breaking news
Nandyala
-
అవసరమైన ప్రాంతాలకు యూరియా
నంద్యాల: జిల్లాలో అవసరమైన ప్రాంతాల్లో యూరియా నిల్వలను వినియోగించాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనవసరంగా యూరియా వాడడం వల్ల కలిగే దుష్ప్రభావాలపై కూడా ప్రచారం చేయాలన్నారు. కలెక్టరేట్ నుంచి అధికారులతో గురువారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్లో భాగంగా నమోదైన బంగారు కుటుంబాలకు త్వరితగతిన మార్గదర్శులను గుర్తించి మ్యాపింగ్ చేయాలన్నారు. పెండింగ్ ఉన్న నీడ్ అసెస్మెంట్ సర్వేను వేగవంతం చేయాలన్నారు. డీఆర్ఓ రామునాయక్, సీపీఓ వేణుగోపాల్, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీధర్రెడ్డి, డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, డీఎంహెచ్ఓ వెంకటరమణ, డీసీహెచ్ఎస్ లలిత, అదనపు మున్సిపల్ కమిషనర్ దాసు, జీజీహెచ్ సూపరింటెండెంట్ మల్లీశ్వరి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి -
వేద భూమి.. నేటి నుంచి ఉత్సవ దీప్తి
మంత్రాలయం: వేద భూమి అయిన మంత్రాలయంలో శ్రీగురు రాఘవేంద్రస్వామి ఆరాధన ఉత్సవాలకు శుక్రవారం శ్రీకారం చుట్టనున్నారు. శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆశీస్సులతో ఉత్సవ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మంత్రాలయం పుర వీధులు విద్యుద్దీపాలతో వెలుగుగొందుతున్నాయి. శ్రీమఠం కారిడార్, ప్రాకారాలు, వసతి నిలయాలు దీపకాంతుల తేజస్సుతో విరాజిల్లుతున్నాయి. మఠం ప్రాకారాలు విరుల పరిమళాలు వెదజల్లుతున్నాయి. శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణతో ఆరాధనకు అంకురార్పణ పలకనున్నారు. లక్ష్మీపూజ, ధాన్యపూజ, గజ, అశ్వ, గోపూజలు అశేష భక్తజనవాహిని మధ్య జరగనున్నాయి. శుక్రవారం రాత్రి ఊంజల మంటపంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలకు ఊంజల సేవ, ఛామర్ల సేవలు ఉంటాయి. -
శ్రీశైలంలో 184 టీఎంసీల నీరు
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయ నీటిమట్టం బుధవారం సాయంత్రం సమయానికి 879.30 అడుగులకు చేరుకుంది. జలాశయంలో 184.2774 టిఎంసీల నీరు నిల్వ ఉంది. బుధవారం నుంచి గురువారం వరకు శ్రీశైలానికి ఎగువ జూరాల, సుంకేసుల ప్రాజెక్ట్ల నుంచి 31,222 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్లకు 1,10,749 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. విద్యుత్ ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్కు 70,124 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వార 35వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 3,225 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కుల నీటిని వదిలారు. శ్రీశైలం డ్యాం పరిసర ప్రాంతాలలో 10.40 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కుడిగట్టు కేంద్రంలో 15.253 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.844 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. అలగనూరు గేట్లు బంద్ పాములపాడు: అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గేట్లు బంద్ చేశామని ఏఈ శ్రీనివాసనాయక్ గురువారం విలేకరులకు తెలిపారు. లాకీన్స్లా నుంచి నిప్పుల వాగుకు 200, తూడిచెర్ల సబ్చానల్కు 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. సుంకేసుల నుంచి కేసీ కెనాల్కు 2,200క్యూసెక్కుల నీరు వస్తోందని చెప్పారు. పసుపు కొమ్ములతో మాలలు మహానంది: శ్రీ కామేశ్వరి దేవి అమ్మవారికి రేపు (శ్రావణ మాసం మూడో శుక్రవారం) సుమారు 250 కిలోల పసుపు కొమ్ములతో మాలలు అలంకరించనున్నారు. అందులో భాగంగా పసుపు కొమ్ములతో మాలలను సిద్ధం చేస్తున్నారు. ఇలా అలంకరించిన అమ్మవారిని దర్శించడం ద్వారా భక్తులకు శుభాలు జరుగుతాయని ఆలయ వేద పండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర్ అవధాని తెలిపారు. ఏఎన్ఎం శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు(హాస్పిటల్): ప్రాంతీయ శిక్షణా కేంద్రం(ఫిమేల్)లో ఎంపీహెచ్ఏ(ఏఎన్ఎం) కోర్సులో ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ప్రిన్సిపల్ డాక్టర్ వై. జయమ్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు మీడియంలో నిర్వహించే ఈ కోర్సు వ్యవఽ ది రెండు సంవత్సరాలు కాగా.. ఇంటర్, వొకేషనల్, వన్స్టింగ్ ఉత్తీర్ణులైన మహిళలు అర్హులన్నా రు. మొత్తం 40 సీట్లు ఉన్నాయని, 17 సంవత్సరాలు దాటిన వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్ల సడలింపు ఉంటుందన్నారు. దరఖాస్తున్ను రీజనల్ సెంటర్ లేదా cfw.in వెబ్సైట్ నుంచి తీసుకుని సెప్టెంబర్ 30వ తేదిలోగా సమర్పించాలన్నారు. అక్టోబ ర్ 15న ఎంపిక జాబితా ప్రచురిస్తామని, అదే నెల 21 నుంచి శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయన్నారు. శిక్షణలో ఉన్నప్పుడు నెలవారీ స్టైఫండ్ రూ.2వేలు మొదటి సంవత్సరం, రూ.2,500 రెండవ సంవత్సరం ఇస్తారని పేర్కొన్నారు. జిల్లా టూరిజం శాఖ అఽధికారిగా లక్ష్మీనారాయణ కర్నూలు కల్చరల్: జిల్లా పర్యాటక శాఖ అధికారిగా ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీటీడీసీ) కర్నూలు డివిజినల్ మేనేజర్ జి.లక్ష్మీనారాయణకు బాధ్యతలు అప్పగించారు. డీటీఓగా విధులు నిర్వహిస్తున్న విజయ ఆమె సొంత శాఖ ఐసీడీఎస్కు పీడీగా వెళ్లడంతో ఆ స్థానంలో లక్ష్మినారాయణకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ టూరిజం అఽథారిటీ(ఏపీటీఏ) డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఇవీ దారుణాలు..
● నాటు తుపాకులతో వన్యప్రాణులను వేటాడటమే కాకుండా శుత్రవులపై పగ తీర్చుకునేందుకు సైతం ఉపయోగించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ● కొంత కాలం క్రితం అహోబిలంలో భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లో నాటు తుపాకీ గాయాలతో మృతి చెందారు. ● గత కొంత కాలం క్రితం వివాహేతర సంబంధం అనుమానంతో వేటకోసం అని రామాంజనేయులు అనే వ్యక్తి నరసింహులను అడవిలోకి తీసుకుపోయి నాటుతుపాకీతో కాల్చగా గురి తప్పి పెద్దన్న అనే వ్యక్తికి తగలడంతో తీవ్రంగ గాయపడ్డ సంఘటన సంచలనం లేపింది. ● గత మూడు రోజుల క్రితం ఐదుగురు వేటగాళ్లు రెండు దుప్పులను వేటాడి వాటి చర్మాలు తీసి దాచి పెట్టి తలలు కాల్చి వండుకుని తిని, మాసం ఓ టీడీపీ నేత దుకాణంలో కవర్లలో ప్యాక్ చేస్తు తుపాకులతో సహా దొరికిపోయారు. స్థానికంగానే తయారీ.. అవసరమైన ట్రిగ్గర్, బ్యారెల్, గార్డ్, వాలా కమ్మీలు వేలూరు నుంచి తెచ్చుకుని స్థానికంగానే నాటు తుపాకులు తయారు చేసుకుంటున్నట్లు సమాచారం. పేర్నంబట్ , గుడియత్తంలో నల్లమందు, గుండ్లు తీసుకొస్తున్నట్లు సమాచారం. వేటగాళ్ల నాటుతుపాకుల కారణంగా ఇప్పటికే కొందరు ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరు ప్రాణాపాయం నుంచి తప్పిచుకున్నా పోలీస్, అటవీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదన్న విమర్శలు ఉన్నాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో రూ. 10వేలు ఇస్తే నాటు తుపాకీ దొరుకుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
కొండెక్కిన కొబ్బరి.. చేదెక్కిన బెల్లం!
నంద్యాల(న్యూటౌన్): నిత్యావసర సరుకుల ధరలు కొండెక్కాయి. ఎర్రగడ్డలు, ఎండుమిరప పప్పు, ఉప్పు, బెల్లం, అల్లం.. అన్ని నిత్యావసర సరకులు ప్రియం అయ్యాయి. కూరగాయల ధరలు అమాంతంగా పెరిగి సామాన్యుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. మార్కెట్కు రూ.100 నోటు తీసుకుని వెళితే కనీసం రెండు రోజులకు సరిపడా కూరగాయలు కొనలేని దుస్థితి నెలకొంది. వర్షాలు సక్రమంగా కురవకపోవడంతో కూరగాయల సాగు ప్రారంభం కాలేదు. దీంతో మిర్చి, క్యారెట్, బీట్ రూట్, బీన్స్, క్యాబేజీ, క్యాప్సికమ్ ధరలు చుక్కలను చూపుతున్నాయి. రైతు బజార్లు ఏవీ? నంద్యాల పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. పట్టణంలో, మండల కేంద్రంలో మరి కొన్ని రైతు బజార్లు ఏర్పాటు చేసినట్లయితే రైతులు నేరుగా తీసుకువచ్చి ప్రజలకు కూరగాయలు అమ్ముకునేందుకు వీలుంటుంది. ప్రస్తుతం మార్కెట్లో వ్యాపారులు చెప్పిందే ఇష్టారాజ్యంగా మారింది. కూరగాయల ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని హోల్సేల్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఉద్దానంలో పండే బీర, కాకర, సొర, బెండ కాయలు ఆగస్టు నెలాఖరు నాటికి మార్కెట్కు వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ధరలపై నియంత్రణ ఉండేలా రెవెన్యూ, మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, లేదంటే తాత్కాలికంగానైనా రైతు బజార్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. నిత్యావసర ధరలు ఇవీ.. (కిలోకు రూపాయల్లో..) గతేడాది ప్రస్తుతం కొబ్బర 180 350 ఎండు మిర్చి 120 160 చింతపండు 100 140 బెల్లం 50 65 పామాయిల్ 90 120 సన్ఫ్లవర్ 112 145 కూరగాయల ధరలు ఇవీ... (కిలోకు రూపాయల్లో..) ప్రస్తుతం గత మూడు రోజుల క్రితం బీన్స్ 120 100 చిక్కుడు 80 60 క్యాప్సికం 100 80 క్యారెట్ 70 50 కాకర 60 40 బీర 60 40 బీట్రూట్ 60 50 వంకాయాలు 60 40 దొండ 60 40 మిర్చి 100 40 బెండ 50 40 క్యాలీఫ్లవర్ 100 80 టమాటా 60 40 ధరలు మండిపోతున్నాయి ప్రస్తుతం మార్కెట్లో కూరగాయల ధరలు మండి పోతున్నాయి. సామాన్యులుగా మంచి కూరగాయల కొనలేకపోతున్నాం. ధరలను ప్రభుత్వం నియంత్రించకుంటే ఎలా? తోట కూర కట్ట రూ.20 అమ్ముతున్నారు. రెండు అరటి కాయలు రూ.20 పలుకుతున్నాయి. ధరలు ఆకాశాన్ని అంటడం బాధకరం. అధికారులు ధరలు నియంత్రించాలి. – లక్ష్మీదేవి, నంద్యాల రైతు బజార్లు ఏర్పాటు చేయాలి నంద్యాల పట్టణంలో రైతు బజార్లు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. పండించే కూరగాయలను రైతు బజార్లలో విక్రయాలు జరిగేలా చూడాలి. ప్రస్తుతం నంద్యాల మార్కెట్లో కూరగాయలు కొనలేకపోతున్నాం. కిలో బెండకాయులు రూ.50, ఆగాకర కాయలు రూ.280 చెబుతున్నారు. కొనేందుకు ధైర్యం చేయలేకపోతున్నాం. – వెంకటేశ్వరమ్మ, నంద్యాల భగ్గుమంటున్న నూనె ధరలు సామాన్యుడికి కూర‘గాయాలు’ -
పీహెచ్సీల్లో మెరుగైన వైద్యసేవలు అందించాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారిగోస్పాడు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందజేయాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. గోస్పాడులోని పీహెచ్సీని బుధవారం ఆమె తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు శ్రేయస్కరం అని, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆరోగ్య కేంద్ర ఆవరణలో పరిశుభ్రతను పాటించాలన్నారు. అనంతరం వైద్య చికిత్స కోసం వచ్చిన వారితో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. రోగులకు సరిపడా మందులు అందుబాటులో ఉన్నాయా, లేదా, గడువు తేదీ ముగిసిన ఔషధాలను ఏం చేస్తున్నారు అని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రైతు సేవాకేంద్రం పరిశీలన.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ అనంతరం సమీపంలోని రైతు సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పంటలకు సరిపడా యూరియా మాత్రమే వినియోగించేలా రైతులకు అవగాహన కల్పింలన్నారు. అనంతరం గోస్పాడుతలోని శ్రీ వెంకట సాయి ప్రైవేటు ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు. అధిక ధరలకు విక్రయిస్తే చట్ట పరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.శ్రీశైలం డ్యాం నీటిమట్టం 880.70 అడుగులు శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయ నీటిమట్టం బుధవారం సాయంత్రం సమయానికి 880.70 అడుగులకు చేరుకుంది. జలాశయంలో 191.6512 టిఎంసీల నీరు నిల్వ ఉంది. మంగళవారం నుంచి బుధవారం వరకు శ్రీశైలానికి ఎగువ జూరాల, సుంకేసుల ప్రాజెక్ట్ల నుంచి 69,457 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్ట్లకు 1,10,948 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. విద్యుత్ ఉత్పాదన అనంతరం నాగార్జునసాగర్కు 69,323 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 35వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 3,225 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కుల నీటిని వదిలారు. శ్రీశైలం డ్యాం పరిసర ప్రాంతాలలో 18.20 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. చేపల పెంపకంపై మూడు నెలల శిక్షణ కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో 7వ తరగతి చదివిన నిరుద్యోగులకు చేపల పెంపకంపై మూడు నెలల శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ రంగనాథబాబు తెలిపారు. స్థానిక బంగారుపేటలోని దేశీయ మత్స్య శిక్షణా కేంద్రంలో సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు 144వ జట్టుకు శిక్షణ ఇస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ నెల 29లోగా దరఖాస్తులను బంగారుపేటలోని తమ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఈ నెల 30న ఽఉదయం 10.30 గంటలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావా లని కోరారు. -
బుగ్గన రాజేంద్రనాథరెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్కు హాజరైన మాజీ సీఎం వైఎస్జగన్
● నూతన దంపతులు అర్జున్, అనన్యకు శుభాకాంక్షలు ● భారీగా తరలివచ్చిన ప్రజలు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ● జగన్ను చూడగానే ఈలలు, కేకలతో హోరెత్తిన రిసెప్షన్ వేదికజనసంద్రం: డోన్ పట్టణంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఎక్కి వైఎస్ జగన్ను చూస్తున్న ప్రజలుఆత్మీయ అభివాదం ప్రజలకు నమస్కరిస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్దిజననేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసిన వెంటనే పెల్లుబుకిన ఆనందం.. కరచాలనం చేసేందుకు ఉరికిన ఉత్సాహం... ‘సీఎం.. సీఎం..జై జగన్’ అంటూ నింగిని అంటేలా నినాదం.. ఎటు చూసినా జనమే జనం.. ఉత్తేజం.. ఉల్లాసం.. బుధవారం డోన్ పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి పర్యటన ఆద్యంతం అభిమాన సంద్రంగా సాగింది. ప్రతి చోటా జననేతపై ప్రజలంతా పూలు చల్లుతూ అభిమానం చాటుకున్నారు. ‘అమ్మఒడి పథకంతో మమ్మల్ని అందుకున్నారు ’ అంటూ మహిళలు చేతులెత్తి నమస్కరించారు. ‘మేమంతా సిద్ధం’ అనే జెండాలతో యువత కదం తొక్కారు. ‘వ్యవసాయాన్ని పండుగ చేశారు’ అంటూ కర్షకులు కదలి వచ్చారు. అడుగడుగునా ప్రజలు అభిమానాన్ని హోరెత్తించారు. డోన్: ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి కుమారుడు బుగ్గన అర్జున్ వివాహ రిసెప్షన్ వేడుక బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరై నూతన వధూవరులు బుగ్గన అర్జున్ అమర్నాథరెడ్డి, అనన్యలకు పుష్ఫగుచ్ఛం అందజేసి ఆశీర్వదించారు. డోన్ శివారులోని దత్తాత్రేయ స్వామి ఆలయ సమీపంలో ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేశారు. నూతన దంపతులకు వేదపండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఉదయం 11.30 గంటలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి నుంచి నేరుగా డోన్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డితో పాటు వైఎస్సార్సీపీ నేతలు జగన్కు స్వాగతం పలికారు. హెలిప్యాడ్ వద్ద భారీగా జనం జగన్ కోసం వేచి ఉన్నారు. హెలికాప్టర్ రాగానే ‘జై జగన్న్’ నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. అక్కడి నుంచి వివాహవేదిక వద్దకు జగన్ చేరుకున్నారు. జగన్ను చూడగానే అభిమానుల ఈలలు, కేకలు, ‘జై జగన్, సీఎం...సీఎం’ నినాదాలతో వేదిక ప్రాంగణం హోరెత్తింది. జగన్కు బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ఆత్మీయంగా స్వాగతం పలికారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంప్పై జగన్ వస్తున్నంత సేపు జనాభిమానంతో ప్రాంగణం హోరెత్తింది. అందరికీ జగన్ ఆప్యాయంగా అభివాదం చేస్తూ, నమస్కరిస్తూ కదిలాడు. చిరునవ్వులు చిందిస్తూ, కరచాలనం చేస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు. నూతన దంపతులను ఆశీర్వదించి, నూతన దంపతుల తల్లిదండ్రులైన బుగ్గన దంపతులు, చల్లా సతీశ్రెడ్డి దంపతులు, సమీప బంధువులతో ఆప్యాయంగా మాట్లాడారు. ఫొటోలు దిగారు. ఆపై వేదికపై నుంచి అందరికీ అభివాదం చేసి నేరుగా హెలిప్యాడ్కు చేరుకుని తిరుగుపయనమయ్యారు. జగన్ రాకతో డోన్ మొత్తం జనాలతో కిక్కిరిసిపోయింది. వేదిక ఏర్పాటు చేసిన ఎన్హెచ్–44 సమీపంలో రోడ్డుకు ఇరువైపులా భారీగా జనం ఉన్నారు. జగన్ కాన్వాయ్ వెళ్తుంటే జైజగన్ అంటూ హోరెత్తించారు. కారులో నుంచి జగన్ అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేశారు. వేడుకకు ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, విరూపాక్షి, ఎమ్మెల్సీలు ఇసాక్ బాషా, మధుసూదన్, కల్పలతారెడ్డి, జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, గంగుల బిజేంద్రనాథ్రెడ్డి, సాయిప్రసాద్రెడ్డి, కాటసాని రామిరెడ్డి, కంగాటి శ్రీదేవి, మాజీ ఎంపీలు బుట్టా రేణుక, పోచా బ్రహ్మానందరెడ్డి, తలారి రంగయ్య, పార్టీ నేతలు ఆదిమూలపు సతీష్, దారా సుధీర్, కోట్ల హర్షతో పాటు నంద్యాల, కర్నూలుతో పాటు పలు జిల్లాల నుంచి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ప్రత్యేక ఆకర్షణగా బుగ్గన ఇంటి సెట్ రిసెప్షన్ కోసం వేదికపై ప్రత్యేకంగా సెట్ ఏర్పాటు చేశారు. బుగ్గన సొంతూరు బేతంచెర్లలో వారి పూర్వీకులు 1923లో ఇంటిని నిర్మించారు. ఇప్పటికీ అదే ఇంట్లో బుగ్గన నివాసం ఉంటున్నారు. వేదికపై తన ఇంటి నమూనాతో సెట్ వేయించారు. అచ్చం బుగ్గన నివాసం ఎలా ఉందో అలాగే సెట్ ఉండటంతో వేడుకకు హాజరైన వారు ప్రత్యేకంగా తిలకించారు. ఇంటి ముందే రిసెప్షన్ జరిగిన భావన కల్పించారు. -
చేయూత కరువై.. చేనేత చిక్కుముడై!
పాత పథకానికి కొత్త ‘షో’కు ఒక్క హామీ నెరవేర్చని కూటమి ప్రభుత్వం ● హామీలు మాటలకే పరిమితం ● జీఓలు విడుదల చేస్తున్నా అమలు కరువు ● ఉమ్మడి జిల్లాలో రాణించిన 4,148 చేనేత కుటుంబాలు ● కూటమి ప్రభుత్వంలో 2,842 కుటుంబాలకే పరిమితం ● గత ప్రభుత్వంలో ఆదుకున్న వైఎస్సార్ నేతన్న నేస్తం ● నేడు జాతీయ చేనేత దినోత్సవం చేనేతలకు పొదుపు నిధి ఎప్పటి నుంచో అమలులో ఉంది. చేనేత సహకార సంఘాల్లో పనిచేసే కార్మికులకు చెల్లించే వేజ్లో పొదుపు కింద 8 శాతం కట్ చేస్తే, దానికి 16 శాతం ప్రభుత్వం కలుపుతుంది. దీనినే పొదుపు నిధిగా వ్యవహరిస్తారు. అయితే కూటమి ప్రభుత్వం తామే ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించుకోవడం విమర్శలకు తావిస్తోంది.కర్నూలు(అగ్రికల్చర్) : ఒకప్పుడు వ్యవసాయ రంగం తర్వాత చేనేత పరిశ్రమ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. 2023–24 సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో 4,148 చేనేత కుటుంబాలు ఉండగా.. అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ నేతన్న నేస్తం కింద నెలకు రూ.2వేల ప్రకారం ఏడాదికి రూ.24 వేల ఆర్థిక తోడ్పాటును అందించింది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అవుతోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూత లేకపోవడంతో ఈ స్వల్ప కాలంలోనే 1,306 కుటుంబాలు చేనేత వృత్తికి స్వస్తి పలకడం గమనార్హం. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఉమ్మడి జిల్లాలో కేవలం 2,842 కుటుంబాలకు మాత్రమే వర్తిస్తోంది. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చేనేత పరిశ్రమ మనుగడ కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. చేయూత కోసం ఎదురు చూపులు కూటమి ప్రభుత్వం ఏర్పాటై 14 నెలలు గడుస్తున్నా చేనేత కార్మికుల సంక్షేమానికి తీసుకున్న చర్యలు ఒక్కటంటే ఒక్కటీ లేదు. చేనేత పరిశ్రమను అభివృద్ధి చేసుకునేందుకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని, చేనేతకార్మికుల ఆరోగ్య భద్రతకు బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించినా అమలుకు నోచుకోలేదు. చేనేతలకు భారంగా మారిన జీఎస్టీని ఎత్తి వేస్తామని, ఇది సాద్యం కాకపోతే కట్టిన జీఎస్టీని వెనక్కు ఇస్తామన్నా ఉలుకూపలుకూ లేదు. చేనేత కార్మికులు ఇళ్లు నిర్మించుకుంటే మగ్గం ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా మామూలుగా ఇచ్చే రూ.4.30 లక్షలకు అదనంగా రూ.50 వేలు చెల్లిస్తామన్న హామీ మాటలకే పరిమితమైంది. కార్మికుల ఆదాయాన్ని పెంచేలా సమగ్ర పాలసీని తెస్తామని ప్రకటించినా కార్యరూపం దాల్చని పరిస్థితి. నేడు జాతీయ చేనేత దినోత్సవం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెండవ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఈ నెల 7న నిర్వహించనున్నారు. కర్నూలు జిల్లాకు సంబందించి ఎమ్మిగనూరులోని కుర్ని ఫంక్షన్ హాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నంద్యాల జిల్లాకు సంబంధించి బనగానపల్లి మండలం నందివర్గంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వంలో అరకొర బడ్జెట్ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత శాసనసభలో రెండు సార్లు బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. అయితే రెండేళ్లలో చేనేతలకు కేటాయించిన బడ్జెట్ రూ.10 కోట్లు మాత్రమే. నామమాత్రపు బడ్జెట్తో చేనేతల సంక్షేమం ఎలా సాధ్యమనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నేతన్న సంక్షేమానికి ఏటా రూ.200 కోట్లు కేటాయించింది. ఐదేళ్లలో రూ.1000 కోట్లు వెచ్చించిన విషయాన్ని చేనేతలు గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో చేనేతలకు రూ.47.58 కోట్ల ఆర్థిక తోడ్పాటు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పింది చెప్పినట్లుగా అమలు చేసి చూపించారు. రెండేళ్లు కరోనాతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైన్పటికీ ఎక్కడా రాజీపడకపోవడం విశేషం. చేనేత మగ్గాలను అభివృద్ధి చేసుకోవడం, ఇతర మౌలిక సదుపాయాలతో సమర్థవంతంగా రాణించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతినెలా రూ.2వేలు చొప్పున ఏడాదికి రూ.24వేలు చెల్లించింది. ఒక్కో చేనేత కుటుంబానికి ఐదేళ్లలో రూ.1.20 లక్షల ఆర్థిక లబ్ధి చేకూరింది. ఐదేళ్లలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో చేనేతలకు రూ. 47.58 కోట్ల ఆర్థిక తోడ్పాటు లభించింది. చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.36 వేలు చెల్లించాలి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లు వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేసింది. నెలకు రూ.2వేల ప్రకారం ఏడాదికి రూ.24 వేలు చేయూతనిచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం చేనేతల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏడాదికి రూ.36 వేల ప్రకారం తోడ్పాటును అందించాలి. అద్దె మగ్గాలకు కూడా ఈ సాయాన్ని వర్తింపజేయాలి. 40 శాతం సబ్సిడీపై యార్న్ సరఫరా చేయాలి. – బి.మాధవస్వామి, రాష్ట్ర అధ్యక్షుడు, చేనేత కార్మిక సంఘం జీఓలు ఇవ్వడమే తప్ప కార్యాచరణ కరువు 2014–15 నుంచి 2018–19 వరకు చేనేతకారుల సంక్షేమం మాటల్లో ఊదరగొట్టడం.. జీఓలు విడుదల చేయడం మినహా ఒక్కటీ కార్యరూపం దాల్చని పరిస్థితి. చేనేతల సంక్షేమానికి విడుదల చేసిన జీఓల విలువ దాదాపు రూ.200 కోట్లు. అయితే కాగితాలకే పరిమితమైంది. 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ప్రతి ఏటా చేనేతకారులకు వేజ్లాస్ కింద నెలకు రూ.2వేల ప్రకారం మూడు నెలల పాటు పరిహారం ఇచ్చేందుకు జీఓలతో సరిపెట్టారు. ఒకప్పుడు జిల్లాలో రూ.200 కోట్ల వరకున్న చేనేత వస్త్రాల ఉత్పత్తి టీడీపీ హయాంలో రూ.40 కోట్లకు పడిపోయింది. ఒకప్పడు ఉమ్మడి జిల్లాలో 45 చేనేత సహకార సంఘాలు ఉండగా.. నేడు ఏడుకు పడిపోవడం గమనార్హం. -
బుగ్గన కుమారుడి రిసెప్షన్కు వైఎస్ జగన్.. జన సంద్రమైన డోన్
సాక్షి, డోన్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. నంద్యాల జిల్లాలో పర్యటించారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కుమారుడి వివాహ రిసెప్షన్కు వైఎస్ జగన్ హాజరయ్యారు. డోన్లోని దత్తాత్రేయ స్వామి గుడి దగ్గర జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్లో నూతన వధూవరులు అనన్య రెడ్డి, బుగ్గన అర్జున్ అమర్నాథ్లను వైఎస్ జగన్ ఆశీర్వదించారు. వివాహ రిసెప్షన్లో పాల్గొన్న నాయకులను, అభిమానులను వైఎస్ జగన్ ఆత్మీయంగా పలుకరించారు.ఇక, వైఎస్ జగన్ రాకతో డోన్ పట్టణం జనసంద్రమైంది. తమ ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా వారికి అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. -
మాతృత్వం..దూరం!
● తగ్గిన సంతానోత్పత్తి రేటు ● కర్నూలు జిల్లాలో 1.8, నంద్యాల జిల్లాలో 1.36 రేటు ● జీవనశైలి మారడంతో తగ్గుదల ● యువతుల్లో స్థూలకాయం, పీసీఓడీ ● పురుషుల్లో తగ్గుతున్న శుక్రకణాల సంఖ్య ● 20 శాతం మందికి సంతానలేమి సమస్య కర్నూలు(హాస్పిటల్): సృష్టిలో ప్రతి సీ్త్ర తను ఒక బిడ్డకై నా జన్మనిచ్చి అమ్మకావాలని భావిస్తుంది. ఈ మేరకు వివాహమైన నాటి నుంచి పరితపిస్తుంది. పుట్టిన బిడ్డ ఆమె పెంపకంలో పెరుగుతూ ఎదుగుతూ ఉంటే ఆ తల్లి పడే ఆనందానికి హద్దులు ఉండవు. కానీ ఈ వరం ఇప్పుడు అందరి తల్లులకు కలగడం లేదు. కొందరికి ఆలస్యంగా పిల్లలవుతుంటే మరికొందరికి అసలు కావడం లేదు. దంపతులిద్దరిలో లేదా ఒకరిలో లోపం ఉండటం వల్లే ఇలా జరుగుతోంది. జీవనశైలిలో వచ్చిన మార్పులే దీనికి ప్రధాన కారణమని వైద్యులు భావిస్తున్నారు. ఈ క్రమంలో సంతాన సాఫల్య కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సంతానలేమి సమస్యతో బాధపడే వారి సంఖ్య అధికమైంది. ఒకప్పుడు వందలో ఒకరిద్దరు మాత్రమే సంతానలేమితో బాధపడేవారు. ఇప్పుడు ఆ సంఖ్య పట్టణాల్లో 20 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 10 శాతం వరకు ఉంటోంది. 2023–24 సంవత్సరంలో రాష్ట్రంలో సగటు సంతానోత్పత్తి రేటు 1.21 ఉండగా ఇందులో కర్నూలు జిల్లాలో 1.80, నంద్యాల జిల్లా 1.36గా నమోదైంది. కాగా జిల్లాలోని ఆదోని, పత్తికొండ వంటి ప్రాంతాల్లో సంతానోత్పత్తి 3, 3.5 రేటు ఉండగా కర్నూలు, నంద్యాల వంటి పట్టణ ప్రాంతాల్లో మాత్రం 1.5 కంటే తక్కువగా సంతానోత్పత్తి రేటు పడిపోవడం ఆందోళనకరం. పెరిగిన సంతాన సాఫల్య కేంద్రాలు పిల్లలు కలగని దంపతులు ఒకప్పుడు సమీప గైనకాలజిస్టులను కలిసి చికిత్స తీసుకునేవారు. అప్పటికీ పిల్లలు కలగకపోతే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్, చైన్నె, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లి సంతా న సాఫల్య కేంద్రాల్లోని వైద్యులను సంప్రదించేవారు. వీరి డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని సిటీల్లో ని సంతాన సాఫల్య కేంద్రాలు పట్టణాల్లోనూ ఏర్పాటవుతున్నాయి. ఈ కారణంగా కర్నూలు, నంద్యాల, ఆదోని వంటి ప్రాంతాల్లోనూ సంతానసాఫల్య కేంద్రాలు వెలిశాయి. కర్నూలు జిల్లాలోనే వైద్య ఆరోగ్యశాఖ వద్ద రిజిస్టర్ అయిన సంతాన సాఫల్య కేంద్రాలు 16 ఉన్నాయి. ఆయా కేంద్రాలకు ప్రస్తుతం ప్రతిరోజూ 50 నుంచి 60 మంది దాకా దంపతులు చికిత్స కోసం వెళ్తున్నారు. కాగా కొన్ని కేంద్రాలు వీరి ఇబ్బందులను ఆసరాగా తీసుకుని అధిక మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్నారు. వెళ్లిన ప్రతిసారి రూ.4వేల నుంచి రూ.5వేలు ఖర్చు అయ్యేలా చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని కేంద్రాలు సంతానం కలగకపోవడానికి గల కారణాన్ని బట్టి గంపగుత్తగా రూ.1లక్ష ను ంచి రూ.3లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. సంతానలేమికి కారణాలు ఇటీవల కాలంలో చాలా మంది యువతీయువకులు జీవితంలో స్థిరపడ్డాక వివాహం చేసుకుంటున్నారు. దీనికితోడు చదువుకున్న అమ్మాయిలు అధి కం కావడం, వారికి సరిపడా అబ్బాయిలు లభించకపోవడం, అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడం వంటి కారణాల వల్ల ఆలస్యంగా వివాహం చేసుకోవడం, మారిన జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, స్థూలకాయం, సీ్త్రలలో పీసీఓఎస్ (అండాశయంలో తిత్తులు), ఎండోమెట్రియాసిస్ సమస్యలు, రాత్రివేళల్లో ఆలస్యంగా నిద్రపోవడం,జంక్ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, మొబైల్ఫోన్ స్క్రీన్ ఎక్కువగా చూడటం వల్ల, అన్యో న్య దాంపత్యం లేకపోవడం వల్ల సంతానలేమికి కారణాలు. అయితే గ్రామాల్లో ఇప్పటికీ త్వరగా వివాహాలు కావడం, చిన్న వయస్సులోనే పిల్లలు అవుతున్నారు. ఈ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి రేటు ఎక్కువ కనిపిస్తోంది. పట్టణాల్లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటోందని వైద్యులు చెబుతున్నారు.ఇలా చేయాలి సమతుల ఆహారం తీసుకోవాలి. రోజూ తగినంత వ్యాయామం చేయాలి. బయటి ఆహారానికి ముఖ్యంగా జంక్ఫుడ్, ఫాస్ట్ఫుడ్కు దూరంగా ఉండాలి. స్థూలకాయం తగ్గించుకోవాలి. ఇందుకోసం జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. దూమపానం, మద్యపానం మానేయాలి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. ఇందుకోసం యోగా, ధ్యానం చేయాలి. వివాహమై ఏడాది దాటినా గర్భం దాల్చకపోతే వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి. తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా వైద్య ఆరోగ్యశాఖలో రిజిస్టర్ చేసుకోవాలి. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు మాత్రమే వాటిని నిర్వహించాలి. రిజిస్ట్రేషన్ చేయకుండా ఏఆర్టీ కేంద్రాలు నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము. జిల్లాలో గతంలో కంటే ఇప్పుడు సంతాన సాఫల్య కేంద్రాలు పెరిగాయి. సంతానోత్పత్తి రేటు తగ్గడమూ దీనికి ఒక కారణం కావచ్చు. –డాక్టర్ పి.శాంతికళ, డీఎంహెచ్ఓ, కర్నూలు జీవనశైలిలో మార్పులే కారణం జీవనశైలిలో వచ్చిన మార్పులే సంతానోత్పత్తి రేటు తగ్గడానికి కారణం. ఇది పురుషుల్లో 30 శాతం, మహిళల్లో 30 శాతం ఉంది. పురుషుల్లో వీరకణాల సంఖ్య తక్కువగా ఉండటం, మహిళల్లో ఇన్ఫెక్షన్లు, పీసీఓఎస్, స్థూలకాయం, మానసిక ఒత్తిడి కారణాలు. పట్టణాల్లో ఆలస్యంగా వివాహం చేసుకోవడం, ఆలస్యంగా పిల్లలను కనాలనే ప్రణాళిక వేసుకోవడం కూడా సంతానోత్పత్తి రేటు తగ్గడానికి మరో కారణం. –డాక్టర్ ఎస్.సావిత్రి, హెచ్ఓడీ, గైనకాలజి విభాగం, జీజీహెచ్, కర్నూలు -
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.1,675 కోట్ల పరిహారం
కర్నూలు(అగ్రికల్చర్): గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం(2019–20 నుంచి 2023–24)లో ఎలాంటి షరతులు లేకుండా నోటిఫై చేసిన పంటలు ఈ–క్రాప్లో నమోదైతే చాలు బీమా వర్తించింది. ఈ ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదే. నేడు రైతుల ఆశలను ఇటు కూటమి ప్రభుత్వం.. అటు బ్యాంకులు దెబ్బతీస్తున్నాయి. ఉచిత పంట బీమాకు కూటమి ప్రభుత్వం తిలోదకాలు ఇవ్వడంతోనే రైతులకు కష్టాలు చుట్టుముట్టాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమాకు స్వస్తి పలికి ప్రీమియం చెల్లించి బీమా పొందే విధానాన్ని అమలులోకి తీసుకరావడంతోనే 90 శాతం పైగా రైతులు పంటల బీమాకు దూరమయ్యారు. కొంతమంది రైతులు బీమా కోసం ప్రీమియం చెల్లించేందుకు ముందుకొచ్చినా సర్వర్ పనిచేయకపోవడంతో నిరాశతో వెనుతిరిగే పరిస్థితి ఏర్పడింది. బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందిన కొందరు రైతులు ప్రీమియం చెల్లించినప్పటికీ బీమాను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. రైతుల అమాయకత్వం, లోనింగ్ను పెంచుకోవాలనే తపనతో బ్యాంకులు రైతులను బీమాకు దూరం చేస్తున్నాయి. స్కేల్ ఆఫ్ ౖఫైనాన్స్ ఎక్కువ ఉన్న పంటలకే రుణాలు బ్యాంకులు లోనింగ్ పెంచుకునేందుకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్(రుణ పరిమితి) ఎక్కువ ఉన్న పంటలకే రుణాలు ఇస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా వర్షాధారం కింద సాధారణంగా కంది, సజ్జ, జొన్న, కొర్ర, ఆముదం వంటి పంటలు సాగు చేస్తున్నారు. ఈ పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ తక్కువ. రైతులు ఏ పంట వేశారు.. ఏ పంట వేస్తున్నారో పక్కాగా తెలుసుకొని ఆ పంటకు మాత్రమే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకా రం పంట రుణం ఇవ్వాలి. కానీ ఏ బ్యాంకు కూడా వాస్తవంగా సాగు చేసిన పంటలకు రుణాలు ఇవ్వని పరిస్థితి. సాగు చేయని పంటలకు రుణాలు ఇస్తున్నాయి. ఎండు మిర్చికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎక్కువ. ఈ పంటకు ఎకరాకు రూ.1.15 లక్షల నుంచి రూ.1.25 లక్షల వర కు ఉంది. బ్యాంకులు లోనింగ్ను పెంచుకునేందుకు ఎండుమిర్చి పంట పేరుతో పంట రుణాలు ఇస్తున్నాయి. రైతులు కూడా ఎక్కువ మొత్తంలో లోన్ వచ్చిందని తాత్కాలికంగా సంతోషపడుతున్నారు. పంటల బీమా సాయం దక్కనప్పుడు ఏ స్థాయిలో నష్టపోతున్నారో ఊహించలేకపోతున్నారు. బీమా చేసుకున్న రైతులు 26,955 మందే! కర్నూలు జిల్లాలో 3.75 లక్షల మంది రైతులుండగా జూలై నెల 31 నాటికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద 11,438 మంది రైతులు మాత్రమే ప్రీమి యం చెల్లించారు. నంద్యాల జిల్లాలో 3.25 లక్షల మం ది రైతులు ఉండగా 220 మంది మాత్రమే ప్రీమి యం చెల్లించడం గమనార్హం. వాతావరణ ఆధారిత బీమా కింద కర్నూలు జిల్లాలో 11,056, నంద్యాల జిల్లాలో 4,241 మంది రైతులు మాత్రమే ప్రీమియం చెల్లి ంచారు. బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్న వారిలో వాతావరణ ఆధారిత బీమా కోసం కర్నూలు జిల్లాలో 16,666, నంద్యాల జిల్లా నుంచి 7,156 దరఖాస్తులు వచ్చాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద కర్నూలు జిల్లాలో 3,740, నంద్యాల జిల్లాలో 266 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. బ్యాంకులు రైతులకు ఇచ్చే పంట రుణంలో ప్రీమియం కట్ చేసి బీమా కంపెనీలకు బదిలీ చేస్తారు. ప్రీమియం చెల్లించిన రైతుల్లో 90 శాతం మంది రైతులు కంది, సజ్జ, కొర్ర, జొన్న పంటలే సాగు చేశారు. అయితే బ్యాంకు ల్లో మాత్రం మిర్చికి పంట రుణం పొందినట్లు ఉంటు ంది. ఈ పరిస్థితి దాదాపు అన్ని బ్యాంకుల్లోనూ ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఐదేళ్లలో ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించకుండానే ఉమ్మడి జిల్లాలో రూ.1,675 కోట్ల బీమా పరిహారం మంజూరైంది. పంట రుణాలతో సంబంధం లేదు.. మీ సేవ కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్లు, బ్యాంకులకు వెళ్లి ప్రీమియం చెల్లించాల్సిన పరిస్థితి లేకపోయింది. సర్వర్ సమస్యలు లేవు. కేవలం నోటిఫై చేసిన పంటలు ఈ–క్రాప్లో నమోదైతే చాలు బీమాకు అర్హత లభించింది. తాజా పరిస్థితులతో రైతులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పారదర్శక పాలనను గుర్తు చేసుకొని తాము ఏం కోల్పోయామో చర్చించుకుంటున్నారు. రుణం పొందిన పంటే ఈ–క్రాప్లో ఉండాలి పంటల బీమా పరిహారం పొందడానికి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. బీమా పరిహారం మంజూరు చేసే సమయంలో వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. రైతులు సాగు చేసిన లేదా సాగు చేసే పంటకే రుణం తీసుకోవాలి. ఆ పంట విధిగా ఈ–క్రాప్లో నమోదు కావాలి. అప్పుడే పరిహారం లభించే అవకాశం ఉంటుంది. బ్యాంకుల్లో ఒక పంటకు రుణం తీసుకొని.. మరో పంట ఈ–క్రాప్లో నమోదైతే అధిక వర్షాలు, అనావృష్టి పరిస్థితుల్లో బీమా పరిహారం కోల్పోతారు. రైతులు ఏ పంట సాగు చేస్తున్నారో స్పష్టంగా తెలుసుకొని ప్రీమియం కట్ చేయాలని అన్ని బ్యాంకులకు సూచించాం. – రామచంద్రరావు, ఎల్డీఎం, కర్నూలు లోనింగ్ పెంచుకోవడంపైనే బ్యాంకర్ల దృష్టి స్కేల్ ఆఫ్ ౖఫైనాన్స్ ఎక్కువున్న పంటలకే రుణాలు బ్యాంకులో ఒక పంట.. ఈ క్రాప్లో మరో పంట అధిక శాతం మిర్చి పేరిటే లోన్లు సాగు చేస్తున్న పంటలు కంది, సజ్జ, ఆముదం, జొన్న, కొర్ర అతివృష్టి, అనావృష్టి సమయంలో దక్కని బీమా బీమాను పట్టించుకోని 90 శాతం పైగా రైతులు -
సింగిల్ డెస్క్ పోర్టల్ దరఖాస్తులను పరిష్కరించాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: ిసంగిల్ డెస్క్ పోర్టల్ దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రమోషన్ కమిటీ, జిల్లా నైపుణ్య అభివృద్ధి కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి రాయితీ, పావలావడ్డీ, విద్యుత్, సేల్ టాక్స్ తదితరాలలో రాయితీ ప్రయోజనాలు కల్పిస్తోందన్నారు. గత త్రైమాసిక కాలంలో వివిధ పరిశ్రమల స్థాపనకు అనుమతుల కోసం 139 దరఖాస్తులు రాగా సింగిల్ డెస్క్ విధానంలో ఆయా శాఖల ద్వారా 131 పరిశ్రమలకు అనుమతులు మంజూరయ్యాయన్నారు. మిగ తా 8 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయన్నారు. జిల్లాలో స్కిల్ హబ్స్, ఈఎస్ఈలలో జాబ్ మేళాలు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎంత మంది యువత నైపుణ్య శిక్షణను పొందుతున్నారన్న అంశాన్ని వెబ్సైట్లో కలెక్టర్ పరిశీలించి, ప్రగతి సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా 2025లో నిర్వహించే జాబ్ మేళా బ్రోచర్లను అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం ఎస్.మహబూబ్ బాషా, నైపుణ్య అభివృద్ధి శిక్షణా అధికారి శ్రీకాంత్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణ రెడ్డి, ఐటీడీఏ పీఓ వెంకట శివప్రసాద్, ఎల్డీఎం రవీందర్ కుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ కిశోర్రెడ్డి, ఎస్సీ, ఎస్టీ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రాజమహేంద్రనాథ్ పాల్గొన్నారు. -
అధిక వర్షాలు ఉన్నా.. రైతులకు సుఖం లేదు!
