breaking news
Mahabubabad
-
రైతులకు అందుబాటులో యూరియా
మహబూబాబాద్ రూరల్ : జిల్లాలో రైతులకు యూరియా అందుబాటులో ఉందని డీఏఓ అజ్మీరా శ్రీనివాసరావు అన్నారు. జిల్లాలోని మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులతో మహబూబాబాద్ పట్టణంలోని రైతు వేదికలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. డీఏఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతుల ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలన్నారు. రైతు బీమాకు సంబంధించి అర్హులైన మృతి చెందిన రైతుల వివరాలు పోర్టల్లో అప్డేట్ చేయాలని సూచించారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ పథకంలో భాగంగా రైతులకు సబ్సిడీపై అందించిన అంశాల వివరాలు, నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ ప్రాజెక్టులో భాగంగా సేకరించిన మట్టి నమూనాల వివరాలు ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. మండలాల్లోని రైతులకు నానో యూరియాపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. సమీక్షలో మరిపెడ ఏడీఏ విజయచంద్ర, ఏడీఏ టెక్నికల్ మురళి, టెక్నికల్ ఏఓలు రాజు, మోహన్, విజ్ఞాన్, జావీద్ తదితరులు పాల్గొన్నారు. -
పిల్లల చదువులు ఆగం అవుతున్నాయి..
నా కుమారుడు బెస్ట్ అవైలబుల్ స్కీం కింద మహబూబాబాద్ పట్టణంలోని గాదె రుక్మారెడ్డి పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదని సార్లు చెబుతున్నారు. పుస్తకాలు, టై, బెల్ట్, దుస్తుల కోసం రూ.7వేలు ఖర్చు అయ్యాయి. ప్రభుత్వం ఫీజులు చెల్లించకుంటే మీరే ఇవ్వాలని అంటున్నారు. అధికారులు స్పందించి బిల్లులు ఇప్పించాలి. – కటుకూరి అనిల్, మహబూబాబాద్ మూడు సంవత్సరాలుగా బిల్లుల పెండింగ్ పేద పిల్లలకు బోధించేందుకు ముందుకు వచ్చాం. ప్రభుత్వం ప్రకటించిన డబ్బులు మూడు సంవత్సరాలుగా ఇవ్వడం లేదు. దీంతో లక్షల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఇతర జిల్లాలో డబ్బులు వచ్చాయి. ఈ జిల్లాలోనే రాలేదు. అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని పెండింగ్ బిల్లులు ఇప్పించాలి. – నరేశ్ రెడ్డి, అభ్యాస్ స్కూల్ చైర్మన్, తొర్రూరు -
పిల్లలను పంపొద్దు..
బెస్ట్ అవైలబుల్ స్కీం స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులకు సూచన‘ఈ ఫొటోలో కనిపిస్తున్న వారు నెల్లికుదురు మండలం రాజుల కొత్తపల్లి గ్రామానికి చెందిన బొల్లెపల్లి వెంకన్న, అతడి కుమారుడు శివరాజ్. బెస్ట్ అవైలబుల్ స్కీం కింద శివరాజ్ తొర్రూరు పట్టణంలోని అభ్యాస్ ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఈ ఏడాది ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదని, రూ. 20వేల చొప్పున రెండు విడతలు రూ.40వేలు చెల్లిస్తేనే బడికి పంపించండి.. లేకపోతే వద్దు అని తేల్చి చెప్పారు. దీంతో డబ్బులు లేక.. అలాగని వేరే పాఠశాలకు పంపలేక బడి ప్రారంభం నుంచి పిల్లవాడిని ఇంటి వద్దనే ఉంచుకుంటున్నాడు. అధికారులు మాట్లాడి మా అబ్బాయిని బడికి పంపించేలా చూడాలని వెంకన్న కోరుతున్నాడు.’ తల్లిదండ్రుల సతమతం.. ప్రభుత్వ ఖర్చులతో తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివించే అవకాశం వచ్చిందని విద్యార్థుల తల్లిదండ్రులు సంబురపడ్డారు. ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదని పిల్ల లను బడికి పంపొద్దని చెప్పడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఫీజులు చెల్లించే స్తోమత లేక పాఠశాలకు పంపించలేమని, అలాగని వేరే పాఠశాలకు పంపిస్తే చదువులు ఆగం అవుతాయని వాపోతున్నా రు. ఈ విషయంపై ఇప్పటికే రెండుమూడు సార్లు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి పెండింగ్ బిల్లులు ఇప్పించాలని తల్లిదండ్రులు కోరారు. ● ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే బడికి పంపాలంటున్న ప్రైవేట్ స్కూల్స్ ● లేకుంటే ఫీజులు చెల్లించాలని ఒత్తిడి ● ఇంటికే పరిమితమైన పలువురు పిల్లలు -
ఉపాధి అవకాశాలపై ఆశలు
కాజీపేట రూరల్: రైల్వే కోచ్ఫ్యాక్టరీ.. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల కోరిక. అనేక ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా కార్యరూపం దాల్చిన కాజీపేట రైల్వే వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం 80శాతం పూర్తికావొచ్చింది. ఈ యూనిట్ ఏర్పాటుతో స్థానిక యువత ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై అనేక ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తోపాటు మరో కేంద్రమంత్రి కిషన్రెడ్డి.. శనివారం రైల్వే వ్యాగన్ మాన్యుఫాక్చరింగ్ యూ నిట్ను సందర్శించనున్నారు. వ్యాగన్షెడ్ టు మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్.. కాజీపేట మండలం అయోధ్యపురంలో 160 ఎకరాల్లో సుమారు రూ.786 కోట్లతో రైల్వే వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం చేపట్టారు. 2023 జూలై 8వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ హనుమకొండ సుబేదారి ఆర్ట్స్కాలేజ్ గ్రౌండ్లో నుంచి కాజీపేట వ్యాగన్షెడ్కు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. 2023లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కాజీపేట రైల్వే మల్టీపుల్ యూనిట్గా ప్రకటన చేసి మంజూరు చేశారు. రీ డిజైనింగ్ చేసి జపాన్ టెక్నాలజీతో మల్టీపుల్ యూనిట్ రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లో వ్యాగన్, కోచ్, వందేభారత్, ఎల్హెచ్బీ, మెము కోచ్లు తయారు చేస్తారు. 80శాతం పూర్తయిన విభాగాలు.. యూనిట్లోని మెయిన్షాప్, పెయింట్ షాప్, స్టోర్ వార్డు, టెస్ట్ షాప్, క్యాంటీన్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఎలక్ట్రిక్ సబ్స్టేషన్, సెక్యూరిటీ పోస్టు, రెస్ట్ హౌస్, సేవగ్ ట్రీట్మెంట్ ప్లాంట్/పంప్హౌస్, టాయిలెట్ బ్లాక్స్, ప్యాకేజీ సబ్స్టేషన్, షవర్ టెస్ట్, రోడ్వే బ్రిడ్జి, పంప్హౌస్/జీఎల్ఆర్, పిట్ ట్రావెర్సర్, వ్యాగన్ వే బ్రిడ్జి, గార్డు పోస్ట్/ట్రాక్ గేట్, ఆర్యూబీ, పార్కింగ్, పాండ్, (2000 కేఎల్ కెపాసిటీ), స్క్రాప్ బిన్స్ పనులు 80శాతం పూర్తయ్యాయి. పెండింగ్ పనులు.. రైల్వే కార్మికుల కోసం క్వార్టర్స్ నిర్మాణం, కోచ్ల తయారీకి షెడ్లలో మిషనరీ ఫిట్టింగ్, కనెక్టివిటీ రోడ్లు, ఎంట్రెన్స్ వద్ద రైల్వే వంతెన నిర్మాణం, ఇతరత్ర సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్ జరగాల్సి ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసి వచ్చే ఏడాది మార్చిలో యూనిట్ను ప్రారంభిస్తామని ఇప్పటికే దక్షిణమధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ ప్రకటించారు. వీటిపై దృష్టిపెట్టి త్వరగా పూర్తి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. పంజాబ్ మాదిరి ఉద్యోగ అవకాశాలు కాజీపేటలోని కోచ్ఫ్యాక్టరీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 10వేల మందికి ఉపాధి లభించనుంది. అయితే ఈ ఉద్యోగాలు ఉమ్మడి జిల్లావాసులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పంజాబ్ కోచ్ఫ్యాక్టరీలో ప్రత్యేక జీఓ తీసి అక్కడి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. అదేమాదిరిగా ఇక్కడ కూడా ఈ ప్రాంతం వారికి ఉద్యోగఅవకాశాలు కల్పించాలని, దీనిపై కేంద్రమంత్రులు స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతున్నారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి అయోధ్యపురంలో రైల్వే యూనిట్కు 112మంది 160 ఎకరాల భూమి ఇచ్చారు. ఇద్దరు ఇళ్లు కోల్పోయారు. మొత్తం 114మంది నిర్వాసితులు ఉండగా ప్రభుత్వం ఎకరాకు రూ.8లక్షలు చెల్లించింది. ప్రభుత్వ విలువ ప్రకారం ఎకరాకు రూ.33 లక్షలు ఉండగా, ప్రభుత్వం రూ.8 లక్షలు రైతుకు ఇచ్చి, రూ.25లక్షలు దేవాదాయశాఖ(ఈ భూమి దేవాదాయశాఖకు సంబంధించింది)కు ఇచ్చారు. 8మంది రైతుల భూమి సీలింగ్ ల్యాండ్ అని నష్టపరిహారం నిలిపివేశారు. ఇప్పటివరకు వారికి రాలేదు. కోట్ల రూపాయల విలువైన భూమి కోల్పోయామని, రైల్వే యూనిట్లో ఇంటికో ఉద్యోగం ఇచ్చి రైల్వేశాఖ ఆదుకోవాలని రైతులు కేంద్రమంత్రులను కోరుతున్నారు. రైల్వే మంత్రి దృష్టికి కాజీపేట డివిజన్ ప్రస్తావన.. రైల్వే మంత్రి అశ్వినివైష్ణవ్ దృష్టికి ముఖ్యంగా కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు అంశాన్ని తీసుకెళ్తామని స్థానిక రైల్వే నాయకులు తెలిపారు. అదేవిధంగా టౌన్ స్టేషన్ అభివృద్ధి, ఫాతిమానగర్లో ట్రైయాంగిల్ స్టేషన్ నిర్మాణం, కాజీపేట రైల్వే ఆస్పత్రి సబ్ డివిజన్ ఆస్పత్రిగా అప్గ్రేడ్, కాజీపేట రైల్వే స్టేషన్లో అదనపు ప్లాట్ఫాంల నిర్మాణం, అన్ని హంగులతో కూడిన రైల్వే క్లబ్ (ఇన్స్టిట్యూట్) భవనం, బెజవాడ తరహాలో రైల్వే ఎలక్ట్రిక్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.చివరి దశకు కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు నెరవేరుతున్న జిల్లా ప్రజల చిరకాల స్వప్నం నేడు యూనిట్ను విజిట్ చేయనున్న కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కాజీపేట డివిజన్ అంశాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని రైల్వే నాయకుల నిర్ణయంకేంద్రమంత్రుల షెడ్యూల్.. శంకర్పల్లి రైల్వే స్టేషన్నుంచి ఎంఆర్ ప్రత్యేక రైలులో ఉదయం 11 గంటలకు బయలుదేరి 1:30 గంటలకు కాజీపేట రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. 01:30 గంటలకు కాజీపేట రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి 01:45 గంటలకు కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్కు చేరుకుంటారు. 02:45 గంటల వరకు యూనిట్ను విజిట్ చేస్తారు. అక్కడి నుంచి 3 గంటలకు బయలుదేరి కాజీపేట రైల్వేస్టేషన్కు చేరుకుంటారు. 05:30 గంటలకు ఎంఆర్ ప్రత్యేక రైలులో కాచిగూడ రైల్వేస్టేషన్కు చేరుకుంటారు. -
విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచాలి
● కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ నెల్లికుదురు: జిల్లాలోని కేజీబీవీ, మోడల్ స్కూల్, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. కేజీబీవీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం ద్వారా ఆన్లైన్ పాఠాలు వినిపించే అవకాశం ఉంటుందన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద నరేశ్, ఎంపీఓ పద్మ తదితరులు పాల్గొన్నారు. -
జూలో శరణ్ షో షురూ..
న్యూశాయంపేట : వరంగల్ హంటర్ రోడ్లోని కా కతీయ జువాలాజికల్ పార్క్లో వైట్ టైగర్(శరణ్, మగ, 13 ఏళ్ల వయసు) సందర్శకులను కనువిందు చేసింది. హైదరాబాద్ నెహ్రూ జువాలాజికల్ పా ర్క్ నుంచి తీసుకొచ్చిన తెల్లపులిని శుక్రవారం రాష్ట్ర అ టవీ శాఖ మంత్రి కొండా సురేఖ.. పాఠశాల చి న్నారులతో కలిసి ఎన్క్లోజర్లోకి విడుదల చేశారు. అ నంతరం జూపార్క్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫొ టో ప్రదర్శనను తిలకించారు. వనమహోత్సవంలో భాగంగా మొక్క నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. హైదరాబాద్లోని నెహ్రూ జువాలాజికల్ పార్క్కు దీటుగా వ రంగల్లోని కాకతీయ జూపార్క్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. రూ. కోటి వ్యయంతో పా ర్క్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. హరిత నిధి నుంచి రూ. 4.25 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. ఈ నిధులతో జూపార్క్లో పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలు జంతువులు జూపార్క్కు వచ్చాయని, త్వరలో ఫిమేల్ వైట్టైగర్ను తీ సుకురావాలని అధికారులను ఆదేశించినట్లు తెలి పారు. రానున్న రోజుల్లో సింహం, మరికొన్ని ఇతర జంతువులను తీసుకురానున్నట్లు వివరించారు. జూపార్క్లోని జంతువుల సంరక్షణకు జంతు ప్రే మికులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. క్యూఆర్ కోడ్.. చాట్బాట్ జూపార్క్లోని జంతువుల వివరాలు తెలుసుకునేందుకు క్యూఆర్కోడ్, చాట్బాట్ సిస్టం అందుబాటులోకి తీసుకొచ్చారు. కాకతీయ జూపార్క్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని వివరాలు తెలుసుకోవచ్చు. కార్యక్రమంలో భద్రాద్రి సర్కిల్ సీసీఎఫ్ భీమానాయక్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల అటవీశాఖాధికారి అనుజ్అగర్వాల్, ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్ఓ కృష్ణమాచారి, ఫారెస్ట్ రేంజ్ అధికారులు మయూరి, భిక్షపతి, ఎఫ్బీఓ శారద, తదితరులు పాల్గొన్నారు. మంత్రి సురేఖ చేతుల మీదుగా ఎన్క్లోజర్లోకి తెల్లపులి విడుదల జూపార్క్లో విద్యార్థుల సందడి .. -
మరమ్మతులు కరువు
నెల్లికుదురు: రైతుల పంటలకు సాగు నీరు అందించేందుకు నిర్మించిన చెక్డ్యాంకు రెండు వైపులా గండిపడింది. దీంతో నీరు నిల్వ ఉండడం లేదు. కాగా, ఆకేరు వాగు పరీవాహక రైతుల పంటలకు సాగు నీరు అందడం లేదు. మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. 2021–22లో నిర్మాణం.. నెల్లికుదురు మండలంలోని మునిగలవీడు గ్రామ పరిధిలో ఆకేరు వాగు పరీవాహక రైతుల సౌకర్యార్థం 2021–22లో అప్పటి ప్రభుత్వం కోట్లు వెచ్చించి చెక్ డ్యాం నిర్మాణం చేపట్టింది. అయితే గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు చెక్ డ్యాం రెండు పైపులా గండ్లు పడి నిరుపయోగంగా మారింది. నర్సింహులపేట మండలం జయ్యారం గ్రామం వైపు ఒక గండి, నెల్లికుదురు మడంలంలోని మునిగలవీడు గ్రామం వైపు మరో భారీ గండిపడి చెక్డ్యాంలో చుక్క నీరు లేకుండా పోతోంంది. దీంతో రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. భూగర్భ జలాల పెంపు.. ఆకేరు వాగులోని చెక్డ్యాం ద్వారా నెల్లికుదురు మండంలోని మధనతుర్తి, మునిగలవీడు, నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ, జయ్యారం శివారు గ్రామాలు, తండాల పరిధిలో గ్రౌండ్ వాటర్ పెరిగి వేల ఎకరాల్లో పంటలు పండుతాయి. చెక్డ్యాంకు గండి పడడంతో ఆయా గ్రామాల రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఆయా గ్రామాల పరిధిలో ఆకేరు వాగులో గుంతలు తవ్వి విద్యుత్ మోటార్ల ద్వారా పంటలకు సాగునీరు అందిస్తున్నారు. కాగా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి చెక్ డ్యాంకు మరమ్మతులు చేపట్టాలని పరీవాహక రైతులు కోరుతున్నారు. ప్లాన్ లేకుండా చెక్ డ్యాం నిర్మాణం చేపట్టారు.. మండలంలోని మునిగలవీడు గ్రామ పరిధిలో ఆకేరు వాగులో ఎలాంటి ప్లాన్ లేకుండా చెక్డ్యాం నిర్మాణం చేపట్టి ప్రజాధనం వృథా చేశారు. దీంతో రెండేళ్లకు గండ్లుపడ్డాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి చెక్డ్యాంలో నీరు ఉండేలా మరమ్మతులు చేపట్టి రైతుల పంటలకు సాగు నీరు అందించాలి. – ఇస్సంపల్లి సైదులు, మునిగలవీడు మునిగలవీడులో ఆకేరువాగుపై చెక్డ్యాంకు గండి ఆందోళన చెందుతున్న పరీవాహక రైతులు మరమ్మతులు చేపట్టాలని వేడుకోలు -
అభివృద్ధి చేస్తే పర్యాటక పురోగతి
జాలువారే జలపాతాలు.. నిషేధాలతో కనుమరుగుకానున్న అద్భుతాలువాజేడు: ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం (కె) మండలాల్లో ఎన్నో జలపాతాలు ఉన్నాయి. అందులో బొగత జలపాతం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందగా మిగతా జలపాతాలు చిన్న చూపుకు గురవుతున్నారు. దీంతో వెలుగులోకి రావడం లేదు. నిర్మానుష్య అటవీ ప్రాంతం.. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని, రక్షణ లేదనే కారణాలతో ఈ అద్భుత జలపాతాల సందర్శనను అధికారులు నిషేధించారు. ఫలితంగా ఆ జలపాతాల సందర్శనకు పర్యాటకులు నోచుకోవడం లేదు. ఈ క్రమంలో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు దండకారణ్యంలోని కర్రె గుట్టలను కేంద్రం ప్రభుత్వం పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఇప్పటికే సన్నద్ధమైనట్లు సమాచారం. కర్రె గుట్టలు ఊటీ, కొడైకెనాల్ లాంటి పర్యాటక ప్రదేశాలను తలదన్నేలా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం పూర్తయిన తర్వాత కర్రె గుట్టలను పర్యాటకంగా తీర్చిదిద్దనున్నట్లు సమాచారం. అక్కడే పెద్ద ఎత్తున పోలీస్ శిక్షణ కేంద్రం సైతం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కర్రె గుట్టలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే అదే సమయంలో ప్రస్తుతం ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం(కె) మండలాల్లో కరె గుట్టలను ఆనుకుని ఉన్నప్పటికీ పర్యాటకపరంగా నిషేధంలో ఉన్న అన్ని జలపాతాలు పూర్తి స్థాయిలో వెలుగు లోకి వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా ఆయా జలపాతాలు శరవేగంగా అభివృద్ధి సాధించనున్నాయి. ఈ క్రమంలో వాజేడు, వెంకటాపురం(కె) మండలాల్లో ఉన్న జలపాతాల పేర్లు, వాటి వివరాలు, ప్రాముఖ్యతపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. -
‘ఔటర్’ ప్రమాదం.. తీరని విషాదం
గూడూరు: ‘ఔటర్’ ప్రమాదం.. తీరని విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్ ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మానుకోట జిల్లా వాసుల దుర్మరణం చెందారు. దీంతో ఆయా కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. గూడూరు మండలం తోటదస్రుతండాకు చెందిన గుగులోత్ జనార్దన్ (50), మహబ్బి దంపతులకు కూతురు సునీత సంతానం. సునీత హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతోంది. కాగా, కూతురు చదువు దృష్ట్యా జనార్ధన్, మహబ్బి దంపతులు రెండు నెలల క్రితం హైదరాబాద్కు వలస వెళ్లి కూలీ చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఓఆర్ఆర్పై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో జనార్దన్ మృతిచెందాడు. దీంతో తోటదస్రుతండాలో విషాదఛాయలు అలుముకున్నారు. మరోఘటనలో.. కొత్తగూడ : మండలంలోని మాసంపెల్లి తండాకు చెందిన మాలోత్ చందూలాల్(28) హైదరాబాద్ ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. చందూలాల్కు ఎనిమిదేళ్ల క్రితం దేవితో వివాహం జరగగా కుటుంబ పోషణ నిమిత్తం కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం తెల్ల వారుజామున నిద్రమత్తులో ఓఆర్ఆర్పై లారీని ఢీకొన్నాడు. ఈ ఘటనలో చందూలాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో తండాలో విషాదఛాయలు అలముకున్నాయి. ఉపాధ్యాయుడిపై కేసుహసన్పర్తి: ఫేక్ డాక్యుమెంట్తో ప్లాట్ విక్రయానికి కుదుర్చుకుని మోసం చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలోని లష్కర్బజార్కు చెందిన సయ్యద్ మసూద్ షరీఫ్ వడ్డేపల్లి శివారులోని సర్వే నంబర్ 370లో వరంగల్ కేఎంసీ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు (ప్రస్తుతం మామునూరులోని పింఛన్పుర సబ్ జైల్ పాఠశాలలో) మజహర్ హుస్సేన్ వద్ద 201 చదరపు గజాల (ప్లాట్–38)కు రూ.44 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకుగాను జూన్లో రూ.9 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. మర్నాడు ప్లాట్ వద్దకు వెళ్లగా.. అక్కడ అగ్రిమెంట్లో పేర్కొన్న ప్లాటు కనిపించలేదు. ఈవిషయమై నిలదీయగా, జాప్యం చేస్తూ వచ్చాడని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. చివరికి బాధితుడు సుబేదారి పోలీసులను ఆశ్రయించాడు.● హైదరాబాద్ ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదాలు ● ఇద్దరు మానుకోట జిల్లా వాసుల దుర్మరణం ● శోకసంద్రంలో తోటదస్రుతండా, మాసంపెల్లి తండాలు -
రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే దంపతులకు గాయాలు
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య, నర్మద దంపతులు శుక్రవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో పుల్లయ్య స్వల్పంగా, నర్మద తీవ్రంగా గాయపడ్డారు. పుల్లయ్య దంపతులు కారులో హైదరాబాద్కు వెళ్తుండగా మార్గమధ్యలోని నల్లగొండ జిల్లా నకిరేకల్ వద్ద జాతీయ రహదారిపై మరో కారు ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చి ఢీకొట్టింది. దీంతో మాజీ ఎమ్మెల్యేకు చెందిన కియా కారు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. అదే సమయంలో మరో కారులో అటువైపు వెళ్తున్న మహబూబాబాద్కు చెందిన జాకీర్ ప్రమాద ఘటనను గమనించారు. వెంటనే తన వాహనాన్ని నిలిపి గాయపడిన మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య, ఆయన భార్య నర్మదను చికిత్స నిమిత్తం నకరేకల్ శివారులోని కామినేని ఆస్పత్రికి తరలించారు. నకిరేకల్ వద్ద ఘటన -
పండుగపూట విషాదం..
ఖానాపురం: పండుగపూట విషాదం నెలకొంది. ఎదురుగా వస్తున్న డీసీఎంను తప్పించబోయిన బైక్.. పండుగ వేడుకలో భాగంగా రహదారి పక్కన నృత్యం చేస్తున్న వ్యక్తిని ఢీకొనగా అతడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఖానాపురం మండలం ఐనపల్లిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామంలో గురువారం తీజ్ పండుగ జరుపుకున్నారు. తీజ్ నిమజ్జనం సందర్భంగా గ్రామంలోని జాతీయ రహదారి పక్కన తండావాసులు రాత్రి నృత్యం చేస్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని బుధరావుపేటకు చెందిన యువకుడు కోడి రాకేశ్ బైక్పై గ్రామానికి వెళ్తున్నాడు. ఇదే సమయంలో ఎదురుగా వచ్చిన డీసీఎం తప్పించబోయి పక్కనే పండగ వేడుకలో ఉన్న వాంకుడోతు ఈరు(45)ను ఢీకొట్టగా అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడితో ఆగకుండా బైక్ పక్కన ఉన్న వారిపైకి దూసుకెళ్లింది. దీంతో ఈ ఘటనలో గుగులోత్ రమేశ్, భూక్య బాలు, భూక్య మౌనిక, గుగులోత్ గాయత్రీకి తీవ్ర గాయాలు కాగా మరో పదిమందికి స్వల్పగాయాలయ్యాయి. ద్విచక్ర వాహనదారుడు రాకేశ్కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈరుతో పాటు మిగతా వారందరిని ఆస్పత్రికి తరలించగా ఈరు అప్పటికే మృతి చెందాడు. కాగా, నెక్కొండ మండలం దుబ్బతండాకు చెందిన ఈరు ఇరవై సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం ఐనపల్లికి వచ్చి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రెండు గ్రామాల్లో విషాదం అలుముకుంది. మృతుడికి భార్య బుజ్జి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఘుపతి తెలిపారు.● బైక్ ఢీకొని వ్యక్తి దుర్మరణం ● పది మందికి పైగా గాయాలు ● ఐనపల్లిలో ఘటన -
తండ్రి మందలించాడనే క్షణికావేశంలో..
● ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు ● చికిత్స పొందుతూ మృతి దామెర: తండ్రి మందలించాడనే కారణంతో క్షణికావేశంలో ఆత్మహత్యాయత్నానికి పాల్ప డిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలో చోటుచేసుకుంది. ఎస్సై కొంక అశోక్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మోతె కుమార్ పెద్ద కుమారుడు బాలకృష్ణ (20) ఐటీఐ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాగా, బాలకృష్ణ దుర అలవాట్లు నేర్చుకుంటున్నాడని తండ్రి ఇటీవల మందలించాడు. మనుసులో పెట్టుకున్న బాలకృష్ణ.. క్షణికావేశంలో ఈ నెల 11న పురుగుల మందుతాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన బంధువులు ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. ఈ ఘటనపై తండ్రి కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ పేర్కొన్నారు. -
కేంద్రం నిధులతోనే గ్రామాల అభివృద్ధి
జనగామ: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయని, ఆ నినాదమే ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అధ్యక్షతన జిల్లా కార్యాలయంలో జరిగిన వర్క్షాప్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సంక్షేమానికి దూరమైన ప్రజలు.. రేవంత్రెడ్డి చెప్పిన బూటకపు మాటలను నమ్మి మోసపోయారన్నారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలను నమ్మి పెనం నుంచి పొయ్యిలో పడ్డారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజాసమస్యలు, అభివృద్ధిని పక్కనపెట్టి పరస్పరం బూతులు తిట్టుకోవడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గెలిచేందుకు బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్నారు. గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తుంది కేంద్ర ప్రభుత్వమని, ఆ నినాదంతోనే స్థానిక సంస్థల్లో ప్రచార హస్తంగా వినియోగించుకుని, ప్రజలకు వాస్తవాలు వివరిస్తున్నామన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. 19 నెలల పాలనలో ఆ వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. ఆరు గ్యారంటీలపై మీరు నిలదీయొద్దు, స్కాంల విషయంలో కేసీఆర్ కుటుంబాన్ని మేం అరెస్ట్ చేయబోమంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య లోపాయికారీ ఒప్పందం నడుస్తోందన్నారు. స్థానిక సంస్థల్లో బీజేపీని గెలిపిస్తేనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందని ప్రజలు నిర్ణయానికి వచ్చారన్నారు. సమావేశంలో మాజీ మంత్రి గుండె విజయరామారావు, పట్టణ అధ్యక్షుడు అనిల్గౌడ్, జిల్లా కన్వీనర్ ఆరుట్ల దశమంతరెడ్డి, రాష్ట్ర నాయకులు కేవీఎల్ఎన్రెడ్డి, బొజ్జపల్లి సుభాశ్, మహంకాళి హరిచంద్రగుప్తా, పెద్దోజు జగదీశ్ పాల్గొన్నారు. ఆ నినాదమే ప్రజల్లోకి తీసుకెళ్లాలి తెలంగాణ ప్రజలు పెనం నుంచి పొయ్యిలో పడ్డారు కేసీఆర్ స్కాంలకు కాంగ్రెస్ రక్షణ స్థానిక సంస్థల సన్నద్ధం వర్క్షాప్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ -
నకిలీ సర్టిఫికెట్ల తయారీలో మరో 9మంది అరెస్ట్
రామన్నపేట : నకిలీ సర్టిఫికెట్ల తయారీలో ప్రధాన సూత్రదారుడు అమరేందర్ను ఈ నెల 12వ తేదీన అదుపులోకి తీసుకోగా అతడికి సహకరించిన మరో 9 మందిని గురువారం అరెస్ట్ చేసినట్లు మట్టెవాడ ఇన్స్పెక్టర్ గోపి తెలిపారు. అమరేందర్ హైదరాబాద్, వరంగల్ రెవెన్యూ అఽధికారుల సంతకాలు ఫోర్జరీ చేస్తూ రెసిడెన్షియల్, మున్సిపాలిటీ బర్త్ సర్టిఫికెట్లను తయారు చేస్తూ ఏజెంట్ల ద్వారా ఆధార్ కార్డులో మార్పులు చేస్తూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసేవాడన్నారు. కాగా, ఈ ఘటనలో అమరేందర్కు సహకరించిన నర్సంపేటకు చెందిన జులూరి ప్రభాకర్, వరంగల్ గోపాలస్వామి గుడి ప్రాంతానికి చెందిన కొన్ని సురేశ్, మూడు వేముల రాజేందర్, హనుమకొండ పద్మాక్షి కాలనీ చెందిన గొల్లపల్లి శశికాంత్, భూపాలపల్లికి చెందిన సంకరమైన సాగర్, హనుమకొండ నక్కలగుట్టకు చెందిన నీరటి రాజేశ్, నాగపురి లిఖిత్కుమార్, ఎం.డి జుబేర్ను అరెస్ట్ చేసినట్లు సీఐ తుమ్మ గోపి తెలిపారు. వివరాలు వెల్లడించిన మట్టెవాడ ఇన్స్పెక్టర్ గోపి -
14.06 టీఎంసీలు.. 6.46 లక్షల ఎకరాలు
సాక్షిప్రతినిధి, వరంగల్: నీటిపారుదల శాఖ వరంగల్, ములుగు సర్కిళ్ల పరిధిలో వానాకాలం సాగునీటి విడుదల యాక్షన్ ప్లాన్ను ఖరారు చేసింది. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు, వర్షం, వరదలను అంచనా వేసి ఉమ్మడి వరంగల్లో ఖరీఫ్ పంటలకు నీరిందించే విధంగా ప్రణాళికను ప్రకటించింది. 2,52,623 ఎకరాల తరి, 3,94,041 ఎకరాల ఆరుతడి కలిపి మొత్తం 6,46,664 ఎకరాలకు 14.06 టీఎంసీల సాగునీటిని సరఫరా చేయనున్నట్లు యాక్షన్ ప్లాన్లో పేర్కొంది. ఈ మేరకు ఇటీవల హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (ఎస్సీఐడబ్ల్యూఏడబ్ల్యూ (స్కివం) సమావేశం అనంతరం సాగునీటి వివరాలను ప్రకటించారు. నీటి విడుదల తేదీ త్వరలో ప్రకటన.. ఉమ్మడి వరంగల్లో వాస్తవంగా ఎస్సారెస్పీ, దేవాదుల, సరస్సులు, చిన్ననీటి వనరుల ద్వారా స్థిరీకరించిన ఆయకట్టు 9,43,530 ఎకరాలు కాగా.. ప్రస్తుత పరిస్థితులు, నీటిలభ్యతను బట్టి 6,46,664 ఎకరాలకు ఆన్ అండ్ ఆఫ్ (వారబందీ) పద్ధతిన సరఫరా చేయనున్నారు. 15 రోజులు విడుదల చేసి 15 రోజులు ఆఫ్ చేసే పద్ధతిలో ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తారు. ప్రస్తుతం ఇరిగేషన్ వరంగల్ సర్కిల్ పరిధిలో దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అన్ని నింపి 2,03,641 ఎకరాలకు 11.48 టీఎంసీలు సరఫరా చేయనున్నారు. సరిపడా వరదలు వచ్చిన తర్వాత సమీక్షించి ఎల్ఎండీ దిగువన కాకతీయ కాల్వ, ఎస్సారెస్పీ–2 కాల్వల ద్వారా మరో 2,91,936 ఎకరాలకు నీటి సరఫరా చేస్తారు. ములుగు సర్కిల్ పరిధిలో 10.05 టీఎంసీలకు 2.419 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. ఎల్ఎండీ, దేవాదుల, రామ ప్ప, లక్నవరం, మల్లూరు వాగు, పాలెం వాగుల ద్వారా 34,618 ఎకరాల తరి, 1,16,469 ఎకరాల ఆరుతడి కలిపి 1,52,087 ఎకరాలకు సుమారు 2.58 టీఎంసీల నీటిని సరఫరా చేయాలని అధికారులను ‘స్కివం’ కమిటీ ఆదేశించింది. ఈ మేరకు 15 రోజులకోసారి ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన వానాకాలం పంటలకు నీరందించేందుకు ప్రణాళిక సిద్ధం కాగా.. నీటిని విడుదల చేసే తేదీలను త్వరలోనే అధికారులు ప్రకటించనున్నారు. చీఫ్ ఇంజనీర్ల ప్రతిపాదనలు.. ‘స్కివం’ కమిటీ సూచనలు.. ములుగు సర్కిల్ పరిధిలోని 1,03,883 ఎకరాల ఆయకట్టుకు అధికారులు 93,750 ఎకరాలు ప్రకటించగా.. వరద ఇన్ఫ్లోను బట్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. దేవాదుల ద్వారా 4,170 ఎకరాలకు 3,570 ఎకరాలకు 0.35 టీఎంసీలు, పాకాల కింద 23,193 ఎకరాలకు 1.43 టీఎంసీలు, రామ ప్ప ద్వారా 6,780కు 0.80 టీఎంసీల నీటిని ప్రతిపాదించారు. లక్నవరం, మల్లూరు వాగు, పాలెం వా గు ద్వారా 23,794 ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించగా.. ఎస్సారెస్పీలో నీటి కొరత కారణంగా ఎల్ఎండీ, ఎస్సారెస్పీ కింద ప్రతిపాదించిన ఈ ఆయకట్టు, ఎస్సారెస్పీ స్టేజ్–2కు తగినంత ఇన్ఫ్లో వచ్చిన తర్వాత సమీక్షించనున్నట్లు ‘స్కివం’ సూ చించింది. గోదావరి నదిలో తగినంత నీరు అందుబాటులో ఉన్నందున దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని అన్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నింపాలని కూ డా కమిటీ ఆదేశించింది. ఇంకా రామప్ప సరస్సు నుంచి పాకాల సరస్సుకు పంపింగ్ అందుబాటులో ఉన్నందున ఈ ప్రాజెక్టుల కోసం ములుగులోని సీఈ ప్రతిపాదించిన కార్యాచరణను కమిటీ అంగీకరించి అమలు చేయాలని సిఫార్సు చేసింది.వానాకాలం సాగుపై నీటిపారుదల శాఖ ప్రణాళిక ఇది ‘స్కివం’ కమిటీ సమావేశంలో యాక్షన్ ప్లాన్ ఖరారు వరంగల్, ములుగు సీఈల ప్రతిపాదనలకు ఆమోదం ప్రస్తుత నీటి లభ్యతను బట్టి నిర్ణయం.. వరదలొచ్చే వరకు ఆన్ అండ్ ఆఫ్.. 15 రోజులకోసారి వారబందీ పద్ధతిన విడుదల -
పాయిజన్ కేసులకు అధునాతన వైద్యసేవలు
నెహ్రూసెంటర్: జిల్లాలో గిరిజనులు అత్యధింగా పాయిజన్ తీసుకొని ప్రాణాలను కోల్పోతున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకుని అధునాతన వైద్య సేవలు అందించి రక్షించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే మురళీనాయక్ అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డయాలసిస్, ఐసీయూ సెంటర్లను పరిశీలించి స్వయంగా రోగులను పరీక్షించారు. అనంనతరం వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పాయిజన్ తీసుకున్న వ్యక్తులను రక్షించేందుకు ప్రత్యేక డయాలసిస్ బెడ్ను ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ తర్వాత మానుకోట జిల్లాలోనే పాయిజన్ తీసుకున్న వారిని బతికించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆస్పత్రిలో సిజేరియన్ కాన్పులను తగ్గించి నార్మల్ డెలివరీలను పెంచాలని, గైనిక్ విభాగంలో కొంత మంది గైర్హజరవుతున్నారని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, జీఎంసీ ప్రిన్సిపాల్ వెంకట్ లకావత్, ఆర్ఎంఓ జగదీశ్వర్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మురళీనాయక్ -
విద్యార్థులకు సక్రమంగా బోధించాలి
● కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం కేయూ క్యాంపస్: విద్యార్థులకు సక్రమంగా బోధించాలని కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం అన్నారు. గురువారం కాకతీయ యూనివర్సిటీలోని విద్యాకళాశాలలో ప్రిన్సిపాల్ టి.మనోహర్తో కలిసి అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలో రామచంద్రం మాట్లాడారు. ఈనెల 16న విద్యాకళాశాలలో విద్యార్థులు ఆందోళన చేసి పలు సమస్యలను రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో చర్చించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ రామచంద్రం మాట్లాడుతూ పాఠాలు సరిగా అర్థం కావం లేదని విద్యార్థులు చెబుతున్నారని, అధ్యాపకులు ముందు ప్రిపేర్ అయిన సరిగా బోధించాలని సూచించారు. ఎలాంటి పక్షపాతం లేకుండా జవాబుపత్రాల వాల్యుయేషన్ చేయాలని చెప్పినట్లు సమాచారం. విద్యార్థినుల పట్ల అనుచితంగా మాట్లాడొద్దని ఆదేశించారని తెలిసింది. కాగా, కొందరు విద్యార్థులు క్లాస్లకు సరిగా రావడం లేదనే విషయాలను పలువురు అధ్యాపకులు.. రిజిస్ట్రార్ దృష్టి తీసుకెళ్లారు. తాము సరిగానే మూల్యాంకనం చేస్తున్నామని సమాధానం ఇచ్చారని తెలిసింది. అనంతరం విద్యా కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య టి. మనోహర్ మాట్లాడుతూ తాను బాధ్యతలు స్వీకరించాక 75 నుంచి 80 శాతం అటెండెన్స్ ఉండాలని విద్యార్థులకు చెప్పానన్నారు. క్లాస్లకు వచ్చేవారికే అటెండెన్స్ వేయిస్తున్నామన్నారు. సరిపడా అటెండెన్స్ లేనిపక్షంలో పరీక్షలకు కూడా అనుమతించబోమని స్పష్టం చేశారని సమాచారం. పోక్సో కేసులో తండ్రికి రిమాండ్దేవరుప్పుల : మండలంలోని ఓ గ్రామంలో బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన తండ్రిని పోక్సో కేసులో గురువారం రిమాండ్కు తరలించినట్లు ఎస్సై సృజన్కుమార్ తెలిపారు. రెండు రోజుల నుంచి కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న తండ్రిపై కుటుంబీకుల ఫిర్యాదు చేశారన్నారు. దీంతో పోక్సో కేసు నమోదు చేసి జనగామ కోర్టులో హాజరుపర్చామన్నారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. ప్రహరీకి అమర్చిన కరెంట్ బైండింగ్ వైర్కు తాకి.. ● విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి ములుగు రూరల్: ప్రహరీకి అమర్చిన కరెంట్ బైండింగ్ వైర్కు తాకి ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ ఘటన ములుగు మండలం ఇంచర్లలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చింతల రవి(45) తాపీ మేసీ్త్ర పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం జంగాలపల్లి క్రాస్ వద్ద బుర్ర సమ్మయ్య అనే వ్యక్తి ఇంటి నిర్మాణ పనికి వెళ్లాడు. సమ్మయ్య ఇంటి పక్కన ఉన్న గౌస్పాషా అనే వ్యక్తి కోతల బెడద కారణంగా ప్రహరీకి బైడింగ్ వైరు అమర్చి విద్యుత్ కనెక్షన్ ఇచ్చాడు. రవి ఉదయం స మ్మయ్య ఇంటికి పనికి వచ్చి ఏమరపాటున ప్ర హరీకి తగలడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎండీ గౌస్, అతడి భార్య నస్రీన్, బుర్ర సమ్మయ్య, అతడి భార్య వనమాల, కొడుకులు నరేశ్, సురేశ్, రమేశ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్రావు తెలిపారు. ప్రజలు తమ ఇళ్లు, ప్రహరీలకు ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ అమర్చి అమాయకుల మృతికి కారణం కావొద్దన్నారు. ఎలక్ట్రిక్ ఫె న్సింగ్ అమర్చిన వారిని, అది తెలిసి సమాచా రం ఇవ్వని వారిపై కూడా కేసు నమోదు చేస్తామని ఎస్సై హెచ్చరించారు. -
వేగంగా విద్యుత్ సమస్యల పరిష్కారం
హన్మకొండ/హసన్పర్తి: నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని వేగంగా విద్యుత్ సమస్యలు పరిష్కరించడానికి ‘రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం’ను ప్రవేశపెట్టినట్లు టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ నగర శివారులోని దేవన్నపేట 33/11 కేవీ సబ్ స్టేషన్ తనిఖీ చేశారు. రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ పనుల పురోగతిని పరిశీలించారు. ఎదురవుతున్న సమస్యలు, పరిష్కరిస్తున్న తీరును అధికారులను అడిగి తె లుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్య మైన విద్యుత్ సరఫరా అందించడానికి రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం ఎంతో దోహద పడుతుందన్నారు. రియల్ టైంలో విద్యుత్ అంతరాయ సమాచారాన్ని ఫీల్డ్ సిబ్బందికి తెలిపి అతి తక్కువ సమయంలో కరెంట్ సరఫరాను పునరుద్ధరించొచ్చన్నారు. విద్యుత్ వినియోగం, ఓల్టేజీ లెవెల్స్, తది తర వివరాలు రియల్ టైంలో సేకరిస్తారన్నారు. అ నంతరం మడికొండ సెక్షన్లో ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్సు చీఫ్ ఇంజనీర్ తి రుమల్ రావు, హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, ఐటీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, ఎమ్మార్టీ డీఈ దర్శన్ కుమార్, కె.అనిల్ కుమార్, ఏడీఈ పి.అశోక్, ఏఈ సత్యనారాయణ పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి దేవన్నపేట సబ్ స్టేషన్ తనిఖీ -
డిసెంబర్ నాటికి యూనిట్ పనులు పూర్తి
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసి 2026 మార్చి నాటికి అధికారింగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అన్నారు. కాజీపేట మండలం అయోధ్యపురంలో నిర్మిస్తున్న రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (కోచ్ఫ్యాక్టరీ, వ్యాగన్షెడ్, వ్యాగన్ రిపేర్ షెడ్ మల్టీపుల్ ప్రాజెక్ట్)ను గురువారం రైల్వే జీఎం సందర్శించి ప్రాజెక్ట్ లేఅవుట్ పరిశీలించగా పనుల పురోగతి సమగ్ర నివేదికను అధికారులు వివరించారు. కాన్ఫరెన్స్ హాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో యూనిట్ నిర్మాణానికి సంబంధించిన అప్ డేట్ వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ను కలియ తిరిగి వివిధ డిపార్ట్మెంట్ వివరాలను తనిఖీ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాస్తవ విలేకరులతో మాట్లాడుతూ షెడ్ అంతర్గత నిర్మాణ పనులు జరుగుతున్నాయని, నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. భద్రతా అంశాలను పరిశీలించి మార్గదర్శకాలు, విధానాలు పాటించేలా అధికారులు నిర్ధారించుకోవాలన్నారు. అంతకు ముందు ప్రత్యేక రైలులో జీఎం సికింద్రాబాద్ నుంచి కాజీపేట వరకు రియర్ విండో తనిఖీలో ట్రాక్లు, సిగ్నలింగ్ వ్యవస్థ, భద్రతా అంశాలను పరిశీలించారు. రైల్వే యూనిట్ను తనిఖీ చేసి తిరుగు ప్రయాణంలో కాజీపేట రైల్వే అమృత్ భారత్ పనులు, రైల్వే లాబీ, ఆర్ఆర్ఐ రిలేను, కాకతీయ రన్నింగ్ రూంను తనిఖీ చేసి సిబ్బంది సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. జీఎం పర్యటన కార్యక్రమంలో సికింద్రాబాద్ రైల్వే డీఆర్ఎం భర్తీష్కుమార్ జైన్, రైల్వే పీసీఎంఈ సి.మధుసూదన్రావు, రైల్వే సీనియర్ డీఈఎన్ కోఆర్డినేషన్ రామారావు, డీఈఎన్ సెంట్రల్ ప్రంజల్ కేశర్వాణి, ఆర్వీఎన్ఎల్ చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ సాయిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. సుందరీకరణ పనుల్లో వేగం పెంచాలి.. జనగామ: రైల్వేస్టేషన్ సుందరీకరణ పనుల్లో మరింత వేగం పెంచాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవత్సవ ఆదేశించారు. గురువారం సికింద్రాబాద్ నుంచి కాజీపేట వెళ్తూ మార్గమధ్యలో జనగామ రైల్వేస్టేషన్లో ఆగారు. స్టేషన్ సేవలు, సుందరీకరణ పనులు, ప్రయాణికుల సౌకర్యాలు తదితర వాటిని పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో ఎక్కడా జాప్యం ఉండకుండా చూడాలన్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఫ్లాట్ఫాంపై షెడ్ల నిర్మాణం, ప్రయాణికులు వేచి ఉండే ఏసీ, జనరల్ గదులు, ముఖ ద్వారం పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. 2026 మార్చిలో అధికారికంగా ప్రారంభం రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాస్తవ కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పరిశీలన -
సూర్యాతండాలో విషాదఛాయలు●
● నర్సాపూర్లో తండా విద్యార్థి ఆత్మహత్య గార్ల: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పుల్లూరు జీపీ పరిధి సూర్యా తండాలో విషాదం అలుముకుంది. తండాకు చెందిన అజ్మీరా మేగ్యా, మంజుల దంపతుల పెద్ద కుమారుడు తరుణ్(19) మెదక్ జిల్లా నర్సాపూర్లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కళాశాల సమీపంలోని ప్రైవేట్ హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, ఉన్నత విద్యనభ్యసించి ఉద్యోగం చేసి తమను సాకుతావానుకుంటే ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోయావా బిడ్డా అంటూ తల్లిదండ్రులు మేగ్యా, మంజుల.. కుమారుడి మృతదేహంపై పడి రోదించిన తీరు చూసి పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. తరుణ్ మృతదేహానికి గురువారం సూర్యాతండాలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, తరుణ్ మృతికి గల కారణాలు నర్సాపూర్ పోలీసుల విచారణలో తేలనున్నాయి. -
పిడుగుపాటుతో యువకుడి మృతి
మల్హర్: పిడుగుపాటుతో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లారం గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యలు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లారం గ్రామానికి చెందిన కల్వల నాగరాజు (20) తమ వ్యవసాయ మోటారు మల్లారం మానేరు వాగులో మునిగిపోతుండడంతో తీసేందుకు గురువారం సాయంత్రం తండ్రితో కలిసి వెళ్లాడు. వాగులోనుంచి మోటారును బయటకు తీస్తున్న క్రమంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో నాగరాజు అక్కడికక్కడే మృతిచెందాడు. -
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి
మహబూబాబాద్ రూరల్: సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి పీహెచ్సీ, జెడ్పీ హై స్కూల్, జీపీ కార్యాలయాలను గురువారం తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య సి బ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాల న్నారు. హైస్కూల్లో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, డిజిటల్ తరగతుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ బడుల్లో అత్యుత్తమ విద్యాబోధన అందుతుందన్నారు. తరగతి గదుల్లో పిల్లల విద్యాసామర్థ్యాలను అదనపు కలెక్టర్ స్వ యంగా పరిశీలించి, మెనూ ప్రకారం రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించాలని సూచించారు. పాఠశాల ఆవరణంలో పక్కాగా శానిటేషన్ నిర్వహించాలని ఆదేశించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. గ్రామంలోని పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రఘుపతిరెడ్డి, హెచ్ఎం ఉప్పలయ్య, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో -
వెక్కిరిస్తున్న ఖాళీలు
మహబూబాబాద్: ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల బలోపేతం కోసం కృషి చేస్తోంది. పిల్లల నమోదులో భాగంగా ఈ ఏడాది అమ్మ మాట–అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహించారు. అలాగే పలు కేంద్రాలకు పెయింటింగ్ వేయించారు. ఇలా పలు అభివృద్ధి పనులు చేస్తున్న ప్రభుత్వం ఖాళీల భర్తీపై మాత్రం దృష్టిసారించడం లేదు. జిల్లాలో 588పోస్టులు ఖాళీగా ఉండడంతో.. ఇన్చార్జ్లతో నిర్వహణ చేపడుతున్నారు. దీంతో పిల్లలు విద్యపరంగా నష్టపోతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. 1,437 కేంద్రాలు.. జిల్లాలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ల పరిధిలో 1,437 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో జీరో నుంచి ఆరు నెలలలోపు పిల్లలు 2,522 మంది, ఏడు నుంచి మూడు సంవత్సరాలలోపు పిల్లలు 18,872 మంది, మూడు నుంచి ఆరు సంవత్సరాలలోపు పిల్లలు 15,930మంది.. మొత్తంగా 37,324 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. గర్భిణులు 3,988 మంది, బాలింతలు 2,790మంది ఉన్నారు. ఇన్చార్జ్ డీడబ్ల్యూఓ... రెగ్యులర్ డీడబ్ల్యూఓగా పని చేసిన ధనమ్మ గత నెల 30న ఉద్యోగ విరమణ పొందారు. ఆ పోస్టు ఖాళీగా ఉండడంతో ఈనెల 1న మానుకోట ప్రాజెక్ట్ సీడీపీఓగా పని చేస్తున్న శిరీషకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కొందిమంది టీచర్లు, ఆయాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు 58 మంది సూపర్వైజర్ పోస్టులకు 46 మంది మాత్రమే ఉండడం కూడా.. పర్యవేక్షణ కొరవడింది. ఎన్నికల షెడ్యూల్లోపే పోస్టులు భర్తీ చేయాలని విజ్ఞప్తి .. స్థానిక సంస్థలు, మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణకు ముందే అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఖాళీల వివరాలు పంపాం ఖాళీల వివరాలు ప్రభుత్వానికి పంపించాం. రిటైర్మెంట్ కాగానే అప్డేట్ చేస్తూ మళ్లీ జాబితా పంపుతున్నాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. టీచర్ ఖాళీగా ఉన్న కేంద్రాలకు ఇన్చార్జ్లను నియమించాం. సౌకర్యాలు లేని కేంద్రాల జాబితాను కూడా ప్రభుత్వానికి పంపాం. అధికారుల ఆదేశాలతో తదుపరి చర్యలు తీసుకుంటాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా కేంద్రాలను నిర్వహిస్తున్నాం. – శిరీష, ఇన్చార్జ్ డీడబ్ల్యూఓ ఇన్చార్జ్ల నియామకం.. జిల్లాలో 115 అంగన్వాడీ టీచర్, 473 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఆయాలు ఉన్న కేంద్రాలకు పక్క సెంటర్ల టీచర్లను ఇన్చార్జ్లుగా నియమించారు. దీంతో తమ సొంత సెంటర్లపై దృష్టి సారించలేకపోతున్నామని పలువురు టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు విద్యపరంగా నష్టపోవాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా కొన్ని కేంద్రాల్లో టీచర్తో పాటు ఆయాలు కూడా రిటైర్మెంట్ అయ్యారు. ఆ కేంద్రాల పరిస్థితి దయనీయంగా మారింది. 588 అంగన్వాడీ టీచర్లు, ఆయా పోస్టులు ఖాళీ భారంగా కేంద్రాల నిర్వహణ కనీస సౌకర్యాలు కరువు సమయపాలన పాటించని పలువురు టీచర్లు కనీస సౌకర్యాలు కరువు.. జిల్లాలో 330 అంగన్వాడీ కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. 1,437 కేంద్రాలకు గానూ 732 కేంద్రాల్లో మరుగుదొడ్లు లేవు.. 703 కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం లేదు. 397కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం లేదని ఇటీవల ప్రతిపాదనలు తయారు చేసి పంపారు. -
ిపీల్చుకు తింటున్నారు..
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలోని ఆమాయక ఆదివాసీలు, గిరిజనుల అవసరాలను ఆసరాగా చేసుకొని వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీ వసూలు చేస్తున్నారు. అవసరాన్ని బట్టి వంద రూపాయలకు నెలకు వడ్డీ రూ.5నుంచి రూ. 10వరకు వసూలు చేస్తున్నారు. బంగారం, ప్లాటు, భూముల పేపర్లు పెట్టుకొని డబ్బులు ఇస్తున్నారు. తీసుకున్న డబ్బులకు వడ్డీ పెరిగి తలకు మించిన భారం అవుతోంది. దీంతో బంగారం, ఇళ్లు అమ్ముకొని అప్పులు తీర్చిన వారు కొందరైతే, అప్పులు తీర్చలేక, పరువుపోతుంటే తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్న వారు మరికొందరు ఉన్నారు. అధిక వడ్డీల వసూలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేని చీటీ, ఫైనాన్స్ వ్యాపారంతోపాటు, ఇంటి వద్ద గుట్టు చప్పుడు కాకుండా అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కాగా అప్పు తీర్చలేదని తోటి ఉద్యోగి కుటుంబ సభ్యులు వేధించడంతో కేసముద్రం మండల కేంద్రంలో ఉంటున్న రైల్వే ఉద్యోగి ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ పట్టణంలోని ఓ టీషాపు నిర్వాహకుడిని అప్పులు ఇచ్చిన వాళ్లు ఒత్తిడి చేయడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. నెల్లికుదురు మండలంలోని ఓ వడ్డీ వ్యపారి డబ్బులు ఇవ్వలేదని మహిళా ఉద్యోగిపై అసభ్యకరంగా మాట్లాడడంతో సదరు ఉద్యోగి తోటి ఉద్యోగుల వద్ద గోడు వెల్ల బుచ్చుకుని కన్నీటిపర్యంతమైంది. ఇలా వడ్డీవ్యాపారుల ఆగడాలు జిల్లాలో మితిమీరిపోతున్నాయి.కొంతకాలం మౌనంగా.. నాలుగేళ్ల క్రితం వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక పలువురు ఆత్మహత్య చేసుకున్నారు. కొందరు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై స్పందించిన అప్పటి ఎస్పీ కోటి రెడ్డి జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై దృష్టి పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా చీటీలు, అధిక వడ్డీలు వసూళ్లు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. ఇలా మహబూబాబాద్ పట్టణంలో ఐదుగురు, డోర్నకల్లో ఇద్దరు, కేసముద్రంలో ముగ్గురు, కురవి, గార్ల, తొర్రూరు, మరిపెడ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 15 మంది వడ్డీ వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. దీంతో కొంతకాలం సద్దుమణిగిన ఈ దందా గత ఏడాది కాలంగా మళ్లీ మొదలైందని బాధితులు చెబుతున్నారు జిల్లాలో వడ్డీ వ్యాపారుల అరాచకం సంవత్సరాలుగా చెల్లించినప్పటికీ తీరని అప్పు వేధింపులు తాళలేక బాధితుల ఆత్మహత్యాయత్నాలు ఒకరి మృతి, మరొకరు ఆస్పత్రిలో చికిత్సఅధిక వడ్డీ వసూలు చేస్తే చర్యలు ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని నిబంధనలకు విరుద్ధంగా అధిక వడ్డీ వసూలు చేయడం నేరం. వ్యాపారులు వేధింపులకు గురి చేస్తున్న విషయంపై ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటాం. అధిక వడ్డీకి డబ్బులు తీసుకొని అప్పుల పాలుకావడం, ఆన్లైన్ గేమ్స్, ఇతర వ్యసనాలకు గురై కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకోవద్దని అవగాహన కల్పిస్తున్నాం. – తిరుపతిరావు, డీఎస్పీ, మహబూబాబాద్ -
జాన్పాక వద్ద ఆర్ఓబీ నిర్మించండి
కాజీపేట రూరల్/న్యూశాయంపేట : జాన్పాక వద్ద ఐఆర్ఆర్ ఏర్పాటు చేస్తున్నందున ఆర్యూబీకి బదులు ఆర్ఓబీ నిర్మించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద.. గురువారం కాజీపేట మండలం అయోధ్యపురంలోని రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పరిశీలనకు వచ్చిన రైల్వే జీఎం సంజ్య్కుమార్ శ్రీవాస్తవ కలిసి కోరారు. జాన్పాక ఎల్సీ 63ఏను మూసివేస్తూ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని అధికారులు నిర్ణయించిన నేపథ్యంలో దాని పక్కనుంచి కుడా ఆధ్వర్యంలో ఇన్నర్రింగ్రోడ్ ని ర్మాణం జరుగుతున్నందున రైల్వే ఓవర్బ్రిడ్జి పరిశీలి ంచాలని కలెక్టర్తోపాటు కమిషనర్ చాహత్బాజ్పాయ్,‘కుడా’చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి కోరా రు. దీనిపై పరిశీలిస్తామని జీఎం హామీ ఇచ్చారు. కాజీపేట రైల్వే బస్టాండ్ కోసం స్థలం ఇవ్వండి కాజీపేట రైల్వే బస్టాండ్ కోసం స్థలం ఇవ్వాలని, చిరు వ్యాపారులకు కాంప్లెక్స్ నిర్మించాలని, రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లో స్థానికులకు ఉద్యోగవకాశం కల్పించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి..రైల్వే జీఎంకు వినతిపత్రం ఇచ్చారు. పరిహారం ఇప్పించండి.. రైల్వే యూనిట్ కాన్ఫరెన్స్హాల్లో రైల్వే జీఎంను అయోధ్యపురం రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ భూనిర్వాసిత రైతులు కలిసి తమకు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని, రైల్వేనుంచి రావాల్సిన పరిహారం ఇప్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు. జీఎంను కలిసిన వారిలో ఉల్లెంగుల శ్రీనివాస్, మామిండ్ల మల్లయ్య, మామిండ్ల బిక్షపతి, ఎలసగరం సమ్మయ్య, గడ్డం అనిల్, కాయిత రమ, జేరుపోతుల కుమారస్వామి ఉన్నారు. -
గిరిజన చేతి వృత్తులకు ప్రోత్సాహం
హన్మకొండ: గిరిజన చేతి వృత్తులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ట్రైఫె డ్) రీజినల్ కార్యాలయం (రెండు తెలుగు రాష్ట్రాలు) జనరల్ మేనేజర్ సుబోజిత్ తరఫ్దార్ అన్నారు. గురువారం హనుమకొండ అశోకా కాలనీలోని గిరిజన భవన్లో గిరిజన చేతి వృత్తి కళాకారుల ఎంప్యానల్మెంట్ మేళా నిర్వహించారు. గిరిజన చేతి వృత్తి కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సుబోజిత్ తరఫ్దార్ మాట్లాడుతూ గిరిజన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడం, గిరిజన సంఘాలను బలోపేతం చేయడం, గిరిజన ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం, గిరిజనుల సామాజిక, ఆర్థికాభివృద్ధికి ట్రైఫెడ్ కృషి చేస్తుందన్నారు. గిరిజన చేతి వృత్తుల కళాకారుల ఉత్పత్తులు పరిశీలించి వారిని ఎంప్యానల్ చేసుకోవడానికి ఈ మేళా ఏర్పాటు చేశామన్నారు. ట్రైఫెడ్కు దేశ వ్యాప్తంగా 150, హైదరాబాద్లో మూడు షోరూంలు ఉన్నాయన్నారు. గిరిజనులు ఉత్పత్తి చేసిన వస్తువులను ట్రైఫెడ్ కొనుగోలు చేసి మార్కెటింగ్ చేస్తుందన్నారు. ఎంప్యానల్ జాబితాలో చోటు చేసుకున్న వారికి ఆర్డర్లు ఇవ్వడం ద్వారా వారు తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తామన్నారు. తద్వారా వారి జీవనోపాధి పెరుగుతుందన్నారు. ప్రధాన మంత్రి వందన్ వికాస్ కేంద్రాస్ ద్వారా గిరిజన స్వయం సంఘాలకు రూ.15 లక్షల ఆర్థిక సాయం అందించి వృత్తి శిక్షణ ఇచ్చి వారి ద్వారా వస్తు ఉత్పత్తి చేసి జీవనోపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల గిరిజన సంక్షేమాధికారులు ప్రేమకళ, సౌజన్య, ట్రైఫాడ్ మార్కెటింగ్ హెడ్ జిషాన్, మార్కెటింగ్ అసిస్టెంట్ సందీప్ శర్మ, సాయిరాం, తదితరులు పాల్గొన్నారు. ట్రైఫెడ్ జనరల్ మేనేజర్ సుబోజిత్ తరఫ్దార్ -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి
మహబూబాబాద్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భ ంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ కమిటీల ద్వారా ఇప్పటికే ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల వివరాలు ఆన్లైన్లో నమోదు, దశల వారీగా బిల్లుల మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. మండల ప్రత్యేకాధికారులు ఇళ్లను తనిఖీ చేయాలన్నారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైతే వడ్డీ లేని రుణాలు ఇవ్వాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లెనిన్వత్సల్ టొప్పో, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పాఠశాలను సందర్శించి.. పాఠాలు బోధించి మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చదువుతోనే సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదివినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని అన్నా రు. హాస్టల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, సీజనల్ వ్యాధులపై జాగ్రత్త వహించాలని, విద్యార్థులకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించాలని, మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందించాలన్నారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ పాఠాలు బోధించారు. కార్యక్రమంలో హాస్టల్ హెచ్డబ్ల్యూఓ లక్ష్మినర్సింహ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ -
నీళ్లు మింగుతున్నారు..!
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్లో అన్యూజ్డ్ పోస్టులను వినియోగంలోకి తీసుకురావడంలో ఖర్చుల పేరుతో జరిగిన వసూళ్లపై ‘సాక్షి’లో ఈ నెల 16న ప్రచురితమైన ‘పంచుకున్నదెవరు’ కథనానికి కొందరు నీళ్లుమింగుతున్నారు. వసూళ్లు, పంపకాలతో సంబంధమున్నట్లు అనుమానిస్తున్న వారు.. తమ అనుచరుల ద్వారా ‘సాక్షి’ కథనం తర్వాత ఏమి జరుగుతుందని ఆరా తీస్తున్నారు. టీజీ ఎన్పీడీసీఎల్లో ఏళ్లుగా వృథాగా ఉన్న 216 అన్యూజ్డ్ పోస్టులు, ఖాళీగా ఉంటున్న 216 అన్యూజ్డ్పోస్టులను వినియోగంలోకి తీసుకొస్తూ వివిధ కేటగిరీల్లో 339 నూతన పోస్టులు ప్రభుత్వం మంజూరు చేసింది. అన్యూజ్డ్ పోస్టులను వినియోగంలోకి తీసుకురావడానికి నూతన పోస్టులు మంజూరుకు ఖర్చులవుతాయని చెప్పి ఓ ప్రధాన ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకుడు వసూళ్లు చేసినట్లు విద్యుత్ ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ఇంజనీర్స్ అసోసియేషన్లతో పాటు, ఇతర ఉద్యోగ అసోసియేషన్లు కూడా ఖర్చుల కోసం తమ సభ్యుల నుంచి వసూలు చేసి ఆ ఇంజనీర్ అసోసియేషన్ నాయకుడికి ముట్టచెప్పినట్లు సమాచారం. ఇందులో కొందరు నేరుగా ఓ బ్యాంకు ఖాతాలో జమచేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరికొందరు ఇతర మార్గాల్లో ముట్టజెప్పినట్లు తెలిసింది. అయితే కొత్త పోస్టుల మంజూరులో ఎలాంటి డబ్బులు ఖర్చు కాలేదని స్పష్టమవడంతో వసూళ్లు చేసిన సొమ్ము ఎవరెవరి చేతుల్లోకి మారిందనే అంశం కలకలం రేపుతోంది. ‘సాక్షి’ ప్రచురితమైన కథనంతో ఈ డబ్బుల లావాదేవీలతో సంబంధమున్న వారు తమ ప్రమేయం, తమ పేర్లు ఎక్కడ బయటపడుతాయోనని ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. దీంతో డబ్బులు చేతులు మారినట్లు వారు పరోక్షంగానే బయటపడుతున్నారు. తన లాభం కోసం ఇతరుల ప్రయోజనాలను అడ్డుకోవడంతో పాటు, ఎలాగైనా ఆశించింది దక్కించుకోవడానికి ఆ నాయకుడు ఏదైనా చేస్తాడని విద్యుత్ ఉద్యోగ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తనకు పదోన్నతి రావడానికి మూడేళ్లగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కాగా, వసూళ్ల పర్వంపై ఇంటెలిజెన్స్తో పాటు టీజీ ఎన్పీడీసీఎల్ విజిలెన్స్ విభాగం విచారణ చేపట్టింది. ఎవరు వసూలు చేశారు...? ఎంత మొత్తంలో చేశారు...? ఎవరెవరు పంచుకున్నారు...? ఎవరికి ముట్టజెప్పారు...? వంటి అంశాలపై ఇంటెలిజెన్స్, ఎన్పీడీసీఎల్ విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు.అన్యూజ్డ్ పోస్టుల కన్వర్షన్లో వసూళ్ల పర్వం ‘సాక్షి’ కథనం ‘పంచుకున్నదెవరు’ తో విద్యుత్ ఉద్యోగుల్లో కలకలం ఇంటెలిజెన్స్తోపాటు సంస్థ విజిలెన్స్ విభాగం విచారణ -
శుక్రవారం శ్రీ 18 శ్రీ జూలై శ్రీ 2025
● మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ విలీన గ్రామానికి చెందిన ఓ చేతి వృత్తిదారుడు తన వ్యాపారం కోసం జిల్లా కేంద్రంలోని ముగ్గురు వడ్డీ వ్యాపారుల వద్ద రూ.3లక్షలు అప్పుగా తీసుకున్నా డు. ఇందుకు నూటికి రూ. 5చొప్పున వడ్డీ చెల్లించే విధంగా అంగీకారం తెలిపాడు. వడ్డీ చెల్లిస్తున్నాడే తప్ప అప్పు తీరలేదు. మళ్లీ కొంత అప్పు తీసుకొని వడ్డీ చెల్లిస్తూ వచ్చాడు. మూడేళ్లలో రూ.15లక్షలకు పెరిగింది అప్పు. దీని నుంచి బయట పడేందుకు మళ్లీ అప్పు తీసుకున్నాడు. ఈక్రమంలో వ్యాపారులు డబ్బులు ఇవ్వాలని నిలదీయడంతో ఇల్లు అమ్మి చెల్లించాడు. అవమానంతో అతడి భార్య ఉరి వేసుకొని మృతి చెందింది. గ్రామంలోనే మరోచోట అతడు చేతి వృత్తి పనులను చేసుకుంటూ పిల్లలను పోషించుకుంటున్నాడు. ● కేసముద్రం మున్సిపాలిటీకి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షల అప్పు తీసుకొచ్చాడు. అధిక వడ్డీ చెల్లిస్తూ వచ్చాడు. చివరకు ఆ డబ్బులు కట్టలేక, మళ్లీ ఇంటి నిర్మాణానికి డబ్బు అవసరం ఉండడంతో కొన్నిచోట్ల అప్పు చేయాల్సి వచ్చింది. అసలు కంటే వడ్డీనే ఎక్కువ కావడంతో, చివరకు గిరిగిరి కింద లక్షల్లో అప్పు తీసుకున్నాడు. రూ.50 లక్షలకు పైగా అప్పు కాగా, చేసేది ఏమీ లేక తనకున్న రెండు ప్లాట్లను రూ.47లక్షలకు అమ్మేసి అప్పు చెల్లించాడు. న్యూస్రీల్ -
జల్సాల కోసం అడ్డదారులు..
బయ్యారం: జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు యువకులు అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అడ్డదారులు తొక్కారు. గంజాయి తరలిస్తూ పోలీసులకు చిక్కారు. ఈ మేర కు గురువారం బయ్యారం పీఎ స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గార్ల–బయ్యారం సీఐ రవికుమార్ వివరాలు వెల్లడించా రు. మంచిర్యాల జిల్లా రాజీవ్నగర్కు చెందిన పర్లపల్లి రాజు, వేల్పుల శాంతికుమార్, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్కు చెందిన రాజు స్నేహితులు. జల్సాలకు అలవాటు పడిన వీరికి మేసీ్త్ర పని ద్వారా వచ్చే డబ్బు సరిపోకపోవడంతో అక్రమంగా సంపాదించాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా గంజాయి విక్రయాలు చేపట్టాలని నిర్ణయించుకున్నా రు. ఈ క్రమంలో పర్లపల్లి రాజు, వేల్పుల శాంతికుమార్.. గంజాయి కొ నుగోలు చేయడానికి రెండు రోజుల క్రితం విశాఖపట్నం వెళ్లారు. హు జూరాబాద్కు చెందిన రాజు తనకు పని ఉందని ఇంటి వద్దే ఉన్నాడు. విశాఖపట్నంలోని గోరాపూర్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి వద్ద రూ. 2,69,250 లక్షల విలువైన 5.385 కేజీల గంజాయి కొనుగోలు చేసి రైలులో మంచిర్యాల వెళ్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు తనిఖీలు చేస్తారని భయపడి గార్ల రైల్వే స్టేషన్లో రైలు దిగి ఆటోలో మహబూబా బాద్ వైపునకు వెళ్తున్నారు. అదే సమయంలో గంధంపల్లి వద్ద ఎస్సై తిరుపతి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా బ్యాగుతో పరారయ్యేందుకు ప్రయత్నించారు. వీరిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని బ్యాగు తనిఖీ చేయగా గంజాయి లభ్యమైంది. దీంతో ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి సరుకు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. స మావేశంలో ఎస్సై తిరుపతి, అదనపు ఎస్సై మహబూబీ పాల్గొన్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకుల అరెస్ట్ రూ. 2.69 లక్షల విలువైన సరుకు స్వాధీనం -
పెరిగిన విద్యుత్ వినియోగం
హన్మకొండ: వర్షాభావ పరిస్థితులు, ఎండ తీవ్రత, సాగు పనులు ముమ్మరం కావడంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. వేసవికి దీటుగా వినియోగదారులు విద్యుత్ను వాడుతున్నారు. ఫలితంగా వర్షాకాలంలో మునుపెన్నడూ లేని విధంగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. మే మాసంలో మురిపించిన వర్షాలు.. వానాకాలం సీజన్ మొదలు కాగానే ముఖం చాటేశాయి. దీంతో వాతావరణ పరిస్థితులు వేసవిని తలపిస్తున్నాయి. ఎండ తీవ్రత, ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు కూలర్లు, ఏసీలు వినియోగిస్తున్నారు. మరో వైపు వర్షాలు కురవకపోడంతో మెట్ట పంటలు వేసి.. భూగర్భ జలాలు అందుబాటులో ఉన్న రైతులు ఎండిపోతున్న పంటను కాపాడుకునేందుకు తడులు పెడుతున్నారు. దీనికి తోడు రైతులు నాటు వేసేందుకు పొలాన్ని దున్నుతున్నారు. ఫలితంగా భూగర్భ జలాలు తోడేందుకు మోటార్లు వాడుతుండడంతో విద్యుత్ వినియోగం పెరిగింది. మొత్తంగా వేసవికి మించిన విద్యుత్ వినియోగం పెరుగుతోంది. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో ఈ నెల 16వ తేదీ వరకు 1059. 994 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగించారు. గతేడాది ఇదే సమయానికి 953.069 మిలియన్ యూనిట్లు వాడారు. గతేడాదితో పోలిస్తే 106.925 మిలియన్ యూనిట్లు అదనంగా వినియోగించారు. వర్షాభావ పరిస్థితులతో పెరుగుతున్న విద్యుత్ వినియోగం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం 22.060 మిలియన్ యూనిట్లు అధికంగా వినియోగించారు. జగిత్యాల సర్కిల్లో గతేడాది కంటే ప్రస్తుతం 12.777 మిలియన్ యూనిట్లు, ఖమ్మంలో గతేడాదికంటే ప్రస్తుతం 18.393 మిలియన్ యూనిట్లు, హనుమకొండ సర్కిల్లో గతేడాదితో పోలిస్తే 15.460 మిలియన్ యూనిట్లు అధికంగా, మంచిర్యాల సర్కిల్లో గతేడాదితో పోలిస్తే 8.053 మిలియన్ యూనిట్లు అధికంగా వినియోగించారు. కాగా, ఆదిలాబాద్, నిర్మల్లో గతేడాది కంటే తక్కువ వినియోగించారు. కామారెడ్డి సర్కిల్లో గతేడాదితో పోలిస్తే 1.926 మిలియన్ యూనిట్లు తక్కువ, నిర్మల్లో 1.148 మిలియన్ యూనిట్లు తక్కువ వినియోగించారు. ఇదిలా ఉండగా జూలై మాసంలో టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో ఈ నెల 2న అతి తక్కువ 48,571 మిలియన్ యూనిట్లు వినియోగించగా ఈ నెల 16న అత్యధికంగా 85.294 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగించారు. జూన్ 30, జూలై 1, 2 తేదీల్లో వర్షం కురవడంతో వాతావరణం చల్ల బడింది. దీంతో ఈ నెల 2న అతి తక్కువ వినియోగం జరిగింది. గతేడాది జూలై 2న 55.352 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగించగా ఈ నెల 2న 48.571 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగించారు. ఆ తర్వాత వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది. ఈ నెల 16 వరకు అత్యధికంగా 85.294 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగించారు. గతేడాది ఈ తేదీన 58.616 మిలియన్ యూనిట్లు మాత్రమే వినియోగమైంది. 26.678 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం పెరిగింది. టీజీ ఎన్పీడీసీఎల్లో ఈనెల 16వ తేదీ వరకు 1059.994 మిలియన్ యూనిట్లు గతేడాది ఇదే సమయానికి 953.069 మిలియన్ యూనిట్లు.. ఎండల తీవ్రత, వర్షాభావ పరిస్థితుల ప్రభావమే కారణంజూలై 1 నుంచి 16వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాలో విద్యుత్ వినియోగం వివరాలు (మిలియన్ యూనిట్లలో) జిల్లా 2025 2024 తేడా (అదనపు వినియోగం) హనుమకొండ 71.600 56.140 15.400 వరంగల్ 47.059 42.100 4.959 జనగామ 66.910 59.400 7.510 మహబూబాబాద్ 40.280 36.050 4.230 జే.ఎస్.భూపాలపల్లి 59.450 37.390 22.060 -
వర్షాల కోసం వరదపాశం
స్టేషన్ఘన్పూర్: వర్షాలు కురవాలని కోరుతూ మండలంలోని రాఘవాపూర్తో పాటు చుట్టుపక్కల గ్రా మాల రైతులు గురువారం రాఘవాపూర్ శివారులో ని పోతరాజు గండి వద్ద వరద పాశం పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ప్రతీ ఏడాది గండిపోతరాజు బండి వద్ద వర్షాల కోసం పూజలు చేస్తామన్నారు. స్వా మివారికి నైవేద్యం సమర్పించిన అనంతరం వరద పాశం ఉంచి పూజలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమం ఏళ్లు ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇలా చేయడం వల్ల వర్షాలు కురుస్తాయని నమ్మకమన్నారు. రైతులు హన్మంత్, కుమార్, రాజేందర్, శ్రీహరి, రాజు, వెంకటయ్య, నర్సింహులు, రాములు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలువురు రైతులు సామూహికంగా వనభోజనాలకు వెళ్లారు. రాఘవాపూర్లో ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ -
అంతర పంటగా కూరగాయల సాగు
తొర్రూరు రూరల్: ఆయిల్పామ్, పండ్లు, మ ల్బరీ తోటల్లో అంతర పంటగా కూరగాయల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. గురువారం మండలంలోని వెంకటాపురం, మాటేడు, అరిపిరాల గ్రామాల్లో సాగు చేస్తున్న అంతర పంటల ను పరిశీలించారు. ఈ సందర్భంగా మరియన్న మాట్లాడుతూ.. అంతర పంటగా టమాట, వంగ, క్యాబేజీ, కాలిఫ్లవర్, తీగజాతీ కూరగాయలు బీరకాయ, సోరకాయ, దొండకాయ, దోసకాయ వంటి పంటలకు పందిరి వేసేందుకు ప్రభుత్వం రాయితీ అందిస్తుందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆయిల్పామ్ అధికారి రాములు, సిబ్బంది వెంకట్, అఖిల్, రంజిత్, ప్రకాశ్, ప్రసాద్బాబు, శరత్, వీరన్న పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో 62వ ర్యాంక్మహబూబాబాద్: రాష్ట్రస్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్–2024లో మానుకోట మున్సిపాలిటీ 62వ ర్యాంక్ సాధించినట్లు మున్సిపల్ పర్యావరణ అధికారి గుజ్జు క్రాంతి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో 50,000 నుంచి 3లక్షల జనాభా ఉన్న మున్సిపాలిటీలు 824 ఉండగా జాతీయ స్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్లో మానుకోటకు 387వ ర్యాంక్ వచ్చిందన్నారు. అలాగే రాష్ట్రంలో 141 మున్సిపాలిటీలు ఉండగా 62వ ర్యాంక్ వచ్చి ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ సర్టిఫికెట్ పొందినట్లు తెలిపారు. బాలికలు అన్ని రంగాల్లో రాణించాలిమహబూబాబాద్ అర్బన్: బాలికలు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా గి రిజన శాఖ అధికారి దేశీరాంనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పా ఠశాలలో గురువారం వాయిస్ ఫర్ గర్ల్స్ అనే అంశంపై శిక్షణ నిర్వహించారు.దేశీరాంనాయక్ మాట్లాడుతూ.. విద్యార్థినులు ఆత్మవిశ్వాసంతో ఎదగాలన్నారు. విద్యార్థినుల్లో నాయ కత్వ లక్షణాలు,నైపుణ్యాలను పెంచడమే లక్ష్యంగా వాయిస్ ఫర్ గర్ల్స్ శిక్షణ కొనసాగుతుందన్నారు. ఆరోగ్యం, విద్య, వృత్తి నైపుణ్యాలు, భవిష్యత్ ప్రణాళిక వంటి పలు అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎం పొడుగు నర్సయ్య, హెచ్డబ్ల్యూఓ పద్మ,ఎఫ్సీ సుప్రజ, కౌన్సిలర్లు పాల్గొన్నారు. కాయకల్ప అవార్డులునెహ్రూసెంటర్: జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్ప త్రులు కాయకల్ప అవార్డుకు ఎంపికైనట్లు డీఎంహెచ్ఓ రవిరాథోడ్ గురువారం తెలిపా రు. ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, అంటువ్యాధుల నియంత్రణను ప్రొత్సహించేలా భారత ప్రభుత్వం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కాయకల్ప అవార్డులు అందజేస్తుందన్నారు. కోమట్లగూడెం పీహెచ్సీ ఉత్తమ ఆరోగ్య కేంద్రంగా ఎంపికై రూ. 2లక్షల బహుమతి, మరి పెడ, కురవి, కొత్తగూడ, కేసముద్రం, ఇనుగుర్తి, దంతాలపల్లి, మల్యాల, నెల్లికుదురు, బలపాల ఆరోగ్య కేంద్రాలు ప్రోత్సాహ బహుమతులు గెలుచుకున్నట్లు తెలిపారు. అలాగే పర్వతగిరి ఆయుష్మాన్కేంద్రం ఉత్తమ సెంటర్గా ఎంపిక కాగా, పెద్ద ముప్పారం, బయ్యారం ఆరోగ్య మందిరాలు రన్నరప్గా నిలిచాయని పేర్కొన్నారు. జిల్లాకు అవార్డులు రావడంతో పీహెచ్సీల అధికారులు, సిబ్బందిని అభినందించారు. దరఖాస్తుల ఆహ్వానంమహబూబాబాద్ అర్బన్: గ్రూప్స్, ఆర్ఆర్బీ, ఎస్సెస్సీ, బ్యాంకింగ్ రిక్రూమెంట్ కోర్సుల్లో 150 రోజుల ఉచిత శిక్షణకు అర్హులైన బీసీ అ భ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ స ర్కిల్ ఇన్చార్జ్ డైరెక్టర్ లక్ష్మణ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 18నుంచి ఆ గస్టు 11వరకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.జీటీబీసీస్టడీసర్కిల్.సీజీజీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. డిగ్రీలో అత్యధిక మార్కులు, రిజర్వేషన్ల ప్రకారం ఎంపిక ఉంటుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల వారి కుటుంబ ఆదాయం రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల వారి కుటుంబ ఆదాయం రూ.2లక్షలకు మించి ఉండొద్దన్నారు. ఎంపికైన అ భ్యర్థులకు నెలకు రూ.1000 చొప్పున 5 నెలల పాటు స్టైఫండ్ మంజూరు చేస్తామన్నారు. పూర్తి వివరాలకు 0870 2571192, 040 2407118నంబర్లలో సంప్రదించాలన్నారు. -
మ్రానుకోటగా మార్చుదాం..
మహబూబాబాద్ రూరల్: మానుకోట పట్టణాన్ని మ్రానుకోటగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో జమాండ్లపల్లి అటవీ అర్బన్ పార్కులో బుధవారం ఎమ్మెల్యే మురళీనాయక్, డీఎఫ్ఓ బత్తుల విశాల్ , ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రకృతి పరిరక్షణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వనమహోత్సవం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో సుమారు 50లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రభుత్వ లక్ష్యం కోసం అన్ని శాఖల అధి కారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. టూ రిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీ సుకువెళ్లి అటవీశాఖ అర్బన్ పార్కును అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంత రం అటవీశాఖ నిర్మించిన వాచ్ టవర్ ప్రారంభించారు. ఎఫ్డీఓ వెంకటేశ్వర్లు, ఎఫ్ఆర్ఓలు సురే శ్,జ్యోత్స్నదేవి, రేణుక, అధికారులు, సిబ్బంది, వివి ధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అట్టహాసంగా వన మహోత్సవం -
మీన మేషాలు..
నెహ్రూసెంటర్: మత్స్యకారులు ఆర్థికాభివృద్ధి సాధి ంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొన్నేళ్లుగా ఏటా ఉచి తంగా చేప పిల్లలను పంపిణీ చేస్తోంది. అధికారులు చెరువులు, కుంటల్లో చేప పిల్లలు వదులుతున్నారు. ఏటా ఏప్రిల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభించి పంపిణీకి సమాయత్తం అయ్యేది. కాగా, గతేడాది ఆలస్యంగా పంపిణీ చేయగా, ప్రస్తుతం ఇప్పటి వరకు ఇంకా టెండర్లు కూడా పిలవకపోవడంతో ఉచిత చేప పిల్లల పంపిణి ఉంటుందా, అదును దాటిన తర్వాత అందిస్తే ప్రయోజనం లేకుండా పోతుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగదు బదిలీ చేయాలి.. గతేడాది నుంచి సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు చేప పిల్లలను పంపిణీ చేస్తున్నారు. దీంతో చేపలు సరిగా పెరగడం లేదని, ఆగస్టులోపు పిల్లను చెరువుల్లో వదలాలని మత్స్యకారులు కోరుతున్నారు. కాంట్రాక్టర్లు నిబంధనలు పాటించకుండా నాసిరకం చేప పిల్లలను పంపిణీ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో మత్స్యసహకార సంఘాలకు ఉచిత చేప పిల్లలకు బదులుగా నగదు బదిలీ పథకాన్ని చేపట్టాలని మత్స్యకారులు కోరుతున్నారు. సగం చేప పిల్లలతోనే సరి.. జిల్లాలో 1250 చెరువులు ఉన్నాయి. 200 మత్స్య సహకార సంఘాలు ద్వారా 14 వేల మంది మత్స్యకారులు చెరువులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గతేడాది జిల్లాలో ఆలస్యంగా ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయడంతో అప్పటికే మత్స్యకారులు కొనుగోలు చేసిన చేప పిల్లలను చెరువుల్లో పోసుకున్నారు. దీంతో జిల్లాకు 4 కోట్ల చేప పిల్ల లను పంపిణీ చేయాల్సి ఉండగా.. కేవలం 2 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేశారు. ఈ ఏడాదైనా పూర్తిస్థాయిలో ఆగస్టులోపే చెరువులకు సరిపడా చేప పిల్లలను పంపిణీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. నష్టాన్ని మిగిల్చిన అకాల వర్షాలు.. గతేడాది చెరువుల్లో పోసిన చేప పిల్లలు అకాల వర్షాలకు కొట్టుకుపోయాయి. జిల్లాలో 46 చెరువులు తెగిపోగా సుమారు రూ.3 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని మత్స్యకారులు తెలుపుతున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, చెరువులు, కుంటల మరమ్మతులు వెంటనే చేపట్టాలని వారు కోరుతున్నారు. ఊసేలేని టెండర్ల ప్రక్రియ... ఈ ఏడాది ముందుగానే వర్షాలు ప్రారంభమయ్యాయి. చెరువులు, కుంటల్లో నీరు చేరింది. ఉచిత చేప పిల్లల పంపిణీ ఉంటుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏటా మే నెలలోనే చేప పిల్లల పంపిణీకి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఆగస్టు చివరి నాటికి పంపిణీ పూర్తి జరిగేది. ప్రస్తుతం టెండర్ల పిలవకపోవడం, చివరి సమయంలో హడావుడిగా చేప పిల్లలను పంపిణీ చేస్తుండడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులపై ఆధారపడి జీవిస్తున్న తమ జీవనోపాధిని దెబ్బతీయొద్దని మత్స్యకారులు కోరుతున్నారు. నిబంధనలకు నీళ్లు.. ఉచిత చేప పిల్లలను పంపిణీ చేసే సమయంలో ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. చెరువుల్లో చేప పిల్లలను వదిలే క్రమంలో వీడియో రికార్డింగ్ చేయడం, పిల్లలను మత్స్యకారుల సమక్షంలో తూకం వేయడం, లెక్కపెట్టడం వంటివి చేయాల్సి ఉంటుంది. మత్స్యశాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగా అవేవి చేయకుండానే తూతూమంత్రంగా చేప పిల్లలను వదిలినట్లు ఆరోపణలు వచ్చాయి. చేప పిల్లల పంపిణీపై విజిలెన్స్ విచారణ కూడా జరిగినట్లు సమాచారం. అధికారులు, కాంట్రాక్టర్లు చేప పిల్లలను పూర్తిస్థాయిలో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీపై నీలినీడలు ఇప్పటివరకు ఖరారు కాని టెండర్లు అదును దాటితే నష్టమేనంటున్న మత్స్యకారులు పూర్తిగా మరమ్మతులకు నోచుకోని చెరువులు, కుంటలు -
రాళ్లు విసురుతూ సైకో వీరంగం
మహబూబాబాద్ రూరల్: మానుకోట పట్టణంలో బుధవారం ఓ సైకో రాళ్లు విసురుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు. రోడ్డుపై వెళ్తున్న వారితో పాటు ఇళ్లలోకి చొరబడి మహిళలపై దాడిచేసి గాయపరిచాడు. అలాగే నిలిచి ఉన్న వాహనాలను ధ్వంసం చేసి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడు. ఈక్రమంలో ప్రజలు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అతడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హల్చల్ చేసిన సైకో మరిపెడ మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని, అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని పోలీసులు తెలిపారు. -
ప్రభంజన్ కుమార్ కన్నుమూత
బహుజన ఉద్యమకారుడుపాలకుర్తి టౌన్/ జనగామ: బహుజన, సామాజిక ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్టు ప్రొఫెసర్ డాక్టర్ యాదనాల ప్రభంజన్కుమార్ యాదవ్(62)బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్లో కన్నుమూశారు. కొన్ని నెలల క్రితం క్యాన్సర్ బారిన పడిన ఆయన పరిస్థితి విషమించడంతో చనిపోయారు. ప్రభంజన్కుమార్ స్వస్థలం జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని గూడురు గ్రామం. ప్రముఖ రచయిత, కవి గూడ అంజయ్య సోదరుడి కూతురు, మంచిర్యాల మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రేఖను వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులున్నారు. ప్రభంజన్కుమార్ నిజామాబాద్లో డిగ్రీ, పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. ఇండియన్ ఇన్మర్మేషన్ సర్వీస్(ఐఐఎస్) సాధించారు. 1998లో ఐఐఎస్ అధికారిగా ఆలిండియా రేడియోలో డిప్యూటీ ఎడిటర్గా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత జాతీయ ప్లానింగ్ కమిషన్ పీఆర్ఓగా కొద్ది రోజులు పనిచేసి రాజీనామా చేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. వామపక్ష ఉద్యమాల్లో కీలకపాత్ర పోషిస్తూ డోలుదెబ్బ, యాదవ ఇంటలెక్చువల్ ఫోరం స్థాపించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య చిత్రం రూపురేఖలను మొదట ప్రజంటేషన్ చేశారు. కాకతీయ, తెలంగాణ యూనివర్సిటీల్లో జర్నలిజం విభాగాలను స్థాపించడంలో ఆయన ముఖ్య భూమిక పోషించారు. తెలంగాణ యూనివర్సిటీ జర్నలిజం విభాగంలో ప్రొఫెసర్గా పనిచేసి 2017లో వీఆర్ఎస్ తీసుకున్నారు. పలు పత్రికలతోపాటు విద్యారంగానికి అనేక విధాలా సేవలందించారు. జనగామ మెడికల్ కాలేజీకి పార్థివదేహం అప్పగింత.. ప్రొఫెసర్ డాక్టర్ యాదనాల ప్రభంజన్కుమార్ యాదవ్ పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులు జనగామ మెడికల్ కాలేజీకి అప్పగించారు. అంతకుముందు మృతదేహాన్ని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ జీవీ వెన్నల సందర్శించి నివాళులర్పించారు. అదేవిధంగా డాక్టర్ చెరుకు సుధాకర్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, కదిరే కృష్ణ, బత్తుల సిద్దేశ్వర్, రచయితలు డాక్టర్ శంకరమంచి శ్యాంప్రసాద్, డాక్టర్ రాపోలు సత్యనారాయణ, మార్గం లక్ష్మీనారాయణ, కన్నా పరుశరాములు, కోలా జనార్ధన్, మెరుగు బాబు యాదవ్, గుమ్మడిరాజు సాంబయ్య, పులి గణేశ్,సంగి వెకన్న సంతాపం తెలిపారు. మాజీ సీఎం సంతాపం ప్రభంజన కుమార్ మృతిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆయన మరణం సామాజిక ఉద్యమాలకు తీరని లోటని పేర్కొన్నారు. ప్రభంజన్ కుమార్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్థివదేహం జనగామ మెడికల్ కాలేజీకి అప్పగింత మాజీ సీఎం కేసీఆర్తోపాటు పలువురు ప్రముఖుల సంతాపం -
విద్యుత్ తీగ తగిలి యువకుడి మృతి
ఎల్కతుర్తి: అడవి పందులను వేటడానికి విద్యుత్ వైర్ అమర్చగా, ఆ తీగ తాకి ఓ యువకుడి మృతి చెందిన ఘటనలో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఎల్కతుర్తి సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్కు చెందిన గండికోట సాంబరాజు(32) తన స్నేహితులు శీలం బాలరాజు, ఊదరి రాజుతో కలిసి ఈనెల 12న పావురాల వేటకు గ్రామశివారులోని పచ్చునూరి ప్రవీణ్ పొలం వైపునకు వెళ్తున్నారు. ఈ క్రమంలో అప్పటికే అక్కడ అడవి పందుల వేట కోసం గోపాల్పూర్కు చెందిన తక్కళ్లపల్లి చందర్రావు అనే వ్యక్తి సూచనతో అదే గ్రామానికి చెందిన పెండ్యాల తిరుపతి, ఎల్కతుర్తికి చెందిన బొజ్జ స్వామి, బొజ్జ సతీశ్.. పచ్చునూరి ప్రవీణ్ పొలం నుంచి తక్కళ్లపల్లి నర్సింగారావు పొలం వరకు విద్యుత్ వైరు అమర్చారు. దీనిని గమనించని సాంబరాజు విద్యుత్ తీగకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో సాంబరాజు వెంట ఉన్న బాలరాజు, ఊదరి రాజు భయంతో పారిపోయారు. తెల్లవారుజామున విద్యుత్ వైరు అమర్చిన పెండ్యాల తిరుపతి, బొజ్జ స్వామి, బొజ్జ సతీశ్ వచ్చి చూడగా సాంబరాజు చనిపోయి కనిపించాడు. దీంతో నేరం తమపైకి రాకుండా మృతదేహాన్ని గోపాల్పూర్కు చెందిన మాసిపెద్ది భాస్కర్రావు వ్యవసాయ బావిలో పడేశారు. పావురాల వేట కోసం వెళ్లి బావిలో పడి మృతి చెందినట్లు చిత్రీకరించి కేసు తప్పుదోవ పట్టించే యత్నం చేశారు. మృతుడి భార్య మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి విశ్వసనీయ సమాచారం గోపాల్పూర్ క్రాస్ వద్ద ఆరుగురు నిందితులు పెండ్యాల తిరుపతి, తక్కళ్లపల్లి చందర్రావు, బొజ్జ స్వామి, బొజ్జ సతీశ్, శీల బాలరాజు, ఊదరి రాజును అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన సీఐ పులి రమేశ్, ఎస్సై ప్రవీణ్కుమార్, సిబ్బంది మల్లేశం, విట్టల్రావు, బుచ్చిలింగం, భాస్కరెడ్డి, బక్క య్య, రాజయ్య, సుమన్ రంజిత్, సదానందంను అభినందించారు. ఈ ఘటనలో ఆరుగురు నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన ఏసీపీ పింగిళి ప్రశాంత్రెడ్డి -
సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి
● కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం కేయూ క్యాంపస్: ప్రసుత్త పోటీ ప్రపంచంలో విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రంఅన్నారు. బుధవారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్కాలేజీలో భౌతిక శాస్త్ర విభాగంలో ఆధ్వర్యంలో ఎల్ఈడీ బల్పుల తయారీపై నిర్వహించిన రెండురోజుల వర్క్ షాప్ ప్రారంభ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. డిగ్రీలతో ఉద్యోగావకాశాలు తక్కువ అని తెలిపారు. ప్రస్తుతం ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసి ఎండీ చేస్తేనే వైద్య వృత్తికి ఉపయోగపడుతుందన్నారు. ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సులను కూడా చదవాలన్నారు. స్వయం ఉపాధి, వివిధ పరిశ్రమల స్థాపనకు కూడా నైపుణ్యాలు అవసరమన్నారు. అనంతరం ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. జ్యోతి, వర్క్షాప్ కన్వీనర్ వరలక్ష్మి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్ మాట్లాడారు. ఈ వర్క్షాప్లో ఈసీఐఎల్ పూర్వ ఉద్యోగి ఎల్ఈడీ బల్పుల తయారీ విధానం వివరించారు. సమావేశంలో అధ్యాపకులు జితేందర్, ప్రవీణ్, ఎ. సరిత, సరిత, ప్రశాంత్, కరుణాకర్, నాగయ్య, ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అల్యుమిని ఔదార్యం అభినందనీయం ● నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ కాజీపేట అర్బన్ : నిట్ 99వ బ్యాచ్ అల్యుమిని విద్యార్థులు ఇంపాక్ట్–99 పేరిట పేద, ప్రతిభ గల విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేయడం అభినందనీయమని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ అన్నారు. నిట్ వరంగల్లోని బోస్ సెమినార్ హాల్ కాంప్లెక్స్లో బుధవారం ఏర్పాటు చేసిన ఇంపాక్ట్–99 స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిట్ వరంగల్ కళాశాలలో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించి ఇన్స్టిట్యూట్ రుణం తీసుకునేందుకు 99వ బ్యాచ్ విద్యార్థులు ఇంపాక్ట్–99 (ఇన్స్ఫైరింగ్ మీనింగ్ ఫుల్ ప్రోగ్రెస్ అండ్ అల్యుమిని కంట్రిబ్యూషన్స్ టూగెదర్)ను ఏర్పాటు చేసి విద్యార్థులకు చేయూతనందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. 99వ బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు ఈసీఈ విభాగం పి.స్వర్ణలత, కెమికల్ విభాగం నుంచి జాన్.జేలు పాల్గొని నిట్కు చెందిన 2 నుంచి 4వ ఇయర్ విద్యార్థుల్లో 22 మందికి రూ.4.58 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. దరఖాస్తుల ఆహ్వానం మహబూబాబాద్ అర్బన్ : మానుకోట మున్సిపల్ పరిధిలోని అనంతారంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఫార్మసీ కళాశాలలో ప్రిన్సిపల్, గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ జి.అన్నపూర్ణ బుధవారం తెలిపారు. ప్రిన్సిపాల్ పోస్టుకు 10 సంవత్సరాల బోధన అనుభవం, ఎంఫార్మసీతోపాటు సర్వీస్ సర్టిఫికెట్లు, పీహెచ్డీ ఉన్న అభ్యర్థులు అర్హులన్నారు. అలాగే, గెస్ట్ లెక్చరర్ పోస్టులకు బీఫార్మసీ, ఎంఫార్మసీతో పొటు సర్వీస్ సర్టిఫికెట్లు ఉన్న అభ్యర్థులు అర్హులన్నారు. ఈ నెల 19న సాయత్రం 4గంటల వరకు జిరాక్స్ పత్రాలతో కళాశాలలో దరఖాస్తులు అందజేయాలన్నారు. ధ్రువపత్రాలు పరిశీలించి డెమోకు, ఇంటర్వ్యూలకు ఎంపికై న అభ్యర్థులకు ఫోన్ చేస్తామన్నారు. పూర్తి వివరాలకు 8897434233 నంబర్లో సంప్రదించాలన్నారు. -
ఏసీబీ అధికారుల తనిఖీలు
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వం నుంచి విడుదలైన సరుకులు విద్యార్థులకు అందడం లేదనే ఆరోపణల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బుధవారం ఏసీబీ, ఫుడ్ ఇన్స్పెక్టర్లు, తూనికలు కొలతలు, ఆడిట్ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఉదయం 7నుంచి సాయంత్రం 5గంటల వరకు ముమ్మరంగా సోదాలు చేశారు. ఈ సందరర్భంగా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య మాట్లాడుతూ.. గిరిజన సహకార సంస్థ నుంచి వచ్చిన సరుకులు విద్యార్థులకు పంపిణీ చేయకుండా పక్కదారి పట్టిస్తున్నారన్నారు. హాస్టల్, పాఠశాలలో మౌలిక వసతులు, మరుగుదొడ్లుకు డోర్లు, నల్లాలు పనిచేయకపోవడం, తాగునీటి సదుపాయం లేదని, సీసీ కెమెరాలు పని చేయడం లేదని తెలిపారు. హాస్టల్ నిర్వాహకులు విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదన్నారు. హాస్టల్ నుంచి విద్యార్థులను బయటకు తీసుకెళ్లే క్రమంలో అవుట్ రిజిస్టర్ బుక్ పర్యవేక్షణ సక్రమంగా లేదన్నారు. హాస్టల్లో జరుగుతున్న సంఘటనలపై రాష్ట్ర, జిల్లా గిరిజన శాఖ అధికారులకు వివరాలను వెల్లడిస్తామన్నారు. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాలనుకునే వారు 91543 88912 నంబర్కు ఫోన్ చేయవచ్చని, ఫిర్యాదుదారుల సమాచారం గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో ఎసీబీ ఇన్స్పెక్టర్లు ఎల్.రాజు, ఎస్.రాజు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గిరిజన హాస్టల్లో ఉదయం 7నుంచి సాయంత్రం 5గంటల వరకు సోదాలు -
సైన్స్ కాంగ్రెస్కు రిజిస్ట్రేషన్ల సంఖ్య పెంచాలి
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఆగస్టు 19, 20, 21 తేదీల్లో మూడు రోజులు నిర్వహించబోయే తెలంగాణ సైన్స్ కాంగ్రెస్కు వివిధ యూనివర్సిటీల నుంచి అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థుల రిజిస్ట్రేషన్ల సంఖ్య పెంచేలా కృషిచేయాలని కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి కోరారు. బుధవారం క్యాంపస్లోని కమిటీ హాల్లో సైన్స్ విభాగాల అధిపతులు, ప్రొఫెషనల్స్ కాలేజీల ప్రిన్సిపాళ్లతో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 98 అబ్స్ట్రాక్ట్లతోకూడిన రిజిస్ట్రేషన్లు అయ్యాయన్నారు. ఈనెలాఖరు వరకు సమయం ఉందని, అప్పటిలోగా ఎక్కువ మంది సైన్స్కాంగ్రెస్లో భాగస్వాములయ్యేలా నమోదు సంఖ్య పెంచాలని సూచించారు. ఈనెల15న నిర్వహించిన మానిటరింగ్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను కూడా వివరించారు. ప్రధానంగా వనరుల సమీకరణ, వసతుల ఏర్పాట్లుకు సంబంధించిన వివరాలను సైన్స్కాంగ్రెస్ లోకల్ సెక్రటరీ బి. వెంకట్రామ్రెడ్డి తెలిపారు. కేయూ వీసీ ప్రతాప్రెడ్డి -
కళాకారుల సమస్యల పరిష్కారానికి కృషి
● సాంస్కృతిక సారథి చైర్పర్సన్ జీవీ వెన్నెల నయీంనగర్: బ్యాండ్ వాయిద్య కళాకారుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సాంస్కృతిక సారథి చైర్పర్సన్ డాక్టర్ జీవీ వెన్నెల అన్నారు. బుధవారం బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం రాష్ట్ర సదస్సు హనుమకొండ ఈద్గా సిటిజన్ హాల్లో జరిగింది. ఈ సదస్సుకు వెన్నెల ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ బ్యాండ్ వాయిద్య కళాకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎంవీ రమణ, హనుమకొండ జిల్లా కన్వీనర్ లింగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో బ్యాండ్ వాయిద్య వృత్తే జీవనాధారంగా లక్షలాదిమంది జీవిస్తున్నారన్నారు. అన్ సీజన్లో అడ్డమీద కూలీలుగా జీవనం గడుపుతున్నారని, వీరికి ప్రభుత్వ పథకాలు అందజేసి ఆదుకోవాలని కోరారు. ప్రతీ కళాకారుడికి గుర్తింపు కార్డు, జీవిత బీమా, ఆర్థిక సాయం, ఆరోగ్య భద్రత, ఇళ్ల స్థలాలు, పింఛన్, 3 ఎకరాల భూమి ఇచ్చి ఆదుకోవాలని కోరారు. గుమ్మడిరాజు నాగరాజు అధ్యక్షతన జరిగిన సదస్సులో సంఘం నాయకులు రాజాసాబ్, చాంద్పాషా, శంకర్, అంజయ్య, బషీర్, వెంకన్న, మల్లేశం, గొడుగు వెంకట్, ఓదెలు, సాంబయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పురాతన వస్తువులు అందజేయాలి
హన్మకొండ కల్చరల్ : చరిత్రను అర్థం చేసుకోవడానికి, సంరక్షించుకోవడానికి, ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు గతం గురించి అధ్యయనం చేయడానికి ఉపయోగపడే పురాతన వస్తువులు, ప్రాచీన కళా ఖండాలను జానపద గిరి జన విజ్ఞానపీఠానికి అందజేయాలని పీఠం పీఠాధిపతి గడ్డం వెంకన్న కోరా రు. బుధవారం వరంగల్ హంటర్రోడ్లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞానపీఠంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీఠం స్థాపించి 30సంవత్సరాలు పూర్తయిందన్నారు. పీఠంలో అరుదైన జానపద వస్తువులతో మ్యూజియం ఏర్పాటు చేశామన్నారు. మ్యూజియంలోని వస్తువులు ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు భవిష్యత్ తరా లకు చరిత్రను తెలుసుకోవడానికి సాయపడతాయన్నారు. ఇందుకోసం ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు తమ వద్ద ఉన్న ఉపయోగంలో ఉన్నా లేకపోయిన పురాతన రాతి, లోహ, చెక్క సంబంధ వంట సామాను, ఇంటి వస్తువులు, పనిముట్లు తదితర వస్తువులను అందజేయాలని కోరారు. వస్తువులు అందజేసిన వారి వివరాలు నమోదు చేస్తామని తెలిపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ క్షమంతుల దామోదర్, డాక్టర్ బాసాని సురేశ్, డాక్టర్ చూరేపల్లి రవికుమార్, అబ్బు గోపాల్రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ డాక్టర్ గంపా సతీశ్, సిబ్బంది పాల్గొన్నారు. జానపద గిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి గడ్డం వెంకన్న మ్యూజియంలోని వస్తువులు -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్యాయత్నం ..
ములుగు రూరల్: అప్పుల బాధతో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ఓ రైతు.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని కొత్తూరు పంచాయతీ పరిధి యాపలగడ్డలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అల్లెం సమ్మయ్య(45) గతేడాది మూడెకరాల్లో మిర్చి సాగు చేశాడు. ఆశించిన మేర దిగుబడి రాక రూ. 2లక్షల మేర అప్పుల పాలయ్యాడు. ఈ ఏడాది మూడెకరాల్లో పత్తి, రెండెకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. గత ఏడాది అప్పులు, ఈ ఏడాది పెట్టుబడికి డబ్బులు అందక మనస్తాపంతో ఈ నెల 14వ తేదీన పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబీకులు ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. 16ఎంయుఎల్460: సమ్మయ్య(ఫైల్) చికిత్స పొందుతూ మృతి -
మహిళలు రాజకీయంగా రాణించాలి
హన్మకొండ చౌరస్తా: మహిళలు రాజకీయంగా రాణించాలని, అప్పుడే సమాజం నిజమైన అభివృద్ధి సాధిస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ ప్రెసిడెంట్ చిన్నారెడ్డి అన్నారు. హనుమకొండ హంటర్రోడ్ లోని ‘డి’ కన్వెన్షన్హాల్లో బుధవారం కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో మహిళలను రాజకీయంగా చైతన్య పరిచి, నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే లక్ష్యంగా శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సమావేశానికి చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ, నాయకత్వం చూపే మహిళలకు మార్గదర్శిగా నిలుస్తుందన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ భారత మొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ స్ఫూర్తితో మహిళలు రాజకీయంగా రాణించాలన్నారు. ఇందిరమ్మ మార్గంలో పయనిస్తూ దేశాన్ని శాసించే స్థాయికి ఎదగాలన్నారు. మహిళలను రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు నుంచి మొదలు.. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం వరకు మహిళలనే యజమానులుగా పరిగణిస్తోందన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ సర్కారు అత్యధిక ప్రాధాన్యవిస్తూ ప్రోత్సహిస్తోందన్నారు. కార్యక్రమంలో వరంగల్ డీసీసీ అద్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాసరావు, మహిళా అధ్యక్షురాలు బంక సరళ, మాజీ ఎంపీ దయాకర్, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మహిళా నాయకత్వ శిక్షణ శిబిరం ప్రారంభం -
గ్రంథాలయాలతో విజ్ఞానం
మహబూబాబాద్: విజ్ఞానవంతమైన సమాజానికి గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడుతాయని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుధవారం గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..గ్రంథాలయాల అభివృద్ధి అనేది గ్రంథాలయాల పన్నుపై ఆధారపడ ఉంటుందన్నారు. జిల్లాలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు వసూలు చేసినటువంటి గ్రంథాలయ పన్ను ఎప్పటికప్పుడు జిల్లా గ్రంథాలయ సంస్థకు చెల్లించాలన్నారు. జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి అధికారుల సహకారంతో పాటు ప్రజల భాగస్వామ్యం అవసరం అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శ్రీలత, కమిషనర్లు రాజేశ్వర్, విజయ్ఆనంద్, నిరంజన్, శ్యాంసుందర్, జిల్లా గ్రంథాలయ సిబ్బంది రుద్రారపు వీరేందర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో -
కళ్లు తెరవకముందే.. కాదనుకున్నారు
రఘునాథపల్లి: సరిగా కళ్లు తెరవకముందే ఆ శిశువును కాదనుకున్నారు. తల్లి పొత్తిళ్లలో నిద్రించాల్సిన అప్పుడే పుట్టిన పసికందును రోడ్డున పడేశారు. మానవత్వానికి మాయని మచ్చగా మారిన ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్లో బుధవారం చోటు చేసుకుంది. ఖిలాషాపూర్ గ్రామం తపాలా కార్యాలయం సమీపంలో రోడ్డు పక్కన బుధవారం తెల్లవారు జామున పసికందు ఏడుపు వినిపిస్తుండడంతో స్థానికులు నిద్రలేచి వెళ్లి చూశారు. లుంగీలో అప్పుడే పుట్టిన నవజాత మగ శిశువు కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా ఎస్సై దూదిమెట్ల నరేశ్ సిబ్బందితో చేరుకుని చైల్డ్హెల్ప్లైన్ 1098కి సమాచారమిచ్చారు. వారు వచ్చి వెంటనే శిశువును రఘునాథపల్లి పీహెచ్సీకి తరలించి అక్కడ ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. మెరుగైన చికిత్స కోసం జనగామ ఎంసీహెచ్కు తరలించారు. సూపరింటెండెంట్ మధుసూదన్, డాక్టర్ మడిపల్లి ఉదయ్కుమార్గౌడ్ (పిడియాట్రీషన్) ఆధ్వర్యంలో శిశువుకు అవసరమైన బేసిక్ టెస్టులు చేసి పర్యవేక్షణలో ఉంచారు. శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి డి. ఫ్లోరెన్స్, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి రవికాంత్, చైల్డ్ హెల్ప్లైన్ కోఆర్డినేటర్ రవికుమార్, ఐసీడీఎస్ సూపర్వైజర్ సరస్వతి ఉన్నారు. మగ శిశువును రోడ్డున పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఎంసీహెచ్ వైద్యుల పర్యవేక్షణలో క్షేమం -
ఆ తర్వాతే సర్పంచ్, వార్డు సభ్యులు
గురువారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2025– 8లోu75 జెడ్పీటీసీలు, 778 ఎంపీటీసీలు.. స్థానిక ఎన్నికల కోసం ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను ప్రభుత్వం బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. రిజర్వేషన్ల ఆర్డినెన్స్పై గవర్నర్ సంతకం చేయడమే తరువాయి రిజర్వేషన్లను ప్రకటించనున్నారు. ముందుగా పేర్కొన్న విధంగానే మొదట జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి.. ఆ తర్వాతే గ్రామ పంచాయతీలు, వార్డులకు జరిపించనున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రకటన ప్రకారం ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో ఆరు జిల్లా ప్రజాపరిషత్లు, 75 జెడ్పీటీసీ స్థానాలను ఖరారు చేశారు. 778 ఎంపీటీసీ స్థానాలు 75 ఎంపీపీ స్థానాలను ప్రకటించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్లపైన సందిగ్ధత నెలకొంది. సాక్షిప్రతినిధి, వరంగల్/సాక్షి, మహబూబాబాద్: త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయా? ఈ దిశగా ప్రభుత్వం పావులు కదుపుతోందా? బుధవారం జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలను ప్రకటించడం వెనుక మతలబు ఇదేనా? స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్య ంలో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచిందా?.. అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. అధికార వర్గాలు కూడా స్థానిక సంస్థల నోటిఫికేషన్ త్వరలోనే రావచ్చని చెబుతున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగానే ప్రభుత్వం గ్రామ పంచాయతీలతోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ స్థానాలను ప్రకటించినట్లు భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయని భావించిన అధికారులు ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాలో 1,708 గ్రామ పంచాయతీలు, 15,006 వార్డులు ఉన్నాయి. ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికలు జరిపే విధంగా 15,021 పోలింగ్ కేంద్రాలను కూడా సిద్ధం చేసినట్లు అధికారులు ఇది వరకే ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ ఇటీవలి సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అందించాలని నిర్ణయించారు. ఈ రిజర్వేషన్లు సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్లకు వర్తిస్తుంది. బీసీ రిజర్వేషన్లను పెంచడానికి ఆర్డినెన్స్ జారీ చేసేందుకు గవర్నర్కు పంపగా, ఆయన సంతకం కాగానే ఈ స్థానాలకు రిజర్వేషన్ ఖరారు చేయనున్నారు. ఇందుకు మరో వారం, పది రోజులు పట్టినా.. వచ్చే నెల మొదటి, రెండో వారాల్లో నోటిఫికేషన్ రావచ్చన్న చర్చ జరుగుతోంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారులకు సంకేతాలు అందినట్లు కూడా చెప్తున్నారు. ఊపందుకున్న ‘స్థానిక’ సందడి... పోటీకి ఆశావహులసై.. సెప్టెంబర్ మాసంలోగా స్థానిక సంస్థల ఎన్నికలు ఖాయమన్న ప్రచారం నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల్లో మళ్లీ సందడి జోరందుకుంది. ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, రేషన్ కార్డులు, రైతు భరోసా తదితర పథకాల పంపిణీని కాంగ్రెస్ పార్టీ వేడుకలా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే ఊపుతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ప్రయత్నంలో కేడర్ను అప్రమత్తం చేస్తోంది. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సైతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు శ్రేణులను సన్నద్ధం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలతో బీజేపీ ఈసారి బలప్రదర్శనకు దూకుడు పెంచుతోంది. వామపక్ష పార్టీలు సైతం కార్యక్రమాలను ఉధృతం చేశాయి. కాగా, ప్రధాన రాజకీయ పార్టీల టికెట్లపై పోటీ చేసేందుకు ఆశావహులు సై అంటున్నారు. ఆయా పార్టీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలను కలుస్తున్నారు. దీంతో వారి ఇళ్ల ముందు సందడి పెరిగింది. న్యూస్రీల్‘స్థానిక’ ఎన్నికల నిర్వహణకు సర్కారు సమాయత్తం ఉమ్మడి వరంగల్లో స్థానాల ఖరారు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ స్థానాల వెల్లడి వచ్చే నెల మొదటి, రెండో వారాల్లో నోటిఫికేషన్? అధికారులకు ఎన్నికల సంఘం సంకేతాలు.. సిద్ధమవుతున్న పార్టీలు ఉమ్మడి వరంగల్లో జెడ్పీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, గ్రామ పంచాయతీలు, వార్డుల వివరాలు జిల్లా జెడ్పీ జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్ వార్డులు హనుమకొండ 1 12 12 129 210 1,986వరంగల్ 1 11 11 130 317 2,754భూపాలపల్లి 1 12 12 109 248 2,102మహబూబాబాద్ 1 18 18 193 482 4,110ములుగు 1 10 10 83 171 1,520జనగామ 1 12 12 134 280 2,534మొత్తం 06 75 75 778 1,708 15,006 -
ప్రయాణికుల అరిగోస
మహబూబాబాద్ రూరల్: మానుకోట రైల్వేస్టేషన్ అమృత్ భారత్ పథకానికి ఎంపికై ంది. ఈమేరకు స్టేషన్ ఆధునికీకరణకు రూ.36కోట్లు కేటాయించగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ముఖ్యంగా కాజీపేట, విజయవాడ రైలు మార్గంలో అత్యధిక ఆదాయాన్నిస్తున్న ఈ స్టేషన్లో నాలుగో నంబర్ ప్లాట్ఫాం లేకపోవడంతో ప్రయాణికులు రైళ్లు ఎక్కేందుకు, దిగేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, దివ్యాంగుల పరిస్థితి వర్ణణాతీతం. కాగా, నాలుగో నంబర్ ప్లాట్ఫాం నిర్మాణం అనివార్యమని ప్రయాణికులు, ప్రజలు అంటున్నారు. ప్రయాణికుల ఇబ్బందులు.. నాలుగో నంబర్ ప్లాట్ఫాం లేకపోవడంతో పట్టాలపై నిలిచిన రైళ్లు ఎక్కేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వేస్టేషన్కు ముందుగా చేరుకున్న ప్రయాణికులు మూడో నంబర్ ప్లాట్ఫాం నుంచి రైలు ఎక్కుతున్నారు. అయితే రైలు వచ్చి పట్టాలపై ఉన్న సమయంలో నాలుగో ప్లాట్ఫాం లేకపోవడంతో ఆ వైపు ఉన్న ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. నాలుగో నంబర్ ప్లాట్ఫాం నిర్మించాలని ప్రజలు కోరుతున్నానరు. నాయకుల సందర్శన... అభివృద్ధి పనుల్లో జాప్యం, ప్రయాణికుల సమస్యలను తెలుసుకోవడానికి ఇటీవల ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్, ఎమ్మెల్సీ రవీందర్ రావు, జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ హుస్సేన్ నాయక్ తదితరులు వేర్వేరుగా మానుకోట రైల్వే స్టేషన్ను సందర్శించారు. రైల్వే అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ బలరరాంనాయక్ సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్తో ఫోన్లో మాట్లాడి నాలుగో నంబర్ ప్లాట్ఫాం నిర్మించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. వారు సందర్శించి నెలలు గడుస్తున్నా.. పనుల్లో మాత్రం కదలిక లేదు. ఇప్పటికై నా రైల్వే శాఖ ఉన్నతాధికారులు స్పందించి నాలుగో నంబర్ ప్లాట్ఫాంతో పాటు, అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు. టికెట్, రిజర్వేషన్ కౌంటర్లను పెంచాలి.. ప్రతీరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చివెళ్లే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైల్వే స్టేషన్లో టికెట్ కౌంటర్లు, రిజర్వేషన్ కౌంటర్లు లేవు. దీంతో టికెట్లు తీసుకునే సమయంలో ప్రయా ణికులు పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోంది. రెండో నంబర్ ప్లాట్ఫాం వైపు ఒకే ఒక టికెట్ కౌంటర్ ఉండటంతో రైళ్లు వచ్చిన సమయంలో ప్రయాణికులు ఇబ్బందులు పడి టికెట్లు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని సందర్భాల్లో టికెట్ తీసుకునే లోపే రైళ్లు కదలిపోతుండడంతో ప్రయాణికులు వెనుదిరిగి వెళ్తున్నారు. పైగా రాత్రి వేళల్లో ఈ బుకింగ్ కౌంటర్ మూసి ఉంటుందని, టికెట్ కౌంటర్లు, రిజర్వేషన్ కౌంటర్లను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.మానుకోట రైల్వేస్టేషన్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులు నాలుగో నంబర్ ప్లాట్ఫాం లేకపోవడంతో ఇబ్బందులు రైళ్లు ఎక్కలేకపోతున్న ప్రయాణికులు వృద్ధులు, దివ్యాంగుల పరిస్థితి మరీ దారుణం నత్తనడకన పనులు మానుకోట రైల్వే స్టేషన్ పరిధిలో రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ఎస్కలేటర్, ర్యాంపు, లిఫ్ట్ల నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. పనుల్లో జాప్యం వల్ల కొత్త బజారు నుంచి రైల్వే స్టేషన్లోకి వెళ్లేందుకు సరైన మార్గంలేదు. దీంతో ప్రయాణికులు రైళ్లు రాగానే ఉరుకులు, పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. -
అలుగుదశకు చేరిన తులారాం ప్రాజెక్టు
బయ్యారం: మండలంలోని వినోభానగర్ సమీపంలో నిర్మించిన తులారాం(బిఎన్.గుప్తా) ప్రాజెక్టులోకి పూర్తిస్థాయి నీరు చేరడంతో మంగళవారం అలుగుదశకు చేరుకుంది. కొన్ని రోజుల క్రితం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు వంకమడుగు, ఉడుములవాగు ద్వారా ప్రాజెక్టులోకి వరదనీరు చేరుతోంది. ఈ క్రమంలో అలుగుల ద్వారా స్వల్పస్థాయిలో నీరు కిందికి తరలివెళ్తోంది. కాగా వ్యవసాయసీజన్ సైతం ప్రారంభం కావడంతో తులారాం ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో పంటలసాగు నిమిత్తం తూమును తీసి కాల్వకు రైతులు నీరు విడుదల చేశారు. పెనుగొండ జెడ్పీ హైస్కూల్కు అరుదైన అవకాశంకేసముద్రం: దేశంలోనే అగ్రగామి విద్యాసంస్థ అయిన ఐఐటీ మద్రాస్ చేపడుతున్న స్కూల్ కనెక్ట్ కార్యక్రమంలో మండలంలోని పెనుగొండ జెడ్పీహైస్కూల్ భాగస్వామిగా ఎంపికై నట్లు ఆ పాఠశాల హెచ్ఎం కాలేరు యాదగిరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ద్వారా 10నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఐఐటీ మద్రాస్ రూపొందించిన 10 ప్రత్యేక ఆన్లైన్ కోర్సులు అందుబాటులో ఉంటాయని, అవి చదువుతోపాటు విద్యార్థుల్లో విజ్ఞానం, పరిశోధనా దృక్పథం పెపొందించేందుకు తోడ్పడుతాయని తెలిపారు. ఈ అవకాశాన్ని తీసుకువచ్చిన ఫిజికల్సైన్స్ టీచర్ వి.గురునాథరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ముగిసిన ఉపాధ్యాయుల శిక్షణమహబూబాబాద్ అర్బన్: మానుకోట మున్సి పాలిటీ పరిధి అనంతారం మోడల్ స్కూల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు చేపట్టిన అటల్ టింకరింగ్ ల్యాబ్ శిక్షణ మంగళవారం ముగి సింది. శిక్షకులు శంషద్, అజయ్, సందీప్ ఈ– ప్రింటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉపయోగించుట, బేసిక్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్, మెకానికల్ టూల్స్, డ్రోన్ కెమెరాల పనితీరును ఉపాధ్యాయులకు వివరించడంతో పాటు ప్రాక్టికల్ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, కోఆర్డినేటర్లు చంద్రశేఖర్ ఆజాద్, పూర్ణ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నర్సరీ నిర్వాహకులు నిబంధనలు పాటించాలిమహబూబాబాద్ రూరల్: మిరప, కూరగాయల నర్సరీల నిర్వాహకులు నిబంధనలు పాటించాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. మిరప, కూరగాయల నర్సరీదారులకు జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ, జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మహబూబాబాద్ రైతు వేదికలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మరియన్న మాట్లాడుతూ.. నిబంధనల మేరకు నర్సరీలను నిర్వహించాలని సూచించారు. నర్సరీల్లో పలు మేలైన యాజమాన్య పద్ధతులు, సూచనలు పాటించాలని, రైతులు అంగీకారం తెలిపిన రకాలు, పేరుగాంచిన రకాలు, వ్యవసాయ శాఖ ద్వారా ఆమోదం పొందిన రకాల నారును పెంచాలన్నారు. నర్సరీ లైసెన్స్ లేకుండా నర్సరీ నుంచి మిరప, కూరగాయలు మొదలైన నారు అమ్మొద్దు.. కొనొద్దని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై, నకిలీ విత్తనాలు, నారు పోసిన వారిపై పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు పంపిస్తామని, జరిమానా కూడా విధిస్తామని తెలిపారు. అనంతరం నర్సరీ నిబంధనల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సదస్సులో ఇన్చార్జ్ జిల్లా వ్యవసాయ అధికారి అజ్మీరా శ్రీనివాసరావు, మల్యాల కేవీకే ఇన్చార్జ్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ బి.క్రాంతికుమార్, హెచ్ఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త కె.నాగరాజు, మండల వ్యవసాయ అధికారి ఎన్.తిరుపతి రెడ్డి, ఉద్యాన అధికారులు ఎ.జె.శాంతిప్రియదర్శిని, ఆర్.శాంతిప్రియ, బి.మానస, కార్యాలయ సూపరింటెండెంట్ ఆర్.శ్రీనివాసరావు, వ్యవసాయ విస్తరణ అధికారులు సాయిప్రకాశ్, పున్నమి, నర్సరీదారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
నిట్తో జర్మనీ యూనివర్సిటీ ఎంఓయూ
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్తో జర్మనీకి చెందిన నార్దౌసెన్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ మంగళవారం ఆన్లైన్లో ఎంఓయూ కుదుర్చుకుంది. వర్చువల్గా డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, ఎన్యూఏఎస్ జర్మనీ యూనివర్సిటీ ప్రెసిడెంట్, ప్రొఫెసర్లు జాంగ్ వ్యాగ్నర్, జెన్నీలు పాల్గొని ఎంఓయూపై సంతకాలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో అకాడమిక్, పరిశోధనలకు ఈ ఒప్పందం తోడ్పడుతుందని, తొలిసారిగా ఆన్లైన్లో ఎంఓయూ చేసుకోవడం ఆనందంగా ఉందని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. కార్యక్రమంలో నిట్ డీన్లు, ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్లోనూ ఏసీబీ ఆరా..!
సాక్షిప్రతినిధి, వరంగల్: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన మాజీ ఈఎన్సీ (జనరల్) చెట్టి మురళీధర్రావు మూలాలపై ఏసీబీ అధికారులు వరంగల్, హనుమకొండలలోనూ ఆరా తీశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల మేరకు మంగళవారం ఉదయం మురళీధర్రావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ బంజారాహిల్స్, కరీంనగర్, జహీరాబాద్ తదితర పదిచోట్ల కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే మురళీధర్రావు కుమారుడు అభిషేక్తో సన్నిహిత సంబంధాలు కలిగిన పలువురు కాంట్రాక్టర్ల గురించి ఆరా తీసినట్లు ప్రచారం. కాగా, కాళేశ్వరం ప్రాజెక్ట్తోపాటు సీతారామ, దేవాదుల, ఎస్సారెస్పీలలో కీలక పనుల సబ్ కాంట్రాక్ట్ల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణల నేపథ్యంలో హనుమకొండకు చెందిన కాంట్రాక్టర్ల గురించి ఆరా తీయడం చర్చనీయాంశంగా మారింది. ఇరిగేషన్లో మురళీధర్రావు కీలకంగా వ్యవహరించిన సమయంలో ఆయన కుమారుడు అభిషేక్ బినామీగా కాంట్రాక్టు సంస్థలకు మేలు జరిగేలా కోట్లాది రూపాయల కాంట్రాక్టులు కట్టబెట్టారన్న ప్రచారం ఉంది. వర్క్ఆర్డర్లు జారీ చేసిన ఆధారాలు కూడా రాబట్టి హర్ష, సహస్ర (హనుమకొండ హంటర్రోడ్డు) కన్స్ట్రక్షన్ కంపెనీల పేర్లను బయట పెట్టినప్పటికీ.. మరో రెండు కాంట్రాక్టు సంస్థల గురించి ఆరా తీసిన ఏసీబీ పూర్తి వివరాలు బుధవారం వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. కాగా, సహస్ర కంపెనీలో మంగళవారం సోదాలు నిర్వహించారు. నెక్ట్స్ ఎవరో.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించి అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న ఒక్కొక్కరిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. ఏప్రిల్లో కాళేశ్వరం ఈఎన్సీ భూక్య హరిరామ్ను ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని అరెస్టు చేశారు. కేసీఆర్ ఫామ్హౌస్ సమీపంలో 28 ఎకరాల వ్యవసాయ భూమితోపాటు అమరావతిలో వాణిజ్య స్థలం, ప్లాట్లు, ఇళ్లు, విల్లాలు ఉన్నట్లు ప్రకటించారు. ఈయన ఆధ్వర్యంలో రూ.48,665 కోట్ల పనులు జరిగినట్లు కూడా గుర్తించారు. ఆ తర్వాత ఇదే ప్రాజెక్టులో కీలకంగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని ఆయన కుటుంబసభ్యులు, బంధువుల్లో ఇటీవల ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా నూనె శ్రీధర్ వందల కోట్ల అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు బయటపెట్టింది. తాజాగా, మంగళవారం ఉదయం మాజీ ఈఎన్సీ మురళీధర్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని కుటుంబసభ్యులు, బంధువుల్లో సోదాలు చేపట్టడం ఇరిగేషన్ వర్గాల్లో కలకలంగా మారింది. తదుపరి జాబితాలో ఎవరో? అన్న చర్చ ఇంజనీరింగ్ వర్గాల్లో సాగుతోంది.కీలక అధికారుల్లో మొదలైన గుబులు.. వరుస దాడులతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఇంజనీర్లలో గుబులు మొదలైంది. పదవీ విరమణ చేసినా వదలకుండా ఏసీబీ దాడులు నిర్వహిస్తుండడం ఆందోళనకు గురిచేస్తోంది. వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు, పంపుహౌస్లు కీలకం. ఈ పనుల నిర్వహణ, పూర్తిలో అప్పటి సీఈ నల్లా వెంకటేశ్వర్లు కీలకంగా వ్యవహరించారని అప్పటి ప్రభుత్వం ప్రశంసించి.. పదవీకాలాన్ని కూడా పొడిగించింది. మేడిగడ్డ కుంగుబాటు తర్వాత ఆయనతోపాటు 19 మంది వివిధ కేడర్లకు చెందిన అధికారులను ప్రస్తుత ప్రభుత్వం తప్పుబట్టింది. విజిలెన్స్, ఎన్డీఎస్ఏ, జస్టిస్ పీసీ ఘోష్ కమిటీలు కూడా విచారించి నివేదికలు రూపొందించాయి. కొందరిపైన క్రిమినల్ కేసులకు కూడా సిఫారసు చేశారు. ఈ జాబితాలో ఉండి విచారణను ఎదుర్కొన్న ముగ్గురు అధికారులపై కొద్ది రోజుల తేడాతో ఆదాయానికి మించిన ఆస్తుల కలిగి ఉన్నారన్న ఆరోపణలపైనే ఏసీబీ దాడులు నిర్వహించింది. అక్రమ ఆస్తుల గుట్టువిప్పి అరెస్టు చేయగా.. తర్వాత జాబితాలో ఎవరు? అన్న అంశం ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీరింగ్ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది.మాజీ ఈఎన్సీ మురళీధర్ అరెస్టు నేపథ్యం ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్వాహకుడితో సంబంధాలు మురళీధర్ కుమారుడు అభిషేక్ సన్నిహితులపై నిఘా కాళేశ్వరం ఇంజనీర్లలో ఒక్కొక్కరిపై దాడి.. ఏసీబీ లిస్టులో తరువాత ఎవరు..? -
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
మహబూబాబాద్ అర్బన్: రైతుల సంక్షేమానికి ప్ర భుత్వం కృషి చేస్తోందని, రైతు భరోసా, రుణమాఫీ, తదితర పథకాలను పకడ్బందీగా అమలు చేస్తుందని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో మంగళవారం వ్యవసాయశాఖ అధికారులు, సొసైటీ సీఈఓలు, పంచాయతీ కార్యదర్శులతో యూరియా, ఫర్టిలైజర్ తదితర అంశాలపై సమీ క్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 7,346 మె ట్రిక్ టన్నుల యూరియా, సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళ న చెందాల్సిన అవసరం లేదన్నారు. కల్తీ ఎరువులు అమ్మితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, క్రమం తప్పకుండా ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాలని సూచించారు. సొసైటీల ద్వా రా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతీ రైతుకు ఎరువులు పంపిణీ చేయాలన్నారు. రైతులతో వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. డిమాండ్కు అనుగుణంగా యూరియా ఇతర ఫర్టిలైజర్స్ సిద్ధంగా ఉంచుకోవా లన్నారు, సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ డీఏఓ శ్రీని వాసరావు,అసిస్టెంట్ డైరెక్టర్స్ మురళి, విజయ్ చందర్, అన్ని మండలాల వ్యవసాయ శాఖ అధికారులు, సొసైటీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో -
తపాలా ఆధునికీకరణ..
ఖిలా వరంగల్: పోస్టల్ డిపార్ట్మెంట్ ఆధునికీకరణ దిశగా మరో ముందు అడుగు వేసింది. జూలై 22వ తేదీ నుంచి వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో అన్ని తపాలా కార్యాలయాల్లో ఐటీ–2.0 సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సూపరింటెండెంట్ బి. రవికుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నూతన సాంకేతికతను రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే నల్లగొండ డివిజన్లో జూలై 8వ తేదీన ప్రారంభించారని, ఇప్పుడు రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో ఈనెల 22న తేదీ నుంచి ప్రారంభం కానుందని తెలిపారు. వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో ప్రస్తుతమున్న 2 హెడ్ పోస్టాఫీస్లు, 42 సబ్ పోస్టాఫీస్ల్లో ఈనూతన సాంకేతికతను అమలు చేయనున్నామని తెలిపారు. పార్సిల్, సీఓడీ, వీపీపీ వంవ సేవల బట్వాడ వేగవంతం అవుతుందని, డిజిటల్ సిగ్నేచర్, డిజిటల్ మోడ్ చెల్లింపులు వంటి ఆధునిక సదుపాయాలు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈక్రమంలో జూలై 18,19 తేదీల్లో ఆన్లైన్ నమోదు పనులు, 21న పూర్తి స్థాయిలో లావాదేవీలు నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు, ఖాతాదారులు తమ తపాలా లావాదేవీలను ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ మార్పు వల్ల తాత్కాలికంగా కొన్ని అసౌకర్యాలు కలగొచ్చునని, అయితే వాటిని సమర్థవంతంగా అధిగమించి మెరుగైన సేవలు అందించేందుకు ఇది ముందడుగని రవికుమార్ తెలిపారు. 22న ఐటీ–2.0 సాంకేతికత ప్రారంభం వేగవంతం కానున్న బట్వాడ సేవలు -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు
● మార్కెట్ కార్యదర్శి గుగులోత్ రెడ్యా వరంగల్ చౌరస్తా : విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని వరంగల్ ఏనుమాముల మార్కెట్ కార్యదర్శి గుగులోత్ రెడ్యా హెచ్చరించారు. మంగళవారం మార్కెట్ ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాజాగా నెలకొన్న తక్పట్టీల విషయంలో జరిగిన పరిణామాలు వివరించారు. రైతులకు మెరుగైన సేవలందించేందుకు ప్రతి ఒక్కరూ చొరవ చూపాలన్నారు. వ్యాపారులు, అడ్తిదారులు, కార్మి కులు.. రైతులను సమన్వయం చేస్తూ గిట్టుబాటు ధరలు కల్పించేందుకు తోడ్పడాలని పేర్కొన్నారు. సమావేశంలో గ్రేడ్–2 కార్యదర్శులు రాము, అంజిత్ రావు, అసిస్టెంట్ సెక్రటరీ దండమల్ల రాజేందర్, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
గంగారం: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ఏజెన్సీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ రవి రాథోడ్ సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని దుబ్బగూడెం, కామారం, మర్రిగూడెం, కోమట్లగూడెం, గంగారం గ్రామాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రుల రికార్డులను పరిశీలించి, సిబ్బందికి తగు సూచనలు చేశారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని, ఏజెన్సీ ప్రాంతాల్లో నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఎవరికై నా మలేరియా, డెంగీ పాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంటనే చికిత్స అందించాలన్నారు. 30 సంవత్సరాలు దాటిన వారందరికీ రక్తపోటు, షుగర్ పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్ధారణ జరిగితే క్రమం తప్పకుండా మందులు అందించాలన్నారు. కార్యక్రమంలో గంగారం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి ప్రత్యూష, డిప్యూటీ మాస్ మీడియా అధికారి ప్రసాద్, ఆరోగ్య విద్యాబోధకులు కేవీ రాజు, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ, సూపర్వైజర్ రత్నకుమారి, స్థానిక హెచ్పీలు, ఆరోగ్య కార్యకరక్తలు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ ఏర్పాట్లపై సమీక్ష
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఆగస్టు 19, 20, 21 తేదీల్లో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం కేయూలో వీసీ కె. ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి. రామచంద్రం.. మానిటరింగ్ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్లో భాగస్వాములు కాబోతున్న రీసెర్చ్ పేపర్ల సమర్పణకు ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ కమిటీల బాధ్యతలు, అతిథులకు వసతి ఏర్పాట్లు, తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ లోకల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ బి. వెంకట్రామ్రెడ్డి, మానిటరింగ్ కమిటీ సభ్యులు, తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జాయింట్ సెక్రటరీ వడ్డె రవీందర్, వైస్ ప్రెసిడెంట్ సి.హెచ్. సంజీవరెడ్డి, ప్రొఫెసర్లు టి. మనోహర్, బి. సురేశ్లాల్, ఆర్. మ ల్లికార్జున్రెడ్డి, వాసుదేవరెడ్డి, ఎస్. జ్యోతి, జె. కృష్ణవేణి, ఎన్. ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసులో నేరస్తుడికి పదేళ్ల జైలు
భూపాలపల్లి అర్బన్: హత్య కేసులో నేరస్తుడికి కోర్టు పదేళ్ల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమానా విధించినట్లు భూపాలపల్లి సీఐ నరేశ్కుమార్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. భూపాలపల్లి మండలం కమలాపూర్లో మార్చి 02, 2020న తాటి వనంలో గ్రామానికి చెందిన మాచర్ల రవి, రేగళ్ల తిరుపతి మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలో కోపోద్రెకుడైన రవి.. తిరుపతిని హత్య చేశాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ వాసుదేవరావు కేసు నమోదు చేసి రవిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపి రిమాండ్కు తరలించారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచి సాక్ష్యాధారాలు సమర్పించారు. ఈ ఘటనలో నేరం రుజువుకావడంతో రవికి భూపాలపల్లి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి రమేశ్బాబు పదేళ్ల జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు సీఐ నరేశ్కుమార్ మంగళవారం తెలిపారు. ప్రతిభా పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానంహన్మకొండ చౌరస్తా: విశ్వబ్రాహ్మణ అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (వోపా) ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఏటా ఇచ్చే ప్రతిభా పురస్కారాలకు విశ్వబ్రాహ్మణ విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని పురస్కారాల కన్వీనర్, వోపా జిల్లా అధ్యక్షుడు శ్రీరామోజు నాగరాజారావు తెలిపారు. మంగళవారం హనుమకొండ రెడ్డికాలనీలోని వోపా జిల్లా కార్యాలయంలో ప్రతిభా పురస్కారాల కమిటీ సమావేశం నిర్వహించారు. 2024–25 విద్యాసంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులు దరఖాస్తుతోపాటు మార్కుల సర్టిఫికెట్, బోనఫైడ్ లేదా కండక్ట్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ జిరాక్స్ ప్రతులను 9440313745 నంబర్కు ఈ నెల 30వ తేదీ వరకు వాట్సాప్ ద్వారా పంపించాలన్నారు. గడువు లోగా అందిన దరఖాస్తులలో అత్యుత్తమ మార్కులు సాధించిన వారికి నగదు, ప్రశంస పత్రాలు అందించనున్నట్లు తెలిపారు. పురస్కారాలకు ఎంపికై న విద్యార్థుల వివరాలు, పురస్కారాలు ఇచ్చే తేదీ, వేదిక త్వరలో వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. వోపా అసోసియేట్ అధ్యక్షుడు పొడిచెట్టి విష్ణువర్ధన్, ప్రధాన కార్యదర్శి మహేశ్వరం భిక్షపతి, కోశాధికారి శ్రీరామోజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 25 నుంచి పీజీ కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంటీఎం, ఎంఎస్డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎల్ఐఎస్సీ కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 25వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి సౌజన్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25, 28, 30, ఆగస్టు 1, 4, 6 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వారు తెలిపారు. పూర్తివివరాలకు సంబంధిత కేయూ వెబ్సైట్లో చూడాలన్నారు. -
ఆరుతడి పంటల్లో కలుపు..
మహబూబాబాద్ రూరల్: ఇటీవల కొద్దోగొప్పో కురిసిన వర్షాలకు రైతులు పప్పు దినుసు పంటలు పెసర, మినుము, కంది, నూనెగింజ పంటలు సోయాబీన్, వేరుశనగతోపాటు మొక్కజొన్న, శనగ పంటలు వేశారు. అలాగే, వాణిజ్య పంట పత్తిని కూడా వేశారు. ఈ నేపథ్యంలో ఈ పంటల్లో కలుపు సమస్య రైతులను ఇబ్బందికి గురిచేయడమే కాకుండా దిగుబడి తగ్గేందుకు కారణమవుంది. ఈ నేపథ్యంలో ఆరుతడి పంటల్లో కలుపు సమస్య పరిష్కారానికి యాజమాన్య పద్ధతులు పాటించాలని మల్యాల కేవీకే ఇన్చార్జ్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ బి.క్రాంతికుమార్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు రైతులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. పప్పు దినుసు పంటల్లో (పెసర, మినుము, కంది) రైతులు విత్తేముందు ఫ్లూక్లోరాలిన్ 45 శాతాన్ని ఎకరాకు 1 నుంచి 1.2 లీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కలుపు ఇక్కడే నివారించొచ్చు. తర్వాత మొలకెత్తకముందు పెండిమిథాలిన్ 30 శాతాన్ని ఎకరాకు 1.3 నుంచి 1.6 లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే, పైరు విత్తిన 20 రోజులకు వెడల్పు ఆకు కలుపు నివారణకు ఇమాజితాఫైర్ (ఫర్యూట్) మందును 300 మిల్లీ లీటర్లు ఎకరాకు లేదా గడ్డి జాతి కలుపు నివారణకు క్విజాలిఫాస్ ఇథైల్ (టర్గా సూపర్) 400 మిల్లీ లీటర్లు లేదా ప్రొపాక్విజాఫాస్ 10 శాతం ఈసీ 200 ఎంఎల్ మందు పిచికారీ చేసుకోవాలి. రైతులు కలుపు మందులు పిచికారీ చేసే సమయంలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. అదే విధంగా వేరుశనగ పంటల్లో కూడా కలుపు మందులను వివిధ దశల్లో పిచికారీ చేసుకోవాలి. విత్తిన 25 నుంచి 30 రోజలు తర్వాత గొర్రుతో అంతరకృషి చేసుకోవడం ద్వారా కలుపు ఉధృతిని తగ్గించుకోవచ్చు. వాణిజ్య పంట పత్తిలో నెల రోజులకు వచ్చే లేతగడ్డి, వెడల్పు ఆకు గల కలుపు నివారణకు క్విజరోఫాస్ ఇథైల్ (టర్గాసూఫర్) 400 మీల్లీ లీటర్లు లేదా ప్రోపాక్విజాఫాస్ (ఏజిల్) 250 మిల్లీ లీటర్లతోపాటు పైరిథమెచ్చాక్ సోడియం (హిట్ వీడో థీమ్/రైప్ ) 250 మిల్లీ లీటర్లను లీటర్ నీటికి చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. అలాగే, పత్తిలో సమయానుకూలంగా పది రోజులకు ఒకసారి గొర్రు లేదా గుంటుకతో అంతరకృషి చేయాలి. సమస్య పరిష్కారానికి యాజమాన్య పద్ధతులు పాటించాలి మల్యాల కేవీకే ఇన్చార్జ్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ క్రాంతికుమార్ రైతులకు పలు సలహాలు, సూచనలు -
తుది దశకు సబ్ స్టేషన్ మరమ్మతు
డోర్నకల్: డోర్నకల్ విద్యుత్ సబ్స్టేషన్లో జరుగుతున్న పలు మరమ్మతు పనులు తుది దశకు చేరుకున్నాయని విద్యుత్శాఖ ఎస్ఈ విజయేందర్రెడ్డి తెలిపారు. సబ్ స్టేషన్ యార్డులో జరుగుతున్న మరమ్మతు పనులను మంగళవారం ఎస్ఈ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సబ్ స్టేషన్లో జరుగుతున్న మరమ్మతు పనులు తు ది దశకు చేరుకున్నాయని, మూడు రోజుల్లో పనులు పూర్తి చేసి విద్యుత్ సరఫరాలో అంతరాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిరంతర విద్యుత్కు చర్యలు నెహ్రూసెంటర్: నాణ్యమైన విద్యుత్ను నిరంతరం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వి ద్యుత్శాఖ ఎస్ఈ పి.విజయేందర్రెడ్డి మంగళవా రం తెలిపారు. వ్యవసాయ సర్వీసులు యుద్ధ ప్రాతిపదికన మంజూరు చేసేలా, రైతులకు చేరువై విద్యుత్ సమస్యలను పరిష్కరించేలా పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు సులభంగా అర్ధమయ్యే రీతిలో వ్యవసాయ ఎస్టిమేట్ కాపీలను తెలుగులోనే అందజేస్తున్నామన్నారు. అదే విధంగా చెడిపోయిన ట్రాన్స్ఫార్మర్ల తరలింపు డిపార్ట్మెంట్ వాహనంలోనే జరుగుతుందని, దాని కోసం పది కొత్త వాహనాలు సర్కిల్ పరిధిలో ఉన్నాయని పేర్కొన్నారు. విద్యుత్ ప్రమాదాలకు అనుగుణంగా ఎక్కువ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయిన పట్టణాల్లో 24 గంటలు, రూరల్ ప్రాంతాల్లో 48 గంటల్లో మార్చి విద్యుత్ సేవలను నిరంతరాయంగా అందజేస్తామన్నారు. -
ప్రజా ఉద్యమాలతోనే సమస్యల పరిష్కారం
ఖిలా వరంగల్: ప్రజాఉద్యమాల నిర్మాణంతోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ అన్నారు. మంగళవారం వరంగల్ శంభునిపేట జంక్షన్లోని ఆర్ఆర్ ఫంక్షన్లో పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేశ్ అధ్యక్షతన జిల్లాస్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. దీనికి అశోక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా పార్టీలో చేరిన మాలోత్ సాగర్, ముక్కెర రామస్వామితోపాటు వందలాది మంది కార్యకర్తలకు కండువాలు కప్పి మాట్లాడారు. కమ్యూనిస్టులు, ప్రజా ఉద్యమాలను బలహీనపర్చాలని పాలకులు అన్ని విధాలా కుట్రలు చేస్తున్నారన్నారు. నిర్భందాలు విధించి కుట్రతో కేసులు పెడుతున్నారన్నారు. సమాజంలో దోపిడీ ఉన్నంత కాలం ఎర్రజెండా ఉద్యమాలు ఉంటాయని పేర్కొన్నారు. దోపిడీ వర్గాల ఐక్యత కమ్యూనిస్టుల మధ్య లేకపోవడం పాలకులకు వరంగా మారిందన్నారు. ఈ క్రమంలో ఎంసీపీఐ(యూ).. కమ్యూనిస్టుల ఐక్యతకు శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని, కార్యకర్తల్లో లోటుపాట్లను సరి చేసి సరైన దృక్పథంతో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, వల్లపు ఉపేందర్రెడ్డి, గోనె కుమారస్వామి, ఎన్రెడ్డి హంసారెడ్డి, మంద రవి, నర్ర ప్రతాప్, కన్నం వెంకన్న, వంగల రాగ సుధ, కనకం సంధ్య, మాలోత్ ప్రత్యూష, గణిపాక ఓదెలు, మహమ్మద్ అబ్బు, తాటికాయల రత్న, దాసు, మాధవి, రామస్వామి, రమేశ్, తదితరులు పాల్గొన్నారు. ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్ -
పంచుకున్నదెవరు?
అన్యూజ్డ్ పోస్టుల కన్వర్షన్కు ఖర్చులవుతాయని వసూళ్లు..హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్లో ఏళ్లుగా అన్యూజ్డ్గా ఉన్న పోస్టులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసి కొత్త పోస్టులను క్రియేట్ చేసిన విషయం విధితమే. ఈ క్రమంలో కొత్త పోస్టులతో ప్రయోజనం చేకూరుతుందని ఆశ చూపి కొందరు వసూళ్లకు పాల్పడినట్లు విద్యుత్ ఉద్యోగ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందులో ఉన్నత స్థాయి పోస్టుకు పదోన్నతిలో ఉన్న ఓ అసోసియేషన్ నాయకుడు కీలకంగా వ్యవహరించినట్లు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. కొన్ని సంవత్సరాలుగా అన్ యూజ్డ్గా ఉన్న వర్క్మెన్ క్యాడర్కు చెందిన 216 పోస్టులను వినియోగంలోకి తీసుకురావాలని విద్యుత్ ఉద్యోగ సంఘాలు యాజమాన్యానికి మూడేళ్లుగా విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో సీఎండీగా వరుణ్ రెడ్డి స్వీకరించిన తర్వాత సంస్థ అవసరాల దృష్ట్యా అన్ యూజ్డ్గా ఉన్న 216 పోస్టులతోపాటు ఖాళీగా ఉంటున్న 217 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను రద్దు చేస్తూ నూతనంగా 339 పోస్టుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రతిపాదనలు పరిశీలించిన ప్రభుత్వం 339 పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులను సంస్థ అవసరాల మేరకు వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు విభాగాలు, సర్కిళ్లు, డివిజన్లు, సబ్ డివిజన్ల వారీగా టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం కేటాయించింది. వసూళ్లకు తెర.. అన్ యూజ్డ్ పోస్టులు రద్దు, నూతన పోస్టుల మంజూరుకు సెక్రటేరియట్లో ఖర్చులు ఉంటాయని చెప్పి, పోస్టులు పెరిగితే లబ్ధి చేకూరే ఆశావహుల నుంచి కొంత ఎక్కువ మొత్తంలో, పోస్టులు పెరుగకున్నా పదోన్నతి లభించే మిగతా వారి నుంచి తక్కువ మొత్తంలో వసూళ్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. వీరికి తోడు కొన్ని అసోసియేషన్లు కూడా కొంత మొత్తం ముట్టజెప్పినట్లు తెలిసింది. పోస్టులు పెరిగితే తనకు పదోన్నతి వచ్చే అవకాశమున్న ఓ అసోసియేషన్ నాయకుడు ఈ వసూళ్లలో కీలకంగా వ్యవహరించినట్లు విద్యుత్ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. రూ.లక్షల్లో వసూళ్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పోస్టులు మంజూరై వచ్చిన తర్వాత ఎలాంటి ఖర్చులు కాలేదని తెలియడంతో డబ్బులు ముట్టజెప్పిన వారు అవాక్కయ్యారు. వాస్తవంగా ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ఈ వ్యవహారంలో ఎక్కడా అవినీతి, ఖర్చులకు ఆస్కారముండదు. అయితే అక్రమ సంపాదనకు అలవాటుపడిన కొన్ని అసోసియేషన్ల నాయకులు కొత్త పోస్టుల మంజూరుకు ఖర్చులవుతాయని దుష్ప్రచారం చేసి వసూళ్లకు పాల్పడడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వసూళ్ల దందాపై పలు యూనియన్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పోస్టుల మంజూరులో ఎక్కడా రూపాయి కూడా ఖర్చు లేదని యాజమాన్యం స్పష్టం చేసింది. అయితే వసూళ్లు చేసిన సొమ్ము ఎవరెవరు పంచుకున్నారని విద్యుత్ ఉద్యోగ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. పదోన్నతిలో ఉన్న ఇంజనీర్ల నుంచి రూ.లక్షల్లో సేకరణ ఓ అసోసియేషన్ నేత కీలకంగా వ్యవహరించినట్లు చర్చ ఖర్చులకు ఆస్కారం లేదంటున్న టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యంమూడేళ్ల క్రితం అన్యూజ్డ్ పోస్టులను వినియోగంలోకి తీసుకురావాలని ఉద్యోగ సంఘాలు యాజమాన్యానికి వినతి పత్రం అందించాయి. అయితే ఇందులో వర్క్మెన్ పోస్టులతో పాటు ఇంజనీరు, అకౌంటెంట్, పర్సనల్ ఆఫీసర్ పోస్టులు కావాలని ఆయా విభాగాల అసోసియేషన్ల నేతలు కోరారు. 216 అన్యూజ్డ్ పోస్టులను వర్క్మెన్ పోస్టులుగా వినియోగంలోకి తీసుకురావాలని ఉద్యోగ సంఘాలు పట్టుదలతో ఉన్నాయని, ఇంజనీర్తో పాటు ఇతర పోస్టులు మంజూరు చేయాలంటే యూనియన్ నాయకులను మచ్చిక చేసుకోవాలని, దీనికి ఖర్చులవుతాయని, అప్పట్లో ఏడీఈ నుంచి డీఈ పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేసినట్లు ప్రచారం జరిగింది. డీఈ పదోన్నతి కోసం ఎదురుచూసిన ఇంజనీర్లు కొందరు రిటైర్డ్ అయ్యారు. వారు రిటైర్డ్ అయిన కొన్ని రోజులకే పదోన్నతి కల్పించారు. దీంతో వీరి వద్ద నుంచి వసూలు చేసిన సొమ్ము న్యాయంగా తిరిగి చెల్లించాలి. కానీ తీసుకున్న మొత్తం కాకుండా కొంత మాత్రమే తిరిగి చెల్లించారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ రిటైర్డ్ ఇంజనీర్ తెలిపారు. ఇలా రెండు పర్యాయాలు వసూళ్లు చేసిన సొమ్ము ఎవరి చేతుల్లోకి వెళ్లిందని? ఎవరు కాజేశారని విద్యుత్ ఉద్యోగులు ఆరా తీస్తున్నారు. అయితే అన్ యూజ్డ్ పోస్టులను వినియోగంలోకి తీసుకురావాలని కోరామని, తాము ఎవరి నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించలేదని కొన్ని విద్యుత్ ఉద్యోగ సంఘాలకు చెందిన నాయకులు స్పష్టం చేశారు. మరో వైపు వసూళ్లు చేసింది ఎవరు.. ఆ సొమ్ము ఎవరి చేతుల్లోకి వెళ్లిందనే అంశంపై యాజమాన్యం దృష్టి సారించినట్లు తెలిసింది. -
19న కాజీపేటకు రైల్వేశాఖ మంత్రి
కాజీపేట రూరల్ : కాజీపేట మండలం మడికొండ శివారు పరిధి అయోధ్య పురంలో కేంద్ర ప్రభుత్వం సుమారు 160 ఎకరాల విస్తీర్ణంలో రూ.786 కోట్ల వ్యయంతో జపాన్ టెక్నాలజీతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాజీపేట రైల్వే కోచ్ఫ్యాక్టరీ, వ్యాగన్ షెడ్ మల్టీపుల్ యూనిట్ను ఈ నెల 19వ తేదీన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తనిఖీ చేయనున్నట్లు అధికారులు మంగళవారం తెలిపారు. రెండేళ్ల క్రితం ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన వ్యాగన్ షెడ్ నిర్మాణ పనుల్లో భాగంగా కోచ్ఫ్యాక్టరీని కూడా కేంద్రం మంజూరు చేసింది. ఈ మేరకు కాజీపేటలో రైల్వే కోచ్ఫ్యాక్టరీ, వ్యాగన్షెడ్, వ్యాగన్ పీఓహెచ్ షెడ్గా అప్గ్రేడ్ చేసి మల్టీపుల్ రైల్వే ప్రాజెక్టు యూ నిట్గా విదేశీ టెక్నాలజీతో నిర్మిస్తోంది. ఇందులో కోచ్లు, వందేభారత్, మెమూ, ఎల్హెచ్బీ కోచ్లు తయారవుతాయి. దాదాపు 70 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. వ్యాగన్షెడ్, కోచ్ఫ్యాక్టరీ నిర్మా ణం పూర్తయితే ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 10 వేల మందికి ఉపాధి లభించనుంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అధికారికంగా కాజీ పేట రైల్వే కోచ్ఫ్యాక్టరీ, వ్యాగన్షెడ్లను ప్రారంభించేందుకు రైల్వే శాఖ ప్లాన్ చేస్తోంది. ఇందులో భా గంగా కోచ్ఫ్యాక్టరీ నిర్మాణ పనుల తనిఖీ కోసం రై ల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ 19వ తేదీన కాజీపేట పర్యటన చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. 17న దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జ్ జీఎం తనిఖీ.. కాజీపేట రైల్వే కోచ్ఫ్యాక్టరీ, వ్యాగన్షెడ్ మల్టీపుల్ యూనిట్ను ఈ నెల 17వ తేదీన దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జ్ జనరల్ మేనేజర్ సందీప్ మథూర్ తనిఖీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 19వ తేదీన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పర్యటనకు ముందస్తుగా దక్షిణ మధ్య రైల్వే ఇన్చార్జ్ జీఎం 17న సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలులో తనిఖీ చేసుకుంటూ కాజీపేట జంక్షన్ చేరుకుంటారు. అనంతరం కోచ్ఫ్యాక్టరీ, వ్యాగన్షెడ్ నిర్మాణ స్థలానికి వెళ్లి నిర్మాణ పనులు పరిశీలిస్తారు. అధికారులతో సమావేశమై చర్చిస్తారు. మల్టీపుల్ యూనిట్ పనుల పరిశీలనకు రానున్న మంత్రి అశ్విని వైష్ణవ్ -
చాకలి ఐలమ్మ మునిమనువడి మృతి
పాలకుర్తి టౌన్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ముని మనువడు చిట్యాల సంపత్(44) ఆదివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడు. సంపత్ మృదేహానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రజక వృత్తిదారులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏదునూరి మదార్ సోమవారం పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో ఐలమ్మ కుటుంబ సభ్యులు మంజుల, సమ్మయ్య, సంధ్యారాణి, అంజమ్మ, యాకయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసుసూరి నవీన్, మాజీ ఎంపీపీ నల్లా నాగిరెడ్డి పాల్గొన్నారు. -
జవాన్ అదృశ్యం మిస్టరీ వీడేనా?
మరిపెడ రూరల్: ఇటీవల ఇంటికి వచ్చిన ఓ ఆర్మీ జవాన్ నాలుగు రోజులుగా కనిపించకుండా పోవడం మిస్టరీగా మారింది. అతడు ప్రయాణించిన కారు శ్రీశైలం డ్యాం వద్ద లభ్యమైంది. అయితే అతడి ఆచూకీ మాత్రం లభించకపోవడంతో బంధువులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురం జీపీ పరిధి పూసలతండాకు చెందిన మూడు నవీన్ (28) ఢిల్లీలో ఆర్మీ జవాన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల స్వగ్రామం వచ్చి తన భార్యకు అనారోగ్యంతో ఉండడంతో కారులో హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఈ నెల 11 నుంచి అక్కడి నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో బంధువులు ఆరా తీయగా అతడు ప్రయాణించి కారు శ్రీశైలం డ్యాం సమీపంలో లభించగా, అందులో నవీన్ సెల్ ఫోన్, ఖాళీ పురుగుల మందు డబ్బా, ఐడీ కార్డులు ఉన్నాయి. బంధువుకు వీడియో కాల్.. ఆర్మీ జవాన్ నవీన్ 11వ తేదీన ఏడుస్తూ బంధువుకు వీడియో కాల్ చేశాడు. తాను పురుగుల మందు తాగి చనిపోతున్నానని, తనకోసం వెతకొద్దని ఏడ్చినట్లు తెలుస్తోంది. అదేవిధంగా నా భార్యకు తల్లిదండ్రులు లేరని, ఆమెను, తన పిల్లలను మంచిగా చూసుకోవాలని కన్నీటి పర్యంతమైనట్లు తెలుస్తోంది. కారును డ్యాం సమీపంలో నిలిపి తాళం వైఫర్ వద్ద ఉంచుతున్నట్లు చెప్పాడని బంధువులు తెలిపారు. అనంతరం ఫోన్ స్విచ్చాఫ్ అయినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న బంధువులు కారు వద్దకు చేరుకుని గాలింపు చేపట్టారు. కర్నూల్ జిల్లా అమ్రాబాద్లోని పీఎస్లో ఈ విషయంపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అక్కడి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఎలాంటి పురోగతి లభించకపోవడంతో కుటుంబీకులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నవీన్ భార్య సరిత అనారోగ్యం కారణంగా మంచం పట్టింది. కాగా, నవీన్కు 2023లో దంతాలపల్లి మండలానికి చెందిన సరితతో వివాహం జరగగా రెండేళ్ల కుమార్తె, రెండు నెలల కుమారుడు ఉన్నారు. నవీన్ అదృశ్యం కావడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. నేను చనిపోతున్నా.. నాకోసం వెతకొద్దని బంధువుకు వీడియో కాల్ మూడు రోజులుగా శ్రీశైలం డ్యాం పరిసరాల్లో గాలింపు ఇప్పటి వరకూ లభించని ఆచూకీ ఆందోళనలో బంధువులు, గ్రామస్తులు అనారోగ్యంతో మంచం పట్టిన జవాన్ భార్య సరిత -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్..
● రూ.1.60 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్ధం ● ఘన్పూర్లో ఘటన స్టేషన్ఘన్పూర్: ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో మహాలక్ష్మి బేకరి వద్ద ఇళ్ల పైనుంచి వెళ్తున్న 33 కేవీ లైన్ కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ప్రమాదంలో మూడు ఇళ్లలో రూ.1.60లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్ధమయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మెడ్ప్లస్ సమీపాన పలు ఇళ్ల మీదుగా 33 కేవీ విద్యుత్ లైన్ వెళ్తోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఆ లైన్పై కాకు(పక్షులు)లు వాలడంతో ప్రమాదవశాత్తు మూడు ఇళ్లలో షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో పి.సుగుణ ఇంటిలో రూ.70వేల విలువైన స్మార్ట్ టీవీ, రూ.30వేల విలువైన సీసీ కెమెరాలు, రూ.30వేల విలువైన ఫ్రిడ్జ్తో పాటు వైరింగ్, లైట్లు, స్విచ్లు దగ్ధమయ్యాయి. అదేవిధంగా బాలాజీ క్లాత్ స్టోర్స్ నిర్వాహకుల ఇంటిలో సర్వీస్ వైరు కాలిపోగా, సారంగానికి చెందిన రవళి కంగన్హాల్లో రూ.20వేల విలువైన టీవీ దగ్ధమైంది. కాగా, మే 20న 33 కేవీ వైరుపై పిడుగుపాటుతో అదే ఏరియాకు చెందిన కుసుమ రమేశ్ ఇంటిలో రూ.2లక్షల విలువైన ఎలక్ట్రానిక్ దగ్ధమయ్యాయి. కాలనీలో పలు ఇళ్లపై నుంచి 33 కేవీ విద్యుత్ లైన్ ప్రమాదకరంగా ఉందని, పలుమార్లు విద్యుత్ ప్రమాదాలు జరిగాయని కాలనీవాసులు గతంలో విద్యుత్శాఖ డీఈకి విన్నవించినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు పేర్కొన్నారు. ఇప్పటికై నా స్పందించి ఇళ్ల మీదుగా వెళ్తున్న 33కేవీ విద్యుత్ లైన్ను మార్చి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. -
స్విమ్మింగ్పూల్కు సెలవు
● రూ.40 లక్షలతో మరమ్మతులు ● నెల రోజులు నోఎంట్రీ వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ బాలసముద్రంలో కొనసాగుతున్న స్విమ్మింగ్ పూల్కు నెలరోజులు సెలవులొచ్చాయి. రెండు నెలల క్రితం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అయితే వేసవిలో స్విమ్మింగ్పూల్కు రద్దీ ఉన్న నేపథ్యంలో పనులు చేపట్టకుండా నిలిపివేశారు. ఈ క్రమంలో వర్షాకాలం ప్రారంభం, విద్యా సంస్థలు తెరుచుకోవడంతో స్విమ్మింగ్ పూల్కు వచ్చే వారి సంఖ్య తగ్గింది. దీంతో వారం క్రితం స్విమ్మింగ్ పూల్ అభివృద్ది పనులు ప్రారంభించారు. రోజుకు ఆరు గంటలకు పైగా స్విమ్మింగ్ పూల్లోని నీరు తోడుతున్నారు. సుమారు రూ.30 లక్షలతో పనులు చేపట్టారు. పూల్ లోపల టైల్స్, వాష్రూమ్స్, పూల్కు సరిపడా విద్యుత్ ఉత్పత్తి కోసం 10కిలో వాట్స్ సోలార్ ప్లాంట్, పోటీలు జరిగినప్పుడు వీక్షించేందుకు షెడ్డు నిర్మాణం తదితర పనులు చేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన పనులు క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి చొరవతో స్విమ్మింగ్ పూల్ అభివృద్ధి పనులు చేపట్టాం. నెల రోజుల్లో పూర్తి చేసి స్విమ్మర్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పనులు యుద్ధప్రాతిపదికన చేస్తున్నాం. – గుగులోత్ అశోక్కుమార్, డీవైఎస్ఓ, హనుమకొండ ● -
సమష్టి కృషితోనే స్నాతకోత్సవం విజయవంతం
కేయూ క్యాంపస్: అన్ని కమిటీల సమష్టి కృషితోనే కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవం విజయవంతమైందని కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం కేయూ సెనేట్హాల్లో వివిధ కమిటీలు, ఎన్ఎస్ఎస్ వలంటీర్ల, ఎన్సీసీ కేడెట్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్వవిద్యాలయం ఇమేజ్ పెంపుదలకు కృషి చేయాలన్నారు. రాబోయే రోజుల్లో యూనివర్సిటీలో బోధన, బోధనేతర ఉద్యోగులకు ముఖ గుర్తింపు హాజరును ప్రవేశపెట్టబోతున్నామన్నారు. యూజీలో కూడా ఆన్లైన్ మూల్యాంకనం ప్రవేశపెట్టబోతున్నామన్నారు. అనంతరం కాకతీయ యూనివర్సిటీ వరంగల్ యూ ట్యూబ్ చానల్ను రిజిస్ట్రార్ వి. రామచంద్రంతో కలిసి ప్రారంభించారు. పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, ఎన్సీసీ కమాండెంట్ కల్నల్ సింథిల్ ఎస్. రమాదురై, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు, డీన్లు, విభాగాల అధిపతులు, తదితరులు పాల్గొన్నారు. అలరించిన ఓరుగల్లు కళాకారుల ప్రదర్శన హన్మకొండ కల్చరల్ : రెండు రోజులుగా హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగిన శ్రీ తనికెళ్ల భరణి రంగస్థల స్వర్ణోత్సవాల్లో భాగంగా తనికెళ్ల భరణి రచనలో వరంగల్కు చెందిన ఓరుగల్లు శారదానాట్యమండలి కళాకారులు ప్రదర్శించిన ‘చల్చల్ గుర్రం’ హాస్యనాటిక అలరించింది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన కార్యక్రమంలో తనికెళ్ల భరణి.. నాటిక నిర్మాత, నటుడు జేఎన్ శర్మను సన్మానించి మెమోంటో అందజేశారు. నాటిక దర్శకుడిగా సోల్జర్ షఫీ, నటీనటులుగా మహమ్మద్, కోడం సురేందర్, కుసుమ సుధాకర్, గుడివా లహరి నటించారు. నిట్ వరంగల్లో బాంబు కలకలం కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లో బాంబు కలకలం సృష్టించింది. నిట్ను మానవ బాంబునై పేలుస్తానంటూ ఓ గుర్తుతెలియని వ్యక్తి నిట్ వరంగల్కు చెందిన గ్రూప్లో మూడు రోజుల క్రితం ఈమెయిల్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై యాజమాన్యం అప్రమత్తమైంది. శని, ఆదివారాలు సెలవు దినాలుకావడంతో సోమవారం తేరుకుంది. మెయిల్ను గమనించి పోలీసులకు సమాచారమిచ్చింది. దీంతో కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి, ఇన్స్పెక్టర్ సుధాకర్రెడ్డి.. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీతో మాట్లాడి క్యాంపస్లోని మెయిన్ బిల్డింగ్తో పాటు వివిధ ప్రాంతాలను బాంబు స్వ్యాడ్తో తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో బాంబు లభించకపోవడంతో యాజమాన్యం, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఫేక్ ఈమెయిల్పై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. -
కూరగాయల సాగుకు ప్రోత్సాహం
హన్మకొండ: రాయితీపై నారు అందిస్తూ ప్రభుత్వం కూరగాయల సాగును ప్రోత్సహిస్తోంది. ఒక్కో రైతుకు ఐదెకరాల వరకు.. వందశాతం రాయితీపై నారును సరఫరా చేస్తోంది. ఉద్యాన శాఖ ద్వారా కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా రాయితీ సదుపాయం కల్పించింది. వందశాతం రాయితీపై టమాట, వంగ, పచ్చి మిర్చి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ నారును సరఫరా చేస్తోంది. సిద్దిపేట జిల్లా ములుగు సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో రైతులు సూచించిన రకం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దీనికిగాను రైతులు 30 రోజుల ముందుగా విత్తన రకం, పట్టాదారు పాస్ బుక్, ఆధార్, బ్యాంకు ఖాతా పాస్ బుక్ జిరాక్స్ ప్రతులను జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ కార్యాలయంలో అందించాలి. శాశ్వత పందిర్ల నిర్మాణానికి.. శాశ్వత పందిర్ల నిర్మాణం, కూరగాయల సాగుకు ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. అర ఎకరానికి రూ.50 వేల చొప్పున రెండున్నర ఎకరాలకు వరకు రాయితీ అందిస్తోంది. మల్చింగ్ పద్ధతిలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు రాయితీ అందిస్తోంది. కలుపు సమస్యను అధిగమించడానికి, ఎరువుల యాజమాన్యం, తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడి సాధించడానికి మల్చింగ్ పద్ధతి ఉపయోగపడుతుంది. ఈపద్ధతిలో సాగు ఎకరాకు రూ.8 వేల చొప్పున 5 ఎకరాల వరకు రాయితీ అందిస్తోంది. అధిక దిగుబడి ఇచ్చేలా.. ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రం ద్వారా కూరగాయల (వంగ) సాగు వైపు రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. భూమి నుంచి సంక్రమించే వివిధ రకాల తెగుళ్లను, చౌడు నేలలను తట్టుకునేలా, అధిక దిగుబడి, ఎక్కువ కాలం దిగుబడి ఇచ్చేలా వంగలో అంటు మొక్కలను ప్రభుత్వం రాయితీపై సరఫరా చేస్తోంది. దీనికి ప్రభుత్వం ఎకరానికి రూ.30 వేల వరకు రాయితీ ఇస్తోంది. ట్రెల్లిసింగ్ విధానంలో టమాట, ఇతర కూరగాయల పంటలను సాగు చేసేందుకు ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేలు రాయితీ అందిస్తోంది. అంతేకాకుండా సూక్ష్మ సేద్యానికి రాయితీని సమకూరుస్తోంది. బిందు సేద్యానికి బీసీ, సన్నకారు, చిన్నకారు రైతులకు 90 శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం, ఇతరులకు 80 శాతం రాయితీని, తుంపర్ల సేద్యానికి అన్ని కేటగిరీల రైతులకు 75 శాతం రాయితీపై పరికారులు అందిస్తున్నారు. ఉద్యాన రైతులను సంప్రదించాలి.. రాష్ట్ర ప్రభుత్వం కూరగాయల సాగుకు అందిస్తున్న రాయితీని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచాలి. కూరగాయలకు భారీ డిమాండ్ ఉంది. కూరగాయల సాగు లాభదాయకం. రైతులు కూరగాయల నారు, ఇతర పద్ధతిలో సాగు కోసం రాయితీ పొందేందుకు అందుబాటులో ఉన్న ఉద్యాన అధికారులను సంప్రదించాలి. – శ్రీనివాస్రావు, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అఽధికారి, వరంగల్ వందశాతం రాయితీపై నారు ఒక రైతుకు 5 ఎకరాలు పరిమితి -
దాతలు చేయూతనందించండి..
కాజీపేట: ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను విధి వక్రీంచింది. పెళ్లి అయిన మూడు సంవత్సరాలకే మంచనపడేసింది. ఫలితంగా ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో ఒక్కసారిగా జీవచ్ఛవంలా మారడంతో కుటుంబ సభ్యులతోపాటు బంధుమిత్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. కాజీపేట పట్టణం సోమిడికి చెందిన నాయుడు మానస గౌడ్కు మూడు సంవత్సరాల క్రితం ఇదే గ్రామానికి చెందిన బత్తిని వంశీకృష్ణతో వివాహం జరిగింది. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల స్వల్ప అస్వస్థతగా ఉందని మానస చెప్పగా కుటుంబీకులు హైదరాబాద్లోని ఓ ఆస్సత్రికి తీసుకెళ్లగా పరీక్షలు నిర్వహించారు. మూత్ర పిండాలు, శ్వాసకోశతో పాటు అవయవాలు దెబ్బతిన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ వ్యాధుల చికిత్సకు దాదాపు రూ.16 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు స్పష్టం చేశారు. దీంతో కుటుంబ సభ్యులు అప్పు చేసి రూ.10 లక్షల వరకు ఖర్చు చేశారు. మిగతా డబ్బులు ఎంతకూ సమకూరడం లేదు. దీంతో చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లే మార్గం లేక మానస గౌడ్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. దీనిపై మనసున్న మాహారాజులు స్పందించి ముందుకొచ్చి మానస వైద్యానికయ్యే ఖర్చు అందించాలని కుటుంబ సభ్యులు చేతులెత్తి వేడుకుంటున్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు స్పందించి ఉచితంగా వైద్య చికిత్స లభించేలా చూడాలని వేడుకుంటున్నారు. దాతలు 99666 68666 నంబర్కు ఫోన్ పే (నాయుడు మనోజ్కుమార్) ద్వారా ఆర్థిక సాయం చేసి మానసను బతికించాలని వారు కోరుతున్నారు. చావు బతుకుల మధ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ మానస.. వైద్య ఖర్చులకు సాయం చేయాలని వేడుకుంటున్న కుటుంబీకులు -
మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాలు
వెంకటాపురం(ఎం)/వాజేడు/వెంకటాపురం(కె)/మంగపేట/గోవిందరావుపేట: మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని కోరుతూ మావోయిస్టు ఆత్మ పరిరక్షణ ప్రజాప్రంట్ పేరిట జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం కరపత్రాలు వెలిశాయి. కాలం చెల్లిన సిద్ధాంతాలను వీడి ప్రజల జీవన విధానంలో పాత్రులు కావాలని పోస్టర్లలో పేర్కొన్నారు. ఈ మేరకు వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని బండ్ల పహాడ్, తొర్రి చింతలపాడు, ఊట్ల, చాకలిరేవు గొత్తికోయగూడెంలలో గోడలపై పోస్టర్లను అంటించారు. వాజేడు మండల పరిధిలోని జగన్నాథపురం జంక్షన్, ధర్మపురం, తదితర గ్రామాల్లో కరపత్రాలు అంటించారు. వెంకటాపురం(కె)మండల పరిధిలోని చొక్కాల గ్రామ సమీపంలో కరపత్రాలు వెలిశాయి. మంగపేట మండల పరిధిలోని దోమెడ పంచాయతీ పరిధిలోని పాలాయిగూడెం, తిమ్మారం, రామచంద్రునిపేట గ్రామాల మధ్య, అటవీ ప్రాంతంలోని రాళ్లగుంపు, బ్రాహ్మణపల్లి సమీపంలోని కేశవాపురంతో పాటు గొత్తికోయగూడేల్లోని గుడిసెల గోడలు, గోవిందరావుపేట మండలంలోని గొత్తికోయ గుంపులలో మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాలు వెలిశాయి. -
ప్రశ్నించినందుకే మావోయిస్టులను చంపుతారా?
భూపాలపల్లి అర్బన్: మానవ సమాజం ఉన్నంత వరకూ కమ్యూనిజం ఉంటుందని, కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకే మావోయిస్టులను చంపుతారా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్లో పార్టీ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ అధ్యక్షతన జరిగిన భారీ బహిరంగ సభకు పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావుతో కలిసి సాంబశివరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని కేటీకే 5వ గని మలుపు నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీ ప్రపంచంలో అతిపెద్దన్నారు. ఏ దేశంలోనైనా కమ్యూనిస్టులు ఉంటారని, ఇతర బూర్జువా పార్టీలు వారి ప్రాంతాలకు పరిమితమవుతారన్నారు. ఎప్పటికీ పేదల పక్షాన నిలబడేది ఎర్రజెండా పార్టీ అన్నారు. 2026 మార్చి వరకు మావోయిస్టులను అంతం చేస్తామని అమిత్ షా చెప్పడం దుర్మార్గమన్నారు. ఒక కమ్యూనిస్టు చనిపోతే 100 మంది జన్మిస్తారని, కమ్యూనిస్టులకు మరణం లేదన్నారు. దోపిడీ ఉన్నంత వరకూ కమ్యూనిజం ఉంటుందన్నారు. పోరాటాలతోనే సమస్యల పరిష్కారం సాధ్యమన్నారు. జిల్లాలో అనేక సింగరేణి కార్మికుల సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామన్నారు. పట్టణంలోని గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సభలో నాయకులు సుధాకర్రెడ్డి, శాంతికుమార్, సతీశ్, సుగుణ, రామ్చందర్, శ్రీనివాస్, ఆసిఫ్ పాషా, సమ్మిరెడ్డి, సోతుకు ప్రవీణ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. పోరాటాలతోనే సమస్యల పరిష్కారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు -
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
ఖిలా వరంగల్: అనారోగ్య సమస్యలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఖిలా వరంగల్ మధ్యకోట యాదవవాడకు చెందిన వేల్పుల సంతోశ్ యాదవ్(56) వ్యవసాయ మార్కెట్లో వ్యాపా రం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల యూరిక్ యాసిడ్ లెవల్ పెరగడంతో అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆదివారం ఈ సమస్య ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం తెల్లవారుజామున ఇంటి ప్రాంగణంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం కుటుంబీకులు గమనించి మిల్స్కాలనీ పోలీసులకు సమాచారం అందజేయగా వారు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కమీషన్ల కక్కుర్తి..
అన్నదాతల నుంచి అదనపు వసూళ్లు వరంగల్ చౌరస్తా : అన్నదాతలకు ఆరుగాలం కష్టపడి పనిచేయడమే తెలుసు. ఏ పంటకు ఎంత ధర పలుకుతుందో ఏ మాత్రం తెలియదు. ఖరీదుదారు మాట, అడ్తిదారు(కమీషన్ ఏజెంట్లు) సముదాయింపే వాళ్లకు భరోసా. అయితే నమ్ముకున్న వారే అన్నదాతలను అందినకాడికి కమీషన్ల పేరిట దండుకున్నారు. దీనిపై ఫిర్యాదు చేస్తే మార్కెట్ అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోకుండా నిమ్మకునీరెత్తిన్న ట్లు వ్యవహరించారు. చివరకు కడుపు మండిన రైతులు మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో దోపిడీ వ్యవహారం వెలుగు చూసింది. ఈ ఘటనపై ఎట్టకేలకు సోమవారం చర్యలకు ఉపక్రమించారు. వివరాలు ఇలా ఉన్నాయి. 4శాతం కమీషన్ కట్.. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కు 2022–23 సంవత్సరంలో 10 మంది రైతులు తమ పంటలను తరలించారు. సరుకులు అమ్మించేందుకు గాను అడ్తిదారులను ఆశ్రయించారు. అడ్తిదారులు వ్యవసాయ ఉత్పత్తులను అమ్మించినందుకుగాను రూ.100కు రూ.2 చొప్పన కమీషన్ తీసుకోవాలి. కానీ ఏడుగురు అడ్తిదారులు రూ.2కు బదులు అదనంగా మరో 2 శాతం అంటే 4శాతం కమీషన్ కట్ చేసుకుని రైతులకు సొమ్ము చెల్లించారు. దీంతో ఆందోళన వ్యక్తం చేసిన రైతులు మార్కెట్ అధికారులకు 14 తక్పట్టీ ఆధారాలతో సహా రాతపూర్వకంగా ఫిర్యాదుల చేశారు. కానీ మార్కెట్ అధికారులు, సిబ్బంది ఎవరీ నుంచి స్పందన కనిపించలేదు. దీనిపై విసిగివేసారిన రైతులు ఆయా గ్రామాల్లోని కార్యదర్శులు, ప్రజాప్రతినిధుల సహకారంతో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులకు వివరాలతో ఫిర్యాదులు చేశారు. ఎట్టకేలకే రెండేళ్ల తర్వాత ఆ శాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. నోటీసులు, చార్జ్ మెమోలు జారీరైతుల నుంచి అధిక కమీషన్ వసూలు చేసిన ఏడుగురు అడ్తిదారులకు నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా ఆ ఏడాదిగా కార్యదర్శిగా పనిచేసిన రాహుల్, గ్రేడ్–2 కార్యదర్శి తోట చందర్, బియ్యాబాని(రిటైర్డ్ గ్రేడ్–2 కార్యదర్శి ), అసిస్టెంట్ సెక్రటరీ కృష్ణ మీనన్, సూపర్ వైజర్ వెంకన్న నాయక్కు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు చార్జీమెమోలు జారీ చేశారు. ప్రస్తుతం మార్కెట్లో పనిచేస్తున్న సూపర్వైజర్ దంతాల గంగాధర్, స్వప్పకు ఏనుమాముల మార్కెట్ కార్యదర్శి గుగులోత్ రెడ్డి చార్జీ మెమోలు జారీ చేశారు. అధిక కమీషన్ల వ్యవహరం మార్కెట్ వర్గాల్లో కలకలం రేపుతోంది. వెలుగుచూసిన ఘటనలు ఒకటి, రెండు కాగా, మార్కెట్ యార్డులో రైతులు పెద్ద ఎత్తున మోసాలకు గురవుతున్నా పట్టించుకునే నాథుడే లేడని తెలంగాణ రైతు సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ఏడుగురు మార్కెట్ అధికారులు, సిబ్బందికి చార్జీ మెమోలు ఏడుగురు అడ్తిదారులకు నోటీసులు -
మార్కెట్లో రైతుల పడిగాపులు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో సోమవారం రైతులు పడిగాపులు పడ్డారు. వ్యాపారులు సమయానికి వచ్చి ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పలేదు. ఈక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి షంషీర్ వద్దకు రైతులు వచ్చి కొనుగోళ్లు చేపట్టాలని కోరారు. ఆయన వ్యాపారులతో మాట్లాడి మధ్యాహ్నం 2.30 గంటలకు ధాన్యం, అపరాల కొనుగోళ్లు జరిపించారు. ఉదయం 9 గంటలకు కొనుగోళ్లు నిర్వహించాల్సిన వ్యాపారులు మధ్యాహ్నం 2.30 గంటలకు ఆలస్యంగా రావడంతో రైతులు అవస్థలు పడ్డారు. నోటీసులు ఇవ్వడమే కారణమా.. ఇటీవల వ్యాపారులకు మార్కెట్ అధికారులు నోటీసులు ఇవ్వడమే ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యానికి కారణమని తెలిసింది. వ్యవసాయశాఖ జేడీఎం, డీడీఎం తనిఖీలకు వచ్చినప్పుడు 2024–25 వార్షిక సంవత్సరానికి సంబంధించి వ్యాపారులు సరైన వివరాలు అందించలేదని తెలిసింది. ఈ విషయంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యాపారులకు మెమోలు ఇచ్చినట్లు సమాచారం. అలాగే మార్కెట్ ఆవరణ, రైస్ మిల్లు వద్ద జరిపిన కొనుగోళ్ల వివరాలు తక్ పట్టీల ప్రకారం ఇవ్వాలని వ్యాపారులకు వ్యవసాయ మార్కెట్ అధికారులు నోటీసులు పంపించినట్లు తెలిసింది. అంతే కాకుండా క్రయవిక్రయాల ప్రక్రియపై కోల్డ్ స్టోరేజీల వద్ద కూడా సిబ్బందిని నియమించారు. దీంతో మార్కెట్ అధికారులు అడిగిన విధంగా వ్యాపారులు వివరాలు సమర్పించకుండా తమ ఇష్టం వచ్చినట్లు అందజేసినట్లు సమాచారం. ఈమేరకు తమకు నోటీసులు పంపించడం ఏమిటని ప్రశ్నిస్తూ, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వ్యాపారులు కొనుగోళ్లకు రాకుండా ఉన్నట్లు తెలిసింది. ఆలస్యంగా ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారులు -
విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించాలి
● డీఈఓ రవీందర్రెడ్డి మహబూబాబాద్ అర్బన్: విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతికపరంగా సృజనాత్మకతను పెంపొందించాలని డీఈఓ రవీందర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మోడల్ స్కూల్లో సోమవారం ఎస్సీఈఆర్టీ ఆదేశాల మేరకు ఉపాధ్యాయులకు అటల్ టింకరింగ్ ల్యాబ్పై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందిస్తున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్పై ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న అంశాలను విద్యార్థులకు బోధించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీకోఆర్డినేటర్ ఆజాద్ చంద్రశేఖర్, జిల్లా సైన్స్అధికారి అప్పారావు, మోడల్స్కూల్ ప్రిన్సిపాల్ ఉపేందర్రావు, శిక్షణ నిర్వాహకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకంమహబూబాబాద్ రూరల్: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి అన్నారు. నేరాల నియంత్రణలో భాగంగా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ పట్టణంలోని షాపుల యజమానులకు సీసీ టీవీ కెమెరాలు పెట్టుకోవాలని టౌన్ సీఐ సోమవారం నోటీసులు అందజేశారు. రెండు వారాల్లో షాపులోపల, బయట కెమెరాలు బిగించుకొని నేరాల నియంత్రణకు సహకరించాలని కోరారు. ఒకవేళ నేరం జరిగితే నేరస్తులను పట్టుకోవడానికి సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని అన్నారు. టౌన్ ఎస్సైలు శివ, ప్రశాంత్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. మోటార్లకు కెపాసిటర్లు అమర్చుకోవాలి గార్ల: రైతులు విధిగా వ్యవసాయ మోటార్లకు కెపాసిటర్లు అమర్చుకోవాలని, తద్వారా విద్యుత్ను పొదుపు చేయవచ్చని మహబూబాబాద్ విద్యుత్ డీఈ హరిలాల్ అన్నారు. పొలంబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం జీవంజిపల్లి గ్రామ సమీపంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మ ర్ వద్ద విద్యుత్ సమస్యలపై రైతులకు ఆయన ఆవగాహన కల్పించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు రైతులు వెంటనే విద్యుత్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నా రు. రైతులు తొందరపడి ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి ఫ్యూజ్లు వేయవద్దని సూచించారు. రైతులు విద్యుత్ సమస్యలపై స్థానిక విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలని, వారు పట్టించుకోకపోతే వెంటనే టోల్ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయాలని సూచించారు. మోటార్లకు రైతులు విధిగా ఎర్తింగ్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో విద్యుత్ ఏడీ రమేశ్, ఏఈ మహేంద్రబాబు, సిబ్బంది సాంబమూర్తి, నరే శ్, రైతులు వడ్లమూడి శ్రీనివాస్, కై లా మల్లేష్, పి.సంజీవరెడ్డి, రాఘవయ్య, ఆగాల రాముడు, వెంకన్నత దితరులు పాల్గొన్నారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్ఎం విభాగాధిపతిగా శ్రీనివాసులు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్ఎం విభాగాధిపతిగా ఆవిభాగం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆకుతోట శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈమేరకు సోమవారం సాయంత్రం కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఆవిభాగాధిపతిగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రొఫెసర్ పెద్దమళ్ల శ్రీనివాస్రావు కొద్దిరోజుల క్రితం రాజీనామా చేశారు. ప్రస్తుతం రెగ్యులర్ ప్రొఫెసర్లు ఎవరూ లేకపోవడంతో శ్రీనివాసులును నియమించారు. నేడు(మంగళవారం) ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన ఆవిభాగానికి బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా, విశ్వవిద్యాలయం మహాత్మాజ్యోతిరావు పూలే సెల్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం.. శ్రీనివాసులకు నియామక ఉత్తర్వులు అందజేశారు. -
ప్రథమ చికిత్స కేంద్రం సీజ్
మరిపెడ రూరల్: జిల్లాలో కొందరు ఆర్ఎంపీలు పరిమితికి మించి వైద్య చేస్తున్నారు. ఈమేరకు సాక్షి దినపత్రికలో ‘పరిధి దాటుతున్నారు’ అనే శీర్షికన ఆదివారం ప్రచురితమైన కథనంపై డీఎంహెచ్ఓ రవి రాథోడ్ స్పందించారు. మరిపెడ పట్టణంలోని మంద వెంకన్న నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని డీఎంహెచ్ఓ సోమవారం ఆకస్మికంగా సందర్శించి అక్కడ రోగులకు అందుతున్న చికిత్స విధానాన్ని పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా చికిత్స చేస్తుండడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రథమ చికిత్స కేంద్రాన్ని సీజ్ చేశారు. అక్కడి రోగులను 108 వాహనం ద్వారా స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఐదు మెడికల్ షాపులకు సస్పెన్షన్ నోటీసులు.. మరిపెడ పట్టణంలోని మెడికల్ షాపులకు జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉమారాణి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఏ టు జెడ్, కేర్, సాయిమారుతి, అపోలో, సీజ్ చేసిన ప్రథమ చికిత్స కేంద్రంలోని షాపునకు డీఐ సస్పెన్షన్ నోటీసులు ఇచ్చారు. వారం రోజుల పాటు ఈ ఐదు మెడికల్ షాపు మూసివేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, సీహెచ్ఓ విద్యాసాగర్, పారామెడికల్ అధికారి వనాకర్రెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ రాజు తదితరులు పాల్గొన్నారు. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై చర్యలు తొర్రూరు: నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ బి.రవిరాథోడ్ అన్నారు. డివిజన్ కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను సోమవారం తనిఖీ చేశారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ..ఆస్పత్రుల్లో పని చేసే వైద్యుల వివరాలను వైద్యశాఖలో నమోదు చేసి అనుమతులు పొందాలన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు అందించే చికిత్సల ధరలు బోర్డుపై ప్రదర్శించాలన్నారు. వైద్యం అందించే వారికి తగిన విద్యార్హతలు ఉండాలని, బోగస్ ధ్రువ పత్రాలతో కొనసాగితే క్రిమినల్ కేసులు తప్పవన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, డీపీఎంఓ వనాకర్రెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ కేవీ రాజు తదితరులు పాల్గొన్నారు. ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ -
ప్రొఫెసర్ శ్రీలతకు అవార్డు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ సీజే శ్రీలతకు ఉమెన్ లీడర్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అవార్డు లభించింది. శ్రీలతకు బెంగళూరు కేంద్రంగా ఉన్న ప్రముఖ సంస్థ ది అకడమిక్ ఇన్సైట్స్ నుంచి అవార్డుకు ఎంపికయ్యారు. ఈపురస్కారం మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఉన్నత విద్యారంగంలో విశేష సేవలందిస్తున్న మహిళలకు అందజేస్తారు. ఈఅవార్డుల వివరాల్ని వారి అధికార జర్నల్ ది అకడమిక్ ఇన్సైట్స్ ఇన్స్పైరింగ్ మైండ్స్లో ఇటీవల ప్రచురించారు. ఈఅవార్డుపై సోమవారం యూనివర్సిటీలో శ్రీలత మాట్లాడుతూ.. ఇది మహిళా నాయకత్వానికి గుర్తింపు అని పేర్కొన్నారు. ఈసందర్భంగా శ్రీలతను కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం అభినందించారు. -
మమ్ముల్ని ఆదుకోండి సారూ..
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదుదారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, ఆర్డీఓ కృష్ణవేణి వినతులు స్వీకరించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో 189 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. అనంతరం పలు అంశాలపై అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. సమావేశంలో డీఆర్డీఓ మధుసూదన్రాజ్, ఇన్చార్జ్ సీపీఓ అశోక్, డీఎం ఇండ్రస్టీ శ్రీమన్నారాయణ, బీసీ, ఎస్సీ, మైనార్టీ అధికారులు నర్సింహారావు, శ్రీనివాస్రావు, డీడీ గ్రౌండ్వాటర్ సురేశ్, ఎల్డీఎం యాదగిరి, డీఎం సివిల్ప్లయీస్ కృష్ణవేణి, ఇన్చార్జ్ డీడబ్ల్యూఓ శిరీష, ఎంప్లాయ్మెంట్ అధికారి రజిత, గిరిజనశాఖ అధికారి దేశీరాంనాయక్, డీపీఓ హరిప్రసాద్, డీహెచ్ఓ మరియన్న తదితరులు పాల్గొన్నారు. వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని.. ● పెద్దవంగర మండలం బొమ్మకల్లు గ్రామానికి చెందిన రెడ్డబోయిన శైలజ తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, అయితే ఇంటి నిర్మాణానికి స్థలం సరిపోకపోవడంతో మరో స్థలంలో నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరింది. ● గూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకోవడానికి దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు వస్తున్నారని, వారికి బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని, వారికోసం సెల్ఫ్ మేనేజ్మెంట్ హాస్టల్ ఏర్పాటు చేయాలని భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య నాయకులు వినతిపత్రం అందజేశారు. ● బయ్యారం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన బానోత్ రాములు పంట రుణం కోసం దరఖాస్తు చేసుకున్నానని, అయితే అధికారుల నుంచి లెటర్ కావాలని బ్యాంకు అధికారులు అడుగుతున్నారని, లెటర్ అందించి రుణం మంజూరయ్యేలా చూడాలని వినతిలో కోరాడు. ● గూడూరు మండలం సీతానాగరం గ్రామ పరిధి భూక్య ధర్మతండాకు చెందిన దరావత్ రాజీ తన భర్త తేజ్యా ప్రమాదంలో మృతిచెందాడని, అయితే తన పేరు వేరే వారి రేషన్కార్డులో తప్పుగా చేర్చినందుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదన్నారు. తన పేరును సవరించాలని ఆమె కోరింది. ప్రజావాణిలో మొరపెట్టుకున్న దరఖాస్తుదారులు అర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో -
ప్రయాణికుల భద్రతకు ఆర్టీసీ ప్రాధాన్యం
హన్మకొండ: ప్రమాదాలు జరగకుండా ఆర్టీసీ డ్రైవర్లు సురక్షిత డ్రైవింగ్ చేయాలని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను సూచించారు. సోమవారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయంలో డ్రైవర్లకు శిక్షణ ఇచ్చారు. ఆర్ఎం మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రతకు ఆర్టీసీ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రమాదాలు లేని వరంగల్ రీజియన్గా తీర్చిదిద్దేందుకు ఆర్టీసీ, అద్దె బస్సు, జేబీఎం బస్ డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. డ్రైవర్లు ఏకాగ్రతతో విధులు నిర్వహించాలంటే ఫిజికల్గా ఫిట్నెస్గా ఉండడంతో పాటు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలన్నా రు. మద్యం ముట్టుకోవద్దని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు కృషి చేయాలని కోరారు. ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను -
విద్యుత్ కనెక్షన్ కష్టాలు
సాక్షి, మహబూబాబాద్: నిరుపేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ప్రభుత్వం.. ఇందిరమ్మ ఇళ్లకు ఇచ్చేందుకు వెనకడుగు వేస్తోంది. ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు అయినా.. సొంతంగా ఇల్లు కట్టినా కమర్షియల్ కేటగి రీ–2 మీటర్ మాత్రమే ఇస్తామని విద్యుత్ శాఖ అధికారులు తేల్చి చెబుతున్నారు. దీంతో ఇల్లు కట్టడం కన్నా.. విద్యుత్ కనెక్షన్ కోసం ముందుగా అప్పులు చేయాల్సి వస్తోందని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వాపోతున్నారు. ఉచితంగా కనెక్షన్ ఇవ్వాలి.. గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లు, ఇతర పథకాలతో నిర్మించిన ఇళ్లకు నామమాత్రపు రుసుముతో విద్యుత్ కనెక్షన్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదని, డబ్బులు చెల్లిస్తేనే కనెక్షన్ ఇస్తామని అధికారులు అంటున్నారు. కాగా జల్లాలోని 18 మండలాల పరిధిలో 1,89,065 దరఖాస్తులు, మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ మున్సిపాలిటీల్లో 28,526.. మొత్తంగా 2,17,591 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో మొదటి విడతలో 7,984 ఇళ్లు మంజూరు చేశారు. ఇందులో ఐదు వేలకు పైగా ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో పాత ఇంటి స్థలంలో ఇల్లు నిర్మించుకుంటున్న వారు కొందరైతే.. కొత్త స్థలంలో ఇల్లు నిర్మించుకునే వారు సుమారు 2వేలకు పైగా ఉంటారని అంచనా. ఇల్లు నిర్మాణం మొదలు పెట్టి బేస్మెంట్ లెవల్ వరకు నిర్మాణం పూర్తి చేస్తే రూ.లక్ష, స్లాబ్ వరకు గోడల నిర్మాణానికి రూ.లక్ష, స్లాబ్ పడిన తర్వాత రూ.2లక్షలు, ఇల్లు పూర్తి అయిన తర్వాత మిగిలిన రూ.లక్ష, ఇలామెత్తం రూ.5లక్షలు చెల్లిస్తారు. కాగా లబ్ధిదారులు ముందు అప్పులు చేసి ఇంటి నిర్మాణాలు మొదలుపెడుతున్నారు. వాటికి తోడు ఇప్పుడు కరెంట్ ఖర్చులు అధికం అవుతున్నాయి. కావునా ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు కేటగిరీ–2 మీటర్ పెడతామంటున్న అధికారులు కొత్తగా ఖాళీ స్థలంలో నిర్మాణం చేస్తే అదనపు ఖర్చులు ఉచితంగా కనెక్షన్ ఇవ్వాలంటున్న పేదలు ‘మహబూబాబాద్ పట్టణానికి చెందిన కర్పూరపు అనిల్కు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. జమాండ్లపల్లి రోడ్డులో ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు సిద్ధమయ్యాడు. అధికారులు వచ్చి ముగ్గు పోశారు. ఇంటికి కరెంట్ మీటర్ కోసం విద్యుత్ అధికారులను సంప్రదించగా.. కొత్త ఇల్లు కాబట్టి కేటగిరీ–2 మీటర్ తీసుకోవాలి. ఐదు స్తంభాలు, వైర్లు కొనుగోలు చేయాలి. ఇందుకోసం రూ. 65వేల మేరకు ఖర్చు అవుతుందని చెప్పారు. కాగా మొదటి బిల్లు వస్తుందని బేస్మెంట్ వరకు నిర్మాణం కోసం రూ.1.5లక్షలు అప్పు చేశాడు. ఈక్రమంలో కరెంట్ కోసం అదనంగా అప్పు చేయలేక దూరంగా ఉన్న బావుల నుంచి నీరు తీసుకొచ్చి క్యూరింగ్ చేస్తున్నాడు.’ఆ మీటరే ఇస్తాం.. ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్న లబ్ధిదారులు విద్యుత్ కనెక్షన్ కోసం అధికారుల వద్దకు వెళ్లగా, కేటగిరీ–2 మీటర్ మాత్రమే బిగిస్తామని చెబుతున్నారు. నిరుపేదలకు అవసరమైన విద్యుత్ వినియోగం కోసం కేజీ వాట్స్ విద్యుత్ కోసం కేటగిరీ–1 అయితే డెవలప్మెంట్ చార్జీలు కలిపి రూ.28,00, కేటగిరీ–2 అయితే రూ.3800 మీసేవలో చలాన్ చెల్లించాలి. అది తీసుకొని విద్యుత్ అధికారుల వద్దకు వస్తే అక్కడ పరిస్థితులను బట్టి మరో రూ.వెయ్యి నుంచి రూ. 2వేల మేరకు ఖర్చు అవుతుందని వినియోగదారులు అంటున్నారు. విద్యుత్ స్తంభం దూరంగా ఉంటే 30 మీటర్లకు ఒక పోల్ చొప్పున వైర్లు, కాసారాలకు ఇతర పరికరాలకు రూ.6 వేల మేరకు చెల్లించాలి. ఐదారు పోల్స్ దూరం అయితే విద్యుత్ కనెక్షన్, పోల్స్, ఇతర విద్యుత్ పరికరాలకు చలా వరకు డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. -
ఆలోచింపజేసిన ‘బుద్ధుడితో నా ప్రయాణం’
హన్మకొండ: బుద్ధుడితో నా ప్రయాణం నాటక ప్రదర్శన ఆలోచింపజేసింది. అఽభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో బుద్ధుడితో నా ప్రయాణం నృత్య రూప నాటకాన్ని ప్రదర్శించారు. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ రాసిన బుద్ధుడు ఆయన ధర్మం పుస్తకం ఆధారంగా రూపొందించిన నాటక ప్రదర్శన ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి అతిథులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు పరంధాములు, లలిత ఫౌండేషన్ చైర్మన్ కేకే రాజా, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, డాక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వర్తమాన సమాజానికి గౌతమ బుద్ధుని బోధనల అవసరం ఉందని అన్నారు. భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నక్క సుదర్శన్, పీఎస్ఎన్ మూర్తి, సిద్ధోజిరావు, నల్ల సూర్యప్రకాశ్, బొమ్మల్ల అంబేడ్కర్, రౌతు రమేశ్కుమార్, జిలకర శ్రీనివాస్, మచ్చ దేవేందర్, కొంగర జగన్మోహన్ పాల్గొన్నారు. -
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలి
మహబూబాబాద్ అర్బన్ : మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని ఆదరించాలని మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం పట్టణ అధ్యక్షుడు వెన్నెమల్ల అజయ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాంనాయక్ మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్, స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయన్నారు. దేశంలో మోదీ పాలనలో చేపట్టిన అభివృద్ధిని చూసి గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఓట్లు వేస్తున్నారన్నారు. ఇటీవల ఉపముఖ్యమంత్రి మానుకోటకు వచ్చినా ప్రజలకు ఏం ఒరిగిందని, తాను ఎంపీగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే ప్రస్తుతం కనబడుతుందన్నారు. వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే మానుకోటను అందంగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శ్యామ్ సుందర్ శర్మ, నాయకులు పల్లె సందీప్, ఓర్సు పద్మ, టౌన్ జనరల్ సెక్రటరీ ధరావత్ రవికుమార్, రవి యాదవ్, నరేష్ నాయక్, సరోజ, హతీరాం, భరత్, శ్యామ్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ -
పరిశుభ్రత పాటించాలి
మరిపెడ రూరల్: నివాస గృహాలు, కార్యాలయాల్లో పరిశుభ్రత పాటించాలని స్వచ్ఛ సర్వేక్షణ్ మహబూబాబాద్ జిల్లా కోర్డినేటర్ పి. శ్రావణ్ అన్నారు. ఆదివారం మరిపెడ మండలం వీరారం, పురుషోత్తమాయగూడెం గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛ భారత్–2025 మిషన్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల గృహాల్లోని మరుగుదొడ్లు, సైడ్ కాల్వలు, కమ్యూనిటీ హాల్స్, హెల్త్ సెంటర్, అంగన్వాడీ సెంటర్లు, కార్యాలయాలను బృందం సభ్యులు పరిశీలించారు. అనంతరం శ్రావణ్ మాట్లాడుతూ.. స్వచ్ఛ భారత్ పథకంలో భాగంగా ఇప్పటికే ఇంటింటకీ రెండు చెత్త సేకరణ డబ్బాలు ఇవ్వడం జరిగిందన్నారు. తడి, పొడి చెత్తను సేకరించడానికి వాటిని వాడుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇన్వెస్టిగేషన్ అధికారి రవిచంద్ర పటేల్, మరిపెడ ఎంపీఓ సోమ్లానాయక్, కార్యదర్శిలు రామోజీ, సురేష్, శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ సోమనాయక్, జీపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఓరుగల్లుతో ‘కోట’కు అనుబంధం
హన్మకొండ కల్చరల్: విలక్షణ నటులు కోట శ్రీనివాసరావు ఆదివారం మృతి చెందారు. ఆయన మృతిపై వరంగల్ నగరవాసులు దిగ్భ్రాంతి చెందారు. ఈసందర్భంగా వరంగల్ నగరవాసులు కోట శ్రీనివాసరావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కోట శ్రీనివాసరావు నాటక కళాకారులు కూడా కావడంతో కొన్నేళ్ల క్రితం కేఎంసీలో జరిగిన పోటీల్లో ఒక నాటకంలో కూడా ప్రదర్శన ఇచ్చారని కవి, సహృదయ సంస్థ సభ్యులు ఎన్వీఎన్ చారి తెలిపారు. ఈసందర్భంగా ఆయన మృతిపై సహృదయ కార్యవర్గం, తెలంగాణ నాటక సమాజాల సమైక్య అధ్యక్షుడు ఆకుల సదానందం, అధ్యక్షుడు మాడిశెట్టి రమేశ్, సీనియర్ కళాకారులు కాజీపేట తిరుమలయ్య, జేఎన్ శర్మ, ఓడపల్లి చక్రపాణి, జూలూరు నాగరాజు, పలువురు కళాకారులు, సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ సంతాపం తెలిపారు. ‘కోట’ మరణం బాధాకరంవిలన్గా, కమెడియన్గా, తండ్రిపాత్రలో నటించి విలక్షణమైన నటుడిగా పేరుపొందిన కోట శ్రీనివాసరావు మరణం బాధాకరం. 1990లో లష్కర్బజార్ హైస్కూల్ జరిగిన ఓ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన సందర్భంగా పరిచయం చేసుకుని ఫొటో దిగా. – మట్టెవాడ అజయ్కుమార్, మైక్రో ఆర్టిస్ట్, వరంగల్ అమ్మవారి దర్శనానికి వరంగల్కు వచ్చిన కోట శ్రీనివాసరావు ఆయన మృతితో దిగ్భ్రాంతి చెందిన ఉమ్మడి జిల్లా కళాకారులు -
ప్రజల చైతన్యంతోనే ఆర్థిక వ్యవస్థ బాగు
హన్మకొండ: ప్రజల చైతన్యం, రాజకీయ వ్యవస్థలో మార్పుతోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగు పడుతుందని, రాష్ట్ర సమగ్రాభివద్ధి సాధ్యమని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్ట హరిత కాకతీయ హోటల్లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక, ఫోరం ఫర్ బెటర్ వరంగల్ ఆధ్వర్యంలో ‘అప్పుల ఊబిలో తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ– కారణాలు, పర్యవసానాలు–ప్రస్తుత పరిష్కారాలు’ అనే అంశంపై మేధావుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో హరగోపాల్ ప్రధాన వక్తగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో గత పాలకుల విధానాల వల్ల విద్య, వైద్యం లాంటి మౌలిక రంగాలు నాశనమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల రాజకీయ చైతన్యంతో, రాజకీయ పార్టీల స్వభావంలో మార్పుతోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుపడి సమగ్రాభివద్ధి జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రానికి నాయకత్వం వహించిన కేసీఆర్ మేధావుల సూచనలను పట్టించుకున్న పాపాన పోలేదని, ఎవరి మాట వినలేదన్నారు. నేటి పాలకులు మేధావుల సూచనలు విన్నప్పటికి వాటి అమలుపై నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ అన్ని రకాలుగా ఆగమైన వర్గాలకు న్యాయం జరగాల్సిన అవసరముందన్నారు. దొరల పాలనలో తెలంగాణ మరింత ఆగమైందని, మానవాభివృద్ధితో కూడిన ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికలు రచించి అమలుపరచాలన్నారు. ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరిగినా కానీ ప్రజల మౌలిక సదుపాయాలు పెరగలేదన్నారు. హెదరాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆర్.వి.రమణమూర్తి మాట్లాడుతూ పంటల విధానంలో మార్పులు తెచ్చి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేయడం ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇట్యాల పురుషోత్తం, ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్, తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్ సోమ రామ్మూర్తి, ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్, డాక్టర్ జిలకర శ్రీనివాస్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్నమనేని జగన్ మోహన్ రావు ప్రసంగించారు. కార్యక్రమంలో వీరమల్ల బాబురావు, మల్లారెడ్డి, సంపత్ రెడ్డి, సుశీల, చాపర్తి కుమార్ గాడ్గే, డాక్టర్ ప్రవీణ్ కుమార్, బుసిగొండ ఓంకార్, వల్లాల జగన్ గౌడ్, సంఘని మల్లేశ్వర్, కొంగ వీరస్వామి, మేకల కేదారి యాదవ్, నలిగింటి చంద్రమౌళి, లంకా పాపిరెడ్డి, బొమ్మినేని పాపిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. గత పాలకుల విధానాలతో విద్య, వైద్య రంగాలు నాశనం ప్రొఫెసర్ హరగోపాల్ -
ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు నామినేషన్
మహబూబాబాద్ అర్బన్: జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు–2025 కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని డీఈఓ రవీందర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఈనెల 17వరకు నామినేషన్ల రిజిస్ట్రేషన్, ఈనెల 20 వరకు దరఖాస్తుల తుది సమర్పణ, అలాగే ఆన్లైన్లో సబంధిత వెబ్సైట్లో నమోదు చేయాలన్నారు. దేశవ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి, వారి సేవలను గౌరవించడమే కాకుండా, ఉపాధ్యాయ దినోత్సవం (సెప్టెంబర్ 5న) రాష్ట్రపతి చేతుల మీదుగా బహుమతులు అందజేస్తారన్నారు. ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులు అందిపుచ్చుకోవాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలి గార్ల: ఇల్లెందు నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఆదివారం ఎమ్మెల్యే కోరం కనకయ్య హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఇల్లెందు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి సీఎంకు వివరించారు. నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని కోరారు. అనంతరం సీఎంను శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యే వెంట పీఏసీఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నూతన కమిటీనెహ్రూసెంటర్: మహబూబాబాద్ జిల్లా కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మూడు ప్యానల్స్ బరిలో నిలిచాయి. జిల్లాలో మొత్తం 457ఓట్లకు గానూ 405 ఓట్లు పోలయ్యాయి. ఈమేరకు పేరాల సంపత్రావు 184 ఓట్లతో అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలుపొందారు. కార్యదర్శిగా సోమ పురుషోత్తం, కోశాధికారిగా బెజగం రాజు ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా మృత్యుంజయరెడ్డి, రామకృష్ణారావు వ్యవవహరించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికై న వారు మాట్లాడుతూ.. అసోసియేషన్ బలోపేతం కోసం కలిసికట్టుగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. సివిల్స్ ఉచిత శిక్షణకు అర్హత పరీక్ష కేయూ క్యాంపస్: సివిల్ సర్వీస్ ఉచిత శిక్షణకు హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాలలో ఆదివారం అర్హత పరీక్ష నిర్వహించారు. ఉదయం 10–30 నుంచి మధ్యాహ్నం 1–30 గంటల వరకు నిర్వహించిన ఈ పరీక్షకు 440 మంది అభ్యర్థులు హాజరయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి, షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఉమ్మడి వరంగల్ సెల్ గౌరవ డైరెక్టర్ డాక్టర్ జగన్మోహన్ తెలిపారు. పరీక్షల నిర్వహణ తీరును ఎస్సీ వెల్ఫేర్ అధికారి బి.నిర్మల, కళాశాల పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ రమాదేవి పరిశీలించారు. భక్తుల కోలాహలం ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి భక్తులు మేడారానికి ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చారు. జంపన్నవాగులో స్నానాలు ఆచరించారు. -
పంటతో నికర ఆదాయం
ఆరేళ్లుగా 20 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేస్తున్నా. దీంతో ఎకరానికి ఏడాదికి నికర ఆదాయం రూ.1.50లక్షలు వస్తోంది. టన్ను పామ్ ఆయిల్ ధర రూ.18,748 పలుకుతుండగా ఒక ఎకరానికి పది టన్నుల గెలలు దిగుబడి వస్తున్నాయి. ప్రభుత్వం ఆయిల్పామ్ సాగుకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తోంది. – వై.ఇంద్రసేనారెడ్డి, కొత్తూరు (సీ) ఐదేళ్లుగా సాగు చేస్తున్నాం.. నేను ఐదేళ్లుగా ఆయిల్ పామ్ సాగు చేస్తుండగా ఎకరానికి నికర ఆదాయం రూ.1.50 లక్షలు వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్పామ్ సాగుపై దృష్టి సారించి రైతులను పంట మార్పిడి వైపునకు ప్రోత్సహిస్తోంది. వరి నుంచి పంట మార్పిడి చేసి ఆయిల్ పామ్ సాగు చేయాలి. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగు చేస్తే రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతారు. – వల్లూరి కృష్ణారెడ్డి, జయ్యారం, రాష్ట్ర ఆయిల్ పామ్ బోర్డు అడ్వైజరీ కమిటీ సభ్యుడు -
భర్తతో ఉండేలా న్యాయం చేయండి
చిల్పూరు : భర్తతోనే (అతడి తల్లిదండ్రులు కాకుండా) కలిసి ఉండేలా తనకు న్యాయం చేయాలని ఓ ఇల్లాలు భర్త ఇంటి ఎదుట తన తల్లిదండ్రులు, ఐదేళ్ల కూతురితో కలిసి ఆదివారం నిరసన చేపట్టింది. మల్కాపూర్ గ్రామానికి చెందిన సాంబారి రాజేశ్వర్, మణెమ్మ దంపతులకు విద్యాసాగర్ ఒక్కడే కుమారుడు. ఆరేళ్ల క్రితం భూపాలపల్లి జిల్లా ములు గు ఘణపురం గ్రామానికి చెందిన వెంకటనారాయణ కుమార్తె తేజస్వినితో పెళ్లి జరిపించారు. దంపతులు కొంతకాలం క్రితం వరకు అన్యోన్యంగా ఉండేవారు. అయితే మల్కాపూర్ వచ్చిన నాటి నుంచి తేజస్వినిని ఏదో రకంగా అత్తామామ ఇబ్బంది పెట్టేవారు. దీంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు నిర్వహించినా ఫలితం లేకపోవడంతో కోర్టు వరకు వెళ్లింది. అయినా విద్యాసాగర్ తల్లిదండ్రుల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఆదివారం తేజస్విని తన తల్లిదండ్రులతో పాటు కూతురితో కలిసి మల్కాపూర్ గ్రామానికి వచ్చింది. ఇంటి ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిరసన చేపట్టింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై నవీన్కుమార్ ఆదేశంతో కానిస్టేబుల్ చారి అక్కడకు వెళ్లి గొడవ జరగకుండా చేశారు. మల్కాపూర్ ప్రజలరా మీకు పాదాభివందనం ఐదేళ్ల కూతురితో భర్త ఇంటి ఎదుట ఫ్లెక్సీతో భార్య నిరసన -
సమస్యల తిష్ట..
మహబూబాబాద్ అర్బన్: నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. విద్యార్థులు సంక్షేమ హాస్టళ్లలో చేరుతున్నారు. అయితే జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో అరకొర వసతులు మధ్య విద్యార్థులు చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. వసతి గృహాల పరిసరాలు అపరిశుభ్రంగా, అధ్వానంగా ఉన్నాయి. విషపురుగులు సంచరిస్తున్నాయి. అలాగే పడుకోవడానికి సరైన బెడ్లు లేవు. గదులకు డోర్లు, కిటికీలు లేకపోవడంతో విద్యార్థులు దోమలతో సావాసం చేయాల్సి పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రంలోని హాస్టళ్లలో.. జిల్లా కేంద్రంలోని కేసముద్రం రోడ్డులోని గిరిజన బాలికల కళాశాల హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరింది. 100 మంది విద్యార్థినులు ఉన్నారు. కాగా ఆ భవనం పెచ్చులూడి పడుతుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని విద్యార్థినులు భయంగా కాలం వెల్లదీస్తున్నారు. అలాగే ఎస్టీ బాలుర కళాశాల హాస్టల్లో సరైన వంట గదిలేక ఓపెన్ షెడ్డులో వంటలు వండుతున్నారు. వర్షం వచ్చినప్పుడు వంట నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. మినరల్వాటర్ ప్లాంట్ మరమ్మతులకు గురైంది. అదేవిధంగా బీసీ బాలికల హాస్టల్ అద్దె భవనంలో కొనసాగుతోంది. పూర్తిగా రేకులతో కూడిన గదులు ఉండడం, వర్షం పడినప్పుడు విద్యార్థులు హాల్లోకి వెళ్లి నిద్రించాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలోని పలు హాస్టళ్లలో.. జిల్లాలోని పలు ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో మరుగుదొడ్ల, బాత్రూమ్లు ధ్వంసమయ్యాయి. దీంతో విద్యార్థులు ఆరుబయటకు వెళ్తున్నారు. అలాగే బెడ్లు లేకపోవడంతో విద్యార్థులు కింద పడుకోవాల్సి వస్తోంది. ఫ్యాన్లు తిరగడం లేదు. మినరల్ వాటర్ అందడం లేదు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. వర్కర్ల ఇష్టారాజ్యం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో విధులు నిర్వర్తించే అవుట్ సోర్సింగ్ వర్కర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మాకు ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్ తెలుసు అని అధికారులను బెదిరిస్తూ.. వారు చెప్పిన పనులు చేయడం లేదని సమాచారం. పాములు తిరుగుతున్నాయి.. హాస్టల్ ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగాయి. చెత్తాచెదారం పేరుకుపోయి పాములు తిరుగుతున్నాయి. భయంగా ఉంది. పరిసరాలను శుభ్రం చేయాలి. – కె.సంతోష్, విద్యార్థి, ఎస్సీ బాలుర హాస్టల్, మానుకోట మెనూ ప్రకారం భోజనం అందించాలి ప్రతీ రోజు మెనూ ప్రకారం భోజనం, టిఫిన్ అందడం లేదు. రుచిగా ఉండడం లేదు. వంట నిర్వాహకులను అడిగితే ఇంటి దగ్గర ఇంతకంటే మంచి భోజనం పెడుతున్నారా అని వెటకారంగా మాట్లాడుతున్నారు. పడుకోవడానికి బెడ్లు కూడా లేవు. ఐరన్ బెడ్లలోనే రెండు దుప్పట్లు వేసుకొని పడుకుంటున్నాం. వెంటనే అన్ని సౌకర్యాలు కల్పించాలి. – ఎస్.సంజయ్, ఎస్సీ హాస్టల్జిల్లాలోని హాస్టళ్ల వివరాలు హాస్టల్ హాస్టళ్ల విద్యార్థుల సంఖ్య సంఖ్య ఎస్సీ సంక్షేమ హాస్టల్స్ 24 1100 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్ 34 7457 బీసీ సంక్షేమ హాస్టల్స్ 14 865 వసతి గృహాల్లో అరకొర వసతులు అపరిశుభ్రంగా హాస్టళ్ల పరిసరాలు సంచరిస్తున్న విషపురుగులు విద్యార్థులకు తప్పని తిప్పలు -
అమెరికా స్వప్రయోజనాల కోసమే యుద్ధాలు
● టీఎస్డీఎఫ్ రాష్ట్ర సదస్సులో వక్తలు న్యూశాయంపేట: అమెరికా స్వప్రయోజనాల కోసం జరుగుతున్న యుద్ధాలతో సమాజానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని వక్తలు పేర్కొన్నారు. ‘యుద్ధాలు ఎవరి కోసం’ అనే అంశంపై తెలంగాణ ప్రజాస్వామిక వేదిక (టీఎస్డీఎఫ్) రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ వినాయకరెడ్డి అధ్యక్షతన ఆదివారం వరంగల్ అబ్నూస్ ఫంక్షన్హాల్లో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్, ఎంసీపీఐ (యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, సీపీఐ ఎంఎల్ న్యూడెమొక్రసీ అధికార ప్రతినిధి జేవీ చలపతిరావు, సీపీఐ ఎంఎల్ కేంద్ర కమిటీ సభ్యుడు గుర్రం విజయ్కుమార్ మాట్లాడారు. ప్రపంచ దేశాలపై పెత్తనం చెలాయించేందుకు, సంపద దోచుకునేందుకు దేశాల మధ్య అమెరికా యుద్ధాలను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. ఈ క్రమంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనుకబడిన దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది ప్రాణాలు పోతున్నాయని, పర్యావరణం దెబ్బతింటున్నదని పేర్కొన్నారు. కోలుకోలేని విధంగా గాజా, ఇరాన్, పాలస్తీనా దేశాలు దెబ్బతిన్నాయని, అభంశుభం తెలియని పసికందులు, మహిళలు సైతం ప్రాణాలు కోల్పోయారన్నారు. అమెరికాకు భారత్ వత్తాసు పలకడం సిగ్గుచేటని, పాకిస్తాన్తో సయోధ్య కుదిర్చామని గొప్పలు చెబుతున్న ట్రంప్ ఇతర దేశాల మధ్య చిచ్చు ఎందుకు ఆపడం లేదని ప్రశించారు. అమెరికా ప్రయోజనాల కోసం, కార్పొరేట్ శక్తుల కోసం ప్రధాని మోదీ సాగిల పడడం ఆందోళన కలిగిస్తోందని వారు పేర్కొన్నారు. ఇప్పటికై నా అలాంటి ధోర ణి మానుకోవాలని హెచ్చరించారు. దోపిడీ లేని రాజ్యం కోసం ప్రజలను చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. సదస్సులో నాయకులు పి.రమేశ్, ఎం.రవి, విశ్వనాఽథ్, ఆర్.బాలరాజు, ఎన్.అప్పారావు, యాదగిరి, ఇనాం అబ్దుల్అలీ జుబేర్, అబ్దుల్ సుభాన్, వి.రాగసుధ, జి.నాగార్జున, సావిత్రి, తదితర నాయకులు పాల్గొన్నారు. -
మితంగా వాడితేనే మేలు..
పెద్దవంగర: పంటల ఎదుగుదలలో యూరియా కీలకం. ఇది పంటకు అవసరమైన నత్రజనిని అందిస్తుంది. అయితే సరైన మోతాదులో, సరైన సమయంలో వాడడం చాలా ముఖ్యం. విచక్షణారహితంగా వాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. కాగా యూరియాను సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. యూరియా ప్రాధాన్యం.. యూరియా 46 శాతం నత్రజనిని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన రసాయనిక ఎరువు. తెల్లని గుళికల రూపంలో ఉంటుంది. నీటిలో తేలికగా కరిగి మొక్కలు ఆకులు పచ్చగా ఉండానికి, కాండం బలంగా పెరగడానికి త్వరగా అందుబాటులోకి వస్తోంది. నత్రజని లోపం ఉంటే మొక్కల ఎదుగుదల తగ్గి, దిగుబడులు తగ్గుతాయి.యూరియా మోతాదుకు మించితే పంటలకు నష్టం భూసారం తగ్గే ప్రమాదం శాసీ్త్రయ పద్ధతులు పాటిస్తే మెరుగైన దిగుబడి -
భార్య మృతి తట్టుకోలేక భర్త కన్నుమూత
చిల్పూరు: భార్య మృతి తట్టుకోలేక భర్త కన్నుమూశాడు. ఈ ఘటన ఆదివారం జనగామ జిల్లా చిల్పూరులో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన సట్ల చెన్నయ్య(85), నర్సమ్మ దంపతులకు సంతానం లేరు. సుధీర్ను దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. ఈ నెల 3వ తేదీన నర్సమ్మ అనారోగ్యంతో మృతిచెందింది. ఆదివారం ఆమె దశదిన కర్మ చేసేందుకు చెన్నయ్య కుటుంబ సభ్యులతో కలిసి శ్మశానవాటికకు వెళ్లా డు. కార్యక్రమం పూర్తయ్యాక ఇంటికి వచ్చేందుకు ఆటో ఎక్కి చనిపోయాడు. చెన్న య్య మృతితో చిల్పూరులో విషాదఛా యలు అలుముకున్నాయి. ఆయన మృతికి కాంగ్రెస్ నాయకులు జక్కం భాస్కర్, గణగోని రమేశ్, పొన్నం శ్రీను, కుమార్ తదితరులు సంతాపం ప్రకటించారు. -
ఆరోగ్యమస్తు..
మట్టి పాత్రలతోమట్టి కడవల్లోనే మంచినీరు.. పూర్వకాలంలో మట్టి పాత్ర(కుండ)ల్లో వంటలు చేసే వారు. మట్టి కడవల్లోనే మంచినీరు తాగే వారు. అందుకే ఆ కాలపు వారు ఆరోగ్యంగా ఉండేవారు. అయితే 40 ఏళ్ల నుంచి మట్టి పాత్రలు వాడకం క్రమేనా తగ్గతూ వచ్చింది. ప్రస్తుతం వ్యాప్తిస్తున్న రోగాలతో పాతకాలం నాటి ఆహార పద్ధతులపై ప్రజలు మక్కువ పెంచుకుంటన్నారు. ఇందులో భాగంగా మట్టి కుండలో చికెన్, మట్టి పాత్రలో వంటలకుక్రేజ్ పెరుగుతోంది. మట్టి పాత్రల్లో వంటలు ఆరోగ్యకరం అనగానే ఆ పాత్రలు మార్కెట్లో భారీగా అమ్ముడవుతున్నాయి. గతంలో ఇళ్లలో మట్టితో తయారు చేసే వస్తువులు అనేకం ఉండేవి. ప్రస్తుతం మార్కెట్లో లభించే కుండలు తప్ప మరే ఇతర మట్టి పాత్రలు కనిపించడం లేదు.ఖిలా వరంగల్ : పూర్వం రోజుల్లో వంటలకు మట్టి పాత్రలనే వాడే వారు. అన్నం, కూర, పాలు, పెరుగు.. ఇలా ప్రతీ పదార్థం మట్టి కుండలోనే వండేవారు, భద్రపరిచేవారు. ఈ పాత్రల్లో వండిన, భోజనం చేసిన వారు ఎక్కువ కాలం ఆరోగ్యంతో జీవించేవారని పెద్దలు చెబుతుంటారు. అయితే పెరిగిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మట్టి పాత్రలు మాయమయ్యాయి. వాటి స్థానంలో అల్యూమినియం పాత్రలు, పేపర్ పేట్లు ప్రత్యక్షమయ్యాయి. ఫలితంగా వీటిని వినియోగించిన ప్రజలు అనారోగ్యాలు కొనితెచ్చుకుంటున్నారు. ఈ ప్రమాదాన్ని గ్రహించిన ప్రస్తుత తరం మట్టి పాత్రలపై మక్కువ చూపుతోంది. దీంతో ఏళ్ల క్రితం వదిలేసిన మట్టి పాత్రలు ప్రజలు మళ్లీ ఇంటికి తెచ్చుకుంటున్నారు. ఫలితంగా మార్కెట్లో మట్టి పాత్రలకు డిమాండ్ కనిపిస్తోంది. అయితే ఈ కాలంలో కూడా మట్టి పాత్రలను ఎవరు వాడతారనుకుంటే పొరపాటే.. వీటిని నేటికీ వినియోగించే వారు ఉన్నత వర్గాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. రుచి..ఆరోగ్యకరం.. మట్టిపాత్రలో వంట రుచిగా ఉంటుంది. అలాగే, ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. మట్టి పాత్రలను తయారు చేసే బురద మట్టిని సిరామిక్ అంటారు. ఈ సిరామిక్కు వేడి తగలగానే ఇన్ ఫ్రారెడ్ అనే కంటికి కనిపించని కిరణాలు ఉత్పత్తవుతాయి. ఈ కిరణాలు ప్రసరించిన ప్రాంతమంతా పూర్తిస్థాయిలో శుద్ధి అవుతుంది. ఉదాహరణకు పిల్లలు బలహీనంగా, తక్కువ బరువుతో పుట్టినా.. పుట్టుకతోనే అనారోగ్యంతో ఉన్నా ఇంక్యుబేటర్ అనే పరికరంలో (లైట్ కింద పెడతారు) కొన్ని గంటల పాటు ఉంచుతారు. ఆ పరికరంలో ఉండే లైట్ ద్వారా ఇన్ ఫ్రారెడ్ కిరణాలను ప్రసరింపజేసి పుట్టిన పిల్లల శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు. కేవలం కొద్ది గంటల్లోనే శిశువులకు పూర్తి స్థాయిలో ఆరోగ్యాన్ని సరిచేయగల శక్తి ఈ కిరణాలకు ఉంది. ప్రకృతి వైద్యంలో బురద స్నానం (మడ్ బాత్) గురించి తెలిసే ఉంటుంది. శరీరం నిండా బురద పూసి ఎండలో ఉంచుతారు. అందులో కూడా ఇవే కిరణాలు ఉత్పత్తి అయ్యి రోగి శరీరాన్ని శుద్ధి చేయడం ద్వారా వ్యాధి నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే, మట్టి పాత్రల్లో వంట చేస్తే పురుగు మందుల అవశేషాలను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసి పదార్థంలోని పోషక విలువలను ఏమాత్రం వృథా కాకుండా చేయడమేకాక పోషకాలకు అదనపు శక్తిని కలిగించి ఆహారాన్ని సమతుల్యంగా మారుస్తాయి. అందుకే మట్టి పాత్రల్లో చేసిన వంటలకు ఎక్కువ రుచి, ఎక్కువ నిల్వ సామర్థ్యం ఉంటుంది. లోహపాత్రల వల్లే రోగాలు.. అల్యూమినియం పాత్రలో వండిన పదార్థాలు విషతుల్యమవుతాయి. ఈ పదార్థలు తిన్న ప్రజలు బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు, కాలేయ సమస్యలు, క్యాన్సర్ వంటి జబ్బుల బారిన పడుతారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. రుచితోపాటు ఆరోగ్యం మట్టి పాత్రలవైపు మళ్లుతున్న ప్రజలు వంట గదుల్లో గత వైభవం..అందుబాటులో మట్టి టీ గ్లాస్, వాటర్ బాటిళ్లు.. తెలంగాణలోని ఆదిలాబాద్, గుజరాత్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో గృహోపకర పాత్రలను మట్టితోనే తయారు చేస్తారు. ఇక్కడి నుంచే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుమ్మరి కులస్తులు మట్టి పాత్రలు అందుబాటులో ఉంచారు. టీ గ్లాస్, వాటర్ బాటిల్, కంచాలు, స్పూన్లు.. ఇలా అన్ని రకాల మట్టి పాత్రలు అందుబాటులో ఉన్నాయి. మట్టి పాత్రలే ముద్దు అల్యూమినియం కంటే మట్టి పాత్రలే ముద్దు. తెలంగాణలో ఉగాది పచ్చడి కొత్త మట్టి కుండల్లో చేస్తారు. ఇలా చేయడం వల్ల మట్టి పాత్రల్లో ఉండే పోషకాలు నేరుగా శరీరంలోకి వెళ్తాయి. దీని వల్ల ఎలాంటి రోగాలు దరిచేరవు. పూరి జగన్నాథుడి ఆలయంలో ఇప్పటికీ మట్టి పాత్రల్లోనే ప్రసాదాలు తయారు చేసి పంపణీ చేస్తారు. డాక్టర్ నరేశ్కుమార్, ఫోర్ట్ రోడ్డు వరంగల్ -
చమత్కారంగా మాట్లాడేవారు..
డిసెంబర్ 2006లో జగపతిబాబు, ప్రియమణి హీరోహీరోయిన్లుగా నటించిన ‘పెళ్లయిన కొత్తలో’ సినిమాకు నేను ప్రొడక్షన్ అసిస్టెంట్గా ఉన్నా. ఆ సందర్భంగా కోట శ్రీనివాసరావు గారితో కలిసి ఫొటో దిగా. ఆయన చమత్కారంగా మాట్లాడేవారు. 1989లో వరంగల్కు వచ్చిన కోట శ్రీనివాసరావు తన తమ్ముడు కోట శంకర్రావుతో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన వరంగల్ చౌరస్తాలోని ఊర్వశి హోటల్లో బస చేశారు. అక్కడి నుంచి ఆటోలో బయలుదేరి అమ్మవారిని దర్శించుకున్నారు. అప్పుడే మొదటిసారి కోట శ్రీనివాసరావును ఊర్వశి హోటల్లో కలిశా. – ఆహా శ్రీనివాస్, ఆర్టీసీ డ్రైవర్ వరంగల్ –1డిపో, హనుమకొండ -
లాభాల పంట !
ఆయిల్పామ్ సాగుతో ఎకరానికి రూ.లక్ష వరకు ఆదాయంమహబూబాబాద్ రూరల్ : రైతులకు దీర్ఘకాలికంగా ఆదాయం అందించే ఆయిల్పామ్ సాగుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈమేరకు పంటను సాగుచేసేలా అన్నదాతలను ప్రోత్సహిస్తోంది. నూనె వినియోగానికి సరిపడా పంటసాగు లేకపోవడంతో ఏటా దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఫలితంగా ఆదాయం కోల్పోవడంతో పాటు అధిక ధరలకు నూనెలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం ఆయిల్ పామ్ పంట సాగుకు సబ్సిడీ, ప్రోత్సాహకాలు అందిస్తోంది. కాగా, మొక్కలు నాటిన నాలుగేళ్ల తర్వాత పంట చేతికొస్తుంది. జిల్లాలో 8,625 ఎకరాల్లో సాగు.. జిల్లాలో 8,625 ఎకరాల్లో రైతులు పంట సాగుచేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 1,380 ఎకరాల్లో దిగుబడులు మొదలై 99 మంది రైతులు ఆయిల్ పామ్ సాగు ద్వారా ఎకరానికి లక్ష నుంచి లక్షన్నర వరకు ఆదాయం పొందుతున్నారు. పంటతో ప్రయోజనాలు.. ఆయిల్పామ్ మొక్కలు నాటిన తర్వాత నాలుగో ఏడాది నుంచి కాపు మొదలై 30ఏళ్ల్ల పాటు ఆదాయం పొందవచ్చు. ఈ మొక్కలు పెరిగే వరకు మొదటి మూడేళ్ల వరకు అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. అరటి, బొప్పాయి, జామ, మల్బరీ, మొక్కజొన్న, కూరగాయలు, వేరుశనగ, మినుము, పెసర, నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుమ, మిరప, పత్తి వేసుకోవచ్చు. ఈ తోటకు తెగుళ్లు, చీడపీడల బెడద తక్కువ. తుపాన్, వడగండ్ల వాన, ప్రకృతి వైపరీత్యాలను సైతం ఈ మొక్కలు సమర్థంగా తట్టుకుంటాయి. అలాగే అడవి పందులు, దొంగల బెడద ఉండదు. రవాణా, మార్కెటింగ్, ప్రాసెసింగ్ సౌకర్యాలు ప్రభుత్వం, ప్రైవేటు వ్యాపారులు కల్పిస్తున్నారు. తక్కువ నీటి వినియోగం.. ఆయిల్పామ్ మొక్కలకు తక్కువ నీరు అవసరం ఉంటుంది. వేసవిలోనూ నీరందించే బోరు బావుల కింద సాగు చేయడం మేలు. అయితే ఎకరం వరి సాగుకు అవసరమయ్యే నీటితో 3 నుంచి 4 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేసుకుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు పూర్తి రాయితీపై డ్రిప్ పరికరాలు.. ఆయిల్పామ్ సాగు చేసే ఎస్సీ, ఎస్టీ రైతులకు బిందు సేద్యం పరికరాలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. బీసీలకు 90శాతం, ఇతర రైతులకు 80 శాతం రాయితీతో ఈ పరికరాలు ఇస్తారు. 5 హెక్టార్ల వరకు డ్రిప్ రాయితీ ఉంటుంది. చిన్న, సన్నకారు రైతులకు, దివ్యాంగులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభం రైతులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం జిల్లాలో 8,625 ఎకరాల్లో సాగు భారీ రాయితీతో డ్రిప్ పరికరాల అందజేతఆయిల్పామ్ ఎకరానికి రాయితీ ఇలా.. ఎకరం ఆయిల్పామ్ సాగుకు మొక్కలు, డ్రిప్, అంతర పంటల సాగు, ఎరువుల యాజమాన్యం కోసం ప్రభుత్వం రూ.50వేల సబ్సిడీ ఇస్తోంది. ఆయిల్ పామ్ మొక్కలకు రూ.11,600, బిందు సేద్యం కోసం రూ.22,518 రాయితీ కల్పించనున్నారు. మొదటి నాలుగేళ్ల వరకు ఎకరానికి అంతర పంటల కోసం రూ.2,100, మొక్కల యాజమాన్య ఎరువులకు రూ.2,100, మొత్తం ఏడాదికి రూ.4,200 చొప్పున రైతుల బ్యాంక్ఖాతాల్లో జమ చేస్తారు. -
ఎమ్మెస్సీ జియాలజీతో ఉపాధి అవకాశాలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఎమ్మెస్సీ జియాలజీలో ప్రవేశాలు పొంది కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. క్యాంపస్లో 1989లో 12 సీట్లలో ప్రవేశాలు కల్పిస్తూ ప్రారంభించిన జియాలజీ విభాగంలో ప్రస్తుతం 40 సీట్లకు పెంపుదల చేశారు. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో, స్వయం ఉపాధి సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా వివిధ కంపెనీలు కూడా ప్రాంగణ నియామకాలతో ఎంపిక చేసుకుంటున్నాయి. ఎమ్మెస్సీ జియాలజీలో ప్రవేశాలకు అర్హత పరీక్ష ఎమ్మెస్సీ జియాలజీ కోర్సులో ప్రవేశాలకు డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో వివిధ పీజీ కోర్సులకు నిర్వహించే సీపీగేట్ –2025కు దరఖాస్తులు చేసుకోవాల్సింటుంది. దరఖాస్తులు చేసుకునేందుకు ఆసక్తి గల అభ్యర్థులకు ఈనెల 17వ తేదీవరకు గడువు ఉంది. ఎమ్మెసీ జియాలజీ కోర్సులో ప్రవేశాలకు డిగ్రీలోని ఏసైన్స్ విభాగంలోనైనా ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు అర్హులు. సీపీ గేట్ ప్రవేశపరీక్షలో ప్రతిభ ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తారు.యువతకు ఉజ్వల భవిష్యత్ ఎమ్మెస్సీ జియాలజీ కోర్సు పూర్తి చేసిన యువతకు ఉజ్వల భవిష్యత్ ఉంది. కేంద్ర ప్రభు త్వ సంస్థల్లోనూ ఉద్యోగాలు న్నాయి. జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ గ్రౌండ్వాటర్ బోర్డు, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఆయిల్ ఇండియా లిమిటెడ్, అటామిక్ మినరల్ డివిజన్, నేషనల్ హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ కార్పొరేషన్ బోధన, పరిశోధన సంస్థల్లో ఉపాధి అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ, రాష్ట్ర భూగర్భ జలశాఖ, డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్లో ఉద్యోగావకాశాలున్నాయి. –ప్రొఫెసర్ ఆర్. మల్లికార్జున్రెడ్డి, జియాలజీ విభాగం అధిపతి,కేయూ కేయూ ఆ విభాగంలో ప్రత్యేకతలు డిగ్రీ ఏ సైన్స్లో ఉత్తీర్ణత పొందినా ప్రవేశానికి అర్హత సీపీగేట్కు దరఖాస్తులకు ఈనెల 17వరకు గడువు -
అంతర్జాతీయ బ్లైండ్ గోల్బాల్ పోటీలకు సాయితేజ
వరంగల్ స్పోర్ట్స్ : హనుమకొండ మండలం నర్సక్కపల్లి గ్రామానికి చెందిన పెండెల సాయితేజ అంతర్జాతీయ బ్లైండ్ గోల్బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఇండియన్ బ్లైండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ స్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ జట్టులో స్థానం దక్కించుకున్నట్లు కోచ్ శివకుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 2025న ఈజిప్టులో జరగనున్న అంతర్జాతీయ బ్లైండ్ గోల్బాల్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కాగా, సమ్మేళిత ఫౌండేషన్.. ఎంపికై న జాతీయ జట్టు క్రీడాకారులకు వసతులు అందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సివిల్స్ శిక్షణ పొందుతున్న సాయితేజ అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలిక ఆత్మహత్య వర్ధన్నపేట: కడుపు నొప్పి భరించలేక ఓ బాలిక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పట్టణంలోని పిరంగడ్డ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఎస్సై బండారి రాజు కథనం ప్రకారం..పిరంగడ్డకు చెందిన రాజబో యిన ఎల్లయ్య కూతురు రాజశ్రీ దేవి(15) కొంత కాల క్రితం కడుపు నొప్పికి చికిత్స పొందింది. అ యినా తగ్గడం లేదు. ఈ క్రమంలో నాలుగు రోజు లుగా నొప్పి ఎక్కువ అయ్యింది. దీంతో ఆదివారం కుటుంబీకులు వ్యవసాయ పనులకు వెళ్లగా ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి రాజబో యిన ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. వ్యవసాయ భూమి ఇవ్వాలని.. ● రైతుపై హత్యాయత్నం మహబూబాబాద్ రూరల్ : ఓ రైతు సొంత వ్యవసాయ భూమిని తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అతడి అన్న కుమారులు దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్ మండలం సాధు తండా గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. సాధు తండా గ్రామానికి చెందిన రైతు బానోత్ బాబుకు మూడు ఎకరాల మూడు గంటల వ్యవసాయ భూమి ఉండగా అతడి పెద్ద కుమారుడు వీరన్న పేరున 37 గుంటలు ఉంది. ఇద్దరు రైతులకు సంబంధించిన భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో బానోత్ బాబు అన్న బానోత్ సామ్య పెద్ద కొడుకు హుస్సేన్, అతడి భా ర్య లక్ష్మి, కుమారుడు సాయి, చిన్న కొడుకు హతీ రాం తదితరులు బాబు వ్యవసాయ భూమి తమకు ఇవ్వాలని కొంతకాలంగా ఘర్షణ పడుతున్నారు. తన సొంత భూమి ఎందుకు ఇస్తానని బాబు పేర్కొంటూ పలుమార్లు పెద్దమనుషుల్లో పంచాయితీలు కూడా నిర్వహించారు. అదేవిధంగా కురవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయగా వారిపై కేసులు నమోదయ్యాయి. అయినా బాబు వ్యవసాయ భూమిలో ఎకరం తమకు ఇవ్వాలని సామ్య కుమారులు కొంతకాలంగా గొడవలు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం బాబు, అతడి చిన్న కుమారుడు భద్రు, కోడలు భూమిక తమ వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి పనులు చేస్తుండగా హుస్సేన్, లక్ష్మి, సాయి, హతీరాం అక్కడికి వచ్చి గొడవకు దిగారు. అంతలోనే నాగలి కాణి తీసుకుని బాబుపై హత్యాయత్నం చేయగా అతడికి తీవ్రగాయాలయ్యాయి. భద్రు, భూమికకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. కాగా, భూమిక మెడలోని మూడు తులాల బంగారు పుస్తెలతాడు అపహరణకు గురైంది. ఈ ఘటనపై బాధితులు కురవి పీఎస్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. తీవ్రగాయాలైన బాబును 108లో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. -
ఫ్యాన్సీ నంబర్ 9999 @ రూ.11లక్షలు..
ఖిలా వరంగల్: వరంగల్ నగరానికి చెందిన ఓ వ్యాపారి అధిక మొత్తంలో చెల్లించి ఫ్యాన్సీ నంబర్ను దక్కించుకున్నట్లు వరంగల్ ఇన్చార్జ్ ఆర్టీఓ శోభన్బాబు శుక్రవారం తెలిపారు. కారు నంబర్ ప్లేట్పై తనకు నచ్చిన లక్కీ నంబర్ ఉండాలనే ఆశతో 9999 ఫ్యాన్సీ నంబర్ను ఆన్లైన్ ద్వారా రూ.11,09,999 చెల్లించి హర్ష కన్స్ట్రక్షన్స్ పేరు మీద దక్కించుకున్నట్లు వివరించారు. ఇంత మొత్తం ఖర్చు చేసి నంబర్ దక్కించుకోవడంపై ఆర్టీఏ అధికారులు సైతం అవాక్కయ్యారు. సదరు వ్యాపారి ఫ్యాన్సీ నంబర్ కోసం చాలా రోజులుగా ప్రయత్నిస్తూ ఈసారి అధిక మొత్తం వెచ్చించి దక్కించుకున్నట్లు చెప్పారు. -
అప్పు తీర్చలేక రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
కేసముద్రం: అప్పు తీర్చలేక మనస్థాపానికి గురైన ఓ రైల్వే ఉద్యోగి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. ఎస్సై మురళీధర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్లోని బండ్లగూడకు చెందిన కోమటిరెడ్డి రామక్రిష్ణారెడ్డి (38) మూడేళ్లుగా కేసముద్రం మున్సిపాలిటీలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటూ, కురవి మండలంలోని గుండ్రాతి మడుగు రైల్వేస్టేషన్లో కీమాన్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నాడు. ఈ క్రమంలో అప్పు ఇచ్చిన వారు ఈనెల 9న ఇంటికి వచ్చి తమ అప్పు తీర్చాలని గొడవకు దిగారు. దాంతో అదే రోజు తీవ్ర మనస్థాపానికి గురైన రామక్రిష్ణారెడ్డి.. గుండ్రాతిమడుగు రైల్వేస్టేషన్ నుంచి ఇంటికి వస్తూ కేసముద్రం మండలం రాజీవ్నగర్ తండా వద్ద గడ్డి మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హనుమకొండలోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి భార్య స్రవంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. రేప్ కేసులో ఐదేళ్ల జైలువెంకటాపురం(కె): ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని వాడగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి రేప్ కేసులో ఐదేళ్ల జైలుశిక్ష పడిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వెంకటాపురం సీఐ బండారి కుమార్ వివరాల ప్రకారం రేప్ కేసులో జాడి రోశయ్యకు ములుగు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ సూర్యచంద్రకళ శుక్రవారం ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. కేసు నమోదు చేసిన ఎస్సై రేక అశోక్, దర్యాప్తు చేసిన ఎస్సై కొప్పుల తిరుపతి రావు, శిక్షపడేలా కృషి చేసిన ప్రాసిక్యూటర్, కోర్టు కానిస్టేబుల్ను పలువురు అభినందించారు. చుట్ట తాగుతూ నిద్రలోకి..నిప్పంటుకొని వృద్ధురాలి మృతి రఘునాథపల్లి: చుట్ట తాగుతూ ఓ వృద్ధురాలు నిద్రలోకి జారుకోగా.. ప్రమాదవశాత్తు నిప్పంటుకొని తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మండలంలోని జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపూర్లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన పండుగ వెంకటలక్ష్మి (95) ఒంటరిగా జీవనం సాగిస్తోంది. చుట్ట తాగుడు అలవాటు ఉన్న ఆమె.. గురువారం ఉదయం మంచంపై పడుకొని చుట్ట తాగుతూ నిద్రలోకి జారుకుంది. ప్రమాదవశాత్తు మంచంపై ఉన్న బెడ్షీట్లకు చుట్ట అంటుకొని మంటలు లేచాయి. వెంకటలక్ష్మి తేరుకొని లేచే సరికి మంటలు చుట్టుముట్టాయి. ఇంట్లో మంటలను గుర్తించిన స్థానికులు వెంటనే తలుపులు ఊడదీసి మంటలను చల్లార్చగా అప్పటికే ఆమె తీవ్ర గాయాలపాలైంది. వెంటనే జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కక చికిత్స పొందుతూ మరణించింది. మృతురాలి కుమారుడు పండుగ మదార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దూదిమెట్ల నరేష్ తెలిపారు. -
జోధ్పూర్ వ్యవసాయ మార్కెట్ సందర్శన
వరంగల్ చౌరస్తా: రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ వ్యవసాయ మార్కెట్ యార్డును తెలంగాణ రైతు సంఘం ప్రతినిధులు శుక్రవారం సందర్శించారు. జోధ్పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి రాంసింగ్ సిసోడియా, పండ్లు, కూరగాయల మార్కెట్ సెక్రటరీ దుర్గారామ్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రాజేందర్ పరివార్, కార్యదర్శి ధర్మేందర్ బండారి, కార్మిక నాయకులు సకూర్ ఘోరీతో సంఘం జాతీయ కార్యదర్శి మోర్తాల చందర్ రావు, ప్రతినిధులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అక్కడ రైతుల నుంచి పంట దిగుమతి చార్జీలు మినహా ఎలాంటి మార్కెట్ చార్జీలు వసూలు చేయడం లేదని, మార్కెట్ సెస్ రూ.100కు 1.50 రూపాయలు వసూలు చేస్తున్నట్లు వారు తెలిపారు. కార్మిక చార్జీలు నూటికి 3.60 రూపాయలు పంట కొనుగోలుదారుడు చెల్లిస్తాడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోర్తాల చందర్రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్లలో పంటలను విక్రయించే కమిషన్ ఏజెంట్లు అదనంగా రైతుల నుంచి కమిషన్, మునిం, దానం, ధర్మం కూటుకు కిలో పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. హర్యానా, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని వ్యవసాయ మార్కెట్ చట్టాల మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ చట్టాలను సవరించాలని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు సంగతి సాంబయ్య, చంద్రశేఖర్, మాదం తిరుపతి, సందెపోగు ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి మత్తులో యువత వీరంగం
ఖిలా వరంగల్: వరంగల్ మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో యువత గంజాయి మత్తులో వీరంగం సృష్టిస్తోంది. అర్ధరాత్రి వరకు బైకుల హారన్ల మోత, కేరింతలతో రహదారులపై ఆకతాయిలు చక్కర్లు కొడుతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై విరుచుకు పడుతున్నారు. ఈ క్రమంలో బీట్ పోలీసులు ఉన్నా లేనట్లేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. అడిగింది ఇవ్వకపోతే చిరువ్యాపారులపై మత్తులో ఉన్న పోకిరీలు విచక్షణ రహితంగా దాడికి తెగబడుతున్నారు. ఈ తరహా ఘటన గురువారం అర్ధరాత్రి వరంగల్ శంభునిపేటలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. రంగశాయిపేట గవిచర్ల క్రాస్ రోడ్డులోని ఓ ఐస్క్రీమ్ బండి వద్ద కొంతమంది ఐస్క్రీమ్ తిన్నారు. డబ్బులు ఇవ్వాలని అడిగితే ఆ చిరు వ్యాపారితో పాటు అడ్డుకోబోయిన కేడల నరేష్, బజ్జూరి వంశీపై ఆకతాయిలు దాడికి చేశారు. ఈ దాడిలో కేడల నరేష్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న స్థానిక మిల్స్ కాలనీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించినట్లు సమాచారం. ఇద్దరిపై దాడి.. ఒకరి పరిస్థితి విషమం ఎంజీఎం ఆస్పత్రికి తరలింపు -
మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో..
ఏటూరునాగారం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద గంట గంటకు పెరుగుతోంది. మండలంలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటి మట్టం శుక్రవారం ఉదయం 10 గంటలకు 14.09 మీటర్లు ఉండగా, రాత్రి 8 గంటలకు 14.48 మీటర్లకు చేరింది. గంటగంటకు వరద నీరు పెరుగుతుండడంతో మొదటి ప్రమాద హెచ్చరికకు (14.80 మీటర్లు) చేరువలో వరద ప్రవాహం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను గోదావరి చుట్టూ పక్కల గ్రామాల్లో సిద్ధం చేసి ఉంచారు. వారి వద్ద పడవలు, లైఫ్జాకెట్లతో పాటు రబ్బర్ బోట్లను ఉంచారు. ఎక్కడైనా విపత్తు ప్రమాదం జరిగితే వెంటనే పోలీసులు, రెవెన్యూ, పంచాయతీ కార్యదర్శులకు ప్రజలు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. కోయగూడ ఎల్లాపురం గ్రామంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలున్నాయని, ఎలాంటి భయాందోళనకు గ్రామస్తులు గురికావొద్దని అవగాహన కల్పించినట్లు రామన్నగూడెం పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణ తెలిపారు. రామన్నగూడెం వద్ద 14.48 మీటర్ల మేర వరద ప్రవాహం రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు -
కంబాలపల్లి పాఠశాలకు అరుదైన అవకాశం
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అరుదైన అవకాశం దక్కింది. ఐఐటీ మద్రాస్ స్కూల్ కనెక్ట్ ప్రోగ్రాంలో భాగస్వామిగా ఎంపికై ంది. ఈ ఏడాది మహబూబాబాద్ జిల్లా నుంచి ఇప్పటి వరకు ఈ ప్రోగ్రాంలో నమోదు చేసుకున్న పాఠశాలలు మొత్తం ఐదు కాగా, కంబాలపల్లి పాఠశాల వాటిలో ఒకటిగా ఎంపిక కావడం విశేషం. ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులకు ఆధునిక రంగాల్లో విద్యను అందించడంతోపాటు భవిష్యత్లో తగిన కెరీర్ ఎంపిక చేసుకునే అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు 8 వారాలపాటు 10 ఆన్లైన్ కోర్సులు చదివే అవకాశం కలుగుతుంది. ఈ కోర్సులను ఐఐటీ మద్రాస్, ఇతర ప్రముఖ విద్యాసంస్థల నిపుణులు రూపొందించారు. ప్రధాన అంశాలు ● కోర్సుల వ్యవధి : 8 వారాలు (ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి ప్రారంభం) ● పరిశీలన : ప్రతి కోర్సుకు రూ.500 మాత్రమే రుసుం ● సర్టిఫికెట్ : కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు ఇ–సర్టిఫికెట్ లభిస్తుందిమరింత సమాచారం ● విద్యార్థులు ఈనెల 25వ తేదీలోపు నమోదు చేసుకోవాలి ● కోర్సు అనంతరం ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ జారీ చేస్తారు ● పాఠశాల తరఫున బాధ్యత వహించే విధంగా పాఠశాల (గణితం) సహాయ ఉపాధ్యాయులు కాసం శ్రీనివాసరావు ఎస్పీఓసీ (సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్)గా నియమితులయ్యారుకోర్సుల వివరాలు ● డేటా సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పరిచయం ● ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ పరిచయం ● ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ పరిచయం ● ఇంజినీరింగ్ బయాలాజికల్ సిస్టమ్స్ పరిచయం ● ఫన్ విత్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ● లా పరిచయం ● మ్యాథ్స్ గేమ్స్ అండ్ పజిల్స్ ● ఏరోస్పేస్ ఫండమెంటల్స్ వంటి మొదలైన అంశాలపై శిక్షణ ఐఐటీ మద్రాస్ స్కూల్ కనెక్ట్ ప్రోగ్రాంలో భాగస్వామ్యం -
మృతదేహం మా వారిది కాదు..
రాయపర్తి: ‘రోడ్డు ప్రమాదంలో నీ భర్త మృతిచెందాడ’ని పోలీసులు సమాచారం అందించడంతో వరంగల్ ఎంజీఎంకు వెళ్లిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతదేహాన్ని తీసుకెళ్లి దహన సంస్కారాలు చేసే క్రమంలో మృతదేహం తమవారిది కాదని గుర్తించి.. తిరిగి ఎంజీఎం ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ విచిత్ర ఘటన శుక్రవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మైలారం గ్రామానికి చెందిన గోక కుమారస్వామి( 55), రమకు ముప్పయి ఏళ్లక్రితం వివాహమైంది. వారికి ఒక కూతురు. ఇరవై ఏళ్ల క్రితం కుమారస్వామి మతిస్థిమితం కోల్పోగా అప్పటినుంచి రమ వేరుగా ఉంటున్నారు. అతను మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణకేంద్రంలో యాచిస్తూ జీవిస్తున్నాడు. తొర్రూరులో ఈనెల 09వ తేదీన రోడ్డుపక్కన అపస్మారకస్థితిలో పడి ఉండగా స్థానికులు, పోలీసుల సాయంతో అంబులెన్స్లో ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ మరుసటి రోజు గురువారం మృతిచెందాడు. ఈ క్రమంలో ఎంజీఎంనుంచి పోలీసులు ‘నీ భర్త చనిపోయాడని’ మైలారానికి చెందిన గోక రమకు సమాచారం అందించారు. ఆస్పత్రికి వెళ్లిన రమ, కుటుంబ సభ్యులకు మార్చురీనుంచి చాపతో చుట్టిన మృతదేహాన్ని అప్పగించారు. మృతదేహాన్ని అంబులెన్స్లో నేరుగా మైలారంలోని దహనసంస్కారాలు చేసే స్థలానికి తీసుకొచ్చారు. కిందికి దించి చాప విప్పిచూడగా కుమార్తె స్వప్న ఆ మృతదేహాన్ని చూడగా తన తండ్రి చేతిపై శ్రీ అనే పచ్చబొట్టు ఉంటుందని, ఈ మృతదేహానికి పచ్చబొట్టు లేదని, తమ నాన్న కాదని తేల్చిచెప్పింది. భార్య, బంధువులు సైతం చూసి తమవారిది కాదని చెప్పడంతో తిరిగి మృతదేహాన్ని అదే అంబులెన్స్లో ఎంజీఎంకు తరలించారు. రమ తన భర్తను చాలా ఏళ్లుగా చూడకపోవడం.. చాపలో చుట్టి ఇవ్వడం వల్ల గుర్తించలేకపోయినట్లు కొందరు అంటున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా, ఆ మృతదేహం ఎవరిది అన్నది గుర్తించాల్సి ఉంది. పోలీసుల వినతి మేరకే.. ఎంజీఎం : ఈ నెల 9వ తేదీన అపస్మారకస్థితిలో ఉన్న ఓ వ్యక్తిని ఎంజీఎంకు తీసుకువచ్చారని, చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్లు ఎంజీఎం ఆర్ఎంఓ శశికుమార్ తెలిపారు. కాగా, సద రు వ్యక్తి మృతదేహం రాయపర్తి మండలం మైలా రం గ్రామానికి చెందిన కుమారస్వామిగా పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. పోస్టుమార్టం లేకుండా అప్పగించాలనే పోలీసుల వినతి మేరకు ఆ మృతదేహాన్ని భార్య, బంధువుల అంగీకారం మేరకు అప్పగించినట్లు ఆర్ఎంఓ తెలిపారు. మృతదేహాన్ని ఇంటికి తీ సుకెళ్లిన కుటుంబ సభ్యులు తమది కాదని పేర్కొని తిరిగి ఎంజీఎం మార్చరీకి తరలించినట్లు వెల్లడించారు. దహన సంస్కారాలు చేసే సమయంలో కుటుంబ సభ్యుల గుర్తింపు తిరిగి ఎంజీఎం ఆస్పత్రికి తరలింపు పోలీసుల వినతి మేరకు పోస్టుమార్టం లేకుండా బంధువులకు అప్పగించాం ఎంజీఎం ఆర్ఎంఓ శశికుమార్ వెల్లడి -
విద్యుత్ అంతరాయాలు తగ్గాలి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి హన్మకొండ: విద్యుత్ అంతరాయాలు తగ్గాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్ఈ, డీఈ, ఏడీఈ, ఏఈ, ఎస్ఏఓ, ఏఏఓలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్కిల్, డివిజన్ల వారీగా ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ 16 సర్కిళ్ల పరిధిలో ముందుగా వేయి ఫాల్ట్ ప్యాసెజ్ ఇండికేటర్లు 15 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో ఉండే పొడవాటి లైన్లలో అమర్చుతున్నట్లు తెలిపారు. తద్వారా విద్యుత్ అంతరాయాలను త్వరగా గుర్తించి పరిష్కరించనున్నట్లు వివరించారు. ఈ నెలలో 30 సబ్స్టేషన్లలో, వచ్చే నెలలో 120 సబ్ స్టేషన్లలో రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ పూర్తి చేయాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న లూజు లైన్లు, వంగిన స్తంభాలు, తుప్పు పట్టిన స్తంభాలు, తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల గద్దెలు, లైన్ క్రాసింగ్, డబుల్ ఫీడింగ్ను గుర్తించి ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. ఈ నెలాఖరు వరకు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందించే లైన్ల పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు టి.మధుసూదన్, సి.ప్రభాకర్, చీఫ్ ఇంజనీర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్ లాల్, కె.తిరుమల్ రావు, రాజు చౌహన్, అశోక్, వెంకట రమణ, ఆర్.చరణ్ దాస్, జనరల్ మేనేజర్లు వేణుబాబు, కృష్ణ మోహన్, వాసుదేవ్, సత్యనారాయణ, అన్నపూర్ణ, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
పెరుగుతున్న గోదావరి
వాజేడు: వరద నీరు ఉధృతంగా వస్తుండడంతో గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో గోదావరి మట్టం పెరగడంతో ములుగు జిల్లా వాజేడు మండలంలో రహదారులు పలు చోట్ల ముంపునకు గురి కావడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండల పరిధిలోని పేరూరు, కృష్ణాపురం గ్రామాల మధ్యన మోడి కుంట వాగు ద్వారా రహదారిపైకి వరద నీరు చేరడంతో కృష్ణాపురం, కడేకల్, పెద్ద గంగారం, చండ్రుపట్ల, టేకులగూడెం, టేకులగూడెం కాలనీ గ్రామాలు, పేరూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ గ్రామాల ప్రజలు పేరూరుకు రావాలంటే జాతీయ రహదారిపై నుంచి చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది. అదేవిధంగా మండల కేంద్రం సమీపంలో కొంగల వాగు ద్వారా వచ్చిన గోదావరి వరద రహదారిని ముంచింది. దాంతో వాజేడు, గుమ్మడిదొడ్డి గ్రామాల మధ్యన రాకపోకలు నిలిచాయి. కొంగల వాగు అవతల ఉన్న సుమారు 25 గ్రామాల ప్రజలు వాజేడు మండల కేంద్రానికి రావాలంటే జగన్నాథపురం మీదుగా రావాలి. మండల పరిధిలోని పూసూరు, ఏడ్జర్లపల్లి గ్రామాల మధ్యన ఉన్న వంతెనపైకి వరద నీరు చేరడంతో ఇక్కడ కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఏడ్జర్లపల్లి, బొమ్మనపల్లి, ముత్తారం, కొత్తూరు గ్రామాల ప్రజలు చుట్టూ తిరిగి వెంకటాపురం(కె) మీదుగా వాజేడుకు రావాల్సి ఉంది. కోయ వీరాపురం గ్రామ సమీపంలో చాకలి వాగు వద్ద రహదారిపైకి గోదావరి చేరడంతో గ్రామస్తులు చీకుపల్లి మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. అప్రమత్తమైన అధికారులు గోదావరి వరద అంతకంతకు పెరుగుతుండడంతో పాటు పలు చోట్ల రహదారులను ముంచెత్తడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. వరదను పరిశీలించిన తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ శ్రీకాంత్ నాయుడు, ఆర్ఐ కుమారస్వామి.. గ్రామ పంచాయతీ సిబ్బందిని ఎక్కడికక్కడ అప్రమత్తం చేశారు. రహదారులపైకి వరద నీరు చేరడంతో నీటిలోకి ఎవరూ వెళ్లకుండా ట్రాక్టర్లు అడ్డంగా పెట్టడమే కాకుండా కర్రలతో అడ్డుగా కంచె కట్టారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. నీట మునిగిన రహదారులు పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలుపెరుగుతున్న నీటి మట్టం ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు వద్ద గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. గురువారం సాయంత్రం గోదావరి నీటి మట్టం 14.28 మీటర్లు ఉండగా, శుక్రవారం సాయంత్రానికి 15.42 మీటర్లకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండడంతో గోదావరి నీటి మట్టం పెరుగుతున్నట్లు సీడబ్ల్యూసీ సిబ్బంది తెలిపారు. పూసూరు హైలెవల్ బ్రిడ్జి వద్ద గోదావరి వరద పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఇప్పటికే పలు చోట్ల రహదారులు నీట మునిగాయి. మండల అధికారులు అప్రమత్తమై మండలంలోని పునరావాస కేంద్రాలను శుభ్రం చేసి సిద్ధం చేశారు. వాగులు వంకల వద్దకు ప్రజలు వెళ్లకుండా రహదారులపై ట్రాక్టర్లు అడ్డంగా ఉంచారు. -
వరద ఉధృతి
కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద గోదావరి ఉగ్ర రూపంలో ప్రవహిస్తోంది. బ్యారేజీలోకి ఎగువ నుంచి భారీగా వరదలు చేరడంతో నిండుకుండను తలపిస్తూ దిగువకు వెళ్తేంది. వారం రోజుల నుంచి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సరస్వతి, లక్ష్మీ బ్యారేజీలలోకి భారీగా వరద నీరు చేరడంతో అక్కడ బ్యారేజీల గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దాంతో దిగువన ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీలోకి భారీగా వరద చేరుతోంది. ఈ క్రమంలో తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద శుక్రవారం గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుండి 7,35,720 క్యూసెక్కుల నీరు చేరుతోంది. బ్యారేజీ వద్ద అన్ని గేట్లు 59 ఎత్తి అదేమోతాదులో దిగువకు నీటిని వదులుతున్నారు. బ్యారేజీ వద్ద నీటి మట్టం 83.మీటర్లకుగాను 82.10 మీటర్లుగా నమోదవుతోంది. బ్యారేజీకి ఎగువన గుట్టల గంగారం పరిధిలో ఉన్న జె.చొక్కారావు ఎత్తిపోతల వద్ద ఫేజ్ –1లో రెండు మోటార్లకు గాను 1 మోటారుతోపాటు ఫేజ్ –3లో 6 మోటార్లకుగాను రెండు మోటార్ల ద్వారా 760 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. ఎత్తిపోతల వద్ద ప్రస్తుతం 83 మీటర్ల నీటి మట్టం కొనసాగుతోంది. సమ్మక్క సాగర్ బ్యారేజీలోకి భారీగా చేరుతున్న వరద నీరు ● ఎగువ నుంచి 7,35,720 క్యూసెక్కుల నీరు ● బ్యారేజీ వద్ద 59 గేట్లు ఎత్తి అంతేమొత్తంలో దిగువకు.. -
ప్రాణహిత పరవళ్లు
కాళేశ్వరం: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రాణహిత వరద కాళేశ్వరం వద్ద గోదావరితో కలిసి నాలుగు రోజులుగా ఉగ్రరూపం దాల్చుతూ ఉప్పొంగి ప్రవహిస్తోంది. తెలంగాణలో అంతగా వర్షాలు లేకపోవడంతో గోదావరిలో అంతగా నీరు లేదు. మహారాష్ట్ర ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 11.790 మీటర్ల ఎత్తులో నీటిమట్టం దిగువకు ప్రవహిస్తోంది. త్రివేణి సంగమం వద్ద సరస్వతి నది పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన రెండు జ్ఞానదీపాలు నీటమునిగి కొంతమేర మాత్రమే పైకి కనిపిస్తున్నాయి. రాత్రివరకు పూర్తి స్థాయిలో మునిగిపోనున్నాయి. దిగువన ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీకి వరద ప్రవాహం 8.68 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో రూపంలో వచ్చి చేరుతుండగా, 85గేట్లు ఎత్తివేయడంతో అదే స్థాయిలో నీటిని దిగువకు ఇంజనీరింగ్ అధికారులు విడుదల చేస్తున్నారు. మహారాష్ట్రలోని గోసిపుర్డ్ డ్యామ్ నీరు వదలడంతో రాత్రి వరకు మరింత వరద నీరు చేరుతుందని తెలిసింది. కాళేశ్వరం ఘాట్ వద్ద 11.790 మీటర్ల నీటిమట్టం మేడిగడ్డ బ్యారేజీ వద్ద 8.68 లక్షల క్యూసెక్కుల వరద ఇన్ఫ్లో -
వనాలు పెంచుడే..
శనివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2025– 8లోu శాఖల వారీగా టార్గెట్ శాఖ టార్గెట్ వ్యవసాయశాఖ 1.92లక్షలు బీసీ వెల్ఫేర్ 5,000 పంచాయతీరాజ్ 40,000 గ్రామీణాభివృద్ధి 35.22లక్షలు ఎకై ్సజ్ 68,000 అటవీశాఖ 5.04లక్షలు వైద్యారోగ్యశాఖ 5,000 ఉద్యాన, పట్టుపరిశ్రమ 1.34లక్షలు పరిశ్రమలశాఖ 7,000 నీటిపారుదలశాఖ 11,000 ఇంటర్, డిగ్రీ కళాశాలలు 3,000 మైనార్టీ వెల్ఫేర్ 5,000 మున్సిపల్(ఐదు మున్సిపాలిటీలు) 3.88లక్షలు పోలీస్ 64,000 రోడ్లు, భవనాలు 15,000 పాఠశాల విద్య 20,000 గిరిజన సంక్షేమ, ఐటీడీఏ 30,000 మొత్తం 50.135లక్షలుసాక్షి, మహబూబాబాద్: మనిషి జీవితం.. పుట్టుక నుంచి చావు వరకు చెట్లతోనే ముడిపడి ఉంటుంది. తినే తిండి, పీల్చేగాలి.. కూర్చునే కుర్చి, పడుకునే మంచం, వృద్ధాప్యంలో చేతికర్ర, చ నిపోయిన తర్వాత చితికర్ర ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ చెట్టుతోనే అనుబంధం. ఇంతటి ప్రా ధాన్యత ఉన్న అడవులకు నిలయం మానుకోట. అ యితే రోజురోజుకూ అంతరించిపోతున్న అడవుల పరిరక్షణతో పాటు, వనమహోత్సవం కార్యక్ర మం ద్వారా మొక్కలు నాటేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అన్ని వర్గాలు, అన్ని ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేస్తూ మొక్కలు నాటేలా లక్ష్యం నిర్దేశించింది. జిల్లాను ఆకుపచ్చ మానుకోటగా మార్చేందుకు అధికార గణం సిద్ధమవుతోంది. 50.135లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం ఈ ఏడాది వన మహోత్సం కార్యక్రమం ద్వారా జి ల్లాలోని 483 గ్రామపంచాయతీలు, ఐదు మున్సిపాలిటీలతోపాటు సగ భాగంగా ఉన్న అడవి ప్రాంతంలో విరివిగా మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 17 శాఖల పరిధిలో మొత్తం 50.135లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటి వరకు గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా 4.91లక్షల గుంతలు తీసి 2.21లక్షల మొక్కలు నాటారు. గత ఏడాది 90శాతం బతికిన మొక్కలు గత ఏడాది జిల్లా వ్యాప్తంగా వనమహోత్సం కార్యక్రమం ద్వారా నాటిన వాటిల్లో 90శాతం మొక్కలు బతికినట్లు అధికారులు చెబుతున్నారు. డీఆర్డీఏ ద్వారా ఏర్పాటు చేసిన నర్సరీల్లో 49.45లక్షల మొక్కలను పెంచారు. ఇందులో 44.10లక్షల మొక్కలు నాటారు. ఇందుకోసం రూ. 2,82,97,015 ఖర్చుచేశారు. ఈ ఏడాది రూ.7,32,84,567 ఖర్చుచేసి 31.20లక్షల మొక్కలు పెంచుతున్నారు. అదే విధంగా 1,39,353 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న అడవి ప్రాంతంలో గత ఏడాది 120.8హెక్టార్లల్లో రూ.81లక్షలు ఖర్చుచేసి 1,42,224 మొక్కలు నాటారు. అలాగే రూ. 34లక్షల కంపా నిధులతో 12కిలో మీటర్ల పరిధిలో హరితనిధి, అమ్మపేరుతో ఒక మొక్క మొదలైన కార్యక్రమాల ద్వారా 25 రకాల చింత, నేరేడు, ఉసిరి, వెదురు తదితర మొక్కలు నాటారు. ఈ ఏడాది 5.04లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు. మున్సిపాలిటీల్లో ఇంటికో మొక్క.. వన మహోత్సవంలో విరివిగా మొక్కలు నాటడం, అందరి భాగస్వామ్యం చేసే పనిలో అధికారులు ఉన్నారు. జిల్లాలోని మహబూబాబాద్, మరిపెడ, తొర్రూరు, డోర్నకల్, కేసముద్రం మున్సిపాలిటీల్లో 3.88లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ఆర్పీల సహకారంతో ప్రతీ కుటుంబానికి పూల మొక్కలు మందార, గులాబీ, అలంకరణ మొక్కలు పాండమస్, ఫెడల్అనీస్ మొక్కలు సరఫరా చేయనున్నారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లకు ఇరువైపులా అందం, అలంకరణ మొక్కలు పులిచెరికలు, గన్నేరు, కాగితపు పూలు, సింగపూర్ చెర్రీ, కానుగు మొదలైన మొక్కలు సిద్ధం చేస్తున్నారు. ప్రతీ ఇంటికి మొక్క ఇవ్వడమే కాకుండా పరిరక్షణ బాధ్యత కూడా స్వయం సహాయక సంఘాల మహిళలపై పెడుతున్నారు. న్యూస్రీల్జిల్లాలో వనమహోత్సవానికి సిద్ధం 50.135లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం శాఖలవారీగా లక్ష్యాల కేటాయింపు ఆకుపచ్చ మున్సిపాలిటీలుగా మార్చేందుకు కసరత్తు అడవిలో పండ్ల మొక్కల పెంపకానికి ప్రాధాన్యం అటవీ సంరక్షణే ముఖ్యం.. ఇందుకు అందరూ సహకరించాలి జిల్లా ఫారెస్టు అధికారి బత్తుల విశాల్ సాక్షి, మహబూబాబాద్: పేరులోనే మాను ఉన్న మానుకోట జిల్లాను మరింత హరితమయంగా మార్చడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని జిల్లా ఫారెస్టు అధికారిఆ బత్తుల విశాల్ తెలిపారు. వనమహోత్సవం, అడవులు సంరక్షణ మొదలైన అంశాలపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. అడవుల సంరక్షణ జిల్లాలోని మహబూబాబాద్ రేంజ్ పరిధిలో 39,854హెక్టార్లు, గూడూరు రేంజ్లో 99,499 హెక్టార్లు మొత్తం 1,39,353 హెక్టార్లలో ఫారెస్టు పరిధి ఉంది. ఇందులో 39,854హెక్టార్లలో ఫారెస్టు లేకుండా పోయింది. 99,499 హెక్టార్లల్లో ఫారెస్టు ఉంది. జిల్లా భూ విస్తీర్ణంలో అడవి విస్తీర్ణం 47.75శాతం ఉంది. గతంలో ఫారెస్టు ఉన్న ప్రాంతాల్లో మొక్కలు పెంచేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. ఇందుకోసం హరిత వనాలు, హరితనిధి, అమ్మపేరుతో ఒక మొక్క మొదలైన పేర్లతో మొక్కలు నాటడమే కాకుండా నాటిన మొక్కల్లో 95శాతం సర్వే అయ్యేలా చూస్తున్నాం. అడవులతోనే జంతువులు జిల్లాలోని అడవులు రకరకాల జంతువులకు నిలయంగా ఉన్నాయి. ఇందులో అడవి దున్నలు, అడవి కుక్కలు, దుప్పులు, జింకలు, అడవి పందులు, ఎలుగు బంట్లు మొదలైన జంతువులు ఉన్నాయి. ఊట్ల, రాంపూర్ మొదలైన ప్రాంతాల్లో పలు సీజన్లలో పులులు కూడా సంచరిస్తున్నాయి. జంతువులకు ఆహారంగా ఉపయోగ పడేలా చింత, నేరేడు, ఉసిరి, పనస మొదలైన మొక్కలు నాటేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాం. జిల్లా అడవుల్లో దొరికే వెదురు నాణ్యమైనదిగా పేరుంది. అదే విధంగా రాష్ట్రంలోనే సుందరమైన పక్షి సంపదకు మహబూబాబాద్ అడవులు నిలయంగా మారాయి. -
జనాభా నియంత్రణపై అవగాహన కల్పించాలి
నెహ్రూసెంటర్: జనాభా నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పంచాయతీ స్థాయిలో ఈనెల 18వ తేదీ వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్ఓ రవిరాఽథోడ్ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జీజీహెచ్ నుంచి నెహ్రూసెంటర్ వరకు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. జనాభా నియంత్రణ అవసరాన్ని గురించి ప్రజల్లో చైతన్యం పెంచడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు. జనాభా పెరుగుదల ప్రపంచ సవాళ్లకు మూలమని, పెరుగుతున్న జనాభా వల్ల కలిగే నష్టాల గురించి వివరించాలన్నారు. దంపతులు బిడ్డకు, బిడ్డకు మధ్య కొంత సమయం కేటాయించాలని, తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించడం ద్వారా ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వవచ్చన్నారు. కుటుంబ నియంత్రణ కార్యక్రమంలో ఉత్తమ సేవలు అందించిన ఆరోగ్య సిబ్బందికి అభినందలు తెలిపారు. కార్యక్రమంలో జీజీహెచ్ ఆర్ఎంఓ జగదీశ్వర్, డాక్టర్ సారంగం, సుధీర్రెడ్డి, లక్ష్మీనారాయణ, డెమో కొప్పు ప్రసాద్, ఆశా నోడల్ ఆఫీసర్ సక్కుబాయి, హెచ్ఈ రాజు, రామకృష్ణ, లోక్య, మనోహర, అరుణ్, అనిల్, ఆశకార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఫైలేరియా నియంత్రణకు చర్యలు జిల్లాలో ఫైలేరియా నియంత్రణకు చర్యలు చేపట్టాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. జాతీయ ఫైలేరియా నియంత్రణలో భాగంగా ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల వైద్యాధికారులు, సిబ్బందికి శుక్రవారం ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఎంహెచ్ఓ మాట్లాడు తూ.. ఫైలేరియా వ్యాధికి కారణమైన దోమల నివా రణకు పరిసరాల పరిశుభ్రత, ఫ్రైడే డ్రైడే పాటించాలన్నారు. జోనల్ మలేరియా ఆఫీసర్ సునీల్కుమార్, డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్ డాక్టర్ శిరీష శిక్షణ అందించారు. ప్రోగ్రాం అధికారులు సుధీర్రెడ్డి, సారంగం, లక్ష్మీనారాయణ, ప్రసాద్, రాజు, పురుషోత్తం, రామకృష్ణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ రవిరాథోడ్ -
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
మరిపెడ: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. మరిపెడలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం సూచించిన విధంగా దశలవారీగా నిర్మాణం పూర్తి అయిన ఇళ్ల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి బిల్లులు త్వరగా పడే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం స్థానిక పీహెచ్సీని ఆయన పరిశీలించారు. ప్రస్తుత వాతవరణ మార్పుల కారణంగా జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అవసరమైన చోట వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యం అందించాలన్నారు. గ్రామపంచాయితీలు, మున్సిపాలిటీల్లో పరిశుభ్రత వారోత్సవాలు నిర్వహిస్తూ షెడ్యుల్ ప్రకారం శానిటేషన్ నిర్వహించాలన్నారు. వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ కృష్ణవేణి, హౌసింగ్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. -
అసంపూర్తిగా డార్మెటరీ భవనాలు
కురవి: ప్రభుత్వ పాఠశాలల్లో డార్మెటరీ(డైనింగ్హాల్) నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. జిల్లాలో మన ఊరు–మనబడి కింద పలు జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్ల నిర్మాణాలను కాంట్రాక్టర్లు చేపట్టారు. అయితే నిధులు నిలిచిపోవడంతో సదరు కాంట్రాక్టర్లు మధ్యలోనే పనులు నిలిపివేయడంతో భవనాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నా యి. దీంతో విద్యార్థులు వరండాలు, చెట్ల కింద కూర్చొని భోజనం చేయాల్సిన దుస్థితి నెలకొంది. నిరుపయోగం.. కురవి, సీరోలు మండలాల్లోని రాజోలు, మోద్గులగూడెం, కొత్తూరు(సీ), చింతపల్లి, కాంపల్లి, సీరోలు జెడ్పీ హైస్కూళ్లలో డార్మెటరీ నిర్మాణాలు పూర్తి కాలేదు. దీంతో అవి నేడు నిరుపయోగంగా మారాయి. అయితే సీరోలులో మాత్రం అసంపూర్తి భవనంలో విద్యార్థులు కూర్చొని భోజనం చేస్తున్నట్లు సమాచారం. నిర్మాణాలు పూర్తి చేస్తే వర్షాకాలంలో వాటిలో కూర్చొని భోజనం చేసే అవకా శం ఉండేది. అధికారులు, ప్రజాప్రతినిధులు పరి శీలించి నిర్మాణాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకో వా లని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. డైనింగ్ హాల్స్ పూర్తి చేయాలి జిల్లాలో అసంపూర్తిగా ఉన్న డార్మెటరీ నిర్మాణాలను పూర్తి చేయాలి. విద్యార్థులు వరండాలు, చెట్ల కింద కూర్చొని భోజనం చేస్తున్నారు. మధ్యలో నిలిచిన పనులను పూర్తి చేసి విద్యార్థులకు అందించాలి. – జ్యోతిబసు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నిధులు రాకపోవడంతో నిలిపివేసిన కాంట్రాక్టర్లు డైనింగ్హాల్ లేక విద్యార్థుల ఇబ్బంది త్వరగా పూర్తిచేయాలని కోరుతున్న తల్లిదండ్రులు -
అసౌకర్యాల రైల్వేస్టేషన్
గార్ల: జిల్లాలోని గార్ల రైల్వేస్టేషన్లో కనీక సౌకర్యాలు కరువయ్యాయి. తాగునీరు, మరుగుదొడ్లలో నీటి సరఫరా లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ప్లాట్ఫాం దెబ్బతినడంతో ప్ర యాణికులు పడుతున్నారు. వానాకాలంలో రేకులషెడ్డు కురుస్తుండడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఈమేరకు కనీస సౌకర్యాలు కల్పించడంలో రైల్వే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రయాణికులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏటా రూ.కోటిపైగా ఆదాయం.. ఏటా గార్ల రైల్వేస్టేషన్లో టికెట్లు, రిజర్వేషన్ టికెట్ల ద్వారా రూ.కోటి పైగా ఆదాయం సమకూరుతోంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చింతలపల్లి, ఎల్గూరు, ఇంటికన్నె, గుండ్రాతిమడుగు రైల్వేస్టేషన్లకు ఆదా యం లేకున్నా.. రైల్వే ఉన్నతాధికారులు ఆయా స్టేషన్లలో పక్కా భవనాలు, కనీస సౌకర్యాలు కల్పించారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా ప్రయాణికుల ఇబ్బందులు.. రైల్వేస్టేషన్లో తాగునీరు, మరుగుదొడ్లలో నీటి వసతి లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా మహిళా ప్రయాణికులకు తిప్పలు తప్పడంలేదు. మరుగుదొడ్ల డోర్లను దొంగలు ఎత్తుకెళ్లారు. నిర్వహణ లేకపోవడంతో తీగజాతి మొక్కలు అల్లుకొని అడవిని తలపిస్తున్నాయి. ఇదిలా ఉండగా రైల్వేస్టేషన్లోని నేమ్బోర్డు వద్ద రేకులు లేచిపోయి గోడ కూలి చూడటానికి అందవికారంగా కనిపిస్తున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వర్షం వస్తే అంతే సంగతులు.. ప్రయాణికులకు ప్లాట్ఫాంలపై నీడ కోసం సరిపడా రేకుల షెడ్లు ఏర్పాటు చేయలేదు. ఉన్న రేకుల షెడ్లు వర్షం వస్తే కురుస్తున్నాయి. ఇకపోతే రెండో ప్లాట్ఫాంపై టైల్స్ ధ్వంసంకావడంతో రాత్రి సమయంలో రైలు దిగే ప్రయాణికులు కిందపడిపోతున్నారు. అలాగే బ్రిటిష్ కాలంలో నిర్మించిన రైల్వేస్టేషన్ భవనం వర్షాకాలంలో కురుస్తోంది. కాగా, ఇప్పటికై నా రైల్వే ఉన్నతాధికారులు స్పందించి రైల్వేస్టేషన్కు కొత్త భవనం నిర్మించి, ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. సౌకర్యాలు కల్పించాలి రైల్వేస్టేషన్లో తాగునీటి సౌకర్యం లేదు. మరుగుదొడ్లలో నీటి వసతి కల్పించలేదు. మరుగుదొడ్ల డోర్లను దొంగలు ఎత్తుకెళ్లారు. మరుగుదొడ్లలో నీటి సౌకర్యం లేకపోవడంలో మహిళలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వాటిని మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తేవాలి. – కందునూరి శ్రీనివాసరావు, గార్ల గార్లలో ప్రయాణికులకు తాగునీరు కరువు మరుగుదొడ్లకు నిలిచిన నీటి సరఫరా దెబ్బతిన్న రెండో ప్లాట్ఫాం రేకుల షెడ్డు కురుస్తుండడంతో ఇబ్బందులు పట్టించుకోని రైల్వే అధికారులు -
ఆర్డినెన్స్ పేరుతో ప్రభుత్వం కాలయాపన
మహబూబాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు విషయంలో ఆర్డినెన్స్ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, ప్రజలు గమనించాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ క్యాంపు కార్యాలయంలో యువగర్జన సదస్సు నిర్వహించారు. సత్యవతిరాథోడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువత రాజకీయాల్లోకి వస్తేనే సమాజంలో మార్పు వస్తుందన్నారు. కాంగ్రెస్కు దోచుకోవడం.. దాచుకోవడం తప్ప పరిపాలనపై పట్టు లేదన్నారు. మానుకోటకు ఆరుగురు మంత్రులు వచ్చి విమర్శలు చేశారే తప్ప చేసిందేమి లేదన్నారు. మానుకోట రూపురేఖలు మార్చిన ఘనత బీఆర్ఎస్దే అన్నా రు. ప్రతీ గ్రామంలో పారిశుద్ధ్యం పడకేసిందన్నారు. మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో యువత పాత్ర కీలకమన్నారు. బయ్యారం మండలంలో ఊసరవెల్లి రాజకీయం చేసే నాయకులు మాజీ సీఎం కేసీఆర్ శవయాత్ర చేయడం దారుణమని, రాబోయే రోజుల్లో ఆ యాత్ర చేసిన వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. మంత్రి సీతక్క అంటే గౌరవం ఉందని, అనవసరంగా శాపనార్థాలు పెట్టవద్దని, ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. రాబోయే అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో నాయకులు నాయిని రంజిత్, లూనావత్ అశోక్, యాళ్ల మురళీధర్రెడ్డి, సుదగాని మురళి, ఆవుల వెంకన్న, ఉప్పలయ్య, దాము, ఎన్.వెంకన్న, కిషన్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ -
నేడు ‘డయల్ యువర్ డీఎం’
నెహ్రూసెంటర్: మహబూబాబాద్ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో నేడు (శ నివారం) ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ ఎం.శివప్రసాద్ శుక్రవారం తెలిపారు. మధ్యాహ్నం 12నుంచి 1గంట వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఆర్టీసీ అభివృద్ధికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రజలు, ప్రయాణికులు 85003 24880 నంబర్కు ఫోన్ చేయాలని డీఎం అన్నారు. విద్యాశాఖలో పోస్టులు భర్తీ చేయాలి డోర్నకల్: విద్యాశాఖలో డీఈఓ, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేశ్ డిమాండ్ చేశారు. సీరోలు మండలం మన్నెగూడెం ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన టీపీటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రమేశ్ మాట్లాడారు. రాష్ట్రంలో 26జిల్లాలకు ఇన్చార్జ్ డీఈఓలు ఉన్నారని, తెలంగాణ ఏర్పడిన తర్వాత డిప్యూటీ డీఈఓల నియామకాలు చేపట్టలేదన్నారు. 596 మండలాల్లో ఇన్చార్జ్ ఎంఈఓలు ఉన్నారని తెలిపారు. ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా రెండు శాతం ఉపాధ్యాయులను పర్యవేక్షణాధికారులుగా నియమిస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో సంఘ మండల అధ్యక్షుడు అక్కినపల్లి బాబూరావు, ప్రధాన కార్యదర్శి విద్యాపాగర్, కార్యదర్శి సింగం మనోహర్, సునీల్కుమార్, వేణు తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజనం రుచిగా వండాలి మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం రుచిగా వండాలని, ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని జిల్లా ఫుడ్ సేఫ్టీ విజిలెన్స్ అధికారి వి.దర్మేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనాన్ని జిల్లా ఫుడ్సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా వి.ధర్మేందర్ మాట్లాడుతూ.. వంటలు రుచిగా ఉండేవిధంగా చూడల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని, వంట నిర్వాహకులు వర్షాకాలంలో పలు జాగ్రతలు పాటించాలన్నారు. విద్యార్థులు భోజనం రుచిగా లేకపోతే వెంటనే పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సిరినాయక్, ఉపాధ్యాయులు వాసేదేవ్, రవీందర్నాయక్, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అవసరం మేరకు యూరియా వినియోగించాలి నెల్లికుదురు: రైతులు అవసరం మేరకే యూరియాను వినియోగించాలని ఇన్చార్జ్ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు సూచాంచారు. శుక్రవారం మండలంలోని వివిధ గ్రామాల్లో పలు ఎరువుల షాపులను ఏఓ షేక్ యాస్మిన్తో కలిసి తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, ఈ పాస్ యంత్రాల్లోని స్టాక్ వివరాలు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. డీలర్లు ఎమ్మార్పీకే ఎరువులను విక్రయించాలని, అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముగిసిన సమ్మర్ ఇంటర్న్షిప్ కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లోని అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో సమ్మర్ ఇంటర్న్షిప్–25 ప్రోగ్రాం శుక్రవారంతో ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ హాజరై సమ్మర్ ఇంటర్న్షిప్లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడారు. నిట్ వరంగల్లో తొలిసారిగా మే 9వ తేదీన ప్రవేశపెట్టిన సమ్మర్ ఇంటర్న్షిప్నకు అనూహ్య స్పందన లభించిందని, యూజీ, పీజీ నుంచి 194 విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. ఇక ప్రతిఏటా సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంను అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీన్ అకడమిక్, ప్రొఫెసర్ వెంకయ్య చౌదరి, ప్రొఫెసర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలి
దంతాలపల్లి: వర్షాకాలంలో గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని డీపీఓ హరిప్రసాద్ అన్నారు. మండలంలోని బీరిశెట్టిగూడెం, దాట్ల గ్రామాలను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా వీధులను పరిశీలించారు. అనంతరం కార్యదర్శులు, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడా రు. వర్షాకాలంలో గ్రామాలను శుభ్రంగా ఉంచుకుంటే సీజనల్ వ్యాధులు దరిచేరవన్నారు. కార్యదర్శులు, కార్మికులు గ్రామాలను శుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలన్నారు. అనంరతం గ్రామాల్లో నిర్మాణాల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల గురించి ఆరా తీశారు. కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి కృష్ణయ్య, కార్యదర్శులు, మల్లికార్జున్, భూలక్ష్మి, జీపీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి కుటుంబమే భేష్..
బంధాలు తెగి.. అనుబంధాలు వీడి ● యాంత్రిక జీవనంలో కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం ● చిన్నచిన్న సమస్యలకే విడాకుల వరకు.. ● కొరవడిన పెద్దల మార్గనిర్దేశం నేడు ప్రపంచ జనాభా దినోత్సవంఒకే ఇల్లు.. ఒకే వంట డోర్నకల్: డోర్నకల్లో దశాబ్దాలుగా జైనమతానికి చెందిన పలువురు ఉమ్మ డి కుటుంబానికే ప్రాధాన్యత ఇస్తున్నా రు. కాగా పట్టణంలోని మెయిన్ రోడ్డు కు చెందిన కాలా సుమేర్చంద్జైన్ది ఉమ్మడి కుటుంబం. సుమేర్చంద్, మ నోజ్కుమార్, ఆనంద్కుమార్, సుశీల్కుమార్ నలుగురు అన్నదమ్ములు. వారి భార్యాపిల్లలతో కలిసి ఒకే ఇంట్లో ఉంటూ ఆనందంగా గడుపుతున్నారు. కుటుంబంలో మొత్తం 19మంది ఉన్నారు. వారికి వంటతో పాటు ఇతర పనులన్నీ ఇంట్లో మహిళలు కలిసి చేస్తుండగా.. అన్నదమ్ములంతా ఉమ్మడిగా వ్యాపారం చేస్తున్నారు. ప్రతీ రోజూ కలిసి పనులు చేసుకోవడం, కలిసి భోజనం చేస్తూ ఆనందంగా గడుపుతున్నామని సుమేర్చంద్జైన్ చెబుతుండగా.. ఎలాంటి సమస్య వచ్చినా అందరం కలిసి పరిష్కరించుకుంటున్నామని, కలిసి ఉండడంతోనే ఆరోగ్యంగా, ధైర్యంగా ఉంటున్నామని మహిళలు అంటున్నారు. -
త్వరితగతిన ఇళ్లు నిర్మించుకోండి
బయ్యారం: లబ్ధిదారులు త్వరితగతిన ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సూచించారు. గురువారం మండలంలోని కాచనపల్లి, గురిమెళ్ల, గౌరారం, ఉప్పలపాడు, నర్సాతండా, వెంకట్రాపురం, బాలాజీపేట, బాల్య తండా, బయ్యారం, జగ్గుతండా, సంతులాల్పోడుతండా, కొత్తపేట, సింగారం పంచాయతీల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇళ్లు నిర్మించుకునేవారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన దృష్టికి తేవాలన్నారు. ఇళ్ల నిర్మాణాలకు విద్యుత్ తీగలు అడ్డువస్తే వెంటనే తొలగించాలన్నారు. అనంతరం సింగారంలో నూతనంగా నిర్మించిన బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఎమ్మెల్యేకు ఫిర్యాదులు.. అర్హులకు కాకుండా అనర్హులకు ఇళ్లు కేటాయించారని వెంకట్రాంపురం, బాలాజీపేట పంచాయతీల్లో పలువురు ఎమ్మెల్యేకు ఫిర్యాదులు అందజేశారు. భూములు, ఆర్థికంగా ఉన్న వారికి ఇళ్లు మంజూరు చేశారని, అర్హులకు అన్యాయం చేశారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఇళ్ల కేటాయింపులో తమకు న్యాయం చేయాలని మహిళలు కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మరో దఫా అర్హులకు ఇళ్లు అందేలా చూస్తామని హామీ ఇచ్చా రు. కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ విజయలక్ష్మి, గార్ల–బయ్యారం సీఐ రవికుమార్, ఎస్సై తిరుపతితో పాటు పలువురు అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య -
ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నాం..
కురవి: మండలంలోని బలపాల గ్రామానికి చెందిన ఈడిగిరాల బాలవర్ధన్కు 17ఏళ్ల క్రితం రజితతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కుమార్తె లక్ష్మీప్రసన్న మరిపెడ ఎంజేపీలో 7వ తరగతి, కుమారుడు భానుప్రకాశ్ మానుకోట ఎంజేపీలో 5వ తరగతి చదువుతున్నాడు. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న బాలవర్ధన్కు వచ్చే జీతంతో కుటుంబం ఇబ్బంది లేకుండా నడుస్తోంది. కాగా ప్రస్తుతం ప్రతీ వస్తువుకు విపరీతమైన ధరలు పెరుగుతున్నాయని, ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే కష్టమని బాలవర్ధన్ అన్నారు. ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నామన్నారు. -
ఆదర్శ కుటుంబం..
మహబూబాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని పాత బజారుకు చెందిన మహమ్మద్ అఫ్జల్, సాబేరబేగం దంపతులకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. కటుంబంలో 19 మంది ఒకేచోట ఉమ్మడిగా నివాసం ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మహమ్మద్ అఫ్జల్, సాబేరబేగం దంపతుల కుమారులు, కోడళ్లు జమీల్–అస్మాఅంజుమ్, ఖలీల్–రెహనాపర్వీన్, షకిల్–హుమేర, ఆదిల్–నఫీస్ ఉన్నారు. అఫ్జల్, సాబేరబేగం నలుగురు కుమార్తెల్లో ఒక కుమార్తె ఖైరున్నీసాబేగం భర్త 24 సంవత్సరాల క్రితం మృతిచెందగా ఆమె కూడా వీరివద్దే ఉంటుంది. కాగా వారంతా ఒకే ఇంట్లో నివసిస్తూ సంతోషంగా ఉంటున్నారు. -
శుక్రవారం శ్రీ 11 శ్రీ జూలై శ్రీ 2025
– 8లోu1. మీరు ఎంత మంది పిల్లలను కనాలనిఅనుకుంటున్నారు?3. పెళ్లి చేసుకున్నాక పిల్లలను కనే ప్లాన్ ఎలా చేస్తారు? 2. ఉమ్మడి కుటుంబమా.. ఒంటరిగా ఉండడం ఇష్టమా? ఉమ్మడి కుటుంబం భార్యాభర్తలు విడిగా ఉండడంభార్యాభర్తలు జాబ్ చేయడం వల్ల పిల్లలను చూసుకునే వారు లేక ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయని..4. ఈ తరంలో ఒక్కరు, ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలను కనడం లేదు ఎందుకు? 401510052416263620‘ఒక్కరు.. లేదా ఇద్దరు పిల్లలు చాలు. అంతకంటే ఎక్కువ మందిని కనే పరిస్థితులు లేవు. ఆ ఆలోచన కూడా మాకు లేదు’ అని అంటున్నారు యువజంటలు. దీంతోపాటు ఉమ్మడి కుటుంబం ఉంటేనే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. మారిన జీవన పరిస్థితుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయాల్సి రావడం, ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడంతో ఈ తరం ఒక్కరు లేదా ఇద్దరితో సరిపెట్టుకుంటున్నారు. కానీ వచ్చే ఇరవై ఏళ్లలో యువజనుల జనాభా తగ్గి, సీనియర్ సిటిజన్ల సంఖ్య పెరుగుతుందని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముగ్గురికి పైగా.. బిడ్డల్ని కనాలన్న సూచనలు వస్తున్నాయి. నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఇద్దరి కంటే ఎక్కువ మందిని కనే విషయంలో యువజంటలు ఏమంటున్నాయి.. వీరితో పాటు 25 ఏళ్ల పైబడి వివాహ ప్రయత్నాల్లో ఉన్న వారి మనోగతంపై ‘సాక్షి’ గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు అంశాలపై సర్వే నిర్వహించింది. అంతకంటే ఎక్కువ కనలేమంటున్న యువ జంటలుఉమ్మడి కుటుంబంలో ఉంటేనే సంతోషం ● ‘సాక్షి’ సర్వేలో స్పష్టీకరణ – సాక్షి నెట్వర్క్ న్యూస్రీల్ -
పెండింగ్ కేసుల పరిష్కారానికి సహకరించాలి
మహబూబాబాద్ రూరల్: పెండింగ్ కేసుల పరిష్కారానికి వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో రెవెన్యూ, పోలీసు అధికారులతో పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలనే ప్రధాన ఏజెండాగా గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. క్రిమినల్ కేసులను త్వరగా పరిష్కరించాలంటే జైల్లో ఉన్న ఖైదీలను కోర్టులో సకాలంలో హాజరుపరచాలని సూచించారు. పెండింగ్ వారెంట్లు త్వరగా క్లియర్ చేయాలని, సాక్షులను సరైన సమయంలో హాజరుపరచాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, సీనియర్ సివిల్ జడ్జి శాలిని, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి స్వాతి మురారి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి అరవపల్లి కృష్ణతేజ్, తొర్రూర్ జూనియర్ సివిల్ జడ్జి ధీరజ్ కుమార్, డీపీఈఓ కిరణ్, డీఎస్పీలు తిరుపతిరావు, కృష్ణకిశోర్, కోర్టు పరిపాలనాధికారి క్రాంతికుమార్, సీఐలు, ఎస్సైలు, ఎకై ్సజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ -
అఽధికారుల తప్పిదం.. రైతుకు శాపం
హసన్పర్తి: అధికారుల తప్పిదం.. రైతుకు శాపంగా మారింది. జాతీయ రహదారి 563లో నిర్మాణంలో భాగంగా అధికారులు చేపట్టిన సర్వే సందర్భంగా అనేక పొరపాట్లు చోటు చేసుకున్నాయి. క్షేత్రస్థాయికి వెళ్లకుండా కేవలం గూగుల్ మ్యాప్ ఆధారంగా సర్వే నంబర్లు సేకరించి నివేదిక ఇచ్చినట్లు రైతుల నుంచి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. హనుమకొండ జిల్లా హసన్పర్తి, సూరారం, కోతులనడుమ, వల్భాపూర్, పెంబర్తి గ్రామాల్లో రైతులు భూములు కోల్పోతున్నట్లు నివేదికల్లో పేర్కొనలేదు. హసన్పర్తి మండల కేంద్రానికి చెందిన గొర్రె సారయ్యకు గ్రామ శివారులోని సర్వే నంబర్ 63/ఏలో సుమారు 0.32 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని రోడ్డు నిర్మాణంలో కోల్పోతున్నాడు. అయితే సర్వే అఽధికారులు ఈ నంబర్లును పరిహార జాబితాలో పొందపరచలేదు. దీంతో సదరు రైతు ఆందోళనకు గురై పరిహారం రాకపోవడంతో చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ భూమి సేకరణకు నోటిఫికేషన్.. సర్వే సందర్భంగా తప్పిపోయిన ఆ భూములను సేకరిస్తున్నట్లు జనవరి 14న నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్లో ఆయా ప్రాంతాల వారీగా పరిహారం నిర్ణయించారు. హసన్పర్తిలో ఎకరానికి రూ.1.06 కోట్లుగా మార్కెట్ ధర నిర్ణయించారు. అయితే ఈ రోడ్డు భూసేకరణ చేపట్టిన సమయంలో 2017లో జారీ చేసిన నోటిఫికేషన్లో మార్కెట్ ధర రూ.51లక్షలు. దీంతో మార్కెట్ ధర రెట్టింపు కావడంతో పరిహారం చె ల్లించడానికి అధికారులు జాప్యంచేస్తూ వస్తున్నారని బాధిత రైతు కుటుంబ సభ్యులు తెలిపారు. అధికారులు స్పందించడం లేదు.. పరిహారం చెల్లింపులో అధికారుల స్పందించడం లేదు. సరైనా సమాచారం కూడా అందించడం లేదు. దీంతో రోజూ కార్యాలయం చుట్టు ప్రదక్షణ చేస్తున్నా. –గొర్రె కిరణ్, మృతుడి కుమారుడు పరిహారం చెల్లింపులో జాప్యం రోదిస్తున్న నేషనల్ హైవే బాధితుడు -
ఆర్టీసీ బస్సును ఢీకొని యువకుడి మృతి
● పాలకుర్తిలో ఘటన పాలకుర్తి టౌన్ : బైక్పై అతివేగంగా వెళ్తూ ఆర్టీసీ బస్సును ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం మండల కేంద్రంలో జరిగింది. ఎస్సై దూలం పవన్కుమార్ కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన గాడిపెల్లి రంజిత్(20) హైదరాబాద్లోని ఓ వైన్ షాపులో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో బైక్పై మైలారం నుంచి పాలకుర్తి మీదుగా జనగామ వెళ్తుండగా జనగామ నుంచి పాలకుర్తికి వచ్చి బస్తాండ్లోకి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడగా గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్షతగాత్రుడిని 108లో జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, ఆర్టీసీ బస్సును ఢీకొన్న రంజిత్ హెల్మ్ంట్ ధరించి ఉంటే బతికేవాడు. -
పెరుగుతున్న గోదావరి
● రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద 13మీటర్లకు చేరిన నీటిమట్టం ఏటూరునాగారం/వాజేడు: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ములుగు జిల్లా ఏటూరునాగారం మండల పరిధిలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నది వరద క్రమక్రమంగా పెరుగుతోంది. గురువారం సాయంత్రం వరకు రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద నీటిమట్టం 13 మీటర్లకు చేరింది. వరద క్రమంగా పెరుగుతోందని కేంద్ర జలవనరుల అధికారులు తెలిపారు. సిబ్బంది అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే వాజేడు మండల పరిధిలోని పేరూరు వద్ద గోదావరి వరద క్రమేపీ పెరుగుతోంది. పేరూరు వద్ద గురువారం సాయంత్రం గోదావరి నీటిమట్టం 14 మీటర్లకు చేరుకుంది. పూసూరు బ్రిడ్జి వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతూ కనిపిస్తోంది. -
నర్సంపేట డిగ్రీ కళాశాల సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల
కేయూ క్యాంపస్: కేయూ పరిధిలోని నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల( అటానమస్) రెండు, నాల్గవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను గురువారం కేయూలో వీసీ కె. ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి. రామచంద్రం, పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, ఆ కళాశాల ప్రిన్సిపాల్ మల్లం నవీన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మల్లం నవీన్ ఫలితాల వివరాలు వెల్లడించారు. బీఎస్సీలో 41.74 శాతం, బీఏలో 51.85శాతం, బీకాంలో 39.92శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.ఈ ఫలితాలను క్యూ ఆర్ కోడ్, లింక్ ద్వారా కళాశాల వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆ కళాశాల పరీక్షల నియంత్రణాధికారి ఎస్. కమలాకర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి రాజీరు, స్టాఫ్సెక్రటరీ రహీముద్దీన్, భద్రు, తదితరులు పాల్గొన్నారు. 17న హనుమకొండలో గిరిజన మార్కెటింగ్ మేళా ఏటూరునాగారం: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ట్రైబల్ ఫెడరేషన్ మార్కెటింగ్ (ట్రైఫాడ్) ఆధ్వర్యంలో ఈనెల 17న హనుమకొండలోని గిరిజన భవన్లో హస్తకళా ప్రదర్శన, మార్కెటింగ్ మేళా నిర్వహించనున్నట్లు ఐటీడీఏ ఏటూరునాగారం పీఓ చిత్రామిశ్రా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో గిరిజన కళాత్మక హస్తకళల (దుస్తుల తయారీ, పెయింటింగ్, ఫుడ్ ప్రొడక్ట్స్, వెదురు బుట్టలు అల్లడం) ప్రదర్శన ఉంటుందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆసక్తిగల గిరిజన కళాకారులు తాము తయారు చేసిన వస్తువులను ప్రదర్శించడానికి మేళాకు హాజరు కావాలని కోరారు. ఈ ప్రదర్శనకు హాజరయ్యే కళాకారులు తప్పని సరిగా కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలన్నారు. మేళాకు హాజరైన కళాకారులకు రవాణా చార్జీలను ట్రైఫాడ్ ద్వారా అందజేస్తామన్నారు. మరింత సమాచారం కోసం 8330954571 నంబర్లో సంప్రదించాలన్నారు. యువకుడిపై పోక్సో కేసు పాలకుర్తి టౌన్: ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి బాలికపై పలుమార్లు లైంగికదాడికి పా ల్పడిన ఘటనలో ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై దూలం పవన్కుమార్ తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన ఓ బాలికపై( 16 ఏళ్లు) మండలంలోని తీగారం గ్రామానికి చెందిన దండెంపల్లి ప్రణయ్ లైంగికదాడికి పాల్పడగా ఆ బాలి క గర్భం దాల్చింది. ప్రస్తుతం 6 నెలల గర్భవతి అని తెలియడంతో ప్రణయ్.. ఆ బాలికకు గర్భస్రావం కోసం టాబ్లెట్లు ఇచ్చాడు. ఇంటికి వెళ్లాక సదరు బాలిక టాబ్లెట్లు వేసుకోగా రక్తస్రావం అయ్యింది. గమనించి కుటుంబ సభ్యులు బాలికను నిలదీశారు. దీంతో విషయం బయటపడింది. ప్రస్తుతం బాలికను హనుమకొండలోని ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై దూలం పవన్కుమార్ తెలిపారు. -
సైబర్ మోసగాళ్ల బరితెగింపు..
జనగామ: సైబర్ మోసగాళ్ల బరితెగించారు. పహల్గాం దాడి కుట్రలో సంబంధాలు ఉన్నాయంటూ ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ వైద్యుడు, ఐఎంఏ ప్రతినిధి లకావత్ లక్ష్మీనారాయణ నాయక్కు పహల్గాం ఉగ్రదాడి ఘటనలో సంబంధాలపై విచారణ ఉందంటూ గుర్తుతెలియని వ్యక్తులు గురువారం ఫోన్ చేసి భయపెట్టే ప్రయత్నం చేశారు. ‘హలో లక్ష్మీనారాయణ గారు పహల్గాం ఉగ్రదాడి విచారణ అధికారిని మాట్లాడుతున్నా.. ఆ దాడి వెనక మీకు సంబంధాలు ఉన్నాయని తెలిసింది.. విచారణకు రావాల్సి ఉంటుంది, లేదంటే వెబ్సైట్ ద్వారా రిపోర్టు చేయాలి’ అని బోల్తాకొట్టించాడు. అయితే సైబర్ నేరస్తుడిపై డాక్టర్ లక్ష్మీనారాయణకు అనుమానం కలిగింది. పహల్గాం ఘటన కు తనకు సంబంధం ఉంటే పూర్తి సమాచారం స్థానిక పోలీసులకు ఇస్తానని, అక్కడ నుంచి తీసుకోవాలని తెగేసి చెప్పడంతో అనుమానితుడిగా భావించిన సైబర్ నేరస్తుడు ఫోన్ కట్ చేశాడు. వెంటనే జనగా మ సీఐ దామోదర్రెడ్డికి గుర్తుతెలియని వ్యక్తి సంభాషణను పంపించి, ఇందుకు సంబంధించి విషయాలు వివరించారు. అగంతకుల బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తే ఎవరూ భయపడొద్దని, వ్యక్తిగ సమాచారం ఇవ్వొద్దని డాక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. పహల్గాం దాడికి సంబంధాలంటూ బెదిరింపు విచారణకు రండి.. లేదా వెబ్సైట్లో రిపోర్టు చేయాలి డాక్టర్ను బురిడీ కొట్టించే ప్రయత్నం పోలీసులకు ఫిర్యాదు -
భద్రకాళీ శరణం మమః
హన్మకొండ కల్చరల్ : సర్వాభిష్టములు ఆకలిదప్పులను తీర్చి, దుష్టులను సంహరించే శాకంబరీదేవిగా భద్రకాళీ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. దీంతో భక్తులు భద్రకాళీ శరణం మమ అంటూ పులకించారు. చారిత్రక శ్రీభద్రకాళీ దేవాలయంలో నిర్వహిస్తున్న తిథిమండల దేవాతాయజన పూర్వక శాకంబరీ నవరాత్రోత్సవాల చివరిరోజు గురువారం ఉదయం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని మహాశాకంబరీదేవిగా కూరగాయలతో అలంకరించి భక్తులను దర్శనానికి అనుమతించారు. జూన్ 26న ఆషాఢ శుద్ధ పాడ్యమి గురువారం ఉత్సవాలు ప్రారంభమై పక్షం రోజులుగా ఒక్కొక్కక్రమంలో పూజలందుకుంటూ ఆషాఢశుద్ద పౌర్ణమి గురువారం అమ్మవారు పరిపూర్ణ శాకంబరీదేవిగా భక్తులను అనుగ్రహించింది. ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించిన భక్తులు భద్రకాళీ శరణం మమః అంటూ భక్తిపారవశ్యంలో మునిగారు. ఆలయ అర్చకులు భద్రకాళీ శేషు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు అలంకరణలో పాల్గొన్నారు. కాంట్రాక్టర్ మండువ శేషగిరిరావు, రేణుక దంపతులు, హైదరాబాద్కు చెందిన ఈమని హరికృష్ణ, స్మిత దంపతులు శాకంబరీ అలంకరణ దాతలుగా వ్యవహరించారు. గురువారం తెల్లవారుజామున 2 గంటల నుంచి టన్ను పలు కూరగాయలు, పండ్లతో శాకంబరీదేవిగా అలంకరించడం ప్రారంభించారు. ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ శేషుభారతి, ఆలయ సూపరింటెండెంట్ అద్దంకి విజయ్కుమార్, సిబ్బంది అలుగు కృష్ణ , నాగులు, అశోక్, చింతశ్యామ్ సుందర్, సిబ్బంది ఏర్పాట్లు చేశారు. మితా, చిత్రానిత్యాక్రమాల్లో పూజలు.. ఉదయం మితా, చిత్రానిత్యాక్రమాల్లో అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని మహాశాకంబరీదేవిగా అలంకరించి మహాహారతి, పంచహారతి, మహానివేదన జరిపారు. హోమం పూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి సర్వదర్శనానికి భక్తులను అనుమతించారు. రాత్రి వరకు కొనసాగింది. శాకంబరీ ఉత్సవాన్ని పురస్కరించుకుని మట్టెవాడ ఇన్స్పెక్టర్ గోపి ఆధ్వర్యంలో 250 మంది పోలీసులతో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. అమ్మవారు మహాశాకంబరీదేవిగా దర్శనం మితా, చిత్రానిత్యాక్రమంలో పూజలు పులకించిన భక్తజనం ఘనంగా ముగిసిన శాకంబరీ ఉత్సవాలుఅమ్మవారిని దర్శించుకున్న మంత్రి కొండా సురేఖ.. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ.. అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది మంత్రిని ఘనంగా స్వాగతించారు. అమ్మవారికి పూజలు నిర్వహించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్ర జలు సుఖసంతోషాలు, ఆయురారో గ్యాలతో జీవించాలని కోరుకుంటున్నానన్నా రు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, మరింత ముందుకెళ్లాలని అమ్మవారిని ప్రార్థించానన్నారు. రాష్ట్ర ప్రజలపై అమ్మ వారి దయ ఉండాలని కోరుకున్నానన్నారు. -
ఎక్కువ మంది పిల్లల్ని పెంచడం కష్టం..
గూడూరు: నా పేరు ఎడ్ల నరేశ్రెడ్డి. మాది గూడూరు మండలం సీతానగరం శివారు రెడ్డిపల్లె గ్రామం. నన్ను మా బంధువులు చిన్నతనంలో దత్తత తీసుకొని పెంచి పెద్దవాడిని చేశారు. మాకు ఎకరం పొలం ఉంది. 15 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. మా కూతురు శ్రీముఖ 8వ తరగతి చదువుతుంది. ఒక్కరు చాలు అనుకున్న.. కానీ గత సంవత్సరం కుమారుడు ఆర్యనాథ్రెడ్డి జన్మించాడు. ఆటో, ట్రాలీ, లారీ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాను. ఏడాదిగా కాంగ్రెస్ పార్టీలో గ్రామ నాయకుడిగా ఎదిగాను. దీంతో ఎమ్మెల్యేలు మురళీనాయక్, దొంతి మాధవరెడ్డి సహకారంతో నెక్కొండ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్గా నియామకమయ్యాను. కొంతకాలంగా కొంచెం చెప్పుకునే విధంగా జీవనం కొనసాగుతుంది. అయితే నేటి పరిస్థితుల్లో ఎక్కువ మంది పిల్లల్ని పెంచి పెద్ద చేయడం కష్టం. వారికి కావాల్సినవి ఇవ్వడంలో ఇబ్బందులు తప్పవు. కాబట్టి ఒక్కరు లేదా ఇద్దరు పిల్ల లతో సరిపెట్టుకుంటే మంచిదనేది నా ఆలోచన. -
ఒకరి వెంట ఒకరు
తీరని విషాదం..జనగామ: తల్లి, కొడుకు ఒకేరోజు ఒకరి వెంట ఒకరు తనువుచాలించారు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలోని గిర్నిగడ్డలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చారబుడ్డి దయాకర్రెడ్డి(55), తల్లి అహల్యాదేవి(85) గిర్నిగడ్డలో నివాసముంటున్నారు. దయాకర్రెడ్డికి ఇద్దరు అన్నలు ఉన్నారు. ఇందులో ఓ సోదరుడు మృతి చెందగా, రెండో సోదరుడు వ్యాపార రీత్యా హైదరాబాద్లో స్థిరపడ్డారు. తల్లి బాగోగులు చూసుకునేందుకు దయాకర్రెడ్డి జనగామలో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల అహల్యాదేవిపై కోతులు దాడులు చేయడంతో కిందపడి తీవ్రంగా గాయపడింది. దీంతో వెన్నుముక ఆపరేషన్ చేయించాడు. ఇదే సమయంలో దయాకర్రెడ్డికి కూడా వెన్ను నొప్పి సమస్య తీవ్ర కావడంతో ఆపరేషన్ చేయించుకుని కోలుకున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం పని మనిషి బయటకు వెళ్లిన తర్వాత రాగిజావ తయారు చేసి తల్లికి ఇచ్చి తానూ తాగాడు. అనంతరం కొడుకు దయాకర్రెడ్డి ఇంటి వెనుక కుర్చీలో, తల్లి అహల్యాదేవి మంచం పక్కన చనిపోయి ఉన్నారు. తల్లి తల కింద నుంచి రక్తం మరకలు ఉన్నాయి. రాగి జావలో పురుగుల మందు కలుపుకుని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు, పలువురు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తల్లి, తమ్ముడు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, వారి మృతిపై ఎలాంటి అనుమానం లేదని సోదరుడు వాసుదేవరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏఎస్పీ చేతన్ నితిన్, సీఐ దామోదర్రెడ్డి ఘటనా స్థలికి చేరుకుని తల్లి, కొడుకు మృతికి గల కారణాలపై ఆధారాలు సేకరించారు. కాగా, దయాకర్రెడ్డి, ఆయన తల్లి అహల్యాదేవి మరణ వార్త తెలుసుకున్న అన్ని పార్టీల నాయకులు, స్థానికులు, అభిమానులు అక్కడకు వచ్చి కన్నీరుమున్నీరుగా విలపించారు. తెలంగాణ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగారాఘవరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మృతుల కుటుంబీకులను పరామర్శించిన వారిలో ఏఎంసీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, ఎర్రమల్ల సుధాకర్, వెన్నెం సత్యనిరంజన్రెడ్డి, జక్కుల వేణు మాధవ్, వంగాల మల్లారెడ్డి, కరుణాకర్రెడ్డి, గుజ్జుల నారాయణ, తదితరులున్నారు.తనువు చాలించిన తల్లి, కొడుకు.. జనగామలో ఘటన మృతుడు మాజీ కౌన్సిలర్ అనారోగ్యంతోనే.. అనుమానం లేదు పోలీసులకు మృతుడి సోదరుడి ఫిర్యాదు -
ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు
డోర్నకల్: ఆయిల్పామ్ సాగుతో రైతులు అధిక లాభాలు సాధించవచ్చని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో తెలిపారు. ఆయిల్పామ్ మెగా ప్లాంటేషన్ మేళా కార్యక్రమంలో భాగంగా మండలంలోని వెన్నారం గ్రామ పరిధిలో గురువారం అదనపు కలెక్టర్ ఆయిల్పామ్ మొక్క నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెంచేందుకు ఉద్యానశాఖ ప్రణాళికలు రూపొందిస్తుందని తెలిపారు. ఆయిల్పామ్ సాగుతో రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన,పట్టు పరి శ్రమ అధికారి మరియన్న, ఇన్చార్జ్ జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ ఇమ్మానియల్, ఎంపీడీఓ శ్రీనివాసనాయక్, హెచ్ఓ శాంతి ప్రియ,ఏఓ మురళీమోహన్,ఏఈఓలు పాల్గొన్నారు. పారిశుద్ధ్య సమస్యపై దృష్టి సారించాలి... డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న పారిశు ద్ధ్య సమస్యపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్, మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశించారు. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో గురువారం పారిశుద్ధ్య సమస్య, ఇందిర మ్మ ఇళ్ల పురోగతిపై సమీక్ష జరిపారు. ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్య సమస్యను వంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులపై నిత్యం సమీక్షించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్, ఏఈ శృతి తదితరులు పాల్గొన్నారు. -
శాసనసభ ఏర్పాటు చేసే దమ్ముందా..?
హన్మకొండ: ప్రతిపక్ష పార్టీ లేఖ రాస్తే శాసనసభ ఏర్పాటు చేసే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి ఉందా అని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ప్రశ్నించారు. రాజకీయాల్లో అనేకమంది ముఖ్యమంత్రులను చూశానని, రేవంత్ రెడ్డిని చూస్తే... మాట మార్చడం, మడమ తిప్పడం, ఏ మార్చడం ఆయన నీతి, రీతిగా కనిపిస్తుందన్నారు. గురువారం హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్తో కలిసి ఆయన మాట్లాడారు. శాసనసభ సమావేశాలకు ఒక తంతు ఉంటుందన్నారు. ప్రభుత్వం గవర్నర్కు సమావేశ తేదీ వివరాలలో లేఖ పంపాల్సి ఉంటుందన్నారు. గవర్నర్ ఆమోదంతో సమావేశాలు నిర్వహిస్తారన్నారు. శాసనసభ సమావేశాలు నిర్వహిస్తామంటే లేఖ రాయడానికి సిద్ధమన్నారు. మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించడం కాదన్నారు. ప్రెస్ క్లబ్ను ఇతర క్లబ్లతో పోల్చడం నిరంకుశత్వమన్నారు. పార్టీలు మారినప్పుడు ప్రెస్క్లబ్కు వెళ్లి మాట్లాడలేదా రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక ఎన్నికలకు పోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, చెప్పులు క్యూలో పెడుతూ నిరీక్షిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 2 లక్షల జాబ్ క్యాలండర్ ఎటు పోయిందని నిలదీశారు. సమావేశంలో నాయకులు మర్రి యాదవ రెడ్డి, చింతం సదానందం, పులి రజనీకాంత్, జోరిక రమేశ్, నయీముద్దీన్, రామ్మూర్తి పాల్గొన్నారు. సభా సమావేశానికి ఒక తంతు ఉంటుంది మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి -
ఓరుగల్లులో తగ్గిన జననాల రేటు
రాష్ట్ర జననాల సగటులో 13వ స్థానంలో ఉమ్మడి జిల్లా సాక్షిప్రతినిధి, వరంగల్ : ఉమ్మడి వరంగల్లో జననాల రేటు రోజురోజుకూ పడిపోతోంది. కేంద్ర ప్రభుత్వం గతేడాది పార్లమెంట్లో దేశంలోని రాష్ట్రాల వారీగా జనన, మరణాలపై నివేదిక సమర్పించింది. బర్త్ రేటు (జననాల రేటు) తగ్గిందని 2021లో దేశవ్యాప్తంగా నమోదైన జనన రిజిస్టర్ రిపోర్ట్నూ వెల్లడించింది. 2021లో జననాల సంఖ్య 2.42 కోట్లుగా ఉంది. రాష్ట్రంలో 2001 నుంచి 2011 పదేళ్లలో సుమారు 42 లక్షల మంది జన్మిస్తే.. 2021 నాటికి ఆ జననాల సంఖ్యతో పోలిస్తే సంఖ్య 5.58 లక్షలు తగ్గిందని ఆ నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో ఉమ్మడి వరంగల్లో జననాల రేటును పరిశీలిస్తే 2011 నుంచి తగ్గుతూ వస్తోంది. అంతకు ముందు జనాభా వృద్ధి రేటు ప్రకారం గంటకు 60–70 మంది నుంచి 30–35కు పడిపోయింది. ఇందుకు కరోనా మహమ్మారి తర్వాత జననాల సంఖ్య తగ్గిందనేది ఒక కారణం కాగా.. చాలా మంది ఒక్కరు, లేదా ఇద్దరితో సరిపెట్టుకోవడం కూడా కారణమని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఉమ్మడి జిల్లాలు, రాష్ట్రంలో జననాల రేటు ఇ లాగే తగ్గితే వచ్చే 20 ఏళ్లలో యువజనుల సంఖ్య తగ్గి సీని యర్ సిటిజన్లు పెరుగుతారనే ఆందోళన వ్యక్తమవుతోంది. 1951 జనాభా వృద్ధి ఇలా.. సాధారణంగా ప్రతీ పదేళ్లకు ఒకసారి దేశ జనాభాను లెక్కిస్తా రు. 1872లో మొదటిసారి జనాభాను లెక్కించినప్పటికీ... స మగ్ర జనగణన 1881లో చేపట్టారు. 1952 నుంచి మనదే శంలో జనాభా పెరుగుదలను అరికట్టేందుకు ‘కుటుంబ ని యంత్రణ’ కార్యాచరణ మొదలైంది. రెండు దశాబ్దాలు ఈ కార్యక్రమం సీరియస్గా సాగినా.. ఆ తర్వాత నెమ్మదించింది. 2011 నుంచి జననాల రేటు తగ్గుముఖం.. ఐదేళ్లలో పుట్టింది 70 వేల మందే.. ఇలాగైతే వచ్చే ఇరవై ఏళ్లలో పెరగనున్న సీనియర్ సిటిజన్లు ఆందోళన కలిగిస్తున్న జననాల సంఖ్య నేడు ప్రపంచ జనాభా దినోత్సవంఉమ్మడి వరంగల్ జిల్లా జనాభా రేటు ఇలా.. సంవత్సరం జనాభా పెరిగిన జనాభా శాతం 1951 13,29,836 +2,04,177 +18.14 1961 15,45,435 +2,15,599 +16.21 1971 18,70,933 +3,25,498 +21.06 1981 23,00,295 +4,29,362 +22.95 1991 28,18,832 +5,18,537 +22.54 2001 32,46,004 +4,27,172 +15.15 2011 35,12,576 +2,66,572 +8.21 2021 37,50,000 +2,37,424 +6.33 2025 38,20,000 +70,000 +1.83 -
కాజీపేట మీదుగా గౌరవ్ టూరిస్ట్ ట్రైన్
కాజీపేట రూరల్ : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం దివ్యదక్షిణ్ యాత్ర విత్ జ్యోతిర్లింగ ప్యాకేజీతో భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ను నడిపిస్తున్నట్లు ఐఆర్సీటీసీ టూరిజం సికింద్రాబాద్ అసిస్టెంట్ మేనేజర్ పి.వి.వెంకటేశ్ తెలిపారు. ఈ మేరకు కాజీపేట రైల్వే వీఐపీ లాంజ్లో గురువారం టూరిస్ట్ ట్రైన్ బుక్లెట్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన సికింద్రాబాద్లో ప్రారంభమయ్యే గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ కాజీపేటకు 1.55 గంటలకు, వరంగల్కు 2.30 గంటలకు చేరుతుందని తెలిపారు. ఈ నెల 19 నుంచి 26వ తేదీ వరకు 7 రాత్రులు, 8 రోజులు పాటు ఉండే గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ను తమిళనాడు, కేరళలోని తిరువణ్ణమలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తాంజావూరు ప్రదేశాల సందర్శన ఉంటుందని వివరించారు. ఒకరికి బుకింగ్ సాధారణ టికెట్ ధర రూ.14,100, 3 ఏసీ టికెట్ ధర రూ.22,300, 2 ఏసీ టికెట్ ధర రూ. 2900 ఉంటుందన్నారు. ఈ ట్రైన్కు సికింద్రాబాద్, జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటలో బోర్డింగ్ పాయింట్స్ ఉంటాయన్నారు. కాజీపేట, హనుమకొండ, వరంగల్తో పాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల వారు ఈ యాత్ర ట్రైన్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టికెట్ బుకింగ్, ఇతర వివరాలకు 040–27702407, 9701360701, 9281495843, 9281495845 నంబర్లు లేదా www.irctctourism.comలో సంప్రదించాలని కోరారు. ఐఆర్సీటీసీ టూరిజం మానిటర్స్ కె.ప్రశాంత్, ఎం.శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ నెల 19న సికింద్రాబాద్ నుంచి ప్రారంభం ఐఆర్సీటీసీ అసిస్టెంట్ మేనేజర్ వెంకటేశ్ -
జ్ఞానదీపం గద్దెలను తాకిన వరద..
● పొంచి ఉన్న ప్రమాదం కాళేశ్వరం: మూడు రోజులుగా మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహితనది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద బుధవారం రాత్రి కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద ఏర్పాటు చేసిన జ్ఞానదీపాల గద్దెలను తాకింది. దీంతో దేవస్థాన అధికారులు ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. ఒక వేళ వరద పెరిగితే ఆ రెండు జ్ఞానదీపాలు వరదల్లో కొట్టుకుపోయే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం త్రివేణి సంగమం సరస్వతీఘాట్ వద్ద 8.480 మీటర్ల ఎత్తులో నీటిమట్టం ప్రవహిస్తోంది. మరింత వరద పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు. -
పెన్షనర్ల బకాయిలు చెల్లించాలి
విద్యారణ్యపురి: పెన్షనర్ల బకాయిలు వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు.బుధవారం హనుమకొండలోని పెన్షనర్ల సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.భవిష్యత్లో పెన్షనర్లకు పీఆర్సీ, డీఏ లబ్ధిపొందే అవకాశం ఉండదన్నారు. కేంద్రప్రభుత్వం పెన్షనర్లకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గతేడాది మార్చి నుంచి జూన్ 2025 వరకు ఉద్యోగ విరమణ చేసిన వారికి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. అనంతరం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వీరస్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు సింగారెడ్డి మాట్లాడారు. సమావేశంలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ప్రభాకర్రెడ్డి, ఉపాధ్యక్షులుగా జి.రాజన్న, మహిళా ఉపాధ్యక్షులుగా ఎన్. సుభాషిణి, ప్రధాన కార్యదర్శిగా కె.దేవదాసు, సహాయ కార్యదర్శులుగా ఎం. మల్లయ్య, ఎం. దేవేందర్రెడ్డి, ట్రెజరర్గా ఎల్. గోవిందరెడ్డిని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా ఆగయ్య వ్యవహరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి -
నేడు గురుపౌర్ణమి
● సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు హన్మకొండ కల్చరల్: ఆషాఢ శుద్ధ పూర్ణిమనే వ్యాస పూర్ణిమ అంటారు. వేద సంహితలను రాసిన వ్యాసభగవానుడిని పూజిస్తారు. వ్యాసభగవానుడు వ్యక్తికాదని గురువే అని భావించేవారు గురుపౌర్ణమిగా జరుపుకుంటారు. భక్తులు సాయిమందిరాల్లో ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో గురువారం హనుమకొండ బస్టాండ్ సమీపంలోని షిర్డీ సాయిబాబా మందిరం, యాదవనగర్లోని సాయిబాబా ఆలయం, పద్మాక్ష్మీనగర్లోని సాయిబాబా ఆలయం, భద్రకాళి దేవాలయం దగ్గర ఉన్న సాయిబాబా మందిరంలో గురుపౌర్ణమి సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. కాగా, హనుమకొండ బస్టాండ్ సమీపంలోని షిర్డీ సాయిబాబా మందిరంలో గురువారం ఉదయం 5 గంటల నుంచి ప్రభాతసేవ, 6 గంటలకు మంగళస్నానం, ఉదయం 8 నుంచి 11గంటల వరకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి, సాయంత్రం 5గంటలకు పూజలు ఉంటాయని చైర్మన్ మతుకుమల్లి హరగోపాల్ తెలిపారు. పత్తి పంటలో యాజమాన్య పద్ధతులు.. ● రైతులు అవగాహన పెంచుకోవాలి ● కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ రాజన్న మామునూరు: పత్తి పంటలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులపై రైతులు అవగాహన పెంచుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ రాజన్న సూచించారు. ఈ మేరకు బుధవారం మామునూరు, సింగారం, ఒంటి మామిడిపల్లి గ్రామాల్లో కృషి విజ్ఞాన కేంద్రం, మామునూరు వ్యవసాయ శాస్త్రవేత్తలు పత్తి పంటలను క్షేత్ర స్థాయిలో సందర్శించారు. మే చివరి వారం, జూన్ మొదటి వారంలో విత్తుకున్న పత్తి పంటలు, ప్రస్తుతం 30 నుంచి 45 రోజుల వయసులో ఉన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పంటలో తామర పురుగులు, పచ్చ దోమ, పేనుబంక, గోధుమ రంగు ముక్కు పురుగు ఉధృతి గమనించారు. వీటి నివారణకు రైతులు పంట తొలి దశ నుంచే సమగ్ర సస్య రక్షణ చర్యలు పాటించాలన్నారు. తామర పురుగుల నియంత్రణకు ఎకరాకు 10 చొప్పున నీలి రంగు జిగురు అత్తలు అమర్చుకోవాలన్నారు. -
గొర్రెల షెడ్డుపై తెగిపడిన విద్యుత్ తీగ..
● షార్ట్ సర్క్యూట్తో జీవాలు మృత్యువాత నెక్కొండ: గొర్రెల షెడ్డుపై 11 కేవీ విద్యుత్ తీగ తెగిపడడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి జీవాలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున మండలంలోని పెద్దకొర్పోలులో జరిగింది. గ్రామస్తులు, బాధితురాలు నూకల లక్ష్మి కథనం ప్రకారం.. లక్ష్మి ఇంటి సమీపంలో ఏర్పాటు చేసిన గొర్రెల షెడ్డుపై 11 కేవీ విద్యుత్ లైన్ వెళ్లింది. ఈ క్రమంలో ఇన్సూరేటర్ ఫెయిల్ కావడంతో విద్యుత్ తీగ తెగి పడింది. దీంతో షెడ్డు షార్ట్ సర్క్యూట్కు గురవడంతో 18 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనలో సుమారు రూ. 3 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితురాలు బోరున విలపించింది. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరింది. కాగా, గతంలోనూ ఇళ్ల పైనుంచి వెళ్లిన 11 కేవీ విద్యుత్ లైన్ను, ట్రాన్స్ఫార్మర్లను తొలగించాలని పలుమార్లు తెలిపినా అధికారులు స్పందించలేదని గ్రామస్తులు వాపోయారు. ఇప్పటికై నా సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. -
‘టీ– హబ్’ను సందర్శించిన వీసీ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్రెడ్డి, విశ్వవిద్యాలయం రూసా నోడల్ ఆఫీసర్ ఆర్. మల్లికార్జున్రెడ్డి బుధవారం హైదరాబాద్లోని టీ–హబ్ కార్యాలయాన్ని సందర్శంచారు. విశ్వవిద్యాలయం తరఫున ఒప్పందానికి సంబంధించి విధివిధానాలపై చర్చించారు. టీ–హబ్లో అందుబాటులో ఉన్న వసతులు, వనరులు, సదుపాయాలను పరిశీలించారు. ఈ వనరుల కాకతీయ యూనివర్సిటీకి కె–హబ్ అభివృద్ధికి ఎలా ఉపయోగపడుతాయనే అంశాలను పరిశీలించారు. టీ–హబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కవికృత్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్తాలుక్ పాల్గొని కె–హబ్ అభివృద్ధికి టీ–హబ్ తరుపున సహకారం ఉంటుందని తెలిపారని వీసీ ప్రతాప్రెడ్డి తెలిపారు. -
శిక్షణ అభ్యర్థులకు పరీక్షలు
హన్మకొండ చౌరస్తా: హనుమకొండలోని ప్రభుత్వ కాకతీయ డిగ్రీ కళాశాల ఎదుట గల ప్రభుత్వ వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో కంప్యూటర్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల్లో శిక్షణ పొందిన అభ్యర్థులకు బుధవారం పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన సెట్విన్ అధికారులు వనజ, సత్యనారాయణరెడ్డి పరీక్షలను పర్యవేక్షించారు. యువజన సర్వీసుల శాఖ సూపరింటెండెంట్ విజయశ్రీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. పరీక్ష కేంద్రాన్ని డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్ సందర్శించారు. కార్యక్రమంలో సిబ్బంది శ్రీనివాస్, సుమంద సోనీ, సోమ శైలజ, బొడ్డు నితీష, తదితరులు పాల్గొన్నారు. -
నేడు మహాశాకంబరీ అలంకరణ
హన్మకొండ కల్చరల్: నగరంలోని శ్రీభద్రకాళి దేవాలయంలో గురువారం(నేడు) అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలతో మహా శాకంబరీదేవిగా అలంకరించనున్నారు. దేవిగా అమ్మవారి రూపాన్ని దర్శించడానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు రానున్నారు. ఈమేరకు మహబూబాబాద్ శ్రీలక్ష్మీ శ్రీనివాస సేవా సమితి అధ్యక్షుడు జీకే రెడ్డి ఆధ్వర్యంలో సేవాసమితి సభ్యులు ఎనిమిది క్వింటాళ్ల కూరగాయలు అమ్మవారికి సమర్పించారు. బుధవారం రాత్రి సేవాసమితి సభ్యులు కూరగాయలను దండలుగా తయారుచేశారు. అమ్మవారి శాకంబరీ విశ్వరూప దర్శనం గురువారం ఉదయం 9గంటల నుంచి రాత్రి వరకు కొనసాగనుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈఓ శేషుభారతి తెలిపారు. లోక కల్యాణం కోసమే శాకంబరీ ఉత్సవాలు వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండి ప్ర జలు సుఖ సంతోషాలతో ఉండాలని శాకంబరీ ఉ త్సవాలు నిర్వహించనున్నారు. నేడు ఉదయం ని త్యాహ్నికం నిర్వహించిన అనంతరం 3 గంటల నుంచి శాకంబరీ అలంకరణ ప్రారంభమవుతుంది. 6గంటల పాటు అలంకరణ కొనసాగుతుంది. అ లంకరణ సమయంలో భక్తులను అనుమతించరు. అలంకరణ పూర్తయిన తర్వాత అమ్మవారి స్నపనభేరాన్ని మితాక్రమంలో, భోగాభేరాన్ని చిత్రాక్రమంలో పూజలు నిర్వహించి ఉదయం 9గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతించనున్నారు. ముద్రా, జ్వాలామాలినీ క్రమాలలో అమ్మవారికి పూజలు భద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్రోత్సవాల్లో భాగంగా 14వరోజు బుధవారం అమ్మవారిని ముద్రా, జ్వాలామాలినీ క్రమాలలో పూజలు జరిపారు. ఆలయ అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించి అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని ముద్రా అమ్మవారిగా, షోడశీక్రమాన్ని అనుసరించి భోగభేరాన్ని జ్వాలామాలినీ అమ్మవారిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ఈఓ శేషుభారతి, ధర్మకర్త తొనుపునూరి వీరన్న, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. భద్రకాళి ఆలయంలో ఏర్పాట్లు పూర్తి తరలిరానున్న వేలాది మంది భక్తులు -
15 రోజుల్లో.. ఇంటికే ఓటరు కార్డు
మొగుళ్లపల్లి: ఓటరు గుర్తింపు కార్డు ఇక నుంచి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే నేరుగా ఇంటికే రానుంది. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడంతో పాటు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 15 రోజుల్లోనే ఇంటికే ఓటరు గుర్తింపు కార్డు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో యువతను చైతన్యపర్చేందుకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. మార్పులు, చేర్పులు కూడా.. ఇదివరకే ఓటరుగా నమోదై జాబితాలో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి సైతం 15 రోజుల్లోనే ఇంటికే ఓటరు కార్డు పంపించనున్నారు. ఇప్పుడు ఉన్న సిస్టమ్ ప్రకారం ఓటర్లకు ఎలక్ట్రోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డు చేయడానికి నెలకు పైగా సమయం పడుతుంది. దీని కోసం కేంద్ర ఎన్నికల సంఘం నూతన ప్రామాణిక నిర్వహణ విధానాన్ని ప్రవేశపెట్టింది. కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు నమోదును ప్రోత్సహించడానికి సరికొత్త మార్గంఅర్హులు ఓటరుగా నమోదు కావాలి..అర్హులు ఓటరుగా నమోదు కావాలి. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలి. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఓటరు నమోదుపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వారికి 15 రోజుల్లోనే గుర్తింపు కార్డు రానుంది. –సునీత, తహసీల్దార్, మొగుళ్లపల్లి -
కేంద్రం మొండి వైఖరి వీడాలి
హన్మకొండ: విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర కోచైర్మన్ ఇనుగాల శ్రీధర్ డిమాండ్ చేశారు. దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం విద్యుత్ అధికారులు, ఉద్యోగులు విధులు బహిష్కరించి టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 50 లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారన్నారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించాలనే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో దేశ వ్యాప్తంగా సమ్మె చేస్తామని హెచ్చరించారు. పేద, మద్య తరగతి ప్రజలున్న దేశంలో విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించడం సరికాదన్నారు. ఇప్పటికే విద్యుత్ చార్జీలు అధికంగా ఉన్నాయని, ప్రైవేటీకరిస్తే చార్జీలు మరింత పెరిగే ప్రమాదముందన్నారు. దీనిని వినియోగదారులు, రైతులు భరించలేరన్నారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వీడాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు వేమునూరి వెంకటేశ్వర్లు, బి.సామ్యా నాయక్, ఎన్.సుబ్రహ్మణ్యేశ్వర్ రావు, పి.మల్లికార్జున్, పి.మహేందర్ రెడ్డి, కె.రంగా రావు, ఎ.ఆనందం, ఎన్.కుమారస్వామి, అజ్మీరా శ్రీరాం నాయక్, వాలు నాయక్, బి.ఆంజనేయులు, ఆర్.నవీన్, జె.అరుణ్, ఎల్.శ్రీనివాస్, జె.హర్జీ నాయక్, మచ్చిక బుచ్చయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర కోచైర్మన్ శ్రీధర్ -
దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
● 18 ఏళ్లు నిండి ప్రతి ఒక్కరూ ఈసీఐ గవర్నమెంట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్లి తమ ఫోన్ నంబర్, ఈ–మొయిల్ ఐడీతో సైన్ అప్ కావాలి. ● క్రియేట్ చేసిన అకౌంట్పై క్లిక్ చేసి తన పేరు, పాస్వర్డ్ నమోదు చేయాలి. తర్వాత పాస్వర్డ్ నిర్ధారించాలి. ● సైన్ అప్ అయిన ఈ–మొయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది. దానిని ఎంట్రీ చేసి అందులో ఓటరు వివరాలు నమోదు చేసుకోవాలి. తర్వాత మొబైల్ నంబర్, పాస్వర్డ్ నమోదు చేసి ఓటీపీతో లాగిన్ అవ్వాలి. ● కొత్తగా ఓటరు నమోదు చేసుకునే వారు ఫామ్–6తో వ్యక్తిగత వివరాలు, అడ్రస్ తదితర వివరాలు నమోదు చేసి అందులో పేర్కొన్న ధ్రువపత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అనంతరం మరోసారి వివరాలను సరిచూసుకుని సబ్మిట్ చేయాలి. ● మార్పులు, చేర్పుల కోసం ఫామ్–8, ఓటరు పేరు తొలగించుకునేందుకు ఫామ్–7 నింపాలి. ● ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ పై క్లిక్ చేస్తే దరఖాస్తు చేసిన సమయంలో ఎస్ఎంఎస్ వచ్చిన రెఫరెన్స్ నంబర్ను నమోదు చేసి సబ్మిట్ చేస్తే అప్లికేషన్ స్టేటస్ ఎంతవరకు వచ్చిందో తెలుస్తుంది. -
ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించకుంటే అంధకారమే
హన్మకొండ: విద్యుత్ ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుళ్తామని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ కె.ఈశ్వర్ రావు, కన్వీనర్ ఎం.ఎ.వజీర్ అన్నారు. విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులను శాశ్వత ఎంప్లాయ్గా కన్వర్షన్ చేయాలని డిమాండ్తో జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట మహా ధర్నా చేశారు. అంతకు ముందు హనుమకొండ పబ్లిక్ గార్డెన్ నుంచి ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు సమ్మెకు వెళ్తే రాష్ట్రంలో అంధకారం తప్పదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఇతర శాఖల్లో ఉన్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో ఆర్టిజన్ ఉద్యోగులను పోల్చొద్దన్నారు. ఇది కంపెనీ అని, ఐడీ యాక్ట్ వర్తిస్తుందన్నారు. యాజమాన్యానికి తమకు లేబర్ కమిషనర్ ఎదుట 12(3) ఒప్పందం కూడా కుదిరిందన్నారు. ఆ ఒప్పందాన్ని గత ప్రభుత్వం తుంగలో తొక్కి స్టాండింగ్ రూల్స్ తీసుకొచ్చిందని, ఈ రూల్స్కు వ్యతిరేకంగా పది నెలలుగా జరుగుతున్నదే ఈ కన్వర్షన్ పోరాటమన్నారు. ఈ నెల 14 ఉదయం 6 గంటల నుంచి సమ్మె చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ నెల 10న లేబర్ కమిషనర్తో చర్చలున్నాయని, ఈ చర్చలు సఫలం కాకపోతే నిరవధిక సమ్మె తప్పదన్నారు. తెలంగాణ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ రాష్ట్ర కోకన్వీనర్ కందికొండ వెంకటేశ్, కోకన్వీనర్ కృష్ణమాచారి. నాయకులు చంద్రారెడ్డి, సలీంపాషా, రఘునాథరెడ్డి, ప్రసాద రాజు, మురళి, ఐలయ్య, రాజన్న, జయచందర్, సృజన, శ్రీనాథ్, శ్రీకాంత్, రాజేందర్ పాల్గొన్నారు. ఏపీ ఎస్ఈబీ సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలి తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ కె.ఈశ్వర్ రావు, కన్వీనర్ ఎం.ఎ.వజీర్ -
8 కిలోల ఎండు గంజాయి పట్టివేత
ఖిలా వరంగల్ : కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 8.7 కిలోల సరుకు స్వాధీనం చేసుకున్నామని వరంగల్ ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బుధవారం వరంగల్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్ల డించారు. భువనేశ్వర్ నుంచి ముంబాయి వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో డ్రగ్ కంట్రోల్ బృందం సీఐ సతీశ్, ఎస్సై పూర్ణచందర్, ఆర్పీఎఫ్ ఏఎస్సై దుర్గాప్రసాద్, సిబ్బందితో కలిసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో మహారాష్ట్ర డైసర్కు చెందిన ఎండి. అష్రఫ్ షేక్, డోంగ్రి శాంతినగర్కు చెందిన రహీం బాబన్ పటేల్, ఉత్తర్ప్రదేశ్ ప్రయాగ్రాజ్ జిల్లాకు చెందిన రాజు ఠాకూర్, మహారాష్ట్ర రత్నగిరి దైసార్కు చెందిన ప్రవీణ్ శ్యామ్ తవుడే అనుమానాస్పదంగా కనిపించారు. వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా అందులో 8.7 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. దీంతో గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసినట్లు ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. నలుగురు నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన వరంగల్ ఆర్పీఎఫ్ సీఐ శ్రీనివాస్ గౌడ్ -
హత్య కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు
వరంగల్ లీగల్ : నగరంలోని ఉర్సు గుట్ట సమీపంలో వనం రాకేశ్ అనే వ్యక్తిని హత్య చేసినఘటనలో శివనగర్కు చెందిన గాడుదుల రాజేశ్, జున్ను హరికృష్ణ అలియాస్ బంటికి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.15 వేల చొప్పున జరిమానా విధిస్తూ వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి నిర్మలా గీతాంబ బుధవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. 2022, ఆగస్టు 27న వనం రాకేశ్ తన మిత్రులు మరుపట్ల నిఖిల్, శివ, తదితరులతో ఉర్సు గుట్ట సమీపంలోని మహాలక్ష్మి బేకరీ వద్ద ఉ న్న సమయంలో కడిపికొండ వైపు నుంచి బైక్పై ఇద్దరు వ్యక్తులు వచ్చారు. రాకేశ్, తన మిత్రుల సమీపంలోకి వచ్చి మూత్ర విసర్జన చేస్తుండగా ఇక్కడ చేయడం ఏమిటని ప్రశ్నించారు. దీంతో రాకేశ్తో నిందితులు ఘర్షణ పడుతుండగా రాకేశ్ మి త్రులు నిఖిల్, శివ నివారించారు. దీంతో ఇద్దరు వ్య క్తులు(బైక్పై వచ్చిన వారు).. రాజేశ్, హరికృష్ణ అలియాస్ బంటికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పగా సుమారు తొమ్మిది మంది అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో ఉర్సు గుట్టకు చేరుకుని అక్కడే ఉన్న రాకేశ్, నిఖిల్పై దాడి చేశారు. హరికృష్ణ కత్తితో రాకేశ్ను పొడవగా అడ్డుకోవడానికి వెళ్లిన తన స్నేహితులు నిఖిల్, శివకు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం మేరకు స్థానికులు అంబులెన్స్లో బాధితులను ఎంజీఎం తరలించారు. చికిత్స పొందుతూ మరుసటి రోజు రాకేశ్ మృతి చెందాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు మిల్స్కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపర్చారు. విచారణలో గాడుదుల రాజేశ్, జున్ను హరికృష్ణ అలియాస్ బంటిపై నేరం రుజువుకావడంతో ఇద్దరికి 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ.15 వేల చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి నిర్మలా గీతాంబ తీర్పు వెలువరించారు. ఈ కేసును పోలీస్ అధికారులు శ్రీనివాస్, రమేశ్ పరిశోధించగా లైజన్ ఆఫీసర్ హరికృష్ణ పర్యవేక్షణలో కానిస్టేబుల్ ప్రతాప్, హోంగార్డు సదానందం సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ పక్షాన పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిరబోయిన శ్రీనివాస్ కేసు వాదించారు. తీర్పు వెలువరించిన వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి -
వైద్యం వికటించి వృద్ధుడి మృతి?
తొర్రూరు/ కొడకండ్ల: వై ద్యం వికటించడంతోనే వృద్ధుడు మృతి చెందా డని ఆరోపిస్తూ బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన డివిజన్ కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆ స్పత్రిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జనగామ జి ల్లా కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు పొన్నం పాండురంగయ్య(70) గ్రామాల్లో దుస్తుల విక్రయాలు జరుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. రోజు వారి మాదిరిగానే బుధవారం కూడా గ్రామాలు తిరిగి ఇంటికి చేరుకున్న సమయంలో తీవ్ర కడుపు నొప్పికి గురయ్యాడు. ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా తొర్రూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని సూచించాడు. దీంతో తొర్రూరులోని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకురాగా వైద్యుడు పరీక్షించి ఇంజక్షన్లు, ఇతర వై ద్యం చేశాడు. అయినా నొప్పి తగ్గకపోవడంతో స్కానింగ్ తీసుకురావాలని సూచించాడు. దీంతో పట్టణంలోని ఓ స్కానింగ్ సెంటర్కు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందగా వృద్ధుడి మృతదేహంతో బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందో ళన చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆందోళనకారులు శాంతించలేదు. చివరకు ఆస్పత్రి తరఫున పరిహారం అందేలా కృషి చేస్తామని మ ద్యవర్తులు తెలపడంతో మృతదేహాన్ని తీసుకెళ్లారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై ఎస్సై ఉపేందర్ వివరణ కోరగా ఫిర్యాదు అందలేదని తెలిపారు.● ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన ● తొర్రూరులో ఘటన -
ముందుకు సాగట్లే.. !
ఉమ్మడి జిల్లాకు కలిసిరాని వానాకాలం ● గత సీజన్లో ఇప్పటికే 74శాతం.. ఈ సారి 34.50 శాతానికే పరిమితం ● సాగు అంచనా 15.83 లక్షల ఎకరాలు.. ఇప్పటికీ అయ్యింది 5.46 లక్షల ఎకరాలు ● లోటు వర్షపాతం ఖాతాలో ఆరు జిల్లాలు ● కష్టకాలంలో పత్తి సాగువైపే మొగ్గు... వరి సాగుపై వేచి చూసే ధోరణిసాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి జిల్లా రైతులకు ఈ వానాకాలం అనుకూలించడం లేదు. గతేడాది ఇదే సమయంలో కురిసిన భారీ వర్షాలకు జలాశయాలు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. గోదావరి, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కానీ, ఈ సీజన్లో రైతులకు ఆ పరిస్థితి లేదు. ముందస్తు వర్షాలకు మురిసిన రైతులు ఇప్పుడు దిగులు పడుతున్నారు. మే నెలలో కురిసిన వర్షాలకు కొందరు దుక్కులు దున్నుకుని పత్తి విత్తనాలను వేస్తే.. మరికొందరు పొలాలు సిద్ధం చేసుకుని నారు పోసుకున్నారు. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో వర్షాలు లేక చాలా వరకు పత్తి, మొక్కజొన్న విత్తనాలు భూమిలో ఎండిపోగా.. పొలాలు దున్నిన రైతులు సైతం ఇప్పటికీ వేచిచూసే ధోరణిలోనే ఉన్నారు. వానాకాలం మొదలై రెండు మాసాలు నడుస్తున్నా.. ఇప్పటికీ లోటు వర్షపాతమే ఉంది. దీంతో జలాశయాలు, చెరువులకు నీరు చేరక.. పెరిగిన భూగర్భజలాలు కూడా అంతంతే కావడంతో రైతులకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదును దాటుతున్నా సాగు 34.50 శాతమే.. మే 28, 30 తేదీల్లో ముందస్తుగానే వర్షాలు పడటంతో సాగు విస్తీర్ణం అంచనాలు దాటుతుందని అందరూ భావించినా.. ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గతేడాది వానాకాలంలో 14.15 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని భావించగా, 15.45 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. గత సాగును దృష్టిలో పెట్టుకుని ఈ సీజన్లో ఉమ్మడి వరంగల్లో 15,82,755 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు వేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. కానీ, వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈసారి సాగు ముందుకు కదలడం లేదు. గతేడాది ఇదే సమయానికి 74 శాతం వరకు పంటలు వేయగా.. అదును దాటుతున్న ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో 5,46,138 (34.50 శాతం) ఎకరాల్లోనే సాగు చేశారు. ముందస్తుగా ఒకటి రెండు వర్షాలు పడినా..ఆశించిన మేరకు వర్షపాతం నమోదు కాకపోవడం వల్ల ఈసారి ఆశించిన మేరకు సాగు పెరగలేదని, అయితే ఇంకా సమయం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఇంకా లోటు వర్షపాతమే... వరి సాగు 6.39 శాతమే.. జనగామ జిల్లాలో 47 శాతం, జయశంకర్ భూపాలపల్లిలో 30 శాతం లోటు వర్షపాతం ఉండగా.. మహబూబాబాద్లో సాధారణ వర్షపాతానికంటే 18 శాతం తక్కువగా నమోదైంది. అలాగే వరంగల్లో 23, ములుగులో 32, హనుమకొండలో 30శాతం తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో గతంతో పోలిస్తే సాగు తగ్గినా.. రైతులు కష్టకాలంలోనూ వర్షాధార పంటగా పత్తిని ఎంచుకున్నారు. 5,76,863 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేయగా, ఇప్పటి వరకు 4,07,554 (70.28 శాతం) ఎకరాల్లో వేశారు. కాగా 8,78,376 ఎకరాల వరిసాగు అంచనాకు కేవలం 56,155 (6.39 శాతం) ఎకరాల్లోనే వరి పంటలు వేయడం ఈసారి ప్రతికూల పరిస్థితులకు అద్దం పడుతోంది. ఉమ్మడి వరంగల్లో 2025–2026 వానాకాలం సాగు అంచనా, సాగు లెక్క ఇదీ..మొత్తం సాగు అంచనా ఎకరాలు5,46,138 మొత్తం సాగు శాతం : 34.50 శాతం15,82,755