Nandyala
-
భ్రామరీకి లక్ష కుంకుమార్చన
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబాదేవికి పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం లక్ష కుంకుమార్చన సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీశైలానికి స్వయంగా రాలేని భక్తులు వారి గోత్ర నామాలతో లక్ష కుంకుమార్చనలో పరోక్ష సేవగా పాల్గొనే అవకాశం దేవస్థానం కల్పించింది. ఈ మేరకు వివిధ ప్రాంతాల నుంచి 26 మంది భక్తులు పరోక్షసేవ ద్వారా పాల్గొన్నారు. మంగళకరమైన ద్రవ్యాలలో కుంకుమకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కుంకుమతో అమ్మవారిని అర్చించడం విశేష ఫలదాయకమని పండితులు చెబుతున్నారు. లక్ష కుంకుమార్చన సేవను జరిపించుకోవడం వలన కష్టాలు తొలగిపోతాయని, సర్వశుభాలు కలుగుతాయని సంతాన సౌఖ్యం కలుగుతుందన్నారు. మార్కుల జాబితాను డౌన్లోడ్ చేసుకోండినంద్యాల(న్యూటౌన్): పదో తరగతి మార్కుల జాబితాను www. bsc.ap.gov.in అందు బాటులో ఉందని, విద్యార్థులు డోన్లోడ్ చేసుకోవాలని డీఈఓ జనార్దన్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలు మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరిగాయన్నారు. ఏప్రిల్ 23వ తేదీన ఫలితాలు వచ్చాయన్నారు. ఈనెల 8వ తేదీ నుంచి వెబ్సైట్లో మార్కుల జాబితాను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఏవైనా దిద్దుబాట్లు ఉన్నట్లు అయితే ఒరిజినల్ పాస్ సర్టిఫికెట్లలో సవరణలు అమలు చేయడానికి ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దృష్టికి తెలియజేయాలన్నారు. అడ్మిషన్కు సక్రమంగా పాఠశాలల రికార్డులను జోడించాలన్నారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించిన సంక్షిప్తం మార్కుల జాబితా పత్రం ఈనెల 25వ తేదీలోగా సమర్పించాలని డీఈఓ తెలిపారు. 17న పాణ్యంకు సీఎం రాక పాణ్యం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 17వ తేదీన పాణ్యం రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే ‘స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమానికి హాజరు కానున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై సోమవారం నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ మండల రెవెన్యూ అధికారులతో సమీక్ష చేపట్టారు. సీఎం పర్యటన షెడ్యూల్డ్ అధికారకంగా రావడంతో ఆర్డీఓ, తహసీల్దార్ నరేంద్రనాథ్రెడ్డి కలిసి హెలిపాడ్ స్థలాన్ని పరిశీలించారు. పాణ్యం హైవేలోని చందమామ హోటల్ ఎదురుగా ఉన్న ప్రయివేట్ వెంచర్ను పరిశీలించారు. మరో స్థలాన్ని పరిశీలించనున్నారు. పాణ్యం ప్రభుత్వ పాఠశాలలో బహిరంగ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు గురించి ఆర్డీఓ అడిగి తెలుసుకున్నారు. అధికారికంగా సీఎం పర్యటన ఖరారైనట్లు ఎంపీడీఓ ప్రవీణ్కుమార్ తెలిపారు. 67 మందికి గ్రేడ్–2 కార్యదర్శులుగా పదోన్నతి కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 67 మంది గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్–2 కార్యదర్శులుగా పదోన్నతి లభించినట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో 31 మందికి, నంద్యాల జిల్లాలో 36 మందికి పదోన్నతి లభించిందన్నారు. వీరిలో కర్నూలు జిల్లాకు 10 మందిని, నంద్యాల జిల్లాకు 10 మందిని కేటాయించి మిగిలిన వారిని ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాలకు కేటాయిస్తు సీపీఆర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయన్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాలో గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతి పొందేందుకు 34 మంది జూనియర్ అసిస్టెంట్లకు అర్హత ఉందన్నారు. ఈ మేరకు అనుమతి కోరుతున్నామని డీపీఓ వెల్లడించారు. దొర్నిపాడులో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత కర్నూలు(అగ్రికల్చర్): భానుడి భగభగలు పెరిగాయి. కొద్ది రోజులుగా 40 డిగ్రీల వరకు నమోదవుతున్న ఉష్ణోగ్రతలు సోమవారం పెరిగి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. దొర్నిపాడులో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పాణ్యంలో 40.5, రుద్రవరంలో 40.2, శిరువెళ్లలో 40, గూడూరులో 39.3, కోడుమూరులో 39.2, వెల్దుర్తిలో 39.1 డిగ్రీల ప్రకారం నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు జిల్లా విపత్తుల నిర్వహణ అథారిటీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అనుపమ తెలిపారు. -
ఫైల్పై ఆరా తీస్తున్నాం
ఎన్ఎస్టీఎఫ్డీసీ రుణాలకు సంబంధించిన ఫైల్ కనిపించకుండా పోయిన విషయంపై ఆరా తీస్తున్నాం. ఎవరైనా కావాలని ఫైల్ను మాయం చేశారా? లేక కార్యాలయంలోనే ఎక్కడైనా మిస్ అయ్యిందా? అనే కోణంలో విచారణ చేయిస్తున్నాం. అప్పట్లో కార్యాలయంలో విధులు నిర్వహించిన ఉద్యోగులు ఫైల్ను తమ ప్లేస్లోకి వచ్చిన వారికి అప్పగించారా, లేదా అనే విషయాలను కూడా తెలుసుకుంటున్నాం. ఫైల్ కనిపించకుండా పోవడం వల్ల ఈ పథకం కింద తీసుకున్న రుణాల రికవరీ కష్టతరమవుతోంది. – కె.తులసీదేవి, జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారిణి● -
గిరిజన సంక్షేమ శాఖలో రుణాల ఫైల్ గల్లంతు
● 2018–19లో 11 మందికి రూ.1.57 కోట్ల రుణాలు ● ఇందులో 7 ఇన్నోవా, 2 బొలేరో వాహనాలు ● కార్పొరేషన్కు చెల్లించాల్సిన రుణం రూ.96.86 లక్షలు ● ఇప్పటి వరకు చెల్లించింది రూ.10.45 లక్షలు ● రికవరీ తక్కువగా ఉందని ఉన్నతాధికారుల అసహనం ● షూరిటీ ఇచ్చిన వారికి నోటీసులు పంపేందుకు కనిపించని ఫైల్ -
ఉద్యోగులు తలుచుకుంటే ఏమైనా చేయగలరనేందుకు సబ్సిడీ రుణాలే నిదర్శనం. అర్హులు రుణాలు అందక కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే.. అడ్డదారిలో రుణాలు దక్కించుకున్న వాళ్లు ఎంచక్కా షి‘కారు’ చేస్తున్నారు. అంతేకాదు.. ఉద్యోగులను బుట్టలో వేసుకొని రుణాలు తిరిగి చెల్లించకుండా
రూ.16,58,300లకు కొనుగోలు చేశారు. ఇందులో ఎన్ఎస్టీఎఫ్డీసీ లోన్ రూ.9,94,980 కాగా, ట్రైకార్ సబ్సిడీ రూ.5,80,405లుగా నిర్ణయించారు. అలాగే లబ్ధిదారుని వాటా రూ.82,915 చెల్లించిన వారికి వాహనాలు కేటాయించారు. రూ.10.60 లక్షలకు కొనుగోలు చేశారు. ఇందులో ఎన్ఎస్టీఎఫ్డీసీ లోన్ రూ.6.36 లక్షలు, సబ్సిడీ రూ.3.71 లక్షలు కాగా.. లబ్ధిదారుని వాటా రూ.53 వేలు చెల్లించిన వారికి బొలెరో వాహనాలను అందించారు. ఇన్నోవా కారు రూ.10 లక్షలకు కొనుగోలు చేశారు. ఇందులో లోన్ రూ.6 లక్షలు కాగా, సబ్సిడీ రూ.3.50 లక్షలు. లబ్ధిదారుని వాటా రూ.50 వేలు చెల్లించిన వారికి ట్రాక్టర్లు మంజూరైంది. ఇన్నోవా కారురెడిమేడ్ గార్మెంట్ యూనిట్ యూనిట్ ఏర్పాటుకు రూ.10 లక్షలను మంజూరు చేశారు. ఇందులో లోన్ 8.50 లక్షలు, సబ్సిడీ రూ.లక్ష. లబ్ధిదారుని వాటా రూ.50 వేలు చెల్లించిన వారికి రుణం మంజూరు చేశారు. బొలెరో వాహనం -
మద్యం దుకాణానికి దరఖాస్తుల ఆహ్వానం
బొమ్మలసత్రం: పగిడ్యాల మండలానికి చెందిన మద్యం దుకాణానికి గీత కార్మికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎకై ్సజ్ అధికారి రవికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15వ తేదీలోగా జిల్లాకు చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. నాన్ రీఫండబుల్ ఫీజు రూ. 2 లక్షలు చలానా రూపంలో సమర్పించాలని సూచించారు. ఫిర్యాదులు పునరావృతం కావొద్దు బొమ్మలసత్రం: పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు పునరావృతం కాకుండా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ అధిరాజ్సింగ్రాణా పోలీసుల అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా 84 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అందిన ఫిర్యాదుల్లో అధికంగా అన్నదమ్ముల ఆస్తి తగాదాలు, అత్తింటి వేధింపులు, ఉద్యోగాల పేరుతో మోసాలు, తప్పుడు పత్రాలతో ఆస్తుల రిజిస్ట్రేషన్ తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయన్నారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ సూర్యమౌళి పాల్గొన్నారు. పీహెచ్సీల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి ఉయ్యాలవాడ: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించా రు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్లో పీహెచ్సీల్లో వైద్య సేవలు అందడం లేదని కలెక్టర్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. పీహెచ్సీల్లో కనీస మౌలిక వసతులు, తాగునీరు, మరుగుదొడ్లు దుస్థితిపై, రోగులకు కావాల్సిన మందులు అందుబాటులో వున్నాయా లేవా వైద్యాధికారులు, సిబ్బంది ఆసుపత్రులకు వస్తున్నారా లేదా సమయ పాలనపై ఆరా తీయాలని మండల స్థాయి అధికారులకు సూచించారు. తహసీల్దార్ శ్రీనివాసులు, ఇన్చార్జ్ ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మండల పరిధిలోని పెద్దయమ్మనూరు, ఉయ్యాలవాడ, మాయలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసి వసతుల కల్పనపై నివేదిక అందజేస్తామన్నారు. -
పొగాకు కంపెనీలపై చర్యలు తీసుకోండి
నంద్యాల(న్యూటౌన్): ఒప్పందానికి అనుగుణంగా పొగాకు కొనుగోలు చేయకుండా రైతులను వేధిస్తున్న ప్రైవేటు కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ ఆళ్లగడ్డ, రుద్రవరం, శిరివెళ్ల, మహానంది, పాణ్యం, కొత్తపల్లి, ఆత్మకూరు మండలాల్లో పలు రైతుల నుంచి ప్రైవేటు కంపెనీ లు ముందుగానే అగ్రిమెంట్ చేసుకుని పంట చేతికొచ్చిన తర్వాత అగ్రిమెంట్ చేసుకున్న ధరకు కొనుగోలు చేయడం లేదన్నారు. పొగాకు రైతులను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్, సహాయ కార్యదర్శి రామచంద్రుడులు మాట్లాడుతూ.. అలయన్స్ వన్, జీపీఐ, ఎంఎల్ గ్రూప్, ఐటీసీ లాంటి కంపెనీలు జిల్లా రైతులతో క్వింటా రూ.18,500 మేర కొనుగోలు చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకొని పొగాకు కొను గోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇళ్లలో పొగాకు నిల్వ చేసుకోవడంతో రంగుమారి నాణ్యత దెబ్బతినడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వసుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు కంపెనీలతో చర్చించి న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ రాజకుమారికి వినతి పత్రం అందజేశారు. ఆందోళనలో ఏపీ రైతు సంఘం నాయకు లు సుబ్బరాయుడు, సురేష్, పొగాకు రైతులు బుజ్జయ్య, రఘురామిరెడ్డి, సుబ్బు, నారాయణ, థామస్, శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కంపెనీలతో కలెక్టర్ చర్చలు జరిపి న్యాయం చేయాలి అగ్రిమెంట్ ధర ఇప్పించాలని డిమాండ్ -
రాష్ట్రంలో రాక్షస పాలన
బొమ్మలసత్రం: కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తుందని ఎమ్మెల్సీ ఇసాక్బాషా విమర్శించారు. సోమవారం స్థానిక మాజీ ఎమ్యెల్యే శిల్పారవి చంద్రకిషోర్రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి విడదల రజిని పట్ల చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు ప్రవర్తించిన తీరు అమానవీయమన్నారు. కూటమి నేతల మెప్పు కోసం పోలీసులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం మంచిది కాదన్నారు. మాజీ మంత్రి, ఒక మహిళ అని చూడకుండా ఆమైపె సీఐ దురుసుగా ప్రవర్తించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. మాజీ మంత్రి విడదల రజిని అనుచరుడు శ్రీకాంత్రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వచ్చిన సీఐ సుబ్బనాయుడును సీఐ గారు..అని సంభోదించినప్పటికీ ఆమెను కారులో నుంచి బైటికి లాగి కిందకు దింపటం ఎంత దుర్మార్గమన్నారు. ఇటీవల గుంటూ రు జిల్లాలో కల్పన అనే దళిత ఎంపీటీసీ సభ్యురాలిని అర్ధరాత్రి అరెస్ట్ చేయడం, నైటీ మార్చుకుని చీరతో వస్తానని ఆమె బ్రతిమాలినా వినకుండా.. చీర కారులోనే మార్చుకోమని పోలీసులు చెప్పడం ఎంతటి బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ పాలన రాక్షసపాలనను తలపిస్తుందని, ఇలాగే కొనసాగితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో నిరసనలు తెలపాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన కూటమి నేతలు రెడ్ బుక్ పాలనను మాత్రం సజావుగా సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, అధికార పత్రినిధి అనిల్ అమృతరాజ్, మాజీ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి, కౌన్సిలర్ కృష్ణమోహన్, నాయకులు లక్ష్మీనారాయణ, సాయిరామ్రెడ్డి, రహంతుల్లా, భాస్కర్రెడ్డి, శంకర్నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఇసాక్బాషా -
‘మీ కోసం’లో అర్జీల సమాచారం
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల(న్యూటౌన్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన అర్జీల (తాజా పరిస్థితిని) సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. దరఖాస్తుదారులు అర్జీల నమోదు, ప్రస్తుత స్థితికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు 1100 నంబర్ను కూడా సంప్రదించవచ్చునన్నారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే మాత్రమే జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమానికి రావాలన్నారు. వినతులలో రెవెన్యూ శాఖకు సంబంధించిన ఫిర్యాదులు అధిక శాతం వస్తున్నాయన్నారు. వినతులను సక్రమంగా పరిష్కరించని కారణంగా 47 రీఓపెన్ అయ్యాయని, వీఐపీ అర్జీలు 7 పెండింగ్లో ఉన్నాయని, వీటిని త్వరితగతిన పరిష్కరించేలా చూడాలన్నారు. జిల్లాలో బంగారు కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు 975 మార్గదర్శులను గుర్తించామని, ఆళ్లగడ్డ మండలం నుంచి ఇంకా మార్గదర్శుల నివేదిక రావాల్సి ఉందని వెంటనే పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. 203 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు అందజేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, డీఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
గరుడ వాహనంపై గోవిందుడి అభయం!
గరుడ వాహన సేవ నిర్వహిస్తున్న దృశ్యం ఆళ్లగడ్డ: అహోబిల నరసింహ స్వామి జయంతి బ్రహ్మోత్స వాల సందర్భంగా ఎగువ అహోబిలంలో చివరి రోజు జ్వాలా నరసింహస్వామి గరుడోత్సవం వైభవోపేతంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి నిత్యపూజలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించిన ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత జ్వాలా నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని గరుడ వాహనంపై కొలువుంచి ఆస్థాన విద్వాంసుల మంగళకరమైన వాయిద్యాలు, వేద పండితుల మంత్ర పఠనములు.. భక్తుల గోవిందా నామస్మరణల నడుమ ఊరేగించారు. ఈ వేడుకలు సోమవారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. అనంతరం బ్రహ్మోత్సవాలు ముగింపు సందర్భంగా శాస్త్రోక్తంగా ధ్వజావ రోహణం చేపట్టారు. దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లావరదస్వామి ఉభయ దేవేరులతో పుష్ప పల్లకీలో కొలువై భక్తులను కనువిందు చేశారు. వైభవోపేతంగా గరుడోత్సవం -
గ్రామం నుంచి పారా మిలటరీలో మొట్టమొదటి మహిళను
మాది వ్యవసాయం కుటుంబం. అమ్మ ప్రమీల, నాన్న జయరాముడు. తొమ్మిదేళ్ల క్రితం నాన్న చనిపోయారు. నాకు అక్క పద్మావతి, తమ్ముడు వేణు ఉన్నారు. డిగ్రీ వరకు చదువుకున్నా. మా ఊరి నుంచి మిలిటరీకి వెళ్లిన వాళ్లను చూసి నేను కూడా సైన్యంలో చేరాలనుకున్నా. ఆ దిశగా చేసిన ప్రయత్నంతోనే న్యూ ఢిల్లీలో సీఐఎస్ఎఫ్ జవాన్గా పనిచేసేందుకు అవకాశం దక్కింది. మా గ్రామం పారా మిలటరీలో చేరిన మొట్టమొదటి మహిళను కావడం ఎంతో గర్వంగా ఉంది. తల్లి, అక్క, తమ్ముడుతో పాటు భర్త ప్రోత్సాహం మరువలేనిది. దేశం కోసం పని చేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. – జరగల స్వాతి, సీఐఎస్ఎఫ్, అమినాబాద్ -
మద్దిలేటి క్షేత్రం.. భక్తజనసంద్రం
బేతంచెర్ల: శ్రీ మద్దిలేటి నరసింహస్వామి పుణ్యక్షేత్రం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం, కుంకుమార్చన, ఆకుపూజ చేశారు. స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజతో పాటు మహా మంగళహారతి నిర్వహించారు. మొక్కుబడులు చెల్లించారు. ఇసుక అక్రమ రవాణాపై నిఘా బొమ్మలసత్రం: రాత్రి సమయాల్లో అక్రమంగా ఇసుక, రేషన్ బియ్యం తరలించే వారిపై నిఘా ఉంచామని ఎస్పీ అదిరాజ్ సింగ్రాణా తెలిపారు. తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. జిల్లాలో ప్రమాదాల నివారణ కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశామన్నారు.గడిచిన 24 గంటల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 30 మందిపై , బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే 61 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు రూ.2,02,712 జరిమానా విధించామన్నారు. సినీ నిర్మాత ఆర్థిక సాయం డోన్: ప్రధానమంత్రి సహాయ నిధితో పాటు ఆపరేషన్ సింధూర్లో మృతి చెందిన సైనికుడికి, పహల్గాంలో మృతి చెందని కశ్మీర్ యువకుడికి సినీ నిర్మాత మహేష్ఖన్నా రూ.33 వేల ఆర్థిక సాయం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును శనివారం జిల్లా కలెక్టర్ రాజకుమారికి అందజేశారు. పహల్గాం టూరిస్టు ప్రదేశానికి పర్యాటకులను గుర్రపు స్వారీపై తీసుకువెళ్లిన కశ్మీర్ యువకుడు సయ్యద్ ఆదిల్ హుసేన్ను తీవ్రవాదులు చంపడం ఆవేదన కలిగించిందన్నారు. పీఎం సహాయనిధికి రూ.11వేలు, ఆదిల్హుసేన్ కుటుంబానికి రూ.11వేలు, ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన మురళీనాయక్ కుటుంబానికి రూ.11వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని జిల్లా కలెక్టర్ను మహేష్ఖన్నా కోరారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అదృశ్యం ● అప్పులవాళ్ల వేధింపులే కారణం? బండిఆత్మకూరు: ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఇమిడి తేజ అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు. ఆయన తెలినపిన వివరాల ప్రకారం ... బండిఆత్మకూరు నుంచి విధులకు వెళ్తున్నానని ఇంటిలో చెప్పి శనివారం ఉదయం బయలుదేరారు. అయితే విధులకు వెళ్లకుండా ఎక్కడికి వెళ్లారో తెలియక కుటుంబసభ్యులు పలుచోట్ల వెతికారు. అయినా ఆచూకీ కనిపించలేదు. అప్పులవాళ్ల నుంచి వేధింపులు అఽధికం కావడంతోనే తన భర్త అదృశ్యమయ్యారని భార్య ఇమిడి శ్వేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రుద్రపార్కులో నంది విగ్రహం ● శ్రీశైల దేవస్థాన ఈఓ శ్రీనివాసరావు శ్రీశైలంటెంపుల్: Æý‡${§ýl-´ë-ÆŠ‡PÌZ° HMýS-ÕÌê Æý‡${§ýl-§ól-Ð]l#-°MìS G§ýl$Æý‡$V> ¯]l…¨ఎ¯]l…¨ Ñ{VýSçßæ… HÆ>µr$ ^ólõÜ…-§ýl$MýS$ Ððl…r¯ól ^èlÆý‡ÅË$ ^ólç³-sêtÌS° A«¨-M>-Æý‡$-ÌS¯]l$ }OÔðæÌS §ólÐ]l-Ý릯]l M>Æý‡Å°-Æý‡Ó-çßæ-×ê-«¨M>Ç G….}-°-Ðé-çÜ-Æ>Ð]l# B§ól-Õ…-^éÆý‡$. §ólÐ]l-Ý릯]l ç³Ç-´ëÌS¯é ¿ýæÐ]l-¯]l…ÌZ° çÜÒ$„> çÜÐ]l*-ÐólÔèæ Ð]l$…¨-Æý‡…ÌZ Ôèæ°-ÐéÆý‡… çÜÒ$„ýS °Æý‡Ó-íßæ…-^éÆý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> BĶæ$¯]l Ð]l*sêÏ-yýl$-™èl*.. §ólÐ]l-Ý릯]l E§øÅVýS$Ë$ fÐé-º$-§é-È™èl-¯]l…™ø Ñ«§ýl$Ë$ °Æý‡¢-Ç¢…-^é-ÌS-¯é²Æý‡$. }OÔðæÌS „óS{™é°² çÜ…§ýlÇØ…^ól ¿ýæMýS$¢-ÌSMýS$ Ð]l˜ÍMýS çܧýl$-´ë-Ķæ*Ë$ MýSÍ-µ…-^éÌS-¯é²Æý‡$. ÑÐ]l*-¯é-{Ôèæ-Ķæ*ÌZÏ E…yól Ñ«§ýl…V> „óS{™èl…ÌZ Ð]l$Æý‡$-VýS$§ö-yýlϯ]l$ °ÇÃ…^éÌS-¯é²Æý‡$. A¯]l²-{ç³-Ýë§ýl Ñ™èl-Æý‡-׿ÌZ ™égê MýS*Æý‡-V>-Ķæ$-ÌS¯]l$ Ѱ-Äñæ*-W…-^éÌS° çÜ*_…-^éÆý‡$. „óS{™èl ç³Ç-«¨ÌZ ¼ÌSÓ… Ððl¬MýSP-ÌS¯]l$ GMýS$P-Ð]lV> ò³…^é-ÌS¯é²Æý‡$. Æ>»ZÐ]l# Ð]lÆ>Û-M>ÌS… Ð]l¬W-õÜ-ÌZV> „óS{™èl…ÌZ Ð]lÊyýl$ ÐólÌS Ððl¬MýSPÌS¯]l$ ¯ésôæ Ñ«§ýl…V> {ç³×êã-MýSË$ Æý‡*´÷…-¨…-^é-ÌS-¯é²Æý‡$. VøÔ>-ÌSÌZ Ô¶æ${¿ýæ™èl ´ësìæ…^é-ÌS-¯é²Æý‡$. çÜÐ]l*Ðól-Ôèæ…ÌZ yìlç³NÅsîæ DK BÆŠ‡.-Æý‡-Ð]l$-׿Ð]l$Ã, A°² Ñ¿êV>ÌS ĶæÊ°sŒæ A«¨M>-Æý‡$Ë$, ç³Æý‡Å-Ðól„ýS-MýS$Ë$, C¯ŒS^éÆŠ‡j yîlDË$, HDË$ ´ëÌŸY-¯é²Æý‡$. -
మనం బాగుంటే చాలు.. అవతల ఎవరేమైపోతేనేం అనుకునే రోజులివి. ప్రపంచం అరచేతిలోకి వచ్చి చేరడంతో బద్దకం ఎవరి గురించీ ఆలోచించని పరిస్థితి. నా కొడుకు డాక్టర్.. నా కూతురు ఇంజినీరు.. మా అల్లుడు ఫారిన్లో ఉద్యోగం.. మా కోడలు సాఫ్ట్వేర్.. అని చెప్పుకోవడం ఆ కుటుంబానిక
తుగ్గలి: ఆపరేషన్ సింధూర్. దేశమంతటినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చిన పదం. ఉగ్రమూకలు చెలరేగుతున్న వేళ.. అమాయకులను పొట్టున పెట్టుకుంటున్న తరుణంలో సైన్యం ఎక్కుపెట్టిన తుపాకీ ప్రతి ఒక్కరిలో దేశభక్తిని రగిల్చింది. మనమంతా గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోతున్నామంటే.. సరిహద్దులో సైనికులు నిద్రలేని రాత్రులు గడుపుతుండటంతోనే సాధ్యమవుతోంది. అక్కడ ఏం జరుగుతుందో.. వాళ్లు ఎలా ఉంటున్నారో.. ఆ కుటుంబాల పరిస్థితి ఏమిటో.. కదనరంగం దృశ్యాలను చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. బుల్లెట్ల మోత.. విరుచుకుపడే మిసైళ్లు.. దూసుకొచ్చే డ్రోన్లు.. అత్యాధునిక ఆయుధాలకు ఎదురొడ్డి నిలుస్తున్న సైనికులను చూస్తే కన్నీళ్లతో సెల్యూట్ చేయాలనిపిస్తోంది. సరిహద్దులో ఉద్రిక్తతల వేళ అమినాబాద్ గ్రామం నిద్రలేని రాత్రులను గడుపుతోంది. ఇందుకు కారణం ఆ చిన్న గ్రామం నుంచి ప్రస్తుతం 15 మంది దాకా ఆర్టీలో పని చేస్తుండటమే. ఈ గ్రామంలో ఇప్పుడు ఎవరిని పలుకరించినా మా పిల్లలు సైన్యంలో ఉండటం తమకెంతో గర్వకారణం అనడం ఎంతో స్ఫూర్తినిస్తోంది. తుగ్గలి మండలంలోని గిరిగెట్ల పంచాయతీ మజరా గ్రామమైన అమినాబాద్లో 201 కుటుంబాలు ఉండగా.. 873 మంది జనాభా ఉన్నారు. గత 30 ఏళ్లలో 25 మంది ఆర్మీలో చేరారు. యువకులే కాకుండా యువతులు మేము సైతమని దేశసేవకు తమ జీవితాలను అంకితం చేస్తుండటం విశేషం. ఒకరి నుంచి మరొకరు స్ఫూర్తి పొందుతూ గ్రామం తలెత్తుకునేలా సైన్యంలో సేవలందిస్తుండటం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం. దేశభక్తికి మారుపేరు కుటుంబాలకు దూరంగా సైన్యంలో సేవలు ప్రస్తుతం వివిధ విభాగాల్లో 15 మంది మేముసైతం అని ఇద్దరు యువతులు గర్వంగా ఉందంటున్న సైనిక కుటుంబాలు ఇప్పటికై నా యుద్ధానికి సిద్ధమంటున్న మాజీలు -
దేశ సేవలో హెబ్బటం యువకులు
హొళగుంద: మండల పరిధిలోని హెబ్బటం గ్రామానికి చెందిన యువకులు దేశం రక్షణకు తమవంతు సేవలందిస్తున్నారు. మండలంలో ఈ గ్రామం నుంచే అధిక సంఖ్యలో యువకులు సైన్యంలో చేరి దేశభక్తిని చాటుకుంటున్నారు. బావిదొడ్డి రామాంజనేయులు, లింగన్న, వెంకటేశ్వర్లు, అంజి, టి.రాము, లక్ష్మన్న, సతీష్, మునేష్, గంగాధర్, శ్రీనివాసులు, తిమ్మప్ప, ప్రకాష్, విజయ్, వీరేశ్తో కలిపి మొత్తం 13 మంది ఆర్మీలో కొనసాగుతున్నారు. వీరిలో బావిదొడ్డి రామాంజనేయులు అమరుడు కాగా.. లింగన్న, వెంకటేశ్వర్లు పదవీ విరమణ పొందారు. బీఎస్ఎఫ్ జవాను బావిదొడ్డి రామాంజనేయులు 2008 మే 15న పశ్చిమ బెంగాల్లో ఎన్నికల విధి నిర్వహణలో ఉండగా నక్సలైట్లు జరిపిన బాంబు పేలుడులో మరణించాడు. ప్రస్తుతం గ్రామానికి చెందిన 11 మంది సైన్యంలో సేవలు అందిస్తుండగా.. ప్రస్తుత యుద్ధ వాతావరణం నేపథ్యంలో వీరిని గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేస్తున్నారు. -
దేశ రక్షణకు ఇప్పటికై నా సిద్ధమే
నేను 1992లో బీఎస్ఎఫ్లో చేరా. జమ్మూకశ్మీర్, గుజరాత్, నాగాలాండ్, మిజోరం, త్రిపుర, మణిపూర్, రాజస్థాన్, ఢిల్లీలో పనిచేశా. 2013లో రిటైర్డ్ అయ్యాను. కార్గిల్ యుద్ధంలో రాత్రింబవళ్లు అక్కడే ఉంటూ శత్రువులను దీటుగా ఎదుర్కొన్నాం. మా గ్రామం నుంచి ఏటా కొందరు సైన్యంలో చేరి దేశరక్షణలో పాల్గొంటుండటం గర్వకారణం. అమాయకులైన పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదుల స్థావరాలను తుద ముట్టడించడమే లక్ష్యంగా భారత సేనలు ముందుకు వెళ్లడం గొప్ప విషయం. ఆ దేశ పౌరులకు ఎలాంటి నష్టం కలిగించకుండా ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. భారత సైన్యంలో 21 ఏళ్లపాటు పని చేసిన అనుభవం ఉంది. దేశ భద్రత కోసం బాధ్యతలు చేపట్టేందుకు ఎప్పుడూ సిద్ధమే. – మండపాటి వెంకటేశ్వర్లు, రిటైర్డ్ జవాన్, అమినాబాద్ -
ఈ విద్యా సంవత్సరమే డోన్లో కేంద్రీయ విద్యాలయం
డోన్ టౌన్: పట్టణంలో ఈ విద్యా సంవత్సరం (2025–26) నుంచే నూతన కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి తగిన చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. ఐటీఐ కళాశాలలో భవనాలను శనివారం పరిశీలించారు. విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించాలన్నారు. అనంతరం కేంద్రీయ విద్యాలయం శాశ్వత భవనాల నిర్మాణానికి వెంకటాపురం రోడ్డులోని పేరంటాలమ్మ గుడి వద్ద 9.5 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వెంట కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ ప్రియదర్శిని, ట్రాన్స్కో ఏఈ నాగేశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు. కాగా..గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రత్యేక చొరవతో రాష్ట్రానికి మంజూరైన కేంద్రీయ విద్యాలయాల్లో డోన్కు ఒక్కటి మంజూరైన విషయం తెలిసిందే. హౌసింగ్ కాలనీలో మౌలిక వసతులు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదల కోసం ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో జిల్లా కలెక్టర్ పర్యటించారు. కాలనీలో 1,554 గృహాలు మంజూరు చేయగా 766 మంది గృహాలు పూర్తి చేసుకున్నారని హౌసింగ్ అధికారులు చెప్పారు. ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. డోన్ ఆర్డీఓ నరసింహులు, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్గౌడ్, తహసీల్దార్ నాగమణి, జిల్లా విద్యాధికారి జనార్దన్రెడ్డి, డిప్యూటీ డీఈఓ సుధాకర్రెడ్డి, హౌసింగ్ డీఈ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
ఇప్పుడు విధుల్లో 15 మంది..
అమినాబాద్ గ్రామంలో అన్నీ వ్యవసాయ కుటుంబాలే. గ్రామం నుంచి మచ్చా రంగనాయకులు, సురేంద్ర, కురవ వంశీ, దాసరి ప్రభాకర్, ఎంబాయి విజయ్కుమార్, రమేష్, పురిమెట్ల హరి, దండు రామాంజిని, రాజు, తిమ్మాపురం హనుమేష్, బాలకృష్ణ, కె.హరినాథ్, సుద్దాల మురళి, జరగల స్వాతి, గొల్ల రాధ(ఆర్మీ, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎస్ఎస్బి, ఎయిర్ఫోర్స్, ఐటీబీపీ) విభాగాల్లో పని చేస్తున్నారు. ఇక దివాకర్చౌదరి, లక్ష్మినారాయణ, మండపాటి వెంకటేశ్వర్లు, దాసరి రంగడు, మచ్చా నాగరాజు, హరినాథ్, మోటుపల్లి కరుణాకర్, రాము, నవీన్, నాగరాజు ఆర్మీ, బీఎస్ఎఫ్, ఎయిర్ఫోర్స్లో పనిచేసి పదవీ విరమణ పొందారు. గ్రామం నుంచి పలువురు యువకులు దేశ రక్షణకు సైన్యంలో విధులు నిర్వర్తిస్తూ ఊరికి వన్నె తెచ్చారని గ్రామస్తులు గర్వంగా చెప్పుకుంటున్నారు. వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న వీరిలో పలువురిని ప్రస్తుతం భారత్–పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధ పరిసర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. -
యుద్ధ సమయంలో అండగా ఉంటాం
నిజమైన హీరో మురళీనాయక్ కర్నూలు(అగ్రికల్చర్): పాకిస్తాన్తో పోరాడుతూ అమరుడైన మురళీనాయక్ను తెలుగు రాష్ట్రాలు ఎన్నటికీ మరచిపోలేవని కర్నూలు విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రంగారెడ్డి తెలిపారు. శనివారం కర్నూలు అబ్బాస్ నగర్లోని కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆర్మీ జవాన్ మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. యుద్ధంలో అసువులు బాసిన ఆర్మీజవాన్ ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిముషాలు మౌనం పాటించారు. దేశ రక్షణకు అమరుడైన శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ ప్రజలందరి దృష్టిలో నిజమైన హీరో అంటూ శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో పలువురు విశ్రాంత ఉద్యోగుల సంఘం నేతలు పాల్గొన్నారు.పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అత్యంత దారుణం. దీనికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్లో ఉగ్రస్థావరాలను నిర్మూలించేందుకు భారత్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. యుద్ధ సమయంలో దేశానికి అండగా ఉంటాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 7 వేలకుపైగా మాజీ సైనికులు ఉన్నాం. ఐదేళ్లలోపు పదవీ విరమణ పొందిన వారి వివరాలను డిఫెన్స్ అధికారులు అడిగారు. 60 ఏళ్లలోపు వయస్సు ఉన్న మాజీ సైనికులు దేశం కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం. – నర్రా పేరయ్య చౌదరి, జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు, కర్నూలు -
ఎమ్మెల్యే జయసూర్య Vs ఎంపీ శబరి.. మరోసారి రచ్చ రచ్చ
సాక్షి, నంద్యాల జిల్లా: నంద్యాల జిల్లాలో వర్గ విభేదాలు.. టీడీపీ నాయకులు మధ్య చిచ్చురేపుతున్నాయి. నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, ఎంపీ శబరిల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. నందికొట్కూరులో అగ్నిమాపక శాఖ నూతన భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్యేను అధికారులు ఆహ్వానించారు.అయితే, ఎంపీ శబరి రాక ముందే.. ఎమ్మెల్యే జయసూర్య భూమి పూజ చేసి వెళ్లిపోయారు. పంతం కొద్ది ఎమ్మెల్యే భూమి పూజ చేసిన భవనాన్నికి ఎంపీ శబరి మరోసారి భూమి పూజ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే ఎవరికి వారు భూమి పూజలు చేసి వెళ్లిపోవడంతో ఎమ్మెల్యే, ఎంపీల ప్రొటోకాల్ అధికారులకు తలనొప్పిగా మారింది. -
యువకుడిని మింగిన బావి!
ఉయ్యాలవాడ: స్నేహితులతో కలిసి ఉత్సాహంగా ఉండే యువకుడిని ఓ బావి మృత్యువు రూపంలో కబళించింది. ఈ విషాద ఘటన శుక్రవారం సాయంత్రం గోవిందపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన షేక్ బాబ్జాన్ అలియాస్ రిజ్వాన్(25) అనే యువకుడు తోటి స్నేహితులతో ఈత కొట్టేందుకు గోవిందపల్లె గ్రామంలో బావికి వెళ్లాడు. ఈత రాకపోయిన నడుముకు ఖాళీ 5 లీటర్ల క్యాన్లు నాలుగు కట్టుకుని బావిలో దూకాడు. నడుముకు కట్టుకున్న క్యాన్లు తెగి పోవడంతో నీటిలో మునిగి పోయాడు. గమనించిన తోటి స్నేహితులు బావిలో గాలించగా యువకుడు లభ్యం కాలేదు. స్నేహితులు గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు వచ్చి బావిలో దూకి అతడిని బయటకు తీశారు. వెంటనే 108 వాహనంలో కోవెలకుంట్ల పట్టణానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యాధికారి తెలిపారు. ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన షేక్ ఖాదర్వలి కుటుంబ సభ్యులు అందరూ గోవిందపల్లె గ్రామంలోని అచ్చుకట్ల బుడ్డే సాహెబ్ ఇంటికి వచ్చారు. షేక్ ఖాదర్వలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. వీరిలో ఒక కుమారుడు మృత్యువాత పడడంతో ఆ కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
‘బానకచెర్ల’కు నూతన గేట్లు
పాములపాడు: మండలంలోని బానకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్ద నూతన గేట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఏఈ దేవేంద్ర శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెగ్యులేటర్ వద్ద వీబీఆర్, పాత ఎస్ఆర్బీసీ, కేసీసీ ఎస్కేప్ చానల్ల నూతన గేట్ల ఏర్పాటు కోసం రూ.15కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ప్రస్తుతం కేసీసీ ఎస్కేప్ ఛానల్ గేట్లను రూ. 5 కోట్లతో నిర్మాణం పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఇక్కడ ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేసిన నూతన గేట్లను హైదరాబాదులో సీఈ కబీర్ బాషా స్వయంగా పరిశీలించారన్నారు. జూన్ చివరి నాటికి నూతన గేట్లను అమర్చి ఖరీఫ్కు నీటిని విడుదల చేయాలని కాంట్రాక్టర్కు సీఈ నుంచి ఆదేశాలు అందాయన్నారు. -
12 నుంచి ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు
నంద్యాల(న్యూటౌన్): ఇంటర్మీడియెట్ మొదటి, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని డీఆర్ఓ చాంబర్లో పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ పరీక్షలు ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటలకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఉంటాయన్నారు. ఇందుకోసం మొత్తం 42 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(అర్బన్): డీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి ఓబులేసు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరిలకు చెందిన అర్హులైన అభ్యర్థులు ఈనెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. టెట్ అర్హత సాధించిన అభ్యర్థులే సొంత జిల్లాలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా వెనుకబడిన తరగతులు, సాధికారత అధికారి కార్యాలయంలో దరఖాస్తులు పొంది అక్కడే సమర్పించాలని తెలిపారు. దరఖాస్తుతో పాటుగా విద్యాఅర్హత, క్యాస్ట్, ఇన్కం, ఆధార్, టెట్ హాల్టికెట్, టెట్ మార్కిలిస్ట్ జిరాక్స్ కాపీలను జతపరచాలన్నారు. శ్రీశైలంలో భద్రత కట్టుదిట్టం శ్రీశైలంప్రాజెక్ట్: భక్తులతో నిత్యం రద్దీగా ఉండే శ్రీశైల క్షేత్రంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సాక్షిగణపతి, హఠకేశ్వరం, ఫాలధార–పంచధార, శిఖరేశ్వరం తదితర ప్రాంతాల్లో నిత్యం పోలీసులు బందోబస్తు ఉండే ఏర్పాట్లు చేశారు. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో శ్రీశైలంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. శ్రీశైలంలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని ముఖద్వారం వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో, స్వంత వాహనాల్లో, కాలినడకన వచ్చే భక్తులను,ల గేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంయి దేవస్థానం టోల్గేట్ వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. దేవస్థాన సెక్యూరిటీ సిబ్బందికి పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. -
మాదక ద్రవ్యాల నియంత్రణకు కార్యాచరణ
నంద్యాల(న్యూటౌన్): మాదక ద్రవ్యాల నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు బానిసైతే కలిగే దుష్ప్రభావాలపై పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల్లో వీడియోలు ప్రదర్శించాలన్నారు. ప్రముఖ కూడళ్లలో హోర్డింగులు ఏర్పాటు చేయాలని, వాల్ పోస్టర్లు ప్రదర్శించాలని సూచించారు. కళాజాతా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మాదకద్రవ్యాల నివారణ కోసం జూన్ 1నుండి జూన్ 26వ తేదీ వరకు సంబంధిత అధికారులు బృందాలుగా వెళ్లి నిర్దేశించిన కార్యక్రమాలను చేపట్టాలన్నారు.. మత్తు పదార్థాల నియంత్రణపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు గాను వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలను నిర్వహించాలన్నారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు రయిజ్ ఫాతిమా, ఎకై ్సజ్ శాఖ సూపరింటెండెంట్ రవికుమార్, డీఈఓ జనార్దన్ రెడ్డి, డీఐఈఓ సునీత, ఐసీడీఎస్ పీడీ లీలావతి, జువైనల్ హోం సూపరింటెండెంట్ హుస్సేన్బాషా తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి -
ఒక్క పరిశ్రమ లేదు.. ఉద్యోగం రాదు
జూపాడుబంగ్లా: అంతన్నారు.. ఇంతన్నారు.. పదేళ్లు గడుస్తున్నాయి. అయినా ఒక్క పరిశ్రమ రాలేదు. ఒక్క ఉద్యోగం దక్కలేదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాటలకు.. చేతలకు పొంతన ఉండదు అనేందుకు నిదర్శనం తంగడంచ భూములు. ఎంతో సారవంతమైన భూములు నిరుపయోగంగా మారాయి. నాణ్యమైన విత్తనాలు ఉత్పిత్తి చేయాల్సిన భూములు ముళ్లకంపలతో దర్శనమిస్తున్నాయి. గత టీడీపీ ప్రభుత్వంలో వందలాది ఎకరాలు కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేశారే కానీ.. ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం లేదు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం జిల్లాలోని తంగడంచ ఫారం భూముల్లో జిల్లాలో అల్ట్రామెగా ఫుడ్పార్కింగ్ చేసి జిల్లాలో 10 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ మేరకు గుజరాత్ అంబుజా పరిశ్రమకు 211.10 ఎకరాలను ఎకరా రూ.4.50 లక్షల చొప్పున విక్రయించేందుకు ఏపీఐఐసీ ఒప్పందం కుదుర్చుకున్నారు. 2015 ఏప్రిల్ 30న టీడీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 152ను విడుదల చేసింది. పరిశ్రమల నిబంధనల ప్రకారం పరిశ్రమల స్థాపన కోసం పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో ఆరు మాసాల్లోగా కంపెనీ స్థాపన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అయితే భూములను కేటాయించి మూడేళ్లు గడిచినా గుజరాత్ అంబుజా పరిశ్రమ స్థాపించకపోవటంతో ఒప్పందాన్ని రద్దు చేసి వారికి కేటాయించిన భూములను రద్దు చేసి ఏపీఐఐసీకి అప్పగించారు. వారు చిన్న, మధ్య తరహా పరిశ్రమలను స్థాపించేందుకుగాను రూ.7.5కోట్లు వెచ్చించి రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు నిర్మించారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు రాకపోవటంతో ప్రస్తుతం ఏపీఐఐసీ అధ్వర్యంలోని 211 ఎకరాలు ముళ్లపొదలతో నిండి అడవిని తలపిస్తున్నాయి. ప్రస్తుతం కంపెనీలకు కేటాయించిన భూములు నిరుపయోగంగా మారగా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిరుపయోగంగా ఉన్న భూముల్లో ఇప్పటికై నా సీఎం చంద్రబాబునాయుడు పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగులైన యువతీ, యువకులను, రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. జైన్ ఇరిగేషన్ అంతే.. తంగడంచ విత్తనోత్పత్తిక్షేత్రంలోని బంగారు పంటలు పండే నల్లరేగడి భూములను అప్పటి టీడీపీ ప్రభుత్వం జైన్ఇరిగేషన్ కంపెనీకి 624.54 ఎకరాలు కేటాయించింది. 2017లో జైన్ కంపెనీని స్థాపించినా ఇప్పటి దాకా 50 మందికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించిన దాఖలాల్లేవు. కేవలం ఎక్కడో పెంచిన మొక్కలు ఇక్కడికి తెచ్చి విక్రయిస్తోంది. కేవలం స్టాక్ పాయింట్గా భూములను వినియోగించుకుంటోంది. తంగడంచ విత్తనోత్పత్తిక్షేత్రంలో అల్ట్రామెగా ఫుడ్పార్కింగ్ ఏర్పా టు కోసం పైలాన్ ప్రారంభించే సమయంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఆరు మాసాల్లోగా గుజరాత్ అంబుజా పరిశ్రమతో పాటు జైన్ పరిశ్రమలను స్థాపించి ప్రత్యక్షంగా, పరోక్షంగా 10వేల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. పదేళ్లు గడిచినా స్థానికులకు ఒక్క ఉద్యోగం రాలేదు. సీడ్ హబ్ పేరుతో మరో 600 ఎకరాలు కేటాయించినా ఇప్పటి వరకు ఒక విత్తనం నాటలేదు. ఒక మొక్క పెంచలేదు. నిరుపయోగంగా తంగడంచ ఫారం భూములు పదేళ్ల క్రితం అల్ట్రామెగా ఫుడ్పార్క్కు చంద్రబాబు శంకుస్థాపన అంబుజా భూములు ఏపీఐఐసీకి అప్పగింత స్థానికులకు ఒక్క ఉద్యోగం ఇవ్వని జైన్ ఇరిగేషన్ కంపెనీ సీడ్ హబ్ పేరుకే పరిమితంరూ.7కోట్ల నిధులు వృథా.. గుజరాత్ అంబుజా పరిశ్రమ స్థాపిస్తారని హడావుడిగా ఏపీఐఐసీ రూ.7.09 కోట్ల నిధులను వెచ్చించి కేజీ రోడ్డు నుంచి అంబుజా పరిశ్రమ స్థాపన భూముల వరకు 1.304 కిలోమీటర్ల మేర రెండులైన్లతో కూడిన బీటీరోడ్డును నిర్మించింది. అలాగే సుద్దవాగుపై వంతెనను ఏర్పాటు చేసింది. కేటాయించిన భూములను సర్వేచేయించి సరిహద్దులు ఏర్పాటు చేయటంతోపాటు కంపచెట్లను తొలగించేందుకు మరో రూ.కోటి నిధులను వెచ్చించారు. ఇప్పటిదాకా ఆభూముల్లో ఒక్క పరిశ్రమలను స్థాపించ లేదు. దీంతో రూ.7 కోట్ల ప్రజాధనం వృథా అయింది. ఇప్పటికై నా నిరుపయోగంగా ఉన్న భూముల్లో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
వర్షాలు కురిస్తే ఈనెల 20 తర్వాత పత్తి సాగు
● మొదలైన బీటీ పత్తి విత్తన ప్యాకెట్ల అమ్మకాలు ● పల్లెలకు చేరుతున్న నకిలీ, లూజు విత్తనాలు ● రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లాలో పత్తి సాగు అధికం ● తమ ఆధీనంలోని కంపెనీల్లో వ్యవసాయ శాఖ తనిఖీలు ● ప్రత్యేక ఏజెంట్ల ద్వారా అమ్మకాలు గత ఏడాది నకిలీ పత్తి విత్తనాల వల్ల జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతినింది. బనగానపల్లి, దొర్నిపాడు, ఎమ్మిగనూరు ప్రాంతల్లో నకిలీ విత్తనాలతో రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. 2023–24 సంవత్సరంతో పోలిస్తే 2024–25లో నకిలీ విత్తనాలు, లూజు విత్తనాల అమ్మకాలు, అనధికార విత్తనాలు, స్టాప్ సేల్స్ తదితరాలకు సంబంధించి పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. రూ.2.40 కోట్ల విలువ చేసే పత్తి, ఇతర విత్తనాలు 100.79 క్వింటాళ్లు సీజ్ చేశారు. ఐదు 6ఏ కేసులు కూడా నమోదయ్యాయి. -
ప్రత్యేక టీమ్లు ఏర్పాటు చేశాం
నకిలీ విత్తనాలు, లూజు విత్తనాలు, అనుమతి లేని విత్తనాల కోసం తనిఖీలు చేస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేక టీమ్లు కూడా ఏర్పాటు చేశాం. వీటితో పాటు హెచ్టీ పత్తి విత్తనాల కోసం తనిఖీలు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ ఏడాదికి సంబంధించి ఇంతవరకు అనధికార విత్తనాలు, నకిలీలు పట్టుబడలేదు. ఎక్కడైన అనుమతి లేని విత్తనాలు అమ్ముతుంటే సంబంధిత వ్యవసాయ అధికారులకు సమాచారం ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. – పీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి, కర్నూలు -
దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదు
దేశంలో ఎక్కడ కూడా రాష్ట్రంలో ఉన్న అధ్వాన పరిస్థితులు లేవు. పత్రికలపై దాడులు చేయడం విలేకరులను బెదిరించడం ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ దినపత్రిక ఎడిటర్ ఇంట్లోకే ఎలాంటి అనుమతులు లేకుండా పోలీసులు వెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజల గొంతు నొక్కేయాలనుకోవడం సిగ్గుచేటు. ఇటీవల కాలంలో జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోతోంది. – శంకర్, సీపీఐఎంఎల్ న్యూ డెమొక్రసీ పార్టీ కార్యదర్శి, నంద్యాల పత్రికా స్వేచ్ఛపై దాడి సిగ్గుచేటు సాక్షి పత్రిక సంపాదకులను ప్రభుత్వం టార్గెట్ చేయడం శోచనీయం. పత్రికా స్వేచ్ఛపై కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడులు సిగ్గుచేటు. అసలు రాష్ట్రంలో పత్రికలు, మీడియాకు స్వేచ్ఛ ఉందో లేదో అర్థం కావడం లేదు. ఉన్నది ఉన్నట్లు రాస్తే ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని పరిస్థితులను ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలోనే చూడాల్సి వస్తోంది. – ఆకుమల్ల రహీమ్, ఆల్మదర్ ఫౌండేషన్ అధ్యక్షుడు, నంద్యాల -
చంపడాలు, చావడాలు ఎవరికీ మంచివి కావు
చెరుకులపాడు నారాయణరెడ్డిని హతమార్చే సమయంలో అడ్డుపడిన బోయ సాంబశివుడును సైతం దారుణంగా మట్టుబెట్టారు. ఇతనికి భార్య లక్ష్మిదేవి, ఇద్దరు పిల్లలు సంతానం. నారాయణరెడ్డి కుటుంబీకుల ఆశీస్సులతో సాంబశివుడి తల్లి బోయ రాములమ్మ ప్రస్తుతం చెరుకులపాడు గ్రామ సర్పంచ్గా సేవలందిస్తున్నారు. ఆయన తండ్రి జయరాముడు కాలం చేయడంతో.. తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు గంగాధర్, మురళీకృష్ణ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ‘సాక్షి’ వాళ్లను పలుకరించగా.. ‘సాంబశివుడిని అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారు. మేము అష్టకష్టాలతో నారాయణరెడ్డి కుటుంబం చలువతో జీవనం నెట్టుకొస్తున్నాం. చంపడాలు, చావడాలు, జైలుకు పోవడాలు ఎవరికీ మంచివి కావు. మా కుటుంబం పడిన వేదన భవిష్యత్లో మరొకరికి రాకూడదు.’’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు. -
జంట హత్యల కేసులో తుది తీర్పు
● సంచలనం రేపిన చెరుకులపాడు నారాయణరెడ్డి, సాంబశివుడు హత్యోదంతాలు ● ఎనిమిదేళ్ల తర్వాత నిందితులకు యావజ్జీవ శిక్ష ● 11 మందికి శిక్ష ఖరారు, ఐదుగురు విడుదల ● కుటుంబ సభ్యుల్లో కట్టలు తెంచుకున్న కన్నీళ్లు అప్పుడు వాళ్లను ఏడ్పించి.. ఇప్పుడు వీళ్లు ఏడుస్తూ! (యావజ్జీవ శిక్ష పడటంతో రోదిస్తున్న ముద్దాయిలు) ఎవరికోసమైతే ఇద్దరిని చంపారో వాళ్లు కాపాడుతారనుకున్నారు. అడిగినంత డబ్బు ఇచ్చాం కాదా, ఎంచక్కా బయటకు రావచ్చునుకున్నారు. ఎనిమిదేళ్లు ఇలా గడిచిపోయింది.. ఇక కోర్టు మెట్లు ఎక్కే పని లేదనుకున్నారు.. గురువారం ఉదయం జిల్లా కోర్టు వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది. జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న వారంతా కోర్టుకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసింది. ఎలాంటి తీర్పు వస్తుందోనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో కనిపించింది. 11 గంటల సమయంలో 11 మంది నిందితులకు యావజ్జీవ శిక్ష విధిస్తూ కర్నూలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పు వెలువరించింది. విషయం క్షణాల్లో బయటకు రావడంతో కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. నెత్తీనోరు కొట్టుకుంటూ, ఇక మాకు దిక్కెవరంటూ రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టించింది. ఇదిలా ఉంటే కోర్టు నుంచి బయటకు వచ్చిన ముద్దాయిలు కూడా తమ వాళ్లను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. చంపినప్పుడు ఆ కుటుంబాల్లో ఎంతటి క్షోభకు గురై ఉంటాయో, ఇప్పుడు వారి కుటుంబ సభ్యులను చూసి వాళ్లు కూడా అంతకు రెట్టింపు వేదనను అనుభవించడం కనిపించింది. – కర్నూలు(సెంట్రల్)/వెల్దుర్తి -
జిల్లా కలెక్టర్కురెడ్క్రాస్ అవార్డు
నంద్యాల(న్యూటౌన్): రెడ్ క్రాస్ సొసైటీల ద్వారా అత్యుత్తమ సేవలందించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి రెడ్ క్రాస్ అవార్డు దక్కింది. ఈ క్రమంలో గురువారం విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ నుంచి కలెక్టర్ అవార్డుతో పాటు గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల అధునాతన వసతులతో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ను ప్రారంభించామన్నారు. రెడ్క్రాస్ ఆధ్వర్యంలో ప్రజలకు అత్యంత తక్కువ ధరలకు లభ్యమయ్యేలా జనరిక్ మెడికల్ షాప్ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రక్తదానానికి యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చేలా అవగాహన కల్పిస్తామన్నారు. మత్స్యకారులు, చెంచులకు రెడ్ క్రాస్ సంస్థ ద్వారా మరిన్ని వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్గా డాక్టర్ సురేఖ గోస్పాడు: నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్గా డాక్టర్ సురేఖ గురువారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడి మెడికల్ కాలేజీలో ప్రిన్సిపాల్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శ్రీదేవి ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. ఆమె స్థానంలో కడప ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న డాక్టర్ సురేఖను ఉన్నతాధికారులు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలకు అడ్డుకట్ట బొమ్మలసత్రం: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరగాళ్లను గుర్తించి నేరాల కట్టడికి అడ్డుకట్ట వేయాలని జిల్లా ఎస్పీ అధిరాజ్సింగ్రాణా పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక రామకృష్ణా పీజీ కళాశాల ఆడిటోరియమ్లో ఫోరెన్సిక్ సైన్స్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్పై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. కేసుల దర్యాప్తులో ఆధారాలు, సాక్ష్యాలు కీలకమన్నారు. కేసు దర్యాప్తు తప్పుదోవ పట్టకుండా ఆధునిక సాంకేతిక ద్వారా నేరస్తులను గుర్తించే అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ మందా జావళి ఆల్ఫోన్స్, ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్, ఫోరెన్సిక్ వైద్య నిపుణులు అసిమ్బాషా, కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు ఇంకెప్పుడు పూర్తి చేస్తారు
డోన్: కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిని విస్మరిస్తుందని, పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను ఇంకెప్పుడు పూర్తి చేస్తారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. కొత్తకోట గ్రామ సమీపంలోని జాతీయ రహదారి పక్కన రూ. 18.50 కోట్లతో నిర్మిస్తున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రైనింగ్ రీసర్చ్ (ఐడీటీఆర్) భవనంతో పాటు దేవరబండ, వెంగళాంపల్లి చెరువులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. సకాలంలో హంద్రీ నీవా కాలువ నుంచి నీరు అందించలేక పోయిన ఘనత కూటమి ప్రభత్వానికే దక్కుతుందన్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి ప్రజలకు తాగేందుకు మంచి నీరు, పశువులకు నీరు లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కోట్లాది రూపాయలతో ప్రారంభించిన అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. మాజీ మంత్రి వెంట మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ రామచంద్రుడు, ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ బద్దల రాజ్కుమార్, పార్టీ మండల అద్యక్షులు సోమేశ్ యాదవ్, నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, మల్యాల శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి -
ఆదర్శనీయులు దామోదరం సంజీవయ్య
● సంజీవయ్య వర్ధంతి సభలో వక్తలుకర్నూలు(అర్బన్): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య కుల, మతాలకు అతీతంగా బడుగు, బలహీన వర్గాలకు విశేషమైన సేవలు అందించి అందరికి ఆదర్శంగా నిలిచారని మాల గెజిటెడ్ అధికారుల సంఘం నేతలు కొనియాడారు. సంజీవయ్య 53వ వర్ధంతి సందర్భంగా బుధవారం స్థానిక నంద్యాల చెక్పోస్టు సర్కిల్లో ఉన్న ఆయన విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం విగ్రహం సమీపంలోనే సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారు గోన నాగరాజు అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సభకు సంఘం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు రామకృష్ణ, రత్నప్రసాద్, శరత్బాబు, చైర్మన్ సోమన్న, కన్వీనర్ చంద్రశేఖర్, కోశాధికారి రాజశేఖర్, రాష్ట్ర కమిటీ సభ్యులు హెచ్డీ ఈరన్న, ఎస్సీ, ఎస్టీ, లాయర్స్ ఫోరం అధ్యక్షుడు ఎగ్గోని జయరాజ్, దామోదరం రాధాక్రిష్ణ హాజరయ్యారు. ముందుగా సభకు అధ్యక్షతన వహించిన గోన నాగరాజు మాట్లాడుతూ రాయలసీమలోని బోయ కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చారని, కోస్తా ప్రాంత కాపు ( తెలగ ), రాయలసీమ బలిజలను బీసీ జాబితాలో చేర్చారని గుర్తు చేశారు. మండల్ కమిషన్ కంటే ముందే బీసీలకు రిజర్వేషన్లు అమలు చేశారని, ఎస్టీ, ఎస్టీలకు ఉద్యోగాలతో పాటు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలయ్యేలా 1961లోనే ఉత్తర్వులు ఇచ్చారన్నారు. కోర్ కమిటీ సభ్యులు రామకృష్ణ, రత్నప్రసాద్ మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా సంజీవయ్య సేవలు అందించారన్నారు. భూమి లేని నిరుపేదల కోసం 6 లక్షల ఎకరాలను పంచారన్నారు. వ్యవసాయానికి కూడా పెద్ద పీట వేసి రాయలసీమలోని కర్నూలు జిల్లాలో హంద్రీ నదిపై గాజులదిన్నె ప్రాజెక్టు, ఆత్మకూరు అటవీ ప్రాంతంలో వరదరాజ స్వామి ప్రాజెక్టు ప్రారంభించారన్నారు. మరో సభ్యులు శరత్బాబు మాట్లాడుతూ మాల గెజిటెడ్ ఆఫీసర్స్ గ్రూపుగా ఏర్పడి బ్యాంకుల ద్వారా రుణాలను పొంది పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు బ్యాంకుల సహకారాన్ని తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కోశాధికారి రాజశేఖర్, నాయకులు డా.వై ప్రవీణ్కుమార్, ఇరిగేషన్ డీఈఈ ఎన్ ప్రసాదరావు, రిటైర్డు అడిషనల్ ఎస్పీ వేల్పుల జయచంద్ర, మాధవస్వామి, డీఆర్ రాజు, సోగరాజు మునెయ్య, రాజీవ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కండువాలు కప్పి.. ప్రజాతీర్పునకు మసిపూసి!
నందికొట్కూరు: కేవలం ఒకే ఒక్క కౌన్సిలర్ ఉన్న టీడీపీ.. నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ కుర్చీతో రాజకీయ చదరంగం ఆడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలోని ఇరు వర్గాలు కౌన్సిలర్లతో రాయ‘బేరాలు’ నడుపుతూ ప్రజాతీర్పును అపహాస్యం చేస్తున్నారు. టీడీపీ పార్లమెంట్ ఇన్చార్జ్ మాండ్ర శివానందరెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి తమ రాజకీయ ఉనికి కోసం నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ గిరిని వేదికగా మార్చుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చైర్మన్గా కొనసాగుతున్న ఎంపీ వర్గీయుడు దాసి సుధాకర్రెడ్డిపై మాండ్ర వర్గం అవిశ్యాస తీర్మానం పెట్టింది. ఈ మేరకు అధికారులు గురువారం తీర్మానం ప్రవేశపెడుతుండటంతో ఇరువర్గాలు బలనిరూపణకు సిద్ధమయ్యాయి. 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార వైఎస్సార్సీపీ భారీ విజయం సాధించింది. మొత్తం 29 స్థానాల్లో వైఎస్సార్సీపీ 21 గెలుచుకుంది. ఏడుగురు ఇండిపెండెంట్లు వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో వారి బలం 28కి చేరింది. టీడీపీ కేవలం ఒక్క స్థానానికి మాత్రమే పరిమితమైంది. అయితే గత సార్వత్రిక ఎన్నికల తర్వాత 15 మంది కౌన్సిలర్లకు పచ్చ కండువా కప్పారు. మాండ్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నారు. ఇక మిగిలిన కౌన్సిలర్లు చైర్మన్తో పాటు 9 మంది కౌన్సిలర్లు ఎంపీ బైరెడ్డి శబరి వర్గంలో చేరారు. ప్రస్తుతం ముగ్గురు కౌన్సిలర్లు మంగళి అల్లూరి కృష్ణ, చెరుకు సురేష్, షేక్ నాయబ్ వైఎస్సార్సీపీలోనే కొనసాగుతూ కీలకంగా మారారు. మాండ్ర, ఎంపీ క్యాంప్ రాజకీయాలు నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జ్ మాండ్ర శివానందరెడ్డి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లతో మంతనాలు మొదలు పెట్టి కొంత మేరకు సఫలం అయినట్లు సమాచారం. మాండ్ర వర్గంలో 16 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు సైకిలెక్కి తిరుగుతుండగా ముగ్గురు వైఎస్సార్సీపీ జెండాను వీడేది లేదని తేల్చి చెప్పారు. ఎంపీ బైరెడ్డి శబరి వర్గంలో 10 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఉన్నారు. కోరం లేకపోయినా మాండ్ర వర్గం అవిశ్వాసానికి తెరలేపారు. ఇరువర్గాలు క్యాంపు రాజకీయాలకు తెరతీశాయి. ఎంపీ వర్గం ఊటికి, మాండ్ర వర్గం గోవాకు కౌన్సిలర్లను తరలించారు. చైర్మన్గిరి కోసం ఎంపీ వర్గంలోని మరో ముగ్గురు, నలుగురు కౌన్సిలర్లను మెజార్టీ కోసం కొనుగోలు చేసేందుకు మాండ్ర సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది. ఈనేపథ్యంలో చైర్మన్ కుర్చీ ఎవరినీ వరిస్తుందో వేచి చూడాల్సిందే. మున్సిపాలిటీలో టీడీపీకి ఒకే కౌన్సిలర్ మారిన రాజకీయాలతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు కండువాలు నేడు నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం పట్టు నిలుపుకునేందుకు ఎంపీ, పైచేయి సాధించేందుకు మాండ్ర యత్నం చర్చనీయాంశంగా మారిన నీచ రాజకీయాలు ఏర్పాట్లు పరిశీలన మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్రెడ్డిపై గురువారం అవిశ్వాసం తీర్మానం ప్రవేశ పెట్టేందుకు స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఏర్పాట్లను ఆర్డీఓ నాగజ్యోతి బుధవారం పరిశీలించారు. కాగా అవిశ్వాస తీర్మానం విధి విధానాల గురించి విలేకరుల కోరగా కమిషనర్ బేబీ చెబుతారని వెళ్లిపోయారు. అయితే అవిశ్వాస తీర్మానం కార్యక్రమం కవరేజీకి పాత్రికేయులు రానీయవద్దని టౌన్ సీఐ ప్రవీణ్కుమార్రెడ్డికి కమిషనర్ సూచించడం ఎంత వరకు సమంజసమని జర్నలిస్ట్ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. -
ప్రాణదాన ట్రస్ట్కు రూ.5 లక్షల విరాళం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ప్రాణదాన ట్రస్ట్కు బుధవారం గుంతకల్లుకు చెందిన వంకదారి రామకృష్ణయ్య రూ.5 లక్షల విరాళాన్ని దేవస్థాన ఏఈవో జి.స్వాములకు అందజేశారు. విరాళాన్ని అందించిన దాతకు దేవస్థానం తరుఫున స్వామివారి శేషవస్త్రాన్ని, లడ్డూప్రసాదాలు, జ్ఞాపికను అందించి సత్కరించారు. టీబీ డ్యామ్కు కొనసాగుతున్న ఇన్ఫ్లోహొళగుంద: కర్ణాటక రాష్ట్రం హోస్పేట్లోని తుంగభద్ర జలాశయానికి ఇన్ఫ్లో కొనసాగుతోంది. అకాల వర్షాలతో అడపాదడపా జలాశయానికి వరద నీరు చేరుతుంది. ప్రస్తుతం డ్యామ్లో 7.5 టీఎంసీల నీరు నిల్వ ఉంటే ఇన్ఫ్లో 2,950 క్యూసెక్కులుంది. గత నెల 24న ఇన్ఫ్లో జీరో ఉండి 6.871 టీఎంసీల నీరు ఉండగా.. అకాల వర్షాలతో రెండు వారాలుగా వరద నీటి చేరిక మొదలై బుధవారానికి 7.5 టీఎంసీలకు చేరింది. గతేడాది ఇదే సమయానికి 1577.79 అడుగుల వద్ద 3.489 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. వర్షాలు ఆశాజనకంగా కురిస్తే జూలై నెలాఖరుకు డ్యాం పూర్తి మట్టానికి నీరు చేరి ఎల్లెల్సీతో పాటు వివిధ కాల్వకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదంలో ఎస్ఐకి గాయాలు కర్నూలు: కర్నూలు శివారు డోన్ రోడ్డులో మిస్టర్ ఇడ్లీ సర్కిల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సీఐడీ ఎస్ఐ శ్రీనివాసులుతో పాటు ఆయన కూతురికి గాయాలయ్యాయి. బుధవారం ఉదయం ఎస్ఐ కుటుంబ సభ్యులతో కలసి నడుచుకుంటూ వెళ్తుండగా దొర్నిపాడు పీఎస్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ కారులో వెళ్తూ ఎస్ఐ శ్రీనివాసులును ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను తప్పించే క్రమంలో కూతురికి కూడా గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. 8 నుంచి ఆర్యూ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిఽధిలో ఈనెల 8 నుంచి జూన్ 3వ తేదీ వరకు డిగ్రీ 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ, 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 55 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షలను ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా హాల్టికెట్, ఐడీ కార్డుతో పరీక్ష కేంద్రానికి అరగంట ముందుగా చేరుకోవాలన్నారు. -
మన్యం వీరుడి పోరాటం స్ఫూర్తిదాయకం
నంద్యాల(న్యూటౌన్): మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం స్ఫూర్తిదాయకమని జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ అన్నారు. బుధవారం అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకొని కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో అల్లూరి చిత్రపటానికి అధికారులు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ రామునాయక్ మాట్లాడుతూ.. భారత స్వాతంత్య్ర పోరాటంలో అల్లూరి పాత్ర ఎనలేనిదన్నారు. బ్రిటీషుయులను ఎదురించి మన్యం గిరిజనులను కాపాడిన వీరుడన్నారు. ఆయన స్ఫూర్తిని కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ రవికుమార్, జిల్లా పర్యాటక అధికారి సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. మెగా డీఎస్సీలో క్రాష్కోర్సు శిక్షణ కర్నూలు(అర్బన్): జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు ఉచిత మెగా డీఎస్సీ క్రాష్ కోర్సులో శిక్షణను విజయవాడలో నిర్వహిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ఫాతిమా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంధులు, బధిరులు, శారీరక విభిన్న ప్రతిభావంతులైన ఎస్జీటీ టీచర్ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థుల కోసం ఈ శిక్షణను ఏర్పాటు చేశారన్నారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా mdfc.apcfss.in వెబ్సైట్ను సందర్శించి ఈ నెల 11లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. కనీసం 40 శాతం వికలత్వం ఉన్న వారు మాత్రమే అర్హులని, శిక్షణ కోసం టెట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. -
జెడ్పీలో అల్లూరికి ఘన నివాళి
కర్నూలు(అర్బన్): మన్యం వీరుడు అల్లూరి సీతారామారాజు నిబద్ధత, త్యాగం ఉంటే ఎలాంటి అణచివేతనైనా ఎదుర్కోగలమని జిల్లా పరిషత్ సీఈఓ జి. నాసరరెడ్డి అన్నారు. బుధవారం అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా స్థానిక జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు అతి చిన్న వయస్సులోనే వీర మరణం పొందారన్నారు. భారత స్వాతంత్ర చరిత్రలో అల్లూరి బ్రిటీష్ వారికి కంటి మీద కునుకు లేకుండా చేశారన్నారు. సమాజం కోసం ప్రాణాలను అర్పించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతను అలవరచుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎల్డీఓ అనురాధ, జెడ్పీలోని వివిధ విభాగాలకు చెందిన పరిపాలనాధికారులు సి. మురళీమోహన్రెడ్డి, రాంగోపాల్, జితేంద్ర, సరస్వతమ్మ, పుల్లయ్య, బసవశేఖర్తో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఆటో బోల్తా .. డ్రైవర్ మృతి
బేతంచెర్ల: మండల పరిఽధిలోని గూటుపల్లె గ్రామ సమీపాన ఆటో బోల్తాపడిన సంఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. బాధిత కుటుంబసభ్యులు, స్థానికుల వివరాల మేరకు.. గూటుపల్లె గ్రామానికి చెందిన రామచంద్రుడు (42)ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. బుధవారం హుసేనాపురం సమీపాన భవన నిర్మాణానికి సెంట్రింగ్ చెక్కల బాడుగ ఉండటంతో వెళ్లి వస్తున్నాడు. గూటుపల్లె సుంకులమ్మ ఆలయం సమీపాన ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో డ్రైవర్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న సీఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ రమేష్ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య లక్ష్మి, కుమార్తె ఉదయ లక్ష్మి ఉన్నారు. -
ఒకే రోజు గుడి నిర్మాణం
బేతంచెర్ల: సాధారణంగా ఒకే రోజు ఆలయ నిర్మాణం పూర్తికాదు. అయితే, మండల పరిధిలోని సీతారామపురం గ్రామంలో ఓ భక్తుడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాన్ని నిర్మించారు. బుధవారం స్వామి ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించి సాయంత్రం నాలుగు గంటల్లోగా పూర్తి చేశారు. సుమారు 30 మంది కూలీలతో ఈ పనులు చేపట్టారు. నెలరోజుల తర్వాత స్వామి విగ్రహ ప్రతిష్ఠోత్సవం ఉంటుందని ఆలయ నిర్మాణ దాత బ్రహ్మయ్య తెలిపారు. 13 ఏళ్ల క్రితం ఇదే మాదిరిగా బేతంచెర్ల పట్టణంలో స్వామి మందిరం నిర్మించినట్లు వెల్లడించారు. -
విత్తనోత్పత్తికి మంగళం
● వ్యవసాయ శాఖ ఫామ్లు ఉన్నా లేనట్లే ● తంగడంచె ఫామ్లో బీళ్లుగా 350 ఎకరాలు ● పత్తి విత్తనాలకు దళారీలే ఆధారం ● ఖరీఫ్ సీజన్ వస్తుందంటే దళారీలు, అధికారులకు పండగే.. ● ముడుపులతో తనిఖీలు నామమాత్రంతంగడంచె ఫామ్లో బీడుగా మారిన భూములుకర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్ వస్తుందంటే విత్తన సమస్య రైతులను ముప్పుతిప్పలు పెడుతోంది. విత్తనోత్పత్తికి పేరొందిన ఉమ్మడి కర్నూలు జిల్లా విత్తనాల కోసం దళారీలపై ఆధారపడాల్సి వస్తోంది. రెండు సీజన్లకు అవసరమైన విత్తనాలను ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ సరఫరా చేస్తోంది. నిబంధనల ప్రకారం రైతులకు ఫౌండేషన్ సీడ్ ఇచ్చి విత్తనోత్పత్తి చేయించాలి. ఆ విత్తనాలను రైతుల నుంచి సేకరించి సర్టిఫైడ్ సీడ్గా సరఫరా చేయాలి. అలాంటిది విత్తనాల కోసం ఏపీ సీడ్స్, వ్యవసాయ శాఖ దళారీలపై ఆధారపడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. విత్తనాలను సరఫరా చేసే దళారీలకు ఏపీసీడ్స్, వ్యవసాయ శాఖలు పెట్టుకున్న ముద్దుపేరు ‘ఆర్గనైజర్లు’. ఈ ఏడాది కూడా దళారీలు కాసుల పంట పండించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 10 లక్షల హెక్టార్లలో సాగు భూములు ఉండగా ఉమ్మడి జిల్లాకు పత్తి విత్తన ప్యాకెట్లు 25 లక్షల వరకు.. ఇతర విత్తనాలు 40వేల క్వింటాళ్లు అవసరం. దళారీలే దిక్కు విత్తనోత్పత్తికి దేశంలోనే కర్నూలు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వేరుశనగ, పత్తి, జొన్న, శనగ, మొక్కజొన్న, కందులు, మినుములు, కొర్రలు తదితర విత్తనాలతో పాటు కూరగాయల విత్తనోత్పత్తి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేపట్టారు. నేడు కర్నూలు జిల్లాలోనే విత్తనాల కోసం దళారీలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏపీ సీడ్స్, వ్యవసాయ శాఖలు కనీసం తమ ఆధ్వర్యంలోని ఆర్గనైజర్ల(దళారీలు)తో విత్తనోత్పత్తి చేయించి సబ్సిడీపై పంపిణీకి సరఫరా చేయాలి. ఆ దిశగా కూడా చర్యలు శూన్యం. మామూళ్ల బంధం.. అంతా సవ్యం 2024–25లో సీడ్ విలేజ్ పోగ్రామ్ అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం మార్కెట్లో వేరుశనగ క్వింటా ధర కేవలం రూ.6,500 నుంచి రూ.7వేలు పలుకుతోంది. రబీలో పండిన వేరుశనగను దళారీలు ఈ ధరతో కొనుగోలు చేసి తూతూ మంత్రంగా ప్రాసెసింగ్ చేసి ఏజెన్సీలకు సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అధికారులు కూడా వీటినే నాణ్యమైన విత్తనమని ధ్రువీకరిస్తూ రైతులకు పంపిణీ చేయనున్నారు. అధికారులు, ఆర్గనైజర్లకు మామూళ్ల బంధం ఉండటంతో అంతా సవ్యమే అన్నట్లు వ్యవహారం సాగుతోంది. దీంతో ఖరీఫ్ రైతులకు నాణ్యమైన విత్తనం ప్రశ్నార్థకమవుతోంది. తనిఖీలు నామమాత్రమే.. ● దళారీలు సిద్ధం చేసిన వేరుశనగను వ్యవసాయ శాఖతో పాటు ఏపీ సీడ్స్ అధికారులు తనిఖీ చేయాలి. ● అయితే ఈ ప్రక్రియ కాగితాలపై కనిపిస్తుందే తప్ప క్షేత్ర స్థాయిలో జరగని పరిస్థితి. ● తనిఖీలకు వెళ్లిన వాళ్లు మామూళ్లు పుచ్చుకొని వస్తున్నట్లు తెలుస్తోంది. ● వ్యవసాయ అధికారులు కూడా తూతూ మంత్రంగానే తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. ● ప్రస్తుతం విత్తనాల ప్రాసెసింగ్తో పాటు ప్యాకింగ్ జరుగుతోంది. ● ఈ నేపథ్యంలో విత్తనాల నాణ్యతను సమగ్రంగా పరిశీలించాల్సి ఉంది. ● ఆ దిశగా చర్యలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మందగించిన విత్తనోత్పత్తివ్యవసాయ శాఖకు కర్నూలు జిల్లాలో ఎదురూరు, ఎమ్మిగనూరు మండలం బనవాసి, నంద్యాల జిల్లా తంగడంచె ఫామ్లు ఉన్నాయి. ఎదురూరు ఫామ్లో 45 ఎకరాలు, బనవాసిలో 55 ఎకరాలు, తంగడంచెలో దాదాపు 600 ఎకరాల భూములు ఉన్నాయి. అయితే ఎదురూరులో తూతూమంత్రంగా ఖరీఫ్లో కంది, రబీలో శనగ.. బనవాసి ఫామ్లో వరి, తంగడెంచెలో కంది విత్తనోత్పత్తి చేస్తున్నారు. తంగడంచె ఫామ్లో 600 ఎకరాల భూములు ఉన్నప్పటికీ 250 ఎకరాల్లోనే విత్తనోత్పత్తి జరుగుతోంది. మిగిలిన 350 ఎకరాల్లో కంపచెట్లు పేరిగి అడవిని తలపిస్తోంది. వందలాది ఎకరాల భూములు వృథాగా మిగిలిపోవడంతో కూటమి ప్రభుత్వం వీటిని ఇతర అవసరాలకు తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2024–25 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం పంపిణీ చేసిన వేరుశనగ నాణ్యతపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఏపీసీడ్స్ సరఫరా చేసిన వేరుశనగలో రాళ్లు, మట్టిపెళ్లలు ఉండటం, విత్తనాలు నాసి రకం, పుచ్చులు ఉండటంతో రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. ఈసారైనా తగిన జాగ్రత్తలు తీసుకుంటారనుకుంటే ఆ ఊసే కరువైంది. ఈ ఖరీఫ్ సీజన్కు అవసరమైన విత్తనాల కోసం వ్యవసాయ శాఖ, ఏపీ సీడ్స్ దళారీలపైనే ఆధారపడటం గమనార్హం. వ్యవసాయ శాఖ, ఏపీ సీడ్స్ విత్తనోత్పత్తి చేసి రైతులకు పంపిణీ చేస్తేనే రైతులకు నాణ్యమైన వేరుశనగ లభిస్తుంది. ప్రభుత్వానికి ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. అయితే దళారీలు ఇచ్చే కమీషన్లు పైనుంచి కింది స్థాయి వరకు ఉండటంతో విత్తనోత్పత్తి అటకెక్కినట్లు చర్చ జరుగుతోంది. -
పాండురంగడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
కోవెలకుంట్ల: పట్టణంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత పాండురంగ విఠలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు, సుదర్శనాచార్యుల ఆధ్వర్యంలో స్వామికి ప్రాత:కాల పూజ, పంచామృతాభిషేకం, సీ్త్రసూక్త, భూసూక్త విధానేన అభిషేకాలు, విష్ణు అష్టోత్తర శతనామావళి, మంత్రపుష్పం, మహామంగళహారతి, తీర్థప్రసాద వినియోగం, తదితర కార్యక్రమాలు నిర్వహిచారు. పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి కోట తిరుణాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం ద్వాదశ కుంభహారతి, పేట, కోనేటి తిరుణాల కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు. -
వేణుగోపాలా.. ఆపద్బాంధవా!
ఆళ్లగడ్డ: నరసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఎగువ అహోబిలం క్షేత్రంలో జ్వాలా నరసింహస్వామి వేణుగోపాల స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువ జామున నిత్య పూజల్లో భాగంగా సుప్రభాత సేవతో స్వామిని మేల్కొపిన అనంతరం అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం జ్వాలా నరసింహుడిని వేణుగోపాల స్వామి అలంకారంలో, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను రుక్మిణీ, సత్యభామలుగా అలంకరించి కొలువుంచి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆతర్వాత ఉభయ దేవేరులతో ఉత్సవ పల్లకీని అధిరోహించిన స్వామివారు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు. రాత్రి ఉభయ దేవేరులతో స్వామి వారు పొన్నచెట్టు వాహనంపై కొలువై భక్తులను అనుగ్రహించారు. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులతో ఎగువ, దిగువ అహోబిల క్షేత్రాలు కళకళలాడాయి. వైభవంగా కొనసాగుతున్న నారసింహుడి జయంతి బ్రహ్మోత్సవాలు శ్రీ వేణుగోపాల స్వామి అలంకరణలో జ్వాలా నరసింహుడు వైభవంగా పొన్నచెట్టు వాహన సేవ -
డీఎస్సీ ప్రిపరేషన్ గడువు పెంచాలి
కర్నూలు సిటీ: డీఎస్సీకి ప్రిపరేషన్ గడువు పెంచాలని, లేకపోతే తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ సరిగా లేదని అందులోని పలు అంశాల్లో మార్పులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వారు డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం బిర్లా కాంపౌండ్ దగ్గర రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేంద్ర, నగేష్ మాట్లాడుతూ అనేక ఉద్యమాల ద్వారా డీఎస్సీ నోటిఫికేషన్ సాధించుకున్నామని, అయితే అందులో అనేక అంశాల్లో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందన్నారు. నెల రోజుల పాటు డీఎస్సీ పరీక్షలు జరపరాదని, ఒక జిల్లా ఒకే పేపర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు 90 రోజుల గడువు ఇవ్వడంతో పాటు వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని కోరారు. ఇంటర్మీడియేట్, డిగ్రీ మార్కులు 40 శాతానికి తగ్గించాలన్నారు. ఈ న్యాయమైన డిమాండ్లపై సర్కారు స్పందించకపోతే డీఎస్సీ అభ్యర్థులతో కలిసి చలో విజయవాడ కార్యక్రమ చేపడతామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సాయి ఉదయ్, కర్నూలు మండల కార్యదర్శి ప్రకాష్, హరికిషన్ రెడ్డి, విశ్వనాథ్, తదితరులు పాల్గొన్నారు. సర్కారు తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించిన అభ్యర్థులు -
రహదారిపై ‘పచ్చ’ కక్ష
● డ్రెయినేజీ ఉన్నా కాల్వపేరుతో తవ్వకాలు ● మట్టిని తవ్వి రోడ్డుపై వేసి రాకపోకలకు అడ్డంకి ● వైఎస్సార్సీపీ సానుభూతి పరులంటూ కక్ష సాధింపు ● అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం కోవెలకుంట్ల: కూటమి నేతల రాజకీయ కక్ష సాధింపు చర్యలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. కంపమల్ల గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకుల తీరుతో బీసీ కాలనీ ప్రజలకు రహదారి కష్టాలు ఎదురయ్యా యి. కాలనీలో 75 కుటుంబాలు జీవనం సాగిస్తున్నా యి. ఎక్కువ శాతం వైఎస్సార్సీపీ సానుభూతి పరులున్నారనే దురుద్దేశంతో కాలనీ ప్రజలకు రహదారి కష్టాలు తెచ్చిపెట్టారు. గత వైఎస్సార్సీపీ హయాంలో రూ. 1.30 లక్షలతో గ్రామ పంచాయతీ నిధులు వెచ్చించి 150 మీటర్ల మేర కాలనీలో డ్రెయినేజీ ఏర్పాటు చేశారు. ఈ రహదారి వెంటే గ్రామానికి చెందిన రైతు లు, కాలనీ ప్రజలు పొలాలు, ఊరకుంట, మెయిన్ రోడ్డుకు వెళుతున్నారు. డ్రెయినేజీ ఉన్నా ఆరు నెలల క్రితం టీడీపీ నాయకులు ఆ డ్రెయిన్ పక్కనే ప్రొక్లెయిన్తో కాల్వ పేరుతో తవ్వకాలు చేపట్టారు. తవ్విన మట్టిని రోడ్డుపైనే కుప్పలుగా పోయడంతో రహదారిలో రాకపోకలు స్తంభించి పోయాయి. ఆరు నెలలు గడిచినా రోడ్డుపై మట్టిని తొలగించకపోవడంతో పొలాలకు వెళ్లేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ సోముల లోకేశ్వరరెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని గ్రామ టీడీపీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఆ కుటుంబ సభ్యుల వాహనాలు ఇంట్లో నుంచి బయటకు రాకుండా కాల్వ పేరుతో మట్టిని తవ్వి ఇంటి ముందు అడ్డంగా పోశారు. మట్టి కట్టలు ఉండటంతో ఆరు నెలల నుంచి లోకేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి వాహనాల్లో బయటకు రావడానికి వీలు లేకుండా పోయింది. రోడ్డుపై మట్టి వేసి రాకపోకలకు అంతరాయం కల్గించిన విషయాన్ని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసినా ఇంత వరకు అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. అంతటితో ఆగక టీడీపీ నేతలు లోకేశ్వరరెడ్డి కుటుంబాన్ని అంతమొందించేందుకు కుట్రలు పన్ని ఈ ఏడాది మార్చి 12వ తేదీన హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. టీడీపీ నాయకుల దాడిలో లోకేశ్వరరెడ్డి తీవ్రంగా గాయపడి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఆయన తండ్రి వెంకట్రామిరెడ్డి, సోదరుడు వెంకటేశ్వరరెడ్డి గాయాలపాలయ్యారు. దాడి కుట్రలో భాగంగానే ప్రణాళికాబద్ధంగా ఇంటి చుట్టూ మట్టికట్టలు వేసినట్లు అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని రోడ్డుపై అడ్డుగా ఉన్న మట్టికట్టలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. -
పీఠాధిపతికి తులాభారం
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు తులాభారం వేడుక కనుల పండువగా సాగింది. బుధవారం కర్ణాకటలోని మాండ్యకు చెందిన మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ దంపతులు మొక్కుబడిలో భాగంగా బియ్యం, బేడలు, బాదంతో తులాభారం చేపట్టారు. శ్రీమఠం ప్రాంగణంలోని తులాభారం కౌంటర్లో జరిగిన ఈ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.ఇంగ్లిషులో మాట్లాడేలా తీర్చిదిద్దాలికర్నూలు(సెంట్రల్): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరూ సులభంగా తెలుగు మాట్లాడినట్లు ఇంగ్లిషులో కూడా మాట్లాడగలిగేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని విల్ టు కేన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిషు సంస్థ డైరెక్టర్ రామేశ్వర్ గౌడ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల ఇంగ్లిషు ఉపాధ్యాయులకు 40 రోజుల ఉచిత ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాన్ని డీఈఓ శామ్యూల్పాల్తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిక్షణకు జిల్లాలో దాదాపు 450 మంది ఆంగ్ల ఉపాధ్యాయులు హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. వారికి ఇంగ్లిషు బోధనలో పలు మెళకువలు, సూచనలు ఇస్తున్నట్లు చెప్పారు. వాటి ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులను ఇంగ్లిషులో పూర్తి నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుందన్నారు. డీఈఓ మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని ప్రతి ఉపాధ్యాయుడు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో విల్ టు కేన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిషు సంస్థ ప్రతినిధులు వేణుగోపాల్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.బైక్ దొంగను పట్టుకుంటే.. బంగారు నగలు లభ్యంసి.బెళగల్: స్కూటర్ ఎత్తుకెళ్లిన దొంగను పట్టుకుంటే... బంగారు నగలు లభించిన ఘటన మండల కేంద్రం సి.బెళగల్లో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు.. బుధవారం సి.బెళగల్ చెందిన కొందరు యువకులు గ్రామ శివారులోని కంబదహాల్ గ్రామ రోడ్డులో వ్యవసాయ పొలం దగ్గర తమ స్కూటర్లను నిలిపి పొలంలో ఉన్న ఉపరితల ట్యాంక్లో స్నానం చేస్తున్నారు. అయితే వారితో పాటు ఓ కొత్త యువకుడు సైతం ట్యాంక్లో స్నానం చేశాడు. కొద్ది సేపటికే ట్యాంక్ నుంచి బయటకు వచ్చిన ఆ యువకుడు సి.బెళగల్కు చెందిన శివ స్కూటర్ను ఎత్తుకెళ్లాడు. అనుమానంతో సదరు యువకుడి కోసం గాలిస్తుండగా కంబదహాల్ సమీపంలో స్కూటర్తో కనిపించాడు. వెంటనే ఆ యువకుడిని పట్టుకొని సి.బెళగల్లో పోలీసులకు అప్పగించేందుకు వెళ్తుండగా నిందితుడి దగ్గర బంగారు ఆభరణాలున్న ప్యాకెట్ గుర్తించారు. స్కూటర్తో పాటు బంగారు దొంగతనం బయటకు వస్తుందని భయపడి కొటారుమిట్ట దగ్గర ఉన్న వంకలోకి దూకాడు. నిందితుడిని వెంబడించిన స్థానికులు వంక నీటి నుంచి బయటకు లాగి పోలీసులకు అప్పగించారు. నిందితుడి దగ్గర దాదాపు ఏడు తులాల బంగారు, వెండి ఆభరణాలన్నాయి. అతడిని విచారిస్తున్నామని ఎస్ఐ పరమేష్నాయక్ తెలిపారు. -
పోలీసులైతేనేం.. మేము ట్యాక్స్‘బాబు’లం!
