breaking news
Mahabubabad
-
‘కొలంబో’పై సీబీఐ కేసుతో ఉత్కంఠ
కాజీపేట రూరల్ : ఫాదర్ కొలంబో మెడికల్ కళాశాలపై సీబీఐ కేసు ఘటన అందరిలో ఉత్కంఠ రేపుతోంది. వరంగల్ హంటర్ రోడ్డు బ్రిడ్జి సమీపంలోని ఫాదర్ కొలంబో మెడికల్ ఆస్పత్రి (ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) సీబీఐ కేసు ఘటన మెడికేర్ ఆస్పత్రి వర్గాల్లో, మెడికల్ కాలేజీ వర్గాల్లో దడ పుట్టిస్తోంది. 2023లో అప్పటి వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీష్రావు ఈ మెడికల్ కళాశాలను ప్రారంభించారు. క్యాంపస్లో మెడికేర్ జనరల్ ఆస్పత్రి, ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ, పారా మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ నిర్వహిస్తున్నారు. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం మెడికల్ విద్యార్థులకు ల్యాబ్ సదుపాయాలు, బోధన, వసతి, పరికరాలు, ఫ్యాకల్టీ, మేనేజ్మెంట్ సిస్టం మొదలగునవి నిర్వహణ ఉండాలి. మెడికల్ కాలేజీ నిర్వాహణలో నిబంధనలు ఉన్నాయా లేదా అనే అనుమానాలు వస్తున్నాయి. కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు అధికార అనుమతుల కోసం ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ ట్రస్టీ మెంబర్ కొమ్మారెడ్డి జోసెఫ్ మెడికల్ కాలేజీల తనిఖీలో అనుకూలంగా నివేదికలు ఇచ్చేందుకు రూ.46 లక్షలు లంచం ఇచ్చినట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కాంలో తేలింది. ఈ విషయంలో జోసెఫ్పై సీబీఐ కేసు నమోదు చేసింది. కాగా ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ సీబీఐ కేసు విషయంలో అసలు ఏం జరుగుతుందని ఆస్పత్రి వర్గాలు, మెడికల్ కాలేజీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం అన్ని విధాలుగా కళాశాల నడుస్తుందని కాలేజీ వర్గాలు అంటున్నాయి. ఆస్పత్రి, మెడికల్ కాలేజీ వర్గాల్లో టెన్షన్ టెన్షన్ -
‘జూనోటిక్’తో జాగ్రత్త
సంగెం/మహబూబాబాద్/హన్మకొండ : కుక్కలు, పశువులు, కోళ్లు, పక్షులు, ఇతర జంతువుల నుంచి సంక్రమించే జూనోటిక్ వ్యాధుల విషయంలో జంతు ప్రేమికులు, పశుపోషకులు జాగ్రత్తగా ఉండాలి. పశువులు, వాటి పాకల అపరిశుభ్రత తదితర కారణాలతో సుమారుగా 200 రకాల నేడు (ఆదివారం) ప్రపంచ జూనోసిస్ డే ను జరుపుకుంటున్న సందర్భంగా వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తం చేయడంతో పాటు వ్యాధులపై విస్త్రత ప్రచారం కల్పించాల్సి అవసరముంది. ఈ సందర్భంగా సంగెం పశువైద్యాధికారి వల్లె రాజు, మహబూబాబాద్ జిల్లా పశువైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కిరణ్కుమార్, వడ్డెపల్లి పశువైద్యశాల వైద్యాధికారి ప్రవీణ్ కుమార్ పలు సూచనలు చేశారు. పెంపుడు కుక్కలు, ఇతర జంతువుల యజమానులు రేబిస్ నివారణకు టీకాలు తప్పనిసరిగా వేయించాలని తెలిపారు. పశువైద్యశాలల్లో రేబిస్ నివారణ టీకాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. రేబిస్ సోకిన వీధి కుక్కలు కరిస్తే పాడి పశువులు సైతం మృత్యువాత పడే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. జూనోసిస్ డే సందర్భంగా నేడు (ఆదివారం)ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు టీకా కార్యక్రమంలో ఉంటుందని పశువైద్యులు తెలిపారు. యజమానులు తమ పెంపుడు జంతువులతో ఉదయం 8 గంటల వరకు పశు వైద్య కేంద్రానికి చేరుకోవాలన్నారు. పెంపుడు కుక్కలకు టీకాలు.. ఇంట్లో పెంచే పెంపుడు కుక్కలకు మొదటిసారి 30 వ రోజు, బూస్టర్ డోస్ 90 రోజులకు, దీంతో పాటుగా ఏటా రేబిస్ నివారణ టీకాలు వేయించాలి. కుక్కలతో సన్నిహితంగా ఉండేవారు రేబిస్ సోకకుండా వ్యాధి నివారణ టీకాలు వేయిస్తూ ఉండాలి. ఈ వ్యాధులు కూడా.. హైడాటిసిస్, ఏకై కోకస్ (అంతర్గత పరాన్న జీవులు) కారణంగా కూడా మనుషులకు జూనోటిక్ వ్యాధులు సోకుతాయి. పశువులు, కుక్కల శరీరంలో ఉండే బద్దె పురుగులు గుడ్లు పెడతాయి. పశువుల మాంసాన్ని సరిగా ఉడికించకుండా తింటే బద్దె పురుగుల గుడ్లు మానవుల శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యాన్ని కలుగజేస్తాయి. ఇక కోళ్లఫారాల్లో పనిచేసే వారికి, సరిగా ఉడికించని గుడ్లు, మాంసం తిన్నవారికి సాల్మోనుల్లోసిస్ సోకుతుంది. కుళ్లిన ఆహార పదార్థాలు తిన్నవారు కూడా ఈ వ్యాధి బారిన పడతారు. పశువులకు రేబిస్ సంక్రమణ ఇలా... పశువులకు పిచ్చికుక్కలు కరవడం ద్వారానే ఎక్కువగా రేబిస్ సోకుతుంది. రేబిస్ ఎక్కువగా కుక్కలు, పిల్లులు, ముంగీసలు, నక్కలు, తోడేళ్లు తదితర జంతువుల ద్వారా చిట్టెలుక నుంచి ఏనుగు వరకు అన్ని క్షీరదాలకు సోకుతుంది. కుక్క కరిచిన తర్వాత వ్యాధి లక్షణాలు 2నుంచి 3 వారాల తర్వాత కనబడుతాయి. మెడ ప్రాంతాల్లో కరిస్తే వ్యాధి లక్షణాలు త్వరగా కనబడుతాయి. పెంపుడు కుక్కలకు క్రమం తప్పకుండా ప్రతీ ఏటా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ (ఏఆర్వీ) ఇప్పిస్తే వ్యాధిని అరికట్టవచ్చు. అంత్రాక్స్, బ్రూసెల్లోసిస్ పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు అనేకం. దొమ్మ (అంత్రాక్స్) మటన్ కొట్టే వారికి, గొర్రెలు, మేకలు, పశువులు చనిపోతే చర్మకోసం వాటిని కోసేవారికి ఈ వ్యాధి సోకే ప్రమాదముంది. కొమ్ములు, చర్మం, ఎముకలతో సంబంధమున్న పరిశ్రమల్లో పనిచేసే వారికి ఈ వ్యాధి సోకవచ్చు. బ్రూసెల్లోసిస్ ఇది డెయిరీఫాంలో పనిచేసే వారికి, పశు వైద్యులకు సోకే అవకాశముంది. పందులను కరిచిన దోమ మనుషులకు కుట్టినప్పుడు మెదడువాపు వ్యాధి వ్యాప్తి చెందుతుంది. పందులను మనుషులకు దూరంగా ఉంచడం, వ్యాధినిరోధక టీకాలు వేయించడం ద్వారా ఈ వ్యాధి నివారించవచ్చును. పెంపుడు కుక్కలతో జర భద్రం రేబిస్ నివారణకు టీకా తప్పనిసరి నేడు ప్రపంచ జూనోసిస్ దినోత్సవంనివారణ చర్యలు..వ్యాధులు సోకిన జంతువులు, కోళ్ల మాంసం, గు డ్లు సరిగా ఉడికించకుండా తినకూడదు. పాడైన, అపరిశుభ్రంగా ఉన్న పాలు, మాంసం, గుడ్లను ఆహారంగా తీసుకోకూకుడు. రేబిస్ సోకిన పశువుల పాలు తాగకూడదు. పాడి పశువులు, జంతువుల పాకలను ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచాలి. పశువులు, జంతువులు, పక్షులు, కోళ్లకు కాలానికి అనుగుణంగా రోగ నిరోధక టీకాలను వేయించా లి. పెంపుడు కుక్కలకు ప్రతి మూడు నెలలకు ఒకసారి డీవార్మింగ్ మందులు తినిపించాలి. చనిపోయిన పశువులు, జంతువులను దూర ప్రాంతాల్లో లోతైన గుంతలో సున్నం చల్లి పూడ్చిపెట్టాలి. నేడు ప్రపంచ జూనోసిస్ డే జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను నివారించేందుకు చాలా ఏళ్ల పాటు బ్రిటిష్ శాస్త్రవేత్తలు టీకాతో ప్రయోగాలు చేశారు. 1885 జూలై 6వ తేదీన లూయిస్ పాశ్చర్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా పిచ్చికుక్క కరిచిన ఓ బాలుడికి వ్యాధి నిరోధక టీకా ఇచ్చారు. ఆ ప్రయత్నం విజయవంతం కావడంతో అప్పటి నుంచి ఆ రోజును ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా పాటిస్తున్నారు. -
స్నాతకోత్సవాన్ని అడ్డుకోవద్దు
కేయూ క్యాంపస్ : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ను కాకతీయ యూనివర్సిటీలో నిర్మించేందుకు పాలకమండలి ఆమోదం తెలపగా దాన్ని వెనక్కి తీసుకోవాలని వివిధ విద్యార్థి సంఘాలు కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న విషయం విదితమే. అంతేగాకుండా ఆమోదాన్ని వెనక్కి తీసుకోకపోతే ఈనెల 7న కేయూలో జరిగే స్నాతకోత్సవాన్ని అడ్డుకుంటామని కూడా వివిధ విద్యార్థి సంఘాలు హెచ్చరించిన విషయం విదితమే. దీంతో కేయూ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులతో క్యాంపస్లోని అకడమిక్ కమిటీ హాల్లో సమావేశం నిర్వహించి, వారితో చర్చలు జరిపారు. హహనుమకొండ ఏసీపీ నర్సింహారావు, కేయూ పోలీస్ స్టేషన్ సీఐ రవికుమార్ పాల్గొన్నారు. స్నాతకోత్సవ వేడుకకు సహకరించాలని వీసీ, రిజిస్ట్రార్ విద్యార్థి సంఘాల బాధ్యులను కోరారు. ఈ సందర్భంగా వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు యంగ్ ఇండియా స్కూల్కు ఎట్టి పరిస్థితుల్లోను భూమి ఇవ్వొద్దని యూనివర్సిటీ భూమిని కేటాయిస్తూ పాలక మండలి ఎలా ఆమోదిస్తుందని ప్రశ్నించినట్లు సమాచారం. పాలకమండలి ఆమోదంను వెనక్కి తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా తమకు పీహెచ్డీ అడ్మిషన్లు కల్పించాలని పలు విద్యార్థి సంఘాల బాధ్యులు కోరారని సమాచారం. మరో రెండు విద్యార్థి సంఘాల బాధ్యులు ఇంటిగ్రేటెడ్ స్కూల్కు భూమిని కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామని యూనివర్సిటీ భూమిలోనే నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీంతో కొద్దిసేపు వారి మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకున్నట్లు సమాచారం. గవర్నర్కు వినతిపత్రం ఇచ్చేందుకు అవకాశం యూనివర్సిటీ సమస్యలపై గవర్నర్కు విన్నవించేందుకు తమకు అవకాశం కల్పించాలని పలు విద్యార్థి సంఘాల బాధ్యులు కోరారు. స్నాతకోత్సవం తర్వాత లంచ్ అయిపోయాక కేయూ గెస్ట్హైజ్ వద్ద గవర్నర్ను కలిసేలా అవకాశం కల్పిస్తామని విద్యార్థి సంఘాల నాయకులకు హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, వీసీ ప్రతాప్రెడ్డి తెలియజేశారని సమాచారం. దీంతో విద్యార్థి సంఘాల బాధ్యులు కూడా ఒకే అన్నట్లు తెలిసింది. భూమిని కేటాయించబోమని.. పీహెచ్డీ అడ్మిషన్లు కల్పించాలని.. ఇంటిగ్రేటెడ్ స్కూల్కు కేయూ భూమిని కేటాయించబోమని వీసీ ప్రతాప్రెడ్డి ఆదివారం వరకు ప్రకటించాలని లేనిచో స్నాతకోత్సవాన్ని అడ్డుకుంటామని ఓ విద్యార్థి సంఘం నాయకులు తేల్చిచెప్పారని సమాచారం. అలాగే తమకు పీహెచ్డీలో ప్రవేశాలు కల్పిస్తామని కూడా వీసీ ప్రకటించి హామీ ఇవ్వాలని లేకుంటే స్నాతకోత్సవాన్ని అడ్డుకుంటామని మరో విద్యార్థి సంఘం నాయకుడు తేల్చి చెప్పారని సమాచారం. ఈ పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలనే విషయంలో పోలీస్ అధికారులు తర్జనభర్జన పడుతున్నారని సమాచారం. వీసీ, రిజిస్ట్రార్, పోలీసు అధికారులు విద్యార్థి సంఘాల నాయకులతో చర్చలు -
చికిత్స పొందుతున్న అన్మ్యాన్ కార్మికుడి మృతి
కురవి : నేరడ గ్రామానికి చెందిన విద్యుత్ శాఖలో అన్మ్యాన్ కార్మికుడు బుర్ర శ్రీకాంత్ (35) చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. నేరడకు చెందిన శ్రీకాంత్ 15ఏళ్లుగా విద్యుత్ శాఖలో అన్మ్యాన్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. జూన్ 6వ తేదీన తట్టుపల్లి శివారు చంద్యా తండా గ్రామంలో ఓ రైతు చేను వద్ద విద్యుత్ స్తంభం ఎక్కి ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని మానుకోటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్లోని ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించి నడుముకు శస్త్ర చికిత్స చేయించారు. చికిత్స పొందుతున్న శ్రీకాంత్ను ఈనెల 3వ తేదీన ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చారు. శనివారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య స్వప్న, ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీకాంత్ మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది. విద్యుత్ శాఖ తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు. -
ఇరువర్గాల దాడి.. తీవ్ర ఉద్రిక్తత
● సోషల్ మీడియాలో పోస్టే ఘర్షణకు కారణం..? రామన్నపేట : వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తవాడకు చెందిన తుమ్మలకుంట ప్రాంతంలో శుక్రవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మొదట ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు యువకుల మధ్య జరిగిన దాడి రెండు కుటుంబాలతో పాటు రెండు ప్రాంతాలకు విస్తరించి సాముహిక దాడికి దారితీసింది. ఇరువర్గాల ఫిర్యాదుతో మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇన్స్పెక్టర్ గోపి తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తవాడ తుమ్మలకుంటకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి సాజిద్, అదే ప్రాంతానికి చెందిన పదో తరగతి విద్యార్థి అర్ఫాత్ మధ్య శుక్రవారం సాయంత్రం మాటమాట పెరిగి గొడవకు దారితీసింది. గాయపడిన అర్ఫాత్ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలపడంతో ఆగ్రహించిన కుటుంబీకులు రాత్రి 8 గంటలకు సాజిద్ ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డారు. వెంటనే విషయం తెలుసుకున్న సాజిద్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు 9గంటల సమయంలో అర్ఫాత్ ఇంటికి వెళ్లి వారి ఇంటిపై దాడి చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు గ్రూపులు విడిపోయి ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున దాడి చేసుకునేందుకు సన్నద్ధమవుతున్న క్రమంలో స్థానికులతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వారిని శాంతింప చేశారు. ఈ ఘటనకు కారణమైన వ్యక్తులను పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం సాజిత్, అర్ఫాత్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు. ఆ.. పోస్టే ఘర్షణకు కారణం? శుక్రవారం రాత్రి నగరంలోని తుమ్మలకుంటలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరు వర్గాలు దాడి చేసుకోవడానికి ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్టే కారణమని చర్చించుకుంటున్నారు. మైనర్లు ప్రేమించుకుంటున్నామని నెపంతో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుతో ఇరు కుటుంబ సభ్యులు ఘర్షణకు పాల్పడ్డట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఉత్సాహంగా చెస్ పోటీలు వరంగల్ స్పోర్ట్స్ : హనుమకొండలోని టీటీడీ కల్యాణ మంటపంలో ఉమ్మడి వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు నిర్వహించనున్న ఓపెన్ టు ఆల్ చెస్ పోటీలు శనివారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 112మంది క్రీడాకారులు వచ్చినట్లు టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి పి.కన్నా పేర్కొన్నారు. ఆర్బిటర్లు సీహెచ్ శ్రీని వాస్, డి.ప్రేమ్సాగర్, ఫ్రాంక్లిన్, కట్కూరి అక్షయ్, ప్రశాంత్ పాల్గొన్నారు. -
సహకార భావనతోనే సమాజాభివృద్ధి
● టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు హన్మకొండ : సహకార భావనతోనే సమాజాభివృద్ధి సాధ్యమనే నినాదంతో సహకార ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలపాలని రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు ఆకాంక్షించారు. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ సహకార వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా డీసీసీబీ కార్యాలయ ఆవరణలో రవీందర్ రావు మొక్క నాటి, మాట్లాడుతూ.. ప్రతి ఏటా జూలై మొదటి శనివారాన్ని అంతర్జాతీయ సహకార దినోత్సవంగా జరుపుకుంటారని వివరించారు. సహకార సంస్థల పాత్ర, వాటి ప్రయోజనాలు, సామాజిక ప్రభావాన్ని విశ్వవ్యాప్తంగా తెలియజేయడమే సహకార దినం ఉద్దేశమన్నారు. 2012లో మొదటి అంతర్జాతీయ సహకార సంవత్సరం నిర్వహించినట్లు గుర్తు చేశారు. 13 సంవత్సరాల తర్వాత ఈ వేడుకలు నిర్వహించుకుంటున్నామన్నారు. తెలంగాణలో మహిళా సహకార సంఘాలు, స్వయం సహాయక సమూహాలు ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. యువతకు సహకార రంగాల్లో శిక్షణ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా సహకార అధికారి సంజీవ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్లు ఎన్నమనేని జగన్మోహన్ రావు, నరేందర్, సీఈఓ వజీర్ సుల్తాన్, జీఎంలు ఉషా శ్రీ, పద్మావతి, డీజీఎం అశోక్, ఏజీఎంలు గొట్టం స్రవంతి, మధు, రాజు, గంప స్రవంతి, కృష్ణ మోహన్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. -
సంస్థ అభివృద్ధికి పాటుపడాలి
● ఎన్పీడీసీఎల్ హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావుహన్మకొండ : సంస్థ అభివృద్ధికి ఉద్యోగ సంఘాలు పాటుపడాలని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి.మధుసూదన్ రావు తెలిపారు. శనివారం నక్కలగుట్టలోని హనుమకొండ సర్కిల్ కార్యాలయంలో ఎస్ఈ మధుసూదన్ రావుకు తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ హనుమకొండ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.శశికుమార్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ ఉద్యోగులను అంకితభావంతో పని చేయించడంలో సంఘాలు తమ పాత్రను పోషించాలన్నారు. కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ధరావత్ లక్ష్మణ్ నాయక్, కార్యదర్శి కడెం మహేష్, సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ సాంబరాజు శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్లు గొలుసు ఉపేందర్, సంపత్ కుమార్, ఉపాధ్యక్షులు, అదనపు కార్యదర్శులు, సెక్రెటరీలు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, కోశాధికారి పాల్గొన్నారు. -
రేపే కేయూ స్నాతకోత్సవం
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఈనెల 7న (సోమవారం) నిర్వహించనున్న స్నాతకోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి తెలిపారు. శనివారం కేయూలోని సెనేట్ హాల్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వీసీ వివరాలు వెల్లడించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్వర్మ స్నాతకోత్సవానికి హాజరు కానున్నారని తెలిపారు. ముఖ్యఅతిథిగా శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత, హైదరాబాద్లోని ఐఐసీటీ డైరెక్టర్ డి.శ్రీనివాస్రెడ్డి పాల్గొన బోతున్నారని చెప్పారు. సోమవారం ఉదయం11గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్వర్మ హైదరాబాద్ నుంచి వరంగల్ నిట్కు చేరుకుంటారని అనంతరం బయలుదేరి 11:25గంటలకు కేయూకు రానున్నారని వెల్లడించారు. తొలుత స్నాతకోత్సవానికి సంబంధించి అకడమిక్ సెనేట్ సమావేశం జరుగనుందని తెలిపారు. 387మందికి పీహెచ్డీ పట్టాలు, 373 మందికి 564 గోల్డ్ మెడల్స్ ప్రదానం కేయూలో 2020–25 జూన్ 30వరకు ఆర్ట్స్, సైన్స్, సోషల్ సైన్స్, ఫార్మసీ, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్, లా, ఇంజనీరింగ్ విభాగాల్లో 387 మందికి గవర్నర్ చేతుల మీదుగా పీహెచ్డీల ప్రదానం జరుగనుందన్నారు. అదే విభాగాలకు చెందిన 2016–21వరకు 373 మంది అభ్యర్థులకు 564 గోల్డ్ మెడల్స్ను కూడా స్నాతకోత్సవంలో ప్రదానం చేయనున్నారని వీసీ ప్రతాప్రెడ్డి పేర్కొన్నారు. స్నాతకోత్సవ వేడుకను అన్ని విభాగాల సహాకారంతో విజయవంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, సిబ్బంది సహకరించి విజయవంతవ చేసేలా సహకరించాలని వీసీ కోరారు. సమావేశంలో కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం, పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ పాల్గొన్నారు.గవర్నర్ పర్యటన ఇలా.. ఈనెల 7న ఉదయం 8:30గంటలకు హైదరాబా ద్లోని రాజ్భవన్ నుంచి బయలుదేరి వరంగల్ నిట్కు 11గంటలకు చేరుకుంటారు. కొద్దిసేపు అక్కడే ఉండి ఉదయం 11:15 గంటలకు బయలుదేరి కాకతీయ యూనివర్సిటీకి 11:25 గంటలకు చేరుకుంటారు. ఉదయం 11:30గంటల నుంచి మధ్యాహ్నం 1:15గంటల వరకు స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. కలెక్టర్లతో సమావేశం కేయూలో స్నాతకోత్సవం కార్యక్రమం ఉదయం 11:30గంటల నుంచి మధ్యాహ్నం 1:15 గంటలకు ముగియనుంది. అనంతరం కేయూ గెస్ట్హౌజ్లో గవర్నర్ జిష్ణుదేవ్వర్మ లంచ్ చేస్తారు. మధ్యాహ్నం 2గంటలకు కాకతీయ యూనివర్సిటీనుంచి బయలుదేరి 2:10గంటలకు వరంగల్ నిట్ చేరుకుంటారు. 2:30గంటల వరకు అక్కడే ఉంటారు. మధ్యాహ్నం 2:30గంటల నుంచి మధ్యాహ్నం 3:15గంటల వరకు వరంగల్, హనుమకొండ కలెక్టర్ల సమావేశంలో గవర్నర్ జిష్ణుదేవ్వర్మ పాల్గొంటారు. యాక్షన్ ప్లాన్ ఫర్ ఎరాడికేషన్ ఆఫ్ టీబీ టీబీ ఆఫీసర్లు, ఐఆర్సీఎస్ రీప్రెసెంటిటీవ్స్ పాల్గొంటారు. ఆ తర్వాత గవర్నర్ హైదరాబాద్కు బయలుదేరి వెళ్తారని సమాచారం. హాజరుకానున్న గవర్నర్ జిష్ణుదేవ్వర్మ పీహెచ్డీలు, గోల్డ్ మెడల్స్ ప్రదానం -
చోరీ కేసుల్లో నిందితుల అరెస్ట్
నర్సంపేట రూరల్ : పలు చోరీలకు పాల్పడిన కేసుల్లో నిందితులను అరెస్టు చేసి ఆరుగురిని రిమాండ్కు తరలించగా, ఒకరు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి రూ.19.20లక్షల సొత్తును రికవరీ చేసినట్లు వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ పేర్కొన్నారు. శనివారం నర్సంపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ అంకిత్ వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలానికి చెందిన పుల్లూరి రాజేష్ (ఆటో డ్రైవర్), నర్సంపేట పట్టణంలోని కుమ్మరికుంటకు చెందిన వర్రెంకి అక్షయ్ కుమార్ (డెకరేషన్ వర్క్), స్నేహనగర్కు చెందిన జెట్టి అక్షయ్, నీరుపల్లి సాయిరాం (మెకానిక్ వర్క్), నెక్కొండ మండలం చంద్రుగొండకు చెందిన మాంకల ఉదయ్, నర్సంపేటకు చెందిన అలువాల విపిన్, ఖానాపురం మండలం టేకులతండాకు చెందిన ఎండీ సుబాని (బ్యాటరీ వర్క్) అంతా కలిసి గ్రూప్గా ఏర్పడ్డారు. చేసే పనిలో డబ్బులు రాకపోవడంతో ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో రాత్రి వేళలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. రాజేష్ ఆటోలో, ద్విచ క్ర వాహనంపై, విపిన్ స్కూటిపై పగటిపూటలో రెక్కీ నిర్వహించి తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రివేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. నర్సంపేటలోని నెక్కొండ రోడ్డులో గల ఫైనాన్స్లో అనుమానం రాకుండా రాజేష్ అతడి స్నేహితుడు ఎండీ సుబాని పేరుతో బంగారం కుదవపెట్టి, వెండి ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులకు విక్రయించి సొమ్ము చేసుకోని జల్సాలకు పాల్పడుతున్నారు. అయితే నర్సంపేట పోలీస్ స్టేషన్లో–6 కేసులు, నల్లబెల్లి పీఎస్లో–1, పర్వతగిరి పీఎస్ లో–1చొప్పున మొత్తం 8 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశా రు. మొత్తం ఏడుగురిలో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా ఒకరు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి ఆటో, ద్విచక్రవాహనం, స్కూటీ, ల్యాప్టాప్, మొబైల్, 13తులాల బంగారం, 30 తులాల వెండి, రూ. 2,000ల నగదు మొత్తం రూ.19.20 లక్షల సొత్తును రికవరీ చేసినట్లు డీసీపీ తెలిపారు. కేసు త్వరగా ఛేదించిన పోలీసులను అభినందించి, రివార్డులను అందించారు. నర్సంపేట ఏసీపీ రవీందర్రెడ్డి, సీఐలు రఘుపతిరెడ్డి, సాయిచరణ్, ఎస్సైలు రవికుమార్, గూడ అరుణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆరుగురి రిమాండ్ .. పరారీలో ఒకరు ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్ -
కమ్యూనిస్టులు లేకుండా చేయలేరు
కురవి: కమ్యూనిస్టులను అంతం చేయడం ఎవరితరం కాదని, అడాల్ఫ్ హిట్లర్ వల్లే సాధ్యం కాలేదు.. అమిత్షా వల్ల ఏం అవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మండల కేంద్రంలోని ఎండీ లియాఖత్ అలీ, సురేందర్కుమార్ ప్రాంగణంలో మహబూబాబాద్ జిల్లా సీపీఐ మూడో మహాసభలో కూనంనేని మాట్లాడారు. కమ్యూనిజం లేకుండా చేయడం ఎవరితరం కాదని, మానవ సమాజం, ఈ భూమి ఉన్నంత వరకు కమ్యూనిస్టులు ఉంటారని అభిప్రాయపడ్డారు. ఆపరేషన్ కగార్ పేరిట అడవుల్లో ఉన్న కమ్యూనిస్టులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంతం చేస్తానని చెప్పి నంబాల కేశవరావును హత్య చేశారని వెల్లడించారు. మావోయిస్టులు మా వాల్లేనని, సీపీఎం, న్యూడెమోక్రసీ, ఎర్రజెండా పట్టుకున్న ప్రతీ ఒక్కరు తమ వాల్లేనని పేర్కొన్నారు. బందిపోట్లు ప్రజల్లో ఉండి తిరుగుతున్నారని, మావోయిస్టులు ఆయుధాలను పక్కన పెట్టే దిశగా ఆలోచన చేయాలని సూచించారు. వేర్వేరుగా ఉన్న ఎర్రజెండా పార్టీలన్ని ఒక్కతాటిపై రావాల్సిన అవసరం ఉందని, ఎర్రకోటపై ఎర్రజెండా ఎగరాలని కోరారు. డిసెంబర్ 26న ఖమ్మంలో సీపీఐ వందేళ్ల పండుగ చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల వరకే పొత్తులు.. ఎన్నికల వరకే పొత్తులుంటాయని, ప్రజాసమస్యలను విస్మరిస్తే చూస్తూ ఊరుకోమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోటను విస్మరిస్తే బీఆర్ఎస్కు పట్టిన గతే పడుతుందన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం ఉద్యమిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి విజయసారథి, సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్రెడ్డి, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యుడు తమ్మెర విశ్వేశ్వరరావు, అజయ్సారథి, కట్టెబోయిన శ్రీనివాస్, కరణం రాజన్న, నెల్లూరి నాగేశ్వర్రావు, పెరుగు కుమార్, చింతకుంట్ల వెంకన్న, సాంబలక్ష్మి, వరిపెల్లి వెంకన్న, నవీన్, బాలకృష్ణ, తురక రమేష్, బుర్ర సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కమ్యూనిస్టులు ఏకతాటిపై రావాలి -
ప్రొటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేయాలి
● డిప్యూటీ సీఎం పర్యటన విజయవంతం చేయాలి ● కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ ● 8న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన మహబూబాబాద్: ఈనెల 8న జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతోపాటు రాష్ట్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో ప్రొటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అధికారులను ఆదేశించా రు. ఉపముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో శనివా రం కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ మాట్లాడుతూ.. ఈనెల 8న మానుకోట మండలం సోమ్లాతండా, కేసముద్రం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిథులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ట్రాఫిక్ సమస్య లే కుండా పార్కింగ్ ఏర్పాట్లపై చర్యలు తీసుకో వాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, జెడ్పీ సీఈఓ పురుషో త్తం,ఆర్డీఓలు కృష్ణవేణి,గణేష్,ఆర్అండ్బీ ఈ ఈ బీమ్లానాయక్, డీఎంహెచ్ఓ రవిరాథోడ్, డీీపీఓ హరిప్రసాద్, తదతరులు పాల్గొన్నారు. విద్యుత్ సరఫరాకు మానిటరింగ్ సిస్టంనెహ్రూసెంటర్: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ అందించేందుకు నూతన సాంకేతికతతో రియల్టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం ప్రవేశపెట్టినట్లు విద్యుత్శాఖ ఎస్ఈ విజేందర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతనంగా వచ్చిన సిస్టం ద్వారా విద్యుత్ అంతరాయ సమాచారాన్ని ఫీల్డ్ సిబ్బందికి తెలియజేయవచ్చని, తక్కువ సమయంలో విద్యుత్ పునరుద్దరణ జరుగుతుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగం, ఓల్టేజీ లెవెల్స్ వంటి వివరాలను రియల్ టైంలో సేకరించవచ్చన్నారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో వంద సబ్ స్టేషన్లను గుర్తించి పనులు ప్రారంభించారని, మిగిలిన వాటిని దశల వారీగా పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. సకాలంలో రైతులకు ‘సహకార’ సేవలు● జిల్లా సహకార అధికారి వెంకటేశ్వర్లు మహబూబాబాద్ రూరల్: రైతుల సేవలో సహకార శాఖ తరిస్తుందని, సకాలంలో వారికి అవసరమైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా సహకార అధికారి ఎన్.వెంకటేశ్వర్లు తెలిపారు. అంతర్జాతీయ సహకార దినోత్సవంలో భాగంగా జిల్లా కేంద్రంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆవరణలో శనివారం డీసీఓ వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ చైర్మన్ నాయిని రంజిత్ మొక్క నాటారు. అనంతరం మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్, డీసీసీబీ బ్యాంకు మేనేజర్ రజిత, ఫీల్డ్ ఆఫీసర్ యశ్వంత్, అసిస్టెంట్ మేనేజర్ సింధు, సొసైటీ సెక్రెటరీ ప్రమోద్, సుధగాని మురళి, లూనావత్ అశోక్ నాయక్, ఆవుల వెంకన్న, నరేష్ నాయక్, నవీన్ నాయక్, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. హేమాచలక్షేత్రంలో మాస కల్యాణం మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు ఆలయ పూజారి ముక్కామల శేఖర్శర్మ ఆధ్వర్యంలో శనివారం మాసకల్యాణం(శాంతికల్యాణం) జరిపించారు. యాగశాలలో స్వామివారి జన్మనక్షత్రాన్ని(స్వాతి) పురస్కరించుకుని ఉత్సవ మూర్తులకు శాంతి కల్యాణాన్ని వేద మంత్రోచ్ఛరణ నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్న భక్తులు శాంతి కల్యాణంలో పాల్గొన్నారు. -
ఆషాఢ మాసంలో మైదాకుపై మహిళల ఆసక్తి
సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ జీన్స్ పాయింట్లు, బికినీ డ్రెస్లు వేసుకొని ఆడ, మగ తేడా లేకుండా తయారు అవుతు న్న ఈ రోజుల్లో మహబూబాబాద్ పట్టణంలోని పలు కాలనీల ప్రజలు సంస్కృతి, సంప్రదాయాలు అద్దం పట్టే విధంగా పండుగలు నిర్వహించుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సంప్రదాయ దుస్తులు, నిండైన వస్త్రధారణతో పండుగలు నిర్వహించుకుంటారు. కాలనీ లోని పెద్దలు సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, అందులో ఇమిడి ఉన్న ఆధ్యాత్మికత చరిత్ర, ఆయుర్వేద గుణాలను రాబోయే తరాలకు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. కాగా, సెవెన్ హిల్స్ కాలనీలో నిర్వహించిన గోరింట పండుగలో కోట నిర్మల, తోట శిరీష, బొమ్మనపల్లి సువర్ణ, ప్రియాంక, నందిని, శ్రీలత, విజయ, జ్యోతి, అరుణ, కవిత తదితరులు ఆనందంగా పాల్గొన్నారు. -
రైతులు రాయితీలను వినియోగించుకోవాలి
మహబూబాబాద్ రూరల్: ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను రైతులు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని పర్వతగిరి గ్రామంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్, ఉద్యాన పంటల అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పంట మార్పిడి విధానాన్ని పాటించాలన్నారు. ఆయిల్ పామ్ సాగు చేసి ఎకరానికి రూ.లక్ష ఆదాయం పొందాలని తెలిపారు. జిల్లాలో 8 వేల ఎకరాలకుపైగా పామాయిల్ సాగు అవుతుందని, 1,350 ఎకరాల్లో పామాయిల్ దిగుబడి మొదలై ప్రతి రైతు ఎకరానికి రూ.లక్ష ఆదాయం పొందుతున్నారని తెలిపారు. ఈ సంవత్సరానికిగాను 4,500 ఎకరాల లక్ష్యంతో ఇప్పటి వరకు 663 ఎకరాల్లో మొక్కలు నాటడానికి రైతులు అనుమతి పొందారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జి.మరియన్న, రైతులు బానోత్ హరి, సీహెచ్.సంపత్ రెడ్డి, బానోత్ సూర్యం, బానోత్ రాములు, బానోత్ వెంకన్న, భూక్య బాలకిషన్, బానోత్ పద్మ, భూక్య పద్మ, భూక్యా శివలాల్, భూక్యా శైలజ, డీఏఓ అజ్మీరా శ్రీనివాసరావు, ఏఓ నారెడ్డి తిరుపతిరెడ్డి, మండల ఉద్యాన అధికారి శాంతిప్రియదర్శిని, తహసీల్దార్ చంద్రరాజేశ్వరరావు, ఎంపీడీఓ రఘుపతిరెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు బాలాజీ, షాహీన్, టీజీ ఆయిల్ ఫెడ్ క్షేత్ర సిబ్బంది శ్రీకాంత్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మురళీనాయక్ -
ఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025
– 8లోuప్రకృతితో మహిళలది విడదీయలేని అనుబంధం.. భూమాతను పూజించాలన్నా.. పూల పండుగ బతుకమ్మను పేర్చాలన్నా.. గిరిజనుల తీజ్ వేడుక మురవాలన్నా.. మహిళల చేతుల స్పర్శ తగలా ల్సిందే.. అలాంటి అపురూపమైన అరచేతులకే అందాన్ని తెచ్చేది.. గోరింటాకు. ఆషాఢంలో చేతులకు గోరింటాకు పెట్టుకుంటే అందంతోపాటు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు సైతం దూరమవుతా యని మహిళలు విశ్వసిస్తారు. ఇంతటి ప్రత్యేకత కలిగిన గోరింటాకు పండుగను మహిళలంతా ఆనందంగా నిర్వహించుకుంటారు. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని సెవెన్ హిల్స్ కాలనీలో శనివా రం గోరింట పండుగ జరుపుకున్న మహిళల అభిప్రాయాలు.. వేడుక వివరాలే ఈనాటి ‘సాక్షి’ సండే స్పెషల్. – సాక్షి, మహబూబాబాద్ సంతోషంగా ఉంది వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి ఒకేచోట ఉండే కాలనీ వాసులం ప్రతీ పండుగను కలిసి జరుపుకుంటాం. గోరింటాకు పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉంది. పండుగ జరుపుకునేందుకు సహకరించిన ‘సాక్షి’ మీడియాకు కృతజ్ఞతలు. పండుగల సందర్భంగా పెద్దలు చెప్పే మాటలతో ఈ తరానికి సంస్కృతి, సంప్రదాయం మీద గౌరవం పెరుగుతుంది. – కీసర నందినిఒకే చోట చేరి సంబురాలు ● అందంతోపాటు ఆరోగ్యానికి మేలని అతివల విశ్వాసం రోజంతా సందడి గోరింటాకు పండుగ జరుపుకోవాలని అనుకున్నదే తడవుగా.. మహిళలంతా ఏకమై సమీపంలోని చెట్ల నుంచి ఆకును పాటలు పాడుతూ సేకరించారు. రోలు, రోకలితో గోరింటాకును మెత్తగా చేసి ఒకరి చేతికి మరొకరు గోరింటాకు పెట్టుకొని మురిసిపోయారు. ఆటలు ఆడుతూ.. పాటలు పాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో రోజంతా ఆనందంగా గడిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత విద్య, వైద్యం, వ్యాపార రంగాల్లో పురోగతి సాధించింది. దీంతో వివిధ ప్రాంతాలు, వివిధ కులాలు, మతాలకు చెందిన సుమారు 30 కుటుంబాలు ఒకే చోట (సెవెన్ హిల్స్ కాలనీ) ఇళ్లు నిర్మించుకుని ఏ పండుగ అయినా.. కలిసి జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. కష్టసుఖాల్లో సహకా రం అందించుకుంటూ ఒకే కుటుంబంలా జీవిస్తున్నారు.న్యూస్రీల్ -
పంటల సాగులో మెలకువలు పాటించాలి
మహబూబాబాద్ రూరల్: రైతులు పంటల సాగు సమయాల్లో మెలకువలు పాటించి అధిక దిగుబడులు పొందాలని జిల్లా వ్యవసాయ అధికారి (ఇన్చార్జ్) అజ్మీర శ్రీనివాసరావు అన్నారు. మహబూబా బాద్ మండలంలోని మల్యాల గ్రామంలోని సాగు చేస్తున్న పత్తి, కూరగాయల పంటలను శ్రీనివాసరావు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు అంతర పంటల కృషి, కలుపు నివారణపై అవగాహన కల్పించారు. పంట మార్పిడి పద్ధతి అవలంభించి భూసారాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి మరియన్న, మండల వ్యవసాయ అధికారి తిరుపతిరెడ్డి, ఏఈఓ బాలాజీ, రైతులు రవి, బానోతు పద్మ, బానోతు బాలకిషన్, భూక్య పద్మ పాల్గొన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే లైసెన్స్ రద్దు నకిలీ విత్తనాలు విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని డీఏఓ శ్రీనివాసరావు అన్నారు. మండల వ్యవసాయ అధికారి తిరుపతిరెడ్డితో కలిసి మహబూబాబాద్లోని విత్తన, ఎరువుల దుకాణాల్లో శనివారం తనిఖీలు నిర్వహించారు. ఎరువులను ఈ పాస్ మిషన్ ద్వారా రైతు ఆధార్ కార్డు మీద మాత్రమే విక్రయించాలని, రైతులకు ఎమ్మార్పీ ధరకు మించి విక్రయించొద్దని డీలర్లకు సూచించారు. వ్యవసాయ శాఖ జారీ చేసిన లైసెన్స్ కలిగిన విత్తనాలను మాత్రమే రైతులకు విక్రయించాలని, నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఏఓ శ్రీనివాసరావు -
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి
నెహ్రూసెంటర్: ఆయూష్మాన్ ఆరోగ్య మందిర్ ద్వా రా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రవిరాథోడ్ సూచించారు. సబ్ సెంటర్ల ఆరోగ్య కార్యకర్తల సమావేశాన్ని శనివారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా వైద్యులు సేవలందించాల ని సూచించారు. సబ్ సెంటర్ల రిజిస్టర్, ల్యాబ్ వివరాలు, ఓపీ రిజిష్టర్లను పరిశీలించారు. సమావేశంలో హెచ్ఈ కేవీ రాజు, ఎస్యూఓ రామకృష్ణ, డీపీఎం నీలోహన, ఏఓ వసంత, డీడీఎం సౌమిత్, రాజ్కుమార్, సురేష్,అరున్,కార్యకర్తలు పాల్గొన్నారు. నాణ్యమైన వైద్యసేవలు అందించాలి చిన్నగూడూరు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు అన్ని సదుపాయాలతో నాణ్యమైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్ఓ రవి రాథోడ్ పేర్కొన్నారు. మండలంలోని ఉగ్గంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పీహెచ్సీలో ఆస్పత్రి రికార్డులు, జేఏఎస్ మీటింగ్కు సంబంధించిన రిజిష్టర్లను పరిశీలించి వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. చికిత్స నిమిత్తం వచ్చిన సెప్సిస్ ఔండ్ పేషెంట్కి డ్రెస్సింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీహెచ్సీ వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. సీజనల్ వ్యాధుల దృష్ట్యా గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని తెలిపారు. అన్ని ఎంసీహెచ్ పారామీటర్లలో ముందు ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి ప్రవీణ్ కుమార్, వైద్య సిబ్బంది ఉన్నారు. డీఎంహెచ్ఓ రవిరాథోడ్ -
ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబం..
డోర్నకల్: డోర్నకల్ సబ్ స్టేషన్ పరిధిలో గత నెల 14న ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతు చేస్తూ అసిస్టెంట్ లైన్మెన్ బి.క్రాంతికుమార్ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. మహబూబాబాద్ జిల్లా నర్సింహుపేటకు చెందిన బోగి నర్సయ్య, ఇందిర దంపతుల పెద్ద కుమారుడు క్రాంతికుమార్ ఏడేళ్ల క్రితం విద్యుత్శాఖలో చేరి డోర్నకల్లో విధులు నిర్వహిస్తూ చనిపోయాడు. 2019లో క్రాంతికుమార్కు వంశీలతతో వివాహం జరిగింది. ఈ దంపతులకు నాలుగేళ్లు, రెండేళ్ల కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో క్రాంతికుమార్ మృతితో తల్లిదండ్రులతోపాటు తన పిల్లలు, భార్య రోడ్డున పడ్డారు. కాగా, తండ్రి కనిపించకపోవడంతో చిన్నారులు నిత్యం నాన్న.. నాన్న అంటూ క్రాంతికుమార్ను కలువరిస్తున్నారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
గాలిలో దీపాలు!
వీరి ప్రాణాలు..భద్రత లేని విద్యుత్శాఖలోని అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ల జీవితాలుక్షేత్రస్థాయిలో కీలక విధులు.. తరచూ ప్రమాదాలువెట్టి చాకిరీ తప్ప ఉద్యోగ భద్రత కరువు..మంచానికే పరిమితమైన భాస్కర్.. జఫర్గఢ్: విద్యుత్ శాఖలో అన్మ్యాన్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తూ ఇటీవల షాక్కు గురైన తాటికాయల భాస్కర్ పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. దీంతో కుటుంబ పోషణ కష్టంగా మారడంతో ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. జఫర్గఢ్ శివారు వడ్డెగూడేనికి చెందిన భాస్కర్ 2012లో విద్యుత్ శాఖలో అన్మ్యాన్గా విధుల్లో చేరాడు. కొన్నేళ్ల నుంచి ఓబులాపూర్ సబ్స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఎల్సీ తీసుకుని స్తంభం ఎక్కి కనెక్షన్ ఇస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించినా భాస్కర్ నడుము భాగంతో పాటు రెండు కాళ్లు పూర్తిగా చచ్చుబడిపోయాయి. అలాగే, కుడి చెయ్యి మూడు వేళ్లను సైతం తొలగించారు. వైద్యానికి సుమారు రూ.10 లక్షలు కాగా రూ. 7 లక్షల వరకు డిపార్ట్మెంట్ ద్వారా ఖర్చు చేయగా మిగతా డబ్బులు బాధిత కుటుంబ సభ్యులు భరించాల్సి వచ్చింది. అయినా భాస్కర్ పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. దీంతో వారానికోసారి హెల్త్ చెకప్ కోసం వెళ్లిన సందర్భంలో రూ. 10వేల నుంచి 15 వేలు ఖర్చు అవుతోందని బాధిత కుటుంబీకులు తెలిపారు. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తే తాము ఏమి చేయలేమంటున్నారని బాధితుడి భార్య అనూష ఆవేదన వ్యక్తం చేస్తోంది. భర్తతో పాటు ముగ్గురు పిల్లల పోషణ భారం పూర్తిగా తనపైనే పడిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటోంది. టీజీ ఎన్పీటీసీఎల్లో అన్మ్యాన్ కార్మికులుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులకు వెట్టి చాకిరీ తప్ప ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ప్రమాదకర పరిస్థితుల్లో కూడా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. విద్యుత్ స్తంభాలు ఎక్కడం నుంచి.. నూతన లైన్ ఏర్పాటు, మరమ్మతులు, బిల్లుల వసూళ్లు తదితర అన్ని రకాల పనులు వీరితోనే చేయిస్తారు. అయినా ఈ కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతోంది. ఈ క్రమంలో ఇప్పటికే 40 ఏళ్ల వయసు దాటుతుండడంతో ఉద్యోగ అర్హత కోల్పోవాల్సి వస్తోందని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబం వీధిన పడాల్సి వస్తోంది. అయి నా పట్టించుకున్న నాథుడే కరవవుతున్నాడని పలువు రు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి ఏళ్లుగా పనిచేస్తున్న అన్మ్యాన్ కార్మికులను పర్మనెంట్ చేసి నెలనెలా బ్యాంకు అకౌంట్ ద్వారా వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. – సాక్షి నెట్వర్క్ -
సిగాచి పరిశ్రమలో అఖిల్ మృతి..
● మృతుడిది తొర్రూరు మండలం మడిపల్లి ● వివాహమైన ఆరునెలలకే విషాదం.. తొర్రూరు రూరల్: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాదంలో తొర్రూరు మండలం మడిపల్లి గ్రామానికి చెందిన మోత్కూరి అఖిల్(29) మృతి చెందాడు. రెండు సంవత్సరాల నుంచి సిగాచి ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అఖిల్.. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందాడు. అయితే మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో డీఎన్ఏ పరీక్షలకు పంపించి అఖిల్గా నిర్ధారించారు. కాగా, అఖిల్కు ఆరు నెలల క్రితం శివరాణి అనే యువతితో వివాహం జరిగింది. ఇంతలోనే ఈ ప్రమాదం జరగడంతో భార్య శివరాణి, తల్లిదండ్రులు రాజేందర్, రాణి కన్నీరుమున్నీరవుతున్నారు. -
అంగవైకల్యమైనా నయా పైసా ఇవ్వలే..
దేవరుప్పుల: పన్నెండేళ్ల క్రితం విద్యుత్ శాఖలో అన్మ్యాన్ కార్మికుడిగా చేరా. 2103లో రూ.1,800 జీతంతో ప్రారంభమైన నా సర్వీస్ నేటికి రూ.13 వేల వేతనం తప్ప ఏ ఇతర సౌకర్యాలు లేవు. 2021లో దేవరుప్పల మండలం కోలుకొండలో ఎల్సీ తీసుకుని పని చేస్తున్న క్రమంలో సబ్స్టేషన్ ఆపరేటర్ (ఉద్యోగ విరమణ పొందిన వృద్ఢుడు తిరిగి విధుల్లో చేరిన వ్యక్తి) రెండు ఫీడర్ బదులు ఒక్కటే ఆఫ్ చేశారు. ఎల్సీ క్లియర్ అని చెప్పగానే స్తంభం ఎక్కి మరమ్మతు చేస్తుండగా షాక్ తగిలి కింద పడ్డా. దీంతో నా చెయ్యి కాలింది. ఛాతీ పై తీవ్రగాయాలై ప్రాణపాయ స్థితిలోకి వెళ్లా. కుటుంబ సభ్యులు అప్పు చేసి సుమారు రూ.18 లక్షలు ఖర్చు చేస్తేనే బతికా. శాఖ పరంగా తిరిగి విధుల్లో తీసుకున్నారే తప్ప ప్రత్యేకించి నయా పైసా ఇవ్వలేదు. ఇతర పనులు చేయని మాకు పర్మనెంట్ చేసి తగిన పనులు అప్పగించి ఆదుకోవాలి. – గొడిశాల వెంకటేశ్, అన్మ్యాన్ కార్మికుడు, దేవరుప్పుల -
కేయూ పాలకమండలి సభ్యుల దిష్టిబొమ్మ దహనం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ భూములను యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి యూనివర్సిటీ పాలకమండలి ఆమోదించిందని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐఎఫ్డీఎస్, డీఎస్ఏ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, బీఆర్ఎస్వీ, బీఎస్ఎఫ్, డీఎస్యూ, ఎస్ఎస్యూ, ఏఐడీఎస్ఓ ఆధ్వర్యంలో శుక్రవారం కేయూలో పాలకమండలి సభ్యుల శవయాత్ర నిర్వహించారు. హ్యూమనిటీస్ భవనం నుంచి పరిపాలన భవనం వరకు శవయాత్రను నిర్వహించి అక్కడ పాలకమండలి సభ్యుల దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయా విద్యార్థి సంఘాల బాధ్యులు మాట్లాడుతూ పలు చోట్ల కేయూ భూ ములు కబ్జాకు గురయ్యాయని, వాటిని వెనక్కితీసుకోవాలనే విషయంపై దృష్టిసారించకుండా యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 15ఎకరాల భూ మిని కేటాయిస్తూ పాలకమండలి సభ్యులు ఆమోదించడం శోచనీయమన్నారు. పాలకమండలి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయా సంఘాల బాధ్యులు గడ్డం నాగార్జున, రాష్ట్ర సావిత్రి, కామగోని శ్రావణ్, ము న్నా గణేశ్, మంద శ్రీకాంత్, స్టాలిన్, కల్యాణ్, మర్రి మహేశ్, సాయికుమార్, బైరపాక ప్రశాంత్, కమ్మరపెల్లి శివ, మధు, అన్నమయ్య, సాయి, జశ్వంత్, రా జు, నరేశ్, సురేశ్, శివ, తదితరులు పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్కు భూములు ఇవ్వొద్దని డిమాండ్ -
అనుమతుల కోసం అడ్డదారులు
● డబ్బులు ముట్టజెప్పిన ‘వరంగల్ ఫాదర్ కొలంబో’ ● ట్రస్టీ కొమ్మారెడ్డి జోసెఫ్పై సీబీఐ కేసు నమోదు కాజీపేట రూరల్: నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) స్కామ్లో వరంగల్ హంటర్రోడ్డు బ్రిడ్జి సమీపంలోని ఫాదర్ కొలంబో మెడికేర్ ఆస్పత్రి (ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) పాత్ర సంచలనం రేపుతోంది. అధికారిక అనుమతుల కోసం డబ్బులు ముట్టజెప్పినందుకు వరంగల్కు చెందిన ఫాదర్ కొలంబో మెడికల్ కళాశాల ట్రస్టీ కొమ్మారెడ్డి జోసెఫ్పై సీబీఐ కేసు నమోదు చేసింది. మెడికల్ కళాశాల తనిఖీల్లో ఎన్ఎంసీ అధికారులు అనుకూలంగా నివేదికలు ఇచ్చేందుకు మధ్యవర్తులకు జోసెఫ్ లంచాలు ఇచ్చినట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కాంలో తేలింది. దేశవ్యాప్తంగా 36 మందిపై సీబీఐ కేసులు నమోదు చేయగా, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఐదుగురిలో వరంగల్కు చెందిన జోసెఫ్పై కేసు నమోదైంది. మెడికల్ కళాశాల క్లియరెన్స్, అధికార అనుమతుల కోసం మధ్యవర్తులకు రూ.20 లక్షలు, రూ.46 లక్షల చొప్పున రెండుసార్లు జోసెఫ్ ముట్టజెప్పినట్లు తేలింది. ఈ విషయమై వివరణ కోసం ట్రస్టీ కొమ్మారెడ్డి జోసెఫ్కు శుక్రవారం రాత్రి ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు. రైల్వే ఇన్స్టిట్యూట్ తనిఖీ కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్ను శుక్రవారం సికింద్రాబాద్ డివిజన్ అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్ (ఏపీఓ, ఇంజనీరింగ్ విభాగం) జితేంద్రకుమార్ బృందం తనిఖీ చేసింది. రైల్వే ఇన్స్టిట్యూట్, కమ్యూనిటిహాల్, స్టేడియాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసింది. ఇన్స్టిట్యూట్ నిర్వహణ, రికార్డులు, మెంబర్స్షిప్ వివరాలు, సౌకర్యాలు, సదుపాయాలను తనిఖీ చేశారు. ఇన్స్టిట్యూట్ బాయ్స్ వివరాలు, వేతనాలు అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిటీహాల్ నిర్వహణ బాగుందని అభినందించారని ఇన్స్టిట్యూట్ ట్రెజరర్ గిరిమిట్ల రాజేశ్వర్రావు తెలిపారు. తనిఖీలో రైల్వే వెల్ఫేర్ ఇన్స్పెక్టర్లు విష్ణువర్ధన్రెడ్డి, రాజేంద్రప్రసాద్, ఓఎస్ సత్యనారాయణ ఉన్నారు. -
కమ్యూనిజం శక్తుల ఐక్యం అనివార్యం
దేవరుప్పుల : పీడిత ప్రజానీకం కోసం నిత్యం పాటుపడే విప్లవ పార్టీలను అంతమొందించేందుకు ప్రధాని మోదీ చే స్తున్న కుట్రలను ఛేదించేందుకు కమ్యూనిజం భావజాల శక్తులు ఐక్యం కావడం అనివార్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండిలో సీపీఐ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 79వ వర్ధంతి సందర్భంగా ఆయన స్మారక స్తూపం, విగ్రహానికి నారాయణతోపాటు అరుణోదయ స మాఖ్య వ్యవస్థాపకులు విమలక్క, ఎంసీపీఐ రాష్ట్ర నాయకుడు కుమారస్వామి, తదితరులు పూలమాల వేసి నివాళులుర్పించారు. అనంతరం కొమురయ్య స్మారక భవనంలో జరిగిన సంస్మరణ సభకు సీపీఐ మండల కార్యదర్శి జీడీ ఎల్లయ్య అధ్యక్షత వహించగా నారాయణ మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకృతి సంపదను కొల్లగొట్టేందుకు డెడ్లైన్ పేరిట సరిహద్దు సైన్యాన్ని అంతర్గతంగా వినియోగిస్తూ కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు. ఇదే మణిపూర్లో సాయుధ పంథాను అణిచివేయకుండా చూడడంలోనే వారి స్వార్థ పాలన వెల్లడైందన్నారు. న్యాయ వ్యవస్థను కించపరిచే పాలకులు రాజ్యాంగాన్ని మార్చలేరని హితవు పలికారు. నిజాం పాలనలో దొడ్డి కొమురయ్య పోరాట పటిమతోనే సాయుధ పోరాటం ఆవిర్భవించిందన్నారు. దీనితోనే బానిసత్వం, దున్నేవాడికి భూమితోపాటు భూస్వామ్య విధానం రద్దు అయ్యిందన్నారు. నేటికీ విస్నూ ర్ దేశ్ముఖ్ మూలాలకు చెందిన ప్రొఫెసర్ పాండురంగా రావు.. సాయుధ పోరాటాన్ని కించపరిచే వ్యాఖ్యలు ఆయన మూర్ఖత్వానికి అద్దం పడుతున్నాయన్నారు. ఎర్రజెండా ద్వారానే అన్ని వర్గాల ప్రయోజనాలు సాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో నల్ల నర్సింహులు వారసురాలు చింతకింది అరుణక్క, సీపీఐ జిల్లా కార్యదర్శి సి.హెచ్. రాజారెడ్డి, రాష్ట్ర నాయకులు విశ్వేశ్వర్రావు, సుగుణమ్మ, సాయన్న, సొప్పరి సోమయ్య, బిల్లా తిరుపతిరెడ్డి, శ్రీనివాస్, ఎల్లయ్య, ప్రశాంత్, సుజిత్, సోమనారాయణ, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు. విముక్తి పోరుకు స్ఫూర్తిప్రదాత దొడ్డి కొమురయ్య కార్పొరేట్ కోసమే ప్రకృతి సంపద దోపిడీకి యత్నం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ -
కేయూ స్నాతకోత్సవ రిహార్సల్స్
కేయూ క్యాంపస్: ఈ నెల 7వ తేదీన జరగనున్న కేయూ స్నాతకో త్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో రిహార్సల్స్ చేశారు. పలువురు పాలకమండలి సభ్యులు, వివిధ విభాగాల డీన్లు, కమిటీల కన్వీనర్లు, సభ్యులు, ఇతర అధికారులు స్నాతకోత్సవ రిహార్సిల్స్ చేశారు. కొందరు విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు, గోల్డ్ మెడల్స్ ప్రదానంపై కూడా రిహార్సల్స్ చేశారు. ఈ సందర్భంగా వీసీ ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ రిహార్సల్స్ ద్వారా లోటు పా ట్లు తెలుసుకుని స్నాతకోత్సవాన్ని విజయవంతం చేస్తామన్నారు. కా ర్యక్రమంలో రిజిస్ట్రార్ వి. రామచంద్రం, తదితరులు పాల్గొన్నారు. 6న కేయూకు పనిదినం.. ఈ నెల7వ తేదీ కేయూ స్నాతకోత్సవం నేపథ్యంలో 6న (ఆదివారం) అధ్యాపకులు, ఉద్యోగులు, పరిశోధకులు, విద్యార్థ్ధులకు వర్కింగ్ డేగా పరిగణిస్తూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఈ రోజుకు బదులు అక్టోబర్ 4వ తేదీని సెలవు దినంగా ప్రకటించారు. కాగా, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు క్యాంపస్లోని పలు చోట్ల క్లీన్అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.రైతుకు పాముకాటు దంతాలపల్లి : ఓ రైతు పాముకాటుకు గురయ్యాడు. ఈ ఘటన శుక్రవారం మండలంలోని వేములపల్లిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గుండగాని వెంకన్న ఉదయం తన పొలంలో నీళ్లు పెట్టి గట్లు వేస్తున్నాడు. ఈ క్రమంలో తన కాళ్లు, చేతులకు అంటుకున్న బురదను శుభ్రం చేసుకునే సమయంలో పాము కాటు వేసింది. గమనించిన రైతు.. కుటుంబ సభ్యులతో కలిసి మండలకేంద్రంలోని ఆస్పత్రికి వచ్చాడు. వైద్యురాలు కవిత, ఏఎన్ఎం కవిత చికిత్స అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాము, తేలు కాటు విషానికి ఆస్పత్రిలో విరుగుడు (ఇంజక్షన్) ఉందన్నారు. తేలు, పాముకాటుకు గురైన మండల ప్రజలు సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే ఆస్పత్రికి రావాలన్నారు. -
శ్రీశైలం మృతితో రోడ్డున పడిన కుటుంబం..
పాలకుర్తి టౌన్: విద్యుత్ శాఖ అన్మ్యాన్ కార్మికుడు బైకాని శ్రీశైలం మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది. పాలకుర్తి మండలం తీగారం గ్రామానికి చెందిన శ్రీశైలం గత సంవతరం ఏప్రిల్ 06న వల్మిడిలో విద్యుత్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్కు గురైన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుంది. శ్రీశైలం మృతి తర్వాత ప్రభుత్వం, విద్యుత్ శాఖ నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందకపోవడంతో భార్య రాణి ఇద్దరు పిల్లలతో జీవన పోరాటం చేస్తోంది. తీగారం నుంచి తన తల్లిగారి ఊరు దేవరుప్పులకు వెళ్లి ఉంటుంది. కుటుంబ పోషణకు రోజువారీ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. పిల్లల పోషణ ఇబ్బందిగా ఉంది.. నాతోపాటు నా పిల్లలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నా భర్త విధి నిర్వహణలోనే ప్రాణం కోల్పోయాడు. అయినా ఇప్పటికీ ప్రభుత్వం, విద్యుత్ శాఖ నుంచి ఎలాంటి సాయం అందలేదు. పిల్లలను పోషించుకునేందుకు ప్రభుత్వం నాకు ఉద్యోగం ఇవ్వాలి. అలాగే, ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలి -
నేషనల్ మీట్లోనూ సత్తా చాటాలి
వరంగల్ క్రైం: జోనల్ డ్యూటీ మీట్లో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు.. జాతీయ స్థాయిలో నూ సత్తా చాటాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న భద్రాద్రి జోనల్ పోలీస్ డ్యూటీ మీట్ శుక్రవారం ముగిసింది. జోనల్ పరిధిలోని వరంగల్, ఖమ్మం పోలీస్ కమిషనరేట్లతో పాటు, మహబుబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు పలు విభాగాల్లో పోటీపడ్డారు. ప్రతిభ కనబరిచిన వారికి సీపీ పతకాలు అందజేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ విభాగానికి 15 గోల్డ్ మెడల్స్తో సహా మొత్తం 31 పతకాలు వచ్చా యి. అలాగే, భద్రాద్రి కొత్తగూడెంకు 19, మహబూబాబాద్ జిల్లాకు 17, ఖమ్మం జిల్లా అధికారులు 5 పతకాలు సాధించినట్లు నిర్వాహకులు వివరించారు. ఈ సందర్భంగా సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ సాధన చేస్తే వృత్తి నైపుణ్యంతో పాటు అన్ని రంగాల్లో ప్రతిభ కనబర్చవచ్చని అన్నారు. పోటీల విజయవంతానికి కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందికి సీపీ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డీసీపీలు షేక్ సలీమా, రాజమహేంద్ర నాయక్, అంకిత్ కుమార్, అదనపు డీసీపీలు రవి, సురేశ్కుమార్, ప్రభాకర్రావు, బోనాల కిషన్, వ రంగల్ ఏఎస్పీ శుభం, ఏసీపీలు, ఆర్ఐలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. సీపీ సన్ప్రీత్ సింగ్ -
మహనీయుల జీవితం అందరికీ ఆదర్శం
మహబూబాబాద్: మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శమని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం దొడ్డి కొమురయ్య వర్ధంతి, మాజీ సీఎం కొణిజేటి రోశయ్య జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాగా.. దొడ్డి కొమురయ్య, రోశయ్య చిత్రపటాలకు కలెక్టర్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ మాట్లాడుతూ.. సాయుధ పోరాట యోధుడు కొమురయ్య అన్నారు. కొటిజేటి రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనలేని సేవలు చేశారన్నారు. మహనీ యులను ఒక కులానికో, వర్గానికో పరిమితం చేయకుండా వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, బీసీ వెల్ఫేర్ అధికారి నర్సింహస్వామి, డీసీఓ వెంకటేశ్వర్లు, డీవీహెచ్ఓ కిరణ్కుమార్ పాల్గొన్నారు. టీబీపై విస్తృత ప్రచారం చేయాలి.. టీబీ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్ర స్థాయిలో ప్రజలకు విస్తృత ప్రచారం చేయాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వైద్యాధికారులతో టీబీ నివారణపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా లెనిన్ వత్సల్ టొప్పో మాట్లాడుతూ.. క్షయ వ్యాధిని 2030 వరకు నివారించాలనే ఉద్దేశ్యంతో దేశవ్యాప్తంగా ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. జిల్లాలోని 171 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల ద్వారా రెండు టీంలు తెమడ పరీక్షలు చేయనున్నట్లు పేర్కొన్నారు. వీసీలో డీఎంహెచ్ఓ రవిరాథోడ్, డీఈఓ రవీందర్రెడ్డి, ఇన్చార్జ్ జిల్లా సంక్షేమాధికారి శిరీష సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ -
విద్యుత్శాఖలో అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లకు భద్రత కరువు
శనివారం శ్రీ 5 శ్రీ జూలై శ్రీ 2025జీవనాధారాన్ని కోల్పోయారు.. మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ ము న్సిపాలిటీ పరిధి ఈదులపూసపల్లి గ్రామానికి చెందిన అన్మ్యాన్ హెల్పర్ గట్ల కరుణాకర్రెడ్డి గత గురువారం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావి విద్యుత్ మోటా రు స్టార్టర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా సర్వీస్ వైరు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. సుమా రు 25ఏళ్లనుంచి ఆయన ఈదులపూసపల్లితోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో విద్యుత్ సేవలు అందిస్తున్నారు. కరుణాకర్ రెడ్డికి భార్య ప్రియాంక, కుమార్తె శ్రీవల్లి, కుమారుడు సుశాంత్ రెడ్డి ఉన్నారు. కుమార్తె హైదరాబాద్లోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతుండగా, కుమారుడు మానుకోటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. కుటుంబ పెద్ద కరుణాకర్ రెడ్డి అకాల మరణంతో ఆ బాధ్యతలన్నీ భార్య ప్రియాంక మీదనే పడ్డాయి. ఈ క్రమంలో పిల్లల చదువులు, కుటుంబ పోషణ భారంగా మారనుందని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు 1,388 మందిహన్మకొండ: విద్యుత్శాఖలో క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్న అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వినియోగదారులకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్న వీరు టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఆదరణకు నోచుకోవడం లేదు. వీరికి ఎలాంటి సర్వీస్ రూల్స్ లేవు. ఏదైనా ప్రమాదం జరిగినా యాజమాన్యంనుంచి అందే సహాయం కూడా లేదు. వినియోగదారులకు విద్యుత్ సంబంద సమస్యలు తలెత్తితే ముందుగా వీరినే సంప్రదిస్తారు. వీరి సమస్యలు వివరించి బాగు చేయించుకుంటారు. ఇంతటి కీలక భూమిక పోషిస్తున్న వీరికి ఆర్థిక భరోసా అందడం లేదు. ఇటీవల బీమా సౌకర్యం.. తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాలిలో కలుస్తుండడంతో చలించిన టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లకు బీమా సౌకర్యం కల్పించారు. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిళ్లలో మొత్తం 1,388 మంది అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లు పనిచేస్తున్నారు. వీరికి గత నెలనుంచి బీమా సౌకర్యం కల్పించారు. ఇప్పటి వరకు 1300మందికి బీమా సౌకర్యం కల్పించారు. ఇందులో అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లను రెండు విభాగాలుగా విభజించారు. ఐటీఐ అర్హత కలిగిన వారికి నెలకు రూ.20 వేల వేతనం, ఐటీఐ అర్హత లేని వారికి నెలకు రూ.17 వేల వేతనం అందిస్తున్నారు. ఈ మేరకు ఐటీఐ అర్హత కలిగిన అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.20 లక్షల బీమా, ఐటీఐ అర్హత లేని వారికి రూ.17 లక్షల పరిహారం అందేలా బీమా సౌకర్యం కల్పించారు. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ ద్వారా వీరికి బీమా చేయించారు. ఇటీవల మహబూబాబాద్ జిల్లాలో మృతిచెందిన అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్కు ఈ బీమా వర్తించే అవకాశముందని విద్యుత్ అధికార వర్గాలు తెలిపాయి. దుగ్గొండి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన తుమ్మలపల్లి రామరాజు కొన్నేళ్లుగా విద్యుత్శాఖలో తాత్కాలిక ఉద్యోగిగా విధులు నిర్వర్తించాడు. ఈ క్రమంలో గత మే 9న రైతుల వ్యవసాయ బావుల వద్ద ఓ ట్రాన్స్ఫార్మర్కు ఎగ్జ్ఫీజ్ వేస్తుండగా ప్రమాదవశాత్తు 11 కేవీ తీగ తగిలి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఓ చెయ్యిని పూర్తిగా మరో చేయిని సగం వరకు తీసి వేశారు. రెండు నెలలుగా వరంగల్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే రూ.19 లక్షల వరకు ఖర్చు అయ్యాయి. గ్రామస్తులు దాదాపు రూ.16 లక్షల వరకు విరాళాలు అందించి చికిత్స చేయిస్తున్నారు. ఇంకా చికిత్స కోసం రూ.10 లక్షలు అవసరం అవుతాయని వైద్యులు అంటున్నారని బాధితుడి భార్య రజిత తెలిపింది. పెద్ద కుమార్తె అఖిల ఇంటర్ పూర్తి చేసి ఉన్నత చదువులు ఎలా కొనసాగించాలని మదనపడుతోంది. చిన్న కుమార్తె అక్షిత ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరాల్సి ఉంది. ఊరు అండగా నిలిచినా ప్రయోజనం లేకుండా పోయిందని, ప్రభుత్వం ఆదుకోవాలని రజిత, పిల్లలు కన్నీటిపర్యంతమవుతున్నారు.పోరాడి తనువు చాలించిన రమేశ్ లింగాలఘణపురం: జనగామ జిల్లా లింగాలఘణపురం మండల కేంద్రానికి చెందిన జాగిళ్లపురం రమేశ్ 2020 జూన్లో కొత్తపల్లిలో లైన్మెన్ ఆదేశాలతో ట్రాన్స్ఫార్మర్ తీగలను సరి చేస్తుండగా విద్యుత్ షాక్తో కిందపడి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. డిపార్ట్మెంట్ నుంచి రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆస్పత్రి బిల్లులు చెల్లించారు. రమేశ్ మాత్రం కోలుకోలేదు. మంచానికే పరిమితమయ్యాడు. తల్లిదండ్రులు లక్షలు ఖర్చు చేసి ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. దీంతో తన తండ్రి ఉప్పలయ్య లేదా చెల్లెలు రజితకు ఎవరికైనా ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని పోరాడాడు. ఎమ్మెల్యేలు, మంత్రులు సహాయం చేస్తామన్నారే కానీ, ఎవరూ ఏమీ చేయలేదు. చివరికి లోకాయుక్తాలో కేసు వేసి పోరాడి 2024, అక్టోబర్ 3న చనిపోయాడు. కేసు ఇంకా లోకాయుక్త్తాలోనే కొనసాగుతోంది. కన్నకొడుకు చనిపోవడంతో అతడి తల్లిదండ్రులు ఉప్పలయ్య, ఆండాలు దుఖఃసాగరంలో మునిగిపోయారు. న్యూస్రీల్చేతులు కోల్పోయి రెండు నెలలుగా ఆస్పత్రిలో.. క్షేత్రస్థాయిలో కీలక విధులు.. తరచూ ప్రమాదాలు ఇంటి పెద్ద చనిపోవడంతో రోడ్డున పడుతున్న కుటుంబం గాయాలపాలై మంచానికే పరిమితమైన మరికొందరు.. మొన్నటిదాకా వినియోగదారులకు ఇస్తున్న ఎక్స్గ్రేషియానే దిక్కు ఇటీవల బీమా సౌకర్యం కల్పించిన టీజీ ఎన్పీడీసీఎల్ ఐటీఐ అర్హత కలిగిన వర్కర్కు రూ.20 లక్షలు ఐటీఐ లేని వారికి రూ.17 లక్షల బీమా ఆర్టిజన్లుగా గుర్తించని టీజీ ఎన్పీడీసీఎల్ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను 2016లో విద్యుత్ సంస్థల్లోకి ఆర్టిజన్లుగా అబ్జర్వ్ చేసుకున్న క్రమంలో తెలంగాణ సౌథర్న్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎస్పీడీసీఎల్)లో పనిచేస్తున్న కట్టర్లను (ఇక్కడ అన్మ్యాన్ వర్కర్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లను అక్కడ కట్టర్లుగా పిలిచేవారు) ఆర్టిజన్లుగా తీసుకున్నారు. టీజీ ఎన్పీడీసీఎల్లో మాత్రం అప్పటి యాజమాన్యం అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్లను ఆర్టిజన్లుగా గుర్తించలేదు. దీంతో వీరు ప్రమాదవశాత్తు మృతిచెందితే వినియోగదారులకు ఎక్స్గ్రేషియా చెల్లించినట్లుగానే రూ.5లక్షలు చెల్లిస్తున్నారు. విధి నిర్వహణలో ప్రమాదానికి గురై గాయాలపాలైతే చికిత్స ఖర్చులు మాత్రం యాజమాన్యం భరిస్తుంది. కానీ, ఇది సరిగా అమలు కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. -
బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి
కేసముద్రం: రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చినట్లుగా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని గణపతి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సీపీఐ 19వ మహాసభలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్పరం చేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి చొప్పరి శేఖర్, మంద భాస్కర్, లక్ష్మీనర్సయ్య, రవీందర్, ఇమామ్, సోమయ్య, వెంకటయ్య, సారయ్య, అనిత, కోటయ్య, సుధాకర్ పాల్గొన్నారు. -
మానుకోట జిల్లా పోలీసుల ప్రతిభ
మహబూబాబాద్ రూరల్: పోలీసులు కేవలం విధి నిర్వహణలోనే కాదు.. ఇతర రంగాల్లోనూ రాణించగలరని నిరూపిస్తూ పోలీస్ డ్యూటీమీట్లో జిల్లా పోలీసులు 16 పతకాలు సాధించారు. భద్రాద్రి జోనల్ పరిధిలో జరిగిన పోలీస్ డ్యూటీ మీట్లో మహబూబాబాద్ జిల్లా పోలీసులు అందులో పాల్గొని ప్రతిభ కనబర్చి జిల్లాకు 4 బంగారు, 9 రజత, 3 కాంస్య పతకాలు తెచ్చిపెట్టారు. బాంబు స్క్వాడ్ విభాగంలో పీసీ రామయ్యకు (ఒక గోల్డ్, ఒక సిల్వర్), పీసీ అశోక్ (ఒక గోల్డ్, ఒక సిల్వర్), పీసీ వి.మహేశ్ (ఒక గోల్డ్, ఒక సిల్వర్), పీసీ ఎ.మహేశ్ (ఒక సిల్వర్), పీసీ రాములు (ఒక గోల్డ్), వీడియో గ్రాఫర్ విభాగంలో పీసీ కుషాల్ కుమార్ (ఒక సిల్వర్), అబ్జర్వేషన్ విభాగంలో పీసీ మధు (ఒక సిల్వర్), కంప్యూటర్ ఎబిలిటీ ప్రోగ్రామింగ్ విభాగంలో ఎస్సై అరుణ్ కుమార్ (ఒక సిల్వర్), ఫింగర్ ప్రింట్ విభాగంలో ఎస్సై ప్రవీణ్ (ఒక కాంస్య), పోలీసు పోర్ర్టైట్ విభాగంలో పీసీ మధు (ఒక సిల్వర్), కంప్యూటర్ అవేర్నెస్ విభాగంలో పీసీ సుమన్ (ఒక సిల్వర్), అబ్దుల్ ఖదీర్ (ఒక గోల్డ్, ఒక బ్రాంజ్) మొత్తంగా 16 మెడల్స్ సాధించారు. ఈపతకాలను వరంగల్ పోలీస్ కమిషనరేట్లోని రాణీ రుద్రమదేవి హాల్లో వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ అందజేశారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశాల మేరకు జిల్లా నుంచి నోడల్ ఆఫీసర్గా డీఎస్పీ శ్రీనివాస్, వారికి కోచ్గా బీడీ టీం పీసీ అంజయ్య టీం సభ్యులకు ప్రోత్సాహాన్ని అందించారు. పోలీస్ డ్యూటీమీట్లో 16 పతకాలు -
‘స్థాయికి మించి వైద్యం చేస్తే సహించేది లేదు’
మరిపెడ: స్థాయికి మించి వైద్యం చేస్తే సహించేది లేదని మహబూబాబాద్ డీఎంహెచ్ఓ రవి రాథోడ్ అన్నారు. మరిపెడ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కాంప్లెక్స్లో శంకర్ నిర్వహిస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని రవిరాథోడ్ సీజ్ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హై డోస్ వాడితే భవిష్యత్లో అనారోగ్యం బారిన పడతారన్నారు. అనుమతి లేకుండా వైద్యం చేయడం చట్టరీత్యా నేరమని, ప్రాక్టీషనర్లు పరిమితులకు లోబడి చికిత్స చేయాలని సూచించారు. జిల్లాలో అధికంగా మరిపెడలో అర్హత లేని వైద్యం జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. తనిఖీలు చేస్తున్నారనే సమాచారంతో మిగతా ప్రథమ చికిత్స కేంద్రాల నిర్వాహకులు షెట్టర్లకు తాళాలు వేసుకుని పరారయ్యారన్నారు. అయినప్పటికీ తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. డీఎంహెచ్ఓ వెంట స్థానిక పీహెచ్సీ వైద్యాధికారి గుగులోతు రవికుమార్ తదితరులున్నారు. పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్ డోర్నకల్: డోర్నకల్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసుకు సంబంధించి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డోర్నకల్ సీఐ బి.రాజేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇస్లావత్ నవీన్ ఓ తండాకు చెందిన బాలికను ఇంటి నుంచి హైదరాబాద్కు తీసుకెళ్లాడు. బాలిక అదృశ్యంపై ఆమె అమ్మమ్మ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అనంతరం నవీన్ పది రోజుల తర్వాత బాలికను స్వగ్రామానికి తీసుకొచ్చాడు. పోక్సో కేసు నమోదు చేసి నవీన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ తెలిపారు. చోరీ చేసేందుకు వచ్చిన బిహార్ యువకుడికి దేహశుద్ధిమహబూబాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని బుక్క బజార్ ప్రాంతంలోని బ్రహ్మణపల్లి సురేశ్ ఇంట్లోకి శుక్రవారం బిహార్ రాష్ట్రానికి చెందిన యువకుడు ప్రవేశించాడు. బీరువా తెరిచి చోరీకి చేసేందుకు యత్నించాడు. ఏదో శబ్ధం అవుతున్నట్లుగా అలికిడి వినిపించడంతో వెంటనే ఆ ఇంటి యజమాని పరిగెత్తుకుంటూ వచ్చి అరిచాడు. స్థానికులు వచ్చి ఆ యువకుడిని కట్టేసి చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేజీబీవీలో రెన్యువల్ విధానాన్ని రద్దు చేయాలిమహబూబాబాద్ అర్బన్: కేజీబీవీల్లో రెన్యువల్ విధానాన్ని రద్దు చేయాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బలాష్టి రమేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కేజీబీవీ, మోడల్ స్కూల్ను టీపీటీఎఫ్ నాయకులు శుక్రవారం సందర్శించి సభ్యత్వ నమెదు చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పులిచింతల విష్ణువర్ధన్రెడ్డి, కార్యదర్శి రాచకొండ ఉపేందర్, మండల అధ్యక్షుడు భిక్షపతి, ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రనెల్లికుదురు: నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన ఉపాధిహామీ చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేయాలనే కుట్ర చేసి పేదలకు దక్కకుండా చేస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ మండిపడ్డారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన సీపీఎం మండల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈనెల 9న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి ఇస్సంపల్లి సైదులు, బాబు గౌడ్, నర్సయ్య, యాకయ్య, పుల్లయ్య, ఎల్లయ్య పాల్గొన్నారు. -
వణికిస్తున్న డెంగీ
జిల్లాలో నమోదైన మలేరియా, డెంగీ కేసుల వివరాలు సంవత్సరం మలేరియా డెంగీ2022 20 125 2023 06 40 2024 11 419 2025 ఇప్పటి వరకు 03 18సాక్షి, మహబూబాబాద్: ప్రతీ సంవత్సరం జిల్లా ప్రజలను వణిస్తున్న డెంగీ జ్వరాలు ఈ ఏడాది కూడా వదలడం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు వైద్య ఆరోగ్యశాఖ నిర్ధారణలో జిల్లాలో 18 మందికి డెంగీ పాజిటివ్ వచ్చినట్లు తేలింది. అయితే ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ డెంగీ కేసుల సంఖ్య వందకు పైగా ఉంటుందని అంచనా. డెంగీ జ్వరానికి కారణమైన దోమలను పూర్తి స్థాయిలో నివారించకపోవడంతోనే కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. డెంగీ జ్వరం వస్తే ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షల్లో ఖర్చవుతుంది. కాగా.. ఈ జ్వరం ఎప్పుడు ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని ప్రజలు భయపడుతున్నారు. 18కి చేరిన కేసులు.. ఈఏడాది ఇప్పటి వరకు 18 మందికి డెంగీ సోకినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో మహబూబాబాద్ అర్బన్ పీహెచ్సీ పరిధిలో నాలుగు, మల్యాలలో మూడు, కురవిలో రెండు, నెల్లికుదురు, నర్సింహులపేట, దంతాలపల్లి, తీగలవేణి, అయోధ్యపురం, కోమట్లగూడెం పీహెచ్సీల్లో ఒకొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. వీటితోపాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకుని మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, తొర్రూరు పట్టణాల్లోని చికిత్స పొందుతున్న వారు వందకుపైగా ఉన్నట్లు అంచనా. పట్టణాల్లోనే ఎక్కువ.. గతేడాది 419 డెంగీ కేసులు నమోదు కాగా.. ఇందులో మహబూబాబాద్, తొర్రూరు, డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీల్లోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఇందుకు ప్రధాన కారణం ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గూడేలు, గిరిజన తండాలతో పోలిస్తే పట్టణాల్లో పారిశుద్ధ్య వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉండడమే అని వైద్యులు చెబుతున్నారు. మురికి కాల్వలు, చెత్త కుప్పలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. దోమల నివారణకు గంభోజీ చేపలు, ఆయిల్ బాల్స్ వేయడం, ఫాగింగ్ చేయడం వంటి చర్యలు ఇప్పటి వరకు జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎక్కడా మొదలు పెట్టలేదని ప్రజలు చెబుతున్నారు. ముందుకు సాగని ప్రణాళిక వర్షాకాలం రాకముందే సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు ఇప్పటి వరకు కనీస కార్యాచరణ చేపట్టలేదనే విమర్శలు వస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు దోమ తెరలు పంపిణీ చేయాలి. కానీ.. నాలుగేళ్లుగా దోమ తెరలు రాలేదని గిరిజనులు చెబుతున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేయడం బ్లీచింగ్, ఫాగింగ్ మొదలైన పనులకు నిధులు లేవు. దీంతో అప్పులు చేసి మరీ పనులు చేయాల్సి వస్తోందని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. పంచాయతీ, వైద్యారోగ్యం, తాగునీటి సరఫరా శాఖల మధ్య సమన్వయంతో పనిచేసి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అరికట్టాలని కలెక్టర్ సమీక్ష సమావేశం పెట్టి ఆదేశించినా ఆశించిన స్థాయిలో పని చేయడంలేదని ఫిర్యాదులు ఉన్నాయి. అప్రమత్తంగా ఉన్నాం..సీజనల్గా వచ్చే మలేరియా, డెంగీ, టైఫాయిడ్ జ్వరాలు ప్రబలకుండా జిల్లాలో చర్యలు తీసుకుంటున్నాం. జ్వర సర్వే నిర్వహించి కేసులను గుర్తించి వైద్య సేవలందిస్తున్నాం. దోమల నివారణ కోసం వినియోగించే రసాయనాలను పీహెచ్సీలకు పంపించాం. ఆర్డీటీ కిట్లు అందజేశాం. అవసరమైన చోట హెల్త్ క్యాంపులు పెట్టి చికిత్సలు అందజేస్తున్నాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. – సుధీర్రెడ్డి, జిల్లా మలేరియా ప్రోగ్రాం ఆఫీసర్ రోజురోజుకూ పెరుగుతున్న కేసులు ఇప్పటికి 16 మంది గుర్తింపు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వందల్లో కేసులు ఇంకా మొదలుకాని ఫాగింగ్, దోమల నివారణ చర్యలు భయపడుతున్న జిల్లా ప్రజలు -
ఘోర ప్రమాదం: రెండు లారీలు ఢీ.. ముగ్గురు సజీవదహనం
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరిపెడ మండలం ఎల్లంపేట దగ్గర జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో లారీ క్యాబిన్లో మంటలు చెలరేగడంతో ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్ సజీవ దహనమయ్యారు.ఇవాళ తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. లారీల్లో ఒకటి గ్రానైట్ లోడుతో, మరొకటి చేపల దానాతో వెళ్తున్నాయని పోలీసులు వెల్లడించారు. ఒక లారీ విజయవాడ నుంచి గుజరాత్ వెళ్తుండగా, మరో లారీ వరంగల్ నుంచి ఏపీ వైపు వెళ్తుందని తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని.. దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.ఈ ప్రమాదం కారణంగా ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. క్యాబిన్లో సజీవదహనమైన మృతదేహాలను బయటకు తీసి మార్చురీకి తరలించారు. -
6న ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క రాక
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఈ నెల 6న రానున్నారని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని సోమ్లాతండా వద్ద సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే మురళీనాయక్.. డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, డీఎస్పీ తిరుపతిరావు, వివిధ శాఖల అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని, మజ్జిగ, చల్లని తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించా రు. తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు గాను పార్కింగ్ స్థలాలకు ఆప్రోచ్ రోడ్లు శనివారంలోగా పూర్తి చేయాలన్నారు. పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చాలా ముఖ్యమన్నారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ -
ఎంపీఎస్ఓల కొరత
మహబూబాబాద్: జిల్లాలో ప్రతీ మండలంలో వర్షపాతం నమోదు కోసం ఒక ఎంపీఎస్ఓ అధికారి ఉండాలి. అయితే జిల్లాలోని 18 మండలాలకు 10మంది మాత్రమే ఉన్నారు. ఆటోమేటిక్ వర్షపాతం నమోదు బాధ్యత అంతా సీపీఓ కార్యాలయ అధికారులదే కాగా.. ఒక టెక్నీషియన్కు మరమ్మతుల నిర్వహణ, ఇతర బాధ్యతలు అప్పగించారు. కాగా సిబ్బంది కొరతతో వర్షపాతం నమోదులో కొంత జాప్యంతో పాటు కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి 16 మాన్యువల్ నమోదు కేంద్రాలు.. జిల్లాలో18మండలాలు,482 గ్రామపంచాయతీలు, 5 మున్సిపాలిటీలు ఉన్నాయి. కాగా పాత 15 మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాల ఆవరణలో మాన్యువల్ వర్షపాతం నమోదు కేంద్రాలు ఉ న్నా యి. మానుకోట మండలానికి చెందిన కేంద్రం మా త్రం ఆర్డీఓ కార్యాలయంలో ఉంది. ఇటీవల ఏర్పా టు చేసిన సీరోలు, ఇనుగుర్తి మండలాల్లో ఏర్పాటు చేయలేదు. ఎంపీఎస్ఓలు రికార్డుల్లో వర్షపాతం వివరాలు నమోదు చేసిన తర్వాత కలెక్టర్ కార్యాల యం, ఆర్డీఓ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలి. వేధిస్తున్న కొరత.. 18 మండలాలకు గాను 18 మంది ఎంపీఎస్ఓలు ఉండాలి. కానీ 10 మంది మాత్రమే ఉన్నారు. 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన మండలాల్లో ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించి నమోదు, నిర్వహణ చేపడుతున్నారు. దీంతో పలువురి అధికారులపై పనిభారం పడుతోంది. ఒక్కరే టెక్నీషియన్.. 18 మండలాలకు గాను 23ఆటోమేటిక్ వర్షపాతం నమోదు కేంద్రాలు ఉన్నాయి. వాటి నిర్వహణ, రిపేర్ కోసం ఒక్కరే టెక్నీషియన్ పని చేస్తున్నారు. ఆటోమేటిక్ మిషన్లలో చాలా సమస్యలు వస్తాయి. అన్ని మండలాలకు ఒక్కరే వెళ్లాల్సి వస్తోంది. కాగా మరో టెక్నీషియన్ను నియమిస్తే సమస్యలు చాలా వరకు తీరుతాయి. ఇంటిగ్రేటెడ్ వర్షపాతం ఫైనల్.. ఎంపీఎస్ఓలు సంబంధిత వెబ్సైట్ లాగిన్లో వివరాలు నమోదు చేయాలి. అలాగే ఆటోమెటిక్ వర్షపాతం వివరాలను సీపీఓ సిస్టమ్లో సంబంధిత టెక్నీషియన్ మొబైల్లో చూడవచ్చు. కాగా ఎంపీఎస్ఓలు, టెక్నీషియన్లు సంబంధిత వెబ్సైట్లో మాన్యువల్, ఆటోమేటిక్ కేంద్రాల వర్షపాతం వివరాలను నమోదు చేస్తారు. అదే ఫైనల్గా ప్రభుత్వం ప్రకటిస్తుంది. అక్కడ ఏర్పాటు చేయాలి.. ఇటీవల ఏర్పాటు చేసిన సీరోలు, ఇనుగుర్తి మండలాల్లో మాన్యువల్ వర్షపాతం నమోదు కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. అలాగే కేంద్రాల నిర్వహణ, మరమ్మతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడితే నమోదు వివరాలు కచ్చితంగా వస్తాయి. అన్నీ పనిచేస్తున్నాయి.. 23 ఆటోమేటిక్ వర్షపాతం నమోదు కేంద్రాలు పని చేస్తున్నాయి. ప్రతీరోజు నమోదును రికార్డు చేస్తున్నాం. ఎలాంటి సమస్య లేకుండా తగు ఏర్పాట్లు చేశాం. భద్రతా దృష్ట్య్టా సబ్ స్టేషన్లలో 22 ఏర్పాటు చేసి, ఒకటి మల్యాల కేవీకేలో ఏర్పాటు చేశాం. కొత్త మండలాల్లో వర్షపాతం నమోదు కేంద్రాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపాం. – దుర్గరాజు, ఉప గణాంక అధికారి 23 ఆటోమేటిక్ నమోదు కేంద్రాలు.. జిల్లాలో 23 ఆటోమేటిక్ వర్షపాతం నమోదు కేంద్రాలు ఉన్నాయి. కాగా మానుకోట మండలంలో 3, నెల్లికుదురు 2, నర్సింహులపేట 2, దంతాలపల్లి 1, తొర్రూరు 1, పెద్దవంగర 1, మరిపెడ 1, చిన్నగూడూరు 1, కురవి 1, సీరోలు 1, డోర్నకల్ 2, బయ్యారం 1, గార్ల 1, ఇనుగుర్తి 1, కేసముద్రం 1, గూడూరు 1, కొత్తగూడ 1, గంగారం మండలంలో ఒకటి ఆటోమేటిక్ వర్షపాతం నమోదు కేంద్రం ఉన్నాయి. వాటిని భద్రత దృష్టా విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలో ఏర్పాటు చేశారు. గంటగంటకు వర్షపాతం నమోదు అవుతుంది. వర్షపాతం నమోదులో తలెత్తుతున్న సమస్యలు జిల్లాలో 16 మాన్యువల్ వర్షపాతం నమోదు కేంద్రాలు 23 ఆటోమేటిక్ ఎంట్రీ సెంటర్లు -
ఒకే కుటుంబంలో ఇద్దరి మృతి
పెద్దవంగర: ఆర్థిక సమస్యలతో కోడలు ఆత్మహత్య చేసుకోగా.. ఆమె మరణ వార్త విన్న మామ గుండెపోటుతో మృతి చెందిన ఘటన మండలంలోని అవుతాపురంలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేముల సంతోష్కు 2011లో మంచిర్యాలకు చెందిన ఝాన్సీ(30)తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు అఖిల్ తేజ, అభిదామిని ఉన్నారు. సంతోష్ స్థానికంగా సీఆర్పీగా పని చేస్తుండగా, ఝాన్సీ తొర్రూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా విధులు చేపడుతుంది. కాగా, ఆర్థిక సమస్యలు తలెత్తడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఝాన్సీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు గుర్తించి వెంటనే తొర్రూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కోడలు మరణ వార్త విన్న మామ వేముల లక్ష్మ య్య(70) తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. కుమారుడు సంతోష్ ఒంటరివాడు అయ్యాడని, మనుమడు, మనుమరాలు తల్లిలేని వారయ్యారని కలత చెందాడు. ఇంటికి తిరిగి వెళ్లిన కొద్ది సేపటికే గుండె నొప్పిగా ఉందని భార్య సరోజనతో చెప్పాడు. ఆమె సపర్యలు చేసేలోపే గుండెపోటుతో లక్ష్మయ్య మృతి చెందాడు. కాగా,కొన్ని గంటల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఝాన్సీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేటకు తరలించారు. ఈ సంఘటనపై ఎస్సై క్రాంతి కిరణ్ను వివరణ కోరగా ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఆర్థిక సమస్యలతో కోడలి ఆత్మహత్య ఆమె మరణ వార్త విని గుండెపోటుతో మామ మృతి అవుతాపురంలో విషాదఛాయలు -
శుక్రవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2025
– 4లోuమూతబడే స్థాయి నుంచి..కురవి: జిల్లాలోని కురవి మండలం కొత్తూరు(జీ) శివారు తాట్యతండా(ఖాసీంతండా) మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గత విద్యాసంవత్సరం ముగ్గురు విద్యార్థులు విద్యనభ్యసించారు. ఈ ఏడాది బడి తెరిచే నాటికి ఒక బాలిక గురుకులంలో సీటు రావడంతో వెళ్లిపోయింది. ఈ తరుణంలో ఇద్దరు విద్యార్థులు మాత్రమే మిగిలారు. దీంతో బడి మూతపడే స్థాయికి చేరింది. అయితే బడిని బతికించాలనే సంకల్పంతో హెచ్ఎం మంజుల బడిబాట కార్యక్రమాన్ని సక్రమంగా చేపట్టారు. అలాగే ప్రతీరోజు ఇంటింటికీ తిరిగి పిల్లలు ఎక్కడ చదువుతున్నారో వివరాలు తెలుసుకుని, వారు ప్రభుత్వ బడిలో చేరేలా తల్లిదండ్రులను ఒప్పించారు. ఎంఈఓ బాలాజీ సహకారంతో పాటు గ్రామ పెద్దలు, యువకులు, విద్యావంతులు మద్దతుగా నిలిచారు. ఇలా ఇద్దరు విద్యార్థులు ఉన్న పాఠశాల ప్రస్తుతం 23మందికి చేరింది. అలాగే మరికొంత మంది విద్యార్థులు బడిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నా రు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఎంఈఓ బాలాజీ ఒక టీచర్ను డిప్యుటేషన్పై పంపించారు. ఇద్దరు టీచర్లు విద్యార్థులకు విద్యాబుద్ధులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా బడిని బాగు చేసేందుకు గ్రామానికి చెందిన పెద్దలు ముందుకు వస్తున్నారు. బడిని అందంగా తీర్చిదిద్దేందుకు సిద్ధమయ్యారు.న్యూస్రీల్ -
ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు సీట్లు
మోడల్ స్కూల్లో అడ్మిషన్ పొందాలంటే ముందుగా ప్రవేశ పరీక్ష రాయాలి. అందులో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తాం. ఇక్కడ విద్యతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, వివిధ క్రీడారంగాల్లో శిక్షణ అందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధిస్తున్నారు. అన్ని సౌకర్యాలతో మెరుగైన విద్య అందిస్తున్నందుకు మానుకోట మోడల్ స్కూల్కు అంత క్రేజ్ ఉంది. ఇంటర్లో బాలికలకు ప్రత్యేక హాస్టల్ వసతి ఉంది. – గండి. ఉపేందర్రావు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ -
నో అడ్మిషన్ బోర్డు..
మహబూబాబాద్ అర్బన్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలకు పంపించడానికి ఆసక్తి చూపుతున్నారు. అప్పులు చేసి లక్షల్లో ఫీజలు చెల్లిస్తున్నారు. అయితే ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మోడల్ స్కూల్లో నాణ్యమైన విద్య అందుతోంది. దీంతో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే నో అడ్మిషన్ బోర్డు పెట్టారు. ఆదర్శం.. అనంతారం మోడల్ స్కూల్.. మానుకోట మున్సిపల్ పరిధి అనంతారం మోడల్ స్కూల్లో మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన విద్య, ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి. అన్ని రంగాల్లో వి ద్యార్థులు ప్రతిభ చాటుతూ ట్రిపుల్ఐటీలో సీట్లు సాధిస్తున్నారు. అలాగే జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణిస్తున్నారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్,ఆర్మీ,నేవీ, పో లీసు ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నా రు. దీంతో మోడల్స్కూల్లో తమ పిల్లలను చది వించడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. నో ఆడ్మిషన్ బోర్డు ఏర్పాటు.. అనంతారం మోడల్ స్కూల్లో అడ్మిషన్ కావాలంటే ముందుగా అర్హత ప్రవేశ పరీక్షలో ఉత్తమ మార్కులు సాధించాలి. ఈ విద్యా సంవత్సరంలో ఇప్పటికే అడ్మిషన్లు పూర్తయ్యాయి. సామర్థ్యం మేరకు అడ్మిషన్లు ఫుల్ కావడంతో నో అడ్మిషన్ బోర్డు పెట్టడం గమనార్హం. తమ పిల్లలకు అడ్మిషన్లు కావాలంటూ ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్, రాజకీయ నాయకుల వద్దకు సిఫార్సు వినతిపత్రాలు కోసం తల్లిదండ్రులు వెళ్తున్నారు. కాగా ఏటా డిమాండ్, సౌకర్యాల మేరకు అడ్మిషన్ల సంఖ్యను పెంచుతూ ఒక తరగతికి 100మంది విద్యార్థుల చొప్పున రెండు సెక్షన్లు ఏర్పాటు చేశారు. ఇంటర్లో గ్రూపునకు 40మంది చొప్పున విద్యార్థుల అడ్మిషన్లు జరుగుతున్నాయి. మోడల్ స్కూల్లో పూర్తిగా నిండిన సీట్లు ఉత్తమ ఫలితాలు రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల ఆసక్తి -
అన్నదాతలకు అర్థమయ్యేలా..!
హన్మకొండ : విద్యుత్ ప్రమాదాల నివారణపై టీజీ ఎన్పీడీసీఎల్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా అవగాహన, చైతన్యం కల్పించేందుకు సర్కిల్ కార్యాలయాల్లోని డివిజనల్ ఇంజనీర్లకు అదనంగా సేఫ్టీ అధికారులుగా బాధ్యతలు అప్పగించింది. రైతులు, విద్యుత్ వినియోగదారుల సమస్యలు తెలుసుకోవడంతో పాటు పరిష్కరించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి పొలంబాట కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. ఇప్పటి వరకు సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారాలు చూపించిన పొలం బాట.. ఈ సారి ప్రత్యేక లక్ష్యంతో ముందుకెళ్తోది. ఇందులో భాగంగా సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కారం చూపుతున్నారు. అంతే కాకుండా విద్యుత్ ప్రమాదాల నివారణే ధ్యేయంగా వినియోగదారులను చైతన్య చేయడంతో పాటు, ప్రమాదాలు తలెత్తే కారణాలను విశ్లేషిస్తూ అధికారులు ముందుకెళ్తున్నారు. హనుమకొండ జిల్లాలో.. హనుమకొండ జిల్లాలో ఇప్పటి వరకు 523 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల సమస్యలను పరిష్కరించారు. అదే విధంగా 935 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు ఎర్తింగ్ సరి చేశారు. తక్కువ ఎత్తులో ఉన్న 297 ట్రాన్స్ఫార్మర్ల గద్దెల పునర్నిర్మించారు. 3,153 మధ్య స్తంభాలు నాటారు. తుప్పు పట్టిన 467 స్తంభాలను మార్చారు. రెండేసి విద్యుత్ లైన్లు ఉన్న 286 లైన్లను సరిచేశారు. క్రాసింగ్లో లైన్ల మధ్య ఉండాల్సిన దూరాన్ని 170 విద్యుత్ లైన్లలో సరిదిద్దారు. 1,216 వదులు ఉన్న లైన్లను సరి చేశారు. రోడ్ క్రాసింగ్లో తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ లైన్లు 185 ప్రాంతాల్లో ఎత్తు పెంచారు. వరంగల్ జిల్లాలో.. వరంగల్ జిల్లాలో సమస్యాత్మకంగా ఉన్న 487 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను సరి చేశారు. 739 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు ఎర్తింగ్ పునరుద్ధరించారు. 224 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల గద్దెల ఎత్తు పెంచారు. 359 వంగిన పోల్స్, 547 డ్యామేజీ స్తంభాలను మార్చారు. 2,965 మధ్య స్తంభాలు ఏర్పాటు చేశారు. 134 ప్రాంతాల్లో రెండేసి విద్యుత్ లైన్ల ఉన్న స్తంభాలను సరి చేశారు. విద్యుత్ లైన్ల క్రాసింగ్లు 348 ప్రాంతాల్లో నిర్దిష్ట ఎత్తుకు సరి చేశారు. వదులు ఉన్న 1,141 విద్యుత్ లైన్లను సరిదిద్దారు. 161 చోట్ల రోడ్డుకు అతి తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ లైన్ల ఎ త్తు పెంచారు. ఓ వైపు విద్యుత్ ప్రమాదాల కారకాల ను సరిదిద్దుతూనే.. మరో వైపు అవగాహన కల్పిస్తున్నారు. విద్యుత్ జాగ్రత్త పాటించే విధానాలు వివరిస్తున్నారు. విద్యుత్ సమస్యలు గుర్తిస్తే 1912 ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. పొలంబాట ద్వారా విద్యుత్ ప్రమాదాల నివారణపై అవగాహన రైతులను చైతన్య పరుస్తున్న డీఈ టెక్నికల్, సేఫ్టీ అధికారులు -
సర్కారు బడిబాట
సాక్షి, మహబూబాబాద్: సర్కారు బడుల్లో విద్యార్థుల నమోదు పెరుగుతోంది. బడుల బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టడం.. బడిబాటను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గతానికి భిన్నంగా ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు సర్కారు బడిబాట పడుతున్నారు. దీంతో గతంలో మూసివేసిన పలు పాఠశాలలు తెరుచుకున్నాయి. గత విద్యా సంవత్సరం వరకు తక్కువ పిల్లలతో వెలవెలబోయిన పాఠశాలలు నిండుగా విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. 4,601 మంది చేరిక ఈ విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి నిర్వహించిన బడి బాట కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా 899 పాఠశాలల్లో 4,601 మంది విద్యార్థులు సర్కారు బడుల్లో కొత్తగా చేరారు. ఇందులో జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో చదివి 5 సంవత్సరాలు నిండిన వారు 1,846 మంది ఉండగా గతంలో ప్రైవేట్ పాఠశాలల్లో చదివి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన వారు 2,755 మంది ఉన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా కురవి మండలంలో 461 మంది పిల్లలను చేర్పించి ప్రథమ స్థానంలో నిలిచింది. కేవలం 10 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించిన చిన్నగూడూరు మండలం చివరి స్థానంలో నిలిచింది. తెరుచుకున్న పాఠశాలలు.. పిల్లలు లేరనే కారణంతో గత ఏడాది మూసివేసిన ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుతం తెరుచుకుంటున్నాయి. జిల్లాలోని 18 మండలాల్లో 148 పాఠశాలలు విద్యార్థులు లేక మూత పడ్డాయి. ఇందులో అత్యధికంగా మరిపెడ మండలంలో 36 పాఠశాలలు ఉండగా.. మహబూబాబాద్ 19, డోర్నకల్ 12, చిన్నగూడూరు 9, తొర్రూరు 8పాటు ఇతర మండలాల్లో మిగిలిన పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ఈ ఏడాది బయ్యారం మండలంలోని ఎంపీపీఎస్ కొత్తూరు హెచ్సీ, ఎంపీపీఎస్ ఐజీ రోడ్ బయ్యారం, ఎంపీపీఎస్ బండ్లకుంట, ఇనుగుర్తి మండలంలోని ఎంపీపీఎస్ లక్ష్మీపురంతండా, ఎంపీపీఎస్ మాస్కుంట తండా, మహబూబాబాద్ మండలం లోని ఎంపీపీఎస్ హజారియాతండా, ఎంపీపీఎస్ చీకటిచింతల తండా, సీరోలు మండలంలోని ఎంపీపీఎస్ గుజిలీతండా, ఎంపీపీఎస్ కర్లకుంట తండా, పెద్దవంగర మండలంలోని ఆర్ఎంఎస్ తండాలోని పాఠశాలలు తెరుచుకున్నాయి. ఆయా పాఠశాలల్లో విద్యాబోధన జరుగుతోంది.నమ్మకం కలిగించాం.. అన్ని వసతులు, ఉత్తమ ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు ఉన్నా ప్రభుత్వ పాఠశాలలు అంటే విద్యార్థుల తల్లిదండ్రుల్లో కొంత మేరకు అపనమ్మకం ఉంది. ఈ విషయంపై తల్లిదండ్రులతో మాట్లాడి మంచి బోధన అందిస్తామని ఒప్పించాం. నమ్మకం కలిగించే విధంగా వారికి నచ్చజెప్పాం. దీంతో ప్రైవేట్ పాఠశాలల్లో చదివే పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారు. ఈ ప్రయత్నం ఇంకా కొనసాగుతూనే ఉంది. మరింత మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. – రవీందర్ రెడ్డి, డీఈఓ●ప్రభుత్వ బడుల్లో పెరుగుతున్న విద్యార్థులు పిల్లల రాకతో మూతబడిన 10 పాఠశాలల్లో బోధన పలు స్కూళ్లలో ఉపాధ్యాయుల ప్రత్యేక శ్రద్ధబడి బాటలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులు మండలం అంగన్వాడీల ప్రైవేట్ మొత్తం నుంచి పాఠశాలల నుంచిబయ్యారం 112 128 240 చిన్నగూడూరు 00 10 10 దంతాలపల్లి 59 219 278 డోర్నకల్ 131 212 343 గంగారం 80 03 83 గార్ల 146 115 261 గూడూరు 162 184 346 ఇనుగుర్తి 45 63 108 కేసముద్రం 90 149 239 కొత్తగూడ 110 24 134 కురవి 144 317 461 మహబూబాబాద్ 150 263 413 మరిపెడ 169 210 379 నర్సింహులపేట 66 133 199 నెల్లికుదురు 162 198 360 పెద్దవంగర 65 268 333 సీరోలు 78 110 188 తొర్రూరు 77 149 226 మొత్తం 1,846 2,755 4,601 -
విద్యారంగంపై ప్రత్యేక దృష్టి
మహబూబాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అన్నారు. మహబూబాబా ద్ మండలంలోని బ్రాహ్మణపల్లి యూపీఎస్, కొమ్ముగూడెం ఎంపీపీఎస్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను గురువారం ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజనం, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థుల హాజరు, అభ్యసన సామర్థ్యాలు, తరగతి గదుల్లో బోధన పద్ధతులు, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణపై సమగ్రంగా సమీక్షించారు. విద్యార్థుల పఠనాభివృద్ధికి పాఠశాలలు తీసుకుంటున్న చర్యలను అభినందించి, ప్రత్యేకంగా కొమ్ముగూడెం పాఠశాలలో పర్యావరణ పరిరక్షణకు గుర్తుగా కలెక్టర్ ఒక మొక్క నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థుల కోసం అనేక సౌకర్యాలు కల్పిస్తూ, అత్యుత్తమ సాంకేతిక విద్యా బోధన అందించడం కోసం విద్యాశాఖను బలోపేతం చేస్తుందన్నారు. డీఈఓ రవీందర్ రెడ్డి, డీఎస్ఓ అప్పారావు, హెచ్ఎంలు భద్రు, శివలక్ష్మి, ఉపాధ్యాయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్మార్ సింగ్ -
బట్టలు విప్పాలనే ఉత్సాహంగా ఉందా..
జనగామ: ‘అసెంబ్లీలో మా బట్టలు విప్పుతామంటున్నారు, అక్కడ చర్చ మాత్రమే జరగాలి, మీ పార్టీ(బీఆర్ఎస్)ఆఫీసుకు నాతోపాటు కార్యకర్తలతో కలిసి వచ్చి గుడ్డలు విప్పి చూపిస్తాం, ఏం కావా లో చూసుకోండి’ అంటూ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్రెడ్డి.. మాజీ మంత్రి హరీశ్రావును ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో గురువారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించిన ఎంపీ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, దీనిని చూసి ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు చెడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై చర్చ కోసం అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని పదేపదే చెబుతున్నా, బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా లేరన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో రాయలసీమ రతనాల సీమ చేస్తామని, చేపల పులుసు తిని హామీ ఇచ్చి, ఈ రోజు బనకచర్ల బంకను తీసుకువచ్చి, మళ్లీ తెలంగాణ ఉద్యమ సెంటిమెంటును రగిలించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు వచ్చి బట్టలు విప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, నీ వు, నీ బామ్మర్ధి చూసుకునేందుకు సిద్ధమా అని ఎంపీ.. హరీశ్రావు వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ చామల బావ, బామ్మర్దులకు ఏం కావాలో చూసుకోండి అసెంబ్లీలో చర్చ మాత్రమే జరగాలి భువనగిరి ఎంపీ చామల హాట్ కామెంట్స్ -
భూ కేటాయింపు ఆమోదాన్ని వెనక్కి తీసుకోవాలి
కేయూ క్యాంపస్: యంగ్ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి కాకతీయ యూనివర్సిటీ భూములు కేటాయిస్తూ యూనివర్సిటీ పాలకమండలి ఆమోదించిందని, ఈ ఆమోదాన్ని వెనక్కి తీసుకోవాలని వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రిజిస్ట్రార్ చాంబర్లో బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనివర్సిటీ అధికారులు ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి భూ కేటాయింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ఈనెల 7న జరిగే స్నాతకోత్సవాన్ని అడ్డుకుంటామన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఓ వర్గాన్ని తయారు చేసుకుని ఇంటిగ్రేటెడ్ స్కూల్ను యూనివర్సిటీ భూముల్లోనే నిర్మించేలా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇది సరికాదని, యూనివర్సిటీ బయట ప్రభుత్వ భూముల్లోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. కాగా, ఆందోళన సమయంలో రిజిస్ట్రార్ వి.రామచంద్రం చాంబర్లోనే ఉన్నారు. రెండు గంటలకుపైగా ఆందోళన కొనసాగడంతో రిజిస్ట్రార్ వద్దకు వివిధ పనుల నిమిత్తం వెళ్లేవారికి అవకాశం లేకుండా పోయింది. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ రామచంద్రం మాట్లాడుతూ స్కూల్ నిర్మాణానికి భూమిని కేటాయిస్తూ పాలకమండలిలో ఆమోదించారని,ఆ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలంటే మళ్లీ పాలకమండలిలోనే చర్చించాల్సింటుందన్నారు. ఆందోళన సమాచారం అందుకున్న కేయూ సీఐ రవికుమార్, ఎస్సై నవీన్కుమార్ ఘటనాస్థలికి చేరుకుని విద్యార్థి సంఘాల బాధ్యులను కేయూ పోలీస్స్టేషన్కు తరలించారు. అక్కడ కొద్ది సమయం తర్వాత విడిచిపెట్టారు. కార్యక్రమంలో ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం నాగార్జున, రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మాస్ సావిత్రి, డీఎస్ఏ రాష్ట్ర కన్వీనర్ కామగోని శ్రావణ్, కోకన్వీనర్ మున్నా గణేశ్, బీఆర్ఎస్వీ కేయూ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్, బాధ్యులు వీరస్వామి, వస్త్రం అనిల్, కొత్తూరు రోహిత్,స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమమకొండ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి మర్రి మహేశ్, ఏఐడీఎస్ఓ జిల్లా ఉపాధ్యక్షులు మధు, సురేశ్, ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ అధ్యక్షుడు సాయి, యూనివర్సిటీ కన్వీనర్ అన్నమయ్య తదితరులు పాల్గొన్నారు. లేనిపక్షంలో కేయూ స్నాతకోత్సవాన్ని అడ్డుకుంటాం వివిధ విద్యార్థి సంఘాల బాధ్యుల డిమాండ్ రిజిస్ట్రార్ చాంబర్లో ఆందోళన -
చోరీకి గురైన వాహనాల అప్పగింత
వరంగల్ క్రైం : హనుమకొండ ట్రాఫిక్ పోలీసులు పకడ్బందీ తనిఖీలతో డిసెంబర్, 2024 నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన పది బైక్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు అడిషనల్ ట్రాఫిక్ డీసీపీ రాయల ప్రభాకర్ తెలిపారు. ఇందులో భాగంగా గురువారం మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ ద్విచక్రవాహనాన్ని బాధిత యజమానికి అప్పగించినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు అప్పగించిన పది ద్విచక్రవాహనాల్లో 9 బైక్లపై కరీంనగర్, కొండాపూర్, సదాశివపేట, రాజన్న సిరిసిల్ల, ఆకివీడు (ఆంధ్రప్రదేశ్), ధర్మసాగర్, సుబేదారి, గోదావరిఖని, మహబూబాబాద్ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదైనట్లు, ఒక వాహనం కాటారం (భూపాలపల్లి జిల్లా)కు సంబంధించినట్లు వివరించారు. కార్యక్రమంలో వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ టి.సత్యనారాయణ, హనుమకొండ ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పాము కాటుతో రైతు మృతి ● రాజోలులో ఘటన కురవి: పొలంలో పనిచేస్తుండగా పాము కాటు వేయడంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం మండలంలోని రాజోలులో చోటుచేసుకుంది. ఎస్సై గండ్రాతి సతీశ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గోదాసి వరదయ్య(66) తన పొలంలో పనిచేసుకుంటున్న క్రమంలో పాము కాటు వేయడంతో అక్కడి నుంచి ఇంటికొచ్చి తన మనుమడికి విషయం చెప్పాడు. వెంటనే వరదయ్యను మహబూబాబాద్ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు సైదులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గండ్రాతి సతీశ్ తెలిపారు. గంజాయి సేవిస్తున్న నలుగురు యువకుల అరెస్ట్ న్యూశాయంపేట : వరంగల్ శివనగర్లోని ఓ ఇంట్లో గంజాయి సేవిస్తున్న నలుగురు యువకులను వరంగల్ నార్కోటిక్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నార్కోటిక్స్ డీఎస్పీ సైదులు కథనం ప్రకారం.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ట్రోల్ ఫ్రీ నంబర్ 1908కు వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం రాత్రి ఆ ఇంటికి చేరుకున్నారు. గంజాయి సేవిస్తున్న నలుగురు యు వకులను అరెస్ట్ చేసిన రిమాండ్ నిమిత్తం కో ర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. కాగా, ఆ నలుగురు యువకులు పద్మాక్షి గుట్ట వద్ద షెహర్లాల్ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేశారని, అతడిని త్వరలో అరెస్ట్ చేస్తామని డీ ఎస్పీ గురువారం పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సై మొగిలి హెడ్కానిస్టేబుల్ సోమలింగం, కానిస్టేబుళ్లు రాజేశ్, విజయ్ పాల్గొన్నారు. -
మేడిగడ్డకు జలకళ..
కాళేశ్వరం: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ జలకళ సంతరించుకుంటోంది. జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం మీదుగా ప్రాణహిత నది గోదావరిలో కలుస్తుంది. అక్కడి నుంచి దిగువన మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవా హం తరలుతోంది. దీంతో బ్యారేజీ వద్ద 77,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా, బ్యారేజీలో మొత్తం 85 గేట్లు ఎత్తి వేయడంతో అవుట్ఫ్లో అదే స్థాయిలో విడుదల చేస్తున్నారు. దీంతో కొన్ని రోజులుగా నీరు లేక వెలవెలబోయిన మేడిగడ్డ బ్యారేజీ వరద తాకిడితో జలకళ సంతరించుకుంది. సమ్మక్క సాగర్ బ్యారేజీలోకి భారీగా వరద నీరు.. కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామం వద్ద గోదావరిపై నిర్మించిన సమ్మక్క సాగర్ బ్యారేజీలోకి భారీగా వరద నీరు చేరుతోంది. వారం రోజుల నుంచి ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద నీరు చేరడంతో నది నిండుగా ప్రవహిస్తోంది. బుధవారం వరకు 40వేల క్యూసెక్కులతో సాధారణంగా ప్రవహించిన గోదావరి.. గురువారం భారీగా వరద నీరు చేరడంతో 94,500 క్యూసెక్కులతో ప్రవహిస్తోది. దీంతో ఇంజనీరింగ్ అధికారులు బ్యారేజీ వద్ద 59 గేట్లలో 14 గేట్లు ఎత్తి 94,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ సామర్థ్యం 6.94టీఎంసీలకు గాను ప్రస్తుతం 3.92టీఎంసీల నీరు ఉంది. బ్యారేజీ నీటి మట్టం 83 మీటర్లకు గాను 79.65 మీటర్ల మట్టం కొనసాగుతోంది. కాగా, దేవాదుల వద్ద ఉన్న చొక్కారావు ఎత్తిపోతల నుంచి రెండు మోటార్ల ద్వారా 494 క్యూసెక్కుల నీరు ఎత్తిపోస్తున్నట్లు డీఈ శరత్ బాబు తెలిపారు. -
అన్నదాతల అగచాట్లు..
దుగ్గొండి: వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. పది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు పంటలకు ఊపిరి పోశాయి. దీంతో రైతులు పంటలకు వేయడానికి ఎరువుల కోసం చూస్తున్నారు. ఇదే క్రమంలో యూరియా కొరత ఉందని, ఒక రైతుకు నెలకు రెండు బస్తాలు మాత్రమే ఇస్తామని ప్రచారం కావడంతో అన్నదాతలు ఒక్కసారిగా యూరియా కోసం ఎగబడ్డారు. బుధవారం మండలంలోని మందపల్లి, దుగ్గొండి, మహ్మదాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 20 టన్నుల చొప్పున యూరియా వచ్చింది. విషయం తెలుసుకున్న రైతులు గురువారం తెల్లవారుజాము నుంచే గోదాముల వద్ద బారులు తీరారు. అయితే ఒక రైతుకు రెండు బస్తాల యూరియా మాత్రమే ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారని, అంతకంటే ఒక్కబస్తా కూడా ఎక్కువ ఇచ్చేది లేదని పీఏసీఎస్ సిబ్బంది తెలిపారు. దీంతో చేసేది ఏమీ లేక రైతులు క్యూలో నిలబడి రెండు బస్తాల చొప్పున తీసుకెళ్లారు. పైగా రెండు బస్తాల యూరియా కావాలంటే అరలీటర్ నానో యూరియా లింకు పెట్టి మరీ అమ్మకాలు సాగించారు. కాగా, యూరియా విక్రయ కేంద్రాల వద్ద జిల్లా వ్యవసాయ శాఖ అఽధికారి పేరిట ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనిపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధను వివరణ కోరగా సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్న ఆ ఆడియో తనది కాదని, అది ఫేక్ అన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు. జిల్లాలో యూరియా నిల్వ లు సరిపడా ఉన్నాయని తెలిపారు. యూరియా లేదని, దొరకదనే ప్రచారాన్ని నమ్మి అవసరం లేకున్నా తీసుకోవద్దని సూచించారు. రైతుకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు యూరియాను పీఏసీఎస్లు, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల్లో తీసుకోవచ్చని ఆమె తెలిపారు. యూరియా కోసం బారులు రెండు బస్తాలకు మించి ఇవ్వలేమంటున్న సొసైటీ సీఈఓలు -
విద్యుదాఘాతంతో విద్యుత్ కాంట్రాక్టు హెల్పర్ దుర్మరణం
మహబూబాబాద్ రూరల్ : విద్యుత్ సరఫరాలో తలెత్తిన సాంకేతికలోపాన్ని సరిచేసేందుకు వెళ్లిన విద్యుత్ కాంట్రాక్టు (ఆన్ మ్యాన్డ్) హెల్పర్ విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదులపూసపల్లి గ్రామ శివారులో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, విద్యుత్ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదులపూసపల్లి గ్రామానికి చెందిన గట్ల కరుణాకర్ రెడ్డి (46) విద్యుత్శాఖలో కాంట్రాక్టు (ఆన్ మ్యాన్డ్) పద్ధతిపై హెల్పర్గా విధులు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం స్థానిక రైతులు పలు ప్రాంతాల్లో విద్యుత్ సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పడంతో గ్రామ శివారులోగల ఓ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి విద్యుత్ మోటారుకు సంబంధించిన స్టార్టర్ వద్ద మరమ్మతులు చేస్తున్నాడు. అంతలోనే ఒక్కసారిగా సర్వీస్ వైరు ఆయనకు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ విజయేందర్ రెడ్డి, డీఈ విజయ్ కుమార్, ఏడీఈ ప్రశాంత్, రూరల్ ఇన్చార్జ్ ఏఈ వెంకటేశ్, మున్సిపాలిటీ ఒకటవ వార్డు మాజీ కౌన్సిలర్ వెన్నం లక్ష్మారెడ్డి, ఇతర సిబ్బంది, ఉద్యోగులు, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య ప్రియాంక, కుమార్తె శ్రీవల్లి, కుమారుడు సుశాంత్ రెడ్డి ఉన్నారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పోస్టుమార్టం గదిలో కరుణాకర్ రెడ్డి మృతదేహాన్ని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ సందర్శించి, మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. చాలామంచి సేవకుడిని కోల్పోయాం... కరుణాకర్ రెడ్డి దుర్మరణం విషయం తెలుసుకున్న వెంటనే ఈదులపూసపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, తండాలవాసులు సంఘటన స్థలానికి వచ్చి ఆయన మృతదేహాన్ని సందర్శించారు. కరుణాకర్ రెడ్డి ఎంతో మంచి సేవకుడని, ఏసమయంలోనైనాసరే కరెంటు సమస్య వచ్చిందని ఫోన్ చేసి చెప్పగానే ఆలస్యం చేయకుండా వచ్చి మరమ్మతులు చేసి వెళ్లిపోయే వాడని కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యుత్ కార్మికుడికి తీవ్ర గాయాలు.. మొగుళ్లపల్లి: విద్యుత్ స్తంభంపై మరమ్మతు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ సరఫరా కావడంతో ఓ కార్మికుడు కింద పడగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం మండలంలోని మొట్లపల్లిలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మొట్లపల్లి గ్రామ ఉపవిద్యుత్ కేంద్రంలో గ్రామానికి చెందిన జన్నె అనిల్ కొన్ని సంవత్సరాలుగా అన్మ్యాన్డ్ కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. రోజుమాదిరిగానే విధి నిర్వహణలో భాగంగా ఎల్సీ తీసుకుని మరమ్మతు చేస్తున్నాడు. కాగా, అదే లైన్ మీద నుంచి కొద్ది దూరంలో 33కేవీ సామ్యర్థం గల మరో లైన్ వెళ్తోంది. ఈ క్రమంలో అనిల్ మరమ్మతు చేస్తున్న లైన్కు సంబంధించిన తీగ ప్రమాదవశాత్తు మరో లైన్కు చెందిన 33కేవీ తీగకు తాకింది. దీంతో విద్యుత్ సరఫరా జరగడంతో అనిల్ ప్రమాదానికి గురై స్తంభంపై నుంచి పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించి వరంగల్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. -
ఈసారి ముందస్తుగానే.. మహాజాతర
ఎస్ఎస్తాడ్వాయి: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క– సారలమ్మ మహా జాతర తేదీలు ఖరారయ్యాయి. 2026 జనవరి 28 నుంచి 31 వరకు మహాజాతర జరగనుంది. ప్రతీ రెండేళ్లకోసారి సాగే మహాజాతర తేదీలను పూజా రులు ఎక్కువగా ఫిబ్రవరి నెలలోనే ఖరారు చేస్తా రు. ఈసారి అధిక అమావాస్య రావడంతో వచ్చే ఏడాది జనవరి చివరివారం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు పూజారులు బుధవారం మహాజాతర తేదీలను ప్రకటించారు. 20 రోజుల ముందుగానే జాతర ఫిబ్రవరిలో నిర్వహించాల్సిన మేడారం మహా జాతర ఈసారి 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది.దీంతో 20 రోజుల ముందుగానే మహా జాతర జరగనుంది. పూజారులు పంచాంగం, కొత్త క్యాలెండర్ ప్రకారం మాఘశుద్ధ పౌర్ణమి, అమ్మవార్ల ఘడియలను బట్టి జాతర తేదీలను ఖరారు చేస్తారు. ప్రతీ రెండేళ్లకోసారి జాతర తేదీలను అమా వాస్య రోజుల్లో పౌర్ణమికి ముందుగా నిర్ణయించడం ఆనవాయితీ. ఈసారి 2026 జనవరి 17 నుంచి అమావాస్య మాసం ప్రారంభం కావడం, జనవరి 31న పౌర్ణమి అవుతుండడంతో మాఘశుద్ధ పౌర్ణమికి ముందుగా జాతర తేదీలను నిర్ణయించారు. అంటే అధిక అమావాస్య రావడంతో ఈసారి జనవరిలోనే నిర్ణయించినట్లు పూజారులు వెల్లడించారు. 2018లో జనవరిలోనే జాతర.. గత మహాజాతరల తేదీలతో పోలిస్తే 2018లో జనవరి 31నుంచి ఫిబ్రవరి 3 వరకు జాతర తేదీలను నిర్ణయించారు. అలాగే 2010లో ఫిబ్రవరి 17నుంచి 20 వరకు, 2012లో ఫిబ్రవరి 8 నుంచి 11వరకు, 2014లో ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు, 2016లో ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు, 2020లో ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు, 2022లో ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు, 2024లో ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మహాజాతర సాగింది. 2018లో మాత్రం జనవరి 31 నుంచి జాతర సాగగా.. ఈ దఫా 2026 జనవరి నెలాఖరులోనే జాతర సాగనుంది. అధికార యంత్రాంగం సమాయత్తం మేడారం మహాజాతర తేదీలను పూజారులు ప్రకటించడంతో జిల్లా అధికార యంత్రాంగం జాతర అభివృద్ధి పనులపై సమాయత్తం కానుంది. ఈ సారి ముందస్తుగానే శాశ్వత అభివృద్ధి పనులను పూర్తి చేయాలనే సంకల్పంతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి సీతక్క చొరవతో ఇప్పటికే మేడారంలో శాశ్వత నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇకనుంచి జిల్లా యంత్రాంగం జాతర అభివృద్ధి పనులపై ప్రణాళికలతో ముందుకెళ్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు కోరారు.అధిక అమావాస్య రాకతో జనవరిలో నిర్వహణ మేడారం జాతర తేదీలను ప్రకటించిన పూజారులు 2026 జనవరి 28 నుంచి 31 వరకు.. కొనసాగుతున్న శాశ్వత అభివృద్ధి పనులుజాతర ఇలా.. జనవరి 28వ తేదీ: సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి రాక 29వ తేదీ : సమ్మక్క గద్దైపెకి 30వ తేదీ : భక్తుల మొక్కుల చెల్లింపు 31వ తేదీ : దేవతల వనప్రవేశం -
విత్తనాలు విత్తేందుకు అనుకూలం
ఇటీవల కురిసిన వర్షాలతో విత్తనాలు మొలకెత్తేందుకు అనుకూలమైన పదును వచ్చింది. ఈనెల15 వరకు పత్తి, మొక్కజొన్న, మెట్ట భూముల్లో పునాస పంటలు వేసుకోవచ్చు. వరిలో 150 రోజుల పంట కాలం రకాలు కాకుండా 120 రోజుల పంట కాలం రకాలు నారు పోసుకోవాలి. ఇందులో కూనారం 1638, 733, 118, వరంగల్ రకం 962, 915, జగిత్యాల రకం(జేజీఎల్)24423, ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనా, 21278 రకాలను నారుపోసుకుంటే ఉపయోగంగా ఉంటుంది. ప్రభుత్వం అందించే బోనస్ కూడా వస్తుంది. – క్రాంతి కుమార్, వ్యవసాయ శాస్త్రవేత్త, కేవీకే మల్యాల● -
బాలుడిపై వీధి కుక్కల దాడి
గూడూరు: మండల కేంద్రంలోని లక్ష్మీనా రాయణస్వామి దేవాలయ సమీప ఓ వీధిలో ఆడుకుంటున్న బాలుడిపై కు క్కలు దాడికి పాల్ప డిన సంఘటన బుధవారం జరిగింది. బాలుడు అమ్మ మ్మ గారి ఇంటి బయట ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో వచ్చిన మూడు కుక్కలు ఒక్కసారిగా బాలుడిని కరుస్తూ గీరడం మొదలు పెట్టా యి. దీంతో ఆ బాలుడి అరుపులకు కుటుంబ సభ్యులు రాగా కుక్కలు పరారయ్యాయి. గాయపడిన బాలుడిని వెంటనే స్థానిక సీహెచ్సీకి తరలించి చికిత్స అందించారు. పట్టణ కేంద్రంలో కుక్కల బెడద ఎక్కువైందని, చిన్నారులు, వృద్ధులు బయట తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయని, కుక్కల బెడదను నివారించాలని స్థానికులు కోరుతున్నారు. -
చిరుద్యోగుల విభజనకు షెడ్యూల్
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ పూర్వ వరంగల్ సర్కిల్లో నిలిచిన చిరుద్యోగుల విభజన ప్రక్రియ అడుగు ముందుకు పడింది. మూడేళ్లుగా జాప్యం జరుగుతూ వస్తున్న ఆ ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభకానుంది. టీజీ ఎన్పీడీసీఎల్ సీజీఎం ఆడిట్ చైర్మన్గా, హనుమకొండ సర్కిల్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కన్వీనర్గా, ఆరు సర్కిళ్ల ఎస్ఈలు సభ్యులుగా ఉన్న కమిటీ.. వాచ్మెన్, స్వీపర్, ఎల్ఎండీ పోస్టుల బైపర్కేషన్కు నిర్ణయం తీసుకుంది. వాచ్మెన్, స్వీపర్, ఎల్ఎండీలకు ఈ నెల 15 వతేదీ వరకు వారు ఎక్కడి వెళ్తారో సంసిద్ధత తెలిపేందుకు దరఖాస్తులు అందిస్తారు. పూరించిన ఆ దరఖాస్తులను ఈ నెల 31వ తేదీలోపు స్వీకరిస్తారు. ఆగస్టులో పరిశీలించి ఉద్యోగుల విభజన పూర్తి చేస్తారు. ఈ మేరకు సీజీఎం ఆడిట్ షెడ్యూల్ ఖరారు చేశారు. టెమ్రిస్ ఉమ్మడి జిల్లా ఆర్ఎల్సీగా సతీశ్ న్యూశాయంపేట : తెలంగాణ మైనారిటీ గురుకులాల విద్యాసంస్థల(టెమ్రిస్) ఉమ్మడి వరంగల్ జిల్లా రీజినల్ లేవల్ కో–ఆర్డినేటర్(ఆర్ఎల్సీ)గా హనుమకొండ(బి–1) గురుకులం ప్రిన్సి పాల్ డాక్టర్ జంగా సతీశ్ నియమితులయ్యా రు. ఈ మేరకు సెక్రటరీ షఫియుల్లా బుధవా రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో ఇద్దరు ఆర్ఎల్సీలు మూడు జిల్లాలకు ఒకరు చొప్పున పదహారు గురుకులాలను పర్యవేక్షిస్తుండగా ఉమ్మడి జిల్లాలో ఉ న్న 16 గురుకులాలను ఒక్కరే పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్ఎల్సీగా నియమితుడైన సతీశ్ను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గురుకులాల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అభినందించారు. వరంగల్ మీదుగా తిరుపతికి 8 వీక్లీ రైళ్లుకాజీపేట రూరల్: దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలంగాణలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లా ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి పుణ్యక్షేత్రానికి వరంగల్ మీదుగా జూలై 6వ తేదీ నుంచి కరీంనగర్–తిరుపతి మధ్య 8 ప్రత్యేక రైళ్ల సర్వీస్లను నడిపిస్తున్నట్లు బుధవారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల సర్వీస్ల వివరాలు ఈ నెల 6వ తేదీ నుంచి 27వ తేదీ వరకు తిరుపతి–కరీంనగర్ (02761) వీక్లీ ఎక్స్ప్రెస్ వరంగల్కు ప్రతీ సోమవారం వచ్చి వెళ్తుంది. 7వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కరీంనగర్–తిరుపతి (02762) వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రతీ సోమవారం వరంగల్కు వచ్చి వెళ్తుంది. ఈ రైళ్ల సర్వీస్లకు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, మధిర, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, జమ్మికుంట, పెద్దపల్లిలో అప్ అండ్ డౌన్ రూట్లో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. -
ఇక వినియోగంలోకి..
