసి రూ.36 లక్షల రాయితీ అందించారు. పీఎం ఈజీపీ పథకం (స్వయం ఉపాధి) ద్వారా 60 పరిశ్రమలు మంజూరు చేశారు. అందుకు గాను రూ.2.16 కోట్ల రాయితీ ప్రభుత్వం కల్పించింది. పీఎం ఎఫ్ఎంఈ పథకం ద్వారా 35శాతం రాయితీ కల్పించి పది లక్షలలోపు పరిశ్రమలకు అవకాశం కల్పించింది చేతి వృత్తులకు.. చేతి వృత్తులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం పీఎం విశ్వకర్మ పథకం ప్రవేశపెట్టింది. గత సంవత్సరం 344 మంది చేతి వృత్తిదారులను గుర్తించి గుర్తింపు కార్డులు మంజూరు చేసింది. వారిలో 253 మందికి నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చింది. వారిలో 96 మందికి రూ.94 లక్షల రుణాలు మంజూరు చేసింది. డిజిటల్ ఎంప్లామెంట్ ఆఫ్ ఎక్ఛ్సేంజ్ ఆఫ్ తెలంగాణ పథకం ద్వారా కూడా రుణాలు మంజూరు చేసింది. పీఎం ఇంటర్న్షిప్ పథకం.. పీఎంఐఎస్ (ప్రధాన మంత్రి ఇంటర్న్షిప్) ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలన్నదే ప్రధాన లక్ష్యం. ఈ పథకం ద్వారా ఏటా 1.25 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాత వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కాగా సంబంధిత పోర్టల్లో దరఖాస్తుకు అవకాశం కల్పించింది. ఈమేరకు పరిశ్రమల శాఖ అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పథకాలను సద్వినియోగం చేసుకోవాలి పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. యువతను పారిశ్రామికవేత్తలుగా మార్చాలన్నదే ప్రభు త్వ ప్రధాన లక్ష్యం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాయితీ శాతం కూడా పెంచుతుంది. దీంతో పరిశ్రమల స్థాపనపై ఆసక్తి పెరుగుతుంది. టార్గెట్ దాటి మంజూరు చేస్తున్నాం. 2026–27 ఆర్థిక సంవత్సర లక్ష్యాలపై ప్రణాళిక తయారు చేస్తున్నాం. –శ్రీమన్నారాయణ రెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం, జనరల్ మేనేజర్ యవత పరిశ్రమలు నెలకొల్పేలా రాయితీతో రుణాలు పారిశ్రామికవేత్తలుగా మార్చడమే లక్ష్యం ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ముందుకు.. జిల్లాలో 940పరిశ్రమలు.. ఎక్కువగా రైలు మిల్లులు -
తగ్గిన ధాన్యం ధర.. రైతుల ఆందోళన
● కేసముద్రం మార్కెట్లో ఘటన కేసముద్రం: ధాన్యం ధర తగ్గించడంతో రైతులు ఆందోళనకు దిగిన సంఘటన కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో జరిగింది. మార్కెట్లో మూడురోజుల క్రితం సన్నరకం ధాన్యం క్వింటాకు ధర రూ.2,488 పలుకగా, గురువారం అమాంతం తగ్గించి రూ.2,100 ధర పెట్టడంతో ఆగ్రహించిన పలువురు రైతులు మార్కెట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మార్కెట్కు వచ్చి మూడురోజులు అవుతున్నా.. సక్రమంగా కొనుగోళ్లు చేపట్టడం లేదని, కాంటాలు పెట్టకపోవడంతో పడిగాపులు పడాల్సి వస్తోందన్నారు. ధర అమాంతం తగ్గించి తమను మోసం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. మిల్లుల్లో కంటే మార్కెట్లోనే ధర తక్కువ పెడుతున్నారని, దీనికి మార్కెట్లో ఈ–నామ్ విధానం ఎందుకంటూ రైతులు ప్రశ్నించారు. మార్కెట్కు వచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదంటూ వాపోయారు. ఇప్పటికై నా రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇంతలో పోలీసులు చేరుకుని నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. -
దళారులను నమ్మి మోసపోవద్దు
● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ గూడూరు: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ సూచించారు. మండల కేంద్రంతో పాటు మచ్చర్ల, అయోధ్యాపురం, బొల్లెపల్లి, తీగలవేణి గ్రామాల్లో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులతో కలసి ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఓ అబ్దుల్, ఉపసర్పంచ్ చంటిస్వామి, నాయకులు బీరం శ్రీపాల్రెడ్డి, బొల్లికొండ మధు తదితరులు పాల్గొన్నారు. -
పంట మార్పిడితో ప్రయోజనాలు
బయ్యారం: పంటమార్పిడితో రైతులు ప్రయోజనాలు పొందాలని డీఏఓ బి.సరిత అన్నారు. మండల కేంద్రంలోని సొసైటీ ఆవరణలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో బుధవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతులు అవసరం మేరకు రసాయనాలను వినియోగించి ప్రకృతి విధానాలను ప్రోత్సహించటం ద్వారా తక్కువ ఖర్చుతో పంటల సాగు చేయవచ్చన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న వరి రకాలను సాగు చేయడం వల్ల అధిక ఆదాయం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో కేవీకే మల్యాల శాస్త్రవేత్తలు దిలీప్కుమార్, సుహాసిని, ఫార్మ్ మేనేజర్ స్వాతి, ఉద్యానవనశాఖాధికారి మరియన్న, ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ రాజు, ఆత్మ డైరెక్టర్ అమృతారెడ్డితో పాటు ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంమహబూబాబాద్ అర్బన్: రాష్ట్ర క్రీడాసాధికార సంస్థ ఆదేశాల మేరకు 14ఏళ్ల బాల బాలికలకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించడానికి అర్హుల నుంచి ఈ నెల 30నుంచి మే 7వతేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ఓలేటి జ్యోతి బుధవారం తెలిపారు. దరఖాస్తులను నేరుగా కలెక్టరేట్లోని జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో అందజేయాలని, పూర్తి వివరాలకు 9440630681 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు. విద్యార్థినికి వేధింపులు!మహబూబాబాద్ రూరల్/నెహ్రూసెంటర్: మానుకోట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థినిని జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధించినట్లు తెలిసింది. కొంతకాలం నుంచి సదరు విద్యార్థిని వెంట పడుతున్నాడు. ఈమేరకు సదరు యువకుడు బుధవారం రాత్రి ఆమె ఉండే హాస్టల్ వద్దకు వెళ్లి ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. భయాందోళనకు గురైన సదరు విద్యార్థిని తోటి విద్యార్థినులతో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యా దు చేసినట్లు సమాచారం. టౌన్ ఎస్సై షాకీర్ను వివరణ కోరగా విద్యార్థిని ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. -
‘పది’ ఫలితాల్లో ‘ఎస్ఆర్’ విజయభేరి
విద్యారణ్యపురి: పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఎస్ఆర్ స్కూల్స్ విద్యార్థులు విజయభేరి మోగించారని ఆ విద్యా సంస్థల చైర్మన్ ఎ. వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోష్రెడ్డి బుధవారం తెలి పారు. సి. సంస్కృతారెడ్డి 600 మార్కులకు 589, పిరంజి వంశీ 588, ఎస్.కీర్తన 587, అంకం సౌజన్య 587, ఎ. సంజయ్ 586, టి. వైష్ణవి 585, బాశెట్టి సాయిశ్రీ 584 మార్కులు సాధించారని వారు తెలి పారు. క్రమశిక్షణతో కూడిన విద్యనందిస్తున్నామని, పాఠ్యప్రణాళిక, అంకితభావం కలిగిన ఉపాధ్యాయ బృందం విద్యాబోధన చేశారని వారు పేర్కొన్నారు. తమ విద్యార్థులు పోటీ పరీక్షలను ఎదుర్కొనేలా ఐఐటీ అండ్ మెడికల్ ఫౌండేషన్లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం చేసేలా బృహత్తర పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా ప్రైమ్స్కూళ్లను ప్రారంభించామని వారు వివరించారు. -
ప్రజల భద్రతకు పోలీసుల కృషి
● ఎస్పీ డాక్టర్ శబరీష్ మహబూబాబాద్ రూరల్ : ప్రజల భద్రత కోసం పోలీసు అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడు కృషి చేస్తారని ఎస్పీ శబరీష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని నెహ్రూసెంటర్ వద్ద ఉన్న ట్రాఫిక్ పోస్టులో వాటర్ మిస్ట్ స్ప్రింక్లర్స్ ఆధారిత కూలింగ్ సిస్టంను ఏర్పాటు చేసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ సిస్టమ్ ద్వారా నీరు మిస్ట్ రూపంలో చల్లదనం కలిగించడం ద్వారా ఎండలో విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ సిబ్బందికి తక్షణ ఉపశమనం కలుగుతుందన్నారు. అలాగే ట్రాఫిక్ సిబ్బందికి మిల్టన్ వాటర్ ఫ్లాస్క్లు, చల్లటి కంటి అద్దాలు పంపిణీ చేశామన్నారు. ప్రజల భద్రత కోసం తీవ్ర ఎండల్లోనూ అంకితభావంతో పనిచేస్తున్న ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్యం కాపాడడం పోలీస్ శాఖ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. వేసవి కాలంలో హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ వంటి సమస్యలను నివారించేందుకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ తిరుపతిరావు, టౌన్ సీఐ మహేందర్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్సై అరుణ్ కుమార్, ట్రాఫిక్ సిబ్బంది రాంచందర్, భాస్కర్, పాపాలాల్, వెంకన్న, రామకృష్ణ, మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
సీఐ మహేందర్ రెడ్డికి డీఎస్పీగా పదోన్నతి
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డికి డీఎస్పీగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ ఉన్నతాధికారులు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసుశాఖ తెలంగాణ మల్టీ జోన్– 1 పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న 35 మంది సీఐలకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు విడుదల కాగా.. అందులో టౌన్ సీఐ మహేందర్ రెడ్డి ఉన్నారు. పట్టాలపై పరుగులు● ట్రాక్టర్ ఇంజన్కు గూడ్స్ బోగీ జత కురవి: రోడ్డుపై నడిచే ట్రాక్టర్ ఇంజన్ పట్టాలపై పరుగులు పెట్టడం చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు. ట్రాక్టర్ ఇంజన్కు గూడ్స్ డబ్బాను తొట్టిగా ఏర్పాటు చేసి రైల్వే పనులకు ఉపయోగపడేలా తయారు చేశారు. కాగా బుధవారం గుండ్రాతిమడుగు(విలేజి) వద్ద పట్టాలపై ట్రాక్టర్ ఇంజన్ పరుగులు తీయడాన్ని సాక్షి తన కెమెరాలో బంధించింది. రైల్వే పనులకు కంకరను తొట్టిలో పోసుకుని వేరే ప్రాంతానికి పట్టాలపై తరలిస్తున్నారు. ట్రాక్టర్ ఇంజన్కు డబ్బాను జత చేసి ఉపయోగించుకోవడం అద్భుతమైన ఆలోచన అని పలువురు అభివర్ణిస్తున్నారు. -
‘ఏకశిల’ విద్యార్థుల ప్రతిభ..
హసన్పర్తి: టెన్త్ పరీక్ష ఫలితాల్లో ఏకశిల విద్యాసంస్థల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వరుసగా 585,582,580,578 ,577,576,574,573,572,571,570 మార్కులతో రాష్ట్ర స్థాయిలో టాపర్గా నిలిచినట్లు ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతిరెడ్డి తెలిపారు. ఈసందర్భంగా హసన్పర్తి మండలం పెంబర్తిలోని ఏకశిల టెక్నో స్కూల్లో బుధవారం అభినందన సభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకశిల విద్యాసంస్థలో విద్య అంటే మార్కులు మాత్రమే కాదు.. భవిష్యత్ను నిర్మించే శక్తి అన్నారు. నాణ్యమైన విద్యతోపాటు నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, జీవిత నైపుణ్యాలను పెంపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫలితాలతో ఏకశిల విద్యాసంస్థకు మరింత గౌరవం పెరిగిందన్నారు. అనంతరం అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఏకశిల విద్యాసంస్థల డైరెక్టర్లు బేతి కొండల్రెడ్డి, గౌరు సువిజారెడ్డి, ప్రిన్సిపాళ్లు బేతి శైలజారెడ్డి, ముచ్చ స్వప్నరెడ్డి, ఎం.డి. బాబా, కె.డి. స్వర్ణరాజ్, లవకుమార్, అడ్మినిస్ట్రేషన్ ఇన్చార్జ్ జి.రాంప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
జిల్లాకు 5వ స్థానం
పదో తరగతి వార్షిక ఫలితాల్లో 98.81శాతం ఉత్తీర్ణతమహబూబాబాద్ అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లా రాష్ట్రస్థాయిలో ఐదో స్థానం కై వనం చేసుకుంది. బుధవారం మధ్యాహ్నం 2గంటలకు ఫలితాలు వెలువడ్డాయి. కాగా జిల్లా వ్యాప్తంగా 8,152 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 8,055 మంది 98.81శాతంతో ఉత్తీర్ణులయ్యారు. 3,998 మంది బాలికలకు గానూ 3,966 మంది 99.2శాతంతో ఉత్తీర్ణత సాధించారు. 4,154 మంది బాలురుకు 4,089 మంది 98.44 శాతంతో ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా బాలికలు పైచేయి సాధించారు. ఇదిలా ఉండగా 2025లో జిల్లా ప్రథమ స్థానం సాధించగా.. ప్రస్తుతం ఐదోస్థానంతో సరిపెట్టుకుంది. 100 శాతం ఉత్తీర్ణత శాతం సాధించిన పాఠశాలలు.. మోడల్ స్కూల్స్ 4, కేజీబీవీల పాఠశాలలు 12, జెడ్పీ పాఠశాలలు 70, గిరిజన ఆశ్రమ పాఠశాలలు 11, బీసీ వెల్ఫేర్, మైనార్టీ గురుకులం, ప్రైవేట్ పాఠశాలలు, మినీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు.. జూన్ 5 నుంచి 12వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. మే 14న పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు విధించారు. పరీక్షలు జరిగే తేదీకి రెండు రోజుల ముందు వరకు రూ.50 ఫైన్తో ఫీజు చెల్లించవచ్చు. సివిల్స్ సాధిస్తామాది నిరుపేద కుటుంబం. బ్రాహ్మణపల్లిలో చిన్న చికెన్షాపు ఉంది. నేను ఇంజనీరింగ్ చదివి భవిష్యత్లో సివిల్స్ సాధించడమే నా లక్ష్యం. మా తల్లిదండ్రులకు ఏ కష్టం రాకుండా బాగా చూసుకుంటా. అమ్మ నాకు గురువు, దైవంతో సమానం. ఉపాధ్యాయుల చొరవతో కష్టపడి చదివాను. పదో తరగతి ఫలితాల్లో మా పాఠశాల నుంచి నేను 576 మార్కులు సాధించాను. – ఎస్కే.అఫరతబ్బుసం, జెడ్పీహెచ్ఎస్, ఈదులపూసపల్లి అందరి భాగస్వామ్యంతోనే విజయం పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా 5వ స్థానం సాధించడం సంతోషంగా ఉంది. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. కష్టపడి చదివిన విద్యార్థులు భవిష్యత్ వివిధ రంగాల్లో రాణిస్తారు. పరీక్షలకు సహకరించిన పోలీసు అధికారులకు పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. – మందుల శ్రీరాములు, ఏసీజీఈ, మానుకోట మేనేజ్మెంట్ల వారీగా ఫలితాలుమేనేజ్మెంట్ పరీక్ష రాసిన ఉత్తీర్ణత ఫెయిల్ విద్యార్థులు ఎయిడెడ్–1 3 3 – ఆశ్రమ 774 766 8 బీసీ వెల్ఫేర్ 390 389 1 ప్రభుత్వ పాఠశాల 111 105 6 కేజీబీవీలు 516 511 5 మోడల్ స్కూల్స్ 720 715 5 ప్రైవేట్ స్కూల్స్ 1836 1,824 12 మినీ రెసిడెన్షీ 143 143 – సోషల్వెల్ఫేర్ 373 368 5 ట్రైబల్ వెల్ఫేర్ 340 340 – జెడ్పీ పాఠశాలలు 2,964 2,909 55 మొత్తం 8,152 8,055 97సాఫ్ట్వేర్ ఉద్యోగం నా కలఉపాధ్యాయుల సలహాలు, సూచనల మేరకు ప్రతీరోజు ఉదయం 5నుంచి 7 గంటల వరకు, మళ్లీ సాయత్రం 6నుంచి 8 గంటల వరకు.. 9నుంచి 11గంటల వరకు చదివాను. టీచర్స్ సందేహాలను నివృత్తి చేసేవారు. నా కష్టానికి ప్రతిఫలం దక్కింది. బాసరలో ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ రంగంలో రాణిస్తాను. మా నాన్న ఆటో నడుపుతాడు. మంచి ఉద్యోగం సాధించి తల్లిదండ్రులను బాగా చూసుకుంటాను. పదో తరగతిలో 578 మార్కులు సాధించాను. – పరాల కీర్తన, మోడల్స్కూల్, మానుకోట బాలికలు 99.2శాతం.. బాలురు 98.44శాతం పాస్ కలెక్టర్, డీఈఓ చొరవతో మెరుగైన ఫలితాలు -
రాష్ట్రస్థాయికి ఎంపికై న జిజ్ఞాస ప్రాజెక్టు
కేసముద్రం: మున్సిపాలిటీ పరిధి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు రూపొందించిన జిజ్ఞాస స్టూడెంట్స్ స్టడీ ప్రాజెక్టు రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ డి.రాజు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతరిస్తున్న పల్లె గీతాలు, కేసముద్రం ప్రాంత జానపద గేయాలు అనే అంశంపై ఈ పరిశోధన ప్రాజెక్టును చేపట్టారని, ఈమేరకు రాష్ట్రస్థాయికి ఎంపికై ందన్నారు. మే నెలలో హైదరాబాద్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు విద్యార్థులు అర్హత సాధించినట్లు ఆయన తెలిపారు. కలెక్టర్కు కలిసిన డిప్యూటీ డైరెక్టర్మహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ఎస్సీ హాస్టల్ పదో తరగతి విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించిన నేపథ్యంలో బుధవారం కలెక్టర్ స్నేహ శబరీష్ను గిరిజన డిప్యూటీ డైరెక్టర్ గుగులోతు దేశీరాంనాయక్, జిల్లా విద్యాశాఖ పరీక్షల విభాగం అధికారి మందుల శ్రీరాములు, ఎస్సీ సంక్షేమశాఖ జిల్లా అధికారి శ్రీనివాస్రావు మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. ఈ విద్యాసంవత్సరం ఉత్తమ మార్కులు సాధించి జిల్లాను 5వ స్థానంలో నిలిపిన విద్యార్థులకు శుభాంకాక్షలు తెలుపుతున్నామన్నారు. రానున్న రోజుల్లో జిల్లాను మొదటిస్థానంలో నిలపాలని సూచించారు. ఇన్చార్జ్ అదనపు కలెక్టర్గా జెడ్పీ సీఈఓమహబూబాబాద్: జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టొప్పో ఇటీవల ములుగు జిల్లా ఏటురూనాగారం ఐటీడీఏ పీఓగా బదిలీ అయిన విషయం విదితమే. కాగా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్గా జెడ్పీ సీఈఓ పురుషోత్తంకు బాధ్యతలు ఇస్తూ కలెక్టర్ స్నేహ శబరీష్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. డీజిల్ లోకో షెడ్ అభివృద్ధికి సమష్టి కృషి కాజీపేట రూరల్: కాజీపేట డీజిల్ లోకో షెడ్కు సమష్టి కృషితోనే దేశంలో మంచి గుర్తింపు లభించిందని డీజిల్ షెడ్ సీనియర్ డీఎంఈ ఎన్.వి.వెంకటకుమార్ అన్నారు. మంగళవారం రాత్రి డీజిల్ లోకో షెడ్ 53 వసంతాల వేడుకలు కనులపండువగా జరిగాయి. రైల్వే సీనియర్ డీఎంఈ వెంకటకుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించి మాట్లాడారు. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ అధికారుల సహకారంతో డీజిల్ షెడ్ రైల్వే అధికారులు, సూపర్వైజర్లు, రైల్వే కార్మికులు విధుల నిర్వహణలో మంచి ఫలితాలతో 53 వసంతాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. సీనియర్ డీఈఈ కేవీ.హరికృష్ణ కేక్ కట్ చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీఎంఈ అనికేత్ ఖడ్గే, ఎడీఎంఈలు శ్రీనివాస్రావు, నాగరాజశేఖర్, ఏడిఈ సతీశ్కుమార్, ఏసీఎంటీ మల్లికార్జునరావు, ఎ.ఎం.ఎం రాజేశ్, కాజీపేట స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ జోనల్ ప్రెసిడెంట్ కాల్వ శ్రీనివాస్, యూనియన్ డీజిల్ బ్రాంచ్ నాయకులు పాక వేదప్రకాశ్ పాల్గొన్నారు. -
‘బాలయేసు’ విజయదుందుభి..
దేవరుప్పుల : జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని బాలయేసు ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు బుధవారం వెలువడిన పదో తరగతి ఫలితాల్లో మరోసారి విజయదుందుభి మోగించారు. 582 మార్కులతో బాకి అభిజ్ఞాన్ దేవరుప్పుల మండలంలో ఫస్ట్ ర్యాంకు సాధించాడు. మహ్మద్ రైసున్నీసా 576, కున్సోతు స్వాతి 566 మార్కులు, మొత్తం 32 మంది విద్యార్థుల్లో 22 మంది 500కు పైగా మార్కులు సాధించారని, ఇది ఎంతో గర్వకారణమని పాఠశాల కరస్పాండెంట్ బ్రదర్ జేసురాజ్ అన్నారు. ఈ సందర్భంగా ప్రతీ విద్యార్థి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయులు మదన్ మోహన్, మహేశ్, కృష్ణ, పాషా, షబానా, సంధ్య.. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. -
‘షైన్’ విజయకేతనం..
హన్మకొండ : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో షైన్ విద్యా సంస్థల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. తమ పాఠశాల విద్యార్థులు ఎ.అక్షర 588 మార్కులు, ఎల్.రేవంత్, ఎండి అఫ్రోజ్ 586, సమీరా నయీం 585, వెలుదండి సీమ, జి.సంహిత, కె.సుమిత్ 584, టి హాసిని, ఎ.ప్రశాంతి, ఎ.సుశాంత్, సీహెచ్.సిరి 583, వి.జాహ్నవి, మార్క శ్రీధన్ 582, ఎ.హరిణి 581, పి.యతిస్, పి.హర్షిత 580 మార్కులు సాధించారని షైన్ విద్యాసంస్థల అధినేత మూగల కుమార్ యాదవ్ వివరించారు. ఐఐటీ ఫౌండేషన్, నీట్తోపాటు పదో తరగతి పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతోనే ఈ ఫలితాలు సాధించామన్నారు. ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాల్లో కూడా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించారన్నారు. బుధవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు, వారి ఉన్నతికి శ్రమించిన అధ్యాపకులను ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో కరెస్పాడెంట్ మూగల రమ, షైన్ పబ్లిక్ స్కూల్ ఎరగ్రట్టుగుట్ట బ్రాంచ్ సెక్రటరీ జక్కుల శ్రీనివాస్ యాదవ్, ఐఐటీ కోఆర్డినేటర్ మూగల రమేశ్ యాదవ్, ప్రిన్సిపాళ్లు పి.విశాల్, కె.దినేశ్, రాజ్ కుమార్, కవిత, ప్రగతిరెడ్డి, సబిత, మానస, కాలేజీ ప్రిన్సిపాళ్లు రాజుగౌడ్, పి.శ్రీనివాస్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. -
‘తేజస్వి’ విద్యార్థుల సత్తా..
నయీంనగర్ : పదో తరగతి ఫలితాల్లో తేజస్వి పాఠశాల విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. 591 మార్కులతో కందిక సాహిత్య ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఎం.అభివర్షిని 590, ఎం.శ్రీతిక 588, జి.సాయి శ్రేష్ఠ, ఆర్. తన్మయి, ఎ.హర్షిత్, ఎండి.సుమేర్ అహ్మద్, అమృత వర్షిణి 587, కె.హిమవర్షిత, కె.నాగస్వామి, మణి సాయి ప్రణవ్ 586, జి.సౌమ్య శ్రీ, ఎల్.కిరణ్ తేజ్, సిహెచ్.మహిన్వద, ఎం.దీప్తి, ఎన్.కార్తికేయ 585, పి.సాయిసాన్వి, పి.శ్రీపాద రెడ్డి 584, సి.హెచ్.శ్రేష్ఠ 583, జునైరియా నౌరిన్, ఎల్.వర్ష, ఎ.రేష్మిత, ఎ.వర్షిణిశ్రీ 582, ఎం.గీతిక, ఎం.మేద, బి.లాస్య, ఎ.నీలిమైథిలి, టి.శశిధర్ 581, జి.సింధు 580 మార్కులు సాధించింది. 570– 579 మధ్య 78 మంది విద్యార్థులు, 560– 569 మధ్య 67 మంది, 550–559 మధ్య 73 మంది, 540 – 549 మధ్య 48 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 539 కంటే తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు 161 మందితో నయీంనగర్, పోచమ్మకుంట, ప్రశాంత్నగర్ బ్రాంచ్లలో జిల్లా స్థాయిలో అధిక మార్కులు సాధించడం తేజస్వి ఘనత. విజయ పరంపర కొనసాగించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, తల్లిదండ్రులకు పాఠశాల చైర్మన్ రేవూరి జెన్నారెడ్డి, పిల్లలమర్రి చంద్రశేఖర్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు. -
కొనసాగుతున్న ‘పెట్రో’ కష్టాలు
మహబూబాబాద్: మొన్నటి వరకు గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నేడు పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు కష్టాలు పడుతున్నారు. బంకుల్లో వాహనదారులు బారులుదీరుతున్నారు. కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. కాగా, డీజిల్ కోసం క్యాన్లు, డబ్బాలను క్యూలైన్లలో పెట్టారు. వాహనాలు కిలోమీటర్ల కొద్ది క్యూలో ఉన్నాయి పోలీసు బందోబస్తు నడుమ విక్రయాలు చేస్తున్నారు. కొన్ని బంకుల్లో ద్విచక్రహనాలకు రెండు నుంచి మూడు లీటర్లు, నాలుగు చక్రాల వాహనాలకు రూ.2,000 ఇధనం మాత్రమే విక్రయిస్తున్నారు. కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు.. జిల్లాలోని పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. జిల్లా కేంద్రంలో ఈనెల 26వ తేదీ వరకు పూర్తిగా డీజిల్ లేక ఇబ్బందులు పడ్డారు. ఈనెల 27న పెట్రోల్ లేకపోవడంతో వాహనదారులకు తిప్పలు తప్పలేదు. ఎట్టకేలకు జిల్లా కేంద్రంలోని ఫాతిమా హైస్కూల్ ఎదుట ఉన్న బంక్, ఆర్టీసీ బస్టాండ్ వద్ద బంక్తో పాటు మండలంలోని పలు బంకుల్లో పెట్రోల్, డీజిల్ సరఫరా అయింది. దీంతో వాహనదారులు బారులు దీరారు. కిలో మీటర్ల కొద్ది దూరంలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీస్ బందోబస్తు నడుమ విక్రయాలు.. కొరతతో విక్రయాలు చేసే పరిస్థితి లేక పోలీసు బందోబస్తు నడుమ అమ్మకాలు చేస్తున్నారు. అది కూడా ద్విచక్రవాహనాలకు రెండు నుంచి మూడు లీటర్లు, ఫోర్వీలర్ అయితే రూ.2,000 వరకు మాత్రమే విక్రయాలు చేస్తూ ఆంక్షలు విధించారు. ఈనెల 27న మానుకోట మున్సిపాలిటీ పరిధిలో తొర్రూరు రోడ్డులో ఉన్న బంకు వద్ద వాహనదారులు బంకులో పనిచేసే సిబ్బందితో తీవ్ర వాగ్వాదం చేశారు. కాగా పెట్రోల్ కొరతపై అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత రావడం లేదు. కొరత లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు ప్రస్తుతం జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కంపెనీల ప్రతినిధులతో మాట్లాడినం. స్టాక్ వస్తుంది. సమస్య పరిష్కరిస్తాం. – రమేశ్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బంకులవద్ద వాహనదారుల బారులు క్యూలో క్యాన్లు, డబ్బాలు పోలీసు బందోబస్తు నడుమ విక్రయాలు పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు -
వెక్కిరిస్తున్న ఖాళీలు
సాక్షి, మహబూబాబాద్: పేదలు, తల్లిదండ్రులు లేని ఆడపిల్లలు చదువుకునే కేజీబీవీల్లో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. టీచింగ్ స్టాఫ్ను నియమించిన అధికారులు.. నాన్ టీచింగ్ సిబ్బంది నియామకంలో జాప్యం చేస్తున్నారు. ఏడాదిగా ఖాళీలు భర్తీ చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే విద్యాసంవత్సరం లోపు ఖాళీలు భర్తీ చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. 32 నాన్టీచింగ్ ఖాళీలు.. బాలికా విద్యను బలోపేతం చేసేందుకు ప్రతీ మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన కేజీబీవీల్లో నాన్టీచింగ్ ఖాళీలు ఇబ్బందిగా మారాయి. జిల్లాలో మొత్తం 18 మండలాలు ఉండగా.. ఇందులో కొత్తగా ఏర్పడిన ఇనుగుర్తి, సీరోలు మినహా 16 మండలాల్లో కేజీబీవీలు ఏర్పాటు చేశారు. ఇందులో దంతాలపల్లి కేజీబీవీకి మినహా అన్నింటికి సొంత భవనాలు ఉన్నాయి. ఆలస్యంగా ప్రారంభించిన దంతాలపల్లి కేజీబీవీకి సొంత భవనం లేదు. అదే విధంగా ఆ పాఠశాలకు నాన్టీచింగ్ ఉద్యోగుల నియామకాలు చేపట్టలేదు. గత ఏడాది నర్సింహులపేట మోడల్ స్కూల్లో అరకొర వసతులతో నెట్టుకొచ్చారు. జిల్లాలో మొత్తం 184 నాన్టీచింగ్ ఉద్యోగులు పనిచేయాల్సి ఉండగా.. 152 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన 32 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దంతాలపల్లి ఏఎన్ఎం నియామకంపై.. చిన్న ఉద్యోగం కూడా నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తున్న తరుణంలో దంతాలపల్లి ఏఎన్ఎం భర్తీ ప్రక్రియపై పలు విమర్శలు వస్తున్నాయి. గత ఏడాది ప్రారంభించిన దంతాలపల్లి కేజీబీవీ నాన్టీచింగ్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. దీంతో అక్కడ మోడల్ స్కూల్ ఉద్యోగులతోనే కొనసాగించారు. అయితే దంతాలపల్లి కేజీబీవీలో ఏఎన్ఎం నియామకం జరిగినట్లు.. సదరు ఉద్యోగిని హైదరాబాద్లో పనిచేస్తున్నట్లు వచ్చిన వార్తలు అందరిని విస్మయానికి గురి చేసింది. అయితే ఈ నియామకంపై జిల్లా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. నోటిఫికేషన్ లేకుండా భర్తీ ఎలా చేశారు. భర్తీ అయిన ఉద్యోగి ఇంతకాలం ఎక్కడ పనిచేశారు.. వచ్చే విద్యాసంవత్సరానికై నా.. పాఠశాలకు వచ్చి పనిచేస్తుందా.. అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి ఖాళీగా ఉన్న నాన్టీచింగ్ ఉద్యోగులను పాఠశాల పునఃప్రారంభానికి ముందుగానే భర్తీ చేయాలని కోరుతున్నారు. ఖాళీలతో ఇబ్బందులు.. గురుకులాలను మించిన విధంగా బోధన జరిపే కేజీబీవీల్లో నాన్టీచింగ్ ఉద్యోగుల భర్తీ కీలకంగా మారింది. ప్రధానంగా అటెండర్, ఏఎన్ఎం, వాచ్మెన్, స్వీపర్లు, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్స్, నైట్ డ్యూటీ అటెండర్ ఇలా అన్నీ పోస్టులు కీలకమే. ఇందులో ఏ ఒక్కటి ఖాళీగా ఉన్నా.. ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దంతాలపల్లి 10, డోర్నకల్ 5, మహబూబాబాద్ 5, తొర్రూరు, నెల్లికుదురు, కురవి, మరిపెడ, గూడూరులో రెండేసి, చిన్నగూడూరు, గార్ల కేజీబీవీల్లో ఒక్కొక్కటి చొప్పున ఖాళీగా ఉన్నా యి. ఇందులో వంట మనుషులను డిప్యుటేషన్పై వేరేచోటుకు పంపించారు. కాగా డిప్యుటేషన్పై వెళ్లడంతో మరింత కొరత ఏర్పడింది. దీంతో వంట గదులు అపరిశుభ్రత, అన్నం, కూరలు రుచిగా వండకపోవడం, పరిసరాల అపరిశుభ్రతతో విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం, పలుచోట్ల ఫుడ్ పాయిజన్ అయిన సంఘటనలు ఉన్నాయి. అదే విధంగా దంతాలపల్లి స్కూల్లో నాన్టీచింగ్ ఉద్యోగుల నియామకం కాకపోవడంతో వచ్చే ఏడాది ఉద్యోగుల భర్తీ చేసిన తర్వాతే పాఠశాల ప్రారంభిచాల్సి ఉంటుంది. కేజీబీవీల్లో వేకెన్సీలతో ఇబ్బందులు వంట మనుషులు లేక సతమతం దంతాలపల్లి ఏఎన్ఎం నియామకంపై విమర్శలు వేసవి సెలవుల్లో భర్తీ చేస్తేనే పాఠశాల తెరిచేదిఖాళీల భర్తీ ప్రక్రియ షురూ..కేజీబీవీల్లో ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ కోసం కసరత్తు మొదలైంది. విద్యా సంవత్సరం ప్రారంభం లోపు భర్తీ ప్రక్రియను పూర్తి చేసే విధంగా ముందుకు వెళ్తున్నాం. జిల్లాలోని ఖాళీలు, భర్తీ ప్రక్రియ విధానం మొదలైన అంశాలను కలెక్టర్కు వివరించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నోటిఫికేషన్, భర్తీ ప్రక్రియ జరుగుతుంది. – రాజేశ్వర్, జిల్లావిద్యాశాఖ అధికారి -
రోడ్డు ప్రమాదంలో ఆర్టిజన్ కార్మికుడి మృతి
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామానికి చెందిన జెన్కో ఆర్టిజన్ కార్మికుడు ముల్కల ప్రభాకర్రెడ్డి(50) మహారాష్ట్రలోని చింతలపల్లి చెక్పోస్టు వద్ద సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సిరొంచ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభాకర్రెడ్డి సిరొంచ సమీపంలోని ఫంక్షన్హాల్లో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యాడు. వేడుక పూర్తయిన అనంతరం తిరిగి వస్తున్న క్రమంలో కాళేశ్వరం వంతెనకు అవుతలి వైపు(మహారాష్ట్ర) అటవీశాఖ చెక్పోస్ట్ వద్ద ఎదురుగా క్యాంపర్ అతివేగంగా వచ్చి బారికేడ్లను తాకింది. ఇదే సమయంలో అటువైపుగా బైక్పై ప్రభాకర్రెడ్డి వస్తున్నాడు. దీంతో బారికేడ్ అదే వేగంతో ప్రభాకర్రెడ్డికి తగలడంతో రక్తస్రావం జరిగింది. దీంతో వెంటనే స్థానికులు మహదేవపూర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిరొంచ ఎస్సై నందే పేర్కొన్నారు. మృతుడికి భార్య పద్మ, కూతురు, కుమారుడు ఉన్నారు. మృతుడు మెట్పల్లిలో కేటీపీపీ పంపుహౌస్లో ఆర్టిజన్ కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రభాకర్ రెడ్డి మృతితో కాళేశ్వరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఆగుతూ.. సాగుతూ..
