Nandyala
-
ప్రారంభ దశలో గుర్తించి చికిత్స అందిస్తే మేలు
మలేరియాను ప్రారంభదశలో గుర్తించి చికిత్స అందిస్తే మేలు. నిర్లక్ష్యం చేస్తే అది ప్లీహము, కిడ్నీ, కాలేయం, మెదడు, రక్తకణాలను దెబ్బతీసి ప్రాణాంతకం చేస్తుంది. తీవ్ర తలనొప్పి, తీవ్ర చలిజ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి. మలేరియా వ్యాధి నిర్ధారణ కాకపోయినా లక్షణాలు అవే ఉంటే అందుకు అనుగుణంగా చికిత్స అందించి ఇతర అవయవాలు దెబ్బతినకుండా కాపాడే అవకాశం ఉంది. –డాక్టర్ ఎం.మహేశ్వరరెడ్డి, ప్రొఫెసర్, జనరల్ మెడిసిన్, జీజీహెచ్, కర్నూలు -
బాబూ.. మహిళలంటే గౌరవం లేదా?
● ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలను ఎందుకు ఖండించ లేదు ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి బొమ్మలసత్రం: రాష్ట్రంలో మహిళల గురించి ఏబీఎన్ రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేసినా సీఎం చంద్రబాబు ఖండించలేదంటే ఆయనకు మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేదని విషయం స్పష్టమవుతుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ను కాటసానితో పాటు మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి, కాటసాని రామిరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు పీపీ మధుసూదన్రెడ్డి, సూర్యనారాయణరెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ డాక్టర్ శశికళారెడ్డి, జిల్లా కార్యదర్శి సోమశేఖర్రెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ దాల్మిల్ అమీర్, పార్టీ లీగల్ సెల్ ఎం. ప్రతాప్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, ఎస్ఈసీ మెంబర్ గోపవరం సాయినాథరెడ్డి కలిశారు. ఈనెల 9న ఏబీఎన్ రాధాకృష్ణ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వైఎస్సార్సీపీ నాయకులు పోలీస్టేషన్లలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు కనీస భద్రత, గౌరవం లభించటం లేదన్నారు. చంద్రబాబు ఇసుక ఫ్రీ అని చెప్పడంతో ప్రజలు వాహనంతో ఇసుక తెస్తుంటే పోలీసులు కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తున్నారన్నారు. ప్రజలకు ఇసుక ఫ్రీ అయినప్పుడూ ప్రతి ప్రాంతంలో టీడీపీ నేతలకు డంప్ యార్డులు ఎలా ఏర్పాటు చేయిస్తారో చంద్రబాబే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు అబద్దాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్న విషయం అందరూ గమనిస్తున్నారని త్వరలో గట్టిగా బుద్ధి చెబుతారన్నారు. రాధాకృష్ణా.. మీ వంశంలో ఆ సంప్రదాయం ఉందా? ‘ఏబీఎన్ రాధాకృష్ణ .. భార్యలను చెల్లెల్లుగా భావించి వివాహం చేసే సంప్రదాయం మీ వంశంలో ఉందా..’ అని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రశ్నించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంప్రదాయం లేదని, కొత్తగా ఆయన కనిపెట్టిన పద్ధతిలో 2029 తర్వాత ఘనంగా వివాహం జరిపిస్తామన్నారు. రాష్ట్రంలో యూరియా, డీజిల్ కొరత ఉందని, పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని, వాటిపై కథనాలు రాస్తే ప్రజలకు ఉపయోగపడతాయన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, మహిళలను కించపరుస్తూ ప్రసారాలు చేయటం బాధాకరమన్నారు. ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోరు.. రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి ఏబీఎన్ రాధాకృష్ణ అనుచితంగా మాట్లడినా ప్రభుత్వం దృష్టిలో నేరం కాదా.. అని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ నేతలను సోషల్ మీడియా వేదికగా ఏవరైన చిన్న మాట అంటే అదే రోజు అర్ధరాత్రిళ్లు ఇళ్ల మీదకు వెళ్లి అరెస్ట్లు చేసే పోలీసులు రాధాకృష్ణపై ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారో తెలపాలన్నారు. చంద్రబాబు దృష్టిలో టీడీపీకి సంబంధించిన వారు మహిళలను ధూషిస్తే తప్పు లేదన్నట్లుగా ఉన్నారన్నారు. జిల్లాలో తరచూ టీడీపీ నేతలు.. వైఎస్సార్సీపీ నాయకులు, సామాన్య ప్రజలపై దాడులకు పాల్పడుతున్నా పోలీసులు మౌనం వహిస్తున్నారని విమర్శించారు. మహిళలపై అనుచిత వాఖ్యలు చేసిన రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది కమీషన్ల సర్కారు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి నంద్యాల: కూటమి ప్రభుత్వం కమీషన్ల సర్కార్గా మారి ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి విమర్శించారు. సోమవారం పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి , శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, నంద్యాల నియోజకవర్గ పరిశీలకుడు సూర్యనారాయణ రెడ్డి , శ్రీశైలం నియోజకవర్గ పరిశీలకుడు పీపీ మధుసూదన్ రెడ్డిలు ప్రజా సమస్యలు పరిష్కరించాలని డీఆర్ఓ రాము నాయక్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత నెలకొందని, బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. పంట దిగుబడి సమయంలో డీజిల్ లభించక రైతులు అవస్థలు పడుతున్నారని, గిట్టుబాటు ధర కల్పించడంలోనూ, ఎరువుల పంపిణీలోనూ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఉచిత ఇసుక అనేది కేవలం మాటలకే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో డబ్బులు ఇస్తే తప్ప ఇసుక దొరకని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సంపద సృష్టించడం అంటే బెల్ట్ షాపులు పెంచడమేనా? అని ప్రశ్నించారు. అడుగడుగునా మద్యం అందుబాటులోకి తెచ్చి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికై నా చోద్యం చూడటం ఆపి తక్షణమే ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు. -
పీజీఆర్ఎస్లో 80 ఫిర్యాదులు
బొమ్మలసత్రం: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి అర్జీదారుల నుంచి 80 వినతులు అందినట్లు జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా ప్రజల నుంచి అందిన వినతుల్లో కొన్ని అక్కడికక్కడే పరిష్కరించామన్నారు. మరికొన్ని సమస్యలను ఆయా స్టేషన్ అధికారులకు పంపామన్నారు. ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు న్యాయం చేసి తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. ఒక వేళ వినతులు పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 29న నేషనల్ ఐటీఐలో ఉద్యోగ మేళా నంద్యాల(న్యూటౌన్): పట్టణంలోని నేషనల్ ఐటీఐ కళాశాలలో ఈనెల 29వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కల్యాణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాబ్ మేళాకు శ్రీరామ్చిట్స్ కంపెనీ, స్పందన, టాటా, తదితర కంపెనీలు పాల్గొంటున్నట్లు తెలిపారు. టెక్నికల్ కంప్యూటర్ ఆపరేటర్, రుణాలు, ప్రొడక్షన్, తదితర ఉద్యోగాలు కల్పిస్తారన్నారు. నిరుద్యోగులు డిగ్రీ, ఐటీఐ, డిప్లొమో చదివి ఉండాలన్నారు. జాబ్ మేళాకు హాజరయ్యే విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకొని హాజరు కావాలన్నారు. అన్నప్రసాద వితరణకు రూ.4 లక్షల విరాళాలు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి పలువురు భక్తులు రూ.4 లక్షల విరాళాలు అందించారు. సోమవారం హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్కు చెందిన ఈశ్వర్ ప్రకాష్ వశిష్ట రూ.1,25,000 విరాళాన్ని, అలాగే నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఎ.సతీష్కుమార్ రూ.1,10,116 విరాళాన్ని, హైదరాబాద్కు చెందిన ఆర్.చంద్రశేఖరరాజు రూ.1,00,116 విరాళాన్ని, కొండూరు ఆధ్య పేరు మీద రూ.1,00,116 విరాళాన్ని పర్యవేక్షకులు కె.అయ్యన్నకు అందజేశారు. విరాళాలను అందించిన దాతలను దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను అందించి సత్కరించారు. జడ్జిగా గిరిధర్ బాబు కర్నూలు (అర్బన్): నంద్యాల సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ (రైల్వేస్)గా ఎస్.గిరిధర్ బాబును నియమించారు. ఈ మేరకు న్యాయ శాఖ ప్రభుత్వ కార్యదర్శి గొట్టపు ప్రతిభాదేవి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 1 నుంచి వేసవి సెలవులు కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో 2025–26 విద్యా సంవత్సరానికి వర్సిటీ అనుబంధ యూజీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ, ఎమ్ఈడీ, ఎమ్పీఈడీ, లా కళాశాలలకు మే 1వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు వర్సిటీ అకడమిక్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ సీవీ కృష్ణారెడ్డి తెలిపారు. జూన్ 14వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని, జూన్ 15వ తేదీన పునఃప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఖైదీలకు ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తాం నందికొట్కూరు: ఆర్థిక స్థోమత లేని ఖైదీలకు ఉచితంగా న్యాయవాది ఏర్పాటు చేస్తామని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి, సీనియర్ సివిల్ జిల్లా జడ్జి లీలా వెంకటశేషాద్రి అన్నారు. సోమవారం పట్టణంలోని సబ్జైల్ను ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. ఖైదీలతో ముఖాముఖి న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సీనియర్ సివిల్ జడ్జి శోభారాణి, జూనియర్ సివిల్ జడ్జి వి. దివ్య, సబ్జైల్ ఇన్చార్జ్ సూపరింటెండెంట్ ఎ. శ్రీనివాసులు, ప్యానల్ న్యాయవాది మద్దయ్య, వైద్యాధికారి ప్రవీణ్కుమార్ ఉన్నారు. -
న్యాయ సేవల వాహనంతో హక్కులపై చైతన్యం
కర్నూలు: జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయ సేవల వాహనాన్ని ప్రారంభించారు. ప్రజలకు న్యాయ అవగాహన, న్యాయ సహాయం, హక్కులపై చైతన్యం కలిగించడం కోసం ఏపీ స్టేట్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్యాట్రన్ ఇన్ చీఫ్ ధీరజ్సింగ్ ఠాకూర్ ప్రతి జిల్లాకు న్యాయ సేవల వాహనాన్ని అందుబాటులోకి తెచ్చారన్నారు. హక్కులపై ప్రజల్లో చైతన్యం కలిగించే సాధనంగా ఈ వాహనం ఉపయోగపడుతుందన్నారు. లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ ప్రతి మారుమూల ప్రాంతాల్లో బలహీన వర్గాలకు న్యాయాన్ని ఈ వాహనం చేరువ చేస్తుందన్నారు. శాశ్విత లోక్ అదాలత్ చైర్మన్ వెంకటహరినాథ్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ శివరామచంద్రరావు, న్యాయవాదులు, ట్రైనీ న్యాయవాదులు పాల్గొన్నారు. -
మలేరియా అంతమయ్యిందా?
● ఈ ఏడాది ఇప్పటి వరకు నమోదుకాని ఒక్క కేసూ ● అయినా పెరుగుతున్న రక్తపరీక్షలుకర్నూలు(హాస్పిటల్): జ్వరమా అయితే మలేరియా కావచ్చు..వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రక్తపరీక్షలు చేయించుకోండి. ఇది ఒకప్పటి ప్రభుత్వ నినాదం. మలేరియా కేసులు విస్తృతంగా ఉన్న సమ యంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని మలేరియా విభాగం సిబ్బంది రక్తపరీక్షలు అధికంగా చేశారు. కానీ ఇప్పుడు మలేరియా కేసులు పూర్తిగా తగ్గుముఖం పడుతున్నాయని చెబుతున్నారు. అయితే జ్వరాల కేసులు పెరగడం, అదే స్థాయిలో అందరికీ రక్తపరీక్షలు నిర్వహించడంపై అనుమానాలు ఉన్నాయి. మలేరియా కేసులు మాత్రం బయటపడకపోవడం చర్చనీయాంశమైంది. పెరుగుతున్న రక్తపరీక్షలు జిల్లాలో 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 28 అర్బన్హెల్త్ సెంటర్లు, ఐదు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, రెండు ఏరియా ఆసుపత్రులు, ఒక బోధనాసుపత్రి ఉన్నాయి. వీటన్నింటిలో మలేరియా వ్యాధినిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల రక్తపరీక్షల సంఖ్య పెరుగుతున్నా కేసులు మాత్రం నమోదు కావడం లేదు. రోగుల్లో మలేరియా లక్షణాలు కనిపిస్తున్నా కాదని సిబ్బంది తేల్చేస్తున్నారు. రోగికి వచ్చింది వైరల్ జ్వరాలని చెప్పి చికిత్స అందిస్తున్నారు. గత సంవత్సరం పది కేసులు నమోదు కాగా ఈ యేడాది ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. 2030 నాటికి మలేరియా రహిత దేశంగా మార్చాలని ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కేసుల సంఖ్య తగ్గుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంవత్సరం రక్తపరీక్షలు మలేరియా కేసులు 2018 2,36,704 18 2019 2,49,187 7 2020 1,93,586 14 2021 2,56,395 16 2022 3,16,178 6 2023 4,18,850 4 2024 4,86,151 17 2025 7,06,836 10 2026 3,18,538 0 (ఇప్పటివరకు) -
వలంటీర్లకు వంచన
జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన వలంటీర్ల వివరాలు నియోజకవర్గం వలంటీర్లు బనగానపల్లె 1,564 ఆళ్లగడ్డ 1,495 నంద్యాల 1,542 నందికొట్కూరు 1,376 డోన్ 1,435 శ్రీశైలం 1,241 పాణ్యం, గడివేముల 1,855 కోవెలకుంట్ల: ఎన్నికల ముందు ‘నీకు రూ. 10 వేలు.. నీకు రూ. 15 వేలు.. నీకు రూ. 20 వేలు’.. అంటూ కూటమి నేతలు అన్ని వర్గాలను నమ్మించి మోసం చేశారు. వారిలో నిలువునా మోసపోయిన వారి జాబితాలో మొదటి స్థానం గ్రామ, వార్డు వలంటీర్లదే. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను తుంగలో తొక్కి ఆ ఊసే లేకుండా చేసింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను అమలు చేసి ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల్లో వారిని కీలకం చేసింది. ప్రతి నెలా ఐదు వేల రూపాయల గౌరవ వేతనం అందించగా ఐదేళ్లపాటు వలంటీర్లు ప్రజలకు ఇళ్ల వద్దనే వివిధ సేవలందించి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారిధిలా పని చేశారు. వలంటీర్లను నెలకు రూ. 10 వేల గౌరవ వేతనం ఇస్తామని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లు కావస్తున్నా వలంటీర్లను పట్టించుకోలేదు. గౌరవ వేతనం అటుంచితే వారికి ఎక్కడా ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయలేదు. జిల్లాలోని 29 మండలాల పరిధిలో గత ప్రభుత్వ హయాంలో 10,508 మంది గ్రామ, వార్డు వలంటీర్లు విధులు నిర్వర్తించారు. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకు వలంటీర్ వ్యవస్థ పేరెత్తక పోవడంతో చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని విధాలా మేలు జరుగుతుందని భావించిన వలంటీర్లకు నిరాశే మిగిలింది. -
నాపరాతి పరిశ్రమపై డీజిల్ ఎఫెక్ట్
● డీజిల్ లేక నిలిచిపోయిన ట్రాక్టర్లు ● కార్మికుల ఉపాధిపై ప్రభావంకొలిమిగుండ్ల: డీజిల్ సరఫరాలో జాప్యంతో నాపరాతి పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడుతుంది. నియోకవర్గంలో కొలిమిగుండ్ల, అవుకు, బనగానపల్లె మండలాల్లో వ్యవసాయం తర్వాత నాపరాతి గనులపై ఆధారపడిన కార్మికులు వేలాది మంది ఉన్నారు. నాపరాతి గనుల్లో వెలికితీసిన రాళ్లను ఎక్కువ భాగం ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తుంటారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా డీజిల్ సమస్య వేధిస్తుండటంతో యజమానులు ట్రాక్టర్లను ఇళ్ల వద్దనే ఖాళీగా పెట్టుకోవాల్సి వస్తుంది. కొలిమిగుండ్ల మండలంలోనే 600కు పైగానే ట్రాక్టర్లు ఉన్నాయి. డీజిల్ లభించక పోవడంతో పదుల సంఖ్యలో ట్రాక్టర్లు రోడ్డెక్కడం లేదు. బంక్లకు డీజిల్ ఎప్పుడు వస్తోందో తెలియని పరిస్థితి నెలకొంది. వచ్చినా క్షణాల్లో వాహనాలు బారులు దీరుతున్నాయి. నాపరాతి గనుల్లో పనులు చేసేందుకు డీజిల్తో నడిచే కోత మిషన్లను ఉపయోగిస్తున్నారు. డీజిల్ లేక గనులు బంద్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని యజమానులు వాపోతున్నారు. గనుల్లో పని చేసే కార్మికులతో పాటు ట్రాక్టర్ డ్రైవర్లు, లోడింగ్, అన్లోడింగ్ కార్మికుల ఉపాధి లేక ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ప్రధాన రహదారిపై పదుల సంఖ్యలో ట్రాక్టర్లు రవాణ సాగిస్తుండేవి. డీజిల్ కొరత వల్ల ఎక్కడక్కడ నిలిచిపోయాయి. మరి కొన్ని రోజులు ఇదే పరిస్థితి నెలకొంటే కార్మికుల పరిస్థితి దయనీయంగా మారుతుంది. సొంత కార్లు ఉన్న యజమానులకు డీజిల్ లేక ప్రత్యామ్నాయ మార్గాల్లో రాక పోకలు సాగిస్తున్నారు. డీజిల్ సమస్యను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. -
స్వీయ జనగణనకు సహకరించండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: స్వీయ జనగణనకు అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. సెన్సస్ ఔట్రీచ్ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు ఆదివారం పట్టణంలో 5కే రన్ చేపట్టారు. టెక్కె మార్కెట్ యార్డ్ నుంచి గాంధీ చౌక్ వరకు సాగిన ర్యాలీలో జిల్లా అధికారులు, యువత, విద్యార్థులు, మహిళలు, వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జనగణన ద్వారా దేశంలోని సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సమగ్ర అవగాహన ఏర్పడి, సరైన ప్రభుత్వ విధానాల రూపకల్పనకు ఇది బలమైన పునాదిగా నిలుస్తుందన్నారు. ప్రత్యేకంగా ‘జనగణన 2027’ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన స్వీయ గణన ప్రక్రియపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఈనెల 30వ తేదీ వరకు ప్రజలు స్వీయ జనగణన ద్వారా తమ కుటుంబ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ ప్రక్రియలో ఎటువంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదని, కేవలం సరైన సమాచారం అందించడం ద్వారా నమోదు పూర్తవుతుందన్నారు. ఆన్లైన్లో వివరాలు నమోదు చేసిన తర్వాత ఒక ప్రత్యేకమైన ఎస్సీ ఐడీ జెనరేట్ అవుతుందని, అనంతరం ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఐడిని చూపితే సరిపోతుందన్నారు. జిల్లాలో సుమారు 6 లక్షల కుటుంబాలు ఉన్నాయని, అందరూ గడువులోగా స్వీయ గణన పూర్తి చేసి ప్రభుత్వానికి సహకరించాలన్నారు. దేశాభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలంటే కచ్చితమైన సమాచారాన్ని అందించడం అత్యంత అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
పొలం పనులు చేసుకుంటున్నా
గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు వలంటీర్గా ప్రజలకు సేవలందించాను. ఆ ప్రభుత్వం ప్రతి నెలా రూ. 5వేల గౌరవ వేతనం అందించింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఒక్కో వలంటీర్కు నెలకు రూ. 10 వేలు వేతనం ఇస్తామని ప్రకటించారు. హామీ అమలు చేయకపోవడంతో ఎలాంటి ఉద్యోగం లేక పొలం పనులు చేసుకుంటూ భార్య, కుమార్తెను పోషించుకుంటూ కాలం నెట్టుకొస్తున్నాను. – నాగరాజు, మాజీ వలంటీర్, కోవెలకుంట్ల తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు వలంటీర్లను పట్టించుకోలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా గౌరవ వేతనంతోపాటు ప్రతిఏటా ఉగాది పండుగ సందర్భంగా వలంటీర్లను సేవా మిత్ర, సేవారత్న, సేవావజ్ర వంటి బిరుదులతో సత్కరించి ఆర్థికంగా ఆదుకుంది. ప్రస్తుత ప్రభుత్వం వలంటీర్ వ్యవస్థను అమలు చేసి ప్రతి నెలా రూ. 10 వేల గౌరవ వేతనం ఇచ్చి ఆదుకోవాలి. – సౌజన్య, మాజీ వలంటీర్, వల్లంపాడు, కోవెలకుంట్ల మండలం -
శస్త్రచికిత్సల్లో అనెస్తీషియా కీలకం
కర్నూలు(హాస్పిటల్): శస్త్రచికిత్సల సమయంలో అనెస్తీషియా వైద్యులు అందించే సేవలు కీలకమని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు చెప్పారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల అనెస్తీషియా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం ఆసుపత్రిలోని మోర్టాన్ సెమినార్ హాలులో ‘మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్’ అనే అంశంపై జోనల్ సీఎంఈ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ వెంకటేశ్వర్లు కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలన్నీ అనెస్తీషియా విభాగంపై ఆధారపడి ఉంటాయన్నారు. నొప్పుల నివారణకు అనెస్తీషియా వైద్యులు ప్రత్యేకంగా క్లినిక్లు ఏర్పాటు చేసిన ఆధునిక వైద్యసేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ అబ్జర్వర్, పీడియాట్రిక్ సర్జరీ హెచ్ఓడీ డాక్టర్ శివకుమార్ మాట్లాడారు. అనంతరం తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ గురించిన పలు అంశాలపై నిపుణులైన వైద్యులు సైన్స్ సెషన్స్ ద్వారా వివరించారు. జోనల్ సీఎంఈ కో–ఆర్డినేటర్, పాథాలజీ హెచ్ఓడీ డాక్టర్ బాలీశ్వరి, అనెస్తీషియా విభాగాధిపతి డాక్టర్ సుధీర్కుమార్, డాక్టర్ విశాల, డాక్టర్ రామశివనాయక్, నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాల అనెస్తీషియా హెచ్ఓడీ డాక్టర్ క్రిష్టఫర్ తదితరులు పాల్గొన్నారు. -
వివరాలు 8లోu
ఈ పథకాలకు సంబంధించి ఈ నెల 30వ తేదీ నాటికి అసలు చెల్లిస్తే గత ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు అయిన వడ్డీని పూర్తిగా మాఫీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేఫథ్యంలోనే ఇప్పటి వరకు ఆయా పథకాల ద్వారా లబ్ధిదారులు రూ.60 లక్షల వరకు చెల్లించారు. రుణాలు తిరిగి చెల్లించే విషయంలో లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు కరపత్రాలను పంపిణీ చేస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నెలవారీ లక్ష్యాలను పూర్తి చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నాం. – కే తులసీదేవి, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్ ఎన్ఎస్ఎఫ్డీసీ, ఎన్ఎస్కేఎఫ్డీసీ పథకాల కింద లబ్దిపొందిన వారికి రికవరీ పేరుతో చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆయా పథకాల కింద ఏర్పాటు చేసుకున్న చిరు వ్యాపారాలు జరగక, తీసుకున్న వాహనాలకు అద్దెలు లభించక అనేక మంది లబ్ధిదారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. వాయిదాలు సరైన సమయానికి చెల్లించలేక పోతున్నారు. ఈ రుణాలను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసి ఎస్సీ లబ్ధిదారులకు ఉపశమనం కల్పించాలి. – కాసారపు వెంకటేష్, మాల సంఘాల జేఏసీ కన్వీనర్ ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలని ఇంత తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేయడం తగదు. గతంలో ఎప్పుడు ఇలా వసూలు చేసింది లేదు. ఆయా పథకాల ద్వారా పెట్టుకున్న వ్యాపారాలు జరగక ఎస్సీ లబ్ధిదారులు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అప్పులు కట్టాలని ఒత్తిడి చేయడం వల్ల అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారు. మానవతా ధృక్పథంతో ప్రభుత్వం ఈ రుణాల రికవరీపై పునరాలోచించాల్సి ఉంది. – చిటికెల సామెల్, మాజీ డీవీఎంసీ సభ్యులు -
మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకున్నారు. వేకువ జామున పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి క్యూ లైన్లలో బారులు దీరారు. క్యూ లైన్లలో వేచివున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థాన అధికారులు తాగునీరు, అల్పాహారం, బిస్కెట్లు పంపిణీ చేశారు. భక్తుల శివ నామస్మరణతో శ్రీశైల ఆలయం మారుమోగింది. ఉదయం 9.30 గంటల నుంచి పీజీఆర్ఎస్ నంద్యాల: ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 20వ తేదీ సోమవారం నిర్వహించే కార్యక్రమంలో ప్రజలు వినతులు ఇచ్చి సమస్యలు పరిష్కరించుకోవచ్చునన్నారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap. gov.in వెబ్సైట్లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. 1వ తేదీ నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నంద్యాల(న్యూటౌన్): వేసవి సెలవుల్లో విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు శాప్ ఆధ్వర్యంలో మే 1 నుంచి 31వ తేదీ వరకు వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి రాజు తెలిపారు. జిల్లాలోని 54 నిర్ణీత ప్రాంతాల్లో నిర్వహించేందుకు శిక్షకులను నియమించనున్నారు. 16 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న బాల, బాలికలకు ఇష్టమైన క్రీడా రంగంలో శిక్షణ పొందేందుకు ఇదో సువర్ణావకాశం. అర్చరీ, అథ్లెటిక్స్, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, షటిల్ బ్యాడ్మింటన్, ఫుట్బాల్, ఫెన్సింగ్, హ్యాండ్బాల్, ఖోఖో, కబడ్డీ, కరాటే, సాఫ్ట్బాల్, తైక్వాండో, వాలీబాల్, రెజ్లింగ్ క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. -
ఇంధనం.. ఇంకెంత దూరం!
ఉమ్మడి జిల్లాలో పెట్రోలు, డీజిల్ కొరత రోజురోజుకు తీవ్రమవుతోంది. ప్రజలు తమ వాహనాలను బయటకు తీయాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బంకులు మూతపడుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. డీజిల్ సరఫరాలో జాప్యంతో రవాణా రంగం స్తంభించిపోతోంది. ఆదివారం కూడా వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం గంటల తరబడి పడిగాపులు కాశారు. ఆటో వాలాలతో పాటు ఇతర రంగాలకు చెందిన వారి ఉపాధిపై దెబ్బపడుతోంది. మరో వైపు వ్యవసాయ పనులు స్తంభించిపోతున్నాయి. పంట నూర్పిళ్ల యంత్రాలు, ట్రాక్టర్లకు డీజిల్ అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. – సాక్షి, నెట్వర్క్గత నాలుగైదు రోజుల ఉంచి కోడుమూరుతో పాటు చుట్టూ పక్కల ఎక్కడా కూడా పెట్రోల్ లభించడం లేదు. స్టాక్ వచ్చిన గంటల వ్యవధిలోనే ఖాళీ అవుతోంది. పెట్రోల్ కావాలంటే బంకుల వద్ద గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. చివరకు పెట్రోల్ దొరకక బండిని తీయడం లేదు. ప్రభుత్వం స్పందించి పెట్రోల్, డీజిల్ను అన్ని బంకుల్లో అందుబాటులో ఉంచాలి. – వీరేష్రెడ్డి, వ్యాపారి, కోడుమూరు -
ప్రహ్లాదరాయులకు బంగారు పల్లకీ సేవ
మంత్రాలయం: శ్రీ రాఘవేంద్రస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల మధ్య ప్రహ్లాదరాయులకు బంగారు పల్లకీ సేవ నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇవ్వడంతో మంత్రాలయానికి భక్తులు పోటెత్తారు. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తుంగభద్ర నదిలో పుణ్యసాన్నాలు ఆచరించి ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకున్నారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి ప్రత్యేక ఆలంకరణలో మూల బృందవనాని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు గ్రామదేవత మంచాలమ్మకు, మూల బృందవనానికి మహామంగళహారతులు గావించారు. పరిమళ ప్రసాదం కౌంటర్లలో, అన్నపూర్ణ భోజశాల దగ్గర భక్తులు రద్దీ కొనసాగింది. -
సేవా వారధులై..
● వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2019 ఆగస్టు నెలలో వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. గ్రామ సచివాలయ, వలంటీర్ వ్యవస్థ ద్వారా వలంటీర్లు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను కుల, మల, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రమాణికంగా గడప వద్దకు చేర్చారు. ● కరోనా కష్టకాలంలో వలంటీర్లు కరోనా వారియ ర్స్గా పనిచేశారు. కరోనా బారినపడిన వ్యక్తుల వద్దకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులు వెనుకాడారు. అలాంటి తరుణంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వలంటీర్లు కరోనా బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి వారికి మందులు, ఆహారం సరఫరా చేయడంలో కీలకపాత్ర పోషించారు. ● ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల వర్తింపులో వలంటీర్లదే ముఖ్యపాత్ర. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేతలు, త దితర లబ్ధిదారులకు ప్రతి నెలా 1వ తేదీన తెల్లవారుజామునే క్రమం తప్పకుండా ఇంటివద్దనే పింఛ న్లు అందజేశారు. ఇంటి తలుపుతట్టి లబ్ధిదారులను నిద్రలేపి మరీ ిపింఛన్లను ఠంచన్గా అందజేశారు. ● వైఎస్సార్ పింఛన్ కానుకతోపాటు వైఎస్సార్ చేయూత, ఆసరా, జగనన్న అమ్మఒడి, రైతు భరోసా, జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన, విద్యార్థులు, లబ్ధిదారులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, సున్నావడ్డీ రుణాలు, పంటల బీమా, డ్వాక్రా మహిళలకు సున్నావడ్డీ, కల్యాణమస్తు వంటి పథకాల వర్తింపులో వలంటీర్లు ముఖ్యపాత్ర పోషించారు. ● సంక్షేమ పథకాలతో పాటు జిల్లాలో అర్హత ఉన్న 48వేల కుటుంబాలకు ఇంటి స్థలంతో పాటు పక్కా గృహాల మంజూరుకు వలంటీర్లు ఎంతగానో కృషి చేసి పేదలకు సొంతింటి కల నెరవేరడంలో వారధిగా నిలిచారు. ● ప్రజలకు విశిష్ట సేవలందించిన వలంటీర్లకు ఏటా ఉగాది పండుగ రోజున సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర బిరుదులతో సత్కరించి రూ. 10 వేలు, రూ. 20 వేలు, రూ. 30 వేలు ప్రోత్సాహక నగదు అందించి అభినందించారు. -
ఎస్సీ, ఎస్టీ కేసుపై విచారణ
కొత్తపల్లి: ఎర్రమఠం గ్రామానికి చెందిన ఎలకంటి చిన్న ఓబులేసు ఫిర్యాదు మేరకు నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై డీఎస్పీ రామాంజీనాయక్ విచారణ చేపట్టారు. ఈనెల 23 వ తేదిన పొలం విషయంలో చిన్న ఓబులేసుపై పాతమాడుగుల గ్రామానికి చెందిన పెద్దవెంకట స్వామి, చిన్న వెంకట స్వామి, రాజులు కర్రలతో దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పై ముగురిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు కావడంతో ఆదివారం ఆత్మకూరు రూరల్ సీఐ సరేష్కుమార్ రెడ్డి, ఎస్ఐ జయశేఖర్తో కలిసి ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్ పాతమాడుగుల గ్రామంలో విచారణ చేపట్టారు. స్వయంగా ఆయన సమస్యాత్మక పొలాన్ని పరిశీలిచారు. చుట్టపక్కల రైతులను, గ్రామస్తులను విచారించారు. కోడి పందేల నిర్వాహకుల అరెస్టు ప్యాపిలి: పోతుదొడ్డి గ్రామంలో కోడి పందేల నిర్వాహకులను ప్యాపిలి ఎస్ఐ నాగార్జున ఆదివారం అరెస్టు చేశారు. గ్రామానికి చెందిన పెనుగొండ రవికుమార్, మునుగుల రామాంజనేయులు, నాగప్ప, రామకృష్ణ తదితరులు గ్రామ శివారు ప్రాంతంలో కోడి పందేలు నిర్వహిస్తుండటంతో అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుల నుంచి 8 బైక్లు, 4 కోడి కత్తులు, 3 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో ఐదుగురి కోసం గాలిస్తున్నామని తెలిపారు. గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి అవుకు(కొలిమిగుండ్ల): పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు ముఖేష్ (36) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. గతంలో అవుకు మోడల్ స్కూల్లో ఏడేళ్ల పాటు ఇంగ్లిష్ పీజీటీగా పనిచేసిన ఆయన, రెండేళ్ల క్రితం బదిలీపై వెలుగోడు మోడల్ స్కూల్కు వెళ్లారు. ప్రస్తుతం ఆయన కుటుంబంతో కలిసి నంద్యాలలో నివసిస్తున్నారు. ముఖేష్ భార్య స్వర్ణరేఖ ఉప్పులపాడు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ముఖేష్ తండ్రి వెంకట కృష్ణయ్య కూడా ఏడాదిన్నర క్రితం ఆకుమల్లలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ గుండెపోటుతోనే మరణించారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి పెద్దకడబూరు: నౌలేకల్లు గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్ఐ ఈ మారుతి తెలిపిన వివరాల మేరకు.. పెద్దకడబూరు మండల కేంద్రానికి చెందిన బోయ ఆంజనేయ కుమారుడు నందవరం తిక్కన్న (42) ఆదివారం తమ బంధువుల పెళ్లి సంబంధం చూసేందుకు కోసిగి వెళ్లారు. కార్యక్రమం అనంతరం బైక్పై తిరిగి వస్తుండగా నౌలేకల్లు గ్రామ సమీపంలో బొలెరో వాహనం ఢీకొంది. ఎమ్మిగనూరు సంతలో ఎద్దులను కొనుగోలు చేసిన కౌతాళం మండలం కుప్పగళ్లు గ్రామానికి చెందిన రైతులు బొలెరో తీసుకొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తిక్కన్న తీవ్రంగా గాయ పడంతో పెద్దతుంబళం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మృతునికి ముగ్గురు ఆడ పిల్లలు, భార్య ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
రాష్ట్రస్థాయి బీచ్ కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
కోసిగి: రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు ఎంపికై నట్లు బీచ్ కబడ్డీ జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మురళి, కార్యదర్శి వలకలదిన్నె వెంకటేష్ తెలిపారు. ఆదోని నేషనల్ స్కూల్లో ఆదివారం జరిగిన ఎంపిక పోటీలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 60 మంది క్రీడకారులు హాజరైయారన్నారు. ఇందుల్లో ప్రతిభ కనబరిచిన రాష్ట్రస్థాయికి 6 మంది పురుషులను, ఆరుగురు మహిళా క్రీడాకారులను ఎంపిక చేశామన్నారు. ఎంపికై న వారు మే 7 నుంచి 10 తేదీ వరకు నెల్లూరు జిల్లాలో జరిగే 13వ రాష్ట్రస్థాయిలో బీచ్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారన్నారు. దేశ అభివృద్ధిలో జనగణన కీలక పాత్ర కర్నూలు (టౌన్): దేశ అభివృద్దిలో జనగణన కీలక పాత్ర పొషిస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అన్నారు. ఆదివారం స్థానిక పాతబస్టాండ్ కొండారెడ్డి బురుజు నుంచి కలెక్టరేట్ వరకు 5 కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేష్ కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. స్వీయ జనగణనలో ప్రజలు తమ వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసుకోవాలన్నారు. జనగణన సిబ్బంది ఫోన్ నంబర్ తప్ప ఇతర వివరాలు, ఓటీపీలు అడగబోరని, వేలిముద్రలు, ఐరిస్ సేకరించరని తెలిపారు. ప్రజలు సందేహాల నివృత్తి కోసం 1855 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని తెలిపారు. ఈనెల 30వ తేదీ వరకు స్వీయ జనగణనకు అవకాశం ఉందన్నారు. నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేష్ మాట్లాడుతూ.. మే 1 నుంచి ఇంటింటా జనగణన సర్వే ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేస్తే సమయం ఆదా అవుతుందన్నారు. ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు ఎస్ఈఐడీ నంబర్ చూపించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్ఓ చిరంజీవి, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, సెన్సస్ ఇంచార్జీ ఎస్. ఇజ్రాయేలు, ఎస్ఈ రమణ మూర్తి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ రఘ. డిఎస్ డీవో భూపతిరావు పాల్గొన్నారు. అనంతరం 5 కే రన్లో విజేతలకు రూ. 5 వేలు,. రూ. 3 వేలు, రూ. 2 వేలు నగదు బహుమతులు అందజేశారు. ఆకుమల్లలో అ‘పూర్వ’ సమ్మేళనం సంజామల: వారంతా చిన్నపిల్లలైపోయారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చిన్ననాటి అనుభవాలను నెమరువేసుకున్నారు. ఫొటోలు, సెల్ఫీలతో సందడిగా గడిపారు. ఆకుమల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002–2003 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వివిధ హోదాల్లో పలు ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా పాఠశాల వేదికగా కలుసుకున్నారు. ప్రధాన ఉపాధ్యాయులు పుల్లారెడ్డి, ఉపాధ్యాయులు ప్రసాద్బాబురావ్, రామసుబ్బారెడ్డి, శ్రీనివాసయాదవ్, ప్రశాంత్ రెడ్డి, వెంకటస్వామి, దామోదర్, లక్ష్మిదేవి, శ్రీనివాసరెడ్డిని సన్మానించి, వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థులు జి. నాగరాజు, వై. నాగరాజు, రాజ్యలక్ష్మి, విజయలక్ష్మి, మధుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. చార్టెడ్ అకౌంటెంట్ మల్లికార్జున రెడ్డి, ఆకుమల్ల ఉపసర్పంచ్ హజీపీరన్, వీఆర్ఓ రాజ్యలక్ష్మి, కానిస్టేబుల్ గఫార్ బాషా, నాగరాజు, సుబ్బు, రాజేష్, పద్మావతి పాల్గొన్నారు. -
ఆశలు గల్లంతు..
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో దర్జాగా బతికిన వలంటీర్లు ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ఉద్యోగాలు లేక కుటుంబ పోషణకు అష్టకష్టాలు పడుతున్నారు. రూ. 10 వేలు గౌరవ వేతనం అటుంచితే గతంలో ఇచ్చే రూ. 5 వేలు గౌ రవ వేతనం కూడా లేకపోవడంతో బతుకు భారంగా నెట్టుకొస్తున్నారు. ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాకపోవడంతో కొందరు వ్యవసాయ, ఉపాధి కూలీలుగా, కిరాణ దుకాణాలు, మార్ట్ల్లో గుమస్తాలుగా, మరి కొందరు హైదరాబాదు, బెంగళూరు, నంద్యాల, కర్నూలు వంటి పట్టణాల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ అరకొరగా వచ్చిన వేతనాలతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసినా వేతనాలు అంతంత మాత్రంగానే ఉండటంతో పిల్లల చదువు, కుటుంబ ఖర్చులకు ఇబ్బందిగా మారటంతో అప్పుల ఊబిలో కూరుకపోయారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చి వలంటీర్ వ్యవస్థను అమలు చేసి గౌరవవేతనాలు అందించి ఆదుకోవాలని వలంటీర్లు ముక్త కంఠంతో కోరుతున్నారు. -
గడ్డకట్టని రక్తం!
కర్నూలు(హాస్పిటల్): సాధారణంగా ఎవ్వరికై నా దెబ్బతగిలి రక్తగాయమైతే వెంటనే రక్తస్రావం జరుగుతుంది. కాసేపు అదిమి పట్టుకుంటే రక్తస్రావం ఆగిపోతుంది. కానీ హిమోఫీలియా జబ్బుతో బాధపడే వారికి గాయమైందంటే రక్తస్రావం ఆగదు. నిరంతరంగా రక్తస్రావం సాగుతూనే ఉంటుంది. ఇలాంటి బాధితుల సంఖ్య జిల్లాలో పెరుగుతోంది. రక్తస్రావం అధికం కావడంతో బాధితుల వ్యథ అంతా ఇంతా కాదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో హిమోఫీలియాతో బాధపడే వారి సంఖ్య 135 వరకు ఉంటుంది. ఒక్క కర్నూలు జిల్లాలోనే 90 మందికి పైగా బాధితులు ఉన్నారు. ఈ వ్యాధి బాధితుల బాధలు విన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చాక నెలకు రూ.10వేల ప్రత్యేక పింఛన్ ఇచ్చి ఆసరా కల్పించారు. అప్పటి నుంచి ఈ బాధితులు ప్రతి నెలా ఠంఛనుగా పింఛన్ తీసుకోవడం వల్ల వారి ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు తీరుతున్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన ఈ ప్రత్యేక పింఛన్ను ప్రస్తుత ప్రభుత్వం సైతం తీసివేయలేని పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వంలో కూడా ప్రతి నెలా పింఛన్ను బాధితులు అందుకుంటున్నారు. హిమోఫీలియా అంటే... హిమోఫిలియా అనేది అరుదైన జబ్బు. ఇది జన్యుపరంగా కుటుంబ సభ్యులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధిలో రక్తం గడ్డకట్టే ప్రొటీన్లు (గడ్డకట్టే కారకాలు) తగినంత ఉండవు. ఈ కారణంతో వారికి ఏదైనా గాయమైతే రక్తస్రావం ఆగకుండా జరుగుతుంది. చిన్నగాయమైనా సరే రక్తస్రావం ఆగదు. అయితే కొందరిలో ఎలాంటి గాయాలు లేకున్నా అంతర్గతంగా కూడా రక్తస్రావం అవుతుంది. దీనిని బ్లీడర్స్ డిసీస్ అని కూడా పేర్కొంటారు. అధికంగా మగపిల్లలే బాధితులు జన్యుపర వ్యాధి అయిన హిమెఫిలియా సాధారణంగా వారసత్వంగా వస్తుంది. ముఖ్యంగా ఇది ఎక్కువగా ప్రధానంగా మగపిల్లల్లో కనిపిస్తుంది. ఈ వ్యాధిలో జన్యువు ఎక్స్ క్రోమోజోముపై ఉంటుంది. ఇది తల్లివాహకంగా పనిచేస్తుంది. వ్యాధికి కారణాలు సాధారణంగా ప్రతి మనిషి శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థలో రక్తం గడ్డకట్టేందుకు కోయాగ్యులేషన్ ఫ్యాక్టర్స్ అనే రసాయనాలు ఉంటాయి. హిమోఫిలియా బాధితుల్లో మాత్రం ఇలాంటివి ఉండవు. ఇవే ఫ్యాక్టర్ 8, ఫ్యాక్టర్ 9. రక్తస్రావ సమయంలో ఈ ఫ్యాక్టర్స్లో ఏది కోల్పోతే దానిని తిరిగి రోగికి ఎక్కించాల్సి ఉంటుంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల విభాగంలో హిమోఫీలియా బాఽధితులకు అవసరమైన చికిత్సను ఉచితంగా అందిస్తున్నాము. వారికి అవసరమైన పరీక్షలతో పాటు చికిత్స, మందులను ఉచితంగా ఇస్తున్నాము. జిల్లా సత్వర చికిత్స కేంద్రం(డైస్)లో ప్రత్యేకంగా ఐసీహెచ్హెచ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ జనరల్ ఫిజీషియన్తో పాటు చిన్నపిల్లల వైద్యులూ ఉన్నారు. బాధిత చిన్నారులకు అవసరమైన పరీక్షలు, కౌన్సిలింగ్ వారు అందిస్తారు. –డాక్టర్ విజయానందబాబు, హెచ్ఓడీ, చిన్నపిల్లల విభాగం, జీజీహెచ్, కర్నూలు వేధిస్తోన్న అరుదైన హిమోఫీలియా జబ్బు ఉమ్మడి జిల్లాలో 135 మంది బాధితులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స కేంద్రంపెద్దాసుపత్రిలో ప్రత్యేక కేంద్రం ఇంటిగ్రేటెడ్ సెంటర్ ఫర్ హిమోగ్లోబినోపతీస్, హిమోఫిలియా(ఐసీహెచ్హెచ్) టెస్టింగ్ అండ్ ట్రీట్మెంట్ సెంటర్లను 2020లో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విశాఖపట్టణం, ఈస్ట్గోదావరి, గుంటూరుతో పాటు కర్నూలులోనూ ఏర్పాటు చేసింది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని మాతాశిశు కేంద్రం పక్కనున్న జిల్లా సత్వర చికిత్స కేంద్రం (డైస్)లో ఇది కొనసాగుతోంది. ఇక్కడ తలసీమియాతో పాటు సికిల్సెల్, హిమోఫిలియా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. -
అరటికి సన్స్ట్రోక్
● అధిక ఉష్ణోగ్రతలకు ఎండిపోతున్న అరటిచెట్లు కొలిమిగుండ్ల: లక్షలాది రూపాయలు ఖర్చు చేసి సాగు చేసిన అరటి రైతులకు చివరకు నష్టాలే మిగులుతున్నాయి. ఓవైపు పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఎగుమతులు పూర్తిగా తగ్గి కొనేవారే కరువయ్యారు. మరో వైపు అధిక ఉష్ణోగ్రతల కారణంగా గెలలు చెట్ల పైనే ఎండిపోతున్నాయి. దీంతో రైతులు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. మండలంలో మదనంతపురం, అబ్దులాపురం, కోర్నపల్లె, చింతలాయిపల్లె, ఇటిక్యాల, తదితర గ్రామాల్లో 500 ఎకరాల మేర అరటి సాగు చేశారు. ఎకరాకు రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టారు. యుద్ధ పరిస్థితులు, రవాణా సమస్యల వల్ల అరటి ఎగుమతులు ఆగిపోయాయి. మార్కెట్లో ధరలు పూర్తిగా తగ్గు ముఖం పట్టాయి. స్థానికంగా కోల్డ్ స్టోరేజ్ లేక నిల్వ చేసుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే తీవ్రమైన ఉష్ణోగ్రతల దాటికి అరటి చెట్లు గెలలతో సహా నిలువునా కూలిపోతున్నాయి. కొందరు రైతులు చేసేది లేక అరటి గెలలను పశువులకు మేతగా వేస్తుండగా మరి కొందరు తోటల్లోనే పక్కకు పడేస్తున్నారు. కొత్తగా అరటి మొక్కలు నాటుకున్న పలువురు రైతులు ఎండల ప్రభావంతో ఎండిపోకుండా పేపర్లు, ఈత ఆకులను రక్షణగా పెట్టి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎండలు పెరుగుతుండటంతో అరటి చెట్లు పూర్తిగా నేలకొరిగే ప్రమాదం పొంచి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అప్పులు చేసి రూ. లక్షల్లో పెట్టుబడి పెట్టి నష్టాలు చవిచూడాల్సి వచ్చిందని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. -
ప్రశాంతంగా పాలిసెట్
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో శనివారం నిర్వహించిన పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (పాలిసెట్) ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా పాలిసెట్ కో ఆర్డినేటర్ జి.శైలేంద్రకుమార్ తెలిపారు. 2026–27 విద్యాసంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవే టు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించిన పరీక్ష ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సజావుగా సాగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 6,856 మంది హాజరైనట్లు తెలిపారు. డోన్లో 755, నందికొట్కూరులో 513, నంద్యాలలో 2,704, ఆత్మకూరులో 607, శ్రీశైలంలో 120, బేతంచెర్లలో 537, బనగానపల్లెలో 945, ఆళ్లగడ్డ లో 655 మంది విద్యార్థులు పరీక్ష రాశారన్నారు. డిగ్రీ పరీక్షలకు 87 మంది విద్యార్థులు గైర్హాజరు కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో శనివారం జరిగిన సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలకు 87 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు తెలిపారు. రెండో సెమిస్టర్ పరీక్షలకు 578 మందికి 490 మంది విద్యార్థులు హాజరు కాగా 87 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ఆరో సెమిస్టర్ పరీక్షలకు 14 మంది హాజరైనట్లు తెలిపారు. ఎమ్మిగనూరు సిద్దార్థ డిగ్రీ కళాశాల కేంద్రాల్లో ఒక విద్యార్థి చూచిరాత పాల్పడగా డిబార్ చేశామన్నారు. కర్నూలు: మాజీ సైనికులందరూ ఉచిత న్యాయ సహాయానికి అర్హులని, చట్టబద్ధమైన సమస్యలు ఉంటే వాటికి ఉచితంగా న్యాయాన్ని అందించి వారి సమస్యలను పరిష్కరిస్తామని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి సూచనల మేరకు శనివారం కర్నూలు బి.క్యాంప్లో ఉన్న జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ను లీలా వెంకటశేషాద్రి సందర్శించారు. మాజీ సైనికుల సమస్యలను చర్చించారు. సైనిక సంక్షేమ కార్యాలయంలో లీగల్ సర్వీసెస్ క్లినిక్ ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ న్యాయవాదితో పాటు పారా లీగల్ వాలంటీర్లు ఉంటారని తెలిపారు. లీగల్ సర్వీసెస్ టోల్ఫ్రీ హెల్ప్లైన్ నెంబర్ 15100కు ఫోన్ చేస్తే వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. జిల్లా ఇన్చార్జి సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ మహేంద్రమ్మ, పారా లీగల్ వలంటీర్ మధుసూదన్, మాజీ సైనికుల ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 28 నుంచి ఖాదర్లింగస్వామి ఉరుసు కౌతాళం: మతసామరస్యానికి ప్రతీకగా వెలసిన జగద్గురు ఖాదర్లింగ స్వామి ఉరుసు కౌతాళంలో ఈనెల 28నుంచి ప్రారంభమై మే 2వ తేదీ వరకు జరగనుంది. శనివారం వివిధ దర్గాల పీఠాధిపతులతో కలిసి ఉరుసు పోస్టర్లను దర్గా ధర్మకర్త సయ్యద్ మున్నపాషా చీష్తీ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. 28న మంగళవారం స్వామి సమాధిని సుగంధ, అత్తర్ పానియాలతో (గుసుల్) శుభ్రచేస్తారని,, 29న బుధవారం గంధం, 30న గురువారం ఉరుసు ఉంటుందని తెలిపారు. ఉత్సవాలకు ఇప్పటికే దర్గా పరిసరాల్లో షామియాలను ఏర్పాటు చేశారు. దర్గాను పూర్తిగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. కర్నూలు సిటీ: జల వనరుల శాఖలోని వివిధ సర్కిల్స్లో పనిచేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు ఎగ్జికూటివ్ ఇంజనీర్లుగా అడ్హాక్ పదోన్నతి కల్పిస్తూ ఆ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయి ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వై.రఘురామిరెడ్డి (ప్రస్తుతం నాణ్యత విభాగం కర్నూలు)ఈఈగా తెలుగుగంగా డిస్ట్రిబ్యూటరీ డివిజన్–1కు, జి.శైలేశ్వర్ (అనంతపురం జిల్లాలో పని చేస్తున్నారు) తుంగభద్ర దిగువ కాలువ ఈఈగా, నారాయణ రెడ్డిని తెలుగుగంగా నంద్యాల డివిజన్ ఈఈగా, ఎన్.భవాని ప్రసాద్ రెడ్డిని ఎస్ఆర్బీసీ డివిజన్–4 ఈఈగా పదోన్నతి కల్పించారు. బి.రఘురామిరెడ్డి (ప్రస్తుతం తెలుగుగంగా డిస్ట్రిబ్యూటరీ)ఎస్ఆర్బీసీ(కడా)ఈఈగా, ఎస్.కుమారస్వామి (ఎస్ఆర్బీసీ క్యూసీ ల్యాబ్) తెలుగుగంగా ఆళ్లగడ్డ డివిజన్ ఈఈగా, వై.చిదంబర రెడ్డిని హంద్రీనీవా డివిజన్–1 నందికొట్కూరు ఈఈగా, కె.వెంకటేశ్వర్లును చిన్న నీటిపారుదల శాఖ కర్నూలు ఈఈగా నియమించారు. -
వెంటాడుతున్న ఇంధన కష్టాలు
● భయపెడుతున్న నో స్టాక్ బోర్డులు ● ఇంధన కొరతతో వాహనదారుల ఆందోళననంద్యాల(అర్బన్)/కోవెలకుంట్ల: వారం రోజులుగా జిల్లాలో ఇంధన కొరతతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రతరం అవుతుందని తెలుసుకున్న కొంత మంది ముందస్తుగా క్యాన్లు, బాటిళ్లలో నిల్వ చేసుకోవడంతో పరిస్థితి మరింత తీవ్రమవుతోంది. ఇంధనం పూర్తి స్థాయిలో కొరత ఏర్పడటంతో వాహన దారులు, రైతులు అసవ్థలు పడుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలో పెట్రోల్ కొరత లేదంటూ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇందు కోసం పంపుల యజమానులతో సమీక్షలు సైతం నిర్వహిస్తున్నారు. అయితే కొరత తీవ్రతరం అవుతుండటంతో కొందరు వాహన దారులు బ్లాక్లో ఎక్కువ మొత్తం చెల్లించి ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రం నంద్యాలలో ఏ బంకు ఎప్పుడు మూత బడుతోందో, మళ్లీ ఎప్పుడు తెరుస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలోని ఆయా మండలాల పరిధిలో నాలుగు రోజుల నుంచి వాహన చోదకులు పెట్రోల్, డీజిల్ దొరక్క ఇక్కట్లు పడుతున్నారు. కోవెలకుంట్ల పట్టణంలో ఎనిమిది పెట్రోల్ బంకులు ఉండగా ఏడు బంకులు మూత పడగా శనివారం ఒక బంకు వద్ద ఇంధనం కోసం వాహనాలు బారులు తీరాయి. గతంలో పెట్రోల్ బంకు యాజమాన్యం ఇంధనం సప్లై వచ్చాక డబ్బులు చెల్లించేవారు. ఇరాన్ యుద్ధ ప్రభావంతో ఇంధన సరఫరాకు ముందుగానే జీఎస్టీతో కలుపుకుని డీడీ తీయాల్సి ఉండటంతో ఇంధన కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. అరకొరగా సరఫరా అవుతున్న బంకు వద్ద వాహనదారులు బైక్లు, కార్ల ట్యాంకులను ఫుల్ చేయించుకుంటున్నారు. కోవెలకుంట్ల పరిసర ప్రాంత ప్రజలే కాకుండా చుట్టు పక్కల మండలాలకు చెందిన వాహనదారులు తరలి రావడంతో బంకుల వద్ద వాహనాలు బారులుదీరాయి. వరి కోతలపై ప్రభావం.. పాణ్యం: డీజిల్ అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీలో సాగు చేసిన వరి పైర్లు కోతకు వచ్చాయి. దీంతో రైతులు వరి కోతకు యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. అయితే డీజిల్ కొరత కారణంగా యంత్రాలు పొలాల్లోకి వెళ్లడం లేదు. కోతలు ఆలస్యం అవుతుండటంతో రైతులను భయం వెంటాడుతోంది. అకాల వర్షాలు కురిస్తే చేతికొచ్చిన పంట దెబ్బతినే ప్రమాదం ఉండటంతో వెంటనే పంటను ఇంటికి చేర్చాలని భావిస్తున్నారు. రైతులు, వరికోత మిషన్ ఆపరేటర్లు క్యాన్లు, డ్రమ్ములతో పెట్రోల్ బంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మరో వైపు రవాణా రంగంపై కూడా ప్రభావం చూపుతోంది. -
నగరడోణ @ 44.8
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి ఉగ్రరూపానికి బయట తిరిగేందుకు జనం బెంబేలెత్తిపోతున్నారు. తీవ్రమైన ఉష్ణోగ్రతలతో పాటు వేడి గాలులు వీస్తున్నాయి. శనివారం జిల్లాలోని చిప్పగిరి మండలం నగరడోన గ్రామంలో 44.8 డిగ్రీలు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్జైన్ తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఎండలో బయటకు వెళితే తప్పక టోపీలు ధరించాలన్నారు. చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, మంచి నీరు అధికంగా తీసుకోవాలని సూచించారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగే కాంట్రాక్టర్..
చాగలమర్రి మండల పరిషత్ కార్యాలయంలో కాంట్రాక్ట్ కంప్యూటర్ ఆపరేటర్ పేరును అధికారులు కాంట్రాక్టర్గా నమోదు చేశారు. మండల వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ఈ రెండు నెలల్లోనే సుమారు రూ. 2.84 కోట్లకు పైగా డ్రా చేసుకుని మండల, జిల్లా స్థాయి అధికారులు పంచుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాగే జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని పంచాయతీల్లో బినామీల పేర్లు పెట్టుకుని అధికారులు రూ. కోట్ల నిధులు దారిమళ్లించి పంచుకున్నట్లు తెలుస్తోంది. మా గ్రామానికి సంబంధించి మేము ఖర్చు చేసిన నిధులు రెండేళ్లలో ఒక్క రూపాయి కూడా రాలేదు. వచ్చిన నిధులు మాత్రం అధికారులే డ్రా చేసుకున్నారు. మండల ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం ఓటీపీ చెప్పమన్నారు. అంతే అవి బినామీల పేరుతో డ్రా చేసుకున్నారు. ఈ సంవత్సరమే సుమారు రూ 1.5 లక్షలు డ్రా చేసుకున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. – యామ నరసమ్మ, తాజా మాజీ సర్పంచ్, చిన్న బోధనం రెండేళ్లుగా గ్రామ అభివృద్ధి కోసం చేసిన పనులకు సంబంధించి బిల్లులు చేయించుకునేందుకు అధికారుల చుట్టూ తిరిగితే 50 శాతం పర్సెంటేజీ ఇస్తే బిల్లులు పెడుతామని చెప్పారు. ఎందుకు ఇవ్వాలని నిలదీస్తే టీడీపీ నేతలు అస్సలు బిల్లు పెట్టొద్దు అన్నారని చెప్పారు. వారు చెప్పినట్లుగానే 50 శాతం ఇస్తానని ఒప్పందం చేసుకుని ముందుగా 30 శాతం డబ్బులు కూడా తీసుకున్నారు. 8 నెలలుగా తిప్పుకుని చివరకు బిల్లులు పెట్టలేదు. అధికారులు విచారించి మాకు న్యాయం చేయాలి. – నరసింహారెడ్డి, తాజా మాజీ సర్పంచ్, డి.కొట్టాల చాగలమర్రి మండలంలో ఓ గ్రామ సర్పంచ్కు గత ఏడాది ప్రభుత్వ ఉద్యోగం రావడంతో సర్పంచ్ పదవీకి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆ గ్రామంలో సర్పంచు లేరు. ఇదే అదునుగా భావించిన అధికారి, కాంట్రాక్ట్ ఉద్యోగి, సెక్రటరీలు కలిసి ఓ డమ్మీ పేరు పెట్టుకుని రూ. 8 లక్షలు డ్రా చేసుకుని పంచుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే మండలంలోని ఓ మేజర్ పంచాయతీలో కూడా సుమారు రూ. 60 లక్షల దాక నిధులు దారి మళ్లించి పంచుకున్నారన్న చర్చ జరుగుతోంది. రుద్రవరం మండలం ముత్తలూరులో గ్రామ మాజీ సర్పంచ్కు పంచాయతీ సెక్రటరీ ఫోన్ చేసి రూ. లక్ష బిల్లు పెడుతున్నాం.. ఓటీపీ చెప్పమనడంతో ఆమె చెప్పింది. తరువాత పరిశీలిస్తే రూ. 30 లక్షల వరకు బిల్లు పెట్టుకున్నారు. ఆరా తీస్తే గ్రామ టీడీపీ నాయకుడి పేరు మీద మెటల్ రోడ్లు వేసినట్లు నిధులు డ్రా చేసుకుని సెక్రటరీ, అతను పంచుకున్నారు. మాజీ సర్పంచ్ అఽధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఇదే మండలంలో మేజర్ పంచాయతీలో రూ. 30 లక్షలు నిధులు దారిమళ్లినట్లు తెలుస్తోంది.ఆళ్లగడ్డ: పంచాయతీ సర్పంచ్లు మాజీలయ్యారు. గతంలో చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు రాలేదు. పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించినా ఇంకా పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకోలేదు. ఈ సమయంలో కొందరు అధికారులు, టీడీపీ నేతలు పంచాయతీ నిధులను కొల్లగొడుతున్నారు. ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతల ఇన్చార్జ్ల పేరుతో పర్సెంటేజీలు వసూలు చేసి బిల్లులు డ్రా చేసుకుంటున్నారు. పనులు చేసిన వారికి సైతం తెలియకుండానే నిధులు పంచుకుంటుకున్నారు. ఉన్నతాధికారులు సైతం ప్రోత్సహిస్తుండటంతో వారి ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు సుమారు రూ. 300 కోట్లు ఆర్థిక సంఘం నిధులు విడుదల కాగా ఇందులో సుమారు రూ. 187 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో 90 శాతం మేరకు అధికారులే కాంట్రాక్టర్లుగా తమ బినామీ పేర్లు పెట్టుకుని డ్రా చేసుకోగా మరికొందరు కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, గ్రీన్ అంబాసిడర్ల పేరుమీద కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఏర్పాటు చేసుకుని రూ. కోట్లు ప్రజల సొమ్ములు స్వాహా చేశారు. కొందరు మండల స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ సెక్రటరీతో కుమ్ముక్కు అయ్యి నిధులు కొల్లగొడుతున్నారు. ఉన్న నిధుల్లో ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ నాయకులకు 50 శాతం పర్సేంటేటీ ఇస్తే డ్రా చేసుకోవచ్చని ఒప్పందం చేసుకుని బినామీ పేర్లు పెట్టుకుని కోట్లాది రూపాయల నిధులు నొక్కేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ మద్దతుదారు సర్పంచ్లు పర్సేంటేజీలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించినందుకు వారికి ఒక్క రూపాయి కూడా బిల్లులు చేయకుండా వేధిస్తున్నారు. పీఎస్లే ఇంజినీర్లు.. ! పంచాయతీ పరిధిలో ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఎస్టిమేషన్ వేసి పని పూర్తయిన తరువాత సంబంధిత ఇంజినీరింగ్ శాఖ అధికారులు పరిశీలించి ఎంబుక్ పూర్తి చేసిన తరువాత కాంట్రాక్టర్కు నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంజినీర్లు లేకుండా కొందరు పీఎస్లు వారే ఎస్టిమేషన్ వేసి ఎంబుక్లు రాసుకోవడం ఒక ఎత్తైతే, మరి కొందరు ఇంజినీర్ల సంతకాలు వారే పెట్టుకుని సీల్ వేసుకుని నిధులు డ్రా చేసుకున్నట్లు తెలుస్తోంది. పీఎంఎస్లో కనిపించని వివరాలు అభివృద్ధి పనులు మొదలు పెట్టే సమయంలో పని పేరు, సామర్థ్యం, నిధుల వివరాలు, పీఎఫ్ఎంఎస్ (పబ్లిక్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ సిస్టమ్) పూర్తి వివరాలు, కాంట్రాక్టర్ పేరు పోర్టర్లో నమోదు చేసి నిధులు విడుదల చేయాలి. అయితే అనేక చోట్ల ఇదేమీ జరగలేదు. పీఎఫ్ఎంఎస్ నమోదు చేయకుండా మెటల్ రోడ్డు, సీసీ రోడ్డు, శానిటేషన్ అని నమోదు చేసి రూ. కోట్లు డ్రా చేసుకున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో 90 శాతం గ్రామాల్లో అభివృద్ధి పనుల పేరుతో డ్రా చేసిన కాంట్రాక్టర్లు జీఎస్టీ బిల్లులు లేకుండా చిత్తుకాగితాలపై ఎస్టిమేషన్ వేయించి బిల్లులు డ్రా చేసినట్లు రికార్డుల్లో నమోదై ఉంది. మచ్చుకు కొన్ని.. చాగలమర్రిలోని పంచాయతీ గ్రామ సర్పంచ్ మృతి చెందగా అక్కడ బినామీ పేరు పెట్టుకుని రూ. 12 లక్షలు స్వాహా చేశారు. శిరివెళ్లకు చెందిన ఓ అధికారి శిరివెళ్ల, ఆళ్లగడ్డ, రుద్రవరం మండలాల్లోని పంచాయతీ సెక్రటరీలతో మాట్లాడి 30 నుంచి 50 శాతం మేరకు పర్సేంటేజీ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన మూడు మండలాల పరిధిలో సుమారు రూ. 2 కోట్లు నొక్కేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రుద్రవరం మండలంలో ఏఈగా పనిచేస్తున్న అధికారి బహిరంగంగానే ఎంబుక్ చేయాలంటే 20 శాతం, బిల్లులు చేయాలంటే 30 శాతం ఇవ్వాల్సిందే వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పనిచేస్తున్న ఓ ఏఈ ఇలాంటి నిధులను డ్రా చేసుకుని పంచుకున్న అక్రమ సంపాదనతో చాగలమర్రి మండలం శెట్టూరు – తండా మధ్యలో ఇటీవల రూ. 90 లక్షల పెట్టి వ్యవసాయ పొలం కొనుగోలు చేసినట్లు సమాచారం. అధికారులు, టీడీపీ నేతల కుమ్మక్కు చేసిన పనులకు 50 శాతం వరకు పర్సెంటేజీలు వసూలు చేయని పనులకు సైతం బిల్లులు మొత్తం డ్రా చేసిన వైనం కాంట్రాక్ట్ ఉద్యోగుల పేరుతో ఏజెన్సీలు ఏర్పాటు చేసి నిధుల దోపిడీ -
పోలీసు బందోబస్తు మధ్య..
చాగలమర్రి: మండల కేంద్రంలో మూడు రోజులుగా నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరత శనివారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పట్టణంలోని మూడు బంకుల్లో నిల్వలు నిండుకోగా.. సాయంత్రం నవనరసింహ ఫిల్లింగ్ స్టేషన్కు ట్యాంకర్ చేరుకుంది. ఈ సమాచారంతో వినియోగదారులు ఉదయం నుంచే క్యాన్లతో బారులు తీరారు.ట్యాంకర్ రాగానే స్థానిక వ్యక్తి ఒకరు ట్రాక్టర్లో పెద్ద డ్రమ్ములు తెచ్చి, రూ.లక్ష విలువైన డీజిల్ కావాలని పంపు వద్ద అడ్డుపడ్డారు. దీంతో యజమాని విక్రయాలు నిలిపివేయగా, క్యూలో ఉన్న వారు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ససమాచారం అందుకున్న ఎస్ఐ రాజారెడ్డి పోలీసులతో కలిసి అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. డ్రమ్ముల ట్రాక్టర్ను పక్కకు తొలగించి, క్యూలో ఉన్న వారికి ఒక్కొక్కరికి రూ.2 వేల వంతున ఇంధనం పంపిణీ చేయించారు. పంట కోతల సమయంలో డీజిల్ దొరక్క హార్వెస్టర్లు, ట్రాక్టర్లు నిలిచిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే తీవ్రంగా నష్టపోతామని, అధికారులు స్పందించి ఇంధన కష్టాలు తీర్చాలని కోరుతున్నారు. స్తంభించిన ట్రాఫిక్.. వధూవరుల పాట్లు బంకు వద్ద వాహనాల రద్దీతో రహదారిపై సుమారు 2 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. అహోబిలం వైపు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రామతీర్థం వద్ద వివాహానికి వెళ్తున్న వధూవరులు ట్రాఫిక్లో చిక్కుకుపోవడంతో, వాహనం దిగి నడుచుకుంటూ అవతలి వైపునకు వెళ్లి వేరే వాహనాల్లో కల్యాణ మండపానికి చేరుకున్నారు. -
మోహినీ అలంకరణలో సింహరూపుడు
● వైభవంగా కొనసాగుతున్న నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలుఆళ్లగడ్డ: అమృతం అసురులపాలు కాకుండా లోక సంరక్షణ కోసం మహావిష్ణువు దాల్చిన జగన్మోహిని అవతారంలో శ్రీ లక్ష్మీనరసింహుడు భక్తులను కనువిందు చేశారు. లోక కల్యాణార్థం ఏటా నిర్వహించే వార్షిక నృసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఎగువ అహోబిలంలో సింహరూపుడైన లక్ష్మీ నరసింహస్వామి జగన్మోహినీ అలంకరణలో దర్శనమిచ్చారు. వేకవజామున నిత్య పూజల్లో భాగంగా సుప్రభాతసేవతో స్వామి అమ్మవార్లను మేలుకొలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ జ్వాలా నరసింహ స్వామిని యాగశాలలో కొలువుంచి నవకళశస్థాపన గావించారు. ఆ తర్వాత ఉత్సవమూర్తి శ్రీ ప్రహ్లాదవరదుడిని నూతన పట్టుపీతాంబరాలతో మోహినీ అలంకరణ గావించారు. అనంతరం పూల పల్లకీని అధిరోహించి భక్తుల గోవింద నామస్మరణలు, మంగళవాయిద్యాల మధ్య తిరుమాడవీధుల్లో విహరిస్తూ శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూసితుడై భక్తులకు దర్శనమిచ్చారు. -
జనగణనపై అవగాహనకు నేడు 5కే రన్
నంద్యాల: జనాభా గణనపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో ఆదివారం పట్టణంలో 5కే రన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. శనివారం కలెక్టర్ చాంబర్లో సెన్సస్ ఔట్రీచ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే 5కే రన్ కార్యక్రమానికి సంబంధించిన టీ–షర్ట్లు ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సెన్సెస్ ప్రక్రియ ప్రాముఖ్యతను ప్రజలకు చేరవేసేందుకు ఈ కార్యక్రమం ముఖ్య వేదికగా నిలుస్తుందన్నారు. ఆదివారం ఉదయం 7.30 గంటలకు టెక్కె మార్కెట్ యార్డ్ నుంచి గాంధీ చౌక్ వరకు నిర్వహించే 5కే రన్లో యువత, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు తమ బృందాలతో తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్ఓ రామునాయక్, మునిసిపల్ కమిషనర్ శేషన్న, ఆర్డీఓ విశ్వనాథ్, కలెక్టరేట్ ఏఓ శుభాకర్ పాల్గొన్నారు. సత్రాల నిర్వాహకులు ఇతోధిక సేవలందించాలి శ్రీశైలంటెంపుల్: శ్రీశైల క్షేత్ర సందర్శనకు వచ్చే భక్తులకు స్థానిక సత్రాల నిర్వాహకులు ఇతోధిక సేవలందించాలని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు సూచించారు. శనివారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో స్థానిక సత్రాల నిర్వాహకులతో ఈఓ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి తీవ్రత కారణంగా అన్నీ సత్రాల నిర్వాహకులు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. చలివేంద్రంలో మంచినీటితో పాటు మజ్జిగను ఉచితంగా భక్తులకు అందించాలన్నారు. పరిసరాలను శ్రుభంగా ఉంచడంతో పాటు, తాజా కూరగాయలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా క్షేత్రంలో ప్లాస్టిక్ నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. సత్రం ప్రాంగణంలో చెత్త కుండీలను ఏర్పాటు సుకోవాలన్నారు. అవకాశం మేరకు సత్రాలలో ఆధ్యాత్మిక ప్రవచనాలు, పారాయణలు, భజనలు, సత్సంగాలు మొదలైన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో రెవెన్యూ విభాగం ఏఈవో శ్రీనివాసరెడ్డి, పర్యవేక్షకులు ఎం.శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎండలకు ఉక్కిరిబిక్కిరి
అంగన్వాడీ కేంద్రాలను ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాల్సి ఉంది. అయితే వేసవి కాలాన్ని దృిష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పనివేళలను కుదించింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఎండతీవ్రత అధికంగా ఉండటంతోపాటు ఉక్కపోతతో కేంద్రాల్లో చిన్నారులు అల్లాడిపోతున్నా రు. మధ్యాహ్న భోజనం అనంతరం చిన్నారులను ఇళ్లకు పంపివేసి కార్యకర్తలు, ఆయాలు ఇళ్లకు వెళుతున్నారు. వేసవికాలం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు 50 రోజులు వేసవి సెలవులు వచ్చాయి. అయితే వేసవికాలంలో సైతం అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు ఉండాల్సి రావడంతో వారి తల్లిదండ్రులు, అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోవెలకుంట్ల: ఏటా వేసవికాలం ప్రారంభం కాగానే మార్చి 15 నుంచి పాఠశాలలకు ఒంటి పూటబడులు, ఏప్రిల్ 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇస్తున్నారు. పూర్వప్రాథమిక విద్యనభ్యసించే అభం, శుభం తెలియని చిన్నారులకు వేసవికాలం శిక్ష తప్పడం లేదు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించగా అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు వర్తింపచేయకుండా కూటమి సర్కార్ చిన్నారుల జీవితాలతో చెలగాటమాడుతోంది. జిల్లాలోని 29 మండలాల పరిధిలో1,622 అంగన్వాడీ, 40 మినీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో 1.23 లక్షల మంది సున్న నుంచి 6 సంవత్సరాల్లోపు చిన్నారులకు 1,662 మంది అంగన్వాడీ కార్యకర్తలు పూర్వప్రాథమిక విద్యను బోధిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు గత నెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తుండగా అంగన్వాడీ కేంద్రాలను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ పాఠశాలలకు ఈ నెల 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటించగా అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు లేకపోవడంతో వేసవిలో కేంద్రాలను నిర్వహించాల్సి వస్తుండటంతో చిన్నారులకు వేసవి సెగ తప్పేటట్లు లేకపోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అంగన్వాడీ కేంద్రంలో పూర్వ ప్రాథమిక విద్యనభ్యసిస్తున్న చిన్నారులంతా ఏడాది నుంచి ఆరు సంవత్సరాల్లోపు వయస్సు ఉన్న వారే. అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించకుండా వేళల కుదింపుతో సరిపెట్టడంతో చిన్నారులకు వేసవికాలం అగ్ని పరీక్షగా మారింది. వసతులు లేమి, అద్దె భవనాలు, మండుటెండలు చిన్నారులకు శాపంగా మారాయి. ఎండలు అధికం కావడంతో ప్రభుత్వ భవనాలతోపాటు అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాల్లో చిన్నారులు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. వేసవికాలం కావడంతో ఉదయం 9 గంటల నుంచే భానుడి విశ్వరూపానికి జనాలు విలవిలాడిపోతున్నారు. ఎండ తీవ్రతకు ఆరేళ్లలోపు చిన్నారుల అవస్థలు వర్ణనాతీతం. కార్యకర్తలు, ఆయాలకు 15 రోజుల పాటు వేసవి సెలవులు.. అంగన్వాడీ కేంద్రాల చిన్నారులకు వేసవి సెలవులు లేకపోగా ప్రభుత్వం కార్యకర్తలు, ఆయాలకు నామమాత్రపు వేసవి సెలవులతో సరిపెట్టింది. మే 1 నుంచి ఆయాలకు 15 రోజులపాటు మే 16 నుంచి 31వ తేదీ వరకు కార్యకర్తలకు వేసవి సెలవులున్నాయి. ఆయాలకు 15 రోజులు, కార్యకర్తలకు 15 రోజుల చొప్పున సెలవులు కేటాయించింది. జూన్ 1వ తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు యఽథావిధిగా కొనసాగుతాయి. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం ఈ నెల 24 తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటించింది. అంగన్వాడీ కేంద్రాలను విస్మరించడంతో ఎండతీవ్రతకు చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేకపోవడంతో వసతులు లేని భవనాల్లో చిన్నారులు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. వారి వయస్సును పరిగణలోకి తీసుకుని అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఇవ్వాలి. – ఓబులేసు, ఆర్పీఎస్ విద్యార్థి సంఘం నాయకుడు, కోవెలకుంట్ల పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం వేసవిలోనూ అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు చిన్నారులకు తప్పని వేసవి సెగ -
బంకులు.. బారులు
ఆళ్లగడ్డ: ఇంధన సెగ జిల్లాలోని వాహనదారుల ను ఇబ్బందులకు గురిచేస్తోంది. జిల్లాలో అవసరమైన మేర ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా అధికారులు ప్రకటిస్తున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. జిల్లాలోని దాదాపు అన్ని బంకుల దగ్గర గత రెండు మూడు రోజులుగా వాహనదారులు బారులుదీరి కనిపిస్తున్నారు. శుక్రవారం ఆళ్లగడ్డ – నంద్యాల రహదారి వెంబడి ఉన్న బంకుల్లో ఎక్కడా డీజిల్ దొరకలేదు. కొన్ని బంకుల్లో పెట్రోల్ మాత్రం విక్రయిస్తుండగా గంటల కొద్ది ద్విచక్ర వాహనదారులు నిల్చొని పెట్రోల్ పట్టించుకున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం వచ్చిన భక్తులు తన వాహనాలకు డీజిల్ లేక అనేక అగచాట్లు పడ్డారు. కొందరు అక్కడే వాహనాలు వదిలి బస్సులకు వెళ్లి పోగా మరి కొందరు బ్లాక్లో కొనుగోలు చేయాల్సి వచ్చింది. అహోబిలంలో పావన క్షేత్రానికి వాహనాలు నడిపే వాహనదారులు కొందరు బద్వేల్ వెళ్లి డీజిల్ తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. -
ప్రశాంతంగా ఏపీఆర్జేసీ పరీక్షలు
నంద్యాల(న్యూటౌన్): 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి గురుకులాల్లో 6, 7, 8 తరగతులతో పాటు ఇంటర్మీడియెట్, డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థుల ప్రవేశం కోసం జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం జరిగిన ఏపీఆర్ఎస్ సీఏటీ ప్రవేశ పరీక్షలకు మొత్తం 1,044 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 877 మంది హాజరు కాగా 166 మంది గైర్హాజరయ్యారు. అదే విధంగా మధ్యాహ్నం జరిగిన ఏపీఆర్జేసీ, డీసీసెట్ ప్రవేశ పరీక్షలకు మొత్తం 1,924 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,741 మంది హాజరు కాగా, 183 మంది గైర్హాజరైనట్లు డీఈఓ జనార్దన్రెడ్డి తెలిపారు. సఖీ నివాస్కు దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(అర్బన్): నంద్యాల పట్టణంలో ఏర్పాటు కానున్న సఖీ నివాస్ (వర్కింగ్ ఉమెన్ హాస్టల్) కోసం మానవ వనరుల సరఫరా నిమిత్తం నమోదిత ఔట్సోర్సింగ్ ఏజెన్సీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా శిశు అభివృద్ధి సాధికారత అధికారిణి లీలావతి దేవి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. డిస్ట్రిక్ట్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్ మెంట్ ఆఫీసర్ నంద్యాల వారి పేరు మీద దరఖాస్తు రుసుం రూ.500తో డిమాండ్ డ్రాప్ట్ తీసి కార్యాలయంలో అందజేసి టెండరు ఫారం పొందాలన్నారు. ఈనెల 29వ మధ్యాహ్నం 3 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాలన్నారు. పోస్టులు, ఇతర వివరాల కోసం డీడబ్ల్యూ సీడబ్ల్యూఈఓ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. బెలుం గుహలపై వేసవి ఎఫెక్ట్ కొలిమిగుండ్ల: రోజు రోజుకు ఎండలు భగ్గుమంటున్నాయి. ఇళ్లలో నుంచి జనం బయటకు వచ్చేందుకు సాహసం చేయడం లేదు. పర్యాటక కేంద్రమైన బెలుం గుహలపై వేసవి తీవ్ర ప్రభా వం చూపుతోంది. సహజ సిద్ధంగా అవతరించిన బెలుం గుహల అందాలను ఆస్వాదించేందుకు ఉమ్మడి తెలుగు రాష్రాలు, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలతో పాటు విదేశీయులు సైతం అధికంగా వస్తుంటారు. అయితే ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు పైగానే నమోదు అవుతున్న కారణంగా పర్యాటక ప్రాంతాల సందర్శనను యాత్రికులు వాయిదా వేసుకుంటున్నారు. బెలుం గుహల సందర్శనకు యాత్రికులు లేక వెలవెలబోతున్నాయి. ప్రస్తుతం గుహలకు రోజు రూ.10 వేల లోపు మాత్రమే ఆదాయం వస్తుంది. శని, ఆదివారాల్లో సైతం అంతంత మాత్రంగానే వస్తున్నారు. పాఠశాలలకు వేసవి సెలవులు అయినా ఎండల తీవ్రత కారణంగా బయట ప్రాంతాలకు వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. మెరుగైన వసతుల కల్పనకుప్రణాళిక రూపొందించండి శ్రీశైలంటెంపుల్: శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాల పట్ల కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వసతి, ఆలయం, దర్శనాలు, అన్నప్రసాద వితరణ, ఇంజినీరింగ్, పారిశుద్ధ్యం మొదలైన విభాగాలన్నీ తగు కాలపరిమితిని నిర్ధారించుకుని తదనుగుణంగా సౌకర్యాలను మెరుగుపర్చాలని ఆదేశించారు. దేవస్థానంలో ప్రతి ఉద్యోగి కూడా సౌకర్యాల కల్పనే ప్రధాన లక్ష్యంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. దేవస్థానం భక్తులకు అందిస్తున్న సౌకర్యాల పట్ల భక్తులు 90 శాతం సానుకూలత స్పందన ఉండాలన్నారు. వేసవీ తీవ్రత దృష్ట్యా ఆలయంలో, క్షేత్ర పరిధిలో పలుచోట్ల చలువపందిళ్లు, గ్రీన్మ్యాట్ ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో అన్ని శాఖల అధికారులు, వివిధ విభాగాల పర్యవేక్షకులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. ఉదయమే పంటలు తీసుకురావాలి కర్నూలు(అర్బన్): ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున మార్కెట్యార్డుకు రైతులు తమ పంట ఉత్పత్తులను ఈ నెల 27వ తేదీ నుంచి ఉదయం 9 గంటల్లోపు తీసుకు రవావాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎంపిక శ్రేణి కార్యదర్శి ఆర్ జయలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలియజేసిన సమయానికే వ్యాపారులు కూడా టెండర్ వేయాలన్నారు. -
ఇంధన కొరతను పరిష్కరిస్తాం
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: జిల్లాలో ఎక్కడా ఇంధన కొరత లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. కలెక్టర్ చాంబర్లో శుక్రవారం జిల్లాలో ఏర్పడిన పెట్రోల్, డీజిల్ సరఫరా అంతరాయంపై జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్తో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా మొత్తం 199 పెట్రోల్ బంకులు ఉన్నాయని, అవసరమైన ఇంధన నిల్వలను సమకూర్చేందుకు ఉన్నతాధికారులతో సమన్వయం కొనసాగిస్తున్నామన్నారు. ప్రస్తుతం వరి కోతలు కొనసాగుతున్న నేపథ్యంలో వ్యవసాయ యంత్రాలకు అవసరమైన డీజిల్ సరఫరా నిరంతరంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ సునీల్ షెరాణ్ మాట్లాడుతూ పెట్రోల్ బంకుల వద్ద ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా శాంతి భద్రతలను కట్టుదిట్టంగా నిర్వహిస్తామన్నారు. సమావేశంలో సివిల్ సప్లయ్ అధికారులు రవిబాబు, హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్, నయారా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ హయాంలోనే ఎంపీడీఓలకు పదోన్నతులు
● జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డికర్నూలు(అర్బన్): వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే పంచాయతీరాజ్ వ్యవస్థలో పదోన్నతులకు శ్రీకారం చుట్టడం జరిగిందని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. గతంలో ఎంపీడీఓగా విధుల్లో చేరిన వారు ఎంపీడీఓగానే పదవీ విరమణ చేసేవారని, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం వల్ల డివిజినల్ స్థాయిలో డీఎల్డీఓ పోస్టులను క్రియేట్ చేయడంతో పీఆర్లో పదోన్నతుల పర్వం ప్రారంభం అయ్యిందన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్థాపనే ధ్యేయంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల్లోనే ప్రజలు 542 రకాల సేవలను పొందగలుగుతున్నారన్నారు. 33వ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం స్థానిక జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో ఘనంగా నిర్వహించారు. జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి జీ భాస్కర్, డీఆర్డీఏ, డ్వామా పీడీలు రమణారెడ్డి, ప్రభాకర్రెడ్డి హాజరయ్యారు. ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడం లేదు జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ హయాంలో 2007, 2008 సంవత్సరాల్లో దాదాపు 9 శాఖలకు చెందిన నిధులు, విధులు, అధికారాలను పంచాయతీరాజ్ వ్యవస్థకు బదలాయించారన్నారు. కాలక్రమేణ కొన్ని మాత్రమే కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు కూడా 2016 తరువాతి నుంచి విడుదల కావడం లేదన్నారు. కేంద్ర ఆర్థిక సంఘం గ్రాంట్లు, ముఖ్యంగా జిల్లా పరిషత్ అవసరాలకు అనుగుణంగా విడుదల కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన దామాషాలో విడుదల చేయడం లేదన్నారు. భూగర్భ ఖనిజ శాఖ వసూలు చేసి రాష్ట్ర కన్సాలిడేటెడ్ నిధికి జమ చేసిన రాయల్టీకి, పంచాయతీరాజ్ వ్యవస్థలకు విడుదల చేస్తున్న గ్రాంట్ల మధ్య ఎక్కువ శాతం వ్యత్యాసం ఉందన్నారు. దీని వల్ల పంచాయతీరాజ్ వ్యవస్థలు ఆర్థికంగా బలోపేతం కాలేకపోతున్నాయన్నారు. సమన్వయంతో ముందుకు వెళ్లాలి స్టాంప్ డ్యూటీకి సంబంధించిన సర్దుబాటును కూడా సకాలంలో చేయడం లేదని జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా ఉన్న పెండెన్సీపై 2022 నుంచి రిజిస్ట్రేషన్ శాఖపై ఒత్తిడి చేస్తూ వస్తే గత ఆర్థిక సంవత్సరం కొంత మేర పెండెన్సీ తగ్గిందన్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థలు సొంత ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ముఖ్య ఉద్దేశం నెరవేరాలంటే, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి మాట్లాడుతూ.. 73వ రాజ్యాంగ సవరణ బిల్లు 1993లో పార్లమెంట్లో ఆమోదం పొందిందన్నారు. అప్పటి నుంచే దేశంలో మూడంచెల వ్యవస్థ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్వయం పరిపాలన సాధ్యమైందన్నారు. డీపీఓ జీ భాస్కర్ మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌళిక సౌకర్యాలు కల్పిస్తు, వారి మనోభావాలకు అనుగుణంగా సేవలు అందించాలన్నారు. -
జయ జయ నారసింహ
ఆళ్లగడ్డ: అహోబిలం క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జయంతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం మూలమూర్తులు స్వామి అమ్మవారిని సుప్రభాత సేవతో మేలుకొలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి యాగశాలలో కొలువుంచి అర్చన, అభిషేకం, తిరుమంజనం నిర్వహించి అనంతరం పట్టు పీతాంబరాలతో అలంకరించి కొలువుంచారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామి ఉభయ దేవేరులతో శేష వాహనాన్ని అధిరోహించి మాడ వీధుల్లో వివహరిస్తూ భక్తులను కటాక్షించారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై కొలువైన జ్వాలా నరసింహస్వామి మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. -
యువకుడి దారుణ హత్య
ఓర్వకల్లు: మండల పరిధిలోని ఉయ్యాలవాడలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామస్తుల కథనం మేరకు.. ఈడిగోటి లలితమ్మ, వెంకటేశ్వర్లు దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు మనోజ్కు గత నెల ఓర్వకల్లు మండలం చింతలపల్లెకి చెందిన వెంకటేశ్వరితో వివాహమైంది. రెండేళ్లుగా వెంకటేశ్వర్లు కర్నూలు నగరంలోని జంపాల ఈశ్వరయ్య నగర్లో ఉంటూ లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈ నెల 21 నుంచి 23 వరకు గ్రామంలో జరిగే ఉత్సవాలకు కుటుంబ సమేతంగా వచ్చారు. ఉత్సవాల్లో పోలీసుల అనుమతితో గురువారం రాత్రి డీజే ఏర్పాటు చేయగా పాటల విషయంలో గ్రామానికి చెందిన వంశీ, మనోజ్ సోదరుడైన మధుబాబుతో గొడవ పెట్టుకున్నాడు. గమనించిన మనోజ్ సర్దిచెప్పే క్రమంలో వాగ్వాదం చోటుచేసుకొంది. కోపోద్రికుడైన వంశీ పొడవాటి కత్తిని తీసుకుని, కుటుంబసభ్యులతో కలిసి మనోజ్ ఇంటివద్దకు వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. ఈ సమయంలో కరెంట్ పోవడంతో అరుగుపై కూర్చొన్న మనోజ్ను పక్కకు ఈడ్చి గొంతుపై కత్తితో పొడిచాడు. అపస్మారక స్థితికి చేరుకున్న మనోజ్ను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసినట్లు సీఐ చంద్రబాబు నాయుడు తెలిపారు. కాగా, డీజే ప్రదర్శనకు అనుమతినిచ్చిన పోలీసులు బందోబస్తు నిర్వహించకుండా, యువకుల మధ్య గొడవలో జోక్యం చేసుకోకపోవడం విమర్శలకు దారితీసింది. కేవలం 100 మీటర్ల దూరంలో యువకుడి హత్య జరుగుతున్నప్పటికీ ఖాకీలు అడ్డుకోకపోవడం వారి చేతకానితనానికి నిదర్శనమంటూ స్థానికులు మండిపడుతున్నారు. వడ్డెర సంఘం నాయకుల అందోళన వడ్డెర సంఘం నేతలు వందలాది మందితో కలిసి మృతదేహాన్ని వంశీ ఇంటి ఎదుట ఉంచి ఆందోళన చేశారు. హంతకుడైన వంశీని తక్షణమే ఎన్కౌంటర్ చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో వంశీతో పాటు, లక్ష్మీనారాయణ, రేణుక, వెంకటలక్ష్మి, శ్రీరాములు అనే ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
చద్దన్నంకు ఆదరణ బాగుంది
చద్దన్నం హోటల్ను నేను గత ఫిబ్రవరిలో ప్రారంభించాను. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చద్దన్నం పదార్థాలను విక్రయిస్తాం. ఆ తర్వాత ఇంటికి వెళ్లి మరుసటి రోజుకు కావాల్సిన చద్దన్నం తయారీకి సిద్ధమవుతాం. ఉదయం పొంగలి తయారు చేసుకుని రెడీమేడ్గా ప్రజలకు అందిస్తున్నాం. చద్దన్నంకు ప్రజల నుంచి ఆదరణ బాగుంది. – నారాయణమ్మ, చద్దన్నం హోటల్ నిర్వాహకురాలు, కర్నూలు నేను ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. రెండు వారాలుగా నాకు, నా భార్యకు చద్దన్నం రుచులను తీసుకెళ్తున్నాను. ఇందులో ముఖ్యంగా అరికెలు, సామలతో చేసిన పదార్థాలు, కారాలు తీసుకుంటున్నాను. నేను రోజూ యోగా, ప్రాణాయామం చేస్తుంటాను. ఆరోగ్య రీత్యా చద్దన్నం రుచులు ఎంతో బాగుంటాయి. –జి. శ్రీరాములు, ప్రైవేటు ఉద్యోగి, కర్నూలు నేను రెండు నెలల క్రితం చద్దన్నం హోటల్ను ప్రారంభించాను. మా వద్ద వరి చద్దన్నంతో పాటు రాగులు, జొన్నలు, అరికెలు, కొర్రలతో చేసిన చద్దన్నాలు, కినోవా, రెడ్రైస్, సామలు, కొర్రలతో చేసిన పొంగలి తయారు చేస్తున్నాం. వీటికితోడుగా మునగాకు, కరివేపాక చట్ని, సూప్లు, ఉల్లి,క్యారెట్, బీట్రూట్లతో తురిమిన మిక్స్, ఆయుర్వేదిక్ కారం పొడి, మజ్జిగ అందిస్తున్నాం. రోజుకు వంద మందికిపైగా వస్తున్నారు. – బాల లక్ష్మి, చద్దన్నం హోటల్ నిర్వాహకురాలు, కర్నూలు మేము కర్నూలులోని వెంకటరమణ కాలనీలో ఉంటున్నాం. రెండు వారాలుగా చద్దన్నం రుచులను తీసుకెళ్తున్నాం. ఒక్కోరోజు ఒక్కో పదార్థాన్ని మధ్యాహ్న భోజనంగా పార్శిల్ తీసుకుంటున్నారు. ఒక పార్శిల్ ఒకరికి సరిపోతుంది. నూనె, మసాలాలు ఉండవు కాబట్టి ఆరోగ్యానికి మంచిది. వేసవిలో ఇలాంటి ఆహారం ఒంటికి ఎంతో మేలు చేస్తాయి. ఎంతో రుచిగా ఉంటున్నాయి. – రామకృష్ణ, లెక్చరర్, కర్నూలు -
వీఓఏలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ
కర్నూలు(సెంట్రల్): గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల (వీఏఓ)కు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె తన కార్యాలయంలో 908 వీఏఓలకు శ్యామ్సంగ్ 5జీ స్మార్ట్ ఫోన్లను అందజేశారు. స్వయం సహాయక సంఘాలకు వీఏఓలు అందించే సేవలు చాలా ఉంటాయని, వారికి అవసరమైన సాంకేతికను అందిస్తే మరింత సేవ చేసే అవకాశం ఉండడంతో 5జీ స్మార్ట్ ఫోన్లను ప్రభుత్వం ఇచ్చినట్లు చెప్పారు. కార్యక్రమలో డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి పాల్గొన్నారు. మల్లన్న సేవలో ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్.జవహర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. గురువారం ఉదయం మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన ఎస్సీ కమిషన్ చైర్మన్, సభ్యులకు ఆలయ ఏఈవో వెంకటేశ్వరరావు, అధికారులు, అర్చకస్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం చైర్మన్ స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయం వద్ద ఉన్న ఆశీర్వచన మండపంలో ఆయనకు వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. అధికారులు స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను అందించి సత్కరించారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ వెంట కమిషన్ సభ్యులు గౌతమ్రాజు, దాసు తదితరులు ఉన్నారు. -
మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
● మత్తు వ్యసనాల నిర్మూలన ర్యాలీలో కలెక్టర్, ఎస్పీ పిలుపుకర్నూలు: కర్నూలును మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేద్దామని కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పించేందుకు ఈగల్ ఆధ్వర్యంలో గురువారం భారీ వాకథాన్ ర్యాలీ నిర్వహించారు. రాజ్విహార్ సెంటర్లో కలెక్టర్, ఎస్పీ జెండా ఊపి వాకథాన్ను ప్రారంభించారు. ఈగల్ టీమ్ ఎస్ఐ సుజన్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో పోలీసు, ఎకై ్సజ్, విద్యార్థులు, యువకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సే నో టు డ్రగ్స్, డ్రగ్ ఫ్రీ సొసైటీ వంటి నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలని సందేశాలందించారు. రాజ్విహార్ నుంచి బుధవారపేట మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది. మాదక ద్రవ్యాలకు సంబంధించి ఈగల్ టీమ్ టోల్ఫ్రీ నెంబర్ 1972కు సమాచారం ఇవ్వాలని యువత నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ.. యువతను మత్తు వ్యసనాల నుంచి కాపాడటం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఆల్కహాల్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం పెరుగుతోందని, దీనివల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, జిల్లా అధికారి సుధీర్ బాబు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణా రెడ్డి, ఔషధ నియంత్రణ శాఖ ఏడీ హరిహర తేజ, సీఐలు చంద్రహాస్, రాజేంద్రప్రసాద్, జయరాం నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
నేడు సీక్యాంప్ రైతుబజార్ బంద్
కర్నూలు(అర్బన్): నగరంలోని సీ క్యాంప్ రైతు బజార్ను ఈ నెల 24వ తేదీన ( శుక్రవారం ) బంద్ చేస్తున్నట్లు ఎస్టేట్ ఆఫీసర్ కళ్యాణి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి నెలలో ఒక రోజు రైతు బజార్ను పూర్తి స్థాయిలో శుభ్రం చేయాల్సి ఉన్నందున ఈ బంద్ను నిర్వహిస్తున్నామన్నారు. పరిశుభ్రత పనులు చేపడుతున్న దృష్ట్యా ఎలాంటి వ్యాపారాలు జరగబోవన్నారు. యథాతథంగా శనివారం రైతు బజార్ పునః ప్రారంభం అవుతుందన్నారు. ఈ విషయాన్ని రైతులు గుర్తించాలన్నారు. ఇద్దరు విద్యార్థులకు ‘షైనింగ్’ అవార్డులు కర్నూలు సిటీ: కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థులు షైనింగ్ స్టార్స్ అవార్డులకు ఎంపికై నట్లు సమగ్ర శిక్ష అదనపు కో–ఆర్డినేటర్ డా.ఎన్.బి లోకరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కల్లూరు కేజీబీవీల్లో చదివిన షేక్ ఆఫ్రీన్ ఒకేషనల్ గ్రూప్ కంప్యూటర్ సైన్స్లో 990 మార్కులు సాధించారని, పంచలింగాల కేజీబీవీకి చెందిన గుడిసె చందన ఒకేషనల్ గ్రూప్ అకౌంటెన్సీ–టాక్సేషన్లో 987 మార్కులు సాధించారని పేర్కొన్నారు. వీరిద్దరూ షైనింగ్ స్టార్స్ అవార్డులకు ఎంపికయ్యారన్నారు. కోవెలకుంట్ల: గతేడాది ఆగస్టు నెలలో జరిగిన చైన్స్నాచింగ్ కేసులో దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. కోవెలకుంట్ల పోలీస్ సర్కిల్ కార్యాలయంలో గురువారం సీఐ హనుమంతునాయక్ వివరాలు వెల్లడించారు. పట్టణంలోని సత్యసాయిబాబా ఆలయ సమీపంలో నివా సం ఉంటున్న లక్ష్మీకుమారి గతేడాది ఆగస్టు 24వ తేదీన ఇంటి పక్కన మహిళలతో వాకింగ్కు వెళ్లింది. ఆ సమయంలో మహిళల వద్దకు గుర్తు తెలియని 35 ఏళ్ల వయస్సు కలిగిన ఓ వ్యక్తి వారి వెనుకనే వాకింగ్ చేస్తున్నట్లు నటించి వారిని దాటే వెళ్లే సమయంలో లక్ష్మికుమారి మెడలో ఉన్న నల్లపూసలదండ, బంగారు గొలుసు లాక్కొని ముందుకు పరిగెత్తాడు. కొంతదూరంలో మరో వ్యక్తి బైక్తో సిద్ధంగా ఉండగా ఆ బైక్ ఎక్కి ఇద్దరు అక్కడి నుంచి గుంజలపాడు గ్రామం వైపు పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దొంగలను గుర్తించి కోవెలకుంట్ల ఎస్ఐ మల్లికార్జునరెడ్డి దర్యాప్తు చేపట్టి కేసు మిస్టరీని చేధించారు. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన షేక్ తహలిబ్ ఉసేన్, షేక్ దిల్వర్ చోరికి పాల్పడినట్లు విచారణలో తేలడంతో వారిని అరెస్ట్ చే సి నల్లపూసలదండ, బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు దొంగలను కోర్టులో హాజరు పరుచగా మేజిస్ట్రేట్ రిమాండ్కు ఆదేశించినట్లు సీఐ పేర్కొన్నారు. -
‘పొరుగు’ మద్యాన్ని కట్టడి చేయాలి
● పంచలింగాల చెక్పోస్టులో తనిఖీ చేసిన డిప్యూటీ కమిషనర్ కర్నూలు: జిల్లాలోకి పొరుగు రాష్ట్రాల మద్యం కాకుండా నిరంతరం తనిఖీలు చేస్తూ కట్టడి చేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి ఎకై ్సజ్ అధికారులకు సూచించారు. గురువారం కర్నూలు శివారు హైదరాబాదు రోడ్డులో ఉన్న పంచలింగాల ఎకై ్సజ్ చెక్పోస్టును జిల్లా అధికారి సుధీర్ బాబుతో కలసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక్కడ ఇద్దరు సీఐలు, ఒక ఎస్ఐ ఐదుగురు సిబ్బంది రెండు షిఫ్టులలో విధులు నిర్వహిస్తుంటారు. అక్కడున్న రికార్డులను డిప్యూటీ కమిషనర్ తనిఖీ చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి స్పిరిట్ ట్యాంకర్లు జిల్లాలోకి వస్తే ఖచ్చితంగా రిజిస్టర్లో నమోదు చేయాలని, అలాగే అనుమానిత వాహనాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. షిఫ్ట్ విధానంలో అప్రమత్తంగా ఉంటూ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ తనిఖీలు నిర్వహించాలన్నారు. గంజాయి, మద్యం, మాదక ద్రవ్యాలు వంటి అక్రమ రవాణాపై కూడా గట్టిగా నిఘా ఉంచాలని సూచించారు. ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి, సీఐలు చంద్రహాస్, రాజేంద్రప్రసాద్, తదితరులు కూడా డీసీ వెంట ఉన్నారు. ఈ సందర్భంగా వారు కొన్ని అనుమానిత వాహనాలను కూడా తనిఖీ చేశారు. లా సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఫిబ్రవరిలో నిర్వహించిన లా 3, 5 సంవత్సరాల కోర్సుల 3, 5, 7, 9 సెమిస్టర్, డిగ్రీ 6వ సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు తెలిపారు. వర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ వి.వెంకట బసరావు ఆదేశాల మేరకు ఫలితాలు విడుదల చేశామన్నారు ఫలితాలు https:// rayalaseemauniversity.ac.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. -
నగరంలో ప్రత్యేక హోటళ్లు