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్లోని అన్యూజ్డ్ పోస్టులకు మోక్షం లభించింది. ఏళ్లుగా పక్కకు పెట్టిన ఆ పోస్టులు ఎట్టకేలకు ఇక వినియోగంలోకి రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 216 అన్యూజ్డ్ పోస్టులతో పాటు ప్రస్తుతం అవసరం లేని 217 పోస్టులను రద్దు చేస్తూ అవసరమైన 339 పోస్టులను క్రియేట్ చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానీయా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏళ్లుగా వినియోగంలో లేని డీఎం గ్రేడ్–1, హెల్పర్ బెంచ్, గన్మాన్, టెలిఫోన్ బాయ్, కార్పెంటర్, సివిల్ మేసీ్త్ర, స్టోర్ కీపర్, టూల్ కీపర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ కమ్ మిక్సర్, టెలిఫోన్ ఆపరేటర్, ఎస్ఎస్ఎ, ఎల్ఎండీ, జేఎల్ఎండీ, క్లీనర్, రోనియో ఆపరేటర్, లష్కర్ వంటి 216 పోస్టులతో పాటు ప్రస్తుతం ఖాళీగా ఉన్న 217 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను రద్దు చేస్తూ కొత్త పోస్టులుగా పునరుద్ధరించారు. దీంతో కొత్తగా 2 చీఫ్ ఇంజనీర్, 1 జాయింట్ సెక్రటరీ, 4 సూపరిటెండెంట్ , 1 జనరల్ మేనేజర్, 4 డివిజనల్ ఇంజనీర్, 4 సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, , 6 అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, 1 అకౌంట్స్ ఆఫీసర్, 2 అసిస్టెంట్ అకౌంట్ , 4 పర్సనల్ ఆఫీసర్ , 16 సబ్ ఇంజనీర్, 16 అసిస్టెంట్ ఇంజనీర్, 20 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, 32 సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్, 88 సీనియర్ అసిస్టెంట్, 48 అసిస్టెంట్ లైన్మెన్, 80 ఆఫీస్ సబార్డినేట్, 4 వాచ్మెన్, స్వీపర్ కమ్ గార్డెనర్, స్వీపర్, 6 శానిటరీ ఆర్డర్లీస్ పోస్టులు మంజూరయ్యాయి. దీంతో అధికా రుల కొరత తీరనుంది. పెరిగిన ఉన్నత స్థాయి పోస్టులతో పదోన్నతి.. ఉన్నత స్థాయి పోస్టులు పెరగడంతో పదోన్నతి లభించనుంది. అన్ యూజ్డ్ పోస్టులను నూతన పోస్టులుగా సృష్టించేందుకు ప్రభుత్వ అనుమతి కోరినప్పటి నుంచి చాలా మంది ఆశావహులు పదోన్నతి కోసం ఎదురుచూస్తున్నారు. చివరకు ప్రభుత్వం కొత్త పోస్టులు సృష్టిస్తూ అనుమతి ఇవ్వడంతో వారిలో సంతోషం వెల్లివిరిస్తోంది. సీజీఎం, ఎస్ఈ, డీఈ, ఏడీఈ, జనరల్ మేనేజర్, జాయింట్ సెక్రటరీ, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పదోన్నతి కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. పోస్టులకు అనుమతి వచ్చినా పదోన్నతి ప్రక్రియ అంశం కోర్టులో ఉంది. పదోన్నతులపై హైకోర్టు స్టే విధించడంతో కొంత కాలంగా ఈ ప్రక్రియ నిలిచింది. కోర్టు ఏ క్షణాన స్టే ఎత్తివేసిన వెంటనే పదోన్నతి కల్పించేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉంది. నూతన పోస్టుల కోసం టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి కృషి ఫలించిందని ఆయా సంఘాలు, అసోసియేషన్ల నాయకులు తెలిపారు. అవసరమైన పోస్టులు పెరగడంతో వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన సేవలు అందుతాయన్నారు. ఎట్టకేలకు అన్యూజ్డ్ పోస్టులకు మోక్షం 339 ఉద్యోగాలు క్రియేట్ చేసి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉన్నత స్థాయి పోస్టులు పెరగడంతో లభించనున్న పదోన్నతి ఆశావహుల్లో వెల్లువెత్తిన సంతోషం.. తీరనున్న అధికారుల కొరత -
కేసీఆర్, కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయం
వేలేరు: కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులతో కేసీఆర్, కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయమని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం వేలేరు మండల కేంద్రంలోని రైతు వేదికలో 17 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడానికి కేసీఆర్, హరీశ్రావే ప్రధాన కారణమని ఆరోపించారు. మేడిగడ్డ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు లేదని, మనిషికి గుండె ఎంత ముఖ్యమో కాళేశ్వరానికి కూడా మేడిగడ్డ అంతేముఖ్యమన్నారు. రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ద్వారా కనీసం 50 వేల ఎకరాలకు కూడా సాగునీరు అందలేదని విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్టుకు నాంది పలికింది కేసీఆరేనని, గతంలో ఆయన ఆంధ్రా ప్రాజెక్టులకు సహకరిస్తామని చెప్పి ఇప్పుడు తప్పించకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ హక్కులే ముఖ్యమని, బనకచర్ల, పోలవరం ప్రాజెక్టులను ఆపి తీరుతామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ హెచ్.కోమి, ఎంపీడీఓ లక్ష్మీప్రసన్న, ఏఓ కవితా, ఎంపీఓ భాస్కర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కత్తి సంపత్, కాంగ్రెస్ నాయకులు బిల్లా యాదగిరి, సద్దాం హుస్సేన్, మల్లికార్జున్, రాజిరెడ్డి, ప్రమోద్ రెడ్డి, లక్ష్మణ్నాయక్, రవీందర్, రణధీర్ రెడ్డి, సలీంమాలిక్, తదితరులు పాల్గొన్నారు.కాళేశ్వరం కూలిపోవడానికి కేసీఆర్, హరీశ్రావే కారణం స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
గుంత.. చింత!
గురువారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2025– 8లోuజిల్లాలోని మహబూబాబాద్ మినహా తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ ఐదేళ్ల ముందు ఏర్పడిన మున్సిపాలిటీలు, కేసముద్రం మున్సిపాలిటీ ఈ ఏడాది ఏర్పడింది. గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో.. మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత కాలనీలు, విలీన ప్రాంతాల్లోని రోడ్లను పట్టించుకున్న వారు కరువయ్యారు. దీంతో గతంలో పోసిన మట్టి రోడ్లపై గుంతలు పడ్డాయి. వానాకాలంలో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. – సాక్షి, మహబూబాబాద్మున్సిపాలిటీల్లో అస్తవ్యస్తంగా రోడ్లు ● గుంతల్లో నిండిన నీళ్లు.. నడిచేందుకు ఇబ్బందులు ● మరమ్మతుల్లో అధికారుల జాప్యం ● మట్టిరోడ్ల స్థానంలో సీసీ రోడ్లు వేయాలని వేడుకోలు న్యూస్రీల్ -
పిల్లలకు పుస్తకాలు కొనుగోలు చేసి వెళ్తూ..
స్టేషన్ఘన్పూర్: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తన పిల్లలకు నోట్ పుస్తకాలు కొనుగోలు చేసి వెళ్తున్న క్రమంలో తండ్రి అనంతలోకాలకు చేరాడు. బైక్పై వెళ్తూ ముందు వెళ్తున్న మరో బైక్ను ఢీకొట్టి కిందపడ్డాడు. అదే సమయంలో ఆర్టీసీ బస్సు మీది నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన బుధవారం ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని జిట్టెగూడెం తండాకు చెందిన లావుడ్య కుమార్(32) తన పిల్లలకు నోట్ పుస్తకాలతో పాటు ఇతర సామగ్రి కొనుగోలు చేసేందుకు సమీపంలోని నారాయణలొద్ది తండాకు చెందిన లకావత్ భిక్షపతితో కలిసి తన బైక్పై స్టేషన్ఘన్పూర్ వచ్చాడు. పుస్తకాలు కొనుగోలు చేసిన అనంతరం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో తిరిగి జిట్టెగూడెం తండాకు బయలుదేరాడు. ఈ క్రమంలో స్టేషన్ ఘన్పూర్ మోడల్ కాలనీ సమీపాన జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న బైక్ను ఢీకొట్టి ఇద్దరు బైక్తో సహా రోడ్డుపై పడ్డారు. అదే సమయంలో హనుమకొండ నుంచి జనగామ వైపునకు వెళ్తున్న ఆర్టీసీ డీలక్స్ బస్సు రోడ్డుపై పడిన వారిపై నుంచి వెళ్లింది. ఈ ఘటనలో కుమార్ అక్కడికక్కడే మృతిచెందగా భిక్షపతికి తీవ్రగాయాలయ్యాయి. ఈఘటనపై ఆర్టీసీ డ్రైవర్ అజాగ్రత్తతో బస్సు నడిపి తన భర్త మృతికి కారణమయ్యాడనే మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.వేణు తెలిపారు. కాగా, మృతుడికి ఐదేళ్లలోపు వయసున్న కుమారుడు జనార్ధన్, కుమార్తె జాను ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో తండ్రి దుర్మరణం మరొకరికి తీవ్ర గాయాలు స్టేషన్ఘన్పూర్లో ఘటన -
పథకాలను వేగవంతంగా అమలు చేయాలి
హన్మకొండ: ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలను వేగవంతం చేయాలని ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ జాయింట్ డైరెక్టర్ సంగీత లక్ష్మి అన్నారు. పథకాల అమలు వేగవంతం చేసేందుకు రాష్ట్ర స్థాయి అధికారులను ఉమ్మడి జిల్లాల వారీగా సూపర్వైజర్ ఆఫీసర్లుగా నియమించారు. ఈ క్రమంలో సంగీత లక్ష్మి హనుమకొండలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వానాకాలం పూర్తయ్యేలోపు మూడు నెలల్లో ఆయిల్ పాం తోటల పెంపకంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటాలన్నారు. అదే విధంగా ఇతర తోటల పెంపకాన్ని పూర్తి చేయాలని, సూక్ష్య సేద్యపు పరికరాల బిగింపు పనులు మూడు నెలల్లో పూర్తి చేయాలన్నారు. ఇక నుంచి ప్రతీ వారం సమీక్ష సమావేశం నిర్వహించి జిల్లాల వారీగా నివేదికను వ్యవసాయ శాఖ మంత్రికి అందించనున్నట్లు తెలిపారు. సమావేశంలో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ డీహెచ్ఎస్ఓలు జి.అనసూయ, ఆర్.శ్రీనివాసరావు, మిరయన్న, శ్రీధర్రావు, మైక్రో ఇరిగేషన్ కంపెనీ ప్రతినిధులు, ఉద్యాన అధికారులు పాల్గొన్నారు. వానాకాలంలోపు తోటల పెంపకం పూర్తి చేయాలి ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ సంగీత లక్ష్మి -
వృత్తి నైపుణ్యంతోనే విధుల్లో రాణింపు
వరంగల్ క్రైం: విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం సొంతం చేసుకోవాలని ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ అన్నారు. బుధవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మూడు రోజుల పాటు జరిగే భద్రాది కొత్తగూడెం జోనల్ పోలీస్ డ్యూటీ మీట్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ భద్రాది పోలీస్ డ్యూటీ మీట్లో వరంగల్, ఖమ్మం పోలీస్ కమిషనరేట్లు, మహబూబాబాద్, భద్రాది కొత్తగూడెం పోలీస్ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారని తెలిపారు. ప్రతీ విభాగంలో ప్రతిభ కనబరిచిన వారిని త్వరలో రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్కు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. నేరాలు త్వరితగతిన ఛేదించేందుకు, సాక్ష్యాలను శాసీ్త్రయంగా విశ్లేషించడానికి, ప్రజలకు న్యాయం అందించేందుకు ఈ వృత్తి శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్, అదనపు డీసీపీలు రవి, సురేశ్కుమార్, ప్రభాకర్రావు, బోనాల కిషన్, జోన్కు చెందిన ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్ కుమార్ -
డీటీఓ కార్యాలయంలో ఏజెంట్ల దందా..?
మహబూబాబాద్ అర్బన్: మానుకోట జిల్లా రవా ణాశాఖ కార్యాలయం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఏడాది క్రితం కార్యాలయ అధికారులు లైసెన్స్ల జారీ కోసం ఏజెంట్ల ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్లు అనుమానం రావడంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏజెంట్ల నుంచి రూ. 4,5100, అధికారి డ్రైవర్ నుంచి రూ.1,6500, జేఏ నుంచి రూ. 895 నగదును స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. అదే విధంగా కార్యాలయంలోనే ఓ అవుట్సోర్సింగ్ ఉ ద్యోగి మద్యం తాగడం వివాదాస్పదంగా మారింది. అలాగే డీటీఓగా బాధ్యతలు చేపట్టిన భద్రునాయక్పై ఆరోపణలు రావడంతో రాష్ట్ర కార్యాలయానికి బదిలీ చేశారు. ఇలా మానుకోట డీటీఓ కార్యాల యం పలు వివాదాలకు కేరాఫ్గా మారింది. ఇదిలా ఉండగా బుధవారం ఉదయం 10గంటలకు లైసెన్స్ కోసం తాళ్లపూసపల్లికి చెందిన ఓ వ్యక్తి.. ఏజెంట్ను సంప్రదించగా డబ్బులు అధికంగా వసూలు చేశాడు. దీంతో మాటామాట పెరిగి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆ యువకుడు కలెక్టర్కు ఫిర్యాదు చేయగా.. ఆర్డీఓ జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో తనిఖీతో పాటు విచారణ చేపట్టారు. లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్, ఇతర అవసరాల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజల నుంచి ఏజెంట్లు పనికో రేటు ఫిక్స్చేసి అక్రమంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నిబంధనల ప్రకారం కార్యాలయంలో పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రశ్నించిన వారిపై దాడి కలెక్టర్కు ఫిర్యాదు.. ఆర్డీఓ విచారణ -
మేడిగడ్డకు పెరుగుతున్న వరద
పొంగిన పాకాల ఏరు గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా గార్ల సమీపంలోని పాకాల ఏరు బుధవారం సాయంత్రం నుంచి చెక్డ్యాంనుంచి ప్రవహిస్తోంది. దీంతో గార్ల నుంచి రాంపురం, మద్దివంచ పంచాయతీల గ్రామాల ప్రజలు మండల కేంద్రమైన గార్లకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. పాకాల ఏటిపై హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఈ గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని ఈ ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. – గార్లకాళేశ్వరం: మహదేవపూర్ మండలం అంబట్పల్లి సమీపంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ(లక్ష్మి)బ్యారేజీకి ప్రాణహిత వరద తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. మహారాష్ట్రలో నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత వరద ప్రవాహం కాళేశ్వరం మీదుగా మేడగడ్డకు చేరుతోంది. దీంతో బుధవారం సాయంత్రం వరకు 36,900 క్యూసెక్కుల వరద ప్రవాహం బ్యారేజీలోని మొత్తం 85గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. -
గడువులోగా లక్ష్యాలు పూర్తి చేయాలి
హన్మకొండ : నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు బ్రాంచ్ మేనేజర్లను ఆదేశించారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో డీసీసీబీ బ్రాంచ్ మేనేజర్తో సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్రాంచ్ల వారీగా ప్రగతిని సమీక్షించారు. ప్రతీ అధికారి, ఉద్యోగి వ్యక్తిగత పనితీరును మెరుగు పరుచుకోవాలన్నారు. పీఏసీఎస్ల ద్వారా ఇచ్చిన రుణాలు కూడా లీగల్గా కవర్ చేసి రికవరీ చేసి సంఘాలను పటిష్టం చేయాలని సూచించారు. ఐఆర్ఏసీ నిబంధనలకు లోబడి మార్చి నెలకు సంబంధంచి నిరార్ధక రుణాలుగా వర్గీకరించిన బకాయిలను రికవరీ చేయాలని ఆదేశించారు. నిరార్ధక ఆస్తులు 2 శాతానికి లోబడి టర్నోవర్ రూ.2,500 కోట్లకు చేరేలా కృషి చేయాలన్నారు. మహిళ స్వయం సహాయక సంఘాలు, చిరు వ్యాపారులకు ఇచ్చిన రుణాల చెల్లింపుపై వన్టైమ్ సెటిల్మెంట్ వివరించి వారి ద్వారా రుణాలు రికవరీ చేయాలని సూచించారు. నాబార్డు తనిఖీల్లో వరంగల్ డీసీసీబీ ఏ కేటగిరీ సాధించేలా బ్యాంకు అభివృద్ధికి కృషి చేయాలన్నారు. వేతన సవరణ చేసినందు కు ఈ సందర్భంగా చైర్మన్ రవీందర్ రావును మేనేజర్లు, ఉద్యోగులు సన్మానించారు. సమావేశంలో సీఈఓ వజీర్ సుల్తాన్, జీఎం పద్మావతి, డీజీఎం అశోక్, ఏజీఎంలు మధు, గొట్టం స్రవంతి, బోడ రాజు, గంప స్రవంతి, కృష్ణ మోహన్, డీఆర్ ఓఎస్డీ విజయ కుమారి, బ్రాంచ్ మేనేజర్లు పాల్గొన్నారు. టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు -
మొక్కలకు జీవం!
జిల్లాలో వర్షపాతం వివరాలు (మిల్లీ మీటర్లలో) మండంల వర్షపాతం గార్ల 87.8కేసముద్రం 68బయ్యారం 64.8గూడూరు 62.8మహబూబాబాద్ 52 కురవి 50.8 దంతాలపల్లి 11.4 పెద్దవంగర 12.4 తొర్రూరు 16.4 నర్సింహులపేట 18.4సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలకు నాటిన పత్తి, మొక్కజొన్న విత్తనాల్లో కొన్ని మొలకెత్తగా, సరిగ్గా పదును లేక మరికొన్ని చోట్ల మొలకెత్తలేదు. మొలకెత్తిన మొక్కలకు నీరు లేక వాడిపోతున్న తరుణంలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలు జీవం పోశాయి. ప్రస్తుతం విత్తనాలు నాటేందుకు అనుకూలమని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పడంతో రైతులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. 82,120 ఎకరాల్లో సాగు.. వానాకాలం సీజన్లో 4,29,790ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా 2,19,143 ఎకరాల్లో వరి, 84,854 ఎకరాల్లో పత్తి, 58,361 ఎకరాల్లో మొక్కజొన్న, 52,249 ఎకరాల్లో మిర్చి సాగు చేసే అవకాశం ఉందని అధికారులు పంట ప్రణాళికలో పేర్కొన్నారు. ఇందులో ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ పంటలు 82,120 ఎకరాల్లో సాగు చేశారు. ఇందులో అత్యధికంగా 54,348 ఎకరాల్లో పత్తి, 16,043 ఎకరాల్లో మొక్కజొన్న, 9,996 ఎకరాల్లో జీలుగ,641 ఎ కరాల్లో పెసర,437ఎకరాల్లో జనుముతోపాటు కొద్ది పాటి ఎకరాల్లో పసుపు, కంది పంటలు సాగు చేశా రు. ఈవర్షంతో జూలై 5వరకు పత్తి గింజలు వేసే అ వకాశం ఉండడంతో మిగిలిన విస్తీర్ణంలో పత్తి గింజ లు పెడుతున్నారు.530ఎకరాల్లో వరి నాట్లు వేశారు. జిల్లా వ్యాప్తంగా జల్లులు జిల్లా వ్యాప్తంగా చిరు జల్లులు కురిశాయి. జిల్లాలో మొత్తం 631 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. 16 మండలాల్లో సగటున 39.5 మిల్లీ మీటర్లు నమోదైంది. అత్యధికంగా గార్ల మండలంలో 87.8 మిల్లీమీటర్లు, అత్యల్పంగా దంతాలపల్లి 11.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ఈ వర్షపాతం స్వల్పమే అని.. మోస్తరు నుంచి భారీ వర్షం కురిసి చెరువులు నిండితేనే పంటలకు భరోసా వస్తుందని రైతులు చెబుతున్నారు. భారీ వర్షం కురిస్తే రైతులకు సాగునీటిపై రందీ ఉండదని అంటున్నారు. వర్షాలతో ప్రాణం పోసుకున్న పత్తి, మొక్కజొన్న పంటలు ఈనెల 15 వరకు విత్తనాలు నాటేందుకు అనుకూలం వరిలో స్వల్పకాలిక వంగడాల నారు పోసేందుకు సిద్ధం జిల్లా వ్యాప్తంగా కురిసిన వానలతో అన్నదాతల్లో ఆనందం -
దంపతుల మధ్య గొడవ..
● మనస్తాపంతో మహిళ ఆత్మహత్య ● తూర్పు తండాలో ఘటన సంగెం: దంపతుల మధ్య గొడవతో మనస్తాపం చెందిన ఓ మహిళ క్షణికావేశంలో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సంగెం మండలం నల్లబెల్లి శివారు తూర్పు తండాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన అజ్మీరా జ్యోతి(44), బాలరాజు దంపతులకు ఇద్దరు కుమారులు సంతోశ్, సందీప్ ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పెద్ద కుమారుడికి వివాహం జరగగా వ్యవసాయం చేసుకుంటున్నాడు. చిన్న కుమారుడు చదువుకుంటున్నాడు. బుధవారం కుటుంబం, మేకలు మేపడానికి వెళ్లే విషయాల్లో దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన జ్యోతి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి అందులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. జ్యోతి బావిలో దూకుతుండగా పక్క చేనులో కలుపు తీస్తున్న మహిళా రైతు బానోత్ బుజ్జమ్మ చూసి తండాకు చెందిన మూడు మోతీలాల్కు చెప్పింది. మోతీలాల్ తండాకెళ్లి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి చూడగా జ్యోతి బావిలో కనిపించలేదు. డయల్100కు కాల్ చేసి విషయం తెలపడంతో స్థానిక పోలీసులు.. ఫైర్ రెస్క్యూ టీంకు సమాచారం అందించగా వారు వచ్చి వెతకగా జ్యోతి మృతదేహం లభించింది. మృతురాలి కుమారుడు సంతోశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ పేర్కొన్నారు. -
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి
మహబూబాబాద్: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని ఎన్ఐసీ హాల్లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అంశంపై సంబంధిత అఽధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు సంబంధించిన చట్టాలను పక్కాగా అమలు చేయాలన్నారు. ఈనెల 1నుంచి 31వ తేదీ వరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని చేపట్టి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా అఽధికారులు పని చేయాలన్నారు. చైల్డ్ హెల్ప్ లైన్ 1098, 112 నంబర్లపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. సమావేశంలో సీడబ్యూసీ చైర్పర్సన్ నాగవాణి, ఇన్చార్జ్ డీడబ్ల్యూఓ శిరీష, డీఎస్పీ తిరుపతి రావు, డీఈఓ రవీందర్రెడ్డి, డీఎంహెచ్ఓ రవిరాథోడ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ -
అభివృద్ధి పథంలో తెలంగాణ
మహబూబాబాద్ రూరల్ : తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ జాటోత్ రామచంద్రునాయక్ అన్నారు. బుధవారం మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుల సన్నాహక సమావేశం పార్టీ పార్లమెంట్ నియోజవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వర్ రావు అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి మందిరంలో నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్ జాటోత్ రామచంద్రునాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యఅతిథిగా హాజరుకానుండగా ఈ నెల 4వ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారన్నారు. నా యకులు, కార్యకర్తలను ప్రభుత్వంలో భాగస్వాములను చేసేందుకు ఖర్గే వస్తున్నారని, ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు తప్పనిసరిగా ఖర్గే సభకు అధిక సంఖ్యలో తరలిరావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించేందుకు కృషి చేస్తామని, సెప్టెంబర్ లోపు గ్రామపంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సి పాలిటీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో మానుకోట, భద్రాచలం, సత్తుపల్లి ఎమ్మెల్యేలు డాక్టర్ మురళీనాయక్, తెల్లం వెంకట్రావు, మట్టా రాగమయి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మద్ది బేబీస్వర్ణకుమారి, నాగ సీతారాములు, డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్చందర్ రెడ్డి, కేసముద్రం ఏఎంసీ చైర్మన్ ఘంట సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ స్పీకర్ జాటోత్ రామచంద్రునాయక్ -
భర్త, యువకుడి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
గార్ల: ఒక పక్క భర్త.. మరోపక్క ప్రేమపేరుతో తరచూ ఫోన్ చేస్తున్న ఓ యువకుడి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెందిన ఏదుల సతీశ్కుమార్తో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన శైలజ(24)కు 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరి కాపురం 5 సంవత్సరాలు సజావుగానే సాగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో 3 సంవత్సరాల నుంచి పిండిప్రోలు గ్రామానికి చెందిన యువకుడు కంపటి శ్రీరామ్.. తరచూ శైలజకు ఫోన్ చేసి ప్రేమపేరుతో వేధిస్తున్నాడు.‘నేను నిన్ను ప్రేమిస్తున్నా.. మనమిద్దరం కలిసి ఉందాం.. పిల్లలు, భర్తను వదిలిపెట్టి రా’అని వేధిస్తున్నాడు. ఈ విషయం భర్త సతీశ్కుమార్కు రెండు సంవత్సరాల క్రితం తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఎన్నాళ్ల నుంచి కొనసాగుతుందని ప్రశ్నిస్తూ.. నువ్వు ఎందుకు బతుకుతున్నావు, చావరాదు అని తరచూ శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసేవాడు. దీంతో భర్త సతీశ్కుమార్, యువకుడు శ్రీరామ్ వేధింపులు తాళలేక శైలజ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తాగింది. గమనించిన భర్త సతీశ్కుమార్ హుటాహుటిన మహబూబాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా శైలజ మృతిచెందింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి కవిత ఫిర్యాదు మేరకు భర్త సతీశ్కుమార్, యువకుడు శ్రీరామ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్కె. రియాజ్పాషా తెలిపారు. -
నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు
తొర్రూరు: ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ రవి రాథోడ్ అన్నారు. బుధవారం తొర్రూరు పట్టణ కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను సందర్శించారు. రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆస్పత్రుల్లో అత్యవసర ఫోన్ నంబర్లు, రుసుము వివరాలు, డాక్టర్ల సమాచారంతో పాటు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు కనిపించేలా ప్రదర్శించాలని సూచించారు. ఫైర్ సేప్టీ పరికరాలు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, సిబ్బంది అర్హత పత్రాలు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. కొత్త సిబ్బంది నియామకాన్ని ముందుగానే అధికారులకు తెలియజేయాలని సూచించారు. విదేశాల్లో ఎంబీబీఎస్ చేసిన వారు భారత అర్హత పరీక్ష ఉత్తీర్ణత సాధించాలన్నారు. తప్పుడు హోదాలో ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సీహెచ్ఓ విద్యాసాగర్, డిప్యూటీ పారామెడికల్ అధికారి వనాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ రవి రాథోడ్ -
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వం పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని, ఈ నెల 2,3,4 తేదీల్లో ప్రైవేట్ డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కళాశాలలు బంద్ చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు మాదరపు నాగరాజు, ఉపాధ్యక్షుడు బోనగిరి మధు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో మంగళవారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో వాల్పోస్టర్లను నాయకులు ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రూ.7,200 కోట్ల స్కాలర్షిప్లు, రీయింబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ రాక పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారన్నారు. స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే పీడీఎస్యూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు, నాయకులు డాక్టర్ డోలి సత్యనారాయణ, బిక్కి వెంకటేశ్వర్లు, పుల్లారావు, లక్పతి, మల్లేష్, రవీందర్, పీడీఎస్యూ నాయకులు మహేష్, దిలీప్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇన్చార్జ్ డీడబ్ల్యూఓగా శిరీషమహబూబాబాద్: జిల్లా డీడబ్ల్యూఓగా పని చేసిన ధనమ్మ గత నెల 30న ఉద్యోగ విరమణ పొందారు. కాగా మానుకోట సీడీపీఓగా పని చేస్తున్న శిరీషకు జిల్లా ఇన్చార్జ్ డీడబ్ల్యూఓ బాధ్యతలు అప్పగిస్తూ ఆశాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీ లక్ష్మిబాయి ఉత్తర్వులు జారీ చేశారని అధికారులు తెలిపారు. కాగా శిరీష మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలుడోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో రోడ్ల నిర్మాణానికి మున్సిపాలిటీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.15 కోట్ల ఎస్డీఎఫ్ నిధులు మంజూరు కాగా మంగళవారం మున్సిపల్ కమిషనర్ నిరంజన్, ఏఈ శృతి రాజుతండాలో పర్యటించి రోడ్ల నిర్మాణం కోసం కొలతలతో ప్రదిపాదనలు సిద్ధం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సుమేర్చంద్జైన్, మాదా శ్రీనివాస్, తారాచంద్, అశ్వక్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యాన పంటల సాగుతో అభివృద్ధిగూడూరు: వరికి ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక రాబడితో పాటు అభివృద్ధి సాధించవచ్చని ఉద్యాన అధికారి శాంతిప్రియదర్శిని అన్నారు. మండలంలోని తీగలవేణిలో మంగళవారం ఉద్యాన పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉద్యాన పంటల సాగును పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతులకు ప్రోత్సాహకాలను అందిస్తుందన్నారు. పండ్ల తోటలతో పాటు పందిరి సాగు కూరగాయలు, ఆయిల్పామ్ సాగు కోసం ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా ఆయిల్పామ్ సాగుతో రైతుకు మంచి ఆదాయం వస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఏఓ అబ్దుల్మాలిక్, ఆయిల్ఫెడ్ ఫీల్డ్ అధికారి శ్రీకాంత్, అశోక్, మహేంద్ర, ఏఈఓ మధు, రైతులు పాల్గొన్నారు. నోటీస్లు జారీకేసముద్రం: మున్సిపాలిటీ పరిధిలో చేపట్టే రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా పలు దుకాణాదారులు, ఇంటి యజమానులకు మంగళవారం మున్సిపల్ అధికారులు నోటీస్లు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీస్లు అందజేసినట్లు వార్డు ఆఫీసర్ ప్రభాకర్ తెలిపారు. మొత్తంగా 51 మందికి నోటీసులు జారీ చేయగా, మిగిలిన వారికి కూడా నోటీస్లను అందించనున్నట్లు ఆయన తెలిపారు. వారం రోజుల్లో ఇచ్చిన నోటీస్లకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. మానుకోటలోనే శిక్షణ తరగతులు నిర్వహించాలిమహబూబాబాద్ అర్బన్: గిరిజన ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులకు జిల్లా కేంద్రంలోనే శిక్షణ తరగతులు నిర్వహించాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేశ్ అన్నారు. ఈనెల 3,4 తేదీల్లో ఎస్ఎస్తాడ్వాయిలో కాకుండా జిల్లా కేంద్రంలోనే శిక్షణ తరగతులు నిర్వహించాలని కోరారు. గిరిజనశాఖ కార్యాలయంలో మంగళవారం జిల్లా అధికారి దేశీరాం నాయక్కు టీపీటీఎఫ్ నాయకులు వినతిపత్రం ఇచ్చారు. -
6న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాక
కేసముద్రం: మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈనెల 6న రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో బహిరంగసభ కోసం స్థలాన్ని ఆర్డీఓ కృష్ణవేణి, డీఎస్పీ తిరుపతిరావు, మున్సిపల్ కమిషనర్ ప్రసన్నరాణి, కేసముద్రం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి పరిశీలించారు. తహసీల్దార్ వివేక్, రూరల్ సీఐ సర్వయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్రెడ్డి, మండల అధ్యక్షుడు అల్లం నాగేశ్వర్రావు, సతీష్, దస్రూనాయక్, వెంకన్న, వేముల శ్రీనివా స్రెడ్డి, కదిర సురేందర్, రావుల మురళి, వసంతరావు, బానోత్ వెంకన్న పాల్గొన్నారు. -
నారాయణపురం రైతుల రిలే నిరాహార దీక్ష
కేసముద్రం: ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారం తమకు పట్టాదార్ పాస్ పుస్తకాలు అందించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామ రైతులు మంగళవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆ గ్రామ మాజీ ఎంపీటీసీ ధారావత్ రవితోపాటుపలువురు రైతులు మాట్లాడుతూ.. 2017లో గత ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 1,827 ఎకరాల పట్టాభూములను అటవీ భూములుగా పేర్కొంటూ తమ పట్టాలను రద్దు చేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జీఓ 94 జారీ చేసి రైతు పేరు, తండ్రి పేరు చోట వస్తున్న ‘అడవి’ అనే పదం తొలగించిందన్నారు. ఆ తర్వాత తమ గ్రామంలో అధికారులు ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించారన్నారు. ఈ సర్వే ఆధారంగా తమకు పట్టాదార్ పాస్ పుస్తకాలు అందించాలని డిమాండ్ చేశారు. 2022 నుంచి టీఎం 33 మాడ్యుల్లో 145 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తే సుమారు 500 ఎకరాలకు పట్టాదార్ పాస్ పుస్తకాలు వచ్చే అవకాశం ఉన్నా రెవెన్యూ అధికారులు జా ప్యం చేస్తున్నారని ఆరోపించారు. 7 ఏళ్లుగా పాస్పుస్తకాలు లేకపోవడంతో తామకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి పాస్పుస్తకాలు అందించాలని, లేనిపక్షంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో రైతులు లక్ష్మీపతి, వెంకట్రెడ్డి, నర్సింహారెడ్డి, అమరేందర్రెడ్డి, లచ్చు, భీమా, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సర్వే ప్రకారం పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ -
పాఠశాలల్లో సదుపాయాలు కల్పిస్తాం
డోర్నకల్: ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పిస్తామని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అన్నారు. మండలంలోని వెన్నారం, సీరోలు మండలంలోని మన్నెగూడెం ప్రభుత్వ పాఠశాలలను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం సకల సదుపాయాలు కల్ప స్తామని తెలిపారు. డీఈఓ రవీందర్రెడ్డి, డోర్నకల్, సీరోలు ఎంఈఓలు లక్ష్మానాయక్, లచ్చిరాం, హెచ్ఎంలు రమేశ్, ఇందిరారాణి ఉన్నారు. ఆయిల్పామ్ సాగుతో అధిక ఆదాయం.. కురవి: ఆయిల్పామ్ సాగుతో అధిక ఆదాయం పొందవచ్చని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నా రు. మంగళవారం మండలంలోని బలపాల గ్రామ ంలో జిల్లా ఉద్యాన పట్టుపరిశ్రమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయిల్పామ్ ప్లాంటేషన్ మెగామేళాలో కలెక్టర్ పాల్గొని మొక్కలు నాటారు. కార్యక్రమంలో రైతులు ఉమాపిచ్చిరెడ్డి, రమేశ్, హనుమంతరావు, చంద్రారెడ్డి, సహాయ సంచాలకుడు ఎ.శ్రీనివాస్, ఏఓ నరసింహరావు, ఉద్యాన అధికారి ఆర్.శాంతిప్రియ, ఏఈఓ లయ, టీజీ ఆయిల్ఫెడ్ క్షేత్ర సిబ్బంది నాగరాజు, జి.చంద్రప్రకాశ్, కార్యాలయ సూపరింటెండెంట్ ఆర్.శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి హరి, బిందుసేద్య ప్రతినిధి కె.శంకర్ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ బలపాల పీహెచ్సీని సందర్శించారు. కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ -
మెడకు బెల్ట్ బిగించి.. కాళ్లను చున్నీతో కట్టేసి..