● గడువు దాటుతున్నా పూర్తికాని పనులు ● టెండర్ల విషయంలోను తీవ్రజాప్యం ● పెండింగ్లోనే ఎక్కువ బిల్లులు మహబూబాబాద్ : మూడేళ్ల క్రితం మంజూరైన పనులు అంతంత మాత్రమే సాగుతున్నాయి. అవి కూడా నేటికి పూర్తి కాలేదు. అయితే కొన్ని పనులు ప్రారంభం కాకపోగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో అవి రద్దయినట్లు అధికారులు తెలిపారు. పెండింగ్లో ఎక్కువ బిల్లులు ఉండడంతోనే పనులు సాగడం లేదు. కార్యాలయం పరిధిలో మూడు సబ్డివిజన్లు ఆర్అండ్బీ శాఖ ఈఈ (కార్యనిర్వాహక శాఖ ఇంజనీర్ కార్యాలయం) పరిధిలో మూడు సబ్ డివిజన్లు ఉన్నాయి. గూడూరు సబ్ డివిజన్ పరిధిలో గూడూరు, కేసముద్రం, గంగారం, కొత్తగూడ, ఇనుగుర్తి మండలాలు ఉన్నాయి. మరిపెడ సబ్ డివిజన్ పరిధిలో మరిపెడ, డోర్నకల్, కురవి, నర్సింహులపేట, సీరోలు, దంతాలిపల్లి, చిన్నగూడూరు మండలాలు ఉన్నాయి. మానుకోట సబ్ డివిజన్ పరిధిలో మానుకోట, తొర్రూర్, బయ్యారం, గార్ల, పెద్దవంగర, నెల్లికుదురు మండలాలు ఉన్నాయి. రెగ్యులర్ ఈఈతో పాటు ఐదుగురు డీఈలు, 11 మంది ఏఈఈలు విధులు నిర్వరిస్తున్నారు. కార్యాలయంలో సూపరిటెండెంట్, డీఏఓ, ఏఈఈ ఒకరు, ఏఈ, టీఓ, ఏటీఓ, జేటీఓ, టీఏ ఒక్కొక్కరు, సీనియర్ అసిస్టెంట్లు నలుగురు, జూనియర్ అసిస్టెంట్లు ఐదుగురు, టైపిస్టులు ఇద్దరు, రికార్డు అసిస్టెంట్ ఒకరు, అటెండర్లు ఐదుగురు పని చేస్తున్నారు. మంజూరైన పనులు అంతంతే.. మూడేళ్ల ఆర్థిక సంవత్సరాల్లో మంజూరైన పనులు అంతంత మాత్రమే. దీంతో పూర్తిస్థాయిలో ఉన్న అధికారులు పెద్దగా పనులు లేక కార్యాలయానికి పరిమితమవుతున్నారు. కొన్ని పనులు కావడం, అవి కూడా నత్తనడక సాగడంతో పదే పదే పనుల పరిఽశీలన బిల్లులు చేసే పని కూడా లేదు. పనులను పరిశీలిస్తే.. ● 2023–24లో కేసముద్రం బైపాస్ కిలోమీటరు పనులకు రూ.5 కోట్లు మంజూరు కాగా నేటికి విస్తరణ పనులు సాగుతున్నాయి. ● కేసముద్రం నుంచి నెల్లికుదురు నాలుగు కిలోమీటర్లకు రూ.20 కోట్లు మంజూరు కాగా పనులు నడుస్తున్నాయి ● గూడూరు మండలంలోని నాయక్పల్లి నుంచి గోవిందాపురం వరకు 12కిలోమీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.24 కోట్లు రాగా పనులు కొనసాగుతున్నాయి. ● మానుకోట మండలంలోని జమాండ్లపల్లి నుంచి రెడ్యాల వరకు 10కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.25 కోట్లు మంజూరు కాగా కేవలం 40శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. ● 2024– 25లో ప్లాన్వర్స్ నుంచి మానుకోట మున్సిపల్ పరిధిలోని బేతోలు నుంచి పర్వతగిరి వరకు 8.7 కిలో మీటర్లకు రూ.17కోట్లతో పనులు జరుగుతున్నాయి. ● గూడూరు–కేసముద్రం1.6 కిలోమీటర్లు, మరో రోడ్డు 4 కిలో మీటర్లకు రూ.40 కోట్లు కంకర పూర్తయ్యి, బీటీ పనులు సాగుతున్నాయి. ● కేసముద్రం మండలంలోని పెనుగొండ–అర్పనపల్లి మధ్య 10 కిలోమీటర్ల రోడ్డు బీటీ పనులు తుదిదశకు చేరాయని అధికారులు పేర్కొన్నారు. ● తొర్రూరు నుంచి కంఠాయపాలెం 4 కిలోమీటర్లకు రూ.6 కోట్ల నిధులు రాగా పనులు ప్రారంభం కాలేదు, అగ్రిమెంట్ ఆలస్యమైంది. ● 2025–26లో కొత్తగూడ మండల కేంద్రం నుంచి దుబ్బగూడెం 5 కిలోమీటర్ల రోడ్డుకు రూ.7 కోట్లు టెండర్ పెండింగ్లో ఉంది. ● సెంట్రల్ రోడ్డు ఫండ్ నిధుల నుంచి డోర్నకల్ మండలంలోని చిలక్కొడు నుంచి వెన్నారం వరకు 10 కిలోమీటర్ల రోడ్డకు రూ.22 కోట్లతో అగ్రిమెంట్ పూర్తయినా, పనులు ప్రారంభం కాలేదు. ● గార్ల నుంచి గుండ్రాతిమడుగు వయా రాంపురం 10 కిలో మీటర్ల రోడ్డకు రూ.20 కోట్లు టెండర్ దశలోనే ఉన్నాయి. ఇల్లందు నుంచి పాకాల రోడ్డులో 2కిలో మీటర్ల రోడ్డు వెడల్పు పనులు రూ.12 కోట్లతో సాగుతున్నాయి. తగ్గుతున్న నాణ్యత.. గడువులోగా పనులు పూర్తయితేనే నాణ్యతగా ఉంటుంది. కాని ఆగుతూ.. సాగుతూ పనులు జరుగుతున్నప్పుడు క్యూరింగ్ విషయంలో లోపం జరుగుతుంది. బిల్లులు రావడం లేదనే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తేనే పనులు వేగవంతంగా పూర్తవుతాయి. ఒక్క పనికూడా పూర్తి కాలేదు మానుకోట నుంచి కేసముద్రం వరకు రోడ్డు మంజూరైనా టెండర్లు ముందుకు రాకపోవడంతో ఆ పని రద్దు చేశారు. కేసముద్రం మండలంలోని పెనుగొండ–అర్పనపల్లి రోడ్డు మాత్రమే తుది దశఽకు చేరింది. కేసముద్రం బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.5 కోట్లకు రూ.2 కోట్లు మాత్రమే వచ్చాయి. కేసముద్రం–నెల్లికుదురు రోడ్డుకు రూ.20 కోట్లకు రూ.6.90 కోట్లు వచ్చాయి. గూడూరు మండలం నాయక్ పల్లి–గోవిందాపురం రోడ్డుకు రూ.24 కోట్లకు రూ.1.76 కోట్లు వచ్చాయని అధికారులు తెలిపారు. మానుకోట మండలంలోని జమాండ్లపల్లి నుంచి రెడ్యాల రోడ్డుకు రూ.25 కోట్లకు ఒక్క బిల్లు కూడా రాలేదని 40 శాతం పనులు పూర్తయ్యాయని చెబుతున్నారు . -
ఆర్థిక ఇబ్బందులతో వార్డు మాజీ సభ్యుడి ఆత్మహత్య
స్టేషన్ఘన్పూర్: ఆర్థిక ఇబ్బందులతో స్టేషన్ఘన్పూర్ గత జీపీ వార్డు మాజీ సభ్యుడు, బట్టల వ్యాపారి గట్టు వెంకటస్వామి(50) మంగళవారం ఉరేసుకు ని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు మృతుడి భార్య గట్టు శ్రీవాణి, పోలీసుల కథనం ప్రకారం.. వెంకటస్వామి ఇంటివద్దే బట్టలషాపు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ఇటీవల వ్యా పారం సరిగ్గా నడవడం లేదు. దీంతో ఇంటిలోన్ , క్రెడిట్ కార్డు ఈఎంఐ ఎలా చెల్లించాలంటూ తరచూ మనస్తాపం చెందేవాడు. కాగా ఐదు రోజుల క్రితం శ్రీవాణి తన అక్క ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆమెను చూసేందుకు సిద్దిపేట వెళ్లింది. ఇంటివద్ద వెంకటస్వామి, అతడి కుమారుడు రాహుల్ ఉన్నారు. రోజూ మాదిరిగానే సోమవారం రాత్రి భోజనం చేసి నిద్రించారు. మంగళవారం ఉదయం రాహుల్ నిద్రలేచి చూసేసరికి బెడ్రూమ్లో తండ్రి వెంకటస్వామి ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించాడు. దీంతో భయాందోళనకు గురైన రాహుల్.. తన బాబాయ్ కుమారస్వామికి సమాచారం అందించాడు. చుట్టపక్కల వారి సాయంతో వెంకటస్వామిని కిందికి దించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య వాణిశ్రీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.వేణు తెలిపారు. బండారుపల్లిలో కడుపునొప్పి భరించలేక విద్యార్థిని.. ములుగు రూరల్ : కడుపు నొప్పి భరించలేక ఓ విద్యార్థిని ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ములుగు మున్సిపాలిటీ పరిధి బండారుపల్లి చోటు చేసుకుంది. ఎస్సై చంద్రశేఖర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బస్వోజు రజిత, భద్రయ్య దంపతుల కూతురు అక్షయ (17) ఇంటర్మీడియెట్ చదువుతోంది. ఈ నెల 22వ తేదీన కడుపు నొప్పి భరించలేక ఎలుకల మందుతాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబీకులు వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి తల్లి రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మూడిళ్లలో చోరీ.. ● బంగారం, నగదు, బైక్ అపహరణ ● పోలీసులకు బాధితుల ఫిర్యాదు హసన్పర్తి : హసన్పర్తి పోలీస్స్టేషన్పరిధిలోని మూడు గ్రామాల్లో మూడిళ్లల్లో చోరీ జరిగింది.ఈ మేరకు బాధితులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మండలంలోని మడిపల్లికి చెందిన కాసబోయిన సురేశ్ కుటుంబసభ్యులతో కలిసి సోమవారం ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల గ్రామానికి వెళ్లాడు. మంగళవారం ఇంటికి రాగా తలుపు ధ్వంసం చేసి బీరువాలో భద్రపరిచిన సుమారు 12 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. అలాగే, అన్నాసాగరం గ్రామానికి చెందిన సుధాకర్ ఇంట్లో దొంగలు చొరబడి సుమారు రూ.25వేలు చోరీ చేశారు. దేవన్నపేటకు చెందిన కందకట్ల శంకర్ ఇంటి ఆవరణలో పార్క్ చేసిన బైక్ అపహరించారు. ఈమేరకు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిపుణులు వేలిముద్రల ఆధారాలు సేకరించారు. -
నాణ్యమైన విద్యనందించాలి
● కేయూ ఓఎస్డీ వెంకట్రాంరెడ్డి కేయూ క్యాంపస్: విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని కాకతీయ యూనివర్సిటీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) ప్రొఫెసర్ బి. వెంకట్రాంరెడ్డి అధ్యాపకులను కోరారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఎస్. జ్యోతి, వివిధ విభాగాల అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధ్యాపకులు పరిశోధనరంగంలోనూ చురుగ్గా వ్యవహరించాలన్నారు. కళాశాలలో ముఖ గుర్తింపు హాజరు తప్పనిసరి చేశారని, డిగ్రీ బోధన చేపట్టే అధ్యాపకులు ఉదయం 9: 30 గంటల వరకు, పీజీ కోర్సుల బోధన చేపట్టే అధ్యాపకులు ఉదయం 10 గంటల వరకు హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అనంతరం ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి మాట్లాడుతూ తమ కళాశాల శత వసంతాల విజయోత్సవానికి అందరూ సహకరించాలన్నారు. సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, ఆర్ట్స్ కళాశాల ఫ్యాకల్టీ క్లబ్ చైర్మన్ భిక్షపతి,కోచైర్మన్లు ఫిరోజ్, కనకయ్య, ఆర్. ఆదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
హ్యాండ్లూమ్ కోర్సులో విద్యార్థులకు అవకాశం
● టెస్కో ఓఎస్డీ హిమజకుమార్ కాశిబుగ్గ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాల అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని టెస్కో ఓఎస్డీ హిమజకుమార్ అన్నారు. మంగళవారం వరంగల్ కొత్తవాడలోని పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ భవనంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఐఐహెచ్టీ కళాశాలలో మూడేళ్ల కోర్సు అడ్మిషన్ల కోసం అవగాహన సదస్సు నిర్వహించారు. చేనేత జౌళిశాఖ సంచాలకుడు శ్రీకాంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. కళాశాలలో అడ్మిషన్లు తీసుకునే విద్యార్థులు పదో తరగతి లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఎంపికై న విద్యార్థులకు మూడేళ్లలో ఆరు సెమిస్టర్లు ఉంటాయని, ప్రతీ విద్యార్థికి ప్రభుత్వం తరఫున రూ.2,500 స్టైఫండ్ ఇస్తారని పేర్కొన్నారు. ప్రతీ విద్యార్థి సంవత్సరానికి రూ.4,050 ఫీజు చెల్లించాలని, నాంపల్లి సమీపంలోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం క్యాంపస్లో వసతి సదుపాయాలు కల్పిస్తారని వివరించారు. సదస్సులో చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు, డివిజనల్ మార్కెటింగ్ ఆఫీసర్ బొట్టు వెంకటేశ్వర్లు, డెవలప్మెంట్ ఆఫీసర్ సోమ సుధీర్, యెలగం చిన్న కొమురయ్య, పంతగాని శ్రీనివాస్, యెలగం రవిరాజ్, కొలిపాక మదనయ్య, చిన్న భద్రయ్య, రాజేందర్, అడిగొప్పుల సంపత్, యెలగం సాంబయ్య, కూరపాటి సంపత్, కుమారస్వామి, శంకరలింగం, తదితరులు పాల్గొన్నారు. -
ఇటుకలు పేర్చారు.. రక్షణ మరిచారు!
కాజీపేట: కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారు. ఇటీవల కారు ఢీకొట్టడంతో సైడ్ వాల్ కూలిపోయింది. ఆస్థానంలో ఇటుకలు పేర్చి వదిలేశారు. ప్లాస్టరింగ్ చేయకపోవడంతో గట్టిగా గాలి వచ్చినా కూలిపోయే ప్రమాదం ఉంది. బ్రిడ్జికి ఇరువైపులా గోడలు బీటలు వారి ఎప్పుడు కూలిపోతాయా అన్నట్లుగా ఉన్నాయి. బ్రిడ్జి పక్కనే ఉన్న వెంకటాద్రినగర్ కాలనీవాసులు గోడలు ఎప్పుడు కూలి మీద పడ్తాయేననే భయంతో వణుకుతున్నారు. బ్రిడ్జి గోడలపై మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. ఇటీవల బ్రిడ్జి మరమ్మతుకు రూ.68 లక్షలు మంజూరైనట్లుగా ప్రకటించిన అధికారులు శాశ్వత పనులు చేపట్టకపోవడం చర్చనీయంశంగా మారింది. -
రైతు బాగుంటేనే అన్ని వర్గాలకు మేలు
తొర్రూరు రూరల్: పంటల దిగుబడి అధికంగా వచ్చి రైతులు బాగుంటేనే అన్ని వర్గాలకు మేలు కలుగుతుందని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అరిపిరాలలో ఆయిల్ పామ్ నర్సరీ ఆవరణలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝూన్సీరెడ్డితో కలిసి జంగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి పంటలు సాగు చేసినా గాలి, వాన, అనేక వ్యాధులు, కోతుల బెడదతో నాశనమవుతున్నాయన్నారు. అందుకే ఎలాంటి నష్టం లేకుండా తక్కువ పెట్టుబడితో నెలకు రెండు సార్లు ఆదాయం వచ్చే ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలన్నారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. త్వరలో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝూన్సీరెడ్డి సహకారంతో ఆయిల్పామ్ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ హనుమాండ్ల తిరుపతిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ తూ నం శ్రావణ్కుమార్, సర్పంచులు చెంచర్ల స్వాతి, ధారావత్ విజయ, ఆయిల్ ఫెడ్ అధికారులు యా స్మిన్ బాషా, దయాకర్, ప్రవీణ్రెడ్డి, మరియన్న, శ్రీనివాస్రావు, తదితరులు పాల్గొన్నారు. ఆయిల్ పామ్ సాగుతో నెలకు రెండుసార్లు ఆదాయం రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి -
దివ్యాంగుల సంక్షేమానికి సీఎం కృషి
● రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య హన్మకొండ అర్బన్: దివ్యాంగుల సంక్షేమానికి సీఎం రేవంత్రెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్లో మహిళా అభివృద్ధి, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాలకు చెందిన 94 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, మోటారు సైకిళ్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్లు, ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ.. దివ్యాంగులకు ఇంత విస్తృత స్థాయిలో ఉపకరణాల పంపిణీ రాష్ట్ర చరిత్రలో మొదటిసారి అని పేర్కొన్నారు. దివ్యాంగులకు ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు, విద్య, వైద్య రంగాల్లో ప్రత్యేక రాయితీలు, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రాధాన్యం, వివాహాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. దివ్యాంగులకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్కుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
కూరగాయల సాగుకు ప్రోత్సాహం
హన్మకొండ: కూరగాయల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ దిశగా రాయితీపై కూరగాయల నారుతో పాటు విత్తానాలు రాయితీపై అందిస్తోంది. దీంతో పాటు రైతులను మరింతగా ప్రోత్సహించేందుకు ప్రతీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుంచి ఒక్కో కూరగాయల పంట సాగు చేసే రైతును ఎంపిక చేసింది. వీరికి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో రెండు దఫాలుగా శిక్షణ ఇచ్చింది. డిమాండ్ మేరకు కూరగాయల ఉత్పత్తి, సరఫరా చేసేలా ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా రైతులను ప్రోత్సహిస్తోంది. కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచే దిశగా రైతులను కూరగాయల సాగు వైపు మళ్లించేందుకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుంచి ఒక్కో రైతును ఎంపిక చేశారు. హనుమకొండ జిల్లాలో 14 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి 14 మంది రైతులు, వరంగల్ జిల్లాలో 28 ప్రాథమిక సహకార సంఘాల నుంచి 28 మంది రైతులను ఎంపిక చేశారు. వీరికి రాష్ట్రంలో ఒక సారి, జిల్లాలో ఒక సారి శిక్షణ ఇచ్చారు. వీరు ఇతర రైతులను కూరగాయల సాగు వైపు దృష్టి సారించేలా ప్రోత్సహించనున్నారు. కలుపు సమస్యను అధిగమించేందుకు.. కలుపు సమస్యను అధిగమించడానికి, ఎరువుల యాజమాన్యం, తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడి సాధించడానికి మల్చింగ్ పద్ధతి ఉపయోగపడుతుంది. ఈ పద్ధతిలో సాగు ఎకరాకు రూ.8 వేల చొప్పున 5 ఎకరాల వరకు రాయితీ అందిస్తోంది. అంతేకాకుండా కూరగాయల (వంగ) సాగు వైపు రైతులను ప్రోత్సహిస్తోంది. భూమి నుంచి సంక్రమించే వివిధ రకాల తెగుళ్లను, చౌడు నేలలను తట్టుకునేలా.. అధిక దిగుబడి, ఎక్కువ కాలం దిగుబడి ఇచ్చేలా వంగలో అంటు మొక్కలను సరఫరా చేస్తోంది. దీనికి ప్రభుత్వం ఎకరానికి రూ.30 వేల రాయితీ ఇస్తోంది. ట్రెల్లిసింగ్ విధానంలో టమాట, ఇతర కూరగాయల పంటల సాగు చేసేందుకు ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేల రాయితీ అందిస్తున్నారు. సూక్ష్య సేద్యం, బిందు సేద్యానికి బీసీ, సన్నకారు, చిన్నకారు రైతులకు 80 శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం, ఇతరులకు 70 శాతం రాయితీని, తుంపర్ల సేద్యానికి అన్ని కేటగిరీల రైతులకు 65 శాతం రాయితీపై పరికారులు అందిస్తున్నారు. అధికారులను సంప్రదించాలి రాష్ట్ర ప్రభుత్వం కూరగాయల సాగుకు అందిస్తున్న రాయితీని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. సాగు విస్తీర్ణాన్ని పెంచాలి. డిమాండ్ ఉన్న, కూరగాయల సాగు లాభదాయకం. నారు, ఇతర పద్ధతుల్లో సాగుకు రాయితీ పొందేందుకు అందుబాటులో ఉన్న ఉద్యాన అధికారులను సంప్రదించాలి. – శ్రీనివాస్రావు, వరంగల్ జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అఽధికారి వందశాతం రాయితీపై నారు ఒక్కో రైతుకు 5 ఎకరాల పరిమితి ప్రతీ పీఏసీఎస్ నుంచి వలంటీర్గా రైతు ఎంపిక రెండు దఫాలుగా శిక్షణ పూర్తిరాయితీ ఇలా.. కూరగాయల పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీ ద్వారా నారు, విత్తనాలు సరఫరా చేస్తోంది. ఒక్కో రైతుకు 5 ఎకరాల వరకు వంద శాతం రాయితీపై నారు సరఫరా చేస్తోంది. 5 ఎకరాల వరకు కూరగాయల పంటల సాగుకు విత్తనాలకు రూ.9,600 రాయితీ అందిస్తోంది. వంద శాతం రాయితీపై టమాట, వంగ, పచ్చి మిరప, క్యాబేజీ, క్యాలీఫవర్ నారును సరఫరా చేస్తోంది. సిద్దిపేట జిల్లా ములుగు సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో రైతు సూచించిన రకం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దీనికి గాను రైతులు 30 రోజుల ముందుగా విత్తన రకం, పట్టాదారు పాస్ బుక్, ఆధార్, బ్యాంక్ ఖాతా పాస్ బుక్ జిరాక్స్ ప్రతులను జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ కార్యాలయంలో అందించాల్సి ఉంటుంది. శాశ్వత పందిర్ల నిర్మాణం, కూరగాయల సాగుకు సైతం ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. అర ఎకరానికి రూ.50 వేల చొప్పున రెండున్నర ఎకరాలకు వరకు రాయితీ ఇవ్వనుంది. -
సీకేఎం ఆస్పత్రికి ఆర్ఎంఓ కావలెను..!
కాశిబుగ్గ: వరంగల్ సీకేఎం ఆస్పత్రికి రెగ్యులర్ ఆర్ఎంఓ లేకపోవడంతో సేవలపై స్తబ్ధత నెలకొంది. ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన డాక్టర్ మురళీని కలెక్టర్ ఆదేశాల మేరకు పిడియాట్రిక్ విభాగానికి పంపించారు. దీంతో నెలరోజులపైనుంచి రెగ్యులర్ ఆర్ఎంఓగా ఎవరు విధులు నిర్వహిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆస్పత్రిలో పలు విభాగాలను చూడటానికి ఆరుగురు ఇన్చార్జ్ ఆర్ఎంఓలకు బాధ్యతలు అప్పజెప్పారు. వీరిలో ముగ్గురు సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ ఉర్సు ఆస్పత్రి నుంచి వచ్చి డిప్యుటేషన్పై విధులు నిర్వహిస్తున్నారు. మరో ముగ్గురు సీకేఎంకు చెందిన వైద్యులు కూడా సివిల్ అసిస్టెంట్ సర్జన్లు కావడంతో ఆర్ఎంఓగా విధులు నిర్వహించడానికి వీలులేదు. ఆర్ఎంఓగా బాధ్యతలు చేపట్టడానికి తప్పనిసరిగా డిప్యూటీ సివిల్ సర్జన్ అయి ఉండాలి. ప్రస్తుతం ఇన్చార్జి ఆర్ఎంఓలతోనే నెట్టుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో రెగ్యులర్ ఆర్ఎంఓ పోస్టు భర్తీ అయితే అడ్మినిస్ట్రేషన్తో పాటు పేషంట్లకు సేవలు మెరుగయ్యే అవకాశం ఉంది. కాంటాలైన వడ్లు.. కారుమబ్బుల గుబులుదేవరుప్పుల: మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా గిట్టుబాట ధర కోసం నీరిక్షిస్తున్న అన్నదాతలకు అకాల వర్షం ముంచుకొస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెంలో మంగళవారం సాయంత్రం కారుమబ్బులను చూసి అప్రమత్తమవుతున్న రైతులకు క్షణాల్లోనే వర్షపు జల్లులు పడడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా పెట్టి నాలుగైదు రోజులైనప్పటికీ రైస్ మిల్లర్లు లారీలు పంపకపోవడంతో ఇటు నిర్వహకులు, రైతులు అయోమయంలో పడ్డారు. ఇదే అదనుగా వర్షం పడడంతో ధాన్యం భద్రపర్చేందుకు తగిన తాటిపత్రులు లేకపోవడంతో కొంత మంది రైతుల కల్లాలు తడిసిపోయాయి. మరికొంత మంది రైతులు కాంటా పెట్టిన ధాన్యం భద్రత కోసం నానా తంటాలు పడ్డారు. ఏదిఏమైనా ప్రభుత్వం యంత్రాంగం యుద్ధప్రాతిపదికన కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కాంటా పెట్టి తరలించకపోతే అకాల వర్షాలు వస్తే రైతులకు తీరని నష్టం వాటిల్లే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వందేమాతరం.. సమర నినాదం కేయూ క్యాంపస్ : వందేమాతర గేయం.. ఒక నినాదం మాత్రమే కాదని సమర రణనినాదమని ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వీరేంద్రసింగ్సోలంకి పేర్కొన్నారు. జాతీయ గేయం వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వందేమాతరం ఉత్సవ సమితి, ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం కాకతీయ యూనివర్సిటీలోని సెనేట్ హాల్లో విద్యార్థులతో కలిసి సామూహికంగా పూర్తి వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశం స్వాతంత్య్రం సాధించేందుకు బ్రిటిష్లకు వ్యతిరేకంగా వందేమాతరం స్ఫూర్తితో నాడు ప్రజలు పోరాటం చేశారన్నారు. వందేమాతరం కేవలం ఒక నినాదం కాదు అని.. దేశ ప్రజలను ఏకీకృతంచేసిన గేయం అని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ విభజనకు ఇప్పటికి విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నిస్తూనే ఉంటున్నారని అలాంటి శక్తులకు వ్యతిరేకంగా వందేమాతరం స్ఫూర్తితో ఐక్యంగా యువత ముందుకెళ్లాలని అలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేశాభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని వికసిత్ భారత్ లక్ష్యసాధనలో యువ త భాగస్వాములు కావాలన్నారు. ఈ సమావేశంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు, యూనివర్సిటీ కార్యదర్శి జ్ఞానేశ్వర్, బాఽ ద్యులు ప్రశాంత్, సతీష్, సాయి పాల్గొన్నారు. మహిళను ఢీ కొట్టిన బైక్ ఐనవోలు: బైక్ అదుపు తప్పి ఓ మహిళను కొట్టింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలై విషమంగా మారిన సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఐనవోలు మండల కేంద్రానికి చెందిన గడ్డం భాగ్యమ్మ ఆలయం వైపు వెళ్తోంది. ఈ క్రమంలో పెరుమాండ్లగూడెంకు చెందిన మధు అతి వేగంగా బైక్పై వస్తు అదుపు తప్పి రోడ్డు పక్కన వెళ్తున్న భాగ్యమ్మను వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. స్థానికులు, కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించగా భాగ్యమ్మను వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతుంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. -
భద్రకాళి అమ్మవారికి వసంతోత్సవం
హన్మకొండ కల్చరల్ : భద్రకాళి దేవాలయంలో భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు నిత్యాహ్నికం, చతుస్థానార్చన, వసంతోత్సవం నిర్వహించారు. ఉదయం అమ్మవారి ఉత్సవమూర్తికి విమానకసేవ (సర్వభూపాల సేవ), సాయంత్రం చతురన్తసేవ నిర్వహించారు. పూజా కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం, సాయంత్రం పూజలకు రజక సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు ఉభయదాతలుగా వ్యవహరించారు. మహిళలు అమ్మవారి శ్రీచక్రానికి కుంకుమపూజ చేశారు. రాత్రి ఎమ్మెల్సీ తీన్నార్ మల్లన్న, మమత దంపతులు దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. -
దివ్యాంగ సారథి
కాజీపేట : ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగులకు అందజేస్తున్న పథకాలు, సంక్షేమాల సమాచారం తెలియకపోవడంతో చాలా మంది అవకాశాలను వినియోగించుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దివ్యాంగ సారథి పేరిట ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్లో దివ్యాంగులకు సంబంధించిన అన్ని అంశాలను తెలుసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ పథకాలే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన అన్ని అంశాలను తెలుసుకోవచ్చు. కేంద్ర న్యాయ సామాజిక శాఖ మంత్రి అధికారికంగా ప్రారంభించారు. దీనిలో ఒక్క దివ్యాంగులే కాకుండా యాసిడ్ దాడి బాధితులతో పాటు పలు రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి అందించే సాయంపై సమాచారం కూడా అందుబాటులోకి తెచ్చింది. జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ దివ్యాంగ్ సారథి యాప్పై అవగాహన కల్పిస్తున్నాయి. స్మార్ట్ఫోన్ ఉంటే గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని విలువైన సమాచారాన్ని పొందవచ్చు. ప్లేస్టోర్లో దివ్యాంగ సారథి అని టైప్ చేస్తే యాప్ డౌన్లోడ్ అవుతుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఇంగ్లిషు, హిందీలో సమాచారం అందుబాటులో ఉంది. ఎవరిని ఎలా సంప్రదించాలో ఫోన్ నంబర్లు ఈ యాప్లో ఉంచారు. దివ్యాంగుల హక్కులు, పథకాలపై ప్రత్యేక యాప్ ఇంటి నుంచే కృత్రిమ అవయవాల సమాచారం ఉన్నత చదువులు, ఉద్యోగావకాశాలపై క్షణాల్లో సమాచారం ఏఏ అంశాలు తెలుసుకోవచ్చంటే.. దివ్యాంగులకు రవాణా, ఇతర సౌకర్యాల్లో రాయితీలు, దీన్దయాళ్ రిహాబిటేషన్ స్కీమ్ విద్యార్థులకు ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాల కోసం ఉచిత శిక్షణ, ఉపాధి శిక్షణ కార్యక్రమాలపై సమాచారం. జాతీయ ఉపకార వేతనాలు, ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్లు, విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి సాయం, ఉన్నత చదువుల కోసం అత్యున్నత ప్రమాణాల్లో విద్య అందించే పథకాల గురించి ఈ యాప్లో వివరాలను అందుబాటులో ఉంచారు. ఆయా పథకాలకు అర్హతల వివరాలు దరఖాస్తు విధానాలు పొందుపర్చారు. భారత కృత్రిమ అవయవాల తయారీ సంస్థ వివరాలు తెలుసుకోవచ్చు. అవయవాలు కావాల్సిన వారు వాటి కోసం ఏం చేయాలి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలు ఉంటాయి. దివ్యాంగులకు ఉద్దేశించిన ప్రత్యేక సంస్థల సమాచారం అభిస్తుంది. -
అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి
వరంగల్ స్పోర్ట్స్: తెలంగాణ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్ర కీర్తి ప్రతిష్ట ప్రపంచ నలుమూలల చాటాలని ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి అన్నారు. హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మూడు రోజుల పాటు జరగనున్న 41వ సౌత్జోన్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్ మెన్ అండ్ ఉమెన్ పోటీలను మంగళవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. అనంతరం విశిష్ట అతిథి, హ్యాండ్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కా ర్యదర్శి డాక్టర్ ప్రీతిపాల్ సింగ్ శాలుజా మాట్లాడు తూ తెలంగాణలో క్రీడాకారులకు ఆతిథ్యం, ఏర్పా ట్లు బాగున్నాయన్నారు. ఇక్కడ ప్రతిభకు కొదవ లేదని, ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహించడం వల్ల ప్రతిభ గల క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం అందుతుందన్నారు. తెలంగాణ హ్యాండ్బాల్ అసో సియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్కుమార్ మాట్లాడుతూ సౌత్ జోన్ పరిధిలోని తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళం, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి మెన్ అండ్ ఉమెన్ జట్లు హాజరయ్యాయని తెలిపారు. హనుమకొండ డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బైరబోయిన కై లాస్యాదవ్, హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సాంబశివరావు, దుబాకి సంతోష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి సౌత్జోన్ హ్యాండ్ పోటీలు షురూ -
గోదాంలో నిల్వ ఉన్న బాటిళ్లు ఎక్కడివి?
● గుట్టుచప్పుడు కాకుండా నీరు పారబోత ఏటూరునాగారం : ఏటూరునాగారం మండల కేంద్రంలోని డీఆర్ఎస్ గోదాం వద్ద భారీగా నిల్వ ఉన్న గడువు ముగిసిన మినరల్ వాటర్ బాటిళ్లు మంగళవారం బయటపడ్డాయి. సుమారు 300 కాటన్లకు పైగా ఉన్న ఓ కంపెనీకి చెందిన బాటిళ్లను కొంత మంది వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా ఖాళీ చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. అధికారుల పర్యవేక్షణ లేకుండా సాగుతున్న ఈ వ్యవహారంపై కొందరు విలేకరులు అక్కడికి చేరుకోగానే బాటిళ్లను ఖాళీ చేస్తున్న వ్యక్తులు జారుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మేడారం జాతర కోసం భారీ స్థాయిలో వాటర్ బాటిళ్ల తెప్పించినట్లు సమాచారం. అయితే జాతర సమయంలో భక్తులకు వీటిని పంపిణీ చేయకుండా గోదాముల్లోనే నిల్వ చేయడంతో కాలక్రమేణా గడువు ముగిసింది. ప్రభుత్వం ప్రజాధనంతో కొనుగోలు చేసిన వేలాది బాటిళ్లు వృథా కావడం.. ఇప్పుడు వాటిని రహస్యంగా పారబోయడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ అంశంపై గోదాం ఇన్చార్జ్ సహా సంబంధిత అధికారులను వివరణ కోరేందుకు యత్నించగా ఎవరూ కూడా అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. నిబంధనలు గాలికి.. నిబంధనల ప్రకారం గడువు ముగిసిన వస్తువులను డిస్పోజ్ చేయాలంటే ముందుగా స్టాక్ వెరిఫికేషన్ నిర్వహించాలి. అనంతరం ఉన్నతాధికారుల నుంచి లిఖిత పూర్వకంగా అనుమతి పొందాలి. మొత్తం ప్రక్రియ అధికారుల పర్యవేక్షణలో పంచనామా నిర్వహించి ప్లాస్టిక్ బాటిళ్లను రిసైక్లింగ్ కేంద్రాలకు తరలించాల్సి ఉంది. కానీ ఇక్కడ ఆ నిబంధనలేమీ అమలు చేయకుండానే నీటిని పారబోసి చేతులు దులుపుకునే ఆలోచనలో ఉన్నారు. ఈ దుర్వినియోగానికి కారణమైన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
తల్లిదండ్రుల క్షణికావేశం.. తర్వాత తనువు చాలించిన సంఘటనలు
బుధవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026నాన్నా.. చాక్లెట్లు కొనిస్తానన్నావు.. ఊరంతా తిప్పి ఊరవతలికి తీసుకువచ్చావు ఎందుకు నాన్నా.. చెట్టుకిందికి తీసుకువచ్చి తాడు తీస్తుంటే ఏదో ఊయల కడుతున్నావు అనుకున్నాం. నాకు, తమ్ముడి మెడకు చుట్టావు. ఏదో ఆట అనుకున్నాం. కొమ్మపైనుంచి తీసి లాగుతున్నావు. ఊపిరి ఆడట్లేదు నాన్న. ఇంకోసారి చాక్లెట్లు అడగము. గొంతు బిగుసుకుపోతోంది. తాడు తీయ్ నాన్నా.. నేను తమ్ముడు బాధ భరించలేకపోతున్నాం. మమ్ముల్ని కిందికి దింపు నాన్నా.. అమ్మకు, నీకు మధ్య మేము అడ్డుగా ఉన్నామా.. మీరిద్దరు పంచాయితీ పెట్టుకుంటే మాదా తప్పు. మేమేం చేశాం నేరం.. మీ పిల్లలుగా పుట్టడమా.. ’ అంటూ ఆ చిన్నారులు తమ ఆఖరి క్షణాల్లో తండ్రిని వేడుకున్నారేమో.. ఆ మాటలకు తండ్రి మనస్సు కరిగి కిందికి దించి ఉంటే రెండు ప్రాణాలు దక్కేవి. కానీ, పిల్లల రోదనలు వినే పరిస్థితిలో లేని తండ్రి.. ఇద్దరి ప్రాణాలు పోయేవరకు అక్కడే రాయిలా నిలబడి చూశాడు. విగతజీవులయ్యారని నిర్ధారించుకున్నాక సమాజం తనను ఛీ కొడుతుందని భావించి అదే చెట్టుకు ఉరివేసుకున్నాడు. – సాక్షి, మహబూబాబాద్/తొర్రూరు కిన్నెర గుంశావలి (ఫైల్)బిడ్డలకోసం నూటొక్క ముడుపులు కట్టి.. కోటొక్కా.. పూజలు చేసిన వారు ఉన్నారు.. ఇది సమాజంలో ఒకవైపు ఉంటే.. భార్యాభర్తల తగాదాలు, వివాహేతర సంబంధాలు, క్షణికావేశాలతో కన్నబిడ్డలను కర్కశంగా చంపిన ఘటనలు మరోవైపు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో సోమవారం జరగగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. అభం శుభం తెలియని ఆ పసికూనలను ఓ తండ్రి చంపి తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. కింద పడితేనే తండ్రి గుండె పగిలినంత బాధ ఉంటుందంటారు.. కానీ, పిల్లలకు ఉరివేసి వారి ప్రాణం పోయేదాక చూసిన అతను ఎంత కర్కోటకుడోనని, అతనికి మనస్సెట్టా వచ్చిందని.. ఆ బిడ్డలు ఎంత తల్లడిల్లిపోయారో అంటూ ఈ ఘ టన చూసిన, విన్న స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పిల్లలను తన దగ్గరికి రానివ్వడం లేదన్న అక్కసుతో.. తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంశావలి (29), అదే గ్రామానికి చెందిన కిన్నెర కాంతను 11 ఏళ్ల క్రితం వివాహమాడాడు. వారికి కూతురు విన్య, కుమారులు విలాస్ (5), వికేష్ (3) ఉన్నారు. గుంశావలి తొర్రూరులోని ఓ బైక్ మెకానిక్ షాప్లో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసైన గుంశావళి రోజూ తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. ఈ బాధలు భరించలేక కాంత పది రోజుల క్రితం అదే గ్రామంలోని నానమ్మ సీతమ్మ ఇంటికి పిల్లలను తీసుకొని వెళ్లింది. గుంశావలి.. పది రోజులుగా పిల్లల కోసం వెళ్తే ఆమె పంపించడం లేదు. దీంతో భార్యపై కోపం పెంచుకున్నాడు. తనకు దక్కని పిల్లలు భార్య వద్ద కూడా ఉండొద్దని కక్ష గట్టాడు. కాంత సోమవారం రోజువారీగా కూలి పనికి వెళ్లగా ఇద్దరు కుమారులు ఇంటి వద్దనే ఉన్నారు. కూతురు ఆడుకోవడానికి మరోచోటికి వెళ్లింది. సమయం చూసి వచ్చిన గుంశావలి పిల్లలకు చాక్లెట్లు కొనిస్తానని ఆశ చూపగా మానాన్న కొనిస్తాడు అంటూ హుషారుగా తండ్రి బైక్పై ఎక్కారు. గుంశావలి తొర్రూరుకు వచ్చి ఓ దుకాణంలో తాళ్లు కొనుగోలు చేశాడు. పిల్లలు నాన్నా చాక్లెట్లు ఏవీ అంటే కొనిస్తానని నమ్మబలికాడు. సాయంత్రం వరకు అటు ఇటు బైక్పై తిప్పాడు. పిల్లలు కూడా సరదాగా ఉందనుకున్నారు. సాయంత్రం తొర్రూరు మార్కెట్ సమీపంలో చెట్టుకు మొదట ఇద్దరు పిల్లలకు ఉరివేసి తరువాత తనూ ఉరేసుకున్నాడు. విలాస్ (ఫైల్)వికేష్ (ఫైల్)● 2024 మార్చి 22వ తేదీన నెల్లికుదరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో కుమారుడు, కుమార్తెను బావిలో తోసేసి తల్లి కూడా బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో తల్లీకూతురు మరణించగా.. బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ● కేసముద్రం మండలంలోని ఓ గ్రామంలో గత ఏడాది తల్లి ఇద్దరు కుమారులను చంపాలని భావించింది. మొదటి ప్రయత్నంలో కుమారుడిని నీటి సంపులో వేసి హత్య చేసింది. రెండో కుమారుడిని బ్లేడ్తో గొంతుకోసి కర్కశంగా చంపేసింది. తర్వాత అసలు విషయం బయటకు రావడంతో తల్లిపై హత్య నేరం కింద జైలుకు పంపించారు. ● డోర్నకరల్ మండలంలో ఓ గ్రామంలో గత ఏడాది తల్లి పాలల్లో విషయం కలిపి ఐదు సంవత్సరాల కుమార్తెను చంపేసింది. ఈ ఘటనలో పోలీసులు విచారణచేసి బాలిక మృతికి కారణం తెలుసుకొని తల్లిపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ● గార్ల మండలంలోని ఓ గ్రామంలో రెండేళ్ల క్రితం భార్యాభర్తలు జల్సాలకు అలవాటు పడి... తమ సంతోషానికి అడ్డు వస్తున్నారని చిన్నారులను పాలలో విషం కలిపి చంపేశారు. చనిపోయిన పిల్లలను ఇంట్లోనే విడిచిపెట్టి పోయారు. ఈ కేసుపై పోలీసులు ఆరా తీయగా 20రోజుల తర్వాత బయ్యారం మండలంలోని నామాలపాడు అడవిలో తల్లిదండ్రులు చెట్టుకు ఉరివేసుకొని చనిపోయి అస్తిపంజరంగా మారిన సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. నిలువ నీడలేదు.. బిడ్డలను ఉంచే చోటులేదు! కంటి పాపలు లేరనే ఆవేదనతో తల్లి తల్లడిల్లింది. కనీసం పిల్లలు, భర్త మృతదేహాలను ఉంచేందుకు గ్రామంలో వారికి ఇల్లు లేదు.. స్థలం లేదు. కిన్నెర గుంశావళి(29), కిన్నెర కాంత దంపతులు వారి వివాహం జరిగిన నాటి నుంచి గ్రామంలో ఖాళీగా ఉన్న ఇళ్లల్లో తలదాచుకుంటున్నారు. కాగా,మృతదేహాలను ఉంచేందుకు సొంత స్థలం లేకపోవడంతో ఓ చోట ఖాళీ జాగాలో తాత్కాలికంగా టెంటు వేసుకుని తల్లి రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. పనికి వెళ్లిన భార్య కాంత సాయంత్రం ఇంటికి వచ్చి తమ్ముళ్లు ఎక్కడికి వెళ్లారని కుమార్తె విన్యను అడగగా నాన్న తీసుకువెళ్లాడని బదులిచ్చింది. ఆందోళన చెందిన కాంత స్థానికుల సహాయంతో ఆటో తీసుకొని బావులు, చెరువులు, సమీప ప్రాంతాల్లో గాలించగా ఆచూకీ తెలియరాలేదు. మంగళవారం ఉదయం తొర్రూరులో పిల్లలు చంపిన ఘటన వెలుగులోకి రావడం.. పోలీసులు వివరాలు సేకరించి తల్లికి సమాచారం అందించారు. ఈ దృశ్యం చూసిన స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై భార్య కాంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు. చాక్లెట్లు కొనిస్తానని చెప్పి మెడకు తాళ్లు బిగించావు.. ఎప్పుడూ చాక్లెట్లు అడగము.. నొప్పిగా ఉంది.. తాడు విప్పి దించు నాన్నా.. అయినా నీ మనస్సు కరగలేదా..తొర్రూరులో ఇద్దరు కొడుకులకు మరణశాసనం రాసి తనూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి కుటుంబ కలహాలకు పిల్లలు బలి గుండెలవిసేలా రోదించిన తల్లి, బంధువులు -
గౌతమి ఎక్స్ప్రెస్లో 30 తులాల బంగారం చోరీ
● ఆలస్యంగా వెలుగుచూసిన ఘటనకాజీపేట రూరల్ : గౌతమి ఎక్స్ప్రెస్లో ఓ మహిళ ప్రయాణికురాలికి చెందిన 30 తులాల బంగారం చోరీ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కాజీపేట జీఆర్పీ సీఐ వి.నరేశ్కుమార్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 16న తేదీన గౌతమి ఎక్స్ప్రెస్ ఎస్–3 కోచ్లో బెర్త్ నంబర్ 79లో కుడిపుడి సుష్మ రాజమండ్రికి వెళ్తుంది. మార్గమధ్యలో రైలు కాజీపేట జంక్షన్కు చేరుకునే సమయంలో సుష్మ బ్యాగులోని 30 తులాల బంగారాన్ని అదే రైలులో ప్రయాణిస్తున్న నిందితుడు చోరీ చేసి పరారయ్యాడు. తెల్లవారుజామున తన బ్యాగు కనిపించకపోవడంతో సుష్మ లబోదిబోమంటూ డయల్ 100కు కాల్ చేసింది. రాజమండ్రికి వెళ్లాక అక్కడి జీఆర్పీ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అక్కడి వారు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కాజీపేట జీఆర్పీ పోలీస్స్టేషన్కు మార్చి 7వ తేదీన బదిలీ చేశారు. నిందితుడు బంగారం చోరీ చేసిన అనంతరం ఖాళీ బ్యాగును, అతడి వెంట ఉన్న బ్యాగును కాజీపేట సమీపం బోడగుట్ట రైల్వే ట్రాక్ వద్ద విడిచి వెళ్లాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా, బ్యాగులో లభించిన రెలు టికెట్ ఆధారంగా అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు. కాజీపేట జీఆర్పీలో కేసు నమోదు చేసి ప్రత్యేక పోలీస్ టీమ్ను నియమించి నిందితుడి ఆచూకీ కోసం అన్ని కోణాల్లో గాలిస్తున్నట్లు, నిందితుడి వివరాలు తెలిసిన వారు 8712658578 నంబర్కు సమాచారం ఇవ్వాలని జీఆర్పీ సీఐ తెలిపారు. ఉపాధి కూలీలపై ‘తేనె టీగల’ దాడి ● ఐదుగురికి గాయాలు ● ఆస్పత్రికి తరలింపు ● ఒకరి పరిస్థితి విషమం హసన్పర్తి: హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం గంటూరుపల్లి గ్రామంలో ఉపాధి కూలీలపై తేనె టీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఐదుగురు కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రులకు 108 అంబులెన్స్ సిబ్బంది ప్రథమ చికిత్స చేసిన అనంతరం ఎంజీఎం తరలించారు. అక్కడి నుంచి నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. వివరాలు ఇలా ఉన్నాయి. 40 మంది కూలీలు మంగళవారం గ్రామ శివారులోని ఉపాధి హామీ పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఉదయం 8గంటల ప్రాంతంలో ఒకే సారి తేనె టీగల దాడి చేశాయి. ఈ ఘటనలో మడిపల్లి లక్ష్మి, గంట మదన్మోహన్రెడ్డి, గంట సుమలత, గంట కరుణాకర్రెడ్డి, మాజీ సర్పంచ్ పెద్ది తిరుపతమ్మకు గాయాయలయ్యాయి. ఇందులో మడిపల్లి లక్ష్మి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని స్థానికంగా డిమాండ్ వ్యక్తమవుతోంది. -
భారత్లోనే గొప్ప సనాతన ధర్మం
● గుడిమెట్ మహాదేవ్ ధర్మ పీఠాధిపతి మహాదేవ్ స్వామిజీ పరకాల : ప్రపంచంలోనే అతిపెద్ద గొప్ప సనాతన ధర్మం భారతదేశంలోనే ఉందని.. అలాంటి దేశంలో హిందువుగా పుట్టినందుకు గర్వంగా భావిస్తు హిందువులంతా ఐక్యంగా దేశం కోసం పాటుపడాలని గుడిమెట్ మహాదేవ్ ధర్మ పీఠాధిపతి మహాదేవ్ స్వామిజీ పిలుపునిచ్చారు. పరకాల పట్టణంలోని పశువుల సంతా ఆవరణంలో హిందువుల ఐక్యతే.. జాతీయ సమైక్యత నినాదంతో హిందూ ధర్మ సమ్మేళన సభ నిర్వహించారు. ఈ సభకు హిందువులు వేలాదిగా తరలివచ్చారు. సాయంత్రం ప్రారంభమైన సభలో హిందూ ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సభకు ముఖ్యఅతిథాగా మహాదేవ్ స్వామిజీ హాజరు కాగా, ప్రత్యేక ఆహ్వానితులుగా స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి, ప్రధాన వక్తగా దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన మంత్రి విద్యాభారతి లింగం సుధాకర్రెడ్డి, విశ్వహిందూ పరిషత్ మాతృశక్తి జిల్లా సహ సయోగిక నీలం నిర్మల హాజరయ్యారు. అనంతరం మహాదేవ్ స్వామిజీ మాట్గాడారు. స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. హిందు ధర్మానికి సనాతన చరిత్ర కలదన్నారు. సమాజంలో వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకొని అంతిమంగా నిజాయితీతో, నిబద్ధతగా గొప్ప వ్యవస్థ అని అన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడు కొలుగూరి రాజేశ్వర్రావు, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ నాగబండి విద్యాసాగర్, ఉపాధ్యక్షుడు పాపిరెడ్డి, పల్నాటి సతీష్, మామిడి రమేష్, దుప్పటి సాంబశివుడు, పలువురు ప్రముఖులు, హిందువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాల్లో గిట్టుబాటు ధర
మహబూబాబాద్ రూరల్: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందని, కొనుగోలు కేంద్రాల్లో పంటలకు గిట్టుబాటు ధర లభిస్తుందని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని మాధవాపురం, పర్వతగిరి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మురళీనాయక్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు భరోసా, రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరతో పాటు బోనస్ కూడా ఇస్తుందన్నారు. రైతు సంక్షేమం కోసం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి ఆర్థికంగా లబ్ధి పొందాలని, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో సర్పంచులు వెంపటి రమేశ్, చల్ల అనితవెంకన్న, కాంగ్రెస్ నాయకులు మద్ది వెంకటరెడ్డి, బంటు అంజయ్య, గడిసందు అశోక్, రాంపల్లి నరేశ్, భరత్, పుల్క వెంకటాద్రి, మందుల శ్రీను, చిన్నం నాగన్న, రైతులు తదిత రులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మురళీనాయక్ -
ఇంధన ఇబ్బందులు..
రెండో రోజు పెట్రోల్, డీజిల్ కోసం వినియోగదారుల కష్టాలు వినియోగదారులను ఇంధన ఇబ్బందులు వెంటాడుతున్నాయి. రెండో రోజు మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలు బంక్ల్లో బారులు దీరారు. గంటల తరబడి నిరీక్షించి తమ వాహనాల్లో ఇంధన నింపుకున్నారు. అలాగే, పలువురు రైతులు క్యాన్లు క్యూలో పెట్టి పెట్రోలు, డీజిల్ పోయించుకున్నారు. కాగా, వినియోగదారులు తాకిడితో పలు బంక్ల్లో నోస్టాక్ బోర్డులు వెలిశాయి. పాలకుర్తి టౌన్: జనగామ జిల్లా బమ్మెరలో బంక్లో డీజిల్ కోసం క్యాన్లు క్యూలో పెట్టిన రైతులు, వినియోగదారులుజనగామ జిల్లా దేవరుప్పుల మండలం గొల్లపల్లి బంక్ వద్ద డీజిల్ కోసం క్యూ కట్టిన వాహనదారులు -
మార్కెట్లో మక్కల కొనుగోళ్లు బంద్
కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్లోని మార్క్ఫెడ్ మక్కల కొనుగోలు కేంద్రంలో మక్కలు పేరుకుపోవడంతో కొనుగోళ్లను బంద్ చేశారు. కాంటాలు పూర్తయినప్పటికీ డీజిల్ కొరతతో లారీలు రాకపోవడంతో ఎగుమతి చేయలేదు. దీంతో రైతులు రోజుల తరబడి పడిగాపులు పడాల్సివస్తోంది. మార్కెట్లో 50వేల బస్తాలు పేరుకుపోయినట్లు అధికారులు తెలుపుతున్నారు. మరోవైపు మార్కెట్కు మక్కల ట్రాక్టర్లు రాకుండా మున్సిపాలిటీ ప రిధిలో చుట్టుపక్కల ప్రధాన రహదారులపై పో లీసులు ప్రత్యేకంగా చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రైవేట్ వ్యాపారులకు మక్కలను విక్రయించేందుకు వెళ్లే ట్రాక్టర్లకే అనుమతిస్తున్నారు. తిరిగి మార్క్ఫెడ్ కొనుగోళ్లు ప్రారంభించే తేదీలు, గ్రామాల పేర్లను ప్రకటించేంత వరకు మక్కలను తీసుకురావద్దని మార్కెట్ చైర్మన్ సంజీవరెడ్డి పేర్కొన్నారు. రహదారులపై చెక్పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు -
కాకతీయ కట్టడాలను రక్షించుకోవాలి
హన్మకొండ కల్చరల్ : కాకతీయ కట్టడాలను రక్షించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందని ఎమ్మెల్సీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. మంగళవారం హనుమకొండ వేయిస్తంభాల దేవాలయాన్ని ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) తన సతీమణి మమతతో కలిసి సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ వారిని ఆలయ మర్యాదలతో స్వాగతించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ రుద్రేశ్వరుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. భారత ప్రభుత్వం జనగణన చేపట్టినందున సబ్బండ వర్గాలు పాల్గొనాలన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రజనీకుమార్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు, నాయకులు పల్లెబోయిన అశోక్, బత్తిని వెంకటేష్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న -
చికిత్స పొందుతూ వినేశ్ ..
● స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తి గూడూరు : ప్రేమ విఫలమైందనే కారణంతో హైదరాబాద్లోని ఓయూ సమీపంలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న మహబూబాబా ద్ జిల్లా గూడూరు మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన బోడ వినేశ్(19) చికిత్స పొందుతూ సోమవారం రాత్రి గాంధీ ఆస్పత్రిలో మృతి చెందాడు. వినేశ్ మృతికి గల కారణాలపై విచారించిన పోలీసులు పోస్టుమార్టం అనంతరం మంగళవారం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో స్వగ్రామం గోవిందాపురంలో వినేశ్ అంత్యక్రియలు నిర్వహించారు. కాగా,వినేశ్ మృతికి ఎవరూ కారణం కాదని కుటుంబ సభ్యులు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. రైళ్లలో హిజ్రాల వేధింపులపై ఆన్లైన్ ఫిర్యాదులుకాజపేట రూరల్ : సికింద్రాబాద్ డివిజన్ పరిధి కాజీపేట సబ్ డివిజన్ సెక్షన్లో పలు రైళ్లలో హిజ్రాలు ప్రయాణికులను వేధిస్తున్నారని ఇటీవల ఆన్లైన్ ఫిర్యాదులు వచ్చాయని రైల్వే అధికారులు మంగళవా రం తెలిపారు. ఈ మేరకు రైల్వే నిఘా విభాగం అధికారులు కొన్ని రో జుల క్రితం క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారన్నారు. ఇందులో కాజీపేట సె క్షన్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్.. హిజ్రాలను కట్టడి చేయడంలో విఫలమయ్యారని గుర్తించి ఓ ఆర్పీఎఫ్ అధికారిని సస్పెండ్ చేశామని పే ర్కొన్నారు. కాగా, సదరు పోలీస్ అధికారి పది రోజుల పాటు సస్పెన్షన్లో ఉండి తిరిగి విధుల్లో చేరారని పోలీస్ అధికారులు తెలిపారు. -
హేమాచలక్షేత్రం ఉత్సవ కమిటీ ఏర్పాటు
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో వచ్చే నెల 6వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల(జాతర)సందర్భంగా 13 మంది సభ్యులతో కూడిన ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి మంగళవారం ఉత్తర్వులు అందినట్లు ఆలయ ఇన్చార్జ్ ఈఓ వీరస్వామి తెలిపారు. కమిటీ చైర్మన్గా యర్రంగారి సురేశ్, సభ్యులుగా నాసిరెడ్డి నాగిరెడ్డి, మండవ రామకృష్ణ, దామెర సారయ్య, పల్నాటి సత్యం, వేమ రవి, చందర్లపాటి శ్రీనివాస్, పూజారి నరేందర్, బోడ బొర్రయ్య, కాటబోయిన నర్సింహారావు, బొడ్డు సుధాకర్, పాయం అనితను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు ఈఓ తెలిపారు. -
కృత్రిమ కొరత సృష్టించొద్దు
● కలెక్టర్ స్నేహ శబరీష్మహబూబాబాద్: పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ స్నేహ శబరీష్ హెచ్చరించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ కంపెనీ ప్రతినిధులు, డీలర్లతో పెట్రో కొరతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజ లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డీజి ల్, పెట్రోల్ అందించాలన్నారు. వ్యవసాయ ఆధారిత వాహనాలైన హార్వెస్టర్లు, ట్రాక్టర్లు తదితర వాటిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. బంకుల నుంచి డబ్బాలలో డీజిల్, పెట్రోల్ తీసుకెళ్లకుండా చూడాలన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బంకుల వద్ద ఎలాంటి ఆందోళన పరిస్థితులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలోఅదనపు కలెక్టర్ అనిల్కుమార్, డీసీఎస్ఓ రమేశ్, కంపెనీల ప్రతినిధులు ప్రణీత్, సౌమ్యదీప్, హరీశ్రాజ్, డీలర్లు పాల్గొన్నారు. -
ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి
మహబూబాబాద్: తొర్రూర్ పట్టణ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన ఇద్దరు కుమారులకు ఉరివేసి హత్య చేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసులు కథనం ప్రకారం.. తండ్రి వలి తన ఇద్దరు కుమారులు విలాస్ (5), వికేష్ (3)లను పోలంలోకి తీసుకెళ్లి ఉరివేసి హత్య చేశాడు. అనంతరం అదే చోట తాను కూడా ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి రావడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. -
నేరాల నియంత్రణలో ముందుండాలి
మహబూబాబాద్ రూరల్: పోలీసులు ప్రజలతో సాన్నిహిత్యం పెంచుకుని నేరాల నియంత్రణలో ముందుండాలని ఎస్పీ శబరీష్ అన్నారు. జిల్లా పరిధిలోని సబ్ డివిజన్ అధికారులు, సీఐలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, సంబంధిత విభాగాల అధికారులతో సోమవారం మహబూబాబాద్ టౌన్ పోలీస్స్టేషన్ సమావేశ మందిరంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రస్తుత నేర స్థితిగతులు, పెండింగ్ కేసుల పరిష్కారం, విచారణల పురోగతి, లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై సమీక్షించి, ప్రతి కేసును నాణ్యతతో దర్యాప్తు చేసి, నిర్దిష్ట కాలవ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు. మన ఊరు–మన బాధ్యత కార్యక్రమం అమలుపై ప్రత్యేకంగా ఆరాతీసి, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, యువతలో మార్పు తీసుకువచ్చే అవగాహన కార్యక్రమాలు, ప్రజలతో సమన్వయం పెంపు వంటి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. సాంకేతిక వనరులను సమర్థవంతంగా వినియోగించాలని, ప్రతీ పోలీస్స్టేషన్ పరిధిలో నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సేవలు అందించాలన్నారు. వివిధ కేసుల్లో శిక్షలు పడటడంలో ప్రతిభ చూపిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించి సంబంధిత సీడీఓలకు రివార్డులు అందజేశారు. అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంపెల్లి వెంకటయ్యను శాలువాతో సన్మానించి మెమెంటో అందించారు. జిల్లా పోలీసు వాహనాలపై ప్రత్యేకంగా పరిశీలన నిర్వహించి ప్రతీ వాహనాన్ని తనిఖీ చేసి వాటి స్థితిగతులు, వాహనాలకు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాహనాలను ఎల్లప్పుడూ మంచి స్థితిలో ఉంచి, సమయానికి మెయింటెనెన్స్ చేయాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎస్పీ శబరీష్ -
‘లీప్’లో ‘టెమ్రిస్’ ఉమ్మడి జిల్లా ప్రిన్సిపాళ్లు
న్యూశాయంపేట: తెలంగాణ మైనార్టీ గురుకులాల విద్యాసంస్థ (టెమ్రిస్) ఆధ్వర్యంలో గురుకులాల్లో పనిచేస్తున్న ఉమ్మడి జిల్లా స్థాయి అధికారులు, ప్రిన్సిపాళ్లకు గురుకులాలను మరింత మెరుగైన రీతిలో నడిపేందుకు ‘లీడర్షిప్ ఫర్ ఎక్సిలెన్స్ అండ్ అకౌంటబిలిటీ ప్రోగ్రామ్’(లీప్) పేరిట మూడు రోజుల పాటు శిక్షణ అందిస్తున్నారు. హైదరాబాద్ దూలపల్లిలోని తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ అకాడమీలో ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు శిక్షణ అందిస్తున్నారు. విజన్ 2026–27లో భాగంగా ఉత్తమ ఫలితాలు, లీడర్షిప్ కెపాసిటీ బిల్డింగ్, రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్వహణ, అకడమిక్ ప్లానింగ్, మానిటరింగ్, తదితర అంశాలపై శిక్షణ అందిస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేస్తున్న రీజినల్ కోఆర్డినేటర్ సతీశ్, విజిలెన్స్ అధికారులు సయ్యద్ అక్బర్, మక్బూల్పాషా, అకడమిక్ కోఆర్డినేటర్ రుహీనా, ప్రిన్సిపాళ్లు జి.భిక్షపతి, నీలిమాదేవి, కృష్ణకుమారి, శ్రీనివాస్, నీరజ, మాధవీలత, శ్రీపాల, శ్రీలత, రాజు, రమేశ్లాల్, కుమార్, అనిల్బాబు తదితరులు పాల్గొన్నారు. -
వినతులు వెంటనే పరిష్కరించాలి
మహబూబాబాద్: ప్రజావాణిలో విచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ స్నేహ శబ రీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవా రం ప్రజావాణి నిర్వహించారు. ఈసంర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అఽధికారుల పరిధిలో ఉంటేనే వెంటనే పరిష్కరించాలని లేని యెడల ిసిఫారసు చేయాలన్నారు. ప్రతీ దరఖాస్తును పారదర్శకంగా పరిశీలించాలన్నారు. ఈనెల 26 నుంచి మే 10వ తేదీ వరకు జరిగే స్వీయ జనగణన కార్యక్రమంలో జిల్లా అదికారులతో పాటు ప్రతీ ఉద్యోగి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ప్రజావాణిలో 179 వినతులు వచ్చినట్లు అఽధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణవేణి, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రజావాణిలో 179 అర్జీల స్వీకరణ -
జాగ్రత్తలే శ్రీరామ రక్ష..
మహబూబాబాద్ రూరల్ : ప్రస్తుత ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి ధాటికి వివిధ పంటలు ఎండుతున్నాయి. అందులో పండ్ల తోటలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో వాతావరణంలో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెంటిగ్రేడ్ దాటిన తర్వాత మొక్కల్లోని పిండి పదార్థాలు ఎక్కువై మొక్కలు త్వరగా వాడిపోతాయి. దీని నివారణకు రైతులు చర్యలు తీసువాలని మల్యాల జేవీఆర్హెచ్ఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త అడ్లూరి ప్రశాంత్ కుమార్ అన్నారు. ఈ మేరకు పండ్ల తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన రైతులు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రస్తుతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వాడిపోనున్న పండ్ల తోటలు జాగ్రత్తలు తీసుకుంటేనే పంట చేతికి.. రైతులకు మల్యాల జేవీఆర్హెచ్ఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త పలు సలహాలు -
మేకలను మేపడానికి వెళ్లి మృత్యుఒడికి..
● బావిలో పడి విద్యార్థి మృతి నర్సింహులపేట: మేకలను మేపడానికి వెళ్లిన ఓ ఇంటర్మీడియెట్ విద్యార్థి ప్రమాదవశాత్తు బావిలో జారి పడి మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం వంతడపల గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. వంతడపల శివారు తండాకు చెందిన బానోత్ రవి, అరుణ దంపతులు బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్లో ఉంటున్నారు. వీరి కుమారుడు హర్షవర్ధన్(18) ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తి కాగానే ఇంటి వద్ద ఉంటున్న తాత రాములు, నానమ్మ దస్మా వద్దకు వచ్చాడు. తాత, నానమ్మ గ్రామంలో మేకలు కాసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఎండ తీవ్రంగా ఉండడంతో తాత, నానమ్మను ఇంటి వద్దే ఉంచి హర్షవర్ధన్ మేకలను తీసుకుని ఒక్కడే వెళ్లాడు. గ్రామ శివారులో మేపుతున్న క్రమంలో మేకలు బావి ధరి వద్దకు వెళ్లాయి. హర్షవర్ధన్ వాటిని కొట్టే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడ్డాడు. ఈత రాక మునిగిపోయాడు. దీనిని చూసిన పక్కన ఉన్న హేము అనే వ్యక్తి బావిలో దూకి కాపాడడానికి ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే హర్షవర్ధన్ మృతి చెందాడు. ఈ ఘటనపై కుటుంబీకులు, తండావాసులు గుండెలవిసేలా రోదించారు. హర్షవర్ధన్ మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. బ్యాంకును మోసం చేశారు.. ● మేనేజర్ ఫిర్యాదుతో నిందితులపై కేసు నమోదు రామన్నపేట : బ్యాంకు కంప్యూటర్ సిస్టమ్లో నెట్ వర్క్ సమస్య, సాంకేతిక లోపం, క్యాషియర్ పొరపాటు కారణంతో బ్యాంకు సొమ్ము ను తప్పుడు పద్ధతిలో డ్రా చేసిన నిందితులపై సోమవారం కేసు నమోదు చేసినట్లు మట్టెవాడ పోలీసులు తెలిపారు. వరంగల్ పోచమ్మమైదాన్ ఎస్బీఐ మేనేజర్గా కొలిపాక సంతోష్ పనిచేస్తున్నారు. గతేడాది నవంబర్ 11న పరకాల మండలం పులిగిల్లకు చెందిన దయ్యాల శైలజ, విష్ణు దంపతులకు రూ.1,49,000 గోల్డ్ లోన్ మంజూరైంది. ఆ రుణానికి సంబంధించిఈ ఏడాది ఫిబ్రవరి 3న గోల్డ్ లోన్ ఖాతా మూసివేత కోసం శైలజ, విష్ణు దంపతులు బ్యాంకుకు వచ్చారు. సి బ్బంది సిస్టమ్లో క్లోజర్ ప్రక్రియ ప్రారంభించారు. అయితే నెట్వర్క్ సమస్య, సాంకేతిక లోపంతో లోన్ ఖాతా మూసివేయలేకపోయారు. కానీ క్యాషియర్ రాజీ పొరపాటున బంగారు ఆభరణాలను శైలజ, విష్ణు దంపతులతోపాటు మరో మహిళ రాధకు అప్పగించారు. కానీ అప్పటికే లోన్ ముగింపునకు ఉంచిన సొమ్ము మొత్తాన్ని ఖాతాలోనే ఉంచారు. ఫిబ్రవరి 4న యూపీఐ, ఏటీఎం లావాదేవీల ద్వారా ఆ సొ మ్మును ఉపసంహరించుకున్నారు. ఈ విషయమై బ్యాంకు అధికారులు వారిని సంప్రదించగా మొదట డబ్బు తిరిగి చెల్లించడానికి నిరాకరించారు. తర్వాత విష్ణు తప్పును అంగీకరించి కొంత సమయం కో రి నా ఇప్పటి వరకూ బకాయి చెల్లించలేదు. ఈ నేపథ్యంలో శైలజ, విష్ణుదంపతులతోపాటు మరో మహిళ దయ్యాల రాధపై మేనేజర్ సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. -
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి
మహబూబాబాద్: దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య డిమాండ్ చేశారు. సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా అడివయ్య మాట్లాడుతూ.. దివ్యాంగులకు పింఛన్ రూ.6,000 చెల్లించాలన్నారు. ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డులు ఇచ్చి 150 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనూ దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు వర్రె బాలకృష్ణ, నాయకులు గౌరమ్మ, నరేష్, సుధాకర్, నాగలక్ష్మి, యాకమ్మ, నాగరాజు, వెంకన్న, గీత తదితరులు పాల్గొన్నారు. కోట సందర్శన ఖిలా వరంగల్: ఖిలావరంగల్ కోటను సోమవారం సాయంత్రం ఎయిర్పోర్ట్ అథారిటీ అధి కారులు ఈడీ ఎస్కె.గుప్తా, జై గౌరవ చౌదరి, జేజీఎం బాలెన్దర్ కుమార్, డీజీఎంలు ఉమేశ్కుమార్ తివారి, ఏజీఎం గోపాలకృష్ణ సందర్శించారు. మధ్యకోటలోని శిల్పకళా నైపుణ్యాలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఖుష్ మహల్, ఏకశిల గుట్ట, రాతి మట్టికోట అందా లను వీక్షించారు. అంతకు ముందు కాకతీయు ల చారిత్రక విశిష్టతను కోట గైడ్ రవి యాదవ్ అధికారులకు వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఇక్బాల్, ఆర్ఐ కీర్తిన్, పురావస్తుశాఖ కో–ఆర్డినేటర్ శ్రీకాంత్, టీజీటీడీసీ కోట ఇన్చార్జ్ గట్టికొప్పుల అజయ్ పాల్గొన్నారు. కొనసాగుతున్న కల్యాణ బ్రహ్మోత్సవాలు హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో శ్రీభద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు నిత్యాహ్నికం, చతుస్థానార్చన, డోలోత్సవం నిర్వహించారు. ఉదయం అమ్మవారి ఉత్సవమూరిక్తి భద్రపీఠసేవ, సాయంత్రం అశ్వవాహన సేవ నిర్వహించారు. ఉదయం అఖిల భారత పద్మశాలి సంఘం వరంగల్, హనుమకొండ, గ్రేటర్ వరంగల్ ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా మేయర్ గుండు సుధారాణి, ప్రభాకర్ దంపతులు, విశిష్ట అతిథిగా కేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు, పండ్లు సమర్పించారు. వీరితో పాటు వడ్నాల నరేందర్, ఆడెపు రవీందర్, బచ్చు ఆనందం,గోరంట్ల రాజు, బేతి అశోక్, బత్తుల రమేశ్, బాబు, కుసుమ శ్యామ్, రాజేందర్, వేణు, సమ్మయ్య, కేదాసి వెంకటేశ్వర్లు, దిడ్డి రమేశ్, తుమ్మ అశోక్, వేణుగోపాల్, పద్మశాలి కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే సాయంత్రం ఎరుకల కులస్తులు ఉభయదాతలుగా వ్యవహరించారు. దేవర యాదగిరి, శ్రీలత దంపతులు పాల్గొన్నారు. -
మక్కల కొనుగోలు కేంద్రంలో సమస్యలు పరిష్కరించాలి
ఇనుగుర్తి: మండల కేంద్రంలోని మక్కల కొనుగోలు సెంటర్లో పది రోజుల నుంచి రైతులకు గన్నీ సంచులు ఇవ్వడం లేదని, నింపిన బస్తాలను కాంటాలు పెట్టి తరలించడం లేదని సోమవారం సీపీఎం, బీఆర్ఎస్ పార్టీల నాయకులు రైతులతో కలిసి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎస్సై కరుణాకర్ అక్కడికి చేరుకొని.. ఏమైనా సమస్యలు ఉంటే అధికారులకు విన్నవించుకోవాలని రైతులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమించారు. అనంతరం తహసీల్దార్ కార్యలయం ఎదుట ధర్నా చేసి, మక్క రైతుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని తహసీల్దార్ శ్రీనివాసులుకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు మార్తినేని పాపారావు, మండల కార్యదర్శి గోడిశాల వెంకన్న, బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బొబ్బిలి మహేందర్ రెడ్డి, బేతమల్ల చంద్రయ్య, గండు నాగన్న, పెండ్లి మహేందర్, బండి సత్యం, రాజన్న, దర్గయ్య, సంజీవ రెడ్డి, యాకయ్య, లచ్చు, రైతులు పాల్గొన్నారు. -
శంకర్ ఆత్మబలిదానం వృథాకాలేదు
నర్సంపేట : డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మబలిదానం వృథా కాలేదని, ప్రభుత్వం దిగొచ్చి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నేరవేర్చిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం నర్సంపేట ఆర్టీసీ డిపో ఎదుట, ముత్తోజిపేటలో శంకర్గౌడ్ ఇంటి వద్ద ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యమ చరిత్రలో డ్రైవర్ శంకర్గౌడ్ త్యాగం వెలకట్టలేనిదన్నారు. శంకర్గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ బీసీ ఉద్యోగు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్, బీసీ విద్యావంతుల వేదిక రాష్ట్ర కన్వీనర్ సంఘని మల్లేశ్వర్, ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు బండి స్వామి, కృష్ణ, గడ్డం యాదగిరి, శ్రీనివాస్, ఉపేందర్, బీసీ ఆర్టీసీ ఉమ్మడి వరంగల్ రీజనల్ అధ్యక్షుడు గోలనకొండ వేణు, జిల్లా ఉపాధ్యక్షులు చెన్నూరి రవి, గోడిశాల అశోక్, సంగెం రమేశ్, కడారి సురేశ్ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్ -
రైతులకు నాణ్యమైన విద్యుత్ సేవలు
నెహ్రూసెంటర్: రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా ట్రాన్స్ఫార్మర్ వాహనాలను అందుబాటులో ఉంచినట్లు మహబూబాబాద్ ఎస్ఈ పి.విజేందర్ రెడ్డి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలో 12 డిపార్ట్మెంట్ వాహనాలు ఏర్పాటు చేశామని, ఇందులో ప్రతీ వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేశామని తద్వారా సత్వర సేవలు అందుతాయన్నారు. వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా అత్యంత ప్రాధాన్యమని, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాహనాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ట్రాన్స్ఫార్మర్ దెబ్బతిన్న సమయంలో వెంటనే మరమ్మతులు చేయడం లేదా ప్రత్యామ్నాయ ట్రాన్స్ఫార్మర్ అమర్చడం కోసం ఈ వాహనాలు ఎంతగానో దోహదపడుతున్నాయని తెలిపారు. రైతులు విద్యుత్ సంబంధిత సమస్యలు వచ్చిన వెంటనే సమీప విద్యుత్ అధికారులకు సమాచారం అందించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ స్వయంగా ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ పరికరాలను తాకొద్దని సూచించారు. ట్రాన్స్ఫార్మర్లో సమస్యలు తలెత్తిన వెంటనే 1912 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. రైతులకు మెరుగైన సేవలు అందించడం ఎన్పీడీసీఎల్ ప్రధాన లక్ష్యమని, ప్రతీ ఉద్యోగి బాధ్యతతో పనిచేసి రైతుల ఆదరణ పొందాలన్నారు. -
ఫర్టిలైజర్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి
ఖిలా వరంగల్: ఫర్టిలైజర్ డీలర్ల ప్రధాన సమస్యలు పరిష్కరించాలని ‘ది తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్’ రాష్ట్ర అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఎరువుల కంపెనీలు మార్క్ఫెడ్కు ఎఫ్ఓఎల్ ఇచ్చి డీలర్లకు ఇవ్వకపోవడం, యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరువుల విక్రయాల్లో లింక్ ప్రొడక్టస్ అంటగట్టి డీలర్లకు ఆర్థిక భారం వేసే కంపె నీలపై ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలన్నారు. డీలర్ల సమస్య సాధన కోసం ఆలిండియా, ది తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్స్,ఫెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపులో భాగంగా సోమవారం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్స్ షాపులు స్వచ్ఛందంగా బంద్ పాటించి డీలర్లు నిరసన ర్యాలీలు నిర్వహించారు. అంతకు ముందు వరంగల్ శివనగర్లోని అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీలర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బంద్ పాటించామని తెలిపారు. విత్తన కంపెనీలపై చర్యలు తీసుకోకుండా విక్రయించిన డీలర్పై కేసులు పెట్టడం సరికాదన్నారు. ఉత్పత్తి కేంద్రాల వద్ద ప్రభుత్వమే నిఘా ఏర్పాటు చేసి నకిలీ విత్తనాల కట్టడి చేయాలన్నారు. నాణ్యమైన విత్తనాలు డీలర్లకు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గౌరిశెట్టి నాగరాజు, పున్నమి రాజేందర్రెడ్డి, గాయత్రి రాంచంద్రారెడ్డి, గుర్రం మధుసూదన్రావు, జిల్లా నేతలు ప్రవీణ్, పరమేశ్వర్, శ్రీనివాస్ లాహోటి, హరిందర్, రాజేశ్వర్రావు, రాజేంద్రయాదవ్, యాదగిరి, జగన్, సంపత్రెడ్డి, నారాయణరెడ్డి, ఎలేందర్రెడ్డి, వెంకన్న, పైడి, ఆనందం పాల్గొన్నారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు -
సెంట్రల్ జైలులో పరిపాలన భవనం ప్రారంభం
ఖిలా వరంగల్/నర్సంపేట : వరంగల్ మామునూరులోని సెంట్రల్ జైలు ప్రాంగణంలో ఇటీవల ని ర్మించిన ప్రధాన పరిపాలన భవనాన్ని సోమవారం జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా ప్రా రంభించారు. ఈ భవనం ద్వారా జైలు పరిపాలన మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామని, జైలు నిర్వహణ, భద్రత, ఆధునికీకరణ, సంక్షేమ చర్యలపై అధికారులు దృష్టిసారించాలని ఆదేశించారు. మహిళా సబ్ జైలు సందర్శన.. నర్సంపేటలోని మహిళా సబ్ జైలును జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీల సౌకర్యాలు, సదుపాయాలపై ఆరా తీసి, వారితో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో జైళ్ల శాఖ వరంగల్ రేంజ్ డీఐజీ ఎం. సంపత్, వరంగల్ ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి మనీషా నెహ్రా, మామునూరు సెంట్ర ల్ జైలు సూపరింటెండెంట్ టి.కళాసాగర్, డీఎస్డీఓ వెంకటేశ్వరస్వామి, వై.శరత్, నర్సంపేట సబ్ జైలు సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, జైలర్ ప్రభాకర్, స్రవంతి, డిప్యూటీ జైలర్ కృష్ణకాంత్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
మేలు రకం వరి విత్తనాలు ఎంపిక చేసుకోవాలి
● వ్యవసాయ శాస్త్రవేత్త వై. ప్రశాంత్ మామునూరు : తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనువైన, మిల్లు యజమానులు ఎక్కువ మొగ్గు చూపే మేలు రకం వరి విత్తనాలు ఎంపిక చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి జి.విజ్ఞాన్, శాస్త్రవేత్తలు వై. ప్రశాంత్, మానస సూచించారు. సోమవారం వరంగల్ బొల్లికుంట రైతువేదిక భవనంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాష్ట్ర వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏఓ జి. విజ్ఞాన్ అధ్యక్షతన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు‘ అనే కార్యక్రమం, ఎరువుల వినియోగం, సేంద్రియ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడుతూ విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో డీలర్ల వద్ద మోసపోకుండా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఏఈఓ ఎన్.సత్య ప్రకాశ్, బీఎస్సీ మూడో సంవత్సరం విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.గూడూరు: ప్రేమ విఫలమైందనే కారణంతో మనస్తాపం చెందిన మహబూ బాబాద్ జిల్లా గూడూరు మండలం గోవిందాపురం గ్రామానికి చెందిన మైనింగ్ కోర్సు చదువుతున్న బోడ వినేశ్ సోమవారం హైదరాబాద్లోని ఉస్మాని యా యూనివర్సిటీలో పెట్రోల్ పోసుకుని ని ప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్ప డ్డాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకున్నా రు. అక్కడ లభించిన ఆ విద్యార్థి సూసైట్ నోట్ ప్రకారం ప్రేమ విఫలమైందనే కారణంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. విద్యార్థికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. యువకుడి ఆత్మహత్య నడికూడ: తల్లిదండ్రులతో గొడవ పడి క్షణికావేశంలో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం కౌకొండలో చోటుచేసుకుంది. దామెర ఎస్సై అశోక్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అల్లే తరుణ్(25) పరకాలలోని ఓ మొబైల్ షాపులో మేనేజర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో జల్సాల కోసం తన జీత మే కాకుండా నిత్యం తల్లిదండ్రులను డబ్బు కోసం వేధించేవాడు. ఆదివారం రాత్రి ఇదే విషయంపై తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. సోమవారం కుటుంబీకులు వ్యవసాయ పనులకు వెళ్లగా క్షణికావేశంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బుల్లి రైలింజిన్లు అదుర్స్..
కాజీపేట రూరల్ : కాజీపేట డీజిల్ లోకోషెడ్లో బుల్లి రైలింజిన్లు అబ్బురపరుస్తున్నాయి. రైల్వే టెక్నీషియన్లు తయారు చేసిన నాటి డీజిల్ లోకోలు ఆకట్టుకుంటున్నాయి. విరామ సమయంలో వారు ఎన్నో రకాల కళాఖండాలు తయారు చేసి ప్రదర్శనలో పెట్టారు. వీటిని తిలకించిన సికింద్రాబాద్ రైల్వే అధికారులు.. కాజీపేట టెక్నీషియన్ల ప్రతిభాపాటవాలను గుర్తించి అభినందించారు. కాగా, మంగళవారం డీజిల్ షెడ్ 53వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా డీజిల్షెడ్, ఎంట్రెన్స్, లోకోలను అధికారులు విద్యుత్ కాంతులతో ముస్తాబు చేశారు. అబ్బురపరుస్తున్న బుల్లి రైలు ఇంజన్లు.. డీజిల్ లోకోషెడ్లో రైల్వే టెక్నీషియన్లు తయారు చేసిన మూడు తరాల బుల్లి రైలింజన్లను ప్రదర్శన నిమిత్తం ప్రత్యేక స్థలంలో ఏర్పాటు చేశారు. ఇవి అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇందులో మొదటిది 30 ఏళ్ల క్రితం ఉపయోగించిన ఆల్కో లోకో, జి–4 లోకో. ఇది మల్టీపర్పస్ డ్యూయల్ క్యాబిన్తో ఉంటుంది. పికప్ ఎక్కువ, అధిక లోడు లాగుతుంది. రెండోది డబ్ల్యూఎజీ –7 ఎలక్ట్రిక్లోకో. ఇది అధిక గూడ్స్ లోడ్ లాగుతుంది. మూడోది స్టీమ్ లోకో (బ్రిటీష్ కాలం నాటిది). పాడైనపోయిన ఇనుప రేకులతో దీనిని తయారు చేసి ప్రదర్శనలో పెట్టారు. ఈ రైలు ఇంజిన్లు చూపరులను అబ్బురపరుస్తున్నాయి. బ్రిటీష్ కాలం నాటి లోకోఎలక్ట్రిక్ డ్యూయల్ లోకో అబ్బుర పరుస్తున్న నాటి డీజిల్ లోకోలు అద్భుత కళాఖండాలు తయారు చేసిన టెక్నీషియన్లు ప్రదర్శనలో హెరిటేజ్ లోకో నేడు డీజిల్షెడ్ 53వ వార్షికోత్సవం -
నత్తనడకన బోర్ హోల్స్ పనులు!
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలోని మేడిగడ్డ బ్యారేజీలో జరుగుతున్న బోర్హోల్స్ పనులు నత్తనడక సాగుతున్నాయి. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు బ్యారేజీలో 19, 20, 21 పియర్స్ వద్ద పరీక్షలు చేపట్టారు. పుణెకు చెందిన సీడబ్ల్యూపీఆర్ఎస్ బృంద శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో పరీక్షలు జరుగుతున్నాయి. గడువులోగా పూర్తి చేయాల్సి ఉండగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటికే 8 వరకు బోర్హోల్స్ వేశారు. సుమారు 500పైగా బోర్హోల్స్ వేయాల్సి ఉన్నట్లు తెలిసింది. డ్రిల్లింగ్ మిషన్ల కొరత ఉంది. ఒక్కొక్కటి 15 మీటర్ల నుంచి 30 మీటర్ల లోతు డ్రిల్లింగ్ చేయాల్సి ఉంది. భూ భౌతిక (జియో ఫిజికల్), భూ సాంకేతిక (జియో టెక్నికల్), జీపీఆర్ పరీక్షలు చేపడుతున్నారు. ఇందులో భూ భౌతిక పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు పూర్తయితేనే బ్యారేజీ పునరుద్ధరణ చేపట్టనున్నారు. -
దాహం.. దాహం
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో ప్రజలకు తాగునీటి తిప్పలు తప్పడం లేదు. మిషన్ భగీరథ అధికారులు నీటి సరఫరాలో విఫలమవ్వడం, మౌలిక సదుపాయాలు, పైపులైన్ల పనులు పూర్తి కాకపోవడం, భూగర్భ జలాలు పడిపోవడం వల్ల ప్రజలు వేసవిలో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా నీరు.. బయ్యారం, గార్ల, మానుకోట, డోర్నకల్ పలు మండలాలు మీదుగా మూన్నేరువాగు ప్రవహిస్తోంది. ఆయా ప్రాంతాల్లో అమృత్ జల్ పథకం పనులు జరుగుతున్న నేపథ్యంలో పాత పైపులైన్లు పగలడంతో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డోర్నకల్లోని పలు వార్డుల్లో తాగునీరు అందడం లేదు. నీటి కోస అక్కడి ప్రజల అలమటిస్తున్నారు. అలాగే మానుకోట మున్సిపాలిటీలో తాగునీటి కొరత తీర్చేందుకు పలువురు కౌన్సిలర్లు ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్నారు. తాగునీటి చర్యలు ఇలా.. జిల్లాలో 18 మండలాల్లో 482 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వేసవిలో ప్రజలు తాగునీటి ఎద్దడితో ఇబ్బందులు పడకుండా ప్రత్యేక కార్యాచరణతో జిల్లాలో పలు మండలాలు, పలు గ్రామ పంచాయతీల్లో సమస్యలను గుర్తించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. చేతి పంపులు, నల్లా కనెక్షన్లు, పైపులైన్, తాగునీటి ట్యాంకుల నిర్మాణంతో పాటు సంపుల పనులు పూర్తి చేసి నీరందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మిషన్ భగీరథ అధికారులు సిబ్బందితో మరమ్మతులు చేపిస్తూ ప్రజలకు తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రారంభం కాని వాటర్ ట్యాంకు.. జిల్లా కేంద్రం కొత్తబజారులోని కంకరబోర్డులో రూ.3కోట్ల వ్యయంతో మిషన్ భగీరథ అధికారులు వాటర్ ట్యాంకు నిర్మాణం చేపట్టారు. పనులు పూర్తయి ఆరు నెలలు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోవడం లేదు. విద్యుత్ సరఫరా అందించి చిన్న చిన్న పనులు పూర్తి చేసి మున్సిపల్కు అప్పగిస్తే తాగునీటి ఇబ్బందులు తప్పుతాయని స్థానికులు అంటున్నారు. అదేవిధంగా పాత బజారులో ఉన్న పలు వార్డులకు తాగు నీరు అందించడంలో మున్సిపల్ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సమయ పాలన పాటించకుండా 20 నుంచి 40 నిమిషాల వరకు నీటిని విడుదల చేయడంతో ప్రజల అవసరాలకు పూర్తి స్థాయిలో మంచినీరు అందడంలేదు. రెండు రోజులకోసారి మంచినీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బోర్లు వేసుకునే వారు అనుమతులు తీసుకోవాలి..రైతులు, గృహవసరాలు, పారిశ్రామిక, వ్యాపారవేత్తలు అనుమతులు తీసుకొని, సర్వే చేసుకొని బోర్లు వేయించుకోవాలి. ఎక్కడపడితే అక్కడ బోర్లు వేస్తే బండలు వచ్చి ఆర్థికంగా నష్టపొతారు. పూర్తిస్థాయిలో అనుమతులు లేకుండా బోర్లు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రైతులు పొల్లాలో, ప్రజలు ఇళ్లలో తప్పకుండా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి. భూగర్భ జలాలను పెంచుకోవాలి. – అశోక్, జిల్లా భూగర్భజలశాఖ అధికారి మానుకోట 25వ వార్డులో ట్యాంకర్తో మంచినీటిని అందిస్తున్న నర్రా సంధ్యశ్రావణ్నిర్మాణ పనులు పూర్తయి ప్రారంభానికి నోచుకోని వాటర్ ట్యాంక్ -
యువత సద్వినియోగం చేసుకోవాలి
మహబూబాబాద్: ప్రధాన మంత్రి ఇంటర్న్షిప్ పథకాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం ప్రచార పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలను కల్పించడమే పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. ఆసక్తి గలవారు టోల్ప్రీ నంబర్ 1800116090, వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ శ్రీమన్నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పిల్లలు అన్ని రంగాల్లో రాణించాలి పిల్లలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని చైల్డ్ కేర్ హోంలో సోమవారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా పిల్లలకు సర్టిఫికెట్లతో పాటు క్రీడా సామగ్రి పంపిణీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారం పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. చైల్డ్ కేర్హోంలో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. సామాజిక అంశాలపై అవగాహన కల్పి ంచాలన్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ సబిత, సీడీపీఓ శిరీష తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ స్నేహశబరీష్ -
మార్కెట్ ఎదుట మక్కల ట్రాక్టర్ల క్యూ..
కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మార్క్ఫెడ్ మక్కల కొనుగోలు కేంద్రానికి ఆది వారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు రెతులు ట్రాక్టర్లలో మక్కలను తీసుకువచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గేటుకు తాళం తీయకపోవడంతో మండుటెండల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు రైతులు వెనుదిరిగి ఇంటికి వెళ్లిపోయారు. మరికొందరు మిల్లులను, దుకాణాలను ఆశ్రయించి తక్కువ ధరకే అమ్ముకుని నష్టపోవాల్సి వచ్చింది. మార్కెట్లో ఇప్పటికే ఖరీదు చేసిన 6వేల బస్తాల మక్కల కాంటాలు పూర్తయినప్పటికీ, లారీల కొరతతో ఎగుమతి కాకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నట్లు అధికారులు తెలిపారు. తీరా సాయంత్రం గేటు తెరిచి, మహముద్పట్నం, అమీనాపురం ఉమ్మడి జీపీల నుంచి వచ్చిన మక్కల ట్రాక్టర్లను లోనికి పంపించారు. కాగా ప్రస్తుతం 15వేల బస్తాల మక్కలు షెడ్లలో పేరుకుపోయాయి. మార్కెట్లో మక్కల రాశులు పేరుకుపోయినందున, తిరిగి తేదీ ప్రకటించేంత వరకు రైతులు తమ మక్కలను మార్కెట్కు తీసుకురావద్దని చైర్మన్ గంట సంజీవరెడ్డి తెలిపారు. అదే విధంగా తాళ్లపూసపల్లి గ్రామంలోని మక్కల కొనుగోలు కేంద్రంలో బస్తాలు లేకపోవడంతో మక్క రైతుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదు
హన్మకొండ చౌరస్తా: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు వెదవలు అని మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం సరికాదని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నాడు పార్లమెంటులో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును భారత్ పాకిస్తాన్తో పోల్చినప్పుడు ఎంపీగా తాను, అదే వేదికపై ఉన్న కాంగ్రెస్ ఎంపీలు తీవ్రంగా ఖండించారని పేర్కొన్నారు. ఇదే విషయంపై పార్లమెంటులో తేజస్వి సూర్య వివరణ ఇచ్చారని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎవరు కించపరిచేలా వ్యవహరించిన తెలంగాణ బిడ్డగా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయాలు ఏమీ తెలుసుకోకుండా కేసీఆర్ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలను వెదవలు అంటూ మాట్లాడడం సరైనది కాదని తెలిపారు. ఇలాంటి విషయాలు కాకుండా తెలంగాణ అభివృద్ధికి మాజీ సీఎం కేసీఆర్ సలహాలు, సూచనలు చేయాలని కోరారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య -
ప్రేమ విఫలమైందని ఒంటికి నిప్పంటించుకున్న విద్యార్థి
లాలాపేట: ప్రేమలో విఫలమయ్యానన్న బాధతో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఓయూ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్బాబాద్ జిల్లా గూడూరు మండలం గోవిందాపురం తండాకు చెందిన బోడ వినీష్కుమార్ (19) ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలో బీఈ (మైనింగ్ ఇంజనీరింగ్) ఫస్టియర్ చదువుతున్నాడు. ఓయూ క్యాంపస్లోని హాస్టల్లో ఉంటున్నాడు.సోమవారం ఉదయం 9:30 గంటల సమయంలో క్యాంపస్లోని ఎల్లమ్మ దేవాలయం వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. గమనించిన ఉమెన్స్ హాస్టల్ గార్డు స్థానికులను అప్రమత్తం చేయగా వారు మంటలు ఆర్పి వినీష్కుమార్ను 108 అంబులెన్స్ ద్వారా గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఘటనాస్థలిలో లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా వినీష్కుమార్ తన క్లాస్మేట్తో ప్రేమ విఫలమై ఆత్మహత్యాయత్నం చేసినట్లు తేల్చారు. ప్రస్తుతం 70 శాతం కాలిన గాయాలతో వినీష్కుమార్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కాగా, వినీష్కుమార్ 3 నెలల నుంచి కాలేజీకి రావట్లేదని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. -
మక్క రైతులు ఆందోళన చెందవద్దు
తొర్రూరు రూరల్: మొక్కజొన్నల తరలింపులో రైతులు ఆందోళన చెందవద్దని తొర్రూరు మార్కెట్ చైర్మన్ హనుమాండ్ల తిరుపతిరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని సోమారం గ్రామంలో మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, అమ్మాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. తొర్రూరు మండల పరిధిలో రెండు మక్కల, గ్రామగ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రైతులు ఎవరూ అధైర్య పడవద్దని, ప్రతీ గింజను సెంటర్లలో కొనుగోలు చేస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్లు కొమురవెల్లి లింగమూర్తి, ముద్ద వీరారెడ్డి, బానోతు శ్రీను, నాయకులు చింతకుంట్ల శ్రీనివాస్రెడ్డి, మేకల కుమార్, వీరారెడ్డి, డొనక ఉప్పలయ్య, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు. విద్యుత్తో అగ్ని ప్రమాదం జరగలేదు బయ్యారం: మండలంలోని కొత్తగూడెం సమీపంలోని మొక్కజొన్న చేన్లలో విద్యుత్ వల్ల అగ్నిప్రమాదం జరగలేదని విద్యుత్శాఖ డీఈ ఏ.కోటేశ్వరరావు తెలిపారు. ఆదివారం అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఆయన పరిశీలించారు. అగ్ని ప్రమాద సమయంలో విద్యుత్ సరఫరా లేదని, ఇతర కారణాల వల్ల ప్రమాదం చోటుచేసుకోవచ్చన్నారు. ఆయన వెంట ఏడీఈ రమేశ్, ఇన్చార్జ్ ఏఈ సందీప్ తదితరులు ఉన్నారు. వేసవితాపం.. వానరాల సేద గార్ల: కోతులు వేసవితాపం నుంచి సేద తీరేందుకు ప్రభుత్వ కార్యాలయాల కిటికీల వద్ద గాఢ నిద్రలోకి వెళ్లాయి. ఆదివారం మండలంలోని ఎంపీడీఓ, పంచాయతీరాజ్ డీఈ కార్యాలయాల్లోని కిటికీల వద్ద మధ్యాహ్నం ఒంటిగంటకు కోతుల గాఢ నిద్రలోకి వెళ్లి సేద తీరుతున్న దృశ్యాలను ‘సాక్షి’ కెమెరా బంధించింది. రామప్పలో విదేశీయుల సందడి వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఆదివారం కామెరూన్ దేశానికి చెందిన సోనిలీ, ప్రాన్స్ దేశానికి చెందిన ఇవాన్ వెబర్లు వేర్వేరుగా సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ అర్చకులు హరీశ్శర్మ, ఉమాశంకర్లు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. రామప్ప ఆలయ చరిత్ర గురించి టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించగా వారు ఆసక్తిగా తిలకించారు. అనంతరం రామప్ప సరస్సును సందర్శించి సరస్సులో బోటింగ్ చేశారు. -
కంపెనీల రీజియన్ మేనేజర్లతో మాట్లాడాను
ఆయా కంపెనీల రీజియన్ మేనేజర్లతో మాట్లాడాను. రేపటి నుంచి డీజిల్ సరఫరా అవుతుంది. సమస్య తీరుతుంది. డబ్బులు చెల్లించిన ఐదు రోజులకు సరఫరా చేస్తున్నారు. సప్లై తక్కువగా ఉండడంతో ఈ సమస్య ఏర్పడింది. జిల్లాలో ఈ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటాం. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు. లైసెన్స్ రద్దు చేస్తాం. –రమేశ్, డీసీఎస్ఓ పవర్ పెట్రోల్ పోయించాను.. చాలా బంక్ల్లో పెట్రోల్ లేదు. తొర్రూరు రోడ్డులోని ఫాతిమా హైస్కూల్ ఎదుట ఉన్న బంక్లో మాత్రం పవర్ పెట్రోల్ ఉంది. చేసేది ఏమీ లేక పోయించాను. దీని వల్ల వాహనం పాడైపోతుంది. అయినా చేసేది ఏమీ లేదు. అధికారులు కొరత లేకుండా చూడాలి. – అంబటి రవీందర్ రిటైర్డ్ సీఐ, మానుకోట ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నాం నాకు ఉన్న రెండు ట్రాక్టర్లు డీజిల్ లేక రెండు రోజులుగా ఇంటి వద్దనే ఉంటున్నాయి. దీంతో డ్రైవర్లు, కూలీలు ఉపాధి కోల్పోతున్నారు. ఇలాగే కొనసాగితే వాహనాల ఈఎంఐ చెల్లింపులు కూడా కష్టమే. సంబంధిత అదికారులు డీజిల్ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి. – లక్ష్మీనారాయణ, మానుకోట -
వైభవంగా వాసవిమాత జయంతి
మహబూబాబాద్ రూరల్: ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీవాసవికన్యకాపరమేశ్వరి అమ్మవారి జయ ంతి వేడుకలు జిల్లా కేంద్రంలోని శ్రీవాసవీ దేవాలయంలో ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు తాటిపాముల దుర్గాప్రసాద్ అమ్మవారికి పంచామృతాభిషేకాలు జరి పారు. గర్భగుడిలోని శ్రీవాసవీమాత మూలవిరాట్ మూర్తిని పట్టువస్త్రాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరణ ద్వారా అర్చన పూజలు చేసి భక్తులకు అమ్మవారి దర్శనభాగ్యం కల్పించారు. శ్రీవాసవి మాత జెండా ఆవిష్కరణ చేసి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో యిమ్మడి రవికుమార్, గీతారాణి, శ్రీరంగం కిశోర్ సుభాషిని, చౌడవరపు శేషగిరి, ఉషారాణి, తల్లాడ విజయ్, వేమిశెట్టి కిశోర్ కుమార్, నాళ్ల నరసింహారావు, జంగాల విజయ్, శ్రీరాం పురుషోత్తం, శ్రీరాం ప్రసాద్, వల్లాల సాయికృష్ణ, యిమ్మడి చంద్రప్రకాశ్, యాదా సోమయ్య, శ్రీరాం రమణ ఎస్వీ.నాగేశ్వరరావు, బొడ్ల కామేశ్వర్ రావు, భక్తులు పాల్గొన్నారు. -
ఐటీడీఏ పీఓకు.. సమస్యల స్వాగతం
● బాధ్యతలు స్వీకరించిన లెనిన్ వత్సల్ టొప్పో ● ఈఎస్ఎస్లో గ్రౌండింగ్ అంతంతే.. ● ముందుకు సాగని రైతు భరోసా, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల సరళీకృతం ● పరిష్కారానికి నోచుకోని గిరివాణి వినతులుఏటూరునాగారం: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఏటూరునాగారం పీఓగా లెనిన్ వత్సల్ టొప్పో ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలు విభాగాల్లో తనిఖీ నిర్వహించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. కాగా నూతనంగా బాధ్యతల చేపట్టిన పీఓకు ఐటీడీఏలో నెలకొన్న అనేక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. పథకాల అమలు నిల్.. 2020–21 నుంచి ఇప్పటి వరకు ఎకనామికల్ సపోర్ట్ స్కీం(ఈఎస్ఎస్)లో గ్రౌండింగ్ చేయడం లేదు. 631 మందిని ఎంపిక చేసి 274 మందికి గ్రౌండింగ్ చేశారు. మిగతావి పెండింగ్లో ఉన్నా యి. వాటికి ఆర్థికశాఖ నుంచి ట్రైకార్, ట్రైబల్ వెల్ఫేర్కు నిధులు వస్తేనే బ్యాంకుల్లో జమయ్యే పరిస్థితి. ఇంతలోనే రాజీవ్ యువ కిరణాలు పథకం తెరపైకి తేవడంతో ఈఎస్ఎస్ మరుగున పడింది. అలాగే గిరివికాసం కింద రైతులకు బోరు, మోటారు, విద్యుత్ కనెక్షన్ ఉచితంగా ఇవ్వాలని వచ్చిన 431 దరఖాస్తులు మూడేళ్లుగా పెండింగ్లో ఉన్నాయి. ఇటీవల పీఎం కుసుము యోజన పథకం కింద గిరిజనులకు సోలార్ పంపు సెట్లు, మోటార్లను అందించేందుకు సర్వేలు చేపట్టి కాగితాలకే పరిమితం చేశారు. అలాగే సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసేందుకు ఐటీడీఏ మహిళలకు అవగాహన కల్పించి పేర్లను నమోదు చేశారు. కానీ సంఘాల పేర్ల మీద భూములు మాత్రం కేటాయించలేదు. బోసిపోయిన టైలరింగ్ స్టోర్.. గిరిజన మహిళా సంఘాలకు కుట్టు శిక్షణ ఇవ్వడంతో పాటు ఉచిత కుట్టు మిషన్లను అందజేసి ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాం కుట్టించి వారికి ఇచ్చేలా అప్పటి పీఓ చిత్రామిశ్రా ప్లాన్ చేశారు. కానీ ఆమె బదిలీ కావడంతో ఆ పనులు మూలకుపడ్డాయి. దీంతో స్టోర్ బోసిపోయి కనిపిస్తోంది. అలాగే కొంత మందికి ఇటుకల తయారీ మిషన్లు ఇవ్వగా వాటిని కేవలం ఇంటి వద్ద ఏర్పాటు చేసుకొని ఎలాంటి పరిశ్రమ నడపడం లేదు. దీంతో సామగ్రి తుప్పుపట్టిపోతోంది. న్యూట్రి బాస్కెట్ పరిశ్రమను సైతం నడిపించలేక మహిళా గ్రూపు సభ్యులు మూసివేశారు. సరైన ఆదాయం, ఉత్పత్తి లేదని చేతులు ఎత్తేశారు. సబ్బుల ఫ్యాక్టరీ క్లోజ్.. శివాపురంలోని సబ్బుల పరిశ్రమకు జీసీసీ ద్వారా రూ. 30 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. ఇప్పించాలని అనేకమార్లు గిరివాణిలో వినతులు ఇచ్చినా ఫలితం లేకుండా పోవడంతో మూసివేశారు. వెంకటాపురం(కె) మండలం ముత్తారం గ్రామంలో నడుపుతున్న సొసైటీ క్వారీ మూడేళ్ల నుంచి గ్రామంలోని సభ్యులకు కమీషన్లు ఇవ్వడం లేదు. దీంతో గిరివాణిలో ఫిర్యాదు చేయగా ఇంత వరకు పట్టించుకోలేదు. సొసైటీ, క్వారీ వివరాలు సైతం గోప్యంగా ఉంచడంపై పలు అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. -
బంద్ను విజయవంతం చేయాలి
ఖిలా వరంగల్: వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సోమవారం నిర్వహించే ఫర్టిలైజర్ షాపుల బంద్ను విజయవంతం చేయాలని ది డిస్ట్రిక్ట్ ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొలం సత్యనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్ శివనగర్లోని అసోసియేషన్ భవనంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎరువుల సరఫరా విషయంలో డీలర్లు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఆల్ ఇండియా, తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపులో భాగంగా స్వచ్ఛందంగా షాపుల బంద్ పాటించాలని సూచించారు. శివనగర్లోని అసోసియేషన్ భవనం వద్ద ఉదయం 8.30 గంటలకు డీలర్లు అధిక సంఖ్యలో హాజరై బంద్కు మద్దతుగా నిర్వహించే బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శులు పల్లె రాజేందర్రెడ్డి, గాయపు రాంచంద్రారెడ్డి, జిల్లా కోశాధికారి బీఎన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ లాహోటి, అచ్చ పరమేశ్వర్, సాంస్కృతిక కార్యదర్శులు దేసు ప్రవీణ్, ముక్కెర సతీశ్, సంయుక్త కార్యదర్శి గోమాత సంపత్రెడ్డి పాల్గొన్నారు. -
మరక చెరగాలి
సోమవారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన– పల్లె ప్రగతి 99రోజుల కార్యక్రమం ముగింపు దశకు చేరుకుంటోంది. అయితే ఇందులో ప్రధాన అంశమైన పిల్లల రక్షణ, డ్రగ్స్, గంజాయి రహిత సమాజ నిర్మాణ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. కాగా, ఇప్పటి వరకు ఒంటరిగా గంజాయిపై యుద్ధం చేసిన పోలీస్శాఖ ఇప్పుడు అన్ని శాఖల సమన్వయంతో ప్రజల వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. పెరుగుతున్న కేసులు.. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా.. ఎంత నిఘా పెట్టినా జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించలేని పరిస్థితి నెలకొంది. ఒక వైపు అవగాహన కార్యక్రమాలు చేపడుతుంటే.. మరో వైపు గంజాయి మత్తులో యువత తూగడం, తల్లిదండ్రులను ఇబ్బందులు పెట్టడం వంటి సంఘటనలు ఎక్కువ అవుతున్నాయి. చేతికి అందవచ్చిన కొడుకు ప్రయోజకుడు అయితే చూసి సంబురపడాల్సిన తల్లిదండ్రులు.. మత్తులో ఇబ్బంది పెడుతున్న కొడును గొడ్డలితో కొట్టి చంపడానికి సిద్ధమయ్యారంటే మత్తు ప్రభావం ఎంత తీవ్రగా ఉందో అర్థం అవుతుంది. ఇలా ఒకటి, రెండు గ్రామాలు, మండలాలు కాదు.. జిల్లా మొత్తం ఈ మహమ్మారి వ్యాప్తి చెందింది. వారోత్సవాలతో మరక చెరపాలని.. సోమవారం నుంచి ఆదివారం వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించే డ్రగ్స్, గంజాయి నిర్మూలన కార్యక్రమం విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం మొత్తం సిద్ధమైంది. ఇందుకోసం కలెక్టర్ స్నేహ శబరీష్, ఎస్పీ శబరీష్ అన్ని శాఖల అధికారులతో సమీక్షించినట్లు తెలిసింది. ప్రతీ మండలంలో పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యాశాఖ అధికారులు టీమ్స్గా గ్రామాల్లోకి వెళ్లడం.. అక్కడ ప్రజాప్రతినిధులు, యువత, మహిళా సంఘాలు, విద్యావంతులు, సామాజిక కార్యకర్తలతో మమేకం కావడం, గంజాయి వినియోగంతో కలిగే నష్టాలను ప్రజలకు తెలపడం, గంజాయి తాగినా, అమ్మినా వెంటనే సమాచారం ఇచ్చేలా ప్రజల్లో చైతన్యం తేవాలన్నదే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది. అంతకన్నా ముందుగా గ్రామ సర్పంచ్లు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లతో పోలీస్శాఖ ద్వారా వాయిస్ కాల్స్, గ్రూప్స్ కాల్స్ ద్వారా సమాయత్తం చేస్తున్నారు. వీటితోపాటు 15సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసుగల యువకుల జాబితాను గ్రామాల వారీగా సిద్ధం చేసి వారిపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. ప్రధానంగా వేసవి సెలవుల్లో వారి కదలికపై ఆరా తీయడం, సాయంత్రం పట్టణాలు, గ్రామ శివారుల్లో మఫ్టీలో పోలీసులను పెట్టి వినియోగం, అమ్మకాల గుట్టు రట్టు చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. యువతకు ఆటల పోటీలు నిర్వహించడం, స్కిల్ డవలప్మెంట్ వైపు మళ్లించేలా చూడాలని ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఏది ఏం చేసినా.. ఈ వారం రోజులు జిల్లాలోని ప్రతీ ఒక్కరు కీలకంగా భావించి భాగస్వామ్యులు కావాలని ప్రచారం చేస్తున్నారు. ప్రజాపాలన–పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గంజాయి వారోత్సవాలు అన్నిశాఖల అధికారులతో కలిసి కార్యక్రమాలు నేటి నుంచి గ్రామగ్రామాన గంజాయి నిర్మూలన నినాదాలు ప్రణాళికలు సిద్ధం చేసిన పోలీస్ శాఖ -
కేవీకేలో నూతన ఒరవడి
● రెగ్యులర్ ఉద్యోగులకు స్థానచలనం ● ఒప్పంద విధానంలో నియామకానికి కసరత్తు మహబూబాబాద్ రూరల్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి విజ్ఞాన కేంద్రం సేవల్లో మార్పులు చేస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకు స్థానచలనం కల్పిస్తూ.. వారి స్థానంలో ఒప్పంద విధానంలో ఉద్యోగుల నియామకానికి కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్ర ప్రభు త్వ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్నట్లు సమాచారం. కాగా, మహబూబాబాద్ మండలం మల్యాలలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిధి లోని జెన్నారెడ్డి వెంకటరెడ్డి కృషి విజ్ఞాన కేంద్రంలో పనిచేస్తున్న వారందరూ బదిలీపై వెళ్లనున్నారు. వారి స్థానంలో ఒప్పంద విధానంలో ఉద్యోగులను నియమించనున్నారు. ఐదు సంవత్సరాల ఒప్పంద నిర్ణయం మేరకు ఉద్యోగులను శాస్త్రవేత్తలుగా విధుల్లోకి తీసుకోనున్నట్లు తెలిసింది. ఒక ప్రోగ్రాం కోఆర్డినేటర్.. ఆరుగురు శాస్త్రవేత్తలు కేవీకేలో ప్రస్తుతం రెగ్యులర్ ఉద్యోగులుగా ఒక ప్రోగ్రాం కోఆర్డినేటర్, ఆరుగురు శాస్త్రవేత్తల పోస్టులు ఉన్నాయి. ప్రోగ్రాం కోఆర్డినేటర్గా సీనియర్ శాస్త్రవేత్తను నియమించారు. కాగా, ఒకరు విస్తరణ శాస్త్రవేత్త, ఒకరు హోమ్ సైన్స్, ఒకరు ప్లాంట్ ప్రొటెక్షన్, ఒకరు హార్టికల్చర్, ఒకరు వెటర్నరీ, ఒకరు క్రాప్ ప్రొడక్షన్ విభాగ శాస్త్రవేత్త ఉండాలి. అయితే ఇందులో ప్రోగ్రాం కోఆర్డినేటర్, ఇద్దరు శాస్త్రవేత్తలు ఉండగా.. నాలుగు శాస్త్రవేత్తల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రైతాంగానికి సేవలు... మల్యాల కేవీకే శాస్త్రవేత్తలు జిల్లాలో ఉన్న వివిధ రైతుల పంట పొలాలను సందర్శించి పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రథమ శ్రేణి పరీక్షల ద్వారా కొత్త సాంకేతికతను రైతులకు అందించి వారి ఆదాయాన్ని పెంచడానికి కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఆన్ ఫామ్ టెస్టింగ్ ద్వారా రైతులు కొత్త పద్ధతుల్లో ఎదుర్కొంటున్న సమస్యల గురించి పరిశోధనలు చేసి వివరిస్తారు. జిల్లాలోని యువ రైతులు, మహిళా రైతులను గుర్తించి వారికి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. విత్తనోత్పత్తి ద్వారా కొత్త రకాల వంగడాలు ఉత్పత్తి చేసి రైతులకు అందించడంతో పాటు క్షేత్ర సందర్శనల ద్వారా రైతుల పొలాల్లోని సమస్యలను తెలుసుకుని, అనుగుణంగా సూచనలు, సలహాలు ఇస్తుంటారు. రైతులకు నూతన సాంకేతికతకు సంబంధించిన పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు టీవీలు, రేడియో, న్యూస్ పేపర్ ద్వారా తెలియజేస్తారు. నియామకానికి కసరత్తు.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు మల్యాల కేవీకేలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకు స్థానచలనం కలుగనుండగా ఒప్పంద విధానంలో ఉద్యోగుల నియామకానికి కసరత్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులను ఆర్ఏఆర్ఎస్, డాట్ సెంటర్, అగ్రికల్చర్ కళాశాలలకు బదిలీ చేయనున్నారు. కాగా, ఒప్పంద విధానంలో స్థానికులకు ఉద్యోగాలు వస్తే వారు ఇక్కడి పరిస్థితులపై పట్టు సాధించడంతో పాటు రైతులకు మెరుగైన సేవలు అందించగలుగుతారని భావిస్తున్నారు. -
హేమాచలక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు
● నేటి నుంచి పది రోజుల పాటు కార్యక్రమాలు ● ముస్తాబైన ఆలయం.. తరలిరానున్న భక్తజనంమంగపేట: రెండో యాదగిరిగుట్టగా పేరుగాంచిన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 10 రోజుల పాటు జరిగే తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను ఆగమశాస్త్రం ప్రకారం దేవా దాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. భద్రాచలం సతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకుడుమురళీకృష్ణమాచార్యుల బృందం, ఆలయ అర్చకులతో శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ ఇన్చార్జ్ అధికారి వీరస్వామి తెలిపారు. అత్యంత వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో తగిన ఏర్పా ట్లు చేశారు. అంకురార్పణతో జాతర ప్రారంభం హేమాచల క్షేత్రంలో నేడు(సోమవారం) ఉదయం 6 గంటల నుంచి బ్రహ్మోత్సవాల యాగ్నికులు యా గశాలలో విశ్వక్షేనపూజా, భగవత్ పుణ్యాహ వాచ న, పసరిషత్ ప్రార్థన, రుత్విక్వరణం, రక్షాబంధన ం, ఉత్సవ మూర్తులకు స్నపనం(ఉత్సవాంగస్నపనం), ఆళువార్లకు తిరువంజనం(అభిశేకం), సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పన, 28న మంగళవారం గరుడాదివాసం, 29న ధ్వజా రోహ ణం, 30న ఎదుర్కోలు, మే 1న మధ్యాహ్నం 12.32 గంటలకు అభిజిత్ లగ్నంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లతో తిరు కల్యాణ మహోత్సవం, 2న రథోత్సవం, 3న సదస్యం(వేదాశీర్వచనం), 4న తెప్పోత్సవం, 5న మహాపూర్ణాహుతి, నాకబలి(నాగవెల్లి), 6న ఉదయం 11 గంటలకు వసంతోత్సవం, గజవాహనసేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈఓ తెలిపారు. -
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
ఖిలా వరంగల్ : రైలు కింద పడి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ సుదర్శన్ కథనం ప్రకారం.. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆదివారం ఉదయం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు బ్లాక్ ప్యాంట్, లైట్ గ్రీన్యాష్ క్రీమ్ కలర్ ఫుల్ షర్ట్ ధరించి ఉన్నాడు. వయసు 45– 50 మంది ఉండగా.. ఎత్తు 5.5, నలుపు రంగు, నలుపు, తెలుపు తలవెంట్రుకలు, గడ్డం, మీసాలు కలిగి ఉండి, ఎడమ చేతిపై కాలిన గుర్తులు ఉన్నాయి. మృతుడిని గుర్తుపడితే 9701747014,8712658627 నంబర్లకు సమాచారం అందజేయాలని జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు మహబూబాబాద్ రూరల్ : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం సాయంత్రం మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి జమాండ్లపల్లిలో చోటుచేసుకుంది. రూరల్ బ్లూకోల్ట్స్ పీసీలు సంపత్, బాపూజీ కథనం ప్రకారం.. మండలంలోని నడివాడ జీపీ పరిధి రంగసాయిపేటకు చెందిన బత్తుల సాగర్ బైక్పై ఇంటికి వెళ్తున్నాడు. ఈక్రమంలో వెనుక నుంచి ఓ గుర్తుతెలియని కారు.. బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో సాగర్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108లో వరంగల్ ఎంజీఎం తరలించారు. -
డీజిల్ నిల్..
మహబూబాబాద్: పెట్రోల్ బంక్ల్లో డీజిల్ నిల్వలు నిండుకున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పెట్రోల్ కూడా అరకొరగా ఉంది. ఇదే అదునుగా కొంతమంది డీలర్లు ఎక్కువ కమీషన్ కోసం పవర్ పెట్రోల్ విక్రయిస్తున్నారు. కాగా, యుద్ధాల వల్లే సప్లై తగ్గి డిమాండ్ పెరిగి కొరత ఏర్పడిందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 80పైగా పెట్రోల్ బంక్లు.. జిల్లాలో 80పైగా పెట్రోల్ బంక్లు ఉన్నాయి. హెచ్పీసీఎల్, ఐఏసీఎల్, బీపీసీఎల్ కంపెనీల పెట్రోల్, డీజిల్ను డీలర్లు విక్రయిస్తున్నారు. జిల్లాకు ఎక్కువగా సూర్యాపేట, చర్లపల్లి, వరంగల్ డిపోల నుంచి పెట్రోల్, డీజిల్ సరఫరా అవుతోంది. ఒక్క ట్యాంకర్కు రూ.12 లక్షలు చెల్లిస్తున్నారు. యుద్ధాల కంటే ముందు డిపోల నిర్వాహకులు ముందస్తు డబ్బులు చెల్లించకపోయినా.. డీజిల్, పెట్రోల్ సరఫరా చేసి ఆ తర్వాత వసూలు చేసుకునేవారు. కానీ యుద్ధాల నేపథ్యంలో ఏర్పడిన కొరతతో ముందుగానే డబ్బులు చెల్లించినప్పటికీ సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఐదురోజులకోసారి.. పెట్రోల్, డీజిల్ను ఐదురోజులకోసారి సరఫరా చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం వరకు డబ్బులు చెల్లించకున్నా.. ఫోన్ చేయగానే డిపో నుంచి సరఫ రా చేసే వారు. అయితే రెండురోజులుగా డీజీల్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో వాహన యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధికి ఎఫెక్ట్.. ట్రాక్టర్లు, ఇతర వాహనాలు డీజిల్ లేక నిలిచిపోవడంతో వాటి ద్వారా ఉపాధి పొందే డ్రైవర్లు, కూలీ లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్ లేకపోవడంతో ఆటో డ్రైవర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది బ్లాక్లో కొనుగోలు చేసి నడుపుతున్నారు. వారు అధికంగా డబ్బులు వసూలు చేస్తుండడంతో ప్రయాణికులపై ఆర్థికభారం పడుతోంది. పవర్ పెట్రోల్ విక్రయాలు: పెట్రోల్ లీటర్ ధర రూ.107.62 ఉండగా పవర్ పెట్రోల్ లీటర్ ధర రూ.117.94 ఉంది. రెండింటి మధ్య రూ.10 వ్యత్యాసం ఉంది. పెట్రోల్ కొరత సాకుగా చూపుతూ కొంతమంది డీలర్లు ఎ క్కువ కమీషన్ కోసం పవర్ పెట్రోల్ విక్రయాలు చే స్తున్నారు. దీంతో వాహనదారులు నష్టపోతున్నా రు. సప్లై లేకనే అంటున్న అధికారులు.. డిపోల నుంచి సప్లై తక్కువగా ఉండడం, డిమాండ్ అధికంగా ఉండడంతో సమస్య వస్తుందని అధికా రులు చెబుతున్నారు. ఆన్లైన్ పేమెంట్ చేసిన త ర్వాత ఐదు రోజులకు బంక్లను సరఫరా అవుతుంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు కొన్ని బంక్ల డీలర్లు కాసులకు కక్కుర్తి పడి కల్తీ విక్రయాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో నర్సంపేట రోడ్డులోని ఓ బంక్, తొర్రూరు రోడ్డులోని మరో బంక్లో కల్తీ పెట్రోల్ విక్రయాలు చేశారని వాహనదారులు యాజమాన్యాలతో వా గ్వాదం చేశారు. తనిఖీలు లేకనే.. డీసీఎస్ఓ, తూనికలు, కొలతల అధికారులతో పా టు సంబంధిత అధికారులు బంక్లను తనిఖీ చే యాలి. కానీ, తూతూమంత్రంగా తనిఖీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. తూనికలు, కొలతల రెగ్యులర్ అధికారి లేకపోవడంతో తనిఖీలు చేపట్టడం లేదు. హనుమకొండ తూనికలు, కొలతల అధికారికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. దీంతో డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బంక్ల వద్ద బారులు.. పెట్రోల్ బంక్ల వద్ద వాహనదారులు బారులుదీరుతున్నారు. గంటల తరబడి వాహనాలతో క్యూలో నిలబడుతున్నారు. సమస్య ఎక్కడ ఉంది. దానికి గల కారణాలను ప్రచారం చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. జిల్లాలో అరకొరగా పెట్రోల్ ఇదే అదునుగా పవర్ పెట్రోల్ విక్రయాలు కొంత మంది డీలర్ల దోపిడీ సప్లై తక్కువ డిమాండ్ ఎక్కువతోనే కొరత అంటున్న అధికారులు బంకుల వద్ద వాహనదారుల బారులు -
కొత్తపల్లిగోరిలో విషాదఛాయలు
రేగొండ: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారీమడూరు గ్రామ శివారులోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర డిగ్రీ కళాశాలలో విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన రాచర్ల దేవేందర్–భవాని దంపతుల కుమారుడు కార్తీక్ (19) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం కళాశాల హాస్టల్లో కార్తీక్ బలవన్మరణానికి పాల్పడడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. చేతికి అందివచ్చిన కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. వరంగల్ చౌరస్తా: వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి సందర్భంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన శోభాయాత్ర వైభవంగా సాగింది. వరంగల్ స్టేషన్ రోడ్డులోని పోచమ్మగుడి వద్ద యాత్రను వరంగల్ కలెక్టర్ సత్యశారద ప్రారంభించారు. అతిథులుగా అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ హాజరయ్యారు. కార్పొరేటర్ గందె కల్పన నవీన్, దాచేపల్లి సీతారాం, పొట్టి శ్రీనివాస్, దుబ్బా శ్రీనివాస్ నేతృత్వంలో యాత్ర వరంగల్ హెడ్పోస్టాఫీస్, జేపీఎన్ రోడ్డు, పిన్నావారి వీధి, బట్టలబజార్, రామన్నపేట కన్యకాపరమేశ్వరి ఆలయం వరకు చేరింది. కోలాటాలు, డప్పుచప్పళ్లు, వాసవి మాత స్మరణలో జైత్రయాత్ర కనులపండువగా జరిగింది. కార్యక్రమంలో గుండా నమఃశివాయ, అనంతుల కేదారి, హేంచందర్, శ్రావణి, మిడియాల నూతన్, నాళ్ల సతీశ్, లావణ్య, మంచాల విజయ్, దేవా అరవింద్ తదితరులు పాల్గొన్నారు.కేఎంసీకి అన్ని విధాలా సహకారంకాశిబుగ్గ: చదువుకున్న కేఎంసీకి అన్ని విధాలా సహకారం అందిస్తామని మానకొండూరు ఎమ్మెల్యే, పూర్వ విద్యార్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, పలువురు వక్తలు అన్నారు. ఆదివారం కాకతీయ వైద్య కళాశాల అలుమ్నీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కేఎంసీలోని ఎన్ఆర్ఐ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రముఖ కార్డియాలజిస్ట్ కస్తూరి శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ జార్జ్రెడ్డి, ఉపాధ్యక్షురాలు డాక్టర్ సంధ్యారాణి, ఇతర కమిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ కళాశాలలో అన్ని రకాల వసతుల కల్పన కోసం సహాయ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, లైబ్రరీ పునర్నిర్మాణం కోసం భూమి పూజ చేయగా, లైబ్రరీ అభివృద్ధి కోసం డాక్టర్ కస్తూరి శ్రీధర్ రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుంకరనేని సంధ్య అనిల్, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి, డాక్టర్ బందెల మోహన్రావు, పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వాహనాలు ఢీ.. నలుగురికి గాయాలుహసన్పర్తి : హనుమకొండ–కరీంనగర్ ప్రధాన రహదారిలోని హసన్పర్తి ఎల్లమ్మ దేవాలయం సమీపంలో ఆదివారం ఎదురెదురుగా వాహనాలు ఢీకొనడంతో పలువురికి గాయాలయ్యాయి. నగరానికి చెందిన ఎ.చైతన్య కుటుంబసభ్యులతో కలిసి వేములవాడకు బయల్దేరింది. చైతన్య ప్రయాణిస్తున్న కారు ఎల్లమ్మ గుడి వద్దకు చేరుకోగానే.. కరీంనగర్ నుంచి హనుమకొండ వైపునకు వస్తున్న మరో వాహనం అతివేగంగా వచ్చి చైతన్య ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. ఈఘటనలో చైతన్యతో పాటు వాహనంలో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. ఈఘటనతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ఇరు రూట్లలో ప్రయాణించే వాహనాలు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
డీఎల్ఎస్@ 53 వసంతాలు
కాజీపేట రూరల్: కాజీపేటలోని డీజిల్ లోకోషెడ్ (డీఎల్ఎస్) ఇండియన్ రైల్వేలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈనెల 28వ తేదీన 53 వసంతోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 1973 ఏప్రిల్ 21న నాటి రైల్వే జీఎం పీఎన్ కౌల్ 30 లోకోల కెపాసిటీతో కాజీపేట డీజిల్ లోకోషెడ్ను ప్రారంభించారు. ప్రస్తుతం 638 మంది కార్మికులతో 242 డీజిల్, ఎలక్ట్రిక్ లోకోల నిర్వహణతో భారతీయ రైల్వేలో ప్రత్యేకతను సంపాదించుకుంది. డీజిల్షెడ్ సీనియర్ డీఎంఈ ఎన్వీ వెంకటకుమార్ పర్యవేక్షణలో కార్మికుల విధులు నిర్వర్తించి, లోకోల నిర్వహణ చేస్తారని రైల్వే ట్రేడ్ యూనియన్ల నాయకులు తెలిపారు. ● లోకోల నిర్వహణ : ప్రస్తుతం డబ్ల్యూజీ–7 లోకోలు విద్యుత్ 160, డబ్ల్యూడీజీ–4 లోకోలు 82, టవర్ కార్స్–32, 140 టన్నుల క్రేన్ నిర్వహణ కాజీపేట డీజిల్ లోకోషెడ్ కేంద్రంగా జరుగుతోంది. విద్యుత్ లోకోల వాడకం పెరిగి డీజిల్ లోకోల నిర్వహణ తగ్గుతోంది. ● లోకోల షెడ్యూల్డ్ : లోకో జీవిత కాలంలో 6 సంవత్సరాలకు అన్వల్ ఓవరాలింగ్, 2 సంవత్సరాలకు టర్క్ ఓవరాలింగ్, 3 సంవత్సరాలకు ఇంటర్ మీడియట్ ఓవరాలింగ్, 72 నెలలకు పీరాడికల్ ఓవరాలింగ్ చేస్తారు. ● పనికిరాని 17 లోకోల మరమ్మతు : వినియోగంలో లేని 17 లోకోలను కాజీపేట డీజిల్ లోకోషెడ్ అధికారులు నైపుణ్యం గల కార్మికులతో మరమ్మతు చేయించి తిరిగి పట్టాలపైకి పంపించారు. ఈ సందర్భంగా అధికారులను, కార్మికులను దక్షిణ మధ్య రైల్వే అధికారులు అభినందించారు. ఇతర దేశాల రైల్వేలకు.. కాజీపేట డీజిల్ లోకోషెడ్ నుంచి నైపుణ్యం గల రైల్వే టెక్నీషియన్లు టాంజానియా, ముజాంబిక్, మలేషియా రైల్వేలకు డిప్యుటేషన్పై కొన్ని సంవత్సరాల పాటు వెళ్లారు. అక్కడి రైల్వే పనితీరు తెలుసుకున్నారు. ఎక్స్ప్రెస్ ఇంజన్ల నిర్వహణ.. కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఎక్స్ప్రెస్ ఇంజన్ల నిర్వహణలో పెట్టింది పేరుగా విధులు నిర్వర్తించి అధికారుల నుంచి ప్రశంశలు అందుకున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రయాణించే రాజధాని, కోణార్క్, నాగర్సోల్, ఫలక్నూమా, గంగా కావేరి, జీటీ తదితర ఎక్స్ప్రెస్ల ఇంజన్ల నిర్వహణ 5 ఏళ్ల క్రితం వరకు కాజీపేట డీజిల్షెడ్ వారే చేశారు. కరోనా సమయంలోనూ ఇంజన్ల నిర్వహణ.. కరోనా సమయంలో కూడా కాజీపేట డీజిల్షెడ్ కార్మికులు ఇంజన్ల నిర్వహణ చేశారు. వేరే రాష్ట్రాల ప్రజలను తరలించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టిన కోవిడ్ రైళ్లకు మన వారే ఇంజన్ల లింక్లను పంపించి మానవతా దృక్పథం చాటారు. 2019 నుంచి విద్యుత్ లోకోల నిర్వహణ.. కాజీపేట డీజిల్ లోకోషెడ్లో 2019 నుంచి విద్యుత్ లోకోలను నిర్వహిస్తున్నారు. షెడ్ అధికారుల పర్యవేక్షణలో డీజిల్ ఇంజన్లను నిర్వహించే కార్మికులు శిక్షణ తీసుకొని విద్యుత్ లోకోల నిర్వహణ సైతం చేస్తుండడం విశేషం. ఐదు లోకోల నిర్వహణతో నేడు 162 విద్యుత్ లోకోలను నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు దేశంలో ఏషెడ్డు నిర్వహణ చేయలేని గజరాజ లోకోల నిర్వహణ కూడా కాజీపేట కార్మికులే చేశారు. భారతీయ రైల్వేలో ఉత్తమ షెడ్డుగా గుర్తింపు.. భారతీయ రైల్వేలో 54 డీజిల్ లోకోషెడ్లు ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వేలో గుత్తి, గుంతకల్, మౌలాలి, విజయవాడ, కాజీపేట డీజిల్ లోకోషెడ్లు ఉన్నాయి. వీటిలో కాజీపేట డీజిల్షెడ్ ప్రత్యేకత సంతరించుకుంది. భారతీయ రైల్వేలో ఉత్తమ నిర్వహణ షెడ్డుగా, రైల్వే బోర్డు అవార్డు, రైల్వే జీఎం అవార్డుతోపాటు అనేక అవార్డులు సొంతం చేసుకుంది. ఈ నెల 28వ తేదీన డీజిల్షెడ్ ప్రాంగణంలో రైల్వే అధికారులు, కార్మిక కుటుంబాలతో కలిసి షెడ్డు 53వ వసంతాల వేడుకలు జరుపుకునేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. కాజీపేటలో 1973లో డీజిల్ లోకోషెడ్ ఏర్పాటు నేడు 638 మంది కార్మికులు.. 242 డీజిల్, ఎలక్ట్రిక్ లోకోల నిర్వహణ కరోనా సమయంలో ఇంజన్లను ఇచ్చిన కార్మికులు రేపు వార్షికోత్సవానికి రైల్వే అధికారుల ఏర్పాట్లు -
మండే ఎండకు చెక్ పెట్టేద్దామా?
ఖిలా వరంగల్: ఇంటర్, పదో తరగతి విద్యార్థులకు సెలవులు వచ్చేశాయ్. పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు శనివారం నుంచే ఇచ్చారు. కుటుంబ సమేతంగా స్వగ్రామాలు, బంధువుల ఊళ్లు, విహారయాత్రలకు వెళ్లే సమయం ఇది. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకూ వెళ్తుంటారు. వేసవి తీవ్రత ఏస్థాయిలో ఉందో ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం 8 గంటలు దాటిందంటే అడుగు బయటపెట్టే పరిస్థితి ఉండడం లేదు. సాయంత్రం ఆరుగంటలు దాటినా వేడి, రాత్రి పది గంటలు దాటినా వడగాల్పుల తీవ్రత తగ్గడం లేదు. ఈనేపథ్యంలో ప్రయాణ సమయాల్లో ఆరోగ్యంపై తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే. వడదెబ్బ తీవ్రత, జ్వరాలు తదితర సమస్యలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. అందుకే ప్రయాణాలను ఉదయం పది గంటలలోగా ముగిసేలా, సాయంత్రం ఐదు తర్వాత మొదలయ్యేలా ప్లాన్ చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కొత్త ప్రాంతాలకు వెళ్లినా, నీడ పట్టున ఉండేలా జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు. ప్రయాణంలో ఈ ఆహారం తీసుకోవాలి.. బస్సులు, రైళ్లలో ప్రయాణం చేస్తున్నప్పుడు విటమిన్ బీ లభించే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ముదురు ఆకుపచ్చ రంగులో లభించే కాయగూరలు, ధాన్యాలు, క్యారెట్ ఎక్కువగా తీసుకోవాలి. నీళ్ల బాటిల్, పండ్లరసాలు దగ్గర ఉంచుకుని తరచూ తాగుతుండాలి. తద్వారా శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అందుతుంది. ప్రయాణంలో వాహనాన్ని ఆపినప్పుడు కొబ్బరి నీళ్లు తీసుకోవడం చాలా మంచిది. వదులైన దుస్తులు ధరించాలి. తద్వారా శరీరానికి గాలి బాగా తగులుతుంది. చిన్నపిల్లలపై చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణంలో తీసుకునే ఆహారంలో తగినంత ఉప్పు ఉండేలా చూసుకోవాలి. ఎలక్ట్రోలైట్ ద్రావణాలు (ఓఆర్ఎస్) కూడా వెంట తీసుకెళ్లడం మరువరాదు. పిల్ల లకు లేతరంగు గల పలుచని దుస్తులు వేయాలి. ముఖానికి సన్స్క్రీన్ లోషన్స్ను తప్పనిసరిగా రాసుకోవాలి. వేసవిలో బయట తిరిగేటప్పుడు ఉల్లిపాయపై తొక్క తీసి దాన్ని ప్యాంట్ జేబులో వేసుకోవాలి. మహిళలు హ్యాండ్ బ్యాగ్లో ఉంచుకోవాలి. దీని వల్ల వడదెబ్బ తగలదు. ఉల్లిపాయను సగం కోసి చిన్న పిల్లల చొక్కాలో ఉంచితే మరీ మంచిది. ఉల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మొహమాటానికి పోకుండా ఆరోగ్యం కోసం ఈచిట్కాను పాటించాలి. శీతలపానీయాలు వద్దే వద్దు.. ప్రయాణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూల్ డ్రింక్స్ తాగరాదు. శీతల పానీయాల్లో ఉండే పాస్ఫోరిక్ యాసిడ్ కారణంగా వాంతులయ్యే ప్రమాదం ఉంటుంది. దీనికితోడు చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. రక్తంలో కలవడం వల్ల షుగర్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి. రక్తపోటు పెరుగుతుంది. కూల్ డ్రిక్స్ తాగడం అంటే చిన్న మోతాదులో డ్రగ్స్ తీసుకున్నట్లే అంటున్నారు వైద్యులు. పొంచి ఉన్న వడదెబ్బ ముప్పు సుదీర్ఘ ప్రయాణం వద్దు కూల్ డ్రింక్స్ తాగడం ప్రమాదకరం పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగాలి దాహం వేయకపోయినా నీటిని తీసుకోవాలి వేసవి ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు. ఎండ తీవ్రత వల అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఈ సమయంలోనే శరీరంలోని ఉప్పు శాతం తగ్గిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ద్ర వపదార్థాలను తీసుకోవాలి. పలుచగా ఉండే దుస్తులు వేసుకోవాలి. చిన్నపిల్లలకు ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్లను ఆరగంటకు ఒకసారి తాగించాలి. ఇంటి నుంచి ఆహర పదార్థాలు వెంట తీసుకువెళ్లి చల్లని ప్రదేశంలో ఆరగించడం శ్రేయస్కరం. నూనె పదార్థాలు భుజించరాదు. – డాక్టర్ నరేశ్కుమార్, వైద్యమండలి రాష్ట్ర సభ్యుడు, వరంగల్ -
వద్దంటే వినరే!
పాలకుర్తి టౌన్: పోలీసుల ఆధ్వర్యంలో మైనర్ల డ్రైవింగ్పై అవగాహన కల్పిస్తూ.. కఠిన ఆంక్షలు పెడుతున్నప్పటికీ తల్లిదండ్రులు పెడచెవిన పెడుతున్నారు. మైనర్లకు వాహనాలను అప్పగిస్తుండడంతో పలువరు ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతుండగా.. మరికొంత మంది గాయాలపాలవుతున్నారు. కొన్ని సమయాల్లో మైనర్లతో పాటు ఎదురుగా వస్తున్న వాహనదారులు సైతం ప్రమాదాల బారినపడుతున్నారు. ఇటీవల జరిగిన ఓ ప్రమాదం.. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని గూడూరులో ఈనెల 25న 12 సంవత్సరాల బాలుడు ట్రాక్టర్ నడిపి ఎదురుగా వచ్చిన కారు తప్పించబోయాడు. దీంతో ట్రాక్టర్ బోల్తాపడి పక్కన కుర్చున మరో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మూడేళ్ల జైలు శిక్ష మైనర్ల డ్రైవింగ్పై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. మైనర్లకు వాహనాలిస్తే సదరు యాజమానులు, వాహనం నడిపిన మైనర్ తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తున్నారు. మోటర్ వాహన చట్టం 1988 సెక్షన్ 199(ఏ) ప్రకారం వాహనం ద్వారా మైనర్లు రోడ్డు ప్రమాదాలకు కారకులైతే తండ్రిని దోషిగా పరిగణిస్తారు. అలాగే మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 25వేల జరిమానా విధిస్తారు. కఠిన నిబంధనలున్నా.. మైనర్ డ్రైవింగ్లు, ప్రమాదాలు మాత్రం తప్పట్లేదు. మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు మైనర్లు వాహనాలు నడపడం, వారిని ప్రోత్సహించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు తమ పిల్ల లకు ద్విచక్రవాహనాలు ఇస్తే చట్టరీత్య చర్యలు తీసుకుంటాం. మైనర్ వాహనం నడుపుతూ పోలీసులకు దొరికితే వాహనం సీజ్ చేస్తాం. మైనర్ డ్రైవింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగి ఎదుటి వ్యక్తి మరణిస్తే వాహనం నడిపిన మైనర్కు జైలు, రూ.25 వేల వరకు జరిమానా, యజమానికి సైతం మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది. – దూలం పవన్కుమార్, ఎస్సై, పాలకుర్తి మైనర్ల డ్రైవింగ్తో ప్రమాదాలు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు మైనర్లకు వాహనం ఇస్తే చర్యలు ప్రమాదం జరిగితే మైనర్తో పాటు వాహనం ఇచ్చినవారిపై కేసులు -
1,750 కేజీల నల్లబెల్లం, వంద కేజీల పటిక పట్టివేత
● ఇద్దరిపై కేసు నమోదు మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వరంగల్ ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో వాహన తనిఖీలు చేపట్టగా ఓ వాహనంలో 1,750 కేజీల నల్లబెల్లం, 100 కేజీల పటిక, 20 లీటర్ల గుడుంబా పట్టుబడిందని ఎకై ్సజ్ సీఐ జి.చిరంజీవి ఆదివారం తెలిపారు. ఆ యన కథనం ప్రకారం.. గుడుంబా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం, పటిక, గుడుంబా రవాణాపై ఎన్ఫోర్స్మెంట్ వరంగల్ టీమ్కు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్, ఏటిగడ్డ తండా మధ్య సిబ్బంది తనిఖీ చేశారు. ఇందులో ఏపీలోని చిలకలూరిపేటకు చెందిన కొరవి రవితేజను అదుపులోకి తీసుకుని విచారించగా సీరోలు మండలం సూర్యా తండాకు చెందిన బానోత్ ప్రసాద్తో కలిసి చిత్తూరులో తక్కు వ ధరకు తీసుకొచ్చినట్లు ఒప్పుకున్నాడు. నల్లబె ల్లం, పటిక సుందరయ్య నగర్, ఏటిగడ్డ తండా, సీరోలు మండలం సూర్యా తండాలో అధిక ధరకు విక్రయించి, వారివద్ద నుంచి గుడుంబా కొనుగోలు చేసి పట్టణాల్లో అమ్ముతూ ఉంటామని, వచ్చిన లాభం ఇద్దరం పంచుకుంటామని నేరం అంగీకరించారు. దీంతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ జి.చిరంజీవి తెలిపారు. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ ఎకై ్సజ్ సీఐలు నాగేశ్వరరావు, చంద్రశేఖర్, సిబ్బంది సత్యనారాయణ, శ్రీనివాస్ కుమార్, శరత్ పాల్గొన్నారు. -
హ్యాండ్బాల్ విజేత కొత్తగూడ
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జేఎన్ స్టేడియంలోని హ్యాండ్బాల్ కోర్టులో కొనసాగిన దివంగత ఏఆర్ డీఎస్పీ పీఎస్ శశిధర్ స్మారక 8వ తెలంగాణ రాష్ట్ర హ్యాండ్బాల్ టాలెంట్ హంట్ పోటీలు ఆదివారం ముగిశాయి. అండర్–15 బాలుర విభాగంలో మూడు రోజుల పాటు నిర్వహించిన టోర్నమెంట్లో 33 జిల్లాల నుంచి 25 టీమ్లు హాజరు కాగా , లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు నిర్వహించారు. నువ్వా?నేనా అన్నట్లు సాగిన ఉత్కంఠ పోరులో ఎంఎస్ఎస్ కొత్తగూడ జట్టు విజేతగా నిలిచింది. రన్నరప్గా టీజీటీడబ్ల్యూఆర్జేసీ కాటారం జట్టు, మూడో స్థానంలో టీడబ్ల్యూఎంఎస్ వనపర్తి, నాలుగో స్థానాన్ని టీఎస్ డబ్ల్యూఆర్ఎస్ ఎల్లారెడ్డి జట్టు కై వసం చేసుకున్నాయి. ముగింపు వేడుకలకు హైదరాబాద్ సీఐడీ డీఎస్పీ రవికుమార్, హనుమకొండ డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ హాజరై విజేతలకు ట్రోఫీ, పతకాలు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, టాలెంట్ హంట్ నిర్వహణ కార్యదర్శి శ్యామల పవన్ కుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బైరబోయిన కై లాస్యాదవ్, హ్యాండ్బాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు సాంబశివరావు, రిటైర్డ్ పీడీ రామ్మూర్తి, దివంగత ఏఆర్ డీఎస్పీ పీఎస్ శశిధర్ సతీమణి మమత, తెలంగాణ హ్యాండ్బాల్ రెఫరీస్ బోర్డు చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, పీడీలు హరి, సంపత్, తదితరులు పాల్గొన్నారు. రన్నరప్ కాటారం ముగిసిన టాలెంట్ హంట్ -
కల్లు గీత.. కన్నీటి రాత!
నిటారు చెట్టు అంచును నిమిషాల్లో చేరుకుంటారు. కమ్మటి కల్లు కత్తులతో సావాసం చేస్తుంటారు. ముంతెడంత కల్లును దింపడానికి ముప్పుతిప్పలు పడుతుంటారు. అమృతాన్ని ముక్తాదుకు వేసుకుని ఆకాశమంతటి చెట్టును అడుగులతో కొలుస్తారు. ఈ క్రమంలో పారే కల్లు కోసం ప్రాణాలను పణంగా పెడుతుంటారు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఆ గీతన్నల కుటుంబాలకు భరోసా లేకుండా పోతోంది. ఈనేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. కాజీపేట: కుటుంబ పోషణకు గీత వృత్తిని నమ్ముకున్న కార్మికులను నిత్యం ప్రమాదాలు వెంటాడుతున్నాయి. కల్లు గీయడం కోసం నిత్యం రెండు, మూడుసార్లు తాటి చెట్టు ఎక్కి దిగే కార్మికులకు ప్రమాదాలు తప్పట్లేదు. కల్లు అమ్మి జీవనం సాగించే కార్మికులు దినదిన గండంగా బతుకులను వెళ్లదీస్తున్నారు. ఏళ్లుగా ఇదే వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న కార్మికులు.. మోగిళ్లలో విషపురుగులను తప్పించుకునే క్రమంలో కింద పడి ప్రాణాలు కోల్పోతున్నారు. చెట్లు ఎక్కే క్రమంలో గుండెపోటు, కళ్లు తిరగడం, పనిభారంతో సత్తువ కోల్పోయి కిందపడుతూ మృతి చెందుతున్నారు. మరి కొందరు క్షతగాత్రులవుతున్నారు. కల్లుగీత కార్మిక సంఘం లెక్కల ప్రకారం.. రాష్ట్ర కల్లు గీత కార్మిక సంఘం లెక్కల ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 800 మంది గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు కిందపడి కులవృత్తికి దూరమయ్యారు. వీరిలో 570 మంది మృత్యువాత పడగా 230 మందికిపైగా పాక్షికంగా, శాశ్వత అంగవైకల్యాం పొందారు. మృతి చెందిన కార్మికులకు రూ.5 లక్షల పరిహారం, గాయపడిన వ్యక్తికి రూ.10 వేల చొప్పున ప్రభుత్వం పరిహారం అందిస్తుంది. ప్రభుత్వ పరిహారం కోసం కార్మికుల కుటుంబాలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 22 మంది గీత కార్మిక కుటుంబాలు పరిహారం కోసం ఎదురుచూస్తున్నాయి. వందకు పైగా గీతకార్మికులు గాయాలపాలై మంచాన పడ్డారు. దీనావస్థలో జీవనం సాగిస్తున్నారు. కాటమయ్య కిట్లు ఉన్నప్పటికీ.. గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం అండగా నిలుస్తోందని రాష్ట్ర ప్రభుత్వం ఆ సామాజిక వర్గ ఆరాధ్యదైవం ‘కాటమరాజు’ పేరుతో పథకానికి శ్రీకారం చుట్టింది. పని భద్రత కల్పించడం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కిట్లను వెనుకబడిన తరగతుల (బీసీ) కార్పొరేషన్ ద్వారా విడుతల వారీగా పంపిణీ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 65 వేల మందికి పైగా గీత వృత్తిని కొనసాగిస్తున్నారు. వీరిలో ఇప్పటి వరకు 3,100 రక్షణ కిట్లను అందజేశారు. గీత కార్మికులు చెట్లు ఎక్కినప్పుడు కిందపడకుండా మోకు జారకుండా ఉండేందుకు ధృడమైన బెల్టు, తాడు, మరో మూడు క్లిప్పులున్నాయి. వీటిపై సరైన అవగాహన లేక కొంతమంది పాత వాటినే వాడుతూ మృత్యువాత పడుతున్నారు. మరిన్ని రక్షణ కవచ కిట్లను మంజూరు చేయాలని, వాటి వినియోగంపై అవగాహన కల్పించాలని కార్మిక సంఘాలు, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.పెండింగ్ పరిహారం ఇవ్వాలి.. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న పరిహారాన్ని ప్రభుత్వం వెంటనే విడుదల చేసి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి. తా టి చెట్టుపై నుంచి పడి మృతి చెందిన కుటుంబాలకు ఇచ్చినట్లుగానే వృత్తికి దూరమైన కార్మికులకు సంపూర్ణ పరిహారం అందించాలి. మెడికల్ బోర్డును సంస్కరించాలి. – గౌని సాంబయ్య గౌడ్, రాష్ట్ర కార్యదర్శి ప్రమాదాల బారిన పడుతున్న గీత కార్మికులు ప్రభుత్వ సాయం అందక అవస్థలు సహజ బీమా వర్తింపజేయాలని కార్మికుల డిమాండ్ బీమా వర్తింపజేయాలి.. రాష్ట్రంలో రైతులకు అమలు చేస్తున్నట్లుగా కల్లుగీత కార్మికులకు సహజ బీమాను వర్తింపజేయాలి. కార్మికులు ఎలా మృతి చెందినా ఆ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం ఇచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక బీమా పాలసీని అమలు చేసి గీత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి. – బుర్ర శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నయీంనగర్: హనుమకొండ జిల్లా నడికూడ మండలం నర్సక్కపల్లిలోని చైతన్య ఆవాస విద్యాలయం 2006 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులంతా ఆదివారం ఒక చోట కలుసుకున్నారు. 20 ఏళ్ల తర్వాత ఆదివారం మనుమకొండ నయీంనగర్ ప్రెసిడెంట్ దాబాలో బాల్య స్మృతులు నెమరు వేసుకున్నారు. ఈఆత్మీయ సమావేశాన్ని ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేకంగా వచ్చిన శ్యామ్రెడ్డి సమన్వయంతో ఏర్పాటు చేయగా.. కార్యక్రమానికి పాఠశాల గురువులు హంసారెడ్డి, సంజీవరావు, రవీందర్తో పాటు ఇతర అధ్యాపకులు హాజరయ్యారు. అదేవిధంగా పాఠశాలలో సేవలందించిన కార్మికులు, అటెండర్లు లక్ష్యయ్య, బతుకమ్మను ఆహ్వానించి గౌరవించారు. పూర్వ విద్యార్థులు తిరుపతి, విజయ్, భాస్కర్, రంజిత్, మహేశ్, విజేందర్, రా జ్కుమార్, అనూష, తిరుమల, సంధ్య ఉన్నారు. -
సులభంగా.. వేగంగా
హన్మకొండ: వినియోగదారులు సులభంగా, వేగంగా విద్యుత్ బిల్లులు చెల్లించే విధానం అందుబాటులో ఉంది. ఇంటి వద్ద నుంచి సులువుగా బిల్లులు చెల్లించే అవకాశం విద్యుత్ పంపిణీ సంస్థలు కల్పించాయి. ఏ కాలమైనా సరే బిల్ కలెక్షన్ సెంటర్లకు వెళ్లి క్యూలో గంటల తరబడి నిలబడి చెల్లించడం తప్పుతుంది. డిజిటల్ విధానంలో బిల్లుల చెల్లింపును టీజీ ఎన్పీడీసీఎల్ ప్రోత్సహిస్తోంది. ప్రస్తుత వేసవి కాలంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచి ఉష్ణొగ్రతలు పెరిగిపోతున్నాయి. వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో విద్యుత్ వినియోగదారులు ఇంటి వద్ద నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించాలని టీజీ ఎన్పీడీసీఎల్ అధికారులు సూచిస్తున్నారు. విద్యుత్ బిల్లుల చెల్లింపు కేంద్రాలకు వచ్చి వెళ్లడం, క్యూలో నిలబడడం వంటి వ్యయప్రయాసలు తగ్గుతాయి. ఏటేటా పెరుగుతున్న చెల్లింపులు.. డిజిటల్ చెల్లింపులు ప్రతి ఏటా 10 శాతం పెరుగుతున్నాయి. గణాంకాలను పరిశీలిస్తే హనుమకొండ సర్కిల్ పరిధిలో 2024– 2025 ఆర్థిక సంవత్సరంలో 13,99,677 మంది వినియోగదారులు ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేయగా.. 2025– 2026 ఆర్థిక సంవత్సరంలో 15,73,410 మంది వినియోగదారులు డిజిటల్ విధానం ద్వారా చెల్లింపులు చేశారు. వరంగల్ సర్కిల్లో 2024–2025 సంవత్సరంలో 7.62 లక్షల మంది వినియోగదారులు డిజిటల్ చెల్లింపులు చేయగా, 2025–2026లో 8.20 లక్షలకు పెరిగింది. యాప్లకు ఆదరణ.. ప్రస్తుతం మనం ఉన్న ఈ టెక్నాలజీ యుగంలో డిజిటల్ చెల్లింపుల హవా నడుస్తోంది. గతంలో లాగా గంటల తరబడి లైన్లలో నిల్చొని బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేకుండా.. ఇంట్లోనే కాలు కదపకుండా పనులు పూర్తి చేసే సౌకర్యం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అందుకే డిజిటల్ చెల్లింపులకు, ఆ సేవలను అందించే యాప్లకు ఆదరణ పెరుగుతోంది. గూగుల్ పే, పేటీఎం, ఫోన్పే, భీమ్ వంటి పలు యాప్స్ డిజిటల్ చెల్లింపులకు ఉపయోగకరంగా నిలుస్తున్నాయి. ఈ యాప్లు విద్యుత్ బిల్లుల చెల్లింపుతో పాటు ఇతర సేవలు అందిస్తున్నాయి. పారదర్శకంగా అకౌంటింగ్ వ్యవస్థ విద్యుత్ వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లోని ప్లేస్టోర్లో టీజీ ఎన్పీడీసీఎల్ అని టైప్ చేసి యాప్ను డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో విద్యుత్ బిల్లుపై ఉన్న యూఎస్సీ నంబర్ నమోదు చేసుకొని ప్రతీ నెల బిల్లులను సులభంగా చెల్లించవచ్చు. భారత్ బిల్ పేమెంట్ సిస్టంలో భాగంగా బ్యాంకింగ్ యాప్ల ద్వారా కూడా విద్యుత్ బిల్లులు చెల్లింపు చేసే అవకాశముంది. భీమ్ యాప్, ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా బిల్లులు సులువుగా చెల్లించే సౌకర్యం అరచేతిలో ఉంది. ఇలా చేయడం వల్ల ప్రతి నెల చెల్లించాల్సిన మొత్తంపై ముందస్తు సమాచారం అందుతుంది. అకౌంటింగ్ వ్యవస్థ పారదర్శకంగా, సురక్షితంగా ఉంటుంది. డిజిటల్ విధానంలో విద్యుత్ బిల్లుల చెల్లింపు ప్రోత్సహిస్తున్న టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఏటా 10 శాతం పెరుగుతున్న ఆన్లైన్ పేమెంట్స్ -
వడదెబ్బతో వ్యక్తి మృతి
హన్మకొండ చౌరస్తా: వడదెబ్బతో హనుమకొండ పెద్దమ్మగడ్డకు చెందిన అంబాల సాంబయ్య (55) మృతి చెందాడు. శనివారం మడికొండలో పెయింటింగ్ పనిచేసిన సాంబయ్య సాయంత్రం ఆటోలో ఇంటికి బయలుదేరాడు. పెద్దమ్మగడ్డ వద్ద ఆటో దిగిన నిమిషాల వ్యవధిలోనే కళ్లు తిరిగి కిందపడ్డాడు. స్థానికుల సాయంతో ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య స్వరూప, కుమారుడు శ్యామ్, కూతురు సరిత ఉన్నారు. ప్రభుత్వం ఆ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బీసీ కాలనీలో మరో వ్యక్తి.. పరకాల: వడదెబ్బతో పరకాల బీసీ కాలనీకి చెందిన కోకిల తిరుపతి( 43) మృతి చెందాడు. శనివారం ఉప్పర పనికి వెళ్లిన తిరుపతి.. రాత్రి అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించి పరకాల ప్రభుత్వ ఆస్పపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. -
మొక్కజొన్న పంట దగ్ధం
కేసముద్రం: ప్రమాదవశాత్తు నిప్పంటుకుని 15 ఎకరాల మొక్కజొన్న పంట దగ్ధమైన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని తాళ్లపూసపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దొంతరబోయిన కొమురయ్య 3 ఎకరాలు, సురేశ్ 2 ఎకరాలు, ఐలయ్య 3 ఎకరాలు, జక్కుల కట్టమల్లు 3 ఎకరాలు, ఐలయ్య 4 ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశాడు. ఈ క్రమం రైతులు సగం వరకు కంకులను ఏరి కుప్పలుగా పోసుకోగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. గమనించిన రైతులు, స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఇంతలో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కానీ, అప్పటికే పూర్తిస్థాయిలో మొక్కజొన్న కంకులు కాలిపోయాయని, మొత్తం రూ.15 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు వాపోయారు. షార్ట్ సర్క్యూట్తోనే మొక్కజొన్న పంటకు నిప్పంటుకుందని వారు పేర్కొన్నారు. సంఘటనా స్థలానికి విద్యుత్ అధికారులు చేరుకుని పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరగలేదని ఏఓ రాజు తెలిపారు. తాళ్లపూసపల్లిలో ఘటన -
వేసవి దుక్కులతో అధిక దిగుబడి
దుగ్గొండి: వేసవికాలం మొదలైంది. యాసంగి పంటలు దాదాపుగా చేతికి వచ్చాయి. రైతులు ఎండాకాలంలో దుక్కిదున్నడం గతేడాది పంట అవశేషాలను ఏరి కాల్చివేయడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. జూన్లో తొలకరి వర్షాలు రాగానే విత్తనాలు సమకూర్చుకుంటారు. సాగుకు ముందే రైతులు ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగితే అధిక దిగుబడులు సాధించవచ్చునని వరంగల్ ఏరువాక కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త విజయ్భాస్కర్ వివరించారు. వేసవిలో రైతులు చేపట్టాల్సిన పనులు, సూచనలు సలహాలు ఇచ్చారు. భూసార పరీక్షలు.. భూమిలో సారం ఎంత ఉంది? ఏ భూమిలో ఏ పంట వేయాలని నిర్ధారించుకోవడానికి భూసార పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి. భూసార పరీక్షల కోసం మట్టిని సరైన పద్ధతిలో తీసుకోవాలి. భూసార పరీక్షల్లో భూమిలో ఏ పోషకాలు ఉన్నాయి.. తక్కువగా ఉన్నవి ఏమిటి? ఎంత ఎరువులు వేయాలి, ఏ పంటను సాగు చేస్తే దిగుబడి వస్తుందని పరీక్షల్లో తేలుతుంది. భూసార పరీక్షలతో అదనపు ఖర్చులు తగ్గించుకునే అవకాశం ఉంది. నూతన ఆధునిక యంత్రాల వినియోగం, సాంకేతిక పరిజ్ఞానం పాటించడంతో అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. వ్యర్థాలను నేలలోనే కలియదున్నాలి.. రైతులు తమ పంట కమతాల్లో సాగు చేసిన పత్తి, మొక్కజొన్న అవశేషాలను కోసి కుప్పగా చేసి కాల్చుతుంటారు. అలా కాకుండా పత్తి మొదళ్లు, మొక్కజొన్న సొప్పను వృథా చేయకుండా మొదట రోటోవేటర్తో కలియదున్నాలి. అనంతరం ట్రాక్టర్ నాగలితో దున్నాలి. మరోసారి రోటోవేటర్తో కలియదున్నాలి. ఈ విధంగా చేయడంతో నేల సారవంతంగా మారి పత్తి, ఇతర పంటలు వేసుకుంటే పంటకు బయటినుంచి అందించాల్సిన ఎరువుల భారం తగ్గుతుంది. భూసార పరీక్షలు కీలకం సాగు ప్రణాళిక.. పంటకు మేలు వరంగల్ ఏరువాక కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త నాగభూషణం -
‘అక్షర కురుక్షేత్రాన్ని’ సమాజంలోకి తీసుకెళ్లాలి
కాశిబుగ్గ: అక్షర కురుక్షేత్రాలాంటి గ్రంథాలను సమాజంలోకి తీసుకెళ్లాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు అన్నారు. శనివా రం భండారు రమాదేవి, చంద్రమౌళీశ్వర్రావు మె మోరియల్ ట్రస్ట్ వరంగల్ ఆధ్వర్యంలో డాక్టర్ భండారు ఉమామహేశ్వర్రావు రచించిన సమగ్ర వచ న ఆంధ్ర మహాభారతంలోని ఆది, సభా, విరాట, ఉద్యోగ పర్వచతుష్టయ గ్రంథావిష్కరణ మహోత్సవం వరంగల్లోని ఐఎంఏ హాల్లో నిర్వహించా రు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ రాజేశ్వర్రా వు మాట్లాడుతూ డాక్టర్ ఉమామహేశ్వర్రావు చి ల్డ్రన్స్ స్పెషలిస్టుగా విధులు నిర్వర్తిస్తూ, మరోవైపు సమాజంలో మార్పు కోసం గ్రంథాలు రచించడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం మహాభారతంలోని నాలుగు గ్రంథాలను ఆవిష్కరించి ముందుకు తీసుకెళ్లడం ప్రశంసనీయమన్నారు. వనం లక్ష్మీకాంతారావు సంయోజకత్వంలో సాగిన సభలో డాక్టర్ ఉమామహేశ్వర్రావు ప్రతిష్టాత్మకంగా రచించిన ఆంధ్రభారత వచన కావ్య పర్వాలు, ఆది, సభా, విరాట ఉద్యోగ పర్వాలను ప్రముఖ పండితలు డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా డాక్టర్ దహగాం సాంబమూర్తి ఆదిపర్వాన్ని, డాక్టర్ కసిరెడ్డి వెంకట్రెడ్డి సభా ప ర్వాన్ని, గిరిజా మనోహనాబాబు విరాటపర్వం, డాక్టర్ ఎన్వీఎన్ చారి ఉద్యోగ పర్వాన్ని సమీక్షించారు. కవులు ఎస్వీఎన్ శర్మ, డాక్టర్ ఎల్ఎస్ఆర్కె ప్రసాద్, పొట్లపల్లి శ్రీనివాస్, వాసిరెడ్డి కృష్ణారావు, వీఆర్ విద్యార్థి, సీహెచ్ శివరావు, వై.నాగయ్య, మో త్కూరు మనోహరారావు, వాణి ప్రసాద్, అవధాని చేపూరి శ్రీరామ్, అనిల్ ప్రసాద్, కంది శంకరయ్య, జేఎన్ శర్మ, మండువ రామగోపాల్రావు, మండువ రవీందర్రావు, వెలుగు ప్రభాకర్ పాల్గొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్వర్రావు -
మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి
● మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రాయపర్తి: గన్నీ సంచులతో మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సంచుల కొరత సమస్య పరిష్కరించి వర్షం రాకముందే కాంటాలు పెట్టి అన్నదాతలను ఆదుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. మొక్కలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు రైతులు శనివారం మండల కేంద్రంలోని వరంగల్, ఖమ్మం జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొని మాట్లాడారు. గన్నీ సంచుల కొరతతో మొక్కజొన్న రైతులు ఆగమవుతున్నారని, వెంటనే సమస్య పరిష్కరించి కొనుగోళ్లు చేపట్టాలన్నారు. అనంతరం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి నిర్వాహకులతో మాట్లాడారు. తాము వస్తున్నామని కాంటాలను మొదలు పెట్టడం ఏంటని, త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ సత్యశారద, డీఎంతో ఫోన్లో మాట్లాడారు. వర్షం వస్తే ప్రభుత్వానిదే బాధ్యతని, తడిసిన ప్రతీ మొక్కజొన్న గింజను కొనుగోలు చేయాలన్నారు. లేని పక్షంలో ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మూనావత్ నర్సింహానాయక్, మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రంగు కుమార్గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి పూస మధు, గారె నర్సయ్య, ఐత రాంచందర్, రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాత కష్టం అగ్గిపాలు
బయ్యారం: పంటచేనుల మధ్య ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను బుగ్గిపాలు చేశాయి. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పండించిన పంట చేతికి వచ్చిన సమయంలో కళ్లెదుటే కాలిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తగూడెం గ్రామ సమీపంలోని ధరావత్ హరిలాల్ మొక్కజొన్న చేనులో శనివారం వ్యాపించిన మంటలు నిమిషాల్లోనే సమీపంలోని చేనులకు వ్యాపించాయి. ఈ మంటలు సుమారు వంద ఎకరాల్లోని పంటభూములకు వ్యాపించగా ఇందులో 30 ఎకరాల్లో విరిచి కుప్పలుగా పోసిన కంకులు కాలిపోయాయి. అదేవిధంగా మంటలు వ్యాపించిన భూముల్లో ఉన్న 40 బోర్లతో పాటు పైపులు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ. 30 లక్షల నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనావేస్తున్నారు. కొత్తగూడెం గ్రామాన్ని చుట్టుముట్టిన మంటలు.. మొక్కజొన్న సొప్పతోపాటు కంకులకు అంటుకున్న మంటలు గ్రామాన్ని చుట్టుముట్టాయి. దీంతో స్థానికులతో పాటు ఘటనాస్థలికి చేరుకున్న గార్ల–బయ్యారం సీఐ రవీందర్ మహబూబాబాద్ అగ్నిమాపక సిబ్బంది సహకారంతో గ్రామానికి మంటలు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. నిమిషాల్లోనే మంటలు వేగంగా వ్యాపించడంతో కొత్తగూడెం, లింగగిరి గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పెద్దకోమటిపల్లి–గణేశ్పల్లి గ్రామ శివారులో.. మొగుళ్లపల్లి: షార్ట్ సర్క్యూట్తో 30 ఎకరాల మొక్క జొన్న పంట కాలిపోయింది. ఈ ఘటన శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్దకోమటిపల్లి–గణేశ్పల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ట్రాన్స్ఫార్మర్ నుంచి వెలువడిన మంటలతో పక్కనే ఉన్న మొక్క జొన్న పంటకు నిప్పు అంటుకుంది. దీంతో ఆ మంటలు చుట్టుపక్కల పంటలకు వ్యాపించడంతో దాదాపు 30 ఎకరాల్లో మొక్క జొన్న పంట అగ్నికి ఆహుతైంది. దీనిపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పారు. పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకున్నారు. ఆర్ఐ శివరామకృష్ణ సందర్శించి వివరాలను అడిగి తెలుకున్నారు. ట్రాన్స్ఫార్మర్ల నుంచి చెలరేగిన మంటలు పలుచోట్ల అగ్నికి ఆహుతైన మొక్కజొన్న పంట కొత్తగూడెంలో 30 ఎకరాలు, 40 బోర్లు, పైపులు దగ్ధం పెద్దకోమటిపల్లి–గణేశ్పల్లి శివారులో 30 ఎకరాలు లక్షలాది రూపాయల నష్టం కన్నీరుమున్నీరవుతున్న రైతులు -
కేంద్రం నూతన చట్టాలను సవరించాలి
● ఆలిండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కె. సత్యనారాయణకేయూ క్యాంపస్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందని ఆలిండియా లాయర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కె. సత్యనారాయణ అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కేయూలోని కెమిస్ట్రీ విభాగం సెమినార్హాల్లో శనివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ‘లా’ విద్యార్థుల కన్వెన్షన్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుందని, దీనిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవాదులుగా సమాజంలో ఏ విధంగా తమ బాధ్యతలు నిర్వర్తించాలనే అంశంపై కూడా వివరించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు మాట్లాడుతూ ప్రైవేట్ ‘లా’ కళాశాలల్లో అధిక ఫీజులు నియంత్రించాలన్నారు. ప్రభుత్వ ‘లా’ కళాశాలల్లో మిగిలిపోతున్న సీట్లను కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అఽధ్యక్షుడు దామెర కిరణ్, రాష్ట్ర ‘లా’ కన్వీనర్ విఘ్నేష్, కోకన్వీనర్ రమ్య, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు స్టాలిన్, జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ , కేయూ కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్కుమార్లోథ్ మాట్లాడారు. బాధ్యులు సహన, సంజన, భరత్ తదితరులు పాల్గొన్నారు. తొలుత ‘లా’ విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ బాధ్యులు క్యాంపస్లోని గెస్ట్హౌస్ నుంచి కెమిస్ట్రీ విభాగం వరకు ర్యాలీ నిర్వహించారు.వడదెబ్బతో మహిళా కూలీ మృతి గీసుకొండ: వడదెబ్బతో వరంగల్ జిల్లా గీసుకొండ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన ఎండీ యాకూబీ(65) మృతి చెందింది. యాకూబీ శుక్రవారం గ్రామంలో మిరప తొడిమెలు ఏరడానికి వెళ్లి అస్వస్థతకు గురై ఇంటికి వెళ్లింది. శనివారం ఉదయం విరేచనాలు అయ్యి నీరసించింది. దీంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందిందని గ్రామస్తులు, మృతురాలు బంధువులు తెలిపారు. కాగా, సర్పంచ్ రడం భరత్ ఆధ్వర్యంలో గ్రామస్తులు మృతురాలి కుటుంబానికి రూ. 10 వేల సాయం అందించారు. మర్రిపల్లిగూడెంలో వృద్ధుడు.. కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండంలం మర్రిపల్లిగూడెం గ్రామానికి చెందిన సాదుల నరహరి (65) వడదెబ్బతో మృతి చెందాడు. నరహరి గత శుక్రవారం మోదుగ ఆకుల (విస్తరి ఆకులు) సేకరణ కోసం గ్రామ శివారులోకి వెళ్లి వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. అప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు. శనివారం మరోసారి అస్వస్థతకు గురి కావడంతో కుటుంబీకుల సమాచారం మేరకు 108 సిబ్బంది వచ్చి పరీక్షించగా అప్పటికే మృతి చెందాడని గ్రామస్తులు, బంధువులు తెలిపారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. -
విద్యార్థుల్లో నైపుణ్యం పెంపు
ఆటాపాటల మేళవింపు..న్యూశాయంపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ ఇప్పుడు మైనార్టీ గురుకులాల్లో కొత్త కాంతులు నింపుతోంది. కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, క్రీడా పటిమను వెలికి తీసేందుకు తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (టెమ్రిస్) నడుం బిగించింది. వేసవి సెలవులు, ప్రత్యేక విరామ సమయాలను వృథా చేయకుండా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రత్యేక క్రీడా సాంస్కృతిక శిబిరాలు (సమ్మర్ స్పెషల్ క్యాంపులు) విద్యార్థుల భవిష్యత్కు బలమైన పునాదులు వేస్తున్నాయి. శిక్షణ శిబిరాల ప్రధాన ఉద్దేశం.. శిక్షణ శిబిరాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచి వారిలోని ప్రత్యేక ప్రతిభను గుర్తించి నైపుణ్య వికా సానికి తోడ్పతాయి. క్రీడలతో క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే తత్వం అలవాటు పడుతుంది. సాంకేతిక నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగవుతాయి. విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా మైదానాల్లో చెమట చిందించి, వేదికలపై తమ కళను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. చదువుతో పాటు ఆటాపాటల్లోనూ మేటి అని నిరూపించేందుకు వేదికలు గొప్ప అవకాశాలుగా మారుతాయి. వసతులు–క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ శిక్షణ శిబిరాల్లో పాల్గొనే విద్యార్థులకు ప్రభుత్వం పౌష్టికాహారంతోపాటు ప్రత్యేక స్పోర్ట్స్ కిట్స్ అంది స్తుంది. ఎంపిక చేసిన రెండు కేంద్రాల్లో ఉదయం, సాయంత్రం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రొఫెషనల్ కోచ్లు, విషయ నిపుణులు క్షేత్ర స్థాయిలో శిక్షణ అందిస్తున్నారు. ఫలితంగా విద్యార్థులు శిబిరాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కలెక్టర్, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి, రీజినల్ లెవల్ కో–ఆర్డినేటర్, విజిలెన్స్ అధికారులు స్వయంగా క్యాంపులను సందర్శించి విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతులు, శిక్షణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఒకే చోట చేరడం వల్ల వారిలో స్నేహ, సోదరభావం, ఐక్యత నెలకొంటుందని అధికారులు చెబుతున్నారు.టెమ్రిస్ ఆధ్వర్యంలో సమ్మర్ స్పెషల్ క్యాంపులు క్రీడలు, సాంస్కృతిక తదితర అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఈనెల 18 నుంచి 30వ తేదీ వరకు నిర్వహణ ఉత్సాహంగా పాల్గొంటున్న ఉమ్మడి జిల్లాలోని 16 గురుకులాల విద్యార్థులురెండు గురుకులాల్లో సమ్మర్ ప్రత్యేక క్యాంపులుఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 16 గురుకుల పాఠశాలల నుంచి 5 నుంచి 8వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్న 200 మంది బాలికలు, 200 మంది బాలురను ఎంపిక చేసి మొత్తం 400 మంది బాలబాలికలకు ఈనెల 18 నుంచి 30వ తేదీ వరకు 13 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. వరంగల్ జిల్లా పరిధిలోని రంగశాయిపేట శివారు జక్కలొద్ది వరంగల్(బీ1)లో 200 మంది బాలురకు, వరంగల్(జీ2) శంభునిపేట బాలికల గురుకులంలో మరో 200 మంది బాలికలకు భోజన, వసతులు కల్పించారు. వీరందరికీ క్రీడలు, సాంస్కృతిక అంశాల్లో శిక్షణ అందిస్తున్నారు. విద్యార్థులకు నిపుణులైన కోచ్ల పర్యవేక్షణలో అథ్లెటిక్స్, ఖోఖో, వాలీబాల్, టెన్నికాయిట్, హాకీ, బాక్సింగ్, రెజ్లింగ్, ఫుట్బాల్, క్రికెట్, కబడ్డీ, కరాటే, చెస్, కుంగ్ ఫూ, మార్షల్ ఆర్ట్స్తో పాటు మోటివేషన్ క్లాస్లు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి శిక్షణ అందిస్తున్నారు. శిక్షణలో ఎంపికై న విద్యార్థులను రాబోయే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం చేయాలనే ప్రధాన ఉద్దేశంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. క్రీడలు, కళలు, విద్యను అనుసంధానిస్తూ ప్రభుత్వం చేపట్టిన ఈ చొరవపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.సమ్మర్ క్యాంపులు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపుతాయి సమ్మర్ క్యాంపులు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలికితీయగానికి ఉపయోగపడుతాయి. క్రీడలు, కళలు, విద్యను అనుసందానిస్తూ ప్రభుత్వ చేపట్టిన చొరవ హర్షణీయం. క్రీడలతో విద్యార్థుల్లో శారీరక దృఢత్వం పెరుగుతుంది. విరామ సమయం వృథా చేయకుండా వేసవి సెలవుల్లో నైపుణ్యాలను నేర్చుకుంటారు. – మహ్మద్ హబీబుద్దీన్, క్రీడాభిమాని, రిటైర్డ్ లేబర్ ఆఫీసర్ -
ప్లేస్మెంట్లో ‘ఎస్సార్’ అగ్రస్థానం
● చాన్స్లర్ ఎ. వరదారెడ్డిహసన్పర్తి : ప్లేస్మెంట్లో ఎస్సార్ యూనివర్సిటీ అగ్రస్థానంలో ఉందని ఆ యూనివర్సిటీ చాన్స్లర్ ఎ. వరదారెడ్డి అన్నారు. శనివారం ఎస్సార్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్–2026 సక్సెస్ మీట్ నిర్వహించారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చాన్స్లర్ ఎ.వరదారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ, కృషి, సరైన మార్గదర్శకం విద్యార్థులు సాధించిన విజయాలకు ఫలితమని పేర్కొన్నారు. విద్యార్థులు తమ నైపుణ్యాలు నిరంతరం వృద్ధి చేసుకుంటూ కొత్త సాంకేతికతను ఆచరణలో పెట్టి పరిశ్రమ అవసరాలకనుగుణంగా సిద్ధంగా ఉంచాలన్నారు. ఈఏడాది 1,300 మంది విద్యార్థులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించినట్లు చెప్పారు. కొన్ని కంపెనీల్లో నియామక ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఈసంఖ్య మరింత పెరుగుతోందని వివరించారు. అదనంగా 1,500మంది విద్యార్థులు ఇంటర్న్షిప్ అవకాశాలు సాధించారని తెలిపారు. కళాశాల వైస్ చాన్స్లర్ దీపక్ గార్గ్ మాట్లాడుతూ విద్యార్థులు సమస్య పరిష్కార నైపుణ్యాలు, విశ్లేషణాత్మక ఆలోచన, ప్రొఫెషనల్ విలువలను పెంపొందించుకోవాలన్నారు. గ్లోబల్ స్థాయిలో పోటీ పడేందుకు అవసరమైన నైపుణ్యాలపై దృష్టి సారించాలన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డీన్ డాక్టర్ అర్చనారెడ్డి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ సునీల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన సరదా..
పాలకుర్తి టౌన్: సరదా.. ప్రాణం తీసింది. వేసవి సెలవులో ఓ బాలుడు తన స్నేహితుడి వద్దకు వెళ్లాడు. అనంతరం ఇద్దరు కలిసి సరదాగా ట్రాక్టర్పై వ్యవసాయ భూమి వద్దకు వెళ్తున్నారు.ఈ క్రమంలో మార్గమధ్యలో కారు ఎదురుగా రావడంతో దానిని తప్పించబోయి ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాగా మరో బాలుడు ప్రాణంతో బయటపడ్డాడు. ఈ ఘటన శనివారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరులో చోటు చేసుకుంది. ఎస్సై దూలం పవన్కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కాసోజు బ్రహ్మచారి, ఉపేంద్ర దంపతుల రెండో కుమారుడు సాయి సంగీత్(15) గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదవి ఇటీవల పదో తరగతి పరీక్ష రాశాడు. ఈ క్రమంలో స్నేహితుడు యాదనాల నితిన్తో కలిసి ట్రాక్టర్పై అతడి వ్యవసాయ బావిద్దకు వెళ్తున్నారు. నితిన్ ట్రాక్టర్ నడుపుతుండగా, సాయి సంగీత్ పక్కన కూర్చున్నాడు. వ్యవసాయ బావి సమీపంలో ముర్సుగడ్డ తండా వద్ద ఎదురుగా కారు వచ్చింది. దీంతో నితిన్ కారును తప్పించే క్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పి రోడ్డు పక్క ఉన్న కంధకంలోకి వెళ్లి బోల్తాపడింది. ఈ ఘటనలో సాయిసంగీత్ అక్కడికక్కడే మృతి చెందాడు. నితిన్ ఇంజన్పై నుంచి దూకి ప్రాణం కాపాడుకున్నాడు. సరదా కోసం వెళ్లి ప్రాణం పోగొట్టుకున్నావా బిడ్డా అంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు ప్రతీ ఒక్కరిని కంటతడికి గురి చేసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి బ్రహ్మచారి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.● ట్రాక్టర్ నడిపిన బాలుడు.. పక్కన కూర్చున్న మరో బాలుడు ● ఎదురుగా వచ్చిన కారును తప్పించబోయి ట్రాక్టర్ బోల్తా ● ఈ ఘటనలో పక్కన కూర్చున్న బాలుడు అక్కడికక్కడే మృతి ● గూడూరులో విషాదం -
భూసమస్యల పరిష్కారానికి ‘భూ భారతి’
మహబూబాబాద్ రూరల్ : తెలంగాణ రాష్ట్రంలో రైతాంగ భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని భూ భారతి చట్ట రూపకర్త, రాష్ట్ర రైతు, వ్యవసాయ కమిషన్ సభ్యుడు భూమి సునీల్ కుమార్ అన్నారు. భూమి చట్టాలు, భూ రికార్డులు, భూ భారతి చట్టంపై మ హబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బార్ అసోసియేషన్ హాల్లో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మా ట్లాడారు. ప్రతీ రైతు తప్పనిసరిగా భూ సర్వే చేయించుకోవాలని, పాస్ పుస్తకాలు కలిగి ఉండాలని, ఆ పుస్తకాల్లో తప్పులు ఉంటే వెంటనే సరి దిద్దుకోవాలని సూచించారు. త్వరలో భూమికి భూ ఆధార్, భూయజమానులకు భూఆధార్ కార్డులు రానున్నాయని, గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ, రిజిస్ట్రేషన్లలో మార్పులు రానున్నాయన్నారు. రాష్ట్రంలోని 5 మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా భూ భారతి చట్టం పనులు ప్రారంభించారని తెలిపారు. సీనియర్ సివిల్ జడ్జి శాలిని షాకెల్లి, జూనియర్ సివి ల్ జడ్జి స్వాతి మురారి, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మామిడాల సత్యనారాయణ, జంగం సిద్ధార్థ, న్యాయవాదులు, రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర రైతు, వ్యవసాయ కమిషన్ సభ్యుడు భూమి సునీల్ కుమార్ -
కట్టుకోబోయేవాడే చంపాడు..
మరిపెడ: ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించారు. వివాహ ముహూర్తానికి వారం రోజులే సమయం.. ఆలోగా కాబోయే భార్యపై అతనికి అనుమానం మొదలైంది. పక్కా ప్లాన్ప్రకారం పండుగ కోసం అని పిలిపించి ఓ బావిలో తోసి చంపాడు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసి పోలీసులు కటకటాల్లోకి పంపారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్స్టేషన్లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఐ పవన్కుమార్ వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తతండాకు చెందిన అజ్మీరా అరవింద్.. మరిపెడ మండలం ఇటుకలగడ్డతండాకు చెందిన భూక్య సంగీత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో కొంతకాలం దూరంగా ఉన్నారు. మళ్లీ మాట్లాడుకుని ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించారు. ఈనెల 29న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. కానీ, సంగీత వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని అరవింద్ అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆమె అడ్డు తొలగించుకోవాలని ప్లాన్వేశాడు. ఈ క్రమంలో ఈ నెల 21వ తేదీన తన ఇంట్లో ఎల్లమ్మ పండుగ ఉందని చెప్పి సంగీతను ఇంటిదగ్గరే ఉండమని చెప్పి ఆమె కుటుంబ సభ్యులను కొత్తతండాకు పిలిపించాడు. అరవింద్ ఇటుకలగడ్డతండాకు బైక్పై వెళ్లి సంగీతను ఊరి చివరకు రమ్మని చెప్పాడు. వచ్చిన తర్వాత ఆమెను బైక్పై ఎక్కించుకొని ఇదే మండలం గారిపురం శివారు రోడ్డు వెంబడి ఉన్న బావి వద్దకు తీసుకెళ్లాడు. పథకం ప్రకారం మాటల్లో పెట్టి బావిలోకి తోసేశాడు. ఆమె చనిపోయేంతవరకు అక్కడే ఉన్నాడు. చనిపోయినట్లు నిర్ధారించుకుని తిరిగి కొత్తతండాకు వచ్చాడు. మొదట అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం కాబోయే భర్త అరవిందే నిందితుడిగా నిర్ధారించారు. అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సైలు వీరభద్రరావు, కోటేశ్వరరావు పాల్గొన్నారు. కాబోయే భార్యను అనుమానంతో బావిలో తోసిన వ్యక్తి చనిపోయిందని నిర్ధారించుకున్నాక ఇంటికి.. నిందితుడి అరెస్ట్.. కోర్టులో హాజరు.. వివరాలు వెల్లడించిన మరిపెడ సీఐ పవన్కుమార్ -
సృజనాత్మకతను వెలికితీయాలి
● అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో తొర్రూరు: విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాలు పెంపొందించేందుకు వేసవి శిక్షణ శిబిరాలు దోహదపడుతాయని అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. ఎస్సీ అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో శనివారం డివిజన్ కేంద్రంలోని సమీకృత వసతి గృహంలో వసతి గృహాల విద్యార్థులకు వేసవి శిబిరాన్ని ప్రారంభించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థుల ఉన్నతికి ప్రభుత్వం వసతిగృహాలు, గురుకులాల ద్వారా కృషి చేస్తోందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలంటే నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలన్నారు. మే 24 వరకు వేసవి శిక్షణ శిబిరాలు కొనసాగుతాయని, రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల విద్యార్థులు వివిధ అంశాలపై తర్ఫీదు పొందుతారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్కుమార్, డీఎల్పీఓ ఆర్. పుల్లారావు, ఎంపీడీఓ కూస వెంకటేశ్వర్లు, కమిషనర్ వక్కల శ్యాంసుందర్, వార్డెన్లు సదానందం, మధురిమ తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలి బయ్యారం: ఇల్లెందు నియోజకవర్గ పరిధిలోని బయ్యారం, గార్ల మండలాల్లో నెలకొన్న పలు సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్కను శనివారం ఎమ్మెల్యే కోరం కనకయ్య కలిసి వినతిపత్రాలు అందజేశారు. మండలంలోని కొత్తపేట పంచాయతీలోని ఇల్లెందు రోడ్డు నుంచి గార్ల మండలం అంకన్నగూడెం వరకు రహదారిని నిర్మిస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని వీటితో పాటు పలు సమస్యలను ఎమ్మెల్యే మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. కొత్తపేట సర్పంచ్ ప్రవీణ్నాయక్, సొసైటీ మాజీ చైర్మన్ మధుకర్రెడ్డి, మాజీ డైరెక్టర్ ప్రభాకర్రెడ్డి ఉన్నారు. మలేరియా రహిత సమాజాన్ని నిర్మించాలి● డీఎంహెచ్ఓ రవిరాథోడ్ కురవి: మలేరియా రహిత సమాజాన్ని నిర్మించాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. శనివారం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని కురవి పీహెచ్సీ ఆధ్వర్యంలో డీఎంహెచ్ఓ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని తెలిపారు. దోమ కాటు వల్ల మలేరియా జ్వరం వచ్చే అవకాశాలున్నాయని వివరించారు. దోమ తెరలు వాడి దోమల నుంచి రక్షించుకోవాలని సూచించారు. జ్వరం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సారంగం, డాక్టర్ విరాజిత, డాక్టర్ నాగేశ్వర్రావు, భిక్షపతి, గౌసుద్దీన్, లింగారెడ్డి, రాజకుమారి, నీరజ, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఫర్టిలైజర్స్ సరఫరాలో ఆంక్షలు విధించొద్దు మహబూబాబాద్ రూరల్: ఫర్టిలైజర్స్ సరఫరాలో ఎలాంటి లింకు ప్రొడక్ట్స్ అంటగట్టవద్దని ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో డీఏఓ బి.సరితకు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రతాపని పాండురంగయ్య మాట్లాడుతూ.. ఆల్ ఇండియా ఆగ్రో ఇన్ఫుట్ డీలర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఎరువుల ఉత్పత్తిదారులు ఫర్టిలైజర్స్ సరఫరాపై ఎఫ్ఓఎల్ ఇవ్వాలని, ఎలాంటి లింకు ప్రొడక్ట్స్ లేకుండా ఫర్టిలైజర్స్ సరఫరా చేయాలన్నారు. -
స్వీయ జనగణనలో పాల్గొనాలి
● కలెక్టర్ స్నేహశబరీష్ మహబూబాబాద్: ప్రతీ ఒక్కరు బాధ్యతాయుతంగా స్వీయ జనగణనలో పాల్గొనాలని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జనగణన, సాదాబైనామా తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద ప్రజా భాగస్వామ్య కార్యక్రమం జనాభా గణన అన్నారు. ఈ నెల 26న నుంచి మే 10వ తేదీ వరకు జిల్లాలో స్వీయ గణన కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఇళ్లు, జనాభా గణన మొదటి దశ మే 11 నుంచి జూన్ 26వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ప్రతీ ఇంటి సమాచారం నమోదు చేస్తారన్నారు. మొదట ప్రాథమిక సమాచారం సేకరిస్తారన్నారు. కచ్చితమైన, సంపూర్ణమైన వివరాలు ఇవ్వాలన్నారు. జిల్లాలో 1,764 మంది సిబ్బందికి విధులు కేటాయించినట్లు తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఆక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించాలన్నారు. మన ఇసుక–మన వాహనం పథకం ద్వారా ఆన్లైన్లో మాత్రమే ఇసుక విక్రయాల కూపన్లు పంపిణీ చేయాలన్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, ఆర్డీఓలు కృష్ణవేణి, గణేష్, సీపీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
‘ప్యాక్స్’ కిరీటాలు ఎవరికో?
సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (పీఏసీఎస్) నామినేటెడ్ పద్ధతిలో పాలకమండళ్లను నియమించే ప్రక్రియకు రంగం సిద్ధమవుతోంది. సహకార సంఘాల పదవీ కాలం గత ఏడాది ఫిబ్రవరి 14తో ముగియడంతో, ప్రస్తుతం వీటి బాధ్యతలను ప్రత్యేకాధికారులు నిర్వహిస్తున్నారు. తిరిగి వారి స్థానంలో అధికార పార్టీకి చెందిన నాయకులను వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)ల తరహాలో సహకార సంఘాలకూ పాలకమండళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల (ఈ నెల 23న) జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పీఏసీఎస్లతో పాటు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీ), సహకార మార్కెటింగ్ సమాఖ్య (డీసీఎంఎస్)లకు కూడా ఇదే పద్ధతిలో పాలకమండళ్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్కు చెందిన ఆశావహులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇదీ పీఏసీఎస్ల లెక్క... ఇన్చార్జ్ మంత్రి, ఎమ్మెల్యేలే కీలకం.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారుల వివరాల ప్రకారం 98 సహకార సంఘాలు ఉండగా, సుమారు 2.96 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. నామినేటెడ్ పద్ధతి ద్వారా ఉమ్మడి జిల్లాలో 98 చైర్మన్ పోస్టులు, 98 వైస్ చైర్మన్ పోస్టులతో పాటు మరో 1,260 మందికి డైరెక్టర్లుగా అవకాశం దక్కనుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, స్థానిక నేతలకు మంత్రివర్గం నిర్ణయం ద్వారా ఈ నామినేటెడ్ పదవులు పొందే అవకాశం కలగనుంది. అయితే మార్కెట్ కమిటీల మాదిరిగానే, స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రతిపాదనల మేరకు పాలకవర్గాలను నియమిస్తారు. ఎమ్మెల్యే లేని నియోజకవర్గాల్లో జిల్లా మంత్రి ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది. ఈ ప్రక్రియలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి కూడా కీలకంగా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ ప్రక్రియను అమలు చేయాలని భావించిన ప్రభుత్వం ప్రస్తుత సహకార చట్టంలో మార్పులు, చేర్పులపై ఉన్నతస్థాయి కసరత్తు మొదలెట్టినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఎన్నికల నుంచి ‘నామినేటెడ్’ వైపు... సహకార సంఘాల ఎన్నికలు అధికారికంగా పార్టీ రహితంగా జరిగినా, పంచాయతీ ఎన్నికల మాదిరిగానే వీటిలో రాజకీయ పార్టీల ప్రమేయం పరోక్షంగా ఉండేది. ఆయా సంఘాల్లో సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే హక్కు ఉంటుంది. సభ్యులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారై ఉండటంతో సహకార చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి దశలో సభ్యులు ఓటు వేసి డైరెక్టర్లను ఎన్నుకోవడం.. రెండో దశలో ఎన్నికై న ఆ డైరెక్టర్లు తమలో నుంచి ఒకరిని చైర్మన్గా, మరొకరిని వైస్ చైర్మన్గా ఎన్నుకునేవారు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ ఎన్నికల పద్ధతికి బదులుగా, మార్కెట్ కమిటీల తరహాలో నామినేటెడ్ పద్ధతిలో పాలకమండళ్లను నియమించాలని భావిస్తోంది. క్లుప్తంగా చెప్పాలంటే, సాధారణ సభ్యులు ఓటు వేసి డైరెక్టర్లను ఎన్నుకునే ప్రక్రియకు బదులుగా, ప్రజా ప్రతినిధుల సిఫార్సుతో నేరుగా ప్రభుత్వం పాలకమండళ్లను ఎంపిక చేయడమే ఈ ‘మార్కెట్ కమిటీ తరహా నియామకం’. త్వరలోనే నామినేటెడ్ ద్వారా పాలకమండళ్లను నియమించనున్నారన్న నిర్ణయం మేరకు పీఏసీఎస్ డైరెక్టర్ మొదలుకుని డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ల వరకు పదవులు పొందేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఉమ్మడి జిల్లాలో ఇలా..జిల్లాల వారీగా ఇలా.. జిల్లా పీఏసీఎస్లు డైరెక్టర్ సభ్యులు స్థానాలువరంగల్ అర్బన్ 12 156 30,317 (హనుమకొండ) వరంగల్ రూరల్(వరంగల్) 31 402 94,967 జనగామ 14 182 50,862 మహబూబాబాద్ 19 234 69,830 జేఎస్భూపాలపల్లి 10 130 22,773 ములుగు 12 156 27,328 నామినేటెడ్ ద్వారానే ‘సహకార’ పదవులు ఎంపికలో మంత్రులు, ఎమ్మెల్యేలే కీలకం ‘పరిషత్’ ఎన్నికలకు ముందే ప్రకటన ఆశల పల్లకిలో అధికార పార్టీ నేతలు.. మొదలైన ఆశావహుల పైరవీలుమొత్తం సహకార సంఘాలు 98సభ్యులు 2,96,077డైరెక్టర్ స్థానాలు 1,260 -
అదనపు కలెక్టర్ బదిలీ
మహబూబాబాద్: జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టొప్పోను బదిలీ చేస్తూ సీఎస్ రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఆయనను ములుగు జిల్లా ఏటురునాగారం ఐటీడీఏ పీఓగా బదిలీ చేశారు. రేపు మార్కెట్ బంద్ మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణం మొత్తం మొక్కజొన్నలతో నిండి ఉన్నందు వల్ల ఈనెల 27వ తేదీ సోమవారం వ్యాపారస్తుల కోరిక మేరకు సెలవు ప్రకటించామని ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ శనివారం తెలిపారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్ యార్డుకు తరలించి ఇబ్బందులకు గురికావొద్దని ముందస్తుగా ప్రకటన చేస్తున్నామని పేర్కొన్నారు. -
రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు
● సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులు ● సీఎం చిత్రపటానికి పాలాభిషేకంనెహ్రూసెంటర్: ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం, పీఆర్సీ, గుర్తింపు ఎన్నికలకు గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో సిబ్బంది సమ్మె విరమించారు. శనివారం తెల్లవారుజాము నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. కాగా, హామీల అమలుకు ప్రభుత్వం చొరవ చూపడంతో మానుకోట డిపో ఆవరణలో సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి కార్మికులు పాలాభిషేకం చేశారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు మల్లయ్య, ఎంఆర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, 11శాతం పీఆర్సీ అమలు, యూనియన్ల పునరుద్ధరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్న ల్ ఇవ్వడం సంతోషకరం అన్నారు. సమ్మెలో పాల్గొన్న కార్మికుల ఆకాంక్షలను నెరవేర్చిన ప్రభుత్వానికి, సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో పాపిరెడ్డి, రుక్మిణి, ఉష, నబీ, షబ్బీర్, ఖలీల్, బీఏ కుమార్, అశోక్, కిష్టయ్య, భూషణం, ఉద్యోగులు పాల్గొన్నారు. -
మక్క రైతులకు నష్టం కలిగించొద్దు
గూడూరు: ప్రభుత్వం మక్కలు కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి నష్టం కలిగించొద్దని ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి గుజ్జు దేవేందర్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమాక్రసీ జిల్లా నాయకుడు గజ్జి లింగన్న డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని మక్కల కొనుగోలు కేంద్రం వద్ద శనివారం రెండు పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కల్లాల వద్ద ఇప్పటి వరకు గోనె సంచులు అందుబాటులో లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 50కిలోలు పెట్టాల్సిన కాంటా బస్తాలో 51కిలోలు పెడు తూ నిర్వాహకులు రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రాల్లో మౌలిక వసతులతో పాటు సంచులు అందుబాటులో ఉంచాలని డిమా ండ్ చేశారు. లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీశైలం, కొట్టెం అచ్చన్న, కొట్టెం వజ్జయ్య, కాడబోయిన నర్సయ్య, రైతులు పాల్గొన్నారు. -
పాకాల ఏటికి జలకళ
గార్ల: రెండు నెలలపాటు పాకాల ఏటిలో నీళ్లు లేక బండలు తేలి వెలవెలబోగా.. శనివారం ఏరు చెక్డ్యాం నిండి అలుగు పోస్తూ జలకళ సంతరించుకుంది. దీంతో యువకులు ఏటిలో జలకాలాడుతూ కేరింతలు కొట్టారు. కాగా, రెండు నెలలుగా ఏటిలో నీళ్లు లేకపోవడంతో పరీవాహక ప్రాంతంలో సాగుచేసిన వరిపంటలకు సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడ్డారు. తీరా పంటలు కోసే సమయంలో ఏరు నిండింది. కాగా, రెండు నెలల ముందు ఏటికి పైనుంచి నీళ్లు విడుదల చేస్తే తమ పంటలు సమృద్ధిగా పండేవని రైతులు పేర్కొంటున్నారు. ఏదిఏమైనా వేసవిలో గార్ల పట్టణ ప్రజలు, పశువుల దాహార్తిని తీర్చేందుకు పాకాల ఏటికి నీళ్లు చేరుకోవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
సిరుల పంట..
ఆదివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సాక్షి, మహబూబాబాద్: మూసపద్ధతిలో వ్యవసాయం చేసి పెట్టుబడి కూడా రాక రైతులు అప్పుల పాలు అవుతున్న సంఘటనలు జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. కాగా, రైతులను లాభాల బాట పట్టించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్ పామ్ పంట సాగు జిల్లాలో మంచి ఫలితాలు ఇస్తోంది. ఐదు సంవత్సరాల క్రితం నాటిన మొక్కలు ఇప్పుడు పంట కాపుకు వచ్చింది. దీంతో రైతుల ఇంటి గెలల పంట పండుతోంది. తొమ్మిదివేల ఎకరాలకు చేరిన సాగు.. జిల్లా రైతులు ముందుగా ఆయిల్పామ్ సాగుకు వెనకడుగు వేశారు. అయితే ఒకరిని చూసి మరొ కరు ఏటేటా సాగు విస్తీర్ణం పెంచుతున్నారు. ఇలా 700 ఎకరాలతో మొదలైన సాగు ఇప్పుడు 9వేల ఎకరాల మేరకు చేరింది. అయితే ఎక్కువ మొత్తంలో భూములు ఉండి, సాగునీటి ఇబ్బందులు లేని రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. కోతుల బాధ లేకపోవడమే సాగుకు ప్రధాన కారణంగా రైతులు చెబుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం నుంచి మొక్కలకు రూ. 12వేలు, డ్రిప్నకు రూ. 22వేలు, మెయింటెనెన్స్కు రూ.16,800, మొత్తం ఎకరానికి నాలుగు సంవత్సరాలకు రూ. 52వేల మేరకు వందశాతం సబ్సిడీ ఇస్తుంది. కాగా వచ్చే ఏడాది మరో నాలుగు వేల ఎకరాల మేరకు సాగు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అందుబాటులోకి మార్కెటింగ్.. అయిల్పామ్ పంట సాగు సరే.. మార్కెటింగ్ ఎక్కడ అనే ప్రశ్న ప్రతీ రైతుల్లో ఉండేది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు వెళ్లి అమ్మాలనే భయపడేవారు. కానీ ఇప్పుడు సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం నర్మెటలో ఫ్యాక్టరీని ప్రారంభించారు. దీనికి తోడు ఇప్పుడు జిల్లాలోని కందికొండ, హరిపిరాలలతోపాటు గత రెండు రోజుల క్రితం కేసముద్రంలో అయిల్ పామ్ గెలల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. దీంతో జిల్లా నలుమూలల ఆయిల్పామ్ సాగుచేసిన రైతులు సమీపంలోని కొనుగోలు కేంద్రాల్లో గెలలు అమ్ముకునే అవకాశం వచ్చింది. పంటల కాపు.. మొక్కలు నాటి ఐదు సంవత్సరాలు కావడంతో ఈ ఏడాది పంట చేతికి వస్తోంది. మొత్తం 9వేల ఎకరాల్లో ఈ ఏడాది నాలుగు వేల ఎకరాల్లో వేసిన పంటలు కాపుకు వచ్చాయి. గెలలు కోసి మార్కెట్కు తెస్తున్నారు. టన్నుకు రూ. 23వేలకు పైగా ధర పలుకుతోంది. దీంతో ప్రస్తుతం ఎకరాకు నెలకు రూ. 10వేల నుంచి రూ. 20వేల మేరకు రైతుకు ఆదాయం వస్తుంది. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా మొత్తం 8వేల టన్నుల దిగుబడి అంచనా వేశామని, ఈ అంచనా ఏటేటా పెరుగుతూ వస్తుందని అధికారులు అంటున్నారు. జిల్లాలో ఆయిల్పామ్ పంట దిగుబడి 4వేల ఎకరాల్లో కోతలు షురూ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వచ్చే ఏడాది మరింత పెరగనున్న సాగు విస్తీర్ణం -
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
● తొర్రూరు సివిల్ కోర్టు జడ్జి ధీరజ్కుమార్ తొర్రూరు రూరల్: న్యాయ వ్యవస్థ, చట్టాలు, కేసులపై గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు చెందిన అన్నివర్గాల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని తొర్రూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ధీరజ్కుమార్ అన్నారు. శనివారం మండలంలోని బోజ్యతండాలో న్యాయ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్జి మాట్లాడుతూ.. ప్రతీ వ్యక్తి వివాదాలకు దూరంగా ఉండాలన్నారు. చిన్నచిన్న సమస్యలపై గొవడలు పడి కేసులపాలై పోలీస్స్టేషన్, కోర్టుల చుట్టూ తిరుగుతూ అమూల్యమైన జీవితాలను సర్వనాశనం చేసుకోవద్దని సూచించారు. ప్రతీ వాహనదారుడు హెల్మెట్ తప్పకుండా ధరించి నెమ్మదిగా ప్రయాణాలు చేస్తూ తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ మౌనిక, ఎస్సై శివరామకృష్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వివి రత్న, న్యాయనాదులు రామకృష్ణ, నాగరాజు, అశోక్, సంతోష్, గౌస్, రమేశ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.. -
ఆర్టీసీ కార్మికులకు అండగా ప్రభుత్వం
నెహ్రూసెంటర్: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి, వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమామురళీనాయక్ అన్నారు. మానుకోట ఆర్టీసీ డిపో ఆవరణలో సీఎం రేవంత్రెడ్డి చిత్రపటానికి ఆర్టీసీ కార్మికులతో కలిసి శనివారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుతుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో డిపో కార్మికులు, ఉద్యోగులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనల మేరకు అక్రిడిటేషన్ కార్డులు
● కలెక్టర్ స్నేహ శబరీష్ మహబూబాబాద్: అర్హులైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రభుత్వ నిబంధనల మేరకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్పర్సన్ స్నేహశబరీష్ అన్నారు. కలెక్టరేట్లో శుక్రవా రం జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడు తూ.. నిజమైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేస్తారన్నారు. వృత్తి ప్రమాణాలు, అనుభవం, సంస్థ గుర్తింపు వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుంటామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 447 ఆన్లైన్ దరఖాస్తులు వచ్చాయని, నిబంధనల మేర కు కార్డులు మంజూరు చేస్తామన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా కీలకపాత్ర పోషిస్తుందన్నారు. బాధ్యతాయుతంగా నిజమైన సమాచారాన్ని ప్రజల కు అందించాలన్నారు. కార్డుల పంపిణీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి, ప్రతీదశలో పారదర్శకత పాటించాలన్నారు. డీపీఆర్వో రాజేంద్రప్రసాద్, కమిటీ సభ్యులు సీహెచ్.శ్రీనివాస్, ఈరగాని బిక్షం, వేముల అయోధ్య రామయ్య, నవాబ్, షేక్ అక్రం, ఎం.మోహన్రెడ్డి, గాడిపెల్లి శ్రీహరి, ఉమ్మగాని మధు, ఉప్పల రంగా తదితరులు పాల్గొన్నారు. -
విద్య, వైద్యం, క్రీడలకు అధిక ప్రాధాన్యం
వరంగల్ స్పోర్ట్స్: సీఎం రేవంత్రెడ్డి ప్రజా ప్రభుత్వం విద్య, వైద్యం తర్వాత క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ నిధులు కేటాయిస్తోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని హ్యాండ్బాల్ కోర్ట్లో దివంగత ఏఆర్ డీఎస్పీ పీఎస్ శశిధర్ స్మారక 8వ తెలంగాణ రాష్ట్ర హ్యాండ్బాల్ టాలెంట్ హంట్ పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అండర్–15 బాలుర విభాగంలో మూడు రోజులపాటు జరగనున్న టోర్నమెంట్ను ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులనుంచి ఎమ్మెల్యే నాయిని గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం దివంగత డీఎస్పీ శశిధర్ చిత్రపటానికి పూలమాల వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఎమ్మెల్యే ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారుల సంక్షేమం, క్రీడల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, టాలెంట్ హంట్ నిర్వహణ కార్యదర్శి శ్యామల పవన్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 44 జట్లు రావాల్సి ఉండగా ఆర్టీసీ సమ్మె కారణంగా 25 జట్లు హాజరైనట్లు తెలిపారు. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు నిర్వహించి ప్రతిభ గల క్రీడాకారులతో రాష్ట్ర జట్టును ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అనంతరం జనగామ వర్సెస్ జైజవాన్, జైకిసాన్ పైడిపెల్లి జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. కార్యక్రమంలో హనుమకొండ డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బైరబోయిన కై లాస్యాదవ్, అధ్యక్షుడు అజీజ్ఖాన్, కోశాధికారి తోట శ్యామ్ప్రసాద్, హ్యాండ్బాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు సాంబశివరావు, దివంగత ఏఆర్ డీఎస్పీ శశిధర్ సతీమణి మమత, అంతర్జాతీయ హ్యాండ్బాల్ క్రీడాకారుడు పోగుల అశోక్ పాల్గొన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అట్టహాసంగా హ్యాండ్బాల్ టాలెంట్ హంట్ ప్రారంభం -
కేఎంసీకి పార్థివదేహం అప్పగింత
కాశిబుగ్గ: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామానికి చెందిన నల్లపు నారాయణ (80) శుక్రవారం మృతిచెందాడు. అయితే నారాయణ గతంలోనే దేహదాన అంగీకార పత్రం ఇవ్వడంతో మృతుడి కుమార్తె స్వరూప సహకారంతో వైద్య విద్య పరిశోధన కోసం నారాయణ మృతదేహాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు శుక్రవారం అప్పగించారు. తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ ఆధ్వర్యంలో మృతదేహాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య, అనాటమీ విభాగాధిపతి డాక్టర్ శశికాంతాచారికి అప్పగించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు కోన్రెడ్డి మల్లారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఏ.రాజేంద్రప్రసాద్, కోటేశ్వర్రావు, గంగుల దయాకర్, రాచర్ల బాలరాజు, గండ్రాతి హరిబాబు, మర్రి మహేష్, ఈరెల్లి మల్లేష్ పాల్గొన్నారు. -
కేంద్ర మంత్రి రాకతో వేడెక్కిన ముత్తోజిపేట
కేంద్ర హోంశాఖ సహాయ శాఖమంత్రి బండి సంజయ్ మధ్యాహ్నం ఒంటిగంటకు ముత్తోజిపేటకు చేరుకుని శంకర్గౌడ్ మృతదేహానికి నివాళులర్పించారు. అనంత రం శంకర్ భార్య లత, కుమారుడు హేమంత్, కూతురు, అల్లుడిని పరామర్శించారు. తనవంతు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. శంకర్ మృతదేహా న్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులర్పించిన తర్వాత ముత్తోజిపేటకు తీసుకొస్తామని బతిమిలాడినా పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యులు, కార్మికులు మంత్రికి విన్నవించారు. వెంటనే ఆయన పోలీసులతో మాట్లాడారు. డిపో వద్దకు మృతదేహాన్ని తరలించాలని కార్యకర్తలకు సంజయ్ సూచించడంతో ఫ్రీజర్లో ఉన్న శంకర్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తోపులాటలో ఫ్రీజ ర్ బాక్స్పైన గ్లాస్ మూత పగిలిపోయింది. ఫ్రీజర్బాక్స్ను సుమారు 500 నుంచి 600 మీటర్ల దూరం వరకు కార్యకర్తలు ఒక్కసారిగా లాక్కొని రావడంతో ఒక్కసారిగా ముత్తోజిపేటలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అనుమతించని పోలీసులు.. మృతదేహాన్ని తీసుకెళ్లకుండా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను బీజేపీ కార్యకర్తలు పక్కకు తోసేశారు. సుమారు గంటపాటు మృతదేహం ఎండలోనే ఉండిపోయింది. డిపో వద్ద ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటామని బండి సంజయ్ హామీ ఇచ్చినా పోలీసులు అనుమతివ్వలేదు. ఒక అంబులెన్స్ తీసుకొచ్చి మృతదేహాన్ని ఎక్కించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సీపీ సన్ప్రీత్ సింగ్ వచ్చి కేంద్ర మంత్రి బండి సంజయ్కి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. మంత్రి కారు దిగి పక్కనే ఉ న్న ఇంటి రేకుల కిందకు వెళ్లిపోయారు. వెంటనే పోలీసులు మృతదేహం, కుటుంబ సభ్యులను ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఉత్కంఠ మధ్యాహ్నం 3.40 గంటల వరకు కొనసాగింది. పోలీసులు నచ్చజెప్పడంతో బండి సంజయ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, కొండేటి శ్రీధర్, నాయకులు రావు పద్మ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సాయంత్రం 6 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం కాగా.. 7.30 గంటలకు అంత్యక్రియలు ముగిశాయి. కాగా, శంకర్ గౌడ్ భార్య లత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
పీహెచ్డీలో ప్రవేశాలకు ఇంటర్వ్యూ
హన్మకొండ కల్చరల్: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం వరంగల్లో పీహెచ్డీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 30న ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశ ప్రకటనలో భాగంగా ఈ మౌఖిక పరీక్షలు హైదరాబాద్ బాచుపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జానపద గిరిజన విజ్ఞానంపై జరిగే ఈ ఇంటర్వ్యూ ద్వారా విద్యార్థుల పరిశోధన సామర్థ్యం, సంబంధిత పరిశోధన అంశంపై అవగాహన, అకాడమిక్ ప్రతిభను సమగ్రంగా అంచనా వేస్తామని, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ వెంట ఒరిజినల్ సర్టిఫికెట్లు, గుర్తింపు పత్రాలు తీసుకురావాలని డాక్టర్ గడ్డం వెంకన్న సూచించారు. మూడో రోజు కొనసాగిన ఆర్టీసీ సమ్మె ● ఆర్టీసీ కార్మికుల ధర్నాలు హన్మకొండ: తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికి పోరుబాట పట్టిన ఆర్టీసీ కార్మికులు మూడో రోజు శుక్రవారం సమ్మె కొనసాగించారు. సమ్మెలో భాగంగా శుక్రవారం హనుమకొండలోని వరంగల్–1, హనుమకొండ డిపోల వద్ద కార్మికులు ధర్నా చేశారు. సమ్మె నేపథ్యంలో పోలీసులు మొహరించారు. హనుమకొండ డిపో వద్ద ముగ్గురు ఇన్స్పెక్టర్లతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్మికులు డిపో సమీపంలోకి రాకుండా చర్యలు తీసుకున్నారు. అయితే తాము డిపో ఎదుట ధర్నా చేస్తామ ని హనుమకొండ డిపో కార్మికులు పట్టుపట్టారు. శాంతియుతంగా ధర్నా, నిరసన తెలుపుతామని పో లీసులను కోరారు. అనుమతించడంతో డిపో ముందుకు చేరుకుని ధర్నా చేశారు. అరగంటకు పైగా ధర్నా చేసిన అనంతరం రాంనగర్ కూడలిలో నిరసనను కొనసాగించారు. వరంగల్– 1 డిపో వద్దకు కార్మికులను రానివ్వకపోవడంతో సమీపంలో ధర్నా ను కొనసాగించారు. శంకర్ గౌడ్ మృతి చెందడంతో రెండు రోజుల పాటు సమ్మెకు దూరంగా ఉన్న సూపర్ వైజర్లు, అన్ని విభాగాల క్లరికల్ సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. న్యాయవాదుల సహకార సంఘం ఎన్నికలువరంగల్ లీగల్: హనుమకొండలోని న్యాయవాదుల సహకార సంఘం భవనంలో ఆసంఘ ఎన్నికలు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు జరిగాయి. సంఘంలో మొత్తం 1,326 మంది ఓటర్లు ఉండగా.. 686 మంది న్యాయవాదులు ఓటు హక్కును విని యోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు అనంతరం ప్రధాన ఎన్నికల అధికారి చిదంబరనాథ్ ఫలి తాలు వెల్లడించారు. ఆ ఫలితాల్లో బండారి కవిత (350 ఓట్లు), ఎ.కిరణ్సింగ్ (272 ఓట్లు) పి.శ్రీనివాస్ (259ఓట్లు), టి.శ్రీనివాస్ (237 ఓట్లు) సాధించి విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. -
శంకర్గౌడ్ ఆశయ సాధనకు కృషి
తొర్రూరు: ఆర్టీసీ కార్మికుడు శంకర్గౌడ్ ఆశయ సాధనకు కృషి చేస్తామని తొర్రూరు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ జిలుకర యాదగిరి తెలిపారు. ఈ మేరకు మూడో రోజు సమ్మెలో భాగంగా శుక్రవారం ఆర్టీసీ కార్మికుడు శంకర్గౌడ్ మృతికి సంతాపంగా జేఏసీ ఆధ్వర్యంలో డిపోనుంచి గాంధీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. జేఏసీ చైర్మన్ మాట్లాడుతూ.. శంకర్గౌడ్ మృతి ఆర్టీసీ కార్మిక ఉద్యమానికి తీరనిలోటు అని, ఆయన స్ఫూర్తితో హక్కుల సాధనకు పోరాటాలు ము మ్మరం చేస్తామని ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిగణనలోకి తీసుకుని పరిష్కారానికి చర్యలు ప్రారంభించాలన్నా రు. కలిసికట్టుగా న్యాయబద్ధంగా పోరాడి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేఏసీ వైస్ చైర్మన్ జి.రమేశ్, కోశాధికారి రవీందర్, సలహాదారులు మల్లికార్జున్, ఆర్ఎస్ కుమార్, జి.యాకయ్య, బీకే స్వామి, జి.వెంకన్న, ఎంకే రావు, ఎవీఎం చారి, ఎండీ షాబుద్దీన్, ఎంఎస్ బాబులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం రూ.కోటి పరిహారం ఇవ్వాలి
రఘునాథపల్లి: ఆత్మహత్యకు పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి పరిహారం అందించాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శంకర్గౌడ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు నర్సంపేటకు వెళ్తున్న సబిత, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్కుమార్, మాలోతు కవిత తదితరులును శుక్రవారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కోమళ్ల టోల్ ప్లాజా వద్ద జనగామ రూరల్ సీఐ ఎడవెల్లి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి సీఐ సర్కిల్ కార్యాలయానికి తరలించారు. సమాచారం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, పార్టీ శ్రేణులతో చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా సబిత మాట్లాడుతూ.. సమ్మె నోటీసు ఇచ్చినా పట్టించుకోని ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులతో బస్సు సర్వీసులు నడిపి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను రెచ్చగొట్టడం వల్లనే శంకర్గౌడ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని సబిత ఆరోపించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై బీఆర్ఎస్ హయాంలో అసెంబ్లీలో తీర్మానం చేశామని, దానిని కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందన్నారు. బండి సంజయ్కు ఎస్కార్ట్ ఇచ్చి నర్సంపేటకు పంపిన ప్రభుత్వం.. తమను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటుందన్నారు. మాజీ ఎంపీలు వినోద్కుమార్, కవిత మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి ఆర్టీసీ కార్మికులపై అహంకారపూరితంగా వ్యవహరించడం వల్లనే శంకర్గౌడ్ ఆత్యహత్య చేసుకున్నాడని అన్నారు. ఎమ్మెల్యే పల్లా.. బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. నాయకులు సిద్దిలింగం, రాజిరెడ్డి, మధు, విజయ్, గూడ కిరణ్, దుబ్బాక హరీశ్, ఎడ్ల బా లరాజు, పయ్యావుల రవి, యాకయ్య, యాకస్వామి పాల్గొన్నారు. రెచ్చగొట్టడం వల్లనే శంకర్గౌడ్ ఆత్మహత్య మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి -
నెక్ట్స్ డాక్యుమెంట్ రైటర్సే..నా?
కాజీపేట అర్బన్ : వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ ఈనెల 2వ తేదీన ఏసీబీ దాడుల్లో అక్రమాల చిట్టా బయడపడడంతో సుమారు 18 రోజుల విచారణ తర్వాత 21న ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరి అరెస్ట్ తర్వాత డాక్యుమెంట్ రైటర్లను అరెస్ట్ చేస్తారా.. అంటూ చర్చ నడుస్తోంది. ఇందుకు నిదర్శనం ఏసీబీ దాడుల సమయంలో కార్యాలయంలో 20 మంది డాక్యుమెంట్ రైటర్ల వద్ద నుంచి 70 దస్తావేజులతోపాటు నగదు రూ.47,450 దొరికింది. వారందరినీ విచారించగా తాము సబ్ రిజిస్ట్రార్లు వసూలు చేయమంటేనే చేశామని ఒప్పుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ల అరెస్ట్తో గుబులు... వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని సు మారు 126 మంది డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారు. వారిలో ఆ 20 మంది ఎవరు? సబ్ రిజిస్ట్రార్ల తర్వాత ఎవరు అరెస్ట్ అవుతారనే గుబులుతో కొందరు డాక్యుమెంట్ రైటర్లు తమ కార్యాలయాలను తెరవడం లేదు. ఓ ప్రైవేట్ వ్యక్తి ద్వారా ఆన్లైన్లో డిజిటల్ పేమెంట్స్ రూ.42లక్షలు, నేరుగా సబ్ రిజిస్ట్రార్ ఆనంద్కు ఎనిమిది రోజుల్లో రూ.16 లక్షల లావాదేవీలు చేసిన డాక్యూమెంట్ రైటర్లు ఎవరు అనే చర్చ జోరుగా సాగుతోంది. తీరు మారేనా..? సబ్ రిజిస్ట్రార్లు అరెస్ట్ అయినా కొందరు డాక్యుమెంట్ రైటర్ల చేతివాటం మారలేదు. ‘సార్లు ఆఫీస్ ఖర్చుల కింద అడుగుతున్నారు.. ఏసీబీ, విజిలెన్స్ దాడులు మామూలే.. ఇవ్వాల్సిన మామూళ్లు మాములే’ అంటూ భూక్రయవిక్రయదారుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్లు విధులు నిర్వహిస్తుండగా.. ఉన్నతాధికారులు పూర్తిస్థాయి సబ్ రిజిస్ట్రార్లను నియమించి వరంగల్ ఆర్వో తీరు మార్చాలని భూక్రమవిక్రయదారుల కోరుతున్నారు. అయితే.. గతంలో కార్యాలయంలో వసూళ్లకు ప్రైవేట్ వ్యక్తులు ఉండగా ప్రస్తుతం ఏసీబీ దాడులతో వారు ఆఫీస్లో అడుగుపెట్టడం లేదని సమాచారం. సబ్ రిజిస్ట్రార్ల అరెస్ట్తో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కలకలం అయినా తీరు మారని డాక్యుమెంట్ రైటర్లు -
నిరసనలు.. ధర్నాలు
నెహ్రూసెంటర్: ఆర్టీసీ కార్మికుల సమ్మె శుక్రవారం మూడో రోజు కొనసాగింది. కార్మికుల నిరసనలు, ఆందోళనలతో మహబూబాబాద్ డిపో పరిధిలో ఒక్క బస్సు కూడా రోడ్డెక్కలేదు. కండక్టర్లు, డ్రైవర్లు, సిబ్బంది, ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొనడంతో బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి. డిపోలో ఆందోళనల నేపథ్యంలో పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాలీ.. నిరసన.. ధర్నా.. ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియం నుంచి డిపో వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. కార్మికులు చేపట్టిన ర్యాలీకి సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, బీఆర్ఎస్, బీజేపీ, మద్దతు తెలిపి పాల్గొన్నారు. నర్సంపేట డిపోలో ఆత్మహత్యకు పాల్పడిన శంకర్గౌడ్ చిత్రపటాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిపో గేటు ఎదుట కార్మికులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథిఏసీ నాయకుడు డోలి సత్యనారాయణ, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లభు వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బి.అజయ్సారథి, ఆర్టీసీ జేఏసీ నాయకులు మల్లయ్య మాట్లాడారు. ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వారి డిమాండ్లు పరిష్కరించేలా సర్వత చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో గుజ్జు దేవేందర్, మైస శ్రీనివాసులు, రేషపల్లి నవీన్, హెచ్.లింగ్య,చీకటి మహేష్గౌడ్, నర్సింహారెడ్డి, మధు, చైతన్య, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. డిపో నుంచి కదలని బస్సులు.. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో ఉద్యోగులు, సిబ్బంది పాల్గొనడంతో మూడోరోజు ఒక్క బస్సు కూడా డిపో నుంచి బయటకు వెళ్లలేదు. ప్రయాణికులు ప్రైవేట్ వాహనాల్లో రాకపోకల సాగించారు. మొత్తంగా 76 బస్సులుండగా డ్రైవర్లు, కండక్టర్లు సమ్మెలోకి వెళ్లగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మూడో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా రోడ్డెక్కని బస్సులు.. ప్రయాణికుల ఇబ్బందులు డిపోలో పోలీసు బందోబస్తు -
మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
● హనుమకొండ జిల్లా వంగపహాడ్లో ఘటన ● ఎంజీఎం ఆస్పత్రికి తరలింపు హసన్పర్తి: హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపహాడ్కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ వరికోలు రవీందర్ ఆత్మహత్యకు యత్నించారు. గురువారం రాత్రి జరిగిన ఈఘటనపై స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్న రవీందరప్రభుత్వ వైఖరికి నిరసనగా గురువారం రాత్రి పురుగుల మందు తాగాడు. దీంతో వెంటనే రవీందర్ను వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఇదే విషయమై స్థానిక ఇన్స్పెక్టర్ చేరాలును సంప్రదించగా.. రవీందర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తమకు సమాచారం ఉందని, అయితే లిఖితపూర్వకంగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. వడదెబ్బతో కూలీ మృతి నల్లబెల్లి: వడదెబ్బతో కూలీ మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బొడిగె రవి(56) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. రోజువారీ పనుల్లో భాగంగా శుక్రవారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. కాసేపటికి తీవ్ర అస్వస్థతకు గురై కిందపడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు నర్సంపేటకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. -
ఆర్టీసీ కార్మికులను మోసం చేసిన ప్రభుత్వం
హన్మకొండ: ఆర్టీసీ కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి దగా చేసిందని, డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ది ప్రభుత్వ హత్య అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శంకర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును శుక్రవారం హనుమకొండ రాంనగర్లో పోలీసులు గృహ నిర్బంధం విధించా రు. మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్, బీఆర్ఎస్ నాయకులు చింతల యాదగిరి, మార్గం భిక్షపతి, రాజు, యాకాంతం, జక్కు రమేష్గౌడ్ను పోలీసులు రాత్రి వరకు హౌజ్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. అధికార పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశా రు. బాధిత కుటుంబాన్ని పరామర్శించకుండా హౌస్ అరెస్ట్ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించడంతోపాటు అండగా ఉంటుందన్నారు. శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని, వారి కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యకు రేవంత్ సర్కార్దే బాధ్యత అని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇంకెతకాలం గడుపుతావని సీఎం రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. ప్రజలు తరిమి కొట్టేదాకా చూసుకోవద్దంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హనుమకొండలో హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు -
చదువుతోనే అంతరాల తొలగింపు
విద్యారణ్యపురి: విద్యార్థులకు సమాన అవకాశాలు గల విద్యను అందించినప్పుడే సమాజంలో ఉన్న అంతరాలు తొలగిపోతాయని తెలంగాణ రాష్ట్ర విద్యా పరిరక్షణ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు ఉప్పలయ్య అధ్యక్షతన హనుమకొండలోని అసంత్భవన్లో నిర్వహించిన ‘మారుతున్న తెలంగాణ విద్యావిధానం’ అనే అంశంపై విద్యాసదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుతో విద్యారంగంలో మార్పులు వస్తాయని భావించిన ప్రజలను పాలకుల విధానాలు నిరాశ పరుస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వాలు విద్యారంగానికి తగినంత బడ్జెట్ కేటాయించడంలేదన్నారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య మాట్లాడుతూ.. సీఎం మాటలకు.. చేతలకు పొంతనలేదన్నారు. విద్యాశాఖ ముఖ్యమంత్రి చేతిలోనే ఉన్నా విద్యారంగంలో అనేక సమస్యలు పేరుకుపోయాయన్నారు. డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి మాట్లాడుతూ.. విద్యాకమిషన్ సిఫారసులపై విద్యారంగ మేధావులు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి అమలుచేయాలన్నారు. ఈ సదస్సులో అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకుడు గంగాధర్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఉప్పలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉమ్మడి వరంగల్ జిల్లా బాధ్యులు గోవిందరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు రాజిరెడ్డి, చాప బాబు, శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర పూర్వ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, నారాయణరెడ్డి, రఘుశంకర్రెడ్డి, రామకృష్ణ, మెండు రవీందర్, అంజనీదేవి, సుమ, సుభాషిణి, మల్లయ్య మాట్లాడారు. సంజీవరెడ్డి అభినందన సభ డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్, హనుమకొండ జిల్లా పూర్వ అధ్యక్షుడు సంజీవరెడ్డి ఉద్యోగ విరమణ నేపథ్యంలో శుక్రవారం అభినందన సభను నిర్వహించారు. సంజీవరెడ్డి డీటీఎఫ్ బాధ్యుడిగా, ఉపాధ్యాయుడిగా అందించిన సేవలను డీటీఎఫ్ బాధ్యులు కొనియాడారు. ఈసభకు డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. సెంట్రల్ వర్సిటీ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ -
నిండా ముంచారు..!
సాక్షి, మహబూబాబాద్: మొక్కజొన్న విత్తనాల దిగుబడి కోసం దేశంలోని పలు విత్తన కంపెనీల ఏజెంట్లు గ్రామాల్లో రైతుల వద్దకు వచ్చారు. మేమే విత్తనాలు ఇస్తాం. ఆడ, మగ విత్తనాలు వేర్వేరుగా నాటి సాగుచేయాలి. ఇలా చేస్తే సాధారణ రేటు కన్నా అదనంగా ధర చెల్లించి తామే కొనుగోలు చేస్తామని చెప్పారు. దీంతో జిల్లాలో రైతులు 40వేల ఎకరాల మేరకు పలు విత్తన కంపెనీలకు చెందిన మొక్కజొన్న పంటలు సాగుచేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇందులో కొన్ని కంపెనీలు ఇచ్చిన విత్తనాలు మంచి దిగుబడి రాగా.. మరికొన్ని కంపెనీల విత్తనాలతో సాగుచేసిన పంటలో నాసిరకం కంకులు, ఎత్తు సరిగ్గా ఎదగకపోవడంతో సగం పంట కూడా రాలేదని రైతులు చెబుతున్నారు. దిగుబడి తగ్గడంతో రైతు దిగాలు.. సాధారణ మక్క పంటకంటే.. ఆడ, మగ మొక్కజొన్న పంట సాగుచేస్తే రెట్టింపు ఆదాయం వస్తుందని ఆశపడిన పలువురు రైతులకు నిరాశే మిగిలింది. ఎకరానికి 35 క్వింటాళ్ల మేరకు దిగుబడి వస్తుంది. క్వింటాకు రూ. 3,500 మేరకు ధర పెట్టి కొనుగోలు చేస్తామని కంపెనీల ఏజెంట్లు చెప్పినట్లు రైతులు అంటున్నారు. ఎక్కువ లాభం వస్తుందని పంటను కంటికి రెప్పలా చూసుకున్నామని, ఇతర పంటలకు నీరు బంద్ చేసి మొక్కజొన్నకు నీరు పెట్టామని రైతులు అంటున్నారు. ఇంత చేసినా ఎకరానికి 10 నుంచి 15 క్వింటాళ్ల మేరకే దిగుబడి వచ్చిందని, దీంతో నష్టపోయామని రైతులు ఆరోపిస్తున్నారు. ఇలా ఒక్క నర్సింహులపేట మండలంలోనే 30 ఎకరాల మేరకు రైతులు నష్టపోయారని, జిల్లాలో వందల ఎకరాల్లో నష్టంవాటిల్లినట్లు రైతులు అంటున్నారు. వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు మంచి దిగుబడి వస్తుంది, లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేసిన విత్తన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని రైతులు అధికారుల వద్దకు వెళ్లి ప్రదక్షిణలు చేశారు. అయితే విత్తన కంపెనీలపై చర్యలు తీసుకోవడం మా పరిధి కాదని అధికారులు చేతులు ఎత్తేశారు. దీంతో గత్యంతరం లేక రైతులు వినియోగదారుల ఫోరం ఆశ్రయించారు. తమ కుటంబం అంతా చేసిన కష్టం విలువ, జరిగిన నష్టం మొత్తం లెక్కించి చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మోసపోయిన మొక్కజొన్న రైతులు ఆడ, మగ విత్తనాలు ఇచ్చిన ఓ కంపెనీ పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువతో సతమతం మోసం చేశారని కంపెనీపై కేసు -
కస్తూరి కాటన్ భారత్ ఈపోర్టల్ అభివృద్ధి
ఖిలా వరంగల్: కస్తూరి కాటన్ భారత్ బేల్స్కొనుగోలు, విక్రయాల కోసం సీసీఐ ప్రత్యేక ఈ పోర్టల్ అభివృద్ధి చేయడం అభినందనీయమని తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి అన్నారు. శుక్రవారం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆధ్వర్యంలో మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ(ఎంసీపీ)లోని కాంపొనెంట్–2 కింద ఈపోర్టల్ అభివృద్ధిపై నిర్వహించిన వర్చువల్ సమావేశంలో బొమ్మినేని రవీందర్ హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈపోర్టల్ ద్వారా కాటన్ ట్రేడింగ్లో ధరల పారదర్శకత పెరగడమే కాకుండా, వ్యాపార లావాదేవీలు మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు. కస్తూరి కాటన్ బేల్స్ దేశీయంగా, అంతర్జాతీయంగా మార్కెట్లలో వినియోగం పెంచడానికి నాణ్యతా ప్రమాణాలను నిర్దారించే టెక్స్ ప్రోసిల్ ధ్రువీకరణ పత్రాలను పోర్టల్లో పొందుపరచాలన్నారు. దేశీయ వినియోగదారులైన స్పిన్నింగ్ మిల్లులు జిన్నర్స్కు ప్రోత్సాహకాలను అందిస్తే బ్రాండ్ ఇమేజ్ పెరిగి దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో జిన్నర్స్, ట్రేడర్స్ను ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు. తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి


