breaking news
Mahabubabad
-
నాన్బోర్డర్లు ఖాళీ చేయాల్సిందే..
కేయూ క్యాంపస్: కేయూ హాస్టళ్లలోని నాన్బోర్డర్లు గదులను వేకెట్ చేయాల్సిందేనని రిజిస్ట్రార్ వి.రామచంద్రం స్పష్టం చేశారు. వర్సిటీలో శనివారం రాత్రి ఇద్దరు విద్యార్థులపై పలువురు దాడిచేసిన ఘటన అనంతరం అదేరోజు రాత్రి, ఆదివారం రాత్రి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళనలు నిర్వహించడం, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. హాస్టళ్లల్లో నాన్బోర్డర్ల వల్ల తలెత్తుతున్న సమస్యలపై సోమవారం సాయంత్రం పరిపాలన భవనంలోని కమిటీ హాల్లో అన్ని విభాగాధిపతితులతోనూ, వర్సిటీ కాలేజీల ప్రిన్సిపాళ్లతో హాస్టళ్ల డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్లతో రిజిస్ట్రార్ రామచంద్రం సమావేశం నిర్వహించారు. నాన్బోర్డర్లు ఈనెల 17న సాయంత్రం వరకు వేకెట్ చేయాలని హాస్టళ్ల డైరెక్టర్ ఎల్పీ రాజ్కుమార్ సోమవారం సాయంత్రం సర్క్యూలర్ జారీ చేశారు. అలుమనాక్ ప్రకారం ఈనెల 20 నుంచి మధ్యాహ్నం లంచ్ తర్వాత హాస్టళ్లను మూసివేస్తున్నట్లు సర్క్యూలర్లో పేర్కొన్నారు. (దసరా సెలవుల నేపథ్యంలో) హాస్టళ్లలోని విద్యార్థులు నిబంధనలు పాటించకపోతే అడ్మిషన్లు రద్దు చేస్తామని కేయూ హాస్టళ్ల డైరెక్టర్ రాజ్కుమార్ సర్క్యూలర్లో పేర్కొన్నారు. విద్యార్థులతో సమావేశం కేయూలో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో హనుమకొండ, కాజీపేట ఏసీపీలు నర్సింహారావు, ప్రశాంత్రెడ్డి, కేయూ పోలీస్ స్టేషన్ సీఐ రవి కుమార్, ఎస్సై శ్రీకాంత్ సిబ్బందితో యూనివర్సిటీకి వచ్చారు. కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, వర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్, కేయూ పాలకమండలి సభ్యులు సురేశ్లాల్ సమక్షంలో హాస్టళ్ల విద్యార్థులతో పలు అంశాలపై చర్చించారు. సర్క్యూలర్ జారీ చేసిన హాస్టళ్ల డైరెక్టర్ -
వందేభారత్కు సిర్పూర్కాగజ్నగర్లో హాల్టింగ్
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే నాగ్పూర్–సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్కు సిర్పూర్కాగజ్నగర్ స్టేషన్లో హాల్టింగ్ కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ సోమవారం తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి సికింద్రాబాద్–నాగ్పూర్ (20102) వందేభారత్, ఈ నెల 19వ తేదీ నుంచి నాగ్పూర్–సికింద్రాబాద్ (201010 వందేభారత్ ఎక్స్ప్రెస్కు సిర్పూర్కాగజ్నగర్ స్టేషన్లో అధికారికంగా హాల్టింగ్ కల్పించినట్లు తెలిపారు. దీంతో కాజీపేట పరిసర ప్రాంతాల నుంచి సిర్పూర్కాగజ్నగర్కు వెళ్లే ప్రయాణికులకు తక్కువ సమయంలో ఎక్కువ దూరం వెళ్లేందుకు ఈ రైలు ఉపయోగపడనుంది. ఆర్సీఎఫ్ యూరియా వచ్చేసింది.. ఖిలా వరంగల్ : వరంగల్ రైల్వే గూడ్స్ షెడ్కు 1,319.220 మెట్రిక్ టన్నుల ఆర్సీఎఫ్ యూరియా వచ్చింది. సోమవారం ఉదయం 10 గంటలకు చేరిన వ్యాగన్ను వ్యవసాయ అధికారులు విజ్ఞాన్, రవీందర్రెడ్డి పరిశీలించారు. అనంతరం ఉమ్మడి జిల్లాలోని వరంగల్కు 209.22 మెట్రిక్ టన్నులు, హనుమకొండ 280, ములుగు 160, జయశంకర్ భూపాలపల్లి 220, జనగామ 230, మహబూబాబాద్ జిల్లాకు 220 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించారు. కేటాయింపుల ప్రకారం ఆయా జిల్లాలకు యూరి యా తరలింపు చేపట్టినట్లు వ్యవసాయ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. విశ్వేశ్వరయ్యకు రిజిస్ట్రార్ ఘన నివాళి కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీర్స్డేను పురస్కరించుకుని సోమవారం మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, ఆ కాలేజీ ప్రిన్సిపాల్ రమణ, టీజీఎస్పీడీసీఎల్ మాజీ డైరెక్టర్ సంధ్యారాణి పూలమాలలువేసి ఘన నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా ఇంజనీర్గా విశ్వేశ్వరయ్య సేవలను కొనియాడారు. -
ఫైనాన్సర్ల వేధింపులు భరించలేక..
● బావిలో దూకి వ్యక్తి బలవన్మరణం● మర్రిపల్లిలో ఘటనదుగ్గొండి: మధ్య తరగతి కుటుంబం.. పనిచేస్తే గాని పూట గడవదు. అప్పు భారమైంది. వేధింపులు మొదలయ్యా యి. అప్పు తీర్చే మార్గం కనిపించక బావిలో దూకి బలవన్మరణాకి పాల్పడ్డాడు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన కసివోజుల బ్రహ్మం(48) తనకున్న ఎకరంన్నర భూమిలో వ్యవసాయంతోపాటు ఇంటివద్ద వెల్డింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో నాలుగు సంవత్సరాలుగా మిరప సాగు చేస్తుండగా పంట గిట్టుబాటు కాక అప్పులే మిగిలాయి. ఇదిలా ఉండగా ఏడాదిన్నర క్రితం ఇల్లు నిర్మించాడు. దీనికి ప్రైవేట్ బ్యాంకు, ఫైనాన్స్ల వద్ద అప్పు తెచ్చాడు. రూ. 20లక్షలు అప్పు అయ్యింది. ఇంటి నిర్మాణం పూర్తయింది. అయితే ప్రతీనెల వాయిదాలు చెల్లించలేకపోవడంతో బ్యాంకర్లు, ఫైనాన్సర్లు ఒత్తిడి తెస్తున్నారు. వీటికి తోడు గ్రా మంలో కొంత మంది వద్ద అప్పు తీసుకున్నాడు. దీంతో అప్పు ఎలా చెల్లించా లని వారం రోజులుగా మదనపడుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉద యం 6 గంటలకు చేను వద్దకు వెళ్లి తిరిగా రాలేదు. దీంతో 10గంటలకు బావి వద్దకు వెళ్లిన భార్య శ్రీలత తన భర్త బావిలో పడినట్లు గుర్తించింది. దీంతో బా విలో వెతికి బ్రహ్మం మృతదేహాన్ని బయటకు తీశారు. బ్రహ్మం తన నడుముకు చున్నీతో రాయి కట్టుకుని బావిలో దూకాడు. దీంతో పైకి తేలలేదు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రణధీర్రెడ్డి తెలిపారు. అప్పుల బాధతో ఆటోడ్రైవర్.. బచ్చన్నపేట : అప్పుల బాధతో ఓ ఆటోడ్రైవర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని వంగా సుదర్శన్రెడ్డి నగర్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చింతల అర్జున్(38) తన ఆటో మరమ్మతుకు రావడంతో మరో ఆటో కొనుగోలు చేశాడు. దీనికితోడు తల్లిదండ్రులు కూడా కుటుంబ అవసరాలకు అప్పు చేశారు. మొత్తం సుమారు రూ. 8 లక్షల వరకు కావడంతో ఎలా తీర్చాలని కొంతకాలంగా మనస్తాపానికి గురవుతున్న అర్జున్.. సోమవారం తన వ్యవసాయ బావివద్ద ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య అనూష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై అబ్దుల్ హమీద్ తెలిపారు. కడుపునొప్పితో వృద్ధురాలు.. వెంకటాపురం(కె): కడుపు నొప్పితో ఓ వృద్ధురాలు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘట న మండలంలోని నేలారిపేటలో జరిగింది. ఎస్సై తిరుపతిరావు కథనం ప్రకారం.. గ్రామానికి చెంది న సంగం సమ్మక్క(60) రెండు నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. కుటుంబ సభ్యులు ఆ స్పత్రిలో చూపించి మందులు వాడుతున్నారు. అ యినా తగ్గకపోవడంతో ఆదివారం రాత్రి ఇంటి ఎదుట ఉన్న బావిలో దూకి అత్మహత్యకు పాల్పడింది. సోమవారం ఉదయం సమ్మక్క కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతుండగా బావిలో మృతదేహం కనిపించింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
విద్యార్థిని చితకబాదిన కిరాణాషాపు యజమాని
కురవి : చాక్లెట్లు కొనేందుకు కిరాణా షాపునకు వెళ్లిన విద్యార్థిని దుకాణ యజమాని, ఆమె కుమార్తె చితకబాదారు. ఈ ఘటన సోమవారం మండలంలోని కంచర్లగూడెం తండాలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కురవి మండలం కంచర్లగూడెం ప్రాథమిక పాఠశాలలో గుగులోత్ ఆకాశ్ ఐదో తరగతి చదువుతున్నాడు. కొంత మంది చిన్నారులు ఏడుస్తుండడంతో హెచ్ఎం వెంకటేష్ రూ.5 ఇచ్చి ఆకాశ్ను చాక్లెట్లు తీసుకురమ్మని చెప్పాడు. దీంతో తండాలోని కిరాణా షాపునకు వెళ్లాడు. అక్కడికి వెళ్లగానే కోతుల గుంపు బాలుడిపై దాడికి యత్నించాయి. దీంతో ఆకాశ్ భయంతో షాపులోకి వెళ్లాడు. ఆ సమయంలో షాపులో యజమాని లేడు. అనంతరం యజమాని గుగులోత్ కాళీ షాపులోకి వచ్చింది. షాపులోకి రాగానే భయపడుతున్న విద్యార్థి ఆకాశ్ను చూసి ఎందుకు లోపలికి వచ్చావని అడగడంతో కోతులు మీదకు రావడంతో వచ్చానని చెప్పాడు. విద్యార్థి మాటలు వినకుండా గల్లాపెట్టెలోని కొంత నగదును బాలుడి జేబులో పెట్టి దొంగతనం చేసేందుకు వచ్చావని విచక్షణారహితంగా కర్రతో కొట్టింది. యజమాని కుమార్తె బానోత్ ప్రమీల సైతం బాలుడిని దారుణంగా కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. రెండు గంటలపాటు బాలుడిని షాపులో బంధించి కొట్టారు. ఆకాశ్ తమ షాపులో దొంగతనం చేసేందుకు వచ్చాడని బాలుడి తండ్రి శివలాల్కు యజమాని ఫోన్ చేసి చెప్పింది. తాను వచ్చి మాట్లాడుతా అని ఫోన్ పెట్టేశాడు. తర్వాత బాలుడిని విడిచిపెట్టారు. ఆకాశ్ ఇంటికి వెళ్లలేదు. దీంతో తాత మంగ్యా తన మనుమడు ఆకాశ్ ఇంటికి రాకపోయే సరికి షాపు వద్దకు వెళ్లాడు. తన మనుమడు ఎక్కడ అని అడగడంతో షాపు యజమాని కాళీ ఇటుకతో తలపై కొట్టడంతో వృద్ధుడి తల పగిలింది. బాలుడి తండ్రి శివలాల్ తండాకు చేరుకుని కురవి పోలీస్ స్టేషన్లో జరిగిన విషయం చెప్పాడు. శివలాల్ ఫిర్యాదు మేరకు బాలుడిని కొట్టిన గుగులోత్ కాళీ, ఆమె కుమార్తె బానోత్ ప్రమీలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీశ్ తెలిపారు. బాలుడికి తీవ్రగాయాలు అడిగేందుకు వెళ్లిన తాతపైనా దాడి.. -
ఆదివాసీ సంస్కృతి
ప్రతిబింబించేలా గద్దెల విస్తరణ ఎస్ఎస్తాడ్వాయి : ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా అమ్మవార్ల గద్దెల విస్తరణ చేపట్టనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. పూజారుల అభిప్రాయం మేరకే పనులు జరుగుతాయని స్పష్టం చేశారు. సోమవారం మేడారంలో పూజారులు, ఆర్కిటెక్, దేవాదాయశాఖ అధికారులు, కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పీ శబరీశ్, పూజార్ల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావుతో కలిసి సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క, సారలమ్మ జాతరలో 20 ఏళ్ల తర్వాత మంత్రిగా సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. గద్దెల ప్రాంగణాల్లో మార్పులు, చేర్పులు చేయడంలో భాగంగా కొద్ది రోజులుగా పూజారులతో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గొట్టు, గోత్రాలు, ఆదివాసీ ఆచారాలు, చరిత్ర, జీవన విధానాల ప్రకారం నిర్మాణ పనులు జరుగుతాయని, దీనిపై గతంలోనే ముఖ్యమంత్రి సమక్షంలో సమావేశం నిర్వహించారన్నారు. చిన్న గద్దెల మార్పిడితో అపచారం జరుగుతుందనే ప్రచారంలో వాస్తవం లేదని, పూజారుల అభిప్రాయం మేరకే పనులు కొనసాగుతాయన్నారు. గద్దెల ప్రాంతాన్ని 20 ఫీట్ల వెడల్పు, 80 ఫీట్ల పొడవుతో ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. పూజారుల తుది నిర్ణయాల మేరకు మాస్టర్ ప్లాన్ రూపొందించి సీఎం ముందు ఉంచుతామని, త్వరలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పూజారులతో కలిసి మేడారంలో నూతన మాస్టర్ ప్లాన్ను ఆవిష్కరించనున్నట్లు మంత్రి తెలిపారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, ఆర్డీఓ వెంకటేష్, ఈఓ వీరస్వామి, పూజారులు ముణిందర్, వెంకటేశ్వర్లు, రఘుపతి, రమేశ్, సారయ్య, స్వామి, గోవర్ధన్, భోజరావు, కృష్ణయ్య, నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు. యుద్ధప్రాతిపదికన నిర్మాణ పనులు పూజారుల నిర్ణయం మేరకే మాస్టర్ ప్లాన్ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క -
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
హసన్పర్తి: గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు వివిధ అంశాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ రవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెల్ఫోన్ రిపేర్ (30రోజులు), బైక్ మెకానిక్ (30రోజులు), ఏసీ, రిఫ్రిజిరేటర్ (30రోజులు), ఎల్ఎండబ్ల్యూ డ్రైవింగ్ (30రోజుల) శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. 18 నుంచి 45ఏళ్ల వయసు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. ఆసక్తి గల వారు నాలుగు పాస్పోర్టు సైజ్ ఫొటోలు, తెల్లరేషన్, ఆధార్కార్డుతోపాటు విద్యార్హత జిరాక్స్ పత్రాలతో ఈనెల 25వ తేదీ లోపు సంస్కృతీ విహార్, హసన్పర్తిలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 9704056522కు నంబర్లో సంప్రదించాలని సూచించారు. వాజేడు: మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల పీఈటీ తెల్లం రాజ్యలక్ష్మి జాతీయ స్థాయి చెస్ పోటీలకు ములుగు జిల్లా నుంచి ఎంపికయ్యారు. ఈనెల 9, 10 తేదీల్లో హైదరాబాద్లో జరిగిన ఆలిండియా సివిల్ సర్వీసెస్ ఎంప్లాయీస్ రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతగా నిలిచారు. దీంతో న్యాయనిర్ణేతలు రాజ్యలక్ష్మిని జాతీయ స్థాయి చెస్ పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మిని ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులతోపాటు పలువురు ఉద్యోగులు అభినందించారు. రెండు బైక్లు ఢీ.. ● జీపీ కార్యదర్శి దుర్మరణం ● రక్మీ తండా శివారులో ఘటన నెక్కొండ: ఎదురెదురుగా రెండు బైక్లు ఢీకొన్నా యి. ఈ ప్రమాదంలో ఓ పంచాయతీ కార్యదర్శి దుర్మరణం చెందాడు. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కొర్ర వెంకట్రాం (55) మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం జయపురం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. సోమవారం విధులు ముగించుకుని బైక్పై వస్తున్నాడు. ఈ క్రమంలో మండలంలోని రక్మీ తండా శివారులో ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకట్రాంకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని శవపంచనామా నిర్వహించారు. మృతుడి కుమారుడు వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
మాజీ డిప్యూటీ సీఎం ‘తాటికొండ’ గృహ నిర్బంధం
హన్మకొండ: మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో తాటికొండ రాజయ్య పాదయాత్ర చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం రఘునాథపల్లి మండలంలో పాదయాత్ర కొనసాగించాల్సి ఉండగా అక్కడ నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా హనుమకొండ సర్క్యూట్ హౌజ్ రోడ్లోని స్వగృహంలో పోలీసులు గృహ నిర్బంధం లో ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, బీఆర్ఎస్ శ్రేణులు రాజయ్య ఇంటికి చేరుకుని సంఘీభావం తెలిపారు. సుమారు నాలుగు గంటల పాటు ఈ ఉద్రిక్తత కొనసాగింది. అనంతరం రాజయ్యను గృహ నిర్బంధం నుంచి విముక్తి చేయడంతో 12 గంటలకు సద్దుమణిగింది. అనంతరం పాదయాత్రకు వెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ నీతి వ్యాఖ్యలు మాట్లాడే స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సిగ్గు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి పార్టీ మారడం ఏ విలువలకు నిదర్శనమని ప్రశ్నించారు. రాజకీయ పబ్బం గడుపుకునేందుకే పార్టీ మారాడని దుయ్యబట్టారు. తాటికొండ రాజయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ జెండాతో గెలిచిన కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. పాదయాత్ర చేస్తుంటే భయం ఎందుకని ప్రశ్నించారు. ఏ పార్టీలో ఉన్నావో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం ఆరు నూరైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా పాదయాత్ర కొనసాగిస్తానని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్నారు. హనుమకొండలో ఉద్రిక్తత రైతుల కోసం పాదయాత్ర కొనసాగిస్తా అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య -
శ్రాద్ధకర్మ పూజలు చేయొద్దని అభ్యంతరం
కాళేశ్వరం: కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద శ్రాద్ధకర్మ పూజలు చేసేందుకు త్రివేణి తీర్థ బ్రాహ్మణ సంఘం సభ్యులంతా విశ్వబ్రాహ్మణ పురోహితుడికి అ భ్యంతరం తెలుపడంతో మనస్తాపానికి గురయ్యా డు. వెంటనే పెట్రోల్ బాటిల్ తీసుకుని మిషన్ భగీ రథ వాటర్ ట్యాంకుపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని, తనకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టాడు. ఈ ఘటన జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరిగింది. పురోహితుడి తల్లిదండ్రుల కథనం ప్రకారం.. కాళేశ్వరం గ్రామానికి చెందిన విశ్వబ్రాహ్మణుడు ము మ్మడి సురేశ్, రమ దంపతుల పెద్ద కుమారుడు రాకేశ్ మూడేళ్లుగా గోదావరిలో శ్రాద్ధ కర్మపూజలు చేసేందుకు వారి సమ్మతితోనే వెళ్తున్నాడు.ఈక్రమంలో సోమవారం యథావిధిగా గోదావరి వద్దకు వె ళ్లాడు. అక్కడ బ్రాహ్మణ సంఘం సభ్యులందరు ‘గోదావరికి నీవు రావొద్దు.. నువ్వు వస్తే నీతోపాటు మరి కొంత మంది ఇతర కులాల వారు వస్తామంటున్నారు’ అని అభ్యంతరం తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన రాకేశ్ పెట్రోల్ బాటిల్ తీసుకొని మిషన్భగీరథ వాటర్ ట్యాంకు ఎక్కి న్యాయం చేయాలని ఆందోళన చేపట్టాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై తమాషారెడ్డి ఘటనాస్థలికి చేరుకుని నచ్చచెప్పే యత్నం చేసినా ససేమిరా అని గంటన్నర పాటు ఆందోళన చేపట్టాడు. తనకు యథావిధిగా పురోహిత వృత్తికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశాడు. దీంతో బ్రాహ్మణ సంఘం సభ్యులు మాడుగుల పవన్శర్మ, జగన్శర్మ, ఆరుట్ల పవన్చార్యులు, రఘుచార్యులు.. హామీ ఇవ్వడంతో ఆ పురోహితుడుకిందికి దిగొచ్చాడు. దీంతో గొడవ సద్దుమణిగింది. మనస్తాపంతో పురోహితుడి ఆత్మహత్యాయత్నం పెట్రోల్తో ట్యాంకు ఎక్కి హల్చల్.. కాళేశ్వరంలో ఘటన -
దొంగల ముఠా అరెస్ట్
● కాపర్ వైర్, పలు సామగ్రి స్వాధీనం కాటారం(మహాముత్తారం): మహాముత్తారంతోపా టు పలిమెల మండలంలో వరుస చోరీలకు పాల్ప డిన దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం మహాముత్తారం పోలీస్స్టేషన్లో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ వివరాలు వెల్లడించారు. కాటారం మండలం దేవరాంపల్లికి చెందిన చిగురు సంతోష్, బుర్రకుంట ప్రకాశ్, జైనేని రమేశ్, షేక్ కుదరత్ ముఠాగా ఏర్పడ్డారు. కాటారం సబ్ డివి జన్ పరిధిలోని పలు గ్రామాల్లో పగలు ఆటోలో రెక్కీ నిర్వహించి రాత్రి సమయంలో చోరీలకు పా ల్పడుతున్నారు. ఇందులో భాగంగా ఇటీవల కాటారం మండలంలో మూడు ట్రాన్స్ఫార్మర్లు, కొయ్యూర్లో రెండు, పలిమెల, మహాముత్తారం ఒక్కో ట్రాన్స్ఫార్మర్ చొప్పున పగలగొట్టి కాపర్వైర్ అపహరించారు. అంతేకాకుండా మహాముత్తారం మండలంలో రోడ్డుపై ఉన్న ఎడ్ల బండి ఇనుప చక్రాలు, ట్రాక్టర్ బ్యాటరీ, మంథని మండలం ఆరెందలో పవర్ టిల్లర్ను చోరీ చేశారు. దీనిపై నిఘా పెట్టిన పోలీసులు పెట్రోలింగ్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున యామన్పల్లి వద్ద ఆటోలో అనుమానాస్పందగా ఉన్న సంతోష్, ప్రకాశ్, రమేశ్, కుదరత్ను అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నిందితులు చోరీలకు పాల్పడు తున్నట్లు అంగీకరించారు. దీంతో వారి వద్ద నుంచి కాపర్వైర్, పవర్ టిల్లర్, ట్రాక్టర్ బ్యాటరీ, ఎడ్ల బండి చక్రాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో కాటారం సీఐ నాగార్జునరావు, ఎస్సై మహేందర్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు రైల్వే అధికారుల పరిశీలన
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో నిర్మించిన మూడో రైల్వేలైన్, నూతన రైల్వే స్టేషన్ భవనం, ఎస్సీ–80 రైల్వే గేట్, ఇతర శాఖాపరమైన పనులను మంగళవారం కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ఉన్నత అధికారి కవిత, దక్షిణ మధ్య రైల్వే జీఎం పరిశీలన చేయనున్నారు. వారివెంట ఏజీఎం, సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 13 ప్రత్యేక విభాగాల ప్రిన్సిపల్ హెచ్ఓడీలు తనిఖీకి రానున్నట్లు సంబంధిత అధికారులు సోమవారం తెలిపారు. ఉదయం ప్రత్యేక తనిఖీల అనంతరం దక్షిణ మధ్య రైల్వే ఉన్నత అధికారుల బృందం కేసముద్రం రైల్వే స్టేషన్, అక్కడి నుంచి ఇంటికన్నె రైల్వే స్టేషన్ వరకు ప్రత్యేక రైలులో ప్రయాణం చేసి మూడో రైల్వే లైన్ నిర్మించిన ప్రాంతాన్ని పరిశీలన చేసి సర్టిఫికెట్ ఇవ్వనున్నారు. -
విద్యార్థుల సామర్థ్యాలు పెంచాలి
● డీఈఓ దక్షిణామూర్తిమహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సామర్థ్యాలను పెంచాలని డీఈఓ దక్షిణామూర్తి అన్నారు. జిల్లా కేంద్రంలోని కేజీబీవీని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ీఈఓ మాట్లాడుతూ.. నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని, బాలికలు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించే విధంగా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. అనంతరం తరగతి గదులు, వంట గదులను పరిశీలించి, చిన్న చిన్న మరమ్మతులు చేసుకోవాలన్నారు. జీసీడీఓ విజయకుమారి, సైన్స్ అధికారి అప్పారావు, పాఠశాల ఎస్ఓ భవాని పాల్గొన్నారు. -
ప్రణాళికతో నియోజకవర్గ అభివృద్ధి
● ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తొర్రూరు/పెద్దవంగర: పక్కా ప్రణాళికతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. తొర్రూరు మండలంలోని 78మంది లబ్ధిదారులకు రూ.78లక్షల విలువ చేసే కల్యాణలక్ష్మి చెక్కులను సోమవారం డివిజన్ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల 51 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.26.90లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణలోనే కాదు దేశమంతా యూరియా కొరత ఉందని, దానికి కేంద్రమే బాధ్యత వహించాలన్నారు. ఎన్నికల హామీ మేరకు దివ్యాంగులకు పింఛన్ పెంచాలని కోరుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఏఎంసీ డైరెక్టర్లు అచ్చిరెడ్డి, కంచర్ల వెంకటాచారి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, నాయకులు మోత్కూరి రవీంద్రాచారి, చిత్తలూరి శ్రీనివాస్, చెవిటి సదాకర్ పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 16 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
● పలు పాఠశాలల్లో వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత ● ఇష్టారాజ్యంగా వర్క్ అడ్జెస్ట్మెంట్ చేశారని ఆరోపణలు ● విద్యాపరంగా నష్టపోతున్న విద్యార్థులు‘మానుకోట మున్సిపాలిటీ పరిధి గాంధీపురం ఎంపీపీఎస్లో ఐదుగురు ఉపాధ్యాయుల్లో నలుగురు పదోన్నతులపై వెళ్లారు. ఉన్న ఒక ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ఒకటో తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు బోధిస్తున్నారు. మొత్తం 54మంది విద్యార్థులకు చదువుతున్నారు. కాగా, హెచ్ఎం కాంప్లెక్స్ సమావేశాలు, జూమ్ మీటింగ్కు హాజరుకావడం, ఎండీఎం అప్డేట్ చేయడం, ఎఫ్ఆర్ఎస్ ఇలా రకరకాల విద్యా సంబంధమైన డ్యూటీలు వేస్తున్నారు. ఈ క్రమంలో పాఠశాలకు సెలవు ఇవ్వాల్సిన దుస్థితి నెలకొంది. అధికారులు తక్షణమే స్పందించి ఇతర పాఠశాలల నుంచి డిప్యుటేషన్ పై ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.’ మహబూబాబాద్ అర్బన్: ఇటీవల ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి బదిలీలు చేశారు. కాగా అవసరం మేరకు ఆయా జిల్లాల్లో టీచర్ల సర్దుబాటు ప్రక్రియను సెప్టెంబర్ 4వ తేదీలోపు పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డీఈఓలను ఆదేశించారు. కలెక్టర్ల ఆమోదంతో ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. గతంలో జూలై 15లోపు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినా.. ఆ తర్వాత పదోన్నతులు, బదిలీల అంశం తెరపైకి రావడంతో అనేక జిల్లాల్లో టీచర్ల సర్దుబాటు పెండింగ్లో పడింది. పదోన్నతుల ప్రక్రియ పూర్తి కావడంతో తాజాగా మరోసారి ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఆరోపణలు.. జిల్లాలో 676 ప్రైమరీ పాఠశాలలు ఉండగా.. 19,213 మంది విద్యార్థులు చదువుతున్నారు. 120 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా 5,354 మంది విద్యార్థులు చదువుతున్నారు. 102 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా 13,497 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఆయా పాఠశాలల్లో 3,281 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. కాగా జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉన్నచోట విద్యార్థులు లేక, విద్యార్థులు ఉన్నచోట ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా, జిల్లా విద్యాశాఖ నెల రోజుల క్రితం 84మంది ఉపాధ్యాయులతో సర్దుబాటు చేసింది. అయితే ఎంఈఓలు నిర్లక్ష్యంగా, ఇష్టారాజ్యంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారని, జాబితాను తప్పుల తడకగా రూపొందించారని పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈసారైనా సక్రమంగా జరిగేనా.. ఈ విద్యా సంవత్సరం ఉపాధ్యాయుల సర్దుబాటు మొదట జరిగిన జిల్లాలో పదోన్నతులపై సుమారు 90మంది ఉపాధ్యాయులు ఇతర పాఠశాలలకు వెళ్లిపోయారు. అదేవిధంగా సర్దుబాటు చేసిన డీఈఓ కూడా పదవీ విరమణ పొందారు. నూతనంగా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన అధికారికి సర్దుబాటు విషయ తలనొప్పిగా మారింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మొత్తం 18 సబ్జెక్టులను బోధించడానికి విద్యార్థులకు అనుగుణంగా మొత్తం నలుగురు ఉపాధ్యాయులతో ఒక హెచ్ఎం ఉండాలి. గత డీఈఓ, విద్యాశాఖ అధికారులు చేసిన తప్పులు ఈసారి సరిదిద్దుకుంటారో లేదో వేచిచూడాలి. ఉపాధ్యాయులను సర్దుబాటు చేసి ఇబ్బందులు లేకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో సర్దుబాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. గతంలో మాదిరిగా ఉపాధ్యాయుల సర్దుబాటు విషయంలో తప్పిదాలు జరగకుండా ఈసారి విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమిస్తాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తాం. – దక్షిణామూర్తి, డీఈఓ -
పోలీస్ తిప్పలు!
● యూరియా పంపిణీలో జాగారం ● ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యూటీలు ● కొరతపై నిఘా వర్గాలతో నివేదిక ● పంపిణీలో మార్పులు, చేర్పులుసాక్షి, మహబూబాబాద్: రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు అందించే వ్యవసాయశాఖ.. ఈ ఏడాది సీజన్కు ముందు నుంచే యూరియా పంపిణీలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈక్రమంలో ఆగస్టు మొదటి వారం నుంచి పోలీసులు లేనిదే యూరియా పంపిణీ చేయలేమని వ్యవసాయశాఖ అధికారులు తేల్చి చెప్పారు. దీనికి తోడు రోజురోజుకూ సమస్య జఠిలం కావడం.. ఎక్కడ లేని సమస్య జిల్లాలోనే ఉండడంతో యూ రియా పంపిణీ అధికారులకు సవాల్గా మారింది. ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వచ్చేలా వ్యవహారం ముదరడంతో.. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి చొరవ తీసుకునే వరకు వెళ్లింది. దీంతో యూరియా పంపిణీ శాంతి భద్రతల సమస్య వర కు దారి తీయడం.. అందులో రైతుల సమస్య కావడంతో పోలీస్శాఖకు అగ్ని పరీక్షగా మారింది. రోజుకో చోట సమస్య.. యూరియా పంపిణీలో సమస్యను ఒకచోట చక్కదిద్దితే మరోచోట ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది. ఇలా జిల్లాలో యూరియా కోసం వచ్చిన రైతులు కింద పడిపోవడం, తలకు గాయాలు కావడం.. మరో చోట ప్రమాదానికి గురై మృతి చెందడం, ఇంకోచోట యూరియా లారీపై రైతులు దాడి చేసి యూరియా బస్తాలు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం.. క్యూలో రైతులు గొడవలు పెట్టుకోవడం.. మహిళల సిగపట్లు.. మొదలైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీటిని అదుపు చేయడం కోసం పోలీసు ల పహారా మధ్య టోకెన్లు, యూరియా బస్తాల పంపిణీ చేయాల్సి వస్తోంది. పోలీసుల జాగారం.. ఒక వైపు యూరియా ఎప్పుడు వస్తుందో.. టోకెన్లు ఎప్పుడు ఇస్తారో అనే ఆలోచనతో రైతులు పీఏసీఎస్ సెంటర్లు, ఆగ్రోస్, రైతు వేదికల వద్ద రాత్రంతా పడుకొని జాగారం చేస్తున్నారు. వీరితోపాటు పోలీసులు కూడా అక్కడే డ్యూటీలు చేస్తున్నారు. టోకెన్లు, యూరియా పంపిణీ వద్ద బందోబస్తూ కోసం.. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్తో పాటు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు తేడా లేకుండా యూరియా పంపిణీ కేంద్రాల వద్ద డ్యూటీలు చేస్తున్నారు. యూరియా అనేది అతిపెద్ద సమస్యగా పరిగణించి.. రోజు ఉదయం పోలీసులు కాన్ఫరెన్స్లో చర్చించుకొని పరిస్థితిని అంచనా వేసి డ్యూటీలు వేస్తున్నారు. అయితే పదిహేను రోజుల నుంచి యూరియా పంపిణీ పనిలోనే పోలీసులు ఉండడంతో ఇతర కేసుల కోసం స్టేషన్లో నామ మాత్రం సిబ్బందికి డ్యూటీలు వేస్తున్నారు. రంగంలోకి నిఘా వర్గాలు.. రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా చేస్తున్నామని వ్యవసాయ, సహకార శాఖ ల అధికారులు చెబుతున్నా.. సమస్య సద్దుమణగపోవడంతో అసలేం జరుగుతుందనే విషయంపై జిల్లా పోలీస్శాఖ నిఘా వర్గాలను రంగంలోకి దింపినట్లు సమాచారం.. సమస్య తీవ్రంగా ఉన్న మరిపెడ ఏడీఏ పరిధితోపాటు, ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. ఆగస్టు 28 వరకు పీఏసీఎస్లు, ఆగ్రోస్, ఇతర కేంద్రాల్లో ఇష్టారాజ్యంగా బస్తాలు ఇచ్చారు. ఇందులో రైతులే కాకుండా దళారులకు కూడా బస్తాలు ఇచ్చారు. దీంతో నిజమైన రైతులకు యూరియా అందలేదని గుర్తించినట్లు తెలిసింది. దీనిని అదుపు చేసేందుకు రైతు బంధు జాబితాను ముందు పెట్టుకొని పట్టాదారుపాస్ పుస్తకాలు, ఆధార్ కార్డును పరిశీలించి రైతు వేదికల్లో టోకెన్లు ఇచ్చి.. రైతుల జాబితాను డిస్ప్లే చేసి యూరియా పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టారు. డబ్బులు తీసుకోవడం మినహా.. టోకెన్లు ఇవ్వడం, బస్తాల పంపిణీ, రైతుల సమన్వయం చేసే పని అంతా పోలీసులే చేయడం మొదలు పెట్టారు. దీంతో గతంతో పోలిస్తే సమస్య కాస్త సద్దుమణిగిందని అధికారులు చెబుతున్నారు. -
‘ప్రజాపాలన’ ముఖ్య అతిథిగా రాంచంద్రునాయక్
సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వం ఈ నెల 17న అధికారికంగా నిర్వహించే ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే వేడుకలకు రాంచంద్రునాయక్ హాజరై జాతీయ పతాకావిష్కరణ చేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి విప్ మాట్లాడనున్నారు. వచ్చే నెల 4న ఐఆర్సీఎస్ సర్వసభ్య సమావేశం కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ మహబూబాబాద్: ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా సర్వ సభ్య సమావేశం వచ్చే నెల 4న నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని లయన్స్ క్లబ్ భవనంలో సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో ఐఆర్సీఎస్ కార్యవర్గం, ఎజెండాలోని పలు అంశాలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. సభ్యులు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. విద్యుత్ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి నెహ్రూసెంటర్: విద్యుత్ కాంట్రాక్టర్లకు పనులు ముగిసిన వెంటనే బిల్లులు చెల్లించాలని విద్యుత్ కాంట్రాక్టర్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు బందు సైదులు అన్నారు. విద్యుత్ కాంట్రాక్టర్లు సోమవారం విద్యుత్శాఖ జిల్లా ఎస్ఈ విజయేందర్రెడ్డికి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో ఆలస్యం జరుగుతుందని, రేట్ల పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నామని తెలిపారు. ఏడు సంవత్సరాలుగా రేట్ల పెంపు జరగలేదని ఆయన పేర్కొన్నారు. నేటి నుంచి సమ్మెలో ఉంటామని పనులను చేపట్టబోమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంట్రాక్టర్లు కుమార్, విశ్వేశ్వర్రావు, సోమిరెడ్డి, నరేష్, శివ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తిరుగుబాటు తప్పదు కేసముద్రం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే, ప్రజల్లో తిరుగుబాటు తప్పదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.నాగయ్య హెచ్చరించారు. సోమవారం మండల కేంద్రంలో జరిగిన ఆ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా నుంచి చమురు దిగుమతి నిలిపివేయాలనే పేరుతో, భారతదేశం ఎగుమతులపై 50శాతం టారిఫ్లు పెంచాడన్నారు. యురోపియన్ దేశాలపై భారత ఎగుమతులపై సుంకాలు వందశాతం పెంచాలని ఒత్తిడి తెస్తున్నాడన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆకుల రాజు, మార్తనేని పాపారావు, మండల కార్యదర్శి గొడిశాల వెంకన్న, నీరుటి జలేందర్, తాడబోయిన శ్రీశైలం, జల్లె జయరాజ్, నర్సయ్య, సావిత్ర, జాటోత్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ డిగ్రీ అడ్మిషన్ల గడువు పెంపు మహబూబాబాద్ అర్బన్: డాక్టర్ బీఆర్ అబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2025–26 విద్యా సంవత్సరానికి డిగ్రీ అడ్మిషన్ల గడువు ఈ నెల 26వరకు పెంచినట్లు ప్రభుత్వ డీగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్ నాయక్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో సోమవారం ఓపెన్ డిగ్రీ అడ్మిషన్ల వాల్ పోస్టర్ను అధ్యాపక బృందం ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ఇంటర్, ఐటీఐ, పాలిసెట్, ఓపెన్ ఇంటర్ పాసైన విద్యార్థులు ప్రవేశాలకు అర్హులన్నారు. డిగ్రీలో బీఎస్సీ సైన్స్, మ్యాథ్స్, బీకాం, బీఏ గ్రూపులు ఉన్నాయని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 500తో అడ్మిషన్ పొందవచ్చన్నారు. పూర్తి వివరాలకు 7382929705 నంబర్లో సంప్రదించాలన్నారు. -
డైలీ వేజ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
మహబూబాబాద్: గిరిజన ఆశ్రమ హాస్టల్ డైలీ వేజ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ పట్టణ కార్యదర్ళి కుమ్మరికుంట్ల నాగన్న డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో డైలీ వేజ్ వర్కర్లు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈసందర్భంగా నాగన్న మాట్లాడుతూ.. గతంలో గిరిజన ఆశ్రమ హాస్టల్ డైలీ వేజ్ వర్కర్లకు కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించారన్నారు. 2021లో ఆర్థికశాఖ విడుదల చేసిన జీఓ నంబర్ 64 వల్ల వేతనాలు తగ్గాయన్నారు. వెంటనే ఆ జీఓను రద్దు చేసి, పాత పద్ధతిలోనే వేతనాలు ఇవ్వాలన్నారు. 212జీఓను సవరణ చేసి 2014 నాటికి ఐదు సంవత్సరాలు సర్వీస్ ఉన్న వారిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలు విడుదల చేయాలన్నారు. నాయకులు కుర్ర మహేశ్, జ్యోతిబసు, మధు, వెంకన్న, మహేశ్, లింగ్యా, రవీందర్ పాల్గొన్నారు. -
నీలినీడలు..
నగదు అందించాలి.. నగదు బదిలీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేసి సొసైటీలకు డబ్బులు అందించాలి. టెండర్ల ద్వారా ఉచితంగా ఇస్తున్న చేప పిల్లలు సరైన సైజు ఉండడం లేదు. తక్కువగా పిల్లలు వస్తున్నాయి. తద్వారా మత్స్యకారులకు ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదు. వెంటనే ప్రభుత్వం స్పందించి నగదు చేయాలి. – కొత్తూరు రమేశ్, ముదిరాజ్ సంఘం నాయకుడు త్వరలో పంపిణీ చేస్తాం జిల్లా వ్యాప్తంగా ఉచిత చేప పిల్లలను త్వరలో పంపిణీ చేస్తాం. ఈనెలలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి చేప పిల్లలను చెరువులు, కుంటల్లో వదిలేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మత్స్య సొసైటీ ప్రతినిధులు, మత్స్యకారులు ఆందోళన చెందవద్దు. –శివప్రసాద్, జిల్లా మత్స్యశాఖ అధికారి తొర్రూరు రూరల్: మత్స్యకారులకు ఉపాధి కల్పించడంతో పాటు ఆర్థికంగా తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం ప్రవేశపెట్టింది. ఏటా టెండర్లు నిర్వహించి చెరువులు, కుంటల్లో చేప పిల్లలను వదులుతున్నారు. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు టెండర్లు నిర్వహించకపోవడంతో చేప పిల్లల పంపిణీ ఉంటుందా.. ఉండదా అని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. కాగా చేప పిల్లలకు బదులు సొసైటీలకు నగదు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో ప్రణాళిక ఇలా.. జిల్లాలోని సుమారు 1,000 చెరువులు, 220 కుంటల్లో 4.50కోట్ల చేప పిల్లలను ఈ ఏడాది వదిలేందుకు మత్స్యశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడం, నిధులు మంజూరు చేయకపోవడం చేప పిల్లల పంపిణీ టెండర్ ప్రక్రియ చేపట్టలేదు. కాగా అదును దాటితే చేప పిల్లల ఉత్పత్తి సరిగ్గా ఉండదని మత్స్యకారులు అంటున్నారు. నగదు బదిలీ చేయాలి.. టెండర్ ద్వారా అందించే చేప పిల్లలు నాసికరంగా ఉండడంతో ఎదగడం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. టెండర్లు దక్కించుకుంటున్న కాంట్రాక్టర్లు చేపపిల్లల్లో కోత విధిస్తున్నారని, చిన్న సైజు పిల్లలను ఇస్తూ చేతులు దులుపుకుంటున్నార ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తద్వారా తమ ఉపాధికి గండి పడుతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి నగదు బదిలీ పథకాన్ని అమలు చేసి నేరుగా మత్స్య సొసైటీలకు డబ్బులు ఇవ్వాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. చేప పిల్లల పంపిణీపై సందిగ్ధం ఇంకా పూర్తికాని టెండర్లు అదును దాటితే పిల్లలు పెరగవని ఆందోళన సొసైటీలకు నగదు అందించాలని మత్స్యకారుల డిమాండ్ -
పారిశుద్ధ్యంపై అశ్రద్ధ వహిస్తే చర్యలు
మహబూబాబాద్ రూరల్ : పారిశుద్ధ్యంపై అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే మురళీనాయక్ అన్నారు. మున్సిపల్ అధికారులతో మహబూబా బాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలో నిర్వహించే బతుకమ్మ పండుగ ఏర్పాట్ల గురించి మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకుని, ప్రతీ వీధిలోనూ లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు బతుకమ్మ ప్రాంగణంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. పట్టణంలోని వెజ్, నాన్ వెజ్ కూరగాయల మార్కెట్ కోసం రూ.90 లక్షల నిధులు మంజూరు చేయించినా ఇప్పటికీ పనులు అసంపూర్తిగా ఉండడంపై మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా ఆ పనులు పూర్తి చేయాలని, అంతేకాకుండా మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్యం లోపిస్తుందని, అధికారులు ఎవరైనా పారిశుద్ధ్య పనులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, మున్సిపల్ డీఈ ఉపేందర్, అధికారులు పాల్గొన్నారు. -
షెడ్యూల్ ప్రకారం సిలబస్ పూర్తి చేయాలి
● నామాలపాడు ఏకలవ్య పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ బయ్యారం: షెడ్యూల్ ప్రకారం పాఠశాలలో సిలబస్ పూర్తి చేయాలని కలెక్టర్ అధ్వైత్కుమార్సింగ్ ఉపాధ్యాయులకు సూచించారు. మండలంలోని నామాలపాడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కిచెన్, డైనింగ్హాల్, మ్యూజిక్, తరగతి గదులను తనిఖీ చేసి అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. బోధనాంశాలతో పాటు సబ్జెక్టుల్లో విద్యార్థుల శక్తిసామర్థ్యాలను తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులతో మాట్లాడుతూ.. విద్యార్థులకు అర్థమయ్యే పద్ధతుల్లో పాఠాలు బోధించాలని, విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలన్నారు. మెనూ ప్రకారం పరిశుభ్రమైన ఆహారం అందించటంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కలెక్టర్ వెంట పాఠశాల ప్రిన్సిపాల్ తదితరులు ఉన్నారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి నెహ్రూసెంటర్: ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరైన సమయంలో వైద్య చికిత్స అందించాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ సూచించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకో వాలన్నారు. ఆస్పత్రి ఆవరణను పరిశుభ్రంగా ఉంచుతూ రోగులకు ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఫీవర్ వార్డు, పిల్లల వార్డులను పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ఆర్ఎంఓ జగదీశ్వర్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కేయూలో ఉద్రిక్తత
● ఇద్దరి విద్యార్థులపై దాడి చేసిన వారిపై కేసు కేయూ క్యాంపస్: కేయూలో ఇద్దరు విద్యార్థులపై దాడి ఘటనతో శనివారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎంబీఏ ఫస్టియర్ విద్యార్థులు గజానంద్, పవన్ శనివారం రాత్రి 8: 20 గంటలకు బైక్పై కామన్ మెస్కు వెళ్తుండగా గెస్ట్హౌస్ ప్రాంతంలో పలువురు అడ్డుకుని దాడి చేశారు. దీంతో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే యత్నం చేశారు. దాడిచేసి కొట్టినవారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీస్ వాహనంలో తరలించే యత్నం చేశారు. అక్కడికి చేరుకున్న విద్యార్థులు వాహనాన్ని అడ్డుకొని రాత్రి 11:30 గంటల వరకు ఆందోళన చేపట్టారు. కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి, కేయూ సీఐ రవికుమార్, ఎస్సై రవీందర్ తదితరులు దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేస్తామని సర్దిచెప్పారు. చివరికి పోలీసులు ఇద్దరిని మాత్రం అదుపులోనికి తీసుకొని వెళ్లారు. ఆ తర్వాత వదిలివేసినట్లు సమాచారం. బాధిత విద్యార్థులు గజానంద్, పవన్ ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన గట్టు ప్రశాంత్, అఖిల్తోపాటు మరికొందరిపై కేసును నమోదు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. నాన్బోర్డర్లు రాకుండా చర్య తీసుకోవాలి హాస్టళ్లలోకి నాన్బోర్డర్లు రాకుండా చూడాలని ఆదివారం సాయంత్రం 6:45 గంటలకు విద్యార్థులు కేయూ మొదటి గేట్ వద్ద ఆందోళన చేశారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు, కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, హాస్టళ్ల డైరెక్టర్ వచ్చి విద్యార్థులకు నచ్చజెప్పారు. కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి ఆందోళన చేస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాన్బోర్డర్లపై కేయూ అధికారులు చర్యలు తీసుకుంటే సహకరిస్తామని పేర్కొన్నారు. దీంతో రాత్రి 11 గంటలకు ఆందోళన విరమించారు. -
పోగొట్టుకున్న నగదు బ్యాగు అందజేత
ఖిలా వరంగల్: పోగొట్టుకున్న నగదు బ్యాగు బాధితుడికి అందజేశారు. మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన మహమ్మద్ అఫ్సర్ సెకండ్ హ్యాండ్ బొలెరో వాహనం కొనుగోలు చేసేందుకు శనివారం హైదరాబాద్ నుంచి నేరుగా మడికొండకు చేరుకున్నాడు. కన్సల్టెన్సీలో సెకండ్ సేల్స్ వాహనాలు నచ్చకపోవడంతో మడికొండ నుంచి నేరుగా ఆటో ఎక్కి వరంగల్ ఆర్టీఏ జంక్షన్లో దిగాడు. వాహనం కొనుగోలు కోసం వెంట తెచ్చిన రూ.3 లక్షల నగదు గల బ్యాగును ఆటోలోనే మర్చిపోయాడు. కన్సల్టెన్సీకి వెళ్లి చూసుకుంటే ఆటోలో రూ.3 లక్షల బ్యాగు మర్చిపోయానని గ్రహించి వెంటనే శనివారం సాయంత్రం మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ చాలెంజ్గా తీసుకొని సీసీ కెమెరాలను పరిశీలించారు. బ్యాగు మరిచిపోయిన ఆటోను కనిపెట్టి కాజీపేటకు చెందిన ఆటో డ్రైవర్ యాసిన్ను అభినందించి, రూ.3లక్షల బ్యాగును బాధితుడు మహమ్మద్ అఫ్సర్కు ఆదివారం ఇన్స్పెక్టర్ బొల్ల రమేశ్ చేతుల మీదుగా అందజేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే బ్యాగును కనిపెట్టి బాధితుడికి అప్పగించేందుకు సహకరించిన ఎస్సై శ్రావణ్, క్రైం పార్టీ కానిస్టేబుల్ జంపాల నాగేశ్వరరావును ఏఎస్పీ శుభం, ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్ అభినందించారు. -
ఉత్సాహంగా రోలర్ స్కేటింగ్ ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: రెండు రోజుల పా టు నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్–5 నుంచి 18 బాలబాలికలకు రోలర్ స్కేటింగ్ ఎంపిక పోటీలు ఆదివారం ముగిశా యి. మొదటి రోజు ఉనికిచర్లలోని ఎస్ఎస్హౌస్ వద్ద నిర్వహించగా, రెండో రోజు రాంపూర్లోని ఢిల్లీ పబ్లి క్ స్కూల్ ఆవరణలోని స్కేటింగ్ రింక్లో నిర్వహించారు. ఈ ఎంపిక పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి 50 మంది క్రీడాకారులు హాజరైనట్లు స్కేటింగ్ అసో సియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సిద్దార్థ, ఓం ప్రకాశ్ తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీ డాకారులు త్వరలో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలు ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తామనే వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. విజేతలకు డీపీఎస్ ప్రిన్సిపాల్ ఇన్నారెడ్డి బహుమతులు అందజేశారు. -
పెంపకమే ప్రాధాన్యం..
