Mahabubabad
-
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
● మేడారంలో ఘటన ఎస్ఎస్తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్ఎస్తాడ్వాయి మండలం మేడారంలో విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మేడారం సమీపం రెడ్డిగూడేనికి చెందిన వల్లేపు జానకీరామ్ (20) మేడారంలో సోడా బండి నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి సోడా బండిలోని ఫ్రిడ్జ్లో నీరు చల్లబడేందుకు విద్యుత్ సరఫరా కోసం కరెంట్ తీగలకు వైరు తగిలించి ఇంటికి వెళ్లాడు. గురువారం ఉదయం వచ్చి బండిని పట్టుకోగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. తీగకు అతుకులు ఏర్పడిన కారణంగా సోడా బండికి విద్యుత్ సరఫరా అయ్యి ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి సారయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నార్లాపూర్ ఎస్సై కమలాకర్ తెలిపారు. -
ఓకే ‘సర్’
ఓటరు కోసం ఆధారాలు.. సర్ ప్రక్రియలో భాగంగా ఓటరు వద్దకు వచ్చిన సర్వే అధికారులకు ప్రభుత్వం నుంచి జారీ చేసిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఒకటి చూపించొచ్చు. కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులు పనిచేస్తున్న ఉద్యోగ గుర్తింపు కార్డు, బ్యాంకు, పోస్టాఫీసు, ఎల్ఐసీ, పీఎస్యూ ద్వారా పొందిన కార్డులు, అధికారులు జారీ చేసిన పుట్టినతేదీ సర్టిఫికెట్, విద్యార్హత సర్టిఫికెట్, నివాస ధ్రువీకరణ పత్రం, అటవీ హక్కు పత్రాలు, కుల ధ్రువీకరణ పత్రం, ఎన్ఆర్సీ, కుటుంబ రిజిస్ట్రేషన్, పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ మొదలైనవి దోహదపడుతాయి. సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–సర్) ప్రక్రియ జిల్లాలో వేగవంతంగా జరుగుతోంది. 94శాతం ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేసుకొని మానుకోట జిల్లాను రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలిపారు. ఈనెల 25నుంచి ఇంటింటి గణన ప్రారంభం కానుంది. అయితే ఓటర్లు గల్లంతు కాకుండా రాజకీయ పార్టీల నాయకులు సర్పై ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. 94శాతం మ్యాపింగ్ పూర్తి.. ప్రజాస్వామ్యంలో ఓటు కీలకం. కాగా, అర్హులకు ఓటు హక్కు కల్పించడం ఎంత ముఖ్యమో, నకిలీ ఓట్లను తొలగించడం అంతే అవసరం. ఇందుకోసం ప్రభుత్వం చేపట్టిన సర్ కార్యక్రమంలో కలెక్టర్ ప్రత్యేక ప్రణాళికలతో వెళ్తున్నారు. ఒకేసారి సవరణ కార్యక్రమం మొదలు పెడితే ఓటరును గుర్తించడం ఇబ్బందిగా ఉంటుందని ముందుగా మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లోని 555 పోలింగ్ స్టేషన్లల్లో మొత్తం 4,84,933 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 4,57,819 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేసుకున్నారు. 94శాతం మ్యాపింగ్ పూర్తి చేసి రాష్ట్రంలోనే మహబూబాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. ఈనెల 25 నుంచి ప్రారంభం.. సర్ అసలు ప్రక్రియ ఈనెల 25నుంచి ప్రారంభం కానుంది. ఇంటింటి గణనతో ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ అక్టోబర్ ఒకటో తేదీన ప్రచురించి ఓటరు సవరణ తుది జాబితా వరకు సాగనుంది. సర్వేకోసం జిల్లాలోని రెండు నియోజకవర్గాల పరిధిలో ఇద్దరు ఆర్డీఓలు ఈఆర్ఓలుగా, 12 మంది తహసీల్దార్లు ఏఈఆర్ఓలుగా, వీరి పరిధిలో 56 మంది సూపర్ వైజర్లు.. వారి పరిధిలో మొత్తం 555 మంది బీఎల్ఓలు పనిచేస్తున్నారు. ఈనెల 25 నుంచి జూలై 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే.. జూలై 31న ముసాయిదా(డ్రాఫ్టింగ్) ఓటరు జాబితా ప్రచురణ, జూలై 31 నుంచి ఆగస్టు 30వరకు క్లైమ్, అభ్యంతరాల స్వీకరణ, సెప్టెంబర్ 28 వరకు నోటీసుల జారీ, ఎన్యుమరేషన్ ఫామ్స్పై నిర్ణయం, అభ్యంతరాల పరిష్కారం మొదౖలైన ప్రక్రియ జరుగుతుంది. అక్టోబర్ ఒకటిన తుది ఓటరు జాబితా విడుదల చేస్తారు. రాజకీయ నాయకుల ఆరా.. తమ ప్రాంతానికి చెందిన ఓటర్లు జాబితా నుంచి వైదొలిగిపోకుండా రాజకీయ నాయకులు ప్రత్యేక ఆరా తీస్తున్నారు. బిహార్ రాష్ట్రంలో సర్ ద్వారా 65 లక్షల ఓటర్ల పేర్లు, పశ్చిమ బెంగాల్లో ఓటర్ల తొలగింపు పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తమ అనుచరులు, పార్టీల నాయకుల ఓట్లు గల్లంతు కాకుండా జాగ్రత్త పడుతున్నారు. కార్యకర్తలను బీఎల్ఓల వద్దకు పంపించి జాబితా చూడటం, మ్యాపింగ్లో పేర్లు ఉన్నాయా లేదా చూడడం, ధ్రువీకరణ పత్రాలు నింపే సమయంలో పొరపాట్లు జరగకుండా చూసేందుకు వార్డుల వారీగా అన్ని పార్టీల నాయకులు సిద్ధమవుతున్నారు. మ్యాపింగ్ ప్రక్రియ ఇలా.. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో జిల్లా ముందంజ 94శాతం మ్యాపింగ్ పూర్తితో రాష్ట్రంలోనే మొదటిస్థానం ఓటర్ల పేర్లు మిస్కాకుండా రాజకీయ నాయకుల ఆరా ఈనెల 25నుంచి ఇంటింటి గణననియోజకవర్గం పీఎస్లు ఓటర్లు మ్యాపింగ్ శాతం మహబూబాబాద్ 288 2,60,761 2,51,693 96 డోర్నకల్ 267 2,24,172 2,06,126 91 మొత్తం 555 4,84,940 4,57,819 94 -
ప్రైవేట్ ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్ సీజ్
గూడూరు: మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రి తిరుమల నర్సింగ్హోంలో అనుమానాస్పద గర్భస్రావం జరిగిందన్న సమాచారంతో గురువారం డీఎంహెచ్ఓ రవి రాథోడ్ అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో నర్సంపేట డివిజన్ చెన్నరావుపేట మండలం పుల్లయ్యబోడుతండాకు చెందిన ఓ మహిళకు అనుమానాస్పద కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరిగిందని, ఆస్పత్రి రికార్డులను, కేసు షీట్లను, ఇతర సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వరంగల్ జిల్లాకు చెందినదని, ఆ జిల్లా వైద్య శాఖ అధికారికి పంపిస్తున్నట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. అనంతరం ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్ను సీజ్ చేశారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ పీఓ ఎంహెచ్ఎన్ డాక్టర్ విరాజిత, డిప్యూటీ డెమో రాజ్కుమార్, లోక్యా, ప్రశాంత్, మనోహర్ పాల్గొన్నారు. -
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
వరంగల్ క్రైం: పోలీస్ అధికారులు విధులు నిర్వహించకుండా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ హెచ్చరించారు. నెలవారీ నేర సమీక్ష గురువారం కిట్స్ కళాశాలలో నిర్వహించారు. ఇందులో తొలిసారిగా సీసీటీఎన్ఎస్ అప్లికేషన్ 2.0 ద్వారా పోలీస్ కమిషనరేట్ పరిధి పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, కేసుల దర్యాప్తు, నేర నియంత్రణ కోసం సంబంధిత పోలీస్ అధికారులు తీసుకుంటున్న చర్యలపై పోలీస్ కమిషనర్ ఆన్లైన్ పద్ధతిలో సంబంధిత స్టేషన్ అ ధికారులను అడిగి తెలుకున్నారు. పెండింగ్ కేసుల, కేసుల పురోగతికి తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లను స్టేషన్ అధికారులు వ్యక్తిగతంగా వెళ్లి తనిఖీ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో విద్యా సంస్థలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలల బస్సులను స్థానిక పోలీస్ అధికారులు తనిఖీ చేయాలన్నారు. సమావేశంలో డీసీపీలు అంకిత్కుమార్, రాజమహేంద్ర నాయక్, దార కవిత, అదనపు డీసీపీలు రవి, బాలస్వామి, ప్రభాకర్రావు, సురేశ్కుమార్, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. పాఠశాలల సమీపంలో పొగాకు ఉత్పత్తులు అమ్మొద్దు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ -
ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకున్న ఎమ్మెల్యే
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ స్వయంగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సందర్భంగా ఎమ్మెల్యే మురళీనాయక్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకుని మాట్లాడారు. రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న ప్రతీ పథకానికి అర్హులు కావాలంటే ఫార్మర్ ఐడీ ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.విజయచంద్ర, ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు, ఏఓలు, ఏఈఓలు ఉన్నారు. ఉపాధ్యాయుల వినూత్న ప్రచారం కేసముద్రం: మున్సిపాలిటీ పరిధి కేసముద్రంస్టేషన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు అడ్మిషన్లకు వినూత్న ప్రచారం చేస్తున్నారు. ఓ ఆటోకు మైక్ అమర్చి పదో తరగతిలో తమ పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల పేర్లు తెలుపుతూ పట్టణంలోని అమీనాపురం, కిష్టాపురం, గిర్నితండాలో గురువారం ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ పాఠశాల ప్రత్యేకతలు తెలుపుతూ కరపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం బందెల రాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి మహబూబాబాద్: గ్రంథాలయాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వెన్నం శ్రీకాంత్రెడ్డి అన్నారు. పాఠకులు గురువారం జిల్లా గ్రంథాలయంలో నెలకొన్ని సమస్యలపై వెన్నం శ్రీకాంత్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయాలని, పోటీ పరీక్షలకు పుస్తకాలు కావాలని, ఇతర ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈసందర్భంగా శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ.. విద్యతోనే సమాజంలో మార్పు వస్తుందన్నారు. జిల్లాలోని గ్రంథాలయాల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. పాఠకులకు మెరుగైన సౌకార్యాలు కల్పిస్తామన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల మహబూబాబాద్ అర్బన్: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు డీఐఈఓ మదార్గౌడ్ గురువారం తెలిపారు. ద్వితీయ సంవత్సరం జనరల్ గ్రూప్లో 1,110 మంది విద్యార్థులకు గాను 903 మంది ఉత్తీర్ణులయ్యారని, ఒకేషనల్ గ్రూప్లో 340 మంది విద్యార్థులకు 268 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ప్రథమ సంవత్సరం జనరల్ గ్రూప్లో 2,141 మంది విద్యార్థులకు 1,652 మంది ఉత్తీర్ణత సాధించారని, ఒకేషనల్ గ్రూప్ లో 461 మంది విద్యార్థుల గాను 337 మంది పాసైనట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా మూడో స్థానంలో నిలిచిందన్నారు. 12 క్వింటాళ్ల నల్లబెల్లం పట్టివేత మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మండలంలోని జంగిలికొండ క్రాస్ వద్ద ఓ వాహనంలో తరలిస్తున్న 12 క్వింటాళ్ల నల్ల బెల్లాన్ని పట్టుకుని కేసు నమోదు చేశామని రూరల్ ఎస్సై పి.రాజు గురువారం తెలిపారు. రూరల్ ఏఎస్సై జాకీర్ తమ సిబ్బందితో కలిసి కేవుల తండా వైపు నుంచి వస్తున్న టాటాఏస్ ట్రాలీని ఆపి తనిఖీ చేయగా అందులో 24బస్తాలు (12 క్వింటాళ్ల) నల్లబెల్లం లభ్యమైందన్నారు. అలాగే 50 కిలోల పటిక, 10 లీటర్ల గుడుంబా ఉందని వివరించారు. కొమ్ముగూడెం గ్రామానికి చెందిన భూక్య బావుసింగ్, రోటిబండ తండాకు చెందిన తేజావత్ మల్సూర్పై కేసు నమోదు చేశామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నారని ఎస్సై తెలిపారు. -
సమర్థవంతంగా పనిచేయాలి
● ఎస్పీ శబరీష్ మహబూబాబాద్ రూరల్ : సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నేరాల నియంత్రణకు మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఎస్పీ శబరీష్ అన్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సమావేశ మందిరంలో గురువారం నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సీసీటీఎన్ఎస్ ద్వారా ప్రతీ పిటిషన్, కేసు వివరాలు తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలని, పారదర్శకత, జవాబుదారీతనం, సేవల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు చేస్తున్న పనుల అమలులో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. గంజాయి విక్రేతలు, రవాణాదారులు, పాత గంజాయి కేసుల నిందితులు, మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరస్తులపై నిరంతర నిఘా కొనసాగించాలని ఆయన ఆదేశించారు. వారి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. మళ్లీ నేరాలకు పాల్పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఆకస్మిక తనిఖీలు, వాహనాల తనిఖీలు, విస్తృత నిఘా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామీ ణ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించి, కార్డన్సెర్చ్, కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో భద్రతా భావం తీసుకురావాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా క్షేత్రస్థాయిలో కఠిన అమలు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కోర్టుల్లో బలమైన సాక్ష్యాధారాలను సమర్పించడం ద్వారా నిందితులకు శిక్షలుపడేలా చూడాలని ఆదేశించారు. జిల్లాలో పలు కేసుల్లో నిందితులకు శిక్షలు పడేందుకు సమర్థవంతంగా పనిచేసిన కోర్టు డ్యూటీ అధికారులను ఎస్పీ అభినందించి ప్రోత్సాహకాలు అందజేశారు. నేటి నుంచి మార్కెట్కు సెలవులు కేసముద్రం: కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు ప్రత్యేక శ్రేణి కార్యదర్శి రాజేంద్రప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 12న(శుక్రవారం) ప్రముఖ వ్యాపారి తాటికొండ పుల్లయ్య సంతాప సూచకంగా చాంబర్ ఆఫ్ కామర్స్ కోరిక మేరకు, 13, 14న(శని,ఆదివారం) వారాంతపు సెలవులు, 15న(సోమవారం) అమావాస్య సందర్భంగా సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. తిరిగి ఈనెల 16న మార్కెట్ పునఃప్రారంభమవుతుందని చెప్పారు. -
ఈతకెళ్లి యువకుడి మృతి
● యాదాద్రి భువనగిరి జిల్లా వెల్మజాలలో ఘటన ● మృతుడు జనగామ జిల్లా వనపర్తి వాసి లింగాలఘణపురం: జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం వనపర్తికి చెందిన కానుగంటి శ్రీనివాస్, అనురాధ దంపతుల కుమారుడు మణికంఠ (19) యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వెల్మ జాలలో స్నేహితులతో కలిసి ఈ తకెళ్లి నీట మునిగి మృతి చెందాడు. వనపర్తి గ్రామస్తుల కథనం ప్రకారం.. మణికంఠ ఇటీవల ట్రాక్టర్ డ్రైవింగ్ కోసం వెల్మజాలకు వెళ్లాడు. అక్కడ సంగి శ్రీశైలం అనే వ్యక్తి ట్రాక్టర్ నడుపుతున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం స్నేహితులతో కలి సి బావిలో ఈతకు వెళ్లాడు. అయితే మణికంఠకు ఈత రాకున్నా బావిలో దూకి నీటిలో మునిగి చని పోయాడు. కాగా, రెండేళ్లుగా ట్రాక్టర్ నడుపుతూ తల్లిదండ్రులకు ఆసరా అవుతున్న ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో అనురాధ, శ్రీనివాస్ దంపతుల రోదనలు మిన్నంటాయి. మణికంఠ మృతితో వనపర్తిలో విషాదం అలుముకుంది. -
విధులకు వెళ్తూ మృత్యుఒడికి..
● అదుపు తప్పిన బైక్.. రెవెన్యూ ఉద్యోగి మృతి ● వర్ధన్నపేటలో ఘటనవర్ధన్నపేట: విధులకు వెళ్తూ ఓ రెవెన్యూ ఉద్యోగి మృత్యుఒడికి చేరాడు. బైక్ అదుపు తప్పడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గురువారం వర్ధన్నపేటలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వర్ధన్నపేట తహసీల్ కార్యాయం చైన్మెన్ బుంగ వెంకటనర్సు(55) బైక్పై తహసీల్దార్ కార్యాలయం నుంచి పట్టణానికి వచ్చి విధులు ముగించుకున్నాడు. తిరిగి తహసీల్ కార్యాలయానికి వెళ్తున్న క్రమంలో అంబేడ్కర్ సెంటర్ వద్ద బైక్ అదుపు తప్పింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వెంకటనర్సు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మహిళా సాధికారతకు సమాఖ్య భవనాలు
గోవిందరావుపేట: మహిళా ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించి అధిక లాభాలు పొందాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువారం మండలంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె.. మహిళా సంఘాల బలోపేతం, రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ముందు లక్నవరం గ్రామంలో మహిళా సంఘాల సమాఖ్య భవనాల నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం సోమలగడ్డ క్రాస్ సమీపంలోని పీఎస్ఆర్ గార్డెన్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సంప్రదాయ సాగుతో పాటు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించి ఉత్పాదకత పెంచుకోవాలని సూచించారు. రసాయన వినియోగాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, పంట మార్పిడి ద్వారా భూసారాన్ని కాపాడుకుంటూ అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు. ములుగు జిల్లాలో ఆయిల్ పామ్ సాగు వేగంగా విస్తరించడ సంతోషకరమన్నారు. తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పంటగా రైతులు దీనిని స్వీకరించాలని సూచించారు. అనంతరం ఉత్తమ రైతులను మంత్రి సీతక్క, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి, కలెక్టర్ హేమంత్ సహదేవరావు సన్మానించి అభినందించారు. ఆయా కార్యక్రమాల్లో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, జిల్లా అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, రైతులు పాల్గొన్నారు. రైతుల అభివృద్ధికి ఆధునిక సాగు మార్గం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క -
టెస్కోతోనే నేత ఉత్పత్తులు కొనాలి
● మంత్రి తుమ్మలకు మాజీ మేయర్ వినతి కాశిబుగ్గ: చేనేత కార్మికుల ఉపాధి కోసం టెండర్ విధానాన్ని రద్దు చేసి, చేనేత ఉత్పత్తులన్నీ టెస్కో ద్వారానే కొనాలని కోరుతూ.. రాష్ట్ర చేనేత జౌళి, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నా గేశ్వరరావును వరంగల్ మాజీ మేయర్ గుండు సుధారాణి కోరారు. గురువారం హైదరాబాద్లో మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. చేనేత ప రిశ్రమపై ఆధారపడి లక్షలాది మంది చేనేత కార్మికులు జీవిస్తున్నారని, ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వేలాది మంది నేత కార్మికుల కుటుంబాలు చేనేత పరిశ్రమపై ఆధారపడి ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం చేనేత ఉత్పత్తులపై టెండర్ విధా నం అమలు చేయడం, టెస్కో ద్వారా నేరుగా కొనుగోళ్లు లేకపోవడం వల్ల సంఘాల్లో చేనేత ఉత్పత్తుల నిల్వలు పేరుకుపోయాయని, కార్మికులు ఉపాధి కరవై ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఈనెల 1 నుంచి వరంగల్లో కార్మికులు మగ్గాలను బంద్ చేసి దీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం టెండర్ విధానం కాకుండా గతంలో ఉన్న టెస్కో ద్వారా నేరుగా కొని, ప్రభుత్వ హాస్టళ్లకు పంపిణీ చేసి, కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు. రాష్ట్రస్థాయి పద్య పఠన పోటీలు ● జూలై 20వతేదీ లోపు ఎంట్రీలు పంపాలి హన్మకొండ కల్చరల్/గీసుకొండ : రాష్ట్ర స్థాయి పౌ రాణిక పద్యనాటక, పద్య పఠన పోటీల కోసం ఆసక్తిగల వారు జూలై 20వ తేదీ లోపు తమ ఎంట్రీలు పంపాలని కళాపిపాసి సదానందాచారి సాంస్కృతిక సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు మారేడోజు స దానందాచారి గురువారం ఒక ప్రకటనలో తెలిపా రు. తమట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే పోటీల్లో పా ల్గొనే వారు పద్యనాటకంలోని ఏదైనా పాత్రకు సంబంధించిన ఐదు పద్యాలు, ఐదు రాగాలతో భావయుక్తంగా 12 నిమిషాలకు మించకుండా పాడేవారై ఉండాలన్నారు. ఈ రంగంలో ప్రఖ్యాతి చెందిన వారు, అనేక ప్రదర్శనలు ఇచ్చిన వారు పోటీల్లో పా ల్గొనొద్దని, కొత్తవారికి, చూడకుండా, తప్పులు లేకు ండా పాడేవారికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే వారు ఆధార్ జిరాక్స్, వయస్సు,సెల్ నంబర్, పాడే నాటకం పేరు, అందులోని ఏ పాత్ర పద్యాలు పాడుతారో తెలుపుతూ, ఐదు పద్యాలు, వాటి ఐదు రాగాల పేర్లను రాసి వాట్సాప్ ద్వారా తమకు పంపాలన్నారు. హార్మోనియం లేకుండా ఐ దు పద్యాలను ఐదు రాగాల్లో పాడిన వీడియోను త మకు వాట్సాప్ చేయాలన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులతోపాటు ప్రోత్సాహ క బహుమతులు ఉంటాయన్నారు. ఆసక్తి గల వా రు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మారేడోజు కేశవ (సెల్ 93475 10237)కు వాట్సాప్ ద్వారా ఎంట్రీలు పంపించాలని, వివరాలకు ఆయనను సంప్రదించాలని కోరారు. పోటీలు నిర్వహించే ప్రాంతాన్ని పాల్గొనే వారికి త్వరలో తెలుపుతామని పేర్కొన్నారు. -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
● టేకులతండాలో ఘటన కురవి: కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మండలంలోని నల్లెల్ల శివారు గాజ తండా జీపీ పరిధి టేకుల తండాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఇదే మండలం కంచర్లగూడెం తండా గ్రామానికి చెందిన భూక్య శాంతి కుమార్తె కల్యాణి(27)తో టేకుల తండాకు చెందిన గుగులోత్ నరేశ్కు పరిచయడం ఏర్పడింది. 2017లో ప్రేమించుకున్న వీరు 2018లో వివాహం చేసుకున్నారు. ఇటీవల కుటుంబ కలహాలు ఏర్పడ్డాయి. దీంతో కల్యాణి బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నిస్తున్న క్రమంలో గుర్తించిన కుటుంబీకులు, భర్త నరేశ్ హుటాహుటిన మానుకోటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే కల్యాణి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న సీరోలు ఎస్సై సంతోశ్ గురువారం తండాకు చేరుకుని పరిస్థితి తెలుసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంతోష్ తెలిపారు. మృతురాలికి నాలుగేళ్ల బాబు, 11 నెలల పాప ఉంది. హత్యాయత్నం నిందితులపై కేసు టేకుమట్ల: నిద్రిస్తున్న వ్యక్తిని విద్యుత్ షాక్కు గురి చేసి హత్య చేసేందుకు యత్నించి, విఫలమై గొతు నులిమి హత్యాయత్నానికి పాల్ప డిన ఇద్దరిపై గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై అమూల్య తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామానికి గ్రామానికి చెందిన బచ్చల రవి కుటుంబం వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో రవి భార్యకు మండలంలోని గర్మిళ్లపల్లి శివారు బోయినిపల్లికి చెందిన ఈర్ల రాజుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయంపై పలుమార్లు రవి తన భార్యను హెచ్చరించాడు. ఈ నెల 9న రవి జమ్మికుంటకు వ్యక్తిగత పనిపై వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి చేరుకుని నిద్రిస్తున్న సమయంలో భార్య, ఆమె ప్రియుడిగా అనుమానిస్తున్న రాజు.. రవి కాళ్లకు విద్యుత్ వైర్లు తగిలించి షాక్కు గురి చేసేందుకు యత్నించారు. వెంటనే మెళకువకు వచ్చిన రవి కేకలు వేయగా ఇద్దరు కలిసి గొంతు నులిమి హత్యాయత్నం చేయగా తప్పించుకుని బయటకు వచ్చాడు. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి తెలుపడంతో అక్కడి నుంచి ఇద్దరు పరారయ్యారు. కాగా, రవి ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మొబైల్ ట్రాన్స్ఫార్మర్ ట్రాలీలు సిద్ధం
హన్మకొండ: హనుమకొండ సర్కిల్ పరిధిలో విద్యుత్ అత్యవసర పరిస్థితుల్లో వినియోగం కోసం రెండు మొబైల్ ట్రాన్స్ఫార్మర్ ట్రాలీలు సిద్ధం చేశా రు. వీటిని హనుమకొండ టౌన్, హనుమకొండ రూరల్ డివిజన్కు కేటాయించారు. గురువారం హ నుమకొండ సర్కిల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వీటిని హనుమకొండ ఎస్ఈ బి.సామ్యానాయక్ డివిజనల్ ఇంజనీర్లకు అందించారు. ఈసందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ సరఫరా అంతరాయాలను అధిగమించేందుకు, వినియోగదారులకు మెరుగైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు ఈ మొబైల్ ట్రాలీలు ఉపయోగపడుతాయన్నారు. విని యోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబనాయక్, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
వాటర్ ట్యాంకర్ను ఢీకొన్న లారీ
దామెర: వాటర్ ట్యాంకర్ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గురువారం హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై కొంక అశోక్ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా కిల్లా ఘనపురం మండలం రుక్కన్నపల్లికి చెందిన నక్క బాలయ్య (40) లారీపై హనుమకొండ నుంచి గూడెప్పాడ్ వైపునకు వెళ్తూ ఊరుగొండ వద్ద మొక్కలకు నీరు పడుతున్న వాటర్ ట్యాంకర్ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. వాటర్ ట్యాంకర్ డ్రైవర్ ముసూఫ్ కార్తీక్, క్లీనర్ గోపాల్కు తీవ్రగాయాలు కాగా 108లో ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై అశోక్ వెంటనే ఘటనా స్థలికి చేరుకుని క్రేన్ సాయంతో వాహనాలను పక్కకు తప్పించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. లారీ క్యాబిన్లో ఇరుక్కున్న బాలయ్య మృతదేహాన్ని సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై అశోక్ సిబ్బందితో కలిసి బయటకు తీసి అంబులెన్స్లో ఎంజీఎం మార్చూరీకి తరలించారు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. అక్కడికక్కడే లారీ డ్రైవర్ మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు ఊరుగొండ వద్ద ఘటన -
వైద్యులు సమయపాలన పాటించాలి
● డీసీహెచ్ఎస్ చింత రమేశ్ గార్ల: వైద్యులు, వైద్య సిబ్బంది విధుల్లో సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీసీహెచ్ఎస్ చింత రమేశ్ ఆదేశించారు. గురువారం గార్లలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత ఆస్పత్రిలో వైద్యులు, వైద్యసిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. వార్డులను పరిశీ లించి వైద్యసేవలు ఎలా అందుతున్నాయని, ఆస్పత్రిలో ఇన్ పేషెంట్లకు మధ్యాహ్న భోజనం సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా అని రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగులతో వైద్య సిబ్బంది మర్యాదగా ప్రవర్తిస్తూ నాణ్యమైన వైద్యసేవలు అందించాలని సూచించారు. అనంతరం ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆస్పత్రికి డయాలసిస్ సెంటర్ మంజూరైందని, త్వరలో యంత్ర సామగ్రి అమర్చుతారని పేర్కొన్నారు. నూతనంగా స్పెషలిస్ట్ వైద్యురాలు కృష్ణవేణి జాయిన్ అయ్యారని, త్వరలో మరికొంత మంది స్పెషలిస్ట్ వైద్యులు విధుల్లో చేరుతారని ఆయన వెల్లడించారు. సీహెచ్సీలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్గౌడ్, డాక్టర్లు బాలునాయక్, నాగేశ్వరరావు, సతీష్, కృష్ణవేణి, అన్నపూర్ణరెడ్డి, నర్సింగ్ ఆఫీసర్లు స్వాతి, మెర్సీరాణి, రాణి, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కూతురును సర్కారు బడిలో చేర్పించిన సర్పంచ్
ఇనుగుర్తి: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘బడి బాట’ కార్యక్రమంలో చిన్నముప్పారం మహిళా సర్పంచ్ తన కూతురుకు అడ్మిషన్ తీసుకుని ఆదర్శంగా నిలిచా రు. వివరాలు ఇలా ఉన్నాయి.. చిన్నముప్పారం మహిళా సర్పంచ్ రాయలి భవాని శేఖర్ తన కూతురు మహతిని ప్రైవేట్ పాఠశాలను కాదని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతిలో అడ్మిషన్ తీసుకున్నారు. అలాగే తమ మిత్రుడు గుండు వేణు కుమారుడు రుత్విక్ను కూడా అదే పాఠశాలలో 8వ తరగతిలో చేర్పించి ప్రభుత్వ విద్యపై తమకున్న నమ్మకాన్ని చాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ భవాని శేఖర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యంత అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, సరైన వసతులు ఉన్నాయన్నారు. తల్లిదండ్రులెవరూ ప్రైవేట్ స్కూళ్ల మోజులో పడి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు. బడీడు పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి.వెంకటరెడ్డి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు -
నాణ్యమైన విత్తనాలు అందించాలి
● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ మహబూబాబాద్ రూరల్: నకిలీ విత్తనాలను నివారిస్తూ రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందేలా చూడాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం వ్యవసాయశాఖ, గృహ నిర్మాణశాఖ అధికారులతో వేర్వేరుగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీనాయక్ మాట్లాడుతూ.. వానాకా లం సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువుల లభ్యతపై తెలియజేయాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ఖరీఫ్ సీజన్ పంటల సాగులో రైతులు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. రైతులకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వ్యవసాయ విస్తరణాధికారులు, మండల వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. డీఏఓ విజయచంద్ర, ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓలు, ఏఈఓలు ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై.. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తుందని ఎమ్మెల్యే మురళీనాయక్ అన్నారు. మొదటి విడతలో కొంతమంది లబ్ధిదారులకు సాంకేతిక కారణాల వల్ల, లబ్ధిదారుల జెండర్ మార్పుల వల్ల పేమెంట్ సమస్య ఎదురవుతుందని, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మొదటి విడతలో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నా రు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ఎలాంటి అవినీతికి తావులేకుండా, అర్హులైన పేదలకు ఇళ్లు అందేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో నిర్మాణ పనుల పురోగతిని పర్యవేక్షించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో గృహ నిర్మాణశాఖ ఇన్చార్జ్ పీడీ పురుషోత్తం, మున్సిపల్ కమిషనర్ వినోద్ కుమార్, వివిధ మండలాల ఎంపీడీఓలు పాల్గొన్నారు. -
సాగులో మార్పు రావాలి
మహబూబాబాద్ రూరల్: రైతులు పంటల సాగులో మార్పు తీసుకురావాలని, నీటి వసతి ఆధారంగా పంటల సాగు చేయాలని, యూ రియా వాడకం తగ్గించాలని, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో స్వల్పకాలిక వరి రకాలు, ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.విజయచంద్ర అన్నారు. భూసారం పెంచేందుకు పచ్చిరొట్ట ఎరువులు సాగు చేసి భూమిలో కలియదున్నాలని, విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, అధిక మొత్తంలో వ్యవసాయ భూమి ఉన్న రైతులు ఆయిల్పామ్ సాగు చేయాలన్నారు. వానాకాలం పంటల సాగు నేపథ్యంలో విత్తనాల సేకరణ, ఎరువుల యాజమాన్యం, నకిలీ విత్తనాలను గుర్తించడం వంటి అంశాలపై రైతుల సందేహాలను నివృత్తి చేసేందుకు సాక్షి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఫోన్ఇన్ కార్యక్రమానికి అ నూహ్య స్పందన వచ్చింది. రైతులు అడిగిన ప్రశ్నలకు డీఏఓ ఎస్.విజయచంద్ర, జిల్లా ఉద్యాన, ప ట్టు పరిశ్రమ శాఖ అధికారి మరియన్న సమాధానాలు చెప్పి వారి సందేహాలను నివృత్తి చేశారు. ప్రశ్న: ఖరీఫ్కు అనువైన వరి రకాలు ఏమిటి? రైతులు: శ్రీనివాస్రెడ్డి గూడూరు, నవీన్ కొత్తగూడ, సత్తిరెడ్డి బయ్యారం, శ్రీనివాస్ జంగిలిగొండ, వెంకన్న జయ్యారం, వేణుగోపాల్ గుండెపుడి, సురేష్ బొడ్లాడ, హరినాయక్ వీరారం. జవాబు: ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు స్వల్పకాలిక వరి రకాలను సాగుచేయడం మేలుదాయకం. వరిలో బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048(తెలంగాణ సోనా), హెచ్ఎంటీ, జైశ్రీరామ్, కేఎన్ఎం 1638, డబ్ల్యూజీఎల్ 44, డబ్ల్యూజీఎల్ 962, జేజీఎల్ 1798, ఎంటీయూ 1010, కేఎన్ఎం 118 వంటి రకాలు సాగు చేసుకోవచ్చు. ప్ర: పత్తిలో అధిక దిగుబడికి ఏ రకం విత్తనాలు నాటాలి? రైతులు: నాగయ్య కురవి, రాజశేఖర్ కంబాలపల్లి, నవీన్ పర్వతగిరి, వెంకన్న బూరుకుంటతండా, లక్ష్మణ్ వేంనూర్, లింగన్న వీఎస్ లక్ష్మీపురం. జ: పత్తిలో అధిక సాంద్రత పద్ధతి ద్వారా సాగు చేస్తే రైతులకు మంచి దిగుబడి వస్తుంది. మొక్కల మధ్య దూరం తగ్గి అధిక మొక్కలు వేసుకునేందుకు వీలుంటుంది. నూజివీడు రకాలు ఎంచుకోవడం మంచిది. రాశిలో స్విఫ్ట్, నూజివీడులో సిరి, వేదలో ప్లాటినం రకాలు సాగు చేసుకోవచ్చు. ప్ర: నకిలీ విత్తనాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైతులు: ఉపేందర్ గూడూరు, రఘు నడివాడ, యాకూబ్రెడ్డి చిన్నగూడూరు, రాజు కంఠాయపాలెం, విజయ్ ఉగ్గంపల్లి. జ: నకిలీ విత్తనాలు అని అనుమానం వస్తే స్థానిక పోలీస్ స్టేషన్లో, మండల వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేయాలి. రైతులు లైసెన్స్ పొందిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి. పంటకాలం పూర్తయ్యే వరకు ఖాళీ ప్యాకెట్లు, బిల్లులు తమ వద్ద ఉంచుకోవాలి. లాట్ నంబర్ వేయించాలి. రైతు, షాపు యజమాని ఇద్దరి సంతకం ఉండాలి. గ్రామాల్లోకి వచ్చి విత్తనాలు అమ్మే వారిని నమ్మవద్దు. జాగ్రత్తలు పాటిస్తే పంటనష్టం జరిగినప్పుడు పరిహారం వచ్చేందుకు వీలుంటుంది. ప్ర: యూరియా పంపిణీలో మార్పులు చేస్తారా? రైతులు: కృష్ణ డోర్నకల్, మల్లయ్య, శ్రీనివాస్ కొమ్ములవంచ, ఠానూనాయక్ బిల్యాతండా, వినయ్, సాయికుమార్ మడగూడ, అనిల్ వెంక్యాతండా, మోతిలాల్ గుండ్లబోడుతండా, అశోక్ బోరింగ్తండా, వెంకన్న ఇస్లావత్తండా, సైదులు రెడ్యాల. జ: రైతులు యూరియాను యాప్ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలి. ప్రస్తుతానికి యూరియా పంపిణీ విషయంలో ఎలాంటి మార్పులు లేవు. యాప్లో బుకింగ్ గురించి తెలియని వారు సంబంధిత షాపుల వద్ద ఉండే వలంటీర్లను సంప్రదించాలి. రైతు వేదికల వద్ద ఏఈఓలు సహకారం అందిస్తారు. పంటల సాగు విషయంలో రైతులు సాధ్యమైనంత వరకు యూరియా వాడకాన్ని తగ్గించి నానోయూరియా వినియోగంపై దృష్టి సారించాలి. ప్ర: పచ్చిరొట్ట ఎరువుల ప్రయోజనాలు ఏమిటి?రైతులు: నవీన్ కొత్తగూడ, శ్రీనివాస్రెడ్డి గూడూరు, కిషన్ గార్ల, శ్రీనివాస్ అమీనాపురం, మహేశ్ చిట్యాల, శంకర్ పెద్దవంగర, ఉప్పలయ్య అమ్మాపురం, రాంబాబు గుర్రాలగుట్టతండా, వెంకన్న పర్వతగిరి, శ్రీహరి కొత్తగూడ. జ: పంటల సాగుకు ముందుగానే పచ్చిరొట్ట ఎరువులైన జిలుగ, జనుము సాగు చేసి భూమిలో కలియదున్నాలి. భూసారం పెంచేందుకు పచ్చిరొట్ట ఎరువులు ఎంతగానో దోహదం చేస్తాయి. అదే విధంగా ఎప్పటికీ ఒకేరకం పంటలు కాకుండా ఆరుతడి పంటలైన కందులు, మినుములు, పెసర, బొబ్బెర, నువ్వులు తదితర రకాలు సాగు చేయడం మంచిది. పంట మార్పిడి విధానాన్ని పాటిస్తూ పత్తి, మిర్చి, మక్కజొన్న వరకే కాకుండా ఆయిల్పామ్ సాగుపై దృష్టి పెంచాలి. ప్ర: మిరపనారు కొనుగోలు చేయవచ్చా?రైతులు: రాంబాబు గుర్రాలగుట్ట, ఉప్పలయ్య అమ్మాపురం, శ్రీనివాస్ కొమ్ములవంచ, శేఖర్, సాగర్ మల్యాల, రమేశ్ సికింద్రాబాద్, నరేష్ చోక్లాతండా, సునీల్ దామ్యతండా, నవీన్ రామచంద్రుతండా, సతీష్, గణేష్ రెడ్యాల. జ: మిరపనారు సిద్ధం చేసుకునేందుకు రైతులు మిరప విత్తనాలు కొనుగోలు చేయగానే ముందుగా విత్తనశుద్ధి చేసుకోవాలి. ఎత్తు నారుమడులు పోసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన నారు చేతికి అందుతుంది. మిరపసాగు సమయంలో పంట మధ్యలో పసుపురంగు, నీలిరంగు, జిగురు అట్టాలను ఏర్పాటు చేసుకుంటే దోమ, నల్లి బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. మిరపనారు పోసుకోని రైతులు నర్సరీల్లో కొనుగోలు చేసుకుని ప్రభుత్వ నిబంధనల మేరకు రశీదులు తీసుకుని మిరప సాగు చేయాలి. ప్ర: వరి నారుమడిలో జాగ్రత్తలు ఏమిటి?రైతులు: ఉప్పలయ్య అమ్మాపురం, హరినాయక్ వీరారం, సత్తిరెడ్డి బయ్యారం, విజయ్ ఉగ్గంపల్లి, యాకూబ్రెడ్డి చిన్నగూడూరు, నవీన్ కొత్తగూడ, నాగయ్య కురవి, శ్రీనివాస్రెడ్డి గూడూరు, సుధాకర్, శ్రీనివాస్ జంగిలిగొండ, మల్లయ్య కొమ్ములవంచ. జ: వరినారు మడిలో తగిన జాగ్రత్తలు పాటించి ప్రధాన పొలం సాగుకంటే ముందు జిప్సమ్ వేసుకుని కలియదున్నాలి. యూరియా తగ్గించి నానో యూరియా అలవాటు చేసుకుని కాంప్లెక్స్ ఎరువులు కూడా సిఫార్సు మేరకే వాడాలి. రసాయనాలు పురుగుమందుల వాడకం తగ్గిస్తే పంట దిగుబడి మంచిగా వస్తుంది. నేరుగా వరివిత్తే విధానం మంచిది. వర్షాలు పడకముందు పంట సాగు చేయవద్దు. వరిలో కాలిబాటలు తీస్తే పంటకు ఎలాంటి దోమపోటు రాకుండా ఉంటుంది. నీటి వసతి ఆధారంగా పంటలు ఎంపిక చేసుకోవాలి స్వల్పకాలిక రకాలు వేయాలి భూసారం పెంచేందుకు పచ్చిరొట్ట ఎరువులు యూరియా వాడకం తగ్గించాలి విత్తనాల కొనుగోలులో జాగ్రత్తలు పాటించాలి ‘సాక్షి’ ఫోన్ఇన్ కార్యక్రమంలో డీఏఓ విజయచంద్ర రైతుల నుంచి అనూహ్య స్పందన -
ఆదిముక్తీశ్వరా.. నీకు ప్రణామాలు
కాళేశ్వరం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని కాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థానం పునరుద్ధరణ పనుల నేపథ్యంలో ఈనెల 17వ తేదీ నుంచి భక్తులు ఆదిముక్తీశ్వరాలయంలో స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించనున్నారు. తద్వారా అడవిలో వెలసిన ఆదిముక్తీశ్వర ఆలయానికి ప్రత్యేక ప్రాధాన్యం లభించనుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. ప్రధాన ఆలయానికి కిలోమీటర్ దూరంలో ఉంది. ఏడాదిపాటు ఆదిముక్తీశ్వరాలయానికి భక్తజనం క్యూ కట్టనున్నారు. దీంతో ఆలయం భక్తుల శివనామస్మరణతో మారుమోగనుంది. షెడ్డుకు మరమ్మతులు.. రూ.198 కోట్ల వ్యయంతో శ్రీ కాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థాన రాతి కట్టడాల పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్సవమూర్తులను (బాలాలయం) ఆదిముక్తీశ్వరాలయం సమీపంలోని ప్రత్యేక షెడ్డులో ప్రతిష్ఠించి నిత్య పూజలు కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ షెడ్డుకు గాలి, వెలుతురు పడకుండా సిమెంట్ మరమ్మతులు ప్రారంభించారు. క్యూలైన్లు ఏర్పాటు కానున్నాయి. 17న ఉదయం క్రతువు.. కర్ణాటకలోని శృంగేరి శారద పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతి తీర్థ స్వామివారి అనుమతితో ఈ నెల 17న ఉదయం 8.15 గంటలకు వారి శిష్య బృందం ఆధ్వర్యంలో కళాపకర్షణ క్రతువు నిర్వహించి, ఆలయ తొలగింపు, పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈనెల 17 నుంచి భక్తుల దర్శనాలు, అభిషేకాలు, మొక్కులు, ప్రత్యేక పూజలు ఆదిముక్తీశ్వరాలయంలోనే నిర్వహించబడతాయి. టికెట్ విక్రయాలు, ప్రసాదాల పంపిణీ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. తాగునీరు ఇతర వసతులపై దృష్టిసారిస్తున్నారు. వసతుల ఏర్పాటు.. ఆదిముక్తీశ్వరాలయం వద్ద స్థలం పరిమితంగా ఉండడంతో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. అలాగే, రవాణా, తాగునీరు, క్యూలైన్లు తదితర సౌకర్యాలను కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. పునర్నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు సుమారు ఏడాది పాటు భక్తులు ఆదిముక్తీశ్వరాలయంలోనే స్వామివారిని దర్శించుకోనున్నారు. దీంతో ఆలయంలో సుమారు 60 మంది వరకు అర్చక సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరితో పాటు దినసరి లేబర్ కూడా పనులు చేస్తున్నారు. దేవాదాయశాఖ మాత్రం ఎలాంటి ప్రకటనలు చేయకుండా గోప్యత పాటిస్తోంది. ఈనెల 17వ తేదీ నుంచి అడవిలో వెలసిన ఆలయంలో పూజలు రూ.198 కోట్ల వ్యయంతో కాళేశ్వరముక్తీశ్వరాలయంలో రాతి నిర్మాణ పనులకు శ్రీకారం ఏడాది పాటు కిలోమీటర్ దూరంలోని ఆదిముక్తీశ్వరాలయంలో మొక్కులు, అభిషేకాలు -
విద్యుత్ బస్సులను వేధిస్తున్న బ్యాటరీలు
హన్మకొండ: ఆర్టీసీ జేబీఎం విద్యుత్ బస్సులను బ్యాటరీ సమస్యలు వేధిస్తున్నాయి. 75 రోజుల వ్యవధిలో రెండు సార్లు బ్యాటరీల్లో మంటలు వచ్చాయి. దీంతో మార్గమద్యలో బస్సులు నిలిచి విసిగి పోతుండగా మరో వైపు బ్యాటరీల్లో షార్ట్ సర్క్యూట్తో వస్తున్న మంటలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎప్పుడు ఏ బస్సులో మంటలు వస్తాయో, ఎక్కడ తగులబడుతాయోననే ఆందోళనల మధ్య అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. టీజీఎస్ ఆర్టీసీ వరంగల్–2 డిపోలో 115 విద్యుత్ బస్సులున్నాయి. మార్చి 28న రాత్రి టీజీ 03 టీ 1260 ఎలక్ట్రిక్ బస్ బ్యాటరీ నుంచి మంటలు ఎగిసిపడగా అగ్నిమాపక సిబ్బంది చేరుకుని ఆర్పారు. ఈ ఘటనలో ఏడు బ్యాటరీలకు నష్టం కలిగింది. కాగా, ఇదిలా ఉండగా బుధవారం రాత్రి టీజీ 03 టీ 2209 బస్సుకు చార్జ్ పెట్టగా రెండు గంటల్లో పూర్తయి వెంటనే బ్యాటరీ నుంచి పొగలు వ్యాపించాయి. వెంటనే గమనించిన సిబ్బంది ఆపే ప్రయత్నం చేస్తుండగా మంటలు లేచాయి. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పారు. ఈ ఘటనలో రెండు బ్యాటరీలు దెబ్బతిన్నాయి. మంటలు వెంటనే ఆర్పకపోతే ఈ బస్సుతో పాటు పక్కన ఉన్న బస్సులు మంటలకు దగ్గమయ్యేవి. సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో భారీ ముప్పు తప్పింది. ఈ ఘటనతో 75 రోజుల్లో రెండు సార్లు జేబీఎం బస్సులో బ్యాటరీల్లో మంటలు లేచాయి. దీంతో ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతాయోననే సిబ్బంది ఆందోళనలో ఉన్నారు. బుధవారం రాత్రి మంటలు సిబ్బంది అప్రమత్తం.. తప్పిన పెనుముప్పు -
ఉపాధి పనుల్లో పెళ్లి వేడుకలు
దంపతులకు చెట్ల ఆకులు, పూలతో పెళ్లి జరిపించిన ఉపాధి కూలీలుజఫర్గఢ్: ఉపాధి హామీ పనుల్లో కూలీలు.. దంపతులకు పెళ్లి జరిపించారు. ఈ ఆసక్తికర ఘటన జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం షాపల్లిలో చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా ఉపాధి పథకంలో భాగంగా గ్రామ చెరువు పూడికతీత పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం పనికి వెళ్లిన కూలీలు విరామ సమయంలో చెట్ల కింద సేదదీరుతున్నారు. ఈ సమయంలో సోషల్ మీడియాలో వచ్చిన ఉపాధి పనుల్లో జరిగిన పెళ్లి వేడుకలను చూశారు. అనంతరం తమ సహచర కూలీలైన మాచర్ల కొమురయ్య సుభద్ర దంపతులకు పెళ్లి జరిపించారు. కూలీలు పూజారిగా గాను, కు టుంబ పెద్దలుగా వ్యవహరించి పూలు, చెట్ల ఆ కులతో దంపతులను ముస్తాబు చేసి వివాహం జరిపించారు. ఆకులతో తయారు చేసిన పుస్తెల తాడు కట్టించడం, తలంబ్రాలు పోయించడం, పూలదండలు వేయించడం వంటి తంతు జరిపించారు. అనంతరం పెళ్లి జరిపించిన పెద్దల పాదాలకు దంపతులు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఘటన కూలీలతోపాటు గ్రామస్తులకు ఆనందం కలిగించింది. -
చాపకింద నీరులా..