హాలహర్వి: నిట్రవట్టి గ్రామంలో మంగళవారం శ్రావణ శుద్ధ దశమి వేడుకలు ఘనంగా జరిగాయి. వసిగేరప్ప తాత భక్తుడు కె.ఏజీ భవిష్యవాణి వినిపించారు. ముంగారి వర్షాలు విశేషంగా గాలి నుంచి మేఘాల ద్వారా వస్తాయని, అయినా రైతులకు సుఖం ఉండదన్నారు. హింగారి వర్షాలు ఏడు కార్తీలు ఉరుములు, మెరుపుల ద్వారా వస్తాయన్నారు. రెండు తుపాన్లు ఉంటాయన్నారు. తెల్ల గుర్రం, ఎర్ర గుర్రం వెనుకా ముందు పరుగులు పెడతాయని చెప్పారు. ఆరు మూడు అవుతుంది, మూడు ఆరు అవుతుందని వివరణ ఇచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో భవిష్యవాణిని వినేందుకు తరలించ్చారు. ● భవిష్యవాణి వినిపించిన వసిగేరప్పతాత భక్తుడు -
కర్నూలు వ్యవసాయ మార్కెట్ ధరలు (క్వింటాల్కు రూ.లలో)
పంట కనిష్టం గరిష్టం వేరుశెనగ 3,000 7,169 పొద్దుతిరుగుడు 5,239 5,250 ఆముదం 5,090 5,090 వాము 2,011 13,060 ఉల్లి 1,069 1,389 ఎండుమిర్చీ 4,860 6,195 శనగలు 6,511 6,511 కందులు 5,397 6,397 మొక్కజొన్న 2,401 2,401 మినుములు 5,059 7,030 కొర్రలు 2,637 3,127 సోయాచిక్కుడు 1,200 1,200 సజ్జలు 2,339 2,339ఫోన్ నం : 08518–257204, 257661 -
భ్రామరీ సమేత మల్లన్నకు ఊయల, పల్లకీ సేవ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో లోక కల్యాణం కోసం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. మంగళవారం శ్రీస్వామిఅమ్మవార్లకు పల్లకీ ఉత్సవాన్ని నిర్వహించారు. ముందుగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠించి, మహా గణపతిపూజ జరిపించారు. అనంతరం శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీ లో ఆశీనులను చేసి శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు జరిపారు. అలాగే ఊయలలో స్వామిఅమ్మవార్లను ఉంచి షోడశోపచార పూజలు నిర్వహించారు. తిరుమల అన్నదాన ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం కోవెలకుంట్ల: తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదాన ట్రస్టుకు కోవెలకుంట్లకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మంగళవారం విరాళం అందజేశారు. నిత్యాన్నదాన ట్రస్టుకు తమ వంతు సాయంగా ఉపాధ్యాయుడు నాగరాజు, వరలక్ష్మి దంపతులు రూ.10 లక్షల చెక్కును టీటీడీ ఏడీఎల్ ఈఓ వెంకయ్య చౌదరికి అందజేసి ఔదార్యం చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో రెండు పర్యాయాలు రూ.10 లక్షల చొప్పున అన్నదాన ట్రస్టుకు విరాళం అందించినట్లు తెలిపారు. సమస్యలపై బుగ్గన ఆరా బేతంచెర్ల: ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు తదితర విషయాలపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ చలం రెడ్డి, నాయకులు ముర్తుజావలి, ఖాజా గూని నాగరాజు, రామచంద్రుడు, మురళీ కృష్ణ, పిట్టల జాకీర్, తిరుమలేశ్వర్ రెడ్డి, వెంకి రెడ్డి, నారాయణ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలన తీరుపై చర్చించారు. ముఖ్యంగా రైతులకు విత్తనాలు, ఎరువులు అందుతున్నాయా? వ్యవసాయ దిగుబడులకు మద్దతు ధర లభిస్తుందా? అని రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డోన్ పట్టణంలో బుధవారం జరిగే తన తనయుడు బుగ్గన అర్జున్రెడ్డి వివాహ రిసెప్షన్ వద్దకు వచ్చే ప్రజలు, నాయకులు, కార్యకర్తలు జాగ్రత్తగా చేరుకోవాలని సూచించారు. -
కూటమి ప్రభుత్వం విఫలం
నంద్యాల(న్యూటౌన్): ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప విమర్శించారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ అధ్యక్షతన ‘రండి.. టీ తాగుతూ మాట్లాడుకుందాం’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చిన్న నీటి పారుదల శాఖ కార్యాలయ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు రూ.35 వేల కోట్లు ప్రభుత్వం ఉద్యోగులకు బకాయి ఉందన్నారు. జిల్లా, మండల కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను ఇళ్ల స్థలాలుగా ఉద్యోగులకు ఇచ్చి బకాయిలను చెల్లించాలన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అలుపెరగని పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి సుధాకర్, శ్రీనివాసులు, తిరుపాలు, ఫకృద్దీన్, సునిల్కుమార్, విజయలక్ష్మి, వేణుగోపాల్రెడ్డి పాల్గొన్నారు. -
అట్టహాసంగా బిషప్ పట్టాభిషేకం
నంద్యాల(న్యూటౌన్): నంద్యాల డయాసిస్ బిషప్గా కామనూరి సంతోష్ ప్రసన్నరావు పట్టాభిషేక కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. హోలీక్రాస్ కెథడ్రల్ సెంటినరీ చర్చి ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి నంద్యాల డయాసిస్ పరిధిలో ఉన్న పాస్టరేట్ డీనరీ చైర్మన్లు, పాస్టర్లు, కౌన్సిల్ మెంబర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా(చైన్నె) మోడరేటర్ రూబెన్ మార్క్ నూతన బిషప్ సంతోష్ ప్రసన్నరావుతో ప్రమాణ స్వీకారం చేయించి మాట్లాడారు. సంతోషరావు క్రమంగా బిషప్ స్థాయికి ఎదగడం అభినందనీయమని చెప్పారు. అవినీతికి తావు లేకుండా నంద్యాల డయాసిస్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రమాణ స్వీకారం అనంతరం బిషప్ ప్రసన్నరావును రైల్వే స్టేషన్ సమీపంలోని ఎంఎస్నగర్ నుంచి ఊరేగింపు నిర్వహించారు. హోలీక్రాస్ కెథడ్రల్ ఆలయ ఆవరణలో బిషప్ దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో బిషప్లు ఐజక్ వరప్రసాద్, జార్జికొర్నెలి, పద్మారావు, తిమోతి, రవీందర్, హేమచంద్రకుమార్, జయసింగ్ ప్రిన్సిన్స్ ప్రభాకరన్లతో పాటు డయాసిస్ వైస్ ప్రెసిడెంట్ వరప్రసాద్, డయాసిస్ సెక్రటరీ స్టాండ్లీ విలియం, సెంటినరీ చర్చి సెక్రటరీ ప్రభుదాసు, నందం ఐజక్తో పాటు అన్ని పాస్టరేట్ల డీనరీ చైర్మన్లు, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా దక్షిణ ఇండియా సంఘం చైన్నె కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. క్రీస్తు మార్గంలో నడుస్తా క్రీస్తు బోధనలు అనుసరిస్తూ ఆయన అడుగు జాడల్లో నడుస్తానని నంద్యాల డయాసిస్ అధ్యక్ష ఖండం పీఠాధిపతి(బిషప్) సంతోష్ ప్రసన్నరావు అన్నారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. డయాసిస్ పరిధిలో ఉన్న ఆస్తులను కాపాడుతూ, నంద్యాలలో విద్య, వైద్య సేవలకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. అవినీతికి తావు లేకుండా నంద్యాల డయాసిస్ అభివృద్ధికి కృషి చేయాలి నూతన బిషప్ సంతోష్ ప్రసన్నరావుకు మోడరేటర్ రూబెన్మార్క్ పిలుపు -
పరిశ్రమలు ఎక్కడ బాబూ..!
జూపాడుబంగ్లా: పరిశ్రమలతో కళకళలాడాల్సిన భూములు వెలవెలబోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో తంగడంచ ఎంఎస్ఎంఈ పార్క్ చిన్నబోయింది. తొమ్మిదేళ్లు అయినా ఒక్క పరిశ్రమను స్థాపించటానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రాలేదంటే అధికారుల నిర్లక్ష్యం ఏపాటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. తండగంచ గ్రామ సమీపంలో కేజీ రోడ్డు నుంచి 1.25 కిలోమీటర్ల దూరంలో ఎంఎస్ఎంఈ పార్కు ఉన్నా అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. 2016లో దాదాపు 211 ఎకరాల తంగడంచ ఫారం భూములను అప్పట్లో సీఎం చంద్రబాబునాయుడు గుజరాత్ అంబుజా పరిశ్రమకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. పరిశ్రమ స్థాపన నిమిత్తం కర్నూలు–గుంటూరు రోడ్డు నుంచి రూ.3.09 కోట్ల ప్రత్యేక అభివృద్ది నిధులతో 1.25 కిలోమీటర్ల మేర రెండులైన్ల రోడ్డును నిర్మించారు. అయితే అంబుజా కంపెనీవారు కాలు పెట్టకుండానే వెనుదిరగటంతో ఆ భూములను ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ సంస్థ (ఏపీఐఐసీ)కు కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఐఐసీకి కేటాయించిన 211 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ (మైక్రోస్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్) పార్కులో చిన్నతరహా, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పేందుకు వీలుగా రూ.7కోట్లతో అంతర్గత బీటీరోడ్లు, డ్రైనేజీలు, త్రీఫేస్ విద్యుత్ సరఫరా నిమిత్తం విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. 211 ఎకరాల్లో 50 ఎకరాలను స్మాల్స్కేల్ ఇండస్ట్రీస్ స్థాపించేందుకు ఏడు, పది సెంట్ల ప్రకారం 260 ప్లాట్లను ఏర్పాటుచేశారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే వారిలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 5 శాతం, బీసీలకు 30 శాతం చొప్పున ప్రాధాన్యతనిస్తూ చదరపు మీటరు రూ.840 చొప్పున స్థలాన్ని కేటాయించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పరిశ్రమల స్థాపనపై ఏపీఐఐసీ అధికారులు పారిశ్రామికవేత్తలకు, నిరుద్యోగులకు అవగాహన కల్పించకపోవటంతో రూ.12కోట్ల నిధులు వెచ్చించి ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కు స్థలాల్లో తొమ్మిదేళ్లు గడిచినా ఒక్క పరిశ్రమ స్థాపించకపోవటాన్ని బట్టిచూస్తే అధికారుల పనితీరు అర్థం చేసుకోవచ్చుననే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎంఎస్ఎంఈ పార్కు లేఅవుట్ చిత్రపటం అవగాహన కల్పించే వారు లేక.. పరిశ్రమల ఏర్పాటుపై ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవగాహన కల్పించడడంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. పరిశ్రమలు స్థాపించుకునే వారికి ఎంఎస్ఎంఈలో స్థలం కేటాయించాలంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి సవాలక్ష ఆంక్షలు విధి ంచటంతో కొంత మందికి అవగాహన లేకపోవడంతో మొదట్లోనే వెనుకడుగు వేస్తున్నారు. దరఖాస్తు చేసినా కొన్ని నిబంధనలతో తిరస్కారానికి గురవుతున్నాయి. ఔత్సాహికులైన పారిశ్రామిక వేత్తలకు తంగడంచ ఫారంలో పరిశ్రమలు స్థాపించే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిరుద్యోగులు, నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. భూముల అధిక ధరలు.. ఆసక్తి చూపని పారిశ్రామికవేత్తలు బంగారు పంటలు పండే తంగడంచ ఫారంలోని నల్లరేగడి భూములను ప్రభుత్వం నుంచి ఏపీఐఐసీ ఎకరా రూ.4.50లక్షల చొప్పున కొనుగోలు చేసింది. బహిరంగ మార్కెట్లో ఎకరా ఫారం భూమి ధర రూ.15 నుంచి రూ.20 లక్షల ఉంటుంది. ఏపీఐఐసీ మాత్రం చదరపు మీటరు రూ.840 ప్రకారం పారిశ్రామిక వేత్తలకు ఇస్తుంది. ఈ లెక్కన ఎకరా భూమి విలువ రూ.33.98 లక్షలు అవుతుంది. కొన్నదానికంటే అత్యధిక ధరకు విక్రయిస్తుండటంతో పాటు ఏడాదిలోగా పరిశ్రమను స్థాపించకపోతే ఇచ్చిన భూమిని వెనక్కితీసుకొంటామనే పలు నిబంధనలను విఽధించటంతో పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపడం లేదనే విమర్శలున్నాయి. తంగడంచ ఎంఎస్ఎంఈ పార్క్ వెలవెల పరిశ్రమల ఏర్పాటుపై అవగాహన కల్పించని ఏపీఐఐసీ అధికారులు తొమ్మిదేళ్లల్లో ఒక్క పరిశ్రమ రాని వైనం ఎంఎస్ఎంఈ స్థలాలు నిరుపయోగం -
నేడు వైఎస్ జగన్ డోన్కు రాక
డోన్: పట్టణంలో బుధవారం జరిగే రాష్ట్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి కుమారుడు అర్జున్ అమర్నాథ్రెడ్డి, మాజీ రాష్ట్రపతి దివంగత నీలం సంజీవరెడ్డి ముని మనవరాలు అనన్యరెడ్డి వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు. తాడేపల్లిలోని హెలిపాడ్ నుంచి హెలికాప్టర్లో ఉదయం 9.30 గంటలకు బయలుదేరి డోన్ పట్టణ శివారులోని ఎం కన్వెన్షన్ హాల్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు 11.40 గంటలకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కంబాలపాడు సర్కిల్, ఉడుములపాడు మీదుగా 44వ జాతీయ రహదారిపై స్థానిక దత్తాత్రేయ స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో నిర్మించిన వివాహ రిసెప్షన్ వేదికకు చేరుకుంటారు. వధూవరులను ఆశీర్వదించిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి తిరిగి కారులో ఎం కన్వెన్షన్ హాల్ వద్దకు చేరుకుని అనంతరం హెలికాప్టర్లో బెంగళూరుకు 12.20కి ప్రయాణమవుతారు.ఏర్పాట్ల పరిశీలన..వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా ఎం కన్వెన్షన్ హాల్ వద్ద నిర్మించిన హెలిపాడ్తో పాటు దత్తాత్రేయ స్వామి గుడి ఆవరణలో నిర్మించిన వివాహ రిసెప్షన్ వేదిక, భోజనశాల షెడ్లను మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి మంగళవారం పరిశీలించారు. సుమారు 40 వేల మంది ప్రజలకు వివాహ విందు ఏర్పాటు చేసినట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. మాజీ మంత్రి వెంట పట్టణ, రూరల్ సీఐలు ఇంతియాజ్ బాషా, రాకేష్, ఎస్ఐ శరత్కుమార్రెడ్డితో పాటు పార్టీ నాయకులు ఉన్నారు. -
విద్యుదాఘాతంతో వలస కార్మికుడి మృతి
ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని చెన్నాపురం గ్రామం సమీపంలోని స్టోన్ క్రస్రర్ మిషన్ ఫ్యాక్టరీ దగ్గర మంగళవారం ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్కు గురై సంతోష్ (22) అనే యువకుడు మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ యువకుడు కొన్ని రోజు క్రితం తమ ప్రాంతానికి చెందిన మేసీ్త్ర ద్వారా చెన్నాపురం స్టోన్ క్రస్రింగ్ మిషన్ ఫ్యాక్టరీలో పనిలో చేరాడు. రోజు మాదిరిగానే ఉదయం ఫ్యాక్టరీ దగ్గర వెల్డింగ్ వర్క్ చేస్తున్నారు. అయితే, ఆ సమయంలో వర్షం రావడంతో షార్ట్ సర్క్యూట్కు గురై కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి కార్మికులు సంతోష్ను చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీస్స్టేషన్ ట్రైనీ ఎస్ఐ మల్లికార్జున ప్రభుత్వాసుప్రతికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును, మృతదేహాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. పోస్టుమార్టుం కోసం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యులకు ప్రమాదం విషయం తెలియజేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు విలేకరులకు తెలిపారు. కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య జూపాడుబంగ్లా: కుటుంబ కలహాలతో మండలంలోని తర్తూరు గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల మేరకు.. సి.బెళగల్కు చెందిన గనిమల్లేశ్వరి (23)కి తర్తూరు గ్రామానికి చెందిన మధు అనే వ్యక్తితో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కొడుకు, కుమార్తె సంతానం. భర్త మతిస్థిమితం లేకపోవటం, మామ వెంకటేశ్వర్లు దివ్యాంగుడు కావడంతో కుటుంబపోషణ భారమంతా గనిమల్లేశ్వరిపై పడింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె మంగళవారం పురుగుమందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు చికిత్స నిమిత్తం నందికొట్కూరుకు తరలించగా అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు గ్రామానికి చేరుకొని బోరున విలపించారు. మల్లేశ్వరి మృతికి భర్త, మామే కారణమని వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మెట్లపై నుంచి జారి లారీ డ్రైవర్ మృతి బేతంచెర్ల: పట్టణంలోని బైటిపేట కాలనీకి చెందిన ఓ లారీ డ్రైవర్ మెట్లపై నుంచి జారీ పడి మృతి చెందాడు. హెడ్ కానిస్టేబుల్ చంద్ర శేఖర్ వివరాల మేరకు.. సానె దుశ్యంత్ కుమార్ (33) సోమవారం ఇంటి పైనుంచి కిందికి వచ్చే క్రమంలో మెట్లు దిగుతుండగా ప్రమాదవశాత్తూ జారి పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం నంద్యాల శాంతిరామ్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య పద్మావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ చంద్ర శేఖర్ మంగళవారం వెల్లడించారు. డివైడర్ను ఢీకొన్న కారు కర్నూలు (రూరల్): కారు అతివేగంతో డివైడర్ను ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వివరాలు.. హైదరాబాదుకు చెందిన సోదరులు శివ, మంజునాథ్, శివ సతీమణి, కూతురుతో కలిసి బెంగళూరులో గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరై తిరుగు పయనమయ్యారు. సోమవారం అర్ధరాత్రి పంచలింగాల సమీపాన శివ కారును వేగంగా నడపడంతో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో పక్కన కూర్చున్న సోదరుడు మంజునాథ్ (42) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో శివ, ఆయన భార్య, కూతురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు తాలూకా అర్బన్ సీఐ శ్రీధర్ తెలిపారు. -
నేడు వైయస్ జగన్ డోన్ పర్యటన
తాడేపల్లి: నేడు (బుదవారం 06.08.2025) మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ నంద్యాల జిల్లా డోన్ పర్యటన చేయనున్నారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కుమారుడి వివాహ రిసెప్షన్లో పాల్గొననున్న వైయస్ జగన్.ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, నంద్యాల జిల్లా డోన్ చేరుకుంటారు, అక్కడ దత్తాత్రేయ స్వామి ఆలయం వద్ద మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కుమారుడి వివాహ రిసెప్షన్లో పాల్గొననున్న వైయస్ జగన్, అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు. -
నిర్మాణాలు చేపట్టకపోతే స్థలాలు రద్దే!
శ్రీశైలంటెంపుల్: భక్తుల సౌకర్యార్థం పలు నిర్మాణాలు చేపడతామని కొన్ని ధార్మిక సంస్థలు శ్రీశైల దేవస్థాన స్థలాలను పొందాయి. కొన్ని సంవత్సరాలుగా నిర్మాణాలు చేపట్టకపోవడంతో దేవదాయశాఖ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టని ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. దీంతో శ్రీశైల దేవస్థాన అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టని సుమారు 25 ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందిన తరువాత కూడా నిర్మాణాలు ప్రారంభించకపోతే స్థలాన్ని రద్దు చేసి, దేవస్థానం స్వాధీనం చేసుకుంటుందని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. స్థలాలు ఇచ్చారు ఇలా.. స్థలాలు ఇవ్వాలని పలు ధార్మిక సంస్థలు శ్రీశైల దేవస్థానానికి అభ్యర్థనలు పెట్టుకుంటాయి. ఆయా సంస్థల అభ్యర్థనలను పరిశీలించి వాటికి స్థలాలు కేటాయించాలని రాష్ట్ర దేవదాయశాఖ కమిషనరు అనుమతులిస్తారు. కమిషనర్ అనుమతుల మేరకు క్షేత్రంలో స్థలాన్ని దేవస్థాన ఈఓ కేటాయిస్తారు. ● ఓ ప్రముఖ సంస్థ ఆయుర్వేద వైద్యశాల, వేదపాఠశాల నిర్మాణం చేపట్టి భక్తులకు సేవలందిస్తామని ప్రతిపాదనలు పంపడంతో ఆ సంస్థకు దేవస్థానం 20 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. సుమారు ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా కాంపౌండ్ వాల్ తప్ప, ఇంతవరకు ఎటువంటి నిర్మాణం చేపట్టలేదు. ● ఓ ప్రముఖ మఠం వైద్యశాల, పాఠశాల నిర్మాణం చేపడతామని ముందుకు రావడంతో ఆ మఠానికి 10ఎకరాల స్థలాన్ని కేటాయించారు. రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఆ మఠం కూడా ఇంతవరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు. దేవస్థాన ఈఓ ఆ మఠం వారిని పిలిచి మాట్లాడడంతో ఇప్పుడిప్పుడే పనులు ప్రారంభించారు. కమిషనర్ అదేశాల మేరకు చర్యలు దాతలు, ధార్మిక సంస్థలు తీసుకున్న స్థలాల్లో నిర్మాణాలు లేవు. కొందరు పునాదులకే పరిమితం చేశారు. అందరికి నోటీసులు జారీ చేశాం. అగ్రిమెంట్ కానీ వారికి, అగ్రిమెంట్ అయినా నిర్మాణాలు చేపట్టని వారికి అగ్రిమెంట్ రద్దు చేసేందుకు రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్కు ప్రతిపాదనలు పంపాం. కమిషనర్ అదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడతాం. – ఎం. శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన ఈఓ ధార్మిక సంస్థలకు నోటీసులు -
అమెరికా ఐవీఎల్పీకి డాక్టర్ వినూషారెడ్డి ఎంపిక
కర్నూలు కల్చరల్: రాజకీయాలలో మహిళల పాత్రపై అమెరికాలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ పోగ్రామ్(ఐవీఎల్పీ)కు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి డాక్టర్ బి.వినూషారెడ్డి ఎంపికయ్యా రు. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఈ ఏడాది నిర్వహిస్తున్న బహు ళ ప్రాంతీయ సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేయబడ్డ 20 మంది విశిష్ట మహిళా నాయకురాళ్లలో ఏకై క భారత ప్రతినిధి డాక్టర్ బి.వినూష రెడ్డి. ఈనెల 11 నుంచి 30వ తేదీ మధ్య మూడు వారాల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. -
అంతర్రాష్ట్ర సెల్ఫోన్ దొంగల అరెస్ట్
● రూ.8లక్షలు విలువైన 56 ఫోన్లు స్వాధీనం కోడుమూరు రూరల్: నలుగురు అంతర్రాష్ట్ర సెల్ఫోన్ల దొంగలను కోడుమూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.8 లక్షల విలువైన 56 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం సాయంత్రం కోడుమూరు సీఐ తబ్రేజ్ విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నంద్యాల జిల్లా డోన్ మండలం చిగుర్మాన్పేటకు చెందిన ఎరుకలి శశికుమార్, శ్రీను మరో ఇద్దరు మైనర్లతో కలసి ముఠాగా ఏర్పడ్డారు. నలుగురు తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని రద్దీ ప్రాంతాల్లో చాకచక్యంగా సెల్ఫోన్లను దొంగలించి వాటిని అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసే వారన్నారు. అనుమానంతో వీరిపై నిఘా పెట్టామన్నారు. సోమవారం ఉదయం కోడుమూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్నారని సమాచారం రావడంతో ఎస్ఐ ఎర్రిస్వామితో కలిసి నలుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న 56 సెల్ఫోన్లన్ని కర్ణాటకలోని బళ్లారి, చిక్ బళ్లాపూర్, హొస్పేట్, బెంగళూరు ప్రాంతాల్లో దొంగలించినట్లు విచారణలో తేలిందన్నారు. స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లన్నింటిని ఐఎంఈఐ నంబర్ల ఆధారంగా బాధితులను పిలిపించి త్వరలో అందజేస్తామన్నారు. సమావేశంలో ఎస్ఐ ఎర్రిస్వామి, ట్రైనీ ఎస్ఐ నీలకంఠ, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
ఎమ్మిగనూరురూరల్: పెసలదిన్నె గ్రామంలో విద్యుదా ఘాతంతో కౌలు రైతు మృత్యువాత పడ్డాడు. గ్రామానికి చెందిన నరసింహుడు కుమారుడు బోయ కృష్ణమూర్తి(34) తనకు ఉన్న ఎకరన్నరతో పాటు 5 ఎకరాలు కౌలు తీసుకోని పత్తి పంటను సాగు చేస్తున్నాడు. ఆదివారం రాత్రి భోజనం అనంతరం పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. పొలం దగ్గర ట్రాన్స్ ఫార్మర్ కింద నున్న బోర్డులో ఉన్న స్విచ్ వేసే క్రమంలో కరెంట్ షాక్కు అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రయినా ఇంటికి రాకపోవటం, కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానంతో తండ్రి నరసింహుడు, మరో వ్యక్తితో కలసి పొలం దగ్గరకు వెళ్లి చూశారు. ట్రాన్స్ ఫార్మర్ సమీపంలో విగత జీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించాడు. మృతుడుకి భార్య సరోజ, కుమార్తె మానస(1) ఉన్నారు. సోమవారం విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు గ్రామానికి వెళ్లి జరిగి న సంఘటనపై వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
జనని బ్యాంకు సీఈఓ అరెస్ట్
కోవెలకుంట్ల: ఎక్కువ వడ్డీ ఆశ చూపి ఖాతాదారులను మోసం చేసి బోర్డు తిప్పేసిన జననీ బ్యాంకు కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న బ్యాంకు సీఈఓ వెంకటరమణను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం స్థానిక పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ హనుమంతు నాయక్ కేసు వివరాలను వెల్లడించారు. 2021 జనవరి నెలలో వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం సోమవాండ్లపల్లెకు చెందిన ఆకుల వెంకటరమణ, కోవెలకుంట్లకు చెందిన గువ్వల పద్మావతి మరికొంత మందితో కలిసి పట్టణంలోని ఓంశాంతి భవన సమీపంలో జనని మ్యూచువల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ పొదుపు, పరపతి సొసైటీని ఏర్పాటు చేశారు. బ్యాంకు సీఈఓగా వెంకటరమణ, కార్యదర్శిగా పద్మావతి, ఆమె కుమారుడు రవీంద్రారెడ్డి సలహాదారుడిగా, ఆమె కోడలు సౌజన్య మేనేజర్గా, యత్తపు వాణిదేవి గౌరవాధ్యక్షురాలిగా, హరిప్రియ కోశాధికారిగా, సుజాత అధ్యక్షరాలిగా కొనసాగుతున్నారు. సొసైటీలో డబ్బులు డిపాజిట్ చేస్తే మిగతా ప్రైవేట్ బ్యాంకుల కంటే ఎక్కువ శాతం వడ్డీ ఇస్తామని, డిపాజిట్లపై రుణాలు తీసుకోవచ్చని ప్రజలను నమ్మబలికించారు. 800 మంది నుంచి రూ.1.10 కోట్ల డిపాజిట్లు.. జననీ బ్యాంకు నిర్వాహకులు మాటలు నమ్మి అధిక వడ్డీ ఆశతో కోవెలకుంట్లతోపాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 800 మంది ఖాతాదారులుగా చేరి దాదాపు రూ.1.10 కోట్లు సేవింగ్స్, ఫిక్స్డ్, రికరింగ్ డిపాజిట్లు చేశారు. డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాదారుల బాండ్లకు గడవు తీరిపోవడంతో డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు సొసైటీ వద్దకు వెళ్లగా సంస్థ యాజమన్యం బోర్డు తిప్పేసింది. బాధితురాలిగా ఉన్న పట్టణానికి చెందిన రిటైర్డ్ అధ్యాపకుడి భార్య సావిత్రమ్మ ఫిర్యాదు మేరకు ఈ ఏడాది జూన్ 2వ తేదీన కోవెలకుంట్ల పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి కేసును చేధించారు. బ్యాంకు సీఈఓ కోవెలకుంట్లతోపాటు చాగలమర్రి, బనగానపల్లె, నంద్యాల పట్టణాల్లో బ్రాంచ్లు ఏర్పాటు చేసి అక్కడ ప్రజలను మోసం చేసి డబ్బులు స్వాహా చేసినట్లు విచారణలో తేలింది. కోవెలకుంట్లలో 300 మంది, చాగలమర్రిలో 250, బనగానపల్లె 100 , నంద్యాలలో 40 మంది డబ్బులు పోగొట్టుకొని మోసపోయినట్లు గుర్తించారు. కోవెలకుంట్ల మెయిన్ బ్రాంచ్లో రూ. 1.10 కోట్లు స్వాహా చేయగా సీఈఓ వెంకటరమణ ఒక్కడే చాగలమర్రిలో ఒక మాజీ సైనిక ఉద్యోగికి చెందిన ఫిక్స్డ్ డిపాజిట్ రూ. 17.50 లక్షలతో కలిపి రూ. 30 లక్షలు, బనగానపల్లెలో రూ. 10 లక్షలు, నంద్యాలలో కొంత మొత్తం తన సొంతానికి వాడుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇప్పటికే ఈ కేసులో గువ్వల పద్మావతి, ఆకుల భరద్వాజ్, బ్యాంకు అధ్యక్షురాలు సుజాతను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. గువ్వల పద్మావతమ్మ బ్యాంకుఖాతాలో ఉన్న రూ. 37 లక్షలను ప్రీజ్ చేసినట్లు పేర్కొన్నారు. సీఈఓ వెంకటరమణను పట్టణంలోని గాంధీసెంటర్ వద్ద అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుచగా మేజిస్ట్రేట్ రిమాండ్కు ఆదేశించినట్లు తెలిపారు. మరో ఇద్దరు నిందితులు కేసులో బెయిల్పై ఉండగా మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ వివరించారు. సమావేశంలో కోవెలకుంట్ల ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, ట్రైనీ ఎస్ఐ అనిల్కుమార్ పాల్గొన్నారు. ఎనిమిది మందిపై కేసు నమోదు నిందితురాలి ఖాతాలోని రూ. 37 లక్షలు ప్రీజ్ కేసులో ఇప్పటి వరకు నలుగురి అరెస్ట్ మరో ఇద్దరు నిందితులు పరారీ బెయిల్పై మరో ఇద్దరు -
గర్భిణి మృతి కేసులో ముగ్గురు అరెస్ట్
నందికొట్కూరు: నాలుగు నెలల గర్భిణి శ్రీవాణి మృతికి కారణమైన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రమణ్యం తెలిపారు. సోమవారం పట్టణంలోని రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గడివేముల మండలం గని గ్రామానికి చెందిన గర్భిణి శ్రీవాణి అబార్షన్ వికటించి గత నెల 30వ తేదీన మృతి చెందింది. ఈ కేసులో అబార్షన్ చేసిన నందికొట్కూరుకు చెందిన ఆర్ఎంపీ గీతారాణి, అబార్షన్ చేయించిన శ్రీవాణి భర్త లోకేష్, అత్తా నాగేంద్రమ్మను అరెస్ట్ చేశారు. ముగ్గురిని కోర్టులో హాజరు పరుచగా మెజిస్ట్రేట్ రిమాండ్కు ఆదేశించినట్లు సీఐ తెలిపారు. అలాగే ఈ కేసులో కర్నూలులోని కొత్తబస్టాండ్ వద్ద ఉన్న రక్ష హాస్పిటల్లో లింగనిర్ధారణ జరిగిందని, ఈ మేరకు ఆస్పత్రి స్కానింగ్ సెంటర్ టెక్నిషీయన్ శేఖర్, ఆసుపత్రి మేనేజ్మెంట్పై దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. టీడీపీ నాయకునిపై కేసు నమోదు సంజామల: ఆకుమల్ల గ్రామంలో టీడీపీలో వర్గపోరు తారా స్థాయికి చేరుకుటుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకుని కేసులు పెట్టు కున్న సంగతి అందరికీ తెలిసింది. తాజాగా గత నెల 31న ఆకుమల్లకు రైతు సేవా కేంద్రానికి ఒక లారీ యూరియా బస్తాలు వచ్చాయి. టీడీపీకి చెందిన ఒక వర్గమే అన్ని బస్తాలు తీసుకుంటుందని టీడీపీకి చెందని మరో వర్గం వ్యక్తిగత ధూషణలు చేయడంతో పంచాయితీ పోలీసు స్టేషన్ చేరింది. ఈ మేరకు దుబ్బా వెంకటేశ్వర్ రెడ్డిపై బొమ్మిరెడ్డి నాగేశ్వర్రెడ్డి ఫిర్యాదు చేయ డంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమణ య్య సోమవారం తెలిపారు. పొలాలకు ఒంటరిగా వెళ్లొద్దు గోనెగండ్ల: చిరుత సంచరించే గ్రామాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు పొలాలకు ఒంటరిగా వెళ్లొద్దని ఆదోని ఫారెస్టు రెంజ్ ఆఫీసర్ తేజశ్విని సూచించారు. సోమవారం సాయంత్రం డిప్యూటీ రెంజ్ ఆఫీసర్ నూర్జహాన్, బీటీ ఆఫీసర్ రవి కుమార్తో కలసి తేజశ్విని గంజిహళ్లి గ్రామానికి చేరుకుని చిరుత సంచారంపై ఆరా తీశారు. చిరుత సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంట పొలాల్లో సంచరిస్తున్నది చిరుతనా... ఇతర అటవీ జంతువా అనేది తేలే వరకు ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. త్వరలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుతను గుర్తించి, బంధించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
ఉరుకుంద క్షేత్రం.. భక్తజన సంద్రం
శ్రావణ మాసం రెండవ సోమవారం సందర్భంగా జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఉరుకుంద ఈరన్న స్వామి క్షేత్రం భక్తజనంతో కిటకిటలాడింది. జిల్లా నుంచే కాక తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి స్వామి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సోమవారం ఒక్క రోజు రెండు లక్షలకు పైగా భక్తులు క్షేత్రానికి చేరుకున్నట్లు అంచనా. క్షేత్ర పరిసరాల్లో భక్తుల రద్దీ ఉండటంతో భక్తులు ఎల్లెల్సీ కాల్వ పరిసరాల్లో, కొండ ప్రాంతంలో, పొలాల్లోనే స్వామి వారికి నైవేద్యం తయారు చేసి పూజలు చేశారు. తలనీలాలల, దర్శన, ప్రసాద కౌంటర్ల వద్ద భక్తులు గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండాల్సి వచ్చింది. వాహనాల రద్దీతో భక్తులు అవస్థలు పడ్డారు. ఉరుకుందలో కోసిగి వైపు వెళ్లే వాహనాలు ఎదురెదురుగా రాకపోకలు సాగడంతో ఇరుక్కుపోయాయి. వాహనాలు ఎటు కదలకుండా రెండు నుంచి మూడు గంటలకు పైగా ట్రాఫిక్ స్తభించిపోయింది. ఎమ్మిగనూరుకు చెందిన ఆర్టీసీ బస్సులు సైతం లోపలికి వెళ్లేందుకు వీలు లేకుండా ఉండి పోయాయి. కోసిగిలో రైల్వే గేటు వద్ద కిలో మీటర్ మేరకు బారులుదీరాయి. ఒక రైలు వెళ్లి గేటు తెరిచే కొన్ని వాహనాలు ముందుకు సాగేలోపు మరో రైళ్ల రాకకు గేటు పడుతుండడంతో గంటల కొద్ది నిలిచి పోయాయి. – కోసిగి -
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
నంద్యాల(అర్బన్): రైతు సేవా కేంద్రాలు, సొసైటీల్లో రెండు వారాలుగా పేర్లు నమోదు చేసుకున్నా యూరియా సరఫరా కాలేదంటూ సోమవారం నంద్యాల మండలం కానాల గ్రామ రైతులు ఏపీ రైతు సంఘం, సీపీఎంల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. గ్రామ సచివాలయం ప్రధాన రహ దారి వద్ద రైతులు గంట పాటు రాస్తారోకో చేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు స్పందిస్తూ.. గ్రామానికి సరఫరా అయ్యే యూరియాను ప్రతి రైతుకు మూడు బస్తాల చొప్పున పంపిణీ అయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విమరించారు. అనంతరం ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్రుడు, సీపీఎం మండల కార్యదర్శి బాలవెంకట్ మాట్లాడుతూ కానాల గ్రామ రైతులు రెండు వారాలుగా ఆర్ఎస్కే, సొసైటీల్లో పేర్లు నమోదు చేసుకున్నారని, అధికారులు కూటమి నేతలు చెప్పిన వారికే యూరియా సరఫరా చేస్తున్నారన్నారు. యూరియా కోసం రైతులు ఎదురు చూడాల్సి వస్తుందని చెప్పారు. యూరియా పంపిణీలో రాజకీయ నాయకుల జోక్యం వల్ల అధికారులు ఇష్టానుసారంగా పంపిణీ చేస్తున్నారన్నారు. జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని జిల్లా అధికారులు చెప్పడం దుర్మార్గమన్నారు. ప్రైవేటు వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్న రైతులకు నిరాశ ఎదురవుతుందని, యూరియాతో పాటు ఇతర కాంప్లెక్స్ ఎరువులు కొనాలని నిబంధనలు పెడుతున్నారన్నారు. మధ్య దళారుల దోపిడీతో రైతాంగం నష్టపోవడంతో పాటు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు అవసరమైన యూరియాను వెంటనే సరఫరా చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో దస్తగిరి, జాకీర్హుసేన్, యూసుఫ్, హుసేన్వలి, సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
శ్రీశైలంటెంపుల్: దేవస్థానం పరిధిలో హోటల్ నిర్వాహకులు ఆహార పదార్థాలను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు హెచ్చరించారు. సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘భక్తుల జేబుకు చిల్లు’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు స్పందించారు. క్షేత్ర పరిధిలోని పలు హోటల్స్లో ఆహర పదార్థాలు అధిక ధరలకు విక్రయించకూడదని, ధరల పట్టికను హోటల్ ముందు ప్రదర్శించాలని ఆదేశించారు. దేవస్థాన మైక్తో హోటల్ నిర్వాహకులకు తెలిసే విధంగా సూచనలు జారీ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. -
రైతులకు అందని యూరియా
పాములపాడు: ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు పూర్తయినా రైతులకు యూరియా అందడం లేదు. సోమవారం ఉదయం మద్దూరు ప్రాథమిక రైతు సేవా సహకార సొసైటీ కార్యాలయానికి యూరియా కోసం రైతులు వెళ్లారు. కార్యాలయం తలుపులు తెరవకపోవడంతో పక్కనే ఉన్న గ్రామ సచివాలయం వద్ద కూర్చున్నారు. సాయంత్రం అయినా యూరియా ఇవ్వలేదు. మంగళవారం ఇస్తామని అధికారులు తాపీగా చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. సమస్య ఎప్పుడూ రాలేదని, కూటమి ప్రభుత్వంలో తమ కష్టాలు వచ్చాయని ఆరోపించారు. అదనులో యూరియా వేయాలని, లేదంటే పైర్ల పెరుగుదల క్షీణిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్ కోసం అవ్వ ప్రదక్షిణ కొలిమిగుండ్ల: వృద్ధాప్య పింఛన్ తీసుకునే భర్త గంగిరెడ్డి మూడేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందినా అవ్వ సారెడ్డి నాగమ్మకు ఇప్పటి వరకు పింఛన్ రాలేదు. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లెకు ఈ వృద్ధురాలు పేదరాలు. తనకు తనకు న్యాయం చేయాలని ప్రభుత్వ ఆలయాల చుట్టూ ప్రదణక్షిణ చేస్తున్నారు. అయితే కొత్త పింఛన్లకు ఇంకా వెబ్సైట్ ఓపెన్ కాలేదని అధికారులు చెబుతుండటంతో ‘తనకు దిక్కెవరు’ అంటూ ఆమె కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎండుతున్న వర్షాధార పంటలు జూపాడుబంగ్లా: వర్షాధారం కింద సాగుచేసిన పంటలు ఎండిపోతుండంతో రైతులు మనోవేదనకు గురవుతున్నారు. ఖరీఫ్లో ముందుస్తుగా కురిసిన వర్షాలతో మొక్కజొన్న సాగుచేశారు. జూపాడుబంగ్లా మండలంలో 1,570 ఎకరాల్లో పైరు బాగా పెరిగింది. అయితే నెలరోజులు కావొస్తున్నా వర్షాలు కురవకపోవటంతో పైర్లు ఎండిపోతున్నాయి. ఇప్పటికే ఎకరాకు రూ.20వేలు ఖర్చు చేశామని, నష్టమే వస్తుందని రైతులు చెబుతున్నారు. వ్యవసాయ అధికారులు త్వరగా ఈక్రాప్ బుకింగ్ చేసి పంట నష్ట పరిహారం వర్తించేలా చేయాలని కోరుతున్నారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(న్యూటౌన్): రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ జనార్దన్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8వ తేదీ లోపల దరఖాస్తులు ఎంఈఓల ద్వారా సమర్పించాలని పేర్కొన్నారు. ఎలాంటి అభియోగాలు లేని, పది సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు అవార్డులకు అర్హులని తెలిపారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్గా, డీఈఓ కన్వీనర్గా, డైట్ ప్రిన్సిపాల్ ఎన్జీఓ ప్రతినిధి, జిల్లా అధికారి సభ్యులుగా ఎంపిక కమిటీ ఉంటుందని పేర్కొన్నారు. ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేస్తాం నంద్యాల: ప్రజల ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అదిరాజ్సింగ్రాణా తెలిపారు. సోమవారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చట్ట పరిధిలో సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, ఫిర్యాదులు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలన్నారు. నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, ఫిర్యాదుదారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత అధికారులకు సూచించారు. పీజీఆర్ఎస్లో 97 ఫిర్యాదులు వచ్చాయని, వీటిని పరిష్కరించాలని కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
పనిచేయని సెల్ఫోన్లు మాకొద్దు
ఆళ్లగడ్డ: సెల్ఫోన్ పనిచేయదు.. సెల్ఫోన్ పనిచేస్తే సిమ్ పనిచేయదు.. ఇలాంటివి మాకెందుకు అని ప్రభుత్వం సరఫరా చేసిన సెల్ఫోన్లను అంగన్వాడీ కార్యకర్తలు సోమవారం ఐసీడీఎస్ కార్యాలయంలో వెనక్చిచ్చి నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని అంగన్వాడీ కార్యకర్తలు అందరూ పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయం చేరుకుని మూకుమ్మడిగా తమ సెల్ఫోన్లను వెనక్కిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ఏమాత్రం పనిచేయని సెల్ఫోన్లు సరఫరా చేసి ఇవి పాడైతే మీరే బాధ్యులవుతారని పూచీకత్తు కూడా రాయించుకోవడం దారుణమన్నారు. సెల్ఫోన్లకు ఇచ్చినా నెట్ కూడా సరిగా పనిచేయడంతో అర్ధరాత్రి సమయంలో మేల్కొని సమాచారాన్ని పంపించాల్సి వస్తోందని వాపోయారు. రాజకీయ వేధింపులు ఆపాలని, కనీస వేతనం రూ.26వేల ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సరఫరా చేసిన సెల్ఫోన్లు, సిమ్లు వెనక్కిచ్చి అంగన్వాడీల నిరసన -
8 నుంచి శ్రీ రాఘవేంద్రుల ఆరాధనోత్సవాలు
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ రాఘవేంద్ర స్వామి 354వ ఆరాధన ఉత్సవాలకు సకల ఏర్పాట్లు పూర్తిచేసినట్లు శ్రీ మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు తెలిపారు. ఈనెల 8 నుంచి 13వ తేది వరకు రాఘవేంద్ర స్వామి సప్తరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈనేపథ్యంలో సోమవారం శ్రీ మఠం గురునివాస్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పీఠాధిపతి మాట్లాడుతూ ఆరు రోజుల పాటు జరిగే వేడుకల్లో భాగంగా 10వ తేదీన పూర్వరాధన, సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం, కాంచీపురం వరదరాజులు, శ్రీరంగపట్నం రంగనాథ స్వామి ఆలయాల నుంచి పట్టువస్త్రాల సమర్పణ ఉంటుందన్నారు. 11వ తేదిన మద్యారాధనలో భాగంగా మూలబృందావనానికి మమాపంచామృతాభిషేకం, పాదుకా పట్టాభిషేకం, స్వర్ణరథోత్సవం నిర్వహిస్తామన్నారు. 12వ తేదిన ఉత్తారారాధనలో భాగంగా మూలబృందావనానికి వజ్రరత్నకవచధారణ, వసంతోత్సవం, మహారథోత్సవం కనులపండువగా చేపడతామన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక దర్శన క్యూలైన్లు ఏర్పాటు చేశామని.. వయోవృద్ధులు, దివ్యాంగులు, గర్భిణిలు, వీఐపీల కోసం ప్రత్యేక క్యూలైన్ సదుపాయం కల్పిస్తామన్నారు. -
వైఎస్సార్సీపీ పాలనలో ఐదేళ్లూ పెరగని ధరలు
ఒక్క ఎరువు బస్తా కూడా దొరకలేదు గతేడాది పండించిన పంటలకు మద్దతు ధర లభించకపోవడంతో తీవ్రంగా నష్టపోయా. ఈ ఏడాది ఖరీఫ్కు అవసరమైన యూరియా ఆర్ఎస్కే, సహకార సొసైటీల్లో దొరకడం లేదు. యూరియా ఎప్పుడు వస్తుందో.. ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. టీడీపీ నాయకులు వాటిని గద్దల్లా తన్నుకపోతున్నారు. పేరు నమోదు చేసుకొని పది రోజులు అవుతున్నా ఒక్క యూరియా బస్తా దొరకలేదు. – మధుబాబుగౌడ్, కానాల గ్రామం, నంద్యాల మండలం అడ్డగోలుగా ధరలు పెంచేస్తున్న కంపెనీలు ● నోరు మెదపని కూటమి ప్రభుత్వం ● ఇప్పటికే మూడుసార్లు పెరిగిన ధరలు ● ఒక్కో రైతుపై రూ.4వేల నుంచి రూ.6వేల భారం ● పెట్టుబడిలో రసాయన ఎరువుల ఖర్చే అధికం ● గగ్గోలు పెడుతున్న రైతులునంద్యాల(అర్బన్)/కర్నూలు(అగ్రికల్చర్): మోతాదుకు మించి రసాయన ఎరువులను వినియోగంతో వ్యవసాయంలో పెట్టుబడి వ్యయం పెరిగిపోతోంది. ఎరువుల వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సి ఉండగా కాగితాలకే పరిమితం అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఎరువుల ధరలు అడ్డుగోలుగా పెరిగిపోవడం పట్ల రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో ఎరువుల ధరలు పెంచే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. అయితే ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా ధరలు పెంచుకునే వెసులుబాటును కేంద్రం ఫర్టిలైజర్ కంపెనీలకు ఇవ్వడంతో ధరలు ఏడాదిలో రెండు, మూడు సార్లు పెంచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ, జనసేన మద్దతు ఇస్తున్నాయి. రాష్ట్రంలోనూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. అయినప్పటికీ ధరల పెరుగుదలను నిలువరించే ప్రయత్నం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఏటా దాదాపు 5 లక్షల టన్నుల రసాయన ఎరువులు వినియోగిస్తున్నారు. ఒక టన్ను అంటే 50 కిలోల బస్తాలు 20 ఉంటాయి. బస్తాపై కనిష్టంగా రూ.50 నుంచి రూ.330 వరకు ధర పెరిగింది. అంటే టన్నుపై కనిష్టంగా రూ.1000 నుంచి గరిష్టంగా రూ.6వేల వరకు ధర పెరగడం ఆందోళన కలిగిస్తోంది. త్వరలోనే డీఏపీ ధర కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ ‘పైసా’చికం నంద్యాల పట్టణ సమీపంలోని రైతునగర్, నూనెపల్లె ప్రాంతాలను టీడీపీ నాయకులు ఎరువు కేంద్రాలుగా చేసుకున్నారు. అధిక ధరలకు విక్రయిస్తున్నారు. నిత్యం వందలాది యూరియా లోడ్లు ఇక్కడికి వచ్చి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నాయి. గత వారం 6వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు వస్తుందని అధికారులు పేర్కొనగా 2,600 టన్నులు మాత్రమే వచ్చింది. వచ్చిన వాటిలో ప్రతి ఆర్ఎస్కేకు రెండు లారీలు (దాదాపు 532 ప్యాకెట్లు), సొసైటీలకు రెండు లారీలు యూరియా పంపారు. ఆర్ఎస్కేలు, సొసైటీలకు వస్తున్న ఎరువులను టీడీపీ నేతలు ఇతర ప్రాంతాలకు తరలించి నిల్వ చేస్తున్నారు. అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల యూరియా కోసం నందికొట్కూరు మండలంలో రైతులు రోడ్డెక్కారు. సోమవారం నంద్యాల మండలం కానాల గ్రామ రైతుల రాస్తారోకో చేశారు. అధికారులతో వాగ్వాదం చేశారు. గోస్పాడు మండలం సాంబవరం గ్రామంలో టీడీపీ వారికే యూరియా ఇస్తాం, ఇతరులకు ఇవ్వమంటూ అధికారుల ముందే టీడీపీ నాయకులు హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.పెరిగిన రసాయన ఎరువుల ధరలు ఇలా.. ఎరువు పేరు పాత ధర కొత్త ధర (రూ.లలో) పోటాష్ 1535 1800 20–20–0–13 1300 1425 (ప్యాక్ట్) 20–20–0–13 1300 1350 (గ్రోమర్) 20–20–0–13 1300 1400 (పీపీఎల్) 10–26–26 1470 1800 12–32–16 1470 1720 (ఇప్కో) 16–16–16 1450 1600 14–35–14 1700 1800 (గ్రోమర్) సింగల్ 580 640 సూపర్ పాస్పేటు 16–20–0–13 1250 13002014–15 నుంచి 2018–19 వరకు టీడీపీ అధికారంలో ఉంది. అప్పట్లో కూడా టీడీపీ బీజేపీ కొమ్ము కాసింది. ఆ సమయంలో ఏకంగా నాలుగైదు సార్లు రసాయన ఎరువుల ధరలు పెరిగాయి. 2019–20 నుంచి 2023–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉంది. ఆ సమయంలో రసాయన ఎరువుల ధరలు ఒక్కసారి కూడా పెరిగిన దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 14 నెలల్లోనే రైతుల నడ్డి విరిగే విధంగా ఽమూడు దఫాలుగా ధరలు పెంచడం గమనార్హం. ఎరువుల ధరలు పెంచడంలో టీడీపీ, జనసేనలు కేంద్రానికి పూర్తి మద్దతు ఇచ్చాయనే ప్రచారం జరుగుతోంది. -
భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి
ఆత్మకూరు: భూ సమస్యలపై ఎక్కువ అర్జీలు వస్తున్నాయని, రెవెన్యూ అధికారులు వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న మార్గదర్శి కుటుంబాలను నమోదు చేయాలన్నారు. వాట్సాప్ గవర్నర్స్, మనమిత్రపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గాల్లో అవగాహన కల్పించేలా ర్యాలీ నిర్వహించాలన్నారు. ఆర్డీఓ నాగజ్యోతి, తహసీల్దార్ రత్నరాధిక, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు. అర్జీలు కొన్ని.. ● తనకున్న 2.80 ఎకరాల భూమిని శ్రీశైలం కుడి మెయిన్ కెనాల్ కోసమని ప్రభుత్వ భూమిగా ఆన్లైన్లో నమోదు చేశారని, దాన్ని పట్టా భూమిగా మార్చాలని ఆత్మకూరు మండలం పాములపాడు గ్రామానికి చెందిన బాలస్వామి అర్జీ ఇచ్చారు. ● తనకున్న భూమిపై ఆర్వోఆర్ కింద నోటీసులు ఇచ్చారని, తన పేరును అసైన్డ్ నుంచి తొలగించారని, న్యాయం చేయాలని బండిఆత్మకూరు మండం బోదనం గ్రామానికి చెందిన పెద్దన్న అర్జీ ఇచ్చారు. ● కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురం గ్రామానికి చెందిన 39 ఎస్సీ కుటుంబాలవారికి చెందిన భూములు వివిధ కారణాలతో ఆన్లైన్లో చూపలేదని, చర్యలు తీసుకోవాలని అర్జీ ఇచ్చారు. ● ఆత్మకూరు మండలంలోని పెచ్చెరువు చెంచు గూడెంలో చెంచు గిరిజనులకు ఇంతవరకు పొలాలు చూపలేదని, ఎలాంటి పట్టాలు కూడా మంజూరు చేయలేదని న్యాయం చేయాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు అర్జీ ఇచ్చారు. ● శ్రీశైలం మండలం సున్నిపెంట గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వాలిన వినతిపత్రం ఇచ్చారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి -
టీడీపీ నాయకులే ఎరువులు అమ్మేస్తున్నారు
● యూరియా కొరత సృష్టించి బ్లాక్లో విక్రయిస్తున్నారు ● జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్కు వినతిపత్రం ఇచ్చిన వైఎస్సార్సీపీ నేతలునంద్యాల: ఎరువులను రైతులకు ఇవ్వకుండా టీడీపీ నాయకులు అమ్ముకుంటున్నారని వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు కాటసాని రామిరెడ్డి, శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డిలు ఆరోపించారు. డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా టీడీపీ నాయకులు పనిచేస్తున్నారని విమర్శిచారు. జిల్లాలో యూరియాతో సహా ఎరువుల కొరత, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, శిల్పారవిచంద్రకిశోర్రెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా, జెడ్పీచైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ పీపీనాగిరెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వంగాల మహేశ్వర రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ను కలిశారు. రైతుల సమస్యలపై చర్చించి వినతి పత్రం అందజేశారు. ● కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. రైతులు కష్టాలు పడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం సమీక్షలు చేసే పరిస్థితి కూడా కనిపించడంలేదన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించకుండా కక్షసాధింపు , డైవర్షన్ రాజకీయాలకే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పెట్టుబడి సహాయం కింద సంవత్సరానికి రూ.20వేలు చొప్పున రెండు సంవత్సరాలకు ప్రతీ రైతుకు రూ.40వేలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.5వేలు మాత్రమే ఇచ్చారన్నారు. ● శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని రైతులకు యూరియా ఎరువులు దొరకడం లేదని, టీడీపీ నాయకులు బ్లాక్ చేసి అమ్ముకుంటున్నారన్నారు. అధికారులు పంపిణీ చేయాల్సిన ఎరువులను టీడీపీ నాయకులు ముందుండి టీడీపీ కార్యకర్తలకే అందజేస్తున్నారన్నారు. ఎరువుల కొరతతో రైతులు అష్టకష్టాలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ● గంగుల బిజేంద్రారెడ్డి మాట్లాడుతూ.. నిజమైన రైతులకు ఎరువులు అందకుండా టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారన్నారు. టీడీపీ నాయకులే అధిక ధరలకు ఎరువులు పంపిణీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాడుతుందన్నారు. ● రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ పీపీనాగిరెడ్డి మాట్లాడుతూ.. యూరియా బస్తాపై బ్లాక్ మార్కెట్లో రూ.60 నుంచి రూ.100 వరకు అదనంగా వసూలు చేస్తున్నారన్నారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి, అధిక రేట్లు పెట్టి ప్రైవేటు వ్యాపారస్తుల వద్ద ఎరువులు రైతులు కొనాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ.. ఎరువులను పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందన్నారు. రైతులకు అందుబాటులో ఎరువులు ముఖ్యంగా యూరియా దొరక్కపోవడంతో ఎక్కడకు వెళ్లాలో రైతులకు అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. ఎమ్మెల్సీ ఇసాక్బాషా మాట్లాడుతూ.. రైతుకు విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ అండగా ఉన్న ఆర్బీకేల వ్యవస్థను పూర్తిగా కూటమి ప్రభుత్వం నీరుగార్చిందన్నారు. గ్రామస్థాయిలో రైతులకు చేదోడుగా ఉన్న వ్యవస్థలను ధ్వంసం చేసి రైతులను రోడ్డు పాలు చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. -
భక్తుల జేబుకు చిల్లు
● శ్రీగిరిలో అధికరేట్లకు ఆహార పదార్థాలు ● హోటళ్లు, దుకాణాలపై కొరవడిన అధికారుల పర్యవేక్షణ శ్రీశైలంటెంపుల్: భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనార్థం శ్రీశైలం వచ్చే భక్తులకు జేబులకు చిల్లులు పడుతున్నాయి. క్షేత్రంలో ఆహార పదార్థాల ధరలు అకాశాన్ని అంటుతున్నాయి. దేవస్థాన అధికారులు, సివిల్ సప్లై అధికారులు ధరల నియంత్రణలో విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో మల్లన్న దర్శనార్థం వచ్చే భక్తులకు అధిక ధరల పోటు తప్పడం లేదు. శ్రీగిరి క్షేత్రంలో చిన్న, పెద్దహోటళ్లు అన్ని కలిపి 50 వరకు ఉంటాయి. క్షేత్రంలో ప్రైవేట్ హోటళ్లలో టిఫిన్, భోజనం చేద్దామంటే భక్తుల జేబుకు చిల్లులు పడే ధరలు దర్శనమిస్తున్నాయి. భక్తుల అవసరాలను అసరాగా చేసుకుని స్థానిక ప్రైవేట్ వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు లేకుండా అధిక ధరలకు విక్రయిస్తున్నా అడిగేవారు లేరు. శివరాత్రి, ఉగాది ఉత్సవాల సమయంలో మాత్రమే సివిల్ సప్లై అధికారులు ధరలను ఫిక్స్ చేసి ధరల పట్టిక ఏర్పాటు చేస్తారు తప్పా..మిగతా రోజుల్లో అంతా వ్యాపారుల చేతుల్లోనే ధరలు ఉంటాయి. హోటల్లో ఆహార పదార్థాలలో నాణ్యమైన పదార్థాలు వినియోగిస్తున్నారా? లేదా? అని తనిఖీలు చేసే అధికారులు కరువయ్యారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు జిల్లా కేంద్రంలో ఉండడం, జిల్లా కేంద్రానికి శ్రీశైలం సుదూర ప్రాంతం కావడంతో ఇక్కడికి వచ్చి ఆహార పదార్థాల శాంపిల్స్ తనిఖీ చేసే అధికారులు కరువయ్యారు. తక్కువ ధరకు వచ్చే వస్తువులతో ఆహార పదార్ధాలు తయారు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆహార పదార్థాల తయారీలో శుచీ, శుభ్రతను సైతం పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై న దేవస్థానం, సివిల్ సప్లై అధికారులు స్పందించి శ్రీశైల మహాక్షేత్రంలో ఆహర పదార్థాలను అధిక ధరలకు విక్రయించకుండా, సామాన్య భక్తులకు సైతం అందుబాటులో ఉండేవిధంగా ధరలను నిర్ణయించి, ధరల పట్టికను హోటల్ నిర్వాహకులు ప్రదర్శించేలా ఏర్పాటు చేసి భక్తుల జేబులకు చిల్లులు పడకుండా తగు చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు కోరుతున్నారు. -
కారుణ్య నియామకాలు
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ పరిధిలో నలుగురికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలను కల్పించి వివిధ కార్యాలయాలకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. జెడ్పీలో జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు కారుణ్య నియామకాల కింద మృతిచెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించామన్నారు. జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి మాట్లాడుతూ.. జెడ్పీ యాజమాన్య పరిధిలోని ఆయా కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న కార్యాలయ సహాయకుల పోస్టుల్లో వీరి ని నియమించామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగాలు పొందిన వారిలో నీరజాబాయి (జెడ్పీహెచ్ఎస్, నొస్సం), పీ శేఖర్ (ఎంపీపీ, ఓర్వకల్), ఎన్ రమాదేవి (పీఆర్ పీఐయూ డివిజన్, నంద్యాల), విజయ కుమారి (జెడ్పీహెచ్ఎస్, గార్గేయపురం) ఉన్నారు. -
మెరుగైన వైద్య సేవలు అందించండి
శ్రీశైలంప్రాజెక్ట్/ శ్రీశైలం టెంపుల్: రోగులకు వైద్యులు నిత్యం అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆదేశించారు. సున్నిపెంట కమ్యూనిటీ హెల్త్ సెంటర్, శ్రీశైలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఆదివారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రతిరోజు ఎంత మంది పేషెంట్లు ఆసుపత్రికి వస్తున్నా రు? వైద్యులు అందుబాటులో ఉన్నారా.. లేదా? ఎంత మంది డాక్టర్లు, సిబ్బంది పని చేస్తున్నారా లేదా?.. అంటూ వైద్య సిబ్బందిని, పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరు పేదలు మాత్రమే ప్రభుత్వాసుపత్రులకు వస్తుంటారని, వారిని దృష్టిలో ఉంచుకొని మానవత్వంతో వైద్యం అందించాలన్నారు. సున్నిపెంట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ వెంట డాక్టర్ లీలా వినయ్రెడ్డి, డాక్టర్ యజ్ఞప్రసాద్, హెడ్నర్స్ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. -
జలుబు చేస్తే.. జ్వరం వస్తే.. విపరీతమైన నొప్పులు బాధిస్తుంటే... స్థానికంగా డాక్టర్లు ఉండరు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్తే వైద్య పరీక్షలు చేసే వారు కనిపించరు.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని చాలా మంది ఆర్ఎంపీల వద్దకు వెళ్తున్నారు. అక్కడ ప్రథమ చికిత్స చ
● ఇష్టానుసారంగా ఆర్ఎంపీల వైద్యం ● ఇటీవల నందికొట్కూరులో మహిళకు అబార్షన్ ● గత నెలలో కల్లూరులో ఓ మహిళకు వికటించిన వైద్యం ● తరచూ జిల్లాలో ఎక్కడో చోట ఇలాంటి ఉదంతాలు ● పట్టించుకోని వైద్య ఆరోగ్య శాఖ కర్నూలు(హాస్పిటల్): ఆర్ఎంపీలు చేస్తున్న వైద్యానికి అమాయకులైన పేదల ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. వెళ్లిన వెంటనే పనైపోతుందని, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతో వారు ఆర్ఎంపీల వద్ద చికిత్స చేయించుకుంటున్నారు. అర్ధరాత్రి అయినా వీరు అందుబాటులో ఉండటం, ఏ రోగమైనా రెండు ఇంజెక్షన్లు వేస్తే తగ్గిపోతుందని ప్రజల్లో నమ్మకం బలంగా ఏర్పడటంతో ప్రజలు ఆర్ఎంపీలను నమ్ముకుంటున్నారు. అధిక శాతం అప్పటికప్పుడు వ్యాధి నయం అవుతున్నా...కొందరికి భవిష్యత్తులో, మరికొందరికి కొన్ని రోజుల తర్వాత రియాక్షన్ వస్తోంది. ఇలాంటి వారు చివరి దశలో నిపుణులైన వైద్యుల వద్దకు చికిత్స చేయించుకుంటున్నారు. నకిలీ వైద్యుల చికిత్సతో సైడ్ఎఫెక్ట్ వచ్చి మెరుగైన వైద్యం కోసం వచ్చే వారి సంఖ్య కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోజురోజుకూ పెరుగుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఐదు వేల మందికి పైగా ఆర్ఎంపీలు రోగులకు చికిత్స అందిస్తున్నారు. వీరి నిర్వహించే క్లినిక్లకు ఎలాంటి అనుమతులు ఉండవు. అవసరమైన మందులు, వైద్యపరీక్షల పరికరాలు, స్కానింగ్ మిషన్లు వీరి వద్ద ఉన్నా కూడా ఎవ్వరూ అడగరు. ఇలాంటి అనుమతి లేని ఆసుపత్రుల కారణంగా ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. నాడు మారుమూల పల్లెకూ వైద్యం ప్రజలకు నిపుణులైన వైద్యనిపుణులు అందుబాటులో ఉండేందుకు గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతా ల్లో విలేజ్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేసింది. గ్రామీ ణ ప్రాంత ప్రజలకు ఎలాంటి అనారోగ్యం వచ్చినా ప్రథమ చికిత్స కోసం వీటిని సంప్రదించేలా చర్యలు తీసుకుంది. అక్కడ ప్రాథమిక వైద్యపరీక్షలతో పాటు బీఎస్సీ నర్సింగ్ చదివిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు జిల్లా లో 450లకు పైగా విలేజ్హెల్త్ క్లినిక్లు ఏర్పాటయ్యా యి. వీరి స్థాయికి మించిన వ్యాధి వస్తే ముందుగా పీహెచ్సీల్లోని వైద్యాధికారిని సంప్రదిస్తారు. వారికీ అర్థం గాకపోతే టెలిమెడిసిన్ ద్వారా కర్నూలు జీజీహెచ్, నంద్యాల జీజీహెచ్లలోని టెలిమెడిసిన్ వైద్యులకు వీడియో కాల్ ద్వారా కలిసి రోగికి ఉన్నచోటే అవసరమైన వైద్యాన్ని అందించేలా ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా రోగి వద్దకే వైద్యులు వచ్చి చికిత్స అందించేవారు. ఆరోగ్య రక్ష కార్యక్రమం ద్వారా ఊళ్లోనే వైద్యశిబిరాలు ఏర్పా టు చేసి చికిత్స అందించేవారు. అలాగే పట్టణాల్లో మురికివాడల్లో సైతం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మరింతగా పెంచి అక్కడ ఎంబీబీఎస్ చదివి న వైద్యులను నియమించారు. బేసిక్ వ్యాధులన్నింటికీ అక్కడ వైద్యపరీక్షలు నిర్వహించేలా ఏర్పాటు చేశారు. అవసరమైన ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టులు సైతం ఇక్కడ ఉన్నారు. మురికివాడల్లోని పేదలు ఆర్ఎంపీల వద్దకు వెళ్లకుండా ఇక్కడే వారికి ప్రాథమిక స్థాయి వైద్యం అందుబాటులోకి తెచ్చారు. అల్లోపతి వైద్యుల ఖర్చుకు భయపడి! వైద్యం ప్రస్తుత పరిస్థితుల్లో భారంగా మారింది. పట్టణాల్లోని వైద్యుల వద్దకు జ్వరం వచ్చిందని వెళ్లినా రూ.3వేల నుంచి రూ.5వేల దాకా ఖర్చు వస్తోంది. పెద్దరోగమైతే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అందుకే ఏ చిన్నరోగమొచ్చినా మందుగా ఆర్ఎంపీలనే ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్ఎంపీలు తెలిసీ తెలియని వైద్యంతో వారికి చికిత్స చేసి ప్రాణాల మీదుకు తీసుకొస్తున్నారు. కొందరు సైలెన్లు(ఫ్లూయిడ్స్) ఎక్కించడంతో పాటు ప్రసవాలు, అబార్షన్లు, స్కానింగ్, మైనర్ సర్జరీలు నిర్వహిస్తున్నారు. కర్నూలు, కోడుమూరు, గూడూరు, ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు వంటి ప్రాంతాల్లో ఆసుపత్రులు కూడా తెరిచి ఆర్ఎంపీలు వైద్యం చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. విచ్చలవిడిగా ఆర్ఎంపీల వైద్యం మృతులు వీరే.. గ్రామాల్లో సాయంత్రం దాటితే విలేజ్ హెల్త్ క్లినిక్లో కమ్యూనిటీ ఆఫీసర్లు, యుపీహెచ్సీల్లో వైద్యాధికారులు అందుబాటులో ఉండటం లేదు. ప్రజలు ఉదయం పనులకు వెళ్లిన సాయంత్రం మాత్రమే ఇళ్లకు చేరుకుంటారు. ఆ సమయంలో వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతో స్థానికంగా ఉండే ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. వైద్యం చేయడానికి వీరికి ఎలాంటి అర్హత లేకపోయినా రోగులకు చికిత్స చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కర్నూలులోని పలు ప్రాంతాల్లో కొందరు ఆర్ఎంపీలు ఇష్టానుసారం వైద్యం చేస్తున్నారు. గూడూరు, కోడు మూరు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూ రు, కౌతాళం, హాలహర్వి, ఆలూరు మండలాల్లో 5వేల మందికి పైగా ఆర్ఎంపీలు ఉన్నారు. గడివేముల మండలం గని గ్రామానికి చెందిన శివమ్మ కుమార్తె శ్రీవాణి గత నెల 28న నందికొట్కూరు పట్టణంలోని గీతారాణి అనే మహిళకు ఆర్ఎంపి వద్ద అబార్షన్ చేయించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో 30వ తేదీన ఆమె మృతి చెందారు. ఆమెకు కర్నూలులోని కొత్తబస్టాండ్ వద్ద ఉన్న ఓ హాస్పిటల్లో లింగనిర్ధారణ చేసినట్లు సమాచారం. శనివారం వరకు ఆ స్కానింగ్ సెంటర్ను అధికారులు తనిఖీ చేయని పరిస్థితి నెలకొంది. కర్నూలు నగరంలోని కల్లూరు ప్రాంతానికి చెందిన ఓ మహిళకు జ్వరం రావడంతో స్థానికంగా ఉండే ఆర్ఎంపీ ఇంజెక్షన్లు ఇచ్చారు. అవి వికటించి ఆమె మృతి చెందారు. కౌతాళానికి చెందిన రాణమ్మకు కీళ్లనొప్పి ఉండటంతో స్థానికంగా ఉన్న ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. ఆమెకు వరుసగా మూడు రోజుల పాటు ఇంజెక్షన్లు ఇవ్వడంతో వికటించి మృతిచెందారు. పత్తికొండ పట్టణానికి చెందిన వై.రంగస్వామి(35) ఛాతీలో మంటగా ఉండటంతో గత నెల 30న స్థానికంగా ఉన్న ఒక క్లినిక్కు వెళ్లగా అసిస్టెంట్ వైద్యం చేశాడు. ఇంటికి వెళ్లిన వెంటనే రంగస్వామి ప్రాణాలు కోల్పోయాడు. గత ఏడాది గోనెగండ్ల మండలం గంజిహల్లి గ్రామంలో రాజేష్(12) జ్వరం రావడంతో తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఆర్ఎంపీని సంప్రదించారు. అతను బాలునికి ఇంజెక్షన్ వేయడంతో అక్కడ గడ్డ ఏర్పడింది. దాని నుంచి చీము, రక్తం కారడంతో ఆసుపత్రిలో చేరగా కోలుకోలేక మృతి చెందాడు. చర్యలు తీసుకుంటాం ఆర్ఎంపీలు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. కనీసం ఇంజెక్షన్ కూడా వేయకూడదు. సర్జరీలు, ప్రసవాలు, అబార్షన్లు అసలే చేయకూడదు. ఎంబీబీఎస్ చదివిన వారు మాత్రమే అల్లోపతి వైద్యం చేయాలి. ఇతరులు వైద్యం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. ఇకపై జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక దాడులు నిర్వహిస్తాం. స్థానికంగా విచారణ చేసి వారిపై చర్యలు తీసుకుంటాం. –డాక్టర్ పి.శాంతికళ, డీఎంహెచ్ఓ, కర్నూలు శ్రీవాణి (ఫైల్) -
ఈ నెలా.. ఎగనామమే!
