breaking news
Nandyala
-
ముగిసిన ఇంటర్ పరీక్షలు
నంద్యాల(న్యూటౌన్): ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు గత నెల 23న ప్రారంభమై బుధవారంతో ముగిశాయి. చివరి రోజు జురిగిన కెమిస్ట్రీ–2 పరీక్షకు 9926 మందికి గాను 9754 మంది హాజరు కాగా 172 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలు ముగిసిన అనంతరం విద్యార్థులు హాస్టళ్లను ఖాళీ చేసి లగేజీలతో సొంతూళ్లకు వెళ్లారు. చాలామంది తల్లిదండ్రులు తమ వెంట పిల్లలను పిలుచుకొని వెళ్లారు. శ్రీశైలంలో కనుల పండువగా ప్రభోత్సవం నంది వాహనంపై దర్శనమిచ్చిన ఆదిదంపతులు మహాసరస్వతి అలంకారంలో కటాక్షించిన భ్రామరి నేడు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పంచాంగ శ్రవణం -
ఎక్కడికక్కడ ఖాళీ సిలిండర్లు
శిరివెళ్ల: హిందూ ముస్లింలకు అతి పెద్ద పండుగలు ఉగాది, రంజాన్. సరిగ్గా పండుగల వేళ గ్యాస్పై ప్రజల్లో ఆందోళన నెలకొంది. బుక్ చేసిన రెండు, మూడు రోజులకు కానీ గ్యాస్ సిలిండర్ దొరకని పరిస్థితి. మండల కేంద్రంలో ఏ ఇంటి ముందు చూసినా ఖాళీ గ్యాస్ సిలిండర్లే దర్శనమిస్తున్నాయి. బండి రాగానే ఆత్రుతతో సిలిండర్ కోసం ప్రజలు ఎగబడుతున్నారు. ఇదిలా ఉంటే చిన్న చిన్న హోటళ్ల నిర్వాహకుల పరిస్థితి మరి ఘోరంగా ఉంది. మొన్నటి వరకు దోసె రూ.30 ఉండగా.. నేడు రూ. 40లకు విక్రయిస్తున్నారు.ఫొటోలు : వడ్డె శ్రీనివాసులుమేము గాయత్రీ ఎస్టేట్లో 2023 నుంచి ఫిష్ ఆంధ్ర రెస్టారెంట్ నడుపుతున్నాం. రూ.1000లకు లభించే గ్యాస్ బండ ఇప్పుడు రూ.2వేలు పెట్టినా దొరకడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే ఒకటి రెండు రోజుల్లో హోటల్ మూసేద్దామనుకుంటున్నా. మా హోటల్పై పలువురు ఉపాధి పొందుతున్నారు. వీరందరూ ఉపాధి కోల్పోతారు. – రంగ ఫిష్ ఆంధ్ర రెస్టారెంట్ నిర్వాహకుడు, కర్నూలు గ్యాస్ సిలిండర్ దొరకడం లేదు. విధిలేని పరిస్థితుల్లో బ్లాక్లో కొనాల్సి వస్తోంది. వంట నూనెల ధర కూడా మండుతోంది. యుద్ధానికి ముందు సన్ఫ్లవర్ ఆయిల్ లీటరు ప్యాకెట్ రూ.162 ఉండగా నేడు రూ.185లకు చేరింది. ప్రభుత్వం చొరవ తీసుకొని గ్యాస్ కొరత లేకుండా చర్యలు చేపట్టాలి. వంట నూనెల కృత్రిమ కొరతను అడ్డుకోవాలి. – అరుణ, నంద్యాల చెక్పోస్టు ఏరియా, కర్నూలు కొత్త బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్న దృశ్యంఏజెన్సీ నుంచి గ్యాస్ సిలిండర్ తీసుకెళ్తున్న యువకుడు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వంట గ్యాస్ కొరత బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు విక్రయం అంతకంతకూ పెరుగుతున్న వంటనూనె ధర అడ్డగోలు ధరలపై నియంత్రణ కరువు పండుగలు, శుభకార్యాల వేళ అవస్థలు -
సుబ్రమణ్యేశ్వరుడికి వెండిపడిగెలు వితరణ
పాణ్యం: కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణ్యేవ్వరస్వామి వారికి ఆదివారం భక్తులు రెండు వెండి పడిగెలు బహూకరించారని ఈఓ రామకృష్ణ తెలిపారు. నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన పట్నం వెంకటసుబ్బయ్య వారి కుటుంబ సభ్యులు 500 గ్రామలు నాగమ వెండి పడిగె, బండిఆత్మకూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన బానగిరి వెంకటసుబ్బయ్య వారు 485 గ్రాముల వెండి నాగపడిగెను విరాళంగా సమర్పించారన్నారు. వీటి విలువ సుమారు రూ. 3 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. నేడు కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 16వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam. ap. gov. in వెబ్సైట్లో సంప్ర దించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారు లందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండ ల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివి జన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కా ర వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9.30 గంటలకు అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. శ్రీశైలం చేరుకున్న పుదుచ్చేరి సీఎం శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి ఆదివారం రాత్రి శ్రీశైలం చేరుకున్నారు. ఈయనకు భ్రమరాంబా అతిథిగృహం వద్ద దేవస్థాన ఈఓ, అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. సోమవారం ఉదయం మల్లికార్జున స్వామివారిని, భ్రమరాంబాదేవిని పుదుచ్చేరి సీఎం దర్శించుకుంటారని దేవస్థాన అధికారులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వైద్యుడి మృతి కర్నూలు: రోడ్డు ప్రమాదంలో డాక్టర్ వి.హరికుమార్(24) అక్కడికక్క డే మృతి చెందాడు. నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి చెందిన ఈయన తండ్రి జయరాముడుతో కలసి కర్నూలు కొత్తబస్టాండు సమీపంలోని ఏపీ ట్రాన్స్కో కార్యాలయం ఎదురుగా ఉన్న తిలక్నగర్లో నివాసం ఉంటు న్నారు. గాయత్రీ ఎస్టేటులోని ఆర్క్ ఆసుపత్రిలో డాక్టరుగా పని చేస్తున్నారు. వెల్దుర్తి గ్రామ శివారులోని తిక్క నరసింహస్వామిని దర్శించుకొని శనివారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై కర్నూలుకు చేరుకున్నారు. బళ్లారి చౌరస్తా వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఎక్కుతుండగా గుర్తు తెలియని వాహనం వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. దీంతో తలఛిద్రమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని హరికుమార్ను ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని మార్చురీ కేంద్రానికి తరలించారు. ఆదివారం పోస్టుమార్టం నిర్వహించి అప్పగించారు. -
సంయమనంతో విధులు నిర్వర్తించండి
● ఉత్సవాలకు 1800 మంది సిబ్బందితో బందోబస్తు ● ఎనిమిది సెక్టార్లుగా విభజించి పర్యవేక్షణ ● జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ శ్రీశైలం: ఉగాది ఉత్సవాల నేపథ్యంలో శ్రీగిరికి బందోబస్తుపై వచ్చిన పోలీసు సిబ్బంది సంయమనంతో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశించారు. సోమ వారం నుంచి ఉగాది ఉత్సవా లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో బందోబస్తు నిమిత్తం వచ్చిన పోలీసు అధికార, సిబ్బందికి ఆదివారం సాయంత్రం వన్టౌన్ సర్కిల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది ఉత్సవాల బందోబస్తుగా వివిధ జిల్లాల నుంచి 1,800 మంది పోలీస్ సిబ్బంది చేరుకున్నారన్నారు. సిబ్బందిని ఎనిమిది సెక్టార్లుగా విభజించి, ప్రతి సెక్టార్కు ఒక ఉన్నతాధికారిని నియమించి నిరంతరం పర్యవేక్షణ చేస్తామన్నారు. ట్రాఫిక్ సమస్యను అధిగ మించడానికి ఏర్పాటు చేసిన మొబైల్ వాహనాలు 24 గంటలూ క్షేత్రం చుట్టూ తిరుగుతూ ట్రాఫిక్ క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకున్నామన్నారు. బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు భక్తులు సహకరించాలన్నారు. భక్తుల క్యూలైన్లు సాఫీగా సాగి దర్శనం చేసుకునేలా నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగిన వెంటనే ఉన్నతాధికారులకు కమాండ్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందజేయాలని ఆదేశించారు. విధుల్లో ఉన్న సిబ్బంది తమకు కేటాయించిన ప్రదేశంలో ఉండాలని, రిలీవర్ వచ్చేంత వరకు వేచి ఉండాలని సూచించారు, బందోబస్తుపై వచ్చిన పోలీసులకు ఏమైనా సమస్యలు ఉంటే పోలీస్ వాట్సాప్ గ్రూపులో సమాచారం చేరవేయాలని ఆదేశించారు. సమావేశంలో యాక్షన్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు, ఆత్మకూరు డీఎస్పీ తదితరులు పాల్గొన్నారు. -
ఉగాది మహోత్సవాలకు వేళాయె!
విద్యుత్ దీపాలంకరణలో భ్రమరాంబ ఆలయంశ్రీశైలంటెంపుల్: శ్రీశైలమహాక్షేత్రంలో ఐదు రోజుల పాటు వైభవంగా జరుగనున్న ఉగాది మహోత్సవాలకు శ్రీగిరి ముస్తాబైంది. సోమవారం ఉగాది మహోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేయ నున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుండి అధికసంఖ్యలో భక్తులు శ్రీగిరి తరలివస్తున్నారు. దీంతో శ్రీశైలం కన్నడ భక్తులతో కిక్కిరిసిపోయింది. ఐదు రోజుల పాటు జరుగనున్న మహోత్సవాలకు దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఉగాది మహోత్సవాలు సోమ వారం ఉదయం 9 గంటలకు దేవస్థాన ఈఓ, ఉభ య దేవాలయాల ప్రధానార్చకు లు, స్థానాచార్యులు స్వామివారి యాగశాల ప్రవేశం చేసి ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. ఐదు రోజుల పాటు నిర్వహించే ఉగాది మహోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు భ్రమరాంబాదేవికి ప్రత్యేక అలంకారం, భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు విశేష వాహనసేవ నిర్వహిస్తారు. మహోత్సవాల్లో మొదటిరోజు సోమవారం భ్రమరాంబాదేవికి మహాలక్ష్మీ అలంకారం, భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు భృంగివాహనసేవ నిర్వహిస్తారు. ప్రత్యేకంగా అలంకీకృతులైన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు గ్రామపురవీధుల్లో అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహిస్తారు. -
పది పరీక్షలకు సర్వం సిద్ధం
నంద్యాల(న్యూటౌన్): జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక నంద్యాల ఎస్పీజీ, బాలికల ఉన్నత పాఠశాల, చాపిరేవుల జిల్లా పరిషత్ హైస్కూల్, ఎస్డీఆర్ తదితర పరీక్ష కేంద్రంలో పది పరీక్షల ఏర్పాట్లను ఆదివారం డీఈఓ జనార్ధన్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఈనెల 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యాశాఖ, పోలీస్, రెవెన్యూ శాఖల సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. 130 పరీక్షా కేంద్రాల్లో 18,508 మంది రెగ్యులర్, 9,093 మంది ప్రైవేట్ విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఐదు పరీక్షా కేంద్రాల్లో 576 మంది ఓపెన్ స్కూల్ విద్యార్థులు హాజరు కానున్నారన్నారు. జిల్లాలో 8 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పా టు చేశామన్నారు. సమస్యల పరిష్కారానికి డీఈఓ కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారన్నా రు. సమస్యలు ఉంటే 9000313871, 9515185150 నంబర్లను సంప్రదించాలన్నారు. ఆయన వెంట చీఫ్ డిపార్టుమెంట్ ఆఫీసర్లు ఉన్నారు. ముఖ్యమైన విషయాలు.. ● ఉదయం 8.45 నుంచి 9.30 గంటల వరకు కేంద్రాల్లోకి అనుమతిస్తారు. 9.30 గంటల వరకు పరీక్ష ప్రారంభమైన తర్వాత మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష ముగిసే వరకు విద్యార్థులను బయటకు వెళ్లనివ్వరు. ● గుర్తింపు కార్డు కలిగి పరీక్షల విధుల్లో ఉన్న అధికారులు స్క్వాడ్ బృందాలను పరీక్ష కేంద్రాల్లోకి తనిఖీలకు అనుమతిస్తారు. ● విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు. పరీక్షల నిర్వహణకు చీఫ్, డిపార్ట్మెంట్, ఇన్విజిలేటర్లను నియమించారు. ● ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు ఉంటుంది. పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. ● జిల్లాలోని పది పరీక్షలకు సంబంధించి జిల్లా స్టోరేజ్ పాయింట్గా వెంకటేశ్వరపురం గ్రామ సమీపంలో ఉన్న ఎస్డీఆర్ పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈ ప్రాంగణంలోనే పరీక్షా పత్రాల మూల్యాంకనం జరుగుతుంది. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కస్టోడియన్స్ను ఏర్పాటు చేశారు. ● పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు జిల్లా పోలీసు అధికారులు ఒక ప్రకటనలో ఆదివారం పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఏ పరీక్ష కేంద్రం అయినా చిన్న సంఘటన జరిగినా వెంట నే 100, 112కు సమాచారం అందించాలన్నారు. -
వస్తువుల కొనుగోలులో అప్రమత్తత అవసరం
నంద్యాల(వ్యవసాయం): వివిధ వస్తువుల కొనుగోలు సమయంలో వినియోగదారులకు అప్రమత్తత అవసరమని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రవిబాబు అన్నారు. ఆదివారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక కలెక్టరేట్లో జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడు అమీర్బాషా ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం సూచించిన ఐఎస్ఐ మార్కు, ఎఫ్ఎస్ఎస్ఏఐ అగ్మార్క్, హాల్మార్క్ వస్తువులనే కొనుగోలు చేయాలని వినియోగదారులకు సూచించారు. ఆహార పదార్థాల విషయంలో నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత ధర ప్రామాణికాన్ని కచ్చితంగా పరిశీలించాలన్నారు. జిల్లా తునికలకొలతల కంట్రోల్ షేక్ జిలానీ బాషా మాట్లాడుతూ.. ప్యాకేజీ, కమాండిటిస్ నిబంధనలు పాటించాలని, తయారీ తేదీ, ఎక్ప్రైరీ తేదీ, కస్టమర్ కేర్ నంబర్లను చూసి కొనుగోలు చేయాలని కోరారు. తినే ఆహార పదార్థాల విషయంలో అప్రమత్తమై ఉండాలన్నారు. కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ అధి కారి వెంకటరాముడు, వినియోగదారులు పాల్గొన్నారు -
నేడు లైలతుల్ ఖదర్
● ముస్లింలకు అత్యంత పవిత్రమైన రాత్రి ● మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు ఆదోని సెంట్రల్: రంజాన్ ముస్లింలకు అత్యంత పవిత్రమాసం. కఠోర ఉపవాస దీక్షలతో పగలు, రాత్రి తేడా లేకుండా అల్లా స్మరణలో గడుపుతారు. ఈ మాసంలో వచ్చే ప్రత్యేకమైన రాత్రి లైలతుల్ ఖదర్. దీన్నే ’బడీరాత్’ అని కూడా పిలుస్తారు. ఈ రోజునే ముస్లింల ఆరాధ్య దైవ గ్రంథం దివ్యఖురాన్ అవతరించిందని చెబుతారు. అందుకే ఈ రోజు ప్రత్యేక ప్రార్థనలకు, ఖురాన్ పఠనానికి, దానధర్మాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. తెలిసీ తెలియక చేసిన తప్పులను తమ ప్రత్యేక ప్రార్థనలతో అల్లా క్షమిస్తారని నమ్మకం. దీంతో రాత్రంతా పశ్చాత్తాప భావనతో దైవ సన్నిధిలో గడుపుతారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వెయ్యికి పైగా మసీదులున్నాయి. నేడు లైలతుల్ ఖదర్ సందర్భంగా వాటిల్లో రాత్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఇషా నమా జ్ తర్వాత జరిగే ఈ ప్రార్థనల్లో ఆధ్మాతిక వేత్తల ప్రసంగాలు, పవిత్ర ఖురాన్ పఠనం, జికర్, తహజు ద్ నమాజ్ చేస్తూ రాతంత్రా జాగరం చేస్తారు. -
మతసామరస్యానికి ప్రతీక నంద్యాల
నంద్యాల(అర్బన్): నంద్యాల జిల్లాలో ఎప్పటి నుంచో మత సామరస్యం వెల్లివిరుస్తోందని కలెక్టర్ రాజకుమారి అన్నా రు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకు ని ఆదివారం మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణం మున్సిపల్ టౌన్హాల్లో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ సబిహా పర్వీన్తో కలసి జిల్లా కలెక్టర్ రాజకుమారి ఈ కార్యక్రమంలో పాల్గొని ముస్లింల కు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రంజాన్ మాసం ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, ముస్లింలు ఉపవాస దీక్షలు, సేవా భావం సమాజానికి గొప్ప స్ఫూర్తినిస్తాయని కొనియాడారు. ఈ పవిత్ర మాసం మనుషుల్లో పరస్పర ప్రేమ, దయ, దాతృత్వ భావాలను పెంపొందించే సమయమన్నా రు. అనంతరం ముస్లిం మత పెద్దలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ముస్లింలతో కలిసి కలెక్టర్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. -
దిగుబడులపై ఆశలు
ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి ఎకరా రూ. 20 వేలు కౌలు చెల్లించి ఇరవై ఎకరాలు కౌలుకు తీసుకుని రబీలో మొక్కజొన్న సాగు చేశాను. బోరు ఆధారంగా పైరుకు సాగునీటిని మళ్లించాల్సి ఉంది. ఈ సీజన్లో వర్షాలు లేని కారణంగా పైరు చేతికందాలంటే దాదాపు పది నీటి తడులు అందించాలి. రసాయన ఎరువులు, పురుగు మందులు, సాగునీటి తడుల రూపంలో ఎకరాకు రూ. 30 వేలకు పైగా ఖర్చువుతుంది. ఈ ఏడాది మొక్కజొన్నలో మంచి దిగుబడులు వస్తాయని భావిస్తున్నాను. – కొత్తూరు, రైతు, వెలగటూరు, కోవెలకుంట్ల మండలం -
రేపటి నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఉగాది ఉత్సవాలకు కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో శ్రీగిరి క్షేత్రం కన్నడ భక్తులమయమైంది. ఐదు రోజుల పాటు జరుగనున్న మహోత్సవాల నిర్వహణ ఏర్పా ట్లపై దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, స్థానాచార్యులు, అన్ని విభాగాల అధికారులతో పలుమార్లు సమావేశాన్ని నిర్వహించి కన్నడ భక్తుల సౌకర్యార్థం క్షేత్రంలో చేపట్టాల్సిన చర్యలపై ఆదేశాలిచ్చి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసు, అటవీ, వైద్యశాఖ అధికారులు సమన్వయంతో ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఉగాది మహోత్సవాలు సోమవారం ఉదయం 9 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశం, చండీశ్వరపూజ తదితర పూజలు నిర్వహిస్తారు. అలాగే భ్రమరాంబాదేవి ఆలయంలో విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, చండీహోమం, అంకురార్పణ నిర్వహిస్తారు. ఉత్సవాల్లో ముఖ్యంగా 18వ తేదీన వీరాచార విన్యాసాలు గగుర్పాటు కలిగిస్తాయి. 19న ఉగాది రోజు పంచాంగ శ్రవణం, రథోత్సవం, అమ్మవారికి రమావాణిసేవిత రాజరాజేశ్వరి అలంకారం చేపట్టనున్నారు. 20వ తేదీన పూర్ణాహుతి, అశ్వవాహనసేవ నిర్వహిస్తారు. ఆరోజు భ్రమరాంబాదేవి నిజాలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. కన్నడ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ప్రతిరోజు అమ్మవారికి విశేష అలంకారం, స్వామిఅమ్మవార్లకు విశేష వాహనసేవలు భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం -
‘నైపుణ్యాల అంచనా’ను పకడ్బందీగా నిర్వహించండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈనెల 15న నిర్వహించే ‘ప్రాథమిక చదువు, సంఖ్యా నైపుణ్యాల అంచనా పరీక్ష’ను జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సూచించారు. శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 1,62,235 మంది అభ్యాసకులను ప్రత్యేక యాప్ ద్వారా నమోదు చేశామన్నారు. వీరి కోసం జిల్లాలో 1,368 పరీక్షా కేంద్రాలను గుర్తించామన్నారు. ప్రతి కేంద్రంలో ఇన్విజిలేటర్లుగా అంగన్వాడీ టీచర్లు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను నియమించినట్లు వెల్లడించారు. 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పరీక్షకు అభ్యాసకులు తమకు అనుకూలమైన సమయంలో హాజరు కావాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో మంచినీటి సదుపాయం, శానిటేషన్ వంటి మౌలిక వసతులను తప్పనిసరిగా కల్పించాలని అధికారులను ఆదేశించారు. పొదుపు సంఘాలు, శ్రామిక సంఘాల ద్వారా ప్రతి అభ్యసకునికి పరీక్షపై విస్తృతంగా అవగాహన కల్పించి, అందరూ తప్పనిసరిగా పరీక్షకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంపీడీవోలు, ఏపీఎంలు, ఇతర సంబంధిత అధికారులు సమన్వయంతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పరీక్షను విజయవంతంగా నిర్వహించాలన్నారు. అన్నప్రసాద వితరణ పథకానికి విరాళం శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి శని వారం ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎం.నితీష్ శ్రీనివాస్ రూ.1,11,000 విరాళాన్ని పర్యవేక్షకులు కె.శివప్రసాద్కు అందజేశారు. ఈ సందర్భంగా దాతను దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రం, లడ్డూప్రసాదం అందించి సత్కరించారు. అలాగే విరాళానికి సంబంధించిన బాండ్ అందజేశారు. సీపీఆర్, ప్రథమ చికిత్సపై శిక్షణ కర్నూలు: రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో బాధితులను ఆదుకోవడంలో ముందుండే పోలీసు సిబ్బందికి సీపీఆర్ విధానం, గాయాల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించారు. 200 మంది ఏపీఎస్పీ ట్రైనీ కానిస్టేబుళ్లకు పోలీసు శిక్షణ కేంద్రంలో సీపీఆర్, ప్రథమ చికిత్సపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కర్నూ లు మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లు, పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ సునీల్ యాదవ్, పోలీసు వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతి, డీటీసీ వైస్ ప్రిన్సిపాల్, డీఎస్పీ ప్రసాద్, సీఐలు, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్లో 41వేల కేసులు పరిష్కారం
కర్నూలు: జాతీయ లోక్ అదాలత్లో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 40,921 కేసులు పరిష్కారమయ్యాయి. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన న్యాయమూర్తి కబర్ధి ఆధ్వర్యంలో శనివారం రెండు జిల్లాల్లో 25 బెంచ్లను ఏర్పాటు చేసి 689 సివిల్ కేసులు, 40,232 క్రిమినల్ కేసులను పరిష్కరించినట్లు న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి తెలిపారు. ఇందులో 186 మోటార్ యాక్సిడెంట్ కేసులలో రూ.12,83,49,000 బాధితులకు నష్టపరిహారంగా ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ఇప్పించారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి కమలాదేవి, 6వ అదనపు జిల్లా జడ్జి వాసు, 7వ అదనపు జిల్లా జడ్జి లక్ష్మీరాజ్యం, కర్నూలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరినాథ్ చౌదరి, రిటైర్డ్ అదనపు జిల్లా జడ్జి లక్ష్మీనరసింహారెడ్డి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సరోజినమ్మ, జూనియర్ సివిల్ జడ్జిలు కిరణ్ కుమార్, అనూష, కోర్టు మానిటరింగ్ సీఐ రామయ్య నాయుడు పాల్గొన్నారు. రైతు త్యాగం మరువరానిది తమ వ్యవసాయ భూములను ప్రాజెక్టు నీటి మునకకు అప్పజెప్పి రైతులు చేసిన త్యాగం మరువరానిదని, వారికి ప్రభుత్వం చెల్లించే సొమ్ము ఎంత ఇచ్చినా తక్కువేనని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి పేర్కొన్నారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చిన 190 మంది రైతులకు అందాల్సిన నష్టపరిహారాన్ని అందించేందుకు గత కొన్ని రోజులుగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి దాదాపు రూ.81 లక్షల పరిహారం చెక్కుల ద్వారా అందించారు. ఈసారి ఆదోని, ఎమ్మిగనూరు కోర్టుల్లో పదేళ్ల నాటి పెండింగ్ కేసుల పరిష్కారమయ్యాయని తెలిపారు. -
వివాదాలకు ‘బలి’అవుతూ!
కర్నూలు: కర్నూలు నాల్గవ పట్టణ పోలీస్స్టేషన్ కొంతకాలంగా వివాదాలకు అడ్డాగా మారింది. వరుస పరిణామాలతో స్టేషన్ ఎస్హెచ్ఓకు కంటి మీద కునుకు లేకుండాపోతోంది. అక్రమ కేసుల నమోదు, దర్యాప్తు పేరుతో వేధింపులు, స్టేషన్కు వెళ్లిన బాధితుల పట్ల దురుసు ప్రవర్తన తదితర ఘటనలతో బాధితులు స్టేషన్ ఎదుట ఆందోళన చేసే పరిస్థితులు తలెత్తాయి. స్టేషన్లో జరుగుతున్న వ్యవహారాలు ఆ శాఖ ఉన్నతాధికారులు సైతం తల పట్టుకునేంతగా వివాదమయ్యాయి. ఏపీ రాజధాని అమరావతి వరకు ఫిర్యాదులు వెళ్లాయి. కొందరు న్యాయం కోసం హైకోర్టు మెట్లెక్కడం గమనార్హం. గంజాయి కేసు విషయంలో పోలీస్స్టేషన్కు వెళ్లిన న్యాయవాది పవన్ కుమార్ను సీఐ విక్రమసింహ దూషించడమే కాక బౌతికంగా దాడి చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. సీఐ విక్రమసింహపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే మధ్యవర్తుల ద్వారా న్యాయవాది పవన్కుమార్తో సీఐ విక్రమసింహ రాజీ కుదుర్చుకున్నారు. యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడి నిర్బంధం తెలంగాణ యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు కె.వెంకటరామిరెడ్డి (కేవీఆర్)పై ఫిబ్రవరి 22న నాలుగో పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. 41ఏ నోటీసు ఇచ్చి విచారణ నిమిత్తం మార్చి 10న కేవీఆర్ను స్టేషన్కు పిలిపించి చంద్రబాబు నాయుడుపైనే కథనాలు చేస్తావా.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి అభాసుపాలు చేస్తావా అంటూ నిర్బంధించి తీవ్రంగా కొట్టారు. కేవీఆర్ కుటుంబ సభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కేవీఆర్ను కర్నూలు అర్బన్ తహసీల్దార్ ఎదుట హాజరుపరచి విడుదల చేశారు. ఈ వివాదం హైకోర్టు వరకు వెళ్లడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సీఐ మధ్యవర్తి ద్వారా కేవీఆర్తో రాజీ సంప్రదింపులు చేశారు. ముడుపుల విషయంలో క్రైం పార్టీ పోలీసులపై వివాదం ఇదే పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న క్రైం పార్టీ పోలీసుల అవినీతిపై ఏకంగా ఏపీ డీజీపీకి ఫిర్యాదులు చేరి వివాదాస్పదమయ్యాయి. కర్నూలు కొత్తబస్టాండ్లో రెండు బంగారు చోరీ కేసులు చోటు చేసుకున్నాయి. వీటి విచారణ కోసం క్రైం పార్టీ పోలీసులు హైదరాబాద్కు చెందిన శ్రీనివాసరావు అనే వ్యాపారిని అదుపులోకి తీసుకుని బేరం కుదుర్చుకుని రూ.3 లక్షలు మామూళ్లు దండుకుని వదిలేశారు. ఈ ఘటన కూడా వివాదాస్పదంగా మారడమే కాక తెలంగాణలో క్రైం పార్టీ పోలీసులపై కేసు నమోదైంది. దీంతో వారిని వీఆర్కు పంపారు. ఆ తర్వాత వేర్వేరు చోట్లకు బదిలీ చేశారు. అలాగే ఇదే స్టేషన్లో సీఐ మధుసూదన్గౌడ్, హెడ్ కానిస్టేబుల్ రవి ద్వారా రూ.80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కి జైలుపాలయ్యారు. శాంతి కోసం పొట్టేలు బలి వరుస ఘటనల నేపథ్యంలో స్టేషన్కు దరిద్రం పట్టింది.. శాంతి చేయాలి.. ఏ కేసు దర్యాప్తు ప్రారంభించినా సమస్యలు ఎదురవుతున్నాయని ఎస్హెచ్ఓకు సిబ్బంది సూచించినట్లు తెలుస్తోంది. పరిస్థితులు అనుకూలించేందుకు పొట్టేలును పోలీస్స్టేషన్కు బలిచ్చి రక్తతర్పణ చేశారు. ప్రధాన గేటు వద్ద పొట్టేలును బలిచ్చి ఓ రెస్టారెంట్లో వంటలు చేయించి స్టేషన్ సిబ్బంది విందు చేసుకున్నారు. ఈ అంశం సిబ్బందిలో హాట్టాపిక్గా మారింది. వాస్తు దోషం పట్టిందంటూ పోలీసులే స్వయంగా స్టేషన్కు పొట్టేలును బలివ్వడం చర్చనీయాంశమైంది. స్టేషన్ ఎస్హెచ్ఓ పనితీరుపై విమర్శల వెల్లువ పరిస్థితులు అనుకూలించేందుకు శాంతి పేరుతో స్టేషన్కు పొట్టేలు బలి రక్త తర్పణం చేసి విందు చేసుకున్న సిబ్బంది పోలీసు శాఖలో హాట్ టాపిక్గా మారిన ఘటన -
మద్దిలేటయ్య కిటకిట
బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం శివారులోని వైష్ణవ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. పాల్గుణ మాసం శుభదినాలను పురస్కరించుకొని చిన్నారుల కేశఖండన, వివాహాల మొక్కులు, స్వామి, అమ్మవార్ల దర్శనార్థం తరలి వచ్చిన భక్తులతో క్షేత్రం జనసందోహంగా మారింది. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామి, అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన, స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజ నిర్వహించారు. ఉపకమిషనర్ రామాంజనేయులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. -
శ్రీశైలంలో భక్తుల కోసం ఉచిత బస్సులు
శ్రీశైలంటెంపుల్: ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటున్న వేలాది మంది భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సుల సదుపాయం కల్పించినట్లు దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఇవి కై లాసద్వారం నుంచి శ్రీశైలం వరకు నడుస్తాయన్నారు. నందిసర్కిల్ నుంచి ప్రారంభమై గణేశసదన్, సెంట్రల్ పార్కింగ్, విభూతిమఠం జంక్షన్, మల్లమ్మకన్నీరు, శివాజీస్ఫూర్తి కేంద్రం, రుద్రాపార్క్, సిద్ధరామప్పకొలను, పాతాళగంగరోడ్డు, ప్రైవేట్ సత్రాల మీదుగా తిరిగి నందిసర్కిల్కు చేరుకుంటాయని చెప్పారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని శిఖరేశ్వరం నుంచి కూడా ఉచిత బస్సును శ్రీశైలానికి నడుపుతున్నట్లు చెప్పారు. భక్తుల రద్దీని అనుసరించి శుక్రవారం నుంచి 15వ తేదీ వరకు ఆరు ఉచిత బస్సులు, 16 నుంచి 19వ తేదీ వరకు ఎనిమిది ఉచిత బస్సులను నడుపుతామని తెలిపారు. -
అక్రమాలు.. అధికార దుర్వినియోగం!
డోన్: అక్రమాలతో అధికార దుర్వినియోగం చేస్తున్నారని డోన్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్గౌడ్పై చైర్మన్ రాజేష్, కౌన్సిలర్ల ధ్వజమెత్తారు. సమాధానాలు చెప్పాలని ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో తనకు కౌన్సిలర్ల నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు మున్సిపల్ కమిషనర్ సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు సమావేశం హాలులోకి రావడం, వీడియోలు తీయమని కమిషనర్ ఆదేశించడం చూసి చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా పోలీసులు లోపలికి రాకూడదన్నారు. కౌన్సిలర్ల ప్రశ్నలకు స మాధానం చెప్పకుండా బెదిరించే ధోరణిలో కమిషనర్ ప్రవర్తించడం తీవ్ర ఆక్షేపణీయమన్నారు. డో న్లో మున్సిపల్ చిట్టచివరి సమావేశం శుక్రవారం వాదోపవాదాలు, ఉద్రిక్తతల మధ్య జరిగింది. ముమ్మాటికీ నేరమే! నిబంధనలకు విరుద్ధంగా సాయికీర్తన అనే పేరుగల కమిషనర్ ప్రసాద్గౌడ్ కూతురికి మున్సిపాలిటీలో ఉద్యోగం ఇవ్వాలని, ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ద్వారా అభ్యర్థించారని అజెండాలోని 63వ అంశంలో చేర్చడంపై మున్సిపల్ చైర్మన్, సీపీఐ కౌన్సిలర్ సుంకయ్య, వైఎస్సార్సీపీ మహిళా కౌన్సిలర్లు సుమలత సురేష్, మిట్టా ఉమామహేశ్వరి తదితరులు నిలదీశారు. ఇది ముమ్మాటికీ కమిషనర్ అధికార దుర్వినియోగం, బంధుప్రీతికి నిదర్శనమని ఆరోపించారు. 45–191 అనే ఇంటి నంబర్ డోన్ మున్సిపల్ పరిధిలోనే లేదని దొంగ ఇంటి నంబర్తో ఎమ్మెల్యేను సైతం తప్పుదోవ పట్టించి ఆయన సిఫారసులు లేకున్నా కూడా అజెండాలో ఆయన పేరును చేర్చడం ముమ్మాటికీ కమిషనర్ చేసిన నేరమని ధ్వజమెత్తారు. ప్రజాధనం దుర్వినియోగం విధి నిర్వహణలో భాగంగా ప్రతి నెలా వాహనంలో తిరిగేందుకు రూ.30వేలను ప్రజల సొమ్మును అద్దె రూపంలో కమిషనర్కు చెల్లిస్తుండగా, అద్దె కారుకు రూ.50వేల వేతనం తీసుకొని మున్సిపల్ ఉద్యోగులను డ్రైవర్గా పెట్టుకోవడం అనైతికమని కౌన్సిలర్లు అన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న కమిషనర్ ప్రసాద్గౌడ్ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరపాలన్నారు. దుర్వినియోగం చేసిన సొమ్మును రికవరీ చేయాలని కౌన్సిలర్లు మల్లికార్జునరెడ్డి, దినేష్గౌడ్, కుమ్మరి రాజు, రైల్వే నాగేంద్ర, మేకల విమల, వెంకటేశ్వరమ్మ, ఆర్ట్ రమణ, మౌలాబీ, ఇమాంబీలు డిమాండ్ చేశారు. ధ్రువ సోలార్ సంస్థతో కుమ్మక్కు ప్రతి ఏటా పది కోట్ల ఆదాయం ఉన్న మున్సిపాలిటీ ఉద్యోగుల జీతభత్యాలు చెల్లించలేక సతమతమవుతుంటే రూ.8కోట్లతో ధ్రువ సోలార్ పనులను ప్రోత్స హించేందుకు రుణాలు ఇస్తామని తప్పుడు ప్రచారాలు చేస్తూ కమిషనర్ ప్రజలను మభ్యపెడుతున్నారని కౌన్సిలర్లు ఆరోపించారు. పట్టణ పరిధిని అతిక్రమించి మండలంలోని అన్ని గ్రామాలలో ధ్రువ సోలార్ గురించి కమిషనర్ ప్రచారం చేస్తూ బ్రాండ్ అంబాసిడర్గా ప్రవర్తిస్తుండటం ఆయన అవినీతికి నిదర్శనమని మున్సిపల్ వైస్చైర్మన్ జాకీర్హుసేన్, బుర్రు రమాదేవి, ఫాతిమాభీ, స్వర్ణలత, సుకన్య ఆరోపించారు. అనుచిత వ్యాఖ్యలు డోన్లో పందులు స్వైర విహారం చేస్తున్నాయని టీడీపీకి చెందిన మున్సిపల్ వైస్చైర్మన్ కోట్రికె హరికిషన్ సభ దృష్టికి తీసుకువస్తుండగా కమిషనర్ ప్రసాద్గౌడ్ ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పందుల వ్యాపారం చేసే వారు కూడా తనపై ఆరోపణలు చేయడమా అని నోరుజారారు. దీంతో చైర్మన్తో పాటు పలువురు కౌన్సిలర్లు ఒక్క ఉదుటన లేచి కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కమిషనర్ ప్రసాద్గౌడ్ క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. చైర్మన్ ఆవేదన కమిషనర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రసాద్గౌడ్ వ్యవహరశైలి ప్రజాభీష్టానికి విరుద్ధంగా ఉందని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని కూడా తప్పుదోవ పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ అవినీతి, అక్రమాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. డోన్ మున్సిపల్ కమిషనర్పై చైర్మన్, కౌన్సిలర్ల ధ్వజం పోలీసులకు కమిషనర్ సమాచారం ఇవ్వడంపై ఆగ్రహం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు ప్రకటించిన చైర్మన్ రాజేష్ -
సీసీఆర్ కార్డులు ఇచ్చి ఏం లాభం?
మాకు ఎలాంటి భూములు లేవు. రైతుల నుంచి భూములను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాం. 2025–26 సంవత్సరానికి సంబంధించి 3.75 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాం. ఇందులో పత్తి సాగు చేసి అధిక వర్షాల నష్టాలు మూట కట్టుకున్నాం. కౌలు భూమికి రైతు అంగీకారంతో ప్రభుత్వం సీసీఆర్ కార్డు కూడా జారీ చేసింది. కార్డుతో సహా ఆధార్, బ్యాంకు ఖాతా తదితర వివరాలతో అన్నదాత సుఖీభవ కింద సాయం కోసం రైతు సేవా కేంద్రంలో సమర్పించాం. అన్నదాత సుఖీభవ సాయం దక్కలేదు. ఉపయోగం లేని సీసీఆర్ కార్డులు ఎందుకు ఇచ్చారో తెలియడం లేదు. – ఉప్పరి లక్ష్మన్న, తులసాపురం, కర్నూలు మండలం -
బాధాకరం
మేం 2023లో పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలం రాతనలో 4.80 ఎకరాల భూములు కొనుగోలు చేశాం. అదే ఏడాది రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. వెబ్ల్యాండ్తో పాటు రెవెన్యూ రికార్డుల్లో కూడా మా పేరుమీదనే భూమి ఉంది. 2025 జూలై నెలలోనే రాతనలో గ్రామ వ్యవసాయ సహాయకుడిని కలసి పాసుపుస్తకం తదితర అన్ని వివరాలు ఇచ్చాం. అయితే అన్నదాత సుఖీభవ సాయం దక్కలేదు. నిజమైన రైతులకు సాయం దక్కకపోవడం బాధాకరం. అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించలేదు. కనీసం అన్నదాత సుఖీభవ కింద చేయూత కూడా దక్కకపోవడం ఆందోళన కలిగిస్తోంది. – తెలుగు వెంకటస్వామి, జి.సింగవరం, కర్నూలు మండలం అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత ఉన్నా మూడు విడతలుగా ఆర్థిక సాయం అందలేదు. నాకు ఆరు ఎకరాల పొలం ఉంది. గత ప్రభుత్వంలో రైతు భరోసా కింద ఆర్థిక సాయం అందింది. చంద్రబాబు ప్రభుత్వంలో నాకు ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు పడ లేదు. ఎందుకు రావడం లేదని అధికారులను ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదు. – బడేసాహెబ్ రైతు, డీ కోటకొండ గ్రామం, ఆస్పరి మండలం అప్పులు పెరిగాయి నాకు సొంత భూమి లేదు. ఐదేళ్లుగా రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నా. రెండేళ్లుగా ఒక్క రూపాయి సాయం కూడా అందలేదు. అన్నదాత సుఖీభవ అని పేర్లు పెట్టారు. ఎలాంటి ఫలితం లేదు. అప్పులు పెరిగిపోతున్నాయి అని అడిగితే అధికారులు వస్తుంది... వస్తుంది అంటారు. ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. – రాజశేఖర్, కౌలు రైతు, పచ్చారపల్లి గ్రామం, హాలహర్వి మండలం నాకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. ఎన్నికల ముందు రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక పాత పథకం కింద వచ్చే డబ్బులు కూడా ఆగిపోయాయి. ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో సకాలంలో డబ్బులు పడేవి. విత్తనాలు, ఎరువులు కొనుక్కునేవాళ్లం. ఇప్పుడు రెండేళ్లు అవుతున్నా ఒక్క రూపాయి కూడా వేయకపోవడం దారుణం. – మారెప్ప, రైతు, నిట్రవట్టి, హాలహర్వి మండలం -
సీసీఆర్సీ కార్డు ఉన్నా ఫలితం లేదు
మాకు సొంతంగా సెంటు భూము లేదు. దేవాలయ భూమిని కౌలుకు సాగు చేసుకుంటున్నాం. 2025–26 సంవత్సరానికి 5.90 ఎకరాలకు సీసీఆర్సీ కార్డును ప్రభు త్వం జారీ చేసింది. అన్నదాత సుఖీభవ కింద సాయం దక్కుతుందని ఆశించాం. మొదటి, రెండవ విడతల్లో రాలేదు. మూడవ విడత లో కౌలుదారులకు న్యాయం జరుగుతుందని ఆశించినా నిరాశే మిగిలింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి కలగనప్పుడు ఇక సీసీఆర్సీ కార్డులు ఎందుకు జారీ చేస్తున్నట్లు. – జంగం జంబులింగయ్య, ఆర్.కొంతలపాడు, కర్నూలు మండలం -
‘కౌలు’కోలేని మోసం!