కాజీపేట : మెడకు బెల్ట్ బిగించి.. కాళ్లను చున్నీతో కట్టేసి.. కూరగాయలు కోసే కత్తితో ఫైనాన్స్ వ్యాపారిని దారుణంగా హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 16.5 తులాల బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కాజీపేట పీఎస్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డి.. సీఐ సుధాకర్ రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. వరంగల్ శివనగర్కు చెందిన త్రిపురాధి నవీన్కుమార్ (55) చిరువ్యాపారులకు ఫైనాన్స్ ఇస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో కాజీపేట రైల్వే క్వార్టర్స్లో సహజీవనం చేస్తున్న ఇద్దరు రైల్వే ఉద్యోగులు గుండా రజని( ఇందులో ప్రస్తుతం రజనీ ఉద్యోగం కోల్పోయింది.) , గడ్డం ప్రవీణ్కుమార్.. నవీన్కుమార్ వద్ద రూ.30 వేల అప్పు తీసుకున్నారు. అసలు, వడ్డీ కలిపి రూ.50 వేలకు పెరిగింది. ఈ డబ్బు చెల్లించాలంటూ నవీన్కుమార్ కొంత కాలంగా ప్రవీణ్కుమార్ను వేధిస్తున్నాడు. అప్పటికే పలు నేరాలతో సంబంధం ఉండి జైలుకెళ్లొచ్చి ఉద్యోగం కోల్పోయిన రజని, ప్రవీణ్కుమార్.. నవీన్కుమార్పై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకోవాలనుకున్నారు. ఏ విధంగానైనా ఫైనాన్స్ వ్యా పారిని హత్య చేసి ఆభరణాలు కాజేసి కుటుంబ అప్పులు, అవసరాలు తీర్చుకోవాలని భావించి నవీన్ కుమార్కు శుక్రవారం ఫోన్ చేసి రైల్వే క్వార్టర్స్కు పిలిపించారు. అయితే అప్పు చెల్లిస్తారనే నమ్మకంతో వచ్చిన వ్యాపారి నవీన్కుమార్ మెడకు ప్రవీణ్ బెల్ట్ బిగించి ఊపిరి ఆడకుండా చేయగా, రజని కాళ్లను చున్నీతో కట్టివేసింది. అనంతరం కూరగాయలు కోసే కత్తితో పొడవడంతో పాటు బండరాయితో తలపై మోది నవీన్కుమార్ను హత్య చేశారు. తర్వాత నిందితులు మృతదేహాన్ని మా యం చేయాలని భావించగా ఎవరూ సహకరించకపోవడంతో చేసేదేమి లేక పరారయ్యారు. హత్య అనంతరం పరారైన రజని.. ఫైనాన్స్ వ్యాపారి నవీన్కుమార్ను హత్య చేసిన అ నంతరం రజనీ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మర్రిగూడెం గ్రామానికి చేరుకుంది. ప్రవీ ణ్ పట్టణంలోనే ఉండి పోలీసుల కదలికలు ఎప్ప టికప్పుడు తెలుసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఈ హత్యపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మర్రిగూడెంలో ఉన్న రజనిని అరెస్ట్ చేసి 16.5 తులాల బంగారు ఆభరణాలు, రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నారు. కడిపికొండ క్రాస్లో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు ప్రవీణ్కుమార్ పట్టుబడ్డాడు. ఇద్దరిది నేర చరిత్రే.. కాజీపేట రైల్వే ఎలక్ట్రికల్ షెడ్లో పని చేస్తున్న రజని, ప్రవీణ్కుమార్ 2013 నుంచి సహజీవనం కొనసాగిస్తున్నారు. కాగా, ప్రవీణ్కుమార్ తన భార్య రేణుకను అదనపు కట్నం కోసం వేధించడంతో ఆమె 2018లో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో రజని, ప్రవీణ్కుమార్ జైలుకెళ్లొచ్చారు. జైలులో సహ నిందితులతో పరిచయం ఏర్పడింది. వారి సూచనల మేరకు ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయగా బసంత్నగర్ పోలీసులు రిమాండ్కు తరలించారు. దీంతో ఉద్యోగాలు పోవడంతో ఇద్దరు సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగనోట్ల వ్యాపారం చేస్తూ పోలీసులకు పట్టుబడగా సుబేదారి, మట్టెవాడ, పాలకుర్తి పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఫైనాన్స్ వ్యాపారిని హత్య చేసిన నిందితులు ఇద్దరి అరెస్ట్.. 16.5 తులాల బంగారం స్వాధీనం వివరాలు వెల్లడించిన పోలీసులురౌడీషీట్, పీడీ యాక్ట్ నమోదు .. నిందితులు రజని, ప్రవీణ్కుమార్పై వెంటనే రౌడీషీట్ తెరవడంతోపాటు పీడీ యాక్ట్ నమోదు చేయనున్నట్లు ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కాగా, కేసు ఛేదనలో ప్రతిభకనబర్చిన సీఐ వై.సుధాకర్ రెడ్డి, ఎస్సైలు నవీన్కుమార్, సర్వేశ్వర్, సిబ్బంది శ్రీధర్, బి.భాస్కర్, విష్ణు, కె.శ్రీనివాస్ను ఏసీపీ అభినందించారు. -
వ్యాధులపై అవగాహన కల్పించాలి
బయ్యారం: సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ సూ చించారు. మండలంలోని బయ్యారం, గంధంపల్లి పీహెచ్సీలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం బయ్యారంలో నిర్వహించిన ఆశాడే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడా రు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రతీ ఆరోగ్యకేంద్రంలోని సిబ్బంది బాధ్యత వహించాలన్నారు. అనంతరం బయ్యారం పీహెచ్సీ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫీవర్వార్డు, ఆపరేషన్ థియేటర్ను డీఎంహెచ్ఓ ప్రారంభించారు. డాక్టర్స్డే సందర్భంగా వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో డీఎంహెచ్ఓ రవిరాథోడ్ తో పాటు పలువురు వైద్యులను సన్మానించారు. వైద్యులు విజయ్కుమార్, శ్రవణ్కుమార్, హనుమంతరావు, శివ, ఉస్మాన్, సుధీర్, మాస్మీడియా అధికారి ప్రసాద్, హెల్త్ ఎడ్యుకేటర్ కె.వి.రాజు, సబ్యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ ఉన్నారు. అందుబాటులో ఉండాలి నెహ్రూసెంటర్: వైద్యులు, ఆరోగ్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని బస్తీ దవాఖానలోని మందుల గిడ్డంగిని మంగళవారం తనిఖీ చేశారు. డాక్టర్ విజయ్కుమార్, బస్తీ దవాఖాన డాక్టర్ సుధీర్, హెచ్ఈ కేవీ రాజు, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ, సీసీ అనిల్, ఫార్మసిస్టు రామారావు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
అడ్డుకుంటున్నది ఎవరు
టీజీ ఎన్పీడీసీఎల్లో నిలిచిన వాచ్మెన్, స్వీపర్ పోస్టుల బైఫర్కేషన్హన్మకొండ: సాధారణంగా ప్రతీ ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయంలో కచ్చితంగా వాచ్మెన్, స్వీపర్ను నియమిస్తారు. ఎందుకంటే ఆ కార్యాలయానికి సంబంధించి ఆస్తుల కాపలాకు వాచ్మెన్, నిరంతరం పరిశుభ్రంగా ఉంచడానికి స్వీపర్ ఉంటారు. అయితే రాష్ట్రంలో రెండు విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఒక్కటైన టీజీ ఎన్పీడీసీఎల్లో మాత్రం ఆ పోస్టులను ఇంకా విభజన చేయడం లేదు. ఫలితంగా ఈ సంస్థ పరిధిలో నూతనంగా ఏర్పాటైన కార్యాలయాలకు కాపలా, పరిశుభ్రత కరువైంది. దీంతో అధికా రులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. వాచ్మెన్, స్వీపర్ల విభజన కాకుండా తెర వెనుక ఎవరో అడ్డుకుంటున్నారని విద్యుత్ ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మిగతా ఉద్యోగుల విభజన పూర్తి చేసి వీరిని బైఫర్కేషన్ చేయకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెరిగిన సర్కిళ్లు.. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనతో పూర్వ వరంగల్ జిల్లా (సర్కిల్)లో నూతన సర్కిళ్లు, డివిజన్లు, ఈఆర్ఓలు, సబ్ డివిజన్లు, సెక్షన్ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. పాలన సౌలభ్యం కోసం వీటిని ఏర్పాటు చేశారు. ఆయా కార్యాలయాలకు ఇంజనీర్లు, ప్రొవెన్షియల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బందిని సర్దుబాటు చేసి పోస్టింగ్లు ఇచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. స్వీపర్, వాచ్మెన్ల బైఫర్కేషన్ను పట్టించుకోలేదు. ఫలితంగా వారు పాత కార్యాలయాల్లోనే విధులు నిర్వహిస్తుండగా, నూతనంగా ఏర్పాటైన కార్యాలయాల్లో వాచ్మెన్లు, స్వీపర్లు లేక అధికారులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్ల వారీగా ఉద్యోగుల సర్దుబాటు.. నూతన కార్యాలయాల ఏర్పాటు తర్వాత ఉద్యోగుల విభజనకు 2018, జూన్లో సీజీఎం చైర్మన్గా ఎస్ఎఓగా కన్వీనర్, పూర్వ సర్కిల్ పరిధిలోని ఎస్ఈలు సభ్యులుగా కమిటీని నియమించి సర్కిల్ స్థాయిలో ఉద్యోగుల విభజన చేశారు. అదే విధంగా సీజీఎం చైర్మన్గా, డీఈ టెక్నికల్ కన్వీనర్, ఎస్ఈలు సభ్యులుగా నియమించిన కమిటీ.. డివిజన్ల వారీగా ఉద్యోగులను సర్దుబాటు చేసింది. కానీ స్వీపర్, వాచ్మెన్లను ముట్టు కోలేదు. పూర్వ ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలో ఇంజనీర్లు, ప్రొవెన్షియల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, స్వీపర్, వాచ్మెన్, లైన్మెన్ డ్రైవర్లను సర్దుబాటు చేశారు. కానీ ఒక్క పూర్వ వరంగల్ సర్కిల్లో స్వీపర్, వాచ్మెన్ లైన్మెన్ డ్రైవర్ పోస్టులను పట్టించుకోకుండా వదిలేశారు. ఆ తర్వాత 2022 ఏప్రిల్లో సర్కిల్ స్థాయిలో స్వీపర్, వాచ్మెన్, లైన్మెన్ డ్రైవర్ల విభజన, సర్దుబాటుకు కమిటీ నియమించారు. అదే విధంగా డివిజన్ స్థాయిలో స్వీపర్, వాచ్మెన్, లైన్మెన్ డ్రైవర్ పోస్టుల విభజన, సర్దుబాటు కోసం మరో కమిటీని నియమించారు. మూడేళ్లు గడిచినా ఎలాంటి నిర్ణయం లేదు.. ఈ కమిటీలను నియమించి మూడేళ్లు గడిచాయి. అయినా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చైర్మన్లుగా వ్యవహరించాల్సిన సీజీఎంలు మారినా, బదిలీల్లో ఎస్ఈలు, ఎస్ఏఓలు, డీఈ టెక్నికల్లు మారుతున్నారే కాని ఉద్యోగుల విభజన మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా అక్కడే ఉంది. ఈ విషయాన్ని యాజమాన్యం కూడా సీరియస్గా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. వాచ్మెన్, స్వీపర్ పోస్టుల విభజనను విస్మరించిన యాజమాన్యం..వాచ్మెన్, స్వీపర్ పోస్టుల విభజనను యాజమాన్యం విస్మరించినట్లు కనిపిస్తోంది. పూర్వ వరంగల్ జిల్లా (సర్కిల్) పరిధిలో టీజీ ఎన్పీడీసీఎల్ నాలుగు సర్కిళ్లు ఏర్పాటు చేసింది. హనుమకొండ సర్కిల్ ఆఫీస్ పూర్వ కార్యాలయంగా, నోడల్ కార్యాలయంగా పని చేస్తుండగా, వరంగల్, జనగామ, మహబూబాబాద్తోపాటు జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలను కలిపి భూపాలపల్లి సర్కిళ్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు డివిజన్ కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాలకు సబ్ ఇంజనీర్ స్థాయి నుంచి డివిజనల్ ఇంజనీర్ వరకు, జూనియర్ లైన్మెన్ నుంచి ఫోర్మెన్ వరకు, జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ వరకు అధికారులు, ఉద్యోగుల బైఫర్కేషన్ చేసి పోస్టులు మంజూరు చేసి భర్తీ చేసిన యాజమాన్యం.. వాచ్మెన్, స్వీపర్ పోస్టులను విస్మరించిందని అధికారులు, ఉద్యోగులు విమర్శిస్తున్నారు. -
తాళాలు వేసి ఉన్న క్వార్టర్స్ టార్గెట్గా..
గణపురం : తాళాలు వేసి ఉన్న క్వార్టర్స్ టార్గెట్గా కేటీపీపీలో భారీ చోరీ జరిగింది. పటిష్ట భద్రత కలిగి ఉండే జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం(కేటీపీపీ) క్వార్టర్స్లో సోమవారం రాత్రి భారీ చోరీ జరిగింది. ఈ ఘటనలో రూ. 3.10 లక్షల నగదుతో పాటు కొన్ని విలువైన ఆభరణాలు చోరీకి గురైనట్లు సమాచారం. చోరీ జరిగిన క్వార్టర్స్లో ఎవరూ లేకపోవడంతో మంగళవారం ఉదయం గుర్తించిన చుట్టుపక్కల వారు బాధితులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అందుబాటులో ఉన్న కొంత మంది ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్వార్టర్స్ నంబర్ సీ9, సీ12, డీ12, డీ37, డీ40, డీ55, డీ117, ఈ6, ఈ 56, ఈ79 బ్లాక్లలో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఇందులో డీ12 క్వార్టర్స్లోని ఏడీఈ వంశీధర్ ఇంట్లో రూ. 3 లక్షల నగదు, డీఈ తిరుపతి గౌడ్ ఇంట్లో రూ. 10వేల నగదు చోరీ గురైందని ఫిర్యాదు చేశారు. మిగతా ఉద్యోగుల క్వార్టర్స్లలో విలువైన ఆభరణాలు పోయినట్లు సమాచారం. మిగతా వారు వచ్చి తమ క్వార్టర్స్లలో ఏ వస్తువు చోరీ జరిగిందో చూస్తే తప్ప పూర్తి వివరాలు తెలియదు. ఘటనా స్థలిని భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, చిట్యాల సీఐ మల్లేశ్, గణపురం ఎస్సై అశోక్ పరిశీలించి ఆధారాలు సేకరించారు. 24 గంటలు భద్రత.. చోరీ ఎలా జరిగింది? కేటీపీపీ క్వార్టర్స్లో సుమారు వెయ్యి మందికి పైగా ఉద్యోగుల కుటుంబాలు నివాసముంటున్నాయి. ఇందులో సీఈ స్థాయి నుంచి ఎస్ఈలు, డీఈలు, ఎడీఈలు, ఇంజనీర్లు, జేపీఏ,ఆర్టిజన్లు కుటుంబాలతో నివాసముంటున్నారు. ఇక్కడ జెన్కో సెక్యూరిటీ బయటి వారిని లోపలికి వెళ్లకుండా ప్రతి క్షణం రక్షణ చర్యలు తీసుకుంటుంది. ప్రతీ కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కానీ ఇంత భద్రత ఉన్నా ఒకే రాత్రి 10 క్వార్టర్స్లో చోరీ జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెక్యూరిటీ విభాగం కాలనీల్లో గస్తీ నిర్వహిస్తారు. అయినా బయటి వారు ఎలా లోపలికి చొరబడ్డారు. తాళాలు వేసి ఉన్న క్వార్టర్స్నే ఎలా గుర్తించారు. ఇదేమైనా ఇంటి దొంగల పనేనా అని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి కేటీపీపీలో ఒకే రోజు 10 క్వార్టర్స్లో చోరీ జరగడం సంచలనంగా మారింది. ఈ చోరీని పోలీసులు ఎలా ఛేదిస్తారో వేచి చూడాలి. కేటీపీపీలో భారీ చోరీ ఒకే రాత్రి 10 ఇళ్లలో రూ.3.10 లక్షల నగదు అపహరణ పటిష్ట భద్రత ఉన్నా చోరీ జరగడంపై అనుమానాలు ఘటనా స్థలిని పరిశీలించిన డీఎస్పీ సంపత్ రావు -
చెత్తాచెదారం తొలగింపు..
కేసముద్రం: మున్సిపాలిటీ పరిధిలో పలు చోట్ల సైడ్ కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని మున్సిపల్ సిబ్బంది తొలగించి శుభ్రం చేశారు. డ్రెయినేజీలు సరిగా లేకపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మంగళవారం సాక్షి దినపత్రికలో ‘కంపు..కంపు’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ ప్రసన్నరాణి ఆదేశాలతో మున్సిపాలిటీ పరిధి కిష్టాపురం, కేసముద్రంవిలేజ్, చైతన్యనగర్, రేకులతండా, అమీనాపురంతోపాటు పలు చోట్ల సైడ్ కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని మున్సిపల్ సిబ్బంది తొలగించి, శుభ్రం చేశారు. -
ఆ.. జలపాతాల సందర్శన నిషేధం
వాజేడు: గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో దండకారణ్యంలోని పలు జలపాతాల సందర్శనకు అటవీశాఖ, పోలీసుల అధ్వర్యంలో బ్రేకులు వేశారు. ములుగు జిల్లాలో ప్రాచుర్యం పొందని జలపాతాల సందర్శనకు పర్యాటకులు రావద్దని కోరుతూ నిషేధం విధించారు. దీంతో గుట్టల సమీపంలో ఉన్న జలపాతాలను సందర్శించడం ఇక కష్టం కానుంది. నిషేధించిన జలపాతాలు ఇవే.. వాజేడు, వెంకటాపురం(కె) మండలాలను ఆనుకుని దండకారణ్యం, కర్రె గుట్టలు ఉన్నాయి. ఈ గుట్టలపైనుంచి జాలువారుతూ వాజేడు మండలంలో మరికొన్ని జలపాతాలు ఉన్నాయి. కొంగాల సమీపంలో దుసపాటిలొద్ది, కృష్ణాపురం సమీపంలో భామనసిరి, దూలాపురం సమీపంలోని మాసన్లొద్ది, అరుణాచలపురం సమీపంలో గుండం, వెంకటాపురం(కె)లో ముత్యంధార జలపాతాలు ఉన్నాయి. ఇవి ఇంకా ప్రాచుర్యం పొందలేదు. కానీ, బొగత జలపాతం సందర్శన వచ్చే పర్యాటకులు ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ జలపాతాలను తిలకించడానికి ఉత్సుకత చూపిస్తున్నారు. నిషేధం ఉందని తెలిసినా వెళ్తున్నారు. రక్షణ లేకపోవడంతోనే.. దుసపాటి లొద్ది, మాసన్ లొద్ది, గుండం, ముత్యం ధార, భామన సిరి జలపాతాలు నట్టడవిలో ఉన్నాయి. ఇక్కడికి చేరుకోవాలంటే చాలాదూరం అడవిలో కాలినడకన వెళ్లాలి. సెల్ఫోన్ సిగ్నల్స్ ఉండవు. ఇవి ఇంకా పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందలేదు. దీంతో ఇక్కడికి అష్టకష్టాలు పడి వెళ్లిన పర్యాటకులు ప్రమాదాలకు గురైన సందర్భంలో సమాచారం బయటికి తెలిసే అవకాశం ఉండడంలేదు.దీంతో స్థానిక అధికారులు ఇబ్బందులు ప డుతున్నారు. ప్రధానంగా ఈ జలపాతాల వద్ద ఎలాంటి రక్షణ చ ర్యలు, సౌకర్యాలు లేవు.దీంతో అటవీశాఖ సిబ్బంది వీటిని ని షేఽ దించడంతోపాటు ఇక్కడికి పర్యాటకులు వెళ్లొద్దని అటువైపు వెళ్లే దారులను బారికేడ్లు పెట్టి మూసివేశారు.ఫ్లెక్సీలను ఏర్పాటు చేశా రు. దొంగ దారిలో వెళ్లకుండా సిబ్బందిని కాపలాగా ఉంచారు. నిషేధిత జలపాతాలకు వెళ్లొద్దు దట్టమైన అటవీప్రాంతంలోని ప్రమాదకర జలపాతాల సందర్శనకు అనుమతులు లేవు. అనవసరంగా పర్యాటకులు వెళ్లి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దు. ప్రమాదం జరిగితే రక్షించడానికి ఆ సమయంలో ఎవరూ అందుబాటులో ఉండరు. ఈ విషయాన్ని పర్యాటకులు గుర్తుంచుకుని మాకు సహకరించాలి. – ద్వాలియా, ఎఫ్డీఓ, వెంకటాపురం(కె)బొగతకు రావాలంటూ పిలుపు తెలంగాణ నయాగరాగా పేరుగాంచిన బొగత జలపాతానికి ఎలాంటి ఇబ్బందులూ లేవని, పర్యాటకులు తరలి రావాలని అధికారులు కోరుతున్నారు. అన్ని సౌకర్యాలున్న ఈ జలపాతాన్ని పర్యాటకులు వీక్షించాలని ఆహ్వానిస్తున్నారు. ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ కూడా బొగత జలపాతాన్ని వీక్షించాలని పిలుపునిచ్చారు. ఇక్కడికి రోజురోజుకూ పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నప్పటికి మండలంలో సరైన వర్షం లేకపోవడంతో పూర్తిస్థాయిలో జాలువారడం లేదు. అటవీ, పోలీస్ అధికారుల నిర్ణయం రక్షణ లేకపోవడం.. గత ప్రమాదాలే ప్రధాన కారణం దారులు మూసి.. కాపలాగా ఉన్న సిబ్బంది బొగత జలపాతానికి రావాలంటూ పిలుపు -
‘స్థానికం’ కోసం.. ‘ముందస్తు’గా..
పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ ఇన్చార్జ్లు● టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు అవకాశం ● వరంగల్కు చిట్ల సత్యనారాయణ, మహబూబాబాద్కు పొట్ల నాగేశ్వర్రావు ● ఇతర జిల్లాల ఇన్చార్జులుగా ఓరుగల్లు నేతలుసాక్షిప్రతినిధి, వరంగల్: స్థానిక సంస్థల ఎన్నికలు కొద్ది రోజుల్లో జరిగే అవకాశం ఉండగా.. అధికార కాంగ్రెస్ పార్టీ ‘ముందస్తు’గా సిద్ధమవుతోంది. గ్రామస్థాయినుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అధిష్టానం సీనియర్లను రంగంలోకి దింపుతోంది. ఈ క్రమంలోనే టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇన్చార్జ్లను నియమించింది. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ ఆ జాబితాను విడుదల చేశారు. ఇతర జిల్లాలకు చెందిన సీనియర్లను ఉమ్మడి వరంగల్కు నియమించిన టీపీసీసీ చీఫ్.. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్లకు ఇతర జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ఒక్కో పార్లమెంట్ స్థానానికి ఒక ఉపాధ్యక్షుడు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులను నియమించారు. వరంగల్ (ఎస్సీ) పార్లమెంట్ నియోజకవర్గం వైస్ ప్రెసిడెంట్గా చిట్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులుగా దుద్దిళ్ల శ్రీనివాస్, పల్లె శ్రీనివాస్ గౌడ్, మోత్కూరి ధర్మారావు, మహబూబాబాద్ (ఎస్టీ)కి వైస్ప్రెసిడెంట్గా మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వర్రావు, ప్రధాన కార్యదర్శులుగా ఎమ్మెల్యే డా.మట్టా రాగమయి, బేబీ స్వర్ణకుమారి, నాగ సీతారాములులను నియమించారు. అదే విధంగా ఉమ్మడి వరంగల్నుంచి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని కరీంనగర్ పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్గా, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను మల్కాజ్గిరి వైస్ప్రెసిడెంట్గా, హన్మాండ్ల ఝాన్సీరెడ్డికి సికింద్రాబాద్ ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పగించారు. నల్లగొండకు నమిండ్ల శ్రీనివాస్ను వైస్ప్రెసిడెంట్గా నియమించిన అధిష్టానం.. ఈవీ శ్రీనివాస్రావు, బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు భువనగిరి, ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామికి సికింద్రాబాద్ ఇన్చార్జ్ జనరల్ సెక్రటరీలుగా బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా మాజీ జెడ్పీ చైర్పర్సన్ లకావత్ ధన్వంతిని ప్రోగ్రాం ఇప్లిమెంటేషన్ ఆర్గనైజేషన్ ఇన్చార్జ్గా నియమించారు. చికిత్స పొందుతూ వినోద మృతి ● కుంటపల్లిలో విషాదఛాయలు●సంగెం: డబ్బు, ఆస్తి కోసం తల్లిపై పెట్రోల్ పోసి ని ప్పంటించగా ఎంజీఎంలో నాలుగు రోజలు మృత్యువుతో పోరాడిన ముత్తినేని వినోద(60) మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. వినోద మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం అనంత రం వినోద మృదేహాన్ని కుంటపల్లి తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. భర్త సాంబయ్య తలకొరివి పెట్టాడు. కాగా, కన్న కొడుకే కాలయముడై తల్లిని కర్కషంగా బతికుండగానే నరకం చూపించి కాటికి పంపిన సతీశ్ లాంటి కొడుకు పుట్టకపోయినా పర్వాలేదని బంధువులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. సతీశ్ను పోలీసులు మంగళవారం రిమాండ్కు తరలించారు. -
ప్రమాదకరంగా విద్యుత్ తీగలు
● పట్టించుకోని అధికారులు ● ఇబ్బందులు పడుతున్న రైతులు మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని సీత్లాతండా గ్రామ శివారులో 33 కేవీ విద్యుత్ తీగలు తెగిపడి ఉన్నాయి. సుమారు రెండు నెలల క్రితం గాలిదుమారం, ఈదురుగాలుల వల్ల విద్యుత్ తీగలు తెగిపడ్డాయని రైతులు పేర్కొన్నారు. కాగా మండలంలోని ఉత్తరతండా గ్రామపంచాయతీ పరిధిలోని గుర్రాలగుట్టతండా నుంచి సీత్లాతండా గ్రామంలోని తుమ్మలకుంట చెరువు వరకు విద్యుత్ వైర్లు తెగిపడి ఉండడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. తీగల వల్ల వ్యవసాయ పనులు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా మరమ్మతుల కోసం 15 రోజుల క్రితం అధికారులు స్తంభాలు ఏర్పాటు చేసి వదిలేసి వెళ్లినట్లు చెప్పారు. ఈ విషయాన్ని సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు తెలియజేసినప్పటికీ పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. -
కలుషిత నీరే దిక్కు..
లీకేజీలు, పగుళ్లతో ఇబ్బందులు ● మున్సిపాలిటీల్లో రోడ్డు మధ్యలో గేట్వాల్వ్స్ ● తాగునీటిలో డ్రెయినేజీ నీళ్లు చేరుతున్న దుస్థితి ● రోగాల బారిన పడుతున్న ప్రజలు ● లీకేజీలతో ఎగువ ప్రాంతాల్లో నీటి కొరత● పక్క ఫొటో మహబూబాబాద్ మున్సిపాలిటీలో మురికి గుంటలో ఉన్న నీటి సరఫరా గేట్వాల్వ్ పాయింట్. ఇది వన్టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉంది. చిన్న పాటి వర్షం పడినా ఈ గుంతలో నీరు నిలుస్తోంది. దీంతో తాగునీరు కలుషితమై గేట్వాల్వ్ ద్వారా ఈప్రాంతంలోని నివాస గృహాలకు సరఫరా అవుతోంది. ఈ నీటిని తాగడమే కాకుండా వంటల్లోకి వినియోగించడంతో రోగాలబారిన పడుతున్నారు. ఈ నల్లా నీరు సరఫరా అయ్యే ప్రాంతాల్లోని ప్రజలకు తరచూ విరేచనాలు కావడం, కామెర్లతో బాధపడుతున్నవారు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. సీజనల్ వ్యాధులు 90శాతం కలుషిత తాగునీటితోనే వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. కాగా మున్సిపాలిటీల్లో మిషన్ భగీరథ తాగునీరు సరఫరా చేస్తున్నారు. అయితే ట్యాంకుల నుంచి స్వచ్ఛమైన తాగునీరు సరఫరా అవుతున్నప్పటికీ.. పైపులైన్ల లీకేజీలు, పగుళ్లతో కలుషితమవుతోంది. కొన్ని చోట్ల డ్రెయినేజీ నీళ్లు కలిసి సరఫరా జరుగుతుంది. దీంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా వానాకాలంలో డయేరియా, కామెర్లు, కిడ్నీ సంబంధిత వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. – సాక్షి, మహబూబాబాద్ -
వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి హన్మకొండ: వర్షాకాలంలో విద్యుత్ అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్లు, నోడల్ జీఎంల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ అంతరాయాలు ఏర్పడిన వెంటనే పునరుద్ధరించేలా మెన్, మెటీరియల్ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ప్రతీ సబ్ స్టేషన్కు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా ఉండాలన్నారు. వచ్చే మూడు నెలల్లో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న లూజు లైన్లు, వంగిన పోల్స్, తుప్పు పట్టిన స్తంభాలు, తక్కువ ఎత్తులో ఉన్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల గద్దెల ఎత్తు పెంచడం, లైన్ క్రాసింగ్, డబుల్ ఫీడింగ్ వచ్చే వాటిని గుర్తించి సరి చేయాలని ఆదేశించారు. 16 సర్కిళ్ల పరిధిలో కొత్తగా వ్యవసాయ కనెక్షన్లు పెరుగుతున్నాయని, అందుకు తగట్లు రిలీజ్ వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవాలని సీఈలను ఆదేశించారు. విద్యుత్ బిల్లుల వసూళ్లు వందశాతం జరిగేలా నోడల్ జనరల్ మేనేజర్లు దృష్టి సారించాలన్నారు. సమావేశంలో డైరెక్టర్లు వి. మోహన్ రావు, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, వి. తిరుపతిరెడ్డి, చీఫ్ ఇంజనీర్లు టి.సదర్లాల్, బి.అశోక్ కుమార్, కె.తిరుమల్ రావు, రాజు చౌహాన్, అశోక్, రవీంద్రనాథ్, ఆర్.చరణ్ దాస్, మాధవరావు, జాయింట్ సెక్రటరీ కె.రమేశ్, తదితరులు పాల్గొన్నారు. -
బయ్యారం చెరువు.. చరిత్రకు సాక్ష్యం
బయ్యారం: ఓరుగల్లును రాజధానిగా చేసుకొని పాలించిన కాకతీయరాజుల వంశవృక్షం.. ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా బయ్యారం పెద్దచెరువు కట్టపై లిఖించిన శిలాశాసనం ద్వారా అందుబాటులో ఉంది. పొడవాటిరాయిపై తెలుగు, కన్నడ, సంస్కృత లిపిలో ఉన్న కాకతీయరాజుల వంశవృక్షం, నాటి రాజుల పరిపాలనాదక్షతను తెలియజేస్తోంది. శాసనంలో ఏముందంటే.. వెన్నురాజు కాకతీయ రాజ్యాన్ని ఏలుతుండగా మొదటి గుండు, రెండో గుండు, మూడో గుండురాజులు జన్మించారు. వీరు రాజ్యాన్ని పాలించగా.. ఆ తర్వాత కుమారులు, మనుమలు, మనుమడి కుమారులు పాలన సాగించారు. వారి తర్వాత ఎర్రమరాజు కాకతీయ రాజ్యాన్ని పాలించగా.. ఆ తర్వాత పిండిగుండమ రాజు అనుమ, కొండ ప్రాంతాలను ఏలుతున్న రాజులను సంహరించి అనుమకొండ పేరున రాజధానిని ఏర్పాటు చేశాడు. అతనికి ప్రోలరాజు జన్మించాడు. అతను ప్రజల్లో దేవునిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రోలరాజుకు త్రిభునవ మల్లరాజు జన్మించగా.. అతను శత్రువులు భయభ్రాంతులయ్యేలా పాలనను కొనసాగించాడు. త్రిభునవ మల్లరాజుకు రుద్రదేవుడు, మహాదేవుడు సంతానం. వీరిలో రుద్రదేవుడు శక్తిమంతుడు. మహదేవుడు దానధర్మాల్లో దేవేంద్రుడు. ఇతని భార్య బయ్యమాంబ.. శివునికి పార్వతిలా వ్యవహరించింది. వీరికి మైలమాంబ, గణపతిదేవుడు సంతానం. వీరిలో గణపతిదేవునికి 1105 సంవత్సరంలో కుమార్తె జన్మించింది. ఆమెకు శ్రీశైల మల్లికార్జునుడి పేరిట ధర్మకీర్తిగా ధర్మానికి ప్రతిగా పేరు పెట్టారు. మహదేవుడు తన కుమార్తె మైలమాంబకు తగిన సంబంధం చూడాలని మంత్రులను ఆదేశించాడు. మంత్రులు నటవాడి వంశీయుడైన రుద్రరాజును మైలమాంబకు తగిన వ్యక్తిగా ఎంపిక చేశారు. రుద్రదేవునికి మైలమాంబను ఇచ్చి వివాహం చేయగా.. వారు పార్వతీ పరమేశ్వరులుగా విలసిల్లారు.. ఇవీ శాసనంలో పేర్కొన్న వివరాలు. మైలమాంబ తన తల్లి బయ్యమాంబ పేరున ప్రజా క్షేమాన్ని కోరి జలనిధి (చెరువు)ని ఏర్పాటు చేసినట్లు ఈ శాసనం తెలుపుతోంది.నీటి సామర్థ్యం 0.4 టీఎంసీలు.. కాకతీయ రాజుల కాలంలో నిర్మించిన బయ్యారం పెద్ద చెరువు 0.4 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగి ఉంది. రెండుగుట్టలను కట్టలుగా చేసుకొని నిర్మించిన చెరువుకట్ట 2.37 కిలోమీటర్ల మేర ఉండగా.. 987 ఎకరాల్లో నీరు నిల్వ ఉంటుంది. చెరువు పైభాగంలో సుమారు 100 కిలోమీటర్ల దూరంలో వర్షం కురిసినా.. చెరువులోకి పందిపంపుల, మసివాగుల ద్వారా వరద నీరు వస్తుంది. ఏటా రాష్ట్రంలో ఉన్న మీడియం ప్రాజెక్టుల్లో మొదట నీరు నిండి అలుగు పోసేది బయ్యారం పెద్ద చెరువుగా రికార్డులో ఉంది. చెరువు కింద 7,200 ఎకరాలు అధికారికంగా సాగవుతున్నట్లు తెలుపుతున్నప్పటికీ.. అనధికారికంగా మరో 7,200 ఎకరాల భూమి సాగవుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. నాడే గొలుసుకట్టుకు అంకురార్పణ.. కాకతీయుల కాలంలోనే.. ముందుచూపుతో వరద నీరు వృధాగా పోకుండా గొలుసుకట్టు చెరువులను నిర్మించారనడానికి బయ్యారం పెద్దచెరువే ఉదాహరణ. బయ్యారం పెద్దచెరువు నిండిన తరువాత అలుగునీరు వృధాగా పోకుండా.. అలుగునీటిపై కొత్తపేట సమీపంలోని కమలాయకట్టును నిర్మించారు. ఈ కట్టుద్వారా కాల్వను మళ్లించి గార్ల పెద్ద చెరువును నింపడంతో పాటు.. ఆ చెరువు అలుగు నీటిని పలు కుంటలకు సరఫరా చేశారు. కాకతీయరాజులు గొలుసుకట్టు చెరువుల ద్వారా భూములకు సాగు నీరందించారు. -
దాతలారా.. ఆపన్నహస్తం అందించండి..
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ నగరం 36వ డివిజన్ పుప్పాలగుట్ట ప్రాంతానికి చెందిన వేల్పుల నవీన్కుమార్ (36) మూడేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోవడంతో మంచంపై కదల్లేని స్థితిలో దీనావస్థలో జీవితం సాగిస్తున్నాడు. అతని భార్య కవిత మూగ, చెవిటికాగా, కూతురు నివేదిత ఉన్నారు. నవీన్కుమార్ స్థానికంగా కరెంటు స్విచ్ బోర్డుల తయారు చేసే కాంట్రాక్టర్ వద్ద రోజుకు రూ.300 దినసరి కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని కష్టంమీద పోషిస్తున్నాడు. మూడేళ్ల క్రితం అతడికి హైబీపీ రావడంతో రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోవడంతో ఇంటిదగ్గరే ఉంటున్నాడు. గతంలో వారానికి రెండు రోజులపాటు డయాలసిస్ చేయగా, ప్రస్తుతం పరిస్థితి విషమించడంతో హనుమకొండలోని విశ్వాస్ ఆస్పత్రిలో వారానికి మూడు సార్లు డయాలసిన్ జరుగుతోంది. ఇందుకోసం ప్రతీనెల రూ.2లక్షల మేర ఖర్చు అవుతుండంతో భరించలేని స్థితిలో నవీన్కుమార్ కుటుంబం ఉంది. చెడిపోయిన రెండు కిడ్నీల స్థానంలో ఓ కిడ్నీ అయినా ఏర్పాటు చేస్తే తన ప్రాణం నిలిచే అవకాశం ఉందని నవీన్కమార్ చెబుతున్నారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో ‘జీవన్దాన్’ పథకం కింద కిడ్నీ మార్పిడి కోసం దరఖాస్తు చేసుకుని 8 నెలల అవుతున్నప్పటికీ కిడ్నీ దాతలు లభించడం లేదు. దాతలెవరైనా ఉంటే 99493 49660 సెల్ నంబర్కు ఫోన్ చేసి సహాయం అందించాలని బాధితుడి తండ్రి రత్నం కోరుతున్నారు. రెండు కిడ్నీలు చెడిపోయి దీనావస్థలో బాధితుడు నిమ్స్లో ‘జీవన్దాన్’కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం శూన్యం చికిత్స పొందుతున్న నవీన్కుమార్ -
అక్టోబర్లో రాష్ట్రస్థాయివెయిట్ లిఫ్టింగ్ పోటీలు
నయీంనగర్: వరంగల్లో అక్టోబర్ నెలలో రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వరంగల్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కెఆర్.దివ్యజ రాజ్ తెలిపారు. సోమవారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో వరంగల్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ నూతన కార్యవర్గం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా దివ్యజ రాజ్ మాట్లాడుతూ వరంగల్ క్రీడాకారులకు నాణ్యమైన శిక్షణతోపాటు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొనే క్రీడాకారులకు ఆర్థిక సహకారం అందజేస్తామన్నారు. క్రీడాకారులకు క్రీడాసామగ్రి, క్రీడా దుస్తులు ఇస్తామన్నారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులకు పారితోషికం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీపాద శ్రీనివాసరావు, ట్రెజరర్ డాక్టర్ ఎస్.నూతన్, మెడ్ల సురేందర్, తదితరులు పాల్గొన్నారు. పీహెచ్డీ అడ్మిషన్లు కల్పించాలని ఆందోళన కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో 2021–2022 పీహెచ్డీ నోటిఫికేషన్ ఇచ్చి అప్పటికే అభ్యర్థులకు అడ్మిషన్లు కల్పించిన విషయం విధితమే. అయితే తమకు పీహెచ్డీలో అడ్మిషన్లు కల్పిస్తామని గతంలో చెప్పారని, ఉన్నత విద్యామండలి నుంచి సిఫార్సు చేసినా అడ్మిషన్లు కల్పించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తూ ఐదుగురు అభ్యర్థులు సోమవారం వీసీ చాంబర్లో ఆందోళన చేపట్టారు. వీసీ ప్రతాప్రెడ్డితో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు. అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. ఆందో ళన చేసిన వారిలో మంద నరేశ్, బొట్ల మనోహర్, మోతే రాజు, ఎస్. అనిల్, తిరుపతినాయక్ ఉన్నారు. -
తల్లికి నిప్పంటించిన కొడుకు అరెస్ట్
● వివరాలు వెల్లడించిన పోలీసులు సంగెం: తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సంగెం పీఎస్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పర్వతగిరి సీఐ రాజ్గోపాల్, సంగెం ఎస్సై నరేశ్.. నిందితుడి అరెస్ట్ చూపి వివరాలు వెల్లడించారు. డబ్బు, ఆస్తి కోసం మండలంలోని కుంటపల్లికి చెందిన ముత్తినేని వినోద(60)పై తన కొడుకు పెట్రోల్ పోసి నిప్పంటించగా ఆమె 90 శాతానికిపైగా కాలిన గాయాలతో ఎంజీఎంలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న విషయం విధితమే. సోమవారం మధ్యాహ్నం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా చింతలపల్లి రైల్వే గేట్ సమీపంలో నిందితుడు ముత్తినేని సతీశ్ పారిపోతుండగా పట్టుకుని విచారించారు. వీరికున్న భూమిలో 4 ఎకరాలు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో, మరో ఎకరం తండ్రి సాంబయ్య పేర ఉంది. పరిహారంగా రూ. 40 లక్షలు వచ్చాయి. వాటిలో రూ. 30 లక్షలు సతీశ్కు ఇవ్వగా వాటితో బుధరావుపేటలో రెండున్నర ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. మిగతా డబ్బులో కొంత మరోసారి కుమారుడికి ఇవ్వగా తండ్రి సాంబయ్య పేర రూ.3 లక్షలు, తల్లి వినోద పేర రూ.3,50,000 బ్యాంకు డిపాజిట్ చేసుకున్నారు. తల్లిదండ్రుల వద్ద ఉన్న డబ్బు, ఎకరం భూమి తనకు ఇవ్వకుండా అక్క స్వరూపకు ఇస్తారా అని తరచూ గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో గీసుకొండ మండలం గంగదేవిపల్లిలో కిరాయికి ఉంటున్న సతీశ్.. తల్లిపై కక్ష పెంచుకుని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. శనివారం రాత్రి సంగెంలోని ఓ బంక్లో పెట్రోల్ కొనుగోలు చేసి అర్ధరాత్రి కుంటపల్లికి చేరుకున్నాడు. ఇంటికి వచ్చి ‘నీవు ఉన్నన్ని రోజులు డబ్బులు, భూమి ఇవ్వవు.. నీవు చస్తే నాకు వస్తాయి’ అని తల్లి వినోదపై పెట్రోల్ చల్లి నిప్పంటించి పరారయ్యాడు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేశామని, మంగళవారం రిమాండ్కు తరలిస్తామని సీఐ, ఎస్సై తెలిపారు. -
టీ–హబ్తో ఒప్పందంపై మంత్రిని కలిసిన వీసీ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్రెడ్డి సోమవారం హైదరాబాద్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబును క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి దృష్టికి కేయూ అభివృద్ధికి సంబంధించిన అంశాలను తీసుకెళ్లారు. ప్రధానంగా రాష్ట్రీయ ఉన్నత విద్య అభియాన్ (రూసా) నిధులతో కేయూలో ఏర్పాటుచేసి కె–హబ్ గురించి మంత్రికి వివరించారు. యువతలో నూతన ఆవిష్కరణలు, ఇంక్యుబేషన్, అంకుర స్టార్టప్లను ప్రోత్సహించాలనే లక్ష్యం ఉందని వీసీ తెలిపారు. ఇంక్యుబేషన్, స్టార్టప్లను అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్లోని టి–హబ్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరం ఉందని, అందుకు సహకరించాలని మంత్రితో చర్చించారు. అలాగే, జీయాలజీ విభాగానికి పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యాన్ని ఏర్పాట చేయాలనే అంశంపై కూడా మంత్రి సానుకూలంగా స్పందించారని వీసీ తెలిపారు. ప్రత్యేకించి లైఫ్ సైన్సెస్ రంగంలో నూతన ఆవిష్కరణల కోసం కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా నిలవాలని మంత్రి కాంక్షించారని ప్రతాప్రెడ్డి సోమవారం సాయంత్రం క్యాంపస్లో వెల్లడించారు. వీసీ వెంట కేయూ జీయాలజీ విభాగం అధిపతి ఆర్. మల్లికార్జున్రెడ్డి ఉన్నారు. -
డీటీ రాజేశ్ ఖన్నా కన్నుమూత..
● ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి ● మృతుడి కుటుంబానికి కలెక్టర్ పరామర్శ నల్లబెల్లి: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న నల్లబెల్లి డిప్యూటీ తహసీల్దార్ (డీటీ) రాజేశ్ ఖన్నా(50) కన్నుమూశారు. సోమవారం తెల్లవారుజామున ఎంజీఎంలో మృతి చెందారు. బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. హనుమకొండ ప్రశాంత్ నగర్కు చెందిన డిప్యూటీ తహసీల్దార్ అన్నబోయిన రాజేశ్కన్నా(50) ఎనిమిదేళ్ల క్రితం అనారోగ్యానికి గురికాగా పరీక్షించిన వైద్యులు రెండు కిడ్నీలు పని చేయడం లేదని నిర్ధారించారు. దీంతో భార్య రమాదేవి తన కిడ్నీ దానం చేసి భర్తను బతికించుకుంది. ఈ క్రమంలో వైద్యం కోసం అప్పు చేయడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. వైద్యుల సూచన మేరకు జాగ్రత్తలు పాటిస్తూ డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్నారు. గతేడాది తండ్రి, రెండు నెలల క్రితం తమ్ముడు మృతి చెందాడు. ఈ క్రమంలో 20 రోజుల క్రితం డీటీ రాజేశ్ కన్నా ఊపిరితిత్తుల సమస్యతో తీవ్ర ఇబ్బంది పడడంతో కుటుంబీకులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. భార్య, కూతురు బంగారు ఆభరణాలు అమ్మి సుమారు రూ.25 లక్షలతో చికిత్స చేయించారు. అయితే ఇంకా అదే ఆస్పత్రిలో చికిత్స చేయించేందుకు చేతిలో డబ్బులు లేవు. దీంతో డిశ్చార్జ్ చేసి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తామంటే ప్రస్తుతం చికిత్స పొందుతున్న ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాహకులు రూ.7 లక్షలు చెల్లించాలని ఒత్తిడి చేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో భార్య రమాదేవి విలపిస్తూ రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో తన గోడు వెల్లబోసుకుంది. దీంతో వారు ఆస్పత్రి యాజమాన్యంతో చర్చించి మెరుగైన వైద్యం అందించారు. ఐదు రోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. కృత్రిమ శ్వాసతో కోలుకుంటున్న క్రమంలో ఆదివారం రాత్రి ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం నిమిత్తం ఎంజీఎం తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. డిప్యూటీ తహసీల్దార్ మృతితో నల్లబెల్లి మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, డీటీ రాజేశ్కన్నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి కుటుంబానికి కలెక్టర్ పరామర్శ.. డిప్యూటీ తహసీల్దార్ మృతి సమాచారం తెలుసుకున్న కలెక్టర్ స త్యశారద.. రాజేశ్ ఖన్నా మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. దహన సంస్కారాల నిమిత్తం రూ.50 వేలు అందించారు. నివాళులర్పించిన వారి లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరెడ్డి, తహసీల్దార్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షు డు పాక రమేశ్, కలెక్టరేట్ ఏఓ విశ్వప్రసాద్, తహసీల్దార్లు ముప్పు కృష్ణ, నాగేశ్వరరావు, మంజుల, తదితరులు పాల్గొన్నారు. -
చెత్త ఎత్తారు..
కేసముద్రం: మున్సిపాలిటీ పరిధిలో పలుచోట్ల పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని సోమవారం మున్సిపల్ సిబ్బంది ట్రాక్టర్లలో తరలించారు. మున్సిపాలిటీ పరిధిలో పలుచోట్ల చెత్తపేరుకుపోవడంతో, ఆ దుర్వాసనకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న తీరుపై సోమవారం సాక్షి దినపత్రికలో ‘చెత్త శుద్ధి ఏది?’ అనే శీర్షీక కథనం ప్రచురితమైంది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ ప్రసన్నరాణి ఆదేశాలతో పలుచోట్ల పేరుకుపోయిన చెత్తాచెదారన్ని సిబ్బంది ఎత్తి, ట్రాక్టర్లలో తరలించారు. మొత్తంగా టన్నున్నర చెత్తను సేకరించినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. -
గుట్టలెక్కి.. వైద్యం చేసి
వాజేడు: గుట్టలపై ఉన్న పెనుగోలు గ్రామానికి వెళ్లి ఆదివాసీలకు వైద్యం చేయడం మధురానుభూతినిస్తుందంటున్నారు వాజేడు వైద్యాధికారి మధుకర్. ఏడాది క్రితం వాజేడు వైద్యాధికారిగా వచ్చిన తొలి రోజుల్లో సిబ్బందితో కలిసి మండల పరిధి కొంగాల గ్రామ పంచాయతీ గుట్టలపై పెనుగోలు గ్రామానికి కాలినడకన వెళ్లారు. వాగులు వంకలు దాటుతూ అప్అండ్ డౌన్ 34 కిలో మీటర్ల నడిచారు. మారుమూల గ్రామాల ప్రజలకు సైతం ప్రభుత్వ వైద్యం అందాలని, వారికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు మధుకర్ చెబుతున్నారు. -
లెక్కలన్నీ తేల్చుతారు ..
నేడు చార్టెడ్ అకౌంటెంట్ డేహన్మకొండ చౌరస్తా: ఏడాదిలో చేసిన లక్షలు, కోట్ల రూపాయల ఖర్చు, జమలకు సంబంధించిన ప్రతీ పైసా లెక్క తేల్చుతారు. బడా వ్యాపారుల నుంచి మొదలు.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోనూ వీరిదే ముఖ్య భూమిక. లాభాల నుంచి నష్టాల వరకు ప్రతి అంశానికి ఓ లెక్క.. ఆ లెక్కకు ఓ రికార్డును సరిచేస్తారు. వారు లేనిది ఎంత పెద్ద సంస్థ అయినా నడవదంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ వారు ఎవరు అనుకుంటున్నారా.. చార్టెడ్అకౌంటెంట్లు. ప్రస్తుతం ప్రతీ సంస్థకు ఓ సీఏ తప్పనిసరి అయ్యింది. దీంతో సీఏ కోర్సుకు డిమాండ్ పెరిగింది. సీఏ పూర్తి చేస్తే ఉపాధి అవకాశాలకు కొరత లేదనే చెప్పొచ్చు. నేడు చార్టెడ్ అకౌంటెంట్ల దినోత్సవ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఆర్థిక మోసాలను కనిపెట్టడంలో దిట్ట.. కంపెనీ ప్రాజెక్టు నివేదికలు తయారుచేయడం.. ఖర్చులు నియంత్రించడం.. ఆర్థిక మోసాలను కనిపెట్టి వాటి నివారణకు చర్యలు సూచించడం సీఏ బాధ్యత. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 250 మంది చార్టెడ్ అకౌంటెంట్లు ఉన్నారు. పెరుగుతున్న ఆదరణ.. సీఏగా గుర్తింపు పొందిన వారికి దేశంలోనే కాదు విదేశాల్లోనూ విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసే సీఏకు రూ.లక్షల్లో వేతనాలు చెల్లిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. సీఏ కోర్సు వివరాలు .. ఇంటర్మీడియట్ పూర్తయ్యాక సీఏ ఫౌండేషన్కు రిజిస్టర్డ్ అవ్వాలి. డిగ్రీ పూర్తి చేసిన వారు ఫౌండేషన్ అవసరం లేకుండానే నేరుగా సీఏకు రిజిస్టర్డ్ కావొచ్చు. అడ్మిషన్ కోసం ముందు ఐసీఏఐ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి, అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. సీఏ ఫౌండేషన్ ఇంటర్ తర్వాత మొదటి స్టేజ్లో అకౌంటింగ్, ‘లా’, ఎకనామిక్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇలా నాలుగు సబ్జెక్టులు ఉంటాయి. 2 నుంచి 3 సంవత్సరాల ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. చివరి స్టేజీలో రెండు గ్రూప్స్, ఆరు పేపర్లు పూర్తి చేయాలి. కోర్సు పూర్తయ్యే వరకు రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అయితే ఐసీఏఐ ద్వారా మెరిట్, నీడ్ బేస్డ్ స్కాలర్షిప్స్ అందుతాయి. కోర్సు పూర్తి చేయడానికి 4–5 సంవత్సరాలు పడుతుంది. అద్దె భవనంలో .. దశాబ్ద కాలంగా హనుమకొండ హంటర్రోడ్ లోని ట్యాక్స్ బార్ అసోసియేషన్ భవనంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) వరంగల్ శాఖ అద్దె భవనంలో కొనసాగుతోంది. అప్పట్లో జిల్లాకు ఐసీఏఐకు సొంత భవనం మంజూరు చేయాలని అసోసియేషన్ బాధ్యులు అప్పటి కలెక్టర్ వాకాటి కరుణను కోరారు. స్పందించిన ఆమె బాలసముద్రంలోని ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ పక్కన గల సుమారు ఎకరం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించేందుకు సూచనప్రాయంగా అంగీకారం తెలిపారు. అందుకు ప్రభుత్వ ధర ప్రకారం ఆయా స్థలానికి చెల్లించేందుకు ఐసీఏఐ సైతం ముందుకొచ్చింది. అంతేకాదు భవన నిర్మాణం కోసం రూ.6 కోట్లు వెచ్చించేందుకు ఐసీఏఐ రెడీగా ఉన్నట్లు తెలిపారు. ఇంతలో ఏమైందో తెలియదు ఆ ప్రతిపాదనలు మూలకుపడ్డాయి. దీంతో సీఏ కోర్సు చదవడానికి సరైన వసతులు లేకపోవడంతో ఉమ్మడి వరంగల్ విద్యార్థులు హైదరా బాద్, చైన్నె లాంటి మహానగరాలకు వెళ్తున్నారు. విశ్వసనీయతకు నిలువుటద్దం వ్యాపారుల లెక్కలన్నీ వీరి గుప్పిట్లోనే.. సీఏ కోర్సుతో ఉన్నత అవకాశాలు -
పల్లె డాక్టర్ ప్రణీత్కుమార్
ఏటూరునాగారం: ఆ గ్రామానికి వెళ్లాలంటే వాగు దాటాలి. రోడ్డు సరిగ్గా ఉండదు. అక్కడున్న వారికి ఆరోగ్యాన్ని అందించేందుకు డాక్టర్ ప్రణీత్కుమార్ సేవలందిస్తున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి పల్లె దవాఖాన వైద్యుడు హనుమకొండ ప్రణీత్కుమార్ కొండాయి సబ్సెంటర్ (పల్లెదావఖాన)లో పని చేస్తున్నారు. ఏ సమయంలోనైనా అందుబాటులో ఉంటూ వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా.. వెంటనే స్పందిస్తున్నారు. గొత్తికోయగూడెల్లోకి సైతం నడుచుకుంటూ వెళ్లి వైద్యం అందిస్తున్నారు. గూడెల్లోని ప్రజల మన్ననలు పొందుతున్నాడు. -
ప్రభుత్వం హామీలను అమలు చేయాలి
మహబూబాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వీరస్వామి, జేఏసీ నాయకుడు డోలి సత్యనాయణ డిమాండ్ చేశారు. ఫోరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కా ర్యాలయం ఎదుట ఒకరోజు శాంతియుత దీక్ష నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఉద్యమకారులకు 250గజాల స్థలంతో పాటు రూ.25,000 పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు గత ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా న్యాయం చేయాలన్నారు. ఉద్యమకారులలో విద్యార్హత ఉన్న వారికి ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. దీక్షకు డాక్టర్ నెహ్రూనాయక్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్లు మార్నేని వెంకన్న, ఫరీద్, టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, బానోత్ రవికుమార్తో పాటు పలువురు సంఘీభావం తెలి పారు. దీక్షలో వెంకటేశ్వర్లు, శ్రీనివాస్రెడ్డి, వహీద్, హనుమంత్, గోపాల్, వీరభద్రం ఉన్నారు. -
పోలీసుల అదుపులో నిందితులు?
● ఫైనాన్స్ వ్యాపారి హత్య కేసు విచారణలో విస్తుపోయే నిజాలు కాజీపేట: కాజీపేట రైల్వే క్వార్టర్స్లో శుక్రవారం ఫైనాన్స్ వ్యాపారి త్రిపురాధి నవీన్కుమార్ను దారుణంగా హత్య చేసిన నిందితులు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నవీన్కుమార్ను చంపిన తర్వాత నిందితులు అతడి(నవీన్కుమార్) శరీరంపై ఉన్న బంగా ర ఆభరణాలను తీసుకుని వరంగల్ బట్టల బజారులోని ఓ జ్యువెల్లరీ షాపులో రూ.6 లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితులు ఇద్దరు కాజీపేటలోని ఓ చిరువ్యాపారిని కలిసి తమ ఫోన్ పోయిందని చెప్పి మరొకరితో మాట్లాడినట్లు కేసు విచారణలో బయట పడింది. దీంతో నిందితుల కదలికలపై కన్నేసిన పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మృతుడు ఆ రోజు డబ్బుల వసూలు కోసం వచ్చి సదరు మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించడం వల్లే చంపినట్లు నిందితుడు ప్రవీణ్కుమార్ పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. నవీన్కుమార్ను చంపిన తర్వాత మృతదేహాన్ని మాయం చేసి ఏమి తెలియనట్లు ఉండాలని భావించామని, కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో విషయం బహిర్గతం అయ్యిందని కన్నీరు పెట్టుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. డబ్బులు సాయం చేసిన వ్యాపారిని హత్య చేయాలనే ఉద్దేశం తమకు లేదని, అతడి ప్రవర్తన వల్లే మద్యం మత్తులో హత్య చేసినట్లు నిందితులు పోలీసు అధికారులకు చెబుతున్నట్లు తెలుస్తోంది. హత్య జరిగిన అనంతరం వరంగల్లో బంగారం విక్రయించగా వచ్చిన డబ్బులలో కొంత మేర బాకీలు చెల్లించి సుదూర ప్రాంతాలకు వెళ్లి బతకాలని నిర్ణయించుకున్నామని నిందితులు వెల్లడిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో విచారణ పూర్తి చేసి నిందితులను కోర్టులో హాజరుపర్చడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. నవీన్కుమార్(ఫైల్) -
కంపు.. కంపు!
‘ఈ ఫొటోలో మురికి కూపంగా కనిపిస్తున్న ప్రాంతం మహబూబాబాద్ పట్టణంలోని గోగుల మల్లయ్య బజార్. నాసిరకంగా డ్రెయినేజీ నిర్మాణం చేపట్టడంతో కొద్దిరోజులకు కూలిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో నివాస గృహాల నుంచి వచ్చే మురుగు నీరు ఒకేచోట చేరుతోంది. దీనిని సరిగ్గా తీయకపోవడంతో చెత్తాచెదారంతో నిండి కంపు కొడుతోంది. బాటసారులు అక్కడికి రాగానే ముక్కు మూసుకుని ముందుకు వెళ్తున్నారు.’● ‘ఫొటోలో కనిపిస్తున్న ఇళ్ల మధ్య మురికి నీటి కుంట కేసముద్రం మున్సిపాలిటీ పరిధి అంబేడ్కర్ సెంటర్ సమీపంలోనిది. కాలనీ నుంచి వచ్చే మురుగు నీరు బయటకు వెళ్లేందుకు సరైన కాల్వలు లేవు. దీంతో ఒకే చోటకు చేరి చెరువును తలపించింది. మురికి కూపంలో పందులు, కుక్కలు స్వైర విహారం చేయడం, ఆహార పదార్థాలు, ఇతర చెత్త కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది.’● ‘పక్క ఫొటోలో కనిపిస్తున్న మురికికాల్వ డోర్నకల్ మున్సి పాలిటీలోని బ్యాంకు స్ట్రీట్లోనిది. నెలల తరబడి కాల్వలు తీయకపోవడంతో మురుగునీటితో నిండిపోయాయి. దీనికి తోడు చెత్త, గృహ నిర్మాణాలకు వినియోగించే ఇటుకలు, కంకర కాల్వలో పడి నీరు ముందుకు కదలడం లేదు. కాల్వ ను శుభ్రం చేయకపోవడంతో పక్కనే గడ్డి మొలిచింది. అంతా కుళ్లిపోయి కాల్వ కంపు కొడుతోంది.’ -
వినతులు వెంటనే పరిష్కరించాలి
మహబూబాబాద్: ప్రజావాణి దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్,అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ మాట్లాడుతూ.. పెండింగ్ వినతులను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలన్నారు సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. పరిష్కారం సాధ్యం కాకపోతే కారణాలతో కూడిన నివేదిక అందజేయాలని సూచించారు. ప్రజావాణిలో 148 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ -
రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలి
మహబూబాబాద్ రూరల్: రైల్వే మూడో లైన్ నిర్మాణం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని రైల్వే డీఆర్ఎం భరతేష్ కుమార్ జైన్ను ఎమ్మె ల్యే భూక్య మురళీనాయక్ కోరారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో డీఆర్ఎంను సోమవారం ఎమ్మెల్యే కలిసి పలు సమస్యలను ఆయ న దృష్టికి తీసుకెళ్లారు. మహబూబాబాద్ పట్టణంలోని ఏ క్యాబిన్ రైలు గేట్ మూసివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, దీనికి శాశ్వత పరిష్కారంగా రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు. కేసముద్రం మండలం అన్నారం గ్రామంలో అండర్ బ్రిడ్జి మరమ్మతులు త్వరగా పూర్తిచేయాలని కోరారు. అలాగే మానుకోట రైల్వేస్టేషన్లో జీటీ, ఏపీ, వందేభారత్, రప్తిసాగర్, హింసాగర్, సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు నిలపాలని కోరారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ డీఈ ఉపేందర్ ఉన్నారు.దరఖాస్తుల ఆహ్వానంమహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల నుంచి 2025 విద్యా సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రవీందర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు జూలై 13 తేదీ లోపు http://nationalawards toteachers.education.gov.in వెబ్సైట్ ద్వారా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం రిజిస్ట్రేషన్ చేసుకొని, రెండు పత్రాలను సంబంధిత ఎంఈఓతో, పాటు ఈనెల 14న సాయంత్రం 5.00గంటల లోపు డీఈఓ కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలికురవి: ఉద్యోగుల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అన్నారు. సోమవారం మండలంలోని రాజోలు ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ కోసం డీఈఓ, డిప్యూటీ ఈఓ, ఎంఈఓ, కాంప్లెక్ హెచ్ఎంలను వినియోగించాలని డిమాండ్ చేశారు. అవసరమైనచోట కొన్ని అదనపు పో స్టులను మంజూరు చేయాలని, ప్రత్యేక యంత్రాంగం ద్వారా మాత్రమే పర్యవేక్షణ చేపట్టాలన్నారు. పర్యవేక్షణ కోసం ఉపాధ్యాయులను నియమించడాన్ని ఉపసంహరించుకోవా లన్నారు. యూపీఎస్ల పర్యవేక్షణ కోసం ఎంఈఓతో పాటు అకడమిక్ పోస్టును అదనంగా సృష్టించాలని డిమాండ్ చేశారు. ఉన్నత పాఠశాలల పర్యవేక్షణకు రెవెన్యూ డివిజన్కు ఉప విద్యాధికారిని నియమించాలన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మురళీకృష్ణ, షేక్యాకూబ్, ఎం.ప్రవీణ్కుమార్, రమ్య, అస్మత్పాషా, డీఎస్ శ్రీనివాస్, భవాని, విజయరాణి, దయతబిత, సుభాషిణి తదిత రులు పాల్గొన్నారు. -
ఉద్యోగ విరమణ సహజం : కలెక్టర్
మహబూబాబాద్: ప్రతీ ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ సహజమని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వీర బ్రహ్మచారి పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అంకితభావంతో విధులు నిర్వర్తించిన అధికారులను ప్రజలు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ గణేశ్, డీఎస్పీ తిరుపతి రావు, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, కలెక్టరేట్ ఏఓ పవన్కుమార్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
చెత్త తీయట్లేదు..
మా బజారులో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని మున్సిపాలిటీ సిబ్బంది ట్రాక్టర్లలో తీసుకుపోవట్లేదు. ఇప్పటి వరకు మా బజారుకు ట్రాక్టర్ రాలేదు. మున్సిపాలిటీ అయ్యాక అసలు అధికారులు ఎవరో అర్థం కావడంలేదు. సైడ్కాల్వలను శుభ్రం చేయకపోవడంవల్ల దుర్వాసనతోపాటు, దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. రాత్రిళ్లు కంటిమీద కునుకులేకుండా పోతుంది. ఇప్పటికై నా చెత్తాచెదారాన్ని తీసుకెళ్లడంతో పాటు సైడ్ కాల్వలను శుభ్రపరచాలి. వీధి లైట్లు ఏర్పాటు చేయాలి. – మేకల వెంకన్న, కేసముద్రం విలేజ్ -
గుంజేడు ముసలమ్మను దర్శించుకున్న అదనపు కలెక్టర్
కొత్తగూడ: మండలంలోని గుంజేడు ముసలమ్మ తల్లిని అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవారికి అర్చన చేశారు. ఆదివాసీ పూజారులు వేద మంత్రాలతో ఆయనకు ఆశీర్వచనం ఇచ్చారు. మర్రిగూడెంలో.. గార్ల: మండలంలోని మర్రిగూడెం వేట వేంకటేశ్వరస్వామిని అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకుడు రామాచార్యులు ఆయనను గర్భగుడిలోకి ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వీరబ్రహ్మచారిని పంచాయతీ కార్యదర్శులు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు అజ్మీరా కిషన్, కిశోర్, చక్రధర్, మహేశ్, వెంకటేశ్వర్లు, మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు. వీరన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు కురవి: మండల కేంద్రంలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆలయంలో ఎటు చూసిన భక్తుల సందడి నెలకొంది. స్వామి, అమ్మవారిని దర్శించుకునేందుకు బారులుదీరారు. మొక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విద్యుత్ తీగలు సరిచేశారు కేసముద్రం : మున్సిపలిటీ పరిధి జమలాపురం సమీపంలో వేలాడుతున్న విద్యుత్ తీగలను ఆ శాఖ సిబ్బంది ఆదివారం సరిచేశారు. ఈ విషయంపై ఈనెల 28న ‘సాక్షి’ దినపత్రికలో ‘చేతులు లేపితే అంతే’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. స్పందించిన విద్యుత్ శాఖ ఏఈ రాజు విద్యుత్ సిబ్బందితో తీగలను ఎలాంటి ప్రమాదం లేకుండా సరి చేయించారు. రైతులు సాక్షి దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు. వైభవంగా శాకంబరీ మహోత్సవాలు హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయంలో వైభవంగా కొనసాగుతున్న శాకంబరీ నవరాత్ర మహోత్సవాలు ఆదివారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు ఉదయం అమ్మవారికి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, క్షీరాన్న నివేదన నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని కురుకుల్లా క్రమంలో, షోడశీక్రమాన్ని అనుసరించి భోగభేరాన్ని భేరుండాక్రమంలో అలంకరించి నవరాత్ర విశేషపూజలు నిర్వహించారు. -
ఇంటర్ లింక్తో నిరంతర విద్యుత్
హన్మకొండ : విద్యుత్ అవసరాలు రోజురోజుకూ పె రుగుతున్నాయి. ఈ క్రమంలో అంతరాయాలతో వినియోగదారులు ఇబ్బందులు పడొద్దనే లక్ష్యంతో టీజీ ఎన్పీడీసీఎల్ పెద్ద ఎత్తున ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్లు చేపట్టింది. ఇందులో భాగంగా నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ఇంటర్ లింక్ లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారా వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్ సరఫరా జరుగుతుంది. దీని కోసం ప్రతీ సబ్ స్టేషన్ మధ్య ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్ నిర్మించింది. తదనుగుణంగా 11 కేవీ ఇంటర్ లింకింగ్ లైన్ల వ్య వస్థపై కూడా దృష్టి సారించింది. అవసరమైన లైన్ల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించింది. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాలతో ఒక లైన్లో లేదా సబ్ స్టేషన్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన లేదా నిలిపివేయాల్సిన ఆవశ్యకత ఏర్పడితే ఆయా లైన్ లేదా సబ్ స్టేషన్ పరిధిలోగల విద్యుత్ 33 కేవీ ఇంటర్ లింక్ లైన్ వ్యవస్థ ఒక 33/11కేవీ సబ్ స్టేషన్ నుంచి మరో 33/11 కేవీ సబ్ స్టేషన్కు, అదే విధంగా 33 కేవీ లైన్ నుంచి మరో 33 ౖకేవీ లైన్కు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందిస్తారు. దీంతో మరమ్మతులు చేసిన సమయంలో, మరే ఇతర కారణాల వల్ల ఒక లైన్లో విద్యుత్ సరఫరా చేస్తే ఆ ప్రాంత విద్యుత్ వినియోగదారులకు అంతరాయాలు లేకుండా ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తారు. ఆరు ఇంటర్ లింకింగ్ లైన్ల నిర్మాణం పూర్తి.. వరంగల్ సర్కిల్ పరిధిలోని 33/11 కేవీ సబ్ స్టేషన్లు, 33 కేవీకి చెందిన 16 లైన్లలో ఇంటర్ లింకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 6 ఇంటర్ లింకింగ్ లైన్ల నిర్మాణం పూర్తి చేశారు. పది 33/11కేవీ సబ్ స్టేషన్లలో పనులు కొనసాగుతున్నాయి. హనుమకొండ సర్కిల్ పరిధిలోని డైబ్బె నాలుగు 33/11 కేవీ సబ్ స్టేషన్లో అయిదు 33 కేవీ లైన్లలో ఇంటర్ లింకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 72 సబ్ స్టేషన్లలో పనులు పూర్తయ్యాయి. మరో రెండు 33/11 కేవీ సబ్ స్టేషన్లలో పనులు కొనసాగుతున్నాయి. మూడు 33 కేవీ లైన్లులలో ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్ల నిర్మాణం జరుగుతోంది. వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన కరెంట్ ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసిన టీజీఎన్పీడీసీఎల్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు .. వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన అంతరాయాలు లేని విద్యుత్ సరఫరాకు ప్రత్యేక కార్యాచరణ తో ముందుకెళ్తున్నాం. కొన్ని లైన్ల నిర్మాణానికి రైల్వే క్రాసింగ్ల వద్ద రైల్వే అధికారుల అనుమతి రావాల్సి ఉంది. ఈ మేరకు రైల్వే అధికారులను అనుమతి కోరాం. – పి.మధుసూదన్ రావు, ఎస్ఈ, హనుమకొండ వినియోగదారులకు నిరంతర విద్యుత్ వినియోగదారులకు నిరంతర విద్యుత్ అందించేందుకు అన్ని చర్యలు చేపట్టాం. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి ప్రత్యామ్నాయ లైన్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. వినియోగదారులకు అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. – కె.గౌతం రెడ్డి, ఎస్ఈ, వరంగల్ -
దౌర్జన్యంగా విద్యుత్ స్తంభాల ఏర్పాటు
మరిపెడ రూరల్: మామిడితోట మధ్యలో ఓ వ్యక్తి రాత్రికిరాత్రే దౌర్జన్యంగా విద్యుత్ స్తంభాలు, తీగలు ఏర్పాటు చేశాడు. ఇది తెలిసిన తోట యజమాని పు రుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డ్డాడు. ఈ ఘటన మ రిపెడ మండలం రాంపురంలో ఇటీవల చోటు చేసుకోగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాధితుడి కుమారుడు రాజాకుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మాడుగుల ఉపేందర్కు ఐదున్న ర ఎకరాల్లో మామిడి తోట ఉంది. ఈ క్రమంలో తోట పక్కన గెట్టు ఉన్న అదే గ్రామానికి చెందిన చింతపల్లి మల్లయ్య మామిడితోట మధ్య నుంచి తన బోరు మోటారుకు విద్యుత్ కోసం ఈ నెల 19వ తేదీన అర్ధరాత్రి స్తంభాలు, తీగలు ఏర్పాటు చేశాడు. ఈ విషయం తెలిసి తోట వద్దకు వెళ్లిన ఉపేందర్ మనస్తాపానికి గురై అక్కడే గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు సూర్యాపేటలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, చింతపల్లి మల్లయ్య .. విద్యుత్ అధికారుల అనుమతులు లేకుండా, తమకు తెలియకుండా మామిడి తోట మధ్య దౌర్జన్యంగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశాడని ఉపేందర్ కుమారుడు రాజాకుమార్ తెలిపాడు. మా నాన్న ఉపేందర్ ఆత్మహత్యాయత్నానికి కారణమైన మల్లయ్యపై చర్యలు తీసుకుకోవాలని కోరాడు. మల్లయ్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నెల 19న తానే స్వయంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసులో ఎలాంటి పురోగతి లేదని ఆరోపించాడు. మనస్తాపంతో పురుగుల మందు తాగిన మామిడితోట యజమాని మండలంలోని రాంపురం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి.. మరిపెడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టింపు కరువు -
చి(చె)త్త శుద్ధి ఏది..
సోమవారం శ్రీ 30 శ్రీ జూన్ శ్రీ 2025– 8లోuసాక్షి, మహబూబాబాద్: వానాకాలం.. అధికంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. డెంగీ, చికెన్ గున్యా, టైపాయిడ్, మలేరియా, ఫైలేరియా వంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. కాగా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టడం, డ్రెయినేజీల్లో చెత్త సేకరించి, బ్లీచింగ్ చల్లడం వంటి చర్యల ద్వారా దోమల వృద్ధిని అరికట్టి, సీజనల్ వ్యాధుల తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుంది. అయితే జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి.. డ్రెయినేజీలు దుర్వాసనను వెదజల్లుతున్నాయి. దీంతో పలువురు సీజనల్ వ్యాధు ల బారినపడి ఆస్పత్రుల బాటపడుతున్నారు. ఆదివారం ‘సాక్షి’ పరిశీలనలో పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి.‘ఈ ఫొటోలో కనిపిస్తున్నది మహబూబాబాద్ కొత్త బస్టాండ్ ఏరియా వివేకానంద విగ్రహానికి సమీపంలోని గోపాల్ రెడ్డి కాంప్లెక్స్ ప్రాంతంలో పేరుకుపోయిన చెత్త. ఈ ప్రాంతంలో నివాస గృహాల నుంచి రోజువారి చెత్త సేకరించడం లేదు. దీంతో ఇళ్లలోని చెత్తను అందరు ఒకేచోట పోస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో చెత్త కుప్ప తయారైంది. తడి, పొడి చెత్త కలిసి ఉండడంతో చెత్త కుళ్లిపోయి దుర్వాస వస్తోందని స్థానికులు చెబుతున్నారు.’న్యూస్రీల్ మూడు రోజులకోసారి సేకరణ పందులు, కుక్కలతో పరేషాన్ వానాకాలం వస్తే అంతా దుర్వాసన సిబ్బంది కొరత, మరమ్మతుల్లోవాహనాలు -
బురద అంటకుండానే వరిసాగు..
దుగ్గొండి : వరి సాగులో ప్రస్తుతం పెట్టుబడి పెరగడంతోపాటు కూలీల కొరత రైతులను వేధిస్తోంది. పంట చేతికొచ్చాక గిట్టుబాటు ధర లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి తరుణంలో అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ నీరు అవసరం లేకుండానే బురద అంటకుండా అధిక దిగుబడి సాధించేలా వరి సాగు విధానాన్ని శాస్త్రవేత్తలు అందుబాటులోకి తీసుకొచ్చారు. దమ్ము చేయకుండా నేరుగా దుక్కిలోనే వరి విత్తనాలు వేసి సాగు చేసే విధానాన్ని వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త నాగభూషణం వివరించారు. దుక్కి తయారీ.. పొలాన్ని లేదా మెట్ట భూమిని కల్టివేటర్తో మొదట రెండు సార్లు దున్నిన అనంతరం రోటోవేటర్తో చ దును చేయాలి. తదనంతరం సీడ్ డ్రిల్లర్, ఫెర్టికమ్ సీడ్ డ్రిల్లర్ యంత్రంతో విత్తనాలు వేయాలి. అనువైన రకాలు.. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి దీర్ఘకాలిక రకాలైతే సాంబమశూర, సిద్ధి, మధ్య కాలిక రకాలైతే జగిత్యా ల వరి, పోలాస ప్రభ, వరంగల్ సన్నాలు, వరంగల్ సాంబ, విజేత, భద్రకాళి, స్వల్ప కాలిక రకాలైతే తెలంగాణ సోన, కూనారం సన్నాలు అనుకూలం. నాటే సమయం.. దీర్ఘకాలిక రకాలైతే జూన్ 10 నుంచి 30 వరకు, మధ్యకాలికం జూన్ 30 నుంచి జూలై 10 వరకు, స్వల్పకాలికం జూలై 10 నుంచి జూలై 30 వరకు విత్తుకోవచ్చు.. విత్తన మోతాదు.. సన్నగింజ రకాలైతే ఎకరాకు 8 నుంచి 10 కిలోలు, దొడ్డు గింజ రకాలైతే 10 నుంచి 12 కిలోలు సరిపోతాయి. సాలుకు సాలుకు మధ్య 25 సెంటీమీటర్ల, మొక్కకు మొక్కకు మధ్య 6 నుంచి 8 సెంటీమీటర్ల దూరం ఉండాలి.. విత్తనాలను ట్రాక్టర్ సాయంతో పనిచేసే సీడ్ డ్రిల్లర్ లేదా ఫర్టికమ్ సీడ్ యంత్రం సాయంతో విత్తుకోవాలి. ఎరువుల యాజమాన్యం.. ఎకరాకు 48 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 16 కిలోల పోటాష్ నిచ్చే ఎరువులు వేయాలి. మొదట 20 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్ను ఆఖరి దుక్కిలో వేయాలి. నత్రజని ఎరువును మూడు సమపాళ్లుగా విభజించి విత్తిన 15 నుంచి 20 రోజులకు, పిలక, అంకురం దశల్లో వాడుకోవాలి. చివరి దశలో వేసే నత్రజనితో పాటు 8 కిలోల పోటాష్ను తప్పనిసరిగా వేయాలి. కలుపు నివారణ.. వరిలో 45 రోజుల వరకు ఎలాంటి కలుపు లేకుండా చూసుకోవాలి. కలుపుపై అశ్రద్ధ చేస్తే దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉంది. విత్తిన వెంటనే తేమ ఉన్న సమయంలో 48 గంటలలోపు ఎకరాకు లీటర్ పెండిమిథాలిన్ను 200 లీటర్ల నీటిలో కలిపి భూమి తడిచేలా పిచికారీ చేయాలి. 20 రోజుల వయసులో ఎకరాకు బిస్పైరిబాక్ సోడియం 120 మిల్లీలీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పంటపై పిచికారీ చేయాలి. లేదా వీడర్ సాయంతోనూ కలుపును నివారించుకోవచ్చు. ఇనుపదాతు లోపం.. ఎద పద్ధతిలో సాగుచేసే వరిలో ఇనుపదాతు లోపం ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లీటర్ నీటికి 5 గ్రాముల అన్నబేది, 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి పంటపై 2–3 సార్లు పిచికారీ చేయాలి. చీడపీడల ప్రభావం పెద్దగా ఉండదు. ఉన్నా మామూలు వరిపై పద్ధతులనే పాటించాలి. నీటి యాజమాన్యం.. తొలకరి వర్షాలు పడగానే వాటిని ఉపయోగించుకుని ఎద పద్ధతి వరిసాగు చేసుకోవడం లాభాదా యకం. తొలకరి వర్షాలకు వరి విత్తనాలు విత్తితే జూ న్, జూలై, ఆగస్టు మాసాల వరకు వర్షాలే సరిపోతా యి. ఆ తర్వాత 15 రోజుల వరకు వర్షాలు లేకుంటే ఆరుతండి పంటకు మాదిరిగా నీటి తడులివ్వాలి. పూత దశనుంచి గింజ గట్టిపడేవరకు పొలంలో అంగుళం మేర నీరు ఉండేలా చూసుకోవాలి.. ఖర్చులు.. ఆదాయం.. సాధారణ పద్ధతిలో వరి సాగుకు నారుమడి, విత్త నం, దమ్ము చేయడం, చదునుచేయడం, కూలీ లు, అధిక నీరు ఇలా చాలా పెట్టుబడి అవుతుంది. ఎద పద్ధతిలో అయితే ఎకరాకు రూ. 10 వేల పెట్టుబడి తగ్గుతుంది. దిగుబడి సాధారణం కంటే ఎక్కువే వస్తున్న నేపథ్యంలో ఎకరాకు రూ. 15 వేల అదనపు ఆదాయం సాధ్యమవుతుంది. దిగుబడి .. వర్షాకాలంలో ఎకరాకు 35 నుంచి 40 బస్తాలకు తగ్గకుండా దిగుబడి వస్తుంది. సాధారణ పదధతిలోని వరికంటే 3 నుంచి 5 బస్తాల అధిక దిగుబడి వస్తుంది. తక్కువ పెట్టుబడి.. ఎక్కువ దిగుబడి -
మానుకోటను బంగారుకోటగా తీర్చిదిద్దుతా
మహబూబాబాద్ అర్బన్: మానుకోట మున్సిపాలిటీని బంగారు కోటగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ అన్నారు. మానుకోట మున్సిపాలిటీ పరిధి ఈదులపూసపల్లి ఒకటో వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో మానుకోట మున్సిపాలిటీ పరిధి విలీన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి, సీసీ రోడ్లు వేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులతో మానుకోటను అభివృద్ధి పథంలో ముందు ఉంచుతామన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వెన్నం లక్ష్మారెడ్డి, నాయకులు గోవర్ధన్ రెడ్డి, బావ్ సింగ్, వెంకన్న, వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ -
డ్రైవర్ నిర్లక్ష్యానికి ఒకరి బలి..
● ట్రాలీ ఆటో ఢీకొని యువకుడు దుర్మరణం ● అయోధ్య క్రాస్ వద్ద ఘటన మహబూబాబాద్ రూరల్ : ఓ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. వాహనం నిర్లక్ష్యంగా నడుపుతున్న క్రమంలో వెనుక నుంచి బైక్పై వచ్చిన ఓ యువకుడు ఆ ఆటోను ఢీకొని దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఆదివారం మహబూబాబాద్ మండలం అయోధ్య క్రాస్ వద్ద చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై వి.దీపిక కథనం ప్రకారం.. మహబూబాబాద్ మండలం ముడుపుగల్కు చెందిన సుంద రవి (లేట్), రమ దంపతుల పెద్ద కుమారుడు అరుణ్ అలియాస్ టాకిల్ (20) జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం తన ద్విచక్రవాహనంపై ఆస్పత్రికి వస్తున్నాడు. అంతకంటే ముందు అయోధ్య గ్రామానికి చెందిన కన్నం విజయ్ తన టాటా ఏస్ ట్రాలీ ఆటోలో ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఆటో అయోధ్య క్రాస్ వద్దకు చేరుకోగానే ఇండికేటర్ వేయకుండా వాహనాన్ని అలాగే నడిపాడు. అంతలోనే ఆ వాహనం వెనకే వస్తున్న ద్విచక్రవాహనదారుడు అరుణ్ ఒక్కసారిగా ఆటోను వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అరుణ్ ద్విచక్ర వాహనంపైనుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ పోలీసులు ఘటనా స్థలిని సందర్శించి ఆటోను అదుపులోకి తీసుకుని అరుణ్ మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పోస్టుమార్టం గదికి తరలించారు. మృతుడి బాబాయ్ సంద రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై దీపిక తెలిపారు. ఇంటి నుంచి బయలుదేరిన పది నిమిషాల్లోనే.. అరుణ్ ఆస్పత్రికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన పది నిమిషాలలోపే ఆటోను ఢీకొని దుర్మరణం చెందాడు. దీనిపై గ్రామస్తులు బోరున విలపించారు. అరుణ్ అప్పటిదాకా తమ ముందే కనబడి అంతలోనే కానరానిలోకాలకు వెళ్లిపోవడంతో ముడుపుగల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. రెండేళ్ల క్రితం తండ్రి రవి అనా రోగ్యంతో మృతిచెందగా కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న పెద్ద కుమారుడు అరుణ్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో తల్లి రమ రోదించిన తీరు అందరి హృదయాలను కలచివేసింది. -
శిథిల భవనం!
మహబూబాబాద్: జిల్లాలో పలు తహసీల్దార్ కార్యాలయాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి ఉంది. దీంతో అధికారులు, సిబ్బంది బిక్కుబిక్కుంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా మానుకోట తహసీల్దార్ కార్యాలయ భవనం పరిస్థితి మరి దారుణంగా ఉంది. పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని స్లాబ్ పెచ్చులు ఊడిపడుతున్నాయి. నూతన భవన నిర్మాణాలు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. నాలుగు కార్యాలయాలు శిథిలావస్థ భవనాల్లో.. జిల్లాలో 18మండలాలు ఉన్నాయి. కాగా 482 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 6,35,872 మంది జనాభా, 5,61,960 మంది ఓటర్లు, 1,69,556 గృహాలు ఉన్నాయి. కాగా మానుకోట, డోర్నకల్ తహసీల్దార్ కార్యాలయాల భవనాలు పూర్తిగా శిథిలావస్థలో ఉండగా.. కురవి, తొర్రూరు కార్యాలయాల భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కాగా పెద్దవంగర, దంతాలపల్లి తహసీల్దార్ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అలాగే కొత్తగూడ కార్యాలయం ఐటీడీఏకు చెందిన భవనంలో.. గంగారం ఇతర శాఖ భవనంలో, చిన్నగూడూరు కార్యాలయం ఎస్సీ హాస్టల్ భవనంలో కొనసాగుతోంది. ఇటీవల ఏర్పడిన ఇనుగుర్తి మండల తహసీల్దార్ కార్యాలయం గ్రామ పంచాయతీ భవనంలో, సీరోలు కార్యాలయం పాత పాఠశాల భవనంలో నడుస్తోంది. ఏడు కార్యాలయాలకే పక్కా భవనాలు.. జిల్లాలోని నెల్లికుదురు, గూడూరు, నర్సింహులపేట, బయ్యారం, గార్ల, కేసముద్రం, మరిపెడ మండలాల తహసీల్దార్ కార్యాలయాలు మాతమ్రే పక్కా భవనాల్లో కొనసాగుతున్నాయి. ఆయా భవనాల్లో అన్ని సౌకార్యాలు ఉన్నాయి. నిజాంకాలం నాటి భవనంలో మానుకోట కార్యాలయం.. మానుకోట తహసీల్దార్ కార్యాలయం నిజాంకాలం నాటి భవనంలో కొనసాగుతోంది. ఈ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. భవనం స్లాబ్ పెచ్చులు ఊడిపడుతున్నాయి. వెనుక భాగంలో ఉన్న పలు గదులు కూలిపోయాయి. వర్షాకాలం నేపథ్యంలో భవనం ఎప్పుడు కూలుతుందోనని అధికారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. అందులో కూడా గదుల కొరతతో సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. ప్రతిపాదనలకే పరిమితం.. నూతన భవనాల కోసం ఏటా అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నారు. కానీ నిధులు మంజూరు కావడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం శిథిలావస్థలో ఉన్న భవనాల కోసం వెంటనే నిధులు మంజూరు చేయాలని ఆయా కార్యాలయాల సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు. కార్యాలయాలకు వచ్చే ప్రజలు కూడా ఆ భవనాలను చూసి భయపడుతున్నారు. శిథిలావస్థలో పలు తహసీల్దార్ కార్యాలయాల భవనాలు ఇబ్బందులు పడుతున్న అధికారులు, సిబ్బంది ప్రతిపాదనలకే పరిమితమైన నూతన బిల్డింగ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్న పలు కార్యాలయాలు -
ఫోన్ ట్యాంపరింగ్లో దయాకర్రావు
హసన్పర్తి: ఫోన్ ట్యాంపరింగ్లో మాజీ మంత్రి దయాకర్రావు ప్రమేయం ఉందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్.నాగరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ వరంగల్ ఒకటో డివిజన్ పరిధిలో రూ.1.78కోట్లతో నిర్మిస్తున్న సీసీరోడ్ల పనులకు నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి ఆదివారం శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పర్వతగిరి కేంద్రంగా ఫోన్ ట్యాంపరింగ్ జరిగిందని, ఇందుకు స్పష్టమైన ఆధారాలు లభ్యమైనట్లు చెప్పారు. ఫోన్ ట్యాంపరింగ్లో దయాకర్రావు జైలుకు వెళ్లడం ఖాయమని, ఆయనకు చిన్న మెదడు చిట్లి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడన్నారు. వర్ధన్నపేట కేంద్రంగా వంద ఎకరాల్లో యంగ్ఇండియా ఇంటిగ్రేడెడ్ స్కూల్తో పాటు సబ్జైలు, మున్సిఫ్ కోర్టు, స్టేడియం నిర్మించడానికి ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. వర్ధన్నపేట ఎమ్మెల్యేగా మూడు పర్యాయాలు కొనసాగిన దయాకర్రావు అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాదిన్న కాలంలోనే అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని అన్నారు. సమావేశంలో కార్పొరేటర్ అరుణకుమారి, మాజీ సర్పంచ్ దేవరకొండ అనిల్కుమార్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వెంకటేశ్వర్లు, మాజీ వార్డు సభ్యుడు గడ్డం శివరాంప్రసాద్, ఎన్ఎస్యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు వీసం సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయన జైలుకు వెళ్లడం ఖాయం వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు -
ప్రభుత్వ బడులను మూసివేయొద్దు
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ బడుల మూసివేత విధానాలను మానుకోవాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బలాష్టి రమేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. గురుకుల పాఠశాలల కారణంగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంటే.. కొత్త పేర్లతో మరిన్ని గురుకులాలను నెలకొల్పి ప్రభుత్వ బడులను పూర్తిగా మూసివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఒకవైపు ప్రైవేట్ స్కూల్స్ దాడి, మరోవైపు సొసైటీ గురుకులాల దాడిని తట్టుకొని విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో నమోదు చేసుకోవడానికి ఉపాధ్యాయులు కష్టపడుతుంటే.. వారి మీద ప్రభుత్వం బురద జల్లే పనులు చేస్తోందని ఆరోపించారు. టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పులిచింతల విష్ణువర్ధన్రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను మంజూరు చేయాడానికి పది శాతం ముడుపులు చెల్లించాల్సి వస్తుందన్నారు. సమావేశంలో రాష్ట్ర కౌన్సిలర్లు శ్రీశైలం, ఐలయ్య జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాస్, వెంకట్రాంనర్సయ్య, ఉపేందర్, సాయిబాబు, ఉపేందర్, రవీందర్, కిషన్, రవీందర్రెడ్డి, జనార్దన్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
భూ వివాదంతో రైతు ఆత్మహత్య
గార్ల: భూ వివాదంతో మనస్తాపం చెందిన ఓ రైతు.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆది వారం పెద్దకిష్టాపురంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గంగావత్ మోహన్ (38) అదే గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద 3 ఏళ్ల క్రితం భూమి కొనుగోలు చే శాడు. ఈ భూమిని పట్టా చేసుకునేందుకు మోహన్ పలుమార్లు విక్రయించిన రైతు వద్దకు వెళ్లాడు. అయితే ఆ వ్యక్తి పట్టా చేయడానికి రెవెన్యూ కార్యాలయానికి రావడం లేదు. ఈ సమస్య 3 ఏళ్లుగా కొ నసాగుతోంది. దీంతో భూమి తన పేరుపై ఇంకా ప ట్టా కావడం లేదనే మనస్తాపంతో మోహన్ శనివా రం రాత్రి తన పొలం వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన స్థానికులు కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రుడిని మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రియాజ్పాషా తెలిపారు. -
బైక్పైనుంచి పడిన మహిళ..
● చికిత్స పొందుతూ మృతి చిట్యాల: ద్విచక్రవాహనంపై నుంచి పడిన ప్రమాదంలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన జయశంకర్ భూ పాలపల్లి జిల్లా చిట్యాలలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన చింతకింది రాజమణి (57) పని నిమిత్తం బైక్పై ఈనెల 27న రేగొండ మండలం కాకర్లపల్లెకు వెళ్తోంది. ఈ క్రమంలో తిర్మలాపూర్లో పంది అడ్డు వచ్చింది. దీంతో కింద పడగా తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన స్థానిక సివిల్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఆదివారం హైదరాబాద్కు తరలిస్తుండగా మారమ్గధ్యలో మృతి చెందింది. మృతురాలి కుమారుడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై శ్రావన్కుమార్ తెలిపారు. మృతురాలికి భర్త రవీందర్, కుమారుడు రామకృష్ణ ఉన్నారు. -
‘కొండా’కు దమ్ముంటే కొత్త పార్టీ పెట్టాలి
హన్మకొండ చౌరస్తా: గత ఎన్నికల్లో పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలను తామే గెలిపించామని పదేపదే చెబుతున్న కొండా మురళీకి దమ్ముంటే కొత్త పార్టీ పెట్టాలని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డితో స్టేషన్ఘన్పూర్ , వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్.నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, గండ్ర సత్యనారాయణ, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్రెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ సమావేశం అయ్యారు. అనంతరం స్వర్ణ, నాగరాజు, వెంకట్రామ్రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ సారయ్య మీడియాతో మాట్లాడారు. గత 38 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని బతికించామని చెబుతున్న కొండా మురళికి రాజకీయ జన్మనిచ్చింది తెలుగుదేశం పార్టీ అన్నారు. పార్టీలు మారలేదంటున్న కొండా కుటుంబం అన్నీ పార్టీలు మారారని.. కాంగ్రెస్ పార్టీకి చేసిన పని ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. షోకాజ్ నోటీసు ఇస్తే హైదరాబాద్కు వెళ్లిన మురళి తననెవరూ పిలవలేదంటూనే క్రమశిక్షణ కమిటీకి తప్పుడు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ నాడు ప్రాణభయంతో రామసహాయం సురేందర్రెడ్డి వద్దకు వెళ్లిన కొండా మురళికి డీజీపీతో చెప్పి గన్మెన్లను ఇప్పించి ప్రాణభిక్ష పెట్టారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి గురించి మురళి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని, ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడడం సరికాదని హితవుపలికారు. జూలై 5 వరకు అధిష్టానం సమయం ఇచ్చిందని.. అప్పటి వరకు ఎదురుచూస్తామని అన్నారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ మా మీద కొండా మురళి సవారీ చేయడం సరికాదని, తన గెలుపునకు ఎలాంటి సహాయం చేయలేదన్నారు. కొందరి కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించి వేధించారని, అలాంటి పనులు చేయొద్దని కోరారు. ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, శ్రీహరి మాట్లాడుతూ.. వచ్చే నెల 4న ఏఐసీసీ చీఫ్ ఖర్గే రాక నేపథ్యంలో జనసమీకరణ అంశంతో పాటు, వరంగల్ జిల్లా అభివృద్ధి, నిధుల సమీకరణపై సీఎం రేవంత్రెడ్డితో సమీక్ష నిర్వహించేందుకు ఆయన అపాయింట్మెంట్పై సుదీర్ఘంగా చర్చించామని చెప్పారు. కొండా మురళి వ్యాఖ్యలు, క్రమశిక్షణ కమిటీకి అందించిన నివేదికపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అధిష్టానం ఇచ్చిన సమయంలో సరైన నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మురళికి సురేందర్రెడ్డి ప్రాణభిక్ష పెట్టాడు వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ -
భర్త జ్ఞాపకాలతో..
మహబూబాబాద్ రూరల్: కట్టుకున్న భర్తను ప్రాణంగా భావించి ఆయన మృతి అనంతరం పాలరాతితో విగ్రహం చేయించి ఓ భార్య ఆయనకు గుడి కట్టించింది. మహబూబాబాద్ మండలం సోమ్లా తండా గ్రామానికి చెందిన బానోత్ కల్యాణి ఎంపీటీసీగా పనిచేసింది. హరిబాబుతో ఆమెకు 1996లో వివాహం కాగా.. 2021లో హరిబాబు అనా రోగ్యంతో మృతిచెందాడు. ఆయనతోపాటే తాను చనిపోదామని కల్యాణి ప్రయత్నించినా బంధువులు ధైర్యం చెప్పడంతో హరిబాబు జ్ఞాపకాలతో జీవిస్తోంది. ఈక్రమంలో రూ.5.30 లక్షలతో పండుగ వాతావరణంలో గతేడాది ఏప్రిల్ 23న గుడి ప్రారంభించింది. ప్రతీ శనివారం ఆయనకు పూజలు చేస్తోంది. -
పర్యాటకులకు ఇబ్బంది కలగొద్దు
●● ఎఫ్డీఓ ద్వాలియా వాజేడు: బొగత జలపాతం వద్ద పర్యాటకులకు ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలని వెంకటాపురం(కె) ఎఫ్డీఓ ద్వాలియా సిబ్బందిని కోరారు. శనివారం మండల పరిధిలోని చెరుకూరు వద్ద ప్లాంటేషన్లో చేపట్టిన పనులను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం బొగత జలపాతానికి వచ్చిన ద్వాలియా అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. జలపాతానికి వచ్చే పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలన్నారు. దుసపాటి లొద్ది, మాసన్ లొద్ది, గుడం జలపాతాలకు పర్యాటకులను వెళ్లకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఎఫ్ఎస్ఓ నారాయణ, సిబ్బంది ఉన్నారు. -
ఎల్లప్పుడూ కళ్ల ముందే ఉండాలని..
డోర్నకల్: కంటికి రెప్పలా చూసుకునే భర్త, అమ్మా అమ్మా అంటూ రోజుకు వెయ్యిసార్లు పలకరించే కుమారుడు అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో దిక్కు తోచని స్థితికి చేరుకున్న ఓ మహిళ తన భర్త, కుమారుడిని విగ్రహాల రూపంలో చూసుకుంటూ వారి జ్ఞాపకాలను నెమరువేసుకుంటుంది. డోర్నకల్ మండలం దుబ్బతండాకు చెందిన అజ్మీర బాల్యా, భారతి దంపతులకు సాయికుమార్ ఏకై క కుమారుడు. భారతి దుబ్బతండా సర్పంచ్గా పని చేసి భర్త బాల్యా సహకారంతో గ్రామాభివృద్ధిలో తమ వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించింది. బాల్యా, భారతి వ్యవసాయం చేస్తుండగా కుమారుడు ఖమ్మంలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. జూన్ 5న కుమారుడు సాయికుమార్ను కళాశాలకు పంపేందుకు బాల్యా ద్విచక్రవాహనంపై ఖమ్మం బయల్దేరగా ఖమ్మంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొని బాల్యా, సాయికుమార్ మృతి చెందారు. వారిని మర్చిపోలేని భారతి.. బాల్యా, సాయికుమార్ విగ్రహాలను గ్రామ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసింది. జూన్ 15న వారి సంతాప సభలో బాల్యా సాయికుమార్ విగ్రహాలను ఆవిష్కరించారు. -
ఆర్టీసీ ప్రత్యేక టూర్ బస్సు ప్రారంభం
నెహ్రూసెంటర్: టీజీఎస్ఆర్టీసీ ప్రవేశపెట్టిన ప్రత్యేక టూర్ ప్యాకేజీలో భాగంగా మహబూబాబాద్ డిపో నుంచి మొదటి యాత్ర ప్రత్యేక బస్సులను శుక్రవారం రాత్రి 11 గంటలకు డిపో మేనేజర్ ఎం.శివప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 40 సీట్ల డీలక్స్ బస్సు మహబూబాబాద్ నుంచి శ్రీశైలం బయల్దేరిందని తెలిపారు. జూలై 6వ తేదీన పంచరామాలు (అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట)కు యాత్ర బస్సు ఉందని, ఒక్కొక్కరికి రూ.1,700 చార్జీలు చెల్లించి బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ప్రజలు, యాత్రికులు ఆర్టీసీ యాత్ర ప్యాకేజీలను వినియోగించుకోవాలని తెలిపారు. బస్సుల బుకింగ్, యాత్ర సంబంధిత వివరాలకు నబి ఫోన్ నంబర్ 99482 14022 ద్వారా సంప్రదించాలని సూచించారు. దరఖాస్తుల ఆహ్వానంమహబూబాబాద్ అర్బన్: జిల్లాలో 2024–25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల, కళాశాలలో చదువుతున్న పోస్ట్మెట్రిక్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి నరసింహస్వామి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి నుంచి ఫీజీ వరకు చదువుతున్న విద్యార్థులు WWW.telaganaepass.cgg.gov.in వెబ్సైట్లో ఈ నెల 30 వరకు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలకు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. బాలసదన్ సందర్శనమహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని బాలసదన్ (బాలికల)ను శనివారం సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ శాలిని షాకెల్లి సందర్శించారు. బాలసదన్లోని వంట గది ఇతర గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లలు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. సిబ్బంది అందుబాలో ఉండాలని ఆదేశించారు. అభివృద్ధికి సహకరించాలి● ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ మహబూబాబాద్: అభివృద్ధి పనులకు ప్రజలు అన్నివిధాలా సహకరించాలని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ అన్నారు. మానుకోట మున్సిపల్ పరిధిలోని అస్తినాపురం కాలనీ, గోపాలపురం కాలనీలను శనివారం ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా మురళీనాయక్ మాట్లాడుతూ.. 11వ వార్డుకు రూ.50 లక్షలు వెచ్చించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. కుల్లా, నిత్యక్లిన్నాక్రమాల్లో శ్రీభద్రకాళి హన్మకొండ కల్చ రల్: శ్రీభద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు శనివారం అమ్మవారిని కుల్లాక్రమంలో, నిత్యక్లిన్నాక్రమంలో పూజలు నిర్వహించారు. ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయంనుంచి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, చతుఃస్థానార్చన నిర్వహించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరానికి కుల్లాగా పూజలు నిర్వహించి, వారాహి అమ్మవారిగా అలంకరించారు. షోడశీక్రమాన్ని అనుసరించి స్నపనమందిరంలోని భోగభేరాన్ని నిత్యక్లిన్నాగా అలంకరించి పూజలు జరిపారు. ఈఓ శేషుభారతి పర్యవేక్షించారు. -
బడికిపోయినా బతికేటోడు..
నెల్లికుదురు : పాపం చిన్నారి.. బడికి పోయినా బతికేటోడు. వ్యవసాయ బావి దగ్గరికి వెళ్దాం ఈ రోజు పాఠశాలకు వెళ్లకండి అని తండ్రి చెప్పడంతో ముగ్గురు చిన్నారులు ఎగిరి గంతేశారు. తల్లిదండ్రితోపాటు ట్రాక్టర్లో వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. అక్కడ తండ్రి వ్యవసాయ భూమి దున్నుతుండగా సరదాగా ముగ్గురు చిన్నారులు ట్రాక్టర్పై ఎక్కారు. ఇందులో ఓ చిన్నారి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ రోటోవేటర్ కిందపడి దుర్మరణం చెందాడు. దీంతో బడికి పోయినా బతికిటోడివి బిడ్డో అంటూ తల్లిదండ్రులు తమ కుమారుడి మృతదేహం మీద పడి గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటన శనివారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రాజులకొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఇన్చార్జ్ ఎస్సై శివరామకృష్ణ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జిలుకర ప్రసాద్, స్వర్ణ దంపతులకు కూతురు సౌమ్య, ఇద్దరు కుమారులు సందీప్, వరుణ్(07) ఉన్నారు. ఈ క్రమంలో ముగ్గురు పిల్లలు, భార్యను ట్రాక్టర్పై ఎక్కించుకున్న ప్రసాద్.. తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాడు. అక్కడ ట్రాక్టర్పై నుంచి స్వర్ణ దిగింది. పిల్లలు వరుణ్, సౌమ్య, సందీప్ ట్రాక్టర్పై కూర్చోపెట్టుకుని తండ్రి వ్యవసాయ భూమి దున్నుతుండగా పిల్లలు కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా వరుణ్ ట్రాక్టర్ పైనుంచి జారి దున్నుతున్న రోటో వేటర్ కింద పడ్డాడు. దీంతో నాన్న.. తమ్ముడు పడిపోయాడు అని మిగతా ఇద్దరు పిల్లలు అరుస్తుండగా ట్రాక్టర్ నిలిపి తండ్రి వెళ్లి చూడగా అప్పటికే వరుణ్ దుర్మరణం చెందాడు. రోటోవేటర్ కింద పడి ఆ చిన్నారి మృతదేహం నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదం తమ కళ్లెదుటే జరుగడంతో ఆ కుటుంబం మొత్తం గుండెలవిసేలా రోదించింది. ఈ ఘటనపై బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జ్ ఎస్సై శివరామకృష్ణ తెలిపారు. కాగా, వరుణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్ రోటోవేటర్ కిందపడి బాలుడి దుర్మరణం రాజులకొత్తపల్లిలో ఘటన మిన్నంటిన కుటుంబీకుల రోదనలు -
విద్యార్థుల చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
మహబూబాబాద్: పాఠశాలలో విద్యార్థుల చదువుపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అన్నారు. కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో విద్యా తదితర విషయాలపై కలెక్టర్ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ మాట్లాడుతూ.. వినూత్న పద్ధతులతో విద్యాబోధన చేయాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధవహించాలన్నారు. ఎంఈఓ ప్రతి రోజు కనీసం ఒక పాఠశాలనైనా సందర్శించాలని తెలిపారు. టైంటేబుల్ ప్రకారం సెలబస్ పూర్తి చే యాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలని తెలిపారు. జిల్లాలో వయోజన విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టి గ్రామీణాభివృద్ధి శాఖ సమన్వయంతో అక్షరాస్యత పెంచాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల అడ్మిషన్లు పెంచాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, డీఈఓ రవీందర్రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మదార్, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య కురవి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీహైస్కూల్, పీహెచ్సీని శనివారం ఆయన సందర్శించారు. జెడ్పీ హైస్కూల్లోని తరగతులను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థుల నైపుణ్యాలను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం అందిస్తున్నట్లు వివరించారు. సీజనల్ వ్యాధులపై వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. రికార్డులను మెయింటెన్స్ చేయాలన్నారు. మాతా శిశుమరణాలు, సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కార్యక్రంమలో డాక్టర్ విరాజిత, హైస్కూల్ హెచ్ంఎం వాహిద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ -
పక్కా వంద సీట్లు.. సర్వేలన్నీ మనవైపే
హసన్పర్తి: వచ్చే ఎన్నికల్లో పక్కాగా వంద అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బీఆర్ఎస్ వర్ధన్నపేట నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నగరంలోని నాని గార్డెన్లో శనివారం జరిగింది. సమావేశానికి మాజీ మంత్రి దయాకర్రావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సర్వేలన్నీ గులాబీ వైపు చూపుతున్నాయని తెలిపారు. గత ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతులకు కనీసం సాగు నీరు అందించకుండా వారి కళ్లల్లో కన్నీళ్లు నిలిపిందన్నారు. నాట్లకి..నాట్లకి రైతుబంధు కేసీఆర్ వేస్తే.. రేవంత్ మాత్రం ఓట్లకు ఓట్లకు రైతు భరోసా వేస్తున్నాడని ధ్వజమెత్తారు. రేవంత్రెడ్డి ఓ అబద్దాల కోరుగా అభివర్ణించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపునకు పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్రెడ్డి, మొట్టు శ్రీనివాస్, కార్పొరేటర్లు ఇండ్ల నాగేశ్వర్రావు, రాధికారెడ్డి, నాయకులు శ్రీధర్, అటికం రవీందర్, చల్లా వెంకటేశ్వర్రెడ్డి, మార్గం భిక్షపతి, అప్పారావు, బండి రజనీకుమార్, తూర్ల కుమారస్వామి, కందుకూరి చంద్రమోహన్, పాడి మల్లారెడ్డి, నద్దునూరి నాగరాజు, జోరుక రమేశ్ పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు -
ఆదివారం శ్రీ 29 శ్రీ జూన్ శ్రీ 2025
ఐనవోలు: మండల కేంద్రానికి చెందిన వడిచర్ల శ్రీనివాస్–అనురాధ దంపతుల కుమారుడు కమల్హాసన్, కూతురు శివాని. శ్రీనివాస్ టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సమాజ సేవంటే ఇష్టపడే శ్రీనివాస్ ఎంపీటీసీగా పని చేశారు. గతేడాది జనవరి 22న అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెందాడు. నాన్న నిర్ణయం మేరకు డిగ్రీ తర్వాత కమల్ హాసన్ లండన్కు వెళ్లారు. తండ్రి చనిపోయిన తర్వాత ఆయన కోరిక మేరకు చెల్లి పెళ్లి జరిపించాడు. ఆ పెళ్లిలో అతడి తండ్రి ఫైబర్ విగ్రహాన్ని తయారు చేయించి నాన్నతో తనకున్న ఎమోషన్ను అందరికి చూపించాడు. ఈసారి లండన్ నుంచి ఇండియాకు వచ్చినపుడు ఆ ఫైబర్ విగ్రహాన్ని మండల కేంద్రంలో ఏర్పాటు చేయించనున్నట్లు కమలహాసన్ తెలిపారు.న్యూస్రీల్పెళ్లిలో విగ్రహం ఓ ఎమోషన్ -
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
మహబూబాబాద్ రూరల్: క్షణికావేశంలో చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. మహబూబాబాద్ జైలు లో ఉన్న ఖైదీలకు అందుతున్న వసతులు, సౌకర్యాలపై ఆయన శనివారం సందర్శించి ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి జైలులో ఉన్న వివిధ బ్యారక్ లను తిరిగి ఖైదీలతో మాట్లాడారు. వారికి అందుతున్న నీరు,ఆహారం, పరిశుభ్రత, వైద్య సౌకర్యాల గురించి సబ్ జైల్ సూపరిండెంటెంట్ మల్లెల శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా అబ్దుల్ రఫీ మాట్లాడుతూ ఖైదీలకు భవిష్యత్లో ఇదే చివరి జైలు జీవితం కావాలని, ఉచిత న్యాయ సహాయం, లోక్ అదాలత్, శిక్ష తగ్గింపు (ప్లీ బార్గేయినింగ్) మొదలైన వాటి గురించి ఖైదీలకు వివరించారు. జైలు జీవితాన్ని తమ భవిష్యత్కు సోపానంగా మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జైల్ సూపరిండెంటెంట్ శ్రీనివాసరావు, భిక్షపతి డిప్యూటీ జైలర్ సదా నిరంజన్, అదనపు డిప్యూటీ జైలర్ ఖాజా ఖలీలుద్దీన్, హెడ్ వార్డర్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ -
సమ్మక్క సాగర్కు జలకళ..
కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామం వద్ద గోదావరిపై నిర్మించిన సమ్మక్క సాగర్ జలకళ సంతరించుకుంది. కొన్ని రోజుల నుంచి బ్యారేజీలో నీరులేక పోవడంతో బోసిపోయిన గోదావరి.. వారం రోజుల నుంచి ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు భారీగా నీరు చేరడంతో గోదావరి నిండుగా ప్రవహిస్తోంది. దీంతో బ్యారేజీలోకి ఎగువ నుంచి 21,500 క్యూసెక్కుల నీరు చేరడంతో అధికారులు బ్యారేజీ వద్ద 59 గేట్లలో మూడు గేట్లు ఎత్తి 27,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ సామర్థ్యం 6.94 టీఎంసీలకు గాను ప్రస్తుతం 3.81టీఎంసీల నీరు ఉంది. బ్యారేజీ నీటి మట్టం 83 మీటర్లకు గాను 79.50 మీటర్ల నీటి మట్టం కొనసాగుతోంది. కాగా, దేవాదుల వద్ద ఉన్న చొక్కారావు ఎత్తిపోతల నుంచి రెండు మోటార్ల ద్వారా 494 క్యూసెక్కుల నీరు ఎత్తిపోస్తున్నట్లు డీఈ శరత్ బాబు తెలిపారు. ఎగువ నుంచి బ్యారేజీలోకి 21,500 క్యూసెక్కుల నీరు చేరిక మూడు గేట్లు ఎత్తి 27,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల -
కుమారులు దూరమై.. విగ్రహాల్లో కొలువై
కొడకండ్ల: అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు కుమారులు రోడ్డు ప్రమాదంలో దూరమయ్యారు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని వారి జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ ఆ తల్లిదండ్రులు కాలం వెళ్లదీస్తున్నారు. ప్రాణం పోయిన వారి కుమారులకు విగ్రహాల రూపంలో ప్రాణం పోసి కళ్లారా చూస్తున్నారు. కొడకండ్ల మండలం రామవరం గ్రామానికి చెందిన మేటి రాములు–రాజేశ్వరి దంపతులకు ముగ్గురు కుమారులు. వ్యవసాయమే జీవనాధారమైన వారు కుమారులను చిన్నప్పటి నుంచి ప్రైవేట్ పాఠశాలల్లోనే చదివించారు. తల్లిదండ్రుల శ్రమను గుర్తించిన వారు ప్రయోజకులయ్యారు. పెద్దకుమారుడు అరవింద్, రెండో కుమారుడు శ్రవణ్ సాప్ట్వేర్ ఇంజనీర్లుగా హైదరాబాద్లో మూడో కుమారుడు శ్రవణ్ వరంగల్ ఎంజీఎంలో హౌస్ సర్జన్గా పనిచేసేవారు. గత సంవత్సరం మే 19న శివ హైదరాబాద్లోని అన్న శ్రవణ్ వద్దకు వెళ్లాడు. భోజనం తెచ్చుకునేందుకు బయటికి వెళ్లిన ఇద్దరు సోదరులను స్కార్పియో కారు ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. కుమారులను గుర్తు చేసుకుంటూ తమ వ్యవసాయ భూమిలో గదిని నిర్మించి శ్రవణ్, శివ విగ్రహాలను ఏర్పాటు చేయించారు. మే 19న ప్రథమ వర్ధంతి సందర్భంగా తల్లిదండ్రులు ఆవిష్కరించుకున్నారు. -
సమన్వయంతో సీజనల్ వ్యాధుల నియంత్రణ
హన్మకొండ: జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు సంబంధిత ప్రభుత్వ విభాగాలతో సమన్వయంతో పని చేస్తూ సీజనల్ వ్యాధుల నియంత్రణకు కృషి చేయాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఎస్.సంగీత సత్యనారాయణ సూచించారు. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులతో సీజనల్ వ్యాధులు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ముందుగా జిల్లాల వారీగా నమోదవుతున్న మలేరియా, డెంగీ, ఇతర వ్యాధుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అ నంతరం ఆమె మాట్లాడుతూ వరంగల్ జిల్లా వైద్యారోగ శాఖాధికారి, సంబంధిత అధికారులు ఎంజీఎంలో నమోదవుతున్న మలేరియా, డెంగీ పాజి టివ్ కేసుల వివరాలను డీఎంహెచ్ఓలకు అందించాలన్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో హెచ్ఎంలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి సీజనల్ వ్యా ధులు, ముఖ్యంగా చేతుల శుభ్రత, ఓఆర్ఎస్ ద్రావ ణం తయారీ విధానం, జ్వరాలు, డయేరియాకు సంబంధించిన ప్రమాదకర లక్షణాల గురించి అవగాహన కల్పించాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ కార్యక్రమాల గురించి ప్రచారం చేయాలన్నారు. ప్రతీ మంగళవారం ఎంపిక చేసిన ఆరోగ్య కేంద్రాలలో నిర్వహించే ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా నిర్వహించాలని, ఆశలు, ఏఎన్ఎంలకు అవసరమైన సూచనలు చేయాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాలికల లింగ నిష్పత్తి చాలా తక్కువ ఉందని, ఈ దిశగా డీఎంహెచ్ఓలు బాధ్యతగా తగిన చర్యలు చేపట్టాలని, లింగ నిర్ధారణ పరీక్షలపై నిఘా పెంచాలన్నారు. లింగ వివక్షతపై అవగాహన కల్పించాలన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ఎక్స్రే పరీక్షలు అవసరం వారికి ఆర్.బి.ఎస్.కె వాహనం ద్వారా అందుబాటులో ఉన్న సెంటర్లకు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించాలన్నారు. మేనరికపు వివాహాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, మహబూబాబాద్ జిల్లాల డీఎంహెచ్ఓలు ఎ.అప్ప య్య, బి.సాంబశివరావు, గోపాల్ రావు, మల్లికార్జు న్, రవి రాథోడ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రోగ్రాం అధికారి శ్రీదేవి పాల్గొన్నారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఎస్.సంగీత సత్యనారాయణ -
ఫైనాన్స్ వ్యాపారి దారుణ హత్య
● కాజీపేట రైల్వే క్వార్టర్స్లో ఘటన ● హత్యకు గల కారణాలపై పోలీసుల ఆరా ● పోలీసులకు లొంగిపోయిన నిందితుడు?కాజీపేట: ఓ ఫైనాన్స్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి కాజీపేట రైల్వే క్వార్టర్స్లో జరిగింది. మృతుడి భార్య మాధవి, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జేపీఎన్ రోడ్డుకు చెందిన త్రిపురాధి నవీన్కుమార్ (55) ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. కొంతకాలంగా కాజీపేటలోని చిరువ్యాపారులు, రైల్వే, ఎఫ్సీఐ, ప్రైవేట్ ఉద్యోగులకు వడ్డీలకు డబ్బులు ఇస్తున్నాడు. ఈ క్రమంలో రైల్వే ఈఎల్ఎస్ షెడ్లో పనిచేసే గడ్డం ప్రవీణ్కుమార్కు ఆరు నెలల క్రితం రూ.50 వేలు అప్పుగా ఇచ్చాడు. అప్పు తీసుకున్నప్పటి నుంచి ప్రవీణ్కుమార్ అసలుతోపాటు వడ్డీ కూడా చెల్లించకపోవడంతో మృతుడు కొద్దికాలంగా ప్రవీణ్కుమార్పై ఒత్తిడి పెంచడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరిగాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి నవీన్కుమార్ రైల్వే క్వార్టర్స్కు వెళ్లి నిందితుడు ప్రవీణ్ కుమార్ను నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వా దం పెరిగింది. ఆ తర్వాత గొడవ సద్దుమణగడంతో ఇద్దరు కలిసి మద్యం సేవించారు. అయితే డబ్బుల విషయంలో జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న ప్రవీణ్కుమార్.. కూరగాయలు కొసే కత్తితో విచక్షణారహితంగా పొడవడంతో నవీన్కుమార్ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. అనంతరం నిందితుడు నేరుగా కాజీపేట పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. హత్య కేసులో విభిన్న వాదనలు .. ఫైనాన్స్ వ్యాపారి నవీన్కుమార్ హత్యపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అప్పులు ఇచ్చిన తర్వాత అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేయడం, చెక్ బౌన్స్ కేసులు నమోదు చేయించడం, ఇళ్లు, స్థలాలు రాయించుకోవడం వంటి పనులు చేస్తుండేవాడనే ఆరోపనలు వినిపిస్తున్నాయి. కాగా, నవీన్కుమార్ను నిందితుడు ప్రవీణ్కుమార్ మధ్యాహ్నమే రైల్వే క్వార్టర్లో చంపి మృతదేహాన్ని బయటపడేయడం కోసం ప్రయత్నించగా ఆటో డ్రైవర్లు ఎవరూ సహకరించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో పోలీసులకు నిందితుడు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కాగా, ఫైనాన్స్ వ్యాపారి నవీన్కుమార్ హత్య సమాచారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఘటనా స్థలికి పోలీసు అధికారులు.. కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డి, ఇన్చార్జ్ సీ ఐ పుల్యాల కిషన్తో పాటు టాస్క్ఫోర్స్, క్రైమ్ సిబ్బంది, క్లూస్ టీం బృందం ఘటనాస్థలిని సందర్శించి ఆధారాలు సేకరించారు. నవీన్కుమార్ హ త్య వెనుక నిందితుడితో పాటు ఇంకా ఎవరైనా ఉ న్నారా? లేక ఒక్కడే హత్య చేసి ఉంటాడా అనే కో ణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కా జీపేట చౌరస్తా నుంచి రైల్వే క్వార్టర్స్కు వెళ్లే రహదారుల్లో ఉన్న సీసీ కెమెరాలను జల్లెడ పడుతు న్నారు. మృతుడి భార్య త్రిపురాధి మాధవి ఫిర్యా దు మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై నవీన్కుమార్ తెలిపారు. కాగా, తన భర్త ఒంటిపైనుంచి రూ. 6 లక్షల విలువైన బంగా రు ఆభరణాలు నిందితుడు ప్రవీణ్కుమార్ తీసుకున్నాడని మృతుడి భార్య మాధవి ఆరోపించింది. -
జీపీలకు భవనాలేవి..?
మహబూబాబాద్: జిల్లాలోని సగానికి పైగా గ్రామపంచాయతీ కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. కేవలం 175 జీపీలకు శాశ్వత భవనాలు ఉండగా 307 కార్యాలయాలకు పక్కా భవనాలు లేక ప్రభుత్వ పాఠశాల భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, ఇతర భవనాల్లో కొనసాగుతోన్నాయి. మరికొన్ని మాత్రం అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఆయా భవనాల్లో కనీస సౌకార్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సిబ్బంది ఆవేవన వ్యక్తం చేస్తున్నారు. 482 గ్రామపంచాయతీలు జిల్లాలో 18 మండలాలు.. 482 గ్రామపంచాయతీలు ఉండగా 6,35,872 మంది జనాభా, 5,61,960 ఓటర్లు ఉన్నారు. 1,69,556 గృహాలు ఉన్నాయి. కాగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 24 మంది సీనియర్ పంచాయతీ కార్యదర్శులు 401 అవుట్ సోర్సింగ్ 12 మొత్తం 437 మంది పని చేస్తున్నారు. 45 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. 1,805 మంది గ్రామపంచాయతీ కార్మికులు పని చేస్తున్నారు. సొంత భవనాలు లేనివి 307 కార్యాలయాలు 482 జీపీలకు గాను 175 గ్రామపంచాయతీల కార్యాలయాలకు సొంత భవనాలు ఉన్నాయి. 307 జీపీల కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. దీంతో చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలో తక్కువ సంఖ్యలో అంగన్వాడీ కేంద్రాల్లో భవనాల్లో నిర్వహిస్తున్నారు. కొన్ని మాత్రమే అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వాటి అద్దె ఆయా జీపీల నిధుల నుంచే చెల్లించాలి. ప్రత్యేక బడ్జెట్ ఏమీ ఉండదని అధికారులు పేర్కొన్నారు. నిర్మాణ దశలో 255 భవనాలు ఆర్జీఎస్కే కింద జిల్లాకు 10 జీపీ కార్యాలయాల భవనాలు, ఎస్టీ కాంపోనెంట్ నిధులతో 103 కార్యాలయాల భవనాలు, ఎన్ఆర్ఈజీఎస్లో 152 కార్యాలయాల భవనాలు మంజూరయ్యాయి. కాగా, కేవలం 10 మాత్రమే పూర్తి కాగా 255 భవనాలు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. వాటి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొన్ని మధ్యలోనే నిలిపివేశారు. సంబంధిత అధికారులు దృష్టి సారిస్తేనే పనులు పూర్తి అవుతాయి. 175 జీపీలకు సొంత భవనాలు ఉండగా 10 పూర్తిగా కాగా మిగిలిన 255 పూర్తి అయితే మరో 42 జీపీలకు భవనాలు నిర్మించాల్సి ఉంటుంది. పెండింగ్లోనే వేతనాలు.. 1,805 మంది జీపీ కార్మికులు ఉండగా వారి వేతనాలు మూడు నెలలుగా పెండింగ్లో ఉన్నాయి. వారికి నెలకు రూ.9,500 జీతం ఉండగా ప్రతి నెలా రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు విడుదల చేయించాలని ఇటీవల కార్మికులు అధికారులకు వినతి పత్రం అందచేశారు. అద్దె సమస్య లేదు 175 కార్యాలయాలు సొంత భవనాల్లో ఉండగా మిగిలినవి చాలా వరకు అద్దె లేకుండా ఉన్న భవనాల్లో నిర్వహిస్తున్నాం. కొన్ని మాత్రమే అద్దె భవనాల్లో ఉన్నాయి. జీపీ నుంచే చెల్లిస్తున్నారు. ఆ సమస్య ఏమీ లేదు. నూతన భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేశాం. అవి పూర్తయితే చాలా వరకు సమస్య తీరుతుంది. – హరిప్రసాద్, డీపీఓ జిల్లాలో 482 గ్రామపంచాయతీలు 175 జీపీలకు మాత్రమే సొంత భవనాలు నిర్మాణ దశలో 265.. -
ఒంటరివాడినయ్యాననే మనస్తాపంతో..
● యువకుడి ఆత్మహత్యాయత్నం ● చికిత్స పొందుతూ మృతి గార్ల: ఒంటరి వాడినయ్యాననే మనస్తాపంతో జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన గార్ల మండల కేంద్రంలోని కొలిమికొట్టం బజారులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొలిమికొట్టం బజారుకు చెందిన రుద్ర ప్రశాంత్ (22) చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. అమ్మమ్మ ఉపేంద్రమ్మ వద్ద పెరిగి ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గతేడాది అమ్మమ్మ కూడా చనిపోవడంతో హైదరాబాద్లో పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈనెల 15న అమ్మమ్మ సంవత్సరీకం సందర్భంగా గార్ల వచ్చాడు. బంధువులతో కలిసి కార్యక్రమం పూర్తి చేశాడు. బంధువులందరూ వెళ్లిపోయాక ఒంటరిగా ఉన్నాడు. అమ్మ, నాన్న, అమ్మమ్మ చనిపోయారని, దీంతో ఒంటరిగా ఉంటున్నానని మనస్తాపం చెంది ఈనెల 18న పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు గమనించి వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి అన్న జశ్వంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై రవీందర్ తెలిపారు. డోర్నకల్లో విషాదం ● కర్ణాటకలో గ్రామ యువకుడి అనుమానాస్పద మృతి డోర్నకల్: డోర్నకల్లో విషాదం నెలకొంది. స్థానిక బంకట్సింగ్తండాకు చెందిన ఓ యువకుడు కర్ణాటకలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. తండాకు చెందిన ఆర్పీఎఫ్ ఎస్సై జాటోత్ సామ్యేల్ దేవరాజ్ కుమారుడు రాజ్కుమార్(26) కర్ణాటకలోని బెల్గావి జిల్లా కాగర్వాట్లోని సెంట్రల్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా విధులు నిర్వర్తిస్తూ బెల్గావిలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 26న ఉదయం తన గదిలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని మార్చురీలో భద్రపర్చి కుటుంబ సభ్యులకు సమాచారం తెలిపారు. కుటుంబ సభ్యులు శనివారం రాజ్కుమార్ మృతదేహాన్ని డోర్నకల్కు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఉన్నత ఉద్యోగం చేస్తూ అందరితో కలిసి ఉండే రాజ్కుమార్ మృతితో స్థానికంగా విషాదం అలుముకుంది. -
వినోదానికి వస్తూ విషాదం..
మరిపెడ రూరల్: సినిమా చూడడానికి ముగ్గురు మిత్రులు ఒకే బైక్పై వస్తున్నారు. ఈ క్రమంలో గేదెలను తప్పించపోయి బైక్ అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురం క్రాస్ సమీపంలోని పత్తి మిల్లు వద్ద శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం బిక్కుమల్ల గ్రామానికి చెందిన గజేంత్రి గణేశ్ (23), కుక్కల గణేశ్, బాల్ని గణేశ్ స్నేహితులు. సినిమా చూడడానికి ముగ్గురు ఒకే బైక్పై మరిపెడ మండల కేంద్రానికి వస్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని గిరిపురం క్రాస్ సమీపంలోని పత్తి మిల్లు వద్ద గేదెల మంద ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చింది. వాటిని తప్పించబోయి బైక్ అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న గజేంత్రి గణేశ్తోపాటు మిగతా ఇద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలిస్తుండగా గజేంత్రి గణేశ్ మార్గమధ్యలో మృతి చెందాడు. మిగతా ఇద్దరు చికిత్స పొందుతున్నారు. మృతుడి తల్లి సుశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గేదెలను తప్పించబోయి అదుపు తప్పిన బైక్.. ఓ యువకుడు మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు మరిపెడ మండలం గిరిపురం క్రాస్ సమీపంలో ఘటన సూర్యాపేట జిల్లా బిక్కుమళ్ల గ్రామస్తులుగా గుర్తింపు -
రైల్వేస్టేషన్లో దొంగ అరెస్ట్
● రూ. 2.86 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన వరంగల్ జీఆర్పీ సీఐ సురేందర్ రామన్నపేట : వరంగల్ రైల్వేస్టేషన్లో ఓ దొంగను అదుపులోకి తీసుకుని అతడి నుంచి రూ. 2,86,645 విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ జీఆర్పీ సీఐ సురేందర్ తెలిపారు. జీఆర్పీ సీఐ కథనం ప్రకారం.. శనివారం ఉదయం 9 గంటల సమయంలో నాలుగో ఫ్లాట్ఫామ్ వద్ద చింతల్ వైపున తనిఖీలు చేస్తుండగా మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం బంగ్లా తండాకు చెందిన ఇస్లావత్ సురేశ్ అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించాడు. దీంతో అతడిని తనిఖీ చేయగా 28.645 గ్రాముల బంగారం చైన్, రెండు పుస్తెలు, 3 జతల చెవి కమ్మలు లభ్యమయ్యాయి. నిందితుడు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో బంగారం చోరీ చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. దీంతో అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తునట్లు జీఆర్పీ సీఐ తెలిపారు. కాగా, నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బంది రాము, రియాజుద్దీన్, నాగరాజు, రామకృష్ణ, రమేశ్. మనోజ్కుమార్ను జీఆర్పీ సీఐ అభినందించారు. -
కొమ్మకొమ్మకో గూడు..!
పక్షుల ఆవాసమైన గూళ్లు అందంగా.. ఆకర్షనీయంగా ఉంటాయి. ప్రస్తుతం వాతావరణ కాలుష్యంతో పలు పక్షి జాతులు అంతరించిపోయాయి. ఎక్కడో ఒకచోట మాత్రమే పక్షులు తమ జీవనాన్ని సాగిస్తున్నాయి. ఈక్రమంలో వాటికి అవసరమైన ఆవాసాలను అవే నిర్మించుకోవడం మనకు తెలిసిందే.. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ సమీపంలోని ఓ బావి వద్ద ఉన్న చెట్లుపై పక్షుల గూళ్లు.. ప్రతి కొమ్మకూ ఉన్నాయా.. అన్నట్లుగా కన్పిస్తూ ఆకట్టుకుంటున్నాయి.. – నెహ్రూసెంటర్ -
బీసీలపై రాజకీయ పార్టీల చిన్నచూపు
కాజీపేట రూరల్ : బీసీలను అన్ని రాజకీయ పార్టీలు చిన్న చూపు చూస్తున్నాయని, జనాభా దామాషా ప్రకారం బీసీలకు వాటా ఇచ్చే వరకూ అవిశ్రాంత పోరాటం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ అన్నారు. కాజీపేట ఫాతిమానగర్ వైష్ణవిగ్రాండ్ హోటల్లో శనివారం బీసీ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్గౌడ్ అధ్యక్షతన ‘స్థానిక సంస్థల ఎన్నికలు–బీసీల రిజర్వేషన్ల పెంపు’ అనే అంశం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. నెల రోజుల్లో రిజర్వేషన్లు నిర్ణయించి ఎన్నికల సంఘానికి నివేదించాలని హైకోర్టు ఆదేశించిన ప్రభుత్వం ఇంకా చర్యలు చేపట్టడం లేదన్నారు. బీజేపీ నాయకులు గల్లీలో ఒక మాట, ఢిల్లీలో మరోమాటతో బీసీలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ బీసీల వ్యతిరేక పార్టీ అని, కాంగ్రెస్, బీజేపీ మాత్రమే రిజర్వేషన్లు తేల్చాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లోగా సీఎం రేవంత్రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఎమ్మెల్సీ కవిత బీసీ నినాదం ఎత్తుకున్నారని ధ్వజమెత్తారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్పించి 42 శాతం బీసీ బిల్లు ఆమోదింపజేయాలని, లేనిపక్షంలో తెలంగాణలో బీజేపీని మట్టి కరిపిస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాడి మల్లయ్యయాదవ్, బీసీ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు డాక్టర్ చిర్ర రాజు, తమ్మేలా శోభారాణి, మాదం పద్మజాదేవి, కాసగాని అశోక్గౌడ్, డాక్టర్ సంగాని మల్లేశ్వర్, మేముల మహేందర్, వల్లాల జగన్గౌడ్, పంజాల మధు, తెల్ల కిశోర్, తెల్ల సుగుణ, బూర్గుల ప్రమాద, బాబుయాదవ్ పాల్గొన్నారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే ఎన్నికలకు పోవాలి బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ -
హక్కుల పరిరక్షణలో ఓంకార్ పాత్ర ఎనలేనిది
● మోదీ పాలన దేశానికే ప్రమాదకరం ● రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలువరంగల్ చౌరస్తా: పౌర హక్కులు.. రాజ్యాంగ పరిరక్షణ కోసం మాజీ ఎమ్మెల్యే ఓంకార్ చేసిన ఉద్యమాలు, త్యాగాలు ఎనలేనివని పలువురు వక్తలు తెలిపారు. వరంగల్ అండర్ బ్రిడ్జికి సమీపంలోని ఎంసీపీఐ(యూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మద్దికాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవాల్లో భాగంగా పౌర హక్కుల పరిరక్షణలో ఆయన పాత్ర అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పెదారపు రమేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, సీపీఎం జిల్లా నాయకురాలు నలిగంటి రత్నమాల, న్యూ డెమోక్రసీ గ్రేటర్ కార్యదర్శి రాచర్ల బాలరాజు, నాయకులు నున్నా అప్పరావు, లిబరేషన్ జిల్లా కార్యదర్శి అక్కనపెల్లి యాదగిరి, రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు సోమ రామమూర్తి, కేడల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీ నాయకులను అక్రమంగా జైలులో పెడుతుందని ఆరోపించారు. బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారన్నాని అన్నారు. అడవిలోని ఆదివాసీలను కాల్చి చంపుతూ.. అటవీ సంపద కార్పొరేట్ పెట్టుబడిదారులకు దోచిపెట్టేందుకు అనేక కుట్రలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో నాయకులు నర్ర ప్రతాప్, కుసుంబ బాబురావు, జగదీశ్వర్, నలిగంటి చంద్రమౌళి, రాజన్న, అనిత, ఇస్మాయిల్ పాల్గొన్నారు. -
ఆషాఢం వేడుకల వేళ..
వనభోజనాల సందడి.. ఆషాఢ మాసంలో వనభోజనాలు ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. ప్రధానంగా గ్రామాల్లోని వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడి పంటలు వెల్లివిరియాలని కోరుకుంటారు. గ్రామదేవతలకు పూజలు నిర్వహించి ప్రకృతి ఒడిలో పచ్చని పంట పొలాల మధ్య చెట్ల కింద సామూహిక వనభోజన సంబురాలు జరుపుకుంటారు. పట్టణ ప్రాంతాల్లో సైతం ఈ సంప్రదాయం కొనసాగుతోంది. భక్తిశ్రద్ధలతో గ్రామ దేవతలకు పూజలు ● అమ్మవార్లకు మొక్కుల చెల్లింపులకు సిద్ధం ● తొలిఏకాదశి నాడు బీరన్న బోనాలు ప్రత్యేకం ● గురువారం ప్రారంభమైన మాసంహన్మకొండ కల్చరల్: ఆషాఢం వేడుకలకు సమయం ఆసన్నమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తొలకరి వానలు పలకరించాయి. ఫలితంగా పంటల సాగుతో పాటే గ్రామ దేవతల (బోనాలు)కు పూజలు మొదలు కానున్నాయి. ఆషాఢ మాసం గురువారం ప్రారంభమైంది. ఇదే సమయంలో గ్రామాల్లో అమ్మవారిని కొలిచేందుకు ప్రజలు సన్నద్ధమవుతున్నారు. మహిళలు కలిసికట్టుగా బయలుదేరి మొక్కులు చెల్లించనున్నారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలిఏకాదశి నాడు బీరన్న బోనాలు వైభవంగా నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో ప్రతీరోజు గ్రామ దేవతలను భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. కొందరికి గ్రామదేవతలకు బోనాలు సమర్పించే సంప్రదాయం కూడా ఉంది. ఇలవేల్పులైన అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తారు. ఆలయాల్లో ఉత్సవాలు.. ఆషాఢ మాస శుద్ధ ఏకాదశి రోజున విష్ణువు యోగా నిద్రలోకి వెళ్లిన రోజుగా భావిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇదే సమయంలో పూరి జగన్నాథ రథయాత్ర, గురుపౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా వేడుకగా జరుపుకోనున్నారు. అలాగే, వరంగల్ జిల్లాలో శ్రీభద్రకాళి అమ్మవారికి శాకంబరీ ఉత్సవాలు నిర్వహించడం ప్రత్యేకం. గోరంటాకు మురిపెం.. ఆరోగ్యదాయకం వర్షకాలం ప్రారంభమై బావులు, వాగులు, చెరువుల్లోకి కొత్త నీరొస్తుంది. ఇది చర్మవ్యాధులు వ్యాప్తి చెందే కాలం. వీటి బారి నుంచి ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు గోరింటాకు ఔషధంగా పని చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆషాఢ మాసంలో మహిళలు గో రింటాకును (మెహందీ) అలంకరించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఆయుర్వేద వైద్య నిపుణులు గోరింటాకు చర్మ వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుందని, శరీరంలో వేడి తగ్గిస్తుందని పేర్కొంటున్నారు. గోరింటాకు వేడుకలు హసన్పర్తి: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గోరింటాకు వేడుకలను మహిళలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నగరంలోని 55వ డి విజన్ సత్యసాయి కాలనీలో అతివలు అరచేతిలో గోరింటాకు పెట్టుకుని మురిసిపోయారు. కార్యక్రమంలో తుమ్మ వనమాల, ఎర్రబెల్లి సుజాత, చెరుకు కృష్ణవేణి, చిట్టిరెడ్డి మంగ పూల్లూరి సరోజన, లావణ్య, చింత జ్యోతి, తుమ్మ ప్రియాంక, తుమ్మ పద్మ నిహాసి పాల్గొన్నారు. ఆరోగ్యం.. ఆనందం హిందూ సనాతన ధర్మంలో ఆరోగ్యం, ఆనందం కోసం కొన్ని పద్ధతులు అనాదిగా వస్తున్నాయి. ఇందులో కుంకుమ, తిలకం అద్దుకోవడం, విభూదిధారణ, గంధ ధారణ, కాటుక, గోరింటాకు పెట్టుకోవడం లాంటి పద్ధతులు ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరంలో ఉన్న వేడి తగ్గి ఆరోగ్యంగా ఉంటామని, అలాగే శరీరం కళకళలాడుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేయిస్తంభాల దేవాలయం ప్రధానార్చకుడు గంగు ఉపేంద్ర శర్మ తెలిపారు. -
దివ్యాంగుల సంక్షేమానికి సర్కారు కృషి
కాళేశ్వరం: దివ్యాంగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషిచేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. శుక్రవారం మహాదేవపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అలీం కో సంస్థ ద్వారా దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, ఇతర ఉపకరణాలు కలెక్టర్ రాహుల్శర్మతో కలిసి అందజేశారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. దివ్యాంగులు సమాజంలో అన్ని రంగాల్లో రాణించేందుకు అవసరమైన సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగవుతాయని అభిప్రాయపడ్డారు. మండలంలో సుమారు 200 మంది దివ్యాంగులను గుర్తించగా, మొదటి విడతలో 54 మందికి వివిధ రకాలైన బ్యాటరీ ట్రై సైకిళ్లు, సాధారణ ట్రై సైకిళ్లు, వినికిడి పరికరాలు, చేతి కర్రలు, స్టాండ్లు వారి వైకల్యాన్ని బట్టి అందిస్తున్నామన్నారు. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఇల్లు లేని దివ్యాంగులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు. అర్హులకు విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. అతి త్వరలో నూతన పెన్షన్లు మంజూరు చేస్తామని తెలిపారు. నిరుపేదలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ, ఉచిత బస్సు సౌకర్యం, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు వడ్డీ లేని రుణాలు వంటి అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఒకొక్క హామీని నెరవేరుస్తున్నామని తెలిపారు. అనంతరం మహదేవ్పూర్ మండలానికి చెందిన 89 మంది లబ్ధిదారులకు సుమారు రూ.90 లక్షల విలువగల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అంతకు ముందు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో రూ.20 లక్షలతో నిర్మించిన బీఆర్ అంబేడ్కర్ చిల్డ్రన్ పార్క్ను రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్రెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయ లక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి, సీడీపీఓ రాధిక, డీఎస్పీ సూర్యనారాయణ, సీఐలు రామచందర్రావు, నాగార్జునరావు, ఎస్సైలు పవన్, తమాషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అర్హులకు విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు -
ప్రజల గుండెల్లోనే పీవీ..
ఎల్కతుర్తి: అభివృద్ధి లేమి.. అప్పుల ఊబిలో కూనరిల్లుతున్న తరుణంలో అన్నీ తానై ఆర్థిక సంస్కణలు చేపట్టి దేశాన్ని ప్రగతిబాట పట్టించా రు.. నాటి ప్రధాని పీవీ నర్సింహారావు. హనుమకొండ జిల్లా భీమదేవపల్లి మండలంలోని వంగర అనే ఒక చిన్న గ్రామం నుంచి ప్రధాన మంత్రి స్థాయికి ఎదిగిన గొప్ప మేధావి పీవీ నర్సింహారావు. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో వంగర గ్రామం ఓ వెలుగు వెలిగింది. ఆ సమయంలోనే గ్రామంలో పలు అభివృద్ధి పనులు జరిగాయి. నేడు దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 104వ జయంతి. భీమదేవరపల్లి మండలం వంగరలో 1921 జూన్ 28న పీవీ జన్మించారు. రాష్ట్ర, కేంద్ర మంత్రి పదవులతోపాటు ముఖ్యమంతి, ప్రధాన మంత్రిగా పదవులకు వన్నెతెచ్చారు. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో వంగరలో ముమ్మరంగా అభివృద్ధి పనులు చేపట్టారు. పోలీస్స్టేషన్ మంజూరైంది. రక్షిత తాగునీటి బావి, పీవీ మోడల్ కాలనీ, బాలికల గురుకుల పాఠశాల, 24 గంటలు పనిచేసే ఆస్పత్రి, సబ్స్టేషన్ మంజూరయ్యాయి. ఓ వైపు దేశం, మరో వైపు కాంగ్రెస్ పార్టీ దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో పీపీ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని తలెత్తుకునేలా చేయడంతోపాటు భారత ఖ్యాతిని దేశ విదేశాల్లో ఇనుమడింపజేసిన ఘనత పీవీదే. కాగా, 2004 డిసెంబర్ 23న పీపీ తుదిశ్వాస విడిచారు. పీవీ మరణానంతరం అయనను సొంతపార్టీ పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. పీవీ నర్సింహారావు ఇంటిని మ్యూజియంగా మారుస్తామని హామీ ఇచ్చిన గత ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. పీవీ సొంతగ్రామంలో విగ్రహం ఏర్పాటు చేయకపోవడంతో చివరకు గ్రామస్తులే చందాలు వసూలు చేసుకొని విగ్రహాన్ని ప్రతిష్ఠించడం గమనార్హం. కళ తప్పిన వంగర గ్రామం నేడు పీవీ నర్సింహారావు జయంతి వంగరలో తుదిదశకు చేరుకున్న పీవీ విజ్ఞాన కేంద్రం పనులుతుది దశలో పీవీ విజ్ఞాన కేంద్రం పనులు వంగర గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని రెండేళ్ల క్రితమే ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా అప్పటి సీఎం కేసీఆర్ రూ.11 కోట్లు మంజూరు చేసి పనులను ప్రారంభించారు. పీవీ విజ్ఞాన వేదిక పార్కు నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. పీవీ విజ్ఞాన వేదికలో ప్రవేశ ద్వారం, ఫుడ్కోర్టు, ఫొటో గ్యాలరీ, పీవీ జీవిత విశేషాలకు సంబంధించిన చిత్రాలు ఉండేలా రూపకల్పన చేశారు. దీంతోపాటు ధ్యాన మందిరం, సైన్స్ మ్యూజియం, అంపీ థియేటర్, వాటర్ ఫౌంటేషన్, చారిత్రక శిల్పాలు, పార్క్కు ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు ప్రారంభించారు. పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రారంభించాలని గత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, అప్పటి నాయకులు పట్టించుకోకపోవడంతో పనులు నత్తనడకన కొనసాగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంత్రి పొన్నం ప్రభాకర్.. పీవీ విజ్ఞాన కేంద్రం నిర్మాణం పనులను వేగవంతం చేశారు. దీంతో నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి.నెరవేరని హామీలు.. హనుమకొండ– సిద్ధిపేట రహదారిలో వంగర క్రాస్ నుంచి గ్రామంలోకి వెళ్లే దారిలో స్వాగత తోరణం, పీవీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు నాలుగు లైన్ల రహదారి నిర్మించి, సెంట్రల్ లైటింగ్ తీర్చిదిద్ధేందుకు అప్పటి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ, నేటికీ పూర్తి కాలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వీటిపై దృష్టి సారించి వంగరలో అభివృద్ధి పనుల వేగం పెంచాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
టీజీ ఎన్పీడీసీఎల్లో బదిలీలు
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్లో బదిలీలు, సర్దుబాట్లు జరిగాయి. ఈ మేరకు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఫైనాన్స్ సీజీఎం వంటేరు తిరుపతి రెడ్డి డైరెక్టర్గా నియామకం కావడంతో ఖాళీ అయిన స్థానంలో సీజీఆర్ఎఫ్ వరంగల్ ఫైనాన్స్ మెంబర్గా కొనసాగుతున్న ఆర్.చరణ్దాస్ను పూర్తి స్థాయి అదనపు బాధ్యతలతో నియమించారు. సిరిసిల్ల సెస్కు ఫారిన్ డిప్యుటేషన్పై వెళ్లిన పి.విజేందర్ రెడ్డి అక్కడి నుంచి సెలవుపై వెళ్లి తిరిగి ఎన్పీడీసీఎల్లో విధుల్లో చేరాడు. ప్రస్తుతం ఆయనను మహబూబాబాద్ ఎస్ఈగా నియమించారు. సూపరింటెండెంట్ ఇంజనీర్ బి.సుదర్శన్ను నిర్మల్ నుంచి జగిత్యాలకు బదిలీ చేశారు. ఎస్ఈ వి.గంగాధర్ను మంచిర్యాల నుంచి పెద్దపల్లికి, జీఎం వి.వేణుమాదవ్ను కార్పొరేట్ ఆఫీస్ ప్రాజెక్ట్సు నుంచి జీఎం ప్లానింగ్కు బదిలీ చేశారు. కార్పొరేట్ ఆఫీస్లో ఆపరేషన్ జనరల్ మేనేజర్గా కొనసాగుతున్న ఉత్తమ్.. మంచిర్యాల ఎస్ఈగా, జగిత్యాల ఎస్ఈ సాలియా నిర్మల్ ఎస్ఈగా బదిలీ అయ్యారు. తొర్రూరు డీఈ జి.మదుసూధన్ను మెట్పల్లికి, కార్పొరేటర్ ఆఫీస్ డీఈ జి.ఎల్.మర్రెడ్డిని అదే ఆఫీస్లో ప్రాజెక్టు విభాగానికి, డీఈ మహా బూబాద్ బి.పెద్దిరాజంను వరంగల్ డీపీఈ డీఈగా, పెద్దపల్లి ఎస్ఈ కార్యాలయంలో డీఈ టెక్నికల్ను తొర్రూరు డీఈగా, కార్పొరేట్ ఆఫీ స్లో ప్రాజెక్టు డీఈ డి.నందరాథోడ్ను ప్రాజెక్టు నుంచి ఇంజనీరింగ్ డీఈగా బదిలీ చేశారు. కాపులకనపర్తి ఏడీఈ నరసింహారావును కార్పొరేట్ ఆఫీస్ ప్రాజెక్టు విభాగానికి, ఏడీఈ బి.రవిని ప్రాజెక్టు నుంచి కాపుల కనపర్తికి, ఏడీఈ బి.శ్రీనివాస్ యాదవ్ను భూపాలపల్లి క్వాలిటీ కంట్రోల్ నుంచి కార్పొరేట్ ఆఫీస్కు, ఏడీఈ కె.పవన్ కుమార్ను కార్పొరేట్ ఆఫీస్ నుంచి హెచ్టీ మీటర్స్ వరంగల్ సర్కిల్కు బదిలీ జరిగింది. అకౌంట్స్ జనరల్ మేనేజర్ ఎన్.దేవేందర్కు సీజీఆర్ఎఫ్ వరంగల్ ఫైనాన్స్ మెంబర్గా స్థానం చలనం కలిగింది. రెవెన్యూ జీఎం ఆర్.కృష్ణ మోహన్ను ఫైనాన్స్ జీఎంగా, ఆడిట్ జీఎం ఎస్.సత్యనారాయణను రెవెన్యూ జీఎంగా, ఫైనాన్స్ జీఎం వి.వేణు బాబును ఆడిట్ జీఎంగా బదిలీ చేశారు. కూరగాయల విత్తనాల పంపిణీ మామునూరు: ఖిలావరంగల్ మండలం మా మునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక (ఎస్సీఎస్పీ) పథకాల ఆధ్వర్యంలో శుక్రవారం వర్ధన్నపేట మండలం అంబేడ్కర్ నగర్కు చెందిన 35 మంది మహిహిళా రైతులకు కూరగాయల విత్తనాలను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృషి విజ్ఞానకేంద్రం కోఆర్డినేటర్ రాజన్న హాజరై మాట్లాడారు. చిన్నపాటి వ్యవసాయ పనిముట్లు మహిళలకు కలిగే శ్రమను తగ్గించి పొలాల్లో కలుపు నివారణ పనులు సు లభతరం చేస్తాయని తెలిపారు. కూరగాయల విత్తన కిట్లను ఇంటి ప్రాంగణంలో లేదా కంచె ల వెంట నాటడం ద్వారా ఆహార భద్రత మె రుగు పడి గ్రామీణ మహిళల జీవనోపాధి స్థిరత్వానికి తోడ్పడుతుందని వివరించారు. శాస్త్రవేత్త డాక్టర్ సా యి కిరణ్, డాక్టర్ గణేష్, రైతులు పాల్గొన్నారు. -
బాధ్యతలు స్వీకరించిన ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు
హన్మకొండ: హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలోని శుక్రవారం టీజీ ఎన్పీడీసీఎల్ డైరక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. ఫైనాన్స్ డైరెక్టర్గా వంటెరు తిరుపతి రెడ్డి, ఆపరేషన్స్ డైరెక్టర్గా టి.మదుసూధన్, ప్రాజెక్ట్స్ డైరెక్టర్గా వంగూరు మోహన్ రావు, హెచ్ఆర్డీ అండ్ ఐఆర్ డైరెక్టర్గా సి.ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించగా.. సీఎండీ వారికి శుభాకాంక్షలు తెలిపారు. సమష్టి కృషితో కంపెనీని అభివృద్ధి పథంలో తీసుకెళ్దామని అన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు మాట్లాడుతూ.. సీఎండీ వరుణ్ రెడ్డి సారథ్యంలో కంపెనీ అభివృద్ధిలో భాగస్వాములవుతామని, వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన డైరక్టర్లను అసోషియేషన్లు, యూనియన్ల నాయకులు, ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలు, ఇతర అధికారులు, ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. -
వివస్త్రను చేసి.. జననాంగంలో జీడిపోసి..
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఐదు రోజుల క్రితం ఓ అమానవీయ ఘటన జరిగింది. ఓ వివాహితను వివస్త్ర చేసి జననాంగంలో జీడిపోసి విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడికి వివాహేతర సంబంధం కారణం కాగా, బాధిత మహిళ ఆచూకీ ఇప్పటివరకు బంధువులకు లభించలేదని సమాచారం. ఈఘటనకు సంబంధించి ‘సాక్షి’కి అందిన ఎక్స్క్లూజివ్ సమాచారం మేరకు.. తాటికాయల గ్రామానికి చెందిన ఓ యువతిని పదేళ్ల క్రితం ములుగు మండలం బోలోనిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి ముగ్గురు పిల్లలు. అతడికి సమీప బంధువైన ఓ వివాహితతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ మహిళతో కలిసి సుమారు పది రోజుల క్రితం ఎటో వెళ్లిపోయారు. దీంతో సదరు వ్యక్తి భార్య తనకు జరిగిన అన్యాయాన్ని స్వగ్రామమైన తాటికాయలకు వచ్చి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు కోపంతో రగిలిపోయి లేచిపోయిన ఆ ఇద్దరిని వెతికి ఐదు రోజుల క్రితం తాటికాయల గ్రామానికి తీసుకొచ్చి విచక్షణారహితంగా దాడి చేశారు. ఇద్దరికి గుండు గీయించారు. ఆ మహిళను ఓ మంచానికి కట్టేసి వివస్త్రను చేసి.. జననాంగంపై జీడీ (పూర్వకాలంలో నొప్పి తగ్గించేందుకు వాడేవారు, అదేవిధంగా శరీరంలోని సున్నిత అవయవాలపై పోస్తే పుండ్లు అవుతాయి) పోశారు. ‘తప్పు చేశాను.. క్షమించండి’ అని బాధిత మహిళ వేడుకున్నా.. పలువురు ఇష్టారీతిన దాడి చేశారు. యోనిలోంచి తీవ్ర రక్తస్రావమవుతున్నా వదల్లేదు. తర్వాత ఆఇద్దరిని ఏం చేశారో ఆచూకీ తెలియలేదు. ఈ అమానవీయ ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా పోలీసులకు సమాచారం అందలేదని తెలిసింది. అసలు ఆ ఇద్దరు ప్రాణాలతో ఉన్నారో, లేదో తెలియని పరిస్థితి. వివాహితపై దాడి వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంతోనే.. ఘటన జరిగి ఐదు రోజులు తాటికాయల గ్రామంలో అమానవీయం -
స్నాతకోత్సవానికి సమన్వయంతో పనిచేయాలి
కేయూ క్యాంపస్: జూలై 7న నిర్వహించనున్న కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవం నిర్వహణకు సమన్వయంతో పనిచేయాలని కేయూ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి ఆయా కమిటీల కన్వీనర్లు, మెంబర్లను కోరారు. ఇప్పటికే స్నాతకోత్సవం నిర్వహణకు ఐదుగురు ప్రొఫెసర్లతో కూడిన స్టీరింగ్ కమిటీ, 10 సబ్ కమిటీలను కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం నియమించారు. అన్ని కమిటీల కన్వీనర్లతో శుక్రవారం క్యాంపస్లోని అకాడమిక్ కమిటీ హాల్లో వీసీ ప్రతాప్రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, హైదరాబాద్లోని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. స్నాతకోత్సవం స్టీరింగ్ కమిటీ మెంబర్ కన్వీనర్ ఆచార్య రాజేందర్ మాట్లాడుతూ.. ఇప్పటికే 331 మంది విద్యార్థులు పీహెచ్డీ పట్టాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. 374 మంది విద్యార్థులకు 564 బంగారు పతకాలను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్నాతకోత్సవ నిర్వహణకు సంబంధించిన విషయాలను ఆయన వివరించారు. సమావేశంలో రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, స్ట్టీరింగ్ కమిటీ చైర్మన్ ఆచార్య మల్లారెడ్డి, యూనివర్సిటీ కాలేజీ ప్రొఫెసర్ మనోహర్, ప్రొఫెసర్ వెంకట్రామ్రెడ్డి, ప్రొఫెసర్ మల్లికార్జున్రెడ్డి, అమరవేణి, ప్రొఫెసర్ నర్సింహారెడ్డి, ప్రొఫెసర్ శ్రీలత, ప్రొఫెసర్ షమిత, ప్రొఫెసర్వై వెంకయ్య, ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి, డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేయూ వీసీ ప్రతాప్రెడ్డి -
గవర్నర్ దత్తత గ్రామంలో సంబురాలు
ఎస్ఎస్తాడ్వాయి: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దత్తత తీసుకున్న ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని కొండపర్తిలో గ్రామస్తులు శుక్రవారం సంబురాలు చేసుకున్నారు. కొండపర్తిలో ఇప్పటికే చాలా మేరకు అభివృద్ధి పనులు చేశారు. గ్రామంలోని ఆదివాసీలను వ్యవసాయం రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అభివృద్ధి పనులతోపాటు 45 ఇళ్లు మంజూరు చేశారు. 7 వ్యవసాయ బోరుబావుల నిర్మాణంతోపాటు మహిళలకు స్వయం ఉపాధి కోసం కుట్టుమిషన్లు, మిర్చి పౌడర్ తయారీ పనులు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామానికి చెందిన మేడారం జాతర చైర్మన్ అరెం లచ్చుపటేల్ ఆధ్వర్యంలో గ్రామస్తులు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క చిత్రపటాలకు శుక్రవారం క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా లచ్చుపటేల్ మాట్లాడుతూ మంత్రి సీతక్క సూచన మేరకు గవర్నర్.. కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో అభివృద్ధి చెందుతుందన్నారు. కొండపర్తి అభివృద్ధికి కృషి చేస్తున్న గవర్నర్, మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఇర్ప సీతారాములు, కల్తి రమేశ్, ఇర్ప రామయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. కొండపర్తిలో గవర్నర్, మంత్రి సీతక్క చిత్రపటాలకు క్షీరాభిషేకం -
భూ సమస్యలకు మోక్షం!
సాక్షి, మహబూబాబాద్: భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి చట్టం తీసుకొచ్చి రెవెన్యూ సదస్సుల ద్వారా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఆన్లైన్ చేస్తోంది. తర్వాత నోటీసులు ఇవ్వడం, విచారణ మొదలైన ప్రక్రియలు చేపట్టేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. త్వరగా తమ భూ సమస్యలు పరిష్కరించి పట్టాదారు పాస్పుస్తకాలు అందజేయాలని రైతులు కోరుతున్నారు. దరఖాస్తుల వరద.. జిల్లాలో ఎనిమిదేళ్లుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా అధికారులు పైలెట్ మండలాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఇది సక్సెస్ కావడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాల్లో జూన్ 3నుంచి 16వ తేదీ వరకు సదస్సులు నిర్వహించారు. ప్రత్యేకంగా తయారు చేసిన సమస్యల జాబితాతో కూడిన దరఖాస్తు ఫాం తయారు చేసి గ్రామాల్లో పంపిణీ చేశారు. సర్వే నంబర్ మిస్ కావడం, మ్యుటేషన్ పెండింగ్, డీఎస్ పెండింగ్, భూ స్వభావంలో మార్పు, పట్టేదారు వివరాల సరవణ, ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చడం, అసైన్డ్ ల్యాండ్, ఓఆర్సీ, వారసత్వం, భూ సేకరణ మొదలైన అంశాలపై దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 39,513 దరఖాస్తులు రాగా.. అధికంగా 2007 వారసత్వ సమస్యలు ఉండగా.. అత్యల్పంగా 38–ఈ సర్టిఫికెట్ సమస్యలు ఉన్నాయి. మొదలైన కసరత్తు ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించే ప్రక్రియ జిల్లాలో మొదలైంది. 18 మండలాల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఆన్లైన్లో ఎంట్రీ చేసేందుకు ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే ముందుగా ప్రతీ దరఖాస్తుదారుడికి, సమస్యకు కారణమైన వారికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఆ తర్వాత విచారణ చేసి అక్కడే గ్రామ పెద్దల సమక్షంలో పరిష్కరిస్తారు. అయితే అత్యధికంగా భూ సర్వేతో ముడిపడి ఉన్న సమస్యలు ఉండడంతో 183 మంది సర్వేయర్లను నియమించి 50రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. సర్వే ద్వారా ఆ భూ సమస్యలను పరిష్కరిస్తారు. ప్రక్రియ వేగవంతం భూ భారతి చట్టం అమలు ప్రక్రియ జిల్లాలో వేగంగా సాగుతోంది. రెండు మూడు రోజుల్లో నోటీసులు జారీ చేసి, ప్రతీ అంశాన్ని విచారణ చేస్తాం. ఈ విచారణలో రైతుల సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుంది. భూ భారతి చట్టం ద్వారా నిజమైన భూ యజమానికి మేలు జరుగుతుంది. –వీరబ్రహ్మచారి, అదనపు కలెక్టర్(రెవెన్యూ)జిల్లాలో వచ్చిన దరఖాస్తుల వివరాలు సమస్య వచ్చిన దరఖాస్తులు సర్వే నంబర్ మిస్సింగ్ 1,476 పెండింగ్ మ్యుటేషన్ 384 డీఎస్ పెండింగ్ 1,148 విస్తీర్ణం సవరణ 1,632 భూ స్వభావంపై 263 పట్టేదారు పేర్ల సవరణ 225 ప్రొహిబిటెడ్ జాబితా నుంచి తీసివేయడం 462 ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చడం 02 అసైన్డ్ భూ సమస్య 1,378 ఓఆర్సీ ఇష్యూ కానివి 45 38–ఈ సర్టిఫికెట్ రాకపోవడం 06 వారసత్వ సమస్య 2,007 భూ సేకరణ సమస్య 169 ఇతర సమస్యలు 30,316 మొత్తం దరఖాస్తులు 39,513 ఆన్లైన్లో భూ భారతి దరఖాస్తుల వివరాలు నమోదు రెవెన్యూ సదస్సుల్లో 39,513 అర్జీల స్వీకరణ ముందుగా నోటీసులు జారీ తర్వాత విచారణ, అవసరమైతే భూ సర్వే ద్వారా పరిష్కారం -
మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని వేమునూరు ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలోని వాటర్ ట్యాంక్కు ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీతో ప్రతీరోజు తాగునీరు వృథాగా పోతోంది. చాలారోజుల నుంచి పైపులైన్ లీకేజీ అవుతున్నా.. సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదు. ఈక్రమంలో ట్యాంకు పిల్లర్ల ప్రాంతంలో నీళ్లు నిలిచి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడే మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉండడంతో విద్యార్థులు అటువైపుగా వెళ్లి లీకేజీ నీళ్లలో జారిపడిన ఘటనలు ఉన్నాయని ఉపాధ్యాయులు వాపోతున్నారు. లీకేజీ కారణంగా ఆ ప్రాంతమంతా బురదమయంగా మారి అధ్వానంగా కనిపిస్తోంది. కాగా, మిషన్ భగీరథ అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు -
లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలి
మహబూబాబాద్: జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ సంబంధిత అఽధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. మంజూరు, గ్రౌండింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారి, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, హౌసింగ్ డీఈ రాజయ్య, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలి.. ప్రతీ గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్–2025లో జిల్లాను ముందంజలో ఉంచాలన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారి పాల్గొన్నారు. పటిష్ట చర్యలు తీసుకోవాలి.. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని లెక్టర్ అద్వైత్కుమార్సింగ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని వీసీ సమావేశ మందిరంలో రోడ్డు ప్రమదాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలలు ఉన్న ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారి, డీఎస్పీ తిరుపతి రావు, ఆర్అండ్బీ ఈఈ బీమ్లా పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ -
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
తొర్రూరు: అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. డివిజన్ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని 72 మంది లబ్ధిదారులకు రూ.72.8 లక్షల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద బిడ్డల వివాహాలకు ప్రభుత్వం సాయం అందించి అండగా నిలుస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేయలేనివి కాంగ్రెస్ ప్రభుత్వం 18 మాసాల్లో చేసి చూపుతుందన్నారు. పేదలకు అండగా రేవంత్రెడ్డి సర్కారు నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ కందాడి అచ్చిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్, స్థానిక నాయకులు గంజి విజయ్పాల్రెడ్డి, ముద్దం విక్రమ్రెడ్డి, చింతకుంట్ల శ్రీనివాస్రెడ్డి, వెన్నం సోమిరెడ్డి, మిత్తింటి హరీశ్, మొగుళ్ల లింగన్న, మహబూబ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
కపాలినీ, భగమాలినీ క్రమాల్లో భద్రకాళి
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం అమ్మవారికి కపాలినీ, భగమాలినీ క్రమాల్లో పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు ఉదయం 4 గంటల నుంచి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, క్షీరాన్న నివేదన, చతుఃస్థానార్చన తదితర పూజలు నిర్వహించారు. దశ మహావిద్యల్లోని కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని కపాలినీగా, షోఢశీక్రమాన్ని అనుసరించి భోగబేరాన్ని భగమాలినీగా అలంకరించి నవరాత్ర విశేష పూజలు జరిపారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు జరుపుకున్నారు. సినీ నటులు కొణిదెల నాగబాబు సతీమణి పద్మజ అమ్మవారిని దర్శించుకున్నారు. పూజల్లో ఆలయ చైర్మన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు పాల్గొన్నారు. ఆల య ఈఓ శేషుభారతి పర్యవేక్షించారు. -
నేడు బెస్ట్ అవైలబుల్ స్కీం ఎంపికలు
మహబూబాబాద్ అర్బన్: కలెక్టరేట్లోని ఐడీఓసీ కార్యాలయంలో శనివారం ఉదయం 9 గంటలకు 2025–26 విద్యా సంవత్సరానికి గిరిజ న విద్యార్థుల బెస్ట్ అవైలబుల్ స్కీం ఎంపికలు లాటరీ పద్ధతిలో నిర్వహించనున్నట్లు జిల్లా గిరిజన శాఖ అధికారి గుగులోతు దేశీరాం నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. బెస్ట్ అవైలబుల్ స్కీంకు దరఖాస్తు చేసుకున్న గిరిజన విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. ‘పది’ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలమహబూబాబాద్ అర్బన్: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయని డీఈఓ రవీందర్ రెడ్డి తెలిపారు. జిల్లాలో 57 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 54 మంది ఉత్తీర్ణులయ్యారని, 94.74శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు చెప్పారు. రికౌంటింగ్ పెట్టాలనుకునే విద్యార్థులు ఎస్బీఐ బ్యాంకులో రూ.500 చలాన్ చెల్లించి, ప్రధానోపాధ్యాయుడి సంతకంతో జూలై 7వ తేదీలోపు డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ హైదరాబాద్కు పంపించాలన్నారు. అలాగే రీ వెరిఫికేషన్ కోసం రూ.1000 చలాన్ చెల్లించి విద్యాశాఖ కార్యాలయంలోని ఎగ్జామినేషన్ సెక్షన్లో జూలై 7లోపు అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు ఏసీజీఈ మందుల శ్రీరాములు 98497 61012 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు. విద్యుత్శాఖ ఎస్ఈగా విజయేందర్రెడ్డి నెహ్రూసెంటర్/తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా విద్యుత్శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్ఈ)గా పి.విజయేందర్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా విద్యుత్శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఇన్చార్జ్ ఎస్ఈగా శ్రీనివాసాచారి కొద్దిరోజులు బాధ్యతలు చేపట్టగా.. పూర్తిస్థాయి ఎస్ఈగా పి.విజయేందర్రెడ్డి జిల్లాకు వచ్చారు. మహబూబాబాద్ జిల్లా నుంచి డివిజన్ ఇంజనీర్ టెక్నికల్గా విధులు నిర్వహిస్తున్న పెద్ది రాజం వరంగల్కు, తొర్రూరు డీఈ మధుసూదన్ మెట్పల్లికి బదిలీ అయ్యారు. కాగా పెద్దపల్లి డీఈ రవి తొర్రూరు డీఈగా బదిలీపై రానున్నారు. కాగా మహబూబాబాద్ డీఈటీ, తొర్రూరు డీఈ బాధ్యతలను ఇన్చార్జ్లకు అప్పగించారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా వెంకన్ననాయక్ నెహ్రూసెంటర్: సేవాలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా జిల్లాకు చెందిన వెంకన్ననాయక్ను నియమించినట్లు సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్య సంజీవ్నాయక్ శుక్రవారం తెలిపారు. హైదరాబాద్లో జరిగిన సంఘం రాష్ట్ర సమావేశంలో ఎన్నుకున్నారని, సంఘం బలోపేతం, గిరిజనుల హక్కుల సాధనకు పోరాటాలు నిర్వహిస్తానని వెంకన్ననాయక్ తెలిపారు. తన నియామకానికి కృషి చేసిన సంఘం జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. వర్సిటీ అధికారుల నిర్లక్ష్యంపై లోకాయుక్తలో ఫిర్యాదుఎంజీఎం: వరంగల్లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం, ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలకు మేలు చేయాలనే ఒప్పందం, నష్టపోయిన అర్హులైన 400 మెడికల్ విద్యార్థులకు న్యాయం జరగాలని, అవినీతి అధికారులపై విచారణ చేపట్టాలని కోరుతూ వినియోగదారుల మండలి రాష్ట్ర కమిటీ లోకాయుక్తలో ఫిర్యాదు చేసింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీలుగా మారడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు తప్పనిసరి. అయితే తెలంగాణ ప్రభుత్వ అనుమతి లేకున్నా.. 400 ఎంబీబీఎస్ సీట్లు ఉన్న రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీలుగా మారడం, ఈక్రమంలో గతేడాది అర్హులైన 400 మెడికల్ సీట్లు రాష్ట్ర ప్రభుత్వ పరిధి నుంచి దాటిపోవడంపై జరిగిన అవినీతిపై విచారణ కోసం లోకాయుక్తలో ఫిర్యాదు దాఖలు చేసినట్లు వినియోగదారుల మండలి ప్రతినిధులు సాంబరాజు చక్రపాణి, మొగిలిచర్ల సుదర్శన్ తెలిపారు. -
ప్రభుత్వం చేసే పనులను ప్రజలకు తెలపాలి
తొర్రూరు: రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచి పనులను గ్రామాల్లోని ప్రజలకు తెలపాలని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం డివిజన్ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో క్లస్టర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, పార్టీ కోసం కష్టపడిన నాయకులను సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా గెలిపించుకోవాలన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్ అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితం అందించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్, నాయకులు డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు, చాపల బాపురెడ్డి, పెదగాని సోమయ్య, జాటోతు నెహ్రూ, ఎర్రబెల్లి రాఘవరావు, జలకం శ్రీనివాస్, పింగిళి ఉష, వల్లపు యాకయ్య, అలువాల సోమయ్య, దొంగరి శంకర్, జాటోతు రవి, బచ్చలి లక్ష్మణ్, వల్లపు మల్లయ్య పాల్గొన్నారు. -
తడి, పొడి పద్ధతుల్లో విత్తన శుద్ధి చేసుకోవాలి
గూడూరు: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ఆధారంగా వరిలో తడి లేదా పొడి పద్ధతుల్లో విత్తనశుద్ధ్ది చేసుకోవాలని ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు అన్నా రు. గూడూరు, గాజులగట్టు గ్రామాల్లో శుక్రవారం వరి, పత్తి, మొక్కజొన్న పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వరిలో తడి పద్ధతిలో లీటరు నీటికి 3గ్రాముల కార్బండిజమ్ కలిపిన నీటిలో కిలో విత్తనాలను 12 నుంచి 24 గంటల పాటు నానబెట్టిన తర్వాత విత్తుకోవాలని సూచించారు. పొడి పద్ధతిలో కిలో విత్తనాలకు 1గ్రాము కార్బండిజమ్ కలిసి నేరుగా నారుమడిలో చల్లుకోవచ్చని తెలిపారు. వానాకాలం మొక్కజొన్న పంటను బోదె సాళ్ల పద్ధతిలో వేసుకోవాలని, దీంతో అధిక వర్షాలు కురిస్తే పంట ముంపునకు గురికాకుండా ఉంటుందన్నారు. యూరియాను మోతాదుకు మించి వినియోగించొద్దన్నారు. కార్యక్రమంలో ఏఓ అబ్దుల్ మాలిక్, ఏఈఓ మధు, రైతులు పాల్గొన్నారు. -
ట్రాఫిక్ కష్టాలు..
మహబూబాబాద్: జిల్లా కేంద్రం కొత్తబజారు మోడ ల్ మార్కెట్ ఎదుట ఉన్న రోడ్డు (పాత తొర్రూ రు బస్టాండ్ సెంటర్)లో ఏర్పాటు చేసిన పార్కింగ్ అ డ్డాతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. అక్కడ ఆటోలు, ద్విచక్రవాహనాలు, కార్లు పార్కింగ్ చేయడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రం కావడంతో ఆ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. కాగా వాహనాల పార్కింగ్తో పాటు ఆరోడ్డుకు ఇరువైపులా చిరువ్యాపారులు తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య జఠిలమైంది. ఇటీవల నెహ్రూసెంటర్లో తొలగింపు.. ఇటీవల నెహ్రూసెంటర్లో ఉన్న పార్కింగ్ అడ్డాను పోలీసులు తొలగించారు. ఆ ప్రాంతంలో మార్క్ చేసి, వాహనాలను పార్కింగ్ చేస్తే రూ.1000 జరి మానా విధిస్తామని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో ఆప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తీరింది. ఆరోడ్డు గుండా రైల్వే స్టేషన్కు వెళ్లే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం పార్కింగ్ తొలగించడంతో వాహనదారులు సాఫీగా వెళ్తున్నారు. కాగా పాత తొర్రూరు బస్టాండ్ సెంటర్లో ఉన్న పార్కింగ్ అడ్డాను తొలగించి ట్రాఫిక్ కష్టాలను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. మానుకోటలోని మోడల్మార్కెట్ ఎదుట పార్కింగ్ అడ్డా ఏర్పాటు వాహనదారులు, ప్రజలకు తప్పని తిప్పలు -
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలి
నెహ్రూసెంటర్: రానున్న మున్సిపాలిటీ, సర్పంచ్, స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ సత్తా చాటాలని, అధిక స్థానాలను కై వసం చేసుకోవాలని ఆపార్టీ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ సమావేశం జిల్లా కేంద్రంలోని ధర్మన్న కాలనీలో శుక్రవారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వందేళ్ల చరిత్ర కలిగిన సీపీఐని స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మున్సి పల్ మాజీ ఫ్లోర్లీడర్ అజయ్సారథి, పెరుగు కుమార్, చింతకుంట్ల వెంకన్న, శ్రావణ్, తోట రాజ కుమారి, మంద శంకర్, మాలోత్ రవీందర్, ఆబో తు అశోక్, మంచినీళ్ల రాకేశ్, తండ శ్రీనాథ్, మాధ వి, అలీమా తదితరులు పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి -
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
మహబూబాబాద్ అర్బన్/మహబూబాబాద్ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని విద్యాశాఖ వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల, అనంతారం మోడల్ స్కూల్, మహబూబాబాద్ మండలంలోని బ్రాహ్మణపల్లి ప్ర భుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు, విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడి గి తెలుసుకున్నారు. ఆర్జేడీ సత్యనారాయణ మాట్లాడుతూ.. సర్కారు బడుల్లోనే సుశిక్షుతులైన ఉపాధ్యాయులు ఉంటారని, ప్రతి విద్యార్థి ఆ తరగతి గది అభ్యసన సామర్థ్యాలు సాధించాలన్నారు. పాఠశాల ఆరంభం నుంచే పదో తరగతి విద్యార్థులను ఉపాధ్యాయులు వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలన్నారు. గణితం, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్ట్ల్లో విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాలను తెలుసుకున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు కూరగాయలు, గుడ్లు, మిక్స్డ్ వెజిటబుల్ బిర్యానీ అందించాలన్నారు. బ్రాహ్మణపల్లి పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయని, గార్డెనింగ్ ఆహ్లాదకరంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. పాఠశాల అభివృద్ధికి ప్రధానోపాధ్యాయుడు చేపడుతున్న కార్యక్రమాలు, ఉపాధ్యాయులు పనితీరును ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డీఈఓ రవీందర్రెడ్డి, ఏఎంఓ చంద్రశేఖర్ఆజాద్, కోఆర్డినేటర్ పూర్ణచందర్, ఎంఈఓ వెంకటేశ్వర్లు, పాఠశాలల హెచ్ఎంలు ఆరుద్ర వెంకటేశ్వర్లు, దారావత్ భద్రునాయక్, మోడల్ స్కూల్ ప్రిన్సి పాల్ ఉపేందర్, ఉపాధ్యాయులు పాలకుర్తి మౌని క, మాడిశెట్టి సూర్యప్రకాశ్, గొట్టిముక్కల పవన్ రాజ్, బొమ్మర కృష్ణమూర్తి, రాచకొండ ఉపేందర్, కుప్పం సూర్యతేజ, బానోత్ శంకర్ పాల్గొన్నారు. ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి