breaking news
Nandyala
-
స్వచ్ఛ జిల్లాకు అందరూ సహకరించాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: స్వచ్ఛ జిల్లాకు ప్రజలందరూ సహకరిస్తూ పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. సోమ వారం పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన స్వచ్ఛాంధ్రా అవార్డ్స్–2025 జిల్లా స్థాయి బహుమతుల ప్రదాన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాబోయే మూడు నెలల్లో స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దాలని, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వ్యాపార ప్రదేశాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయాలని, తడి, పొడి వ్యర్థాలను వేరుగా వర్గీకరించేందుకు శ్రీకారం చుట్టాలని, మెప్మా, డీఆర్డీఏ ఆధ్వర్యంలోని మహిళా స్వచ్ఛంద సమూహాల ద్వారా ఇంట్లోనే కంపోస్ట్ తయారీని ప్రోత్సహించాలని, నీటి మట్టాలు తగ్గిపోయిన 165 గ్రామాల్లో భూగర్భ జలాలను పునరుద్ధరించే చర్యలు చేపట్టాలని కలెక్టర్ తీర్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 24 పర్యాటక కేంద్రాల పరిసరాలు ఆహ్లాదకరంగా మార్చాలన్నారు. స్వచ్ఛ ఆంధ్రా అవార్డ్స్–2025లో రాష్ట్ర స్థాయిలో ‘మన ఊరు మన గుడి మన బాధ్యత‘ స్వచ్ఛంద సంస్థ అవార్డు లభించిందని తెలిపారు. జిల్లాలో వివిధ విభాగాల్లో మొత్తం 51 అవార్డులు సాధించిన నిర్వాహకులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన మెమొంటోలు, సర్టిఫికెట్లు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేసి, వారిని శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, డీపీవో లలితాబాయి, డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, డోన్ మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్, నంద్యాల ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తక్ అహ్మద్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
పప్పుశనగ సాగుపై నీలినీడలు
అటు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం.. ఇటు అనుకూలించని వాతావరణంతో పప్పుశనగ సాగుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఏటా రబీ సీజన్ మొదటి పంటగా జిల్లాలో విస్తారంగా పప్పుశనగ సాగు చేసే రైతులకు ఆదిలోనే అవరోధాలు ఎదురవుతున్నాయి. కోవెలకుంట్ల: అక్టోబర్ మాసం ప్రారంభంతో రబీ సీజన్ షురూ అయ్యింది. పప్పుశనగ సాగుకు సరైన అదును. జిల్లాలోని 29 మండలాల పరిధిలో జేజే–11, ఫూలేజి రకాలకు చెందిన శనగ సాగు సాధారణ విస్తీర్ణం 57,299 హెక్టార్లు. ఇందులో స్థానిక వ్యవసాయ సబ్ డివిజన్లోని కోవెలకుంట్ల, సంజామల, అవుకు, కొలిమిగుండ్ల, ఉయ్యాలవాడ, దొర్నిపాడు మండలాల్లో అత్యధికంగా 38,900 హెక్టార్లలో శనగ సాగు కావాల్సి ఉంది. అల్పపీడన ప్రభావంతో ఇటీవల కురుస్తున్న వర్షాలు, రసాయన ఎరువులు అందుబాటులో లేకపోవడం. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు సబ్సిడీ విత్తనాలను సరఫరా చేయకపోవడంతో విత్తన ప్రక్రియ ముందుకు సాగడం లేదు. గత నెల 20వ తేదీ నుంచి ఒకటి రెండు, రోజుల వ్యవధిలో వరుసగా వర్షాలు కు రుస్తుండటంతో నీరు నిల్వ చేరి పొలాలు బీళ్లు అయ్యాయి. ఈ నెల మొదటి వారం సాగుకు అనుకూలంగా ఉంటుందనుకున్నా రైతులకు నిరాశే మిగిలింది. వర్షాలు వీడకపోవడంతో సాగు ముందుకు సాగడం లేదు. వర్షాల కారణంగా పొలాల్లో పిచ్చిమొక్కలు, కలుపు పెరిగి బీళ్లను తలపిస్తున్నాయి. ప్రతి ఏటా దసరా పండుగ ముగిసిన వెంటనే విత్తనా లు వేసే వారు. ఈ ఏడాది దసరా పండుగ ముగిసినా విత్తనానికి పొలాలు సిద్ధం చేసుకులేని పరిస్థితి తలెత్తింది. పొలాల్లో తేమ శాతం ఆరేందుకు మరో వారం రోజులపాటు గడువు పట్టేలా ఉండటం, అల్పపీడన ప్రభావంతో తిరిగి వర్షాలు కురిసే ఆస్కారం ఉండటంతో రైతులు దిగాలు చెందుతున్నారు.గతేడాది కుదేలుగత ఏడాది విత్తన సమయంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. వరణుడిపై భారం వేసి రైతులు విస్తారంగా శనగ పంట సాగు చేశారు. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 51 వేల హెక్టార్లలో శనగ సాగు సాధారణ విస్తీర్ణం కాగా 52 వేల హెక్టార్లలో రైతులు జేజే–11, ఫూలేజీ రకాలకు చెందిన శనగ పంట సాగుచేశారు. విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపు నివారణ, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 20 వేలు వెచ్చించారు. కౌలు రైతులపై కౌలు రూపంలో అదనంగా మరో రూ. 15 వేలు భారం పడింది. పంట మార్పిడి విధానం అవలంభించకపోవడం, విత్తన సమయంలో పొలాలను కలియదున్నక పోవడం, వాతావరణం అనుకూలించకపోవడం, తదితర కారణాలతో శనగ పైరును వేరుకుళ్లు (ఎండు తెగులు) ఆశించి పైరులో మొక్కలు ఎండిపోయాయి. ఫూలేజి (తెల్లశనగ) రకానికి చెందిన పైరుకు ఎక్కువశాతం ఎండు తెగులు ఆశించింది. తెగులుకు తోడు గత నవంబర్, డిసెంబర్ నెలల్లో తుపాన్ల ప్రభావంతో కురిసిన వర్షాలు, అధిక తేమ కారణంగా పైరు దెబ్బతినింది. వేలాది రూపాయాలు పెట్టుబడులు వెచ్చించగా అధిక వర్షాలు, తెగుళ్ల కారణంగా దెబ్బతిని ఎకరాకు 3– 4 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాకపోడంతో రైతులు నష్టాల ఊబిలో కూరకపోయారు.ఈ ఏడాది ఆరంభంలోనే అడ్డంకులు..జిల్లాలో ఈ ఏడాది పప్పుశనగ సాగుకు సరైన అదును కాగా సాగుకు అడ్డంకులు వేధిస్తున్నాయి. విత్తనానికి ముందు రైతులు ఎకరాకు రెండు బస్తాల డీఏపీ ఎరువులను భూమిలో వేయాల్సి ఉంది. ఖరీఫ్ సీజన్లో రైతులను యూరియా కష్టాలు వేధించగా ఈ సీజన్లో డీఏపీ కష్టాలు తప్పడం లేదు. జిల్లాలోని ఆయా మండలాల్లో రైతులు గత కొన్నేళ్ల నుంచి శనగ పంటకు గోదావరి డీఏపీని విరివిగా వినియోగిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆ రకం డీఏపీ అందుబాటులో లేదు. రైతు సేవా కేంద్రాలు, మనగ్రోమోర్ కేంద్రాల్లో, సహకార పరపతి సంఘాల్లో గోదావరి డీఏపీ దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం బస్తా రూ. 1,430కు రైతులకు అందాల్సి ఉంది. దీన్ని ఆసరా చేసుకుని కొందరు ప్రైవేట్ డీలర్లు గోదావరి డీఏపీని అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. అలాగే జిల్లాకు 11,950 క్వింటాళ్ల సబ్సిడీ శనగలను ప్రభుత్వం కేటాయించింది. క్వింటాకు రూ. 7,800 ప్రభుత్వం ధర నిర్ణయించగా 25 శాతం సబ్సిడీతో రైతులకు రూ. 5,850 ప్రకారం సరఫరా చేయాల్సి ఉంది. విత్తన కేటాయింపులు తప్పా ఇప్పటి వరకు విత్తనాలు సరఫరా కాకపోవడంతో రైతులు విత్తనాల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది.రసాయన ఎరువులు దొరకడం లేదు ఈ ఏడాది 65 ఎకరాల సొంత పొలంతోపాటు ఎకరాకు రూ. 20 వేలు కౌలు చెల్లించి మరో పదిహేను ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. మొత్తం 80 ఎకరాల్లో తెల్ల, ఎర్ర శనగ సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. గోదావరి డీఏపీ దొరకడం లేదు. ఇతర రకాలకు చెందిన డీఏపీ వేద్దామనుకున్నా రైతుసేవా కేంద్రాల్లో వ్యవసాయ శాఖ సిబ్బంది ఎరువులు ఇవ్వడం లేదు.– గోవిందరెడ్డి, రైతు, గుంజలపాడు, కోవెలకుంట్ల మండలం50 శాతం సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలిఈ ఏడాది పప్పు శనగ సాగుకు ప్రభుత్వం 25 శాతం సబ్సిడీతో శనగ విత్తనాలను సరఫరా చేస్తోంది. క్వింటా రూ. 7,800 ధర నిర్ణయించి రూ. 5,850 ప్రకారం పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మూడు ఎకరాల సొంత పొలంలో ఈ ఏడాది శనగ సాగు చేయాలనుకుంటున్నాను. ప్రస్తుత మార్కెట్ క్వింటా రూ. 6 వేలలోపు ధర ఉంది. 25 శాతం సబ్సిడీ ఇచ్చినా మార్కెట్ధర ప్రకారం శనగలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. 50 శాతం సబ్సిడీతో శనగ విత్తనాలు సరఫరా చేసి ఆదుకోవాలి.– సుబ్బరాయుడు, రైతు, కోవెలకుంట్లసబ్ డివిజన్ సాధారణ సాగు విస్తీర్ణం విత్తన కేటాయింపులు(హెక్టార్లలో) (క్వింటాళ్లలో)కోవెలకుంట్ల 38,900 7,900నంద్యాల 5,000 2,125ఆళ్లగడ్డ 4,747 500ఆత్మకూరు 1,310 250నందికొట్కూరు 6,772 1,000డోన్ 570 175జిల్లాలో 57,299 హెక్టార్లలో సాగు లక్ష్యం -
వైభవంగా శ్రీశైలగిరి ప్రదక్షిణ
శ్రీశైలంటెంపుల్: పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. స్వామిఅమ్మవార్ల మహా మంగళహారతుల అనంతరం ఉత్సవమూర్తులను పల్లకీలో ఉంచి ప్రత్యేక పూజలు జరిపారు. పల్లకీ ఊరేగింపుతో శ్రీశైల గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం నుంచి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధర మండపం, అంకాళమ్మ గుడి, నందిమండపం, గంగాసదనం, బయలు వీరభద్రస్వామి ఆలయం, రింగ్రోడ్డు, ఫిల్టర్బెడ్, సిద్దరామప్ప కొలను, పుష్కరిణి వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి తిరిగి నందిమండపం, ఆలయ మహాద్వారం వద్దకు చేరుకుంది. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన అధికారులు, సిబ్బంది, పలువురు భక్తులు పాల్గొన్నారు. చట్ట పరిధిలో విచారించి న్యాయం చేస్తాం నంద్యాల: ప్రజలు ఇచ్చిన సమస్యలను చట్ట పరిధిలో విచారించి సత్వర న్యాయం చేస్తామని అడిషనల్ ఎస్పీ యుగంధర్బాబు అన్నారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు నుంచి ఆయన ఫిర్యా దులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, ఫిర్యాదు లు పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్నప్రసాద వితరణకు విరాళాలు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి పలువురు భక్తులు విరాళాలు అందించారు. సోమవారం గుంటూరుకు చెందిన దాత వీరశేఖరరావు రూ.1,00,116, కర్నూలుకు చెందిన దాత ఎల్.రమేష్బాబు రూ.1,01,101 విరాళాన్ని పర్యవేక్షకులు కె.శివప్రసాద్కు అందజేశారు. విరాళాలు అందించిన దాతలకు దేవస్థానం తరుఫున స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను, జ్ఞాపికను అందించి సత్కరించారు. నేడు కర్నూలుకు డీజీపీ కర్నూలు: ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్త మంగళవారం కర్నూలులో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 16వ తేదీన జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు డీజీపీ కర్నూలుకు వస్తున్నారు. ఈ మేరకు జిల్లా పోలీసు శాఖకు సమాచారం అందింది. ప్రధానమంత్రి పర్యటన నిమిత్తం వీవీఐపీలు, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పర్యటించనున్న నేపథ్యంలో ముందస్తు భద్రత ఏర్పాట్లపై డీజీపీ సమీక్షించనున్నారు. ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ సర్వజన వైద్యశాలల్లో పోస్టుల భర్తీకి ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసినట్లు కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 10 కేటగిరీల్లో పోస్టులు భర్తీ చేసేందుకు జూలై 7న నోటిఫికేషన్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఏడు కేటగిరీల్లో పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారి ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్లను https:// kurnool.ap.gov.in, https://kurnool medical college.ac.in వెబ్సైట్లలో అప్లోడ్ చేశామని తెలిపారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 8 నుంచి 10వ తేదీలోపు కర్నూలు మెడికల్ కాలేజీలో సాయంత్రం 5 గంటల్లోపు లిఖిత పూర్వకంగా సమర్పించాలని పేర్కొన్నారు. ఆన్లైన్లో పంపిన అభ్యంతరాలు స్వీకరించబోమని తెలిపారు. -
ఆశలు నీట మునిగి.. కన్నీళ్లు మిగిలి!
● కుండపోత వర్షం ● నీట మునిగిన పంటలు.. తడిచిన దిగుబడులు ● లబోదిబోమంటున్న రైతన్నలు హరినగరం సమీపంలో ఆరబెట్టిన మొక్క జొన్నలు తడిచిన దృశ్యంచిత్రేనిపల్లె సమీపంలో మొక్కజొన్న పొలంలో నుంచి పారుతున్న వాన నీరురుద్రవరం: అన్నదాతలను వరుణుడు ముంచేస్తున్నాడు. భారీ వర్షాలకు చేతికొచ్చిన పంటలు నీటి పాలవుతున్నాయి. 20 రోజులుగా కురిసిన వరుణుడు ఇక తెరిపి ఇచ్చాడులే అనుకుంటున్న తరుణంలో కుండపోత వర్షంతో రైతులు కుదేలయ్యారు. రుద్రవరం, చాగలమర్రి, దొర్నిపాడు, ఉయ్యాలవాడ మండలాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు ఉప్పొంగాయి. పంట పొలాల్లో నీళ్లు నిలిచాయి. మొక్కజొన్న రైతులకు కోలుకోలేని దెబ్బ పడింది. గత 20 రోజులుగా కురుస్తున్న వర్షం మూడు రోజులుగా తెరిపి ఇవ్వడంతో మండల కేంద్రమైన రుద్రవరం, టీ.లింగందిన్నె, ఆలమూరు, నర్సాపురం, అప్పనపల్లె, ఎల్లావత్తుల, కోటకొండ, ముకుందాపురం, హరినగరం, నక్కలదిన్నె, ముత్తలూరు తదితర గ్రామాల పరిధిలో మొక్కజొన్న కోతలు జోరుగా సాగాయి. దిగుబడులను ఆర్అండ్బీ రోడ్లు, కల్లాలు, బయలు ప్రదేశాల్లో ఆరబెట్టారు. హఠాత్తుగా వర్షం కురవడంతో ఆరబోసిన మొక్క జొన్నలు తడిచిపోవడంతో రైతులు నష్టపోయారు. ఆలమూరు వద్ద ఉన్న దొన్ల వాగుపై నీరు ఉద్ధృతంగా పారుతోంది. భారీ వర్షానికి మండలంలోని పలు గ్రామాల వద్ద వరి, మొక్కజొన్న, మిర్చి, మినుము, వేరుశనగ వంటి పంటలు నీట మునిగాయి. అలాగే మండల కేంద్రమైన రుద్రవరంతో పాటు పలు గ్రామాల్లోని లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. దొర్నిపాడు మండలంలో.. పత్తి, మినుము, కంది, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. పొలాల్లో తేమ శాతం అధికం కావడంతో ఈ పంటలన్నీ నీరుకుట్టు తీసుకుంటున్నాయని రైతులు వాపోతున్నారు. ఇటీవలే విత్తనపత్తి క్రాసింగ్ పనులు మొదలు కావడంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పింజలన్నీ నేలరాలుతున్నాయి. కుందూ పరీవాహక ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ సుభద్ర హెచ్చరించారు. జిల్లాలో మళ్లీ వర్షం నంద్యాల(అర్బన్): జిల్లాను వరుణుడు వీడటం లేదు. మూడు రోజులు తెరిపి ఇచ్చి మళ్లీ కురిశాడు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు పలు మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. చాగలమర్రి మండలంలో అత్యధికంగా 75.2 మి.మీ, వెలుగోడు మండలంలో అత్యల్పంగా 3.0 మి.మీల వర్షపాతం నమోదైంది. అదే విధంగా రుద్రవరంలో 70.2, పాములపాడు 43.6, జూపాడుబంగ్లా 43.2,ఆళ్లగడ్డ 33.6, దొర్నిపాడు 30.4, శిరువెళ్ల 19.2, పగిడ్యాల 14.4, ఉయ్యాలవాడ 10.0, కోవెలకుంట్ల 3.4 మి.మీల వర్ష పాతం నమోదైంది. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ముత్యాలపాడులో మొక్కగింజలను నీళ్లలో నుంచి బయటకు తీస్తున్న మహిళా రైతు భారీ వర్షం.. అపార నష్టం చాగలమర్రి: భారీ వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండలంలో 75.2 మి.మీ వర్షపాతం నమోదైంది. గొడిగనూరు, శెట్టివీడు గ్రామాల వద్ద భవనాశి, అడ్డువాగులు ఉద్ధృతంగా ప్రవహించాయి. బ్రాహ్మణపల్లె వద్ద వక్కిలేరు వాగు వంతెన మీదుగా ప్రవహించింది. ముత్యాలపాడు చెరువు నిండి అలుగు ఎక్కి పారడంతో గ్రామం జలమయమైంది. స్థానిక ఎస్పీజీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆరబెట్టిన మొక్కజొన్న గింజలు తడిచి పోయాయి. దిగుబడులను కాపాడుకునేందుకు రైతులు పాట్లు అన్నీ ఇన్నీ కావు. కళ్ల ముందు కష్టమంతా నీటి పాలవుతుండటంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. -
పీజీఆర్ఎస్లో అర్జీల వెల్లువ
నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం అర్జీలు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై ప్రజలు వినతులు అందజేశారు. 222 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు సమర్పించారు. ఎక్కువగా భూ సమస్యలు, రీ సర్వేపై వినతులు వచ్చాయి. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో డీఆర్ఓ రాము నాయక్, డిప్యూటీ కలెక్టర్లు, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరించా రు. అంతకుముందు జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలు నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాల్సినవి 2,017, రీఓపెన్ అయిన దర ఖాస్తులు 539 ఉన్నాయని, వాటిని గడువు ముగిసే వరకు వేచి చూడకుండా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ఫీడ్ బ్యాక్ స్వీకరణ తక్కువ శాతం ఉందని వేగవంతం చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని సంక్షేమ హాస్టళ్లు, సీ్త్ర శిశు సంరక్షణ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై సంబంధిత క్షేత్రాధికారులు తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. వినతుల్లో కొన్ని.. ● గోస్పాడు మండలం ఎం.చింతకుంట్ల గ్రామంలో సర్వే నెం.247, 232లో అనుభవంలో ఉన్న భూమిని కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నానని, ఆ భూమిని ఆన్లైన్లో ఎక్కించాలని కోరుతూ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు వినతి పత్రం అందజేశారు. ● ఆళ్లగడ్డ మండలం జి.జంబులదిన్నె గ్రామంలో సర్వే నెం.328/ఎ2లో రెండు ఎకరాలు, సర్వే నెం.328/బి2లో 0.40 ఎకరాలు సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నానని, కానీ ఆన్లైన్లో 2.20 ఎకరాలు మాత్రమే చూపుతోందని అందుకు తగు చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన బి.శ్రీరామ్ అర్జీ ఇచ్చారు. ● తన భర్త అనారోగ్యంతో మృతి చెందారని జీవనోపాధి కోసం వితంతు పింఛన్ మంజూరు చేయాలని పాణ్యం ఎస్సీ కాలనీకి చెందిన నెరవాటి పుల్లమ్మ వినతి పత్రం అందజేశారు. -
హృదయ విదారకం
కొలిమిగుండ్ల: చిన్నా .. పెద్దా వయస్సు తేడా లేకుండా గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయనేందుకు ఈ వ్యక్తి ఆకస్మిక మరణమే మరో నిదర్శనం. 35 ఏళ్ల వ్యక్తి గుండె ఆగిపోయింది. ఆరోగ్య సమస్యతో ఆసుపత్రికి వెళ్లేందుకు బస్టాప్లో బస్సు కోసం వేచి ఉన్న వ్యక్తి అందరూ చూస్తుండగానే గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన సోమవారం కొలిమిగుండ్లలో చోటు చేసుకుంది. గొర్విమానుపల్లెకు చెందిన చెన్నయ్య(35) జీవనోపాధి కోసం నెల రోజుల నుంచి కొలిమిగుండ్లలోని మోడల్ స్కూల్ సమీపంలోని కాలనీలో ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం గ్యాస్ ట్రబుల్ సమస్య అంటూ తాడిపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. బైక్లో వస్తుండగా మార్గమధ్యలో కిందపడిపోయాడు. స్థానికులు సపర్యలు చేయడంతో కోలుకుని ఇంటికి చేరుకున్నాడు. నంద్యాల సమీపంలోని ఆసుపత్రికి వెళ్లేందుకు సోమవారం కాలనీలోని ఓ వ్యక్తి సాయంతో బైక్పై తహసీల్దార్ కార్యా లయం సమీపంలోని బస్టాప్ వద్దకు వచ్చాడు. వెనుక భార్య రమాదేవి, తల్లి నడిచి వస్తున్నారు. కూర్చున్న చోట మరొక వ్యక్తితో మాట్లాడుతుండగానే చెన్నయ్య కు గుండెపోటు రావడంతో కుప్పకూలి మృతి చెందాడు. ఈలోగా భార్య, తల్లి అక్కడికి చేరుకుని బోరున విలపించారు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నా రు. కుటుంబీకుల రోదన పలువురిని కలిచివేసింది. -
ముగిసిన అహోబిల పవిత్రోత్సవాలు
ఆళ్లగడ్డ: ఎగువ అహోబిలంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహ ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు వైభవోపేతంగా ముగిశాయి. ఆదివారం తెల్లవారు జామున ప్రారంభమైన పూజలు సోమవారం ఉదయం పూర్ణాహుతితో ముగిశాయి. ముందుగా మూలమూర్తులు జ్వాలా నరసింహస్వామి, చెంచులక్ష్మీ అమ్మవార్లను సుప్రభాతసేవతో మేల్కొలిపి దివ్యదర్శనం అనంతరం నిత్యపూజలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ జ్వాలా నరసింహుడిని యాగశాలలో కొలువుంచి నవకళశాలతో అభిషేకించి నూతన పట్టు పీతాంబరాలతో అలంకరించి పవిత్ర హోమం నిర్వహించారు. సాయంత్రం గ్రామోత్సవం, రాత్రి నిత్యపూజ అనంతరం శాంతి హోమాలు నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి, అర్ధరాత్రి అనంతరం ఉత్సవమూర్తులైన స్వామి అమ్మవార్లకు తిరుమంజనం, సంప్రోక్షణ చేపట్టారు. సోమవారం తెల్లవారు జామున శాత్తుమురై గోష్టితో పవిత్రోత్సవ కార్యక్రమాన్ని ముగించారు. ఆయా కార్యక్రమాలను అహోబిలం ప్రధానార్చకులు శ్రీమాన్ శఠగోప వేణుగోపాలన్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన వేద పాఠశాలల పండితులు నిర్వహించారు. -
శాస్త్రోక్తంగా శేర్తి పూజ
ఆళ్లగడ్డ: నవనారసింహులు కొలువైన ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం అహోబిలంలోని నల్లమల అటవీ ప్రాతంలో కొలువైన శ్రీ మాలోల లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ఆదివారం శేర్తి పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అహోబిలం మఠం 46వ పీఠాధిపతి శ్రీవణ్ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో ఉద యం సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపారు. నిత్య పూజలు అనంతరం గద్య త్రయం విన్నవించారు. అనంతరం నిత్యం ఆరాధించే ఉత్సవమూర్తి స్వర్ణ మాలోల నరసింహస్వామిని మూలమూర్తితో ఉంచి ప్రత్యేక శేర్తి పూజలు నిర్వహించి స్వామివారిని ప్రత్యేకంగా ఆరాధించారు. అనంతరం శాత్తుమురై గోష్టి కార్యక్రమాలతో పూజలు ముగించారు. ఈ పూజలు ప్రధానార్చకులు కీడాంబి వేణుగోపాలన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. -
రైతుల అభ్యున్నతికి కృషి చేయాలి
నంద్యాల(వ్యవసాయం): రైతుల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా అన్నారు. ఆదివారం నంది రైతు సమాఖ్య రజతోత్సవ కార్యక్రమాన్ని రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. నంది రైతు సమాఖ్య ముఖ్య సలహాదారులు డాక్టర్ రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మాట్లాడుతూ.. రైతు సంఘాల కృషితో గోరుకల్లు రిజర్వాయర్ నిర్మాణం సాధ్యమైందని, అలాగే గిట్టుబాటు ధరల కోసం సమాఖ్య కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సిద్దేశ్వరం అలుగు నిర్మాణం ఆవశ్యకతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. డాక్టర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ 25 సంవత్సరాల పాటు నంది రైతు సమాఖ్య రైతు సంక్షేమానికి, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంత రైతుల అభ్యున్నతికి కృషి చేసిందన్నారు. ఎమ్మెల్సీ ఇసాక్బాషా మాట్లాడుతూ.. రైతులకు సరసమైన ధరలతో నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు అందించడానికి ప్రభుత్వం ముందుకు రావాలన్నా రు. రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేలా రైతు సమాఖ్య మరింత కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా నంది రైతు సమాఖ్య 25 ఏళ్ల ప్రత్యేక వార్షిక సంచికను అతిథులు, రైతులు, రైతు నాయకులు ఆవిష్కరించారు. అనంతరం వ్యవసాయ రంగంలో విశేష కృషి చేస్తున్న మహిళా రైతులు పద్మావతమ్మ, గోవిందమ్మను సత్కరించారు. సమాఖ్య నూతన అధ్యక్షునిగా బీవీ రామసుబ్బారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రైతు సమాఖ్య ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, కోఆర్డినేటర్ ఓబుళపతి, రైతు నాయకులు డాక్టర్ హయాగ్రీవచారి, రామసుబ్బారెడ్డి, శివరామకృష్ణారెడ్డి, శివారెడ్డి, అనుపూరు రామ సుబ్బారెడ్డి, రఫీ, హరినాథ్రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఆదినారాయణరెడ్డి, డీవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శ్రీశైలం డ్యాం గేట్ల మూసివేత
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గడంతో ఆదివారం సాయంత్రం డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్లను మూసివేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో జలాశయానికి భారీగా వరద ప్రవా హం చేరడంతో 10 రేడియల్ క్రస్ట్గేట్లను 26 అడుగుల మేర తెరచి దిగువకు నీటిని విడుదల చేశారు. గత కొద్దిరోజుల నుంచి వరద తగ్గుముఖం పడుతుండడంతో క్రమేపి గేట్ల ఎత్తును, సంఖ్యను తగ్గించుకుంటూ వచ్చారు. శనివారం నుంచి ఆదివారం వరకు జలాశయానికి 3,19,207 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేర గా దిగువ ప్రాంతాలకు 3,13,478 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. స్పిల్వే ద్వారా 2,35,088 క్యూసెక్కు లు, విద్యుత్ ఉత్పత్తి అనంతరం 70,555 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు విడుదల చేశారు. బ్యాక్ వాటర్ నుండి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 5,000 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,835 క్యూసెక్కుల నీటిని వదిలా రు. కుడిగట్టు కేంద్రంలో 15.450 మిలియన్ యూ నిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.955 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. ఆదివారం సాయంత్రానికి జలాశయంలో 210.9946 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
‘గంపెడు’ నష్టాలు!
కర్నూలు(అగ్రికల్చర్): నిన్న మొన్నటి వరకు ఉల్లి రైతుల కన్నీరు.. ఇప్పుడు టమాట రైతుల వేదన.. కూటమి ప్రభుత్వం రైతన్నల జీవితాలను రోడ్డు పడేస్తోంది. ఆరుగాలం కష్టించినా గిట్టుబాటు ధరలేక రైతులు దిగాలు చెందుతున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలకు, క్షేత్రస్థాయిలో చర్యలకు పొంతన లేకపోవడంతో రైతు నష్టాలను మూటకట్టుకుంటున్నాడు. టమాట కిలో ధర కనీసం రూ.8లకు తగ్గకుండా కొనుగోలు చేయాల్సి ఉన్నా.. ప్రస్తుతం రూ.2 కూడా దక్కని పరిస్థితి. 20 కిలోల టమాటకు లభిస్తున్న ధర రూ.50 మాత్రమే. టమాటకు మార్కెట్లో లభిస్తున్న ధరతో అమ్ముకుంటే కోత, రవాణా చార్జీలు, కమీషన్కే సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు. కర్నూలు జిల్లా లో పత్తికొండ, ఆస్పరి మండలం బిల్లేకల్, కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు, కర్నూలు మండలం గార్గేయపురంలో టమాట క్రయవిక్రయాలు సాగుతున్నాయి. నంద్యాల జిల్లాలో ప్యాపిలి, డోన్ మండలం చింతలపేట టమాట క్రయవిక్రయాలు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఆస్పరి, పత్తికొండ, పెద్దకడుబూరు, దేవనకొండ, క్రిష్ణగిరి, హాలహర్వి, హొళగుంద, వెల్దుర్తి, ఓర్వకల్, సీ.బెళగల్, గూడూరు మండలాలు, నంద్యాల జిల్లాలో ప్రధానంగా ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లో సాగవుతోంది. సీఎం ఆదేశాలు బేఖాతరు రైతులు తెచ్చిన టమాటను హోల్సేల్గా కిలో రూ.8 కంటే తక్కువకు కొనరాదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశించారు. ఈ ఆదేశాలు ఎక్కడా అమలుకు నోచుకోని పరిస్థితి. 25 కిలోల బాక్స్ను రూ.50 నుంచి రూ.80 ధరతో కొనుగోలు చేస్తున్నారు. అంటే కిలో ధర రూ.2 నుంచి రూ.3 వరకు మాత్రమే పలుకుతోంది. రెండు, మూడు రోజులుగా టమాట ధర మరింత దయనీయంగా మారింది. గత వైఎస్సార్సీపీ పాలనలో ధరలు పడిపోయినప్పుడు మార్కెటింగ్ శాఖ అధికారులు కిలో రూ.8కి తక్కువ లేకుండా కొనుగోలు చేశారు. ఇందుకు అనుగుణంగా వ్యాపారులు ధరలు పెంచారు. నేడు ఈ పరిస్థితి లేకపోవడం పట్ల రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. భారీగా నష్టపోతున్న టమాట రైతులు ఉమ్మడి జిల్లాలో 13,500 ఎకరాల్లో సాగు ధర పడిపోయినా స్పందించని సర్కారు రూ.8లకు కొనాలనే సీఎం ఆదేశాలు బేఖాతరు అనువుగాని చోట టమాట ప్రాసెసింగ్ యూనిట్ ఈ చిత్రంలోని రైతు పేరు లింగన్న. పత్తికొండ మండలం చిన్నహుల్తి గ్రామానికి చెందిన టమాట రైతు. శుక్రవారం మార్కెట్కు 30 గంపల టమాట తెచ్చారు. ఒక్కో గంప 20 కిలోలు ఉంటుంది. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం కనీస ధర రూ.8 ప్రకారం కొంటే గంపకు రూ.160 లభిస్తుంది. అయితే పత్తికొండ మార్కెట్లో 20కిలోల గంపకు లభించిన ధర రూ.50 మాత్రమే. అంటే కిలో టమాటకు లభించిన ధర రూ.2 మాత్రమే. ఒక ఎకరాలో టమాట సాగు చేశారు. పెట్టుబడి రూ.60 వేల వరకు వచ్చింది. కొద్ది రోజులుగా మార్కెట్కు టమాట తీసుకొస్తున్నా ఒక్క రోజు కూడా రూ.8 ధర లభించలేదు. టమాట పంటకు కూడా ఎకరాకు రూ.20 వేల ప్రకారం పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నాడు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 13,500 ఎకరాల్లో టమాట సాగయింది. ఈ–క్రాప్ బుకింగ్ ప్రకారం కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 3,990 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 3,312 ఎకరాల్లో సాగయింది. ఈ–క్రాప్ బుకింగ్ ఇంకా కొనసాగుతుండటంతో టమాట సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. ఉద్యాన శాఖ అధికారుల అంచనాల ప్రకారం ఎకరాకు 15 టన్నుల ప్రకారం దిగుబడి వస్తోంది. ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన టమాట నుంచి దాదాపు 2 లక్షల టన్నులు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ప్రతి రోజు 300 టన్నుల టమాట మార్కెట్కు వస్తోంది. -
విక్రయాలను అడ్డుకోవాలి
గంజాయి, డ్రగ్స్ రవాణా, విక్రయాలను అధికారులు అడ్డుకోవాలి. నంద్యాలలో ఇంజినీరింగ్, మెడికల్, డిగ్రీ, బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్లో చదువుకోడానికి పలు జిల్లాల నుంచి యువత వస్తోంది. యువకులనే కేంద్రంగా చేసుకొని గంజాయి వ్యాపారులు గంజాయిని పట్టణంలో అమ్ముతున్నారు. పోలీసులు విస్తృత దాడులు చేసి ముఠా ఆట కట్టించాలి – రాజునాయుడు, ఆర్వీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, నంద్యాల పోలీసు, ఎకై ్సజ్ శాఖ అధికారులు మత్తు పదార్థాలతో కలిగే నష్టాలపై యువతకు అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలం అయ్యారు. తూతూ మంత్రంగా కాకుండా ప్రధాన కూడళ్లు, కళాశాలలు, పాఠశాలల వద్ద అవగాహన కలిగేలా ప్లెక్సీలు ఏర్పాటు చేయాలి. పోలీసులు కాలేజీలు, గ్రామ శివారులు, నిర్మానుష్య ప్రాంతాలో నిఘా ఉంచాలి. తల్లిదండ్రులు తమ పిల్లలపైనే నిఘా ఉంచి పక్కదారి పట్టకుండా బాధ్యతగా ఉండాలి. మత్తు పదార్థాలపై విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు అవగాహన సదస్సులు కల్పించాలి. – నాగరాముడు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి, నంద్యాల -
శ్రీగిరికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకు న్నారు. వేకువజామున పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి క్యూలైన్లలో బారులుదీరారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండి పోయాయి. భక్తుల శివ నామ స్మరణతో శ్రీశైల ఆలయం మారుమోగింది. గోస్పాడు: వైద్యుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పీహెచ్సీ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అంకిరెడ్డి అన్నారు. పీహెచ్సీల వైద్యులు డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ఆ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అంకిరెడ్డి మాట్లాడుతూ.. పీహెచ్సీ వైద్యుల సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎంతో కాలంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ప్రభు త్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ఓకే క్యాడర్లో పని చేస్తున్న సంబంధిత వైద్యులకు ఎలాంటి ప్రమోషన్లకు నోచుకోగా అవస్థలు పడాల్సి వస్తుందన్నారు. ఇన్ సర్వీస్ పీజీ కోటా పునరుద్ధరించాలని, టైమ్ బౌండ్ ప్రమోషన్లు అమలు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి బేసిక్ పే 50 శాతం ట్రెబల్ అలవెన్స్, నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరారు. నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 29న సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam. ap.gov.in వెబ్సైట్లో, టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రశాంతంగా ఏపీపీ రాత పరీక్షలు కర్నూలు (టౌన్): పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) రాత పరీక్షలు ప్రశాంత వాతవరణంలో జరిగాయి. నగరంలోని జి. పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాలలో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలకు కర్నూలులో 261 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తనిఖీ చేశారు. ఎస్పీ వెంట ఏఎస్పీ హుస్సేన్ పీరా, కర్నూలు తాలూకా సీఐ తేజమూర్తి ఉన్నారు. -
జాడలేని బట్టమేక పక్షి
● వాతావరణంలో మార్పులే కారణమా ?నందికొట్కూరు: ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో అరుదైన బట్టమేక పక్షి.. రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి కొన్ని నెలల పాటు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ పక్షులు ఇక్కడే గుడ్లు పెడుతుంటాయి. అయితే ఈ ఏడాది ఇంత వరకు అభయారణ్యంలో బట్టమేక పక్షుల జాడ కనిపించలేదని అధికారులు చెబుతున్నారు. వీటితో పాటు సుమారు 80 నుంచి 100 పక్షి జాతులు ఇక్కడికి వస్తుంటాయి. కొల్లేరు ప్రాంతంలో అరుదుగా కనిపించే ఫ్లవింగ్ బర్డ్స్ కూడా ఇక్కడికి వస్తాయి. ఈ ఏడాది అధిక వర్షాలు కురవడం, వాతావరణంలో మార్పులు రావడంతో కొన్ని పక్షులు సమయానికి రాలేదని తెలుస్తోంది. అందువల్లే బట్టమేక పక్షి కూడా రావడానికి ఆలస్యం అయ్యి ఉంటుందన్నా రు. పక్షి జాతులపై అధ్యయనం చేయడానికి చైన్నె, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి శాస్త్రవేత్తలు, జంతు ప్రేమికులు ప్రతి శని, ఆదివారాల్లో వస్తుంటారు. వచ్చిన వారికి వసతి కోసం రెండు గదులు ఉన్నాయి. మరిన్ని వసతులు కల్పిస్తే పక్షులను, జింకలను చూసేందుకు జంతు ప్రేమికులు, పాఠశాలల విద్యార్థులు వచ్చే అవకాశం ఉంది. పక్షులను చూసేందుకు అభయారణ్యంలోకి వెళ్లాలంటే తప్పని సరిగ్గా ఉన్నతాధికారుల అనుమతులు ఉండాలని అధికారులు తెలిపారు. -
నువ్వు చాలా అందంగా ఉన్నావ్..
సాక్షి, నంద్యాల: ఆమె భర్తను కోల్పోయిన ఒంటరి మహిళ. దీంతో ఆ సీఐ కన్నుపడింది. ‘‘నువ్వు చాలా అందంగా ఉన్నావ్..! నిన్ను, నీ పిల్లలను బాగా చూసుకుంటాను’’ అంటూ మాటలు కలిపాడు. లోబర్చుకునేలా పొగిడాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు పెట్టించుకున్నాడు. ఇప్పుడు నీతో సంబంధమే లేదు పో అంటూ తిరస్కరిస్తున్నాడు. దీంతో నంద్యాల పట్టణంలోని మూలసాగరానికి చెందిన బాధితురాలు శనివారం మీడియా ముందుకు వచ్చి గోడు వెళ్లబోసుకుంది.ఆమె చెప్పిన వివరాలు... ‘‘నా భర్త రైల్వే ఉద్యోగిగా పనిచేస్తూ 14 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో నాకు రైల్వేలో ఉద్యోగం ఇచ్చారు. నంద్యాల త్రీటౌన్ సీఐ కంబగిరి రాముడుది మా ఊరే. 8 నెలల క్రితం ఫోన్లో పరిచయమయ్యారు. సొంత ఊరి వారవడంతో అరమరికలు లేకుండా మాట్లాడాను. ఖాళీగా ఉంటే స్టేషన్ వద్దకు రా అంటూ పిలిచేవారు. ఈ విధంగా మా మధ్య చనువు ఏర్పడింది. అయితే, సీఐ మభ్యపెట్టి నా వీడియోలు, ఫొటోలు తీశారు. వీటిని చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. లైంగికంగా వేధిస్తున్నారు. సీఐపై చర్యలు తీసుకోవాలని కర్నూలు డీఐజీ, నంద్యాల జిల్లా గత ఎస్పీకి పలుసార్లు ఫిర్యాదు చేసినా వారు ఆయనకే వత్తాసు పలికారు.’అనిఆవేదన వ్యక్తం చేసింది.పిల్లల్ని చంపేస్తా.. గంజాయి కేసు పెడతానా వ్యక్తిగత వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని, నన్ను, నా పిల్లలను చంపేస్తానని, గంజాయి కేసు పెడతానని సీఐ బెదిరించారు. నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారని గత ఎస్పీకి ఫిర్యాదు చేశా. ఆ తర్వాత ‘‘నీ ఫొటోలు అన్నీ డిలీట్ చేయించా. సీఐ ఇక నీ జోలికి రాడు. ఆయనపై కేసు పెట్టొద్దు అని డీఎస్పీ తెల్లకాగితంపై సంతకం చేయాలని ఒత్తిడి చేశారు.నేను కర్నూలు డీఐజీని కలిసేందుకు వెళ్లి... సీఐ పేరు చెప్పగానే ఇక్కడినుంచి వెళ్లు, ఏమైనా ఉంటే అక్కడ తేల్చుకో అని కసురుకుని పంపించేశారు. సీఐ కారణంగా మానసికంగా కుంగిపోయా. ఎప్పుడు ఏం చేస్తారోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నా. కూటమి ప్రభుత్వంలో మహిళలకు న్యాయం జరగడం లేదు’’ అని బాధితురాలు వాపోయింది. కాగా, మహిళ ఆరోపణలపై సీఐ కంబగిరిరాముడును ఫోన్లో వివరణ కోరగా స్పందించలేదు. -
టీడీపీ అరాచకాలను అడ్డుకుంటాం
● ఉనికి కోల్పోతామనే భయంతోనే టీడీపీ నాయకుల దాడులు ● రౌడీషీటర్కు పోలీసుల అండదండలు! ● మాజీ ఎమ్మెల్యేకాటసాని రామిరెడ్డికోవెలకుంట్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉన్న కలుగొట్ల గ్రామంలో రాబోయే రోజుల్లో తమ ఉనికి కోల్పోతామనే భయంతో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ అరాచకాలను అడ్డుకుంటామన్నారు. శుక్రవారం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెద్దగుర్రప్ప, తలారి శ్రీనివాసులు, నడిపిగుర్రప్ప, చిన్నగుర్రప్ప, గడ్డం బ్రహ్మానందరెడ్డి, బూస సుధాకర్రెడ్డి, మగ్బుల్పై ఇదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గడ్డం నాగార్జునరెడ్డి తన అనుచరులతో కర్రలు, రాడ్లతో దాడి చేసి గాయపరిచారు. ఈ మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కాటసాని పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వైఎస్సార్సీపీకి పట్టు ఉన్న గ్రామంలో ఆధిపత్యం కోసం పోలీసు రికార్డుల్లో రౌడీషీటర్గా ఉన్న నాగార్జునరెడ్డి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి చేశారన్నారు. రౌడీషీటర్గా ఉన్న టీడీపీ నాయకుడిని పోలీసులు గడిచిన 15 నెలల కాలంలో ఏ రోజు పోలీస్స్టేషన్కు పిలువలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ అధికారంలో ఉందని, తామేమి చేసినా అడిగేవారు ఉండరన్న అహంభావంతో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీషీటర్ అండతోనే గ్రామంలో బహిరంగంగా బెల్ట్షాపు ద్వారా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయన్నారు. బస్టాండ్ ప్రాంతంలో తెల్లారకముందే మద్యం బాటిళ్లు అమ్ముతున్నా స్థానిక, ఎకై ్సజ్ పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కూరగాయలు, పాలు తెచ్చుకునేందుకు వెళుతున్న మహిళలను దుర్భాషలాడుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో ఎక్కడా ఎలాంటి ఘర్షణలు, గొడవలు చోటు చేసుకోకుండా ప్రజలు ప్రశాంత జీవనం గడిపారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అరాచకాలు సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. వైఎస్సార్ కార్యకర్తలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడి ఘటనను డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లామని, ఎస్పీని కలిసి వివరిస్తామన్నారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బీవీ నాగార్జునరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు సిద్ధంరెడ్డి రాంమోహన్రెడ్డి, చిక్కేపల్లి ప్రసాదరెడ్డి, రాచంరెడ్డి రాంభూపాల్రెడ్డి, రాజారెడ్డి, పోతం రాంమోహన్రెడ్డి, ఉప్పరి సుబ్బరాయుడు, రాంభూపాల్రెడ్డి, జశ్వంత్రెడ్డి పాల్గొన్నారు. -
కష్టాలే పెట్టుబడి.. నష్టాలే దిగుబడి!
కోవెలకుంట్ల: మొక్కజొన్న సాగుతో గతేడాది నష్టాలు చవి చూసిన రైతులకు ఈ ఏడాది సాగు కలిసి రాలేదు. గత ఖరీఫ్లో చోటు చేసుకున్న నష్టాన్ని పూడ్చుకునేందుకు ఈ ఏడు లక్ష్యాన్ని మించి సాగు చేసినా నిరాశే మిగిలింది. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 54,150 హెక్టార్లలో మొక్కజొన్న సాగు సాధారణ విస్తీర్ణం కాగా ఆయా మండలాల పరిధిలో 55,408 హెక్టార్లలో సాగైంది. విత్తనానికి ముందు విస్తారంగా వర్షాలు కురియడంతో సాగుకు అనుకూలంగా మారింది. బోర్లు, బావులు, చెరువులు, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, తదితర సాగు నీరు వనరులు అందుబాటులో ఉండటంతో లక్ష్యానికి మించి సాగైంది. విత్తనం వేశాక వరణుడు ముఖం చాటేయడం, పైరు వివిధ దశల్లో తెగుళ్లు, పుప్పడి దశలో వేసవిని తలపించేలా ఎండలు, పంట చేతికందే తరుణంలో అధిక వర్షాలు మొక్కజొన్న రైతులను వెంటాడటంతో రైతులు కుదేలయ్యారు. జిల్లాలో ప్రస్తుతం మొక్కజొన్న కోత, నూర్పిడి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నష్టాల మూట! గత ఏడాది జిల్లాలోని 29 మండలాల పరిధిలో 45,200 హెక్టార్లలో మొక్కజొన్న సాగు సాధారణ విస్తీర్ణం కాగా ఆయా మండలాల్లో 54 వేల హెక్టార్లలో సాగు చేశారు. 105 నుంచి 110 రోజులు పంటకాలం కాగా పైరు ఆరంభంలో వర్షాభావం, పంట చేతికందే తరుణంలో తుఫాన్ వెంటాడి దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపాయి. పైరు కంకిదశలో ఉండగా గత ఏడాది అక్టోబర్ నెలలో తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసి పంట దెబ్బతిని దిగుబడులు తగ్గాయి. విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కోత, నూర్పిడి, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 25వేల నుంచి రూ. 30 వేలు వెచ్చించారు. ఎకరాకు 22 నుంచి 30 క్వింటాళ్లలోపే దిగుబడులు రావడంతో నష్టాల ఊబిలోకూరకపోయారు. మార్కెట్లో క్వింటా రూ. 2,200 మించి పలకపోవడంతో నష్టాలు మూటగట్టుకున్నారు. ఈ ఏడాది మిరపకు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగు చేసినా రైతులకు కష్టాలు తప్పలేదు. క‘న్నీటి’కష్టాలు ఈ ఏడాది కోటి ఆశలతో మొక్కజొన్న సాగు చేసిన రైతులకు విత్తనం వేసినప్పటి నుంచి అష్టకష్టాలు తప్పలేదు. తొలుత సాగునీటిని మళ్లించుకునేందుకు అవస్థలు పడ్డారు. ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, కుంటలు, చెరువులకు డీజల్ ఇంజిన్లు అమర్చుకుని ఐదు నుంచి ఏడు తడులు సాగునీటిని అందించారు. ఒక్కో తడి సాగునీటి మళ్లింపుకు డీజిల్ ఇంజిన్లు, పైపులు, డీజల్, కూలీ ఖర్చుల రూపంలో రూ. 5 వేలు అదనపు భారం పడింది. వర్షాభావానికి తోడు పైరు పుప్పడి దశలో వేసవికాలాన్ని తలపించేలా ఎండలు మండటంతో మొక్కజొన్న కంకి కట్టక దిగుబడులపై ప్రభావం చూపింది. వీటికి తోడు కొన్ని చొట్ల పైరుకు ఎండు తెగులు, కత్తెర పురుగు ఆశించడంతో వాటి నుంచి పైరును కాపాడుకునేందుకు రైతులు వ్యయ ప్రయాసలు ఎదుర్కొన్నారు. ఎకరాకు 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడులు వస్తాయనుకుంటే వర్షాభావం, పుప్పడి రాలిపోడం, తెగుళ్లతో ఎకరాకు 20 నుంచి 22 క్వింటాళ్లకే దిగుబడులు పరిమితమయ్యాయి. కోత, నూర్పిడి పనులు ప్రారంభం కాగా అల్పపీడన ప్రభావంతో ఇటీవల కురుస్తున్న వర్షాలతో రైతులు అల్లాడిపోతున్నారు. రోడ్లపై, కల్లాల్లో ఆరబెట్టిన దిగుబడులు తడిచి పోతుండటంతో వర్షానికి పైరు నేలవాలడంతో రైతులకు వరుస కష్టాలు తప్పలేదు. వేలాది రూపాయలు పెట్టుబడుల రూపంలో వెచ్చించగా దిగుబడులు తగ్గిపోయా మరోవైపు రైతులను గిట్టుబాటు ధర వేధిస్తోంది. ప్రస్తుత మార్కెట్లో క్వింటా రూ. 2 వేల లోపే ధర ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నియోజకవర్గం సాగు విస్తీర్ణం (హెక్టార్లలో) నందికొట్కూరు 28,465 ఆళ్లగడ్డ 9,334 బనగానపల్లె 7,766 శ్రీశైలం 5,570 డోన్ 1,735 నంద్యాల 1,202 పాణ్యం, గడివేముల 1,336 రెండో ఏడాది కలిసి రాని మొక్కజొన్న సాగు ఎకరాకు రూ. 35 వేల పెట్టుబడి 20 నుంచి 22 క్వింటాళ్లకే దిగుబడి లభించని గిట్టబాటు ధర అన్నదాతకు మిగిలింది కన్నీరే! -
ఘనంగా బీఎస్ఎన్ఎల్ రజతోత్సవాలు
కర్నూలు(హాస్పిటల్): భారత సంచార నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం కర్నూలు నగరంలో సంస్థ ఆధ్వర్యంలో రజతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ జి.రమేష మాట్లాడుతూ బీఎస్ఎన్ఎల్ 2000 అక్టోబర్ 1న ప్రభుత్వ రంగ సెక్టార్ యూనిట్గా రూపుదిద్దుకున్నప్పటి నుంచి ప్రజలకు చేరువగా మారుమూల గ్రామాలకు కాపర్ ద్వారా ల్యాండ్లైన్, బ్రాండ్ బాండ్ సేవలను అందిస్తోందన్నారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పూర్తి ఫైబర్ టెక్నాలజీ ద్వారా వాయిస్, హై స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తోందన్నారు. ప్రపంచంలోనే స్వదేశీ టెక్నాలజీని ఉపయోగిస్తున్న ఆరవ అతి పెద్ద సంస్థగా బీఎస్ఎన్ఎల్ రూపుదిద్దుకుందన్నారు. వినియోగదారులు తమ పాత సిమ్కార్డులను 4జీ సిమ్లుగా మార్చుకోవాలన్నారు. సిల్వర్ జూబ్లీ సందర్భంగా సరసమైన ధరలతో ప్రవేశపెట్టిన నూతన ప్లాన్లను వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ సాయినాథ్, ఏజీఎంలు వి.శ్రీను నాయక్, దేవచంద్ నాయక్, లక్ష్మనాయక్, మురళీకృష్ణ, నారాయణస్వామి, వి.జాన్సన్, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. -
● రైతు కష్టం జీవాలపాలు!
సి.బెళగల్: ఉల్లి రైతుల కష్టం అంతా ఇంతా కాదు. నాటు వేసినప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన ఉల్లి పంట.. చేతికొచ్చిన తర్వాత ధర లేకపోవడంతో దిక్కుతోచక జీవాలకు వదిలేస్తున్నారు. మండలంలోని ఇనగండ్ల గ్రామానికి చెందిన రైతు ఇమ్మానియేలు ఎకరన్నర పొలంలో ఉల్లి సాగు చేశాడు. పంట చేతికి రావడంతో కోత కోయించేందుకు సిద్ధమయ్యాడు. ఈక్రమంలో మార్కెట్లో ధర పూర్తిగా పడిపోయింది. మరోవైపు కోతకు కూలీ, గ్రేడింగ్, రవాణా ఖర్చులతో మరింత అప్పులపాలు కావాల్సి వస్తుందని ఆందోళన చెంది జీవాలకు వదిలేశాడు. తన రెక్కల కష్టం జీవాలకు మేతగా మారడం చూసి రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఉల్లి రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. -
నేడు అశ్వాల పారువేట
● కొనసాగుతున్న యాదవరాజ వంశీయుల సంప్రదాయం ● సైనికులుగా మద్ది కులస్తులు మద్దికెర: రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి.. కానీ ఆనాటి సంప్రదాయాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. యాదవ రాజ వంశంలోని పెద్దనగిరి, చిన్ననగిరి, యామనగిరి కుటుంబీకులు అశ్వాల పారువేట ఉత్సవాన్ని మూడు శతాబ్దాల నుంచి కొనసాగిస్తున్నారు. ఏటా విజయదశమి రోజున గుర్రాలపై స్వారీ చేయడం వీరి ఆచారం. అందులో భాగంగా గురువారం ఉత్సవాలు నిర్వహించడానికి సిద్ధం చేసుకున్నారు. భోగేశ్వరాలయం నుంచి.. పూర్వం యాదవ వంశాలు రాజ్యాలను ఏలిన విజ యం విదితమే. అందులో భాగంగా ఆయా యాదవ వంశీయుల కుటుంబాలు తమ పూర్వీకుల నుంచి వస్తున్న గురప్రు స్వారీ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఒక్కో కుటుంబం నుంచి రెండు, మూడు గుర్రాలను స్వారీకి అనుమతిస్తుండటంతో ఆయా కుటుంబాలు విజయదశమికి నెల రోజుల ముందు నుంచే గుర్రాలు సమకూర్చుకుని శిక్షణ ఇస్తారు. పండుగ రోజు వారు తలపాగ ధరించి రాచరికపు వస్త్రాలతో ఖడ్గాలు ధరించి గుర్రాలపై మేళ తాళాలతో మండల కేంద్రానికి 3 కి.మీ దూరంలోని బొజ్జనాయినిపేట గ్రామంలో ఉన్న భోగేశ్వర ఆలయానికి చేరుకుంటారు. వీరికి సైనికులుగా ‘మద్ది’ కులస్తులు ఆయుధాలు ధరించి వెంట నడుస్తారు. ఆలయంలోని స్వామి వారికి పూజలు నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి మద్దికెరకు గుర్రాల స్వారీ ప్రారంభిస్తారు. విజయం సాధించిన వారిని భాజాభజంత్రీలతో మొదట ఊరేగిస్తారు. అనంతరం యాదవ రాజ వంశీకుల కుటుంబాలు గుర్రాలపై ప్రధాన రహదారిలో తమ రాచఠీవిని ప్రదర్శిస్తారు. ఈ వేడుకలను ప్రజలకు ఎంతో ఆశక్తితో తిలకిస్తారు. -
నిలిచిపోయిన రహదారి పనులు
● ఇబ్బందుల్లో 5 గ్రామాల ప్రజలు బేతంచెర్ల: మండల పరిధిలోని వెంకటగిరి గ్రామం నుంచి సీతారామాపురం, శంకరాపురం, బైనపల్లె మీదుగా యంబాయి, మండ్లవానిపల్లె గ్రామం వరకు చేపట్టిన పనులు నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వైఎస్సార్సీపీ హయాంలో ఈ రహదారికి రూ.8.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కాంట్రాక్ట్ దక్కించుకున్న మేఘా సంస్థ వెంకటగిరి గ్రామం నుంచి సీతారామాపురం వరకు రహదారి పనులు పూర్తి చేసింది. అంతలో సార్వత్రిక ఎన్నికలు రావడం, ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో అప్పటి నుంచి శంకరాపురం, బైనపల్లె మీదుగా యంబాయి, మండ్లవానిపల్లె వరకు చేయాల్సిన పనులు కాంట్రాక్టర్ నిలిపేశారు. ఇప్పటికి ఏడాదిన్నర గడిచిపోయినా పనులు ప్రారంభించకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 35 ఏళ్ల క్రితం నిర్మించిన శంకరాపురం బ్రిడ్జి సైతం ప్రమాదకరంగా ఉండటంతో అధికారులు స్పందించి మధ్యలో నిలిచిపోయిన పనులను పూర్తి చేయించాలని కోరుతున్నారు. -
అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు
అవుకు(కొలిమిగుండ్ల): బనగానపల్లె నుంచి అవుకు మండలం మంగంపేట తండాకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బుధవారం మార్గమధ్యంలో అదుపుతప్పి పక్కకు ఒరిగిపోయింది. బస్సులో 25 మందికి పైగానే ప్రయాణికులు ఉన్నారు. అయితే ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ఏమీ కాక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దసరా పండుగ కావడంతో ప్రజలు నిత్యావసర సరుకులు,ఇతర వస్తువులను బనగానపల్లెలో తీసుకొని బస్సులో బయలుదేరారు. బస్సు కృష్ణగిరి మెట్ట మీదుగా మంగంపేటకు ప్రయాణించే సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పి పక్కకు ఒరిగింది. -
అనారోగ్యంతో ఆర్మీ జవాన్ మృతి
పగిడ్యాల: జ మ్మూ కశ్మీర్లో ఆర్మీ జవాన్గా విధులు నిర్వ హించే పగిడ్యాల వాసి శెట్టిమాన్ తిక్కస్వామి(35) వారం రోజులు గా అనారోగ్యం బారినపడి ఢిల్లీ ఆర్ఆర్ హస్పిటల్లో చికిత్స పొందుతూ కోలు కోలేక బుధవారం మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆర్మీలో 14 ఏళ్ల సర్వీస్ను పూర్తి చేసుకుని ఇటీవల మళ్లీ 8 ఏళ్ల సర్వీస్ను పొడిగించుకుని ఢిల్లీలో పరేడ్కు హాజరై బీపీ లెవెల్స్ పడిపోయి అనారోగ్యానికి గురయ్యాడని వెల్లడించారు. మృతునికి భార్య సుభాషిణి, కుమారులు నిక్షిత్, షణ్ముఖ్ ఉన్నారు. గురువారం స్వగ్రామం పగిడ్యాలలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. -
సంప్రదాయ సమరానికి ‘సై’
దేవరగట్టు హొళగుంద మండలం నెరణికి గ్రామ సమీపంలోని దేవరగట్టుపై వెలసిన మాత మాళమ్మ, మల్లేశ్వర స్వామి అమ్మవార్ల ఉత్సవాలు విజయదశమి రోజున వైభవంగా జరుగుతాయి. అదే రోజు అర్ధరాత్రి నిర్వహించే స్వామి అమ్మవార్ల కల్యాణం తర్వాత జరిగే బన్ని ఉత్సవంలో ఘర్షణలకు తావులేకుండా కలిసి కట్టుగా జరుపుకుందామని దేవరగట్టు సమీపంలోని నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు చెరువుకట్ట (డొళ్లిన బండే)వద్దకు చేరి పాలబాసలు తీసుకుంటారు. అనంతరం కల్యాణానికి వస్తున్నట్లు గ్రామపెద్దలు పోలీసులకు బండారాన్ని ఇస్తారు. జౌట్లు పేల్చీ ఇనుప తొడుగులు, రింగు కర్రలు, అగ్గి కాగడాలు చేతపట్టి డోలు, మేళతాళాలతో నిమిషాల్లో కొండ(గిరి)పైకి చేరుకుంటారు. అక్కడ మాత మాళమ్మ, మల్లేశ్వర ఉత్సవ విగ్రహాలకు పురోహితులు, వేదపండితులు కల్యాణం జరిపిస్తారు. అనంతరం అర్ధరాత్రి ఉత్సవ మూర్తులతో జెత్రయాత్ర ప్రారంభమవుతుంది. నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెర తండా, కురుకుంద, లింగంపల్లి తదితర గ్రామాల భక్తులు మొగలాయిలో పాల్గొంటారు. ఈక్రమంలో భక్తుల చేతుల్లో ఉన్న కర్రలు తగిలి పలువురికి గాయాలవుతాయి. మాళ మాళమ్మ, మల్లేశ్వరుని విగ్రహాలను మల్లప్ప గుడిలో కొద్ది సేపు కొలువుంచి తిరిగి ఉత్సవ విగ్రహాలను పల్లకీతో ఊరేగింపుగా జైత్రయాత్రను కొనసాగిస్తారు. భవిష్యవాణిపై నమ్మకం శమీ వృక్షం నుంచి విగ్రహాలు బసవన్న గుడికి చేరుకోవడంతో ఆలయ పూజారి గిరిస్వామి భక్తులకు భవిష్యవాణి వినిపిస్తారు. ఆ సమయంలో అందరూ ఒక్కసారిగా మొగలాయిని నిలిపేసి నిశ్శబ్దాన్ని పాటిస్తారు. రాబోయే కాలంలో వాణిజ్య పంటల ధరలు, ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయాలు తదితర పరిస్థితులను పూజారి వివరిస్తారు. అనంతరం పూజారి బహుపరాక్... గోపరాక్ అనగానే విగ్రహాలు సింహాసన కట్ట వైపు ఊరేగింపుగా బయలుదేరుతాయి. విగ్రహాలు సింహాసన కట్టకు చేరుకోవడంతో జైత్రయాత్ర ముగుస్తుంది. జంతువుల నుంచి రక్షణకే.. పురాతన కాలంలో దసరా బన్ని ఉత్సవాలు జరుపుకోవడానికి దూర ప్రాంతాల నుంచి భక్తులు దేవరగట్టు మాళ మల్లేశ్వస్వామి కొండకు తరలి వచ్చే సమయానికి చీకటయ్యేది. అప్పట్లో విద్యుత్, రవాణా సదుపాయాలు లేకపోవడంతో విషపురుగులు, జంతువుల భారీ నుంచి రక్షణ పొందేందుకు దివిటీటులు, మారణాయుధాలు చేత పట్టుకుని కొండపైకి వెళ్లి స్వామి వారి కల్యాణాన్ని నిర్వహించేవారు. కొందరు వ్యక్తిగత కక్షలతో చీకట్లో జరిగే ఊరేగింపులో రింగుకర్రలు, దివిటీలు, మారణాయు ధాలతో తమ ప్రత్యర్థులపై దాడులు చేసి పగ తీర్చుకునేవారు. ఇది కాలక్రమంలో కర్రల సమరంగా ముద్ర పడిపోయింది. హెల్త్ క్యాంప్ ఏర్పాటు ఉత్సవంలో గాయపడిన భక్తులకు దేవరగట్టులో భారీ ఎత్తున హెల్త్ క్యాంప్ను ఏర్పాటు చేయనున్నారు. డీఎంఅండ్హెచ్ఓ ఆధ్వర్యంలో 10 మంది డాక్టర్లు, ఆర్థోపెడిక్ సర్జన్, జనరల్ సర్జన్తో పాటు 100 మంది సిబ్బందితో వైద్య సేవలు అందించనున్నారు. వాటర్ ప్రూప్ టెంట్లో వందకు పైగా మంచాలు, మెడిసిన్, ఇతర అత్యవసర చికిత్సకు కావాల్సిన మందులు, పరికరాలతో పాటు 108, 104 అంబులెన్స్లు అందుబాటులో ఉంచనున్నారు. విజయ దశమి రోజున అర్ధరాత్రి సాగనున్న సంప్రదాయ సమరానికి దేవరగట్టు సర్వం సిద్ధమైంది. స్వామి అమ్మవార్ల జైత్రయాత్ర సందర్భంగా బన్ని ఉత్సవం పేరుతో జరిగే కర్రల సమరాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలమూలల నుంచే గాక పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికారులు వెయ్యి మందితో పోలీసు బందోబస్త్ను ఏర్పాటు చేశారు. – హొళగుంద ఆలూరు నియోజకవర్గ ప్రజలకు దసరా శుభకాంక్షలు. ప్రతి ఒక్కరూ దేవరగట్టు బన్ని ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి. ఆచారాలను, సంప్రదాయాలను గౌరవిస్తూనే పండుగను భక్తితో నిర్వహించుకుని, సంతోషంగా ఇంటికి చేరాలి. ఉత్స వాల్లో పాల్గొనే నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులతో పాటు దేవరగట్టు చుట్టు పక్కల గ్రామస్తులు బన్ని ఉత్సవం సమరం కాదు సంప్రదాయ పండుగని సమాజానికి చాటి చెబుదాం. – బుసినే విరూపాక్షి, ఆలూరు ఎమ్మెల్యే -
డ్రోన్ కెమెరాల నిఘాలో బన్ని ఉత్సవం
కర్నూలు: దసరాను పురస్కరించుకుని జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరిగే దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి బన్ని ఉత్సవాన్ని డ్రోన్ కెమెరాల నిఘాలో నిర్వహించనున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయుధ పూజ అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడారు. బన్ని ఉత్సవాల్లో 10 డ్రోన్ కెమెరాలతో పాటు 110 సీసీ కెమెరాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉత్సవాల్లో ఎవరైనా గాయాలపాలైతే వెంటనే వైద్యం అందించేందుకు 20 బెడ్లతో తాత్కాలిక ఆసుపత్రితో పాటు 104, 108 అంబులెన్స్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇప్పటికే దాదాపు 200 మంది ట్రబుల్ మాంగర్స్, సారా విక్రేతలను బైండోవర్ చేశామన్నారు. కార్డెన్ సెర్చ్లో భాగంగా 340 రింగుల కర్రలు, నాటుసారాను సీజ్ చేశామన్నారు. దేవరగట్టు పరిసర ప్రాంతాల్లో ఐదు చెక్పోస్టులు, పది పికెట్లు ఏర్పాటు చేశామన్నారు. ఉత్సవంలో చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలన్నారు. బన్ని ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా జరుపుకో వాలని భక్తులకు ఎస్పీ సూచించారు. తప్పిన ప్రమాదం ఆస్పరి: మండల కేంద్రం సమీపంలోనున్న విద్యుత్ సబ్ స్టేషన్ దగ్గర విద్యత్ స్తంభాన్ని బుధవారం ఓ లారీ ఢీ కొట్టింది. అయితే ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. స్తంభం లేకుంటే నేరుగా లారీ విద్యుత్ సబ్ స్టేషన్లోకి దూసుళ్లేదని ట్రాన్స్కో సిబ్బంది తెలిపారు. మహారాష్ట్ర నుంచి చక్కెర లోడుతో ఆదోని నుంచి ఆస్పరి వైపు వస్తున్న లారీని ఒక కారు ఓవర్ టేక్ చేసి వెళ్లే క్రమంలో స్పీడ్ బ్రేకర్ వద్ద సడన్ బ్రేక్ వేయడంతో.. లారీ డ్రైవర్ కారును తప్పించే క్రమంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్, క్లీనర్ వెంటనే లారీ నుంచి కిందకు దూకేశారు. ప్రమాదంపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఆస్పరి పోలీసులు తెలిపారు. -
సారూ కాళ్లు మొక్కుతా .. స్తంభాలు తొలగించండి
● తహసీల్దార్ను వేడుకున్న రైతు కుమారుడు నందికొట్కూరు: సారూ తమ పొలంలో ఉన్న విద్యుత్ స్తంభాలు తొలగించండి అంటూ మిడుతూరు మండలం చౌట్కూరు గ్రామానికి చెందిన రైతు నాగేశ్వరరావు కుమారుడు స్వామన్న తహసీల్దార్ శ్రీనివాసులు కాళ్లు మొక్కాడు. బుధవారం గ్రామ సభ జరుగుతుండగా స్వాములు తహసీల్దార్ వద్దకు వెళ్లి తమకు ఉన్నదే ఎకరా పొలమని, అందులో విద్యుత్ స్తంభాలు వేయడంతో సాగుకు కష్టంగా మారిందని, ఇదే విషయమై పదేళ్లుగా అధికారులకు విన్నవించుకుంటున్నా తొలగించడం లేదని ఆవేదన వ్యక్తం చేయగా.. స్పందించిన తహసీల్దార్ విద్యుత్ అధికారులతో మాట్లాడి తొలగించేందుకు చర్యలు తీసుకుంటానని హామీచ్చారు. -
శ్రీశైలంలో దేదీప్యమానంగా దసరా మహోత్సవాలు
● రమావాణీసేవిత రాజరాజేశ్వరిగా భ్రమరాంబాదేవి ● అశ్వ వాహనంపై విహరించిన భ్రమరాంబా సమేత మల్లికార్జునుడు ● రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పణ ● నేటితో ముగియనున్న దసరా మహోత్సవాలు -
రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పణ
దసరా మహోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామి అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాలకు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి అనం రామనారాయణరెడ్డి, దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, దేవస్థానం ఈఓ ఎం.శ్రీనివాసరావులు పట్టువస్త్రాలను తలపై పెట్టుకుని స్వామిఅమ్మవార్లను దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. -
జిల్లాకు రాష్ట్ర స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డు
నంద్యాల: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర అవార్డ్స్– 2025’లో నంద్యాల జిల్లాకు ఒక రాష్ట్రస్థాయి, 51 జిల్లాస్థాయి అవార్డులు లభించినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర (ఎస్ఏఎస్ఏ) కార్యక్రమం కింద రాష్ట్రంలో తొలిసారిగా సమగ్ర పరిశుభ్రతా సర్వే నిర్వహించి ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, ప్రజా ప్రదేశాల పరిశుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, ఆర్ఆర్ఆర్ (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్) వంటి స్థిరమైన ఆచరణల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన సంస్థలకు అవార్డులు కేటాయించారన్నారు. ఇందులో జిల్లా నుంచి ‘మన ఊరు – మన గుడి – మన బాధ్యత’ స్వచ్ఛంద సంస్థ రాష్ట్రస్థాయి అవార్డు పొందగా, జిల్లాస్థాయిలో 51 అవార్డులు లభించాయని తెలిపారు. స్వచ్ఛ మున్సిపాలిటీలు, స్వచ్ఛ గ్రామపంచాయతీలు, స్వచ్ఛ పాఠశాలలు, స్వచ్ఛ ఆసుపత్రులు, స్వచ్ఛ కార్యాలయాలు, స్వచ్ఛ రైతు బజార్లు, స్వచ్ఛ బస్ స్టేషన్లు, స్వచ్ఛ పరిశ్రమలు వంటి విభాగాలకు అవార్డులు ప్రకటించారన్నారు. ఈనెల 6వ తేదీన నంద్యాల జిల్లా కేంద్రంలో అవార్డు విజేతలను సన్మానించనున్నట్లు వెల్లడించారు. జిల్లాకు సంబంధించిన రాష్ట్రస్థాయి విజేతలు, జిల్లాస్థాయి అవార్డు విజేతల పూర్తి వివరాలు ప్రజలు పోర్టల్( https://sasa.ap.gov.in/) ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. -
మా సమస్యలు పరిష్కరించాల్సిందే
● డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట పీహెచ్సీ వైద్యుల ఆందోళనగోస్పాడు: న్యాయమైన తమ సమస్యలను పరిష్కరించాల్సిందేనని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అంకిరెడ్డి అన్నారు. బుధవారం డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ఆ సంఘం ఆధ్వర్యంలో వైద్యులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అంకిరెడ్డి మాట్లాడుతూ పీహెచ్సీ వైద్యుల సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇప్పటి వరకు పరిష్కారం లేదన్నారు. 20 ఏళ్లుగా పీహెచ్సీల్లో పనిచేస్తున్నా తమకు పదోన్నతులు రావడం లేదని, సీనియర్లు, జూనియర్లు ఒకే కేడర్లో పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్సర్వీస్ పీజీ కోటా పునరుద్ధరించాలని, టైమ్ బౌండ్ ప్రమోషన్లు అమలు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి బేసిక్ పే 50 శాతం ట్రైబల్ అలవెన్స్, నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలనికోరారు. అలాగే వైద్యులకు కచ్చితమైన పనిగంటలు ఏర్పాటు చేయాలని, స్థిరమైన వారాంతపు సెలవు ఇవ్వాలని, వైద్యుల జాబ్ చార్ట్ ఇవ్వాలని, అనధికార వ్యక్తులు(నాన్ మెడికల్, శాఖకు సంబంధం లేనివారు) పీహెచ్సీలను విచ్చలవిడిగా తనిఖీ చేయకుండా స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలన్నారు. అలాగే గత మూడు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న చంద్రన్న సంచార చికిత్స అలవెన్స్ను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్లు కాంతారావు నాయక్, భరత్ కుమార్, ప్రణీత్, షబ్బీర్, హుసేని, ప్రసన్న లక్ష్మి, రూపేంద్రనాథరెడ్డి, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. -
పింఛన్ల పంపిణీ.. తప్పని అవస్థలు
● ఇంటి దగ్గర అందజేత నామమాత్రమే ● అవ్వాతాతలకు తీరని ఎదురుచూపులుకర్నూలు(అగ్రికల్చర్)/నంద్యాల (న్యూటౌన్): కూటమి ప్రభుత్వ పాలనలో ఇంటి వద్ద పింఛన్ల పంపిణీ చెప్పుకోవడానికే పరిమితమైంది. ప్రతి నెల మాదిరిగానే ఈసారి కూడా అవ్వతాతలు, వికలాంగులు ఇతర పింఛన్దారులు గ్రామ, వార్డు సచివాలయాల మెట్లు ఎక్కాల్సి వచ్చింది. పనులు వదులుకొని చాలామంది పింఛన్దారులు సచివాలయాలు, రచ్చబండల దగ్గర పడిగాపులు కాశారు. అక్టోబరు నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. పలు మండలాల్లో పింఛన్దారులందరికీ ఒకే చోటుకు పిలిపించి పంపిణీ చేశారు. దీని వల్ల అవ్వాతాతలు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి డీఆర్డీఏ పీడీ వైపీ రమణారెడ్డితో కలసి కర్నూలు నగరంలోని వివిధ కాలనీల్లో పింఛన్లు పంపిణీ చేశారు. కర్నూలు మండలం పంచలింగాల గ్రామంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పింఛన్లు పంపిణీ చేశారు. కర్నూలులో 94.12 శాతం, నంద్యాల జిల్లాలో 94.43 శాతం పంపిణీ... అక్టోబరు నెలకు సంబంధించి కర్నూలు జిల్లాలో 2,38,755 పింఛన్లు ఉండగా...సాయంత్రం 6 గంటల సమయానికి 2,24,711 (94.12 శాతం) మందికి పంపిణీ చేశారు. నంద్యాల జిల్లాలో 2,15,005 పింఛన్లు ఉండగా 2,03,032 (94.43 శాతం) పంపిణీ చేశారు. ఇంకా తీసుకోని వారికి ఈ నెల 3వ తేదీన పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
నాసిరకం పనులు
ఆత్మకూరురూరల్: జాతీయ రహదారి నిర్మాణం ఏర్పాటయితే ఆ దారి వెంబడి ఉండే గ్రామాల ప్రజలు, వాహనదారులు ఎంతో సంతోష పడతారు. ప్రయాణ కాలం తగ్గడంతో పాటు ప్రమాదాలకు చోటు ఉండకపోవడమే కారణం. అయితే ఇందుకు విరుద్ధంగా ఉమ్మడి కర్నూలు జిల్లా మీదుగా వెళ్తున్న కర్నూలు – గుంటూరు ప్రధాన రహదారి 340సీ జాతీయ రహదారి నిర్మాణం సాగుతోంది. కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో ఓ వైపు నాసిరకం పనులు.. మరో వైపు రాజకీయ మలుపులతో రోడ్డు మన్నికపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2014 లో మంజూరైన ఈ రహదారి 2025 నాటికి కూడా పూర్తిగా పనులు జరగలేదు. ఈ రహదారి పూర్తి స్థాయి లో ప్రారంభం కాకముందే రోడ్డు పగుళ్లు బారుతుండడం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో చేసిన పనులనే మళ్లీ చేయాల్సి వస్తోంది. పాములపాడు మండలం సమీపంలో శ్రీశైలం ప్రధాన కుడిగట్టు కాల్వ డీప్ కట్ కోసం జరిపిన తవ్వకాలలో బయట పడిన బిలుకు (వెల్స్పాయిల్) గుట్టలుగా పేరుకుని ఉంది. ఈ బిలుకును అక్కడే ఒక క్రషర్ నెల కొల్పి సన్నని ముక్కలుగా చేసి అలా తయారైన కంకరను 340సీ జాతీయ రహదారి అడుగు పాటుకు వినియోగించారు. ఈ బిలుకు లేయర్ను తగిన విధంగా తొక్కించక (రోలర్ తిప్పి) పోవడం వల్ల నాసిరకం రాతి పలకులు పిండిగా మారడంతో ఈ రహదారి తొలిదశలోనే నాణ్యతకు తిలోదకాలిచ్చింది. నిబంధనలు ‘బైపాస్’చేస్తూ.. జాతీయ రహదారి 340సీ కోసం మొదట ఇచ్చిన ప్లాన్ అప్రూవల్కు భిన్నంగా అక్కడక్కడా అలైన్మెంట్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తొలి ప్లాన్లో లేకున్నా పాములపాడు మండలం ఎర్రగూడూరు గ్రామంలో ఎంపీ శబరి ఒత్తిడి మేరకు అండర్ పాస్తో ఓవర్ బ్రిడ్జి నిర్మాణం అవుతోంది. ఇందుకోసం అవసరమైన భూసేకరణ జరపకుండా ముందు సేకరించిన భూమిలోనే నిర్మాణం చేపట్టడంతో సర్వీస్ రోడ్లు స్థలం చాలక ఇరుగ్గా మారుతున్నాయి. ● ఇదే మండలంలోని రుద్రవరం గ్రామం వద్ద నిర్మిస్తున్న అండర్ పాస్ కూడా అలైన్మెంట్ మార్పునకు గురైంది. అయితే రోడ్డు నిర్మాణం భూసేకరణలో లేని భూమి వైపు జరిగారని బాధితుడు హైకోర్టును ఆశ్రయించడంతో అటు వైపు పనులు జరగలేదు. దీంతో కుడివైపున రావాల్సిన సర్వీస్ రోడ్డు కుచించుకు పోయింది. సంబంధిత నిర్మాణ సంస్థ కుడివైపున ఉన్న ప్రయివేట్ భూముల్లో కొంత మేర తమకు ఇవ్వమని రైతులను నయానా, భయాన ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ● ఆత్మకూరు పట్టణానికి బైపాస్ చేస్తూ వెళ్లే రహదారి, ప్రధాన రహదారిని కలిసే చోట నిర్మించిన అండర్ పాస్ కూడా అలైన్మెంట్ తప్పింది. ఇక్కడ కూడా ఎడమవైపు భూసేకరణ జరిగిన భూమిని పూర్తిగా వినియోగించుకోకుండా కుడి వైపు ఎక్కువ స్థలంలో అండర్ పాస్ను నిర్మించారు. దీంతో సర్వీస్ రోడ్డు కోసం ఎడమ వైపు ప్రయివేటు భూమిలోకి జరగాల్సి వచ్చింది. ఇది గమనించిన ఆ భూ యజమాని నేరుగా కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి గడ్కరికి ఫిర్యాదు చేయడంతో గుత్తేదారు తగ్గాల్సి వచ్చింది. దీంతో ఎడమ వైపు సర్వీస్ రోడ్డు కుచించుకు పోతోంది. ఇక్కడ ఉన్న ఒక ప్రముఖ హోటల్ యజమాని కేంద్ర ప్రభుత్వ పెద్దల సహకారంతో విజయవంతంగా ముందుకు జరిపించుకోగలిగారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ కారణంగానే ఈ అండర్ పాస్ అలైన్మెంట్ మారి సర్వీస్ రోడ్డు సమస్య తలెత్తి నట్లు తెలుస్తోంది. ● ఆత్మకూరు పట్టణ శివార్లలో 340సీ (కర్నూలు – అమరావతి) జాతీయ రహదారి, 167కే (కల్వకుర్తి – నంద్యాల) జాతీయ రహదారులు రెండు క్రాస్ అవుతాయి. ఈ దారిలో ఆత్మకూరు పట్టణాన్ని కనెక్ట్ చేసే సర్వీస్ రోడ్డుకు బైపాస్ కింద దారి చేసేందుకు ఒక అండర్ పాస్ నిర్మించారు. వాస్తవానికి కల్వకుర్తి – నంద్యాల జాతీయ రహదారికి కూడా దారి ఇవ్వడం కోసం ఇక్కడే అండర్ పాస్ నిర్మించాల్సి ఉంది. ముందు చూపుతో అధికారులు ఆలోచన చేసి ఉంటే రెండింటికి ఉపయోగడే విధంగా ఒకే అండర్ పాస్తో పని జరిగేది. దీంతో ముందుగా అండర్ పాస్ కోసం నిర్మించిన ప్లయ్ ఓవర్ను తొలగించి మరో అండర్ పాస్ నిర్మించాల్సి వచ్చింది. ఇప్పుడు పక్కపక్కనే రెండు అండర్ పాస్లు రావడంతో వాహనదారుల్లో సందిగ్ధం నెలకొనే ప్రమాదం పొంచి ఉంది. రాజకీయ ‘మలుపులు’.. -
రేబిస్ వ్యాధితో వ్యక్తి మృతి
కోవెలకుంట్ల: పట్టణ శివారులోని స్వామినగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి రేబిస్ వ్యాధితో మంగళవారం మృతి చెందాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. కాలనీకి చెందిన మెట్ల నాగరాజు(40)కు రెండు నెలల క్రితం కుక్క కరిచింది. కుక్కకాటుకు సంబంధించి ఇంజెక్షన్లు వేయించుకోకుండా నిర్లక్ష్యం చేశాడు. రేబిస్ వ్యాధి ముదిరి సోమవారం సాయంత్రం అపస్మారక స్థితికి చేరుకోగా బంధువులు చికిత్స నిమిత్తం నంద్యాలకు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించగా కోలుకోలేక మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మిదేవి, కుమారుడు లింగమయ్య, కుమార్తె అక్షర ఉన్నారు. వీడని వర్షం నంద్యాల(అర్బన్): నాలుగు రోజులుగా జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కుందూనదితో పాటు మద్దిలేరు, పాలేరు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు బండిఆత్మకూరు మండలంలో 70.2 మి.మీ వర్ష పాతం నమోదైంది. వెలుగోడులో 56.0, మహానందిలో 50.2, పగిడ్యాల 48.6, నంద్యాల అర్బన్ 44.0, నంద్యాల రూరల్ 42.4, గడివేముల 32.8, శిరివెళ్ల 32.6, పాములపాడు 32.2, బనగానపల్లె 30.4, రుద్రవరం 30.2, గోస్పాడు 28 మి.మీ మేర వర్షం కురిసింది. వరి, మొక్కజొన్న, పొగాకు, మినుము, మిరప పంటలు నీట మునగడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. నేటి నుంచి పింఛన్ల పంపిణీ నంద్యాల(న్యూటౌన్):జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు బుధవారం నుంచి పంపిణీ చేస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ శ్రీధర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 2,15,005 మంది పింఛన్ దారులకు రూ.92.64 కోట్లు మంజూరైనట్లు వివరించారు. కాగా సచివాలయ సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి పింఛన్ల పంపిణీలో పాల్గొంటున్నట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు. -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
బొమ్మలసత్రం: ప్రభుత్వ వైద్య కళాశాలలు పేద విద్యార్థులకు దేవాలయాలతో సమానమని, వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తే అడ్డుకుంటామని ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యోబు హెచ్చరించారు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయటాన్ని నిరసిస్తూ మంగళవారం స్థానిక బొమ్మలసత్రం సర్కిల్లో ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, కౌన్సిలర్ చంద్ర ఆధ్వర్యంలో నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా యోబు మాట్లాడుతూ.. దళితుల పిల్లలు ఉన్నత చదువులు చదివేలా దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఆయన బాటలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద పిల్లలు వైద్య విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారన్నారు. మిగతా కళాశాలల నిర్మాణానికి కేవలం రూ. 5వేల కోట్లు మాత్రమే అవసరమవుతాయని, అయినా ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వమే వాటి నిర్మాణానికి ముందుకు రావాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు యత్నించడం సరైంది కాదని, ఈ విధానాన్ని రద్దు చేసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోరుకు సిద్ధమని జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పంతో నంద్యాల మెడికల కాలేజీ నిర్మాణం పూర్తయి ఇప్పటికే విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారన్నారు. ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు అన్ని ప్రభుత్వ వ్యవస్థలను పేదలకు దూరం చేయాలనుకోవడం దారుణమన్నారు. దళితులకు వైద్యం, విద్యను దూరం చేసే దురుద్దేశంతో చంద్రబాబు ఇలాంటి కుటిల ఆలోచనలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షులు నాగేశ్వరరావు, బనగానపల్లి, డోన్, శ్రీశైలం, ఆళ్లగడ్డ, నందికొట్కూరు నియోజకవర్గాల అధ్యక్షులు సత్యం, వెంకస్వామి, జైపాల్, వెంకటన్న, పుల్లయ్య, నాయకులు తిమ్మరాజు, బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటీకరణ రద్దు చేయకపోతే పోరుకు సిద్ధం.. -
కూటమి ప్రభుత్వం రైతులను రోడ్డున పడేసింది!
ఓర్వకల్లు: కూటమి ప్రభుత్వం రైతులను రోడ్డున పడేసిందని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి విమర్శించారు. హుసేనాపురం గ్రామంలో రైతులు సాగు చేసిన పత్తి, పొగాకు పంటలను సోమవారం ఆయన రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా చేదు శ్రీనివాసులు, గాలెన్న అను రైతులు సాగు చేసిన పత్తి పొలాల్లో నిల్వవున్న వర్షపునీటితో పంట దెబ్బతిన్న పరిస్థితులను గమనించారు. అనంతరం నడివాగు వద్ద నిర్మించిన చెక్డ్యామ్ వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎద్దులబండిపై వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం రైతుల సమక్షంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ.. సాగుచేసిన పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు గగ్గోలు పెట్టాల్సిన పరిస్థితిలు నెలకొన్నాయన్నారు. పంటలు కోతదశకు వచ్చే సమయంలో అధిక వర్షాలు కురవడం, పండించిన దిగుబడులకు మార్కెట్లో గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో రైతుల పరిస్థితి దారుణంగా వుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉల్లి దిగుబడులను అమ్మకోవడానికి మార్కెట్కు తీసుకెళ్లిన రైతుల నుంచి కమీషన్ల ముసుగులో దోచుకోవడం ఎంత వరకు సమంజసమన్నారు. అక్రమ వసూళ్లను అరికట్టాల్సిన బాధ్యత మార్కెట్ శాఖ అధికారులపై ఉందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఉల్లి ధరలు తగ్గినప్పుడు రైతులకు నష్ట పరిహారం ఇవ్వడం, ధరలు పెరిగినప్పుడు సామాన్యులు ఇబ్బందులు పడకుండా సబ్సిడీతో ఉల్లిని అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులు పండించిన దిగుబడులకు గిట్టుబాటు ధర కల్పించపోగా, హెక్టారుకు రూ.50 వేలు పరిహారం చెల్లిస్తామని చెప్పినా ఇంత వరకు ఎటువంటి కార్యాచరణ చేపట్టలేదన్నారు. అధిక వర్షాలతో నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలి కర్నూలు మార్కెట్లో కమీషన్ల దందాను అరికట్టాలి వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి -
అధికార పార్టీ నేతలకు ఉద్యోగులు తలొగ్గొద్దు
బొమ్మలసత్రం: అధికారపార్టీ నేతల మాటలు విని కొందరు అధికారులు, ఉద్యోగులు వైఎస్సార్సీపీ కార్యకర్తల ధన, మాన, ప్రాణాలకు హాని కలిగించేలా వ్యవహరిస్తున్నారని, నేతలకు అధికారులు తలవంచాల్సిన అవసరం లేదని నంద్యాల మాజీ ఎమ్యెల్యే శిల్పా రవి చంద్రకిషోర్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన నివాసంలో కార్యకర్తల కోసం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న వైఎస్సార్సీపీ డిజిటల్బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్లను మాజీ ఎమ్యెల్యేతో పాటు ఎమ్మెల్సీ ఇసాక్బాషా పార్టీ నేతలు ఆవిష్కరించారు. అధికారపార్టీ నేతలు వైఎస్సార్సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కొందరు అధికారులను తొత్తులుగా మార్చుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో మారుమూల ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా డిజిటల్బుక్ ద్వారా అండగా నిలుస్తామన్నారు. కార్యకర్తకు అన్యాయం చేసిన అధికారి పేరు, అధికార పార్టీ నాయకుడి పేరు తదితర అంశాలను డిజిటల్ బుక్లో నమోదు చేయాలని సూచించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి బలైన వారిని భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదుకుంటామన్నారు. అధికారపార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరించి తమ కార్యకర్తల కుటుంబాలకు అన్యాయం చేస్తే ఎక్కడ ఉన్నా నడిరోడ్డుపై నిలబెట్టి ప్రశ్నిస్తామన్నారు. పేదలకు అన్యాయం చేస్తే వదిలే ప్రసక్తే లేదు కార్యకర్తలకు అండగా నిలించేందుకు ‘డిజిటల్ బుక్’ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా -
సేవల అంతరాయానికి ప్రభుత్వానిదే బాధ్యత
ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ల న్యాయపరమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలి. రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు సమ్మె కార్యాచరణ ప్రకటించి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాం. వైద్య సేవల్లో అంత రాయం కలగడంపై పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. 30న జిల్లా ప్రధాన కార్యాలయాల్లో జిల్లా స్థాయి వైద్యుల నిరసన, 1న జిల్లా ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన, నిరసన ర్యాలీ, 2న చలో విజయవాడకు పిలుపునిచ్చాం. – డాక్టర్ అంకిరెడ్డి, పీహెచ్సీ వైద్యుల శాశ్వత సంఘం జిల్లా అధ్యక్షుడు -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించే అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అర్జీదారుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్య త అధికారులదేనన్నారు. జిల్లాలో గత ఏడాది జూన్ 15 నుంచి ఇప్పటి వరకు మొత్తం 43,143 అర్జీలు స్వీకరించబడ్డాయని, అందులో సరైన రీతిలో ఎండార్స్ చేయకపోవడం వల్ల 471 దరఖాస్తులు రీ–ఓపెన్ అయ్యాయని తెలిపారు. ప్రతి అధికారి రీ–ఓపెన్ అయిన దరఖాస్తులపై పూర్తి దృష్టి సారించి పరిష్కరించాలన్నారు. ప్రస్తుతం నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాల్సిన దరఖాస్తులు 1,926 ఉన్నాయని, అందులో రెవెన్యూ 1,038, సర్వే 394, పోలీస్ 130 తదితర శాఖల్లో పెండింగ్లో ఉన్నాయన్నారు. గడువు ముగిసే వరకు వేచి చూడకుండా వెంటనే పరిష్కరించాలన్నారు. ఆడిట్లో లోపాలు గుర్తించిన ఫిర్యాదులను తప్పనిసరిగా రీ–ఓపెన్ చేసి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ఫీడ్బ్యాక్ సేకరణలో డోన్ రూరల్, గడివేముల, గోస్పాడు, జూపాడుబంగ్లా, మిడుతూరు, సంజామల, రుద్రవరం, పాములపాడు, వెలుగోడు తదితర 15 మండలాలు గత రెండు వారాలుగా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. సోమ వారం మొత్తం 263 మంది వివిధ సమస్యలపై అర్జీలు అందజేశారన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్ఓ రాము నాయక్, డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
కార్యకర్తలకు వైఎస్ జగన్ అండ ..
రాష్ట్రంలోని పేదలకు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా ఉంటారని ఎమ్మెల్సీ ఇసాక్బాషా అన్నారు. కార్యకర్తలకు ఏకష్టం వచ్చినా వైఎస్ జగన్ చూస్తూ ఊరుకోరని, వారి కుటుంబాలకు ఆదుకుని తీరుతారన్నారు. అధికార పార్టీ నేతలు, అధికారులు ఇబ్బందులకు గురి చేస్తే వెంటనే డిజిటల్ బుక్లో వారి వివరాలను నమోదు చేయాలని కోరారు. భవిష్యత్తులో తమ పార్టీ అధికారం చేపడితే ఇబ్బందులకు గురిచేసిన వారి భరతం పట్టడం ఖాయ మన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల సంక్షేమం కోసం మ్యానిఫెస్టోలో చెప్పిన పథకాలన్నీ మాట మీద నిలబడి ఎలా నెరవేర్చారో, అలాగే డిజిటల్బుక్ ద్వారా తప్పకుండా కార్యకర్తలకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. కార్యకర్తలు తప్పకుండా డిజిటల్బుక్ను సద్వినియోగం చేసుకుని తీరాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్రమార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ పీపీ నాగిరెడ్డి, ఎంపీపీ శెట్టి ప్రభాకర్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ రామసుబ్బారెడ్డి, రాష్ట్ర మాజీ ఉమెన్వింగ్ ఉపాధ్యక్షురాలు శశికళారెడ్డి, పార్టీ మండలాధ్యక్షులు బసవేశ్వరరెడ్డి, పార్టీ జిల్లా నాయకులు రసూల్ ఆజాద్, దేవనగర్బాషా, అనీల్ అమృతరాజ్, టైలర్ శివయ్య, రామచంద్రుడు, నాయకులు నెరవాటి సత్యనారాయణ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
ధరలు ఇంకా పెరుగుతాయనే భయం
ధరలు పెరుగుతున్నా అవసరాన్ని బట్టి కొనక తప్పడం లేదు. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,500 ఉంది. ఈ ధర రూ.లక్షలోపునకు వస్తే వినియోగదారులకు కాస్త ఉపశమనం కలుగుతుంది. ధరలు ఇంకా పెరిగిపోయే ప్రమాదం ఉన్నందున కాస్త ముందుగానే కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో వచ్చాం. – స్వాతి, కర్నూలు ఏడాదిలో 10 గ్రాముల బంగారంపై దాదాపు రూ.40 వేల పెరుగుదల ఉంది. ధరలు ఇంకా పెరగడమే తప్ప తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. వేచి చూడటం వల్ల ధరల భారాన్ని భరించడమే అవుతుంది. డిజైన్లు ఆకట్టుకుంటున్నా ధరలు, తరుగు ఆందోళన కలిగిస్తున్నాయి.– రూప, కర్నూలు● -
రోడ్డు ప్రమాదంలో సైనికుడి మృతి
కర్నూలు(అర్బన్): విశాఖపట్నం ఇండియన్ నేవీలో విధులు నిర్వహిస్తున్న నగరంలోని క్రిష్ణానగర్కు చెందిన పీ రఘురామిరెడ్డి ఈ నెల 28వ తేదిన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నర్రా పేరయ్య తెలిపారు. ఆయన పార్థివదేహాన్ని కర్నూలులోని ఆయన నివాసానికి తీసుకువస్తున్నట్లు నేవీ ఉన్నతాధికారుల నుంచి ఇక్కడికి సమాచారం అందిందన్నారు. ఈ నెల 30వ తేదీన ఆయన అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా సైనిక్బోర్డు, నేవీ అధికారులు, మాజీ సైనికులు పాల్గొంటారని తెలిపారు. ఆయన మృతికి మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నదని, ఆయన కుటుంబానికి సంఘం ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. తోటలో రైతు మృతి కొలిమిగుండ్ల: మండల పరిధిలోని తోళ్లమడుగు గ్రామానికి చెందిన రైతు సద్దల చలమయ్య(60) మృతి చెందాడు. గ్రామానికి సమీపంలో చీని, నిమ్మ తోటలతో పాటు వరి సాగు చేస్తున్నాడు. సోమవారం కుటుంబ సభ్యులతో పాటు కూలీల తో పనుల్లో నిమగ్నమయ్యాడు. డ్రిప్కు సంబంధించి అన్ని వాల్వ్లు ఆఫ్ చేసి ఉంచడంతో మర్చిపోయి గేట్వాల్వ్ ఆన్చేశాడు. నీళ్ల ఒత్తిడికి పైపు ఎగిరి తలకు తగలడంతో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు. కొద్ది సేపటి తర్వాత కూలీలు గమనించి చలమయ్య కుటుంబ సభ్యులకు తెలిపారు. చికిత్స కోసం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఇంజినీరింగ్ అధికారులకు సెలవులు రద్దు కర్నూలు (టౌన్): దేశ ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల 16వ తేదీ కర్నూలు నగరంలో పర్యటిస్తున్నందున నగరపాలక ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే ఇంజినీర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, సచివాలయాల ఉద్యోగులకు సెలవులను రద్దు చేస్తున్నట్లు నగరపాలక కమిషనర్ పి. విశ్వనాథ్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వచ్చే నెల 7 వ తేదీ లోపు పూర్తి చేసిన అభివృద్ధి పనులకు సంబంధిచిన వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో డిస్ట్రిక్ట్ మాస్ ఎడ్యుకేషన్ మీడియా ఆఫీసర్ (డెమో)గా ఎన్.ప్రకాష్రాజు నియమితులయ్యారు. గుంటూరులోని పీఓడీటీటీలో పనిచేస్తున్న ఆయన్ను పదోన్నతిపై కర్నూలుకు బదిలీ చేశారు. ఇక్కడ ఇన్చార్జ్ డెమోగా ఉన్న పి.శ్రీనివాసులుశెట్టిని కర్నూలులోని రీజనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ట్రైనింగ్ సెంటర్ (మేల్)లో కమ్యూనికేషన్ ఆఫీసర్గా బదిలీ చేశారు. ఆయనతో పాటు రీజనల్ ట్రైనింగ్ సెంటర్ (ఫిమేల్) సెంటర్లో విధులు నిర్వహిస్తున్న ఎ.నిర్మలమ్మను తిరుపతిలోని ఎస్వీఎంసీలో ఉన్న ప్రసూతి హాస్పిటల్కు బదిలీ చేశారు. -
వర్షంలో సచివాలయ ఉద్యోగుల నిరసన
బొమ్మలసత్రం: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ తీర్చాలంటూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సోమవారం రాత్రి 8 గంటల సమయంలో కలెక్టర్ కార్యాలయంలో బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల సంఘం నంద్యాల అధ్యక్షులు మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ.. ఇంటింటికి తిరిగి నిర్వహించే సర్వేల నుంచి తమకు విముక్తి చేయాలన్నారు. సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలని కోరారు. పారదర్శకంగా బదిలీల ప్రక్రియ కొనసాగేలా చూడాలని డిమాండ్ చేశారు. రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్ను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్గా మార్చాలని డిమాండ్ చేశారు. -
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
బనగానపల్లె రూరల్: బనగానపల్లె పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల మేరకు సుమారు 40 ఏళ్ల వయస్సు, ఐదున్నర అడుగుల ఎత్తు కలిగిన వ్యక్తి, ఆదివారం రాత్రి పెట్రోల్బంకు సర్కిల్ నంద్యాల బస్సు స్టాప్ షెల్టర్ సమీపంలో ఉన్న స్తంభానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని కాపాడేందుకు చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి శరీరంపై సిమెంట్ కలర్, హాఫ్ టీ షర్ట్, లైట్ బ్లూ కలర్ ఫుల్షర్ట్, సిమెంట్ కలర్ ప్యాంట్ ధరించినట్లు సీఐ తెలిపారు. మృతుడి ఆచూకీ తెలియకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేశామని, మృతుడి వివరాలు తెలిసిన వారు 91211 01124కు సమాచారం ఇవ్వాలని సీఐ తెలిపారు. నాటుసారా కట్టడికి ప్రత్యేక బృందాలు ఆలూరు రూరల్: దేవరగట్టు బన్ని ఉత్సవాల్లో నాటు సారా తయారీ, విక్రయాలు, ఉత్సవాల రోజు మద్యం అమ్మకాలను అరికట్టేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్లు రాజశేఖర్, రామకృష్ణారెడ్డి తెలిపారు. దేవరగట్టు కొండల్లో సోమవారం ఆలూరు సీఐ లలిదాదేవి ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బన్ని ఉత్సవాల్లో నాటుసారా తయారు చేసినా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు 69 మంది నాటు సారా తయారీ, విక్రయదారులపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. ఆలూరు ఎకై ్సజ్ పరిధిలోని 5 మండలాల్లో నాటుసారా వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎస్ఐ నవీన్ కుమార్ పోలీసు సిబ్బంది ఉన్నారు. ఉచిత క్యూలైన్ల మార్గంలో నాగుపాము ● భక్తులకు తప్పిన ప్రమాదం మహానంది: మహానంది దేవస్థానంలో సోమవారం భక్తులకు ప్రమాదం తప్పింది. ఉచిత దర్శనం ద్వారా వెళ్లే క్యూలైన్ల మార్గంలో నాగుపాము ప్రత్యక్షం కావడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఆలయ సిబ్బంది స్నేక్ క్యాచర్ మోహన్కు విషయం చెప్పగా ఆయన ఆలయానికి చేరుకుని నాగుపామును పట్టుకుని నల్లమల అటవీ ప్రాంతంలో వదిలేశారు. -
అనంతపురం – అమరావతి రహదారి అలైన్మెంట్ ఖరారు
● ఆమోదం తెలిపిన కేంద్రం ● అలైన్మెంట్లో మార్పులు కోరిన జెడ్పీచైర్మన్ కొలిమిగుండ్ల: అనంతపురం–అమరావతి 544–డీ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి అలెన్మెంట్ దాదాపుగా ఖరారు అయ్యింది. అనంతపురం నుంచి బుగ్గ వరకు రెండు ప్యాకేజీల కింద చేపడుతున్న హైవే పనులు చివరి దశకు చేరుకున్నాయి. జిల్లా సరిహద్దు నుంచి గిద్దలూరు వరకు 135 కి.మీ మేర జాతీయ రహదారి నిర్మాణం కోసం జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల అలైన్మెంట్కు ఆమోదముద్ర వేసింది. జిల్లా సరిహద్దు నుంచి కొలిమిగుండ్ల మండలంలో మీదుగా ఈ హైవే సాగనుంది. అలైన్మెంట్లో చిన్న మార్పులు చేసేందుకు సోమవారం ఎన్హెచ్ఏఐ సైట్ ఇంజినీర్ సుశాంత్, బెంగళూరుకు చెందిన కన్సల్టెన్సీ ప్రతినిధి భరత్తో పలు అంశాలపై క్షేత్ర స్థాయిలో చర్చించారు. జిల్లా సరిహద్దు నుంచి మండల కేంద్రం వరకు పలు చోట్ల అలైన్మెంట్ మార్పులు చేసే వాటిపై ఆయా ప్రాంతాలను చూపించి వివరించారు. మార్పులకు సంబంధించి ఉన్నతాధికారులకు నివేదికలు అందిస్తామని ఎన్హెచ్ఏఐ అధికారి చెప్పారు. 2017లో చేసిన అలైన్మెంట్ ప్రకారమే ఎలాంటి మార్పులు లేకుండా మండలంలో జాతీయ రహదారి నిర్మాణం జరుగనుంది. అతి త్వరలోనే డీపీఆర్కు కేంద్రం ఆమోదముద్ర వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టెండర్లు పిలిచి ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈప్రాజెక్ట్ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అలైన్మెంట్లో తప్పక మార్పులు చేపట్టాలి.. అనంతపురం–అమరావతి జాతీయ రహదారి నిర్మాణం జరిగితే రవాణ సదుపాయం మెరుగుపడుతుండటం సంతోషకరమని జెడ్పీచైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. కొలిమిగుండ్ల మండలంలో అలైన్మెంట్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందన్నారు. ఆమోదం చేసిన అలైన్మెంట్ ప్రకారం జిల్లా సరిహద్దు నుంచి కొలిమిగుండ్ల క్రాస్ రోడ్డు వరకు గ్రామాల్లోనే హైవే వస్తుంది. దీని వల్ల ఆయా గ్రామాల్లో నివాసాలు, ఇతర నిర్మాణాలు పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పవు. అంకిరెడ్డిపల్లె, రాఘవరాజుపల్లె, కనకాద్రిపల్లె, ఇటిక్యాల గ్రామాల్లో కాకుండా వెలుపల బైపాస్ నిర్మించాలని ఆయన కోరారు. ఈ విషయంపై ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ డైరక్టర్ దృష్టికి తీసుకెళ్తామని అవసరమైతే రాష్ట్ర స్థాయి అధికారులను కోరుతామన్నారు. గ్రామాల్లో కాకుండా వెలుపల బైపాస్ చేపడితే నిర్వహణ వ్యయం తగ్గడంతో పాటు దూరం తగ్గుతుందన్నారు. ప్రధానంగా సిమెంట్, పవర్గ్రిడ్ తదితర పరిశ్రమలకు అనుకూలంగా మారుతుందన్నారు. -
మహానందిలో మహాగౌరి దుర్గగా
మహానంది: దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి అమ్మవారిని మహాగౌరిదుర్గగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని విశేష పూజలు నిర్వహించారు. వర్షం కారణంగా వాహనసేవను రద్దు చేశారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్రెడ్డి, ఎం.నీలకంఠేశ్వరరాజు, పి.సుబ్బారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ నాగమల్లయ్య పాల్గొన్నారు. చౌడేశ్వరిదేవి సేవలో.. బనగానపల్లె రూరల్: నందవరంలో వెలసిన శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారిని దేవదాయ శాఖ జోన్–2 రీజనల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ కుటుంబ సభ్యులు సోమవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ చౌడేశ్వరిదేవికి కుంకుమార్చన అభిషేకం తదితర పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు, వేదపండితులు చంద్రశేఖర్ ఆజాద్ను సత్కరించి ప్రసాదం అందజేశారు. -
కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా
నంద్యాల(న్యూటౌన్): నకిలీ మొక్కజొన్న విత్తనాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేలు చెల్లించి, బేయర్, న్యూజి వీడు, జీల్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్రెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర్, రామచంద్రుడు అన్నారు. నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నకిలీ విత్తనాలు విక్రయించిన షాపు యజమానుల లైసెన్స్లు రద్దు చేయా లని డిమాండ్ చేశారు. అనంతరం వినతి పత్రాన్ని కలెక్టర్ రాజకుమారికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు, జూపాడుబంగ్లా మండలాల్లో నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కోతలు ప్రారంభమైనందున జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు అమలు చేయాలని కోరారు. శాస్త్రవేత్తల రిపోర్టు అనంతరం కంపెనీలపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారన్నారు. ఏపీ రైతు సంఘం నాయకులు వెంకటేశ్వరరావు, సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
అమ్మకం లేదు.. అంతా జీఎస్టీ ఆమ్యామ్యా!
మంత్రాలయం: దుకాణం లేదు.. వ్యాపారం ఊసే లేదు.. అయినా ట్రేడర్స్ను సృష్టించి జీఎస్టీ నంబర్ పొందాడు. రూ.కోట్లలో వ్యాపారాలు చేసినట్లు దొంగ బిల్లులతో ఏకంగా ప్రభుత్వ ఖజానాకే కన్నం వేశాడు. అకౌంటెంట్ ముసుగులో ఒక వ్యక్తి మూడేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా చేసిన మోసం ఇదీ. రాయచూరుకు చెందిన ఓ డీలర్కు అనుమానం వచ్చి జీఎస్టీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ చీటింగ్ వెలుగులోకి వచ్చింది. ఇలా మోసం.. మంత్రాలయానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య విశాల పేరున ట్రేడర్స్ను సృష్టించాడు. పాతూరులోని ఇరుకు సందులో ఇంటి చిరునామాలో దుకాణం ఉందని రికార్డులో చూపాడు. అందులో ఐరన్, సిమెంట్, పెయింట్స్ వ్యాపారం చేస్తున్నట్లు పేర్కొన్నాడు. విశాల ట్రేడర్స్ రిజిస్ట్రేషన్తో 2002 ఆగస్టు నెల 4వ తేదీన జీఎస్టీ నంబర్ పొంది 2–112 నంబరు ఇంటిని దుకాణంగా చూపించాడు. నాన్ మూవింగ్ ఆఫ్ గూడ్స్ తరహాలో ప్రభుత్వ ట్యాక్స్ మొత్తాన్ని తన సొంత అకౌంట్కు మళ్లించుకున్నా డు. కొంత మంది డీలర్లను నమ్మబలికి తానే బిల్స్ వేస్తానని తంతు సాగించాడు. నాన్ మూవింగ్ ఆఫ్ గూడ్స్ విధానంతో మూడేళ్లలో రూ.4 కోట్ల మేర టర్నోవర్ జరిగినట్లు సమాచారం. ఇన్వాస్ బిల్లులు పేరుతో జీఎస్టీ ట్యాక్స్ను తన సొంత అకౌంట్కు మళ్లించుని దాదాపు రూ.70 లక్షల మేర ప్రభుత్వ జీఎస్టీ ఖజానాకు గండికొట్టినట్లు తెలుస్తోంది. గుట్టు రట్టు ఇలా.. ఈ చీటింగ్ వ్యవహారాన్ని రాయచూరులోని ఓ డీలర్ తెలుసుకుని జీఎస్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సదరు ట్రేడర్స్, జీఎస్టీ నంబర్పై విజయవాడ, తిరుపతి, కర్నూలు, ఆదోని జీఎస్టీ కార్యాలయాలకు ఫిర్యాదులు అందజేసి పూర్తి విచారణ చేపట్టాలని కోరారు. నాన్ మూవింగ్ ఆఫ్ గూడ్స్పై వే బిల్లు, ఇన్వాస్ బిల్లులు, అలాగే దుకాణాన్ని తని ఖీ చేయాలని విన్నవించారు. రాయచూరు మరో దొంగ ఫర్మ్ క్రియేట్ చేసుకుని తతంగం మొదలు పెట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం తెలిసి చీటింగ్ చేసిన వ్యక్తి తన గుట్టును కప్పి పుచ్చుకునేందుకు జీఎస్టీ అకౌంట్ను క్లోజ్ చేయాలని దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఫిర్యాదు వచ్చిన మాట వాస్తమే. ఫిర్యాదును ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. హెడ్ ఆఫీసు నుంచి ఆదేశాలు రాగానే పూర్తి విచారణ చేపడతాం. – కల్లూరు వరలక్ష్మి, సీటీవో, ఆదోని అకౌంటెంట్ ముసుగులో చీటింగ్ వ్యాపారం చేయకుండానే జీఎస్టీ ట్యాక్స్ స్వాహా దొంగ బిల్లులు సమర్పించిన వైనం విచారణ చేస్తామన్న అధికారులు -
అరాచకాలకు మూల్యం చెల్లించాల్సిందే
● అధికారపార్టీ నాయకులకు ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే హెచ్చరిక ● కార్యకర్తలకు అండగా నిలబడేందుకే ‘డిజిటల్ బుక్’ఆళ్లగడ్డ: ‘అధికారం ఉంది కదా అని అధికారపార్టీ నాయకులు, కార్యకర్తలు అరాచకాలకు పాల్పడుతున్నారు. దీనికి అధికారులు వత్తాసు పలుకుతున్నారు. ప్రతి ఒక్కరు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకునేందుకు సిద్ధంగా ఉండాల’ని మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి హెచ్చరించారు. ఆళ్లగడ్డలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్లను పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురైన ప్రతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు పార్టీ తరఫున డిజిటల్ బుక్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కూటమి ఏలుబడిలో అన్యాయానికి గురైన కార్యకర్తలు ధైర్యంగా క్యూఆర్ కోడ్ ఐవీఆఎస్ కాల్స్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఇందుకోసమే జగన్ ఈ కొత్త వ్యవస్థ తీసుకువచ్చారన్నారు. దీన్ని అన్ని మండలాలు, గ్రామాల్లో రిలీజ్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా నిలుస్తామన్నారు. ఇప్పటికే పార్టీ సానుభూతి పరులు, కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరిగిందని, వాటిపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు బాధితులకు తగిన న్యాయం చేస్తామన్నారు. డిజిటల్ బుక్ను టీడీపీ నేతల రెడ్బుక్ మాదిరి పెట్టుకున్నామని చెప్పడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. పార్టీ సానుభూతి పరులతో పాటు సామన్యుల సైతం ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా సులువుగా సమాచారం తెలుసుకునేందుకు ఈ డిజిటల్ బుక్ పెట్టామని స్పష్టం చేశారు. మూడున్నరేళ్లలో వచ్చేది కచ్చితంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని చెప్పారు. ఇప్పటికే కూటమి సర్కారుపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఈవిషయం తెలిసి అసెంబ్లీలో కూటమి ప్రజాప్రతినిధులు, అధికారులు కంగారు పడుతున్నారన్నారు. కూటమి సర్కారు దగా పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపైనా పోరాడుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నరసింహారెడ్డి, సుధాకర్రెడ్డి, సింగం వెంకటేశ్వర్రెడ్డి, డాక్టర్ సురేంద్రరెడ్డి తదితరులు ఉన్నారు. -
అర్హులకు పదోన్నతి కల్పించాలి
గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులను ప్రభుత్వం మాతృశాఖలకు అప్పగించి అర్హులైన వారికి పదోన్నతి కల్పించాలి. విభాగాల వారిగా సీనియారిటీ ఉద్యోగుల జాబితాను విడుదల చేసి పదోన్నతి కల్పించటంతో పాటు విధి విధానాలననుసరించి పారదర్శకంగా బదిలీలు జరిగేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి. వాటితో పాటు ఉద్యోగులకు రావాల్సిన అరియర్స్, నోషనల్ ఇంక్రిమెంట్లు తక్షణమే మంజూరు చేయాలి. – గురుస్వామి, ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్గా అమలవుతున్న విధానాన్ని జూనియర్ అసిస్టెంట్ క్యాడర్కు మార్పు చేయాలి. అలాగే ఆరేళ్ల పాటు ఒకే క్యాడర్లో విధులు నిర్వహించిన ఉద్యోగులకు ఏఏఎస్ ప్రకారం స్పెషల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి. కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న 1.25 లక్షల మంది ఉద్యోగులు ప్రభుత్వ సంక్షేమాలను ప్రతి ఇంటికి చేర్చటంలో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇంటింటికి తిరిగి సర్వేలు నిర్వహించటంలో ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదురవుతున్నాయి. – మధుసూదన్రెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, నంద్యాల ఇంటింటికి తిరిగి నిర్వహించే సర్వేలు, ఇతర పనుల నుంచి సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం విముక్తి కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతం చేస్తాం. సచివాలయ ఉద్యోగులను మాతృశాఖకు అప్పగించటంతో పాటు విభాగాల వారీగా సీనియారిటీ జాబితా విడుదల చేసి అర్హులైన వారికి పదోన్నతి కల్పించాలి. ఉద్యోగులందరికీ ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని రకాల ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి. – సంపత్కుమార్, సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి, నంద్యాల -
16 నెలల్లో ఒక్క హామీ అమలు కాలేదు
నంద్యాల(న్యూటౌన్): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయినా ఏ ఒక్క హామీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకు లు హృదయరాజు అన్నారు. ఆదివారం స్థానిక ఏపీటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో హృదయరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఉపాధ్యాయుల అపరిష్కృత సమ స్యలపై కూటమి ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా అక్టోబర్ 7న విజయవాడలో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన పీఆర్సీ, మధ్యంతర భృతి, సీపీఎస్ స్థానంలో మెరుగైన పెన్షన్ విధానం, ఆర్థిక బకాయిల చెల్లింపు, పెన్షనర్లకు కార్పొరేషన్ వంటి హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదని అన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాతపెన్షన్ అమలుకు ఆర్థిక శాఖలో నాలుగు సంవత్సరాలుగా మూలుగుతుందన్నారు. 1998, 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్ల పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. కేజీబీవీ ఉపాధ్యాయు లతో వెట్టిచాకిరి చేయించుకుంటున్న కనీస వేతన స్కేల్ అమలు చేయడం లేదని అన్నారు. సమావేశంలో ఫ్యాప్టో చైర్మన్ శివయ్య, జిల్లా ఫ్యాప్టో కార్యవర్గ సభ్యులు పీవీ ప్రసాద్, మౌలాలి, నగరి శ్రీనివాసులు, రామచంద్రారెడ్డి, సుబ్రమణ్యం, కిరణ్కుమార్రెడ్డి, సురేంద్రనాథ్, శివరాంప్రసాద్, సాంబశివుడు, అజాంబేగ్, లింగమయ్య, నాగేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
శుభంకరీ..కాళరాత్రి
● శ్రీగిరి క్షేత్రంలో నేత్రానందపర్వంగా సాగుతున్న దసరా ఉత్సవాలు శ్రీశైలంటెంపుల్: అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహాక్షేత్రంలో దసరా నవరాత్రోత్సవాలు నేత్రానందభరితంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఏడవరోజు ఆదివారం భ్రమరాంబాదేవి ఉత్సవమూర్తిని కాళరాత్రి స్వరూపంలో అలంకరించారు. అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికలో కాళరాత్రి అమ్మవారిని ఉంచి అర్చకులు, వేదపండితులు విశేష పూజాకార్యక్రమాలు చేపట్టారు. ఉత్సవాల్లో భాగంగా భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను గజ వాహనంపై అలంకరించారు. గజ వాహనదీశులైన పార్వతీ పరమేశ్వరులను అలంకార మండపంలో ఉంచి అర్చకులు, వేదపండితులు వేదమంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక పూజా హారతులనిచ్చారు. కాళరాత్రి అమ్మవారిని, గజ వాహనాధీశులైన స్వామిఅమ్మవార్లకు ఆల య ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం గంగాధర మండపం నుంచి నందిమండపం, బయలువీరభద్రస్వామి ఆలయం వరకు నిర్వహించిన గ్రామోత్సవం కమనీయంగా సాగింది. గ్రామోత్సవంలో కోలాటం, డోలు విన్యాసాలు, కేరళ చండీమేళం, డప్పు వాయిద్యాల నడుమ కళాకారుల నృత్యప్రదర్శనలు గ్రామోత్సవానికి మరింత వన్నె తెచ్చాయి. ఈ పూజా కార్యక్రమం నేత్రానందభరితంగా సాగింది. ప్రత్యేక అలంకీకృతులైన స్వామిఅమ్మవార్లను భక్తులు కనులారా దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు. ఈ పూజా కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు సోమవారం భ్రమరాంబాదేవి మహాగౌరి అలంకారంలో, భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లు నందివాహన సేవపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. అక్టోబరు 1వ తేదీ శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి అనం రామనారాయాణరెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారని దేవస్థాన ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. -
అపార్ ఐడీ ప్రక్రియను వేగవంతం చేయండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: విద్యార్థుల అపార్ ఐడీ (ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేయాలని విద్యాధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. అపార్ ఐడీ ప్రగతిపై శనివారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ విద్యా విధానంలో భాగంగా విద్యార్థుల విద్యా పురోగతిని పరిశీలించడానికి అపార్ ఐడీ కీలక సాధనమన్నారు. జిల్లాలో 4,801 మంది కళాశాల విద్యార్థుల ఐడీలు పెండింగ్లో ఉన్నాయన్నారు. అలాగే 57,942 మంది పాఠశాల విద్యార్థుల అపార్ ఐడీలు పూర్తి చేయాల్సి ఉందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఉండే చిన్నారుల్లో 15,894 మందికి ఐడీలు పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. డీఈఓ జనార్దన్ రెడ్డి, డీవీఈఓ శంకర్ నాయక్, ఐసీడీఎస్ పీడీ లీలావతి, జీఎస్డబ్ల్యూఎస్ కో ఆర్డినేటర్ ఖాదర్ బాషా పాల్గొన్నారు. -
హంస వాహనంపై ఆదిదంపతులు
శ్రీశైలంటెంపుల్: ఇల కై లాసమైన శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శనివారం అలంకార మండపంలో హంస వాహనంపై స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుంచి ఆలయ అర్చకులు, పండితులు విశేష పూజలు చేశారు. శ్రీ భ్రమరాంబాదేవిని కాత్యాయని స్వరూపంలో అలంకరించారు. అమ్మవారు చతుర్భుజాలను కలిగి ఉండి..కుడివైపున అభయహస్తాన్ని, వరముద్రను, ఎడమవైపున పద్మాన్ని, ఖడ్గాన్ని ధరించి ఉన్నారు. కాత్యాయనీ దేవిని ఆరాధిస్తే భయాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఆలయం ఎదుట భాగంలో వేదికపై ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారిని అధిష్టింపజేసి విశేష పూజా కార్యక్రమాలను జరిపారు. అనంతరం కాత్యాయనీ దేవిని, హంస వాహనంపై కొలువుదీరిన స్వామిఅమ్మవార్లను భక్తులు దర్శించుకుని ప్రత్యేక నీరాజనాలు సమర్పించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రాతఃకాల పూజలు, శ్రీచక్రార్చాన, నవావరణార్చన, విశేష కుంకుమార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీశైలంలో నేడు దసరా నవరాత్రోత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం కాళరాత్రి అలంకారంలో భ్రమరాంబాదేవి, గజవాహనంపై భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
న్యాయమూర్తులకు అవగాహన సదస్సు
కర్నూలు: ‘నేరారోపణల రిమాండ్, జీవిత రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన చట్టం–జాగ్రత్త’ అనే అంశంపై న్యాయమూర్తులకు అవగాహన సదస్సు జరిగింది. జిల్లా కోర్టు ఆవరణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి అధ్యక్షతన శనివారం జరిగిన అవగాహన సదస్సుకు హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ బీఎస్ భానుమతి, హైకోర్టు న్యాయమూర్తి ఎ.హరిహరనాథ శర్మ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయ శాఖకు సంబంధించిన పలు అంశాలపై న్యాయమూర్తులకు పలు సూచనలు చేశారు. జిల్లా అదనపు న్యాయమూర్తులు లక్ష్మీరాజ్యం, శ్రీవిద్య, శోభారాణి, రాజేంద్రబాబు, హరినాథ్తో పాటు జిల్లాలోని న్యాయమూర్తులందరూ పాల్గొన్నారు. -
దేవరగట్టు ఉత్సవాలకు శ్రీకారం
● భక్తిశ్రద్ధలతో కంకణాధారణ ● అక్టోబర్ 2న ‘బన్ని’ జైత్రయాత్రహొళగుంద: దేవరగట్టు దసరా బన్ని ఉత్సవాలకు శనివారం శ్రీకారం చుట్టారు. శ్రీమాళ మల్లేశ్వరస్వామికి శనివారం రాత్రి కంకణధారణ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నెరణికి గ్రామంలో ఉత్సవమూర్తులను కొలువుంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి పల్లకీతో పాటు విగ్రహాలను గ్రామ శివారు వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి గొరవయ్యలు, ఆలయ పూజారులతో దేవరగట్టుకు పంపారు. కొండకు చేరుకున్న విగ్రహాలను గిరిపై ఉన్న ఆలయంలోని కంకణకట్టపై కొలువుంచారు. సాయంత్రం ఆలయంలోని మూల విరాట్లకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. కంకణ కట్టపై కొలువుదీరిన మాత మాళమ్మ, మల్లేశ్వరునికి భక్తుల జయ ధ్వనుల మధ్య కంకణధారణ నిర్వహించారు. వచ్చే నెల 2న విజయదశమి రోజున స్వామి వారికి కల్యాణోత్సవం నిర్వహించడానికి నిశ్చయించారు. అనంతరం జైత్రయాత్ర, మరుసటి రోజు 3న దైవవాణీ(కార్ణీకం), 4న రథోత్సవం, 5న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, కంకణ విసర్జన, 6న మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. -
తీరం దాటిన వాయుగుండం
సాక్షి, అమరావతి/వాకాడు/కర్నూలు(అగ్రికల్చర్)/నంద్యాల(అర్బన్): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం ఉదయం తీరం దాటింది. ఒడిశాలోని గోపాల్పూర్కు దగ్గర తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా కదులుతూ క్రమంగా బలహీనపడుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి.ఆదివారం ఉత్తరాంధ్ర జిల్లాలు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా బుధవారం నాటికి ఉత్తర, దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ఎగసి పడుతున్న సముద్రం అలలు వాయుగుండం ప్రభావంతో శనివారం తిరుపతి జిల్లా వాకాడు మండలం, తూపిలిపాళెం సముద్ర తీరంలో అలలు 4 మీటర్లు ఎత్తుకు ఉవ్వెత్తున ఎగసి పడుతూ సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ తరుణంలో సముద్రంపై మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, వేటకు ఎవ్వరూ వెళ్లరాదని అధికారులు ఆదేశించారు.నంద్యాల జిల్లాలో ఎడతెరపిలేని వర్షం నంద్యాల జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటంతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. కుందూ, మద్దిలేరు, పాలేరు వాగులు ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.కర్నూలులో కుండపోతకర్నూలు జిల్లాలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో ఒకే రోజు జిల్లాలో 62 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా దేవనకొండలో 142.6 మి.మీ., అత్యల్పంగా ఆలూరులో 25.6 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఎమ్మిగనూరు మండలం సోగనూరు గ్రామంలో భారీ వర్షం కారణంగా 30 గొర్రెలు మరణించాయి. అధిక వర్షాల వల్ల పత్తి, ఉల్లి, మొక్కజొన్న, కంది, టమాటా సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో సెపె్టంబర్ నెల సాధారణ వర్షపాతం 116.5 మి.మీ. కాగా, 27 రోజుల్లో 199.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
నంద్యాల(వ్యవసాయం): 70 ఏళ్లు పైబడిన వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందజేస్తానని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి లీలా వెంకట శేషాద్రి తెలి పారు. శుక్రవారం పట్టణంలోని సైబ్జైల్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి ఖైదీలతో మాట్లాడుతూ.. సబ్జైల్లో నెలకొన్న సమస్యలు ఉంటే న్యాయవాదుల దృష్టికి తీసుకురావాలన్నారు. అదే విధంగా జైళ్లలోని ఖైదీల సంఖ్య, కేసుల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జైలు సూపరింటెండెంట్ గురుప్రసాదరెడ్డి, న్యాయవాది బాలు, లోక్ అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి, తదితరులు ఉన్నారు. ఎల్లెల్సీలో జారి పడి మహిళ మృతి ఆదోని అర్బన్: ఇస్వీ గ్రామానికి చెందిన యాస్మిన్ (30) ఎల్లెల్సీ కాలువలో ప్రమాదవశాత్తూ జారి పడి మృత్యువాత పడింది. శుక్రవారం తన సొంతూరు పెద్ద హరివాణంలోని కుటుంబీకులను చూసేందుకు యాస్మిన్ భర్త నబీసాహెబ్తో కలసి సొంత ఆటోలో వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా నబీసాహెబ్ మలవిసర్జనకు ఆటో నిలిపాడు. ఈ క్రమంలో యాస్మిన్ కాలువలో ముఖం కడిగేందుకు వెళ్లి జారి కాలువలో పడిపోయి కేకలు వేసింది. గమనించిన భర్త వెంటనే స్థానికుల సహయాంతో ఒడ్డుకు చేర్చారు. అస్వస్థతకు గురైన ఆమెను ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
మోక్షదాయినీ... శ్రీ స్కందమాత...!
మహానంది: కమలవాసినీ. శ్వేతవర్ణం కలిగిన శ్రీ స్కందమాత దుర్గను ఉపాసించడం ద్వారా భవసాగరాల నుంచి విముక్తులై మోక్షం పొందుతారని మహానంది ఆలయ వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని తెలిపారు. మహానందిలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఐదోరోజైన శుక్రవారం రాత్రి శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారు శ్రీ స్కందమాత దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక అలంకార మండపంలో సహస్రదీపాలంకరణ, నృత్యార్చన, మహామంగళ హారతులు, కూష్మాండబలి పూజలు నిర్వహించగా స్కందమాతా...నమోస్తుతే అంటూ ప్రణమిల్లారు. కాగా వర్షం కారణంగా గ్రామోత్సవాన్ని రద్దు చేశారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ, సూపరింటెండెంట్లు అంబటి శశిధర్రెడ్డి, నీలంకంఠేశ్వరరాజు, పి.సుబ్బారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ నాగమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కర్నూలు: దసరా సెలవుల నేపథ్యంలో యువకులు, విద్యార్థులు ఈతకు వెళ్లడం వల్ల ప్రమాదకర ఘటనలు జరిగే అవకాశమున్నందున జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని గ్రామాలు, పట్టణ శివారులో వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, కాల్వలు పూర్తిగా నిండిపోయాయని, తమ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో తల్లిదండ్రులు గమనించి జాగ్రత్తలు తీసుకోవాలని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నా రు. నదీ తీర ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా, ఏవైనా సమస్యలు ఉంటే 112కు డయల్ చేసి సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆపదలు, అత్యవసర పరిస్థితులు, అసాంఘిక కార్యకలాపాలు, ఏ సమస్య అయినా 112కి కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. -
అప్పుల మాఫీలో లక్ష కోట్ల అవినీతి
కర్నూలు(సెంట్రల్): ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన 11 ఏళ్ల పాలనలో కార్పొరేట్ దిగ్గజాలకు రూ.14 లక్షల కోట్ల రుణమాఫీ చేశారని, అందులో 10 శాతం వాట దక్కించుకొని లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపించారు. అప్పుల రుణమాఫీలో గుజరాత్ మార్వాడీలే ఎక్కువగా ఉన్నారని, వారి పేర్లను ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్ ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. శుక్రవారం కర్నూలుకు వచ్చిన ఆయన ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కర్నూలు జిల్లాలో ఎస్సీ వర్గాల ప్రజలు కార్పొరేషన్ ద్వారా రూ.60 కోట్ల రుణాలు తీసుకుంటే కట్టాలని నోటీసులు ఇచ్చే ప్రభుత్వాలు.. బడా కార్పొరేట్లకు ఎందుకు రుణమాఫీ చేస్తున్నాయనో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో పత్రికా స్వేచ్ఛకు తీవ్ర భంగం కలుగుతోందని, పత్రిక కార్యాలయాలు, విలేకరులపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు పాలన సజావుగా లేదని, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అసమ్మతి ఉందని చింతామోహన్ పేర్కొన్నారు. ఆయన తన సొంత నిజయోజకవర్గమైన కుప్పానికే ఏమి చేయలేదని, ఇక సొంత జిల్లా ఊసే పట్టించుకోవడం లేదన్నారు. కర్నూలులో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోతున్నా ఏమైనా చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. -
పీహెచ్సీ డాక్టర్ల శాశ్వత సంఘం ఏర్పాటుకు ఎన్నికలు
గోస్పాడు: జిల్లా ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ల శాశ్వ త సంఘం ఏర్పాటుకు ఎన్నికలు జరగనున్నట్లు అడహక్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ చెన్నకేశవులు తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు అడహక్ కమిటీ ద్వారా డాక్టర్ల సంఘం నిర్వహణ కొనసాగిందన్నారు. ఇప్పటి నుంచి ప్రైమరీ హెల్త్ సెంటర్ల డాక్టర్ల శాశ్వత సంఘం ఏర్పాటుకు రాష్ట్ర ఏపీపీహెచ్ఈడీఏ నుంచి వచ్చిన ఆదేశాలను అనుసరిస్తామనానరు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ను నియమించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణకు విన్నవించగా డీసీహెచ్ఎస్ డాక్టర్ లలితను నియమించారన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నియామకం పొందిన డీసీహెచ్ఎస్ డాక్టర్ లలితను కలిసి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని వినతి పత్రం అందజేశారు. ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ఈనెల 25న ప్రారంభమైందని, 27వ తేదీ మధ్యా హ్నం 2గంటలకు ముగుస్తుందన్నారు. అదే రోజు నామినేషన్ల పరిశీలన, 28న ఉపసంహరణ, అనంతరం అదే రోజు ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు. -
ప్రమాదం పొటుకు పెట్టింది!
పెద్దాసుపత్రి అధికారుల నిర్లక్ష్యంతో రోగుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. వైద్య సేవల కోసం సూదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు ఆసుపత్రిలో ఎదురయ్యే కష్టాలతో వణికిపోతున్నారు. పది రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో పెద్దాసుపత్రిలో ప్రమాదం పొటుకు పెట్టింది. భవనాలు మరమ్మతులకు నోచుకోకపోవడంతో ఫిమేల్ 5, 6 వార్డుల్లో వాన నీరు గోడల వెంబడి కారుతూ ఫ్లోరుపైకి చేరుకోవడంతో బెడ్లపై కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. రోగుల సహాయకుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రోగులకు అవసరమైన మందులు, ఆహారం కోసం బయటకు వెళ్లాంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లాల్సిందే. కాలు జారితే వాళ్లు కూడా అదే ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి నెలకొంది. పైకి చూస్తే భయపెట్టే పైకప్పు పెచ్చులు.. వానకు తడిచిన విద్యుత్ స్విచ్ బోర్డులు.. ఓ వైపు దోమలు.. వార్డు లోపల కుక్కలు.. వామ్మో ఇదేమి ఆసుపత్రి అని రోగులు భయపడుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలుఆసుపత్రిలోనే కుక్క కరిస్తే.. -
10 కి.మీ 500 గుంతలు
ఆలూరు–పెద్దహోతూరు రోడ్డులో ఏర్పడిన పెద్ద పెద్ద గుంతలు నియోజకవర్గ కేంద్రమైన ఆలూరు నుంచి పెద్దహోతూరు రహదారిపై ప్రయాణం అంటే ప్రయాణికులు జడుసుకుంటున్నారు. పది కిలో మీటర్లు ఉండే ఈ రోడ్డులో అడుగడుగునా మోకాలు లోతు గుంతలు ఉన్నాయి. చిన్న.. పెద్ద గుంతలు కలిపి దాదాపు 500కు పైగా ఉన్నాయి. వానలకు ఆ గుంతల్లో నీరు నిలవడంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల జిల్లా ఉన్నతాధికారులు ఈ రోడ్డుపై ప్రయాణించినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో గమనార్హం. ఈ రోడ్డు బాగుపడేదెన్నడూ.. అంటూ ప్రయాణికులు గుంతల దారిలో ప్రయాణిస్తున్నారు. – ఆలూరు -
క్యాన్సర్ను ముందుగా గుర్తిస్తే మేలు
కర్నూలు(హాస్పిటల్): క్యాన్సర్ వ్యాధిని ముందుగా గుర్తించి సరైన చికిత్స అందించడం వల్ల కోలుకునే అవకాశం ఉంటుందని రాష్ట్రీయ బాలస్వాస్త్య కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ మహేశ్వరప్రసాద్ చెప్పారు. శుక్రవారం స్థానిక ముజఫర్నగర్ యుపీహెచ్సీలో స్వస్త్నారీ స శక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పా ల్గొని మాట్లాడారు. బాల్యవివాహాలు, అపరిశుభ్రత,అబార్షన్ తదితర కారణాలతో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వస్తుందని తెలిపారు. ప్రాథమిక దశలో దీనిని గుర్తించి చికిత్స తీసుకుంటే ముప్పు నుంచి తప్పించుకోవచ్చని చెప్పారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం ద్వారా వీటిని నివారించుకోవచ్చన్నారు. ప్రాథమిక దశలో మొహమాటం కారణంగా వైద్యపరీక్షలకు ఆసక్తి చూపకపోతే ఇబ్బంది తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో డీపీ ఎంఎఓ డాక్టర్ ఉమా, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రోహిణి, డీపీఓ విజయరాజు, కన్సల్టెంట్ సుధాకర్, మల్లికార్జున, ప్రొజెక్షనిస్టు ఖలీల్ పాల్గొన్నారు. ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు డోన్ టౌన్: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. శుక్రవారం డోన్ డిపోను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ను పరిశీలిస్తూ పలువురు ప్రయాణికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బస్టాండ్లో తాగునీటి వసతి, మూత్రశాలలు, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం డిపో పరిసరాలు, గ్యారేజ్ను తనిఖీ చేశారు. బస్సుల సంఖ్య, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందితో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలు, పదోన్నతులపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిందని, త్వరలో పదోన్నతులు కల్పిస్తామన్నారు. ప్రజల సౌకర్యార్థం, సంస్థ నిర్వాహణ ఖర్చులను తగ్గించి సంస్థ లాభాలు ఆర్జీంచేలా 110 ఎలక్ట్రికల్ బస్సులను త్వరలో ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఆయన వెంట నంద్యాల జిల్లా రీజినల్ మేనేజర్ రజియా సుల్తానా, డోన్ డిపో మేనేజర్ శశిభూషణ్ తదితరులు ఉన్నారు. -
పల్లెలు, పట్టణాల్లో ఆరోగ్య ప్రచారం
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: సమగ్ర ఆరోగ్య ప్రచార రథాన్ని శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో, పట్టణాల్లో ఆరోగ్యంపై రథం ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తారని పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారానే అన్ని రకాల ఆరోగ్య సమస్యల్లో 50 శాతం మేర పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. ఎయిడ్స్తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలను కూడా ప్రజలు తేలికగా ఎదుర్కొనగలిగే విధంగా వైద్య సిబ్బంది నిరంతరం కృషి చేయాలన్నారు. సమయానికి సరైన మందులు వాడితే వ్యాధులను పూర్తిగా నియంత్రణలో ఉంచవచ్చన్నారు. సమగ్ర ప్రచార రథంలో అమర్చిన ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ఆరోగ్య అంశాలపై ప్రజలకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించాలన్నారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ – క్షయ వ్యాధి అధికారి డాక్టర్ శారదా బాయి మాట్లాడుతూ.. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సమితి మార్గదర్శకత్వంలో ఏపీ సాక్స్ ఆధ్వర్యంలో 15 రోజులపాటు నంద్యాల జిల్లాలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, వైద్య అధికారులు డాక్టర్ కాంతారావు నాయక్, డాక్టర్ అవినాష్ రెడ్డి, డాక్టర్ తేజస్విని, డాక్టర్ నౌషీన్, ఏపీ సాక్స్ ప్రోగ్రామ్ గణాంక అధికారి దేవిశంకర్ గౌడ్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నాగరాజు, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. -
పెద్దాసుపత్రి నిధులకు ‘టెండర్’!
‘తినేవాడు మనవాడైతే చాలు పంక్తిలో ఏ మూల కూర్చున్నా ముందుగా వారికే’ అన్నట్లు ఉంది కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల అధికారుల తీరు. కోట్ల రూపాయల విలువ జేసే ఆసుపత్రికి అవసరమైన మందులు, సర్జికల్స్ తదితరాల సరఫరా కాంట్రాక్టును తిరిగి పాత వారికే కట్టబెట్టారు. కొత్తవారు దరఖాస్తు చేసినా అర్హత లేదని తిరస్కరించారు. దీంతో అధికారంలో ఉన్న వారికి, అనుకూలమైన వారికే టెండర్ దక్కింది. దీంతో ఆసుపత్రిలో కోట్ల విలువైన నిధులకు ‘టెండర్’ వేసినట్లయ్యింది.కర్నూలు(హాస్పిటల్): రాయలసీమ జిల్లాలకు తలమానికమైన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు సీమ జిల్లాలతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి సైతం రోగులు చికిత్స నిమిత్తం వస్తుంటారు. ఈ ఆసుపత్రికి ప్రతిరోజూ 2,500 నుంచి 3వేల వరకు ఓపీ రోగులు, 1,200 నుంచి 1,500 వరకు ఇన్పేషంట్లు చికిత్స కోసం వస్తుంటారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం ఖరీదు కావడం, ఎన్టీఆర్ వైద్యసేవ సరిగ్గా అమలు కాకపోవడంతో ఇటీవల కాలంలో పెద్దాసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య మరింత పెరిగింది. ఒక్కోసారి ఓపీ రోగుల సంఖ్య 3,500 వరకు చేరుకుంటుండగా మెడికల్ వార్డుల్లో ఒక్కో పడకపై ఇద్దరేసి రోగులు చికిత్స అందుకుంటున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వీరందరికీ మందులు, సర్జికల్స్, ఆపరేషన్లకు ఇన్ప్లాంట్స్, వైద్యపరీక్షలకు రీ ఏజెన్స్కు ఆసుపత్రి ఖజానా నుంచి భారీగా ఖర్చు అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మందులు, సర్జికల్స్, రీ ఏజెన్స్, ఇన్ప్లాంట్స్ను ఏపీ ఎంఎస్ఐడీసీ డ్రగ్ స్టోర్ ద్వారా పంపిణీ చేస్తుంది. అక్కడ లభించని ఔషధాలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అగ్రిమెంట్ చేసుకున్న ప్రధాన మంత్రి జన ఔషధి సంస్థ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సంస్థ వద్ద కూడా మందులు లేకపోతే టెండర్ ద్వారా కాంట్రాక్టు దక్కించుకున్న వారి నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీటికి ఆసుపత్రి అభివృద్ధి నిధులు, ఎన్టీఆర్ వైద్యసేవ నిధులను అధికారులు ఖర్చు చేస్తున్నారు. ఈ మేరకు రెండు, మూడేళ్ల గడువుతో టెండర్లు పిలుస్తున్నారు. నిబంధనలతో ఎసరు ఆసుపత్రిలో మందులు, సర్జికల్స్, ఇన్ప్లాంట్స్, రీ ఏజెన్స్ కొనుగోలు కోసం అధికారులు ప్రతి ఏటా రూ.3కోట్లకు పైగా నిధులు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తాన్ని ఆసుపత్రి అభివృద్ధి సొసైటీతో పాటు, ఎన్టీఆర్ వైద్యసేవ నిధులను ఖర్చు చేస్తున్నారు. ఈ మేరకు గత నెలలో టెండర్ పిలిచారు. డిపాజిట్ను రూ.3లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచారు. సరఫరాదారు స్థానికుడై ఉండాలని, అనుభవం ఉండాలని నిబంధన పెట్టారు. అయినా కూడా నాలుగు కేటగిరీలకు 51 దరఖాస్తులు వచ్చాయి. నిబంధనల పేరుతో అధికారులు 25 మందికి మాత్రమే టెండర్ పాడేందుకు అవకాశం కల్పించారు. వీరిలో 20 మందికి టెండర్ దక్కింది. గతంలో స్థానికేతరులు సైతం మందులు సరఫరా చేశారు. వారు స్థానికంగా ఉన్న వ్యక్తులతో ఒప్పందం చేసుకుని రోగులకు మందులు అందేలా చర్యలు తీసుకున్నారు. ఈసారి స్థానికేతరులను పక్కనబెట్టారు. దీంతో ఈ టెండర్ విషయమై కొందరు కోర్టును ఆశ్రయించారు. అయినా కూడా అధికారులు టెండర్ నిర్వహించి స్థానికులకు కట్టబెట్టారు.పక్కాగా ప్రణాళిక వేసి..సాధారణంగా టెండర్లో ఎక్కువ మంది పాల్గొంటే పోటీతత్వం కారణంగా ధర తగ్గుతుంది. కొద్ది మందిని, అది కూడా స్థానికులను మాత్రమే టెండర్లో పాల్గొనేలా చేస్తే వారు చెప్పిన ధరకే కొనుగోలు చేయాల్సి వస్తుంది. మందులు, సర్జికల్స్, ఇన్ప్లాంట్స్, రీ ఏజెన్స్ ఒక్కో కంపెనీ ఒక్కో ధర, నాణ్యతలో తేడాలూ ఉంటాయి. ఉదాహరణకు పారాసిటమాల్ అనే మందును 10 మాత్రల స్రిప్ను ఒక కంపెనీ రూ.10లకు ఇస్తుండగా మరో కంపెనీ రూ.6లకు, ఇంకో కంపెనీ రూ.2లకు ఇస్తాయి. కొందరు బ్రాండెడ్ కాకుండా ప్రాపగండ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల మందులను అతి తక్కువగా కొని ఇలాంటి టెండర్ పాడి సరఫరా చేస్తుంటారు. సర్జికల్స్, ఇన్ప్లాంట్స్, ల్యాబ్ రీ ఏజెన్స్ సైతం కొన్ని తక్కువగా మార్కెట్లో లభిస్తాయి. ఈ విషయాలపై పూర్తిగా అవగాహన ఉన్న అధికారులకే ఇలాంటి టెండర్లను నిర్వహించే సామర్ధ్యం ఉంటుంది. ఈ విషయాలన్నీ అవపోసన పట్టిన కొందరు అధికారులు, ఉద్యోగులు తమ వారికి టెండర్ను కట్టబెట్టేందుకు పక్కాగా ప్రణాళిక వేసి, నిబంధనల పేరుతో ఏ మార్చి మందులు, సర్జికల్స్, ఇన్ప్లాంట్స్, రీ ఏజెంట్స్లను తమకు అనుకూలురైన వారికి ఒక్కో కేటగిరిని ముగ్గురు, నలుగురికి కట్టబెట్టారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వీరిలో కొందరు 10 ఏళ్లుగా, మరికొందరు 15 నుంచి 20 ఏళ్లుగా ఆసుపత్రికి సరఫరా చేస్తున్న వారూ ఉండటం గమనార్హం. వీరు ఏటా సరఫరా చేసే వాటి విలువ రూ.3కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. టెండర్ వివరాలను ఆసుపత్రి అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఇతరులకు ఎవ్వరికీ వివరాలు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. దీంతో టెండర్ నిర్వహణపై అనుమానాలు మరింత రెట్టింపవుతున్నాయి. అనుకూలమైన వారికి కాంట్రాక్టు దక్కేలా నిబంధనల మార్పు మెడికల్, సర్జికల్, రీ–ఏజెన్స్, ఇన్ప్లాంట్స్ కేటాయింపులు కొత్తవారు దరఖాస్తు చేస్తే అనుభవం లేదంటూ తిరస్కరణ టెండర్ల నిర్వహించి రూ.3కోట్ల విలువైన పనుల అప్పగింత! -
శ్రీశైలం, విజయవాడ వెళ్లే వాహనాల దారి మళ్లింపు
● సిద్ధాపురం అలుగు వద్ద పోలీసుల బందోబస్తుఆత్మకూరు: భారీ వర్షంతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆత్మకూరు మీదుగా శ్రీశైలం, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, ఒంగోలు, చీరాల తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. నల్లమలలోని రాళ్లవాగు ఉధృతితో సిద్ధాపురం చెరువుకు వరదనీరు పోటెత్తింది. ఫలితంగా సిద్ధాపురం చెరువు నిండి అలుగు దాటి ప్రమాద సూచికతో ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ఆత్మకూరు పోలీసులు అప్రమత్తమై గురువారం రాత్రి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. నల్లమల నుంచి కర్నూలు–గుంటూరు జాతీయ రహదారి మీదుగా దోర్నాల వద్దే వాహనాలను నిలిపివేసినట్లు సీఐ రాము తెలిపారు. ఈ వాహనాలను దోర్నాల నుంచి మార్కాపురం, గిద్దలూరు మీదుగా నంద్యాల, ఆత్మకూరు, కర్నూలుకు చేరాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే బెంగళూరు, కర్నూలు మీదుగా వచ్చే వాహనాలను ఆత్మకూరు పట్టణంలోని నంద్యాల టర్నింగ్ వద్ద నంద్యాల, గిద్దలూరు, దోర్నాల మీదుగా శ్రీశైలం, విజయవాడకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే వరద అధికంగా అలుగు వద్ద ఉండడంతో దోర్నాల పోలీసులతో ఆత్మకూరు పోలీసులు మాట్లాడి వాహనాల రాకపోకలకు దారి మళ్లించారు. వరదరాజస్వామి ప్రాజెక్టుకు భారీ వరదనీరు చేరడంతో రాత్రి 9 గంటల సమయంలో హుటాహుటిన మొదటి గేటు ఎత్తి 1000 నుంచి 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో కురుకుంద, కొత్తపల్లి, ఆత్మకూరు వద్ద ఉన్న భవనాశి నది, సుద్దవాగులు పొంగి ప్రవహించాయి. దీంతో రాకపోకలు నిలిపివేశారు. కురుకుంద, కొత్తపల్లి మండలాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగును ఎట్టి పరిస్థితుల్లో దాటొద్దని సీఐ సూచించారు. రెండుచోట్ల పోలీసులు బందోబస్తు నిర్వహించినట్లు తెలిపారు. భారీ వర్షాలు కురవడంతో ఆత్మకూరు, కొత్తపల్లి మండలాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పగిడ్యాల మండలంలో అత్యధిక వర్షం నంద్యాల(అర్బన్): జిల్లాలో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. పగిడ్యాల మండలంలో అత్యధికంగా 36.4 మి.మీ వర్ష పాతం నమోదైంది. జూపాడుబంగ్లా, కొత్తపల్లిలో 26.8, శ్రీశైలంలో 23.4, నందికొట్కూరు, ఆత్మకూరులలో 18.4, పాములపాడులో 11.0, మిడుతూరులో 10.4 మి.మీ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. -
కేఎంసీ మైక్రోబయాలజీకి ఎన్ఏబీఎల్ గుర్తింపు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజి(కేఎంసీ)లోని మైక్రోబయాలజీ విభాగానికి ప్రతిష్టాత్మకమైన ఎన్ఏబీఎల్ గుర్తింపు లభించింది. ఈ మేరకు మైక్రోబయాలజీ విభాగం వైద్యులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ శుక్రవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మైక్రోబయాలజీ విభాగంలోని హెచ్ఐవీ పరీక్షలకు ఎన్ఏబీఎల్ నూతన నిబంధనల ప్రకారం గుర్తింపు లభించిందన్నారు. అత్యంత కచ్చితత్వంతో పరీక్షలు నిర్వహించే వారికే ఈ గుర్తింపు లభిస్తుందన్నారు. మైక్రోబయాలజీ హెచ్ఓడీ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రేణుకాదేవి మాట్లాడుతూ ప్రిన్సిపాల్ సహకారంతో సూపర్స్పెషాలిటీ డీఎం వైరాలజి సీట్లకు ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలిపారు. -
విశేష పూజలు
● శేష వాహనంపై కనిపించిన ఆదిదంపతులు ● స్వామిఅమ్మవార్లను దర్శించుకుని పులకించిన భక్తజనం శేష వాహనాధీశులైన స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు నిర్వహిస్తున్న అర్చకులు శ్రీశైలంటెంపుల్: దసరా మహోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లు శేష వాహనంపై కనిపించి భక్తులకు ఆశీస్సులు అందించారు. శేషవాహనంపై ప్రత్యేకంగా అలంకరించిన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు అలంకార మండపంలో అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. స్కందమాత స్వరూపంలోని అమ్మవారిని, శేషవాహనంపై అధిష్టించిన స్వామిఅమ్మవార్లను కన్నులారా భక్తులు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించుకుని నీరాజనాలు సమర్పించారు. ఈ పూజా కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వర్షం కారణంగా స్వామిఅమ్మవార్లకు నిర్వహించాల్సిన గ్రామోత్సవం రద్దయింది. స్కందమాత అలంకారంలో శ్రీశైల భ్రామరీ నవదుర్గాలలో ఐదో రూపమైన స్కందమాత దేవి చతుర్భుజాలను కలిగి ఉంటారు. ఒక చేతిలో స్కందున్ని పట్టుకుని ఉండి, మిగిలిన చేతుల్లో పద్మాలను, అభయముద్రలను ధరించి ఉంటారు. ఈమె ఒడిలో బాలుని రూపంలో స్కందుడు(కుమారస్వామి)కూర్చొని ఉంటారు. స్కందదేవుని జనని కావడంతో ఈ దుర్గాస్వరూపం స్కందమాతగా ప్రసిద్ధి చెందారు. స్కందమాతను ఆరాధిస్తే సకల కోర్కెలు నెరవేరడంతో పాటు శాంతి సౌఖ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. దసరా నవరాత్రోత్సవాలల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం శ్రీశైల భ్రమరాంబాదేవి స్కందమాత స్వరూపంలో ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కొలువుంచారు. అనంతరం ఆలయ అర్చకులు, వేదపండితులు వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజా హారతులనిచ్చారు. శ్రీశైలంలో నేడు.. దసరా నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శనివారం శ్రీశైల క్షేత్రంలో కాత్యాయని అలంకారంలో అమ్మవారు, హంస వాహన సేవపై స్వామిఅమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
ఇవీ డిమాండ్లు..
కోవెలకుంట్ల: సమగ్ర శిక్ష, విద్యాశాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ చిరు ఉద్యోగులు వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 168 మంది సీఆర్ఎంటీ(క్లస్టర్ రిజర్వు మొబైల్ టీచర్స్)లు, మండల్ లెవల్ అకౌంటెంట్లు, ఎంఐఎస్ కో ఆర్టినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వేతనాలు అందక, సంక్షేమ పథకాలు వర్తించక కుటుంబాలను భారంగా నెట్టుకొస్తున్నారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, ఇంటి అద్దెలు, పిల్లల చదువు, వైద్య, ఇతర ఖర్చులతో దిక్కుతోచని పరిస్థితులతో అల్లాడిపోతున్నారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేకుండా పనిచేయాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వంలో అందని వేతనాలు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదు. అరకొరగా వస్తున్న వేతనాలు సైతం రెండు నెలల నుంచి అందడం లేదు. వేతనాల పెంపు అటుంచితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడస్తున్న పథకాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమమ్ టైం స్కేల్ వర్తింపచేయరాదని ఈ ఏడాది జనవరి నెలలో జీవోనంబర్–2ను విడుదల చేసింది. ప్రభుత్వ శాఖల్లో మంజూరైన ఖాళీపోస్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు మాత్రమే అర్హులుగా తేల్చింది. ఈ జీఓ రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కుకు విరుద్ధమని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సరైన వేతన నిబంధనలు లేకపోవడం బాధాకరమని ఉద్యోగులు వాపోతున్నారు. తప్పని వెట్టి చాకిరి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతని పనిచేస్తున్న సీఆర్ఎంటీఎస్లతో ప్రభుత్వం వెట్టిచాకిరి చేయిస్తోంది. ఈ ఏడాది జూన్నెలలో పాఠశాలలు పున:ప్రారంభం కాగా ఉపాధ్యాయుల బదిలీలు, డీఎస్సీ పరీక్షల నిర్వహణ అదే నెలలో ఉండటంతో పనిభారం సీఆర్ఎంటీఎస్లపై పడింది. జిల్లాలో ఉన్న ఏకోపాధ్యాయ పాఠశాలల్లో వీరు ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తించాల్సి వచ్చింది. సీఆర్ఎంటీఎస్లను డిప్యూటేషన్లపై ఇతర పనులు అప్పగించమని ప్రకటించినా ఆచరణలో అమలు కాలేదు. ఏకారణంతోనైనా ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయుడు విధులకు హాజరు కాకపోతే ఆ స్థానాల్లో సీఆర్ఎంటీఎస్లు వెళ్లి విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు. అమలు కాని హామీలు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింప చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ చేర్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, తల్లికి వందనం, నూతన రేషన్కార్డులు, తదితర సంక్షేమ పథకాలు వర్తింప చేసినా కొందరికి మాత్రమే షరతులు విధించారు. నిత్యావస ధరలు, రవాణా ఖర్చులు, వైద్య ఖర్చులు, ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగడంతో అప్పులు చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఇలా.. జిల్లాలోని ఆయా మండలాల్లోని ఎంఈఓ కార్యాలయాల్లో 91 మంది సీఆర్ఎంటీఎస్లు, 19 మంది మండల్ లెవల్ అకౌంటెంట్లు, 29 మంది ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, 29 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. వీరంతా 2012లో ఉద్యోగాల్లో చేరారు. వీరికి గతంలో నెలకు రూ. 18,500 వేతనం అందేది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2020వ సంవత్సరం వేతనాన్ని రూ. 23,500లకు పెంచింది. అప్పటి నుంచి వీరికి ఈ వేతనం అందుతోంది. ఆరోగ్య భద్రత, పిల్లల విద్య, ఇంటి అద్దె భృతి, రేషన్ సబ్సిడీ పథకాలను ప్రత్యేకంగా అమలు చేయాలి. రద్దు చేసిన ఒంటరి మహిళ పెన్షన్, కుటుంబ సభ్యుల వృద్ధాప్య పింఛన్లు పునరుద్ధరించాలి. అంగన్వాడీ, ఆశావర్కర్లకు గ్రాట్యూటీ అమలు చేస్తూ రిటైర్డ్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇదే విధానాన్ని అమలు చేయాలి. జిల్లాలో 168 మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వేతనాలు అందక, సంక్షేమ పథకాలు వర్తించక అవస్థలు ఉద్యోగుల కుటుంబాల్లో ఆకలి కేకలు సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని డిమాండ్ -
ఆది స్వరూపం.. దివ్య తేజం
● కూష్మాండ దుర్గ స్వరూపంలో భక్తులకు సాక్షాత్కరించిన శ్రీశైల భ్రామరి ● కై లాసవాహనంపై స్వామిఅమ్మవార్ల దర్శనం ● శ్రీశైలంలో వైభవంగా దసరా నవరాత్రోత్సవాలుశ్రీశైలంటెంపుల్: సృష్టి లేని వేళ..దశ దిశలు అంధకారంలో ఉన్నప్పుడు.. తన మందస్మితంతో ఈ బ్రహ్మాండాన్ని సృష్టించిన దివ్యస్వరూపిణి కూష్మాండదుర్గ. ఈ దేవికి గుమ్మడికాయ బలి ప్రీతికరం. ఎనిమిది చేతుల్లో ఆయుధాలు ధరించి ఉండడంతో అష్టభుజదేవిగానూ భక్తులు కొలుస్తారు. దసరా ఉత్సవాల్లో భాగంగా నాల్గో రోజు గురువారం శ్రీశైల భ్రమరాంబాదేవి కూష్మాండదుర్గ అమ్మవారి స్వరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ దేవి ఎనిమిది భుజాలు కలిగి ఆది స్వరూపిణిగా పేరుపొందారు. కూష్మాండదుర్గ దేవిని ఆరాధిస్తే రోగాలన్నీ తొలగి ఆయువు, యశస్సు వృద్ధి చెందుతాయని భక్తుల నమ్మకం. కూష్మాండదుర్గ అలంకారంలో అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికలో అధిష్టింపజేసి అర్చకులు, పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
గౌరవ వేతనాలు ఇచ్చేందుకు చేతులు రావడం లేదు
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనాలను విడుదల చేసేందుకు చేతులు రావడం లేదు. ముస్లిం, క్రిస్టియన్లకు సూపర్ 10 అమలు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఆయా వర్గాలకు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. ముస్లిం, క్రిస్టియన్ వర్గాలపై ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ చట్టాన్ని బలపరిచేది కాదు. – పీ ఇక్బాల్హుసేన్, ఆవాజ్ నగర కమిటీ అధ్యక్షుడు -
వైభవోపేతం.. స్వాతి మహోత్సవం
ఆళ్లగడ్డ: శ్రీనరసింహ స్వామి జన్మనక్షత్రమైన స్వాతిని పురస్కరించుకుని గురువారం స్వాతి మహోత్సవం వైభవంగా నిర్వహించారు. దిగువ అహోబిలంలో ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను ఆండాల్ ఆమ్మవారి దేవాలయం ఎదురుగా యాగశాలలో కొలువుంచారు. అభిషేకం, అర్చన, తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను నూతన పట్టుపీతాంబరాలతో అలంకరణచేసి కొలువుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అర్చకుల వేద మంత్రోచ్ఛారణలు.. ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాల మధ్య శ్రీ స్వాతి, శ్రీసుదర్శన హోమాలు వైభవోపేతంగా నిర్వహించి పూర్ణాహుతితో ముగించారు. రాత్రి విశేష పుష్పాలకంరణ గావించిన ఉత్సవ పల్లకీలో ఉభయ దేవేరులతో కొలువైన శ్రీ ప్రహ్లాదవరదుడు మాడవీధుల్లో సంచరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. -
ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
నందికొట్కూరు: ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఖైదీలకు కోర్టు ఉచిత న్యాయ సహాయం అందజేస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి లీలా వెంకటశేషాద్రి అన్నారు. గురువారం పట్టణంలోని సబ్జైల్ను జడ్జి ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సబ్జైల్లో నెలకొన్న సమస్యలుంటే న్యాయవాదుల దృష్టికి, ఆన్లైన్ నంబరు 15100 ద్వారా కంప్లయింట్ చేయవచ్చని స్పష్టం చేశారు. 70 ఏళ్లకు పైబడిన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోజన వసతుల గురించి ముద్దాయిలను అడిగి తెలుసుకున్నారు.వైద్య సదుపాయల గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సబ్జైల్ సూపరింటెండెంట్ రఘునాథరెడ్డి, న్యాయవాది వెంకటేశ్వర్లు, మెడికల్ ఆఫీసర్ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. -
పరిశుభ్రతతో అందరికీ ఆరోగ్యం
● జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ నంద్యాల: పరిసరాల పరిశుభ్రతతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పేర్కొన్నారు. నంద్యాల కలెక్టరేట్ ఆవరణంలో స్వచ్ఛతహి సేవ–2025లో భాగంగా ‘ఏక్ దిన్.. ఏక్ గంట.. ఏక్ సాత్ స్వచ్ఛత’ కార్యక్రమం గురువారం నిర్వహించారు. కలెక్టరేట్ సిబ్బందితో కలిసి జేసీ విష్ణు చరణ్ చెత్తాచెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల పరిసర ప్రాంతాల్లో మురుగు నీరు నిల్వ ఉండి, చెత్త దిబ్బలు ఉంటే దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందన్నారు. పట్టణంలోని ముఖ్య ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. డీఆర్ఓ రాము నాయక్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేరాల నియంత్రణకు చర్యలు శ్రీశైలంప్రాజెక్ట్: నేరాలను నియంత్రించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోనున్నట్లు ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. శ్రీశైలం టూటౌన్ అవుట్పోస్టును గురువారం మధ్యాహ్నం ఎస్పీ సునీల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పనితీరుపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ.. సున్నిపెంట టూటౌన్లో సిబ్బంది కొరత ఉందని తన దృష్టికి వచ్చిందన్నారు. టూటౌన్ శాశ్వత భవన నిర్మాణానికి రాష్ట్ర ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతామన్నారు. ఎస్పీ వెంట ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్, సీఐలు చంద్రబాబు, ప్రసాదరావు ఉన్నారు. సెలవులో వెళ్లిన జిల్లా ట్రెజరీ అధికారి ● ఏటీవో సుబ్బరాయుడుకు పూర్తి అదనపు బాధ్యతలు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా ట్రెజరీ అధికారి రామచంద్రరావు అనారోగ్య కారణాలతో ఈ నెల 19 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు సెలవులో వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇదే కార్యాలయంలో అసిస్టెంట్ ట్రెజరీ అధికారి(ఏటీవోగా పనిచేస్తున్న సుబ్బరాయుడును పూర్తి అదనపు బాధ్యతలతో జిల్లా ట్రెజరీ అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ఖజానా శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు బాధ్యతలు స్వీకరించిన సుబ్బరాయుడును ఏపీటీఎస్ఏ జిల్లా అధ్యక్షుడు డి.రవికుమార్, సెక్రటరీ గురుమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మురళీధర్నాయుడు, రాష్ట్ర కార్యదర్శి జడ్.కరుణాకర్ పలువురు ట్రెజరీ ఉద్యోగులు అభినందించారు. తప్పుడు స్టాంపు డ్యూటీ సొమ్ము రూ.20.26 లక్షల రికవరీ ● అప్పటి సబ్ రిజిస్ట్రార్ రాజశేఖర్పై క్రమశిక్షణా చర్యలు కర్నూలు(సెంట్రల్): ఆస్తి విలువను తక్కువగా చూపి రూ.20.26 లక్షల స్టాంపు డ్యూటీ మినహాయింపుపై లోకాయుక్త ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది క్షమించరాని నేరమని, బాధ్యతాయుత హోదాలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ అలా చేయడంతో అతనికి మూడు సంవత్సరాలపాటు ఇంక్రిమెంట్లను నిలుపుదల చేయడంతోపాటు రూ.20.26 లక్షలను బాధిత పార్టీల నుంచి ఖజానాకు జమ చేసేలా చర్యలు చేపట్టింది. 2023లో అప్పటి ఆదోని సబ్ రిజిస్ట్రార్ రాజశేఖర్ డాక్యుమెంట్ నంబర్ 5352/2023 రిజిస్ట్రేషన్కు తక్కువ స్టాంపు డ్యూటీ నమోదు చేసి ఖాజానాకు రూ.20.26 లక్షలు ఆర్థిక నష్టం కలిగించారని లోకాయుక్తకు ఫిర్యాదు రావడంతో ఉప లోకాయుక్త స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కర్నూలు డీఐజీని విచారణకు ఆదేశించారు. విచారణలో నేరం రుజువు కావడంతో బాధిత పార్టీల నుంచి రూ.20,26,200 వసూలు చేయడమే కాకుండా సబ్ రిజిస్ట్రార్ రాజశేఖర్పై క్రమశిక్షణా చర్యల కింద మూడు సంవత్సరాల పాటు ఇంక్రిమెంట్ల కోత విధిస్తూ లోకాయుక్తకు గురువారం నివేదిక సమర్పించారు. పరిశీలించిన ఉప లోకాయుక్త జస్టిస్ పి.రజనీ కేసును మూసివేశారు. -
అనాథ పిల్లలపై ‘వాత్సల్య’ం
● జిల్లాలో తొమ్మిది మందికి ఆర్థిక సహాయం నంద్యాల: కోవిడ్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన నిరుపేద పిల్లలకు మిషన్ వాత్సల్య స్కీం కింద గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్లో ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ.. జిల్లాలో కోవిడ్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన తొమ్మిది మంది పిల్లలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందన్నారు. ఒక్కొక్కరికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు కలిపి మొత్తం రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందజేశామన్నారు. బాధిత పిల్లల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తు సాధికారత కోసం మిషన్ వాత్సల్య పథకం కింద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. ఎటువంటి సమస్యలు ఎదురైనా జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులను అనాథ పిల్లలు సంప్రదించాలన్నారు. ఎంతో సంతృప్తి కోవిడ్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనాఽథ పిల్లలను ఆదుకోవడంలో ఎంతో సంతృప్తి కలుగుతోందని జిల్లా కలెక్టర్ తెలిపారు. నందికొట్కూరు మండలం వడ్డేమాను గ్రామానికి చెందిన పి.రాజుకు రూ.1.50 లక్షల విలువైన వీడియో కెమెరా, గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు నిర్మించుకునేందుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. శ్రీశైలం మండలం సున్నిపెంట గ్రామానికి చెందిన ఎస్.సబి సుల్తానా బి.ఫార్మసీ చదువుతున్నదని వివరించగా ఆమె విద్య కొనసాగించేందుకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. పాణ్యం మండలం బలపనూరు గ్రామానికి చెందిన సుప్రియ, సూర్యలక్ష్మిలకు గృహ నిర్మాణ నిధులు మంజూరు చేస్తామన్నారు. ఆత్మకూరు మండలం నల్లకాల్వ గ్రామానికి చెందిన ఎస్. సౌమ్యకు డిగ్రీ పూర్తి చేసుకునేందుకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. అలాగే మహేష్, మధుసూదన్, వంశీకృష్ణ, ఓబులేసు మొత్తం 9 మంది పిల్లలను పేరుపేరునా పిలిచి వారి పరిస్థితులను జిల్లా కలెక్టర్ తెలుసుకున్నారు. -
ఆదోని ఎంపీపీపై అవిశ్వాస తీర్మానానికి వినతి
ఆదోని రూరల్/ఆదోని టౌన్: ఆదోని ఎంపీపీపై అవిశ్వాసానికి వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు సిద్ధమయ్యారు. ఈ మేరకు గురువారం మండలంలోని 20 మంది వైఎస్సార్సీపీ చెందిన ఎంపీటీసీలు ఏకమై ఎంపీపీపై అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించాలని సబ్కలెక్టర్ మౌర్యభరద్వాజ్ను కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ౖవైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి చంద్రకాంత్రెడ్డి, మండలాధ్యక్షుడు గురునాథ్రెడ్డి, ఎంపీటీసీలు మాట్లాడారు. ౖవైఎస్సార్సీపీ తరఫున గెలిచి వేరే పార్టీలో చేరడంతోనే ఎంపీపీ దానమ్మపై అవిశ్వాస తీర్మానం పెట్టినట్లు తెలిపారు. దానమ్మ పార్టీకి నమ్మకద్రోహం చేసిందని, అందువల్లనే ఆమెను ఎంపీపీ పదవి నుంచి దించాలన్న ఉద్దేశంతోనే తాము ఈ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టినట్లు చెప్పారు. స్పందించిన సబ్కలెక్టర్ మౌర్యభరద్వాజ్ మాట్లాడుతూ.. ఎంపీటీసీల వినతి మేరకు 15 రోజుల్లో నోటీసు జారీ చేస్తామన్నారు. అవిశ్వాస తీర్మానంలో ప్రస్తుత ఎంపీపీగా ఉన్న దానమ్మ నెగ్గితే కొనసాగుతారని, లేనిపక్షంలో తదుపరి ఎంపీపీ ఎన్నిక జరుగుతుందన్నారు. పార్టీకి నమ్మకద్రోహం వైఎస్సార్సీపీ తరఫున కపటి గ్రామ ఎంపీటీసీగా ఏకగ్రీవంగా గెలుపొందిన దానమ్మను అప్పటి ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీపీగా ఎన్నుకున్నారు. ఆదోని మండలంలో మొత్తం 29 మంది ఎంపీటీసీ స్థానాలు ఉండగా మండిగిరి–1, 2, సాదాపురం స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. 26 స్థానాల్లో మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఇందులో ముగ్గురు మృతి చెందగా, ఒకరు రాజీనామా చేశారు. అప్పటి ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి ఆదేశాల మేరకు కపటి గ్రామానికి చెందిన ఎంపీటీసీ దానమ్మ ఎంపీపీగా ఎన్నుకున్నారు. -
టమాట ధర మరింత పతనం
పత్తికొండ/ప్యాపిలి: మార్కెట్లో టమాట ధర మరింత పతనం అయ్యింది. గత కొద్ది రోజులుగా నిలకడగా ఉండటం లేదు. దీంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. గురువారం పత్తికొండ పట్టణంలోని మార్కెట్లో టమాట ధర కిలో రూ.2 నుంచి గరిష్టంగా రూ.4 మాత్రమే పలికింది. మార్కెట్లో ధర తగ్గినప్పుడు కూటమి ప్రభుత్వం కిలో 8 రూపాయలకు కోనుగోలు చేస్తామన్న హామీ ఇచ్చినా క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పత్తికొండ మార్కెట్యార్డులో గురువారం టమాట 25కేజీల జత గంపలు కేవలం రూ.150 నుంచి రూ.250లోపు ధర పలికింది. వ్యాపారులు కమీషన్ పట్టుకోని ఇవ్వడంతో కేజీ రూ.2 నుంచి రూ. 4 మాత్రమే వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో 421 క్వింటాల టమాటను వ్యాపారులు కోనుగోలు చేశారు. దాదాపు 10 లారీల సరకు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేశారు. మూడో రోజు కూడా పూర్తిగా ధరలు తగ్గిపోవడంతో ఈఏడాది టమాట పంట సాగు కోసం పెట్టిన పెట్టుబడులు కూడా రాక మమ్ముల్ని అప్పుల్లో ముంచేస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఽ ప్యాపిలిలో.. ప్యాపిలి మార్కెట్లో రెండు రోజుల క్రితం 25 కిలోల బాక్స్ రూ. 650 వరకు పలికింది. గురువారం మాత్రం 25 కిలోల బాక్స్ ధర రూ. 50 పలికింది. కిలో రెండు రూపాయలకు పలకడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులు కుమ్మకై ్క రైతులను నిలువునా ముంచుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తనకేమీ పట్టనట్లు చోద్యం చూస్తోందని మండిపడ్డారు. -
ప్రశాంతంగా నంద్యాల డయాసిస్ కమిటీ ఎన్నిక
● సెక్రటరీగా ప్రభుదాసు, ఉపాధ్యక్షుడిగా రాజేంద్రబాబు విజయంనంద్యాల(న్యూటౌన్): నంద్యాల అధ్యక్ష ఖండం డయాసిస్ కమిటీ ఎన్నిక గురువారం ప్రశాంతంగా జరిగింది. పట్టణంలోని హోలీక్రాస్ కెథడ్రల్ చర్చికి ఎదురుగా ఉన్న డయాసిస్ కార్యాలయ ఆవరణలో బిషప్ సంతోష్ ప్రసన్నరావు ఆధ్వర్యంలో డయాసిస్ సెక్రటరీ, ఉపాధ్యక్షులకు హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అధికారిగా స్టాండ్లీ విలీయం వ్యవహరించారు. ఉదయం 9గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 2 గంటకు ముగిసింది. అప్పటి నుంచి కౌంటింగ్ నిర్వహించారు. డయాసిస్ సెక్రటరీగా బైళ్ల ప్రభుదాసు 200 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అలాగే ఉపాధ్యక్షుడిగా రెవరెండ్ మేకల రాజేంద్రబాబు 300 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. అలాగే డయాసిస్ ట్రెజరర్గా పరిశుద్ధ మత్తయి ఆలయం డీనరీ చైర్మన్ నందం ఐజక్ను కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ కమిటీ మూడేళ్ల పాటు 2028 వరకు కొనసాగుతుందని బిషప్ వివరించారు. ఎన్నికై న అభ్యర్థులను ఆయా పాస్టరేట్ల కౌన్సిలర్లు, గురువులు పూలమాలలతోను ఘనంగా సత్కరించారు. నూతనంగా ఎన్నికై న డయాసిస్ సెక్రటరీ బైళ్ల ప్రభుదాస్, ఉపాధ్యక్షుడు మేకల రాజేంద్రబాబు మాట్లాడుతూ.. బిషప్ సంతోష్ ప్రసన్నరావు ఆధ్వర్యంలో నంద్యాల డయాసిస్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. డయాసిస్ ఎన్నికల సందర్భంగా మూడవ పట్టణ సీఐ కంబగిరిరాముడు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉపాధ్యక్షుడు రాజేంద్రబాబుసెక్రటరీ బైళ్ల ప్రభుదాసు -
సింహ వాహనంపై కూష్మాండదుర్గ
మహానంది: మహానందిలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీకామేశ్వరిదేవి కూష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అలంకార మండపంలో ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, రుత్వికులు ముందుగా అమ్మవారికి విశేష అలంకార పూజలు, సహస్రదీపాలంకరణ పూజలు చేపట్టారు. బలిహరణ, కూష్మాండబలి పూజల అనంతరం అమ్మవారిని సింహవాహనంపై కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఉత్సవం చేపట్టగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమాల్లో ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్రెడ్డి, నీలకంఠేశ్వరరాజు, పి.సుబ్బారెడ్డి, ఇన్స్పెక్టర్ నాగమల్లయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
● బావిలో మునిగి ఇంటర్ విద్యార్థి మృతికర్నూలు: ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణాన్ని బలి తీసుకుంది. కర్నూలు మండలం నూతనపల్లె గ్రామానికి చెందిన జయంతి, వెంకటేశ్వర్లు దంపతుల కుమారుడు శ్రీనివాసులు(17) కర్నూలు మండలం పసుపల–రుద్రవరం గ్రామాల మధ్య ఉన్న పొలంలోని బావిలో సరదాగా ఈత కొట్టేందుకు దిగాడు. సరిగ్గా ఈత రాకపోవడంతో మునిగి మృతిచెందాడు. తల్లి జయంతి దుబాయ్లో నర్సుగా పనిచేస్తుండగా తండ్రి వెంకటేశ్వర్లు కర్ణాటకలో పాలిష్ కట్టర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి కొడుకు, కూతురు సంతానం. ఇద్దరు కూడా నాయనమ్మ దగ్గర ఉంటూ చదువుకుంటున్నారు. శ్రీనివాసులు పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు ఎదురుగా ఉన్న సెయింట్ మేరీస్ జూనియర్ కళాశాలలో ఫస్టియర్ ఇంటర్మీడియట్ హెచ్ఈసీ చదువుతున్నాడు. బుధవారం స్నేహితులు ఈదుర్ బాషా, గణేష్, నవీన్, చంద్రహాస్లతో కలసి పసుపుల సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు చేరుకున్నారు. స్నేహితులందరూ నీటిలోకి దిగి ఈత కొడుతుండగా తనకు కూడా కొద్దిగా ఈత వచ్చని స్నేహితులకు చెప్పి వారితో సరదాగా గడిపేందుకు నీటిలోకి దిగి మునిగిపోయాడు. ఎంత సేపటికీ నీటిలో నుంచి తేలకపోవడంతో స్నేహి తులు భయాందోళనకు లోనై పరిగెత్తుకుంటూ వెళ్లి కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని బావిలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలోని మార్చు రీ కేంద్రానికి తరలించి భద్రపరిచారు. విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు కర్నూలుకు చేరుకున్నారు. అయితే విద్యార్థి శ్రీనివాసులు పెదవులు, చెవుల వద్ద చాపలు కొరికిన గాట్లు ఉన్నాయి. వాటిని చూసి స్నేహితులే ఏదో చేశారని, అందుకే తన కుమారుడు మృతిచెందాడని తల్లి జయంతి అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. -
ఫుట్బాల్ విజేత కర్నూలు
● బాలికల విభాగంలో అనంతపురం జట్టు ● ముగిసిన రాష్ట్ర స్థాయి పోటీలు ఎమ్మిగనూరుటౌన్: మూడు రోజులుగా ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్ 19 స్కూల్ గేమ్స్ ఫుట్బాల్ పోటీల్లో బాలురు విభాగంలో కర్నూలు జట్లు విజేతగా నిలిచింది. గురువారం ఫైనల్ పోటీలు హోరాహోరీగా సాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి బాలురు, బాలికల జట్లు ఈ పోటీల్లో తలపడ్డాయి. ఈ పోటీల్లో బాలుర విభాగంలో ద్వితీయ స్థానం శ్రీకాకుళం జట్టు, తృతీయ స్థానాన్ని అనంతపురం జిల్లా జట్టు దక్కించుకొంది. అదే విధంగా బాలిక పోటీల్లో మొదటి స్థానాన్ని అనంతపురం జట్టు, ద్వితీయ స్థానాన్ని విశాఖ పట్టణం జట్టు కై వసం చేసుకోగా తృతీయ స్థానం వెస్ట్ గోదావరి జిల్లా జట్టు దక్కించుకొంది. గెలుపొందిన ఆయా జట్లకు జిల్లా ఆర్ఐఓ లాలప్ప, మల్లెల గ్రూప్స్ అధినేత మల్లెల ఆల్ఫ్రెడ్రాజు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి రాఘవేంద్రాచారి, ఫుట్బాల్ అసొయేషన్ అధ్యక్షుడు రామకృష్ణ నాయుడు పాటు స్థానిక ప్రజాప్రతినిధులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పోటీల ఆర్గనైజర్లు వ్యాయామ ఉపాధ్యాయులు నరసింహరాజు, హనీఫ్, శ్రీనివాసులు, సీజీ ఈరన్న ,శ్రీరాములు, లతీఫ్, వెంకటేష్, బసవరాజు, గంగాధర్తో పాటు పలువురు పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. -
సస్యరక్షణ చర్యలతో తెగుళ్ల నివారణ
కొత్తపల్లి: సస్యరక్షణ చర్యలతో తెగుళ్ల నివారణ సాధ్యమని యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు సుధాకర్, బాలరాజు, కృష్ణమూర్తి, రవిగౌడ్ అన్నారు. గురువారం వారు నందికుంట గ్రామ సమీపంలోని వరిపొలాలను పరిశీలించారు. అనంతరం స్థానిక వెలుగు కార్యాలయంలో రైతు ఉత్పత్తి దారుల సంఘం రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వాతావరణం చల్లగా ఉండడంతో తెగుళ్లు సోకే అకాశం ఎక్కువగా ఉందన్నారు. రైతులు భూసార ఆధారిత ఎరువుల యాజమాన్యం చేపట్టి సాగు ఖర్చు తగ్గించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అమీరున్నీసా బేగం, ఏపీఎమ్ పుల్లయ్య, వెలుగు సీసీలు నరసింహులు, రైతులు, మహిళా రైతులు పాల్గొన్నారు. కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో మే/జూన్ నెలల్లో జరిగిన డిగ్రీ రెండు, నాల్గవ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల పునఃమూల్యాంకనం ఫలితాలను విడుదల చేశారు. వర్సిటీ వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసరావు ఆదేశాల మేరకు ఫలితాలను విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు పేర్కొన్నా రు. రెండో సెమిస్టర్కు సంబంధించి 541 మంది రీ వాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోగా 151 మంది, నాల్గవ సెమిస్టర్కు 781 మందికి 196 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఫలితాలు https://rayalaseemauniversity.ac.in లో అందుబాటులో ఉన్నాయన్నారు. బాషా, రక్ష ఆసుపత్రులపై కేసులు నమోదు చేయండి కర్నూలు (సెంట్రల్): లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న కోడుమూరు బాషా, కర్నూలు రక్ష ఆసుపత్రులపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ కమిటీ (పీసీ, పీఎన్డీటీ యాక్ట్) సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సమావేశానికి 6వ అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి లక్ష్మీరాజ్యం, డీఎంహెచ్ఓ డాక్టర్ శాంతికళ, సీఐ తబ్రేజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణి మరణానికి కారణమైన రక్ష ఆసుపత్రిపై కేసు నమోదు చేసి సీజ్ చేయాలని ఆదేశించారు. ఇకపై జిల్లాలో ఎక్కడ కూడా లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎన్జీఓ ప్రతినిధులు డాక్టర్ బాలమద్దయ్య, నోడల్ ఆఫీసర్ నాగప్రసాద్ బాబు, ప్రోగ్రాం కన్సల్టెంట్ సుమలత పాల్గొన్నారు. -
పెన్షనర్ల సంఘానికి నేడు ఎన్నికలు
నంద్యాల(అర్బన్): ప్రభుత్వ పెన్షనర్ల జిల్లా సంఘానికి శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. రహస్య బ్యాలె ట్ పేపర్ ద్వారా జరిగే ఈ ఎన్నికల్లో పుల్లారెడ్డి, రామసుబ్బయ్య ప్యానళ్లు పోటీలో ఉన్నాయి. పన్నెండు ఏళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో గెలుపే లక్ష్యంగా ప్రచారం సాగించారు. దాదాపు 3,400 మంది ఓటర్లు ఉన్న సంఘానికి ఎన్నికల అధికారులుగా పెదనగౌడ్, ప్రభాకర్, కిట్టప్పలు వ్యవహరించనున్నా రు. శుక్రవారం ఉదయం 10కి ప్రారంభమయ్యే ఎన్నిక లు సాయంత్రం 4గంటలకు ముగుస్తాయి. గంట వ్యవధిలోనే తుది ఫలితాలు వెలువరించి అధ్యక్ష కార్యదర్శులకు గెలుపు పత్రాలను అందజేయనున్నారు. -
దీక్ష బూని.. భక్తి చాటి !