కాజీపేట/చిల్పూరు : పాడి అభివృద్ధికి పెయ్యదూడల సంరక్షణనే కీలకం.. దూడల పెంపకంపై పాడి రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని పశు వైద్యాధికారులు తెలిపారు. దూడల పెంపకంపై శ్రద్ధ వహిస్తే అధిక లాభాలు పొందవచ్చని పేర్కొన్నారు. పెయ్యదూడల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మడికొండ పశువైద్యాధికారి కరుణాకర్ రెడ్డి, మల్కాపూర్ పశువైద్యాధికారి మూడిక అనేష్ సూచనలు.. జాగ్రత్తలు తప్పనిసరి.. పెయ్యదూడలు పుట్టినప్పటి నుంచి ఎదకు వచ్చే వరకు వాటిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. దూడలు బలంగా, ఆరోగ్యంగా ఉండేలా పాడి రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. పుట్టిన దూడకు వెంటనే జున్ను పాలు తాగించాలి. దీంతో దూడలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి భవిష్యత్లో వాటికి వ్యాధులు సోకకుండా, ఆరోగ్యంగా ఉంటాయి. అయితే అవగాహన లేక కొంతమంది రైతులు పాడి పశువుల నుంచి మొత్తం పాలను పితుకుతారు. దీంతో దూడలకు పాలు సరిపోక నీరసించి, వ్యాధి నిరోధక శక్తి కోల్పోతుంది. అనంతరం వ్యాధుల బారిన పడి మృత్యువాత పడే అవకాశం ఉంది. అందుకే రైతులు దూడలకు సరిపడా పాలు అందేలా జాగ్రత్త వహించాలి. పాడి పరిశ్రమ వైపు మొగ్గు.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం తదితర పనుల నిర్వహణకు తగినంత సాగునీరు లేకపోవడంతో రైతులు పాడి పరిశ్రమ వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రారంభంలో ఒకటి, రెండు ఆవులను కొనుగోలు చేసి పాడిని ప్రారంభిస్తున్నారు. వ్యవసాయ పనులతో పాటు ఉదయం, సాయంత్రం కొద్దిపాటి సమయం పాడి పశువుల కోసం సమయం కేటాయిస్తూ అధిక లాభాలు పొందుతున్నారు. ఇప్పటికే ఆవులను కొనుగోలు చేసి, లాభాలు పొందుతున్న రైతులను గమనిస్తున్న ఇతరులు పాడి ఆవులను కొనుగోలు చేసి పాడి పరిశ్రమపై ఆధారపడేందుకు మొగ్గు చూపుతున్నారు. దూడలను కాపాడుకుంటూ అదనపు ఆదాయం పొందుతున్నారు.పాడి రైతులు పుట్టిన దూడల పెంపకంపై జా గ్రత్త వహించకుండా పాలిచ్చే ఆవులపై మా త్రమే దృష్టి సారిస్తున్నారు. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. లేగదూడలు పుట్టి న వెంటనే వాటికి ముర్రుపాలు తాగించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. బొడ్డు కోసే సమయంలోనూ జాగ్రత్త అవసరం. లేగదూడల వ యస్సును బట్టి అవి బలిష్టంగా పెరిగేందుకు సరిపడా పాలు మిగల్చడం ఎంతో ముఖ్యం. దూడలు ఆరోగ్యంగా పెరిగితేనే భవిష్యత్లో అధిక మొత్తంలో పాలు ఇస్తాయి. పెంపకంలో ఎటువంటి అనుమానం తలెత్తిన వెంటనే స మీపంలోని పశువైద్యాధికారిని సంప్రదించా లి. వెంటనే అనుమానాన్ని నివృత్తి చేసుకుని అవసరమైన వైద్య పరీక్షలు చేయించాలి. లేకపోతే భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. పాడిపశువుల విషయంలో పరిశుభ్రత ము ఖ్యమైందని పెంపకందారులు గుర్తించాలి. దూడల సంరక్షణతోనే పాడి వృద్ధి మడికొండ, మల్కాపూర్ పశువైద్యాధికారులు కరుణాకర్ రెడ్డి, అనేష్ దూడలకు సోకే వ్యాధులు..పెయ్యదూడల సంరక్షణలో వాటికి పలు వ్యాధులు సోకే అవకాశం ఉంది. వైరస్, బ్యాక్టీరియా, ఇతరత్రా వ్యాధులు సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా దూడలకు అతిసార, తెల్ల పారుడు, న్యూమోనియా, రక్తవిరోచనాలు, కీళ్ల నొప్పులు, బొడ్డువాపు వ్యాధులతో పాటు ఇతరత్రా వ్యాధులు, పరాన్న జీవులతో వ్యాప్తి చెందుతాయి. దూడలు ఎటువంటి రోగాల బారిన పడకుండా పెరిగితే రైతుకు ఆదాయమే. వీటి పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. -
ముగిసిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
జఫర్గఢ్ : జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం కూనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి 44వ సబ్ జూనియర్ ఇంటర్షిప్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. బాలికల విభాగంలో మెదక్ జట్టు మొదటి స్థానం, ఖమ్మం ద్వితీయ, వరంగల్ తృతీయ, ఆదిలాబాద్ జట్లు నాలుగో స్థానంలో నిలిచాయి. బాలుర విభాగంలో ఆదిలాబాద్ ప్రథమ, నల్లగొండ ద్వితీయ, కరీంనగర్ తృతీయ, నిజామాబాద్ జట్టు నాలుగో స్థానంలో నిలిచాయి. ఈ జట్లకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి జనగామ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు గాదెపాక అయోధ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు జయాకర్, అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.దుర్గయ్య, ప్రధాన కార్యదర్శి రమణ హాజరై మాట్లాడారు. దేశంలో క్రీడలు, క్రీడాకారులకు గుర్తింపు ఉందన్నారు. మారుమూల ప్రాంతమైన కూనూర్లో రాష్ట్రస్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ బాధ్యులు నారాయణరెడ్డి, వీరభద్రరావు, రవీందర్ కుమార్, వీరయ్య, కమల్కుమార్, తిరుపతి, శ్రీనివాస్రెడ్డి, నిర్వాహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రథమ స్థానంలో ఆదిలాబాద్, మెదక్ జట్లు -
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు అండగా ఉంటాం
● టీఎస్ ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యాం మనోహర్ హన్మకొండ: విద్యుత్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం కృషి చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాసరి శ్యాం మనోహర్, రాష్ట్ర సెక్రటరీ జనరల్ మేడి రమేశ్ అన్నారు. శనివారం రాత్రి హనుమకొండ విద్యుత్ నగర్లోని డీఐపీఈఏ భవన్లో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం టీజీ ఎన్పీడీసీఎల్ శాఖ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఇందులో టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 జిల్లాల నుంచి అసోసియేషన్ జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు తమ సమస్యలను అసోసియేషన్ దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం టీజీ ఎన్పీడీసీఎల్ శాఖ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎ.ఆనందం, వర్కింగ్ ప్రెసిడెంట్గా బి.శంకర్, ప్రధాన కార్యదర్శిగా ఎన్.కుమారస్వామి ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో సంఘం వ్యవస్థాపకుడు కలకుంట్ల మాణిక్యం, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ ఆర్.నాంపల్లి, వర్కింగ్ ప్రెసిడెంట్ కె.చంద్రయ్య పాల్గొన్నారు. -
పీఆర్సీ అమలు చేయాలి
టీఆర్టీఎఫ్ రాష్ట్ర చీఫ్ పాట్రన్ సంజీవరెడ్డి విద్యారణ్యపురి: ఉద్యోగ, ఉపాధ్యాయులకు 60 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) రాష్ట్ర చీఫ్పాట్రన్ లక్కిరెడ్డి సంజీవరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలోని సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో టీఆర్టీఎఫ్ హనుమకొండ, వరంగల్ జిల్లాల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ స్టేట్ జాయింట్ కౌన్సిల్లో టీఆర్టీఎఫ్నకు తిరిగి ప్రాతినిథ్యం కల్పించినందుకు సీఎం రేవంత్రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర కోకన్వీనర్ దాక్షపు విష్ణుమూర్తి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన డీఏలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీఆర్టీఎఫ్ బాధ్యులు పెండెం మధుసూదన్, రాజునాయక్ మాడిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో రెండు జిల్లాల నూతన కార్యవర్గాలను ఎన్నకున్నారు. హనుమకొండ జిల్లా కార్యవర్గం.. టీఆర్టీఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా బాసిరి రాజిబాపురావు, ప్రధాన కార్యదర్శిగా గు గులోత్ శ్రీనివాస్ నాయక్, ఉపాధ్యక్షులుగా గుండు సదానందం, బంగారు స్వామి ఎన్నికయ్యారు. వరంగల్ జిల్లా.. టీఆర్టీఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా వడ్డె కిషన్, ప్రధాన కార్యదర్శిగా తాళ్లపల్లి రాజు, ఉపాధ్యక్షులుగా భక్తిని రాజేశ్, శ్రీపతి కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శులుగా ల్యాద లింగమూర్తి, కలకోట ప్రభాకర్, బుర్ర మొగిలి, శివశంకర్ ఎన్నికయ్యారు. సమావేశంలో బాధ్యులు మాడిశెట్టి శ్రీనివాస్, సర్వర్నాయక్, సారంగం, మురళి పాల్గొన్నారు. -
అమ్మానాన్న కోసం అన్వేషణ
ఖిలా వరంగల్: చిన్నతనంలో ఓ అనాథాశ్రమంలో పెరిగిన కుమార్తె సంధ్యారాణి తల్లిదండ్రుల కోసం అన్వేషిస్తోంది. కన్నవారిని కలవాలని స్వీడన్ దేశం నుంచి ఆమె ఆదివారం వరంగల్కు వచ్చింది. తల్లిదండ్రుల మూలాలు ఇక్కడే ఉన్నాయని వరంగల్ శివనగర్లోని పోపా రాష్ట్ర అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్తోపాటు పద్మశాలి సంఘాల ప్రతినిధులను కలిసింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘మా తల్లిదండ్రులు రాజ్కుమార్, అనసూయ. కొందరు నా తల్లి చనిపోయిందని అంటున్నారు. కానీ, ఆమె చనిపోలేదు. నా వయసు రెండేళ్లు ఉన్నప్పుడు బతుకుదెరువు కోసం నాన్న నన్ను తీసుకుని హైదరాబాద్ ఖైరతాబాద్లోని ప్రేమ్నగర్ వెళ్లాడు. అక్కడ నిజాం కాలేజీ తోటమాలి రామయ్యతో ఆయనకు పరిచయం ఏర్పడింది. అక్కడే ఓ బార్ అండ్ రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేశాడు. ఈ విషయం తెలిసి రామయ్య తన మరదలు విజయను నాన్నకు ఇచ్చి వివాహం చేశాడు. మూడు నెలలు ఆమెతో కాపురం చేసిన ఆయన ఓ రాత్రి నన్ను విజయ దగ్గరే వదిలేసి పత్తాలేకుండా వెళ్లిపోయాడు. అతడి ఆచూకీ కోసం రామయ్య గాలించినా దొరకలేదు. దీంతో విజయ.. మూడేళ్ల వయసున్న నన్ను విజయనగర్ కాలనీలోని ‘సేవా సమాజం.. బాలికా నిలయం’ అనే అనాథాశ్రమంలో వదిలేసింది.సంతానం లేని స్వీడన్కు చెందిన లిండ్, గ్రేన్ నన్ను ఆశ్రమం నుంచి దత్తత తీసుకున్నారు. చిన్నతనం నుంచి అక్కడే పెరిగి పెద్దయ్యా. ఊహ తెలిసినప్పటి నుంచి స్వీడన్ నా దేశం కాదు.. వాళ్లు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కాదని గ్రహించా. పైచదువుల కోసం యూకే వెళ్లాక ఓ ఫ్రెండ్ ప్రేరణతో నా అసలు పేరెంట్స్ గురించి 2009 నుంచి అన్వేషణ ప్రారంభించా. ఇందులో భాగంగా ఆదివారం వరంగల్ శివనగర్కు చేరుకున్నా. పద్మశాలి సంఘం ప్రతినిధి, పోపా రాష్ట్ర అధ్యక్షుడు శామంతుల శ్రీనివాస్ను కలిశా. తన తండ్రి రాజ్కుమార్, తల్లిపేరు అనసూయ. ఏళ్లు గడుస్తున్నా వారి ఆచూకీ లభించలేదు. తల్లిదండ్రులను కలుసుకోవాలని ఇండియాకు వచ్చా. మూలాలు వెతుక్కుంటూ హైదరాబాద్ నుంచి వరంగల్కు వచ్చా. నా తల్లిదండ్రులు తెలిస్తే 9822 206485 నంబర్కు కాల్చేయండి. తల్లిదండ్రులను ఎలాగైనా కలుస్తాననే నమ్మకం నాలో దృఢంగా ఉంది’ అని సంధ్యారాణి కన్నీటి పర్యంతమైంది. వేయి కళ్లతో కుమార్తె ఎదురుచూపులు తల్లిదండ్రుల కోసం స్వీడన్ నుంచి వరంగల్కు పద్మశాలి సంఘం ప్రతినిధులను కలిసిన సంధ్యారాణికన్నవారి కోసం సముద్రాలు దాటి వచ్చింది. వేల కిలోమీటర్లు ప్రయాణించింది. భాష రాకపోయినా.. తెలిసిన వారెవరూ లేకపోయినా.. అమ్మానాన్న జాడ కోసం 16 ఏళ్లుగా అన్వేషిస్తోంది. వారి ఫొటోలు లేకపోయినా, ఆనవాళ్లు తెలియకపోయినా.. వారిని కలుస్తాననే దృఢ నిశ్చయంతో ఉంది. కన్నవారిని కలిసేదాకా నిద్రపోనని చెబుతున్న స్వీడన్కు చెందిన సంధ్యారాణి ఆదివారం వరంగల్ నగరంలో తల్లిదండ్రుల ఆచూకీ కోసం ప్రయత్నించింది. -
తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక
హన్మకొండ: తెలంగాణ పవర్ డిప్లొ మా ఇంజనీర్స్ అసోసియేషన్ టీజీ ఎన్పీడీసీఎల్ శాఖ కమిటీని ఎన్నుకున్నారు. ఆదివారం హనుమకొండ వి ద్యుత్ నగర్లోని అసోసియేషన్ కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఇందులో ఎన్పీడీసీఎల్ పరిధిలోని 17 జిల్లాల నుంచి విద్యుత్ డిప్లొమా ఇంజనీర్స్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎన్పీడీసీఎల్ శాఖ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నార్ల సుబ్రహ్మణ్యేశ్వర్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇంద్రసేనారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పి.మల్లికార్జున్, డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఎం.అనిల్ కుమా ర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఎ.శ్రీనివాస్, కార్యాలయ కార్యదర్శిగా భవాని, సలహాదారులుగా మధుసూదన్, మనోహర్, కార్యవర్గ సభ్యులుగా త రుణ్, వరుణ్, జ్యోతిర్మయి, వి.రాములు, లక్ష్మణ్ నాయక్, వాలు నాయక్, జి.సత్యనారాయణ, టి.యగంధర్, ఖలీం, టి.శ్రీనివాస్, క్రాంతి కుమార్ ఎన్నికయ్యారు. -
జాతరకు ప్రత్యామ్నాయ దారులు..
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం మహాజాతరకు ప్రత్యామ్నాయ దారుల ఏర్పాటునకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈసారి మహాజాతర సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, భక్తులకు రవాణా ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ రోడ్ల ఏర్పాట్లను ఆదివారం ఎస్పీ శబరీశ్తో కలిసి పరిశీలించారు. గోవిందరావుపేట మండలం మొట్లగూడెం నుంచి ముత్తాపురం మీదుగా తాడ్వాయి మండలం గోనెపల్లి వరకు, కొండపర్తి మీదుగా గోనెపల్లి వరకు, గోనెపల్లి నుంచి మేడారంలోని శివరాంసాగర్ సమీపంలోని వీఐపీ వరకు, వీఐపీ పార్కింగ్ నుంచి చిలకలగుట్ట వరకు రోడ్ల ఏర్పాటును పరిశీలించారు. ఈసారి జాతరకు నూతన రోడ్లు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ తలెత్తకుండా ఉంటుందని భావించారు. కాగా, కొండపర్తి నుంచి ఒకదారి, ముత్తాపురం నుంచి మరో దారి, ఈరెండు దారులు కూడా గోనెపల్లిలో కలిసి జంక్షన్ ఏర్పడనుంది. అక్కడ నుంచి ఈ దారులు ప్రత్యామ్నాయం కానున్నాయి. కాగా, మంత్రి జా తీయ రహదారి నుంచి కొండపర్తి మీదుగా అటవీ మార్గ గుండా గోనెపల్లి వరకు బైక్పై సుమారు 3 కిలోమీటర్లు అటవీ మార్గంలో పర్యటించి రోడ్డు ఏర్పాటును పరిశీలించారు. డీఎస్పీ రవీందర్, పస్రా సీఐ దయాకర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్రెడ్డి ఉన్నారు. హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని మంత్రికి వినతి మండలంలోని నార్లాపూర్ చెక్ పోస్టు సమీపంలోని కల్వర్టుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని మంత్రి సీతక్కకు నార్లాపూర్ రైతులు ఆదివారం వినతి పత్రం అందజేశారు. కల్వర్టు కింద పైపులు చిన్నగా ఉండడంతో జంపన్నవాగు వరద తాకిడికి కల్వర్టుకు ఇరువైపులా ఉన్న వందలాది ఎకరాల వరి పంట నీటమునిపోతుందని విన్నవించారు. స్పందించిన మంత్రి బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, మేడారం జాతర చైర్మన్ అర్రెం లచ్చుపటేల్, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అటవీ ప్రాంతాల్లో రోడ్ల ఏర్పాట్ల పరిశీలన బైక్పై మూడు కిలోమీటర్ల ప్రయాణం.. -
నిర్మాణం..కళాత్మకం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అద్భుత కట్టడాలుకాజీపేట అర్బన్: దక్షిణాదిలోనే అతి పెద్ద హాస్టల్ భవనంతో నిట్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నిట్లోని సివిల్ ఇంజనీర్లు 2009లో హాస్టల్ భవనానికి శ్రీకారం చుట్టారు. 10 అంతస్తుల్లో 1,800 మంది విద్యార్థులకు వసతి కల్పించేందుకు ఎటుచూసినా వీ ఆకారంలో కనిపించేలా భవనం నిర్మించారు. నాటి కాకతీయ కళాకారుల కీర్తి ప్రతిష్టను పెంపొందించేందుకు హాస్టల్ భవనానికి రామప్ప హాల్ ఆఫ్ రెసిడెన్సీగా నామకరణం చేయగా.. విద్యార్థులు ఆల్ట్రా మెగా హాస్టల్ 1.8కేగా పిలుచుకుంటున్నారు. చక్కటి గాలి, వెలుతురు వస్తుంది. నిట్ వరంగల్లో ప్రవేశం పొందిన బీటెక్ ఫస్ట్ ఇయర్, ఎంటెక్ విద్యార్థులకు హాస్టల్ భవనంలో వసతి కల్పిస్తారు. ఒక గదిలో నలుగురు విద్యార్థులకు సౌకర్యం కల్పించారు. జిమ్, కాఫీ షాపు, టీవీ రూంలు, బ్యాడ్మింటన్ కోర్టులతోపాటు మెస్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఇంజనీర్లు బహుళ అంతస్తు నిర్మాణంలో నిట్ను రోల్మెడల్గా తీసుకుంటున్నారు. కల్లెడ గడి ముఖద్వారంవసతులు ఘనం.. అతి పెద్ద భవనం చెక్కు చెదరని వందల ఏళ్ల నాటి గడీలు పర్యాటకులను ఆకర్షిస్తున్న శిల్పకళా సంపద కాకతీయుల కాలం నాటి ఇంజనీర్ల అపార మేథశతాబ్దికి సమీపం.. నేటికీ పదిలం -
ఏజెన్సీలో భారీ వర్షం
బయ్యారం: మండలంలోని ఏజెన్సీ గ్రామాల్లో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. అల్లిగూడెం, కంబాలపల్లి, రామచంద్రాపురం, లక్ష్మీపురం, మిర్యాలపెంట, ఇసుకమేధి పంచాయతీల్లో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. అలాగే ఇల్లెందు ఏజెన్సీలో కురిసిన వర్షానికి మండలంలోని మసివాగు, రాళ్లవాగుల్లో వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో మండలం నుంచి ఇల్లెందు వైపు వెళ్లే రహదారిపై నుంచి వరద ప్రవాహం కొనసాగడంతో రాత్రి సమయంలో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దచెరువుకు భారీ వరద.. మండలంలో బయ్యారం పెద్దచెరువుకు ఇల్లెందు ఏజెన్సీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షంతో వరద ప్రవాహం పెరిగింది. మసివాగు ప్రవాహం భారీగా పెరగడంతో 16.2 అడుగుల నీటిసామర్థ్యం ఉన్న చెరువులోకి 19.2 అడుగుల మేర నీరు చేరడంతో మూడు అడుగుల మేర అలుగు పారుతోంది. తెగిపోయిన రహదారి.. మండలంలోని భీమ్లాతండా–కొత్తూరు గ్రామాల నడుమ ఉన్న ప్రధాన రహదారి వర్షం కారణంగా తెగిపోయింది. దీంతో అల్లిగూడెం–కంబాలపల్లి ప ంచాయతీల మధ్య రాకపోకలు నిలిచిపోగా బ య్యారం నుంచి రామగుండాల మీదుగా ఇల్లెందు వైపు వెళ్లే బస్సు రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో మొక్కజొన్న పంటలు నేలవాలా యి. దెబ్బతిన్న రహదారి, పంటలను తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ విజయలక్ష్మి పరిశీలించారు. బయ్యారం పెద్దచెరువుకు భారీగా వరద -
నేటి ప్రజావాణి రద్దు
● కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మహబూబాబాద్: కలెక్టర్ కార్యాలయంలో నేడు(సోమవారం) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా స్థాయి అధికారులు అందరూ క్షేత్రస్థాయిలో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమంలో నిమగ్నమై ఉండడం వల్ల ప్రజావాణి రద్దు చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి ప్రజావాణి దరఖాస్తులతో కలెక్టర్ కార్యాలయానికి రావొద్దని సూచించారు. కురవి: మండల కేంద్రంలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ఆదివారం భక్తులతో సందడి నెలకొంది. రెండు రోజులు సెలవులు రావడంతో వీరభద్రస్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. క్యూలో నిలబడి స్వామి, అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నేటి నుంచి ‘విలువలు’ విద్యమహబూబాబాద్ అర్బన్: రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు నేటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విలువల విద్యపై ప్రత్యేక కార్యక్రమాలను టీ శాట్ చానల్లో ప్రత్యక్ష ప్రసారం, ఫోన్ ఇన్ లైవ్ నిర్వహిస్తున్నట్లు డీఈఓ దక్షిణామూర్తి ఆది వారం తెలిపారు. విద్యాశాఖ కార్యదర్శి యో గితారాణా ప్రైమరీ విద్యార్థులతో ఉదయం 11నుంచి 12గంటల వరకు, హైస్కూల్ విద్యార్థులతో మధ్యాహ్నం 2:30నుంచి 3:30 గంటల వరకు లైవ్లో సంభాషిస్తారన్నారు. సందేహాల కోసం 040–23540326, 23540726, టోల్ ఫ్రీ నంబర్ 18004254039లో ఉపాధ్యాయులు సంప్రదించాలన్నారు. అనంతరం పుస్తకాల కార్యాలయాని డీఈఓ సందర్శించారు. కార్యక్రమంలో ఏఎంఓ చంద్రశేఖర్ ఆజాద్, సైన్స్ అధికారి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. పంపిణీ పరిశీలన కురవి: సీరోలు మండలం కాంపల్లి సొసైటీలో యూరియా పంపిణీ కార్యక్రమాన్ని డీఏఓ విజయనిర్మల ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు అధైర్యపడవద్దని, అందరికీ యూరియా అందుతుందని తెలిపారు. యూరియా పుష్కలంగా వస్తుందన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా ఉండేలా పంపిణీ చేస్తామన్నారు. ఆమె వెంట సీరోలు ఏఓ చాయారాజ్ ఉన్నారు. మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో రెవెన్యూ సర్వేయర్ల పరీక్షల ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా భూమి, కొలతల అదనపు డైరెక్టర్ నర్సింహమూర్తి ఆదివారం తెలిపారు. ఉయదం 10 గంటలకు థియరీ పరీక్షకు 65మందికి 63 అభ్యర్థులు హాజరయ్యారని, మధ్యాహ్నం నిర్వహించిన ప్లాటింగ్ పరీక్షకు 71 మందికి 68 మంది అభ్యర్థులు హాజరయ్యరని తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు. రైతులందరికీ యూరియాగార్ల: రైతులందరికీ యూరియా అందిస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) హరిప్రసాద్ సూచించారు. ఆదివారం ముల్కనూరు జరిగిన మండల అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండలంలోని నాలుగు రైతు వేదికల్లో యూరియా సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్ శాఖల సమన్వయంతో యూరియా పంపిణీ సజావుగా కొనసాగుతుందన్నారు. మండల అధికారులు ప్రణాళిక ప్రకారం రైతులందరికీ యూరి యా అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. తహసీల్దార్ శారద, ఎంపీడీఓ మంగమ్మ, ఏఓ కావటి రామారావు, ఎస్సై రియాజ్పాషా, ఏఈఓ కిరణ్, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన భోజనం అందించాలి
కేసముద్రం: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధి అమీనాపురం గ్రామంలోని మహాత్మా జ్యోతిరావుపూలే బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు హాస్టల్లోని డైనింగ్ హాల్, స్టోర్ రూం, కిచెన్ షెడ్, చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతోపాటు, వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రతీ సబ్జెక్ట్పై అవగాహన, డిజిటల్ తరగతులు, క్రీడా, సాంస్కృతి విభాగాల్లో శిక్షణ అందించాలన్నారు. ఆ తర్వాత ధన్నసరి పీఏసీఎస్ సెంటర్ను సందర్శించారు. యూరియా పంపిణీ ఎలా కొన సాగుతుందనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా డీఎస్పీ తిరుపతిరావు ధన్నసరి పీఏసీఎస్ సెంటర్ను సందర్శించి, యూరియా పంపిణీని పరిశీలించారు. కార్యక్రమంలో డీఏఓ విజయనిర్మల, తహసీల్దార్ వివేక్, ఎస్సై మురళీధర్రాజు, ఏఓ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. పారదర్శకంగా పంపిణీ చేయాలి మహబూబాబాద్ రూరల్ : పారదర్శకంగా ప్రతీ రైతుకు యూరియా అందేవిధంగా చర్యలు తీసుకో వాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి గ్రా మంలో యూరియా పంపిణీ కేంద్రాన్ని ఆదివారం సందర్శించారు.రైతుల కోసం ఇప్పటికే అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. నిత్యం యూరియా పంపిణీ కోసం అదనపు కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, వ్యవసాయ సహకార సంఘాలు, అన్ని విభాగాల సిబ్బంది క్షేత్రస్థాయిలో విధుల్లో ఉన్నారని తెలిపారు. డీఏఓ విజయనిర్మల, డీఆర్డీఓ మధుసూదన్ రాజు, తహసీల్దార్ రాజేశ్వరరావు తదితరులు ఉన్నారు. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ -
యూరియా పంపిణీలో ప్రభుత్వాలు విఫలం
నెహ్రూసెంటర్: యూరియా పంపిణీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్లే రైతులు రోడ్లపైకి రావాల్సిన దుస్థితి నెలకొందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గూడూరులో యూరియా టొకెన్ల కోసం వెళ్తూ ఇద్దరు రైతులు మృతి చెందగా.. వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జీజీహెచ్ మార్చురీ ఎదుట ఆదివారం బంధువులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయలేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ యూరియా అందించడంలో జాప్యం చేస్తున్నాయని ఆరోపించారు. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబ సభ్యులతో ఆమె మాట్లాడి వారిని ఓదార్చారు. కార్యక్రమంలో ఎల్హెచ్పీఎస్ నాయకులు బోడ లక్ష్మణ్నాయక్, ఆంగోత్ చందూలాల్, మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు గుగులోత్ రవినాయక్, బానోత్ రామునాయక్ పాల్గొన్నారు. మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ జీజీహెచ్ మార్చురీ ఎదుట ధర్నా -
మేడారంలో మొక్కుల సందడి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ కు మొక్కులు చెల్లించుకునేందుకు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి మేడారానికి ప్రైవేట్ వాహనాల్లో వచ్చిన భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి కల్యాణ కట్టలో పుట్టువెంట్రుకలను సమర్పించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం, కానుకలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజుకు పూజలు చేశారు. వనదేవతల దర్శనం అనంతరం భక్తులు మేడారం ఆర్టీసీ బస్టాండ్, చిలకలగుట్ట, జంపన్నవాగు ప్రాంతాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనలు చేశారు. డీజే సౌండ్లతో డ్యాన్స్లు చేసి సందడి చేశారు. హనుమకొండ డీఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మేడారం దేవాదాయశాఖ జూనియర్ అసిస్టెంట్ జగదీశ్వర్, రమాదేవి భక్తులకు సేవలందించారు. -
రైతులు ఆందోళన చెందవద్దు
డోర్నకల్: రైతులు యూరియా బస్తాల కోసం ఆందోళన చెందవద్దని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. సీరోలు మండలం మన్నెగూడెం పీఏసీ ఎస్లో ఆదివారం ఎరువుల పంపిణీని పరిశీలించారు. డోర్నకల్ పోలీస్ స్టేషన్ను పరిశీలించి పలు కేసుల వివరాల గురించి తెలుసుకున్న ఎస్పీ మన్నెగూడెంలో ఎరువుల పంపిణీని పరిశీలించి రైతులతో మాట్లాడారు. కార్యక్రమంలో డోర్నకల్ సీఐ రాజమౌళి, ఎస్సై వంశీధర్, పీఏసీఎస్ సెక్రటరీ సతీష్ తదితరులు పాల్గొన్నారు. బయ్యారంలో పరిశీలన.. బయ్యారం: మండల కేంద్రంలోని రైతువేదిక, గంధంపల్లిలోని రైతువేదికలో ఆదివారం నిర్వహించిన యూరియా పంపిణీని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ పరిశీలించారు. గంధంపల్లిలో ఓ రైతు దిచక్రవాహనంపై తన సిబ్బందితో స్వయంగా యూరియా బస్తాలు వేయించిన ఎస్పీ జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. తహసీల్దార్ నాగరాజు, గార్ల–బయ్యారం సీఐ రవికుమర్, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎస్సై తిరుపతి తదితరులు ఉన్నారు. జాగ్రత్తగా వెళ్లాలి.. కురవి: ఆదివారం సీరోలు మండలం కాంపల్లి సొసైటీ వద్ద ఓ రైతు రెండు యూరియా బస్తాలను తీసుకున్నాడు. తన బైక్పై బస్తాలను పెట్టేందుకు యత్నిస్తుండగా సిబ్బంది సాయం చేశారు. ఆ రైతు దగ్గరకు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ వెళ్లి బస్తాలతో బైక్పై జాగ్రత్తగా వెళ్లు.. పదిలంగా ఇంటికి చేరుకో అని జాగ్రత్తలు చెప్పారు. దీంతో ఆ రైతు జాగ్రత్తగా వెళ్తానని ఎస్పీకి చెప్పాడు. పంపిణీ పరిశీలన మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ పట్టణంలోని పీఏసీఎస్ వద్ద యూరియా పంపిణీ ప్రక్రియను ఆదివారం ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో మాట్లాడుతూ.. అవసరం ఉన్నంత మేరకు యూరియా సరఫరా జరుగుతుందన్నారు. కార్యక్రమంలో టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి, ఎస్సై శివ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. యూరియా కేంద్రం తనిఖీ గార్ల: గార్ల మండలం ముల్కనూరు గ్రామంలోయూరియా పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సందర్శించారు. యూరియా రైతులందరికీ అందేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఎస్పీ వెంట గార్లబయ్యారం సీఐ రవికుమార్, ఎస్సై రియాజ్పాషా, ఏఓ కావటి రామారావు, ఏఎస్సైలు వెంకట్రెడ్డి, రవీందర్ ఉన్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ -
న్యాయవాదులకు శిక్షణ తరగతులు అవసరమే
● హైకోర్టు జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్వరంగల్ లీగల్ : యువ న్యాయవాదులకు శిక్షణ త రగతులు అవసరమేనని తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్గౌడ్ అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా కేంద్రంలోని డీసీసీబీ భవన్లో తెలంగా ణ రాష్ట్ర న్యాయవాది పరిషత్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా జడ్జి లక్ష్మణ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సీనియర్ న్యాయవాది కె.వి. గుప్తా రాసిన ‘తెలంగాణ కోర్టు ఫీ యాక్ట్ పుస్తకం’ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్గౌడ్ మాట్లాడారు. యాంటీ కరప్షన్ లాస్, ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ అంశాల్లో యువ న్యా యవాదులు మెళకువలు తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయవాద పరిషత్ అ ధ్యక్ష, కార్యదర్శులు ఎల్.ప్రభాకర్ రెడ్డి, శ్యాంశాని సునీల్, చొళ్లేటి రామకృష్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలుస సుధీర్, పులి సత్యనారాయణ, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు అమ్మవారికి హైకోర్టు జడ్జి పూజలు.. హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవాలయాన్ని శనివారం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ కె. లక్ష్మణ్ సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భద్రకాళి శేషు, ధర్మకర్తలు.. జస్టిస్ను ఘనంగా స్వాగతించారు. పూజలనంతరం అర్చకులు శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తి పట్టాభి రామారావు, వరంగల్ జిల్లా న్యాయమూర్తి నిర్మలా గీతాంబ తదితరులు పాల్గొన్నారు. -
పాస్ కావాల్సిందే..
మహబూబాబాద్: ప్రభుత్వం భూ సమస్యల పరి ష్కారానికి భూ భారతి చట్టం తీసుకొచ్చింది. దీని లో భాగంగా పూర్తి స్థాయిలో రెవెన్యూ సర్వేయర్లు లేకపోవడంతో లైసెన్స్డ్ సర్వేయర్లకు అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకున్న వారికి శిక్షణ ఇచ్చి న తర్వాత మూడు రకాల పరీక్షలు నిర్వహిస్తుంది. ఆ పరీక్షలలో పాస్అయితేనే లైసెన్స్ జారీ చేయాల ని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల నిర్వహించిన పరీక్షలో 139 మందికి కేవలం 30 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఫెయిల్ అయిన వారి కోసం మరోమారు పరీక్ష నిర్వహించనుంది. జిల్లాలో 31,900 దరఖాస్తులు భూ భారతి అమలులో భాగంగా జిల్లాలో మొదట పైలెట్ ప్రాజెక్ట్ కింద దంతాలపల్లి మండలాన్ని ఎంపిక చేసి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం మిగిలిన మండలాల్లో జూన్ 3 నుంచి 16 వరకు రెవెన్యూ సదస్సులు ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. అదే నెల 17 నుంచి 20వ తేదీ వరకు తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా దరఖాస్తుల స్వీకరణ చేశారు. మొత్తం 31,900 దరఖాస్తులు స్వీకరించి ఆన్లైన్ చేశారు. గ్రామ పరిపాలన అధికారుల కోసం పూర్వ వీఆర్ఏ, వీఆర్వోలకు అవకాశం కల్పించారు. ఆప్షన్ పెట్టుకున్న వారికి పరీక్ష నిర్వహించారు. జిల్లా నుంచి 151 మందిని ఎంపిక చేసి ఈనెల 5న హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందుకున్న విషయం విదితమే. సర్వేయర్ల పాత్రకీలకం జిల్లాలో 18 మండలాలుండగా కేవలం 10 మంది మాత్రమే రెవెన్యూ సర్వేయర్లు ఉన్నారు. దీంతో ప్రైవేట్ లైసెన్స్డ్ సర్వేయర్లకు అవకాశం కల్పించింది. మొదటి విడతలో 181 మంది మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వారికి జిల్లా కేంద్రంలో మోడల్ స్కూల్లో 50 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణకు 181 మందిలో 139 మాత్రమే హాజరై శిక్షణ పూర్తి చేశారు. 30 మంది మాత్రమే ఉత్తీర్ణత మొదటి విడతలో శిక్షణ పొందిన వారికి ఎస్ఎస్ మెంట్ పరీక్షలు, ప్రాక్టీకల్, రాత పరీక్ష ఉంటుంది. చాలా మంది ఎస్ఎస్ మెంట్ పరీక్ష, ప్రాక్టీకల్స్ పాస్ అవుతున్నారని అధికారులు తెలిపారు. రాత పరీక్షలో 139 మందికి కేవలం 30 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. లేదంటే లైసెన్స్ రాదు రెవెన్యూ సర్వేయర్లకు పరీక్షలు మొదటి విడతలో 139 మందిలో 30 మంది మాత్రమే ఉత్తీర్ణత ఫెయిల్అయిన వారి కోసం మరోసారి అవకాశం నేడు రాత పరీక్ష 94 మంది దరఖాస్తులు మొదటి విడతలో ఫెయిల్అయిన వారి కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. మొదటి విడతలో ఫెయిల్ అయిన 94 మంది మళ్లీ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి నేడు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా రెండో విడతలో 185 మంది దరఖాస్తు చేసుకోగా 137 మంది శిక్షణకు హాజరవుతున్నారు. వారికి శిక్షణ పూర్తయిన తర్వాత పరీక్ష నిర్వహించనున్నారు.అన్ని ఏర్పాట్లు చేశాం.. నేడు నిర్వహించే పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశాం. పరీక్ష పాస్ అయితేనే లైసెన్స్ను ప్రభుత్వం జారీ చేస్తుంది. ఆ విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉంది. రెండో విడత శిక్షణ కొనసాగుతోంది. వారికి కూడా పరీక్షలో పాస్ అయితేనే లైసెన్స్ జారీ చేస్తారు. – నర్సింహమూర్తి, భూమి కొలతల జిల్లా అదనపు డైరెక్టర్ -
పగిలిన ‘దేవాదుల’పైపులైన్
● ఎగిసిపడిన నీరు.. నిండిన జయగిరి పాత చెరువు హసన్పర్తి: హసన్పర్తి మండలం జయగిరి పాత చెరువు వద్ద దేవాదుల పైపులైన్ పగిలింది. ఇటీవల దేవాదుల నుంచి నీటిని విడుదల చేశారు. రెండు రోజుల క్రితం జయగిరి సమీపంలోని పాత చెరువు వద్ద పైపునకు చిన్న రంధ్రం పడింది. అది పెద్దది కావడంతో ఒత్తిడి పెరిగి పగిలింది. దీంతో ఒకేసారి నీరు ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ నీరంతా సమీప చెరువులోకి చేరడంతో నిండి మత్తడి పోసింది. చెరువుకింద ఉన్న పంటపొలాలు ముంపునకు గురయ్యాయి. సమాచారం అందుకున్న నీటి పారుదలశాఖ ఎస్ఈ రాంప్రసాద్, ఈఈ మంగీలాల్, సునీత, డీఈఈ కిషన్ ప్రసాద్, తేజేశ్వర్రావు, ఏఈ శ్రీనివాస్లు ఘటన స్థలాన్ని చేరుకుని పరిస్థితి సమీక్షించారు. పులుకుర్తి వద్ద పంపింగ్ను నిలిపివేశారు,. రైలు నుంచి జారిపడి ప్రయాణికుడి దుర్మరణం ఖిలా వరంగల్: ప్రమాదవశాత్తు శాతవాహన ఎక్స్ప్రెస్ రైలు నుంచి జారి పడి ఓ ప్రయాణికుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన శనివారం చింతలపల్లి– ఎల్గూరు రైల్వేస్టేషన్ల మధ్య చోటు చేసుకుంది. జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ రాజు కథనం ప్రకారం.. వెస్ట్ బెంగాల్లోని తిల్న్ చౌదర్ గ్రామానికి చెందిన లాబాను కరుణాకర్ (41).. అబ్దుల్ సల్మాన్, రంజిత్ మరిడేతో కలిసి శాతవాహన ఎక్స్ ప్రెస్ రైలులో విజయవాడ నుంచి వరంగల్కు ప్రయాణిస్తున్నాడు. ఈక్రమంలో చింతలపల్లి– ఎల్గూరు రైల్వేస్టేషన్ల మధ్య కరుణాకర్ ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి అక్కడికక్కడే దుర్మణం చెందాడు. మృతుడి బంధువులకు సమాచారం అందజేసి మృతదేహాన్ని ఎంజీఎం మార్చరీకి తరలించినట్లు వరంగల్ జీఆర్పీ హెడ్కానిస్టేబుల్ రాజు తెలిపారు. -
మళ్లీ మొదటికి వచ్చినట్లేనా?