ఆధునిక కాలంలో చాలా మంది బిజీ జీవితాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలో అప్పట్లోలాగా ఇప్పుడు చద్దన్నం తయారు చేసుకుని తినే సమయం, ఓపిక ఇప్పటి వారికి లేదు. అందుకే ఇలాంటి వారి కోసం రెడీమేడ్గా చద్దన్నం అంది స్తున్నాయి హోటళ్లు. ఇటీవల కాలంలో కర్నూలు నగరంలో అవుట్ డోర్ స్టేడియం, వెంకటరమణ కాలపీ, బి.క్యాంపులోని సిల్వర్జూబ్లీ కాలేజి వద్ద ‘మన చద్దన్నం’ పేరుతో వరి అన్నంతో పాటు కొర్రలు, సామలు, అరికెలు, జొన్నలు, రాగులతో చద్దన్నం, పొంగలి తయారు చేసి మట్టిపాత్రలో వడ్డిస్తున్నారు. ఇందులో మునగాకు సూపు, మునగాకు చట్ని, వేరుశనగ, మిరియాలు, లవంగాలు, మిర్చి విత్తనాలతో కూడిన పౌడర్, ఉల్లి, క్యారెట్, బీట్రూట్ తురిమిన సలాడ్ను కలిపి ఇస్తున్నారు. దీంతో పాటు అవిశగింజెలు లడ్డు, డ్రైఫ్రూట్ లడ్డూలను తయారు చేసి ఇస్తున్నారు. ప్రతిచోటా రోజూ వంద మందికి పైగా ఈ చద్దన్నం తింటున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. వీరికి నల్గొండకు చెందిన ఓ వారు ప్రాంచైజీ రెండు రోజుల పాటు శిక్షణ, పరికరాలు ఇచ్చి వెళ్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. వీరి చద్దన్నంకు సోషల్ మీడియాలోనూ వైరల్ కావడంతో ప్రజలు చిరునామా తెలుసుకుని వచ్చి తింటున్నారు. నగరంలో చద్దన్నం పదార్థాల విక్రయశాల -
పెద్ద చెరువు అభివృద్ధికి కార్యాచరణ
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: పట్టణంలోని పెద్ద చెరువును సమగ్రంగా అభివృద్ధి చేయడానికి చర్యలు ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. గురువారం చెరువు పరిసరాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చెరువు చుట్టూ సుమారు 2.5 కిలోమీటర్ల మేర వాకింగ్ ట్రాక్ను త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ట్రాక్ను సౌకర్యవంతంగా అభివృద్ధి చేయాలన్నారు. చెరువు పరిసరాల్లో గ్రీనరీని పెంపొందిస్తూ, షేడ్ పగోడాలు ఏర్పాటు చేసి అందమైన వాతావరణాన్ని సృష్టించేందుకు బ్యూటిఫికేషన్ పనులు చేపట్టాలన్నారు. ప్రజలకు విశ్రాంతి, వినోదం కలిగించే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. చెరువు కట్టను ఆక్రమణల నుంచి రక్షించేందుకు బౌండరీ ఫిక్సింగ్, ఫెన్సింగ్, ట్రెంచెస్ ఏర్పాటు చేయాలన్నారు. చెరువు భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ కట్టను శాశ్వతంగా సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పాలేరు వాగు, చామ కాలువలతో అనుసంధానమై సుమారు 700 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పెద్ద చెరువును సమగ్రంగా అభివృద్ధి చేస్తే, నంద్యాల పట్టణానికి ఒక విలువైన ఆస్తిగా మారుతుందన్నారు. కలెక్టర్ వెంట ఇరిగేషన్ ఎస్ఈ శివ శంకర్ రెడ్డి, కేసీ కెనాల్ డీఈ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వరి రైతుకు వాన దెబ్బ
రెడ్డిపల్లె వద్ద పొలంలో విరిగి పడిన విద్యుత్ స్తంభంకొండమాయపల్లె సమీపంలో నీట మునిగిన ధాన్యాన్ని బయటకు తీస్తున్న రైతులురుద్రవరం: గాలివాన దెబ్బకు వరి రైతులు కుదేలయ్యారు. కోతలు కోసి ఆరబోసిన ధాన్యం వర్షపు నీటిలో తడిసిపోయింది. కోత దశలో ఉన్న పైర్లు పూర్తిగా నేల వాలాయి. మండల కేంద్రమైన రుద్రవరంతో పాటు కొండమాయపల్లె, ఆర్.కొత్తూరు, చందలూరు, మాచినేనిపల్లె, రెడ్డిపల్లె, ఆర్.నాగులవరం తదితర గ్రామాల్లో బుధవారం రాత్రి గాలివాన కురిసింది. కోత దశలో ఉన్న వరి, మొక్కజొన్న పైర్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. కోతలు పూర్తయి పొలాల్లోనే ఆరబోసిన ధాన్యం పూర్తిగా నీట మునిగింది. పట్టలు కప్పకుండా రోడ్లపై ఆరబోసిన వరి ధాన్యం, మొక్కజొన్నలు తడిసి పోయాయి. రాత్రి వర్షం కురవడంతో కల్లాల్లో ఉన్న దిగుబడిని కాపాడుకోలేక పోయారు. గురువారం ఉదయం పొలాల్లో నేలవాలిన పంటను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. వెంటనే కూలీల సాయంతో నీట మునిగిన ధాన్యాన్ని బయటకు తీసి ఆరబోశారు. అలాగే మొక్కజొన్న, మామిడి రైతులు కూడా నష్టపోయారు. గాలివానకు మండలంలో దాదాపు 39 విద్యుత్ స్తంభాలు పడిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వెంటనే మరమ్మతులు చేపడుతున్నట్లు ఏఈ రాజశేఖర్ తెలిపారు. -
వైభవంగా నరసింహుడి జయంతి బ్రహ్మోత్సవాలు
ఆళ్లగడ్డ: అహోబిల దివ్యక్షేత్రంలో నరసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఎగువ అహోబిలంలో గురువారం ఉదయం యోగా నరసింహ గరుడ వాహన, రాత్రి హనుమంత వాహన సేవ నిర్వహించారు. భక్తులు లక్ష్మీనరసింహ స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మరర్లాను దర్శించుకుని తరించారు. తెల్లవారుజామున మూలమూర్తి జ్వాలా నరసింహస్వామి, చెంచు లక్ష్మీ అమ్మవార్లను మేలుకొలిపి, సుప్రభాత సేవ, నిత్యపూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను యాగశాలలో కొలువుంచి అర్చన, అభిషేకాలు నిర్వహించారు. ఆతర్వాత శ్రీ జ్వాలా నరసింహ స్వామి ఉభయ దేవేరులతో యోగానంద గరుడ విమాన వాహనంలో కొలువై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు. రాత్రి శ్రీ జ్వాలా నరసింహస్వామి హనుమంత వాహనంపై కొలువై భక్తులను అనుగ్రహించారు. -
రేపు పాలిసెట్
నంద్యాల(న్యూటౌన్): 2026–27 విద్యాసంవత్సరానికి గాను ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, డిప్లొమో ప్రవేశాల కోసం ఈనెల 25న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు 8 పరీక్ష కేంద్రాల్లో పాలిసెట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా పాలిసెట్ కో ఆర్డినేటర్ శైలేంద్రకుమార్ తెలిపారు. గురువారం ప్రభుత్వ ఈఎస్సీ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాలిసెట్కు ఏర్పాట్లు చేస్తామన్నారు. డోన్లో 798 మంది, నందికొట్కూరులో 533, నంద్యాలలో 2868, ఆత్మకూరులో 638, శ్రీశైలంలో 140, బేతంచెర్లలో 560, బనగానపల్లెలో 989 మంది, ఆళ్లగడ్డలో 695 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం 9912377723ను సంప్రదించాలన్నారు. పోస్టాఫీసుల్లో కొత్త ఆధార్ నమోదు కేంద్రాలు నంద్యాల(వ్యవసాయం): పోస్టాఫీసుల్లో ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్, కొత్త ఆధార్ నమోదు చేసుకోవచ్చని నంద్యాల డివిజనల్ పోస్టల్ సూపరింటెడ్ బి.అప్పలస్వామి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల హెడ్ పోస్ట్ ఆఫీస్, రైల్వే స్టేషన్లోని పోస్టాఫీస్, ఆళ్లగడ్డ ఎండీజీ, పాణ్యం సబ్ పోస్టాఫీస్, ఎస్ఎస్ డాం ఈస్ట్ సబ్ పోస్టాఫీస్లో కొత్త ఆధార్ నమోదు, ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రుణాలను సద్వినియోగం చేసుకోవాలి శిరివెళ్ల: పొదుపు సంఘాల మహిళలు రుణాలు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీఏ పీడీ శ్రీధర్రెడ్డి అన్నారు. గురువారం వెలుగు కార్యాలయంలో వార్షిక జీవనోపాధుల రుణ ప్రణాళికపై డ్వాక్రా సంఘాలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడు తూ మహిళల జీవనోపాధులకు ఎంత నిధులు కావాలని ఒక నిర్థష్ట ప్రణాళికలు రూపొందింస్తున్నామన్నారు. బ్యాంక్ లింకేజీ, సీ్త్ర నిధి, ఉన్నతి వంటి పథకాల ద్వారా రుణాలను మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. పొదుపు రుణాలతో మహిళలు స్వయం ఉపాధిలో రాణించాలన్నారు. సమావేశంలో ఏపీఎం రాజశేఖరరెడ్డి, సంఘాల లీడర్లు, సీసీలు పాల్గొన్నారు. పాఠశాలలకు వేసవి సెలవులు నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల్లో పని చేస్తున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు గురువారం నుంచి సెలవులు ప్రకటించినట్లు డీఈఓ జనార్దన్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉందని, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సెలవులు ప్రకటిచిందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఈఓ తెలిపారు. ప్రైవేటు విద్యాసంస్థలు ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు. మహనీయుడు భగీరథ మహర్షి నంద్యాల: తపస్సుతో గంగాదేవిని భువికి తీసుకొచ్చిన భగీరథ మహర్షి మహనీయుడని జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని భగీరథ మహర్షి జయంతిని పురస్కరించుకుని భగీరథ చిత్రపటానికి డీఆర్ఓ, సగర (ఉప్పర) సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ.. భగీరథ మహర్షి గంగను భూమిపైకి తీసుకువచ్చిన పట్టుదల జల సంరక్షణకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. కఠోర శ్రమ చేసి దేనినైనా సాధించగలమని భగీరథ మహర్షి నిరూపించారని, ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని యువత లక్ష్యాలను సాధించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిని వినియోగించుకోవాలన్నారు. వెనుకబడిన తరగతుల వారి జీవన ప్ర మాణాలను మెరుగుపరిచేందుకు చేపడుతున్న కార్యాచరణను పూర్తిస్థాయి ఫలాలు వారికి అందేలా నిరంతరం కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సగర వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ సురేష్ కుమార్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గోవర్ధన్, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఓబులేసు, హాస్టల్ వార్డెన్ ఇన్చార్జ్ మునిరాజు, బీసీ వెల్ఫేర్ సెక్రటరీ షబ్బీర్, నంద్యాల అసెంబ్లీ సంఘం అధ్యక్షుడు బి.బాలాజీ, యువజన సంఘం అధ్యక్షుడు యు.హరికిరణ్, గురు ప్రసాద్, శివ ప్రసాద్ పాల్గొన్నారు. -
అనుమానం.. పెనుభూతమై!
● భార్య గొంతు కోసి హత్య చేసిన భర్తఆళ్లగడ్డ: భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానం పెనుభూతంగా మారి చివరికి దారుణంగా హత్య చేసిన ఘటన ఆళ్లగడ్డ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. పట్టణ సీఐ నాగరాజరావు కథనం ప్రకారం.. రుద్రవరం మండలం చిత్రేనిపల్లె గ్రామానికి చెందిన చెన్నయ్య మొదటి భార్య పదేళ్ల క్రితం మృతి చెందడంతో మండల కేంద్రం రుద్రవరానికి చెందిన పుష్ప (35)ను రెండో వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజులు చిత్రేనిపల్లెలో వ్యవసాయం చేసుకుంటూ కాపురం ఉండగా అప్పులు ఎక్కువ కావడంతో బతుకు దెరువు కోసం ఆళ్లగడ్డ చేరుకున్నారు. అక్కడ దంపతులు ఇద్దరు గౌండా పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పనిచేసేచోట పుష్ప ఓ వ్యక్తితో చనువుగా ఉంటుండంతో అనుమానపడిన చెన్నయ్య కాపురం నంద్యాలకు మార్చాడు. అక్కడ బతకడం ఇబ్బందిగా మారడంతో తిరిగి ఆళ్లగడ్డ చేరుకుని చాంద్ వీధిలో ఇళ్లు బాడుగకు తీసుకుని నివాసం ఉంటున్నా రు. ఈ క్రమంలో బుధవారం రుద్రవరంలో దేవరకు పోయి రాత్రి పొద్దుపోయాక ఆళ్లగడ్డ చేరుకున్నారు. గురువారం తెల్లవారుజామున ఇద్దరు గొడవ పడుతూ ఆవేశంతో చెన్నయ్య భార్య పుష్ప గొంతులో కత్తెరతో పొడవగా పుష్ప అక్కడికక్కడే మృతి చెందింది. భార్యను హత్య చేసి పరారైన చెన్నయ్య మధ్యాహ్నం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దీంతో తల్లి చనిపోవడం, తండ్రి జైలు పాలు కావడంతో ఇద్దరు కూతుర్లు అనాథలయ్యారు. -
మల్లన్న హుండీ ఆదాయం రూ.4.83 కోట్లు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలోని ఉభయ దేవాలయాల్లో హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూపేణా రూ.4,83,22,554 లభించినట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆలయంలోని అలంకార మండపంలో గత 33 రోజుల వ్యవధిలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించినట్లు చెప్పారు. బంగారం 162.200 గ్రాములు, వెండి 4.180 కేజీలు లభించాయన్నారు. నగదు, బంగారం, వెండితో పాటు యూఎస్ఏ డాలర్లు–144, శ్రీలంక రూపి–9,870, యూఏఈ దిర్హమ్స్–90, సౌదీరియాల్స్–120, ఇంగ్లాండ్ పౌండ్స్–20, మలేషియా రింగిట్స్–151, ఆస్ట్రేలియా డాలర్లు–25, యురోలు–30, కెనడా డాలర్లు–25, కువైట్ దినార్–1, న్యూజిలాండ్ డాలర్లు–30 వచ్చినట్లు ఈఓ తెలిపారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపు చేపట్టామన్నారు. హుండీల లెక్కింపులో పలు యూనిట్ విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు. -
నో స్టాక్
● జిల్లాలో మూతపడుతున్న పెట్రోల్ బంక్లు నంద్యాల(అర్బన్)/బనగానపల్లె: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత వాహన దారులను భయపెడుతోంది. నంద్యాల పట్టణంతో పాటు బనగానపల్లె, కోవెలకుంట్ల తదితర ప్రాంతాల్లో గురువారం పలు పెట్రోల్ బంక్లు మూతపడ్డాయి. జిల్లా 167 పెట్రోల్ బంక్లు ఉండగా ప్రతి రోజు ఇంధనం సరఫరా అయ్యేది. ప్రస్తుతం రెండు మూడు రోజులకు ఒకసారి ఇంధనం సరఫరా జరుగుతుండటంతో వాహన దారులు ఇంధనం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంధనం సరఫరాలో అధికారుల పర్యవేక్షణ లోపాలు ఉన్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని వాహనదారుల భావిస్తున్నారు. జిల్లా అధికారులు కొరత లేదంటూ ఓ వైపు చెబుతుండగా వాహన దారులు మాత్రం ఇంధనం కోసం అన్ని పెట్రోల్ పంపుల వద్దకు పరుగులు తీస్తున్నారు. పంపుల యజమానులు కొందరు కృత్రిమ కొరత సృష్టిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
వైభవంగా గంగా పుష్కరోత్సవం
మహానంది: మహానంది పుణ్యక్షేత్రంలో వైశాఖ శుద్ధ సప్తమి సందర్భంగా గురువారం గంగా పుష్కరోత్సవం పూజలు వైభవంగా జరిగాయి. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ఉప ప్రధాన అర్చకులు మూలస్థానం శంకరయ్యశర్మ, ఏఈఓ ఎరమల మధు, సూపరింటెండెంట్ అంబటి శశిధర్రెడ్డి, ఇన్స్పెక్టర్ నాగమల్లయ్య, అర్చకులు శరభయ్యశర్మ, రఽఘుశర్మ వేకువజాము నుంచే విశేష పూజలు నిర్వహించారు. ముందుగా గంగాదేవి అమ్మవారిని రాజగోపురం వద్ద కొలువు తీర్చి గణపతి పూజ, పుణ్యాహవాచనం, షోడశోపచారాలు నిర్వహించి లోపల ఉన్న రుద్రగుండం కోనేరులోకి మేళతాళాలు, భాజాభజంత్రీలతో సాదరంగా తీసుకెళ్లారు. అక్కడ పంచలింగాల మండపంలో పంచామృతాలు, వివిధ చూర్ణాలు, పసుపు, కుంకుమ, విభూతి, గంధం, చందనం, పన్నీరు, పుష్పాలతో అభిషేక పూజలు ఘనంగా చేయగా భక్తులు కనులారా తిలకించారు. గంగాదేవితో కలిసి లోక కల్యాణార్థం సంకల్ప స్నానాలు నిర్వహించారు. వేలాది సంఖ్యలో భక్తులు హాజరై పుణ్యస్నానాలు ఆచరించి కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకున్నారు. -
గడువులోపు భూ రీసర్వే పూర్తి చేయాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: నిర్ణీత గడువులోపు భూ రీసర్వే పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆదేశించారు. రీసర్వేకు సంబంధించిన ఫేజ్–1 నుంచి ఫేజ్–5 వరకు ఉన్న అన్ని దశలను వేగవంతం చేసి, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కలెక్టరేట్లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఆర్డీఓలు, తహసీల్దార్లు, వీఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. భూసంబంధిత వివాదాలు, అడ్డంకులు తక్షణమే పరిష్కరించే విధంగా అన్ని స్థాయిలలో అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలోని ప్రతి రైతుకు పట్టాదారు పాసు పుస్తకాలు మార్చి 2027 నాటికి అందజేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. శ్రీమఠం హుండీ ఆదాయం రూ.3.25 కోట్లు మంత్రాలయం: శ్రీ రాఘవేంద్రస్వామి మంఠంలో మార్చి 31 నుంచి ఏప్రిల్ 21 వరకు భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించారు. మొత్తం రూ.3,25,96,854 సమకూరింది. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆదేశానుసారంగా హుండీ లెక్కింపునకు ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఒక సారి కౌటింగ్ హాల్లోనికి ప్రవేశించిన తరువాత ఎవరినీ ఏ కారణంతోనూ బయటకు అనుమతించలేదు. హుండీ లెక్కింపునకు ఆలస్యముగా వచ్చే వారికి ప్రవేశం లేదు అని సూచిక బోర్డును ఏర్పాటు చేసినట్లు మేనేజర్ ఎస్కె.శ్రీనివాసరావు తెలిపారు. నగదు రూపేణా రూ. 3,15,62,354, నాణేల రూపంలో రూ.10,34,500 వచ్చినట్లు వివరించారు. అలాగే 47 గ్రాముల బంగారం, 592 గ్రాముల వెండి కానుకలు సమకూరినట్లు ఏఏఓ మాధవశెట్టి , మేనేజర్–2 వెంటేష్ జోషి,ఇంజనీర్ సురేష్కోనాపూర్ తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి కర్నూలు(సెంట్రల్): జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. ఎంఓయూలు చేసుకున్న పరిశ్రమల పురోగతిపై బుధవారం కలెక్టరేట్లో తన కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలులో ఉన్న వివిధ ప్రాజెక్టుల పురోగతిని కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. ప్రాజెక్టులను వేగవంతంగా అమలు చేయడం, భూసేకరణ, అవసరమైన అనుమతులు, ఇతర సమస్యలపై విస్తృతంగా చర్చించారు. జిల్లాలో 38 పరిశ్రమల ఏర్పాటుకు ఎంఓయూలు జరిగాయని, వాటిలో ఇంకా మొద లు కాని పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ అశోక్కుమార్, ఏపీఐఐసీ జెడ్ఎం మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హంస వాహనంపై దివ్య తేజం
● వైభవంగా నారసింహ జయంతి బ్రహ్మోత్సవాలుఆళ్లగడ్డ: నృసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉదయం హంస వాహనం, రాత్రి సూర్య ప్రభ వాహనాలను అధిరోహించి మాడ వీధుల్లో వివహరిస్తూ భక్తులను కటాక్షించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జయంతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం మూలమూర్తులు స్వామి అమ్మవారిని సుప్రభాత సేవతో మేలుకొలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వాములను యాగశాలలో కొలువుంచి అర్చన, అభిషేకం, తిరుమంజనం చేశారు. అనంతరం పట్టు పీతాంబరాలతో అలంకరించి కొలువుంచారు. నారసింహ స్వామిని విశేషంగా అలంకరించిన హంస వాహనంపై కొలువుంచి మాడవీదుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి సూర్యప్రభ వాహనం మాడ వీధుల్లో సంచరిస్తూ భక్తులను స్వామి కటాక్షించారు. -
రమణీయం.. స్వర్ణ రథోత్సవం
శ్రీశైలంటెంపుల్: ఆరుద్రోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం నిర్వహించారు. వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు చేశారు. స్వర్ణరథోత్సవంలో ముందుగా అర్చకస్వాములు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. అనంతరం రథారూఢులైన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపించారు. ఉదయం 7.30గంటలకు స్వర్థరథోత్సవం ప్రారంభమైంది. రథోత్సవంలో కోలాటం, తాళం భజన, డోలు వాయిద్యం, చెక్కభజన మొ దలైన జానపద కళారూపాలు అలరించాయి. స్వర్ణరథోత్సవంలో శ్రీశైల దేవస్థాన ఆలయ ఏఈవో వెంకటేశ్వరరావు, అర్చకస్వాములు, వేదపండితులు, పలు వి భాగాల అధికారులు, పర్యవేక్షకులు, ఇతర సిబ్బంది, శివసేవకులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
పోతిరెడ్డిపాడును పరిశీలించిన కేఆర్ఎంబీ చైర్మన్
జూపాడుబంగ్లా/ పాములపాడు: పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ను బుధవారం కృష్ణా రివర్బోర్డు చైర్మన్ సుబ్రాంగ్ షూ బిశ్వాన్, కమిటీ మెంబర్లు జాన్గిడ్, సతీష్ కాంబోజీ పరిశీలించారు. శ్రీశైలంలో ఎన్ని అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు ఎవరి అనుమతితో నీటిని విడుదల చేస్తారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బానకచెర్ల క్రాస్ రెగ్యులేటరును సందర్శించారు. తెలుగుగంగ, కేసీసీ ఎస్కేప్, జీఎన్ఎస్ఎస్ గేట్లను పరిశీలించారు. అనంతరం నీటిపారుదల శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షలో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు, పంపిణీలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను బోర్డు బృందం దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. సాగు, తాగు నీటి సరఫరాలో బానకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ పాత్ర కీలకమని చెప్పారు. ఎస్ఈ శివశంకర్రెడ్డి , కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు డీఈ పవన్, ఈఈ రవీంద్ర, పోతిరెడ్డిపాడు డీఈలు సుబ్రమణ్యంరెడ్డి, నగేష్, ఏఈ విష్ణువర్ధన్రెడ్డి, ఎన్సీఎల్ మేనేజర్ రమణ, తదితరులు పాల్గొన్నారు. -
రాయలసీమ లిఫ్టును పూర్తి చేయాల్సిందే
సాక్షి, నంద్యాల జిల్లా: రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును తక్షణం మొదలుపెట్టి ఎట్టిపరిస్థితుల్లో పూర్తి చేయాల్సిందేనని వైఎస్సార్సీపీ నాయకులు, రైతు నాయకులు, రాయలసీమ ఉద్యమకారులు డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ ఆధ్యర్యంలో నంద్యాలలో జరిగిన రాయలసీమ లిఫ్టు సమాలోచన సమావేశంలో రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు చేస్తున్న ద్రోహంపై గళమెత్తారు. రాయలసీమ ప్రాజెక్టు ఆవశ్యకతతోపాటు కూటమి పాలనలో ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై గ్రామ స్థాయి నుంచే ప్రజల్లో అవగాహన కల్పించేలా ప్రణాళిక రూపొందించాలని తీర్మానించారు.రాయలసీమ లిప్టుతోపాటు గుండ్రేవుల ప్రాజెక్టు, మల్లిఖార్జున రిజర్వాయర్లు కూడా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితుల కోసం ఇచ్చిన జీవో నెంబర్ 98 అమలు చేసి బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే గ్రామ స్థాయి నుంచి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాయలసీమ నీటి హక్కులు సాధించుకోవడం కోసం సమన్వయంతో ముందుకు సాగాలని, ప్రాజెక్టుల అమలుకు కార్యాచరణ సిద్ధం చేయాలని నేతలు నిర్ణయించారు.రాయలసీమ ప్రాజెక్టులు, ఈ ప్రాంత అభివృద్దిపై చంద్రబాబుకి చిత్తశుద్ధిలేదని, ఆయన ఈ ప్రాంతంలో పుట్టడం దౌర్భాగ్యమని నాయకులు మండిపడ్డారు. తన పార్టీకి ఓట్లు వేయడం లేదని రాయలసీమ ప్రాంతాన్ని చిన్నచూపు చూస్తున్న చంద్రబాబు, తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో రాయలసీమకు ఏం చేశానో తనను తానే ప్రశ్నించుకోవాలని సూచించారు.రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ స్కీమ్ సమాలోచన కార్యక్రమంలో నంద్యాల, నెల్లూరు జిల్లాల వైయస్సార్సీపీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, జిల్లా పరిశీలకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, గంగుల బిజేంద్ర రెడ్డి, మాజీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సాకె శైలజానాథ్, నందికొట్కూరు సమన్వయకర్త దారా సుధీర్, మాజీ ఎంపీలు తలారి రంగయ్య, పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, ఇసాక్ బాషాలతోపాటు రాయలసీమ ఉద్యమకారులు, రైతు సంఘాల నాయకులు, వివిధ విభాగాలకు చెందిన వైయస్సార్సీపీ నాయకులు, పాల్గొన్నారు.రేవంత్తో చంద్రబాబు చీకటి ఒప్పందం: కాటసాని రాంభూపాల్ రెడ్డితెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకుని రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు ద్రోహం చేశారు. ముఖ్యమంత్రిగా ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ రాయలసీమకు చంద్రబాబు చేసిందేమీ లేదు. రాయలసీమ అంటే చంద్రబాబుకు చులకన భావన ఉంది. రాయలసీమ రైతుల సమస్యలను పట్టించుకోకుండా, ప్రాంత అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాడు. నీటి ప్రాజెక్టుల విషయంలో రాయలసీమకు అన్యాయం జరుగుతోంది. ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి, రాయలసీమ హక్కుల కోసం పిడికిలి బిగించి పోరాటం చేయాలి. పసుపు పూలు చల్లి చంద్రబాబు క్రెడిట్ చోరీ: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిరాయలసీమ ఎత్తిపోతల పథకం లేకపోతే రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉంది. 90 శాతం పనులు పూర్తి చేసి, యంత్ర సామాగ్రి సిద్ధం చేసిన ప్రాజెక్టును పక్కనపెట్టేశాడు. 23 నెలల్లో రూ. 3.56 లక్షల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు, రాయలసీమ లిఫ్టు పూర్తి చేయకపోవడం రాయలసీమ ప్రాంతానికి ద్రోహం చేయడమే. వైయస్ జగన్ కుప్పానికి నీళ్లిస్తే అది కూడా చంద్రబాబు తన ఘనతగానే చెప్పుకోవడం సిగ్గుచేటు. పసుపు పూలు చల్లి క్రెడిట్ చోరీకి పాల్పడుతున్న చంద్రబాబు రాయలసీమలో పుట్టడం మన ప్రాంత ప్రజల దౌర్భాగ్యం.బాబు చేసిందేమీ లేదు: కాకాణి గోవర్థన్ రెడ్డిరేవంత్రెడ్డి ప్రయోజనాలు కాపాడటం కోసం చంద్రబాబు రాయలసీమ లిఫ్టును తాకట్టుపెట్టాడు. నిజం కాదని మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు చెప్పలేకపోతున్నారు. సూటిగా సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ మీదున్న ప్రేమ చంద్రబాబుకి ఏపీ మీద లేదని తేలిపోయింది. చంద్రబాబు రోజురోజుకీ దిగజారి ప్రవర్తిస్తున్నాడు. సాగునీటి రంగం గురించి కానీ, రైతుల గురించి కానీ ఏనాడూ చంద్రబాబు ఆలోచన చేసిన పాపాన పోలేదు.చంద్రబాబు సీఎంగా ఉంటే చకచకా ప్రాజెక్టులు కట్టుకోవచ్చని పక్క రాష్ట్రాలు సంబరాలు చేసుకుంటాయి. రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు ఆగిపోతే ఆరు జిల్లాల ప్రజల మనుగడ ప్రశ్నార్థకం అయ్యే ప్రమాదం ఉంది. సాగునీటి ప్రాజెక్టులు కట్టకుండా సాగునీటి భద్రత- నీటి సంఘాల బాధ్యత అంటూ తెలుగుదేశం నాయకులు జేబులు నింపే కార్యక్రమాలు చేస్తున్నాడు. ప్రాజెక్టులు మొదలుపెట్టి దోచుకోవడం మినహా చేసిందేమీ లేదు. తెలంగాణకు ఎందుకు అమ్ముడుపోయాడో చంద్రబాబు సమాధానం చెప్పాలి. కలిసొచ్చే వారితో ఉద్యమించి రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్తును తిరిగి ప్రారంభించేలా పోరాడదాం.చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదు: బుగ్గన రాజేంద్రనాథ్దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం రాయలసీమ. రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంత ప్రయోజనాల కోసం అందరూ ఏకం కావాలి. రాయలసీమ ప్రజలు నాకు ఓటెయ్యరు కాబట్టి, నేను రాయలసీమకు ఏమీ చేయననే ఆలోచనలో చంద్రబాబు ఉన్నాడు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి రాయలసీమ ప్రాంతానికి ఆయన చేసిందేమీ లేదు. ఓటేసిన వారికే పనిచేస్తానని ముఖ్యమంత్రి స్ధాయిలో ఉన్న చంద్రబాబు చెప్పడం కన్నా నీచం ఇంకోటి ఉండదు. వైయస్సార్సీపీ హయాంలో జరిగిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.కృష్ణా నది మీద ఎగువన ఉన్న రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతే రాయలసీమకి నీరు ఎలా వస్తాయని విజనరీనని చెప్పుకునే చంద్రబాబు ఆలోచించడం లేదు. రాయలసీమ అభివృద్ధి మీద చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదు కాబట్టే ఇవన్నీ పట్టించుకోవడం లేదు. వైయస్సార్ గారు చేసిన ప్రాజెక్టులను నేనే చేశానని చెప్పుకుంటున్నాడు. రాయలసీమ సమస్యల గురించి పట్టించుకునే వాళ్లే కరువయ్యారు. చంద్రబాబు మోసాలపై ప్రతిఒక్కరూ ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలి.రాయలసీమను ఎడారిగా మార్చే కుట్ర: సాకే శైలజానాథ్రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేస్తున్న కూటమి నాయకులకు ఖచ్చితంగా బుద్ధి చెబుతాం. వారు ఇప్పటికైనా రాయలసీమ ద్రోహి చంద్రబాబును నిలదీయాలి. 20 టీఎంసీలు దేనికి పనికొస్తాయని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు. పంటలు పండక రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారితే ఈ భూములన్నీ ఎకరం 99 పైసలకు అమ్ముకోవాలని చంద్రబాబు కుట్ర చేస్తన్నాడు. గ్రేటర్ రాయలసీమ ప్రజల ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. రాయలసీమ రైతులు వలస వెళ్లి కూలీలుగా మారే పరిస్థితికి ఇప్పటికైనా ఫుల్స్టాప్ పెట్టాలి.గ్రామ స్థాయి నుంచి రిలే నిరాహార దీక్షలు: శిల్పా చక్రపాణిరెడ్డిచంద్రబాబు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రాయలసీమ లిఫ్టును తాకట్టుపెట్టాడు. ఎన్జీటీ అనుమతులు లేవనేది కేవలం సాకు మాత్రమే. గతంలో పట్టిసీమ ప్రాజెక్టును చంద్రబబు ఎన్జీటీ అనుమతులు లేకుండానే మొదలుపెట్టాడు. తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లేకుండానే శరవేగంగా సాగుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. రాయలసీమకు తీవ్ర నష్టం జరుగుతున్నా చంద్రబాబుకి పట్టడం లేదు. గ్రామ స్థాయి నుంచి రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ సాధన కోసం సమిష్టిగా ఉద్యమించాల్సిన అసవరం ఉంది.అందుకోసం గ్రేటర్ రాయల్ సీమ వ్యాప్తంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో రిలే నిరాహార దీక్షలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. దీంతోపాటు ప్రాజెక్టు ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కృషి చేయాలి. సిద్ధేశ్వరం అలుగు పేరుతో గతంలో హడావుడి చేసిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తన కుమార్తెకు ఎంపీ పదవి రాగానే నోరు తెరవడం లేదు. రాయలసీమ లిప్టు కోసం వైఎస్ జగన్ చేసిన కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పెండింగ్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడం చేతకాని చంద్రబాబు, పోలవరం- బనకచర్ల అంటూ ప్రజలకు అబద్ధాలు చెబుతున్నాడు. రైతులకు మేలు జరగాలంటే రాయలసీమ లిఫ్టుని సాధించుకోవాల్సిందే. రాయలసీమ లిఫ్టుపై ప్రజల్లో చర్చ జరగాలి.చంద్రబాబు రాయలసీమ ద్రోహి: ఎమ్మెల్సీ ఇసాక్ బాషానేను అడగడం వల్లే చంద్రబాబు రాయలసీమ లిప్టు ఇరిగేషన్ స్కీమ్ను ఆపేశాడని రేవంత్ రెడ్డి చెప్పాడు. రాయలసీమలో పుట్టి ఈ ప్రాంతానికి చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నాడు. రాయలసీమ బిడ్డల కోసం మనం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. చంద్రబాబు చేస్తున్న ద్రోహాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రాజెక్టును తిరిగి ప్రారంభించేదాకా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం.ప్రభుత్వం మనసు పెడితే ఏడాదిలోపు ప్రాజెక్టు పూర్తి: దారా సుధీర్వైఎస్సార్సీపీ హయాంలోనే రాయలసీమ లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టులో 90 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టుకు అవసరమైన యంత్ర సామాగ్రిని కూడా వైఎస్ జగన్ సమకూర్చారు. చంద్రబాబు వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం రెండేళ్లుగా ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశాడు. ప్రాజెక్టు పూర్తయితే వైఎస్ జగన్కి మంచి పేరొస్తుందనే పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మనసుపెడితే మిగిలిన 10 శాతం పనులు ఏడాదిలోపే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావొచ్చు. వ్యవసాయం, రైతులంటే చంద్రబాబుకి అసహ్యం: పోచ్చా బ్రహ్మానందరెడ్డిచంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం గురించి ఎప్పుడూ పట్టించుకున్న పాపాన పోలేదు. రైతులన్నా, వ్యవసాయమన్నా చంద్రబాబుకి నచ్చదు. ఘోరకల్లు రిజర్వాయర్ సాధ్యం కాదని గతంలో టీడీపీ ప్రభుత్వం తేల్చేసింది. కానీ వైయస్సార్ సీఎం అయ్యాక సాధ్యం చేసి చూపించారు. రైతులతో కలిసి రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ స్కీమ్ కోసం ఉద్యమించాలి. ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహించాలిరాయలసీమ రైతుల త్యాగం గొప్పది: గంగుల బ్రిజేంద్రరెడ్డితరతరాలుగా రాయలసీమ ప్రాంతం తీవ్రంగా నష్టపోతోంది. శ్రీశైలం ప్రాజెక్టు కోసం భూములను త్యాగం చేసిన చరిత్ర మన రైతులది. రాజధానిని కోల్పోయింది. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు. సాధ్యం కాదని తెలిసీ వేల కోట్లు అప్పులు తెచ్చి అమరావతి రాజధాని మీద గుమ్మరిస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాడు. కానీ రాయలసీమ ప్రాంతానికి నీరిచ్చే లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి వెయ్యి కోట్లు వెచ్చించడానికి మాత్రం చంద్రబాబుకి మనసు రావడం లేదు. మంత్రులను సింగపూర్ కి పంపి పబ్లిసిటీలు, జల్సాలు చేయడం తప్ప చిత్తశుద్ధితో చంద్రబాబు ఆలోచించడం లేదు. చంద్రబాబు సీఎం కావడం రైతుల దౌర్భాగ్యం: బుడ్డా శేషారెడ్డిచంద్రబాబు అధికారంలో ఉంటే రైతులంతా రోడ్ల మీద ఉండాల్సిన దుస్థితి. ఎరువులు, పురుగు మందులు, గిట్టుబాటు ధరలు ఏది కావాలన్నా రోడ్డెక్కి ధర్నా చేయాల్సిన దుస్థితి. రాయలసీమలో పుట్టి ఈ ప్రాంతానికి చంద్రబాబు చేసింది శూన్యం. రాయలసీమ రైతాంగాన్ని కాపాడుకోవడం కోసం అందరూ ఉద్యమించాలి. అమరావతికైతే డబ్బులున్నాయా?: తలారి రంగయ్యరాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వైయస్ జగన్ గారు ప్రారంభించక పోయుంటే రైతుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. అమరావతి కోసం లక్షల కోట్లు అప్పులు తెచ్చి మరీ ఖర్చు చేయడానికి సిద్ధపడిన చంద్రబాబు, రాష్ట్రంలో సగం ప్రాంతమైన గ్రేటర్ రాయలసీమ ప్రజల కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి చేయడానికి ఖర్చు చేయడం లేదు. విద్య, వైద్యం, సాగునీటి రంగాల విషయంలో రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది.జగన్ ముందుచూపుతో ఆలోచించారు: పాపిరెడ్డిరాష్ట్ర సాగునీటి రంగాన్ని 2004కి ముందు 2004 తర్వాత అని చూడాలి. దివంగత వైయస్సార్ కృషితో రాయలసీమ ముఖచిత్రం మారిపోయింది. సాగునీటి రంగానికి ఎనలేని కృషి చేశారు. చంద్రబాబు మాటలన్నీ నీటి మూటలుగానే మిగిలిపోయాయి. రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన మొదలు పెట్టి పూర్తి చేసిన ఘనత వైయస్ జగన్కే దక్కుతుంది. రాయలసీమ భావితరాల కోసం దూరదృష్టితో ఆలోచించి పనిచేశారు.అమరావతిపై ఉన్న శ్రద్ధ రాయలసీమ మీద లేదు: కాటసాని రామిరెడ్డిరాయలసీమ లిప్టు ఇరిగేషన్ ప్రాజెక్టు ఆవశ్యకతపై రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైయస్సార్సీపీ నాయకుల మీదనే ఉంది. భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పోరాటం చేయాలి. చంద్రబాబు కారణంగా రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ముంచుకొస్తోంది. అమరావతి మీద ఉన్న శ్రద్ధ ఆయనకు పుట్టిన గడ్డ రాయలసీమ మీద లేదు. రైతు సంఘాలతో కలిసి రాయలసీమ ప్రాజెక్టును పునః ప్రారంభించేలా ఉద్యమించాలి.చంద్రబాబు మోసాలపై గ్రామ గ్రామాన చర్చ జరగాలి: గంగుల ప్రభాకర్ రెడ్డిసాగునీటి రంగాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై గళమెత్తాలి. 90 శాతం పూర్తయిన రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును పక్కనపెట్టేయడం దుర్మార్గం. యావత్తు రాయలసీమ ప్రాంతానికే అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడింది. రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు చేస్తున్న అన్యాయంపై గ్రామగ్రామాన చర్చజరగాలి.ప్రభుత్వానికి బుద్ది చెప్పే సమయం ఆసన్నమైంది: ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డిలిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేసి ప్రజల మనుగడను చంద్రబాబు ప్రశ్నార్థకం చేశాడు. తన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం రాయలసీమ రైతాంగం భవిష్యత్తును పణంగా పెట్టడం దుర్మార్గం. 90 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టు విషయంలో ఆయన వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉంది. రాయలసీమకు వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. తక్షణం పనులు మొదలుపెట్టకపోతే రాయలసీమ కూటమి ప్రజాప్రతినిధులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నా. -
చంద్రబాబు, రేవంత్ మధ్య చీకటి ఒప్పందం: కాకాణి
సాక్షి, నంద్యాల జిల్లా: సీమకు నీటి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ముందు చూపుతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఏర్పాటు చేస్తే.. చంద్రబాబు తన స్వార్థం కోసం ఆపేసారంటూ మండిపడ్డారు. ఇక్కడ ఇంత పోరాటం చేస్తుంటే.. చంద్రబాబు మాత్రం కాసేపట్లో మమ్మల్ని టీడీపీ నాయకులతో తిట్టించే పని మొదలు పెడతారు’’ అంటూ కాకాణి ధ్వజమెత్తారు.చంద్రబాబు, రేవంత్ మధ్య చీకటి ఒప్పందం జరిగింది. ప్రతి విషయంలో ఇంతకన్నా దిగజారుడు అనుకున్న ప్రతి సారి చంద్రబాబు ఇంకా దిగజారి వ్యవహరిస్తున్నారు. ఏ రోజు చంద్రబాబు అధికారంలోకి వస్తాడో ఆ రోజు నుంచి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. రైతుల పేరుచెప్పుకొని నీరు-చెట్టు పేరుతో టీడీపీ నాయకులు దోచుకుంటున్నారు. రైతుల పేరుతో దోచుకోవడం తప్ప సాయం చేయడం చంద్రబాబుకు తెలియదు. ఏ ప్రాంత ప్రజల ఆత్మభిమానం కోసం చంద్రబాబు పని చేయడు ఆయనకు ఆత్మభిమానం లేదు..చంద్రబాబు కన్ను అర్పకుండా చెబుతాడు రాయలసీమను సస్యశ్యామలం చేస్తానంటాడు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గాలికి వదిలేసి కల్లబొల్లి మాటలు చెప్పడంలో దిట్ట. చంద్రబాబు మెడలు వంచి రాయలసీమ ప్రాజెక్టులను సాధించుకుందాం అందరూ సిద్ధం కావాలి’’ అంటూ కాకాణి పిలుపునిచ్చారు. -
వైఎస్సార్సీపీ హయాంలో వాల్మీకులకు పెద్దపీట
ప్యాపిలి: గత వైఎస్సార్సీపీ హయాంలోనే వాల్మీకుల సంక్షేమానికి పెద్దపీట వేశామని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. గుడిపాడు గ్రామంలో నూతనంగా ప్రతిష్టించిన వాల్మీకి విగ్ర హానికి సోమవారం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న బుగ్గనకు వాల్మీకులు, గ్రామ పెద్దలు ఘన స్వాగతం పలికారు. వాల్మీకి విగ్రహానికి పూలమాల లు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోలేని వాల్మీకి గుహలను తమ ప్రభుత్వ హయాంలో తీర్చిదిద్ది పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. రూ. 3 కోట్లతో పర్యాటకంగా అభివృద్ధి చేశామన్నారు. బేతంచెర్ల మండలంలో వాల్మీకి భవన్ నిర్మించిన ఘనత కూడా తమకే దక్కుతుందన్నారు. వాల్మీకి మహర్షిని ఆదర్శంగా తీసుకొని తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోవాలన్నారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి, బూత్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి బొర్రా మల్లికార్జునరెడ్డి, వాల్మీకులు నారాయణ స్వామి, మాజీ సర్పంచ్ గోవిందు, నరేశ్, శంకర్, ఓబులేసు, గ్రామ పెద్దలు రామిరెడ్డి, చిన్నపుల్లారెడ్డి, వెంకటరామిరెడ్డి, జనార్ధన్ రెడ్డి, నారాయణ స్వామి, వైఎస్సార్సీపీ నాయకులు బోరెడ్డి పుల్లా రెడ్డి, కృష్ణారెడ్డి, రజనీ రెడ్డి, కొండయ్య, నాగరాజు, రంగస్వామి, వెంకటేశ్, ప్రేమసాగర్ రెడ్డి, ప్రభాకర్రెడ్డి, పాలవెంకటేశ్, చెన్నకేశవ యాదవ్, ఇంద్రసేనారెడ్డి, పరమేశ్ రెడ్డి, నాగేశ్ రెడ్డి పాల్గొన్నారు. -
రీ–ఓపెన్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రీ–ఓపెన్ అయిన దరఖాస్తులను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై సరైన ఎండార్స్మెంట్ ఇవ్వకపోతే ప్రభుత్వం దానిని తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. ప్రతి దరఖాస్తును బాధ్యతాయుతంగా పరిశీలించి, సమగ్రంగా నివేదికలు సమర్పించాలన్నారు. జిల్లాలో 364 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ రాము నాయక్, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి ఉమామహేశ్వరి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ క్లినిక్స్తో మెరుగైన సేవలు.. భూ సంబంధిత సమస్యలను సమగ్రంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని కలెక్టర్ రాజకుమారి అన్నారు. ఈ క్లినిక్స్ ద్వారా భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా పరిష్కరించే అవకాశముందన్నారు. సోమ వారం 162 దరఖాస్తులు స్వీకరించామన్నారు. -
చస్తే ఎక్కడ పూడ్చాలి!
గ్రామంలో పూర్వం నుంచి ఉన్న శ్మశాన స్థలం రోడ్డు నిర్మాణానికి తీసుకోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గ్రామంలో ఎవరైనా చనిపోతే పూడ్చేందుకు ఎక్కడికి తీసుకెళ్లాలో అర్థంకాని పరిస్థితి ఉంది. అధికారులు స్పందించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలి. – సాదె పక్కీరయ్య, గోస్పాడు శ్మశాన స్థలం రహదారి నిర్మాణంలో పోవడంతో గ్రామంలో తీవ్ర సమస్యగా మారింది. ఇప్పటికే ఉన్న స్థలం చాలక అవస్థలు పడుతుంటే తిరిగి కొత్త సమస్య తలెత్తింది. శ్మశాన స్థలం రహదారి నిర్మాణంలో పోతుందని ముందుగానే అధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరం. – శేఖర్, గోస్పాడు గోస్పాడు: రహదారి నిర్మాణంలో భూసేకరణ సంబంధించిన వ్యవహారాల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎస్సీలకు శ్మశాన వాటిక సమస్య ఎదురైంది. మండల కేంద్రమైన గోస్పాడులో ఎస్సీల్లో రెండు వర్గాల వారికి దాదాపుగా 60 సెంట్లకు పైగా శ్మశాన వాటిక స్థలం ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.23 లక్షల వ్యయంతో రెండు శ్మశానాలకు కాంపౌండ్లు, మెయిన్ గేట్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేసింది. కాగా ఇటీవల కల్వకుర్తి– జమ్మలమడుగు రహదారి పనుల్లో రెండు శ్మశాన వాటికలు పోయాయి. వాటికి అధికారులు ప్రత్యామ్నాయంగా భూమి కేటాయించకపోవడంతో దళితులు సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఎస్సీ కాలనీ వాసులు శిలాస్, కాశన్న, బాలరాజు, అంకన్నతో పాటు దాదాపుగా వంద మందికి పైగా అక్కడి వచ్చి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ సర్వేయర్ ఉమామహేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎంతో కాలంగా ఉన్న శ్మశానాన్ని రహదారి నిర్మాణానికి తీసుకోవడంతో శ్మశాన వాటిక లేక ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. శ్మశాన వాటిక స్థలం పోతుందని తెలిసినా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గ్రామంలో ఎవరైనా చనిపోతే ఎక్కడ పూడ్చాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం గ్రామాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయని, ప్రస్తుతం సెంటు భూమికి ప్రభుత్వం ఎంత మేరకు చెల్లిస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉందని తెలిపారు. గ్రామానికి అవసరమైన శ్మశాన స్థలాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇవ్వాలని కోరారు. శ్మశాన స్థలాన్ని అధికారులు పరిశీలించి తమకు న్యాయం చేయాలని పట్టుబట్టారు. దీంతో తహసీల్దార్ షేక్ మొహిద్దీన్ వెంటనే అక్కడున్న సర్వేయర్ను స్థలం పరిశీలించి నివేదిక అందించాలన్నారు. ఈ విషయంపై తహసీల్దార్ను సాక్షి వివరణ కోరగా చుట్టుపక్కల పొలాల రైతుల భూముల ధరలు విచారించి నివేదికను తయారు చేసి జిల్లా ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు వెల్లడించారు. రహదారి నిర్మాణంలో రెండు ఎస్సీల శ్మశాన వాటికలు గల్లంతు ప్రత్యామ్నాయం చూపని అధికారులు స్థలం కేటాయించాలని రోడ్డెక్కిన ఎస్సీలు -
వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై దాడులు
● ఇద్దరికి తీవ్రగాయాలుసాక్షి టాస్క్ఫోర్స్: గడివేముల మండల పరిధిలోని ఒండుట్ల మజరా గ్రామమైన పైబోగులలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఇళ్లపై టీడీపీ వర్గీయులు కర్రలు, రాడ్లతో దాడి చేశారు. గ్రామానికి చెందిన రమణయ్య, రాజులు పొలం పనులతో జీవనం సాగిస్తున్నారు. గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న సోలార్ నిర్మాణానికి పొలాలను తీసుకున్నారు. పొలాలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం రాకుండా టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారు. నష్టపరిహారం అడిగినందుకు దాడులకు తెగబడుతున్నారు. రమణయ్య, రాజు గత ఎన్నికలలో వైఎస్సార్సీపీకి అనుకూలంగా వ్యవహరించారు. వీరిద్దరూ సోమవారం ఉదయం పొలానికి ఎద్దుల బండిపై వెళ్తుతుండగా టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాడ్లతో దాడి చేశారు. రాజు కాలికి తీవ్రగాయం కావడంతో రక్తస్రావమైంది. స్థానిక పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న బాధితులను వైస్ ఎంపీపీ కాలునాయక్, వైఎస్సార్సీపీ నాయకులు రవీంద్రారెడ్డి, మేఘనాధరెడ్డి, అనిల్కుమార్రెడ్డి పరామర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ సానుభూతి పరులు, నాయకులపై దాడులు చేయడం పరిపాటిగా మారింది. పైబోగుల గ్రామంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై దాడులు చేయడం హేమమైన చర్య. గ్రామానికి చెందిన రాజు, రమణయ్య కుటుంబాలకు అండగా ఉంటాం. దాడులకు పాల్పడిన టీడీపీ వర్గీయులపై పోలీసులు నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలి. – కాటసాని రాంభూపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు -
పీజీఆర్ఎస్కు 106 వినతులు
బొమ్మలసత్రం: స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సునీల్ షెరాన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి 106 వినతులు అందాయి. ఫిర్యాదుల్లో ఎక్కువగా నగదు మోసాలు, భూ తగాదాలు, కుటుంబ వివాదాలకు సంబంధించినవి ఉన్నాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదుదారుల నుంచి అందుకున్న వినతులు పరిశీలించి ఆయా స్టేషన్ అధికారులకు పంపామన్నారు. నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని సూచించామన్నారు. మద్యం విక్రయాల్లో నిబంధనలు పాటించాలి నందికొట్కూరు: మద్యం దుకాణదారులు నిబంధనలు పాటించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని మద్యం దుకాణాలను ఆయన తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల మధ్యనే మద్యం దుకాణాలను నిర్వహించాలని యజమానులకు ఆదేశించారు. సమయం పాలన పాటించకపోయినా, అధిక రేట్లకు విక్రయించినా చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సీఐ జయరాం, నందికొట్కూరు సీఐ రామాంజనేయులు నాయక్, ఎస్ఐ జఫ్రూల్లా, తదితరులు ఉన్నారు. కుటీర నిర్మాణ పథకానికి రూ.15 లక్షల విరాళం శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న కుటీర నిర్మాణ పథకానికి సోమవారం హైదరాబాద్కు చెందిన చిత్త చంద్రశేఖరరెడ్డి దంపతులు రూ.15 లక్షల విరాళాన్ని డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఎం.రమణమ్మకు అందజేశారు. కుటీర నిర్మాణ పథకంలో భాగంగా గణేశసదన్లో షూట్ రూము కోసం ఈ విరాళాన్ని అందించారు. విరాళాన్ని అందించిన దాతకు దేవస్థానం తరుఫున స్వామి వారి శేషవస్త్రాలు, లడ్డూప్రసాదాలను అందించి సత్కరించారు. కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ఆరుగురు విద్యార్థులు డిబార్ అయ్యారు. సోమవారం నాలుగో సెమిస్టర్ పరీక్షలకు 8,395 మందికి గాను 7,570 మంది విద్యార్థులు హాజరు కాగా 819 మంది గైర్హాజరైనట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు తెలిపారు. డోన్ జీవీఆర్ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో ఇద్దరు, కర్నూలు సెయింట్ జోసప్స్ కళాశాల, ఉస్మానియా కళాశాల, నంద్యాల పీఎస్సీ అండ్ కేవీఎస్సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆలూరు శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల కేంద్రంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఆరుగురు విద్యార్థులు చూచి రాతలకు పాల్పడటంతో డిబార్ చేసినట్లు తెలిపారు. వైభవంగా అక్షయ తృతీయ మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో అక్షయ తృతీయ వేడుకలు వైభవంగా జరిగాయి. సోమ వారం శ్రీమఠం పీఠాధిపతి సబుధేంద్రతీర్థులు నేతృత్వంలో వేడుకలు నిర్వహించారు. ముందుగా రాఘవేంద్రులకు సుప్రభాత సేవతో పూజ లు ప్రారంభం కాగా రాఘవేంద్రుల మూల బృందావనానికి విశేష పంచామృతాభిషేకం గావించారు. వేడుక ప్రత్యేకతగా మూల బృందావనాన్ని గంధ లేపనంతో విశేషాలంకరణ చేశారు. పీఠాధిపతి చేతుల మీదుగా మహా మంగళహారతి కానిచ్చారు. గ్రామ దేవత మంచాలమ్మ, మూల సంస్థాన పూజలో భాగంగా మూల, జయ, దిగ్విజయ రాముల పూజలో తరించారు. అక్షయ తృతీయ సందర్భంగా భక్తుల రద్దీ కనిపించింది. -
ఉల్లి సాగు వద్దంటున్న చంద్రబాబు ప్రభుత్వం
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉల్లి ప్రధాన వాణిజ్య పంట. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఏటా లక్ష ఎకరాల వరకు ఉల్లి సాగవుతోంది. ఇలాంటి పంటకు మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలకు ఉల్లి ఎగుమతులు నిలిచిపోయాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పండించిన ఉల్లిలో 50 శాతం బంగ్లాదేశ్కు ఎగుమతి అవుతుంది. అయితే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎగుమతులను నిలిపివేయడం ఉల్లి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ మద్దతు ఇస్తోంది. అయినప్పటికీ బంగ్లాదేశ్కు ఉల్లి ఎగుమతులను ప్రోత్సహించే విధంగా చొరవ తీసుకోవాల్సిన చంద్రబాబు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలోని ఉల్లిలో 80 శాతం ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే పండుతుంది. 2025 ఖరీఫ్లో పండించిన ఉల్లికి ధర పడిపోయినప్పుడు ఎకరాకు రూ.20 వేల ప్రకారం పరిహారం చెల్లించినప్పటికీ రైతులకు పెట్టుబడి కూడా దక్కలేదు. రబీలో ఉల్లి సాగు చేసిన రైతులు 100 శాతం మంది నష్టాలు భరించారు. ఉల్లి సాగు చేసి లాభపడిన రైతు ఒక్కరంటే ఒక్కరూ లేకపోవడం గమనార్హం. కలసిరాని మహారాష్ట్ర రకాలు సాగు మహారాష్ట్రలోని పుణే, నాసిక్ తదితర ప్రాంతాల్లో పండించిన ఉల్లిలో నాణ్యత ఎక్కువగా ఉంటోంది. నిల్వ కూడా ఎక్కువ రోజులు సాధ్యం. మహారాష్ట్ర రకాలతో జిల్లాలో ఉల్లి సాగు చేయించాలని కొన్నేళ్ల క్రితమే కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్హెచ్ఆర్డీఎఫ్ను ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర విత్తన రకాలతో ఉల్లి సాగు చేయిస్తున్నప్పటికీ కలసిరాని పరిస్థితి నెలకొంది. అక్కడి నేలలకు, ఇక్కడి నేలలకు తేడా ఉండటంతో సాగులో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విధిలేని పరిస్థితుల్లో లోకల్ రకాలైన బళ్లారి రెడ్, పూనా రెడ్ వంటి రకాలతో నెట్టుకొస్తున్నారు. ఉల్లి ధర దయనీయం పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, బంగ్లాదేశ్కు ఎగుమతులు నిలిచిపోవడం తదితర కారణాలతో ఉల్లికి డిమాండ్ పడిపోయింది. కేంద్రంతో చర్చించి బంగ్లాదేశ్కు ఎగుమతులను ప్రోత్సహించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఉల్లికి అన్సీజన్. ఈ సమయంలో ఉల్లి ధరల్లో కొంతమేర పెరుగుదల ఉండాలి. కానీ ఎగుమతులు నిలిచిపోవడం వల్ల ఉల్లికి డిమాండ్ లేకుండా పోయింది. రాష్ట్రంలోనే ఉల్లి మార్కెటింగ్కు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు ఆధారం. ఇక్కడే ఉల్లి ధర దయనీయంగా ఉంటోంది. గరిష్ట ధర రూ.841 మాత్రం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ధర కూడా ఒకటి, రెండు లాట్లకు మాత్రమే లభించింది. ఎక్కువ లాట్లకు రూ.500 కూడా మించని పరిస్థితి. 2025–26 రబీలో ఒకటిన్నర ఎకరాలో ఉల్లి సాగు చేశాం. రూ.1.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టాం. దిగుబడి ఆశాజనకంగా వచ్చింది. ధరనే పూర్తిగా నిరాశకు గురి చేసింది.క్వింటాలుకు కనీసం రూ.1200 ధర లభిస్తే గిట్టుబాటు అవుతుంది. అయితే క్వింటాలుకు లభించిన ధర రూ.480 మాత్రమే. ఈ ధరతో అమ్ముకోవడం వల్ల రూ.లక్ష మాత్రమే వచ్చింది. పెట్టుబడితో పోలిస్తే రూ.30 వేలు నష్టం వచ్చింది. ఎగుమతులు లేకపోవడం వల్ల ఉల్లి ధరలు పడిపోయాయి. బంగ్లాదేశ్కు ఎగుమతులు ఉన్నప్పుడు క్వింటాలుకు కనీసం రూ.1200 నుంచి రూ.1500 వరకు ధర లభించేది. ఎగుమతులు లేకపోవడంతో క్వింటాలుకు రూ.500 కూడా లభించడం లేదు. – రామానాయుడు, పులకుర్తి, కోడుమూరు మండలం సోలార్ డ్రైయ్యర్లను విస్మరించిన సర్కారు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీని ఏర్పాటు చేసిన ఉల్లి రైతులను ఆదుకోవాలనే ప్రధాన లక్ష్యంతో సోలార్ డ్రైయర్లను ప్రోత్సహించింది. వీటి వల్ల రైతులు పండించిన ఉల్లికి డిమాండ్ ఏర్పడటంతో పాటు పొదుపు మహిళలకు ఉపాధి లభించింది. ఉల్లి రైతులను ఆదుకోవాలనే ఏకై క లక్ష్యంతో వందలాది సోలార్ డ్రైయర్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం అధికారంలోని చంద్రబాబు ప్రభుత్వం సోలార్ డ్రైయర్లను పూర్తిగా పక్కన పెట్టింది. నేడు జిల్లాలో ఒక్క సోలార్ డ్రైయర్ కూడా కనిపించని పరిస్థితి. బంగ్లాదేశ్కు ఎగుమతులను నిలిపేసిన కేంద్రం మోదీని ఒప్పించడంలో చొరవ చూపని టీడీపీ ప్రభుత్వం ధర పతనమై రైతులకు నష్టాలు మద్దతు ఇవ్వకపోగా సాగు వద్దంటున్న చంద్రబాబు గత ప్రభుత్వం సోలార్ డ్రైయర్లతో ప్రోత్సాహం వీటిని పక్కన పెట్టిన ప్రస్తుత సర్కారు సరిగ్గా 10 నెలల క్రితం ఉల్లి సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర బృందం జిల్లాలో పర్యటించింది. సాగులో ఇబ్బందులు, విస్తీర్ణాన్ని పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు, కొత్త ఉల్లి రకాలను రైతులకు అందుబాటులోకి తేవడం తదితర అంశాలపై కేంద్ర బృందం రైతులతో చర్చించింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఉల్లి సాగు వద్దంటోంది. రాయలసీమ జిల్లాలను ఉద్యాన పంటల హబ్గా అభివృద్ధి చేస్తామంటున్న చంద్రబాబు సర్కార్ ఉల్లి సాగు చేయకుండా చూడాలని, ప్రత్యామ్నాయ పంటలను సూచించాలని ఉద్యాన శాఖను ఆదేశించింది. ఉమ్మడి జిల్లాలో ఏడాది పొడవునా లక్ష ఎకరాల వరకు ఉల్లి సాగవుతోంది. దీనిని 50 శాతానికిపైగా తగ్గించాలని ఉద్యాన శాఖకు లక్ష్యాన్ని నిర్దేశించింది. ఉల్లి పంటకు మద్దతు కల్పించడంలో చేతులెత్తేసిన సర్కార్ ఏకంగా సాగును లేకుండా చేయాలనుకోవడం గమనార్హం. -
డీఎస్జీఎస్డబ్ల్యూఓగా భాస్కర్నాయుడు
● నంద్యాల అధికారిగా కే లలితాబాయి కర్నూలు(అర్బన్): జిల్లా స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు అధికారిగా (డీఎస్జీఎస్డబ్ల్యూఓగా) టీవీ భాస్కర్నాయుడు నియమితులయ్యారు. నంద్యాల జిల్లా డ్వామాలో ఎంఅండ్ఈగా విధులు నిర్వహిస్తున్న ఈయనను కర్నూలు డీఎస్జీఎస్డబ్ల్యూఓగా నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి భాస్కర్ కాటంనేని ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్జీఎస్డబ్ల్యూఓగా నియమితులైన భాస్కర్నాయుడు గతంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎంపీడీఓగా, జిల్లా పరిషత్ ఏఓ, డిప్యూటీ సీఈఓగా విధులు నిర్వహించారు. ఇటీవల జరిగిన పదోన్నతుల్లో భాగంగా ఆయనను ప్రభుత్వం ఇక్కడకు నియమించింది. అలాగే నంద్యాలలో జిల్లా గ్రామ పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న కే లలితాబాయిని నంద్యాల డీఎస్జీఎస్డబ్ల్యూఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 మంది డిప్యూటీ సీఈఓ, డీడీఓలకు పదోన్నతులు కల్పిస్తూ వేర్వేరు జిల్లాలకు స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు జిల్లా అధికారులుగా నియమించారు. -
‘ప్రత్యేక’ నిర్లక్ష్యం!
● ఫెయిల్ అయిన ఇంటర్ విద్యార్థులకు మొదలవ్వని ప్రత్యేక తరగతులు ● ఉత్తర్వులు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ విద్యలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో ఈ ఏడాది మొదటి సంవత్సర విద్యార్థులు జిల్లాలో 6,813 మంది ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన విద్యార్థులు తిరిగి ఉత్తీర్ణులు అయ్యేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేక తరగతులు నిర్వహించింది. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు ‘ప్రత్యేక’ ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈ నెల 1వ తేదీ నుంచే ఇంటర్మీడియెట్ రెండో సంత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. ఫెయిల్ అయిన విద్యార్థులు సెకండియర్ తరగతులకు హాజరుకావాలా? ఫెయిల్ అయిన సబ్జెక్టులు చదువుకోవా లా? అని ఆందోళన చెందుతున్నారు. సప్లిమెంటరీ పరీక్షలు వచ్చే నెల 21 నుంచి జూన్ 4వతేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ పరీక్షల్లో ఫెయిల్ అయినవారికి జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు జిల్లా కేంద్రంలో మాత్రమే పరీక్షలు జరపనున్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఈ నెల 20 నుంచి 27వ తేదీలోపు పరీక్ష ఫీజులు చెల్లించాలి. జిల్లాలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు మొత్తం 23,169 మంది పరీక్షలు రాస్తే 16,356 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరితోపాటు రెండో సంవత్సరం విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ అవకాశం ఇచ్చారు. ఈ నెల 20 నుంచి 27వ తేదీలోపు ఫీజు చెల్లించాలి. ఈ తేదీల్లోనే ఫెయిల్ అయిన విద్యార్థులు, మార్కులు తక్కువ వచ్చినవారు, వచ్చిన మార్కులపై అనుమానమున్న వారు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఫీజుల వివరాలు.. ● రీకౌంటింగ్కి ఒక్కో పేపర్కు రూ.260 ● రీవెరిఫికేషన్తో పాటు, స్కాన్ చేసిన సమాధాన పత్రానికి ఒక్కో సబ్జెక్టుకు రూ.1,300 ● సప్లిమెంటరీ ఫస్ట్ ఇయర్లో థియరీ పరీక్షలకు రూ.600 ● ప్రాక్టికల్ పరీక్షలకు రూ.275 ● బ్రిడ్జి కోర్సు ప్రాక్టికల్ పరీక్షలకు రూ.275 ● ఫస్ట్ ఇయర్, సెకండియర్ థియరీ పరీక్షలకు రూ.1,200 ● వొకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలకు రూ.550 ● మొదటి, ద్వితీయ పరీక్షల్లో పాసై, మార్కులు పెంచుకునేందుకు ఆర్ట్స్ విద్యార్థులు రూ.1350, సైన్స్ విద్యార్థులు రూ.1,600. ఇంటర్మీడియెట్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసి సెకండియర్లోకి వచ్చిన విద్యార్థులకు ఈనెల 1 నుంచి 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యింది. – జి.లాలెప్ప, ఇంటర్మీడియెట్ విద్యా మండలి ప్రాంతీయ కార్యాలయ అధికారి -
నంద్యాలలో అదనపు కోర్టులు ప్రారంభం
నంద్యాల(వ్యవసాయం): నంద్యాల కోర్టు కాంప్లెక్స్లో ఆదివారం 9వ అదనపు జిల్లా కోర్టుతో పాటు రెండవ, మూడవ, నాల్గవ అదనపు కోర్టులను ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.కృష్ణమోహన్, జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి, జస్టిస్ ఎ.హరిహరనాథ శర్మ ప్రారంభించారు. అదనపు కోర్టుల్లో సర్వ మత ప్రార్థనలు నిర్వహించి కాల్వర్క్ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు మాట్లాడుతూ.. అదనపు కోర్టుల ఏర్పాటు కేసుల పరిష్కారం వేగవంతమవుతుందని, ఇది కక్షిదారులకు ఎంతో ఉపయోగమన్నారు. జూనియర్ న్యాయవాదులు వృత్తి ప్రావీణ్యం పెంచుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది మాట్లాడుతూ.. త్వరలో ఉమ్మడి జిల్లాలో మిగిలిన అనదపు కోర్టులను ప్రారంభిస్తామన్నారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవీఎన్ ప్రసాద్, ప్రతాపరెడ్డి, గౌరీశంకర్ ఆధ్వర్యంలో జడ్జీలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలోని వివిధ కోర్టుల జడ్జీలతో పాటు సీనియర్ న్యాయ వాదులు రామసుబ్బయ్య, పెద్ది శ్రీనివాసులు, తిమ్మారెడ్డి, హుసేన్బాషా, సుబ్బరాయుడు, శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్రెడ్డి, తులసిరెడ్డి, కృపావతి, వివేకానందరెడ్డి, రాజేశ్వరరెడ్డి, వెంకటేశ్వర్లు, మహమ్మద్ రఫీ, రామ్మోహన్రెడ్డి, గోళ్ల జయకృష్ణ, ఖలీల్, తిరుపతి, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
ఎకరాకు రూ. 32 వేలకు పైగా ఖర్చు
ఈ ఏడాది రబీ సీజన్లో నాలుగు ఎకరాల సొంత పొలంలో వరిసాగు చేశాను. రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపునివారణ, కోత, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 32 వేలకు పైగా ఖర్చు వచ్చింది. పైరు చేతికందటంతో ఇటీవలే నూర్పిడి పనులు చేపట్టాను. వాతావరణం అనుకూలించకపోవడంతో ఎకరాకు 25 బస్తాలకు మించి దిగుబడులు రాలేదు. – చాకలి సుబ్బారావు, రైతు, కంపమల్ల, కోవెలకుంట్ల మండలం రెండేళ్ల నుంచి వరికి మార్కెట్లో గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్ సీజన్లో వరి సాగుతో నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. రబీలో మూడు ఎకరా సొంత పొలంలో వరి సాగు చేశాను. ప్రస్తుత మార్కెట్లో బస్తా రూ.1,500 లోపే ఉంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింటా రూ. 2,200 ప్రకారం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. – రఘునాథరెడ్డి, రైతు, గుళ్లదూర్తి, కోవెలకుంట్ల మండలం ● -
రేపు ఆది శంకరుల జయంతి
శ్రీశైలంటెంపుల్: వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా మంగళవారం ఆదిశంకరాచార్యుల జయంతి నిర్వహిస్తున్నట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఈఓ మాట్లాడుతూ మంగళవారం ఉదయం 9 గంటలకు పాలధార–పంచధార ఉన్న శంకర మందిరంలో ప్రత్యేక పూజలు చేపడుతామన్నారు. శంకరులు శ్రీశైలంలోని పాలధార–పంచధార వద్ద కొంతసేపు తపస్సు చేసి ఇక్కడే శివానందలహరి గ్రంథాన్ని రచించారని తెలిపారు. నేడు కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 20వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్సైట్లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9.30 గంటలకు అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. అన్నప్రసాద వితరణకు రూ.3 లక్షల విరాళాలు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి పలువురు భక్తులు రూ.3 లక్షల విరాళాలను అందజేశారు. ఆదివారం మహారాష్ట్ర రాష్ట్రం పూణేకు చెందిన ప్రమోద్గుప్తా రూ.లక్ష , హైదరాబాద్కు చెందిన రమేష్ బాబు రూ. లక్ష, టీ.నాగేంద్రకుమార్ రూ.1,05,000, విరాళాన్ని పర్యవేక్షకులకు అందజేశారు. విరాళాలను అందించిన దాతలకు దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను అందించి సత్కరించారు. ఓంకారంలో మహిళ అదృశ్యం ● ఆమె వద్ద 12 తులాల బంగారం బండిఆత్మకూరు: మండల పరిధిలోని ఓంకార దేవస్థానంలో ఓ మహి ళ మిస్సింగ్ అయిన ఘటన కలకలం రేపుతోంది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ఖాదరాబాద్ గ్రామానికి చెందిన జింకల లక్ష్మీదేవి తన కూతురు, మనువరాలు, మరి కొందరితో కలిసి ఒక ఆటోలో ఆదివారం ఉదయం ఓంకార పుణ్య క్షేత్రానికి చేరుకున్నారు. మధ్యాహ్నం సమయంలో కాశిరెడ్డి నాయన ఆశ్రమంలో భోజనం చేసిన అనంతరం తిరిగి ఇంటికి బయలు దేరే సమయానికి లక్ష్మీదేవి కనిపించకుండా పోయింది. ఆ సమయంలో ఆమె వద్ద సుమారు 12 తులాల బంగారం ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న ఎస్ఐ జగన్ మోహన్ సిబ్బందితో చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. మహిళ ఆచూకీ తెలిసిన వారు 8985541339, 9849484977 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. క్వింటా వేరుశనగ రూ.7,394 ఎమ్మిగనూరు టౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్కు ఆదివారం వేరుశనగ దిగుబడులు 1,212 క్వింటాళ్లు వచ్చాయి. క్వింటం వేరుశనగ గరిష్టంగా రూ.7,394 ధర పలికింది, కనిష్ట ధర రూ.3,860, మధ్యస్థ ధర క్వింటం రూ.5,627 పలికినట్లు మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జి. చంద్రమౌళి తెలిపారు. ఆముదాలు 67 క్వింటాళ్లు విక్రయానికి రాగా కనిష్ట ధర క్వింటం రూ.5,010, మధ్యస్థ ధర క్వింటం రూ.5,709, గరిష్ట ధర రూ.5,890, అదేవిధంగా మొక్కజొన్న 25 క్వింటాళ్లు విక్రయానికి రాగా అందులో క్వింటం కనిష్ట ధర రూ.1,410, మధ్యస్థ ధర రూ.1,455, గరిష్ట ధర రూ.1,480కు వ్యాపారు లు కొనుగోలు చేశారు. -
దళారులకు ‘షుగర్లెస్’
బనగానపల్లె: రబీలో షుగర్ లెస్ సాగు చేసిన రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. గిట్టుబాటు ధర లభించకపోవడంతో పెట్టుబడులు కూడా చేతికందని పరిస్థితి నెలకొంది. దళారులు లాభాలు పొందుతూ రైతులను అప్పులపాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎస్సార్బీసీ, అవుకు రిజర్వాయర్ ఆయకట్టు, వ్యవసాయబోర్ల కింద రైతులు రబీలో సుమారు 15 వేల హెక్టర్లలో షుగర్లెస్, 1010 రకాల వరి సాగు చేశారు. ఇందులో ఎక్కువశాతం షుగర్లెస్ ఉంది. ఈ పంటకు మంచి డిమాండ్ ఉన్నందుననే గత రెండేళ్లుగా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. పంట చేతికొచ్చే తరుణంలో గిట్టుబాటు ధర దక్కడం లేదు. 20 రోజుల క్రితం 75 కిలోల బస్తా రూ.1,800 ధర ఉండగా ప్రైవేట్ వ్యాపారులు సిండికెట్గా మారడంతో రూ.1,550కి మించడం లేదు. పెట్టుబడి అధికంగా ఉండటం, దిగుబడి మాత్రం 28–30 బస్తాలకు మించకపోవడంతో రైతులకు నష్టాలు మిగులుతున్నాయి. కౌలు రైతులు మరింత అప్పులపాలయ్యారు. షుగర్లెస్ ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ పంటను దళారులు కొనుగోలు చేస్తున్నారు. పంట కల్లాలో చేరే సమయంలో వ్యాపారులు సిండికేట్గా మారడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. షుగర్లెస్ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. – వెంకటేశ్వర్లు రైతు, కాపులపల్లి బనగానపల్లె మండలం -
కార్మిక సంఘాలతో పోరాటాలను ఉద్ధృతం చేస్తాం
నంద్యాల(న్యూటౌన్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై ఇతర కార్మిక సంఘాలతో కలిసి పోరాటాలు చేస్తా మని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు పేర్కొన్నారు. ఆదివారం సీఐటీయూ రాష్ట్ర మహాసభల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత మూడు రోజులుగా నంద్యాల పట్టణంలో రాష్ట్ర మహాసభలు దిగ్విజయంగా నిర్వహించామన్నారు. 80 మంది చర్చల్లో పాల్గొన్నారన్నారు. రాబోయే మూడు సంవత్సరాల కాలంలో కార్మిక వర్గం స్థితి గతులను మెరుగు పడేందుకు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. మోదీ ప్రభుత్వం లేబర్ కోడ్లతో 12 గంటల పనివిధానాన్ని తెచ్చిందని, దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నట్లు చెప్పారు. కార్మిక చట్టాల అమలు కోసం హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం కార్మికులు సిద్ధంగా ఉండాలన్నారు. రాష్ట్ర మహాసభల్లో 25 తీర్మానాలు ఆమోదం చేసినట్లు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి పేర్కొన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని, స్కీం వర్కర్ల సమస్యలపై ఐక్యపోరాటాలు, మహిళలకు మూడు రోజులు నెలసరి సెలవులు ఇవ్వాలని, వర్కర్లకు రక్షణ భద్రత కల్పించాలన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏసురత్నం, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీలో ‘రచ్చ’కెక్కిన విభేదాలు!
● ఒకే రోజు వేర్వేరుగా కోట్ల, ధర్మవరం కార్యక్రమాలు డోన్: తెలుగుదేశం పార్టీలోని రెండు ప్రధాన వర్గాల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న చందంగా తయారైంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన అనంతరం రెండు వర్గాలు ఏ ఒక్క కార్యక్రమంలో కూడా కలిసి పాల్గొన్న సంఘటన లేదు. చాలాసార్లు తమ పట్ల ఎమ్మెల్యే వర్గం వివక్ష కనబరుస్తోందని ధర్మవరం సుబ్బారెడ్డి వర్గీయులు బాహాటంగా విమర్శలు చేశారు. ఆ మేరకు పార్టీ అధినేతకు ఫిర్యాదు చేశారు. గత శనివారం తనకు కనీస సమాచారం ఇవ్వకుండా తన స్వగ్రామం ధర్మవరం గ్రామంలో రచ్చబండ ప్రారంభోత్సవం పేరుతో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పర్యటించడం ధర్మవరం సుబ్బారెడ్డికి ఆగ్రహం కలిగించింది. దీంతో తన మద్దతుదారుడైన కోడుమూరు నియోజకవర్గంలోని కోట్ల స్వగ్రామమైన లద్దగిరి సర్పంచ్ హనుమంతు పదవీ విరమణ కార్యక్రమం అంటూ ధర్మవరం సుబ్బారెడ్డి అదేరోజు లద్దగిరి గ్రామంలో కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ డోన్ ఎమ్మెల్యే తన రాజకీయ ప్రత్యర్థి కోట్ల చిన్నాన్న అయిన కోట్ల కోదండరామిరెడ్డి కుటుంబీకులను ధర్మవరం సుబ్బారెడ్డి కలవడంతో ఎమ్మెల్యే వర్గీయులకు పుండుమీద కారం చల్లినట్లయింది. ఎగువ అహోబిల క్షేత్రంలో అగ్నిప్రమాదం ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రం ఎగువ అహోబిల క్షేత్రంలో కారధ్య నరసింహస్వామి ఆలయ ప్రవేశ ద్వారం వద్ద భద్రత సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక షెల్టర్ షార్ట్ సర్క్యూట్తో కాలిపోయింది. ఆదివారం గేటు వద్ద ఉన్న షెల్టర్ను ఒక్కసారిగా పొగలు, మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారంతా భయాందోళనకు గురయ్యారు. సీసీ కెమెరాలతో పాటు నిఘా వ్యవస్థ పూర్తిగా కాలి బూడిదైంది. ఈఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
సున్నిపెంటలో కూటమి నేతల సర్వే చట్ట విరుద్ధం
● ఎమ్మెల్యే బుడ్డాపై కేసు నమోదు చేయాలిశ్రీశైలంప్రాజెక్ట్: సున్నిపెంట గ్రామంలో ప్రైవేటు సర్వే చేసేందుకు కూటమి నాయకులకు ఎవరు హక్కు ఇచ్చారని, ప్రైవేటుగా సర్వే చేస్తుంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు.. జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగంతో సున్నిపెంటలో ప్రతి గడప సర్వే చేపట్టారని, ఇందుకు ప్రజలు కూడా సహకరించారన్నారు. అయితే జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా ఎమ్మెల్యే బుడ్డా, ఆయన అనుచరుడు యుగంధర్రెడ్డి మళ్లీ ప్రైవేటుగా సర్వే జరిపించడం చట్టరీత్యా నేరమన్నారు. ప్రజల వ్యక్తిగత వివరాలను వారి ఆధార్కార్డులు, ఇతర పత్రాల ద్వారా సేకరించి డాటా చోరీకి పాల్పడుతున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, యుగంధర్రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సున్నిపెంటలోని కొందరి వ్యక్తుల గృహాలు, స్థలాలను లాక్కోవడానికి టీడీపీ నేతలు పెద్ద కుట్ర పన్నుతున్నారని శిల్పా విమర్శించారు. సున్నిపెంటలో ఏ ఒక్కరూ భయపడవద్దనీ, ప్రజలందరికీ తాను అండగా ఉంటానన్నారు. తాము అధికారంలో ఉన్న ప్పుడు జీవో నంబర్ 40 ద్వారా సున్నిపెంటను గ్రామ పంచాయతీగా చేసి, సచివాలయ వ్యవస్థ తీసువచ్చామన్నారు. స్థానికులకు ఇంటి యాజమాన్య హక్కులు కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు పేదల ఆస్తులను లాక్కునేందుకు యత్నించడం దారుణమన్నారు. సున్నిపెంట ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడుతానన్నా రు. అవసరమైతే సొంత ఖర్చులతో సుప్రీం కోర్టు వరకు ప్రజల ఆస్తులను కాపాడుతానని శిల్పా చక్రపాణిరెడ్డి స్పష్టం చేశారు. -
బీసీ.. అక్రమాలన్నీ మీవే!
బనగానపల్లె: డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదెవరో, ఉనికి కోసం రాజకీయం చేస్తున్నది ఎవరో ప్రజలకు తెలుసని మంత్రి బీసీ జనార్దన్రెడ్డి గురించి బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. రెండేళ్ల టీడీపీ పాలనలో అభివృద్ధి లేకుండా అక్రమాలు తారాస్థాయికి చేరడంతో ప్రజలు ఛీత్కరించుకుంటున్నారన్నారు. కమీషన్లు ఇచ్చేవారికే పనులు ఇస్తూ, గ్రామ పంచాయతీ నిధులు స్వాహా చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను చూపారు. బనగానపల్లెలో శనివారం సాయంత్రం విలేకరులతో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడారు.. ఆయన మాటల్లోనే.. ఓపెన్ డిబేట్కు సిద్ధం ‘‘ నేను 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా ఉన్నా. ఈ సమయంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో శాశ్వత మంచినీటి పథకాలు, రోడ్లు నిర్మాణం, ఇంకా మరెన్నో అభివృద్ధి పనులు చేశాం. బనగానపల్లెలో వందపడకల ఆసుపత్రి, జీఎం టాకీసు నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు సెంటర్ లైటింగ్ సౌకర్యం కల్పిలించాం. కోవెలకుంట్ల, కొలిమిగుండ్లలో ఇదే విధమైన సౌకర్యం కల్పించాం. అన్ని మండల కేంద్రాల్లో రోగులకు వైద్య సౌకర్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మించాం. మంత్రిగా రెండేళ్లుగా మీరు ఏమి చేశారు? ఇద్దరి హయాంలో జరిగిన అభివృద్ధిపై ఓపెన్ డిబేట్కు మేం సిద్ధం. పేద రైతుల తరఫున పోరాడుతాం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని 2020 మార్చిలో భానుముక్కలలో 65.11 ఎకరాల ఎస్ఆర్బీసీ స్థలాన్ని సేకరించాం. అప్పట్లో కోర్టుకు వెళ్లి పేదలకు స్థలం పంపిణీ జరకుండా అడ్డుకున్నారు. ప్రజలకు ఒక చట్టం, మంత్రికి ఒక చట్టమా? ఎన్నికల సమయంలో ఎన్ని కోట్లు అయినా సరే సొంత డబ్బులతో భూమిని కోనుగోలు చేసి పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తానని హామీ ఇచ్చారు కదా.. ఆ హామీ ఏమైంది? అప్పట్లో మేం సేకరించిన భూమినే మీరు పేదలకు పంపిణీ చేసేందుకు సిద్ధం కావడం నిజం కాదా? వెంకటేశ్వరస్వామి ఆలయ మాన్యం భూమి కూడా ఇళ్ల స్థలాల పంపిణీకి సిద్ధమయ్యారు కదా! ఆలయ మాన్యం భూమి 85 ఎకరాలను ఇల్లూరుకొత్తపేట గ్రామంలో గతంలో పేదలకు పంపిణీ చేశారని, దాన్ని తీసుకుంటే పేద రైతుల తరఫున తప్పక పోరాడతాం. బలవంతంగా డబ్బులు వసూళ్లు కొలిమిగుండ్ల మండలం గోరుమానుపల్లి గ్రామ పంచాయతీకి చెందిన మొత్తాన్ని టీడీపీ నాయకుడు రామేశ్వరరెడ్డి స్వాహా చేశారు. ఈ విషయం ఇక్కడ అందరికీ తెలిసిందే. ఈ విషయంపై మంత్రి బీసీ ఎందుకు స్పందించడం లేదు. ఆల్ట్రాటెక్ రాంకో మహా సిమెంట్ ఫ్యాక్టరీల్లో మేం ఎంతో మందికి జీవనోపాధి చూపాం. ఇప్పుడు కమీషన్ల ఇచ్చేవారికే పనులు అప్పగిస్తున్నారు. బనగానపల్లె పట్టణంలో పలువురి నుంచి బలవంతంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. ఇలా వసూలు చేసి అభివృద్ధి కోసమని అబద్ధాలు చెబుతున్నారు’’ అని కాటసాని అన్నారు. ప్రజలు అన్నీ చూస్తున్నారని, సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధిచెబుతారన్నారు. సమాధానం చెప్పాలి నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మంత్రి బీసీ జనార్దన్రెడ్డి స్వగ్రామం యనకండ్లలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేశాం. ఆ గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తే దానిని మూసివేయించి దానిపై ఉన్న నా ఫొటోలకు రంగులు వేయించారు. బనగానపల్లె పాతబస్టాండ్ కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్ను నిర్మిస్తే ఓర్వలేక కూల్చి వేశారు. రోడ్డు వెడల్పులో భాగంగా పాతబస్టా ండ్లో పేద ప్రజలు జీవనోపాధి పొందుతున్న షాపులను తొలగించారు. ఇదే కారణంతో మైనర్ ఇరిగేషన్ కార్యాలయాన్ని తొలగించారు. మంత్రి ఇల్లు కూడా రోడ్డుకు అడ్డంగా ఉంది ఎందుకు తొలగించలేదో సమాధానం చెప్పాలి. మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలో వస్తే అదే స్థానంలో మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తాం. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి -
నంద్యాలలో ‘బయోడైజెస్టర్’
నంద్యాల(న్యూటౌన్): నంద్యాల పట్టణంలో తడి చెత్త నిర్వహణను శాసీ్త్రయంగా, సమర్థవంతంగా చేపట్టేందుకు ఆధునిక బయోడైజెస్టర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. శనివారం నంద్యాల పట్టణంలోని పొన్నాపురం కాలనీలో రూ. 17 లక్షలతో నిర్మించిన బయోడైజెస్టర్ యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ యంత్రం రోజుకు 1000 కిలోల తడి చెత్తను ఎరువుగా మారుస్తుందన్నారు. ఈ ఎరువును వ్యవసాయ భూముల్లో, పండ్ల తోటల్లో, అలాగే గృహ స్థాయిలో పెంచుకునే మొక్కలకు ఉపయోగించుకోవచ్చన్నారు. తయారైన ఎరువును 30 రోజుల పాటు ప్రత్యేక గుంతల్లో నిల్వ ఉంచితే అది మెత్తటి పొడి రూపంలోకి మారుతుందన్నారు. పట్టణంలోని హోటళ్లు, హాస్టళ్ల నిర్వాహకులు ఉత్పత్తి అయ్యే తడి చెత్తను ఈ కేంద్రానికి తరలించి ఎరువుగా మార్చుకోవచ్చన్నారు. నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య బనగానపల్లె రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని జిల్లావిద్యాధి కారి జనార్దన్రెడ్డి అన్నారు. టంగుటూరు, బనగానపల్లె కొండపేట మోడల్ ప్రైమరీ పాఠశాలల ఉపాధ్యాయులు శనివారం నిర్వహించిన బడి పిలుస్తోందని ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, బ్యాగ్లు, నోటుపుస్తకాలు అందుతాయన్నారు. ర్యాలీ అనంతరం బనగానపల్లెలోని ఒక పాఠశాలలో ఆర్వో ప్లాంట్ల నిర్వహణపై డోన్ డి విజన్ స్థాయి ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇ చ్చారు. డోన్ డిప్యూటీ డీఈఓ వెంకటరెడ్డి, సమగ్ర శిక్ష సెక్టోరియల్ ఆఫీసర్స్ మాధవీలత, రామ్మోహన్, ఎంఐఎస్ అండ్ ప్లానింగ్ ఆఫీసర్ జగన్మోహన్రెడ్డి, ఎంఈఓ స్వరూప పాల్గొన్నారు. జూట్ బ్యాగుల తయారీలో ఉచిత శిక్షణ కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని రేషన్కార్డు కలిగిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ మహిళలకు జూట్ బ్యాగుల తయారీలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ డైరెక్టర్ కె.పుష్పక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ ఈ నెల 20 నుంచి మే 4వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన 19 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు అభ్యర్థులు అర్హులన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భో జనం, వసతి సౌకర్యాలను కల్పిస్తామన్నారు. వివరాలకు 9000710508, 9666224931, 9440905477, 08518– 273710 నెంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు. -
నేరం చేసిన వారికి శిక్ష పడేలా దర్యాప్తు
నందికొట్కూరు: నేరం చేసిన వారికి శిక్ష పడేలా దర్యాప్తు నిర్వహించి పోలీస్ శాఖపై ప్రజలకు నమ్మకాన్ని పెంపొందించాలని ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. నందికొట్కూరు రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించిన అనంతరం పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణలో. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దని సూచించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్నారు. గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు యువత బానిసలుగా కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ కేసులు పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ రామాంజనేయులు నాయక్, సీఐలు సుబ్రమణ్యం, ప్రవీణ్కుమార్రెడ్డి పాల్గొన్నారు. నంద్యాల(న్యూటౌన్): కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నా పీఆర్సీ నియమించకపోవడం శోచనీయమని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యా యులు ధర్నా చేశారు. ఏపీటీఎఫ్ నంద్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామచంద్రారెడ్డి, శివయ్య మాట్లాడుతూ మధ్యంతర భృతి 30 శాతం, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు, 2022 నుంచి పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ బకాయిలు, 2003 డీఎస్సీ ఉపా ధ్యాయులకు మెమో నం.57ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. కేజీబీవీలో ఉపాధ్యాయులకు ఎంఈటీఎస్ విధానాన్ని అమలు చేసి, మున్సిపల్ ఉపాధ్యాయులకు పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాకీర్హుసేన్, దస్తగిరి బాషా, తిమ్మారెడ్డి, శ్రీనివాసులు, నూరుల్లా, నౌమాన్బాషా పాల్గొన్నారు. -
అడిషనల్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభం
నందికొట్కూరు: పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన అడిషనల్ సివిల్ జడ్జి కోర్టు ను శనివారం హైకోర్టు జడ్జి, ఆంధ్రప్రదేశ్, అడ్మినిస్ట్రేటివ్ జడ్జి బి. కృష్ణమోహన్ ప్రారంభించారు. ఈయన వెంట హైకోర్టు జడ్జీలు కొనకంటి శ్రీనివాసరెడ్డి, ఎ. హరిహరనాథ శర్మ ఉన్నారు. వీరికి జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కబర్ధి, కర్నూలు జడ్జి రాజేంద్రప్రసాద్, ఎస్పీ సునీల్ షెరాన్, స్థానిక జడ్జిలు శోభారాణి, దివ్య, న్యాయవాదులు, వేద పండితులు పూర్ణ కుంభంతో, మేళాతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. అడిషనల్ కోర్టులో హైకోర్టు జడ్జీలు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సర్వమతాల ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి కృష్ణ మోహన్ మాట్లాడుతూ.. ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత స్థానిక కోర్టులపై ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 88 అదనపు కోర్టులు, కర్నూలు జిల్లాలో 21 అదనపు కోర్టులను మంజూరు అయ్యాయన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రామాంజనేయులునాయక్, సీఐలు సుబ్రమణ్యం, ప్రవీణ్కుమార్రెడ్డి, ఎస్ఐలు, తదితరులు పాల్గొన్నారు. -
కమిషనర్ సారూ.. ఇదేం తీరు!
డోన్: గత కొద్దిరోజులుగా వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న నంద్యాల జిల్లా డోన్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్గౌడ్ తీరు పట్టణంలో చర్చనీయాంశమైంది. ఇటీవల ప్రసాద్గౌడ్ వ్యవహార శైలిపై సామాజిక మాద్యమాల్లో పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. మున్సిపల్ పరిధిలో మొత్తం 32 వార్డులు ఉండగా, ఇటీవల జరిగిన చివరి సమావేశం ఎజెండాలో 45వ వార్డులో తాను నివసిస్తున్నట్లు పేర్కొంటూ తన కూతురు సాయి కీర్తనకు మున్సిపల్ కార్యాలయంలో నాన్ పీహెచ్ వర్కర్గా ఉద్యోగం కోసం ఎమ్మెల్యే సిఫారసు చేశారని అజెండాలో చేర్చారు. ఇదే అజెండాలో సాయి కీర్తన అనే అమ్మాయి మున్సిపల్ కమిషనర్ ప్రసాద్గౌడ్ను ఉద్యోగం కోసం అభ్యర్థించిందని మరోచోట పేర్కొనడం విశేషం. ● మున్సిపల్ పరిధిలో పన్నుల పర్యవేక్షణకు ప్రతి నెలా రూ.35 వేలు ప్రైవేటు వాహనం అద్దె కింద తీ సుకుంటూ ప్రైవేటు డ్రైవర్ను కాదని, రూ.50 వే లు వేతనం తీసుకుంటున్న మున్సిపల్ వాహన డ్రైవర్ ను తన కారు డ్రైవర్గా నియమించుకున్నారు. ● ఆగస్టు 15, జనవరి 26 లాంటి జాతీయ పర్వదినాల సందర్భాలతో పాటు వివిధ నాయకుల జయంతులు, వర్దంతులు జరిపే సమయంలో కూడా ఆయన డ్యాన్సుల పేరిట చిందులు తొక్కు తూ విమర్శలకు గురవుతున్నారు. పట్టణంలోని కోతులు, పందులను పట్టి ఇతర ప్రాంతాలకు తరలించడంతో పాటు కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించానంటూ పెద్ద మొత్తంలో నిధులు స్వాహా చేసినటు ఆరోపణలు ఉన్నాయి. ● ఇటీవల మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి పాదాభివందనం చేసి మరోసారి వార్తల్లోకెక్కారు. ఇదే ప్రసాద్గౌడ్ మూడేళ్ల క్రితం కర్నూలు జిల్లా గూడూరు కమిషనర్గా పనిచేస్తూ అక్కడి ఎమ్మెల్యే సుధాకర్ను మంత్రిగా చేసే వరకు విశ్రమించ రాదని పలు బహిరంగ వేదికల్లో మాట్లాడిన విషయాన్ని స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. ప్రస్తు తం డోన్ కమిషనర్గా కాకుండా ఫక్తు టీడీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్న ప్రసాద్గౌడ్ వైఖరి స్థానికులకు మింగుడు పడటం లేదు. ● స్థానిక పేరంటాలమ్మ గుడి వద్ద మున్సిపల్ స్థలంలో అక్రమంగా నిర్మించారంటూ ఆంజనేయస్వామి గుడిని ప్రొక్లెయిన్లతో కూల్చివేశారు. ఇదే కమిషనర్ ఎమ్మెల్యే కోట్లను తప్పుదారి పట్టించి స్థానిక బోగందాని వంక బఫర్ జోన్ స్థలంలో మరో హనుమాన్ దేవాలయ నిర్మాణానికి పునాదిరాయి వేయించారు. ఇక్కడ గుడి నిర్మించే పేరుతో కొందరు టీడీపీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకే పన్నాగం పన్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కమిషనర్ ప్రసాద్గౌడ్ ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో కూడా నేర్పరని కొందరు విమర్శిస్తున్నారు. కమిషనర్ వ్యవహార తీరుపై ఉన్నతాధికారులు విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తరచూ వివాదాస్పదంగా డోన్ కమిషనర్ అడ్డగోలు నిర్ణయాలతో ప్రజాధనం వృథా అడ్డదారిలో కూతురికి ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం -
సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత
● జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ బొమ్మలసత్రం: విధి నిర్వహణ, శాంతి భద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా గడిపే పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. పోలీసు వెల్ఫేర్ కార్యక్రమం ద్వారా సిబ్బంది సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ గ్రీవెన్స్డేను ఎస్పీ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా 12 మంది సిబ్బంది తమ సమస్యలను విన్నవించగా, పరిష్కరిస్తామని ఎస్పీ భరోసా ఇచ్చారు. మహిళా బిల్లుకు సంపూర్ణ మద్దుతు నంద్యాల: నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా బిల్లుకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శశికళారెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో రాష్ట్ర దృశ్యకళల మాజీ డైరెక్టర్ సునీత అమృత రాజ్, నంద్యాల అసెంబ్లీ అధ్యక్షురాలు హుసేనమ్మ, మాజీ కౌన్సిలర్ కన్నమ్మ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శశికళారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతంపైగా రిజర్వేషన్లను కల్పించారన్నారు. కేబినెట్ పదవులో మహిళలకు ప్రాధాన్యత కల్పించారని, డిప్యూటీ సీఎం, హోంశాఖ, వైద్యారోగ్యశాఖ, టూరిజం.. ఇలా అనేక కీలక శాఖలను మహిళలకు కేటాయించారన్నారు. సంక్షేమ పథకాలు కూడా మహిళలకే వర్థింపజేశారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయానికి వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందన్నారు. భవన నిర్మాణ కార్మికులకు నాలుగు పథకాలు కర్నూలు(అర్బన్): భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికులకు ప్రసూతి సహాయం, వివాహ కానుక, అంత్యక్రియల ఖర్చు, సహజ మరణ ఆర్థిక సహాయం పథకాలను పునరుద్ధరించినట్లు ఉప కార్మిక కమిషనర్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు. భవన నిర్మాణ గుర్తింపు కార్డు కలిగిన కార్మికుల కుటుంబ సభ్యులకు వివాహ కానుకగా రూ.20 వేలు, ప్రసూతి ప్రయోజనం కింద రూ.20 వేలు, సహజ మరణ ఉపశమనానికి రూ.60 వేలు, అంత్యక్రియల ఖర్చులకు రూ.20 వేలు లభిస్తుందని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా పథకాల కింద ప్రయోజనం పొందేందుకు తమ దరఖాస్తులను సమీప సహాయ కార్మిక అధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 15న కార్మిక సంఘాల నాయకులతో అవగాహన సదస్సును నిర్వహిస్తామన్నారు. కార్మిక సంక్షేమ బోర్డులో లబ్ధిదారులుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. -
రేపు హైకోర్టు జడ్జీలు రాక
నంద్యాల(వ్యవసాయం): నంద్యాల కోర్టు కాంప్లెక్స్లో 9వ అదనపు జిల్లా కోర్టుతో పాటు మూడు అదనపు కోర్టుల ప్రారంభోత్సవానికి ఆదివారం నంద్యాలకు హైకోర్టు జడ్జీలు వస్తున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవీఎన్ ప్రసాద్, ఉపాధ్యక్షుడు ప్రతాపరెడ్డి, కార్యదర్శి కందాల గౌరీశంకర్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కర్నూలు ఉమ్మడి జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కబర్ది, నంద్యాల మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజ, కర్నూలు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి హైకోర్టు జస్టిస్ కృష్ణమోహన్, జస్టిస్ కోనకంటి శ్రీనివాసరెడ్డి, జస్టిస్ హరిహరనాథశర్మ, కలెక్టర్, ఎస్పీ, అధికారులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు వారు తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఐఏఎస్ లక్ష్యంగా చదువుతా సంజామల: ఆర్.లింగందిన్నె గ్రామానికి చెందిన మూరబోయిన గౌతమి ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో సత్తా చాటింది. గ్రామానికి చెందిన మూరబోయిన లింగన్న, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె గౌతమి ఇటీవల విడుదలైన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో మెదటి సంవత్సరం బైపీసీ గ్రూప్లో 453 మార్కులు సాధించి అందరి నుంచి అభినందనలు అందుకుంటోంది. గౌతమి ఆరో తరగతి నుంచి పది వరకు కోవెలకుంట్ల గురుకుల పాఠశాలలో చదువుకుంది. ఇంటర్మీడియెట్ కర్నూలు జిల్లా బనవాసి రెసిడెన్షియల్ కళాశాలలో చదువుతోంది. తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. పేదరికం వెంటాడుతున్నా చదువులో గౌతమి రాణిస్తోంది. ఐఏఎస్ లక్ష్యంగా ప్రణాళికతో చదువుతూ ముందుకెళ్తానని గౌతమి చెబుతోంది. జనగణనలో స్వీయ నమోదు విధానంపై అవగాహన నంద్యాల: జనగణన–2027లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వీయ నమోదు విధానాన్ని ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ స్వయంగా అధికారిక వెబ్సైట్ https://se.census.gov.in ద్వారా తన కుటుంబ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు స్వయంగా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ముందుగా పోర్టల్లో నమోదు చేసుకుని, మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ ద్వారా ధ్రువీకరణ పూర్తి చేయాలన్నారు. అనంతరం కుటుంబ సభ్యుల వివరాలు, నివాస సమాచారం, విద్యా స్థాయి, ఉపాధి వంటి అంశాలను కచ్చితంగా నమోదు చేయాలన్నారు. ఒక కుటుంబానికి ఒక మొబైల్ నంబర్ మాత్రమే ఉపయోగించాలన్నారు. నమోదు పూర్తిచేసే ముందు ఆప్షన్ ద్వారా వివరాలను పరిశీలించి, అనంతరం చేయాలని తెలిపారు. ఇంటర్నెట్ సౌకర్యం లేని వారు లేదా స్వయంగా నమోదు చేయలేని వారికి ప్రభుత్వం నియమించిన ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారన్నారు. జిల్లాలోని ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకుని జనగణన ప్రక్రియలో భాగస్వాములు కావాలన్నారు. పెండింగ్లో 2,255 వ్యవసాయ కనెక్షన్లు నంద్యాల(అర్బన్): జిల్లాలో 2024 నుంచి ఇప్పటి వరకు 5,392 కొత్త వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చామని, ఇంకా 2,255 వ్యవసాయ కనెక్షన్ల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, విద్యుత్ శాఖ ఎస్ఈ సుధాకర్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల సంబంధించిన సీనియారిటీ జాబితాను అన్ని సచివాలయాల్లో ప్రదర్శించామన్నారు. ఈ జాబితాలో డిపాజిట్ చెల్లించి కనెక్షన్ల కోసం వేచి చూస్తున్న దరఖాస్తు దారుల వివరాలను సీనియారిటీ క్రమంలో పొందు పరించామని, దరఖాస్తు దారులు తమ దరఖాస్తు ప్రస్తుత స్థితిని సులభంగా తెలుసుకోవచ్చన్నారు. అదే విధంగా 2,464 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామని, 906 ట్రాన్స్ఫార్మర్లు అవసరంగా గుర్తించామన్నారు. రైతులు సచివాలయాల్లో ప్రదర్శించిన జాబితాను పరిశీలించి తమ వంతు వచ్చే వరకు సహకరించాలని జాబితాలో పేరు లేకపోయినా ఏవైనా పొరపాట్లు ఉన్నా వెంటనే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులను కలిసి సరి చేసుకోవాలని సూచించారు. విద్యుత్ సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. -
సంజామలలో 44.8
నిర్మానుష్యంగా కర్నూలులోని కొండారెడ్డి బురుజు ప్రాంతం కర్నూలు(అగ్రికల్చర్): ఎండలు, వడగాలుల తీవ్రత ఉమ్మడి జిల్లాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ కారణంగా విద్యుత్ వినియోగం కూడా అధికమైంది. బయట తిరగడం పక్కనపెడితే.. ఇంట్లో ఫ్యాన్ లేకుండా ఒక్క నిముషం కూడా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఉష్ణోగ్రతల తీవ్రతకు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు నిరంతరం తిరుగుతుండటంతో విద్యుత్ మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 2.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం పెరిగిందంటే ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏప్రిల్ మూడవ వారంలోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోయాయి. నంద్యాల జిల్లా సంజామల మండలంలో హీట్వేవ్ కొనసాగుతోంది. సంజామలలో ఈ నెల 16న ఉష్ణోగ్రత 45.1 డిగ్రీలు నమోదైంది. 17న 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండటం గమనార్హం. ఎండల తీవ్రతతో ఈ మండలం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. 183 చలివేంద్రాలు ఏర్పాటు చేశారట! ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నా.. పాదచారులకు తగిన ఉపశమన చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులు ఇబ్బంది పడరాదనే ఉద్దేశంతో ఎరువులు, పురుగుమందులు, విత్తన షాపుల ఎదుట చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి ఎండలు, వడగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నా.. చలి వేంద్రాలు, చలువ పందిళ్లు వేయడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని చాటుకుంటోంది. జిల్లా మొత్తం మీద ప్రభుత్వం, లోకల్ బాడీస్, స్వచ్ఛంద సంస్థలు అన్నీ కలిపి 183 చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు లెక్కలు ఉన్నాయి. ఇందులో 10 శాతం వరకు పనిచేయడం లేదు. చలివేంద్రాల ఏర్పాటులో అంకెలగారిడీ ప్రదర్శించినట్లు తెలుస్తోంది. కర్నూలు నగరంలోని 9 పాంత్రాల్లో 12 చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, గూడూరు వంటి పట్టణాల్లో చలువ పందిళ్ల జాడ లేకపోవడం గమనార్హం.మండలం ఉష్ణోగ్రత ఆళ్లగడ్డ 44.5 బనగానపల్లి 43.7 రుద్రవరం 43.7 కొత్తపల్లి 43.6 కోడుమూరు 43.6 వెల్దుర్తి 43.6 మంత్రాలయం 43.5 నంద్యాల రూరల్ 43.5 చాగలమర్రి 43.4 కర్నూలు 43.4 ఉయ్యాలవాడ 43.3 కోవెలకుంట్ల 43.3 గూడూరు 43.1 దొర్నిపాడు 43.1 కల్లూరు 43.1 చిప్పగిరి 43 మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలురానున్న రోజుల్లో పలు మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ విభాగం ప్రకటించింది. రాష్ట్రంలోనే అత్యధిక ఎండలు, వడగాలుల తీవ్రత నంద్యాల జిల్లాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చని, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయట తిరగరాదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం ప్రకటించింది. ఈ సారి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 48 నుంచి 50 డిగ్రీలకు చేరే ప్రమాదం ఉన్నట్లు స్పష్టమవుతోంది. సంజమల మండలంలో కొనసాగుతున్న హీట్వేవ్ రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు సంజామలలో 44.8.. ఆళ్లగడ్డలో 44.4 డిగ్రీలు నమోదు అధికమైన విద్యుత్ వినియోగం గిర్రున తిరుగుతున్న విద్యుత్ మీటర్లు 0 -
సమష్టి పోరు
రాయలసీమ ప్రజలు అంటే చంద్రబాబుకు చిన్న చూపు. రాయలసీమ గురించి జగనన్న రాయలసీమ లిఫ్ట్ పనులు ప్రారంభించారు. రైతులకు, ప్రజలకు మేలు చేసే విధంగా జగనన్న చేస్తే, చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రం సీఎం కోసం నిలిపివేయడం దారుణం. రాయలసీమ కోసం పార్టీలకు అతీతంగా పోరాటం చేద్దాం. కలిసి వచ్చే వారందరినీ కలుపుకుందాం. గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేయాలి. ప్రజలు, రైతుల గురించి ఆలోచిస్తున్న జగనన్నకు మద్దతుగా ఉద్యమ బాట పడదాం. – బుట్టా రేణుక, కర్నూలు పార్లమెంటు సమన్వయకర్త మాట్లాడుతున్న అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, చిత్రంలో మాజీ మంత్రి శైలజానాథ్, నంద్యాల, కర్నూలు జిల్లాల అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి, ఎస్వీ మోహన్రెడ్డి, ఎమ్మెల్యేలు బాల నాగిరెడ్డి, విరూపాక్షి, ఎమ్మెల్సీ మధుసూదన్, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, తదితరులుకర్నూలు(టౌన్): చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాయలసీమను పూర్తిగా విస్మరిస్తున్నారు. రైతులంటే ఆయనకు గిట్టదు. తాగునీరు, సాగునీటి విషయంలో సీమ ప్రాంత ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై ఇక పోరుబాట తప్పదని వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరించారు. జిల్లాతో పాటు నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించి ప్రజలు, రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. చంద్రబాబు సీమ ప్రాంత పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యాన్ని వీడాలని ధ్వజమెత్తారు. దివంగత మహానేత వైఎస్సార్, ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనే సీమలో నీళ్లు పారాయన్నారు. చంద్రబాబు అధికారంలోకి రావడంతో కేవలం అమరావతి జపం సాగుతోందన్నారు. రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసి అమరావతిలో రాజధాని నిర్మిస్తామంటున్న చంద్రబాబు.. సీమ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమబాట తప్పదని నేతలు హెచ్చరించారు. వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం కర్నూలు బిర్లా సర్కిల్లోని శ్రీలక్ష్మి ఫంక్షన్ హాలులో ‘రాయలసీమ నీటి ప్రాజెక్టులు– సమాలోచన’ అంశంపై సమావేశం నిర్వహించారు. ముందుగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతపురం మాజీ పార్లమెంటు సభ్యులు, పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామి రెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, కర్నూలు పార్లమెంట్ పరిశీలకులు గంగుల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షులు అహమ్మద్ అలీఖాన్, కర్నూలు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు చల్లా విఘ్నేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ, రాష్ట్ర కార్యదర్శులు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాంపుల్లయ్య యాదవ్, తెర్నేకల్ సురేందర్ రెడ్డి, మద్దూరు సుభాష్ చంద్రబోస్, పార్టీ నేతలు షరీఫ్, కిషన్, రాఘవేంద్ర, పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి, పాటిల్ హనుమంతరెడ్డి, శ్రీనివాస రెడ్డి, నరసింహులు యాదవ్, రామాంజనేయులు, మహిళా నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశికళ, మాజీ కార్పొరేటర్లు రాజేశ్వర రెడ్డి, సిట్రా సత్యనారాయణమ్మ, గాజుల శ్వేతారెడ్డి, సిద్దారెడ్డి రేణుకా, అరుణ, మంగమ్మ, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.శ్రీశైలం ప్రాజెక్టు కోసం సీమ ప్రాంతానికి చెందిన 26వేల మంది రైతులు త్యాగం చేశారు. ఊళ్లు ఖాళీ చేశారు.. గూడు కోల్పోయారు. మరి అమరావతిలో 28వేల మంది రైతుల త్యాగం మాత్రమే చంద్రబాబుకు కనిపిస్తుందా. సీమ రైతులది త్యాగం కాదా. సీమ ప్రాంతంలో సాగునీరు, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మాజీ సీఎం జగనన్న రూ.900 కోట్లు ఖర్చు చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టారు. 10 శాతం పనులతో మొత్తం లిఫ్ట్ పూర్తవుతుంది. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడని లిఫ్ట్ పనులు నిలిపేశావు. లిఫ్ట్ వల్ల 20 టీఎంసీలు నిల్వ చేసుకుంటే 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. – ఎస్వీ మోహన్ రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షులు సీమకు అన్యాయం చేస్తే సహించేది లేదు. 1995 సంవత్సరం నుంచి 2004 వరకు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు రాయలసీమను పట్టించుకోలేదు. ఆ తర్వాత సీఎం అయిన దివంగత వైఎస్సార్ వల్లే ఎస్సార్బీసీ, హంద్రీనీవా ప్రాజెక్టులతో నీళ్లు పారాయి. తెలంగాణ రాష్ట్రం ప్రతి రోజు 8 టీఎంసీల నీటిని తోడుకుంటున్నా ఎందుకు చంద్రబాబు మౌనంగా ఉన్నారు. వేదావతి, గుండ్రేవుల కోసం ఉద్యమిద్దాం. లిఫ్ట్ పనులు సాధించుకుందాం. సీమకు అన్యాయం జరుగుతున్నా రాయలసీమ టీడీపీ నేతలకు పౌరుషం లేదా?. ఈ ప్రాంత రైతుల ప్రయోజనాల కోసం కలిసికట్టుగా పోరాడుదాం. – కాటసాని రాంభూపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాయలసీమ ప్రాంతం అంటే చిన్న చూపు. సీమలో పుట్టిన చంద్రబాబుకు చీము నెత్తురు లేదు. దివంగత నేత వైఎస్సార్ రైతులకు ఉచితంగా కరెంటు ఇస్తామని చెప్పి ఆచరణలో చూపిస్తే అప్పట్లో చంద్రబాబు నాయుడు హేళన చేశారు. కరెంటు వైర్లపై బట్టలు ఆరేసుకోవడానికి తప్ప ఏ మాత్రం సాధ్యం కాదన్నారు. గురు శిష్యులు కలిసి రాయలసీమ రైతాంగాన్ని దగా చేశారు. – వై.బాలనాగిరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు రాయలసీమను ఏడారి చేసే కుట్రలు చేస్తున్నారు. రాయలసీమలో సాగునీరు, తాగునీరు అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోతిరెడ్డిపాడు వద్ద ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడితే చంద్రబాబు తెలంగాణ సీఎం అడిగారని పనులు నిలిపివేయించారు. సీమ ద్రోహి చంద్రబాబు. సీమకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు నాయుడుపై పోరాటం చేద్దాం. – బి.విరూపాక్షి, ఆలూరు ఎమ్మెల్యే రాయలసీమకు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారు. సీమకు అన్యాయం చేసి తెలంగాణకు న్యాయం చేయడం ఏంటి? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీమ ప్రాంత రైతులు, ప్రజల కోసం ఎత్తిపోతల పథకాలకు రూ.900 కోట్లు ఖర్చు చేసి లిఫ్ట్ పనులకు శ్రీకారం చుడితే ఆ పనులు నిలిపివేసి చంద్రబాబు ద్రోహిగా నిలిచారు. సీమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై పోరాడదాం. – డాక్టర్ మధుసూదన్, ఎమ్మెల్సీ సీమ ప్రాంతానికి న్యాయం జరిగిందంటే ఒక్క వైఎస్సార్ కటుంబంతోనే. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద 11 వేల క్యూసెక్కుల సామర్థ్యాన్ని 44వేలకు పెంచిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిదే. రాయలసీమ లిఫ్ట్ పనులను నిలిపి వేసిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుదాం. లిఫ్ట్తో 20 టీఎంసీల నీరు నిల్వ చేసుకోవచ్చు. – ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా పరిషత్తు చైర్మన్తెలంగాణ సీఎంకు సీమ ప్రాంతంలో జరుగుతున్న లిఫ్ట్ పనులు నిలిపివేసి చంద్రబాబు నాయుడు గిఫ్గ్గా ఇచ్చారు. సీమలో పుట్టి ఈ ప్రాంతానికి చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు. జగనన్న హయంలో మంజూరైన లా యూనివర్సిటీని కూడా తరలించారు. హైకోర్టును లేకుండా చేశారు. తెలంగాణ కోసం 6 జిల్లాలను చంద్రబాబు తాకట్టు పెట్టారు. – బీవై రామయ్య, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిరెండేళ్లలో చంద్రబాబు నాయుడు 3.30 లక్షల కోట్లు అప్పు చేశారు. వేల కోట్లు అప్పులు చేసి ప్రజలకు ఏం చేశారు. సుదీర్ఘ అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక్క మంచి పథకం ప్రారంభించారా?. 10 పైసలు ఖర్చు చేసి వంద రూపాయిల బిల్డప్ తప్ప ఆయన చేసిందేమీ లేదు. రాయలసీమ వ్యక్తి అయిన చంద్రబాబు ఎప్పుడూ అమరావతి జపమే చేస్తున్నాడు. సీమ ప్రాంత ప్రజలు ఆయనను తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. – వై.సాయిప్రసాద్ రెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు రాయలసీమ వాసిగా సిగ్గు పడాలి. ఒక్క ప్రాజెక్టు కట్టాడా. సీమ ప్రాంత రైతులను దగా చేశారు. రైతులంటే ఎందుకంత కోపం. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించే లిఫ్ట్ పనులు నిలిపి వేసి చంద్రబాబు చరిత్ర హీనుడిగా నిలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం సీమ ప్రజలను నాశనం చేస్తావా? ఈ ప్రాంత ప్రజలు ఆయన్ను ఎప్పటికీ క్షమించరు. హంద్రీనీవా అంటే దివంగత వైఎస్సార్ గుర్తుకు వస్తారు. మరి చంద్రబాబు రైతులకు ఏం చేశాడో చెప్పాలి. – కంగాటి శ్రీదేవి, పత్తికొడ మాజీ ఎమ్మెల్యే రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. తాగడానికి నీళ్లు దొరకని పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. సీమలోని రైతులు, ప్రజల దాహార్తి పట్టదా. భావి తరాల కోసం మనందరం పోరాడుదాం. ప్రాజెక్టులను సాధించుకుందాం. – ఎస్వీ విజయ మనోహరి, మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సీమ ప్రాంతానికి చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు వద్ద సీమ ప్రజలకు, రైతుల కోసం జగనన్న లిఫ్ట్ పనులు ప్రారంభిస్తే వాటిని తెలంగాణ కోసం చంద్రబాబు నాయుడు నిలిపివేసి సీమకు అన్యాయం చేస్తున్నారు. సీమలోని టీడీపీ నాయకులు రాయలసీమ ప్రాజెక్టు సాధనకు కలిసి రాకుంటే పుట్టగతులుండవు. రైతుల పక్షాన అలుపెరుగని పోరాటం సాగిస్తాం. – రాజీవ్ రెడ్డి, ఎమ్మిగనూరు సమన్వయ కర్త కర్నూలును రాజధానిగా కొనసాగించి ఉంటే బెంగళూరు, చైన్నె తరహాలో అభివృద్ధి సాధించేది. సీమ ప్రాంతాన్ని వైఎస్ కుటుంబం తప్ప ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. జగనన్న ప్రారంభించిన రాయలసీమ లిఫ్ట్ పనులను ప్రారంభించుకుందాం.గ్రేటర్ రాయలసీమ ప్రాంత సమస్యలపై ప్రజలను, రైతులను చైతన్యం చేద్దాం. ఇక సీమ రైతులందరూ కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. – తలారి రంగయ్య, మాజీ పార్లమెంట్ సభ్యులు చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సీమకు అన్యాయమే జరుగుతుంది. రాయలసీమలో భూమి మంచిదే. నీటి లభ్యత లేక రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దివంగత వైఎస్సార్ హయాంలో రిజర్వాయర్లు నిర్మించారు. జగనన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. సీమ రైతుల త్యాగం చంద్రబాబుకు కనిపించడం లేదు. ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులను అవమానిస్తున్నారు. రైతులను ఈ ప్రభుత్వం బిచ్చగాళ్లుగా చూస్తోంది. – వంగాల భరత్ కుమార్ రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాయలసీమ లిఫ్ట్ పనులు వెంటనే ప్రారంభించాలి చంద్రబాబు సీమ ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారు అమరావతి జపం చేస్తున్న టీడీపీ నేతలు సీమ ప్రాంత అభివృద్ధి పూర్తిగా విస్మరించారు కర్నూలులో ‘రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు–సమాలోచన’ సదస్సు గళం వినిపించిన సీమ ప్రాంత ముఖ్య నేతలు -
చిలకలడోణ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
మృత్యు పంజా!కర్నూలు (హాస్పిటల్): అప్పటి వరకు తనతో కబుర్లు చెప్పుకుంటూ వచ్చిన భార్య, అపురూపంగా చూసుకుంటున్న కుమార్తె మృతిని కళ్లారా చూసి గుండెపగిలేలా రోదిస్తున్న వ్యక్తి ఒకరు.. చెట్టంతా కు మారుడు, ఇంటికి పెద్దగా ఉన్న తండ్రి లోకం వీడటంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబీకులు.. తీవ్రంగా గాయపడి హహాకారాలు చేస్తున్న క్షతగాత్రు లను చూసి చీకట్లో మృత్యువు వికటాట్టహాసం చేసింది. అందరూ నిద్రలో ఉన్నారు. వారు ప్రయాణిస్తున్న వా హనం గమ్యానికి చేరువైంది. ఇంతలో ఉలిక్కిపాటు. రెప్పపాటులో ఘోరం. కళ్లు తెరిచి చూసేసరికి చుట్టూ చీకట్లు.. ఆర్తనాదాలు. ఘటనా స్థలం రక్తసిక్తం. కొందరు అప్పటికే ప్రాణం విడిచారు. దైవ దర్శనానికి బయలుదేరిన భక్తులపై మృత్యువు పంజా విసిరింది. మలుపులో మాటు వేసి లారీ రూపంలో ఎనిమిది మందిని మింగేసింది. మరి కొద్ది నిమిషాల్లో దైవ స్మరణలో తరలించాల్సిన వారిలో కొందరు విగతజీవులుగా మారగా.. మరి కొందరు క్షతగాత్రులై ఆసుపత్రి పాలయ్యారు. మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామ సమీపంలో గురువారం తెల్లవారు జామున 3.20 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. కర్ణాటక ప్రాంతానికి చెందిన యాత్రికులు గూడ్స్ వాహనంలో మంత్రాలయం వస్తుండగా.. ఎదురుగా వస్తున్న ఫయాస్ మిల్లర్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలో ఐదుగురు మృతి చెందగా.. ఆసుపత్రిలో ముగ్గురు మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఉన్నారు. క్షతగ్రాతుల భాష అర్థం కాక వైద్యుల సతమతం.. చిలకలడోణ రోడ్డు ప్రమాద క్షతగాత్రులతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్యాజువాలిటీ హాహాకారాలు అక్కడి వారిని కలిచి వేశాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారిలో అమృత(11), తేజస్విని(15), దీక్షిత(16), వర్షిత(19), శుభ (34), జయమ్మ(60), ధన్యశ్రీ(14), దీపక్(16), ప్రతాప్(14), సునీత(20), భారతి(40), సునీల్కుమార్(25) ఉన్నారు. వీరిలో తేజస్విని, శుభల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు క్షతగాత్రులు ఏమి చెబుతున్నారో అర్థం గాక.. కన్నడ భాష అర్థం కాని వైద్యులు, సిబ్బంది చికిత్స అందించడంలో సతమతమయ్యారు. కన్నడ భాష స్వల్పంగా తెలిసిన వారు దగ్గరుండి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా చిన్నారులు బాధతో విలవిలలాడి కొద్దిసేపు మూర్చపోయారు. ఎమినిమిది మంది మృత్యువాత, 12 మందికి తీవ్రగాయాలు ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి అందరూ కర్ణాటక రాష్ట్ర వాసులే క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమం -
ఈద్గా కూల్చేసిన మంత్రి అనుచరులు
బనగానపల్లె: పట్టణ సమీపంలోని ఎస్సార్బీసీ కాలనీలో ఈద్గాను (ముస్లింల ప్రార్థనా మందిరం) రెండు రోజుల క్రితం అర్ధరాత్రి రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్రెడ్డి ఆదేశాలతో ఆయన అనుచరులు జేసీబీలతో కూల్చేశారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, పలువురు ముస్లిం నాయకులు తెలిపారు. ఈద్గా కూల్చివేసిన ప్రదేశాన్ని పరిశీలించేందుకు గురువారం ఉదయం కాటసాని రామిరెడ్డి బనగానపల్లెలోని తన ఇంటి నుంచి బయలుదేరగా, సీఐలు మంజునాథ్రెడ్డి, ప్రవీణ్కుమార్, ఎస్ఐలు దుగ్గిరెడ్డి, కల్పన, పోలీసు సిబ్బందితో వచ్చి అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ముస్లింలు పెద్ద ఎత్తున కాటసాని ఇంటి వద్దకు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తాను ఈద్గా వద్దకు వెళితే పోలీసులకు ఇబ్బంది ఏమిటని కాటసాని రామిరెడ్డి ప్రశ్నిస్తూ తన ఇంటి వద్దే నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బనగానపల్లెలో కొన్నేళ్ల కిందట ఎస్సార్బీసీ ఎస్ఈగా పని చేసిన హుస్సేన్మియా తన సిబ్బందితోపాటు పట్టణ ముస్లిం సోదరుల సహకారంతో ఎస్ఆర్బీసీ కాలనీలో మసీదు, మదర్సా, ఈద్గాను నిర్మించారని తెలిపారు. ప్రస్తుతం ఇళ్ల స్థలాల కోసం మంత్రి బీసీ జనార్దన్రెడ్డి ఎస్సార్బీసీ కాలనీలోని నివాసయోగ్యమైన ఇళ్లు, ఈద్గాను అర్ధరాత్రి కూల్చివేయించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎస్సార్బీసీ కాలనీలోని క్వార్టర్స్, మసీదు, ఈద్గా, మదరసా జోలికి వెళ్లకుండా నిరుపయోగంగా ఉన్న ఆరు ఎకరాల స్థలాన్ని కలెక్టర్తో మాట్లాడి పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి చర్యలు తీసుకున్నానని చెప్పారు. దానిపై అప్పట్లో బీసీ జనార్దన్రెడ్డి కోర్టులో కేసు వేసి స్టే తీసుకొచ్చారని గుర్తుచేశారు. తాను స్టేను తొలగింపచేసే సమయానికి ఎన్నికల కోడ్ వచ్చిందని, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియ ఆగిపోయిందని కాటసాని రామిరెడ్డి వివరించారు. వైఎస్సార్సీపీ లీగల్సెల్ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ఖైర్ మాట్లాడుతూ ఈద్గా కూల్చివేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ముస్లిం నాయకుల వెల్లడి ఈద్గాను పరిశీలించేందుకు బయలుదేరిన కాటసాని హౌస్ అరెస్ట్ బనగానపల్లెలో ఉద్రిక్తత -
మొబైల్కు వచ్చే లింక్లను ఓపెన్ చేస్తే ప్రమాదం
బొమ్మలసత్రం: గుర్తుతెలియని కొత్త నెంబర్ల నుంచి మొబైల్ ఫోన్కు వచ్చే లింక్లను ఓపెన్ చేస్తే ప్రమాదంలో పడ్డట్టేనని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ హెచ్చరించారు. గురువారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో నగదు మోసాలకు పాల్పడుతున్నారని, అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మొబైల్ ఫోన్కు ఏపీకే ఫైల్స్ లింక్ను పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారని వివరించారు. లింక్ను ఓపెన్ చేయగానే మొబైల్ఫోన్లో ఉన్న డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లిపోతుందన్నారు. ఆదమరిచి లింక్ ఓపెన్ చేస్తే వెంటనే పోలీసులు, 1930 నెంబర్కు ఫోన్చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడి అరెస్ట్ కొలిమిగుండ్ల: ఐపీఎల్ టీ20 క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రమేష్బాబు తెలిపారు. నందిపాడుకు చెందిన గుర్రాల కంబగిరి రాముడు అలియాస్ శ్రీరామ్ అనే వ్యక్తి గురువారం ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్పై బెట్టింగ్ నిర్వహించాడు. సమాచారం అందుకున్న శ్రీరామ్ను అదుపులోకి తీసుకొని విచారించారు. అతని వద్ద నుంచి రూ.24 వేలు స్వాధీనం చేసుకున్నారు. వివిధ గ్రామాలకు చెందిన ఎనిమిది మంది వ్యక్తులు శ్రీరామ్ వద్ద బెట్టింగ్ ఆడినట్లు నిర్ధారించారు. ఈ మేరకు అందరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై వినతులకు ఆహ్వానం కర్నూలు(అర్బన్): స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను పరిశీలించేందుకు ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్(చైర్మన్ రిటైర్డు ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా) ప్రజల నుంచి వినతులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ సాధికారత అధికారిణి కె.ప్రసూన తెలిపారు. బీసీల స్థితిగతులు, రిజర్వేషన్లపై అవగాహన ఉన్న వారు తమ వినతిపత్రాలను ఆధారాలతో సహా ఈ నెల 30లోగా చేరే విధంగా పోస్టు ద్వారా పంపాలని ఆమె గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వినతి పత్రాలను డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ కార్యాలయంలోని 1వ అంతస్థు, కొనేరు లక్ష్మయ్య వీధి, మొఘల్రాజాపురం, విజయవాడ – 520010 అనే చిరునామాకు పంపాల్సి ఉందన్నారు. లేదా ఈ మెయిల్ (apbcdedicatedcommisson 2026 @gmali.com) ద్వారా పంపవచ్చన్నారు. సీబీఎస్ఈ ఫలితాల్లో ‘నవోదయం’ ఎమ్మిగనూరుసెంట్రల్: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించిన 10వ తరగతి పరీక్షల్లో బనవాసి జవహర్ నవోదయ విద్యాలయం విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. 79 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందరూ ఉత్తీర్ణత సాధించారు. పాఠశాలకు చెందిన సాయిచరణ్ 485 మార్కులు, గణేష్ 477 మార్కులు, ప్రణీత్ 467 మార్కులు సాధించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ ఈ.పద్మావతి గురువారం అభినందించారు. విద్యార్థులు భవిష్యత్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆమె ఆకాంక్షించారు. -
కొట్టేసిన ఫోన్లు పట్టేశారు
కర్నూలు: రకరకాల కారణాలతో చోరీకి గురైన, పోగొట్టుకున్న సెల్ఫోన్ల రికవరీలో జిల్లా పోలీసులు సత్తా చాటుతున్నారు. బాధితులు ఇచ్చిన ఓ చిన్న ఫిర్యాదుతో పోయిన సెల్ఫోన్లు ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లో ఎక్కడున్నా పట్టేస్తున్నారు. విక్రాంత్ పాటిల్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడు విడతల్లో రూ.3.70 కోట్ల విలువ చేసే 1,873 సెల్ఫోన్లను రికవరీ చేయగా, తాజాగా నాలుగో విడత రూ.1.10 కోట్ల విలువ చేసే 529 సెల్ఫోన్లను రికవరీ చేశారు. బాధితులను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయానికి పిలిపించి ఎస్పీ చేతుల మీదుగా రికవరీ చేసిన సెల్ఫోన్లను బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు మధుసూదన్రావు, శివశంకర్, మస్తాన్, సైబర్ ల్యాబ్ టెక్నికల్ టీమ్ పాల్గొన్నారు. మొబైల్ పోగొట్టుకుంటే.. ఎవరైనా మొబైల్ పోగొట్టుకుంటే కర్నూలు పోలీస్ వెబ్సైట్ http://kurnoolpolice.in/mobiletheft లోకి వెళ్లి లింక్ ఓపెన్ చేసి ఫిర్యాదు ఫారం నింపాలి. పేరు, జిల్లా, పోలీస్స్టేషన్ పరిధి, మొబైల్కు సంబంధించిన ఐఎంఈఐ–1, ఐఎంఈఐ–2 నెంబర్లతో పాటు బిల్లులు ఆన్లైన్లో సమాచారం పొందుపరిస్తే సాంకేతికత ఆధారంగా ట్రాక్ చేసి ఎక్కడుందో పోలీసులు గుర్తిస్తారు. -
వైభవంగా ముగిసిన వసంతోత్సవాలు
ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిల లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న వసంతోత్సవాలు బుధ వారం శాస్త్రోక్తంగా ముగిశాయి. చైత్ర కృష్ణ ఏకాదశి నుంచి మూడు రోజులపాటు స్వామికి వసంతోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా మూడో రోజైన బుధవారం ఉదయం దిగువ అహోబిలంలో వసంత మంటపంలో ఉత్సవ మూర్తులైన శ్రీ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవారిని కొలువుంచి తిరుమంజనం, అర్చన, నవకళశ పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం ఉత్సవ మూర్తులకు గ్రామోత్సవం నిర్వహించారు. వైఎస్సార్సీపీలో పలువురికి పదవులు బొమ్మలసత్రం: నంద్యాల జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులకు పార్టీలో పలు విభాగాలకు సంబంధించి పదవులను కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ● నంద్యాల నియోజకవర్గానికి చెందిన ఎం శివనాగిరెడ్డిని స్టేట్ ఎంప్లాయీస్, పింఛనర్స్ వింగ్ సెక్రటరీగా, గోపవరం జయప్రకాష్ నారాయణరెడ్డిని జిల్లా యూత్వింగ్ వైస్ ప్రెసిడెంట్, పాణ్యంకు చెందిన జీ సుమంత్కుమార్రెడ్డిని పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్, జీ మధుమోహన్రెడ్డిని జిల్లా ట్రెజరర్, సద్దల చంద్రశేఖర్రెడ్డిని జిల్లా యూత్వింగ్ జనరల్ సెక్రటరీ, బొనిగేని బాలుడును జిల్లా యూత్వింగ్ సెక్రటరీగా, రోషనాల సంతోష్కుమార్ను నియోజకవర్గం స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్గా నియమించింది. ● బనగానపల్లెకి చెందిన పేరం సత్యనారాయణరెడ్డిని జిల్లా సెక్రటరీ ఆర్గనైజర్, యేరాసి నాగేశ్వరరెడ్డిని జిల్లా యూత్వింగ్ జనరల్ సెక్రటరీ, కొట్టాల వెంకటేశ్వర్లును జిల్లా యూత్వింగ్ సెక్రటరీ, పీఆర్ చిన్నఓబుల్రెడ్డిని జిల్లా యూత్ వింగ్ సెక్రటరీ, కునుకుంట్ల హరి, గురుకంటి అకార్బాషాలను జిల్లా యూత్ వింగ్ ఎక్సిక్యూటీవ్ మెంబర్లుగా నియమించింది. ● డోన్కు చెందిన ఎద్దుల గజేంద్రనాధ్రెడ్డిని జిల్లా యూత్ వింగ్ వైస్ప్రెసిడెంట్, మధుసూదన్రెడ్డిని జిల్లా యూత్ వింగ్ జనరల్ సెక్రటరీ, రజనికాంత్రెడ్డిని జిల్లా యూత్ వింగ్సెక్రటరీగా నియమించింది. ● శ్రీశైలంకు చెందిన ఎస్ లక్ష్మిరెడ్డిని జిల్లా యూత్వింగ్ జనరల్ సెక్రటరీగా, వీ నారపరెడ్డిని జిల్లా యూత్వింగ్ సెక్రటరీ, ఎల్ చక్రపాణియాదవ్ను, ఎం అల్లాబకాష్, సహ్రిఫా రాజ్, గుంటి శరత్కుమార్లను జిల్లా యూత్వింగ్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి ఎస్బీఎం కార్యక్రమాలపై శిక్షణ కర్నూలు(అర్బన్): ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘స్వచ్ఛ భారత్ మిషన్’ (గ్రామీణ్) కార్యక్రమాలపై ఉమ్మడి జిల్లాలోని డీడీఓ, డీఎల్పీఓ, ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓలకు ఈ నెల 16 నుంచి 29వ తేదీ వరకు వేర్వేరుగా శిక్షణ ఇవ్వనున్నట్లు డీపీఆర్సీ ప్రిన్సిపాల్, జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లాలోని అధికారులకు జెడ్పీ ప్రాంగణంలోని డీపీఆర్సీ భవనంలో, నంద్యాల జిల్లాకు చెందిన అధికారులకు నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణా కార్యక్రమాలను ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 16, 17, 22, మే 5, 12, 13వ తేదీల్లో డీఎల్పీఓ, డీడీఓ, ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓలకు వివిధ అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు. -
వైద్య సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం
● ఐదుగురిపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశాలుమహానంది: మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురంలోని 24 గంటల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిపై తరచూ ఫిర్యాదుల నేపథ్యంలో బుధవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 10.10 గంటల వరకు ఇద్దరు వైద్యులతో పాటు ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్లు విధులు హాజరు కాలేదు. అయితే విధులకు హాజరు కాని ముగ్గురు సిబ్బంది తరఫున స్థానిక ఎంపీహెచ్ఈఓ హుసేన్రెడ్డి ద్వారా మూమెంట్ రిజిస్టర్లో సంతకాలు చేసినట్లుగా ఉండటంతో కలెక్టర్ గుర్తించి తీవ్రంగా పరిగణించారు. ఐదుగురు వైద్య సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆసుపత్రిలో తనిఖీలు ముగించి పక్క గ్రామమైన అబ్బీపురం సచివాలయం వద్దకు చేరుకోగా అక్కడికి వైద్యాధికారులు భగవాన్దాస్, వేణుకార్తికేయలు చేరుకోగా ఇదేనా ‘మీ సమయ పాలన’ అంటూ మండిపడ్డారు. -
భక్తిశ్రద్ధలతో దేవర
ఎమ్మిగనూరుసెంట్రల్: మండలంలోని సోగనూరు గ్రామంలో శ్రీమారెమ్మవ్వ, శ్రీసుంకులమ్మవ్వ దేవర మహోత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో జరిగాయి. దేవర సందర్భంగా ఉదయం నుంచే అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. మహిళలు కుంభాలతో అమ్మవార్ల దేవాలయానికి వెళ్లి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వివిధ గ్రామాల నుంచి బంధువులు తరలిరావడంతో గ్రామంలో సందడి నెలకొంది. వైఎస్సార్సీపీ పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుక, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్రెడ్డి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి కానుకలు సమర్పించారు. -
రోగి కడుపులో అతి పెద్ద కణితి
● విజయవంతంగా తొలగించిన వైద్యులు కర్నూలు(హాస్పిటల్): ఓ రోగి కడుపులో ఏర్పడ్డ అతి పెద్ద క్యాన్సర్ కణితిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జనరల్ సర్జరీ విభాగం వైద్యులు విజయవంతంగా తొలగించారు. బుధవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనరల్ సర్జరీ హెచ్ఓడీ డాక్టర్ హరిచరణ్ వివరాలు తెలిపారు. కర్నూలు నగరంలోని ఎర్రబురుజు ప్రాంతానికి చెందిన జి.మత్తయ్య(75)కు చాలా ఏళ్లుగా కడుపులో గడ్డ(కణితి) ఉంది. ఈ నెల 6న ఆయన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో శస్త్రచికిత్స కోసం చేరాడు. జనరల్ సర్జరీ మొదటి యూనిట్ వైద్యులు అన్ని పరీక్షలు చేసిన తర్వాత అతనికి రెట్రోపెరిటోనియల్ లైపోసోర్కోమా అనే ఒక క్యాన్సర్ గడ్డ ఉన్నట్లు నిర్ధారించారు. ఇది కడుపులో ముప్పావు భాగాన్ని ఆక్రమించేంత పెద్దగా ఉంది. ఈ అతి పెద్ద కణితి అతని ఎడమ మూత్రపిండాన్ని పక్కకు జరిపింది. అన్ని పరీక్షలు అయిన తర్వాత ఈ నెల 15న ఆయనకు మూడు గంటల పాటు శ్రమించి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. ఈ ఆపరేషన్ ప్రక్రియలో డాక్టర్ హరచరణ్తో పాటు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ విజయబాబు, క్యాన్సర్ ఆసుపత్రి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నరేష్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ మహేష్, డాక్టర్ అజమ్ముల్ హుసేన్, పీజీలు ఉన్నారు. అనెస్తీషియా ప్రొఫెసర్ డాక్టర్ రామశివనాయక్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణలత, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ భార్గవ్రామ్ సహకరించారు. ఇంత పెద్ద పరిమాణంలో ఉన్న క్యాన్సర్ కణితిని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ ఎన్టిఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) కింద ఉచితంగా నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. -
నోటీసులు ఇవ్వకుండా శ్రీహరిని అరెస్టు చేయడమేంటి?
● వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బీవై రామయ్యకర్నూలు (టౌన్): పోలీసులు నోటీసులు ఇవ్వకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శ్రీహరిని అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మేయర్ బీవై రామయ్య అన్నారు. బుధవారం ఆయన కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీహరి ఒక జర్నలిస్టుగా పనిచేశారన్నారు. మీడియా ఇన్చార్జ్గా పనిచేసిన వ్యక్తిని ఎందుకు అరెస్టు చేస్తున్నారో కూడా తెలియకుండా పోలీసులు వ్యవహరించడం దారుణమన్నారు. ‘అసలు నోటీసులు ఇచ్చారా.. భయభ్రాంతులు చేయడం కోసమే కదా.. ఆటవిక పాలనలో ఉన్నామా..? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా?’ అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత జయంతి రోజున అంబేడ్కర్కు దండలు వేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు అర్హుడా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభు త్వం భారత రాజ్యాంగం ప్రకారం పనిచేయడం లేదని, రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో ప్రశ్నించిన వారిని ఇబ్బందులు పెడుతోందన్నారు. శ్రీహరి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే అతన్ని బేషరుతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదన్నారు. అవకాశం ఉంది కదా అని చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ప్రజలు గమనిస్తున్నారని, భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. -
పువ్వుల నవ్వులు.. పచ్చని నేస్తాలు..!
ప్రకృతితో మమేకమైతే జీవితంలో సంతోషం విరబూస్తుంది. గొడ్డలితో నరికినా నీడనిస్తూ, ఫలాలను అందిస్తూ చల్లని గాలితో ఆహ్లాదాన్ని పంచడం చెట్లకే చెల్లు. కర్నూలు నగర శివారు, వెంకయపల్లె ఎల్లమ్మకు వెళ్లే దారిలోని చెట్లు(గోల్డెన్ ట్రంపెట్) సరిగ్గా నెల రోజుల క్రితం ఒళ్లంతా పూలతో నవ్వులు చిందించాయి. పసుపు పచ్చని పూలు గాలికి రాలిపడుతూ ఈ ప్రాంతానికి కొత్త అందాలను తీసుకొచ్చాయి. ఇవే చెట్లు నేడు పచ్చని ఆకులతో చల్లని నేస్తాలుగా మారడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు నెల రోజుల క్రితం పువ్వులతో నిండిన చెట్లు ప్రస్తుతం ఆకుపచ్చని ఆకులతో ఆహ్లాదాన్ని పంచుతూ.. -
బాలుడి గొంతులో చిక్కుకున్న గోలి
ఆదోని అర్బన్: పట్టణంలోని ఎన్జీఓ కాలనీకి ఈర న్న, ఉష దంపతుల నాలుగేళ్ల కుమారుడు హన్విత్ ఇంటి దగ్గర ఆడుకుంటూ గోలిని మింగేశాడు. అది గొంతులో చిక్కుకుని నొప్పి వస్తూ గాలి తీసుకోలేక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితిని చూసి వెంటనే తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యురాలు ప్రసూన వెంటనే బాలుడి పరిస్థితిని చూసి ఎండోస్కోపీ ద్వారా 15 నిమిషాల సమయంలోనే శస్త్ర చికిత్స లేకుండా, కుట్లు, కోతలు లేకుండా గోలిని సులభంగా బయటకు తీశారు. బాలుడి తల్లిదండ్రులు వైద్యురాలికి కృతజ్ఞతలు తెలియజేశారు. -
మరణంలోనూ తోడుగా..
గోస్పాడు: కలకాలం కలసి ఉంటామని పెళ్లి నాడు చేసిన ప్రమాణాన్ని మృత్యువు సైతం వారిని విడదీయలేదు. వివాహ బంధంతో ఒక్కటైన ఆ జంట దాదాపు 60 ఏళ్లు కలతలు లేకుండా ఆనందంగా కొనసాగారు. కొన్నాళ్లు కుటుంబ బాధ్యతలతో తలమునకలైనా.. ఆ తర్వాత వృద్ధాప్యంలో కుమారుడి సపర్యలతో జీవితాన్ని గడుపుతుండగా మృత్యువు గంటల వ్యవధిలో వారిని తీసుకెళ్లింది. వారి వైవాహిక జీవితానికి తోడుగా ముగింపు పలకడం కుటుంబీకులు, గ్రామస్తులను కలిచివేసింది. ఈ విషాద ఘటన గోస్పాడు మండలం సాంబవరం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోరెడ్డి అంకాల్ రెడ్డి (88), వెంకటసుబ్బమ్మ (81)కు దాదాపు 60 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ముగ్గురు సంతానం. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈ దంపతులు పాడి పశువులతో పాటు పొలాలు సాగు చేసుకుంటూ జీవనం సాగించారు. మొదటి నుంచి భార్యాభర్తలు ఎలాంటి కలతలు లేకుండా ఎంతో అన్యోన్యంగా మెలుగుతూ ప్రశాంత జీవితాన్ని గడిపారు. వృద్ధాప్యంలో కూడా కుమారుడు వెంకటేశ్వరరెడ్డి వద్ద ఉంటూ కాలం వెల్లదీశారు. ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు కుమారుడు సపర్యలు చేస్తుండేవారు. అయితే వృద్ధాప్యం వల్ల ఇద్దరూ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి భోజన అనంతరం నిద్రకు ఉపక్రమించారు. అయితే తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో వెంకటసుబ్బమ్మ ఆయాస పడుతుండడంతో కుమారుడు వెంకటేశ్వరరెడ్డి గమనించి పలుకరిస్తుండగా కొద్దిసేపటికి ఆమె మృతి చెందింది. భార్య ఇక లేదని తెలుసుకున్న అంకాల్రెడ్డి గుండె ఆగిపోయింది. తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో తండ్రి నుంచి ఎలాంటి చలనం లేకపోవడంతో మృతి చెందినట్లు కుమారుడు గుర్తించాడు. గంటల వ్యవధిలో ఇద్దరు మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదించారు. దంపతులు ఇద్దరూ ఒకే రోజు మరణించడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. గంటల వ్యవధిలో వృద్ధ దంపతుల మృతి 60 ఏళ్ల వైవాహిక జీవితం తోడుగానే ముగింపు సాంబవరం గ్రామంలో విషాదం -
డిగ్రీ పరీక్షల్లో ఆరుగురు విద్యార్థులు డిబార్
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో బుధవారం ఆరుగురు విద్యార్థులు డిబార్ అయినట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్.నరసింహులు తెలిపారు. నాల్గో సెమిస్టర్ పరీక్షలకు 8281 మందికి 7470 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాల కేంద్రంలో ఇద్దరు, నంద్యాల నేషనల్ డిగ్రీ కళాశాల, ఎమ్మిగనూర్ రావూస్ డిగ్రీ కళాశాల, ఎస్ఎమ్ఎల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆలూరు శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల పరీక్షల్లో కేంద్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఆరుగురు విద్యార్థులు చూచిరాతలకు పాల్పడగా డిబార్ చేసినట్లు తెలిపారు. బీఈడీ 4వ సెమిస్టర్ పరీక్షలకు 3575 మందికి 3381 మంది విద్యార్థులు హాజరు కాగా 194 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. వంకలోకి దూసుకెళ్లిన లారీ పత్తికొండ రూరల్ : మండల పరిధిలోని అటికెలగుండు గ్రామ సమీపంలోని మలుపులో ఉన్న బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న ఓ లారీ మంగళవారం రాత్రి అదుపు తప్పి వంకలోకి దూసుకెళ్లింది. బనగానపల్లె నుంచి ఆదోనిలోని రైస్మిల్లుకు వడ్ల లోడుతో లారీ బయల్దేరింది. దేవనబండ–ఆటికెలగుండు మలుపు దగ్గర అదుపు తప్పి వంకలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బుధవారం హమాలీలతో వడ్లను వేరే లారీలోకి మార్చారు. సుళువాయిలో గడ్డివాములు దగ్ధం హొళగుంద: సుళువాయి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఆరు గడ్డివాములు కాలి బూడిదయ్యాయి. దాదాపు రూ. మూడు లక్షల వరకు ఆస్తి నష్ఠం సంభవించింది. గ్రామానికి చెందిన హరిజన పెద్ద ఈరన్న, వెండికట్ట వసంతకుమార్, బసాపురం రమేశ్, చాకలి పరుశురాం అనే రైతులు వరిగడ్డిని కొని ఎస్సీ కాలనీ సమీపంలో నిల్వ చేసుకున్నారు. అయితే మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఉన్నట్టుండి గడ్డివాములకు మంటలు అంటుకుని కాలిపోయాయి. స్థానికులు ఆలూరు ఫైర్స్టేషన్కు సమాచారం అందించగా వారు వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా అప్పటికే కాలి బూడిదయ్యాయి. కర్నూలు(సెంట్రల్): వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీంను 2026–27 ఆర్థిక సంవత్సరానికి కొనసాగిస్తూ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జీఓ విడుదల చేసినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ డెప్యూటీ డైరక్టర్ జయమ్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్రిడిటేషన్ కలిగిన జర్నలస్టులు రూ.1250 ప్రీమియం చెల్లించి పథకాన్ని రెన్యూవల్ చేసుకోవాలన్నారు. www.cfmr.ap.gov.in అనే సైట్లో లాగిన్ అయి హెడ్ అకౌంట్ 8342–00–120–01–03–001, డీడీఓ కోడు 2703 0802 003 నందు ప్రీమియం చెల్లించేలాని సూచించారు. మరిన్ని వివరాలకు కలెక్టరేట్లోని ఐ అండ్ పీఆర్ కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొన్నారు. వ్యక్తి ఆత్మహత్య ప్యాపిలి: పట్టణంలోని స్థానిక శ్రీరామ టాకీస్ సమీపంలో నివాసం ఉంటున్న రామాంజనేయులు (29) అలియాస్ బిట్టు రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలు గు చూసింది. రామాంజనేయులు కొద్ది సంవత్సరాల క్రితం గుడిపాడుకు చెందిన మహేశ్వరిని వివాహం చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. రెండో కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిన మహేశ్వరి రెండు నెలల క్రితం ఆడపిల్లకు జన్మనిచ్చింది. మద్యం సేవించే అలవాటు ఉన్న రామాంజనేయులు భార్య పుట్టింటికి వెళ్లినప్పటి నుంచి మద్యానికి బానిసగా మారాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం తన రెండు చేతులను కోసుకుని అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్తకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన భార్య తన బంధువులకు విషయం చెప్పింది. బుధవారం వారు ఇంటి వద్దకు వచ్చి చూడగా లోపల గడియ పెట్టినట్లు గుర్తించి వెంటనే తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూశారు. రామాంజనేయులు మృతి చెంది ఉండటంతో బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంజినీర్ల కొరత.. పనులు సర్వేశ్వరుడికెరుక!
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం వార్షిక బడ్జెట్ సుమారు రూ.300 కోట్లు ఉంటుంది. అందులో ఇంజినీరింగ్ విభాగానికి బడ్జెట్ అగ్రభాగం. భక్తుల సౌకర్యార్థం క్షేత్రంలో ఏటా సుమారు రూ.వంద కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటాయి. అయితే ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఇంజినీరింగ్ విభాగంలో కొంత మందిదే హవా జరుగుతున్నట్లు సమాచారం. అభివృద్ధి పనుల పర్యవేక్షణకు ఇంజినీర్ల కొర త స్పష్టంగా కనపడుతుంది. రాష్ట్రంలో అతి పెద్ద పుణ్యక్షేత్రాల్లో శ్రీశైల మహాక్షేత్రం రెండవది. శ్రీశైల దేవస్థానంలో ఇంజినీరింగ్ విభాగంలో సూపరింటెండింగ్ ఇంజినీర్ స్థాయి అధికారి ఉండాలి. గతంలో ఎస్ఈ పోస్టు మంజూరైనప్పటికీ దేవస్థాన ఈఓతో సమానమైన హోదా ఉంటుందని గతంలో పనిచేసిన ఈవోలు ఆ పోస్టును తొలగించారు. ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లు ఇద్దరు ఉండాలి. వీరికి బీటెక్ అర్హత ఉండాలి. అలాగే సివిల్–2, ఎలక్ట్రికల్–1, వాటర్ సప్లై–1 ఇలా నలుగురు డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లు ఉండాలి. అలాగే హెడ్ డ్రాఫ్ట్స్మెన్–1, డ్రాఫ్ట్మెన్–2 ఉండాలి. అలాగే ఒక్కో డీఈఈ కింద ఐదుగురు సహాయ ఇంజినీర్లు ఉండాలి. ఒక్కో ఏఈకి ఒక వర్క్ ఇన్స్పెక్టర్ ఉండాలి. అంతేకాకుండా ఎలక్ట్రిషియన్లు, ఫ్లంబర్స్, ఫ్టిర్, పంప్ ఆపరేటర్, సూపర్వైజర్స్, మేషన్ (మేస్త్రి), కార్పెంటర్, వెల్డర్, పెయింటర్, హెల్పర్స్ ఉండాలి. ప్రస్తుతం శ్రీశైల దేవస్థానంలో ఎస్ఈ పోస్టు లేదు. అలాగే ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లులో ఒకరికి మాత్రమే బీటెక్ అర్హత ఉంది. మరొక ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్కు డిప్లొమా అర్హత ఉంది. నలుగురు డీఈఈలకు గాను ఎవరూ లేరు. 20 మంది ఏఈలకు గాను నలుగురు రెగ్యులర్, మరి కొంత మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నారు. డ్రాఫ్ట్మెన్ ఒకరు మాత్రమే ఉన్నారు. ఒకే ఒక్క డ్రాఫ్ట్మెన్.. ఇంజినీరింగ్ విభాగంలో అత్యంత కీలకమైన పోస్టు డ్రాఫ్ట్మెన్. క్షేత్రంలో హెడ్ డ్రాఫ్ట్మెన్ ఒకరు, ఇద్దరు డ్రాఫ్ట్మెన్ ఉండాలి. అయితే ప్రస్తుతం ఒక్క డ్రాఫ్ట్మెన్ మాత్రమే ఉన్నారు. టెండర్ ప్రతిపాదనలను పరిశీలించడం, తనిఖీ చేయడం, రేట్ కోడింగ్ తనిఖీ, టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్ అనుమతులు తీసుకోవడం, బిడ్ డాక్యుమెంట్ సిద్ధం చేయడం, పేపర్ నోటిఫికేషన్ ద్వారా ఈ–ప్రొక్యూర్మెంట్లో టెండర్లు పిలవడం, టెక్నికల్ ఎవాల్యువేషన్, కండీషన్లు ప్రకారం కాంట్రాక్టర్లు దరఖాస్తు చేశారా.. లేదా? తదితర ముఖ్యమైన విధులు డ్రాఫ్ట్మెన్ నిర్వహిస్తారు. ఈయనపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలు పాటించకుండా అక్రమాలకు పాల్పడుతుంటారని పలువు రు కాంట్రాక్టర్లు సైతం ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా దేవదాయ శాఖ అధికారులు శ్రీశైల దేవస్థానంలోని ఇంజినీరింగ్ విభా గంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. అర్హత కలిగిన ఇంజినీర్లను నియమించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. -
అమ్మ కష్టాన్ని చూసి చదివా
మాది నిరుపేద కుటుంబం. నాన్న అన్నపురెడ్డి భాస్కర్ 16 ఏళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. రోజువారి కూలీపోతేగానీ ఇల్లు గడవని పరిస్థితి. మా అక్క అనారోగ్యంతో చనిపోగా, రెండో అక్క బీటెక్ చదువుతోంది. మా పేదరికాన్ని చూసి ఆర్డీటీ వారు ఆరో తరగతి నుంచే నా చదువు బాధ్యతలు తీసుకున్నారు. మా అమ్మ అన్నపురెడ్డి సుబ్బమ్మ కష్టాన్ని చూసి బాగా చదివాను. కర్నూలు నగరంలో ఓ కాలేజీలో ఎంపీసీ గ్రూప్లో చేరి 992 మార్కులు సాధించాను. భవిష్యత్తులో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి, కుటుంబానికి అండగా నిలుస్తాను. – అన్నపురెడ్డి మరియమ్మ, నల్లకాల్వ, ఆత్మకూరు మండలం, నంద్యాల జిల్లా నంద్యాల(న్యూటౌన్): ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో గతేడాదితో పోల్చితే ప్రథమ సంవత్సరం ఉత్తీర్ణత శాతం కొంత మెరుగుబడి, ద్వితీయ సంవత్సరంలో పెద్దగా మార్పులేదు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు బుధవారం విడుదల కాగా మొదటి సంవత్సరం 70.50 శాతం, రెండో సంవత్సరం 78.56 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో బాలుర కంటే బాలికలే అత్యధిక శాతం మంది పాస్ అయ్యారు. మొదటి సంవత్సరం విద్యార్థులు జనరల్ విభాగంలో 13,957 మంది విద్యార్థులు హాజరు కాగా 9 వేల మంది విద్యార్థులు (70 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,343 విద్యార్థులకు గాను 688 మంది (61.75 శాతం) ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్ విద్యార్థులు జనరల్ విభాగంలో 12,657 మందికి గాను 9,297 మంది (78 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,233 మందికి గాను 827 పాస్ (76 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బుధవారం ఇంటర్మీడియెట్ బోర్డు కమిషనర్ ఫలితాలను విడుదల చేశారు. జిల్లా మొదటి సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రంలో 25వ స్థానం, ఇంటర్ రెండో సంవత్సరంలో రాష్ట్రంలో 19వ స్థానంలో నిలిచింది. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో బాలుర కంటే బాలికలే ఎక్కువగా ఉత్తీర్ణత సాధించారు. మొదటి ఏడాది పరీక్షల్లో 6,363 మందికి గాను 3,576 మంది బాలురు పాస్ అయ్యారు. అలాగే బాలికలు 7,694 మందికి గాను 5,424 మంది పాస్ అయ్యారు. అలాగే వొకేషనల్లో బాలురు 692 మందికి గాను 286 మంది పాస్ కాగా, బాలికలు 651 మంది గాను 402 మంది పాస్ అయ్యారు. అదే విధంగా ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాల్లో బాలురు 5,679 మందికి గాను 3,815 మంది పాస్ కాగా, బాలికలు 6,978 మందికి గాను 5,482 మంది ఉత్తీర్ణత సాధించారు. వొకేషనల్ పరీక్షల్లో బాలురు 583 మందికి గాను 331 మంది పాస్ కాగా బాలికలు 650 మందికి గాను 496 మంది ఉత్తీర్ణత సాధించారు. గోస్పాడు మోడల్ స్కూల్లో 99.16 శాతం జిల్లాలో 19 ఏపీ మోడల్ స్కూళ్లు ఉన్నాయి. మొదటి సంవత్సర ఫలితాల్లో 1,489 మందికి గాను 1,092 మంది (74.89 శాతం), ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 1,359 మందికి గాను 1,104 మంది (83.57 శాతం) విద్యార్థులు ఉతీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో జిల్లాలో 100 శాతం ఫలితాలు రాలేదు. మొదటి సంవత్సరంలో గోస్పాడు మోడల్ స్కూల్ 99.16 శాతం సాధించగా, అతి తక్కువలో జూపాడుబంగ్లా మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల 63 శాతం సాధించింది. రెండు కేజీబీవీల్లో వంద శాతం.. జిల్లాలో 26 కేజీబీవీ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. మొదటి సంవత్సరంలో 813 మంది విద్యార్థులకు గాను 573 మంది (70.48 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 653 మందికిగాను, 490 మంది (75.04శాతం) ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరంలో గోస్పాడు, మిడుతూ రు కేజీబీవీలు 100 శాతం ఫలితాలు సాధించగా, ఆళ్లగడ్డ కేజీబీవీ అతి తక్కువ 31 శాతం సాధించి చివరలో నిలిచింది. శ్రీశైలం కళాశాలలో 98 శాతం.. జిల్లాలో 21 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నా యి. ఈ కాలేజీలకు చెందిన విద్యార్థులు మొదటి సంవత్సరంలో 2,599 మందికి గాను 1170 (45.72 శాతం), ద్వితీయ సంవత్సరంలో 2,203 మందికి గాను 1,498 (67.9 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం అత్యధికంగా శ్రీశైలం ప్రభుత్వ జూనియర్ కళాశాల 98 శాతం, అతి తక్కువ ఆళ్లగడ్డ ప్రభుత్వ జూనియర్ కాలేజీ 20 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. రెసిడెన్షియల్ కాలేజీల్లో ఇలా.. జిల్లాలో ఆరు సోషల్ వెల్ఫేర్ కళాశాలలకు చెందిన విద్యార్థులు కాలేజీలకు చెందిన విద్యార్థులు ఫస్ట్ ఇయర్లో 441 మందికి గాను 410 మంది (93 శాతం) ఉత్తీర్ణులయ్యారు. సెకండ్ ఇయర్లో 390కి గాను, 377 మంది (97 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ● ఒకేషనల్ 9 ప్రభుత్వ కళాశాలల్లో 1,343 మందికి గాను 688 పాస్ కాగా (51 శాతం) ఉత్తీర్ణత సాధించారు. అలాగే రెండో సంవత్సరం 1,233 మంది విద్యార్థులకు గాను 827 మంది పాసై (67శాతం) ఉత్తీర్ణులయ్యారు. ● జిల్లాలో మూడు బీసీ వెల్ఫేర్ కళాశాలలో మొదటి సంవత్సరం 243 మందికి గాను 230 మంది పాస్ కాగా 94.5 శాతం ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సరం 238 మందికి గాను 222 మంది (94శాతం) ఉత్తీర్ణత సాధించారు. ● ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ మూడు కళాశాలల్లో మొదటి సంవత్సరం 282 మందికి గాను 252 మంది (89 శాతం) ఉత్తీర్ణత సాధించారు. అలాగే రెండో సంవత్సరం 295 మంది విద్యార్థులకు గాను 268 మంది (90 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ కళాశాలల్లో అత్యధిక మార్కులు సాధించిన వారు.. మొదటి సంవత్సరం బైపీసీ విభాగంలో జీవమణి (438) ఆత్మకూరు, ఎంపీసీ విభాగంలో గురుపవిత్ర (458) ఆళ్లగడ్డ, సీఈసీలో ధనలక్ష్మి (489) ఉయ్యాలవాడ, రమేష్ (475) కొలిమిగుండ్ల, షేక్ జరీనాబేగ్ (487) నంద్యాల, సెకండియర్ ఎంపీసీలో రమ్య (984) ప్యాపిలి, లక్ష్మీనరహరి (983) కోవెలకుంట్ల, షేక్ రియాజ్ (961), శీశైలం, సీఈసీలో అక్బర్బాబు 951(డోన్), ఉసేన్బీ (900) సంజామల, బైపీసీలో సీమ 974 (గోస్పాడు), స్వరూపరాణి (971) పాములపాడు.. తో పాటు పలువురు విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు. ఇంటర్లో ఎంపీసీలో నాకు 984 మార్కులు వచ్చాయి. మా తల్లిదండ్రులు కూలీ పనులు చేసి కష్టపడి పడి నన్ను చదివించారు. కష్టపడి చదివించిన వారి రుణాన్ని ఇంజనీర్ను అయి తీర్చుకుంటా. వారి ఆశయ సాధనకు నిరంతరం శ్రమిస్తా. ఇంజనీర్ కావాలని ఉంది. – రమ్య, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్యాపిలి రీకౌంటింగ్కు అవకాశం... రీ వెరిఫికేషన్ దరఖాస్తులు ఈనెల 20 నుంచి 27 వరకు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల 21 నుంచి జూన్ 4వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఐఈఓ శంకర్ నాయక్ తెలిపారు. పరీక్షల ఫీజు, చెల్లించాల్సిన తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కోవెలకుంట్ల: మండలంలోని వెలగటూరుకు చెందిన ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన షాలిని నంద్యాల పట్టణంలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసింది. బుధవారం ఇంటర్ ఫలితాలు వెల్లడి కాగా పరీక్షల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపం చెందింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రసాయన ద్రావణం(పేడపౌడర్) తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యానికి నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా ఫస్టియర్లో 70.50 శాతం, సెకండియర్లో 78.56 శాతం ఉత్తీర్ణత సత్తాచాటిన ప్రభుత్వ కళాశాల విద్యార్థులు -
టోల్ప్లాజా ఉద్యోగిని కిడ్నాప్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే
పాములపాడు: నంద్యాల జిల్లా శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి బుధవారం టోల్ప్లాజా ఉద్యోగి మహేష్ ను కిడ్నాప్ చేశారు. అతడి తల్లిదండ్రులు, తోటి ఉద్యోగులు, గ్రామపెద్దలు వెళ్లడంతో వదిలిపెట్టారు. టోల్ప్లాజా ఉద్యోగిని దౌర్జన్యంగా కారులో ఎక్కించి తీసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నేషనల్ హైవే 340సీ మీద పాములపాడు మండలం రుద్రవరం వద్ద టోల్ప్లాజా ఉంది. ఆ టోల్ప్లాజాలో రుద్రవరం గ్రామానికి చెందిన మహేష్ టోల్ కలెక్టర్గా పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కర్నూలు నుంచి ఆత్మకూరు వైపు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన వాహనం యూపీఐ చెల్లింపుల లైన్లోకి వచ్చింది. ముందున్న వాహనం యజమాని టోల్చార్జీని ఫోన్పే ద్వారా చెల్లిస్తుండటంతో ఎమ్మెల్యే వాహనం ఆగాల్సి వచ్చింది. దీంతో ఎమ్మెల్యే టోల్ప్లాజా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేనెవరినో తెలియదా.. నీ కథ చూస్తాను’’ అంటూ హూంకరించారు. ‘వాడిని కారులో ఎక్కించండిరా..’ అంటూ అనుచరులను పురమాయించగా వారు మహేష్ ను బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. మహేష్ ను ఎమ్మెల్యే స్వగ్రామమైన వెలుగోడు మండలం వేల్పనూరుకు తీసుకెళ్లారు. దీంతో మహేష్ తల్లిదండ్రులు, గ్రామపెద్దలు, టోల్ప్లాజా ఉద్యోగులు వేల్పనూరు వెళ్లారు. అనంతరం మహేష్ ను ఎమ్మెల్యే అనుచరులు వదిలిపెట్టారు. -
అందరికీ ఆదర్శం అంబేడ్కర్
సాక్షి, నంద్యాల: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందరికీ ఆదర్శమని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. మంగళవారం నంద్యాల మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన అంబేడ్కర్ విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జయంత్యుత్సవ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ నంద్యాలలో అంబేడ్కర్ భవనం నిర్మాణానికి ప్రణాళికలు తయారు చేశామన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ.. అంబేడ్కర్ చిన్నతనంలో ఎన్నో వివక్షలను ఎదుర్కొన్నప్పటికీ, ఉన్నత విద్యను సాధించి గొప్ప స్థాయికి ఎదిగారన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎం.జావళి ఆల్ఫోన్స్, పలు సంఘాల నాయకులు కొమ్ముపాలెం శ్రీనివాసులు, లింగుస్వామి, దండు వీరయ్య, డీవీఎంసీ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ శేషన్న, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చింతామణి పాల్గొన్నారు. -
ఉగ్ర భానుడు
● కోడుమూరు, సంజామల మండలాల్లో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాపై బానుడు విరుచుకుపడుతున్నాడు. మంగళవారం ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత మరింత పెరిగింది. కర్నూలు జిల్లా కోడుమూరులో 44.2, నంద్యాల జిల్లా సంజామలలో 44.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇవే అత్యధిక ఉష్ణోగ్రతలు కావడం గమనార్హం. ఏప్రిల్ మొదటి పక్షంలోనే ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటితే.. మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన నెలకొంది. అత్యధిక మండలాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని, వడదెబ్బకు గురికాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ విభాగం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సురేష్కుమార్ తెలిపారు. -
ఉజ్వల భవితకు పాలిటెక్నిక్
నంద్యాల(న్యూటౌన్): పాలిటెక్నిక్ ఉత్తీర్ణులైన వారికి ఉపాధి అవకాశం అధికంగా ఉంటుంది. బీటెక్ పూర్తి చేసివారి కంటే ఉద్యోగాల ఎంపికలో ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ సెక్టార్లోనూ పాలిటెక్నిక్ వారికే పెద్దపీట వేస్తున్నారు. తక్కువ సమయం, ఖర్చుతో ఉద్యోగ, ఉపాధిని సులువుగా పొందే వెసులుబాటు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల ద్వారా ఉంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే పాలిసెట్ రాసేందుకు పదోతరగతి విద్యార్థులు సైతం పోటీ పడవచ్చని తెలియజేస్తున్నారు. ఇంటర్ ఒకేషనల్ విద్యార్హతతో నేరుగా పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం పొందవచ్చని చెబుతున్నారు. అలాగే ఐటీఐ విద్యార్థులు బ్రిడ్జి పరీక్ష ద్వారా డిప్లొమా కోర్సుల్లో ద్వితీయ ఏడాదికి అడ్మిషన్ అందుకోవచ్చని వివరిస్తున్నారు. ఇంతటి సువర్ణావకాశాలు గల ఈ కోర్సులపై జిల్లాలోని పాలిటెక్నిక్ సిబ్బంది సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. పిల్లల ఉజ్వల భవితకు దిశా నిర్దేశం చేస్తున్నారు. కళాశాలల వివరాలు... జిల్లాలో మొత్తం ఐదు పాలిటెక్నిక్ కళాశాలు ఉన్నాయి. అందులో ప్రభుత్వ కాలేజీలు 3, ప్రైవేటు 2 కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వ పాలిటెక్నిక్ ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల (నంద్యాల), ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల (శ్రీశైలం), ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల (బేతంచెర్ల), ప్రైవేటు కళాశాలలు: ఎస్వీఆర్ ఇంజనీరింగ్(నంద్యాల), వాసవీ పాలిటెక్నిక్(బనగానపల్లె) ఉన్నాయి. బ్రాంచ్లు, సీట్ల వివరాలు... ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో సివిల్, మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, సీఎంఈ, బీఎం, సీహెచ్ఎస్టీ, సీసీపీ, డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులు. అయితే డిప్లొమా ఇన్ బయోమెడికల్ ఇంజినీరింగ్ మాత్రం మూడున్నరేళ్ల కోర్సు. ప్రారంభమైన ఉచిత శిక్షణ... జిల్లాలోని మూడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో పాలిసెట్కు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ఉచిత శిక్షణతో పాటు మెటీరియల్ను అందించనున్నారు. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శిక్షణ ఉంటుంది. ప్రవేశం ఇలా.. ఇంటర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్హతతో ఎటువంటి ప్రవేశ పరీక్ష లేకుండా పాలిటెక్నిక్లో చేరొచ్చు. అలాగే ఇంటర్ ఒకేషనల్ చేసిన విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరై ద్వితీయ ఏడాది పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశం పొందవచ్చు. అలాగే ఐటీఐ ట్రేడ్లలో 60 శాతానికి పైగా మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు బ్రిడ్జి కోర్సు ద్వారా నిర్వ హించే అర్హత పరీక్షకు హాజరవ్వాలి. ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ద్వితీయ ఏడాది పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో అడ్మిషన్ పొందవచ్చు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు, ఇదివరకే పదో తరగతి పూర్తి చేసిన వారు పాలిసెట్కు దరఖాస్తు చేసుకో వచ్చు. ప్రవేశం నాటికి పదో తరగతి సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. డిప్లొమా కోర్సులతో చక్కటి ఉపాధి లభిస్తుంది. జీవితంలో త్వరగా స్థిరపడడానికి పాలిటెక్ని క్ సరైన మార్గం. విద్యార్థులకు ఇదో మంచి అవకాశం, డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం, ఉపాధి పొందవచ్చు. పై చదువులకు సైతం ఉపయోగపడుతుంది. విద్యార్థులకు బుధవారం నుంచి ఉచితంగా శిక్షణ సైతం అందిస్తున్నాం. – శైలేంద్రకుమార్, పాలిసెట్ కన్వీనర్, నంద్యాలఉచిత శిక్షణ పొందుతున్న విద్యార్థులు పదో తరగతి విద్యార్థులకు అవకాశం ఇంటర్ ఒకేషనల్ విద్యార్హతతో ద్వితీయ ఏడాదిలో నేరుగా ప్రవేశం బ్రిడ్జి పరీక్ష ద్వారా ఐటీఐ విద్యార్థులకు సెకండియర్లో అడ్మిషన్ 25న ప్రవేశ పరీక్ష డిప్లొమో కోర్సులతో చక్కటి ఉపాధి -
వైభవంగా వసంతోత్సవాలు
ఆళ్లగడ్డ: చైత్ర కృష్ణఏకాదశి నుంచి మూడు రోజులపాటు శ్రీ అహోబిల లక్ష్మీనరసింహ స్వామి వసంతోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా రెండో రోజైన మంగళవారం ఉదయం దిగువ అహోబిలంలో ప్రత్యేక పూజలు చేశారు. వసంత మంటపంలో ఉభయ దేవేరులతో కొలువైన శ్రీ ప్రహ్లాదవరదులకు నవకళలశాలతో, పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం 108 కలశాలతో తిరుమంజనం సేవ నిర్వహించారు. ఉత్సవమూర్తులను పట్లుపీతాంబరాలతో ప్రత్యేకంగా అలంకరించి కొలువుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. 26 నుంచి ‘శాప్’ ఎంపిక పోటీలు నంద్యాల(న్యూటౌన్): ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో 2026–27 ఏడాదికి ఏప్రిల్ 26 నుంచి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 15 నుంచి 19 సంవత్సరాల్లోపు ఉన్న క్రీడాకారులు, 01–01–2008 నుంచి 01–01–2011 మధ్య జన్మించిన వారు అర్హులని తెలిపారు. ప్రతిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. వివిధ క్రీడా విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు. ఎంపికై న క్రీడాకారులకు కోచింగ్, వసతి, భోజనం, ఆధునిక శిక్షణ సదుపాయాలు ఉంటాయని పేర్కొన్నారు. వివరాలు https://soprts.ap.gov.in అనే వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలను నేడు(బుధవారం) విడుదల చేయనున్నారు. పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి గత నెల 24వ తేది వరకు నిర్వహించారు. జిల్లాలో మొదటి సంవత్సరం విద్యార్థులు 26,473 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 22,491 మంది హాజరయ్యారు. గత నెల 2వ తేది నుంచే కర్నూలు నగరంలోని టౌన్ మోడల్ జూనియర్ కాలేజీలో స్పాట్ క్యాంపును ఏర్పాటు చేశారు. ప్రధాన సబ్జెక్టుల మూల్యాంకనం గత 21వ తేదిన మొదలై.. ఈ నెల 9వ తేది వరకు కొనసాగింది. జిల్లాకు ఫస్ట్ ఇయర్, ద్వితీయ సంవత్సరానికి చెందిన సమధాన పత్రాలు మొత్తం 2,41,217 వచ్చాయి. పరీక్షల ఫలితాలు ఉదయం 10.31 గంటలకు విడుదల చేయ నున్నారు. ఫలితాల కోసం https:// resultsbie.ap.gov.in అనే వెబ్సైట్లో చూసుకోవచ్చు. 95523 00009 అనే నెంబరుకు Hi అని పెడితే ఫలితాలు తెలుసుకునే వీలుంది. -
గుక్కెడు నీరివ్వలేని చంద్రబాబు ప్రభుత్వం
● దోచుకో.. దాచుకో అన్న ధ్యాస తప్ప, అభివృద్ధి లేదు ● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆలూరు రూరల్: తీవ్రమైన ఎండలతో మంచినీరు దొరకక, గొంతులు ఎండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, గుక్కెడు నీరు ఇవ్వలేని దుస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. ఆలూరులోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకేష్ , పవన్కు ‘దోచుకో.. దాచుకో’ అన్న ధ్యాస తప్ప, అభివృద్ధి చేయడం తెలియదన్నారు. ఆలూరులో 20 రోజులకు ఒక సారైనా తాగునీరు రావడం లేదన్నారు. ఆస్పరి, చిప్పగిరి, ఆలూరు మండలంలోని మొలగవల్లి, కురుకుంద, హులేబీడు, పెద్దహోతూరు, తుంబళబీడు గ్రామా ల్లో నెల తరబడి మంచినీరు సరఫరా లేకపోవడంతో ప్రజలు పంచాయతీ కార్యాలయాలకు తాళం వేశారన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఈఈ వచ్చి ఏదైనా చేస్తామని చెప్పి వెవెళ్లారన్నారు. గత పదేళ్లుగా కురుకుంద గ్రామస్తులు ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లతో పక్కనే ఉన్న హెబ్బటం గ్రామానికి వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నారన్నారు. ప్రభుత్వంలో కనీసం చలనం లేదు తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే తాగునీటి పైపు లైన్లు మార్చాలని గత జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కు ఎస్టిమేట్ వేసి వినతిపత్రం ఇచ్చారన్నారు. డీఆర్సీ మీటింగ్లో కూడా చాలా సార్లు తాగునీటి సమస్యపై ప్రస్తావించినా చంద్రబాబు ప్రభుత్వానికి కనీసం చలనం లేదన్నారు. ప్రచార ఆర్భాటాలకే పరిమితంగ్రామాల్లో తాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇంచార్జ్ సోషల్ మీడియాలో ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారని ఎమ్మెల్యే విరూపాక్షి విమర్శించారు. గ్రామాల్లో ప్రజలను రెచ్చగొట్టి తిరగడం కాదని, తాగునీరు, రోడ్లు సమస్య తీర్చాలన్నారు. గ్రామాల అభివృద్ధికి సహకరించాలన్నారు. ఇన్చార్జ్ పదవి పోతే వారు ఇక్కడ ఉండబోరన్నారు. మంచినీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నా.. పక్కనే ఎల్ఎల్సీ పారుతున్నా.. ఎస్ఎస్ ట్యాంకులు సామర్థ్యం పెంచుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆస్పరి మండలంలోని జొహరాపురం వద్ద ఎస్ఎస్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని అప్పటి కలెక్టర్ సృజన ద్వారా ప్రతిపాదనలు పంపిస్తే.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక దాన్ని విస్మరించిందన్నారు. నగరడోణ రిజర్వార్కు బిల్లు చెల్లిస్తే రెండు మండలాలు సస్యశామలం అవుతాయన్నారు. -
టీడీపీని వీడి వైఎస్సార్సీపీలోకి
గడివేముల: మండల పరిధిలోని ఒండుట్ల గ్రామానికి చెందిన ఐదు కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి. వీరికి వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. గ్రామ వైఎస్సార్సీపీ నాయకుడు గంజర్ల రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కాటసాని ఇంటి వద్దకు చేరుకుని పార్టీలో చేరారు. పార్టీలో చేరినవారిలో సత్యనారాయణ, మద్దిలేటి, గోరంట్ల, మారెళ్ల కిట్టు, నాగేష్ తదితర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇంత వరకు అమలు చేయలేదన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందన్నారు. పార్టీలో చేరిన వారి భవిష్యత్తులో సముచిత న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కాలు నాయక్, వైఎస్సార్సీపీ నాయకులు అనిల్ కుమార్ రెడ్డి, గని రామలింగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీమజోన్లో 25 మంది సీఐల బదిలీ
● ఉమ్మడి జిల్లాలో 15 మందికి స్థానచలనం ● వీఆర్లో ఉన్న ఇద్దరికి పోస్టింగులు బదిలీ అయిన సీఐలు కర్నూలు: రాయలసీమ జోన్ కర్నూలు, అనంతపురం రేంజ్ల పరిధిలో వివిధ సర్కిళ్లలో పనిచేస్తున్న 25 మంది సీఐలపై బదిలీ వేటు పడింది. ఈ మేరకు ఆదివారం రాత్రి కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 15 మంది సీఐలకు స్థానచలనం కలిగింది. ఇందులో ఒకరు సత్యసాయి, మరొకరు వైఎస్సార్ జిల్లా నుంచి బదిలీపై కర్నూలు జిల్లాకు వచ్చారు. అలాగే అనంతపురం రేంజ్లో వీఆర్లో ఉన్న ఒకరికి చెన్నూరు యూపీఎస్, కర్నూలు రేంజ్ పరిధిలో ఉన్న మరొకరిని మంత్రాలయం పీఎస్కు నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కర్నూలు రేంజ్లో వీఆర్లో ఉన్న మరో ఇద్దరు అనంతపురం రేంజ్కి బదిలీ అయ్యారు. పేరు ప్రస్తుత సర్కిల్ బదిలీ అయిన సర్కిల్ జి.వి.నాగరాజరావు కర్నూలు టూటౌన్ ఆళ్లగడ్డ యూపీఎస్ ఎం.శ్రీధర్ ఫ్యాక్షన్ జోన్, కర్నూలు కర్నూలు టూటౌన్ ఎం.యుగంధర్ ఆళ్లగడ్డ యూపీఎస్ కౌతాళం యూపీఎస్ ఎన్.అశోక్ కుమార్ కౌతాళం యూపీఎస్ నందికొట్కూరు వై.ప్రవీణ్ కుమార్ రెడ్డి నందికొట్కూరు సోషల్ మీడియా అండ్ సైబర్ క్రైం సెల్, కర్నూలు డి.మస్తాన్ వలి సోషల్ మీడియా అండ్ సీసీఎస్–2, సైబర్ క్రైం సెల్, కర్నూలు కర్నూలు కె.శ్రీనివాస నాయక్ సీసీఎస్–2, కర్నూలు ఆస్పరి, కర్నూలు దస్తగిరి బాబు వీఆర్, కర్నూలు మంత్రాలయం పి.రామాంజులు మంత్రాలయం పులివెందుల ట్రాఫిక్ వి.సీతారామిరెడ్డి పులివెందుల రూరల్ డీటీసీ, నంద్యాల డి.హాజీవలి డీటీసీ, నంద్యాల సీసీఎస్,వైఎస్సార్ కడప జి.మారుతి శంకర్ కొత్తచెరువు, సత్యసాయి జిల్లా కర్నూలు వన్టౌన్ ఎం.పార్థసారధి కర్నూలు వన్టౌన్ ఫ్యాక్షన్జోన్, కర్నూలు ఎ.గంగాధర్ వీఆర్, కర్నూలు వీఆర్, అనంతపురం కె.ఉలసయ్య వీఆర్, కర్నూలు వీఆర్, అనంతపురం -
సర్కారు బస్సు కదలనంటోంది!
ఊడుతున్న చక్రాలు..పనిచేయని స్టీరింగ్లు, పొలాలు, చెరువుల్లోకి దూసుకెళ్తున్న వాహనాలు కొన్ని..పొగలు కక్కుతున్నవి మరికొన్ని..కాలం చెల్లినవి ఇంకొన్ని వెరసి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణమంటే ఏదో తెలియని భయం. ఇది వరకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమనేవారు ఇప్పుడా పరిస్థితి లేదు. బస్సులు ఎక్కడ మొండికేసి మొరాయిస్తాయో తెలియని పరిస్థితి. కూటమి సర్కారు కాలం చెల్లిన బస్సులు, పాతవాటికి ౖపైపెన మరమ్మతులు చేసి తిప్పుతుండటమే దీనికి ప్రధాన కారణం. సోమవారం కడప నుంచి కర్నూలుకు బయలు దేరిన కడప డిపోకు చెందిన ఎక్స్ప్రెస్ బస్సు మార్గ మధ్యలోనే నిలిచిపోయింది. ఇంజన్ బెల్ట్, బెరింగు పోవడంతో ముందుకు కదలలేని పరిస్థితి. దీంతో ఈ బస్సులోని 60 మంది ప్రయాణికులు గమ్య స్థానాలకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బంది గురయ్యారు. ముందుగానే టికెట్లు తీసుకొని ఉండటంతో చేసేది లేక కడప వైపు నుంచి వచ్చిన పల్లెవెలుగు బస్సులు ఎక్కి వెళ్లారు. మహిళలకు, దివ్యాంగులకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు సర్కారు ముందుగా బస్సుల కండీషన్పై దృష్టిసారించాలని ప్రయాణికులు కోరుతున్నారు. – చాగలమర్రి -
నిప్పుల వాన
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాపై బానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఈ నెల 12న నంద్యాల జిల్లాలో గరిష్టంగా 42.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. సోమవారం సంజామలలో ఏకంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం కలవరపెడుతోంది. ఇప్పటి వరకు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత సంజామల మండలంలో కావడం గమనార్హం. ఆళ్లగడ్డలో 43.6 డిగ్రీలు, కోవెలకుంట్లలో 43.3, ఉయ్యలవాడలో 43.3, గూడూరులో 43, బనగానపల్లిలో 42.8, కర్నూలులో 42.8, కోడుమూరులో 42.7, గోస్పాడులో 42.7, నంద్యాల రూరల్లో 42.7, పాణ్యంలో 42.6, మంత్రాలయంలో 42.5, చాగలమర్రిలో 42.5, కొలిమిగుండ్లలో 42.4, రుద్రవరంలో 42.4, కొలిమిగుండ్లలో 42.4 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ 10 శాతానికి పడిపోవడంతో వేడిగాలుల తీవ్రత పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు నమోదవుతోది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగనుండటం ఆందోళన కలిగిస్తోంది. వడదెబ్బతో వృద్ధుడు మృతి పగిడ్యాల: నెహ్రూనగర్లో వడదెబ్బతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన బోయ కొంతలపాడు నాగన్న(70) ఆదివారం నీటి మునక పొలంలో సాగు చేసిన మినుము పంటకు నీరు కట్టేందుకు వెళ్లాడు. ఎండ తీవ్రతకు సాయంత్రం ఇంటికి వచ్చి అస్వస్థతకు గురైనట్లు కుటుంబీకులు తెలిపారు. స్థానిక ఆర్ఎంపీని ఇంటికి పిలిపించి చికిత్స చేయించేందుకు ప్రయత్నించగా అప్పటికే మరణించాడన్నారు. 44 డిగ్రీల ఉష్ణోగ్రత -
మోసకారి చంద్రబాబు
బేతంచెర్ల: అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు నమ్మించి మోసం చేశారని రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, గిడ్డంగుల శాఖ మాజీ డైరెక్టర్ బాబురెడ్డి ఆధ్వర్యంలో ఆయా గ్రామాలకు చెందిన పొదుపు గ్రూపుల మహిళలు, తొలగించిన (వీఓఏ) బుక్ కీపర్లు మాజీ మంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి వేధింపులు ఎక్కువయ్యాయని వాపోయారు. అధికార పార్టీ నాయకుల మాటలు విని వెలుగు ఏపీఎంలు తమని అన్యాయంగా తొలగిస్తున్నారని చెప్పారు. ఆలాగే బ్యాంకులు తమకు రుణాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. టీడీపీ నాయకుల సిఫారసుతో నియమితులైన వీఓఏల దగ్గరకు వెళ్లలేదని కారణంతో ఇలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మాజీ మంత్రి బుగ్గన మాట్లాడుతూ బాధ్యతగా పనిచేస్తున్న బుక్ కీపర్లను తొలగించడం మంచి పద్ధతి కాదన్నారు. రాజకీయ నాయకుల మాటలు విని వారి మెప్పు కోసం బుక్ కీపర్లను అక్రమంగా తొలగిస్తే అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పొదుపు మహిళలు, వీఓఏలు ఐక్యంగా ఉండి అధికారులు నిబంధనలు పాటించకపోతే నిలదీయాలన్నారు. మీకు అండగా మేము ఉంటామని వారికి ధైర్యం చెప్పారు. రెండు సంవత్సరాల టీడీపీ పాలనలో ప్రజలకు ఇచ్చిన ఏ హామీ సక్రమంగా అమలుకు నోచుకోలేదన్నారు. నమ్మించి మోసం చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి -
కోటకొండ కుంటలో అక్రమ మట్టి తవ్వకాలు
రుద్రవరం: కోటకొండ గ్రామ సమీపంలోని కుంటలో కొందరు వ్యక్తులు యథేచ్ఛగా మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు.గత రెండు రోజుల నుంచి రాత్రి సమయాల్లో జేసీబీలతో తవ్వి మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు తమకేమి తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆ కుంటలో మట్టి తవ్వకాలు సాగుతున్నప్పటికీ ఎవరు పట్టించుకోక పోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుంటలో ఎక్కడబడితే అక్కడ గుంతలు తవ్వడం వల్ల వర్షాలు కురిసినప్పుడు నీరు కుంటకు ఉన్న తూముల వైపు రాకుండా ఆ గుంతల్లోనే ఉండి పోతుందని వాపోయా రు. అలా తూముల ద్వారా నీరు అందక పోతే దిగువన ఉన్న ఆయకట్టు పొలాలకు నీరు పారక పంటలు పండించుకోలేక పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కుంటలో మట్టి తవ్వకాలను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ రైతులు కోరారు. వీఆర్వో గురుస్వామిని వివరణ అడగ్గా కుంటలో మట్టి తవ్వకాలకు ఎవ్వరికీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. -
నల్లమలలో కారు బోల్తా
మహానంది: నల్లమలలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు..మద్యం వ్యసనం మానుకునేందుకు పాణ్యం వద్ద పసురు, అంత్రాలు వేస్తున్నారని తెలుసుకుని గుంటూరు పట్టణానికి చెందిన ముగ్గురు కారులో బయలుదేరి వచ్చారు. వచ్చిన పని చూసుకొని నంద్యాల, గాజులపల్లె మీదుగా తిరిగి వెళ్తున్నారు. గిద్దలూరు నల్లమల ఘాట్రోడ్డులో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న వంతెనను ఢీకొని బోల్తాపడింది. ఈ సంఘటనలో డ్రైవర్తో పాటు కారులో ఉన్న మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చేపల వేటకు వెళ్లి జాలరి మృతి
కోవెలకుంట్ల: పట్టణ శివారులోని వెలగటూరు రస్తాలో జుర్రేరు వాగుకు చేపల వేటకు వెళ్లిన జాలరి మృతి చెందాడు. కోవెలకుంట్ల పోలీసులు అందించిన సమాచారం మేరకు.. పట్టణానికి చెందిన బాలకృష్ణ(32) అదివారం చేపలు పట్టుకునేందుకు బైక్పై జుర్రేరు వాగు వద్దకు వెళ్లాడు. చేపలు పట్టుకునే తరుణంలో ప్రమాదవశాత్తు వాగు నీటి గుంతలో మునిగిపోయాడు. గుంత లోతుగా ఉండటంతో పాటు పూడిక పేరుకు పోవడంతో అందులో చిక్కుకుపోయాడు. సాయంత్రం అయినా ఇంటికి రాక పోవడంతో కుటుంబ సభ్యులు వాగు వద్దకు చేరుకోగా ఒడ్డున బైక్, చెప్పులు ఉండటంతో నీటిలో పడి పోయి ఉంటాడని భావించి ఈత గాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం వాగులో బాలకృష్ణ మృతదేహం లభ్యమైంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కోవెలకుంట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఎన్హెచ్ 40లో ‘క్యూఆర్ కోడ్’ సేవలు
● స్కాన్ చేస్తే పెట్రోల్ బంక్లు, పంక్చర్ షాపుల వివరాలు కర్నూలు: జాతీయ రహదారిపై వెళ్లేటప్పుడు అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఎవరిని సంప్రదించాలి, పెట్రోల్ బంకులు, హోటళ్లు, మరుగుదొడ్లు, ఇ–చార్జింగ్ స్టేషన్లు వంటి వసతులు ఎక్కడ ఉన్నాయి అనే ఆందోళన ప్రయాణికుల్లో సహజంగా ఉంటుంది. ఇకపై అలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాయలసీమ ప్రాంతానికి అత్యంత కీలకమైన రవాణా మార్గం 40వ నెంబర్ జాతీయ రహదారిలో ప్రయాణికుల భద్రత, పారదర్శకత, సౌకర్యార్థం వినూత్నంగా క్యూఆర్ కోడ్ సేవలు అమలులోకి వచ్చాయి. రాయలసీమ ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ ఆధ్వర్యంలో కర్నూలు నుంచి కడప వరకు విస్తరించి ఉన్న 189 కిలోమీటర్ల మేర రహదారిలో క్యూఆర్ కోడ్ ఆధారిత సమాచార బోర్డులను ఏర్పాటు చేశారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ, నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమం వాహనదారులకు ఇకపై ఒక డిజిటల్ గైడ్లా మారనుంది. సోమవారం (13వ తేదీ) నుంచి 40వ జాతీయ రహదారిలో డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రాజెక్టు హెడ్ వి.మదనమోహన్ విలేకరులకు తెలిపారు. ఒక్క స్కాన్తో అన్ని వివరాలు హైవే వెంట ప్రయాణించేటప్పుడు స్మార్ట్ బోర్డులను స్మార్ట్ ఫోన్తో స్కాన్ చేయగానే మనకు అవసరమైన సమాచారం లభిస్తుంది. ప్రధానంగా అత్యవసర సేవా కేంద్రాలు, జాతీయ రహదారి హెల్ప్లైన్ నెంబర్ 1033, హైవే పెట్రోలింగ్, అంబులెన్స్ సేవలు, సమీపంలోని పోలీస్స్టేషన్ నెంబర్లు ఇట్టే తెలిసిపోతాయి. 189 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రోడ్డును రాయలసీమ ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్ వారు నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వహణ, బాధ్యతలు, కాలపరిమితి, టోల్ప్లాజాల మేనేజర్లు, రెసిడెంట్ ఇంజనీర్ల ఫోన్ నెంబర్లు కూడా క్యూ ఆర్ కోడ్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే రోడ్డుకు ఇరువైపుల ఉన్న పెట్రోల్ బంకులు, హోటళ్లు, మరుగుదొడ్లు, పంక్చర్ షాపులు, ఇ–చార్జింగ్ స్టేషన్ల లొకేషన్ల వివరాలు కూడా ఒక్క స్కాన్తో తెలుసుకోవచ్చు. -
గుర్తు తెలియని వాహనం ఢీ కొని ..