కర్నూలు(అగ్రికల్చర్): అన్నదాత సుఖీభవతో అర్హులకు న్యాయం చేయడంలో చంద్రబాబు సర్కార్ చేతులెత్తేసింది. 2025–26 సంవత్సరానికి సంబంధించి ఇది వరకు రెండు విడతల్లో అన్నదాత సుఖీభవ కింద రూ.10 వేలు, పీఎం కిసాన్ కింద రూ.4వేల ప్రకారం రైతుల బ్యాంకు ఖాతాలకు విడుదలయ్యాయి. రెండు విడతల్లో పట్టా భూములు కలిగిన రైతులకు అన్యాయం జరిగింది. అన్నదాత సుఖీభవ నుంచి కౌలుదారులను పక్కన పెట్టారు. మూడవ విడతలో న్యాయం జరుగుతుందని అధికారులు కౌలుదారులను నమ్మించారు. అయితే ఇప్పుడు కూడా కౌలుదారులతో పాటు అర్హులైన పట్టా రైతులకు నిరాశే మిగిలింది. చంద్రబాబు నమ్మించి మోసం చేశారని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2025–26 సంవత్సరానికి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు ఈ నెల 13న రైతుల బ్యాంకు ఖాతాలకు విడుదల కానున్నాయి. కౌలుదారులను నట్టేట ముంచిన చంద్రబాబు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సీసీఆర్సీ పత్రాలు పొందిన సాగుదారులకు అన్నివిధాల న్యాయం చేసింది. పెట్టుబడి సాయంగా రూ.13,500 రాష్ట్ర ప్రభుత్వం అందించింది. కౌలుదారులతో పాటు ఆర్వోఎఫ్ఆర్ రైతులు, దేవదాయ భూములు అనుభవిస్తున్న వారికి సీసీఆర్సీ కార్డులు జారీ చేసి పూర్తి మొత్తాన్ని చెల్లించి అండగా నిలిచింది. ఇలా 28,600 మంది సాగుదారులకు వైఎస్ఆర్ రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అందించడం విశేషం. చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ సాయాన్ని కౌలుదారులకు ఇవ్వకుండా తీరని అన్యాయం చేస్తోంది. 2025–26 సంవత్సరానికి జిల్లాలో 25వేల సీసీఆర్సీ కార్డులు జారీ చేయాలనేది లక్ష్యం కాగా 24,793 మంది సాగుదారులకు కార్డులు జారీ అయ్యాయి. అయితే అన్నదాత సుఖీభవ కింద ఒక్క కౌలుదారుకు కూడా పెట్టుబడి సాయం అందించలేకపోవడం గమనార్హం. 21,841 మందికి అన్నదాత సుఖీభవ ఎగనామం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2023–24లో వైఎస్ఆర్ రైతుభరోసా కింద 2,94,598 మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించింది. చంద్రబాబు ప్రభుత్వం 2,72,757 మంది రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ అమలు చేస్తోంది. వైఎసార్సీపీ ప్రభుత్వంతో పోలిస్తే చంద్రబాబు సర్కార్ 21,841 మంది రైతులకు తీరని అన్యాయం చేసింది. కౌలుదారులతో పాటు భూ యజమానులకు అన్యాయం జిల్లాలో 2025–26లో 24,793 సీసీఆర్సీ కార్డులు జారీ ఒక్క కౌలుదారుకూ అందని సాయం చుక్కల భూముల పేరిట అర్హులకు ఎగనామం -
వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
నంద్యాల(వ్యవసాయం): వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ఉమ్మడి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి అన్నారు. బుధవారం పట్టణంలోని స్పెషల్ సబ్ జైలును ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం జైల్లోని పరిసరాలను పరిశీలించి ఖైదీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సుపై అవగాహన కల్పించారు. 60 సంవత్సరాలు పైబడిన వారు ఖైదీలు ఉంటే వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. సబ్జైలు సూపరింటెండెంట్ గురుప్రసాద్రెడ్డి, లోక్అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు నంద్యాల(న్యూటౌన్): ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను బుధవారం ప్రశాంతంగా నిర్వహించినట్లు డీఐఈఓ శంకర్నాయక్ తెలిపారు. గురువారం జరిగిన కామర్స్ పేపర్–2, వొకేషనల్–2 పరీక్షలకు 3,330 మందికి గాను 3,190 మంది విద్యార్థులు హాజరు కాగా 145 మంది గైర్హాజరయ్యారన్నారు. పరీక్ష కేంద్రాలను సిట్టింగ్ స్క్వాడ్లు తనిఖీ చేసినట్లు తెలిపారు. ● సార్వత్రిక విద్యాపీఠం ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు డీఈఓ జనార్దన్రెడ్డి తెలిపారు. జిల్లాలోని 5 పరీక్ష కేంద్రాల్లో బుధవారం 305 మంది విద్యార్థులకు గాను 271 మంది హాజరు కాగా 34మంది గైర్హాజరైనట్లు చెప్పారు. నిలిచిపోయిన విద్యార్థి బస్సు బనగానపల్లె: బనగానపల్లె డిపోకు చెందిన ఆర్టీసీ విద్యార్థి బస్సు బుధవారం ఉదయం 8 గంటల సమయంలో రాళ్లకొత్తూరు వద్ద నిలిచిపోయింది. అవుకు మండలం వేములపాడు నుంచి ఈ బస్సు బనగానపల్లెకు వస్తుండగా సమస్య తలెత్తింది. అందులోని విద్యార్థులు సుమారు ఆరగంట వరకు అక్కడే వేచి ఉండాల్సివచ్చింది. అర్ధగంట తర్వాత తాడిపత్రి నుంచి బనగానపల్లెకు వెళ్లే ఆర్టీసీ బస్సు రావడంతో దానిలో విద్యార్థులు బనగానపల్లెకు చేరుకున్నారు. టైర్ పంక్చర్ కావడంతో సమస్య వ చ్చిందని డిపో మేనేజర్ శశిభూషణ్ తెలిపారు. డోన్ ఎంపీడీఓపై క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు డోన్: ఎంపీడీఓ వెంకటేశ్వరరెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ ముఖ్య అధికారికి డీఎల్పీవో నరసింహారెడ్డి సిఫార్సు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కొత్తబురుజు గ్రామంలో మధు అనే ఉద్యోగిని వదిలి మరొకరి వాహనంలో వెెళ్లిపోయినందున ఈ ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన వివరించారు. విధి నిర్వహణలో వాహనాన్ని వినియోగించకుండా వినియోగించుకుంటున్నట్లు ప్రభుత్వం నుంచి అద్దె రూపంలో లబ్ధి పొందుతున్నట్లు నిర్ధారించామని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రైవేట్ వాహనాల బిల్లులను చెల్లించకుండా ఆపివేయాలని కోరారు. -
పరీక్షలకు ‘పది’లమైన ఏర్పాట్లు
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు గతంలో మాదిరిగానే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించారు. బాలురు, బాలికలనే తేడా లేకుండా పరీక్ష సమయంలో విద్యార్థులు తమ గ్రామాల నుంచి పరీక్ష కేంద్రానికి ఆర్టీసీ బస్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. పరీక్ష హాల్ టికెట్ను చూసిస్తే సరిపోతుంది. నంద్యాల(న్యూటౌన్): పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పరీక్షలు ఈనెల 16 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 1 వరకు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో 130 కేంద్రాల్లో 25,033 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంది. గత ఏడాది జిల్లా వ్యాప్తంగా 81.85 శాతం ఉత్తీర్ణత సాధించగా ప్రస్తుత విద్యాసం వత్సరంలో 90 శాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంగా విద్యాశాఖ నిర్ణయించుకోంది. బాలురే అధికం పబ్లిక్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల్లో బాలికల కంటే బాలురే అధిక సంఖ్యలో ఉన్నారు. మొత్తం 25,033 మంది విద్యార్థులు పరీ క్షలకు హాజరుకానుండగా వారిలో 13,039 మంది బాలురు, 11,994 మంది బాలికలు ఉన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ల కోసం స్కూళ్లు చుట్టూ తిరగనవసరం లేకుండా వెబ్సైట్ నుంచి పొందువచ్చు. ప్రశ్నపత్రాలు ఈనెల 10, 11వ తేదీల్లో జిల్లా కేంద్రమైన నంద్యాలకు చేరుకున్నాయి. ఇక్కడ నుంచి మండల కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. పరీక్ష కేంద్రాల సీఎస్, డీఓలు, సబ్జెక్టు తేదీల వారీగా విభజించుకొని వాటిని పోలీసుస్టేషన్లో భద్రపరుస్తారు. మెడికల్ కిట్లు సిద్ధం పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్య సేవలు అందేలా ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన వైద్య సిబ్బందితో పాటు మందులను వైద్యశాఖ ఏర్పాటు చేసింది. పరీక్ష కేంద్రంలో ఏఎన్ఎంతో పాటు ఆశా వర్కర్ను నియమించి ప్రథమ చికిత్సకు అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా చర్యలు చేపట్టాం. పరీక్షల నిర్వహణకు దాదాపు 1,300 మంది ఇన్విజిలేటర్లు, సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, రాష్ట్ర, జిల్లా స్థాయి అబ్జర్వర్స్ పనిచేస్తున్నారు. ఉదయం 8.45 గంటల నుంచి 9.30 గంటలకు మాత్రమే విద్యార్థులకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆ తర్వాత గేట్లు మూసివేస్తారు. పరీక్ష రాసే విద్యార్థులంతా 8.30 గంటలలోపే కేంద్రాలకు చేరుకోవాలి. –జనార్ధన్రెడ్డి, డీఈఓ, నంద్యాల 16 ఫస్ట్ లాంగ్వేజ్ 18 సెకండ్ లాంగ్వేజ్ 21 ఇంగ్లిష్ 23 మ్యాథ్స్ 25 ఫిజికల్ సైన్స్ 28 బయాజికల్ సైన్స్ 30 సాంఘిక శాస్త్రం 31 సెకండ్ లాంగ్వేజ్ పేపర్–2 ఏప్రిల్ 1 ఆప్షనల్/ఇతర సబ్జెక్టు ఈనెల 16 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పోలీసుస్టేషన్కు చేరుకున్న ప్రశ్నపత్రాలు జిల్లాలో 25,033 మంది విద్యార్థులు విధులు నిర్వర్తించనున్న 1300 మంది ఇన్విజిలేటర్లు -
వెలుగోడు రిజర్వాయర్లో చేప పిల్లల విడుదల
వెలుగోడు: ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద వెలుగోడు రిజర్వాయర్లో మంగళవారం చేప పిల్లలను విడుదల చేశారు. రిజర్వాయర్ ర్యాంప్ వద్ద ప్రజా ప్రతినిధులు, సీడ్ స్టాకింగ్ కమిటీ సభ్యులు అధికారుల సమక్షంలో చేప పిల్లలను విడుదల చేశారు. నంద్యాల జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ జి. హిరా నాయక్ , కర్నూలు జిల్లా డిప్యూటీ డైరెక్టర్, అబ్జర్వర్ డాక్టర్ రంగనాథ్ బాబు, ఉమ్మడి కర్నూలు జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు నవీన్ కుమార్ మాట్లాడుతూ.. మత్స్యకారుల అభి వృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. మత్స్యకారులకు వలలు, పుట్టీలు, ఐస్ బాక్స్లతో కూడిన రెండు చక్రాల వాహనాలు అందించేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని మత్స్య శాఖ అధికారులను కోరారు. కార్యక్రమంలో ఫిష్ సీడ్ స్టాకింగ్ పాయింట్ అధికారి, ఫిషరీస్ డెవలప్ మెంట్ ఆఫీసర్ కె.బి. భరత్ లాల్ నాయక్ తెలుగు సంఘం అధ్యక్షుడు మద్దయ్య, వెంకట సుబ్బన్న, మాజీ సర్పంచ్ ఎంఏ అబ్దుల్ కలాం, రమణ, వీఆర్వో సురేష్ నాథ్ రెడ్డి, మత్స్య సహాయకులు చంద్ర, లోకేష్, ఆనంద్ గౌడ్, శిరోమణి, శివ, అనోక్, నరేంద్ర, విజయ్ కుమార్ పాల్గొన్నారు. -
43 చేనేత సహకార సంఘాల్లో మిగిలింది ఏడు
● కలెక్టరేట్ ప్రాంగణంలోని ఆప్కో షోరూము మూత ● చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తెరుచుకోని రెండు షోరూములు ● చేనేత వస్త్రాల ఉత్పత్తి లేక అంధకారంలో ఆప్కో ● ఉగాది ముంగిట వెలవెలబోతున్న ఆప్కో షోరూములు ● రెండేళ్లుగా కొత్త స్టాక్ సరఫరాలో చేతులెత్తేసిన వైనం ● కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మూతపడిన ఆప్కో గోదాము ● ఐదు నెలలుగా వేతనాలు అందక సిబ్బంది ఇక్కట్లు ● చేనేత సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణలోనూ వైఫల్యంకర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఆప్కో పరిస్థితి దయనీయంగా మారింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆప్కో దివాళా దిశగా పయనిస్తోంది. ఏడాదికొకటి చొప్పున ఆప్కో షోరూములు మూతపడుతున్నాయి. చేనేత వస్త్రాల ఉత్పత్తికి ప్రోత్సాహం కరువైంది. చేనేత సహకార సంఘాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. చేనేత వస్త్రాలను మార్కెటింగ్ చేసే ఆప్కోలో చీకటి రాజ్యమేలుతోంది. దసరా, ఉగాది హిందువులకు అతి పెద్ద పండగలు. ఈ సారి ఉగాదితో పాటే రంజాన్ కలసి వచ్చింది. అయితే ఆప్కో షోరూములు మాత్రం వెలవెలబోతున్నాయి. హుందాతనానికి, మన్నికకు చేనేత వస్త్రాలు పెట్టింది పేరు. వ్యవసాయ రంగం తర్వాత చేనేతకు అంతటి ప్రాధాన్యత ఉంది. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నేడు చేనేత, ఆప్కో మనుగడ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేనేత వస్త్రాల మార్కెటింగ్కు అనేక చర్యలు చేపట్టింది. కొత్త షోరూములను ఏర్పాటు చేయడంతో పాటు ఆన్లైన్ మార్కెటింగ్ సదుపాయం కూడా కల్పించింది. ప్రత్యేక స్కీమ్ల ద్వారా ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంది. ఆప్కో ద్వారా చేనేత వస్త్రాల వ్యాపారం పెంచేందుకు ప్రత్యేక ఆఫర్లు ఇవ్వడం విశేషం. ప్రతి నెలా ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని చేనేత సహకార సంఘాలు ఉత్పత్తి చేసిన వస్త్రాలను కొని షోరూములకు సరఫరా చేయడం జరిగింది. పండుగలకు నెల రోజుల ముందే కొత్త డిజైన్లతో ఆప్కో షోరూములు కళకళలాడేవి. అయితే ప్రస్తుతం రెండేళ్లుగా ఇటు చేనేత, అటు ఆప్కోలో నిస్తేజం నెలకొంది. మూతపడుతున్న షోరూమ్లు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఆప్కో షోరూములు మూతపడే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెలల్లోనే కర్నూలు పాత బస్టాండులోని శ్రీనివాస క్లాత్ మార్కెట్లో ఉన్న ఆప్కో షోరూము మూత పడింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ నేతలే ఆప్కోపై ఒత్తిడి తెచ్చి ఖాళీ చేయించినట్లు సమాచారం. తాజాగా కలెక్టరేట్ ప్రాంగణంలోని చేనేత బజారులో ఉన్న ఆప్కో షోరూము మూతపడటం ఆందోళన కలిగించే విషయం. కలెక్టరేట్కు నిత్యం వందలాది మంది సందర్శకులు వస్తుంటారు. కలెక్టరేట్ ప్రాంగణంలో 35 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. ఇంతటి కీలకమైన ప్రాంతంలోని ఆప్కో షోరూము మూతపడటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. -
జీతాలు చెల్లించండి మహాప్రభో..!
శ్రీశైలంటెంపుల్: అసలే అరకొర జీతం.. ఆపై మూడు నెలలు అవుతున్నా అందని వేతనంతో శ్రీశైల దేవస్థానం పారిశుద్ధ్య, హౌస్కీపింగ్ కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. దేవస్థానం కార్మికులందరికీ ఫేస్ రికగ్నైజేషన్ హాజరు నమోదు ఏర్పాటు చేయడంతో కాంట్రాక్టర్ పప్పులు ఉడకడం లేదు. దీంతో ఏజెన్సీ టెండర్ ప్రకారం పూర్తిస్థాయిలో కార్మికులను సరఫరా చేయక పోవడం, కార్మికులకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికుల వెతలు అన్నీ ఇన్నీ కావు. శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ధ్య, హౌస్కీపింగ్ నిర్వహణను తిరుపతికి చెందిన పద్మావతి హస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సంస్థ దక్కించుకుంది. శ్రీశైల దేవస్థానంతో పాటు రాష్ట్రంలోని ఆరు ప్రముఖ దేవాలయాలకు కలిపి సెంట్రలేజేషన్ పేరుతో చంద్రబాబు ప్రభుత్వానికి అత్యంత అప్తుడైన వ్యక్తికి చెందిన సంస్థకు పారిశుద్ధ్య నిర్వహణను కట్టబెట్టారు. గతేడాది అక్టోబరు 1వ తేదీ నుంచి పద్మావతి సంస్థ శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ధ్య నిర్వహణ చేపడుతుంది. చంద్రబాబు ప్రభుత్వంలో నూతనంగా ఏర్పాటైన పద్మావతి ఏజెన్సీకి సూపర్వైజర్స్–4, శానిటరీ మేసీ్త్ర–52, హౌస్కీపింగ్ వర్కర్స్–506, స్కావెంజర్స్–58, మెషిన్ ఆపరేటర్స్, ట్రాక్టర్ డ్రైవర్స్–4, ఎలక్ట్రిషియన్స్–5, ఏసీ మెకానిక్–3, ప్లంబర్స్–5, కార్పెంటర్స్–4 ఇలా (వీక్లి ఆఫ్ రిలీవర్స్తో) మొత్తం కలిపి సుమారు 641 మందికి కేటాయించారు. వీరికి కార్మిక చట్టం ప్రకారం రూ.12,253 నెలకు వేతనంగా చెల్లిస్తామని టెండర్లో పొందుపర్చారు. ఇందులో ఈపీఎఫ్, ఈఎస్ఐకి పోను బేసిక్ వేతనంగా ఒక్కొక్కరికి నెలకు 10,690 ఇవ్వనున్నారు. అయితే పద్మావతి సంస్థ రెండు నెలలు గడుస్తున్నా కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు అవస్థలు పడుతున్నారు. అయితే పారిశుద్ధ్య, హౌస్కీపింగ్ కార్మికులకు జనవరి, ఫిబ్రవరి వేతనాలు ఇప్పటి వరకు చెల్లించలేదు. ఫేస్ రికగ్నైజేషన్ హాజరుతో ఏజెన్సీకి తిప్పలు పద్మావతి ఏజెన్సీ పూర్తిస్థాయిలో కార్మికులను పనుల్లో పెట్టరనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా పద్మావతి ఏజెన్సీ శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ద్య, హౌస్కీపింగ్ పనులు చేపట్టినప్పటి నుంచి పారిశుద్ద్యంలో భక్తుల సంతృప్తి స్థాయి కిందిస్థాయికి దిగజారిపోయి చివరి స్థానంలో శ్రీశైల దేవస్థానం నిలిచింది. పద్మావతి ఏజెన్సీపై నమ్మకం సన్నగిల్లి కార్మికులకు ఫేస్ రికగ్నైజేషన్ హాజరుతోనే వేతనం నమోదు అయ్యేటట్లు దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పద్మావతి ఏజెన్సీకి ఫేస్ రికగ్నైజేషన్ హాజరు కంట్లో నలకలా మారింది. ఈ క్రమంలో హౌస్ కీపింగ్ కింద పనిచేస్తున్న కార్మికులను పారిశుద్ధ్య నిర్వహణ పనులకు వినియోగించుకుంటున్నారు. అయినా కానీ ఇంకా సిబ్బంది తక్కువగా ఉన్నారు. 30 మంది కార్మికులను సరఫరా చేయలేం పద్మావతి ఏజెన్సీకి టెండర్లో పారిశుద్ద్య, హౌస్కీపింగ్కు కలిపి మొత్తం 641 మంది కార్మికులను సరఫరా చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ సంస్థపై నమ్మకం లేకపోవడంతో చాలా మంది ఆ సంస్థలో పనిచేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఇప్పటికి 30 మంది కార్మికులను తాము సరఫరా చేయలేమని, ఉన్న కార్మికులతో ఓటీ (ఓవర్ టైం) పనిచేయించుకునేందుకు అనుమతించాలని పద్మావతి ఏజెన్సీ దేవస్థానానికి లేఖ రాశారు. ఏజెన్సీ లేఖపై కమిషనర్ అనుమతులకు పంపారు. ప్రత్యేక కమిటీ రద్దుకు ఏజెన్సీ యత్నం పద్మావతి ఏజెన్సీ ద్వారా పారిశుద్ద్యం, హౌస్కీపింగ్, మెటీరియల్, మిషనరీల నిర్వహణపై దేవస్థానం నుంచి బిల్లు చెల్లింపులకు పూర్తి పారదర్శకత కోసం దేవస్థాన ఈఓ నలుగురు అధికారుల బృందంతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ పూర్తిస్థాయిలో పరిశీలించి బిల్లుకు ఆమోదం తెలిపితేనే బిల్లు చెల్లిస్తారు. దేవస్థానం ఏజెన్సీ నిర్వహణపై కమిటీ వేయడం పద్మావతి ఏజెన్సీకి మింగుడు పడ డం లేదు. ఏదో అరకొర మనుషులను, మెటీరియల్ను తీసుకువచ్చి మల్లన్న సొమ్మును కాజేద్దామనుకుంటే దేవస్థాన ఈఓ అడ్డుకట్ట వేయడంపై ఆ సంస్థ ఎండీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఏజెన్సీ నిర్వహణపై వేసిన కమిటీని తొలగించేందుకు ప్రభుత్వ పెద్దలతో ఈఓపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తుంది. శ్రీశైల దేవస్థానంలో పద్మావతి ఏజెన్సీ ఇష్టారాజ్యం మూడో నెల గడుస్తున్నా చెల్లించని జీతాలు పారిశుద్ధ్య, హౌస్కీపింగ్ కార్మికుల అవస్థలు కార్మికులకు ఫేస్ రికగ్నైజేషన్ హాజరు నమోదుకు దేవస్థాన నిర్ణయం కార్మికులను సర్దుబాటు చేయలేని ఏజెన్సీ -
వెలవెలబోతున్న ఆప్కో
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 43 చేనేత సహకార సంఘాలు ఉండగా.. నేడు ఏడు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇందులో కూడా ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం మినహా మిగిలిన వాటి పనితీరు అంతంతమాత్రమే. ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం ఉత్పత్తి చేసిన చేనేత వస్త్రాలను ఆ సంఘమే మార్కెటింగ్ చేసుకుంటోంది. మిగిలిన సంఘాలు ఉత్పత్తి చేసిన వస్త్రాల మార్కెటింగ్కు ఆప్కోనే ఆధారం. రెండేళ్లుగా జిల్లాలోని చేనేత సహకార సంఘాలు ఉత్పత్తి చేసిన వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తే సంఘాలు యాక్టివ్గా పనిచేసే అవకాశం ఉంటుంది. అయితే ఎన్నికలకు ప్రభుత్వం ఆసక్తి చూపని పరిస్థితి. రెండేళ్లుగా మంగళగిరిలోని ఆప్కో గోదాము నుంచి కొత్త సరుకు రాకపోవడంతో కర్నూలు ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని ఆప్కో గోదాము మూతపడింది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు, ఆదోని, శ్రీశైలంలలో ఆప్కో షోరూములు ఉన్నాయి. కొత్త సరుకు రాకపోగా ఉన్నది పాతబడిపోయింది. పాత సరుకు కొనేందుకు వినియోగదారులు ముందుకు రాకపోవడంతో మూటకట్టి మంగళగిరి గోదాముకు పంపుతున్నారు. -
నంద్యాలకు చేరుకున్న పది ప్రశ్నాపత్రాలు
నంద్యాల(న్యూటౌన్): ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నాపత్రాలు జిల్లాకు స్టాక్ పాయింట్ కేంద్రానికి చేరుకున్నట్లు డీఈఓ జనార్దన్రెడ్డి తెలిపారు. పట్టణంలోని స్టాక్ పాయింట్గా ఉన్న శ్రీచైతన్య పాఠశాల నుంచి జిల్లాలోని 12 రూట్లు ఏర్పాటు చేసి పేపర్–1 ప్రశ్నాపత్రాన్ని తరలించారు. ఈ రూట్లలోని పోలీస్టేషన్లలో భద్రత పరిచేందుకు డీఈఓ పర్యవేక్షణలో రూట్ ఆఫీసర్లతో పోలీసు స్టేషన్లకు పంపించినట్లు తెలిపారు. అలాగే బుధవారం పేపర్–2 ప్రశ్నాపత్రాన్ని కూడా ఏర్పాటు చేసిన రూట్లలో పోలీసు స్టేషన్లో భద్రపరిచేందుకు పంపడం జరుగుతుందన్నారు. వీరి వెంట విద్యాశాఖ అధికారులు రఘురామిరెడ్డి, జగన్మోహన్రెడ్డి, ఎంఈఓ–2 శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. పేద ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం నందికొట్కూరు: పేద ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం కల్పిస్తామని కర్నూలు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. మంగళవారం పట్టణంలోని సబ్జైల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి పలు సూచనలు చేశారు. 60 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైన ఉన్నారా అని అడిగి తెలుసుకున్నారు. సదుపాయలు, భోజనాలు గురించి ఆరా తీశారు. అనంతరం కోర్టులో పోలీసులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈయన వెంట జూనియర్ సివిల్ జడ్జి దివ్య, సబ్జైల్ ఇన్చార్జ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, న్యాయవాది వెంకటేశ్వర్లు, వైద్యు లు ప్రవీణ్కుమార్, స్థానిక మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ వారు, తదితరులు ఉన్నారు. ముస్లిం సామూహిక వివాహాలకు దరఖాస్తులునంద్యాల (వ్యవసాయం): పట్టణంలోని అంజుమన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే పేద ముస్లిం ఉచిత సామూహిక వివాహాలకు దర ఖాస్తు చేసుకోవాలని సంస్థ అధ్యక్షుడు నష్యం మహమ్మద్ ఖుదూస్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 19వ తేదీన ముస్లిం యువతీ యువకులకు అంజుమన్ షాదీ ఖానాలో ఉచిత సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నట్లు తెలి పారు. ఏప్రిల్ 12 తేదీలోపు అంజుమన్ షాదీఖానాలో ఉచిత దరఖాస్తులు పొంది ఆధార్ కార్డు, పాస్ ఫొటోలు రెండు, యువతి బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ అందజేయాలన్నారు. ఏప్రిల్ 19వ తేదీ జరిగే వివాహ వేడుకల్లో నిఖా ఖర్చులతో పాటు వధువుకు రూ.50 వేల చెక్కును అందజేస్తామన్నారు. ఈ అవకాశాన్ని పేద ముస్లిం తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 14న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను ఈ నెల 14న నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి నోట్ ఉత్తర్వుల మేరకు ఈ సమావేశాలను ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్థానిక జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో నిర్వహిస్తామన్నారు. సమావేశాల్లో షెడ్యూల్ ప్రకారం గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, విద్య మరియు వైద్యం, మహిళాభివృద్ధి–శిశు సంక్షేమం, పను లు – ఆర్థిక ప్రణాళిక అంశాలపై సమీక్ష కొనసాగుతుందన్నారు. సమావేశాలకు కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన సంబంధిత స్థాయీ సంఘాల సభ్యులు, అధికారులు తమకు కేటాయించిన సమయానికి హాజరు కావాలన్నారు. -
విస్తృతంగా రుణాలు మంజూరు చేయాలి
● జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్నంద్యాల: ప్రభుత్వ పథకాలకు అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకులు విస్తృతంగా రుణాలు మంజూరు చేస్తూ ఆర్థిక సహకారం అందించాలని జిల్లా రెవె న్యూ అధికారి రాము నాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ(డీఎల్ఆర్సీ) సమావేశం జిల్లా రెవెన్యూ అధికారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. ముఖ్యంగా రైతులు, స్వయం ఉపాధి పొందే యువత, మహిళా సంఘాలకు రుణాల మంజూరులో బ్యాంకులు మరింత చురుకుగా వ్యవహరించాలన్నారు. ప్రధానమంత్రి ముద్ర యోజన, స్టాండప్ ఇండియా, పీఎంఎఫ్బీవై వంటి పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు రుణాలను సకాలంలో మంజూరు చేయాలన్నారు. అలాగే వ్యవసాయ, పంట రుణాల పంపిణీ, స్వయం సహాయక సంఘాలకు రుణాల మంజూరుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో ప్రాధాన్యత రంగ రుణాల పంపిణీ లక్ష్యాలను బ్యాంకులు తప్పనిసరిగా చేరుకోవాలన్నారు. నాబార్డ్ డీడీఎం కార్తీక్ మాట్లాడుతూ.. రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన పంటలకు ఎగుమతి అవకాశాలు ఉన్నప్పటికీ, స్థానిక బ్యాంకుల నుంచి ఎగుమతి క్రెడిట్ పొందడంలో వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రైతులు, యువతలో అవగాహన పెంచేందుకు బ్యాంకుల్లో బ్రోచర్లు, పోస్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ పథకంలో ప్రాజెక్టు ఖర్చుపై 40 శాతం వరకు సబ్సిడీ లభిస్తుందన్నారు. ఆర్బీఐ ఎల్డీఓ రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలోని 43 బ్యాంకుల్లో 15 బ్యాంకుల్లో మాత్రమే కేవైసీ 99.68 శాతం నమోదైందన్నారు. ఈ విషయంలో ఆయా బ్యాంకులు తక్షణమే ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు ఎల్డీఎం రవీంద్ర కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద కేటాయించిన లక్ష్యాల సాధనలో బ్యాంకులు సాధించిన ప్రగతిని కమిటీకి వివరించారు. అనంతరం డిజిటల్ పేమెంట్స్, నాబార్డ్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ నరసింహారావు, వివిధ బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేయాలి
● జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ కర్నూలు (సెంట్రల్): ప్రభుత్వ పాఠశాలలను, అంగన్వాడీ కేంద్రాలను కచ్చితంగా తనిఖీ చేయాలని ఆర్డీఓ, తహసీల్దార్, ఎంపీడీఓలను జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, హౌసింగ్, రెవెన్యూ తదితర అంశాలపై జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మధ్యాహ్నం విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, రుచి ఏ విధంగా ఉందనే విషయాలను తనిఖీ చేయాలన్నారు. హౌసింగ్కి సంబంధించి ఆప్షన్–3 కింద కాంట్రాక్టర్లు నిర్మించిన ఇళ్లలో 2,522 ఇళ్లలో నిర్మాణ లోపాలను గుర్తించారన్నారు. ఇప్పటివరకు 1,521 ఇళ్ల నిర్మాణాల లోపాలను సరిచేయడం జరిగిందని, మిగిలిన 1001 వాటిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఉగాది నాటికి పూర్తి చేయాల్సిన ఇళ్ల నిర్మాణాలలో పురోగతి లేకపోవడంపై జేసీ అసహనం వ్యక్తం చేశారు. రెవెన్యూ క్లినిక్కి సంబంధించి పరిష్కరించాల్సిన సమస్యలు పెండింగ్లో ఉన్నాయన్నారు. అందులో ప్రధానంగా వర్గీకరణ మార్పు (క్లాసిఫికేషన్ ఛేంజ్), నిషేధిత జాబితా (ప్రొహిబిటెడ్ లిస్ట్) అంశాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయన్నారు. ఇనామ్ భూములకు సంబంధించి వాటివి కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయన్నారు. మ్యూటేషన్కి సంబంధించి వచ్చిన అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏ వెళ్లకుండా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, హౌసింగ్ పీడీ చిరంజీవి, డీఈఓ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్యూ విద్యార్థుల భిక్షాటన
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఏఐఎస్ఏ, పీడీఎస్యూ, ఆర్పీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం వినూత్నంగా నిరసన చేపట్టారు. విద్యార్థి సంఘాల నేతలు వర్సిటీలో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున, పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు రమణ, ఆర్పీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, ఏఐఎస్ఏఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.శరత్కుమార్ మాట్లాడుతూ.. వర్సిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఖజానాకు కన్నం వేస్తున్న రిజిస్ట్రార్ను వెంటనే పదవి నుంచి తొలగించాలన్నారు. రిజిస్ట్రార్పై పలుమార్లు వర్సిటీ వీసీకి ఫిర్యాదు చేసినా విచారణకు స్పందించకపోవడం, తొలగించకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. వర్సిటీలో జరుగుతున్న వ్యవహారాలపై ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి, ఉన్నత విద్యాశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు హరిష్, రాజు, ఏఐఎస్ఏ నాయకులు రాము, ఆర్పీఎస్ నాయకులు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తాం
కర్నూలు(సెంట్రల్): సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేంద్ర, అబ్దుల్లా డిమాండ్ చేశారు. సోమవారం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ కోసం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారన్నారు. అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా హామీని అమలు చేయకపోవడంతో ఎంతో మంది నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. మరోవైపు జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోవడంతోపాటు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేయని నేపథ్యంలో ఒక్కో నిరుద్యోగికి రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. లేకపోతే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. -
అగ్నిపూలు విరబూసి.. అందాలు వికసించి!
శిశిర రుతువు రాకతో మరో వసంతానికి స్వాగతం పలుకుతూ ఆకుల వలువలను నేలరాల్చి నిలుచున్న వృక్షాలు నల్లమలలో పసిపిల్లలను తలపిస్తుంటాయి. అలాంటి చెట్ల సమూహంలో మోదుగ చెట్లు మరింత విశిష్టంగా కనిపిస్తాయి. ఆకులన్నీ రాలిన మోదుగ చెట్లు ఆకుల స్థానంలో ఎర్రటి మొగ్గలు పూస్తాయి. అవి విచ్చుకుని అడవి తల్లికి కొత్త అందాలను అద్దుతాయి. అందుకే వీటిని అగ్ని పూలు అని, మంకెన పూలు అని పిలుస్తూ కవితలు రాస్తుంటారు. ఆంగ్లంలో ఈ పూలను ఫ్లేమ్ ఆఫ్ది ఫారెస్ట్గా పిలుస్తారు. జనవరి చివరి వారం నుంచి మోదుగ పూలు పూస్తూ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. నల్లమల వ్యాప్తంగా మోదుగ పూలు విస్తారంగా కనపడుతున్నాయి. తొలకరి పలకరించే వేల మోదుగ మోడులు చిగురులు తొడుగుతాయి. – ఆత్మకూరు రూరల్ -
ఘనంగా శివపార్వతులకు పల్లకీ సేవ
బనగానపల్లె రూరల్: యాగంటి క్షేత్రంలోని శ్రీ ఉమామహేశ్వరస్వామి దేవస్థానంలో స్వామివారికి పల్లకీ సేవ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయంలో ఏకశిలా రూపంలో కొలువైన శ్రీ ఉమామహేశ్వరస్వామికి అభిషేకం, అర్చన తదితర ప్రత్యేక పూజలు చేపట్టారు. సాయంత్రం శివపార్వతుల ఉత్సవ విగ్రహాలకు పల్లకీ సేవా కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ పాండురంగారెడ్డి, చైర్మన్ బండి మౌలిశ్వరరెడ్డి, పాతపాడు సర్పంచ్ మహేశ్వరరెడ్డి తదితర భక్తులు ఆలయ కమిటి సభ్యులు పాల్గొన్నారు. హాస్టల్ లైబ్రరీకి పుస్తకాల వితరణ కర్నూలు (అర్బన్): నగరంలోని సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల బాలికల నెం.1 వసతి గృహంలోని లైబ్రరీకి పంచాయతీరాజ్ డీఈఈ, ఏపీఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు పి.మల్లికార్జున, నీట్, ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను ఇచ్చినట్లు వసతి గృహ సంక్షేమాధికారిణి బి.బెన్నమ్మ తెలిపారు. సోమవారం స్థానిక హాస్టల్లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ శ్రీశైలం ప్రాజెక్టు పూర్వ విద్యార్థుల అసోసియేషన్ సభ్యులుగా కూడా ఆయన పేద, మధ్య తరగతి విద్యార్థుల విద్యకు సంబంధించి పలు సేవా కార్యక్రమాలను కూడా చేపడుతున్నారని తెలిపారు. దాతల నుంచి కళాశాల విద్యార్థినులకు అవసరమైన పుస్తకాలను సేకరించి హాస్టల్ లైబ్రరీలో నిక్షిప్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ లైబ్రరీని హాస్టల్లోని విద్యార్థినులందరూ సద్వినియోగం చేసుకుంటున్నారని బెన్నమ్మ తెలిపారు. -
హెల్త్ సెక్రటరీలకు పనిభారం తగ్గించాలి
కర్నూలు(హాస్పిటల్): గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే హెల్త్ సెక్రటరీలకు పనిభారం తగ్గించాలని ఏపీ గ్రామ, వార్డు సచివాలయ హెల్త్ సెక్రటరీ అసోసియేషన్(సీఐటీయూ) రాష్ట్ర కార్యదర్శి సంధ్యారాణి, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, జిల్లా ప్రధాన కార్యదర్శులు పీఎస్. రాధాకృష్ణ, ఎండీ అంజిబాబు, శ్రామిక మహిళా రాష్ట్ర నాయకులు పి.నిర్మల డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద హెల్త్ సెక్రటరీలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాప్ల పనిభారం తగ్గించాలని, ప్రమోషన్లు కల్పించాలని, జీవో నెం.124ను అమలు చేయాలని కోరారు. మదర్ డిపార్ట్మెంట్ అయిన మెడికల్ అండ్ హెల్త్కు హెల్త్ సెక్రటరీలను బదలాయించాలని డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలో హెల్త్ సెక్రటరీలకు ఇంక్రిమెంట్ అమలు జరిగే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, పీ–4 సర్వే, మున్సిపల్ తదితర సర్వేలపై సర్వే పేరుతో సతమతమవుతున్నారని, వారిని మారుమూల గ్రామాలకు రాత్రి 10 గంటల వరకు తిప్పుతున్నారని మండిపడ్డారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ ఏఓ అరుణకు వారు వినతి పత్రం సమర్పించారు. సీఐటీయూ న్యూసిటీ కమిటీ అధ్యక్షులు వై.నాగేష్, హెల్త్ సెక్రటరి యూనియన్ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు మహేశ్వరి, నంద్యాల జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరమ్మ, మాధవి, శంషాద్, సుజాత, రాధాబాయి, నాగమణి, రజని, వరలక్ష్మిదేవి పాల్గొన్నారు. -
ఆస్తి కోసం భర్త వేధిస్తున్నాడు.. న్యాయం చేయండి
● ఎస్పీకి బాధితురాలి ఫిర్యాదుకర్నూలు: ‘మేమిద్దరం పదేళ్లుగా దూరంగా ఉంటున్నాం... నా పేరు మీద గూడూరులో ఉన్న ప్రైవేటు స్కూల్ను భర్త రమేష్ ఆక్రమించుకోవాలని నా సంతకాలు ఫోర్జరీ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. పిల్లలను కూడా పట్టించుకోకుండా ఆస్తి, చెక్బౌన్స్ కేసులతో వేధింపులకు గురిచేస్తున్నాడు’ అని కర్నూలుకు చెందిన రాధిక ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారు. కర్నూలులోని రెండో పట్టణ పోలీస్స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీజీఆర్ఎస్కు మొత్తం 65 ఫిర్యాదులు వచ్చాయి. వాటన్నిటిపై చట్టపరిధిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కారమయ్యేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, డీఎస్పీ బాబుప్రసాద్, సీఐ శివశంకర్, తదితరులు కూడా పీజీఆర్ఎస్లో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. పీజీఆర్ఎస్కు వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని... ● విద్యాంజలి పథకం కింద ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి హైదరాబాద్కు చెందిన సుజాత ఠాకూర్ రూ.40 లక్షలు డబ్బులు తీసుకుని మోసం చేసిందని కర్నూలు బీక్యాంప్కు చెందిన అహ్మదున్నీసా ఫిర్యాదు చేశారు. ● బెంగళూరులోని డెలాయిట్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి పామిడికి చెందిన చింతల సోమశేఖర్ రూ.లక్ష తీసుకుని మోసం చేశాడని ఆదోని పట్టణానికి చెందిన నరేంద్రకుమార్ ఫిర్యాదు చేశారు. ● పెద్ద కుమారుడు తన బాగోగులు పట్టించుకోకుండా ఆరోగ్యపరిస్థితి బాగలేకపోయినప్పటికీ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని సి.బెళగల్ మండలం కంపాడు గ్రామానికి చెందిన యశోదమ్మ ఫిర్యాదు చేశారు. ● భర్త గుండెపోటుతో మృతిచెందారని, ఆయన పేరు మీద వచ్చిన జీవిత బీమా (ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారని, విచారణ జరిపించి న్యాయం చేయాలని ఆస్పరి మండలానికి చెందిన సుగుణమ్మ ఫిర్యాదు చేశారు. -
హంస వాహనంపై రంగనాథస్వామి
మద్దికెర: పెరవలి గ్రామంలో శ్రీరంగనాథస్వామి సోమవారం హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం ఉత్సవమూర్తులను పల్లకీలో కొలువుంచి ఊరేగింపుగా స్థానిక బావి వద్దకు తీసుకెళ్లి వసంతోత్సవం జరిపారు. ఈ సందర్భంగా యువకులు రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పూజలు నిర్వహించారు. రాత్రి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి హంసవాహనంపై కొలువుంచారు. దేవాలయ ఆవరణలో పల్లకీ సేవ చేశారు. అనంతరం గ్రామ పురవీధుల గుండా ఊరేగింపు చేశారు. ఆలయ ఈఓ రెబ్బావీరయ్య, ఆలయ చైర్మన్ రవికుమార్, సభ్యులు రామయ్య, నరసింహులు, రంగస్వామి, భక్తులు పాల్గొన్నారు. -
శ్రీశైలం ఘాట్లో త్రుటిలో తప్పిన ప్రమాదం
శ్రీశైలం: సున్నిపెంట – శ్రీశైలం ఘాట్ మార్గంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. రహదారిలో మలుపు వద్ద భారీ వృక్షం విరిగి రోడ్డుపై పడింది. ఆ సమయంలో వాహనాల రాకపోకలు లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బందితో అక్కడికి చేరుకుని చెట్టును తొలగించే వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా చేశారు. ఘాటు మార్గంలో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ వారు వాహన చోదకులకు సూచించారు. కర్నూలు(సెంట్రల్): తాను ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కర్నూలు, డోన్, నంద్యాల ప్రాంతాల్లో చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కాంట్రాక్టర్ హనుమదాసు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక తాను రూ.3 కోట్లతో ఆయా ప్రాంతాల్లో రోడ్లు, మంచినీటి పనులకు సంబంధించిన పనులు చేశానని, అయితే ఇంత వరకు ఒక్క రూపాయి బిల్లు చెల్లించలేదన్నారు. అప్పుల తెచ్చి పనులు చేయించానని, ప్రభుత్వం చెల్లించకపోవడంతో వడ్డీలు పెరిగి అప్పులపాలయ్యాయని, వెంటనే చెల్లించకపోతే ఇబ్బందికరంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో పాము కల్లూరు: స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో సోమవారం పాము కలకలం రేపింది. కార్యాలయంలో పని చేసి సిబ్బంది బైక్లోకి పాము దూరింది. గుర్తించిన స్థానికులు, కార్యాలయం సిబ్బంది చాలా సేపు దానిని బయటకు రప్పించడానికి ప్రయత్నం చేశారు. ఫలితం లేకపోవడంతో పాములు పట్టే వ్యక్తి వచ్చి బయటకు తీశారు. దీంతో కార్యాలయ సిబ్బంది, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పాముకాటుతో వ్యక్తి మృతి కొత్తపల్లి: పాముకాటుకు గురై చికిత్స పొందుతూ కోలుకోలేక ఎర్రమఠం గ్రామానికి చెందిన టేకులనాగరాజు(50)అనే వ్యక్తి మృతి చెందాడు. మొక్కజొన్న పంటనుకు నీళ్లు పెట్టేందుకు పొలానికి వెళ్లి ఫిబ్రవరి 28న ఈయన పాముకాటుకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లగా అక్కడ ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక సోమవారం మృతిచెందాడు. మృతుడి తండ్రి టేకుల పెద్ద పుల్లయ్య ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ రవీంద్రబాబు తెలిపారు. వైద్య విద్యార్థిని మృతికి కారణాలు తేల్చండి డోన్ రూరల్: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో విధులు నిర్వర్తిస్తూ తన కుమార్తె బత్తుల దీపిక గత నెల 5న అనుమానాస్పద స్థితిలో మరణించిందని, ఇందుకు గల కారణాలను ఇప్పటివరకు వెల్లడించకపోవడం అనుమానాలకు తావిస్తోందని బాలిక తండ్రి, ఏపీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఆధ్యక్షుడు బత్తుల కోదండ రామిరెడ్డి వాపోయారు. సోమవారం డోన్ మండలం కొత్తబురుజు గ్రామ పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె మృతిపై అనుమానాలను నివృత్తి చేయాలని మంత్రులతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను నెల రోజుల నుంచి కోరుతున్నా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు, వైద్యాధికారులు అనేక కోణాల్లో విచారించినా సరైన కారణాలు తెలపకపోవడం తమ కుటుంబ సభ్యులను మరింత ఆందోళనకు గురి చేస్తోందన్నారు. పోస్టుమార్టం నివేదికను తక్షణమే వెవెల్లడించాలని కోరారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్కు సైతం వినతి పత్రం సమర్పించారు. -
కదలని ఆర్టీసీ బస్సు
కదలని ఆర్టీసీ బస్సును డ్రైవర్లు, కండక్టర్లు నెట్టుతున్న ఈ దృశ్యం సోమవారం కోసిగి ఆర్టీసీ బస్టాండ్లో కనిపించింది. కోసిగి నుంచి ఆదోనికి వెళ్లేందుకు ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ఎక్కి కూర్చున్నారు. అయితే బస్సు ఎంతసేపటికీ స్టార్ట్ కాకపోవడంతో కండక్టర్, మరో బస్సు డ్రైవర్లు, ప్రయాణికులు వెనుక నుంచి తోయాల్సి వచ్చింది. ఇలాంటి బస్సులు కొన్ని సందర్భాల్లో మార్గమధ్యలో కూడా నిలిచి పోతున్నాయని, కండీషన్లో ఉండేవి నడపాలని ప్రయాణికులు కోరారు. – కోసిగి -
హామీలు విస్మరించి.. విమర్శలతో ముగించి!