ఈ నెల 27న శనివారం నెరణికి గ్రామంలో ఉంటున్న మాళ మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను దేవరగట్టుకు తీసుకెళ్లి రాత్రి కంకణధారణ నిర్వహిస్తారు. ● అక్టోబర్ 2వ తేదీ గురువారం విజయదశమి రోజున కల్యాణోత్సవం, బన్ని, జైత్రయాత్ర. ● 3న భవిష్యవాణి (దైవవాణి) ● 4న సాయంత్రం స్వామివారి రథోత్సవం. ● 5న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, సాయంత్రం దేవదాసీల క్రీడోత్సవం. ● 6న సోమవారం మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి. హొళగుంద: దేవరగట్టులో ప్రతి ఏటా నిర్వహించే దసరా బన్ని ఉత్సవంలో నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు ఐక్యతను చాటుకుంటూ వస్తున్నారు. ప్రత్యేక దీక్ష చేపట్టి వేడుకను వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు జరిగే దసరా ‘బన్ని’ఉత్సవాలకు సిద్ధమవుతున్నారు. ఈ మూడు గ్రామాలకు చెందిన కొందరు యువకులు గత నాలుగేళ్ల నుంచి మల్లయ్య మాల దీక్షను చేపట్టి భక్తిని చాటుతున్నా రు. అయ్యప్ప, శివయ్య మాల దీక్ష వలే కొన్నేళ్ల నుంచి మల్లయ్య మాల ధరిస్తుస్తున్నారు. మూడు గ్రామాల్లో మల్లయ్య దీక్ష చేపట్టే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతోంది. కఠోర దీక్షను పాటిస్తూ తమ ఇలవేల్పుపై భక్తిని చాటుకుంటున్నారు. దేవరగట్టు దసరా బన్ని మహోత్సవాల్లో ఈ మూడు గ్రామాస్తులదే కీలక భూమిక. అమావాస్య నుంచి దీక్షను మొదలు పెట్టి బన్ని ఉత్సవాలు ముగిసేంత వరకు నిష్టతో ఉంటారు. విగ్రహాలు తిరిగి నెరణికి గ్రామానికి చేరే వరకు కట్టుబాట్లను తూచ తప్పకుండా పాటిస్తారు. ఈ 15 రోజుల పాటు చెప్పులు తొడుక్కోరు. అలాగే దాంపత్య సుఖానికి పూర్తిగా దూరంగా ఉంటారు. ఇక మద్యం జోలికెళ్లరు. మాంసం ముట్టరు. దైవకార్యాన్ని విజయవంతంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో పండుగను జరుపుకుంటారు. ఎంత కక్షలు ఉన్నా బన్ని రోజు అన్నదమ్ముల్లా కలిసి మెలసి ఉందామని పాలబాస తీసుకుంటారు. మూడు గ్రామాల్లో ఆరోజే దసరా.. ఈ ఏడాది దేశమంతా అక్టోబర్ 2వ తేదీ దసరా వేడుకలు జరుపుకుంటే ఈ మూడు గ్రామంలో 6వ తేదీన చేసుకుంటారు. విజయదశమి నాడు అందరికీ దసరా పండుగా అయితే ఆ మూడు గ్రామస్తులకు మాత్రం బన్ని ఉత్సవాలు ముగిసి విగ్రహాలు నెరణకి గ్రామానికి చేరే రోజు విజయానికి సూచికగా వారు పండుగ చేసుకుంటారు. ఈ కట్టుబాట్లను కులమత భేదాలు లేకుండా అన్ని వర్గాల వారు పాటిస్తూ ఉత్సవంలో భాగస్వాములవుతారు. ఉత్సవాలు ముగిసేంత వరకు ఒకరినొకరు కొట్టుకోరు. ఒకరినొకరు తిట్టుకోరు. వాళ్ల లక్ష్యం ఒక్కటే. మాళమల్లేశ్వరుల విగ్రహాన్ని విజయవంతంగా నెరణికికి చేర్చడం. మనస్సు నిండా భక్తిని నింపుకుని నిష్టతో, నిబద్ధతతో ఉంటారు. కట్టుబాట్లను పాటిస్తున్నందునే బన్ని (కర్రల సమరం)లో దేవరగట్టు చుట్టు పక్క ఉన్న మిగిలిన గ్రామాలకు చెందిన భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొన్నా జైత్రయాత్రాన్ని విజయవంతంగా ముగించుకుని విగ్రహాలను నెరణికి గ్రామం చేరుస్తున్నామని మూడు గ్రామస్తు ల నమ్మకం. తమ గ్రామాల్లో ఇన్నాళ్లు ఒకరికొకరు ఎలా ఉన్నా ఉత్సవంలో మాత్రం కలిసికట్టుగా ఉండి తమ మధ్య విధించుకున్న కట్టుబాట్లకు కట్టుబడి ఉంటారు. ఉత్సవం ఇలా.. -
సీడీపీఓ వేధింపులపై విచారణ
ఆలూరు రూరల్: ఆలూరు సీడీపీఓ నరసమ్మ వేధిస్తున్నారని కురువళ్లి అంగన్వాడీ టీచర్ భువనేశ్వరి ఆరోపణలపై జిల్లా ఐసీడీఎస్ పీడీ విజయ విచారణ చేపట్టారు. ఈ నెల 6వ తేదీన సీడీపీఓ కురువళ్లి అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్లో వివరాలు లేకపోవడంతో టీచర్ను నిలదీసి, రూ. 4 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశా రని, ఇవ్వలేకపోవడంతో వేధిస్తు న్నారని అంగన్ వాడీ టీచర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పీడీ విజయ బుధవారం ఆలూరుకు చేరుకుని సీడీపీఓ, సూపర్ వైజర్, అంగన్వాడీటీచర్, ఆయాను విచారించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని తెలిపారు. సబ్ జైలు తనిఖీడోన్ టౌన్: పట్టణంలోని సబ్ జైలును బుధవారం జిల్లా లీగల్ సర్వీసు అథారిటీ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలు పరిసరాలను, వంట గదిని పరిశీలించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడారు. ఏ ఏ నేరాలపై జైలుకు వచ్చారు? బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారా? ఎవ్వరైన 70 ఏళ్ల పైబడిన వయస్సు వారు ఉన్నారా? అంటూ అరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జైలులో వసతులు, భోజనం, వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయని అడిగారు. బెయిలు కోసం స్వతహాగా దరఖాస్తు చేసుకోవడానికి ఆర్ధిక స్థోమత లేక పోతే జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు దరఖాస్తు పెట్టకోవాలని సూచించారు. ఈయన వెంట పట్టణ సీఐ ఇంతియాజ్బాషా, లీగల్ అడ్వయిజర్ మాధవస్వామి తదితరులు ఉన్నారు. -
వివాదం రాజేసిన చేపల వేట
అవుకు(కొలిమిగుండ్ల): చేపల వేట కోసం రెండు వర్గాల మధ్య వివాదం రాజుకుంది. బుధవారం మెట్టుపల్లె వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అవుకు మండలం మెట్టుపల్లె సమీపంలోని గాలేరు నగరి కాల్వకు ఎగువ నుంచి నీటి విడుదల సామర్థ్యాన్ని ఇటీవల అధికారులు తగ్గించారు. దీంతో మెట్టుపల్లె, కోనాపురం గ్రామాలకు చెందిన కొంత మంది వ్యక్తులు గాలేరు నగరి కాల్వలో దిగి చేపలు పట్టుకుంటున్నారు. పది నుంచి ఇరవై కేజీల బరువున్న చేపలు కాల్వ ద్వారా అవుకు రిజర్వాయర్లోకి చేరుతుంటాయి. కొద్ది రోజుల నుంచి రెండు గ్రామాలకు చెందిన వ్యక్తులు చేపలు పట్టుకొని బనగానపల్లెకు చెందిన వ్యాపారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు నాలుగు టన్నుల వరకు చేపలను విక్రయించినట్లు తెలుస్తోంది. తాజాగా బుధవారం టన్నుకు పైగానే చేపలు పట్టు కొని ఆటోలో తరలించేందుకు సిద్ధం చేశారు. ఈ విష యం తెలుసుకున్న అవుకు పట్టణానికి చెందిన బెస్త సంఘం నాయకులు గాలేరు నగరి కాల్వ వద్దకు చేరుకున్నారు. చేపలు పట్టుకునే హక్కు తమకు మాత్రమే ఉందని వాదించారు. అయితే తమ గ్రామ పొలిమేర కాబట్టి తమకు మాత్రమే హక్కు ఉందని గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకోవడంతో ఒకరికొకరు స్వల్పంగా తోపులాటకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కాల్వ వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఇరువర్గాల వాదనలు విని సమస్య పరిష్కారం అయ్యే వరకు ఎవరూ చేపలు పట్టరాదని సూచించారు. ఆటో లో ఉన్న చేపలను స్టేషన్కు తరలించారు. సీఐ మంజునాథరెడ్డి అవుకు పోలీస్ స్టేషన్కు చేరుకొని రెండు గ్రామాలకు చెందిన వ్యక్తులతో పాటు అవుకు బెస్త సంఘం నాయకులతో చర్చించారు. కాగా చివరకు ఆ ప్రా ంతం చేపల వేటకు నిషేధమని, ఎవరూ చేపలు పట్ట కూడదని తేల్చి చెప్పారు.ఆటోలో ఉన్న చేపలను అప్పటికే కొనుగోలు చేసిన వ్యాపారులకు అప్పగించారు. -
ప్రతి విద్యా సంస్థలో ఈగల్ బృందాలు
కర్నూలు(సెంట్రల్): యూనివర్సిటీ మొదలు పాఠశాలల వరకు ప్రతి విద్యా సంస్థలో ఈగల్టీం(బృందాలు)లను సోమవారంలోపు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అధికారులను ఆదేశించారు. జూనియర్ కాలేజీలు, పాఠశాలల ఈగల్ టీంలో ఇద్దరు ఉపాధ్యాయులు, ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు ఉండేలా చూసుకోవాలన్నారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఎన్సీఓఆర్డీ సమావేశాన్ని కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, ఎస్పీ విక్రాంత్పాటిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలు, విద్యార్థుల సాయంతో మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణాపై పూర్తి స్థాయిలో నిఘా వేయవచ్చన్నారు. మత్తు పదార్థాల వినియోగంతో అనారోగ్యం బారిన పడతారని, కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడతాయనే విషయాన్ని ఈగల్ టీంల ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నారు. పంట పొలాల్లో గంజాయి పెంచకుండా తగిన నిఘా ఉంచాలని వ్యవసాయ, ఉద్యాన వన శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం పోలీసు శాఖ మత్తు పదార్థాల వినియోగం, రవాణాను అరికట్టడంపై ముద్రించిన పోస్టర్లు, కరపత్రాలు, వీడియోలను ఆవిష్కరించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలోని 250 పాఠశాలల్లో ఈగల్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి శుక్రవారం పాఠశాలల్లో మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని విద్యా సంస్థలకు సూచించినట్లు చెప్పారు. ఆదోని మండలం పెద్దతుంబళంలో గంజాయిని అంతర పంటగా సాగు చేస్తుండడంతో గుర్తించామని, సుమారు 3.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, కర్నూలు మునిసిపల్ కమిషనర్ పి.విశ్వనాథ్, మైనార్టీ కార్పొరేషన్ ఈడీ సబీహపర్వీన్, డీటీసీ శాంతకుమారి, ఆర్టీసీ ఏఓ సుధారాణి, డిజేబుల్డ్ ఏడీ ఫాతిమా సుల్తానా, జేడీఏ వరలక్ష్మీ, డీఎంహెచ్ఓ శాంతికళ, ఎకై ్సజ్ సూపరింటెంటెండ్ సుధీర్బాబు, బీసీ వెల్ఫేర్ అధికారి ప్రసూన, ఆర్ఐఓ లాలెప్ప, సోషల్ వెల్ఫేర్ అధికారి రాధిక, లేబర్ డీసీ వెంకటేశ్వర్లు, క్లస్టర్ యూనివర్సిటీ డీన్ అఖీరాబాను పాల్గొన్నారు. -
నల్లమలలో ట్రాఫిక్ జామ్
మహానంది: నల్లమల ఘాట్రోడ్డులో బుధవారం దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు అవస్థలు పడ్డారు. మహారాష్టకు చెందిన సంఘ్వి మూవర్స్కు చెందిన భారీ వాహనం గిద్దలూరు మీదుగా నంద్యాల వైపు వస్తుండగా చింతమాను టర్నింగ్ వద్ద సాంకేతిక లోపం తలెత్తడంతో ఆగిపోయింది. దీంతో సుమారు రెండు కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. అనంతరం వాహనదారుల సహాయంతో రోడ్డుకు అడ్డుగా ఉన్న భారీ వాహనాన్ని పక్కకు తప్పించడంతో వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. -
విగ్రహాల రక్షణే మా లక్ష్యం
వేలాది మంది పాల్గొనే వేడుకల్లో విగ్రహాలను కాపాడుకోవడమే మా మూడు గ్రామాల లక్ష్యం. పలు కట్టుబాట్లతో ఉండంతోనే జైత్రయాత్రలో విగ్రహాలకు దెబ్బలు తగలకుండా రక్షణ కవచగా ఉండి కాపాడుకుంటూ వస్తున్నాం. విగ్రహాలను కై వసం చేసుకోవడానికి అడ్డు పడ్తారనేది అవాస్తవం. మద్యం, మాంసం ముడితే బన్ని ఉత్సవం జరిపే అర్హత కోల్పోతాం. ఉత్సవంలో మా మూడు గ్రామాల ఆచారాలు, పూజలు నిష్ట నిబద్ధత కలిగి ఉంటాయి. – బసవరాజు, రాక్షస గుండ్లకు రక్తం ఇచ్చే గొరవయ్య, కంచాభీరా వంశస్తుడు, నెరణికి -
విజయవాడకు బయలుదేరిన కొత్త సారోళ్లు
● ఉమ్మడి జిల్లా నుంచి 123 బస్సుల్లో తరలింపు ● జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ కర్నూలు సిటీ: డీఎస్సీ–2025లో ఉపాధ్యాయ పోస్టులు సాధించిన అభ్యర్థులు నియామక పత్రాలు అందుకునేందుకు బుధవారం విజయవాడకు తరలివెళ్లారు. వీరంతా గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అమరావతిలో నియామకపత్రాలు అందుకోనున్నారు. ఉమ్మడి జిల్లా అభ్యర్థులు, వారికి ఒకరి చొప్పున సహాయకులను రాయలసీమ యూనివర్సిటీ నుంచి ఆర్టీసీ బస్సుల్లో జిల్లా విద్యాశాఖ అధికారులు తీసుకెళ్లారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం చేతుల మీదుగా నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి ఆర్టీసీ బస్సుల్లో వెళ్తున్న 2,805 మంది నూతన ఉపాధ్యాయులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించామన్నారు. 123 బస్సుల్లో ప్రతి బస్సుకు ఒక పోలీసు ఎస్కార్ట్, మెడికల్ కిట్లు ఏర్పాటు చేశామన్నారు. పర్యవేక్షణకు పది బస్సులకు ఒక నోడల్ అధికారిని నియమించామన్నారు. రాత్రి విడిది కోసం ప్రత్యేకంగా మహిళలు, పురుషులకు వేర్వేరుగా నరసరావుపేట, గుంటూరులో బస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమం ముగిసిన తరువాత అదే బస్సుల్లోనే అభ్యర్థులను జిల్లా కేంద్రానికి తీసుకొస్తామన్నారు. కాగా చంటి పిల్లలు ఉన్న తల్లులు ఎంతో అవస్థలు పడ్డారు. వాతావరణం చల్లగా ఉండడంతో పిల్లలతో సుదూర ప్రయాణం చేయాల్సి రావడంతో ఆందోళన చెందారు. అయితే నియమాక పత్రాలు జిల్లాకు ఇద్దరికి మాత్రమే వేదికపై ఇస్తారని ప్రయాణంలో తెలియడంతో అభ్యర్థులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రచారం కోసం ప్రభుత్వం తమను ఇబ్బందులకు గురి చేయడం ఎంత వరకు సబబు అని బస్సుల్లో ఉన్న అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. -
వస్త్రాలయ షాపింగ్ మాల్ ప్రారంభం
కర్నూలు (టౌన్): నగరంలోని నాగిరెడ్డి రెవెన్యూ కాలనీలో బుధవారం వస్త్రాలయ షాపింగ్ మాల్ ప్రారంభమైంది. కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, సినీ హీరోయిన్ నిధి అగర్వాల్, షాపింగ్ మాల్ ఎండీ గోపాల్ రెడ్డి, హరీష్రెడ్డి పాల్గొన్నారు. అతిథులు నూతన షాపింగ్ మాల్ను రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎండీ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తమ వస్త్రాలయ షాపింగ్ మాల్లో అపరితమైన కలెక్షన్లు, మెన్స్వేర్, ఉమెన్స్ వేర్, కిడ్స్ వేర్, పార్టీ వేర్, 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలు అందు బాటులో ఉన్నాయన్నారు. షాపింగ్ మాల్ ప్రారంభం పురస్కరించుకొని దీపావళి పండుగ వరకు లక్కీ డ్రాలు ఉన్నాయన్నారు. రూ.1000 కొనుగోలు చేస్తే లక్కీ డ్రాలో టీవీ, ఫ్రిడ్జ్, బైక్ వంటి బహుమతులతో పాటు బంపర్ డ్రాలో విజేతకు కారును కూడా అందిస్తున్నామన్నారు. -
ఆత్మకూరు అటవీ డివిజన్ డీడీగా విఘ్నేష్ అపావ్
ఆత్మకూరురూరల్: నాగార్జునసాగర్ – శ్రీశైలం పెద్ద పులుల అభయారణ్యంలోని ఆత్మకూరు అటవీ డివిజన్కు నూతన డిప్యూటీ డైరెక్టర్ (ప్రాజెక్ట్ టైగర్)గా ఐఎఫ్ఎస్ అధికారి విఘ్నేష్ అపావ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తమిళనాడులోని కోయంబత్తూరు వాసి అయిన ఈయన అనంతపురం జిల్లా ముఖ్య అటవీ అధికారిగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇక్కడ డీడీగా పని చేసిన సాయిబాబా తిరుపతి డీఎఫ్ఓగా బదిలీ అయ్యారు. గోసంరక్షణ నిధికి రూ.లక్ష విరాళం శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న గోసంరక్షణనిధి పథకానికి బుధవారం హైదరాబాద్కు చెందిన చెన్నుదుర్గ సత్యనారాయణ రూ.1,00,116విరాళాన్ని పర్యవేక్షకులు కె.శివప్రసాద్కు అందజేశారు. విరాళాన్ని అందించిన దాతను దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రం, లడ్డూప్రసాదం, జ్ఞాపికను అందజేసి సత్కరించారు. ఆళ్లగడ్డలో 30.6 మి.మీ వర్షం నంద్యాల (అర్బన్): ఆళ్లగడ్డలో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం 30.6 మి.మీ వర్షం కురిసింది. అలాగే బండిఆత్మకూరు 24.6, రుద్రవరం 20.8, మిడుతూరు 19.2, గడివేముల 17.2, నంద్యాల అర్బన్ 165.4, బేతంచెర్ల 15.4, గోస్పాడు 13.8, సంజామల 13.2, కోవెలకుంట్ల 12.8, ప్యాపిలి 12.2, దోర్నిపాడులో 10.2 మి.మీ వర్షపాతం నమోదైంది. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ నంద్యాల(న్యూటౌన్): పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు ఉచిత వసతి సౌకర్యాలతో కూడిన శిక్షణ ఇస్తున్నట్లు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ పూర్తి చేసి ఐబీపీఎస్ (క్లర్క్ ప్రొబిషనరీ ఆఫీసర్), ఆర్ఆర్బీ ఆఫీసర్ స్కిల్, ఆఫీస్ అసిస్టెంట్, ఎస్ఎస్సీ (సీజీఎల్) టీఎర్ వంటి పరీక్షలు రాసే వారు అర్హులని పేర్కొన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 6లక్షలలోపు ఉండాలని తెలిపారు. ఈ నెల 24న ఆన్లైన్ అప్లికేషన్లు ప్రారంభం అయ్యాయని, వచ్చేనెల 6న చివరితేదీ అని పేర్కొన్నారు. ప్రత్యేక పరికరాలతో వన్యప్రాణుల సంరక్షణ మహానంది: గుంటూరు డివిజన్లోని నంద్యాల–గుంటూరు రైల్వే మార్గంలో భద్రతా చర్యలు పటిష్టం చేస్తున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. చలమ–దిగువమెట్ట రైల్వే సెక్షన్ వెంట సిబ్బంది, ప్రయాణీకుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు గుంటూరు రైల్వే డివిజన్ అధికారులు బుధవారం రాత్రి తెలిపారు. వారు మాట్లాడుతూ.. ప్రతి రోజూ ట్రాక్ను తనిఖీ చేసేందుకు డేపెట్రోలింగ్లో ఇద్దరు ఉంటారన్నారు. రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ముగ్గురు వర్షాకాలంలో విధుల్లో ఉంటారని చెప్పారు. దిగువమెట్ట నుంచి చలమ వరకు సుమారు 16 కిలోమీటర్ల మేరకు పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు తదితర వన్యప్రాణుల సంరక్షణ కోసం పగలు, రాత్రి గస్తీ సిబ్బంది టాంబురైన్ లాంటి డ్రమ్స్, పటాకులు, ఫ్లాంబీలు, భద్రతా పరికరాలు వాడతారన్నారు. రైల్వే సిబ్బంది, ప్రయాణికుల భద్రతతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు(సెంట్రల్): చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పోస్టుకు అర్హులైన న్యాయవాదులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన వారై కనీసం పదేళ్లపాటు న్యాయవాద వృత్తిలో అనుభవం కలిగి ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తును జిల్లా కోర్టు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చసుకొని ఈనెల 26వతేదీలోపు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. -
కానరావా.. దయ చూపలేవా!
శ్రీశైలానికి వెళ్లే ప్రయాణికులతో కిటకిటలాడుతున్న ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండుఆత్మకూరు: మహిళల కోసం ఉచిత బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. ఉచిత బస్సులను ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకుంటుడటంతో ప్రయాణికులు ఇబ్బంది పడున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా శ్రీశైల క్షేత్రానికి వెళ్లడానికి వివిధ ప్రాంతాల నుంచి ఆత్మకూరుకు వచ్చిన వారికి బుధవారం కష్టాలు ఎదురయ్యాయి. ‘శివశివా.. ఏమిటీ ప్రయాణ కష్టాలు’ అనుకుంటూ మల్లన్న స్వామిని చూడకుండానే చాలా మంది తిరిగి వెళ్లారు. బస్సులు లేక.. కర్నూలు, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు, నంద్యాల, బనగానపల్లె, ఆళ్లగడ్డ నుంచి మహిళలు గతంలో ఉచిత ప్రయాణం పేరుతో శ్రీశైలం వెళ్లేవారు. అయితే సీఎం చేతుల మీదుగా నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి వెళ్తున్న 2,805 మంది నూతన ఉపాధ్యాయులకు 123 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. దీంతో శ్రీశైలానికి వెళ్లేందుకు ఉచిత బస్సులు లేవని కర్నూలు, నంద్యాల, ఇతర డిపోల్లో బుధవారం ప్రకటించారు. ఫలితంగా వివిధ మార్గాల్లో 500 మందికి పైగా ప్రయాణికులు ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్కు వచ్చారు. బస్సులు లేకపోవడంతో ఇబ్బంది పడ్డారు. కొందరు పిల్లాపాపలతో ఆత్మకూరు బస్టాండులోనే భోజనాలు చేస్తూ కనిపించారు. ‘శ్రీశైల మల్లికార్జున స్వామిని, శ్రీ భ్రమరాంబ అమ్మవారిని చూసేందుకు వచ్చాం. స్వామిని చూడకుండానే వెనక్కి వెళ్తున్నాం. ఇదేం ప్రభుత్వం’ అనుకుంటూ చాలా మంది పెదవి విరిచారు. ఇవీ కష్టాలు.. ● అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం చంద్రబాబు నిర్వహించిన సీ్త్ర శక్తి సభకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రతి డిపో నుంచి సగానికి పైగా బస్సులు వెళ్లాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ● పల్లె వెలుగు, అల్ట్రా డీలక్స్, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించగా.. ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు బస్సులను సీఎం సభకు తరలిస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మల్లన్న దర్శనం కోసం రాత్రి పత్తికొండ నుంచి కర్నూలుకు వచ్చాం. శ్రీశైలానికి బస్సులు లేవు, ఆత్మకూరుకు వెళ్లాలని చెప్పారు. ఇక్కడికి వస్తే బస్సులు లేవని చెబుతున్నారు. ఇబ్బందులు పడతామని వెనక్కి వెళ్తున్నాం. శ్రీశైలానికి బస్సు సర్వీసులు లేవని రెండు రోజుల ముందే ప్రకటన ఇచ్చి ఉండొచ్చు కదా? – చిన్నమ్మ, పత్తికొండ గ్రామం, కర్నూలు జిల్లా మేం ముఫ్పై మందిమి ఉన్నాం. శ్రీశైలానికి వెళ్లాలని బనగానపల్లె నుంచి నంద్యాలకు, అక్కడి నుంచి ఆత్మకూరుకు వచ్చాం. ఇక్కడ శ్రీశైలానికి బస్సులు లేవని చెబుతున్నారు. శనివారం వరకు ఆగాల్సిందే అంటున్నారు. శ్రీశైలానికి, ఇతర పుణ్యక్షేత్రాలకు బస్సు సర్వీసులను నిలిపివేయడం అన్యాయం. – శివమ్మ, బనగాపల్లె గ్రామం, నంద్యాల జిల్లా మా ఊరి నుంచి శ్రీశైలానికి బస్సులు లేవు. ఆళ్లగడ్డలో ఉన్న బస్సుల్లో ఆత్మకూరుకు వచ్చాం. ఇక్కడి నుంచి బోలెడు బస్సులు ఉంటాయని చెప్పారు. బస్సులు లేకపోవడంతో ఉన్న సద్దితో ఆత్మకూరు బస్టాండులో భోజనం చేశాం. మరలా వెనక్కి వెళ్తున్నాం. ఈ బస్సులు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఉండవో తెలియడం లేదు. – మల్లీశ్వరి, ఆళ్లగడ్డ గ్రామం, నంద్యాల జిల్లా ఆత్మకూరు డిపో నుంచి ఫిట్నెస్ ఉన్న అన్ని బస్సులను ఉదయం 6 గంటల నుంచి పంపిస్తున్నాం. పెద్దసంఖ్యలో ప్రజలు ఆత్మకూరుకు తరలివచ్చారు. ఉన్న బస్సులన్నీ శ్రీశైలానికి పంపాం. ఇంకా పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలు ఉన్నారు. వారికి కావాల్సిన బస్సులు లేవు. నంద్యాల, కర్నూలుకు వెళ్లిన బస్సులు ఆత్మకూరుకు వచ్చిన వెంటనే వీరిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తాం. – వినయ్కుమార్, ఆర్టీసీ డీఎం, ఆత్మకూరు శ్రీశైలం వెళ్లే ఆర్టీసీ బస్సులు కరువు ఆత్మకూరు బస్టాండులో ప్రజల ఎదురు చూపులు చిన్న పిల్లలతో మహిళల ఇబ్బందులు మల్లన్న స్వామిని చూడకుండానే తిరిగి వెళ్లిన వైనం -
నిష్టతో కట్టుబాట్లను పాటిస్తారు
దేవరగట్టు ఉత్సవాల్లో మూడు గ్రామస్తులు నిష్టతో కట్టుబాట్లు పాటిస్తారు. ఇక బన్ని రోజు రెండుసార్లు స్నానం చేస్తారు. సాయంత్రం గట్టుకెళ్లే ముందు ప్రతి ఒక్కరు స్నానమాచారిచి గ్రామంలోని గుడిలకు వెళ్లి టెంకాయలు సమర్పిస్తారు. అనంతరం తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని కొండకు బయలుదేరుతారు. బన్నిలో ఏ ఒక్కరు మద్యం తాగరు, మాంసం ముట్టరు. తాగి కర్రలతో విగ్రహాల దగ్గరకు వచ్చే వారిని కట్టడి చేసి విగ్రహాలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా జైత్రయాత్రలో పాల్గొంటారు. – రవిశాసీ్త్ర, మాళమల్లేశ్వరునికి కల్యాణం జరిపే పురోహితుడు, నెరణికి -
పంట తడిచి.. నష్టం మొలకెత్తి!
దొర్నిపాడు: భారీ వర్షాలు అన్నదాతను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. మండలంలో ఈ ఏడాది ఖరీఫ్లో మొక్కజొన్నను విస్తారంగా సాగు చేశారు. పంట చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలు పంటను దెబ్బతీశాయి. ప్రస్తుతం పంట కోతకు వచ్చింది. కానీ గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కంకులు చెట్లపైన్నే మొలకెత్తున్నాయి. కోతకోయడానికి పొలమంతా నీరు, బురద ఉండటంతో కోత యంత్రాలు, కూలీలు పొలంలోకి వెళ్లలేని పరిస్థితి. ఇంకా వర్షాలు కురుస్తూనే ఉండటంతో మొక్కజొన్న రైతులు ఆందోళన చెందుతున్నా రు. చేతికొచ్చిన మొక్కజొన్న కళ్ల ముందే పొలంలోనే వర్షాలకు తడిచి కంకులు మొలకెత్తుండటంతో ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. -
దొంగతో జతకట్టి పోలీసు చోరీలు
కర్నూలు: ఆయనో కానిస్టేబుల్. బాగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఓ దొంగతో దోస్తీ కట్టాడు. తన ద్విచక్ర వాహనంపై దొంగను కూర్చోబెట్టుకొని నగరంలో తిరుగుతుంటాడు. తాళం వేసిన ఇల్లు కనిపిస్తే చాలు అక్కడ దొంగను రంగంలోకి దించుతాడు. బయట తాను గస్తీ పోలీసుననే ఫోజు ఇస్తాడు. పని పూర్తి కాగానే ఇద్దరూ కలసి లక్ష్మీ టౌన్షిప్లోని కానిస్టేబుల్ ఇంటికి చేరుకుంటారు. చోరీ సొత్తును విక్రయించగా వచ్చిన డబ్బును పంచుకుంటారు. మోస్ట్ వాంటెడ్ గజదొంగ జగదీష్ను కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఏపీఎస్పీ రెండో బెటాలియన్ కానిస్టేబుల్ ఎద్దుల కృపానందం బాగోతం వెలుగులోకి వచ్చింది. కారు డ్రైవర్ ఫిర్యాదుతో కేసు నమోదు కల్లూరులోని తెలుగు వీధిలో నివాసముంటున్న కార్ డ్రైవ్ గురుస్వామి ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలసి వృత్తి రీత్యా బయటకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో దాచిన 11 తులాల బంగారు ఆభరణాలు, రూ.15 వేల నగదు మూటగట్టుకుని ఉడాయించారు. ఈ మేరకు బాధితుడు గురుస్వామి నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ విక్రమసింహ, ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి క్రైం పార్టీ సిబ్బందితో కలసి దర్యాప్తులో భాగంగా నగర శివారులో విజయవాడకు చెందిన దొంగ జగదీష్ను అదుపులోకి తీసుకుని విచారించగా కానిస్టేబుల్ దోస్తీ వ్యవహారం వెలుగు చూసింది. జగదీష్పై 25కు పైగా చోరీ కేసులు ఉన్నాయి. ఫోన్ కాల్ డేటా ఆధారంగా వెలుగులోకి.. దర్యాప్తులో భాగంగా ఇటీవల కాలంలో జైలు నుంచి రిలీజైన నిందితుల వివరాలను పోలీసులు సేకరించారు. కర్నూలు ఏపీఎస్పీ రెండో బెటాలియన్ కానిస్టేబుల్ కృపానందం సెల్ఫోన్కు గజదొంగ జగదీష్ నుంచి తరచూ ఫోన్లు వచ్చినట్లు కాల్ డేటా సేకరించారు. కల్లూరులోని గురుస్వామి ఇంట్లో దొంగతనం జరిగిన రోజు విజయవాడకు చెందిన జగదీష్ కదలికలు ఉన్నట్లు సాంకేతిక ఆధారాలతో గుర్తించి విచారించడంతో వారి మధ్య ఉన్న బంధం బయటపడింది. విధి నిర్వహణలో భాగంగా కృపానందం విజయవాడకు వెళ్లినప్పుడు అక్కడ గార్డు డ్యూటీ విధుల్లో ఉండగా జగదీష్ పరిచయమయ్యాడు. అది కాస్తా స్నేహంగా మారి తరచూ కర్నూలుకు వస్తూ కానిస్టేబుల్ ఇంట్లోనే ఉంటూ ఇద్దరూ కలసి చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెలుగుచూసింది. ఇలా కర్నూలు నగరంలో ఇద్దరూ కలసి పలు ఇళ్లల్లో చోరీలు చేసినట్లు విచారణలో అంగీకరించారు. నిందితుల నుంచి 5 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు రికవరీ చేశారు. తన బైక్పైనే తిప్పుతూ తాళం వేసిన ఇళ్ల గుర్తింపు చోరీ సొత్తు సొమ్ము చేసుకొని భాగాలు మోస్ట్ వాంటెడ్ దొంగ జగదీష్పై 25కు పైగా కేసులు ఇప్పటికే ఓ కేసులో అరెస్టయిన కానిస్టేబుల్ -
కర్రలతో కొట్టుకోరు..
దేవరగట్టు బన్ని ఉత్సవంలో భక్తులు కర్రలతో కొట్టుకుంటారనేది అవాస్తవం. ఉత్సవాన్ని కర్రల సమరంగా చెప్పడం భావ్యం కాదు. పూర్వం గట్టు మీదకెక్కడానికి దివిటీలు, జంతువుల నుంచి రక్షణగా కర్రలు, ఆయుధాలు తీసుకెళ్లే వారు. కాలక్రమేణా అవి దురుద్దేశాలకు వాడడంతో కర్రల సమరంగా ముద్ర పడింది. మద్యం సేవించిన వారు మాత్రమే గాయ పడుతారు తప్ప ఇతరులకు గాయాలు కావు. విచక్షణ కోల్పోయి కొట్టుకోవడం వల్ల గతంలో చనిపోయారు. ఇప్పుడు తగ్గిపోయాయి. ఇదొక సంప్రదాయ పండుగ. – గిరిస్వామి,భవిష్యవాణి వినిపించే ఆలయ పూజారి -
వైద్యుల పోరుబాట
గోస్పాడు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీల్లో) పనిచేసే వైద్యులు సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ బాట పట్టారు. నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ మూడు రోజులుగా వైద్య సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్ల అసోసియేషన్ పిలుపు మేరకు వైద్యులు ప్రస్తుతం నిరసన తెలుపుతున్నట్లు చెబుతున్నారు. అయితే ఇప్పటికే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి వినతి పత్రాలు అందజేశారు. సమస్యను పరిష్కరించకపోతే రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు తదుపరి కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. పీజీ వైద్య విద్యను అభ్యసించేందుకు ఇచ్చే ఇన్ సర్వీస్ కోటాను ప్రభుత్వం తగ్గించడంతో వారంతా నిరసనబాట పట్టారు. తమ డిమాండ్ నేరవేర్చకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. గతంలో ఉన్న ఇన్ సర్వీస్ కోటాను తగ్గించడంపై మండిపడుతున్నారు. ఇన్సర్వీస్ కోటా తగ్గింపుతో ఇబ్బందులు పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ కోట కుదిస్తూ తీసుకొచ్చిన జీవో నంబర్ 85కు బదులు తెచ్చిన జీఓ 99ని పీహెచ్సీ వైద్యులు వ్యతిరేకిస్తున్నారు. ఇది అమలు చేయడంతో తమ సర్వీస్కు అర్థం లేకుండా పోతుందని, అకస్మాత్తుగా జీఓను మార్చడం అన్యాయమని ఆవేదన చెందుతున్నారు. గతంలో ఇన్సర్వీస్ కోటా క్లినికల్ 20శాతం ఉంటే 15శాతానికి తగ్గించారు. గతంలో మాదిరి క్లినికల్ కోటాను 20 శాతానికి పెంచాలని వైద్యులు కోరుతున్నారు. ఇన్సర్వీస్ కోటా తగ్గిస్తూ ఇచ్చిన జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ జీఓతో తమ వృత్తి ప్రగతికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పరిస్థితులిలా..వైద్యులు చాలామంది కోవిడ్–19 వంటి విపత్కర పరిస్థితిలోనూ జీవితాలను ప్రమాదంలో పెట్టి వైద్యసేవలు అందించారు. ఇప్పుడు ఉన్న జీఓ85ను జీఓ 99గా మార్చి దాని ద్వారా పీజీ అవకాశాలు తగ్గించడం అన్యాయం. జీవో రద్దు చేయాలని కోరుతున్నాం. – హుసేన్, డబ్ల్యూ.కొత్తపల్లి పీహెచ్సీ వైద్యుడు జీఓ 99 అమలు కారణంగా సర్వీస్ కోల్పోవడంతో పాటు పీజీలో చేరే స్థానాల సంఖ్య తగ్గిపోతుంది. సరికొత్త జీఓతో వైద్యులకు భవిష్యత్తు లేకుండా చేయడం సరైన విధానం కాదు. ప్రభుత్వం వెంటనే జీఓ 99ను రద్దు చేయాలి. –డాక్టర్ ప్రణీత్ , జిల్లా జాయింట్ సెక్రటరీ, నంద్యాల మూడు రోజులుగా నల్ల బ్యాడ్జీలతో విధుల నిర్వహణ సమస్యల పరిష్కారంపై స్పందించని కూటమి ప్రభుత్వం నంద్యాల జిల్లా పరిధిలో 59 పీహెచ్సీలు, 16 అర్బన్ హెల్త్ సెంటర్లు, 11 సీహెచ్సీలు, రెండు ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి. వీటిల్లో 146 మంది వైద్యులు పనిచేస్తున్నారు. వైద్యులుగా విధుల్లో చేరాక ఏజెన్సీ ప్రాంతాల్లో రెండు సంవత్సరాలు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న వైద్యులకు సర్వీస్ కోట కింద పీజీ వైద్య విద్య అభ్యసించేందుకు జీఓ 85 ఉపయోగపడుతుంది. అయితే కూటమి ప్రభుత్వం గత ఆగస్టులో ఈ జీఓను 99గా మార్పుచేసినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. -
ఇల కై లాసం.. దేవీ వైభవం
శ్రీశైలంటెంపుల్: అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో దేవీ శరన్నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇల కైలాసంలో దేవీ వైభవాన్ని కనులారా తిలకించిన భక్తజనం తన్మయత్వానికి లోనయ్యారు. దసరా నవరాత్రోత్సవాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం శ్రీశైల భ్రామరీ బ్రహ్మచారిణి స్వరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంక్రీకృతులైన అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయం ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఉంచి అర్చకులు, వేదపండితులు వేదమంత్రోచ్చరణల నడుమ పూజ లు చేశారు. ప్రత్యేక అలంక్రీకృతులైన అమ్మవారి స్వరూపాన్ని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటూ నీరాజనాలు సమర్పిస్తున్నారు. నవరాత్రోత్సవాల్లో భాగంగా మూడవ రోజు బుధవారం శ్రీశైల క్షేత్రంలో చంద్రఘంట అలంకారంలో అమ్మవారు, రావణ వాహనసేవపై స్వామిఅమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు. మయూర వాహనంపై మల్లన్న విహారం దసరా మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిఅమ్మవారలు మయూర వాహనంపై విహరించి భక్తులకు ఆశీస్సులు అందించారు. బ్రహ్మచారిణి స్వరూపంలోని అమ్మవారిని, మయూర వాహనంపై అధిష్టించిన స్వామిఅమ్మవార్లను ఆలయ రాజగోపురం మీదుగా వెలుపలకి తీసుకొచ్చి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. గంగాధర మండపం నుంచి నందిమండపం, అక్కడి నుంచి బయలువీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఈ గ్రామోత్సవంలో కళాకారుల నృత్యాలు, డప్పు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆయా పూజల్లో దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీని వాసరావు దంపతులు, తదితరులు పాల్గొన్నారు. శ్రీగిరిలో దేదీప్యమానంగా దేవీ శరన్నవరాత్రులు బ్రహ్మచారిణి అలంకారంలో శ్రీశైల భ్రామరీ.. మయూర వాహన సేవలో ఆదిదంపతుల విహారం స్వామిఅమ్మవార్లను దర్శించుకుని పులకించిన భక్తజనం -
అవును.. నిధులివ్వలేదు!
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇలా.. మైనారిటీల సంక్షేమానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ. 21,365.13 కోట్లు కేటాయించింది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో 51,04,409 మంది మైనారిటీలకు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా నిధులు మంజూరు చేసింది. మౌజాన్ల గౌరవ వేతనం రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంపు, ఇమామ్లకు రూ. 5 వేల నుంచి రూ.10 వేల కు పెంచి వారికి ప్రతి నెలా క్రమం తప్పకుండా అందించడం విశేషం.బొమ్మలసత్రం: శాసనమండలిలో ఎమ్మెల్సీ ఇసాక్బాషా మంగళవారం అడిగిన ప్రశ్నల కు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎమ్డీ ఫరూక్ ఇచ్చిన సమాధానం చూస్తే కూ టమి ప్రభుత్వం తమను మోసం చేసిందన్న విషయం మైనారిటీలకు ఇట్టే అర్థమైంది. శాసన మండలిలలో ఎమ్మెల్సీ అడిగిన ప్రశ్నలు ● 2025–26బడ్జెట్లో మైనారిటీల సంక్షేమానికి రూ.5,434కోట్లు, 2024–25 బడ్జెట్లో రూ.4,376 కోట్లు, సబ్ప్లాన్ కింద రూ.2,512 కోట్లు కేటాయించామని కూట మి ప్రభుత్వం చెబుతోంది. ● 50 ఏళ్లు నిండిన మైనారిటీలకు పింఛన్ అందిస్తామన్నారు. ● ఇద్గాల కోసం స్థలాలు కేటాయిస్తామన్నారు. ● హజ్హౌస్ నిర్మాణానికి, నూర్బాషా కార్పొరేషన్కు నిధులు. ● రూ.5 లక్షల వడ్డీ లేని రుణాలు. ● ఇమామ్, మౌజాన్లకు ప్రతినెలా రూ.5 వేల గౌరవ వేతనం. ● దుల్హన్ పథకం ద్వారా రూ.లక్ష. ● మైనారిటీ కార్పొరేషన్ ద్వారా మైనారిటీ యువతి, యువకులకు ఆర్థిక తోడ్పాటు. రూ.2 లక్షలు, రూ.5 లక్షల స్కీమ్ కింద 50 శాతం సబ్సిడీ. ● ఈ పథకాలన్నీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుంది. ఈ ఏడాది బడ్జెట్ ఈ ఏడాదే అమలు చేస్తారా.. లేదా వచ్చే ఏడాది అమలు చేస్తారా? మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఇచ్చిన సమాధానం 2024–25 బడ్జెట్లో రూ.173.5 కోట్లు కేటాయించాం. కానీ అప్పుడు ఆర్ధిక ఇబ్బందుల వల్ల నిధులు విడుదల చేయలేకపోయాం. ● 2025–26 బడ్జెట్లో రూ.173.5 కోట్లు కేటాయించాం. అయితే ఫైనాన్స్ విభాగంలో ఉంది. ● నిధులు విడుదల కాగానే దాదాపు 19,779 మంది మైనార్టీ యువతకు ప్రయోజనం కలుగుతుంది. వీటికి సమాధానం కరువు ● మౌజాన్, ఇమామ్ల గౌరవవేతనం, 50 ఏళ్లు పైబడిన వారికి పింఛన్, ఈద్గాలకు స్థలాల కేటాయింపు, హజ్హౌస్ నిర్మాణానికి నిధులు, నూర్బాషాల సంక్షేమానికి నిధులు, దుల్హన్ పథకం తదితర ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇవ్వకుండా దాటవేయడం గమనార్హం. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్సీ ఇషాక్బాషా హామీల వారీగా ప్రశ్నల వర్షం ఒక్క పైసా నిధులు విడుదల చేయలేదన్న మంత్రి ఫరూక్ ఈ విడత ఆదుకుంటామని వెల్లడి -
రైతుల భూ సమస్యల పరిష్కారానికి చర్యలు
బేతంచెర్ల: రైతుల భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజకుమారి అన్నా రు. ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన మధు శేఖర్ గౌడు తన పొలంలో రహదారి లేకున్న మరో రైతు అక్రమంగా తన పొలంలో వెళ్తున్నాడని, సమస్యను రెవెన్యూ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదంటూ సోమవారం కలెక్టరేట్ ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన విషయం విధితమే. స్వయంగా తానే సమస్యను పరిశీలించి పరిష్కరిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఆర్ఎస్ రంగాపురం చేరుకుని పొలం రహదారిని పరిశీలించారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టా, అనుభవం దారుల వివరాలను ఆర్డీఓ నరసింహులు, డిప్యూటీ తహసీల్దార్ మారుతి, మండల సర్వేయర్, వీఆర్వో మధుతో చర్చించారు. బాధితుడు మధు శేఖర్ గౌడు తాత ఈడిగ మద్దిలేటికి 1970లో 961–బీ2ఏ 5 ఎకరాల డీ పట్టాను ప్రభుత్వం ఇచ్చిందన్నారు. కాని బాధితుడు రహదారికి సంబంధించి ఇచ్చిన దరఖాస్తు సర్వే నంబర్ 961– బీ2బీలో 2.62 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎవ్వరికి అసైన్మెంట్ చేయలేదని కలెక్టర్, ఆర్డీఓ నరసింహులు విన్నవించారు. ఇరువర్గాల రైతుల సమస్యల విన్న అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇద్దరి రైతులకు నోటీసులు ఇచ్చి తుది నివేదిక మంజూరు చేస్తానని, 15 రోజుల తరువాత ఇచ్చే తుది నివేదికకు ఇరువర్గాలు కట్టుబడి ఉండాలని హెచ్చరించారు. రంగాపురం గ్రామానికి చెందిన మాధవ రెడ్డి మరి కొంత మంది గ్రామస్తులు 340(బీ) జాతీయ రహదారి నిర్మాణంలో తమ దుకాణాలు కూల్చి వేయడంతో ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. -
అటు వైపు ఎలివేటెడ్ కారిడార్కు ప్రతిపాదనలు..
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అమ్రాబాద్ అడవుల్లో శ్రీశైలం రహదారిని ఎలివేటెడ్ కారిడార్గా నిర్మించేందుకు అనుమతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. పట్టణాలలో నిర్మించే ఫ్లైఓవర్లా అడవుల్లో కూడా పిల్లర్లపై అడవిపై రహదారిని నిర్మించడమే ఎలివేటెడ్ కారిడార్ అంటారు. అడవుల్లో జాతీయ రహదారుల నిర్మాణానికి ఇదే అత్యుత్తమ పరిష్కారంగా కనిపిస్తోంది. నిజానికి ఈ పద్ధతిలో నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇందు కు ప్రతిపాదించడం చూస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం కానున్న జాతీయ రహదారులకు ఆర్థికంగా పెద్ద సమస్య కాబోదని తెలుస్తోంది. నల్లకాల్వ – వెలుగోడు మధ్య కేవలం ఏడు కి.మీ దూరం మాత్రమే ఫ్లైఓవర్ నిర్మించాల్సి ఉంటుంది. అలాగే కర్నూలు – గుంటూరు మార్గంలో ఎస్ఎన్ తండా నుంచి ప్రకాశం జిల్లాలోని కొర్రప్రోలు వరకు సుమారు 30 కి.మీ ఇలాంటి ఫ్లైఓవర్ నిర్మించాలి. అప్పుడు అటు అటవీ రక్షణకు, వన్యప్రాణి సంరక్షణకు సమస్యలు తలెత్తవు. ప్రయాణికులకు వేగంగా గమ్యం చేరుకునే వీలు కలుగుతుంది. అందుకే నోడల్ సంస్థ అయిన ఎన్హెచ్ఏ ఈ ప్రణాళిక ను కేంద్ర వైల్డ్ లైఫ్ బోర్డు ముందు పెట్టాల్సి ఉంది. -
ఓపెన్ స్కూల్ ప్రవేశానికి గడువు పెంపు
నంద్యాల(న్యూటౌన్): ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీటం (ఏపీఓఎస్ఎస్) 2025–26 విద్యాసంవత్సరానికి పదవ తరగతి, ఇంటర్మీడియెట్ తరగతుల్లో ప్రవేశానికి రూ.200 అపరాధ రుసుంతో ఈనెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు డీఈఓ జనార్దన్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 14 సంవత్సరాలు నిండిన వారు పదవ తరగతిలో, 15 సంవత్సరాలు నిండిన వారు పది పాస్ అయి ఇంటర్మీడియెట్లో అడ్మిషన్ పొందవచ్చన్నారు. మరింత సమాచారం కోసం www.apopenschool.ap.gov.in వెబ్సైట్లో లేదా సమీపంలో ఉన్న ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లో, డీఈఓ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యమొద్దు ఉయ్యాలవాడ: పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ రెవెన్యూ అధికారులను హెచ్చరించారు. మంగళవారం ఉయ్యాలవాడ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీదారులను పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా అర్జీ అర్థమయ్యే విధంగా ఎండార్స్మెంట్ క్లియర్గా ఇవ్వాలన్నారు. ఉయ్యాలవాడ మండలంలో ఎక్కువగా భూ సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయని, భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని తహసీల్దార్ ప్రసాద్బాబు, ఆర్ఐ అంకన్న, మండల సర్వేయర్ విజయలక్ష్మి, సూచించారు. నవోదయలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగింపు ఎమ్మిగనూరు రూరల్: మండల పరిధిలోని బనవాసి జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతిలో ప్రవేశానికి గడుపు తేదీ ఈ నెల 29 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు పొడిగించినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ ఇ.పద్మావతి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రవేశ పరీక్ష 7.2.2026న నిర్వహిస్తామన్నారు. సందేహాలుంటే 08512–294545 నెంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. ఎస్సీ యువతకు ఆర్టీసీలో డ్రైవింగ్ శిక్షణ కర్నూలు(అర్బన్): జిల్లాలోని షెడ్యూల్డు కులాల సేవా ఆర్థిక సహకార సంస్థ ద్వారా ఎంపికై న షెడ్యూల్డు కులాలకు చెందిన యువతకు హెవీ మోటారు వెహికల్ డ్రైవింగ్ శిక్షణను ఆర్టీసీలో ఇప్పించేందుకు చర్యలు చేపట్టినట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె.తులసీదేవి తెలిపారు. మంగళవా రం స్థానిక కార్యాలయంలో ఈఓ విజయలక్ష్మితో కలిసి ఆమె ఎంపికై న అభ్యర్థుల జాబితాను పరిశీలించారు. ఈ సందర్భంగా తులసీదేవి మాట్లాడుతూ శిక్షణ కోసం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించామన్నారు. కర్నూలు జిల్లాలో 10 మందిని, నంద్యాల జిల్లాలో 10 మందిని ఎంపిక చేశామన్నారు. శిక్షణనిచ్చే అంశాన్ని రెండు జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకుపోతామన్నారు. అనుమతి రాగానే ఆర్టీసీ ట్రైనింగ్ కళాశాలల్లో శిక్షణ మొదలవుతుందని పేర్కొన్నారు. -
భూసేకరణ ప్రతిపాదనలు సమర్పించండి
నంద్యాల: జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పారిశ్రామిక ప్రాజెక్టులు, విద్యాసంస్థలు, సంక్షేమ వసతి గృహాలు, రోడ్లు–భవనాల నిర్మాణం వంటి పనులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియకు సంబంధించి ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో అర్జీల స్వీకరణ అనంతరం జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. భూసేకరణకు సంబంధించి ప్రతి ప్రాజెక్టుకు ఎంత భూమి అవసరమవుతుందో సంబంధిత శాఖలు స్పష్టమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలన్నారు. ప్రాజెక్టుల వారీగా అవసరమైన భూముల వివరాలను సిద్ధం చేయడంలో ఆలస్యం జరిగితే సంబంధిత శాఖలపై బాధ్యత ఉంటుందన్నారు. భూముల ఫీజీబిలిటీని బట్టి ఆర్డీవోలు, తహసీల్దార్లు తనిఖీలు నిర్వహించి 26 డాక్యుమెంట్లతో కూడిన నివేదికను సమర్పిస్తే ప్రతిపాదనలు ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీకి పంపిస్తామని కలెక్టర్ తెలిపారు. పాఠశాలలు, సంక్షేమ వసతి గహాలు, కంప్రెష్డ్ బయోగ్యాస్ వంటి ప్రాధాన్యత ప్రాజెక్టులకు అడ్వాన్స్ పొజిషన్ ఇస్తామని, జీఓ వెలువడిన తర్వాతే సంబంధిత భూములను స్వాధీనం చేయడం జరుగుతుందన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం ● ఎస్పీని ఆశ్రయించిన బాధితులు నంద్యాల: అంగన్వాడీ సెంటర్లో టీచర్గా, హౌసింగ్ ఆఫీస్లో వర్కింగ్ ఇన్స్పెక్టర్గా, డేటా ఎంట్రీ ఆపరేటర్గా, ఇలా వివిధ రకాలుగా ఉద్యోగం ఇప్పిస్తామంటూ నంద్యాలకు చెందిన వాహిదా అనే మహిళ మోసం చేసిందని గోస్పాడు మండలం యాళ్లూరు గ్రామానికి చెందిన సమీరాతో పాటు మరికొందరు జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్కు ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితులు ఎస్పీని కలసి విచారించి తమకు న్యాయం చేయాలని, తీసుకున్న డబ్బు తిరిగి ఇప్పించాలని వినతి పత్రం అందజేశారు. పీజీఆర్ఎస్లో 95 వినతులు వచ్చాయి. ప్రజల ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపుతామన్నారు. -
సంతృప్త స్థాయిలో పరిష్కరించండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను క్షేత్ర స్థాయిలో నిశితంగా పరిశీలించి సంతృప్త స్థాయిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డీఆర్ఓ రాము నాయక్, డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులతో కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. అనంతరం అధికారుల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీదారులకు సరైన రీతిలో ఎండార్సెమెంట్ ఇవ్వకపోవడం వల్లే అసంతృప్తి స్థాయి పెరిగి జిల్లా ర్యాంకింగ్లో వెనుకబడి పోతున్నామన్నారు. పెండింగ్లో ఉన్న రీఓపెన్ దరఖాస్తులన్నీ ఈ వారం క్లియర్ చేయాలన్నారు. రెవెన్యూ దరఖాస్తులపై ఆర్డీఓలు, తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పరిష్కరించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. కార్యాలయపు ఫైళ్లన్నీ సంబంధిత అధికారుల ఈ సైన్తో ఈ ఆఫీస్ ద్వారానే సమర్పించాలన్నా రు. కార్యక్రమంలో 220 అర్జీలు వచ్చాయని, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వినతిదారులతో భోజనం.. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో పాల్గొన్న అర్జీదారులతో జిల్లా కలెక్టర్ రాజకుమారి కలిసి భోజనం చేశారు. సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారుల కోసం ఓంకారంలోని శ్రీ కాశిరెడ్డి నాయన సత్రం ఆధ్వర్యంలో చేపట్టిన అన్నదాన కార్యక్రమంలో అర్జీదారులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. బాధిత కుటుంబంలోని వ్యక్తులతో కలిసి భోజనం చేస్తూ చిన్నారులను కలెక్టర్ ఆప్యాయంగా పలకరించారు. భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నారు.. అని పిల్లలను అడగగా వారు వైద్య విద్యను అభ్యసించి డాక్టర్ అవ్వాలనుకుంటున్నామని తెలిపారు. అందుకు అనుగుణంగా చిన్నారులకు మెరుగైన విద్యను అందించాలని వారి తల్లిదండ్రులకు సూచించారు. అర్జీదారులతో భోజనం చేస్తూ వారి సమస్యలను నేరుగా విని స్పందించిన కలెక్టర్, అధికార యంత్రాంగం, ప్రజల మధ్య దూరాన్ని తగ్గించడం ద్వారా సేవా దృక్పదం మరింత బలపడుతుందన్నారు. -
రేషన్ బియ్యం లారీ సీజ్?
ఆదోని అర్బన్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని కర్ణాటక పోలీసులు ఆదివారం రాత్రి సీజ్ చేసినట్లు తెలిసింది. ఆదోని నుంచి అహ్మదాబాద్కు 35 టన్నుల రేషన్ బియ్యంతో అక్రమంగా వెళ్తున్న లారీని కర్ణాటక రాష్ట్రం సింధనూరు రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి రసీదులు లేకపోవడంతో లారీని సీజ్ చేసి పోలీసుస్టేషన్కు తరలించారు. ఇదిలాఉంటే బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ఆదోని పట్టణంలోని నలుగురు కూటమి నాయకుల హస్తం ఉన్నట్లు తెలిసింది. లారీ డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు వారిపైనా కేసు నమోదు చేసినట్లు సమాచారం. -
శాస్త్రోక్తంగా నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం
ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలంలో నవరాత్రి ఉత్సవాలు సోమవారం నుంచి శాస్త్రోక్తంగా ప్రారంభమయ్వాయి. ఉదయం ఉత్సవమూర్తులు శ్రీదేవి భూదేవి సహిత శ్రీ ప్రహ్లాదవరద స్వామిని దేవాలయం ఎదురుగా ఉన్న యాగశాలలో కొలువుంచి వేద పండితుల మంత్రోచ్ఛారణలతో నవకళస్తాపన గావించి పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం తిరుమంజనం నిర్వహించి ఉత్సవమూర్తులను నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి కొలువుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాత్రి శ్రీ అమృతవల్లీ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక నవరాత్రి పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేసి మొదటి రోజు కార్యక్రమాన్ని ముగించారు. ఈ పూజలు ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కేంద్రంలోనే నియామక పత్రాలు ఇవ్వాలి ఆత్మకూరు: డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రంలో నియామక పత్రాలు అందజేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రాజు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఫంక్షన్ హాల్లో సోమవారం ఇటీవల డీఎస్సీ ద్వారా ఎంపికై న నూతన ఉపాధ్యాయులను ఏపీటీఎఫ్ కర్నూలు, నంద్యాల జిల్లాల శాఖల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ఏపీటీఎఫ్ ముందుంటుందన్నారు. నూతన ఉపాధ్యాయులకు పాఠశాలల కేటాయింపు మ్యానువల్గా అందజేయాలన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాల పీఆర్సీ, డీఏలను, బకాయిల సరెండర్ను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలన్నారు. అనంతరం ఆత్మకూరు పట్టణంలో ఎంపికై న 136 మందిని సన్మానించారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఇస్మాయి ల్, మరియానందం, శ్రీనివాసులు, ఆత్మకూరు ఎంఈఓ అయూబ్అహ్మద్, శ్రీశైలం ఎంఈఓ కలి ముల్లా, ఉమ్మడి జిల్లా నాయకులు ఉమ్మర్, వెంకటేశ్వర్లు, పుల్లయ్య, స్వామినాదం, వెంకటరాముడు, శ్రీరాములు, గోపాలరావు, అజయ్కుమార్, రవిప్రసాద్, రవికుమార్, రామ్మూర్తి, అంబయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. తనిఖీలతో హడలెత్తించిన ఎస్పీ నంద్యాల: ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎస్పీ సునీల్ షెరాన్ ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించారు. పట్టణంలోని ఎస్డీఓపీ కార్యాలయం, తాలూకా, సెంట్రల్ క్రైం, వన్టౌన్, మహిళా పోలీస్ స్టేషన్, పోలీస్ క్వార్టర్స్ పరిసర ప్రాంతాలను జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద ఫిర్యాదుదారుల సమస్యలు తెలుసుకుంటూ పోలీసుల పని తీరు గురించి ఆరా తీశారు. అనంతరం స్టేషన్ పరిసరాలు పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. పోలీస్ క్వార్టర్స్లోని పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ను సందర్శించి ఇక్కడ ఉన్న మందుల వివరాలు, డాక్టర్ల పనితీరు తదితర వాటిపై ఆరా తీశారు. నంద్యాల ఎస్డీఓపీ కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం మహిళా పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన శక్తి యాప్, సైబర్ క్రైం, మహిళలు చిన్నపిల్లలపై జరిగే నేరాలపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. పట్టణంలోని సెంట్రల్ క్రైం పోలీస్ స్టేషన్ను సందర్శించి సిబ్బంది వివరాల తెలుసుకున్నారు. వన్టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఎస్పీ వెంట సబ్ డివిజన్ ఏఎస్పీ ఎం.జావళి ఆల్ఫోన్స్, ట్రైనింగ్ డీఎస్పీ రాజాసింహారెడ్డి, తదితరులు ఉన్నారు. -
కల్యాణ వీణ మోగేనా..
● పేదల కోసం ఫంక్షన్ హాల్ నిర్మించిన సిమెంట్ పరిశ్రమ ● నిర్వహణ పేరుతో ప్రైవేటుకు దీటుగా వసూళ్లకు అధికారుల నిర్ణయం కొలిమిగుండ్ల: పేదల కోసం రామ్కో సిమెంట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులతో నిర్మించిన ఫంక్షన్హాల్లో అధికారుల తీరుతో శుభకార్యాలు నిర్వహించుకోలేని పరిస్థితి ఏర్పడింది. శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించేందుకు మార్కెట్లో ఉన్న రేట్ల కంటే ఎక్కువగా రుసుం నిర్ణయించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివాహాలు తదితర శుభకార్యాలు జరుపుకునేందుకు మండల కేంద్రంలో అనువైన కల్యాణ మండపాలు లేవు. పెళ్లిళ్లు జరుపుకోవాలంటే తాడిపత్రి, జమ్మలమడుగు, కోవెలకుంట్ల తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉండేది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ప్రజ ల అవసరాలను గుర్తించారు. సమస్యను రామ్కో యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి అన్ని వసతులతో కూడిన ఫంక్షన్హాల్ను నిర్మించాలని కోరడంతో స్పందించారు. రూ.2.75 కోట్ల సీఎస్ఆర్ నిధులు విడుదల చేయడంతో కాటసాని, జెడ్పీచైర్మన్ చేతుల మీదుగా భూమి పూజ చేశారు. వైఎస్సార్సీపీ ప్రభు త్వంలోనే పనులు అన్నీ పూర్తయ్యాయి. అయితే ఎన్నికల కోడ్ రావడంతో ప్రారంభోత్సవం వాయి దా పడింది. కూటమి ప్రభుత్వం దాదాపు 15 నెలల తర్వాత గత నెల 30న ఈ ఫంక్షన్హాల్ ఎట్టకేలకు ప్రారంభించారు. దీనిని నిర్వహణ బాధ్యత మండల పరిషత్ అధికారులు తీసుకున్నారు. హాల్ మెయింటెన్స్, విద్యుత్ చార్జీలు తదితర వాటి కోసం మాత్రమే నామమాత్రంగా వసూలు చేసే విధంగా అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. అందుకు భిన్నంగా ప్రస్తుతం రేట్లు నిర్ణయించడంతో మండల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వివాహాలకు రూ.25 వేలు, బర్త్డే, ఇతర కార్యక్రమాలకు రూ.15 వేలుగా రుసుం నిర్ణయించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఫంక్షన్హాల్ నిర్మిస్తే ఎక్కువ మొత్తం వసూలు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత మొత్తం చెల్లించి శుభకార్యాలు జరుపుకోవడం కంటే ఇతర ప్రాంతాలకు వెళ్లడమే మంచిదనే అభిప్రాయాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. స్థానికంగా ప్రైవేటు ఫంక్షన్హాల్లో ఇవే రేట్లు ఉన్నాయని, ఈ విషయాన్ని అధికారులు పరిగణనలోనికి తీసుకుని రేట్లు మార్చాలని కోరుతున్నారు. కాగా విషయంపై ఇన్చార్జ్ ఎంపీడీఓ ప్రసాద్రెడ్డి వివరణ కోరగా.. ఫంక్షన్హాల్ మెయింటెన్స్ నిమిత్తం ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చేశామని, ఈ మేరకు శుభకార్యాలు నిర్వహించుకునే వారి కోసం రుసుం నిర్ణయించామన్నారు. -
అయ్యో పాపం
● పాముకాటుతో తల్లి మృతి ● రెండేళ్ల క్రితం గుండెపోటుతో తండ్రి మృత్యువాత ● అనాథలుగా మిగిలిన ఇద్దరు చిన్నారులు బనగానపల్లె: విధిరాతకు ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. రెండేళ్లలోనే తల్లిదండ్రుల ను కోల్పోయి బంధువుల చెంతన చేరా రు. బనగానపల్లెకు చెందిన శేఖర్ గౌడ్, రమాదేవి దంపతులది పేద కుటుంబం. వీరికి ఇద్దరు కుమారులు. కష్టపడి కుమారులను బాగా చదివించి ప్రయోజకులను చేయాలనుకున్నారు. ఇంతలోనే ఆ ఇంట విషాదం నెలకొంది. శేఖర్గౌడ్ రెండు సంవత్సరాల క్రితం గుండెపోటుతో మృతి చెందగా రమాదేవి పిల్లలతో పుట్టినిల్లు యనకండ్లకు చేరుకుంది. రోజు కూలీకెళ్తూ పిల్లలను పోషించేది. ఈ క్రమంలో విధి ఆ తల్లిని పిల్లలకు దూరం చేసింది. రమాదేవి (35) సోమవారం కై ప గ్రామానికి కూలీ పనికి వెళ్లగా పొలంలో మధ్యాహ్నం ఆమెను పాముకాటు వేసింది. వెంటనే బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక గంట వ్యవధిలోనే మృతి చెందింది. ఎనిమిదేళ్లలోపు ఇద్దరూ కుమారులు అనాథలుగా మారారు. పెద్ద కుమారుడు మాణిష్గౌడ్ 3వ తరగతి, చిన్న కుమారుడు హేమనాథ్ గౌడ్ యూకేజీ చదువుతున్నారు. తల్లిదండ్రులు ఇద్దరు మృతి చెందడంతో అనాథలుగా మారిన పిల్లలను ప్రభుత్వ ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నా రు. మృతరాలి సోదరుడు ఈడిగ హరిష్గౌడ్ ఫిర్యా దు మేరకు నందివర్గం ఎస్ఐ వెంకటసుబ్బయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాసుల కోసం కక్కుర్తి!
కాసుల కోసం వ్యవసాయ అధికారులు కక్కుర్తి పడుతున్నారు. ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. నకిలీ బయో ఉత్పత్తుల దారుడికి కొమ్ము కాస్తూ అతడు పడేసే ఎంగిలి మెతుకులకు దాసోహమవుతూ అన్నదాతలకు అన్యాయం చేస్తున్నారు. లైసెన్స్ డీలర్లతోనే నకిలీ బయో ఉత్పత్తులను రైతులకు అంటగట్టి ఆమ్యామ్యాలు పోగేసుకుంటున్నారు. అక్రమ సంపాదనలో వాటా ఉండటంతో ఈ తతంగమంతా తెలిసినా జిల్లా వ్యవసాయ యంత్రాంగం కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.కర్నూలు(అగ్రికల్చర్): నకిలీ బయో ఉత్పత్తులను అరికట్టాల్సిన వ్యవసాయ అధికారులే అక్రమ సంపాదన కోసం అడ్డుదారులు తొక్కుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది జూన్ నెలలో జరిగిన బదిలీల్లో కొందరు వ్యవసాయ అధికారులు కూటమి పార్టీల నేతలకు పెద్ద ఎత్తున ముడుపులు ఇచ్చుకొని కీలకస్థానాలు పొందారు. ఇటువంటి ఏఓలు ఇప్పటికే సంపాదన కోసం పలు మార్గాలను ఎంచుకున్నారు. కొందరు మరింత తెగబడి నకిలీ బయోల ద్వారా జేబులు నింపుకునేకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వ్యవసాయ అధికారుల తీరు చూస్తే కంచే చేను మేసినట్లు ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్షయ్ ఉత్పత్తులపై అంత ప్రేమ ఎందుకో.. బయోస్టిమిలింట్స్ ఉత్పత్తి, మార్కెటింగ్ కోసం పామ్–జి ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్రం పరిధిలో ఉత్పత్తి మార్కెటింగ్ చేసుకునేందుకు ప్రభుత్వం ఫామ్–జి2 ద్వారా అనుమతులు ఇస్తుంది. దేశంలో ఎక్కడైనా మార్కెటింగ్ చేసుకోవాలంటే కేంద్రం ఫామ్–జి3 ద్వారా అనుమతి ఇస్తుంది. ఇప్పటికే జిల్లాలో ఎన్ని బయో స్టిమిలెంట్స్ కంపెనీలకు చెందిన ఎన్ని ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉందో.. ఆ వివరాలను వ్యవసాయ శాఖ జిల్లాకు పంపింది. ఆ వివరాల ప్రకారం జిల్లాలో 47 బయోస్టిమిలెంట్స్ కంపెనీలకు చెందిన 622 ఉత్పుత్తులకు మాత్రమే మార్కెటింగ్ చేసుకునేందుకు అనుమతులున్నాయి. కానీ వివిధ మండలాల్లో అక్షయ్ అగ్రి సొల్యూషన్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన ఉత్పత్తులు హల్చల్ చేస్తున్నాయి. ఈ కంపెనీకి చెందిన ప్లవర్ ప్లస్ అనే బయోలను వ్యవసాయ అధికారులే మార్కెటింగ్ చేయాలని డీలర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ ప్రాంతంలో కొందరు ఏఓలు ఐదారు కేసుల ఈ బయోలను సరఫరా చేసి లీటరు రూ.1,000 ప్రకారం వసూలు చేసిన, ఎంతకై నా అమ్ముకోవచ్చని ఉదారత చూపినట్లు సమాచారం. ఈ కంపెనీ ఉత్పత్తులపై వ్యవసాయ అధికారులకు అంత ప్రేమ ఏమిటోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులే ఈ బయో కంపెనీని నడుపుతున్నారా అనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. మా ఉత్పత్తులు అమ్మించండిఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత బయో కంపెనీలు జిల్లాలో హల్చల్ చేస్తున్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధి రెండు బయో కంపెనీలను నడుపుతున్నట్లు తెలుస్తోంది. ‘ఇపుడు మా ప్రభుత్వం ఉంది. మా ఉత్పత్తులు అమ్మడానికి సహకరించండి. మీకు తగిన ప్రతిఫలం ఉంటుంది’ అంటూ వ్యవసాయ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. కొన్ని ఉత్పత్తులకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. మిగతా ఉత్పత్తులకు అనుమతులు లేవు. అయినా గ్రామాలు, మండలాల వారీగా ఏజెంట్లను నియమించుకుని అమ్మకాలు సాగిస్తున్నారు. గ్రామాల్లోకి వెళ్లి మార్కెటింగ్ చేయాలని, వ్యవసాయ అధికారులు కూడా సహకరిస్తారని, ఎవరితోనైనా ఇబ్బందులొస్తే తాము చూసుకుంటామని సదరు ప్రజాప్రతినిధి ఏజెంట్లకు చెబుతున్నట్లు సమాచారం. ఈ కంపెనీలకు కర్నూలులో ఉత్పత్తి లేదు. గుంటూరులోనే ఉత్పత్తి చేసి కర్నూలులోని గోదాములకు తరలించి మార్కెటింగ్ చేసుకుంటున్నారు. నకిలీ బయోల ద్వారా ఆదాయం కోసం వ్యవసాయ అధికారుల అడ్డదారులు అక్షయ్ అగ్రి సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలకు ప్రోత్సాహం లైసెన్స్ పొందిన డీలర్ల ద్వారానే నకిలీ బయోల మార్కెటింగ్ వెల్లువెత్తుతున్న ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ నేత కంపెనీల ఉత్పత్తులు -
కందిపప్పు.. కరువే!
కర్నూలు(సెంట్రల్): పేదలకు బియ్యం, బ్యాళ్లు, చక్కెర కచ్చితంగా ఇస్తామన్న పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ నోరు మెదపడంలేదు. కేవలం బియ్యం మాత్రమే ఇస్తూ బ్యాళ్లు అస్సలే ఇవ్వడంలేదు, అరకొరగా చక్కెర ఇచ్చి చేతుతులు దులుపుకుంటున్నారు. దసరా పండుగ వస్తున్న తరుణంలో బ్యాళ్లు ఇస్తారనుకుని ఆశించిన ప్రజలకు ఆశాభంగమే మిగిలింది. పండగ పూట కూడా కందిపప్పు కరువడంతో పరమాన్నం, భక్షభోజ్యాలకు పేదలు దూరం కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 16 నెలల్లో మూడు నెలలు మాత్రమే! కర్నూలు జిల్లాలో 6,34,631 మంది రేషన్ కార్డుదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా 1 నుంచి 18వ తేదీల మధ్య రేషన్ షాపుల ద్వారా సరుకులను సరఫరా చేస్తున్నారు. ఒక్కో కార్డుకు కేజీ కంది పప్పు ఇవ్వాలని స్వయంగా మంత్రి ప్రమాణస్వీకారం చేసిన తరువాత మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. అయితే ఆయన ఆదేశాల తరువాత జిల్లాకు బ్యాళ్ల కేటాయింపులే జరగడంలేదు. జిల్లాకు దాదాపు 600 టన్నుల బ్యాళ్లను కేటాయించాలి. ప్రభుత్వం ప్రతి కార్డుకు కేజీ బ్యాళ్లను రూ.67లకు సరఫరా చేస్తుంది. ఈక్రమంలో ప్రభుత్వం బ్యాళ్లు లేకపోవడంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల బయటి మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది.అక్కడ కిలో ఏకంగా రూ.180పైగా ధర పలుకుతోంది. ఇదే సమయంలో ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేసే బ్యాళ్లను ఇవ్వకపోవడంతో బయటిమార్కెట్లో అధిక రేటుకు కొనుగోలు చేయలేక పేదలు, మధ్యతరగతి వర్గాల ప్రజలు పప్పుకు దూరమవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 16 నెలలు అవుతోంది. ఇందులో బ్యాళ్లను సరఫరా చేసింది మాత్రం కేవలం 3 నెలలు మాత్రమే! జొన్నలు తీసుకోవడానికి ముందుకు రాని ప్రజలు ప్రస్తుతం జిల్లాలోని రేషన్ కార్డుదారులకు కేవలం బియ్యం మాత్రమే రేషన్ షాపుల ద్వారా సరఫరా చేస్తున్నారు. దాదాపు 10,500 టన్నుల బియ్యాన్ని కేటాయించారు. కాగా.. 1100 టన్నుల జొన్నలు ఉన్నా పేదలు, మధ్యతరగతి వర్గాల ప్రజలు తీసుకోవడానికి ఇష్టపడంలేదు. జొన్నలు నాణ్యత పరంగా నాసిరకంగా ఉంటున్నాయనేది ప్రజల వాదన. కాగా, ఒక్కో కార్డుకు 2 లేదా 3 కేజీలు బియ్యానికి బదులుగా ఎలాంటి డబ్బులు తీసుకోకుండా జొన్నలను వినియోగదారులకు అందించాలి. రేషన్కార్డుదారులకు అక్టోబర్కు సంబంధించి బ్యాళ్ల కేటాయింపులు జరుగలేదు. ఇది ప్రభుత్వ నిర్ణయం. జిల్లాకు 11వేల టన్నుల బియ్యం, 1,100 టన్నుల జొన్నల కేటాయింపులు జరిగాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు 338 టన్నుల చెక్కర అందుబాటులో ఉంది. ప్రజలు ఆయా నిత్యావసరాలను తీసుకొని సద్వినియోగం చేసుకోవాలి. – వెంకటరాముడు, డీఎం, సివిల్ సప్లై సంస్థ అరకొరగా చక్కెర కేటాయింపులు రేషన్షాపుల్లో ప్రతి కార్డుదారుడికి అర్ధకేజీ చెక్కరను రూ.17.50 లకు పౌర సరఫరాల సంస్థ సరఫరా చేస్తోంది. అయితే కార్డుకు కనీసం కేజీ చెక్కరైనా ఇవ్వాలని ప్రజలు కోరుతున్నా పట్టించుకోవడంలేదు. కేవలం అర్ధఽ కేజీ మాత్రమే ఇస్తుంది. అన్న అంత్యోదయ కార్డు దారులకు మాత్రం కేజీ చక్కెర చొప్పున సరఫరా ఇస్తారు. ప్రస్తుతం అక్టోబర్ నెలకు సంబంధించి జిల్లాకు 338 టన్నుల చక్కెర అందుబాటులో ఉంది. ఏడు నెలలుగా రేషన్ షాపులకు బ్యాళ్ల కేటాయింపులే లేవు బయటి మార్కెట్లో కిలో బ్యాళ్ల ధర రూ.180 పైమాటే కొనలేక ఇబ్బంది పడుతున్న పేద, మధ్యతరగతి ప్రజలు ప్రస్తుతం రేషన్ షాపుల్లో ఇస్తున్నది బియ్యం, అరకొరగా జొన్నలు మాత్రమే! -
నేడు కలెక్టరేట్లో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం ఉదయం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెనన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తులను జిల్లా కలెక్టరేట్కు వచ్చే అవసరం లేకుండా "meekosam.ap.gov.in"లో ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించవచ్చన్నారు. దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో ప్రస్తుత సమాచారం ఆన్లైన్లో తెలుస్తుందని లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించి తెలుసుకోవచ్చ ని పేర్కొన్నారు. అర్జీదారులు తమ అర్జీలను ముందుగా సంబంధిత మండల, డివిజన్, మున్సిపాలిటీలలో అధికారులకు ఇవ్వాలని అక్కడ పరిష్కారం కాకపోతే జిల్లా కేంద్రానికి రావాలని సూచించారు.మహానందిలో 60.4 మిల్లీమీటర్ల వర్షం నంద్యాల(అర్బన్): నంద్యాల జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు పలు మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా మహానంది మండలంలో 60.4 మి.మీ వర్షం కురవగా డోన్లో అత్యల్పంగా 1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇక ఆత్మకూరులో 52.8, రుద్రవరం 40.4, నంద్యాల అర్బన్ 28.4, శ్రీశైలం 24.2, కొత్తపల్లి 20.6, ఉయ్యాలవాడ 18.0, నంద్యాల రూరల్, చాగలమర్రి 15.2, పగిడ్యాల 14.6, శిరివెళ్ల 12.2, ఆళ్లగడ్డ, నందికొట్కూరు 12.0, మిడుతూరు 11.4, కొలిమిగుండ్ల 10, జూపాడుబంగ్లా 9.8, బండిఆత్మకూరు 9.2, వెలుగోడు 8.8, బనగానపల్లె 7.4, గడివేముల 4.2, గోస్పాడు 3.2, దొర్నిపాడు, బేతంచెర్ల 2.4, పాణ్యం 2.2, పాములపాడు 2, అవుకు 1.6 మిల్లీ మీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. నంద్యాలకు బయలుదేరిన మహానందీశ్వరుడు మహానంది: మహానందిలో కొలువైన గంగ, కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి దంపతులు ఆదివారం నంద్యాలకు బయల్దేరారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నంద్యాలలోని బ్రహ్మనందీశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. ముందుగా స్థానిక అలంకార మండపంలో ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ఉప ప్రధాన అర్చకులు మూలస్థానం శివశంకర శర్మ, ముఖ్య అర్చకులు రాఘవశర్మ, మణికంఠశర్మ, అర్చకులు స్థానిక అలంకార మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాల మధ్య నంద్యాలకు పయణమయ్యారు. -
శ్రీగిరిలో నేటి నుంచి దేవీశరన్నవరాత్రోత్సవాలు
శ్రీశైలంటెంపుల్: విజయ దశమి సందర్భంగా శ్రీగిరి క్షేత్రంలో సోమవారం నుంచి అక్టోబర్ 2 వరకు భ్రమరాంబాదేవి శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈఓ ఎం.శ్రీనివాసరావు ఇటీవల అధికారులతో సమావేశమై భక్తులకు ఏలోటూ రానివ్వకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈఓ సూచనల మేరకు అధికారులు ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారు. సంప్రదాయాన్ని అనుసరించి శాస్త్రోక్తంగా నిర్వహించబడే ఈ ఉత్సవాలలో అమ్మవారికి నవదుర్గ అలంకారాలు, ప్రత్యేక నవావరణపూజలు, స్వామిఅమ్మవార్లకు వాహనసేవలు, చండీయాగం, రుద్రయాగం జరుగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు స్వామిఅమ్మవార్లకు విశేష అర్చనలు, అమ్మవారికి ప్రత్యేక పూజలు, రుద్రయాగం, చండీయాగం, అమ్మవారి ఉత్సవమూర్తికి నవదుర్గ అలంకరణలు, స్వామిఅమ్మవార్లకు వివిధ వాహనసేవలు నిర్వహిస్తారు. నేడు ఉత్సవాలకు అంకురార్పణ దసరా మహోత్సవాలకు నాందిగా సోమవారం ఉదయం 9 గంటలకు అమ్మవారి ఆలయ మండపంలో యాగశాల ప్రవేశం చేసి, గణపతిపూజ, స్వస్తిపుణ్యాహవచనము, దీక్షాసంకల్పం, కంకణపూజ, ఋత్విగ్వరణం, కంకణపూజ, కంకణధారణ జరిపిస్తారు. అఖండ స్థాపన, వాస్తుపూజ, వాస్తుహోమం, నవగ్రహ మండపారాధన, చండీకలశస్థాపనము, చతుర్వేద పారాయణలు, విశేష కుంకుమార్చనలు, గణపతి పంచాక్షరీ, కుంకుమార్చనలు, కుమారి పూజలు జరిపిస్తారు. ఉదయం 9.30 గంటలకు స్వామివారి యాగశాలలో యాగశాల ప్రవేశం చేసి వేదస్వస్తి, శివసంకల్పం, గణపతిపూజ, అఖండదీపా స్థాపన, వాస్తుపూజ, మండపారాధనలు, రుద్రకలశ స్థాపన, స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మధ్యాహ్నకాలార్చనలు, మహానివేదనలు జరిపిస్తారు. సాయంత్రం అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన, రుద్రహోమం, అమ్మవారికి నవావరణార్చన, కుంకుమార్చనలు జరిపిస్తారు. ఉత్సవ కార్యక్రమాల నిర్వహణలో దేవస్థాన అర్చకులు, వేదపండితులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉత్సవ నిర్వహణలో పాల్గొంటారు. దసరా మహోత్సవాల్లో నేడు దసరా మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు శ్రీశైల భ్రమరాంబాదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. అలాగే స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను భృంగివాహనంలో అదిష్టించి ప్రత్యేక పూజల అనంతరం ప్రత్యేక అలంకృతులైన అమ్మవారిని, ప్రత్యేక వాహనాధీశులైన స్వామిఅమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహిస్తారు. యాగశాల ప్రవేశంతో ఉత్సవాలకు అంకురార్పణ మొదటిరోజు శ్రీశైల భ్రామరీకి శైలపుత్రి అలంకారం భృంగివాహనంపై విహరించనున్న స్వామిఅమ్మవార్లు -
ప్రతిభా విద్యార్థులకు కలెక్టర్ అభినందన
నంద్యాల(న్యూటౌన్): ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో చదివి నీట్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులకు కలెక్టర్ రాజకుమారి అభినందించారు. శనివారం కలెక్టర్ చాంబర్లో వారిని అభినందిస్తూ ఒక్కొక్కరికి రూ.లక్ష ప్రోత్సాహక చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆత్మకూరు మండలం నందికుంట గ్రామా నికి చెందిన ప్రణయ్బాబు, గడివేముల మండలం ఎల్కే తండాకు చెందిన నితీస్ నాయక్ చిన్నటేకూరులోని ఏపీఆర్జేసీ స్కూల్లో 10వ తరగతి వరకు, అనంతరం డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ ఐఐటీ మెడికల్ అకాడమీలో ఇంటర్ చదివారన్నారు. అక్కడే నీట్ కోచింగ్ తీసుకుని మెడికల్ సీట్లు సాధించారన్నారు. ప్రణయ్ బాబుకు తిరుపతి మెడికల్ కళాశాలలో, నితీష్ నాయక్కు అనంతపూర్ మెడికల్ కళాశాలలో సీట్లు పొందారన్నారు. ఈనెల 22 నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయని, శ్రద్ధగా చదివి తల్లిదండ్రులు, కళాశాలకు మంచి పేరు తేవాలని విద్యార్థులకు సూచించారు.కార్యక్రమంలో డీఆర్ఓ రామునాయక్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శ్రీదేవి, ప్రిన్సిపాల్ వేణుగోపాల్, ఫిజిక్స్ లెక్చరర్ ఉమామహేశ్వరప్ప విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. రేపటి నుంచి దసరా సెలవులు నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఈనెల 22 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించిందని డీఈఓ జనార్దన్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా దసరా సెలవులు ఈనెల 24వ తేదీ నుంచి ప్రకటించిందని, మార్పు చేస్తూ ఈనెల 22 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు 11 రోజులు సెలవులు ప్రకటించినట్లు ఆయన తెలిపారు. దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు. వచ్చే నెల 3న యథావిధిగా పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని తెలిపారు. దేవరగట్టులో 2న బన్ని ఉత్సవం హొళగుంద: దేవరగట్టులో దసరా బన్ని ఉత్సవం వచ్చే నెల 2న నిర్వహించనున్నారని, భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదోని సబ్కలెక్టర్ మౌర్య భరధ్వాజ్ ఆదేశించారు. దేవరగట్టులో అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామపెద్దలతో శనివారం ఆయన మాట్లాడారు. తేరు బజారు, డొళ్లిన బండెను పరిశీలించారు. ముగ్గురు ఎంపీడీఓలకు పోస్టింగ్స్ కర్నూలు(అర్బన్): ఇటీవల ఎంపీడీఓలుగా పదోన్నతి పొందిన ఆరుగురిలో ముగ్గురికి పోస్టింగ్స్ ఇచ్చినట్లు జిల్లా పరిషత్ సీఈఓ జీ నాసరరెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ డ్వామాలో ఏఓగా విధులు నిర్వహిస్తు న్న టీ క్రిష్ణమోహన్ శర్మను గూడురు, పాములపాడు ఏఓ గాయత్రీని బండి ఆత్మకూరు ఎంపీడీఓగా, మహానంది డిప్యూటీ ఎంపీడీఓగా ఉన్న పీ నాగేంద్రుడును ఆత్మకూరుకు పోస్టింగ్ ఇచ్చామన్నారు. పదోన్నతి పొందిన వారిలో పీ దస్తగిరిబాబు, ఎస్ నాగరాజు, రామక్రిష్ణవేణికి ఇంకా పోస్టింగ్స్ ఇవ్వాల్సి ఉంది. కర్నూలు జిల్లాలో కోసిగి, ఓర్వకల్లు, నంద్యాల జిల్లాలో అవుకు, కొలిమిగుండ్ల, బనగానపల్లెలో ఎంపీడీఓ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కాగా, పోస్టింగ్స్ కోసం ఎదురు చూస్తున్న ముగ్గురిని కూడా పీఆర్ కమిషనరేట్ నంద్యాల జిల్లాకే కేటాయించింది. రెండో రోజూ స్తంభించిన రిజిస్ట్రేషన్ సేవలు కర్నూలు(సెంట్రల్): దస్తావేజు రైటర్ల పెన్డౌన్తో రిజిస్ట్రేషన్ సేవలు రెండో రోజూ స్తంభించాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో విక్రయదారులు లేక కళ తప్పి కనిపించాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో రోజుకు దాదాపు 500 రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. వాటి ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.30 లక్షల నుంచి 40 లక్షల ఆదాయం వస్తుంది. అయితే దస్తా వేజు లేఖరుల పెన్డౌన్తో రిజిస్ట్రేషన్లు నిలిచిపో యాయి. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్క రించే వరకు పోరాటం చేస్తామని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట శనివారం దస్తావేజు లేఖరు లు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూ నియన్ నాయకులు ఎస్ఏ రహమాన్, మహ్మద్ రఫీక్, చంద్రశేఖర్, రామకృష్ణ, నాగరాజు మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. పీడీఈ విధానంలో ఉన్న లోపాలను సరిచేయాలన్నారు. నాయకులురాజా, మహేష్, గోపాల్, జగదీష్, భాస్కర్ గౌడ్, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
వజ్రాన్వేషణకు వచ్చి.. వరదనీటిలో చిక్కుకుని..
● తాళ్ల సాయంతో ప్రాణాలు కాపాడిన స్థానికులు మహానందిలో నేలకూలిన భారీ వృక్షంతాళ్లసాయంతో వంకలో నుంచి బయటికి వస్తున్న బాఽధితులు మహానంది: నల్లమలలోని సర్వనరసింహ స్వామి ఆలయ సమీపంలోని వజ్రాలవంక(వాగు)లో వజ్రాల అన్వేషణకు వచ్చిన వారిలో ముగ్గురు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. నల్లమలలో భారీ వర్షం కురవడంతో నీటిప్రవాహం అధికమైంది. వాగులో గుంతల లోతు తెలియని పలువురు వజ్రాన్వేషణకు వెళ్లగా గుంతల్లో పడ్డారు. వారిలో కొందరు మహిళలు, పురుషులు బయటికి రాగా ఒంగోలుకు చెందిన చిన్నయ్య, మరో ఇద్దరు ఈత రాకపోవడంతో చెట్టెక్కి కేకలేశారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న ఆంజనేయపురం గ్రామస్తులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి తాళ్ల సాయంతో ముగ్గురిని ఒడ్డుకు చేర్చి ప్రాణాలు కాపాడారు. నేలకూలిన వృక్షాలు, విద్యుత్ స్తంభాలు.. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి దేవస్థానం పాత కార్యాలయం ముందు ఉన్న సుమారు వందల ఏళ్ల నాటి భారీ చింత వృక్షం నేలకొరిగింది. అదృష్టవశాత్తూ అక్కడ ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఇదే చోట నాలుగు విద్యు త్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేపట్టారు. నల్లమల అడవిలోనూ భారీ వర్షం కురవడంతో మహానంది నుంచి గాజులపల్లె వెళ్లే మార్గంలోని ఎంసీ ఫారం గ్రామం వద్ద ఉన్న పాలేరు వారు ఉప్పొంగి ప్రవ హించింది. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు రాకపోకలు నిలిచిపోయాయి. తహసీల్దార్ రమాదేవి, విద్యుత్ ఏఈ ప్రభాకర్రెడ్డి, ఎస్ఐ రామ్మోహన్రెడ్డి, పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రయాణికులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో కొనసాగుతున్న వర్షాలు నంద్యాల(అర్బన్): జిల్లాను వర్షాలు వీడటం లేదు. పది రోజులుగా మోస్తరుగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు పలు మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా రుద్రవరంలో 40.2 మి.మీ, అత్యల్పంగా వెలుగోడు, బనగానపల్లె మండలాల్లో 1.0 మి.మీ వర్ష పాతం నమోదైంది. మహానందిలో 29.2, సంజామల 25.2, నంద్యాల అర్బన్ 19.6, ఉయ్యాలవాడ 19.4, గోస్పాడు 15.0, శిరివెళ్ల 11.0, ఆళ్లగడ్డ 10.0, కొత్తపల్లె, నంద్యాలరూరల్ 8.6, కోవెలకుంట్ల 6.2, దొర్నిపాడు 4.8, కొలిమిగుండ్ల, చాగలమర్రి 4.6, బండిఆత్మకూరు 3.0, మి.మీ వర్ష పాతం నమోదైంది. కోవెలకుంట్ల – జమ్మలమడుగు రహదారిలో గోవిందపల్లె సమీపంలో చెరువు ఉప్పొంగడంతో నీటి ప్రవాహంలో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు నిలిచిపోయింది. 30 మంది ప్రయాణికులను పోలీసులు జేసీబీ ద్వారా ఒడ్డుకు చేర్చారు. -
‘అనకొండ’ అవినీతిపై నత్తనడకన విచారణ
● తవ్వేకొద్ది వెలుగు చూస్తున్న అక్రమాలు ● సిబ్బంది ప్రమేయంతోనే భారీగా నిధుల స్వాహా ● స్కామ్లో తెరపైకి పలువురి ఉద్యోగుల పేర్లు ● చర్యలు తీసుకోవడంలో అధికారుల జాప్యంఆత్మకూరురూరల్: ఆత్మకూరు అటవీ డివిజన్లో ప్రభుత్వ నిధులు స్వాహా కేసులో తవ్వే కొద్ది అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో స్థానిక డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో పని చేసి రిటైర్డ్ అయిన కార్యాలయ పర్యవేక్షణాధికారి చాంద్బాషా ప్రధాన నిందితుడిగా తేల్చి అరెస్ట్ చేశారు. అక్రమాలు మొదట రూ.4 కోట్లుగా నిర్ధారణ చేసి విచారణ చేపట్టగా మరో రూ. 3 కోట్ల మేర బయటపడినట్లు సమాచారం. ఈ కేసులో జరిగిన లావాదేవిలను అటవీశాఖ విజిలెన్స్ డీఎఫ్వో శివప్రసాద్ బృందం విచారణ చేస్తుండగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు చాంద్బాషా అటవీశాఖలో పని చేస్తున్న పలువురు మినిమం టైం స్కేల్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కొందరు ఏబీవోలు, ఎఫ్బీవోల సహకారాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. నిధుల స్వాహాలో పలువురి ఉద్యోగుల పేర్లు తెరపైకి వచ్చినా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తుండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అక్రమార్కుడికి సహకరించిన కొందరు ఉద్యోగులు దర్జాగా విధులు నిర్వహిస్తుండటం గమనార్హం. విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలు.. ● డీడీ కార్యాలయంలో కంప్యూటర్ విభాగంలో పని చేసే ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రెండు బ్యాంకు అకౌంట్లలోకి ప్రధాన నిందితుడు వేతనాల పేర్లతో మూడు సార్లు నిధులు మళ్లించుకున్నట్లు బ్యాంకు స్టేట్మెంట్లు తెలుపుతున్నాయి. ఈ లెక్కన ఆయన నెలకు మూడు వేతనాల చొప్పున డ్రా చేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఇలా దారి మళ్లిన సొమ్ము ప్రధాన నిందితునికి చేరిందా లేకా అన్ని అంశాలలో సహకరించిన ఉద్యోగికి అనకొండ అందించిన నజరానా అనే సంగతి తెలియాల్సి ఉంది. ● మినిమం టైం స్కేల్ ఉద్యోగి ఒకరు తన పరిధిలో ఉన్న వన సంరక్షణ సమితికి కేటాయించిన సొమ్మును నేరుగా చెక్కుల రూపంలో ప్రధాన నిందితుడి సోదరుడి ఖాతాకు మళ్లించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ● ఒక ఏబీవో, ఏబీవోలకు కూడా డీడీ కార్యాలయ బ్యాంకు అకౌంట్ నుంచి పెద్ద మొత్తం బదిలీ చేసి, తిరిగి ఆ మొత్తం అనకొండ సంబంధీకుల ఖాతాలకు జమ చేసినట్లు సమాచారం. ● ఆత్మకూరు డివిజన్లో ఉన్న ఒక ఎఫ్ఆర్ఓ జీపు డ్రైవర్గా పని చేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఖాతా లోకి ఆయన వేతనం కాకుండా పలుమార్లు పెద్ద మొత్తాలు బదిలీ అయినట్టు వెలుగు చూసింది. ఆ మొత్తం తిరిగి ఫోన్పే ద్వారా ఈ కేసులో ప్రధా న నిందితుడి సూచనల మేరకు ఇతర అకౌంట్లకు బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ● బైర్లూటీ ఎకో టూరిజం రిసార్ట్లో పనిచేసే ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఖాతాలకు కూడా వనసంరక్షణ సమితిల నుంచి చెక్కుల రూపంలో పెద్ద మొత్తం జమ అయినట్లు విచారణలో తెలిసినట్లు సమాచారం. ● అటవీ నిధుల స్వాహాలో తెరపైకి పలువురి ఉద్యోగుల పేర్లు వెలుగులోకి వస్తున్నా విచారణ నత్తనడకన కొనసాగుతుండటం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. -
పరిహారం పెంచాలి
మేము రెండు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాం. ఎకరాకు పెట్టుబడి వ్యయం రూ.లక్షపైనే వచ్చింది. ఎకరాకు దిగుబడి 50 క్వింటాళ్లు మించడం లేదు. ప్రస్తుతం మార్కెట్కు 60 క్వింటాళ్ల ఉల్లి మార్కెట్కు తీసుకువచ్చాం. నాణ్యత లేదని ఉల్లిగడ్డలను వ్యాపారులు టెండరు వేయలేదు. ఆదివారం మళ్లీ టెండరు పెడుతామని అధికారులు చెబుతున్నారు. వ్యాపారుల తీరు చూస్తే క్వింటాకు రూ.100, 150 కూడా ధర వేసే పరిస్థితి లేదు. పెట్టుబడి వ్యయాన్ని బట్టి ప్రభుత్వం పరిహారం చెల్లించాలి. ఎకరాకు కనీసం రూ.40 వేల వరకు పరిహారం ఇవ్వాలి. – మస్తాన్వలీ, తడకనపల్లి, కల్లూరు మండలం ఈ సారి ఖరీఫ్లో ముక్కాల్ ఎకరాలో ఉల్లి సాగు చేశా. పెట్టుబడి రూ.80 వేల వరకు పెట్టా. 70 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దీనిని మార్కెట్కు తీసుక వస్తే వ్యాపారులు క్వింటా రూ.429 ధరతో కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా పరిహారం ముక్కాల్ ఎకరాకు రూ.15వేలు వస్తుంది. అంటే రైతుకు దక్కుతున్న మొత్తం రూ.45 వేలు మాత్రమే. పెట్టుబడిలో 50 శాతం మాత్రమే దక్కుతుంది. ప్రభుత్వం పెట్టుబడి వ్యయాన్ని బట్టి పరిహారం ఇవ్వాలి. – వీరేష్, చిన్న కొతిలి, నందవరం మండలం -
వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి
గోస్పాడు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వైద్య సేవలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వస్త్ నారీ–సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లెల్లలో ఎన్సీడీ, ఆర్బీఎస్కే జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ కాంతరావునాయక్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ మాట్లాడుతూ.. మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబాలు శక్తి వంతంగా ఉంటాయన్నా రు. గర్భిణులు, కౌమార బాలికలు ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. హైరిస్క్ గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. -
స్వచ్ఛ నంద్యాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
బొమ్మలసత్రం: స్వచ్ఛ నంద్యాల కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణ శివారులోని డంప్యార్డులో మంత్రితో పాటు కలెక్టర్ రాజకుమారి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, కమిషనర్ శేషన్న మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లా ప్రజలందరూ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. అన్ని కార్యాలయాల్లోని అధికారులు తమ సమీపంలోని చెత్తను తొలగించి శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ నంద్యాల కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు. జిల్లాలోని 529 ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. నంద్యాల పట్టణంలో 17 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న డంపింగ్ యార్డులో ఆరు ఎకరాల్లో 500 మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. -
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కల్లూరు: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిలోని వివిధ విభాగాల్లో పదవులు పొందిన వారందరూ బాధ్యతయుతంగా పనిచేయాలని ఆ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి సూచించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మణిరెడ్డి శనివారం కాటసాని రాంభూపాల్రెడ్డిని స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలతో సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో కష్టపడే కార్యకర్తలకు పదవులు వరిస్తాయన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పదవులు పొందిన వారందరూ సమన్వయంగా, సమష్టిగా పని చేయాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ లక్ష్మికాంతరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు మధుసూదన్రెడ్డి, శ్రీధర్రెడ్డి, శివారెడ్డి, ఎ. గోకులపాడు గ్రామ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. -
ఇద్దరి కుమార్తెలతో తల్లి అదృశ్యం
● గొర్రెల మేతగా ఉల్లి పంట ఉల్లి పంటను గొర్రెలకు మేతగా వదిలేసిన ఈ దృశ్యం సి.బెళగల్ గ్రామ సమీపంలో శనివారం కనిపించింది. రైతు కురువ నాగన్న తన రెండు ఎకరాల పొలంలో ఉల్లి సాగు చేశాడు. పంట చేతికి రావడంతో ఉల్లి కోతకు సిద్ధమయ్యాడు. అయితే మార్కెట్లో ఆశించిన స్థాయిలో ధరలు లేకపోవడంతో ఆప్పులు అవుతాయని రైతులు ఆందోళన చెందాడు. దీంతో శనివారం రెండు ఎకరాల పొలంలోని ఉల్లి పంటను గొర్రెలకు వదిలేశాడు. ఇన్నేళ్ల కాలంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు అని రైతు కురువ నాగన్న కన్నీటి పర్యంతమయ్యాడు. – సి.బెళగల్ నంద్యాల(అర్బన్): జిల్లా కేంద్రం నంద్యాల పట్టణంలో ఓ మహిళ, తన ఇద్దరు కుమార్తెలు ఈనెల 4వ తేదీ నుంచి కనిపించడం లేదు. నంద్యాల రూరల్ స్టేషన్ ఎస్ఐ జాకీర్హుసేన్ తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని విజయనగర కాలనీలో నివాసముంటున్న మరాఠీ కులానికి చెందిన బాషాకు భార్య నర్సమ్మ (46), నందిని (21), స్వప్న(19) ఉన్నారు. ఈ నెల 4వ తేదీ ఉదయం నర్సమ్మ, నందిని, స్వప్నతో పాటు బంధువులు అయిన తులసి, శోభాతో కలిసి సమీపంలోని క్రాంతినగర్ వద్ద వంట చెరకు కోసం వెళ్లారు. కొద్ది సేపటి తర్వాత నర్సమ్మ, ఆమె పిల్లలు కనిపించడం లేదని వెంట వెళ్లిన ఇద్దరు వెతుకులాట ప్రారంభించారు. కనిపించకపోవడంతో వారి కుటుంబీకులకు విషయం తెలిపారు. రెండు రోజులుగా కుటుంబీకు లు చుట్టు పక్కల గాలించినా ఆచూకీ తెలియలేదు. దీంతో తన భార్య, ఇద్దరు కుమార్తెలు కనిపించడం లేదని ఈనెల 6వ తేదీన బాషా రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే ఇటీవల పోలీసు పీజీఆర్ఎస్లో తన భార్యా పిల్లల ఆచూకీ తెలపాలంటూ బాషా ఫిర్యాదు సైతం చేశారు. తన భార్యాపిల్లల ఆచూకీ తెలిస్తే 9000850771,9502917316 సమాచారం ఇవ్వాలని బాషా కోరుతున్నారు. నర్సమ్మ ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు ఆధార్ కార్డు లు, పొదుపు డబ్బులు రూ. 17 వేలు డ్రా చేసుకుని వెళ్లినట్లు సమాచారం. భార్యభర్తల మధ్య చిన్న పాటి గొడవలతో మనస్తాపం చెందిన నర్సమ్మ కుమార్తెలతో ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. నర్సమ్మ సొంతూరైన తెలంగాణ రాష్ట్రంలోని సూర్యపేట, సమీపంలోని కోదాడా, జగ్గయ్యపేట, తదితర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. కాగా మిస్సింగ్ కేసుల దర్యాప్తు సమయంలో పోలీసుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఆచూకీ జాప్యమవుతుందని పలువురు విమర్శలు చేస్తున్నారు. నర్సమ్మ (ఫైల్) నందిని (ఫైల్) స్వప్న (ఫైల్) -
కేఎంసీ అలుమ్ని భవనం కోసం స్థల పరిశీలన
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజి అలుమ్ని (పూర్వ విద్యార్థుల సంఘం) భవనం నిర్మాణం కోసం శనివారం స్థల పరిశీలన చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ చంద్రశేఖర్తో పాటు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, అలుమ్ని సంఘం నాయకులు కలిసి కళాశాలలోని పలు స్థలాలను చూశారు. ఈ సందర్భంగా వైస్ చాన్స్లర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ మాట్లాడుతూ అలుమ్ని వైద్యులు ఈ కళాశాల విద్యార్థులే అని, ఇక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా ఇక్కడి వైద్యులకే తిరిగి ఉపయోగపడతాయని చెప్పారు. అయితే ప్రస్తుతం విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు, సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేలా నిర్మాణ ప్రదేశం ఉండాలని అలుమ్ని సంఘం నాయకులకు సూచించారు. ఈ మేరకు కళాశాలలో చివరగా ఉన్న ఎగ్జామినేషన్ హాలు పక్కనున్న ఖాళీ ప్రదేశాన్ని పరిశీలించినట్లు తెలిపారు. అలుమ్ని ప్రెసిడెంట్ డాక్టర్ బి.కుమారస్వామిరెడ్డి, డాక్టర్ కేజీ గోవిందరెడ్డి మాట్లాడుతూ అలుమ్ని భవన నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రెండేళ్ల క్రితమే జీవో విడుదలైందని, ఈ భవన నిర్మాణం అన్నది వైద్యులందరి కోసం అని, ముఖ్యంగా కళాశాల వైద్యులకు మరింత ఉపయోగపడుతుందని చెప్పారు. అందరి సమ్మతితో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మైదానానికి దూరంగా ఉన్న ప్రదేశాన్నే సూచిస్తున్నామని తెలిపారు. ఈ స్థల పరిశీలనలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సాయిసుధీర్, ప్రొఫెసర్ డాక్టర్ మాధవీశ్యామల, అలుమ్ని నాయకులు డాక్టర్ రామచంద్రరావు, వైద్యులు పాల్గొన్నారు. -
విద్యార్థుల ‘నడక’ యాతన
● టైర్లు పంక్చరై, పగిలిపోయి నిలిచిన ఆర్టీసీ బస్సు ● పరీక్షలు రాయలేకపోయిన విద్యార్థులు హొళగుంద: టైర్లు పంక్చరై, పగిలిపోయి ఆదోని డిపో బస్సు ఆగిపోవడంతో దాదాపు 50 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆలూరు నుంచి సుళువాయి మీదుగా తిరుగుతున్న ఆర్టీసీ బస్సులో శనివారం విరుపాపురం, సుళువాయి, పెద్దహ్యాట, సమ్మతగేరి, ముగుమానుగుందికి చెందిన 50 మంది ఎక్కారు. వీరు హొళగుందలోని జెడ్పీ హైస్కూల్, జూనియర్ కళాశాలకు వెళ్లాల్సి ఉంది. అయితే పెద్దహ్యాట క్రాస్ వద్దకు చేరిన బస్సు వెనుక టైరు పంక్చర్ అయ్యింది. అలాగే ముందు టైరు పగిలిపోయింది. దీంలో బస్సు అక్కడే నిలబడిపోయింది. అందులో ఉన్న విద్యార్థులు దాదాపు నాలుగు కిలోమీటర్ నడిచి హొళగుందకు చేరుకున్నారు. వేళకు చేరుకోకపోవడంతో ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు రాయలేకపోయామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. -
మృతదేహంతో ఆందోళన
ఆదోని అర్బన్: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కౌతాళం మండలం బదినేహాల్ గ్రామానికి చెందిన మల్లికార్జున మృతదేహంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఆస్పరి మండలం చిరుమాన్దొడ్డి గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్లికార్జున మృతిచెందిన విషయం విధితమే. అయితే, మృతుడి వెంట ఆటోలో ఇద్దరు వెళ్లారని, ప్రమాదంలో వారికి ఎలాంటి గాయా లు కాకుండా మల్లికార్జున ఒక్కడే చనిపోవడం నుమానాలురేకెత్తిస్తున్నాయని కుటుంసభ్యులు ఆరోపించారు. కాగా ఆసుపత్రి ఎదుట ఆందోళన విషయం తెలుసుకున్న వన్టౌన్ సీఐ శ్రీరామ్ అక్కడికి చేరుకొని మృతుడి కుటుంబసభ్యులతో మాట్లాడారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
మతిస్థిమితం లేని మహిళ అదృశ్యం
మహానంది: గోపవరం సమీపంలోని సెయింట్ ఆన్స్ దివ్యాంగ వయోజన వసతి గృహ ంలో ఉంటున్న 36 ఏళ్ల షేక్ ముబీనా శుక్ర వారం నుంచి కనిపించడం లేదని ఎస్ఐ రా మ్మోహన్ రెడ్డి తెలిపారు. కర్నూలులోని మ హబూబ్ బాషా కుమార్తె అయిన షేక్ ముబీనాకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఇక్కడ వసతి పొందుతోందన్నారు. ముబీనా వెళ్లే సమయంలో ఆకుపచ్చ, తెల్లటి రంగు కలిగిన చుడీదార్, గులాబీ రంగు చున్నీ ధరించిందన్నారు. ఎవరికై నా ఆచూకీ తెలిస్తే 9121101093కు సమాచారం అందించాలని సూచించారు. గోనెగండ్ల: జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించేందుకు బైకుల దొంగతనలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. సీఐ విజయ భాస్కర్ తెలిపిన వివరాల మేరకు.. సి. బెళగల్ మండలం పోలకల్ గ్రామానికి చెంది ఉప్పరి వీరేష్ జేసీబీ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. తర్వాత మద్యం, పేకాట, జూదం తదితర చెడు వ్యాసనాలకు బానిసయ్యాడు. కూలీ పనుల నుంచి వచ్చే ఆదాయం జల్సాలకు, ఖర్చులకు సరిపోకపోవడంతో సులువుగా డబ్బు సంపాదించేందుకు బైక్ల చోరీని ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఇళ్ల ముందు, దేవాలయలు, బస్టాండ్ల దగ్గర పార్కు చేసి ఉంచిన ద్విచక్ర వాహనాలను ఎత్తుకెళ్లి వాటిని ఇతరులకు విక్రయించేవాడు. ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడకు చెందిన గొల్ల మధుశేఖర్, బొడ్డువాని పల్లెకు చెందిన చంద్రశేఖర్లు తమ బైక్లను గోనెగండ్లలోని శ్రీ చింతలాముని, నల్లారెడ్డి స్వామి దేవాలయం దగ్గర ఉంచగా చోరీ గురయ్యాయని గోనెగండ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు పోలకల్ గ్రామానికి చెందిన ఉప్పరి వీరేష్ బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలియడంతో శనివారం పథకం ప్రకారం మాటు వేసి గాజులదిన్నె ప్రాజెక్టు క్రాస్ రోడ్డు దగ్గర అదుపులోకి తీసుకున్నారు. రూ.5లక్షలు విలువ చేసే 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు పంపినట్లు సీఐ తెలిపారు. బైకుల దొంగను పట్టుకున్నందుకు సీఐ విజయభాస్కర్, పోలీసులు దేవరాజు, ఎన్టీ కుమార్, కార్తీక్, మద్దిలేటి, కృష్ణనాయక్, మహేంద్రలను డీఎస్పీ భార్గవి అభినందించారు. -
దళిత, గిరిజనులను మోసం చేస్తున్న ప్రభుత్వాలు
కర్నూలు(అర్బన్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఇతర సంక్షేమ పథకాలకు మళ్లిస్తు దళిత, గిరిజనులను మోసం చేస్తున్నాయని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి సి. మహేష్, ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి వి. నాగరాజు ఆరోపించారు. శనివారం స్థానిక ఎస్సీ కార్పొరేషన్ ఎదుట డీహెచ్పీఎస్ నగర కార్యదర్శి కుమార్ రాజా అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటి పోతున్నా, సబ్ప్లాన్ నిధుల గురించి మాట్లాడకపోవడం దుర్మార్గమన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దళిత, గిరిజనుల పట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తోందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎన్ఎస్ఎఫ్డీసీ పథకం నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ పథకానికి సంబంఽధించి గత నాలుగేళ్లుగా నిధులు విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని లేని పక్షంలో ఆయా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్ రామచంద్ర, కోశాధికారి సీ కుమార్, ఉపాధ్యక్షురాలు కోటమ్మ, నాయకులు అంజి, రమేష్, శ్రీను, ఏసన్న, వై నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
కుటుంబాన్ని మట్టుబెట్టే యత్నం!
● పెద్ద కొట్టాలలో ఇరు కుటుంబాల ఘర్షణ ● ఇంటిలో పెట్రోల్ పోసి నిప్పంటించి గడియ పెట్టిన వైనం ● సకాలంలో పోలీసుల రాకతో స్వల్ప గాయాలతో బయటపడిన బాధితులు నంద్యాల(అర్బన్): పెద్దకొట్టాల గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య ఏర్పడిన ఘర్షణ తీవ్ర పరిణామాలకు దారి తీసింది. ఓ కుటుంబాన్ని ఇంటిలో పెట్టి నిప్పంటించి మట్టుబెట్టే యత్నం చేయగా పోలీసుల రాకతో ఆ కుటుంబం ప్రాణాలతో బయటపడింది. గ్రామంలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బండి చిన్నబాబు, సంటెన్నలు కొత్త కాలనీలో నివాసం ఉంటున్నారు. మూడు మాసాల క్రితం తన ఇంటి వద్దకు వచ్చాడని సంటెన్న, తదితరులు చిన్నబాబు కుటుంబంపై దాడి చేశారు. గ్రామ పెద్దల సమక్షంలో జరిగిన పంచాయితీలో చిన్నబాబు కొంత కాలం పాటు గ్రామాన్ని వదలి వెళ్లాలని తీర్పు ఇచ్చారు. నందికొట్కూరు సమీపంలో జీవనం సాగిస్తున్న చిన్నబాబుకు ఇటీవల కుమార్తె జన్మించింది. పాప బర్త్డేను పెద్దకొట్టాలలో బంధువుల సమక్షంలో నిర్వహించుకోవాలని చిన్నబాబు గ్రామంలో ఏర్పాట్లు చేసుకున్నారు. గురువారం బంధుమిత్రులు వేడుకలకు హాజర య్యారు. కాగా తన ఇంటి ముందు వెళ్తున్న చిన్నబాబును సంటెన్న వర్గీయులు ఎగతాళి చేశారని, కోపోద్రిక్తుడైన చిన్నబాబు వారితో ఘర్షణకు దిగారు. అనంతరం రాత్రి వేడుకలు జరుపుకుంటున్న సమయంలో సంటెన్న వర్గీయులు చిన్నబాబు ఇంటిపై దాడికి దిగారు. ఘర్షణ తీవ్రతరం కావడంతో చిన్నబాబు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఆ క్రమంలో సంటెన్న వర్గీయులు చిన్నబాబు ఇంటిలో పెట్రోల్ పోసి నిప్పటించడమే కాకుండా ఇంట్లో ఉన్న వారు ఎవరూ బయటకు రాకుండా గడియపెట్టారు. కేకలు వేస్తున్న సమీపంలో ప్రజలు భయంతో అక్కడికి రాలేకపోయారు. సకాలంలో పోలీసులు రంగప్రవేశం అప్పటికే గ్రామంలో ఘర్షణ జరుగుతుందనే సమాచారం తెలుసుకున్న రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇల్లు తగలబడి పోతుండటాన్ని గమనించి తలుపులు తెరిచారు. లోపల మంటల్లో చిక్కుకొని ఉన్న చిన్నబాబు చిన్నమ్మ లక్ష్మీదేవి, సామన్నతో పాటు చిన్నారులు సామేల్ రాజు, కీర్తనలు పరుగుపరుగున బయటకు వచ్చారు. అప్పటికే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్న రెండు సిలిండర్లు ఆఫ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం ఫైర్ ఇంజన్ సాయంతో మంటలు ఆర్పినా ఇల్లు పూర్తిగా కాలిపోయి చిన్నబాబు కుటుంబం కట్టుబట్టలతో రోడ్డున పడింది. కుమార్తె బర్త్డేను ఘనంగా జరుపుకోవాల్సిన సమయంలో దాడి చేసుకోవడంతో అందరూ భయాందోళనకు గురయ్యాడరు. డెకరేషన్ సామగ్రి మొత్తం దగ్ధమైంది. సంటెన్న, చిన్నబాబు పరస్పర ఫిర్యాదు మేరకు ఇరువురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ ఈశ్వరయ్య శుక్రవారం తెలిపారు. గ్రామంలో ఎలాంటి సంఘటనలో చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. -
స్తంభించిన రిజిస్ట్రేషన్ సేవలు
కర్నూలు(సెంట్రల్): దస్తావేజు రైటర్ల పెన్డౌన్తో రిజిస్ట్రేషన్ సేవలు స్తంభించి పోయాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయా ల్లో ఎక్కడ కూడా ఒక్క రిజిస్ట్రేషన్ జరుగలేదు. ఫలితంగా నిత్యం క్రయ, విక్రయదారులతో కళకళలాడే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కళ తప్పి కనిపించా యి. ఉమ్మడి జిల్లాలో ప్రతిరోజూ 500 రిజిస్ట్రే షన్ల వరకు జరుగుతాయి. ప్రభుత్వానికి దాదాపు రూ.30 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు ఆదా యం వస్తుంది. అయితే దస్తావేజు లేఖరుల పెన్డౌన్తో ప్రభుత్వ ఆదాయానికి గండి పడగా..విక్రయ దారులు ఇబ్బంది పడ్డారు. శనివారం కూడా పెన్డౌన్ కొనసాగుతుందని యూనియన్ నేతలు తెలిపారు. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఆందోళన కర్నూలులోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట శుక్రవారం దస్తావేజు లేఖరులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకునే వరకు పోరాటం చేస్తామని యూనియన్ నాయకులు ఎస్ఏ రహమాన్, మహ్మద్ రఫీక్, చంద్రశేఖర్, రామకృష్ణ, నాగరాజు తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. అలాగే పీడీఈ విధానంలో ఉన్న లోపాలను సరిచేయాలన్నారు. ఆటో మ్యూటేషన్లో అనవసరపు నిబంధనలను తొలగించి తమపై పనిభారం తగ్గించాలన్నారు. స్లాట్ బుకింగ్లో విధానంలో అనేక లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేయాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. ఈ స్టాంపింగ్ విధానాన్ని రద్దు చేసి నాన్ జ్యూడిషియల్ స్టాంపులను అందుబాటులోకి తేవాలని కోరారు. నాయకులురాజా, మహేష్, గోపాల్, జగదీష్, భాస్కర్ గౌడ్, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
చంద్రబాబుకు ప్రజా వ్యతిరేకత తప్పదు
నంద్యాల: కూటమి ప్రభుత్వం ప్రజాస్వేచ్ఛకు సంకెళ్లు వేసింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఇచ్చిన ‘చలో మెడికల్ కాలేజ్’ కార్యక్రమాన్ని పోలీసులతో అణిచివేసేందుకు ప్రయత్నించింది. అడుగడుగునా ఆంక్షలు విధిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు ఎవరూ నంద్యాలకు రాకుండా అడ్డుకుంది. పోలీసు యాక్టు 30 అమలులో ఉందంటూ పోలీసులను మోహరించి బలవంతంగా అరెస్ట్లకు పాల్పడింది. నంద్యాల మెడికల్ కళాశాల వైపు వచ్చే అన్ని రహదారుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు ఉంటే వారిని వెంటనే దగ్గరలోని పోలీసు స్టేషన్లకు తరలించి సాయంత్రం విడుదల చేశారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తామని.. తమను అడ్డుకోవద్దని పోలీసులను ఎంత వేడుకున్నా కనికరించ లేదు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పోలీసుల కళ్లు గప్పి కొందరు మెడికల్ కళాశాల వద్దకు చేరుకున్నా బలవంతంగా జీపుల్లో, లారీల్లో ఎక్కించి పోలీసు స్టేషన్కు తరలించారు. చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమానికి వేలాది మంది వైఎస్సార్సీపీ శ్రేణులు, విద్యార్థులు తరలి వస్తారనే సమాచారంతో గురువారం రాత్రి నుంచే అడ్డంకులు సృష్టించేందుకు పోలీ సులు సిద్ధమయ్యారు. పోలీసుల బెదిరింపులకు భయపడకుండా ఆయా నియోజకవర్గాల నుంచి తరలివస్తున్నా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను అడుగడుగునా అడ్డుకున్నారు. మెడికల్ కళాశాల వద్దకు వచ్చిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సురేష్యాదవ్, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శశికళారెడ్డి, కొండ జూటూరు సర్పంచ్ సద్దల సుజిత్రెడ్డితో పాటు మరో 100 మందిని బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేసి పట్టణంలోని త్రీటౌన్ స్టేషన్కు తరలించారు. నంద్యాల పట్టణంలోని మెడికల్ కళాశాల వద్దకు ఎవరో రాకుండా అడ్డుకోవడానికి భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోని సీఐలు, ఎస్ఐలు అందరూ మెడికల్ కళాశాల వద్ద మోహరించారు. మెడికల్ కళాశాల వద్దకు వైఎస్సార్సీపీ శ్రేణులు ఎవరూ రాకుండా నూనెపల్లెలోనే ఆసుపత్రి వద్ద, రైతునగరం బ్రిడ్జి వద్ద, బొమ్మలసత్రంలోని గాంధీనగర్ వద్ద సీఐలు, ఎస్ఐలు ప్రతి వాహనాన్ని ఆపి తనిఖీ చేసిన తర్వాతనే పంపారు. వాహనంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఉంటే వారిని కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకొని వెనక్కి పంపారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, మండ ల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు ఎవరూ కళాశాల వద్దకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా మాజీ అధ్యక్షుడు సన్నల సాయిరాంరెడ్డిని స్వగృహంలో అరెస్ట్ చేశారు. మున్సిపల్ చైర్మన్ మాబున్నిసాను గాంధీనగర్ వద్ద ఆపి కార్యక్రమానికి రాకుండా వెనక్కి పంపించారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సురేష్యాదవ్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అమృతరాజు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్రెడ్డి, మరో 100 మందికి పైగా కార్యకర్తలు మెడికల్ కళాశాల వద్దకు చేరుకోగా వారిని బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేసి జీపుల్లో, లారీల్లో త్రీటౌన్ పోలీసు స్టేషన్కు తరలించి సాయంత్రం విడుదల చేశారు. నంద్యాల మెడికల్ కళాశాల వద్ద మోహరించిన పోలీసు బలగాలుకూటమి ప్రభుత్వం వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వెనుకడుగు వేసే వరకు ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామ ని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సురేష్యాదవ్ హెచ్చరించారు. చంద్రబాబు మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి పూనుకొని చరిత్రహీనుడిగా మిగిలిపోతున్నారన్నారు. వైఎస్సార్సీపీ శాంతియుతంగా నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే దానిని పోలీసులతో అణిచివేసి ప్రజాస్వేచ్ఛను కాలరాస్తున్నారన్నారు. అరెస్ట్లకు వైఎస్సార్సీపీ నాయకులు భయపడరని, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ఉపసంహరించుకునేంత వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. నందికొట్కూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త ధారా సుధీర్ ఆధ్వర్యంలో దాదాపు 400 మందికి పైగా నంద్యాలకు వస్తుండగా పట్టణ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. బనగానపల్లె నియోజకవర్గం నుంచి పార్టీ నేతలు అంబటి రవికుమార్, సిద్ధంరెడ్డి రామిరెడ్డి, కాటసాని తిరుపాల్రెడ్డిలతో పాటు మరో 300 మంది కార్యక్రమానికి వేర్వేరుగా వస్తుండగా కొందరినీ నందవరం వద్ద, మరికొందరిని నంద్యాల బొమ్మలసత్రంలోని గాంధీనగర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. డోన్ నియోజకవర్గం నుంచి జెడ్పీటీసీ రాజ్కుమార్, పార్టీ నేతలు కిట్టిరెడ్డి, మార్కెట్యార్డు మాజీ చైర్మన్ పుల్లారెడ్డి, మరో 200 మంది నంద్యాలకు వస్తుండగా బేతంచెర్ల వద్ద పోలీసులు అరెస్ట్ చేసి సాయంత్రం వదిలేశారు. ఆళ్లగడ్డ వైఎస్సార్సీపీ యూత్వింగ్ అధ్యక్షుడు శీను, స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు కుమార్ ఆధ్వర్యంలో భారీగా ప్రజలు చలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి వస్తుండగా రైతునగరం ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద పోలీసులు ఆపి అడ్డుకున్నారు. బైరెడ్డి సిద్దార్థ రెడ్డి హౌస్ అరెస్టు.. ‘చలో నంద్యాల మెడికల్ కాలేజీ’ కార్యక్రమంలో పాల్గొనాల్సిన వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు బైరెడ్డి సిద్దార్థ రెడ్డిని కర్నూలు మూడవ పట్టణ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తెల్లవారు జామున 4 గంటలకే పోలీసులు ఇంటి వద్దకు చేరుకొని మోహరించారు. విషయం తెలుసుకున్న యువజన విభాగం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. శాంతి యుతంగా చేపడుతున్న కార్యక్రమానికి సైతం పోలీసులు అనుమతి ఇవ్వలేదు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి బైరెడ్డి సిద్దార్థ ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. నలువైపులా మోహరించి.. -
విద్యుత్ ఉద్యోగుల సమస్యలను తక్షణం పరిష్కరించాలి
● ఏపీ పవర్ జేఏసీ కర్నూలు జిల్లా చైర్మన్ ఎస్.సతీష్కుమార్ కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ ఉద్యోగుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఏపీ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ కర్నూలు జిల్లా చైర్మన్ ఎస్.సతీష్కుమార్ తెలిపారు. ఈ నెల 15 నుంచి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న జేఏసీ శుక్రవారం స్థానిక విద్యుత్ భవన్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. ఇందులో 50 మందికిపైగా పాల్గొన్నారు. రిలే దీక్షలకు పలు సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ సతీష్కుమార్ మాట్లాడుతూ.. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. విద్యుత్ సంస్థల అభివృద్ధిలో శాశ్వత, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నిరంతర శ్రమ ఉందన్నారు. చాలీచాలని వేతనాలతో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రాణాలను ఫణంగా పెట్టి విద్యుత్ సంస్థల బలోపేతానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. డిమాండ్లను సాధించుకునేందుకు ఏర్పాటైన జేఏసీలో 1104, 327, డిప్లోమ ఇంజనీర్స్, బీసీ, ఓసీ, బహుజన ఉద్యోగ సంఘాలు మొత్తంగా 23 సంఘాలు ఉన్నా యని తెలిపారు. విద్యుత్ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అందించాలని, 1999 ఫిబ్రవరి 1 నుంచి 2004 ఆగస్టు 31 మధ్య చేరిన ఉద్యోగులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని, దళారీ వ్యవస్థను రద్దు చేసి కార్మికులకు నేరుగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చే శారు. వివిధ విద్యుత్ ఉద్యోగుల సంఘాల నాయకులు మునిస్వామి, గురుమూర్తి, మధుకృష్ణ, రమణ, మల్లికార్జున, ఈ. శ్రీనివాసులు, సుందరయ్య, యల్లప్ప, కె.సత్యం తదితరులు పాల్గొన్నారు. సరిహద్దులో రాకపోకలు బంద్ హాలహర్వి: జిల్లా సరిహద్దులో రాకపోకలు బంద్ అయ్యాయి. హాలహర్వి మండలంలోని చింతకుంట వద్ద కట్రవంక వంతెనపై లారీ ఇరుక్కుపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ వంతెన కూలిపోవడంతో చింతకుంట గ్రామస్తులు మట్టిని వేసి చదును చేశారు. శుక్రవారం ఉదయం బళ్లారి నుంచి కర్నూలు వైపు వస్తున్న లారీ ఈ మట్టిలో దిగబడింది. దీంతో రాకపోకలు నిలిచిపోయి ప్ర యాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రైవేట్ బస్సుకు భారీ జరిమానా కృష్ణగిరి: రోడ్ ట్యాక్స్ లేకుండా తిరుగుతున్న ప్రైవేట్ బస్సుకు రూ. 4,43,000 జరిమానా విధించినట్లు డోన్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) క్రాంతికుమార్ తెలిపారు. కృష్ణగిరి మండల పరిధిలోని అమకతాడు సమీపాన జాతీయ రహదారిలోని టోల్గేట్ వద్ద శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలో పాండిచ్చేరి రాష్ట్రానికి చెందిన బాలాజీ క్యాబ్స్ ట్రావెల్స్కు సంబంధించిన బస్సు తమిళనాడులోని శేలం నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఆపారు. రోడ్ ట్యాక్స్ లేకుండా ఏపీలో తిరుగుతున్నట్లు గుర్తించి రూ. 4,43,000ల జరిమానా విధించినట్లు ఎంవీఐ తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా పత్రాలు లేకుండా తిరిగితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. -
తామర.. సొగసు చూడ తరమా..!
చాకరాజువేముల శివారులో విరబూసిన తామ పూలు పవిత్రత, స్వచ్ఛత, దైవత్వం, ప్రేరణకు చిహ్నంగా తామర పుష్పాలను భావిస్తారు. నీటి కొలనులో విరబూసే ఈ తామర పుష్పాలను అటు పూజల్లో, ఇటు ఆయుర్వేద వైద్యంలోనూ వినియోగిస్తారు. ఈ పుష్పాలకు ఉండే లక్షణాల బట్టి ఎంతో విశిష్టతగా పరిగణిస్తారు. చాకరాజువేముల, ఉమాపతినగరం, గుండుపాపల గ్రామా ల్లోని నీటికుంటల్లో తామర పూలు విరబూసి కనువిందు చేస్తున్నాయి. ఎంతో అందంగా కనిపిస్తూ తామర.. సొగసు చూడ తరమా అనేలా మనసు దోచేస్తున్నాయి. – దొర్నిపాడు -
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె బాట
కర్నూలు(సెంట్రల్): తమ సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో అక్టోబర్ నుంచి సమ్మెలోకి వెళ్తామని సచివాలయ ఉద్యోగుల జేఏసీ నాయకులు భాస్కరరెడ్డి, శివప్రసాదు, రవి యాదవ్, మగ్బుల్ హుస్సేన్ స్పష్టం చేశారు. ఈనెల 8వ తేదీ నుంచి చేపట్టిన ఆందోళనల్లో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరికి ఆమె కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను సర్వే పేరుతో క్షేత్ర స్థాయికి పంపి అవమానాలపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తమ చదువుకు విలువ ఇచ్చి రాష్ట్రాభివృద్ధికి అవసరమైన సేవలను తమతో చేయించుకోవాలన్నారు. ముఖ్యంగా ఇంటింటికీ తిరిగే సర్వేలకు దూరంగా ఉంచాలని కోరారు. తమను తమ శాఖల మాతృసంస్థలకు అప్పగించాలని, సమయపాలన పాటించేలా విధంగా చర్యలు తీసుకొని పని ఒత్తిడి లేకుండా చూడాలని కోరారు. ఆరేళ్ల పాటు ఒకే క్యాడర్లో పనిచేసిన వారికి ఏఏఎస్ ప్రకారం స్పెషల్ ఇంక్రిమెంటు ఇవ్వాలని, నోషల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని, తమకు జూనియర్ అసిస్టెంట్ హోదా కల్పించాలని, అన్ని విభాగాల మాదిరిగా పదోన్నతులు కల్పించాలని, స్టేషన్ సినియారిటీ ఆధారంగా బదిలీలు చేపట్టాలని కోరారు. -
నర్సాపురంలో డెంగీ కేసు
రుద్రవరం: నర్సాపురం ఎస్సీ కాలనీకి చెందిన కొండమ్మ అనే మహిళ డెంగీ జ్వరం బారిన పడింది. నర్సాపురం పీహెచ్సీ వైద్యాధికారి బాబు శుక్రవారం సిబ్బందితో కలిసి ఎస్సీ కాలనీలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రెండు రోజులు గా కొండమ్మకు జ్వరం తగ్గకపోవడంతో వైద్యు లు నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేయగా అక్కడ పరీక్షలు నిర్వహించగా డెంగీ జ్వరం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అక్కడే ఆమెకు వైద్యం అందించడంతో కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. గ్రామంలో డెంగీ కేసు నమోదు కావడంతో పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ గ్రీన్ అంబాసిడర్లతో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి బండి ఆత్మకూరు: పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు చర్యలు తీసుకోవాలని డీఈఓ జనార్దన్ రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. మండలంలోని పలు పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారులు శుక్రవారం పరిశీలించారు. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ను జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్ రెడ్డి సందర్శించి బోధన, సౌకర్యాలు, విద్యార్థుల హాజరు, ఇటీవల పాఠశాల ముంపునకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి, పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారికి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించి పదవ తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. జిల్లా ప్రత్యామ్నాయ పాఠశాలల సమన్వయకర్త ఎండీ ప్రసన్నకుమార్, జిల్లా ప్రణాళిక, సహిత విద్యా సమన్వయకర్త ఎస్. జగన్ మోహన్ రెడ్డి గిరిజన ఆవాస ప్రాంతాల్లోని నెమళ్లకుంట, నారపురెడ్డి కుంట పాఠశాలలను సందర్శించారు. వారి వెంట ఎంఈఓ మోహన్ రెడ్డి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అబ్దుల్ రఫీ తదితరులు ఉన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటివిడుదల తగ్గింపు జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి నీటి విడుదలను 8వేల నుంచి 5వేల క్యూసెక్కులకు తగ్గించినట్లు ఏఈ విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయంలోకి 2,24,882 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా డ్యాంలో సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో 884.40 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. పోతిరెడ్డిపాడు వద్ద 883.40అడుగుల నీటిమట్టం నమోదు కాగా హెడ్రెగ్యులేటర్ నాల్గవ గేటు నుంచి 1,500 క్యూసెక్కులు, ఎన్సీఎల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి 3,500క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేస్తున్నామన్నారు. బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగకు 3వేల క్యూసెక్కులు, ఎస్సార్బీసీ(జీఎన్ఎస్ఎస్) కాల్వకు 1,000, కేసీ ఎస్కేప్ కాల్వకు 1,000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు బానకచర్ల ఏఈ దేవేంద్ర తెలిపారు. కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్పీ నంద్యాల: జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియాని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ శుక్రవారం కలెక్టర్ చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల నంద్యాల నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సునీల్ షెరాన్, కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో కలువలేకపోయారు. ఈ క్రమంలో ఎస్పీ కలెక్టర్కు పూల మొక్క అందజేసి అభినందనలు తెలిపారు. -
కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్యాయం
బేతంచెర్ల: కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి రైతులకు అన్యాయం చేస్తుందని ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. సకాలంలో రైతులకు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు ఇవ్వకపోగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. శుక్రవారం మండల పరిధిలోని యంబాయి గ్రామంలో రైతు శాలిమియా ఆరబోసిన ఉల్లి పంటను బుగ్గన పరిశీలించారు. నాలుగు ఎకరాల్లో రూ. 2లక్షల దాక ఖర్చు చేసి ఉల్లి పంటను సాగు చేశానని, పంట పండింది కాని ప్రస్తుతం గిట్టుబాటు ధర లేకపోవడంతో రూ. 50 వేలు కూడా రావని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఉల్లి పంట క్వింటా రూ. 500 అడుగుతున్నారన్నారు. ఉల్లితో పాటు టమాట, మిరప పంటలకు కూడ ధర లేదని రైతులు బుగ్గనకు విన్నవించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో సకాలంలో విత్తనాలు, ఎరువులు, యూరియా రైతులకు అందుబాటులో ఉంచడమే కాకుండా పండిన పంటలకు మద్దతు ధర కల్పించామన్నారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ పాలనలో పంటల మద్దతు ధర కోసం, యూరియా కోసం రైతులు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రైతు సమస్యలను పరిష్కరించకపోతే కూటమి ప్రభుత్వం రైతుల ఆగ్రహాన్ని చవిచూడాల్సివస్తుందని బుగ్గన హెచ్చరించారు. -
పట్టపగలే విద్యార్థిని కిడ్నాప్
చాగలమర్రి: కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్న ఓ విద్యార్థినిని గుర్తు తెలియని దుండగులు పట్టపగలే కిడ్నాప్ చేశారు. ఈ ఘటన గురువారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో చోటు చేసుకుంది. వివరాలు.. వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం కానగూడూరుకు చెందిన మంత్రాల గౌస్, మస్తాన్బీల కుమార్తె షాజిదా స్థానిక డిగ్రీ కాలేజీలో బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతోంది. రోజూ కానగూడూరు నుంచి చాగలమర్రిలోని కాలేజీకి బస్సులో వచ్చి వెళ్తుంటుంది. షాజిదా తనకు అనారోగ్యంగా ఉందని.. ఇంటికి వెళ్లడానికి అనుమతివ్వాలని గురువారం ఉదయం 11.30 సమయంలో ప్రిన్సిపాల్ను కోరింది. ఆమె తండ్రితో ఫోన్లో మాట్లాడిన అనంతరం ప్రిన్సిపాల్ ఆమె ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. కాలేజీ గేటు దాటి బయటికి వచ్చిన షాజిదాను.. అక్కడే కాపు కాచి ఉన్న దుండగులు బలవంతంగా కారులోకి లాగేసి.. ఎత్తుకెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో తండ్రికి షాజిదా ఫోన్ చేసి.. కిడ్నాప్ విషయాన్ని చెప్పింది. అనంతరం ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ సురేశ్, ఆళ్లగడ్డ రూరల్ సీఐ మురళిధర్రెడ్డి చాగలమర్రికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పట్టపగలే విద్యార్థినిని కిడ్నాప్ చేయడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడుతున్నారు. -
తీవ్రంగా నష్టపోతాం
ఈ–క్రాప్ విధానాన్ని సక్రమంగా అమలు చేయకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. పంట ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధర పొందే అవకాశాన్ని కోల్పోతాం. ప్రభుత్వం అందించే రాయితీలు అర్హులకు కాకుండా అనర్హులు పొందే అవకాశం అవకాశం ఉంటుంది. ఇకనైనా ప్రభత్వం ఈ–క్రాప్ విధానాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలి. – మధు, రైతు శ్రీరాంగాపురం ప్రతి సంవత్సరం విత్తనాలు మొదలు పెట్టినప్పటి నుంచే పంట నమోదు జరిగేది. ఈ సంవత్సరం ఈ – క్రాప్ బుకింగ్ చేయమని రోజు అడుగుతున్నాం. అయినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే మొక్కజొన్న కోయడం జరిగింది. వాటిని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలంటే ఈ–క్రాప్ నమోదయి ఉండాలి. ఇలా అయితే సేద్యం కష్టమే. – రంగారెడ్డి, గోవిందపల్లె మా శాఖ పనులు చేసుకోకుండా ఇతర పనులకు అధికారులు ఇష్టానుసారంగా వినియోగించుకుంటు ఒత్తిడికి గురిచేస్తున్నారు. పింఛన్ల పంపిణీతో పాటు అనేక రకాల సర్వేలతో నిత్యం వేధిస్తున్నారు. మళ్లీ గడువులోగా ఈ–క్రాప్ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. వ్యవసాయేతర పనుల నుంచి మమ్మల్ని పూర్తిగా మినహాయించి షెడ్యూల్ ప్రకారం ఈ–క్రాప్ నమోదుకు అవకాశం ఉంటుంది. – గ్రామ వ్యవసాయ సహాయకుడు -
బాబూ గారి బిల్డప్ బ్యాచ్!
డోన్: చిత్రంలో భోజనాలు వడ్డిస్తున్న నేతలు బాబూ గారి బిల్డప్ బ్యాచ్ తాలూకాకు చెందిన వారు. వీరు తమ నాయకుడి జన్మదినం పేరిట ప్రభుత్వ పాఠశాలలో హడావుడి గురించి తెలుసుకుంటే వారేవ్వా అనాల్సిందే. మధ్యాహ్న భోజనం విద్యార్థులకు వడ్డిస్తూ తమ సొంత ఖర్చులతో భోజనం పెడుతున్నట్లు కలరింగ్ ఇచ్చుకున్న సంఘటన గురువారం ప్యాపిలి మెయిన్ స్కూల్లో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన కొంత మంది టీడీపీ నాయకులు ఎమ్మెల్యే కోట్ల జన్మదినం పేరిట పాఠశాలలో ప్రవేశించి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం అప్పటికే తయారైన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు వడ్డించి తామే సొంత ఖర్చులతో అన్నదానం చేసినట్లు బిల్టప్ ఇవ్వ డం పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విద్యాసంస్థల్లో రాజకీయ కార్యక్రమాలు చేయరాదనే ఓ వైపు నీతులు చెబుతూనే కూటమి నేతలు ప్రైవేటు కార్యక్రమాలు నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
మోసగించడం చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య
బేతంచెర్ల: ఎన్నికలకు ముందు అబద్దపు హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక విస్మరించి ప్రజలను మోసగించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. గురువారం బేతంచెర్ల పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ చలం రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రుడు, అధికార ప్రతినిధి మురళీ కృష్ణతో కలిసి పార్టీ నాయకులతో సమీక్షించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలతో పాటు గోరుకల్లు రిజర్వాయర్ నుంచి నీరు సక్రమంగా వస్తుందా, నీటి సమస్య ఏమైనా ఉందా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బుగ్గన మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ హయాంలో ఎవ్వరి సిఫారసు లేకుండా కులం, మతం, పార్టీలు చూడకుండా అర్హులైతే చాలు సంక్షేమ పథకాలు వర్తించాయన్నారు. ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నేటికీ ఒక్క కొత్త పింఛను ఇవ్వలేకపోయిందన్నారు. పైగా ఉన్న పింఛన్లనే తొలగిస్తూ ఎంతో మంది ఉసురు పోసుకుంటోందన్నారు. టీడీపీ నాయకులు ఎక్కడికక్కడ అక్రమాలు, దందాలకు పాల్పడుతూ ప్రతి పనికీ రేటు కట్టి దోచుకుంటున్నారన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా సూపర్ సిక్స్ పథకాలు విజయవంతమయ్యాయని సభలు నిర్వహించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. -
అంకితభావం వాగు దాటించింది!
కోవెలకుంట్ల: కోవెలకుంట్లతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు మండల పరిధిలోని కంపమల్ల సమీపంలో బుచ్చమ్మ కుంట గురువారం ఉప్పొంగి ప్రవహించింది. గ్రామానికి వెళ్లే ఆర్అండ్బీ రహదారిపై వరదనీరు పోటెత్తింది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మూర్తి, గిరీష్కుమార్ పాఠశాలకు బయలుదేరే క్రమంలో వరద అడ్డగించి రాకపోకలు స్తంభించిపోయాయి. ఎలాగైనా పాఠశాలకు చేరుకోవాలన్న ఉద్దేశంతో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును సాహసం చేశారు. ఒకరికొకరు తోడుగా వాగు దాటుకుని పాఠశాలకు చేరుకున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును సైతం లెక్క చేయకుండా విధులకు హాజరైన ఉపాధ్యాయులను గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు. బైరెడ్డి ఆధ్వర్యంలో నేడు చలో మెడికల్ కాలేజీ బొమ్మలసత్రం: జిల్లా కేంద్రంలోని నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్వాహణకు సంబంధించి వాస్తవ పరిస్థితితులను ప్రజలకు వివరించేందుకు వైఎస్సార్సీపీ స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం చలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు సురేష్యాదవ్ గురువారం తెలిపారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు విద్యార్థి విభాగం, యువకులతో కలిసి శుక్రవారం ఉదయం అక్కడికి చేరుకుంటామన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో కలిగే నష్టాలను బైరెడ్డి సిద్దార్థరెడ్డి ప్రజలకు వివరిస్తారని తెలిపారు. నాగంపల్లి సొసైటీ సీఈఓపై కేసు నమోదు కొత్తపల్లి: మండల కేంద్రంలోని నాగంపల్లి సొసైటీ సీఈఓ కోటేశ్వరయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జయశేఖర్ గురువారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు.. 2022 నుంచి నాగంపల్లి సొసైటీలో కోటేశ్వరయ్య సీఈఓగా విధులు నిర్వహిస్తూ రుణాలు తీసుకున్న రైతులు చెల్లింపు సమయంలో నకిలీ రసీదులు ఇచ్చి తప్పుదోవ పట్టించారు. బాధిత రైతుల ఫిర్యాదు మేరకు ఈ ఏడాది జూన్ నెలలో సహకార సొసైటీ జిల్లా అధికారులు విచారణ చేపట్టారు. రూ. 42.40, లక్షల మేర అవినీతికి పాల్పడినట్లు గుర్తించి విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు ప్రస్తుత నాగంపల్లి సొసైటీ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ ఫిర్యాదు మేరకు కోటేశ్వరయ్యపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం రూ.3.46 కోట్లు శ్రీశైలం టెంపుల్: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాల హుండీ ఆదాయం రూ.3,46,96,431 లభించినట్లు శ్రీశైల దేవస్థాన అధికారులు తెలిపారు. గురువారం చంద్రావతి కల్యాణ మండపంలో పకడ్బందీగా హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ ఆదాయాన్ని గత 29 రోజులులో స్వామి అమ్మవార్లకు భక్తులు కానుకల రూపంలో సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటు 131.300 గ్రాములు బంగారం, 5.50 కేజీలు వెండి లభించాయి. అలాగే 2,321 యూఎస్ఏ డాలర్లు, 84 యూఏఈ దిర్హమ్స్, కత్తార్ రియాల్స్ 567, మలేషియా రింగ్ ఇట్స్ 57, యూకే పౌండ్స్ 165, కాంగో ఫ్రాంకులు 2000, కెనడా డాలర్లు 20, ఆస్ట్రేలియా డాలర్లు 15, ఈరోస్ 30, మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. సీసీ కెమెరాల నిఘా లో పకడ్బందీగా హుండీ లెక్కింపు చేపట్టారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవో రమణమ్మ, టెంపుల్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు, పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు. -
ఉరిమిన వరుణుడు
ఉయ్యాలవాడ: ఒక్కసారిగా ఆకాశానికి చిల్లు పడిందా.. అన్నట్లుగా వరుణుడు ఉరిమాడు. గురువారం తెల్లవారుజామున 4 నుంచి ఉదయం 7 గంటల వరకు ఎడతెరిపి లేకుండా మండలంలో భారీ వర్షం కురిసింది. జిల్లాలోనే అత్యధికంగా 127.2 మి.మీ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహించాయి. పలు దారుల్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి. మిరప, పత్తి, మినుము, మొక్కజొన్న, తదితర పంటలు నీట మునిగాయి. పెట్టుబడి నీటి పాలు కావడంతో రైతులు కుదేలయ్యారు. ఉయ్యాలవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణ, బీసీ కాలనీలో 4వ అంగన్వాడీ కేంద్రాన్ని వర్షపు నీరు చుట్టేసింది. ఆళ్లగడ్డ – మాయలూరు ఆర్అండ్బీ ప్రధాన రహదారిలో ఇంజేడు గ్రామ సమీపంలో కుందరవాగు వంతెనపై ఉధృతంగా నీరు ప్రవహించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కొందరు వాహనదారులు ఆర్.పాంపల్లె మీదుగా రాకపోకలు కొనసాగించారు. హరివరం, ఉయ్యాలవాడ, బోడెమ్మనూరు గ్రామాల్లో వీధులన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షంతో మండలంలో పాఠశాలలకు ఎంఈఓ రఘురామిరెడ్డి సెలువు ప్రకటించారు. సర్వాయిపల్లె గ్రామ సమీపంలోని వంక ఉప్పొంగడంతో గ్రామస్తులు అవస్థలు పడ్డారు. ఇదే సమయంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కుందూనదికి భారీగా వరద నీరు చేరుతుండటంతో హరివరం, ఉయ్యాలవాడ, బోడెమ్మనూరు గ్రామాల మధ్య ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉయ్యాలవాడలో భారీ వర్షం 127.2 మి.మీ వర్షపాతం నమోదు పొంగి పొర్లిన వాగులు, వంకలు స్తంభించిన రాకపోకలు నీట మునిగిన పంటలు -
భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయండి
నంద్యాల: జిల్లాలో వివిధ పరిశ్రమలు, విద్యాసంస్థలు, సంక్షేమ వసతి గృహాల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ చాంబర్లో జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్, డీఆర్ఓ, ఆర్డీఓ లు, సంబంధిత మండల తహసీల్దార్లు, తదితర అధికారులు కలెక్టర్ ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, సామాజిక మౌలిక సదుపాయాల విస్తరణలో భూసేకరణ ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేత్రస్థాయి లో రైతులు, అసైన్దారులతో సమన్వయం చేసు కొని స్పష్టమైన నివేదికలు పంపాలని జాయింట్ కలెక్టర్, సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు జిల్లాలో కుసుం ప్రాజెక్టు కోసం మిడ్తూరులో 162 ఎకరాలు, కంప్రెష్డ్ బయోగ్యాస్ ప్రాజెక్టుల కోసం రుద్రవరం, చాగలమరి, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో కలిపి 315 ఎకరాలు కేటాయించామన్నారు. అలాగే ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం డోన్, బేతంచర్లలో 2,860 ఎకరాలు, ఎంఎస్ఎంఈ ప్రాజెక్టు కోసం సుగాలిమెట్ట లో 49 ఎకరాలను కేటాయించామన్నారు. జిల్లాలో భూసేకరణకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను త్వరితగతిన పరిష్కరించి, పెట్టుబడులు, పరిశ్రమలు సజావుగా సాగేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధి కారి రాము నాయక్, నంద్యాల, డోన్, ఆత్మకూరు ఆర్డీఓలు విశ్వనాథ్, నరసింహులు, నాగజ్యోతి, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
పంట నమోదుపై గుడువు పిడుగు
పంట నష్టపరిహారం.. పంటల బీమా .. పంట రుణాలు.. సున్నా వడ్డీ.. కనీస మద్దతు ధర.. ఇలా వ్యవసా య పథకాలకు ప్రభుత్వం నుంచి రైతులు రాయితీలు పొందాలన్నా ఈ–క్రాప్ నమోదు కీలకం. ఇలాంటి ప్రక్రియ నంద్యాల జిల్లాలో నత్తనడకన సాగుతోంది. వ్యవసాయ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపంతో ఈ–క్రాప్ కనీసం 20 శాతం లక్ష్యానికి చేరుకోలేదు. మరో 12 రోజుల్లో గడువు ముగుస్తోంది. ఆలోపు నమోదు పూర్తికాకపోతే రైతులు అన్ని విధాలా నష్టపోవాల్సిన దుస్థితి దాపురించింది. - ఆళ్లగడ్డఖరీఫ్ సీజన్ ప్రారంభమై నాలుగు నెలలవుతోంది. మరో 12 రోజుల్లో సీజన్ ముగుస్తోంది. ఇప్పటికే భారీ వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరో వైపు ముందస్తు సాగు చేసిన పంటలు కోతకు రావడంతో నూర్పిళ్లు మొదలవుతున్నాయి. అయినా రైతులకు అన్ని విధాలుగా ఉపయోగపడే ఈ – క్రాప్ నమోదుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో ఈ–క్రాప్ నమోదు 19 శాతం కూడా దాటలేదు. దీంతో ఖరీఫ్లో పంటలు చేసిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. పంట నమోదు కాకపోవడంతో విపత్తుల సమయంలో పరిహారం, పంట అమ్మకాల సమయంలో ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నారు. పంటలతో సంబంధం లేకుండా ప్రతి ఎకరా భూమిని సర్వే నంబర్ల ఆధారంగా వివరాలు కచ్చితంగా నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా 7,73,150 ల్యాండ్ పార్శిల్స్ ఉండగా ఇప్పటి వరకు 1,47,781 ల్యాండ్ పార్శిల్స్ మాత్రమే పంట నమోదు పూర్తయింది. ఇంకా 81 శాతానికి పైగా ల్యాండ్ పార్శిల్స్కు ఈ–క్రాప్ నమోదు కావల్సి ఉంది. ఈ నెల 30వ తేదీలోపు అంటే మరో 12 రోజుల్లో ఈ–క్రాప్ నమోదు గడువు పూర్తి కానుంది. దీంతో వ్యవసాయశాఖ సిబ్బంది లక్ష్యానికి చేరుకునేందుకు మల్లగుల్లాలు పడుతుండగా గడువులోపు పంట నమోదు కాకుంటే తమ పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన చెందుతుందున్నారు.శాఖల మధ్య సమన్వయ లోపం..పంటల నమోదు రెవెన్యూ, వ్యవసాయశాఖలు సంయుక్తంగా పూర్తి చేయాల్సి ఉంది. రైతులతో కలిసి పంట పొలాలకు వెళ్లి అక్కడ సాగులో ఉన్న పంట వివరాలు, సర్వే నంబర్ ఆన్లైన్లో నమోదు చేసి పూర్తిగా ధ్రువీకరణ చేసిన తరువాతే ఈ – క్రాప్ పూర్తి చేయాలి. కానీ రెండు శాఖల మధ్య సమన్వయం లోపించింది. రెవెన్యూ సిబ్బంది ఈ ప్రక్రియకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. దీనికితోడు వీఏఏల బదిలీల నేపథ్యంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేకపోవడం గమనార్హం. అక్కడక్కడా కొందరు వ్యవసాయ సిబ్బంది మాత్రమే ప్రక్రియను మమ అనిపిస్తున్నారు. దీంతో ఈ–క్రాప్ నమోదులో స్పష్టత ఎంత వరకూ..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.నిర్లక్ష్యం తీరిది..● మారిన నిబంధనల ప్రకారం ఈ సారి సర్వే నంబర్ల వారీగా జియో మ్యాపింగ్ చేసి, ఫొటో తీసి అప్లోడ్ చేయాలి. ఈ తంతంగం క్షేత్రస్థాయిలో పూర్తికావడానికి ఎక్కువ సమయం పడుతోంది. సాంకేతిక సమస్యలతో ముందుకు సాగడం లేదు.● యూరియా కోసం రైతులు పంపిణీ కేంద్రాల వద్ద పడిగాపులు కాపుస్తుండటంతో పంపిణీ చేసేందుకు సిబ్బంది అక్కడే ఉండటం పంట నమోదుపై దృష్టి పెట్టలేక పోతున్నారు.● భూములు సర్వే జరిగిన గ్రామాల్లో ఎల్పీ నంబర్లకు వ్యవసాయశాఖ సిబ్బంది దగ్గరున్న సర్వే నంబర్లకు సరిపోక పోవడంతో సమస్య ఎదురవుతోంది.● బయోమెట్రిక్ పడని రైతులకు ఐరీస్ చేయడానికి సిగ్నల్స్ సమస్య వేధిస్తోంది.● వెబ్ల్యాండ్ నుంచి ప్రభుత్వ భూమి లేదా అభ్యంతరకర సర్వే ఖాతా నంబర్లు డౌన్లోడ్ అయితే వ్యవసాయేతర భూమిగా పరిగణించి నమోదు చేయాల్సి ఉంది. వెబ్ల్యాండ్, అటవీ భూముల్లో పంటలు ఉన్నా, లేకపోయినా ఫీల్డ్ సర్వే చేయాలి. బీడు భూములను అయిదేళ్లకు పైగా సాగు చేయనివి, 1–5 ఏళ్ల మధ్య చేయనివి, ఈ ఏడాది మాత్రమే చేయనివిగా విడదీయాలి.● ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ పంటల సాగు లక్ష్యం 5,95,535 ఎకరాలు కాగా ఇప్పటి వరకు 5,33,460 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.● ఇప్పటి వరకు 1,01,357.4 ఎకరాల్లో మాత్రమే పంటల నమోదు చేశారు.ల్యాండ్ పార్శిల్స్ మేరకు జిల్లాలో ఈ నెల 16వ తేదీకి మండలాల వారీగా ఈ క్రాప్ నమోదు శాతం ఇలా..(జిల్లాలో 7,73,150 ల్యాండ్ పార్శిల్స్ కాగా ఇప్పటి వరకు 1,44,781 ల్యాండి పార్శిల్స్లోనే పంట నమోదు)4 మండలాల్లో 1 నుంచి 9 శాతం: ఉయ్యాలవాడ, ప్యాపిలి, కోవెలకుంట్ల, కొలిమిగుండ్ల5 మండలాల్లో 20 నుంచి 29 శాతం: ఆత్మకూరు, డోన్, గోస్పాడు, జూపాడుబంగ్లా, మహానంది8 మండలాల్లో 30 నుంచి 29 శాతం: మిడ్తూరు, బండిఆత్మకూరు, బేతంచెర్ల, నందికొట్కూరు, పగిడ్యాల, పాములపాడు, పాణ్యం, వెలుగోడు11 మండలాల్లో 10 నుంచి 19 శాతం : ఆళ్లగడ్డ, బనగానపల్లె, దొర్నిపాడు, గడివేముల, కొత్తపల్లె, నంద్యాల, అవుకు, చాగలమర్రి, రుద్రవరం, సంజామల, శిరివెళ్ల -
టీడీపీ ర్యాలీకి పోలీసు హా‘రన్’!
డోన్: సామాన్య ప్రజలకు రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న పోలీసులు కూటమి నేతల సేవలో మాత్రం నిత్యం తరిస్తున్నారు. ఆయన ప్రజాప్రతినిధి కాదు.. ఉన్నతాధికారి అంత కన్నా కాదు.. ఆయనకు బందోబస్తు అంటూ పోలీసులు చేసిన నిర్వాకం చూస్తే ముక్కున వేలు వేసుకోవాల్సిందే. డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన తనయుడు కోట్ల రాఘవేంద్రారెడ్డి డోన్, ప్యాపిలి పట్టణాల్లో పర్యటించగా, పోలీసులు చేసిన హడావుడి, హంగామా అంతా ఇంతా కాదు. యువరాజు వెడలే.. అన్న చందంగా ప్రొటోకాల్ నిబంధనలను పక్కన పెట్టేసి రాఘవేంద్రారెడ్డి కాన్వాయ్ ముందు హారన్ మోగిస్తూ పోలీసులు వెళ్లడం చూసిన ప్రజలు.. ఇది ముమ్మాటికీ అధికార దుర్వినియోగమేనని చర్చించుకుంటున్నారు. ఈ విషయమై పోలీసు అధికారులను సంప్రదించగా.. కోట్ల రాఘవేంద్రారెడ్డి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుచూపుతో బందోబస్తు ఏర్పాటు చేశామని చెబుతుండటం గమనార్హం. -
ఏరియా ఆసుపత్రులు, సీహెచ్సీల్లోనూ ఖరీదైన ఇంజెక్షన్లు
ఇటీవల కాలంలో చిన్న వయస్సు నుంచే దురలవాట్లు ఎక్కువయ్యాయి. దీనికితోడు మితిమీరిన ఆహారపు అలవాట్లు, సమయానికి తినకపోవడం, మద్యపానం, దూమపానంతో స్థూలకాయ బాధితులు ఎక్కువయ్యారు. దీనివల్లే గుండైపె ఒత్తిడి అధికమవుతోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ గుండెపోటుతో మరణించేవారి సంఖ్య ఎక్కువైంది. ఇలాంటి వారు పెరగడంతో 2023లో స్టెమీ ప్రోగ్రామ్ ప్రారంభించి ఖరీదైన టెనిక్టమిప్లేజ్ అనే ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా వీటిని రోగులకు ఉచితంగా అందిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం ఈ ఇంజెక్షన్ ఎంతో ఉపయోగపడుతోంది. వారి ప్రాణాలు పోకుండా కాపాడుతోంది. –డాక్టర్ జఫ్రుల్లా, డీసీహెచ్ఎస్, కర్నూలు ఆసుపత్రిలోని క్యాజువాలిటీ విభాగానికి ప్రతిరోజూ ఐదారుగురు గుండెపోటుతో చికిత్స కోసం వస్తుంటారు. వీరికి 2023లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రవేశపెట్టిన స్టెమీ ప్రోగ్రామ్ కింద దాదాపు రూ.40వేల ఖరీదైన టెనెక్టిప్లేజ్ ఇంజెక్షన్లు ఉచితంగా ఇస్తున్నాం. రెండు గంటల అబ్జర్వేషన్ తర్వాత కార్డియాలజీ విభాగానికి పంపిస్తున్నాం. గుండెపోటు వచ్చిన వెంటనే రెండు గంటలలోపు ఆసుపత్రికి రోగిని తీసుకువస్తేనే ఈ ఇంజెక్షన్ బాగా పనిచేస్తుంది. ఇటీవల కాలంలో ఎక్కువ శాతం 30 నుంచి 40 ఏళ్లలోపు వారే గుండెపోటుతో వస్తున్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వస్తే ప్రాణాలు నిలిచే అవకాశం ఉంది. – డాక్టర్ పి. సుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎమర్జెన్సీ మెడిసిన్, జీజీహెచ్, కర్నూలు -
హిట్ అండ్ రన్ కేసులను త్వరితగతిన పరిష్కరించండి
కర్నూలు: ఉమ్మడి జిల్లాలో హిట్ అండ్ రన్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సూచించారు. స్థానిక న్యాయ సేవాసదన్లో హిట్ అండ్ రన్ కేసులపై బుధవారం జిల్లాస్థాయి అధికారులతో మానిటరింగ్ సమావేశం నిర్వహించారు. కర్నూలు జిల్లాలో 76 హిట్ అండ్ రన్ కేసులకు గాను 21 కేసుల్లో నష్టపరిహారం (అవార్డు) మంజూరైందని అధికారులు తెలిపారు. అలాగే నంద్యాల జిల్లాలో 37 హిట్ అండ్ రన్ కేసులకు గాను 11 కేసుల్లో నష్టపరిహారం మంజూరైందన్నారు. మిగతా వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని లీలా వెంకటశేషాద్రి అధికారులను ఆదేశించారు. కర్నూలు, నంద్యాల డీఆర్వోలు వెంకటనారాయణమ్మ, రాము నాయక్, ఆర్టీఓలు భరత్ చవాన్, శివారెడ్డి, డీటీఆర్బీ సీఐలు ఆదిలక్ష్మి, మల్లికార్జున, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ సంధ్యారెడ్డి, డీసీఆర్బీ ఎస్ఐ శ్రీనివాసరావు, డిప్యూటీ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ శివరాం తదితరులు పాల్గొన్నారు. -
రుణాలు తక్షణమే మంజూరు చేయాలి
● బ్యాంకర్లను ఆదేశించిన జేసీ విష్ణు చరణ్నంద్యాల: జిల్లాలోని రైతులకు, పొదుపు మహిళలకు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు స్థాపించే యువకులకు తక్షణమే రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ఆదేశించారు. కలెక్టరేట్ లోని వీసీ హాలులో డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ (డీసీసీ), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ (డీఎల్ఆర్సీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ఈ ఏడాది మొత్తం రూ. 15,120 కోట్ల వార్షిక రుణ లక్ష్యమని, జూన్ 30 నాటికి రూ. 5,360 కోట్లు మాత్రమే సాధించారన్నారు. మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. రైతులకు రెండు లక్షల రూపాయల వరకు పూచీకత్తు లేకుండా పంట రుణాలు ఇవ్వాలన్నారు. స్టాండప్ ఇండియా రుణాల మంజూరులో ప్రగతి అధ్వాన రీతిలో ఉందన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు మినహా 57 వేల మందికి రుణాలు మంజూరు చేయాల్సి ఉందన్నారు. నాబార్డ్ డీడీఎం కార్తిక్ , యూనియన్ బ్యాంక్ రీజినల్ మేనేజర్ నరసింహారావు, ఆర్బీఐ ఆర్ఎం రామకృష్ణ, కెనరా బ్యాంక్ ఆర్ఎం సుశాంత్ కుమార్, ఏపీజీబీ ఆర్ఎం వెంకటరమణ, ఎల్డీయం రవీంద్రకుమార్, డీఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, సంక్షేమ కార్పొరేషన్ల అధికారులు పాల్గొన్నారు. -
ఘనంగా విశ్వకర్మ జయంతి
నంద్యాల: కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో, జిల్లా ఎస్పీ కార్యాలయంలో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లో విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగ్గయ్య మాట్లాడుతూ.. విశ్వకర్మ వల్లే చేతివృత్తులు అభివృద్ధి చెందాయన్నారు. కలెక్టరేట్ ఏవో సుభాకర్, అసిస్టెంట్ బీ వెల్ఫేర్ ఆఫీసర్ ఓబులేసు, బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది, విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ● జిల్లా ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు ఆధ్వర్యంలో విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కష్టపడే తత్వం, పట్టుదల, నైపుణ్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే సందేశాన్ని విశ్వకర్మ ద్వారా మనం నేర్చుకోవచ్చని అడిషనల్ ఎస్పీ తెలిపారు. -
'లయ' తప్పని వైద్యం
దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుండెశస్త్ర చికిత్సలను ఆరోగ్యశ్రీలోకి చేర్చి ఎంతో మందికి ప్రాణం పోశారు. ఆయన తనయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుండెపోటుకు గురైన వారికి వెంటనే ఖరీదైన ఇంజెక్షన్లు ఇచ్చే వైద్యాన్ని తీసుకొచ్చారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయంలో ప్రారంభించిన స్టెమీ ప్రోగ్రామ్ ఇప్పటికీ కొనసాగుతూ అనేక మంది ప్రాణాలు నిలుపుతోంది. జిల్లాలోని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పాటు ఏరియా ఆసుపత్రులు, సీహెచ్ సీల్లోనూ ఈ ఖరీదైన ఇంజెక్షన్లు ఇస్తున్నారు.కర్నూలు(హాస్పిటల్): ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా గుండెపోటుతో ఆకస్మిక మరణాలు అధికమయ్యాయి. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే ఈ గుండెపోటు మరణాలు ఇప్పుడు యువకుల్లోనూ అధికమయ్యాయి. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి బాధితుల కోసం 2023 సెప్టెంబర్లో నేనున్నాంటూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సరికొత్త ప్రోగ్రామ్ను తెచ్చారు. కేవలం నగర కేంద్రాల్లోని ఆసుపత్రుల్లోనే గాకుండా ఏరియా ఆసుపత్రులు, సీహెచ్సీల్లో కూడా త్రాంబోలైసిస్ విధానంలో రూ.40వేల విలువ చేసే ఖరీదైన టెనిక్టమి ప్లేజ్ అనే ఇంజెక్షన్లు అందుబాటులో ఉండేటట్లు చేశారు. సీహెచ్సీలకు వచ్చిన రోగికి ముందుగా ఈసీజీ తీసి కర్నూలులోని టెలిమెడిసిన్ హబ్కు పంపిస్తారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఈ ఇంజెక్షన్ ఇస్తున్నారు. గుండెపోటు వచ్చిన వారిని మొదటి గంటలోపు సమయానికి తీసుకొస్తే వెంటనే ఈ ఖరీదైన ఇంజెక్షన్ ఇచ్చి బతికిస్తున్నారు. రోగులకు భారం గాకుండా ఆరోగ్యశ్రీ పథకంలోనే దీనిని చేర్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో వందలాది మంది ప్రాణాలు పోసింది ఈ ఇంజెక్షన్.కూటమి ప్రభుత్వం గొప్పలుస్టెమీ ప్రోగ్రామ్ను తామే ప్రవేశపెట్టామని, దానిని ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో చేర్చి రోగులకు ఉచితంగా ఇస్తున్నామని కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. ఈ ప్రోగ్రామ్పై ఆ పార్టీ నాయకులతో పాటు పచ్చమీడియా సైతం ప్రచారం చేసుకుంటూ వస్తోంది. వాస్తవంగా ఈ ప్రోగ్రామ్ 2023లో అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పట్లోనే దీనిని ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి గుండెరోగుల ప్రాణాలు పోకుండా కాపాడుతోంది.మూడేళ్లలో టెనిక్టమి ప్లేజ్ ఇంజెక్షన్ వివరాలుఆసుపత్రి, 2023, 2024, 2025ఎమ్మిగనూరు ఏరియా ఆసుపత్రి, 1, 9, 5ఆలూరు సీహెచ్సీ, 1, 10, 8పత్తికొండ సీహెచ్సీ, 3, 20, 26ఓర్వకల్ సీహెచ్సీ, 1, 7, 6కోడుమూరు సీహెచ్సీ, 3, 14, 11వెల్దుర్తి సీహెచ్సీ, 1, 4, 6కర్నూలు జీజీహెచ్, 25, 59, 55నంద్యాల జిల్లాలో ఈ యేడాది ఇప్పటి వరకు 123 టెనిక్టమి ప్లేజ్ ఇంజెక్షన్లు ఇచ్చారు. -
పొలం నిండా కన్నీళ్లే!
గిట్టుబాటు ధర లేక.. పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే ఆశ లేక రైతులు ఉల్లి పంటపై ఆశలు వదులుకున్నారు. పంటను పీకి పొలంలోనే వదిలేస్తున్నారు. మండల పరిధిలోని గువ్వలదొడ్డి గ్రామానికి చెందిన కౌలు రైతు పెద్ద రంగన్న 15 రోజుల క్రితం ఉల్లి పంట పీకి పొలంలోనే వదిలేశాడు. ఐదు ఎకరాల్లో ఉల్లి సాగుచేస్తే రెండు ఎకరాల ఉల్లిని అరకొరగా విక్రయించడు. మిగిలిన మూడు ఎకరాల ఉల్లి పంటను గిట్టుబాటు ధర లేక పొలంలోనే వదిలేశాడు. పంట సాగుతో దాదాపు రూ.4 లక్షల వరకు నష్టం వచ్చినట్లు రైతు వాపోతున్నాడు. – ఎమ్మిగనూరు రూరల్ -
గిరిజన ఆటోడ్రైవర్లకు ఎల్ఎల్ఆర్
ఆత్మకూరు: ఆధార్, రేషన్కార్డు ఆధారంగా గిరిజనులకు ఎల్ఎల్ఆర్ మంజూరు చేస్తున్నట్లు ఆర్టీఓ సత్యనారాయణరెడ్డి తెలిపారు. కొట్టాల చెరువు, పెచ్చెరువులోని 60 మంది గిరిజన ఆటో డ్రైవర్లకు ఈ కార్డులను బుధవారం ఆత్మకూరు పట్టణంలో అందించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ చెంచుగూడాల నుంచి ఆటోల్లో ఆత్మకూరుకు వచ్చేటప్పుడు లైసెన్సులు లేక గిరిజన డ్రైవర్లు ఇబ్బందులు పడేవారన్నారు. వారికి ఎల్ఎల్ఆర్ కార్డులు ఇవ్వడంతో సమస్య పరిష్కారమయ్యిందన్నారు.డోన్లో జీబీఎస్ కేసుడోన్ టౌన్: పట్టణంలోని ఒక మహిళకు గులియన్ బారే సిండ్రోమ్(జీబీఎస్) అనే వ్యాధి సోకినట్లు కుటుంబ సభ్యులు బుధవారం విలేకరులకు తెలిపారు. కుట్టు మిషన్పై ఆధారపడి జీవించే ఈ మహిళక తీవ్ర నరాల నొప్పి రావడంతో ఈ నెల 2న కర్నూలు పెద్దాసుపత్రికి వెళ్లారన్నారు. అక్కడ పరీక్షించిన వైద్యులు వ్యాధి నిర్ధారించినట్లు తెలిపారు.పంట మార్పిడి ఎంతో మేలునంద్యాల(అర్బన్): పంట మార్పిడి రైతుకు ఎంతో మేలు చేస్తుందని ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు వెంకటరమణ, ప్రజనన, చైతన్య తెలిపారు. నంద్యాల మండలం పులిమద్ది గ్రామంలో మొక్కజొన్న, వరి పొలాలను రైతులతో కలిసి బుధవారం వారు పరిశీలించారు. ఖరీఫ్లో మినుము వేసిన పొలంలో రబీలో మొక్కజొన్న వేయాలన్నారు. ప్రస్తుతం మొక్కజొన్నను కత్తెర పురుగుతో పాటు గొంగళి పురుగులు ఆశించాయని, ఎకరాకు క్లూరాంట్రినిప్రోల్ 60మి.లీ, ఇమో మేక్టీన్ బెంజోయెట్ 80గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు.టైగర్ ప్రాజెక్ట్ ఫీల్డ్ డైరెక్టర్గా విజయ్కుమార్బొమ్మలసత్రం: నంద్యాల జిల్లా అటవీ సంరక్షణాధికారి, టైగర్ ప్రాజక్ట్ ఫీల్డ్ డైరెక్టర్గా బి. విజయ్కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా ప్రతి ఒక్క ఉద్యోగి నిర్లక్ష్యం వహించకుండా విధులు నిర్వహించాలన్నారు. ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించే ప్రసక్తిలేదని హెచ్చరించారు. ప్రకృతి సంపదలైన అడవులను సంరక్షించే భాధ్యత అటవీశాఖ ఉద్యోగులపై ఉందన్నారు. గతంలో తాను రాజమండ్రిలో పని చేసినట్లు చెప్పారు.నాల్గో విడత ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంకర్నూలు సిటీ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కాలేజీల్లో నాల్గో విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ బాలికల కాలేజీ ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ ఎల్.నాగరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 27లోపు www.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 28వ తేదీన వెరిఫికేషన్ చేసి, ప్రభుత్వ కాలేజీల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 29వ తేదిన.. ప్రైవేటు కాలేజీల్లో దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధిత కాలేజీల్లో 30వ తేదిన కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఉల్లి పంట పరిశీలనకు గ్రామ, మండల స్థాయి టీంలుకర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో సాగైన ఉల్లి పంట స్థితిగతులను పరిశీలించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసింది. గ్రామస్థాయిలో వీఆర్వో, రైతుసేవా కేంద్రాల ఇన్చార్జీలతో కమిటీలు ఏర్పాటయ్యాయి. మండల స్థాయిలో తహసీల్దారు, మండల వ్యవసాయ అధికారి, హార్టికల్చర్ ఆఫీసర్లతో టీంలు ఏర్పాటయ్యాయి. జిల్లాలో ఉద్యాన పంటల పరిస్థితి ఎలా ఉంది.. అధిక వర్షాలకు దెబ్బతినిందా.. వారానికి ఎన్ని టన్నులు మార్కెట్కు వస్తుంది తదితర వివరాలపై టీంలు సర్వే చేస్తాయి. గ్రామస్థాయి టీంలు చేసే సర్వేను మండల స్థాయి టీమ్లు పర్యవేక్షిస్తాయి. ఈ నెల 20వ తేదీలోపు సర్వే పూర్తి చేసి జిల్లా కలెక్టర్కు రిపోర్టు ఇవ్వాలని జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి గ్రామ, మండల స్థాయి టీంలను ఆదేశించారు.