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ 2010లో నియమితులైన వివిధ విభాగాల అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాన్ని ఆమోదిస్తూ ఈ ఏడాది మే 8న రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ జారీ చేసిన జీఓ 22ను సవాల్ చేస్తూ అప్పట్లో ఉద్యోగం రాని వినిత నాయిని హైకోర్టులో ఈనెల 9న రిట్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి, కాకతీయ యూనివర్సిటీ, కేయూలో 2010లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమితులైన వారిని ప్రతివాదులుగా చేర్చారు. దీంతో హైకోర్టు ఈనెల 9న వాదనలు వింటూ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకు, రాష్ట్ర ఉన్నత విద్యామండలికి, కాకతీయ యూనివర్సిటీకి కౌంటర్దాఖలు చేయాలని, 2010లో నియమితులైన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నోటీస్లు జారీచేయాలని ఆదేశాలు ఇస్తూ ఈ కేసును అక్టోబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. మొదటి నుంచీ వివాదమే.. కాకతీయ యూనివర్సిటీలో 2010లో వివిధ విభాగాల్లో నియమితులైన అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలపై అప్పటి నుంచి వివాదం కొనసాగుతూనే ఉన్న విషయం విధితమే. అప్పట్లో ఉద్యోగాలు రాని పలువురు అభ్యర్థులు ఈ నియామకాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించగా చివరికి పూర్తిస్థాయి పాలకమండలి సమావేశంలో ఆమోదించుకోవాలని సుప్రీంకోర్టు గతంలోనే సూచించింది. దీంతో 2019 నవంబర్లో కేయూ పూర్తిస్థాయి పాలకమండలి సమావేశంలో చర్చించి అవకతవకలు చోటుచేసుకున్నాయని భావించి ఆమోదించలేదు. దీంతో అప్పటి రిజిస్ట్రార్ తుది నిర్ణయం కోసం ఫైల్ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో జువాలజీ విభాగానికి చెందిన ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను యూనివర్సిటీ అధికారులు కొంత కాలం క్రితమే ఉద్యోగాలనుంచి తొలగించిన విషయం విధితమే.ఆ తర్వాత కూడా ఉద్యోగం రాని వినితనాయిని అప్పటి నుంచి న్యాయం పోరాటం చేస్తూనే ఉన్నారు. మిగతా పలువురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ ఉద్యోగాలు కాపాడుకోవడం కోసం కూడా హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరికి సుప్రీం కోర్టు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ తుది నిర్ణయం తీసుకోవాలని ఈఏడాది ఫిబ్రవరి 24న ఆదేశించిన విషయం విధితమే. ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి నియమించిన కమిటీ నివేదిక ఆధారంగా ఉన్నత విద్యాశాఖ 2010లో నియమితులైన అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలపై(అప్రూవల్ చేస్తూ) సానుకూల నిర్ణయం తీసుకుని జీఓ 22ను ఈఏడాది మే 8న యూనివర్సిటీ అధికారులకు పంపింది. తదుపరి చర్యలను తీసుకోవాలని కూడా పేర్కొంది. ఇప్పటికే ఉద్యోగాలనుంచి తొలగించబడిన ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు జీఓలో మాత్రం అవకాశం కల్పించ లేదు. ఈక్రమంలో జూన్ 17న హైదరాబాద్లో నిర్వహించిన కేయూ పాలకమండలి సమావేశంలో 2010లో నియమితులైన వివిధ విభాగాల అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలపై చర్చించి ఆమోదించింది. దీంతో ఆయా అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఊపిరి పీల్చుకున్నారు. కేయూపాలకమండలి ఆమోదించడంతో వారంతా సంతోషించారు. ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంపై వినితనాయిని మళ్లీ రిట్ పిటిషన్ కౌంటర్దాఖలు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి, కేయూకు హైకోర్టు ఆదేశంకేయూపాలకమండలి ఆమోదంతో ఆయా అసిస్టెంట్ ప్రొఫెసర్లు పదోన్నతుల కోసం నిరీక్షిస్తున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నుంచి అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియ కూడా ఇటీవలే ప్రారంభించినట్లు తెలిసింది. పదోన్నతుల కల్పనకు యూనివర్సిటీ అధికారులు కూడా కొద్దిరోజుల్లోనే ఉపక్రమించబోతుండగా మళ్లీ అప్పట్లో ఉద్యోగం రాని వినితనాయిని.. ఉన్నత విద్యాశాఖ ఆయా అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలను ఆమోదిస్తూ సానుకూలంగా జారీచేసిన జీఓను సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడంతో వీరి సమస్య మళ్లీ మొదటికొచ్చినట్లైందని కాకతీయ యూనివర్సిటీలో చర్చ జరుగుతోంది. వీరికి ఇక ఇప్పట్లో పదోన్నతుల కల్పన ఉండబోదని, ప్రస్తుతానికి బ్రేక్ పడినట్లేనని భావిస్తున్నారు. -
చెట్టు కొమ్మ తొలగిస్తుండగా..
భూపాలపల్లి రూరల్: చెట్టు కొమ్మ తొలగిస్తుండగా ఓ విద్యార్థి విద్యుత్ తీగ తగిలి గాయపడ్డాడు. ఈ ఘటన శనివారం భూపాలపల్లి మండలం గొల్లబు ద్దారం ఎస్సీ హాస్టల్లో చోటు చేసుకుంది. బాధిత విద్యార్థి కథనం ప్రకారం.. భూపాలపల్లి మండలం పెద్దకుంటపల్లి గ్రామానికి చెందిన పి. రాజేంద్రన్ గొల్లబుద్దారం ఎస్టీ హాస్టల్లో ఉంటూ 9వ తరగతి చదువుతున్నాడు. శనివారం సెలవు దినం కావడంతో హాస్టల్ పరిసరాలను శుభ్రం చేయాలని వార్డెన్ రాంగోపాల్రెడ్డి విద్యార్థులకు సూచించారు. దీంతో కొంత మంది విద్యార్థులు పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. రాజేంద్రన్ వసతి గృహం ఆవరణలో అడ్డుగా ఉన్న కొమ్మలను తొలగించేందుకు చెట్టు ఎక్కాడు. కొమ్మలు కొడుతున్న క్రమంలో చెట్టుపై నుంచి వెళ్లిన విద్యుత్ తీగలకు తాకి కిందపడ్డాడు. వెంటనే సహ విద్యార్థులు కేకలు వేయడంతో హుటాహుటిన సదరు విద్యార్థిని భూపలపల్లిలోని వంద పడకల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి నిలకడగానే ఉంది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు, బీఆర్ఎస్పీ, ఎస్ఎఫ్ఎ విద్యార్థి సంఘాల నేతలు విద్యార్థి రాజేంద్రన్ను పరామర్శించారు. ప్రమాదానికి కారణమైన వార్డెన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ తీగ తగిలి విద్యార్థికి గాయాలు గొల్లబుద్దారం ఎస్టీ హాస్టల్లో ఘటన -
ఓటమిని గెలుపుగా మలుచుకోవాలి
కొత్తగూడ: క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిన వారు నిరాశపడకుండా గెలుపు కోసం మరోసారి ప్రయత్నించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి ఈఎంఆర్ఎస్లో జరిగిన రాష్ట్ర స్థాయి క్రీడల ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. విద్యార్థి దశ నుంచి క్రీడలు, చదువులో ప్రతిభచాటాలన్నారు. ప్రస్తుత క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఒడిశాలో జరిగే జాతీయ స్థాయి క్రీడల్లో పథకాలు సాధించి రాష్ట్రానికి పేరు తీసుకురావాలన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచి నాణ్యమైన భోజనం అందిస్తున్నామన్నారు. అనంతరం ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించిన కామారెడ్డి జిల్లా గంధారి ఈఎంఆర్ఎస్కు, అలాగే వివిధ విభాగాల్లో గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ సుధీర్ రాంనాఽథ్ కేకన్, ఆర్డీఓ కృష్ణవేణి, స్పోర్ట్స్ ఆఫీసర్ వీర్యనాయక్, ఆర్సీఓ రత్నకుమారి, రాష్ట్ర ఉపాధిహామీ సంస్థ డైరెక్టర్ చల్ల నారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ అజ య్సింగ్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎస్పీతో మంత్రిప్రత్యేక సమావేశం.. ఈఎంఆర్ఎస్లో క్రీడల ముగింపు కార్యక్రమానికి వచ్చిన మంత్రి సీతక్క.. ఎస్పీ సుధీర్రాంనాఽథ్ కేకన్తో పాఠశాలలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎవరిని లోపలికి అనుమతించకపోవడం గమనార్హం. జిల్లాలో యూరియా పంపిణీ గురించి ఎస్పీని అడిగి తెలుసుకున్నట్లు సమాచా రం. కొత్తగూడ, గంగారం మండలాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఎస్పీకి సూచించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ముగిసిన రాష్ట్ర స్థాయి క్రీడలు -
నాణ్యమైన భోజనం అందించాలి
కురవి: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి మాడిశెట్టి నరసింహస్వామి అన్నారు. శనివారం బలపాలలోని ఎస్సీ బాలు ర వసతిగృహం, కురవిలోని ఎస్సీ బాలికల వసతిగృహంలో జరిగిన పీటీఎంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రుల సూచనలను తూచా తప్పకుండా పాటించి భవిష్యత్లో అన్ని వసతి గృహాలు సజావుగా నడపడానికి ఎంతో తోడ్పాడునందిస్తామన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలన్నారు. చదువుతోనే పిల్లలకు ఉజ్వల భవిష్యత్ మరిపెడ రూరల్: చదువుతోనే పిల్లలకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి నర్సింహాస్వామి అన్నారు. మరిపెడ మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో విద్యార్థుల తల్లిదండ్రులతో శనివారం సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా వసతి గృహాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తాం కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ లా కళాశాల ఐదేళ్ల కోర్సు విద్యార్థుల సమస్యలు దశల వారీగా పరిష్కరిస్తామని రిజిస్ట్రార్ రామచంద్రం హామీ ఇచ్చారు. ఈనెల 12న ఐదేళ్ల లాకోర్సుల విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేసిన నేపథ్యంలో ఆయా విద్యార్థులతో శనివారం పరిపాలనాభవనం వద్ద చర్చలు జరిపారు. అయినప్పటికీ విద్యార్థులు వినకుండా పరిపాలనా భవనం వద్ద ధర్నా నిర్వహించారు. మళ్లీ కొంతసేపటికి రిజిస్ట్రార్ రామచంద్రం విద్యార్థులతో మాట్లాడారు. వీసీ ప్రతాప్రెడ్డి ఈనెల 23న కేయూకు రానున్నారని మీ సమస్యలను వీసీ దృష్టికి తీసుకెళ్లి దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చా రు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించా రు. వినతిపత్రాన్ని రిజిస్ట్రార్ రామచంద్రంకు అందజేశారు. రిజిస్ట్రార్ వెంట పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, యూనివర్సిటీ లా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుదర్శన్, కేయూ పాలకమండలి సభ్యులు ఆచార్య బి.సురేశ్లాల్, లా హాస్టల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ చల్లా శ్రీనివాస్ ఉన్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో.. కేయూ పోలీస్టేషన్ పోలీస్ అధికారులు కూడా అక్కడికి విచ్చేశారు. రామప్పలో అమెరికన్ల సందడి వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని అమెరికాకు చెందిన బ్రాడ్, రాచెల్లు శనివారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్ అంటూ కొనియాడారు. హేమాచలక్షేత్రంలో.. మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు శనివారం భారీగా తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించి భక్తుల గోత్ర నామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణాన్ని వివరించారు. -
జీపీ భవనాల్లోనే మున్సిపల్ కార్యాలయాలు
● ఇబ్బందులు పడుతున్న అధికారులు, సిబ్బంది మహబూబాబాబాద్: మేజర్ గ్రామపంచాయతీలను ప్రభుత్వం మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ చేసింది. ప్రజాప్రతినిధులు అప్గ్రేడ్పై పెట్టిన శ్రద్ధ నూతన భవనాల నిర్మాణాలపై పెట్టడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిపోను గదులు లేక అధికారులు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐదు మున్సిపాలిటీలు జీపీ భవనాల్లోనే.. జిల్లాలో మానుకోట మున్సిపాలిటీ, మరిపెడ, డోర్నకల్, తొర్రూర్తో పాటు ఇటీవల కేసముద్రంను కూడా మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశారు. ప్రస్తుతం అన్ని కార్యాలయాలు గ్రామపంచాయతీ భవనాల్లోనే కొనసాగుతున్నాయి. మానుకోట మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా 68,889 మంది జనాభా, 57,828 మంది ఓటర్లు ఉన్నారు. 25,000లకు పైగా గృహాలు ఉన్నాయి, తొర్రూరులో 16 వార్డులు 19,100 జనాభా, మరిపెడలో 15 వార్డులు 17,875 మంది జనాభా, డోర్నకల్లో 15 వార్డులు 14,425 మంది జనాభా ఉన్నారు. కేసముద్రంలో 16 వార్డులుగా అధికారులు నిర్ణయించినప్పటికీ అధికారికంగా వార్డుల విభజన పూర్తి కాలేదు. జనాభా 19,438 మంది ఉన్నారు. 2018లోనే శంకుస్థాపన.. పురపాలక అభివృద్ధి నిధుల నుంచి 2018లోనే మానుకోట మున్సిపాలిటీ భవనానికి రూ.5 కోట్ల నిధులతో శంకుస్థాపన చేశారు. నేటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. బిల్లులు రాకపోవడంతో నిర్మాణ పనులను కాంట్రాక్టర్ నిలిపివేశారు. మరిపెడ మున్సిపాలిటీకి టెండరు పూర్తి కాగా నిధులు రద్దవడంతో పనులు ప్రారంభం కాలేదు. డోర్నకల్, మరిపెడ, తొర్రూరు మున్సిపాలిటీల కార్యాలయాలు జీపీ భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వెంటాడుతున్న సిబ్బంది కొరత మానుకోట మున్సిపాలిటీకి అధికారులు, సిబ్బంది ఉన్నప్పటికీ పారిశుద్ధ్య కార్మికులు పూర్తి స్థాయిలో లేకపోవడం ఇబ్బందులు పడుతున్నారు. మరిపెడ, తొర్రూరు, డోర్నకల్, కేసముద్రంలో ఇన్చార్జ్ల పాలన కొనసాగుతోంది. బిల్లులు రాలేదు.. మానుకోట మున్సిపాలిటీ నూతన భవనానికి కేవలం బిల్లులు రాకనే పనులు నిలిచిపోయాయి. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాం. నిధులు విడుదల కాగానే పనులు పూర్తి అయ్యేలా చూస్తాం. – టి.రాజేశ్వర్, మానుకోట మున్సిపాలిటీ కమిషనర్ -
మహబూబాబాద్
ఆదివారం శ్రీ 14 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025సమన్వయ సమావేశాలు నిర్వహించాలి7మహబూబాబాద్: జిల్లాలో పకడ్బందీగా యూరియా పంపిణీ విషయంలో మండల స్థాయిలో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క ఉద్యోగి రైతు వేదికలు, ప్రాథమిక సహకార సొసైటీల వద్ద అందుబాటులో ఉండాలని, రైతులకు స్టాక్ వివరాలను తెలియపర్చాలన్నారు. అధికారులు సమన్వయంతో పని చేసి యారియా పంపిణీని విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, డీఏఓ వి జయనిర్మల, డీసీఓ వెంకటేశ్వర్లు, ఎంపీడీలు, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు. యూరియా పంపిణీ సజావుగా జరగాలి కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ -
కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట
జఫర్గఢ్: గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు అధిక నిధులు కేటాయిస్తూ పె ద్దపీట వేస్తోందని ఖోఖో అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. మండలంలోని కూనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర స్థాయి 44వ సబ్ జూనియర్ ఇంటర్ షిప్ బాల్ బ్యాండ్మిటన్ క్రీడా పోటీలను శనివారం పాఠశాల పూర్వ వి ద్యార్థి, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి ప్రా రంభించారు. ఈ సందర్భంగా జంగా రాఘవ రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం క్రీడలకు మొండిచేయి చూపిందన్నారు. రా ష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీ ఎం రేవంత్రెడ్డి క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని క్రీడారంగంలో తెలంగాణను అగ్రభాగాన నిలపాలన్నా రు. మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించి స్ఫూర్తి చాటాలన్నారు. తల్లిదండ్రులు పి ల్లలను చదువుతోపాటు క్రీడల్లో ప్రోత్సహించి వారి ఉజ్వల భవిష్యత్కు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గాదెపాక అయోధ్య, బాధ్యులు బంగారు స్వామి, బి.వి. రమణ, దర్గయ్య, వెంకట్రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ తీగల కరుణాకర్రా వు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నెబోయిన భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు. ఖోఖో అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవరెడ్డి -
జాతీయ లోక్ అదాలత్కు అపూర్వ స్పందన
వరంగల్ లీగల్: వరంగల్, హనుమకొండ జిల్లాల కోర్టు ప్రాంగణాల్లో శనివారం వేర్వేరుగా ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్కు అపూర్వ స్పందన లభించింది. కేసుల పరిష్కారానికి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10 బెంచ్లు ఏర్పాటు చేశారు. ఇందులో వరంగల్ – 8, నర్సంపేట–2 బెంచ్లు ఏర్పాటు చేసి 5,938 పెండింగ్ కేసులు ఛేదించారు. ఇందులో సివిల్ 26, ఎంవీఓపీ 24 కేసులకు రూ.2,15, 44,176లు, క్రిమినల్ కేసులు 5912, బ్యాంకు పీఎల్సీ కేసులు 76,720 కేసులకు రూ. 2,28,82,709లతో పరిష్కరించారు. అలాగే, హనుమకొండ జిల్లా వ్యాప్తంగా 8 బెంచ్లు ఏర్పాటు చేసి 56,867 పెండింగ్ కేసులు పరిష్కరించారు. ఇందులో సివిల్ కేసులు 71, ఎంవీఓపీ 62 కేసులకు రూ.7,31,55,963లు, క్రిమినల్ కేసులు 18,412, బ్యాంకు పీఎల్సీ 38,379 కేసులకు రూ.1,15,56,828లతో పరిష్కరించారు. ఈజాతీయ లోక్ అదాలత్లో వినూత్న లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డేవిడ్ రాజ్కుమార్ సుమారు 300 పులిహోర ప్యాకెట్లను కక్షిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు, కక్షిదారులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు జయశ్రీ, రమాదేవి పాల్గొన్నారు దంపతులను కలిపిన లోక్ అదాలత్.. మహబూబాబాద్ రూరల్ : కుటుంబ తగాదాలతో కొంతకాలంగా దూరంగా ఉంటున్న దంపతులను లోక్ అదాలత్ కలిపింది. మహబూబాబాద్ జిల్లా గంగారం పోలీసు స్టేషన్ పరిధికి చెందిన బోడ అనూష, అనిల్ దంపతులు ఏడాది నుంచి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో డీఎస్పీ తిరుపతిరావు ఆధ్వర్యంలో గూడూరు సీఐ సూర్యప్రకాశ్, గంగారం ఎస్సై రవికుమార్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఫిర్యాది అనూషతో మాట్లాడి రాజీ కుదుర్చగా శనివారం లోక్ అదాలత్ సందర్భంగా కోర్టు డ్యూటీ అధికారి వెంకటేశ్వర్లు ఆ దంపతులను జిల్లా జడ్జి మహమ్మద్ అబ్దుల్ రఫీ సమక్షంలో మాట్లాడించారు. దీంతో తాము కలిసి ఉంటామని ఒప్పుకున్నారు. కాగా, జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ వారిని అభినందించారు. యూరియా వచ్చేసింది.. ఖిలా వరంగల్: వరంగల్ రైల్వేస్టేషన్ గూడ్స్ షెడ్కు శనివారం 2,644.150 సీఐఎల్ కోరమండల్ యూరియా వచ్చింది. దీంతో రైతులకు ఊరట లభించనుంది. వ్యవసాయ అఽధికారులు విజ్ఞాన్, రవీందర్రెడ్డి.. కంపెనీ ప్రతినిధులతో కలిసి యూరియా స్టాక్ను పరిశీలించారు. కలెక్టర్ సత్యశారద, డీఏఓ అనురాధ.. మార్క్ఫెడ్కు 60 శాతం, ప్రైవేట్ఫర్టిలైజర్ డీలర్లకు 40శాతం కేటాయించారు. వరంగల్ జిల్లాకు 424.15 మెట్రిక్ టన్నులు, హనుమకొండ 430, ములుగు 300, జయశంకర్ భూపాలపల్లి 400, జనగామ 450, మహబూబాబాద్ జిల్లాకు 440 మెట్రిక్ టన్నుల కేటాయింపులు జరిగాయి. శనివారం సాయంత్రం వరకు యూరియాను జిల్లా, మండల కేంద్రాలకు తరలించే కార్యక్రమాన్ని చేపట్టామని ఏఓ రవీందర్ రెడ్డి తెలిపారు. -
చైన్స్నాచర్ అరెస్ట్, రిమాండ్
స్టేషన్ఘన్పూర్: మండలంలోని సముద్రాల శివారు నారాయణపురం గ్రామానికి చెందిన మహిళా రైతు కత్తుల రాజమ్మ మెడ నుంచి బంగారు పుస్తెలతాడును అపహరించిన కుక్కల రాంబాబును పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సీఐ జి.వేణు కథనం ప్రకారం.. జఫర్గఢ్ మండలం కూనూరుకు చెందిన కుక్కల రాంబాబు భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే గతేడాది నుంచి ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ల్లో పాల్గొంటూ డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో స్టేషన్ఘన్పూర్లో ఓ వ్యక్తి తన బైక్ డిక్కీలో రూ.70వేలు ఉంచి కిరాణాషాపుకు వెళ్లొచ్చే సరికి ఆ నగదు తస్కరించాడు. ఆ ఘటనలో పోలీసులకు చిక్కి వారం రోజులు జైలుకెళ్లొచ్చాడు. అయినా మార్పు రాలేదు. ఈ క్రమంలో ఈనెల 4వ తేదీన ఉదయం మహిళా రైతు కత్తుల రాజమ్మ, యాదగిరి దంపతులు యూరియా కోసం స్టేషన్ఘన్పూర్ వచ్చారు. సాయంత్రం బైక్పై యూరియా తీసుకెళ్తుండగా రాంబాబు బైక్పై వారిని అనుసరించాడు. విశ్వనాథపురం వద్ద రాజమ్మ మెడ నుంచి రూ.1.20లక్షల విలువైన మూడుతులాల పావు బంగారు పుస్తెలతాడు గొలుసును లాక్కుని ఉడాయించాడు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఎస్సై మనీషా ఈనెల 12న ఘన్పూర్ శివాజీ సెంటర్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా రాంబాబు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. మహిళా రైతు రాజమ్మ మెడ నుంచి బంగారు పుస్తెలతాడును అపహరించింది తానేనని అంగీకరించాడు. దీంతో పుస్తెలతాడును, బైక్ను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. కాగా, చైన్స్నాచింగ్ జరిగిన వారం రోజుల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి బంగారం రికవరీ చేసిన సీఐ జి.వేణు, ఎస్సైలకు,సిబ్బందికి బాధితురాలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐలు వినయ్కుమార్, మనీషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వారం రోజుల్లోనే నిందితుడిని పట్టుకున్న పోలీసులు -
ప్రాణాల మీదకు వస్తున్న యూరియా కొరత
కొత్తగూడ: యూరియా కొరత రైతుల ప్రాణాల మీదకు వస్తోంది. క్యూలో నిల్చున్న రైతులు అనారోగ్యం పాలవుతుంటే.. యూరియా దొరకక కొందరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారు. కొత్తగూడ, గంగారం మండలాల్లో మొక్కజొన్న, వరి పంటలు ఎక్కువగా సాగవుతుంటాయి. దీంతో యూరియా వినియోగం కూడా ఎక్కువ ఉంటుంది. పంటకు అదనుకు యూరియా వేయకపోతే పంట ఎర్రబడి దిగుబడి తక్కువగా వస్తుంది. తర్వాత యూరియా వేసినా ప్రయోజనం ఉండదు. తాజాగా కొత్తగూడ మండల కేంద్రంలోని బూరుగుగుంపుకు చెందిన మల్లెల నర్సయ్య యూరియా దొరకడం లేదని శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘పొగుళ్లపల్లి సొసైటీ వద్దకు పది రోజులు.. కొత్తగూడలో ఐదు రోజుల పాటు యూరియా కోసం తిరిగినా దొరకలేదు. పంట ఎర్రబడి పోతుంది. ఏం చేయాల్నో తెలువక పురుగుల మందు తాగి సద్దామనుకున్న.. ఎవుసం చేసినోడు సావక ఏం చేయాలె’ అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. అలాగే తెల్లవారుజాము నుంచి లైన్లో నిల్చుని అనారోగ్యం పాలైన గాంధీనగర్కు చెందిన రామక్క, ఈశ్వరగూడెంకు చెందిన లక్ష్మినర్సులను ఎస్సై రాజ్కుమార్ తన వా హనంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఇలా చాలా మంది రైతులు యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్నారు. క్లస్టర్ల వారీగా పంపిణీ చేస్తున్నా.. మండలంలోని పీఏసీఎస్ వద్ద యూరియా పంపిణీ చేయడంతో రైతులు ఎక్కువ సంఖ్యలో రావడంతో సమయం ఎక్కువగా తీసుకుంటుంది. దూర ప్రాంతాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అధికారులు క్లస్టర్ వారీగా విభజించి పంపిణీ చేస్తున్నారు. అయినా సరిపడా యూరియా లభించకపోవడంతో రైతులు మనోవేదనకు గురవుతున్నారు. ఇప్పటికై న అధికారులు స్పందించి సకాలంలో యూరియా పంపిణీ చేసి రైతులకు ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. అదనుకు అందకపోవడంతో రైతుల ఆత్మహత్యాయత్నం -
బంగారమే వృద్ధురాలి ప్రాణం తీసింది..
నెల్లికుదురు: శరీరంపై ఉన్న బంగారమే వృద్ధురాలి హత్యకు కారణమైంది. బంగారం కోసం ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని దుండగులు హత్య చేసి బావిలో పడేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై చిర్ర రమేశ్ బాబు కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన వీరగాని రాధమ్మ(80), హుస్సేన్ దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. హుస్సేన్ పదేళ్ల క్రితమే మృతి చెందగా కూతుళ్లు, కుమారుల పెళ్లిళ్లు అయ్యాయి. ముగ్గురు కొడుకులు వ్యాపార నిమిత్తం ఇతర గ్రామాల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో రాధమ్మ ఒంటరిగా ఉంటూ కూలీ చేసుకుంటూ జీవిస్తోంది. రాధమ్మ శరీరం మీద సుమారు మూడు తులాల బంగారం, కొంత వెండి ఉంది. ఇది గమనించి దుండగులు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో రాధమ్మపై దాడికి పాల్పడ్డాడు. అనంతరం హత్య చేసి మృతదేహాన్ని ఇంటి ఎదుట ఉన్న బావిలో పడేశారు. శనివారం ఉదయం రాధమ్మ కనిపించకపోవడం.. ఇంటి ఎదుట రక్తపు మరకలు కనిపించడంతో స్థానికులు చూసి రాధమ్మ కుమారులకు సమాచారం అందించారు. పోలీసుల సహకారంతో బావి నుంచి రాధమ్మ మృతదేహాన్ని వెలికితీశారు. మృతురాలి కుమారుడు మలేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. హత్య చేసి బావిలో పడేసిన దుండగులు నెల్లికుదురులో ఘటన వివరాలు వెల్లడించిన ఎస్సై రమేశ్ బాబు -
నాడు శాంతిని నెలకొల్పడమే గాంధీ ధ్యేయం
విద్యారణ్యపురి: దేశంలో స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రం సిద్ధించాక నాడు శాంతిని నెలకొల్ప డమే ధ్యేయంగా పనిచేసిన మహనీయుడు మహాత్మాగాంధీ అని కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్యనవీన్ అన్నారు. శనివారం హనుమకొండలోని నవీన్ రెసిడెన్సీలో ప్రజాకవికాళోజీ నారాయణరావు రచించిన బాపూ..బాపూ రెండో ముద్రణకావ్యాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భగా నిర్వహించిన సభలో ఆయన ముఖ్యఅతిథిగాపాల్గొని మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా గొప్ప రచయితలు మహాత్మాగాంధీ గురించి అద్భుతంగా రచించారన్నారు. గిరిజా మనోహరాబాబు ఈ గ్రంథాన్ని పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి, బాధ్యులు పొట్లపెల్లి శ్రీనివాస్రావు, పందిళ్ల అశోక్కుమార్, కాళోజీ ఫౌండేషన్ పేరుతో గ్రంఽథాన్ని ముద్రించిన చింతకుంట్ల సంపత్రెడ్డి, రచయితలు గంటారామిరెడ్డి, ఆచార్య బన్న అయిలయ్య, బాసిరి సాంబశివరావు, నెల్లుట్ల రమాదేవి, డాక్టర్ ఆగపాటి రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నవీన్ -
నిరీక్షణకు తెర!
సాక్షి, మహబూబాబాద్ : నమ్మకంతో భూములు కొనుగోలు చేసి తెల్లకాగితంపై ఒప్పందం కుదుర్చుకున్న రైతులు భూమిని సాగు చేసుకుంటున్నా.. వారి పూర్తి స్థాయి హక్కు రాలేదు. ఇటువంటి రైతులకు భూమి హక్కు కల్పించేందుకు ప్రభుత్వం కల్పించిన సాదా బైనామాకు ఇంత కాలం అడ్డంకిగా ఉన్న సమస్యలకు కోర్టు స్టే తొలగిపోయింది. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంలో నిబంధనలకు పొందుపరుస్తూ జీఓ జారీ చేశారు. దీంతో ఐదు సంవత్సరాలుగా సాదాబైనామా కోసం ఎదురుచూస్తున్న రైతుల నిరీక్షణకు తెరపడనుంది. తొలగిన అడ్డంకులు భూ ప్రక్షాలన సందర్భంగా వెలుగులోకి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు 2020లో అప్పటి ప్రభుత్వం 121 జీఓ తీసుకొచ్చింది. ఈ జీఓ ప్రకారం భూ క్రయవిక్రయాలపై తెల్లకాగితం ఉంటే చాలు సాదా బైనామా ద్వారా పట్టేదారు పాస్ పుస్తకాలు జారీ చేసే అవకాశం వచ్చింది. దీనిని ఆసరాగా చేసుకొని జిల్లా వ్యాప్తంగా 80 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే 2020 ఆర్ఓఆర్ చట్టంలో క్రమబద్ధీకరణ సెక్షన్లు లేనందున కోర్టు స్టే విధించింది. దీంతో సాదాబైనామా ప్రక్రియకు బ్రేక్ పడింది. ప్రభుత్వం ఇటీవల 106 జీఓ తీసుకొచ్చి అడ్డంకులను తొలగించడంతో సాదాబైనామాకు మార్గం సుగమనం అయ్యింది. కాస్తులో ఉన్నా.. రూ.లక్షలు పెట్టి భూమిని కొనుగోలు చేసుకొని.. కాస్తులో ఉన్నా.. హక్కు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా బ్యాంకు రుణాలు, ప్రభుత్వం అందించే సబ్సిడీతో ఎరువులు, విత్తనాల కొనుగోలు, పండించిన ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో గిట్టుబాటు ధరకు అమ్మడం, చివరకు ప్రకృతి వైపరీత్యాలకు పంటనష్టం జరిగితే వచ్చే పరిహారం పొందేందుకు పట్టేదారు పాస్ పుస్తకం అనివార్యమైంది. దీంతో భూమి తనదైనా.. సాగుచేసి పంట పండిస్తున్నా.. హక్కు పత్రం లేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. 12 సంవత్సరాలు కాస్తులో ఉన్నవారికే.. సాదాబైనామాకు అడ్డంకి తొలిగినా.. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన 106 జీఓ ప్రకారం 2014కు పూర్వం క్రయవిక్రయాలు జరిగినట్లు ఉండి.. 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు దరఖాస్తు చేసుకున్నవారికే అవకాశం ఉంటుంది. అంటే 12 సంవత్సరాల క్రితం భూమిని కొని కాస్తులో ఉన్నవారికే సాదాబైనామా ద్వారా పట్టాదారు పాస్ పుస్తకాలు అందనున్నాయి. రెవెన్యూ సదస్సులో.. గత ప్రభుత్వ హయాంలో 2020లో రైతులు చేసుకున్న దరకాస్తులకు తోడుగా ప్రభుత్వం ఇటీవల భూ భారతి చట్టం అమలుకోసం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు కూడా పరిశీలిస్తున్నారు. అంతకు ముందు 80వేల సాదా బైనామా దరఖాస్తులు రాగా.. రెవెన్యూ సదస్సుల్లో 39,513 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా 24,014 దరఖాస్తులు సాదాబైనామావే ఉన్నాయి. అయితే గతంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అందులో ఉన్న దరఖాస్తుల్లో రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన వాటిని పరిశీలించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కోర్టు గ్రీన్ సిగ్నల్తో రైతుల్లో ఆశలు 2020లో 80వేలకు పైగా సాదాబైనామా దరఖాస్తులు నిబంధనల ప్రకారం పట్టాలు జిల్లాలో మొదలైన ప్రక్రియజిల్లాలో వచ్చిన దరఖాస్తుల వివరాలు సమస్య వచ్చిన దరఖాస్తులు సర్వే నంబర్ మిస్సింగ్ 1,476 పెండింగ్ మ్యుటేషన్ 384 డీఎస్ పెండింగ్ 1,148 విస్తీర్ణ సవరణ 1,632 భూ స్వభావం 263 పట్టాదారు పేర్ల సవరణ 225 ప్రొహిబిటెడ్ లిస్టు నుంచి తీసివేయడం 462 ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చడం 02 అసైన్డ్ భూ సమస్య 1,378 ఓఆర్సీ ఇష్యూ కానివి 45 38–ఈ సర్టిఫికెట్ రాకపోవడం 06 వారసత్వ సమస్య 2,007 భూ సేకరణ సమస్య 169 ఇతర సమస్యలు 30,316 మొత్తం 39,513ప్రక్రియ వేగవంతమైంది.. భూ భారతి చట్టం అమలు ప్రక్రియ జిల్లాలో వేగంగా సాగుతోంది. సాదా బైనామాకు ఉన్న అడ్డంకులు తొలిగి పోయాయి. నిబంధనలను అనుసరించి ప్రక్రియ మొదలవుతుంది. అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి గైడెన్స్ రావాల్సి ఉంది. మిగిలిన సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. – అనిల్ కుమార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ -
రాజీ మార్గం అత్యుత్తమం
మహబూబాబాద్ రూరల్ : రాజీమార్గమే ప్రశాంతమైన జీవన విధానానికి మార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో ఆయన పాల్గొని మాట్లాడారు. భార్యభర్తల మధ్య వచ్చే తగాదాలతో ఎన్నో రకాల కేసులు నమోదవుతున్నాయని, వీటన్నింటికీ భార్యాభర్తలు ఒక కేసులో రాజీ పడినట్లయితే మిగతా అన్ని కేసులు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందన్నారు. జాతీయ లోక్ అదాలత్కు సహకరిస్తున్న న్యాయవాదులు, పోలీసులు, కోర్టు సిబ్బందికి అభినందనలు తెలిపారు. అనంతరం సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్.శాలిని మాట్లాడుతూ కక్షిదారులకు తక్కువ సమయంలో అంతిమమైన పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎ.ప్రేమ్ చందర్, న్యాయమూర్తులు స్వాతి మురారి, కృష్ణతేజ్ అర్వపల్లి, న్యాయవాదులు, వివిధ బ్యాంకుల అధికారులు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు. 6,482 కేసుల పరిష్కారం... జిల్లా కోర్టు భవనాల సముదాయం ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 6,482 కేసులను పరిష్కరించారు. ఇందులో రాజీపడిన 104 క్రిమినల్ కేసులు, నేరం ఒప్పుకున్న క్రిమినల్ కేసులు 116, చెక్కు బౌన్స్ కేసులు రెండు, సివిల్ కేసులు ఎనిమిది, సైబర్ క్రైమ్ కేసులు 22, ఒప్పుకున్న సెకండ్ క్లాస్ కోర్టు నేరం కేసులు 865 ఉన్నాయి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పరిధిలో ప్రిలిటిగేషన్, ట్రాఫిక్, బీఎస్ఎన్ఎల్, బ్యాంకు, విద్యుత్ శాఖ మొత్తం కేసులు కలిపి 5,350 ఉన్నాయి. మోటారు వాహన ప్రమాద (ఎంవీఓపీ) కేసులు 15 పరిష్కరించి బాధితులకు రూ.1,16,45,000 పరిహారంగా అందజేయాలని ఆదేశించారు. న్యాయవాదులకు శిక్షణ తరగతులు అవసరమే హైకోర్టు జడ్జి జస్టిస్ కె.లక్ష్మణ్ డీసీసీబీ భవన్లో న్యాయ విజ్ఞాన సదస్సు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ -
జీవన ఎరువులు వాడాలి
మహబూబాబాద్ రూరల్ : జీవన ఎరువుల వాడకంతో రైతులకు మేలు జరుగుతుందని మల్యాల కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ బి.దిలీప్ కుమార్ అన్నారు. మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలో భాగంగా కంబాలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మిర్చి పంట సాగులో పురుగులు, తెగుళ్ల యాజమాన్యంపై శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మిరపలో ఆశించే పురుగుల యాజమాన్యం, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలో భాగంగా పంపిణీ చేసిన ట్రైకోడెర్మా, సూడోమొనాస్ జీవన ఎరువులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యాన శాస్త్రవేత్త సుహాసిని మాట్లాడుతూ.. కూరగాయల సాగు పెంచుకోవాలని రైతులను కోరారు. పంట ఉత్పత్తి శాస్త్రవేత్త క్రాంతికుమార్ మిరపలో తెగుళ్ల యాజమాన్యం గురించి వివరించారు. ఉద్యాన అధికారి శాంతిప్రియదర్శిని మాట్లాడారు. -
శభాష్.. ఎల్కతుర్తి పోలీస్
ఎల్కతుర్తి : వాగులో చిక్కుకున్న ఓ వ్యక్తిని ఖాకీలు కాపాడారు.హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ గ్రామానికి చెందిన గాజుల రాకేశ్.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని శుక్రవారం తెల్లవారుజామున ఇంటికి వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలోని తాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు దాటే క్రమంలో రాకేశ్ కొట్టుకుపోయి బ్రిడ్జి వద్ద ఉన్న మూడో పిల్లర్ను పట్టుకొని కేకలు వేశాడు. గమనించిన గ్రామస్తులు వెంటనే డయల్–100కు సమాచారం ఇచ్చారు. స్పందించిన ఎల్కతుర్తి సీఐ పులి రమేశ్, ఎస్సై ప్రవీణ్కుమార్ వెంటనే తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని తాడుసాయంతో రాకేశ్ను రక్షించారు. దీంతో పోలీసులను ప్రజలు అభినందించారు. కానిస్టేబుల్ బక్కయ్య, వికిల్, రాజు గ్రామస్తులు పాల్గొన్నారు. -
డీసీసీబీ ‘ఏ’ కేటగిరీ సాధించాలి
హన్మకొండ : నాబార్డు ఇన్స్పెక్షన్లో వరంగల్ డీసీసీబీ ‘ఎ’ కేటగిరీ సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో డీసీసీబీ బ్రాంచ్ మేనేజర్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బ్రాంచ్ల వారీగా ప్రగతిని సమీక్షించి ఆయన మాట్లాడారు. నిర్దేశించిన లక్ష్యాలు గడువులోగా సాధించాలని సూచించారు. వ్యక్తిగత పనితీరు మెరుగుపడని వారిపై చర్యలు తీసుకోవాలని సీఈఓను ఆదేశించారు. రుణాలు, మొండి బకాయిలను రికవరీ చేసి సంఘాలను పటిష్టం చేయాలని పేర్కొరు. నిరర్థక ఆస్తులు 2 శాతానికి లోబడి ఉండేలా, టర్నోవర్ రూ.2,500 కోట్లు చేరుకునేలా కృషి చేయాలని అన్నారు. ప్రతి నెల ఖాతాదారులతో సమావేశాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం వరంగల్ డీసీసీబీని రాష్ట్రంలో రెండో స్థానానికి తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో సీఈఓ వజీర్ సుల్తాన్, జీఎంలు ఉషశ్రీ, పద్మావతి, డీజీఎం అశోక్, ఏజీఎంలు మధు, గొట్టం స్రవంతి, బోడ రాజు, గంప స్రవంతి, కృష్ణ మోహన్, డీఆర్ ఓఎస్డీ విజయకుమారి, బ్యాంకు బ్రాంచ్ల మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు -
సాంకేతిక లోపంతో నిలిచిన ‘గోల్కొండ’
డోర్నకల్ : రైలులోని ఓ బోగీలో సాంకేతిక లోపం తలెత్తడంతో సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న గోల్కొండ ఎక్స్ప్రెస్ డోర్నకల్ రైల్వే స్టేషన్లో మూడు గంటలకు పైగా నిలిచింది. వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన గోల్కొండ ఎక్స్ప్రెస్ కాజీపేట దాటిన తర్వాత రైలులోని డీ–2 బోగీలో సాంకేతిక లోపం తలెత్తింది. వరంగల్ స్టేషన్లో బోగీలోకి ఎస్కార్ట్గా ఎక్కిన సిబ్బంది రైలు ఆగిన ప్రతీ స్టేషన్లో డీ–2 బోగీని పరిశీలించారు. రైలు మహబూబాబాద్ దాటిన తర్వాత డీ–2 బోగీలో హార్డ్ యాక్సిల్ బేరింగ్ దెబ్బతిందని సిబ్బంది డోర్నకల్ రైల్వే స్టేషన్కు సమాచారం అందించారు. డోర్నకల్ స్టేషన్లో సీఅండ్ డబ్ల్యూ సిబ్బంది అప్రమత్తమయ్యారు. రైలు సాయంత్రం 5:04 గంటలకు డోర్నకల్ స్టేషన్లోని నాలుగో ప్లాట్ఫామ్ చేరుకున్న తర్వాత డీ–2 బోగీని క్షుణ్ణంగా తనిఖీ చేసి రైలు నుంచి తొలగించాలని నిర్ధారించారు. రైలు వెనుకవైపు ఇంజన్ అమర్చి బీ–2 వరకు చివరి ఐదు బోగీలను జంక్షన్లోని యార్డుకు తరలించారు. డీ–2 బోగీని యార్డులో వదిలి మిగతా నాలుగు బోగీలను తిరిగి రైలుకు అమర్చిన తర్వాత రైలు రాత్రి 8:13 గంటలకు డోర్నకల్ నుంచి కదిలింది. సుమారు మూడు గంటలకు పైగా స్టేషన్లో రైలు నిలవడంతో విజయవాడ, గుంటూరు వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఖమ్మం వెళ్లే ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. -
గొర్రెల మందపై పిడుగు..
కాళేశ్వరం : గొర్రెల మందపై పిడుగు పడి 94 మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం పెద్దంపేట గోదావరి శివారు ప్రాంతంలో గురువారం రాత్రి జరిగింది. స్థానికులు, గొర్రెల కాపరులు తెలిపిన కథనం ప్రకారం.. అంబటిపల్లికి చెందిన సుమారు ఆరు గొర్రెల మందలు పెద్దంపేట–లెంకలగడ్డ గ్రామ శివారులో మేతకు వెళ్లి అక్కడే నిద్రిస్తున్నట్లు చెప్పారు. ఈక్రమంలో రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కాపరులు మంద నుంచి సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న గుడారంలోకి వెళ్లారు. మందపై ఒక్కసారి పిడుగు పడడంతో గొర్రెలన్నీ ఎక్కడిక్కడ చెల్లా చెదురయ్యాయి. రూ.10 లక్షల విలువైన 94 గొర్రెలు మృతిచెందడంతో యజమానులు కన్నీటి పర్యంతమయ్యారు. జిల్లా పశువైద్యాధికారి కుమారస్వామి, మండల పశువైద్యాధికారి రాజబాపు, తహసీల్దార్ రామారావు చనిపోయిన గొర్రెలకు పంచనామా, పోస్టుమార్టం చేశారు. గోతితీసి పాతిపెట్టినట్లు అధికారులు తెలిపారు. -
ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబించేలా పనులు
ఎస్ఎస్తాడ్వాయి : మేడారం గద్దెల ప్రాంగణంలో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా పనులు చేపట్టనున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు తెలిపారు. ఐటీడీఏ అతిథి గృహంలో శుక్రవారం నిర్వహించిన ఆదివాసీ సంఘాల ముఖ్య ప్రతినిధుల సమావేశంలో ఆర్కిటెక్చర్, కోయల పడిగల గుడ్డల లిపి 3నుంచి 7 గొట్ల మూలాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాలు గుడ్డలో ఉన్న పూర్వ చరిత్ర చిత్రలిపి, ఆదివాసీ జీవన విధానం గోడలపై ఆవిష్కరించాలని సూచించారు. వెయ్యేళ్లు సజీవంగా ఉండేలా, ఆదివాసీల చరిత్ర నిలిచేలా జాతర చరిత్ర బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా గద్దెల ప్రాంగణం, సాలాహారం నిర్మాణంపై ఆదివాసీల బొమ్మలు ఉండాలని తీర్మానించినట్లు పేర్కొన్నారు. కోయ ద్వారాల మాదిరిగానే ఆలయ ద్వారాల నిర్మాణాలు ఉంటాయని వివరించారు. ద్వారాలపై సమ్మక్క–సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు మూలాలు, ఆదివాసీల గొట్లు, గోత్రాలు, సిద్ధబోయిన వారి పూజావిధాన పద్ధతులు కూడా ఉంటాయని చెప్పారు. మిగిలిన 8 ద్వారాల్లో ఐదో గొట్టు సమ్మక్క, మూడో గొట్టు సారలమ్మ, నాలుగో గొట్టు పగిడిద్దరాజు, గోవిందరాజు, వడ్డె (పూజారి) గోత్రాలతో ప్రత్యేక ద్వారాలు ఏర్పాటు చేయడంతోపాటు ఆ వంశ మూల చరిత్ర ఉంటుందన్నారు. ఆదివాసీ సంస్కృతికి విరుద్ధంగా నిర్మాణాలు ఉండవని స్పష్టం చేశారు. ఆలయంలో ఏర్పాటు చేయనున్న చిత్రాలను కలెక్టర్కు పంపించామన్నారు. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, డాక్టర్ మైపతి అరుణ్ కుమార్, పూజారులు చందా రఘుపతి, సిద్ధబోయిన స్వామి, నర్సింగరావు, సిద్ధబోయిన అరుణ్, కొక్కెర రమేశ్, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి, ఆదివాసీ నేత ముద్దబోయిన రవి, సమ్మక్క–సారలమ్మ పరిశోధన కేంద్రం సభ్యుడు కోరం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు -
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ కేసముద్రం: యూరియా పంపిణీలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. శుక్రవారం ఉదయం మండలంలోని కల్వల, ధన్నసరి పీఏసీఎస్ సెంటర్తోపాటు, ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతువేదిక యూరియా పంపిణీ సెంటర్లను పరిశీలించారు. రైతులకు సరిపడా యూరియా అందుతుందని, ఎవరూ కూడా ఆందోళన చెందవద్దన్నారు. కార్యక్రమంలో ఎస్సై మురళీధర్రాజు, పోలీస్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. ప్రతీ రైతుకు యూరియా బస్తా అందుతుంది మరిపెడ రూరల్: ప్రతీ రైతుకు యూరియా బస్తా అందేల చూస్తామని ఎస్పీ సుధీర్ రాంనాఽథ్ కేకన్ అన్నారు. శుక్రవారం మరిపెడ పీఏసీఎస్ కార్యాలయం వద్ద రైతులకు యూరియా పంపిణీని ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. మరిపెడ సీఐ రాజ్కుమార్, సెకండ్ ఎస్సై కోటేశ్వరావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఆటోడ్రైవర్ ఆత్మహత్య
ఖిలా వరంగల్ : మైక్రో ఫైనాన్స్ వేధింపులు, ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందిన ఓ ఆటో డ్రై వర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. బంధువుల కథనం ప్రకారం.. ఖిలా వరంగల్ పడమరకోట ఎస్సీ కాలనీకి చెందిన ఆకులపల్లి కమలాకర్ (40) ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అప్పు తీర్చాలని మైక్రో ఫైనాన్స్లో వేధింపులు, ఆర్థిక ఇబ్బందులతో కమలాక ర్ పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిల్స్కాలనీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య, కుమారులు ఉన్నారు. మృతుడి మమత ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఒకే ఇంటిపై మూడు పిడుగులు
●ఎల్లంపేటలో గృహోపకరణాలు దగ్ధం.. మరిపెడ రూరల్ : ఒకే ఇంటిపై మూడుసార్లు పిడుగులు పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేటలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలోని ఎస్సీ కాలనీలో వంగూరి వెంకన్న, వెంకటమ్మ నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి వారి భవనం మెట్లపై ఒక చోట, డాబాపై రెండు చోట్ల పిడుగు పడింది. భయంతో వణికిపోయిన దంపతులు పక్కింట్లో తలదాచుకున్నారు. సొమ్మసిల్లి పడిపోయిన వెంకటమ్మను ఆస్పత్రికి తరలించారు. పిడుగులు పడి స్లాబుకు పెచ్చులూడి పగుళ్లు ఏర్పడ్డాయి. ఇంట్లోని ఫ్రిడ్జి, ఫ్యాన్లు, టీవీ, విద్యుత్ తీగలు కాలిపోయాయి. మొత్తం రూ.లక్షకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. ఘటన స్థలాన్ని శుక్రవారం గ్రామ పరిపాలన అధికారి గణేశ్ పరిశీలించి పంచనామా నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మరిపెడ పీఏసీఎస్ వైస్ చైర్మన్ గండి మహేశ్తో పాటు గ్రామస్తులు కోరారు. -
ప్రభుత్వ బడిలో కార్పొరేట్ విద్య
హసన్పర్తి : ప్రభుత్వ విద్యా సంస్థల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందుతోందని హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. దాతలు (అరబిందో ఫార్మా ఫౌండేషన్, బ్రెల్చివ్ టర్నాలజీ, స్వాన్ టర్బిన్ సర్వీస్) సహకారంతో హసన్పర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల, బాలికల పాఠశాలలో సుమారు రూ.42లక్షల వ్యయంతో నిర్మించిన ఆడిటోరియం, కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయ భవనాన్ని శుక్రవారం ఎమ్మెల్యే కేఆర్.నాగరాజుతో కలిసి కలెక్టర్ స్నేహశబరీష్ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. చదువుకు పేదరికం అడ్డుకాదని చెప్పారు. ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు మాట్లాడుతూ.. ఆడిటోరియంలో ఫర్నిచర్ను సమకూరుస్తానని హామీ ఇచ్చారు. హసన్పర్తికి చెందిన ఈగల్ ఎస్పీ చెన్నూరి రూపేశ్ పేదరికాన్ని జయించి ఐపీఎస్గా ఉద్యోగం సాధించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోటీపరీక్షలకు సంబంధించిన సుమారు రూ.8లక్షల విలువైన మెటీరియల్ను విద్యార్థులకు అందజేశారు. దాతలు స్వాన్ టర్బిన్ సర్వీస్ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ, డైరెక్టర్ అరుణ, బ్రెల్చివ్ టర్నాలజీ సీఈఓ డాక్టర్ ఉదయ్కుమార్, మహర్షి ఫౌండేషన్ అధ్యక్షుడు చెన్నూరి రవిని శాలువాలతో సత్కరించారు. డీఐఈఓ గోపాల్, ప్రిన్సిపాల్ సునీత, కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, కాంగ్రెస్ నాయకులు, ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ స్నేహశబరీష్ దాతల సాయంతో హసన్పర్తి కళాశాల, పాఠశాలలో రూ.42 లక్షల వ్యయంతో ఆడిటోరియం, ల్యాబ్ ప్రారంభం -
16న జాబ్మేళా
న్యూశాయంపేట: ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగులకు వరంగల్ జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి టి.రజిత తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఈనెల 16న ములుగురోడ్డులోని ఐటీఐ క్యాంపస్లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ముత్తూట్ మైక్రోఫిన్ లిమిటెడ్ కంపెనీలో రిలేషన్ షిప్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్న ట్లు తెలిపారు. వివరాలకు 80790 09659లో నంబర్లో సంప్రదించాలని ఆమె సూచించారు. బిట్ కాయిన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసంమహబూబాబాద్ రూరల్ : బిట్ కాయిన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసం జరగగా ఓ బాధితుడు రూ.32.53 లక్షలు పోగొట్టుకున్నాడు. అనంతరం పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మహబూబాబాద్ టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి శుక్రవారం కేసు వివరాలను వెల్లడించారు. మహబూబాబాద్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి మొబైల్కు సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా షాదీడాట్ కామ్ అని మెసేజ్ చేసి వివరాలు అడిగారు. బాధితుడికి వివాహమైందని తెలియజేసి వారికి వివరాలు ఇవ్వలేదు. కొన్నిరోజుల తర్వాత అదే వాట్సాప్ నంబర్ నుంచి బిట్ కాయిన్ ట్రేడింగ్ గురించి చెప్పి అందులో పెట్టుబడి పెడితే ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయని నమ్మబలికి లింక్ పంపించారు. ఆ లింక్తో బిట్ కాయిన్ ట్రేడింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు. అనంతరం వాళ్లు చెప్పిన విధంగా మొదటగా రూ.50వేలు, ఆ తర్వాత రూ.5లక్షలు పంపించాడు. అయితే బాధితుడి వాలెట్లో రూ.పది లక్షలు ఉన్నట్టు చూపించి నమ్మించారు. ఇది నమ్మిన బాధితుడు పలు దఫాలుగా వాళ్లు చెప్పినట్లు వివిధ ఖాతా నంబర్లకు మొత్తం రూ.32,53,447 పంపించాడు. తర్వాత ఎలాంటి నగదు బాధితుడి అకౌంట్లో జమకాలేదు. అయినా కూడా డబ్బులు జమ చేయకుండా మరింతా డబ్బులు అడుగుతుండటంతో తాను సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయానని గ్రహించాడు. వెంటనే బాధితుడు మహబూబాబాద్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. ● రూ.32.53లక్షలు పోగొట్టుకున్న బాధితుడు ● కేసు నమోదు చేసిన పోలీసులు -
అత్తను కడతేర్చిన అల్లుడి అరెస్ట్
ఏటూరునాగారం : మద్యానికి బానిసై మేనత్తను హత్యచేసిన అల్లుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఏఎస్పీ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం వీఆర్కేపురం–ఇప్పలగూడెం ప్రాంతానికి చెందిన కొండగొర్ల ఎల్లమ్మను బుధవారం ఆమె మేనల్లుడు విజయ్కుమార్ గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ ఘటనపై వెంకటాపురం(కె) పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా విజయ్కుమార్ తండ్రి చిన్నతనంలో మరణించగా ఎలాంటి పని చేయకుండా మద్యం, జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈక్రమంలో అతడి మేనత్త ఎల్లమ్మ భర్తతో విడిపోయి తల్లిగారి ఇంటి వద్దనే ఉంటోంది. దీంతో ఆమె వద్దనుంచి విజయ్కుమార్ తరుచూ డబ్బులు తీసుకొని జల్సాలు చేసేవాడు. బుధవారం కూడా డబ్బు, బంగారం ఇవ్వాలని ఎల్లమ్మ ను అడడగా ఆమె నిరాకరించింది. మద్యం మత్తులో ఉన్న విజయ్కుమార్ కోపోద్రికుడై గొడ్డలితో ఎల్లమ్మపై దాడి చేసి హత్య చేశాడని ఏఎస్పీ తెలిపారు. నిందితుడిని పట్టుకున్న సీఐ రమేష్, ఎస్సై తిరుపతిని ఏఎస్పీ అభినందిచారు. -
ఖాతానుంచి రూ.99,600 మాయం
ఖానాపురం : బంగారం కుదువ పెట్టి తీసుకున్న నగదు ఖాతానుంచి మాయమైంది. ఈ సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని బాలుతండాకు చెందిన గుగులోత్ ఈరు బంగారాన్ని తీసుకెళ్లి బుధవారం నర్సంపేట పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కుదువ పెట్టి రూ.2.60 లక్షల రుణం తీసుకున్నాడు. గురువారం నగదు విత్డ్రాకు అనుమతి ఇవ్వకపోవడంతో తనకున్న మరో ఏపీజీవీబీకి బదిలీ చేయించుకున్నాడు. బీఓఐలో బంగారం ఇచ్చినట్లు రశీదు తీసుకోవడానికి రూ.260 చెల్లించాలని బ్యాంక్ ఉద్యోగి తెలిపాడు. దీంతో క్యూఆర్ కోడ్తో చెల్లించి ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత చిట్టీ చెల్లించడానికి రూ. 13వేలు, పెట్రోల్ కోసం రూ.200 ఖాతా నుంచి వినియోగించాడు. సాయంత్రం కుటుంబ స భ్యులు ఈరు సెల్కు వచ్చిన మెసేజ్లు చూ డటంతో పలు దఫాలుగా రూ.99,600 ఖా తాలో నుంచి వి త్డ్రా అయినట్లు గమనించారు. దీంతో భయాందోళనకు గురైన ఈరు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చెల్పూరులో చైన్ స్నాచింగ్ ● బంగారు పుస్తెలతాడు అపహరణ గణపురం: మండలంలోని చెల్పూరులో గురువారం అర్ధరాత్రి చైన్ స్నాచింగ్ జరిగింది. చెల్పూరుకు చెందిన వృద్ధురాలు కౌటం మొండక్క మూత్రవిసర్జనకు బయటకు వచ్చింది. అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడకు వెంట తెచ్చుకున్న టైరును వేసి బంధించాడు. ఒక చేతితో నోటిని మూసి ఆమె మెడలోని నాలుగున్నర తులాల బంగారు పుస్తెల తాడును అపహరించాడు. ఆమె అరుపులు విన్న భర్త మొగిలయ్య బయటకు రావడంతో అప్పటికే దుండగుడు పారిపోయాడు. మెడ ను ంచి పుస్తెల తాడు తెంపే క్రమంలో మొండక్క మెడకు గాయాలయ్యాయి. భర్త మొగిలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ పేర్కొన్నారు. వరుస చోరీలతో ఆందోళన.. గతనెలలో కూడా చెల్పూరు గ్రామానికి చెందిన వృద్ధురాలు నరహరి కమలమ్మను ఇంటి వద్ద దింపుతానని గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలును లాక్కెళ్లాడు. ఈ ఘటన జరిగి నెలగడవక ముందే గురువారం అర్ధరాత్రి చైన్ స్నాచింగ్ చేయడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దొంగతనాలను ప్పాడుతున్న వారు స్థానికుల లేదా ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చారా అని గ్రామస్తులు భయపడుతున్నారు. నిందితులను వెంటనే పట్టుకొని పోలీసులు ధైర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ముగిసిన కబడ్డీ టోర్నమెంట్కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఇంటర్ కాలేజీయేట్ డిగ్రీ, పీజీ కళాశాలల కబడ్డీ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. ఫైనల్లో ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ డిగ్రీ కాలేజీ జట్టు విజయం సాధించింది. హనుమకొండలోని వాగ్దేవి కళాశాల జట్టు రన్నరప్గా నిలిచింది. ఇరు జట్లకు కేయూ స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ వై.వెంకయ్య, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి. మనోహర్ బహుమతులు అందజేశారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ఎస్. కుమారస్వామి, ఫిజికల్ డైరెక్టర్లు సోమన్న, జేత్య, కిరణ్కుమార్, పాషా, పల్లవి, బుచ్చన్న, సుమన్, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. -
వర్షం, పిడుగుల బీభత్సం
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆస్తి నష్టంఉమ్మడి వరంగల్ జిల్లాలో గురువారం రాత్రి పిడుగులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించాయి. పలు ప్రాంతాల్లో పిడుగుపాటుకు భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. హనుమకొండ జిల్లా నడికూడ మండలం కౌకొండలో రూ.95 వేల విలువైన ఎద్దు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం పెద్దంపేట గోదావరి శివారు ప్రాంతంలో రూ.10 లక్షల విలువైన 94 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. టేకుమట్ల మండలంలో మానేరులో వరద ఒక్కసారిగా ఉప్పొంగడంతో ట్రాక్టర్లు మునిగిపోగా ఏడుగురిని పోలీసులు రక్షించారు. -
శంకర్దాదా ఎంబీబీఎస్లు!
● వరంగల్ నగరం కాశిబుగ్గ ప్రాంతంలో అర్హత లేకుండా నిర్వహిస్తున్న నకిలీ వైద్య కేంద్రాలపై ఆగస్టు 20న తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీఎంసీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఈసందర్భంగా మామిడి ఈశ్వరయ్య అనే వ్యక్తి ఎల్ఐసీ ఏజెంట్గా పనిచేస్తూ డాక్టర్ పోస్టర్ పెట్టుకుని రోగులను మోసం చేస్తున్నట్లు సభ్యులు గుర్తించారు. ● హనుమకొండ జిల్లా మడికొండ ప్రాంతంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ లాలయ్యకుమార్ ఆదేశాల మేరకు టీజీఎంసీ బృందం ఇటీవల ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈతనిఖీల్లో మడికొండ మెయిన్ రోడ్డులో ‘సాయిశ్రీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్’ పేరుతో అక్రమంగా ఒక క్లినిక్ను నిర్వహిస్తున్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాక్షిప్రతినిధి, వరంగల్: ..ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నకిలీ సర్టిఫికెట్లు.. పొంతనలేని మందులు.. ఎమర్జెన్సీ వైద్యం చేస్తూ కొందరు ‘నకిలీ’లు నిర్వహిస్తున్న ఆస్పత్రులు పేదలకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఖర్చు తక్కువ పేరిట వైద్యం ఎరవేస్తున్న కొందరు ‘శంకర్దాదా ఎంబీబీఎస్’ల తీరు శాపంగా మారుతోంది. ఫేక్ డిగ్రీలు.. సర్టిఫికెట్లతో ‘డాక్టర్’ స్టిక్కర్లు వేసుకుంటున్న అనేక మంది నగరాలు, పట్టణాలతో పాటు పల్లెల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలా ఉమ్మడి వరంగల్లో 3,250కు పైగా అర్హత లేని వైద్యులున్నట్లు సమాచారం. చాలా మంది ఎలాంటి అనుమతులు లేకుండా ఆస్పత్రులు, క్లినిక్లు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆయుర్వేద వైద్యం పేరిట ఎక్కడ పడితే అక్కడ ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. ఇటీవల తెలంగాణ వైద్య మండలి, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో అనేక ఘటనలు వెలుగు చూడడం గమనార్హం. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీలు గ్రేటర్ వరంగల్ నగరంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో నకిలీ పీఎంపీలు, ఆర్ఎంపీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. ఎక్కడి పడితే అక్కడ ఇష్టారాజ్యంగా క్లినిక్లు, ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు సైతం జ్వరం, ఒళ్లునొప్పులు, వ్యాధి ఏదైనా ముందుగా సమీపంలోని ఆర్ఎంపీల దగ్గరికే వెళ్తున్నారు. రోగాలను నయం చేస్తారనే భరోసాతో వేలకు వేలు ఫీజులు చెల్లిస్తున్నారు. తాజాగా నకిలీ డిగ్రీలతో చికిత్స చేస్తున్న కొందరు ఆర్ఎంపీ, పీఎంపీలపై మెడికల్ కౌన్సిల్ కొరడా ఝుళిపిస్తుండడంతో ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. ఆగస్టులో 15 కేసులు.. కొన్ని నెలలుగా నకిలీ వైద్యులపై తరచూ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్న తెలంగాణ మెడికల్ కౌన్సిల్.. ఒక్క ఆగస్టు నెలలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 15 కేసులు నమోదు చేసింది. పలువురి నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మెడికల్ కౌన్సిల్ అధికారులు గత నెలలో వరంగల్, హనుమకొండ, స్టేషన్ఘన్పూర్, గీసుకొండ, హసన్పర్తి, భూపాలపల్లి, జనగామ, ములుగు, మహబూబాబాద్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నకిలీలు అని తేలిన వారిపై ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఎంసీ చట్టం 34, 54 (టీఎస్ఎంపీఆర్ చట్టం 22 ప్రకారం కేసులు నమోదు చేశారు. పరిధి దాటి వైద్యం చేసిన మరికొంత మంది ఆర్ఎంపీలు, పీఎంపీలు ఎన్ఎంసీ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు టీఎంసీ అధికారులు ప్రకటించారు. కాగా.. ఆరు నెలల్లో 50 మందికి పైగా కేసులు నమోదైనప్పటికీ కొందరు ఆర్ఎంపీలు, పీఎంపీలు తమ తీరు మార్చుకోకుండా పరిధి దాటి వైద్యం చేస్తూ అమాయక ప్రజల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మచ్చుకు కొన్ని ఘటనలు.. ● వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రైల్వే స్టేషన్ ఎదురుగా కొందరు అనధికారికంగా హాస్పిటల్ మాదిరిగా బెడ్స్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అర్హతలు లేకుండా ఆదర్శ వైద్యులమని ప్రజలను మోసం చేసి రిజిస్టర్డ్ వైద్యుల్లా అలోపతి వైద్యం నిర్వహించారు. ముగ్గురు నకిలీ వైద్యులను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు తనిఖీల్లో గుర్తించారు. ఎం.రమేశ్ (లావణ్య ఫస్ట్ ఎయిడ్ సెంటర్), బి.రవి (రుద్ర ఫస్ట్ ఎయిడ్ సెంటర్), డి.అశోక్ (అమ్మ ఫస్ట్ ఎయిడ్ సెంటర్)పై కేసులు నమోదు చేసినట్లు ప్రకటించారు. ● మహబూబాబాద్ జిల్లా హరిపిరాలలో ఓ బాలికకు జ్వరం, వాంతులు రావడంతో ఓ క్లినిక్కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడు సైలెన్ పెట్టి నాలుగు ఇంజక్షన్లు ఇచ్చారు. దీంతో ఆమె అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇలా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా తరచూ అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. నకిలీ వైద్యులపై వైద్య, ఆరోగ్యశాఖాపరంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని ఈ విషయంలో అప్రమత్తం చేస్తున్నాం. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆర్ఎంపీలపై దాడులు నిర్వహించేటప్పుడు వైద్య, ఆరోగ్యశాఖతో కలిసి చేస్తే మరిన్ని సత్ఫలితాలు వస్తాయి. అనధికారిక క్లినిక్లు సీజ్ చేసే అధికారం వైద్య ఆరోగ్యశాఖ అధికారికి మాత్రమే ఉంటుంది. క్వాలిఫైడ్ ఆర్ఎంపీలు బోర్డు పెట్టుకోకుండా ఫస్ట్ ఎయిడ్ చికిత్స చేయవచ్చు. – డాక్టర్ అప్పయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, హనుమకొండ పేదలకు శాపంగా మారిన నకిలీ వైద్యులు ఎక్కడపడితే అక్కడ క్లినిక్లు, ల్యాబ్లు యథేచ్ఛగా నిర్వహిస్తున్న అనర్హులు తక్కువ ఖర్చు పేరిట ఫేక్ ట్రీట్మెంట్ వైద్యం వికటించి పలువురికి అస్వస్థత పోలీసు కేసులకు వెరవని కొందరు -
యూరియా అందేలా చర్యలు చేపట్టాలి
● కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ గార్ల: ప్రతీ రైతుకు యూరియా బస్తాలు అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం గార్లలోని పీఏసీఎస్ గోదాం, సీహెచ్సీ, కేజీబీవీని పరిశీలించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్క అధికారి అంకితభావంతో పనిచేస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యూరియా స రఫరా చేయాలన్నారు. గోదాం వద్దకు వెళ్లి యూ రియా నిల్వలను పరిశీలించారు. అలాగే సీహెచ్సీని తనిఖీ చేసి వైద్యులు, వైద్యసిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. విధులకు గైర్హాజరైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డీసీహెచ్ఎస్ రమేశ్ను ఆదేశించారు. రోగుల వార్డులను పరిశీలించి, మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. కేజీబీవీ సందర్శించి, తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థినుల విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. డీపీఓ హరిప్రసాద్, తహసీల్దార్ శారద, ఎంపీడీఓ మంగమ్మ, ఏఓ కావటి రామారావు, సీఈఓ వెంకటేశ్వర్లు ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలి డోర్నకల్: సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అద్వైత్సింగ్కుమార్ ఆదేశించారు. స్థానిక పీహెచ్సీని శుక్రవారం తనిఖీ చేశారు. ఇన్పేషెంట్, ఔట్ పేషెంట్ సిబ్బంది వివరాలు, సిబ్బంది హాజరు రికార్డులు తనిఖీ చేశారు. మాతా, శిశు మరణాల నివారణకు మందస్తు చర్యలు చేపట్టాలని, సాదారణ ప్రసవాలను పెంచాలని సూచించారు. అనంతరం పీఏసీఎస్లో ఎరువుల పంపిణీని పరిశీలించారు. -
అనాసక్తి!
వ్యాపారులమహబూబాబాద్: జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన మోడల్ కూరగాయల మార్కెట్లోకి వెళ్లేందుకు వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. పనులు పూర్తికాలేదని, గాంధీపార్కులోనే ఉంటామని చాలామంది వ్యాపారులు వాదిస్తున్నారు. అయితే సభలు, సమావేశాలకు ఇబ్బంది అవుతుందని గాంధీపార్కునుంచి కూరగాయల మార్కెట్ను తొలగించాలని పలు పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నారు. ఈసమస్య ఇలా ఉంటే పాత బజార్లో ఉన్న పాత కల్లు కాంపౌండ్ స్థలంలో కూరగాయాల మార్కెట్ ఏర్పాటు చేయాలని వ్యాపారులు కార్యాలయంలో వినతులు ఇచ్చారు. లక్ష దాటినా జనాభా.. మానుకోట మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా 57,818 మంది ఓటర్లు 68,889 మంది జనాభా ఉంది. కానీ ఉద్యోగం, విద్యా, వ్యాపారం పరంగా మానుకోటలో నివాసం ఉండే వారితో కల్పితే లక్ష జనాభా దాటుతుంది. 25,000లకు పైగా గృహాలు ఉన్నాయి. కాగా చిరు వ్యాపారులను దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం హయాంలోనే ఆఫీసర్ క్లబ్ పక్కనే ఉన్న స్థలంలో ఇంటిగ్రేటెడ్ నాన్ వెజ్ మార్కెట్ సముదాయానికి నిధులు కేటాయించి దాదాపు పనులు పూర్తి చేశారు. అయితే ఆ స్థలంలోనే కూరగాయల వ్యాపారులు వ్యాపారం చేసే వారు. ఇంటిగ్రేటెడ్ నాన్వెజ్ మార్కెట్ నిర్మాణం వల్ల వారికి గాంధీపార్కులో కేటాయించారు. అప్పటి నుంచి అక్కడే కూరగాయలు విక్రయిస్తున్నారు. 2023లోనే మోడల్ మార్కెట్ ప్రారంభం మోడల్ మార్కెట్ను 30–06–2023లో ప్రారంభించారు. అయితే నేటి వరకు కూరగాయల వ్యాపారులు అందులోకి వెళ్లలేదు. కొన్ని పనులు పెండింగ్లో ఉండడంతో స్థానిక ఎమ్మెల్యే మురళీనాయక్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన రూ.90లక్షలు మంజూరు చేయగా.. అందులో రూ.60లక్షల పనులు పూర్తయ్యాయి. మిగిలిన రూ.30లక్షలతో పార్కింగ్, గేట్లు ఇతర పనులు చేపట్టాల్సి ఉందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. మార్కెట్ను ప్రారంభించి సంవత్సరాలు గడుస్తున్నా వ్యాపారులు వెళ్లకపోవడంతో మందు బాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. అనుకూలంగా లేదనే వాదన.. మార్కెట్ తమకు అనుకూలంగా లేదని వ్యాపారులు వాదిస్తున్నారు. దానికి తోడు పనులు కూడా పూర్తి కాలేదని చెబుతున్నారు. దీంతో గాంధీపార్కులోనే వారు తిష్ట వేశారు. అధికారులు మాత్రం పార్కింగ్ గేట్ల పనులు జరుగుతున్నాయని, దీంతో ఎలాంటి ఆటంకం లేదని వ్యాపారులు వెళ్లాలని సూచిస్తున్నారు. కానీ వ్యాపారులు ససేమిరా అంటున్నారు. దీంతో ఆ సమస్య అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. పలు పార్టీలు ఆధ్వర్యంలో ఆందోళనలు.. గాంధీపార్కు మొదటి నుంచి సభలు, సమావేశాలకు వేదికగా ఉందని వెంటనే కూరగాయల వ్యాపారులను ఖాళీ చేయించి, అభివృద్ధి చేయాలని పలు పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నారు. పలు సంఘాల ఆధ్వర్యంలో ఆపార్కులో అంబేడ్కర్ భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. తెరపైకి కొత్త సమస్య.. పాత బజార్లోని పాత కల్లు కాంపౌండ్ స్థలంలో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయాలని కమిషనర్కు వినతులు ఇచ్చారు. కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయకపోతే ఆస్థలం కబ్జా చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులకు విన్నవించారు. కాగా అది గ్రీన్ల్యాండ్ కావడంతో ఎలాంటి నిర్మాణాలు చేపట్టే అవకాశం లేదని అధికారులు అంటున్నారు.పనులన్నీ పూర్తయితేనే.. మోడల్ మార్కెట్లో పనులన్నీ పూర్తయితేనే వెళ్తాం. అందరికీ అనుకూలంగా ఏర్పాటు చేయాలి. మార్కెట్ ఎదుట గుమ్చీలు ఏర్పాటు చేయవద్దు. వ్యాపారపరంగా నష్టం లేకుండా చేస్తేనే వెళ్తాం. –ఎం.వెంకట్రావ్, కూరగాయల మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు దసరాలోపే తరలిస్తాం దసరాలోపే కూరగాయల మార్కెట్ను మోడల్ మార్కెట్లోకి తరలిస్తాం. దాదాపు పనులు పూర్తి అయ్యాయి. మిగిలిన చిన్న చిన్న పనులతో సమస్య లేదు. వ్యాపారులు మోడల్ మార్కెట్లోకి వెళ్లాల్సిందే. వ్యాపారుల కోసమే అది ఏర్పాటు చేశాం. వ్యాపారులు సహకరించాలి. – రాజేశ్వర్, మానుకోట మున్సిపల్ కమిషనర్ -
ప్రజల గొంతు నొక్కడమే..
హన్మకొండ అర్బన్: ప్రతిపక్షాల గొంతు నొక్కడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఉన్న ఏకై క గొంతుక పత్రికలు. వాటిని కూడా అణచివేయడం, అక్రమ కేసులతో తొక్కివేయడం వంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో దురదృష్టకర పరిణామాలుగా చెప్పాలి. ఏపీలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. పత్రికలే ప్రజల గొంతుకగా ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో పత్రికలు, పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టులను కేసుల పేరుతో నిర్బంధించడం, వేధించడం అమానుషం. ఇది మంచి పరిణామం కాదు. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ప్రభుత్వాలు, నాయకులు ప్రజాగ్రహానికి గురవ్వక తప్పదు. – ఎన్నమనేని జగన్మోహన్రావు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రజల స్వేచ్ఛను హరించడమే..హన్మకొండ అర్బన్: అధికార పక్షం విఫలమైనప్పుడు ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా నిలబడేవి పత్రికలు, మీడియా మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు అధికారంలోకి వస్తే వారు తమ స్వలాభం కోసం నిర్బంధాలు విధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అది పూర్తిగా ప్రజలను ఇబ్బంది పెట్టినట్లే, కక్ష సాధించినట్లే. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. అధికారంలో ఎవరున్నా పత్రికా స్వేచ్ఛను కాలరాయడమన్నది ప్రజల స్వేచ్ఛను హరించడమే. ఇప్పటికై నా ప్రభుత్వాలు ఉద్దేశపూర్వక చర్యలను మానుకోవాలి. సాక్షి జర్నలిస్టులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి. – నిమ్మల శ్రీనివాస్, సామాజికవేత్త -
కలానికి సంకెళ్లేసి సత్యాన్ని నిర్బంధించలేరు!
నిఖార్సయిన జర్నలిజంతో తెలుగు పత్రికా ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్న ‘సాక్షి’పై ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అక్కసు పెంచుకుందని ఉమ్మడి వరంగల్ జిల్లా పాత్రికేయులు, పాత్రికేయ సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలకు అక్షర రూపమిచ్చినందుకు సాక్షి జర్నలిస్టులపై అక్కడి ప్రభుత్వం కేసులు పెట్టించడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. కలానికి సంకెళ్లు వేసి సత్యాన్ని నిర్బంధించగలరా? అని వారంతా ప్రశ్నిస్తున్నారు. -
నియంతృత్వ పాలనకు నిదర్శనం..
మహబూబాబాద్ అర్బన్: ప్రజాస్వామ్య మౌలిక సూత్రమే భావ ప్రకటన స్వేచ్ఛ. అలాంటి స్వేచ్ఛను కాలరాయడం నియంతృత్వ పాలనకు నిదర్శనం. వాక్ స్వాతంత్య్రం నిరాకరించడం అంటే ప్రజస్వామ్యంలో నాలుగో స్తంభాన్ని కూలగొట్టడమే. ప్రభుత్వ కాలపరిమితి పరిమితం. కానీ, ప్రజాస్వామ్యం అజేయమైంది. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై కేసులు పెట్టి మీడియా గొంతును నొక్కడం సరికాదు. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం సరికాదు. – డాక్టర్ డోలి సత్యనారాయణ, తెలంగాణ ఉద్యమకారుడు, మానుకోట ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే.. ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా పత్రికలు పనిచేస్తాయి. ఆంధ్రప్రదేశ్లో సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై పోలీసులు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పత్రికా స్వేచ్ఛను హరించడమంటే రాజ్యాంగ సూత్రాలను దెబ్బతీయడమే. ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే. పత్రికా స్వేచ్ఛను కాపాడకుంటే ప్రజలు బుద్ధిచెబుతారు. – పిల్లి సుధాకర్, మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు -
ఇబ్బంది లేకుండా పంపిణీ చేయాలి
● కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ గూడూరు: రైతులకు ఇబ్బంది కలగకుండా యూరియా పంపిణీ చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ అన్నారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్లో యూరియా నిల్వ, వడ్డెరగూడెం శివారు రైతు వేదిక వద్ద టోకెన్ల కోసం రైతుల క్యూను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి అబ్దుల్మాలిక్తో యూరియా పంపిణీ, రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యూరియా పంపిణీలో తప్పకుండా పోలీసుల సహకారం తీసుకోవాలని, అందుకు పోలీసులు తప్పక సహకరించాలని సూచించారు. అనంతరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్తో పాటు ప్రాథమిక పాఠశాలను, తిరిగి వెళ్లే ముందు బ్రాహ్మణపల్లిలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. మధ్యాహ్నం భోజనం సమయంలో పాఠశాలకు వెళ్లిన కలెక్టర్ ప్రతీరోజు మెనూ పాటిస్తూ వడ్డిస్తున్నారా, భోజనం రుచికరంగా ఉంటుందా అని విద్యార్థులను అడిగారు. అందుకు పిల్లలు బాగుంటుందని చెప్పడంతో సంతృప్తి చెందారు. అదేవిధంగా సీహెచ్సీలో మందులు వివరాలను అడిగి తెలుసుకొని, వైద్యులు అందుబాటులో ఉంటూ సేవలందించాలన్నారు. కేజీబీవీ పరసర ప్రాంతాలను పరిశుభ్రంగా చూసుకోవాలన్నారు. భోజన వసతి, తరగతి గదులను పరిశీలించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్ నాగభవాని, సీఐ సూర్యప్రకాశ్, ఎస్సై గిరిధర్రెడ్డి పాల్గొన్నారు. -
రైతులకు సరిపడా యూరియా
● డీఏఓ విజయనిర్మల, డీసీఓ వెంకటేశ్వర్లు మహబూబాబాద్ రూరల్ : జిల్లాలోని రైతులందరికీ యూరియా అందించడం కోసం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నామని జిల్లా వ్యవసాయ, జిల్లా సహకార శాఖల అధికారులు విజయనిర్మల, వెంకటేశ్వర్లు అన్నారు. కలెక్టరేట్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో రైతులకు యూరియా అంది ంచడానికి అన్ని మండలాలలకు ప్రత్యేక అధికారులను నియమించారని తెలిపారు. కలెక్టర్, ఎస్పీ స్వయంగా రైతులను కలుస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారని, ప్రస్తుతం అందిస్తున్న యూరి యా, వచ్చే యూరియా వివరాలను క్లస్టర్ల వారీగా రైతులకు సమాచారం అందిస్తున్నారన్నారు. జిల్లాలో 44 యూరియా అమ్మకాల కేంద్రాలు, 20 రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీ చేస్తున్నామన్నారు. మరో 10 కేంద్రాల నిర్వహణ కోసం ప్రతి పాదనలు సిద్ధం చేశామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 27,347 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామన్నారు. రైతులు నానో యూరియా వినియోగించి భూసారాన్ని కాపాడుకోవాలని సూచించారు. సమావేశంలో డీపీఆర్ఓ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కొరత లేకుండా చర్యలు డోర్నకల్: జిల్లాలో యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని డీఏఓ విజయనిర్మల తెలిపారు. మండలంలోని అమ్మపాలెం గ్రామ రైతువేదిక భవనంలో జరుగుతున్న యూరియా కూపన్ల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం డీఏఓ పరిశీలించారు. గొల్లచర్ల సమీపంలోని పీఏసీఎస్ కార్యాలయంలో ఎరువుల పంపిణీని మండల ప్రత్యేక అధికారి నర్సింహమూర్తి, సీఐ చంద్రమౌళి, వ్యవసాయ అధికారి మురళీమోహన్ తదితరులు పరిశీలించారు. -
భావ ప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు సరికాదు!
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం వచ్చాక పత్రికా స్వేచ్ఛ, ప్రశ్నించే గొంతుకలను భౌతికదాడులతో పాటు పోలీసులను ఉపయోగిస్తూ తప్పుడు కేసులతో తీవ్ర అణచివేతకు గురిచేస్తుండడంపై పాత్రికేయులు, పాత్రికేయ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రజా సమస్యలపై కథనాలు ప్రచురిస్తే సాక్షి దినపత్రిక జర్నలిస్టులపై కొందరు ప్రభుత్వ ఉద్యోగులతో ఫిర్యాదులు ఇప్పిస్తూ కేసులు నమోదు చేస్తుండడాన్ని ఖండించారు. వివిధ అంశాలపై ప్రతిపక్ష పార్టీల నాయకులు ఏర్పాటు చేసే ప్రెస్కాన్ఫరెన్స్ల వార్తలు రాసిన సందర్భంలోనూ సాక్షి దినపత్రికతో పాటు ఎడిటర్, ఇతర జర్నలిస్టులపై తప్పుడు కేసులు నమోదు చేస్తూ రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛను పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. – హన్మకొండ -
రైతులు అధైర్యపడొద్దు
● ఎస్పీ సుధీర్రాంనాథ్ కేకన్ నర్సింహులపేట: రైతులకు సరిపడా యూరియా అందుతుందని, ఎవరూ అధైర్యపడొద్దని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. గురువారం నర్సింహులపేట, పెద్దనాగారం రైతు వేదికల వద్ద యూరియా కూపన్లు, బస్తాల పంపిణీని ఎస్పీ పరిశీలించారు. బస్తాల కోసం క్యూలో ఉన్న రైతులతో మాట్లాడారు. ఈరోజు మండలానికి 50టన్నుల యారియా వచ్చిందని, ప్రతీరోజు వస్తుందని, రైతులు ఎలాంటి అందోళన చెందవద్దన్నారు. నిత్యం పోలీసులు బందోబస్తు మధ్య పంపిణీ జరిగేలా చూస్తామన్నారు. యూరియా పంపిణీపై అధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో డీఎస్పీ కృష్ణకిశోర్, ఎస్సై సురేష్, ఏఓ వినయ్కుమార్ పాల్గొన్నారు. సజావుగా సరఫరా మహబూబాబాద్ రూరల్: యూరియా సరఫరా సజావుగా జరిగేలా జిల్లా పోలీసు యంత్రాంగం అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి శనిగపురం పీఏసీఎస్, అమనగల్ రైతు వేదిక వద్ద యూరియా టోకెన్లు, బస్తాల పంపిణీ ప్రక్రియను ఎస్పీ గురువారం సందర్శించి పరిశీలించారు. డీఎస్పీ తిరుపతిరావు, సీఐలు మహేందర్ రెడ్డి, హతీరాం, సర్వయ్య ఉన్నారు. -
ముందస్తు ప్రణాళిక
సాక్షి, మహబూబాబాద్: ప్రతీ సంవత్సరం మాదిరిగానే వానాకాలం రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే గత యాసంగిలో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలనే ఆలోచనతో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే గతంలో జరిగిన తప్పులు జరగకుండా మొదటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.2,89,350 మెట్రిక్ టన్నులు కొనుగోలు లక్ష్యంఈ వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా రైతులు పండించిన మొత్తం ధాన్యంలో 2,89,350 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు జిల్లా సివిల్ సప్లయీస్ మార్కెటింగ్ అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. 8,097 ఎకరాల దొడ్డురకం, 2,15,782 ఎకరాల్లో సన్న రకం మొత్తం 2,23,880 ఎకరాల్లో వరి సాగు చేశారు. దీంతో 17,607 మెట్రిక్ టన్నుల దొడ్డురకం, 4,47,878 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇందులో రైతులు తినడానికి నిల్వ ఉంచుకోవడం, ఇతర మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారుల కొనుగోళ్లు పోగా 17,383 మెట్రిక్ టన్నుల దొడ్డురకం, 2,71,967 మెట్రిక్ టన్నుల సన్నరకం మొత్తం 2,89,350 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే అవకాశం ఉందని వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రణాళికలో పేర్కొన్నారు.జిల్లాలో వరి సాగు వివరాలువానాకాలం వరి సాగు: 2,23,880 ఎకరాలుధాన్యం దిగుబడి అంచనా: 4,65,485 మెట్రిక్ టన్నులురైతుల నిల్వ, మిల్లర్లు, ప్రైవేట్ కొనుగోళ్లు: 1,76,135 మెట్రిక్ టన్నులుప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం: 2,89,350 మెట్రిక్ టన్నులుగుణపాఠం నేర్చితేనే..గత యాసంగిలో జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తలెత్తిన సమస్యల నుంచి గుణపాఠం నేర్చుకుంటేనే వానాకాలం కొనుగోళ్లు సజావుగా సాగుతాయని రైతులు చెబుతున్నారు. యసంగిలో 239 కొనుగోలు కేంద్రాల ద్వారా 1.79లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 44.75లక్షల గన్నీ బ్యాగులు అవసరం ఉండగా జిల్లాలో 22,02,225 సిద్ధంగా ఉన్నాయని, మిగిలిన 22,72,775 గన్నీలు కావాలని ఉన్నతాధికారులకు ఇండెంట్ పెట్టారు. అదేవిధంగా 9,979 టార్పాలిన్లు, 259 ప్యాడీ క్లీనర్లు, 239 క్యాలీపర్స్, 234 డస్ట్ రిమూవర్స్, 427 తేమ పరిశీలన యంత్రాలు, 921 వెయింగ్ మిషన్లు సిద్ధం చేశారు. అయితే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు పెట్టేందుకు హమాలీల కొరత వెంటాడింది. కాంటాలు పెట్టిన ధాన్యం వెంటవెంటనే మిల్లులకు తరలించాల్సి ఉండగా.. లారీ సప్లయీస్ కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, తక్కువ లారీలను పంపించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. అంచనాలకు మించి 1,76,100 మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చింది. దీంతో మరోవైపు గన్నీ బ్యాగుల కొరత వెంటాడింది. దీంతో కల్లంలో కాంటాలు పెట్టేందుకు, కాంటాలు పెట్టిన ధాన్యం లారీల్లో లోడ్ చేసేందుకు నెలల తరబడి రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో కాంటాలు పెట్టిన ధాన్యం వర్షాలకు తడిసి మొలకెత్తిన సంఘటనలు ఉన్నాయి. ఇలా యాసంగి ధాన్యం కొనుగోళ్లలో రైతులు, అధికారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ వానాకాలం అలా జరగకుండా ముందుగానే లారీలు, గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని రైతులు కోరుతున్నారు.నవంబర్ నుంచి కొనుగోళ్లుగతంలో మాదిరిగానే ఈ వానాకాలంలో నవంబర్ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఆలస్యంగా వర్షాలు పడ్డాయి. అయితే బావులు, బోర్లు, ఇతర నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో జూన్, జూలైలో నాట్లు వేయగా.. చెరువులనే నమ్ముకున్న ప్రాంతాల్లో ఆగస్టు చివరి వరకు నాట్లు వేశారు. జిల్లాలో ప్రధానంగా పెద్దవంగర, తొర్రూ రు, దంతాలపల్లి, నెల్లికుదురు, నర్సింహులపేట మండలాల్లోని కొంత భాగం నవంబర్ నుంచి వరికోతలు మొదలయ్యే అవకాశం ఉంది. ఈక్రమంలో నవంబర్ చివరి వారంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తే జనవరి వరకు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. -
అటవీ సంపదను కాపాడుకోవాలి
మహబూబాబాద్ రూరల్ : భవిష్యత్ తరాల మనుగడ కోసం అటవీ సంపదను కాపాడుకోవాలని జిల్లా అటవీశాఖ అధికారి విశాల్ బత్తుల అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని మదర్ థెరిస్సా సెంటర్ నుంచి జమాండ్లపల్లి శివారు అటవీశాఖ జిల్లా కార్యాలయం వరకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి అటవీశాఖలో విధి నిర్వహణలో అమరులైన వారిని స్మరించుకుంటూ నివాళులర్పించారు. డీఎఫ్ఓ విశాల్ మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలో అడవుల ప్రాముఖ్యతను గురించి జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం తెలియజేస్తుందన్నారు. కార్యక్రమంలో అటవీ మండల అధికారి వెంకటేశ్వర్లు, రేంజ్ అధికారులు, డిప్యూటీ రేంజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రైళ్లను పునరుద్ధరించాలి
డోర్నకల్: కరోనా కాలంలో రద్దైన రైళ్లను పునరుద్ధరించాలని డీఆర్యూసీసీ సభ్యుడు జె.లచ్చిరాంనాయక్ విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీలో రైల్వే బోర్డు చైర్మన్ సతీష్కుమార్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న లచ్చిరాంనాయక్ పలు రైల్వే సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అంందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కాలంలో రద్దైన రైళ్లను పునరుద్ధరించాలని, డోర్నకల్ రైల్వే స్టేషన్లో పలు రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని కోరినట్లు తెలిపారు. డోర్నకల్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారాలపై టాయిలెట్ల ఏర్పాటుతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేపట్టాలి నెల్లికుదురు: సేంద్రియ పద్ధతులు పాటించి ఎత్తు మడులు, మల్చింగ్ విధానంలో పంటల సాగు చేసి లాభాలు పొందాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి జినుగు మరియన్న రైతులకు సూచించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో గురువారం పర్యటించారు. బోర్లు, బావుల కింద ఆయిల్పామ్, కూరగాయలు, పండ్లు, పూలు, పసుపు, మున గ, మల్బరీ పంటలు సాగు చేసి అధిక లాభాలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు మానస, విజయ్పాల్రెడ్డి, అశోక్, హరీశ్, రైతులు రమేశ్, భూషయ్య తదితరులు పాల్గొన్నారు. విహారయాత్రకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు నెహ్రూసెంటర్: మహబూబాబాద్ ఆర్టీసీ డిపో నుంచి విజయవాడ–బాపట్ల బీచ్కు ఆర్టీసీ యాత్ర ప్రత్యేక బస్సు ఈ నెల 18న బయలుదేరుతుందని ఆర్టీసీ డీఎం ఎం.శివప్రసాద్ గురువారం తెలిపారు. డిపో నుంచి ఉదయం 4 గంటలకు డీలక్స్ బస్సు బయలుదేరి విజయవాడ కనకదుర్గమ్మ గుడి, బాపట్ల బీచ్కు పర్యాటకులను తీసుకెళ్లి అదే రాత్రి 11 గంటలకు మహబూబాబాద్కు చేరుకుంటుందన్నారు. పెద్దలకు రూ.1,000, పిల్లలకు రూ. 500గా చార్జీలు నిర్ణయించామన్నారు. బుకింగ్ కోసం ఎండి.నబీ 99482 14022 నంబర్లో సంప్రదించాలన్నారు. భోజనం, రూమ్ సదుపాయాలు యాత్రికులే భరించాలన్నారు. పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలి మహబూబాబాద్ అర్బన్ : జిల్లాలోని అన్ని ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో ఈ నెల 13న పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలని జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారి ఎం.నర్సింహస్వామి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించాలని, మంచిచెడులు వివరించాలన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు అందజేస్తున్న సంక్షేమాలు, నూతన డైట్ మెనూ గురించి తెలియజేయాలన్నారు. ఈ సమావేశానికి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మెడికల్ ఆఫీసర్స్, సిబ్బంది, వార్డెన్లను ఆహ్వానించాలన్నారు. విద్యుత్ అంతరాయాలు లేకుండా చూస్తాం మహబూబాబాద్ రూరల్: విద్యుత్ అంతరాయాలు తగ్గించి నాణ్యమైన విద్యుత్ సరఫరాకు 11కేవీ లింక్ లైన్ ఏర్పాటు చేశామని జిల్లా విద్యుత్శాఖ ఎస్ఈ విజేందర్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ మండలంలోని దర్గా తండా జీపీ పరిధిలోని రేగడిగూడెం గ్రామంలో 11కేవీ లింక్ లైన్ను గురువారం ప్రారంభించి మాట్లాడారు. నూతన 11 కేవీ లింక్ లైను లక్ష్మీపురం, లక్ష్మీపురం తండా, లాక్య తండా, దర్గా తండా, కొమ్ముగూడెం గ్రామాలను కలుపుతూ నిర్మాణం చేపట్టామన్నారు. తద్వారా రంగాపురం సబ్ స్టేషన్ పరిధిలోని వేమునూరు ఫీడర్పై గల 30శాతం లోడ్ను నడివాడ ఫీడర్పైకి మారిందన్నారు. పొలంబాట కార్యక్రమం చేపట్టి విద్యుత్ వినియోగదారులు, రైతులకు విద్యుత్ ప్రమాదాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో డీఈ విజయ్ కుమార్, ఏడీఈ ప్రశాంత్, ఏఈ వెంకటేశ్వర్లు, విద్యుత్ సిబ్బంది, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. -
మహిళల రక్షణకు చర్యలు తీసుకోవాలి
నెహ్రూసెంటర్: మహిళల రక్షణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటూ, చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి గాడిపెల్లి ప్రమీల డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో ఐద్వా జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అన్ని రంగాల్లో మహిళలు అణచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో హక్కుల సాధనకు నడుంబిగించాలనిపిలుపునిచ్చారు. మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుఛిజీ సూర్నపు సోమయ్య, సంఘం జిల్లా అధ్యక్షురాలు కందునూరి కవిత, తాళ్లపల్లి రమ, సావిత్ర, మమత, చాగంటి భాగ్యమ్మ పాల్గొన్నారు. పంపిణీ పరిశీలన కురవి: సీరోలు మండలం కాంపల్లి సొసైటీలో గురువారం యూరియా పంపిణీ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూశాఖ అధికారులతో మాట్లాడారు. యూరి యా పంపిణీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూ డాలని సూచించారు. యూరియా రైతులందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఆయన వెంట సీరోలు ఏఓ చాయారాజ్, తహసీల్దార్ పున్నంచందర్ ఉన్నారు. ఇంటర్లో ప్రవేశాలకు ఆహ్వానం గూడూరు : మండలంలోని దామరవంచ రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 6, బైపీసీలో 17 సీట్లు ఖాళీగా ఉన్నట్లు ప్రిన్సిపాల్ ఎం.రమే్శ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల జిల్లాలోని గిరిజన బాలురు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేడు (శుక్రవారం) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు హాజరై అడ్మిషన్ పొందాలని ఆయన పేర్కొన్నారు. -
ఆర్టీసీలో భద్రతకు పెద్దపీట..
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం రోడ్డు భద్రతకు ప్రాధాన్యమిస్తోంది. రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు పోతోంది. డ్రైవర్ ఆరోగ్యంగా ఉండి, మంచి నడవడిక, ఆరోగ్యకరమైన జీవన శైలి ఉంటే, మానసికంగా దృఢంగా ఉంటారని... తద్వారా ప్రమాదాలు అరికట్టవచ్చనే ఆలోచనతో వరంగల్ రీజియన్ ముందుకు పోతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సేఫ్టీ వార్డెన్లను నియమించారు. ప్రమాదాలు చేయని, అనుభవజ్ఞులు, సత్ప్రవర్తన, ఎలాంటి దురలవాట్లు లేని డ్రైవర్లు, కండక్టర్లను సేఫ్టీ వార్డెన్లుగా ఎంపిక చేశారు. వరంగల్ రీజియన్లో 9 డిపోలకు ఒకరి చొప్పున నియమించారు. సేఫ్టీ వార్డెన్ల విధులు.. సేఫ్టీ వార్డెన్లు డ్రైవర్లను ప్రతీరోజు నిశి త పరిశీలన చేస్తా రు. సెలవులో ఉ న్న వారిని వదిలి పెట్టరు. వారి ఆరోగ్యాన్ని, జీవనశైలిని దగ్గరగా గమనిస్తారు. వారాంతపు సెలవు రోజులు, స్పెషల్ ఆఫ్లో ఉన్న సమయంలో తగిన విశ్రాంతి తీసుకుంటున్నారా..? మద్యం సేవిస్తున్నారా..? ఇతర దురలవాట్లకు పాల్పడుతున్నారా.. అనారోగ్యంగా ఉంటే అవసరమైన మందులు సమయానుకూలంగా వాడుతున్నారా.. తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. డ్రైవర్ల కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు తీసుకుని విశ్రాంతి రోజు వారి జీవన విధానాన్ని గమనిస్తున్నారు. వారి నడవడిక, ప్రవర్తనలో ఏ మాత్రం తేడా వచ్చినా డిపో, రీజియన్ అధికారులకు వివరించి సన్మార్గంలో నడిచేలా చూస్తారు. ఇలా చేయడం ద్వారా డ్రైవర్లు ఆరోగ్యంగా ఉంటారని, ఎలాంటి అలజడులకు తావు లేకుండా మానసికంగా ఉంటారని అధికారులు తెలిపారు. వరంగల్ రీజియన్లో సంస్థ డ్రైవర్లు 1100, ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్లు 258 మంది ఉన్నారు. ఉద్యోగులు, కార్మికులకు వైద్య పరీక్షలు.. గ్రాండ్ హెల్త్ చాలెంజ్ కార్యక్రమం ద్వారా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు యాజమాన్యం వైద్య పరీక్షలు నిర్వహించింది. వారి ఆరోగ్యాన్ని బట్టి ఉద్యోగులకను కేటగిరీలుగా విభజించింది. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయించింది. హెల్త్ డేటా బేస్లో ఉద్యోగి వారీగా ఆరోగ్యానికి సంబంధించిన సమగ్ర సమాచారం పొందుపరిచారు. వైద్య పరీక్షల ఆధారంగా నాలుగు కేటగిరీలుగా విభజించారు. మందులు వాడుతున్నారా లేదా అని సేఫ్టీ వార్డెన్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. విధులకు వచ్చిన సందర్భంలోనూ వారి వ్యక్తిగత రికార్డులు పరిశీలించి వాడాల్సిన ఔషధాలు వెంట తెచ్చుకున్నారా లేదా అని తెలుసుకుంటున్నారు. అదేవిధంగా భోజనం, తాగునీరు కూడా ఇంటి వద్ద నుంచి తెచ్చుకునేలా మార్గదర్శనం చేస్తున్నారు. నైట్ డ్యూటీకి వెళ్లే వారు, రెస్ట్లో ఉండే వారు దోమతెర, ఓడోమస్ వెంట తీసుకొచ్చేలా వారిని ప్రోత్సహిస్తున్నారు. తద్వారా డ్రైవర్ల ఆరోగ్యం బాగుండడంతోపాటు రోడ్డు ప్రమాదాలు తగ్గుతున్నాయని అధికారులు తెలిపారు. వ్యక్తిగత రికార్డుల పరిశీలన.. డ్రైవర్ల పనితీరుపై కూడా వ్యక్తిగత రికార్డులు నిర్వహిస్తున్నారు. డ్రైవర్ ఉద్యోగంలో చేరిన తేదీ, ప్రవర్తన తీరు.. ప్రమాదాలు జరిగాయా.. జరిగితే ప్ర మాదానికి కారణం ఎవరు.. మామూలు ప్రమాదా మా, మేజర్ ప్రమాదమా.. ప్రాణాలుపోయిన ప్ర మాదమా వంటి వివరాలు నమోదు చేస్తున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సురక్షిత డ్రైవింగ్ చేసే డ్రైవర్లను ‘ఏ’ కేట గిరీలో, మైనర్ ప్రమాదాలు చేసిన వారిని ‘బి’ కేట గిరీ, మేజర్ ప్రమాదాలకు పాల్పడిన వారిని ‘సి’ కే టగిరి, ప్రమాదంలో ప్రాణాలు పోతే ‘డి’ కేటగిరీలో చేర్చారు. డిపో డ్రైవర్లు హనుమకొండ 199 వరంగల్–1 286 వరంగల్–2 19 పరకాల 90 జనగామ 172 తొర్రూరు 120 మహబూబాబాద్ 83 నర్సంపేట 121 భూపాలపల్లి 119డిపోల వారీగా సేఫ్టీ వార్డెన్ల నియామకం..ఆర్టీసీ వరంగల్ రీజియన్లో సేఫ్టీ వార్డెన్స్ను డిపో వారీగా నియమించారు. వరంగల్–1కు ఎంఎం రావు, వరంగల్–2 డిపోకు ఎస్.బాబురావు, హనుమకొండ డిపోకు ఎ.శ్రీనివాస్రెడ్డి, జనగామ డిపోకు సురేందర్, పరకాల డిపోకు శంకరయ్య, భూపాలపల్లి డిపోకు రమేశ్, తొర్రూరు డిపోకు యాకూబ్రెడ్డి, నర్సంపేట డిపోకు బాబు, మహబూబాబాద్ డిపోకు నర్సయ్యను సేఫ్టీ వార్డెన్లుగా నియమించారు.డిపోల వారీగా సేఫ్టీ వార్డెన్ల నియామకం..ఆర్టీసీ వరంగల్ రీజియన్లో సేఫ్టీ వార్డెన్లను డిపో వారీగా నియమించారు. వరంగల్–1కు ఎంఎం రావు, వరంగల్–2 డిపోకు ఎస్.బాబురావు, హనుమకొండ డిపోకు ఎ.శ్రీనివాస్రెడ్డి, జనగామ డిపోకు సురేందర్, పరకాల డిపోకు శంకరయ్య, భూపాలపల్లి డిపోకు రమేశ్, తొర్రూరు డిపోకు యాకూబ్రెడ్డి, నర్సంపేట డిపోకు బాబు, మహబూబాబాద్ డిపోకు నర్సయ్యను సేఫ్టీ వార్డెన్లుగా నియమించారు. సేఫ్టీ వార్డెన్స్ ద్వారా నిత్య పరిశీలన మారుతున్న డ్రైవర్ల జీవన శైలి తగ్గుతున్న ప్రమాదాలు వరంగల్ రీజియన్లో 9 డిపోలు -
మహాజాతర పనులు సకాలంలో పూర్తి చేయాలి
ఎస్ఎస్తాడ్వాయి : మేడారం మహాజాతర అభివృద్ధి పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ దివాకరటీఎస్ అన్నారు. గురువారం మండలంలోని మేడారం ఐటీడీఏ గెస్ట్ హౌస్లో ఎస్పీ డాక్టర్ శబరీశ్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, డీఎఫ్ఓ రాహుల్కిషన్ జాదవ్, అడిషనల్ కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావుతో కలిసి మహాజాతర అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా చేపట్టనున్న పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివాకర్ టీఎస్ మాట్లాడుతూ పీఆర్, ఆర్అండ్బీ, ట్రైబల్ వెల్ఫేర్, ఆర్డబ్ల్యూఎస్, రెవెన్యూ, అటవీశాఖ, పోలీస్, విద్యుత్ శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలించి వారంలోగా నివేదిక అందజేయాలని ఆదేశించారు. ప్రతీ శాఖకు సంబంధించి టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసిన పనులు క్షేత్ర స్థాయిలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో జరిగిన జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. సంబంధిత అధికారులు మేడారంలో క్షేత్ర స్థాయిలో ఉండాలని, పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదిక అందించాలన్నారు. మహాజాతరకు సుమారు కోటి యాభై లక్షల పైగా భక్తులు హాజరవుతారని అంచనా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో జాతర పనులు భక్తులకు సంతృప్తికరంగా ఉండాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ వెంకటేష్, డీఆర్ఓ శ్రీనివాస్రావు, మేడారం ఈఓ వీరస్వామి, తహసీల్దార్ సురేశ్బాబు, అధికారులు పాల్గొన్నారు. పనులను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలి కలెక్టర్ దివాకరటీఎస్ -
సేఫ్టీ వార్డెన్లతో సత్ఫలితాలు..
సేఫ్టీ వార్డెన్ల నియామకం సత్ఫలితాలనిస్తోంది. డ్రైవర్లు వ్యసనాలు, దురలవాట్లకు దూరమవుతున్నారు. మానసికంగా దృఢంగా తయారై సురక్షిత డ్రైవింగ్ చేస్తున్నారు. తద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గుతున్నాయి. గత సంవత్సరంలో చూసుకుంటే గడిచిన నాలుగు నెలల కాలంలో 8 ఫ్యాటల్ ఆక్సిడెంట్లు తగాయి. గతేడాది నాలుగు నెలల కాలంలో 19 ఫ్యాటల్ ఆక్సిడెంట్లు జరుగగా ఈ ఏడాది 11 ప్యాటల్ ఆక్సిడెంట్లు జరిగాయి. 11 ప్రమాదాల్లో మూడు మాత్రమే సంస్థ, సంస్థ అద్దెకు తీసుకున్న డ్రైవర్ల పొరపాటుతో జరిగాయి. మిగతా ప్రమాదాలు ఇతరుల తప్పిదాలతో జరిగాయి. డి.విజయభాను, రీజినల్ మేనేజర్ , వరంగల్ -
పొగాకు ఉత్పత్తులు స్వాధీనం
రామన్నపేట: మట్టెవాడ పీఎస్ పరిధిలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు(అంబర్ ప్యాకెట్లు) విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు వ్యాపారి కొలారియా ముకేశ్ ఇంటిపై టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం దాడులు చేశారు. ఈ మేరకు రూ.8.82 లక్షల విలువైన అంబర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. దాడుల్లో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.శ్రీధర్, ఎస్సై టి.వీరస్వామి, సిబ్బంది పాల్గొన్నారు. 13 నుంచి రోలర్ స్కేటింగ్ ఎంపికలువరంగల్ స్పోర్ట్స్: అండర్–5 నుంచి 18 బాలబాలికలకు ఈ నెల 13, 14వ తేదీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి రోలర్ స్కేటింగ్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు స్కేటింగ్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బండి సిద్ధార్థ, ఓం ప్రకాశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలు 13వ తేదీన ఉనికిచర్లలో ఎస్ఎస్హౌస్ వద్ద, 14న రాంపూర్లోని ఢిల్లీ పబ్లిక్స్కూల్ ఆవరణలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు వివరాల కోసం 6301591754 నంబర్లో సంప్రదించాలని వారు కోరారు. 13,14వ తేదీల్లో వాగ్దేవిలో క్రీడాపోటీలు మామునూరు: ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి క్రీడామైదానంలో ఈనెల 13,14 తేదీల్లో కాకతీయ యూనివర్సిటీ స్థాయి (ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలా బాద్ జిల్లాల) క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు కళాశాల మేనేజ్మెంట్, ప్రిన్సిపాల్ సునీల్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడా పోటీల్లో 32 కళాశాలకు చెందిన డిగ్రీ, పీజీ , ప్రొఫెషనల్ కోర్సుల క్రీడాకారులు హాజరవుతున్నారని తెలిపారు. క్రీడా పర్యవేక్షకులుగా వాగ్దేవి కళాశాలల కార్యదర్శి సి.హెచ్. దేవేందర్రెడ్డి, సి.హెచ్.వాణిదేవి, డైరెక్టర్ సుదర్శన్రెడ్డి, ఆర్గనైజర్ సెక్రటరీ రామాంజనేయులు వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు. బాంబు బ్లాస్టింగ్లో మునేశ్కు గాయాలు ఎస్ఎస్తాడ్వాయి: ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో గురువారం జరిగిన బాంబు బ్లాస్టింగ్లో తాడ్వాయి మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన సీఆర్ఎఫ్ 195 బెటాలియన్ చెందిన ఆదివాసీ యువకుడు అలెం మునేశ్ తీవ్రంగా గాయపడ్డారు. దంతెవాడ జిల్లాలోని బార్సూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రావతి నది సమీపంలో బాంబులను వెలికి తీస్తున్నారు. ఈ క్రమంలో బాంబు పేలి మునేశ్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, మునేశ్ త్వరగా కోలుకోవా లని భూపతిపూర్ గ్రామస్తులతోపాటు మండల ప్రజలు సోషల్ మీడియా ద్వారా దేవతలను వేడుకుంటున్నారు. -
తల్లిదండ్రులకు భారమైన శిశువు మృతదేహం
● ఎంజీఎం మార్చురీలో వదిలేసిన కన్నవారు ● ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనఎంజీఎం: ఎంజీఎం మార్చురీలో ఓ పసికందు మృతదేహాన్ని సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మామిడాల గ్రామానికి చెందిన హైమవతి–అనిల్ దంపతులు వదిలివెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైమావతి 7 నెలల గర్భిణి. కాగా, ఇటీవల తొర్రూరు ఆస్పత్రిలో శిశువుకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో శిశువుకు గుండె సమస్య ఉందని చెప్పడంతో అక్కడి నుంచి ఎంజీఎంలోని నవజాత శిశు కేంద్రానికి తీసుకొచ్చి చికిత్స చేస్తుండగా ఈనెల 8వ తేదీన మృతి చెందింది. కాగా, పసికందు మృతదేహాన్ని తల్లిదండ్రులు మార్చురీలో వదిలివెళ్లారా, డబ్బులు లేకపోవడంతో మున్సిపల్ సిబ్బంది ఖననం చేస్తారు అని వదిలివెళ్లారో తెలియదు. కానీ, గురువారం సాయంత్రం ఆస్పత్రిలో ఈ విషయం చర్చకు దారితీసింది. వెంటనే సమాచారం తెలుసుకున్న మట్టెవాడ పోలీసులు మార్చురీలో ఉన్న పసికందు మృతదేహం గురించి సదరు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు మరోసారి ఎంజీఎం మార్చురీకి రానున్నట్లు మట్టెవాడ ఇన్స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు. -
పేకాట శిబిరంపై పోలీసుల దాడి
● నలుగురి అరెస్ట్ వరంగల్ క్రైం : పేకాట శిబిరంపై దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేసినట్లు సుబేదారి ఇన్స్పెక్టర్ మేకల రంజిత్కుమార్ గురువారం తెలిపారు. సుబేదారి పీఎస్ పరిధి జులైవాడలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు తనిఖీ చేయగా నలుగురు పట్టుబడ్డారు. దీంతో నిందితుల నుంచి రూ. 1.04 ల క్షలు స్వాధీనం చేసుకుని జులైవాడకు చెందిన భూక్య రవి, గుండ్లసింగారానికి చెందిన మాలోత్ రాజు, రాయపర్తికి చెందిన హలావత్ వినోద్, అదాలత్కు చెందిన నూనవత్ తిరుపతిని అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. కాగా, నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన ఎస్సై రామారావు, కానిస్టేబుళ్లు మారేపల్లి ప్రభాకర్, అఖిల్, ప్రమోద్ను ఇన్స్పెక్టర్ రంజిత్కుమార్ అభినందించారు. -
విద్యార్థులు దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి
● రాష్ట్ర గురుకులాల కార్యదర్శి సీతాలక్ష్మి కొత్తగూడ: విద్యార్థులు దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని రాష్ట్ర గురుకులాల కార్యదర్శి సీతా లక్ష్మి అన్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లిలోని ఏకలవ్య గురుకులంలో గురుకులాల రాష్ట్ర స్థాయి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యం ఏర్పరుచుకుని సాధనకు నిరంతరం కష్టపడాలన్నారు. విద్యతోపాటు క్రీడలకూ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వెలికి తీసేందుకు గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ప్రభుత్వం సహకారాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత శిఖ రాలు అధిరోహించాలన్నారు. అదనపు కార్యదర్శి మాధవిదేవి, ఓఎస్డీలు రామారావు, శ్రీనివాస్, గంగాధర్, స్పోర్ట్స్ ఆఫీసర్ వీర్యనాయక్, ఆర్సీఓ రత్నకుమారి, ప్రిన్సిపాల్ అజయ్సింగ్, వివిధ పాఠశాలల పీఈటీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాగా, ఈ పోటీలు ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. -
ఉద్రిక్తంగా మారిన ఏబీవీపీ ఆందోళన
హన్మకొండ అర్బన్: విద్యార్థుల పెండింగ్ ఉపకార వేతనాలు చెల్లించాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. ముఖ్యమంత్రిని విమర్శిస్తూ నినాదాలతో హోరెత్తిన ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు కలెక్టరేట్ లోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించారు. కలెక్టరేట్ గేట్ను తోసుకుని, గేట్లు ఎక్కి లోపలికి దిగేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో పోలీసులు విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. ఆందోళన చేస్తున్న కార్యకర్తలను పోలీసులు ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా సుమారు గంటకుపైగా ఆందోళన కొనసాగింది. ఈసందర్భంగా ఏబీవీపీ వరంగల్ విభాగ్ కన్వీనర్ ఆరెపల్లి సుజిత్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్రెడ్డికి విద్యార్థులు గుర్తుకొస్తారని ఆరోపించారు. వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయకపోతే సీఎం, మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కన్వీనర్ దూళిపూడి హరిచరణ్, వరంగల్ మహానగర్ కార్యదర్శి బెల్లం కార్తీక్, రోహిత్, రాహుల్, నవీన్, త్రినేష్, అభిలాష్, శ్రీశాంత్, సిద్ధు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నం సీఎంను విమర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని ధర్నా -
ఎఫ్ఓబీ నిర్మాణం ఎప్పుడో?
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకోషెడ్ (ఈఎల్ఎస్) వద్ద రైల్వే ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు నిర్మిస్తారని రైల్వే కార్మికులు అంటున్నారు. కాజీపేట జంక్షన్లో 2004లో రైల్వే శాఖ ఎలక్ట్రిక్లోకో మెయిన్ షెడ్ నిర్మించింది. అప్పటి నుంచి రైల్వే అధికారులు, కార్మికులు రైలుపట్టాలు దాటి షెడ్కు వెళ్లాల్సి వస్తోంది. ప్రస్తుతం షెడ్లో 250 లోకోల నిర్వహణతో సుమారు 410 మంది రైల్వే కార్మికులు వివిధ సెక్షన్లలో విధులు నిర్వర్తిస్తున్నారు. షెడ్లోకి వెళ్లి రావాలంటే రైలు పట్టాలు దాటి వెళ్లాల్సి వస్తోంది. రన్నింగ్ ట్రైన్స్, షట్టింగ్ ట్రైన్స్, డీజిల్షెడ్, ఫిట్లైన్ నుంచి వచ్చి వెళ్లే రైళ్ల వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు రైల్వే కార్మికులు అంటున్నారు. ఉదయం డ్యూటీకి వెళ్లేటప్పుడు, లంచ్ టైం, డ్యూటీ అయిపోయిన తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో రైళ్లు వెళ్లే వరకు గేట్ వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు. రైళ్ల రాకపోకలతో విధులకు అంతరాయం ఏర్పడినప్పుడు షెడ్లో 8 గంటల పని వేళలో ఆలస్యం కావడం వల్ల పని భారం పడుతోందని రైల్వే ట్రేడ్ యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో షెడ్ వద్ద ఆర్యూబీ మంజూరైందని, ఏమైందో ఏమో గాని రద్దు కూడా అయిందని అంటున్నారు. షెడ్ కార్మికుల కోసం ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని రైల్వే జీఎం, డీఆర్ఎం, పీఎన్ఎం మీటింగ్తోపాటు రైల్వే బోర్డు స్థాయి వరకు వెళ్లిందని చెబుతున్నారు. ఇప్పటికై నా రైల్వే శాఖ బ్రిడ్జిని నిర్మించాలని షెడ్ రైల్వే నాయకులు, కార్మికులు కోరుతున్నారు. ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ లోకోషెడ్ రైల్వే కార్మికులు -
అంతర్జాతీయ క్రీడా సదస్సుకు డీవైఎస్ఓ అశోక్
వరంగల్ స్పోర్ట్స్: నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ సైన్స్ (ఎన్ఏపీఈఎస్ఎస్) ఆధ్వర్యంలో మలేషియాలో ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న మొదటి అంతర్జాతీయ క్రీడా సదస్సులో పాల్గొనేందుకు హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్కు ఆహ్వానం అందింది. మలేషియాలోని యూనివర్సిటీ టెక్నాలజీ మారా, షా ఆలంలో మూడు రోజులపాటు జరిగే సదస్సులో అశోక్కుమార్ పాల్గొననున్నారు. ఈ మేరకు ఎన్ఎపీఈఎస్ఎస్ చైర్మన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజామహ్మద్ ఫిర్హరాజాఅజిదిన్ ఆహ్వాన పత్రికను పంపించారు. కాకతీయ యూనివర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్పై పీహెచ్డీ చేస్తున్న అశోక్కుమార్ సెమినార్లో పేపర్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. -
వృద్ధురాలి దారుణ హత్య..
వెంకటాపురం(కె): వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. మద్యం మత్తులో డబ్బుల కోసం అల్లుడు గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం వీఆర్కేపురంలో చోటు చేసుకుంది. ఎస్సై తిరుపతిరావు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొండగొర్ల ఎల్లమ్మ(65) భర్తను వదిలి తల్లిదండ్రులతో కలిసి జీవనం కొనసాగిస్తోంది. ఎల్లమ్మ రోజువారీగా కూలీ పనులు చేసుకుంటూ కొంతమేర డబ్బులు దాచుకుంది. ఈ డబ్బులపై తన అన్న కుమారుడు విజయ్ కన్నేశాడు. మద్యానికి బానిసైన విజయ్.. డబ్బులు, బంగారం కావాలని మూడు రోజులుగా మేనత్త ఎల్లమ్మను అడుగుతుండగా ఆమె నిరాకరిస్తోంది. దీనిపై విజయ్ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఎల్లమ్మ గురువారం ఉదయం ఇప్పలగూడెంలోని కిరాణా షాపునకు వెళ్లొస్తోంది. ఈ సమయంలో మద్యం మత్తులో ఉన్న విజయ్ తనకు డబ్బులు ఇవ్వడం లేదనే కోపంతో ఎల్లమ్మపై గొడ్డలితో దాడికి పాల్పడగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి సోదరి బాడిస దుర్గ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందింతుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై తిరుపతిరావు తెలిపారు. కాగా, ఎల్లమ్మ హత్యతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. గొడ్డలితో నరికి చంపిన అల్లుడు మద్యం మత్తులో డబ్బుల కోసం ఘాతుకం వీఆర్కేపురంలో ఘటన -
ఏం జరుగుతోంది..!
సాక్షి, మహబూబాబాద్: మారుమూల ప్రాంతాలు, గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలు ఎక్కువగా ఉన్న మానుకోట జిల్లాలో రోజుకో సమస్య తలెత్తుతోంది. దీంతో అటు అధికారులకు, ఇటు ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారుతోంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా యూరియా సమస్య ఉన్నప్పటికీ మానుకోటలోనే ఎక్కువ ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ సమస్యలతోపాటు, ఇతర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరు ఎలా ఉందని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరా తీసినట్లు తెలిసింది. ఇందుకోసం మంగళవారం రాత్రి ఖమ్మం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లాకు చెందిన పలువురు అధికారులతో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.యూరియా సమస్యపై ఆరా..మానుకోట జిల్లాలో యూరియా సమస్యపై ప్రతీరోజు ఆందోళనలు జరుగుతున్నాయి. కూపన్ల పంపిణీలో గొడవలు, బస్తాలు సక్రమంగా ఇవ్వడం లేదని రైతులు ఆందోళన, బ్లాక్ మార్కెట్ వంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగడం, కొన్నిచోట్ల ఫర్టిలైజర్ షాపులపై దాడులు చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రం అంతటా సమస్య ఉన్నా.. మానుకోటలోనే ఎక్కువ ఆందోళనలు జరగడంతో ముఖ్యమంత్రి, మంత్రి వర్గంలో కూడా చర్చ జరిగినట్లు తెలిసింది.ఈ విషయంపై మంగళవారం జరిపిన సమీక్షలో జిల్లాలో సాగు ఎంత, ఎంత మేరకు యూరియా అవసరం.. ఇప్పటి వరకు ఎంత వచ్చింది.. ఎంత రావాలి.. అనే విషయాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. సమస్య సద్దుమణిగే వరకు అంతా అప్రమత్తంగా ఉండాలని, రైతులతో సున్నితంగా వ్యవహరించి పరిస్థితి చక్కబెట్టాలని సూచించినట్లు సమాచారం. ఇప్పుడు వస్తున్న యూరియాతోపాటు అదనంగా సరఫరా చేసే ప్రయత్నం చేస్తామని, రైతుల్లో నమ్మకం కలిగించేలా వ్యవహరించాలని అధికారులకు చెప్పినట్లు తెలిసింది. -
రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి
● కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ మహబూబాబాద్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా పంపిణీ చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో బుధవారం యూరియా సరఫరా, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 25,800 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామన్నారు. యూరియా సమాచారం క్షేత్రస్థాయిలో ముందస్తుగా రైతులకు అందించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతీ కేంద్రంలో రైతులకు కావాల్సిన తాగునీరు, టెంట్లు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో స్వచ్ఛ భారత్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. శాఖల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించాలన్నారు. అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, నిల్కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
మద్యం టెండర్లకు కసరత్తు
సాక్షిప్రతినిధి, వరంగల్: వైన్స్ (ఏ4)లకు 2025–27 సంవత్సరాలకు సంబంధించి టెండర్లు నిర్వహించేందుకు ఆబ్కారీ శాఖ సన్నద్ధమవుతోంది. వాస్తవానికి నవంబర్ నెలాఖరుతో గడువు ముగియనుండగా.. ఒక నెల ముందుగానే టెండర్లు నిర్వహించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిసింది. గత ప్రభుత్వం 2023 ఆగస్టులోనే వైన్స్ల టెండర్లు నిర్వహించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 1 నుంచి కొత్త ఎకై ్సజ్ పాలసీ అమల్లోకి వస్తున్నప్పటికీ అక్టోబర్లో టెండర్లు నిర్వహించాలని ఆబ్కారీ శాఖ నిర్ణయించినట్లు తెలిసింది. ఈనేపథ్యంలోనే మద్య నిషేధ, ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్లతో ఇటీవల హైదరాబాద్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. దీంతో అక్టోబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడవచ్చని అధికారులు భావిస్తున్నారు. డిసెంబర్ 1 నుంచే కొత్త దుకాణాలు ప్రభుత్వం మద్యం దుకాణాల టెండర్ల సందర్భంగా 2023–25 ఎకై ్సజ్ పాలసీనే అమలు చేయనున్నట్లు చెబుతున్నారు. ఈసారి కూడా ఆరు స్లాబుల విధానాన్నే అమలు చేయనున్నట్లు తెలిసింది. గతంలో 5 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.50 లక్షల లైసెన్స్ ఫీజు వసూలు చేశారు. 5 వేల నుంచి 50 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.55 లక్షలు, 50 వేల నుంచి లక్ష జనాభాకు రూ.60 లక్షలు, లక్ష జనాభా నుంచి 5 లక్షల్లోపు ఉన్న ప్రాంతాలకు రూ.65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల్లోపు జనాభా ప్రాంతాలకు రూ.85 లక్షలు, 20 లక్షలకుపైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.1.10 కోట్లు లైసెన్స్ ఫీజు నిర్ణయించారు. ఈసారి కూడా అదే పాలసీ అమలు చేయనుండడంతో ఎప్పటిలాగే టెండర్లు వేసేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారు. కాగా, డిసెంబర్ ఒకటి నుంచి రాబోయే రెండేళ్లకు సంబంధించి కొత్త పాలసీ అమలుల్లోకి రానుండగా.. గతంలో మాదిరిగానే దుకాణాలకు సంబంధించి మూడు సామాజికవర్గాల (గౌడ, ఎస్సీ, ఎస్టీ) వ్యాపారులకు 30 శాతం వరకు రిజర్వేషన్లు కేటాయించనున్నారు. ఈసారి మద్యం దుకాణాల టెండర్లు పోటాపోటీగా సాగనున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మేడారం సమ్మక్క–సారలమ్మ–జాతరతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగనున్నాయన్న చర్చ ఇప్పటికే సాగుతోంది. రిజర్వేషన్లు యథాతథం.. దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు యథాతథంగా అమలు కానున్నట్లు, ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడినా.. టెండర్లు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎకై ్సజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈమేరకు మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం కేటాయించేలా జిల్లాల వారీగా మద్యనిషేధ, ఆబ్కారీ శాఖ చేస్తున్న కసరత్తు తుదిదశకు చేరినట్లు సమాచారం. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జేఎస్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో 2021–23 సంవత్సరాల నుంచి ఈ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. ఈసారి కూడా ఉమ్మడి వరంగల్లో 294 మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు పాటించనున్నారు. ఈలెక్కన ఉమ్మడి వరంగల్లో 15 శాతం రిజర్వేషన్ల కింద గౌడ సామాజికవర్గానికి 39 నుంచి 44 దుకాణాలు రానున్నాయంటున్నారు. ఎస్సీలకు 27 లేదా 29, ఎస్టీలకు 13 నుంచి 15 దుకాణాలు కేటాయించనున్నారు. సుమారు 206 నుంచి 215 మద్యం దుకాణాలకు ఓపెన్ కేటగిరీ కింద కేటాయించే అవకాశం ఉండగా.. ఇందులోనూ అన్ని సామాజికవర్గాలు పాల్గొనే వీలుంటుంది. కాగా, ఈసారి కూడా 2011 జనాభా ప్రకారమే షాపులు కేటాయించనుండగా, స్లాబ్ల విధానం కూడా గత పాలసీ ప్రకారమే కొనసాగించనున్నారు. అయితే గతంలో టెండర్ దరఖాస్తు ధర రూ.2 లక్షలు ఉండగా.. ఈ సారి రూ.3 లక్షలకు పెంచారు. ఉమ్మడి వరంగల్లో 294 దుకాణాలు దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలకు పెంపు త్వరలో టెండర్ల తేదీల ప్రకటన డీసీ కార్యాలయాలకు అందిన మార్గదర్శకాలు -
చాకలి ఐలమ్మ జీవిత చరిత్రను అధ్యయనం చేయాలి
మహబూబాబాద్: వీరనారి చాకలి ఐలమ్మ జీవిత చరిత్రను ప్రతీ ఒక్కరు అధ్యయనం చేయాలని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. చాకలి ఐలమ్మ చిత్రపటానికి కలెక్టర్, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్ మాట్లాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లెనిన్వత్సల్ టొప్పో, అనిల్కుమార్, బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి నర్సింహస్వామి, జిల్లా అఽధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ కలెక్టరేట్లో ఐలమ్మ వర్ధంతి -
కొడుకు చంపుతాడనే భయంతో..
వెంకటాపురం(ఎం): మద్యానికి బానిసై, ఆన్లైన్ బె ట్టింగ్లతో అప్పుల పాలైన కుమారుడు తనను ఎ క్కడ చంపుతాడనే భయంతో తండ్రే తన కుమారుడిని హత్య చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ మేరకు మంగళవారం ములుగు పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ములుగు సీఐ దారం సురేశ్, వెంకటాపురం ఎస్సై చల్ల రాజు వివరాలు వెల్లడించారు. వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేటకు చెందిన రిటైర్డ్ టీచర్ దుర్గం సూరయ్యకు ఇద్దరు కుమారులు సంపత్, అశోక్ (32) ఉన్నారు. సూరయ్య ప్రస్తుతం ములుగు మండలం రంగారావుపల్లి శివారులో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో సూరయ్య చిన్న కుమారుడు అశోక్ మద్యానికి బానిసై ఆన్లైన్ బెట్టింగ్లో తీవ్రంగా నష్టపోయి తన వాటాగా వచ్చిన రెండు ఎకరాల భూమిని అమ్ముకున్నాడు. ఈనెల 7న లక్ష్మీదేవిపేట నుంచి రంగారావుపల్లిలో నివాసముంటున్న తండ్రి సూరయ్య వద్దకు వెళ్లి మద్యం మత్తులో ఎలాగైనా నిన్ను ఈరోజు చంపుతానంటూ బెదిరించాడు. దీంతో ఆందోళనకు గురైన సూరయ్య తన పెద్దకుమారుడు సంపత్, తమ్ముడు సాంబయ్య సాయంతో అశోక్ మెడకు తాడు చుట్టి చంపేశాడు. అనంతరం డ్రైవర్ రమేశ్ సాయంతో అశోక్ మృతదేహాన్ని కారులో రంగారావుపల్లి నుంచి తీసుకుని తాను ఉంటున్న ఇంటి వద్ద పడేశాడు. ఈ ఘటనపై లక్ష్మీదేవిపేటకు చెందిన ఓ వ్యక్తి సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ, ఎస్సై తెలిపారు. కుమారుడిని హత్య చేసిన తండ్రి ఈ ఘటనలో తండ్రితోపాటు సహకరించిన ముగ్గురి అరెస్ట్ వివరాలు వెల్లడించిన పోలీసులు -
డెంగీతో చిన్నారి ..
లింగాలఘణపురం: జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం వనపర్తి గ్రామానికి చెందిన కౌడె ఉపేందర్, అనిత దంపతుల కూతురు సంహిత(07) బుధవారం హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఉపేందర్, అనిత దంపతులు జనగామలో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇటీవల గ్రామంలో బోనాలు, ఇతర పండుగలు రావడంతో అనిత స్వగ్రామం కోడూరుకు, అత్తగారిల్లు వనపర్తికి వెళ్లి వచ్చారు. ఈ క్రమంలో సంహితకు పదిహేను రోజుల క్రితం తీవ్ర జ్వరం రావడంతో ప్రైవేట్ ఆస్పత్రులకు, అనంతరం చంపక్హిల్స్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ జ్వరం తగ్గకపోవడంతో హైదరాబాద్లోని నిలోఫర్కు తరలించగా డెంగీ అని నిర్ధారణ అయ్యింది. దీంతో చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చిన్నారి సంహిత మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ విషయంపై స్థానిక వైద్యురాలు స్వర్ణలతను వివరణ కోరగా ఆ కుటుంబం జనగామలో నివాసం ఉంటోందని తెలిపారు. -
మాడవీధుల నిర్మాణ పనుల పరిశీలన
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని బుధవారం సాయంత్రం హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ సందర్శించారు. ఆమ్మవారిని దర్శించి పూజలు చేసిన అనంతరం అర్చకులు శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందజేశారు. అనంతరం మాడవీధుల పురోగతిని ‘కుడా’ అధికారులతో చర్చించి పనులు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల నుంచి మాడవీధి గుండా ప్రవేశం మార్గం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అడ్డంగా ఉన్న నిర్మాణాలను తొలగించి నవరాత్రులకు రెండు రోజుల ముందుగానే ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయం ముందు ఉన్న, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. అనంతరం బతుకమ్మ పండుగను పురస్కరించుకుని వేయిస్తంభాల దేవాలయాన్ని ఆమె సందర్శించారు. బతుకమ్మ వేడుకల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఆమె వెంట ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత, ఆలయ చైర్మన్ డాక్టర్ బండారు శివసుబ్రహ్మణ్యం, ఆలయ అర్చకులు భద్రకాళి శేషు, ‘కుడా’ అధికారులు అజిత్రెడ్డి, భీంరావు, ఆర్డీఓ రమేశ్, వరంగల్ ఏసీపీ సత్యనారాయణ, మట్వాడ సీఐ కరుణాకర్, తహసీల్దార్ రవీందర్ ఉన్నారు. -
సంపులో పడి ఆర్టిజన్ కార్మికుడి మృతి
● కేటీపీపీలో ఘటనగణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూ రు కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి ఓ ఆర్టిజన్ కార్మికుడు మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. భూపాలపల్లి మండలం కొంపెల్లి గ్రామానికి చెందిన తూండ్ల సురేశ్(38) కేటీపీపీ మొదటి దశ 500 మెగావాట్ల విద్యుత్ కేంద్రంలో 2017 నుంచి ఆర్టిజ న్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. మంగళవారం యఽథావిధిగా విధులకు హాజరైన సురేశ్.. అర్ధరాత్రి సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి బాటమ్ యాష్ సంపులో పడి మృతి చెందాడు. బుధవారం విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న కేటీపీపీ సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించి మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, మృతుడికి భార్య జీవిత, కూతురు సిరివల్లి, కుమారుడు సుజిత్ ఉన్నారు. సురేశ్ మృతితో కేటీపీపీలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
యూరియా సక్రమంగా పంపిణీ చేయాలి
కొత్తగూడ: యూరియా సక్రమంగా పంపిణీ చేయాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. బుధవారం మండలంలో యూరియా పంపిణీ కేంద్రాలను పరిశీలించారు. టోకెన్ల జారీ వివరాలను ఏఈఓ రాజును అడిగి తెలుసుకున్నారు. వచ్చిన యూరియాను గ్రామాల వారీగా కేటాయించి టోకెన్లు జారీ చేస్తున్నట్లు వివరించారు. యూరియా కోసం రాత్రి వచ్చి రైతు వేదిక వద్ద చాలా మంది రైతులు పడుకున్నట్లు తెలిపారు. ఉదయం భారీగా రైతుల ఒత్తిడి జరిగినట్లు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. రాత్రి సమయంలో పోలీసులు రైతు వేదికలను పరిశీలించాలని, రైతులు ఇక్కడ పడుకోకుండా చూడాలని ఎస్సై రాజ్కుమార్కు సూచించారు. రైతులు ఆందోళన చెందవద్దని అందరికీ యూరియా వస్తుందని భరోసా ఇచ్చారు. అనంతరం యూరియా గోదాంలు, పొగుళ్లపల్లి పీఏసీఎస్ వద్ద యూరియా పంపిణీని పరిశీలించారు. ఎస్పీ వెంట గూడూరు సీఐ సూర్యప్రకాశ్ తదితరులు ఉన్నారు. -
ఐలమ్మ చరిత్ర భావితరాలకు తెలియజేయాలి
హన్మకొండ: చాకలి ఐలమ్మ చరిత్ర భావితరాలకు తెలియజేయాలని ఓబీసీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ అన్నారు. నక్కలగుట్టలోని హోటల్ హరితకాకతీయలో చాకలి ఐలమ్మ వర్ధంతి, మహిళా చైతన్య సదస్సు ఓబీసీ ఉపాధ్యక్షురాలు డాక్టర్ టి.విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం జరిగింది. ముందుగా ఐలమ్మ చిత్రపటానికి సుందర్రాజ్ యాదవ్, అతిథులు, మహిళలు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి మహిళా చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా మేధావులు, ఉద్యోగులు, అధ్యాపకులు, సామాజిక ఉద్యమకారులతో కలిసి ఓబీసీ ఏర్పాటు చేశామన్నారు. భూమి.. భుక్తి.. వెట్టిచాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ పోరాటం చేసిందని గుర్తు చేశారు. మలిదశ తెలంగాణ కోసం త్యాగాలు చేసిన 1200 మందిలో 80 శాతం మంది బీసీలేనన్నారు. అయినా ప్రభుత్వ పాలసీల్లో బీసీల ఊసేలేదని లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ బిల్లు ప్రకారం పెరిగే సీట్లతో 153 స్థానాల్లో 51 మంది మహిళలు ఉండబోతున్నారన్నారు. 51 మందిలో 26 సీట్లు బీసీ మహిళలు సాధించేలా కొట్లాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్కాలర్షిప్లు ఇవ్వకపోవడంతో బీసీ విద్యార్థులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఓబీసీ జనరల్ సెక్రటరీ ప్రొఫెసర్ గడ్డం భాస్కర్, కార్పొరేటర్లు చీకటి శారద, బైరి లక్ష్మి, రావుల కోమల, విజయశ్రీ, మహిళా ప్రతినిధులు దాసోజు లలిత, డాక్టర్ నాగవాణి, డాక్టర్ రమ, అరుణ, లక్ష్మి, ఓబీసీ నాయకులు అరవింద్ స్వామి, ఎంఎన్ మూర్తి, వేణుమాధవ్, సరిత, మౌనిక, భవాని, సరస్వతి, పద్మజ, ప్రవళ్లిక, శ్రావణి, షైన్, పల్లవి, శ్రీలత, విద్యార్థినులు, మహిళలు పాల్గొన్నారు. ఓబీసీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ -
ఆస్తి కోసం తల్లిని హత్య చేసిన కుమార్తె
పాలకుర్తి టౌన్: ఆస్తి కోసం భర్తతో కలిసి కుమార్తె.. తల్లిని హత్య చేసింది. ఈ ఘటన జనగామ జి ల్లా పాలకుర్తి మండలం పెద్దతండా (కే) గ్రామంలో జరిగింది. సీ ఐ జానకీరాంరెడ్డి కథనం ప్రకా రం.. పెద్దతండా(కే)కు చెందిన బాదావత్ లక్ష్మి (42) వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె భర్త తిరుపతి 15 సంవత్సరాల క్రితం మృతి చెందాడు. ఈ దంపతులకు సంగీత ఏకై క సంతానం. ఈమెకు ఐదేళ్ల క్రితం ఇదే మండలంలోని దుబ్బతండా(ఎస్పీ) గ్రామానికి చెందిన బానోత్ వీరన్నతో వివాహం చేశారు. తల్లి పేరిట ఉన్న 20 గుంటల వ్యవసాయ భూమి తన పేరుతో పట్టా చేయాలని సంగీత పలుమార్లు అడిగింది. ఇందుకు తల్లి నిరాకరించింది. దీంతో ఎలాగైనా ఆ భూమిని దక్కించుకునేందుకు తల్లిని హత్య చేయాలని ప్లాన్ వేసింది. ఈ విషయాన్ని భర్తతో చర్చించింది. ఇరువురు హత్య చేయాలని నిర్ణయం తీసుకొని మంగళవారం రాత్రి పెద్దతండాకు చేరుకున్నారు. కూతురు సంగీత, అల్లుడు వీరన్న కలిసి నిద్రలో ఉన్న లక్ష్మి మొఖంపై దిండుపెట్టి హత్య చేశారు. కూలి పని కోసం పిలవడానికి వెళ్లిన స్థానిక మహిళ చూసి తండావాసులకు బుధవారం తెలుపగా వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి తండ్రి నేనావత్ చంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జానకీరాంరెడ్డి తెలిపారు. పాలకుర్తి మండలం పెద్దతండా (కే)లో దారుణం -
బైక్.. భద్రం!
ఖిలా వరంగల్: వర్షాకాలంలో ద్విచక్రవాహనాలను భద్రంగా చూసుకోవాలి. వర్షం కురుస్తున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణించొద్దు. అప్పుడే బైక్లు కొద్దికాలంపాటు మన్నికగా ఉంటాయి. ఇలా కాకుండా నిర్లక్ష్యంగా నడిపితే వాహనాలు మరమ్మతులకు గురవుతాయి. అప్పుడు కనీసం రూ.2వేలు చేతిలో ఉండాల్సిందే. ఇంజన్ పాడైతే రూ.6వేల నుంచి రూ.8వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన అదనపు భారం పడే అవకాశముంది. ఒక్కసారిగా ఇంత ఖర్చు చేయాలంటే సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు భారమే. కనీస జాగ్రత్తలు పాటిస్తే వాహనాలు మన్నికగా ఉంటాయని సీనియర్ మెకానిక్ అంకాల సతీశ్ చెబుతున్నారు. బైక్ల నిర్వహణ గాలికి.. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3.50లక్షల పైగా ద్విచక్రవాహనాలు ఉన్నాయి. ఏటా సుమారు రూ.20వేలకు పైగా కొత్త వాహనాలు రహదారులపైకి వస్తున్నాయి. ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసిన చాలా మంది వాటి నిర్వహణను పట్టించుకోవడం లేదు. ఫలితంగా మరమ్మతులకు గురవడంతో వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడే పార్క్.. వర్షం కురుస్తున్న సమయంలో పలువురు తమ వాహనాలను నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడ ఆపుతారు. దీంతోపాటు వాహనాన్ని రహదారులపై మె కాలి లోతులో నిలిచిన నీటి నుంచి నడుపుకుంటూ వెళ్తారు. ఇలా చేయడం వల్ల పలు భాగాల్లోకి నీరు చేరి బైక్ మొరాయిస్తుంది. లాక్ సిస్టమ్, ప్లగ్, కేబుళ్లు, బ్రేకులు, ఇంజన్, ఫైరింగ్ సిస్టమ్.. ఇలా వాహనంలో ప్రతీ వస్తువు పాడయ్యే అవకాశముంది. వాహనం నీటిలో నానితే బ్రేక్ సిస్టమ్పై ప్రభావం.. వాహనం నీటిలో నానితే బ్రేక్ సిస్టమ్పై ప్రభావం చూపుతుంది. మరో వైపు ప్రతీ వాహనదారుడు తమ వాహనానికి సంబంఽధించి టైర్లు, బ్రేకులు బాగున్నాయా..? లేవా..? అని తనిఖీ చేయాలి. దీంతోపాటే చైన్ను కూడా లూబ్రికేషన్ చేయించాలి. తడిస్తే తుప్పు పడుతుంది. ఈనేపథ్యంలో చైన్ లూబ్రికేంట్ను వాడడం మంచిది. వర్షాకాలంలో తడి, నీళ్ల రోడ్లపై చాలా మంది ప్రయాణిస్తుంటారు. ఈ నేపథ్యంలో మొదట వాహన టైర్లును తనిఖీ చేయాలి. అరిగిపోయి ఉంటే వాటిని మార్చుకోవాలి. బ్యాటరీ పూర్తిగా చార్జీంగ్ చేసి మంచి స్థితిలోఉందో.. లేదో చూసుకోవాలి. వర్షానికి వాహనం తడిస్తే ఆ ప్రఽభావం పలు భాగాలపై పడుతుంది. విజిబిలిటీ బాగుండాలంటే బ్యాటరీ ఫుల్గా ఉండాలి. బల్బుపోతే వెంటనే మార్చుకోవాలి.వర్షంలో ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనదారుడు (ఫైల్)బైక్ను భద్రంగా కాపాడుకోవాలి..వర్షం కురుస్తున్న సమయంలో బైక్పై ప్రయాణం ప్రమాదకరం. బ్రేక్లు, క్లచ్లు పనిచేయక బైక్ అదుపు తప్పి ప్రమాదం జరుగుతుంది. లోతట్టు ప్రాంతాల్లో ప్రయాణిస్తే సైలెన్సర్ ద్వారా ఇంజిన్లోకి వరదనీరు చేరి బైక్ పాడవుతుంది. తద్వారా మరమ్మతుకు వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలా కాకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ వర్షాకాంలో బైక్ను భద్రంగా కాపాడుకోవాలి. అంకాల సతీశ్, సీనియర్ బైక్ మెకానిక్వర్షాకాలంలో ద్విచక్రవాహనాలను జాగ్రత్తగా చూసుకోవాలి ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మెకానిక్ షెడ్కు వెళ్లాల్సిందే మరమ్మతుకు చేతిలో వేలాది రూపాయలు ఉండాల్సిందే.. వర్షపు నీటిలో ప్రయాణించొద్దని మెకానిక్ల సూచన -
బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న కేంద్రం
తొర్రూరు: తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని విశ్రాంతి భవనంలో బుధవారం బీసీ నాయకులతో సమావేశం నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవికృష్ణతో కలిసి శ్రీనివాస్గౌడ్ మాట్లాడారు. రాష్ట్రపతి భవన్, రాజ్భవన్ను కేంద్రం జేబు సంస్థలుగా మార్చుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాటి మండల్ నుంచి నేటి బీసీ బిల్లు వరకు బీజేపీ బీసీలను మోసగిస్తోందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టిందని, కేంద్రం రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో పెట్టి అమలు చేస్తుందా లేదా చెప్పడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర బీజేపీ నేతలు మాట్లాడకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరడం హాస్యాస్పదమన్నారు. రిజర్వేషన్ల అమలు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై త్వరలో సింహగర్జన నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో కేయూ ప్రొఫెసర్ మల్లేశ్వర్, నాయకులు గుండగాని వేణు, గట్టు ప్రభాకర్, పెదగాని సోమయ్య, మురళి యాదవ్, భిక్షంగౌడ్, తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ -
ధూపదీపనైవేద్య అర్చకులకు వేతనాలు అందించాలి
హన్మకొండ కల్చరల్ : గ్రామాల్లోని ధూపదీపనైవేద్య అర్చకులకు సక్రమంగా ప్రతీనెలా వేతనాలు అందేలా ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగజాక్ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు బుధవారం హైదరాబాద్లోని రాష్ట్ర చేనేత భవన్లో నూతనంగా పదవీబాధ్యతలు చేపట్టిన దేవాదాయధర్మాదాయశాఖ కమిషనర్, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజరామయ్యర్ను గంగు ఉపేంద్రశర్మ, పరాశరం రవీంద్రాచారి, దేవాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాండూరి కృష్ణమాచారి, ఇతర అర్చకులు కలిసి శుభాకాంక్షలు తెలిపి వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అర్చక ఉద్యోగుల సమస్యలు పెండింగ్లో ఉన్నాయన్నారు. అనేక దేవాలయాల్లో క్యాడర్ స్ట్రెంత్లేక ఇబ్బంది పడుతున్నారని, ప్రమోషన్లలో అన్యాయం జరుగుతుందని వివరించారు. ప్రమోషన్ల విషయంలో సంబంధిత అధికారులతో జిల్లాల వారీగా నివేదికలు తెప్పించుకుంటానని కమిషనర్ పేర్కొన్నారు. 11,12 తేదీల్లో ఇంటర్ కాలేజీ కబడ్డీ టోర్నమెంట్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ని ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ఆధ్వర్యంలో యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల డిగ్రీ, పీజీ కాలేజీలకు ఇంటర్ కాలేజీ కబడ్డీ టోర్నమెంట్ ఈనెల 11, 12వ తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ టి. మనోహర్ తెలిపారు. ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ టోర్నమెంట్, సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ టోర్నమెంట్కు సెలక్షన్స్ కూడా నిర్వహించనున్నామని పేర్కొన్నారు. కేయూ పరిధి లోని డిగ్రీ, పీజీ కాలేజీల నుంచి కబడ్డీ క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొనబోతున్నారని తెలిపారు. ఈ టోర్నమెంట్ ప్రారంభ కా ర్యక్రమంలో ముఖ్యఅతిథులుగా కేయూ రిజి స్ట్రార్ వి రామచంద్రం, స్పౌర్ట్స్బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య పాల్గొంటారని చెప్పారు. ప్రతినెలా 1న జీతాలు చెల్లించాలి హన్మకొండ: విద్యుత్ ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు కోరారు. హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ గెస్ట్హౌస్లో జేఏసీ ఎన్పీడీసీఎల్ శాఖ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల 9వ తేదీ వరకు ఉద్యోగులకు జీతాలు అందకపోవడంపై చర్చించారు. అనంతరం టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఫైనాన్స్ డైరెక్టర్ వి.తిరుపతి రెడ్డి, సీఎండీ పేషీలో అధికారికి వినతి పత్రాలు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ జీతాలు ఆలస్యమైతే వైద్య ఖర్చులు, అప్పుల వాయిదాలు, కుటుంబ అవసరాలకు అవస్థలు పడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఎ.విజేందర్ రెడ్డి, కేవీ.జాన్సన్, ఎస్.మల్లికార్జున్, బండారి ప్రభాకర్, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. -
ఎన్నికలకు సర్వం సిద్ధం
తుది ఓటరు జాబితా విడుదలమహబూబాబాద్ అర్బన్: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తుది ఓటరు జాబితాను అధికారులు విడుదల చేశారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాలతో జెడ్పీ సీఈఓ పురుషోత్తం పర్యవేక్షణలో రూపొందించిన తుది ఓటరు జాబితాను ఎంపీడీఓల ఆధ్వర్యంలో ప్రదర్శించారు. 10 రోజుల నుంచి చేపడుతున్న కసరత్తు తుది ఓటరు జాబితా వెల్లడితో ముగిసిందని అధికారులు పేర్కొంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓటరు జాబితాను మండలాల వారీగా విడుదల చేశారు. 18 జెడ్పీటీసీ, 193 ఎంపీటీసీ స్థానాలు.. జిల్లాలో 18 మండలాల్లో 18 జెడ్పీటీసీలు, 193 ఎంపీటీసీలు స్థానాలను ఖరారు చేశారు. ఒక్కో ఎంపీటీసీ పరిధిలో జనాభా ప్రకారం రెండు, మూడు జీపీలు వచ్చే విధంగా ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో 5,56,780 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 2,73,692మంది, మహిళా ఓటర్లు 2,83,064మంది ఉన్నారు. 1,066 పోలింగ్ బూత్ లను అధికారులు ఏర్పాటు చేశారు. గత ఏడాది జెడ్పీ, మండల పరిషత్ల కాలపరిమితి ముగిసింది. కాగా జిల్లా పరిషత్కు కలెక్టర్ను ప్రత్యేకాధికారిగా నియమించగా.. మండల పరిషత్లకు జిల్లాస్థాయి అధికారులు ప్రత్యేకాధికారులుగా వ్యవహస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మండలాలు, గ్రామాల్లో తాగు నీటి సరఫరా, రోడ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు, మరుగుదొడ్లు, బ్రిడ్జిలు, అంగన్వాడీ కేంద్రాలు, సీసీ రోడ్లు, దళిత వాడలు, గిరిజన తండాల అభివృద్ధి తదితర నిర్మాణాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు వచ్చేవి. పాలకవర్గాలు లేకపోవడంతో నిధులు నిలిచిపోయాయి. ఎన్నికలు నిర్వహించి కొత్త పాలకవర్గాలను ఏర్పాటు చేస్తే నిధులు సమకూరి గ్రామాలు, తండాలు అభివృద్ధి చెందుతాయని ప్రజలు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 193 ఎంపీటీసీ, 18 జెడ్పీటీసీ స్థానాలు మొత్తం 5,56,780 మంది ఓటర్లు -
ఉపాధి శిక్షణతో ఆర్థికాభివృద్ధి
● హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్ పాండే హన్మకొండ: మహిళల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు ఉపాధి శిక్షణ దోహదపడుతుందని హనుమకొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్పాండే అన్నారు. బుధవారం హనుమకొండ సుబేదారిలోని అసుంత భవన్లో మహిళా సాధికారత మేళా కార్యక్రమం జరిగింది. మగ్గం శిక్షణ, టైలరింగ్, బ్యూటిషన్ ట్రైనింగ్ పొందిన 350 మంది మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఉపాధి శిక్షణతో కుటుంబం ఆర్థికాభివృద్ధి సాధిస్తుందన్నారు. అడిషనల్ డీసీపీ రవి, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ సిస్టర్ సహాయ, సంస్థ రీజినల్ అధ్యక్షులు రుమాల్డిన, ప్రాజెక్టు కోఆర్డినేటర్లు ఎర్ర శ్రీకాంత్, బత్తుల కరుణ, ఆయా సంస్థల ప్రతినిధులు అనితారెడ్డి, కె.నాగవాణి, ఆల్బటా అమృత, ఎం,అజయ్కుమార్, ఈసంపల్లి సుదర్శన్, పరికి సుధాకర్, సుదర్శన్ గౌడ్, ప్రభాకర్, శివప్రసాద్, కొమ్ముల నవీన్ పాల్గొన్నారు. -
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
నర్సంపేట రూరల్: కూలి విషయంలో దంపతుల మధ్య జరిగిన గొడవతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నర్సంపేట మండలం పర్శనాయక్తండాలో చోటుచేసుకుంది. ఎస్సై గూడ అరుణ్ ప్రకారం.. తండాకు చెందిన కొర్ర జగన్ (45), జ్యోతి దంపతులు కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జ్యోతి గ్రామంలో కొర్ర రవీందర్ వద్దకు మిషన్లో మొక్కజొన్నలు పట్టే కూలికి వెళ్తోంది. అయితే ఆ పనికి వెళ్లొద్దని జగన్ ఎంత చెప్పినా జ్యోతి వినకపోవడంతో పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ క్రమంలో బుధవారం రవీందర్.. జగన్ ఇంటికొచ్చి జ్యోతిని కూలికి రావాలని కోరాడు. దీనిపై దంపతులు మళ్లీ గొడవ పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన జగన్ గురై ఇంట్లోకెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై గూడ అరుణ్ ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేటకు తరలించారు. జగన్ తల్లి సమ్మక్క ఫిర్యాదు మేరకు రవీందర్పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సంగెం: అనారోగ్య సమస్యలతో జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం ఎల్గూరు, చింతలపల్లి రైల్వేస్టేషన్ల మధ్య జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. సంగెం మండల కేంద్రానికి చెందిన భూపతి నాగరాజు(26) పదేళ్ల నుంచి పక్షవాతం, తల, నడుము నొప్పితో బాధపడుతున్నాడు. పలు ఆస్పత్రులో చికిత్స పొందినా తగ్గకపోవడంతో జీవితంపై విరక్తి చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం అతడి బంధువులకు అప్పగించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
బైక్..భద్రం!
వర్షాకాలంలో ద్విచక్ర వాహనాలను జాగ్రత్తగా చూసుకోవాలని, వర్షం కురుస్తున్నప్పుడు ప్రయాణించొద్దని సీనియర్ మెకానిక్లు సూచిస్తున్నారు.ఇటీవల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థుల హాస్టల్ భవనం, ఎమర్జెన్సీ కేర్ భవనాలను రాష్ట్ర మంత్రులు దామోదర రాజన ర్సింహ, కొండా సురేఖతో కలిసి ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పలు విషయాలను మంత్రుల దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనుల్లో జాప్యం, నారాయణపురం రైతుల సమస్య ప్రధానంగా మంత్రుల ముందు వివరించారు. ఈ అంశాలపై కూడా ఇన్చార్జ్ మంత్రి జిల్లా అధికారులతో చర్చించినట్లు తెలిసింది. ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం చేయవద్దని మంత్రి సూచించినట్లు సమాచారం. అదే విధంగా జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితి, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్న తీరు, ప్రభుత్వంపై ప్రజలకు ఎటువంటి అభిప్రాయం ఉంది.. ఇంకా ప్రజలకు చేరువయ్యేందుకు ఏం చేస్తే బాగుంటుందనే విషయాలను అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. ఒక వైపు యూరియా గొడవ, మరోవైపు భూ భూరతి చట్టం అమలుకు శ్రీకారం, ఇంకో వైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం.. ఇటువంటి పరిస్థితిలో జిల్లా పరిస్థితిపై ఇన్చార్జ్ మంత్రి ఆరా తీయడంపై జిల్లాలో చర్చగా మారింది. మంత్రి ఆదేశాలతో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై.. -
డే కేర్ సెంటర్లో ఉచిత న్యాయ సలహాలు
హన్మకొండ: హనుమకొండ జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలోని వయోవృద్ధుల డే కేర్ సెంటర్లో సీనియర్ సిటిజన్స్ కోసం ప్రారంభించిన లీగల్ ఎయిడ్ క్లినిక్ సేవలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. జిల్లా న్యాయసేవాధికార సంస్థ న్యాయ సలహాదారుగా పారాలీగల్ వలంటీర్ ఎం. ఉపేందర్ను నియమించింది. ప్రతీ బుధ, శనివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు న్యాయ సలహాలు అందిస్తారని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి తేరాల యుగేంధర్ తెలిపారు. వివరాలకు 8074979359 ఫోన్ నంబర్లో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తాడూరి లక్ష్మీనారాయణ, గంగారపు యాదగిరి, సుమతి, డాక్టర్ ఉష, తదితరులు పాల్గొన్నారు. -
వైద్యులు స్థానికంగా ఉండాలి
● డీఎంహెచ్ఓ రవిరాథోడ్ గార్ల: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు పీహెచ్సీ వైద్యులు, వైద్య సిబ్బంది స్థానికంగా ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ ఆదేశించారు. బుధవారం మండలంలోని ముల్కనూరు పీహెచ్సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత వైద్య సిబ్బంది హాజరు పట్టిక, రికార్డులను పరిశీలించారు. పీహెచ్సీలో డెలివరీల సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. గర్భిణుల డెలివరీల సంఖ్య పెంచాలని, నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలని సూచించారు. వైద్య సిబ్బంది విధుల్లో సమయపాలన పాటించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం గార్లలోని సబ్సెంటర్లను తనిఖీ చేశారు. వ్యాక్సినేషన్ను సమయం ప్రకారం చిన్నపిల్లలకు చేయాలని సూచించారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ఫీవర్ సర్వే చేసి, జ్వరపీడితులు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఏఎన్ఎంలను ఆదేశించారు,. డాక్టర్ శివకుమార్, సీహెచ్ఓ సక్కుబాయి, హెచ్ఎస్ ఇస్మాయిల్ బేగ్, వైద్య సిబ్బంది లలిత తదితరులు పాల్గొన్నారు. -
దానాపూర్ రైలుకు చర్లపల్లిలో హాల్టింగ్
కాజీపేట రూరల్ : ప్రయాణికుల సౌకర్యార్థం దీపావళి, దసరా, చాత్పూజా పండుగల సందర్భంగా కాజీపేట జంక్షన్ మీదుగా వెళ్లే సికింద్రాబాద్–దానాపూర్ డైలీ ఎక్స్ప్రెస్కు చర్లపల్లిలో తాత్కాలికంగా హాల్టింగ్ కల్పించినట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి 10 రోజులపాటు పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లిలో హాల్టింగ్ కల్పించినట్లు తెలిపారు. హాల్టింగ్ వివరాలు.. సికింద్రాబాద్–దానాపూర్ (12791) ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్లో 9: 25 గంటలకు బయలుదేరి చర్లపల్లికి 9:40 గంటలకు, కాజీపేటకు 11:08 గంటలకు చేరుతుంది. అదేవిధంగా దానాపూర్–సికింద్రాబాద్ (12792) ఎక్స్ప్రెస్ దానాపూర్లో బయలుదేరి మరుసటి రోజు కాజీపేటకు 18:23 గంటలకు, చర్లపల్లికి 20:42 గంటలకు, సికింద్రాబాద్కు 21:30 గంటలకు చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. నేడు నాలుగు ప్యాసింజర్ రైళ్లు రద్దు.. కాజీపేట రూరల్ : కాజీపేట–విజయవాడ మార్గంలో నెక్కొండ–కేసముద్రం–మహబూబాబాద్ మ ధ్య చేపడుతున్న థర్డ్ లైన్ కమిషనింగ్ ఎన్ఐ వర్క్స్ కారణంగా గురువారం పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ బుధవారం తెలిపారు. నేడు రద్దయ్యే రైళ్ల వివరాలు.. కాజీపేట–డోర్నకల్ (67765) ప్యాసింజర్, డోర్నకల్–కాజీపేట (67766) ప్యాసింజర్, డోర్నకల్–విజయవాడ (67767) ప్యాసింజర్, విజయవాడ–డోర్నకల్ (67768) ప్యాసింజర్లను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. పాక్షికంగా రద్దు.. భద్రాచలం రోడ్–బల్లార్షా (17033) సింగరేణి ప్యాసింజర్ను భద్రాచలంరోడ్–కాజీపేట మధ్య పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు సీపీఆర్వో తెలిపారు. పండుగల రద్దీ దృష్ట్యా 10 రోజులపాటు అమలు.. -
అన్నారం బ్యారేజీలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం అన్నారం బ్యారేజీలో నాటు పడవ నడుపుతూ వెళ్లి పియర్ (పిల్లర్)కు తగిలి గోదావరిలో గల్లంతైన గడ్డం వెంకటేశ్(46 మృతదేహం మంగళవారం లభ్యమైంది. కాళేశ్వరం ఎస్సై తమాషారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలూకా మండలిపురానికి చెందిన ఇద్దరు మత్స్యకారులు గడ్డం వెంకటేశ్, తుముకూరి కృష్ణస్వామి మంచిర్యాల జిల్లా పొక్కూర్ వద్ద నాటు పడవ కొనుగోలు చేసి గోదావరి మీదుగా నడుపుకుంటూ సోమవారం అన్నారం బ్యారేజీ చేరుకున్నారు. అన్నారం బ్యారేజీ 11వ పియర్ వద్ద గేటు దాటే క్రమంలో ప్రవాహానికి ఒక్కసారిగా పడవ బోల్తాపడింది. దీంతో వెంకటేశ్ గోదావరిలో మునిగి గల్లంతు కాగా, కృష్ణస్వామి ఈదుకుంటూ బయటకు ప్రాణాలతో వచ్చాడు. రాత్రి వరకు పోలీసులు, జాలర్లు ఎంత వెలికినా ఆచూకీ లభ్యం కాలేదు. మంగళవారం మధ్యాహ్నం వెంకటేశ్ మృతదేహం లభ్యమైంది. కాళేశ్వరం పోలీస్స్టేషన్లో మృతుడి సోదరుడు గడ్డం లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతదేహానికి మహదేవపూర్ సీహెచ్సీలో పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
సీఐఎస్ఎఫ్ జవాన్కు కన్నీటి వీడ్కోలు
● అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చిట్యాల : మండల కేంద్రానికి చెందిన సీఐఎస్ఎఫ్ జవాన్ ఆరెపల్లి రమేశ్ (38) అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్లో తుదిశ్వాస విడిచాడు. అతడి పార్థివదేహాన్ని రాంనగర్ కాలనీలో తన ఇంటికి తీసుకువచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐఎస్ఎఫ్ జవాన్లు మంగళవారం గ్రామానికి చేరుకుని రమేశ్ భౌతికకాయంపై జాతీయ జెండా కప్పి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్ర సాయంత్రం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా శ్మశానవాటికలో రమేశ్ పార్ధివదేహానికి సీఐఎస్ఎఫ్ ఆర్ఎస్సై భాస్కర్ (హైదరాబాద్), ఎన్టీపీసీ రామగుండం సీఐఎస్ఎఫ్ జవాన్లు తిరుపతిరావు, మనోజ్కుమార్ పాండే, గణేష్, శ్రీధర్, అనిల్కుమార్, గౌతమ్కుమార్ అధికార లాంఛనాలతో నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. మృతదేహంపై కప్పిన జాతీయ జెండాను అతడి భార్య మమతకు అప్పగించారు. రమేశ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
స్కూల్వ్యాన్ డ్రైవర్ నిజాయితీ
● రూ.52 వేలు అప్పగింత మహబూబాబాద్ రూరల్ : నగదుతో దొరికిన బ్యాగును బాధితుడికి అప్పగించి ఓ స్కూల్ వ్యాన్ డ్రైవర్ నిజాయితీ చాటుకున్నాడు.మహబూబాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్కి చెందిన వ్యాన్ సోమవారం సాయంత్రం పిల్లలను ఇంటివద్ద వదిలేందుకు వేమనూరుకు వెళ్లింది. తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డుపై ఒక బ్యాగ్ కనిపించడంతో డ్రైవర్ పొదిల ఆంజనేయులు వ్యాన్ను నిలిపి దానిని తీసుకుని చూడగా అందులో రూ.52 వేల నగదు ఉంది. వెంటనే తీసుకువెళ్లి ఆ పాఠశాల కరెస్పాడెంట్ బూర పూర్ణచందర్కు తెలియజేశాడు. మంగళవారం వేమనూరు గ్రామంలో పిల్లల్ని తీసుకొచ్చేందుకు వెళ్లగా గ్రామస్తులకు దొరికిన బ్యాగ్ విషయం తెలియజేశాడు. సాయంత్రం వేమునూరు దగ్గరలో ఉన్న రాములు తండాకు చెందిన గుగులోత్ ప్రవీణ్ ఆ బ్యాగు తనదేనని పాఠశాలకు ఫోన్ చేసి చెప్పాడు. డైరెక్టర్ పూర్ణచందర్, ప్రిన్సిపాల్ హిమబిందు, డ్రైవర్ ఆంజనేయులు.. ప్రవీణ్కు రూ.52 వేల నగదు అప్పజెప్పారు. దీంతో ప్రవీణ్ ఆంజనేయులుని, యాజమాన్యానికి, సహకరించిన టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాడు. -
కుటీర పరిశ్రమలకు తగ్గిన విద్యుత్ బిల్లులు
హన్మకొండ: కుటీర పరిశ్రమలపై విద్యుత్ బిల్లుల భారం తగ్గింది. తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఎల్టీ కేటగిరీ–3 నుంచి ఎల్టీ కేటగిరీ–4కు కుటీర పరిశ్రమలను తీసుకొచ్చారు. దీంతో కుటీర పరిశ్రమ వినియోగదారులపై భారం తగ్గింది. 25 హెచ్పీ లోపు లోడ్ కలిగిన కుటీర పరిశ్రమలు ఈ కేటగిరీ–4లోకి వస్తాయి. 25 హెచ్పీ లోడ్కు పైన ఉన్న పరిశ్రమలు కేటగిరీ–3 కిందికి వస్తాయి. కేటగిరీ మారడంతో యూనిట్ చార్జీలు మారాయి. కేటగిరీ–3లో యూనిట్ చార్జీ రూ.7.70 ఉండగా కేటగిరీ–4లో యూనిట్ చార్జీ రూ.4గా ఉంది. అదే విధంగా ఫిక్స్డ్ చార్జీలు కిలో వాట్కు రూ.100 ఉండగా కేటగిరీ మార్పుతో రూ.20 తగ్గింది. యూనిట్ పరంగా చూస్తే రూ.3.70, కిలోవాట్ పరంగా రూ.80 భారం వినియోగదారులపై తగ్గింది. పవర్లూమ్స్, వడ్రంగి, కమ్మరి, కంచరి, గోల్డ్స్మిత్, శిల్పి, కొవ్వొత్తుల తయారీ, పాపడ్ లెదర్ వస్తువులు, చెప్పుల తయారీ, లాక్ టాయ్ మేకింగ్, పాప్ టాయ్స్, ప్లాస్టర్ ఆప్ పారిస్ ఉత్పత్తులు, బొమ్మల తయారీ పరిశ్రమలు, ఊరగాయల తయారీ, మామిడి జెల్లి యూనిట్లకు 25 కిలోవాట్లకు మించకుండా లోడ్ ఉన్న కుటీర పరిశ్రమలు మాత్రమే ఎల్టీ కేటగిరీ–3లోకి వస్తాయి. కేటగిరీ మార్పు చేయించామని దళారుల వసూళ్లు.. ఇదిలా ఉండగా తామే కేటగిరీ మార్పు చేయించి బిల్లులు తగ్గించామని చెబుతూ కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారని తెలిసింది. ప్రధానంగా మడికొండ టెక్స్టైల్స్ పార్కు కేంద్రంగా కొందరు ఒక్కొక్కరి నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) కుటీర పరిశ్రమలపై భారం పడుకుండా, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కేటగిరీ మార్పు ద్వారా భారం తగ్గిస్తే కొందరు ఇదే అదనుగా సొమ్ము చేసుకుంటున్నారు. కాగా, విద్యుత్ అధికారులు, సిబ్బంది పేరుతో ఎవరైనా వసూళ్లకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి సూచించారు. విద్యుత్ నియంత్రణ మండలి తీసుకున్న ఈ నిర్ణయంతో ఇతరులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కేటగిరీ మార్పు కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని సూచించారు. హనుమకొండ టౌన్ డివిజన్లోని 25 హెచ్పీకి తక్కువ లోడ్ ఉన్న కుటీర పరిశ్రమల వినియోగదారులు కేటగిరీ మార్పు, వివరాల కోసం డివిజన్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఎల్టీ కేటగిరీ–3 నుంచి కేటగిరీ–4కు మార్పు యూనిట్ ధర రూ.7.70 నుంచి రూ.4కు తగ్గింపు -
కదంతొక్కిన లంబాడీలు
హన్మకొండ : లంబాడీలు ఆత్మగౌరవ శాంతి ర్యాలీతో కదం తొక్కారు. ఎస్టీ హోదా పరిరక్షణకు లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఆత్మగౌరవ ర్యాలీలకు పిలుపునిచ్చింది. ఈక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో మంగళవారం హనుమకొండ బాలసముద్రం ఏకశిలా పార్కు ఠాణూ నాయక్ విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు లంబాడీలు ఆత్మగౌరవ ర్యాలీని నిర్వహించ తలపెట్టారు. ర్యాలీ ఉందనే సమాచారంతో పోలీసు బలగాలు అక్కడికి పెద్దఎత్తున చేరుకున్నాయి. బారికేడ్లు అడ్డుపెట్టి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యువకులు, విద్యార్థులు, మహిళలతో పాటు లంబాడీలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఠాణూనాయక్ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభం కాగానే పోలీసులు వారిని వారించారు. అనుమతి లేదని ఇక్కడి నుంచి కదలవద్దని సూచించారు. అయినా ఆందోళనకారులు పోలీసులను తోసుకుంటూ ముందుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు ప్రతిఘటించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. దీంతో స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులకు పరిస్థితులు వివరించి సర్దిచెప్పడంతో శాంతించారు. ఠాణూనాయక్ విగ్రహం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. కోయ, గోండులకు చెందిన కొద్దిమంది రాజకీయ నాయకుల వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆ రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలి.. ఈ ర్యాలీ సందర్భంగా లంబాడీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ..లంబాడీలపై నిరాధార ఆరోపణలు చేస్తున్న కోయ, గోండు వర్గాలకు చెందిన రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని లంబాడీలను రాజ్యాంగబద్ధంగా ఎస్టీ జాబితాలో చేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉందని, లంబాడీల ఎస్టీ రిజర్వేషన్లను కాపాడాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదేని వారు పేర్కొన్నారు. లంబాడీలను నిర్లక్ష్యం చేసిన, సుప్రీంకోర్టులో లంబాడీల పక్షాన కేంద్ర.,రాష్ట్ర ప్రభుత్వాలు పోరాడకపోయినా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ, రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో లంబాడీల వ్యతిరేకమైన పార్టీలను బొందపెడతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. వెంటనే కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. లంబాడీల శాంతి ర్యాలీకి జిల్లా యంత్రాంగం, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా నిరసించారు. కార్యక్రమంలో లంబాడీ జాయింట్ యాక్షన్ కమిటీ (ఎల్–జేఏసీ) కన్వీనర్లు జాటోత్ కిషన్నాయక్, జైసింగ్ రాథోడ్, సమన్వయకర్త వి.ఎన్.నాయక్, నాయకులు రాజు నాయక్, అంగోత్ వినోద్, వాంకుడోత్ వీరన్న, పోరిక గోవింద నాయక్, వీరమ్మ, గోపిసింగ్, బానోత్ వసంత్ నాయక్, బానోత్ వెంకన్న నాయక్, డాక్టర్ ఉదయ్ సింగ్ నాయక్, నునావత్ జవహర్, బానోత్ మంగీలాల్, సమ్మయ్య రాథోడ్, లకావత్ కరుణాకర్, పాడియా గాంగు నాయక్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. హనుమకొండలో లంబాడీల ఆత్మగౌరవ శాంతిర్యాలీ అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు ఇరువర్గాల తోపులాట, స్పల్ప ఉద్రిక్తత ఠాణూ నాయక్ విగ్రహం వద్ద ధర్నా తమ ఎస్టీ హోదాను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే: లంబాడీ జేఏసీ -
చరిత్రలో నిలిచేలా గద్దెల నిర్మాణాలు
ఎస్ఎస్తాడ్వాయి : మేడారం సమ్మక్క–సారలమ్మల కీర్తిప్రతిష్టను నిలబెడుదామని, వందేళ్ల అమ్మవార్ల చరిత్ర నిలిచేలా శాశ్వత నిర్మాణాలను చేపట్టేందుకు మేడారం మాస్టర్ ప్లాన్ రూపొందించిన్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క పేర్కొన్నారు. మంగళవారం మేడారంలోని ఐటీడీఏ అతిథిగృహంలో కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ డాక్టర్ శబరీశ్, పీఆర్శాఖ ఇంజనీరింగ్, దేవాదాయశాఖ, పూజారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత మాస్టర్ ప్లాన్లో గద్దెల ప్రాంగణంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల డిజైన్ను అర్కిటెక్ బృందం ప్రొజెక్టర్ ద్వారా చూపించారు. గద్దెల ప్రాంగణంలోని అభివృద్ధి ప నుల ఏర్పాట్లపై సమీక్షించిన అనంతరం సీతక్క మాట్లాడారు. పూజారుల అభిప్రాయాలు, నిర్ణయా ల మేరకు గద్దెల ప్రాంగణంలో మార్పులు చేర్పులు చేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులను వంద రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సీతక్క ఈనెల, 13,14వ తేదీన సీఎం రేవంత్రెడ్డి మేడారానికి వచ్చే అవకాశం ఉంది. దీంతో మంత్రి సీతక్క అధికారులతో కలిసి మేడారం వైజంక్షన్ సమీపంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సీఎం సమావేశం నిర్వహణకు స్థలాన్ని పరిశీలించారు. శివరాంసాగర్ సమీపంలోని వీఐపీ రోడ్డును సీతక్క పరిశీలించి, వరద కోతతో పైపులు బయటికి కనిపించడంతో మరమ్మతులు చేయాలని ఆదేశించారు. సీఎం పర్యటన సందర్భంగా వచ్చే వీఐపీ, వీవీఐపీల విశ్రాంతి కోసం హరితహోటల్ను పరిశీలించి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్, ఎస్పీ డాక్టర్తో చర్చించారు. అనంతరం అమ్మవార్లను మంత్రి సీతక్క దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవీందర్, ఈఓ వీరస్వామి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, అర్కిటెక్ బృందం పాల్గొన్నారు. పూజారుల అభిప్రాయాల స్వీకరణ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ స్థపతి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి డాక్టర్ శివనాగిరెడ్డి, అర్కిటెక్చర్ ఇంజనీరింగ్ అధికారులు, దేవాదాయశాఖ ఇంజనీరింగ్ అధికారులు, పూజా రులు గద్దెల వద్దకు వెళ్లి మాస్లర్ ప్లాన్లో చేయాల్సిన మార్పులు,చేర్పులను అడిగి తెలుసుకున్నా రు. నూతన సాలహారంపై ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయల చిత్రాలు, పడిగలను ఏర్పాటు చేయాలని పూజారులు వివరించారు. బుధవారం ఫైనల్ మాస్టర్ ప్లాన్ డిజైన్ను రూపొందించాలని శివనాగిరెడ్డి అర్కిటెక్ డిజైనర్ల బృందానికి సూచించారు. సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క మేడారంలో అభివృద్ధి పనుల పరిశీలన -
అగ్నికణం ఐలమ్మ
పాలకుర్తి టౌన్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చిట్యాల ఐలమ్మ పాత్ర వీరోచితమైనది. ఆమె జీవితం ఇప్పటికీ అనేక పోరాటలకు ప్రేరణగా నిలుస్తోంది. భూమి, భుక్తి, పేదల బతుకుల విముక్తి కోసం సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని రగిల్చిన అగ్నికణం చాకలి ఐలమ్మ. అనేక మందికి విప్లవభావాలు మండించిన నిప్పుల కొలిమి ఐలమ్మ. విస్నూర్ దొర రాపాక రాంచంద్రారెడ్డి ఆగడాలపై అగ్నికణంలా మారి ముందుకు దూంకిన తొలి వీరనారి చాకలి ఐలమ్మ. తన పంటపొలాల్లో పండించిన ధాన్యం విషయంలో ప్రారంభించిన ఉద్యమం యావత్ తెలంగాణ జిల్లాలకు వ్యాపించింది. రాంచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఎర్రజెండాను చేతపట్టి ప్రజలను సమీకరించి సాగించిన పోరాటం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఐలమ్మ తన చాకలి వృత్తిలో ఆర్థికంగా నిలదొక్కు కోలేకపోయింది. దీంతో కుటుంబీకులు మల్లంపల్లి జమీందార్ ఉత్తంరాజు కొండల్రావు దగ్గర 40 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. దేశ్ముఖ్ ఏజెంట్ అయిన పాలకుర్తి పోలీసు పటేల్ వీరమనేని శేషగిరిరావు గ్రామంలో పెత్తనం చెలాయిస్తూ వెట్టి చేయించుకునే వాడు. ఓ రోజు పోలీస్ పటేల్ ఐలమ్మను, ఆమె భర్త నర్సయ్యను పశువులతో సహా వచ్చి తన వ్యవసాయ పొలంలో పనిచేయాలని ఆదేశించారు. అప్పటికే ఆంధ్ర మహాసభలో చేరిన ఐలమ్మ కుటుంబంపై కక్షగట్టి ఆంధ్ర మహాసభల్లో చేరిందని, నాయకులకు ఆశ్రయం కల్పించి అన్నం పెడుతోందని ఆరోపిస్తూ దాడులు చేయించారు. ఐలమ్మ భర్త నర్సయ్య, సంఘం నాయకులు ఆరుట్ల రాంచంద్రారెడ్డి, బీంరెడ్డి నర్సింహరెడ్డి, నల్లా నర్సింహులు, నల్లు ప్రతాప్రెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వర్రావును తీసుకు వచ్చారు. పాలకుర్తి తదితర ప్రాంతాల్లో జరిగిన కొన్ని సంఘటనల్లో ఐలమ్మ, ఆమె భర్త నర్సయ్య, కుమారుడు సోమయ్య, లచ్చయ్యపై రాంచంద్రారెడ్డి కుట్ర కేసు పెట్టి జైలుకు పంపాడు. మల్లంపల్లి జమీందార్ కొండల్రావును దేశ్ముఖ్ పిలిపించి ఐలమ్మకు కౌలుకు ఇచ్చిన భూమిని తనకు కౌలుకు ఇచ్చినట్లుగా ఒక అగ్రిమెంట్ రాయించుకుని దానిని ఆధారంగా చేసుకుని ఐలమ్మ పంటను ధ్వంసం చేసేందుకు గుండాలను పంపించాడు. ఐలమ్మ పొలంలోని పంటను కాపాడుకునేందుకు బీంరెడ్డి నర్సింహారెడ్డి నాయకత్వంలో పార్టీ కార్యకర్తలు, గుండాలను అడుగుపెట్టనియ్యకుండా ప్రతిఘటించారు. ఐలమ్మ కుటుంబానికి ఆంధ్రమహాసభ అండగా నిలిచింది. ఐలమ్మ పోరాటం గురించి తెలుసుకున్న పుచ్చలపల్లి సుందరయ్య ఆమె ఇంటికివచ్చి ఇల్లునే కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంగా మార్చి ఇంటి ఆవరణలో అరుణపతాకాన్ని ఎగురవేశారు. ‘ఐలమ్మ భూస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటుకు చిహ్నంగా నిలిచిందని’ పుచ్చలపల్లి సుందరయ్య కొనియాడారు. చాకలి ఐలమ్మ పేరుతో స్మృతివనం ఏర్పాటు చేయాలి హైదరాబాద్ సచివాలయం ఎదుట, ఢిల్లీ పార్లమెంట్లో ఐలమ్మ విగ్రహం పెట్టాలని, ఏదైనా జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలని పలువురు కోరుతున్నారు. పాలకుర్తి మండల కేంద్రంలో ఐదెకరాల్లో ఐలమ్మ పేరుతో పార్కు, స్కృతివనం ఏర్పాటు చేయాలని ఐలమ్మ అభిమానులు కోరుతున్నారు. భూస్వాములు, రజాకార్లను తరిమికొట్టిన వీరనారి దేశ్ముఖ్లకు ముచ్చెమటలు పట్టించిన ధీశాలి నేడు చాకలి ఐలమ్మ వర్ధంతిఐలమ్మ 1895 సెప్టెంబర్ 26వ తేదీన రాయపర్తి మండలంలోని కిష్టాపురం గ్రామంలో జన్మించింది. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో 1908లో తన 13వ యేటా వివాహం జరిగింది. వృద్ధాప్యంతో 90 ఏళ్ల వయస్సులో 1985, సెప్టెంబర్ 10న ఐలమ్మ కన్నుమూసింది. ఆమె పోరాటానికి చిహ్నంగా మండల కేంద్రంలో ఐలమ్మ స్మారక స్థూపం, భవనం, కాంస్య విగ్రహం నిర్మించారు. -
మూతబడిన పాఠశాలలు
డోర్నకల్: మండలంలోని చాప్లాతండా, పాతదుబ్బతండా ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోవడం లేదు. పలు గ్రామాల్లో విద్యార్థులు లేక ఒక్కొక్కటిగా పాఠశాలలు మూసివేయగా.. ప్రస్తుతం చాప్లాతండా, పాతదుబ్బతండా పాఠశాలలు వాటి సరసన నిలిచాయి. చాప్లాతండా పాఠశాలలో విద్యార్థులు లేకపోవడంతో ఇక్కడ విధులు నిర్వర్తించిన ఉపాధ్యాయురాలిని మరో పాఠశాలకు కేటాయించారు. దీంతో చాప్లాతండా పాఠశాలలో అంగన్వాడీ కేంద్రం నిర్వహిస్తున్నారు. అలాగే పాతదుబ్బతండా పాఠశాలలో విధులు చేపట్టిన ఉపాధ్యాయురాలు పదోన్నతి పొంది బదిలీపై వెళ్లారు. దీంతో అక్కడ చదివే ముగ్గురు విద్యార్థులు రాకపోవడంతో పాఠశాల మూతబడింది. అలాగే మండలంలో పదిమంది లోపు విద్యార్థులు ఉన్న మరో పది పాఠశాలలు మూసివేసే అవకాశం ఉంది. -
వానకొండయ్య జాతర అభివృద్ధికి కృషి
● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డిదేవరుప్పుల: వానకొండయ్య లక్ష్మీనరసింహస్వామి జాతర వైభవానికి సమష్టిగా కృషి చేద్దామని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి సూచించారు. మండలంలోని కడవెండి రెవెన్యూ పరిధిలోని వానకొండయ్య గుట్టపై మౌలిక వసతుల కోసం ఇటీవల మంజూరైన రూ.కోటి వినియోగంపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మంజూరైన నిధులతో ఆలయ ప్రాంగణం పునరుద్ధరణ, కల్యాణ మండపం, అన్నదాన సత్రం, భక్తుల కోసం తాగునీరు, స్నానపు గదుల సదుపాయాలు, పార్కింగ్ స్థలాల వంటి వసతులను కల్పించాలన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలన్నారు. ప్రణాళిక మేరకు సత్వరమే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతామన్నారు. వచ్చే జాతర నాటికి వానకొండయ్య గుట్ట రూపురేఖలు మార్చాలని పిలుపునిచ్చారు. తొలుత గుట్టపై ఆలయంలో మూలవిరాట్కు ఎమ్మెల్యే మొక్కులు చెల్లించుకొని పరిసరాలను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆడెపు ఆండాలు, ఎంపీడీఓ సురేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరామ్, వివిధ శాఖల అధికారులు అరుణ, దివ్య, మానస, సింధుప్రియ, ఆలయ పూజారి బీట్కూరు సంపత్ కుమారచార్యులు పాల్గొన్నారు. -
కలెక్టర్ ఇంటివైపు మురుగు.. పరుగు
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. చిన్నపాటి వర్షానికే డ్రెయినేజీలు పొంగిపొర్లి మురుగు నీరు రోడ్లపై చేరుతోంది. ఏకంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయం రోడ్డులో సైడ్ డ్రైయినేజీలో వ్యర్థాలు పేరుకుపోయి రోడ్డుపై ముగురుప్రవహిస్తోంది. కాగా అటు వైపు మున్సిపల్ అధికారులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. అధికారులు ఉండే ప్రాంతాల్లో పరిస్థితి ఇలా ఉంటే.. సామాన్యులు ఉండే కాలనీల పరిస్థితి ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
క్యాన్సర్ పేషెంట్లకు ఊరట
నెహ్రూసెంటర్: జిల్లాలోనే క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందనుంది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రితో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయగా.. మంగళవారం హైదరాబాద్ నుంచి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వర్చువల్గా ప్రారంభించారు. కాగా జిల్లాలో 765 మంది పలు రకాల క్యాన్సర్ వ్యాధుల బాధపడుతున్నారు. వీరంతా హైదరాబాద్ వంటి నగరాల్లోని పెద్దాసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. స్థానికంగా వైద్యం అందనుండడంతో బాధితులకు ఉపశమనం కలగనుంది. కాన్సర్ సర్జరీ చేసుకున్నవారికి కీమోథెరిపీ చికిత్స చేసేలా ఆస్పత్రిలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక వార్డు, బెడ్లు... క్యాన్సర్కు చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రిలో 20 బెడ్లు, ఐదుగురు వైద్యులు, ఐదుగురు నర్సులు, పేషెంట్కేర్, సిబ్బందిని కేటాయించారు. క్యాన్సర్ సర్జరీల తర్వాత వ్యాధిగ్రస్తులకు నా ణ్యమైన వైద్యం, మందులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని వ్యాధిగ్రస్తులు ఇకపై ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా చికిత్స పొందనున్నారు. వర్చువల్గా వార్డును ప్రారంభించిన మంత్రి.. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో క్యాన్సర్ చికిత్స వార్డును హైదరాబాద్ నుంచి వర్చువల్గా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. ఎంఎన్జే క్యాన్సర్ ఆస్పత్రికి అనుసంధానంగా పని చేస్తుందని, క్యాన్సర్ పేషెంట్లను అడ్మిట్ చేసుకుని కీమోథెరపీ అందించి డిశ్చార్జ్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. క్యాన్సర్ వార్డు ప్రారంభంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు పాల్గొని క్యాన్సర్ బాధితులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జీఎంసీ ప్రిన్సిపల్ వెంకట్ లకావత్, డాక్టర్ గోదాదేవి, నాగరాజు, అనస్తీషియా డాక్టర్సునీల్, డాక్టర్ కోటేశ్వర్రావు, ఆర్ఎంఓలు జగదీశ్వర్, హర్షవర్ధన్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. జీజీహెచ్లో ప్రత్యేక క్యాన్సర్ వార్డు, వైద్యులు, సిబ్బంది నియామకం వర్చువల్గా వార్డును ప్రారంభించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి అందుబాటులోకి కీమోథెరపీ చికిత్స జిల్లాలో 765 మంది బాధితులు జిల్లాలో క్యాన్సర్ బాధితుల వివరాలు .. బ్రెస్ట్ క్యాన్సర్ 255 క్రానికల్ 205 ఓరల్ 93 గొంతు 46 యూట్రస్ 47 బ్లడ్ 22 ఇతర పలరకాల క్యాన్సర్ 97బాధితులు సద్వినియోగం చేసుకోవాలి జీజీహెచ్లో క్యాన్సర్ బాధితులకు కీమోథెరపీ చికిత్స అందించేందుకు ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశాం. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ క్యాన్సర్ వార్డును ప్రారంభించారు. జిల్లాలో ఉన్న బాఽధితులు సద్వినియోగం చేసుకోవాలి. జీజీహెచ్లో ఉచితంగా చికిత్సను అందజేయడం జరుగుతుంది. – శ్రీనివాసరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ చికిత్స అందించడం సంతోషకరం జిల్లాలో క్యాన్సర్ చికిత్సను అందించడం సంతోషకరం. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ప్రజలు వ్యాధితో ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా చితికిపోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయడం సంతోషకరం. ప్రజలకు అన్ని రకాల చికిత్సలను అందుబాటులోకి తీసుకురావడం హర్షనీయం. – సిరిపురం వీరన్న, మానుకోట -
కల్తీ మద్యం బాటిళ్ల స్వాధీనం
గార్ల: మండలంలోని పెద్దకిష్టాపురం పంచాయతీ పరిధి ముష్టికుంట సమీపంలోని పంట కాలువల్లో మంగళవారం కల్తీ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ముష్టికుంట సమీపంలోని కాలువల్లో ఉన్న కల్తీ మద్యం బాటిళ్లను గ్రామస్తులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి ఎస్సై రియాజ్పాషా సిబ్బందితో చేరుకొని సుమారు 120 ఐబీ, రాయల్స్టాగ్ కల్తీ మద్యం క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల జిల్లా కేంద్రం సమీపంలో కల్తీ మద్యం తయారీ కేంద్రంలో హస్తం ఉన్న పెద్దకిష్టాపురం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు జైలుకు వెళ్లారు. ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్న బాటిళ్లు సైతం వారికి సంబంధించినవే అయి ఉంటాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఎకై ్సజ్ సీఐ చిరంజీవి, ఎస్సై రియాజ్పాషాను సాక్షి వివరణ కోరగా.. ముష్టికుంట వద్ద 120 కల్తీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని, సమగ్ర విచారణ చేస్తున్నట్లు తెలిపారు. -
కలెక్టరేట్లో కాళోజీ జయంతి
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో మంగళవారం ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి కార్యక్రమం నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, అధికారులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కాళోజీ చరిత్రను ప్రతీ ఒక్కరు అధ్యయనం చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, అనిల్కుమార్, బీసీ సంక్షేమశాఖ జిల్లా అధికారి నర్సింహస్వామి పాల్గొన్నారు. కూరగాయల సాగుతో అధిక లాభాలు నెల్లికుదురు: కూరగాయల సాగుతో అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న రైతులకు సూచించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో సాగులో ఉన్న ఆయిల్ పామ్, కూరగాయల పంటలను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మరియన్న మాట్లాడుతూ.. ఆయిల్పామ్ సాగుతో ఎకరానికి ఏటా రూ.1.50లక్షల ఆదాయం పొందవచ్చన్నారు. జిల్లాలోని వివిధ మండలాల్లో ఆయిల్పామ్, పండ్ల తోటలు, కూరగాయలు, మల్బరీ, పూలు, మునగ పంటలను రైతులు సాగు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు ఈ పంటలపై మక్కువ పెంచుకుని సాగు చేసి అధిక లాభాలు పొందాలని కోరారు. డోర్నకల్లో గౌతమి, చార్మినార్ రైళ్లకు హాల్టింగ్ డోర్నకల్: డోర్నకల్ రైల్వే స్టేషన్లో బుధవారం నుంచి గౌతమి, చార్మినార్ ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పించనున్నారు. కాకినాడ–లింగంపల్లి, లింగంపల్లి–కాకినాడ గౌతమి ఎక్స్ప్రెస్, తాంబరం–హైదరాబాద్ చార్మినార్ ఎక్స్ప్రెస్కు స్టేషన్లో హాల్టింగ్ కల్పిస్తున్నట్లు డీఆర్యూసీసీ సభ్యులు లచ్చిరాంనాయక్, ఖాదర్ మంగళవారం తెలిపారు. కేయూ వీసీ అమెరికా పర్యటన కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి ఈనెల 12 నుంచి 20వ తేదీవరకు అమెరికా అధికార పర్యటన చేస్తారని రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం మంగళవారం తెలిపారు. అమెరికాలోని న్యూజెర్సీ అట్లాంటాలో నిర్వహించనున్న కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఫార్మసీ విభాగం చాప్టర్ సమ్మేళనంలో వీసీ ముఖ్యఅతిథిగా పాల్గొంటారని, టెక్సాస్లోని ఏ అండ్ ఎం యూనివర్సిటీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మకాలజీ అండ్ న్యూరో థెరిప్యూటిక్స్తో ఒక అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకుంటారని ఆయన తెలిపారు. ఈ ఒప్పందం విద్య, పరిశోధన రంగాల్లో అంతర్జాతీయ సహకారానికి దోహదం చేస్తుందని భావిస్తున్నట్లు వివరించారు. రెండు విశ్వవిద్యాలయాల మధ్య పరిశోధనల మార్పిడి మరింతగా సులభతరం అవుతుందని తెలిపారు. పూజారుల అభిప్రాయం మేరకే గద్దెల మార్పు ఎస్ఎస్తాడ్వాయి: మేడారంలో పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను పూజారుల అభిప్రాయాల మేరకే మార్పు చేస్తున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు చందా రఘుపతి, కొక్కెర రమేష్, కాక సారయ్య, కాక వెంకటేశ్వర్లు, దబ్బగట్ల గోవర్ధన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమ్మక్క–సారలమ్మ గద్దెలతో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలను భక్తులు దర్శించుకునే సమయంలో ఎదురుపడి ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. జంపన్నవాగు నుంచి వచ్చే భక్తులు టీటీడీ కల్యాణ మండపం వెనుకాల క్యూలైన్, ఆర్టీసీ బస్టాండ్ క్యూలైన్ ద్వారా వచ్చే భక్తులు మీడియా పాయింట్ సమీపంలోని ఎంట్రెన్స్ ద్వారం నుంచి ఒక్కసారిగా గద్దెల ప్రాంగణంలోకి రావడంతో తొక్కిసలాట జరిగి ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. ఈమేరకు రెండు గద్దెలను మార్పు చేయాలని ఆలోచన చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. గోవిందరాజు, పగిడిద్దరాజుల మూలలను ముట్టుకోకుండా గద్దెల స్థానం మార్పు అనేది పూర్తిగా పూజారుల అనుమతి, అంగీకారాలతోనే జరుగుతుందన్నారు. -
కాంటాలు సక్రమంగా లేకుంటే చర్యలు
● ఇన్చార్జ్ తూనికలు కొలతల జిల్లా అధికారి శ్రీలత మహబూబాబాద్: వ్యాపారుల కాంటాలు సక్రమంగా ఉండాలని, తూకాల్లో తేడా వస్తే కేసులు నమోదు చేస్తామని ఇన్చార్జ్ తూనికలు కొలతల జిల్లా అధికారి శ్రీలత అన్నారు. వ్యా పారులు నిబంధనలకు విరుద్ధంగా వస్తువులు విక్రయిస్తున్నారని, నాణ్యత లేని ఆహార పదార్థాలు, ఇతర వస్తువులు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని, తూకంలో మోసాలకు పాల్పడుతున్నారని ఈనెల 8న సాక్షి దినపత్రికలో ‘తూతూ మంత్రంగా తనిఖీలు’ అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై ఇన్చార్జ్ తూనికలు కొలతల జిల్లా అధికారి శ్రీలత స్పదించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కూరగాయాల మార్కెట్ను సందర్శించి కాంటాలు, బాట్లను తనిఖీ చేశారు. అలాగే కిరాణా షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. వినియోగదారులకు నష్టం చేస్తే కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తామన్నారు. ఎనిమిది షాపులు తనిఖీ చేసి మూడు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. -
జీపీఓలు వస్తున్నారు..
సాక్షి, మహబూబాబాద్: ఇంతకాలం గ్రామ రెవెన్యూ వ్యవస్థను పట్టించుకునే వారు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అయితే ప్రస్తుతం వారి ఇబ్బందులను తొలగించేందుకు మళ్లీ గ్రామ పరిపాలనాధికారుల నియామకం వేగవంతంగా జరుగుతోంది. కాగా, గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా పనిచేసిన వారినే జీపీఓలుగా నామకరణం చేసి .. బాధ్యతల్లో కొంత మేర మార్పులు చేసి గ్రామాలకు పంపిస్తున్నారు. పాతవారే అయినప్పటికీ పనితీరులో కొత్తదనం ఉంటుందని.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పనులు చేయాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. గ్రామస్థాయిలో మళ్లీ సేవలు గ్రామస్థాయిలో సమస్యలు వస్తున్నాయని 2020 ఏడాదిలో గత ప్రభుత్వం వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసింది. అప్పటి నుంచి గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ లేకుండా పోయింది. ఈక్రమంలో పలు సమస్యలు పేరుకుపోయాయి. వీటికి పరిష్కారం లభించకపోవడంతో ఇటు ప్రజలు.. అటు అధికారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రతీ చిన్న సమస్యకు గ్రామస్తులు తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. విద్యార్థులకు కావాల్సిన సర్టిఫికెట్ల నుంచి భూ సమస్యల పరిష్కారం వరకు తహసీల్దార్ కార్యాలయాలే దిక్కయ్యాయి. అన్ని సమస్యల పరిష్కారంలో రెవెన్యూ వ్యవస్థ కీలకం. ఆ వ్యవస్థ గ్రామస్థాయిలో నిర్వీర్యమైంది. ప్రస్తుతం జీపీఓల నియామకంతో భూ రికార్డుల పరిరక్షణ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వ ఏజెంట్లుగా మారి ప్రజలకు అండగా నిలుస్తారు. వారికి పునరావాసం కల్పిస్తారు. ప్రజల చర, స్థిర ఆస్తుల పరిరక్షణకు పనిచేస్తారు. ఎన్నికల సందర్భంగా బీఎల్ఓలుగా ఉంటారు. ఓటరు జాబితా తయారీలో కీలకంగా వ్యవహరిస్తారు. ప్రతీ ఎన్నికకు గ్రామాల్లో ఏర్పాట్లు చేస్తారు. శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడతారు. సంక్షేమ ఫలాలు అమలు చేసేందకు నివేదికలు అందిస్తారు. నియామక ప్రక్రియ షురూ.. గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ, నూతన భూభారతి చట్టం అమలుకు గ్రామస్థాయిలో జీపీఓలను నియమించారు. జిల్లాలో 18 మండలాలు, 473 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో రెవెన్యూ గ్రామాలు(క్లస్టర్లు) 180 ఉన్నాయి. వీటికి ఇప్పటికే వ్యవసాయశాఖ పరిధిలో ఏఈఓలను నియమించారు. అయితే భూముల క్రయ విక్రయాలు, హద్దులు, భూమి స్వభావం వంటి వివరాల తెలుసుకోవడం, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ప్రతీ క్లస్టర్కు ఒక జీపీఓను నియమించాలని ప్రభుత్వం భావించింది. దీనిలో భాగంగా గతంలో వీఆర్వో, వీఆర్ఏగా పనిచేసిన వారికి జీపీఓలుగా అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. వెనక్కి వచ్చిన వారికి పరీక్ష నిర్వహించారు. ఇందులో 151 మంది పరీక్ష రాయగా.. ఐదుగురు వెనక్కి తగ్గారు. మిగిలిన 147 మందికి జీపీఓలుగా నియామక పత్రం అందజేసే ప్రక్రియ మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో కొససాగింది. మెరిట్ జాబితాతో పాటు, దివ్యాంగులు, స్పౌజ్, ఇతర ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకొని పోస్టింగ్లు ఇస్తున్నారు. మిగిలిన 33 క్లస్టర్లకు ప్రస్తుతం రెవెన్యూశాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించి.. ప్రభుత్వ నిర్ణయం మేరకు పనిచేయించేలా చూస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో విధుల్లోకి.. ప్రజలకు రెవెన్యూ, ఇతర సేవలు చేరువలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం జీపీఓల నియామకం చేపడుతోంది. మెరిట్, ఇతర ప్రభుత్వ నిబంధనల మేరకు పోస్టింగ్లు ఇస్తున్నాం. కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేసుకొని రెండు, మూడు రోజుల్లో జీపీఓలు విధుల్లో చేరుతారు. వీరి ద్వారా మరింత మెరుగైన సేవలు అందుతాయి. –అనిల్ కుమార్, అదనపు కలెక్టర్ పాత వీఆర్వో, వీఆర్ఏలే గ్రామ పాలనాధికారులు జిల్లా వ్యాప్తంగా 147 మంది నియామకం క్లస్టర్ల వారీగా బాధ్యతలు మిగిలిన గ్రామాల్లో జూనియర్ అసిస్టెంట్లకు అప్పగింత -
నాణ్యమైన భోజనం అందించాలి
● కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ కేసముద్రం: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశించారు. సోమవారం ఇనుగుర్తి, కేసముద్రం మండలాల్లో కలెక్టర్ సుడిగాలి పర్యటన చేశారు. కేజీబీవీని తనిఖీ చేశారు. విద్యార్థుల అభ్యసనాలు, స్టోర్ గదిని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. రెండు మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు. ఇన్పేషెంట్, అవుట్ పేషెంట్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోగులకు సరైన వైద్యం అందించాలన్నారు. ఆస్పత్రిల పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. కేసముద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలోని చిన్నారులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని సూచించారు. పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధగా ఉండాలన్నారు. తనిఖీలో మండల ప్రత్యేక అధికారులు, వైద్యాధికారులు పాల్గొన్నారు. -
మొదటి ప్రశంస కాళోజీదే
‘ఓరుగల్లు’కు బీజేపీ మొండిచెయ్యి బీజేపీ రాష్ట్ర కమిటీలో ఈసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్కరికి కూడా చోటుదక్కలేదు.వాతావరణం జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు కాస్త ఉక్కపోతగా ఉంటుంది. ‘ప్రజాకవి కాళోజీ నారాయణరావుతో పరిచయం ఉంది. మొదటి సారి 1990 హనుమకొండలో బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తున్న సమయంలో కాళోజీ నారాయణరావు ఇంట్లో మిత్రమండలి సమావేశం జరిగింది. ఆ సమావేశానికి వెళ్లిన నేను మొదటిసారి ఆయనను ప్రత్యక్షంగా చూశా. అప్పటికే ప్రజాకవిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా గొప్ప పేరుంది. ఆయన ముందు ధైర్యం చేసి నేను రాసిన ఒక కవితను చదివాను. దానికి కాళోజీ నన్ను అభినందించడం ఇప్పటికీ గుర్తు ఉంది.’ అని అన్నారు తెలుగు కవయిత్రి, కార్టూనిస్టు నెల్లుట్ల రమాదేవి. ఆమెను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కాళోజీ సాహితీ పురస్కారం–2025కు ఎంపిక చేసిన నేపథ్యంలో నేడు (మంగళవారం) కాళోజీ జయంతి సందర్భంగా సోమవారం ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉద్యోగం చేస్తూనే ఆమె చేసిన రచనలు, రాసిన కథలు.. గీసిన కార్టూన్లు, కాళోజీతో ఉన్న అనుబంధాన్ని వివరించారు. వివరాలు ఆమె మాటల్లోనే.. – సాక్షిప్రతినిధి, వరంగల్/స్టేషన్ఘన్పూర్ విద్యార్థి దశనుంచే రచనలు.. అమ్మ ప్రోత్సాహం, భర్త సహకారం.. 1980లో తొమ్మిదో తరగతిలో స్నేహ అనే నాటిక రాశాను. అనంతరం మొదటగా బుజ్జాయి అనే పిల్లల పత్రికలో నేను రాసిన కథను ప్రచురించారు. ఈ తరం అమ్మాయి అనే కథను ఒక మహిళా మ్యాగ్జిన్కు వాడుకున్నారు. నా చిన్నప్పటినుంచే మా అమ్మ శకుంతలాదేవి కథల పుస్తకాలు బాగా చదివేది. మాకు కథలు చెప్పేది. అలా కథల పుస్తకాలు చదువుతూ నేను కూడా కథలు రాయాలనుకున్నా. నన్ను మొదట ప్రోత్సహించింది మా అమ్మనే. అదేవిధంగా 1983లో వివాహం జరిగింది. భర్త దేవేందర్ జిల్లా కోఆపరేటిట్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్గా పనిచేసేవారు. ఆయన నన్ను బాగా ప్రోత్సహించేవారు. కథలు, రచనలకు, కార్టూన్లకు తన అభిప్రాయాలు, సూచనలు చేసేవారు. అయితే దురదృష్టవశాత్తు 2009లో ఆయన హఠాన్మరణం చెందడం బాధాకరం. కాళోజీని చాలాసార్లు కలిసి మాట్లాడాను.. నాతో కలిసి హనుమకొండలో బ్యాంకులో పనిచేసే రవికుమార్ కాళోజీ కుమారుడని తర్వాత తెలిసింది. రవికుమార్ పద్యాలు రాసేవారు. ఇద్దరం కవితలు, పద్యాలు ఒకరికొకరం చెప్పుకునేవాళ్లం. అతడితో కలిసి కాళోజీ ఇంటికి వెళ్లి ఆ మహానుభావుడితో చాలాసార్లు మాట్లాడాను. కాళోజీకి నేను రాసిన కథలు, రచనలు చూపించి సంతోషపడ్డాను. అనంతరం రెండు, మూడు సమావేశాల్లో కలుసుకున్నాం. కాళోజీ రచనలు చాలా చదివాను. ఆయన రచనలు సరళంగా, వ్యంగ్యంగా ఉంటాయి. సమాజాన్ని సూటిగా ప్రశ్నించే ఆయన రచనలు అంటే చాలా ఇష్టం. ఆయన ధిక్కార స్వరం.. సమాజానికి దిక్సూచి.. ఒక మనిషి, కవి, రచయిత ఎలా ఉండాలని సమాజానికి దిశానిర్దేశం చేయడమే కాకుండా స్వయంగా పాటించిన గొప్పవ్యక్తి కాళోజీ. ఆయన రాసిన పలుకుబడుల భాష–బడిపలుకుల భాషతోపాటు పలు రచనలు చదివాను. ధిక్కార స్వరం అయిన కాళోజీ తెలంగాణకే కాదు మొత్తం సమాజానికి దిక్సూచి. ఆయన ఏదైనా పద్యం చెబితే వాస్తవికంగా, సరళంగా ఉండేది. రచనలు, మాటలు సూటిగా, చురుకుమనిపించేలా ఉంటాయి. ఆయన పోయట్రీ తెలంగాణకు దిశానిర్దేశం. తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛగా, సంతోషంగా ఉంటున్నామంటే ఆరోజుల్లోనే తెలంగాణ గురించి మాట్లాడి, కొట్లాడిన వ్యక్తి కాళోజీ ఒకధీరోదత్తుడు. సీరియస్, హాస్యం.. రెండూ ఉంటాయి.. కాళోజీ మంచి జోకులు వేసేవారు. ఒక సమావేశంలో ఆయనను కలిసినప్పుడు బ్యాంకు క్యాషియర్నైన నన్ను కేవలం పైసలు లెక్కపెడ్తున్నావా? రచనలు చేస్తున్నావా? అంటూ హాస్యంగా మాట్లాడారు. రచయితలు రచనలు చేయాలని, సమాజానికి దిశానిర్దేశం చేసేలా, ప్రజలను చైతన్యం చేసేలా రచనలు ఉండాలని చెప్పేవారు. కాళోజీ పురస్కారం... మొదటి మహిళగా సంతోషంగా ఉంది.. గత పదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న కాళోజీ సాహితీ పురస్కారానికి ఈ ఏడాది మొదటి మహిళగా నేను ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. 2015లో అమ్మంగి వేణుగోపాల్ ఈ అవార్డుకు ఎంపిక కాగా, అనంతరం గోరటి వెంకన్న తదితర ప్రముఖులు అందుకున్నారు. గత ఏడాది నలిమెల భాస్కర్కు ఈ అవార్డు అందించారు. 11వ వ్యక్తిగా మొదటి మహిళగా, కాళోజీ పుట్టిన ఓరుగల్లు బిడ్డగా ఎంపిక కావడం ఆనందంగా ఉంది. నేను రాసి, చదివిన కవిత బాగుందని మెచ్చుకోవడం మరిచిపోలేని గుర్తు ఆయన పేరిట సాహితీ పురస్కారానికి ఎంపికై నందుకు సంతోషంగా ఉంది.. అమ్మ ప్రోత్సాహంతో రచనలు.. భర్త సహకారం కొనసాగించేలా చేశాయి.. ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో కాళోజీ సాహితీ పురస్కారం–2025 గ్రహీత నెల్లుట్ల రమాదేవిబహుముఖ ప్రజ్ఞాశాలి.. రమాదేవి నెల్లుట్ల రమాదేవి... తెలుగు కవయిత్రి, కథకురాలు, ఉపన్యాసకురాలు, కార్టూనిస్టు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ రైతు కుటుంబానికి చెందిన రాంచందర్రావు, శకుంతలా దేవి దంపతులకు జన్మించారు. 1983లో దేవేందర్ను వివాహమాడిన ఆమె 1984లో గ్రామీణ బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి ఆంధ్రాబ్యాంకు సీనియర్ మేనేజర్గా పదవీ విరమణ చేశారు. కవి, రచయిత్రి, కార్టూనిస్టుగా రాణించిన రమాదేవి మొదటి కార్టూన్ 1978లో స్వాతిలో అచ్చయ్యింది. ఆ తర్వాత అనేక కథలు, కథానికలు ఆమెకు మంచి గుర్తింపు తేగా.. 2013 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కీర్తిపురస్కారం అందుకున్నారు. కథలు, కవిత్వమే కాకుండా కార్టూన్లు వేసి బహుముఖ ప్రజ్ఞాశాలిగా రమణీయమైన కావ్యాలు, మనసుకు హత్తుకునే భాషతో అందరినీ ఆకట్టుకున్న రమాదేవి కాళోజీ సాహితీ పురస్కారం –2025కు ఎంపికయ్యారు. -
రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
దంతాలపల్లి: రాష్ట్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీపీఎస్లో భవిత్ భవన్, మరుగుదొడ్ల నిర్మాణానికి సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని దివ్యాంగుల సంక్షేమమే లక్ష్యంగా పాఠశాల ఆవరణలో భవిత భవన్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ, అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన గురు పూజోత్సవంలో ప్రభుత్వ విప్ పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే లక్ష్యంగా పనులు చేస్తున్నామన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయ, ఎంఈఓ శ్రీదేవి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీలక్ష్మి, ప్రధానోపాధ్యాయులు వేణుమాధవరెడ్డి, కృష్ణయ్య, కిషన్నాయక్, ఏఎంసీ వైస్ చెర్మన్ బట్టు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.పండిట్ పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేయాలిమహబూబాబాద్ అర్బన్: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పండిట్ పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేయాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బలాష్టి రమేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో సోమవారం గిరిజన సంక్షేమశాఖ డీడీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతుల షెడ్యూలు విడుదల చేయాలని, సీఆర్టీల పెండింగ్ వేతనాలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో గార్ల మండల ప్రధాన కార్యదర్శి గుగులోత్ బాలాజీ, సభ్యులు బాలు, రాజు తదితరులు పాల్గొన్నారు.28న జిల్లాస్థాయి పవర్లిఫ్టింగ్ పోటీలుడోర్నకల్: డోర్నకల్లో ఈనెల 28న జిల్లాస్థాయి పవర్లిఫ్టింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు పవర్లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.దేవ్సింగ్, బుట్టి అశోక్కుమార్ తెలి పారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. డోర్నకల్ బుల్లెట్ప్రూఫ్ వ్యాయామశాల ఆధ్యర్యంలో 28న స్థానిక జైన్భవన్లో జిల్లాస్థాయి పవర్లిఫ్టింగ్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సీ్త్ర, పురుషులకు సీనియర్, జూనియర్ విభాగాల్లో వేర్వేరుగా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. విజేతలకు టీం చాంపియన్తో పాటు స్ట్రాంగ్మెన్ టైటిల్ అందించనున్నట్లు తెలిపారు.నిధులు విడుదల చేయాలిమహబూబాబాద్: పెండింగ్లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం నిధులు విడుదల చేయాలని పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో వినతిపత్రం అందజే శారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. మూడు సంవత్సరాలుగా నిధులు పెండింగ్లో ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారన్నారు. నిధులు వెంటనే విడుదల చేయకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మహేష్కుమార్, షబ్బీర్, చరణ్ పాల్గొన్నారు.విద్యుదాఘాతంతో యువరైతు మృతిబయ్యారం: వ్యవసాయ మోటారు వద్ద విద్యుదాఘాతానికి గురై ఓ యువరైతు మృతి చెందిన సంఘటన సోమవారం మండలంలోని బంజరతండాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన బానోత్ కుమార్(27) తన వ్యవసాయ మోటారు ఆఫ్ చేసేందుకు సాయంత్రం పొలం వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురైన ఆయన వరి పొలంలో పడిపోయాడు. చీకటి పడినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు అతడి అచూకీ కోసం పొలం వద్దకు వెళ్లారు. కాగా మోటారు దగ్గర చలనం లేకుండా పడిపోయి ఉండగా.. ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా కుమార్ అప్పటికే మృతి చెందాడు. -
అక్షరాస్యతతోనే సమాజాభివృద్ధి
మహబూబాబాద్ అర్బన్: అక్షరాస్యతతోనే సమాజం అభివృద్ధి దిశగా పయనిస్తుందని డీఈఓ దక్షిణామూర్తి అన్నారు. జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ అక్షరాస్యత ముగింపు వారోత్సవ ర్యాలీ సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు అక్షరాస్యులు కావాలని, తద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు సమాన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. విద్య అనేది వ్యక్తిని మాత్రమే కాదు, మొత్తం సమాజాన్ని ముందుకు నడిపించే శక్తి అని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరు అక్షరాస్యత సాధనలో భాగస్వాములు కావాలని, అక్షరాస్యతను ఒక సామూహిక ఉద్యమంలా మార్చాలని పిలుపునిచ్చారు. ఏఎంఓ చంద్రశేఖర్ అజాద్, డీఎస్ఓ అప్పారావు, ఏపీఎం శంకర్ నాయక్, డీడీ ధనరాజు, రిసోర్స్ పర్సన్లు నాగముణి, వీరన్న, విద్యార్థులు, ఉపాధ్యాయులు, వలంటీర్లు పాల్గొన్నారు. సృజనాత్మకతను వెలికితీయొచ్చు.. కళా–ఉత్సవ్ పోటీలు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి ఎంతగానో దోహదపడుతాయని డీఈఓ దక్షిణామూర్తి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో సోమవారం జిల్లా స్థాయి కళా–ఉత్సవ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో కళాత్మక నైపుణ్యాలను వెలికితీసే మంచి వేదిక కళా ఉత్సవ్ అన్నారు. వాయిద్య పోటీలు, గ్రూప్ డ్యాన్స్, భరత నాట్యం, ఏకపాత్రాభినయం, బొమ్మల తయారీ పోటీలు, చిత్రలేఖనం పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఏసీజీఈ మందుల శ్రీరాములు, ఏఎంఓ ఆజాద్ చంద్రశేఖర్, డీఎస్ఓ అప్పారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పర్యవేక్షించిన ఎస్పీ
మహబూబాబాద్ రూరల్/కురవి/మరిపెడ : మానుకోట పీఏసీఎస్ వద్ద ఆదివారం పేర్లు నమోదు చేసిన వారిలో 444 మంది రైతులకు సోమవారం ఒక్కొక్క బస్తా చొప్పున పంపిణీ చేశారు. మిగిలిన రైతులకు స్టాక్ వచ్చిన పంపిణీ చేస్తామని చెప్పారు. ఆ రైతుల పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్ కార్డులు పరిశీలించి ఎంఏఓ పేరిట సీరియల్ నంబర్లు, స్టాంపులు వేసి పంపించారు. శనిగపురం గ్రామంలోని పీఏసీఎస్ సెల్ పాయింట్ వద్ద ఆదివారం పేర్లు నమోదు చేయించుకున్న రైతులు యూరియా కోసం సోమవారం తెల్లవారుజాము వరకు చేరుకున్నారు. అయితే యూరియా రావడం లేదని వ్యవసాయ అధికారులు చెప్పగానే వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడి సముదాయించారు. ఏడీఏ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. యూరియా స్టాకురాగానే మంగళవారం పంపిణీ చేస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు. అదే విధంగా కురవి, మరిపెడ మండలాల్లో యూరియా పంపిణీ ప్రక్రియను ఎస్పీ పరిశీలించారు. డీఎస్పీలు తిరుపతిరావు, కృష్ణకిషోర్ ఆధ్వర్యంలో సీఐలు మహేందర్ రెడ్డ్డి, సర్వయ్య, చంద్రమౌళి, రవికుమార్, సూర్యప్రకాష్, రాజ్ కుమార్, గణేష్, ఎస్సైలు, పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు. డీఏఓ విజయనిర్మల ఆధ్వర్యంలో ఏడీఏ శ్రీనివాసరావు, విజయ్ చంద్ర, ఏఓలు, ఏఈఓలు రైతుల పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్ కార్డులు పరిశీలించి యూరియా పంపిణీ చేశారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
● తండ్రిని హత్య చేసిన కుమారుడు ● ఈ ఘటనలో కొడుకు అరెస్ట్ ● వివరాలు వెల్లడించిన వర్ధన్నపేట ఏసీపీ వర్ధన్నపేట : తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో తండ్రిని హత్య చేసిన కుమారుడిని అరెస్ట్ చేసినట్లు వర్ధన్నపేట ఏసీపీ ఎ. నర్సయ్య తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. వర్ధన్నపేట మండలం గుబ్టేటి తండాకు చెందిన సపావత్ సురేశ్కు 2019లో తాళ్లకుంట తండాకు చెందిన మౌనికతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. వివాహం జరిగిన కొద్ది కాలం వరకు కాపురం సాఫీగానే సాగింది. అనంతరం సురేశ్ మద్యానికి బానిపై భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ విషయంపై సురేశ్ తండ్రి ససావత్ రాజు(49) సర్ది చేప్పేవాడు. దీనిపై సురేశ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలుమార్లు తండ్రి రాజును కొట్టాడు. ఈ క్రమంలో సురేశ్కు ఓ యువతితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలిసి సురేశ్ భార్య తన పుట్టింటికి వెళ్లింది. ఆగస్టులో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించి భార్యను ఇంటికి తీసుకురాగా రాజు.. సురేశ్ను మందలించాడు. దీనిపై కోపోద్రికుడైన సురేశ్ తన వివాహేతర సంబంధానికి తండ్రి, భార్య అడ్డుపడుతున్నారని భావించి వారిని అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. ఇందులో భాగంగా ఈనెల 6న రాత్రి తన భార్య మౌనికతో గొడవ పడుతుండగా రాజు.. సురేశ్కు సర్ది చెప్పాలని యత్నించాడు. దీంతో ఇదే అదునుగా భావించిన సురేశ్.. తండ్రి రాజుపై విచక్షణారహితంగా దాడికి పాల్ప డ్డాడు. అనంతరం చీరను మెడకు చుట్టి చంపి పరారయ్యారు. మృతుడి కుమార్తె స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సోమవారం నిందితుడు సురేశ్ను వర్ధన్నపేట బస్టాండ్ వద్ద అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. కాగా, నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావు, ఎస్సైలు సాయిబాబు, రాజు, సిబ్బందిని సీపీ సన్ప్రీత్ సింగ్ అభినందించారు.● ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు -
ట్యాంకర్ నుంచి ఆయిల్ లీక్
● రోడ్డుపై పల్టీలు కొట్టిన వాహనాలు ● 40 మంది వాహనదారులకు గాయాలు జనగామ: జనగామ పట్టణం శ్రీవిల్లాస్ కాలనీ యూ టర్న్ నుంచి హైదరాబాద్ రోడ్డు అటవీ శాఖ కార్యాలయం వరకు సోమవారం హైవేపై ఓ ట్యాంకర్ నుంచి ఆయిల్ లీకై పడడంతో వాహనదారులు పల్టీకొట్టారు. సుమారు కిలో మీటర్ వరకు రోడ్డుపై ఆయిల్ పడడంతో బైక్లు, చిన్న వాహనాలు జారి పడగా వాహనదారులు గాయాల పాలయ్యారు. వెంటనే అప్రమత్తమైన ట్రాఫిక్ కానిస్టేబుళ్లు అజయ్, ఫయాజ్ రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా అక్కడే ఉండి పర్యవేక్షించారు. కాగా, సుమారు 40 మందికి పైగా గాయాలు కాగా, ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందారు. అధిక వడ్డీకి డబ్బులు ఇచ్చిన మహిళ అరెస్ట్ నర్సంపేట రూరల్ : అధిక వడ్డీకి డబ్బులు ఇ చ్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న న ర్సంపేటకు చెందిన గుజ్జ సుజాతను అరెస్ట్ చే సి కోర్టులో హాజరుపర్చినుట్ల టౌన్ సీఐ రఘుపతిరెడ్డి తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన గుజ్జ సుజాత అధిక వడ్డీకి డబ్బులు అప్పుగా ఇస్తూ వారి వద్ద నుంచి అక్రమంగా భూములు రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తుందన్నారు. సుజాతపై నర్సంపేట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయ్యాయని, ఆమె ఇన్ని రోజులు తప్పించుకుని తిరిగిందన్నారు. ఈ క్రమంలో శుక్రవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ తెలిపారు. తాబేళ్ల కోసం వెళ్లి కుంటలో వ్యక్తి గల్లంతు ● రెస్క్యూ టీం గాలింపు.. లభించని ఆచూకీ కురవి: తాబేళ్ల వేట కో సం కుంట వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన కురవి మండలం తిర్మలాపురం–నల్లెల్ల శివారులోని గణేశ్ కుంటలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లికుదురు మండలం వావిలాలకు చెందిన భూతం వెంకన్న కుటుంబంతో కలిసి కొన్నేళ్ల నుంచి కురవిలోని చెంచు కాలనీ వద్ద జీవిస్తున్నాడు. ఇదే కాలనీకి చెందిన బాజ వెంకన్నతో కలిసి ఆదివారం మధ్యాహ్నం గణేశ్ కుంట వద్దకు తాబేళ్ల కోసం వచ్చాడు. అనంతరం భూతం వెంకన్న ఇంటికి చేరుకోలేదు. ఈ విషయం తెలుసుకున్న వెంకన్న భార్య రమణమ్మ కాలనీలోని పెద్దలకు చెప్పింది. భూతం వెంకన్న తన దుస్తులు, పర్సు, సెల్ఫోన్ తీసి కట్టపై పెట్టి కుంటలోకి దిగినట్లు అతడి వెంట ఉన్న బాజ వెంకన్న సోమవారం కాలనీ పెద్దలకు చెప్పగా వారు గణేశ్ కుంట వద్దకు వచ్చి పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే కురవి పోలీసులు, మానుకోట అగ్నిమాపక శాఖ ఎస్సై మోహన్రావు, సిబ్బంది గోపి, షఫీ, రమేశ్, రహీం ఘటనాస్థలికి చేరుకుని గజ ఈతగాళ్లు, రెస్క్యూ టీం సాయంతో కుంటలో గల్లంతైన వెంకన్న కోసం గాలించారు. సాయంత్రమైనా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో బాజ వెంకన్నను పోలీసులు విచారిస్తున్నారు. కాగా, భూతం వెంకన్న గల్లంతుతో భార్య రమణమ్మతోపాటు కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోద చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గండ్రాతి సతీశ్ తెలిపారు. -
‘ఓరుగల్లు’కు బీజేపీ మొండిచెయ్యి
సాక్షిప్రతినిధి, వరంగల్: భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఉమ్మడి వరంగల్కు మొండిచెయ్యి చూపింది. రాష్ట్ర కమిటీలో ఈసారి ఒక్కరికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. సోమవారం ప్రకటించిన రాష్ట్ర కమిటీలో ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్లకు ఉద్వాసన పలికింది. తెలంగాణ వ్యాప్తంగా కమిటీలో 8 మంది ఉపాధ్యక్షులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, 8 మంది కార్యదర్శులు, ఇద్దరు కోశాధికారులు, ఒక జాయింట్ ట్రెజరరీ, ఒక అధికార ప్రతినిధి కలిపి 22 మందిని ప్రకటించారు. ఈ కమిటీలో ఉమ్మడి జిల్లాలో పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా వ్యవహరిస్తున్న సీనియర్లకు అవకాశం ఇవ్వకపోడంపై పెద్ద చర్చే జరుగుతోంది. మొండిచెయ్యి ఇదే మొదటి సారి.. ప్రతీసారి రాష్ట్ర కమిటీలో ఉమ్మడి వరంగల్కు తగిన ప్రాధాన్యత దక్కేది. సీనియర్లుగా ఉన్న ముగ్గురునుంచి ఐదుగురికి అవకాశం కల్పించిన సందర్భాలే ఉన్నాయి. బండి సంజయ్కుమార్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. ఆ తర్వాత వచ్చిన కిషన్ రెడ్డి కూడా సీనియర్లకు అవకాశం కల్పించారు. 2023, జూలై 4న బండి సంజయ్.. ఆ తర్వాత పగ్గాలు చేపట్టి జి.కిషన్ రెడ్డిలు పూర్తిస్థాయిలో రాష్ట్ర కమిటీ వేశారు. అందులో ఉమ్మడి జిల్లానుంచి డా.గుండె విజయ రామారావు (ఉపాధ్యక్షుడు), గుజ్జుల ప్రేమేందర్రెడ్డి (ప్రధాన కార్యదర్శి), ఏనుగుల రాకేష్ రెడ్డి (అధికార ప్రతినిధి, ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నారు), చందుపట్ల కీర్తిరెడ్డి (అధికార ప్రతినిధి), జాటోతు హుస్సేన్ నాయక్ (ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు), కొండేటి శ్రీధర్ (ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు)లకు అవకాశం కల్పించారు. ఈసారి కూడా ఉమ్మడి వరంగల్కు రాష్ట్ర కమిటీలో సముచిత స్థానం దక్కుతుందని భావించినా.. ఒక్కరికీ కూడా అవకాశం కల్పించకపోవడంపై సీనియర్లు భగ్గుమంటున్నారు. 1980లో పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర కమిటీలో జిల్లాకు ప్రాతినిథ్యం లేకుండా సందర్భం లేదని, సుమారు నాలుగున్నర దశాబ్దాల తర్వాత బహుశ ఇది మొదటిసారని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఓరుగల్లు నుంచి మహామహులు.. బీజేపీ, జనసంఘ్.. పార్టీలకు ఉమ్మడి వరంగల్ పెద్దపీట వేసింది. బీజేపీ ఆవిర్భావం తర్వాత ఈ జిల్లాలో ఉన్నంత బలం, బలగం ఎక్కడా లేదన్న వ్యాఖ్యలు నాయకత్వం చేసిన సందర్భం. ఎంపీగా పోటీ చేసిన చందుపట్ల జంగారెడ్డి ఏకంగా పీవీ నర్సింహరావును ఓడించడం.. ఎమ్మెల్యేగా కూడా ఓసారి పార్టీ బ్యానర్ మీదే గెలిచారు. బీజేపీ నుంచి ఎమ్మెల్యేలుగా టి.రాజేశ్వర్రావు, జయపాల్, వన్నాల శ్రీరాములు, మార్తినేని తదితరులు గెలుపొందారు. పార్టీ అధిష్టానం కూడా ప్రతీసారి సంస్థాగత పదవుల విషయంలో వరంగల్కు పెద్దపీట వేస్తూ వచ్చింది. ఈసారి కూడా రాంచందర్రావు టీమ్లో సీనియర్లకు ఛాన్స్ ఉంటుందని భావిస్తే తీవ్ర నిరాశకు గురి కావాల్సి వచ్చింది. పూర్వ వరంగల్ జిల్లాలో వన్నాల శ్రీరాములు, మాజీ మంత్రి గుండె విజయరామారావు, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, కొండేటి శ్రీధర్, మార్తినేని ధర్మారావు, డా.టి.రాజేశ్వర్రావులు, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, చందుపట్ల కీర్తిరెడ్డి, రావు పద్మలలో ఎవరికీ ఈసారి కమిటీలో చోటు దక్కలేదు. అదేవిధంగా పార్టీలో సీనియర్లుగా ఉన్న ఆరుట్ల దశమంతరెడ్డి, కేవీఎల్ఎన్ రెడ్డి, డా.కాళీప్రసాద్, ఎడ్ల అశోక్రెడ్డి, చాడ శ్రీనివాస్ రెడ్డి, రావుల కిషన్, కోరబోయిన సాంబయ్య, గుజ్జ సత్యనారాయణరావు, గంట రవికుమార్, ముక్కెర తిరుపతిరెడ్డిలతో పాటు పలువురు కూడా రాష్ట్ర కమిటీలో పదవులు ఆశించగా.. అధిష్టానం సీనియర్లను విస్మరించిందన్న చర్చ పార్టీలో జరుగుతోంది. సీనియర్లను పట్టించుకోని పార్టీ అధిష్టానం పార్టీ ఆవిర్భావం తర్వాత ఇదే మొదటిసారి ప్రతీసారి కమిటీలో ముగ్గురు నుంచి ఐదుగురు అధిష్టానం తీరుపై ‘కాషాయం’ నేతల కారాలు, మిరియాలు -
కుర్చీ మీద ప్రేమతోనే బీజేపీ హిందూ నినాదం
హన్మకొండ: కుర్చీ మీద ప్రేమతోనే బీజేపీ హిందూ నినాదం ఎత్తుకుందని, అధికారం కోసం అడ్డదారులు తొక్కుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు దుయ్యబట్టారు. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సంస్కరణ సభ జరిగింది. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ సె క్యులరిజం, సోషలిజం పదాలను రాజ్యాంగం నుంచి తీసివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సీ బీఐ, ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగబద్ధ సంస్థలను వారికి అనుకూలంగా మలుచుకున్నారని, ప్ర శ్నిస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారని తూర్పారబట్టారు. ఉప రాష్ట్రపతిగా పోటీ చేస్తున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పుకు బీజేపీ వక్రభాష్యం పలుకుతుందని విమర్శించారు. కమ్యూనిస్టులంటే ప్రధాని మోదీ, బీజేపీకి భయమన్నారు. భగత్ సింగ్, సుభాశ్చంద్రబోస్, దొడ్డి కొమురయ్య, చివరకు చాకలి ఐలమ్మ, తెలంగాణ సాయుధపోరాటాన్ని బీ జేపీ హైజాక్ చేసిందని మండిపడ్డారు. దేశానికి క మ్యూనిస్టుల అవసరం ఉందని, తామంత ఒకట య్యే సమయం వస్తుందన్నారు. బీఆర్ఎస్పై రాష్ట్రంలో రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయని, బీ జేపీలో విలీనం కానుందని, ఇతర చర్చలు జరుగుతున్నాయన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి ఆశయ సాధనకు పార్టీ మందుకెళ్తుందన్నారు. సభలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు, సీపీఎం, సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శులు జి.ప్రభాకర్ రెడ్డి, కర్రె భిక్షపతి, సీపీఐ వరంగల్ జిల్లా కార్యదర్శి షేక్ బాషుమియా, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు, నాయకులు నేదునూరి జ్యోతి, టి.వెంకట్రాములు, సదాలక్ష్మి, పనాస ప్రసాద్, మేక ల రవి, సిరబోయిన కరుణాకర్, వలీఉల్లాఖాద్రి, టి.విశ్వేశ్వర్ రావు, పల్లె నర్సింహ, తోట భిక్షపతి, మద్దెల ఎల్లేశ్, అరూరి కుమార్ పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు -
కాళోజీ.. ధిక్కారస్వరం
హన్మకొండ కల్చరల్ : పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు.. ధిక్కార స్వారానికి మారుపేరు. ప్రశ్నించేతత్వానికి చిరునామా. ‘ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాతర వేస్తం.. ప్రాంతేతరులు దోపిడీ చేస్తే తన్ని తరుముతాం.. దోస్తుగ ఉండే వారితో మే మూ దోస్తే చేస్తం.. ప్రాణమిస్తం.. ఎంతకు అంత అన్న ధోరణితో చింతమాని బతుకు సాగిస్తం’ అంటూ తన కవితల ద్వారా నిరంత రం పాలకులపై ధిక్కారస్వరం వి నిపించేవారు. తెలంగాణ మాండలికంలో తన రచనల ద్వారా ప్రజలను చైతన్య పరిచేవారు.ఈక్రమంలో మంగళవారం కాళోజీ జయంతి, తెలంగాణ భా షా (మాండలిక) దినోత్సవాన్ని పురస్కరించుకు ని కాళోజీ నారాయణరావుపై‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఏకీభవించనోని పీక నొక్కుటే ఫాసిజం.. శాంతిని అందరూ కోరుకుంటున్నట్లు మాట్లాడుతారు. శాంతిగా మెలగుటమంచిదే. కానీ శాంతి పరిస్థితి కలదా సఖుడా! అన్నది నా ప్రశ్న. ‘శాంతి శాంతట శాంతి గుండె మండిపోతుంటే, కండ కరిగిపోతుంటే బతుకు చితికిపోతుంటే, ఎముక విరిగిపోతుంటే శాంతి శాంతట శాంతి’. హింస హింస అని వూరికే అంటుంటారు. నా దృష్టిలోనూ హింస తప్పు. రాజ్యహింస మరీ తప్పు. ప్రతి హింస తప్పుకాదు. ఏకీభవించనోని పీక నొక్కు సిద్ధాంతం అంటే మరేమిటోకాదు అచ్చమైన ఫాసిజం. నాగొడవలో హిరణ్యకశిపుడు అచ్చమైన ఫాసిస్టు ప్రహ్లదుడు సత్యాగ్రహి, సత్యాగ్రహం వల్ల ఫాసిస్టుల్లో పరివర్తన జరగనప్పుడు నరసింహుల్లా ప్రతిహింస తప్పదు. అన్యాయాన్నెదిరించిన వాడే ఆరాధ్యుడు.. మ్రోగుతున్న ప్రజల వాణి/ ఆగి మూగపోతున్నద?/ దోపిడీ పెత్తన్దారికి / తోడా? ఆ చావు కూడా/ ఎదిరించిన ప్రతీ వ్యక్తికి / ఈ వ్యవస్థలో అవస్థ/ రాజీపడు ‘మేతావి’/ పాజీలకు మజామజా.. అన్యాయాన్నెదిరించిన/ వాడు నాకు ఆరాధ్యుడు/ పేరుకు బతికున్న ప్రభుత్వం/ పేరుకు చస్తున్న ‘రాజు’ / అన్నాయాన్నేదిరిస్తే నాగొడవకు సంతృప్తి / అన్యాయం అంతరిస్తే/ నాగొడవకు ముక్తిప్రాప్తి. ప్రశ్నించడం మానొద్దు.. ప్రశ్నలడగడంలో నేనేప్పుడు ప్రథముడినే. 1946లో నైజాం రాజును అడిగా నేను అడగడం మాత్రం మానలేదు. నిజమైన కవి అన్నవాడు జనం కోసం న్యాయం అడుగుతాడు. ఎవరి పనుల్లో వారు మునిగిపోగుడదు. ఎవరి బాగు వాళ్లు చూసుకుంటూ కూర్చోకూడదు. నిలదీసి ప్రశ్నించినవారిని ప్రభుత్వం బందిస్తుంది. వాళ్లమీద కక్షగడుతుంది. అయినా ప్రభుత్వం చూపించే ఎరలకు లొంగిపోకూడదు. ఆలోచించాలి.. అడగాలి. ప్రశ్నలు అందరూ అడగాలి. చైతన్యం కలిగించాలి. తిరగబడాలి. ఎదురించాలి. రైతుబాధలు.. రాణివాసములోన రంజిల్లు రాజా/ రైతు బాధలు తీర్చి రక్షించ లేవా/ పట్టణపు సొగసుకై పాటుపడురాజా/ పల్లెకందము గూర్చు బాధ్యత తెలియదా?/ ప్రజలను హింసించు ప్రభువు మాకేల? / వధియించి భక్షించ వనరాజు లేడా?/ సామాన్య ప్రజలకు చైతన్య మొదవ/ చతురంగ బలముండ జంకేల రాజా? జాగ్రత్త.. మనసు సంతలో బేరమాడబోకు/ బతుకు పెన్నిధిని గవ్వల కమ్మబోకు నిన్ను మించినదేమున్నది కోరుకొనగ/ ఆశనిరాశల వసతి మనసు కాగూడదెప్పుడు/ కలము గారడీ చేయకు కవితనెపుడు. నడత – నాణ్యం.. దొంగవలె అందాల తొంగిచూచుట తప్పు/ ఆగుపడిన అందాన్ని అరయకుండుట తప్పు/ కనపడ్డ ప్ర తీదాని కానపడుటయు తప్పు/ భంగపడి వాంఛల కు లొంగిపోవుట తప్పు/ కినుకతో మదిలోన కృంగిపోవుట తప్పు/ పైకి ప్రహ్లదువలె పలుకుచుండుట తప్పు/ సహజ ప్రవృత్తులను చంపివేయట తప్పు/ సహజమని వృత్తుల చంకచేరుట తప్పు.. స్వేచ్ఛ.. బాధ్యత ఎరుగని స్వేచ్ఛ బానిసత్వ లక్షణము బాధ్యత ఎరిగిన స్వేచ్ఛ స్వాతంత్రపు రక్షణము వ్యక్తిత్వం.. ‘ప్రతివారికి వ్యక్తిత్వం ఉంటేనే పౌరత్వం వ్యక్తిత్వం భద్రంగా ఉంటేనే వ్యక్తి బతుకు వ్యక్తిత్వం భద్రంగా ఉంటేనే జాతి బతుకు’ కాళోజీ నారాయణరావు (ఫైల్)– కాళోజీ జయంతి సందర్భంగా పాలకుర్తికి చెందిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ శంకరమచి శ్యాంప్రసాద్. (9989148305) –పాలకుర్తి టౌన్ కవితలతో ప్రజల్లో నిత్యం చైతన్యం నింపిన స్ఫూర్తి ప్రదాత అన్యాయాలను ఎదురిస్తూ ప్రజాస్వామ్య విలువలు బోధించిన శక్తి.. నేడు కాళోజీ జయంతి, తెలంగాణ భాషా (మాండలిక) దినోత్సవంకాళోజీ జన్మదినమైన సెప్టెంబర్ 9వ తేదీని తెలంగాణ భాషా (మాండలిక) దినోత్సవంగా జరుపుకోవాలని 2014 సెప్టెంబర్ 9న వరంగల్లోని నిట్ కళాశాలలో జరిగిన కాళోజీ నారాయణరావు 100వ జయంతి సభలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మానవత్వ విలువలు ప్రబోధించిన శక్తి.. తన భావాలకే కాదు శరీరానికి మరణం లేదని నిరూపించిన వ్యక్తి పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు. 1914 సెప్టెంబర్ 9వ తేదీన రంగారావు, రమబాయి దంపతులకు కాళోజీ జన్మించారు. పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ. మడికొండలో ప్రాథమిక విద్య, హనుమకొండ, హైదరాబాద్లలో ఉన్నతవిద్యనభ్యసించారు. కాళోజీ పదిహేనేళ్ల వయసు నుంచే రాజకీయ ఉద్యమాలు, కవిత, రచనా వ్యాసంగాలలో మునిగిపోయారు. ఆర్య సమాజం, ఆంధ్రమహాసభ , నిజాంస్టేట్ కాంగ్రెస్లో సభ్యుడిగా ఉంటూ నైజాం వ్యతిరేకపోరాటంలో పనిచేశారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత 1958 నుంచి 1960 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా , ఆంధ్రసారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీల్లో సభ్యుడిగా, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, కాళోజీ సతీమణి రుక్మిణి కాళోజీ ఉద్యమాలు, అరెస్ట్ల నేపథ్యంలో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకున్నారు. కాళోజీ అభిప్రాయాలు ... -
గోదావరి మీదుగా నాటు పడవలో ప్రయాణం..
కాళేశ్వరం: జీవనోపాధి కోసం చేపలు పట్టేందుకు నాటుపడవ కొనుగోలు చేసిన ఇద్దరు మత్స్యకారులు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అధికం అవుతాయని భావించారు. అదే గోదావరి మీదుగా తమకు తెలిసిన విద్యనే కదా అని మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచకు నడుపుతూ ప్రయాణం సాగించారు. దారి మద్యలో అన్నారం బ్యారేజీ వద్ద 11 పియర్కు తట్టుకొని ప్రవాహంలో పడవ బోల్తాపడడంతో ఒకరు గల్లంతు కాగా, మరొకరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన జయశంకర్భూపాలపల్లి–మంచిర్యాల జిల్లాల మధ్యలో గోదావరిపై నిర్మించిన అన్నారం బ్యారేజీలో సోమవారం జరిగింది. చెన్నూర్ సీఐ దేవేందర్ తెలిపివ వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ సమీపంలో మండలపురానికి చెందిన ఇద్దరు మత్స్యకారులు గడ్డం వెంకటేష్(46), తూముకూరి కృష్ణస్వామిలు మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం పొక్కూర్లో చొంక సంపత్ వద్ద నాటు పడవ కొనుగోలు చేశారు. అక్కడ ఓ టాటాఏస్ను కిరాయి నిమిత్తం అడుగగా అధికంగా చెప్పడంతో..చేసేదేమి లేక అదే గోదావరిపై నాటుపడవను నడుపుకుంటూ అన్నారం బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. సుందరశాలౖవైపు బ్యారేజీలోని 11వ పియర్ వద్ద ప్రవాహం అధికంగా కొనసాగుతుండడంతో అందులోంచి బయటకు దాటే క్రమంలో పడవ బోల్తాపడి వెంకటేష్ గల్లంతయ్యాడు. కృష్ణస్వామి ఈతకొడుతు దరికి చేరి ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో గల్లంతైన వెంకటేష్ కోసం పోలీసులు, జాలర్లు, కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ వివరించారు. గల్లంతైన వ్యక్తి అవసరాల కోసమే నాటుపడవ కొనుగోలు చేశారు. అతనికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. కాగా, అన్నారం బ్యారేజీ పియర్ వద్ద నాటుపడవ బోల్తాపడ్డ విషయం జిల్లా వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. నిఘా లేకనే.. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బ్యారేజీలపై ఇరిగేషన్శాఖ నిఘా, పర్యవేక్షణ లోపించింది. అన్నారం బ్యారేజీ గుండా గోదావరి మీదుగా గేట్ల మధ్యనుంచి నాటు పడవ సాయంతో బయటకు దాటేందుకు సాహసం చేసి ఒకరు గల్లంతయ్యే ఘటన చోటు చేసుకున్నా పట్టింపులేనితనం కొట్టచ్చినట్లు కనిపిస్తుందని ఆరోపణలు వెల్లువెత్తాయి. సోమవారం సుమారుగా 52వేల క్యూసెక్కుల ప్రవాహం తరలి దిగువకు కాళేశ్వరం వైపునకు వెళ్తోంది. అన్నారం బ్యారేజీ 11వ గేటు వద్ద పియర్ను తాకి పడవ బోల్తా ఒకరి గల్లంతు..మరొకరు సురక్షితంగా బయటకు.. పడవ కొనుగోలు చేసి ప్రయాణం చేసిన ఇద్దరు మత్స్యకారులు ఇద్దరు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ వాసులు గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్న జాలర్లు, పోలీసులు -
రెనోవా బన్ను ఆస్పత్రి ప్రారంభం
● సామాన్యులకు అందుబాటులో అత్యాధునిక క్యాన్సర్ చికిత్స ఎంజీఎం : ప్రజలకు ప్రపంచ స్థాయి నాణ్యతతో క్యాన్సర్ చికిత్స అందించేందుకు రెనోవా బన్ను ఆస్పత్రిని ప్రారంబించినట్లు రెనోవా గ్రూపు ఆస్పత్రి ఫౌండర్ సీఈఓ శ్రీధర్ పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ములుగు రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ ఆస్పత్రిని సోమవారం ఆరోగ్యవర్సిటీ వీసీ నందకుమార్రెడ్డి, రిజిస్ట్రార్ నాగార్జునారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ పెద్దిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్ ప్రాంతంలో తొలి సమగ్ర క్యాన్సర్ ఆస్పత్రిగా రెనోవా బన్ను ఆస్పత్రి నిలుస్తుందని తెలిపారు. ఈ ఆస్పత్రిలో అత్యాధునిక సదుపాయాలైన దాదాపు రూ. 20 కోట్ల విలువైన హెల్కాయిన్ ఇమేజ్ గైడెడ్ రేడియేషన్, దాదాపు రూ.6 కోట్ల విలువైన పెట్ సిటీ పరికరాలతో అంతర్జాతీయ స్థాయి చికిత్స సదుపాయాలు వరంగల్ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ప్రభాకర్రావు, ఐఎంఏ ప్రతినిధులు పాల్గొన్నారు. పలు రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ కొనసాగింపు కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్, వరంగల్ రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాణించే పలు రైళ్లకు ప్రయాణికుల సౌకర్యార్థం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన తాత్కాలిక హాల్టింగ్లను కొనసాగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ సోమవారం తెలిపారు. హాల్టింగ్ స్టేషన్లు ఇవే.. దానాపూర్–సికింద్రాబాద్ (12792) దానాపూర్ ఎక్స్ప్రెస్కు జమ్మికుంట, నర్సాపూర్–నాగర్సోల్ (12787) ఎక్స్ప్రెస్కు మహబూబాబాద్, నాగర్సోల్–నర్సాపూర్ (12788) ఎక్స్ప్రెస్కు మహబూబాబాద్, పూణె–కాజీపేట (22151) ఎక్స్ప్రెస్కు మంచిర్యాల, కాజీపేట–పూణె (22152) ఎక్స్ప్రెస్కు మంచిర్యాల రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు సీపీఆర్వో తెలిపారు. -
ఉద్యమ ధ్వజం..
అక్షరాలను అగ్ని కణాలుగా విరజిమ్మావు.. అఖిలాండంలోని అనాథలగాథలను వినిపించావు అణగదొక్క గర్జించావు అధికారం ముసుగులో కాళికవై కదిలావు ప్రశ్నించేతత్వానికి ప్రహ్లాదుడే గురువని ప్రవచించావు ఉప్పెనలా ఎగిసిపడే ఉద్యమాలకెన్నిటికో ఊపిరిగా నిలిచావు ప్రజల భాషలో ప్రజల గొడవకు పట్టం కట్టావు నిర్మోహ్మటం, నిజాయతీలనే త్రికరణశుద్ధిగా పాటించావు సామాన్యుడిగా ఉంటూనే సాహసంతో సత్యాగ్రహిగా బతికావు తెలంగాణ పోరు తేరుపై ‘ఉద్యమ ధ్వజం’గా మిగిలావు -
కొనసాగుతున్న యూరియా కష్టాలు
యూరియా పంపిణీని పరిశీలించిన ఎస్పీ మహబూబాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని ప్రాఽథమిక వ్యవసాయ సహకారం సంఘం, శనిగపురం గ్రామంలోని పీఏసీఎస్ విక్రయ కేంద్రం వద్ద ఆదివారం తెల్లవారుజాము నుంచే వందలాది మంది పురుష, మహిళా రైతులు బారులుదీరారు. విషయం తెలుసుకున్న ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ శనిగపురం పాతజీపీ కార్యాలయం వద్దకు చేరుకుని యూరియా పంపిణీ చేయిస్తామని, సంయమనం పాటించాలని రైతులకు నచ్చచెప్పి వరుస క్రమంలో నిలబెట్టించారు. ఈ క్రమంలో పాతజీపీ కార్యాలయం వద్ద రైతుల పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులు తీసుకుని ఏఓ తిరుపతిరెడ్డి, ఏఈఓ బాలాజీ టోకెన్లు ఇవ్వగా డీఎస్పీ తిరుపతిరావు, ఏడీఏ శ్రీనివాసరావు పీఏసీఎస్ విక్రయ కేంద్రం వద్ద యూరియా బస్తాలను పంపిణీ చేయించారు. సీసీఎస్ సీఐ హతీరాం, ఎస్సైలు దీపిక, మౌనిక, సూరయ్య, పోలీసు, పీఆర్, రెవెన్యూ సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు. మహబూబాబాద్ పీఏసీఎస్ దగ్గర టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సైలు అశోక్, అలీంహుస్సేన్, ఏఆర్, సివిల్ పోలీసు, పీఆర్, రెవెన్యూ సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు. మహబూబాబాద్ పీఏసీఎస్ వద్ద 444 బస్తాలు, శనిగపురం పీఏసీఎస్ విక్రయ కేంద్రం వద్ద 666 బస్తాలు, ఈదులపూసపల్లి గ్రామంలో 222 బస్తాలు, సికింద్రాబాద్ తండా గ్రామంలో 222 బస్తాల యూరియా రైతులకు పంపిణీ చేశారు. అయితే మహబూబాబాద్, శనిగపురం పీఏసీఎస్ విక్రయ కేంద్రాల వద్ద వందల సంఖ్యలో రైతులు మిగిలిపోగా వారి పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులు తీసుకుని వాటిపై సీరియల్ నంబర్లు రాసి, స్టాంపులు వేసి ఇచ్చారు. యూరియా స్టాకురాగానే రైతులకు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. మహబూబాబాద్ పీఏసీఎస్ వద్ద ఓ మహిళా రైతు సొసైటీ షట్టర్లపైకి రాళ్లు విసిరేందుకు ప్రయత్నం చేయడంతో పాటు యూరియా కోసం ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని తిడుతూ శాపనార్థాలు పెట్టగా పోలీసులు ఆమెను సముదాయించి పంపించారు. యూరియా పంపిణీని పరిశీలించిన ఎస్పీకురవి: మండల కేంద్రంతో పాటు నేరడ గ్రామంలో ఆదివారం యూరియా పంపిణీ కార్యక్రమాన్ని ఎస్పీ సుధీర్రాంనాఽథ్ కేకన్ పరిశీలించారు. కురవిలోని సొసైటీ కార్యాలయంలో అధిక సంఖ్యలో రైతులు యూరియా కోసం బారులుదీరారు. ఎస్పీ సొసైటీకి చేరుకొని క్యూలో ఉన్న రైతుల పరిస్థితిని పరిశీలించారు. ఓ వృద్ధురాలు యూరియా కోసం రావడంతో ఆమెను తాడు పక్క నుంచి బయటకు వచ్చేలా చూశారు. ఓ రైతు ఆధార్కార్డు జిరాక్స్లు తీసుకుని వస్తుండగా పరిశీలించారు. ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. నేరడలోని యూరియా పంపిణీ కేంద్రానికి వెళ్లి పరిశీలించారు. పోలీసు బందోబస్తు మధ్య నెల్లికుదురు: మండలంలోని ఎర్రబెల్లిగూడెంలో, శ్రీరామగిరి సొసైటీల ఆధ్వర్యంలో ఆదివారం పోలీసు బందోబస్తు మధ్య 668 యూరియా బస్తాలను రైతులకు పంపిణీ నిర్వహించారు. ఎర్రబెల్లిగూడెం సొసైటీ ఆధ్వర్యంలో 444 యూరియా బస్తాల పంపిణీని ఎస్పీ సుధీర్రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్ అనిల్కుమార్ పర్యవేక్షించారు. అలాగే శ్రీరామగిరి గ్రామ సొసైటీలో 224 యూ రియా బస్తాలను పోలీసు బందోబస్తు మధ్య రైతులకు అందజేశారు. కార్యక్రమంలో డీఏఓ వియజనిర్మల, మండల ప్రత్యేక అధికారి జినుగు మరియన్న, తహసీల్దార్ చందా నరేష్, సీఐ గణేష్, ఎస్సైలు చిర్ర రమేష్ బాబు, క్రాంతికిరణ్, ఏఓ షేక్ యాస్మిన్ పాల్గొన్నారు. -
డబుల్.. ఎన్నాళ్లీ ట్రబుల్!
సాక్షిప్రతినిధి, వరంగల్:● హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో 790 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 520 ఇళ్లు నిర్మించారు. మర్రిపల్లిగూడెం, గూడూరులో 50 చొప్పున 100 ఇళ్లు, కమలాపూర్లో 320 నిర్మించారు. అయితే రోడ్లు, డ్రెయినేజీలు, విద్యుత్, వాటర్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కొద్ది రోజులు కాలయాపన జరిగింది. ఇప్పటికీ లబ్ధిదారులను ఎంపిక చేసి పంపిణీ చేయకపోవడంతో ఇళ్లు నిరూపయోగంగానే ఉన్నాయి. ● మహబూబాబాద్ జిల్లాలో 5,567 ఇళ్ల నిర్మాణం చేపట్టగా.. 2024 వరకు 2,503 మాత్రమే పూర్తయ్యాయి. అందులో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి 1,256 మందికి పంపిణీ చేశారు. ఇంకా 3,064 ఇళ్లు వివిధ స్థాయిల్లో ఉండగా.. పూర్తయిన 2,503 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఇంకా 1,247 లబ్ధిదారులకు అందజేయడంలో కాలయాపన జరుగుతోంది. .. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పథకానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మోక్షం కలగడం లేదు. నిర్మాణాలు పూర్తయినా ఇళ్ల పంపిణీపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఫలితంగా మూడేళ్ల కిందట పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీకి నోచుకోక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. వివిధ స్థాయిల్లో నిలిచిపోయిన నిర్మాణాల్లో గడ్డి, ముళ్లపొదలు ఏర్పడ్డాయి. పంపిణీ చేసిన వాటిలో సరైన మౌలిక సదుపాయాలు లేక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవకాశం రాక అర్హులైన వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటిౖకైనా అసంపూర్తి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, పూర్తయిన వాటిని పంపిణీ చేయాలన్న డిమాండ్ వస్తోంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవకాశం రాని వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అర్హులు కోరుతున్నారు. నెరవేరని సొంతింటి కల.. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల సొంతింటికలను సాకారం చేసే లక్ష్యంతో, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల పథకాన్ని అమలు చేసింది. ఉమ్మడి వరంగల్లో ఈ పథకం కింద రెండు విడతల్లో 26,284 ఇళ్లు మంజూరు చేసింది. ఇందులో అధికారులు చెబుతున్న ప్రకారం సుమారు రూ.860 కోట్ల వరకు ఖర్చు చేసి 10,939 (41.62 శాతం) ఇళ్లు పూర్తి చేశారు. అందులో నుంచి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి 4,874 (44.56 శాతం) రెండు పడకల గదుల ఇళ్లను పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా మంజూరైన మొత్తం 26,284లలో 4100 వరకు వివిధ కారణాలతో నిర్మాణాలు మొదలు పెట్టలేదు. నిర్మాణాలు ప్రారంభించిన 22,184 ఇళ్లలో 10,939 పూర్తయ్యాయి. 11,245 ఇళ్లు వివిధ స్థాయిల్లో నిర్మాణ దశలోనే నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా పలు చోట్ల కొన్నేళ్ల క్రితం చేపట్టిన ఈ ఏళ్ల నిర్మాణాలు నేటికీ పూర్తి కాలేదు. పూర్తయిన 10,939 ఇళ్లలో 4,874 ఇళ్లు మాత్రమే పంపిణీ చేశారు. 6,065 ఇళ్ల మంజూరులో జాప్యం జరుగుతుండడంతో ఉండడానికి గూడులేక వేలాది మంది నిరుపేదలు ఏళ్లపాటు గుడిసెల్లో జీవిస్తూ పక్కా ఇళ్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లా మంజూరు పూర్తి పంపిణీ హనుమకొండ 4,326 2,143 1,200 వరంగల్ 6,350 2,350 1,250 జేఎస్ భూపాలపల్లి 3,882 1,615 710 జనగామ 4,400 1,600 750 ములుగు 1,800 950 300 మంజూరైన ఇళ్లలో పూర్తయినవి 41.62 శాతమే పూర్తయిన ఇళ్లలో పంపిణీ చేసింది 44.56 శాతం చాలాచోట్ల శిథిలావస్థకు గృహాలు వివిధ స్థాయిల్లో నిలిచినవి 11,245.. ఆ నిర్మాణాలపై నీలినీడలు నెరవేరని పేదోళ్ల సొంతింటి కల.. ‘ఇందిరమ్మ’పై అర్హుల ఆశలు -
దగ్గు.. జ్వరం
సోమవారం శ్రీ 8 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025న్యూస్రీల్సర్వే వివరాలు.. జ్వరం విరేచనాలు దగ్గు, జలుబురాపిడ్11,988293 7,311మెడికల్ క్యాంపు 1,481 62 808హాస్టల్ క్యాంపు 186 13 90మొత్తం13,655 368 8,209సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. గతం కంటే ఎక్కువగా జ్వరపీడితులు ఉన్నట్లు ఇటీవల వైద్యారోగ్యశాఖ నిర్వహించిన సర్వేల్లో తేలింది. పారిశుద్ధ్యం, దోమలు, తాగునీటి కలుషితం, తీసుకునే ఆహారం, వాతావరణంలో ఆకస్మికంగా వచ్చిన మార్పులే ఇందుకు కారణమని వైద్యులు అంటున్నారు. అయితే అధికారుల మధ్య సమన్వయ లోపంతో సీజనల్ వ్యాధుల కట్టడిలో విఫలమైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో జిల్లాలో జ్వర పీడితుల సంఖ్య పెరుగుతుందనే విమర్శలు వస్తున్నాయి. వైద్యారోగ్యశాఖ సర్వే.. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. గ్రామస్థాయిలో ఆశ, ఏఎన్ఎంల సహకారంతో ఇటీవల ఫీవర్ సర్వేలు నిర్వహించింది. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో మొత్తం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో రాపి డ్ సర్వే చేశారు. ఇందులో 30,436 మందిని పరీక్షించారు. ఇందులో 11,988మంది జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. 293 విరేచనాల సమస్య, 7,311 మంది దగ్గు, జలుబు(శ్వాస కోశ సమస్య) ఉంది. అదేవిధంగా 994 గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించారు. 44,192 మందిని పరీక్షించారు. వీరిలో 1,481 మందికి జ్వరం, 62 మంది విరేచనాలు, 808మంది దగ్గు, జలుబుతో బాధ పడుతున్నట్లు గుర్తించారు. అలాగే ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీలు, హాస్టల్స్లో మొత్తం 133 క్యాంపులు నిర్వహించి 6,007 మంది విద్యార్థులను పరీక్షించారు. ఇందులో 186 మంది జ్వరం, 13 మంది విరేచనాలు, 90 మంది దగ్గు, జలుబుతో బాధపడుతున్నట్లు గుర్తించారు. జ్వరపీడితులు.. గత మూడు నెలలుగా జిల్లాలో నమోదైన కేసులను పరిశీలిస్తే అత్యధికంగా దగ్గు, జ్వరం, ఒంటినొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారే అధికంగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది. వైద్యారోగ్యశాఖ అధికారులు సేకరించిన వివరాల ప్రకారం 13,655 మంది జ్వర పీడితులు, 8,209 మంది దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. అలాగే 231 మంది డెంగీ జ్వరం బారిన పడిన వారు ఉన్నట్లు గుర్తించారు. అయితే ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు, పరీక్షలు చేయించుకున్నవారు, ఇతర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకునే వారి సంఖ్య రెట్టింపుగానే ఉండే అవకాశం ఉంది. దీంతో జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు, ప్రైవేట్ ఆస్పత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. డెంగీ కేసులు : 231 మలేరియా : 04రోజురోజుకూ పెరుగుతున్న జ్వరపీడితులు 13,655 మందికి జ్వరం.. 8,209 మందికి శ్వాస సంబంధ సమస్య కిటకిటలాడుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులుపారిశుద్ధ్య సమస్య ఇటీవల కురిసిన వర్షాలతో మురుగునీరు చేరడం, గిరిజన పల్లెలు, గూడేలు, తండాల్లో అపరిశుభ్ర వాతావరణం, తాగునీటి కలుషితమైంది. కాగా పంచాయతీ, వైద్యారోగ్యశాఖ, ఆర్డబ్ల్యూఎస్శాఖలు సమన్వయంతో పనిచేయాలి. పంచాయతీ సిబ్బంది తమ వద్ద ఉన్న ట్రాక్టర్ల ద్వారా పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. దోమల నివారణ కోసం ఫాగింగ్, కిరోసిన్ చల్లడం, గంబూసియా చేపలు వదలడం, మురికి కాల్వలను శుభ్రం చేసేందుకు నిధుల లేమితో ముందుకు సాగడం లేదు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జ్వరాలు వచ్చిన వారికి మందులు ఇచ్చి వెళ్లిపోతున్నారు. వీరితో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కలిసి రాకపోవడం, చిన్న చిన్న లీకేజీలను సరిచేసేందుకు రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. -
తూతూ మంత్రంగా తనిఖీలు
మహబూబాబాద్: వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా వస్తువులు విక్రయిస్తున్నారు. నాణ్యత లేని ఆహారపదార్థాలు ఇతర వస్తువులు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. తూ కంలో కూడా మోసాలకు పాల్పడుతూ సొమ్ము చే సుకుంటున్నారు. కొంతమంది కూరగాయల వ్యా పారులు, చిరువ్యాపారులు బాట్లకు బదులుగా రా ళ్లు వాడుతున్నారు. దీంతో అన్ని రకాలుగా నష్టపోవాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. అధికారులు తనిఖీలు నిర్వహించకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా రు. జిల్లాలో 1000కిపైగా షాపులు.. జిల్లాలో 1000కిపైగా కిరాణా షాపులు, 19 సూపర్ మార్కెట్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. సూపర్ మార్కెట్లో తప్పని సరిగా ఎలక్ట్రానిక్ కాంటాలు వాడాలి. కిరాణా షాపుల్లో కూడా తప్పనిసరి గా వాడాలి. అయితే కొంత మినహాయింపుతో పండ్లు, కూరగాయలు, ఇతర చిరువ్యాపారులు మా న్యువల్ కాంటాలు వాడుతున్నారు. ఎలక్ట్రానిక్ కాంటాలు సంవత్సరానికి ఒకసారి, మాన్యువల్ కాంటాలు రెండేళ్లకు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటు ంది. అధికారులు కూడా తనిఖీ చేసి తేడా ఉంటే కేసులు నమోదు చేయాలి. తనిఖీలు లేకపోవడంతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోతున్నా రు. బేకరీ షాపుల్లో మరీ దారుణం.. తూనికలు కొలతల అధికారులతో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా బేకరీలను తనిఖీ చేయాలి. అయితే తనిఖీలు లేకపోవడంతో కాలంచెల్లిన వస్తువులు విక్రయిస్తున్నారు. దీంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఇటీవల తనిఖీల్లో కాలం చెల్లిన వస్తువులు ఉండగా కేసు నమోదు చేశారు. పెట్రోలు బంక్ల్లో.. జిల్లా కేంద్రం తొర్రూరు రోడ్డులోని ఓ పెట్రోల్ బంక్, నర్సంపేట రోడ్డులోని ఓ పెట్రోలు బంక్లో తూకంలో తేడా వచ్చిందని, కల్తీ పెట్రోలు విక్రయిస్తున్నారని వాహనదారులు ఆందోళన చేశారు. ఆ బంక్ల్లో అధికారులు శాంపిల్ తీసుకెళ్లారే తప్ప చర్యలు చేపట్టలేదు. ఇలాంటి ఘటనలు జిల్లాలో చాలా జరిగాయి. నేటికీ నిబంధనలకు విరుద్ధంగా బంక్ల నిర్వహణ చేపడుతున్నారు. కొన్నింటిలో మరుగుదొడ్లు లేవు.. ఇతర సౌకర్యాలు లేకుండానే నిర్వహిస్తున్నారు. మూడు జిల్లాలకు ఒక్కరే అధికారి.. జిల్లా తూనికలు కొలతల అధికారిగా పని చేసిన విజయ్కుమార్ గత నెల 8న పదోన్నతిపై ఆది లాబాద్ జిల్లాకు బదిలీపై వెళ్లారు. కాగా భూపాలపల్లి జిల్లా తూనికల కొలతల అధికారి శ్రీలతకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ములుగు జిల్లాకు కూడా ఆమె ఇన్చార్జ్ కావడంతో తనిఖీలు చేపట్టడం లేదు. దీంతో వ్యాపారుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. ఖాళీగా కుర్చీలు.. కలెక్టరేట్లో ఒక గదిని తూనికల కొలతల అధికారి కార్యాలయానికి కేటాయించారు. ఆగదిలోనే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ కొనసాగుతోంది. తూనికలు కొలతల అధికారితో పాటు టెక్నికల్ అసిస్టెంట్ మాత్రమే ఉన్నారు. అటెండర్ ఉండగా వరంగల్కు డిప్యుటేషన్పై పంపారు. దీంతో కార్యాలయంలో ఖాళీ కుర్చీలు మాత్రమే దర్శనం ఇస్తున్నాయి. సమాధానం చెప్పేనాథుడే కరువయ్యాడు. మూడు జిల్లాలకు ఒక్కరే తూనికలు, కొలతల అఽధికారి కార్యాలయంలో ఖాళీగా కుర్చీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వ్యాపారులు నాసిరకం వస్తువుల విక్రయాలు నష్టపోతున్న వినియోగదారులు -
ముగిసిన దస్లక్షణ్ పర్వ్ వేడుకలు
డోర్నకల్: జైన మతస్తులు పది రోజులుగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న దస్లక్షణ్ పర్వ్ వేడుకలు ఆదివారం ముగిశాయి. స్థానిక ఆదినాథ్ భగవాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పట్టణంలో ఆదినాథ్ భగవాన్ విగ్రహంతో శోభాయాత్ర నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు ఆచరించిన నరేశ్జైన్ను ప్రత్యేక వాహనంలో ఊరేగించి ఘనంగా సన్మానించారు. శోభాయాత్రలో జైనమతానికి చెందిన సీ్త్ర, పురుషులు రాజస్థానీ సంప్రదాయ దుస్తులు ధరించి ఆడుతూ, పాడుతూ ఆనందంగా గడిపారు. వీరభద్రస్వామి ఆలయం మూసివేతకురవి: మండల కేంద్రంలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయాన్ని ఆలయ పూజారులు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు మూసివేశారు. చంద్రగ్రహణం నేపథ్యంలో ఆలయంలో పూజాధికాలు పూర్తి చేసిన తర్వాత మధ్యాహ్నం ద్వారబంధనం చేశారు. తిరిగి సోమవారం తెల్లవారుజామున 5గంటలకు ఆలయ తలుపులు తెరిచి సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తారని ఆలయ ఈఓ సత్యనారాయణ, చైర్మన్ కొర్ను రవీందర్రెడ్డి తెలిపారు. ఉదయం 6గంటల నుంచి స్వామివారి దర్శనం కల్పిస్తామని తెలిపారు. డీపీఓ పర్యవేక్షణగార్ల: కలెక్టర్ ఆదేశాల మేరకు గార్ల మండలంలో కొనసాగుతున్న యూరియా పంపిణీ కేంద్రాలను డీపీఓ హరిప్రసాద్ ఆదివారం పర్యవేక్షించారు. గార్ల పీఏసీఎస్ కార్యాలయంలో కొనసాగుతున్న యూరియా పంపిణీ కార్యక్రమాన్ని డీపీఓతో పాటు తహసీల్దార్ శారద, ఎంపీడీఓ మంగమ్మ పరిశీలించారు. డీపీఓ మాట్లాడు తూ.. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని, జిల్లా అధికార యంత్రాంగం ప్రతీ రైతుకు యూరియా అందించడం కోసం ప్రత్యేక ప్రణాళిక, కార్యాచరణ ద్వారా ముందుకు సాగుతుందన్నారు. కార్యక్రమంలో సీఈఓ ఎస్ వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి అజ్మీరా కిషన్, సిబ్బంది పాల్గొన్నారు. కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు తొర్రూరు: రైతులకు సరఫరా చేస్తున్న యూ రియాలో కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని డీఏఓ విజయ నిర్మల, తొ ర్రూరు ఆర్డీఓ గణేష్ హెచ్చరించారు.ఆదివారం డివి జన్ కేంద్రంలోని ఎరువుల షాపులను ఆకస్మికంగా తనిఖీలు చేసి, ఎరువుల బస్తాలు, పురుగుల మందుల స్టాక్, బిల్ బుక్స్ల వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రతి యూరియా బస్తాతోపాటు ఇతర ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. ఏఓ రాంనర్సయ్య, డీటీ నర్సయ్య, ఆర్ఐ నజీముద్దీన్ పాల్గొన్నారు. చిన్నగూడూరు: జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత లేదని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల అన్నారు. ఆదివారం మండలంలోని ఉగ్గంపల్లి, జయ్యారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన యూరియా పంపిణీ కేంద్రాలను మండల అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా విడతల వారీగా ఎప్పటికప్పుడు యూరియా బస్తాలను తెప్పిస్తున్నామని అన్నారు. యూరి యాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా వాడాలని సూచించారు. నానో యూరియాతో మొక్క ఎదుగులతో పాటు అనేక లాభాలు ఉంటాయని పేర్కొన్నారు. మండలంలో యూరి యా నిల్వల గురించి ఏఓ అజ్మీరా భాస్కర్ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏఈఓలు సరిత, శిరీష, పీఏసీఎస్ సిబ్బంది, రైతులు ఉన్నారు. కల్వల సెంటర్ తనిఖీ కేసముద్రం: కేసముద్రం పీఏసీఎస్ పరిధిలోని కల్వల గ్రామ సెంటర్ను డీఏఓ విజయనిర్మల ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు యూరియా పంపిణీతోపాటు, సెంటర్లో ఉన్న యూరియా నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్స్ను పరిశీలించారు. ఏడీఏ అజ్మీరా శ్రీనివాసరావు, ఎస్సై మురళీధర్రాజు, ఏవో వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
హాస్టల్, మెస్ కోసం రెన్యువల్ చేసుకోవాలి
కేయూ క్యాంపస్: కేయూలో ఈ విద్యాసంవత్సరం హాస్టల్, మెస్ కోసం విద్యార్థులు రెన్యువల్ చేసుకునేందుకు ఈ నెల 9వ తేదీ వరకు మాత్రమే చివరి గడువు ఉంది. రెన్యువల్ చేసుకునేందుకు హాస్టళ్ల డైరెక్టర్ ఎల్పీ రాజ్కుమార్ ఇచ్చిన గడువు ముగిసింది. 79 మంది మాత్రమే విద్యార్థులు రెన్యువల్ చేసుకున్నారు. ఫీజు తగ్గించాలని విద్యార్థులు ఆందోళన చేయడంతో అధికారులు రూ.వెయ్యి నుంచి రూ.500 తగ్గించారు. దీంతో రెన్యువల్ చేసుకున్న రసీదు, ఇప్పటివరకు వినియోగిస్తున్న ఒరిజినల్ మెస్కార్డును క్యాంపస్లోని హాస్టల్ ఆఫీస్లో సమర్పించిన విద్యార్థులకు కొత్తగా మెస్కార్డులు జారీచేస్తున్నారు. తక్కువ మంది రెన్యువల్ చేసుకోవడంతో ఇంకా గదులను విద్యార్థులకు కేటాయించలేదు. వసతి, మెస్ సౌకర్యం మాత్రం ప్రస్తుతం యథా విధిగా పొందుతున్నారు. విద్యార్థులు గడువులోగా ఆన్లైన్లో రూ.500 ఫీజు చెల్లించి రెన్యువల్ చేసుకో వాలని హాస్టళ్ల డైరెక్టర్ రాజ్కుమార్ ఆదివారం తెలి పారు. రెన్యువల్ చేసుకోని విద్యార్థులకు హాస్టల్ వసతి, మెస్ సదుపాయం ఉండదని పేర్కొన్నారు. -
అవగాహనే ఆయుధం
సైబర్ మోసాలపై ప్రతీ ఒక్కరికీ అవగాహన ఉండాలి. చాలా మంది చదువుకున్న వారే మోసపోతున్నారు. ఎవరైనా తెలిసిన వ్యక్తులు డబ్బులడిగితే ప్రొఫైల్ ఫొటో చూసి మోసపోవద్దు. ఫోన్ నంబర్ చెక్ చేసుకోవాలి. ఆన్లైన్లో పెట్టుబడి పేరుతో ఆహ్వానాలు వస్తే నమ్మెద్దు. ఒకే రోజు వేల రూపాయలు ఏ వ్యాపారంలో రావు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్లు ఎత్తకుండా, ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయకుంటే నష్టం ఉండదు. మోసపోయిన వెంటనే టోల్ఫ్రీ 1930 నంబర్కు ఫోన్ చేసి పోగొట్టుకున్న నగదును పుట్ అన్హోల్డ్ చేసే అవకాశం ఉంది. సోషల్ మీడియా పరిచయాలతో ప్రమాదం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త – కలకోటి గిరికుమార్, ఏసీపీ, సైబర్ క్రైమ్ -
సంవత్సరీకానికి వెళ్లొస్తూ మృత్యుఒడికి..
నెల్లికుదురు: తన బంధువు సంవత్సరీకం కార్యక్రమానికి వెళ్లొస్తూ ఓ వ్యక్తి మృత్యుఒడికి చేరాడు. బైక్ అదుపు తప్పిన ఘటనలో దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఆదివారం మండలంలోని బ్రాహ్మణకొత్తపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై చిర్ర రమేశ్ బాబు కథనం ప్రకారం.. ఇనుగుర్తి మండలం కోమటిపల్లికి చెందిన ఆరెందుల సత్యనారాయణ (56) బైక్పై గార్ల గ్రామంలోని తన బంధువు సంవత్సరికం కార్యక్రమానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో నెల్లికుదురు మండలం బ్రాహ్మణకొత్తపల్లి శివారులో బైక్ అదుపు తప్పడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి క్షతగాత్రుడిని 108లో మహబూబాబాద్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు ఆరెందుల ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బైక్ అదుపు తప్పి వ్యక్తి దుర్మరణం -
మహిళ హత్య ఘటనలో నిందితుడి అరెస్ట్
మరిపెడ: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం సమీపంలో ఓ మహిళను దారుణంగా హత్య చేసిన ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం మరిపెడ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మరిపెడ మండలం ఉల్లెపల్లికి చెందిన బంటు వెంకటమ్మ(55) వ్యవసాయ కూలి మేసీ్త్రగా జీవనం కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో ఆమెకు సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం వాయిలసింగారం గ్రామానికి చెందిన తాపీమేసీ్త్ర సాగల వీరన్నతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో వీరన్నకు మృతురాలు అప్పుడప్పుడు అప్పు ఇచ్చేది. ఈ క్రమంలో గత నెల ఆగస్టు 31వ తేదీన తనకు అప్పు కావాలంటూ వీరన్న.. మృతురాలికి ఫోన్ చేసి మరిపెడకు రాగా ఇద్దరు కలుసుకున్నారు. అనంతరం మద్యం కొనుగోలు చేసి పురుషోత్తమాయగూడెం శివారుకు వెళ్లారు. అక్కడ మద్యం సేవించిన తర్వాత వీరన్న డబ్బులు అడిగాడు. అయితే మృతురాలు తన దగ్గర లేవని చెప్పింది. దీంతో వీరన్న.. ఆమె శరీరంపై ఉన్న నగలు బలవంతంగా లాక్కొంటుండగా ప్రతిఘటించింది. ఈ క్రమంలో మద్యం సీసాతో ఆమె ముఖంపై దాడి చేశాడు. అనంతరం గొంతు నులిమి హతమార్చి పక్కన ఉన్న నీటిగుంటలో పడేశాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మరిపెడ సీఐ రాజ్కుమార్గౌడ్ నేతృత్వంలో కేవలం వారం రోజుల్లోనే కేసును ఛేదించారు. నిందితుడి దగ్గర నుంచి నాలుగుతులాల బంగారు ఆభరణాలు, బైక్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. కాగా, సీఐ రాజ్కుమార్గౌడ్తో పాటు ఎస్సై బొలగాని సతీశ్, కానిస్టేబుళ్లు రమేశ్, స్వామి, వేణు, మహేశ్, రమ్య, శాంత, డ్రైవర్ సందీప్ను డీఎస్పీ అభినందించారు. వివరాలు వెల్లడించిన తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్