● బాబు పర్యటన అలా ముగిసింది..డోన్: మండల పరిధిలోని కొత్తబురుజు గ్రామంలో సోమవారం సీఎం చంద్రబాబు ‘రైతన్నా మీ కోసం’లో భాగంగా చేపట్టిన పర్యటన ఆద్యంతం రాజకీయ విమర్శలు, ఆరోపణలకే పరిమితమైంది. రైతులకు కొత్త పాస్ పుస్తకాలు రాజముద్రతో ఇచ్చానని పేర్కొంటూనే రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఏమి చర్య తీసుకుంటుందనేది మాత్రం చంద్రబాబు చెప్పలేకపోయారు. నిత్యం కరువు కాటకాలతో అల్లాడిపోయే డోన్ నియోజకవర్గ ప్రాంత రైతులకు సాగునీటి సౌకర్యం కోసం తీసుకుంటున్న ప్రణాళికా బద్ధమైన చర్యలను చెప్పడంలో కూడా విఫలమయ్యారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని వ్యక్తిగతంగా దూషించడం, గత ప్రభుత్వం వ్యవస్థల్లో విధ్వంసం సృష్టించిందని ప్రజలను నమ్మించే ప్రయత్నమే తప్పితే ఆయన గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, వాటిలో నెరవేర్చిన వాటి సంఖ్యను చెప్పకపోవడం గమనార్హం. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చివేయడం, జంతు చర్మాలతో చేసిన చెప్పులతో వేంకటేశ్వర స్వామి దర్శనానికి చంద్రబాబు వెళ్లడాన్ని ఈ సందర్భంగా కొందరు గుర్తుచేసుకున్నారు. టైటిల్ డీడ్ యాక్ట్ను రద్దుచేస్తానని, భూ రీసర్వేను ఆపివేస్తానని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు అదేవిధానాన్ని కొనసాగించడాన్ని కూడా రైతులు గుర్తుచేసుకుంటున్నారు. హామీలు తూచ్! సభ ప్రారంభం కాగానే ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి డోన్ను తిరిగి కర్నూలు జిల్లాలో విలీనం చేయాలని, అవుకు రిజర్వాయర్ నుంచి ప్యాపిలి మండలం కొండ మీది పల్లెలకు సాగునీరు అందజేయాలని, నియోజకవర్గ వ్యాప్తంగా అనేక గ్రామాల వద్ద భూగర్భ జలాల పెంపునకు అధిక నిధులు విడుదల చేయాలని కోరినా సీఎం చంద్రబాబు స్పందించలేదు. అన్నీ పరిశీలిస్తామని ముక్తసరిగా చెప్పి దాటవేయడం గమనార్హం. జలదుర్గం మండల కేంద్రం ఏర్పాటు అంశాన్ని ఎత్తకపోవడం ప్రజల్లో చర్చకు తావిచ్చింది. బీసీ సర్పంచ్కు అవమానం సభ ప్రారంభమై అరగంట గడిచినా స్థానిక గ్రామ సర్పంచ్ అయిన బీసీ మహిళ ప్రమీలను వేదికపైకి పిలవకపోవడం పట్ల రైతుల్లో ఆగ్రహం కనిపించింది. ఉడుములపాడు సర్పంచ్ ఉప్పరి రాధమ్మ భర్త సర్పంచ్ లేకుండా గ్రామసభ ఎలా జరుపుతారంటూ కేకలు వేస్తూ సర్పంచ్ను పిలవండి అంటూ గట్టిగా అరిచారు. దీంతో అప్రమత్తమైన అధికారులు తమ తప్పు తెలుసుకొని సర్పంచ్ ప్రమీలను వేదికపైకి ఆహ్వానించారు. -
అబద్ధపు హామీలతో నిలువునా మోసం
బేతంచెర్ల: ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అబద్ధ్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేశారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. సోమవారం పట్టణంలోని కోటపేట కాలనీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులను మాజీ మంత్రి బుగ్గన ఆప్యాయంగా పలకరించి, వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. కాలనీలో నెలకొన్న సమస్యలను పలువురు మహిళలు బుగ్గనకు వివరించారు. అధికారులు నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం వారానికి ఒక్కసారి కుళాయిలకు నీరు వదులుతున్నారని, డ్రైనేజీ కాల్వలు శుభ్రం చేయడం లేదని తెలిపారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో జగనన్న సీఎం అయ్యింటే డోన్ నియోజకవర్గం రూపురేఖలు మారేవన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బేతంచెర్ల పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ. 351 కోట్లతో గోరుకల్లు రిజర్వాయర్ నుంచి పైపులైన్ వేయించి తాగునీటి సమస్య పరిష్కారానికి చొరవ చూపామన్నారు. మన ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే పట్టణంలో సంపులు, పైపులైన్లు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం పూర్తయి 24 గంటలు నీరు అందుబాటులో ఉండేదన్నారు. బేతంచెర్ల నగర పంచాయతీలో పాలక మండలి పనులకు అధికార పార్టీ అడ్డు పడుతుందని మాజీ మంత్రి బుగ్గన విమర్శించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి సీఎం చంద్రబాబుకు పట్టదన్నారు. గత ప్రభుత్వంలో చేపట్టిన పనులను కూడా పూర్తి చేయలేని స్థితిలో ఉన్నారన్నారు. ప్రజా సమస్యలను విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అలాగే పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయా గ్రామాలు, పట్టణానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ఆర్యవైశ్యులు, రజక సంఘం నాయకులు మాజీ మంత్రి బుగ్గనను మర్యాద పూర్వకంగా కలిశారు. రజక సంఘం నాయకులు బుగ్గనను గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ చలం రెడ్డి, వివిధ కార్పొరేషన్ల మాజీ డైరెక్టర్లు బాబురెడ్డి, మూర్తుజావలి, ఖాజ హుసేన్, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు బుగ్గన చంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రుడు, అధికార ప్రతినిధి మురళీ కృష్ణ, టౌన్ కన్వీనర్ జాకీర్ హుసేన్, బ్రహ్మనాయుడు, తిరుమలేష్ , రామ చంద్రుడు, మహేష్, సలీం, ఖాజా పాల్గొన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి సీఎంకు పట్టదు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధంకండి మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి -
కన్నడ భక్తులకు మెరుగైన వసతులు
శ్రీశైలంటెంపుల్: భ్రమరాంబ, మల్లన్న దర్శనానికి శ్రీశైలానికి తరలివస్తున్న భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తామని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు అన్నారు. దేవస్థాన పరిపాలన భవనంలోన సమీక్షా సమావేశ మందిరంలో ఉగాది మహోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా దేవస్థాన ఈఓ మాట్లాడుతూ.. ఉగాది మహోత్సవాల్లో ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు ఐదు రోజుల పాటు భక్తులందరికీ అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తామన్నారు. 16వ తేదీ వరకు విడతల వారీగా మల్లన్న స్పర్శదర్శనం కల్పిస్తున్నామన్నారు. క్యూ కాంప్లెక్స్, ఆలయ విభాగాలు పరస్పరం సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా విడతల వారీగా దర్శనాలను కల్పించాలన్నారు. క్యూకాంప్లెక్స్లో, క్యూలైన్లలో వేచిఉన్న భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారాన్ని అందించాలని ఆదేశించారు. సిబ్బంది అందరూ నిరంతరం అప్రమత్తంగా ఉంటు విధులు నిర్వర్తించాలని అన్నారు. క్యూలైన్ల నిర్వహణలో పోలీసు శాఖ సహకారాలు పొందాలన్నారు. అటవీమార్గంలో కాలినడక వచ్చే భక్తులకు అటవీశాఖ సహకారంతో ఏర్పాట్లు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి అంతరాయం లేకుండా నీటిసరఫరాకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రశాంతంగా సాగుతున్నాయి. సోమ వారం రెండో సంవత్సరం విద్యార్థులకు మ్యాథమ్యాటిక్స్–2, వొకేషనల్–2 పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షలకు 7,263 మంది విద్యార్థులకు గాను 7,112 మంది హాజరు కాగా 151 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ శంకర్నాయక్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 97.92 శాతం హాజరైనట్లు తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారన్నారు. -
జలాధివాసం వీడుతున్న సంగమేశ్వరుడు
కొత్తపల్లి: సప్తనదీ సంగమ ప్రాంతంలో వెలసిన ప్రాచీన సంగమేశ్వరాలయం జలాధివాసం వీడుతోంది. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 885 అడుగులు కాగా సోమవారం 850 అడుగులకు చేరుకుంది. దీంతో ఆలయం మండపం కిందిభాగం వరకు నీరు తగ్గింది. మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రాచీన సంగమేశ్వరాలయం బయటపడనుంది. మల్లన్న సేవలో.. శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న పీఠాధిపతికి దేవస్థాన ఈఓ శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యు లు చిట్టిబోట్ల భరద్వాజశర్మ, అర్చకులు, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో భారతీ మహాస్వామి వారి గౌరవార్థం వేదగోష్ఠి నిర్వహించారు. తరువాత గురువందన కార్యక్రమం జరిపారు. అనంతరం మహాస్వామి వారు అనుగ్రహ భాషణం చేశారు. 13న పీఎం కిసాన్ సాయం విడుదల కర్నూలు(అగ్రికల్చర్): పీఎం కిసాన్ 22వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 13న విడుదల చేయనుంది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.6వేల ప్రకారం ఆర్థిక సహాయాన్ని మూడు విడతలుగా విడుదల చేస్తోందని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. ఇప్పటికే రెండు విడతలుగా రూ.4వేలు రైతుల బ్యాంకు ఖాతాలకు విడుదల చేసిందని, మూడవ విడత సాయం ఈ నెల 13న విడుదలవుతుందన్నారు. -
అన్నదాన యజ్ఞానికి అంతా సిద్ధం
● సరంజామాతో తరలివచ్చిన మహారాష్ట్ర బృందంఆత్మకూరురూరల్: ఏ చిన్న వస్తువు కావాలన్నా రోడ్డు పాయింట్కు రావాలంటే ఆరేడు కి.మీ అడవిలో నడవాల్సిందే. అలాంటి చోట 16 ఏళ్లుగా ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీశైలం వెళ్లే కన్నడ పాదయాత్రికుల కోసం అన్నదానం కొనసాగించడం అంటే ఒక యజ్ఞంతో సమానమే. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలోని ఇచ్చలకరంజికి చెందిన శ్రీశైల మల్లికార్జున మల్టీపర్పస్ ట్రస్ట్కు చెందిన వలంటీర్లు అన్నదాన యజ్ఞం చేపట్టేందుకు సిద్ధమై సోమవారం నల్లమలకు చేరుకున్నారు. ఆత్మకూరు అటవీ డివిజన్ నాగలూటిలో ఉన్న వీరభద్రాలయం వద్ద వారు ఏటా ఉగాది ఉత్సవాల సందర్భంగా 10 రోజుల పాటు 24 గంటలు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ట్రస్ట్ అధ్యక్షులు మాలగొండ్ల పాటిల్, కార్యదర్శి పాండుతో పాటు 200 మంది స్వచ్ఛంద సేవకులు ఈ అన్నదాన క్రతువుకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది భక్తుల కోసం చపాతీలు కూడా అందివ్వనున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఇందుకోసం రోజుకు 50 వేల చపాతీలు తయారు చేసే మిషన్ ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఐదు భారీ లారీల్లో కావలసిన కిరాణ సరుకు కూడా ఇందుకోసం వినియోగిస్తున్నారు. ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పాదయాత్రతో శ్రీశైలం వెళ్లే భక్తులు అటవీశాఖ నియమ నిబంధనల మేరకు నడుచుకోవాలని వారు ఈ సందర్భంగా సూచించారు. -
నిబంధనలకు ‘మట్టి’కొట్టి!
మహానంది: నల్లమల అటవీ ప్రాంతంలో యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి. పట్టపగలే జేసీబీలు పెట్టి పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నా అడ్డుకునే వారు కరువయ్యారు. అధికార పార్టీకి చెందిన నేతలే కావడంతో అధికారులు సైతం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మహానంది, శిరివెళ్ల మండలాల పరిధిలోని అంకిరెడ్డి చెరువు, వజ్రాల వంక వాగు పరిసరాల్లో ఎర్రమట్టి అధికంగా లభిస్తుండటంతో అక్రమార్కులు ప్రకృతి సంపదను కొల్లకొడుతున్నారు. విలువైన ఎర్రమట్టిని ఇటుకల బట్టీలకు, గ్రావెల్ను వెంచర్లకు తరలిస్తూ రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. మహానందితో పాటు సమీపంలోని పెద్దకొట్టాల, నంద్యాల పట్టణాల్లోని పలు వెంచర్లకు మట్టి, గ్రావెల్ తరలిపోతుంది. అనుమతులు లేని కొందరు రాత్రి వేళల్లో మట్టిని తరలిస్తూ కొల్లగొడుతున్నారు. ఇంటి నిర్మాణాలు, పొలాల చదును కోసం ఓ ట్రాక్టర్ మట్టిని తీసుకెళ్తే పట్టుకుని కేసులు పెట్టి జరిమానాలు విధించే రెవెన్యూ, భూగర్భ గనులశాఖ అఽధికారులకు ఇవేమి కనిపించకపోవడం పట్ల పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎర్రమట్టి, గ్రావెల్ను టిప్పర్ల ద్వారా తరలిస్తుండటంతో నంద్యాల – గిద్దలూరు మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. నిండుగా మట్టిని, గ్రావెల్ను నింపుకుని వెళ్తుడటంతో వెనుకగా వెళ్లే వారి కళ్లల్లో మట్టి కొట్టుకుని పోతుంది. గతంలో టిప్పర్ల వలన రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. దీంతో పాటు గాజులపల్లె మెట్ట వద్ద నిత్యం రద్దీ ఉంటుంది. వీటికి తోడు టిప్పర్లు వేగంగా తిరుగుతుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. రెవెన్యూ, భూగర్భ గనుల శాఖ అధికారులు స్పందించి మట్టి, గ్రావెల్ అక్రమ రవాణాకు చెక్ పెట్టాలని సమీప పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు రూ. కోట్లు ఆర్జిస్తున్న అక్రమార్కులు రోడ్లపై హడలెత్తిస్తున్న మట్టి టిప్పర్లు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు -
ఏకగ్రీవ ఎన్నిక
● స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఎంప్లాయీస్ అసోసియేషన్ నూతన కమిటీలు ఏర్పాటుకర్నూలు(సెంట్రల్): కర్నూలు, నంద్యాల జిల్లాల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఎంప్లాయీస్ అసోసియేషన్లు ఏకగీవ్రంగా ఎన్నికయ్యాయి. ఆదివారం కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రెండు జిల్లాలకు చెందిన ఉద్యోగులు హాజరై నూతన కమిటీలను ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర కమిటీ సభ్యులు బాల సుబ్రమణ్యం, ఎస్ మహబూబ్బాషా (డోన్), ఫైరోజ్ (ఓర్వకల్) వ్యవహరించారు. కర్నూలు జిల్లా కమిటీ.. కర్నూలు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడిగా కె.శ్రీనివాసరావు (కర్నూలు సబ్ రిజిస్ట్రార్) జిల్లా అధ్యక్షుడిగా ఎంయూ మురళీ సుందరరావు, ఉపాధ్యక్షులుగా డీ లలితకుమారి, ప్రధాన కార్యదర్శిగా జే ప్రవీణ్కుమార్, జాయింట్ సెక్రటరీగా బీ భవానీ, ట్రెజరర్గా టీ ఈశ్వరయ్య, ఈసీ మెంబర్లుగా ఫైరోజ్, బీ కర్ణ, మూర్తికుమార్, ఉదయ్కుమార్, అనిత, ఎన్ రాధను ఎన్నుకున్నారు. నంద్యాల జిల్లా కమిటీ.. నంద్యాల జిల్లా గౌరవాధ్యక్షుడిగా ఎస్ మహబూబ్బాషా (డోన్), జిల్లా అధ్యక్షుడిగా కే శివకుమార్, ఉపాధ్యక్షులుగా ఎం.ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శిగా కే అబ్దుల్కరీం, జాయింట్ సెక్రటరీగా కే మంజుల, ట్రెజరరీగా ఎం.హుజిమియ్యా, ఈసీ మెంబర్లుగా జే వీఎన్రాజు, ఎన్. మధుబాబు, బీ వసంత, ఎం రాముడు, ఎన్ నీలమ్మ, ఎల్,వీరన్న, పీ జయవాణిని ఎన్నుకున్నారు. -
అభివృద్ధి నిరోధకులు
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో రాజకీయ వివక్ష చూపించరాదు. దురదృష్టవశాత్తు టీడీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులను రద్దు చేయించారు. టీడీపీ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మారారు. – శ్రీరాములు, రాష్ట్ర మీట్ కార్పొరెషన్ మాజీ చైర్మన్ చంద్రబాబు ప్రభుత్వం తీరును ప్రజలు గమనిస్తున్నారు. అబివృద్ధి పనులను అడ్డుకోవడం అర్థరహితం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ సంకీర్ణ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే పుట్టగతులు ఉండవని హెచ్చరిస్తున్నాం. – మల్యాల విజయ భాస్కర్రెడ్డి, రైతు, మల్యాల గ్రామం -
‘ఇంటి’ గుట్టు బట్టబయలు!
ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇవ్వడం... నమ్మి ఓట్లు వేసిన వారిని అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోకపోవడం టీడీపీ నేతలకు అలవాటైపోయింది. గత ఎన్నికల సమయంలో డోన్ పాతబస్టాండ్ వద్ద జరిగిన బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. రేషన్కార్డు, ఆధార్కార్డులతో ప్రమేయం లేకుండా ప్రతి కుటుంబానికి ఒకటిన్నర సెంటు చొప్పున ఇంటిస్థలం మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. డోన్ నియోజకవర్గాన్ని మోడల్గా తీర్చిదిద్దుతున్న అప్పటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఓటమే ధ్యేయంగా ఈ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా డోన్ నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. పైగా జగనన్న కాలనీల్లో సౌకర్యాల కల్పనకు నయాపైసా ఖర్చు చేయలేదు. టీడీపీ నేతల ‘ఇంటి’ గుట్టు బట్టబయలు కావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం పాలన అంటూ నిట్చూర్చుతున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదలకు ఎంతో మేలు జరిగిందని, అప్పట్లో మంజూరైన ఇళ్లు, ఇంటి స్థలాలు, ఏర్పాటైన కాలనీలను గుర్తు చేసుకుంటున్నారు. 80 వేల కుటుంబాలకు కుచ్చుటోపీ డోన్ నియోజకవర్గంలో డోన్, బేతంచెర్ల మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్యాపిలి మేజర్ గ్రామ పంచాయతీ ఉంది. నియోజకవర్గంలో రెండు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. మొత్తం 80 వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇంటింటికి ఒకటిన్నర సెంటు ఇస్తామని తెలుగుదేశం పార్టీ పేరుతో ఆ పార్టీ నేతల ఫొటోలను ముద్రించి కార్డులు ఇంటింటికీ పంపిణీ చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఈ కార్డులను పట్టించుకోవడం లేదు. ప్రజలు వీటిని టీడీపీ నేతలకు చూపిస్తే వాటిని తీసుకుని చెత్తబుట్టల్లో వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ కార్డులు ఎవరికీ కనిపించకుండా దహనం చేస్తున్నారు. అబద్ధపు హామీలు ఇచ్చి 80 వేల కుటుంబాలకు టీడీపీ నేతలు కుచ్చుటోపీ పెట్టారని ప్రజలు మండిపడుతున్నారు. వైఎస్సార్ హయాంలో డోన్ నియోజకవర్గంలో ఏడు వేల పక్కాగృహాలను మంజూరు చేశారు. పలు కాలనీల ఏర్పాటుకు ఉదారంగా నిధులు ఇచ్చారు. వైఎస్సార్సీపీ పాలనలో 10వేల పక్కాగృహాలను మంజూరు చేసి జగనన్న కాలనీల ఏర్పాటు చేశారు. ఇప్పుడు పేదలకు సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. – కీర్తి, బేతంచెర్ల చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా అర్హులైన ఒక్క నిరుపేద కుటుంబానికి అంగుళ స్థలం కూడా ఇవ్వలేదు. ఎన్నికల సమయంలో అలవి కాని వాగ్దానాలు ఇచ్చి ప్రజలను నమ్మించి మోసం చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో సహా ఆ పార్టీ నేతలు తగిన మూల్యం చెల్లించక తప్పదు. – వరలక్ష్మి, ఏనుగుమర్రి, ప్యాపిలి మండలం. ఒకటిన్నర సెంటు ఇస్తామని టీడీపీ నేతల హామీ అధికారంలోకి వచ్చాక గజం స్థలం కూడా ఇవ్వని వైనం అన్నీ అబద్ధాలు చెప్పారని ప్రజల ఆగ్రహం -
శాస్త్రోక్తంగా ఆది శంకరాచార్యుల విగ్రహ ప్రతిష్ట
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం పరివార దేవాలయమైన పాలధార – పంచధార వద్ద శ్రీ శారదాంబా సహిత జగద్గురు ఆదిశంకరాచార్యుల నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆదివారం దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి చేతుల మీదుగా ఈ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. ఆలయం ఎదుట నిర్వహించిన యాగశాలలో అధివాసహోమాలు, నూతన విగ్రహాలకు నేత్రోన్మీలనము, అనంతరం పూర్ణాహుతి చేపట్టిన తర్వాత ఉదయం 11 నుంచి 12.30 గంటల మధ్య ఆలయంలో విగ్రహాల ప్రతిష్టాపన చేపట్టారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, అర్చకులు, వేదపండితులు, పలువురు అధికారులు ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విధుశేఖర భారతీ మహాస్వామి అనుగ్రహభాషణం చేశారు. ఆదిశంకరా చార్యులు పాలధార – పంచధార వద్ద తపస్సును ఆచరించి స్వామిఅమ్మవార్లను సేవించారన్నారు. ఆయన శివానందలహరి స్తోత్రాన్ని ఇక్కడే రచించారన్నారు. శ్రీశైలక్షేత్ర మహిమావిశేషాలు, దక్షిణామూర్తితత్త్వం, అద్వైతతత్త్వం, శివానందలహరి స్తోత్ర గొప్పతనం మొదలైన అంశాలను ఆయన భక్తులకు వివరించారు. -
వైభవోపేతం.. స్వాతి మహోత్సవం
ఆళ్లగడ్డ: అహోబిల నవనారసింహ క్షేత్రాలు భక్త జనసంద్రంగా మారాయి. స్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం తరలివచ్చిన భక్తుల గోవింద నామస్మరణతో నల్లమల పులకించింది. దిగువ అహోబిలంలో ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను యాగశాలలో కొలువుంచి అభిషేకం, అర్చన, తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను నూతన పట్టుపీతాంబరాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్చారణలు, ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాల మధ్య శ్రీస్వాతి, శ్రీసుదర్శన హోమాలు వైభవోపేతంగా నిర్వహించి పూర్ణాహుతితో కార్యక్రమాన్ని ముగించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాత్రి విశేష పుష్పాలకంరణ గావించిన ఉత్సవ పల్లకీలో ఉభయ దేవేరులతో కొలువైన శ్రీ ప్రహ్లాదవరదుడు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. నేడు కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 9వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్సైట్లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9.30 గంటలకు అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. కల్లూరు సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్ కర్నూలు(సెంట్రల్): కల్లూరు సబ్ రిజిస్ట్రార్ ప్రవీణ్కుమార్ను సస్పెండ్ చేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ కిరణ్కుమార్ ఆదివారం ఉత్వర్వులు ఇచ్చారు. కల్లూరు గ్రామ సర్వే నంబర్ 645ఏ వక్ఫ్ భూమిని నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేయడంతో జిల్లా రిజిస్ట్రార్ బజారితో విచారణ జరిపించినట్లు చెప్పారు. ఆయన నివేదిక మేరకు ప్రవీణ్కుమార్ను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. తదుపరి పూర్తి నివేదికను కోరినట్లు ఆయన వివరించారు. జిల్లాలో ఎవరైనా రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, కల్లూరు ఇన్చార్జి సబ్రిజిస్ట్రార్గా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఈశ్వర్ను నియమించినట్లు డీఐజీ తెలిపారు. సోమవారం నుంచి ఆయన బాధ్యతలు తీసుకుంటారని చెప్పారు. మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ధి నంద్యాల(అర్బన్): మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ధి సాధ్యమని మంత్రులు ఎన్ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఆదివారం నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో మంత్రులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల చదువును ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. ఇంజినీరింగ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పటికీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతలో చాలా మంది మహిళలే ఉన్నారని ఆయన తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు రుణాలు పంపిణీ చేశారు. అంతకుముందు మంత్రులు స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ఉత్పత్తులను ప్రదర్శించిన స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో సీ్త్ర శిశు సంక్షేమ అభివృద్ధి అధికారి లీలావతి, మున్సిపల్ కమిషనర్ శేషన్న, డీఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, మెప్మా పీడీ వెంకట దాసు తదితరులు పాల్గొన్నారు. -
మహిళా హామీలు గాలికొదిలేశారు
● చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు మొండిచేయి ● రెండేళ్లు గడుస్తున్నా ఆడబిడ్డ నిధి లేదు ● వైఎస్సార్సీపీ మహిళా నాయకురాళ్లు కర్నూలు (టౌన్): ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత గాలికి వదిలేశారని వైఎస్సార్సీపీ మహిళా నాయకురాళ్లు విమర్శించారు. ఆదివారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి సతీమణి కాటసాని ఉమా మహేశ్వరమ్మ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షురాలు ఎస్వీ విజయ మనోహరి తదితరులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేసిందన్నారు. జగనన్న మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి వారికి అండగా నిలిచారన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే జగన్ ప్రభుత్వం కన్నా రెండింతలు సంక్షేమ పథకాలు ఇస్తామని ప్రతి సమావేశంలో చెప్పి ఇప్పుడు మొహం చాటేశారన్నారు. ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్ల నిండిన మహిళలకు ప్రతి నెల రూ.1,500 ఇస్తామని చెప్పి రెండేళ్లు పూర్తయిందన్నారు. కనీసం బడ్జెట్లో ఆ ఊసే లేదన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు అరకొరగా ఇస్తున్నారని, బస్సుల్లేని ఉచిత బస్సు పథకంతో మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సిద్దారెడ్డి రేణుకా, జిల్లా మాజీ అధ్యక్షురాలు సిట్రా సత్యనారాయణమ్మ, మహిళా కార్పొరేటర్లు మునెమ్మ, పల్లవి, అరుణ, ఆర్షియా ఫర్హీన్, చిట్టెమ్మ, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు మంగమ్మ, పార్టీ విభాగం నాయకురాళ్లు పాల్గొన్నారు. -
జగన్ హయాంలోనే సంక్షేమ పథకాల పండుగ
ఆళ్లగడ్డ (చాగలమర్రి): వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలోనే సంక్షేమ పథకాల పండుగ కొనసాగిందని మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ పథకాలను కొనసాగించి పేదలను ఆదుకున్నారన్నారు. చంద్రబాబునాయు డు ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరించిందన్నా రు. శిరివెళ్ల మండలం మహదేవపురం గ్రామానికి చెందిన టీడీపీ ఎంపీటీసీ సభ్యురాలు షేక్ శంషాద్బీతో పాటు కొంతమంది వార్డు సభ్యులు, సుమారు 36 కుటుంబాలకు చెందిన 200 మందికి పైగా టీడీపీ కార్యకర్తలు ఆదివారం వైఎస్సార్సీపీలో చేరారు. ఆళ్లగడ్డ పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యమని విమర్శించారు. కూటమి ప్రభుత్వం 20 నెలల్లో రూ. 3.18 లక్షల కోట్లు అప్పు చేసినా సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. రీయింబర్స్మెంటు బకాయిలను ఎగ్గొంటేందుకు కుట్ర పన్నుతుందని ఆరోపించారు. ప్రతి నెల 18 సంవత్సరాలు నిండిన మహిళలకు రూ. 1,500 ఇస్తామని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు మొహం చాటేశారన్నారు. నిరుద్యోగ భృతి కోసం యువత ఆందోళనలు చేస్తున్నా పాలకులకు కనిపించడం లేదన్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించి భయపెట్టడం దారుణమన్నారు. రెండేళ్లకే టీడీపీ ప్రభుత్వంతో విసిగిపోయిన ప్రజలు వైఎస్సార్సీపీలోకి చేరుతున్నారన్నారు. మహదేవపురం ఎంపీటీసీ సభ్యురాలు వెంట షేక్ శంషాద్బీ, కార్యకర్తలు అబ్దుల్, ఖాదర్, గూడ పోగుల సాలయ్య, శంకర్, వెంకటరమణ, షేక్ మహబూబ్బాషా, లింగమయ్య, రవి, బొల్లవరం అబ్దుల్లాతో పాటు సుమారు 200 మంది వైఎస్సార్సీపీలో చేరారన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు అబ్దుల్ సలాం, శిరివెళ్ల ఎంపీపీ వసీం, మండల పార్టీ అధ్యక్షుడు ప్రతాప్రెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ నరహరి, మహదేవపురం నాయకురాలు జయమ్మ, నాయకులు రాజేశ్గౌడ్ మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 20 నెలల చంద్రబాబు పాలనలో ప్రజలకు ఒరిగింది శూన్యం అప్పులు చేసినా సూపర్ సిక్స్ అమలు చేయలేదు మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి -
మంజూరైన పనులు రద్దు
ఓబులాపురం వద్ద 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.32 కోట్లతో నిర్మించతలపెట్టిన అంబేడ్కర్ గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనుల టెండర్ను టీడీపీ నేతలు రద్దు చేయించారు. అలాగే ప్యాపిలి శివారులో 100 ఎకరాల విస్తీర్ణంలో మంజూరైన ఇంటిగ్రెటెడ్ మార్కెట్ పనులను నిలిపివేశారు. మెట్టుపల్లి వద్ద నిర్మించతలపెట్టిన టమాట జ్యూస్ ఫ్యాక్టరీని పట్టించుకోలేదు. వెంగళాంపల్లె, అబ్బిరెడ్డి పల్లె చెరువుల వద్ద టూరిస్ట్ బోటు కలగా మిగిలింది. డోన్ నియోజకవర్గంలో ఏడు పార్కుల అభివృద్ధి పనులను నిలిపివేశారు. హార్టికల్చర్, అగ్రికల్చర్ కళాశాల నిర్మాణ పనులను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. రూ.4 లక్షల లీటర్ల నీటి కేపాసిటి గల ఓవర్ హెడ్ ట్యాంక్ పనులను నిలిపివేశారు. -
నంద్యాల
అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం అంటూ ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు. ప్రజలు కష్టంలో ఉన్నారని, అధికారంలోకి వచ్చిన తరువాత ఇతోధికంగా ఆదుకుంటామని వాగ్దానం చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తున్నా ఇచ్చిన హామీలను పట్టించుకోలేదు. ఇప్పటి వరకు జలదుర్గాన్ని మండలంగా ప్రకటించలేదు. గుండాల రిజర్వాయర్ను నిర్మించలేదు. మైనింగ్ కళాశాల ఏర్పాటు కలగా మారింది. హంద్రీ–నీవా నీటితో చెరువులు నింపలేదు. కష్టాలు చూసి‘నారా’.. ఇదేనా పాలన అంటే అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఆదివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2026చాడీలు చెప్పడం, ఇద్దరి మధ్య గిల్లలు పెట్టి వారిని దూరం చేయడం, బంధువుల మధ్య సంబంధాలు తెంచడం చాలా పాపం. ఇలాంటి వా టి పట్ల దూరంగా ఉండండి. – పవిత్ర ఖురాన్డోన్: ప్రతి అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఆకర్షణీయమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని మరచిపోవడం సీఎం చంద్రబాబుకు అలవాటేనని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని కొందరు ప్రకటిస్తున్నారు. దీంతో ఈ నెల 9న మాధవరం గ్రామంలో నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని మార్చారు. జలదుర్గం మండల కేంద్రం చేయకపోవడంతో పరిసర గ్రామాల ప్రజలు నిలదీస్తారనే భయంతో పట్టాదారు పాసుబుక్కుల పంపిణీ కార్యక్రమాన్ని డోన్ నియోజకవర్గ శివారులోని కొత్తబురుజు గ్రామానికి మార్చాల్సి వచ్చిందని అధికార పార్టీ నాయకులే వెల్లడిస్తున్నారు. బుట్టదాఖలు! ప్యాపిలి మండలంలోని జలదుర్గాన్ని మరో మండలంగా ఏర్పాటు చేస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీ ఒట్టిదేనని తేలిపోయింది. జలదుర్గం గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఈ వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా అమలు కాలేదు. సుమారు 10వేల గ్రామ జనాభా, 25 గ్రామాలకు అనుకూలంగా ఉన్న జలదుర్గాన్ని మండల కేంద్రంగా ఎప్పుడు ఏర్పాటు చేస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రతి చిన్న విషయానికి 20 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్యాపిలికి వెళ్లాల్సి వస్తోందని బూరుగల, బోంచెరువుపల్లె, సీతమ్మతండా, రాచర్ల, అలేబాద్తండా, మునిమడుగు, బోంచెరువుపల్లె తండా, కొమ్మేమర్రి, సిద్దనగట్టు, గార్లదిన్నె, ఊటకొండ, హుసేనాపురం, యజ్ఞరాామాపురం, కౌలపల్లె గ్రామాల ప్రజలు వాపోతున్నారు. చెరువులను నింపడంలో నిర్లక్ష్యం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో డోన్ నియోజకవర్గంలోని 50 చెరువులను కోట్లాది రూపాయలతో ఆధునికీకరించారు. ఈ చెరువుల పటిష్ట తర్వాత హంద్రీ–నీవా నీటితో చెరువులను నింపి ప్రజలకు అందించారు. అనేక మంది రైతులు చెరువుల కింద వరి పంట పండించారు. ప్రస్తుత పరిస్థితి అందుకు విరుద్ధంగా మారింది. గతేడాది సగం ఆయకట్టు కూడా నీరు ఇవ్వలేదు. చెరువులకు నీరిచ్చేందుకు చేపట్టిన పథకం నిర్వహణకు నిధులు కేటాయించ లేదు. చెరువులను నింపడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. దీంతో వేసవిలో ప్రజలు మంచినీటి కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొననున్నాయి. మూతపడిన మైనింగ్ చంద్రబాబు ప్రభుత్వం అవలంబిస్తున్న పారిశ్రామిక వ్యతిరేక విధానాలతో అపార ఖనిజ నిక్షేపాలు ఉన్న డోన్ నియోజకవర్గంలో మైనింగ్ కార్యకలాపాలు కుంటుపడ్డాయి. సెస్సు, రాయల్టీ, డెవిడెంట్ల్లు లాంటి పన్నులను విపరీతంగా పెంచడంతో పారిశ్రామిక వృద్ధి కుప్పకూలిపోయింది. గతంలో చంద్రబాబు ఇచ్చిన మైనింగ్ కళాశాల ఏర్పాటు హామీ అటకెక్కింది. నాపరాతి గనులు, ఇతర క్వారీల మీద 40 వేలకు పైగానే కార్మిక కుటుంబాలు ఆధారపడ్డాయి. పన్నులను విపరీతంగా పెంచడంతో వీరి ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపనుంది. నీటి మీద రాత డోన్ నియోజకవర్గాన్ని నంద్యాల జిల్లా నుంచి విడదీసి తిరిగి కర్నూలు జిల్లాలో విలీనం చేస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే గత ఐదు నెలల క్రితం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కొన్ని నియోజకవర్గాలు, మండలాలను విలీనం చేయడం, విడగొట్టడం చేశారు. అయితే డోన్ ప్రజలకు ఇచ్చిన హామీని నీటి మీద రాతగా మార్చేశారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హామీలను అటకెక్కించిన సీఎం చంద్రబాబు మండిపడుతున్న ప్రజలు కర్నూలు జిల్లాలో డోన్ విలీనం ఉత్తిమాటేనా? అటకెక్కిన జలదుర్గం మండలం వాగ్దానం కలగా మిగిలిన మైనింగ్ కళాశాల ఏర్పాటు హంద్రీ–నీవా నీటితో నిండని చెరువులు -
‘పది’ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
నంద్యాల(న్యూటౌన్): పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయని, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎంఈఓలను డీఈఓ జనార్దన్రెడ్డి, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ నిత్యానందరాజులు ఆదేశించారు. సమగ్ర శిక్ష మీటింగ్ హాల్లో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. డిప్యూటీ డీఈఓ శంకర్ప్రసాద్, వెంకటరామిరెడ్డి, ఎస్ఎస్ఏ ఈఈ సంపత్, జగన్మోహన్రెడ్డి, ప్రసన్నకుమార్, శ్రీనివాసరెడ్డి, రామ్మోహన్, ఎంఈఓలు పాల్గొన్నారు. ఓపెన్ ఇంటర్ పరీక్షలు.. జిల్లాలోని ఐదు పరీక్ష కేంద్రాల్లో ఓపెన్ ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహిస్తున్నట్లు డీఈఓ తెలిపారు. శనివారం రసాయన శాస్త్రం, అర్థశాస్త్రం పరీక్షలకు 684 మంది విద్యార్థులకు గాను 627 మంది హాజరు కాగా 57 మంది గైర్హాజరయ్యారన్నారు. ప్రశాంతంగా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగినట్లు డీఐఈఓ శంకర్నాయక్ తెలిపారు. శనివారం నిర్వహించిన ఎకనామిక్స్–1, వొకేషనల్–1 పరీక్షకు 91.2 శాతం విద్యార్థులు హాజరయ్యారన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశామన్నారు. పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించామన్నారు. నేడు ఆదిశంకరాచార్యుల విగ్రహ ప్రతిష్ట శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం దేవస్థాన పరివార దేవాలయమైన పాలధార–పంచధార వద్ద శారదాంబ సహిత జగద్గురు ఆదిశంకరాచార్యుల నూతన విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించనున్నట్లు శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు శనివారం నూతన విగ్రహాలకు ధాన్యాధివాస కార్యక్రమం, సాయంత్రం పుష్పాధివాసము, శయ్యాధివాసము, అధివాస హోమాలు జరిపించి మంత్రపుష్పము, తీర్థప్రసాద వితరణ చేశారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ పాలధార–పంచధార వద్ద గత రెండు రోజులుగా విగ్రహ ప్రతిష్ట ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. ఆదివారం ఉదయం 11గంటలకు నూతన ఆలయంలో దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి మహాస్వామివారి చేతుల మీదుగా నూతన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఉత్తమ లైన్మ్యాన్గా నాగరాజు బేతంచెర్ల: పట్టణానికి చెందిన నాగరాజు శేఖర్ ఏపీ రాష్ట్రం తరఫున ఉత్తమ లైన్మ్యాన్ అవార్డుకు ఎంపికయ్యారు. శనివారం ఢిల్లీలో సెంట్రల్ విద్యుత్ బోర్డ్ చైర్మన్ ఘన శ్యామ్ ప్రసాద్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. అవార్డు అందుకున్న నాగరాజు శేఖర్కు విద్యుత్ శాఖ అధికారులు, తోటి ఉద్యోగులు, స్నేహితులు అభినందనలు తెలిపారు. -
అహోబిలేశుని తెప్పోత్సవం.. భక్తిపారవశ్యం
శ్రీ ప్రహ్లాదవరద స్వామి తెప్పోత్సవం చివరిరోజు శనివారం రాత్రి కన్నులపండుగలా సాగింది. ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీప్రహ్లాదవరద స్వాములను పల్లకీ పై కొలువుంచి మాడ వీధుల్లో ఊరేగింపుగా కోనేటి వరకు తోడ్కొని వచ్చారు. ఉభయ దేవేరులతో స్వామి తెప్పను అధిరోహించిన అనంతరం వేదపండితుల పూజలు అందుకున్నారు. సుమారు గంటపాటు తెప్పోత్సవం జరిగింది. నారసింహ స్వామి కీర్తనలు భక్తి పారవశ్యంతో ఆలపిస్తుండగా, చల్లని వేళ భక్తుల నుంచి హారతులు అందుకుంటూ ప్రహ్లాదవరదస్వామి ఉభయ దేవేరులతో తెప్పపై ఊరేగారు. కోనేటి చుట్టూ భక్తులు చేరుకుని కార్యక్రమాన్ని వీక్షించి ఆశీస్సులు అందుకున్నారు. – ఆళ్లగడ్డపుష్కరిణిలో మిరమిట్లు గొలిపే వెలుగుల్లో ప్రహ్లాదవరదుడి తెప్పోత్సం తెప్పోత్సవంలో కొలువైన ఉత్సవమూర్తులు -
అందరికీ అర్థమైంది
మాయమాటలతో టీడీపీ నేతలు మోసగించారని రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు అర్థమైంది. సూపర్ సిక్స్ హామీలంటూ గత వైఎస్సార్సీపీ అమలు చేసిన పథకాలనే పేర్లు మార్చారు. సామాన్య పేద ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం చేసిందేమీ లేదు. – తిరుమలరెడ్డి, సింగిల్విండో మాజీ చైర్మన్, తిరునాంపల్లె ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారు. ఇప్పటి వరకు ఒక్కటి కూడా పూరిస్థాయిలో అమలు కాలేదు. డోన్ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఈ ప్రాంతంలో పర్యటనకు రావడం సిగ్గుచేటు. టీడీపీ నేతల మాటలను ప్రజలు ఇక నమ్మే పరిస్థితి లేదు. – రేగటి రాజశేఖర్ రెడ్డి, ఎంపీపీ, డోన్ నమ్మిన ప్రజలను పదేపదే వంచించడం దారుణం. నిత్యం కరువు కాటకాలతో అల్లాడిపోయే ఈ ప్రాంతం ప్రజల చిరకాల వాంఛ అయిన చెరువులను నింపే కార్యక్రమాన్ని చేపట్టకపోవడం దౌర్భాగ్యం. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. – రామాంజనేయులు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, డోన్ పరిపాలనా సౌలభ్యం కోసం జలదుర్గం గ్రామాన్ని మండల కేంద్రంగా చేస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు.రాష్ట్రంలో అనేక జిల్లాల్లో కొత్త మండలాలు ఏర్పాటు చేసినా జలదుర్గం మండలం ఊసే లేకపోవడం బాధ కలిగించింది. చంద్రబాబు మాయమాటలకు జలదుర్గం గ్రామ ప్రజలు మోసపోయారు. – రసూల్, ఆవాజ్కమిటీ చైర్మన్, జలదుర్గం గ్రామం ● -
ఇప్పుడేం చేయాలో?
నాకు ఇరువురు సంతానం. బిడ్డతో సహా ఇక్కడే నివసిస్తున్నాం. ఇల్లు పోతుందన్న బాధతో ఇటీవల పెరాలసిస్ సోకింది. మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. కూతురు ఫ్యాక్టరీల పనులకు వెళితే ఇంటి బయట గేటుకు తాళం వేసి వెళుతుంది. ఆమె వచ్చిన తర్వాతే నాకు సపర్యలు చేస్తుంది. రేషన్ బియ్యం తెచ్చుకొని వండుకొని తినాల్సిన పరిస్థితులు ఉన్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పట్టణ సమీపంలో సెంటు స్థలం ఇచ్చారు. అప్పోసప్పో తెచ్చుకొని లెంటల్ వరకు ఇంటిని నిర్మించుకున్నాం. ఉన్న ఫలంగా సెంటు స్థలంతో పాటు కట్టించిన ఇల్లు కాకుండా రెండు సెంట్ల స్థలం ఇస్తామంటూ ఇటీవల సంతకాలు చేయించుకున్నారు. రెండు సెంట్ల స్థలం మాకు వద్దు.. జగనన్న ఇచ్చిన సెంటు స్థలంలోనే ఇంటిని నిర్మించుకొని నివాసం ఉంటాం. – మహమ్మద్ -
అర్ధరాత్రి ఎర్రమట్టి తరలింపు
మహానంది: గాజులపల్లె సమీపంలోని అంకిరెడ్డి చెరువులో ఎర్రమట్టి తవ్వకాలు మళ్లీ మొదలయ్యాయి. ఈ ఎర్రమట్టికి నంద్యాల జిల్లాలో విపరీతమైన డిమాండ్ ఉంది. దీనిపై టీడీపీ నేతల కన్ను పడింది. ఉదయం వేళల్లో మట్టిని తరలిస్తే అడ్డుకుంటారనుకున్నారో ఏమో కానీ రాత్రి వేళల్లో మట్టిని తరలించడం చర్చనీయాంశమైంది. శుక్రవారం రాత్రి స్థానిక అంకిరెడ్డి చెరువులో ఒక జేసీబీతో పాటు సుమారు 16 టిప్పర్లు ఉన్నట్లు గాజులపల్లె గ్రామస్తులు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి వేళల్లో ఎర్రమట్టిని తరలిస్తున్న వైనంపై గ్రామస్తులు కొందరు మహానంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా అనుమతులు ఉంటే అధికారికంగా ఉదయం వేళల్లో తరలించొచ్చు కదా అంటూ గాజులపల్లె గ్రామస్తులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఎర్రమట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి చెరువును కాపాడాలని గాజులపల్లె, బసవాపురం గ్రామాల ప్రజలు, రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంటర్ పరీక్షలకు 242 మంది గైర్హాజరు నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్ సెకండియర్ పరీక్షలకు 242 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ శంకర్నాయక్ తెలిపారు. జువాలజీ–2, ఎకనామిక్స్–2, వొకేషనల్–2 పరీక్షలకు 96.87 శాతం హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్స్క్వాడ్ సిబ్బంది పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. శ్రీశైలం నుంచి 27,094 క్యూసెక్కుల నీటి విడుదల శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్లకు 27,094 క్యూసెక్కుల నీరు విడుదలయ్యింది. విద్యుత్ ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్కు 20,140 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 800 క్యూసెక్కులు, మల్యాల ఎత్తిపోతలకు 335 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,678 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కుల నీటిని వదిలారు. కుడిగట్టు కేంద్రంలో 6.526 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు భూగర్భ కేంద్రంలో 3.743 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. గురుకులాల్లో ఖాళీ సీట్ల భర్తీకి 8న ప్రవేశ పరీక్ష కర్నూలు(అర్బన్)/నంద్యాల(న్యూటౌన్): అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 8న ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ఎంఈ గీత శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 9వ తరగతి విద్యార్థులకు సమ్మెటివ్ అసెస్మెంట్ –2 పరీక్షలు నిర్వహించబడుతున్న నేపథ్యంలో ఈ నెల 2వ తేదీన నిర్వహించాల్సిన ప్రవేశ పరీక్షను 8వ తేదీకి మార్పు చేస్తామని తెలిపారు. విద్యార్థుల ప్రయోజనం కోసమే ఈ మార్పును చేశామని, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరు కొత్త తేదీన నిర్వహించే పరీక్షకు హాజరు కావాలన్నారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్కు జైలు మంత్రాలయం రూరల్: మద్యం తాగి బస్సు నడిపిన వ్యక్తికి 15 రోజులు జైలు శిక్ష విధించినట్లు సీఐ రామాంజులు తెలిపారు. రెండు రోజుల క్రితం రాఘవేంద్ర సర్కిల్లో పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. రాయచూరు నుంచి మంత్రాలయం మీదుగా బెంగళూరుకు వెళ్తున్న బస్సు ను ఆపారు. బస్సు డ్రైవర్ శివశంకర్ మద్యం తాగినట్లు గుర్తించారు. ఆయనను శుక్రవారం ఎమ్మిగనూరు జెఎఫ్సియం కోర్టులో హాజరుపర్చగా జైలు శిక్ష విధించినట్లు సీఐ తెలిపారు. -
చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతి పనికీ టాక్స్ చెల్లించాల్సిందే
● మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డిబొమ్మలసత్రం: చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతి పనికీ టీడీపీ నేతలకు టాక్స్ చెల్లించాల్సిన దుస్థితి నెలకొందని మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆళ్లగడ్డ పట్టణంలోని పీవీఎస్ఆర్ గోడౌన్లో కాంట్రాక్టర్ శివరామిరెడ్డి పై గుర్తుతెలియని ముగ్గురు దుండగులు కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన నేపథ్యంలో ఆయనను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నంద్యాల ఉదయానంద ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరామర్శించేందుకు మాజీ ఎమ్మెల్సీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథరెడ్డిలు ఆస్పత్రికి చేరుకున్నారు. అనంతరం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. గుర్తుతెలియని ముగ్గురు దుండగులు శివరామిరెడ్డిపై కత్తితో హత్యాయత్నానికి పాల్పడడం దారుణం అన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రతి వ్యాపారి టీడీపీ నేతలకు ట్యాక్స్లు చెల్లించకుంటే బెదిరించడం ఆనవాయితీగా మారిందన్నారు. కోళ్ల వ్యాపారులు, ఇసుక, మట్టి రవాణా దారుల నుంచి అక్రమంగా టాక్స్లు వసూలు చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలకు ట్యాక్స్ చెల్లించకుంటే వారిపై బెదిరింపులు దాడులు చేయడం సర్వసాధారణమైందన్నారు. గోవింద పల్లె గ్రామంలో సోలార్ నిర్వాహకులను టీడీపీ నాయకులు కమీషన్ల కోసం బెదిరించారన్నారు. వారి ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకులపై కేసు నమోదు చేశారన్నారు. ఇటువంటి నాయకులపై చర్యలు తీసుకొని పోలీసులు బాధితులకు అండగా నిలవాలని కోరారు. -
క్వాంటం టెక్నాలజీతో వేగంగా సమస్యల పరిష్కారం
కర్నూలు సిటీ: క్వాంటం టెక్నాలజీ అత్యంత వేగంగా సమస్యలను పరిష్కారం చేస్తుందని ప్రొఫెసర్లు అన్నారు. జగన్నాథగట్టులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్(ట్రిబుల్ఐటీడీఎం)లో క్వాంటం మెటీరియల్స్ ఫండమెంటల్స్ అండ్ అప్లికేషన్స్ అనే అంశంపై శుక్రవారం వర్క్షాపు ప్రారంభం అయ్యింది. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ వర్క్షాపును ట్రిబుల్ఐటీడీఎం రిజిస్ట్రార్ జె.క్రిష్ణయ్య, ఆన్లైన్లో ఐఐటీ తిరుపతి ప్రొఫెసర్ బి.కోటేశ్వరరావులు ప్రారంభించి ప్రసంగించారు. క్వాంటం టెక్నాలజీ డేటాను అత్యంత వేగంగా విశ్లేషణ చేస్తుందన్నారు. అనంతరం వర్క్షాపు కో–ఆర్డినేటర్ డా.పవన్ ప్రకాష్ మాధురీ మాట్లాడారు. ట్రిబుల్ఐటీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
బ్రడ్జి నిర్మాణంలో ‘కోట్లా’ట!
● కోట్ల, సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య విభేదాలు ● డోన్ నియోజకవర్గ ప్రజలకు తొలగని కష్టాలు డోన్: ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన టీడీపీ నేతలు ఆధిపత్యం కోసం కోట్లాడుతున్నారు. దీంతో ఒక బ్రిడ్జి నిర్మాణ పనులకు ఇంతవరకు తీర్మానం రాలేదు. డోన్ రూరల్ పోలీసుస్టేషన్ ఎదురుగా ఉన్న 44వ జాతీయ రహదారికి సమాంతరంగా సాయిబాబు గుడికి సర్వీసు రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభం అయ్యే సూచనలు కనిపించడం లేదు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. సాయిబాబా మందిర ప్రథమ వార్షికోత్సవానికి వచ్చి బ్రిడ్జి నిర్మాణానికి రూ.1.20కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆలయ కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ నేత ధర్మవరం సుబ్బారెడ్డి, డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్రెడ్డిల వర్గీయుల మధ్య విభేదాలు తలెత్తి బ్రిడ్జి నిర్మాణ పనులు ముందుకు సాగేందుకు అడ్డంకిగా మారాయి. ఈ నేపథ్యంలో ఉడుములపాడు గ్రామ పంచాయతీలో బ్రిడ్జి నిర్మాణం పనుల ఆమోదం కోసం పెట్టిన తీర్మానం చేయకుండా ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకుంటునారని ధర్మవరం వర్గీయులు ఆరోపిస్తున్నారు. సాయిబాబా ఆలయానికి నిత్యం వచ్చే భక్తులతో పాటు ఉడుములపాడు వైపు వేళ్లే వాహన దారులు, పాదచారులకు 44వ జాతీయ రహదారికి సర్వీస్ రోడ్లులా ఉపయోగపడేందుకు ఈ బ్రిడ్జి ఎంతగానో అనుకూలంగా ఉంటుంది. అయితే ధర్మవరం వర్గీయులు చేస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే వర్గీయులు కొట్టిపడేస్తున్నారు. ప్రజలకు ఉపయోగ పడే పనుల ప్రాధాన్యత గురించి ధర్మవరం వర్గీయుల కంటే తమకే బాగా తేలుసని కోట్ల వర్గీయులు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా శాశ్వతమైన పనులు చేయలేదు. టీడీపీ నాయకులు ఆధిపత్యం కోసం కాంట్రాక్టుల ద్వారా అక్రమ సంపాదన ధ్యేయంగా పనిచేస్తునారని కోట్ల, ధర్మవరం వర్గీయులపై నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరువమంటే కప్పకి కోపం–విడువమంటే పాముకు కోపం.. అన్నట్లు బ్రిడ్జి నిర్మాణ పనులకు ప్రతిపాదనలను తయారుచేసే అధికారులు పరిస్థితి తయారైంది. -
దేహదారుఢ్య పరీక్షలు
కర్నూలు: ఇటీవల విడుదలైన గ్రూప్–2 పరీక్ష ఫలితాల్లో ఎకై ్సజ్ శాఖ జోన్–4 (కర్నూలు జోన్) కింద ఎంపికై న 42 మంది అభ్యర్థులకు గాను శుక్రవారం 20 మంది అభ్యర్థులకు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ కర్నూలు నోడల్ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్.హనుమంతరావు ఆధ్వర్యంలో ఆరోగ్య, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. స్థానిక డీసీ కార్యాలయంలో 20 మంది అభ్యర్థులకు రిజర్వ్ ఇన్స్పెక్టర్ జావేద్ బృందం నేతృత్వంలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలో వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మిగిలిన 22 మంది అభ్యర్థులకు శనివారం దేహదారుఢ్య, ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. కార్యక్రమంలో ఏఈఎస్లు రాజశేఖర్ గౌడ్, రామకృష్ణా రెడ్డి, సీఐలు చంద్రహాస్, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ హయాంలో ఇలా..
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రోడ్డు వెడల్పు చేసేందుకు రూ.17కోట్ల ఆర్అండ్బీ నిధులు విడుదల చేయించింది. మొదటగా మెడికల్ కళాశాల సమీపంలో రహదారి పనులు ప్రారంభం కాగా అక్కడ నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించి వారికి ప్రత్యామ్నాయంగా నంద్యాల–కర్నూలు కుందూ హైవే పక్కన స్థలాలు చూపారు. వీరితో పాటు బొగ్గులైన్, మూలసాగరం, బొమ్మలసత్రం, గాంధీనగర్ తదితర వాసులు దాదాపు 424 మందికి ఇళ్ల పట్టాలతో పాటు లే అవుట్ స్థలాలు చూపి ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు మౌలిక వసతులు కల్పించారు. సర్వేనం.502, 504లో 424 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా 162 మందికి టిడ్కో ఇళ్లు కేటాయింపు చేపట్టారు. దాదాపు రూ.5లక్షల విలువ చేసే సెంటు స్థలం ఇవ్వడంతో కొంత మంది ఇంటి నిర్మాణాలు చేపట్టుకోగా మరికొంత మందికి హద్దు రాళ్లు పాతి స్థలాలు చూపారు. ఈలోపు రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు వచ్చి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 18 నెలల తర్వాత స్థానికులకు ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా గుడిసెలు కూల్చివేస్తుండటంపై స్థానికులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. -
మేమేం పాపం చేశాం
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిశోర్రెడ్డి మా కుటుంబానికి విలువైన సెంటు స్థలాన్ని ఇచ్చారు. ఎంతో కొంత మొత్తంతో ఇంటి నిర్మాణం చేపట్టుకున్నాం. కొడుకు అల్లబకాష్ కూలీకి వెళ్లి తెచ్చే డబ్బులతో కుటుంబ పోషణ జరుగుతుంది. తాను ఎక్కడికి కదల్లేని పరిస్థితి. ఉన్నఫలంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలంటూ ఇటీవల అధికారులు తమతో సంతకాలు చేయించుకున్నారు. రెండు సెంట్ల స్థలం ఎక్కడ ఇచ్చేది చెప్పకుండా అధికారులు దాగుడు మూతలాట ఆడుతున్నారు. గతంలో ఎంతో మంది నాయకులు ఇంటి పట్టాలు ఇస్తున్నామంటూ బూటకపు మాటలు చెప్పారే కాని ఒక్క శిల్పారవిచంద్రకిశోర్రెడ్డి మాత్రమే ఇంటి స్థలం ఇచ్చి ఆదుకున్నారు. ఆ స్థలంలో ఇంటి నిర్మాణానికి అధికారులు సహకరిస్తే సంతోషిస్తాం. –ఖాదర్బీ, బాధితురాలు -
‘మగ’వల అందం చూడతరమా!
ఆదోని రూరల్: హోలీ పండగ అంటే రంగుల పండగ అంటూ అందరూ ఆనందంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం ఎక్కడైనా చూసుంటాం. కానీ సంతెకూడ్లూరు గ్రామంలో మాత్రం వింతగా ఈ పండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న ఈ గ్రామంలో వింత ఆచారం కొనసాగుతోంది. గ్రామంలో వెలిసిన రతీమన్మథుల ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. కోరికలు తీరిన భక్తుల్లో పురుషులు ఆనవాయితీ ప్రకారం మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేకంగా సీ్త్ర వేషంలో చీర కట్టి అందంగా అలంకరించుకుని కలశాలతో రతీ మన్మథుల ఆలయానికి డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా చేరుకున్నారు. పిండి వంటలను నైవేద్యంగా సమర్పించి పూజలు చేశా రు. వేడుకలను చూసేందుకు ఆంధ్రా నుంచే గాక కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బుధవారం రాత్రి కామప్పను దహనం చేసిన గుంత వద్దకు సీ్త్ర వేషధారణలో వెళ్లిన పురుషులు బోరున విలపిస్తూ బాధను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎద్దుల సంత నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు ఎద్దులను కొనుగోలు చేసేందుకు తరలివచ్చారు. భక్తుల మధ్య రతీమన్మథుల రథోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. కోర్కెలు నెరవేరి సీ్త్ర వేషధారణలో మొక్కులు చెల్లింపు సంతెకూడ్లూరులో కొనసాగిన వింత ఆచారం వైభవంగా రతీమన్మథుల రథోత్సవం -
పీజీ ఫలితాల్లో కేఎంసీ విద్యార్థులు ‘సూపర్’
● ముగ్గురు వైద్యవిద్యార్థులకు గోల్డ్మెడల్స్ ● ముగ్గురూ యూనివర్సిటీ టాపర్లే కర్నూలు(హాస్పిటల్): సూపర్ స్పెషాలిటీ కోర్సులను అభ్యసిస్తున్న వైద్య విద్యార్థులకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇటీవల వార్షిక పరీక్షలు నిర్వహించింది. గురువారం ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో కర్నూలు మెడికల్ కాలేజీ పీజీ వైద్య విద్యార్థులు యూనివర్సిటీ టాపర్లుగా రాణించడంతో పాటు మంచి పర్సెంటైల్స్తో గోల్డ్మెడల్స్ను సాధించారు. ఈ పరీక్షలకు కళాశాల నుంచి 11 మంది హాజరు కాగా అందరూ ఉత్తీర్ణులయ్యారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, వైద్యులు అభినందించారు. కార్డియాలజీలో.. కార్డియాలజీ విభాగంలో సూపర్స్పెషాలిటీ పీజీ చేస్తున్న డాక్టర్ సనాఖాన్ పర్వేజ్ నవాజ్ యూనివర్శిటి టాపర్గా నిలిచారు. దీంతో పాటు ఆయన 75 పర్సెంటేజ్తో గోల్డ్మెడల్ సాధించారు. ఈయన తండ్రి సనాహా హుసేన్ అహ్మద్ ఆదోనిలోని అవ్వ బ్యాంకులో మేనేజర్. తల్లి మెహజబీన్ గృహిణి. అన్నయ్య ఇంజనీర్గా, చెల్లెలు టీచర్గా పనిచేస్తున్నారు. సనాఖాన్ పర్వేజ్ నవాజ్ భార్య రాహత్ షేక్ కూడా కంటి వైద్యులుగా రాణిస్తున్నారు. నెఫ్రాలజీ విభాగంలో... నెఫ్రాలజీ విభాగంలో సూపర్స్పెషాలిటీ పీజీ చేస్తున్న డాక్టర్ నేహా శర్మ యూనివర్శిటి టాపర్గా నిలిచారు. దీంతో పాటు 76 శాతం పర్సెంటేల్తో గోల్డ్మెడల్ సాధించారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కాంగ్ర జిల్లాకు చెందిన ఈమె 2022 బ్యాచ్లో డీఎం నెఫ్రాలజి సీటు రావడంతో కర్నూలు మెడికల్ కాలేజిలో చేరారు. ఈమె తండ్రి శివకుమార్ శర్మ అగ్నికల్చర్ జేడీగా పనిచేశారు. తల్లి రమాశర్మ పోస్టుమాస్టర్గా పనిచేస్తున్నారు. భర్త డాక్టర్ తుకారామ్ గోవాలో కార్డియాలజిస్టు. యురాలజీ విభాగంలో.. యురాలజీ విభాగంలో సూపర్స్పెషాలిటీ పీజీ చేస్తున్న డాక్టర్ కటారు ప్రశాంత్బాబు యూనివర్సిటీ టాపర్గా నిలిచారు. అంతేగాక మంచి పర్సంటైల్తో ఆయన గోల్డ్మెడల్ సాధించారు. నంద్యాలకు చెందిన ఈయన కర్నూలు మెడికల్ కాలేజీలో వైద్యవిద్యను పూర్తి చేశారు. 2022లో యురాలజీ సీటు కూడా ఇక్కడే రావడంతో యురాలజీ విభాగంలో చేరి రాణించారు. ఆయన తండ్రి కె.బాలుదాసు పోలీస్ కంట్రోల్ రూమ్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. తల్లి కె.ప్రేమకుమారి గృహిణి. డాక్టర్ కటారు ప్రశాంత్బాబుడాక్టర్ నేహా శర్మ సనాహా ఖాన్ నవాజ్ -
క్రీడలతో స్నేహసంబంధాలు
కర్నూలు: క్రీడాపోటీలు ఉత్సాహాన్ని పెంచడమే గాకుండా పరస్పర సహకారం, స్నేహభావాన్ని పెంచుతాయని అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బందికి ఆటల పోటీలు నిర్వహించారు. మహిళా సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని టగ్ ఆఫ్ వార్, షార్ట్ పుట్, త్రోబాల్, టెన్నికాయిట్, మ్యూజికల్ చైర్స్ తదితర ఆటలలో ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు వారి ఆరోగ్యం, సంతోషానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మరిన్ని అవగాహన కార్యక్రమాలు, పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. డీపీఓ ఏఓ విజయలక్ష్మి, మినిస్టీరియల్ సిబ్బంది, ఆర్ఐ నారాయణ, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. -
వైభవంగా గరుడోత్సవం
మద్దికెర: శ్రీరంగనాథుడు వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మండల పరిధిలోని పెరవలి గ్రామంలో కొలువైన శ్రీరంగనాథుడు శ్రీదేవి, భూదేవి సమేతంగా గురువారం గరుడ వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో స్వామివారికి బిందెసేవ, పంచామృతాభిషేకం, అష్టోత్తరనామార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం స్వామి వారి ఉత్సవ మూర్తులను గరుడ వాహనంపై కొలువుంచా రు. అనంతరం ప్రభోత్సవం గ్రామ పుర వీధుల్లో మేళతాళాల మధ్య నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ వీరయ్య, ఆలయ చైర్మన్ రవికుమార్, అర్చకులు రంగస్వామి, మధుస్వామి, నరసింహస్వామి, సిబ్బంది రఘు పాల్గొన్నారు. పూజల అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. నీటి కుంటలో పడి 80 గొర్రెలు మృత్యువాత బనగానపల్లె: చెరువుపల్లె గ్రామ సమీపంలో గురువారం మధ్యాహ్నం నీటి కుంటలో పడి 80 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. బేతంచర్ల మండలం బుగ్గానిపల్లి, కొలుములపల్లి గ్రామాలకు చెందిన గొర్రెల యజమానులు తమ గొర్రెలను మేపుతూ బనగానపల్లె మండలం నందవరం గ్రామానికి చేరుకున్నారు. కొద్ది రోజులుగా తమ గొర్రెలను గ్రామ పొలిమేరల్లో మేపుతున్నారు. గురువారం చెరువుపల్లె సమీపంలో నీటి కుంటలో నీరు తాగేందుకు వెళ్లిన గొర్రెలు ఒకదానిపై ఒకటి పడటంతో ఊపిరాడక 80 మృతి చెందాయి. ఈ ప్రమాదంలో నాగేష్కు చెందిన 40 గొర్రెలు, పరశురాముడు 20, శేఖర్ 10, మల్లికార్జున 10 గొర్రెలు మృతి చెందాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 10 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. ప్రభుత్వం పరిహారం అందజేసి తమను ఆదుకోవాలని కోరారు. కొండాపురంలో ఇరువర్గాల ఘర్షణ సి.బెళగల్: కొండాపురం గ్రామంలో గురువారం ఇరువర్గాల ఘర్షణతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో రెండు సామాజిక వర్గాలకు చెందిన యువకుల మధ్య 2023లో జరిగిన క్రికెట్ పోటీల విషయంపై రెండు రోజుల క్రితం వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పంతాలకు వెళ్లిన ఇద్దరు యువకులు వారి బంధుమిత్రులతో కలసి పరస్పరం దాడులకు సిద్ధమయ్యారు. అందరూ ఒక చోట గుమికూడి ఘర్షణ పడుతుండగా సమాచారం అందుకున్న కోడుమూరు సీఐ తబ్రేజ్, సి.బెళగల్ ఎస్ఐ వేణుగోపాల్రాజు సిబ్బందితో గ్రామానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. కొండాపురంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ముందస్తు చర్యగా పలు ప్రాంతాల నుంచి పోలీసులు గ్రామంలో మొహరించారు. అనంతరం పెద్దలు, పోలీస్ అధికారుల జోక్యంతో ఘర్షణ పరిస్థితులు సద్దుమణిగాయి. కర్నూలు ట్రాఫిక్ సీఐ మనుసూరుద్దీన్, ఇంటెలిజెన్స్ సీఐ (జోనల్ ఇన్చార్జ్) వెంకటరామిరెడ్డి, ఎస్ఐ పీరయ్య ఇతర పోలీస్ అధికారులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. -
బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం
● ఆగమోక్తంగా ధ్వజావరోహణం ● శాస్త్రోక్తంగా సకల దేవతలకు వీడ్కోలుఆళ్లగడ్డ: శ్రీ అహోబిలేశుడి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన ధ్వజావరోహణ కార్యక్రమాన్ని గురువారం తెల్లవారుజామున ఆగమోక్తంగా చేపట్టారు. 10 రోజులుగా అంగరంగ వైభవంగా జరిగిన అహోబిలేశుడి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల మొదటిరోజు బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ శాస్త్రోక్తంగా ధ్వజపటాన్ని ఆవిష్కరించారు. చివరిరోజు గురువారం వేదమంత్రాచ్ఛారణల మధ్య ధ్వజావరోహణం (గరుడ పటాన్ని కిందకు దించడం) చేసి సకల దేవతలకు వీడ్కోలు ఉత్సవం చేపట్టారు. ముందుగా ఉత్సవమూర్తులను పంచామృతాలతో అభిషేకించి, తిరుమంజన సేవ గావించిన అనంతరం ఆలయ ధ్వజస్తంభం వద్దకు వేంచేశాక ముద్రక్త ఆగమశాస్త్రం ప్రకారం వేదమంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ధ్వజస్తంభంపై ఉన్న గరుడ పటాన్ని శాస్త్రోక్తంగా కిందకు దించారు. అనంతరం ముద్రకర్త కీడాంబి వేణుగోపాలన్ ఆధ్వర్యంలో అర్చక బృందం గరుడ ధ్యానం, భేరీపూజ, భేరితాడనం, గరుడ గద్యం, దిక్పాలక గద్యం, గరుడ లగ్నాష్టకం, గరుడ చూర్ణిక మంత్రాలను జపించి బ్రహ్మోత్సవాలు ముగిసినట్టు వేద పారాయణం ద్వారా ప్రకటించారు. గత నెల 21వ తేదీ మొదలైన బ్రహ్మోత్సవ వేడుకలకు మొదట్లో భక్తులు పెద్దగా కనిపించలేదు. చివరి ఘట్టాలైన రథోత్సవం, కల్యాణోత్సవం, గరుడ సేవకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ అధికారులు, సిబ్బంది సమన్వయంతో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు, వసతులు కల్పించడంలో పూర్తిగా సఫలీకృతులయ్యారు. దివ్యాంగులు, వయో వృద్ధులకు తప్పని ఇక్కట్లు.. ఉత్సవాల్లో నేపథ్యంలో ఎగువ, దిగువ అహోబిల క్షేత్రాల్లో అధికారులు స్వామి దర్శనాలకు వీఐపీలు, వీవీఐపీలకే ప్రాముఖ్యత ఇచ్చారు. దివ్యాంగులు, వయోవృద్ధులు, గర్భణులు, చంటిపిల్లలు తల్లులు దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్ల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. సామాన్య భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించక పోవడంతో తోపులాట చోటు చేసుకుని పలువురు స్వామి వారిని దర్శించుకోకుండానే వెనుదిరిగారు. గుడిబయట నుంచే ముక్కుబడులు చెల్లించుకుని వెనుదిరగాల్సిన దుస్థితి నెలకొంది. -
తిరు వీధుల్లో దివ్య దర్శనం
● దిగువ అహోబిలంలో వైభవంగా గరుడోత్సవంఆళ్లగడ్డ: శ్రీ మహావిష్ణువుకు నిత్య వాహనమైన గరుత్మండిపై శ్రీ లక్ష్మీనారసింహుడు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. దిగువ అహోబిలంలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారు జామువరకు గరుడోత్సవం కనుల పండువగా సాగింది. అహోబిలేశుని బ్రహ్మోత్సవాలు మొదలైనప్పటి నుంచి పది రోజుల్లో వచ్చే భక్తులు ఈ ఒక్కరోజే అహోబిలం చేరుకుంటారు. స్వామిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లిస్తారు. ఈ రోజు కోసం ఏడాది పొడువునా వేచి ఉంటారు. బుధవారం తెల్లవారు జామునుంచే దిగువ అహోబిలం దేవాలయం ప్రాంగణం భక్త జనసందోహంతో కిటకిటలాడింది. ఉదయం ఉత్సవమూర్తులను కోనేరు దగ్గరకు తోడ్కొని వెళ్లి తీర్థవారి చక్రస్నానం, సాయంత్రం ద్వాదశారాధనం, రాత్రి పుష్పయాగం నిర్వహించారు. అర్ధరాత్రి అనంతరం ఉత్సవమూర్తి అయిన శ్రీ ప్రహ్లాదవరద స్వామి వజ్రవైడూర్యాలు, బంగారు ఆభరణాలు ధరించి గరుడవాహనంపై అధిష్టించి తిరువీధుల్లో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. గరుడోత్సవంలో పాల్గొని స్వామిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశ, విదేశాలకు చెందిన భక్తులు తరలి వచ్చారు. దిగువ అహోబిలంలో భక్తుల గోవిందా నామస్మరణ మర్మోగింది. -
డీసీసీబీని అభివృద్ధి పథంలో నిలుపుదాం
● డీసీసీబీ సీఈఓ శివలీల కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా సహకార కేంద్రబ్యాంకును మరింత అభివృద్ధిలోకి తెచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్య కార్యనిర్వహణ అధికారిణి (సీఈఓ) కొమ్మ శివలీల అన్నారు. గురువారం డీసీసీబీ సీఈఓగా ఆమె బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు డీసీసీబీ జనరల్ మేనేజర్ అయిన పి.రామాంజనేయులు పూర్తి అదనపు బాధ్యతలతో సీఈఓగా ఉన్నారు. ఆప్కాబ్ కొన్ని నెలల క్రితం డీసీసీబీకి రెగ్యులర్ సీఈఓను నియమించుకునేందుకు 11 మందితో కూడిన ప్యానల్ను పంపింది. ఈ మేరకు డీసీసీబీలో జీఎంగా విధులు నిర్వహిస్తున్న శివలీల కూడా ప్యానల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్యానల్లో ఉన్న శివలీలను సీఈఓగా నియమిస్తూ డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ముందుగా చైర్మన్ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత ఇన్చార్జీ సీఈఓ నుంచి రెగ్యులర్ సీఈఓగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. సీనియర్ అధికారులు, ప్రధాన కార్యాలయం సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి విధి విధానాలు వివరించారు. సమష్టిగా పనిచేసి డీసీసీబీని మరింత అభివృద్ధ్దిలోకి తీసుకురావాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో జీఎం పి.రామాంజనేయులు, డీజీఎంలు ఉమామహేశ్వరరెడ్డి, సునీల్కుమార్, ఏజీఎం త్రినాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉచితంగా ఆధునిక దంత వైద్య సేవలు
ఆసుపత్రిలోని దంత విభాగంలో రోజుకు 50 మంది దాకా ఓపీ రోగులు వస్తారు. వారికి ఆధునిక వైద్యపరికరాలు, ఆధునిక చైర్లపై దంత వైద్యం చేస్తున్నాం. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, తిరిగి 3 నుంచి 4 గంటల వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయి. పాడైన దంతాలు, చిగుళ్ల వ్యాధులకు చికిత్స, పిల్లలకు వచ్చే దంత సమస్యలకు, గుట్కా తినడం వల్ల పాడైన దంతాలకు చికిత్స చేయడం, నోటి క్యాన్సర్తో బాధపడే వారికి చికిత్స అందిస్తున్నాం. – డాక్టర్ ఆర్. విజయకుమార్, అసోసియేట్ ప్రొఫెసర్, దంత వైద్యవిభాగం, జీజీహెచ్, కర్నూలు దంత వైద్యచికిత్సలో ఆధునిక వైద్యసదుపాయాలు మరింత మెరుగైన, నాణ్య మైన చికిత్సను రోగులకు అందించేందుకు అవకాశం ఏర్పడుతోంది. ఒకప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్కు నాలుగుసార్లు వైద్యుల వద్దకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఒకే విజిట్లోనే ఈ చికిత్సను పూర్తి చేసే అవకాశం వచ్చింది. ఎత్తు, వంకర పళ్లను సరిచేసేందుకు గతంలో క్లిప్స్ ఉపయోగించేవాళ్లం. ఇప్పుడు అలైనర్స్ ద్వారా సౌకర్యవంతంగా ఎత్తు, వంకర, సందు పళ్లను సవరించుకోవచ్చు. అల్ట్రాసోనిక్ స్కేలింగ్ సహాయంతో ఎప్పటికప్పుడు దంతాలను శుభ్రం చేసుకోవచ్చు. డెంటల్ లేజర్స్ పరికరం ద్వారా ఇంజెక్షన్స్ లేకుండా రక్తస్రావం రాకుండా కుట్లు వేయవచ్చు. – డాక్టర్ పి. సునీల్కుమార్రెడ్డి, డెంటల్ సర్జన్, కర్నూలు -
డబ్బులు ఇవ్వలేదనే హత్యాయత్నం
● వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్రెడ్డి ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్ల అవినీతి, అరాచక పాలన సాగుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గూండాల చేతిలో కత్తిపోట్లకు గురై ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ నాయకుడు శివరామిరెడ్డిని కిషోర్రెడ్డి గురువారం పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రామ్ ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందన్నారు. ఆస్తులు రాయించుకోవాలని శివరామిరెడ్డిని బెదిరించారన్నారు. డబ్బులు ఇవ్వలేదనే హతమార్చేందుకు యత్నించడం సిగ్గుచేటన్నారు. రౌడీలను, గూండాలను వెంటపెట్టుకుని ఇలాంటి అరాచకాలకు పాల్పడుతూ ఏం సాధించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. దాడికి పాల్పడ్డవారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
జెడ్పీలో సీనియర్ సహాయకులుగా నలుగురికి పదోన్నతి
కర్నూలు(అర్బన్): జిల్లాపరిషత్ పరిధిలోని వివిధ కా ర్యాలయాల్లో జూనియర్ సహాయకులు/టైపిస్టులుగా విధులు నిర్వహిస్తున్న నలుగురికి సీనియర్ సహాయకులుగా పదోన్నతి కల్పించినట్లు జిల్లాపరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. గురువారం స్థానిక కార్యాలయంలో పదోన్నతి పొందిన నలుగురు ఉద్యోగులకు జిల్లాపరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి పదోన్నతి ఉత్తర్వులను అందజేశారు. అలాగే పదోన్నతి పొందిన వారికి వివిధ మండల పరిషత్ కార్యాలయాలకు పోస్టింగ్స్ ఇచ్చారు. పదోన్నతి పొందిన వారిలో డి.ప్రభాకర్ను గోనెగండ్ల, ఐ.లక్ష్మీబాయిని దొర్నిపా డు, జె.చిన్నయ్యను బనగానపల్లె, వి.లలితా జ్యోతిని పాములపాడుకు పోస్టింగ్స్ ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ ఇ.వి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
రాష్ట్ర బీసీసెల్ ప్రధాన కార్యదర్శిగా మౌలాలి
బొమ్మలసత్రం/పాములపాడు: వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ విభాగం ప్రధాన కార్యదర్శిగా పాములపాడు మండలం ఇస్కాల గ్రామానికి చెందిన ఢంకా మౌలాలి(బంగారం)ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం పత్రిక ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. పాలిసెట్కు దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(న్యూటౌన్): పాలిటెక్నిక్ కళాశాల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పాలిటెక్నిక్ కో ఆర్డినేటర్ శైలేంద్రకుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉత్తీర్ణులైన తర్వాత ఏప్రిల్ 4వ తేదీలోపు https://polycetap.ap. gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25న ఉంటుందన్నారు. ఈ ఏడాది నంద్యాల, బేతంచెర్ల, బనగానపల్లె, నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, డోన్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం 9912377723 నంబరును సంప్రదించాలన్నారు. పకడ్బందీగా ‘ఓపెన్’ పరీక్షలు నంద్యాల(న్యూటౌన్): ఓపెన్ ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఎంఈఓలను పరిశీలకురాలు అనురాధ ఆదేశించారు. ఓపెన్ ఇంటర్ పరీక్షల ప్రశ్నపత్రాల కేంద్రాన్ని గురువారం ఆమె పరిశీలించారు. అనంతరం ఎస్పీజీ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈమె వెంట డీఈఓ జనార్దన్రెడ్డి ఉన్నారు. కేజీబీవీల్లో మిగిలిన సీట్ల భర్తీ నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని 27 కేజీబీవీ(కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు)ల్లో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష జిల్లా అదనపు కో ఆర్డినేటర్ నిత్యానందరాజు, జీసీడీఓ సువర్చ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా ఈనెల 12 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 6వ తరగతికి 40 సీట్లు ఉన్నాయని, 7, 8, 9, 10, 12 తరగతులకు 2025–26 ఏడాదికి మిగిలిన సీట్లు ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. కేజీబీవీ కళాశాలలో ఎంపీసీ గ్రూప్కు–14, బైపీసీకి 10, సీఈసీకి 1, ఎంఈసీకి 1, ఏఅండ్టీ 1లలో బాలికలకు విద్యను అభ్యసించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సామాజిక బాధ్యత కలిగి ఉండాలి కర్నూలు కల్చరల్: యువత చదువుతో పాటు సామాజిక బాధ్యత కలిగి ఉండాలని రాయలసీమ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఆచార్య వి.వెంకటబసవరావు అన్నారు. యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ స్వచ్ఛతా యాక్షన్ ప్లాన్లో భాగంగా కర్నూలు ఆర్టీసీ బస్స్టేషన్ ప్రాంగణంలో చేపట్టిన ఒక రోజు పరిశుభ్రతా కార్యక్రమాన్ని గురువారం వీసీ వర్సిటీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విశ్వ విద్యాలయం ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు బస్టాండ్ పరిసరాల్లో పరిశుభ్రతా కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవలసిన అవసరాన్ని ప్రతి పౌరుడూ తెలుసుకోవాలని వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్టీకే నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయ్ కుమార్ నాయుడు అన్నారు. వర్సిటీ ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ పి.నాగరాజు, హైదరాబాదులోని ఎన్ఎస్ఎస్ డైరెక్టరేట్ ప్రతినిధి సంజయ్, కర్నూలు–1 డిపో మేనేజర్ కె.సుధారాణి, వర్సిటీ ఎన్ఎస్ఎస్ ప్రొగ్రాం ఆఫీసర్లు డాక్టర్ కె.వెఎంకటరత్నం, డాక్టర్ బి.విజయుడు పాల్గొన్నారు. -
ఆళ్లగడ్డలో రెడ్బుక్ రాజ్యాంగం
● మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ఆళ్లగడ్డ: దేశం మొత్తం అంబేడ్కర్ రచించిన రాజ్యంగం నడుస్తుంటే ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్ నారాలోకేశ్ రచించిన రెడ్బుక్ రాజ్యంగం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే అఖిలప్రియ ముఖ్య అనుచరుల చేతిలో హత్యాయత్నానికి గురై నంద్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ నాయకుడు శివరామిరెడ్డిని గురువారం ఆయన పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... గతేడాది డిసెంబర్ 31వ తేదీ శివరామిరెడ్డి క్రషర్ను పెట్రోల్ పోసి కాల్చేందుకు యత్నించారన్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. కోర్టు పరిధిలో ఉన్న క్రషర్లో విలువైన సామగ్రి ఎత్తుకుపోతున్నారని, చర్యలు తీసుకోవాలని రిజిష్టర్ పోస్టు ద్వారా ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదన్నారు. అప్పట్లో ఎస్పీని కలిసి కూడా వివరాలు చెప్పినప్పటికీ ఎలాంటి ఫలితం లభించలేదన్నారు. ఇప్పుడు ఏకంగా హత్య చేసేందుకు యత్నించారన్నారు. మొదట్లోనే చర్యలు తీసుకుని ఉంటే ఇంతదూరం వచ్చేది కాదని అన్నారు. చూస్తూ ఊరుకోం దాడులు చేసి బెదిరించాలని చూస్తే అలాంటి తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడేది ఉండదని గంగుల అన్నారు. ఫ్యాక్షన్ గొడవలతో అనేక కుటుంబాలు ఇబ్బందులు పడి ఇప్పుడిప్పుడే అన్నీ మరిచిపోయి ప్రశాంతంగా జీవిస్తున్నాయన్నారు. దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకునేది ఉండదని హెచ్చరించారు. ఉదయం దాడి జరిగితే బాధితులు ఇచ్చిన ఫిర్యాదు తీసుకునేందుకు పోలీసులు తటపటాయించారన్నారు. ఐదుసార్లు రాసిన ఫిర్యాదు చించి తమకు అనుకున్నట్లు రాసేలా ఒత్తిడి చేయడం ఎంతవరకు సబబో చెప్పాలని ప్రశ్నించారు. చూస్తుంటే మనిషి ప్రాణం కంటే పోలీసులకు పోస్టింగే ఎక్కువగా కనిపిస్తోందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇప్పటి వరకు చాకలి శీనును, గోవిందపల్లె ప్రతాపరెడ్డిని చంపాలని ప్రయత్నించారన్నారు. ఇప్పుడు శివరామిరెడ్డిని చంపేందుకు యత్నించారన్నారు. ఇంత అరాచాకం జరుగుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. -
వైద్య విద్యార్థులు నైపుణ్యాన్ని పెంచుకోవాలి
● డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ చంద్రశేఖర్కర్నూలు (హాస్పిటల్): ఎప్పటికప్పుడు ఆధునిక టెక్నాలజీలో వస్తున్న నైపుణ్యాలను యువ వైద్యులు పెంపొందించుకోవాలని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ అన్నారు. కర్నూలు మెడికల్ కళాశాలలో గురువారం సాయంత్రం 2020 బ్యాచ్ ఎంబీబీఎస్ వైద్య విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. యువ వైద్యులు సమాజానికి ఆశాకిరణాలుగా నిలవాలని ఆకాంక్షించారు. వైద్యుని వద్దకు ఎంతో ఆశతో వచ్చే రోగి ఒక కేసు కాదని, అతను ఎంతో నమ్మకంతో మీ వద్దకు వచ్చే సగటు మనిషే అని మరువవద్దని తెలిపారు. కోటి ఆశలతో తమ పిల్లలను వైద్య విద్యలో చదివించేందుకు తల్లిదండ్రులు అహర్నిశలు కృషి చేస్తారని, వారి నమ్మకాన్ని పిల్లలు నిలబెట్టాలని సూచించారు. వైద్యవిద్యలో నూతన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నారు. కృత్రిమ మేథస్సుతో జీనోమిక్స్ చేసుకోవాలని, రీసెర్చ్ రంగంలో అధిక ప్రాధాన్యతనివ్వాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి వైద్య విద్యార్థికి విజ్ఞానం, నైపుణ్యం, మానవత్వం కలసినప్పుడే నిజమైన వైద్యసేవలు సమాజానికి అందుతాయన్నారు. అనంతరం ఐసీఎంఆర్, యూజీఎస్ఆర్ఎస్ ప్రాజెక్టులలో పాల్గొనే యూజీ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యపరీక్షల్లో రాష్ట్రస్థాయిలో టాపర్లుగా నిలిచిన వారిని సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.సుధాకర్, ప్రస్తుత ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్కే ప్రకాష్, వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ హరిచరణ్, డాక్టర్ శ్రీరాములు, డాక్టర్ రేణుకా దేవి, డాక్టర్ విజయానంద బాబు, డాక్టర్ సింథియా శుభప్రద, డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ లక్ష్మీబాయి, డాక్టర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
గరుడ గమనం.. గోవిందుడి అభయం
గరుడోత్సవాన్ని తిలకిస్తున్న భక్తజనం ఆళ్లగడ్డ: బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం తెల్లవారుజామున ఎగువ అహోబిలంలో గరుడోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ నృసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహుడు విశేష అలంకరించిన గరుడ వాహనాన్ని అధిష్టించారు. ఆస్థాన విద్వాంసుల మంగళకరమైన వాయిద్యాలు, పండితుల వేదోక్త మంత్ర పఠనములు.. భక్తుల గోవిందా నామస్మరణల నడుమ అట్టహాసంగా ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. గరుడ మహోత్సవం మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారు జామువరకు కొనసాగింది. బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం చేపట్టారు. శాస్త్రోకంగా అగ్గిసేవ అహోబిల బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన ఘట్టం చివరిరోజు నిర్వహించే అగ్గిసేవ. నెత్తిన అగ్గితో కొట్టించుకుంటే శుభం లభిస్తుందని, కర్మలు తెగిపోతాయని భక్తుల నమ్మకం. అగ్ని జ్వాలలు విరజిమ్ముతున్న కుంపటిని నెత్తిన పెట్టుకున్న వ్యక్తి మరో చేత్తో మండుతున్న కొరివితో భక్తుల నెత్తిన కొట్టినా ఎటువంటి గాయం కాదని భక్తులు చెప్పారు. -
ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా
ఆత్మకూరు: ప్రభుత్వ వైద్యాధికారిణిగా ఉద్యోగం రావడంతో ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ ఆసియా మారూఫ్కు బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ ఓబులేష్కు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మునిపల్ చైర్పర్సన్గా తనకు వైఎస్సార్సీపీ అవకాశం ఇచ్చిందన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన అన్ని రకాల నిధులతో ఆత్మకూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులు చేశామన్నారు. కార్యక్రమంలో ఆత్మకూరు మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు రషీద్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇంటర్ పరీక్షల్లో 256 మంది గైర్హాజరు నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం మ్యాథ్స్ పేపర్–2ఏ, సివిక్స్ పేపర్–2, వొకేషనల్–2 పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగినట్లు డీఐఈఓ శంకర్నాయక్ తెలిపారు. మొత్తం 10,376 మంది విద్యార్థులకు గాను 1,120 మంది హాజరు కాగా 256 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. -
ప్రమాదం అంచున ప్రయాణం
కోవెలకుంట్ల: పనులకు వెళ్లే కూలీలు ప్రమాదం అంచున ప్రయాణం చేస్తున్నారు. ఈ ఏడాది రబీ సీజన్లో సాగు చేసిన శనగ నూర్పిడి పనులు యంత్రాల సాయంతో చేస్తున్నారు. కోతకోసిన పప్పుశనగ అడలను కంబైన్డ్ హార్వెస్టర్లో వేసి నూర్పిడి చేయాల్సి ఉంది. గ్రామాలకు దూరంలో ఉండే పొలాలకు కూలీలు యంత్రంలోని గ్రిల్లో కూర్చొని వెళుతున్నారు. పొరపాటున యంత్రం వెళ్లే సమయంలో గ్రిల్ ఆన్అయితే కూలీలు చట్రంలో పడి ప్రాణాలు కోల్పోవాల్సిందే. గతంలో గ్రిల్లో కూర్చుని ప్రమాదశాత్తు అందులో పడి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికై నా కూలీలను గ్రిల్లో తరలించకుండా పొలాలకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించాలని పలువురు కోరుతున్నారు. సత్వర చికిత్స కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి గోస్పాడు: జిల్లా సత్వర చికిత్స కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటరమణ అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ వినికిడి దినోత్సవం కార్యక్రమాన్ని జిల్లా సత్వర చికిత్స కేంద్రంలో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా సత్వర చికిత్స కేంద్రంలో చిన్న పిల్లలకు వినికిడిని పరీక్షించుకోవాలన్నారు. జిల్లా ప్రోగ్రాం అధికారి కాంతారావునాయక్, పిల్లలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. జాతీయ పోటీలకు హిమ గణేష్ నంద్యాల(న్యూటౌన్): బనగానపల్లెలో వెటర్నరీ అసిస్టెంట్గా పనిచేస్తున్న దివ్యాంగ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు హిమ గణేష్ జాతీయస్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ పోటీలు హైదరాబాదులో ఆరవ తేదీ నుంచి నిర్వహించనున్నారు. విజయనగరంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో హిమ గణేష్ ప్రతిభ కనబరిచారని జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికృష్ణ, కార్యదర్శి రమణయ్య తెలిపారు. నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో హిమ గణేష్ను బుధవారం అభినందించారు. కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజీలో 2020 బ్యాచ్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే గురువారం నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ చెప్పారు. ఆమె బుధవారం మాట్లాడుతూ.. కళాశాలలో ఇది 63వ గ్రాడ్యుయేషన్ సెర్మనీ అని పేర్కొన్నారు. అరోకా 26 పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగాడాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. -
కౌలు రైతులకు దక్కని సాయం
మాకు నాలుగు ఎకరాల సొంత భూమి ఉంది. ఆరు ఎకరాలు కౌలుకు తీసుకున్నాం. ఇందులో ఉల్లి, మొక్కజొన్న, టమాట తదితర పంటలు సాగు చేస్తున్నాం. ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేవు. అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. నష్టపరిహారం ఇవ్వలేదు. – ఈశ్వరయ్య, రైతు, చిన్నటేకూరు, కల్లూరు మండలం మాది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. ఈ ఏడాది వర్షాలు ఎక్కువై పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు ఎలాంటి ఆసరా లేకుండా పోయింది. అన్నదాత సుఖీభవకు మొదటి ఏడాది మంగళం పలికారు. రెండో ఏడాది రెండు విడతలకే పరిమితం చేశారు. మూడో విడత ఎప్పుడు ఇస్తారో? రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా బీమా లభించలేదు. – టీ.పక్కీరప్ప, జొన్నగిరి, తుగ్గలి మండలం294598 గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ‘రైతు భరోసా’ అందుకున్న అన్నదాతలు 272757 చంద్రబాబు ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ అందుకున్న కర్షకులు 21841 చంద్రబాబు ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవకు దూరమైన రైతులు కర్నూలు(అగ్రికల్చర్): కష్టాన్నే నమ్ముకున్న కర్షకులకు కన్నీళ్లే మిగిలాయి. చంద్రబాబు ప్రభుత్వంలో అన్నీ కోతలే కనిపిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలతో పంటలన్నీ దెబ్బతిన్నా.. ఉచిత పంటల బీమా జాడ లేకుండా పోయింది. ‘అన్నదాత సుఖీభవ’ అంటూ గొప్పలు చెప్పినా.. తొలి ఏడాది రిక్తహస్తం చూపారు. రెండో ఏడాది అరకొర సాయం అందింది. ‘అన్నం పెట్టం.. మాటలతోనే కడుపు నింపుకోండి’ అన్నట్లు సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని రైతులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఉత్తుత్తి మాటలు నమ్మి దారుణంగా మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘మూడో’ మోసం! అన్నదాత సుఖీభవ అన్నదాతలను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. 2024 జూన్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికలకు ముందు ప్రకటించిన సూపర్–6 హామీల పక్కన పెట్టేశారు. ఇందులో భాగంగానే 2024–25లో అన్నదాత సుఖీభవను ఎగ్గొట్టడంపై రైతుల నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది. 2025–26 నుంచి అమలు చేస్తున్నా అరకొరకు పరిమితం చేసి మమ అనిపిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్నదాత సుఖీభవ కింద సాయాన్ని మూడు విడతల్లో చెల్లిస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు రెండు విడతల్లో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కింద రైతులకు రూ.14 వేలు మాత్రమే లభించాయి. మూడో విడతలో అన్నదాత సుఖీభవ కింద రూ.4000, పీఎం కిసాన్ కింద రూ.2000 విడుదల చేయాల్సి ఉంది. 2025–26 ఆర్థిక సంవత్సరం మరో 25 రోజుల్లో ముగియనుంది. ఇప్పటి వరకు మూడో విడత సాయం రైతులకు దక్కని పరిస్థితి ఏర్పడింది. అన్నదాత సుఖీభవపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2024 ఎన్నికల సమయంలో సూపర్–6లో భాగంగా పీఎం కిసాన్తో సంబంధం లేకుండా మేమే రైతులకు ఏటా రూ.20 వేలు చెల్లిస్తామని టీడీపీ ఆధినేత చంద్రబాబు నాయుడు ఊరూవాడా ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్తో ముడిపెట్టి రూ.14 వేలకు మాత్రమే పరిమితం అవుతుండటంపై రైతుల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. మొదటి ఏడాది అన్నదాత సుఖీభవను పూర్తిగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది నుంచి అమలు చేస్తున్నప్పటికి మూడో విడత ఊసే లేకుండా పోయింది. పెండింగ్ రూ.10 కోట్లు అధిక వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులెత్తేశారు. 2025 ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కురిసిన అధిక వర్షాలతో వేలాది ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి. నిబంధనల ప్రకారం 33 శాతం కంటే దెబ్బతింటే ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలి. అధిక వర్షాలతో 50 నుంచి 100 శాతం వరకు పంటలు దెబ్బతిన్నాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఎన్యూమరేషన్ చేయించి పంట నష్టాన్ని అతి తక్కువగా చూపించింది. అతి తక్కువ నమోదు చేసిన ఇన్పుట్ సబ్సిడీ కూడా రైతులకు చెల్లించలేదు. ఉమ్మడి జిల్లాలో 2026లో అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్ సబ్సిడీ దాదాపు రూ.10 కోట్ల వరకు పెండింగ్లో ఉండి పోయింది. ధీమా ఇవ్వని బీమా రైతులు ప్రీమియం చెల్లిస్తే 2024–25 రబీ నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా, వాతావరణ ఆధారిత బీమాను అమలు చేస్తున్నారు. ఉచిత పంటల బీమాను పక్కన పెట్టి ప్రీమియం చెల్లించిన రైతులకే బీమా అనే విధానాన్ని తెచ్చారు. 2024–25 రబీ, 2025 ఖరీఫ్ సీజన్లో రైతులు ప్రీమియం చెల్లించి బీమా చేసుకున్నప్పటికీ పరిహారం ఊసే లేకుండా పోయింది. అధిక వర్షాలు, వర్షాభావంతో పంటలు దెబ్బతిన్నప్పటికీ ఒక్క రూపాయి పరిహారం లేదు. ప్రీమియం చెల్లించి బీమా చేసుకున్నా పరిహారం వస్తుందో.. లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది.. 2025–26 రబీలో పంటల బీమాను అమలే చేయలేదు. అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్నప్పటికీ బీమా జాడనే లేకుండా పోవడం రైతులకు తీవ్ర ఆందోళనను మిగిల్చింది. వైఎస్సార్సీపీ హయాంలో.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అధిక వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లితే కేవలం నెల రోజుల్లోనే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది. పంట నష్టం జరిగిన కొద్ది రోజుల్లోనే ఎన్యూమరేషన్ చేపట్టడం, ఆ వెంటనే ప్రభుత్వానికి రిపోర్టు పంపడం, రిపోర్టు పంపిన కొద్ది రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాలకు డీబీటీ ద్వారా ఇన్పుట్ సబ్సిడీ చెల్లించడం ఆనవాయితీగా ఉండేది. రైతుల నుంచి ప్రీమియం రూపంలో రూపాయి కూడా వసూలు చేయకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసింది. ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్కు ముందే పంటల బీమా కింద రైతులకు పరిహారం చెల్లించేవారు. నోటిఫై చేసిన పంట ఏదైనా ఈ–క్రాప్లో నమోదైతే చాలు బీమా అమలులో ఉన్నట్లే.41320 ఆర్సీ కార్డులు ఉన్నా అన్నదాత సుఖీభవ అందని కౌలు రైతులు28600 గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా అందుకున్న కౌలు రైతులుచంద్రబాబు ప్రభుత్వంలో కౌలు రైతులకు తీరని అన్యాయం జరిగింది. అన్నదాత సుఖీభవ కింద జిల్లాలో కౌలుదారులకు రూపాయి కూడా చెల్లించలేదు. కర్నూలు జిల్లాలో 25 వేలు, నంద్యాల జిల్లాలో 28 వేల మంది రైతులకు సీసీఆర్సీ కార్డులు జారీ చేశారు. ఒక్క రైతుకు కూడా అన్నదాత సుఖీభవ అమలు కాలేదు. కౌలు రైతులతో పాటు ఎండోమెంట్, అటవీ భూములు (ఆర్ఓఎఫ్ఆర్) అనుభవిస్తున్న వారికి, అసైన్ భూములకు, వేలాది పట్టాదారులకు అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయం అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కౌలురైతులతో పాటు ఆర్వోఎఫ్ఆర్, ఎండోమెంటు, అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు ఆర్థికంగా చేయూత ఇచ్చింది. 2024–25లో అందని అన్నదాత సుఖీభవ 2025–26 నుంచి అరకొరగా అమలు ఏడాది ముగుస్తున్నా మూడో విడత మాటే లేదు! అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలు నష్ట పరిహారం ఊసే కరువు చంద్రబాబు ప్రభుత్వ తీరుపై రైతుల ఆగ్రహం -
తేనె ఉత్పత్తితో అదనపు ఆదాయం
ఎమ్మిగనూరు సెంట్రల్: తేనె టీగలు పెంచుతూ తేనె ఉత్పత్తి చేయడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని నంద్యాల ఆర్ఏఆర్ఎస్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఎం.జాన్సన్, కేవీకే ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డా. రాఘవేంద్ర చౌదరి పేర్కొన్నారు. బనవాసి కేవీకేలో గత కొన్ని రోజులుగా తేనేటీగల పెంపకంపై ఇస్తున్న శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. శిక్షణకు హాజరైన 30 మంది రైతులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తేనెటీగల పెంపకం ద్వారా నూనెగింజల పంటలలో పరాగసంపర్కం మెరుగుపడి ఉత్పాదక గణనీయంగా పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు అశోక్కుమార్, రవిప్రకాష్రెడ్డి, సుజాతమ్మ, ట్రైనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
వాము క్రయవిక్రయాలపై నిఘా
కర్నూలు(అగ్రికల్చర్): వాము క్రయవిక్రయాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారనే అనుమానితులపై ప్రత్యేక నిఘా ఉంచాలని కర్నూలు మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి అసిస్టెంట్ సెక్రటరీ, సూపర్వైజర్లను ఆదేశించారు. ఇందుకోసం ఆరు టీములు ఏర్పాటు చేశారు. బుధవారం ‘సాక్షి’లో వాము క్రయ విక్రయాల్లో జరిగే మోసాలపై ‘కాటా’కట శీర్షికన ప్రచురితమైన కథనానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి స్పందించారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులను, మార్కెట్ కమిటీని ఆదేశించారు. మార్కెట్లో వాము క్రయ విక్రయాల్లో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందో.. అలాంటి కమీషన్ ఏజెంట్ దుకాణాలకే సరుకు ఎక్కువగా వస్తుండటం గమనార్హం. ఏఏ కమీషన్ ఏజెంటుకు ఎక్కువ వాము వచ్చిందో.. వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని, తూకాలను తనిఖీ చేయాలని సూచించారు. -
గత ఫిబ్రవరి 2వ తేదీన వాముకు అత్యధికంగా రూ.30,303 ధర లభించింది. సగటు ధర మాత్రం రూ.16,099 మాత్రమే. ఈ స్థాయిలో ధర లభించినప్పుడు సగటు ధర కూడా రూ.25 వేల వరకు ఉంటే రైతులకు గిట్టుబాటు ధర లభించినట్లవుతుంది. అలాంటిది సగటు ధర అత్యల్పంగా నమోదు కావడం చూస్తే వ్యాపారుల
మార్కెట్కు వచ్చిన వాము నిల్వలు కర్నూలు(అగ్రికల్చర్): తక్కువ పెట్టుబడితో ఎక్కువ నికర ఆదాయాన్ని తెచ్చి పెట్టే పంట కావడంతో రైతులు వాము సాగుపై ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో పండించిన వాము దేశంలోని అన్ని ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది. ఏడాది పొడవున 10 వేల ఎకరాల్లో ఈ పంట సాగవుతోంది. రబీ సీజన్లోనే 4,873 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ సీజన్లో సాగయ్యే ప్రధాన పంటల్లో వాము కూడా ఒకటి. అయితే మార్కెటింగ్కు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు మాత్రమే ఆధారం. తీరా ఇక్కడ చూస్తే వ్యాపారులు సిండికేట్గా మారి రైతులను దగా చేస్తున్నారు. కొందరు కమీషన్ ఏజెంట్లు వాము రైతులను నిలువునా దోచేస్తున్నారు. అండ గా నిలవాల్సిన మార్కెట్ కమిటీ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఉత్తుత్తి తనిఖీలు చేపట్టడం మినహా అక్రమాలను అరికట్టే పరిస్థితి కరువైంది. ఒకటి, రెండు లాట్లకే అధిక ధర వాము కాసుల పంట పండించేది కావడంతో మార్కెట్కు భారీగా తెప్పించుకునేందుకు వ్యాపారులు ఒకటి, రెండు చిన్న లాట్లకు అత్యధిక ధర కోట్ చేస్తారు. ఈ ధరను చూసి కర్నూలు మార్కెట్లో వాము ధర మెరుగ్గా ఉందని భ్రమపడి సరుకును తెచ్చి కొందరు కమీషన్ ఏజెంట్లు, వ్యాపారుల చేతుల్లో రైతులు నిలువునా మోసపోతున్నారు. ప్రతి రోజూ మార్కెట్లో వ్యాపారులు సిండికేట్గా మారి తక్కువ ధరకు వాము కొని లాభాల పంట పండించుకుంటు న్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కర్నూలు వ్యవసా య మార్కెట్ యార్డులో వాము వ్యాపారులు దాదాపు 10 మంది మాత్రమే ఉన్నారు. వీరంతా సిండికేట్గా మారుతున్నట్లు తెలుస్తోంది. పొద్దుపోయే వరకు కాటా సాగదీత మార్కెట్ యార్డులో మధ్యాహ్నం 2 గంటల సమయానికే ధరలు ఖరారవుతాయి. వెంటనే కాటాలు వేయవచ్చు. ధరలు ఖరారైన రెండు, మూడు గంటల్లోనే వేరుశనగ, కందులు, శనగలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల కాటాలు వేయడం పూర్తవుతోంది. వాము తూకాల విషయంలో వ్యాపారులు, కొందరు కమీషన్ ఏజెంట్లు తీవ్ర జాప్యం చేస్తూ రాత్రి పొద్దు పోయే వరకు సాగదీస్తున్నారు. మార్కెట్ కమిటీ అధికారులు, సిబ్బంది ఐదారు గంటల ప్రాంతంలో వెళ్లిపోతారు. ఆ తర్వాత మార్కెట్ యార్డులో రైతులను దోపిడీ చేసే కార్యక్రమం మొదలవుతుంది. తూకాలు పూర్తయిన తర్వాత కొంత చిలుకు మిగు లుతుంది. 50 కిలోలు ఉంటే 25 కిలోలే ఉన్నట్లు.. 25 కిలోలు ఉంటే 10 కిలోలే ఉందనడం.. ఇలా సగానికి సగం దగా చేసి కాసుల పంట పండించుకుంటున్నారు. మార్కెట్ యార్డులో వాముపై అక్రమ సంపాదన దాదాపు రూ.కోటి వరకు ఉంటుందనే ప్రచారం ఉంది. సీల్ బ్రేక్ చేసి.. మార్కెట్ యార్డులో ఎలక్ట్రానిక్ కాటాలు వినియోగిస్తున్నారు. వీటికి సీల్ ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో తొలగించరాదు. తొలగించారంటే రైతులను మోసం చేస్తున్నట్లే. ఇటీవల ఓ కమీషన్ ఏజెంట్ కాటాకు ఉన్న సీల్ తొలగించి తూకాల్లో రైతులను భారీ ఎత్తున దగా చేసినట్లు తేలింది. ఈ కమీషన్ ఏజెంట్కు రూ.70 వేలు జరిమానా కూడా విధించారు. ఇలాంటి కమీషన్ ఏజెంట్లు మార్కెట్ యార్డులో మరికొందరు ఉన్నారనే చర్చ జరుగుతోంది. ప్రతి రైతు నుంచి 2–3 కిలోల వరకు తరుగు కింద తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. శాంపుల్స్ రూపంలో ప్రతి ఒక్కరూ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇలా ప్రతి రైతు 10 కిలోల వరకు కోల్పోతున్నారు. అంటే దీని విలువ రూ.1000పైనే. వాము వ్యాపారంలో జీరో దందా రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా వాము సాగవుతోంది. వాము మార్కెటింగ్కు కర్నూలు వ్యవసా య మార్కెట్ యార్డు మాత్రమే ఆధారం. మార్కెట్కు వచ్చిన రైతులు ఏ ఒక్కరూ మంచి ధర లభించిందని సంతోషంగా వెళ్లే పరిస్థితి లేదు. రైతులను దగా చేస్తూనే జీరోకు పాల్పడుతూ మార్కెట్ కమిటీ ఆదాయానికి సైతం గండికొడుతున్నారు. ఈ–నామ్లోనే కొనుగోళ్ల ప్రక్రియ జరుగుతున్నప్పటికీ 50 శాతం వరకు జీరోపై తరలిస్తున్నట్లు తెలుస్తోంది. రైతుల నుంచి వ్యాపారులు వాము కొనుగోలు చేస్తే మార్కెట్ కమిటీకి ఒక్కశాతం ఫీజు చెల్లించాల్సి ఉంది. ఫీజును ఎగ్గొట్టేందుకు వ్యాపారులు జీరోకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. మార్కెట్లో ఎక్కడికక్కడ ముడుపులతో జీరోపై బయటికి తరలిస్తుండటం గమనార్హం. దగా పడుతున్న వాము రైతు జాతీయ స్థాయిలో వాముకు డిమాండ్ ఉన్నా.. జిల్లా రైతులు మాత్రం నష్టాలను మూటగట్టుకుంటున్నారు. మార్కెట్కు వాము రావడం మొదలైందంటే మార్కెట్లో వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, కార్మికులు, మార్కెట్ కమిటీ అధికారులు.. ఇలా అందరికీ పండగే. కొందరు కమీషన్ ఏజెంట్లు వాము పండించే గ్రామాలకు వెళ్లి రైతులను తియ్యటి మాటలతో మభ్యపెడుతున్నారు. అమ్ముకోవడానికి తమ వద్దకే వచ్చేలా చేసుకొని దోపిడీ సాగిస్తున్నారు. మరికొందరు రైతులకు ముందుగా అప్పులు ఇచ్చి తమ వద్దే అమ్ముకునే పరిస్థితి కల్పిస్తూ మోసానికి పాల్పడుతున్నారు. మార్కెట్ కమిటీ అధికారుల ఉదాసీన వైఖరి రైతులకు శాపంగా మారుతోంది. -
పనుల మోత.. జీతంలో కోత
గోస్పాడు: అసలే అరకొర వేతనాలు.. ఆపై నెలలుగా నిరీక్షించాల్సి రావడంతో జిల్లా సర్వజన ఆసుపత్రి పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన బాట పట్టారు. వేతనాల చెల్లింపులో తీవ్ర జాప్యం చేస్తుండంతో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. శ్రమకు తగిన గుర్తింపు, భద్రత లభించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో ప్రస్తుతం షిప్టుల వారీగా 94 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో వేతనాలు సక్రమంగా అందక, మరో వైపు వేతనాల్లో కోత పడే పరిస్థితి నెలకొనడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పని భారంతో పాటు వేధింపులకు గురి చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో చేయా ల్సిన పనులకు మించి చేయిస్తున్నారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య పనులతో పాటు వార్డుల్లో కుళాయిలు, తలుపులు, ఫ్లోరింగ్ మరమ్మతులు సంబంధించిన పనులు చేయిస్తున్నారు. ప్రస్తుతం పారిశుద్ధ్య పనులపై పర్యవేక్షణ పెరిగిందని కార్మికుల పనితీరుకు స్కోరింగ్ ఇస్తూ వేతనాలు మంజూరు చేస్తున్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.18,685 వేతనం అందాల్సి ఉండగా పీఎఫ్, ఈఎస్ఐ, ఇతర అలవెన్సులు పోగా చేతికి నెలనెలా రూ.14 వేలు అందాల్సి ఉంది. జిల్లా ఆసుపత్రిలో వారికి నెలకు మొత్తంగా రూ.20 లక్షలకుపైగా బిల్లులు రావాల్సి ఉంది. అయితే కార్మికులకు 95 శాతం స్కోర్ ఉంటే తప్ప వారికి ఈ వేతనాలు అందే పరిస్థితి లేదు. అయితే ప్రస్తుతం అందుకు సంబంధించిన అధికారులు సక్రమంగా బిల్లు లు చేయక పోగా కార్మికులు పని చేస్తున్న పనులకు సంబంధించిన స్కోరింగ్ను 88 శాతానికి పరిమితం చేస్తుండటంతో వేతనంలో కూడా కోత పడునుంది. దీంతో తమకు రావాల్సిన వేతనంలో నెలకు రూ. 2వేలకు పైగా తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇది కూడా సక్రమంగా రాక పోతే తమ పరిస్థితి ఏంటని వారు మంగళవారం ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలో రెగ్యులర్ సూపరింటెండెంట్ లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికులుగా నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి లో విధులు నిర్వహిస్తున్నాం. ప్రతినెలా వేతనాలు అందటం లేదు. వేతనాల కోసం ప్రతిసారి అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. పని చేసిన ఫలితం లేదు. ప్రతిరోజు ఆసుపత్రిలో వ్యర్థాలను తొలగిస్తూ శుభ్ర పరుస్తున్నాం. అధికారులు చెప్పిన ప్రతి పని సకాలంలో చేస్తున్నా మాకు నెల వచ్చే సరికి వేతన కష్టాలు తప్పడం లేదు. ప్రతి నెలా సక్రమంగా జీతాలు చెల్లించి న్యాయం చేయాలి. – కిరణ్, పారిశుద్ధ్య కార్మికుడు మాకు రెండు నెలల జీతం రావాలి. చాలీచాలని వేతనాలను నమ్ముకుని జీవనం సాగిస్తున్నాం. వేతనాలు ఎప్పుడు వస్తాయోనని ఎదురుచూడాల్సి వస్తుంది. రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో కుటుంబ పోషణ భారంగా మారింది. వేతనం పెరగక పోగా వచ్చే సొమ్ము సకాలంలో చేతికందటం లేదు. – నాగలక్ష్మమ్మ, పారిశుద్ధ్య కార్మికురాలు -
వేగంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. ఎండల తీవ్రతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాష్ట్రంలోనే అధిక ఉష్ణోగ్రతలు కర్నూలు జిల్లాలోనే నమోదు అవుతుండటం గమనార్హం. కర్నూలులో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23.7 డిగ్రీలు, నంద్యాలలో గరిష్ట 37 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 22.4 ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రోజుల్లో వేగంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకా శం ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. వడదెబ్బతో రైతు మృతి జూపాడుబంగ్లా: తాటిపాడుకు చెందిన వంగల కృష్ణారెడ్డి (62) అనే రైతు వడదెబ్బ తో మృతి చెందాడు. మొక్క జొన్న పొలానికి మంగళవారం నీళ్లు కట్టుకొంటూ కుప్పకూలిపోయాడు. కృష్ణారెడ్డిని ఆటో లో ఇంటికి, అక్కడి నుంచి 108లో నందికొట్కూరు ప్రభు త్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుని భార్య లక్ష్మీదేవి తాటిపాడు సర్పంచ్ కాగా మృతునికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
సిమెంట్నగర్ వాసుల్లో యుద్ధ భయం
బేతంచెర్ల: ఇరాన్ – ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధంతో సిమెంట్నగర్ వాసుల్లో భయాందోళన నెలకొంది. గల్ఫ్ దేశాల్లో సిమెంట్నగర్ గ్రామానికి చెందిన కార్మిక కుటుంబాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. ప్రధానంగా కువైట్ సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో క్షిపణి దాడులు జరగడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులను బయటకు వెళ్ల వద్దని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అక్కడ సుమారు 70 మంది వరకు సిమెంట్నగర్ యువకులు ఉన్నట్లు సమాచారం. గతంలో పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తూ నైపుణ్యం పొందిన పలువురు సిమెంట్ నగర్ వాసులు ఉపాధి కోసం కువైట్, దుబాయ్, సౌదీ, బెహరిన్, ఖతర్, అబుదాబీకి వెళ్లినట్లు తెలుస్తోంది. చంద్రగ్రహణం ఎఫెక్ట్ మహానంది: కేతుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం మహానంది ఆలయ తలుపులు మూతబడ్డాయి. ఉదయం 8 గంటల వరకు శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వార్ల దర్శనాలు కొనసాగాయి. అనంతరం గ్రహణం కాలం కావడంతో ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఆలయ వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ.. శ్రీ కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వార్లతో పాటు కోదండ రామాలయం, వినాయకనంది, ఆంజనేయ స్వామి, నవగ్రహ ఆలయాలు, గరుడనంది ఆలయాల తలుపులను శాస్త్రోక్త పూజలతో మూసేశారు. రాత్రి ఏడు గంటలకు సంప్రోక్షణ, ఆలయ శుద్ధి అనంతరం రాత్రి 9.30 గంటల వరకు భక్తులకు దర్శనాలను కల్పించారు. ఆలయ సూపరింటెండెంట్ అంబటి శశిధర్రెడ్డి, ఆలయ ఇన్స్పెక్టర్ నాగమల్లయ్య, సిబ్బంది పాల్గొన్నారు. పాఠశాలల్లో నేటి నుంచి విజ్ఞాన వారోత్సవాలు కర్నూలు సిటీ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో నేటి(బుధవారం) నుంచి విజ్ఞాన వారోత్సవా లు నిర్వహించాలని డీఈఓ ఎల్.సుధాకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 4, 5, 6 తేదీల్లో మూడు రోజుల పాటు విజ్ఞాన వారో త్సవాలు నిర్వహించాలన్నారు. నేడు పాఠశాల స్థాయిలో, 4, 5వ తేదీల్లో ఆయా మండల కేంద్రాల్లో ఎంఈఓ సూచించిన పాఠశాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. 6వ తేదీన జిల్లా స్థాయి విజ్ఞాన వారోత్సవాలు ఐఏఎస్ఈ కాలేజీ (సిల్వర్జూబ్లీ కాలేజీ ఆవరణలోని ప్రభుత్వ బీఈడీ కాలేజీ)లో నిర్వహిస్తామన్నా రు. సందేహాల నివృత్తికి జిల్లా సైన్స్ అధికారి 87901 11331ను సంప్రదించాలన్నారు. 25న డాక్ అదాలత్ కర్నూలు(అర్బన్): డాక్ అదాలత్ కార్యక్రమాన్ని ఈనెల 25న ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు కర్నూలు డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ జి.జనార్ధన్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. డివిజన్ పరిఽ దిలోని తపాలా కార్యాలయాల్లో ప్రజలకు అందించే సేవలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇతరత్రా సమస్యలను డాక్ అదాలత్లో పరిష్కరించుకునే అవకాశాన్ని కల్పిస్తామన్నారు. -
తిరువీధుల మెరసీ దేవదేవుడు
● అంబరాన్నంటిన అహోబిలేశుడి రథోత్సవం ● గోవింద నామస్మరణతో మార్మోగిన నల్లమల ● ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఆళ్లగడ్డ: అహోబిల క్షేత్రంలో ప్రహ్లాదవరదుడు ఉభయ దేవేరులతో కలసి రథంపై కొలువై భక్తులకు అభయమిచ్చారు. సకల దేవతారాధకుడైన స్వామివారు దాంపత్య శోభతో రథాన్ని అధిష్టించి అహోబిలం క్షేత్రం తిరువీధుల్లో విహరించారు. వేద పండితుల మంత్రాచ్ఛారణలు.. ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాలు.. భక్తజన గోవిందా నామస్మరణతో నల్లమల గిరులు మారుమోగాయి. అహోబిలేశుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా దిగువ అహోబిల క్షేత్రంలో మంగళవారం ప్రహ్లాదవరదస్వామి రథోత్సవం కనుల పండువగా సాగింది. ముందుగా ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించి పట్టు పీతాంబరాలతో ఆదిదంపతులుగా ముస్తాబు చేసి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను రథం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అప్పటికే వివిధ రకాల పుష్పాలతో ముస్తాబు చేసిన రథంపై స్వామి, అమ్మవార్లను ఉంచి పూజలు చేశారు. అహోబిల మఠం పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్ శాస్త్రోక్తంగా రథాంగ పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. రథం ముందు భక్తి పారవశ్యంతో కళాకారులు, భక్తుల కోలాటాలు, హరి భజనలు, డప్పుల వాయిద్యాలు, ఢమరుక నాధాలు, కళాకారుల వేషధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రహ్లాదవరదుడు రథంపై నుంచి భక్తులను అనుగ్రహిస్తూ క్షేత్ర మాడవీధుల్లో విహరించారు. స్వామి వారిని దర్శించుకున్న భక్తజనం గోవిందా.. గోవింద అంటూ మొక్కులు చెల్లించుకున్నారు. -
భక్తులను దోచుకుంటున్నారు
ఆళ్లగడ్డ: అహోబిలం చేరుకునే భక్తులను టోల్గేట్ నిర్వాహకులు దోచుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. అహోబిలం బ్రహ్మోత్సవాలకు అత్యధికంగా పేదలు, మధ్యతరగతి వర్గాల కు చెందిన భక్తులు వస్తారన్నారు. కుటుంబంతో వచ్చే సమయంలో కారు, ఆటోలను అద్దెకు తెచ్చుకుంటారన్నారు. వారి నుంచి ఒక్కో వాహనానికి రూ. 200 వసూలు చేయడం ఏంటని మండి పడ్డారు. టోల్గేట్ వసూలు చేసే దగ్గర ఏ వాహనానికి ఎంత అన్న బోర్డును అధికారులు ఎందుకు పెట్టలేక పోతున్నారని నిలదీశారు. గతంలో టోల్గేట్ వేలం పాటల్లో పోటీ లు పడి పాట ఎక్కువగా పోతే భక్తుల నుంచి వసూళ్లు ఎక్కువగా చేయాల్సి వస్తుందని అప్పటి పోలీసు, పంచాయతీ అధికారుల ద్వారా రాజీ చేయించి తక్కువ పాటకు దక్కేలా చేశామన్నారు. భారీ వాహనానికి రూ.100 వసూలు చేస్తున్నారని ఇప్పటి ఎమ్మెల్యే అప్పుడు ఆ చీటి పట్టుకుని నానా రభస చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారులు నిర్ణయించిన ధరల ప్రకారం ఆటోకు రూ. 75, కారుకు రూ. 100 మాత్రమే వసూలు చేయాలని, ఇష్టారాజ్యంగా వసూలు చేస్తే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. -
ఈ కారు ఎవరిదో?
నంద్యాల జిల్లా: మండల పరిధిలోని కౌలూరు సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ పెట్రోల్ బంకులో ఆరు రోజులుగా ఉన్న కారు స్థానికంగా కలకలం రేపుతోంది. గత నెల 25వ తేదీ రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు తెలంగాణ రిజిస్ట్రేషన్ ( టీఎస్ 11 ఈఎఫ్ 0956) కలిగిన హ్యుందాయ్ కారును బంకు ఆవరణలో పార్క్ చేసి వెళ్లారు. వారం గడుస్తున్నా కారును తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోవడంతో అనుమానం వచ్చిన బంకు యజమాని సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును పరిశీలించారు. వాహన వివరాల ఆధారంగా యజమాని ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
సమన్వయంతో విధులు నిర్వర్తించండి
● శ్రీశైల దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు శ్రీశైలంటెంపుల్: ఉగాది మహోత్సవాలపై శ్రీశైల దేవస్థానంలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వర్తించాలని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు ఆదేశించారు. సోమవారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో ఉగాది మహోత్సవాల ఏర్పాట్లపై ఈఓ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. కన్నడ భక్తుల సౌకర్యార్థం ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నాలుగు విడతలుగా స్పర్శ దర్శనం కల్పించబడుతుందన్నారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశించినట్లుగా అన్ని ఏర్పాట్లు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయా లని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అటవీశాఖ అధికారుల సహకారంతో పాదయాత్ర భక్తులకు మంచినీటి సదుపాయం, సాక్షిగణపతి, హఠకేశ్వరం, శిఖరేశ్వరం, కైలాసద్వారం, క్షేత్రంలో భక్తులు సేద తీరే ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేయాలన్నారు. కాలిబాట మార్గంలో, క్షేత్రంలో అన్నదానం చేసే దాతలకు దేవస్థానం తరఫున పూర్తి సహా య సహకారాలను అందిస్తామన్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారాన్ని అందజేస్తామన్నారు. క్యూలైన్లలో అవసరమైన చోట కూలర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్షేత్ర పరిధిలో భక్తులు సేద తీరేందుకు షామియానాలు, పైప్ పెండ్యాల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. క్షేత్ర పరిధిలో పలు చోట్ల తాత్కాలిక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తామన్నారు. -
బ్రహ్మాండ నాయకా.. భక్తజన పాలకా!
భక్తజనం మధ్య రథోత్సవం● రమణీయం ఉగ్రనరసింహుడి రథోత్సవం ఆళ్లగడ్డ: భక్తుల గోవింద నామస్మరణలు.. వేదపండితుల వేదమంత్రోచ్ఛారణలు.. డప్పుల వాయిద్యాల మధ్య శ్రీ జ్వాలా నృసింహస్వామి రథో త్సవం ఎగువ అహోబిలంలో నేత్ర పర్వంగా కొనసాగింది. అహోబిలేశుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదవ రోజైన సోమవారం ఎగువ అహోబిలంలో వెలసిన శ్రీజ్వాలా నృసింహస్వామి రథోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. భక్తులు భక్తి పారవశ్యంతో రథం లాగారు. నిత్యపూజల్లో భాగంగా ఉత్సవమూర్తులైన జ్వాలా నృసింహ స్వామి, అమ్మవార్లకు వేదపండితుల ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకించి, నవకలశ తిరుమంజనం నిర్వహించిన అనంతరం స్వామి, ఉభయదేవేరులను పట్టుపీతాంబరాలతో అలంకరించి ఆది దంపతులుగా ముస్తాబు చేశారు. ముస్తాబైన ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాల మధ్య పల్లకీలో కొలువుంచి దేవాలయం బయట ఉన్న రథం వరకు తోడ్కొని వచ్చారు. అప్పటికే వివిధ పుష్పాలతో నేత్రానందపర్వంగా ముస్తాబు చేసిన రథంపై అహోబిలేశుడు దేవదేవేరులతో అధిష్టించారు. వేదపండితులు రథాంగ పూజలు నిర్వహించిన అనంతరం కొబ్బరికాయలు సమర్పించి హారతిచ్చి మేష లగ్నంలో రథోత్సవాన్ని ప్రారంభించారు. దేవస్థాన మాడ వీధుల్లో రథోత్సవం కనుల పండువగా సాగింది. భక్తుల గోవింద నామస్మరణతో నల్లమల పులకించి పోయింది. ఉభయ దేవేరులతో రథంలో కొలువైన శ్రీజ్వాలా నృసింహస్వామి -
వైభవంగా శ్రీశైలగిరి ప్రదక్షిణ
శ్రీశైలంటెంపుల్: పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్ల మహామంగళహారతుల అనంతరం ఉత్సవమూర్తులను పల్లకీలో ఉంచి ఊరేగింపుగా గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. ఆలయ మహాద్వారం నుంచి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధర మండ పం, అంకాళమ్మగుడి, నందిమండపం, గంగా సదనం, బయలు వీరభద్రస్వామి ఆలయం, రింగ్రోడ్డు, ఫిల్టర్బెడ్, సిద్దరామప్పకొలను, పుష్కరిణి వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి తిరిగి నందిమండపం, ఆలయ మహాద్వారం వద్దకు చేరుకుంది. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన అధికారులు, సిబ్బంది, పలువురు భక్తులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించండి నంద్యాల: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సంబంధించిన వాల్ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభు త్వం ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఈనెల 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వివిధ కార్యక్రమాల్లో మహిళలు పాలుపంచుకునేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, డీఆర్ఓ రామునాయక్, ఐసీడీఎస్ పిడి లీలావతి దేవి తదితరులు పాల్గొన్నారు. సారా రహిత జిల్లాగా మార్చాలి నంద్యాల: సారా రహిత జిల్లాకు మార్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి ఎస్. రవికుమార్ అన్నారు. సోమవారం జిల్లా ఎకై ్సజ్ కార్యాలయంలో ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ల వద్ద పెండింగ్లో ఉన్న కేసుల గురించి ఆరా తీసి, తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్ కేసులకు సంబంధించిన చార్జిషీట్లు సిద్ధం చేసి కోర్టుకు సమర్పించాలన్నారు. తర్వాత ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్ల వ్యక్తిగత పనితీరుపై సమీక్షించి, వారి పనితీరును మెరుగుపరచుకోలని సూచించారు. ఈనెల 13న జరగనున్న మెగా లోక్ అదాలత్ను దృష్టిలో ఉంచుకొని, వీలైనన్ని ఎక్కువ కేసులను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలన్నారు. మద్యం షాపులు, బార్లలో ఎటువంటి అక్రమాలు జరగకుండా, ప్రభుత్వ ఆదాయానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉగా ది ఉత్సవాల నేపథ్యంలో శ్రీశైలంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమీక్షించి, వాటికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. -
పీజీఆర్ఎస్ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ చూపండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా ఫిర్యాదులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, ప్రతి దరఖాస్తును సమయానుకూలంగా పరిశీలించి పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు ఓపెన్ చేసి పరిశీలించాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుతం 71 అర్జీలు ఇంకా ఓపెన్ చేయలేదన్నారు. ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీదారులకు అందజేసే ఎండార్స్మెంట్లు స్పష్టంగా, పారదర్శకంగా ఉండాలన్నారు. రీ–ఓపెన్ అయిన అర్జీలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని, అవి మళ్లీ పెండింగ్లో ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఆడిట్ కేసులను కూడా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, డీఆర్ఓ రామునాయక్, మున్సిపల్ కమిషనర్ శేషన్న అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ క్లినిక్స్లో 130 అర్జీల స్వీకరణ... భూ సంబంధిత సమస్యలను సమగ్రంగా పరిష్కరించేందుకు రెవెన్యూ క్లినిక్స్ను సద్వినియోగం చేసుకోవా లన్నారు. సోమవారం రెవెన్యూ క్లినిక్స్ ద్వారా మొత్తం 130 దరఖాస్తులు స్వీకరించగా, వాటిలో సచివాలయ సేవలకు సంబంధించినవి 4, అడంగల్ సవరణలకు సంబంధించినవి 22, చుక్కల భూముల క్రమబద్ధీకరణ, 22–ఎ భూములకు సంబంధించినవి 19, అసైన్డ్ భూములు, భూ ఆక్రమణలకు సంబంధించినవి 18, రెవెన్యూ కోర్టు విచారణలు, ఆర్ఓఆర్కు సంబంధించినవి 26 ఉన్నాయన్నారు. -
రెంటచింతల కంటే ఎక్కువ!
కర్నూలు(అగ్రికల్చర్): అధిక ఉష్ణోగ్రతలు ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే నమోదవుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. వేసవి కాస్త ఆలస్యంగా మొదలైనప్పటికీ ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటోంది. ఇప్పటికే వేసవి భగభగలతో ప్రజలు అల్లాడుతున్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి ఉపశమన చర్యలు తీసుకోలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు చలువ పందిళ్లు ఏర్పాటు చేసింది. నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ద్వారా చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసి వేసవి ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగించింది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఉపశమన చర్యలు చేపట్టడం లేదు. ఈ సారి కూడా రాష్ట్రంలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ ఇప్పటికే ప్రకటించింది. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలకు ఉమ్మడి కర్నూలు జిల్లా కేంద్రంగా మారింది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు చేరుకోవడం ఆందోళన కలిగించే విషయం. చల్లదనం కనుమరుగు గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే వాతావరణం చల్లగా ఉంటుంది. గాలిలో తేమ శాతం తగ్గే కొద్ది వేడి, వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ఫిబ్రవరి మొదటి వారంలో గాలిలో ఉదయం తేమ 90 శాతం వరకు, మధ్యాహ్నం సమయంలో 50 నుంచి 60 శాతం వరకు ఉంది. మార్చి మొదటి వారంలో ఉదయం పూట తేమ 50 శాతం వరకు, మధ్యాహ్న సమయంలో 15–20 శాతానికి పడిపోతోంది. ఒకవైపు ఎండల తీవ్రత, మరోవైపు వడగాల్పులు పెరుగుతున్నాయి. ఏప్రిల్లో ఉదయం పూట తేమ 40 శాతంలోపునకు, మధ్యాహ్నం సమయంలో 10 శాతానికి గాలిలో తేమ పడిపోయే ప్రమాదం ఉన్నట్లు వాతావరణ అధికారులు స్పష్టం చేస్తున్నారు. రానున్న రోజుల్లో వేసవి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసే ప్రమాదం ఏర్పడింది. కనిపించని పచ్చదనం జిల్లా మొత్తం విస్తీర్ణంలో అడవులు 33 శాతం వరకు ఉండాల్సి ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 15 నుంచి 16 శాతం మాత్రమే అడవులు ఉన్నాయి. అడవులు తరిగిపోతుండటానికి తోడు వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ఇది కూడా ఎండల తీవ్రత పెరగడానికి కారణమవుతోంది. భూగర్భ జలాలను ఎక్కువగా వినియోగిస్తుండటంతో భూమిలో నీటి నిల్వలు రోజురోజుకు ఇంకిపోతున్నాయి. గతేడాది అక్టోబరు నుంచి వర్షాలు లేవు. ఇందువల్ల భూమిలో తేమ లేకపోవడంతో ఎండల తీవ్రతకు నేలకు పగుళ్లు ఏర్పడి వాటి నుంచి వేడి సెగలు పుట్టుకొస్తున్నాయి. అప్పుడే వడగాడ్పులు వాహనాల సంఖ్య పెరగడంతో వాయు కాలుష్యం ఏర్పడుతోంది. కార్బన్ డైఅక్సైడ్ గాలిలో చేరుతుండటంతో భానుడి భగభగలు పెరుగుతున్నాయి. సాధారణంగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటితే వేడి గాలులు వీయడం ప్రారంభిస్తాయి. ప్రస్తుతం 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. అప్పుడే వడగాడ్పులు మొదలు కావడం ఆందోళన కలిగించే విషయం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండల తీవ్రత ఉంటోంది. ఉపశమనం లేనట్లే! వేసవి తీవ్రత పెరుగుతున్నా ఉపశమన చర్యలు లేకపోవడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. గతేడాది వేసవి ఉపశమన చర్యలు కనిపించలేదు. ఈ సారి కూడా అధిక ఉష్ణోగ్రతలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకునే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పంటలు ఎండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మూగజీవులకు నీరు అందుబాటులో ఉంచాలని వాతావరణ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అయితే ఈ సూచనలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితులు కనిపించడం లేదు. గత ఏడాది వేసవితో పోలిస్తే ఈ వేసవిలో ఎండలు, వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ సారి ప్రధానంగా ఎల్నినో ప్రభావం ఉంటుంది. ఏప్రిల్, మే నెలల్లో 45–46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. రైతులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పంటలు ఎండకుండా నీటితడులు ఇచ్చుకోవాలి. మూగజీవులకు నీరు అందుబాటులో ఉంచాలి. వడదెబ్బకు గురి కాకుండా అన్ని వర్గాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. – నారాయణ స్వామి, ప్రధానశాస్త్రవేత్త, వ్యవసాయ వాతావరణ విభాగం, అనంతపురంఉమ్మడి కర్నూలు జిల్లాలో 2024లో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 2025లో 46 డిగ్రీల వరకు నమోదయ్యాయి. ఇవే దేశంలోనే ఇదే అత్యధిక ఉష్ణోగ్రతలు. రాష్ట్రంలో సాధారణంగా అత్యధిక ఉష్ణోగ్రతలు రెంటచింతలలో నమోదు అవుతాయి. రెంటచింతల కంటే కర్నూలు, నంద్యాల జిల్లాల్లోనే రెండు, మూడు డిగ్రీలు ఎక్కువ నమోదు అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో కాలుష్యం బెడద ఎక్కువగా ఉంది. కాలుష్యం పెరిగే కొద్ది ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి. రానున్న ఐదు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల వరకు ఉంటాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఉపాధి కూలీలకు ఎండదెబ్బ ఉపాధి పనులకు జనవరి నుంచి మే నెల వరకు సీజన్ వంటిది. ఉమ్మడి జిల్లాలో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో దాదాపు 3 లక్షల మంది ఉపాధి పనులకు హాజరయ్యే అవకాశం ఉంది. వేసవి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ఉపాధి పనులు జరిగే ప్రాంతంలో నీడ సదుపాయం కల్పించాల్సిన అవసరం ఉంది. గతేడాది ఉపాధి కూలీల గురించి పట్టించుకోక పోవడంతో వడదెబ్బకు గురై దాదాపు ఉమ్మడి జిల్లాలో ఎనిమిది మంది మృతి చెందారు. వారికి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదు. -
ఈ జాగ్రత్తలు అవసరం..
● అధిక ఉష్ణోగ్రతల(హీట్వేవ్)తో డీహైడ్రేషన్(శరీరంలో నీటి కొరత) ఏర్పడే ప్రమాదం ఉంది. ● తలనొప్పి, వాంతులు, బీపీ సమస్యలు పెరుగుతాయి. ● ఎండల్లో బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు తిరగరాదు. ● మధ్యాహ్నం 12 నుంచి సాయం6తం 4 గంటల మధ్య బయటికి వెళ్లకపోవడం మంచిది. ● ఈ సమయంలో శారీరక శ్రమతో కూడిన పనులు చేయరాదు. ● రోజుకు 4 నుంచి 5 లీటర్ల నీరు తాగాలి. ● కొద్దిగా ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు, కొబ్బరి నీళ్లు వీలైనంత వరకు ఎక్కువగా తీసుకోవాలి. ● వేసవిలో తెల్లని వస్త్రాలు ధరించడం మంచిది. ● ఎండలో బయటికి వెళ్లాల్సి వచ్చినపుడు గొడుగు తీసుకెళ్లాలి. కనీసం తలను టోపీ, టువాలతో కప్పుకోవాలి. -
అట్టహాసంగా ‘గురురాజా’ వార్షికోత్సవం
గోస్పాడు: గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ వార్షిక వేడుకలు ఆదివారం అట్టహాసంగా జరిగాయి. మండలంలోని బాబానగర్ గ్రామంలో ఉన్న ఈస్కూల్లో ఆదివారం నిర్వహించిన వార్షికోత్సవానికి స్కూల్ డైరెక్టర్ పెద్దిరెడ్డి షేక్షావలి రెడ్డి, న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి 24వ వార్షికోత్సవ వార్షిక సంచికను ఆవిష్కరించి మాట్లాడారు. విద్యార్థుల ఉన్నత శిఖరాలను అధిరోహించేలా బోధన సాగిస్తున్న గురురాజా పాఠశాల యాజమాన్యాన్ని మంత్రి ఫరూక్ అభినందించారు. గురు రాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ 2002 సంవత్సరంలో 120 మంది విద్యార్థులతో ప్రారంభమైన గురు రాజా ఇంగ్లిష్ మీడియం స్కూల్ నేడు 24వ వార్షికోత్సవం జరుపుకుంటుందంటే ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులకు విద్యాబోధన సాగిస్తున్నట్లు చెప్పారు. డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ నంద్యాలలోనీ గురరాజా ఇంగ్లిష్ మీడియం పాఠశాల రాష్ట్రస్థాయిలోనే పేరు ప్రఖ్యాతులు పొందిందని చెప్పారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యా సంస్థ డైరెక్టర్లు పి. మౌలాలి రెడ్డి, షేక్షావలి రెడ్డి, అతిథులను సత్కరించారు. టీడీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్, ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక అధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి, మౌలాలి రెడ్డి. విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కల్యాణోత్సవం.. నయనానందకరం
కల్యాణ మహోత్సవానికి హాజరైన భక్తులుఆళ్లగడ్డ: అహోబిల క్షేత్రంలో ఆదివారం లక్ష్మీనరసింహస్వామి పరిణయోత్సవం కన్నుల పండువగా సాగింది. ముందుగా పండితులు పుణ్యాహవచనం చేశారు. నవగ్రహ మంటపరాధన అనంతరం విశేష పూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సమర్పించిన పట్టు వస్త్రాలతో స్వామి, అమ్మవార్లను పెండ్లి కూతురు, పెండ్లి కుమారులుగా అలంకరించారు. పల్లకీలో కొలువుంచి ఊరేగింపుగా పెండ్లి మంటపానికి తోడ్కొని వచ్చి పెళ్లి పీటలపై కొలువుంచారు. ఎదుర్కోళ్లు నిర్వహించిన అనంతరం వైష్ణవ ఆచారంగా పండితులు వేదమంత్రోచ్ఛారణలతో కల్యాణాన్ని నిర్వహించారు. యజ్ఞధారణ, జీలకర్ర బెల్లం తతంగాలు చేపట్టాక మాంగళ్య ధారణ నిర్వహించారు. అనంతరం ముత్యాల తలంబ్రాలు కార్యక్రమం పూర్తి చేశారు. స్వామి, అమ్మవారి మీద నుంచి కింద పడ్డ తలంబ్రాలను భక్తులకు పంచి పెట్టారు. ముఖ్య అతిథులుగా (పెళ్లి పెద్దలుగా) పాల్గొన్న భక్తులకు ఆర్చకులు కంకణ ధారణ చేశారు. కమనీయ దృశ్యాన్ని తనివితీరా చూసిన ప్రతి హృదయం అంతులేని ఆనందంతో మురిసింది. నూతన పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెగా అలంకరించిన ప్రహ్లాదవరదుడిని, అమృతవల్లీ అమ్మవార్లను వేదిక వద్ద కొలువు దీర్చినది మొదలు జరిగిన ప్రతి ఘట్టం పరమార్థంతో నిండి ముగ్ధమనోహరంగా ఆలరించింది. ఆకట్టుకున్న ఎదుర్కోల్ల ఉత్సవం ప్రత్యేకంగా అలంకరించిన స్వామి, అమ్మవారిని వేరువేరు పల్లకీల్లో కొలువుంచి పెళ్లి మండపానికి తోడ్కొని వచ్చే ముందు సాంప్రదాయ ఎదుర్కోలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా స్వామి తరఫున కొందరు, అమ్మవారి తరఫున కొందరు అర్చకులు బంధుగణంగా విడిపోయి పెద్ద మనుషులుగా వ్యవహరిస్తారు. కట్నకానుకలు, ఆడపడుచు లాంఛనాలు, ఇచ్చి పుచ్చుకోవడం తదితర విషయాలు చర్చించుకుంటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుకునే మాటలు విశేషంగా అలరించడంతో పాటు ఆలోపించజేసింది. అనంతరం స్వామి, అమ్మవారిని ఒక్కటిగా చేసి కల్యాణ మండపానికి తోడ్కొని పోయారు. మండపంలో కొలువైన స్వామి, అమ్మవారు కల్యాణోత్సవం నిర్వహిస్తున్న పీఠాధిపతి, అర్చకులు -
ఎంచక్కా.. ఎద్దుల బండిలో..
పల్లెటూరి జీవనశైలిని ప్రతిబింబించే చిత్రమిది. ప్రస్తుత యాంత్రిక యుగంలో ఎద్దుల బండ్లు కనుమరుగై పోయాయి. వ్యవసాయం చేసే రైతులు సైతం యాంత్రీకరణ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి సమయంలో ఆదివారం కొలిమిగుండ్ల మండలంలోని తోళ్లమడుగుకు చెందిన ఓ రైతు ఎద్దుల బండిలో కుటుంబ సభ్యులతో కోర్నపల్లె సమీపంలోని పట్టాభిరామాలయంలో విగ్రహాల ప్రతిష్టకు వెళ్తూ కనిపించారు. ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్లు వాహనాల్లో వెళుతూ ఎద్దుల బండిలో వెళ్తున్న మహిళలను చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. – కొలిమిగుండ్ల -
ఏపీ జేఏసీ జిల్లా కార్యవర్గం ఎన్నిక
● చైర్మన్గా జవహార్లాల్, ప్రధాన కార్యదర్శిగా ఇస్మాయిల్కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి( ఏపీ జేఏసీ) కర్నూలు జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఏర్పాటైంది. జేఏసీ ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా యూనిట్గా ఉంది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కొత్త జిల్లాల వారీగా ఏపీ ఎన్జీజీవోస్ అసోసియేషన్లు ఏర్పాటు అయ్యాయి. ఇందుకు అనుగుణంగా జేఏసీలు కూడా ఏర్పాటు కావాల్సి ఉంది. ఈ మేరకు ఆదివారం కర్నూలులోని ఎన్జీఓ హోమ్లో జిల్లా జేఏసీ నూతన కమిటీ ఏర్పాటైంది. దాదాపు 76 ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాలతో పాటు వివిధ శాఖల ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ చైర్మన్గా ఏపీ ఎన్జీజీవోస్ జిల్లా శాఖ అధ్యక్షుడు వి.జవహార్లాల్ ఎన్నికయ్యారు. జేఏసీ ప్రధాన సెక్రటరీగా ఎస్.ఇస్మాయిల్ (ఏపీటీఎఫ్–1938 జిల్లా అధ్యక్షుడు), కో–చైర్మన్లుగా ఎంసీ కాశన్న (ఎన్జీజీవోస్ అసోసియేషన్), పీఎండీ ఇస్మాయిల్ (ఆర్టీజీ ఎన్ఎంయూ), సుంకన్న(ఎస్టీయూ), వెంకటేశ్వర్లు (పశుసంవర్ధకశాఖ), వైస్ చైర్మన్లుగా కృష్ణారెడ్డి, లింగన్న, చాంద్బాషా, నాగకిశోర్, మధుసూదన్రెడ్డి, నవీన్పాటిల్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సాంబశివారెడ్డి, కోశాధికారిగా భాస్కరనాయుడు ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీలుగా వివిధ సంఘాల నుంచి 10 మంది, ఈసీ మెంబర్లుగా వివిధ సంఘాల నుంచి 15 మంది ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ జవహార్లాల్ మాట్లాడుతూ.. సంఘటితంగా పోరాటాలు చేసేందుకు జేఏసీ అవసరం ఎంతో ఉందని తెలిపారు. జేఏసీ ద్వారా అన్ని సంఘాల సమన్వయంతో ఉద్యమాలు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల హక్కులు, డిమాండ్లను సాధించుకుందామని పిలుపునిచ్చారు. నూతన జేఏసీ కార్యవర్గ సభ్యులను వివిధ సంఘాల నేతలు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. -
‘అలగనూరు’ పనులను పూర్తి చేయండి
అలగనూరు రిజర్వాయర్ మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలనే డిమాండ్పై ఆదివారం సీపీఐ, ఏపీ రైతు సంఘం నేతలు జిల్లా పరిషత్లోకి దూసుకువచ్చారు. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగుతున్న దృష్ట్యా తమ డిమాండ్ను అధికారులకు, ప్రజా ప్రతినిధులకు తెలియజేయాలని వారు జెడ్పీ గేట్లు దాటుకొని వచ్చి సమావేశం భవనం ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తు బైఠాయించారు. అలగనూరు రిజర్వాయర్ మరమ్మతుల కోసం రూ.33 కోట్లను విడుదల చేసి పనులు పూర్తి చేస్తామని జెడ్పీ సమావేశంలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ అవే తప్పులు ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే రామాంజనేయులు, నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు మాట్లాడుతూ.. నందికొట్కూరు నియోజకవర్గం మిడ్తూరు మండలంలో తుంగభద్ర జలాశయం ద్వారా కేసీ కెనాల్ ఆయకట్టు నీరుకు 1985లో 2.5 టీఎంసీల సామర్థ్యంతో 1999లో పనులు ప్రారంభించి 2002లో పూర్తి చేశారన్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 2017లో అధిక వర్షాలతో గండి పడిందన్నారు. అప్పట్లో రూ.3 కోట్లు ఖర్చు చేసి ఉంటే పనులు పూర్తి అయ్యేవన్నారు. రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నాడు చేసిన తప్పులనే మళ్లీ చేస్తోందన్నారు. ఫలితంగా అలగనూరు రిజర్వాయర్ ద్వారా వచ్చే నీటిని కేసీ కెనాల్ ఆయకట్టు రైతులు వినియోగించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతుల సమస్యలను పట్టించుకోని మంత్రులు ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా రైతుల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని సీపీఐ నాయకులు ఆరోపించారు. అలగనూరు రిజర్వాయర్ మరమ్మతులకు నిధులను విడుదల చేసి వెంటనే పనులను పూర్తి చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫకృద్దీన్, నగర కార్యదర్శి రామక్రిష్ణారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు రమేష్బాబు, నాయకులు రఘురాం, భార్గవ, మహిళా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రావణి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కే శ్రీనివాసులు, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆవుల సుబ్బారెడ్డి, జీ సోమన్న, జిల్లా సమితి సభ్యులు డీ శ్రీనివాసులు, నందికొట్కూరు శ్రీనివాసులు, నరసింహులు, నారాయణ, ప్రతాప్ పాల్గొన్నారు. -
తప్పు చేసినా.. మనవాడైతే ఓకే!
శ్రీశైలంటెంపుల్: భక్తులకు సేవలు అందించాల్సిన ఉద్యోగులు ఎంత పెద్ద తప్పు చేసినా, మోసం చేసినా టీడీపీకి అనుకూలంగా ఉంటే ఓకే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. భక్తుల నుంచి ఫిర్యాదు రాలేదనే సాకుతో తప్పు చేసిన వ్యక్తికే తిరిగి అదే స్థానంలో పోస్టింగ్ ఇప్పిస్తున్నారు. టీడీపీకి సంబంధం లేని వ్యక్తులు ఎటువంటి తప్పు ఏయకపోయినా, భక్తుల నుంచి ఫిర్యాదు లేకపోయినా వారిని విధుల నుంచి తొలగిస్తున్నారు. సంవత్సరాలు గడుస్తున్నా వారికి పోస్టింగ్లు ఇవ్వకుండా మానసికంగా హింసిస్తూ..రాజకీయ కక్ష సాధిస్తున్నారన్న అరోపణలు వినిపిస్తున్నాయి. రీ–పోస్టింగ్ గత సంవత్సరం డిసెంబరు 24న ఉత్తరాఖాండ్కు చెందిన హిందీ భక్తులు కుటుంబ సమేతంగా శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనార్థం శ్రీశైలం వచ్చారు. వసతి కోసం మల్లికార్జున సదన్లోని డార్మెంటరీలో ఏడు బెడ్లు తీసుకున్నారు. డార్మెంటరీలో ఒక రోజుకు ఒక బెడ్ రుసుం రూ.250 చెల్లించాలి. ఈ లెక్కన వారి వద్ద నుంచి రూ.1750తీసుకోవాలి. అలాగే అడ్వాన్స్ సైతం తీసుకోవాలి. వారికి బిల్లు ఇవ్వాలి. అయితే ఆ కౌంటర్లో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పి.ఉదయ్కుమార్ వారి వద్ద నుంచి రూ.2వేలు తీసుకుని, బిల్లు ఇవ్వకుండా, ఆ డబ్బును తన జేబులోకి వేసుకున్న వైనంపై ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై స్పంధించిన దేవస్థాన అధికారులు విచారణ జరిపి కౌంటర్ విధులు నిర్వహిస్తున్న పి.ఉదయ్కుమార్ అనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి తప్పు చేశాడని ధృవీకరించుకుని అతనిని విధుల నుంచి తప్పించారు. అయితే సదరు ఉద్యోగి నియోజకవర్గ స్థాయి రాజకీయ నేతకు సన్నిహితంగా ఉండడంతో..రాజకీయ నేత మనవాడికి పోస్టింగ్ ఇచ్చేయండని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆగమేఘాల మీద దేవస్థాన అధికారులు, సంబంధిత విభాగపు అధికారి ఔట్సోర్సింగ్ ఉద్యోగి తప్పు చేయలేదన్నట్లు ఫైల్ రాయడంతో, దేవస్థాన డిప్యూటీ కార్యనిర్వహణాధికారి పేరుతో రీ పోస్టింగ్కు ఉత్తర్వులు సైతం జారీ చేశారు. ఆదివారం సదరు ఉద్యోగి తిరిగి అదే స్థానంలో ఉద్యోగంలో చేరారు. సదరు ఉద్యోగి తప్పు చేయకపోతే మూడు నెలల పాటు ఎందుకు ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు, ఉద్యోగి భక్తుల నుంచి డబ్బులు తీసుకుని మోసం చేయకపోతే అప్పటి సీసీ ఫుటేజ్ను బహిర్గంతం చేయవచ్చు కదా! భక్తులను, దేవస్థానాన్ని మోసం చేసిన వ్యక్తిని కేవలం భక్తుల నుంచి ఫిర్యాదు లేదనే సాకును చూపి అతనికి రీ–పోస్టింగ్ ఇచ్చేశారు. పోస్టింగ్ ఇవ్వకుండా.. గత సంవత్సరం జనవరి నెలలో శ్రీశైల దేవస్థాన టోల్గేట్లో అకస్మిక తనిఖీలు నిర్వహించగా సిబ్బంది వద్ద ఉండాల్సిన డబ్బు కంటే అదనపు డబ్బును అధికారులు గుర్తించారు. దేవస్థాన అధికారులు విచారణ జరిపి టోల్గేట్లో విధులు నిర్వహిస్తున్న రెగ్యులర్ ఉద్యోగి ఎం.రామకృష్ణుడు(హెల్పర్), కాంట్రాక్ట్ లేబర్లు బి.నాగపరమేశ్వరుడు, జి.మల్లికార్జునరెడ్డి, ఎన్.గోవిందు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు బి.మల్లికార్జునరెడ్డి, బీ.ఆర్.మల్లేశ్వర్రెడ్డి, జి.శ్రీనివాసులు, డైలీ వేజ్ సిబ్బంది కె.కె.రాజు లను విధుల నుంచి నిలుపుదల చేశారు. వీరిలో ఎం.రామకృష్ణుడుకి పోస్టింగ్ ఇచ్చారు. మిగిలిన వారందరికి ఇంతవరకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఇందులో ఇద్దరు ఉద్యోగులు సైతం తాము ఏ తప్పు చేయలేదని కోర్టు మెట్లెక్కారు. కమిషనర్, కోర్టు కూడా వీరిని విధుల్లోకి తీసుకోవాలని చెప్పిన ఇంత వరకు విధుల్లోకి తీసుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఉద్యోగులు తప్పులు చేసిన వారికి ఒకలా, ఇతరులకు మరోలా దేవస్థాన అధికారులు వ్యవహరిస్తున్నారు. టోల్గేట్ వ్యవహరంలోనూ భక్తుల నుంచి ఎటువంటి ఫిర్యాదు రాలేదని సమాచారం. భక్తుల నుంచి ఫిర్యాదు లేకపోతే సిబ్బందికి పోస్టింగ్ ఇవ్వోచ్చు కదా. కేవలం రాజకీయ కక్షతో వీరిని ఇబ్బందులకు గరిచేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీశైల దేవస్థానంలో తప్పుచేసిన వ్యక్తికి వత్తాసు తిరిగి అదే స్థానంలో పోస్టింగ్ టోల్గేట్ సిబ్బంది తొలగింపు సంవత్సరం అయినా పోస్టింగ్ ఇవ్వని వైనంరాజకీయ కక్ష తీర్చుకునేందుకు శ్రీశైల దేవస్థానాన్ని రాజకీయ కక్ష సాధింపులకు, వేధింపులకు వేదికగా చంద్రబాబు ప్రభుత్వం చేసుకుంటుందనే అరోపణలు వినిపిస్తున్నాయి. అర్హత లేకపోయిన టీడీపీ నాయకుల అనుచరులకు కీలకమైన పోస్టింగులు ఇవ్వడంతోపాటు అనుకూలమైన వారికి దేవస్థానంలో ఆదాయం వచ్చే స్థానాల్లోకి బదిలీ చేస్తున్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఉద్యోగుల అంతర్గత బదిలీ చేయాలని రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు ఉన్నప్పటికి వాటిని పాటించడం లేదు. అంతేకాకుండా చిన్న పాటి ఉద్యోగులను సైతం ఎన్నికల్లో ప్రచారానికి తిరిగారని వారికి పోస్టింగులు ఇవ్వకుండా సంవత్సరం పాటు వేధింపులకు గురి చేశారు. ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేయని ఉద్యోగులను బదిలీలు, వారిపై విధుల పట్ల అలసత్వం పేరుతో రాజకీయ కక్ష సాధింపులు, వేధింపులకు గురిచేస్తున్నట్లు అరోపణలు వినిపిస్తున్నాయి. -
కేసీ కెనాల్లో యువకుడి గల్లంతు
బండిఆత్మకూరు: మండల పరిధిలోని సింగవరం గ్రామ సమీపంలో ఉన్న కేసీ కెనాల్ వద్ద ఆదివారం నారిపెద్ద హేమంత్ (17) నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ జగన్మోహన్ యాదవ్ ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గల్లంతైన యువకుడుది ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం శివరాంపురం గ్రామం. అయితే శనివారం రాత్రి అతనితోపాటు 20 మంది యువకులు గ్రూప్గా ఏర్పడి సింగవరం గ్రామానికి వచ్చి బస చేశారు. సింగవరం గ్రామం నుంచి వీరందరూ నడుచుకుంటూ బండిఆత్మకూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో కేసీ కెనాల్ మెట్ల వద్ద కాళ్లు కడుక్కోవడానికి హేమంతు దిగి కాలు జారి ప్రవాహంలో కొట్టుకుపోయారు. దీంతో పక్కనున్న యువకులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని కేసీ కెనాల్ లో నీటి ప్రవాహం తగ్గించి డ్రోన్ల ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే వారి కుటుంబ సభ్యులు వచ్చి కెసి కెనాల్ సమీప గ్రామాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. -
సర్కారు నిర్లక్ష్యం..రైతుకు నష్టం!
కర్నూలు సిటీ: తుంగభద్ర జలాల్లో జిల్లా ఆయకట్టు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఏపీ ప్రభుత్వానికి ముందు చూపులేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. వాస్తవంగా డ్యా గేట్ల మార్పునకు దిగువ కాలువ నీటి విడుదలకు ఎలాంటి సంబఽంధమే లేదు. అయినప్పటికి గేట్ల మార్పు పేరుతో డ్యాంలో ఉన్న నీటిని వృథాగా దిగువకు వదిలేశారు. ఫలితంగా ఒక్క ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే 1.5 లక్షల ఎకరాల పంటల సాగును రైతన్నలు కోల్పోవాల్సి వచ్చింది. తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో గతంలో ఎప్పుడు లేని విధంగా వర్షాలు రావడంతో తుంగభద్ర డ్యాంలో ఇన్ఫ్లో మొదలైంది. సీజన్ ప్రారంభం నాటికే డ్యాంలో నీటి నిల్వలు ఆశాజనకంగా చేరాయి. 2025–26 నీటి సంవత్సరంలో 415.16 టీఎంసీల నీరు డ్యాంలో చేరింది. 2024 ఆగస్టులో టీబీ డ్యాం గేటు కొట్టుకుపోవడం..ఆ తరువాత గేట్ల నిపుణులతో సలహాతో మొత్తం గేట్లు మార్చేందుకు నిర్ణయం తీసుకొని టెండర్లు సైతం ఖరారు చేశారు. నీటి నిల్వను 105.79 టీఎంసీల నుంచి 80 టీఎంసీల తగ్గించారు. డిసెంబరు నెలలో కూడా 80 టీఎంసీల నీరు ఉన్నప్పటికి గేట్ల పనుల సాకుతో డ్యాం నుంచి వృథాగా దిగువకు నీటిని విడుదల చేసి క్రస్ట్ లెవెల్ 1613 అడుగులకు నీటి మట్టాన్ని తీసుకొచ్చారు. ఈ నీటి మట్టాన్ని చూపి రబీకి నీరు ఇవ్వలేమని ఈ ఏడాది జనవరి 15 వరకు నీటిని విడుదల చేసి బంద్ చేశారు. గేట్ల మార్పునకు ఎల్ఎల్సీకి నీటి సరఫరా నిలిపివేతకు ఎలాంటి సంబఽంధం లేదు. రైతులకు తీవ్ర నష్టం కలిగించే దీనిపై చంద్రబాబు సర్కారు స్పందించకపోవడం లోలెవన్ కెనాల్లో మిగిలిపోయిన ఆధునికీకరణ పనులు చేసి బిల్లులు చేసుకునేందుకేనని ఇంజినీరింగ్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. దిగువ రైతుకు మొండిచేయి తుంగభద్ర దిగువ కాలువ కింద జిల్లాలో ఖరీఫ్, రబీలో 1.51 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. రబీలో లక్ష ఎకరాలకు పైగా నీరు ఇవ్వాల్సి ఉంది. గతేడాది టీబీడ్యాం గేట్లు మార్చేందుకు ఖరీఫ్లో మాత్రమే సాగుకు నీరిస్తామని, రబీలో నీరివ్వమని టీబీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం రబీ ఆయకట్టుకు నీరు అవసరం లేదని ఇండెంట్ ఇవ్వలేదు. దీన్ని సాకు చూపించి ఏపీ ప్రభుత్వం కూడా ఎల్ఎల్సీ, కేసీ వాటా నీటికి ఇండెంట్ పెట్టకపోవడం గమనార్హం. టీబీ డ్యాంలో ఎల్ఎల్సీకి 4.7, కేసీకి 4.6 టీఎంసీల వాటాకు ఇండెంట్ పెట్టి ఉన్నట్లైతే ఆరుతడి పంటలైన పండించుకునేందుకు అవకాశం ఉండేది. ప్రభుత్వ నిర్లక్ష్యం వలన 9.3 టీఎంసీల తుంగభద్ర జలాలను ఆయకట్టుదారులు కోల్పోయారు. ఫలితంగా 1.5 లక్షల ఎకరాలకుపైగా సాగును కోల్పోయి దాదాపు రూ.500 కోట్లకుపైగా ఆదాయాన్ని కోల్పోయారు. దీంతో పాటు ఎల్ఎల్సీ ఆధారిత, తుంగభద్ర నది తీరంలోని గ్రామాలు, తీరంలోని తాగు నీటి పథకాలకు నీరందని పరిస్థితులు రావడంతో వేసవిలో తాగు నీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తుంగభద్ర డ్యాంలో ప్రస్తుతం 23 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం గేట్ల మార్చేందుకు క్రస్ట్ లెవెల్ 1,613 అడుగులకు నీటి మట్టాన్ని తగ్గించేందుకు డిసెంబరు నెలలో నీటిని దిగువకు విడుదల చేశాం. క్రస్ట్ లెవెల్లో కూడా 43 టీఎంసీల నీరు ఉంటుంది. ఈ నీటిలోనే జనవరి 15 వరకు ఎల్ఎల్సీకి తాగు నీటి ట్యాంకులు నింపుకునేందుకు నీరు ఇచ్చాం. రబీలో సాగు నీరు వద్దని కర్ణాటక ప్రభుత్వం ఇండెంట్ పెట్టకపోవడంతో ఏపీ ప్రభుత్వం కూడా ఇండెంట్ పెట్టలేదు. ఎల్ఎల్సీ ఆధునీకీకరణ పెండింగ్ పనులు జరుగుతున్నాయి. ఆ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – నారాయణ నాయక్, టీబీ డ్యాం ఎస్ఈ డ్యామ్ గేట్ల మార్పు పేరుతో రబీకి నీరు ఇవ్వలేమని ప్రకటించిన టీబీ బోర్డు అవకాశం ఉన్నా ఏపీ వాటాకు ఇండెంట్ ఇవ్వని చంద్రబాబు సర్కారు బిల్లులు చేసుకునేందుకు ఇలా వ్యవహరించిందనే విమర్శలు రబీ ఆయకట్టును కోల్పోయిన రైతులు ప్రస్తుతం డ్యాంలో 23 టీఎంసీల నీటి నిల్వలు ఎల్ఎల్సీ, తుంగభద్ర నది తీర ఆధారిత తాగు నీటి పథకాలకు పొంచి ఉన్న ముప్పు -
అంగన్వాడీ వర్కర్ల, హెల్పర్ల అక్రమ అరెస్టులు
కర్నూలు(సెంట్రల్)/డోన్ టౌన్: విజయవాడలో మార్చి 2వ తేదీన చేపట్టే మహాధర్నాలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొనకుండా పోలీసులు ఎక్కడిక్కడే అరెస్టులు చేస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం విజయవాడ వెళ్తున్న వారిని డోన్ రైల్వే స్టేషన్లో అరెస్టు చేశారు. విజయవాడకు వెళ్లడానికి వీలులేదని పోలీసులు చెప్పడంపై అంగన్వాడీలు మండిపడుతున్నారు. మరోవైపు ఫిబ్రవరి 23 నుంచి 27వ తేదీ వరకు అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే ప్రభుత్వం స్పందించకపోవడంతో ముందుగా ఇచ్చిన పిలుపుమేరకు మార్చి 2 వతేదీన చలో విజయవాడకు బయలు దేరి వెళ్తుండడంతో పోలీసులు వారిని వెళ్లనీయకుండా ఎక్కడిక్కడే అరెస్టు చేస్తుండడంపై సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పీఎస్ రాధాకృష్ణ, ఎండీ అంజిబాబు, అంగన్వాడీ ఎంప్లాయీస్ అండ్ హెల్పర్ల యూనియన్ గౌరవాధ్యక్షుడు పి.నిర్మలమ్మ ఖండించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని గ్రాట్యుటీ, పీఎఫ్, ఈఎస్ఐ, హెల్త్కార్డుల అమలు చేయాలని డిమాండ్ చేశారు.పెండింగ్లో ఉన్న 1810 మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, ఖాళీగా ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. మెస్ చార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. -
శాస్త్రోక్తంగా పల్లకీ సేవ
శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆదివారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఉత్సవమూర్తులు అధిష్టింపజేసి వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. పూజా కార్యక్రమాల్లో దేవస్థాన అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. శ్రీశైల దేవస్థానానికి రూ.3 లక్షల విరాళాలు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న వివిధ పథకాలకు దాతలు రూ.3 లక్షల విరాళాలను ఆదివారం అందించారు. అన్నప్రసాద వితరణ పథకానికి గుంటూరుకు చెందిన పి.రాజేశ్వరరావు రూ.1,01,116 విరాళాన్ని ఈఓ ఎం.శ్రీనివాసరావుకు అందజేశారు. అలాగే హైదరాబాద్కు చెందిన ఎం.అవినాష్ గో సంరక్షణ నిధి పథకానికి రూ.లక్ష, ప్రాణదాన ట్రస్ట్కు రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. దాతలకు దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను అందించి సత్కరించారు. యువకుడి ఆత్మహత్య ఆదోని అర్బన్: మండలంలోని కడితోట గ్రామానికి చెందిన రామకృష్ణ, ఈరమ్మ దంపతుల కుమారుడు శ్రీకాంత్(21) కడుపునొప్పి తాళలేక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెద్దతుంబలం ఎస్ఐ విద్యశ్రీ తెలిపిన వివరాలు.. శ్రీకాంత్ రోజు వారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గత ఏడేళ్లుగా కడుపునొప్పితో బాధ పడుతుండేవాడు. ఆదివారం కడుపునొప్పి రావడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిగేలా విలపించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ కోవెలకుంట్ల: స్థానిక ఆర్టీసీ డిపో సమీపంలో ఆదివారం సాయంత్రం ఆర్టీసీ అద్దె బస్సు, టిప్పర్ ఢీకొన్నాయి. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. బస్టాండ్లో నుంచి నంద్యాలకు బయలు దేరిన ఆర్టీసీ అద్దె బస్సు బస్టాండ్ ఔట్ గేటు నుంచి బయటకు వస్తుండగా ముదిగేడు రహదారి వైపు నుంచి బస్టాండ్ వైపు టిప్పర్ వెళ్తుండగా రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. బస్సు, టిప్పర్ ఢీ కొనడంతో రెండు వాహనాలు స్వల్పంగా డ్యామేజ్ కావడంతో ఇరువురు డ్రైవర్లు వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. -
ప్రతి కార్మికుడికి ఈ–శ్రామ్ కార్డులు
కర్నూలు: అసంఘటిత రంగంలో పనిచేసే ప్రతి కార్మికుడు కార్మిక శాఖ జారీ చేసే ఈ–శ్రామ్ కార్డులు తీసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి తెలిపారు. లీగల్ సర్వీసెస్ యూనిట్ సభ్యుడు రాయపాటి శ్రీనివాసులు, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖ మార్కెటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ నారాయణమూర్తి ఆధ్వర్యంలో కర్నూలు వెంకటరమణ కాలనీలోని రైతు మార్కెట్లో అసంఘటిత కార్మికులకు ఏర్పాటు చేసిన ఈ–శ్రామ్ కార్డుల నమోదు కేంద్రం, ఉచిత కంటి వైద్య శిబిరాన్ని లీలా వెంకటశేషాద్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత కంటి, హెల్త్ చెకప్లను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు. కార్మికులకు చట్టపరమైన సమస్యలు ఉంటే లీగల్ సర్వీసెస్ హెల్ప్లైన్ నెంబర్ 15100కు కాల్ చేస్తే ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తామన్నారు. ఈ సందర్భంగా 40 మంది కార్మికులకు ఈ–శ్రామ్ కార్డులు, ఐదుగురికి పెన్షన్ కార్డులను అందజేశారు. అనంతరం కంటి వైద్యనిపుణులు డాక్టర్ జయరాం, డాక్టర్ రంగనాథ్, ప్రభాకర్ ఆధ్వర్యంలో కార్మికులకు కంటి వైద్యపరీక్షలు ఉచితంగా నిర్వహించారు. -
శ్రీశైలంలో 16 నుంచి ఉగాది ఉత్సవాలు
● 20 వరకు నిర్వహణ ● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: శ్రీశైలంలో ఈ నెల 16 నుంచి 20 వరకు ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తారన్నారు. గతేడాది 7 లక్షల మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారని, ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో రద్దీ ఉండే అవకాశం ఉందన్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి పాదయాత్ర భక్తులకు అనుమతి ఉంటుందని వెల్లడించారు. తాగునీరు.. వైద్య సదుపాయాలు భక్తులకు సమృద్ధిగా తాగునీరు అందించేందుకు రోజుకు 4 నుంచి 5 లక్షల నీటి బాటిళ్లు సిద్ధంగా ఉంచాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. నీటి నాణ్యతను క్రమం తప్పకుండా పరీక్షించాలన్నారు. మార్చి 8వ తేదీ నుంచి ప్రధాన ప్రదేశాలు, పార్కింగ్ స్థలాలు, పాదయాత్ర మార్గాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి రొటేషన్ పద్ధతిలో వైద్యులను అందుబాటులో ఉంచాలన్నారు. బయో మెడికల్ వ్యర్థాలను ప్రత్యేకంగా రెడ్ కలర్ డస్ట్బిన్లలో సేకరించి తక్షణం నిర్వహించాలన్నారు. పారిశుద్ధ్యం.. మౌలిక వసతులు ఆర్డబ్ల్యుఎస్, పంచాయతీ రాజ్ శాఖలు సమన్వయంతో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలన్నారు. భక్తులు వినియోగించిన ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర వ్యర్థాలను నిర్దిష్ట ప్రదేశాల్లో సేకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గాలివానలు వచ్చినా షెడ్లు, తాత్కాలిక నిర్మాణాలు దృఢంగా ఉండేలా ఆర్ అండ్ బి శాఖ తనిఖీలు నిర్వహించాలన్నారు. విద్యుత్ తీగలు వేలాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పార్కింగ్ .. ట్రాఫిక్ నిర్వహణ పార్కింగ్ ప్రదేశాల్లో తగినంత వెలుతురు, త్రాగునీటి సదుపాయం కల్పించడంతో పాటు వాహనాలు మొరాయించినపుడు తరలించేందుకు క్రేన్లు, టోయింగ్ వాహనాలు మెకానిక్స్తో సహా సిద్ధంగా ఉంచాలన్నారు. లింగాలగట్టు, పాతాళగంగా ప్రాంతాల్లో ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. తెలుగు, కన్నడ భక్తుల కోసం శ్రీమే ఐ హెల్ప్ యూశ్రీ డెస్క్లను పెంచాలని, ముఖ్యంగా కన్నడ భక్తులు అధికంగా వచ్చే ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్నారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా కన్నడలోనూ ప్రకటనలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిత్యావసర వస్తువులు అధిక ధరలకు విక్రయించకుండా పర్యవేక్షణ చేయాలని, భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. దర్శన ఏర్పాట్లు రోజుకు 8,000 నుంచి 10,000 మందికి స్లాట్ విధానంలో దర్శనం కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఒక్కో స్లాట్ రెండు గంటల పాటు ఉండగా, మొత్తం ఎనిమిది గంటలు స్లాట్ దర్శనం నిర్వహిస్తామని . మిగిలిన సమయంలో ఉచిత దర్శనం కొనసాగుతుందని, స్పర్శ దర్శనం ప్రారంభానికి గంటన్నర ముందే ఉచిత దర్శనం క్యూ లైన్లను ఖాళీ చేసేలా సమన్వయం చేసుకోవాలన్నారు. వలంటీర్ల నియామకంజిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ మాట్లాడుతూ.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన సమయాల వివరాలను బోర్డులపై స్పష్టంగా ప్రదర్శించాలన్నారు. పాతాళగంగ బోటు సేవల్లో భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. భక్తుల రద్దీని బట్టి 6వ తేదీ నుంచి వలంటీర్లను నియమించే అంశంపై చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కర్ణాటక, అనంతపురం ప్రాంతాల నుంచి వలంటీర్లను సమీకరించనున్నట్లు చెప్పారు. కన్నడ భాష తెలిసిన పోలీసు సిబ్బందిని కర్నూలు జిల్లా నుంచి రప్పించేందుకు ఇప్పటికే లేఖ రాసినట్లు వెల్లడించారు. ఆత్మకూరు అటవీ శాఖ డీడీ విఘ్నేష్ అపూర్వ మాట్లాడుతూ.. అటవీ ప్రాంతాల గుండా వచ్చే పాదయాత్ర మార్గాల్లో ఫైర్ వాచర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రధాన పాయింట్ల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, డీఆర్ఓ రామునాయక్, ఆర్డీఓలు, డిఎస్పీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కమనీయం.. కల్యాణోత్సవం
కల్యాణ మండపానికి వస్తున్న అమ్మవారు కల్యాణ మహోత్సవాన్ని తిలకిస్తున్న భక్తులు ఆళ్లగడ్డ: బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ జ్వాలా నరసింహస్వామి, చెంచులక్ష్మీ అమ్మవార్ల తిరు కల్యా ణోత్సవం ఎగువ అహోబిలంలో వైభవోపేతంగా నిర్వహించారు. ముందుగా అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీమన్ శఠకోప రంగనాధయతీంద్ర మహదేశికన్ ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా ఎదురుకోళ్ల కార్యక్రమం జరిపారు. అనంతరం స్వామి, అమ్మవారిని మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా కల్యాణ మండపానికి తోడ్కొని వచ్చి కొలువుంచారు. పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య కళ్యాణ తంతు పూర్తిచేశారు. అనంతరం స్వామి, అమ్మవారికి కంకణధారణ నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణ మధ్య మాంగళ్య ధారణ కార్యక్రమం నిర్వహించారు. చివరగా స్వామి, అమ్మవార్ల పాదాల వద్ద ముత్యాల తలంబ్రాలు పోసి కల్యాణ మహోత్సవాన్ని ముగించారు. బ్రహ్మోత్సవాల్లో నేడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో ఆదివారం ఉదయం ఉత్సవం, మధ్యాహ్నం అభిషేకం, సాయంత్రం తొట్టి తిరుమంజనం, రాత్రి అశ్వవాహన సేవలు కొనసాగుతాయి. దిగువ అహోబిలంలో ఉదయం ఉత్సవమూర్తులకు అభిషేకం, సాయంత్రం గజవాహనం సేవ, రాత్రి కల్యాణమహోత్సవం నిర్వహించనున్నారు. ముత్తైదువుల ఆశీర్వాదం కోసం తాళి చూపుతున్న అర్చకుడు -
మద్దిలేటి స్వామి ఆలయంలో భక్తుల రద్దీ
బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం శివార్లో వెలసిన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. పాల్గుణ మాసాన్ని పురస్కరించుకొని చిన్నారుల తలనీలాలు సమర్పించారు. వివాహాలు ఉంటడంలో స్వామి, అమ్మవార్ల దర్శనార్థం భక్తులు భారీగా తరలి వచ్చారు. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన వారు స్వామి, అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన చేశారు. స్వామి వారికి ప్రీతిపాత్రమైన వరపూజ నిర్వహించారు. 3న మహానంది ఆలయం మూసివేత మహానంది: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఈనెల 3న మహానంది ఆలయ తలుపులు మూసివేయనున్నట్లు ఆలయ వేద పండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర్ అవధాని తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ఆలయ తలుపులు మూసివేసి రాత్రి 7 గంటలకు తెరిచి సంప్రోక్షణ పూజలు, ఆలయ శుద్ధి నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత భక్తులకు శ్రీ కామేశ్వరీ దేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామి దర్శనం కల్పిస్తామన్నారు. శ్రీశైలంలో నేడు కామదహనం శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం కామదహనం కార్యక్రమం నిర్వహించనున్నట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఈఓ మాట్లాడుతూ.. ఆదివారం స్వామి వారి ప్రధాన ఆలయం ముందుభాగంలో గల గంగాధర మండపం వద్ద సాయంత్రం 6.30 గంటలకు కామదహన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా ఆలయంలో శ్రీస్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపిస్తామని, అనంతరం శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని మనోహర గుండం ఎదురుగా అధిష్టింపజేసి విశేష పూజలు చేస్తామన్నారు. అనంతరం ఉత్సవమూర్తులకు పల్లకీసేవ నిర్వహించి, గంగాధరమండపం వద్దకు తెచ్చి శాస్త్రోక్తంగా పునఃపూజలు చేస్తామన్నారు. సంప్రదాయాన్ని అనుసరించి మన్మథ రూపాన్ని దహనం చేస్తామని పేర్కొన్నారు. మహానంది ఆలయానికి రూ. 80 లక్షల విరాళం మహానంది: మహానంది దేవస్థానంలోని శ్రీ కామేశ్వరీ దేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామి వారి ఆలయాల్లో బ్రాస్ గేట్లు, గ్రిల్స్ ఏర్పాటు కోసం విజయవాడకు చెందిన శ్రీ వైభవి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అధినేత డాక్టర్ బొప్పన ఝాన్సీ లక్ష్మీబాయి రూ. 80 లక్షలు విరాళం ఇచ్చేందుకు అంగీకార పత్రం అందించినట్లు ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్వామి, అమ్మవారి దర్శనానికి శనివారం వచ్చిన ఆమె హామీ ఇచ్చినట్లు చెప్పారు. అందులో భాగంగా పనులు ప్రారంభించేందుకు మొదటి విడతగా రూ. 30 లక్షలు చెల్లించారని చెప్పారు. స్వామి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయికి స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ ఎరమల మధు, వేద పండితులు పాల్గొన్నారు. -
చీకటి ఒప్పందంతో ‘సీమ’కు అన్యాయం
● ఎమ్మెల్సీ ఇసాక్బాషాబొమ్మలసత్రం: తెలంగాణ ముఖ్యమంత్రితో సీఎం చంద్రబాబు చీకటి ఒప్పందం కుదుర్చుకుని రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేసి సీమ ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని ఎమ్మెల్సీ ఇసాక్బాషా అన్నారు. సాగునీరు అందక రైతులు వలసలు పోతూ.. అప్పులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించకోపవడం దారుణమన్నారు. నంద్యాలలోని తన కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫిబ్రవరి 26వ తేదీ శాసనమండలిలో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తి చేస్తారో సమాధానం చెప్పాలని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడిని ప్రశ్నించామన్నారు. ఇప్పటి వరకూ ప్రాజెక్ట్కు మంజూరైన నిధులు, ఖర్చు చేసిన వాటిపై సమాధానం ఇవ్వాలని అడిగామన్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు వివరించాలని కోరితే మంత్రి సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారని ఆరోపించారు. రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమయం తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తెలంగాణాలో ప్రాజెక్ట్లు నిర్మించి కృష్ణా జలాలు తరలించుకుపోతుంటే ఎందుకు ప్రశ్నించలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నీటి కోసం పోతిరెడ్డిపాడు వద్ద 800 అడుగుల్లో ఎత్తిపోతల ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారన్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రితో చీకటి ఒప్పందం కుదుర్చుకుని నిర్మాణం పనులు నిలిపివేయటం సరైందికాదన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ప్రాజెక్ట్పై నడుస్తున్న కేసుపై చంద్రబాబుకు ఎందుకు శ్రద్ధ చూపటంలేదో అర్థం కావటంలేదన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంతో సీమకు భవిష్యత్తులో జరగబోయే అన్యాయంపై ఆదివారం కడపలో రౌండ్టేబుల్ సమావేశం జరగనుందన్నారు. -
మధ్యవర్తిత్వంతో కేసుల సత్వర పరిష్కారం
కర్నూలు: న్యాయవాదులకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యాలయ భవనంలో మధ్యవర్తిత్వంపై న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శుక్రవారం మధ్యవర్తిత్వ న్యాయవాదులకు పలు సూచనలు చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం హైకోర్టుతో పాటు అన్ని కోర్టుల్లో మధ్యవర్తిత్వం ప్రవేశపెట్టారన్నారు. మార్చి 7వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టుల నుంచి మధ్యవర్తిత్వ ప్రక్రియకు కేసులు స్వీకరిస్తారన్నారు. వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గంగా సివిల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్ 89 కింద పరిగణించేదే మధ్యవర్తిత్వమని తెలిపారు. దీంతో కోర్టులో కేసులు విచారణ వరకు వెళ్లకుండా పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
సమ్మోహనం.. జగన్మోహినీ రూపం
ఆళ్లగడ్డ: అమృతం అసురులపాలు కాకుండా లోక సంరక్షణ కోసం మహావిష్ణువు దాల్చిన జగన్మోహిని అవతారంలో నృసింహుడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం వాడవాడల్లో సంచరిస్తూ.. భక్తులకు కనువిందు చేశారు. లోక కల్యాణార్థం ఏటా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన శుక్రవారం సింహరూపుడైన స్వామిని జగన్మోహినీ అలంకరణతో గడగడపకు వెళ్లారు. వేకవజామున నిత్య పూజల్లో భాగంగా సుప్రభాతసేవతో స్వామి అమ్మవార్లను మేలుకొలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరద స్వామిని యాగశాలలో కొలువుంచి నవకళశస్థాపన చేశారు. ఉత్సవమూర్తి శ్రీ ప్రహ్లాదవరదుడిని నూతన పట్టుపీతాంబరాలతో మోహినీ అలంకరణ చేశారు. పుష్పాలంకరణ పల్లకీలో కొలువుంచి భక్తుల గోవింద నామస్మరణలు, మంగళవాయిద్యాల మధ్య వీధుల్లో సంచరించారు. శరభవాహనంపై శ్రీహరి సర్వాలంకార భూషితుడైన శ్రీహరి శరభ వాహనాన్ని అధిరోహించి మాడవీధుల్లో వివహరించారు. ఈ వాహనసేవ శోభాయనంగా సాగింది. భక్తులు తరలివచ్చి కర్పూర నీరాజనాలు సమర్పించారు. పొన్నచెట్టు వాహనంపై ఊరేగిన గోవిందుడు శ్రీ అహోబిలేశుడి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజైన శుక్రవారం ఎగువ అహోబిలంలో వెలసిన శ్రీ జ్వాలా నృసింహస్వామి పొన్నచెట్టు వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఉత్సవమూర్తులకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పుష్ప పల్లకీలో కొలువుంచి గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి శ్రీ జ్వాలా నృసింహుడు కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షం ( పొన్నచెట్టు వాహనం) అధిష్టించి భక్తజనులకు దర్శనమిచ్చారు. అహోబిలంలో నేడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో శనివారం ఉదయం అభిషేకం, సాయంత్రం గజవాహన సేవ, రాత్రి తిరుకల్యాణోత్సవం నిర్వహించనున్నారు. దిగువ అహోబిలంలో ఉదయం వేణుగోపాల స్వామి అలంకారం, రాత్రి పొన్నచెట్టు వాహనంపై స్వామి వివహరించనున్నారు. ‘మోహినీ’ అలంకరణలో సింహరూపుడు దిగువ అహోబిలంలో మోహినీ అవతారంలో సందడి చేసిన ప్రహ్లాదవరదుడు రాత్రి శరభ వాహనము పై దర్శనమిచ్చిన స్వామి ఎగువ అహోబిలం లో పొన్నచెట్టు వాహనము పై దర్శనమిచ్చిన జ్వాలనారసింహుడు -
మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: జిల్లాలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగంపై జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో ఏవైనా ఫిర్యాదులు వచ్చాయా అనే అంశాన్ని సమగ్రంగా పరిశీలించాలన్నారు. మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలపై ఎకై ్సజ్, పోలీస్, విద్యాశాఖల సమన్వయంతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నందికొట్కూరు మండలంలోని షికారు కాలనీ వాసులకు ఉపాధి అవకాశాలు కల్పించి అక్రమ మద్యం తయారీని పూర్తిగా నివారించాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను ఇతర ప్రాంతాలకు తరలించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ మాట్లాడుతూ.. గంజాయి, గుట్కా తదితర మత్తు పదార్థాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక డ్రైవ్లు చేపడుతోందన్నారు.సమావేశంలో ఏఎస్పీ యుగంధర్ బాబు, ఎకై ్సజ్, పోలీస్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, డీఈఓ, ఐసీడీఎస్, బీసీ, ఎస్సీ వెల్ఫేర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
అజ్ఞాతంలో బంగారం వ్యాపారి
● రూ.5 కోట్లకు పైగా అప్పులు ● రెండు నెలలుగా మూతపడిన దుకాణంఎమ్మిగనూరు రూరల్: పట్టణంలోని సుంకులమ్మ దేవాలయం సమీపంలోని ఓ బంగారం దకాణం యజమాని రెండు నెలలుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. వ్యాపారులు, ఇతరుల దగ్గర దాదాపు రూ.5 కోట్లకు పైగా అప్పులు చేసినట్లు తెలుస్తోంది. దుకాణం మూతపడటం, ఇళ్లు ఖాళీ చేసి కుటుంబంతో సహా కనిపించకుండాపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. పెళ్లిళ్లు ఉండటంతో కుదువ పెట్టిన బంగారం విడిపించుకునేందుకు వచ్చిన బాధితులు వ్యాపారి సెల్ఫోన్కు కాల్ చేయగా స్వీచ్ఆఫ్ వస్తుండటంతో మోసపోయామని తెలుసుకున్నారు. పలువురు బాధితులు శుక్రవారం పట్టణ పోలీసులను ఆశ్రయించారు. నందవరం మండలం మిట్టసోమపురానికి చెందిన లింగన్న 2 తులాల బంగారు చైన్ కోసం రూ.2.80 లక్షలు, జొహరాపురం వెంకటేష్ బంగారు చైన్ కోసం రూ.1.30 లక్షలు, కడిమెట్ల మహేష్ తులం బంగారు, బీషన్న అరతులం బంగారం, మిట్టసోమపురం లక్ష్మీ లాంగ్ చైన్ రిపేరికి ఇవ్వటమే కాకుండా, అర తులం చైన్ చేయటానికి రూ.50 వేలు, రంగమ్మ తులం బంగారు చైన్, నందవరం రామలక్ష్మీ 100 తులాల వెండి కుదవపెట్టింది. వీరే కాకుండా వందల సంఖ్యలో బాధితులు ఉన్నట్లు సమాచారం. ఈ నెల 23న పత్తికొండకు చెందిన షేక్షావలి జిల్లా ఎస్పీ విక్రాంత్పాటిల్కు తాను కుదవపెట్టిన బంగారం ఇవ్వటం లేదంటూ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. -
మహానందీశ్వరుని హుండీ ఆదాయం రూ. 35.05 లక్షలు
మహానంది: హుండీ కానుకల ద్వారా శ్రీ మహానందీశ్వరస్వామికి రూ. 35.05 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఈఓ ఎన్. శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానిక అభిషేక మండపంలో హుండీ కానుకలను గురువారం లెక్కించినట్లు చెప్పారు. ఆలయాల ద్వారా రూ. 34,64,108 , గో సంరక్షణ ద్వారా రూ.16,825 , అన్నప్రసాదం ద్వారా రూ. 24,640 మొత్తంగా రూ. 35,05,573 లభించిందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా దేవదాయశాఖ అధికారి మోహన్, ఆలయ ఏఈఓ ఎరమల మధు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. నేడు మార్చి నెల పింఛన్ల పంపిణీ నంద్యాల(న్యూటౌన్)/కర్నూలు(అగ్రికల్చర్): మార్చి నెల పింఛన్ల పంపిణీ ఈ నెల 28న చేపట్టడానికి డీఆర్డీఏ ఏర్పాట్లు చేసింది. పంపిణీకి అవసరమైన నిధులు శుక్రవారం బ్యాంకులకు విడుదలయ్యాయి. వెంటనే వార్డు, గ్రామ సచివాలయ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు డ్రా చేసి సచివాలయ ఉద్యోగులకు అందజేశారు. మార్చి 1న ఆదివారం కావడంతో ఈ నెల 28నే పింఛన్లు పంపిణీ చేయనున్నారు. కర్నూలు జిల్లాలో 2,36,185 పింఛన్లకు రూ.103.87కోట్లు, నంద్యాల జిల్లాలో 2,12,494 పింఛన్లకు రూ.92.03 కోట్లు పంపిణీ చేయనున్నారు. మిగిలిపోయిన వారికి మార్చి 2న పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు. వైభవంగా తిరుచ్చి మహోత్సవం బేతంచెర్ల: వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం తిరుచ్చి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో అధిష్టింపజేసి ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు, పండితులు, అర్చకులు పూజలు చేశారు. అనంతరం ఆలయ మాడ వీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ స్వామిని ఊరేగించారు. తిరుచ్చి మహోత్సవంలో భక్తులు భారీగా పాల్గొన్నారు. బంగారు రుద్రాక్షమాల, హారం విరాళం శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానానికి శుక్రవారం బాపట్లకు చెందిన కూరపాటి మాధవి, కుటుంబ సభ్యులు బంగారు రుద్రాక్షమాల, బంగారు హారాన్ని విరాళంగా అందజేశారు. ఆశీర్వచన మండపంలో దాతలు వీటిని పర్యవేక్షకులు జి.రవికుమార్, ఇన్స్పెక్టర్ కె.మల్లికార్జునకు అందజేశారు. బంగారు హారాన్ని విరాళంగా అందించిన దాతకు రసీదుతో పాటు స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలను అందజేసి సత్కరించారు. దాతలు మాట్లాడుతూ.. 43 గ్రాముల బంగారంతో రుద్రాక్షమాలతో పాటు త్రిశూలం, ఢమరుకం తయారు చేయించినట్లు తెలిపారు. అలాగే 30 గ్రాముల బంగారంతో హారాన్ని తయారు చేయించినట్లు చెప్పారు. -
నిబంధనల మేరకే పనులు చేపట్టాం
భారత ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన ఏర్పాట్ల పనుల్లో, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పనుల్లోను నిబంధనల మేరకే చేశాం. దేవస్థానానికి సీఎం పేషీ నుంచి పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు వచ్చింది. ఫిర్యాదును పరిశీలించి క్షుణ్ణంగా అన్నింటికీ వివరాలు సమర్పించాం. అన్ని పనులకు ఆన్లైన్ ద్వారా ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారానే టెండర్లు నిర్వహించాం. ప్రధాని భద్రతా అధికారులైన ఎస్పీజీ సూచనల మేరకు మూడంచెల భద్రత కోసం పటిష్టంగా బారికేడింగ్ ఏర్పా టు చేశాం. భ్రమరాంబా అతిథిగృహంలో ఐదు గదులకు ఫర్నిచర్ మార్చాం. టీటీడీ ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారమే పెయింటింగ్ పనులు చేపట్టాం. – ఎం.నరసింహారెడ్డి, శ్రీశైల దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ -
నాలుగు కేంద్రాల్లో మే 3న ‘నీట్’
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: జిల్లాలో మొత్తం నాలుగు కేంద్రాలలో 1,320 మంది విద్యార్థులు మే 3వ తేదీన నిర్వహించనున్న నీట్ (యూజీ) పరీక్షకు హాజరుకానున్నారని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అమరావతి నుంచి నీట్ యూజీ పరీక్షల డైరెక్టర్ జనరల్ ప్రదీప్ సింగ్ కరోలా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ.. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నంద్యాల బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ హై స్కూల్, టెక్కే జూనియర్ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. నీట్ యూజీ పరీక్షల డైరెక్టర్ జనరల్ ప్రదీప్ సింగ్ కరోలా మాట్లాడుతూ.. పరీక్ష నిర్వహణలో నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ దుకాణాలు మూసివేయాలన్నార. అవసరమైతే ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలలను కూడా కేంద్రాలుగా వినియోగించుకోవాలన్నారు. కేటాయించిన సామర్థ్యానికి 10 శాతం అదనంగా సీట్లు ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఈఓ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పన్ను వసూళ్లపై ప్రత్యేక పర్యవేక్షణ
ఈ ఆర్థిక సంవత్సరం ముగి సే నాటికి జిల్లాలో వంద శాతం పన్ను వసూళ్లే లక్ష్యం. ప్రత్యేకంగా ఉన్నతాధికారు లు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా లోని అన్ని గ్రామ పంచాయతీల్లో పన్నులు, పన్నేతరముల కింద రూ.29 కోట్లను వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.17 కోట్లు వసూలయ్యా యి. మిగిలిన 12 కోట్లను మార్చి 15వ తేదిలోగా వసూలు చేయాల్సి ఉంది. అధిక డిమాండ్ ఉండ డం వల్ల కర్నూలు, ఆదోని మండలాల్లో కొంత మేర పురోగతి తక్కువగా ఉంది. కౌతాళం, కోసిగి మండలాలు కూడా పన్ను వసూళ్లలో వెనుకబడ్డాయి. – జి.భాస్కర్, జిల్లా పంచాయతీ అధికారి -
తీవ్ర మానసిక వేదన
సర్వేలు, బీఎల్ఓ విధులు నిర్వహించాలని రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు చేస్తున్న ఒత్తిడితో తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్నాం. ముఖ్యంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను ఈ నెల 28లోగా పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎలాంటి సెలవులు లేవని, సంబంధిత శాఖల నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. మాకు రావాల్సిన పదోన్నతులు, బకాయిలు, నోషనల్ ఇంక్రిమెంట్స్, ఏఏఎస్పై మాత్రం నోరు మెదపకపోవడం ఎంతవరకు సమంజసం. – ఎం రవికుమార్, ఏపీ జీఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర కో చైర్మన్ -
నమో.. శేషశైలావాసా!
● వైభవంగా అహోబిలేశుడి బ్రహ్మోత్సవాలుఆళ్లగడ్డ: అహోబిలంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజైన గురువారం ఉదయం శ్రీ ప్రహ్లాదవరదస్వామి ఉభయ దేవేరులతో శేషవాహనాన్ని అధిరోహించి మాడ వీధుల్లో ఊరేగారు. వేకవజామున మూలవిరాట్ శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవ మూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదుడిని యాగశాలలో కొలువుంచి పట్టువస్త్రాలతో అలంకరించారు. వివిధ రకాల స్వర్ణాభరణాలు ధరించిన ప్రహ్లాదవరదుడు విశేషంగా ముస్తాబైన ఉభయ దేవేరులతో తొమ్మిది తలల శేషవాహనం అధిష్టించి మాడ వీధుల్లో సంచరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. మధ్యాహ్నం ఉత్సవమూర్తులను యాగశాలలో కొలువుంచి పంచామృతాలతో అభిషేకించి తిరుమంజనం నిర్వహించారు. ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన అద్దాల మండపంలో కొలువుంచారు. రాత్రి శ్రీ ప్రహ్లాదరవదస్వామి చంద్రప్రభ వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. శరభ వాహనం అధిరోహించిన జ్వాలా నారసింహ స్వామి అహోబిలంలో కొలువైన శ్రీ జ్వాలా నరసింహస్వా మి గురువారం శరభ వాహనం అధిరోహించి భక్తులను అనుగ్రహించారు. ఉదయం నిత్య పూజల అన ంతరం ఉత్సవ మూర్తులైన జ్వాలా నరసింహ స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి ఉత్సవం నిర్వహించారు.మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించి అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అల ంకరించి యాగశాలలో కొలువుంచి భక్తుల కు దర్శ న భాగ్యం కల్పించారు. రాత్రి శ్రీ జ్వాలా నరసింహస్వామిని శరభ వాహనంపై కొలువుంచి మాడవీధుల్లో వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో నేడు ఎగువ అహోబిలంలో ఉదయం ఉత్సవం, మధ్యాహ్నం అభిషేకం, రాత్రి పొన్నుచెట్టువాహనం సేవ ఉంటుంది. దిగువ అహోబిలంలో ఉదయం మోహిని అలంకారం, మధ్యాహ్నం అభిషేకం, రాత్రి శరభ వాహనము సేవలు నిర్వహిస్తారు. -
285 మంది విద్యార్థులు గైర్హాజరు
నంద్యాల(న్యూటౌన్): ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్ పేపర్–2 పరీక్ష గురువారం ప్రశాంతంగా జరిగినట్లు డీఐఈఓ శంకర్నాయక్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 55 పరీక్ష కేంద్రాల్లో ద్వితీయ సంవత్సరం వొకేషనల్ విద్యార్థులతో కలిపి 13,934 మంది విద్యార్థులకు గాను 13,649మంది హాజరు కాగా 285 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసినట్లు తెలిపారు. తెలుగుగంగ ప్రధాన కాలువకు భారీ గండి బండిఆత్మకూరు: తెలుగుగంగ ప్రధాన కాలువ కుడి వైపున 4వ బ్లాక్ వద్ద బుధవారం రాత్రి 15 అడుగుల భారీ గండి పడింది. దీంతో నీటి ప్రవాహం వరి పంట మీదుగా జీసీ పాలెం, లింగాపురం చెరువుల వైపు వెళ్లడంతో 60 ఎకరాల పొలం నీటి ముంపుకు గురైంది. విషయం తెలుసుకున్న తెలుగు గంగ ఈఈ శంకర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. వెలుగోడు రిజర్వాయర్ నుంచి నీటి ప్రవాహన్ని పూర్తిగా నిలిపి వేశారు. పరిస్థితి అదుపులోనికి వచ్చాక గండిని మూసి వేస్తామని అధికారులు తెలిపారు. కాగా గండి పడిన సమయంలో కాలువలో రెండు వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. సరిగ్గా ఇరవై రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఎడమ వైపున గండి పడింది. మళ్లీ గండి పడటంతో కట్ట భద్రతపై రైతుల్లో ఆందోళన నెలకొంది. ఉన్నతాదికారులు స్పందించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు. సబ్ జైలులో బోర్డ్ ఆఫ్ విజిటర్స్ బృందం నంద్యాల(వ్యవసాయం): నంద్యాల సబ్ జైలులో బోర్డ్ ఆఫ్ విజిటర్స్ బృందం నంద్యాల మండల లీగల్సెల్ చైర్మన్ అమ్మన్న రాజ ఆధ్వర్యంలో ఏర్పాటైంది. ఈ సందర్భంగా మండల లీగల్ సెల్ చైర్మన్ అమ్మన్నరాజ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని ఆళ్లగడ్డ, బనగానపల్లె, డోన్, నందికొట్కూరు, నంద్యాల సబ్ జైళ్లలో ఉన్న రిమాండ్ ఖైదీలకు సమస్యలను తెలుసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కమిటీ సభ్యుల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, డీఎంహెచ్ఓ, పీడబ్ల్యూడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎంప్లాయీ మెంట్ ఆఫీసర్, అగ్రికల్చర్, ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీయల్ ఆఫీసర్లు ఉంటారన్నారు. వీరు ప్రతి నెలా నంద్యాల జిల్లాలోని సబ్ జైళ్లను తనిఖీ చేస్తూ ఖైదీల సమస్యలు, సంక్షేమం, న్యాయపరంగా విద్యా, ఆరోగ్య పరంగా సమస్యలు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించడం కోసం పని చేస్తానన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ విశ్వనాథ్, తహసీల్దార్ శ్రీనివాసులు, డీఈఓ జనార్ధన్రెడ్డి, సూపరింటెండెంట్ గురుప్రసాదరెడ్డిలతో పాటు లోక్ అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
అధిక రేట్లు.. అనర్హులతో పనులు!
శ్రీశైలంటెంపుల్: ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం పర్యటన సందర్భంగా అధిక రేట్లకు, అర్హతలేని కాంట్రాక్టర్లకు పనులు అప్పగించినట్లు, భారీగా అవకతవకలు జరిగినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి, విజిలెన్స్ శాఖకు, దేవదాయశాఖ ముఖ్య అధికారులకు శ్రీశైలానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ పనుల్లో సైతం భారీ అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు ఇవీ.. ● ప్రధాని నరేంద్రమోదీ గత సంవత్సరం అక్టోబరు 16న శ్రీశైలంలో పర్యటించారు. శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ● ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు పిలిచామని చెబుతున్న దేవస్థానం జీవో.ఎంఎస్ నెం.94 ప్రకారం కాకుండా తప్పుగా ఎలిజిలిటీ క్రైటీరియా చేసి అర్హత లేని వారికి క్లాస్–4 బదులుగా క్లాస్–5తో రెకమెండేషన్ చేశారు. ● సప్లై మెటీరియల్ టెండర్లకు ఎంఎస్ఎంఈ, ఫర్మ్ రిజిస్ట్రేషన్ లేకుండా చేశారు. ● దేవస్థాన ఇంజినీర్ల తమ బినామీ కాంట్రాక్టర్లకు మాత్రమే కాంట్రాక్టులు దక్కేలా టెండర్లు తయారు చేశారనే విమర్శలు ఉన్నాయి. ● ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన నేపథ్యంలో భ్రమరాంబా అతిథిగృహంలో ఫర్నిచర్ నిమిత్తం రూ.1.5కోట్లు వృధా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ● మార్కెట్ రేట్ల కంటే నాలుగు నుంచి ఐదు రేట్లకు ఫర్నిచర్ కొనుగోలు చేశారని, భ్రమరాంబా అతిథిగృహంలో పాత ఫర్నిచర్ ఎక్కడికి తీసుకెళ్లాలో చెప్పలేదని ఫిర్యాదు చేశారు. ● దేవస్థానంలోని పలు ప్రదేశాల్లో పెయింటింగ్, చిత్రాల పెయింటింగ్ వేయడానికి అయిదు రెట్లు అధికంగా డబ్బులు ఇచ్చి స్వామివారి నిధులకు గండి కొట్టే ప్రయత్నం చేశారు. ● బారీకేడింగ్, పెండాల్స్ కొనుగోలు చేశారో, అద్దెకు తీసుకొచ్చారో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. బారికేడ్లు ఒక ఫ్రేమ్ రూ.300కాగా దేవస్థానం తీసుకున్న కోటేషన్ రేటు రూ.2వేలు, అపై జీఎస్టీతో టెండర్లు పిలిచారని ఫిర్యాదులో పేర్కొన్నార. ● దేవస్థానం శానిటేషన్ విభాగం రూ.80లక్షలతో బిల్లులు చెల్లించేలా సిద్ధం చేశారు. ● ప్రధానికి స్వాగతం పలికేందుకు సంప్రదాయ వస్త్రధారణ పేరుతో మహిళలకు కాషాయం చీర, జాకెట్, స్కార్ప్, పురుషులకు తెల్లచొక్కా, పంచె పేరుతో నాసిరకం వస్తువులను తీసుకువచ్చి, అది కూడా తక్కువ తీసుకువచ్చి ఎక్కువ మందికి ఇచ్చినట్లు బిల్లులు సిద్ధం చేశారు. ● తోటలు, గార్డెన్లు, ఇతర మొక్కలు ఏర్పాటు చేసినందుకు రూ.లక్షల్లో బిల్లులు చెల్లించేందుకు బిల్లులు సిద్ధం చేశారు. ● పై విషయాలపై క్షుణ్ణంగా పరిశీలించి, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
సర్వేత్రా ఉక్కిరిబిక్కిరి!
కర్నూలు నగరం డాక్టర్స్ కాలనీలో(ఇంటి నెం.88–429) ఓ ప్రయివేట్ ఉద్యోగి నివాసం ఉంటున్నారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే జరుగుతోందని తెలుసుకొని తమ ఇంటికి ఎవరూ రాకపోవడంతో సచివాలయానికి వెళ్లాడు. అయితే ఆ ప్రాంతంలో సర్వే పూర్తయిందని, మీరు అందుబాటులో లేకపోవడంతో వివరాలు తీసుకోలేదని చెప్పడంతో అవాక్కయ్యాడు. ఈ ప్రాంతంలో చాలా మంది ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఒత్తిడి తాళలేక ఉద్యోగులు ఆ కుటుంబం అందుబాటులో లేనట్లుగా నమోదు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కర్నూలు(అర్బన్): గ్రామ/వార్డు సచివాలయల ఉద్యోగులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. అనేక రకాల సర్వేలను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఉద్యోగులు ఆందోళనకు చెందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో పంచాయతీ కార్యదర్శులపైనే అధిక భారం పడుతోంది. మెజారిటీ పంచాయతీ కార్యదర్శులు ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు తమ పరిధిలోని గ్రామాల్లో కుటుంబాలను కలిసి సర్వేలను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, ఈకేవైసీ అప్డేట్, పీ4(బంగారు కుటుంబాలు)తో పాటు గ్రామ పంచాయతీల్లో పన్ను వసూళ్లు, తాజాగా వార్డుల వారీగా ఓటరు జాబితా రూపకల్పన కార్యక్రమాలను పంచాయతీ కార్యదర్శులే చేయాల్సి ఉండటం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.అధిక సమయం తీసుకుంటున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేవైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ‘నవశకం’ పేరిట సాగిన సర్వేను ప్రస్తుత కూటమి ప్రభుత్వం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేగా పేరు మార్చింది. గత ప్రభుత్వంలో 50 ఇళ్లకు ఒక వలంటీరు విధులు నిర్వహించిన దృష్ట్యా, అప్పట్లో చాలా సులభంగా సర్వే చేపట్టారు. ప్రస్తుతం వలంటీరు వ్యవస్థకు కూటమి ప్రభుత్వం మంగళం పాడిన నేపథ్యంలో భారమంతా సచివాలయ ఉద్యోగులపైనే పడింది. ఒక కుటుంబానికి ఈ సర్వే పూర్తి చేయాలంటే కనీసం 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతోందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక కుటుంబంలోని అందరు వ్యక్తులకు చెందిన సమాచారాన్ని 20 నుంచి 30 డాక్యుమెంట్ల రూపంలో అప్లోడ్ చేయాల్సి ఉంది. ఒక ఉద్యోగి సగటున వంద నుంచి వెయ్యి కుటుంబాలను సర్వే చేయాల్సి ఉందని సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. దీనికి తోడు మనిషి జీవించి ఉన్నాడా, లేదా? అని నిర్ధారించుకునేందుకు ఈకేవైసీ అప్డేట్ చేయాల్సి ఉంది. ఇదే సమయంలో విధిగా బయోమెట్రిక్ తీసుకోవాల్సి ఉండటంతో ప్రక్రియ ప్రహసనంగా మారుతోందంటున్నారు. అలాగే పీ4(బంగారు కుటుంబాలు)లను గుర్తించే బాధ్యత కూడా వీరి నెత్తిపైనే ఉంది.ఆన్లైన్ పన్ను చెల్లింపులతో ఇబ్బందులుప్రస్తుతం అన్ని రకాల పన్నులను ఆన్లైన్ పద్ధతిలో చెల్లించాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని పలువురు తమ మొబైల్ ద్వారా పన్నులు చెల్లిస్తున్నారు. ఇంటి నెంబర్ లేదా ఇతర అంశాలను పూరించే సమయంలో చిన్నపాటి పొరపాట్లు చేస్తే మరో 24 గంటల పాటు సర్వర్ స్తంభిస్తోంది. అలాగే పలు ప్రాంతాల్లో సర్వర్లు పనిచేయక పోవడం వల్ల కార్యదర్శులకు ఇబ్బందులు తప్పడం లేదు.తాజాగా ఓటరు జాబితా రూపకల్పనఓ వైపు సర్వేలు, మరో వైపు పన్ను వసూళ్లకు లక్ష్యాలు, ఇంకో వైపు ఓటరు జాబితాలను మార్చి 9 నాటికి రూపొందించాలని డెడ్లైన్ విధించారు.దీంతో పంచాయతీ కార్యదర్శులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.ఈ రకమైన ఒత్తిడికి లోనవుతుంటే ఐవీఆర్ఎస్ మరో రకంగా భయపెడుతోంది.గ్రామాల్లో పారిశుద్ధ్యానికి సంబంధించి ప్రభుత్వం ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజల నుంచి సమాచారాన్ని సేకరిస్తోంది.తీవ్ర పని ఒత్తిడి కారణంగా ఏ గ్రామ పంచాయతీలోనైనా పారిశుద్ధ్యంపై నెగిటివ్గా తెలియజేస్తే, సంబంధిత కార్యదర్శులపై వేటు వేసేందుకు కూడా ప్రభుత్వం వెనుకాడకపోవడం గమనార్హం.సవాలుగా పన్ను వసూళ్లుగ్రామాల్లో పన్ను వసూళ్లు పంచాయతీ కార్యదర్శులకు సవాల్గా మారింది. మార్చి 20వ తేదిలోగా జిల్లాలో వంద శాతం పన్నులు వసూలు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పీఆర్అండ్ఆర్డీ కమిషనర్ ప్రత్యేకంగా పన్ను వసూళ్లను పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం పంచాయతీ కార్యదర్శుల మెడపై కత్తి పెట్టింది. జిల్లాలోని 484 గ్రామ పంచాయతీల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి పన్నులు, పన్నేతరములు కలిపి రూ.29 కోట్లను వసూలు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.17 కోట్లను వసూలు చేశారు. ఇంకా 20 రోజుల్లో రూ.12 కోట్లను వసూలు చేయాల్సి ఉంది. పన్ను వసూళ్లలో ఎవరు అశ్రద్ధ చూపినా, ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటోంది. దీంతో పంచాయతీ కార్యదర్శులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. -
రూ.210 కోట్లకు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఐపీ
డోన్ రూరల్: ప్రజల నుంచి అధిక వడ్డీలకు కోట్లాది రూపాయలను తీసుకుని అదృశ్యమైన నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా కోర్టులో బుధవారం రూ.210 కోట్లకు దివాలా పిటిషన్ దాఖలు చేశారని తెలిసింది. పట్టణానికి చెందిన రాజశేఖర్రెడ్డి కొడుకు శ్రీనివాసరెడ్డి బెంగళూరు పట్టణంలో హౌసో పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించాడు. గత పదేళ్లుగా అధిక వడ్డీలకు వందలాది మంది దగ్గర నుంచి కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నాడు. గతేడాది చివరిలో ఆయన దేశం విడిచి పారిపోయాడు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు, బళ్లారి, హోస్పేట్, గుజరాత్ రాష్ట్రానికి చెందిన కొంతమందితో పాటు డోన్ నియోజకవర్గంలోని అతని బంధువుల నుంచి కూడా కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నట్లు సమాచారం. అయితే నాలుగు నెలల తర్వాత తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం కోర్టులో రూ.210 కోట్లకు దివాలా పిటిషన్ దాఖలు చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సుమారు 226 మంది వరకు బాధితులు ఉన్నట్లు సమాచారం. శ్రీనివాసరెడ్డి ఐపీ కేసు మార్చి 30వ తేదీన విచారణ ఉన్నట్లు తెలిసింది. -
శేష వాహనంపై అహోబిలేశుడు
● వైభవంగా అహోబిలేశుడి బ్రహ్మోత్సవాలుఆళ్లగడ్డ: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన బుధవారం ఎగువ అహోబిలంలో శ్రీ జ్వాలానృసింహస్వామి శేషవాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ జ్వాలా నృసింహ స్వామిఅమ్మవార్లకు నిత్య పూజల్లో భాగంగా తెల్లవారుజామున మేలుకొలుపు చేసి వేద మంత్రోచ్ఛారణలతో అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. విశేష పుష్పాలంకరణ అనంతరం శేష వాహనంపై ఉభయ దేవేరులతో శ్రీ జ్వాలా శ్రీ జ్వాలానృసింహస్వామి కొలువుదీరారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణలతో మాడవీధుల్లో వివహరిస్తూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉత్సవమూర్తులకు మధ్యాహ్నం పంచామృతాభిషేకం నిర్వహించారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. దిగువ అహోబిలంలో.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన బుధవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వామి శ్రీ యోగానృసింహ గరుడ విమానంపై దర్శనం ఇచ్చారు. భక్తజనం మధ్య మాడవీధుల్లో విహరించారు. అంతకు ముందు వేకవజామున నిత్య పూజల్లో భాగంగా సుప్రభాత సేవ అనంతరం మూలమూర్తులను మేలుకొలిపి శ్రీఘ్రదర్శనం అనంతరం అర్చనలు నిర్వహించారు. ఉత్సవమూర్తులు శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను యాగశాలలో కొలువుంచి నవకళశస్థాపన చేశారు. జలాభిషేకం నిర్వహించి నూతన పట్టువస్త్రాలు, వజ్ర, వైఢూర్యాలు పొదిగిన బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా ముస్తాబైన ప్రహ్లాదవరదుడు ఉభయ దేవేరులతో శ్రీ యోగనృసింహ గారుడ విమానం వాహనం అధిరోహించారు. మంగళవాయిద్యాలతో వేదపండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య మాడ వీధుల్లో వైభవోపేతంగా ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. పంచామృతాభిషేకం, జలాభిషేకం నిర్వహించి స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన అద్దాల మండపంలో కొలువుంచారు. రాత్రి శ్రీ ప్రహ్లాదరవదస్వామి హనుమంతు వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. నేటి ఉత్సవాలు.. ఎగువ అహోబిలంలో గురువారం ఉదయం ఉత్సవం, మధ్యాహ్నం అభిషేకం, రాత్రి శరభ వాహన సేవ నిర్వహిస్తారు. దిగువ అహోబిలంలో ఉదయం శేషవాహన సేవ, మధ్యాహ్నం అభిషేకం, రాత్రి చంద్రప్రభ వాహన సేవలు జరగనున్నాయి. శేషవాహనంపై.. -
ఆధార్ చూపించాలి..ఓటీపీ చెప్పాలి
కర్నూలు(అగ్రికల్చర్): కష్టపడి పండించిన పంటలు అమ్ముకునేందుకు రైతులు అవస్థలు పడాల్సి వస్తుంది. ఇప్పటికే గిట్టుబాటు ధర లభించక నష్టాల పాలవుతున్న రైతన్నలకు కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ఈ –నామ్ 2.0 వర్షన్ మరింత తలనొప్పిగా మారింది. ఇప్పటి వరకు ఈ–నామ్ 2.1 వర్షన్ కింద రైతుల వివరాలు నమోదు చేసుకోవడం జరిగేది. ఈ వర్షన్ మంగళవారం రాత్రి క్లోజ్ అయింది. తాజాగా ఈ–నామ్ 2.0 నందు వన్టైమ్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతనే వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ లోపలికి అనుమతిస్తారు. కనీస సమాచారం లేకుండా కొత్త వర్షన్ అమలు చేయడంపై రైతులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వర్షన్ మారడంతో కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు మార్కెట్ యార్డుల్లో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. మార్కెట్కు వచ్చే రైతులు సాధారణంగా ఆధార్ కార్డు తెచ్చుకోరు. అనేక మంది రైతుల దగ్గర మొబైల్ ఫోన్లు కూడా ఉండవు. ఇక నుంచి మార్కెట్ యార్డుల్లో పంటలను అమ్ముకోవాలంటే రైతులు విధిగా ఆధార్ కార్డు, బ్యాంక్ పాసుపుస్తకం నకళ్లు, మొబైల్ ఫోన్ వెంట తెచ్చుకోవాలి. మార్కెట్ ఎంట్రీ గేటులోనే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఆధార్ కార్డు, బ్యాంకు పాసు పుస్తకం కాపీలు ఇవ్వాల్సి ఉంది. ఓటీపీ నెంబరు చెప్పాల్సిందే.. ఈనామ్ కొత్త వర్షన్లో ఫోన్ నంబరు కూడా చెప్పాలి. వివరాలు నమోదు చేసిన తర్వాత రైతు మొబైల్కు ఓటీపీ నంబరు వస్తుంది. ఓటీపీ నెంబరు చెబితేనే రైతు వివరాలు రిజస్టర్ అవుతాయి. అయితే రైతులు తమ వెంట ఆధార్ తెచ్చుకోకపోవడం, కొంతమంది తెచ్చుకున్నా.. ఓటీపీ నెంబరు చెబితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయోనన్న భయంతో ఆధార్, బ్యాంకు పాసుపుస్తకం ఇవ్వడానికి, ఓటీపీ నెంబరు చెప్పేందుకు ఇష్టపడలేదు. వర్షన్ మారడంతో రిజిస్ట్రేషన్లు ముందుకు సాగ లేదు. సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఓటీపీ నెంబర్లు చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఈ–నామ్ 2.0 వర్షన్కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగారు. ఆధార్ ఇవ్వం.. ఓటీపీ చెప్పేదిలేదని భీష్మించారు. కొత్త వర్షన్కు రైతులు సహకరించకపోవడంతో బుధవారం కర్నూలు వ్యవసాయ వ్యవసాయ మార్కెట్ యార్డులో మాన్యువల్గా ఈ–నామ్ అమలుకు ముందున్న విధానం ప్రకారం క్రయవిక్రయాలు జరిగాయి. ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఓటీపీ లేకుండానే రిజిస్ట్రేషన్ చేపట్టి వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు చేపట్టారు. కాగా.. ఈ–నామ్ వర్షన్ మారినందున మార్కెట్ యార్డుల్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్ముకునేందుకు వచ్చే రైతులు విధిగా వెంటనే ఆధార్, బ్యాంకు పాసుపుస్తకం నకళ్లు, మొబైల్ ఫోన్ వెంట తెచ్చుకోవాలని కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. వన్టైమ్ రిజిస్ట్రేషన్ తర్వాతనే వ్యవసాయ ఉత్పత్తులను లోపలికి అనుమతిస్తారని స్పష్టం చేశారు. ఉన్నట్టుండి ఈ–నామ్ వర్షన్ మార్పు చేసిన కేంద్రం ఇంతవరకు ఈ–నామ్ 2.1 వర్షన్ కింద వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు తాజాగా 2.0 వర్షన్ కింద ప్రతి రోజు రైతుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి వెంట ఆధార్, బ్యాంకు పాసు బుక్తో పాటు మొబైల్ ఫోన్ తెచ్చుకోవాల్సిందే ఆందోళనలో అన్నదాతలు -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– బనగానపల్లె ఆర్అండ్బీ ప్రధాన రహదారిలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అందించిన సమాచారం మేరకు.. బనగానపల్లె పట్టణం కొండపేటకు చెందిన శాలిక శివప్ప (32) కారు డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కోవెలకుంట్లలో ఉన్న బంధువులను చూసేందుకు ఇంటి వద్ద నుంచి బైక్పై బయలుదేరాడు. మండలంలోని అమడాల మెట్ట పెట్రోల్ బంక్ సమీపంలో పంక్చరై ఆగి ఉన్న కంకర టిప్పర్ను వెనుకవైపు నుంచి బలంగా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో యువకుడి తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య మేరి, కుమారుడు మోక్షిత్ ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి శపపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు. 1,113 పింఛన్ల కోత కర్నూలు(అగ్రికల్చర్): మార్చి నెల పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 1వ తేదీ ఆదివారం కావడంతో ఈ నెల 28నే పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఫిబ్రవరి నెల 4,49,792 పింఛన్లు ఉండగా.. మార్చి నెలలో 4,48,679కు తగ్గిపోయాయి. అంటే 1,113 పింఛన్లు కోతపడ్డాయి. పింఛన్ల పంపిణీకి రూ.195.9 కోట్లు విడుదలయ్యాయి. డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పోస్టుకు నోటిఫికేషన్ కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పోస్టుకు న్యాయవాదులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పోస్టు(1)కు నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. క్రిమినల్ లా ప్రాక్టీసులో ఏడు సంవత్సరాలు, సెషన్స్ కేసులు చేయడంలో అనుభవం కలిగిన న్యాయవాదులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జిల్లా కోర్టు వెబ్సైట్ https://www.ecourtskurnool.com నందు అప్లికేషన్ అందుబాటులో ఉందన్నారు. మార్చి 10 సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులను పంపాలని పేర్కొన్నారు. -
క్షతగాత్రులకు నగదు రహిత వైద్యం
● సమర్థవంతంగా పీఎం రాహత్ పథకం అమలు ● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు తక్షణం నగదు రహిత వైద్య చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం రాహత్ పథకం అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా రవాణాశాఖ అధికారి, మున్సిపల్ కమిషనర్లు, రోడ్లు, భవనాలు శాఖ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులతో బుధశారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాద బాధితులకు ప్రమాదం జరిగిన తొలి 7 రోజుల్లో ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు నగదు రహిత వైద్య చికిత్స అందిస్తారని తెలిపారు. పోలీసుల ధ్రువీకరణ అనంతరం సాధారణ గాయాల కేసుల్లో 24 గంటల పాటు, తీవ్ర గాయాల కేసుల్లో 48 గంటల పాటు స్థిరీకరణ వైద్య సేవలు అందుతాయన్నారు. ఈ పథకం కింద ఆసుపత్రులకు చెల్లింపులు మోటారు వాహన ప్రమాద నిధి ద్వారా చేరతాయన్నారు. ప్రమాదానికి కారణమైన వాహనం బీమా చేసినట్లయితే బీమా సంస్థలు వ్యయాన్ని భరిస్తాయని తెలిపారు. బీమా చేయని వాహనాలు ఉన్న సమయంలో భారత ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల ద్వారా ఖర్చును భరిస్తుందని స్పష్టం చేశారు. ఈ పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాలతో కలిగే ప్రాణనష్టాన్ని తగ్గించడంలో అన్ని శాఖల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. -
పాల విక్రయ కేంద్రాల్లో తనిఖీలు
కర్నూలు(హాస్పిటల్): ఆహార భద్రత నియంత్రణ విభాగం అధికారులు బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కర్నూ లు నగరంలోని పలు పాల విక్రయ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. రాజమండ్రిలో పాలకల్తీతో మరణాలు సంభవించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాలను తనిఖీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు కర్నూలులోని సి.క్యాంపులో ఉన్న రామి రెడ్డి తాత మిల్క్ డైరీలో వల్లభ గోల్డ్ మిల్క్ను, మాధవనగర్లోని పంచముఖి మిల్క్ పార్లర్లోని గాయత్రి ఫుల్క్రీమ్ మిల్క్ను, ఠాగూర్ నగర్లోని ఇందుమణి మిల్క్ పార్లర్లోని ఆరోక్య టోన్ మిల్క్ను, అమ్మ హాస్పిటల్ సమీపంలోని ఎస్ఎస్ మిల్క్ పార్లర్లో లూజు పాల ప్యాకెట్ పాల ను శాంపిల్స్ తీసి హైదరాబాద్లోని ల్యాబోరేటరీకి పరీక్షల నిమిత్తం పంపించారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కూర్మానాయకులు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజగోపాల్ ఈ తనిఖీల్లో పాల్గొని పాల విక్రయ దారులకు పలు సూచనలు చేశారు. డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ఇద్దరు డీబార్ కర్నూలు(సెంట్రల్): రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో బుధవారం జరిగిన సెమిస్టర్ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులు డీబార్ అయ్యారు. కర్నూలు సాయి కృష్ణ , ఆళ్లగడ్డ అనంత డిగ్రీ కాలేజీల్లో ఒక్కొక్కరు చొప్పున డీబార్ అయ్యారు. మరోవైపు డిగ్రీ ఫస్టు సెమిష్టర్ పరీక్షకు 85 శాతం, బీటెక్ పరీక్షలకు 97 శాతం, లా పరీక్షలకు 93 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మెడికల్ విద్యార్థులు రక్తదానం కర్నూలు(హాస్పిటల్): వైద్య విద్యను పూర్తి చేసి త్వరలో మెడిసిన్ పట్టా తీసుకుంటున్న వేళ కర్నూలు మెడికల్ కాలేజీ ఎంబీబీఎస్ విద్యార్థులు బుధవారం రక్తదానం చేశారు. ఈ వైద్యవిద్యా ర్థులు త్వరలో ఔట్గోయింగ్ బ్యాచ్ ఏఆర్ఓకేఏహెచ్–26 పేరుతో గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య విద్యార్థులు వైద్యంతో ప్రాణాలు కాపాడటమే గాక రక్తదానంతో కూడా ప్రాణాలు నిలిపేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రతి వైద్య విద్యార్థి ఇలాంటి సంప్రదాయాన్ని పాటించాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షెహనాజ్, పెథాలజి అసోసియేట్ ప్రొఫెసర్ శైల, 2కే20 బ్యాచ్ సీఆర్ డాక్టర్ అభిషేక్, అఖిల్, శిరీష, స్వర్ణలత, ప్రవల్లిక, హరినాత్, జైషన్, బాలు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు నంద్యాల: జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు 2026–27 సంవత్సరానికి గాను అక్రిడిటేషన్ కార్డులను జిల్లా కలెక్టర్, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ రాజకుమారి బుధవారం అందజేశారు. జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ తొలి సమావేశంలో ఆమోదం పొందిన మొత్తం 508 మంది పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న మిగిలిన పాత్రికేయుల అర్హతలను పరిశీలించి, తదుపరి కమిటీ సమావేశంలో వారికి కూడా మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. గంజాయి పట్టివేత నంద్యాల: పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఎస్డీపీఓ మందాజావళి, వన్టౌన్ సీఐ సుధాకర్రెడ్డి బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నందమూరినగర్కు చెందిన దాసరి కల్యాణ్, బైటిపేటకు చెందిన మనోహర్ గంజాయికి అలవాటుపడ్డారు. ఈక్రమంలోనే వైజాగ్ నుంచి గుర్తు తెలియని వ్యక్తుల వద్ద కేజీ రూ. 4వేలు ప్రకారం గంజాయిని కొనుగోలు చేసి పది గ్రాముల ప్రకారం చిన్నచిన్న ప్యాకెట్లు తయారు చేసి ఒక్కోక్కటి రూ.2 వేలు చొప్పున నంద్యాల పట్టణంలో విక్రయించి సొమ్ము చేసుకునేవారు. ఆ ఇద్దరిపై నిఘా వేసిన పోలీసులు బుధవారం జగజ్జననీ నగర్ చెరువు కట్ట మల్లెలమ్మ గుడి వెనుక ఉండగా దాడి చేసి పట్టుకొని రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. -
ఇతని పేరు పాల మద్దయ్య. కర్నూలు మండలం చిన్నటేకూరు గ్రామం. వయస్సు 63 ఏళ్లు. ఒక కుమార్తె సంతానం కాగా సున్నిపెంటలో ఉంటోంది. పింఛను కోసం పదుల సంఖ్యలో దరఖాస్తులు ఇచ్చినా ఫలితం లేకపోయింది. పూట గడవక రెండేళ్లుగా కలెక్టరేట్ ముఖద్వారం వద్ద కూర్చొని అడుక్కుంటున్నాడు
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర దాటినప్పటికీ కొత్త పింఛన్ల ఊసెత్తడం లేదు. 2024 ఎన్నికల సమయంలో చంద్రబాబు 50 ఏళ్లు నిండిన వారందరికీ వృద్ధాప్య పింఛను ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు నాకు 62 ఏళ్లు. ఏ పనీ చేయలేని పరిస్థితి. 50 ఏళ్లకే పింఛను ఇస్తామని ఎన్నికల సమయంలో ఊరూవాడా ప్రకటించారు. చంద్రబాబు మాటలకు ఎంతో సంతోషించాం. ఇప్పుడు ఆ మాట ఎత్తకపోవడం ఆందోళన కలిగిస్తోంది. – బి.ఆంజనేయులు, చిన్నటేకూరు, కల్లూరు మండలం 2024 మే నెలలో జరిగిన ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛను ఇస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు మాటలను విశ్వసించాం. ప్రభు త్వం ఏర్పాటై 20 నెలలు అవుతోంది. ఇంతవరకు హా మీ అమలు దిశగా చర్యలు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నా వయస్సు 58 ఏళ్లు. రెక్కల కష్టం మీద బతుకుతున్నాం. ఇప్పటికై నా ప్రభుత్వం ఆదుకోవాలి. – కుషిదా బేగం, కేఈ మాదన్న నగర్, డోన్ కర్నూలు(అగ్రికల్చర్): 2024 మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సూపర్–6లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛను ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆర్భాటంగా ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పాటై 20 నెలలు అవుతున్నప్పటికీ ఈ పింఛను హామీ పట్టాలెక్కని పరిస్థితి. ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటీ కొత్త పింఛను ఇవ్వకపోగా ప్రతినెలా పింఛన్లలో కోత పెడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల అసెంబ్లీలో త్వరలో కొత్త పింఛన్ల దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు అవకాశం ఇస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటికీ కార్యరూపం దాల్చని పరిస్థితి. చంద్రబాబు సర్కార్ కర్నూలు జిల్లాలో 4,748, నంద్యాల జిల్లాలో 4,163 దివ్యాంగుల పింఛన్లను అనర్హత పేరిట తొలగింపునకు నోటీసులు జారీ చేసింది. వీరంతా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దిగి వచ్చిన ప్రభుత్వం మళ్లీ రీ వెరిఫికేషన్కు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాలో దివ్యాంగుల పింఛన్లు 55,861 ఉండగా.. 48,314 పింఛన్లను రీ వెరిఫికేషన్ చేశారు. మిగిలిన 7,547 మంది దివ్యాంగుల పునః పరిశీలన చేపట్టాల్సి ఉంది. ఈ ప్రక్రియ స్థానిక ఎన్నికలు ముగిసిన తర్వాత చేపట్టే అవకాశం ఉంది. దివ్యాంగుల పింఛన్ల వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత వితంతు పింఛన్లను కూడా పునఃపరిశీలన చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త పింఛన్లకు తప్పని నిరీక్షణ చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అవుతోంది. ఇంతవరకు కొత్త పింఛన్ల ప్రస్తావనే లేకపోవడం అవ్వతాతలను ఆందోళనకు గురిచేస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 50 నుంచి 60 ఏళ్లలోపు అవ్వతాతలు దాదాపు 4.50 లక్షల మంది వరకు ఉన్నారు. వీరిలో 60 శాతం మందికి పింఛన్లకు అర్హులే. 2024 జూన్ 12వ తేదీ నుంచి ఇప్పటి వరకు కొత్త పింఛన్ల కోసం దాదాపు 2లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. కొత్త పింఛను దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేసే ఆప్షన్ కూడా ఇవ్వకపోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. 2024 ఎన్నికల సమయంలో 50 ఏళ్లకే పింఛను ప్రకటన జిల్లా గత ఏడాది జూన్ నెల పింఛన్లు ఈ ఏడాది జనవరి నెల పింఛన్లు కోత కర్నూలు 2,45,687 2.36,185 9,502నంద్యాల 2,21,702 2.12,494 9,208 మొత్తం 4,67,389 4,48,679 18,710 నెరవేరని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛను హామీ అవ్వతాతలు, దివ్యాంగులు, చేనేత, మత్స్యకారుల నిరీక్షణ చంద్రబాబు ప్రభుత్వంలో 18710 పింఛన్ల కోత త్వరలో కొత్త పింఛన్లని అసెంబ్లీలో ప్రకటన అయినప్పటికీ ఒక్క అడుగూ ముందుకుపడని పరిస్థితి -
అరెస్టుల మధ్య ప్రమాణ స్వీకారం
● ‘ఉరుకుంద’ చైర్మన్గా పాండురంగయ్య ప్రమాణం ● తీవ్ర నిరసన తెలిపిన తెలుగు తమ్ముళ్లు ● హౌస్ అరెస్టు చేసిన పోలీసులు కౌతాళంలో టీడీపీ నాయకుడు చెన్నబసప్పను అరెస్ట్ చేసి పోలీసులుఉరుకుందలో టీడీపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులుకౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి పాలక మండలి సభ్యుల ప్రమాణాస్వీకారం సొంత పార్టీ నేతల అరెస్టుల నడుమ పోలీస్ బందోబస్తు మధ్య జరిగింది. మంత్రి టీజీ భరత్ చిన్నాయన పాండురంగయ్య శెట్టిని చైర్మెన్గా పాలకమండలి ఎన్నికకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై కౌతాళం మండలంతో పాటు నియోజవర్గంలోని టీడీపీ నేతలు బహిరంగంగా నిరసనకు దిగారు. కొందరు రాజీనామాలూ చేస్తున్నారు. బుధవారం ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయం వద్ద కౌతాళం మండలం నేతలు, మాజీ ట్రస్ట్బోర్డు చెర్మన్లు చెన్నబసప్ప, శివమోహన్ రెడ్డి, కోట్రేష్ గౌడ, కురుగోడు, మంత్రాలయం నాయకుడు పన్నాగ వెంకటేష్, కోసిగి నాయకుడు భరత్ శెట్టి, పెద్ద కడుబూరు నాయకులు సుమారు 400 మందితో కలిసి విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. పార్టీ అధిష్టానం స్పందించక పోతే విజయవాడలోని పార్టీ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతామని ప్రకటించారు. ఇదిలా ఉంటే మరో వైపు మంత్రి టీజీ భరత్ ఆదేశాలతో పూర్తి స్థాయిలో పాలక మండలి సభ్యులు రాకపోయినా హడావుడిగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముందు జాగ్రత్తగా సొంత పార్టీ నేతలు మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ చెన్నబసప్పను కౌతాళంలో, మాజీ డైరెక్టర్ కోట్రేష్ గౌడు, మాజీ ఎంపీటీసీ కురుగోడు తదితరులను ఉరుకుందలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. -
టీబీ డ్యాం నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
ఆలూరు: టీబీ డ్యాం నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. ఈనెల 24వ తేదీన 20 గేట్లు ఎత్తి 62.610 క్యూసెక్కుల నీరు విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డ్యాం కు ఇన్ ఫ్లో 74.555 క్యూసెక్కులు, ఔట్ప్లో 85.616 క్యూసెక్కులు ఉంది. 105.788 సామర్థ్యం గల డ్యాంలో 75.612 టీఎంసీల నీరు నిలువ ఉంది. కాగా రబీ సీజన్లో ఎల్లెల్సీ కింద వివిధ పంటలు సాగయ్యాయి. నీటి విడుదల తగ్గిపోవడంతో పంటలు చేతికి వస్తాయోలేదోననే భయం రైతులకు పట్టుకుంది. హత్య కేసులో ముద్దాయి అరెస్ట్ అవుకు(కొలిమిగుండ్ల): తండ్రి హత్య కేసులో ముద్దాయిగా ఉన్న కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం అవుకు పోలీస్ స్టేషన్లో బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథరెడ్డి వివరాలను విలేకరులకు వెల్లడించారు. మండలంలోని ఉప్పులపాడు గ్రామానికి చెందిన మంగలి శివరాముడిని కుమారుడు నాగశేఖర్ 2022లో హత్య చేశాడు. వీటికి సంబంధించి నంద్యాల అడిషనల్ సెషన్స్ కోర్టుకు ముద్దాయి హాజరు కాక పోవడం, వాయిదాలకు వెళ్లకుండా ఉండటంతో కోర్టు ముద్దాయిపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐ పర్యవేక్షణలో అవుకు ఎస్ఐ అశోక్ సిబ్బందిని రెండు బృందాలుగా ఏర్పాటు చేసి బెంగళూరు,కర్ణాటక తదితర ప్రాంతాల్లో వెతుకుతూ వచ్చారు. చివరకు మండలంలోని సంగపట్నం ఊరి వాకిలి వద్ద పట్టుబడటంతో అదుపులోకి తీసుకొని నంద్యాల కోర్టులో హాజరు పర్చినట్లు సీఐ తెలిపారు. -
చెంచులకు ఉచిత స్పర్శదర్శనం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శదర్శనాన్ని శనివారం చెంచులకు కల్పించారు. సంప్రదాయబద్ధంగా తప్పెట వాయిద్యాలతో, నృత్యాలు చేస్తూ చెంచు భక్తులు దర్శనానికి వచ్చారు. ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద దేవస్థాన ఽఅధికారులు చెంచులకు ఆహ్వానం పలికారు. అనంతరం చెంచు భక్తులు ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణ చేశారు. చెంచులకు మల్లన్న స్పర్శదర్శనం, భ్రమరాంబాదేవి దర్శనం చేయించారు. అన్నప్రసాద వితరణ భవనంలో అన్నప్రసాదాలు సమర్పించారు. స్థానిక మేకలబండ, ఇతర గూడేలకు చెందిన చెంచు భక్తులు పాల్గొన్నారు. సీనియర్ అసిస్టెంట్ పదోన్నతి వెనక్కు ● ఆ 11 మంది గ్రేడ్–1 వీఆర్వోలే.. కర్నూలు (సెంట్రల్): చంద్రబాబు ప్రభుత్వం 11 మంది సీనియర్ అసిస్టెంట్లకు ఇచ్చిన పదోన్నతిని వెనక్కు తీసుకుంది. 2022లో ఉమ్మడి జిల్లాలోని కర్నూలులో నలుగురు, నంద్యాల జిల్లాలో ఏడుగురికి గ్రేడ్–1 వీఆర్వో నుంచి సీనియర్ అసిస్టెంట్గా పదోన్నతి కల్పించారు. అయితే వీరు డిపార్ట్మెంటల్ పరీక్ష పాస్ కాలేదన్న నెపంతో వారి పదోన్నతిని చంద్రబాబు ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీంతో ఇన్నాళ్ల వరకు సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేసిన వారంతా తిరిగి గ్రేడ్–1 వీఆర్వోలుగా పనిచేయాల్సి ఉంటుంది. కాగా ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఇచ్చిన పదోన్నతిని వెనక్కు తీసుకోవడం అవివేకమని, వారికి మరో అవకాశమిచ్చి డిపార్ట్మెంటల్ పరీక్షల్లో పాసయ్యేలా చూడాలని కోరుతున్నాయి. ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించి డిమాండ్లు పరిష్కరించకుండా వేధిస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ఇచ్చిన పదోన్నతులను వెనక్కు తీసుకోవడం దారుణంగా ఉందని మండిపడుతున్నారు. -
స్వలాభం కోసమే ‘సీమ’ తాకట్టు
బొమ్మలసత్రం: సాగునీరు అందక, పంటలు చేతికందక రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సీఎం చంద్రబాబు తన స్వలాభం కోసం తాకట్టు పెట్టారని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. ఇలాగైతే రాయలసీమ ఎడారిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాలలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. మాజీ ఎంపీలు తలారి రంగయ్య, పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, గంగుల బిజేంద్రా రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్, సూర్యనారాయణరెడ్డి, ఎస్ఈసీ మెంబర్ కల్లూరి రామలింగారెడ్డి, సీనియర్ నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి, స్టేట్ మహిళా విభాగం జనరల్ సెక్రటరీ శశికళారెడ్డి, స్టేట్ యూత్ వింగ్ జాయింట్ సెక్రటరీ శ్రీకాంత్రెడ్డి, స్టేట్ మైనారిటీ సెక్రటరీ యూనూస్ బాషా, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్రరెడ్డి, జిల్లా యూత్వింగ్ ప్రెసిడెంట్ గుండం నాగేశ్వరరెడ్డి హాజరయ్యారు. ఓటుకు నోటు కేసుకు భయపడి .. విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ.. అనంతపురం నివాసి చిలకూరి నారాయణ నంద్యాల గడ్డపై నిలబడి 1982లో రాయలసీమ అని నామకరణం చేశారన్నారు. రాయలసీమలో కరువు ఉండకూడదనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించారన్నారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చెప్పగానే ముఖ్యమంత్రి చంద్రబాబు పనులు నిలిపివేయటం దారుణమన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి కాకపోతే సాగు, తాగునీరే కాకుండా స్నానాలకు కూడా నీరు దొరకని పరిస్థితులు ఎదురవుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలను మధ్యలోనే తరలించుకుపోయేందుకు ఎన్నో ప్రాజెక్ట్లు నిర్మించిందన్నారు. ఓటుకు నోటు కేసుకు భయపడి చంద్రబాబు హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చి సాగునీటి ప్రాజెక్ట్లను గాలికొదిలేశారన్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు అసెంబ్లీలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులపై మాట్లాడకపోవటం దురదృష్టకరమన్నారు. ప్రాజెక్ట్ పనులు తిరిగి మొదలుపెట్టకపోతే దశలవారీగా ఉద్యమాలు చేపడతామన్నారు. ప్రజలు ఈ ప్రాజెక్ట్లపై ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోతే భావితరాలకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. చంద్రబాబును నిలదీయాలి బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులు ప్రారంభించాలని కోరుతూ వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టనుందన్నారు. ఇందుకు కోసం సీమ ప్రజలు మద్దతు తెలుపుతూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు తన శిష్యుడు రేవంత్రెడ్డికి సీమ ప్రాజెక్ట్లను తాకట్టుపెట్టారన్నారు. ప్రజలు చంద్రబాబును నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి మా ట్లాడుతూ సీమ బాగుండాలంటే ప్రాజెక్ట్ నిర్మాణాలు అవసరమన్నారు. ఇప్పటికే వర్షాభావంతో నీళ్లు తగ్గాయన్నారు. రానున్న రోజుల్లో వర్షాలు లేకపోతే రైతులు పంటలు ఎలా పండిస్తారని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్ట్ల కోసం ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. సీమ రైతుల కోసం ఉద్యమాలువైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే నెల 1వ తేదీ కడపలో రాయలసీమ జిల్లాల నాయకులతో సాగునీటి ప్రాజెక్ట్లపై సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. వైఎస్సార్ హయాంలో రాయలసీమకు 40 వేల క్యూసెక్కుల నీరు అందించేలా చర్యలు తీసుకుంటే ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 80 వేల క్యూసెక్కుల నీరు అందించేందుకు కృషి చేశారన్నారు. దీన్ని చంద్రబాబు అడ్డుకోవటం సరైందికాదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 80 శాతం పూర్తి చేసిందని, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పనులు నిలిపివేయటం దారుణమన్నారు. రాయలసీమ అభివృద్ధికి చంద్రబాబు తన పాలనలో ఎప్పుడు మంచి చేసిన దాఖలాలు లేవన్నారు. రాయలసీమ రైతుల కోసం భవిష్యత్తులో వైఎస్సార్సీపీ ఉద్యమాలు చేపడుతుందని, అందరూ సహకరించాలని కోరారు. ప్రజలకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి ఎత్తిపోతల పథకం నిలిచిపోతే రాయలసీమ ఎడారిగా మారుతుంది 1న కడపలో ‘సీమ’ నాయకులతో ఇరిగేషన్ ప్రాజెక్ట్లపై సమావేశాలు విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు -
మాదిగలపై దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం
● ఏపీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు దాసరి సువర్ణ రాజుకర్నూలు(అర్బన్): రాష్ట్రంలో మాదిగలపై పెరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలను అరికట్టడంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి సువర్ణరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జిల్లాలోని తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టి.ఎం.రమేష్ హత్యకు నిరసనగా బుధవారం స్థానిక అంబేద్కర్ భవన్లో సభను నిర్వహించి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, ఏపీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పేరపోగు వెంకటేశ్వరరావు, బుంగా సంజయ్ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సువర్ణరాజు మాట్లాడుతూ జనవరి 31న టి.ఎం.రమేష్ను అతి దారుణంగా హత్య చేసినా నేటికీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన లేకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో దళితులకు, ముఖ్యంగా మాదిగ బిడ్డలకు రక్షణ లేకుండాపోయిందన్నారు. దోషులు స్వేచ్ఛగా తిరుగుతున్నా పాలకులు మౌనం వహించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో దళితుల ఓట్లు కావాలి కాని వారి ప్రాణాలు పోతుంటే పరామర్శించే తీరిక కూడా ప్రభుత్వ పెద్దలకు లేదా అని నిలదీశారు. రమేష్ హంతకులకు కఠిన శిక్ష పడేలా చేయాలన్నారు. కేసు విచారణను వేగవంతం చేసేందుకు తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని, బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు. దళితులపై జరుగుతున్న దౌర్జన్యాలను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. రమేష్ హత్య కేసులో ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ జాతిని ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, ఛలో అమరావతి కార్యక్రమానికి కూడా వెనకాడమని హెచ్చరించారు. మాదిగలపై జరుగుతున్న హత్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనీసం స్పందించడం లేదన్నారు. అగ్ర వర్ణాలకు చెందిన నాయకులు హత్యలకు గురైతే కోట్ల రూపాయల పరిహారంతో పాటు కోట్లు ఖరీదు చేసే స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం వెనుకాడటం లేదన్నారు. మాదిగ బిడ్డ హోంమంత్రిగా ఉన్నా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు హత్యలకు గురవుతున్నా ఆమె స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. పెద్ద మాదిగ అని చెప్పే మందకృష్ణ మాదిగ సైతం మాదిగల హత్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో విఫలమయ్యారన్నారు. ● కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు సోమసుందరం మాదిగ, ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కమతం పరుశురాం, సుధాకర్ మాదిగ, రాయలసీమ దండోరా అధ్యక్షులు అనంతరత్నం మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకురాలు నాగేశ్వరి మాదిగ, రాష్ట్ర కోకన్వీనర్ వెంకటేశ్వర్లు మాదిగ, జిల్లా అధ్యక్షులు పులికొండ మాదిగ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గద్ద రాజశేఖర్ మాదిగ, నగర అధ్యక్షుడు కన్నెమరకల వెంకటేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు గిడ్డయ్య మాదిగ, విన్సెంట్ విజయ్ కుమార్ మాదిగ, రంగడు మాదిగ, నవీన్ మాదిగ, శాంతి పాల్గొన్నారు. -
16 నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు
శ్రీశైలంటెంపుల్: మార్చి 16వ తేది నుంచి 20వ తేది వరకు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు జరుగుతాయని శ్రీశైల జగద్గురు పీఠాధిపతి డా.చెన్నసిద్దరామ శివాచార్య మహాస్వామి అన్నారు. బుధవారం కర్ణాటక రాష్ట్రం భాగల్కోట్ జిల్లా తేర్దాళ్లోని అల్లమ ప్రభు దేవస్థానంలో భక్త బృందాలు, స్వచ్ఛందసేవా సంస్థలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ముందుగా స్వామిఅమ్మవార్ల ధర్మ ప్రచార రథయాత్ర బసవేశ్వర సర్కిల్ నుంచి అల్లమ ప్రభు దేవాలయం వరకు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో పీఠాధిపతి మాట్లాడుతూ ఉగాది ఉత్సవాలకు శ్రీశైల దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తుందన్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆ సమయంలో అలంకార దర్శనానికే అనుమతిస్తున్నట్లు చెప్పారు. భక్తులు సంయమనం పాటిస్తూ స్వామిఅమ్మవార్లను దర్శించుకోవాలని, ఉత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. అలాగే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ కాలిబాటగా వచ్చే భక్తుల సౌకర్యార్థం మంచినీటి సరఫరా, దాతల సహకారంతో అన్నదాన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. -
40 ఏళ్ల భూ పరిహారం కేసు పరిష్కారం
కర్నూలు(సెంట్రల్): లోకాయుక్త చొరవతో 40 ఏళ్లనాటి భూ పరిహారం కేసు పరిష్కారమైంది. ఉప లోకాయుక్త జస్టిస్ పి.రజనీ బాధిత రైతుకు రూ.1,47,078 నష్టపరిహారం అందించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం మండలం బొర్రపాళెంగ్రామానికి చెందిన కేవీఎస్ సూర్యనారాయణ మూర్తికి చెందిన టీ.నర్సాపురం మండలం సర్వే నంబర్ 67/2లోని 0.76 ఎకరాల భూమిని ప్రభుత్వం ఎస్కేకేవైఆర్ ప్రాజెక్టు కోసం 1980 అక్టోబర 27వ తేదీన స్వాధీనం చేసుకుంది. అయితే సదరు భూమికి సంబంధించి నష్టపరిహారం కేసులో మంజూరైన పరిహారంపై అప్పటి బాధిత రైతు తండ్రి లేటు అప్పారావు ఒప్పుకోలేదు. దీంతో ఆయన కుమారుడు కేవీఎస్ సూర్యనారాయణ మూర్తి పరిహారం కోసం లోకాయుక్తను ఆశ్రయించారు. ఈ క్రమంలో 40 సంవత్సరాలు గడిచిన తరువాత లోకాయుక్త కేసును పరిష్కరించి బాధితుడికి రూ.1.47 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించిన నేపథ్యంలో కేసును మూసి వేస్తున్నట్లు ఉప లోకాయుక్త జస్టిస్ పి.రజనీ బుధవారం ప్రకటించారు. -
డిగ్రీ పాఠ్యాంశాల్లో సాంకేతికతను జోడించాలి
కర్నూలు(సెంట్రల్): డిగ్రీ కోర్సుల పాఠ్యాంశాలు విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుదిద్దేలా ఉండాలని రాయలసీమ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఆచార్య వి.వెంకట బసవరావు ఆకాంక్షించారు. బుధవారం వర్సిటీ సెనేట్ హాలులో అకడమిక్ ఆఫైర్స్ విభాగం ఆధ్వర్యంలో యూజీ బోర్డు ఆఫ్ స్టడీస్ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వైస్ చాన్స్లర్ మాట్లాడుతూ..డిగ్రీ పూర్తయ్యేసరికి విద్యార్థి స్వయం సహాయకంగా ఎదగాలన్నారు. ఈ దిశగా పాఠ్యాంశాలకు సాంకేతికతను మేళవించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్వాంటం కంప్యూటింగ్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్పై కూడా విద్యార్థులకు బోధనాంశాలు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్టీకే నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయకుమార్ నాయుడు పాల్గొన్నారు. -
రాజకీయ ప్రయోజనాల కోసమే లడ్డూపై చర్చ
● చంద్రబాబు తీరుపై వైఎస్సార్సీపీ నేత సుభాష్ చంద్రబోస్ ఆగ్రహం కర్నూలు (టౌన్): చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రయోజనాల కోసమే అసెంబ్లీలో వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై చర్చ పెట్టారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దూరు సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. బుధవారం స్థానిక సీ క్యాంపులోని తన కార్యాలయంలో మాట్లాడుతూ ప్రభుత్వ పాలన, సంక్షేమంలో వైఫల్యం చెందడంతో తిరుమల లడ్డూపై చంద్రబాబు తన దైన మార్క్ రాజకీయం నడుపుతున్నారన్నారు. దేవుడితో రాజకీయం ఇంకెన్నాళ్లు సాగదీస్తారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రపంచం నలుమూలల్లో ఉన్న హిందూవులు జీవితంలో ఒక్కసారైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని, ప్రసాదం స్వీకరించాలని భావిస్తారన్నారు. లడ్డూపై విష ప్రచారం ద్వారా అలాంటి వారి మనోభావాలను చంద్రబాబు సర్కారు దెబ్బతీస్తుందని మండిపడ్డారు. ఎలాంటి ఆధారం చూపకుండా జంతువుల కొవ్వు కలిపారంటూ చంద్రబాబు నాయుడు చెప్పడం దుర్మార్గమన్నారు. దేవుడిని అడ్డం పెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బతియాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
తనిఖీ లో‘పాలు’!
● రెండేళ్లుగా ప్రయివేటు డెయిరీల్లో తనిఖీలు శూన్యం ● శాంపిల్స్ తీయడానికే పరిమితమవుతున్న ఫుడ్ సేప్టీ అధికారులు ● కల్తీ నిర్ధారణ అయితే జరిమానాలతో సరిపుచ్చుతున్న వైనం ● రాజమహేంద్రవరం సంఘటనతో ప్రభుత్వం మేలుకొనేనా!కర్నూలు(అగ్రికల్చర్): పాలు ఆరోగ్యానికి మంచిదంటారు. ఉదయాన్నే గ్లాసు పాలు తాగాలంటారు. ఇప్పుడు మనం తాగే పాలు స్వచ్ఛమైనవేనా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగిన సంఘటనలో ఐదుగురు మరణించడమే ఇందుకు ప్రధాన కారణం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకవైపు ప్రయివేటు పాల డెయిరీలు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. మరోవైపు అనధికారికంగా పాలవ్యాపారం చేసే వ్యాపారులు పెరిగిపోతున్నారు. వీరు పాలు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు. ఎన్ని సేకరిస్తున్నారు.. పాటిస్తున్న నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయనే దానిని పరిశీలించే యంత్రాంగమే లేదు. ప్రయివేటు డెయిరీల్లో పాల నాణ్యతపై దృష్టి పెట్టిన దాఖలాలు రెండేళ్లలో ఎక్కడా కనిపించలేదు. మరోవైపు పాడి పశువులు సేపునకు రావడానికి అడ్డగోలుగా అక్సిటోసిన్ అనే సూదులు వేస్తున్నారు. ఈ ఇంజెక్షన్లు వేయడం కూడా ప్రాణాంతకమే. అయితే, దీనిని అరికట్టేవారే కరువు అయ్యారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి ఫుడ్ సేస్టీ అధికారులు 15 పాల శాంపిల్స్ తీసి ప్రయోగశాలకు పంపారు. ఇందులో అను మిల్క్ డెయిరీకి చెందిన పాల శాంపిల్స్లో నాణ్యత లేదని తేలింది. అయితే చర్యలు లేవు. నాణ్యత లేదని తేలినప్పుడు జేసీ కోర్టులో ఫుడ్ సేప్టీ అధికారులు కేసు ఫైల్ చేస్తారు. అక్కడ విచారణ జరిగినా జేసీ జడ్జిమెంటు ఇవ్వడానికి ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితి. ఇందులో కూడా జరిమానాతో సరిపుచ్చే అవకాశాలే ఎక్కువ. ప్రయివేటు డెయిరీల్లో తనిఖీలు చేయని అధికారులు రాజమహేంద్రంలో జరిగిన సంఘటనకు సంబంధించి శీతలీకరణ యంత్రంలో కూలెంట్గా వినియోగించిన ఇథలిన్ గ్లైకాల్ లీకై పాలల్లో కలువడం వల్లే తీవ్రమైన కిడ్నీ సమస్యలు ఏర్పడి మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో రోజుకు దాదాపు 20 లక్షల పాల వినియోగం ఉంది. ఉత్పత్తి అవుతున్న పాలు కేవలం 10 లక్షల లీటర్ల వరకే. ప్రయివేటు డెయిరీలు, పాల వ్యాపారులు పాటిస్తున్న నాణ్యత ప్రమాణాల గురించి రెండేళ్లలో తనిఖీలు నిర్వహించిన దాఖలాలే లేవు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి కర్నూలులో అసిస్టెంటు ఫుడ్ కంట్రోలర్ కార్యాలయం ఉంది. పాల నాణ్యత ప్రమాణాలు చూడాల్సిందే ఈకార్యాలయ అధికారులే. అయితే తనిఖీలకు మంగళం పలికి శాంపిల్స్ తీయడానికే వారు పరిమితమయ్యారనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు పశుసంవర్ధక శాఖ అధికారులకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం డెయిరీలను తనిఖీ చేసే అధికారం ఇచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పశు సంవర్ధక శాఖ అధికారులు డెయిరీలు, పాల వ్యాపారంపై ఏ నాడు దృష్టి సారించిన దాఖలాలు లేవు. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రాజమహేంద్రవరం సంఘటనలతోనైనా పాల వ్యాపారంపై దృష్టి పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. -
బాలికల్లో పోటీతత్వం పెరగాలి
వెల్దుర్తి: సమాజంలో ఉన్నతంగా రాణించేందుకు బాలికల్లో పోటీతత్వం పెరగాలని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ డాక్టర్ ఇషితా గంగూలీ త్రిపాఠి అన్నారు. మంగళవారం ఆమె జిల్లా విద్యాశాఖాధికారి ఎల్. సుధాకర్, సమగ్రశిక్ష జిల్లా అధికారి ఎన్. లోకరాజు, రాష్ట్ర ప్రభుత్వ అబ్జర్వర్ జయలక్ష్మి, జిల్లా జీసీడీఓ మేరి స్నేహలతతో కలిసి స్థానిక పీఎంశ్రీ బాలికల జెడ్పీ హైస్కూల్ను సందర్శించారు. పాఠశాలలో విద్యార్థినులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. సైన్స్ల్యాబ్లో విద్యార్థినులు చేసిన ప్రయోగాలను పరిశీలించి అభినందించారు. విద్యార్థినులతో మాట్లాడి కంప్యూటర్స్, గ్రంథాలయం, సాంకేతిక విద్య, క్రీడలపై ఆసక్తిని తెలుసుకున్నారు. కర్నూలు: ఓ కేసు విషయంలో స్టేషన్కు వెళ్లిన న్యాయవాది పవన్కుమార్పై దాడి చేసిన సీఐ విక్రమసింహాపై కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలనే డిమాండ్తో మంగళవారం న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. 24 గంటల్లో సీఐపై చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ హుసేన్ పీరా చెప్పారని, అయితే ఎలాంటి చర్యలు లేకుండా కాలయాపన చేస్తున్నారని న్యాయవాదులు ఆరోపించారు. మరోవైపు బాధిత న్యాయ వాది పవన్కుమార్ ఇంటికి ఇద్దరు సీఐలు వెళ్లి బెదిరించి రాజీ అయినట్లు వీడియో తీసి బార్ అసోసియేషన్ అధ్యక్షుల పేరుతో జిల్లా పోలీసు అధికారులకు పంపినట్లు న్యాయవాది పవన్ మీడియా ఎదుట ఆరోపించారు. ఈ విషయంలో మరో సీఐ జోక్యం చేసుకుని కేసును నీరుగార్చే ప్రయత్నం చేయడం నేరమని, ఇందులో రాజీ ధోరణి కాకుండా పోరాటం చేయాలని న్యాయవాద సంఘం సభ్యు లు తీర్మానం చేశారన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం వరకు తమ విధులు బహిష్కరించాలని నిర్ణయించినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరినాథ్ చౌదరి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు ప్రధాన ద్వారం వద్ద సీఐ విక్రమసింహాకు వ్యతిరేకంగా న్యాయవాదులు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. -
పొట్టు లారీలో మంటలు
● అనుమానాలకు తావిస్తున్న ఘటనకొలిమిగుండ్ల: పొట్టును తరలిస్తున్న లారీకి మంగళవారం త్రుటిలో ప్రమాదం తప్పగా చివర్లో నాటకీయం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఆళ్లగడ్డ నుంచి తుమ్మలపెంట సమీపంలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీకి తరలిస్తున్న పొట్టు లారీలో మంటలు చెలరేగాయి. సంజామల మండలం పేరు సోముల సమీపంలో స్థానికులు గమనించి చెప్పినా డ్రైవర్ రామేశ్వరయ్య అలాగే డ్రైవింగ్ చేస్తూ వచ్చా డు. నందిపాడు–కల్వటాల మధ్యలో లారీకి వెనుక వస్తున్న కానిస్టేబుల్ పెద్దయ్య ప్రమాదాన్ని గమనించి వాహనాన్ని ఆపించాడు. సీఐ రమేష్బాబు రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన ఫైర్ ఇంజిన్ను తెప్పించి మంటలను అదుపు చేయడంతో పాటు జేసీబీల సాయంతో పొట్టును కిందకు తొలగించేలా చర్యలు తీసుకున్నారు. ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్నాక పోలీసులు, రామ్కో సిబ్బంది సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు. చీకటి పడ్డాక మళ్లీ లారీ మంటల్లో కాలిపోవడం చూసి స్థానికులు అవాక్కయ్యారు. ఉద్దేశ పూర్వకంగానే నిప్పు పెట్టడంతో వాహనం కాలిపోయిందనే అను మానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై విచారణ చేస్తామని సీఐ తెలిపారు. -
లోక్ అదాలత్ను విజయవంతం చేద్దాం
ఆళ్లగడ్డ: మార్చి 14వ తేదీన నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్ను సమష్టిగా విజయవంతం చేద్దామని సీనియర్, జూనియర్ సివిల్ జడ్జీలు శైలజ, భాస్కర్ అన్నారు. స్థానిక బార్ అసోసియేషన్ సభ్యు లు, బ్యాంక్ల అధికారులతో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ లోక్ అదాలత్లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించడమే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న సివి ల్, రాజీపడదగిన క్రిమినల్ కేసులతోపాటు వాహన ప్రమాదం, చెక్బౌన్స్, కుటుంబ తగాదాల వంటి వివిధ రకాల కేసులను పరిష్కరించుకోవచ్చని ఇరువర్గాల కక్షిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. న్యాయవాదులు ఈ విషయంలో చొరవ చూపితే కేసులను పరిష్కరించడానికి అవకాశం ఉంటుందన్నారు. -
మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత
● జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్నంద్యాల: మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఎస్పీ సునీల్షెరాన్ పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా పోలీస్ కార్యా లయంలో మంగళవారం పోలీసు అధికారులతో నేర సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు వాటి స్థితిగతులు, నమోదైన కేసుల్లో నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు తీరుతెన్నులు, వాటి పురోగతిపై సంబంధిత పోలీస్ అధికారులతో ఎస్పీ ఆరా తీశారు. ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోపు పెండింగ్ కేసులను పరిష్కార దశకు తీసుకురావాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ లేకుండా విధులు నిర్వహిస్తూ చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ప్రాపర్టీ నేరాల్లో నిందితులను త్వరగా పట్టుకొని సొత్తును రికవరీ చేయాలన్నారు. రికవరీ అయిన సెల్ఫోన్లను ప్రతినెల మొదటిరోజు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి బాధితులకు నేరుగా అందించాలన్నారు. రాబోయే లోక్ అదాలత్ సందర్భంగా కేసుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కాలేజీలు, వసతి గృహాలు, ఆలయాలు, చర్చి, మసీదు పరిసర ప్రాంతాలలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. సమా వేశంలో నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ జావళి, డీఎస్పీలు రామంజి నాయక్, శ్రీనివాసులు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
పొగాకు రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దు
ఓర్వకల్లు: పొగాకు రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోళ్లు చేపట్టాలని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఐటీసీ కంపెనీ ప్రతినిధులను కోరారు. మండల కేంద్రమైన ఓర్వకల్లులో ఏర్పాటు చేసిన ఐటీసీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన మండల నాయకులతో కలిసి సందర్శించారు. ముందుగా రైతుల సమస్యలను తెలుసుకున్నారు. గిట్టుధర కల్పిస్తున్నారా? నాణ్యత బాగున్నప్పటికీ సీఆర్ పేరుతో తిరస్కరణకు గురి చేస్తున్నారా? అని తెలుసుకుంటూ.. రైతులతో కలిసి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఎక్కువ శాతం పొగాకు బేళ్లను సీఆర్ పేరుతో వెనక్కి పంపుతున్నారని, దీంతో రవాణా ఖర్చులు భరించలేక చాలా అవస్థలు పడుతున్నామని పలువురు రైతులు గగ్గోలు పెట్టారు. అనంతరం కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది పొగాకు నాట్లు ప్రారంభంలోనే కురిసిన అధిక వర్షాలకు పంటలు దెబ్బతినడం, రసాయన ఎరువులు, వ్యవసాయ కూలీలు ధరలు విపరీతంగా పెరిగి పోవడంతో పెట్టుబడి పెరిగి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ఎన్నో నష్టాలు, కష్టాలు అధిగమించి పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే, పంట నాణ్యత సరిగా లేదని, తేమశాతం ఎక్కువగా వుందని, రీబేల్ కట్టమని వెనక్కి పంపడం సబబు కాద న్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ శాతం బేళ్లను సీఆర్ చేయకుండా కొనుగోలు చేయాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.. ప్రైవేటు కంపెనీల ద్వారా పొగాకు రైతులు నష్టపోతున్న తరుణంలో ప్రభుత్వమే గిట్టుబాటు ధరతో కొనుగోళ్లు చేపట్టాలని కాటసాని డిమాండ్ చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో యూరియా కోసం ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడలేదని, పుష్కలంగా అందుబాటులో ఉంచిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా కోసం రైతులు రోడ్డెక్కారన్నారు. కాటసాని వెంట కర్నూలు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు జీకే వెంగన్న, ఎంపీపీ తిప్పన్న, జెడ్పీటీసీ సభ్యులు రంగనాథ్గౌడు, వైఎస్సార్సీపీ మండల నాయకులు కాశిరెడ్డి విష్ణువర్ధన్రెడ్డి, శంకర్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, గోపా రమణారెడ్డి, నాగతిరుపాలు, గోపా రామ్మోహన్రెడ్డి, రామేశ్వరరెడ్డి, హరినాథ్రెడ్డి, పుల్లారెడ్డి, ప్రవీణ్కుమార్రెడ్డి, మహేశ్వరరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. అధిక బేళ్లను ఐటీసీ అధికారులు కొనుగోలు చేయాలి తేమ శాతం పేరుతో వెనక్కు పంపొద్దు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి -
భక్త హనుమా.. వైభవం కనుమా!
ఆళ్లగడ్డ: అహోబిల దివ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవ వైభవం అంబరాన్ని తాకుతోంది. ఎగువ, దిగువ అహోబిలంలో ఓబులేశుడి ఉత్సవాలను తిలకించిన భక్తజనం పరవశించిపోయారు. మంగళవారం హంస, సూర్యప్రభ, యోగా నరసింహ గరుడ, హనుమంత వాహనాలపై విహరిస్తున్న శ్రీ లక్ష్మీనృసింహస్వామిని భక్తులు దర్శించుకుని పులకించిపోయారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు మంగళవారం జ్వాలా నరసింహుడు హనుమంత వాహనంపై ఊరేగారు. త్రేతాయు గం నాటి శ్రీరాముడిని తానేనంటూ భక్తులకు దర్శనమిచ్చారు. అనన్య భక్తుడైన హనుమంతు వాహన సేవ లో స్వామివారు కోదండరామ అలంకరణలో భక్తుల ను కటాక్షించారు. కృతయుగంలో వేంకటేశ్వరుడిగా, త్రేతాయుగంలో శ్రీరాముడిగా, ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడిగా, కలియుగంలో అహోబిలేశుడిగా అవతరించారన్న సందేశాన్ని చాటుతూ మాడవీధుల్లో హనుమంత వాహనసేవ.. రామరాజ్య వైభవాన్ని సాక్షాత్కరింపజేసింది. ఉదయం యోగా నరసింహ గరుడ విమాన వాహన సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. దిగువ అహోబిలంలో.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన మంగళవారం దిగువ అహోబిలంలో వెలసిన శ్రీ ప్రహ్లాదవరద స్వామి ఉదయం హంస వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. వేకువ జామునే నిత్యపూజల అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి అర్చన అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకరణలోని హంస వాహనంపై కొలువై మాడవీధుల్లో విహరించారు. దేవాలయ ప్రాంగణం నుంచి అహోబిల మఠం చేరుకున్న హంస వాహానధీశుడైన అహోబిలేశునికి మఠం పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరదస్వాములను యాగశాలలో కొలువుంచి పంచామృతాభిషేకం, జలాభిషేకం నిర్వహించి పట్టు పీతాంబరాలతో అలంకరించి కొలువుంచారు. రాత్రి సూర్యప్రభ వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించిన సూర్యప్రభ వాహనంపై కొలువైన ప్రహ్లాదవరదుడు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. కనుల పండువగా అహోబిలేశుడి బ్రహ్మోత్సవాలు హనుమంత వాహనంపై ఊరేగిన జ్వాలా నరసింహుడు హంస, సూర్యప్రభ వాహనాలపై దర్శనమిచ్చిన ప్రహ్లాదవరదుడు -
మూడు ఎకరాల్లో పైరు తొలగించాను
ఖరీఫ్ సీజన్లో ఎకరా రూ.15 వేలు కౌలు చెల్లించి మూడు ఎకరాల్లో కంది పంట సాగు చేశాను. రసాయన ఎరువులు, విత్తనాలు, సేద్యాలు, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 10 వేలు వెచ్చించాను. గత ఏడాది అక్టోబర్ నెలలో తుపాన్ ప్రభావంతో పైరు దెబ్బతినడంతో పైరును పూర్తిగా తొలగించాను. ఆ స్థానంలో పప్పుశనగ పంట సాగు చేయాల్సి వచ్చింది. కందిసాగుతో పెట్టుబడుల రూపంలో నష్టం వాటిల్లగా రెండోసారి వేసిన పంటకు మరలా పెట్టుబడులు పెట్టాల్సి వచ్చింది. – వెంకటేశ్వరరెడ్డి, రైతు, అమడాల, కోవెలకుంట్ల మండలం ఈ ఏడాది కంది పంట సాగులో పెట్టుబడులు అధికంగా పెట్టాల్సి వచ్చింది. ఎకరాకు రూ. 20 వేలు చెల్లించి పది ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని కంది పంట సాగు చేశాను. విత్తనాలు, రసాయన ఎరువులు, సేద్యాల రూపంలో ఎకరాకు రూ. 22 వేలు, క్రిమి సంహారక మందుల పిచికారీకి రూ. 15 వేల చొప్పున పెట్టుబడుల రూపంలో ఖర్చు చేశాను. అధిక వర్షాలు, పొగమంచు కారణంగా ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్లలోపే దిగుబడులు వచ్చాయి. కందికి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలి. – మనోజ్కుమార్, రైతు, కంమపల్ల, కోవెలకుంట్ల మండలం ● -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
బండిఆత్మకూరు: హోటళ్ల నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా గృహ అవసరాల గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తే చర్యలు తప్పవని జిల్లా పౌర సరఫరాల అధికారి జ్యోతి రవిబాబు హెచ్చరించారు. మంగళవారం బండి ఆత్మకూరు బస్టాండ్ ఆవరణలో హోటళ్లను జిల్లా పౌర సరఫరాల అధికారులు తనిఖీ చేశారు. పలు హోటళ్లలో గృహ అవసరాల కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. వాణిజ్య కార్యకలాపాల కోసం తప్పకుండా 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్లనే వినియోగించాలని జ్యోతి రవిబాబు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారి వెంట సివిల్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.చదువుతోనే పేదరికం నిర్మూలన సంజామల: చదువుతోనే పేదరికం నిర్మూలన సాధ్యమవుతుందనే విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తెలుసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి జగ్గయ్య అన్నారు. మండల కేంద్రం సంజామల ప్రభుత్వ హాస్టల్ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో ఆయన సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. పదో తరగతి అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు వారి అభిప్రాయాల మేరకు చదివించాలని సూచించారు. ప్రభుత్వ హాస్టల్లో చదువుకుంటూ ఎంతో మంది విద్యార్థులు ఐపీఎస్, ఐఎఎస్లు అయ్యారని గుర్తుచేశారు. కార్యక్రమంలో బీసీ హాస్టల్ డోన్ క్లస్టర్ ఇన్చార్జ్ మునిరాజు, ఉపాధ్యాయులు బాషా తదితరులు పాల్గొన్నారు. మట్టి మిద్దె కూలి వృద్ధురాలు మృతి నందికొట్కూరు రూరల్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దత్తత గ్రామమైన మండల పరిధిలోని కొణిదేలలో మట్టిమిద్దె కూలి వృద్ధురాలు గ్రంధే లక్ష్మిదేవి(80) మృతి చెందిగా మరో మహిళకు గాయాలయ్యాయి. గ్రామస్తులు, పోలీసులు తెలి పిన వివరాలివీ.. గ్రామానికి చెందిన లక్ష్మిదేవికి ఇద్దరు కుమారులు సంతానం. ఉమ్మడి కుటుంబంలో కుమారులతో కలిసి జీవనం సాగిస్తోంది. ఇంటి పక్కనే మట్టి మిద్దెలో జిలాన్ నిర్వహిస్తున్న పిండి మిషన్ వద్ద జొన్నలు పిండి పట్టించేందుకు వృద్ధురాలు, కుర్వ సాలమ్మ కలసి వెళ్లారు. ఆ సమయంలో మట్టిమిద్దె కూలడంతో వృద్ధురాలు మృతి చెందగా, మరో మహిళ కుర్వ సాలమ్మ కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నందికొట్కూరు ఎస్ఐ చంద్రశేఖర్, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.