గురువారం శ్రీ 11 శ్రీ జూన్ శ్రీ 2026నెహ్రూసెంటర్: జీవనశైలిలో మార్పుల వల్ల జిల్లాలో బీపీ, షుగర్ వ్యాధుగ్రస్తుల సంఖ్య ఏటా పెరుగుతో ంది. పట్టణాల్లో కనిపించే వ్యాధులు ఇప్పుడు పల్లెల్లో సైతం విస్తరిస్తూ కలవరపెడుతున్నాయి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటివి ప్రధాన కారణమవుతున్నా యి. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో 30 సంవత్సరాలు పైబడిన వారందరికీ రీస్క్రీనింగ్ పేరుతో బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి పరీక్షలను నిర్వహిస్తూ వారి వివరాలను నమోదు చేస్తున్నారు. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు జిల్లాలో 50వేలకు పైగానే ఉన్నట్లు సమాచారం. అలాగే క్యాన్సర్, లెప్రసీ వంటి వ్యాధులను గుర్తిస్తూ వైద్యం అందిస్తున్నారు. విస్తరణ ఇలా.. జిల్లాలో చాపకిందనీరులా బీపీ, షుగర్, క్యాన్సర్ వ్యాధుల విస్తరణ ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా 30 ఏళ్లకు పైబడిన వారు సైతం ఈ వ్యాధులు బారిన పడుతుండటం ఆందోళన కలిగించే అంశం. మూడున్నర లక్షలకుపైగా 30 ఏళ్లపైబడిన వారిని పరీక్షించగా 50 వేల మంది షుగర్, బీపీ, ఇతర వ్యాధులతో బాధపడుతుండడం ఆశ్చర్యం కలిగి స్తోంది. ప్రతీరోజు వ్యాయామం చేస్తూ శారీక శ్రమ, ఒత్తిడి తగ్గించుకోవడం ద్వారా వ్యాధులను దూరం చేసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. 6 నెలలకు ఓసారి వైద్య పరీక్షలు చేయించుకుని అందుకు తగినట్లు జీవన విధానంలో మార్పులు చేసుకో వడం ద్వారా వ్యాధులను అరికట్టవచ్చని తెలుపుతున్నారు. ఒత్తిడి, ఆహారపు అలవాట్లు.. ఒత్తిడి, శారీరకశ్రమ లేకపోవడంతో పాటు ఆహారపు అలవాట్లు బీపీ, షుగర్ వ్యాధుల బారిన పడేలా చేస్తున్నాయి. సరైన ఆహారం తీసుకోకపోవడం, ప్రతీరోజు కనీసం అరగంట పాటు వ్యాయామం చేయకపోవడంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. అవగాహన లేక, నిర్లక్ష్యంతో వ్యాధుల బారిన పడుతున్నారు. 30 ఏళ్లు పైబడిన వారికి రీ స్క్రీనింగ్.. జిల్లాలో 30ఏళ్లు పైబడిన వారందరిని వైద్యారోగ్యశాఖ సిబ్బంది రీస్క్రినింగ్ ద్వారా సర్వే చేపడుతున్నారు. జిల్లాలో మొత్తంగా 30 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 3,92,894 ఉండగా ఇప్పటి వరకు 2,75,968 మందికి సర్వే నిర్వహించారు. సర్వే ద్వారా బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి బాధితులను గుర్తించి వారికి వైద్య చికిత్సలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సర్వేలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలిప్రజలందరూ తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా పరీక్షలు చేయడంతో పాటు మందులు కూడా క్రమం తప్పకుండా ఉచితంగా అందజేస్తారు. సర్వేలు, పరీక్షలు నిర్వహిస్తున్న వెద్య సిబ్బందికి సహకరించాలి. ఎన్సీడీ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నాం. – రవిరాథోడ్, డీఎంహెచ్ఓ బీపీ, షుగుర్ వ్యాధుల విస్తరణ జిల్లాలో 50వేల మందికి పైగా బాధితులు 30ఏళ్లు పైబడిన వారికి వైద్య పరీక్షలు మారుతున్న జీవనశైలి వల్లే వ్యాధుల వ్యాప్తి -
నేడు డీఏఓతో సాక్షి ఫోన్ ఇన్
మహబూబాబాద్ రూరల్ : వానాకాలం పంటల సాగు నేపథ్యంలో రైతులు తమ సందేహాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్.విజయచంద్రతో నివృత్తి చేసుకునేలా సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో సాక్షి ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. విత్తనాల సేకరణ, ఎరువుల యాజమాన్యం, నకిలీ విత్తనాలను గుర్తించడం తదితర అంశాలపై రైతుల సందేహాలను డీఏఓ నివృత్తి చేయనున్నారు. అంశం : వానాకాలం సాగుపై సలహాలు, సూచనలు నేడు (గురువారం) సమయం : ఉదయం 11నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. రైతులు ఫోన్ చేయాల్సిన నంబర్లు : 89777 49210, 96034 62487 -
మాదకద్రవ్యాలను నిర్మూలించాలి
దంతాలపల్లి: గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలని తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్ అన్నారు. బుధవారం మండలంలోని రామానుజాపురంలో నిర్వహించిన గ్రామసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువత గంజాయి మత్తులో తూగుతుందని, మాదక ద్రవ్యాల నిర్మూలనకు అందరూ సహకరించాలన్నారు. అనంతరం సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామంలోని ద్వి చక్రవాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అక్కిరెడ్డి దామోదర్రెడ్డి, ఎస్సై రవికుమార్, ఉపసర్పంచ్ మల్లం మౌనిక, గ్రామ కార్యదర్శి ప్రభు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. -
నకిలీలపై టాస్క్ఫోర్స్
ఈ వానాకాలంలో సాగు అంచనా(ఎకరాల్లో)పంట గత ఏడాది ఈ వానాకాలం సాగు (అంచనా) పత్తి 1,06,674 1,01,716 వరి 2,30,723 2,35,163 మొక్కజొన్న 66,208 73,760 మిర్చి 31,423 38,819 పప్పుదినుసులు 1,353 2,100 ఆయిల్పామ్ 7,904 8,676 ఇతరపంటలు 2,065 17,487 మొత్తం 4,46,350 4,77,721బయ్యారం: పంటల సాగుల విత్తనం ఎంపిక కీలకం. అయితే మార్కెట్లో అసలుతో పాటు నకిలీ విత్తనాల బెడద ఎక్కువైంది. కాగా, ఏటా నకిలీ విత్తనా లు అని తెలియక నాటిన రైతులు నష్టపోతున్నారు. ఈమేరకు నకిలీ విత్తనాలు రైతుకు చేరకుండా వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ అధికారులతో కూడిన టాస్క్ఫోర్స్ బృందం ప్రత్యేక దృష్టి పెట్టింది. జిల్లాలోని అన్ని మండలాలు, పట్టణాల్లోని విత్తనదుకాణాల్లో సోదాలు నిర్వహిస్తూ డీలర్లకు పలు సూచనలు చేస్తున్నారు. గ్రామాల్లో అపరిచిత వ్యక్తుల నుంచి విత్తనాలు కొనుగోలు చేయొద్దని, అలాంటి వ్యక్తుల సమాచారం తమకు అందజేయాలని అధి కారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బిల్లుతో పాటు ప్యాకెట్ భద్రపర్చుకుంటే మేలు.. విత్తనాలను కొనుగోలు చేసిన రైతులు సంబంధిత డీలర్ల నుంచి తప్పనిసరిగా బిల్లును తీసుకోవాలి. అలాగే విత్తన ప్యాకెట్లను పంట దిగుబడి వచ్చే వరకు భద్రపర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల విత్తనాలు మొలకెత్తకున్నా, మొలకెత్తిన విత్తనాలు పూత, కాత లేకపోతే సంబంధిత డీలర్, కంపెనీ నుంచి రైతులకు నష్టపరిహారం అందుతుంది. పెరగనున్న మిర్చి, మొక్కజొన్న, వరి, ఇతర పంటల సాగు.. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది వానాకాలంలో సాగు చేసిన పంటల్లో ఈఏడాది మిర్చి, మొక్కజొన్న, వరి, పప్పుదినుసులు, ఆయిల్పామ్, కూరగాయలు, పండ్లతోటల సాగు పెరుగుతుందని వ్యవసాయశాఖాధికారులు అంచనా వేశారు. పత్తి పంట గత ఏడాది కంటే తక్కువ ఎకరాల్లో సాగు జరిగే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. రైతులు సహకరించాలినకిలీ విత్తనాలను అరికట్టేందుకు రెవెన్యూ, పోలీస్శాఖ సహకారంతో తనిఖీలు నిర్వహిస్తున్నాం. క్షేత్రస్థాయిలో అనుమతి లేకుండా ఎవరైనా విత్తనాలు విక్రయిస్తే సంబంధిత వ్యక్తుల సమాచారం అందజేసేందుకు రైతులు సహకరించాలి. – రాజు, ఏఓ, బయ్యారం విత్తన దుకాణాల్లో అధికారుల తనిఖీలు వానాకాలంలో 4,77,721 ఎకరాల్లో సాగు అంచనా -
వాహనదారులు క్షేమంగా గమ్యస్థానం చేరాలి
గూడూరు: ద్విచక్రవాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ క్షేమంగా ఇంటికి చేరాలని ఎస్పీ శబరీష్ అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రభుత్వం, పోలీసులు ప్రత్యేకంగా చేపట్టిన అరైవ్–అలైవ్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఎస్పీ చేతుల మీదుగా ఉచితంగా హెల్మెట్లు అందించా రు. తర్వాత రోడ్డు ప్రమాదాలకు గల కారణాలను ప్లకార్డుల ప్రదర్శనతో గూడూరు సీఐ వినయ్కుమార్ వివరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ద్విచక్రవాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించేలా చర్యలు చేపట్టామన్నారు. మండలంలో గాజులగట్టు, పొనుగోడులో పోలీసుల ప్రత్యేక దృష్టితో జీపీ పాలకవర్గం గ్రామంలోకి వచ్చే ప్రతీ ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించాలనే నిబంధన మొదలు పెట్టి సక్సెస్ అయినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సునీత కొమ్మాలు, తహసీల్దార్ నాగభవాని, ఎంపీడీఓ సత్యనారాయణ, నెక్కొండ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ నరేష్రెడ్డి, ఆర్టీఏ శంకర్నాయక్, ఎస్సై గిరిధర్రెడ్డి, ఏఓ అబ్దుల్మాలిక్, ఎఫ్ఆర్వో ప్రసాదరావు, ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఎస్పీ శబరీష్ -
అధిక ధరలను నియంత్రించాలి
మహబూబాబాద్: అధిక ధరలను నియంత్రించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథి డిమాండ్ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా విజయసారథి మాట్లాడుతూ.. 12 ఏళ్ల మోదీ పాలనలో వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్తో పాటు అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగి పేదలపై భారం పడిందన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్తో కొంతమంది విద్యార్థులు ఆత్యహత్య చేసుకున్నారని, అందుకు సంబంధిత కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు అజయ్సారథిరెడ్డి, సుధాకర్రెడ్డి, శ్రీని వాస్, పెరుగు కుమార్, నవీన్, చింతకుంట్ల వెంకన్న, సాంబలక్ష్మి, పాండురంగాచారి, వెంకన్న, నా గేశ్వర్రావు, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే ఏడాది ఖరీఫ్కు సాగునీరు
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల్లో మరమ్మతుల పూర్తి చేసి వచ్చే ఏడాది ఖరీఫ్ సీజన్కు సాగునీరందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఇరిగేషన్శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ కల్నల్ పరీక్షిత్ మెహ్రాతో కలిసి మంత్రి ఉత్తమ్ ప్రత్యేక హెలికాప్టర్లో బుధవారం మధ్యాహ్నం 2.15గంటలకు మేడిగడ్డకు చేరుకున్నారు. అక్కడినుంచి కాన్వాయ్లో బ్యారేజీ దిగువకు వెళ్లారు. పుణెకు చెందిన సైంటిస్టులు, ఇరిగేషన్శాఖ ఇంజనీర్లతో మాట్లాడి పరీక్షలు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. అక్కడి నుంచి బ్యారేజీ ఎగువన యాగశాల వద్ద ఏర్పాటు చేసిన సమీక్షలో పాల్గొన్నారు. ముందుగా కల్నల్ పరీక్షిత్ మెహ్రా బ్యారేజీల్లో జరుగుతున్న పరీక్షలను ఒక్కొక్కటిగా వీడియోలు, ఫొటోల ఆధారంగా వివరించారు. రాత్రిపగలు పరీక్షలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూపీఆర్ల ఆదేశాలకు అనుగుణంగా పరీక్షలు జరుగుతున్నాయని వివరించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజీ లోపభూయిష్టమైన నిర్మాణం వల్లనే కుంగినట్లు తెలిపారు. కారణాలను లోతుగా విశ్లేషణ చేసేందుకు సీడబ్ల్యూసీ, ఎన్డీఎస్ఏ వంటి ప్రతిష్టాత్మకమైన అనుభవం కలిగిన సంస్థలతో పరీక్షలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు. భారత సైన్యంలో అత్యంత నైపుణ్యం, అనుభవం కలిగిన కల్నల్ పరీక్షిత్ మెహ్రా ఆధ్వర్యంలో ముందుకుపోతున్నట్లు తెలిపారు. ఎన్డీఎస్ఏ గుర్తించిన స్కౌర్ డెప్త్, కట్–ఆఫ్ డెప్త్, టెయిల్ వాటర్ రేటింగ్ కర్వ్, ఎనర్జీ డిసిప్లేషన్, గేట్ల నిర్వహణ వంటి కీలక అంశాలపై సమగ్ర అధ్యయనాలు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ రైతాంగానికి దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరేలా ప్రాజెక్టులను తిరిగి సురక్షితంగా, సమర్థవంతంగా అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ఇరిగేషన్ సెక్రటరీ శ్రీధర్, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, సీఈ శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి గంటపాటు మేడిగడ్డ బ్యారేజీలో పర్యటన.. పరిశోధనల తనిఖీ మూడు బ్యారేజీల్లోని పరీక్షల వివరాలు వెల్లడి -
మొన్న.. నిన్న.. నేడు
వరంగల్ అర్బన్ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి మొయిన్ గేట్కు ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై తాగునీటి పైపులైన్ లీకేజీ కావడంతో మరమ్మతు కోసం తవ్వకాలు చేశారు. లీకేజీని సరిచేసి గుంతను తవ్విన మట్టితోనే పూడ్చివేసి చేతులు దులుపుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఒకరోజు గడవకముందే గుంతగా మారింది. నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉండే రోడ్డులో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైంది. చూడలేక, వాహనదారుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వరంగల్ ట్రాఫిక్ పోలీసులు నడిరోడ్డుపై ఏర్పడిన గుంత వద్ద బారికేడ్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’లో’ ఈనెల 7వ తేదీన ‘ప్రమాదాలకు కేరాఫ్ ఎంజీఎం రోడ్డు’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. మరునాడు ట్రాఫిక్ పోలీసులు స్పందించి బల్దియా ఇంజనీర్ల దృష్టికి తీసుకెళ్లారు. కాంట్రాక్టర్ సహకారం, ట్రాఫిక్ పోలీసుల చొరవతో కంకర డస్ట్, ఇసుక పోసి గుంతను పూడ్చి వేశారు. బారికేడ్ను తొలగించారు. ఒకటి, రెండు రోజులు గడవకముందే ఆ గుంత మళ్లీ కుంగిపోయింది. రెండు రోజులుగా గుంత ప్రమాదకరంగా మారడంతో ట్రాఫిక్ పోలీసులు మళ్లీ బారికేడ్ పెట్టారు. ఈ రహదారి ప్రధాన నిర్వహణ బాధ్యత ఆర్అండ్బీ ఇంజనీర్లతోపాటు పైపులైన్ లీకేజీ కోసం తవ్వకం చేసిన బల్దియా ఇంజనీర్లది. కానీ ఎవరికి వారు అన్నట్లు వ్యవహరించడంతో వాహనదారులు ఇక్కట్ల పాలవుతున్నారు. ఇకనైనా ఆర్అండ్బీ, బల్దియా ఇంజనీర్లు ప్రధాన రహదారిపై గుంత ఏర్పడకుండా శాశ్వత మరమ్మతులు చేయాలని వాహనదారులు, ప్రజలు విన్నవిస్తున్నారు. -
త్వరలో దేవాదాయశాఖలో పోస్టుల భర్తీ
హన్మకొండ కల్చరల్ : త్వరలో దేవాదాయశాఖ కార్యాలయాలు, దేవాలయాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర దేవాదాయధర్మాదాయశాఖ కమిషనర్ ఎం. హనుమంతరావు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అనేక దేవాలయాల్లో పాచిక, పరిచారిక, అర్చక పోస్టులను వేదపండితుల ద్వారా పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ నాయకులు హైదరాబాద్లో కమిషనర్ హనుమంతరావును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వివిధ దేవాలయాల్లో పనిచేస్తూ చనిపోయిన ఉద్యోగుల, అర్చకుల పిల్లలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని, వారిని గ్రాంట్ ఇన్ ఎయిడ్లో చేర్చాలని ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపించాలని తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, రాష్ట్ర కన్వీనర్ పరాశరం రవీంద్రాచారి, జేఏసీ నాయకులు కోరారు. దీనికి కమిషనర్ హనుమంతరావు స్పందిస్తూ మంత్రులు కొండా సురేఖ, భట్టి విక్రమార్కలకు పంపించామని, అలాగే అర్చకుల ప్రమోషన్ల విషయమై వారంలో సమావేశం ఏర్పాటు చేసి 888 జీఓ ప్రకారంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. క్యాండర్ స్ట్రెంత్ ప్రకారం దేవాదాయశాఖ కార్యాలయాల్లో పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అగ్నిహోత్రం చంద్రశేఖరశర్మ, వరంగల్ జిల్లా జేఏసీ కన్వీనర్ పాతర్లపాటి నరేశ్శర్మ, రాష్ట్ర కన్వీనర్ గంగు సత్యమూర్తి, కాండూరి కృష్ణమాచారి, ధనుంజయ్శర్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ను కలిసి అర్చక ఉద్యోగుల సమస్యలు వివరించారు. ప్రతీ కలెక్టరేట్లో దేవాదాయశాఖ చాంబర్ ఏర్పాటు రాష్ట్ర దేవాదాయధర్మాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు -
రైలు ఎక్కబోతూ మృత్యుఒడికి..
ఖిలా వరంగల్: రైలు ఎక్కబోతూ ప్రమాదవశాత్తు ప్లాట్ఫామ్ మధ్యలో పడి ఓ మహిళ దుర్మరణం చెందింది. ఈ ఘటన వరంగల్ రైల్వేస్టేషన్ సెకండ్ ప్లాట్ఫామ్పై చోటు చేసుకుంది. జీఆర్ పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్ చిలకగూడ ప్రాంతానికి చెందిన పుప్పాల ధరణి (30) వరంగల్లోని తల్లి భాగ్యలక్ష్మి ఇంటికి వచ్చింది. బుధవారం మధ్యాహ్నం షిర్డీ ఎక్స్ప్రెస్లో హైదరాబాద్కు వెళ్లేందుకు తల్లి భాగ్యలక్ష్మి, కూతురు ధరణి వరంగల్ రైల్వేస్టేషన్ చేరుకున్నారు. ఇద్దరు కలిసి రైలు ఎక్కబోతున్నారు. ఈ క్రమంలో ధరణి ప్రమాదవశాత్తు ప్లాట్ఫామ్ మధ్యలో పడగా తీవ్రగాయాలయ్యాయి. దీంతో కుటుంబీకులు ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు సమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ ఎస్. రవీందర్రెడ్డి తెలిపారు. ● ప్లాట్ఫామ్ మధ్యలో పడి మహిళ దుర్మరణం ● వరంగల్ రైల్వే స్టేషన్లో ఘటన -
ఓట్ల తొలగింపునకు బీజేపీ కుట్ర
మహబూబాబాద్ రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియతో ఓట్ల తొలగింపునకు కుట్ర చేస్తోందని టీపీసీసీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ నర్సిరెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో సర్ ప్రక్రియపై బూత్ లెవెల్ ఏజెంట్లకు బుధవారం శిక్షణ ఇచ్చారు. ముఖ్య అతిథిగా నర్సిరెడ్డి హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సున్నితమైన అంశాలతో రాజకీయాలు చేయడం సరికాదని, సర్ ప్రక్రియ విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశ్చిమ బెంగాల్, బిహార్, తమిళనాడు రాష్ట్రాల్లో ఓట్లు అక్రమంగా తొలగించారని ఆరోపించారు. 2002నాటి ఓటరు జాబితా ఆధారంగా చేసుకుని నూతన ఓట్లను తొలగించే ప్రయత్నం చేసే ప్రమాదం ఉందని, దీనిని అడ్డుకోవడానికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, కానీ వారు ప్రజలను పక్కదారి పట్టించే ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. జూన్ 25 నుంచి జూలై 24వ తేదీ వరకు సర్ ప్రక్రి య కొనసాగనుందని, ఓటరు నమోదు ప్రక్రియ, ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా స్పష్టత నిచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు భూక్య ఉమా, సర్ మానుకోట, డోర్నకల్ ఇన్చార్జ్లు పులి అనిల్ కుమార్, అవేజ్, అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజయ్య, మండలాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. టీపీసీసీ పార్లమెంట్ ఇన్చార్జ్ నర్సిరెడ్డి -
బడిబాట..
రెండు చిలకల కథ నేను గీసిన చిత్రం బాస్కెట్ బాల్ నేర్చుకుంటున్నాం కాజీపేట : హాయ్. నాపేరు పాము అన్విక్ భారతి. వేసవి సెలవుల్లో నేను కాజీపేట నుంచి అమ్మమ్మ వాళ్ల ఊరు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు మా అమ్మ గాయిత్రి, నాన్న రాజేశ్తో కలిసి వెళ్లా. అక్కడ మా అమ్మమ్మ నాకు రాత్రి వేళల్లో మంచి కథలు చెబుతూ నిద్రపుచ్చుతుంది. ఇందులో భాగంగా ఓ రామచిలక కథను చెప్పి నీతిని బోధించింది. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక వేటగాడు ఉండేవాడు. ఒకరోజు అతడు అడవిలోకి వేటకు వెళ్లి రెండు రామచిలకలను పట్టి తెచ్చి రాజుకు బహూకరించాడు. రాజు వాటిని వెంటనే మంత్రికి, సేనాధిపతికి చేరొటి ఇచ్చాడు. రామచిలకలకు ఎవరైతే మంచి మాటలు నేర్పిస్తారో వారికి బంగారు కానుకలు ఇస్తానని ప్రకటించాడు. మంత్రి, సేనాధిపతులు చిలకలను ఇంటికి తీసుకెళ్లి భార్యలకు ఇచ్చి రాజుగారి కానుకల విషయం తెలిపాడు. మంత్రి భార్య సంగీతం నేర్పించే గురువు కావడంతో చిలుకకు చక్కటి పద్యాలు, పాటలు, మాటలు నేర్పించింది. సేనాధిపతి భార్య పదవి ఉందనే అహంకారంతో ఏ పని చేయకుండా అందరితో కఠిన పనులు చేయిస్తూ నిత్యం వారిని తిడుతుండేది. ఆది విన్న ఆ చిలక పూర్తిగా తిట్లనే నేర్చుకుంది. మంత్రికి రాజు మీద ఎనలేని ప్రేమ ఉండడంతో చిలకకు కూడా ఆ ప్రేమ పెరుగుతూ వచ్చింది. సేనాధిపతి ఇతర రాజులతో కలిసి కుట్రలు చేస్తుండేవాడు. ఒకరోజు ఆ రెండు చిలకల ను రాజు సభకు తీసుకురావాలని ఆదేశిస్తాడు. సభలో రా జు మంత్రి చిలకను ఎలా ఉన్నావంటూ ప్రశ్నిస్తాడు. దానికి ఆ చిలక పద్ధతిగా బాగున్నాను మీరు ఎలా ఉన్నారంటూ అడుగుతుంది. రాజుకు దీంతో ఎక్కడాలేని సంతోషం కలుగుతుంది. సేనాధిపతి చిలకను ప్రశ్నించగా దానికి ఆ పక్షి నేను ఎలా ఉంటే నీకేందుకు మా సేనాధిపతి నీపై దాడి చేస్తాడు నువ్వు చస్తావు అంటుంది. వెంటనే ఆగ్రహించిన రాజు.. సేనాధిపతి బంధిని చేసి కఠినంగా శిక్షిస్తాడు. నీతి! మంచివాళ్ల సహవాసం ఎప్పుడూ మంచే నేర్పుతుంది. అందుకే అన్నారు పెద్దలు సహవాస దోషం అని -
ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల ప్రగతి
పెద్దవంగర: గ్రామసభలు గ్రామాభివృద్ధికి పునాది వంటివని, గ్రామంలోని సమస్యలు, అవసరాలు, అభివృద్ధి ప్రాధాన్యతలను ప్రజలే నిర్ణయించే వేదిక గ్రామసభ అని కలెక్టర్ స్నేహశబరీష్ పేర్కొన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం మండలంలోని ఉప్పరగూడెం గ్రామంలో సర్పంచ్ దుంపల శ్రీదేవి కుమారస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం పెరగడమే కాకుండా భూమి లోని పోషకాలు, సూక్ష్మజీవులు దెబ్బతింటాయని అన్నారు. రైతులు వరి కొయ్యలను కాల్చకుండా ప్రత్యామ్నాయ పద్ధతిలో వినియోగించాలని సూచి ంచారు. నిబంధనలు ఉల్లంఘించి కొయ్యలను కాల్చితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. భూసారాన్ని కాపాడుకోవడానికి పంట మార్పిడి విధానం అవసరమని, వ్యవసాయశాఖ అధికారులు రైతులకు భూసార పరీక్షలు నిర్వహిస్తూ ఆధునిక సాగు విధానంపై అవగాహన కల్పించాలని అదేశించారు. గ్రామంలో ప్రతీ ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, నిర్మించిన మరుగుదొడ్లను ప్రజలు తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. విద్యార్థులు తమ లక్ష్యసాధనపై దృష్టి సారించి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం పలు దరఖాస్తులను స్వీకరించి సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వేణుమాధవ్, తహసీల్దార్ వినోద్ కుమార్, ఏఓ స్వామి నాయక్, ఎస్సై ప్రమోద్ కుమార్ గౌడ్, ఎంఈఓ శ్రీనివాస్, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పరిశీలనమహబూబాబాద్: జిల్లా కేంద్రం శివారులోని గుమ్ముడూర్ ప్రాంతంలో మధ్యలో నిలిచిపోయిన డబుల్ బెడ్రూం ఇళ్లను బుధవారం కలెక్టర్ స్నేహశబరీష్ పరిశీలించారు. నిర్మాణాలు నిలిచిపోవడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అందుకు తహసీల్దార్ చంద్రరాజేశ్వర్ కోర్టు కేసులో ఉందని చెప్పారు. సమస్యను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఆమె వెంట డీఈఈ ఉపేందర్, సంబంధిత అధికారులు ఉన్నారు. కలెక్టర్ స్నేహశబరీష్మాట్లాడుతున్న కలెక్టర్ స్నేహ శబరీష్ -
ములుగు జిల్లా షూటింగ్కు అనువైన ప్రాంతం
వెంకటాపురం(ఎం): సినిమా షూటింగ్లకు ములుగు జిల్లా అనువైన ప్రాంతమని సినీ దర్శకుడు నేరెళ్ల దేవేందర్ అన్నారు. షైన్ స్టూడియో బ్యానర్ పై రూపొందుతున్న ‘ప్రొడక్షన్ నెం. 2’ సినిమాలోని కొన్ని సన్నివేశాలను బుధవారం మండలంలోని అందుగులమీది ప్రాంతంలో చిత్రీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ములుగు జిల్లాలో అనేక పుణ్యక్షేత్రాలతో పాటు పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని పేర్కొన్నారు. ములుగు ప్రాంతంలో సినిమా చిత్రీకరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. అందుగులమేది గ్రామ పరిసర ప్రాంతాల్లో ఓ మంచైపె హీరోహీరోయిన్పై పలు సన్నివేశాలు చిత్రీకరించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రొడ్యూసర్ వేణు యాదవ్, కోడైరెక్టర్ అరవింద్, లిరిక్స్ రైటర్ రాజ్ కుమార్, మూవీ ఎడిటర్ యూనిక్, డీఓపీ తరుణ్, అసిస్టెంట్ డైరెక్టర్ లోకేశ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గౌతమ్, యూనిట్ సభ్యులు సిద్ధు, రఘు, రాహుల్, రఘుపతి, శ్రీనాథ్, తదితరులు పాల్గొన్నారు. సినీ దర్శకుడు నేరెళ్ల దేవేందర్ అందుగులమేది ప్రాంతంలో సినిమా చిత్రీకరణ -
నీళ్లు రావు.. చెత్త ఎత్తరు
● మున్సిపల్ సిబ్బందిపై స్థానికుల ఆగ్రహం డోర్నకల్: మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో నెలల తరబడి తాగునీటి సరఫరా నిలిచిందని, చాలా రోజులుగా చెత్తబండ్లు రావడం లేదని, రోడ్లు అధ్వానంగా మారాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో బుధవారం జరిగిన వార్డు సభలో స్థానికులు సమస్యలపై మున్సిపల్ పాలకవర్గం, సిబ్బందిని నిలదీశారు. నెలల తరబడి నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, చెత్తను తొలగించకపోవడంతో ఇళ్లు, వీధులు చెత్తతో నిండిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. అధికారులు, పాలకవర్గం స్పందించడం లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ అధికారులను, పాలకవర్గాన్ని నిలదీశా రు. మున్సిపల్ చైర్పర్సన్ కొండేటి రాజకుమారి మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో సమస్యల పరి ష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగరాజు, సీఐ చంద్రమౌళి, డీటీ వీరన్న, సీడీపీఓ లక్ష్మి, కౌన్సి లర్లు బాదావత్ హేమలత, ఎల్లావుల సువర్ణ, గారె రమేశ్, బానోత్ ప్రమీల, ఆంగోత్ శైలజ, గుగులోత్ రాము తదితరులు పాల్గొన్నారు. -
‘దిక్సూచి’ పేరిట రూ.46.50 లక్షలు హాంఫట్
జనగామ: ‘దిక్సూచి’ కెరీర్ గైడెన్స్ పుస్తకాల కొనుగోలు పేరిట రూ.46లక్షల 50వేల ప్రజాధనం దుర్వినియోగమైంది. ఈ ఘటన జనగామ కలెక్టరేట్లో కలకలం రేపింది. ఈ వ్యవహారంలో అప్పటి కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, డీడీఓ హోదాలో ఉన్న తహసీల్దార్ సీహెచ్.శ్రీకాంత్పై జనగామ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఏఓ రవికిరణ్ బుధవారం తెలిపారు. అసలేం జరిగింది.. పదో తరగతి విద్యార్థుల కోసం 15వేల ‘దిక్సూచి’ కెరీర్ గైడెన్స్ పుస్తకాలు ఒక్కొటి రూ.310 చొప్పున మొత్తం రూ.46లక్షల50వేలకు హనుమకొండకు చెందిన మెస్సర్స్ రిత్విక్ గ్రాఫిక్స్ ప్రొప్రైటర్ విజయ్ నుంచి కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి ఏఓ, డీడీఓ అయిన తహసీల్దార్ సీహెచ్.శ్రీకాంత్ ఈ బిల్లును ప్రాసెస్ చేసి 2026, మార్చి26న ఆర్టీజీఎస్ ద్వారా మొత్తం సొమ్ము చెల్లించారు. ఆడిట్లో అక్రమాలు బట్టబయలు.. కలెక్టర్ సందీప్ కమార్ ఝా ఆదేశాలతో జిల్లా ఆడిట్ ఆఫీసర్ నిర్వహించిన విచారణలో అవకతవకలు వెలుగుచూసినట్లు ఫిర్యాదులో పొందు పరిచారు. జిల్లాలో పదో తరగతి విద్యార్థుల నమోదు 4,635 మాత్రమే ఉండగా, సుమారు 5,100 పుస్తకాలు అవసరమని గుర్తించారు. కాగా, 15 వేల పుస్తకాలు ఆర్డర్ చేశారు. అంటే అవసరానికి మూడు రెట్లు ఎక్కువ. ఇందులో రూ.46.50 లక్షల భారీ కొనుగోలుకు ఓపెన్ టెండర్ పిలవకుండా కేవలం మూడు సంస్థల నుంచి డైరెక్ట్ కొటేషన్ తీసుకున్నారు. డీఈఓ ఇండెంట్ లేకపోవడంతో పాటు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనుమతి కూడా తీసుకోలేదని అందులో ఉంది. డబ్బుల గోల్మాల్ ఇలా ఉంటే జిల్లా విద్యాశాఖ అధికారి లిఖితపూ ర్వకంగా ఇచ్చిన నివేదిక ప్రకారం ఒక్క పుస్తకం కూడా జిల్లాకు చేరుకోలేదు. గూడ్స్ రిసిప్ట్ నోట్, స్టాక్ ఎంట్రీ, పంపిణీ రికార్డు, రిసిప్ట్ అక్నాలెడ్జ్మెంట్ ఏదీ లేకుండానే యథేచ్ఛగా చెల్లింపులు కానిచ్చేశారు. సాక్ష్యాలు మాయం చేసే కుట్ర పుస్తకాల కొనుగోలు పేరిట రూ.46.5 లక్షలు డెబిట్ అయిన వెంటనే కలెక్టరేట్ అధికారిక ఈ–మెయిల్ collecto-jangaon@ gmail. comMS$ HDFC, IDFC FIRST బ్యాంకుల నుంచి ట్రాన్సాక్షన్ అలర్ట్ అయినట్లు మెయిల్ వచ్చింది. ప్రస్తుత కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 4.30కు ఈ చెల్లింపు జరిగింది. అధికారిక మెయిల్ పాస్వర్డ్లు తెలిసిన శ్రీకాంత్ ఈ లావాదేవీకి సంబంధించిన అలర్ట్ మెయిల్స్ను, కమ్యూనికేషన్లను డిలీట్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కొత్త కలెక్టర్కు ఈ లావాదేవి తెలియకుండా, తనను, ఏ–2 రిత్విక్ గ్రాఫిక్స్ను చట్టపరమైన శిక్ష నుంచి కాపాడుకునేందుకే ఈ పని చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తు.. హెచ్డీఎఫ్సీ, ఐడీఎఫ్సీ, ఎఫ్ఐఆర్ఎస్టీ బ్యాంకు రికార్డులు, గూగుల్ లాగిన్ డేటా, ఐపీ అడ్రస్లు, డివైజ్ డేటా, యాక్టివిటీ హిస్టరీ, ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అధికారిక ఇ–మెయిల్ ను అనధికారికంగా యాక్సెస్ చేసి సాక్ష్యాలు మాయం చేయడం తీవ్రమైన నేరమని ఎఫ్ఐఆర్లో స్పష్టం చేశారు. ముగ్గురిపై కేసు నమోదు.. ఆధారాలు లేకుండా జీమెయిల్ అకౌంట్ నుంచి తొలగించిన వారిపై చట్ట ప్రకారం అప్పటి కలెక్టర్ ఏఓ శ్రీకాంత్, ప్రొప్రైటర్ విజయ్, హనుమకొండ గ్రాఫిక్స్ రుత్విక్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ప్రస్తుత కలెక్టరేట్ ఏఓ రవికిరణ్ జూన్ 6న జనగామ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యతలు స్వీకరించగానే ఆరా.. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ వ్యవహారంపై ఆరా తీశారు. ఇందుకు సంబంధించి ఒక్క పుస్తకం కూడా జిల్లాకు చేరలేదని గుర్తించారు. వెంటనే విచారణకు ఆదేశించారు. ఈ కుంభకోణం వెనుక ఎవరెవరు ఉన్నారనే దానిపై జోరుగా చర్చ జరుగుతుంది. కాగా, జిల్లా పాలనపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తనదైన శైలిలో ముందుకెళ్తుతుండగా, ఈ కేసులో పూర్తిస్థాయి నిజాలు బయటకు తీస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.విద్యాశాఖలో జరిగిన కుంభకోణాన్ని ప్రస్తుత కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గుర్తించి వెలుగులోకి తెచ్చారు. అవినీతిపై ఉక్కు పాదం మోపుతున్న కలెక్టర్ చొరవతోనే ఈ భారీ భాగోతం బయటపడింది. మైనింగ్, ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతూ, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మెరుగైన సేవలు అందించేలా పర్యవేక్షిస్తున్నారు. ఈ క్ర మంలోనే విద్యాశాఖలో జరిగిన ఆర్థిక లావాదేవీల పై దృష్టి సారించారు. పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో గతేడాది ‘దిక్సూచి’ కార్యక్రమాన్ని చేపట్టారు. జనగామ కలెక్టరేట్లో వెలుగులోకి.. పుస్తకాలు రాకుండానే డబ్బులు డ్రా గత తహసీల్దార్ శ్రీకాంత్పై కేసు -
రైలులో గర్భిణికి ప్రసవం చేసిన 108 సిబ్బంది
● సీకేఎం ఆస్పత్రికి తరలింపు.. తల్లీబిడ్డ క్షేమం కాశిబుగ్గ: బెంగళూరు నుంచి బిహార్ వెళ్తున్న దానాపూర్ రైలులో ప్రయాణిస్తున్న అర మంజుల అనే మహిళ పురిటినొప్పులతో బాధపడుతుండగా, 108 సిబ్బంది వెళ్లి ప్రసవం చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన సమయంలో వరంగల్ రైల్వే స్టేషన్లో రైలు ఆపిన తర్వాత గర్భిణి సమాచారం తెలుసుకున్న 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నాగరాజు, పెలట్ అమర్లు అక్కడికి చేరుకున్నారు. ఆమె పరిస్థితి గమనించి, రైలులోనే ప్రసవం చేశారు. ప్రసవం అనంతరం మెరుగైన వైద్యసేవల కోసం ఇద్దరిని వరంగల్ సీకేఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, వెంటనే స్పందించిన 108 సిబ్బందిని రైల్వే అధికారులు అభినందించారు. ● నలుగురికి గాయాలు కాశిబుగ్గ: వరంగల్ నగరంలోని 36వ డివిజన్లో వీధి కుక్కల బెడద స్థానికులను భయపెడుతోంది. మంగళవారం రాత్రి సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న కాంపెల్లి వరమ్మ, రేణుకుంట్ల రమేష్, మహ్మద్ తాహి, గౌనియాలపై దాడి చేయగా వారికి గాయాలయ్యాయి. వీరు ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. -
మేడారం అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలి
● రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఎస్ఎస్ తాడ్వాయి : మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయ(గద్దెలు) ప్రాంగణాన్ని భక్తి భావం ఉట్టిపడేలా తీర్చిదిద్దడంతోపాటు పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఆదేశించారు. ఈ మేరకు బుధవారం మేడారం హరిత హోటల్లో కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి నిర్వహించిన అభివృద్ధి పనుల సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ మేడారం మహాజాతర ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. జాతర సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భద్రత, పరిశుభ్రత, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్య సేవల్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. వనదేవతల ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో శాశ్వత నిర్వహణ వ్యవస్థ ఉండేలా అన్ని శాఖల సమన్వయంతో ప్రత్యేక మెయింటెనెన్స్ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు.. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు మేడారానికి వచ్చే అవకాశమున్నందున ముందస్తుగా మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శాశ్వత స్నాన ఘట్టాలు, విశ్రాంతి గదులు, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలను దశలవారీగా ఏర్పాటు చేయాలని సూచించారు. జంపన్నవాగును పర్యాటక కేంద్రంగా.. జంపన్నవాగు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని మంత్రి పేర్కొన్నారు. అలాగే, మేడారంలో శాశ్వత ప్రాతిపదికన 30 పడకల ఆస్పత్రి నిర్మాణం కోసం అవసరమైన స్థల సేకరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. అంతకు ముందు వనదేవతలను దర్శించుకున్నారు. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో, డీఎఫ్ఓ వికాస్ మీనా, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, తదితరులు పాల్గొన్నారు. -
దోపిడీకి పాల్పడిన పాత నేరస్తుల అరెస్ట్
ఖిలా వరంగల్ : ఏకాంతంగా ఉన్న జంటను బెదిరించి దోపిడీకి పాల్ప డిన ముగ్గురు పాత నేరస్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నగదు, వెండి, బంగారు ఉంగరాలు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ కర్రె స్వామి తెలిపారు. ఈ మేరకు బుధవారం పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సైలతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్కు చెందిన ప్రస్తుతం కాజీపేట వైఎస్సార్ నగర్లో నివాసం ఉంటున్న బౌరి పవన్ సింగ్, అదే ప్రాంతానికి చెందిన బౌరి రవీందర్ సింగ్, రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్కు చెందిన బాపూరి సికెందర్ సింగ్ పాత నేరస్తులు. వీరు టీమ్గా ఏర్పడి నిర్మానుష్య ప్రదేశంలో ఏకాంతంగా ఉన్న ఒక జంటలను రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసి భయభ్రాంతులకు గురిచేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 7న నిందితులు ఉర్సుగుట్ట – భట్టుపల్లి రోడ్డులో వేచి చూస్తున్నారు. ఆ సమయంలో ఓ యువకుడు, యువతి బైక్పై వచ్చి ఓ పెట్రోల్ బంక్ ఎదుట ఉన్న ఒక వెంచర్లోకి వెళ్లడాన్ని గమనించారు. వారు లోపలికి వెళ్లిన కొద్దిసేపటికి నిందితులు అక్కడికి చేరుకుని ఆ జంటను చుట్టుముట్టారు. ఫొటోలు, వీడియోలు తీసి ఇవి మీ తల్లిదండ్రులకు పంపుతాం.. మీడియాలో పెడతామని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. ఆ జంట నగదు లేదని చెప్పగా నిందితులు ఆ యువకుడిని తీవ్రంగా కొట్టారు. పవన్ సింగ్ సదరు యువతి చేతికి ఉన్న బంగారు, రవీందర్ సింగ్ ఆ యువకుడి చేతికి ఉన్న వెండి ఉంగరాలను లాక్కున్నారు. ఇదే క్రమంలో సికెందర్ సింగ్ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. అనంతరం ఆ వీడియోలను డిలీట్ చేసినట్లు నటించి పరారయ్యారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, దోచుకున్న ఉంగరాలను వరంగల్లో విక్రయించేందుకు నిందితులు బైక్పై వస్తుండగా ఎస్సై శ్రవణ్,హెడ్ కానిస్టేబుల్ నరేందర్, కానిస్టేబుళ్లు వాజీద్, ప్రవీణ్ రెడ్డి, నాగేశ్వర్ రావు అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. దీంతో వారి వద్ద నుంచి బంగారు, వెండి ఉంగరాలు మూడు సెల్ఫోన్లు, బైక్ను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ స్వామి తెలిపారు. నగదు, ఉంగరాలు, బైక్ స్వాధీనం వివరాలు వెల్లడించిన ఇన్స్పెక్టర్ స్వామి -
పావుగంట ఆలస్యమైందని పక్కన పెట్టారు
వైద్యులు రాకముందే వెయింగ్ తీసుకున్నారు. 200 గ్రాములు ఎక్కువ ఉన్నావని తెలపడంతో ఎంపికకు ఇంకా సమయం ఉందని గ్రౌండ్ వర్కవుట్ చేశా. ఆ తర్వాత మరోసారి వెయింగ్ కోసం వస్తే ఆలస్యమైందని చెప్పి బాక్సింగ్ హాల్ నుంచి బయటకు పంపారు. ఇప్పటి వరకు నేను రెండు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఒక మెడల్ సాధించా. ఎప్పుడూ ఇలా జరగలేదు. రాజేశ్, బుద్దారం, ములుగు జిల్లా సమయపాలన తప్పనిసరి క్రీడాకారులకు సమయపాలన, క్రమశిక్షణ తప్పనిసరి. ఎంపికలు ఉన్నాయని తెలిసి సదరు క్రీడాకారుడు గంటన్నర ఆలస్యంగా వచ్చాడు. దీంతో ఎంపికలకు అనర్హుడిగా తేల్చి పంపాం. కొందరు కోచ్లు నిబంధనలు తెలియకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. తద్వారా క్రీడాకారులు నష్టపోతారని మరిచిపోతున్నారు. రవీందర్కుమార్, అధ్యక్షుడు, వరంగల్ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ -
రేపు డీఏఓతో సాక్షి ఫోన్ ఇన్
మహబూబాబాద్ రూరల్ : వానాకాలం పంటల సాగు నేపథ్యంలో రైతులు తమ సందేహాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్.విజయచంద్రతో నివృత్తి చేసుకునేలా సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో సాక్షి ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. విత్తనాల సేకరణ, ఎరువుల యాజమాన్యం, నకిలీ విత్తనాలను గుర్తించడం తదితర అంశాలపై రైతుల సందేహాలను డీఏఓ నివృత్తి చేయనున్నారు. అంశం : వానాకాలం సాగుపై సలహాలు, సూచనలు తేదీ : ఈ నెల 11న (గురువారం) సమయం : ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రైతులు ఫోన్ చేయాల్సిన నంబర్లు : 89777 49210, 96034 62487 -
యాప్ ద్వారా ఎరువుల విక్రయాలు
● డీఏఓ ఎస్.విజయచంద్ర మహబూబాబాద్ రూరల్ : రైతులకు యూరియా యాప్ ద్వారా మాత్రమే ఎరువులు విక్రయించాలని డీఏఓ ఎస్.విజయచంద్ర అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని రైతువేదికలో యాప్ ద్వారా ఎరువుల విక్రయాలపై సొసైటీ, వ్యవసాయ అధికారులకు మంగళవారం వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. వానాకాలం 2026లో జిల్లాలో యూరియా సరఫరా, పచ్చిరొట్ట విత్తనాల పంపిణీపై జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, హాకా రైతు కేంద్రాలు, ఓడీసీఎంఎస్ రైతు విక్రయ కేంద్రాల బాధ్యులకు యూరియా యాప్ ద్వారా పంపిణీ సులభతరం అవుతుందని తెలిపారు. ఆయా కేంద్రాలు నిల్వలు, రిజిస్టర్లు, బిల్ పుస్తకాలు విధిగా నిర్వహించాలని, ఎరువులను గరిష్ట ధరకు మించి విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి విజయకుమారి, మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ శ్యామ్ కుమార్, మార్క్ ఫెడ్ అధికారి రవి, హాకా మేనేజర్ అరుణ, ఏడీఏలు శ్రీనివాసరావు, శ్రీదేవి, టెక్నికల్ ఏడీఏ మురళి, వివిధ మండలాల వ్యవసాయ అధికారులు, సొసైటీ అధికారులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ సదస్సులో ప్రొఫెసర్ వెంకట్రామ్రెడ్డి ప్రతిభ
కేయూ క్యాంపస్: గోవాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) లో ఈనెల 8,9వ తేదీల్లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో కాకతీయ యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ ఆచార్య బి. వెంకట్రామ్రెడ్డి పాల్గొని ప్రతిభ చాటారు. ‘ఇంటర్నేషల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎమర్జింగ్ మల్టీ ఫంక్షనల్ మెటీరియల్స్ అండ్ డివైసెస్ ఫర్ సస్టేయినబుల్ టెక్నాలజీస్’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇది దేశ, విదేశాలనుంచి హాజరైన శాస్త్రవేత్తలు,అధ్యాపకులు, పరిశోధకుల నుంచి ప్రశంసలు అందుకుంది. సుస్థిర సాంకేతికతకు అవసరమైన బహుళ విధుల పదార్థాలు, పరికరాలపై ప్రపంచవ్యాప్తంగా జరగుతున్న పరిశోధనలకు ఈ వేదికపై చర్చించారు. కాగా, నిర్వాహకులు వెంకట్రామ్రెడ్డిని సన్మానించి జ్ఞాపిక అందజేశారు. అలాగే, మద్రాస్ ఐఐటీ ప్రొఫెసర్ వేదాంతం సుబ్రహ్మణ్యం వేదాంతం కూడా జ్ఞాపిక అందజేసి అభినందించారు. అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న ఆచార్య వెంకట్రామ్రెడ్డిని కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి. రామచంద్రం అభినందించారు. -
మాది ప్రజాప్రభుత్వం
చిల్పూరు/జఫర్గఢ్: కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని పల్లగుట్ట గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి హాజరయ్యారు. తొలుత ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య, కలెక్టర్ సందీప్ కుమార్ఝా, ట్రాన్స్కో సీఎండీ కృష్ణభాస్కర్, ఎన్పీడీసీఎల్ సీఎండీ కె.వరుణ్రెడ్డి, చిల్పూరు ఆలయ చైర్మన్ శ్రీధర్రావు, స్థానిక సర్పంచ్ నర్సింహారెడ్డి డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. స్టేషన్ఘన్పూర్ ప్రాంతం ఒకప్పుడు వలసలకు కేరాఫ్గా ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవన్నారు. నియోజకవర్గంలో దేవాదుల ప్రాజెక్టు, రిజర్వాయర్ల ద్వారా పంటలకు నీరు అందడం, పెరిగిన వ్యవసాయ పంపుసెట్ల వల్ల పంట దిగుబడులు పెరిగి రైతుల ఆదాయం పెరిగి వలసలు తగ్గాయన్నారు. ఏ ప్రాంతంలో నీరు ప్రవహించాల న్నా, ఇతర అవసరాలకూ విద్యుత్ అవసరమని, అందుకు విద్యుత్ వ్యవస్థను నిరంతరం ఆధునీకరిస్తున్నామన్నారు. నియోజకవర్గ సమస్యలను ఎమ్మెల్యే శ్రీహరి తన దృష్టికి తీసుకొచ్చారని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు పల్లగుట్ట గ్రామంలో రూ.60.62 కోట్లతో చేపట్టిన 4 విద్యుత్ సబ్స్టేషన్ల ప్రారంభం, 3 సబ్స్టేషన్ల శంకుస్థాపనల శిలాఫలకాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి ఎరువుల షాపులు, దివ్యాంగులకు సంబంధించిన స్టాళ్లను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రూ.3.5 కోట్ల విలువైన సీ్త్రనిధి చెక్కులు అందజేశారు. 107 స్వయం సహాయక సంఘాల మహిళలకు సీ్త్రనిధు రుణాల కింద రూ.3.07 కోట్లు, బ్యాంకు లింకేజీ కింద 407 స్వయం సహాయక సంఘాలకు రూ.32.89కోట్ల విలువైన చెక్కులను మహిళలకు అందించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు యశస్వినిరెడ్డి, నాగరాజు, నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూపాషా, కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ కుట్ర: ఎంపీ కావ్య ఓటు హక్కుపై ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని ఎంపీ కడియం కావ్య అన్నారు. 10 ఏళ్లుగా అబివృద్ధిలో చీకట్లో మగ్గిపోయిన స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం కడియం నాయకత్వంలో మోడల్ నియోజకవర్గంగా రూపుదిద్దుకుంటున్నట్లు తెలిపారు. నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవసాయ, గృహ అవసరాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు.రఘునాథపల్లిలో ఉన్న 132/ 33 కేవీ సబ్ స్టేషన్ను 220/133 కేవీ సబ్ స్టేషన్గా అప్గ్రేడ్ చేయాలని, ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ లైన్లను తొలగించేందుకు నిధులు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎంను కోరారు. సాగునీటి వసతులతో ఘన్పూర్లో వలసలు తగ్గాయి పల్లగుట్ట సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.60.62 కోట్లతో 4 సబ్స్టేషన్ల ప్రారంభం, 3 సబ్స్టేషన్లకు శంకుస్థాపన -
కలెక్టర్ మేడమ్కు నమస్కరించి..
బుధవారం శ్రీ 10 శ్రీ జూన్ శ్రీ 202 జిల్లా పాలనాధికారి స్నేహశబరీష్కు మారుమూల ప్రాంత విద్యార్థిని లేఖసాక్షి, మహబూబాబాద్: ‘శ్రీయుత గౌరవనీయులైన కలెక్టర్ స్నేహ శబరీష్ మేడమ్ గారికి నమస్కరించి రాయునది. నేను జిల్లాలోని మారుమూల ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని. పదిరోజుల నుంచి మా అమ్మానాన్నలు ఒకటే గొడవ. ఒకరు ప్రైవేట్ బడికి పంపుదాం అంటే మరొకరు సర్కారు బడికి పంపుదామని అంటున్నారు. నాకేమో సర్కారు బడికే వెళ్లాలని ఉంది. కానీ, సమస్యలతో ఉన్న సర్కారు బడిని బాగుచేస్తే నాలాంటి పేద పిల్ల లు చదువుకునే అవకాశం ఉంటుంది. నా విన్నపాన్ని మన్నించి మీరు బడులు బాగు చేయిస్తారు.. మంచి చదువు చెప్పిస్తారని నా నమ్మకం. ఈ విషయాలన్నీ మీకు నేరుగా కలిసి చెప్పాలనే అనుకున్నా.. కానీ నేను చిన్నపిల్ల ను.. మీ దగ్గరకు రాలేక.. నేరుగా కలువలేక.. ఈ లేఖ రాస్తున్నాను.’ పర్యవేక్షణ లేక.. మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలలపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఉపాధ్యాయులు సరిగ్గా బోధించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో రోజు బడికి వెళ్లినా.. ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నాం. రెగ్యులర్ ఎంఈఓలు లేకపోవడంతో ఆ మండలంలోని సీనియర్ పీజీ హెచ్ఎంలకే ఎంఈఓల బాధ్యతలు అప్పగించారు. వారికి వివిధ రకాల రిపోర్టులు ఇవ్వడం, వారి సొంత పాఠశాలలను చూసుకోవాల్సి ఉండడంతో పాఠశాలల పనితీరు.. ఉపాధ్యాయుల రాకపై పెద్దగా దృష్టిపెట్టడం లేదు. కాగా, ఈనెల 15నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండగా.. సమస్యలు స్వాగతం పలకనున్నాయి. కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో సమస్యలు.. తల్లిదండ్రులు లేని వారు, పేద ఆడపిల్లలు చదివే కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలల్లో వసతులు అంతంత మాత్రంగా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యను బోధించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ మోడల్ స్కూళ్లు ఎవరికి పట్టని విధంగా మారాయి. గత ఏడాది పలు మోడల్ స్కూళ్లలో జరిగిన సంఘటనలు తలుచుకుంటేనే భయంగా ఉంది. తీరని సమస్యలు.. జిల్లా వ్యాప్తంగా 762 ప్రభుత్వ, కేజీబీవీ, మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఇందులో పది పాఠశాలలకు భవనాలు లేవు. ఇందులో ఆరు పాఠశాలలు అద్దె భవనాలు, రెండు పాఠశాలలు రెంట్ ఫ్రీ భవనాలు, మరో రెండు పాఠశాలలు చెట్లకింద నిర్వహిస్తున్నారు. 338 పాఠశాలలకు ప్రహరీలు ఉండగా.. 92 పాఠశాలల ప్రహరీలు కూలిపోయాయి. మరో ఐదు పాఠశాలలకు ఫెన్సింగ్ వేశారు. 222 పాఠశాలలకు ప్రహరీలు లేవు. 98 పాఠశాలల్లో ప్రహరీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరో ఏడు నిర్మాణాల్లో ఉన్నాయి. 21 పాఠశాలలకు విద్యుత్ కనెక్షన్లు లేవు. ఆరు పాఠశాలలకు కనెక్షన్లు ఉన్నా మరమ్మతులకు గురయ్యాయి. 17 పాఠశాలల్లో టాయిలెట్స్ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 272 పాఠశాలల్లో వంట గదులు లేవు. దీంతో ఆరుబయట వంట చేస్తున్నారు. సమస్యలతో ప్రభుత్వ బడులు సతమతం ఎంఈఓల పర్యవేక్షణ లేక ఇష్టారాజ్యం 15నుంచి పాఠశాలల పునఃప్రారంభం ప్రత్యేక దృష్టిపెట్టి సౌకర్యాలు కల్పించాలని వినతి కలెక్టర్కు వినతి చేస్తున్న విద్యార్థిని -
అంకిత భావమే విజయానికి మూలం
హసన్పర్తి: కృషి, నిజాయితీ, అంకితభావమే విజయానికి మూలమని బిట్స్ పిలానీ గ్రూప్ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రాంగోపాల్రావు అన్నారు. మంగళవారం వరంగల్లోని ఎస్సార్ యూనివర్సిటీలో 4వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాంగోపాల్రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సావీనర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని చెప్పారు. జీవితాంతం నేర్చుకునే తత్వం సృజనాత్మకత, పట్టుదల, విలువల ఆధారిత నాయకత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. దేశ వ్యాప్తంగా ఎస్సార్ యూనివర్సిటీకి మంచి గుర్తింపు ఉందన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత దీపికారెడ్డి మాట్లాడుతూ అభిరుచి, పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలు సాధించొచ్చన్నారు. విద్య కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా సమాజంపై సానుకూల ప్రభావం చూపే విలువలను అందించేదని పేర్కొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్లర్ ఎ.వరదారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమగ్రాభివృద్ధి, నాణ్యమైన విద్య విలువల ఆధారిత అభ్యాసానికి విశ్వవిద్యాలయం కట్టుబడి ఉందన్నారు. విద్యార్థుల విజయాల్లో తల్లిదండ్రుల పాత్రను ప్రత్యేకంగా కొనియాడారు. ఈసందర్భంగా సుమారు 1,500 మంది విద్యార్థులకు డిగ్రీలకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కూచి పూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ అవార్డు గ్రహీత దీపికారెడ్డికి భారతీయ కళల రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ (హానరిస్ కాసా) ప్రదానం చేసింది. యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ దీపక్ గార్గ్, ప్రో–చాన్స్లర్ ఎ.మధుకర్ రెడ్డి, ప్రో–వైస్ చాన్స్లర్ డాక్టర్ వి.మహేశ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.వెంకట రమణారావు, డీన్ ఆపరేషన్స్ అండ్ గ్రోత్ ప్రొఫెసర్ ఆర్. అర్చనారెడ్డి, డైరెక్టర్ ఐ క్యూఏసీ ప్రొఫెసర్ పి.వి. రాజశేఖర్, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ ఎ.వి.వి. సుధాకర్ పాల్గొన్నారు. ఉన్నత విద్యలో ప్రమాణాలు పడిపోతున్నాయి ఉన్నత విద్యలో ప్రమాణాలు పడిపోతున్నాయని ఐఐటీ, మాజీ డైరెక్టర్ (ఢిల్లీ) రాంగోపాల్రావు అన్నారు. మంగళవారం ఎస్సార్ యూనివర్సిటీలో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితిల్లో నెలకొందన్నారు. కొన్నాళ్లుగా యూనివర్సిటీల్లో అధ్యాపకుల ఖాళీలు భర్తీ చేయకపోవడంతో ఉన్నత విద్యలో ప్రమాణాలు క్షీణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ ఫ్యాకల్టీతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. యూనివర్సిటీల్లో అనుభవజ్ఞులైన వారిని వీసీలుగా నియమించాలన్నారు. బిట్స్ పిలానీ గ్రూప్ వైస్ చాన్స్లర్ రాంగోపాల్రావు ఘనంగా ఎస్సార్ స్నాతకోత్సవం 1,500 మంది విద్యార్థులకు డిగ్రీల ప్రదానం -
వదినపై మరిది గొడ్డలితో దాడి
● ల్యాబర్తిలో ఘటన వర్ధన్నపేట: ఆస్తి తగాదా నేపథ్యంలో వదినపై మరిది గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ల్యాబర్తిలో చోటుచేసుకుంది. ఎస్సై సాయిబాబు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బాధితుడు సూరారపు నిరంజన్కు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. వీరికి ఉన్న భూమి మూడు సమ భాగాలుగా హద్దులు పెట్టి పంపకాలు చేసుకోవాలని గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడుకుంటున్న క్రమంలో తమ్ముడు నాగరాజుకు ఎక్కువ ఇంటి స్థలం, అదే విధంగా వ్యవసాయ భూమి కావాలని గత సంవత్సరం నుంచి తగాదాలు జరుగుతున్నాయి. కాగా, భూమికి హద్దులు పెడితే చంపుతామని సోమవారం నిరంజన్ భార్య కవితను బెదిరించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం కవిత ఇంటికి వస్తుండగా నాగరాజు గొడ్డలితో దాడికి పాల్పడగా ఆమెకు గాయాలయ్యాయి. వెంటనే వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు ప్రథమ చికిత్స చేసి వరంగల్ ఎంజీఎం తరలించారు. ఈ ఘటనపై నిరంజన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
ఎంజేపీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో స్పాట్ అడ్మిషన్లు
విద్యారణ్యపురి : వరంగల్లోని రంగశాయిపేట ఆర్టీఓ జంక్షన్ సమీపంలోని ములుగు, మహబూబాబాద్ మహాత్మాజ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ మహిళా డిగ్రీ గురుకుల కళాశాలల్లో (ఎంజేపీబీసీ)లో ఈవిద్యాసంవత్సరం( 2026–2027)లో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను ఈనెల 15వ తేదీ వరకు నిర్వహించనున్నామని ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్వీఎన్ చారి ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు ఇతర జిల్లాల విద్యార్థినులు కూడా ఈ కళాశాలల్లో అడ్మిషన్లు పొందొచ్చని తెలిపారు. ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు దోస్త్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఏ కళాశాలకు ఆప్షన్ ఇవ్వని విద్యార్థినులు నేరుగా ఈ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలు పొందొచ్చని తెలిపారు. తమ ఒరిజనల్ విద్యార్హతల సర్టిఫికెట్లతో రావాలని సూచించారు. ఈ కళాశాలల్లో బీకాంసీఏ, బీఎస్సీ ఎంపీసీ, ఎంపీపీఎస్, ఎంఎస్సీఎస్, ఎంఎస్డీఎస్, బీజెడ్సీ, బీఏ కోర్సుల్లో అడ్మిషన్లు పొందాలని కోరారు. వివరాలకు 9866610429, 9676817038, 8130594460 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. అనాథపిల్లలకు అండగా బాలవికాస ● 250 మంది గ్రామీణ పేదలకు ఆర్థికసాయం కాజీపేట రూరల్ : సమాజంలో పాఠశాలలకు వెళ్లే అనాథ పిల్లలకు బాలవికాస సంస్థ అండగా ఉంటుందని జనవికాస అధ్యక్షుడు లూర్థు మర్రెడ్డి అన్నారు. ఫాతిమానగర్ బాలవికాస ట్రైనింగ్ సెంటర్లో మంగళవారం బాలవికాస, సోపార్ మద్దతుతో నడుస్తున్న ఆరు జిల్లాలకు చెందిన గ్రామీణ పేద అనాథ విద్యార్థులు 250 మందికి రూ.7,50,000 లక్షల విలు వైన కిరాణా సరుకులు, స్టడీ కిట్లు, స్టేషనరీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు చదువుతోపాటు క్రమశిక్షణ నై పుణ్యం పెంపొందించుకోవాలన్నారు. ప్రము ఖ వక్త విజయ్ జక్కోజు మాట్లాడుతూ యువతకు భవిష్యత్ బాలవికాస మార్గదర్శకమన్నా రు. కోఆర్డినేటర్లు, బాలవికాస మహిళా ప్రో గ్రాం సభ్యులు జ్యోతి, అమూల్య పాల్గొన్నారు. -
తుదిదశకు ఇన్వెస్టిగేషన్
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బరాజ్లలో పరిశోధన (ఇన్వెస్టిగేషన్) పరీక్షలు తుదిదశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు 70శాతానికి పైగా పరీక్షలు పూర్తయ్యాయి. సుందిళ్ల బరాజ్లో మొత్తం 75 పరీక్షలకు 69 పూర్తికాగా.. అన్నారంలో 66కు 58 పూర్తయ్యాయి. మేడిగడ్డలో 85కు 73 జీపీఆర్ పరీక్షలు పూర్తయ్యాయి. బరాజ్లలో పరీక్షలను నీటిపారుదల కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ కల్నల్ పరీక్షిత్ మెహ్రాతోపాటు టీం స్థితిగతులను సమీక్షిస్తూ పనుల్లో వేగిరం పెంచుతున్నారు. మిగిలిన పరీక్షలు ఈనెల 20వరకు పూర్తి చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఇంజనీర్లు పనిచేస్తున్నారు. నేడు మంత్రి పరిశీలన.. సమీక్ష కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి బరాజ్లలో పరీక్షలు తుది దశకు చేరడంతో బుధవారం మధ్యాహ్నం 12.45గంటలకు మేడిగడ్డ బరాజ్కు ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తదితరులు రానున్నారు. బరాజ్ వద్దనే రెండు గంటల పాటు క్షేత్రస్థాయి పరిశీలన చేసి తరువాత అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో సాగుతున్న పరీక్షలు నేడు మేడిగడ్డకు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి -
ధరలు తగ్గించాలి
కేంద్ర ప్రభుత్వం పెంచిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు తగ్గించాలి. అసలే రైతులు అష్టకష్టాలతో పంటలు సాగు చేస్తుంటే తమ నడ్డివిరిచే విధంగా ధరలు పెంచి అగాధంలోకి నెట్టివేస్తుంది. కంపెనీలు కాంప్లెక్స్ ఎరువుల రేట్లు ఇష్టారాజ్యంగా పెంచడం విచారకరం. వర్షాలు రావడం ఆలస్యమై కర్షకులు బాధపడుతుంటే పంటల సాగుకు కాంప్లెక్స్ ఎరువులు అవసరం కదా అని ధరల పెంపుదల చేయడం ఎంతవరకు సమంజసం. – బోళ్ల సందీప్ రెడ్డి, రైతు, ఆమనగల్ రైతులపై అదనపు భారంకాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడం వల్ల రైతులపై అదనపు ఆర్థిక భారం పడనుంది. నేను మూడు ఎకరాల్లో వరి, ఒక ఎకరం మిర్చి, రెండు ఎకరాల్లో కూరగాయలు, పెసర పంట సాగు చేయబోతున్నాను. మొత్తం పంటల సాగుకు సంబంధించి 13 బస్తాల అడుగు మందు కొనుగోలు చేయాలి. ప్రస్తుత సీజన్లో కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడంతో వేల రూపాయల్లో ఖర్చులు పెరుగుతాయి. – దొడ్డ సాగర్, రైతు, మల్యాల -
విద్యార్థుల నమోదులో లక్ష్యాలు సాధించాలి
గార్ల: పాఠశాలల వారీగా విద్యార్థుల నమోదు లక్ష్యాలను ఉపాధ్యాయులు సాధించాలని డీఈఓ ఎం. సత్యనారాయణమూర్తి అన్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమాన్ని మంగళవారం డీఈఓ తనిఖీ చేసి ఉన్నత పాఠశాలను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల ప్రారంభం నాటికి పరిసరాలు, వాటర్ట్యాంక్లు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఆయన వెంట ఏఎంఓ వెంకటేశ్వర్లు, జీసీడీఓ గాయత్రి, పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. మానవ మనుగడకు అడవులే ఆధారంగూడూరు: మానవ మనుగడకు, భూమిపై జీవకోటికి అడవులు ప్రాణధారమని ఎఫ్ఆర్వో ప్రసాదరావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ప్రజాపాలన–ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా గూడూరు అటవీశాఖ రేంజ్ ఆధ్వర్యంలో మండలంలోని సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు అడవుల ప్రాముఖ్యత, రక్షణ, చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్వో మాట్లాడుతూ.. జీవ వైవిధాన్ని కాపాడటంతో పాటు ఆక్సిజన్ అందిస్తూ, వర్షాలు పడడానికి, వాతావరణ సమతుల్య తకు అడవులు సహాయపడుతాయన్నారు. అలాంటి అడవులను, వన్యప్రాణులను, అటవీ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వాంకుడోతు సునీతకొమ్మాలు, ఎంపీడీఓ సత్యనారాయణ, అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాటాలు చేయాలినెహ్రూసెంటర్: బిర్సాముండా పోరాటస్ఫూర్తితో ఆదివాసీల హక్కుల కోసం పోరాటాలు సాగించాలని గిరిజన సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ కిషన్నాయక్ అన్నారు. గిరిజన, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బిర్సాముండా వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. బిర్సాముండా ఆది వాసీల అస్తిత్వం కోసం జల్–జంగల్–జమీన్ నినాదంతో అటవీపై సర్వ హక్కులు ఆదివాసీలకే దక్కాలని, ఆదివాసీల విముక్తి కోసం పోరా టాలు సాగించారని గుర్తు చేశారు. ఆదివాసీల హక్కుల రక్షణ కోసం పోరాటాలకు ఆదివాసీ గిరిజనులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చిత్తారి సోమన్న, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుడ్డెల రాంమూర్తి, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకన్న, డీబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పోలెపాక వెంకన్న, గణేష్, ఆంగోత్ కిషన్నాయక్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావాణి ఫిర్యాదుతో పాఠశాల పునఃప్రారంభం
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఈనెల 8న జరిగిన ప్రజావాణిలో ధరంసోతు సీతారాంనాయక్ ఇచ్చిన ఫిర్యాదుతో ప్రభుత్వ పాఠశాలను పునఃప్రారంభించామని డీఏఓ సత్యనారాయణమూర్తి అన్నారు. జిల్లా కేంద్రంలోని బాబునాయక్ తండాలో మూసివేసిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను విద్యాశాఖ అధికారులు పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ బడులను బలోపేతం చేయాడానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు భాగాస్వాములు కావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు, నోటుబుక్స్ అందజేస్తున్నామన్నారు. పాఠశాలలో 15మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారని, ఉపాధ్యాయులు బడిబాటలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యా పరిరక్షణ కమిటీ సభ్యులు మైస శ్రీనివాసులు, సీఎంఓ సురేష్, ఏఎంఓ వెంకటేశ్వర్లు, జీసీడీఓ గాయత్రి, ఉపాధ్యాయులు సిరినాయక్, ప్రతిభ, భోజన్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
● ఊరుగొండలో ఘటన దామెర: అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలో చోటుచేసుకుంది. ఎస్సై కొంక అశోక్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెట్టుపల్లి విజేందర్ (50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఇంటి నిర్మాణానికి కొంత అప్పు చేశాడు. ఎలా తీర్చాలో తెలియక మద్యానికి బానిపై మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మంగళవారం వెల్లడించారు. -
ధరల దడ..!
మహబూబాబాద్ రూరల్ : వానాకాలం సాగుకు సిద్ధమవుతున్న తరుణంలో కాంప్లెక్స్ ఎరువుల ధరల పెరుగుదల రైతులను కలవరపెడుతోంది. డీజిల్ రేట్ల పెంపుతో ఇప్పటికే ట్రాక్టర్, హార్వెస్టర్ కిరాయిలు పెరిగి ఆందోళన చెందుతున్న రైతులు.. తాజాగా పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు చూసి లబోదిబోమంటున్నారు. ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని సాకుగా చూపుతూ కంపెనీలు ఒక్కో బస్తాపై రూ.300కుపైగా పెంచేశాయి. గత వానా కాలం నుంచి ఇప్పటివరకు కాంప్లెక్స్ ఎరువుల ధరలు మూడు, నాలుగుసార్లు పెరిగాయి. ఏదో ఓ సాకుతో కంపెనీలు పోటాపోటీగా ధరలు పెంచుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై అందించే యూరియా, డీఏపీ ధరల్లో మార్పులు లేకపోవడం గమనార్హం. యుద్ధం పేరుతో.. దేశంలో ఎరువుల ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకులను కంపెనీలు పశ్చిమాసియా దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. యుద్ధం కారణంగా గ్యాస్, పెట్రోల్ సరఫరాకి అంతరాయం కలగడం, రవాణా చార్జీలు పెరగడం, రూపాయి మారకం విలువ పడిపోవడంతో మార్కెట్లో ముడిసరుకుల ధరలు పెరిగి, ఆ ప్రభావం ఎరువుల ఉత్పత్తిపై పడినట్లు చెబుతున్నారు. మూడు నుంచి నాలుగుసార్లు పెంపు.. గత వానాకాలం నుంచి ఇప్పటివరకు కాంప్లెక్స్ ఎరువుల ధరలను కంపెనీలు మూడు నుంచి నాలుగుసార్లు పెంచాయని ఫర్టిలైజర్స్ డీలర్లు చెబుతున్నారు. మరోవైపు ఫర్టిలైజర్ డీలర్లకు రవాణా చార్జీలు చెల్లించకపోవడంతో ఆ భారాన్ని కూడా రైతులపైనే మోపుతున్నారు. యూరియా బస్తా ధర రూ.265 కాగా కంపెనీలు డీలర్లకు రూ.15 మాత్రమే మార్జిన్ ఇస్తున్నాయి. ఒక్కో బస్తాకు హమాలీ చార్జీ రూ.15, రవాణా చార్జీ రూ.30 నుంచి రూ.35 కలిపి అదనంగా రూ.50 దాకా వసూలు చేస్తున్నారు. రూ.265 యూరియా బస్తాకు రైతులు రూ.300కుపైగా చెల్లిస్తున్నారు.ఎరువులు పాత ధర పెరిగిన ధర (రూ.లలో) (రూ.లలో) 20:20:0:13 1,500 1,800 10:26:26 2,025 2,250 12:32:16 2,025 2,250 14:35:14 2,175 2,400 19:19:19 2,075 2,300 ఎంఓపీ 1,850 1,975కాంప్లెక్స్ ఎరువుల రేట్లు ౖపైపెకి.. రైతులపై అదనపు ఆర్థిక భారం -
గంజాయితో జీవితాలు నాశనం చేసుకోవద్దు
● ఎస్పీ శబరీష్ మహబూబాబాద్ రూరల్ : గంజాయి మత్తులో యువత తమ జీవితాలు నాశనం చేసుకోవద్దని ఎస్పీ శబరీష్ అన్నారు. గంజాయి రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా మహబూబాబాద్ పట్టణంలోని సిగ్నల్ కాలనీలో ఎస్పీ మంగళవారం పర్యటించారు. ప్రజలకు గంజాయి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించి పోస్టర్లను విడుదల చేసి, కాలనీలోని గోడలకు అతికించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి వాడకం వల్ల మెదడు దెబ్బతినడం, ఆలోచనా శక్తి తగ్గడం, శ్వాసకోశ సమస్యలు, డిప్రెషన్ వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. గంజాయి మత్తు చదువు, ఉద్యోగం, భవిష్యత్పై తీవ్ర ప్రభావం చూపుతుందని, గంజాయి సమాచారం అందించి రూ.5 వేల నగదు బహుమతి పొందాలని సూచించారు. గంజాయికి సంబంధించిన ఎటువంటి అనుమానాస్పద సమాచారం ఉన్నా వెంటనే 87126 56999 నంబర్లో తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు. గంజాయిలేని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడమే లక్ష్యమని, దీనికి ప్రజలందరూ బాధ్యతతో సహకరించాలని కోరారు. కార్యక్రమంలో టౌన్ సీఐ రఘుపతిరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ మాలోత్ శ్రీదేవిబాలు, పోలీసు సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. -
క్రమశిక్షణ మరిచి.. విచక్షణ కోల్పోయి
వరంగల్ స్పోర్ట్స్ : క్రమశిక్షణ నేర్పించాల్సిన పెద్దలే విచక్షణ కోల్పోయారు. క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలవాల్సిన నిర్వాహకులే భౌతికదాడులకు తెగబడ్డారు. క్రీడా లోకానికే మచ్చతెచ్చేలా వ్యవహరించిన తీరుతో యువ క్రీడాకారులు ఆత్మ పరిశీలనలో పడ్డారు. హనుమకొండలోని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ బాక్సింగ్ హాల్లో మంగళవారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి అండర్–15 బాలబాలికల ఎంపికలు అపహాస్యం పాలయ్యాయి. అసలేం జరిగిందంటే.. వరంగల్ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి ఎంపికలకు ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ఉదయమే బాక్సింగ్ హాల్కు చేరుకున్నారు. నిబంధనల మేరకు క్రీడాకారులకు ముందుగా వైద్య పరీక్షలు చేసిన అనంతరం వెయింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా నిర్వాహకులు వైద్య బృందం రాకముందే క్రీడాకారుల బరువు నమోదు చేస్తున్నారు. అందులో కొందరు క్రీడాకారులు బరువు 100 నుంచి 200 గ్రాముల ఎక్కువగా ఉన్నట్లు చూపెట్టారు. దీంతో బరువు తగ్గించేందుకు అరగంట పాటు గ్రౌండ్లో వ్యాయామం చేసేందుకు వెళ్లారు. అనంతరం మరోసారి వెయింగ్ కోసం వచ్చిన క్రీడాకారులను సమయం ముగిసిందంటూ నిర్వాహకులు ఎంపికల్లో పాల్గొనకుండా రిజెక్ట్ చేశారు. నిబంధనల పేరుతో తమ జీవితాలతో ఆడుకుంటున్నారని క్రీడాకారులు, తల్లిదండ్రులు, కోచ్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా నిర్వాహకులు అవేమీ పట్టించుకోకకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ విషయంపై రెఫరీగా వ్యవహరించే కోచ్ శ్రీకాంత్, బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బి. రవీందర్కుమార్తో వాగ్వాదానికి దిగాడు. సమయం పేరుతో క్రీడాకారుల భవిష్యత్ను నాశనం చేయడమేంటని నిలదీశాడు. ఈ క్రమంలో మాటలు కాస్త దూషించే స్థాయికి ఆ తర్వాత బాక్సింగ్ హాల్లోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఠాణా మెట్లెక్కిన పంచాయితీ.. రెఫరీ వర్సెస్ అసోసియేషన్ అధ్యక్షుడి మధ్య జరిగిన దాడులతో క్రీడాకారులు, తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. గొడవ ముదురుతుండడంతో అక్కడే కొందరు 100 డయల్ చేయడంతో ఇద్దరిని హనుమకొండ పీఎస్కు తరలించారు. కాగా, ఎంపికల కోసం రిజిస్ట్రేషన్ పేరుతో ఒక్కో క్రీడాకారుడి నుంచి రూ.300 వసూలు చేసిన నిర్వాహకులు కనీసం అరటిపండు కూడా ఇవ్వలేదని వాపోయారు. ఉమ్మడి జిల్లా నుంచి 17 మంది హాజరు.. పంచాయితీ సమస్యను పక్కనపెట్టి సాయంత్రం 5 గంటలకు ఎంపిక ప్రక్రియ కొనసాగించినట్లు నిర్వహణ కార్యదర్శి సీ. హెచ్ రామకృష్ణ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నలుగురు బాలికలు, 13 మంది బాలురు ఎంపికలకు హాజరైనట్లు తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈ నెల 13, 14 తేదీల్లో హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. బాక్సింగ్ క్రీడ ఎంపికలో భౌతిక దాడులు నిర్వాహకుల తీరుపై అసంతృప్తి ఠాణా మెట్లెక్కిన క్రీడల పంచాయితీ -
ఆనందపు ఆటలు..
వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా కాజీపేట మండలం సోమిడి శివారులోని తాళ్లపద్మావతి ఒలంపియాడ్ పాఠశాలలో కంప్యూటర్ శిక్షణ పొందుతున్నారు. ప్రతీరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కంప్యూటర్లో ఎంఎస్ వర్డ్, పెయింట్, ఎక్సెల్ నేర్చుకుంటున్నారు. ప్రతీ రోజు 20 మందికిపైగా శిక్షణకు హాజరవుతున్నారు. –కాజీపేటసోమిడి మైదానంలో ఆడుకుంటున్న పిల్లలు కంప్యూటర్ నేర్చుకుంటున్న విద్యార్ధులు నేను గీసిన బొమ్మవేసవి సెలవుల్లో బాలబాలికలు ఖాళీగా ఉండకుండా పలు క్రీడలు, కళలు నేర్చుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా బొమ్మలు గీయడంపై ఆసక్తి కనబర్చుతున్నారు. వివిధ రకాల చిత్రాలు గీస్తూ అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. అందరితో ప్రశంసలు అందుకుంటున్నారు.కాజీపేట : వేసవి సెలవుల్లో విద్యార్థులు ఆటపాటలతో సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగా మండలంలోని సోమిడి, టేకులగూడెం, మడికొండ, తరాలపల్లి, కడిపికొండ తదితర గ్రామాల్లో బాలబాలికలు క్రికెట్, ఖోఖో, వాలీబాల్ తదితర ఆటలు ఆడుతున్నారు. దీంతో గ్రామాల్లో ఏ వీధిలో, ఏ మైదానంలో చూసినా పిల్లలతో కళకళలాడుతున్నాయి. -
చదువుతోపాటు క్రీడల్లోనూ.. కృష్ణవేణి
కేయూ క్యాంపస్ : మలేషియాలోని కౌలాలంపూర్లో ఈనెల 2 నుంచి 5 వరకు నిర్వహించిన సెకండ్ ఏషియన్ పారాత్రోబాల్ చాంపియన్ షిప్ –2026 పోటీల్లో భారతదేశ టీమ్తో పోటీల్లో పాల్గొన్న కాకతీయ యూనివర్సిటీ కామర్స్అండ్ బిజినెస్మేనేజ్మెంట్ విభాగం పరిశోధకురాలు మాచర్ల కృష్ణవేణి ప్రతిభ చాటారు. ఈ టీమ్ కాంస్య పతకం సాధించింది. ఇందులో మాచర్ల కృష్ణవేణి వైస్ కెప్టెన్గా వ్యవహరించారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్కు చెందిన ఎల్లగౌడ్, హైమావతి దంపతుల కుమార్తె కృష్ణవేణి. తండ్రి ప్రైవేట్గా డ్రైవర్గా పనిచేస్తుండగా తల్లి గృహిణి. చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి.. కృష్ణవేణికి చిన్నప్పటి నుంచే చదువులో చురుగ్గా ఉంటూనే క్రీడలపై ఆసక్తి పెంచుకుంది. గతంలో హనుమకొండ సు బేదారి దివ్యాంగుల హాస్టల్లో ఉంటూ చదువుకున్నారు. ప్ర స్తుతం హైదరాబాద్లోని ది వ్యాంగుల ఉమెన్స్ హోమ్లో ఉంటున్నారు. పారా త్రో బాల్, తైక్వాండో పోటీల్లో శిక్షణ కూడా పొందుతున్నారు. పీహెచ్డీ పూర్తిచేయాలనే లక్ష్యం.. కేయూ కామర్స్అండ్ బిజినెస్మేనేజ్మెంట్ విభాగంలో ప్రస్తుతం పరిశోధకురాలుగా పీహెచ్డీ చేస్తున్నారు. ఇప్పటికే నాలుగేళ్లు కావొస్తోంది. ఈఏడాది డిసెంబర్లో పూ ర్తిచేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు కృష్ణవేణి తెలి పారు. భవిష్యత్లో పారా ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనాలని ఉందని, ఆ దిశగానే కృషి చేస్తూనే ఉంటానని పేర్కొన్నారు. ఏషియన్ పారా త్రోబాల్ పోటీల్లో ప్రతిభ కాంస్య పతకం అందుకున్న కృష్ణవేణి -
గోల్డ్ లోన్ కోసం వెళ్తే.. గొలుసులో కొంత భాగం మాయం
● బ్యాంకు అప్రైజర్ను తొలగించిన బీఎం బచ్చన్నపేట : గోల్డ్ లోన్ కోసం బ్యాంకుకు వెళ్లిన ఓ ఖాతాదారుడి గొలుసులోని కొంత భాగం మాయమైంది. మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. బాధితుడు బ్యాంకు మేనేజర్కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మండలంలోని కట్కూర్కు చెందిన బాధితుడు తమ్మడి శ్రీకాంత్ కథనం ప్రకారం.. శ్రీకాంత్ సుమారు 22.2 గ్రాముల బంగారు గొలుసును గోల్డ్ లోన్ కోసం బ్యాంకులో అప్రైజర్ సిరివి రూపారాం అలియాస్ ప్రకాశ్కు చూపించాడు. గోల్డ్ తనిఖీ ప్రక్రియ అనంతరం గొలుసులోని కొంత భాగం కనిపించకపోవడంతో బాధితుడు అనుమానం వ్యక్తం చేశాడు. అనంతరం పరిశీలించగా మాయమైన భాగం గోల్డ్ అప్రైజర్ డ్రాలో కనిపించింది. ఈ ఘటనతో ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా గోల్డ్ తనిఖీ నిర్వహించే ప్రాంతంలో సీసీ కెమెరాల పర్యవేక్షణ లేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా ఈలాంటి ఘటనలు జరిగాయని దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశారు. ఈ విషయమై బ్యాంక్ మేనేజర్ ఆర్. రాజును వివరణ కోరగా గొలుసు నుంచి కొంత భాగం తీశానని గోల్డ్ అప్రైజర్ ఒప్పుకున్నాడని, చైన్ ఓ రింగు విరిగి ఉండడంతో డ్రాలో వేశానని తెలిపాడన్నారు. ఈ విషయమై ఆ అప్రైజర్ను తొలగించామని మేనేజర్ పేర్కొన్నారు. -
బాల్యం.. రంగుల లోకం
పాఠశాలకు సెలవులు వచ్చాయంటే చాలు.. పిల్లలంతా టీవీ, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోవడం సాధారణం. కానీ, ఆ సమయాన్ని వృథా చేయకుండా తల్లిదండ్రులు కొద్దిగా శ్రద్ధ పెడితే పిల్లల్లోని అద్భుత సృజనాత్మకత (క్రియేటివిటీ) బయటకు వస్తుంది. ఈ క్రమంలోనే భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామానికి చెందిన గూడూరి ప్రశాంత్రెడ్డి, మనోరంజిత దంపతుల కూతురు యూకేజీ చదువుతున్న దాక్షిణ్యారెడ్డి తన ఊహకు రంగులద్దారు. రాబోయే వర్షాకాలాన్ని ఉద్దేశించి వర్షించే మేఘాలు, పచ్చని చెట్లు థర్మకోల్ షీట్పై రంగులతో వేయడంతో పాటు కాగితాలకు రంగులు వేసి జాతీయ పక్షి చిహ్నం మయూరం ఆకారం ఆకట్టుకుంది. –భీమదేవరపల్లి -
పోక్సో కేసులో నేరస్తుడికి ఇరవై ఏళ్ల జైలు
వరంగల్ లీగల్: పోక్సో కేసులో వరంగల్ దేశాయిపేట వివర్స్ కాలనీకి చెందిన మోత్తూరి శివ అలియాస్ శివకుమార్కు ఇరువై ఏళ్ల జైలు, రూ.1.05 లక్షల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి క్షమాదేశ్ పాండే సోమవారం తీర్పు వెలువరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గంపా వెంకటరమణ కథనం ప్రకారం.. గతంలో వరంగల్ నగరంలోని ఓ కాలనీలో నివసిస్తున్న పదో తరగతి చదువుతున్న ఓ బాలికతో అదే కాలనీలో ఉంటున్న శివ ఇన్స్ట్రాగామ్ ద్వారా పరిచయమై స్నేహం చేశాడు. మాయమాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడు. తరచూ బాలిక సెల్ఫోన్కు మెసేజ్లు, కాల్స్ చేస్తూ మాట్లాడేవాడు. దీనిని గమనించిన తల్లిదండ్రులు బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలిక భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ఆ కాలనీ నుంచి ఖాళీ చేసి మరో ప్రాంతానికి వెళ్లిపోయారు. అయితే బాలిక వద్ద ఫోన్ లేకపోవడంతో శివ సెల్ఫోన్ కొనిచ్చి రహస్యంగా మాట్లాడేవాడు. బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఇంటికి వచ్చి నేను చెప్పినట్లు చేయాలి.. నాతో మాట్లాడాలి.. లేదంటే నిన్ను, మీ కుటుంబీకులను చంపుతానని బెదిరించేవాడు. ఈ క్రమంలో బాలిక సెల్ఫోన్ ఇంట్లో పెట్టి బంధువుల వద్దకు వెళ్లిన సమయంలో తల్లిదండ్రులకు దొరకడంతో అందులో ఉన్న మెసేజ్లు, నగ్న ఫొటోలు చూసి బాలిక ద్వారా విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగస్టు 06, 2022న మట్టెవాడ పోలీసులు అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడు శివను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో నేరం రుజువుకావడంతో నేరస్తుడు శివకు ఇరువై ఏళ్ల జైలు శిక్ష రూ.1.05 లక్షల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు వెలువరించారు. కేసును ఏసీపీ కె.గిరికుమార్ పరిశోధించగా లైజన్ ఆఫీసర్ హరికృష్ణ పర్యవేక్షణలో హెడ్కానిస్టేబుల్ రమేశ్, హోంగార్డు శ్రీనివాస్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. -
పింఛనో రామచంద్రా..
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో నూతన పింఛన్ల మంజూరు కోసం లబ్ధిదారులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అర్హత ఉన్నా ఆసరా అందడం లేదని వారు వాపోతున్నారు. నాలుగేళ్లుగా కొత్త పింఛన్లు మంజూరు కావడం లేదు. కాగా, ప్రభుత్వం ఇటీవల అర్హులకు నూతన పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించడంతో జిల్లాలో 25వేల మంది అర్హుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రస్తుతం 1.09లక్షల మందికి.. జిల్లా వ్యాప్తంగా 1,09,240 మందికి ప్రతీ నెల రూ.27.86కోట్ల పింఛన్ అందజేస్తున్నారు. ఇందులో 45,707 మంది వృద్ధులు, 41,500మంది వితంతువులు, 380మంది చేనేత కార్మికులు, 2,938మంది గీత కార్మికులు, 375మంది బోదకాలు, 14మంది బీడీ కార్మికులు, 3014మంది ఒంటరి మహిళలు, 74 డయాలసిస్ పేషెంట్లకు నెలకు రూ. 2,016 చొప్పున, 15,238 మంది దివ్యాంగులకు నెలకు రూ. 4,016 చొప్పున అందజేస్తున్నారు. అర్హత ఉండి ఎదురుచూపులు.. ప్రభుత్వం 2022 ఆగస్టు ఒకటో తేదీ వరకు ఆత్మీయ భరోసా నూతన పింఛన్లు మంజూరు చేసింది. ఆ తర్వాత ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయలేదు. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు 25వేల మందికి పైగా కొత్త పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో 2024 జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఆరు గ్యారంటీల కోసం దరఖాస్తులు స్వీకరించారు. కాగా, వృద్ధాప్యం, వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగ, నేత, గీత కార్మికులు మొదలైన వారు 17,111 మంది తాము పింఛన్ పొందడానికి అన్ని అర్హతలు ఉన్నాయని దరఖాస్తు చేసుకున్నారు. అలాగే వితంతువులు, ప్రమాదాల్లో కాళ్లు, చేతులు పోగొట్టుకున్నవారు, వివిధ రకాల వైకల్యం పొందిన వారు, పింఛన్ పొందేందుకు వయస్సు వచ్చిన వారు కలిపి మొత్తంగా 25వేల మందికిపైగా పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. నాయకుల ప్రకటనతో ఆశలు.. ఇటీవల జరిగిన సభలు, సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. దీంతో అర్హతలు ఉండి ఏళ్ల తరబడి పింఛన్ కోసం ఎదురుచూస్తున్న వారిలో ప్రజా ప్రతినిధులు, అధికారుల ప్రకటనలతో ఆశలు చిగురించాయి. కొత్త పింఛన్లు త్వరగా మంజూరు చేయాలని కోరుతున్నారు. నాలుగేళ్లుగా కొత్త పింఛన్లకు మోక్షం కరువు సదరం సర్టిఫికెట్ పట్టుకొని ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణ వృద్ధులు, వితంతువులు, నేత, గీత కార్మికుల ఎదురుచూపులు -
వినతులు వెంటనే పరిష్కరించాలి
● కలెక్టర్ స్నేహశబరీష్ ● ప్రజావాణిలో 170 అర్జీల రాక మహబూబాబాద్: ప్రజావాణి వినతుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..పెండింగ్ వినతులు కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వినతులను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. ప్రతీ దరఖాస్తుకు అత్యంత ప్రాధాన్యం ఇ వ్వాలన్నారు. 170వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. వచ్చిన వాటిలో కొన్ని వినతులు పరిశీలిస్తే.. ● జిల్లాలో విద్యార్థులు లేరనే కారణతో 162 పాఠశాలలను మూసివేశారని, తిరిగి వాటిని పునఃప్రారంభించాలని తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ మైస శ్రీనివాసులు వినతిపత్రం అందజేశారు. ● పెరిగిన ఎరువుల ధరలు తగ్గించాలని, నకిలీ విత్తనాలను అరికట్టాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు పాయం చిన్న చంద్రన్న, రాములు, బిక్షం, సత్యం తదితరులు పాల్గొన్నారు. ● మరిపెడ మండలం తాళ్లఊకల్ గ్రామానికి చెందిన రైతులు హరి, మల్లయ్య, భాస్కర్, సతీష్ ఆ గ్రామంలోని ఐకేపీ నిర్వాహకురాలు రైతులను ఇబ్బంది పెడుతుందని, విచారణ చేసి చర్యలు తీసుకోవాలని వినతి ఇచ్చారు. ● జిల్లా కేంద్రానికి చెందిన వక్కల శ్రీనివాస్ తన షాపుల సమీపంలో రోగులు మూత్ర విసర్జన చేస్తున్నారని, ఆస్పత్రిలో పలు మరుగుదొడ్లకు తాళాలు వేసి ఉండడంతో బహిరంగ మూత్రవిసర్జన చేస్తున్నారని వినతిలో పేర్కొన్నారు. వెంటనే ఆ మరుగుదొడ్ల తాళాలు తీయించి సమస్య పరిష్కరించాలని కోరాడు. -
‘చేనేత’ ఉపాధికి నష్టం కలిగించొద్దు
● కలెక్టరేట్ ఎదుట కార్మికుల ధర్నా ● వినతిపత్రం అందజేసిన నాయకులు న్యూశాయంపేట : చేనేత ఉపాధికి నష్టం కలిగించొద్దని కార్మికులు సోమవారం వరంగల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వ సంక్షేమ శాఖలకు అవసరమైన మేటిరియల్ (కార్పెట్స్, బెడ్షీట్స్) ఏకీకృత టెండర్ విధానాన్ని తొలగించి యథావిధిగా టెస్కో సంస్థకు ఆర్డర్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హ్యాండ్లూమ్ వీవర్స్ కో–ఆపరేటివ్ సొసైటీస్ సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్మికులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు స్పందించి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రం అందించేందుకు అనుమతించగా నాయకులు కలెక్టర్కు వినతిపత్రాన్ని అందించారు. బీజేపీ నాయకులు కుసుమ సతీష్, సీపీఐ నాయకులు టి. వెంకట్రాములు, చేనేత సంఘం నాయకులు డి.సత్యనారాయణ, సంపత్, వెంకటమల్లు, సాంబయ్య, భద్రయ్య, కుమారస్వామి, రాజేందర్, రమేష్, ఓదేలుతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఎంసీపీఐ ఆధ్వర్యంలో.. ధరలను అదుపు చేయడంలో పాలకులు విఫలమయ్యారని ఎంసీపీఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ విమర్శించారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం.చందర్రావు, జి.కుమారస్వామి, సాంబయ్య, ప్రతాప్, ఎం.సాగర్, సంధ్య, రామస్వామి, ఇస్మాయిల్, రమేష్, నర్సయ్య, సమ్మయ్య, గోవర్దన్ కార్యకర్తలు పాల్గొన్నారు. నాసిరకం విత్తనాలను అరికట్టాలని.. నాసిరకం విత్తనాలను అరికట్టాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్ర సూరి పేర్కొన్నారు. కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం కలెక్టర్కు వినతిపత్రం అందించారు. నాయకులు ఎం.పాణి, కొమురయ్య, లింగయ్య, సాగర్, మెహన్, శ్రీను, కొత్తపల్లి రవి తదితరులు పాల్గొన్నారు. -
గుప్తనిధుల కోసం అన్వేషిస్తున్న ఇద్దరి అరెస్ట్
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం అటవీ ప్రాంతంలో గుప్త నిధుల కోసం అన్వేషిస్తున్న ఆదిలాబాద్లోని టీచర్స్ కాలనీకి చెందిన ఇంజారపు వెంకటరమణ ప్రసాద్, హనుమకొండలోని సుధానగర్కు చెందిన వలబోజు శ్రీనివాస్ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. భూపాలపల్లి సీసీఎస్ సీఐ రమేశ్ కథనం ప్రకారం.. నిందితులు ఆరు నెలలుగా కాళేశ్వరం అటవీ ప్రాంతంలో గుప్త నిధుల కోసం ఎలక్ట్రానిక్ పరికరాలతో సంచరిస్తున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తదుపరి విచారణ నిమిత్తం కాళేశ్వరం పోలీస్స్టేషన్కు అప్పగించినట్లు సీఐ తెలిపారు. గుప్త నిధులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం వెంగంపేట శివారు పాల్త్యాతండాలో మంత్రగాళ్లమంటూ దయ్యాలు, భూతాలు తొలగిస్తామని తిరుగుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసి తహసీల్దార్ నాగభవాని ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై గిరిధర్రెడ్డి తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. వెంగంపేట సమీప తండాల్లో ఇటీవల కొందరు వ్యక్తులు తమకు మంత్రాలు వస్తాయని.. కార్లలో వస్తూ గిరిజనులకు దయ్యాలు, భూతాలు, చేతబడులు ఉన్నాయని నమ్మబలుకుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కొందరు తండావాసులు గుర్తించారు. ఈ క్రమంలో సోమవారం వచ్చిన ముగ్గురిని అడ్డగించి ప్రశ్నించగా భయపడి పారిపోబోయారు. వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారిలో ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి చెందిన జుజ్వువం గోపాలస్వామి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుండ్రుగొండ మండలం తుంగారం గ్రామానికి చెందిన పట్ర నాగేందర్, సోడెపోగు బసవేశ్వర్తోపాటు వీరిని తీసుకొచ్చిన పాల్త్యాతండాకు చెందిన సోమ్లానాయక్ను విచారించి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై తెలిపారు. -
మల్బరీ సాగు.. లాభాలు బాగు
● తోటల సాగు, పట్టు పరిశ్రమకు ప్రభుత్వం ప్రోత్సాహం ● రైతులకు సబ్సిడీ అందజేత ● పంట మార్పిడితో ప్రయోజనాలుడోర్నకల్: మల్బరీ సాగు, పట్టు పరిశ్రమలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. రైతులు అధిక లాభాలు పొందవచ్చని, పంట మార్పిడికి వీలు కలుగుతుందని, ప్రతీ సంవత్సరం ఎకరాకు రూ.2లక్షల వరకు ఆదాయం పొందే అవకాశాలు ఉంటాయని పట్టుపరిశ్రమ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో సాగుకు జిల్లా రైతులు ఆసక్తి చూపుతున్నారు. సాగు తేలిక.. పట్టు పురుగుల మేత కోసం మల్బరీ తోటలను సాగు చేస్తారు. అలాగే అక్కడే పట్టుపురుగుల పెంపకం కోసం షెడ్డు నిర్మించాల్సి ఉంటుంది. ఒకసారి మల్బరీ మొక్కలను నాటితే 15 సంవత్సరాల వరకు ఆకు లభిస్తుంది. కాగా, సంవత్సరానికి ఆరుసార్లు ఆకు కోసుకునే(6 పంటలు) అవకాశాలు ఉంటాయి. పురుగు మందుల అవసరం లేకుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేయవచ్చు. ప్రస్తుతం జిల్లాలో డోర్నకల్, కేసముద్రం, నెల్లికుదురు, గూడూరు, ఇనుగుర్తి, తొర్రూరు, మహబూబాబాద్ మండలాల్లో మల్బరీ సాగు, పట్టుగూళ్ల పెంపకం కొనసాగుతోంది. కాగా, మల్బరీసాగు, పట్టు పరిశ్రమ నిర్వహణపై ఆసక్తి కలిగిన రైతులు సహాయ పట్టు పరిశ్రమ అధికారులు కె.సురేష్(9966757765), డి.రాజయ్య(9989270269)ను సంప్రదించవచ్చు. ప్రభుత్వ రాయితీ.. పట్టు పరిశ్రమ, మల్బరీ సాగు పథకంలో భాగంగా రెండెకరాల(యూనిట్) పంట సాగు కోసం ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. మొక్కల పెంపకం, నీటి వసతి, షెడు నిర్మాణం తదితరాల కోసం భారీగా రాయితీలు ప్రకటించింది. మూడోసారి సాగు చేస్తున్నా.. నా వ్యవసాయ భూమిలో మల్బ రీసాగు, పట్టు పురుగుల నిర్వహణ మూడోసారి ప్రారంభించా. మొదటి సారి షెడ్డు నిర్మాణం, మల్బరీ మొక్కలను నాటాను. మల్బరీ సాగు ఆశాజనకంగా ఉంది. – చంద్రశేఖర్, సత్యతండా, డోర్నకల్ ఉత్సాహం చూపే రైతులకు ప్రోత్సాహం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మల్బరీ సాగు, పట్టు పురుగుల పెంపకం చేసేందుకు ఉత్సాహం చూపే రైతులకు సబ్సిడీలతో ప్రోత్సాహం అందిస్తున్నాం. మల్బరీ సాగుతో వాణిజ్య పంటలకంటే ఎక్కువ ఆదాయం పొందవచ్చు. పంట మార్పిడి చేసుకునే అవకాశం కూడా కలుగుతుంది. – అనసూయ, జిల్లా పట్టు పరిశ్రమ శాఖ సంయుక్త సంచాలకులు, హనుమకొండవివరాలు యూనిట్ ధర రాయితీ (రూ.లలో) (రూ.లలో) ఎస్సీ ఎస్టీ ఇతరులుమొక్కల పెంపకం 1,20,000 1,08,000 1,08,000 90,000 నీటి వసతి 1,00.000 65,000 65,000 50,000 పురుగు మందులు 5,000 3,200 3,200 2,500 షెడ్డు నిర్మాణం 4,50,000 4,05,000 4,05,000 3,37,500 పెంపకం పరికరాలు 75,000 48,750 48,750 37,500 మొత్తం 7,50,000 6,30,000 6,30,000 5,17,500 -
మంగళవారం శ్రీ 9 శ్రీ జూన్ శ్రీ 2026
‘తొర్రూరు మండలం వెలికట్ట గ్రామానికి చెందిన కొమ్ము విష్ణు అనే యువకుడు 2024 సెప్టెంబర్ 7న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు శస్త్ర చికిత్స చేసి కుడి కాలు తొలగించారు. పేద కుటుంబానికి చెందిన యువకుడు పింఛన్ కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ నేటికీ అందలేదు. పింఛన్ మంజూరు అయితే అవసరాలు తీర్చుకుంటామని ఆయన కోరుతున్నాడు.’ ‘జిల్లాలోని బయ్యారం మండలం ఇర్సులాపుం గ్రామానికి చెందిన కలికినేని సంపత్ తొమ్మిది నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయాడు. డాక్టర్ 57శాతం అంగవైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ ఇచ్చాడు. సంపత్ పింఛన్ మంజూరు కోసం ప్రయత్నిస్తున్నాడు. కాగా, ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేస్తేనే నీకు కూడా పింఛన్ వస్తుందని అధికారులు చెబుతున్నారని, అవి ఎప్పుడు వస్తాయో అని సంపత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.’ -
రేపు మేడిగడ్డకు మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి బుధవారం రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్రెడ్డి రానున్నారు. ప్రాజెక్టులో జరుగుతున్న పలు పరీక్షలు తుది దశకు చేరడంతో పరిశీలనకు ప్రత్యేకంగా హెలికాప్టర్లో రానున్నారని సోమవారం ఇరిగేషన్శాఖ కార్యాయం నుంచి షెడ్యూల్ వెలువడింది. మంత్రి ఉత్తమ్ మేడిగడ్డ బ్యారేజీకి మధ్యాహ్నం 12:45 గంటలకు చేరుకుని క్షేత్రస్థాయిలో జియోఫిజికల్, జియోటెక్నికల్, జీపీఆర్, ఎన్డీటీ, ఎస్పీ టీ, పర్మియబిలిటీ పరీక్షల పనులు పరిశీలిస్తారు. అనంతరం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై రివ్యూ నిర్వహించనున్నారు. తిరిగి 1:45 గంటలకు ఖమ్మం జిల్లాకు వెళ్తారు.రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి చిల్పూరు: స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని నష్కల్ సమీపంలో చోటు చేసుకుంది. ఎస్సై నవీన్కుమార్ కథనం ప్రకారం.. హనుమకొండకు చెందిన కొమ్మాల జస్వంత్(19), మడాల అభిరామ్ మిత్రులు. అభిరామ్ పుట్టిన రోజు ఉండడంతో స్టేషన్ఘన్పూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చారు. పార్టీ చేసుకున్న అనంతరం ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో బైక్పై హనుమకొండకు వెళ్తున్నారు. ఈ క్రమంలో చిల్పూరు మండలం నష్కల్ సమీపంలో లారీని ఓవర్టేక్ చేయబోయి ఢీకొనడంతో జస్వంత్కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చేనేత కార్మికురాలు హఠాన్మరణం కాశిబుగ్గ : వరంగల్ కొత్తవాడ 23వ డివిజన్లో సుదీర్ఘకాలంగా చేనేత సహకార సంఘం సభ్యురాలిగా కొనసాగుతున్న కర్నే శాంతమ్మ(70) సోమవారం హఠాన్మరణం చెందారు. చేనేత వృత్తిపై ఆధారపడి 45 సంవత్సరాలుగా కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మూడు రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం టెండర్ విధానంలో బెడ్ షీట్స్, కార్పెట్స్ ఆర్డర్స్ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం ద్వారా చేనేత మగ్గాలు మూలన పడ్డాయని నిరసన వ్యక్తి చేస్తూ దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పనిలేక మనస్తాపం చెందిన శాంతమ్మ చనిపోయినట్ల టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్పా వెంకటేశ్వర్లు తెలిపారు. శాంతమ్మ చేనేత బీమా పథకంలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ద్వారా వచ్చే రూ. 5 లక్షలు ఆ కుటుంబానికి త్వరితగతిన అందించాలని చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకుడు శ్రీకాంత్ రెడ్డికి వినతి పత్రం అందచేశారు. కాగా, మృతురాలికి కుమారుడు రఘుపతి, కూతురు చిప్ప పద్మ ఉన్నారు. అక్రమ దత్తతను ఛేదించిన అధికారులుభూపాలపల్లి రూరల్: జిల్లాలోని మల్హర్ మండలం దుబ్బపల్లి గ్రామంలో అక్రమ దత్తత ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా సంక్షేమ అధికారి మల్లేశ్వరి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ మహిళ ఇటీవల హనుమకొండలోని ఓ ఆస్పత్రిలో ప్రసవించింది. అప్పటికే ఆమెకు ఒక కుమారుడు, కూతురు ఉంది. భర్త వదిలేయడంతో ఆర్థిక పరిస్థితి అనుకూలించక ఇటీవల పుట్టిన కుమారుడిని మధ్యవర్తుల ద్వారా పెద్దపల్లి జిల్లా మంథనిలో ఒకరికి దత్తత ఇచ్చింది. ఈ విషయం తెలిసిన జిల్లా అధికారులు దత్తత ఇచ్చిన వారిని, తీసుకున్న వారిని హనుమకొండ సీడబ్ల్యూసీకి పంపించారు. అనంతరం వారికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. కాగా, ఇటీవల జన్మించిన బాబును కన్నతల్లికి అప్పగించినట్లు జిల్లా సంక్షేమ అధికారిని మల్లేశ్వరి తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు, పాల్గొన్నారు. -
టీపీఎస్ ఏర్పాటుకు పరిశీలన
● వరంగల్ వెస్ట్కు కాజీపేట బాలుర హైస్కూల్లోనే.. ● పరకాలకు పెద్దాపూర్ జెడ్పీఎస్ఎస్లోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్విద్యారణ్యపురి : ఈ విద్యా సంవత్సరం (2026–27) నుంచి రాష్ట్రంలోని ప్రతీ నియోజక వర్గానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు కూడా తీసుకుంటుంది. హనుమకొండ జిల్లాలోను నియోజకవర్గానికి ఒకటి చొప్పున నాలుగు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయబోతున్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో వరంగల్ పశ్చిమలోని కాజీపేట ప్రభుత్వ హైస్కూల్ (బాయ్స్) లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు. సోమవారం సాయంత్రం ఈ స్కూల్ను కలెక్టర్ చాహత్బాజ్పాయ్ సందర్శించి పరిశీలించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల సుమారు 2 ఎకరాల 11గుంటల వరకు ఉంటుందని డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ తెలిపారు. దీంతో కాజీపేట ప్రభుత్వ బాలుర హైస్కూల్లోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఏర్పాటుకు కలెక్టర్ నిర్ణయించారు. ఎంఈఓ బి.మనోజ్కుమార్, టీజీడబ్లూఐఈడీసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, రెవెన్యూ అధికారులు ఉన్నారు. అలాగే కాజీపేట జాగీర్ కో ఎడ్యుకేషన్ ప్రభుత్వ హైస్కూల్ను కూడా కలెక్టర్ సందర్శించి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు అనువుగా ఉంటుందా అని పరిశీలించినట్లు సమాచారం. పెద్దాపూర్ జెడ్పీఎస్ఎస్ను సందర్శన.. ఆత్మకూరు మండలం పెద్దాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సోమవారం డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్, ఎంఈఓ, ఇతర రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులు సందర్శించి పరిశీలించారు. ఇక్కడే పరకాల నియోజక వర్గానికి సంబంధించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలనే యోచన ఉందని డీఈఓ తెలిపారు. తొలుత నీరుకుళ్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేయాలని ఎంపిక చేసినా ఇక పెద్దాపూర్ జిల్లా పరిషత్హైస్కూల్లోనే ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఈ హైస్కూల్ స్థలం నాలుగు ఎకరాల వరకు ఉంది. ఇప్పటికే స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలోని నారాయణగిరి జిల్లా పరిషత్ హైస్కూల్, వర్ధన్నపేట నియోజకవర్గంలో హసన్పర్తి ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు ఎంపిక చేశారు. ఒక్కో తెలంగాణ పబ్లిక్ స్కూల్కు ప్రభుత్వం రూ.15కోట్ల చొప్పున నిధులు ఇవ్వనుందని తెలుస్తోంది. ఆయా నిధులతోనే అన్ని హంగులతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు కానున్నాయి. -
భర్తను వదిలి బంగారం, డబ్బుతో వెళ్లిపోయిన భార్య..
● అవమానభారంతో పురుగుల మందు తాగిన భర్త పర్వతగిరి: భార్య.. భర్తను వదిలి డబ్బులు, బంగారం, ఇతర సామగ్రితో వెళ్లిపోయింది. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండలో చోటు చేసుకుంది. కుటుంబీకులు, స్థానికుల కథనం ప్రకారం... పుట్ట నరేశ్ అనే వ్యక్తి ప్రైవేట్ ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గీసుగొండ మండలం మునుగొండకు చెందిన గుల్లపల్లి గాయత్రితో మార్చి 15, 2026న వివాహం జరిగింది. కాగా, ఇంట్లో ఎవరూ లేని సమయంలో గాయత్రి సోమవారం గూడ్స్ వాహనాన్ని రప్పించి ముగ్గురు వ్యక్తులతో కలిసి ఇంటిలోని ఐదు తులాల బంగారం, రూ.2.5లక్షల నగదు, ఇతర సామగ్రి తీసుకుని వెళ్లిపోయింది. దీంతో భార్య కోసం వెతికిన నరేశ్ ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అనంతరం ఆదివారం అవమాన భారం భరించలేక పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన స్థానికులు హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పతికి తరలించారు. ప్రస్తుతం నరేశ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. -
సత్వర పరిష్కారం చూపండి
● స్కానింగ్ పేరుతో గంటల తరబడి నిలబెట్టొద్దు ● హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్హన్మకొండ అర్బన్ : ప్రజావాణిలో ప్రజలు సమర్పించే ప్రతీ దరఖాస్తును నిర్దిష్ట గడువులోగా పరిష్కరించి అర్జీదారులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ఎన్.రవితో కలిసి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం ప్రజావాణి పెండింగ్ ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్, దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం జరుగుతుండడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. ప్రజావాణిపై ఎంతో నమ్మకంతో వచ్చే ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. దరఖాస్తుల స్కానింగ్ పేరుతో ప్రజలను గంటల తరబడి నిరీక్షిస్తుండడం సరికాదని, ఈ విధానాన్ని వెంటనే మార్చాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ దరఖాస్తును వెంటనే స్కాన్ చేసి ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు ఏ అర్జీ కూడా పెండింగ్లో ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. శాఖల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, మండల స్థాయిలో పెండింగ్ అర్జీల పరిష్కారానికి తహసీల్దార్లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ప్రజావాణి వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 365 దరఖాస్తులు అందినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ శేషాద్రి, సీపీఓ సత్యనారాయణరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
టీజీ–20 క్రికెట్ వేలంలో నలుగురికి చోటు
వరంగల్ స్పోర్ట్స్: బీసీసీఐ ఆమోదంతో ఈనెల 20 నుంచి జూలై 11వ తేదీ వరకు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మొదటిసారిగా నిర్వహిస్తున్న టీ–20 (టీజీ20) లీగ్ పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారుల్లో నలుగురికి చోటు దక్కింది. క్రీడాకారులను ప్రతిభ ఆధారంగా వేలంలో ప్రముఖ 8 ఫ్రాంచైస్ కొనుగోలు చేయగా అందులో వరంగల్ జిల్లా క్రీడాకారులు నలుగురు ఎంపికై నట్లు వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు. ఎంపికై న వారిలో జంబోజు పార్దిపన్(ఆల్ రౌండర్)ను రూ. 75 వేలకు పాలమూరు స్ట్రైక్ జట్టు, బానోత్ సతీశ్ కుమార్(ఫాస్ట్ బౌలర్)ను కరీంనగర్ డిమాండ్స్ జట్టు రూ. లక్షకు, విశ్వనాథ వైష్ణవ్ (ఆల్ రౌండర్– లెగ్ స్పిన్నర్ కం బ్యాట్స్మన్ )ను రూ. లక్షకు వరంగల్ వారియర్స్ జట్టు, బీరవోలు నాగ సుధామ్ష్ రెడ్డి(ఆల్ రౌండర్–లెగ్ స్పిన్నర్ కం బ్యాట్స్మన్)ని నల్లగొండ కింగ్స్ జట్టు రూ.75 వేలకు కొనుగోలు చేశారు. కాగా, టీజీ–20 కి ఎంపికై న క్రీడాకారులను వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అభినందించింది.సుధామ్ష్రెడ్డి, విశ్వనాథ వైష్ణవ్, సతీశ్కుమార్, పార్దిపన్ -
మహిళలకు ఆర్టీసీ అద్దె బస్సులు
● నేడు సీఎం చేతుల మీదుగా పంపిణీ ● వరంగల్ రీజియన్లో 86 బస్సుల కేటాయింపుహన్మకొండ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్టీసీ బస్సులను అద్దె ప్రాతిపదికన కేటాయించింది. వరంగల్ రీజియన్లోని 9 డిపోల పరిధిలో 86 బస్సులు మహిళలకు కేటాయించగా నేడు (ఈనెల 9న) హైదరాబాద్లో నిర్వహించనున్న కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మహిళా సంఘాలకు ఈ అద్దె బస్సులు అందించనున్నారు. అద్దె బస్సుల్లోనే మహిళలను బస్సుల పంపిణీ కార్యక్రమానికి తరలివెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో పురుషులతో పాటు మహిళల భాగస్వామ్యం ఉంటేనే జీవితం సాఫీగా సాగుతుందని భావించి ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తోంది. ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పించి మహిళా సంఘాలకు బస్సులు కొనిచ్చి వాటిని నడిపే బాధ్యత ఆర్టీసీకి అప్పగించింది. వరంగల్ రీజియన్లోని మహిళా స్వయం సహాయ సంఘాల ద్వారా హనుమకొండ డిపోకు 14, వరంగల్–1 డిపోనకు– 2, తొర్రూరు–5, భూపాలపల్లి–14, జనగామ–14, నర్సంపేట–13, మహబూబాబాద్–9 బస్సులు కేటాయించారు. వరంగల్–2 డిపోను ప్రైవేటు సంస్థ జేబీఎంకు అప్పగించడంతో ఇక్కడ మహిళలకు అద్దె బస్సులు కేటాయించలేదు. -
స్టేషన్ ఘన్పూర్లో నేడు డిప్యూటీ సీఎం పర్యటన
జనగామ: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో నేడు (మంగళవారం) రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన 4 సబ్స్టేషన్లను ప్రారంభించడంతోపాటు మరో 3 సబ్స్టేషన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి తదితరులు హాజరుకానున్నారు. భూ హద్దుల గుర్తింపులో వేగం పెంచాలి మహబూబాబాద్: భూముల రీ సర్వే, పట్టణ భూముల హద్దుల గుర్తింపు (నక్ష) కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి సీఎస్ రామకృష్ణారావు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నక్ష పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికై న జిల్లాలో సమన్వయంతో సర్వే త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ.. జిల్లాలో క్షేత్రస్థాయిలో సర్వే పనులు జరుగుతున్నాయన్నారు. మున్సిపల్శాఖ ద్వారా ఆర్ఓఆర్ నమోదు ప్రక్రియ ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టామన్నారు. వీసీలో కలెక్టర్ స్నేహశబరీష్, అదనపు కలెక్టర్ అనిల్కుమార్ పాల్గొన్నారు. లైసెన్స్ లేకుండా నారు విక్రయిస్తే చర్యలు డోర్నకల్/కురవి: నర్సరీ నిర్వాహకులు లైసెన్స్ లేకుండా మిరప, కూరగాయల నారు విక్రయిస్తే నర్సరీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి జినుగు మరియన్న హెచ్చరించారు. డోర్నకల్, కురవి మండలాల్లోని పలు గ్రామాల్లో సోమవారం పర్యటించిన మరియన్న నర్సరీలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సరీ చట్టం ప్రకారం నిబంధనలు పాటించాలని, తప్పనిసరిగా లైసెన్స్ పొందాలని సూచించా రు. ఆరుబయట నారు పెంచవద్దని, లైసెన్స్ లేకుండా ఎలాంటి నారు విక్రయించొద్దని హె చ్చరించారు. వ్యవసాయశాఖ ఆమోదం పొందిన విత్తనాలనే నర్సరీలో నాటాలని, కల్తీ విత్తనాలతో నారు పోసేవారిపై పీడీ యాక్ట్ ప్రకా రం కేసులు పెడతామని అన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషిమహబూబాబాద్ రూరల్: ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తోందని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య అన్నారు. మహబూబాబాద్ జిల్లా అటవీశాఖ కార్యాలయ ఆవరణలో దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల స్కూటీలను సోమవారం పంపిణీ చేశారు. అనంతరం వీరయ్య మాట్లాడుతూ.. దివ్యాంగులు సామాన్య వ్యక్తులతో సమానంగా పోటీ పడాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి విశాల్ బత్తుల, టీజీఎఫ్డీసీ సీజీఎం డీవీ.రెడ్డి, జీఎం స్కైలాబ్, ఇన్చార్జ్ డివిజనల్ మేనేజర్ శైలజ, ప్లాంటేషన్ మేనేజర్ కరుణాకర్ రావు, ఎఫ్డీఓ వెంకటేశ్వర్లు, ఎఫ్ఆర్ఓలు సురేష్, విజయలక్ష్మి, రాకేష్, ఇనుగుర్తి డీపీఎం రాకేష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు. కోటగుళ్లలో ప్రత్యేక పూజలుగణపురం: గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో ఉదయం నుంచి గణపేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు. -
అంగన్వాడీల భర్తీకి సిద్ధం
సాక్షి, మహబూబాబాద్: సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల భర్తీకి ఎ ట్టకేలకు మోక్షం లభించింది. జిల్లాలోని 125 టీచర్, 139 ఆయా పోస్టుల భర్తీకి ఉన్నతాధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 125 టీచర్, 139 ఆయా పోస్టుల భర్తీ.. జిల్లా వ్యాప్తంగా డోర్నకల్, గూడూరు, మహబూబాబాద్, మరిపెడ, తొర్రూరు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 1,437 సెంటర్లు నడుస్తున్నాయి. వీటిలో 1,312 మంది టీచర్లు, 953 ఆయాలు పనిచేస్తున్నారు. అయితే ఇందులో 125 టీచర్లు, 139 ఆయాల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే 65 సంవత్సరాలు నిండాయని టీచర్లు, ఆయాలకు పదవీ విరమణ కల్పించారు. ఈమేరకు ఇందులో 489 ఆయా పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇందులో ఏజెన్సీ ప్రాంతాలైన గూడూరు, కొత్తగూడ, గంగారం, బయ్యారం, గార్ల మండలాల పరిధిలో ఉన్న 139 ఆయాల పోస్టులు మాత్రమే భర్తీకి అనుమతి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం మాతా శిశుసంరక్షణకోసం కోట్లాది నిధులు వెచ్చించి పౌష్టికాహారం అందిస్తుంటే వాటిని పిల్లలకు, గర్భిణులు, బాలింతలకు వండి పెట్టేందుకు ఆయాలు లేరు. చాలా కాలం తర్వాత చేస్తున్న భర్తీ ప్రక్రియలో కేవలం ఏజెన్సీ ప్రాంతంలోని ఆయాల పోస్టులు మాత్రమే భర్తీ చేయడంపై మైదాన ప్రాంతం ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయాలని కోరుతున్నారు. భర్తీ ప్రక్రియ ఇలా.. గతంలో పదో తరగతి చదివిన వారికి అంగన్వాడీ పోస్టులు ఇచ్చారు. ఇప్పుడు విద్యార్హత ఇంటర్మీడియట్కు పెంచారు. గతంలో మాదిరిగానే కమిటీ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ కమిటీలో కలెక్టర్ చైర్పర్సన్గా ఉంటారు. ఆర్డీఓ, ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్(ఏజెన్సీ), డీఎంహెచ్ఓ, డీడబ్ల్యూఓ మొత్తం ఐదుగురు కమిటీలో ఉంటారు. టీచర్, ఆయా పోస్టుల భర్తీ విషయంలో స్థానికతకు ప్రాధాన్యం ఉంటుంది. మార్కుల కేటాయింపు.. మొత్తం100 మార్కులతో భర్తీ ప్రక్రియ నిబంధనలు ప్రకటించారు. ఇందులో ఇంటర్మీడియట్లో సాధించిన మార్కులకు మెరిట్ ఆధారంగా అత్యధికంగా 70 మార్కులు, వితంతులకు 5 మార్కులు, తల్లిదండ్రులు లేని వారికి 10 మార్కులు, దివ్యాంగులకు 5 మార్కులు అదనంగా కలుపుతారు. కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూలో 10 మార్కులు ఉంటాయి. మొత్తం మార్కులు కలిపి మెరిట్ వచ్చిన వారిని ఎంపిక చేస్తారని అధికారులు చెబుతున్నారు. మొదలైన పైరవీలు.. చాలాకాలం తర్వాత అంగన్వాడీ టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టడంతో ఆశావహులు అధిక సంఖ్యలో పోటీపడుతున్నారు. అదే విధంగా తమకు పోస్టు ఇప్పించాలని రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు మొదలయ్యాయి. మరోవైపు టీచర్ పోస్టుకు రూ. లక్ష నుంచి రూ. 2లక్షలు, ఆయా పోస్టుకు రూ. 50వేల నుంచి రూ.లక్ష వరకు ఇస్తే పోస్టులు ఇప్పిస్తామని దళారులు రంగప్రవేశం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తమకు రాజకీయ నాయకులు తెలుసు, మేము చెప్పిన వారికే ఉద్యోగం వస్తుందని పోటీలో ఉన్నవారిని నమ్మించే పనిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దళారుల మాట నమ్మవద్దు అంగన్వాడీ టీచర్లు, ఆయాల పోస్టులు ఇప్పిస్తామని ఇప్పటికే దళారులు సిద్ధమైనట్లు మా దృష్టికి వచ్చింది. ఎవరు కూడా దళారుల మాట నమ్మవద్దు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతోపాటు, ఇతర పాయింట్లు వచ్చేందుకు అర్హత ఉన్నవారు మొత్తంగా మెరిట్ ప్రాతిపదికన ఎంపిక జరుగుతుంది. దళారుల మాట నమ్మవద్దు. డబ్బులు ఇవ్వవద్దు. – ఎం. సబిత, డీడబ్ల్యూఓ 125 టీచర్, 139 ఆయాల పోస్టుల నియామకం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఉన్నతాధికారులు వారంలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు సన్నద్ధం -
పారిశుద్ధ్య కార్మికులు నిర్లక్ష్యం చేయొద్దు
● మున్సిపల్ కమిషనర్ వినోద్ కుమార్ మహబూబాబాద్: పారిశుద్ధ్య కార్మికులు కాల్వలను శుభ్రం చేయడంతో పాటు రోడ్లపై చెత్తను వెంటనే తొలగించాలని కమిషనర్ వినోద్కుమార్ అన్నారు. మానుకోట మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సమస్యపై ఈనెల 7న సాక్షి దినపత్రికలో ‘పారిశుద్ధ్యం గాడిన పడేనా?’ అనే శీర్షిక నప్రచురితమైన కథనంపై సోమవారం కమిషనర్ వినోద్కుమార్ స్పందించారు. మార్వాడీ బజార్తో పాటు రెడ్డి బజార్లో పారిశుద్ధ్య పనులు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. పారిశుద్ధ్య సమస్యలకు గల కారణాలపై ఆరా తీసి తగు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీహరి, జవాన్లు శ్రీను, చిరంజీవి పాల్గొన్నారు. -
దూర విద్య పీజీ రెండో సెమిస్టర్ పరీక్షలు షురూ
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య (ఎస్డీఎల్సీఈ) పీజీ ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ తదితర కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలు (2023–2024 బ్యాచ్) సోమవారం ప్రారంభమయ్యాయి. 11 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. హనుమకొండలోని వరంగల్ఎల్బీ కళాశాల, ఏఎస్ఎం డిగ్రీ కళాశాల, హంటర్రోడ్డులోని అల్లూరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్సైన్సెస్లోని కేంద్రాలను పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, అదనపు పరీక్షలనియంత్రణాధికారి పద్మజ సందర్శించారు. ఈసందర్భంగా ఆయా కేంద్రాల్లో కొందరు విద్యార్థులు తమకు పాఠ్య పుస్తకాలు, స్టడీమెటీరియల్ ఇవ్వలేదని, పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించి వాగ్వాదానికి దిగారు. పరీక్షల విభాగం అధికారులు మాట్లాడుతూ తాము పరీక్షలు మాత్రమే నిర్వహిస్తామని పాఠ్యపుస్తకాలు కాని స్టడీమెటీరియల్ను కాని ఇచ్చేది దూరవిద్య కేంద్రం డైరెక్టర్ బాధ్యతన్నారు. పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా పరీక్షలు నిర్వహించడం సరికాదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాకుండా వివిధ సబ్జెక్టుల పేపర్ పరీక్షల ప్రశ్నపత్రాలు కేవలం ఇంగ్లిష్లోనే ఇచ్చారని, తెలుగులో ఇవ్వలేదని విద్యార్థులు మండిపడ్డారు. దీంతో పరీక్షల విభాగం అధికారులు నిబంధనల ప్రకారం పీజీ కోర్సుల ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్లోనే ఇస్తున్నామని తెలిపారు. కాగా, మిగతా కేంద్రాలకు సిబ్బంది వెళ్లినప్పుడు కూడా అక్కడ కూడా స్టడీ మెటీరియల్ ఇవ్వకుండా పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారని తమకు సమాచారం అందిందని అదనపు పరీక్షలనియంత్రణాధికారి పద్మజ తెలిపారు. స్టడీమెటీరియల్ ఇవ్వడం తమ బాధ్యత కాదని వివరణ ఇచ్చారు. తొలిరోజు వివిధ కోర్సుల సబ్జెక్టుల పరీక్షలకు 40నుంచి 50శాతం మంది విద్యార్థులే హాజరయ్యారని పద్మజ తెలిపారు. పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండానే పరీక్షలా! అధికారులతో విద్యార్థుల వాగ్వాదం -
మృగశిర కార్తె సందడి
● చేపల కొనుగోలుకు ప్రజల ఆసక్తి ● కేజీ రూ.250 నుంచి రూ.600 వరకు విక్రయాలునెహ్రూసెంటర్: మృగశిర కార్తె రోజు చేపలు తింటే మంచిదని, తప్పకుండా తినాలనే నానుడి ఉంది. కాగా, సోమవారం మానుకోట పట్టణంలో చేపల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపారు. సాధారణ రోజుల్లో వివిధ రకాల చేపలను కిలో రూ.180 నుంచి రూ.500 వరకు విక్రయించే వారు. అయితే మృగశిర కార్తె సందర్భంగా కిలో వివిధ రకాల చేపలను రూ.250 నుంచి రూ.600పైగా విక్రయించారు. ఎక్కువ ధరలు ఉన్నప్పటికీ ప్రజలు చేపలకోసం ఎగబడ్డారు. -
గన్ గురి పెడితే పతకమే..
కమలాపూర్ : ఆ క్రీడాకారిణి గన్ గురి పెడితే పతకమే. వెనుదిరిగే సమస్యే లేదు. పద్నాలుగేళ్ల ప్రాయంలోనే షూటింగ్ క్రీడలో రాణిస్తోంది. అండర్–14, 17, 19, సీనియర్ కేటగిరీల్లోనూ ప్రతిభ కనబరుస్తోంది. 2 గోల్డ్, 3 బ్రౌంజ్, 11 సిల్వర్ మెడల్స్ సొంతం చేసుకోవడంతోపాటు మూడు సార్లు జాతీయస్థాయి పోటీల్లో ప్రాతినిథ్యం వహించింది. అంతేకాకుండా రెండు సార్లు ఇండియన్ టీమ్ ట్రయల్స్లో పాల్గొని ఔరా అనిపిస్తోంది. ఇటు షూటింగ్లో అటు చదువులోనూ రాణిస్తూ పలువురి మన్ననలు పొందుతోంది. ఆమె హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం గ్రామానికి చెందిన సంగెం చంద్రశేఖర్, శృతి దంపతుల కూతురు తాన్సీ. హైదరాబాద్లోని విద్యానికేతన్ మోడల్ హైస్కూల్లో ఇటీవల పదో తరగతి పూర్తి చేసిన తాన్సీ 515/600 మార్కులు సాధించింది. ఈ నెలలో హైదరాబాద్లో జరుగనున్న రాష్ట్రస్థాయి షూటింగ్ పోటీలకు సన్నద్ధమవుతోంది. స్పాన్సర్ల కోసం ఎదురుచూపులు.. చిన్న వయస్సులోనే షూటింగ్లో ప్రతిభ కనబరుస్తూ పతకాలతోపాటు పలువురి ప్రశంసలు అందుకుంటున్న తాన్సీ స్పాన్సర్ల కోసం ఎదురుచూస్తోంది. ఎవరైనా ముందుకొస్తే వారి సహకారంతో మ రింత రాణించి పతకాలు సాధిస్తానంటోంది. షూటింగ్ క్రీడలో రాణిస్తున్న తాన్సీ 2 గోల్డ్, 3 బ్రౌంజ్, 11 సిల్వర్ మెడల్స్ సొంతం అండర్–14, 17, 19, సీనియర్ కేటగిరీల్లో ప్రతిభ 3 సార్లు నేషనల్స్, 2 సార్లు ఇండియన్ ట్రయల్స్లో ప్రాతినిథ్యం -
బంగారం ఇస్తామని టోకరా..
ఏటూరునాగారం : బంగారం ఇస్తామని ఓ కుటుంబం మరో కుటుంబాన్ని మోసం చేసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాలను బాధితుడు కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడేనికి చెందిన కొండగొర్ల వెంకన్న సోమవారం ఏటూరునాగారంలో విలేకరులకు వెల్లడించారు. కొండగొర్ల వెంకన్న కుమారుడు చరణ్, మంగపేట మండలం కమలాపూర్కు చెందిన జిలానీ(అలియాస్) షేమినా, రబ్బానీ దంపతుల కుమారుడు విరానీ స్నేహితులు. ఈ క్రమంలో విరానీ ద్వారా జిలానీ షేమినా, రబ్బానీ దంపతులు వెంకన్న కుటుంబానికి దగ్గరయ్యారు. తమ వద్ద తవ్వకాల్లో బయపడిన బంగారం ఉందని, రూ.30 లక్షలు ఇస్తే ఇస్తామని నమ్మబలికారు. దీంతో కొండగొర్ల వెంకన్న దంపతులు ఆ నగదు ఇచ్చారు. అయితే బంగారం ఇవ్వకుండా రేపు మాపు అంటూ సుమారు మూడేళ్ల నుంచి కాల యాపన చేస్తూ తిప్పకుంటున్నారు. దీంతో విసుగు చెందిన బాధితులు పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. దీంతో జిలానీ షేమినా, రబ్బానీ దంపతులు రూ. 18లక్షలు ఇస్తామని గతేడాది పత్రం రాసి ఇచ్చారు. అయితే ఏడాది గడిచినా ఇప్పటి వరకూ డబ్బులు ఇవ్వకపోడంతో ఏటూరునాగారం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు వెంకన్న తెలిపాడు. దీనిపై పోలీసులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. రూ.30 లక్షలు తీసుకుని మోసం చేసిన దంపతులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు -
దేవునిగుట్టకు విముక్తి
● బ్లాక్ గ్రానైట్ క్వారీ లీజు రద్దు చేసిన జనగామ కలెక్టర్ సందీప్కుమార్ ఝా ● రెండేళ్ల వివాదానికి తెర జనగామ : జిల్లాలోని దేవరుప్పుల మండలం ధర్మాపురం గ్రామ పరిధిలోని వానకొండయ్య లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉన్న దేవుని గుట్టపై అక్రమంగా సాగుతున్న బ్లాక్ గ్రానైట్ క్వారీ లీజును రద్దు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీ అనుమతి లేకు ండా, నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన రెవెన్యూ ఎన్ఓసీని రద్దు చేస్తూ, లీజును రద్దు చేయాలని మైనింగ్ శాఖకు సిఫార్సు చేశారు. అసలేం జరిగింది.. 2018లో మెస్సర్స్ రోహిత్పాల్ మినరల్స్కు ధర్మాపురం సర్వే నంబర్ 37లో 6 హెక్టార్లలో బ్లాక్ గ్రానైట్ క్వారీకి లీజు మంజూరైంది. ఆలయం, హరితహారం మొక్కల రక్షణ కోసం 1.15 హెక్టార్లు తొలగించి 4.85 హెక్టార్లకు 2022లో 20 ఏళ్ల లీజు అమల్లోకి వచ్చింది. అయితే పనులు మొదలు కాగానే ధర్మాపురం, కడవెండి, లకావత్ తండా గ్రామాల ప్రజలు, సర్పంచులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజల ఫిర్యాదులివే.. క్వారీకి ధర్మాపురం గ్రామ పంచాయతీ ఎలాంటి తీర్మానం, అనుమతి ఇవ్వలేదని పలువురు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఇచ్చిన రెవెన్యూ ఎన్ఓసీకి సంబంధించి నోట్ ఫైల్, కరెంట్ ఫైల్ ఆఫీసులోనే లేవని విచారణలో తేల్చారు. ప్రాచీన వానకొండయ్య లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి, పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, డంపింగ్ యార్డుకు నష్టం వాటిల్లుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. లీజుదారుడు బకాయిలు చెల్లించకపోవడంతో 2023 నుంచి క్వారీ పూర్తిగా మూతబడింది. ఇందుకు సంబంధించి ఈనెల 7వ తేదీన ఇచ్చిన ఫైనల్ ఆర్డర్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాలు జారీ చేశారు. ఎన్ఓసీ రద్దు.. గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా ఇచ్చిన తహసీల్దార్ ఎన్ఓసీని తక్షణమే రద్దు చేశారు. లీజుకు చట్టబద్ధమైన పునాది లేదని తేల్చి, క్వారీ లీజును రద్దు చేయాలని డైరెక్టర్ ఆఫ్ మైన్స్, జియాలజీకి ఫైల్ పంపాలని ఆదేశించారు. మూడు రోజుల్లో ఆర్డీఓ, తహసీల్దార్ సంయుక్తంగా పంచనామా నిర్వహించి 4.85 హెక్టార్ల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ప్రభుత్వ భూమిని అతిక్రమించకుండా, బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. 10 రోజుల్లో సర్వే నంబర్ 37 రెవెన్యూ రికార్డుల్లో లీజు ప్రస్తావన తొలగించి ప్రభుత్వ భూమిగా నమోదు చేయాలని సూచనలు చేశారు. డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ, లకావత్ తండా సర్పంచ్ జాటోత్ ఆనంద్, గ్రామస్తుల ఫిర్యాదులతో కలెక్టర్ బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 94 కింద విచారణ చేపట్టారు. అలాగే ఇటీవల క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పల్లా సుందర్ రాంరెడ్డి ఉద్యమం తీవ్రం చేయగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అన్ని పక్షాలను విచారించిన కలెక్టర్ ఈ ఉత్తర్వులు వెలువరించారు. దీంతో దేవుని గుట్టపై రెండేళ్లుగా నిలిచిపోయిన క్వారీ వివాదానికి తెరపడినట్లయింది. -
ప్రజలకు మెరుగైన సేవలందించాలి
● హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్ : పరకాల మున్సిపాలిటీలో ప్రజలకు మెరుగైన సేవలు అందేలా అధికారులు పనిచేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. పరకాల మున్సిపల్ కమిషనర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గ్రూప్–1 అధికారి పోతరాజు పవనన్కు విధుల నిర్వహణ, మున్సిపాలిటీ పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు సోమవారం కలెక్టరేట్లో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, వీధి దీపాలు, పన్నుల వసూళ్లు, మౌలిక వసతులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, అక్రమ నిర్మాణాల నియంత్రణ, అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్, ఏఈ రవీందర్, టీపీఎస్ సుమన, టీపీబీఓ సందీప్, జూనియర్ అకౌంట్స్ అధికారి అర్షద్ తదితరులు పాల్గొన్నారు. ‘నీట్’కు పకడ్బందీ ఏర్పాట్లు ఈ నెల 21న నిర్వహించనున్న నీట్–6 (యూజీ) పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ సమావేశంలో పరీక్ష ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 12 పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో నీట్ జిల్లా కో–ఆర్డినేటర్ బిక్షపతి, ఏసీపీ నరసింహారావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి గౌరీశంకర్, ఈడీఎం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. పిడుగుపాటుకు ఇల్లు దగ్ధం ● రూ.5లక్షల నష్టం చిట్యాల : పిడుగుపాటుతో ఇల్లు దగ్ధమైన సంఘటన మండలంలోని జడలపేట గ్రామ శివారు గాంధీనగర్లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గాంధీనగర్కు చెందిన రత్న సారయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి మూడ్రోజుల క్రితం అతడి పెద్ద కుమారుడు చిరంజీవి అనార్యోగంతో ఉండడంతో వరంగల్ని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి కురిసిన వర్షంతో పాటు పిడుగు పడడంతో సారయ్య ఇల్లు పూర్తిగా కాలిపోయింది. గమనించిన గ్రామస్తులు మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, దుస్తువులు, బీరువా అందులో ఉన్న ఆభరణాలు పూర్తిగా కాలిపోవడంతో సుమారు రూ.5లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు గ్రామస్తులు తెలిపారు. కాగా సారయ్యతో పాటు కుటుంబ సభ్యులు ఇంట్లో ఎవరూ లేకపోడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. సారయ్యకు భార్య మల్లమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. నిరంతరం చెలిమె నీరే.. మహాముత్తారం : ప్రభుత్వం సురక్షిత తాగునీటిని సరఫరా చేస్తున్నా కాలనీవాసులు మాత్రం చెలిమె నీటినే తాగుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని కొర్లకుంట గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీపాదకాలనీ వాసులు కొన్నేళ్లుగా గ్రామ సమీపంలోని వాగు ఒడ్డుకు ఉన్న చెలిమెకు సిమెంట్ ఓడలు ఏర్పాటు చేసి ఆ నీటినే నిరంతరం వినియోగిస్తున్నారు. ప్రస్తుత ం గ్రామంలో ఇంటింటికి సురక్షిత (మిషన్ భగీరథ) తాగునీరు సరఫరా అవుతున్నప్పటికీ కాలనీవాసులు మాత్రం ప్రత్యేకంగా చెలిమె నీటిని వినియోగించడం గమనార్హం. ఈ విషయంపై గ్రామస్తులను సాక్షి పలకరించగా తా ము సుమారు 40 సంవత్సరాల నుంచి చెలిమె నీరు తాగడం అలవాటుగా మారిందన్నారు. చెలిమె నీరు రుచిగా ఉంటుందికాలనీ వాసులకు కొన్నేళ్ల నుంచి చెలిమె నీరు తాగడం అలవాటుగా మారింది. నీరు కూడా రుచిగా, తియ్యగా ఉంటుంది. అందుచేత కాలనీవాసులు రోజు ఈ నీటినే వాడుతారు. మేము కూడా 40ఏండ్ల నుంచి చెలిమె నీళ్లనే తాగుతున్నాం. – బెల్లంకొండ మధునయ్య, శ్రీపాదకాలనీ, కొర్లకుంట -
భాషాసాంస్కృతిక శాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డికి పురస్కారం
విద్యారణ్యపురి: సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండలోని పీఎల్ఆర్ గార్డెన్లో సహృదయానుబంధ పురస్కా ర ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇందులో తెలంగాణ భాషా సాంస్కృతికశా ఖ డైరెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డికి ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఆ సంస్థ బాధ్యులు మల్యాల మనోహరరావు స్వాగతంతో గిరిజామనోహరాబా బు అధ్యక్షతన జరిగిన సభకు జస్టిస్ లింగాల నర్సింహారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడు తూ రాళ్లబండి కవితాప్రసాద్ తెలుగు సాహిత్యానికి అవధాన రంగానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ సందర్భంగా కవితాప్రసాద్ కావ్యగ్రామం గ్రంథాన్ని ఆవిష్కరించారు. టి. లక్ష్మణ్ రావు కవితాప్రసాద్ పద్యాలు పఠించారు. అనంతరం సహృదయ సంస్థ ఉపాధ్యక్షుడు ఎన్వీఎన్చారి సన్మాన పత్రం పఠించి నర్సింహారెడ్డికి ప్రదా నం చేశారు. ఈసభకు కవితాప్రసాద్ సతీమణి నాగి నీదేవి, కుమారుడు సంవరణ్, బాధ్యులు ఎన్. భా స్కర్రావు,నాగిళ్లరామశాస్త్రి, మారుపాక రాధాకృష్ణ రాజేశ్వర్రావు,అనిల్ప్రసాద్, శ్రీనివాస్,మండువ రవీందర్రావు,మడత భాస్కర్ పాల్గొన్నారు. -
వీరన్న సన్నిధిలో భక్తుల సందడి
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో ఆదివారం భక్తులతో సందడి నెలకొంది. స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలో భక్తులు బారులుదీరారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ అధికారులు సౌకర్యాలు కల్పించారు. గంజాయి రవాణాదారుడి అరెస్టు మహబూబాబాద్ రూరల్ : గంజాయి రవాణాదారుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని మహబూబాబాద్ రూరల్ సీఐ ఎన్.అంజలి అన్నారు. రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఆదివారం అరెస్టు వివరాలను ఆమె వెల్లడించారు. గత మార్చిలో గంజాయి రవాణా చేసిన నిందితుడు పాయలి క్రాంతికుమార్ కదలికలను జిల్లా కేంద్రంలోని అడ్వకేట్ కాలనీ గుర్తించి పట్టుకున్నామన్నారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించి సెల్ఫోన్ రికవరీ చేశామని తెలిపారు. గంజాయి కేసులో పట్టుబడ్డ నిందితులపై పీడీ యాక్ట్ పెడతామని, గంజాయి తాగినా, అమ్మినా, రవాణా చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో రూరల్ ఎస్సై ఫై.రాజు, హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ, శంకర్, మధుసూదన్, పీసీలు సంతోష్, విజయ్, ఈర్యా తదితరులు పాల్గొన్నారు. ఇంగ్లిష్ పరీక్షకు 46 మంది హాజరు మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో ఆదివారం జరిగిన పదో తరగతి ఇంగ్లిష్ పరీక్షకు 46 మంది విద్యార్థులు హాజరై, ఆరుగురు గైర్హాజరైనట్లు డీఈఓ సత్యనారాయణ మూర్తి తెలిపారు. సోమవారం జరగనున్న మ్యాథ్స్ పరీక్షకు విద్యార్థులు తప్పకుండా హాజరుయ్యేవిధంగా ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలన్నారు. నేటి నుంచి కేయూ దూరవిద్య పీజీ సెమిస్టర్ పరీక్షలు కేయూ క్యాంపస్: కేయూ పరిధి దూరవిద్య సీడీఓఈ/ఎస్డీఎల్సీఈ ఎంఏ, ఎంకామ్, హెచ్ఆర్ఎం, జేఎంసీ, ఎమ్మెస్సీ కోర్సుల (2023–24 బ్యాచ్) మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 8వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ తెలిపారు. ఈనెల 8, 10, 12, 15, 17, 19, 22 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆయా తేదీల్లో పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 11 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, 2,354 మంది పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. కేయూ బాటనీ విభాగం అధిపతిగా మమత కేయూ క్యాంపస్: కేయూ బాటనీ విభాగం అధిపతిగా యూనివర్సిటీ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్, కెమిస్ట్రీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ మమతను నియమిస్తూ (తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు) రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఆమె ఈనెల 6న సాయంత్రం బాధ్యతలను స్వీకరించారు. ప్రొఫెసర్ లలితాకుమారి ఇప్పటివరకు బాటనీ విభాగం అధిపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె పదవీ కాలం ముగియగా మళ్లీ విభాగం అధిపతిగా యూనివర్సిటీ అధికారులు కొనసాగించడం లేదు. దీంతో మమతను బాటనీ విభాగం అధిపతిగా నియమించారు. వారిలో ఒకరికి అవకాశం? యూనివర్సిటీలోని బాటనీ విభాగంలో ఒక్కరు రెగ్యులర్ ప్రొఫెసర్, ఐదుగురు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్నే బాటనీ విభాగం అధిపతిగా నియమిస్తారా అనేది చర్చనీయాంశమైంది. సీని యారిటీని పరిగణనలోనికి తీసుకొని విభాగం అధిపతిగా కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ను నియమించాలని వీసీ, రిజిస్ట్రార్ను కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు కోరినట్లు సమాచారం. -
స్కూల్ లైబ్రరీల బలోపేతం..
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభు త్వ ఉన్నత పాఠశాలల్లో ప్రస్తుతం విద్యార్థుల కోసం ఉన్న లైబ్రరీల్లో కొన్నింటిని బలోపేతం చేయాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ /సమగ్రశిక్ష నిర్ణయించింది. ఈ నేపథ్యంలో లైబ్రరీలు, రీడింగ్ గదులు అభివృద్ధి కోసం గ్రంథాలయ సంస్థలు,/ ప్రజాగ్రంథాలయాల ద్వారా నిధులు విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ అనుమతినిచ్చారు. ప్రతీనెల రూ.1,000 ఆర్థిక సాయం.. పత్రికలు, మ్యాగజైన్లు, జర్నళ్ల కొనుగోలు కోసం ఎంపిక చేసిన ఒక్కో హైస్కూల్కు ప్రతీనెల రూ. 1000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తారు. సంబంధిత హైస్కూల్ హెచ్ఎం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థి మండలి సభ్యులు కొనుగోలు చేయాల్సినవి నిర్ణయించుకోవాల్సింటుంది. లైబ్రరీల బలోపేతానికి రూ. 15వేలు ఎంపిక చేసిన హైస్కూల్లోని లైబ్రరీ బలోపేతానికి రూ 15,000 చొప్పున విడుదల చేయబోతున్నారు. ఈ నిధులతో లైబ్రరీ గది మరమ్మతులు, పెయింటింగ్, టేబుల్స్, కుర్చీలు, బుక్ ర్యాక్లు, ఆల్మారాలు, ఫ్యాన్లు కొనుగోలు చేస్తారు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు సమకూర్చడం కోసం వినియోగించుకోవాల్సింటుంది. ప్రతీ లైబ్రరీలో ప్రత్యేక బోర్డు ఏర్పాటుచేయాలి ప్రతీ లైబ్రరీలో ‘దిస్ లైబ్రరీ డెవలప్డ్ అండ్ మెయిన్టెయిన్డ్ విత్ ఫండింగ్ ఫ్రమ్ జిల్లా గ్రంథాలయాల సంస్థ’ అనే వాక్యంతో బోర్డును కూడా ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. ఉమ్మడివరంగల్ జిల్లాలో 44 ప్రభుత్వ, జిల్లాపరిషత్ హైస్కూళ్లను ఎంపిక చేశారు. జిల్లాల వారీగా ఎంపిక చేసిన హైస్కూళ్లు.. హనుమకొండ జిల్లాలో 15 హైస్కూళ్లు ఉన్నాయి. అందులో హనుమకొండలోని ప్రభుత్వ మర్కజీ హైస్కూల్, జులైవాడ ప్రభుత్వ హైస్కూల్, సుబేదారి ప్రభుత్వ హైస్కూల్, లష్కర్బజార్ జీహెచ్ఎస్ గర్ల్స్ హైస్కూల్, వడ్డేపల్లి జీహెచ్ఎస్, నారాయణగిరి జీహెచ్ఎస్, కాజీపేట జీహెచ్ఎస్, శాయంపేట జీహెచ్ఎస్, హనమకొండ జీహెచ్ఎస్, కాజీపేట జాగీర్ జీహెచ్ఎస్, పెద్దపెండ్యాల జెడ్పీహెచ్ఎస్, వేలేరు జెడ్పీహెచ్ఎస్, వంగపహాడ్ జెడ్పీహెచ్ఎస్, కడిపికొండ జెడ్పీహెచ్ఎస్, తరాలపెల్లి జెడ్పీహెచ్ఎస్ ఉన్నాయి. వరంగల్ జిల్లాలో పది .. కరీమాబాద్ జీహెచ్ఎస్, కృష్ణకాలనీ జీహెచ్ఎస్, రంగశాయిపేట జీహెచ్ఎస్ గర్ల్స్, దేశాయిపేట జీహెచ్ఎస్, ధర్మారం జెడ్పీహెచ్ఎస్, పర్వతగిరి జెడ్పీహెచ్ఎస్, శంభునిపేట జీహెచ్ఎస్, క్రిస్టియన్కాలనీ జీహెచ్ఎస్, శివనగర్ జీహెచ్ఎస్, మట్టెవాడ జీహెచ్ఎస్ ఉన్నాయి., మహబూబాబాద్ జిల్లాలో పది.. మహబూబాబాద్ జీహెచ్ఎస్, మహబూబాబాద్ జెడ్పీహెచ్ఎస్, పెద్దవంగర జెడ్పీహెచ్ఎస్, చిన్నగూడూరు జెడ్పీహెచ్ఎస్, మోదుల గూడెం జెడ్పీహెచ్ఎస్, ఈదుల పూసపల్లి జెడ్పీహెచ్ఎస్, మరిపెడ జెడ్పీహెచ్ఎస్, ముల్కలపల్లి జెడ్పీహెచ్ఎస్, కల్వల జెడ్పీహెచ్ఎస్, రాజోలు జెడ్పీహెచ్ఎస్ ఉన్నాయి. జనగామ జిల్లాలో ఆరు.. జనగామ జీహెచ్ఎస్, స్టేషన్ఘన్పూర్ జెడ్పీహెచ్ఎస్, బచ్చన్నపేట మండలం పడమటి కేశవాపూర్ జెడ్పీహెచ్ఎస్, పెంబర్తి జెడ్పీహెచ్ఎస్, శివునిపల్లి జెడ్పీహెచ్ఎస్, పాలకుర్తి మండలం చెన్నూరు జెడ్పీహెచ్ఎస్ ఉన్నాయి. ములుగు జిల్లాలో రెండు.. ములుగు మండలం వెంకటాపురం జెడ్పీహెచ్ఎస్, మంగపేట జెడ్పీహెచ్ఎస్ ఉన్నాయి . జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒకటి జయశంకర్భూపాలపల్లి జిల్లాలోని మహదేవపూర్ జెడ్పీహెచ్ఎస్ (గర్ల్స్) ఉన్నాయి. ప్రత్యేకంగా నిధుల కేటాయింపు ఉమ్మడి జిల్లాలో44 ఉన్నత పాఠశాలల ఎంపిక -
కాలం చెల్లిన పురుగు మందుల పట్టివేత
సంగెం: కాలం చెల్లిన పురుగు మందులు పట్టుకున్నట్లు సంగెం మండల వ్యవసాయాధికారి బి.జగదీశ్వర్ తెలిపారు. పల్లారుగూడ గ్రామంలోని మహేశ్వర ఏజెన్సీస్లో కాలం చెల్లిన పురుగుల మందులు నిల్వ చేసినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. రూ.1,38,904 విలువైన వివిధ కంపెనీలకు చెందిన 213 కాలం చెల్లిన పురుగు మందులు లభించాయని తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకుని యజమాని వేములపల్లి హరీశ్ను పోలీస్స్టేషన్కు తరలించామన్నారు. వ్యవసాయాధికారి జగదీశ్వర్ ఫిర్యాదు మేరకు కాలం చెల్లిన పురుగు మందులను సీజ్ చేసి, హరీశ్పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. -
పంట మార్పిడి తప్పనిసరి!
● రైతులకు ప్రభుత్వం సూచన ● ఎల్నినో నేపథ్యంలో యాజమాన్య పంటల ప్రణాళిక విడుదలమహబూబాబాద్ రూరల్: తెలంగాణ ప్రభుత్వం ఎల్నినో ప్రభావం నేపథ్యంలో యాజమాన్య పంటల ప్రణాళికను రూపొందించింది. సాధారణంగా ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గడం, వర్షాల రాకలో ఆలస్యం, ఉష్ణోగ్రతలు పెరగడం వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతులు పంటల ఎంపిక, విత్తనాల వినియోగం, నీటి నిర్వహణ, సాగు విధానాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తుంది. వర్షపాతం అంచనాలతో పంటల సాగు.. వర్షపాతం అంచనాలను పరిశీలించి, అధిక నీటి అవసరం ఉన్న పంటలకు బదులు తక్కువ నీటి అ వసరం ఉండే పంటలను సాగు చేయాలని అధికా రులు సూచించారు. కంది, పెసర, మినుములు, జొన్న, సజ్జ, కొర్రలు, నువ్వులు వంటి పంటలు రైతులకు అనుకూలంగా ఉంటాయని పేర్కొన్నారు. అలాగే వర్షాభావ పరిస్థితులను తట్టుకునే విత్తన రకాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. విత్తనాలు సిద్ధం చేసుకోవడం.. రైతులు వర్షాల పరిస్థితిని బట్టి దశలవారీగా విత్తనాలు సిద్ధం చేసుకోవడం, భూసార పరీక్షలు నిర్వహించడం, పొలాల్లో తేమ సంరక్షణ చర్యలు చేపట్టడం, నీటి వనరులను పొదుపుగా వినియోగించడం అవసరమని అధికారులు తెలిపారు. వర్షాలు ఆలస్యమైనా లేదా తక్కువగా కురిసినా ప్రత్యామ్నాయ పంటల సాగుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. సుస్థిరమైన దిగుబడులు సాధించాలి.. ఈ ప్రణాళిక ద్వారా రైతులు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించుకొని, పంట నష్టాలను నివారిస్తూ స్థిరమైన దిగుబడులు సాధించేందుకు అవకాశం కలుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. రైతులు తమ సమీప వ్యవసాయ అధికారులను సంప్రదించి సాంకేతిక సూచనలు పొందాలని కోరారు. స్వల్పకాలిక రకాల సాగు మేలు వర్షాలు తక్కువగాపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తున్న సందర్భంగా రైతులు స్వల్పకాలిక రకాల పంటల సాగుపై దృష్టి సారించాలి. కంది, పెసర, మినుములు, బొబ్బెర, జొన్న, సజ్జ, కొర్రలు, నువ్వులు లాంటి స్వల్పకాలిక రకాల సాగు మేలు. మూస పద్ధతిలో ఎప్పటికి ఒకేరకం కాకుండా ఆయిల్ పామ్ సాగును పెంచాలి. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. –ఎస్.విజయచంద్ర, జిల్లా వ్యవసాయ అధికారి -
ఫిట్నెస్పై కదలట్లే..!
సాక్షిప్రతినిధి, వరంగల్ : మరో వారం రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వేలాది మంది విద్యార్థులు మళ్లీ బడి బస్సులు, వ్యాన్లలో ప్రయాణించేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విద్యార్థుల ప్రాణ భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. అనేక ప్రైవేట్ పాఠశాలల బస్సులు, వ్యాన్లు ఫిట్నెస్ చేయించుకపోవడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. 33.43 శాతం బస్సులు ఇంకా సామర్థ్య పరీక్షల నిర్ధారణ (ఫిట్నెస్) సర్టిఫికెట్లు పొందలేదు. సోమవారం (జూన్ 1) నాటికి 820 బస్సులు ఫిట్నెస్కు దూరంగా ఉన్నాయి. ఫిట్నెస్ నత్తనడకపై సాక్షి కథనం.. స్కూల్ బస్సుల ఫిట్నెస్ నత్తనడకన నడుస్తోందని ‘సాక్షి’ వారం కిందటే కథనం రూపంలో అధికారులు దృష్టికి తీసుకెళ్లింది. వారిలో పెద్ద కదలిక లేకపోవడం, ఇటు స్కూల్ యాజమాన్యాలు కూడా మాములుగా తీసుకోవడంతో వారం రోజుల్లో 125 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ చేశారు. ఇంకా 693 బస్సులకు బీమా, పర్మిట్లు, కాలుష్య ధ్రువపత్రాలు సైతం నవీకరించకపోయినా అధికారులు కఠిన చర్యలకు కదలడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తనిఖీలు, చర్యలు ఇంకెప్పుడు..? హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లో వందలాది ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఎక్కువభాగం విద్యార్థుల రవాణాకు బస్సులు, వ్యాన్లు నిర్వహిస్తున్నాయి. ప్రతిరోజూ వేలాది మంది విద్యార్థులు ఈ వాహనాలపై ఆధారపడుతున్నారు. ప్రతీ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు రవాణా శాఖ, పోలీసులు, విద్యాశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలి. కానీ పాఠశాలలు తెరుచుకునే సమయం దగ్గరపడుతున్నా ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృత స్థాయిలో తనిఖీలు జరగలేదని తెలుస్తోంది. రవాణాశాఖ గణాంకాల ప్రకారం ఉమ్మడి వరంగల్లో మొత్తం 2,079 స్కూల్ బస్సులు, వ్యాన్లు ఉంటే.. శనివారం నాటికి 1,386 వాహనాలకే సామర్థ్య పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేశారు. 693 బస్సులకు ఇంకా ఫిట్నెస్ నిర్వహించలేదు. హనుమకొండ జిల్లాలో 348, వరంగల్లో 172, మహబూబాబాద్లో 43, జనగామలో 75, జేఎస్ భూపాలపల్లిలో 28, ములుగులో 27 బస్సులు ఫిట్నెస్కు దూరంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా, గతేడాది తనిఖీల్లో అరిగిపోయిన టైర్లు, పని చేయని ఎమర్జెన్సీ డోర్లు, గడువు ముగిసిన ఫైర్ ఎక్స్టింగ్విస్టర్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేకపోవడం, సీట్లకు మించి విద్యార్థులను ఎక్కించడం, జీపీఎస్ పరికరాలు పనిచేయకపోవడం, స్పీడ్ గవర్నర్లు లేకపోవడం వంటి ప్రధాన లోపాలను గుర్తించి సరిచేశారు. ఈసారి 693 బస్సులు ఇంకా ఫిట్నెస్కు దూరంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఫిట్నెస్ లేకుండా పాఠశాల బస్సులు రోడ్డెక్కితే కేసులు నమోదు చేస్తాం. ఫిట్నెస్ తోపాటు డ్రైవర్ తప్పని సరిగా లైసెన్స్ కలిగి ఉండాలి. క్లీనర్తోపాటు మిగతా నిబంధనలు కచ్చితంగా పాటించాలి. పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకోవద్దు. – నాగలక్ష్మి, ఎంవీఐ, హనుమకొండ గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువగా నడుపుతున్నారుకొన్ని పాఠశాలల నిర్వాహకులు ఫిట్నెస్ లేని బస్సులను ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో నడుపుతున్నారు. ఇక్కడ తనిఖీలు ఎక్కువ జరగవని, ఎవరూ పట్టించుకోరని నడుపుతున్నారు. పాఠశాలలు ప్రారంభం కాగానే అధికారులు తనిఖీలు నిర్వహించాలి. – నద్దునూరి నాగరాజు, పేరెంట్ సీరియస్గా తీసుకోని స్కూళ్ల యాజమాన్యాలు, అధికారులు ఉమ్మడి జిల్లాలో 2,079 స్కూల్ బస్సులకు 1,386కే సామర్థ్య పరీక్షలు వారంలో 125 బస్సులకే ఫిట్నెస్.. ఇంకా ఫిట్నెస్ లేనివి 33.43 శాతం వారంలో తెరుచుకోనున్న స్కూళ్లు.. తనిఖీలు, చర్యలపై మీనమేషాలుఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇలా... స్కూల్ బస్సులు : 2,079 ఫిట్నెస్ చేసినవి : 1,386 చేయించుకోనివి : 693 -
నేను గీసిన బొమ్మ
భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామానికి చెందిన యూకేజీ విద్యార్థిని గూడూరి దాక్షిణ్యారెడ్డి గీసిన చిత్రం జేఎస్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలకేంద్రానికి చెందిన మార్క ప్రీతిమేఘన గీసిన చిత్రాలువేసవి సెలవుల్లో బాలబాలికలు ఖాళీగా ఉండకుండా పలు క్రీడలు, కళలు నేర్చుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా బొమ్మలు గీయడంపై ఆసక్తి కనబర్చుతున్నారు. వివిధ రకాల చిత్రాలు గీస్తూ అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. అందరితో ప్రశంసలు అందుకుంటున్నారు.భానుశ్రీటీ కప్పులతో కట్టేస్తా.. ఆడేస్తా సెల్ ఫోన్కు దూరంగా ఉంటూ కాగితపు టీ కప్పులను ఆటకు పరికరంగా మార్చేస్తున్నాడు పరకాలకు చెందిన 3వ తరగతి విద్యార్థి పోల్నా టి మణితేజ. టీ కప్పులను ఎవరు ఎత్తుగా పేర్చితే వారే విజేతగా నిలిచేలా స్నేహితులు, తన చెల్లితో టీ కప్ గేమ్ ఆడుతున్నాడు. పోటీలో ఉన్నవారు కొంత దూరంలో ఉండి ఊదుతూ ఉండగా వీటిని పేర్చడం మరింత జోష్ నింపుతోంది. –పరకాలగురువు సహాయం లింగాలఘణపురం : జనగామ పట్టణానికి దగ్గరగా పెంబర్తి అనే గ్రామంలో రామయ్య, లక్ష్మమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి ఒక కూతురు. ఆమె పేరు వరలక్ష్మి. చక్కని లక్షణాలు కలిగిన అమ్మాయి. కానీ ఆమె తల్లిదండ్రులు ఎప్పుడు గొడవ పడుతుండేవారు. అది చూసి ఆమె ఎంతో బాధపడేది. కొద్ది రోజుల తర్వాత కుటుంబ గొడవలతో లక్ష్మమ్మ పుట్టింటికి వెళ్లిపోయింది. రామయ్య కూడా తన సంతోషం, సరదాల కోసం ఎక్కడికో వెళ్లిపోయాడు. పాపం వాళ్ల నానమ్మ వరలక్ష్మిని పెంచి పోషించింది. చదివించే స్తోమత లేక ఎప్పుడు బాధపడేది. ఒక రోజు బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు వరలక్ష్మి ఇంటికి వచ్చి పాపను బడిలో చేర్పిండి అని అడిగారు. వాళ్ల నానమ్మ చదివించే స్తోమత లేదని చెబుతుంది. అప్పుడు ఉపాధ్యాయులు ఇలా అన్నారు. మాది ప్రభుత్వ బడి. మేము ఉచితంగా చదువు చెబుతాము. పుస్తకాలు, రెండు జతల దుస్తులు ఇస్తాము. అంతేకాకుండా మధ్యాహ్న భోజనం కూడా పెడుతామని చెప్పారు. ఆ ఊరు చిన్నది కావడం వల్ల ఐదో తరగతి వరకే ఉంది. పై చదువుల కోసం ఒక ఉపాధ్యాయురాలిని సహాయం అడుగుతుంది. అప్పుడు ఆ ఉపాధ్యాయురాలు గురుకుల పాఠశాల గురించి వివరించి పరీక్ష రాయించింది. అప్పుడు వరలక్ష్మి హాస్టల్లో ఉంటూ ఉన్నత చదువు కొనసాగించింది. వరలక్ష్మి సాధించిన విజయాల గురించి పత్రికలు, టీవీల్లో ప్రసారం చేశారు. వరలక్ష్మి గొప్పతనాన్ని తెలుసుకున్న రామయ్య, లక్ష్మమ్మ తమ తప్పు తెలుసుకొని తమ దగ్గరికి తెచ్చుకొని కలిసి మెలిసి ఉంటారు. వరలక్ష్మి ప్రభుత్వ ఉద్యోగం సాధించి అమ్మానాన్నలను సంతోష పెడుతుంది. తన జీవితానికి బాటలు వేసిన ఉపాధ్యాయులను వరలక్ష్మి ఉపాధ్యాయ దినోత్సవం రోజు ఘనంగా సత్కరించింది. పిల్లలతో వ్యాయామంబయ్యారం: వేసవి సెలవుల్లో ఇంటి వద్ద ఉంటున్న పిల్లలతో ఓ ఉపాధ్యాయుడు వ్యాయా మం చేయిస్తూ శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యా రం మండలం సింగారం గ్రామానికి చెందిన జి.మోహన్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సెలవుల్లో ఇంటి వద్ద ఉంటున్న మోహన్ తమ గ్రామంలోని పిల్లలను ఉదయం వేళ ఒక చోటకు చేర్చి వ్యాయామంతో పాటు ఆటలు నేర్పిస్తున్నారు.ఎం. అంజన, 6వ తరగతి, మోడల్ స్కూల్, లింగాలఘణపురంవిద్యార్థిని చెప్పిన కథ -
బండ బాదుడు
సోమవారం శ్రీ 8 శ్రీ జూన్ శ్రీ 2026● మార్చిలో రూ.60, ప్రస్తుతం రూ.29 పెరుగుదల ● పేదలపై ఆర్థికభారం ● వినియోగదారులకు ఓటీపీ కష్టాలుమహబూబాబాద్/మరిపెడ రూరల్: కేంద్ర ప్రభుత్వం మూడు నెలల్లో రెండుసార్లు వంటగ్యాస్ సిలిండర్ ధర పెంచింది. మార్చిలో రూ.60, ప్రస్తుతం రూ.29 పెంచడంతో పేదలపై ఆర్థికభారం పడుతుంది. గ్యాస్తో పాటు నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 2,11,531 కనెక్షన్లు.. జిల్లాలో హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ(హెచ్పీసీఎల్), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓ సీఎల్), భారత్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ (బీఓసీఎల్)కి చెందిన 2,11,531 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. కాగా, ఈ ఏడాది మార్చి 7న గ్యాస్ సిలిండర్ ధర రూ.60 పెంచింది. అప్పటి వరకు రూ.924 ఉన్న సిలిండర్ ధర రూ.984కి చేరింది. కాగా ప్రస్తుతం సిలిండర్ ధర రూ.29పెంచింది. మొత్తంగా సిలిండర్ ధర రూ.1,013కి చేరింది. అందని సబ్సిడీ.. చాలామంది వినియోగదారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సబ్సిడీ రావడం లేదు. దీంతో ప్రతీరోజు వినియోగదారులు డీలర్ కార్యాలయాలు, బ్యాంక్లు, డీసీఎస్ఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సంబంధిత అన్ని పత్రాలు సమర్పించినప్పటికీ సబ్సిడీ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని గ్యాస్ ధరలు తగ్గించాలని వినియోగదారులు కోరుతున్నారు. ఓటీపీ కష్టాలు.. ఓటీపీ ఉంటేనే గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తున్నారు. గ్యాస్ కనెక్షన్కు వినియోగదారుడి సెల్ఫోన్ నంబర్ అనుసంధానం చేయాలి. గ్యాస్ బుక్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. దానిని డెలివరీ బాయ్కు చెబితేనే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. దీంతో సెల్ఫోన్, గ్యాస్ పుస్తకంతో వినియోగదారుడు గ్యాస్ ఆఫీస్కు వెళ్లి అనుసంధానం చేసుకోవాల్సి వస్తోంది. దీంతో పాటు ఈ–కేవైసీ తప్పనిసరి అయింది. దానికోసం కార్యాలయం వెళ్లి ఐరిస్ స్కాన్ చేసుకోవాలి. ఆధార్ అప్డేట్ చేసుకోవాలి. లేకుంటే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరగదని, ప్రధానంగా సబ్సిడీ రాదని చెబుతున్నారు. మోయలేని భారం..నిత్యావసర సరుకులు, గ్యాస్ ధరలు వరుసగా పెంచుతూ సామాన్యుడిపై మోయలేని భారం మోపుతున్నారు. పెంచిన ధరలు తగ్గించి పేద ప్రజలకు అందుబాటులో ఉంచాలి. లేదంటే పేద, మధ్యతరగతి ప్రజలు మళ్లీ కట్టెల పొయ్యిల వైపు చూడాల్సి వస్తుంది. – బాణాల రాజన్న, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు, మరిపెడ మూడు నెలల్లో రెండుసార్లు వంటగ్యాస్ ధర పెంపు దీపం పథకం 34,314ప్రధానమంత్రి ఉజ్వల పథకం32,379 సీఎస్ఆర్ (హాస్టళ్లు) 8,659మొత్తం కనెక్షన్లు 75,352వామ్మో.. జూన్! కంపెనీ డీలర్ కేంద్రం కనెక్షన్లు హెచ్పీసీఎల్ మానుకోట 36,839 కురవి 21,055 బయ్యారం 6,304 గూడూరు 1,90 ఐఓసీఎల్ మానుకోట 2,863 డోర్నకల్ 6,226 మరిపెడ 14,957 నెల్లికుదురు 3,657 కేసముద్రం 1,540 బీఓసీఎల్ గార్ల 2,240 నర్సింహులపేట 8,845 తొర్రూరు 30,563 మొత్తం 1,36,179 -
టెండర్ విధానం రద్దు చేయాలి
హన్మకొండ: చేనేత వస్త్రాల కొనుగోలులో ఓపెన్ టెండర్ విధానం, ఓపెన్ మార్కెట్ విధానం రద్దుచేసి పాత పద్ధతినే కొనసాగించాలని బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ తిరునహరి శేషు కోరారు. జీఓ 1తో చేనేత సహకార సంఘాల నుంచి ఆర్డర్ల ద్వారా ప్రభుత్వ విద్యా సంస్థలు, హాస్టళ్లు, గురుకులాలు, సొసైటీల కోసం చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్కు లేఖ రాశారు. చేనేత కార్మికులు, పవర్ లూం కార్మికులను ఆదుకోవడానికి 2024లో ప్రభుత్వం జీఓ 1ని జారీచేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత వస్త్రాలను టెస్కో ద్వారా కాకుండా ఓపెన్ టెండర్ విధానంలో కొనాలని భావించడంతో దాదాపు 50 వేల మంది చేనేత కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చేనేత వస్త్రాల కొనుగోలు విషయంలో పాత పద్ధతినే కొనసాగించాలన్నారు. విద్యాశాఖ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్రెడ్డి ఈ దిశగా ప్రత్యేక దృష్టి సారించాలని, నిర్ణయాన్ని పునఃపరిశీలన చేయాని విజ్ఞప్తి చేశారు. ప్రజావేదిక రాష్ట్ర చైర్మన్ తిరునహరి శేషు -
ఆర్థిక ఇబ్బందులతో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
● వెన్నారంలో ఘటన డోర్నకల్ : ఆర్థిక ఇబ్బందులతో ఓ రైల్వే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం డోర్నకల్ మండలం వెన్నారంలో చోటు చేసుకుంది. ఎస్సై ఝాన్సీ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బోయినపల్లి ఆంజనేయులు(35) గార్ల రైల్వే స్టేషన్ పరిధిలో గ్యాగ్మెన్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. పలు కారణాలతో అప్పులపాలైన ఆంజనేయులు కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత తన భార్య రాశికి ఫోన్ చేసి ‘ఐ లవ్ యూ రాశి’ అని చెప్పి ఏడుస్తూ ఫోన్ కట్ చేశాడు. దీనిపై అప్రమత్తమైన రాశి విషయాన్ని కుటుంబీకులకు చెప్పగా గ్రామ శివారులో ఆంజనేయులు ఆచూకీ కోసం వెతికారు. రాత్రి 12:40 గంటల సమయంలో మోదుగుచెట్టుకు ఉరేసుకుని కనిపించగా స్థానికులు పరిశీలించడంతో అప్పటికే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి భార్య రాశి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఝాన్సీ తెలిపారు. తీగరాజుపల్లిలో వ్యక్తి ..సంగెం: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని తీగరాజుపల్లిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మహమ్మద్ మహబూబ్ అలీ(55), రజియా దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సర్దార్పాషా ఉన్నారు. అందరికీ పెళ్లి చేశారు. మహబూబ్ అలీ దంపతులు కొడుకు కోడలితో కలిసి ఉంటున్నారు. కొంతకాలంగా మద్యానికి అలవాటు పడి ఏ పనిచేయకుండా ఇంటివద్దనే ఉంటున్నాడు. ఈ నెల 5న బంధువుల పెళ్లికి భార్య రజియా వెళ్లగా మరో గదిలో ఉన్న మహబూబ్ అలీ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం రాత్రి గమనించిన కోడలు రుక్సానా పక్కనే ఉన్న యాకూబ్ పాషాకు చెప్పింది. స్థానికులతో కలిసి చూసేసరికి మృతి చెందాడు. మృతుడి భార్య రజియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. -
వ్యతిరేక విధానాలతోనే సింగరేణికి నష్టాలు
భూపాలపల్లి అర్బన్: కార్మిక వ్యతిరేక విధానాలు, గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాల వైఫల్యంతోనే సింగరేణి సంస్థ నష్టాలబాట పట్టిందని బీఎంఎస్ జాతీయ బొగ్గు పరిశ్రమల ఇన్చార్జ్ కొత్తకాపు లక్ష్మారెడ్డి విమర్శించారు. భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి కమ్యూనిటీహాల్లో ఆదివారం సింగరేణి కోల్మైన్స్ కార్మిక సంఘం 29వ ద్వైవార్షిక మహాసభలు నిర్వహించారు. తెలంగాణలోని 12 డివిజన్లకు చెందిన సుమారు 500 మంది ప్రతినిధులు హాజరైన ఈ మహాసభలో లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతినిథ్యం సంఘం ఐఎన్టీయూసీ పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. కార్మిక సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి చూపకుండా యాజమాన్యం, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. మూడు సంవత్సరాలుగా కార్మిక సమస్యల పరిష్కారానికి సంఘాలు చర్యలు తీసుకోలేదని, సమ్మె పేరుతో కార్మికులను తప్పుదోవ పట్టించాయని ఆయన మండిపడ్డారు. కార్మిక హక్కుల సాధన, వేతనాల అమలు, కనీస పెన్షన్ వంటి అంశాలపై బీఎంఎస్ జాతీయస్థాయిలో పోరాటం కొనసాగిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి రూ.51,149 కోట్ల విద్యుత్ బొగ్గు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 12వ వేజ్ బోర్డు అమలుకు సంబంధించి కోల్ ఇండియా యాజమాన్యం వెంటనే కమిటీ ఏర్పాటు చేసి నోటిఫికేషన్ జారీ చేయాలని కోరారు. మహాసభలో జాతీయ నాయకులు మాధవ్నాయక్, యాదగిరి సత్తయ్య, సారంగపాణి, వర్షా ఉడికే, భూపాలపల్లి బ్రాంచ్ నాయకులు వెలబోయిన సుజేందర్, ఆర్ నర్సింగ్రావు, అల్లం శ్రీనివాస్, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు. బీఎంఎస్ జాతీయ బొగ్గు పరిశ్రమల ఇన్చార్జ్ కొత్తకాపు లక్ష్మారెడ్డి భూపాలపల్లిలో సింగరేణి కోల్మైన్స్ కార్మిక సంఘం మహాసభలు -
హేమాచల క్షేత్రంలో కోలాహలం
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు హేమాచల క్షేత్రంలోని లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. సెలవురోజు కావడంతో రాష్ట్రంలోని వరంగల్, హైదరాబాద్, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్ తదితర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, రాజమండ్రి, గుంటూరు నుంచి భక్తులు భారీ సంఖ్యలో వివిధ వాహనాల్లో ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్నారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తి శ్రద్ధలతో స్వయంభు స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. -
ఆర్టీసీలో బదిలీలు
హన్మకొండ: ఆర్టీసీ వరంగల్ రీజియన్లో డిప్యూటీ రీజినల్ మేనేజర్తోపాటు పలువురు డిపో మేనేజర్లు బదిలీ అయ్యారు. వరంగల్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ (మెకానికల్) గా పని చేస్తున్న పి.మహేశ్ను సికింద్రాబాద్ రీజియన్ డిప్యూటీ ఆర్ఎం (ఆపరేషన్స్) గా బదిలీ చేస్తూ ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ రీజియన్ పరిధిలోని భూపాలపల్లి డిపో మేనేజర్గా పనిచేస్తున్న ఆమంచ ఇందు ఏటీఎంగా బస్ భవన్కు, యాదగిరిగుట్ట డిపో మేనేజర్ సీహెచ్ మురళీకృష్ణను భూపాలపల్లి డీఎంగా నియమించారు. జనగామ డిపో మేనేజర్ ఎస్.స్వాతిని చెంగిచెర్ల డిపోకు, షాద్నగర్ డిపో మేనేజర్గా పనిచేస్తున్న ఎం.ఉషను జనగామ డిపో మేనేజర్గా నియమించారు. నర్సంపేట డిపో మేనేజర్ కె.ప్రసూనలక్ష్మిని తొర్రూరు డిపో మేనేజర్గా, మెట్పల్లి డిపో మేనేజర్ ఎం.సరస్వతిని నర్సంపేట డిపో మేనేజర్గా నియమించారు. తొర్రూరు డిపో మేనేజర్ వి.పద్మావతిని హైదరాబాద్ తార్నాక హాస్పిటల్ పీఓగా బదిలీ చేశారు. పరకాల డిపో మేనేజర్ జి.రాంప్రసాద్ను మియాపూర్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ అసిస్టెంట్ వర్క్స్ మేనేజర్గా, మంచిర్యాల డిపో మేనేజర్ టి.శ్రీనివాసులును పరకాల డిపో మేనేజర్గా నియమించారు. వరంగల్ బస్స్టేషన్ ఏటీఎంగా పనిచేస్తున్న మల్లేశయ్యను కొల్లాపూర్ డిపో మేనేజర్గా బదిలీ చేశారు. ఆడుకుంటూ వెళ్లి అనంతలోకాలకు.. ● సంపులో పడి బాలుడి మృతి ● నర్మెటలో ఘటన నర్మెట: ఓ బాలుడు ఆడుకుంటూ వెళ్లి అనంతలోకాలకు చేరాడు. నీటి సంపులో పడి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జనగామ జిల్లా నర్మెటలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన రొయ్యల సరిత, వెంకటేష్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు రుత్విక్ (4) ఉన్నారు. ఈ క్రమంలో ఆ బాలుడు సాయంత్రం ఆడుకుంటూ వెళ్లి ఇంటి ఆవరణలోని నీటి తొట్టి (సంపు) పడిపోయాడు. శబ్దం విన్న కుటుంబీకులు బాలుడిని తొట్టి నుంచి తీసి 108లో జనగామ మాతా శిశు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. -
మేడారంలో భక్తుల రద్దీ
ఎస్ఎస్తాడ్వాయి: మండల పరిధిలోని మేడారంలో వనదేవతల ప్రాంగణంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వేలాదిమంది భక్తులు మేడారానికి తరలివచ్చి సమ్మక్క–సారలమ్మను దర్శించుకున్నారు. తల్లులకు మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే గద్దెల వద్ద భక్తుల రాకపోకలు పెరగడంతో ఆలయ పరిసరాలు భక్తజన సందోహంతో కళకళలాడాయి. భక్తులు కొబ్బరికాయలు కొట్టి, పసుపు, కుంకుమ, కానుకలు, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దేవాదాయశాఖ అధికారులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అమ్మవార్ల గద్దెల వద్ద దొంగలు చేతివాటం ప్రదర్శించారు. భక్తుల రద్దీని అసరాగా చేసుకుని భక్తుల జేబుల్లోని సుమారుగా రూ. 25వేల నగదు కాజేసినట్లు బాధితులు తెలిపారు. ఈవిషయంపై బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. -
సెల్ఫోన్ కొనివ్వలేదని యువతి ఆత్మహత్య
గూడూరు: సెల్ఫోన్ కొనివ్వలేదని క్షణికా వేశంలో ఓ యువతి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మట్టెవాడలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన బొడ్డు రాములు–కరుణశ్రీ దంపతులకు కూతురు బిందు (22), ఇద్దరు కుమారులు న్నారు. కూతురు పీజీ చదివి ఇంటి వద్దనే ఉంటోంది. శనివారం రాత్రి సెల్ఫోన్ కొనివ్వాలని బిందు తండ్రిని అడగడంతో డబ్బులు లేవన్నాడు. దీంతో క్షణికావేశానికి గురైన ఆమె రాత్రి బయటికి వెళ్లింది. రాత్రి నుంచి కుటుంబ సభ్యులు, బంధువులు గాలించారు. ఇంటి సమీపంలోని వ్యవసాయ బావిలో శవమై కనిపించింది. తండ్రి బొడ్డు రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గిరిధర్రెడ్డి తెలిపారు. -
మైనింగ్ శాఖలో కలకలం
మహబూబాబాద్ అర్బన్: మానుకోట జిల్లా కేంద్రంలోని జిల్లా మైనింగ్ శాఖ కార్యాలయంలో సీఐడీ బృందం శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విస్తృత తనిఖీలు నిర్వహించింది. ఆశాఖలో కీలక రికార్డులు, ఫైళ్లు పరిశీలించారు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ వ్యవహారంపై ప్రభుత్వం దూకుడు పెంచింది. ఈనేపథ్యంలో రాష్ట్రంలో పలు జిల్లాలతోపాటు మానుకోట జిల్లా మైనింగ్ శాఖలో కూడా సీఐడీ బృందం తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా మానుకోట జిల్లాలో 45 క్వారీలు ఉండగా.. అందులో 6 క్వారీలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు వచ్చిన ఆరోపణలు మేరకు సీఐడీ అధికారుల బృందం తనిఖీలు చేసింది. క్వారీల లీజులు, రాయల్టీ చెల్లింపులు, అనుమతుల్లేని క్వారీలు ఇలా.. పలు కోణాల్లో విచారణ జరిపారు. ఇనుగుర్తి, గూడూరు, కేసముద్రం, అదే మండలంలోని అర్పనపల్లిలో ఉన్న క్వారీలను సీఐడీ బృందం తనిఖీలు నిర్వహించింది. అదేవిధంగా.. కార్యాలయంలో కీలక అధికారులు ఫైళ్లను, కంప్యూటర్లలో ఉన్న సమాచారాన్ని అధికారులు సేకరించారు. ఉదయం నుంచి సోదాలు పలు క్వారీల్లో తనిఖీ -
సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్
● మంత్రి సీతక్క గంగారం: ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే ప్రజాదర్బార్ను ఏర్పాటు చేస్తున్నట్లు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అసనూయ సీతక్క అన్నారు. గంగారం మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్ను మంత్రి సీతక్క ప్రారంభించారు. తొలుత ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గంగారం మండలంలోని అన్ని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రజాదర్బార్ ద్వారా పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మహబూబాద్ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని మంత్రి సీతక్క అన్నారు. గంగారం మండలంలో ప్రజాదర్బార్లో భాగంగా మంత్రి సీతక్క, మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆధ్వర్యంలో పలువురు తల్లిదండ్రులకు అడ్మిషన్ ఫారాలను అందించారు. కార్యక్రమంలో డీఈఓ సత్యనారాయణమూర్తి, ఎంఈఓ రమాదేవి, ఏఎస్సీ సంతోశ్ ప్రధానోపాధ్యాయులు ఆదినారాయణ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గంగారం మండలంలోని పుల్సంవారిగుంపు, మర్రిగూడెం, గ్రామాల్లో నిర్వహించి బడిబాట కార్యక్రమానికి డీఈఓ సత్యనారాయమూర్తి హాజరై అవగాహన కల్పించారు. -
హాకీ.. వసతులు హుష్కాకి!
వరంగల్ స్పోర్ట్స్: హాకీ క్రీడకు వరంగల్ మహానగరంలో ఆదరణ కరువైంది. తమ ప్రభుత్వం క్రీడాభివృద్ధికి పెద్ద పీట వేస్తోందన్న పాలకుల మాటలు ఆచరణలో శూన్యంగానే మిగులుతున్నాయి. హైదరాద్ తర్వాత అతి పెద్ద నగరమైన వరంగల్లో హాకీ క్రీడా మైదానం లేకపోవడం బాధాకరం. హాకీ నేర్చుకోవాలన్న ఆకాంక్ష ఉన్నప్పటికీ అందుకు తగిన కనీస సదుపాయాలు లేకపోవడంతో చిన్నారులు క్రీడను మధ్యలోనే వదిలేయాల్సిన దుస్థితి. వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో భాగంగా హనుమకొండలోని నయీంనగర్లో హనుమకొండ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో హాకీ క్రీడా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఉన్న కొద్దిపాటి వసతులను ఉపయోగించుకుంటూ చిన్నారులకు శిక్షణ అందిస్తున్నారు. ఈనేపథ్యంలో నయీంనగర్ హాకీ క్లబ్పై ప్రత్యేక కథనం. 40 ఏళ్ల చరిత్ర.. సుమారు 40 ఏళ్ల క్రితం స్థానిక హాకీ క్రీడాకారులు ములకల నర్సయ్య, గొడిశాల ఈశ్వరయ్య మొదటిసారిగా నయీంనగర్లో హాకీ ఫీల్డ్ కోర్టుకు శ్రీకారం చుట్టారు. మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన సుమారు అర ఎకరం స్థలంలో ఏర్పాటైన హాకీ ఫీల్డ్ గ్రౌండ్ కొన్నేళ్ల తర్వాత హాకీ క్లబ్గా రూపుదిద్దుకుంది. ఇద్దరు వ్యక్తులతో ఏర్పాటైన నయీంనగర్ హాకీ క్లబ్ అధ్యక్షుడిగా ప్రస్తుత వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కొనసాగాడు. సుమారు పదేళ్ల క్రితం పోలీస్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో క్లబ్ అధ్యక్షుడిగా ఉండడం విశేషం. ఎమ్మెల్యే నాగరాజు జాతీయ స్థాయి హాకీ క్రీడాకారుడు, అంతేకాదు ఆయన హాకీ క్రీడా కోటలోనే పోలీస్ ఉద్యోగం సాధించినట్లు అనేక సందర్భాల్లో తెలిపారు. ఆయన సోదరుడు కృష్ణమూర్తి సైతం హాకీ క్రీడాకారుడు కావడం విశేషం. కనీస వసతులు కరువు? ప్రస్తుతం నయీంనగర్లో గ్రావెల్ కోర్టులోనే క్రీడాకారులు సాధన చేస్తున్నారు. జాతీయ, అంతర్జాతీ య స్థాయిలో రాణించాలంటే సుమారు మూడెకరాల స్థలం అవసరం. అందులో ఆస్ట్రో టర్ఫ్ కోర్టు ఏర్పాటుతో పాటు ఆధునిక హాకీ కిట్లు అవసరం ఉంటుంది. అయితే నయీంనగర్ హాకీ క్లబ్లో గ్రావెల్ కోర్టులో కనీస సదుపాయాలు లేకుండా క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు. ఒక్కో జట్టులో 11 మంది చొప్పున 70 నిమిషాల పాటు కొనసాగే హాకీ మ్యాచ్లో రాణించాలంటే సదుపాయాలు ఆ స్థాయిలో ఉండాల్సిందే. లేదంటే ఎన్నిరోజులు సాధన చేసిన కాలక్షేపమే తప్పితే ఫలితాలు ఉండవు. ఉమ్మడి వరంగల్ జిల్లానుంచి పలువురు జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నత స్థానాల్లో ఉన్నా పట్టింపు కరువు నయీంనగర్ హాకీ క్లబ్లో హాకీ సందడి ఆడుకోవాలని ఉన్నా సదుపాయాలు కరువు -
ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా సీపీఐ
● పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నెహ్రూసెంటర్: రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా సీపీఐ మారనుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా, రైతాంగ, విద్యార్థి, మహిళాళ, ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ అధిక ధరల పెంపుపై ఈ నెల 10న జిల్లా కేంద్రాల్లో భారీ ఆందోళనలు, ఆగస్టు 6వ తేదీ నుంచి 14 వరకు రాష్ట్రంలోని 49 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి బి.విజయసారధి, సహాయ కార్యదర్శులు బి.అజయ్సారధిరెడ్డి, నల్లు సుధాకర్రెడ్డి, రాష్ట్ర సమితి సభ్యులు కట్టెబోయిన శ్రీనివాస్, ఖమ్మం జిల్లా కార్యదర్శి జితేందర్రెడ్డి, రేషపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు. పార్టీలో చేరిన సీపీఎం నాయకులు.. జిల్లాలోని గార్ల మండలానికి చెందిన సీపీఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సమక్షంలో సీపీఐలో చేరారు. పార్టీలో చేరిన నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో భూక్య హరినాయక్, మెదరమెట్ల గిరిప్రసాద్, అన్నం శ్రీనివాస్, పూల్సింగ్, దారావత్ లక్ష్మీ, భూక్య పద్మ, మంగీలాల్, శ్రీను, సోమ్లానాయక్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో పెరుగు కుమార్, చింతకుంట్ల వెంకన్న, వరిపెల్లి వెంకన్న, జంపాల శ్రీనివాస్, నర్ర శ్రావణ్, మాగం లోకేష్ తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమానికి చేరువ!
జిల్లాలో 40,782 కొత్త రేషన్ కార్డులు మంజూరు● ప్రభుత్వ పథకాలకు ఈ కార్డే ప్రామాణికం ● ప్రతీ నెల 5,240 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా మహబూబాబాద్: జిల్లాలో అర్హులైన పేదలు దరఖాస్తు చేసుకున్న తర్వాత అతి తక్కువ సమయంలోనే సంబంధిత అధికారులు రేషన్కార్డులు మంజూరు చేస్తున్నారు. కొన్నేళ్ల పాటు కొత్త రేషన్కార్డుల మంజూరు జరగలేదు. గత 17 నెలల నుంచి ప్రభుత్వం కొత్త రేషన్కార్డులు మంజూరు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. దీంతో అర్హులైన వారు దరఖాస్తు చేసుకుని కార్డు పొంది రేషన్ బియ్యం ఇతరత్రా లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వ పథకాలైన ఆరోగ్యశ్రీ, గృహలక్ష్మి, ఆదాయ సర్టిఫికెట్, ఇతరత్రా ప్రయోజనాలు పొందడానికి రేషన్ కార్డే ప్రామాణికం కావడంతో పేద, మధ్యతరగతి కష్టాలు తొలగిపోనున్నాయి. గతంలో 2,40,359 కార్డులు మాత్రమే.. జిల్లాలోని 18 మండలాల్లో 558 రేషన్ షాపులు ఉన్నాయి. కాగా, 2024 డిసెంబర్ వరకు రేషన్ కార్డులు 2,40,359 ఉన్నాయి. ఆ కార్డుల ప్రకారం.. ప్రతీ నెల 4,517 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించి రేషన్ షాపులకు సరఫరా చేశారు. ప్రతీ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు బియ్యాన్ని డీలర్లు పంపిణీ చేస్తున్నారు బయోమెట్రిక్, ఐరిష్, ఓటీపీ విధానాలతో లబ్ధిదారులకు రేషన్ పంపిణీ జరుగుతోంది. పేదల్లో ఆనందం.. కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పేదల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. 2025 జనవరి మాసం నుంచి ప్రభుత్వం కొత్త రేషన్కార్డుల మంజూరుకు శ్రీకారం చుట్టింది. దీంతో 40,782 కొత్త కార్డులు వాటిలో 1,24,217 మంది లబ్ధిదారులు ఉన్నారు. వారందరి కార్డుల మంజూరు పూర్తి చేశారు. పాత కార్డుల్లోని 49,858 కార్డుల్లో కొత్తగా 72,235 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. పాతవి, కొత్త కార్డులు కలిపితే జిల్లాలో 18 మండలాలు ఉండగా.. ఈ శాఖ పరంగా 16 మండలాలు (పాత మండలాల లెక్క ప్రకారం) వాటి పరిధిలో 558 రేషన్ షాపులు ఉండగా.. అందులో ఏఎఫ్ఎస్సీ కార్డులు 16,812, ఎఫ్ఎస్సీ కార్డులు 2,60,854 కార్డులు అన్నపూర్ణ కార్డులు 2 మొత్తం 2,77,668 కార్డులు ఉన్నాయి. అందుకుగాను ప్రతీ నెల 5,240 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయించారు. లబ్ధి పొందాలంటే కార్డు ఉండాల్సిందే.. ఇందిరమ్మ ఇళ్లు, ఆసరా పింఛన్లు ఇతరత్రా పథకాలకు రేషన్ కార్డే కీలకం. వాటితో పాటు ఆరోగ్య శ్రీ, ఆదాయం సర్టిఫికెట్ ఇతరత్రా వాటికి కార్డు కీలకం. మీసేవ కేంద్రాల్లో రేషన్కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న అనంతరం.. తహసీల్దార్ లాగిన్కు వెళ్తుంది. ఆతర్వాత జీపీఓలు విచారణ చేసి నివేదిక ఇస్తారు. అనంతరం ఆర్ఐలు మరోసారి పరిశీలిస్తారు. తహసీల్దార్ చూసి ఆమోదించిన తర్వాత డీసీఎస్ఓ లాగిన్కు వెళ్తుంది. డీసీఎస్ఓ లాగిన్లో కార్డు ఆమోదిస్తున్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు..అర్హులైన పేదలందరికీ రేషన్కార్డులు మంజూరు చేస్తున్నాం. జిల్లాలో ఇప్పటివరకు 40,782 కొత్త కార్డులు జారీ చేశాం. ఇది నిరంతర ప్రక్రియ. అర్హులు దరఖాస్తు చేసుకుంటే పౌర సరఫరాల శాఖ అధికారులు విచారణ చేసి కార్డులు ఇస్తారు. – రమేశ్, డీసీఎస్ఓ -
నేను చేసిన మంచిపని
దుగ్గొండి: నాపేరు దీక్షిత్. నేను దుగ్గొండి మండలం నాచినపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. నాకు మొక్కలు, జంతువులు అంటే ఇష్టం. ఈ వేసవికాలంలో పక్షులు నీరు దొరకక చనిపోతూ ఉంటాయి. అందుకని వాటికోసం నేను ప్రతీ రోజు ఓ బేషన్(ీస్టీల్ బౌల్)లో నీళ్లు పెడుతూ ఉంటాను. కొన్ని తిండి గింజలు వేస్తాను. దాంతో ఆ పక్షులు వచ్చి గింజలు తిని, నీరు తాగి ఉత్సాహంగా ఎగిరిపోతుంటే ఆనందంగా ఉంటుంది. మీరు ప్రకృతిని, పక్షులను కాపాడుతారని ఆశిస్తున్నాను. బేషన్లో పక్షులకు నీరు పెడుతున్న దీక్షిత్ -
పోరాడితేనే వేతన సవరణ
హన్మకొండ: విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ కోసం పోరాటం తప్పదని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్–327, తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ అన్నారు. హనుమకొండ వడ్డెపల్లిలోని టీఎస్ఈఈయూ–327 కార్యాలయం పల్లా రవీందర్ రెడ్డి భవన్లో శుక్రవారం కార్మిక దినోత్సవం సందర్భంగా శ్రామిక శక్తి అవార్డు అందుకున్న యూనియన్ వరంగల్ జిల్లా కార్యదర్శి మచ్చిక బుచ్చయ్య గౌడ్, ఎన్పీడీసీఎల్ కంపెనీ కార్యదర్శి కె.శ్రీనివాస్, నాయకులు పి.మాధవ రావు, శ్రీనివాస్, ఎండీ అబ్దుల్ మజీద్, పి.రమేష్, కె.వెంకటేశ్వర్ రావు, తులసీ శ్రీమతి, బి.విజయభాస్కర్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇనుగాల శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. త్వరలోనే బదిలీలు ఉంటాయన్నారు. అనంతరం టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ ఎస్ఈ ఎ.ఆనందం మాట్లాడారు. టీఎస్ ఈఈయూ–327 ఎన్పీడీసీఎల్ అధ్యక్షుడు పి.మహేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, డీఈలు మల్లికార్జున్, రాంబాబు, టీఎస్ఈఈయూ–327 రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం ఐలేష్, నాయకులు భూపాల్డ్డి, చిట్ల ఓదెలు, దొనికల సదయ్య, రవికుమార్ పాల్గొన్నారు. టీఎస్ ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీధర్ -
క్రీడాభివృద్ధికి కృషి చేయాలి..
హైదరాబాద్లో హాకీ ఫీల్డ్ గ్రౌండ్స్ మూడుకు పైగా ఉన్నాయి. రెండో రాజధానిగా చెప్పుకుంటున్న వరంగల్ నగరంలో ఒక్క కోర్టు లేకపోవడం బాధాకరం. ఇటీవల హనుమకొండకు వచ్చిన అంతర్జాతీయ హాకీ కోచ్ మధుకరన్ తన వంతుగా సాయం చేస్తానన్నారు. అలాగే ప్రజాప్రతినిధులు సైతం హాకీ క్రీడా సదుపాయాల కల్పనకు పాటుపడాలి. – లేగల శివరామ్, సీనియర్ హాకీ క్రీడాకారుడు నేర్చుకోవాలన్న తపన ఉంది..హాకీ క్రీడలో శిక్షణ పొందాలన్న ఆకాంక్ష, పట్టుదల నగరంలో అనేక మంది పిల్లల్లో ఉంది. అయితే అందుకు తగిన సదుపాయాలు లేక నిరుత్సాహంతో వెనుకడుగు వేస్తున్నారు. అత్యాధునిక వసతులు కల్పిస్తే ఇక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయి హాకీ క్రీడాకారులను తీర్చిదిద్దవచ్చు. – ములకల సుజిత్, కోచ్, నయీంనగర్ -
ఆలయ ధర్మకర్తల ప్రమాణ స్వీకారం
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళి సమేత శ్రీవీరభద్రస్వామి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు శుక్రవారం ఆలయ ముఖ మండపంలో దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు డివిజన్ పరిశీలకుడు సంజీవరెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. 11 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేయగా.. ముగ్గురు హాజరు కాలేదు. వీరు ఆలయ చైర్మన్గా కొర్ను రవీందర్రెడ్డిని ఎన్నుకున్నట్లు ఆలయ ఈఓ సత్యనారాయణ తెలిపారు. ఆలయ పాలక మండలి చైర్మన్తోపాటు సభ్యులను ఈఓ సత్యనారాయణను సత్కరించి వీరభద్రస్వామి చిత్రపటాలను బహూకరించారు. ఈసందర్భంగా చైర్మన్ రవీందర్రెడ్డి మాట్లాడుతూ.. విప్ డాక్టర్ జాటోత్ రాంచంద్రునాయక్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి సహకారంతో ఆలయాన్ని రూ.50 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక తయారు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తలు బాలగాని శ్రీనివాస్, కుదురుపాక ఉప్పలయ్య, బందెల సంజీవరెడ్డి, దొంగల జనార్దన్రెడ్డి, గడీల భిక్షపతి, చిన్నం గణేశ్, ప్రొద్దుటూరి సత్యనారాయణ, భూక్య సక్రునాయక్, గుగులోత్ సోమ్లా, వెంపటి శ్రీను పాల్గొన్నారు. కాగా, వీరిని కాంగ్రెస్ నాయకులు అంబటి వీరభద్రంగౌడ్, బండి శ్రీనివాస్, నూకల వేణుగోపాల్రెడ్డి, బాదావత్ రామునాయక్, వద్దుల సురేందర్రెడ్డి, గొల్లపల్లి రజనీకాంత్, బానోత్ తుకారంనాయక్, డాక్టర్ వీరన్న, శ్యామల వేణు, దైద భద్రయ్య, దయ్యాల శ్రీధర్ పాల్గొన్నారు. -
వడదెబ్బతో వృద్ధుడి మృతి
సంగెం : వడదెబ్బతో వృద్ధుడు మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గవిచర్ల గ్రామానికి చెందిన గుళ్లపల్లి రాములు(65) గత మూడు రోజులుగా వీస్తున్న వడగాల్పులకు అస్వస్థతకు గురయ్యాడు. అస్వస్థతకు గురైన రాములును శుక్రవారం ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా మృతి చెందాడు. రాములుకు భార్య భద్రమ్మ, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. కమలాపూర్: వడదెబ్బతో బోళ్లు విక్రయించే చిరువ్యాపారి శుక్రవారం మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని కానిపర్తి గ్రామానికి చెందిన బోళ్ల వ్యాపారి పస్తం వినోద్ (31) గ్రామాల్లో తిరిగి బోళ్ల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే వినోద్ గురువారం బోళ్ల వ్యాపారం కోసం గ్రామాలు తిరుగుతున్న క్రమంలో ఎండ వేడిమితో వడదెబ్బకు గురయ్యాడు. ఈక్రమంలో రాత్రి సమయంలో ఇంటి వద్ద భోజనం చేసి పడుకుని తెల్లారే సరికి మృతి చెందాడు. వినోద్కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. -
బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వండి
మహబూబాబాద్ అర్బన్: తెలంగాణలో రెండుసార్లు బీఆర్ఎస్కు, మరోసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారని ఈసారి జరగనున్న అంసెంబ్లీ ఎన్ని కల్లో బీజేపీకి ప్రజలు అధికారం అందిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన బీజేపీ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం రామచందర్రా వు మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పరి పాలనలో ప్రజలు, ఉద్యోగులు సంతోషంగా లేరన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన వా గ్ధానాలను మరిచిపోయిందని ఆరోపించారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతీ ఒక్కరు తల్లి పేరుతో మొక్కలు నాటాలన్నారు. ప్రధాని మోదీ 12 సంవత్సరాల పాలనలో రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల నిధులు వచ్చాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్, చేవెళ్ల, కామారెడ్డిల డిక్లరేషన్లు ఏమయ్యాయన్నాని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం, మంత్రులు తలో మాటా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ శిక్షణ తరగతుల్లో జిల్లా అధ్యక్షుడు వల్లాభూ వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శులు చీకటి మహేష్గౌడ్, గడ్డం అశోక్ కుమార్, మదన్లాల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వద్దిరాజు రామచంద్రరావు, లింగాల సుధీర్రెడ్డి , శ్యామ్సుందర్శర్మ, గిరిజప మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్, ఉపాధ్యక్షుడు కల్యాణ్నాయక్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, రాష్ట్ర నాయకులు ఎండ్ల అశోక్రెడ్డి, సుధాకర్రెడ్డి, శ్రీధర్రెడ్డి, వెంకన్న, నర్సిహరెడ్డి, సందీప్గౌడ్ పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు -
మొక్కలు నాటుదాం.. సంరక్షిద్దాం
● జిల్లా ఇన్చార్జ్ జడ్జి ఎంఆర్.సునీత మహబూబాబాద్ రూరల్: రేపటి తరం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని మహబూబాబాద్ జిల్లా ఇన్చార్జ్ జడ్జి ఎంఆర్.సునీత పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. ముఖ్య అతిథిగా జిల్లా ఇన్చార్జ్ ప్రధాన న్యాయమూర్తి సునీత హాజరై మొక్కనాటారు. ఈసందర్భంగా ఒక వినూత్న, పర్యావరణహిత బోర్డును న్యాయమూర్తులు ఆవిష్కరించారు. ‘ఇక్కడ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు ఇవ్వబడవు. వినియోగదారులు/కొనుగోలుదారులు తమ సొంత చేతి బ్యాగులను వెంట తెచ్చుకోవాలి’ అనే సందేశంతో కూడిన బోర్డును ఆవిష్కరించారు. దీన్ని స్థానిక వీధి వ్యాపారులు అందరూ తమ దుకాణాల వద్ద ప్రదర్శించేలా చర్యలు ప్రారంభించారు. పర్యావరణ చైతన్యాన్ని సమాజంలోకి తీసుకెళ్లే ఉద్దేశంతో పారా లీగల్ వలంటీర్లు, ఎన్సీసీ కేడెట్లకు మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి శాలిని షాకెల్లి, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి అర్వపల్లి కృష్ణతేజ్, బార్ ప్రెసిడెంట్ మామిడాల సత్యనారాయణ, కార్యదర్శి జంగం సిద్ధార్థ, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ డి.నాగేశ్వరావు, వి.రాజ్ కృష్ణ, జిల్లా కోర్టు ముఖ్య పరిపాలన అధికారి ఎస్సెస్పీ శ్రీనివాస్, సూపరింటెండెంట్ పూస శ్రీనివాస్, కోర్టు సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది గౌస్ పాషా, నూకల రామచంద్రారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల 11వ బెటాలియన్ ఎన్సీసీ కేడెట్లు తదితరులు పాల్గొన్నారు. -
నాలుగేళ్లుగా శిక్షణ తీసుకుంటున్నా..
హాకీ అంటే ఎంతో ఇష్టం, మేజర్ ధ్యాన్చంద్ స్ఫూర్తితో నాలుగేళ్లుగా నయీంనగర్ హాకీ క్లబ్లో శిక్షణ తీసుకుంటున్నా. గతేడాది జార్ఖండ్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టు నుంచి ఆడాను. భవిష్యత్లో మరింత సాధన చేసి అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నదే లక్ష్యం. – టిక్క అరవిందరాజు, గోపాలపురం రాష్ట్రస్థాయిలో కాంస్య పతకం సాధించాం..మూడేళ్లుగా హాకీలో శిక్షణ తీసుకుంటున్నా. జూనియర్స్ విభాగంలో ఇప్పటి వరకు మూడు రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు నుంచి పాల్గొన్నా. ఒక్క టోర్నమెంట్లో జిల్లాకు కాంస్య పతకం రావడం సంతోషం. ఇక్కడ మెరుగైన వసతులు కల్పిస్తే మరిన్ని పతకాలు సాధిస్తాం. – ప్రతీక్ధావన్, నయీంనగర్ -
జనగామలో నకిలీ బంగారం ముఠా అరెస్ట్
జనగామ: నకిలీ బంగారాన్ని విక్రయించేందుకు యత్నించిన నలుగురిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించినట్లు సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపారు. పట్టణ పోలీస్టేషన్లో శుక్రవారం ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా స్వర్ణభారతి కాలనీ కొత్తరోడ్డుకు చెందిన తురుక శివయ్య, ఆంజమ్మ, విజయవాడకు చెందిన తన్నీరు గంగరాజు, తన్నీరు అంకమ్మ 10 రోజుల క్రితం జనగామకు వచ్చి గ్రేయిన్ మార్కెట్ ఏరియాలో కొయ్యడ కృష్ణ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అదే ఇంటి పక్కన ఉన్న డబ్బాలో కిరాణం షాప్ నిర్వహిస్తున్న చింతకాయల హేమలతను పరిచయం చేసున్నారు. తాము జనగామ రైల్వే ట్రాక్ దగ్గర పనిచేస్తున్న క్రమంలో బంగారు బిళ్లలు దొరికాయని, బంగారు బిస్కెట్ల విలువ సుమారు రూ.పది లక్షల వరకు ఉంటుందని, ప్రస్తుతం రూ.ఐదు లక్షలు ఇస్తే బిస్కెట్లు ఇస్తామని చెప్పడంతో నమ్మింది. అదే సమయంలో అక్కడకు వచ్చిన బాధితురాలి తమ్ముడు రాజు బిస్కెట్లను చూసి నకిలీగా గుర్తించాడు. విషయం తెలుసుకున్న నేరస్తులు గుట్టుచప్పుడుకాకుండా పారిపోయేందుకు రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన నలుగురిని అదుపులోకి తీసుకుని, విచారించగా నేరం అంగీకరించారు. వారి నుంచి రెండు నకిలీ బంగారం బిస్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సైలు నర్సయ్య, ఎండీ సాల్మన్, కానిస్టేబుళ్లు బూడిద కరుణాకర్, కృష్ణ, ఎ.రమేష్ను సీపీ అభినందించారు. రెండు నకిలీ బంగారం బిస్కెట్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన సీఐ సత్యనారాయణరెడ్డి -
వడ్రంగి.. నక్క కథ
సైకిల్కూ నంబర్ ఉంది..కాజీపేట: హాయ్ ఫ్రెండ్స్.. నాపేరు టి.హర్ష ఆదిత్య. నేను కాజీపేట నుంచి అమ్మమ్మ వాళ్ల ఊరైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లంద మండలం రొంపె డుకు వేసవి సెలవులకు వెళ్లాను. అక్కడ మా అమ్మమ్మ నాకు మా అన్నయ్యకు చాలా కథలు చెప్పింది. ఇందులో వడ్రంగి.. నక్క కథ నాకు బాగా నచ్చింది. ‘ఒకప్పుడు ఒక అడవిలో నక్క నివసించేది. ఒక రోజు నక్క వేటకుక్కల గుంపు నుంచి తప్పించుకోవడానికి పరుగెడుతోంది. ఆ సమయంలో ఒక వడ్రంగి చెట్లను కోస్తూ కనిపించాడు. నక్క అతని దగ్గరకు వెళ్లి స్వామీ దయచేసి నన్ను వేటకుక్కల నుంచి రక్షించండని కోరింది. వడ్రంగా తన ఇంటిని చూపించి అక్కడ దాక్కోమన్నాడు. నక్క వెంటనే ఇంట్లోకి వెళ్లి ఒక మూలలో దాక్కుంది. కొంతసేపటికి వేటకుక్కలు అక్కడకు చేరాయి. వాటిని నడిపిస్తున్న వేటగాడు వడ్రంగిని మీరు నక్కను చూశారా.. అని అడిగాడు. వడ్రంగి నోటితో లేదు అని చెప్పాడు. కానీ తన వేలితో ఇంటివైపు సూచించాడు. అయితే వేటగాడు వడ్రంగి సంకేతాన్ని గమనించలేదు. దీంతో వేట కుక్కలతో అడవిలోకి వెళ్లిపోయాడు. వేటగాడు, వేట కుక్కలు వెళ్లిపోయిన తర్వాత నక్క బయటకు వచ్చింది. వడ్రంగి.. నక్కను చూసి నీవు ధన్యవాదాలు చెప్పకుండా వెళ్తున్నావు.. నేను నిన్ను దాచాను కదా అంటాడు. దానికి నక్క సమాధానం ఇస్తూ మీ మాటలు నన్ను రక్షించాయి. కానీ మీ చేతులు నన్ను మోసం చేశాయి. మీరు నిజాయితీగా ఉంటే నేను మీకు ధన్యవాదాలు చేప్పే వాడిని అంటూ అడవిలోకి జారుకుంది. నీతి: మన మాటలు, చర్యలు ఒకేలా ఉండాలి. ఒకటి చెప్పి మరొకటి చేయడం నైతికం కాదుఈ చిత్రంలో కనిపిస్తున్న బాలుడు తన తండ్రి మోటార్ బైక్ నంబర్ను ఒక అట్టముక్కపై రాసి తన సైకిల్కు అమర్చుకున్నాడు. బండి, కార్లకే కాదు.. నా సైకిల్కూ నంబర్ ఉందంటూ తెగ మురిసిపోతున్నాడు మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి చెందిన గండి సతీష్ కుమారుడు అద్విత్. – ఇనుగుర్తి -
పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
● గర్భవతిని చేసిన యువకుడు ● అత్యాచారం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు మహబూబాబాద్ రూరల్ : ఓ దివ్యాంగురాలైన యువతిని ఓ యువకుడు నమ్మించి వివాహం చేసుకుంటానని చెప్పి గర్భవతి అయ్యాక నిరాకరించడంతో సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో మహబూబాబాద్ టౌన్ పోలీసులు యువకుడిపై అత్యాచారం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ మేరకు టౌన్ సీఐ రఘుపతిరెడ్డి శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దివ్యాంగురాలితో స్థానిక నివాసితుడు నాగేటి రాము పరిచయం ఏర్పరచుకున్నాడు. ఆమెతో తరచూ సాన్నిహిత్యంగా ఉంటూ వివాహం చేసుకుంటానని నమ్మబలికి లైంగికంగా లొంగదీసుకున్నాడు. కొద్ది రోజుల నుంచి ఆమె అనారోగ్యంగా ఉండడంతో స్థానికుల సహకారంతో కుటుంబ సభ్యులు ఆమెను వైద్యపరీక్షల నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా.. గర్భవతి అని వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో ఆమె వివాహం చేసుకోమని సదరు యువకుడిని కోరగా.. పట్టించుకోకపోవడంతో మోసపోయానని గుర్తించి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో టౌన్ ఎస్సై గడ్డం ఉమ సదరు యువకుడు రాముపై అత్యాచారం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీగా మదన్మోహన్ విద్యారణ్యపురి: వరంగల్ పాఠశాల విద్యాశాఖ ఫుల్ అడిషనల్ చార్జ్ (ఎఫ్ఏసీ) ఆర్జేడీగా పి.మదన్మోహన్ శుక్రవారం బాధ్యతులు స్వీకరించారు. హైదరాబాద్లోని సమగ్రశిక్షలో జాయింట్ డైరెక్టర్ –1గా విధులు నిర్వర్తిస్తున్న మదన్మోహన్ను ఎఫ్ఏసీ ఆర్జేడిగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్నికోలస్ ఉత్తర్వులు జారీచేయడంతో ఇన్చార్జ్ ఆర్జేడీగా ఉన్న రంగయ్యనాయుడు నుంచి బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీగా ఇటీవల హైదరాబాద్లోని విద్యాశాఖ ఆర్జేడీ విజయలక్ష్మిని బదిలీ చేశారు. కానీ ఆమె ధీర్ఘకాలిక సెలవులో ఉన్నందున బాధ్యతలు చేపట్టలేదు. ఇక్కడ ఆర్జేడీగా బాధ్యతలను నిర్వర్తించిన సత్యనారాయణరెడ్డి హైదరాబాద్కు బదిలీ అయిన విషయం తెలిసిందే. అయితే విజయలక్ష్మి సెలవు ముగించుకొని బాధ్యతలు చేపట్టేవరకు మదన్మోహన్ ఆర్జేడీగా కొనసాగుతారని నవీన్నికోలస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఎఫ్ఏసీ ఆర్జేడీగా బాధ్యతలు స్వీకరించిన మదన్మోహన్ను టీఎన్జీఓ ఫోరం స్కూల్ ఎడ్యూకేషన్ సెక్రటరీ ఎండీ ఫక్రుద్దీన్ అహ్మద్, ఉపాధ్యక్షుడు రాయిశెట్టి అశోక్ శుక్రవారం కలిసి పూలబోకేను అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆఅసోసియేషన్ హనుమకొండ జిల్లా సెక్రటరీ రాజేశ్వర్, దిలీప్ తదితరులు ఉన్నారు. -
టూరిజం స్పాట్గా పోచాపూర్
ఎస్ఎస్తాడ్వాయి: సహజసిద్ధమైన ప్రకృతి అందాలు, దట్టమైన అడవులు, కొండ ప్రాంతాలు, ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉన్న పోచాపూర్ ఊటీని తలపిస్తోందని త్వరలో ఈ అటవీ ప్రాంతాన్ని టూరిజం స్పాట్గా అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలిస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. పోచాపూర్లో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆమె మాట్లాడారు. పోచాపూర్ చుట్టూ విస్తరించి ఉన్న అడవులు, కొండలు, ప్రకృతి వైభవాన్ని చూసిన ప్రజాప్రతినిధులు, అధికారులు సంతోషం వ్యక్తం చేశారన్నారు. ఊటీని గుర్తు చేసే వాతావరణం పోచాపూర్ చుట్టూ ఉందని పేర్కొన్నారు. అటవీ సంపదకు ఎలాంటి నష్టం కలగకుండా ఎకో–టూరిజం తరహాలో అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఊటీ తరహా ప్రకృతి అందాలతో అలరారుతున్న పోచాపూర్ భవిష్యత్లో రాష్ట్ర పర్యాటక మ్యాప్పై ప్రత్యేక స్థానం సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయని మంత్రి సీతక్క ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రి సీతక్క -
శంకుస్థాపనకు రావాలని మంత్రికి ఆహ్వానం
గార్ల: దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న పాకాల ఏటిపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే కోరం కనకయ్య వెల్లడించారు. ఈశంకుస్థాపన కార్యక్రమానికి రావాలని శుక్రవారం హైదరాబాద్లో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి ఆహ్వానించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట పీఏసీఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ ఉన్నారు. మానుకోట ఆర్డీఓగా రాజేశ్వరిమహబూబాబాద్: రాష్ట్రంలోని పలువురు ఆర్డీఓలను బదిలీ చేస్తూ ఆశాఖ సెక్రటరీ లోకేశ్ కుమార్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, మానుకోట ఆర్డీఓగా ఎం.రాజేశ్వరిని బదిలీ చేశారు. ఖమ్మంలో జిల్లాలో రాజేశ్వరి ఎస్డీసీగా (ఐపీటీ రైల్వేలో) పని చేశారు. మానుకోట ఆర్డీఓగా పని చేసిన కృష్ణవేణిని ములుగు జిల్లాకు బదిలీ చేశారు. విద్యార్థులకు ఘన స్వాగతం పలకాలి మహబూబాబాద్ అర్బన్: జిల్లా ఎస్సీ సంక్షేమ హాస్టల్ పునఃప్రారంభం రోజున విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా ఘన స్వాగతం పలకాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ జిల్లా అధికారి శ్రీనివాస్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని షెడ్యూల్డ్ కులాల సంక్షేమ అభివృద్ధి కార్యాలయంలో జిల్లాలోని హాస్టల్ వార్డెన్లతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా అధికారి శ్రీనివాస్రావు మాట్లాడుతూ.. హాస్టల్లో కిటికీలు, తలుపులకు మరమ్మతులు చేయాలని, మరుగుదొడ్లు, వసతి గదులు, వంటశాలలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. మంచినీరు, వ్యక్తిగత అవసరాలకు నీరు అందుబాటులో ఉండాలని, మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, ఏమైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో వార్డెన్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ధాన్యం తరలించేలా చర్యలు తీసుకోవాలి..దంతాలపల్లి: కొనుగోలు కేంద్రాల్లో మిగిలిన ధాన్యాన్ని త్వరగా తరలించేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అనిల్కుమార్ అన్నారు. మండలంలోని పెద్దముప్పారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మండలంలోని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఎంత వచ్చింది? ఎంత తరలించారు.. అనే విషయాలపై ఆరా తీశారు. అనంతరం అధికారులకు పలు సూచనలిచ్చారు. తహసీల్దార్ సునీల్కుమార్ పాల్గొన్నారు. ఐదుగురు గైర్హాజరు..మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయని డీఈఓ ఏ.సత్యనారాయణ మూర్తి తెలిపారు. తెలుగు సబ్జెక్ట్ పరీక్షకు 27 మంది విద్యార్థులకు 22 మంది హాజరైనట్లు, ఐదుగురు గైర్హాజరైనట్లు తెలిపారు. కాగా, ఈ పరీక్షకు సీఎస్, డీఓఎస్, సిట్టింగ్ స్క్వాడ్లు విధులు చేపట్టారు. జిల్లా పరీక్షల విభాగాధికారి మందుల శ్రీరాములు తనిఖీలు చేపట్టారు. మొత్తానికి మొదటి రోజు తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగింది. బైక్ అదుపు తప్పి ఒకరి మృతిమరిపెడ రూరల్: మరిపెడ మండలం స్టేజి తండాకు చెందిన సింగారపు రవి(38) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గురువారం రాత్రి ఓ పని నిమిత్తం తన ద్విచక్రవాహనంపై ఆనెపురం గ్రామానికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో నాగేంద్రస్వామి ఆలయ సమీపంలో బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రవి మృతితో గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మరిపెడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రవి మృతి ఘటన తెలుసుకున్న డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ మృతదేహాన్ని సందర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. -
మత్స్యశాఖలో నీలినీడలు!
నెహ్రూసెంటర్: మత్స్యకారుల అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలు, పణ్రాళికల అమలులో జాప్యం జరుగుతోంది. దీంతో వారి జీవనోపాధిపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. జిల్లాలో చేప పిల్ల ల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, పంపిణీ కోసం ప్రైవేట్ వారిపై ఆధారపడాల్సి వస్తోంది. కాగా, నాణ్యత, కొలతల్లో తేడాలు, సరైన మోతాదులో చేపపిల్లలు రాకపోవడంతో సరైన దిగుబడి లేక మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 1,264 చెరువులు ఉండగా.. ఇందులో గతేడాది సుమారు రెండు కోట్ల చేప పిల్లలను మాత్రమే వదిలారు. కాగా, వరదల కారణంగా చెరువుల కట్టలు తెగిపోయి మత్స్యకారులకు తీవ్ర నష్టం జరిగింది. చేప పిల్లల పంపిణీకి ఈ ఏడాది టెండర్ల పక్రియ ఊసేలేదు. ఉత్పత్తి కేంద్రాల జాడేది? జిల్లాలో మత్స్యకారుల అభివృద్ధికి ఉచిత చేప పిల్ల ల పంపిణే కాకుండా మత్స్యకారులే ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాల్సి ఉంది. మత్స్యకారులే చేప పిల్లల ఉత్పత్తిదారులుగా మారితే ఆర్థికంగా మరింత లబ్ధి జరిగే అవకాశాలున్నాయి. ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నా.. సద్వినియోగం చేసుకునేలా మత్స్యకారులకు అవగాహన లేకపోవడంతో కేంద్రాల ఏర్పాటు జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ కాంట్రాక్టర్లకు చేపపిల్లల కోసం టెండర్లు ఇవ్వడంతో నాణ్యత ఉండడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెరువుకు చేరని లక్ష్యం.. జిల్లాలో ఉచిత చేప పిల్లల పథకం ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదు. అన్ని చెరువుల్లో సుమారు 4 కోట్ల చేప పిల్లలు వదలాల్సి ఉండగా.. గతేడాది సగానికి తగ్గించి పంపిణీ చేశారు. సరైన సమయం, సరైన మోతాదులో చేప పిల్లలను వదలాల్సి ఉంటుందని, కానీ, ప్రభుత్వం ఏడాది చివరిలో వదలడం వల్ల ప్రయోజనం లేకుండాపోతుందని మత్స్యకారులు చెప్పుకొస్తున్నారు. టెండర్ల ద్వారా కాకుండా సహకార సంఘాలకు నగదు బదిలీ చేయడం ద్వారా నాణ్యమైన పిల్లల్ని కొనుగోలు చేసి వర్షాల ప్రారంభంలోనే చెరువుల్లో వదుకుంటామని మత్స్యకారులు కోరుతున్నారు. ఊసేలేని ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రక్రియ.. జిల్లాలో 200 మత్స్యసహకార సంఘాలు, సుమారు 14 వేల మంది మత్స్యకారులు చెరువులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గతేడాది సుమారు రెండు కోట్ల చేప పిల్లలను అందించినప్పటికీ వర్షాల కారణంగా చెరువుల కట్టలు తెగి మత్స్యకారులకు తీవ్రనష్టం వాటిల్లింది. కాగా, ఈ ఏడాది ప్రభుత్వం నుంచి ఇంకా ఉచిత చేప పిల్లల పంపిణీ ఊసేలేదు. ఉచిత చేప పిల్లలు కాకుండా నగదు బదిలీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. మత్స్యకారుల అభివృద్ధిపై దృష్టి సారించని అధికారులు జిల్లాలో ఏర్పాటు కాని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు చెరువులకు చేరని పంపిణీ లక్ష్యం జీవనోపాధిపై ప్రభావం పడే అవకాశం ఉచిత చేప పిల్లల పంపిణీ చేపల ఉత్పత్తి -
కదలిక వచ్చేనా..
● అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ డీలా ● ఐదు సర్పంచ్ స్థానాలు, ఒక్క మున్సిపల్ వార్డుకే పరిమితం ● సభ్యత్వం ఉన్నా.. ఓటు బ్యాంకు లేని పరిస్థితి ● నేటి నుంచి జిల్లాలో బీజేపీ శిక్షణ తరగతులుసాక్షి, మహబూబాబాద్: దేశంలో ప్రధానమంత్రి మోదీ ప్రభంజనం కొనసాగుతోంది. ఈమేరకు అన్ని జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయాలని రాష్ట్ర అధినాయకత్వం పదేపదే చెబుతున్నా.. జిల్లా కమలనాథుల్లో మాత్రం చలనం రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో పార్టీకి కాయకల్ప చికిత్స అందించి కార్యకర్తల్లో కదలిక తీసుకువచ్చేందుకు శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జరిగే పార్టీ శిక్షణ తరగతుల ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు రానున్నారు. అలాగే ముగింపు సమావేశానికి ఎంపీ ఈటల రాజేందర్ వచ్చి దిశానిర్దేశం చేయనున్నారు. ఉనికి కాపాడుకోవడంలో.. జిల్లాలో ఉభయ కమ్యూనిస్టు, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బలంగా ఉన్నా.. భారతీయ జనతా పార్టీ కూడా తన ఉనికిని చాటుకుంటూ వస్తోంది. జిల్లా వ్యాప్తంగా మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల్లో బీజేపీకి 26వేలకు పైగా సభ్యత్వాలు ఉన్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్లో 13వేల మేరకు ఓట్లు సాధించగా.. డోర్నకల్ నియోజకవర్గంలో మాత్రం 3,800 ఓట్లకే పరిమితమైంది. ఈ ఫలితాలను చూసిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు నిర్ఘాంతపోయారు. కనీసం సభ్యత్వం ఉన్నవారు కూడా ఓటు వేయని పరిస్థితి ఉందనే చర్చ జరిగింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని మోదీ వచ్చినా.. ఆశించిన స్థాయిలో ఓట్లు పడలేదని పార్టీ కార్యకర్తలు నిరుత్సాహం వ్యక్తం చేశారు. అదే విధంగా పంచాయతీ ఎన్నికల్లో ఐదు సర్పంచ్ స్థానాలు, 11 ఉప సర్పంచ్లు, మరో 50 మంది మేరకు వార్డు సభ్యులు గెలిచారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఒక వార్డు కౌన్సిలర్ గెలుపొందారు. అయితే ఈ గెలుపు కార్యకర్తల కష్టానికి ఫలితమే అని.. పార్టీ జిల్లా నాయకులు ఎవరు కూడా సరైన మద్దతు తెలపలేదని కార్యకర్తలు ఆరోపించారు. ఎవరికి వారుగా.. క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న మానుకోట బీజేపీలో ఎవరికి వారు యమునా తీరు అన్నట్లు మారిందని కార్యకర్తలు, సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్నాయక్ గతంలో పార్టీని ఒక్కతాటిపై నడిపించారని, ఆయన ఢిల్లీకి వెళ్లిన తర్వాత పార్టీకి పెద్దదిక్కు కరువయ్యారనే ప్రచారం జరుగుతోంది. సీనియర్ నాయకులతో పాటు యువత కూడా వర్గాలుగా విడిపోయి ఎవరికివారు కార్యక్రమాలు నిర్వహించడంతో పార్టీ ప్రభావం తగ్గుతుందనే విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పలువురు కార్యకర్తలు చందాలు వసూళ్లు చేయడం తమను బాధిస్తుందని పార్టీలోని ఓ సీనియర్ నాయకుడు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ఇటువంటి పరిస్థితిలో జిల్లాలో నిర్వహించే పార్టీ శిక్షణ తరగుతుల్లో అనేక విషయాలు చర్చకు రావాలని, కార్యకర్తల్లో ఈ శిక్షణ ఉత్సాహాన్ని నింపాలని పార్టీ అభిమానులు, సీనియర్ నాయకులు కోరుకుంటున్నారు. -
సన్నాలు సాగు చేయండి
హసన్పర్తి: అధిక దిగుబడి, మంచి మార్కెట్ ధర పొందేందుకు సన్నరకాలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి విజయ్చంద్ర సూచించారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గురువారం అన్నాసాగరం, సీతంపేటలో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయ్చంద్ర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రైతులకు సూచనలిచ్చారు. నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయశాఖ అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్లు మేక రమ్య, రామంచ వెన్నెల, ఉపసర్పంచ్ బండారు సాగర్, ఏఓ అనురాధ, హెచ్ఓ సుష్మిత, ఏఈఓ ప్రవళిక, సాయి, పంచాయతీ కార్యదర్శులు అనూష, సరితతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
రూ.6.25 లక్షల విలువైన హశిష్ ఆయిల్ పట్టివేత
ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం పీఎస్ పరిధిలో రూ.6.25 లక్షల విలువైన 526 గ్రాముల హశిష్ ఆయిల్ (లిక్విడ్ గంజాయి) పట్టుకుని ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సీఐ అనుమలు శ్రీనివాస్, ఎస్సై మహేశ్ తెలిపారు. ఈ మేరకు గురువారం సర్కిల్ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎస్సై మహేశ్ సిబ్బందితో కలిసి మండల కేంద్రం సమీపంలోని జీడివాగు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నల్లగట్ల సురేంద్ర కుమార్, బండ్ల సాయి బైక్ వస్తూ అనుమానాస్పందగా కనిపించారు. దీంతో వారి వద్ద ఉన్న బ్యాగు తనిఖీ చేయగా హశిష్ ఆయిల్ లభించింది. సురేంద్ర కుమార్, సాయి ఒడిశాలోని కుమురమానూరు చెందిన రాజు నాయక్ వద్ద నుంచి హశిష్ ఆయిల్ కొనుగోలు చేశారు. అనంతరం బైక్పై ఒడిశా నుంచి మహారాష్ట్రలోని సిరోంచ వైపునకు ఏటూరునాగారం మీదుగా వెళ్తుండగా పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేసి రెండు సెల్ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారని సీఐ తెలిపారు. కాగా, ములుగు జిల్లాలో ఇలాంటి ఆయిల్ లభించడం ఇదే మొదటి సారి అన్నారు. సిబ్బంది హరీశ్, చంద్రమోహన్, సదానందం, సుధాకర్, మహేందర్ పాల్గొన్నారు. ఇద్దరు నిందితులు అరెస్ట్ వివరాలు వెల్లడించిన పోలీసులు -
పర్యావరణంపై ఆ‘మంచి’ కుంచె
భూమాత.. చెట్లు, నదులు, జంతువులు, పక్షులతో నిండి ఆరోగ్యంగా ఉంది. ఆమె చేతిలో ఆకులు, పూలు, వేర్లతో చేసిన విల్లు ఉంది. రాక్షసుడి రూపంలో ఉన్న కాలుష్యం విల్లు దెబ్బకు పారిపోతుందని తెలిసేలా ఈ చిత్రం గీశాడు. సూర్యుడు తన చేతిలో విసనకర్రతో అత్యధిక వేడిమిని భరించలేక తనకు తానే విసురుకుంటున్నాడు. చెట్ల నరకడం వల్ల భూమి వేడెక్కి ఓజోన్ పొర దెబ్బతిని సూర్యుని వేడి నేరుగా భూమిని తాకుతుంది. సూర్యుడు నవ్వాలంటే మొక్కలను పెంచాలని చెప్పడానికి ఈ చిత్రం గీశాడు. నరికితే నష్టం.. నాటితే లాభం. నేడు చెట్లను విచక్షణారహితంగా నరకడం వల్ల రేపు ఆక్సిజన్ సిలిండర్ను వీపున మోస్తూ మాస్కు పెట్టుకుని భవిష్యత్ వైపు చూడాల్సి వస్తుంది. దీనిని వర్ణిస్తూ ఈ చిత్రం గీశాడు. దుగ్గొండి: ఆధునిక పోకడలు శరవేగంగా ముందుకు సాగుతున్న తరుణంలో అభివృద్ధి పేరుతో చెట్లు అంతరించి పోతున్నాయి. వాహనాలు, పరిశ్రమల పొగతో కాలుష్యం పెరిగిపోతోంది. కార్బన్డైయాకై ్సడ్ పెరిగి ఆక్సిజన్ తగ్గిపోతోంది. సూర్యుడి తాపం పెరిగి సరిగా వర్షాలు కురువని పరిస్థితి నెలకొంటోంది. దీంతో భవిష్యత్ తరం లేకుండా పోయే ప్రమాదం ఏర్పడుతోంది. ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణపై వరంగల్ జిల్లా దుగ్గొండి మండల ప్రశాంతి మండల సమాఖ్య కార్యాలయంలో కమ్యూనిటీ సర్వేయర్ ఆమంచ రవి పలు కార్టూన్లు గీసి అవగాహన కల్పిస్తున్నాడు. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలను చైతన్య వంతం చేసేందుకు రవి గీసిన చిత్రాలు ఇలా ఉన్నాయి. నేడు వర్సెస్ రేపు.. అభివృద్ధి పేరుతో అడవులు నరకబడుతున్నాయి. దీంతో రేపు ఆక్సిజన్ కోసం మొక్కను మోయాల్సి వస్తుంది. నేడు ఉచితంగా లభించే ఆక్సిజన్ను రేపు కొనుక్కోవాల్సి వస్తుందని చెప్పడానికి ఈ చిత్రం గీశాడు. ప్రకృతి పరక్షణకు వినూత్న కార్టూన్లు గీసి అవగాహన కల్పిస్తున్న రవి ప్రశంసిస్తున్న పర్యావరణవేత్తలు నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం -
గంజాయి రహిత జిల్లా లక్ష్యం
● ఎస్పీ శబరీష్ మహబూబాబాద్ రూరల్ : మానుకోటను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీసు శాఖ పటిష్ట చర్యలు చేపట్టిందని ఎస్పీ శబరీష్ అన్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీసు స్టేషన్ సమావేశ మందిరంలో గురువారం ఎస్పీ గంజాయి నియంత్రణపై మాట్లాడారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు జిల్లాలో ప్రత్యేక పోలీసు బృందాలు నిరంతరం నిఘా పెడుతున్నాయని తెలిపారు. గంజాయి సేవి ంచే వారిని గుర్తించేందుకు అత్యాధునిక 4వేల గంజాయి టెస్టింగ్ కిట్లు వచ్చాయన్నారు. ఎస్సైలు, పోలీసు సిబ్బంది ఈ కిట్లను విధుల్లో భాగంగా వెంట తీసుకెళ్లి అనుమానిత వ్యక్తులను, పదార్థాలను అక్కడికక్కడే పరీక్షించి 10 నిమిషాల్లో ఫలితాలు పొందవచ్చని చెప్పారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసైన వారిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో డీ అడిక్షన్ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. గంజాయి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కఠినమైన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి విక్రయం, విని యోగం, రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 87126 56999 నంబర్కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. డీఎస్పీలు తిరుపతిరావు, కృష్ణకిశోర్, సీఐలు రఘుపతిరెడ్డి, అంజలి, పవన్ కుమార్, రవీందర్, గణేష్, చంద్రమౌళి, సత్యనారాయణ, వినయ్ కుమార్ ఉన్నారు. -
పాపతో బంధం.. వీడ్కోలు వేళ భావోద్వేగం
జనగామ: తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన ఓ పసికందుకు వైద్యులే అమ్మానాన్నలుగా మారి 72 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడిన మానవీయ ఘటన జనగామ చంపక్హిల్స్ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా తీర్చిదిద్దిన వైద్యులు గురువారం శిశుగృహకు అప్పగించారు. ఈ సమయంలో భావోద్వేగానికి గురయ్యారు. లింగాలఘనపురం మండలం (ఏపీ వసల కూలీలు) కళ్లెం గ్రామానికి చెందిన తిక్కవరపు పద్మ, నరేశ్ దంపతులు ఇటుక బట్టీలో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 23న పద్మ ఐదో సంతానంగా ఆడశిశువుకు జన్మనిచ్చింది. కేవలం 1.24 కిలోల బరువు, చిన్న ఆరోగ్య సమస్యలతో జన్మించిన ఆ చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో ఎస్ఎసీయూలో ఇన్నాళ్లు చికిత్స అందించారు. అయితే ఆడపిల్ల కావడం, అత్యల్ప బరువుతో జన్మించడం వంటి కారణాలతో డెలివరీ జరిగిన వారం రోజులకే తల్లిదండ్రులు పాపను ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఎంసీహెచ్ సూపరింటెండెంట్ రాజలింగం ఆధ్వర్యంలో, డిప్యూటీ సూపరింటెండెంట్ మధుసూధన్రెడ్డి పర్యవేక్షణలో వైద్యులు, నర్సులు, సిబ్బంది ఆ చిన్నారికి అండగా నిలిచారు. పాపకు ‘అనామిక’ అని పేరు పెట్టి నెల బర్త్డే వేడుకలతోపాటు మినీ బారసాల కార్యక్రమం కూడా నిర్వహించారు. పూర్తిగా ఆరోగ్యవంతురాలిగా మారడంతో డాక్టర్ మధుసూధన్రెడ్డి, చైల్డ్ వెల్ఫేర్ శాఖ సమన్వయంతో గురువారం హనుమకొండ శిశు గృహకుప్రత్యేక వాహనంలో తరలించారు.అయితే ఆ క్షణం అక్కడున్న ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసింది. 72 రోజులుగా తమ చేతుల్లో పెరిగిన చిన్నారిని పంపించే సమయంలో వైద్యులు, సిబ్బంది కన్నీరు పెట్టుకున్నారు. పేగుబంధం లేకపోయినా ప్రేమతో పెంచిన అనామికకు వీడ్కోలు పలుకుతూ వారు చూపిన ఆప్యాయత అందరినీ కదిలించింది. కన్నవారు వదిలేసినా.. 72 రోజుల ‘వైద్య’అనుబంధం పూర్తి ఆరోగ్యవంతురాలు కావడంతో హనుమకొండ శిశు గృహకు తరలింపు -
రాజకీయాలకతీతంగా అభివృద్ధి
మహబూబాబాద్: రాజకీయాలకతీతంగా మానుకోట మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గురువారం కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని చైర్పర్సన్ గుగులోత్ జ్యోతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మానుకోట మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని, ఆదర్శంగా మారుస్తామన్నారు. కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ.. అన్ని వార్డులకు సమానంగా నిధులు కేటాయించాలన్నారు. ఇందరిమ్మ ఇళ్ల మంజూరులో రాజకీయ జోక్యం ఉండొద్దన్నారు. మహిళలకు భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. కుక్కల బెడదకు శాశ్వత పరిష్కారం చూడాలన్నారు. మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలు అధికారులు పరిష్కరించాలన్నారు. మీడియాకు అనుమతి నిరాకరణ.. సీపీఐ, బీఆర్ఎస్ కౌన్సిలర్ల నిరసన.. కౌన్సిల్ సాధారణ సమావేశానికి కమిషనర్ మీడియాకు అనుమతించకపోవడంపై సీపీఐ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు నిరసన తెలిపారు. రూ.59 కోట్ల అభివృద్ధి నిధుల విషయంలో అధికారపక్షాన్ని నిలదీశారు. ఈసందర్భంగా సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్సారథి రెడ్డి మాట్లాడుతూ.. కూరగాయల మార్కెట్ను వినియోగంలోకి తేవాలన్నారు. ఆఫీసర్ క్లబ్ స్థలాన్ని స్వాధీనం చేసుకొని అభివృద్ధి చేయాలన్నారు. వాగ్వాదం.. పట్టణంలో పేరుకుపోయిన పలు సమస్యలపై పలువురు కాంగ్రెస్ కౌన్సిలర్లతో బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు వాగ్వాదం చేశారు. వారి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనగా అధికారులు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. పలువురు కౌన్సిలర్లు సమస్యలపై మాట్లాడారు. ఎజెండాలో 161 అంశాలు.. కౌన్సిల్ సమావేశానికి కమిషనర్ మీడియాకు అనుమతించలేదు. పాత్రికేయులు కారణాలు అడుగగా.. అనుమతి లేదని జీఓ ఉందని బదులిచ్చారు. సమావేశంలో చర్చించిన అంశాలు ప్రజలకు ఎలా తెలియాలని ప్రశ్నించగా.. మున్సిపల్ అధికారులు ఏది రాసిస్తే అది రాయండి అని కమిషనర్ సమాధానం ఇచ్చారు. కాగా, ఎజెండాలోని 161 అంశాలపై చర్చించినట్లు అధికారులు తెలిపారు. వైస్ చైర్మన్ సూర్నపు సోమయ్య, కమిషనర్ వినోద్ కుమార్, డీఈ ఉపేందర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. మానుకోట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఎమ్మెల్యే మురళీనాయక్ మీడియాకు అనుమతి ఇవ్వని కమిషనర్ సీపీఐ, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన -
అగ్గితో బుగ్గి
● అగ్ని ప్రమాదాలతో ఉద్యాన పంటలకు నష్టం ● నివారణ చర్యలతోనే రైతులకు భరోసామహబూబాబాద్ రూరల్ : జిల్లాలో అగ్ని ప్రమాదాలతో ఉద్యాన పంటలకు తీరని నష్టం వాటిల్లుతోందని ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అగ్ని ప్రమాదాల బారినుంచి ఉద్యాన పంటలు, బిందు సేద్య పరికరాలను రక్షించుకోవాలని వారు సూచిస్తున్నారు. ఏటా ప్రమాదాలు.. జిల్లాల ఏటా ఆయిల్పామ్, మామిడి, సపోటా, నిమ్మ, బొప్పాయి, అరటి తదితర తోటల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే బిందు సేద్య పరికరాలు కూడా అగ్ని ప్రమాదంలో కాలిపోతున్నాయి. ముఖ్యంగా పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగి ఆర్థికపరమైన నష్టం జరుగుతోంది. యాజమాన్య పద్ధతులు పాటించకుండా వదిలేసిన తోటలు అగ్ని ప్రమాద బారిన పడుతున్నాయి. పూల పొదలతో ఉండే పలురకాల గడ్డిజాతి కలుపు మొక్కలు బాగా పెరిగి అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్నాయి. నివారణ చర్యలు.. ● తోట చుట్టూ ఫైర్ లైన్ ఏర్పాటు చేసుకోవాలి. ● ఆరు అడుగుల దూరంతో చుట్టూ ఎలాంటి ఎండిన ఆకులు, ఇతర వాటిని లేకుండా తీసివేయాలి. ● పాదులలో తేమ ఉండేలా చూసుకోవాలి. ● మల్చింగ్ చేయాలి, బిందు సేద్యం ద్వారా నీరు పెట్టాలి. ● ఎప్పటికప్పుడు కలుపును నివారించాలి. ● చెట్లకు ఉన్న పిచ్చి తీగలు, పిచ్చి దొండ తీగలు, ఎండు మండలు, కొమ్మలు, ఎండు పుల్లలు ఒకటి రెండు వర్షాల తరువాత తొలగించాలి. ● అడ్డదిడ్డ కొమ్మలు, గొడుగు కొమ్మలను కూడా వర్షాకాలంలో తొలగించాలి. ● ఫ్రూనింగ్, కొమ్మ కత్తిరింపులు చర్యలు తీసుకోవాలి. ● అంతర పంటలు సాగు చేయాలి. ● ఎండు ఆకులు, ఇతర వ్యర్థాలను డీకంపోజర్తో కుళ్ల్లిపోయే విధంగా చేయాలి. ● పశు గ్రాసం పెంచాలి. ● కూరగాయపంటలు సాగు చేయాలన్నారు. ● శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించాలి. కలుపు లేకుండా చూసుకోవాలి రైతులు మామిడి, ఆయిల్ పామ్ తోటల్లో ఎప్పటికప్పుడు యాజమాన్య పద్ధతులు పాటించి కలుపు లేకుండా చూసుకోవాలి. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల చుట్టుపక్కల ఉన్న తోటలకు ఆ మంటలు వ్యాప్తి చెంది తీరని నష్టం వాటిల్లుతుంది. తోటల్లో బయట, లోపల పరిశుభ్రంగా ఉంచుకుంటే అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ఉంటాయి. పంట వ్యర్థాలను కాల్చకుండా ఉంటే రైతులకు ఉపయోగకరం. – జినుగు మరియన్న, జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి ఆయిల్ పామ్ 8,962 ఎకరాలు మామిడి 13,542 ఎకరాలు మిర్చి 30,839 ఎకరాలు కూరగాయలు, అరటి, జామ, బొప్పాయి, నిమ్మ, పూలు, మల్బరీ పంటలు : 6,161 ఎకరాలు -
పంట మార్పిడితో ఆర్థికాభివృద్ధి సాధించండి
● కలెక్టర్ స్నేహ శబరీష్ గూడూరు: పంట మార్పిడి ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మండలంలోని అప్పరాజ్పల్లి, పడమటితండా గ్రామాల్లో గురువారం ప్రజాపాలన–ప్రగతిప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామసభలకు కలెక్టర్ హాజరై మాట్లాడారు. దేశ వ్యాప్తంగా వ్యవసాయంలో మార్పు తీసుకొచ్చేందుకు ఖేత్ బచావో అభియాన్ అనే కార్యక్రమంతో రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఎప్పుడు ఒకేరకమైన పంటల సాగు చేయకుండా.. మార్పిడి చేస్తూ ఉండాలన్నారు. నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని, సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలని సూచించారు. పంట మార్పిడితో భూసారం పెరుగుతుందన్నారు. అన్ని రకాలుగా వ్యవసాయంలో మార్పు కనిపించి, దిగుబడులు పెరిగి, ఖర్చు తగ్గి లాభం వస్తుందన్నారు. వరి తర్వాత పప్పు ధాన్యాల సాగు చేయాలని తెలిపారు. రైతులు పంట వ్యర్థాలను కాల్చొద్దని, దీని వల్ల పర్యావరణం కలుషితం కావడమే కాక, నేలకు అనర్థాలు కలుగుతాయన్నారు. పడమటితండా జీపీలో గ్రామసభ అనంతరం జనగణన కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేశారు. గ్రామంలో ఎన్ని కుటుంబాలు, జనాభా ఎంత అనే విషయం తెలుసుకున్నారు. తండావాసులతో జనగణనపై అడిగి తెలుసుకుంటూ, ఓ బాలిక కనిపించగా, ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు, శ్రద్ధగా చదువుకోవాలని సూచించగా.. ఒకే మేడం గారూ అంటూ సమాధానం ఇచ్చింది. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, ఏఓ అబ్దుల్మాలిక్, తహసీల్దార్ నాగభవాని, ఇన్చార్జ్ ఎంపీడీఓ పృథ్వీరాజ్, ఎస్సై గిరిధర్రెడ్డి, ఏఎస్ఓ సుమలత, అప్పరాజ్పల్లి సర్పంచ్ భరత్, పడమటితండా సర్పంచ్ భాస్కర్, రైతులు పాల్గొన్నారు. ‘బడిబాట’ను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి మహబూబాబాద్: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి గురువారం కలెక్టర్ స్నేహశబరీష్ జిల్లాలోని 18మండలాల ఎంపీడీఓలు, ఏంఈఓలతో విద్యపై వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విధంగా అవగాహన కల్పించాలన్నారు. నూతన టెక్నాలజీ ద్వారా బోధన అందిస్తున్నామన్నారు. విద్యతోపాటు క్రీడలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు
మహబూబాబాద్ రూరల్ : గ్రామాలు, పట్టణాల్లోని అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ పురుషోత్తం అన్నారు. మహబూబాబాద్ మండలంలోని నడివాడ గ్రామంలో నిర్వహించిన గ్రామసభకు గురువారం అదనపు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాలు, తండా గ్రామపంచాయతీల్లో పచ్చదనం, పరిశుభ్రత విషయంలో ప్రతీ ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. బాల్య వివాహాల నిర్మూలన, గంజాయి మాదకద్రవ్యాల రవాణా, వాడకంపై సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, వారికి నగదు ప్రోత్సాహకాలు కూడా అందిస్తామన్నారు. ప్రతి ఒక్కరు సమాజాభివృద్ధికి కృషి చేసి గ్రామాలు ఆదర్శవంతంగా తయారయ్యేలా సహకరించాలని కోరారు. ప్రభుత్వ నిర్దేశించిన మేరకు ఓటరు జాబితా సవరణకు ప్రజలు సహకరించాలన్నారు. సమావేశంలో ఎంపీడీవఓ రఘుపతిరెడ్డి, తహసీల్దార్ చంద్రరాజేశ్వరరావు, ఏఓ తిరుపతిరెడ్డి, సీడీపీఓ శిరీష, సర్పంచ్ మైదం విజయ్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు. అడవుల రక్షణతోనే మానవ మనుగడ బయ్యారం: అడవుల రక్షణతోనే మానవుల మనుగడ సాధ్యమని జిల్లా అటవీశాఖ అధికారి బి.విశాల్ అన్నారు. బయ్యారంలోని రైతువేదికలో ప్రజాపాలన–ప్రగతిప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం వనసంరక్షణ సమితి సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీఎస్ఎస్ సభ్యులకు అడవులు, వన్యప్రాణుల రక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం డీఎఫ్ఓ మాట్లాడారు. కార్యక్రమంలో ఎఫ్డీఓ వెంకటేశ్వర్లు, ఎఫ్ఆర్ఓ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఉక్కపోత నుంచి ఉపశమనం తొర్రూరు: ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలు గురువారం కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం పొందారు. తొర్రూరు పరిసర ప్రాంతాల్లో వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కాగా, ధాన్యం కొనుగోళ్లు పూర్తికాకపోవడం, వర్షాలు కురుస్తుండడంతో ధాన్యం తడిసి నష్టపోతామనే భయం రైతుల్లో నెలకొంది. డీటీఓగా శంకర్ బాధ్యతల స్వీకరణ మహబూబాబాద్ అర్బన్: జిల్లా రవాణాశాఖ అధికారి(డీటీఓ)గా బి.శంకర్ గురువారం బాధ్యతులు స్వీకరించారు. ప్రస్తుతం ఉన్న జయపాల్రెడ్డి డీటీసీ నుంచి కరీంనగర్కు బదిలీ అయ్యారు. కొమురంభీం ఆసిఫాబాద్ నుంచి డీటీఓ శంకర్, హనుమకొండ నుంచి ఏఎంవీఐ బి.విజయశాంతి, మంచిర్యాల నుంచి ఏఎంవీఐ షేక్ కాసీం బదిలీపై వచ్చి బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి రైల్వేల స్టేట్ ట్రైనింగ్ కమిషనర్గా ఏలియా కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకోషెడ్లో సీనియర్ టెక్నీషియన్గా పనిచేస్తున్న ఎర్ర ఏలియా ఉమ్మడి రైల్వేలు సౌత్ సెంట్రల్ రైల్వే, సౌత్ కోస్ట్ రైల్వే భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ స్టేట్ ట్రైనింగ్ కమిషనర్గా ఇటీవల నియమితులయ్యారు. ఈ మేరకు సికింద్రాబాద్లో భారత్ స్కౌట్ అండ్ గైట్స్ స్టేట్ సెక్రటరీ శేఖర్బాబు చేతుల మీదుగా నియామకపత్రం స్వీకరించినట్లు ఏలియా గురువారం స్థానిక విలేకర్లకు తెలిపారు. ఏలియా నియామకం పై స్థానిక స్కౌట్ అండ్ గైడ్స్, రైల్వే అధికారులు, నాయకులు, కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. -
నేడు శృంగేరికి అధికారులు
కాళేశ్వరం: కాళేశ్వరాలయం అభివృద్ధి, పునరుద్ధరణ పనులు ఈనెల 17న ప్రారంభిస్తున్న నేపథ్యంలో దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, ఈఓ మహేష్, ఉపప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మ కర్ణాటకలోని శృంగేరి పీఠానికి (నేడు) శుక్రవారం వెళ్లనున్నారు. శృంగేరి పీఠాధిపతి అనుమతులు ఇప్పటికే సూత్రపాయంగా ఇవ్వడంతో పనులు మొదలు పెట్టడానికి తేదీ ఖరారు చేసి వారి రాక కోసం ఆహ్వానానికి అధికారులు వెళ్తున్నట్లు తెలిసింది. ఆలయంలో పనులు ప్రారంభిస్తున్న నేపథ్యంలో భక్తులు దర్శనాలు చేసుకునేందుకు బాలాలయాన్ని ఆలయ ఆవరణ లేదా అడవిలోని ఆదిముక్తీశ్వరాలయం వద్ద ఏర్పాటు చేయడానికి ఇప్పటికే దేవాదాయశాఖ కసరత్తు ప్రారంభించింది. గురువారం తమిళనాడులోని శిల్పులు కాళేశ్వరం దేవస్థానం గర్భాలయంలోని జోడు లింగాల (కాలుడు,యముడు) కొలతలు తీసుకున్నారు. అదే నమూనాతో లింగాలు తయారు చేసి బాలాలయంలో ఏర్పాటు చేసి భక్తుల దర్శనాలు చేస్తారని సమాచారం. ఈ బాలాలయం ఆలయ ఆవరణలోనా.. ఆది ముక్తీశ్వరాలయంలోనా.. అనేది శృంగేరి పీఠాఽఽధిపతి ఆదేశాలతో ఏర్పాటు కానుందని తెలిసింది. -
ఎంఏ తెలుగు కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్
హన్మకొండ కల్చరల్ : సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞానపీఠంలో ఎంఏ తెలుగు కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైందని జానపద గిరిజన విజ్ఞాన పీఠం పీఠాధిపతి గడ్డం వెంకన్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా వరంగల్ ప్రాంగణంలోని జానపద గిరిజన విజ్ఞానపీఠంలో 2026–2027 విద్యా సంవత్సరానికిగాను ఎంఏ తెలుగు కోర్సులో ప్రవేశం పొందడానికి ఆసక్తిగల అభ్యర్థులు తెలుగు యూనివర్సిటీ వెబ్సైట్ teluguuniversity.ac.in,www.pstucet.orgలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను 2026 జూన్ 24లోగా సాధారణ రుసుముతో, 2026 జూన్ 30వరకు ఆలస్యరుసుముతో సమర్పించాలన్నారు. వివరాలకు 9989417299, 9989139136, 7989385451 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. నేటినుంచి హాస్టళ్లు, మెస్ల రీఓపెన్ కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని పలు హాస్టళ్లు, కామన్మెస్, మహిళా హాస్టల్తోపాటు మెస్, ‘లా’ హాస్టల్తోపాటు మెస్ను ఈనెల 5వతేదీ నుంచి రీఓపెన్ చేయబోతున్నామని హాస్టళ్ల డైరెక్టర్ పి. శ్రీనివాస్ గురువారం తెలిపారు. పీజీ కోర్సుల నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 8నుంచి జరగనున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి హాస్టళ్లు, మెస్లను రీఓపెన్ చేస్తున్నామన్నారు. పీజీ కోర్సుల రెండో సెమిస్టర్ విద్యార్థులకు ఈనెల 9 నుంచి తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో అదేరోజు నుంచి హాస్టల్, మెస్ సదుపాయం కల్పిస్తామని ఆయన తెలిపారు. బెటాలియన్ను సందర్శించిన ట్రైనీ ఐపీఎస్లు మామూనూరు : తెలంగాణకు కేటాయించిన 2024 బ్యాచ్కు చెందిన నలుగురు ట్రైనీ ఐపీఎస్లు అయేషా ఫాతిమా, సోహమ్ సునీల్, మనీషా నెహ్రా, రాహుల్ కాంత్ ప్రాక్టికల్ శిక్షణ నిమిత్తం గురువారం మామూనూరులోని టీజీఎస్పీ 4వ బెటాలియన్ను సందర్శించారు. ఈ సందర్భంగా బెటాలియన్ల నిర్మాణం, కమాండ్ కంట్రోల్, శిక్షణ, వసతి, సంక్షేమం, ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాల పనితీరు పరిశీలించి అవగాహన పెంచుకున్నారు. అడ్మినిస్ట్రేటివ్ గురించి బెటాలియన్ కమాండెంట్ డి.శివప్రసాద్ రెడ్డి వివరించారు. అసిస్టెంట్ కమాండెంట్ జె.రాజేందర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వడదెబ్బతో యువకుడి మృతి కాజీపేట : కాజీపేట మండలం సోమిడికి చెందిన నాగపూరి మురళీధర్ గౌడ్ (35) వడదెబ్బతో మృతి చెందాడు. బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మురళీధర్ గౌడ్ రాత్రి ఇంటికి చేరుకున్న అనంతరం అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబీకులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం తెల్ల వారుజామున మృతి చెందాడు. దేవరుప్పులలో వృద్ధుడు.. పాలకుర్తి టౌన్(దేవరుప్పుల): దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన కొత్త శ్రీనివాస్రెడ్డి(70) వడదెబ్బతో గురువారం మృతి చెందాడు. శ్రీనివాస్రెడ్డి రేకుల ఇంట్లో రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. -
‘అడ్వాన్స్’గా భోంచేశారు!
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని హాస్టళ్ల మెస్ల నిర్వహణలో నిధులను ముందస్తు చెల్లింపుల పేరిట భోంచేసినట్లు తెలుస్తోంది. గత డైరెక్టర్ హయాంలో అడ్వాన్స్ల రూపంలో రూ.30లక్షలకు పైగానే చెల్లించినట్లు విచారణ కమిటీ గుర్తించింది. దీనిపై గత హాస్టళ్ల డైరెక్టర్తోపాటు మరికొందరికి రిజిస్ట్రార్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. కామన్మెస్లో గత ఏడాదిలో ఒక్కసారిగా బిల్లులు పెరిగిపోవడంతో విద్యార్థులకు అనుమానం వచ్చి విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో గత ఏడాది నవంబర్ 29న ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్ ఎన్.ప్రసాద్ చైర్మన్గా విచారణ కమిటీని వీసీ ప్రతాప్రెడ్డి ఆదేశాలతో రిజిస్ట్రార్ రామచంద్రం వేశారు. పది నెలలకు సంబంధించిన మెస్బిల్లులను పరిశీలించాలని ఆదేశించగా ఆ కమిటీ హాస్టళ్ల డైరెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి విచారణ జరిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 19న నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా బాధ్యులైన వారిని గుర్తించి తగిన చర్యలు సూచించేందుకు వివిధ బిల్లుల పరిశీలనకు మరో విచారణ కమిటీని గత మార్చి 4న నియమించారు. యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి.మనోహర్ చైర్మన్గా ఉన్న ఈ కమిటీ.. నిధుల వినియోగంలో ఏమేమి అవకతవకలు జరిగాయి, బాధ్యులెవరు, ఎలాంటి చర్యలు తీసుకోవాలో పూర్తి నివేదిక ఇవ్వాలని రిజిస్ట్రార్ రామచంద్రం ఆదేశించారు. ఇష్టారాజ్యంగా అడ్వాన్స్లు కాకతీయ యూనివర్సిటీలోని హాస్టళ్ల డైరెక్టర్ కార్యాలయంలో గత డైరెక్టర్ హయాంలో హాస్టళ్ల, మెస్లకు కలిపి 20మందికిపైగా జాయింట్ డైరెక్టర్లు ఉన్నారు. వీరికి అడ్వాన్స్ల రూపంలో డబ్బులు చెల్లించారు. మరో నలుగురు కేర్టేకర్లకు కూడా అడ్వాన్స్లు చెల్లించారు. ఈ అడ్వాన్స్లు హాస్టళ్ల, మెస్ల నిర్వహణ కోసమని ఇచ్చారు. ముఖ్యంగా జాయింట్ డైరెక్టర్లకు రూ.50వేల నుంచి రూ.2లక్షలకుపైగా అడ్వాన్స్లు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. ఒక్కో జాయింట్ డైరెక్టర్కు ఎంతెంత అడ్వాన్స్ల రూపంలో చెల్లించారనేది విచారణ కమిటీ గుర్తించినట్లు సమాచారం. ఇలా మొత్తం రూ.30లక్షలకు పైగానే చెల్లించినట్లు విచారణ కమిటీ గుర్తించినట్లు తెలిసింది. అడ్వాన్స్లు తీసుకొని వ్యయం చేసినట్లు సెటిల్మెంట్లు చేయడంలో ఎక్కువ శాతం మంది జాయింట్ డైరెక్టర్లు, నలుగురు కేర్టేకర్లు జాప్యం చేశారనే ఆరోపణలున్నాయి. కొందరు సమర్పించిన సెటిల్మెంట్ల బిల్లులు సరిగా లేవనే అరోపణలున్నాయి. ఏ అవసరం ఉందో వాటికి అడ్వాన్స్ల రూపంలో డబ్బులు చెల్లించాక జాయింట్ డైరెక్టర్లు/ కేర్టేకర్లు ఆయా డబ్బులను ఖర్చు చేసి బిల్లులు సమర్పించాకే మరో అడ్వాన్స్ ఇవ్వాల్సింటుంది కానీ, అడ్వాన్స్ సెటిల్చేయకున్నా కొత్తగా అడ్వాన్స్లు ఇచ్చుకుంటూ పోవడంలో ఆంతర్యమేమిటి అనేది చర్చగా ఉంది. హాస్టళ్ల డైరెక్టర్ నుంచి వివరాల సేకరణ ప్రొఫెసర్ మనోహర్ విచారణ కమిటీ గత హాస్టళ్ల డైరెక్టర్ను పిలిపించి విచారణ జరిపింది. కమిటీ అడిగిన పలు ప్రశ్నలకు ఆ డైరెక్టర్ లిఖిత పూర్వకంగా సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా జాయింట్ డైరెక్టర్లు, కేర్ టేకర్లకు అడ్వాన్స్లు ఇచ్చిన విషయంతోపాటు అదనపు కార్మికుల అనుచిత వినియోగం, మరికొన్ని అంశాలను అడిగినట్లు తెలిసింది. విచారణ కమిటీ మే 11న కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రానికి నివేదిక అందజేసింది. హాస్టళ్ల, మెస్ల నిర్వహణ, అడ్వాన్స్లపై నియంత్రణ లేకపోవడం, ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. నివేదికను వీసీ, రిజిస్ట్రార్ పరిశీలించారు. దీంతో బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది యూనివర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. 18మందికి షోకాజ్ నోటీసుల జారీ కాకతీయ యూనివర్సిటీలోని గత హాస్టళ్ల డైరెక్టర్, ప్రస్తుత హాస్టళ్ల ఆఫీస్ సూపరింటెండెంట్, 12మంది హాస్టళ్ల జాయింట్ డైరెక్టర్లు, నలుగురు కేర్టేకర్లకు రిజిస్ట్రార్ రామచంద్రం ఈ నెల 2న షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా జాయింట్ డైరెక్టర్లు / కేర్టేకర్లు అడ్వాన్స్లుగా తీసుకున్న నిధుల వినియోగంలో సరైన లెక్కలు చూపడంలో విఫలమైనందున, ఆర్థిక ధ్రువీకరణ విధానాలను ఉల్లంఘించినందుకు మీపైన ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదో లిఖితపూర్వకంగా ఏడు పనిదినాల్లో వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. నిర్దిష్ట గడువులోపు వివరణ ఇవ్వకపోతే ఆరోపణలు అంగీకరించినట్లుగా పరిగణించి తదుపరి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. గత డైరెక్టర్, ప్రస్తుత హాస్టళ్ల ఆఫీస్ సూపరింటెండెంట్ కూడా ఏడు పనిదినాల్లో వివరణ సమర్పించాల్సి ఉంటుంది. కేయూ హాస్టళ్ల మెస్ల నిర్వహణలో అవకతవకలు ఇష్టారాజ్యంగా ముందస్తు చెల్లింపులు రెండు విచారణ కమిటీల నివేదికలు అందజేత హాస్టళ్ల గత డైరెక్టర్తో సహా 18మందికి షోకాజ్ నోటీసుల జారీ -
మన కేంద్ర మంత్రులు నిధులు తీసుకురాలేని దద్దమ్మలు
స్టేషన్ఘన్పూర్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రూపాయి కూడా అదనపు నిధులు తీసుకురాలేని చేతగాని దద్దమ్మలు మన కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఘన్పూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఎన్నో ఏళ్లుగా కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుయే ప్రధాని మోదీకి, బీజేపీ నేతలు ఇష్టం లేదని, మొదటి నుంచి తెలంగాణ అభివృద్ధికి ఆటంకాలు సృష్టించడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందన్నారు. కిషన్రెడ్డి, సంజయ్ కేంద్ర మంత్రులుగా ఉండి తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు అయినా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని తెలంగాణ ద్రోహి అని సంబోధించడం ఆయన అహంకారానికి నిదర్శమని విమర్శించారు. సమావేశంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్కుమార్, వైస్ చైర్మన్ నీల రాజమ్మగట్టయ్య తదితరులు పాల్గొన్నారు. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో ఈ నెల 5వ తేదీ నుంచి జరిగే పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కె.అనిల్కుమార్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశామని, మొత్తం 97మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షలు పారదర్శకంగా, ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, సీసీ కెమెరాల మధ్య పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్ష కేంద్రం వద్ద జిరాక్స్ సెంటర్లకు అనుమతి లేదని, 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ ఆఫీసర్ నాగలక్ష్మి, డీఈఓ సత్యనారాయణమూర్తి, ఏసీజీఈ మందుల శ్రీరాములు, సెక్షన్ ఇన్చార్జ్ శ్రీకాంత్ తదితరలు పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
● డీఏఓ ఎస్.విజయచంద్ర మహబూబాబాద్ రూరల్ : రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని డీఏఓ ఎస్.విజయచంద్ర హెచ్చరించారు. విత్తనాలు, ఎరువుల డీలర్లతో విత్తన విక్రయాలపై వ్యవసాయశాఖ, పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రైతు వేదికలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలను బిల్లుతో విక్రయించాలని సూచించారు. డీలర్లు వ్యవసాయ శాఖ జారీ చేసిన సీడ్ లైసెన్స్లను ధ్రువీకరించుకోవాలన్నారు. స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్కులు, స్టాక్ బోర్డు, ధర పట్టికలను షాపుల్లో ఏర్పాటు చేయాలని, ఎమ్మార్పీ కంటే ఎక్కువ అమ్మితే డీలర్ల లైసెన్స్లను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎరువుల క్రయవిక్రయాలను ఈపాస్ మిషన్లో నమోదు చేయాలని, ఈపాస్ మిషన్ ద్వారా మాత్రమే రైతులకు విక్రయించాలన్నారు. ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు, టౌన్, రూరల్ సీఐలు రఘుపతిరెడ్డి, అంజలి, రూరల్ ఎస్సై రవికిరణ్, టెక్నికల్ ఏఓ రాంజీనాయక్, ఏఓ నారెడ్డి తిరుపతిరెడ్డి, మండల డీలర్ల అధ్యక్షుడు వక్కల శ్రీనివాస్, విత్తన, ఎరువుల డీలర్లు పాల్గొన్నారు. -
వార్డు సభలను సద్వినియోగం చేసుకోవాలి
● మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి మహబూబాబాద్: వార్డు సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మానుకోట మున్సిపల్ చైర్పర్సన్ గుగులోతు జ్యోతి అన్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం పట్టణంలో 7,8,19,20వ వార్డులకు సంబంధించి వార్డు సభ నిర్వహించారు. ఈసందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. ఇంకుడు గుంతల ఏర్పాటుతో భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. పారిశుద్ధ్యం, తాగునీరుపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. నీటి నిల్వలు లేకుండా చూడాలని, వాటి వల్ల దోమల సంఖ్య పెరిగి ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలన్నారు. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని కోరారు. ప్రజల సహకారంతోనే సమస్యలు పరిష్కారం కావడంతో పాటు అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ సూర్నపు సోమయ్య, కమిషనర్ వినోద్కుమార్, కౌన్సిలర్లు బుజ్జి, నీరుటి హైమా, బానోత్ పార్వతి, చిదిరాల అరుణ, తదితరులు పాల్గొన్నారు. -
నేను గీసిన బొమ్మ
పట్టుకుంటే ఔట్.. ఒకప్పుడు నలుగురు బాలబాలికలు కలిస్తే చాలు కుంటుడు ఆట ఆడేవారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆ ఆటను పూర్తిగా మరిచిపోయారు. కానీ ప్రస్తుత కాలంలో కొందరు గ్రామీణ, పట్టణ ప్రాంత వాసులు తమ పిల్లలకు నాటి ఆటలు నేర్పిస్తుండడం విశేషం. ఒక కాలును పైకి లేపి ప ట్టుకుని మరో కాలుతో కుంటుతూ మిగతా పిల్ల లను పట్టుకోవడాన్ని ఔట్గా పిలుస్తారు. కుంటుకుంటూ వచ్చే వ్యక్తిని తప్పించుకోవడం ఈ ఆటలో ప్రధానం. –కాజీపేట హైదరాబాద్ అద్భుతంగా ఉంది మండలంలోని పాతదుబ్బతండాకు చెందిన భార్గవి, పూజ, రేవంత్ డోర్నకల్ సెయింట్ ఆగ్నేస్ పాఠశాలలో 9, 10వ తరగతి చదువుతున్నారు. వేసవి సెలవుల సందర్భంగా ఇటీవల హైదరాబాద్లోని చార్మినార్, గోల్కొండ కోట, ట్యాంక్బండ్, లుంబినీ పార్క్, అంబేడ్కర్ విగ్రహం తదితర ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. –డోర్నకల్ -
పాముకాటుతో మహిళ మృతి
గీసుకొండ: ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుని గృహ ప్రవేశం చేసిన మరుసటి రోజే ఆ పేదింటి కుటుంబంలో విషాదం నెలకొంది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఊకల్ హవేలి గ్రామానికి చెందిన కట్ట సునీత(38) పాముకాటుతో మృతి చెందింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కట్ట సునీత, దేవేందర్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కూలీ పని చేస్తూ జీవనం కొనసాగించే వారు ఇటీవల ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నారు. గత నెల 29న గృహ ప్రవేశం చేసి ఇంట్లోలోనే నిద్రించారు. మిగిలిన అన్నం గిన్నెను బయట పెట్టడానికి మరుసటి రోజు(30వ తేదీన) ఉదయం సునీత బయటకు వచ్చి కుప్పగా పోసిన ఇటుకల వద్దకు వెళ్లగా అక్కడ ఉన్న పాము కాటేసింది. దీంతో ఆమెను వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలి భర్త దేవేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గీసుకొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. ● గృహప్రవేశం చేసిన మరుసటి రోజే ఘటన.. -
మా పోరాటం లంబాడీలపై కాదు.. పాలకులపై
కొత్తగూడ: ఆదివాసీల పోరాటం లంబాడీలపై కాదని వారిని చట్ట విరుద్ధంగా ఎస్టీ జాబితాలో చేర్చిన పాలకులపై అని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోరు కేక బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మహారాష్ట్రలో బీసీలు, ఛత్తీస్గఢ్లో ఎస్సీలుగా ఉన్న లంబాడీలను ఎమర్జెన్సీ సమయంలో ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఓ జీఓ ద్వారా ఎస్టీ జాబితాలో కలిపారని ఆరోపించారు. దీని ద్వారా తెలంగాణ ప్రాంతంలోకి వలసలు పెరిగాయన్నారు. దీంతో ఆదివాసీలు విద్య, ఉద్యోగం, రాజకీయ, వనరుల దోపిడీకి గురవుతున్నారన్నారు. దీనిపై జూన్ 30 లోగా ముఖ్యమంత్రి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తుడుందెబ్బ స్వయంగా చట్టాల అమలుకు పూనుకుంటుందని హెచ్చరించారు. గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి నీరు, ఇసుక మైదాన ప్రాంతాలకు తరలిస్తున్నారన్నారు. వాటిని దిగ్భందించేందుకు కూడా వెనుకాడబోమన్నారు. రిజర్వేషన్ సమస్య పరిష్కారానికి జ్యుడీషియల్ కమిషన్ నియమించి ఏజెన్సీ గ్రామాల ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా ఏజెన్సీ ప్రాంతంలో వడ్డీ వ్యాపారులపై సుమోటోగా కేసు నమోదు చేసి ఆదివాసీ సమాజాన్ని కాపాడాలని కోరారు. సభలో నాయకులు చుంచు రామకృష్ణ, సిద్ధబోయిన లక్ష్మీనారాయణ, ఈసం సుధాకర్, కల్తి వీరస్వామి, కుర్సం సీతారాం, దాట్ల నాగేశ్వరరావు, పొడెం బాబు, నిమ్మక సింహసనం, వంశీకృష్ణ, గోప వీరయ్య, సువర్నపాక పాపారావు, వట్టం సాయిలు, సుంచ సారయ్య తదితరులు పాల్గొన్నారు. పోలీసుల దిగ్బంధంలో కొత్తగూడ.. తుడుందెబ్బ పోరు కేక బహిరంగ సభను అడ్డుకుంటామని లంబాడీ నాయకుల హెచ్చరికల నేపథ్యంలో డీఎస్పీ తిరుపతి రావు ఆధ్వర్యంలో పోలీసులు కొత్తగూడ మండల కేంద్రాన్ని దిగ్బంధించారు. ముందస్తుగా వర్తక, వ్యాపార సంస్థలను బంద్ చేయించారు. బహిరంగ సభ స్థలంలోకి ఇతరులు రాకుండా తనిఖీలు చేపట్టారు. ముఖ్యమంత్రి స్థాయిలో భద్రతాఏర్పాట్లు చేశారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలి తుడుందెబ్బ పోరు కేక సభలో వక్తల డిమాండ్ -
విద్యార్థుల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
మహబూబాబాద్: విద్యార్థుల నమోదు తక్కువగా ఉన్న పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రిన్సిపల్ సెక్రటరీ హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, డీఈఓలు, సంబంధిత అధికారులతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, బోధన తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈసందర్భంగా యోగితా రాణా మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు గ్రామాల్లో ప్రతీ ఒక్కరిని భాగస్వామ్యం చేయాలన్నారు. విద్యార్థులు చదవడం, రాయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రీ ప్రైమరీ పాఠశాలలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ స్నేహ శబరీష్, డీఈఓ సత్యనారాయణ మూర్తి, డీఐఈఓ మదార్ తదితరులు పాల్గొన్నారు. వీసీలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా -
ఆస్తి కోసం తమ్ముడిపై హత్యాయత్నం
పాలకుర్తి టౌన్: భూవివాదం, తగాదాల నేపథ్యంలో సొంత తమ్ముడిని చంపడానికి ఓ అన్న సుపారీ ఏర్పాటు చేసి హత్యాయత్నం చేయించాడు. ఈ కేసును పోలీసులు వేగంగా ఛేదించి ఆరుగురిని అరెస్ట్ చేశారు. బుధవారం పాలకుర్తి పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలను వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య వెల్లడించారు. పాలకుర్తి మండలంలోని శాతాపురం గ్రామానికి చెందిన తీగల ధర్మారావు స్టేషన్ఘన్పూర్ మండల కేంద్రంలో ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి గ్రామంలో వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిపై అతడి అన్న కిషన్రావు కన్నేశాడు. ధర్మారావుకు సంతానం లేకపోవడంతో అతడి అడ్డు తొలగిస్తే భూమి తమ సొంతమవుతుందని భావించాడు. అన్న కిషన్రావు కుమారుడు కిరణ్ తన స్నేహితుడు గీతేశ్వర్ ద్వారా రూ.15 లక్షలకు సుపారీ ఒప్పందం కుదుర్చుకుని హత్యకు డీల్ కుదుర్చుకున్నాడు. రూ.25వేలు అడ్వాన్స్, షూరిటీ కింద కిరణ్ భూమి పత్రాలు, ఖాళీ చెక్కులు, ఖాళీ బాండ్ పేపర్లు తీసుకున్నారు. సుపారీ గ్యాంగ్ సోనుతో పాటు తూముల గీతేశ్వర్, ద్వాప సంజయ్, కసప్ శ్రీకాంత్, వేముల హర్షిత్తో కలిసి ధర్మారావు కదలికలపై మూడుసార్లు స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. మే 27న రాత్రి పనులు ముగించుకొని ధర్మారావు 9గంటల సమయంలో పాలకుర్తి చేరుకున్నాడు. అప్పటికే కారులో మాటువేసిన సుపారీ గ్యాంగ్ నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న ధర్మారావును కత్తితో కడుపు, వీపు, ఛాతిపై విచక్షణరహితంగా పొడిచారు. అటువైపు జనం వస్తుండడంతో భయపడిన నిందితులు కారులో పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ధర్మారావును స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించగా కోలుకుంటున్నాడు. ఈ ఘటనపై ఽధర్మారావు భార్య తీగల మౌనిక ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు కేసును ఛేదించారు. హత్యాయత్నానికి అతడి సోదరుడు కిషన్రావు, అతడి కుమారుడు కిరణ్తో కొనసాగుతున్న భూతగాదాలే కారణమని పోలీసులు తేల్చారు. హత్యకు స్కెచ్ వేసిన కిషన్రావు, కిరణ్తో పాటు ఘటనలో పాలొన్న సుపారీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి కత్తి, కారు, భూపత్రాలు, చెక్కులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు త్వరితగతిన ఛేదించిన సీఐ జానకీరాంరెడ్డి, ఎస్సై పవన్ కుమార్, ఐడీ అసిస్టెంట్ అనలిస్ట్ సల్మాన్, హెడ్ కానిస్టేబుల్ గోలి సోమిరెడ్డి, పోలీస్ సిబ్బంది రమేశ్, రాజ్కుమార్, రవి, సురేశ్, యాకయ్య, ప్రశాంత్లను ఏసీపీ నర్సయ్య అభినందించారు. సుపారీ గ్యాంగ్తో సోదరుడి ఒప్పందం గత నెల 27న కత్తితో దాడి.. కోలుకుంటున్న బాధితుడు ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు -
రైతు సంక్షేమమే పాలకవర్గ ధ్యేయం
ఖిలా వరంగల్: మార్కెట్ అభివృద్ధితోపాటు రైతు సంక్షేమమే పాలకవర్గ ధ్యేయమని, రైతులకు మెరుగైన సేవలందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఏనుమాముల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎర్ర ప్రియాంక అన్నారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కు 18 మందితో కూడిన పాలక వర్గాన్ని మంగళవారం రాత్రి ప్రభుత్వం ప్రకటించింది. చైర్పర్సన్గా ఎర్ర ప్రియాంక, వైస్ చైర్మన్గా బండి జనార్దన్, సభ్యులుగా గాదరబోయిన రాజు, కందుకూరి పూర్ణచందర్, చల్ల వాసుదేవ రెడ్డి, గొడుగు భిక్షపతి, బాదావత్ నర్సింహ నాయక్, ఆకుల రుద్రప్రసాద్, బొడ్డు ప్రదీప్ కుమార్, కత్తి సంపత్, మహమ్మద్ సాబీరా, అచ్చ నాగరాజు, దుగ్యాల గోపాల్ రావు, గజ్జెల శ్యామ్ సుందర్, హసన్పర్తి పీఏసీఎస్ చైర్మన్, డిస్ట్రిక్ మార్కెటింగ్ అధికారి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వరంగల్, బల్దియా మేయర్తో కలిపి 18 మందితో నూతన పాలక వర్గం ఏర్పడింది. ఈ మేరకు వరంగల్ మార్కెట్ పరిపాలన భవనంలో బుధవారం చైర్ పర్సన్ ఎర్ర ప్రియాంక, వైస్ చైర్మన్ బండి జనార్దన్, డైరెక్టర్లు గజ్జెల శ్యామ్ సుందర్, దుగ్యాల గోపాల్రావు తదితరులు బాధ్యతలు స్వీకరించారు. నూతన కార్యవర్గాన్ని మార్కెట్ అధికారులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ ప్రియాంక -
వీరన్న సన్నిధిలో పూజలు
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని డైరెక్టర్ ప్రొటోకాల్ జీఏడీ శివలింగయ్య(ఐఏఎస్) దంపతులు బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ ఈఓ సత్యనారాయణ, చైర్మన్ కొర్ను రవీందర్రెడ్డి స్వాగతం పలికారు. వారు ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేశారు. స్వామివారిని దర్శించుకున్నారు. వారి పేర అర్చకులు గోత్రనామార్చనలు నిర్వహించారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ, సర్పంచ్ బాదావత్ లక్ష్మీరాజునాయక్, పంచాయతీ కార్యదర్శి రాజేశ్, జీపీఓ జుంకీలాల్, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు సీహెచ్.శ్రీనివాస్ ఉన్నారు. గర్భిణులకు అవగాహన కల్పించాలిదంతాలపల్లి: గర్భిణులకు ఎండ తీవ్రతపై వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశకార్యకర్తలు అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధీర్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని వైద్యశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని గర్భిణులు, ప్రజలకు తగిన వైద్యం చేయాలన్నారు. ఎండదెబ్బతో వచ్చినవారికి వెంటనే పరీక్షలు నిర్వహించి తగిన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం ఆస్పత్రిలో సుఖ ప్రసవాల సంఖ్య పెంచాలని, గర్భం దాల్చిన వారి పేర్లు వెంటనే నమోదు చేసుకోవాలని తెలిపారు. అనంతరం ఆస్పత్రిలో రిజిస్టర్లను పరిశీలించి సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో వైద్యాధికారి కవిత, సిబ్బంది పాల్గొన్నారు. పథకాల అమలులో అగ్రస్థానంలో నిలపాలిమహబూబాబాద్ రూరల్: పథకాల అమలులో రాష్ట్రంలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని డీఏఓ ఎస్.విజయచంద్ర అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న పథకాలపై మహబూబాబాద్ పట్టణంలోని రైతు వేదికలో వ్యవసాయ సహాయ సంచాలకులు, వ్యవసాయ అధికారులు, ఏఈఓలతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. పథకాల అమలులో ప్రత్యేక దృష్టి పెట్టాలని, రైతులకు అందుబాటులో ఉంటూ నకిలీ విత్తనాల మీద రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయశాఖ అమలు చేస్తున్న రైతు బీమా, రైతుబంధు, ఫార్మర్ రిజిస్ట్రీ, పీఎం కిసాన్, క్వాలిటీ కంట్రోల్, వరి కొయ్యలను కాల్చడంపై కలిగే నష్టాలను రైతులకు వివరించాలన్నారు. పంట మార్పిడి వల్ల కలిగే ప్రయోజనాలు, ఆయిల్ పామ్ పంట వల్ల రైతులకు కలిగే లాభాలు, పచ్చిరొట్ట ఎరువుల వల్ల కలిగే ప్రయోజనాలు, ఖేతీ బచావో ఉపయోగాలను రైతులకు తెలియజేయాలన్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించడం, నానో యూరి యా వాడకాన్ని పెంచడం, పురుగుమందుల వాడకాలు తగ్గించాలని రైతులకు వివరించాలని సూచించారు. సమావేశంలో జిల్లా ఉద్యాన అధికారి జినుగు మరియన్న, డివిజన్ సహాయ సంచాలకుడు అజ్మీరా శ్రీనివాసరావు, మరిపెడ ఇన్చార్జ్ ఏడీఏ శ్రీదేవి, డీఏఓ కార్యాలయ టెక్నికల్ ఏడీఏ మురళి తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు గిరిజన మహిళల అనుమానాస్పద మృతి
మరిపెడ రూరల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యతండాలో మంగళవారం రాత్రి ఇద్దరు గిరిజన మహిళల అనుమానాస్పద మృతి జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది. స్నేహితురాళ్లయిన మాలోతు శారద (40), మాలోతు నీల (42) ఒకే మద్యం బాటిల్లోని మద్యం సేవించి అనంతరం అస్వస్థతకు గురై మృతి చెందడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మూడు రోజుల క్రితం మాలోతు శారద తన కుమారుడు తిరుపతితో కలిసి సూర్యాపేటలోని బంధువుల ఇంటికి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో సూర్యాపేటలోనే ఒక బీరు, ఓ బ్రాండ్ క్వార్టర్ బాటిల్ మద్యాన్ని కొనుగోలు చేసింది. కుమారుడు బీరు సేవించగా, శారద కొంత మద్యం తాగి మిగిలినదాన్ని ఇంటికి తీసుకువచ్చింది. మంగళవారం సాయంత్రం స్నేహితురాలైన నీలతో కలిసి మిగిలిన మద్యాన్ని తాగారు. ఇద్దరు మాట్లాడుకుంటున్న క్రమంలో కొద్ది సేపటికే అపస్మారక స్థితికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు మొదట ఇద్దరికి చెడుగాలి సోకిందేమోనని ఓ ఆటోలో స్థానిక భూత వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అక్కడినుంచి కురవి మండలం చింతపల్లిలోని మరో భూత వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా, పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో 108 వాహనంలో మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే ఇద్దరు మృతిచెందినట్లు నిర్ధారించారు. విష ప్రయోగం కోణంలో అనుమానాలు ఇద్దరు మహిళలు ఒకే మద్యం సేవించిన అనంతరం అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోవడంతో మద్యంలో విషపదార్థం ఏమైనా కలిసిందా? లేక కల్తీ మద్యం కారణమా? అనే అనుమానాలు వారి ఇరువురి కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం మరో కోణంలో వడదెబ్బగా భావిస్తున్నారు. మద్యం సేవిస్తున్న క్రమంలో మాలోతు నీలకు సన్స్ట్రోక్ వచ్చి అపస్మారక స్థితిలో పడిపోగా మరో మహిళ మాలోతు శారద భయంతో బీపీ పెరిగిపోయి ఇద్దరు మృత్యువాత పడి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుల ఇళ్లలో వరుస విషాదాలు.. శారద భర్త బాబురావు ఆరు నెలల క్రితం అనారోగ్యంతో మరణించగా, ఆమె ఇద్దరు కుమారులతో ఉన్నారు. మరోవైపు నీల చిన్నకుమారుడు లోకేశ్ మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ప్రస్తుతం భర్త భావ్సింగ్, కుమారుడు వెంకటేష్ ఉన్నాడు. ఒకే తండాకు చెందిన ఇద్దరు మహిళ స్నేహితులు మృత్యువులోని వారి స్నేహబంధం వీడలేదని పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసుల దర్యాప్తు.. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మరిపెడ పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మిగిలిన మద్యాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే వారి మరణాలకు అసలు కారణం వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విష ప్రయోగమా..? కల్తీ మద్యమా.. వడదెబ్బ వల్లనా.. మరేమైనా కారణమా..? దర్యాప్తు చేస్తున్న మరిపెడ పోలీసులు -
ఎన్సీసీతో విద్యార్థుల్లో క్రమశిక్షణ
రామన్నపేట : ఎన్సీసీతో విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి పెంపొందుతాయని పదో తెలంగాణ బెటాలియన్ అడ్మినిస్ట్రేవ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ రవి సునారే అన్నారు. బుధవారం నగరంలోని ఎల్బీ కళాశాల ఆడిటోరియంలో వరంగల్ పదో తెలంగాణ బెటాలియన్ ఆర్మీ వింగ్ ఆధ్వర్యంలో ఎన్సీసీ –2026 ‘ బి సర్టిఫికెట్’ పూర్తి చేసిన ఉమ్మడి వరంగల్ ఎన్సీసీ కేడెట్లకు బెటాలియన్ కమాండింగ్ అధికారి కల్నల్ ఎస్ఎస్ రామదురై పర్యవేక్షణలో సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎన్సీసీ రెండు సంవత్సరాల కోర్స్ పూర్తి చేసి పాసై ‘ బి ’ సర్టిఫికెట్ పొందిన కేడెట్లకు ఆర్మీలో ప్రవేశించడానికి రాజమార్గమని తెలిపారు. కాగా, 355 మంది కేడెట్లు ఉత్తీర్ణత సాధించి సర్టిఫికెట్లు పొందినట్లు ఎల్బీ కళాశాల ప్రిన్సిపాల్ అరుణ డీఎహెచ్రావు తెలిపారు. కెప్టెన్ ముండ్రాతి సదానందం, నాయబ్ సుబేదారి అనిల్ జాదవ్, బెటాలియన్ హవల్దార్ మేజర్ బెటా గేరికరూ సందీప్, లెఫ్టినెంట్ విష్ణువర్ధన్ రెడ్డి, ట్రైనింగ్ విభాగం ఇన్చార్జ్ కుమారస్వామి, హవల్దార్లు విష్ణు, నిషాద్, నిక్లేష్, రాజేందర్, ఈశ్వర్ పాల్గొన్నారు. లెఫ్టినెంట్ కల్నల్ రవి సునారే -
వడదెబ్బతో ఇద్దరి మృతి
చిట్యాల/గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జూకల్కు చెందిన రైతు మాశబో యిన రాజయ్య (65) బుధవారం ఉదయం చల్లగరిగ శివారులో మొక్కజొన్న సొప్ప కాల్చేందుకు వెళ్లాడు. మధ్యాహ్నం ఎండ తీవ్రతతో తీవ్ర అస్వస్థతకు గురై పక్కనే ఉన్న చెట్టుకింద స్పృహతప్పి పడ్డాడు. గమనించిన సమీప రైతులు కుటుంబీకులకు సభ్యులకు సమాచారం అందించగా వారు వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక సివిల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కాగా, రాజయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. అలాగే, గణపురం మండలం కర్కపల్లి గ్రామానికి చెందిన గాదె అంజయ్య(45) గ్రామాల్లో తిరుగుతూ పండ్ల వ్యాపారం చేస్తాడు. ఈ క్రమంలో బుధవారం పలు గ్రామాలకు వెళ్లి వ్యాపారం చేసి సాయంత్రం ఇంటి వద్దకు వచ్చి అస్వస్థతకు గురై మృతి చెందాడు. -
సర్వీస్ రికార్డే కీలకం..!?
పోలీస్శాఖలో కొత్త ఫార్ములా.. ● పోస్టింగ్ల ‘రాజకీయా’నికి డీజీపీ బ్రేక్ ● ‘సేఫ్ పోస్టింగ్’లకు ‘డిప్యుటేషన్’తో చెక్.. లూప్లైన్ డ్యూటీలు ఇక తప్పనిసరి ● ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల కంటే డీజీపీ రూల్సే పవర్ఫుల్ ● ఒకేచోట ఉంటే కూడా ఔట్... పోలీస్వర్గాల్లో కలకలంసాక్షిప్రతినిధి, వరంగల్: పోలీస్శాఖలో తప్పనిసరి డిప్యుటేషన్ విధానం మళ్లీ అమల్లోకి రాబోతుంది. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ కొత్త నిబంధనలను అమలు చేసే పనిలో పడ్డారు. పోలీస్ అధికారి ఇకపై ప్రమోషన్కు ముందు.. తర్వాత కనీసం రెండేళ్లయినా డిప్యుటేషన్పై లూప్లైన్ పోస్టింగుల్లో పనిచేయాల్సిందే. గతంలోనూ ఈ నిబంధనలున్నా.. రాజకీయ పలుకుబడి, పైరవీల కారణంగా అమలు కాలేదు. చాలామంది సబ్ ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీ/ఏసీపీల వరకు శాంతిభద్రతల విభాగంలోనే కొనసాగుతూ వస్తున్నారు. డీజీపీ కొత్త ఫార్ములా అమల్లోకి వస్తే డిప్యుటేషన్పై ఇతర యూనిట్లలో పనిచేసిన వారికి ప్రాధాన్యత దక్కనుంది. సిఫార్సులు కాకుండా సర్వీస్ రికార్డులు ప్రామాణికంగా పదోన్నతులు, పోస్టింగ్లు దక్కనున్నాయన్న చర్చ ఆ శాఖలో హాట్టాపిక్గా మారింది. బదిలీ లేదా డిప్యుటేషన్.. పలువురు అధికారులకు ఎఫెక్ట్.. వరంగల్ పోలీస్ కమిషనరేట్తో పాటు ములుగు, మహబూబాబాద్, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లో పలువురిపై బదిలీ లేదా డిప్యుటేషన్ వేటు తప్పేట్టులేదు. డీఎస్పీ, ఏసీపీ, సీఐ, ఎస్ఐ స్థాయిలో పనిచేస్తున్న అధికారులు గణనీయ సంఖ్యలో ఐదేళ్లకు పైగా ఒకే ప్రాంతంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. డీఎస్పీ/ఏసీపీలు 10–15 మంది, సీఐలు 30 మందికిపైగా, ఎస్ఐలు 40–50 మంది వరకు ఉండగా, కొత్త విధానం అమలైతే వీరంతా బదిలీ, డిప్యుటేషన్ పరిధిలోకి వచ్చే అవకాశముందని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. సీఐ, డీఎస్పీ/ఏసీపీలుగా పనిచేస్తున్న పలువురు రెండు నుంచి మూడు ప్రమోషన్లు పొందినా.. చాలామంది సీఐడీ, డీసీఆర్బీ, పీసీఆర్, పీటీసీ, సీటీసీ, ఇంటెలిజెన్స్ తదితర లూపులైన్ విభాగాలవైపు కన్నెత్తయినా చూడలేదు. దీంతో డీజీపీ కొత్త నిర్ణయంతో ఉమ్మడి వరంగల్లో చాలామందికి డిప్యుటేషన్లు తప్పవన్న చర్చ జరుగుతోంది. కుటుంబం, పిల్లల విద్య, స్థానిక అనుబంధాల కారణంగా కొందరు సీనియర్ అధికారులు డిప్యుటేషన్లు, బదిలీల నిర్ణయంపై ఆందోళన చెందుతుండగా, కీలక పోస్టింగ్ల కోసం ఎదురుచూస్తున్న యువ అధికారులు మాత్రం స్వాగతిస్తున్నారు. ఒకే వర్గం అధికారుల ఆధిపత్యానికి చెక్ పడి కీలక పోస్టుల్లో కొత్తవారికి అవకాశాలు లభిస్తాయని, ఫీల్డ్, లాఅండ్ఆర్డర్, ఇంటెలిజెన్స్, ట్రాఫిక్ విభాగాల్లో అనుభవం, పోస్టింగ్లలో పారదర్శకత పెరిగే అవకాశం ఉంటుందని వారంటున్నారు. లూప్లైన్ విధులు తప్పనిసరి.. దీర్ఘకాలికంగా శాంతిభద్రతల విభాగంలో పనిచేసే అధికారులకు లూప్లైన్ పోస్టింగ్లు తప్పనిసరి కానుంది. ఇప్పటివరకు పట్టణ పోలీస్ స్టేషన్లు, ట్రాఫిక్, టాస్క్ఫోర్స్, ప్రత్యేక విభాగాల పోస్టింగులలో రాజకీయ ప్రభావం కీలక పాత్ర పోషించేదన్న అభిప్రాయం ఉంది. కొత్త విధానం అమలైతే ఒకేచోట ఎక్కువకాలం కొనసాగడం కష్టమవడంతోపాటు సిఫార్సుల ప్రభావం కూడా తగ్గే అవకాశముంది. ఒకే కమిషనరేట్, జిల్లా లేదా ప్రత్యేక విభాగంలో ఐదేళ్లకు పైగా కొనసాగుతున్న అధికారులను ఇతర యూనిట్లు, జిల్లాలు లేదా విభాగాలకు పంపడం అనివార్యం కానుంది. ఇకపై పోస్టింగ్లలో వ్యక్తిగత సిఫార్సుల కంటే సర్వీస్ రికార్డు, పనితీరు, పరిపాలనా అవసరాలకే ప్రాధాన్యం లభించే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. -
బిలాస్పూర్– యెలహంక మధ్య ప్రత్యేక రైళ్లు
కాజీపేట రూరల్ : వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాజీపేట జంక్షన్ మీదుగా బిలాస్పూర్– యెలహంక మధ్య అప్ అండ్ డౌన్లో 10 ప్రత్యేక రైళ్ల సర్వీస్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ బుధవారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. ఈ నెల 3 నుంచి జూలై 1వ తేదీ వరకు 5 సర్వీ స్లుగా బిలాస్పూర్–యెలహంక (08261) ఎక్స్ప్రెస్ కాజీపేట జంక్షన్ చేరుకుని వెళ్తుంది. అదేవిధంగా ఈ నెల 4 నుంచి జూలై 2వ తేదీ వరకు 5 సర్వీ స్లుగా యెలహంక –బిలాస్పూర్ 908262) ఎక్స్ప్రెస్ కాజీపేట జంక్షన్కు చేరుకుని వెళ్తుంది. ఈ రైళ్ల సర్వీస్లకు భాతప్రా, రాయ్పూర్, దుర్గ్, రంజన్గాం, డోంగ్రఘర్, గొండియా, వడ్సా, చాదాపోర్టు, బల్లార్షా, సిర్పూర్కాగజ్నగర్, మంచిర్యాల, కాజీ పేట, చర్లపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి, వికా రాబాద్, తాండూర్, యాద్గిరి, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, గూటి, అనంతపురం, ధర్మవరం స్టేషన్లో హాల్టింగ్ కల్పించారు. మాదిగ హక్కుల దండోరా నియోజకవర్గ ఇన్చార్జుల నియామకంహన్మకొండ చౌరస్తా: మాదిగ హక్కుల దండోరా (ఎంహెచ్డీ) ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆయా నియోజకవర్గాలకు ఇన్చార్జులను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణలు తెలిపారు. ఈ మేరకు ఆయా ఇన్చార్జులకు నియామకపత్రాలు అందజేశారు. రాము – పరకాల, వక్కల ప్రభాకర్ – స్టేషన్ ఘన్పూర్, కొమిరె యాకాస్వామి – డోర్నకల్, రాజు – వరంగల్ పశ్చిమ, గనిపాక మహేందర్ – జనగామ, మాచర్ల ప్రభాకర్ – పాలకుర్తి, కొట్టెపాక శ్రీనివాస్ – ములుగు, సదానందం –వరంగల్ తూర్పు, మేకల ఓంకార్ – భూపాలపల్లి ఇన్చార్జులుగా నియమితులైనట్లు వివరించారు. మాదిగ సమాజ సమస్యల పరిష్కారం కోసం గ్రామస్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు సునీల్ మాదిగ, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు తెలిపారు. -
కూరగాయల మార్కెట్ను వినియోగంలోకి తేవాలి
మహబూబాబాద్: నూతన సమీకృత కూరగాయాల మార్కెట్ను తక్షణమే వినియోగంలోకి తేవాలని సీపీఐ మున్సిపల్ ఫ్లోర్లీడర్ అజయ్సారథిరెడ్డి డిమాండ్ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో వినూత్నంగా తోపుడుబండ్లతో నాయకుల మెడలో కూరగాయల దండలు, కూరగాయల బుట్టలతో నిరసన ర్యాలీ నిర్వహించి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లుగా గాంధీపార్క్లోనే కూరగాయల విక్రయాలు జరుగుతున్నాయన్నారు. మార్కెట్ను ప్రారంభించినప్పటికీ కూరగాయల విక్రయాలు జరగడం లేదని, దీని వెనుక కుట్ర జరుగుతుందన్నారు. గాంధీ పార్క్లో కూరగాయాల విక్రయాలు జరుగుతుండటంతో రాజకీయ సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధానంగా శ్రీరామనవమి వేడుకలకు ఇబ్బంది అవుతుందన్నారు. వ్యాపారులను ఖాళీ చేయించి పార్క్ను అభివృద్ధి చేయాలన్నారు. అనంతరం కమిషనర్ వినోద్కుమార్కు వినతిపత్రం అందజేశారు. నాయకులు పెరుగు కుమార్, కౌన్సిలర్లు రేషపల్లి నవీన్, నర్రా సంధ్య, నాయకులు చింతకుంట్ల వెంకన్న, శ్రావణ్, సాంబలక్ష్మి, చిరంజీవి, పాల్, శంకర్, పద్మ, రఫీ, రమేశ్, శ్యాంప్రసాద్, సాయి, ఉప్పలయ్య, మల్లయ్య ఉన్నారు. -
బెధరగొడుతున్నాయి..!
తొర్రూరు: జిల్లాలో ఓ వైపు భానుడి భగభగలు.. మరో వైపు కూరగాయల ధరల సెగలు సామాన్య, మధ్య తరగతి ప్రజలను బెంబెలెత్తిస్తున్నాయి. మార్కెట్కు వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇదివరకే పెరిగిన వంటగ్యాస్ ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు కూరగాయల ధరల రూపంలో భారం పడుతోంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే దాదాపు అన్ని రకాల కూరగా యలు, ఆకుకూరల ధరలు దాదాపు రెట్టింపు కావడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. నాణ్యత కరువు.. విపరీతమైన ఎండల కారణంగా సాగునీటి వనరులతో పాటు భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలకు నీరందక తోటలు ఎండిపోతున్నాయి. దీనికి తోడు రవాణా ఖర్చులు పెరగడం, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి తగ్గడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రధాన పట్టణాలు, గ్రామాల్లోని రైతులు కూరగాయలను పెద్దగా మార్కెట్లకు తీసుకురావడం లేదు. జిల్లాలో గతేడాది 3,320 ఎకరాల్లో కూరగాయలు సాగు చేయగా.. ఈ ఏడాది 3 వేల ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. 320 ఎకరాల్లో సాగు తగ్గింది. దీంతో కూరగాయల కొరత ఏర్పడింది. ఎండకు కాత, పూత రావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. అక్కడక్కడ పండిన కూరగాయలు భానుడి దెబ్బకు పాడవుతున్నాయి. హోల్సేల్ వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి స్థానికంగా విక్రయిస్తున్నారు. వీటిల్లో నాణ్యత ఉండటం లేదు. వేసవిలో కొండెక్కిన కూరగాయల ధరలు సాగు తగ్గడమే కారణం సామాన్యులపై అధిక భారంధరలు ౖపైపెకి.. గత నెలలో టమాట కిలో రూ.30 నుంచి రూ.40 వరకు పలకగా ప్రస్తుతం ఏకంగా రూ.60కి చేరింది. వంటల్లో తప్పనిసరిగా వాడే టమాట ధర ఇలా పెరగడంతో గృహిణులు ఆందోళన చెందుతున్నారు. బీరకాయ కిలో రూ.70, కాకర రూ.80, గోరు చిక్కుడు రూ.60, వంకాయ రూ.50కి అమ్ముతున్నారు. సొరకాయ ఒక్కటి రూ.20–30 పలుకుతోంది. క్యారెట్, దొండ కిలో రూ.50కి విక్రయిస్తున్నారు. కేవలం అదొక్కటే కాదు.. మిగిలిన వాటి పరిస్థితి కూడా అలాగే ఉంది. వంటలకు రుచి, సువాసన ఇచ్చే కొత్తిమీర ధర ప్రస్తుతం చుక్కలను తాకుతోంది. మార్కెట్లో చిన్న కొత్తిమీర కట్ట కూడా రూ.20 పెట్టినా రావడం లేదు. కీర, నిమ్మకాయ ధరలు సైతం బాగా పెరిగాయి. -
ఆర్థిక సాధికారతకు
మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్కాజీపేట అర్బన్ : మహిళలు ఆర్థిక సాధికారత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ను అందజేస్తుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య తెలిపారు. కాజీపేట మండలం మడికొండ గ్రామంలోని దుర్గాబాయి శిశు మహిళా ప్రాంగణంలో డీఆర్డీఏ, సెర్ఫ్ సంయుక్తంగా రూ. 1.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ నిర్మాణానికి బుధవారం ఎంపీ కడియం కావ్య.. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, డీఆర్డీఏ పీడీ మేన శ్రీనుతో కలిసి శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రారంభించే తొలి మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ దేశంలోనే ఆదర్శంగా నిలవాలన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళా సంఘాలు ఆదాయ వనరుల విస్తరణకు పెట్రోల్ బంక్ దోహదపడుతుందని, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. ఈ సందర్భంగా ఐనవోలు ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ మహిళా సభ్యులకు రూ.51 లక్షల ఆర్థిక సహాయ చెక్కును అందజేశారు. కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ మేణ శ్రీను, బీపీసీఎల్ ఎండీ సుధీర్, ఐకేపీ రీజినల్ కోఆర్డినేటర్లు, తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య -
పేదలకు భూములు పంచాలి
కేసముద్రం: తెలంగాణలో భూస్వాముల చేతుల్లో ఉన్న 10లక్షల ఎకరాల భూములను అర్హులైన పేదలకు ప్రభుత్వం పంచాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య డిమాండ్ చేశారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధి హరిహర గార్డెన్లో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మూడో మహాసభలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూస్వాముల ప్రయోజనాలకు అనుకూలంగా పనిచేస్తున్నాయన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వాల వైఖరి మార్చుకుని పేదలకు భూములను పంచాలని, జూన్ చివరివారంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పేదలే భూములను వెలికితీసి, సంఘం ఆధ్వర్యంలో పంచే కార్యక్రమం చేపడుతారన్నారు. రాష్ట్రంలో ఉపాధి కూలీలకు సరైన వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్నారు. భూమి, కూలీ, ఉపాధి రక్షణకు ప్రజలంతా ఉద్యమాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సంఘం జిల్లా నాయకుడు గొడిశాల వెంకన్న ముందుగా సంఘం జెండాను ఆవిష్కరించారు. సంఘం ఉపాధ్యక్షుడు ఎండి.యాకూబ్, బాణాల రాజన్న మంజుల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అలవాల వీరయ్య, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు సాదుల శ్రీనివాస్, ఆకుల రాజు, రైతుసంఘం జిల్లా కార్యదర్శి శెట్టి వెంకన్న, కవిత, అశోక్, నక్క సైదులు, వెంకటేశ్వర్లు, సారయ్య, కావటి నర్సయ్య, యాకూబ్రెడ్డి, నీరుటి జలేందర్, శ్రీశైలం, జయరాజ్, మోడెం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య -
నకిలీల బెడద
నకిలీ విత్తనాలపై కఠినంగా ఉన్నాంగతంలో చోటుచేసుకున్న సంఘటనల నేపథ్యంలో జిల్లాలో నకిలీ విత్తనాల అమ్మకాలపై ప్రత్యేక నిఘా పెట్టాం. ఇందుకోసం ప్రత్యేక టీమ్ వేశాం. రైతులు మాయమాటలకు మోసపోవద్దు. లైసెన్స్ ఉన్న షాపులోనే విత్తనాలు, ఎరువులు కొనాలి. ప్రతీ కొనుగోలుకు రశీదు తీసుకోవాలి. అనుమానం వస్తే వెంటనే వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలి. పోలీసులకు ఫిర్యాదు చేయాలి. రైతులను మోసం చేసే పని ఎవరూ చేసినా సహించేది లేదు. – శబరీష్, ఎస్పీ, మహబూబాబాద్మొదలైన నాసిరకం విత్తనాల విక్రయదందా●సాక్షి, మహబూబాబాద్: అలుపెరుగని శ్రమ రైతులది. పంటలు పండినా.. ఎండినా.. లాభం వచ్చి నా.. రాకపోయినా అప్పటికప్పుడే మర్చిపోతారు. మరుసటి ఏడాది వ్యవసాయం చేసేందుకు సిద్ధం అవుతారు. ఈమేరకు ఈ ఏడాది వానాకాలం పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. దుక్కులు దున్నడం, సేంద్రియ ఎరువులు(పశువుల పేడ) తోలడం, గొర్రెలు, బర్రెల మందలు పెట్టిస్తున్నారు. దీంతోపాటు విత్తనాలు సిద్ధం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. కాగా, గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో జిల్లా రైతులు విత్తనాలు కొనా లంటేనే భయపడుతున్నారు. విత్తన కొనుగోళ్లలో పాటించాల్సిన జాగ్రత్తలు తెలియక సతమతమవుతున్నారు. విత్తనాలు సిద్ధం చేసుకునే పనిలో.. ఈ వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా అన్ని పంటలు కలిపి 4,77271 ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయశాఖ అంచనాకు వచ్చింది. ఇందుకు అనుగుణంగా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈమేరకు 58,790 క్వింటాళ్ల వరి విత్తనాలు, 5,900 క్వింటాళ్ల మొక్కజొన్న, 2,66,666 ప్యాకెట్ల పత్తి, 388 క్వింటాళ్ల మిర్చి, 168 క్వింటాళ్ల పప్పుదినుసుల విత్తనాలు అవసరమని అంచనా వేశారు. ఈ విత్తనాలు సేకరించే పనిలో అన్నదాతలు నిమగ్నమయ్యారు. అదే భయం.. జిల్లాలో గతంలో జరిగి సంఘటనలు తలచుకుంటూ.. విత్తనాలు కొనేందుకు రైతులు భయపడుతున్నారు. మూడు సంవత్సరాల క్రితం మహబూబాబాద్ పట్టణంలో నకిలీ పత్తి, మిర్చి, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలు తయారు చేస్తూ అడ్డంగా దొరికారు. కరోనా సమయంలో ఒక దుకాణంలో క్వింటాళ్లకొద్ది నకిలీ పత్తివిత్తనాలు దొరికిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. నకిలీ మొక్కజొన్న, వరి విత్తనాలు కొని మోసపోయామని రైతులు జిల్లా కేంద్రంలోని విత్తన విక్రయ షాపు ముందు కాత పూతలేని పంటలను పట్టుకొని ధర్నా చేశారు. నకిలీ మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేయడంతో సరైనపంట రాలేదని పలువురు రైతులు విత్తన కంపెనీలపై ఆరోపణ చేస్తూ వినియోగదారుల ఫోరంను సంప్రదించారు. అలాగే మిర్చి తోటలు దిశ మార్చి కాపునకు వచ్చిందని రైతులు ఆందోళన చేశారు. ఇవే కాకుండా 2023లో బీటీవిత్తనాలు అమ్ముతున్న ముఠాను పట్టుకున్నారు. 2024లో జిల్లాకు వచ్చిన జీలుగు విత్తనాల సబ్సిడీని కాజేసేందుకు ఆంధ్రాప్రాంతానికి అమ్మారనే ఆరోపణలపై ఏఓ, ముగ్గురు ఏఈఓలను సస్పెండ్ చేశారు. ఐదు విత్తన విక్రయషాపుల లైసెన్స్ రద్దు చేశారు. జిల్లా సరిహద్దుల్లోనే.. మహబూబాబాద్ జిల్లాకు ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల సరిహద్దుగా ఉన్నాయి. ఇందులో సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలు ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రాంతాలకు సమీపంలో ఉన్నాయి. దీంతో నకిలీ విత్తనాల విక్రయాల ముఠా సునాయసంగా జిల్లాకు వచ్చి రైతులకు మాయమాటలు చెప్పి అమ్ముకొని పోతున్న సంఘటనలు బయట పడ్డాయి. ఈ సీజనల్లో కూడా నకి లీ విత్తనాల విక్రయాల అమ్మకాలు మొదలయ్యాయనే ఆరోపణలు రావడం.. పోలీసులు పలువురిని పట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లోనే ఎక్కువ గతంలో మోసపోవడంతో రైతుల బెంబేలు జిల్లాలోని విత్తన షాపుల తనిఖీ