ఆత్మకూరు రూరల్: మండలంలోని సిద్దాపురం చెరువు సమీపంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ బాలుడు మృతి చెందాడు. మండలంలోని సంజీవనగర తండాకు చెందిన నాగేశ్వరికి ఇద్దరు కుమారులు. చిన్నవాడైన అభిలాష్ (16)కు కుటుంబ సభ్యులు ఇటీవల కొత్త ద్విచక్రవాహనం కొనుగోలు చేశారు. ఆ వాహనంపై అభిలాష్ బైర్లూటి వెళ్లి వస్తుండగా సిద్దాపురం చెరువు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. స్థానికులు గమనించి తీవ్రంగా గాయపడిన బాలుడి సమాచారం కుటుంబ సభ్యులకు ఇచ్చారు. వారు ఆ బాలుడిని చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. తీవ్ర రక్తస్రావం జరగడంతో అభిలాష్ కోలుకోలేక సోమవారం మరణించాడు. గొర్రెలను తప్పించబోయి.. కొత్తపల్లి: విధులకు మోటారు బైకుపై వెళ్తుండగా మార్గ మధ్యంలో ఎదురుగా వస్తున్న గొర్రెలను తప్పించ బోయి ఇద్దరు ఉపాధ్యాయులు కిందపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. శివపురం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసే ఖాజా మొహిద్దీన్, షహిన్ షా అనే ఉపాధ్యాయులు సోమవారం ఉదయం ద్విచక్రవానంపై ఆత్మకూరు వైపు నుంచి బయలుదేరారు. శివపురం గ్రామ శివారులోని జమ్ములమ్మ గుడి సమీపంలో రోడ్డుపై ఎదురయ్యాయి. వాటిని తప్పించే క్రమంలో బైకు అదుపుతప్పడంతో కింద పడ్డారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఖాజా మోహిద్దీన్ పరిస్థితి విషయంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి వైద్యులు కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేశారు. ఖాళీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(న్యూటౌన్): సమగ్రశిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టులను డిప్యూటేషన్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష అదనపు జిల్లా కో ఆర్డినేటర్ నిత్యానందరాజు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అసిస్టెంట్ స్టాస్టికల్ ఆఫీసర్, ప్రోగ్రాం ఆఫీసర్, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ (ఉర్దూ), గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో పని చేస్తున్న వారు మాత్రమే అర్హులని, స్కూల్ అసిస్టెంట్లకు కనీసం 5 సంవత్సరాలు, సెకండ్ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీ)కు కనీసం 8 ఏళ్ల అనుభవం ఉండాలన్నారు. అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 15 నుంచి 20లోగా సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాలన్నారు. -
శ్రీశైలం ఘాట్లో చిరుత కలకలం
శ్రీశైలం: దోర్నాల– శ్రీశైలం ఘాట్లో శిఖరం సమీపంలో ఉన్న మలుపు వద్ద రోడ్డు పక్కన ఆదివారం రాత్రి చిరుత పులి కనిపించింది. గమనించిన వాహనదారులు భయంతో కిందకు దిగకుండా కేకలు వేస్తూ డిమ్ అండ్ డిప్ లైట్ కొట్టడంతో చిరుత అడవిలోకి వెళ్లిపోయింది. కాగా అటవీ శాఖ వారు ఘాట్ రోడ్లో శ్రీశైలం వచ్చి వెళ్లే ప్రయాణికులకు హెచ్చరికలను జారీ చేశారు. వేసవి కాలం కావడంతో రాత్రి సమయంలో అడవిలోని వన్యప్రాణులు దాహం తీర్చుకోవడానికి రోడ్డు మార్గాలను దాటుతుంటాయని వాహనదారులు తక్కువ స్పీడ్లో వెళ్లాలని సూచించారు. ఒకవేళ వన్యప్రాణులు రోడ్డు దాటుతూ కనిపిస్తే వెంటనే వాహనాలను నిలిపి వేయాలని చెప్పారు. జొన్న కొనుగోలుకు మార్గదర్శకాల జారీ నంద్యాల(అర్బన్): రబీ 2025–26లో సాగు చేసిన జొన్న పంట కొనుగోళ్లకు మార్గదర్శకా లు జారీ చేసినట్లు జిల్లా పౌరసరఫరాల మేనేజర్ అశ్వర్థ నారాయణ నాయక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు కొనుగోళ్లు ఉంటాయని, హైబ్రీడ్ రకం క్వింటా రూ.3,699గా ధర నిర్ణయించడమైనదన్నారు. రైతులు తమ పంట విక్రయానికి ముందు తప్పని సరిగా ఈ క్రాప్ నమోదుతో పాటు ఈకేవైసీ పూర్తి చేసి సమీప రైతు సేవా కేంద్రంలో నమోదు చేయించుకోవాలన్నారు. ఆన్లైన్ విధానంలో మాత్రమే కొనుగోలు ప్రక్రియ జరుగుతుందన్నారు. పెరిగిన ‘తర్తూరు’హుండీ ఆదాయం జూపాడుబంగ్లా: తర్తూరుజాతరను పురస్కరించుకుని శ్రీలక్ష్మీరంగనాథస్వామి, అమ్మవార్ల హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. సోమవారం దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి, ఈఓ సాయికుమార్ అధ్వర్యంలో నంద్యాల పట్టణానికి చెందిన బాలాజీ సేవా ట్రస్టు సభ్యులు నగదును లెక్కించగా రూ.16,11,871 ఉంది. గతేడాది రూ.11,21,770 ఆదాయం రాగా ఈ ఏడాది రూ.4,90,101 అదనంగా వచ్చినట్లు ఈఓ తెలిపారు. కాగా కానుకల లెక్కింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ శిక్షణకు 21 మంది ఎంపిక నంద్యాల(న్యూటౌన్): ఎవరెస్ట్ బేస్ క్యాంపు శిక్షణకు మొత్తం 21మంది ఎంపికై నట్లు డీఈఓ జనార్ధన్రెడ్డి, సమగ్ర శిక్ష అదనపు జిల్లా కో ఆర్డినేటర్ నిత్యానందరాజు తెలిపారు. ఎంపికై న వారిలో నంద్యాల జిల్లాకు చెందిన నలుగురు బాలికలు, ముగ్గురు బాలురు ఉన్నట్లు వెల్లడించారు. సోమవారం వారిని అభినందించి డీఈఓ మాట్లాడారు. ఎవరెస్ట్ అధిరోహించేందుకు వివిధ స్థాయిల్లో శిక్షణ ఇచ్చి ఈనెల 15వ తేదీన ఖాట్మండుకు పంపుతున్నట్లు తెలిపారు. అభినందన కార్యక్రమంలో సహిత విద్య కో ఆర్డినేటర్ జగన్మోహన్రెడ్డి, ప్రసన్నకుమార్ ఉన్నారు. అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(అర్బన్): జిల్లాలోని ఏడు అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ లీలావతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని గడివేముల మండలం బిలకలగూడూరు–4, డోన్ మండలం కొచ్చెరువు–2, మహానంది మండలం మహానంది–2, వెలుగోడు మండలం గుంతకందాల–1, కొత్తపల్లి మండలం జానలగూడెం, అవుకు మండలం పిక్కిళ్ల పల్లి తండా, సంజామల మండలం సి.కానాలలో అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. నంద్యాలలోని ఆదర్శ నగర్, చాబోలు టెక్కె, రోజాకుంట–2, భీమవరం–1లలో ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులైన మహిళలు ఈనెల 23వ తేదీలోగా దరఖాస్తులు అందజేయాలన్నారు. -
వినతుల పరిష్కారానికి చర్యలు
నంద్యాల: ప్రజలు అందజేసిన వినతులను చట్టపరిధిలో విచారణ జరిపి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని జిల్లా ఎస్పీ సునీల్షెరాన్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్ఎస్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి మాట్లాడారు. నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, అలాగే అవి పునరావృతం కాకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఏ ఒక్కరూ నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.... ● ఆస్తి తీసుకుని తమ యోగక్షేమాలు చూడటం లేద ని ఆత్మకూరులోని ఇందిరానగర్కు చెందిన యోహాన్, అంకమ్మ ఎస్పీ ఎదుట వాపోయారు. ● చేతబడులు చేసే ఆత్మకూరుకు చెందిన షేక్. నజురున్ భారీ మొత్తంలో బంగారం, వెండి, డబ్బులు తీసుకుని మోసం చేసిందని, మీరు స్పందించి న్యాయం చేయాలని ఓ మహిళ ఎస్పీకి విన్నవించారు. ● ట్రాక్టర్ ఇంజన్ను రిపేర్ కోసం ఆటోనగర్లో వీరేష్ అనే వ్యక్తికి ఇస్తే, అతను వేరే వాళ్లకు అమ్మివేసి కనిపించకుండపోయాడని గడివేముల మండలం కొరటమద్దికి చెందిన లక్మీరామిరెడ్డి జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లాడు. -
శ్రీశైలంలో ఘోర రోడ్డు ప్రమాదం
శ్రీశైలం: శ్రీశైల దేవస్థాన పరిధిలో టోల్గేట్ దాటిన తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లే రహదారిపై ఉన్న నో ఎంట్రీ గేట్ రాడ్ను కారు ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లోని పటాన్ చెరువు మండలం ఇస్నాపూర్ గ్రామానికి చెందిన 9 మంది శ్రీశైల మల్లన్న దర్శనం కోసం కారులు బయలుదేరారు. రాత్రి 9 గంటల సమయంలో శ్రీశైలం టోల్గేట్ వద్దకు చేరుకున్నారు.గేట్ దాటిన తర్వాత యూటర్న్ తీసుకునే క్రమంలో కారు అదుపుతప్పి వేగంగా వెళ్లి ఎదురుగా ఉన్న నో ఎంట్రీ చెక్ పోస్ట్ రాడ్ను బలంగా ఢీకొంది. ఇందులో ప్రయాణిస్తున్న మల్లమ్మ (50), మంజుల, జగదీష్, సాయి కార్తీక్ అనే నలుగురికి బలమైన కాయాలు కాగా ప్రవీణ్ అనే వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని అంబులెన్స్లో వైద్యశాలకు తరలించగా మల్లమ్మ ప్రాణాలు వదిలింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న వన్టౌన్ సీఐ జీవన్ గంగనాథ్బాబు, దేవస్థానం సీఎస్ఓ శ్రీనివాసరావు వైద్యశాలకు చేరుకొని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. ఒకరు మృతి నలుగురికి తీవ్ర గాయాలు -
నీడ, నీరు కరువే..
కర్నూలు(అగ్రికల్చర్): ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుతున్నాయి. ఏప్రిల్ నెల మొదటి పక్షంలోనే 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. మే నెలలో ఎండలు, వడగాలుల తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తోంది. గత మూడు నాలుగేళ్లతో పోలిస్తే ఈ వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. సాధారణంగా ఈ సమయంలో 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అయితే 2–3 డిగ్రీలకు పైగా అధికంగా అంటే 43 డిగ్రీల వరకు నమోదవుతుండటం గమనార్హం. ఇప్పటికే నంద్యాల రూరల్, కౌతాళం, ఆళ్లగడ్డ, ఆలూరు, కర్నూలు, కల్లూరు, రుద్రవరం, దొర్నిపాడు తదితర మండలాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి. ఏప్రిల్ 15 నుంచి ఉష్ణోగ్రతలు, వడగాలుల తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ నెల చివరిలోపు ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు, మే నెలలో 45–47 డిగ్రీలకు చేరే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల బెడద తీవ్రతరమవుతున్నా ఉపాధి కూలీలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ‘ఉపశమనం’ కాగితాల్లోనే! ● పని ప్రదేశాల్లో ఉపాధి కూలీలకు సురక్షిత మంచి నీటి సదుపాయం కల్పించాలని గ్రామీణాభివృద్ధి శాఖ ఈ నెల 1న ఆదేశించింది. ● ప్రతి గంటకు నీటిని తాగే విధంగా వాటర్ బెల్ పద్ధతిని అమలు చేయాలి. ● గ్రామ పంచాయతీ సహకారంతో స్థానికంగా లభించే తాటాకు 8, ఈతాకు తదితరాలతో పని ప్రదేశంలో పందిళ్లు వేయాలి. ● ఉపాధి కూలీలకు ప్రథమ చికిత్స సామాగ్రిని(ఫస్ట్ ఎయిడ్ బాక్స్) పని ప్రదేశంలో సిద్ధంగా ఉంచాలి. ● ఆరోగ్య శాఖ సహకారంతో పని ప్రదేశాల్లో ఏఎన్ఎం సేవలను ఉపయోగించుకోవాలి. ●ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ●ఉపాధి కూలీలు ఉదయం 6 గంటలకే పని ప్రదేశానికి వెళ్లి 11 గంటలకు ఇళ్లకు చేరుకోవాలి. ● అవసరమైతే సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు తిరిగి పని కొనసాగించాలి. ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణాలు ● జిల్లా విస్తీర్ణంలో అడవులు 33 శాతం ఉండాలి. ● ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుతం 16శాతం మాత్రమే అడువులు ఉన్నట్లు తెలుస్తోంది. ● అడవులు తరిగిపోతుండటానికి తోడు వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ఇది కూడా ఎండల తీవ్రతకు కారణమవుతోంది. ● ఈసారి ఎల్నినో ప్రభావం కూడా భయపెడుతోంది. మామూలుగా వేసవి మే నెల చివరితో ముగుస్తుంది. అయితే ఎల్నినో ప్రభావంతో సారి ఆగస్టు వరకు ఎండలు, వడగాలుల తీవ్రత కొనసాగనుంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇలా.. గత వైఎసార్సీపీ ప్రభుత్వం ఉన్న ఐదేళ్లూ ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లో వేసవి ఉపశమన చర్యలు పక్కాగా అమలయ్యాయి. అప్పటి ప్రభుత్వం ఎండల నుంచి రక్షణ కల్పించేందుకు షేడ్ సరఫరా చేసింది. షేడ్స్ కింద నీళ్లు తాగి కొద్ది సేపు సేదతీరడం, భోజనం చేయడం జరిగింది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచడం విశేషం. ప్రస్తుతం ఉపాధి పనులకు కర్నూలు జిల్లాలో 28వేలు, నంద్యాల జిల్లాలో 24వేల మందికి పైగా కూలీలు హాజరవుతున్నారు. నిప్పుల కొలిమిని తలపించే ఎండల్లో పనులు చేస్తున్నప్పటికీ ఉపశమన చర్యలు లేకపోవడం గమనార్హం. ఉదయం 9 గంటలకే వడగాలుల తీవ్రత పెరుగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పటైన తర్వాత 2025లో ఉపాధి కూలీల కోసం షేడ్స్ సరఫరా చేసిన దాఖలాలు లేవు. జిల్లాలో ఎక్కడా పని ప్రదేశంలో నీటి సదుపాయం కల్పిస్తున్న దాఖలాలే లేవు. ఓఆర్ఎస్ ప్యాకెట్ల జాడే లేకుండాపోవడం గమనార్హం. ఉపాధి కూలీలకు నీడ సదుపాయం వెతికినా కనిపించదు. వాటర్బెల్ పాటించకపోవడం కూలీల ప్రాణం తీస్తోంది. -
వైభవోపేతం.. వసంతోత్సవం
ఆళ్లగడ్డ: మహా పుణ్యక్షేత్రం అహోబిలం సన్నిధిలో వసంతోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వసంత రుతువులో శ్రీ లక్ష్మీనరసింహస్వామికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు. ఎండ వేడి నుంచి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఈ ఉత్సవం కావడంతో ఉపశమనోత్సవం అని కూడా అంటారు. ఈ ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతో పాటు పలురకాల మధురఫలాలను స్వామికి నివేదిస్తారు. ఈ వేడుకల కోసం దేవాలయం ఎదురుగా ఆకర్షణీయంగా నల్లమల అడవిని తలపించేలా మండపాన్ని తీర్చిదిద్దారు. వసంతోత్సవంలో భాగంగా ఉదయం నిత్య పూజలు అనంతరం యాగశాలకు చేరుకున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను కొలువుంచి ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాలు, అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య తిరుమంజనం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు -
ప్రజలకు జవాబుదారీగా ఉండాలి
సాక్షి, నంద్యాల: ప్రజలకు జవాబుదారీగా ఉంటూ వారి సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో పరిష్కరించిన కొన్ని గ్రీవెన్సులు మళ్లీ రీఓపెన్ అవుతున్నాయని, అలాంటి వాటిని అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలన్నారు. నేడు జరిగే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి కార్యక్రమాలకు అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. ఇటీవల బేతంచెర్ల మండలంలోని కృష్ణాపురం గ్రామ సచివాలయాన్ని సందర్శించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నట్లు తెలిపారు. కొన్ని శాఖల సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తమవుతుందన్నారు. విద్యుత్ సదుపాయాల కల్పనలో జాప్యం జరగకుండా సమన్వయంతో పని చేయాలన్నారు. వినతులకు క్షేత్రస్థాయిలోనే పరిష్కారం చూపేందుకు సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. కేసీ కాలువ, తెలుగు గంగ మరమ్మతు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్,డీఆర్ఓ రాము నాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్లో అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం -
ఊరు నీరడుగుతోంది
ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చి నీరందిస్తామని సర్కారు చెప్పడం తప్ప ఆచరణలో చూపించడం లేదు. దీంతో వేసవి కాలం ప్రారంభంలోనే పల్లెల్లో తాగునీటి సమస్య తలెత్తింది. పలు గ్రామాల్లో ప్రజలు తమ దాహం తీర్చాలంటూ రోడ్డెక్కుతున్నారు. సంజామల మండలం ఆకుమల్ల గ్రామంలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఈ గ్రామంలోని చల్లా కాలనీలో ప్రధాన తాగునీటి పైపు లైన్ వెళ్తుంది. అయిత, అక్కడ నివసించే 50 కుటుంబాలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. రెండేళ్ల క్రితం వైఎస్సార్సీపీ ప్రభుత్వం మారి కూటమి సర్కారు రావడంతో కుళాయి కనెక్షన్ల ఏర్పాటు అంశం అటకెక్కింది. రెండేళ్లుగా ఈ ప్రాంత వాసులు కనిపించిన అధికారులను, పాలకులను కలిసి పనులు వదులుకొని సుదూరం వెళ్లి నీళ్లు తెచ్చుకోవాలంటే కష్టంగా ఉందని, తమ ఇళ్ల ముందే పైపులైన్ వెళ్తుందని కుళాయి కనెక్షన్లు ఇచ్చి సమస్య తీర్చాలని వేడుకుంటున్నారు. అయినా, వారి నుంచి ఎలాంటి స్పందన లేదని చల్లా కాలనీవాసులు వాపోతున్నారు. – సంజామల -
పద్మావతి ఏజెన్సీపై కార్మికుల ఆగ్రహం
● రెండు నెలలుగా వేతనాలు అందక అవస్థలు ● శ్రీశైల దేవస్థాన పరిపాలన భవనం వద్ద కార్మికుల నిరసనశ్రీశైలంటెంపుల్: రెండు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ద్య, హౌస్కీపింగ్కార్మికులు ఆదివారం ఉదయం దేవస్థాన పరిపాలన భవనం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కార్మికులపై పద్మావతి ఏజెన్సీ చిన్నచూపు చూస్తోంది. రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికులు అవస్థలు పడుతున్నారు. దీంతో వేతనాల కోసం ఆందోళన బాట పట్టారు. కిరాణ కొట్టులో కూడా నిత్యావసర సరుకులు అప్పు ఇవ్వడం లేదని కార్మికులు వాపోతున్నారు. రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకపోతే మా జీవనం ఎలా గడుస్తుందని కార్మికులు గగ్గోలు పెట్టారు. వేతనాల గురించి పద్మావతి ఏజెన్సీ ప్రతినిధులను అడిగితే దేవస్థాన ఈఓ బిల్లులు చేయడం లేదని సమాధానం చెబుతున్నట్లు కార్మికులు తెలిపారు. అంతేకాకుండా ‘మీకు ఇష్టం వచ్చిన వాళ్ల దగ్గరికి వెళ్లి చెప్పుకోండి ఏమి చేయలేరు.. మీరు ఫిర్యాదు చేసే నేను మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తాం’ అంటూ బెదిరింపులకు గురి చేస్తున్నట్లు కార్మికులు వాపోతున్నారు. 10 మంది చేసే పని దగ్గర నలుగురితో చేయిస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. అంతేకాకుండా కార్మికుల ఖాతాలో వేతనాలు ఎక్కువ వేసి తిరిగి పద్మావతి ఏజెన్సీ ప్రతినిధులు వెనక్కి ఇప్పించుకుంటున్నారని కార్మికులు వాపోతున్నారు. ఇప్పటికై న శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి స్పందించి కార్మికులకు ప్రతి నెల వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు పేర్కొన్నారు. -
వసంతోత్సవాలకు అంకురార్పణ
ఆళ్లగడ్డ: లోక కల్యాణార్థం విశ్వశాంతిని కోరుతూ శ్రీ అహోబిలేశుడి వార్షిక వసంతోత్సవాలకు నాంది పలుకుతూ దిగువ అహోబిలంలో ఆదివారం రాత్రి అంకురార్పణ పూజలు చేపట్టారు. సోమవారం నుంచి వైభవంగా సాగే కృతువుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలని శాస్త్రోక్తంగా విశ్వక్సేనుడి ఆరాధన నిర్వహించారు. అనంతరం తిరుమంజనం, స్వస్తివచనంతో పాటు మృత్సంగహణం, రక్షాబంధనంతో ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేశారు. వైష్ణవ ఆచారంగా రాత్రివేళ వేదమంత్ర పఠనాలతో మత్స్యంగ్రహణం పర్వాన్ని చేపట్టారు. అనంతరం ఈశాన్యంలోని పుట్టమన్ను తెచ్చి నవధాన్యాలను నాటి ఉత్సవాలకు నాంది పలికారు. అంతకు ముందు ఉత్సవ మూర్తులైన శ్రీ ప్రహ్లాదవరదస్వామిని ఉభయ దేవురులతో యాగశాలలో కొలువుంచి తిరుమంజనం చేపట్టారు. కొత్తపల్లి: మండలంలోని నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న సప్తనది సంగమ ప్రాంతంలో వెలసిన ప్రాచీన సంగమేశ్వరాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి. కృష్ణాజలాల నుంచి ఆలయం బయటపడడంతో భక్తులు ప్రాచీన సంగమేశ్వరాలయాన్ని సందర్శించేందుకు వస్తున్నారు. దీంతోపాటు ప్రాచీన గర్భాలయంలోని వేపదారు శివలింగానికి ప్రత్యేక పూజలు చేసుకుంటున్నారు. ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ వేపదారు శివలింగాన్ని పూలమాలలతో అలంకరించారు. అనంతరం కుంకుమార్చన, పుష్పార్చన, బిల్వార్చన, మహా మంగళహారతి వంటి విశేష పూజలు చేశారు. శ్రీశైలంలో భక్తుల రద్దీ శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వేలాది మంది భక్తులు బారులు తీరారు. ఆదివారం సెలవు రోజును పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచి పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూలైన్ల వద్ద బారులుదీరారు. భక్తుల రద్దీతో ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా క్యూకంపార్ట్మెంట్లలో తాగునీరు, అల్పాహారం, ప్రసాదం పంపిణీ చేశారు. ఎవరెస్టు బేస్ క్యాంప్నకు ఎంపిక వెలుగోడు: పట్టణానికి చెందిన బండి స్వాతి అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక అవసరాలు ఉన్న మోడల్ స్కూల్ విద్యార్థిని ఎవరెస్టు బేస్ క్యాంప్ సాహసయాత్రకు ఎంపికై ంది. ఈనెల 14 నుంచి 30 వరకు రాష్ట్ర సర్వ శిక్ష అభియాన్ అధికారుల పర్యవేక్షణలో ఈ సాహస యాత్ర జరగనుంది. ఈ యాత్రలో మొత్తం 20 మంది విద్యార్థులు పాల్గొననుండగా, అందులో తమ కళాశాల విద్యార్థిని ఎంపిక కావడం గర్వకారణమని ప్రిన్సిపాల్ ఎం.నళిని తెలిపారు. ఈ సందర్భంలో కళాశాల అధ్యాపక బృందం బండి స్వాతికి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదించారు. -
నష్టపోతున్నాం
మేం 18 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాం. ఎకరాకు పెట్టుబడి దాదాపు రూ.30 వేల వరకు పెట్టాం. కత్తెర పురుగు ప్రభావంతో దిగుబడులు పడిపోయాయి. ఎకరాకు 25 క్వింటాళ్ల వరకే దిగుబడి వచ్చింది. మద్దతు ధర రూ.2400 ఉంటే దళారీలు.. రూ.1500 ధరతో అడుగుతున్నారు. తెలంగాణలో అటు ఖరీఫ్, ఇటు రబీ సీజన్లలో పండించిన మొక్కజొన్నలను మద్దతు ధరతో అక్కడి ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇక్కడ మాత్రం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. క్వింటాకు రూ.900 వరకు నష్టపోతున్నాం. ఇప్పటికై న చంద్రబాబు ప్రభుత్వం చొరువ తీసుకొని మద్దతు ధరతో మొక్కజొన్న కొనుగోలుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. – తిరుమలేశ్వరరెడ్డి, మొక్కజొన్న రైతు, రేమడూరు గ్రామం, కల్లూరు మండలం -
ఎదురు చూస్తున్నాం
ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు 12వ వేతన సవరణ కమిషన్ వేయడంతో పాటు మధ్యంతర భృతి ఇవ్వాలనేది ప్రదానమైన డిమాండ్. దీనికోసమే ఎదురు చూస్తున్నాం. పెండింగ్లో ఉన్న డీఏలతో పాటు నాలుగు విడతల సరండర్ లీవ్లు, డీఏ, పీఆర్సీ అరియర్స్ కూడా చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల ప్రధానమైన డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. – వి.జవహర్లాల్, జిల్లా అధ్యక్షుడు, ఏపీఎన్జీజీవోస్ అసోసియేషన్, కర్నూలు -
తెలుగు తమ్ముడి జల దోపిడీ
● ఉచిత మినరల్వాటర్ ప్లాంట్ నీటిని అమ్ముకుంటున్న టీడీపీ నేత సాక్షి, టాస్క్ఫోర్స్: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నాయకుల దౌర్జన్యాలు, బెదిరింపులు, అక్రమ వసూళ్లకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ధనార్జనే ధ్యేయంగా కొందరు తెలుగు తమ్ముళ్లు దోపిడీకి శ్రీకారం చుట్టారు. కోవెలకుంట్ల మండలం సౌదరదిన్నెకు చెందిన ఓ టీడీపీ నేత అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఉచిత మినరల్ వాటర్ప్లాంట్ నీటిని అమ్ముకుంటూ జలదోపిడికి పాల్పడుతున్నాడు. గ్రామంతోపాటు కోవెలకుంట్ల పరిసర ప్రాంత ప్రజల దాహార్తి తీర్చేందుకు ఆర్టీసీ బస్టాప్ సమీపంలో ఉచిత మినరల్ వాటర్ప్లాంట్ ఏర్పాటు చేశారు. విద్యుత్ బిల్లు, వాటర్మెన్కు వేతనం, తదితర నిర్వహణ ఖర్చులకు సంబంధించి ఏడాదికి రూ.1.50 లక్షలకు పైగా గ్రామ కమిటీ (రైతు సంఘం) భరిస్తూ ఈ ప్లాంట్ను నిర్వహిస్తోంది. గ్రామానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధి భర్త, టీడీపీ నేత గత 20 నెలల నుంచి ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ నీటిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న విషయం ఇటీవల బయటపడింది. కోవెలకుంట్ల పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ప్లాంట్ నుంచి ప్రతి రోజు క్యాన్ల ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని సదరు టీడీపీ నేత నెలకు రూ. 1,500 చొప్పున పాఠశాల యాజమాన్యం నుంచి వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇరవై నెలల నుంచి ప్రతి నెలా ఫోన్పే ద్వారా డబ్బులు ఆయన ఖాతాకు జమ అయినట్లు ఫోన్పే లావాదేవీలు లీక్ కావడంతో టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక స్కూల్ యాజమాన్యం నుంచే డబ్బులు వసూలు చేస్తు న్నాడా.. ఇతర వ్యక్తుల వద్ద నుంచి కూడా నీటిని పట్టుకున్నందుకు డబ్బులు తీసుకుంటున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు ప్లాంట్ ద్వారా ఉచితంగా నీటిని సరఫరా చేయగా టీడీపీ అధికారంలోకి రాగానే టీడీపీ నేత జలదోపిడీకి తెరలేపి నీటిని అమ్ముకున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఉచిత ప్లాంట్ నీటిని అమ్ముకుంటున్న టీడీపీ నేత తీరును పలువురు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. -
పూలే సేవలు స్ఫూర్తిదాయకం
సాక్షి, నంద్యాల: సామాజిక సమానత్వం, విద్యా విస్తరణ, మహిళా సాధికారతకు మహాత్మా జ్యోతిరావు పూలే అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, కలెక్టర్ రాజకుమారి అన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ ఆర్చి వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వారి తో పాటు జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, జిల్లా అధికారులు పాల్గొని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన సభలో వారు మాట్లాడుతూ పూలే భారతదేశంలో సామాజిక సంస్కరణలకు పునాది వేసిన మహానుభావుడని పేర్కొన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి విద్యే ప్రధాన సాధనమని పూలే చూపిన మార్గాన్ని అనుసరించడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పేందుకు చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. సీ్త్ర విద్య ప్రాధాన్యతను ఆయన ఎంతో ముందుగానే గుర్తించి, తన భార్య సావిత్రిబాయి పూలే సహకారంతో ఆడపిల్లల కోసం పాఠశాలలను స్థాపించడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, బీసీ సంక్షేమ అధికారి జగ్గయ్య, వివిధ సంఘాల ప్రతినిధులు రమణయ్య గౌడ్, జిల్లెల్ల శ్రీనివాసులు, బాలస్వామి, నాగశేషుడు, సుధాకర్, రామచంద్రరావు, కొమ్ము పాలెం శ్రీనివాసులు, వేణుగోపాల్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
వరి రైతులకు ‘మద్దతు’ కరువు
ఆరబోసిన ధాన్యంపాణ్యం: రబీలో వరి సాగు చేసిన రైతులకు మద్దతు ధర లభించడం లేదు. కేంద్ర ప్రభుత్వం సాధారణ వరికి కనీస మద్దతు ధర క్వింటాకు రూ.2,369, ఏ గ్రేడ్ రకానికి ?2,389గా నిర్ణయించింది. రైతులకు 75 కేజీల బస్తాకు రూ. 1,776 నుంచి రూ. 1,791 వరకు లభించాలి. అయితే మార్కెట్లో రూ.1,600 కూడా అందడం లేదు. మద్దతు ధర కూడా రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కష్టమే మిగిలింది! ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల రబీ సీజన్లో వరి సాగు చేశారు. విత్తనం నుంచి పంట చేతికి వచ్చే వరకు రైతులను కష్టాలు వెంటాడాయి. రాష్ట్ర ప్రభుత్వం యూరియా ఇవ్వకపోవడంతో దొరికిన చోట రూ.500 వెచ్చించి బస్తా చొప్పున తీసుకున్నారు. అధిక ధరతో యురియాను కొనుగోలు చేసి పంటను కాపాడుకున్నారు. ఎకరానికి రూ. 30వేలకు పైగానే ఖర్చు రాగా దిగుబడి మాత్రం 30 నుంచి 35 బస్తాలు మాత్రమే వచ్చింది. పంట వచ్చిన వారం రోజులు మాత్రమే బస్తా రూ. 1900 వరకు పలికింది. ఇరవై రోజుల నుంచి రూ.1600తో కూడా కొనడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. తమకు కష్టమే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రైవేటు సైన్యంతో మంత్రి బీసీ వసూళ్ల దందా
● మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి బనగానపల్లె: ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకుని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి వసూళ్ల దందా నడుపుతున్నారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆరోపించారు. పట్టణంలో ఆయన స్వగృహం వద్ద శనివారం వైఎస్సార్సీపీ నియోజకవర్గ స్థాయి క్యాడర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. మంత్రి బీసీ రోడ్లు నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యత లోపం ఉన్నాయంటూ కాంట్రాక్టర్లను తన వద్దకు రప్పించుకుని కమీషన్ల వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి బీసీ జనార్దన్రెడ్డి సమా ధానం చెప్పాలన్నారు. మంత్రి బీసీ బనగానపల్లెలో చుట్టూ ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఇసుక టిప్పర్ నుంచి రూ. 300, గ్రావెల్ టిప్పర్ నుంచి రూ.1,500 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బెల్టుషాపులు, రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం జోరుగా సాగుతుందన్నారు. వ్యాపారులను భయపెట్టి రూ.కోట్లు వసూలు కేసీవీఆర్ ప్రాజెక్టు యజమాని జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులపై మంత్రి బీసీ అక్రమ కేసులు పెట్టించి, ఆయన ద్వారా రూ.30 కోట్లు అక్రమంగా వసూళ్లు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆరోపించారు. పట్టణంలోని వ్యాపారి నూకల విజయుడు ఇంటికి మూడు రోజుల పాటు విద్యుత్ ను తొలగింపజేసి ఆయనతో పాటు సోదరుడు నూకల సుబ్బయ్య, వారి బావ ద్వారా రూ.3 కోట్లు, బనగానపల్లె పట్టణంలో ఫంక్షన్హాల్ యజమాని వేణుగోపాల్ వద్ద నుంచి రూ.1.5 కోట్లు, డాక్టర్ మహమ్మద్హుస్సేన్, శ్రీనివాసరెడ్డిని బెదిరించి అక్రమంగా వసూలు చేశారన్నారు. పొగాకు కొనుగోలుదారుల నుంచి మంత్రి అనుచరులు బేలుకు రూ.2 వేలు వసూలు చేయడంతో రైతులకు గిట్టుబాటు ధర లభించలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎస్సార్బీసీకి చెందిన మిగులు స్థలాల్లో ఇంటి స్థలాల పంపిణీ చేయబోగా కోర్టు స్టే ద్వారా అడ్డుకున్న బీసీ ఇప్పుడు అదే స్థలంలో స్థలాల పంపిణీ ఎలా చేస్తారని ప్రశ్నించారు. 2024 ఎన్నికల ప్రచారంలో బనగానపల్లె పట్టణంలో ప్రచారంలో భూమిని కొనుగోలు చేసి ఇంటి స్థలాలను పంపిణీ చేస్తామన్న మంత్రి బీసీ ఇప్పుడు ఎస్సార్బీసీ స్థలాల పంపిణీకి చర్యలు తీసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. స్థానిక వెంకటేశ్వరస్వామి ఆలయ మాన్యం భూమికి మంత్రి ఎసరు పెట్టారని విమర్శించారు.పంటలను ఎలా కాపాడుకోవాలి జిల్లాలో ఎస్సార్బీసీకి నీటి విడుదల నిలిచిపోవడంతో రైతులు పంటలను కాపాడుకోలేక పోతున్నారని జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీశైలం రిజర్వాయర్కు వరద వచ్చిన సమయంలోనే గోరుకల్లు, అవుకు రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నింపి ఉంటే ప్రస్తుతం నీటి సమస్య ఏర్పడేది కాదన్నారు. ఇటీవల నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో జిల్లాలో తాగునీటి సమస్య ఉత్పన్నం అయ్యే పరిస్థితులు ఉన్నాయని చెప్పగా, ఆ సమావేశంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్రెడ్డి నీటి సమస్య ఉండదని చెప్పారని గుర్తు చేశారు. సాగునీటి ప్రాజెక్ట్ల నిర్వహణలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. గతేడాది అవుకు రిజర్వాయర్ లీకేజీ ఏర్పడితే చర్యలు తీసుకోకపోవడంతో సమస్య తీవ్రమవుతుందని జెడ్పీ చైర్మన్ అన్నారు. -
మహానందిలో వీకెండ్ సందడి
మహానంది: మహానంది క్షేత్రం శనివారం భక్తులతో కళకళలాడింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. కోనేర్లలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు ఉచిత, శీఘ్ర, మహదాశీర్వాచనం, అభిషేకం ,అర్జిత సేవా టికెట్ల ద్వారా భక్తులు శ్రీ కామేశ్వరి దేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం భక్తులకు ఉచిత ఉచిత ప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఆది, సోమవారాల్లో నిరంతర దర్శన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాస రెడ్డి తెలిపారు. శ్రీశైల దేవస్థానం వెబ్సైట్లో సాంకేతిక సమస్య శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం అధికారిక వెబ్సైట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. శనివారం ఉదయం శ్రీశైల దేవస్థాన వెబ్సైట్లో టికెట్ల బుకింగ్కు అంతరాయం ఏర్పడింది. శ్రీశైల మల్లన్న ఆర్జిత సేవా టిక్కెట్లు, స్పర్శ దర్శనం టిక్కెట్లు బుకింగ్ చేసినా డౌన్ లోడ్ కాకపోవడంతో భక్తులు ఇబ్బందిపడ్డారు. బుకింగ్ హిస్టరీలో వివరాలు చూపించకపోవడం గందరగోళానికి తావిచ్చింది. వారాంతపు రోజు కావడంతో ఆన్లైన్లో టికెట్ల బుకింగ్కు భక్తులు అవస్థలు పడ్డారు. ఈ సమస్య మూడు గంటల పాటు ఇబ్బందులు పెట్టినట్టు భక్తులు పేర్కొన్నారు. ఈ విషయమై దేవస్థానం అధికారులను వివరణ కోరగా రాష్ట్ర వ్యాప్తంగా దేవదాయ శాఖ వెబ్సైట్లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలిపారు. అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(అర్బన్): జిల్లా పరిధిలోని ఆరు ఐసీడీఎస్ ప్రాజెక్టులలోని మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల నియామకానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ లీలావతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 7 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 101 అంగన్వాడీ ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అంగన్వాడీ కార్యకర్తకు అభ్యర్థినులు తప్పని సరిగా పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, 2025 జూలై 1వ తేదీ నాటికి 21 ఏళ్లు నిండి, 35 ఏళ్ల వయస్సు లోపు వారై ఉండాలని, తప్పని సరిగా వివాహితురాలై స్థానిక నివాసం ఉండాలన్నారు. ఆయా పోస్టుకు అభ్యర్థి పదవ తరగతి తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఒక వేళ పదవ తరగతి వారు ఎవరూ లేకపోతే ఎక్కువ చదువు చదివిన వారు అర్హులుగా ఉంటారన్నారు. ధ్రువీకరణ పత్రాలతో స్థానిక సీడీపీఓ కార్యాలయంలో ఈనెల 14 నుంచి 23వ తేదీలోగా దరఖాస్తులు అందజేయాలన్నారు. సూర్యుడి ప్ర‘తాపం’ ● గోస్పాడులో 42.8, మంత్రాలయంలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కర్నూలు (అగ్రికల్చర్): సూర్యుడి ప్రతాపానికి కర్నూలు, నంద్యాల జిల్లాలు నిప్పుల కొలిమిని తలపించాయి.పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల తీవ్రతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. శనివారం గోస్పాడులో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంత్రాలయంలో 42.7, ఆళ్లగడ్డలో 42.6, దొర్నిపాడులో 42.3, కౌతాళంలో 42.2, నంద్యాల రూరల్లో 42.1, చాగలమర్రిలో 42 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ మధ్యాహ్నం సమయంలో సాధారణంగా 30 శాతం ఉండాలి. అయితే 10 శాతానికి పడిపోవడంతో వేడిగాలుల తీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం 30 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. రానున్న నాలుగైదు రోజుల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం ప్రకటించింది. శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథం కార్యక్రమంలో భాగంగా శనివారం ఆలయ దక్షిణ మాడ వీధులలోని నిత్య కళావేదికపై హైదరాబాద్కు చెందిన గురు నృత్యాలయ కూచిపూడి డాన్స్ అకాడమీ వారి సంప్రదాయ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. గణపతి ప్రార్థన, శివపంచాక్షరి స్తోత్రం, చిదంబరస్తోత్రం, జతిస్వరం, నమశ్శివాయతే తదితర గీతాలకు హిమశ్రీ, హిమవర్షిణి, సహస్ర, ధాత్రి, మయూఖ, శ్రీశ్రేష్ఠ, వైష్ణవి, అభిజ్ఞ తదితరులు నృత్యప్రదర్శన చేశారు. -
వైఎస్సార్సీపీ నిర్మిస్తే.. టీడీపీ పేరు మార్చుకుంటోంది!
● స్వర్ణ గ్రామాలుగా గ్రామ సచివాలయాలు చిప్పగిరి: పేర్లు మార్చవచ్చు కానీ, కట్టిన భవనాలను మార్చలేరనే విషయాన్ని టీడీపీ ప్రభుత్వం విస్మరిస్తోంది. ప్రజలకు పాలన చేరువ చేయాలనే ఉద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామా ల్లోనే లక్షలాది రూపాయలు వెచ్చించి సచివాలయ వ్యవస్థకు కొత్త రూపు తీసుకొచ్చింది. మండల కార్యాలయాలకు వెళ్లే అవసరం లేకుండా స్థానికంగానే ఉద్యోగులను నియమించి సేవలు ఇంటి తలుపు తట్టేలా పాలన సాగించింది. రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పాలనలో కొత్తదనం చూపడం పక్కనపెడితే.. క్రెడిట్ చోరీకి పాల్పడుతోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి గత ప్రభుత్వంలో నిర్మించిన గ్రామ సచివాలయాలకు పేరు మార్పుతో ప్రజల్లో నవ్వుల పాలయ్యేందుకు సిద్ధమైంది. స్వర్ణ గ్రామాలుగా పేరు మార్చిన టీడీపీ ప్రభుత్వం ఆ మేరకు గ్రామ సచివాలయాల పేర్లు మార్చే దిశగా చర్యలు చేపట్టడం విమర్శలకు తా విస్తోంది. కొత్తగా నిర్మాణాలు చేపట్టి పేర్లు మార్చుకుంటే బాగుంటుంది కానీ, ఎవరో కట్టించిన నిర్మాణాలకు వీళ్లు పేర్లు మార్చుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. -
ఎక్కడి బిల్లులు అక్కడే!
చంద్రబాబు ప్రభుత్వంలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు చెల్లించాల్సిన మొత్తం రూ.3,200 ఇప్పటికి పెండింగ్లో ఉంది. కర్నూలు జిల్లాలో రూ.1,800 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.1,400 కోట్ల బిల్లులు పెండింగ్లోనే ఉండిపోయాయి. రెండేళ్లలో ఉమ్మడి జిల్లా ఉద్యోగులకు లభించిన ప్రయోజనాలు రూ.220 కోట్ల వరకే. ఉద్యోగుల ఆర్థిక బకాయిలకు సంబంధించి ట్రెజరీ నుంచి వెళ్లిన బిల్లులకు మోక్షం లభించడం ఎపుడో అనేది ప్రశ్నార్థకం అయింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల వెతలు అన్ని ఇన్నీ కావు. 2024 జూన్లో పదవీ విరమణ చేసిన వారికి 10 నెలల సెలవు వేతనం, గ్రాడ్యుటీ, కమిటేషన్ తదితర ఆర్థిక బెనిఫిట్స్ వందలాది మందికి ఇప్పటికీ పెండింగ్లోనే ఉండిపోయాయి. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బెనిఫిట్స్ నెలల తరబడి పెండింగ్లో పెట్టినప్పటికీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు పట్టించుకోకపోవడం లేదు. ఆర్థిక ప్రయోజనాల కోసం రిటైర్డ్ ఉద్యోగులు రొడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. -
అప్పుడు రూ. 20 వేలు.. ఇప్పుడు రూ. 4 వేలే
నేను రూ.50వేలు కౌలుతో 4 ఎకరాలు తీసుకుని అరటి పంట సాగు చేశా. రూ.10 లక్షల దాకా పెట్టుబడి వచ్చింది. పంట బాగానే పండినా ధరల్లేవు. యుద్ధంతో ధరలు పూర్తిగా పడిపోయాయి. టన్ను రూ.20 వేలకు పైగా ధరలు యుద్ధం కారణంగా ఇప్పుడు రూ.4 వేలకు పడిపోయింది. ఇప్పటి వరకు రూ.2.50 లక్షలు మాత్రమే చేతికొచ్చింది. పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదు. పంట కోనుగోలుకు వ్యాపారులు ఎవరూ రాక దిక్కుతోచడం లేదు. నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలి. – ఆకుల శ్రీనివాసులు, కౌలు రైతు, తుగ్గలి -
అరటి రైతుల ఆక్రందన
తుగ్గలి : ఏ పంట సాగు చేసినా రైతును కుదిపేస్తున్నాయి. లాభాలు కనిపించడం లేదు. అప్పుల ఊబిలో రైతు కూరుకుపోతున్నాడు. ఈ క్రమంలో అరటి రైతు కూడా చేరాడు. ప్రకృతి వైపరీత్యాలు ఓ వైపు దెబ్బతీస్తుంటే.. మరో వైపు పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో ధరలు పాతాళానికి పడి పోయి అరటి రైతుకు శాపమైంది. పత్తికొండ నియోజకవర్గంలో మొత్తం 150 ఎకరాల్లో అరటి పంట సాగైంది. పంట సాగు కోసం లక్షల్లో ఖర్చు చేశారు. అరటి గెలలు కోతకు వచ్చిన సమయంలో పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ధరలు పతనం కావడంతో రైతులకు కోలుకోలేని దెబ్బతగిలింది. అడిగే వారు లేక, మార్కెటింగ్ సౌకర్యం లేక తోటల్లోనే అరటిని వదిలేసి రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మార్కెట్లో ధరలు పూర్తిగా పడిపోయాయి. టన్ను అరటి రూ.3 వేల నుంచి రూ.4 వేలకు మించి ధరలు లేకపోవడంతో రైతులు అల్లాడిపోతున్నారు. యుద్ధం ప్రారంభానికి ముందు టన్ను రూ.20 వేలకు పైగానే ధర ఉంది. ధరలు స్థిరంగా ఉంటాయని సాగులో ఆదాయం ఉంటుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. కోతకు వచ్చిన సమయంలో ధరలు అమాంతంగా పడిపోవడంతో తీవ్రంగా నష్ట పోతున్నారు. కొనుగోళ్లకు ముందుకురాని వ్యాపారులు.. అరటి ధరలు మార్కెట్లో పడిపోవడంతో కొనుగోళ్లకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. ధరలు ఉన్నప్పుడు తోటల వద్దకు వచ్చిన వ్యాపారులు ధరలు పడిపోగానే అటువైపు కన్నెత్తి చూడలేదని రైతులు వాపోతున్నారు. పెట్టుబడులు కూడా చేతికందని పరస్థితి ఏర్పడటంతో ఆందోళన చెందుతున్నారు. -
త్వరగా భూ రీసర్వే పూర్తి చేయండి
శిరివెళ్ల: భూ రీసర్వేను త్వరగా పూర్తి చేయాలని జేసీ కొల్లాబత్తుల కార్తీక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక 3వ సేవా కేంద్రం ( సచివాయంను) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. భూ రీసర్వేపై ఆరా తీయగా మండల కేంద్రంలో 11,559 మంది రైతులకు సంభంధించి భూముల సర్వే తుదిశకు చేరుకుందని ఇంకా 2,390 రైతు ఖాతాలకు చెందిన భూములను సర్వే చేయాల్సి ఉందని వీర్ఓ ప్రసాదు వివరించారు. వారం లోగా సర్వే పూర్తి చేయాలని జేసీ ఆదేశించారు. ఇతర కేంద్రాలకు పంపుతున్నారన్న ఫిర్యాదు వస్తున్నాయని జేసీ అన్నారు. ఫిర్యాదులు కాకుండా చేసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం చౌక దుకాణాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. కర్నూలు(అగ్రికల్చర్): రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు విత్తన కంపెనీలు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ) పీఎల్ వరలక్ష్మి సూచించారు. శుక్రవారం కల్లూరు మండల పరిధిలోని వివిధ విత్తన ప్రాసెసింగ్ యూనిట్లను అధికారులు తనిఖీ చేశారు. కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేటు పరిధిలోని ఏపీ సీడ్స్ గోదాముల్లో వివిధ విత్తనాల ప్రాసెసింగ్ను గమనించారు. విత్తనాల నాణ్యతను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం మహాలక్ష్మి జిన్నింగ్ అండ్ ప్రాసెసింగ్ కేంద్రంలో ప్రాసెసింగ్ చేసిన పత్తి విత్తనాల్లో హెచ్టీ పరీక్షలు నిర్వహించారు. అగ్రో లైఫ్లో ప్రైవేటు లిమిటెడ్ పురుగు మందుల గోదామును తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. వ్యవసాయ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే నిర్వహించాలన్నారు. కర్నూలు ఏడీఏ సాలురెడ్డి, కల్లూరు ఏఓ విష్ణువర్ధన్రెడ్డి ఉన్నారు. -
ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలి
● వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి కర్నూలు (టౌన్): అసభ్య, అభ్యంతరకర వ్యాఖ్యా లు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి పాటిల్ తిరుమలేశ్వర రెడ్డి అన్నారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భార్యకు, చెల్లెలుకు తేడా తెలియని వ్యక్తి రాధాకృష్ణ అని, చేతిలో పేపరు, టీవీ చానల్ ఉంది కదా అని ఏది చెబితే అది రాసి, ఏమంటే అది మాట్లాడి వైఎస్సార్సీపీపై బురద జల్లుతామంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. అమరావతికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదని, ఆ పేరుతో జరుగుతున్న వేల కోట్ల దోపీడీకి వ్యతిరేకమన్నారు. రాష్ట్రంలో అందరి నోట్లో మావిగన్ చర్చ జరుగుతోందని, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే మంత్రి అచ్చెన్నాయుడు పిచ్చి ప్రేలాపన మాటాలు మాట్లాడుతున్నారన్నారు. తాము ఎర్రనాయుడు గురించి మాట్లాడవచ్చు అయితే తమకు సంస్కారం ఉందన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ మానుకొని, వెంటనే రాధాకృష్ణ మహిళలకు క్షమాపణలు చెప్పాలన్నారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు. -
బినామీ పేర్ల నమోదును అరికట్టండి
● మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఓర్వకల్లు: ప్రభుత్వ భూముల్లో బినామీ పేర్ల ప్రక్రియను తక్షణమే అరికట్టాలని, నిజమైన రైతులకు మాత్రమే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ విద్యాసాగర్ను కలిసి భూముల అన్యాక్రాంతమవుతున్న అంశంపై సమగ్రంగా చర్చిరించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. మండలంలోని చింతలపల్లె, గుట్టపాడు, ఓర్వకల్లు గ్రామాల్లో భూములు బినామీ పేర్లమీద నమోదవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. వాస్తవంగా సాగులో ఉన్న రైతులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2014– 2019 వరకు భూములను సాగు చేసుకున్న రైతులు, అప్పట్లో అర్జీలు సమర్పించిన వారు, కోర్టులను ఆశ్రయించిన వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి నిజమైన రైతులను గుర్తించాలని సూచించారు. పార్టీలకు అతీతంగా వ్యవహరించి వాస్తవంగా భూములను సాగు చేసుకున్న రైతులకు మాత్రమే పరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు. ఓర్వకల్లు గ్రామ రెవెన్యూ పరిధిలో 440–488 సర్వే నంబర్లలో సుమారు 48 సర్వే నంబర్లలో బినామీ పేర్ల మీదుగా ఎంట్రీలు జరుగుతున్నాయని ఆరోపించారు. అదే విధంగా చింతలపల్లె గ్రామంలో కూడా బినామీ వ్యక్తుల పేర్లు నమోదు జరుగుతోందన్నారు. ఇప్పటికై న బినామీ పేర్లమీద నమోదు చేసుకున్న వారికి నష్టపరిహారం చెల్లించకుండా, నిజమైన లబ్దిదారులకు మాత్రమే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. బినామీల వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాటసాని వెంట జెడ్పీటీసీ సభ్యులు రంగనాథ్గౌడు, మాజీ సింగిల్ విండో చైర్మన్ చంద్రశేఖరరెడ్డి, చేట్ల అనిల్కుమార్, బి.ప్రభుకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మారని చేనే‘తల రాత’
కర్నూలు(అగ్రికల్చర్): నష్టాల్లో ఉన్న చేనేత కార్మికులకు చంద్రబాబు ప్రభుత్వం చేయూతనిచ్చి ఆదుకోవడం లేదు. ఘన కీర్తిని సొంత చేసుకున్న ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘాన్ని ఆప్కో పరం చేయడానికి చర్యలు చేపట్టింది. దీంతో తమ తల రాతలు మారబోవని చేనేత కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి 1938లో ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం ఏర్పాటు అయ్యింది. ఈ సంఘాన్ని మురార్జీదేశాయ్ స్వయంగా వచ్చి పరిశీలించారు. ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం వ్యవస్థాపకుడు మాచాని సోమప్ప నాటి జవహర్లాల్ నెహ్రూతో గుంతకల్లులో సమావేశమై చేనేత వస్త్రాల ఉత్పత్తి, విశిష్టతను వివరించారు. ఈ సొసైటీకి ఇంటర్నేషనల్ అవార్డుతో పాటు పలు నగదు పురస్కారాలు కూడా దక్కాయి. ఎంతో ఘనకీర్తిని గడించిన ఎమ్మిగనూరు చేనేత సహకర సంఘం ఒకప్పుడు 2000 మంది సభ్యు లతో ఏటా కోట్ల రూపాయల టర్నోవర్తో కళకళలాడుతూ ఉండేది. ప్రస్తుతం రూ. 6 కోట్లు నష్టాల్లో ఉంది. ఆర్థిక వెసులుబాటు ఇవ్వకుండా.. నష్టాల్లో ఉన్న సంఘాన్ని గట్టెక్కించేందుకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వంపై ఉంది. అయితే ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. మొదటి దశలో ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం షో రూముల్లో ఆప్కో ఉత్పత్తులు ఉంచి విక్రయించాలని నిర్ణయించింది. ఆ తర్వాత సంఘాన్ని ఆప్కో పరం చేసే కుట్రదాగి ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రెండేళ్లలో ఆప్కో తమ షోరూములకు కొత్త సరుకు అనేదే పంపిన దాఖలాలు లేవు. లేని అప్కో ఉత్పత్తులను ఎమ్మిగనూరు సంఘం షోరూముల్లో ఉంచి విక్రయిస్తారనేది సమాధానం లేని ప్రశ్న. నష్టాల్లో ఉన్న సంఘానికి ఆర్థిక వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా చర్యలు మాత్రం లేవు. ఆధిపత్య పోరు సంఘంలో 59 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరి జీతభత్యాలకే రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతోంది. విద్యుత్ బిల్లులు, ఇతర నిర్వహణ ఖర్చులు కలిపితే సంఘానికి నష్టాలే మిగులుతున్నాయి. ప్రస్తుతం పనిచేస్తున్న 59 మందిలో 18 మంది విశ్రాంత ఉద్యోగులు కూడా ఉన్నారు. పాలకవర్గాలు రాజకీయ ప్రయోజనాల కోసం రిటైర్డ్ అయిన వారిని కూడా కొనసాగిస్తుండటంతో సంఘంపై ఆర్థిక భారం పెరిగిపోతోంది. నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు రిటైర్డ్ అయిన వా రిని కొనసాగించడం అవసరమా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. పాలక వర్గాలు, సంఘం సెక్రటరీల మధ్య ఆధిపత్య పోరు కూడా సంఘం నష్టాల్లో కూరుకుపోవడానికి కారణమవుతోందనే విమర్శలు ఉన్నాయి. తగ్గిపోయిన ఉత్పత్తులు ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘంలో ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఒకప్పుడు 2000 మంది సభ్యులతో కళకళలాడిన సంఘంలో నేడు 500 మంది కూడా సభ్యులు లేరు. ఇందులో కూడా చేనేత వస్త్రాలు తయారు చేస్తున్నది 200 మంది వరకే. ఇందువల్ల ఉత్పత్తులు పడిపోయాయి. ఆధునిక యుగంలో కొత్త కొత్త డిజైన్లతో రాణించాల్సి ఉండగా... నేటికి సంప్రదాయ వస్త్రాలైన దోవతులు, పంచలు, టువాళ్లు, దోమతెరలకే పరిమితం అయ్యింది. నాగరికత అభివృద్ధి చెందిన నేపథ్యంలో సంప్రదాయ వస్త్రాలకు ఆదరణ తగ్గిపోయింది. వైఎస్సార్సీపీ హయాంలో ఇలా..గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేనేతను ప్రోత్సహించేందుకు విశేషంగా కృషి చేసింది. ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేసి ఆధునాతన పరికరాలను సరఫరా చేసింది. ప్రత్యేకంగా డిజైనర్లను కూడా నియమించింది. ఫలితంగా ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘంలో ఉత్పత్తులు పెరిగాయి. సంఘానికి వివిధ రూపాల్లో ఏడాదికి రూ.60 లక్షల వరకు ఆర్థిక చేయూత దక్కింది. వైఎస్సార్ నేతన్న నేస్తం కింద ఏడాదికి రూ.24 వేల ప్రకారం ఐదేళ్లు అందించింది. రూ.6 కోట్ల నష్టాలు! ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘం నష్టాల్లో కూరుకపోయింది. 2024–25 ఆడిట్ రిపోర్టు ప్రకారం ఈ సంఘానికి ఉన్న నష్టాలు రూ.6 కోట్లు. 2025–26 సంవత్సరంలో ఆడిట్ చేస్తే నష్టాలు మరింత పెరిగే ప్రమాదం ఏర్పడింది. ఈ సంఘానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో 16 అవుట్లెట్స్ (షోరూములు) ఉన్నాయి. ఒక షోరూం ద్వారా రోజుకు జరుగుతున్న వ్యాపారం కేవలం రూ. 2500 మాత్రమే. 16 షోరూములలో రోజుకు జరుగుతున్న వ్యాపారం కేవలం రూ.40 వేలు మాత్రమే. అంటే నెలకు రూ.12 లక్షల వరకు వ్యాపారం జరగుతోంది. గణనీయంగా పడిపోయిన చేనేత వస్త్రాల ఉత్పత్తి చేనేత కార్మికులను ఆదుకోని చంద్రబాబు ప్రభుత్వం ఎమ్మిగనూరు చేనేత సంఘాన్ని ఆప్కో పరం చేసేందుకు అడుగులు తొలి దశలో ఆప్కో ఉత్పత్తుల అమ్మకాలు మలి దశలో విలీనం చేసేందుకు కసరత్తు -
బాలికపై అత్యాచారయత్నం
బనగానపల్లె రూరల్: బనగానపల్లె పట్టణంలోని నంద్యాల రోడ్డులో యనకండ్ల వాగు వంతెన వద్ద ఓ యువకుడు బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం మేరకు.. బనగానపల్లెలోని కొండపేట కాలనీకి చెందిన గౌండ పని చేసే రవితేజ నంద్యాల రోడ్డులోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఉన్న స్విమ్మింగ్పూల్ వద్దకు సరదాగా ఈతకు వెళ్లాడు. సమీపంలోని రౌండ్ల వద్ద నివాసం ఉంటున్న ఓ మహిళ తన 13 ఏళ్ల కూతు రు, ఎనిమిదేళ్ల కుమారుడిని వెంట తీసుకుని పొలం పనులకు వెళ్లింది. మధ్యాహ్నం సమయంలో ఇద్దరు పిల్లలను ఇంటికి వెళ్లమని చెప్పడంతో వారు నడుచుకుంటూ బయల్దేరారు. అయితే స్విమ్మింగ్పూల్ నుంచి ఇంటికి బయల్దేరిన రవితేజ మార్గమధ్యలో బాలికకు మాయ మాటలు చెప్పి సమీపంలో ఉన్న వంతెన కిందకు తీసుకెళ్లి అత్యాచారయత్నం చేయబోయాడు. బాలిక వెంట ఉన్న తమ్ముడు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకొని బాలికను రక్షించారు. నిందితుడికి దేహశుద్ధి చేసి బనగానపల్లె పోలీసులకు అప్పగించారు. ఈ మేర కు గాయపడిన బాలికను స్థానిక వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కల్పన తెలిపారు. యువకుడికి దేహశుద్ధి పోలీసులకు అప్పగింత -
కేంద్ర బృందం ఉపాధి పనుల పరిశీలన
నంద్యాల(అర్బన్): చాబోలు గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులను సెంట్రల్ మానిటరింగ్ టీం సభ్యులు పరిశీలించారు. టీం లీడర్ అజయ్కుమార్ సాహు, రూబల్ కుమార్లు ఎస్ఏ జీవై, ఎంజీ ఎన్ఆర్ఈజీఎస్, పీఆర్, హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్, డీఆర్డీఏ, ఎన్ఆర్ఎల్ఎం పెన్షన్స్ రికార్డులను పరిశీలించి ఫీల్డ్ విజిట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన కూలీలందరికీ పను లు కల్పించాలని, పనులు, కొలతల్లో తేడాలు లేకుండా చూడాలని సూచించారు. వారి వెంట పీఆర్ డీఈ మోహన్రావు, ఎంపీడీఓ సుగుణశ్రీ, డిప్యూటీ ఎంపీడీఓ శివనాగజ్యోతి, ఏపీడీ సాంబశివరావు, కోర్స్ డైరెక్టర్లు ఏసుదాసు, పరమేష్, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు, ఏఈఓ గనేష్, ఈసీ మగ్బుల్, వెలుగు ఏపీఎం రామశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నీటి ఎత్తిపోతల నిలిపివేత జూపాడుబంగ్లా: ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కర్నూలు–కడప కాల్వకు నీటిసరఫరా నిలిపివేశారు. కేసీ కాల్వకు మూడు మాసాల క్రితమే సుంకేసుల డ్యాం నుంచి నీటిసరఫరా నిలిచిపోగా, రైతుల ఆందోళనల నేపథ్యంతో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా వారం క్రితం వరకు నీటిని విడుదల చేశారు. 2025–26 ఏడాదికి గాను కేసీ కాల్వకు నీటిసరఫరా నిలిపివేశారు. 2026–27 ఏడాదికి గాను వర్షాలు సంవృద్ధిగా కురిస్తే జూలై, ఆగస్టు మాసంలో కేసీ కాల్వకు సాగునీటిని సరఫరా చేసే అవకాశాలున్నాయి. కాగా తాగునీటి అవసరాల నిమిత్తం కేసీ కాల్వకు సుంకేసుల డ్యాం నుంచి 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నీటితో పాటు ముచ్చుమర్రి వద్ద నిల్వ చేసిన 200 క్యూసెక్కుల నీటిని పశువులు, జీవాలు, తాగునీటి అవసరాల నిమిత్తం కాల్వకు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. నేడు మూడు మండలాలకు ఎల్లో అలర్ట్ కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా నిప్పుల కుంపటిగా మారుతోంది. ఈ నెల 11న నంద్యాల జిల్లాలోని పలు మండలాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం ఎల్లో అలర్ట్ ప్రకటించింది. శనివారం వెలుగోడులో 44.5, ఆత్మకూరులో 44.8, కొత్తపల్లిలో 44.2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. వడగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండే ప్రమాదం ఉన్నట్లు స్పష్టం చేశారు. కాగా శుక్రవారం బనగానపల్లిలో 42.3, నంద్యాల రూరల్ లో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆళ్లగడ్డలో 41.9, చాగలమర్రిలో 41.9, సంజామలలో 41.8, రుద్రవరంలో 41.7, కర్నూలులో 41.4, గడివేములలో 41.4 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆళ్లగడ్డ డీఎస్పీగా శ్రీనివాసరావు ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ డీఎస్పీగా శ్రీనివాసరావును నియమిస్తూ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన నెల్లూరు ఎస్బీ డీఎస్పీగా విధులు నిర్వహిస్తూ బదిలీపై ఇక్కడికి రానున్నారు. గతంలో ఇక్కడ డీఎస్పీగా విధులు నిర్వహించిన ప్రమోద్ రిలీవ్ అయిన విషయం తెలిసిందే. ఖరీఫ్ సీజన్కు విత్తనాల కేటాయింపు కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్కు విత్తనాలు కేటాయిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే ఉమ్మడి జిల్లా వ్యవసాయ అధికారులు విత్తనాల కోసం పంపించిన ప్రతిపాదనలను ప్రభుత్వం పక్కనపెట్టి అరకొరగా కేటాయించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు జిల్లాకు సబ్సిడీపై పంపిణీ చేసేందుకు 12,674 క్వింటాళ్లు, రబీ సీజన్కు 9480 క్వింటాళ్లు కేటాయించింది. వేరుశనగ కర్నూలు జిల్లాకు 10,723 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 2136 క్వింటాళ్లు, కొర్ర కర్నూలు జిల్లాకు 76 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 27 క్వింటాళ్లు, మినుములు నంద్యాల జిల్లాకు 40 క్వింటాళ్లు చొప్పున కేటాయించింది. కర్నూలు జిల్లాలో కూడా మినుము సాగవుతున్నప్పటికీ కేటాయింపులు లేకపోవడం గమనార్హం. పచ్చ రొట్ట ఎరువుల విత్తనాలైన దయంచ కర్నూలు జిల్లాకు 1,681 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 5,685 క్వింటాళ్లు, సన్హెంప్ విత్తనాలు కర్నూలు జిల్లాకు 4 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 76 క్వింటాళ్లు, పిల్లి పెసర విత్తనాలు కర్నూలు జిల్లాకు 190 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 1516 క్వింటాళ్ల ప్రకారం కేటాయించింది. -
అప్పు తీర్చేదెట్లా
నేను తువ్వదొడ్డి గ్రామం వద్ద 8 ఎకరాలు ఏడాదికి రూ.1.76 లక్షల చొప్పున కౌలుకు తీసుకుని అరటి పంట సాగు చేశా. తొలి ఏడాది రూ.22 లక్షలు, రెండో ఏడాది రూ.8 లక్షలు పెట్టుబడి పెట్టాను. తొలి ఏడాది ప్రకృతి వైపరీత్యాలతో తీవ్ర నష్టం జరిగింది. లక్షన్నర మాత్రమే చేతికొచ్చింది. ఇప్పుడు కొనేనాథుడే లేడు. కోత కూలీల ఖర్చులు కూడా రావని పంటంతా వదిలేశా. సాగుకు అయిన రూ.30 లక్షలు అప్పు ఎలా తీర్చాలో తెలియడం లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి. లేకపోతే ఆత్మహత్యే శరణ్యం. – ఆర్ సుంకన్న, కౌలు రైతు, రామకొండ -
సాంకేతిక పరిజ్ఞానంతో నేర నియంత్రణ
● జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్నంద్యాల: నేర నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, నేరస్తుల గుర్తింపునకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ పోలీసు అధికారులతో నేర సమీక్ష నిర్వహించారు. స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులు, వాటి స్థితిగతులు, నమోదైన కేసుల్లో నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తు తీరుతెన్నులు, వాటి పురోగతిపై సంబంధిత పోలీస్ అధికారులతో ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోపు పెండింగ్ కేసులను పరిష్కార దశకు తీసుకురావాలన్నారు. మహిళల భద్రత, సైబర్ క్రైం, శాంతిభద్రతల పరిరక్షణ, హత్యలు, చీటింగ్, రోడ్డు ప్రమాదాలు తదితర కేసులపై సమీక్షించాల న్నారు. నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే రోడ్డు రవాణా సంస్థ, ట్రాన్స్పోర్ట్ డిపార్టుమెంట్ వారి సహకారంతో నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు. మహిళలు భద్రతకు పెట్రోలింగ్ పెంచడంతో పాటు నిఘా కెమెరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల దర్యాప్తు, పరిష్కారం, ప్రాపర్టీ నేరాలలో ముద్దాయిల అరెస్ట్, బందోబస్తు విధులు మొదలగు వాటిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 36 మంది పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ ఎం.జావళి ఆల్ఫోన్స్, డీఎస్పీ రామంజి నాయక్, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
చెత్త పలుకుల రాధాకృష్ణను అరెస్టు చేయాలి
● మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డిఆత్మకూరు: ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని స్థానిక పోలీస్స్టేషన్లో ఆయన కార్యకర్తలతో కలిసి రాధాకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళలను కించపరిచేలా రాధాకృష్ణ మాట్లాడడం సరికాదన్నారు. ఆయనకూ భార్యాపిల్లలు ఉన్నారని, మహిళల విషయంలో సభ్యసమాజం తలదించుకు నేలా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. జర్నలిస్టులుగా నైతిక విలువలను కాపాడాల్సిన వ్యక్తి నోటికొచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు సంబంధించిన మహిళలపై దురుసుగా మాట్లాడడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే రాధాకృష్ణ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలన్నారు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి పత్రిక, చానళ్లపై చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీ పాలనలో లబ్ధి పొందేందుకు రోత పలుకులు పలికారని విమర్శించారు. వెంటనే ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. అంతకుముందు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు శిల్పా భువనేశ్వర్రెడ్డి, ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు దేశం తిరుపంరెడ్డి, ఆత్మకూరు, వెలుగోడు మండలాల పార్టీ అధ్యక్షులు సయ్యద్మీర్, రాజమోహన్రెడ్డి, అంబాల ప్రభాకర్రెడ్డితో పాటు ఆత్మకూరు, వెలుగోడు మండలాలకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. -
జీడీపీకి ఎల్లెల్సీ నీరు
గోనెగండ్ల: తుంగభద్ర దిగువ కాలువ నీటిని అధికారులు గాజులదిన్నె ప్రాజెక్టు(జీడీపీ)లోకి మళ్లించారు. గోనెగండ్ల సెక్షన్కు చేరిన నీటిని 50 క్యూసెక్కుల నీరు ఎస్కేప్ చానల్ ద్వారా గాజులదిన్నె ప్రాజెక్ట్కు మళ్లించారు. డోన్, పత్తికొండ, దేవనకొండ తదితర ప్రాంతాలకు తాగునీరు సరఫరా చేసేందుకు ఎల్లెల్సీ ద్వారా నీటి ని జీడీపీలోకి మళ్లించినట్లు ఏఈ మహమ్మద్ అలీ శుక్రవారం తెలిపారు. అలాగే జీడీపీ కుడి కాలువ ద్వారా 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జీడీపీలో 1.8 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు. -
పేదలపై టీడీపీ నాయకుల దౌర్జన్యం
● ఇంటి స్థలం తమదే అంటూ బెదిరింపు ● కన్నీటి పర్యంతమైన శివమ్మబాయి నందికొట్కూరు: టీడీపీ నాయకులు దౌర్జన్యం శ్రుతిమించి పోయింది. స్థలాలను కబ్జా చేసేందుకు పేదలను బెదిరిస్తున్నారు. అధికారులతో నోటీసులు ఇప్పిస్తున్నారు. వారి ఆగడాలు పెచ్చుమీరడంతో శుక్రవారం జంగంపాడు గ్రామంలో శివమ్మ బాయి కన్నీటి పర్యంతమవుతూ తనకు జరుగుతున్న అన్యాయాన్ని విలేకరులకు వివరించారు. తమకు రెవెన్యూ అధికారులు ఇంటి స్థలాన్ని ఇచ్చారన్నారు. ఈ స్థలంలో టీడీపీ నాయకులు దౌర్జన్యంగా పూరి గుడిసె వేశారని తెలిపారు. ఈ స్థలం కోసం ఇద్దరు గొడవపడి గ్రీవెన్స్కు వెళ్లారని, అధికారులు పరిశీలించి పూలు నాయక్పై ఈ స్థలం ఉందని తేచ్చి చెప్పారన్నారు. అయితే టీడీపీ నాయకులు కుట్రపన్ని ఇంటి స్థలాన్ని రద్దు చేయాలని అధికారులతో నోటీసు పంపారన్నారు. తన భర్త పూలునాయక్ పక్షవాతం రోగంతో మంచానికే పరిమితమయ్యారని, జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. -
గత ఏడాది రూ.2 కోట్లు రిజర్వులో ఉంచాం
గత ఏడాది వేసవిని దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంతాల్లో బోర్లు, పైప్లైన్లు తదితర నీటి సమస్యలను తీర్చేందుకు రూ.2 కోట్లను రిజర్వులో ఉంచుకున్నాం. అప్పట్లో రిజర్వులో ఉంచుకున్న మొత్తంతోనే జెడ్పీటీసీల ఆధ్వర్యంలో అనేక గ్రామాల్లో తాగునీటికి సంబంధించిన పనులను చేపట్టాం. ఈ ఆర్థిక సంవత్సరం రూ.కోట్లలో ఉన్న స్టాంప్ డ్యూటీ లక్షలకు పడిపోయింది. జెడ్పీకి సొంత ఆదాయ వనరులు లేకపోవడం, ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉండడం చాలా బాధాకరం. – యర్రబోతుల పాపిరెడ్డి, జెడ్పీ చైర్మన్ స్థానిక సంస్థలకు స్టాంప్ డ్యూటీ విడుదల చేయకుంటే ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేని పరిస్థితి ఉంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి పక్కాగా స్థానిక సంస్థలకు నిధులు విడుదలయితే గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న స్టాంప్ డ్యూటీని జమ చేయించడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి. – పోచా జగదీశ్వరరెడ్డి, జెడ్పీటీసీ, జూపాడుబంగ్లా -
ఉత్తమమైనది హోమియో వైద్యం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్దికర్నూలు: హోమియో వైద్యం ఉత్తమమైనదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది అన్నారు. ప్రపంచ హోమియో దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కోర్టులోని న్యాయసేవా సదన్లో ఏర్పాటు చేసిన ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలావెంకటశేషాద్రితో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కబర్ది మాట్లాడుతూ.. హోమియోపతి వైద్యంపై అవగాహన కల్పించడానికి ఉచితవైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలావెంకట శేషాద్రి మాట్లాడుతూ..చిన్నపాటి మందుతోనే తీవ్రమైన వ్యాధులను సైతం నయం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ హోమియో వైద్యులు మహదేవ్రావ్, డాక్టర్ పీవీ హరినాథ్, కర్నూలు కోర్టుకు సంబంధించిన న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రసిడెంట్ చంద్రుడు, వైద్యురాలు భారతి తదితరులు పాల్గొన్నారు. -
చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా శివరామచంద్రరావు
కర్నూలు: కర్నూలు చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా న్యాయవాది ఎం.శివరామచంద్రరావు నియమితులయ్యారు. రాష్ట్ర హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయగా.. శుక్రవారం ఉదయం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఆర్థిక స్తోమతలేని నిందితులకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అందించే ఉచిత న్యాయసేవల్లో భాగంగా క్రిమినల్ కేసుల్లో నిందితుల తరఫున వాదనలు వినిపిస్తారు. గడచిన రెండు సంవత్పరాల నుంచి డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా పనిచేసి పలు కేసుల్లో తన వాదనలు వినిపించారు. ఇటీవల రాష్ట్ర హైకోర్టువారు ఇచ్చిన నోటిఫికేషన్లో చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా ధరఖాస్తు చేసుకోవడంతో శివరామచంద్రరావును ఎంపిక చేసి నియమించారు. -
త్వరలో నూతన అదనపు కోర్టులు ఏర్పాటు
నంద్యాల(వ్యవసాయం): నంద్యాలలో నాలుగు నూతన అదనపు కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ది తెలిపారు. శుక్రవారం కోర్టు కాంప్లెక్స్లోని నాలుగు కోర్టులకు సంబంధించిన గదులను పరిశీలించి అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కోర్టు కాంప్లెక్స్లో తొమ్మిదవ అదనపు జిల్లా కోర్టుతో పాటు మూడు అదనపు కోర్టులకు అవసరమైన వసతులు అన్ని ఉన్నాయన్నారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సిబ్బందికి, న్యాయవాదులు, కక్షిదారులకు అవసరమైన ఫర్నిచర్ను ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఇందుకు రూ.21 కోట్ల నిధులు విడుదలయ్యాయన్నారు. ఈనెల 18, 19 తేదీలలో నంద్యాలలో నాలుగు కోర్టులు, నందికొట్కూరులో ఒక కోర్టు, కర్నూలులో రెండు కోర్టులను హైకోర్టు జస్టిస్ బి.కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ప్రారంభించడానికి హైకోర్టు అనుమతులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి తంగమణి, రెండవ అదనపు జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కర్రి లక్ష్మి, ఆర్డీవో విశ్వనాఽథ్, తహసీల్దార్ పత్తి శ్రీనివాసులు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హుస్సేన్ బాషా, జయకృష్ణ, శివశంకర్ రెడ్డి, ఏపీపీ రాజేశ్వరరెడ్డి, ప్రతాపరెడ్డి, గౌరీ శంకర్ తదితర కోర్టు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. -
ఈతకు వెళ్లి బాలుడు మృతి
నంద్యాల(అర్బన్): సరదాగా ఈతకు వెళ్లి చెక్ డ్యాంలో మునిగి 15 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన శనివారం మండలంలోని పొ న్నాపురం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన షేక్ మోదిన్కుమారుడు షేక్ సోహేల్ గురువారం హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఉన్న కేసీ కెనాల్ చెక్డ్యాంలో ఈతకు వెళ్లాడు. లోతు గమనించని సోహేల్ డ్యాంలో దూకడంతో మునిగిపోయాడు. సాయంత్రం ఇంటికి చేరని కొడుకు ఏమయ్యాడోనని తల్లిదండ్రులు, బంధువులు గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. శుక్రవారం ఉదయం సోహేల్ శవమై తేలాడు. ఈ మేరకు మృతుడి తల్లి షేక్ షబానా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
బాలల హక్కులపై అవగాహన తప్పనిసరి
కర్నూలు: బాలలకు రాజ్యాంగంలో పొందుపరచిన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని పోలీసు అధికారులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి సూచించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్లో బాలలు, న్యాయచట్టంపై గురువారం అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ప్రధాన న్యాయమూర్తి కబర్ధి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాల నేరస్తుల్లో నేర స్వభావాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించి కౌన్సెలింగ్, విద్యాబోధన ద్వారా మార్పు తీసుకురావాలన్నారు. బాల నేరస్తులను సన్మార్గంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి పిలుపునిచ్చారు. జువైనెల్ జస్టిస్ యాక్ట్ గురించి చైర్మన్ కమ్ ప్రిన్సిపాల్ మెజిస్ట్రేట్ టి.అపర్ణ తెలియజేశారు. ప్రజా వినియోగ సేవల కోసం శాశ్విత లోక్ అదాలత్ అధ్యక్షులు వెంకటహరినాథ్ పలు రంగాలకు సంబంధించి ఎలాంటి సేవల్లో లోపం కాని, నష్టం కాని, అన్యాయం కాని జరిగితే తక్షణమే పర్మనెంట్ లోక్ అదాలత్లో వినతిపత్రంతో పాటు తగిన ఆధారాలతో సమర్పించాలని సూచించారు. ఎలాంటి కోర్టు ఖర్చులు లేకుండా తక్కువ సమయంలో న్యాయం చేస్తామని తెలిపారు. మహిళా పీఎస్ డీఎస్పీ ఉపేంద్ర బాబు మాట్లాడుతూ పిల్లల కేసుల పట్ల ఎలా విచారణ చేయాలో పోలీసులకు తెలియజేశారు. కార్యక్రమంలో మానసిక వైద్యనిపుణులు డాక్టర్ చంద్రశేఖర్, ప్రభుత్వ బాలుర పరిశీలన గృహం సూపరింటెండెంట్ డాక్టర్ హుసేన్ బాషా, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ జుబేదా బేగం, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ విజయ, తదితరులు పాల్గొన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించం
బేతంచెర్ల: గ్రామ సచివాలయాల్లో సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. బేతంచెర్ల మండల పరిధిలోని ఆర్ కొత్తపల్లె గ్రామ సచివాలయాన్ని గురువారం ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ సచివాలయ సిబ్బంది ఆన్లైన్ హాజరు నమోదును పరిశీలించారు. విధులకు హాజరుకాని పంచాయతీ గ్రేడ్–5 సిబ్బంది, వీఆర్వోపై షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. గ్రామ సచివాలయంలో రిజిష్టర్లను పరిశీలించి ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. రీ సర్వేకు సంబంధించి వీఆర్వో, సర్వేయర్ అందుబాటులో లేరని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకరాగా, వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలి గోస్పాడు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఆదేశించారు. గోస్పాడు పీహెచ్సీని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఆరోగ్య పరీక్షల కోసం వచ్చిన గర్భవతులతో మాట్లాడారు. రక్తహీనత సమస్య తలెత్తకుండా సమయానికి మంచి పోషకాహారం తీసుకోవాలని, క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జూలేపల్లి గ్రామంలో సంచారచికిత్స కార్యక్రమాన్ని పరిశీలించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఎన్సీడీ సర్వేని వేగవంతం చేయాలన్నారు. క్యాన్సర్ వ్యాధి నివారణకు ఇస్తున్న హెచ్పీవీ వ్యాక్సినేషన్ 14 సంవత్సరాల బాలికలందరికీ అందేలా చూడాలన్నారు. ఆరోగ్య కేంద్రంలో వైద్యసేవలు సక్రమంగా అందుతున్నయా లేదా అనే విషయంపై రోగులతో ఆరా తీశారు. స్థానిక వైద్యాధికారులు డాక్టర్ కాంతారావు నాయక్, డాక్టర్ షబ్బీర్ హుస్సేన్ వలి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో జిల్లా నాయకులకు పదవులు బొమ్మలసత్రం: జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులకు వివిధ విభాగాలకు సంబంధించి పదవులను కల్పించారు. ఈ మేరకు గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. నంద్యాల నియోజకవర్గానికి చెందిన ఎం.శివనాగిరెడ్డిని స్టేట్ ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగం జాయింట్ సెక్రటరీగా నియమించారు. ఎస్వీఎన్వీ ప్రసాదరెడ్డిని నంద్యాల జిల్లా ఎంప్లాయ్, పెన్షనర్స్ విభాగం అధ్యక్షుడిగా నియమించారు. పాణ్యానికి చెందిన కాల్వ లక్ష్మిపతిని రాష్ట్ర పబ్లిక్ వింగ్ సెక్రటరీగా, పొంగులేటి సుభాషిణిరెడ్డిని స్టేట్ అంగన్వాడీ వింగ్ సెక్రటరీగా, యాతా సురేష్ను స్టేట్ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీగా నియమించారు. బనగానపల్లెకు చెందిన అందె శ్రీనివాసరెడ్డి, పోరెడ్డి మనోహర్రెడ్డిలను స్టేట్ రైతు విభాగం జాయింట్ సెక్రటరీగా, నందికొట్కూరుకు చెందిన వి.రామకృష్ణారెడ్డిని నియోజకవర్గ ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగం అధ్యక్షులుగా నియమించారు. నిప్పుల కొలిమి ● దొర్నిపాడులో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గురువారం ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. దొర్నిపాడులో అత్యధికంగా 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. గోస్పాడులో 42.8, ఆళ్లగడ్డలో 42.7, రుద్రవరంలో 42.6, చాగలమర్రిలో 42.3, నంద్యాల రూరల్లో 42.3, అవుకులో 42.2, బనగానపల్లిలో 42.2, కౌతాలంలో 41.6, మంత్రాలయంలో 41.5 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు మండలాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యాహ్న సమయంలో గాలిలో తేమ 10 శాతానికి పడిపోతుండటంతో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. -
సమస్యలపై ఉపాధ్యాయుల నిరసన గళం
● మూల్యాంకన కేంద్రం ఎదుట ఆందోళననంద్యాల(న్యూటౌన్): ఉద్యోగ, ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేంత వరకు పోరడతామని నంద్యాల జిల్లా ఫ్యాప్టో చైర్మన్ శివయ్య, జనరల్ సెక్రటరీలు దస్తగిరిబాషా, వరప్రసాద్, కార్యవర్గ సభ్యుడు నగరి శ్రీనివాసులు తెలిపారు. నంద్యాల పట్టణ సమీపంలో ఉన్న ఎస్డీఆర్ పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి మూల్యాంకన కేంద్రం ఎదుట గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 12వ పీఆర్సీ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే 30 శాతం ఐఆర్ ప్రకటన ఇవ్వాలన్నారు. దీర్ఘకాలిక బకాయిల చెల్లించడంతోపాటు నాలుగు పెండింగ్ డీఏల మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు. ఏకీకృత రూల్స్ సమస్యల పరిష్కరించాలన్నారు. బోధనేతర కార్యక్రమాల రద్దు చేయాలన్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు గ్రాట్యుటీ కమ్యూటేషన్, లీవ్ఎన్వెస్మెంట్ ఆలస్యం లేకుండా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎంఈఓల బదిలీలు, ఎంఈఓ, హెచ్ఎంల పరస్పర బదిలీలు చేపట్టాలన్నారు. కేజీబీవీ, మోడల్ స్కూల్, గురుకులాలు, ఎయిడెడ్, యాజమాన్యాల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం ఆగబోదని వెల్లడించారు. ప్రతి పాఠశాలలో నాన్టీచింగ్ స్టాఫ్, కంప్యూటర్ ఆపరేటర్ను నియమించాలని కోరారు. నాయకులు రవికుమార్, స్వామిశంకర్, సుబ్బన్న, లక్ష్మణ్నాయక్, అజాంబేగ్, వరప్రసాద్ పాల్గొన్నారు. -
రాధాకృష్ణవి ‘చెత్త’పలుకులు
ఆలూరు రూరల్: ఏబీఎన్ రాధాకృష్ణ ‘చెత్త’పలుకులు మానుకొని మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి డిమాండ్ చేశారు. రాధాకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం ఆయన వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి స్థానిక అంబేడ్కర్ సర్కిల్లో నిరసన వ్యక్తం చేసి ఆంధ్రజ్యోతి పత్రికలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మావిగన్ను ప్రతిపాదించారన్నారు. ఇందుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండటంతో జీర్ణించుకోలేని రాధాకృష్ణ తప్పుడు వ్యాఖ్యలతో గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు దోచుకోవడం, దాచుకోవడం తప్ప మరోపని లేదన్నారు. ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ 5 బీఆర్ నాయుడు, ఈనాడు ఎల్లో మీడియా కూటమి కుల పిచ్చితో చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నారన్నారు. అమరాతి పేరిట చంద్రబాబు అండ్ బ్యాచ్ భూ కబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. అమరాతి ప్రజల రాజధానిగా కాకుండా కమ్మ రాజధానిగా మారుతోందన్నారు. కారుకూతలు కూసిన రాధాకృష్ణ రాష్ట్రంలోని మహిళలందరికీ క్షమాపణ చెప్పే వరకు వైఎస్సార్సీపీ నేతలు, నాయకులు ఆందోళనలు కొనసాగిస్తారన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ మల్లికార్జున, వైఎస్సార్సీనీ నాయకులు చిన్న ఈరన్న, రామాంజినేయులు, ఎస్కే గిరి, వెంకటేషులు, ఎల్లప్ప, లక్ష్మిరెడ్డి, ఉరుకుందు, మారెప్ప, ఈరన్న, కో–ఆప్షన్ మెంబర్ బాషా పాల్గొన్నారు. -
మొక్కజొన్న రైతు కుదేలు!
నేను 11 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. ఎకరాకు రూ. 40 వేల వరకు పెట్టుబడులు పెట్టాను. పంట దిగుబడి చూస్తే ఏం మిగిలేలా లేదు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయడం లేదు. మేము కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాం. ఇప్పటికై నా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింటా రూ.2,400 మద్దతు ధరతో కొనుగోలు చేయాలి –భూపాల్ రెడ్డి, మొక్కజొన్న రైతు, ఆకుమల్ల గ్రామం,సంజామల మండలం గతేడాదిలాగే ఏడాది కూడా మొక్కజొన్న కలిసి రాలేదు. ఈ రబీలో 6 ఎకరాల్లో పంట వేశాను. దిగుబడి ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు వచ్చింది. అయితే, మద్దతు ధర లభించడం లేదు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో వ్యాపారులు ధర తగ్గించి అడుగుతున్నారు. క్వింటా రూ. 1750లోపే పలుకుతుంది. – పేరం వెంకటేశర్ రెడ్డి, మొక్కజొన్న రైతు, ఆకుమల్ల గ్రామం, సంజామల మండలం సంజామల: గత రెండేళ్లుగా రైతులకు వ్యవసాయం కలిసి రావడం లేదు. అతివృష్టి, అనావృష్టికి తోడు ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో నష్టాలు మూటగట్టుకుంటున్నారు. మొక్కజొన్న రైతుల పరిస్థితి మరీ దయనీయం. కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర లేక, దళారులు అడిగిన ధరకు విక్రయించలేక సతమతమవుతున్నారు. మరికొందరు ఆర్థిక పరిస్థితి సహకరించక, నిల్వ చేసుకునే సదుపాయం లేక వ్యాపారులు అడిగిన ధరకే విక్రయిస్తున్నారు. ఖరీఫ్ కలిసి రాలేదు. కనీసం రబీ సీజనైనా తమకు నష్టాల నుంచి గట్టెక్కిస్తుందేమోననే ఆశతో నంద్యాల జిల్లాలో భారీగా మొక్కజొన్న సాగు చేశారు. సాధారణ విస్తీర్ణం 29,713 ఎకరాలు కాగా రికార్డు స్థాయిలో 72, 896 ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశారు. జిల్లాలో పాములపాడు, బనగానపల్లె, రుద్రవరం, చాగలమర్రి, ఆళ్లగడ్డ మండలాల్లో అత్యధిక విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేశారు. ‘మద్దతు’ ప్రకటనలకే పరిమితం విత్తు నుంచి కోత వరకు ఎకరాకు రూ. 40 వేల నుంచి రూ. 45 వేల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. దిగుబడి 30 నుంచి 35 క్వింటాళ్లు వస్తుంది. ప్రభుత్వం మద్దతు ధర రూ. 2,400గా ప్రకటించి జిల్లాలో ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో చేతికొచ్చిన దిగుబడిని ఎక్కడ విక్రయించుకోవాలో అర్థం కావడం లేదు. దీనిని ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ వ్యాపారులు, దళారులు ధర తగ్గించి అడుగుతున్నారు. నాణ్యతను బట్టి క్వింటం రూ. 1500 నుంచి రూ. 1750కు మించి కొనుగోలు చేయడం లేదు. ఈ ధరకు విక్రయిస్తే కష్టమంతా పెట్టుబడులకే సరిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పంట చేతికి రాగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకునేవారని, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మొక్కజొన్న రైతులు కోరుతున్నారు. నియోజకవర్గం సాధారణ సాగు నందికొట్కూరు 5957 20095 ఆళ్లగడ్డ 11176 19957 బనగానపల్లె 6394 17102 శ్రీశైలం 2445 7160 డోన్ 997 2067 నంద్యాల 568 1689 పాణ్యం 2176 4826 మొత్తం 29,713 72,896 ప్రకటనకే పరిమితమైన మద్దతు ధర జిల్లాలో ఎక్కడా కానరాని కొనుగోలు కేంద్రాలు సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు ప్రభుత్వ తీరుతో నష్టపోతున్న రైతులు