దేశమంతా యుద్ధ భయం.. ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని అధికార యంత్రాంగం సర్వ సన్నద్ధమవుతోంది. ప్రజలను అప్రమత్తం చేస్తూ, యుద్ధం వస్తే ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో తెలియజేసేందుకు బుధవారం జిల్లా కేంద్రం కర్నూలులో మాక్ డ్రిల్ నిర్వహించారు. రోడ్డు పొడవునా పోలీసు వాహనాలు, ఖాకీ డ్రస్సు వేసుకున్న అధికారులు కలియతిరుగుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ మందు బాబు పోలీసులైతేనేమి, ఎవరేమైతే నాకేంటి అన్నట్లు నడి రోడ్డులో మద్యం సేవించడం మొదలుపెట్టాడు. పక్క నుంచే పోలీసు వాహనాలు వెళ్తున్నా.. తాను ట్యాక్స్‘బాబు’ అనే ధీమాతో ఎంచక్కా మందు కలుపుకొని గుటకేసిన దృశ్యాలు కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దిన మద్యాంధ్రప్రదేశ్కు అద్దం పట్టాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
పైసాచికం
ఇసు‘కాసు’రులు బనగానపల్లె మండలం చెరువుపల్లి సమీపంలో అక్కజమ్మ చెరువులో మట్టిని తరలిస్తున్న దృశ్యం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకుల అక్రమాలు పెచ్చుమీరాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్నారు. అనుమతి లేకుండా చెరువుల్లో మట్టి సైతం దోపిడీ చేస్తున్నారు. వీరికి అధికారులు అండగా ఉంటూ ‘పక్ష’ పాత ధోరణి ప్రదర్శిస్తున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరులే లక్ష్యంగా దాడులు చేస్తూ విమర్శలపాలవుతున్నారు. ఒక వైపు టీడీపీ నాయకుల పైశాచికాన్ని చూస్తూ.. మరో వైపు అధికారులు నిశ్చలంగా ఉండటాన్ని గమనిస్తూ ప్రజలు ఇదేమి చోద్యం అని చర్చించుకుంటున్నారు. సాక్షి, టాస్క్ఫోర్స్: అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఽటీడీపీ నాయకులు ఇసుక, మట్టి, గ్రా వెల్ తవ్వకాలు జరుపుతున్నారు.వీరి అక్రమాలకు కొందరు అధికారులు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. కోవెలకుంట్ల పట్టణ శివారులో ప్రవహిస్తున్న కుందూనది తీరంలో ఇసుక,నదిఒడ్డున ఏర్పాటు చేసిన కరకట్టను సైతం వదలకుండా టీడీపీ నాయకులు కొల్లగొడుతున్నారు. బెలుకు.. అవినీతి పలుకు! కుందూనది విస్తరణ పనుల్లో భాగంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నది ఒడ్డున కరకట్ట ఏర్పాటు చేశారు. వర్షాకాలంతో నదికి వరద నీరు అధికంగా చేరినా తీర గ్రామాలు, పొలాలను ముంచెత్తకుండా ఈ కరకట్ట అడ్డుకట్ట వేసింది. అయితే టీడీపీ నేతలు కరకట్టను సైతం వదలకుండా తవ్వకాలు జరిపి బెలుకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రొక్లెయిన్లు ఏర్పాటు చేసుకుని కట్టను తవ్వి యథేచ్ఛగా బెలుకు తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ బెలుకును రూ. 500 నుంచి రూ. 800 చొప్పున అమ్ముకుంటున్నారు. ప్రతి రోజు పెద్ద ఎత్తున బెలుకు తరలిపోవడంతో కరకట్ట బలహీన పడింది. వర్షాకాలంలో నదికి వరదనీరు చేరితే పంటపొలాలు, గ్రామాల్లోకి వరదనీరు చేరే ఆస్కారం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చెరువులో మట్టి దందా బనగానపల్లె మండలం చెరువుపల్లి సమీపంలోని అక్కజమ్మ చెరువులో టీడీపీ నేత అక్రమ మట్టిదందా కొనసాగిస్తున్నాడు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రొక్లెయిన్, ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. టీడీపీ నేత అండదండలతో మట్టిని తరలిస్తూ లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల అనుమతితోనే మట్టిని తరలిస్తున్నానని, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని బహిరంగంగా చెబుతుండటం గమనార్హం. చెరువు నుంచి వందలాది ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలిపోస్తున్నా రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహిస్తున్నారు. కక్ష సాధింపు ఇలా.. వైస్సార్సీపీ నాయకులపై టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అధికారులను బెదిరించి తనిఖీలు, దాడులు చేయిస్తున్నారు. మూడు రోజుల క్రితం కోవెలకుంట్ల మండలం జోళదరాశిలో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు ఉప్పరి సుబ్బరాయుడు తన సొంత పొలంలోని మట్టిని మరో పొలానికి తరలించుకునేందుకు ప్రొక్లెయిన్, ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకున్నాడు. ఇదే గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు తహసీల్దార్ పవన్కుమార్రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన మరుక్షణమే తహసీల్దార్ తమ సిబ్బందితో హుటాహుటినా అక్కడికి చేరుకుని మట్టిని తరలించవద్దని హుకూం జారీ చేశారు. నిబంధనల ప్రకారం తన సొంత పొలంలోని మట్టిని మరొక పొలా న్ని చదును చేసేందుకు తోలుకుంటున్నానని చెప్పినా వినకుండా అడ్డుకున్నారు. టీడీపీ పెద్దల ఆదేశాలతో ప్రొక్లెయిన్, రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు జరిగాయని మైనింగ్ శాఖ అధికారులు వాహనాలకు రూ.25 వేలు జరిమానా విధించా రు.అంతటితో కక్ష సాధింపు ఆగలేదు. జరిమానా చెల్లి ంచి రిలీజ్ కాపీని సమర్పించినా తిరిగి ఆర్టీఓ అధికారులకు మరో రిపోర్టు పంపించారు. వాహనాలకు సరై న రికార్డులు లేవని ఆర్టీఓ అధికారులు రూ. 19, 500 జరిమానా విధించడంతో ఆమొత్తాన్ని చెల్లించి వాహనాలను రిలీజ్ చేయించోవాల్సి వచ్చింది. టీడీపీ నాయకుల కొమ్ముకాస్తూ అధికారులు పచ్చపాత ధోరణి ప్రదర్శిస్తున్నారనడానికి ఈ సంఘటనే నిదర్శనం. విమర్శలు ఇవీ.. కోవెలకుంట్ల తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఇసుక, బెలుకును ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ నాయకులు సొంతపొలాల్లోని మట్టిని తోలుకుంటున్నట్లు సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకుని అడ్డుకుని కేసులు పెడుతున్నారు. కళ్లెదుటే ఇసుక, మట్టి టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలిపోతున్నా రెవెన్యూ అధికారులు కాని, కేసీ కెనాల్, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. సహజ వనరులను అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం ఇచ్చినా చోద్యం చూస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇసుకను తరలిస్తున్న టీడీపీ నాయకులు చెరువులో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు సహజ వనరులను కొల్లగొడుతున్న వైనం అక్రమార్కులకు రెడ్ కార్పెట్ పరుస్తున్న అధికారులు వైఎస్సార్సీపీ సానుభూతి పరులే లక్ష్యంగా దాడులు అధికారుల తీరుపై విమర్శల వెల్లువ కుందూతీరంలో ఇసుకను ట్రిప్పు రూ. వెయ్యి నుంచి రూ. 1,200, మట్టిని రూ. 500 నుంచి 600 చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ అమల్లోకి తెచ్చినా టీడీపీ నాయకులు ఇసుక దందా కొనసాగిస్తున్నారు. రైతులు, ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా ఇసుక సరఫరా చేసుకోవచ్చు అన్న నిబంధనను తుంగలో తొక్కి ఇసుక తువ్వను సైతం విక్రయిస్తున్నారు. ప్రొక్లెయిన్లతో కుందూతీరంలో ఇసుకను తవ్వుతుండటంతో తీరం వెంట పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. వర్షాకాలం నది ఉప్పొంగితే ఈ గుంతల్లో భారీగా నీరు చేరే అవకాశం ఉంది. ప్రజలు అందులో పడితే తమ విలువైన ప్రాణాలను కోల్పోవచ్చు. జిల్లా అధికారు లు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాలి బనగానపల్లె నియోజకవర్గంలో ఎలాంటి అనుమతులు లేకుండా కుందూ నదిలోని, కుంటల్లోని, చెరువుల్లోని ఇసుక, మట్టిని టీడీపీ నాయ కులు తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం సొంత పొలాలకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు మట్టిని తోలుకుంటే అడ్డుకుని కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తున్నారు. అధికారులు టీడీపీ నాయకులకు కొమ్ము కాయకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. – కాటసాని రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, బనగానపల్లె -
‘మోహినీ’ అలంకరణలో సింహరూపుడు
ఆళ్లగడ్డ: బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఎగువ అహోబిలంలో సింహరూపుడైన లక్ష్మీనృసింహస్వామి జగన్మోహినీ అలంకరణతో భక్తులను కనువిందు చేశారు. వేకువజామున సుప్రభాతసేవతో స్వామి అమ్మవార్లను మేలుకొలిపి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ మూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత జ్వాలా నరసింహ స్వామిని యాగశాలలో కొలువుంచి నవకలశ స్థాపన గావించారు. ప్రహ్లాదవరదుడిని నూతన పట్టుపీతాంభరాలతో మోహినీగా అలంకరించి పల్లకీలో కొలువుంచి భక్తుల గోవింద నామస్మరణలు, మంగళవాయిద్యాల మధ్య తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. రెక్కల కష్టాన్ని దోచేస్తారా? ● ఏపీఓను నిలదీసిన ‘ఉపాధి’ కూలీలు పగిడ్యాల: దినసరి వేతనాలు తక్కువ వేస్తున్నారని ‘ఉపాధి’ కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రెక్కల కష్టాన్ని దోచేస్తారా’ అంటూ ఏపీఓ మద్దిలేటిని నిలదీశారు. స్థానిక కార్యాలయానికి మంగళవారం ఉపాధి కూలీలు వచ్చారు. సంకిరేణిపల్లె, ముచ్చుమర్రి, నెహ్రూనగర్ గ్రామాల్లో ఆరు రోజులకు వేతనాలు వేస్తున్నారని, పగిడ్యాల, బీరవోలు, పాలమర్రి గ్రామాల్లో మాత్రం నాలుగు రోజులకే వేతనాలు వేసి కూలీలకు కోత విధిస్తున్నారని మండిపడ్డారు. ఆరు రోజులు పనిచేస్తే నాలుగు రోజులకు మాత్రమే డబ్బులు ఎలా వేస్తున్నారని ప్రశ్నించారు. ఇష్టారాజ్యంగా చేస్తున్నందునే అలా వేస్తున్నారని ఏపీఓ మద్దిలేటి వెల్లడించారు. 12 నుంచి ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 12 నుంచి 20వ తేది వరకు నిర్వహించనున్నారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్, మద్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు జరుగనున్నాయి. మొత్తం 21,342 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 15,292.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,032 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణకు 52 పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రాక్టికల్స్ ఫెయిల్ అయిన విద్యార్థులకు, గైర్హాజరైన వారికి ఈ నెల 28వ తేది నుంచి జూన్ 1వ తేది వరకు కేవలం జిల్లా కేంద్రంలో మాత్రమే వీటిని నిర్వహించనున్నారు. కొత్తిమీర అ‘ధర’హోగోనెగండ్ల: ఒక్కసారిగా కొత్తిమీర ధర పెరిగిపోయింది. ఒక మడి ధర రూ. వెయ్యి నుంచి రూ. 1,200 వరకు పలుకుతోంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొత్తిమీరకు డిమాండ్ పెరిగింది. గోనెగండ్ల మండలంలో బోర్లు,బావుల కింద 1,500 ఎకరాల్లో రైతులు కొత్తిమీర పంటను సాగుచేశారు. ఈ ఏడాది ఉల్లి, మిరప తదితర పంటలు సాగుచేసిన రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం కొత్తిమీర పంటకు రెండు రోజుల నుంచి ధరలు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
జొన్న రైతుకు ‘వ్యయ’ప్రయాస
కష్టాలు అన్నీఇన్నీ కావు ఈ ఏడాది జొన్న సాగు చేసిన రైతులకు దిగుబడులు అంతంత మాత్రంగానే వచ్చాయి. మార్కెట్లో సరైన ధర లేక రైతులు అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడంతో కొంత మేరకు ఉపశమనం వచ్చినా కష్టాలు అన్నీఇన్నీ కావు. బాడుగలు భారంగా మారుతున్నాయి. – ప్రతాపరెడ్డి, ఎం.చింతకుంట్ల, గోస్పాడు మండలం. అర్థం కావటం లేదు నంద్యాల సెంట్రల్ వేర్ హౌస్ వద్ద ఉన్న మమ్మల్ని తిరిగి దీబగుంట్లకు తీసుకెళ్లాలని చెప్పడంతో ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చాక తిరిగి గోపవరం వద్దకు తీసుకెళ్లాలని చెప్పారు. మాకేం అర్థం కావటం లేదు. ఒకసారి కుదుర్చుకున్న బాడుగలకు తిరిగి క్వింటాకు రూ. 50 వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. – వలి, పెసరవాయి, గడివేముల మండలం గోస్పాడు: జొన్నలను రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయడం లేదు. ఇందుకు కొను గోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా ప్రతి రోజూ తికమక పెడుతోంది. దీంతో రైతులకు ఖర్చులు తడిసి మోపెడుతున్నాయి. ముందుగా నంద్యాలలోని సెంట్రల్ వేర్ హౌస్ గోడౌన్ వద్దకు జొన్నలను తీసుకెళ్లేందుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోజుకు ట్రాక్టర్కు అయితే రూ. 1,300నుంచి రూ. 1,800 వరకు, లారీకి అయితే రూ. 2వేల నుంచి రూ. 2,500 వరకు ఖర్చు చేశారు. జొన్నలు అమ్ముకోవడానికి క్యూలో నిల్చొని నాలుగైదు రోజులు గడిచాక నంద్యాల సెంట్రల్ వేర్హౌస్ నుంచి దీబగుంట్ల లోని గోడౌన్కు పంపించారు. మంగళవారం దీబగుంట్లకు వచ్చిన తర్వాత గోపవరం సమీపంలోని గోడౌన్కు తరలించాలని అధికారులు చెప్పడంతో రైతు లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోడౌన్ ఖాళీగా ఉన్నా ఇలా ఎందుకు చేశారని ప్రశ్నించారు. రోజుల తరబడి క్యూలో నిలపాల్సి వస్తోందని, ఖర్చులు మరింత పెరిగి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు రైతులు ట్రాక్టర్ల వద్ద నిద్రిస్తూ కనిపించారు. మరికొందరు పొలాల్లో వేచి చూశారు. మద్దతు ధరతో కొనుగోలు చేయని ప్రభుత్వం రోజుకొక గోడౌన్కు తిరగాల్సిందే! -
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్క్లు నంద్యాల న్యూటౌన్: జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ల ఏర్పాటు చేయనున్నామని, ఇందుకు ప్రభుత్వ స్థలాలు గుర్తించాలని ఆర్డీఓలు, తహసీల్దార్లను జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పాణ్యం, సుగాలిమెట్ట ప్రాంతాల్లో 50, డోన్ మండలం ఉంగరాలగుట్ట ప్రాంతంలో 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు. సంబంధిత ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలపై పరిశీలించాలన్నారు. రిలయన్స్ కంప్రెస్సెడ్ బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు జిల్లాలో 5 వేల ఎకరాలను గుర్తించి నివేదికలు ఇవ్వగా అందులో 765 ఎకరాల్లో ఏర్పాటు చేయడానికి సంస్థ నుంచి అంగీకారం వచ్చిందన్నారు. అందులో గడివేములలో 300, చాగలమర్రిలో 105, రుద్రవరంలో 190, ఆళ్లగడ్డలో 170 ఎకరాలు ఉన్నాయన్నారు. పీఎం కుసుమ్ సంబంధించి పాణ్యం, నంద్యాల, గోస్పాడు, జూపాడుబంగ్లా, భానుముక్కల, ప్యాపిలి మండలాల్లో 10 ఎకరాల మేరకు ప్రభుత్వ భూములు పరిశీలించి సబ్ స్టేషన్ల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డీఆర్ఓ రాము నాయక్, నంద్యాల, ఆత్మకూర్, డోన్ ఆర్డీఓలు విశ్వనాథ్, నాగజ్యోతి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. -
‘సూచనల’ మూగ నోము!
● శ్రీశైలంలో ఆగిపోయిన ‘డయల్ యువర్ ఈఓ’ ● నామమాత్రంగా సూచనల బాక్సుల ఏర్పాటు శ్రీశైలం టెంపుల్: దేశ నలుమూలల నుంచి జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలానికి వచ్చే భక్తులు తమ కష్టాలను ఎవరి చెప్పుకోవాలో తెలియక మూగు నోము పాటిస్తున్నారు. గతంలో భక్తుల సలహాలు, సూచనలు, ఫిర్యాదులు స్వీకరించేందుకు డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి అధికారులు ఎగనామం పెట్టారు. దీంతో భక్తుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు రావడం లేదు. శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో కల్పిస్తున్న సౌకర్యాలు భక్తులకు ఏవిధంగా ఉపయోగపడుతున్నాయి.. ఇంకా ఎటువంటి సౌకర్యాలు మెరుగుపర్చాలి.. తదితర వివరాలు తెలుసుకునేందుకు శ్రీశైలంలో డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని 2021 డిసెంబరు 22న ప్రారంభించారు. ఇందుకోసం 08524–287111 నంబరును కేటాయించారు. ప్రతి బుధవారం ఉదయం 11గంటల నుంచి 12గంటల వరకు భక్తులు ఫోన్ చేసి తమ సలహాలు, సూచనలు, ఫిర్యాదులు ఇచ్చేవారు. కొన్ని వారాల పాటు సజావుగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నెలలో ఒక రోజు మాత్రమే నిర్వహించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని ఎత్తివేశారు. ఉపయోగంలేని బాక్స్లు డయల్ యువర్ ఈఓ కార్యక్రమానికి ప్రత్యామ్నాయంగా ఫిర్యాదుల బాక్స్లను ఏర్పాటు చేశారు. దేవస్థాన పరిపాలనా భవనం వద్ద, వసతి గదుల కేంద్రాల వద్ద, సీఆర్వో కార్యాలయం, క్యూలైన్ల వద్ద, అన్నప్రసాద వితరణ భవనం వద్ద వీటిని ఉంచారు. భక్తులు వీటిని వినియోగించడం లేదు. పునఃప్రారంభించేందుకు చర్యలు శ్రీశైల దేవస్థానంలో డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. భక్తుల నుంచి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు స్వీకరిస్తాం. ఆయా విభాగాల అధికారులతో చర్చించి సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుంది. – ఎం. శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి -
భద్రతా లోపం.. పర్యవేక్షణ శూన్యం
త్వరలో భద్రతాధికారిని నియమిస్తాం శ్రీశైల ఆలయంలో చోరీ సంఘటన జరగడం దురదృష్టకరం. దేవస్థానంలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి ఇటీవలే ప్రత్యేక శిక్షణ ఇప్పించాం. దేవస్థాన సీఎస్వో పోస్టుకు అనేకసార్లు నోటిఫికేషన్ ఇచ్చాం. త్వరలోనే రిటైర్డ్ డీఎస్పీ స్థాయి అధికారిని, జూనియర్ కమాండెంట్ ఆఫీసర్ని శ్రీశైలం సీఎస్వోగా నియమించేందుకు చర్యలు చేపడుతున్నాం. – ఎం.శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి నలుగురికి రిమాండ్ హుండీ నగదు చోరీ కేసులో సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించాం. తెలంగాణకు చెందిన సంగనమోని రమేష్, అతనితో సహ జీవనం చేసే కె.లక్ష్మీ, మరో ఇద్దరు మైనర్లను ఉచిత క్యూలైన్ వద్ద అదుపులోకి తీసుకున్నాం. వీరి నుంచి రూ.10,150 స్వాధీనం చేసుకున్నాం. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించాం. – జి.ప్రసాదరావు, శ్రీశైలం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం టెంపుల్: కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్త దేవాలయాల పర్యవేక్షణ గాలికి వదిలేసింది. ఇటీవల తిరుమలలో చోటుచేసుకున్న తొక్కిసలాట, సింహాచలంలో గోడకూలిన ఘటన, శ్రీశైల దేవస్థానంలో వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. కొన్ని నెలల క్రితం శ్రీశైలం టోల్గేట్లో చోటుచేసుకున్న అవినీతి కుంభకోణం, అలాగే టికెట్ల మార్ఫింగ్, ప్రస్తుతం హుండీ చోరీ ఘటనలు మల్లన్న సన్నిధిలో భద్రత డొల్లతనాన్ని బయటపెడుతోంది. శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వార్ల దర్శనానికి నిత్యం భక్తులు వేలాదిగా తరలివస్తారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని భక్తులు కానుకలను సమర్పిస్తారు. ఇందుకోసం ఇనుప హుండీలు, క్లాత్ (గుడ్డ) హుండీలను దేవస్థానం ఏర్పాటు చేసింది. ఈ నెల 1వ తేదీన ఇద్దరు వ్యక్తుల సహకారం, ప్రోత్సాహంతో మరో ఇద్దరు మైనర్లు భక్తుల రూపంలో ఉచిత క్యూలైన్ ప్రవేశమార్గం ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. గర్భగుడిలోని రత్నగర్భ గణపతి ఆలయం వద్దగల క్లాత్ (గుడ్డ)తో ఏర్పాటు చేసిన హుండీని బ్లేడ్తో కోసి అందులో నుంచి రూ.10,150 దొంగతనం చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉందని తెలిసి కూడా అధికారుల అలసత్వాన్ని ఆసరాగా తీసుకుని దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది. గర్భగుడిలో చోరీ ఘటనపై విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన టెంపుల్ ఇన్స్పెక్టర్ను దేవస్థాన కార్యనిర్వహణాధికారి సస్పెండ్ చేశారు. అలాగే కమాండ్ కంట్రోల్ రూంలో సీసీ కెమెరాలను పర్యవేక్షించాల్సిన సెక్యూరిటీ గార్డులు కూడా నిర్లక్ష్యం వహించారని ఇద్దరిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు. శ్రీశైలం పర్యవేక్షణ గాలికి.. శ్రీశైలక్షేత్ర భద్రతను, పర్యవేక్షణను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో, ఉగాది మహోత్సవాల్లో సైతం భక్తులకు అరకొర సౌకర్యాలు కల్పించారని భక్తులు విమర్శించారు. అలాగే శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శివస్వామిపై వ్యాపారస్తులు దాడిచేసి గాయపరచిన ఘటన చోటుచేసుకుంది. టోల్గేట్లో అవినీతి కుంభకోణం చోటుచేసుకుంది. అంతేకాకుండా వీఐపీ బ్రేక్ స్పర్శదర్శనం టికెట్లను మార్ఫింగ్ చేసి భక్తులకు విక్రయించిన ఘటన తెలిసిందే. ప్రస్తుతం గర్భగుడిలో హుండీ చోరీ ఘటన కలకలం రేపుతోంది. రెగ్యులర్ ఛీప్ సెక్యూరిటీ ఆఫీసర్ లేని వైనం శ్రీశైల దేవస్థాన భద్రతను పర్యవేక్షించేందుకు, ఉభయ దేవాలయాల్లోకి అసాంఘిక శక్తులు, నిషేధిత పదార్థాలు తీసుకెళ్లకుండా క్షేత్ర భద్రతను దేవస్థాన ఛీప్ సెక్యూరిటీ ఆఫీసర్ పర్యవేక్షిస్తారు. అయితే గత కొన్ని నెలల నుంచి దేవస్థానం సీఎస్వో పోస్టు ఖాళీగా ఉంది. దేవస్థాన పర్యవేక్షకులకే ఇంచార్జి సీఎస్వోగా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ కాలం నెట్టుకొస్తున్నారు. అలాగే దేవస్థానంలో డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, హ్యండ్ ప్రేమ్ మెటల్ డిటెక్టర్లు, లగేజి స్కానర్లు ఉన్నప్పటికీ అలంకారప్రాయంగానే ఉండిపోయాయి. మల్లన్న సన్నిధిలో భద్రత డొల్ల ఏకంగా గర్భగుడిలోని క్లాత్ హుండీని కోసి డబ్బు దొంగతనం ఇద్దరు మైనర్లకు మరో ఇద్దరి సహకారం ఈఓ ఆదేశాలతో శ్రీశైలం పీఎస్లో సీఎస్ఓ ఫిర్యాదు నిందితులు రిమాండ్కు తరలింపు విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన టెంపుల్ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్ -
శేష వాహనంపై అహోబిలేశుడు
ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జయంతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూలమూర్తులను సోమవారం ఉదయం సుప్రభాత సేవతో మేలుకొలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి, శ్రీ లక్ష్మీనరసింహస్వాములను యాగశాలలో కొలువుంచి అర్చన, అభిషేకం, తిరుమంజనం నిర్వహించి పట్టు వస్త్రాలతో అలంకరించారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉభయ దేవేరులతో శేషవాహనంపై మాడ వీధుల్లో వివహరిస్తూ భక్తులను కటాక్షించారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై కొలువైన జ్వాలా నరసింహస్వామి మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. -
రైతులకు డీనోటిఫై పత్రాలు
నంద్యాల(న్యూటౌన్): చుక్కల, 22ఏ1 కింద నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించి 11 మంది రైతులకు డీనోటిఫై పత్రాలను ఇచ్చామని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. మొత్తం 11 మంది రైతులకు 32.71 ఎకరాల భూములకు డీ నోటిఫై పత్రాలు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లు, ఆర్డీఓలు కృషి చేశారన్నారు. బాధిత సర్వే నంబర్ల రైతులను ఐజీఆర్ఎస్ నిషేధిత జాబితాలో డీనోటిఫై చేయాలని, వెబ్ ల్యాండ్ పోర్టల్లో మార్పుకు చర్యలు తీసుకోవాలన్నారు. మలేరియా, డెంగీ రాకుండా పటిష్ట చర్యలు గోస్పాడు: మలేరియా, డెంగీ వ్యాధులు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య సిబ్బందిని డీఎంఅండ్హెచ్ఓ వెంకటరమణ ఆదేశించారు. పట్టణంలోని తన కార్యాలయంలో సోమవారం నంద్యాల జిల్లా సబ్ యూనియన్ అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంఅండ్హెచ్ఓ మాట్లాడుతూ.. జ్వరం కేసులను త్వరగా గుర్తించి రక్తనమూనాల సేకరించి మలేరియా నిర్ధారణ అయితే వెంటనే ఏఎల్ఓ, పోగింగ్ స్ప్రేయింగ్ నివారణ చర్యలు చేపట్టాలన్నారు. మలేరియా, డెంగీ నివారణ చర్యలపై ఏఎన్ఎం, ఆశా, సీహెచ్ఓలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా మలేరియా అధికారి కామేశ్వరరావు, ఇన్చార్జి ఏఎంఓ రామవిజయారెడ్డి, సబ్ యూనిట్ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో పాఠశాల విద్యకు నష్టం నంద్యాల(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పాఠశాల విద్యకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని ఏపీటీఎఫ్(275) జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ, ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు కోరుతూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ ప్రియదర్శినికి అందజేశారు. కార్యక్రమంలో నాయకులు నాయకులు తిమ్మారెడ్డి, రమేష్, నాగేంద్ర, ప్రసాద్, నౌమాన్బాషా తదితరులు పాల్గొన్నారు. హంద్రీనీవా ఎస్ఈగా పాండురంగయ్య కర్నూలు సిటీ: హంద్రీనీవా సుజల స్రవంతి పథకం సర్కిల్–1 పర్యవేక్షక ఇంజనీర్గా పాండురంగయ్యను నియమిస్తూ ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సాయిప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఎల్ఎల్సీ ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్గా పాండురంగయ్య పని చేస్తున్నారు. హంద్రీనీవా సర్కిల్–1కి రెగ్యులర్ ఎస్ఈ లేరు. గత నెల 30న ఇన్చార్జిగా ఉన్న సురేష్ పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం హంద్రీనీవా విస్తరణ పనులు జరుగుతుండడంతో ఖాళీగా ఉన్న ఎస్ఈ పోస్టుకు పాండురంగయ్యను నియమించారు. ● కర్నూలు సర్కిల్ ఎస్ఈగా బాల చంద్రారెడ్డిని నియమించారు. ఈ ఏడాది జనవరి నెల లో రెగ్యులర్ ఎస్ఈలుగా పదోన్నతులు ఇవ్వడంతో ద్వారకనాథ్ రెడ్డి ఎస్ఈగా బాధ్యతలు స్వీకరించారు. గత నెల 30న పదవీ విరమణ పొందారు. ఖాళీగా ఉన్న ఈ స్థానంలో బాల చంద్రారెడ్డిని ఎస్ఈగా నియమితలయ్యారు. -
సాగులో లేని వాళ్లు ఉన్నట్లు చూపిస్తున్నారు. అసలు ప్రాణాలతో లేని వ్యక్తులు పరిహారం కోసం కోర్టుకు వెళ్లినట్లు సృష్టించారు. ఈ విషయంలో ఓ టీడీపీ నేత చక్రం తప్పారు. ఇప్పటికే కొంతమందికి పరిహారం మంజూరు కాగా, మిగిలిన వారికీ పరిహారం మంజూరు చేయాలని సదరు నేత అధికారుల
అయ్యన్న సంతకాలు ఫోర్జరీ సర్వేనెంబర్ 232లో అయ్యన్న అనే వ్యక్తికి రెండు ఎకరాల పొలం ఉంది. ఇతనికి కూడా రూ.8.60లక్షలు పరిహారం రావాలి. ఇతను 2008 జూలై 8న చనిపోయారు. ప్రభుత్వం మరణధ్రువీకరణ పత్రం కూడా జారీ చేసింది. అయితే ఇతని పొలాన్ని 2013లో సేకరించారు. పరిహారం కోసం చనిపోయిన అయ్యన్న 2018 నవంబర్ 5న కోర్టులో రిట్(40116/2018) దాఖలు చేశారు. 2002లో చనిపోయిన వ్యక్తి 2018లో కోర్టును ఎలా ఆశ్రయించారో అధికారులకే తెలియాలి. 2002లో చనిపోతే.. 2018లో కోర్టుకు ఎలా వెళ్లారు? పాలకొలనులోనే కలగొట్ల నాగమ్మ అనే మహిళకు 2 ఎకరాల పొలం ఉంది. ఎకరాకు రూ.4.30లక్షల చొప్పున ఈమెకు రూ.8.60లక్షలు పరిహారం రావాలి. అయితే నాగమ్మ 2002లో చనిపోయారు. భూమిని 2013లో సేకరించారు. కానీ పరిహారం కోసం నాగమ్మ పేరుతో ఓ టీడీపీ నేత 2018లో రిట్ (డబ్ల్యూపీ 42989/2018)దాఖలు చేశారు. అందులో నాగమ్మ వేలిముద్రలను ఫోర్జరీ చేశారు. నాకు తెలీకుండానే నా పేరుతో కోర్టుకు.. నాకు అరెకరా ఉంది. నాకు రూ.2.15లక్షలు రావాలి. నేను బతికే ఉన్నా. నాకు తెలియకుండా నా పేరుతో టీడీపీ లీడర్ కోర్టుకు వెళ్లారు. నాకు సంతకం రాదు. నేనైతే ఎక్కడా వేలిముద్రలు వేయలేదు. కానీ నేను వేసినట్లు వేలిముద్రలు వేశారట. లేదంటే డ్వాక్రా గ్రూపులోని వేలిముద్రలను తీసుకున్నారేమో తెలీదు. ఇది చాలా అన్యాయం. నా పరిహారం నాకు ఇప్పించాలి. – శేషమ్మ నకిలీ పాసుపుస్తకాలు సృష్టించారు మా మానాన్న మద్దిలేటికి 4.38 ఎకరాల పొలం ఉంది. ఇప్పటికీ పాసుపుస్తకాలు మా నాన్న పేరుతో ఉన్నాయి. అయితే మా ఆడపిల్లలతో పాటు మా సోదరుడు వెంకటేశ్వర్లు భార్య భాగమ్మ, ఆమె పిల్లలు బతికే ఉన్నారు. వారికి తెలియకుండా భూమి భాగ పరిష్కారాలు కాకుండా మొత్తం భూమి రామాంజనేయులు తీసుకున్నట్లు నకిలీ పాసుపుస్తకాలు సృష్టించారు. మా వద్ద మా నాన్న పాసుపుస్తకాలు ఉన్నాయి. దీనిపై అధికారులు విచారణ చేయాలి. అప్పటి వరకూ పరిహారం ఆపాలి. – మద్దిలేటి వారసులుఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ భూసేకరణ కుంభకోణం ● పరిహారం కోసం రైతులకు తెలియకుండా కోర్టుకు ● చనిపోయిన వారి పేరిట రిట్ పిటిషన్లు దాఖలు ● ఇప్పటికే 120 మందికి పరిహారం.. త్వరలో మరో 70 మందికి ● ఈ విషయంలో చక్రం తిప్పుతున్న ఓ టీడీపీ నేత ● మంజూరైన పరిహారంలో 50శాతం ఇచ్చేలా ఒప్పందం సాక్షి ప్రతినిధి కర్నూలు: ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్లో డీఆర్డీఓ(డిఫెన్స్ రీసెర్స్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) కోసం 3,250 ఎకరాల భూమిని ఏపీఐఐసీ ద్వారా ప్రభుత్వం సేకరించింది. పట్టా భూము లకు, అసైన్డ్ భూములకు ప్రభుత్వం ఎకరాకు రూ.4.30లక్షల చొప్పున పరిహారం ఇచ్చింది. అయితే ఈ పరిహారం మంజూరులో కొందరు రైతుల పేర్లతో టీడీపీ నేతల భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. 15–20 ఏళ్ల కిందట చనిపోయిన వారి పేర్లతో ఫోర్జరీ సంతకాలు చేసి పరిహారం పొందేందుకు సిద్ధమ య్యారు. ఇప్పటికే 120మందికి పరిహారం అందింది. మరో 70మందికి పరిహారం మంజూరు కాగా, ఖా తాల్లో జమ కావల్సి ఉంది. అయితే ఈ పరిహారం మంజూరులో అక్రమాలు జరిగాయని ఇటీవలే బాధిత రైతు కుటుంబాలతో పాటు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాట సాని రాంభూపాల్రెడ్డి కలెక్టర్ను కలిసి విన్నవించారు. నిజమైన బాధితులకు న్యాయం చేయాలని కోరారు. వేలిముద్రలు ఫోర్జరీ చేసి కోర్టులో రిట్ పాలకొలనులో మాదిగ శేషమ్మకు అరెకరా పొలం ఉంది. ఈమె భూమిని డీఆర్డీఓ కోసం సేకరించారు. అయితే పొలంలో శేషమ్మ సాగులో లేదని పరిహారం తిరస్కరించారు. దీనిపై శేషమ్మకు తెలియకుండానే ఆమె పేరుతో హైకోర్టులో 2022లో రిట్(పిటిషన్ నెం.25654) దాఖలు చేశారు. పిటిషన్లో శేషమ్మ పేరుతో వేలిముద్రలు వేసి ఆమె పేరు రాశారు. నిజానికి ఈ విషయం ఆమెకు ఏమాత్రం తెలీదు. గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు తప్పుడు వేలిముద్రలతో శేషమ్మ పేరుతో రిట్ దాఖలు చేశారు. లేదంటే డ్వాక్రా సంఘంలో ఉన్న శేషమ్మ రుణాల లావాదేవీలలో గతంలో వేసిన వేలిముద్రలను ఫోర్జరీ చేసి ఉండొచ్చని శేషమ్మ అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఈమె పేరుతో మంజూరైన పరిహారం శేషమ్మకు తెలియకుండానే టీడీపీ నేత ఖాతాలో జమ కానుంది. వచ్చిన పరిహారంలో ఫిఫ్టీ.. ఫిఫ్టీ పాలకొలనులో డీఆర్డీఓ కోసం వందల ఎకరాల భూమి సేకరించారు. ఇందులో కొందరు నిజమైన అర్హులు ఉంటే కొందరు భూమి లేకుండా కేవలం నకిలీ పట్టాలు సృష్టించి పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్న వారున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎవరైతే ప్రభుత్వం నుంచి అసైన్డ్భూములు పొంది, సాగులో లేకుండా ఉన్నారో వారికి పరిహారం నిరాకరించారు. ఇదే అదునుగా ఓ టీడీపీ నేత పరిహారం నిరాకరించిన కొందరి పేర్లతో వారికి తెలీకుండా వారి పేర్లతో కోర్టులో రిట్దాఖలు చేశారు. ఇది చూసి ఇంకొందరు రైతులు కూడా టీడీపీ నేతతో కలిసి వెళ్లి తమకూ పరిహారం ఇప్పించాలని కోరారు. దీంతో ఆ టీడీపీ నేత వచ్చే పరిహారంలో సగం తనకు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. తనకు వచ్చే సగంలో అధికారులకు వాటా ఇస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీకి తెలీకుండా దోపిడీ నక్కల మద్దిలేటికి సర్వేనెంబర్ 199లో 3.50 ఎకరాలు, సర్వేనెంబర్ 243/5లో 0.88 ఎకరాలు మొత్తంగా 4.38 ఎకరాలు ఉంది. మద్దిలేటి చనిపోయి 20 ఏళ్లు దాటింది. ఈయనకు ఐదుగురు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు. వీరిలో మొదటి, రెండో కుమారులు మద్దిలేటి, వెంకటేశ్వర్లు చనిపోయారు. అలాగే ఓ ఆడపిల్ల కూడా చనిపోయింది. చిన్నోడు రామాంజనేయులుతో పాటు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. మద్దిలేటి పేరుతో ఉన్న పొలాన్ని రెండో కుమారుడు వెంకటేశ్వర్లు భార్య భాగ్యమ్మకు మగపిల్లోడు ఉన్నారు. ఈమెతో పాటు తక్కిన నలుగురు ఆడపిల్లలకు సంబంధం లేకుండా మొత్తం పొలం దాన విక్రయం కింద తండ్రి తనకు రాసిచ్చినట్లు పాస్బుక్కులు సృష్టించారు. పరిహారం కోసం కోర్టులో 2018లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే రామాంజనేయులు మినహా తక్కిన మద్దిలేటి వారసులు పాస్బుక్కులు తమ తండ్రి పేరుతోనే ఉన్నాయని, నకిలీ పాసుపుస్తకాలు సృష్టించుకుని రామాంజనేయులు తమకు పరిహారం ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీని వెనుక గ్రామానికి చెందిన టీడీపీ నేత ఉన్నారని చెబుతున్నారు. -
అన్నదాతలకు తీవ్ర అన్యాయం
● రైతు భరోసా కేంద్రాలను నాశనం చేశారు ● టీడీపీ నాయకుల ఇళ్లలోకి ఎరువుల బస్తాలు ● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి పాణ్యం: దేశానికి అన్నం పెట్టే రైతులకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి మండిపడ్డారు. అన్నదాతలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, ప్రభుత్వంపై పోరాడతామని చెప్పారు. పాణ్యం మండలం ఆలమూరు గ్రామంలో రైతులతో సోమవారం ముఖాముఖి నిర్వహించారు. పెట్టుబడి వ్యయం, గిట్టుబాటు ధర, సాగు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో కాటసాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఎరువులను టీడీపీ నాయకుల ఇళ్లలో ఉంచుతున్నారన్నారు. చేసేదేమి లేక రైతులు వేరే ప్రాంతానికి వెళ్లి యూరియా బస్తా రూ. 400 ప్రకారం కొనాల్సి వస్తోందన్నారు. కనీస మద్దతు ధర లేకపోవడంతో ధాన్యం కల్లాలు దాటడడం లేదన్నారు. సాగు నీరు అందలేదు ‘పది రోజులుగా కల్లాల్లో ధాన్యం ఉంచినా కొనుగోలు చేసేందుకు ఎవరూ రావడం లేదు’ అని కన్నీటితో తమ కష్టాలను కాటసానికి రైతులు వివరించారు. ‘సాగు నీరు సరిగ్గా రాలేదని, తెగుళ్లు ఎక్కువయ్యాయని, మందు బస్తాల రేటు చాలా పెరిగిందని.. ఇలా ఉంటే రైతులు ఏమి చేయాలి’ అని వాపోయారు. గత ప్రభుత్వంలో ఆర్బీకేల్లో బుకింగ్ చేస్తే ఊర్లోనే మందులు, విత్తనాలు, పనిముట్లు ఇచ్చేవారని, నాటి పరస్థితులు నేడు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు అన్నదాత సుఖీభవ కింద రూ. 20వేలు రైతులకు ఇస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేశారని కాటసాని అన్నారు. అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోతే ఒక్క పైసా పరిహారం ఇవ్వలేదన్నారు. మోసం చేస్తే ప్రభుత్వానికి రైతులే బుద్ధి చెబుతారన్నారు. జెట్పీటీసీ మాజీ సభ్యుడు సద్దల సూర్యనారాయణరెడ్డి, వైస్ ఎంపీపీలు వెంకటేశ్వర్లు, పార్వతమ్మ, మల్లు జయచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు రామలక్ష్మయ్య, గోపాల్రెడ్డి, ఉపేంద్రారెడ్డి, దేవేంద్రరెడ్డి, శ్రీనాథ్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శ్రీశైలం.. భక్తజనసంద్రం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే గాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. పలువురు భక్తులు ఆన్లైన్ ద్వారా టికెట్లు పొంది స్వామివారి స్పర్శదర్శనం నిర్వహించుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్నీ కిటకిటలాడాయి. -
మల్లన్న ఆలయంలోని హుండీకి కన్నం?
● కానుకలు చోరీచేసిన నలుగురు ● ఓ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలోని మల్లికార్జున స్వామి గర్భగుడిలో ఉన్న హుండీకి నలుగురు మైనర్లు కన్నం వేసినట్లు సమాచారం. ఈనెల 1న ఉచిత దర్శన క్యూలైన్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన మైనర్లు గర్భగుడిలోని రత్నగర్భ గణపతి ఆలయం వద్ద ఉన్న (క్లాత్)హుండీని బ్లేడ్తో కోసి, అందులో కొంత డబ్బు తీస్తుండగా దేవస్థాన సూపరింటెండెంట్ పట్టుకున్నట్లు సమాచారం. వారి వద్ద నుంచి సుమారు రూ.10 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పది రోజుల నుంచి నలుగురు మైనర్లు దర్శనం పేరుతో ఉచిత క్యూలైన్ల ద్వారా ఆలయంలో తరచూ తిరిగినట్లు వెల్లడైంది. ఈఓ ఆదేశాలతో దేవస్థాన సీఎస్ఓ ఫిర్యాదు మేరకు శ్రీశైలం ఒకటో పట్టణ స్టేషన్ ఆఫీసర్ కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సమాచారం. చోరీ విషయమై విధుల్లో అలసత్వం ప్రదర్శించిన సీనియర్ అసిస్టెంట్ను బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బాలుడి కుటుంబానికి ఆర్థికసాయం బేతంచెర్ల: స్థానిక హనుమాన్ నగర్కు చెందిన నాలుగేళ్ల బాలుడు షేక్ మొహిద్దీన్ ఈనెల 2న కుక్కల దాడిలో మృతిచెందిన విషయం విదితమే. బాలుడి తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డోన్ ఆర్డీఓ నరసింహులు, మండల ప్రత్యేక అధికారి బషీరున్నీసా బేగం, తహసీల్దార్ ప్రకాశ్బాబు, నగర పంచాయతీ కమిషనర్ హరిప్రసాద్ రూ.3 లక్షల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది మధు, తేజ పాల్గొన్నారు. భగీరథుడిని స్మరించుకోవాలి నంద్యాల(అర్బన్): భగీరథుడిని స్మరించుకోవడం అందరి బాధ్యత అని రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. భగీరథ మహర్షి జయంతిని ఆదివారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ భగీరథుడు వారి పూర్వ పితామహులకు స్వర్గ ప్రాప్తి కల్పించేందుకు దివి నుంచి గంగను భువికి తెచ్చేలా చేశారన్నారు. కార్యక్రమంలో సగర సంఘం జిల్లా నాయకులు సురేష్కుమార్, శివయ్య, బాలరాజు, బాలాజీ, చిన్నయ్య, జిల్లా సంక్షేమ అధికారి ఓబులేసు, తదితరులు పాల్గొన్నారు. నేడు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నంద్యాల(న్యూటౌన్): జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాలులో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ సూచనల మేరకు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే ప్రజలు ఎవ్వరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఉదయం 9.30 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 12.30 గంటలకు ముగించనున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిల్లోనూ పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నీట్కు 1,144 మంది హాజరు నంద్యాల(న్యూటౌన్): నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. నంద్యాలలో నాలుగు కేంద్రాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్ష జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,176 మందికి గాను 1,144 మంది హాజరు కాగా 32 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల ఎదుట కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామన్నారు. దివ్యాంగ విద్యార్థులకు అన్ని పరీక్ష కేంద్రాల ఎదుట వీల్చైర్లను అందుబాటులో ఉంచామన్నారు. పరీక్ష కేంద్రాలను ఆర్డీఓ విశ్వనాథ్, డీఎస్పీ మందా జావలి ఆల్ఫోన్స్ తమ సిబ్బందితో పర్యవేక్షించారు. -
కొనుగోళ్లు మూరెడు..కష్టాలు బారెడు
నంద్యాల(అర్బన్): కొనుగోళ్లు మూరెడు.. కష్టాలు బారెడులా తయారైంది జొన్న రైతుల పరిస్థితి. ఒకపక్క అరకొర కొనుగోలు కేంద్రాలు.. మరోపక్క సరుకు బాగోలేదంటూ వెనక్కు పంపుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 30 వేల మెట్రిక్ టన్నుల జొన్నలను మద్దతు ధర రూ.3,371తో కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా నందికొట్కూరు, ఆళ్లగడ్డ, గడివేముల, నంద్యాలలో రెండు కేంద్రాల్లో కొనుగోళ్లకు జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే ప్రస్తుతానికి రైల్వే స్టేషన్ సమీపంలోని సీడబ్ల్యూసీ గోడౌన్లో కొనుగోళ్లను చేపట్టారు. ఒకే గోడౌన్లో కొనుగోళ్లు జరుగుతుండటంతో జిల్లావ్యాప్తంగా వస్తున్న జొన్న పంట దిగుబడులను కొనుగోలు చేయడం సిబ్బందికి ఇబ్బందిగా మారింది. మరోవైపు రైతులు రోజుల తరబడి వేసిచూడాల్సి వస్తోంది. ఈక్రమంలో శనివారం నుంచి సెంట్రల్ వేర్హౌస్కు సరుకు తీసుకు రావద్దని, దీబగుంట్ల గోడౌన్కు తీసుకెళ్లాలని గోడౌన్ అధికారులు హడావుడిగా సమాచారం ఇవ్వడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడికి ఇక్కడికి తిప్పుతూ ఉంటే వాహనాల రవాణ బాడుగలు రెండింతలు భరించాల్సి వస్తుందంటూ అన్నదాతలు నిట్టూర్చారు. నాణ్యత లేవంటూ వెనక్కి.. జొన్నలు జల్లెడ పట్టలేదని, నాణ్యత లేవంటూ సిబ్బంది కొంత మంది రైతులను వెనక్కిపంపుతున్నారు. గోడౌన్లు, సంచుల కొరత తీవ్రంగా వేధిస్తుండటం, కొనుగోళ్లు ఆలస్యమవుతుండటంతోపాటు నాణ్యత లేవంటూ వెనక్కి పంపుతుండటంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇదే సమయంలో కొందరు సిఫార్స్ ఉన్న రైతుల నుంచి మాత్రమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇక ట్రాక్టర్ను లోపలికి అనుమతించే గోడౌన్ సిబ్బందికి రూ.500, సెక్యూరిటీకి రూ.50 ఇచ్చుకోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో సకాలంలో కొనుగోళ్లు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జొన్నలను అధికారులు సకాలంలో కొనుగోలు చేసేవారు. జనవరి నుంచి ప్రారంభించి మార్చి చివరిలోపే జిల్లాలోని రైతులందరితో కొనుగోళ్లు పూర్తి చేసేవారు. మొదట కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జొన్న కొనుగోళ్లు జరిగాక.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెచ్చిన ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతుల వద్ద ఉన్న మొత్తం జొన్నల కొనుగోళ్లు జరిగేవి. గ్రామాలు, మండలాల వారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడమే గాకుండా మరికొన్ని ప్రాంతాల్లో కల్లాల వద్దే రైతుల నుంచి కొనుగోళ్లు జరిగేవి. కూటమి ప్రభుత్వం మాత్రం రైతన్నలను ముప్పుతిప్పలు పెడుతోంది. బాడుగ ఖర్చు పెరుగుతోంది రోజుకు ట్రాక్టర్ బాడుగ రోజుకు రూ.2 వేలు. వారం రోజుల క్రితం జొన్నలను విక్రయించేందుకు తెచ్చాను. ఇంకా కొనుగోలు చేయలేదు. ఎన్నిరోజులవుతుందో తెలియదు. అధికారులు రేపుమాపు అంటున్నారు. ట్రాక్టర్ బాడుగలు పెరిగిపోతున్నాయి. కేంద్రాలను మరిన్ని పెంచి త్వరగా కొనుగోలు చేయాలి. – వెంకటేశ్వరరెడ్డి, కరిమద్దెల, గడివేముల(మం) రోజుకు 15వేల టన్నులు కొంటున్నాం జిల్లాకు సంబంధించి 30వేల మెట్రిక్ టన్నుల జొన్న కొనుగోళ్లకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఇప్పటి వరకు 5వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. వరుస క్రమంలోనే కొనుగోళ్లు చేస్తున్నాం. అవినీతికి ఆస్కారమే లేదు. హమాలీలు, గోడౌన్లు, గన్నీ బ్యాగ్ల కొరత ఉంది. కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. కేంద్రాలు పెంచితే రైతులు వేచి చూడాల్సిన పని ఉండదు. – రాజునాయక్, సివిల్ సప్లయ్ డీఎం, నంద్యాల జొన్న కొనుగోలు కేంద్రాలు అస్తవ్యస్తం సరుకు బాగోలేదంటూ వెనక్కి పంపుతున్న సిబ్బంది నత్తనడకన కొనుగోలు ప్రక్రియ.. రోజుల తరబడి రైతుల నిరీక్షణ ట్రాక్టర్ల బాడుగలు అధికమవుతు న్నాయంటూ అన్నదాత ఆందోళన -
ఆర్బీకేలు ఉన్నా లేనట్టే!
మాకు ఆరు ఎకరాల భూమి ఉంది. ఇందులో కంది, వేరుశనగ, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేస్తున్నాం. ఆర్బీకే మాకు అన్ని విధాలా ఉపయోగకరంగా ఉండేది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్బీకేలు లేనట్లుగా ఉన్నాయి. ఎలాంటి సేవలు అందడం లేదు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులకు కోడుమూరుకు, వెల్దుర్తికి వెళ్లాల్సి వస్తోంది. రాజకీయాలకు అతీతంగా ఆర్బీకేలను నిర్వహించాల్సిన అవసరం ఎంతో ఉంది. – ఎం.మాదన్న, ఎస్హెచ్ ఎర్రగుడి, కృష్ణగిరి మండలం ప్రభుత్వం చొరవ తీసుకోవాలి గత ఏడాది మే నెల వరకు రైతుభరోసా కేంద్రాలతో అన్ని రకాల సేవలు పొందాం. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆర్బీకేలు పనిచేయడం లేదు. గత ఏడాది వరకు ఎరువులు/ పురుగు మందులు ఏదీ అవసరమైనా నిమిషాల వ్యవధిలోఆర్బీకే ద్వారా పొందువారం. నేడు బస్తా ఎరువు కావాలన్నా... నీళ్ల మందులు కావాలన్నా డోన్కు, పత్తికొండకు పోవాల్సి వస్తోంది. ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. – నౌనేపాటి, ముక్కెళ్ల, తుగ్గలి మండలం -
వైఎస్సార్సీపీ హయాంలో ఇలా..
దేశానికే రోల్ మోడల్గా గుర్తింపు పొందిన రైతు భరోసా కేంద్రాలు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వీటిని రైతుసేవా కేంద్రాలుగా మార్చడంతో నీలినీడలు అలుముకున్నాయి. ప్రస్తుతం రేషనలైజేషన్ పేరుతో వందలాది రైతుసేవా కేంద్రాలు మనుగడ కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఉమ్మడి కర్నూలు జిల్లా యూనిట్గా రేషనలైజేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది.● రైతు సేవా కేంద్రాలకు ఉరి వేసిన రాష్ట్ర ప్రభుత్వం ● రేషనలైజేషన్ పేరుతో కొన్ని కేంద్రాల తొలగింపు ● రెండు, మూడు రోజుల్లో రానున్న ఉత్తర్వులు ● వైఎస్సార్సీపీ హయాంలో 188 ఆర్బీకేల మనుగడ ● ఇక పోస్టుల భర్తీ, ఆర్బీకేల మనుగడ లేనట్లే ఆర్బీకేలో పనిచేయని డిజిటల్ కియోస్క్ కర్నూలు(అగ్రికల్చర్): రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ స్థాయిలోనే అన్నదాతలకు అన్ని రకాల సేవలు అందించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామస్థాయిలో రైతులకు సేవలు అందించే రైతుభరోసా కేంద్రాలు నిర్వీర్యం అయ్యాయి. వీటిని రైతు సేవా కేంద్రాలుగా మార్పు చేశారే తప్ప ఎలాంటి సేవలు అందించడం లేదు. వాటికి అన్నదాతలకు దూరం చేసేందుకు సరికొత్త ప్రణాళిక రూపొందించారు. గతంలో విత్తనం వేసే సమయం నుంచి మద్దతు ధరతో పంటను అమ్ముకునే వరకు అనేక సేవలు పొందిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కర్షకుల కష్టం రెట్టింపు అయ్యింది. ఎక్కడి పనులు అక్కడే! ఉమ్మడి కర్నూలు జిల్లాలో 877 ఆర్బీకేలు(ఆర్ఎస్కేలు) ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 849, అర్బన్ ప్రాంతాల్లో 28 పనిచేస్తున్నాయి. కర్నూలు జిల్లాలో 466, నంద్యాల జిల్లాలో 411 ఆర్బీకేలు సేవలు అందిస్తున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో ఆర్బీకేలకు సొంత భవనాలు ఏర్పాటు చేసింది. కర్నూలు జిల్లాలో 328, నంద్యాల జిల్లాలో 156 ప్రకారం 484 ఆర్బీకేలకు అపురూపమైన సొంత భవనాలు ఉన్నాయి. మిగిలిన 393 ఆర్బీకేలకు కూడా సొంత భవనాలు నిర్మితం అవుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. పోస్టుల భర్తీ లేనట్టే ఆర్ఎస్కే పరిధిలో ఉద్యాన పంటలు ఉంటే గ్రామ ఉద్యాన సహాయకుడు(వీహెచ్ఏ) ఉండాలి. మల్బరీ సాగైతే గ్రామ పట్టు పరిశ్రమ సహాయకుడు(వీఎస్ఏ) పనిచేయాల్సి ఉంది. వ్యవసాయ పంటలు ఎక్కువగా ఉంటే గ్రామ వ్యవసాయ సహాయుడు( వీఏఏ) విధులు నిర్వర్తించాలి. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రామ పట్టుపరిశ్రమ సహాయకులందరికీ పదోన్నతులు లభించాయి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వీఏఏలు 474, వీహెచ్ఏలు 215 ప్రకారం మొత్తం 689 మంది పని చేస్తున్నారు. మిగిలిన 188 పోస్టులను భర్తీ చేయడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం లేకుండా పోయింది. ఈ పోస్టులన్నీ రద్దయినట్లేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మూతపడినట్లే! ఉమ్మడి కర్నూలు జిల్లాలో 877 ఆర్బీకేలు(ఆర్ఎస్కేలు)ఉండగా రేషనలైజేషన్తో వీటిలో 188 కేంద్రాలు మూతపడినట్లే అని వ్యవసాయశాఖ వర్గాలే పేర్కొంటున్నాయి. పోస్టుల భర్తీ లేనందున ఆర్ఎస్కేలు కూడా లేనట్లేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏకంగా 188 ఆర్ఎస్కేలు మూత పడే పరిస్థితి ఉత్పన్నం అవుతుందంటే రైతులకు సేవలు ఏ స్థాయికి దిగజారి పోతాయో ఊహించుకోవచ్చు. 2,600 ఎకరాలకు ఒక వీఏఏ/వీహెచ్ఏ! ప్రతి 2,600 ఎకరాలకు ఒక వీఏఏ/వీహెచ్ఏలు ఉండే విధంగా రేషనలైజేషన్ జరుగుతోంది. ఉమ్మడి జిల్లా యూనిట్గా ఈ ప్రక్రియ జరుగుతోంది. దీనిపై వ్యవసాయ, ఉద్యాన శాఖలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. మిగిలిన భూములకు వ్యవసాయ శాఖలో ఎంపీఈవోలుగా పనిచేస్తున్న వారిని నియమిస్తారు. వీఏఏ, వీహెచ్ఏ పోస్టులను భర్తీ చేయకుండా కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న ఎంపీఇవోలను వినియోగించుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇవీ కష్టాలు..● విత్తనం మొదలు పండించిన పంటను మద్దతు ధరతో అమ్ముకునే వరకు రైతుకు ఆర్బీకేలు అండగా నిలిచాయి. ● ఖరీఫ్, రబీ సీజన్లలో ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తనాలు పంపిణీ చేసేవారు. ● వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, ఏపీఎంఐపీ, ఫిషరీష్, మార్కెటింగ్ తదితర శాఖలకు సంబంధించిన అన్ని రకాల కార్యాక్రమాలు ఆర్బీకేల ద్వారానే అమలయ్యాయి. ● ఆర్బీకేల్లో వ్యవసాయ విజ్ఞానానికి సంబంధించిన దాదాపు 50 పుస్తకాలతో మినీ లైబ్రరీ ఉండేది. ● ఆర్బీకేల్లోనే రైతుల సందేహాలను నివృత్తి చేసేవారు. ఏ ఎరువు ఎందుకు ఉపయోగపడుతుందనే దానిపై అవగాహన కల్పించేవారు. ● డిజిటల్ కియోస్క్ల ద్వారా తమకు అవసరమైన రైతులు ఆర్డర్ చేస్తే 48 గంటల్లోనే సరఫరా అయ్యేవి. ● ఆడియో, వీడియోలతో వ్యవసాయానికి సంబంధించిన సలహాలు, సూచనలు ఇచ్చేవారు. రేషనలైజేషన్ జరుగుతోంది ఉమ్మడి జిల్లా యూనిట్గా రేషనలైజేషన్ ప్రక్రియ జరుగుతోంది. అయితే రైతులకు ఎలాంటి నష్టం ఉండదు. ఉమ్మడి జిల్లాలో 877 ఆర్బీకేలు ఉన్నాయి. ప్రస్తుతం వీఏఏలు, వీహెచ్ఏలు కలిపి 689 మంది పనిచేస్తున్నారు. ఇందువల్ల ఆర్బీకేలు తగ్గే అవకాశం లేదు. వీఏఏలు, వీహెచ్ఏలు స్థానంలో ఎంపీఇవోలను వినియోగించుకుంటాం. రైతులకు సేవలు యథావిధిగా అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. – పీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి, కర్నూలు 2014నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ హయాంలో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం అవే కష్టాలు ఎదురవుతున్నాయి. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందడం లేదు. కల్తీ విత్తనాలు విజృంభిస్తున్నాయి. గతేడాది డిసెంబర్ నెలలో నకిలీ కంది విత్తనాలతో నష్టపోయిన రైతులు పత్తికొండలో ఆందోళన చేపట్టారు. అలాగే గతేడాది ఖరీఫ్ సీజన్లో జూపాడుబంగ్లా, గడివేముల, మిడుతూరు మండలాల్లోని రైతులు నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయారు. పురుగుమందులు, ఇతరత్రా సేవలు పొందడానికి పట్టణాలకు వెళ్లాల్సి వస్తోంది. ఆర్బీకేల్లో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబందించిన సేవలను పొందడానికి కియోస్క్లను వినియోగిస్తారు. అయితే ఇవి నిరుపయోగంగా మారాయి. రైతుల నుంచి పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేసే ఆర్బీకేలు అసలు లేవు. పంటలు పండకపోయినా రైతులను పలకరించే వారు కరువయ్యారు. -
సమయం లేదు మిత్రమా!
● రిజిస్ట్రేషన్లలో టైమ్ స్లాట్ ● బుక్ చేసుకున్న స్లాట్ సమయానికి వెళ్లకపోతే అంతే సంగతులు ● అదనంగా రూ.200 చెల్లించి మరోస్లాట్ బుక్ చేసుకోవాలి ● ఇబ్బంది పడుతున్న క్రయ, విక్రయదారులుకర్నూలు(సెంట్రల్): స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తెచ్చిన టైమ్ స్లాట్ విధానంతో క్రయ, విక్రయదారులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో రోజులో ఎన్ని డాక్యుమెంట్లు అయినా రిజిస్ట్రేషన్ చేసేవారు. ఒకనొక సమయంలో సిబ్బంది రాత్రిళ్లు ఉండి నూరు డాక్యుమెంట్లకుపైగా రిజిస్ట్రేషన్లను జరిపే వారు. నూతన విధానంతో ఎస్ఆర్ఓల్లో (సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో) రోజుకు కేవలం 39, ఆర్ఓ కార్యాలయంలో 78 స్లాట్లే బుకింగ్ అవుతున్నాయి. దీంతో ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి దూర ప్రాంతాల నుంచి రిజిస్ట్రేషన్ పని మీద వచ్చిన వారు రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. అన్లిమిటెడ్ నుంచి లిమిటెడ్కు... ఉమ్మడి కర్నూలు జిల్లాలో 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఇందులో 22 ఎస్ఆర్ఓ, కర్నూలు, నంద్యాల ఆర్ఓ కార్యాలయాలు ఉన్నాయి. గతంలో కర్నూలు, నంద్యాల, ఆదోని, కల్లూరు, ఎమ్మిగనూరు, కోడుమూరు తదితర సబ్ రిజిస్ట్రార్ కార్యాలాయల్లో రోజులో ఎన్ని డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లైనా జరిగేవి. ఒకనొక రోజులో 100కు పైగా డాక్యుమెంట్లు జరిగేవి. డాక్యుమెంట్ ఉంటే రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది అర్ధరాత్రి వరకు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తెచ్చిన టైం స్లాట్తో అనేక అవస్థలు ఉన్నాయి. వాటిని సరిచేయకపోతే క్రయ, విక్రయదారులు ఇబ్బంది పడాల్సిందే. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ సంఖ్య టైమ్ స్లాట్తో బాగా తగ్గిపోతోంది. గతంలో అన్లిమిటెడ్గా జరిగే డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నూతన విధానంలో లిమిటెడ్గా మారిపోయింది. ఇప్పుడు రోజులో సబ్ రిజిస్ట్ట్రార్ కార్యాలయం(ఎస్ఆర్ఓ)లో అయితే కేవలం 39, ఆర్ఓ కార్యాలాయల్లో అయితే 78 డాక్యుమెంట్లను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయడానికి టైమ్ స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇబ్బందిగా మారింది. వారు మరుసటి రోజు ఉండే టైం స్లాట్లను బుక్ చేసుకోవాల్సి వస్తోంది. ఆ రోజు కూడా ఆన్లైన్ సైట్ పనిచేయకపోతే వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రెండో సారి స్లాట్బుక్ చేసుకుంటే రూ.200 వసూలు ఒకసారి రిజిస్ట్రేషన్ కోసం టైం స్లాట్ను బుక్ చేసుకుంటే కచ్చితంగా అదే సమయానికి వెళ్లాల్సి ఉంటుంది. వారికి ఇచ్చిన 10 నిమిషాల సమయంలో వెళ్లకపోతే ఆ స్లాట్ ముగిసిపోతుంది. వారు మళ్లీ స్లాట్ను బుక్ చేసుకోవాలంటే అదనంగా రెండో సారి అయితే రూ.200, మూడోసారి అయితే రూ.500 చెల్లించాలనే నిబంధనలు ఉన్నాయి. ఫలితంగా విక్రయదారులపై మరింత ఆర్థిక భారం పడుతుంది. ఇప్పటికే పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీలు, డాక్యుమెంట్ రైటర్ల ఫీజు, చలానాల మొత్తాలతో వినియోగదారులపై తీవ్ర రుణ భారం పడుతోంది. గతంలో ఎప్పుడైనా అందుబాటులో టైం స్లాట్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో టైం స్లాట్ విధానం 2020 నుంచే వినియోగదారులకు అందుబాటులో ఉంది. గత ప్రభుత్వ హయాంలో క్రయ, విక్రయదారులే తమ డాక్యుమెంట్ను తయారు చేసుకొని వారికి అనువైన సమయంలో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లేలో పీడీఈ(పబ్లిక్ డేటా ఎంట్రీ) విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నూతనంగా టైం స్లాట్ విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించారు. గతంలో ఎప్పుడైనా టైం స్లాట్లు బుక్ చేసుకునే అవకాశం ఉండగా..ప్రస్తుతం వాటిని కుదించారు. దీంతో క్రయ, విక్రయదారులు ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది టైమ్స్లాట్ విధానంలో అనేక లోపాలు ఉన్నాయి. వాటిని సరిచేయడానికి అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. గతంలోనూ స్లాట్లు అన్లిమిటెడ్గా బుక్ చేసుకునేందుకు అవకాశం ఉండేది. ప్రస్తుతం లిమిటెడ్ చేయడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి వారికి ఇబ్బంది మారింది. ప్రభుత్వం పునరాలోచనచేయాల్సిన అవసరం ఉంది. – చంద్రశేఖర్, డాక్యుమెంట్ రైటర్ -
హంస వాహనంపై దివ్య తేజం
ఆళ్లగడ్డ: నృసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉదయం హంస వాహనం, రాత్రి సూర్య ప్రభ వాహనాలను అధిరోహించి భక్తులను కటాక్షించారు. ఎగువ అహోబిలం క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జయంతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం మూలమూర్తులు స్వామి అమ్మవారిని సుప్రభాత సేవతో మేలుకొలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వాములను యాగశాలలో కొలువుంచి అర్చన, అభిషేకం, తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పట్టు పీతాంబారలతో అలంకరించి కొలువుంచారు. నారసింహ స్వామిని విశేషంగా అలంకరించిన హంస వాహనంపై కొలువుంచి మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి సూర్యప్రభ వాహనం అధిరోహించి మాడ వీధుల్లో సంచరిస్తూ భక్తులను కటాక్షించారు. ఘనంగా సూర్య ప్రభ వాహనోత్సవం అహోబిలంలో వైభవంగా నారసింహ జయంతి బ్రహ్మోత్సవాలు -
‘పది’ సంతోషం.. దారిలోనే మాయం!
గోనెగండ్ల: పదో తరగతి పాసైన సంతోషంలో శ్రీశైలానికి వెళ్లొస్తుండగా జరిగిన ప్రమాదంలో విద్యార్థి మృత్యువాతపడ్డాడు. ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించగా, విద్యార్థి కురువ కుమార్ చికిత్స పొందుతూ కోలుకోలేక మరణించాడు. వివరాలివీ.. ఎర్రబాడు గ్రామానికి చెందిన సునిల్కు భార్య సునిత, ఇద్దరు కుమారులు సంతానం. సునిల్కు బొలెరో వాహనం ఉంది. భార్య గ్రామంలో కూలీ పనులు చేస్తోంది. పెద్ద కుమారుడు కుమార్ సున్నిపెంటలోని గురుకుల పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేశాడు. చిన్న కుమారుడు గ్రామంలోనే ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో కుమార్ 514 మార్కులు సాధించాడు. ఎర్రబాడు గ్రామానికి చెందిన చంద్రమ్మకు ఆదోనికి చెందిన వ్యక్తితో వివాహమైంది. ఈ నేపథ్యంలో సునీల్ బొలెరో వాహనాన్ని ఆదోని చెందిన వారు శ్రీశైలానికి వెళ్లేందుకు బడుగకు మాట్లాడుకున్నారు. తన కుమారుడు కూడా పదిలో మంచి మార్కులు సాధించడంతో కుమార్ను కూడా తండ్రి సునీల్ తన వెంట తీసుకెళ్లాడు. శ్రీశైలంలో స్వామి అమ్మవార్లను దర్శించుకొని శుక్రవారం తిరిగి ఆదోనికి పయనమయ్యారు. మార్గమధ్యంలో ఆత్మకూరు మండలం సిద్దాపురం చెరువు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనానికి దారి ఇవ్వబోగా బొలెరో టైరు జారింది. వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి పల్టీకొట్టింది. ప్రయాణికులంతా చెల్లాచెదురుగా పడిపోయారు. ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 14 మంది గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామానికి చెందిన కుమార్ కోలుకోలేక శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందాడు. పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన కుమారుడు కళ్ల ముందే చనిపోవడంతో తల్లిదండ్రుల రోదన మిన్నంటింది. శనివారం ఉదయం ఎర్రబాడు గ్రామంలో కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు. బొలెరో బోల్తా ఘటనలో ఐదుకు చేరిన మృతులు ఎర్రబాడు గ్రామంలో అలుముకున్న విషాదం -
షెడ్యూలింగ్ ఉంటేనే జొన్నల కొనుగోలు
● జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ నంద్యాల(అర్బన్): రైతు సేవా కేంద్ర పరిధిలో వ్యవసాయ సిబ్బందితో షెడ్యూలింగ్ చేస్తేనే జొన్నలు కొనుగోలు చేయాలని, లేదంటే వద్దని అధికారులకు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ సూచించారు. షెడ్యూల్ లేకుండా రైతులు జొన్నలను అన్లోడింగ్ గోడౌన్కి తీసుకొని వచ్చి రెండు మూడు రోజులు నిరీక్షించవద్దని సూచించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శనివారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. మద్దతు ధరతో జిల్లాలో 30 వేల టన్నుల జొన్నల కొనుగోలుకు అనుమతి ఉందన్నారు. ఇప్పటి వరకు 5 వేల మెట్రిక్ టన్నుల జొన్నలు కొనుగోలు చేశారని, ఇంకా 25 వేల టన్నులు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉందన్నారు. 5 వరకు ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు నంద్యాల(న్యూటౌన్):ఇంటర్మీడియెట్ ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు ఈనెల 5వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని డీఐఈఓ సునీత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఆయా కళాశాలల్లోనే విద్యార్థులు ఫీజులు చెల్లించాలని పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యలపై ముస్లింల ఆగ్రహం ● నేడు కర్నూలులో ధర్నా కర్నూలు(సెంట్రల్): ‘ముస్లమాన్లందరూ టెర్రరిస్టులే’ అన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముస్లింల చరిత్ర తెలియక లేనిపోని వ్యాఖ్యలు చేయడం ఆయనకు భావ్యం కాదన్నారు. డిప్యూటీ సీఎం మాట లను నిరసిస్తూ ఆదివారం ఉదయం 10 గంటలకు కర్నూలులోని జమ్మిచెట్టు దగ్గర ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినట్లు ముస్లిం సంఘాల జేఏసీ నాయకుడు ఎస్ఎండీ షరీఫ్ తెలిపారు. ఎంపీహెచ్ఏల కౌన్సెలింగ్ వాయిదా కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్(మేల్)ల కౌన్సెలింగ్ వాయిదా పడింది. శనివారం నిర్వహించాల్సిన రీ డిప్లాయ్మెంట్ కౌన్సెలింగ్లో పలువురు హెల్త్ అసిస్టెంట్లు కొన్ని సందేహాలను లేవనెత్తారు. అన్ని జిల్లాల్లో ఉమ్మడి జిల్లాగా జాబితాను వేసి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారని, ఇక్కడ మాత్రమే కేవలం కర్నూలు జిల్లా జాబితాను తయారు చేశారని చెప్పారు. దీంతో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వివరణ తీసుకుని డీఎంహెచ్వో డాక్టర్ పి.శాంతికళ కౌన్సెలింగ్ను వాయిదా వేశారు. ముగ్గురికి జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కర్నూలు(అర్బన్): జిల్లాలోని వివిధ జెడ్పీ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు రికార్డు/లైబ్రరీ/ ల్యాబ్ అసిస్టెంట్లకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించింది. వీరిని మండల పరిషత్ కార్యాలయాలు, పాఠశాలలకు కేటాంచినట్లు జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి తెలిపారు. ఎన్.కొత్తపల్లి జెడ్పీహెచ్ఎస్లో రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తున్న ఎస్.వీరశేఖర్రాజును జెడ్పీహెచ్ఎస్ బలపనూరుకు, దేవనకొండ నుంచి ఎం.అన్వర్సాదత్ను జూపాడుబంగ్లా ఎంపీపీ కార్యాలయానికి, బనగానపల్లె నుంచి ఎస్.జాకీర్హుసేన్ను ఎంపీపీ కోవెలకుంట్లకు పదోన్నతిపై బదిలీ చేసినట్లు సీఈఓ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అక్రమ కుళాయి కనెక్షన్ తొలగింపు ఆలూరు: మొలగవెల్లి గ్రామంలో దేవాలయ నీటిని టీడీపీ నాయకుడు ఇంటికి తరలిస్తుండగా అధికారులు స్పందించారు. మంచినీటి కుళాయి కనెక్షన్ను శనివారం తొలగించారు. భక్తులకు ఇచ్చే నీటిని అక్రమ కనెక్షన్తో టీడీపీ నాయకుడు తన ఇంటికి తరలిస్తున్నాడు. ‘సాక్షి’ దినపత్రికలో శుక్రవారం వార్త ప్రచురితం కావడంతో జిల్లా, డివిజనల్ పంచాయతీ అధికారులు స్పందించారు. వెంటనే కుళాయి కనెక్షన్ తొలగించాలని పంచాయతీ కార్యదర్శి వెంకటనాయుడిని ఆదేశించారు. పంచాయతీ సిబ్బంది రామాంజనేయులుతో కలసి కుళాయి కనెక్షన్ తొలగించారు. -
రైతుల కష్టం నేలపాలు!
నంద్యాల(అర్బన్): జిల్లాలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు ఓ మోస్తరు వర్షంతో పాటు గాలులు బీభత్సం సృష్టించాయి. విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. జిల్లాలోని దొర్నిపాడు, బేతంచెర్ల మండలాల్లో వరి ధాన్యం తడిసిపోయింది. అంతే కాకుండా పెనుగాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిసి పడ్డాయి. మామిడి రైతులు తీవ్రంగా నష్టోపోవాల్సి వచ్చింది. నంద్యాల, డోన్, ప్యాపిలి, మహానంది, బండిఆత్మకూరు తదితర మండలాల్లో దాదాపు వందలాది ఎకరాల్లో అరటి చెట్లు నేలకొరిగాయి. దొర్నిపాడు, ఆళ్లగడ్డ, శిరివెళ్ల, చాగలమర్రి తదితర మండలాల్లో బొప్పాయి, కర్బుజా పంటలకు నష్టం వచ్చింది. జిల్లాలో దాదాపు రూ.50లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
‘పది’ విద్యార్థులకు అభినందన
నంద్యాల(న్యూటౌన్): పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ రాజకుమారి అభినందించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో శనివారం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పదో తరగతి ఫలితాల్లో రాయలసీమ జోన్లో నంద్యాల జిల్లాను మొదటి స్థానంలో నిలిచిందన్నారు. జిల్లాలో ఇంకా 19 శాతం విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయారని, సప్లిమెంటరీలో వారు పాస్ అయ్యే విధంగా చేయాలని ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలన్నారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. డీఈఓ జనార్దన్ రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి, డీసీఓ శ్రీదేవి పాల్గొన్నారు. భూసార పరీక్షలకు మట్టి నమూనాల సేకరణ కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో 2025–26 సంవత్సరానికి 25,942 భూసార పరీక్షలు నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి మట్టి నమూనాల సేకరణపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి శనివారం కర్నూలు, వెల్దుర్తి మండలాల్లో మట్టి నమూనాలు ఏ విధంగా సేకరించాలనే విషయమై అవగాహన కల్పించారు. ప్రతి రైతుభరోసా కేంద్రం నుంచి 55 మట్టి నమూనాలు సేకరించే విధంగా లక్ష్యాలను కేటాయించారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోని భూసార పరీక్ష కేంద్రంలో 12931, ఎమ్మిగనూరు భూసార పరీక్ష కేంద్రంలో 13,011 మట్టి నమూనాలను పరీక్షిస్తారు. మొత్తం 13 మండలాలకు చెందిన మట్టి నమూనాలను కర్నూలులో భూసార పరీక్షలు నిర్వహిస్తారు. మిగిలిన అన్ని మండలాలకు చెందిన మట్టి నమూనాలను ఎమ్మిగనూరులో పరీక్షిస్తారు. ● కాగా నంద్యాల జిల్లాలో 22,880 భూసార పరీక్షలు నిర్వహిస్తారు. ఈ సారి నంద్యాల జిల్లా మట్టి నమూనాలను నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులోని ల్యాబ్లో భూసార పరీక్షలు నిర్వహిస్తారు. -
నేడు ఆఫ్లైన్లో నీట్ పరీక్ష
కర్నూలు(సిటీ): వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఎన్టీఏ ఆదివారం నిర్వహించనున్న జాతీయస్థాయి అర్హత ప్రవేశ పరీక్ష(నీట్)కు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో 16 పరీక్షా కేంద్రాల్లో 4,466 మంది, నంద్యాల జిల్లాలో 1,172 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఆఫ్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేందుకు సమయానికి బస్సులు, ప్రతి కేంద్రంలో దివ్యాంగుల కోసం వీల్చైర్లు ఏర్పాటు చేశారు. కర్నూలు నగర శివారులోని ట్రిపుల్ఐటీడీఎంలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎన్టీఏ నిబంధనల మేరకు ప్రతి ఒక్క విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉండటంతో విద్యార్థులు కనీసం రెండు గంటల ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని పరీక్ష నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రకటించింది. వస్త్రధారణపై ఆంక్షలు ● నీట్కు హాజరయ్యే విద్యార్థుల వస్త్రధారణపై ఎన్టీఏ కఠినమైన ఆంక్షలు విధించింది. విద్యార్థినులు జీన్స్ ప్యాంట్లు వంటి వస్త్రాలను ధరించకూండా, సాధారణ దుస్తుల్లోనే రావాల్సి ఉంటుంది. తలకు టోపీ, కళ్లకు బ్లాక్ సన్గ్లాసెస్ ధరించకూడదు. విద్యార్థినులు ముక్కుపుడక సహా చెవులకు దిద్దులు, చేతులకు గాజులతో పాటు ఎలాంటి ఆభరణాలను ధరించరాదు. ● చేతికి స్మార్ట్, సాధారణ వాచీలను సైతం ధరించరాదు. సమయాన్ని తెలుసుకునేందుకు వీలుగా పరీక్షా కేంద్రాల్లోని గదుల్లో గడియారాలను ఏర్పాటు చేశారు. ● బ్లూటూత్ వాచీలు, సెల్ఫోన్లు, స్మార్ట్ బ్యాండ్లు, పెన్నులు సహా ఇతర ఎలాంటి వస్తువులను విద్యార్థులు తమ వెంట తీసుకురాకూడదు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి నాలుగు బస్సులు జగన్నాథగట్టులోని ట్రిపుల్ ఐటీలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు కర్నూలు కొత్త బస్టాండ్ నుంచి నాలుగు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈ బస్సులు ఉదయం 10.30, 11.15, 11.45, 12.15 గంటల సమయంలో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ● ఎస్పీ అదిరాజ్సింగ్ రాణా నంద్యాల(న్యూటౌన్): ‘నీట్’ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ అదిరాజ్సింగ్ రాణా తెలిపారు. నీట్ కేంద్రాలు ఏర్పాటు చేసిన నంద్యాల ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ ప్రభుత్వ కశాళాలలను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నీట్ కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించేది లేదన్నారు. విద్యార్థులు ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్తో పాటు గుర్తింపు పొందిన ఫొటో తప్పనిసరిగా తెచ్చుకోవాలని సూచించారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళ, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాప్రసాద్, సీఐ కంబగిరి రాముడు, సూర్యమౌళి పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో 20 పరీక్ష కేంద్రాలు -
4న మహానందిలో వైశాఖ శుద్ధ సప్తమి వేడుకలు
మహానంది: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో ఈ నెల 4వ తేదీన వైశాఖ శుద్ధ సప్తమి వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ వేదపండితుడు రవిశంకర అవధాని, ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ సప్తమి రోజున గంగాదేవి స్వయంగా మహానంది రుద్రగుండం కోనేరులో స్నానమాచరించి భక్తుల పాపాలను పోగొడుతుందన్నారు. ఆ రోజు స్నానం చేయడం 12 ఏళ్లకు ఒకసారి వచ్చే గంగానది పుష్కరస్నానంతో సమానమన్నారు. వేడుకల్లో భాగంగా గంగాదేవికి ప్రత్యేక పూజలు చేస్తామని చెప్పారు. ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ(ఐటీఐ)లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఏ.రవీంద్రబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు సంవత్సరాల ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్ కోర్సులు, ఒక సంవత్సరం మెకానికల్ డీజిల్, వెల్డర్ కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు 9703395091, 9440748448, 08524–286055లను సంప్రదించాలన్నారు. నేటి నుంచి మహానందీశ్వరుడి నిరంతర దర్శనం మహానంది: వేసవి సెలవుల దృష్ట్యా మహానంది ఆలయంలో నేటి నుంచి జూన్ 15 వరకు నిరంతర దర్శనం కల్పిస్తున్నట్లు ఆలయ సూపరింటెండెంట్ అంబటి శశిధర్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శనివారం నుంచి భక్తులకు అసౌకర్యం కలుగకుండా నిరంతరంగా మహానందీశ్వరుడి దర్శనం కల్పిస్తున్నట్లు ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ప్రస్తుతం ఉదయం నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు దర్శనం కొనసాగుతోందన్నారు. తాజా నిర్ణయంతో జూన్ 15 వరకు ఎలాంటి విరామం లేకుండా నిరంతరాయంగా దర్శన భాగ్యం లభిస్తుందన్నారు. శ్రీశైలంలో భారీ వర్షం శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి భారీ ఈదురు గాలులు వీచాయి. అనంతరం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. భారీ వర్షానికి శ్రీశైలం రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షం ధాటికి పలువురు భక్తులు వసతి గృహాలకే పరిమితమయ్యారు. ఈదురు గాలులకు క్షేత్ర పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హుండీ ఆదాయం రూ.1.14 కోట్లు కౌతాళం: ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయ హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించారు. మొత్తం 56 రోజులకు భక్తులు నగదు రూపంలో రూ.1,14,68,836 సమర్పించినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు, హుండీ పర్యవేక్షణ అధికారి వెంకటేశ్ తెలిపారు. -
టీడీపీ నాయకుడి ఇంటికి ఆలయ నీరు!
ఆలూరు: దేవస్థానంలో భక్తులకు అందాల్సిన నీరు టీడీపీ నాయకుడి ఇంటికి నేరుగా వెళ్తోంది. ఇందుకు అక్రమంగా పైప్లైన్ వేసుకున్నారు. అధికారుల అనుమతి కూడా తీసుకోలేదు. ఆలూరు మండలంలోని మొలగవెల్లి గ్రామంలో కాశీవిశ్వేశ్వరస్వామి దేవాలయం ఉంది. ఆలయానికి వచ్చే భక్తులకు తాగునీటి వసతి కల్పించాలని పంచాయతీ అధికారులకు గ్రామపెద్దలు విన్నవించారు. ఇదే అదునుగా భావించిన గ్రామ టీడీపీ నాయకుడు దేవాలయంలో భక్తుల తాగు నీటికోసం ఇచ్చిన మంచినీటి పైపులకు అదనంగా వాల్ను బిగించుకున్నారు. ప్లాస్టిక్ పైపులైన్ వేసుకుని తన ఇంటికి దేవాలయ నీటిని తరలించుకుంటున్నారు. ఈ నీటితో తన వాహనాలను శుభ్రం చేస్తున్నారు. టీడీపీ నాయకుడి దౌర్జన్యాన్ని చూసి గ్రామ ప్రజలు ఇదేమి చోద్యం అని చర్చించుకుంటున్నారు. అంతటితో ఆగకుండా పంచాయతీ అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పీఎస్ వెంకటనాయుడి దృష్టికి తీసుకెళ్లగా.. అక్రమ మంచినీటి కుళాయి కనెక్షన్ను తీసుకున్న విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటానని తెలిపారు. -
భూ వివాదాలతోనే లక్ష్మినారాయణ హత్య
ఆలూరు రూరల్: కాంగ్రెస్ నేత, ఎమ్మార్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడు లక్ష్మినారాయణ హత్యకు భూ వివాదాలు, పంచాయతీలే కారణమని అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా తెలిపారు. ఆలూరులోని పోలీసు సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. లక్ష్మినారాయణ హత్య కేసులో 14 మందిపై కేసు నమోదు చేశామన్నారు. అయితే పది మందిని నిందితులుగా గుర్తించామన్నారు. లక్ష్మినారాయణ కుమారుడు వినోద్ ఫిర్యాదు చేసినట్లు వైకుంఠం ప్రసాద్, వైకుంఠం మల్లికార్జున, మల్లేష్, చికెన్ రామాంజిలపై కేసు దర్యాప్తులో ఉందని, వీరి పాత్ర ఉంటే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన ప్రధాన నిందితులైన పూనుగొండ్ల రాజేష్, బేపర్ గౌసియా, కత్రిమల సౌభాగ్యలను పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య, ఆలూరు సీఐ రవి శంకర్ రెడ్డితో కలిసి శుక్రవారం హైవే 167లోని నక్కనదొడ్డి గ్రామం వద్ద అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. ఇదే కేసులో ముద్దాయిలుగా ఉన్న పెద్దన్న, బోయ మేకల శ్రీనివాసులు, బోయ గోవిందు, బోయ రాము, వడ్డే నవీన్, ధర్మ, మనోహర్లను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. హత్యకు కారణమైన వివాదాలు అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని ఆలూరు రోడ్డులో ఉన్న 1.10 ఎకరాల ఇంటి స్థలాల భూమి, సిద్ధార్థ కాలనీలోని 9 ఎకరాల దేవదాయ భూమి పంచాయతీ విషయంలో గుంకతల్లుకు చెందిన గౌసియా, రాజేష్లతో లక్ష్మినారాయణకు వివాదం నడుస్తోంది. ఈ భూమిలోని 4 ఎకరాల్లో లక్ష్మినారాయణ ప్లాట్లు వేసి విక్రయించాడు. గుంతకల్లు మండలం కొనకొండ్ల చెందిన ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం విషయంలోనూ ఆయన పంచాయతీ చేసినట్లు తెలిసింది. అలాగే పెద్దన్నకు చెందిన 8 ఎకరాల భూమికి ఏడేళ్ల క్రితం లక్ష్మినారాయణ తన అత్త పేరిట నకిలీ పాసు పుస్తకాలు సృష్టించాడు. ఈ భూమి వివాదం కోర్టులో ఉంది. ఈ విషయంలో వివాదంతో పాటు పెద్దన్నపై లక్ష్మినారాయణ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారు. అదేవిధంగా నాలుగు నెలల క్రితం పెద్దన్న, రాజేష్, గౌసియాలను లక్ష్మినారాయణ బహిరంగంగా దూషించడంతో వారంతా ఆయనను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారమే హత్య ● రెండు నెలల క్రితం హిందూపురంలో టిప్పర్ కొనుగోలు చేశారు. ● గత నెల 27న ఉదయం పెద్దయ్య ఇంటి వద్ద సమావేశమయ్యారు. ● అదే రోజు మధ్యాహ్నం లక్ష్మినారాయణ గుంతకల్లు నుంచి తన స్వగ్రామమైన చిప్పగిరికి ఇన్నోవా కారులో బయలుదేరాడు. ● రాజేష్ అతన్ని మరో కారులో అనుసరించి టిప్పర్ డ్రైవర్ మేకల శ్రీనివాసులు, మరో వ్యక్తి ధర్మన్నకు సమాచారం ఇస్తూ వచ్చాడు. ● మరో నిందితుడు రాము మార్గమధ్యంలో ఉండి టిప్పర్ డ్రైవర్ను అప్రమత్తం చేశాడు. ● లక్ష్మినారాయణ కారు గుంతకల్లు సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్దకు రాగానే డ్రైవర్ శ్రీనివాసులు ఇన్నోవా కారును బలంగా ఢీకొట్టాడు. ● పక్కనే వేచి ఉన్న పెద్దన్న కొడవలితో లక్ష్మినారాయణ తలపై నరికాడు. ● మరో వ్యక్తి వడ్డే నవీన్ వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో ఆయన తలపై కొట్టాడు. ● మిగిలిన నిందితులు రహదారిలో ఎవరూ రాకుండా జాగ్రత్త వహించారు. ● లక్ష్మినారాయణపై దాడి అనంతరం అందరూ కలిసి పరారయ్యారని ఏఎస్పీ హుసేన్ పీరా విలేకరులకు వెల్లడించారు. ● విలేకరుల సమావేశంలో పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య, ఆలూరు సీఐ రవి శంకర్ రెడ్డి, హొళగుంద ఎస్ఐ దిలీప్ కుమార్, ఆలూరు ఎస్ఐ మహబూబ్ బాషా, చిప్పగిరి ఎస్ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
రమణీయం.. స్వర్ణ రథోత్సవం
శ్రీశైలంటెంపుల్: ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రంలో శుక్రవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం నిర్వహించారు. వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం చేశారు. లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పాన్ని పఠించారు. అనంతరం రథారూఢులైన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపించారు. ఉదయం 7.30గంటలకు స్వర్థరథోత్సవం ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం ముందుభాగం గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు రథోత్సవాన్ని జరిపించారు. రథోత్సవంలో కోలాటం, చెక్కభజన మొదలైన జానపద కళారూపాలు అలరించాయి. శ్రీశైల దేవస్థాన డిప్యూటీ కార్యనిర్వహణాధికారి రమణమ్మ, సహాయ కమిషనర్ ఇ.చంద్రశేఖరరెడ్డి, పలు విభాగాల అధికారులు, భక్తులు పాల్గొన్నారు. -
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏర్పడిన కరువు పరిస్థితులు ‘క్షీర’ క్షోభానికి దారితీశాయి. వేసవి కాలం పాల ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయింది. శిశువులు ఏడుస్తున్నా సీసాలో నింపి కాసిన్ని పాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. ఇంట్లో ఉన్న వృద్ధులకు సైతం పాలు వేడి చేసి ఇవ్వడం కష
పాల ఉత్పత్తి తగ్గింది మాకు 14 ముర్రా గేదెలు ఉన్నాయి. అన్నీ పాలు ఇస్తాయి. డిసెంబరులో రోజుకు 90 నుంచి 100 లీటర్ల వరకు పాలు ఉత్పత్తి అయ్యేవి. ఫిబ్రవరి నుంచి పాల ఉత్పత్తి తగ్గింది. రోజుకు 50 నుంచి 55 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. దాణా ఖర్చులు పెరిగాయి. వేసవిలో పచ్చిమేత తగినంత లేదు. నీటి సమస్య, ఎండల తీవ్రతతో పాల ఉత్పత్తి బాగా తగ్గింది. వర్షాలు కురిసి పచ్చి మేత అందుబాటులోకి వస్తే ఆగష్టు నుంచి పాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది. – వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్, మల్లెపల్లి, వెల్దుర్తి మండలం త్వరలో దాణామృతం ఇస్తాం వేసవిలో పాల ఉత్పత్తి 20 నుంచి 30 శాతం వరకు తగ్గుతుంది. వేసవిలో పాల ఉత్పత్తి తగ్గకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కో జిల్లాకు 250 టన్నుల సమీకృత దాణాను ప్రభుత్వం కేటాయించింది. త్వరలోనే పాడి రైతులకు సరఫరా చేస్తాం. పశుగ్రాసాల సాగుకు గడ్డి విత్తనాలను కూడా సబ్సిడీపై ఇస్తాం. వేసవిలో పశువుల కోసం ఉపాధి నిధులతో గ్రామాల్లో నీటితొట్లు కూడా ఏర్పాటు చేయనున్నాం. – డాక్టర్ జి.శ్రీనివాస్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఉమ్మడి జిల్లాలో ‘క్షీర’ క్షోభం ● వేసవిలో తగ్గిపోయిన పాల ఉత్పత్తి ● రోజుకు 13 లక్షల లీటర్లు అవసరం ● లభించేది 5 లక్షల లీటర్లు మాత్రమే ● ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి దిగుమతి కర్నూలు(అగ్రికల్చర్): అసలే వేసవి కాలం.. ఒక వైపు పచ్చిమేత కొరత.. మరోవైపు నీటి సమస్య.. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదు. ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు అంటూ హడావుడి చేసినప్పటికీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఇండియన్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం ప్రతి ఒక్కరూ రోజుకు 250 ఎంఎల్ పాలు తీసుకోవాల్సి ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 52 లక్షల జనాభా ఉంది. వీరి ప్రతి రోజూ 13 లక్షల లీటర్ల పాలు అవసరం అవుతాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో అన్ని పాలు అందుబాటులో లేవు. నీరు లేదు.. పచ్చిమేత కరువు ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,55,747 పశువులు ఉన్నాయి. వీటిలో 1,61,228 ఆవులు, గేదెల నుంచి మాత్రమే పాల దిగుబడి ఉంది. మిగిలినవి చూలు(ప్రెగ్నెంట్)తో, గొడ్డుబోతు పశువులుగా ఉన్నాయి. ఆగస్టు నుంచి జనవరి వరకు పచ్చిమేత నీరు పుష్కలంగా ఉండటంతో 10 లక్షల పాలు ఉత్పత్తి అయ్యేవి. కరువు పరిస్థితుల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఫిబ్రవరి నుంచి పాల ఉత్పత్తి తగ్గింది. ప్రస్తుతం పశువులకు పచ్చి మేత లేదు.. నీరు కూడా లభించని పరిస్థితి నెలకొంది. దీంతో వేసవిలో పాల దిగుబడి 50 శాతానికి పైగా పడిపోయింది. కేవలం 5 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. పాలపొడికి డిమాండ్ డెయిరీల్లో వెన్న పూర్తి తీసి పాలపొడి తయారు చేస్తారు. పాల కొరత ఉన్నసమయంలో పాల పొడిని ఉపయోగించి పాలు తయారు చేస్తారు. పాలపొడితో టోన్డ్ మిల్క్ తయారు అవుతాయి. టోన్డ్ మిల్క్లో వెన్న 3 శాతం ఉంటుంది. గేదె పాలల్లో వెన్న 6.50 శాతం నుంచి 8 శాతం ఉంటుంది. ఆరు శాతంపైన ఉన్న వెన్నను తీసి 6 శాతం వెన్నతో గోల్డ్ మిల్క్ తయారు చేస్తారు. పాల పొడిపాలల్లో వెన్న ఉండదు. 50 శాతం పాలపొడి పాలు, మరో 50 శాతం 6 శాతం వెన్న ఉన్న పాలు కలిపితే మొత్తంగా పాలల్లో వెన్న మూడు శాతం ఉన్నట్లు అవుతోంది. వీటితో టోన్డ్ మిల్క్ ప్యాకెట్లు తయారు చేసి వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న టోన్డ్మిల్క్ పాలు పాలపొడితో తయారు చేసినవేనని స్పష్టమవుతోంది. ఉత్తుత్తి హడావుడే వేసవిలో పాల ఉత్పత్తి తగ్గకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాణామృతం (టీఎంఆర్), సమీకృత దాణా వంటి వాటిని సరఫరా చేయాలి. అయితే దాణామృతం లేదు.. దాణా సరఫరా లేకుండా పోయింది. ‘ఉపాధి’ నిధులతో ఊరూర పశుగ్రాస క్షేత్రాలు ఏర్పాటు అంటూ హడావుడి చేసింది.. ఇంతవరకు కార్యరూపమే దాల్చలేదు. 10 సెంట్ల నుంచి 50 సెంట్ల వరకు భూమిలో ఉపాధి నిధులతో పశుగ్రాసక్షేత్రాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 600 ఎకరాల్లో పశుగ్రాస క్షేత్రాలు ఏర్పాటుకు అనుమతులు లభించాయి. కాని ఒక్క సెంటులో పశుగ్రాస క్షేత్రం ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. వేసవిలో పశువుల దాహర్తి తీర్చేందుకు ఉపాధి నిధులతో ఇదుగో నీటితొట్లు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించినప్పటికీ ఆచరణలో సాధ్యం కాలేదు. అక్కడక్కడ నీటితొట్లు నిర్మించినప్పటికీ వాటిని నీటితో నింపే వారు కరువయ్యారు. రైతుల చేతికి పంటలే చేతికి అందలేదు. దీంతో రైతులు పాడిగేదెలకు మేతను సర్దుబాటు చేయలేక కబేళాలకు తరలిస్తున్నారు. దిగుమతి ఇలా.. ఉత్పత్తి తగ్గిపోవడంతో డెయిరీ నిర్వాహకులు పక్క జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి పాలు దిగుమతి చేసుకుంటున్నారు. కొన్ని ప్రయివేటు డెయిరీలు మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. మరికొన్ని డెయిరీలు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలను ఆశ్రయించాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 లక్షల కుటుంబాలు ఉండగా... దాదాపు 40 శాతం కుటుంబాలు లూజు పాలు వినియోగిస్తున్నాయి. 60 శాతం కుటుంబాలు ప్యాకెట్ పాలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. నేడు గ్రామాల్లో పశుసంపద తగ్గిపోయింది. గ్రామాల్లో కూడా ప్యాకెట్ పాలే వినియోగిస్తున్నారు. -
నంద్యాలలో నాలుగు ‘నీట్’ కేంద్రాలు
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల న్యూటౌన్: మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 4వ తేదీన నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్టు (నీట్) కోసం నంద్యాలలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. జిల్లాలో ప్రథమంగా ‘నీట్’ నిర్వహిస్తున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం చీఫ్ సూపరింటెండెంట్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నంద్యాల బస్టాండ్ సమీపంలో ఉన్న గవర్నమెంట్ హైస్కూల్, టెక్కె జూనియర్ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ‘నీట్’ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొత్తం 1,172 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారన్నారు. మధ్యాహ్నం 1.30 గంటల తరువాత విద్యార్థులకు పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదన్నారు. దివ్యాంగ విద్యార్థులకు ప్రతి పరీక్ష కేంద్రంలో రెండు వీల్ చైర్లను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రాన్రిక్ పరికరాలను అనుమతించకూడదన్నారు. నంద్యాల పట్టణంలో విద్యార్థులకు ట్రాఫిక్తో సమస్య లేకుండా చూడాలన్నారు. ‘నీట్’పై పాటించాల్సిన నియమ నిబంధనలపై జిల్లా కోఆర్డినేటర్ సత్యనారాయణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో చీఫ్ సూపరింటెండెంట్లకు వివరించారు. నీట్ పరీక్షల సిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నేతలపై కక్ష
రేణిగుంట/కొలిమిగుండ్ల: వైఎస్సార్సీపీ నేతలపై కక్ష గట్టి నష్టం చేకూర్చిన ఘటనలు తిరుపతి, నంద్యాల జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో వైఎస్సార్సీపీ నేత, సర్పంచ్ చెలికం నాగరాజురెడ్డి తన పొలం (లీజు)లో ఉన్న 100 టన్నుల టేకు కొయ్యలను కట్ చేయించి గ్రామ శివారులో ఉన్న తన స్థలంలో నిల్వ చేశారు. ఇది తెలుసుకున్న కొందరు గురువారం అర్ధరాత్రి వాటికి నిప్పు పెట్టారు. టేకు కలప ఉంచిన ప్రాంతంలో మంటలు ఎగుస్తుండటంతో స్థానికులు గుర్తించి నాగరాజురెడ్డికి సమాచారం ఇచ్చారు.మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా వీలు కాలేదు. అవి పూర్తిగా కాలిపోవడంతో రూ.10 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. గ్రామానికి చెందిన కొందరు అధికార పార్టీ నాయకులు తనను భయభ్రాంతులకు గురిచేసేందుకు తగులబెట్టారని ఆయన మండిపడ్డారు. ఇందుకు కారకులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో ఘటనలో నంద్యాల జిల్లా హనుమంతుగుండంలో వైఎస్సార్సీపీ నేత పాణ్యం ఖాన్బాదర్కు చెందిన పొలానికి కొందరు వ్యక్తులు శుక్రవారం నిప్పు పెట్టారు.గ్రామ సమీపంలోని ఆంజనేయస్వామి గుండం వద్ద ఉన్న ఎకరం పొలంలో పశువుల మేత కోసం గడ్డి సాగు చేశాడు. కొందరు ఉద్దేశ పూర్వకంగా పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో పశుగ్రాసం పూర్తిగా కాలిపోయింది. బోరులో నుంచి తీసి పక్కన పెట్టిన 40 పైపులు దగ్ధమయ్యాయి. నీళ్లు పారించేందుకు ఏర్పాటు చేసిన పది లింక్ పైపులు, స్టార్టర్ బాక్స్, విద్యుత్ తీగ కాలిపోయింది. రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఖాన్బాదర్, రమీజాబి దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు. పక్కనే ఉన్న గడ్డివామికి కూడా నిప్పంటించి వెళ్లారు. అయితే అదే సమయంలో పొలంలోకి వచ్చిన రమీజాబి గమనించి మంటలను ఆర్పేసింది. బాధితుడు వైఎస్సార్సీపీ తరఫున 2024 ఎన్నికల్లో ఏజెంట్గా కూర్చున్నాడు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత డిసెంబర్లో టీడీపీ నాయకులు పట్టుబట్టి ఇతన్ని వీఓఏగా తొలగించారు. భార్య రమీజాబి చాలా ఏళ్లుగా ఉపాధి హామీ పథకంలో మేటీగా పని చేస్తోంది. ఆమెను మేటీగా తొలగించాలని టీడీపీ నేతలు కొద్ది రోజులుగా ఒత్తిడి చేస్తున్నారు. ఎలాగైనా తమను ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో టీడీపీ నాయకులే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని ఖాన్బాదర్ దంపతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కొలిమిగుండ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.పాలన మరచి పగబట్టారు : ఎంపీ గురుమూర్తి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, పాలనను మరచి కేవలం వైఎస్సార్సీపీ నాయకులు, సానుభూతిపరులే లక్ష్యంగా విధ్వంసం సృష్టిస్తోందని తిరుపతి ఎంపీ గురుమూర్తి మండిపడ్డారు. ఇనగలూరు సర్పంచ్ చెలికం నాగరాజురెడ్డికి చెందిన టేకు కొయ్యలకు నిప్పంటించిన ప్రాంతాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. బాధితుడు నాగరాజు రెడ్డికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మరచి, రెడ్ బుక్ రాజ్యాంగ పాలనను అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితునికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
మరణించింది టైగర్ 123
నిర్ధారించిన అటవీశాఖ నాడు ఉచ్చుకు చిక్కి.. నేడు అర్ధంతరంగా మృతిచెందిన పెద్దపులి నంద్యాల జిల్లా, ఆత్మకూరు అటవీ డివిజన్ ముసలిమడుగు సెక్షన్లో ఇటీవల కుళ్లిపోయిన స్థితిలో కనిపించిన పెద్దపులిది తొలుత సహజ మరణమని అధికారులు భావించారు. అయితే పులి చర్మంపై ఉన్న చారల ఆధారంగా శ్రీశైలం బయో లాబ్లో పరిశీలించగా అది టి123(ఎఫ్)గా నిర్ధారించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నాలుగేళ్ల వయసున్న ఈ ఆడపులి గతేడాది వేటగాళ్ల ఉచ్చులోపడి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే. - ఆత్మకూరు రూరల్టైగర్ 123కి ఏం జరిగిందంటే పూర్తి ఆరోగ్యంగా ఉన్న ఈ టి123 ఆడపులి హఠాత్తుగా మరణించడం వెనక ఏడాది క్రితం ఉచ్చుకు బిగుసుకుని తప్పించుకున్న ప్రభావమేనని భావిస్తున్నారు. అప్పట్లో ఉచ్చు నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఈ ఆడపులి నడుముకు ఉచ్చుకు సంబంధించిన ఇనుప తీగ ఉన్నట్టు ఇన్ఫ్రారెడ్ కెమెరాల్లో గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అటవీ అధికారులు పులిని ట్రాంక్విలైజర్ గన్తో అపస్మారక స్థితిలోకి చేర్చి, ఆ తీగను తొలగించారు. వన్యప్రాణి వైద్యులు చికిత్స చేసి, పూర్తిగా నయమైన తర్వాత అడవిలో వదిలిపెట్టారు. అదే పులి సంవత్సరం తరువాత చనిపోవడం వెనుక నాటి ఉచ్చు గాయమే కారణమని తెలుస్తోంది. గాయం పైపైన నయమైనప్పటికీ అంతర్గత అవయవాలైన గర్భాశయం(గర్భ సంచి), కాలేయం వంటి వాటికి ఇన్ఫెక్షన్ సోకి అది క్రమేపి విస్తరించి పులి మరణానికి కారణమైనట్లు భావిస్తున్నారు.మరణాన్ని ముందే ఊహించే పులి పెద్దపులి జీవనశైలిలో ప్రత్యేకత ఏంటంటే... అది తన మరణాన్ని ముందే ఊహించడం. వృద్ధాప్యంలో వేటాడలేని స్థితిలో కొండ అంచుకు చేరుకుంటుంది. అక్కడ ఏ ఇతర జంతువులు గమనించలేని ప్రదేశంలో విశ్రమించి మరణం కోసం వేచి చూస్తూ... అలాగే మరణిస్తుంది. మరణించిన పులి కళేబరం ఎవరి కంటా పడకపోవడానికి కారణం అదే. ఈ కోవలోనే టి123 పులి కూడా తన చావు సమీపించే కొద్దీ ఒంటరి ప్రదేశానికి వెళ్లి తనువు చాలించినట్లుగా అనుమానిస్తున్నారు. అది ఎవరి కంటాపడని ప్రదేశం కాబట్టే చనిపోయిన 20 రోజులకు గానీ గుర్తించలేక పోయారని సమాచారం. -
రోడ్డు ప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి : నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందడంపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీశైలంలో దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు వైఎస్ జగన్ ఇటువంటి దుర్ఘటనలు జరగటం అత్యంత బాధాకరమని, ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు వైఎస్ జగన్.కాగా, నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం చెరువు వద్ద శుక్రవారంఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు, గుంటూరు ప్రధాన జాతీయ రహదారిపై బోలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 16 మందికి గాయాలు కాగా, అందులో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీశైల క్షేత్రంలో దైవదర్శనానికి వెళ్లి బొలెరో వాహనంలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారు, మృతులు కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఇందిరానగర్, రాజీవ్ నగర్ లకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. -
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
నంద్యాల: జిల్లాలోని ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం చెరువు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు, గుంటూరు ప్రధాన జాతీయ రహదారిపై బోలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 16 మందికి గాయాలు కాగా, అందులో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీశైల క్షేత్రంలో దైవదర్శనానికి వెళ్లి బొలెరో వాహనంలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారు, మృతులు కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఇందిరానగర్, రాజీవ్ నగర్ లకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. -
మూగ వేదన.. అరణ్య రోదన!
ఆళ్లగడ్డ: మండే ఎండలతో ప్రజలే దాహంతో అల్లాడుతున్నారు. నల్లమల అడవిలో వన్యప్రాణులదీ ఇదే పరిస్థితి. అటవీ ప్రాంతంలో నీటి నిల్వలు తగ్గడంతో జనావాస ప్రాంతాలకు వస్తూ ప్రాణాలను కోల్పోతున్నాయి. వేసవిలో సాసర్ పిట్లు( నీటి తొట్టెలను) నింపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో అమలు కావటం లేదు. నల్లమలలో జంతువులు ఇవీ.. దేశంలోనే అతి పెద్ద అభయారణ్యం నల్లమల. ఇక్కడ ఎన్నో రకాల వన్యప్రాణులు ఉన్నాయి. నంద్యాల జిల్లాలో అటవీ భూభాగం 1.60 లక్షల హెక్టార్లలో ఉంది. గుండ్లబ్రహ్మేశ్వరం, బండిఆత్మకూరు, నంద్యాల, చెలమ, రుద్రవరం, ఆత్మకూరు, బైర్లూటి, నాగలూటి, శ్రీశైలం, వెలుగోడు అటవీ రేంజ్లు ఉన్నాయి. వీటి పరిధిలో 65 బీట్లు, 44 సెక్షన్లు ఉన్నాయి. అడవిలో చిరుతలు, పెద్దపులులు, ఎలుగుబంట్లు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రేసు కుక్కలు, అడవి పిల్లులు, చుక్కల దుప్పులు, అడవి పందులు, కృష్ణ జింకలు, కుందేళ్లు, అడవి గొర్రెలు, నక్కలు కనిపిస్తాయి. బట్టమేక, అడవికోళ్లు, నెమళ్లతో పాటు వందలాది పక్షి జాతులకు నల్లమల ఆవాసం. వర్షాభావం వెంటాడటం, ఎండ తీవ్రత పెరగడంతో కుంటలు, వాగులు ఎండిపోయాయి. జలవనరుల్లో నీటి జాడ కనుమరుగైంది. అడవిలో చాలా చోట్ల తేమ సైతం ఆవిరైంది. ఇదే వన్యప్రాణుల పాలిట శాపమవుతోంది. సాసర్లు నింపరు! నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వన్యప్రాణుల దాహం తీర్చేందుకు 450కి పైగా సాసర్ పిట్లు ఏర్పాటు చేశారు. ఏటా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు 5 నెలలు నిరంతరం పర్యవేక్షిస్తూ సాసర్ పిట్లలో నీరు నింపాల్సి ఉంది. అయితే ఈ ఏడాది నిధుల కొరతతో చాలాకాలంగా నీరు నింపడంలేదన్నట్లు తెలుస్తోంది. కొందరు క్షేత్ర స్థాయి అధికారులు అడపాదడపా అక్కడక్కడా దాతల సాయంతో, సొంతంగా ఖర్చు చేసుకొని వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో దప్పిక తీరడంలేదు. అనేక చోట్ల సాసర్ పిట్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. చెత్తాచెదారంతో నిండిపోయి ఉన్నాయి. ఇలా చేస్తే ఎంతో మేలు.. బండిఆత్మకూరు, చెలమ, రుద్రవరం రేంజ్ పరిధిలో సాసర్ పిట్లకు ప్రతి రోజూ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలి. కొన్ని ప్రాంతాల్లో చెలమలను తవ్వి మూగజీవాలకు నీటి సౌకర్యాన్ని అందించాలి. అదేవిధంగా చెక్ డ్యామ్స్ ఏర్పాటు చేసి వాటి వద్ద నీటి నిల్వలను ఉంచాలి. సాసర్ పిట్ల వద్దకు నీటి కోసం వచ్చిన జంతువుల కోసం ఉప్పు ముద్దలను ఏర్పాటు చేయాలి. మూగ జంతువులు ఉప్పు ముద్దను నాకడంతో వడదెబ్బ బారి నుంచి కాపాడుకునే అవకాశం ఉంది.నీటి కోసం వచ్చి.. ప్రాణాలు విడిచిఅడవిలో నీటి వనరులు ఎండిపోవడం, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాసర్ పిట్లలో నీరు నింపకపోవడంతో మూగ జీవాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ సమయంలో వాహనాలు ఢీకొని ప్రాణాలు వదులుతున్నాయి. అలాగే విద్యుదాఘాతానికి గురై, వేటగాళ్ల ఉచ్చులో చిక్కి మృత్యువాత పడుతున్నాయి.» ఈ మధ్య కాలంలో నీటికోసం వస్తున్న మూగజీవాలను వేటగాళ్లు నీటిలో విషపు గుళికలు వేసి చంపేస్తున్నారు. » రుద్రవరం, చెలమ అటవీ రేంజ్ల పరిధిలో వేటగాళ్లు పెట్రేగి పోతున్నారు. ఉచ్చులు వేసి వణ్యప్రాణులను వేటాడి వాటి మాంసాన్ని, శరీర భాగాలను విక్రయిస్తున్నారు. » ఇటీవల పెద్దకంబలూరు సమీపంలో వేటగాళ్లు వేసిన ఉచ్చులో చిక్కుకుని పెద్దపులి మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. » మూడు నెలల క్రితం అహోబిలం సమీపంలో కారుపై పెద్దపులి దాడి చేసింది. ఆ సమయంలో గాయాలై అడవిలోకి వెళ్లి పోయింది. » ఈ నెల 6వ తేదీ రుద్రవరంలో ఇద్దరు వ్యక్తులు వన్యప్రాణుల మాంసం విక్రయిస్తుండగా అట వీ అధికారులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. » 2019లో బాచిపల్లె తండా సమీపంలో పెద్దపులి కళేబరం కనిపించింది. అదే సంవత్స రం ఓ పెద్ద పులి మిట్టపల్లె సమీపంలోని ఎర్రచెరువు కాల్వలో మృతి చెంది కనిపించింది. » గండ్లేరు రిజర్వాయరులో వేర్వేరు సంఘటనల్లో రెండు చిరుత కళేబరాలు కనిపించాయి. » 2018లో బాచిపల్లె తండా, అహోబిలం మధ్యన రెండు ఎలుగుబంట్ల కళేబరాలు కనిపించాయి. » ఆళ్లగడ్డ సమీపంలో కృష్ణజింక వేటకు బలైంది. » రుద్రవరం సమీపంలో ఐదు నెమళ్లు వేటగాళ్ల ఉచ్చుకు బలయ్యాయి. » గాజులపల్లి – బొగద మధ్య రైలు పట్టాలపై రెండు చిరుత పులులు మృతి చెందాయి. చర్యలు తీసుకుంటాం సాసర్ పిట్లలో నీరు నింపుతున్నాం. ఎక్కడైనా నీరు లేదంటే సిబ్బంది చూడక పోవడమో, మరచిపోవడమో ఉంటుంది. వెంటనే నీటిని నింపేలా చర్యలు తీసుకుంటాం. – శ్రీపతి నాయుడు, రుద్రవరం అటవీ రేంజ్ అధికారి కుంటలు ఎండిపోయాయి అహోబిలం అటవీ పరిధిలో చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోయాయి. వన్యప్రాణులు నీటి కోసం పొలాల్లోకి, గ్రామాల్లోకి వస్తున్నాయి. అవి దాడి చేస్తాయోనని ప్రజలు భయపడుతున్నారు. – నాసారి వెంకటేశ్వర్లు, ఏకలవ్య ఎరుకలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అందరి బాధ్యత నల్లమల అభయారణ్యం రాయలసీమకు మాణిక్యం లాంటింది. అందులోని వన్యప్రాణులను కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపై ఉంది. సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి మూగజీవాల దాహార్తి తీర్చేందుకు ఏర్పాట్లు చేయాలి. – గజ్జల రాఘవేంద్రారెడ్డి, ఎంపీపీ -
జ్వాలాపురం సందర్శన
బనగానపల్లె రూరల్: ఆదిమానవులు నివసించిన ఆనవాళ్లు ఉన్న జ్వాలాపురం గ్రామాన్ని గురువారం అధికారులు సందర్శించారు. ఆదిమానవుల సంచారానికి సంబంధించిన కథనాలు ఇటీవల పత్రికల్లో ప్రచురితమవుతుండటంతో జిల్లా కలెక్టర్ రాజకుమారి స్పందించారు. ఈ మేరకు ఈ ప్రదేశాన్ని పరిశీలించేందుకు ఆర్డీఓ, డిప్యూటీ సీఈఓ, పురావస్తు, మైనింగ్శాఖ అధికారులు, తహసీల్దార్ మొత్తం ఏడుగురు అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో ఈ ప్రదేశాన్ని గురువారం డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి శివారెడ్డి పరిశీలించారు. త్వరలో పురావస్తుశాఖ, ఆర్డీఓతో పాటు ఇతర అధికారులు జ్వాలాపురాన్ని పరిశీలించనున్నట్లు వారు తెలిపారు. వారి వెంట ఎంపీడీఓ వెంకటరమణ తదితరులు ఉన్నారు. శ్రీమఠంలో భక్తజన సందోహం మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠం భక్తజన సందోహంతో కనువిందు చేసింది. గురువారం ప్రత్యేకం కావడంతో భక్తులు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చారు. రాఘవేంద్రస్వామి బృందావన దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. సాధారణ క్యూలైన్లు, వీవీఐపీ క్యూలైన్లు, మంచాలమ్మ దర్శన మార్గాలు భక్తలతో కిక్కిరిశాయి. అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లలో రద్దీ నెలకొంది. మధ్వమార్గం కారిడార్, తుంగభద్ర నది వైపు కారిడార్లు భక్తులతో పోటెత్తాయి. కార్మిక చట్టాలపై అవగాహన కర్నూలు కల్చరల్: మేడే సందర్భంగా కర్నూలులోని న్యాయ సేవా సదన్లో గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్మిక చట్టాలపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్ అవగాహన కల్పించారు. ఈ–శ్రమ్ కార్డును పొందాలని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సాంబశివరావు సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు శ్రీలక్ష్మీ, కేశన్న, ప్రసాద్, దుకాణ కార్మికులు, ఆటో, హమాలీ, బిల్డింగ్ కార్మికులు పాల్గొన్నారు. క్యూఆర్ కోడ్తో వైద్యసేవలపై అభిప్రాయంకర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అందే వైద్యసేవలపై క్యూఆర్ కోడ్తో రోగులు, వారి కుటుంబసభ్యులు అభిప్రాయాన్ని చెప్పవచ్చని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు సూచించారు. గురువారం ఆయన ఆసుపత్రిలోని పలు విభాగాలను తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఓపీ కౌంటర్, ఎంసీహెచ్, పీడియాట్రిక్, ఫిజియోథెరపి, శుశ్రుత భవన్ తదితర విభాగాల్లో పర్యటించి వైద్యసేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని పలు ఓపీ, ఐపీ విభాగాలకు వచ్చే రోగులకు అందుతున్న వైద్యసేవల అభిప్రాయా న్ని క్యూఆర్ కోడ్లో నమోదు చేసుకునే విధంగా రోగులకు అవగాహన ఇవ్వాలని వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి సూచించారు. శుశ్రుత భవన్, సర్జికల్ విభాగంలోని ఆపరేషన్ థియేటర్లో పర్యటించి యూనిట్ వారీగా ఎన్నెన్ని సర్జరీలు చేస్తున్నారనే దానిపై ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి తప్పనిసరిగా ఆధార్కార్డు, అభా కార్డు తీసుకుని వస్తే ఓపీ నమోదు ప్రక్రియ, ఇతర సేవలు వేగంగా అందుతాయని చెప్పారు. ఆయన వెంట డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీరాములు, అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ శివబాల నాగాంజన్, డాక్టర్ కిరణ్కుమార్, డాక్టర్ సునీల్ ప్రశాంత్ తదితరులు ఉన్నారు. -
చిప్పగిరిలో భయం.. భయం!
● కొనసాగుతున్న పోలీసు పికెట్ ఆలూరు: ఎమ్మార్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజకవర్గ నేత లక్ష్మీనారాయణ(60)ను గత నెల 27న హత్య చేయడంతో చిప్పగిరి గ్రామంలో భయం నెలకొంది. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ నాయకులే హత్య చేసి ఉండవచ్చనే అనుమానాలు వస్తున్నాయి. చిప్పగిరిలో ప్రజలకు రక్షణ కల్పిస్తూ పోలీసులు పికెట్ కొనసాగిస్తున్నారు. గుంతకల్లు నుంచి చిప్పగిరికి గత నెల 27న లక్ష్మీనారాయణ ఇన్నోవా వాహనంలో బయలు దేరగా గుంతకల్లు రైల్వేబ్రిడ్జి వద్ద టిప్పర్తో ఢీ కొట్టి హత్య చేసిన విషయం తెలిసిందే. హత్య కేసును పూర్తిస్థాయిలో విచారించేందుకు ఏఎస్పీ హుసేన్పీరా నియమించగా.. ఐదు పోలీసుల బృందాలుగా ఏర్పడి ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో విచారణ సాగిస్తున్నారు. గ్రామంలో పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య నేతృత్వంలో ఆలూరు సీఐ రవిశంకర్రెడ్డి, పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. గ్రామంలో 10 నుంచి 15 మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారని, ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఎస్ఐ సతీష్ కుమార్ తెలిపారు. -
పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
ఆలూరు రూరల్: పరీక్షల్లో ఫెయిల్ అయ్యాయని మనస్తాపానికి చెందిన పదో తరగతి విద్యార్థి సిద్ధార్థ్ (15) ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు తెలిపిన వివరాలు.. ఆలూరులోని కొట్టాల వీధికి చెందిన శ్రీనివాసులు, దానమ్మ దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. మూడో సంతానమైన సిద్ధార్థ్ (15) స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల–1 పదో తరగతి చదివారు. గత ఏప్రిల్ 23న వెలువడిన ఫలితాల్లో సిద్ధార్థ్ ఫెయిల్ అయ్యాడు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బంధువులు గమనించి ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. సిద్ధార్థ్ పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు బళ్లారి ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. వారం రోజులుగా చికిత్స పొందుతూ గురువారం కోలుకోలేక మృతి చెందాడు. సిద్ధార్ మృతికి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. బాలికపై పందుల దాడి కల్లూరు: ఆటలు ఆడుకుంటున్న బాలికపై పందులు దాడి చేయడంతో గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం కల్లూరు అర్బన్ 32వ వార్డు పరిధిలోని పోలీస్ కాలనీలో చోటుచేసుకుంది. గురువారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చుట్టుపక్కలవారు గమనించి పందులను తోలడంతో చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. తల్లిదండ్రులు చిన్నారిని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. కాలనీలో పందుల బెడద ఎక్కువగా ఉందని, అధికారుల స్పందించి సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. బెల్లం ఊట ధ్వంసం ఆత్మకూరు: సిద్ధాపురం గ్రామానికి రెండు కి.మీ. దూరంలోని అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీకి ఉపయోగించే 600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ కిషోర్కుమార్ గురువారం తెలిపారు. పీటల రాంప్రసాద్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశామన్నారు. ఎవరైనా అక్రమంగా నాటుసారా తయారు చేసినా, విక్రయించినా అలాంటి వారిపై కేసులు నమోదు చేసి జైలుకు తరలిస్తామన్నారు. నాటుసారా తయారు చేసే వారి వివరాలను 9440902585, 9177299067, 8328307774కు సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. -
మార్గదర్శకాలు రావాల్సి ఉంది
ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి గ్రామ/ వార్డు సచివాలయాల మ్యాపింగ్ను దాదాపు పూర్తి చేశాం. సమీపంలోని సచివాలయాల మ్యాపింగ్లో భాగంగా 350 సచివాలయాలను గుర్తించాం. ప్రధానంగా టెక్నికల్ ఫంక్షనీర్స్గా గుర్తించిన ఉద్యోగులు ఇక నుంచి సమీపంలోని రెండు సచివాలయాల్లో సేవలను అందించాల్సి ఉంటుంది. ఉద్యోగుల సర్దుబాటుకు సంబంధించి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు విడుదలైతే స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. – జీ నాసరరెడ్డి, జెడ్పీ సీఈఓ, జీఎస్డబ్ల్యూఎస్ జిల్లా నోడల్ అధికారి -
సార్.. మంచినీటిని సరఫరా చేయండి
● ఆరేళ్ల బాలుడి అభ్యర్థన సోషల్ మీడియాలో వైరల్ కోవెలకుంట్ల: పట్టణంలోని వివిధ కాలనీల్లో కుళాయిల ద్వారా ఉప్పునీరు సరఫరా అవుతోందని ఆరేళ్ల బాలుడు గురువారం లేఖ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. స్థానిక సాయినగర్ కాలనీకి చెందిన షాజిల్ హుస్సేన్ అనే బాలుడు ‘మాకు ఉప్పునీరు వద్దు.. కుందూనది నీరు సరఫరా చేయండి’ అనే సందేశాన్ని లేఖ ద్వారా ఇన్చార్జ్ ఈఓ ప్రకాష్నాయుడుకు తెలియజేశాడు. బాలుడు రాసిన లేఖ కోవెలకుంట్ల పట్టణంలోని స్థానిక వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
హత్య కేసు నిందితులకు యావజ్జీవ జైలు శిక్ష
డోన్ టౌన్: ఓ వ్యక్తి హత్య కేసులో సాక్ష్యాలు రుజువు కావడంతో నిందితులకు యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ జిల్లా న్యాయమూర్తి కబర్ది తీర్పు వెలువరించారు. డోన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొట్రాయి పంచాయతీ పరిధిలోని మజరా గ్రామమైన ఎస్. గుండాలకు చెందిన బోయ గుడిమిరాళ్ల కౌలుట్ల (60) డోన్ రైల్వే స్టేషన్ సమీపంలో 2016 మే 15వ తేదీన దారుణహత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంలో కొట్రాయి గ్రామానికి చెందిన మాదిగ నగేష్, అతని బంధువు గుమ్మకొండ గ్రామానికి చెందిన హరిజన నాయకంటి బాలమద్ది అలియాస్ కంకర బాలమద్ది రాయితో తలపై మోది హత్యకు పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఈ మేరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. కోర్టు విచారణలో ఇద్దరు నిందితులు హత్యకు పాల్పడినట్లు రుజువు కావడంతో గురువారం జిల్లా న్యాయమూర్తి కబర్ది యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. -
ఓ వైపు వేసవి సెలవులతో విహారయాత్ర, దైవ దర్శనాలకు బయలుదేరిన కొందరు, మరో వైపు పెళ్లిళ్లు, శుభాకార్యాలతో కుటుంబాలతో ప్రయాణమైన మరి కొందరు.. వివిధ పనుల మీద దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇంకొందరు.. ఇలా ఎంతో మంది బస్టాండ్లకు చేరుకుంటే బస్సుల్లేవ్. ఆరా తీస్తే బస్సుల
నంద్యాల బస్టాండ్లో బస్సుల కోసం వేచి వున్న ప్రయాణికులు జిల్లాల వారీగా తరలించిన బస్సుల సంఖ్య కర్నూలు నంద్యాల 105 115రెండు గంటలైనా ఒక్క బస్సు రాలేదు మా బంధువు కర్నూలు పెద్దాసుపత్రిలో ఉంటే పరామర్శించేందుకు వచ్చాం. తిరిగి ఆదోని వెళ్లేందుకు బస్టాండ్కు వచ్చి రెండు గంటలైనా ఒక్క బస్సు కూడా లేదు. ఊరికెట్లా పోవాలో తెలియడం లేదు. ఎంతో మంది బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు బస్సులన్నీ వేరే ఊళ్లకు పంపితే మాలాంటోళ్ల పరిస్థితి ఎట్లా. కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు హామీని వెంటనే నెరవేర్చాలి. – వెంకటలక్ష్మి, ఆదోని బస్సు లేక ఇబ్బంది పడ్డాం పెళ్లి నిమిత్తం కుటుంబం అంతా కలిసి నంద్యాలకు వచ్చాం. కార్యక్రమం ముగించుకున్న తర్వాత మధ్యాహ్నం 1.30 గంటలకు ఆర్టీసీ బస్టాండక్కు చేరుకున్నాం. అప్పటి నుంచి 3 గంటలుగా బస్సు కోసం వేచి చూస్తూనే ఉన్నాం. ఎంక్వైరీలో అడిగితే ఎక్స్ప్రెస్ బస్సులు అమరావతికి తరలించడంతో బస్సులు తక్కువగా ఉన్నాయని, బస్సు వచ్చేంత వరకు వేచి ఉండాలన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులకు ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి. – మహేశ్వరరెడ్డి, కడప ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం సరికాదు రాజధాని పేరుతో ఆర్టీసీ బస్సులన్నీ గుంటూరు, విజయవాడ జిల్లాకు తరలించి ఇక్కడి ప్రయాణికులకు ఇబ్బంది పెట్టడం కూటమి ప్రభుత్వానికి తగదు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత ఆర్టీసీ అధికారులదే. కూటమి నేతల ఒత్తిళ్లకు తలొగ్గి బస్సులను ఇతర ప్రాంతాలకు పంపితే పేదలు ఎలా ప్రయాణం చేయాలి. – ఎం.శంకర్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యదర్శి, నంద్యాల నంద్యాల(వ్యవసాయం): రాజధాని పనుల పునఃప్రారంభానికి శుక్రవారం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమరావతికి వస్తుండడంతో కూటమి ప్రభుత్వం భారీగా జనసమీకరణకు సిద్ధమైంది. జిల్లాతో పాటు, ఇతర జిల్లాలకు చెందిన మహిళలు, కూటమి పార్టీల కార్యకర్తలు, నాయకులను ఆర్టీసీలో బస్సుల్లో తరలించే ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆర్టీసీ డిపోల నుంచి దాదాపు 220 బస్సులను ఆర్టీసీ అధికారులు వివిధ ప్రాంతాలకు తరలించారు. దీంతో వివిధ పనుల మీద ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు బస్టాండ్కు చేరుకున్న ప్రయాణికులు ఇబ్బందుల పాలయ్యారు. బస్టాండ్లలో బస్సులు లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. చిన్న పిల్లలతో వచ్చిన వారు, వైద్య చికిత్స నిమిత్తం వివిధ ఆసుపత్రులకు వచ్చి తిరుగు ప్రయాణమయిన వారు.. వృద్ధులు బస్టాండ్లలో ఉక్కపోతకు విలవిలలాడారు. కొంత మంది తప్పని పరిస్థితుల్లో అధిక చార్జీలు పెట్టి ప్రైవేటు వాహనాల్లో సొంతూర్లకు చేరుకున్నారు. పీఎం సభకు తరలించిన బస్సులు అత్యధిక శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందినవి కావడంతో పేదలు, సామాన్యులు ఇబ్బందులు పడ్డారు. అరకొరగా ఉన్న బస్సుల్లో వెళ్లేందుకు పోటీ పడ్డారు. సీటు లేకపోయినా అతి కష్టం మీద నిల్చుని ప్రయాణించాల్సి వచ్చింది. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి.. బస్సు సర్వీసుల రద్దుతో బస్టాండ్లలో ప్రయాణికుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు, ఆదోని, డోన్ బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ నిత్యం ఉంటుంది. ఈ క్రమంలో పలు రూట్లలో బస్సు సర్వీసులు లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. అయితే ఎండ వేడమితో ఉక్కిరిబిక్కిరయ్యారు. చిన్నారులు, వృద్ధు లు, మహిళలు ఉక్కపోతతో విలవిలాడారు. సౌక ర్యాలు సైతం లేకపోవడంతో అవస్థలు పడ్డారు. మరో రెండు రోజులూ.. ఇవే కష్టాలు ఏపీ రాజధాని అమరావతి అంటూ.. 2015 జూన్లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేతల మీదుగా శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అప్పటి టీడీపీ ప్రభుత్వం తాత్కాలిక భవనాలతో సరిపెట్టింది. మరోసారి రాజధాని పనుల పునఃనిర్మాణం పేరుతో కూటమి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు పీఎం మోడీ శుక్రవారం అమరావతి రానున్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలను తరలించేందుకు కర్నూలు జిల్లా నుంచి 105, నంద్యాల జిల్లా నుంచి 115 బస్సులను వివిధ ప్రాంతాలకు మళ్లీంచారు. గత ఎన్నికల సమయంలో ఆర్టీసీ బస్సులను ప్రజల ప్రయాణానికి మాత్రమే వినియోగించాలి.. ప్రభుత్వ కార్యక్రమాలు, రాజకీయ పార్టీ సమావేశాలు కాదని ప్రగల్భాలు పలికారు. ఇప్పుడే అదే కూటమి నేతలు పీఎం సభకు ఆర్టీసీ బస్సులను మళ్లించడంపై ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులతో పాటు కొన్ని చోట్ల ప్రైవేటు స్కూళ్లకు చెందిన బస్సుల్లోనూ జనాలను తరలిస్తున్నారు. శుక్ర, శని వారాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. సూదూర ప్రాంతాలకు బస్సులను తరలించడంతో ఆ బస్సులు తిరిగి శనివారం ఆయా డిపోలకు చేరుకునే అవకాశం ఉంది. దీంతో ఉమ్మడి జిల్లాలో వివిధ రూట్లలో రద్దు చేసిన బస్సు సర్వీసులను శనివారం సాయంత్రం తర్వాతనే ఆర్టీసీ అధికారులు పునఃరుద్ధరించనున్నారు. అప్పటి వరకు ప్రయాణికులు ప్రైవేటు వాహనాల్లో అధిక చార్జీలతో ప్రయాణించాల్సి పరిస్థితి నెలకొంది. భోజన భారం పంచాయతీ కార్యదర్శులదే!అమరావతిలో మోదీ సభకు తరలించే జనాలకు భోజన ఖర్చుల భారం పంచాయతీ కార్యదర్శులు భరించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. జన సమీకరణలో భాగంగా జిల్లాలోని కొన్ని గ్రామాలకు బస్సులను కేటాయించారు. ఆ బస్సుల్లో వెళ్లే జనాలకు భోజనం, మంచినీటి సౌకర్యాలు అన్నీ ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ చూసుకోవాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఒక్కో బస్సులో 30 నుంచి 40 మంది వరకు వెళ్లే అవకాశం ఉంది. వారి ఖర్చు లకు రూ. 25 వేల వరకు కానుంది. ఈ భారమంతా పంచాయతీ సెక్రటరీలపై పడటంతో ఉద్యోగులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి 220 బస్సులు మోదీ సభకు తరలింపు పలు రహదారుల్లో బస్సు సర్వీసులు రద్దు అవస్థలు పడిన ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లలో నిరీక్షణ ప్రైవేటు వాహనాల్లో గమ్యస్థానాలకు చేరిన వైనం కూటమి ప్రభుత్వంపై ప్రయాణికుల ఆగ్రహం -
ఈత కొలనులో విషాదం
● నీట మునిగి ఐదేళ్ల బాలుడు మృతి ఆదోని అర్బన్: ఈత కొలనులో నీట మునిగి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ దుర్ఘటన ఇస్వీ గ్రామ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. ఇస్వీ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆదోని పట్టణం ఇందిరానగర్ కాలనీకి చెందిన రవి, రీటా దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. గురువారం ఉదయం ఇస్వీ గ్రామ సమీపంలో ఉన్న ఈత కొలనుకు ముగ్గురు కుమారులతో కలిసి తల్లిదండ్రులు వెళ్లారు. తల్లి రీటా తన రెండో కుమారుడు దుస్తులు మారుస్తుండగా తండ్రి బెలూన్ తేవడానికి వెళ్లాడు. తల్లిదండ్రులకు చెప్పకుండా పెద్ద కుమారుడు ప్రిన్స్ (5) ఈతకొలనుతో దూకాడు. కాళ్లు, చేతులు ఆడించినా నీటిలో మునిగిపోయాడు. పది నిమిషాల తర్వాత తల్లిదండ్రులు ప్రిన్స్ ఎక్కడికి వెళ్లిపోయాడని వెతుకుతుండడంతో ఈత కొట్టే వ్యక్తి విషయాన్ని తెలిపారు. ఈత కొలను నుంచి ప్రిన్స్ను బయటకు తీసి వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు అప్పటికే ప్రిన్స్ మృతి చెందాడని తెలిపారు. కోలుకోలేక ఏఆర్ కానిస్టేబుల్ మృతి బొమ్మలసత్రం: నంద్యాల జిల్లా కేంద్రంలో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న చిన్నికృష్ణ (35) గడ్డిమందు తాగి గత ఏప్రిల్ 25 నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే కోలుకోలేక గురువారం మరణించారు. ఉద్యోగ రీత్య స్థానిక బాలాజీ కాంప్లెక్స్లో నివాసముంటున్న చిన్నికృష్ణ ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ కలహాల కారణంగా జీవితంపై విరక్తి చెందాడు. ఈనేపథ్యంలో నంద్యాల శివారులో గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే కోలుకోలేక గురువారం మృతి చెందినట్లు తాలుకా పోలీసులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు సంతానం. ఆర్యూలో ఘర్షణ కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీలో చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. గురువారం వర్సిటీలోని ఫోర్త్ బిల్డింగ్ సమీపంలో ఓ విద్యార్థి సంఘం నాయకుడు, బోధనేత ర ఉద్యోగి ఒకరికొకరు వాగ్వాదం చేసుకున్నా రు.ఘర్షణ తీవ్రం కావడంతో పరస్పరం దూషి ంచుకుంటూ దాడి చేసుకున్నారు. తర్వాత ఇరువురు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయకుమార్ నాయుడుకు ఫిర్యాదు చేశారు. -
నరసింహ జయంతి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
ఆళ్లగడ్డ: అహోబిలంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి అంకుర్పారణ పూజలు చేశారు. ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఎగువ అహోబిలంలోని శ్రీ జ్వాలా నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విష్వక్సేనుడికి పూలమాలలు వేసి, తల పాగా చుట్టి పల్లకీలో కొలువుంచి ఆలయం వెలుపలకు తోడ్కొని వచ్చారు. ఈ బ్రహ్మోత్సవాలకు పర్యవేక్షుకుడిగా విష్వక్సేనుడు వ్యవహరిస్తారని విశ్వాసం. అనంతరం ఆలయానికి ఈశాన్యం వైపు ఉన్న పుట్ట నుంచి సేకరించిన మట్టితో అంకుర హోమం నిర్వహించి సోముడిని (చంద్రుడిని) మట్టిలోకి ఆవాహం చేశారు. పాత్రలో మట్టిలో నవగ్రహాలకు సూచికగా నవధాన్యాలు పోసి సోమకుంభ స్థాపన చేశారు. -
హత్య కేసులో నిందితుల అరెస్ట్
కర్నూలు (టౌన్): హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలులోని డీఎస్పీ కార్యాలయంలో గురువారం సాయంత్రం డీఎస్పీ బాబు ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వవెల్లడించారు. కోడుమూరు మండలం పులకుర్తికి గ్రామంలో మునిస్వామి, మరో వర్గానికి చెందిన నడిపి రంగడు, సురేష్కు మధ్య కొన్నేళ్లుగా ఒక అమ్మాయి విషయంలో గొడవలు ఉన్నాయి. గత నెల 26న మునిస్వామి, అతని స్నేహితుడు మహేష్ మద్యం సేవించి ట్రాక్టర్ డ్రైవర్ సోమేష్ వద్దకు వెళ్లి సురేష్ గురించి అరా తీశారు. సురేష్కు ఈ విషయాన్ని డ్రైవర్ సోమేష్ చెప్పారు. పులకుర్తి గ్రామంలోని గూడూరు బస్టాప్ వద్ద ఉన్న సురేష్, నడిపి రంగడులపై నాటు కట్టెలు, రాడ్లతో మునిస్వామి వర్గీయులు దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయ పడిన నడిపి రంగడు ఈనెల 28న కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితులను గురువారం మధ్యాహ్న సమయంలో అరెస్టు చేసినట్లు డిఎస్పీ వెల్లడించారు. ● అరెస్టు అయిన వారిలో మునిస్వామి, శివ రాముడు, పెద్ద బజారి, రాకేష్, సురేష్, నాగరాజు, బంగి తిప్మప్ప (పులకుర్తి గ్రామం) కల్లపరి నాయుడు ఉన్నారు. హత్య ఘటనలో పాల్గొన్న మొత్తం 8 మంది నిందితులను కోడుమూరు సీఐ చిరంజీవి, ఎస్ఐ స్వామి, గూడూరు ఎస్ఐ తిమ్మయ్య, పోలీస్ సిబ్బంది అరెస్టు చేశారు. నిందితుల నుంచి నాటు కట్టెలు, రాడ్లు, మూడు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అమ్మాయి విషయంలో గొడవ పడే హత్య వివరాలు వెల్లడించిన కర్నూలు టౌన్ డీఎస్పీ -
బంగారు దుకాణంలో చోరీ
పత్తికొండ రూరల్:పత్తికొండ–గుత్తి రోడ్డు కూడలిలో మెయిన్ రోడ్డులో ఉన్న బంగారు దుకాణంలో చోరీ జరిగింది. దూదేకొండ గ్రామానికి చెందిన పింజరి అక్బర్ సాహెబ్ గత 13 ఏళ్లుగా పత్తికొండ పట్టణంలో బంగారు దుకాణం నిర్వహిస్తున్నాడు. వెండి, బంగారు ఆభరణాలు తయారు చేస్తూ విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి షాపునకు తాళం వేసి సొంతూరుకు వెళ్లాడు. బుధవారం ఉదయం షాపు తెరిచి చూడగా గుర్తు తెలియని వ్యక్తులు పైకప్పు తొలగించి చోరీకి పాల్పడినట్లు గుర్తించాడు. షాపులోని లాకర్లో ఉంచుకున్న 8 జతల బంగారు కమ్మలు, ఒకటిన్నర కేజీల వెండి ఆభరణాలతో పాటు రూ.3 లక్షల నగదును అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దుకాణాన్ని స్థలాన్ని పరిశీలించి, వేలిముద్రలు సేకరించినట్లు సీఐ జయన్న తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
సెంటిమెంట్ పండింది
● అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోళ్లకు పోటెత్తిన జనాలు ● ఉమ్మడి జిల్లాలో దాదాపు రూ.250 కోట్ల మేర అమ్మకాలు? ● వివాహాలు ఉండటంతో పెరిగిన కొనుగోళ్లుకర్నూలు(అగ్రికల్చర్): సెంటిమెంటు పండింది. అక్షయ తృతీయను పురస్కరించుకుని బుధవారం బంగారం కొనుగోలు చేసేందుకు వినియోగదారులకు దుకాణాలకు పోటెత్తారు. కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్ తదితర పట్టణాల్లో కొనుగోలుదారులతో బంగారం దుకాణాలు కిటకిటలాడాయి. ఉదయం 9 గంటలకే బంగారం దుకాణాలు తెరుచుకున్నాయి. రాత్రి ప్రొద్దుపోయే వరకు జనాల రద్దీ తగ్గలేదు. ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా మొత్తం మీద దాదాపు రూ.250 కోట్ల వ్యాపారం జరిగి ఉంటందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కార్పొరేట్ జ్యువెలరీ సంస్థలు 10 రోజులుగా ఆఫర్ల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాయి. గత ఏడాది అక్షయ తృతీయ రోజున 10 గ్రాముల బంగారం ధర రూ.73,240గా ఉంది. ఈ అక్షయ తృతీయ నాటికి 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,800, 24 క్యారెట్ల ధర రూ.97,960కి చేరాయి. ఈ ధరపై తరుగు పేరుతో డిజైన్ బట్టి 6 నుంచి 22 శాతం సొమ్ము అదనంగా రాబట్టినట్లు స్పష్టమవుతోంది. మే నెలలో వివాహాది శుభకార్యాలు ఉండటంతో అక్షయ తృతీయ అమ్మకాలు జోరుగా జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోళ్లు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవిని ఇంటిలోకి ఆహ్వానించినట్లే అన్న సెంటిమెంటు కూడా బాగా కనిపించింది. కార్పొరేట్ బంగారం దుకాణ సంస్థలు అక్షయ తృతీయ ఆఫర్ల పేరుతో పెద్ద ఎత్తున చేసుకున్న ప్రచారం గ్రామీణ ప్రాంతాల ప్రజల్లోకి కూడా వెళ్లడంతో కొనుగోళ్లు కొంత పెరిగినట్లు తెలుస్తోంది. -
కుందూనదిలో మునిగి యువకుడి మృతి
కోవెలకుంట్ల: రేవనూరుకు చెందిన ఓ యువకుడు గొర్రెలు మేపుకునేందుకు వెళ్లి బుధవారం ప్రమాదశాత్తు కుందూనదిలో మునిగి మృతి చెందాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన బాలుడు, లక్ష్మీదేవి దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె సంతానం. కుమారుడు జయవర్ధన్(20) పదవ తరగతి వరకు విద్యనభ్యసించి మధ్యలో చదువు మానేశాడు. గొర్రెల కాపరిగా ఉంటూ తల్లిదండ్రులకు చేదోడు వాడోడుగా ఉంటున్నాడు. ఉదయం మరో ఇద్దరు యువకులతో కలిసి గొర్రెలు మేపుకునేందుకు రేవనూరు– కలుగొట్ల గ్రామాల మధ్య ప్రవహిస్తున్న కుందూనది వైపు వెళ్లారు. నది ఆవతలి ఒడ్డుకు గొర్రెలను తోలుకపోయే క్రమంలో ముగ్గురు నదిలో దిగారు. జయవర్ధన్ లోతు ఎక్కువ ఉన్న వైపు వెళ్లి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. మిగిలిన యువకులు పెద్దగా కేకలు వేయడంతో పక్క పొలాల్లో ఉన్న రైతులు నదిలో దిగి గాలించగా అప్పటికే మృతి చెందాడు. ఈ మేరకు రేవనూరు పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
కర్ణాటక మద్యం స్వాధీనం
డోన్ రూరల్: అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయిస్తుండగా ఎకై ్సజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో బుధవారం సీఐ వరలక్ష్మి కేసు వివరాలను వెల్లడించారు. అందిన సమాచారం మేరకు కొచ్చెర్వు గ్రామంలో దాడి చేయగా గ్రామానికి చెందిన మేకల లక్ష్మన్న, వడ్డే శ్రీనివాసులు అక్రమంగా మద్యం విక్రయిస్తూ పట్టుబడ్డారన్నారు. వారి వద్ద నుంచి 192 కర్ణాటక మద్యం సీసాలు, బైక్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. సమావేశంలో ఎస్ఐలు సోమశేఖర్రావు, దౌలత్ఖాన్, హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, సుధాకర్రెడ్డి, గోపాల్, భషీర్, ఉమాకాంత్రెడ్డి, చెన్నకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. బీరుసీసాతో దాడి మహానంది: మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురంలోని వైన్షాపు వద్ద ఉన్న ఓ దుకాణంలో బుధవారం రాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. అబ్బీపురం గ్రామానికి చెందిన యువకుడు దుకాణంలో వస్తువులు కొనుగోలు చేసి రూ.30 ఫోన్ పే చేశాడు. అయితే ఓ నంబరుకు పంపించబోయి మరో నెంబరుకు పంపించాడు. దీంతో తనకు డబ్బు రాలేదని దుకాణం యజమాని చెప్పడంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. కోపోద్రిక్తుడైన యువకుడు బీరుసీసాతో దుకాణం యజమానిపై దాడి చేయడంతో స్వల్పగాయమైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు అందలేని పోలీసులు తెలిపారు. -
గిర గిర తిరగాలి బొంగరం..!
పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు ఆటపాటల్లో మునిగి తేలుతున్నారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా ఆటల్లో బిజీ అయ్యారు. మారుతున్న కాలానుగుణంగా సెల్ఫోన్లకు బానిస కాకుండా పిల్లలను వారి తల్లిదండ్రులు పాతకాలంనాటి ఆటల వైపు దృష్టి మళ్లిస్తున్నారు. ఖోఖో, కబడ్డీ, క్యారమ్స్, బిల్లంగోడు, బొంగరాలు, తదితర ఆటలపై పిల్లలు ఆసక్తి కనబరుస్తున్నారు. కోవెలకుంట్ల పట్టణంలో నాగుల కట్ట సమీపంలో కొందరు పిల్లలు బొంగరాల ఆట ఆడుతూ కనిపించారు. – కోవెలకుంట్ల -
విద్యుదాఘాతంతో విద్యార్థిని మృతి
బొమ్మలసత్రం: పట్టణంలోని ఓ కోచింగ్ సెంటర్కు చెందిన విద్యార్థిని నేత్ర(24) విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. టూటౌన్ సీఐ ఇస్మాయిల్ తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లికిచెందిన నేత్ర గత కొంత కాలంగా పట్టణంలోని ఓ బ్యాంక్ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటుంది. అయితే సమీపంలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటుంది. హాస్టల్కు సమీపంలో ఉన్న విద్యుత్ వైర్లపై ప్రమాదవశాత్తు చేయి తగిలి అక్కడికక్కడే కుప్పకూలింది. హాస్టల్ నిర్వాహకులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే నేత్ర ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమె కుటుంబ సభ్యులు పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ కోలుకోలేక 26వ తేదీ మృతి చెందినట్లు సీఐ తెలిపారు. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థిని మృతి చెందినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కుక్కను తప్పించబోయి.. కర్నూలు: కర్నూలు బళ్లారి చౌరస్తా సమీపంలోని ఆంజనేయస్వామి గుడి వెనుక జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం తరిగోపుల గ్రామానికి చెందిన మండ్ల పరుశురాముడు (26) కర్నూలు నగరంలోని సాయికృష్ణ డిగ్రీ కళాశాల సమీపంలో నివాసముంటాడు. బుధవారం తెల్లవారుజామున హైదరాబాదు వైపు నుంచి కర్నూలులోకి వచ్చే సర్వీసు రోడ్డులో ఆంజనేయస్వామి గుడి వెనుక రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. బైక్పై స్నేహితుడు ఎల్లా నాయుడుతో కలసి వస్తూ ఆంజనేయస్వామి గుడి వద్ద అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించబోయి అదుపు తప్పి కింద పడ్డాడు. బైక్ నడుపుతున్న పరుశురాముడు తలకు బలమైన గాయం కావడంతో అ క్కడికక్కడే చనిపోయాడు. వెనుక కూర్చున్న ఎల్లా నాయుడుకు స్వ ల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరుశురాముడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించారు. మృతునికి ఇంకా వివాహం కాలేదు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిడుగుపాటుకు జీవాలు మృతి అవుకు:చెన్నంపల్లి గ్రామంలో బుధవారం పిడుగుపాటుకు నాలుగు జీవాలు మృతి చెందాయి. బాధితులు తెలిపిన మేరకు.. సింగన పల్లె గ్రామా నికి చెందిన కొత్తపేట ప్రసాదు తన భార్య నాగలక్ష్మితో కలిసి జీవాలను చెన్నంపల్లె గ్రామ సమీపంలో జీవాలను మేపుతుండగా ఉరుములతో నాలు గు జీవాలు మృతి చెందాయని తెలిపారు. ● రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి -
అధికారులు ఈ వంక చూడరు?
● యథేచ్ఛగా వాగులు, వంకలు కబ్జా చేస్తున్న కూటమి నేతలు ● వంక పోరంబోకు స్థలంలో షెడ్లకు ఇంటి నంబర్ల కేటాయింపు డోన్: ఖాళీ జాగా కనిపిస్తే చాలు కూటమి నేతలు పాగా వేస్తేన్నారు. వాగులు, వంకలను సైతం వదలడం లేదు. రాత్రిరాత్రికి ఆక్రమణకు గురవుతున్నా అధికారులు అటు వైపు కన్నెతి చూడటం లేదు. అంతేకాకుండా కొందరు అధికారులు ఆక్రమణదారులకు అండగా నిలుస్తున్నారు. కూటమి నేతల ఆక్రమణలకు చెరువులు సైతం ఒట్టిపోయే ప్రమాదం పొంచి ఉంది. డోన్ పట్టణ నడిబొడ్డున ఉన్న బోగందాని వంక.. కొచ్చెర్వు చెరువు, వెంకటాపురం, ఉడుములపాడు, జగదుర్తి చెరువులకు సమృద్ధిగా నీరందించేది. ఈ వంకను పూడ్చేందుకు కొందరు టీడీపీ నాయకులు పూడ్చివేస్తున్నారు. మరోవైపు వంకను ఆనుకొని ఓ టీడీపీ కార్యకర్త రేకులషెడ్డును నిర్మించి నిబంధనలకు విరుద్ధగా మున్సిపాలిటీ నుంచి ఇంటి నంబర్ను పొందడం జరిగింది. ఈ ప్రాంతంలో సెంటు స్థలం రూ.10 లక్షల ధర పలుకుతుండటంతో టౌన్ ప్లానింగ్ అధికారులతో కుమ్మకై ్క ఇంటి నంబర్ పొందేందుకు పలువురు నేతలు పావులు కదుపుతున్నారు. దీంతో వంక నానాటికి ఆక్రమణతో కుశించికుపోయి నీటి ప్రవాహం నిలిచిపోయి చెరువులకు నీరందని పరిస్థితి ఏర్పడుతుంది. వెంటనే మైనర్ ఇరిగేషన్ అధికారులు ఈ వంక వెంట వెలుస్తున్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. లేకపోతే లోతట్టు కాలనీలు జలమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. -
కల్వర్టును ఢీకొన్న లారీ
కోడుమూరు రూరల్: ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి లారీ అదుపుతప్పి కల్వర్టును ఢీకొన్న సంఘటన బుధవారం కోడుమూరు నుంచి కర్నూలు వెళ్లే రోడ్డులో చోటు చేసుకుంది. వివరాలు.. డోన్ నుంచి ఆదోని వైపు వెళుతున్న లారీ ప్యాలకుర్తి సమీపాన ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించే క్రమంలో రోడ్డు సైడ్కు ఉన్న కల్వర్టును వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ చక్రాలన్నీ ఊడిపోవడంతో పాటు, లారీ డ్రైవర్, క్లీనర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద పరిస్థితి చూస్తే ఘోర ప్రమాదం నుంచి బయటపడినట్లుగా ఉంది. విషయం తెలుసుకున్న కోడుమూరు ఎస్ఐ ఎర్రిస్వామి ప్రమాద స్థలాన్ని చేరుకుని పరిస్థితి సమీక్షించి రోడ్డుపై వెళ్లే వాహనాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. -
ప్రియుడి ఇంటి ముందు ట్రాన్స్జెండర్ ధర్నా
ఆదోని రూరల్: తనను మోసం చేశాడంటూ ఆదోని మండలం బైచిగేరికి చెందిన యువకుడి ఇంటి ఎదుట ఓ ట్రాన్స్జెండర్ ఆందోళనకు దిగింది. బాధితురాలి కథనం మేరకు.. నాలుగేళ్ల క్రితం ఆదోని మండలం బైచిగేరికి చెందిన గణేష్ అనే యువకుడు ఉద్యోగరీత్యా హైదరాబాద్కు వెళ్లాడు. అక్కడ అన్నమయ్య జిల్లా మదనపల్లె గ్రామానికి చెందిన వెంకటరమణ కుమారుడు హాసినిగౌడ్ ఊరఫ్ రామకృష్ణ(24) అనే ట్రాన్స్జెండర్తో పరిచయం ఏర్పడి, సహజీవనం చేస్తూ వచ్చాడు. గతేడాది గణేష్కు పెళ్లి కుదరడంతో ట్రాన్స్జెండర్ హాసినిని వదిలేసి సొంత గ్రామానికి రావడంతో 2024 జూన్ 10న బైచిగేరి గ్రామానికి వచ్చి తనకు న్యాయం చేయాలని హాసినిగౌడ్ నిరసన తెలిపింది. ఆదోని తాలూకా పోలీసులు ఆమె నివాసముంటున్న హైదరాబాద్లోని సైబరాబాద్ కమిషనరేట్ సనత్నగర్ పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ మేరకు హాసినిగౌడ్ అక్కడ ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయితే మరలా బుధవారం వచ్చి బైచిగేరిలో గణేష్ ఇంటి ముందు ధర్నాకు దిగింది. ‘‘నువ్వే నా ప్రాణం, నా సర్వస్వం.. నువ్వు లేనిదే నేను లేనంటూ నా వెంట పడ్డాడు. నేను ఒక ట్రాన్స్జెండర్. నాతో నీవు సావాసం చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పాను. అయినా వినకుండా, తననే పెళ్లి చేసుకుంటాని వెంట బడ్డాడు. నాకు పిల్లలు పుట్టరని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. మా ఇంటి నుంచి రూ.5 లక్షలు తీసుకెళ్లి ఇద్దరం పెళ్లి చేసుకుని హైదరాబాద్లో నివాసముంటున్నామని హాసినిగౌడ్ వాపోయింది. తన డబ్బులు రూ.5 లక్షలు అయినా ఇప్పించాలని, లేకపోతే గణేష్తో కాపురం అయినా చేయించాలని డిమాండ్ చేసింది. సమాచారం అందుకున్న తాలూకా ఎస్ఐ రామాంజనేయులు గ్రామానికి చేరుకుని విచారించారు. హాసినిగౌడ్ గణేష్పై ఇదివరకే కేసు హైదరాబాద్లో నమోదయ్యిందని, ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి న్యాయం చేస్తామని ఎస్ఐ చెప్పడంతో వారు హాసినిగౌడ్, ఇతర ట్రాన్స్జెండర్లు ధర్నా విరమించారు. -
కూటి కోసం పాము చేత పట్టి
కూటి కోసం కోటి విద్యలన్నారు పెద్దలు. కడుపు నింపుకోవడానికి వైఎస్సార్ జిల్లా కడపకు చెందిన వెంకటమ్మ అనే మహిళ కొండచిలువను మెడలో వేసుకుని భిక్షాటన చేస్తోంది. మండలంలోని పల్లెల్లో భిక్షాటన చేస్తూ కనిపించిన మహిళ పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. గొంతుకు చుట్టుకుంటే ప్రాణానికే ప్రమాదం కదా అని ప్రశ్నిస్తే ప్రస్తుతం భిక్షాటన చేయాలంటే ఏదో ఒక కొత్తదనం ఉంటే తప్పా పైసలు ఇవ్వడం లేదని చెబుతోంది. పాముకు ఆహారంగా కోళ్ల వ్యర్థాలు, కప్పలు, ఎలుకలను వేస్తానని, కొండచిలువను చూసేందుకు వచ్చి ఒకొక్కరు రూ.10, రూ.5 ఇస్తున్నారని కోటివిద్యల్లో ఇదోకటి అంటూ నవ్వుతూ చెబుతోంది. – దొర్నిపాడు -
బంధువుల ఆదరణ కరువై.. కనిపెంచిన కుమారులు, కుమార్తెల ప్రేమకు దూరమై.. కంటికి రెప్పలా చూస్తున్న భర్తను కోల్పోయి.. పింఛన్ కోసం ఎదురు చూసే మహిళలకు శోకమే మిగులుతోంది. బతుకు దుర్భరంగా మారిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదు. ‘స్పౌజ్’ అంటూ సరికొత్త విధానం త
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సామాజిక పింఛన్ మంజూరు కాలేదు. పది నెలలుగా పట్టించుకోలేదు. నూతనంగా స్పౌజ్ కేటగిరీ పేరుతో వితంతువులకు పింఛన్లు ఇస్తామని చెబుతోంది. పింఛన్ల కోసం ప్రతి వారం భర్తలను కోల్పోయిన మహిళలు కలెక్టరేట్ వద్ద క్యూ కడుతున్నారు. అయితే ప్రభుత్వం తీసుకున్న నూతన నిర్ణయంతో వీరికి పింఛన్ వస్తుందో రాదో చెప్పలేదని దుస్థితి నెలకొంది. నంద్యాల(న్యూటౌన్): వితంతు పింఛన్ అర్థాన్నే రాష్ట్ర ప్రభుత్వం మార్చేసింది. భర్త చనిపోయిన వెంటనే మహిళలకు పింఛన్ ఇవ్వాల్సి ఉంది. దరఖాస్తు చేసుకున్న అనంతరం ఆసరా కల్పించాలి. నిబంధనల మేరకు వితంతు పింఛన్ ఇచ్చి మహిళల జీవితంలో వెలుగులు నింపాల్సి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు నూతన వితంతు పింఛన్లు ఇవ్వలేదు. ఇప్పుడు కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. స్పౌజ్ కేటగిరీలో వితంతు పింఛన్లు మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఏదైనా కేటగిరీలో పింఛన్ పొందుతున్న భర్త మృతి చెందితే, అతని భార్యకు మాత్రమే పింఛన్ మంజూరు చేసేలా నిబంధనలు విధించింది. ఇదీ దుస్థితి పింఛన్ల కోసం అర్హులు దరఖాస్తు చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా స్పౌజ్ కేటగిరీ పేరుతో వితంతు పింఛన్ల మంజూరంటూ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇక్కడ ఓ మెలిక పెట్టింది. ఏదైనా కేటగిరిలో పింఛన్ పొందుతూ భర్త మృతిచెందితే భార్యకు స్పౌజ్ కేటగిరీ పేరుతో పింఛన్ మంజూరు చేయాలని నిర్ణయించింది. అది కూడా నిర్దిష్ట కాలమేనని స్పష్టం చేసింది. ఎవరైనా పింఛన్ పొందుతూ డిసెంబర్ 2023 నుంచి అక్టోబర్ 2024 మధ్య చనిపోతే అతని భార్యను స్పౌజ్ కేటగిరీ కింద అర్హురాలిగా గుర్తిస్తారు. అక్టోబర్ తర్వాత భర్త మరణించిన మహిళకు పింఛన్ లేనట్లే. ఇది కూటమి ప్రభుత్వం వితంతు పింఛన్లకు విధించిన షరతు. దరఖాస్తులు వస్తాయా? నంద్యాల జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి సామాజిక పింఛన్లు మొత్తం 2,22,477 ఉన్నాయి. ఈ నెల ఒకటో తేదీ నాటికి 2,14,590 మాత్రమే ఉన్నాయి. మరణాలు, ఇతర కారణాలతో 7,887 పెన్షన్లు అగిపోయాయి. ప్రస్తుతం స్పౌజ్ కేటగిరీ కింద డిసెంబర్ ఒకటి 2023 నుంచి 31 అక్టోబర్ 2024 మధ్య 3,169 మంది పింఛన్ లబ్ధిదారులు చనిపోయారని, వారి భార్యలు స్పౌజ్ కేటగిరీ కింద సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వీరిలో ఎంత మంది బతికి ఉన్నారో దరఖాస్తులు వస్తేగానీ తెలియదు. కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 ఏళ్లకే పింఛన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 50 ఏళ్లు నిండిన వారు పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. వారి నుంచి ప్రభుత్వం కనీసం దరఖాస్తులు కూడా తీసుకోవడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే.. ● భర్తలు మృతి చెందినా నంద్యాల మండలంలోని అయ్యలూరు గ్రామంలో లక్ష్మి, అప్పయ్యమ్మ, రమణమ్మలకు వితంతు పింఛన్ రాలేదు. ● కోవెలకుంట్లలో బాలమద్దమ్మ భర్త వాసగిరి పెద్ద సుబ్బరాయుడుకు ప్రతి నెలా వృద్ధాప్య పింఛన్ అందేది. అయితే ఈయన 2023 మే నెలలో అనారోగ్యంతో మృతి చెందాడు. వితంతు పింఛన్ కోసం బాలమద్దమ్మ దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు అందలేదు. ● భర్త మృతి చెందినా స్పౌజ్ కింద భార్యకు పింఛన్ ఇవ్వనున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించడంతో దొర్నిపాడు మండలం క్రిష్టిపాడు గ్రామానికి చెందిన పాలుట్ల కాంతమ్మ ఆనందం వ్యక్తం చేశారు. అయితే కాంతమ్మ భర్త పాలుట్ల ఓబన్న 2023 నవంబర్ 9న మృతిచెందడంతో ఆమె అనర్హురాలిగా మిగిలిపోయారు. ● ఉయ్యాలవాడ మండలం ఆర్. జంబులదిన్నెకు చెందిన నాగమ్మ(82) భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. ఈమెకు సంతానం లేకపోవడంతో ఒంటరిగా నివసిస్తోంది. వృద్ధాప్యం మీద పడటం, ఆరోగ్యం సహకరించకపోవడంతో కనీసం వంట చేసుకునే స్థితిలో కూడా లేదు. పింఛన్పై సందేహాలు ఉండటంతో జీవితంపై విరక్తి చెంది బలవన్మరణానికి పాల్పడ్డారు. ● రుద్రవరం గ్రామంలో లక్ష్మీదేవి(45) అనే వితంతువుకు గత కొన్నేళ్ల నుంచి పింఛన్ అందుతోంది. అయితే ఇంటి పన్ను బకాయి ఉందని అధికారులు పింఛన్ సొమ్ము ఇవ్వకపోవడంతో ఆమె వైద్యం చేయించుకోలేక అనారోగ్యంతో మృతి చెందింది. ‘స్పౌజ్’ పేరుతో సరికొత్త విధానం ఇప్పటి వరకు అర్హులైన వితంతువులకు అందని పింఛన్ కొత్త విధానం తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ పొందే భర్త చనిపోతేనే అర్హతంటూ ప్రచారం దరఖాస్తులకు ఆహ్వానం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వలంటీర్, సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చింది. సంక్షేమ పథకాలను అర్హుల ఇళ్లకే డోర్ డెలివరీ చేసింది. 50 ఇళ్లకో వలంటీర్ను నియమించి ఆయా కుటుంబాల్లో అర్హత ఉన్న వారిని పథకాలు దరఖాస్తు చేయించేవాళ్లు. 35 ఏళ్ల వయసు పైబడిన మహిళలకు భర్త చనిపోతే మరుసటి నెలలోనే వితంతు పింఛన్ అందించేవారు. -
బసవేశ్వరుడు విశ్వగురువు
గోస్పాడు: మహాత్మా బసవేశ్వరుడు 64 లక్షలకు పైగా ప్రవచనాలు రాసి విశ్వగురువుగా ఖ్యాతి పొందారని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. మహాత్ముని బోధనలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం బసవేశ్వరుడి జయంతి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి, డీఆర్ఓ రాము నాయక్, జిల్లా పర్యాటక అధికారి సత్యనారాయణమూర్తి, వీరశైవ సంఘం నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా విభజన తర్వాత తొలిసారి బసవేశ్వరుడి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. బసవేశ్వరుడు.. 12వ శతాబ్దంలో వర్ణాంతర వివాహాలను ప్రోత్సహించారని, అన్ని కులాల వారు ఒకే చోట కూర్చుని భోజనం చేసే సంప్రదాయాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. దేశమంతా లింగాయత ధర్మ వ్యాప్తి కోసం కృషి చేశారన్నారు. పూజారి సాంబయ్య, అధ్యాపకులు మల్లిఖార్జున మాట్లాడారు. అనంతరం వీరశైవ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ను సన్మానించి జ్ఞాపికను అందించారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి -
వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
నంద్యాల(వ్యవసాయం): వృద్ధ(70 ఏళ్లు వయస్సుపై బడిన) ఖైదీలకు, అనారోగ్యంతో బాధ పడే వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ఉమ్మడి కర్నూలు జిల్లా న్యాయ సేవాది కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి తెలిపారు. త్వరగా బెయిల్ మంజూరు అయ్యేలా కృషి చేస్తామని చెప్పారు. నంద్యాల స్పెషల్ సబ్ జైలును బుధవారం ఆయన తనిఖీ చేశారు. జైలు ఖైదీలకు ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్స్ గురించి తెలియజేశారు. ప్రిజన్ లీగల్ ఎయిడ్లో ఒక అడ్వకేట్, ఒక పారా లీగల్ వలంటీర్ ఉంటారని, వారు ఖైదీలకు న్యాయ సహాయాలు అందిస్తారని తెలిపారు. ఖైదీలకు ఎవరికై నా న్యాయవాదులు లేకుంటే ఉచితంగా నియమిస్తామని అన్నారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్లైన్ నంబర్ 15100పై ఖైదీలకు తెలియజేశారు . జైల్ సూపరింటెండెంట్ గురుప్రసాద్ రెడ్డి, జిల్లా జైళ్ల అధికారి నరసింహారెడ్డి, జైల్ డాక్టర్ గురుకుమార్, లాయర్ బాలు నాయక్, శేషసాయి పాల్గొన్నారు. -
అంతా సర్దుబాటే
కూటమి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు ఇచ్చిందేమీ లేదు. ఉన్న వాటినే సర్దుబాటు చేస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 50 ఏళ్లు నిండిన వారందరికీ పింఛన్లు ఇవ్వాలి. ఇప్పటికే భర్తలను కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారందరికీ వితంతు పింఛన్లు ఇచ్చి ఆదుకోవాలి. స్పౌజ్ కేటగిరీ దరఖాస్తులతో పాటే వారికి దరఖాస్తులు తీసుకొని పింఛన్లు మంజూరు చేయాలి. – రంగనాయుడు, సీపీఐ జిల్లా కార్యదర్శి, నంద్యాల దరఖాస్తు చేసుకోవాలి జిల్లాలో ప్రస్తుతం స్పౌజ్ కేటగిరి కింద 2023 డిసెంబర్ 21 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య 3,159 మంది పింఛన్ దారులు చనిపోయారు. వారి భార్యలు స్పౌజ్ కేటగిరి కింద సచివాలయంలో ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలి. – శ్రీధర్రెడ్డి, డీఆర్డీఏ పీడీ, నంద్యాల -
లంచం అడిగితే సమాచారమివ్వండి
కర్నూలు: ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే (లంచం అడిగితే) టోల్ఫ్రీ నెంబర్ 1064కి కాల్ చేసి సమాచారం అందించాలని అవినీతి నిరోధక శాఖ కర్నూలు రేంజ్ డీఎస్పీ దివిటి సోమన్న ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దాదాపు 11 నెలల కాలంగా ఏసీబీ డీఎస్పీ పోస్టు ఖాళీగా ఉండటంతో ప్రభుత్వం ఇటీవల సోమన్నను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం కలెక్టరేట్ వెనక ఎ.క్యాంప్లో ఉన్న ఏసీబీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం జిల్లా కనగానపల్లె మండలం వేపకుంట గ్రామానికి చెందిన సోమన్న 1991లో ఎస్ఐ హోదాలో పోలీసు శాఖలో చేరారు. క్రిష్ణగిరి, సంజామల, నందవరం, వెల్దుర్తి, అనంతపురం పీటీసీలో విధులు నిర్వహించారు. సీఐగా పదోన్నతి పొందిన తర్వాత సీఐడీ, ప్యాపిలి, ఆదోని తాలూకా, లక్కిరెడ్డిపల్లె పీఎస్లో పనిచేశారు. 2020లో డీఎస్పీగా పదోన్నతి పొంది సీఐడీ, ఆదోని డీఎస్పీగా పనిచేశారు. ప్రస్తుతం అమరావతి హెడ్ క్వార్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సోమన్నను కర్నూలు రేంజ్ ఏసీబీ విభాగానికి నియమించడంతో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అవినీతి నిర్మూలనకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలన్నారు. అవినీతి అధికారుల సమాచారం తన ఫోన్ నెంబర్ 9440446178కు కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. టోల్ఫ్రీ నెంబర్ 1064 ఏసీబీ నూతన డీఎస్పీ దివిటి సోమన్న -
కంచి పీఠాధిపతికి మహానందీశుని ప్రసాదాలు
మహానంది: కంచి కామకోటి మూలామ్నయ సర్వజ్ఞ పీఠంలో పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, 71వ పీఠాధిపతిగా శిష్య స్వీకారం చేసిన సత్యచంద్రశేఖరేంద్రసరస్వతి స్వామికి బుధవారం మహానందీశ్వరుడి ప్రసాదాలు అందించారు. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి, ఆలయ వేదపండితులు చెండూరి రవిశంకర అవధాని, ఏఈఓ ఎరమల మధు వెళ్లి శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి వారి ప్రసాదాలు అందించారు. వైభవంగా అక్షయ తృతీయ వేడుక మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో పవిత్ర అక్షయ తృతీయ వేడుక వైభవంగా నిర్వహించారు. బుధవారం పీఠాధిపతి సుభుదేంద్రద్రతీర్థులు నేతృత్వంలో వేడుకలు శాస్త్రోక్తంగా చేపట్టారు. రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి గంధ లేపనం గావించి విశేష పూజలు కానిచ్చారు. రెండు గంటల పాటు వేద మంత్రోచ్ఛారణలతో పూజోత్సవాలు నిర్వహించారు. వేడుక భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అక్షయ తృతీయ కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామి సేవలో తరించారు. పాలిసెట్కు 562 మంది గైర్హాజరు నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని 22 పరీక్ష కేంద్రాల్లో పాలిసెట్ను బుధవారం నిర్వహించగా 562 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 5,682 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో 3,784 మంది బాలురు, 1,898 మంది బాలికలు ఉన్నారు. దరఖాస్తు చేసుకున్న బాలురుల్లో 3466 మంది, బాలికల్లో 1,654 మంది పరీక్షకు హాజరైనట్లు నంద్యాల జిల్లా పాలిటెక్నిక్ జిల్లా కో ఆర్డినేటర్, ప్రిన్సిపాల్ శ్రీనివాసప్రసాద్ తెలిపారు. రుద్రవరంలో బాల్య వివాహం రుద్రవరం: మండల కేంద్రమైన రుద్రవరం బెస్త కాలనీకి చెందిన ఓ యువకుడికి ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామానికి చెందిన బాలికకు బుధవారం గ్రామ సమీపాన ఉన్న ఆలయం వద్ద వివాహం చేశారు. బాలిక పెళ్లి విషయం తెలుసుకున్న ఆళ్లగడ్డ సీడీపీఓ తేజశ్వరి అక్కడికి చేరుకొని విచారించారు. వధూవరులతో పాటు పెద్దలను పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. అక్కడ ఆమె ఫిర్యాదు ఇవ్వగా వధూవరుల కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వరప్రసాదు తెలిపారు. నిర్మాణాలు త్వరగా పూర్తయితే బిల్లులు సంజామల: గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసుకుంటే బిల్లులు అందుతాయని లబ్ధిదారులకు జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీహరి గోపాల్ తెలిపారు. మండల పరిధిలోని ఆర్.లింగందిన్నె, పేరుసోముల, రామిరెడ్డిపల్లె గ్రామాలో ఉన్న హౌసింగ్ కాలనీలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లడుతూ.. ప్రభుత్వం నుంచి అదనంగా వచ్చే బిల్లులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మే 30లోపు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకి అడిషినల్ పేమెంట్ వర్తిస్తుందని తెలిపారు. నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాల కోసం బీసీ, ఎస్సీలకు రూ.50 వేలు,ఎస్టీలకు రూ.75 వేలు అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ బాలచంద్రుడు, వర్క్ ఇన్స్పెక్టర్స్, ఇంజినీర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
నా బిడ్డకు న్యాయం చేయండి
ఆదోని అర్బన్(కర్నూలు): డీఎస్పీ, సీఐ కారణంగా తన బిడ్డ జీవితం అన్యాయమైపోయిందని ఓ యువతి తండ్రి ఆవేదన చెందుతున్నాడు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఆదోని పట్టణంలోని వన్టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో నివాసముంటున్న యువతి, కౌతాళం మండలం కామవరానికి చెందిన యువకుడు వీరేష్ ప్రేమించుకున్నారు. గతేడాది డిసెంబర్ 1వ తేదీన పెద్దలకు తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియదు కానీ.. యువకుడు తన తల్లిదండ్రుల బలవంతంతో మరో యువతితో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న యువతి తండ్రి గత నెల 19న ఆదోని వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీఐ శ్రీరామ్ ఆ యువకుడిని పిలిపించి అడగగా, రెండో పెళ్లి చేసుకోవడం లేదని, ఒక నెల గడువు కోరి లలితను తీసుకెళ్తానని చెప్పాడు.ఇంతలోనే ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలిసి యువకుడిని నిలదీయడంతో యువతి కుటుంబీకులపై దాడి చేశారు. ఈ మేరకు బాధిత యువతి తండ్రి ఆదోని డీఎస్పీకి ఈనెల 21న ఫిర్యాదు చేశాడు. అయితే ఎలాంటి చర్యలు తీసుకోని కారణంగానే.. కామవరం వీరేష్ ఈనెల 25న రెండో పెళ్లి చేసుకున్నాడని, పోలీసులు డబ్బులు తీసుకుని తమ కేసును తారుమారు చేశారని ఆరోపిస్తున్నాడు. ఈ విషయమై డీఎస్పీ హేమలతను వివరణ కోరగా.. యువకుడితో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశామని, కేసు దర్యాప్తులో ఉందన్నారు. -
అహోబిలంలో ‘బీ ట్యాక్స్’!
ఆళ్లగడ్డ: దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో ‘బీ – ట్యాక్స్’ కోసం పచ్చముఠాలు అరాచకాలకు తెగబడుతున్నాయి. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలు లాడ్జీలు, సత్రాల నిర్వాహకులను కప్పం కట్టాలంటూ వేధిస్తున్నారు. ముడుపుల కోసం మూడు నెలలుగా అధికార యంత్రాంగంతో రకరకాలుగా బెదిరించినా దారికి రాకపోవడంతో అహోబిలంలో లాడ్జీలకు మంగళవారం తెల్లవారుజామున కరెంట్ తొలగించారు. ఇదంతా ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ భర్త భార్గవరామ్ రెడ్బుక్ కుట్రలేనని స్థానికులు అంటున్నారు. బీ ట్యాక్స్ మాట్లాడుకోవాలంటూ.. అహోబిలం క్షేత్రం పరిధిలో సొంత పట్టా పొలాలు లేవు. అయినప్పటికీ సుమారు 50 సంవత్సరాలుగా క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. అహోబిలంలో చిన్న, పెద్ద లాడ్జీలు, సత్రాలు కలిపి సుమారు 100 వరకు నిరి్మంచుకుని పలువురు వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీటిపై కన్నేసిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి ‘బీ ట్యాక్స్’ వసూలు బాధ్యతను ‘వలస తమ్ముడు’ గుంటూరు శ్రీనుకు అప్పగించారు. తొలుత పంచాయతీ సెక్రటరీ ద్వారా లాడ్జీల నిర్వాహకులకు నోటీసులు ఇప్పించారు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నిర్మించుకున్న తమకు ఇప్పుడు నోటీసులు ఏమిటని వారు తెల్లబోవడంతో ‘అన్న’ దగ్గరకు వెళ్లి బీ ట్యాక్స్ గురించి మాట్లాడుకోవాలని సలహా ఇచ్చారు. అయినా దారికి రాకపోవడంతో అధికారులతో సర్వే చేయించారు. అహోబిలంలో ఒక్కో లాడ్జీ నుంచి రూ.10 లక్షలు నుంచి రూ.50 లక్షల వరకు వసూలు చేయవచ్చని ‘బీ’ గ్యాంగ్ భావించింది. అయితే ఎంత బెదిరించినా దారికి రాకపోవడంతో లాడ్జీలకు కరెంట్ కట్ చేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఆందోళనకు గురైన లైన్మెన్ సెలవుపై వెళ్లిపోగా అధికారులు ఆళ్లగడ్డ నుంచి ప్రైవేటు సిబ్బందిని రప్పించి మూడు నాలుగు లాడ్జీలకు కరెంట్ కట్ చేశారు. ఈలోగా తెల్లవారడం, స్థానికులు తిరగబడటంతో విద్యుత్ అధికారులు జారుకున్నారు. 20 ఏళ్లుగా మీటర్లు ఏర్పాటు చేసుకుని ప్రతి నెలా సక్రమంగా బిల్లులు కడుతుంటే కనెక్షన్లు ఎలా తొలగిస్తారంటూ లాడ్జీల నిర్వాహకులు విద్యుత్ అధికారులను నిలదీశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ‘అహోబిలంలో అనుమతులు లేకుండా లాడ్జీలు నిర్మించుకున్నారని, విద్యుత్ కనెక్షన్ కట్ చేయాలని పంచాయతీ సెక్రటరీ మాకు నోటీసులు ఇచ్చారు. దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి డీఈఈ ఆదేశాలతో కట్ చేశాం’ అని ఏఈ వెంకటకృష్ణ చెప్పారు. -
శ్రీశైలం డ్యామ్కు తక్షణమే మరమ్మతులు చేయాలి
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం డ్యామ్కు తక్షణమే మరమ్మతులు చేపట్టకపోతే రాష్ట్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) చైర్మన్ అనిల్జైన్ చెప్పారు. శ్రీశైలం డ్యామ్ పటిష్టతను అంచనా వేసేందుకు మంగళవారం అనిల్జైన్తోపాటు నిపుణులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అప్రోచ్ రోడ్, ప్లంజ్పూల్, గ్యాలరీ, బ్లాకులు, రేడియల్ క్రస్ట్ గేట్లను నిపుణులు పరిశీలించి వివిధ సమస్యలను గుర్తించారు. 2009వ సంవత్సరానికి ముందు ప్లంజ్పూల్ ప్రాంతంలో గోతులు ఏర్పడ్డాయి. అయితే, 2009 వరదల వల్ల ఒక్క రోజులోనే 25 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో ప్లంజ్పూల్ ప్రాంతంలో 120 మీటర్ల నుంచి 150 మీటర్ల లోతు గొయ్యిలు ఏర్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. దీనివల్ల డ్యామ్ పునాదులు కూడా బలహీనపడినట్లు తేల్చారు. స్పిల్వే ఎగువన కటాఫ్ దెబ్బతినడంతో 17, 18 బ్లాక్లలో పగుళ్లు ఏర్పడ్డాయని, పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని గుర్తించారు. సీజన్తో సంబంధం లేకుండా గ్యాలరీలో సీపేజీలు అధికమయ్యాయని, ఇవి డ్యామ్ అంతర్గత నిర్మాణాన్ని శిథిలం చేసేలా ఉన్నాయని పేర్కొన్నారు. శ్రీశైలం డ్యామ్ పటిష్టతకు తక్షణమే చర్యలు తీసుకోకపోతే జలాశయం మనుగడ మరింత ప్రమాదకరంగా మారుతుందని స్పష్టంచేశారు. అనంతరం డ్యామ్ ఇంజనీర్లతో అనిల్జైన్, నిపుణులు సమావేశమై మొదటి విడతలో అప్రోచ్ రోడ్ నిర్మాణం, ప్లంజ్పూల్ గోతుల పూడ్చివేత, రెండో విడతలో బ్లాకుల పటిష్టత, గ్యాలరీ సీపేజీల అరెస్ట్కు చేపట్టాల్సిన మరమ్మతులపై చర్చించారు. పరిశీలనలు, సమీక్షలతోనే సంవత్సరాలుగా కాలయాపన చేయడం, శ్రీశైలం డ్యామ్ మరమ్మతులకు ప్రపంచ బ్యాంక్ రూ.200కోట్లు రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చినా వినియోగించుకోకపోవడంపై నిపుణులు విస్మయం వ్యక్తంచేశారు. ఎన్డీఎస్ఏ రీజనల్ డైరెక్టర్ ఎన్డీ గిరిధర్, డ్రిప్ ప్రాజెక్ట్ ప్రతినిధి నీతా, సెంట్రల్ వాటర్ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ ప్రభాత్కుమార్, సీఈ రాజేష్ కశ్యప్, ఈఎన్సీ రత్నకుమార్, డ్యామ్ సీఈ కబీర్బాషా, ఎస్ఈ శ్రీరామచంద్రమూర్తి డ్యామ్ తనిఖీల్లో పాల్గొన్నారు. -
బంగారు కిరీటం సమర్పణ
ఆదోని అర్బన్: మహాయోగి లక్ష్మమ్మవ్వకు సోమవారం ఆలయ నిర్వాహకులు బంగారు కిరీటం సమర్పించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎండోమెండ్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకుడు రాయచోటి సుబ్బయ్య, సభ్యులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి కర్నూలు సిటీ: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నేషనల్ మజ్దూర్ యూనియన్ రీజినల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పీఏ వలి అధ్యక్షతన రిలే నిరహార దీక్షలు చేపట్టారు. రెండు రోజుల పాటు జరిగే దీక్షలను మొదటి రోజు సోమవారం సంఘం రీజినల్ చైర్మన్ ఎస్ఎండీ గౌస్, కార్యదర్శి సి.మద్దిలేటిలు దీక్షలో కూర్చున ఉద్యోగులకు పూల మాలలు వేసి ప్రారంభించి ప్రసంగించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని డిపోల ఎదుట దీక్షలు చేపట్టినట్లు చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యోగ భద్రత కోసం జారీ చేసిన సర్క్యూలర్ 1/2019ను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అక్రమ సస్పెన్షన్స్, రిమూవల్స్ను నిలిపి వేయాలని, మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీఓ ప్రకారం పిల్లల సంరక్షణ సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మొదటి రోజు దీక్షలో ఆర్బీఎన్ మూర్తి, కేటీ రెడ్డి, సి.లక్ష్మన్న, ఆర్పీ రావు, జేబీ రాజేశ్వరయ్య, ఎం.జెడ్ బాషా, ఎస్డీ బాషా కూర్చున్నారు. వీరికి డిపో–1 సెక్రటరీ సయ్యద్ ఇసాక్, డిపో–2 సెక్రటరీ ఎంఎస్బీ రెడ్డి సంఘీభావం తెలిపారు. -
కలపరిలో జ్వరంతో వృద్ధురాలి మృతి
ఆస్పరి: జ్వరాలతో మంచం పట్టిన కలపరిలో ఓ వృద్ధురాలు మృతి చెందడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజుల క్రితం గ్రామంలో జ్వరపీడితుల రక్త నమూనాలు ల్యాబ్కు పంపగా చికున్గున్యాగా బయటపడింది. 26 మందిని పరీక్షించగా 10 మందికి చికున్ గున్యా ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన వెంకమ్మ (60) జ్వరంతో బాధపడుతూ ఆదివారం రాత్రి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజులు క్రితం వెంకమ్మకు జ్వరంతో పాటు కాళ్లు, కీళ్లు నొప్పులతో బాధపడుతండడంతో మొదట ఆర్ఎంపీతో వైద్యం చేయించారు. అయినా జ్వరం తగ్గకపోవడంతో ఆమెను ఐదు రోజుల క్రితం కర్నూలులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అక్కడ రూ. 3 లక్షలు ఖర్చు అయినా జ్వరం నయం కాకపోవడంతో కుటుంబీకులు రెండు రోజులు క్రితం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కాగా కోలుకోలేక ఆదివారం రాత్రి 11 గంటలకు మృతి చెందినట్లు వెంకమ్మ కుమారుడు గిడ్డయ్య తెలిపారు. వెంకమ్మకు భర్త వెంకటేష్, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొనసాగుతున్న వైద్య శిబిరం కలపరి ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం సోమవారం కూడా కొనసాగింది. వైద్య శిబిరాన్ని జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ రఘు, పత్తికొండ డీఎల్పీఓ వీరభద్రప్ప సదందర్శించి రోగులతో మాట్లాడారు. రక్త పరీక్షల ద్వారా చికెన్ గున్యా వ్యాధిగా నిర్ధారణ కావడంతో గ్రామస్తులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చికెన్ గున్యా సోకిన వారికి తలనొప్పి, వాంతులు, జ్వరం, వికారం, చేతి వేళ్లు, కాళ్లు నుంచి మొదలుకుని శరీరంలోని అన్ని కీళ్లు నొప్పితో బాధిస్తుందన్నారు. కీళ్ల నొప్పులు వల్ల సరిగా నిలబడలేని పరిస్థితి వస్తుందని, జ్వరం తగ్గినా నొప్పులు ఎక్కువ కాలం ఉంటాయన్నారు. రోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గ్రామంలో జ్వరాలు తగ్గే వరకు వైద్య శిబిరం కొనసాగిస్తామని పత్తికొండ డీప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ రఘురామిరెడ్డి చెప్పారు. సోమవారం వైద్య శిబిరంలో 30 మందికి వైద్య చికిత్సలు చేసి మందులు పంపిణీ చేశామని, అవసరమైన వారికి వైద్యం అందించాని డాక్టర దుర్గాబాయి తెలిపారు. వైద్య శిబిరంలో సర్పంచ్ సుధమ్మ, పంచాయతీ, వైద్య సిబ్బంది వెంకటేష్, విజయరాజు, పద్మావతి, శంకర్, ఖలీల్, శకుంతల రోగులకు సేవలు అందించారు. కొనసాగుతున్న వైద్య శిబిరం గ్రామాన్ని సందర్శించిన అధికారులు -
విద్యుదాఘాతంతో కేబుల్ ఆపరేటర్ మృతి
రుద్రవరం: మండల కేంద్రంలోని బెస్త కాలనీలో సోమవారం విద్యుదాఘాతంతో కేబుల్ ఆపరేటర్ జనార్దన్(42) మృతి చెందాడు. కాలనీ వాసులు తెలిపిన వివరాలు.. జనార్దన్ కొన్నేళ్లుగా కేబుల్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. అప్పుడప్పుడు విద్యుత్ స్తంభాలకున్న డిష్ తీగలను సరిచేస్తూ ఉండటాన్ని అదిగమనించిన విద్యుత్ లైన్మెన్ ఖాజామొహిద్దీన్.. బెస్త కాలనీకి వెళ్లే ప్రధాన రహదారిలో విద్యుత్ తీగలు సరి చేయాలని కోరాడు. లైన్మెన్ నిచ్చెన పట్టుకోగా కేబుల్ ఆపరేటర్ స్తంభంపైకి చేరుకొని విద్యుత్ తీగలను సరి చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే 108 వాహనంలో నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్సలు అందిస్తుండగానే మృతి చెందినట్లు కాలనీవాసులు తెలిపారు. ఎస్ఐ వరప్రసాదు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. మృతుడి భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ పెద్ద మృతిచెందడంతో భార్య, పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు. -
పాలిసెట్కు సర్వం సిద్ధం
● 30న ప్రవేశ పరీక్ష ● జిల్లాకు 22 పరీక్ష కేంద్రాలు కేటాయింపు ● హాజరుకానున్న 5,700 మంది అభ్యర్థులునంద్యాల(న్యూటౌన్): పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 30న పాలిసెట్–2025 నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పరీక్షకు గంట ముందుగానే ఆయా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. జిల్లా వ్యాప్తంగా పాలిసెట్కు 5,700 మంది దరఖాస్తు చేసుకున్నారు. నంద్యాలలో 13 పరీక్ష కేంద్రాలు కేటాయించారు. ఇందులో 3,747 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లాలో 5 కళాశాలలు ప్రభుత్వ పాలిటెక్నిక్ పాటు జిల్లావ్యాప్తంగా 2 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. వీటిల్లో కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్లో సివిల్ 66, మెకానికల్ 132 సీట్లు ఉండగా, ఐదు ప్రైవేటు కళాశాలల్లో వివిధ కోర్సుల్లో సుమారు 1,500 సీట్లు ఉన్నాయి. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంత మంది హాజరవుతారో, వారిలో ర్యాంకులు సాధించేవారెందరో, ర్యాంకు వచ్చినా పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు ఎంత మంది ఆసక్తి చూపుతారో చూడాల్సి ఉంది. కొన్నేళ్లుగా కొన్ని కళాశాలల్లో వందల సంఖ్యలో సీట్లు ఉండగా, పదుల సంఖ్యలోనే విద్యార్థులు చేరుతూండటంతో తరగతుల నిర్వహణ ఇబ్బందిగా మారుతున్నట్లు సమాచారం. గంట ముందుగానే ప్రవేశం ● ప్రవేశ పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు. ● పరీక్ష కేంద్రంలోకి ఉదయం 10 గంటల నుంచి అనుమతిస్తారు. ● పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోనికి అనుమతించరు. ● విద్యార్థులు హాల్ టికెట్టు, బాల్ పాయింట్ పెన్ను, హెచ్బీ పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ తీసుకుని వెళ్లాలి. ● సెల్ఫోన్, కాలిక్యులేటర్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. మౌలిక వసతులకు ప్రాధాన్యం పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. కేంద్రాల ఆవరణంలో తాగునీరు, విద్యుత్, వైద్య సేవల వంటి మౌలిక వసతులకు కల్పనకు ప్రాధాన్యమిచ్చాం. – శ్రీనివాసప్రసాద్, జిల్లా కో ఆర్డినేటర్, నంద్యాల -
యాగంటిని దర్శించుకున్న డైరెక్టర్ సుకుమార్
బనగానపల్లె రూరల్: మండలంలోని ప్రముఖ శైవక్షేత్రం యాగంటిలో వెలసిన శ్రీ ఉమామహేశ్వరస్వామిని ప్రముఖ సినీ డైరెక్టర్ సుకుమార్ సోమవారం సాయంత్రం దర్శించుకున్నారు. ముందుగా ఆలయంలో ఏకశిలారూపంలో కొలువైన శివపార్వతులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వెంకటేశ్వరస్వామి గుహను సందర్శించి అక్కడున్న వెంకటేశ్వరస్వామిని కూడా దర్శించుకున్నారు. గతంలో అల్లుఅర్జున్ హీరోగా నటించిన పుష్ప–2 షూటింగ్ ఇక్కడ జరిగిన విషయం తెలిసిందే. మళ్లీ డైరెక్టర్ సుకుమార్ యాగంటిని దర్శించుకోవడంతో పుష్ప–3 షూటింగ్ చిత్రీకరణ ఏర్పాట్ల పరిశీలన నిమిత్తం వచ్చి ఉంటారనే చర్చ అభిమానుల మధ్య సాగుతోంది. -
హామీల అమలుపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వం
కర్నూలు సిటీ: ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన మేనిఫెస్టో హామీల అమలుపై ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథ రెడ్డి విమర్శించారు. సోమవారం సలాంఖాన్ భవనంలో ఏర్పాటు చేసిన ఎస్టీయూ జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే సీపీఎస్/జీపీఎస్ విధానాన్ని సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని, మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని, తాము అధికారాన్ని చేపట్టిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని, పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేస్తామని అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఆ దిశగా ఆలోచనలు చేయకపోవడం తగదన్నారు. ఇప్పటికై నా 12వ పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేసి, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. జీఓ 117 రద్దు చేసి కొత్త పాఠశాలల విధానాన్ని అమలు చేసేటప్పుడు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సమావేశంలో సంఘం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిమ్మన్న, జిల్లా అధ్యక్షులు ఎస్.గోకారి, కార్యదర్శి టి.కె జనార్దన్, నాయకులు వీరచంద్ర యాదవ్, సి.రమేష్, షఫీ పాల్గొన్నారు. -
పెద్దమ్మ జాతరకు వేళాయె!
గోస్పాడు: కుల, మత, రాజకీయాలకు అతీతంగా యాళ్లూరులో పెద్దమ్మ జాతరను నిర్వహించేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. 1926, 1966, 2015 సంవత్సరాల్లో గ్రామంలో జాతరను నిర్వహించారు. మళ్లీ పదకొండేళ్ల తర్వాత ఈనెల 29, 30 తేదీల్లో జాతర నిర్వహించేందుకు గ్రామపెద్దలు నిర్ణయించారు. దీంతో గ్రామంలో సందడి నెలకొంది. అమ్మవారికి ప్రత్యేకంగా ఎలాంటి ఆలలయం లేకపోవడంతో పూర్వం నుంచి వస్తున్న ఆచారం మేరకు అమ్మవారిని స్థానిక రామచావిడి ఎదుట ఏర్పాటు చేసి జాతర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేటితో ఉత్సవాలు ప్రారంభం పెద్దమ్మ జాతర మహోత్సవంలో భాగంగా మంగళవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అమ్మ వారి మహిషముల గ్రామ ఊరేగింపు ఉంటుంది. రాత్రి 8గంటలకు అన్నదానం, 10 గంటలకు అమ్మవారిని రామ చావిడికి తీసుకెళ్లి ఆశీనులను చేయనున్నారు. 30 తెల్లవారుజామున 3.30 గంటలకు అమ్మవారికి మహిషముల సమర్పణ, ఉదయం 5 గంటల నుంచి గ్రామంలో పొలి చల్లే కార్యక్రమం, ఉదయం బోనాల సమర్పణ, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు అన్నదానం, సాయంత్రం 4గంటల నుంచి అమ్మవారికి గ్రామోత్సవం(దీవెన బండారు) నిర్వహిస్తారు. జాతరకు అధిక ఖర్చు.. అమ్మవారికి మొక్కు తీర్చుకునే విషయంలో గ్రామ స్తులు ఖర్చుకు వెనుకాడటం లేదు. జాతరకు వ చ్చే బంధుమిత్రులకు మాంసాహార విందు ఇచ్చేందుకు బాగానే ఖర్చు అవుతుంది. ఈలెక్కన గ్రామం మొత్తంపై దాదాపు రూ. 4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఖర్చు కావచ్చని గ్రామ పెద్దలు అంచనా వేస్తున్నారు. ప్రశాంతంగా నిర్వహించాలి జాతర ప్రశాంతంగా జరుపు కోవాలి. ఎలాంటి గొడవలకు తావులేకుండా జాతర పూర్తయ్యేలా ప్రజలు సహకరించాలి. గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, ప్రోత్సహించినా చర్యలు తప్పవు. జాతర సందర్భంగా వాహనాలకు, ప్రజలకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా గ్రామ శివారులు ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంతో వాహనాలు నిలుపుకోవాలి. – ఎస్ఐ వెంకటప్రసాద్ యాళ్లూరులో 11 ఏళ్ల తర్వాత ఉత్సవం గ్రామంలో పండగ సందడి -
దాడిలో గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి
కోడుమూరు రూరల్: మండలంలోని పులకుర్తి గ్రామంలో ఈనెల 26న జరిగిన దాడిలో గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్త నడిపి రంగన్న (38) ఆదివారం అర్ధరాత్రి మృతిచెందాడు. దీంతో పులకుర్తిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త నడిపి రంగన్న అదే గ్రామానికి చెందిన మునిస్వామిల మధ్య కొంతకాలంగా మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 26న నిందితుడు మునిస్వామి, బజారి, మరికొద్ది మంది అనుచరులతో కలిసి నడిపి రంగన్నను, అతని అల్లుడు సురేష్ విషయంపై మాట్లాడేందుకంటూ పిలిపించారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం నడిపి రంగన్నతో గొడవ పెట్టుకుని రాడ్లు, కర్రలతో తీవ్రంగా కొట్టారు. కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆదివారం సాయంత్రం ఇంటికి తీసుకెళ్లారు. అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురై సృహలేకుండా పడిపోవడంతో కుటుంబ సభ్యులు 108 వాహనంలో కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే రంగన్న మృతిచెందినట్లు చెప్పారు. మునిస్వామి అతని అనుచరులు కొట్టిన దెబ్బల వల్లే రంగన్న మృతి చెందాడంటూ కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదు మేరకు కోడుమూరు ఎస్ఐ ఎర్రిస్వామి కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మృతుడికి భార్య మల్లీశ్వరీ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కాగా విషయం తెలుసుకున్న కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్దన్రెడ్డి సోమవారం కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని రంగన్న మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నడిపి రంగన్న మృతికి కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట కోడుమూరు జెడ్పీటీసీ సభ్యులు రఘునాథ్రెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు క్రిష్ణారెడ్డి, మాజీ ఉపసర్పంచు ప్రవీణ్కుమార్, స్థానిక నాయకులు రవికుమార్రెడ్డి, లింగమూర్తి, జగదీష్ ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన కోట్ల హర్ష -
ఏపీ టీఏఎస్ఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సునీల్కుమార్
కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సర్వీస్ అసోసియేషన్(ఏపీ టీఏఎస్ఏ) నూతన కార్యవర్గం ఎన్నికలు సోమవారం విజయవాడలో జరిగాయి. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కర్నూలు జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఎస్టీఓగా పనిచేస్తున్న పలనాటి సునీల్కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి జిల్లా నుంచి ఈయన అసోసియేషన్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికై నట్లుగా ఎన్నికల అధికారి పి.కిరణ్కుమార్ ధ్రువపత్రం అందజేశారు. ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర కార్యవర్గంలో తనకు ప్రాతినిధ్యం కల్పించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ట్రెజరీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(న్యూటౌన్): నంద్యాల ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా కేంద్రంలో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రసాద్ సోమవారం తెలిపారు. ప్రభుత్వ ఐటీఐలో చేరాల్సిన విద్యార్థులు మే 24వ తేదీలోపు iti.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుని, 26వ తేదీలోపు నంద్యాల ప్రభుత్వ ఐటీలో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకుని, జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు డోన్ ప్రభుత్వ ఐటీఐలో జరిగే కౌన్సెలింగ్కు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. మరింత సమాచారం కోసం 9866022451 నంబరును సంప్రదించాలన్నారు. సరిహద్దు చెక్పోస్ట్లపై నిఘా పెంచుతాం ఎమ్మిగనూరురూరల్: రాష్ట్రాల సరిహద్దు చెక్పోస్ట్ల వద్ద నిఘా పెంచుతామని రాష్ట్ర టాస్క్ఫోర్స్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక ఎకై ్సజ్ పోలీస్స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక మద్యాన్ని అక్రమ రాష్ట్రాంలోకి రాకుండా నిఘా ఉంచామన్నారు. మద్యం దుకాణాల పక్కన అనుమతులు లేకుండా షెడ్లు ఏర్పాటు చేసుకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. కర్ణాటక మద్యంతో పాటు బెల్టుషాపులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. సరిహద్దు చెక్పోస్ట్లను పరిశీలించనున్నట్లు చెప్పారు. సమావేశంలో ఎకై ్సజ్ సీఐ రమేష్రెడ్డి పాల్గొన్నారు. బదిలీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి నంద్యాల(న్యూటౌన్): ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి డిమాండ్ శాచేరు. సోమవారం ఫెడరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి శివయ్య, ఉపాధ్యక్షుడు జాకీర్హుసేన్లతో కలిసి రామచంద్రారెడ్డి మాట్లాడారు. ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం కలుగుతోందన్నారు. 8 ఏళ్లు పూర్తయిన ఎస్జీటీలు 1,500పైగా ఆప్సన్లు ఇచ్చుకోవాల్సి వస్తోందన్నారు. సమావేశంలో ఏపీటీఎఫ్ నాయకులు వీరేశ్వరరెడ్డి, పుల్లయ్య, రాజేష్, మల్లికార్జున, మధు, తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ నేత హత్యోదంతంలో నలుగురిపై కేసు
ఆలూరు/ఆలూరు రూరల్/చిప్పగిరి: కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మార్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడు లక్ష్మినారాయణ హత్యోదంతంపై కేసు నమోదు చేసినట్లు సీఐ రవిశంకర్ రెడ్డి సోమవారం విలేకరులకు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం చిప్పగిరి–గంతకల్లు మధ్య దుండగులు లక్ష్మినారాయణ ప్రయాణిస్తున్న ఇన్నోవా కారును లారీతో గుద్ది వేటకొడవళ్లతో దారుణంగా నరికి హత్య చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు వినోద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైకుంఠం శివప్రసాద్, వైకుంఠం మల్లికార్జున, మల్లేష్, కొండ రామాంజితో పాటు మరికొందరిపై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామన్నారు. 2006లో టీడీపీ నేత, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ వైకుంఠం శ్రీరాములు దంపతుల హత్యకేసులో లక్ష్మినారాయణ 7వ ముద్దాయి కాగా.. ఈ కేసును 2019లో కోర్టు కొట్టివేసింది. ఇదిలాఉంటే కర్నూలు–అనంతపురం జిల్లాలో సరిహద్దులో జరిగిన లక్ష్మినారాయణ హత్య కేసును అనంతపురం జిల్లా గుంతకల్లు పోలీసు స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు కాగా.. కర్నూలు జిల్లా చిప్పగిరి పోలీసు స్టేషన్కు బదలాయించారు. లక్ష్మినారాయణ మృతదేహానికి సోమవారం గుంతకల్లు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం ఆయన భౌతికాయాన్ని భారీ పోలీసు బందోబస్తు నడుమ స్వగ్రామమైన చిప్పగిరికి తరలించారు. ఉద్దేశపూర్వకంగానే పికెట్ తొలగింపు: మారెప్ప లక్ష్మినారాయణ హత్యోదంతంపై సీబీఐతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి మూలింటి మారెప్ప డిమాండ్ చేశారు. సోమవారం ఆయన చిప్పగిరిలో లక్ష్మినారాయణ భౌతికాయానికి నివాళులర్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన పది నెలల్లో కుల రాజకీయాలకు వత్తాసు పలుకుతూ హత్యా రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారని ఆరోపించారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే లక్ష్మినారాయణ ఇంటి వద్ద పికెట్ను తీసివేశారన్నారు. పికెట్ కొనసాగించాలని హోంమంత్రి అనితకు స్వయంగా తాను విన్నవించినా పట్టించుకోలేదన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ బాబు తదితరులు ఉన్నారు.లక్ష్మీనారాయణ అంత్యక్రియలు పూర్తి చిప్పగిరి: గుంతకల్లు – చిప్పగిరి మధ్య ఆదివారం హత్యకు గురైన కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజక వర్గ ఇన్చార్జ్ లక్ష్మీనారాయణ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం చిప్పగిరిలో సోమవారం పూర్తయ్యాయి. మృతదేహానికి ఎమ్మెల్యే విరుపాక్షి నివాళులు అర్పించగా.. పీసీ అధ్యక్షురాలు షర్మిళ ఫోన్లో కుటుంబ సభ్యలును పరామర్శించి ధైర్యం చెప్పారు. అంత్యక్రియల సందర్భంగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఏఎస్పీ ఉసేన్ పీరా ఆధ్వర్యంలో 8 మంది సీఐలు, పలువురు ఎస్ఐలతో గట్టి బందోబస్తు నిర్వహించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గ్రామాన్ని, హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కుటుంభ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఆలూరు సీఐ రవిశంకర్రెడ్డి తెలిపారు. కాగా నిందితులను కఠినంగా శిక్షించాలని పలువురు నాయకులు, ఎమ్మార్పీఎస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారీ బందోబస్తు మధ్య లక్ష్మినారాయణ అంత్యక్రియలు -
గాలివానకు రాలిన ఆశలు
నంద్యాల(అర్బన్): అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని మిగుల్చుతున్నాయి. రెండు రోజులుగా జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షాలతో వరితో పాటు ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. వర్షాలు, పెనుగాలులకు వరి, మొక్కజొన్న, కొర్ర, మినుము పంటలు 1,321 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన గాలి, వాన బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి తీవ్రమైన ఎండలు ఉండగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు లు చోటు చేసుకున్నాయి. కొలిమిగుండ్ల, అవుకు, బనగానపల్లె, ప్యాపిలి, బేతంచెర్ల మండలాల్లో కురిసిన వర్షాలకు అరటి, వరిపైర్లు నేలకొరిగాయి. ఈదురుగాలుల దాటికి పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రహదారుల రాకపోకలకు ఇబ్బంది కరంగా మారా యి. జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు 1,321 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయాధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అందులో వరి 1,057 వరి హెక్టార్లు, 2,18 హెక్టార్లు మొక్కజొన్న, మరికొన్ని పంటలు దెబ్బతిన్నట్లు అంచనాలు తయారు చేసి నివేదికలను రాష్ట్రస్థాయి అధికారులకు పంపారు. బండిఆత్మ కూరు మండలంలో 402 హెక్టార్లు, మహానందిలో 325, నంద్యాలలో 15, ఆళ్లగడ్డలో 81, అవుకులో 308, చాగలమర్రి మండలంలో 190 హెక్టార్ల పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతు న్నారు. ఉద్యాన పంటలకు నష్టం గత నాలుగు రోజులుగా జిల్లాలో అక్కడక్కడ కురుస్తున్న అకాల వర్గాలకు ఉద్యానవన పంటలకు భారీగా నష్టం జరిగింది. మహానంది, కొలిమిగుండ్ల, బండిఆత్మకూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, తదితర మండలాల్లో అరటి చెట్లు నేలకొరిగి రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అదే విధంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. జిల్లాలో కురిసిన వర్షపాతం వివరాలు.. జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మొత్తం మీద 139 మి.మీ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. అందులో కొలిమిగుండ్ల మండలంలో అత్యధికంగా 48.0 మి.మీ పగిడ్యాలలో అత్యల్పంగా 0.8 మి.మీ వర్షం కురిసింది. అదే విధంగా బనగానపల్లెలో 23.2, అవుకులో 22.4, ప్యాపిలిలో 16.4, బేతంచెర్లలో 8.2, డోన్ 4.2, మిడుతూరు 3.4, నందికొట్కూరు 3.2, కోవెలకుంట్ల 2.4, గోస్పాడు 2.2, జూపాడుబంగ్లా, పాణ్యం, సంజామల 1.2, ఉయ్యాలవాడ 1.0 మి.మీ వర్షం కురిసింది. వరి, అరటి, మామిడి రైతులు కుదేలు -
ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత
గోస్పాడు: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తు న్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. సోమ వారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా నలుమూలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, డీఆర్వో రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు వచ్చిన 32,796 వినతుల్లో 30,985 పరిష్కారమయ్యాయన్నారు. రీఓపెన్ అయిన 59పై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న 1,811 వినతులకు పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పరిష్కార స్థితిపై కొత్త ట్యాగ్ విధానాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు. ‘నీట్’కు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి వచ్చే 4వ తేదీన జరిగే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్) యూజీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ పలు అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బస్టాండ్ సమీపంలో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్, టెక్కె జూనియర్ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల తదితర కళాశాలలో నిర్వహిస్తున్న నీట్ పరీక్షకు 1,172 మంది విద్యార్థులు హాజరవుతున్న నేపథ్యంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లో అనుమతి ఇస్తారని నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పరీక్ష కేంద్రాల పరిధిలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని డీఎంహెచ్ఓ వెంకటరమణను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల తో పాటు పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య చర్యలు, తాగునీటి వసతి కల్పించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన బెంచీలు ఏర్పాటు చేయాలని డీఈఓను సూచించారు. అదే విధంగా పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి -
మల్లన్న ‘స్పర్శ’ భాగ్యం .. సామాన్యులకు దూరం
శ్రీశైలంటెంపుల్: దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీశైల క్షేత్రంలో మాత్రమే జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జున స్వామివారికి తలను తాకించి స్పర్శదర్శనం చేసుకునే భాగ్యం ఉంది. ప్రతి ఒక్క భక్తుడు స్వామివారిని స్పర్శ దర్శనం చేసుకునేందుకు ఆరాటపడతారు. అయితే స్పర్శ దర్శనం టిక్కెటు రుసుం రూ.500గా దేవస్థానం నిర్ణయించింది. స్పర్శదర్శనం టికెట్టు పూర్తిగా ఆన్లైన్లో తీసుకోవాలి. మల్లన్న దర్శనానికి వచ్చే పేద, సామాన్య భక్తులకు ఆర్థిక భారంతో పాటు అవగాహన లేకపోవడంతో స్పర్శ దర్శనానికి నోచుకోలేక పోతున్నారు. పేదలను దృష్టిలో ఉంచుకుని గతంలో దేవస్థానం వారంలో నాలుగు రోజుల పాటు ఉచిత స్పర్శ దర్శన భాగ్యం కల్పించింది. భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి శని, ఆది, సోమవారాల్లో అధికసంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ రద్దీ రోజులు కాకుండా ప్రతి మంగళవారం నుంచి శుక్రవారం వరకు రెండు పూటలా మల్లన్న స్పర్శదర్శనానికి సమయాన్ని కేటాయించారు. ఈమేరకు మధ్యాహ్నం 1.30 నుంచి 2.30గంటల వరకు అవకాశం కల్పిస్తూ 2022 కార్తీక మాసం నుంచి ప్రారంభించారు. అనంతరం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తుల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని అప్పటి దేవస్థాన కార్యనిర్వహణాధికారి మంగళవారం నుంచి సాయంత్రం వేళలలో కూడా 6.30 నుంచి 7.30 గంటల వరకు ఒక గంట పాటు సామాన్య భక్తులకు మల్లన్న స్పర్శదర్శనాన్ని కల్పించారు. ఆ తర్వాత ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు రెండు గంటల పాటు భక్తులకు ఉచితంగా మల్లన్న స్పర్శదర్శనాన్ని కల్పించారు. భక్తులు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి క్యూలైన్లలో ఉన్నవారికి ఈ అవకాశం కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి మల్లన్నను ఉచితంగా స్పర్శదర్శనం చేసుకుని తరించేవారు. కమిషనర్తో చర్చించి నిర్ణయం తీసుకుంటాం శ్రీశైల దేవస్థానంలో గతంలో సామాన్య భక్తుల సౌకర్యార్థం మల్లికార్జునస్వామివారి ఉచిత స్పర్శదర్శనం కల్పించారు. కాలక్రమేణా క్షేత్రానికి భక్తుల రద్దీ పెరగడంతో ఉచిత స్పర్శదర్శనాన్ని అమలు చేయడం లేదు. భక్తుల నుంచి ఉచిత స్పర్శదర్శనం కల్పించాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ విషయంపై కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి, వారి సూచనలతో ఉచిత స్పర్శదర్శనంపై తదుపరి చర్యలు తీసుకుంటాం.– ఎం.శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఉచిత స్పర్శదర్శనానికి మంగళం.. గతంలో నాలుగు రోజుల పాటు ఉచితంగా స్పర్శదర్శనం కొన్ని నెలలుగా ఉచిత స్పర్శదర్శనం నిలిపివేసిన దేవస్థానం పునరుద్ధరించాలని కోరుతున్న భక్తులు గత కొన్ని నెలల నుంచి మల్లన్న ఉచిత స్పర్శదర్శనానికి దేవస్థాన అధికారులు మంగళం పలికారు. భక్తు ల రద్దీ పేరుతో ఉచిత మల్లన్న స్పర్శదర్శన కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే సామాన్య భక్తులు, డబ్బులు పెట్టి ఆన్లైన్లో టికెట్టు పొందే స్థోమత లేని పేద భక్తులు నిరాశతో దూర దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఇప్పటికైన దేవస్థాన అధికారులు స్పందించి మల్లన్న ఉచిత స్పర్శదర్శనాన్ని కొనసాగించాలని, గతంలో మాదిరి ప్రతి మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఈ దర్శన సౌకర్యం కల్పించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. -
ఏజీబీఎస్సీ చేసిన యువకుడినీ పక్కనపెట్టారు
సర్టిఫికెట్లు ఏం చేసుకోవాలి అగ్రికల్చర్ డిప్లొమా పూర్తయింది. 2024 జనవరి 5 నుంచి 16వ తేదీ వరకు డ్రోన్ రిమోట్ పైలెట్గా శిక్షణ తీసుకున్నా. ఇలాగైనా ఉపాధి లభిస్తుందని ఆశపడ్డా. ప్రభుత్వం మారడంతో మమ్మల్ని పక్కనపెట్టేశారు. శిక్షణ పొందిన సర్టిఫికెట్లు ఏం చేసుకోవాలి. నిరుద్యోగుల విషయంలోనూ రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం. – ముత్యాలరాజు, వెల్దుర్తి గ్రామం కల్లూరు మండలం పుసులూరు గ్రామానికి చెందిన యువకుడు అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేశాడు. వ్యవసాయం పట్ల అతనికున్న ఆసక్తిని గమనించి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో డ్రోన్ పైలెట్గా ఎంపిక చేశారు. రైతులకు సేవ చేసేందుకు అవకాశం కలిసి వచ్చిందని అతను ఎంతో సంతోషించాడు. ఆచార్యా ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 12 రోజులు రిమోట్ పైలెట్ శిక్షణ కూడా తీసుకున్నాడు. కూటమి ప్రభుత్వం ఆధికారంలోకి రావడంతో టీడీపీ నేతలు ‘తమ్ముళ్ల’ కోసం ఇతడిని పక్కన పెట్టేయడం గమనార్హం. -
అరటి రైతులకు అపారనష్టం
కొలిమిగుండ్ల: ఈదురుగాలల బీభత్సంతో అరటి రైతులకు అపార నష్టం వాటిల్లింది. అరటి గెలలు కోత కోసే సమయంలో బలమైన గాలులు వీయడంతో గెలలతో సహ చెట్లు నేలకొరిగాయి. మదనంతపురం, కోర్నపల్లె తదితర గ్రామాల్లో రైతులు వంద ఎకరాలకు పైగానే అరటి సాగు చేశారు. రెండు మూడు రోజుల్లో కోత కోసేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో అకాల వర్షం రూపంలో నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. పది రోజుల ముందుగానే చాలా మంది రైతులు అరటి గెలలను కోసుకున్నారు. మొక్క జొన్న ఆరబెట్టుకోవడంతో వర్షం దాటికి తడిసిపోయాయి. మిరప రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో అత్యధికంగా కొలిమిగుండ్ల మండలంలో 48 మి.మీ వర్షపాతం నమోదైంది. -
మహానందీశ్వరుడి సేవలో కలెక్టర్
మహానంది: మహానందీశ్వరుడి సన్నిధిలో సోమవారం నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా దంపతులు పూజలు నిర్వహించారు. మహానందీశ్వరస్వామి వారి దర్శనానికి వచ్చిన కలెక్టర్ దంపతులకు ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వారు శ్రీ కామేశ్వరీదేవి, శ్రీ మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకుని పూజలు చేశారు. దర్శనం అనంతరం స్వామి వారి అలంకార మండపంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, పండితులు కలెక్టర్ రాజకుమారి దంపతులకు స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేశారు. పీజీఆర్ఎస్లో 110 ఫిర్యాదులు బొమ్మలసత్రం: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఎస్పీ అధిరాజ్సింగ్రాణా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 110 ఫిర్యాదులు అందాయి. అర్జీదారుల నుంచి వినతులు అందుకున్న అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. చట్టపరమైన ఫిర్యాదులపై వెంటనే విచారించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. పీజీఆర్ఎస్లో తమకు అందిన ఫిర్యాదులు పునరావృతం కాకుండా ఆయా స్టేషన్ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి ఫిర్యాదు చేసేందుకు రాలేని వారు సమీపంలోని స్టేషన్ అధికారులకు వినతులు సమర్పించవచ్చని ఎస్పీ సూచించారు. ఎంపీడీఓలకు మండలాలు కేటాయింపు కర్నూలు(అర్బన్): ఉమ్మడి జిల్లాలో ఎంపీడీఓలు గా పదోన్నతులు పొందిన పరిపాలనాధికారులు, డిప్యూటీ ఎంపీడీఓలకు మండలాలు కేటాయించినట్లు జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆయా మండలాలకు నియమితులైన ఎంపీడీఓలకు జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఉత్తర్వులను అందించారు. ఈ సందర్భంగా సీఈ ఓ నాసరరెడ్డి మాట్లాడుతూ బీవీ రమణారావును దేవనకొండ, బీ నూర్జహాన్ను మంత్రాలయం, కె.విజయశేఖర్రావును కౌతాళం, జి.ప్రభావతిదేవిని పెద్దకడుబూరు, ఎ.మద్దిలేటి స్వామిని ఆలూ రుకు నియమించామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. బీఈడీ సెమిస్టర్ పరీక్షలకు 392 మంది గైర్హాజరు కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహిస్తున్న బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో భాగంగా సోమవారం జరిగిన పరీక్షలకు 392 మంది గైర్హాజరయ్యారు. 3,384 మందికి 2,992 మంది ఛాత్రోపాధ్యాయులు హాజరు కాగా 392 మంది గైర్హాజరయ్యారని, వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఇద్దరు విద్యార్థులు చూచిరాతలకు పాల్పడగా వారిని డిబార్ చేసినట్లు తెలిపారు. డీసీసీబీ, డీసీఎంఎస్లకు చైర్మన్లు ● డీసీసీబీ చైర్మన్గా ఎదురూరు విష్ణువర్ధన్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్గా నాగేశ్వరరావు యాదవ్ కర్నూలు(అగ్రికల్చర్): కూటమి ప్రభుత్వం ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, ఉమ్మడి జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలకు చైర్మన్లను ప్రకటించింది. సహకార సంఘాలు, డీసీసీబీ, డీసీఎంఎస్లకు ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ ఉంది. అయితే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇదిలాఉంటే జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్గా కోడుమూరు నియోజకవర్గం ఎదురూరు గ్రామానికి చెందిన టీడీపీ నేత డి.విష్ణువర్ధన్రెడ్డి, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్గా డోన్ నియోజక వర్గం చండ్రపల్లి గ్రామానికి చెందిన జి.నాగేశ్వరరావు పేర్లను ప్రకటించారు. అయితే జీవోలు విడుదల కావాల్సి ఉంది. -
టీడీపీ కార్యకర్తలకే డ్రోన్లు
● ఉమ్మడి జిల్లాకు 80 మంజూరు ● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే అందుబాటులోకి సేవలు ● అప్పట్లో మహిళా సంఘాలకు ఉచితంగా 8 సరఫరా ● శిక్షణ ధ్రువపత్రాలు ఇచ్చిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ● కూటమి ప్రభుత్వం అప్పటి గ్రూపులను పక్కన పెట్టిన వైనం ● టీడీపీ కార్యకర్తలతో ఎఫ్ఎంబీ కిసాన్ డ్రోన్ గ్రూపుల ఏర్పాటు కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయంలో పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకునేందుకు సాంకేతికత దోహద పడుతోంది. ఇందులో భాగంగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల వారీగా(ఆర్ఎస్కేలు) వైఎస్సార్ యంత్రసేవ పథకం కింద కస్టమ్ హయరింగ్ సెంటర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లు అందుబాటులోకి తెచ్చింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సులభంగా, వేగంగా పురుగు మందుల పిచికారీ కోసం డ్రోన్లను కూడా వినియోగంలోకి తీసుకొచ్చింది. నాటి ప్రభుత్వ చొరవతో వివిధ ఎరువుల కంపెనీలు 8 డ్రోన్లు మహిళా గ్రూపులకు సరఫరా చేశా యి. ఐదు కోరమాండల్ కంపెనీ, ఇప్కో, ీపీపీఎల్, ఆర్సీఎఫ్ కంపెనీలు ఒక్కొక్కటి చొప్పున అందించాయి. డ్రోన్ల వినియోగానికి ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేసి పైలెట్ శిక్షణ కూడా ఇప్పించారు. 2023–24లోనే ఈ గ్రూపులకు సబ్సిడీపై డ్రోన్లు ఇవ్వాలని తలపెట్టినప్పటికీ ఎన్నికల కోడ్ రావడం వల్ల సాధ్యం కాలేదు. కూటమి ప్రభుత్వం కూడా డ్రోన్ సేవలను రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. అయితే టీడీపీ కార్యకర్తలకే డ్రోన్లను మంజూరు చేస్తుండటం గమనార్హం. 2023–24లో రాజకీయాలకు అతీతంగా అర్హులైన వారితో ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేసి ఇవ్వాలని తలపెట్టింది. కూటమి ప్రభుత్వం కూడా మొదట్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పైలెట్ శిక్షణ పొందిన వారిలో ఆసక్తి ఉన్న గ్రూపులకు డ్రోన్లు ఇవ్వాలని తలపెట్టింది. అయితే ఆ ప్రభుత్వంలో ఎంపిక చేసిన వారికి ఇవ్వడం తగదని కూటమి పార్టీల నేతలు ఒత్తిడి తెచ్చి టీడీపీ కార్యకర్తలకే మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టడం గమనార్హం. టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జీ లు రెకమెండ్ చేసిన కార్యకర్తలకే డ్రోన్లు అంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది. నాడు శిక్షణ సర్టిఫికెట్లు పొందినా.. గత ౖవైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కర్నూలు జిల్లాలో 36 మంది, నంద్యాల జిల్లాలో 35 మంది రిమోట్ పైలెట్ శిక్షణ పొందారు. వీరిలో అగ్రికల్చర్ బీఎస్సీ, అగ్రికల్చర్ డిప్లొమో చేసిన వారు కూడా ఉన్నారు. గుంటూ రులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వీరు 12 రోజుల శిక్షణ తీసుకుని సర్టిఫికెట్లు అందుకున్నారు. 2024 జూన్ నెలలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో డ్రోన్ అందుబాటులోకి రావడం ఆలస్యమైంది. ఆ తర్వాత కూడా ఏడాది జాప్యం చేశారు. ఎట్టకేలకు 2025–26లో డ్రోన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే వైఎస్సార్ సీపీ పాలనలో ఎంపిక చేసిన గ్రూపులను, రిమోట్ పైలెట్లను పక్కన పెట్టడం విమర్శలకు తావిస్తోంది. కొందరు వ్యవసాయ అధికారులే సంబంధిత ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీలతో మాట్లాడు కోవాలని సూచిస్తుండటం గమనార్హం. టీడీపీ మద్దతుదారులు, సానుభూతి పరులనే ఎంపిక చేస్తుండటంతో తమ పరిస్థితి ఏమిటని శిక్షణ పొందిన వారు ప్రశ్నిస్తున్నారు. కర్నూలు జిల్లాలో వైఎస్సార్సీపీ హయాంలో రిమోట్ పైలెట్గా శిక్షణ పొందిన వారిలో కూటమి ప్రభుత్వంలో కూడా కొందరికి అవకాశం ఇచ్చారు. శిక్షణ పొందిన వారు సంబంధిత ఎమ్మెల్యేలను కలువడంతో ఇది సాధ్యమైంది. జిల్లాలో 36 మంది పైలెట్ శిక్షణ పొందితే 10 మందికి పైగా అవకాశం దక్కించుకున్నారు. నంద్యాల జిల్లాలో మాత్రం గత ప్రభుత్వంలో శిక్షణ పొందిన వారందరినీ ౖవైఎస్సార్సీపీ ముద్ర వేసి పక్కన పెట్టడం గమనార్హం. కూటమి ప్రభుత్వం అర్హతలను పక్కన పెట్టి కార్యకర్తలకే పెద్దపీట వేసింది. అర్హతలను పట్టించుకోకుండా పైలెట్ శిక్షణకు పంపుతుండటం మితిమీరిన రాజకీయానికి నిదర్శనం. ఉమ్మడి జిల్లాకు 80 డ్రోన్లు మంజూరు కూటమి ప్రభుత్వం ఉమ్మడి కర్నూలు జిల్లాకు 80 డ్రోన్లను మంజూరు చేసింది. కర్నూలు జిల్లాకు 40, నంద్యాల జిల్లాకు 40 ప్రకారం కేటాయించారు. టీడీపీ కార్యకర్తలతో ఏర్పాటైన ఎఫ్ఎంబీ కిసాన్ డ్రోన్ గ్రూపులకు మంజూరు చేస్తోంది. వీటి సరఫరాకు డ్రోగో, విహంగ కంపెనీలను ఎంపిక చేసింది. డ్రోగో కంపెనీ డ్రోన్ పూర్తి ధర రూ.9.80 లక్షలు, విహంగ కంపెనీ డ్రోన్ ధర రూ.9.81 లక్షలు. ఇందులో ప్రభుత్వం 80 శాతం సబ్సిడీ ఇస్తుంది. అయితే 50 శాతం మొత్తానికి బ్యాంకులు రుణాలు ఇస్తాయి. మిగిలిన 50 శాతం కిసాన్ డ్రోన్ గ్రూపులు భరిస్తాయి. ఎఫ్ఎంబీ కిసాన్ డ్రోన్ గ్రూపులో ఐదుగురు సభ్యులు ఉంటారు. గ్రూపు సభ్యులు పైలెట్గా ఎంపిక చేసుకున్న వారికి ప్రభుత్వం శిక్షణ ఇస్తుంది. ఈ పైలెట్ కనీసం మూడేళ్లు పనిచేయాల్సి ఉంది. మధ్యలో మానుకోవాలనుకుంటే రూ.70 వేలు చెల్లించాలనే నిబంధన పెట్టారు. డ్రోన్ల సామర్థ్యం 25 లీటర్లు.నంద్యాల జిల్లాలో వైఎస్సార్సీపీ ముద్ర వేసి.. -
చర్యలు తీసుకుంటాం
సాసర్ పిట్లలో నీరు నింపుతున్నాం. ఎక్కడైనా నీరు లేదంటే సిబ్బంది చూడక పోవడమో, మరచిపోవడమో ఉంటుంది. వెంటనే నీటిని నింపేలా చర్యలు తీసుకుంటాం. – శ్రీపతి నాయుడు, రుద్రవరం అటవీ రేంజ్ అధికారి కుంటలు ఎండిపోయాయి అహోబిలం అటవీ పరిధిలో చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోయాయి. వన్యప్రాణులు నీటి కోసం పొలాల్లోకి, గ్రామాల్లోకి వస్తున్నాయి. అవి దాడి చేస్తాయోనని ప్రజలు భయపడుతున్నారు. – నాసారి వెంకటేశ్వర్లు, ఏకలవ్య ఎరుకలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అందరి బాధ్యత నల్లమల అభయారణ్యం రాయలసీమకు మాణిక్యం లాంటింది. అందులోని వన్యప్రాణులను కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపై ఉంది. సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి మూగజీవాల దాహార్తి తీర్చేందుకు ఏర్పాట్లు చేయాలి. – గజ్జల రాఘవేంద్రారెడ్డి, ఎంపీపీ -
ఉరిమిన వర్షం.. పిడుగులా నష్టం
● కల్లాల్లో ధాన్యం తడిచిన వైనం ● నేలవాలిన బొప్పాయి, మామిడి వృక్షాలు ● పిడుగుపాటుతో ముగ్గురు మృతికర్నూలు(అగ్రికల్చర్): ఉరుములు, మెరుపులు, పిడుగులు, భారీ గాలులతో ఉన్నట్టుండి ఆదివారం మధ్యాహ్నం కురిసిన వర్షం రైతులను నిలువునా ముంచింది. అన్నదాతలకు తీవ్ర నష్టం మిగిల్చింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఐదు చోట్ల పిడుగుపాటు సంఘటనలు చోటు చేసుకోగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మూగజీవులు సైతం మృత్యువాత పడ్డాయి. అకాల వర్షంతో కల్లాల్లో ఉన్న వరి ధాన్యం తడిచి పోయింది, పెనుగాలుల తీవ్రతకు అరటి, బొప్పాయి, మామిడి వంటి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. నష్టం ఇలా.. ● బనగానపల్లె మండలంలో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట నేలవాలింది. అకాల వర్షం తమను నిండా ముంచిందని రైతులు అవేదన వ్యక్తం చేశారు. పసుపల పరిసర ప్రాంతాల్లో కల్లాల్లోని మొక్కజొన్న తడిచిపోయింది. ● కొలిమిగుండ్ల మండలంలో కొద్ది రోజుల్లో అరటి గెలలను కోయాల్సిన తరుణంలో ఆకాల వర్షం దెబ్బతీసింది. మిరప కోత కోసి ఆరబెట్టుకోగా పూర్తిగా తడిచి పోయింది. ● సంజామల మండలంలో రబీలో వేసిన మొక్కజొ న్న, మిరప, వరి తదితర పంటలు నూర్పిడి దశలో ఉన్నాయి. అకాల వర్షంతో పంట తడిచిపోయింది. ● బేతంచెర్ల మండలంలో గాలివానకు మామిడి కాయలు రాలిపోవడంతో రైతులు నష్టపోయారు. ● పాణ్యం మండలంలో అరటి, మిరప రైతులు తీవ్రంగా నష్టపోయారు. ● బండి ఆత్మకూరు మండలంలో వరి పైరు నేలవాలడంతో గింజలు రాలిపోయాయి. దీంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. ● కోవెలకుంట్ల మండలంలోని గుళ్లదూర్తి, కలుగొట్ల, రేవనూరు, లింగాల, వల్లంపాడు, చిన్నకొప్పెర్ల, తదితర గ్రామాల రైతులు వడ్లు, మిరప, మొక్కజొన్న దిగుబడులను కల్లాలు, పొలాల్లో ఆరబోసుకున్నారు. భారీ వర్షం కావడంతో పట్టలు కప్పినా నీరు కిందకు చేరి దిగుబడులు తడిచిపోయాయి. విషాదం కౌతాళం మండలం కాత్రికి గ్రామంలో పిడుగు పడి యువకులు అశోక్(21), బాలయ్య (22) మృతి చెందారు. అలాగే నిరుపాధి, గంగాధర్ తీవ్రంగా గాయపడ్డారు. క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా గాలీవాన మొదలై వర్షం ఎక్కువ కావడంతో సమీపంలోని చెట్టు కిందకు చేరుకోవడంతో పిడుగు పడి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ● కృష్ణగిరి మండలం కటారుకొండ గ్రామంలో పొలానికి వెల్లిన బోయ శ్రీనివాసులు అనే రైతు పిడుగుపాటు పడి మృతి చెందారు. -
యంత్ర పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
నంద్యాల(అర్బన్): వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద ప్రభుత్వం అందజేస్తున్న పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ తెలిపారు. ఆదివారం స్థానిక టెక్కె మార్కెట్యార్డులో రైతులకు యంత్ర పరికరాలు రాయితీపై పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఫరూక్ మాట్లాడుతూ.. పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రభుత్వం మద్దతు ధర కింద క్వింటా జొన్నలు రూ.3,371తో రైతుల నుంచి కొనుగోలు చేస్తుందన్నారు. అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. డీఏఓ మురళీకృష్ణ మాట్లాడుతూ నంద్యాల మండలంలో 49 మంది రైతులకు, గోస్పాడు మండలంలో 35 మంది రైతులకు తైవాన్ స్పేయర్లు, రోటావేటర్లు, విత్తన గొర్రులు, గుంటికలు అందజేశామన్నారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ మెంబర్ తులసిరెడ్డి, ఏడీఏ రాజశేఖర్, సివిల్ సప్లయ్ డీఎం రాజునాయక్, మార్క్ఫెడ్ డీఎం హరినాథరెడ్డి, ఏఓ ప్రసాదరావు, స్వప్నికారెడ్డి, నంద్యాల మండల ఎంపీపీ శెట్టి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. -
మేలో పూర్తి స్థాయిలో దిగుబడి
జనవరి నెలలో ఈ పంట పూత దశ ఉన్న సమయంలో తేనే మంచుపురుగు ఆశించి కొంత మేర దెబ్బతిన్నా సస్యరక్షణ చర్యలతో దిగుబడి ఆశాజనకంగానే ఉంది. వారం రోజులుగా దిగుబడి లభిస్తుండగా మే నెలలో పూర్తి స్థాయిలో దిగుబడి మార్కెట్కు చేరుతుంది. – అబ్దుల్ హమీద్, మామిడి తోటల యజమాని, బనగానపల్లె గతేడాది కంటే తక్కువ ధర గతేడాది వంద మామిడి పండ్లు రూ. ఐదారు వేల వరకు విక్రయించగా ఈ సంవత్సరం రూ. నాలుగైదు వేలకు మించడం లేదు. పండ్లు నాణ్యతగా ఉన్నాయి. వ్యాపారం కూడా పదిరోజుల్లో ఊపందుకుంటుందని అనుకుంటున్నాం. బంగినపల్లి రకం రుచి అద్భుతంగా ఉంటుంది. – ఖాదర్వలి, పండ్లవ్యాపారి, బనగానపల్లె -
శ్రీశైలంలో భక్తుల సందడి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. పలువురు భక్తులు ఆన్లైన్ ద్వారా టికెట్లు పొంది స్వామివారి స్పర్శదర్శనం చేసుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్ని కిటకిటలాడాయి. నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక గోస్పాడు: కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ సూచనల మేరకు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఉదయం 9.30 ప్రారంభించి మధ్యాహ్నం 12.30 గంటలకు పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఉదయం 9.30 గంటలకు జిల్లా అధికారులందరూ హాజరు కావాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేడు డయల్ యువర్ డీఎం నంద్యాల(వ్యవసాయం): డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 11 నుంచి 12.00 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు నంద్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ గంగాధర రావు ఆదివారం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులు, ప్రజలు తమ సమస్యలను, సలహాలు, సూచనలను 9505065651 నంబరుకు ఫోన్ చేసి చెప్పాలని సూచించారు. ముమ్మరంగా కార్డన్ సర్చ్ ● అనుమానిత ప్రాంతాల్లో సోదాలు ● 49 వాహనాలు సీజ్ బొమ్మలసత్రం: శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ఆదివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసుల బృందాలు కార్డన్ సెర్చ్ చేపట్టారు. జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు రౌడీ షీటర్లు, నేర చరిత్ర ఉన్న వారి అనుమానిత ఇళ్లలో సోదాలు చేశారు. నంద్యాల పట్టణంలోని దేవనగర్ ప్రాంతంలో సరైన పత్రాలు లేని 49 వాహనాలు సీజ్ చేశారు. ఆత్మకూరు పరిధిలో ఏఎంబీ పాలెం, గొల్లపేట, కొట్టాల చెరువు గ్రామాలలో 20 లీటర్ల నాటు సారాయి సీజ్ చేసి ఒకరిపై కేసు నమోదు చేశారు. నందికొట్కూరు లోని షికారిపేటలో 30 లీటర్ల నాటుసారాయి, 500 లీటర్ల బెల్లంఊట ధ్వంసం చేశారు. అలాగే నందికొట్కూరు రూరల్ పరిధిలో లక్ష్మాపురం గ్రామంలో 18 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ప్రజలు అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హ్యాండ్బాల్ చాంపియన్ ‘కర్నూలు’ కర్నూలు (టౌన్)/ కదిరి అర్బన్: శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణం ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజులుగా జరిగిన 54వ రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో కర్నూలు జట్టు చాంపియన్షిప్ను కై వసం చేసుకుంది. మొత్తం 16 జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. ఆదివారం టోర్నీ ముగిసింది. ప్రథమ స్థానం కర్నూలు, ద్వితీయ స్థానం పశ్చిమగోదావరి, తృతీయ స్థానంలో శ్రీసత్యసాయి జిల్లా జట్లు నిలిచాయి. విజేత జట్టుకు సీనియర్ హ్యాండ్బాల్ క్రీడాకారుడు ప్రసాద్ ట్రోఫీని ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ కార్యదర్శి మహేష్తో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. -
బెలుం గుహలకు వేసవి ఎఫెక్ట్
కొలిమిగుండ్ల: భూగర్భంలో అవతరించి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే బెలుం గుహలపై వేసవి ప్రభావం పడింది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులా వచ్చినా ఫలితం లేకుండా పోయింది. గుహల అందాలను తిలకించేందుకు ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు సహా పలు రాష్ట్రాల నుంచి యాత్రికులు వచ్చేవారు. 42 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో భయపడుతున్నారు. పైగా గుహల్లో ఉక్కపోత అధికంగా ఉండటంతో చాలా మంది వెనుకడుగు వేస్తున్నారు. సాధారణ రోజుల్లో రోజుకు రూ.15వేలకు పైగా, శని, ఆదివారాల్లో రూ.30 వేల మేర ఆదాయం వస్తుండేది. ప్రస్తుతం ఎండల తీవ్రత దృష్ట్యా చాలా వరకు యాత్రికుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో ఆదాయం పడిపోయింది. గుహలోపలి భాగాలతో పాటు ఆవరణలోని ప్రదేశాలు పర్యాటకులు లేక వెలవెలబోతున్నాయి.గుహ లోపలికి చేరుకునే దారిలో కనిపించని ప్రజలు ఎండల తీవ్రతతో గుహలు చూసేందుకు ఆసక్తి చూపని పర్యాటకులు -
ఆహార పదార్థాల భద్రతపై అవగాహన
నంద్యాల(వ్యవసాయం): వ్యాపారులకు శనివారం ఆహార పదార్థాల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. నంద్యాలలోని రిటైల్ మర్చెంట్ వ్యాపారుల కార్యాలయంలో పో స్ట్రాక్ ట్రైనర్ రాజ్కుమార్, జిల్లా ఫుడ్సేఫ్టీ అధికారులు వెంకట రమణ, కాశీం వలి మాట్లాడారు. ఆహార పదార్థాల్లో కల్తీని అరికట్టాలని, వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలన్నారు. వ్యాపారులు ఫుడ్ లైసెన్స్తో పాటు పోస్ట్రాక్ శిక్షణ సర్టిఫికెట్ తప్పని సరిగా కలిగి ఉండాలన్నారు. ఏపీ ఫుడ్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ది రిటైల్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్డగాళ్ల మల్లికార్జున, కేవీజీవీఎం సభ్యులు సింధు, మోహన్బాబు, సాయిరాం, రాములు, ఖాజాహుసేన్, మాధవి, చిరు, కిరాణ వ్యాపారులు పాల్గొన్నారు. రేపు బీచ్ కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు నంద్యాల(న్యూటౌన్): ఉమ్మడి కర్నూలు జిల్లా సీనియర్ బీచ్ కబడ్డీ పురుషుల, మహిళల జట్ల ఎంపిక పోటీలు ఈనెల 28వ తేదీన నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ ఏపీరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నంద్యాలలోని నందమూరినగర్ నాగులకట్ట వద్ద పోటీలు ఉంటాయని ఆయన తెలిపారు. పురుషులు 85 కేజీల్లోపు, మహిళలు 75 కేజీల్లోపు ఉండాలని, పోటీలకు వచ్చే సమయంలో ఆధార్కార్డు, పదో తరగతి మార్కులిస్టు తీసుకుని రావాలన్నారు. జట్లకు ఎంపికై న వారు మే 2 నుంచి 4వ తేదీ వరకు కాకినాడ బీచ్లో జరిగే రాష్ట్రస్థాయి బీచ్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. మంచి సినిమాలకు ఎప్పుడూ ఆదరణ మహానంది: మంచి సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఎప్పుడూ ఆదరణ ఉంటుందని ప్రముఖ సినీ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అన్నారు. శనివారం రాత్రి ఆయన మహానందికి వచ్చారు. శ్రీ కామేశ్వరీదేవి, శ్రీ మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. దర్శనం అనంతరం వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, పండితులు, అర్చకులు ఆయనకు స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేశారు. కొత్త బంగారులోకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, నారప్ప, బ్రహ్మోత్సవం వంటి సినిమాలకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. శివపురంలో అతిసారం! ● ఎనిమిది మందికి అస్వస్థత కొత్తపల్లి: మండలంలోని శివపురం గ్రామ ఎస్సీ కాలనీలో అతిసార వ్యాధి ప్రబలినట్లు తెలిసింది. ప్రజలు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. శనివారం పేరుమాళ్ల సామేలు, సుబ్బన్న, మాణిక్యమ్మ, స్రవంతి, మేరిమాత, అనుసూయమ్మ, 15 ఏళ్ల విక్రాంత్ అనే బాలుడు, 7 ఏళ్ల బాలిక మహిమ భాగ్యమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొంతమంది గోకవరం ప్రభుత్వం అసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. విషయం తెలుసుకున్న వైద్యులు శివపురం గ్రామం వెళ్లి పరిశీలించారు. ఎంపీడీఓ మేరి, గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్.. బాధితుల ఇంటి వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పేరుమాళ్ల సామేలును ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులకు ముగిసిన వైద్యపరీక్షలుకర్నూలు(హాస్పిటల్): బదిలీల నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న వైద్యపరీక్షలు శనివారం ముగిశాయి. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మెడికల్ బోర్డు ఆధ్వర్యంలో మొదటి రోజు 70 మందికి, రెండోరోజు 102 మందికి, చివరి రోజు 264 మందికి వైద్యపరీక్షలు చేశారు. ఇందులో ఆర్థోపెడిక్, న్యూరోసర్జరీ, న్యూరాలజీ, మానసిక వైకల్యం, కార్డియాలజీ తదితర వ్యాధులున్న ఉపాధ్యాయులు, వారి కుటుంబసభ్యులు వైద్య పరీక్షలు చేయించుకుని నివేదికలు అందుకున్నారు. -
మైనారిటీలకు సబ్సిడీ రుణాలు
● దరఖాస్తుకు మే 25 ఆఖరు కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మైనారి టీ, క్రిిస్టియన్ వర్గాల ప్రజలు సబ్సిడీ రుణాలకు మే 25లో గా దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ కార్పొరేషన్ ఈడీ ఎస్.సబీహా పర్వీన్ తెలిపా రు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మైనారిటీలకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు, క్రిస్ట్టియన్ మైనారిటీలకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణాలను అందిస్తామన్నారు. ఎంపికై న వారికి 50 శాతం సబ్సిడీ మంజూరవుతుందన్నారు. అర్హత కలిగిన వ్యక్తులు వివరాలను https://apobmms.apcfss.in వెబ్సైట్లో నమో దు చేసుకోవాలన్నారు. వివరాలకు ఈడీ, మైనారిటీ కార్పొరేషన్ కార్యాలయం, లేదా 9848864449, 9440822219 నెంబర్లను సంప్రదించాలన్నారు. -
శ్రీశైల క్షేత్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
గోస్పాడు: శ్రీశైల దివ్య క్షేత్రంతో పాటు చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలను ఆధ్యాత్మికంగా, పర్యాటకపరంగా, అహ్లాదకరంగా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని, ఇందుకు అవసరమయ్యే డాక్యుమెంట్లు ఇవ్వాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో శ్రీశైలం క్షేత్ర అభివృద్ధిపై శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. శ్రీశైలానికి వచ్చే భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనానంతరం మూడు రోజులపాటు అక్కడే ఉండి పరిసర ప్రాంతాలను దర్శించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. భక్తుల సౌకర్యార్థం తొమ్మిది రకాల సదుపాయాలతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే సున్నిపెంట ప్రాంతంలో గుర్తించిన 178 ఎకరాల రెవెన్యూ భూముల్లో 50 ఎకరాలు పర్యాటక శాఖకు కేటాయించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. గతంలో ఇరిగేషన్కు సంబంధించిన 1,468.52 ఎకరాల ఇరిగేషన్ భూముల్లో 719 ఎకరాలు వివిధ శాఖలకు కేటాయించామన్నారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్ఓ రాము నాయక్, డీఎఫ్ఓ సాయిబాబా, శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు, ఆత్మకూరు ఆర్డీఓ అరుణజ్యోతి, ఇరిగేషన్ ఎస్ఈ శివప్రసాద్ రెడ్డి, జిల్లా పర్యాటక అధికారి సత్యనారాయణమూర్తి, ఏపీటీడీసీ డీవీఎం లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి -
కుటుంబం వీధిన పడింది
పది నెలల్లో 67 మంది రైతుల బలవన్మరణం ●● కలసిరాని వ్యవసాయంతో అప్పులపాలు ● అన్నదాత సుఖీభవకు నీళ్లొదిలిన కూటమి ప్రభుత్వం ● ఆత్మహత్యల సంఖ్య తగ్గించి చూపే ప్రయత్నాల్లో త్రీమెన్ కమిటీ ● ఉచిత పంటల బీమాకు చెల్లుచీటి ● 2023 ఖరీఫ్, 2023–24 రబీ, 2024 ఖరీఫ్ పంటల బీమా అందనట్లే.. అప్పుల ఊబిలో బలవన్మరణంతుగ్గలి మండలం రాంపల్లి గ్రామానికి చెందిన వెంకట్రాములుకు వ్యవసాయమే జీవనాధారం. 2024–25లో గతంలో ఎప్పుడూ లేని విధంగా వ్యవసాయంలో దెబ్బతిన్నాడు. 5 ఎకరాల స్వంతభూమి ఉండగా.. మరో ఐదారు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. సహకార సంఘంలో రూ.10 లక్షలకు పైగా అప్పు చేశాడు. ప్రయివేటు అప్పులు ఐదారు లక్షలు ఉన్నాయి. అధిక వర్షాలు, వర్షాభావంతో పాటు అరకొర పంటలకు గిట్టుబాటు ధర లేక నష్టాలను మూటకట్టుకున్నాడు. అప్పులు తీర్చాలనే ఒత్తిళ్లు అధికమవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య లక్ష్మి అనాథగా మారింది. వెల్దుర్తి మండలం రామళ్లకోటకు చెందిన కలుగొట్ల బోయ హనుమంతు కౌలుదారు. ఈయన 6.65 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేశాడు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వ్యవసాయం కోసం రూ.6 లక్షలు అప్పు చేశాడు. ప్రభుత్వం నుంచి ఎలాంటి తోడ్పాటు లభించక, వ్యవసాయం కలిసిరాక అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. విధిలేని పరిస్థితుల్లో గత ఏడాది పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈయనకు భార్య బోయ రామేశ్వరి. శివ(12), లత(10) సంతానం. ఇంటికి ఆధారమైన వ్యక్తి మరణించంతో వీళ్లంతా దిక్కులేని వాళ్లయ్యారు. త్రీమెన్ కమిటీ కౌలుదారు ఆత్మహత్యగా నిర్ధారించిందే కానీ, ప్రభుత్వం ఇప్పటికీ ఆదుకోని పరిస్థితి. కర్నూలు(అగ్రికల్చర్): ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేకపోవడం.. వ్యవసాయం కలసి రాకపోవడం.. ప్రకృతి కరుణించకపోవడం.. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడం.. వెరసి రైతుల జీవనం దుర్భరం అవుతోంది. వ్యవసాయం కోసం బ్యాంకులు, పీఏసీఎస్ల్లో తీసుకున్న అప్పులు, ప్రయివేటు వ్యక్తుల దగ్గర అధిక వడ్డీలతో పొందిన రుణాలు బక్కచిక్కిన రైతులను బలవన్మరణాలకు ఉసిగొల్పుతున్నాయి. 2014–15 నుంచి 2018–19 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 321 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. తిరిగి మళ్లీ ఆయన ప్రభుత్వంలోనే రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. నాడు వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఇప్పటికి ఆ మాటలకే కట్టుబడి ఉన్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు, కరువు కవలలనే పేరుంది. 2014–15 నుంచి 2018–19 వరకు ఐదేళ్లు పాలిస్తే వరుసగా నాలుగేళ్లు కరువొచ్చింది. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ప్రతి ఏటా వర్షాభావం ఏర్పడుతుండటంతో ఉమ్మడి కర్నూలు జిల్లా ఎడారిగా మారింది. వర్షాలు లేక, అంతంతమాత్రం పండిన పంటలకు గిట్టుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడిలో 10 శాతం కూడా దక్కక రైతులు చితికిపోయారు. నాటి దారుణ పరిస్థితులే మళ్లీ పునరావృతం అవుతున్నాయి. రైతులు బలవన్మరణాలకు పాల్పడుతుంటే.. బ్యాంకులు రుణాలు రికవరీకి ఆస్తులను జప్తులు చేస్తుండటం గమనార్హం. అన్నదాత సుఖీభవ అమలులో నిర్లక్ష్యం 2024 ఎన్నికల సమయంలో సూపర్–6లో భాగంగా రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 వేలు చెల్లించి ఆదుకుంటామని ఊరూవాడ చంద్రబాబు ప్రకటించారు. ఆయన మాటలు నమ్మి రైతులు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. రైతుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ మొదటి ఏడాది అన్నదాత సుఖీభవకు నీళ్లొదిలారు. ఈ నేపథ్యంలో పంట పెట్టుబడులకు రైతులు అప్పులు చేయాల్సి వస్తోంది. ఈ అప్పులు తీర్చలేక పురుగుల మందు తాగడం, ఉరేసుకోవడం ద్వారా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2025–26 సంవత్సరానికి అన్నదాత సుఖీభవ అమలు చేస్తామని ప్రకటించారు. అయితే పీఎం కిసాన్తో కలిపి రూ.20వేలు ఇస్తామని నాలుక మడతేశారు. రైతు సంక్షేమాన్ని పట్టించుకుంటే ఒట్టు 2023 ఖరీఫ్ కరువు మండలాలకు సంబంధించి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2024 జనవరిలోనే ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసింది. 41,857 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో తప్పులు ఉన్నందున రూ.60.59 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ విడుదల కాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖాతాలను సరి చేసి పంపారు. ఇంతవరకు ఈ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయని పరిస్థితి. 2023–24 రబీలో ఉమ్మడి జిల్లాలో 31 కరువు మండలాలను గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గుర్తించింది. కరువు ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో 92,208 రైతులు నష్టాలను మూటకట్టుకున్నారు. ఇన్పుట్ సబ్సిడీ కోసం కర్నూలు జిల్లాకు రూ.58.28 కోట్లు, నంద్యాల జిల్లాకు రూ.37.76 కోట్లు విడుదల కావాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతనే కేంద్ర బృందం జిల్లాలో పర్యటించింది. అయితే ఇప్పటికీ ఇన్పుట్ సబ్సిడీ అతీగతీ లేకుండాపోయింది. బీమా మర్చిపోవాల్సిందే.. ● గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఐదేళ్లూ ఉచిత పంటల బీమాను అమలు చేసింది. ● 2024, 2024–25 రబీ సీజన్కు సంబంధించి రైతుల వాటా ప్రీమియం చెల్లించాల్సిన సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో బ్రేక్ పడింది. ● కూటమి ప్రభుత్వం రైతుల వాటా సొమ్మును చెల్లిస్తే రైతులకు బీమా పరిహారం అందుతుంది. ● 2024 ఖరీఫ్ సీజన్లో కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమాను అమలు చేస్తామని చెప్పినా, రైతుల వాటా విడుదల చేయని పరిస్థితి. ● దీంతో మూడు సీజన్లకు సంబంధించి రైతులు పంటల బీమా పరిహారానికి దూరమయ్యారు. ● కేవలం 2024–25 రబీ పంటల బీమాను మా త్రమే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోంది. ● అది కూడా ఉచిత పంటల బీమాను పక్కనపెట్టి రైతులే ప్రీమియం చెల్లించే విధానాన్ని తీసుకురావడం గమనార్హం. 10.3.2527.9.2418.7.24డోన్ మండలం గోసానిపల్లి గ్రామానికి చెందిన వై.రామాంజనేయులు(35) కౌలు రైతు. 3.95 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని గత ఏడాది ఉల్లి సాగు చేశాడు. పెట్టుబడుల కోసం రూ.9 లక్షలు అప్పు తీసుకున్నాడు. అయితే అధిక వర్షాలు, అనావృష్టి కారణంగా పంట దెబ్బతినింది. గత ఏడాది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈయనకు భార్య అనిత, కూతురు మైతిలి(8), కుమారులు రామ్కుషల్(6), రామ్ చరణ్(4) ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మరణించడంతో భార్యా పిల్లలు దీనావస్థలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 67 మంది రైతులు ఆత్మహత్య కూటమి ప్రభుత్వం ఏర్పాటైన మొదటి ఏడాదిలోనే మరణమృదంగం మోగింది. ప్రభుత్వం నుంచి చేయూత లేకపోవడం, వ్యవసాయం కలసిరాక అప్పులు మీద పడటంతో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో రికార్డు స్థాయిలో 67 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం గమనార్హం. కర్నూలు జిల్లాలో 42 మంది, నంద్యాల జిల్లాలో 25 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్యను తగ్గించి చూపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్రీమెన్ కమిటీ విచారణలో అనర్హులుగా తేల్చేందుకు రంగం సిద్ధమవుతోంది. మండల వ్యవసాయ అధికారి, తహసీల్దారు రైతుల ఆత్మహత్యలేనని నిర్ధారించినప్పటికీ త్రీమెన్ కమిటీ విచారణలో రైతులు కాదని, ఇతర కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్యాయం చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. -
లిమిటేషన్ యాక్ట్తో కేసుల సత్వర పరిష్కారం
కర్నూలు(సెంట్రల్): లిమిటేషన్ యాక్ట్తో కేసులను త్వరగా పరిష్కరించేందుకు వీలు ఉంటుందని జిల్లా జడ్జి జి.కబర్ధి పేర్కొన్నారు. జిల్లా కోర్టులో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న సీనియర్, జూనియర్ జడ్జీలకు లిమిటేషన్ యాక్ట్పై శనివారం వర్కుషాపు నిర్వహించారు. ముందుగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. లిమిటేషన్ యాక్ట్పై క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలన్నారు. అప్పుడు కేసులను సత్వరమే పరిష్కరించడానికి వీలు అవుతుందన్నారు. అనంతరం రిసోర్స్పర్సన్లు విశ్రాంత న్యాయమూర్తులైన మోహన్రావు, ఎస్.రజనీలు మాట్లాడారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జీలు కమలాదేవి, పీజేసుధాకర్, అమ్మనారావు, పి.వాసు, ఎం.శోభారాణి, ఎన్. శ్రీవిద్య పాల్గొన్నారు. న్యాయమూర్తుల వర్కుషాపులో జిల్లా జడ్జి జి.కబర్ధి -
పోలీసుల విస్తృత తనిఖీలు
బొమ్మలసత్రం: జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. శనివారం స్ధానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ముఖ్యమైన ప్రాంతాల్లో పోలీసు జాగిలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే నేషనల్ హైవేలు, టోల్ ప్లాజాలు, చెక్పోస్టులు, లాడ్జీలు తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నామన్నారు. నిషేధిత వస్తువులు, గంజాయి, అక్రమ మద్యం, పేలుడు పదార్థాల అక్రమ రవాణా అరికట్టేందుకు పోలీసు సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. 59 మందిపై కేసులు నమోదు గడిచిన 48 గంటల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 59 మందిపై, బహిరంగంగా మద్యం సేవించిన 198 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. నైట్ బీట్లలో భాగంగా ప్రతిరోజు పోలీస్ సిబ్బంది అనుమానితుల వివరాలు సేకరించి వారి వేలిముద్రలు తీసుకుంటున్నారన్నారు. గడిచిన 48 గంటల్లో ర్యాష్ డ్రైవింగ్ చేసిన 647 మందిపై రూ.3.08 లక్షల జరిమానా విధించామన్నారు. పేకాట అడుతూ పట్టుబడిన ఏడు మంది పై కేసు నమోదు చేశామన్నారు. -
గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
నంద్యాల(అర్బన్): గ్రామాలను యూనిట్గా తీసుకొని అధికారులు జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. నంద్యాల సెంట్రల్ వేర్హౌస్ గోడౌన్లో ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రం వద్ద శనివారం ఆందోళన నిర్వహించారు. అన్నదాతలకు ఏపీ రైతు సంఘం నాయకులు మద్దతు పలికారు. క్వింటా రూ.3,371 మద్దతు ధరతో జొన్న దిగుబడులను కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందు కోసం నంద్యాల సెంట్రల్ వేర్హౌస్ గోడౌన్లో జొన్న కొనుగోళ్లను ప్రారంభించారు. అయితే హమాలీలు, గోడౌన్లు, గన్నీ బ్యాగ్ల కొరతతో రైతులు తెచ్చిన జొన్నను సకాలంలో కొనుగోలు చేయలేక పోయారు. నాలుగు రోజులుగా రైతులు రైల్వే స్టేషన్ నుంచి చామకాల్వ వరకు ట్రాక్టర్లు, లారీల్లో తీసుకొచ్చిన దిగుబడులతో రోడ్లపై నిలుపుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో శనివారం రైతులు ఆందోళనకు దిగారు. సివిల్ సప్లయ్ డీఎం రాజునాయక్ అక్కడి వచ్చి రైతులతో మాట్లాడారు. దిగుబడులన్నింటిని కొనుగోలు చేస్తామని, కొంత సమయం కావాలని కోరారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, సహాయ కార్యదర్శి రామచంద్రుడు , రైతులు హుసేన్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి, శేషాద్రిరెడ్డి, మల్లయ్య, బాలవెంకటరెడ్డి, అబ్దుల్బాషా తదితరులు పాల్గొన్నారు. జొన్న రైతుల ఆందోళన -
విపత్తు నిర్వహణ ప్రణాళికకు నివేదికలు ఇవ్వండి
గోస్పాడు: ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కలిగే నష్టాలను నివారించడానికి వ్యూహాత్మక ప్రణాళిక సిద్ధం చేసేందుకు నివేదికలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళిక – నివారణ ముందస్తు జాగ్రత్త చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 54 గ్రామాల రహదారులకు అనుసంధానమై ఉన్న 21 వాగుల పటిష్టతకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సార్బీసీ, తెలుగుగంగ, కేసీ కెనాల్ తదితర సాగునీటి కాలువలపై సరైన ట్రాక్ ఏర్పాటు చేయాలన్నారు. వాగుల బండ్ పటిష్టతపై ఇరిగేషన్ అధికారులు నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని 80 ఆటోమేటెడ్ వాతావరణ కేంద్రాలపై ఎప్పటికపుడు తనిఖీ చేసి పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సీపీఓను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 27,203 మట్టి ఇళ్లు ఉన్నాయని వర్షాల వల్ల కూలిపోయే ప్రమాదం ఉంటుందని, అందులో ఎక్కువ శాతం బనగానపల్లెలో 6 వేల వరకు మట్టి ఇళ్లు ఉన్నాయని, అందులో ఉన్న వారికి అర్హత మేరకు ఇళ్లు నిర్మించి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి -
అహోబిలం.. ‘వసంత’ వైభవం
ఆళ్లగడ్డ: దిగువ అహోబిలంలో వసంతోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. వసంత రుతువులో శ్రీ లక్ష్మీనరసింహస్వామికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవం అని పేరు. ఎండ వేడి నుంచి స్వామివారు ఉపశమనం పొందేందుకు జరిపే ఉత్సవం కావడంతో ఉపశమనోత్సవం అని కూడా అంటారు. ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతో పాటు పలురకాల మధురఫలాలను స్వామికి నివేదిస్తారు. వేడుకల కోసం దేవాలయం ఎదరుగా భాష్యకార మండపంలో ఆకర్షణీయంగా మండపాన్ని తీర్చిదిద్దారు. అలాగే పలురకాల వృక్షాల ప్రతిరూపాలతో నల్లమల అడవిని తలపించేలా మండపాన్ని తీర్చిదిద్దారు. గురువారం ఉదయం నిత్య పూజలు అనంతరం యాగశాలకు చేరుకున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను కొలువుంచారు. ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాలు, అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య తిరుమంజనం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
సాగు పెరిగి.. నష్టాలు మిగిలి
ఉమ్మడి జిల్లాలో పొగాకు సాగు లేని మండలం లేదంటే అతిశయోక్తి కాదు. 10 ఎకరాల నుంచి 100 ఎకరాలు సాగు చేసిన రైతులు ఉన్నారు. ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు కౌలుకు తీసుకొని మరీ సాగు చేశారు. 2023–24లో రికార్డు స్థాయి ధరలు లభించడంతో ఈ ఏడాది రైతులు సాగుకు రెండు జిల్లాల్లో పోటీపడ్డారు. కంపెనీలు కూడా అదేవిధంగా ప్రోత్సహించాయి. 2024–25లో కర్నూలు జిల్లాలో 36,471 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 30,865 ఎకరాల్లో పొగాకు సాగయింది. 2023–24తో పోలిస్తే 48,959 ఎకరాల్లో అదనంగా సాగు చేయడం విశేషం. విత్తనం మొదలు పొగాకును కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లే వరకు ఎకరాకు రూ.60 వేల వరకు పెట్టుబడి పెడుతున్నారు. ఎకరాకు సగటున 4 క్వింటాళ్ల వరకు మాత్రమే దిగుబడి వచ్చింది. కంపెనీలు అరకొరగా కొనుగోలు చేసి చేతులెత్తేయడంతో రైతులు రోడ్డెక్కుతున్నారు. -
ఆర్యూలో నిత్యం సమస్యల ‘పరీక్ష’
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ పరీక్షల విభాగంలో గందరగోళం వీడటం లేదు. నిత్యం ఏదో ఒక సమస్యతో నెట్టుకురావడం తప్ప పరిష్కార మార్గాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈనెల 23న బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే రెండు కళాశాలల విద్యార్థులకు పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు కూడా హాల్టికెట్లు రాకపోవడంతో ఆందోళన చెందారు. దీంతో పాటు విద్యార్థుల వివరాలతో కూడిన ప్రింటెండ్ ఓఎమ్మార్ షీట్లు ఏర్పాటు చేయలేకపాయారు. డోన్లో ఓ పరీక్ష కేంద్రం, కర్నూలులో ఓ పరీక్ష కేంద్రంలో సుమారు 90 మంది విద్యార్థులతో బఫర్ ఓమ్మార్ షీట్లలో వివరాలు నమోదు చేయించి పరీక్ష రాయించారు. వివరాలు నమోదు చేసే సమయంలో పొరపాటు చేస్తే ఆ విద్యార్థి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. గురువారం జరిగిన పరీక్షకు కర్నూలు ఉస్మానియా కళాశాల కేంద్రంలో శాంతినికేతన్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థి స్థానంలో మరో విద్యార్థి పరీక్ష రాస్తూ పట్టుబడటం పర్యవేక్షణ లోపమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిరాక్స్ ప్రశ్నపత్రాలు రెండు పరీక్ష కేంద్రాల్లో ప్రింటెండ్ కాకుండా జిరాక్స్ ప్రశ్నపత్రాలతో పరీక్షలు రాయిస్తున్నారు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి అర గంట ముందు ప్రశ్నపత్రాల షీల్డ్బండిల్ను తెరుస్తారు. అందులోంచి ప్రశ్నపత్రాలను తీసుకొని వాటిని జిరాక్స్ తీయించి పరీక్షలు రాయిస్తున్నారు. అదే సమయంలో ప్రశ్నా పత్రం లీక్ అయినా, కరెంట్ పోయినా, ప్రింటర్ పనిచేయకపోయినా ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వెబ్సైట్లో కానరాని విద్యార్థుల పేర్లు 2023–25 విద్యా సంవత్సరం బీఈడీ మూడో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫీజును శుక్రవారంలోగా చెల్లించేందుకు వర్సిటీ అధికారులు గడువు విధించారు. అయితే గురవారం అర్ధరాత్రి వరకు ఫీజు చెల్లింపుకు ఎన్ఆర్లో విద్యార్థుల పేర్లు పెట్టలేదు. దీంతో ఒక్కరోజులోనే విద్యార్థులకు ఎప్పుడు సమాచారం ఇవ్వాలి, ఫీజు ఎప్పుడు చెల్లించాలని కళాశాలల యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నాయి. ఏజెన్సీ మారడంతో సమస్యలు పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పరీక్ష నిర్వహణ ఏజెన్సీ మారడంతో కొన్ని సాంకేతిక సమస్యలు ఉత్పన్నవుతున్నాయి. త్వరలోనే పరిష్కరిస్తాం. వీసీతో చర్చించి బీఈడీ మూడో సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంచేందుకు నిర్ణయం తీసుకుంటాం. ఒక విద్యార్థి స్థానంలో మరో విద్యార్థి పరీక్ష రాస్తూ దొరకడంతో అతనిపై పోలీస్లకు ఫిర్యాదు చేశాం. – డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు, సీఈ, ఆర్యూ గురువారం ఒక విద్యార్థికి బదులు మరో విద్యార్థి పరీక్ష రాస్తుండగా గుర్తింపు బీఈడీ మూడో సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లింపు నేటితో గడువు పూర్తి ఫీజు చెల్లింపునకు వెబ్సైట్లో కానరాని విద్యార్థుల పేర్లు -
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు
● జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ నంద్యాల: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా రహదారుల భద్రత సమన్వయ కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. నంద్యాల ఏఎస్పీ మందా జావళి ఆల్ఫోన్స్, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీధర్ రెడ్డి, ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయులు, ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్, నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ... నేషనల్ హైవే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లో బోర్డులు ఏర్పాటు చేయాలని నంద్యాల మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. యన్హెచ్40 రహదారి చాబోలు సమీపంలో, శాంతిరాం ఆసుపత్రి దగ్గర బ్యారికేడ్లతో పాటు ఇల్యూమినేషన్ లైట్స్ ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 23 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయని, అందులో 11 పూర్తి కాగా ఇంకా 12 పెండింగ్ ఉన్నాయని, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చేలా ఐరాడ్తో సమన్వయం చేసుకోవాలన్నారు. ఆర్అండ్బీ రోడ్లపై మార్కింగ్స్ వేయాలని సూచించారు. మలేరియా నివారణ అందరి బాధ్యత గోస్పాడు: మలేరియా నివారణ అందరి బాధ్యత అని డీఎంహెచ్ఓ వెంకటరమణ అన్నారు. నంద్యాలలోని కార్యాలయంలో గురువారం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏడాది ఏప్రిల్ 25వ తేదీన ప్రపంచ మలేరియా దినోత్సవంగా నిర్వహిస్తోందన్నారు. ప్రజల్లో అవగాహన కలిగించేందుకు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఆరోగ్య సిబ్బంది ర్యాలీలు నిర్వహించాలన్నారు. ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘మలేరియా అంతం మనతోనే’ అనే నినాదంతో ప్రజల్లో అవగాహన కల్పిస్తోందన్నారు. సమావేశంలో జిల్లా మలేరియా అధికారి కామేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు నంద్యాల(అర్బన్): జిల్లాలో తొమ్మిది మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి ఉత్తర్వులు వచ్చాయని డ్వామా పీడీ వెంకటసుబ్బయ్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామ పంచాయతీలో కనీస పనిదినాలు కల్పించాలని తెలిపారు. అయితే కంటే తక్కువ పనిదినాలు కల్పించిన తొమ్మిది మంది ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించినట్లు చెప్పారు. గోపాలాపురం గ్రామంలో రాజశేఖర్రెడ్డి, రామకృష్ణాపురంలో మహేష్చౌదరి, తిమ్మాపురంలో చాకలి శేఖర్, నేలంపాడులో వెంకటేశ్వరరెడ్డి, తిరుపాడు గ్రామానికి చెందిన శేఖర్, గుంజలపాడు గ్రామంలో గోవిందరెడ్డి, కడుమూరులో రమేష్, గుంతనాలలో రమేష్బాబు, రాయమాల్పురంలో దేవన్నలను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు వచ్చాయని తెలిపారు. కానిస్టేబుల్ అభ్యర్థులకు జూన్ 1న రాత పరీక్ష కర్నూలు: కానిస్టేబుల్ అభ్యర్థులకు జూన్ 1వ తేదీన తుది రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు నియామక మండలి ప్రకటన విడుదల చేసింది. పోలీస్ కానిస్టేబుల్, సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో పోస్టులకు సంబంధించి ప్రాథమిక రాత పరీక్ష 2023 జ నవరి 22న జరిగింది. అర్హత సాధించిన వారికి 2024 డిసెంబర్ 30 నుంచి 2025 ఫిబ్రవరి 1 వరకు కర్నూలు ఏపీఎస్పీ రెండో పటాలం మైదానంలో దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేశా రు. ఇందులో అర్హత సాధించిన వారందరికీ జూన్ 1న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. తనయుడు ఫెయిల్ అయ్యాడని తల్లి ఆత్మహత్య కర్నూలు: పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో కుమారుడు భరత్బాబు ఫెయిల్ అయ్యాడనే మనస్థాపంతో తల్లి బెజవాడ లక్ష్మీజ్యోతి (39) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రవి, లక్ష్మీజ్యోతి దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానం కాగా మొదటి కుమారుడు భరత్ బాబు పదవ తరగతి పరీక్షల్లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. బుధవారం ఫలితాలు వెలువడగా రాత్రి తల్లి లక్ష్మీజ్యోతి ఇంట్లోనే చీరతో ఉరేసుకుంది. ఆమె భర్త గుర్తించి ఉరి నుంచి తప్పించి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైతుల పాలిట ‘పగా’కు!
● ఉమ్మడి జిల్లాలో 67,336 ఎకరాల్లో పొగాకు సాగు ● 50వేల టన్నుల వరకు దిగుబడి ● ఇప్పటి వరకు కొనుగోలు 20 వేల టన్నులే.. ● పత్తాలేకుండా పోయిన కంపెనీల ప్రతినిధులు ● రైతుల కష్టాన్ని పట్టించుకోని ప్రభుత్వం ● అకాల వర్షాలతో దిక్కుతోచని రైతులు -
గ్రామీణాభివృద్ధిలో పంచాయతీరాజ్ కీలకం
● జిల్లా కలెక్టర్ రంజిత్బాషాకర్నూలు(అర్బన్): గ్రామీణాభివృద్ధి, స్థానిక పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తున్నదని జిల్లా కలెక్టర్ పీ రంజిత్బాషా అన్నారు. గురువారం జిల్లా పరిషత్ మినీ సమావేశ భవనంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2025లో ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థకు 1947 స్వాతంత్య్రం వచ్చిన అనంతరం ఉన్న పరిస్థితికి చాలా వ్యత్యాసం ఉందన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ షెడ్యూల్లో 243 ఆర్టికల్ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను రూపొందిస్తూ చట్టం చేశారన్నారు. ఈ చట్టాన్ని రాజ్యసభ, లోక్సభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో కూడా ఆమోదం చేసిన తరువాత 1993 ఏప్రెల్ 24వ తేదీన నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలోనే పంచాయతీరాజ్ వ్యవస్థలో పర్యవేక్షణ బలోపేతం అయ్యిందన్నారు. పంచాయతీలకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వడం, స్వయం ప్రతిపత్తి కల్పించడం వంటి సంస్కరణలు వచ్చాయన్నారు. ఫైనాన్స్ పరిధిలోకి రావడం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా సక్రమంగా ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు. స్థానిక పాలనా వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడంలో పీఆర్ సంస్థలు కీలకంగా వ్యవహరిస్తున్నాయన్నారు. నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డుకు పెరవలి ఎంపిక.. నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డుల కోసం దేశ వ్యాప్తంగా 1.40 లక్షల దరఖాస్తులు రాగా, ఇందులో ఆరు గ్రామ పంచాయతీలను ఎంపిక చేశారని కలెక్టర్ చెప్పారు. ఎంపికై న ఆరు గ్రామ పంచాయతీల్లో జిల్లాలోని మద్దికెర మండలం పెరవలి గ్రామ పంచాయతీ ఉండడం అభినందనీయమన్నారు. అలాగే ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ కింద జిల్లాలోని మద్దికెర, హొళగుంద, చిప్పగిరి మండలాలు ఎంపికయ్యాయన్నారు. ఇందులో మద్దికెర మండలం దక్షిణ భారత దేశంలో ప్రథమ స్థానంలో ఉందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1.50 కోట్లను మంజూ రు చేసిందన్నారు. కార్యక్రమంలో పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ పర్యవేక్షక ఇంజనీర్లు వీ రామచంద్రారెడ్డి, బీ నాగేశ్వరరావు, కర్నూలు డివిజినల్ పంచాయతీ అధికారిణి టీ లక్ష్మి, పీఆర్ ఈఈ మద్దన్న, పీఏ టు ఎస్ఈ బండారు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
సిబ్బంది.. ఇబ్బంది
గోస్పాడు: ఓ సాధారణ వ్యక్తి అద్దె ఇల్లు మారాల్సి వస్తే కనీస సౌకర్యాలు చూసుకున్న తర్వాత ఆ ఇంటికి వెళ్తాడు. అదే ఓ కార్యాలయాన్ని మరో చోటుకు తరలించాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికార, సిబ్బందికి సౌకర్యాలు ఉన్నా యా.. లేవా అని చూసుకోవాలి. కానీ పంచాయతీ రాజ్ శాఖలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో సిబ్బంది అవస్థలు పడుతున్నారు. ఆ శాఖలో భాగమైన పీఐయూ (ప్రాజెక్టు ఇంప్లిమెంటింగ్ యూనిట్) కార్యాలయం ఎంతో కాలంగా ఉమ్మడి జిల్లా కేంద్రమైన కర్నూలులోనే కొనసాగేది. అయితే నంద్యాల జిల్లా కేంద్రం కావడంతో ఈ కార్యాలయం ఇక్కడికి రావాల్సిన అవసరముందని గుర్తించిన అధికారులు హడావుడిగా తరలించారు. ఈ మేరకు ఈనెల 1వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఉన్నట్లుండి ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో చేసేదిలేక సిబ్బంది కార్యాలయ సామగ్రిని తెచ్చి స్థానిక పీఆర్ కార్యాలయంలో ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ వేశారు. ప్రస్తుతం ఉన్న పీఆర్ జిల్లా ఇంజినీరింగ్ అధికారి కార్యాలయం పైన ఉన్న ఓ గదిని పీఐయూ కార్యాలయానికి కేటాయించారు. దీంతో సిబ్బంది సరైన వసతులు లేక అవస్థలు పడుతున్నారు. కనీసం కార్యాలయం మార్పుచేస్తున్నట్లు ఉన్నతస్థాయి అధికారులకు తెలియకుండానే జరుగుతుందా, తరలిస్తే కనీస వసతులు ఉన్నాయా? లేవా? అనే ఆలోచన ఏమాత్రం చేయకుండానే ఇలాంటి మార్పు చేయ డం ఏమిటని పలువురు సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. సమాచారం లేకుండానే.. జిల్లాకు సంబంధించిన పీఐయూ కార్యాలయం కావడంతో అందులో దాదాపుగా 23 మందికి పైగానే సిబ్బంది పనిచేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, డీఈ స్థాయి పీఏ, డీఏఓ, సూపరింటెండెంట్లు ఒక్కొక్కరు చొప్పున, ముగ్గురు ఏఈలు, రికార్డు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు నలుగురు చొప్పున, ఇద్దరు టైపిస్టులు, టెక్నికల్, బీపీఓలు ఒక్కొక్కరితో పాటు అటెండర్లు విధులు నిర్వహించాల్సి ఉంది. అయితే పనిచేసే వారిలో మహిళా సిబ్బంది దాదాపుగా 10 మంది ఉన్నారు. కార్యాలయాన్ని కర్నూలు నుంచి నంద్యాలకు తరలించే సమయంలో అక్కడున్న సిబ్బందికి మాట మాత్రమైనా సమాచారం లేకుండా హడావిడిగా తరలించడంతో అవస్థలు పడుతున్నారు. ఈనెల 19వ తేదీ నుంచి సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న కార్యాలయంలో పని చేయలేక అవస్థలు పడుతున్నారు. ఓ వైపు పనులు.. మరో వైపు విధులు.. అసలే నంద్యాల కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రం కావడంతో కార్యాయాలకు భవనాల కొరత ఉందన్న విషయాన్ని సైతం అధికారులు మర్చిపోయారా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి. వస తులు ముందస్తుగా ఏర్పాటు చేసుకోకుండా ఆర్భాటాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చాక అప్పటికప్పుడు కార్యాలయానికి రంగుల పూత వేస్తుండటంతో పాటు ఫ్యాన్లు ఏర్పాటు చేస్తూ కనిపించారు. దీంతో కార్యాలయానికి అక్కడి నుంచి తెచ్చిన టేబుళ్లు, బల్లలు, కుర్చీలు ఉంచే స్థలం లేక ఎక్కడపడితే అక్కడ వేశారు. ఇదిలా ఉండగా సిబ్బంది మాత్రం ఎక్కడ కూర్చోవాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారు. భవన నిర్మాణానికి ప్రతిపాదనలు.. పీఐయూ కార్యాలయానికి ఏప్రిల్ నెలలోనే నూతన భవన నిర్మాణానికి రూ. 34 లక్షలతో ప్రతిపాదన చేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రతిపాదనలు చేసిన పనులు మంజూరై పనులు ప్రారంభించి భవన నిర్మాణం పూర్తి అయ్యేందుకు ఎంత సమయం పడుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కనీసం సిబ్బంది కూర్చోవడానికి, కార్యాలయానికి సంబంధించిన టేబుళ్లు, బల్ల లు, కుర్చీలు ఉంచేందుకు అనుగుణంగా ఏర్పా టు చేయాలని కోరుతున్నారు. హడావుడిగా పీఐయూ కార్యాలయం మార్పుతో అవస్థలు కర్నూలు నుంచి నంద్యాల కేంద్రానికి తరలింపు సిబ్బంది కూర్చోవడానికి సరైన వసతులు కరువు -
మొక్క జొన్న పంట దగ్ధం
పాణ్యం: మండల కేంద్రమైన పాణ్యంలోని డొంగు సమీపంలో చేతికొచ్చిన మొక్కజొన్న పంట అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైంది. గ్రామంలోని రైతు వై.వి లింగమయ్యకు చెందిన 3 ఎకరాలు, లింగాల సుబ్రహ్మణ్యంకు చెందిన 3 ఎకరాలు, గుడిపాటి మద్దిలేటికి చెందిన 1.50 ఎకరాల పంట దగ్ధమైంది. పొలంలో మంటలు వ్యాపించడంతో గమనించిన రైతులు నంద్యాల అగ్నిమాపక స్టేషన్కు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. మరో రోజుల్లో మూడు రోజుల్లో పంట కోత చేపట్టాల్సిన సమయంలో ప్రమాదం జరగడంతో రైతులు నష్టపోయారు. బోర్ వైర్ నుంచి మంటలు చేలరేగి పంటలకు వ్యాపించినట్లు ప్రాథమికంగా తెలిసింది. ఎకరానికి రూ. 35వేలకు వరకు పెట్టుబడులు పెట్టామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ నరేంద్రనాథ్రెడ్డి, ఆర్ఐ రాము, వ్యవసాయ అధికారులు దగ్ధమైన పంటను పరిశీలించారు. -
ప్రభుత్వాసుపత్రిలో నాగుపాము కలకలం
ఎమ్మిగనూరురూరల్: స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని పిల్లల వార్డులో గురువారం నాగుపాము కలకలం సృష్టించింది. పిల్లల వార్డులో పామును గుర్తించిన తల్లులు కేకలు వేయటంతో అక్కడ ఉన్న బంధువులు వచ్చి పామును కర్రలతో వార్డు నుంచి బయటకు వెళ్లేలా చేశారు. అనంతరం బయటకు వచ్చిన పామును చంపటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గతంలో చాలా సార్లు పాములు ఆసుపత్రిలో వచ్చిన సంఘటనలు ఉన్నాయి. అసుపత్రి అవరణలో అపరిశుభ్రంగా ఉండటంతో పాములు వార్డుల్లోకి వస్తున్నాయని రోగులు వాపోతున్నారు. శ్రీశైలం ఘాట్లో అదుపుతప్పిన బస్సు ● డ్రైవర్కు తీవ్ర గాయాలు ● 20 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలు శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం ఘాట్ రోడ్డులో గురువారం ఉదయం ఓ ప్రైవేటు బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి కొండచరియను ఢీ కొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు తీవ్ర గాయాలు, 20 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా సిరిగుప్ప ప్రాంతానికి చెందిన 40 మంది భక్తులు తీర్ధయాత్రలకు బయలుదేరారు. గురువారం ఉదయం 8 గంటల సమయంలో చిన్నారుట్ల ఘాట్ రోడ్డులో బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్ బస్సు లోయలో పడకుండా పక్కనే ఉన్న కొండ చరియలను ఢీ కొడ్డాడు. ప్రమాదంలో బస్సు డ్రైవర్ ఫయాజ్ (28) తీవ్ర గాయాలయ్యాయి. 20 మంది భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ఫయాజ్ను మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్పెషల్ ఒలింపిక్స్లో స్వర్ణ పతకం
నందికొట్కూరు: స్థానిక కోట జెడ్పీ హైస్కూల్ 9వ తరగతి విద్యార్థి భాను ప్రసాద్ రాష్ట్రస్థాయి స్పెషల్ ఒలింపిక్స్ భారత్ క్రీడల్లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో హీల్ స్కూల్లో ఈనెల 23 జరిగిన రాష్ట్రస్థాయి స్పెషల్ ( ప్రత్యేక అవసరాలు గల క్రీడాకారులు) ఒలంపిక్స్ భారత్ క్రీడల్లో నంద్యాల జిల్లా తరుపున 50 మీటర్ల పరుగు పందెంలో భాను ప్రసాద్ స్వర్ణ పతకం సాధించారు. ఈ మేరకు గురువారం పాఠశాల హెచ్ఎం సాలమ్మ, ఫిజికల్ డైరెక్టర్ శ్రీనాథ్, ఉపాధ్యాయులు క్రీడాకారుడిని అభినందించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ భాను ప్రసాద్ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఈఆర్టీ రవిబాబు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
‘సాక్షి’ కార్యాలయంపై దాడి హేయం
● దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి ● ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు మధు నంద్యాల: సాక్షి దిన పత్రికలో వార్త వచ్చిందని ఆ పత్రిక కార్యాలయంపై దాడి చేయడం హేయమైన చర్య అని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు మధు అన్నారు. ఏలూరు జిల్లా ‘సాక్షి’ కార్యాలయంపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు దాడి చేయడాన్ని ఖండిస్తూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ అదిరాజ్సింగ్ రాణాను కలిసి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు మధు, జిల్లా ఉపాధ్యక్షుడు ఆవుల బాలమద్దిలేటి మాట్లాడుతూ.. పత్రికలో వచ్చిన వార్తల్లో వాస్తవాలు లేకుంటే దానికి వివరణ ఇచ్చుకోవాలన్నారు. అయితే కార్యాలయంపై దాడులకు పాల్పడటం సిగ్గు చేటన్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సాక్షి పత్రిక కార్యాలయంలోనే కంప్యూటర్లు, ఫర్నిచర్ ధ్వంసం చేయడమే కాక విధి నిర్వహణలో ఉన్న విలేకరిపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర ఎంతో ఉందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ తప్పు ఒప్పులను, అక్రమాలను, నిజాలను బయట పెట్టే బాధ్యత మీడియాకు ఉందన్నారు. ప్రభుత్వంలోనే కొందరు నేతలు పత్రికల్లో వార్తలు వస్తే జర్నలిస్టులను భయపెట్టడానికి చూస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ఇది మంచిపద్ధతి కాదన్నారు. జర్నలిస్టులు హరినాథరెడ్డి, దస్తగిరి, చంద్రవరప్రసాద్, నాగేశ్వరరెడ్డి, మోహన్, అబ్దుల్కరీం తదితరులు పాల్గొన్నారు. -
మాండ్ర మెప్పునకు సీఐ పాట్లు
● సామాజిక మాధ్యమాల్లో టీడీపీ పాంప్లెట్ పోస్టు చేసిన సీఐ సాక్షి, నంద్యాల: అధికార పార్టీ నాయకుల ఆశీస్సుల కోసం పోలీసులు పడరాని పాట్లు పడుతున్నారు. వారి మెప్పు పొందేందుకు హోదాను మరిచి దిగజారుతున్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో పది రోజుల క్రితం రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఒక వర్గంపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని టౌన్ సీఐ ప్రవీణ్కుమార్రెడ్డిపై ఎమ్మెల్యే గిత్త జయసూర్య తీవ్ర ఒత్తిడి చేశారు. ఒకానొక దశలో టౌన్ సీఐపై నోరు పారేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో తన పోస్టింగ్ను కాపాడుకునేందుకు టౌన్ సీఐ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మాండ్ర శివానందరెడ్డి మెప్పు పొందేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ‘‘ఇదీ మన కుటుంబం.. ఇదీ మన తెలుగు దేశం కుటుంబం.. కలిసి పని చేద్దాం.. కలిసి ముందుకు సాగుదాం..’’ అనే పాంప్లెట్ను మాండ్ర ఫొటోతో కలిపి కొన్ని వాట్సాప్ గ్రూప్లలో స్వయంగా టౌన్ సీఐ పోస్టు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పోలీసులు అధికార పార్టీ నేతల చెప్పుచేతల్లో ఉన్నారనేందుకు ఈ పోస్టు తాజా ఉదాహరణ. -
అహోబిలంలో వసంతోత్సవాలు ప్రారంభం
ఆళ్లగడ్డ: అహోబిలంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వసంతోత్సవాలకు బుధవారం రాత్రి అంకుర్పారణ పూజలు చేశారు. అహోబిలం ముద్రకర్త కిడాంబి వేణుగోపాలన్, మఠం మేనేజర్ మాధవన్, మణియార్ సౌమ్యానారాయణ్ల పర్యవేక్షణలో పండితులు, అర్చకులు శస్త్రోక్తంగా వసంతోత్సవాలకు శ్రీ కారం చుట్టారు. దిగువ అహోబిలంలోని ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిచారు. అనంతరం విశ్వక్సేనుడికి పూలమాలలు వేసి, తల పాగా చుట్టి పల్లకీలో కొలువుంచి ఆలయం వెలుపలకు తోడ్కొని వచ్చారు. ఈ ఉత్సవాలకు పర్యవేక్షుకుడిగా విశ్వక్సేనుడు వ్యవహరిస్తారు. అనంతరం ఆలయానికి ఈశాన్యం వైపు ఉన్న పుట్టకు పూజలు నిర్వహించి పుట్టమన్నును సేకరించి మండపం దగ్గరకు తీసుకువచ్చారు. అక్కడ అంకుర హోమం నిర్వహించి సోముడిని (చంద్రుడిని) మట్టిలోకి ఆవాహం చేశారు. పాత్రలో మట్టిలో నవగ్రహాలకు సూచికగా నవధాన్యాలను పోసి సోమకుంభ స్థాపన చేశారు.