● బదిలీ టీచర్లకు రెండు నెలలుగా జీతాలు లేవు ● ఇప్పటికీ కేటాయించనిపొజిషన్ ఐడీలు ● జిల్లాలో దాదాపు 600 మంది ఉపాధ్యాయుల ఆందోళన ప్రభుత్వం విఫలం బదిలీ అయిన ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఒక నెల జీతాలు చెల్లించలేదంటే సాంకేతిక లోపమో, పని ఒత్తిడో అని సరిపెట్టుకోవచ్చు. కానీ రెండు నెలల జీతాలు ఆపడం అంటే సీఎస్ఈ నిర్లక్ష్యంగానే భావించాల్సి ఉంటుంది. ఇప్పటికై నా సకాలంలో బిల్లులు చేసి జీతాలు చెల్లించాలి. – నగరి శ్రీనివాసులు, 1938 జిల్లా ప్రధాన కార్యదర్శి, నంద్యాల ఉపాధ్యాయులపై కక్ష రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోంది. బోధనేతర పనులు అప్పగిస్తూ ఇబ్బందులకు గురిచేస్తోంది. అనేక రకాల లక్ష్యాలు, యాప్ అప్లోడ్ వంటి పనులు అప్పగించడం వారిని అవమానించడానికే. జీతాల చెల్లింపులో అలసత్వంపై ఉపాధ్యాయ లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. – శివయ్య, ఫ్యాప్టో చైర్మన్, నంద్యాల నంద్యాల(న్యూటౌన్): అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం పరిపాలనలో చేతులేత్తేస్తోంది. బదిలీ ఉపాధ్యాయులకు ఈ నెలా మొండిచేయి చూపింది. టీచర్ల బదిలీల ప్రక్రియ పూర్తిచేసిన ప్రభుత్వం బదిలీలు అయిన ఉపాధ్యాయులకు మాత్రం జీతాల చెల్లింపులో పూర్తిగా విఫలమైంది. దీనిపై ఉపాధ్యాయులు ఆందోళనలు, నిరసనలు చేపట్టినా సర్కారులో చలనం లేదు. ఈనెల 1వ తేదీన జీతాలు వస్తాయని ఎదురుచూసిన ఉపాధ్యాయులకు భంగపాటు మిగిలింది. సాధారణంగా బదిలీ అయిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు వారు బదిలీ అయిన ప్రాంతాల్లో జీతాలు తీసుకునేలా అక్కడి డీడీఓకు సమాచారం అందించాలి. దీని నిమిత్తం పాజిషన్ ఐడీలు కేటాయించాలి. గత నెల 15వ తేదీ లోపు అన్ని కేడర్ల ఉపాధ్యాయుల బదిలీలను పూర్తి చేశారు. నంద్యాల జిల్లాలో దాదాపు 600 మందికి పైగా స్థానచలనం కలిగింది. బదిలీలు పూర్తి చేసి నెల రోజులు దాటుతున్నా క్లియర్ వేకెన్సీల్లోకి బదిలీ అయిన వారికి మాత్రమే పాజిషన్ ఐడీలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం కొత్తగా సృష్టించిన పీఎస్ హెచ్ఎం, రీపోర్షన్మెంట్ కొత్తగా ఏర్పడిన పాఠశాలలకు బదిలీ అయిన ఉపాధ్యాయులకు మాత్రం ఇప్పటికీ పొజిషన్ ఐడీలు కేటాయించలేదు. దీంతో జూన్, జూలై నెలలకు సంబంధించి ఆగస్టు నెలలో రావాల్సిన జీతాలు ఉపాధ్యాయులకు అందలేదు. వచ్చే నెలా అనుమానమే.. ఉపాధ్యాయులను బదిలీ చేసిన తర్వాత కేడర్ స్ట్రెంగు నిర్ధారించి ఆ వివరాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీ అండ్ ఆడిట్కు అందించాలి. అయితే పాఠశాల విద్యాశాఖ ఇప్పటికీ ఆ పని చేయలేదు. కేడర్ స్ట్రెంగ్ అయిన తర్వాతే ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీలు కేటా యించే అవకాశం ఉంది. బదిలీ అయిన ఉపాధ్యాయులకు జూన్, జూలై నెలలకు సంబంధించి జీతా లు ఏరియర్ బకాయిలతో ఈనెల 10వ తేదీలోపు ట్రెజరీకి బిల్లులు పెడితేనే ఈ నెలలో జీతాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈనెల 10లోపు ఈ ప్రక్రియ పూర్తికాకుంటే బదిలీ అయిన టీచర్లకు జూన్, జూలై తో పాటు ఆగస్టు నెలకు సంబంధించిన జీతాలు కూడా సెప్టెంబర్లో పడే అవకాశం ఉండదని ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా జీతాలు లేకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించాల్సి వస్తోందని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. -
మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మ వార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. అదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వేకువ జామున పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూ లైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూ లైన్లు నిండి పోయాయి. క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, అల్పాహారం, బిస్కెట్లు దేవస్థాన అధికారులు పంపిణీ చేశారు. భక్తుల శివ నామ స్మరణతో శ్రీశైల ఆలయం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడుతున్నాయి. ఉద్యోగుల సమస్యలపై ‘మాట్లాడుకుందాం రండి’ నంద్యాల(న్యూటౌన్): సమస్యల పరిష్కారం కోసం ఈనెల 5న నంద్యాల జిల్లాలో ‘రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ ం నంద్యాల జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప పేర్కొన్నారు.ఆదివారం స్థానిక కార్యాలయంలో ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలతో పాటు ఉద్యోగులకు రా వాల్సిన ఆర్థిక బకాయిలపై ఉద్యోగులతో టీ తా గుతూ చర్చించడం జరుగుతుందన్నారు. ఉద్యోగులకు రావాల్సిన రూ.35 వేల కోట్లకు సంబంధించిన బకాయిలు దాదాపు 27 రకాల సమస్యలను మాట్లాడుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర సంఘం ఆదేశాలకు అను గుణంగా చేపడుతున్నట్లు వివరించారు. ఉద్యోగులందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నా రు. కార్యక్రమంలో ఆళ్లగడ్డ తాలూకా ఏడీఏ విజయశేఖర్, జిల్లా కార్యదర్శి తిరుపాలయ్య, జిల్లా కోశాధికారి శ్రీనివాసులు, సహాయ కార్యదర్శులు సునిల్కుమార్, విజయలక్ష్మి, నంద్యాల అధ్యక్షు డు సత్యం, వెంకటశివన్న, చక్రధర్ పాల్గొన్నారు. నేడు ఆత్మకూరులో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమంలో తనతో పాటు జిల్లా అధికారులు హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారన్నారు. జిల్లా అధికారులందరూ ఉదయం 11.00 గంటలకు ఈ కార్యక్రమానికి తప్పక హాజరుకావాలన్నారు. అలాగే కలెక్టరేట్తో పాటు మండల, డివిజన్ కేంద్రాలు, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహించి ప్రజల నుంచి యథావిధిగా విజ్ఞప్తులు స్వీకరిస్తారని చెప్పారు. అర్జీదారులు తమ దరఖాస్తులను జిల్లా కలెక్టరేట్కు వచ్చే అవసరం లేకుండా meekosam. ap. gov. in లో ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించవచ్చునన్నారు. దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో ప్రస్తుత సమాచారం ఆన్లైన్లో తెలుస్తుందని లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. -
సీమ ప్రాజెక్టులకు పూర్తిస్థాయి నీరు విడుదల చేయాలి
నంద్యాల(అర్బన్): రాయలసీమ ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. తెలుగుగంగ, గాలేరునగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు నేటికి పూర్తి కాకపోవడం, పంట కాల్వలు లేకపోవడంతో ప్రాజెక్టుల కింద ఉన్న లక్షలాది ఎకరాలకు నేటికి సాగునీరు అందలేదన్నారు. వాస్తవ పరిస్థితి ప్రపంచానికి తెలియజేసేందుకు ఆలోచన పరుల వేదిక నాయకులు విశ్రాంత ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావు నేతృత్వంలో రైతు సేవా సంస్థ అధ్యక్షుడు భవానీప్రసాద్ సాగునీటి రంగ విశ్లేషకులు లక్ష్మీనారాయణ, సామాజిక వేత్త రామారావు రాకపై ఆదివారం స్థానిక కార్యాలయంలో ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టులకు సాధారణం కంటే నెల రోజుల ముందే వరదలు వచ్చినా సీమ ప్రాజెక్టులకు ప్రభుత్వం నీటిని విడుదల చేయలేదన్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నీటిని దిగువకు విడుదల చేయడం అన్యాయమన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా గాలేరునగరి, ఎస్సార్బీసీ, తెలుగుగంగ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలన్నారు. ప్రకృతి కనికరించి కృష్ణా, తుంగభద్ర జలాలు సీమ ముగింట చేరినా నీటిని పొందలేకపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం మాటలతో కాలం వెళ్లదీస్తుందని, సీమ రైతులకు అవసరమైన నీటిని తక్షణమే అందించి ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు వైఎన్రెడ్డి, రామచంద్రారెడ్డి, వెంకటేశ్వరనాయుడు, సుధాకర్కుమార్, అసదుల్లా, భాస్కరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
‘కస్తుర్బా’ విద్యార్థినులకు అస్వస్థత
బేతంచెర్ల: పట్టణానికి సమీపంలోని కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇద్దరు విద్యార్థినులు శనివారం అస్వస్థకు గురయ్యారు. బేతంచెర్లలోని జెండాపేటకు చెందిన 9వ తరగతి విద్యార్థిని విజయలక్ష్మికి చేతులు కాళ్లు పట్టేసి ఆయాసం వచ్చింది. అలాగే 7వ తరగతి విద్యార్థిని నాగ భవానికి ఫిట్స్ వచ్చాయి. వీరికి స్థానిక పీహెచ్సీలో ప్రాథమిక వైద్యం చేశారు. విషయం తెలిసి సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భార్గవ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యాక్షుడు ఉదయ్ ఆసుపత్రికి వచ్చి విద్యార్థినులను పరామర్శించారు. ఇదే విద్యాలయంలో గత నెలలో 9వ తరగతి విద్యార్థిని లలిత మాధురి మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. అస్వస్థతకు గురైన ఇద్దరు విద్యార్థులను 108 వాహనంలో కర్నూలుకు తరలించారు. -
పొలాల్లో ‘కేబుళ్ల’ బూచోళ్లు!
మూడు సార్లు చోరీ చేశారు నా మోటారు గత ఏడాది 3 సార్లు విద్యుత్ వైర్లు కోసి చోరీ చేశారు. ప్రతి సారి దాదాపు రూ. 5 వేలు ఖర్చు వస్తోంది. పైర్లను నీరు పట్టే సమయంలో గత నెల 3వ తేదీన విద్యుత్ వైర్లను అపహరించారు. ఎన్ని సార్లు దొంగతనాలు జరుగుతాయో.. మా రైతు పరిస్థితి ఇంతే! – గాలి వెంకట సుబ్బారెడ్డి పోలీసులు స్పందించాలి గతేడాది 20 మీటర్ల చొప్పున నాలుగు సార్లు కేబుల్ను కోశారు. ప్రతి సారి 20 మీటర్లు కొత్త వైర్ వేసుకున్నాను. ఈ ఏడాది సీజన్ ప్రారంభంలోనే దొంగలించడం ప్రారంభించారు. ప్రతి సారి నాకు రూ. 5 వేలు ఖర్చు వస్తోంది. పోలీసులు స్పందించి దొంగలను అరెస్ట్ చేయాలి. –బోయ నాగరాజు ● వ్యవసాయ మోటార్ల వద్ద విద్యుత్ కేబుళ్ల చోరీ ● పైర్లకు నీరు అందకు రైతుల ఇబ్బందులు ● దొంగలను అరెస్ట్ చేయని పోలీసులు ● పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వంసంజామల: వర్షాలు అరకొర పడుతున్నాయి. భూగర్భ జలాలతో పంటలు పండిద్దామనుకుంటే దొంగలు హల్చల్ చేస్తున్నారు. పొలాల్లో విద్యుత్ మోటార్ల వద్ద కేబుళ్లను చోరీ చేస్తున్నారు. సకాలంలో నీరు అందక పైర్లు ఎండిపోతున్నాయి. వ్యయప్రయాసలకు ఓర్చలేక ఎండిపోయిన పైర్లను చూసి రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి కేబుళ్ల దొంగలను అరెస్ట్ చేయాలని కోరుతున్నారు. నిత్యం చోరీలే.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేస్తూ వస్తోంది. అయితే విద్యుత్ మోటార్ల వద్ద నిత్యం చోరీలే జరుగుతుండటంతో రైతులకు ఉచిత విద్యుత్ అందని పరిస్థితి నెలకొంది. గత ఏడాది సంజామల మండలంలోనే మూడు సార్లు విద్యుత్ వైర్లు చోరీకి గురయ్యాయి. నంద్యాల జిల్లాలో ని మిగతా మండలాల్లోనూ వ్యవసాయ మోటార్లను అపహరించుకుని వెళ్తున్నారు. జిల్లాలో బోర్లు, బావుల కింద వ్యవసాయం చేసే గ్రామాల్లో 50 మంది వరకు రైతులు బాధితులుగా ఉన్నారు. చోరీకి గురైన కేబుళ్ల కన్నా వందల అడుగులో ఉన్న మోటార్లను బయటికి తీయడంతో రూ.15 వేల వరకు ఖర్చు వస్తోందని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టాలు.. కన్నీళ్లు! ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా వర్షాలు ఆశించిన మేర లేకపోవడం.. కాపర్ వైర్ల చోరీ జరుగుతుండటంతో రైతులకు కష్టాలు చుట్టుముట్టాయి. విద్యుత్ మోటార్ల వద్ద కేబుళ్లు తరుచుగా చోరీకి గురవుతుండటంతో కన్నీళ్లు మిగులుతున్నాయి. సంజామల మండలం రెడ్డిపల్లె గ్రామంలో 20 రోజుల క్రితం మోటార్ల విద్యుత్ తీగలతో పాటు రైల్వే ట్రాక్ పనులకు చెందిన దాదాపు రూ.6 లక్షల గల కాపర్ విద్యుత్ వైర్లను దొంగలించారు. రాంకో ఫ్యాక్టరీ యాజమాన్యం సంజామల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆకుమల్లలో గ్రామంలో గత ఏడాది 30 మంది రైతుల వ్యవసాయ విద్యుత్ కేబుళ్లు చోరీకి గురయ్యాయి. గత నెల 3వ తేదీ గ్రామనికి చెందిన మాజీ సర్పంచ్ ఉస్సేనికి చెందిన రూ.32 వేలు వ్యవసాయ మోటార్ అపహరణ అయ్యింది. పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదు అందినా ఇప్పటి వరకు దొంగలను అరెస్ట్ చేయలేదు. -
దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(న్యూటౌన్): పట్టణంలోని ఈఎస్సీ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శైలేంద్రకుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో 18, సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో మూడు సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. పాలిసెట్ ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులు, రాయని వారు కూడా అర్హులని తెలిపారు. విద్యార్థులు ఈనెల 5వ తేదీన ఉదయం 9.30 గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. సేద్యం ఖర్చులు తగ్గిస్తూ తీర్మానం పగిడ్యాల: రైతుల సేద్య ఖర్చులను తగ్గిస్తూ గ్రామ కమిటీ సభ్యులు తీర్మానం చేశారు. కూలీ రేట్లు, గడెం, ట్రాక్టర్ బాడుగలు నిర్ణయించిన మేరకే తీసుకోవాలని ఆదేశించారు. కమిటీ తీర్మానం మూడేళ్ల పాటు అమల్లో ఉంటుందని చెప్పారు. నెహ్రూనగర్ సచివాలయ రచ్చకట్ట వద్ద రైతులతో శనివారం గ్రామ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. రైతులు పలు సమస్యలు చెప్పడంతో పై నిర్ణయం తీసుకున్నారు. వీబీఆర్లో 14 టీఎంసీల నీరు వెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (వీబీఆర్)లో శనివారం సాయంత్రానికి 14.793 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఏఈ శివనాయక్ తెలిపారు. బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వీబీర్కు 14,600 క్యూసెక్కుల నీరు వస్తోందన్నారు. వీబీఆర్ నుంచి మద్రాస్ కాల్వ, స్విల్వే, వన్ ఆర్, వన్ఎల్ తూముల నుంచి 14,580 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. వైద్యాధికారికి, సిబ్బందికి మెమోలు కొత్తపల్లి: ఎర్రమఠం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వైద్యాధికారి, సిబ్బందికి మెమోలు జారీ చేసినట్లు జిల్లా వైద్యాధికారి వెంకటరమణ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తనకు చెప్పకుండా సెలవు తీసుకోవడంతో వైద్యాధికారికి మెమో ఇచ్చానని పేర్కొన్నారు. విధుల్లో వైద్యం సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నారని, వైద్యశాల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో మెమో జారీ చేసినట్లు తెలిపారు. పీఆర్సీ కోసం ఉపాధ్యాయుల ధర్నా నంద్యాల(న్యూటౌన్): ఫ్యాప్టో సంఘం ఆధ్వర్యంలో నంద్యాలలోని కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయలు ధర్నా నిర్వహించారు. పెండింగ్లో ఉన్న కరువు భత్యాలను విడుదల చేయాలని, 12వ పీఆర్సీ కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు. ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకులు హృదయరాజు, ఫ్యాప్టో చైర్మన్ శివయ్య, జనరల్ సెక్రటరీ దస్తగిరిబాషా, నగరి శ్రీనివాసులు మాట్లాడుతూ.. పీ4 కార్యక్రమాన్ని ఉపాధ్యాయులకు నిర్బంధం చేయరాదన్నారు. పంచాయతీరాజ్ యాజమాన్యంలో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలు తక్షణమే చేపట్టాలన్నారు. రిటైర్మెంట్ అయిన వారికి వెంటనే గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాస్మెంట్ తదితర బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఆర్ఓ రామునాయక్కు అందజేశారు. ఫ్యాప్టో నాయకులు సుధాకర్, మౌలాలి, అజాంబేగ్, గోపాలకృష్ణ, ఏపీటీఎఫ్ నాయకులు రామచంద్రారెడ్డి, భాస్కరరెడ్డి, మాధవస్వామి, సాంబశివుడు, జానీబాషా, మహమ్మద్ అనీఫ్, యూనిస్ బాషా, రవికుమార్, సుబ్బన్న, లక్ష్మణనాయక్, తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాకు ఎల్లో అలర్ట్ ● 5, 6 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కర్నూలు(అగ్రికల్చర్): రుతుపవనాల ప్రభావం వల్ల ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ నెల 6 తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అనంతపురం వాతావరణ కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. ఈ నెల 5వ తేదీ ఉమ్మడి కర్నూలు జిల్లాకు విశాఖపట్టణంలోని వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ ప్రకటించిందని, 6వ తేదీన కర్నూలు జిల్లాకు ఎల్లో అలర్ట్ ఉందన్నారు. రుతుపవనాలు చురుగ్గా ఉండటం వల్ల ఆయా తేదీల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రోజుకు 64.5 నుంచి 115.5 మి.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నప్పుడు ఎల్లో అలర్ట్ ప్రకటిస్తారన్నారు. -
వరద నీటి సద్వినియోగంలో విఫలం
కర్నూలు(అర్బన్): ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని సద్వినియోగం చేసుకోవడంలో జల వనరుల శాఖ ఇంజనీర్లు పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. ఇంజనీర్ల నిర్లక్ష్యం వల్ల ప్రస్తుత ఖరీఫ్లో కూడా పంటలు ఎండిపోయి, తాగునీరు అందని పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంది. శ్రీశైలంలో 854 అడుగుల మేరకు నీరు ఉంటే పోతిరెడ్డిపాడుకు నీటిని విడుదల చేసుకునే అవకాశం ఉన్నా, ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్లోని మినీ సమావేశ భవనంలో నీటి పారుదల అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ సకాలంలో చర్యలు చేపట్టకపోవడం వల్ల గత మూడు రోజులుగా 20 నుంచి 30 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నీటి విడుదలకు సంబంధించి కేఆర్ఎంబీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పలువురు ఇంజనీర్లు చెప్పగా, వరద ప్రవాహాన్ని ముందుగానే అంచనా వేసి ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాల్సిన బాధ్యత మీకు ఉంది కదా ? అని ఆయన ప్రశ్నించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి తెలంగాణ వారు ఏ విధంగా నీటిని వినియోగించకుంటున్నారో మీకు తెలియదా అని ప్రశ్నించారు. మే చివరి నాటికి హెచ్ఎన్ఎస్ఎస్ పనులను పూర్తి చేసి ఉంటే, ఇప్పటికే గాజులదిన్నెలో కనీసం మూడు టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉండేది కదా, జూన్ నెలాఖరు వరకు కాలువ వైడనింగ్, లైనింగ్ పనులు చేపట్టడం వల్ల ఇప్పటి వరకు కేవలం 0.2 టీఎంసీల నీరు కూడా జీడీపీకి చేరలేదని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా మనకు అరకొర వర్షాలు కురుస్తున్నా, దేవుని పుణ్యాన ఎగువన వర్షాలు కురవడంతో మనకు వరద నీరు వస్తోందని, అనుకోకుండా వరద నీరు ఆగిపోతే ఎలా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే పలువురు ఇంజనీర్లు చెప్పిన సమాధానాల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పండ్ల తోటల పెంపకంపై అవగాహన పెంచాలి కరువు జిల్లా అనంతపురం నేడు పండ్ల తోటల పెంపకంలో అగ్రగామిగా ఉందని, అన్ని రకాల పండ్లను అక్కడి రైతులు పండిస్తున్నారని ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూధన్ చెప్పారు. అయితే కర్నూలు జిల్లాలో మాత్రం మిర్చి, ఉల్లి, టమోటా, పత్తి తదితర పంటలపైనే రైతులు మొగ్గు చూపుతున్నారన్నారు. వివిధ రకాల పండ్ల తోటలను సాగు చేసుకునేందుకు ఇక్కడి రైతులకు అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే ఆయా పండ్లకు సంబంధించిన మార్కెటింగ్పై కూడా రైతులకు తెలియజేయాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈలు మహేశ్వరరెడ్డి, శ్రీధర్రెడ్డి, పీఆర్ ఎస్ఈ మద్దన్న, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈలు బి.నాగేశ్వరరావు, సీహెచ్ మనోహర్, సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణులు బీ రాధిక, చింతామణి, జెడ్పీటీసీలు సుధాకర్రెడ్డి, సుంకన్న, రఘునాథరెడ్డి, మౌలాలి, ప్రసన్నకుమార్, జగదీశ్వరరెడ్డి, మహేశ్వరరెడ్డి, శివశంకర్రెడ్డి, రామక్రిష్ణ, రంగనాథ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మినరల్ వాటర్ ప్లాంట్ కూల్చివేతపై చర్యలేవి బనగానపల్లె పాత బస్టాండ్ ప్రాంతంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు అప్పటి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ను కూల్చివేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని చైర్మన్ పాపిరెడ్డి ప్రశ్నించారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను కూడా పనిచేయకుండా చేసి పోలీసుల సాయంతో మినరల్ వాటర్ ప్లాంట్ను కూల్చారనే వాదనలు వినిపిస్తున్నాయని, ఈ ఘటనపై ఏమి చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా పంచాయతీ అధికారిణి లలితాబాయి మాట్లాడుతూ జరిగిన ఘటనను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని.. అలాగే పంచాయతీ కార్యదర్శి, డిప్యూటీ ఎంపీడీఓ ఆధ్వర్యంలో నివేదికలు తయారు చేస్తున్నారన్నారు. సకాలంలో యూరియా అందక ఇబ్బందులురైతులకు సకాలంలో యూరియా అందకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బ్లాక్ మార్కెట్లో ఒక బస్తా యూరియాను రూ.500 పెట్టి కొనాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని కొత్తపల్లి జెడ్పీటీసీ సుధాకర్రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి కలుగజేసుకుంటు రబీ సీజన్లో యూరియా కొరత తీవ్ర రూపం దాల్చిన సమయంలోనే రానున్న ఖరీఫ్లోనైనా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియాను అందించాలని స్థాయీ సంఘ సమావేశాలు, జనరల్ బాడీ సమావేశాల్లోను అధికారులను కోరామన్నారు. అయినా, ప్రస్తుత ఖరీఫ్లో యూరియా లభించక రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఇంజనీర్ల నిర్లక్ష్యంతో 20 నుంచి 30 టీఎంసీల నీరు సముద్రం పాలు సకాలంలో రైతులకు యూరియా అందక ఇబ్బందులు మినరల్ వాటర్ ప్లాంట్ కూల్చివేతపై చర్యలేవి జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి -
టీడీపీ నేత దాష్టీకంపై సమగ్ర విచారణ
ఆళ్లగడ్డ: చాగలమర్రి డిప్యూటీ ఎంపీడీఓ తాహిర్ హుస్సేన్పై టీడీపీ నేత చల్లా నాగరాజు దాష్టీకం చేయడంపై సమగ్ర విచారణ జరపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులందరికీ రక్షణ కల్పించాలంటే ఇది అత్యవసరం అని భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేయాలని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి లలితాభాయ్ని నంద్యాల జిల్లా కలెక్టర్ ఆదేశింశారు. సమగ్ర విచారణ చేసి వారం లోపు నివేదిక అందజేయాలని చాగలమర్రి ఎంపీడీఓకు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి సూచించారు. ఈ ఘటనపై గత నెల 17వ తేదీ సాక్షి దినపత్రికలో ‘పీక నొక్కి.. పిడిగుద్దులు గుద్ది’ అన్న శీర్షికన వార్త ప్రచురితమైంది. ప్రభుత్వ అధికారిపై టీడీపీ నేత దాడి చేసిన విషయాన్ని ఎమ్మెల్యే అఖిలప్రియకు ఎంపీడీఓ తెలపగా ‘నువ్వు ఇక్కడ ఉద్యోగం చేయాలంటే ఇలాంటివి ఈజీగా తీసుకోవాల్సిందే’ అని వార్నింగ్ ఇచ్చారు. అయితే రాష్ట్ర ఆల్ మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం(ఆల్ఎంఈడబ్లూఏ), నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో సమస్య తీవ్రంగా మారింది. అయితే ఎంపీడీఓ నివేదిక ఇచ్చే విషయం చర్చనీయాంశంగా మారుతోంది. -
మంత్రి బీసీ జనార్దన్రెడ్డి ప్రైవేట్ గూండాల దుర్మార్గ చర్య
బనగానపల్లె: గ్రామ పంచాయతీ, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వకుండా మంత్రి బీసీ జనార్దన్రెడ్డికి చెందిన ప్రైవేట్ గూండాలు పోలీసుల బందో బస్తుతో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ను కూల్చివేయడం దుర్మార్గమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బనగానపల్లె పట్టణం పాతబస్టాండ్లో కూల్చివేసిన వాటర్ ప్లాంట్ను శుక్రవారం భారీ జనసందోహం మధ్య మాజీ ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాతబస్టాండ్లోని గ్రామ పంచాయతీ స్థలంలో 2019లో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రభుత్వ నిధులతో ప్రజల అవసరం కోసం వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయించానన్నారు. అప్పటి నుంచి పట్టణ ప్రజలతో పాటు బనగానపల్లెకు వచ్చే గ్రామీణులు ఈ ప్లాంట్ నుంచే మంచినీటిని పొందేవారన్నారు. వాటర్ ప్లాంట్పై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తన ఫొటోను ఉండటాన్ని చుస్తూ ఓర్వలేక ప్రైవేట్ గూండాలతో మంత్రి బీసీ జనార్దన్రెడ్డి ఇంటి సమీపంలో ఉన్న వాటర్ ప్లాంట్ను కూల్చివేయడం దారుణమన్నారు. ఈ విషయంపై రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారులను అడిగితే కూల్చివేతపై తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారన్నారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల వద్ద తన ఫొటో ఎక్కడైనా అగుపిస్తే టీడీపీ వారు స్టిక్కర్లు అతికిస్తున్నారని, ఎన్నికల కోడ్ ఏమైనా అమల్లో ఉందా అని ప్రశ్నించారు. వాటర్ ప్లాంట్ను మంత్రి బీసీ జనార్దన్రెడ్డికి చెందిన సొంత స్థలంలో ఏమీ నిర్మించలేదన్నారు. మినరల్ వాటర్ ప్లాంట్తో పాటు సమీపంలోని చిరువ్యాపారుల దుకాణాలను కూడా కూల్చడం హేమమైన చర్య అన్నారు. బీసీ జనార్దన్రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బనగానపల్లె పట్టణంలో సొంత నిధులతో పాటు ప్రభుత్వ నిధులతో నిర్మించిన వాటర్ ప్లాంట్స్ను తాను అధికారంలో ఉన్న సమయంలో ఎప్పుడూ కూల్చలేదన్నారు. కాటసాని కుటుంబం 40 సంవత్సరాలుగా రాజకీయంలో ఉందని, ఏనాడూ ప్రభుత్వ ఆస్తులను కూల్చలేదని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బనగానపల్లె పట్టణంలో వంద పడకల వైద్యశాలతో పాటు సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్లు నిర్మించానని వాటిని కూడా కూల్చివేస్తారా అంటూ ప్రశ్నించారు. కూల్చివేసిన వారిపై ఫిర్యాదు చేయాలి మినరల్ వాటర్ ప్లాంట్ను కూల్చివేసేందుకు బాధ్యులైన వారిపై రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. వాటర్ ప్లాంట్ కూల్చివేతతో ఇక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని, లేదంటే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. కాటసాని వెంట అవుకు, బనగానపల్లె వైఎస్సార్సీపీ కన్వీనర్లు కాటసాని తిరుపాల్రెడ్డి, జనార్దన్రెడ్డి, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ న్యాయవాది అబ్దుల్ఖైర్, ముస్లిం మైనార్టీ నాయకుడు అత్తార్జాహెద్, నాయకులు శంకర్రెడ్డి, సిద్ధంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, అనిల్, సురేష్, కృష్ణారెడ్డి, సుదర్శన్రెడ్డి, బుచ్చిరెడ్డి, వెంకట్రామిరెడ్డి, రవికుమార్రెడ్డి, సుధాకర్రెడ్డి ఉన్నారు. ప్రజలకు మంచినీరు అందకుండా చేశారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి -
బ్యాంకుల్లో చోరీలు లేకుండా కట్టుదిట్టమైన భద్రత
● జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణానంద్యాల: బ్యాంకుల్లో దొంగతనాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అదిరాజ్సింగ్ రాణా తెలిపారు. బ్యాంకుల్లో భద్రతా ప్రమాణాలపై శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో బ్యాంక్ మేనేజర్లతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలతో పాటు మధ్యప్రదేశ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాల్లోని బ్యాంకుల్లో చోరీలు జరిగాయని, అలాంటి ఘటనలు జిల్లాలో జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. నగదు రవాణా సమయంలో శిక్షణ పొందిన లైసెన్స్ కలిగిన ఆయుధం ఉన్న గార్డులను నియమించాలని సూచించారు. బ్యాంక్లో అత్యవసర కాల్ నంబర్లు, సైబర్ క్రైమ్కు సంబంధించిన హెల్ప్ లైన్ నంబర్లను స్పష్టంగా ప్రదర్శించాలన్నారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు బ్యాంకు అధికారులకు, పోలీసు స్టేషన్కు కాల్ చేసే సౌకర్యంతో కూడిన అలారం వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కమిటీలో జిల్లా వాసులకు చోటు నంద్యాల: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాకు చెందిన పలువురికి పార్టీ అనుబంధ రాష్ట్ర కమిటీలో చోటు కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శిగా కురువ సుంకన్న(పాణ్యం), రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రటరీగా ఎస్.నాగేంద్ర(పాణ్యం), రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ జనరల్ సెక్రటరీగా ఏవీ కృష్ణారెడ్డి(శ్రీశైలం), రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ కార్యదర్శిగా ఎస్వీ రమణారెడ్డి(శైలం), రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా కె.బాబు(పాణ్యం), రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ జాయింట్ సెక్రటరీగా వి.రామకృష్ణుడు(శ్రీశైలం), రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ జాయింట్ సెక్రటరీగా బి.అబ్దుల్ఖాదర్ జిలానీ(శ్రీశైలం)లను నియమించారు. గురుకులాల్లో నేరుగా ప్రవేశాలు నంద్యాల(న్యూటౌన్): ఉమ్మడి జిల్లాలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో పదో తరగతి, ఇంటర్మీయట్లో సీట్లు ఖాళీగా ఉన్నాయని, నేరుగా భర్తీ చేయనున్నట్లు డీసీఓ శ్రీదేవి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అరికెల బాలుర కళాశాలలో సీఈసీలో ఎస్సీలకు 48, కంబాలపాడు బాలికల కళాశాలలో సీఈసీలో నాలుగు సీట్లు, బైపీసీ, జనరల్ విభాగంలో ఒక సీటు ఖాళీగా ఉందని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో పదో తరగతిలో 24, సీనియర్ ఇంటర్లో 2002, నంద్యాల జిల్లాలోని పదో తరగతిలో 16, సీనియర్ ఇంటర్లో 88 ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం 9866616633, 9010070219 నంబర్లను సంప్రదించాలన్నారు. నాణ్యతతో ‘అమృత్’ పనులు పూర్తి చేయాలి డోన్ టౌన్: అమృత్ భారత్ మహోత్సవ్ పథకం కింద చేపట్టిన పనులను త్వరితగతిన నాణ్యతతో పూర్తి చేయాలని రైల్వే సౌత్ సెంట్రల్ జోనల్ మేనేజర్ సంజీవ్కుమార్ శ్రీవాత్సవ ఆదేశించారు. ప్రత్యేక రైలులో గుంతకల్లు నుంచి హైదరాబాద్వైపు వెళుతూ డోన్ రైల్వే స్టేషన్లో శుక్రవారం కాసేపు ఆగారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ఆయన వెంట స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వర్లు, గుంతకల్లు డివిజన్ అధికారులు ఉన్నారు. ఆభరణాలు, వెండి పళ్లెం బహూకరణ డోన్ టౌన్: అహోబిలం లక్ష్మీనరసింహస్వామికి రూ.1.50 లక్షల విలువ చేసే ఆభరణాలను డోన్ పట్టణం కొండపేటకు చెందిన భాస్కర్గౌడ్, అరుణ్జ్యోతి దంపతులు బహూకరించారు. అలాగే డోన్ శ్రీషిర్డీ సాయిబాబా గుడికి రూ.43వేల విలువ చేసే వెండి పళ్లెం శుక్రవారం అందజేశారు. -
హాస్టళ్లలో నీళ్ల పప్పుతో అన్నం
నంద్యాల: ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నీళ్ల పప్పుతో అన్నం పెడుతున్నారని వైఎస్సార్సీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు సురేష్యాదవ్ అన్నారు. గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారికి వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. కలెక్టరేట్ ఎదుట సురేష్యాదవ్ విలేకరులతో మాట్లాడారు. గత నాలుగు రోజులుగా సంక్షేమ హాస్టళ్ల బాట కార్యక్రమం నిర్వహించి సమస్యలు తెలుసుకున్నామన్నారు. చాలా హాస్టళ్లలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉందని, విద్యార్థులు నేలపై నిద్రిస్తున్నారని, నేటికీ దుప్పట్లు, దోమతెరలు పంపిణీ చేయలేదని తెలిపారు. స్నానపు గదులు, మరుగుదొడ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మెనూ ప్రకారం ప్రతి రోజూ గుడ్డు, వేరుశనగ చిక్కీ, వారానికి రెండుసార్లు చికెన్ పెట్టడం లేదన్నారు. మెస్ బిల్లులు, కాస్మొటిక్ చార్జీలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు జశ్వంత్రెడ్డి, హరికిరణ్, రియాజ్బాషా, అబ్దుల్లా, శషాంక్, హేమంత్, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సురేష్ యాదవ్ -
పంద్రాగస్టు వేడుకలకు ఘన ఏర్పాట్లు
నంద్యాల: ప్రజలందరిలో దేశభక్తి భావాలు పెంపొందించేలా ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. వేడుకలు నిర్వహింఏ మైదానాన్ని ఆకర్షణీయమైన రీతిలో తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థులకు నీటి సమస్య తలెత్తకుండా ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేయాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ శాఖల శకటాలు ప్రత్యేకంగా ఉండాలన్నారు. ఆయా శాఖలు ఎగ్జిబిషన్ స్టాల్స్ను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా అభివృద్ధిపై సందేశ బుక్లెట్ను సిద్ధం చేయాలన్నారు. స్వాతంత్య్ర సమరయోధులకు, జిల్లా ప్రజాప్రతినిధులకు, అధికారులకు వేర్వేరుగా కుర్చీలు ఏర్పాట్లు చేయాలన్నారు. -
జీ–2 మాటున దందా
● జిల్లాను ముంచెత్తుతున్న అనుమతిలేని బయో స్టిములెంట్స్ ● గుంటూరు జిల్లా కేంద్రంగా ఉమ్మడి కర్నూలులోకి దిగుమతి ● మార్కెట్లోకి దొంగ బయోలు, నకిలీ పురుగు మందులు ● తూతూ మంత్రంగా స్క్వాడ్ బృందాల తనిఖీలు ● కర్ణాటక, తెలంగాణ నుంచీ అక్రమ విక్రయాలు ఇటీవల తనిఖీలకు వచ్చిన స్క్వాడ్ బృందాలు ఫామ్ జీ–2 చూడటంతోనే అంతా సవ్యంగా ఉన్నట్లు సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇన్వాయిస్ బిల్లులను పట్టించుకున్న దాఖలాలు లేవు. వీటిని పరిశీలించినప్పుడే దొంగ బయోల గుట్టురట్టవుతుంది. అయితే ఆ దిశగా చర్యలు లేకపోవడం మామూళ్ల బంధానికి నిదర్శనంగా తెలుస్తోంది. జీ–2 అనుమతి ఉన్న కంపెనీ ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్రంగా పనిచేస్తోంది. ఈ కంపెనీకి 6 ఉత్పత్తులకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. అయితే 25 రకాల ఉత్పత్తులను ఉమ్మడి కర్నూలు జిల్లాలో విక్రయిస్తున్నా వ్యవసాయ శాఖ నోరు మెదపని పరిస్థితి. .. బయో అమ్మకాల్లో కాసుల పంట పండుతుండటంతో అనేక మంది డీలర్లు వీటి అమ్మకాలపై మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కొంత మంది డీలర్లు కాలంచెల్లిన పురుగు మందులను బయోల పేరిట విక్రయిస్తున్నారు. ఆకర్షించే ప్యాకింగ్, పేర్లతో రైతులను మోసగిస్తున్నారు. -
పట్ట పగలే చోరీ
పాణ్యం: మండల కేంద్రమైన పాణ్యం విజయానికేతన్ పాఠశాల సమీపంలో ఓ ఇంట్లో పట్టపగలే చోరీ జరిగింది. గ్రామానికి చెందిన జక్కుల మద్దిలేటి డొంగు వద్ద ఉన్న హోటల్ వంట మాస్టర్గా పని చేస్తున్నారు. రోజులాగే తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు భార్యాభర్తలు హోటల్కు వెళ్లారు. ఆ సమయంలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించి మూడు బీరువాలను పగులగొట్టి రూ. 60 వేలు నగదు, ఒక ఉంగరాన్ని అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు క్లూస్టీమ్ను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. దొంగలు చోరీకి ఉపయోగించిన సుత్తి, ఇనుపరాడ్డును అక్కడే వదిలేయడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఆర్టీసీ బస్టాండ్లలో మెరుగైన వసతులు
నంద్యాల(వ్యవసాయం): జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి రజియాసుల్తానా శుక్రవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలోని బనగానపల్లె, ఆళ్లగడ్డ, నందికొట్కూరు, ఆత్మకూరు, కోవెలకుంట్ల, డోన్ డిపోలలో సీటింగ్ చైర్స్ వేయడం జరుగుతుందన్నారు. నంద్యాలలో 20 ఫ్యాన్లు, బనగానపల్లెలో 8 ఫ్యాన్లు ఏర్పాట్లు చేశామన్నారు. 23 హైటెక్ బస్సులలో పల్లెవెలుగుగా మార్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థి బస్సుల ద్వారా రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లలో అదనపు ట్రిప్పులు తిప్పుటకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం జిల్లాకు 36 సూపర్లగ్జరీ, 32 ఎక్స్ప్రెస్ బస్సులు రావడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని పల్లెవెలుగు బస్సుల కండీషన్ చెక్ చేసి అవసరమైన మరమ్మతులు చేయబడుతుందన్నారు. ఉచిత టికెట్ జారీ చేసే పద్ధతి గురించి కండెక్టర్లకు, డ్రైవర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. రోజా దర్గా భూమి అన్యాక్రాంతం కర్నూలు(అర్బన్): కర్నూలులోని సయ్యద్ ఇషాక్సనుల్లా ఖాద్రి అలియాస్ సయ్యద్ ఖాద్రి మియా సాహెబ్ (ఆర్హెచ్) రోజా దర్గాకు సంబంధించి సర్వే నంబర్ 218లోని 19.65 సెంట్ల భూమి అన్యాక్రాంతమైనట్లు వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్ షేక్ ముక్తార్ బాషా తెలిపారు. రాష్ట్ర వక్ఫ్బోర్డు చైర్మన్ ఆదేశాల మేరకు.. కల్లూరు పరిధిలోని ముజఫర్నగర్ ప్రాంతంలో ఉన్న ఈ భూమిని క్షేత్ర స్థాయిలో పరిశీలించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ భూమి వెంచర్ ఫ్లోటింగ్ అయ్యిందని, ఆక్రమణ, అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు కూడా జరిగినట్లు తమ పరిశీలనలో తెలిసిందన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు చెప్పారు. అలాగే జిల్లా కలెక్టర్ ద్వారా ఆర్డీఓ, జిల్లా రిజిస్ట్రార్కు నివేదికలు అందించామన్నారు. భూమిని ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
సమాచారం అందించడం ప్రభుత్వ బాధ్యత
● జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి పీఎల్ వరలక్ష్మి కర్నూలు(అర్బన్): పాలనా వ్యవహారాల్లో గోప్యతను నివారించి ప్రభుత్వ విధానాలను ప్రజల ముందు ఉంచేందుకు పౌరులకు కల్పించిన అద్భుత అవకాశమే సమాచార హక్కు అని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి పీఎల్ వరలక్ష్మి అన్నారు. శుక్రవారం స్థానిక మద్దూర్నగర్లోని ప్రకృతి వ్యవసాయ హాల్లో సమాచార హక్కు చట్టం –2025పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ మాధురి, సీనియర్ కన్సల్టెంట్స్ లక్ష్మయ్య, రాజేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడు తూ సమాచారాన్ని ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని, సమాచారాన్ని పొందడం పౌరుల హక్కు అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రకృతి వ్యవసాయ పంట కొత్త ప్రయోగానికి సంబంధించిన 32 కిట్లను పంపిణీ చేశారు. ఈ కిట్లను ఉపయోగించుకొని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించిన పంట ఉత్పత్తుల దిగుబడులను కచ్చితమైన దిగుబడిని అంచనా వేసేందుకు ఉపయోగించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో డీపీఎంయూ సిబ్బంది, ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ సందీప్కుమార్, లావణ్య, ఎన్ఎఫ్ఏస్ తదితరులు పాల్గొన్నారు. -
ఫైనాన్షియర్ ఇంట్లో పోలీసుల సోదాలు
ఆదోని అర్బన్: పట్టణంలోని టీజీఎల్ కాలనీలో నివాసముంటున్న యోగేష్ అనే ఫైనాన్షియర్ ఇంట్లో శుక్రవారం త్రీటౌన్ పోలీసులు సోదాలు చేశారు. త్రీటౌన్ సీఐ రామలింగమయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక సాయిబాబానగర్కు చెందిన బసవరాజుకు మండిగిరి పరిధిలో 3 ఎకరాల భూమి ఉంది. ఆయన అవసరాలకు స్థానిక టీజీఎల్ కాలనీలో నివాసముంటున్న సురేష్ శివలాల్ ఫైనాన్షియర్తో మూడు ఎకరాలు మార్ట్గేజ్ చేసి 2019లో రూ.1.80 కోట్లు రుణం తీసుకున్నాడు. అయితే ఆరు నెలల క్రితం సురేష్ శివలాల్ మృతి చెందాడు. బసవరాజు తన పొలాన్ని విడిపించుకోవడానికి వెళ్తే తన తండ్రికి అప్పుడే అమ్మేశావు కదా అని సురేష్ శివలాల్ కుమారుడు యోగేష్ చెప్పాడు. దీంతో వారి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో యోగేష్పై ఈ ఏడాది జూన్ 3వ తేదీన త్రీటౌన్ పోలీస్స్టేషన్లో బసవరాజ్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అయితే అనుమతి లేకుండా పెద్ద మొత్తంలో రుణాలు ఇస్తున్నట్లు విచారణలో తేలడంతో శుక్రవారం డీఎస్పీ హేమలత అనుమతితో యోగేష్ ఇంట్లో తనిఖీ చేసినట్లు సీఐ తెలిపారు. యోగేష్ ఇంట్లో రిజిస్ట్రేషన్ పత్రాలు, డాక్యుమెంట్లు పరిశీలించామన్నారు. తనిఖీలో ఎస్ఐ రామస్వామి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు
తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల ఒకటవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ సంవత్సరం ‘తల్లిపాల సంస్కృతిని ప్రోత్సహిద్దాం’ అనే నినాదంతో ఈ కార్యక్రమాలతో అవగాహన కల్పిస్తున్నాం. ముఖ్యంగా ముర్రుపాలు తప్పనిసరిగా బిడ్డకు పట్టించాలని సూచిస్తున్నాం. బిడ్డకు పాలివ్వడం వల్ల తల్లులకు రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల నివారణకు దోహదపడతాయని వివరిస్తున్నాం. –డాక్టర్ పి.శాంతికళ, డీఎంహెచ్వో, కర్నూలు తల్లిపాలతో బిడ్డకు అనుబంధం బిడ్డ జన్మించిన అరగంటలోపే తల్లికి పాలు వస్తాయి. ఈ ముర్రుపాలను బిడ్డకు తప్పనిసరిగా పట్టించాలి. ఇందులో బిడ్డకు అవసరమైన వ్యాధినిరోధక శక్తి ఉండి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఆరు నెలల వరకు బిడ్డకు తల్లిపాలు మాత్రమే పట్టించాలి. ఈ పాల ద్వారా బిడ్డకు అవసరమైనంత పోషకాలు, విటమిన్లు, కాల్షియం, ప్రొటీన్ అందుతాయి. లైఫేజ్ అనే ఎంజైమ్ వల్ల బిడ్డ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ముఖ్యంగా బిడ్డకు తల్లి పాలివ్వడం వల్ల వారిద్దరి మధ్య బాంధవ్యం బలపడుతుంది. – డాక్టర్ ఎం. విజయవాణి, చిన్నపిల్లల వైద్యనిపుణులు, కర్నూలు -
తల్లిపాలు.. అమృతధారలు
● శిశువు పుట్టిన గంటలోపేతల్లి పాలివ్వాలి ● ముర్రు పాలలో వ్యాధి నిరోధక శక్తి ● బిడ్డ ఎదుగుదలకు ఎంతో మేలు ● శిశువు ఆరు నెలల వరకు ఇవే ఇవ్వాలి ● జిల్లాలో ఏటా 48 వేలకు పైగా ప్రసవాలు ● అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం కర్నూలు(హాస్పిటల్): అప్పుడే జన్మించిన బిడ్డకు తల్లిపాలే ఆహారం. అది మనిషైనా...ఇతర ఏ జీవికైనా. జన్మించిన శిశువు తల్లిని తాకగానే ఆమెకు పాలు స్రవిస్తాయి. ఇది సృష్టి ధర్మం. ఈ ధర్మానికి వ్యతిరేకంగా ఇతర పాలను బిడ్డకు పట్టిస్తే అటు బిడ్డకు.. ఇటుకు తల్లికి అనారోగ్యం. అందుకే బిడ్డకు రెండేళ్ల వయస్సు వచ్చే వరకు తల్లిపాలే పట్టించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇది బిడ్డకు, తల్లికి ఇద్దరికీ మంచిదని సెలవిస్తున్నారు. తల్లిపాల ప్రాముఖ్యత పట్ల తల్లులకు, ఆమె కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఆగష్టు ఒకటి నుంచి ఏడవ తేదీ వరకు అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కొత్తగా మంజూరైన మరో 12 పీహెచ్సీలు ఉన్నాయి. ఇవేగాక ఐదు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 26 అర్బన్హెల్త్ సెంటర్లు, రెండు ఏరియా ఆసుపత్రులు, ఒక బోధనాసుపత్రి ఉన్నాయి. ఆయా ఆసుపత్రుల్లో ప్రతి సంవత్సరం 48 వేలకు పైగా గర్భిణులు ప్రసవిస్తున్నారు. పుట్టిన బిడ్డకు ఎలా పాలను పట్టించాలనే విషయమై అక్కడి వైద్య సిబ్బంది బాలింతలకు సూచిస్తున్నారు. తల్లిపాల పట్ల ఆవశ్యకతను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో విడుదలయ్యే ముర్రుపాలను బిడ్డకు పట్టిస్తే వ్యాధినిరోధక పెరిగి భవిష్యత్లో రాకుండా ఉంటాయని వివరిస్తున్నారు. పనిచేసే చోట, ఉద్యోగం చేసే చోట తల్లులకు తమ బిడ్డకు పాలిచ్చేందుకు వీలు కల్పించాలి. అందుకు అందరూ సహకారం అందించాలి. ఈ మేరకు ఉన్నంతలో ఏర్పాట్లు చేయాలి. తల్లి పాలు బాగా రావాలంటే...! మహిళ గర్భధారణ అయినప్పటి నుంచే పోషకాలు కలిగిన పాలు, చేపలు, గుడ్లు, వెల్లుల్లిపాయ, తాజా ఆకుకూరలు, పండ్లు తగిన మోతాదులో తీసుకోవాలి. ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. అతిగా స్వీట్లను తినకూడదు. ఇవి తీసుకోరాదు బిడ్డకు పాలిచ్చే సమయంలో తల్లి కొన్నింటిపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలి. బిడ్డను పడుకోబెట్టి, నిలబెట్టి పాలు పట్టకూడదు. పాలిచ్చే సమయంలో కెఫిన్ అధికంగా ఉండే పదార్థాలు, శీతల పానియాలు తీసుకోకూడదు ఇది శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. ముర్రుపాలలో రోగ నిరోధక శక్తి గర్భిణి ప్రసవించిన అనంతరం మొదటి అరగంటలోపు తల్లికి వచ్చే పాలను ముర్రుపాలంటారు. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చాలా మంది అవగాహన లేకపోవడం వల్ల బిడ్డకు ముర్రుపాలను తాగించడంలో నిర్లక్ష్యం వహిస్తారు. ఈ పాలలో వ్యాధి నిరోధకశక్తిని పెంచే గుణం ఉంటుంది. సమతుల్యమైన పోషకాహార పదార్థాలు అందజేస్తాయి. చాలా రకాల వ్యాధులు రాకుండా తల్లిపాలు కాపాడతాయి. తల్లికి, శిశువుకు జ్వరం వచ్చినప్పుడు, టీకాలు ఇచ్చినప్పుడు కూడా పాలు పట్టించవచ్చు. తల్లిపాలు తాగే పిల్లల్లో ఆకస్మిక మరణాలు తక్కువేనని వైద్యులు చెబుతున్నారు. ఎప్పుడు..ఎలా పాలివ్వాలంటే... ఉపయోగాలు శిశువుకు తల్లిపాలు సంపూర్ణమైన సంతులిత ఆహారాన్ని అందిస్తాయి. ఇవి నాణ్యమైన ప్రొటీన్లు, ఒమెగా 3, ఒమెగా 6, ఒమెగా 9, విటమిన్లు ఉండి బిడ్డ మెదడుకు వికాసానికి తోడ్పడుతాయి. లాక్టోజుతో కాల్షియం నిల్వలు పెరుగుతాయి. బిడ్డను రక్తహీనత నుంచి కాపాడుతాయి. తొలి నెలలో శిశువులకు వివిధ రకాల అంటువ్యాధుల బారి నుంచి కాపాడుతాయి. డయేరియా, నిమోనియా వంటి ప్రాణాంతక వ్యాధుల రాకుండా నిరోధిస్తాయి. క్యాన్సర్, చెవికి సంబంధించిన వ్యాధులు, గుండెవ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. అలర్జి, ఆస్తమా, డయాబెటీస్ వంటి వ్యాధులూ రావు బాల్యంలో, యవ్వనంలో ఊబకాయం వచ్చే ప్రమాదం తక్కువ. తల్లిపాలు ఎంతో స్వచ్ఛంగా, ఎలాంటి క్రిములు లేకుండా ఉంటాయి. శ్వాసకోశ, అలర్జి, ఆస్తమా, చర్మవ్యాధుల నుంచి బిడ్డలను రక్షిస్తాయి. బిడ్డ మానసిక, శారీరక వికాసానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. అందుకే బిడ్డ జన్మించిన గంటలోపు తల్లికి వచ్చే ముర్రుపాలు పట్టించాలి. ఆ తర్వాత ఆరు నెలల వరకు తల్లిపాలు తప్ప మరే పదార్థాలూ ఇవ్వకూడదు. రోజులో 8 నుంచి 10 సార్లు లేదా ప్రతి రెండు నుంచి మూడు గంటలకు ఒకసారి బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలి. ఆరు మాసాల తర్వాత తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం ఇవ్వాలి. రెండేళ్ల వరకు క్రమం తప్పకుండా పాలు పట్టాలి. -
ఎనిమిది నెలలుగా జీతాలు లేవు
హొళగుంద: తమకు ఎనిమిది నెలలుగా జీతాలు రావడం లేదని, చాలా ఇబ్బందులు ఉన్నాయని జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి దృష్టికి గ్రీన్ అంబాసిడర్లు తీసుకెళ్లారు. గ్రామానికి వచ్చే నిధుల్లో ముందుగా గ్రీన్ అంబాసిడర్లకు జీతాలు ఇవ్వాలని సెక్రటరీకి, సర్పంచ్కు సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని మార్లమడికి గ్రామంలో జెడ్పీ సీఈఓ పర్యటించారు. గ్రామంలో బళ్లారి రోడ్డు పక్కన ఉన్న ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసి శిథిలావస్థకు చేరిన గదులను వాడొద్దని ఉపాధ్యాయులకు సూచించారు. ఐవీఎస్ఆర్ కాల్స్లో గ్రామానికి జీరో శాతం రావడంతో పంచాయతీ సెక్రటరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీకి 15వ ఆర్థిక సంఘం నిధులు రాలేదని, పనులు ఎలా చేయాలని గ్రామ సర్పంచ్ తనయుడు రమేశ్ ప్రశ్నించారు. హొళగుంద ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ విజయలలిత, ఈఓపీఆర్డీ చక్రవర్తి, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో జెడ్పీ సీఈఓ సమీక్ష నిర్వహించారు. -
దర్జాగా ఇసుక దందా
● వాహన యజమానులకు టీడీపీ నేతల బెదిరింపులు ● టన్ను ఇసుక రూ. 500కే తమకివ్వాలని ఒప్పందం ● అక్రమంగా ఇసుక డంప్ చేసి వ్యాపారండోన్: ఇసుక ఉచితంగా అందిస్తామని.. భవన నిర్మాణ రంగాన్ని గాడిలో పెడతామని హామీ ఇచ్చిన కూటమి నేతలు ఇప్పడు దర్జాగా ఇసుక దందాకు పాల్పడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఇసుక తెచ్చి స్థానికంగా డంప్ చేసి అక్రమ వ్యాపారం చేస్తున్నా రు. ప్రతి నెల లక్షలాది రూపాయలు అక్రమార్జన చేస్తున్నారు. డోన్, బేతంచెర్ల చుట్టు పక్కల ప్రాంతాల నుంచి అనంతపురం జిల్లా పామిడి, తాడిపత్రితో పాటు నెల్లూరు జిల్లాకు వివిధ ఖనిజాలను లారీల్లో తరలిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో పెన్నా నది ఇసుకను టన్ను రూ.220 చొప్పున కొనుగోలు చేసి డోన్, బేతంచెర్ల, ప్యాపిలి మండలాల్లో టన్ను రూ.550 చొప్పున విక్రయిస్తుండేవారు. ఈ క్రమంలో అధికార పార్టీ నేతల కళ్లు ఇసుక అక్రమ రవాణాపై పడింది. కొత్తబస్టాండ్ సమీపంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రి వద్ద ఇసుక రవాణా చేసే టిప్పర్, లారీ యజమానులందరినీ సమావేశ పరిచి టన్ను ఇసుక రూ.500 ప్రకారం తెచ్చి ఇవ్వాలని హుకుం జారీ చేశారు. అదే ఇసుకను భవన నిర్మాణ యజమానులకు టన్ను రూ.900 చొప్పున అమ్ముకుంటామని లేదంటే, పోలీసుల ద్వారా వేధింపులు అధికం చేయడమే కాక ఆర్థికంగా నష్టపోయేట్లు చేస్తామని హెచ్చరించారు. దీంతో టిప్పర్, లారీ కిరాయి, డ్రైవర్ బత్తా, డీజల్ అన్ని కలిపి టన్ను ఇసుక రూ.550కు ఇచ్చేందుకు అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో శుక్రవారం స్థానిక బట్టీల సెంటర్లోని ధర్మవరం రోడ్డులో మూతపడిన గ్రానైట్ ఫ్యాక్టరీ ఆవరణలో అధికార పార్టీ నేతలు ఇసుక డంప్ ఏర్పాటు చేసి దోపిడీకి రంగం సిద్ధం చేశారు. సామాన్యుడు తమ గృహ నిర్మాణాలకు ఎడ్లబండ్లు, ఆటోలలో ఇసుక తరలిస్తే పట్టుకొని వేధించే రెవెన్యూ, పోలీసు, ఏడీఎంఈ అధికారులు అధికార పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఇసుక డంప్ గురించి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. -
సంతెకూడ్లూరులో ఘర్షణ
ఆదోని అర్బన్: సంతెకూడ్లూరు గ్రామంలో టీడీపీ, బీజేపీ వర్గీయుల మధ్య బుక్ కీపర్ విషయంలో శుక్రవారం ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీకి చెందిన మహేష్ భార్య గాయత్రీ బుక్ కీపర్గా పనిచేస్తోంది. గత నెల నుంచి ఆమెను తీసివేసి టీడీపీకి చెందిన వీరేష్ భార్య సువార్తమ్మను నియమించారు. ప్రస్తుతం టీడీపీకి చెందిన సువార్తమ్మ గ్రామంలో ఫేష్ యాప్ ద్వారా వివరాలు రికార్డు చేస్తున్నారు. బీజేపీకి చెందిన వారు ఎవరు ఫేష్ యాప్ చేసుకోవద్దని ప్రచారం చేసినట్లు తెలిసింది. ఇలా ప్రచారం చేయడం తెలుసుకున్న టీడీపీకి చెందిన వారు నేరుగా బీజేపీ వారిని నిలదీశారు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు. దాడిలో బీజేపీకి చెందిన మహేష్, టీడీపీకి చెందిన మదిరె వీరేష్కు గాయాలయ్యాయి. వెంటనే కుటుంబీకులు గాయపడిన వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ఇక వార్షిక ఫాస్టాగ్
కర్నూలు: సొంత వాహనదారుల టోల్ప్లాజా కష్టాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పాలసీతో ముందుకొచ్చింది. జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే వ్యక్తిగత వాహనదారుల ప్రయాణ ఖర్చులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గరిష్టంగా 200 ట్రిప్పులకు అనుమతిస్తూ వార్షిక ఫాస్టాగ్ ఆఫర్ను ఈ నెల 15 నుంచి దేశ వ్యాప్తంగా అమలులోకి రానుంది. రూ.3 వేలు చెల్లింపుతో ప్రత్యే క టోల్ పాస్ను ఎవరైనా వ్యక్తిగత వాహనదారులు పొందవచ్చు. ఇది ఒక సంవత్సరం లేదా 200 టోల్ ప్రయాణాల వరకు వర్తిస్తుంది. జాతీ య రహదారుల టోల్ ప్లాజాలపై ఇది అమలు కానుంది. కావాలనుకున్న వాహనదారులు మా త్రమే వార్షిక పాస్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వార్షిక పాస్ అనేది పూర్తిగా స్వచ్ఛందం. ఈ నెల 15 నుంచి అమలులోకి.. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ ఫాస్టాగ్ ఆఫర్ అందుబాటులోకి రానుంది. టోల్ ప్లాజా ను దాటిన ప్రతిసారి ఒక ట్రిప్పు గా లెక్క కడతా రు. ఉదాహరణకు మనం ప్రయాణంలో 4 టోల్ ప్లాజాలు దాటితే 4 ట్రిప్పులు పూర్తయినట్లు లెక్కిస్తారు. ఈ లెక్కన వార్షిక ఫాస్టాగ్ పాస్ అనే ది 200 సార్లు మాత్రమే పని చేస్తుంది. మొత్తం పూర్తి కాకపోతే ఏడాదంతా ఈ పాస్ పనిచేస్తుంది. ఈ రెండింటిలో ఏది ముందుగా ముగిస్తే దానిని ఫాస్టాగ్కు తుది గడువుగా పరిగణిస్తారు. ఎవరికి వర్తిస్తుందంటే... ఫాస్టాగ్ ఉన్న వ్యక్తిగత వాహనదారులకు మాత్రమే వర్తిస్తుంది. టోల్ ఫీజు ఎంత ఉన్నా సంబంధం లేకుండా టోల్ ప్లాజా దాటవచ్చు. ప్రవేశం–నిష్క్రమణను ఒకే దాటుగా పరిగణిస్తారు. ఇది ప్రయాణ ఖర్చులను తగ్గించి వేగవంతమైన టోల్ క్లియరెన్స్కు దోహదపడుతుంది. పాస్ను టోల్ ప్లాజాలో లేదా ఆన్లైన్లో పొందవచ్చు. సొంత వాహనదారులకు కొత్త ప్లాన్ ధర రూ.3 వేలు.. గరిష్టంగా 200 ట్రిప్పులు టోల్ ప్లాజా ఎంట్రీ నుంచి ఎగ్జిట్కు ఒక ట్రిప్పుగా పరిగణన కర్నూలు–కడప హైవేలో వేలాది మందికి ఉపయోగం రాయలసీమ ఎక్స్ప్రెస్ వే ప్రైవేటు లిమిటెడ్ ద్వారా నిర్వహిస్తున్న కర్నూ లు నుంచి కడప వరకు 40వ నంబర్ జాతీయ రహదారిలో ప్రయాణించే వేల మంది ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగకరం. ఈ మార్గాన్ని వినియోగించే విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారవేత్తలకు ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. కేంద్రం తీసుకొచ్చిన ఈ నిర్ణయం డిజిటల్ ఇండియా స్మార్ట్ మౌలిక సదుపాయాల లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది. – వి.మదన్మోహన్, రాయలసీమ ఎక్స్ప్రెస్ వే ప్రైవేటు లిమిటెడ్ ప్రాజెక్ట్ హెడ్ -
ఆస్తి రాబట్టుకునేందుకు బాలుడి కిడ్నాప్
● 24 గంటల్లో ఛేదించిన పోలీసులు కర్నూలు: కర్నూలు రూరల్ పోలీస్ సర్కిల్ పరిధిలోని లక్ష్మీపురం గ్రామ శివారు స్కందాన్షి వెంచర్కు చెందిన బాలుడు మోక్షిత్ (10) అదృశ్యం కేసు తెర పడింది. తెలుగు సురేష్, విజయలక్ష్మి దంపతుల కుమారుడు మోక్షిత్ లక్ష్మీపురంలోని రామకృష్ణ విద్యా మందిర్లో 5వ తరగతి చదువుతున్నాడు. గురువారం స్కూల్ నుంచి ఇంటికి రాకపోవడంతో తండ్రి సురేష్ ఫిర్యాదు మేరకు ఉలిందకొండ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. కర్నూలు రూరల్ సీఐ చంద్రబాబు నాయుడు, ఉలిందకొండ, నాగలాపురం ఎస్ఐలు ధనుంజయ, శరత్ కుమార్ రెడ్డి తదితరులు రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టగా బాలుడు ఇంట్లోనే నివాసమున్న వెల్దుర్తి మండలం మల్లెంపల్లె గ్రామానికి చెందిన మనోహర్ నాయుడు బాలుడి కుటుంబ సభ్యులను భయపెట్టి డబ్బులు, ఆస్తిని రాబట్టుకునేందుకు కిడ్నాప్ చేసినట్లు బయటపడింది. మనోహర్ నాయుడు అదృశ్యమైన బాలుడు మోక్షిత్తో పాటు వెల్దుర్తి రైల్వే స్టేషన్ ఎదురుగా క్రిష్ణగిరి టర్నింగ్ వద్ద కర్నూలుకు వచ్చే దారిలో కారులో ఉండగా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా ఆస్తిని రాబట్టుకునేందుకు తానే కిడ్నాప్ చేసినట్లు మనోహర్ నాయుడు నేరాన్ని అంగీకరించాడు. శుక్రవారం సాయంత్రం కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ ఎదుట హాజరుపరిచారు. సీఐ చంద్రబాబు నాయుడుతో కలసి డీఎస్పీ కిడ్నాప్ వ్యవహారం విషయాలను వెల్లడించారు. అదృశ్యమైన బాలుడిని 24 గంటల్లో వెతికిపట్టి తల్లిదండ్రులకు అప్పగించినట్లు డీఎస్పీ తెలిపారు. -
ఈరన్నస్వామి క్షేత్రం.. భక్తజన సంద్రం
దేవాలయం వద్ద భక్తుల రద్దీ కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా మొదటి గురువారం భక్తుల రద్దీ కొనసాగింది. శ్రావణమాస ఉత్సవాల మొదటి గురువారం కావడంతో భక్తులు ఉదయం నుంచే స్వామి దర్శనానికి తరలిరావడంతో పుణ్యక్షేత్రం భక్త జనసంద్రంగా దర్శనమిచ్చింది. భక్తులు ఆలయ పరిసరాల్లో ప్రత్యేక వంటకాలను వండి స్వామి వారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాతసేవ, మహా మంగళహారతి, ఆకుపూజ, బిందుసేవ, పంచామృతాభిషేకం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి వదిలారు. స్వామి దర్శనం కోసం భక్తులు గంటకు పైగా వేచి ఉండాల్సి వచ్చింది. -
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ
● ఎమ్మెల్సీ ఇసాక్బాషా నంద్యాల: రెడ్బుక్ అరాచకానికి పోలీసులు తోడుకావడంతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఎమ్మెల్సీ ఇసాక్బాషా ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేశారని, అయినా ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి జగన్పై ఉన్న అభిమానాన్ని చాటారన్నారు. మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూడటానికి వచ్చే ప్రజలకు పోలీసులు ఆంక్షలు విధించడం సరికాదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, అసమర్థతను ప్రశ్నించే వారిపై కూటమి సర్కార్ రెడ్బుక్ రాజ్యాంగంతో భయానక పరిస్థితి సృష్టిస్తోందన్నారు. ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మగా మారిన పోలీసులు ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు నమోదు చేయడం, జైలుకు పంపడం కర్తవ్యంగా పనిచేస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పుతాయన్నారు. -
ఎస్సీ, ఎస్టీ మహిళా నర్సులకు ఉచిత శిక్షణ
నంద్యాల(న్యూటౌన్): జర్మనీలో ఉద్యోగాలు పొందేందుకు ఎస్సీ, ఎస్టీ మహిళా నర్సులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు నంద్యాల జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి, పుత్తూరు, విశాఖపట్నం కేంద్రాల్లో శిక్షణ ఉంటుందని, 35 సంవత్సరాల్లోపు వయస్సు ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. శిక్షణకు దరాఖాస్తులు వచ్చేనెల 7వ తేదీలోగా సమర్పించాలని, మరింత సమాచారం కోసం 8297812530 సెల్ నంబర్ను సంప్రదించాలన్నారు. మహిళ ప్రాణం తీసిన ఆర్ఎంపీ వైద్యం నందికొట్కూరు: ఆర్ఎంపీ వైద్యం ఒక మహిళ ప్రాణం తీసింది. ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముచ్చుమర్రి పోలీసు స్టేషన్ ఏఎస్ఐ సుబ్బారావు తెలిపిన వివరాల మేరకు.. గడివేముల మండలంలోని గని గ్రామానికి చెందిన శివమ్మ కూమార్తె శ్రీవాణికి ఈ నెల 28వ తేదీన నందికొట్కూరు పట్టణంలోని గీతారాణి ఆర్ఎంపీ వద్ద శ్రీవాణి అబార్షన్ చేయించారు. అనంతరం 29వ తేదీన పగిడ్యాల మండలం బీరవోలు గ్రామానికి వెళ్లారు. శ్రీవాణికి తీవ్ర రక్తస్రావం కావడంతో 30వ తేదీన బుధవారం నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు కుటుంబ సభ్యులు తరలించారు. వైద్యులు చూసి అప్పటికే మృతి చెందిందని తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. రూరల్ సీఐ సుబ్రమణ్యం సంఘటనపై విచారణ చేపట్టారు. డిసెంబర్ నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి కోవెలకుంట్ల: వివిధ స్టేజీల్లో ఉన్న పక్కాగృహాలను డిసెంబర్ ఆఖరునాటికి పూర్తి చేయాలని హౌసింగ్ పీడీ శ్రీహరి గోపాల్ సూచించారు. పట్టణ శివారులోని జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో హౌసింగ్ సిబ్బంది, గ్రామసచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో సమీక్ష నిర్వహించారు. జగనన్న కాలనీల్లో బేస్మెంట్, లింటల్, తదితర దశల్లో ఇళ్ల ఉన్న నిర్మాణాలు పూర్తి చేసుకోవాలన్నారు. బిల్లులు తీసుకుని నిర్ణీత గడువులోగా పూర్తి చేసుకోకపోతే ఆ గృహాలు రద్దు అవుతాయని, భవిష్యత్తులో గృహ నిర్మాణ బిల్లులు అందబోవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వరప్రసాదరావు, హౌసింగ్ డీఈ కృష్ణారెడ్డి, ఏఈ మద్దిలేటి, వర్క్ఇన్స్పెక్టర్లు గోవిందు, సుబ్బరాయుడు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. రోజంతా సర్వర్ సమస్యే! ● ఫసల్ బీమాకు దూరమైన రైతులు కర్నూలు(అగ్రికల్చర్): కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమాకు తిలోదకాలు ఇవ్వడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద నోటిఫై చేసిన వివిధ పంటలకు ప్రీమియం చెల్లించేందుకు గురువారం చివరి రోజు కావడంతో సర్వర్పై ఒత్తిడి పెరిగింది. కంది, జొన్న, సజ్జ తదితర పంటలకు ప్రీమియం చెల్లించేందుకు రైతులు ముందుకొచ్చారు. ప్రీమియం చెల్లించాలంటే రైతు సేవ కేంద్రం నుంచి పంట సాగు చేసినట్లు ఆన్లైన్లో సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాల్సి ఉంది. అయితే సర్వర్ సమస్యతో రైతులు సర్టిఫికెట్ పొందలేకపోయారు. జిల్లాలోని అన్ని మండలాల్లో సమస్య ఏర్పడటంతో రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షించాల్సి వచ్చింది. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. అక్కడక్కడ షోయింగ్ సర్టిఫికెట్ అప్లోడ్ అయినప్పటికీ ప్రీమియం చెల్లించేందుకు కూడా సర్వర్ సమస్య తలెత్తింది. సాంకేతిక సమస్యల వల్ల సర్వర్ ప్రాబ్లం వచ్చినట్లు తెలుస్తోంది. పరిష్కారానికి వ్యవసాయ యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల రైతులు ఫసల్ బీమా చేయించుకోలేకపోయారు. గత వైఎస్సార్సీపీ పాలనలో ఈ–క్రాప్లో నోటిఫైడ్ పంట సాగు చేసినట్లు నమోదైతే చాలు ఉచిత పంటల బీమా వర్తించింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉచిత పంటల బీమాకు తిలోదకాలు ఇవ్వడం, ప్రీమియం చెల్లించే విధానాన్ని తీసుకురావడంతో రైతులు చుక్కలు చూడాల్సి వస్తోంది. -
మంత్రి కళ్లలో ఆనందానికా.. రామిరెడ్డికి మంచి పేరొస్తుందనా!
మినరల్ వాటర్ ప్లాంట్ కూల్చివేత ● భారీ పోలీసు బందోబస్తు మధ్య ఘటన ● సీసీ కెమెరాల నిలిపివేత ● ఫొటోలు, వీడియోలు తీయకుండా దౌర్జన్యంసాక్షి టాస్క్ఫోర్స్: బనగానపల్లెలో టీడీపీ నేతల అరాచకానికి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే పోలీసులతో బెదిరింపులకు పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేపట్టిన మంచి పనులను టీడీపీ నేతలు ఇప్పటికీ జీర్ణించుకోలేని పరిస్థితి. ఆ పనులు అలాగే కొనసాగితే ఎక్కడ మంచిపేరు వస్తుందోనని ఏకంగా ఆనవాళ్లు లేకుండా చేసేందుకు సిద్ధపడటాన్ని ప్రజలు ఛీకొడుతున్నారు. ఎంతో మంది ప్రజల దాహార్తి తీరుస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్ను ఏకంగా కూలదోసిన ఘటన టీడీపీ నేతల నీచ రాజకీయానికి అద్దం పడుతోంది. మంత్రి కళ్లలో ఆనందం చూడటానికి ఇలా చేశారా? లేక మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని జీర్ణించుకోలేక ఇలా దుశ్చర్యకు పాల్పడ్డారా? అని ప్రజల్లో చర్చ జరుగుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బనగానపల్లె పాత బస్టాండ్ సమీపంలో అప్పటి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఉచిత కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ ద్వారా పట్టణ ప్రజలేకాకుండా సంతమార్కెట్, పండ్ల మార్కెట్ ఉండటంతో వివిధ ప్రాంతాల నుంచి పండ్లు, కూరగాయలను రాత్రి వేళల్లో మార్కెట్కు తీసుకొచ్చేవారికి ఉపయోగకరంగా ఉంది. అర్థరాత్రి అయినప్పటికీ ఈ ఫ్లాంట్ ద్వారా పట్టణ ప్రజలు, వ్యాపారులకు తాగునీరు లభిస్తోంది. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం, ఆ వాటర్ ప్లాంట్ను అలాగే కొనసాగిస్తే ఎక్కడ రామిరెడ్డికి మంచి పేరు వస్తుందోనని స్థానిక టీడీపీ నేతలు భావించినట్లు తెలుస్తోంది. భారీ బందోబస్తు మధ్య కూల్చివేత పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఉపయోగకరంగా ఉన్న వాటర్ప్లాంట్ కూల్చివేత వెనుక మంత్రి బీసీ హస్తం ఉన్నట్లు స్థానికుల్లో చర్చ జరుగుతోంది. ఆయనకు తెలియకుండా అధికారులు కూడా ఇంతటి సాహసం చేయలేరని తెలుస్తోంది. ప్లాంట్ మిషనరీని మరోచోటుకు తరలించి గురువారం జేసీబీ సాయంతో ప్లాంట్ భవనాన్ని కూల్చివేశారు. ఆ సమయంలో అక్కడి సీసీ కెమెరాలను సైతం పనిచేయకుండా చేశారు. ఒక వ్యక్తి రహస్యంగా వీడియో తీస్తుండటంతో గమనించిన టీడీపీ శ్రేణులు సెల్ఫోన్ లాక్కొని పగులగొట్టినట్లు తెలిసింది. అధికారం అండతో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కూల్చివేత చేపట్టడం గమనార్హం. -
మూడు మండలాల్లో అడుగంటిన భూగర్భ జలాలు
నంద్యాల: వర్షాభావ పరిస్థితులతో ఫ్యాపిలి, డోన్, కొలిమిగుండ్ల మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటాయని, నీటి సంరక్షణ చర్యలు విస్తృతం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టర్ చాంబర్లో వివిధ అంశాలపై ఆయా శాఖల అధికారులతో గురువారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్యాపిలిలో 24.23, డోన్లో 23.46, కొలిమిగుండ్లలో 26.67 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు వెళ్లాయన్నారు. జిల్లాలో భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకొని 16 మండలాలలో మైక్రో వాటర్ షెడ్ల ప్రోగ్రాంల కోసం 18 ప్రాజెక్టుల ద్వారా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాకు 3,500 మెట్రిక్ టన్నుల యూరియా ఆగస్టు1న (శుక్రవారం) రానున్నట్లు తెలిపారు. ఇవేకాక ఇప్పటికే జిల్లాలో అదనంగా మరొక 1100 మెట్రిక్ టన్నుల యూరియా లభ్యత ఉందన్నారు. ప్రతి రైతు ఈ పంట నమోదుతో పాటు పంటల బీమా కూడా చేసుకోవాలన్నారు. జిల్లాలోని ఆయకట్టును అభివృద్ధి చేయడానికి 91 పనులను ప్రతిపాదించామన్నారు. ఈ పనులకు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం ఖర్చును భరిస్తాయన్నారు. ఇవే కాక రెండవ దశలో మరొక 19 పనులను రూ.16 కోట్లతో ప్రతిపాదించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో వ్యవసాయ, జల వనరుల శాఖ, డ్వామా, భూగర్భ జలాలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో సీనియర్ అసిస్టెంట్
జూపాడుబంగ్లా: రైతు నుంచి రూ.40వేల లంచం తీసుకుంటూ ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రమేష్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సోమన్న, బాధిత రైతు ఈశ్వరయ్య తెలిపిన వివరాలివీ.. జూపాడుబంగ్లాకు చెందిన శంకరమ్మకు 80బన్నూరు రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 568/ఏలో 0.70 సెంట్లు, 568/సీలో 0.30సెంట్ల పొలం ఉంది. వీరు ఈ పొలాన్ని పూర్వం నుంచి అనుభవిస్తున్నారు. అయితే ఆన్లైన్ అడంగల్లో రెవెన్యూ అధికారులు జూపాడుబంగ్లాకు చెందిన లింగన్న పేరిట నమోదు చేశారు. తమకు వారసత్వంగా వస్తున్న రిజిష్టర్ భూమిని తిరిగి తమ పేరిట ఎక్కించాలని రైతు ఈశ్వరయ్య 2021 నుంచి జూపాడుబంగ్లా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్ఓఆర్ విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయానికి రెఫర్ చేశారు. అయితే పేరును చేర్చేందుకు రూ.70వేలు లంచం డిమాండ్ చేశారు. తాను అంత మొత్తం ఇచ్చుకోలేనని రూ.30వేలు ఇస్తానని పేర్కొన్నట్లు బాధిత రైతు తెలిపాడు. చివరికి రూ.50వేలకు బేరం కుదిరింది. అందులో భాగంగా రూ.10వేల అడ్వాన్స్ను ఆర్డీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రమేష్కు ఇచ్చాడు. మిగిలిన రూ.40వేల నగదు రైతు ఈశ్వరయ్య వద్ద తీసుకొని తనకు ఇవ్వాలని ఆర్డీఓ ఆదేశించినట్లు ఏసీబీకి పట్టుబడిన సీనియర్ అసిస్టెంట్ రమేష్ ఏసీబీ అధికారులకు తెలిపాడు. రమేష్ ఒత్తిడి తాళలేక రైతు కర్నూలు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వల పన్నిన ఏసీబీ ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు గురువారం ఈశ్వరయ్యకు రూ.40వేల నగదు ఇచ్చి పంపించారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న సూచనల మేరకు రైతు ఆర్డీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రమేష్కు గురువారం ఫోన్చేసి డబ్బులు ఎక్కడకు తెచ్చిమ్మంటారని అడిగాడు. అందుకాయన తాను నందికొట్కూరు నుంచి ఏపీ 40 డీఏ 5036 నెంబర్ కారులో ఆత్మకూరుకు వెళ్తున్నానని, జూపాడుబంగ్లాకు వచ్చిన తర్వాత డబ్బులు తీసుకొంటానన్నాడు. జూపాడుబంగ్లా జంగాల పెద్దన్న ఇంటికి సమీపంలో ఈశ్వరయ్య వేచి చూస్తుండగా అక్కడకు కారులో వచ్చిన రమేష్ రైతు ఇచ్చిన రూ.40వేల నగదును తీసుకొని ఆత్మకూరుకు బయలుదేరాడు. డబ్బులు ఇచ్చిన వెంటనే ఈశ్వరయ్య ఏసీబీ అధికారులకు ఫోన్చేయటంతో వారు జూపాడుబంగ్లా బస్టాండు వద్ద రమేష్ను అదుపులోకి తీసుకొన్నారు. అతని నుంచి రూ.40వేల నగదును స్వాధీనం చేసుకొని అరెస్టు చేశారు. ఆర్డీఓ ఒత్తిడితోనే... ఏసీబీకి పట్టుబడిన రమేష్ మాట్లాడుతూ రైతు ఈశ్వరయ్య వద్ద డబ్బులు ఇప్పించుకొని రావాలని ఆర్డీఓ నాగజ్యోతి ఒత్తిడి చేయటం వల్లే తాను డబ్బు తీసుకొన్నానని తెలిపాడు. లంచం ఇస్తేనే పనిచే స్తానని రైతు ఈశ్వరయ్యపై ఆర్డీఓ ఒత్తిడి చేయటం వల్లే తానే ఏసీబీ వద్దకు వెళ్లాలని రైతుకు సలహా ఇచ్చినట్లు పేర్కొనటం గమనార్హం. ఇదిలాఉంటే ఆర్డీఓ విషయమై ఏసీబీ డీఎస్పీ సోమన్నను ‘సాక్షి’ ప్రశ్నించగా.. ఆర్డీఓ స్వయంగా లంచం డిమాండ్ చేసినట్లు తగిన ఆధారాలు లేవన్నారు. అందువల్ల ఆమైపె కేసు నమోదు చేయడం లేదని తెలిపారు. రైతు వద్ద రూ.40వేల లంచం డిమాండ్ ఆర్డీఓ చెప్పినందుకే తీసుకున్నట్లు సీనియర్ అసిస్టెంట్ వెల్లడి -
జిల్లాలో కంది సాగు వివరాలు
మండలం సాధారణ సాగు విస్తీర్ణం విస్తీర్ణం (హెక్టార్లలో) డోన్ 10,517 10,762 బేతంచెర్ల 8,651 7,091 ప్యాపిలి 7,588 6,208 బనగానపల్లె 3,336 869 మిడుతూరు 1,507 926 జూపాడుబంగ్లా 766 477 గడివేముల 519 300 నందికొట్కూరు 448 555 అవుకు 458 61 కొలిమిగుండ్ల 353 08 -
రక్షిత నీరు.. ‘లెస్’ టెండర్ తీరు
● 40 శాతం లెస్కు ఆర్డబ్ల్యూఎస్ ఓఅండ్ఎం టెండర్లు ● 12 స్కీంలకు తొలగిన అడ్డంకులు ● అగ్రిమెంట్ చేసుకొని పనుల నిర్వహణను చేపట్టిన కాంట్రాక్టర్లు ● నష్టానికి నీటి సరఫరాపై అనుమానాలు ● చివరి గ్రామాలకు రక్షిత నీరు ప్రశ్నార్థకమే!‘అడిషనల్’ డిపాజిట్ ఇవ్వాల్సిందే మంచి నీటి పథకాల నిర్వహణకు సంబంధించి 25 శాతం వరకు లెస్కు టెండర్లు వేసుకునే సౌలభ్యం ఉంది. అయితే 25 శాతం కంటే అధికంగా లెస్కు వెళ్తే సంబంధిత కాంట్రాక్టర్ నుంచి అడిషనల్ సెక్యూరిటీ డిపాజిట్ను చేయించుకుంటాం. అగ్రిమెంట్ చేసుకున్నప్పటి నుంచి ఏడాది పాటు ఆయా స్కీంల నుంచి నిర్ణయించిన గ్రామాలకు రక్షిత మంచి నీటిని సరఫరా చేయాల్సిందే. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటాం. – బీ నాగేశ్వరరావు, ఎస్ఈ, ఆర్డబ్ల్యూఎస్ కర్నూలు(అర్బన్): ఎవరైనా వ్యాపారం చేసేది లాభం కోసమే, కానీ జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగంలో మాత్రం నష్టానికి నీళ్ల వ్యాపారం చేస్తున్నారు. అధికారులు నిర్ణయించిన ధర కంటే 40 శాతానికి పైగా లెస్కు పనులను దక్కించుకున్నారంటే ఆయా పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకం అవుతోంది. 10 శాతం లెస్కు టెండర్లు వేసుకోవడం సహజం. అయితే 25 శాతం వరకు లెస్కు వేసుకునేందుకు ప్రభుత్వ అనుమతి ఉంది. అయితే పలు పథకాలకు ఏకంగా 40 శాతానికి పైగా లెస్కు టెండర్లు వేసి అగ్రిమెంట్లు చేసుకున్నారు. ప్రస్తుతానికి పనులు దక్కించుకొని అధికార పార్టీ నేతల అండదండలతో ఏదో ఒక విధంగా మేనేజ్ చేయవచ్చనే ఆలోచనలతోనే కాంట్రాక్టర్లు అధిక శాతం లెస్కు వెళ్లి ఉంటారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్ల ఆశ్చర్యం జిల్లాలోని 351 గ్రామాలకు గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో 33 మంచి నీటి పథకాల ద్వారా రక్షిత మంచి నీటిని అందించాల్సి ఉంది. ఈ స్కీంల నిర్వహణకు ప్రతి ఏటా రూ.49.29 కోట్లు ఖర్చు చేస్తున్నారు. తాగునీటి పథకాల నిర్వహణ, తాత్కాలిక మరమ్మతులు, సిబ్బంది జీతభత్యాలకు ఈ నిధులను వెచ్చించుకునే సౌలభ్యం ఉంది. ఈ పథకాలకు సంబంధించి టెండర్ విధానం ద్వారా కాంట్రాక్టర్లకు పనులను అప్పగిస్తున్నారు. అయితే ఆదోని డివిజన్లోని 16 మంచి నీటి పథకాల నిర్వహణకు సంబంధించి పలువురు టెండర్కు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇందులో 12 రిట్ పిటిషన్లకు సంబంధించి నామినేషన్ పద్ధతిన పనులను అప్పగించరాదని, టెండర్లు నిర్వహించిన వాటికి అగ్రిమెంట్ చేసుకుంటే తాము అడ్డుపడమని న్యాయ స్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే 12 స్కీంలకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ పనులకు సంబంధించి ఒకటి, రెండు మినహా మిగిలిన అన్ని పనులకు 25 శాతానికంటే అధికంగా లెస్కు వెళ్లి కాంట్రాక్టర్లు పనులు దక్కించుకున్నారు. 40 శాతం లెస్కు పనులు దక్కించుకోవడంపై ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. చివరి వరకు ఆయా స్కీంల నుంచి నిర్దేశించిన గ్రామాలకు రక్షిత నీటిని అందించగలరా? అనే అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు. కాగా, కొన్ని గ్రామాలకు రెండు నుంచి నాలుగు రోజులకు ఒకసారి, మరి కొన్ని గ్రామాలకు ఆయా గ్రామాల్లోని సోర్సులను అనుసరించి వారానికి ఒకసారి నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ఇంజినీర్లే చెప్పడం గమనార్హం. ఆదోని డివిజన్లోని పెసలబండ స్కీం నుంచి 21 గ్రామాలకు రక్షిత తాగునీటిని అందించాల్సి ఉంది. ఏడాది పాటు ఆయా గ్రామాలకు రక్షిత నీరు అందించేందుకు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) కింద రూ.81.21 లక్షలు వ్యయం అవుతుందని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అంచనాలు రూపొందించి టెండర్లను ఆహ్వానించారు. అయితే ఓ కాంట్రాక్టర్ 40 శాతం లెస్కు ఈ పనులను దక్కించుకున్నారు. పనుల్లో నాణ్యత ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఏడాది పాటు చివరి గ్రామాల వరకు రక్షిత తాగునీటిని సరఫరా చేస్తారా? అనే అనుమానాలను ఇంజినీర్లే వ్యక్తం చేస్తున్నారు. విరుపాపురం స్కీం నుంచి 13 గ్రామాలకు రక్షిత నీటిని అందించేందుకు అంచనా విలువ రూ.21.60 లక్షలు కాగా, ఈ పనులను కూడా 31.76 శాతం లెస్కు దక్కించుకున్నారు. అలాగే కుప్పగల్ (40 శాతం), హెబ్బటం (40.15 శాతం), కౌతాళం (40.01 శాతం), సాతనూరు (40.01 శాతం), మండగిరి (40.01 శాతం) ఆస్పరి (35.46 శాతం), అల్వాల (36.90 శాతం), హానవాళు (28.59 శాతం) లెస్కు కాంట్రాక్టులను దక్కించుకున్నారు. కాగా.. రూ.114.46 లక్షల అంచనాతో 26 గ్రామాలకు నీరు అందించే బాపురం నీటి పథకం పనులను మాత్రం 23 శాతం లెస్కు దక్కించుకున్నారు. -
జర్మన్ భాషలో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(అర్బన్): బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం కోర్సు పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ మహిళలకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమం, సాధికారత అధికారిణి చింతామణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని మూడు కేంద్రాల్లో 150 మందికి జర్మన్ భాషలో శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. షెడ్యూల్డ్ కులాలకు 75, షెడ్యూల్ తెగలకు 75 సీట్ల చొప్పున 8 నుంచి 10 నెలల పాటు జర్మనీ భాషపై శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి ప్రధాన కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. మహిళా అభ్యర్థులు విద్యార్హత పత్రాలను dscw.eonandyal@gmail. com కు మెయిల్ చేయాలన్నారు.వీబీఆర్లో 14 టీఎంసీల నీరువెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (వీబీఆర్)లో 14.929 టీఎంసీల నీరు నిల్వ ఉంది. బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి వీబీఆర్కు 13,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. వీబీఆర్ నుంచి దిగువకు 1,3705 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఏఈ శివనాయక్ తెలిపారు.ఎన్పీసీఐ ఖాతాల మ్యాపింగ్ తప్పనిసరినంద్యాల: అన్నదాత సుఖీభవ లబ్ధి కోసం ఇన్ యాక్టివ్ ఉన్న రైతుల ఎన్పీసీఐ ఖాతాలను వెంటనే పునరుద్ధరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అన్నదాత సుఖీభవ, యూరియా లభ్యత అంశాలపై రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 2.07 లక్షల మంది రైతులకు ఉన్నారని, అందులో 1.97 లక్షల మందికి ఈకేవైసీ, ఎన్పీసీఐ ఖాతాలు మ్యాపింగ్ చేశారని తెలిపారు. మిగతా రైతులకు కూడా వెంటనే ఈకేవైసీ, ఎన్పీసీఐ మ్యాపింగ్ అయ్యేలా చూడాలన్నారు. జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, వాటిని అవసరం మేరకు మాత్రమే వినియోగించుకోవాలన్నారు. టెలీకాన్ఫరెన్స్లో జేసీ విష్ణు చరణ్, ఆర్డీఓలు, తహసీల్దార్లు, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, మార్క్ఫెడ్, డీఎల్డీఎం సంబంధిత మండలాధికారులు పాల్గొన్నారు.శ్రీశైల ముఖద్వారం సమీపంలో ఎలుగుబంటిశ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థాన ముఖద్వారం సమీపంలో ఎలుగుబంటి హల్చల్ చేసింది. దీనిని బస్సులో నుంచి కొందరు ప్రయాణికులు చూశారు. తరచూ ముఖద్వారం వద్ద, శిఖరేశ్వరం వద్ద ఎలుగుబంటి సంచారం కొనసాగుతోందని స్థానికులు తెలిపారు. దీంతో ద్విచక్రవాహనదారులు భయాందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి ఎలుగుబంటిని పట్టుకుని అటవీప్రాంతంలో వదిలిపెట్టాల్సి ఉంది.తిరుపతి రైలుకు కోవెలకుంట్లలో స్టాపింగ్కోవెలకుంట్ల: నంద్యాల– యర్రగుంట్ల రైల్వే మార్గంలో ప్రతి రోజు నడుస్తున్న గుంటూరు– తిరుపతి ఎక్స్ప్రెస్ రైళ్లకు రెండు స్టేషన్లలో స్టాపింగ్కు అనుమతిని ఇస్తూ దక్షణ మధ్య రైల్వేశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు గుంతకల్లు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. ఈ మార్గంలో కోవెలకుంట్ల, జమ్మలమడుగు స్టేషన్లలో నెల రోజుల నుంచి స్టాపింగ్ను రద్దు చేశారు. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నెల రోజుల నుంచి ఆయా స్టేషన్లలో తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నారు. ప్రయాణీకుల ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తిరిగి రైల్వేశాఖ ఆగస్టు 2వ తేదీ నుంచి ఆరు నెలల పాటు రెండు స్టేషన్లలో స్టాపింగ్కు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోవెలకుంట్ల మండలంతోపాటు సంజామల, ఉయ్యాలవాడ, దొర్నిపాడు, గోస్పాడు, అవుకు, కొలిమిగుండ్ల మండలాలకు చెందిన ప్రజలు కోవెలకుంట్లకు చేరుకుని తిరుపతి, గుంటూరు తదితర ప్రాంతాలకు వెళ్లవచ్చు. -
శ్రీమఠంలో నంద్యాల జిల్లా కలెక్టర్
మంత్రాలయం రూరల్: శ్రీరాఘవేంద్ర స్వామి దర్శనార్థం బుధవారం నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి మంత్రాలయానికి వచ్చారు. జిల్లా కలెక్టర్కు శ్రీమఠం అధికారులు స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మకు అర్చన సహిత హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రాఘవేంద్రుల మూలబృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు జిల్లా కలెక్టర్కు ఫలపూలమంత్రాక్షింతలతో ఆశీర్వచనం చేశారు. అంచనా విలువ కన్నా 40 శాతం లెస్కు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పూర్తి స్థాయిలో ఆయా స్కీంలను నిర్వహిస్తారనేది ప్రశ్నార్థకమేనని ఆ శాఖకు చెందిన ఇంజినీర్లే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. లెస్కు అగ్రిమెంట్ చేసుకున్న నీటి పథకాలకు సంబంధించి దాదాపు 120కి పైగా గ్రామాల ప్రజలకు రక్షిత మంచి నీటిని అందించాల్సి ఉంది. అయితే అయితే అక్కడి ప్రజల అవసరాలకు అనుగుణంగా నీటిని విడుదల చేసి చేతులు దులుపుకుంటారేమో అనే అనుమానాలను కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఏ గ్రామానికి ఎంత నీరు సరఫరా చేశారో, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లు క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఎం బుక్ రికార్డ్ చేసి బిల్లులను చేయాల్సి ఉంది. ఇందులో పారదర్శకత లోపిస్తే లెస్ టెండర్లకు ఫలితం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చివరి గ్రామాలకు రక్షిత నీరు ప్రశ్నార్థకమే! -
బీసీ విద్యార్థులపై చిన్నచూపు
కర్నూలు (టౌన్) : బీసీ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థులపై కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, హాస్టళ్ల నిర్వహణను గాలికి వదిలేసిందని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర నాయుడు విమర్శించారు. మంగళవారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్లోని సమావేశ హాలులో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. విద్యార్థులకు వడ్డించే మెనూ సక్రమంగా నిర్వహించడం లేదన్నారు. నీళ్ల చారు, రసంతో సరిపెడుతున్నారన్నారు. గత ప్రభుత్వంలో హాస్టళ్లు, పాఠశాలల నిర్వహణ ఉన్నతంగా ఉండేదన్నారు. ఇప్పుడు ఎక్కడా ఆపరిస్థితి లేదన్నారు. కూటమి సర్కారు ప్రజా సంక్షేమం పక్కన పెట్టి అక్రమ అరెస్టులు చేస్తూ రాష్ట్రంలో భయానక వాతావరణం కల్పిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో బీసీ విద్యార్థుల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర నాయుడు -
సంక్షోభంలో ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు
● వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కటికె గౌతమ్ కర్నూలు(అర్బన్): కూటమి ప్రభుత్వ హయాంలో సంక్షేమ వసతి గృహాలు సంక్షోభంలో కూరుకుపోయాయని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కటికె గౌతమ్ ఆరోపించారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య నాయకత్వంలో ఈ నెల 28,29,30వ తేదీల్లో సంక్షేమ హాస్టళ్ల బాట కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి సూచన మేరకు నగరంలోని పలు హాస్టళ్లను పరిశీలించామన్నారు. డాక్టర్స్ కాలనీలోని బీసీ కళాశాల బాలుర వసతి గృహం వద్ద వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నేతలు మాట్లాడుతూ నగరంలోని పలు సంక్షేమ హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని, కనీసం మరుగుదొడ్లు, నిద్రించేందుకు గదులు, స్నానానికి, తాగేందుకు నీరు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. నాడు – నేడు ద్వారా వేల కోట్ల రూపాయలు వెచ్చించి పాఠశాలల రూపురేఖలు మార్చారన్నారు. 42 ఏళ్ల రాజకీయ అనుభవం, నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రి అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబుకు విద్యార్థుల సమస్యలు, సంక్షేమ వసతి గృహాల అభివృద్ధి పట్టదన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో సకాలంలో విద్యా దీవెన, వసతి దీవెన, హాస్టల్ విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు విడుదలయ్యేవన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి హాస్టల్ విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. కార్యక్రమంలో బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు రాఘవేంధ్రనాయుడు, నగర అధ్యక్షుడు స్వాములు, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనగర్ వెంకటేష్, విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు అన్సూర్బాషా, జిల్లా నాయకులు తిరుమలేష్, శ్రీధర్, కోట్ల మధుకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పేకాట రాయుళ్ల అరెస్టు
పాములపాడు : బానకచర్ల గ్రామం సమీపంలోని నల్లమల అడవిలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. మొత్తం 18 మందిలో 11 మ ంది పరారుకాగా ఏడుగురు పట్టుబడ్డారు. వీరి నుంచి రూ. 62,400 నగదు, మూడు సెల్ ఫోన్లు, ఆరు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మకూరు టౌన్కు చెందిన మల్లికార్జున, ఇస్కాల పెద్ద మదిలేటి, పాములపాడు గంగాధర్ రెడ్డి, బండి ఆత్మకూరు సత్యనారాయణ, పెద్ద దేవలాపురం సుబ్బరాయుడు, ఎర్ర గుడూరు శ్రీరాములు , వెలుగోడు శివన్న పట్టుబడిన వారిలో ఉన్నట్లు ఎస్ఐ సురేష్ బాబు తెలిపారు. ముందస్తు సమాచారంతో ఆత్మకూరు రూరల్ సీఐ సురేష్ కుమార్ రెడ్డితో కలిసి పేకాట స్థావరంపై దాడి చేసినట్లు ఆయన వెల్లడించారు. -
మద్యం కిక్కు.. ఆరోగ్యానికి చిక్కు!
ఐదేళ్లలో మద్యం బాధితుల వివరాలు మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. ఇది అన్ని మద్యం బాటిళ్లపై రాసి ఉంటుంది. ఇందులో నాణ్యమైన మద్యం, కల్తీ మద్యం అన్న తేడా ఉండదు. ఏ మద్యం తాగినా కాలేయం చెడిపోవడం తథ్యం. ఒక్కమాటలో చెప్పాలంటే క్రమంగా వ్యాధులకు గురిచేసి ప్రాణాలు తీసే మహమ్మారి ఇది. కూటమి ప్రభుత్వం వచ్చాక విచ్చలవిడిగా మద్యం దుకాణాలు వెలియడంతో మద్యం తాగే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. మందుబాబులు పూటుగా మద్యం తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ కనిపిస్తున్నారు. పలువురు వ్యాధుల బారిన పడి చనిపోతున్నారు. జిల్లాలో మద్యం తాగి మరణించే వారి సంఖ్య ఈ ఏడాది కాలంలో గణనీయంగా పెరగడమే అందుకు నిదర్శనం. కర్నూలు(హాస్పిటల్): వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యం తాగడాన్ని కట్టడి చేసేందుకు మద్యం దుకాణాల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. ప్రైవేటు దుకాణాలు, బెల్ట్షాపులకు చెక్ పెట్టింది. కేవలం ప్రభుత్వ మద్యం దుకాణాల్లోనే మద్యం విక్రయించేలా చర్యలు చేపట్టింది. మద్యం ధరలు సైతం షాక్ కొట్టేలా చర్యలు తీసుకుంది. ఈ కారణంగా మద్యం తాగే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. కానీ కూటమి సర్కారు ఏర్పడ్డాక ప్రైవేటు మద్యం దుకాణాలు మళ్లీ రాజ్యమేలుతున్నాయి. వాటిలో ఎలాంటి మద్యం విక్రయిస్తున్నారో అర్థం గాని పరిస్థితి. ప్రభుత్వం నాణ్యమైన మద్యం అని చెబుతున్నా దానిని తాగిన వారు ఎక్కువ మంది ఆసుపత్రి పాలవుతున్నారు. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ తూలి, కూలిపోతున్నారు. ఫలితంగా మద్యంకారక వ్యాధులు అధికమయ్యాయి. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని జీర్ణకోశవ్యాధుల విభాగం (గ్యాస్ట్రో ఎంట్రాలజి)కు చికిత్స కోసం వచ్చే వారిలో 50 శాతం వరకు ఆల్కహాలు బాధితులే కావడం గమనార్హం. ప్రతిరోజూ, దీర్ఘకాలం అధిక మోతాదులో మద్యం సేవించడం ద్వారా కాలేయం దెబ్బతిని అది క్రమంగా లివర్ సిర్రోసిస్కు దారి తీస్తోంది. ఒకసారి సిర్రోసిస్ వచ్చిందంటే ప్రాణాంతకమై ప్రాణాలు పోయే అవకాశం ఉంది. గతంలో ఆల్కహాలు సేవనం వల్ల లివర్సిర్రోసిస్కు గురై ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య 20 శాతం కంటే తక్కువగా ఉండేదని, ఇటీవల ఈ సంఖ్య 40 శాతానికి మించిందని వైద్యులు చెబుతున్నారు. వీరితో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ప్రతిరోజూ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టుల వద్దకు మద్యానికి బానిసై వివిధ వ్యాధులకు గురై చికిత్స కోసం వచ్చే వారి సంఖ్య రోజుకు 200లకు పైగా ఉంటోంది. మద్యం ఏదైనా ఒళ్లు గుళ్లే...! మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని అటు బాటిళ్లపై, సినిమాల్లో తారలు మద్యం తాగేసమయంలో వచ్చే హెచ్చరికలు తెలియజేస్తున్నాయి. ఇందులో మంచి మద్యం, చెడు మద్యం అంటూ ఉండవు. ఎలాంటి మద్యం తాగినా ఒళ్లు గుళ్ల కావాల్సిందే. మద్యం తాగడం వల్ల ముందుగా ఫ్యాటీ లివర్ వస్తుంది. ఈ స్టేజిలో మద్యం ఆపేసి చికిత్స తీసుకుంటే కాలేయం దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. ఆ తర్వాత వచ్చే ఆల్కహాలిక్ హెపటైటిస్ స్టేజిలోనూ మద్యం సేవనం ఆపేసి చికిత్స తీసుకుంటే 70 శాతం వరకు రోగిని రక్షించుకోవచ్చు. ఆ తర్వాత సిర్రోసిస్ వచ్చిందంటే కాపాడుకోవడం కష్టం. ప్రతిరోజూ విస్కీ 90ఎంఎల్, వైన్ 150ఎంఎల్, బీర్ 350ఎంఎల్ తాగే వారిలోనూ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ వస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఆల్కహాలు కారణంగా ప్యాంక్రియాస్ జబ్బులు పెరిగి మెదడు, గుండైపె తీవ్ర ప్రభావం చూపుతోంది. మద్యపానంతో వచ్చే వ్యాధులు ఆల్కహాలు సేవించడం వల్ల ముందుగా ఫ్యాటీ లివర్, లివర్ సిర్రోసిస్ వస్తుంది. శరీరంలో కొవ్వు శాతం పెరిగి గుండెజబ్బులకు దారి తీస్తుంది. అధిక రక్తపోటు, నాడీ మండల వ్యాధులకు గురిచేస్తుంది. నరాలు, కండరాలు పటుత్వాన్ని కోల్పోతాయి. ఎక్కువగా నోరు, అన్నవాహిక, గొంతు, లివర్, పాంక్రియాస్ క్యాన్సర్లకూ దారి తీస్తుంది. కడుపులో అల్సర్కు దారి తీసి అది ఒక్కోసారి క్యాన్సర్గా మారే అవకాశమూ ఉంది. ఆల్కహాలు సేవించడం వల్ల పాంక్రియాస్ జబ్బులు కూడా పెరుగుతున్నాయి. అది మెదడు, గుండైపె తీవ్రప్రభావం చూపుతుంది. రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అతిగా మద్యం సేవించే వారు క్రమంగా సమాజం నుంచి దూరమవుతున్నారు. ఇన్ని నష్టాలున్న మద్యాన్ని తాగకపోవడమే మేలని వైద్యులు సూచిస్తున్నారు. మద్యం తాగి గతేడాది 271 మంది మృతి ఈ ఏడాది జూన్ నాటికి 97 మంది మృత్యువాత పెద్దాసుపత్రికి వచ్చే రోగుల్లో 50 శాతం మంది మద్యం బాధితులే ఏటా పెరుగుతున్న కాలేయం, క్లోమ గ్రంథివ్యాధి కేసులు వేధిస్తున్న ఫ్యాటీ లివర్, హెపటైటిస్ జబ్బులుసంవత్సరం ఓపీ ఐపీ మరణాలు 2021 6,617 1,013 24 2022 8,943 1,449 35 2023 10,051 1,626 60 2024 15,564 3,366 271 2025 8,655 1,561 97 (జూన్ వరకు) మద్యం ఏదైనా ఆరోగ్యానికి హానికరమే మేము వారానికి ఒకసారి మాత్రమే తాగుతున్నాము. అది కూడా లిమిట్గా తాగుతున్నామని కొందరు చెబుతుంటారు. మద్యం ఎంత మోతాదులో తాగినా ప్రమాదమే. అతిగా మద్యం సేవించడం ద్వారా త్వరగా కాలేయం దెబ్బతింటుంది. లివర్ సిరోసిస్కు గురైన వారిని కాపాడటం కష్టంతో కూడుకున్నపని. మద్యం తాగడం కన్నా దానికి దూరంగా ఉంటేనే ఆరోగ్యానికి మంచిది. –డాక్టర్ జి.మోహన్రెడ్డి, గ్యాస్ట్రో ఎంట్రాలజి హెచ్వోడి, జీజీహెచ్, కర్నూలు ఎక్కువ మందికి ఫ్యాటీ లివర్ మద్యపానం వల్ల ఎక్కువ మంది ముందుగా ఫ్యాటీలివర్కు గురవుతున్నారు. ఇటీవల ఈ వ్యాధితో బాధపడే వారి సంఖ్య బాగా పెరిగింది. మద్యం తాగే సమయంలో కొవ్వు అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల కాలేయంపై కొవ్వు పేరుకుంటోంది. ఫ్యాటీలివర్ను త్వరగా గుర్తించి చికిత్స తీసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది. –డాక్టర్ పి. అబ్దుల్ సమద్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు, కర్నూలు -
మద్యం తాగేందుకు తీసుకెళ్లి దాడి
ఎమ్మిగనూరురూరల్: మద్యం తాగేందుకు తీసుకెళ్లి వేటకొడవలితో దాడి చేశారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో బాధిత వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. కోడుమూరుకు చెందిన ఎరుకుల కృష్ణ కొన్ని రోజులుగా గోనెగండ్లలో భార్య సుజాత దగ్గరే ఉంటున్నారు. ఆటో పెట్టుకొని గుజిరి వ్యాపారం చే స్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండు రోజుల క్రితం కోడుమూరులోని తన ఇంటి పక్కనే ఉన్న బోయ రాములమ్మ అనే మహిళతో చెత్త విషయంలో కృష్ణ గొడవ పడ్డాడు.ఒకరికొకరు కోడుమూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విషయాన్ని బోయరాములమ్మ తన కుమారుడైన బోయ ఠాగూర్కు తెలియజేసింది. దీనిని మనస్సులో పెట్టుకున్న అతను సోమవారం రాత్రి గోనెగండ్లకెళ్లి ఎరుకుల కృష్ణను కలిశాడు. మద్యం తాగుదామని చెప్పి గోనెగండ్ల–రాళ్లదొడ్డి గ్రామాల మధ్య ఉన్న కాలువ గట్టు వద్దకెళ్లారు. మద్యం తాగిన తర్వాత తన తల్లితో ఎందుకు గొడవపడ్డావని వాదనకు దిగి వెంట తెచ్చుకున్న వేటకొడవలితో కృష్ణపై దాడి చేశాడు. అతను ఎదురు దాడికి దిగడంతో ఠాగూర్ అక్కడి నుంచి పారిపోయాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన కృష్ణ మార్గమధ్యంలో కాలువ గుంతలో పడిపోయాడు. మంగళవారం ఉదయం మెలకువ రావడంతో జరిగిన విషయాన్ని ఎమ్మిగనూరు రూరల్ పోలీసులకు తెలియజేయగా వారు మొదట చికిత్స నిమిత్తం కృష్ణను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడిపై అట్రాసిటీ కేసుతో పాటు, హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
ఇద్దరు యువకుల దుర్మరణం
కోడుమూరు రూరల్: కోడుమూరు–కర్నూలు రోడ్డులో నెరవాడ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గూడూరు మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు.. చనుగొండ్లకు చెందిన ఏబెల్ కుమారుడు శాంతి రాజు(20), యిర్మీయా కుమారుడు శివ(18) కర్నూలులో ఒకరు ఏసీ మెకానిక్, మరొకరు తాపీ మేసీ్త్రగా పని చేస్తున్నారు. వారిద్దరూ కలిసి మంగళవారం రాత్రి కర్నూలు నుంచి బైక్పై స్వగ్రామం చనుగొండ్లకు బయలుదేరారు. మార్గమధ్యలో నెరవాడ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. వాహనదారులు గమనించి చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోలుకోలేక యువకులిద్దరూ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కె.నాగలాపురం ఎస్ఐ శరత్కుమార్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా చేతికొచ్చిన కుమారులను రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబలించడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు వర్ణణాతీతం. మృతిచెందిన శాంతిరాజు, శివ -
పట్టు తప్పితే అంతే!
నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా కొందరిలో మార్పు రావడం లేదు. తమ వెనుక ఓ కుటుంబం ఉందనే విషయాన్ని మరచి నిర్లక్ష్యంగా ప్రయాణం చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఓ బాలుడు ట్రాక్టర్ ఇంజిన్కు గొర్రును తగిలించుకుని దానిపై కూలీలను ఎక్కించుకుని ప్రమాదకరంగా తీసుకెళ్తున్నాడు. ఏమాత్రం పట్టు తప్పినా విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోయే ఈ దృశ్యాలు కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామ సమీపంలో మంగళవారం కనిపించాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
దొంగ అరెస్టు
బనగానపల్లె: ఇంటి పక్కనే ఉండి చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల మేరకు..మండలంలోని ఇల్లూరుకొత్తపేట గ్రామంలో నూర్ ఆహమ్మద్, జాఫర్హుస్సేన్ల గృహాలు పక్కపక్కనే ఉన్నాయి. అయితే, వీరి మధ్య మనస్పర్థలు ఉండటంతో మాటల్లేవు. ఈ క్రమంలో ఈనెల 26వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి జాఫర్హుస్సేన్ తమ బందువుల ఊరికి వెళ్లాడు. గమనించిన నూర్ఆహమ్మద్ రాత్రి ఇంటి తాళం పగలగొట్టి లోపలికి చొరబడి బీరువాలో ఉన్న రూ. 4.80 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, వెండివస్తువులు చోరీ చేశాడు. మరుసటి రోజు ఇంటికి చేరుకున్న జాఫర్హుస్సేన్ ఇంటి తాళం, బీరువా తెరిచి ఉండటంతో చోరీ జరిగిందని నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చోరీకి గురైన సొమ్ములో గోల్డ్ రింగ్ మినహా మిగతా ఆభరణాలన్నీ రికవరీ చేసినట్లు సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. -
కేంద్ర పథకాలను పటిష్టంగా అమలు చేయాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: కేంద్ర ప్రభుత్వ పథకాలను పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని తన చాంబర్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనుల పరిశీలనకు వచ్చిన జాతీయ స్థాయి పర్యవేక్షణ కేంద్ర బృందం, జిల్లా అధికారులతో కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సంతోష్ ఫరీదా ఆధ్వర్యంలో కేంద్ర బృందం ఈనెల 19 నుంచి 29 వరకు జిల్లాలో పర్యటించిందన్నారు. ఉయ్యాలవాడ, జూపాడుబంగ్లా, నంద్యాల మండలంలోని పాంపల్లి, గోవిందపల్లి, జంబులదిన్నె, పారుమంచాల, జూపాడుబంగ్లా, లింగందిన్నె, భీమవరం, బిల్లలాపురం గ్రామపంచాయతీలు సందర్శించి వివిధ కేంద్ర పథకాల కింద అమలవుతున్న పనులను పరిశీలించిందన్నారు. పర్యటనలో గుర్తించిన విధానపరమైన అంశాలను బృందం సభ్యులు సంబంధిత శాఖల అధికారులతో కూలంకషంగా చర్చించారన్నారు. పలు అంశాలలో తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన పనులపై పలు సలహాలు, సూచనలు ఇచ్చారన్నారు. సమావేశంలో ఎన్ఎల్ఎం సభ్యులు సూర్య ప్రదాన్, డ్వామా పీడీ సూర్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు. -
సబ్సిడీ విత్తనాలు మగ్గుతున్నాయ్
రుద్రవరం: చిత్రంలో సంచుల్లో కనిపిస్తున్నవి రుద్రవరం వ్యవసాయ కార్యాలయంలోని సబ్సిడీ కంది, మినుము విత్తనాలు. నెల రోజుల క్రితం ఇక్కడికి చేరుకున్నాయి. రోజూ.. రైతులు ఇక్కడికి వచ్చి సబ్సిడీ విత్తనాలు ఎప్పుడు పంపిణీ చేస్తారని అడగటం, అధికారులు మాత్రం రేపు..మాపు అంటూ జాప్యం చేస్తూ వచ్చారు. ఇప్పటికే ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు కావస్తోంది. ఈ విత్తనాలు పంపిణీ చేసి ఉంటే పొలాల్లో మొలకెత్తి పంట పచ్చగా కళకళలాడేది. పంపిణీ చేయకపోవడంతో నెల రోజులుగా కుట్టేసిన సంచుల్లో 16 క్వింటాళ్ల కందులు, 20 క్వింటాళ్ల మినుములు మగ్గిపోతున్నాయి. రోజూ కార్యాలయం తలుపులు తెరుస్తున్నారు.. అధికారులు వస్తున్నారు.. రైతులు విత్తనాలు ఇంకెప్పుడిస్తారని అని అడుగుతున్నారు.. అయినా విత్తనాలు గేటు దాటని పరిస్థితి నెలకొంది. ఓ ప్రజా ప్రతినిధి చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేయాలని స్థానిక అధికారులు, నేతలు భావించారు. అయితే ఇప్పుడు.. అప్పుడు అంటూ కాలయాపన కావడంతో పుణ్యకాలం గడిచిపోయింది. విత్తనం అదును దాటిపోయిందని, రబీ సీజన్లో భాగంగా సెప్టెంబర్ నెలలో పంపిణీ చేసే అవకాశం ఉందని అధికారుల ద్వారా తెలుస్తోంది. -
దాతల దయాదాక్షిణ్యాలు వద్దు
ఆడబిడ్డనిధి పథకాన్ని పక్కన పెట్టి పీ4 పేరిట ముఖ్యమంత్రి మహిళలను మోసం చేస్తున్నారు. పీ4 కింద ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయదు. దాతల దయాదాక్షిణ్యాల మీద బతికే పరిస్థితిని ముఖ్యమంత్రి తీసుకరావడం దారుణం. మాకు పీ–4 వద్దు.. ఆడబిడ్డ నిధి అమలు చేయాలి. – ఆవుల ఆదిలక్ష్మి, జ్యోతి గ్రూపు, కడమకుంట్ల, తుగ్గలి మండలం అప్పుల ఊబిలో కూరుకుపోయాం పొదుపు మహిళలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై రూ.10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణా లు అమలు చేస్తామన్నారు. ఇంతవరకు ఆ ఊసే కరువైంది. బ్యాంకుల నుంచి రుణాలు పొందిన మహిళలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. మహిళా సంక్షేమానికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణం. – బి.రమాదేవి, పొదుపు మహిళ, రామకృష్ణాపురం, క్రిష్ణగిరి మండలం -
మోడల్ స్కూల్ విద్యార్థికి అస్వస్థత
జూపాడుబంగ్లా: స్థానిక మోడల్స్కూల్లో మధ్యాహ్న భోజనం చేస్తూ విజయ్కైలాస్ అనే 8వ తరగతి విద్యార్థి అస్వస్థతకు గురయ్యాడు. విషయం తెలుసుకొన్న పాఠశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ సుభాకర్, పీఈటీ పద్మావతి, పాఠశాల విద్యార్థులు కైలాస్ను హుటా హుటినా కారులో ప్రాథమిక వైద్య కేంద్రానికి తరలించారు. పీహెచ్సీ వైద్యురాలు సభా అస్వస్థతకు గురైన విజయ్కై లాస్కు వైద్య పరీక్షలు చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తున్న విజయ్కై లాస్కు ఫిట్స్ రావటంతో తోటి విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న కై లాస్ తండ్రి చిన్నతిరుపాలు ఆసుపత్రికి చేరుకోవ డంతో మెరుగైన చికిత్స నిమి త్తం 108లో కర్నూలు ప్రభు త్వ వైద్యశాలకు తరలించారు. -
వ్యర్థ కాలుష్యాన్ని నివారిద్దాం
● ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య బేతంచెర్ల: పరిశ్రమలు, గనుల నుంచి వెలువడే వ్యర్థ కాలుష్యాన్ని నివారించేందుకు అందరూ సహకరించాలని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య అన్నారు. మంగళవారం పట్టణంలోని అయ్యల చెర్వులో నాపరాళ్ల పరిశ్రమల యజమానులు, సిమెంట్ ఫ్యాక్టరీ యాజమానాల్యతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాపరాళ్ల గనుల యజమానులు ఒక క్లస్టర్గా ఏర్పడి దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లోగా క్లస్టర్ ఈసీల మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. నాపరాళ్ల గనుల ఈసీల సమస్యలతో పాటు, పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను సిమెంట్ పరిశ్రమలో ఉపయోగించుకునే విధానంపై చర్చించారు. నాపరాళ్ల పరిశ్రమల వేస్టేజీని పాణ్యం సిమెంట్ ఫ్యాక్టరీ మాత్రమే వాడుకుంటామని తెలపగా, మహా సిమెంట్, జిందాల్, రామ్కో సిమెంట్ యాజమాన్యాలు తమకు వాడుకోవడానికి వీలుపడదని స్పష్టం చేశాయి. బేతంచెర్ల నాపరాళ్ల పరిశ్రమల యజమానులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నంద్యాల ఏజీ మైన్స్ అధికారి శ్రీనివాస్, పరిశ్రమల యజమానులు పాల్గొన్నారు. -
ఆడబిడ్డ నిధి లేనట్లే..
కర్నూలు(అగ్రికల్చర్): ‘‘ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 నేరుగా మీ ఖాతాలో జమచేస్తాం. మీ ఇంటిలో ఇద్దరు ఉంటే ఇద్దరికి, ముగ్గురు ఉంటే ముగ్గురికి కూడా ఈ మొత్తాన్ని అందిస్తాం. 18 నుంచి 59 ఏళ్లలోపు వయస్సు మహిళలందరికీ ఆడబిడ్డ నిధి పథకాన్ని వర్తింపజేస్తాం.’’ అంటూ 2024 మే నెలలో జరిగిన ఎన్నికల సమయంలో అన్ని ప్రచార సభల్లోనూ కూటమి నేతలు హోరెత్తించారు. నీకు.. నీకు.. నీకు అంటూ వేలితో చూపించి మీ అకౌంటుకు నెలకు రూ.1,500 ప్రకారం వేస్తామని ఊరూవాడా నమ్మబలికారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపు 14 నెలలు అవుతోంది. ఇంతవరకు ఆడబిడ్డనిధి జాడ లేకుండాపోయింది. కూటమి నేతల వైఖరి చూస్తే ఆడబిడ్డ నిధిని గంగలో కలిపినట్లు తెలుస్తోంది. ఈ పథకాన్ని అమలు చేయలేక చేతులెత్తేసిన ముఖ్యమంత్రి ప్రజల దృష్టి మళ్లించేందుకు పీ–4 కార్యక్రమాన్ని తెరమీదకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దాతల దయాదాక్షిణ్యాల మీద బతికే దుస్థితి తీసుకురావడం పట్ల మహిళల్లో నిరసన వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో రైస్కార్డులు కలిగిన కుటుంబాలు దాదాపు 16 లక్షల వరకు ఉన్నాయి. ఈ కుటుంబాలన్నీ దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవే. అయితే బంగారు కుటుంబాలుగా కర్నూలు జిల్లాలో 64,178, నంద్యాల జిల్లాలో 43,021 కుటుంబాలను మాత్రమే ఎంపిక చేయడం గమనార్హం. బలవంతపు దత్తత ఆడబిడ్డ నిధి సహా వివిధ ఎన్నికల హామీలకు మంగళం పలుకుతున్న కూటమి ప్రభుత్వం మహిళల దృష్టి మళ్లించేందుకు పబ్లిక్, ప్రైవేటు, పీపుల్స్, పార్టనర్షిప్(పీ4)ను తెరపైకి తీసుకొచ్చింది. ఇందులో ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయదు. కార్పొరేట్ కంపెనీలు, పరిశ్రమల నిర్వాహకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకొని బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దాలి. దాతల దయాదాక్షిణ్యాల మీద ఈ కుటుంబాలు బతికే దుస్థితికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో 64,178, నంద్యాల జిల్లాలో 43,021 కుటుంబాలను అత్యంత నిరుపేద కుటుంబాలుగా ఆయా జిల్లాల యంత్రాంగం ఎంపిక చేసింది. ఇందులో కర్నూలు జిల్లాలో 34,385, నంద్యాల జిల్లాలో 40,231 కుటుంబాలను దాతలు దత్తత తీసుకున్నారు. ఇందుకోసం కర్నూలు జిల్లాలో 4,443, నంద్యాల జిల్లాలో 5,150 మంది మార్గదర్శలను ఎంపిక చేశారు. బలవంతంగా మార్గదర్శకులను ఎంపిక చేస్తుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. విజయవంతంగా వైఎస్ఆర్ చేయూత గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 18–59 ఏళ్ల వయస్సు మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకాన్ని అమలు చేసింది. ఒక్కో మహిళకు ఏడాదికి రూ.18,870 ప్రకారం విడుదల చేసిది. నాలుగేళ్లలో వైఎసార్ చేయూత కింద రూ.1,954.92 కోట్లు నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం విశేషం. వైఎసార్ చేయూత పథకాన్నే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆడబిడ్డ నిధిగా మార్పు చేశారు. 18–59 ఏళ్ల వయస్సు మహిళలు కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరికీ నెలకు రూ.1,500 ప్రకారం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి నమ్మించడం గమనార్హం. 2024 ఎన్నికల సమయంలో ఊరూవాడ మారుమోగిన ఆడబిడ్డ నిధి పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళం పలికినట్లేనని టీడీపీ నేతలే పేర్కొంటున్నారు. ఈ పథకాన్ని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాల్సిందేనని ఇటీవల వ్యవసాయ అనుబంధ శాఖల మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొనడం పట్ల మహిళల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని 2024–25లో ఎగ్గొట్టి.. 2025–26లో అరకొరగా అమలు చేసింది. ఆడబిడ్డ నిధికి పూర్తిగా మంగళం పలుకుతుండటం పట్ల మహిళల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. -
సహకార సంఘాల బలోపేతానికి కృషి
● జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ నంద్యాల: జిల్లాలో సహకార సంఘాల బలోపేతానికి కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీసీ హాల్లో జిల్లా కో–ఆపరేటివ్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. జిల్లాలో 56 కో–ఆపరేటివ్ సొసైటీలను ఆర్థికంగా బలోపేతం చేసి మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా నాబార్డు, డీసీసీబీలు ఆర్థికంగా మద్దతు అందించాల్సిన అవసరం ఉందన్నా రు. మల్టీపర్పస్ ఫెసిలిటీస్ సెంటర్ గోడౌన్స్ రైతుల అవసరం మేరకు ఇవ్వాలన్నారు. జిల్లాలో పండిస్తున్న పంటలకు అనవసరంగా యూరియా వాడకూడదని, యూరి యా ఎక్కువగా వాడటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఒక ఎకరాకు రెండు బ్యాగులు మాత్రమే యూరియా వాడాలని అధిక మోతాదులో వినియోగిస్తే పంట దిగుబడి తగ్గిపోవడంతో పాటు భూస్వారం నిర్వీర్యమవుతుందన్నారు. నానో యూరియా పిచికారీపై అవగాహన పెంచు కోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కో–ఆపరేటివ్ అధికారి రామాంజనేయులు, నాబార్డు డీడీఎం కార్తికేయ, డీసీసీబీ శివలీల తదితరులు పాల్గొన్నారు. -
అటకెక్కిన ‘ఆడబిడ్డ నిధి’
● 2024 ఎన్నికల సమయంలో ఊరూవాడా మారుమోగిన హామీ ● రూ.1,500 చొప్పున ఖాతాల్లో జమచేస్తామని ప్రచారం ● 14 నెలలు గడిచినా ఆ ఊసెత్తని కూటమి నేతలు ● ఇప్పుడు అమలుపై మాట మార్చిన సీఎం చంద్రబాబు ● ఆడబిడ్డల దృష్టి మళ్లించేందుకు తెరపైకి పీ–4 ● దాతల దయాదాక్షిణ్యాలు మాకొద్దని మహిళల ఆగ్రహం ఉపాధ్యాయులను మినహాయించండి ఆదోని సెంట్రల్: ప్రభుత్వం పీ–4 పథకం బాధ్యతల నుంచి ఉపాధ్యాయులను మినహాయించాల ని ఎస్టీయూ రాష్ట్ర పురపాలక కన్వీనర్ జి.వీరచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం గుర్తించిన పేద కుటుంబాలను సంపన్న వర్గాల కు చెందిన వారు దత్తత తీసుకొని వారికి ఆర్థికంగా తోడ్పాటు అందించే కార్యక్రమంలో ఉపాధ్యాయులను భాగస్వాములు కావాలనడం సరికాదన్నారు. ప్రతి ప్రధానోపాధ్యాయుడు ఐదు కుటుంబాలు, ప్రతి ఉపాధ్యాయుడు రెండు కుటుంబాలను దత్తత తీసుకొని మార్గదర్శులుగా నమో దు చేసుకోవాలని బలవంతం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జీతం మీద ఆధారపడిన ఉద్యోగులకు అంతస్థాయి ఎక్కడిదన్నారు. ఇప్పటికే బోధనేతర పనులతో సతమతం అవుతున్నామని, ఈ నేపథ్యంలోనే మరింత వేధింపులకు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. -
విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరిస్తే గుణపాఠం తప్పదు
ఓర్వకల్లు: పేద విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరిస్తే కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని వైఎస్సార్సీపీ విభాగం నంద్యాల జిల్లా అధ్యక్షుడు సురేష్ యాదవ్ హెచ్చరించారు. పార్టీ ఆదేశాల మేరకు ‘సంక్షేమ హాస్టళ్ల బాట’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కాల్వబుగ్గ గురుకుల పాఠశాలలోని వసతి గృహాన్ని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులతో కలసి ఆయన సందర్శించారు. వసతి గృహంలో నెలకొన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సురేష్ యాదవ్ మాట్లాడుతూ.. వసతి గృహంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగు దొడ్లు లేవన్నారు. సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారన్నారు. గత ప్రభుత్వ పాలనలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండేళ్లు కరోనా పోగా, మిగతా మూడేళ్లలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చారన్నారు. నాడు–నేడుతో శాశ్వత పరిష్కారం చూపారని గుర్తుచేశారు. 42 ఏళ్ల రాజకీయ అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకోవడమే గానీ విద్యార్థులను పట్టించుకొన్న పాపాన పోలేదని మండిపడ్డారు. జగనన్న ప్రభుత్వంలో హాస్టల్ విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు, దుప్ప ట్లు, ట్రంకు పెట్టెలు సకాలంలో అందేవని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఏమి ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులను విద్యకు దూరం చేయాలనే కుట్రపన్నుతున్న కూ టమి ప్రభుత్వానికి పుట్టగతులు వుండవని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి పాయి, జిల్లా నాయకులు తిరుమలేష్, కర్నూలు మండల అధ్యక్షులు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా గరుడ పంచమి వేడుకలు
ఆళ్లగడ్డ: అహోబిలం క్షేత్రంలో గరుడ పంచమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. గరుడ పంచమిని పురస్కరించుకుని మంగళవారం దిగువ అహోబిలంలో మూలమూర్తులు శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవార్లకు నిత్య పూజల అనంతరం ప్రత్యేక గరుడ పంచమి పూజలు చేపట్టారు. అనంతరం దేవాలయం ఎదురుగా ధ్వజ స్తంభం దగ్గర కొలువైన మూలమూర్తి గరుత్మంతుడికి వేద పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా పంచామృతాలతో అభిషేకించి తిరుమంజనం సేవ నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి కార్యక్రమాన్ని ముగించారు. ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్, మణియార్ సౌమ్యానారాయణ్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఉన్నత శిఖరాలు అధిరోహించాలి ఆత్మకూరు: అడవి బిడ్డలు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని డీఈఓ జనార్దన్రెడ్డి అన్నారు. బైర్లూటీ చెంచుగూడెంలో రూ.2.30 కోట్లతో నూతన గిరిజన బాలుర వసతిగృహ నిర్మాణానికి మంగళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ చెంచు గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకుని గూడేలకు మంచి పేరు తేవాలన్నారు. క్రమశిక్షణతో చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో ఆత్మకూరు ఎంఈఓ మేరీమార్గరేట్, సమగ్రశిక్ష ఈఈ శ్రీనివాసులు, సర్పంచ్ గురువమ్మ, ఏఈ శంకరయ్య, గిరిజన విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రతపై అవగాహన కల్పించండి కొత్తపల్లి: ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై వైద్య, ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పించాలని జిల్లా మలేరియా నివారణ అధికారి చంద్రశేఖర్ సూచించారు. మంగళవారం గువ్వలకుంట్ల గ్రామ ఎస్సీకాలనీలో డాక్టర్ మహమ్మద్ బేగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని తనిఖీ చేశారు. అనంతరం కాలనీలో ఎక్కడైనా నీటికలుషితం జరిగిందా అని ఆరా తీశారు. కాలనీకి నీటి సఫరా అయ్యే బావినీటిని, చేతిపంపులు, ఇళ్లలోని నీటినిల్వ డ్రమ్ములు, తొట్టిలు, కాలనీ పరిసర ప్రాంతాలను, మురికి కుంటలను పరిశీలించారు. నీటిసరఫరా అయ్యే బావిని శుభ్రంచేయించి బ్లీచింగ్ పౌడర్ వేయాలన్నారు. నీటిని ఎక్కువరోజులు నిల్వ ఉంచకుండా, రోజుమరచిరోజు తొట్టిలు, డ్రమ్ములను శుభ్రం చేయించేలా ఆశాలు చూడాలన్నారు. గ్రామస్తులకు ఎక్కువగా టైఫాయిడ్ లక్షణాలు ఉన్నందును గ్రామంలో సరఫరా అయ్యే నీటిని పరీక్షలకు పంపించామన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున కాచిన నీటిని తాగాలని సూచించారు. ఆయన వెంట డిప్యూటీ ఎంపీడీఓ సుబ్బరావు, పంచాయతీ కార్యదర్శి చిన్నస్వామి, వైద్య, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. కొత్తూరులో విజిలెన్స్ ఎస్పీ పూజలు పాణ్యం: కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణేశ్వర్యస్వామి ఆలయంలో ఉమ్మడి జిల్లా విజిలెన్స్ ఎస్పీ చాముండేశ్వరి పూజలు చేశారు. ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజ లు, అభిషేకాలు, అర్చనలు చేశారు. అనంతం ఆలయ మర్యాదలతో ఆమెకు శేషావస్త్రాలు, తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. -
సాగర్కు పెరిగిన వరద
విజయపురిసౌత్, శ్రీశైలం ప్రాజెక్ట్, ఏలూరు, హోళగుంద: ఈ ఏడాది కృష్ణా పరీవాహక ప్రాంతాలైన మహారాష్ట, కర్ణాటకలలో కురిసిన భారీ వర్షాలకు ముందస్తుగానే జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. ఆల్మట్టి నుంచి శ్రీశైలం జలాశయం వరకు గల జలాశయాలు గత వారంలోనే గరిష్ట స్థాయి మట్టాలకు చేరాయి. అదనంగా వచ్చే వరదనంతటినీ శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి 1,98,920 క్యూసెక్కుల మేర వరద పెరగడంతో సోమవారం నాలుగు గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 1,08,260 క్యూసెక్కుల వరదనీటిని దిగువకు వదులుతున్నారు.కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 66,896 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 312 టీఎంసీలు కాగా, వరద పోటెత్తడంతో ప్రస్తుతం 297 టీఎంసీలకు చేరింది. అలాగే, తుంగభద్రకు సోమవారం వరద పోటెత్తడంతో జలాశయంలోని నీరు 1,07,500 క్యూసెక్కులకు చేరుకుంది.పోలవరానికి గోదావరి ఉధృతి కొనసాగడంతో స్పిల్వే 31 మీటర్ల ఎత్తు నుంచి 6,60,977 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ముంపు మండలమైన వేలేరుపాడులో ఎద్దులవాగు వంతెన నీట మునగడంతో 18 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
పులుల లెక్కింపు ఇలా..
దశాబ్ద కాలం వెనక్కు వెళ్తే నల్లమల అడవుల్లో ఎక్కడ చూసినా.. కలప కోసం వెళ్లే మనుషులు, వారి ఎద్దుల బండ్లు, సైకిళ్ల వరుసలు కనిపించేవి. గొడ్డలి మోతలతో అడవి దద్దరిల్లేది. జాతీయ పులుల సంరక్షణాసాధికార సంస్థ తీసుకున్న నిర్ణయాలను తూచా తప్పక పాటించిన స్థానిక అధికారులు అడవిలో మానవ సంచారాన్ని పూర్తి స్థాయిలో నిరోధించారు. ప్రస్తుతం ఆదిమ గిరిజనులైన చెంచులు, అటవీ సిబ్బంది తప్ప అడవుల్లో తిరిగే వారే లేరు. ఇది పులుల సంరక్షణకు ఎంతో కలసివచ్చింది. పులుల సంచారానికి, సంయోగానికి ఆటంకం లేని పరిస్థితులతో వాటి సంఖ్య పెరగడానికి దోహదపడిందని చెప్పవచ్చు. నాగార్జునసాగర్ – శ్రీశైలం పెద్ద పులుల అభయారణ్యం యావత్ భారత దేశంలోనే విస్తీర్ణం రీత్యా అతి పెద్ద పెద్దపులుల అభయారణ్యం. సుమారు 3500 చ.కిమీ పరిధిలో విస్తరించిన ఈ అభయారణ్యంలో ఆత్మకూరు అటవీ డివిజన్ అత్యంత కీలకమైనది. ఎన్ఎస్టీఆర్లో 2015 నాటికి 37 పెద్దపులులు ఉన్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. కాగా 2025 నాటికి ఈ సంఖ్య 87కు చేరుకుంది. అలాగే పులుల గణనలో మూడేళ్ల లోపు కూనలను లెక్కింపులోకి తీసుకోరు. దశాబ్ద కాలంలో ఎన్ఎస్టీఆర్లో పెద్దపులుల సంఖ్య ఏకంగా 87కు చేరుకుని దాదాపు 50 పులులు మేర పెరగడం పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. ఆత్మకూరు అటవీ డివిజన్లోని శ్రీశైలం, నాగలూటి, బైర్లూటీ రేంజ్లు పులుల ప్రవర్దనానికి స్వర్గధామం. వాటి సంరక్షణా పద్ధతుల్లో అధికారులు తీసుకున్న చర్యలతో పాటు సహజ ఆవాసపు నాణ్యత కూడా కారణాలు అని చెప్పవచ్చు. పులి చాలా సిగ్గరి జంతువు. పులుల సంగమ సమయంలో మనిషి అలికిడి విన్నాచాలు అవి వెంటనే సమాగం నుంచి దూరమవుతాయి. లేత గర్భంతో ఉన్న ఆడపులులకు మానవ కలకలం వినపడినా సరే బెదురుతో గర్భస్రావం అవుతుంది. పులి విహారానికి ఆటంకం జరగకుండా అడవుల్లో మానవ ప్రవేశాన్ని సంచారాన్ని నియంత్రిస్తున్నారు. వైల్డ్లైఫ్ క్లినిక్ ఎన్ఎస్టీఆర్ పరిధిలో పని చేసేందుకు ఆత్మకూరు అటవీ డివిజన్ కేంద్రంగా బైర్లూటీలో ఒక వైల్డ్లైఫ్ క్లినిక్ ఏర్పాటు అయ్యింది. ఇందులో ఇద్దరు వన్యప్రాణి వైద్య నిపుణులు పని చేస్తున్నారు. వీరికి సహాయకారిగా ఒక అనిమల్ రెస్క్యూ వాహనం కూడా ఉంటోంది. పులులతో పాటు ఏ ఇతర వన్య ప్రాణులు గాయపడినప్పుడు సత్వర చికిత్స అందించేందుకు ఈ క్లినిక్ ఎంతో ఉపయుక్తంగా ఉంది. అలాగే ఒక స్నిఫర్ డాగ్ కూడా ఉంది. ఇది ఇద్దరు సంరక్షకుల శిక్షణతో పని చేస్తోంది. శేషాచలం వైపు అడుగులు నల్లమలలోని శ్రీశైలం నుంచి శేషాచలం అడవుల వరకు పెద్దపులి ప్రస్థానం కొనసాగాలని ఆకాంక్షించిన అటవీ అధికారులు ఆదిశగా కార్యక్రమాలు చేపట్టారు. శ్రీశైలం, గుండ్ల బ్రహ్మేశ్వరం, నంద్యాల అటవీ డివిజన్, రుద్రవరం రేంజ్, వైఎస్సార్ జిల్లా లంకమల వరకు పెద్దపులుల ప్రస్థానం కొనసాగింది. ఈ నేపథ్యంలో పులులు స్వేఛ్ఛగా సుదూర ప్రాంతాలకు తరలి వెళ్లడానికి తగిన వసతులు కల్పించడమే శ్రీశైలం – శేషాచలం పెద్దపులుల కారిడార్ ఆలోచనకు నాంది అయ్యింది. ఇటీవల ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో ఒక పెద్దపులి ఏకంగా అడవిని దాటి పూర్తిగా మైదాన ప్రాంతంలో 25 కిమీ సంచరించి తిరిగి అడవిలోకి వెళ్లడాన్ని అధికారులు గుర్తించారు. దీంతో పులి కారిడార్పై కొత్త ఆశలు చిగురించాయి. ఎలాంటి పచ్చదనం లేక పోయినా పులి ముందుకు వెళ్లగలుగుతుందనే నమ్మకం ఏర్పడింది. ఇక కేవలం పులికి, మనిషికి ఏర్పడే సంఘర్షణ నివారణ చర్యలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందని గుర్తించారు. పులుల స్వర్గధామం... ఆత్మకూరు అభయారణ్యం దశాబ్దకాలంలో రెండింతల పెరుగుదల శ్రీశైలం – శేషాచలం కారిడార్కు ప్రయత్నాలు నేడు అంతర్జాతీయ పెద్దపులుల దినోత్సవం పెద్దపులి సంరక్షణలో ముందడుగు పెద్దపులి సంరక్షణ కోసం అన్నిరకాల చర్యలు చేపట్టడంలో ముందడుగులో ఉన్నాము. పులి ఆహార జంతువులకు ఆహార కొరత లేకుండా 200 హెక్టార్లలో గడ్డి మైదానాలను అభివృద్ధి పరుస్తున్నాం. నీటి కొరత లేకుండా నీటి వనరుల పర్యవేక్షణ జరుగుతోంది. ఎన్ఎస్టీఆర్ పరిధిలో 80 నీటి కుంటల్లో పూడిక తీయించాం. పులుల సంఖ్య పెరుగుతున్నందువల్ల వాటి ఆహార జంతువుల నిష్పత్తి తగ్గకుండా బయటి ప్రాంతాల్లోంచి చుక్కల దుప్పులు, కణుతులను పూర్తి ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అడవిలో వదులుతున్నాం. ఇప్పటికే కాకినాడలోని నాగార్జున ఎరువుల కర్మాగారం వారి సంరక్షణలో ఉన్న దుప్పులను, కణుతులను, సత్యసాయిబాబా ట్రస్ట్ పరిధిలో ఉన్న హరిణి వనాల్లోని జింకలు అడవుల్లో వదలడానికి సిద్ధం చేశాం. – వి సాయిబాబా, డిప్యూటీ డైరెక్టర్, ప్రాజెక్ట్ టైగర్, ఆత్మకూరు పెద్ద పులుల పాద ముద్రలు సేకరించి వాటి ఆధారంగా పులుల సంఖ్యను అంచనా వేయడాన్నే స్టాండర్డ్ ఫగ్మార్క్ ఎన్యూమరేషన్ పద్ధతిగా పిలుస్తారు. పులుల సంచారాన్ని గుర్తించడం, అవి సంచరించే దారుల్లో రోజు సాయంత్రం మెత్తటి ఇసుక, మట్టితో నియమిత ప్రమాణంలో చదును చేస్తారు. వీటినే ఫగ్ ఇంప్రెషన్ ప్యాడ్స్గా పిలుస్తారు. పులులు ఆ ప్యాడ్స్ మీద నడిచినప్పుడు వాటిపై ఏర్పడిన పాదముద్రలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో అచ్చులుగా మారుస్తారు. ఇలా సేకరించిన అచ్చులను ఒక క్రమ పద్ధతిలో విశ్లేషించి పులుల సంఖ్యపై ఓ అంచనాకు వస్తారు. అలాగే అడవుల్ల ఇన్ఫ్రారెడ్ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిల్లో పడే చిత్రాల ఆధారంగా పులుల చారలను విశ్లేషిస్తారు. పులి చారలు మనుషుల వేలిముద్రలలాగే దేనికవే ప్రత్యేకంగా ఉంటాయి. పులి పెంటను సేకరించి వాటి డీఎన్ఏ మ్యాప్లను సేకరిస్తారు. నల్లమలలో పులుల ఉనికి ఇలా పెరిగింది.. సంవత్సరం ఎన్ఎస్టీఆర్ 2014 - 15 37 2015 - 16 40 2016 - 17 46 2017 - 18 46 2018 - 19 47 2019 - 20 63 2020 - 21 70 2022 - 23 78 2024 - 25 87 -
వన్యప్రాణి కనిపిస్తే క్లిక్
అటవీ సంరక్షణ మొత్తం కను సన్నల్లో సాగుతోంది అంటే అతిశయోక్తి కాదు. ప్రధానమైన ప్రాంతాల్లో ఇన్ఫ్రారెడ్ కెమెరాలు ఏర్పాటు చేయడంతోనే ఇది సాధ్యమైంది. ఏ జీవమున్న కదలిక కెమెరాల ముందు జరిగితే చాలు కెమెరా ట్రిగ్గర్ అయి క్లిక్మని ఫొటోలు తీస్తుంది. అంతే కాక ఇవి ఆన్లైన్లో వెంటనే చూసే అవకాశం కూడా ఉంది. దీనితో వన్యప్రాణుల స్థితిగతులు, వాటిని వేటాడే వ్యక్తుల కదలికలు ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది. ఉచ్చులకు చిక్కిన పులులను కూడా ఇలాగే గుర్తించి సంరక్షించిన ఘటనలు కూడా ఉన్నాయి. -
మానవ అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలి
నంద్యాల: మానవ అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలని వాటి నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవానికి సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలు అక్రమ రవాణాకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎక్కడైనా అక్ర మ రవాణా జరుగుతుందని తెలిసి నట్లయితే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098కి లేదా 1800– 1027–222కు సమాచారం ఇస్తే వెంటనే సంబంధిత శాఖల సమన్వయంతో వెంటనే బాలల రక్షణ కోసం చర్యలు తీసుకుంటామన్నారు. దీనికి బాధితులుగా సీ్త్రలు, పిల్లలు, వలసదారులు, ఇతర బలహీన వర్గాల ప్రజలు ఎక్కువగా ఉంటారన్నారు. అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అవగాహన కల్పించి, బాధితులకు సహాయం చేయా లన్నారు. జిల్లాలో హెల్త్ ఎడ్యుకేషన్, రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించి మానవ అక్రమ రవాణాపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో సీ్త్ర,శిశు సంక్షేమ శాఖ పీడీ లీలావతి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ సంపత్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా తిరువాడిప్పూరం ఉత్సవం
ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో తిరువాడిప్పూరం ఉత్సవం వైభవంగా నిర్వహించారు. సోమవారం వేకువ జామునే దిగువ అహోబిలంలో కొలువైన మూలవిరాట్ శాంతమూర్తి శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవార్ల్లతో పాటు గోదాదేవి అమ్మవార్లను సుప్రభాతసేవతో మేలుకొలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గర్భగుడి ఎదురుగా ఏర్పాటు చేసిన యాగశాలలో ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీప్రహ్లాదవరదస్వాములను, గోదాదేవి అమ్మవారికి ఎదురుగా కొలువుంచారు. వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య నవకలశ స్థాపన, అర్చన, అభిషేకం, తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను నూతన పట్టువస్త్రాలు, మేనిమి ఆభరణాలతో అలంకరించి కొలువుంచా రు. రాత్రి స్వామి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన అద్దాల మండపంలో శ్రీ గోదాదేవి, ప్రహ్లాదవరదుల కల్యాణం నిర్వహించారు. ఆ తర్వాత పల్లకీలో కొలువుంచి గ్రామోత్సవం చేపట్టారు. ముద్రకర్త కీడాంబి వేణుగోపాలన్, మణియార్ సౌమ్యానారాయణ్, అర్చకులు ఆధ్వర్యంలో కల్యాణం నిర్వహించారు. -
ఫిర్యాదుదారులకు చట్టపరిధిలో న్యాయం చేస్తాం
నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి చట్టపరిధిలో న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ అధిరాజ్సింగ్ రాణా అన్నారు. సోమవారం బొమ్మలసత్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి 86 ఫిర్యాదులు అందుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఫిర్యాదులు పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. ఈ ఫిర్యాదుల్లో కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, భూకబ్జాలు, పొలం తగాదాలు తదితర కేసులకు సంబంధించి ఫిర్యాదు అందాయన్నారు. -
ఒక క్రస్ట్ గేటు నుంచి నీటి విడుదల
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం నీలంసంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్ట్లో తెరచి ఉంచిన రెండు రేడియల్ క్రస్ట్గేట్లలో ఒక దానిని ఆదివారం మూసివేసి ఒక క్రస్ట్ గేటు ద్వారా 26,698 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి జలాశయంలో 198.8120 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 882 అడుగులకు చేరుకుంది. శనివారం నుంచి ఆదివారం వరకు జూరాల, సుంకేసుల నుంచి 1,57,715 క్యూసెక్కుల వరదనీరు శ్రీశైలంకు వచ్చి చేరింది. జలాశయం నుండి దిగువ ప్రాజెక్ట్లకు 53,516 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడిగట్టు కేంద్రంలో 15.917 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 17.335 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం 69,771 క్యూసెక్కులు, స్పిల్వే ద్వారా 53,744 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు విడుదల చేశారు. బ్యాక్ వాటర్ నుండి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 30,000 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,401 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. -
బాల శాస్త్రవేత్తలకు భలే అవకాశం
నంద్యాల(న్యూటౌన్): చిన్నారుల్లో దాగిన సృజనాత్మకతను వెలికి తీసి, వారిలో విజ్ఞాన జిజ్ఞాసను రేకెత్తించేందుకు ఇన్స్పైర్ మనక్ ఎంతో దోహదపడుతుంది. కేంద్ర, శాస్త్ర సాంకేతిక విజ్ఞాన మండలి, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగిన ప్రతిభను బయటకు తీయడం, సైన్స్పై వారికి ఆసక్తిని పెంచడం దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి విద్యార్థుల నుంచి నూతన ప్రాజెక్టులను ఆహ్వానిస్తున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ విద్యా సంస్థల్లో ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు, వారికి బోధించే ఉపాధ్యాయులతో కలిసి ఇన్స్పైర్ మనక్ ప్రోగ్రామ్లో పాల్గొనవచ్చు. ప్రతి తరగతి నుంచి ఒకరు వంతున ప్రాథమికోన్నత పాఠశాలకు మూడు, ఉన్నత పాఠశాలలు ఐదు ప్రాజెక్టులను నమోదు చేసుకునే వీలుంది. 2008–08 సంవత్సరం నుంచి ఏటా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఎంపికై న ప్రాజెక్టులను తయారు చేసిన విద్యార్థుల ఖాతాలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక్కొక్కరికి రూ.10 వేల వంతున జమ చేశారు. అయితే అత్యధిక ప్రాజెక్టులు రిజిస్టర్ అయినప్పటికీ ప్రాజెక్టుల రూపకల్పనలో నాణ్యతా ప్రమాణాలు లోపించడం వల్ల ప్రాజెక్టుల ఎంపిక సంఖ్య తగ్గుతోందనే విమర్శలున్నాయి. ప్రాజెక్టులో సృజనాత్మకత, నాణ్యత లోపించడంతో దీనికి కారణమని చెబుతున్నారు. 2025–26 విద్యాసంవత్సరానికి జిల్లాలో ప్రభుత్వ యాజమాన్య పరిధిలో 156 ప్రాథమికోన్నత, 277 ఉన్నత పాఠశాలలు ఉండగా, ప్రైవేట్ యాజమాన్యం పరిధిలో 167 ప్రాథమికోన్నత, 190 ఉన్నత పాఠశాలలున్నాయి. గతేడాది ఇలా.. జిల్లాలో గతేడాది జిల్లా స్థాయి సైన్స్ఫేర్ పోటీల్లో 162 ప్రదర్శనలు ఎంపిక కాగా రాష్ట్రస్థాయికి 16 ఎంపిక చేశారు. వీటిలో పలు వినూత్న ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చాగల్రమరి జెడ్పీహెచ్ఎస్ ముల్లా మోమిన్ తయారు చేసిన ఉమెన్ సేఫ్టి బ్యాగ్, వేంపెంట జెడ్పీహైస్కూల్ విద్యార్థి సంతోష్ రాజ్ రూపొందించిన సోలార్ అగ్రికల్చరల్ ఫెర్టిసైడ్ స్పేయర్ విత్ లోకాస్ట్ పరికరం, బనగానపల్లె జెడ్పీహెచ్ఎస్ విద్యార్థి హర్షియభాను ఆవిష్కరించిన ఆటోమేటిక్ మినీ ఫ్యాన్ తదితర ఆవిష్కరణలు అందరినీ ఆలోచింపచేశాయి. ఈ ఏడాది మరింత మెరుగైన ఆవిష్కరణలను రూపొందించి జాతీయ స్థాయి లో ప్రదర్శించేలా పలు పాఠశాలల ఉపాధ్యాయులు సిద్ధమవుతున్నారు. ప్రాజెక్టులను పంపండిలా.. www.inspireawards&dst.gov.in వెబ్సైట్లో ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న పాఠశాల లాగిన్ ద్వారా సెప్టెంబరు 15వ తేదీలోపు పాఠశాల విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టాలి. వారి నుంచి రూపుదిద్దుకున్న ప్రాజెక్టుల వివరాలను నమోదు చేయాలి. అవార్డుకు ఎంపికై న ప్రతి విద్యార్థి జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో తమ ప్రాజెక్టును ప్రదర్శించేందుకు వీలుగా రూ.10 వేల పారితోషకం అందజేస్తోంది. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటి జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై న బాల శాస్త్రవేత్తలకు రూ.25 వేల వరకు తమ ప్రాజెక్టును మెరుగుపర్చుకునేందుకు శాస్త్ర సాంకేతిక శాఖ అదనపు నిధులు కేటాయిస్తుంది. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రాష్ట్రపతి భవన్, జపాన్ సందర్శన తదితర అవకాశాలతో పాటు ఇంజినీరింగ్ కళాశాల విద్యలో మెరుగైన అవకాశాలు లభిస్తాయి. జాతీయస్థాయికి ఎంపికై న ప్రాజెక్టుకు పేటెంట్ లభించే అవకాశముంది. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారిని సంప్రదించాలి. జాతీయ స్థాయిలో నిలిచేలా రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీ పడేలా ప్రాజెక్టులను విద్యార్థులు రూపొందించాలి. ఈ ప్రక్రియను సైన్స్ ఉపాధ్యాయులు పర్యవేక్షించాలి. జిల్లా లోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్సు ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలి. –కేవీ సుబ్బారెడ్డి, జిల్లా సైన్స్ కో ఆర్డినేటర్, నంద్యాల సృజనాత్మకత ఆవిష్కరణలకు ఆహ్వానం సెప్టెంబర్ 15 వరకు గడువు ఇన్స్పైర్ మనక్కు పాఠశాలల్లో రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్టులు -
శ్రీగిరిలో భక్తుల సందడి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం తోలి ఆదివారాన్ని పురస్కరించుకుని స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచి పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగాణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్ని కిటకిటలాడాయి. నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తులను ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov. in వెబ్సైట్లో తెలుసుకోవడంతో పాటు అర్జీలను కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కుందూనది తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నంద్యాల(న్యూటౌన్): కుందూనది పరి వాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద చేరుతుండటంతో బానకచర్ల, వెలుగోడు, కేసీ కెనాల్, శ్రీశైలం బ్యాక్ వాటర్ విడుదలవుతుందన్నారు. పట్టణంలోని మద్దిలేరువాగు, హరిజనవాడ, బైటిపేట, తెలుగుపేట, ఊడుమాల్పురం వంటి కుందూ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల పట్ల వార్డు సచివాలయ సిబ్బంది అప్రమత్తంగా ఉండి పరిరక్షించాలన్నారు. మరింత సమాచారం కోసం మున్సిపల్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ రూం నంబర్ 7702776048ను సంప్రదించాలన్నారు. ఉప ప్రధానార్చకుడి ఆత్మహత్యపై విచారణ కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఉరుకుంద ఈరన్నస్వామి ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పూజన్నస్వామి ఆత్మహత్యపై ఆదివారం రాత్రి శ్రీశైలం ఈఓ శ్రీనివాసులు విచారణ చేపట్టారు. ముందుగా ఆయన పూజన్న ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పూజన్న ఆత్మహత్యపై ఏమైనా అనుమానాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవాలయ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ విజయరాజును, ప్రధాన అర్చకుడు ఈరప్పస్వామిని, ఉప ప్రధాన అర్చకుడు మహదేవస్వామిలతో పాటు అర్చకులందరినీ పిలిచి విచారణ చేపట్టారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం మేరకు బీపీ, షూగర్ ఉండడంతో సమాయానికి మందులు తీసుకోక పోవడంతో పూజన్నస్వామి మృతి చెందారన్నారు. దేవాలయంలో పని చేస్తున్న ప్రతి అధికారి ఇచ్చిన సమాచారాన్ని నివేదిక రూపంలో రాష్ట్ర కమిషనర్కు పంపిస్తామన్నారు. దేవాలయంలో అర్చకులు వర్గాలుగా విడిపోయారా, పూజల్లో ఏమైనా మార్పులు జరిగాయా, డిప్యూటీ కమిషనర్ ఏమైనా ఇబ్బందులకు గురి చేశాడా అన్న విషయాలపై కూడా విచారణ చేపట్టామన్నారు. -
అదును దాటుతోంది.. ఆందోళన మొలకెత్తుతోంది!
ఉయ్యాలవాడ సమీపంలో పత్తి సాగు కోసం సాల్లు తోలుతున్న రైతు కమ్ముకుంటున్న మేఘాలు వర్షించడం లేదు. సాగుకు సిద్ధం చేసిన భూములు పదునెక్కడం లేదు. రైతుల్లో ఆందోళన మొలకెత్తుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా వానల్లేక పోవడంతో వ్యవసాయం మందకొడిగా సాగుతోంది. ఇప్పటికే విత్తనం, నాట్లు పూర్తయి సేద్యం పనులు ఊపందుకోవాల్సి ఉండగా ఇప్పటి వరకు 30 శాతం కూడా సాగు కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో పత్తి, మిరప, మొక్కజొన్న, వరి సాగు చేసిన రైతులు నాట్లు వేసి ఎదురు చూస్తున్నారు. కొందరు వరుణుడిపై భారం వేసి చిన్నపాటి వర్షాలకే నాట్లు వేస్తున్నారు. – ఉయ్యాలవాడ -
నిద్రలేమి, మానసిక ఒత్తిడి కారణం
కర్నూలు(హాస్పిటల్): గుండెపోటు అంటే ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు పాతికేళ్ల వయస్సు వారికీ వస్తోంది. ఇటీవల కాలంలో పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో యువత గుండెపోటుతో మృతి చెందుతున్నారు. జీవనశైలిలో మార్పులు, వ్యాయామం లేకపోవడం, మితిమీరిన ఆహారపు అలవాట్లు, దురవాట్లే ఈ పరిస్థితికి కారణమని వైద్యులు చెబుతున్నారు. బాధితుల్లో 5 శాతం యువత కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని క్యాజువాలిటీకి ఇటీవల గుండెపోటుతో చికిత్సకు వచ్చేవారి సంఖ్య ఎక్కువైంది. ఇందులో కొందరు ఆసుపత్రికి వచ్చేలోపు, మరికొందరు చికిత్స పొందుతూ మృతి చెందుతున్నారు. ఇంకొందరు కార్డియాలజీ విభాగానికి ఆపరేషన్కు వెళ్తున్నారు. ఇలా కార్డియాలజీ విభాగానికి గత సంవత్సరం రోజుల్లో ఓపీకి 22,325 మంది గుండెజబ్బులతో చికిత్సకు రాగా 4,281 మంది విభాగంలో చేరారు. వీరిలో 1,235 మందికి యాంజియోగ్రామ్, 433 మందికి యాంజియోప్లాస్టీ(స్టెంట్) వేశారు. ఇందులో 125 మంది 25 నుంచి 40 ఏళ్ల వయస్సు వారే ఉండటం గమనార్హం. ఇదే పరిస్థితి నగరంలోని పలు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో నెలకొంది. ఆయా ఆసుపత్రులకు ఒక్కో దానికి ప్రతిరోజూ రోజుకు సగటున 10 మంది గుండెజబ్బులతో చికిత్స పొందుతున్నారు. జిల్లాలో 10 శాతం మంది ప్రజలు గుండెజబ్బులతో బాధపడుతున్నట్లు గతంలో నిర్వహించిన ఓ సర్వేలో నిర్ధారణ అయ్యింది. ఆసుపత్రులకు చికిత్స కోసం వస్తున్న వారిలో 5 శాతం మంది యువతే ఉంటున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు వంశపారంపర్యం, జన్యులోపాలు, మేనరికపు వివాహం వంటి కారణాలతో పుట్టుకతోనే గుండెజబ్బులతో జన్మించే పిల్లలూ ఇటీవల అధికమయ్యారు. మారిన ఆహారపు అలవాట్లు ప్రతి ఒక్కరికీ పోషకాహారం తీసుకుని మరింత ఆరోగ్యంగా ఉండాలన్న ఉత్సుకత అధికమైంది. ఈ క్రమంలో తీసుకోవాల్సిన దానికన్నా అధికంగా ఆహారాన్ని తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆహారంలో మాంసాహార సేవనం అధికమైంది. డ్రైఫ్రూట్స్ వాడకం పెంచేశారు. అందుకుతగ్గ వ్యాయామం చేయడం లేదు. దీంతో శరీరంలో కొవ్వు శాతం పెరిగిపోతోంది. రక్తనాళాల్లో ఎక్కడికక్కడ బ్లాక్లు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఉన్న ఫలంగా గుండెపోటు, పక్షవాతం కేసులు అధికమవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీనికితోడు కార్పొరేట్ సంస్కృతితో ఇతర దేశాలు, రాష్ట్రాల్లో లభించే ఆహారాన్ని సైతం ఇక్కడి వారు ఎక్కువ తీసుకుంటున్నారు. సాధారణంగా ఏ ప్రాంతం వాతావరణానికి తగ్గట్లు అక్కడి ప్రజలు ఆహారం తీసుకుంటారు. ఉత్తరాదిలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి.. అక్కడి వారు శరీరంలో ఉష్ణోగ్రతను పెంచే ఆహారాన్ని ఎక్కువ తీసుకుంటారు. దక్షిణాదిలో వాతావరణం వేడిగా ఉంటుంది పెద్దలు చెప్పిన ఆహార నియమాలను పాటించాలి. అయితే ప్రాంతీయ భేదం లేకుండా అన్ని ఆహార పదార్థాలను ప్రజలు రుచి చూస్తున్నారు. దీనివల్లే జీవన విధానంలో మార్పులు వచ్చి ఆరోగ్యం దెబ్బతింటోందని వైద్యులు చెబుతున్నారు. అలాగే పాటు ఒకేచోట ఎక్కువసేపు కూర్చుని పనిచేసే ఉద్యోగాలు కావడంతో అధికబరువున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ కారణంగా శరీరంలో కొవ్వు శాతం పెరిగి అనేక అనారోగ్య సమస్యలు పలకరిస్తున్నాయి. అధిక చక్కెర, మాంసాహారం, వెన్న, నూనెలు వంటివి కొవ్వు పదార్థాలు గుండెజబ్బులు రావడానికి ముఖ్యపాత్ర వహిస్తున్నాయి. ఇటీవల కాలంలో చాలా మంది యువకుల్లోనూ గుండెపోటు వస్తోంది. ఆసుపత్రికి వచ్చే వారిలో 30 శాతానికి పైగా వీరుంటున్నారు. శారీరక వ్యాయామం లేకపోవడం, మితిమీరిన మానసిక ఒత్తిడి, అనియత జీవనశైలి, నిద్రలేమి, పొగతాగడం, మద్యంసేవనం అలవాట్లు చిన్న వయస్సులో గుండెపోటు రావడానికి కారణం. కొందరు యువత శారీరక దారుఢ్యం కోసం అధికంగా వర్కవుట్స్ చేయడం కూడా గుండైపె ఒత్తిడి పెంచుతోంది. – డాక్టర్ బి.కిరణ్కుమార్రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, కార్డియాలజీ విభాగం, జీజీహెచ్, కర్నూలు -
గిరిజన గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్
పాణ్యం: నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని నెరవాడ మెట్ట వద్ద ఉన్న గిరిజన గురుకుల(బాలుర)పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 25మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. శనివారం ఉదయం నుంచి కడుపునొప్పి, విరేచనాలతో బాధపడ్డారు. కేవలం రెండు బాత్రూంలే ఉండటంతో విద్యార్థులు నరకయాతన అనుభవించారు. ఈనెల 25న సాయంత్రం విద్యార్థులకు కారం బొరుగులు ఇచ్చారు. రాత్రి భోజనంలో అన్నం, దోసకాయ కూర, సాంబారు, మజ్జిగ వడ్డించారు. ఉదయానికి విద్యార్థులు అస్వస్థతకు గురవగా సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. వీరంతా 3, 4వ తరగతి చదువుతున్న విద్యార్థులే. కాగా, ఈ ఘటనపై కలెక్టర్ ఆదేశాలతో అధికారుల బృందం విచారణ చేపట్టింది. ఐటీడీఏ పీఓ శివప్రసాద్, డీఎంహెచ్ఓ వెంకటరమణ తదితరులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. అస్వస్థతకు కారణం బయటి ఆహారమా, లేక మునుపటి రోజు తిన్న ఆహారమా అనే కోణంలో విచారణ చేపట్టారు. అనంతరం పాఠశాలకు వెళ్లి ఆవరణను పరిశీలించారు. అపరిశుభ్ర వాతావరణంతో పాటు పాఠశాల ముందున్న కాల్వ, బురద, ఇతర సమస్యలను గుర్తించారు. ఈనెల 25న వడ్డించిన ఆహార పదార్థాలు, అక్కడ అందిస్తున్న నీటి శాంపిళ్లను సేకరించి పరీక్షకు పంపుతున్నట్లు అధికారులు తెలిపారు. -
నెలకే ‘తారు’మారు
● నాసిరకంగా బూజునూరు–గడివేముల రోడ్డుదెబ్బతిన్న బూజునూరు – గడివేముల రహదారిరోడ్లు వేశాం.. గుంతలు పూడ్చామని గొప్పలు చెప్పుకునే పాలకులు ఒక సారి ఆ దారుల్లో ప్రయాణించాలని ప్రజలు వాపోతున్నారు. కొత్తగా నిర్మించిన రహదారి నెలకే ఛిద్రమైతే ఎలా వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. కమీషన్లకు నాణ్యత చెదిరిపోయి, మళ్లీ గుంతలు దర్శనమిస్తున్నాయని చెప్పేందుకు బూజునూరు – గడివేముల రహదారే నిదర్శనం. బూజునూరు నుంచి గడివేముల మీదుగా మంచాలకట్ట వరకు రూ.కోట్లు ఖర్చు చేసి నూతన రోడ్డు నిర్మించారు. రోడ్డు పనులు పూర్తయ్యాయి. అయితే గడివేముల సొసైటీ సమీపంలో రోడ్డు దెబ్బతిని గుంతలమయంగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సంబంధిత కాంట్రాక్టర్ నాసిరకంగా నిర్మించి నిధులు కాజేశారనే ఆరోపణలున్నాయి. – గడివేముల -
ఈరన్న స్వామి.. నమోనమామి!
● ఉరుకుందలో శ్రావణ మాసోత్సవాలు ప్రారంభం కౌతాళం: ఉరుకుంద ఈరన్నస్వామి క్షేత్రంలో శ్రావణ మాస ఉత్సవాలు శుక్రవారం ప్రార ంభం అయ్యాయి. తెల్లవారు జామున 4 గంటలకు సుప్రభాతసేవ, మహామంగళ హారతి, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి వదిలారు. రాత్రి 8 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి దీపారాధన చేశారు. గోవు పూజ అనంతరం ఆలయ గోపురంపై స్వామి జెండాను ఆవిష్కరించారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామి సన్నిధిలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. ఈరన్న స్వామి.. నమోనమామి.. అని వేడుకున్నారు. శ్రావణ మాస ఉత్సవాలు ఆగస్టు 23 వరకు కొనసాగుతాయని ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు తెలిపారు. -
పేదల బతుకుల్లో వెలుగులు నింపుదాం
నంద్యాల: జిల్లాలో పేదరిక నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కలిసి ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపునిచ్చారు. శుక్రవారం సీఎం చంద్రబాబు అమరావతి సచివాలయం నుంచి పీ4పై జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, జిల్లాధికారులు హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పేదరిక నిర్మూలనకు సంపన్నులందరూ ముందుకు వచ్చి బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలన్నారు. పీ4 కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అత్యుత్తమ విధానాలను జిల్లా అంతట అమలు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో కార్పొరేట్ సంస్థలు కూడా కలిసి వచ్చేలా చూడాలన్నారు. అధికారులు గ్రామాన్ని యూనిట్గా తీసుకుని ఆ ప్రాంతానికి చెందిన ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు స్థానిక బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలన్నారు. బంగారు కుటుంబాల అత్యంత ప్రాధాన్యతలపై చేపట్టిన సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో బంగారు కుటుంబాలు, మార్గదర్శుల వివరాలు సరిగ్గా నమోదు చేసినప్పుడే ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందన్నారు. ఆగస్టు 15 నాటికి జిల్లాలో బంగారు కుటుంబాలను ‘మార్గదర్శులు’ దత్తత తీసుకునే కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి -
చెంచులకు మెరుగైన వైద్యసేవలు
కొత్తపల్లి/ఆత్మకూరు: గిరిజన గూడేల్లోని చెంచులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ సూచించారు. శుక్రవారం కొత్తపల్లి మండలంలో కొత్తపల్లి, శివపురం, ఆత్మకూరు మండలంలోని బైర్లూటీ పీహెచ్సీలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. శివపురం చెంచుగూడెంలో 104 సంచార చికిత్సను సందర్శించి, ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా చెంచు మహిళలతో వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. బైర్లూటీ పీహెచ్సీలో వైద్యసిబ్బంది సమయపాలన పాటించడం లేదని, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏబీహెచ్ఏ ఐడీ జనరేషన్, పీఎంజేఏవై పథకాల లబ్ధిదారులకు అన్నీ వైద్యసేవలు అందించాలన్నారు. ఆయన వెంట వైద్యాధికారులు దీపా నాగవేణి, మహమ్మద్ బేగ్, జబ్బీర్, విజయేంద్ర, జుబేదా, వైద్య సిబ్బంది ఉన్నారు. జిల్లా వైద్యాధికారి వెంకటరమణ -
సబ్సిడీలకు తిలోదకాలు
కర్నూలు(అగ్రికల్చర్): అగ్గిపెట్టెలో పట్టే విధంగా పట్టు చీరలు నేసిన ప్రాంతం ఉమ్మడి కర్నూలు జిల్లా. అయితే పట్టు పరిశ్రమకు, మల్బరీ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇవ్వడం లేదు. పెట్టుబడి వ్యయం రెట్టింపు అవుతున్నా రైతులకు సబ్సిడీలు అందడం లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పట్టుగూళ్ల మార్కెటింగ్ సదుపాయం లేదు. నష్టాలు ఎక్కువగా ఉండటంతో రైతులు మల్బరీ సాగుకు దూరమవుతున్నారు. గతేడాది (2024–25లో) మల్బరీ సాగు తగ్గిపోగా.. ఈ ఏడాది మరింత అధ్వాన స్థితికి చేరింది. అరకొరగా మల్బరీ సాగు 2025–26లో కర్నూలు జిల్లాలో 150, నంద్యాల జిల్లాలో 200 ప్రకారం ఉమ్మడి జిల్లాలో 350 ఎకరాల్లో మల్బరీ సాగు చేపట్టాలనేది లక్ష్యం. ఖరీఫ్ సీజన్ మొదలై దాదాపు 50 రోజులవుతున్నా మల్బరీ సాగులో పురోగతి కనిపించడం లేదు. కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 18 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 4 ఎకరాల్లో మాత్రమే మల్బరీ ప్లాంటేషన్ జరిగినట్లు తెలుస్తోంది. 2024–25లో ఉమ్మడి జిల్లాలో 350 ఎకరాల్లో మల్బరీ ప్లాంటేషన్ చేపట్టాలనేది లక్ష్యం. అయితే 200 ఎకరాల్లో మాత్రమే జరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి మరింత తగ్గే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికీ మల్బరీ సాగుపై ఆసక్తి ఉన్న రైతులను గుర్తించడానికి చర్యలు తీసుకోలేదు. రాయితీలు తగ్గించడంతో రైతులు పట్టు సాగుపై నిర్లిప్తతతో ఉన్నట్లు తెలుస్తోంది. ‘ఉపాధి’ తొలగింపు మల్బరీ సాగు చేసే రైతులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రత్యేక రాయితీలు లభించేవి. షెడ్ల నిర్మాణానికి ‘ఉపాధి’ నిధుల నుంచి సబ్సిడీలు ఆశాజనకంగా ఉండేవి. ఒక షెడ్కు రూ.3.50 లక్షల వరకు సబ్సిడీ ఇచ్చేవారు. 2024–25 నుంచి షెడ్ల నిర్మాణానికి ‘ఉపాధి’ నుంచి రాయితీలు లేవు. కేవలం ప్లాంటేషన్లో మాత్రం అరకొర సబ్సిడీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఒక్క రైతుకు కూడా ‘ఉపాధి’ నుంచి ప్లాంటేషన్కు రాయితీలు ఇవ్వలేదు. ప్రోత్సాహం కరువై! ఉమ్మడి కర్నూలు జిల్లాలో గతంలో 1,500 టన్నుల బైవోల్టెన్ పట్టుగూళ్ల ఉత్పత్తి జరిగేది. 2024–25లో కేవలం 500 టన్నులకు పడిపోయింది. ఉమ్మడి జిల్లాలో మార్కెటింగ్ సదుపాయం లేకపోవడంతో ఉత్పత్తి చేసిన పట్టుగూళ్లను హిందూపురం మార్కెట్కు తరలించాల్సి వస్తోంది. మార్కెట్లో పట్టుగూళ్లకు లభించిన ధరకు అదనంగా కిలోకు రూ.50 రాష్ట్ర ప్రభుత్వం ఇంటెన్సివ్ పేరుతో ప్రత్యేక ప్రోత్సాహం ఇచ్చేది. కూటమి ప్రభుత్వం ఇంటెన్సివ్ ఇవ్వడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2023–24 వరకు మల్బరీ సాగును ప్రోత్సహించాయి. కేంద్ర ప్రభుత్వం యథాతథంగా రాయితీలు ఇస్తుండగా 2024–25 నుంచి కూటమి ప్రభుత్వం సబ్సిడీలకు తిలోదకాలు ఇచ్చింది. పట్టుపురుగుల పెంపకం కోసం రైతులు విధిగా షెడ్డు నిర్మించుకోవాల్సి ఉంది. షెడ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.2.25 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1,12,500 సబ్సిడీ ఇస్తాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా కింద రూ.1,12,500 సబ్సిడీ ఇవ్వడం లేదు. దీన్ని కూడా రైతు భరించాల్సి వస్తోంది. మల్బరీ మొక్కలు నాటుకోవడంలో (ప్లాంటేషన్) ఎకరాకు యూనిట్ కాస్ట్ రూ.30 వేలు ఉంది. ఇందులో కేంద్రం ప్రభుత్వం రూ.15,000, రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 ఇవ్వాల్సి ఉంది. రైతు రూ.7,500 భరించాల్సి ఉంది. అయితే మొక్కలు నాటుకున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం లేదు. పరికరాలకు యూనిట్ కాస్ట్ రూ.75 వేలు ఉండగా..రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా రాయితీలకు ఎగనామం పెట్టింది. మల్బరీ సాగు చేసే రైతులకు బ్రష్ కట్టర్, పవర్ స్ప్రేయర్లు, సికేచర్ వంటివి కూడా రాయితీపై రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అయితే వీటిని కూడా ఇవ్వడం లేదు. -
నిర్లక్ష్యానికి మూత‘బడి’
రుద్రవరం: కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతుండటంతో పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. పాఠశాలల పునఃప్రారంభంలో అడ్మిషన్లపై చొరవ చూపకపోవడం, ఖాళీగా ఉన్న స్థానాలకు ఉపాధ్యాయులను నియమించకపోవడం, ఏకోపాధ్యాయ పాఠశాలలపై పర్యవేక్షణ లేకపోవడంతో సర్కారు బడులు మూతబడుతున్నాయి. రుద్రవరం మండలంలో ఇప్పటికే రెండు పాఠశాలలకు తాళం వేయగా, మరి కొన్ని మూసివేత దిశగా అడుగు లు పడుతున్నాయి. ఈ ఏడాది కొత్తగా 1వ తరగతికి విద్యార్థులు చేరక పోవడం, ఆపై తరగతిలో ఉన్న ఒక రు ఇద్దరు బయటి పాఠశాలల్లో చేరడంతో డీ.కొట్టాల పంచాయతీ మజరా గ్రామమైన టీ.కొట్టాల, మరొకటి పెద్దకంబళూరు పంచాయతీ మజరా పందిర్లపల్లె గ్రా మాల్లోని ప్రభుత్వ పాఠశాలలు రెండు మూత పడ్డా యి. పాఠశాలలల్లో సరైన వసతులు లేక పోవడం, కూటమి ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించలేక పోవడంతో పాఠశాలలు మూత పడుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు విమర్శిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాడు – నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలలు కళకలాడాయి. కూటమి ప్రభుత్వం పాఠశాలను నిర్లక్ష్యం చేయడంతో ఈ పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. రుద్రవరం మండలంలో మొత్తం 60 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ ఏడాది వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాక కొన్ని పాఠశాలల్లో 1వ తరగతికి విద్యార్థుల నమోదు సంఖ్య అరకొరగా ఉంది. మరికొన్ని పాఠశాలల్లో ప్రవేశాలు లేవు. అలాగే కొన్ని పాఠశాలల్లో 2, 3, 4, 5 తరగతులకు సంబంధించి విద్యార్థులు అరకొరగా ఉండటంతో ఉపాధ్యాయులు పట్టించుకోరని భావించిన తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. దీంతో ఉన్న విద్యార్థుల సంఖ్య తగ్గి ఇప్పటికి రెండు మూత పడ్డాయి. ఆర్.కొత్తపల్లెలో 10 మంది, ఎల్లావత్తుల స్పెషల్లో ఏడుగురు, చిన్నకంబళూరు స్పెషల్లో ఆరుగురు చొప్పున మాత్రమే విద్యార్థులు ఉన్నారు. ఇలా విద్యార్థుల సంఖ్య పూర్తిగా తగ్గి పోతు బడులు మూసివేతకు గురవుతున్నాయి. టీ.కొట్టాల, పందిర్లపల్లె పాఠశాలలకు తాళాలు మరో మూడు పాఠశాలల్లో పది లోపు విద్యార్థులు -
నష్టపోయాం
నేను 3 ఎకరాల్లో మల్బరీ సాగు చేశాను. 150 గుడ్లకు రికార్డు స్థాయిలో బైవోల్టెన్లో 140 కిలోల పట్టుగూళ్లు ఉత్పత్తి చేశాను. ఇటీవల హిందూపురం మార్కెట్లో కిలో రూ.550 ప్రకారం విక్రయించాను. గతంలో కిలోకు రాష్ట్ర ప్రభుత్వం రూ.50 ఇంటెన్సివ్ ఇచ్చేది. ఈ రాయితీ లేకపోవడంతో రూ.7,000 నష్టపోయాం. పట్టు సాగులో పెట్టుబడి వ్యయం ఎక్కువగా ఉంది. రాయితీలను పెంచాలి. – పి.నన్నేసాహెబ్, నరసాపురం, వెల్దుర్తి మండలం చర్యలు తీసుకుంటున్నాం జిల్లాలో మల్బరీ సాగుకు ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది జిల్లాలో 150 ఎకరాల్లో మల్బరీ ప్లాంటేషన్ చేయాలనేది లక్ష్యం. ఇప్పటి వరకు 18 ఎకరాల్లో చేపట్టాం. ఇంకా సమయం ఉంది. కనీసం 100 ఎకరాల వరకు ప్లాంటేషన్ చేపడుతాం. రైతులను గుర్తిస్తున్నాం. – ఆంజనేయులు, జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారి, కర్నూలు -
‘గిరి గీసి..’ బరితెగించి..!
● రెచ్చిపోతున్న ‘పచ్చ బ్యాచ్’ ● చాగలమర్రిలో టీడీపీ నేతల బరితెగింపు ● రూ. కోట్ల విలువైన గ్రామ కంఠం స్థలాలు కబ్జా ● అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని ఇష్టారాజ్యం ● చేష్టలుడిగి చూస్తున్న పంచాయతీ, రెవెన్యూ, ఆర్అండ్బి, ఇరిగేషన్ శాఖలు ఇక్కడ దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం వేసిన ఈ బేస్మెంట్ ఎవరో ప్రైవేటు స్థలం కొనుగోలు చేసి అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణం చేస్తున్నారనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇది చాగలమర్రి పట్టణంలోని కడప, కర్నూలు జాతీయ రహదారి పక్కన మల్లెవేముల చౌరస్తాలో అత్యంత విలువైన ఆర్ అండ్బీ స్థలం. ఇక్కడి నుంచి గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం బస్ షెల్టర్ నిర్మించేందుకు ఖాళీగా ఉంచిన స్థలం. ఈ స్థలంపై కన్నుపడిన ‘తమ్ముడు’ అక్కడ అనధికారికంగా ఉన్న చిన్న వ్యాపారులను, బంకులను, ఆటో స్టాండును దౌర్జన్యంగా ఖాళీ చేయించారు. ఆ వెంటనే అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం రాత్రికి రాత్రి పునాదులు తీసి బేస్మెంట్ కూడా వేశారు. ఈ నిర్మాణం పూర్తయితే నెలనెలా రూ. లక్షల్లో బాడుగలు వస్తాయని సమాచారం. అయితే ఇంత బహిరంగంగా ప్రభుత్వ స్ధలంలో అనధికారిక నిర్మాణం జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. నిత్యం ఈ రహదారి వెంట రాకపోకలు సాగిస్తున్న మండల స్థాయి నుంచి జిల్లా అధికారుల వరకు చూసీచూడనట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చిత్రం పెద్ద ఇనుప గేటు వేసింది ఇంటికి కాదు. టీడీపీ నేత కొలిమి హుస్సేన్వలి తన ఇంటి పక్కన ఉన్న గ్రామ కంఠానికి సంబంధించిన వీధి రస్తాకు. ఈ రస్తా మీదుగా ప్రధాన రహదారి నుంచి మంగళి వీధిలోకి నిత్యం వందలాది మంది రాకపోకలు కొనసాగించేవారు. తెలుగు తమ్ముడు తన ఇంటి పక్కనే ఉన్న ఈ రహదారిని ఆక్రమించుకుని రాకపోకలు బంద్ చేయించి కేవలం తమ ఇంటికి మాత్రమే ఉండేలా ఏకంగా పెద్ద ఇనుప గేట్ వేయించుకున్నాడు. దీంతో గ్రామ కంఠానికి సంబంధించిన విలువైన స్థలం కబ్జాకు గురైనా ఎవరూ అడిగే పరిస్థితి లేదు. ఆ వీధుల్లోని ప్రజలు ప్రధాన రహదారిలోకి రావాలంటే చుట్టూ తిరిగి రావల్సిన దుస్థితి నెలకొంది.ఖాళీ జాగా .. వేసేయ్ పాగా..! -
కలుగొట్ల‘పల్లె’కు వెళ్లాలంటే తిప్పలే..
ఇక్కడ షెడ్డు నిర్మాణం చేపట్టిన ఈ స్థలం పాత హైవే నుంచి కలుగొట్లపల్లె రహదారికి సంబంధించినది. చాగలమర్రి నుంచి కలుగొట్లపల్లెకు వెళ్లేందుకు అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బీటీ రోడ్డుకు అనుసంధానంగా కొంత దూరం సీసీ రోడ్డు వేశారు. మంచి సెంటర్లో ఉండటంతో ఇక్కడ వ్యాపారం చేసుకోవాలని ఆలోచించిన టీడీపీ నేత అక్కడ రోడ్డు సైడుకు ఉన్న చిన్న బంకులను తీసివేయించాడు. తర్వాత సగం రోడ్డుకు అడ్డంగా షాపింగ్ గది కట్టుకున్నాడు. ఇప్పుడు కలుగొట్లపల్లె గ్రామంతో పాటు అటువైపు ఉన్న బైపాస్ రోడ్డు, ఇత గ్రామాలకు వెళ్లాంటే చుట్టు తిరిగి వెళ్లాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నేర నియంత్రణకు పకడ్బందీ నిఘా
నంద్యాల: నేర నియంత్రణే లక్ష్యంగా పకడ్బందీగా నిఘా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అధిరాజ్సింగ్రాణా డ్రోన్ కెమెరా ఆపరేటర్లకు సూచించారు. గురువారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని అన్ని సబ్ డివిజన్లలో శిక్షణ పొందిన డ్రోన్ ఆపరేటర్లతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధునిక టెక్నాలజీతో విధులలో నైపుణ్యాన్ని ఏ విధంగా పెంచుకోవాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పోలీసు అధికారులు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. పండగలు, ఊరేగింపులు, ధర్నాల సమయంలో, ఈవ్ టీజింగ్, ట్రాఫిక్, నేర నియంత్రణ, ప్రకృతి విపత్తులలో, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిఘా ఉంచాలని, ఏదైనా నేర నియంత్రణే లక్ష్యంగా పని చేయాలన్నారు. వివిధ నేరాల్లో నిందితులు తప్పించుకునేందుకు వీలు లేకుండా దర్యాప్తు అధికారులకు సహాయపడేలా వీడియోలు, పొటోలు చిత్రీకరించాలన్నారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రతిరోజు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిల్లో నిర్వహించే విజిబుల్ పోలీసింగ్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ యుగంధర్బాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ అదిరాజ్సింగ్రాణా -
పరోక్షసేవగా బయలువీరభద్రస్వామికి విశేషపూజ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైలక్షేత్ర పాలకుడైన బయలువీరభద్రస్వామికి గురువారం అమావాస్య సందర్భంగా విశేషార్చన చేపట్టారు. ఈ అర్చనను పరోక్ష సేవగా జరిపించుకునేందుకు దేవస్థానం దేవస్థానం కల్పించడంతో వివిధ ప్రాంతాల నుంచి 27 మంది భక్తులు పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజ జరిపారు. అనంతరం పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్దజలాలతో వీరభద్రస్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఈ స్వామి ఆరాధన వలన గ్రహదోషాలు నివారించబడతాయని, అరిష్టాలన్నీ తొలగి పోతాయని, ఎంతటి క్లిష్ట సమస్యలైనా పరిష్కరించబడతాయని, ప్రమాదాలు నివారించబడతాయని, సర్వకార్యానుకూలత లభిస్తుందని, అభీష్టాలు సిద్దిస్తాయని పండితులు పేర్కొంటున్నారు. చౌడేశ్వరీదేవికి విశేష పూజలు బనగానపల్లె రూరల్: మండలంలోని నందవరం చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించా రు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పీవీ కుమార్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు జరిగాయి. ఉదయం అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకం తదితర పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం ఉత్సవ విగ్రహాలను సుందరంగా అలంకరించి పల్లకిసేవ, సహస్రదీపాలంకరణ సేవ చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాన్ని పంపిణీ చేశారు. వర్షాలతో అప్రమత్తం నంద్యాల: జిల్లాలో కురు స్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు, ప్రజలు నిర ంతరంగా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గురువారం ఒక ప్రటకనలో హెచ్చరించారు. వాతావరణ శాఖ సూచనలు దృష్టిలో ఉంచుకొని ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. శిథిలావస్థలో ఉన్న హాస్టల్ భవనాల్లో పిల్లలను ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూట్లలోని శిథిలావస్థలో ఉన్న గదులలో తరగతులు నిర్వహించవద్దన్నారు. మట్టి ఇళ్లలో ప్రజలు ఉండడానికి అనుమతించరాదని, దీనిని పక్కగా పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు. ఈ విషయాల్లో అధికారులు అలసత్వం వహిస్తే తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుంటామన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల పెంపు జూపాడుబంగ్లా: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి నీటి విడుదలను 20వేల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచినట్లు ఏఈ విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయంలోకి 1,01,785 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా డ్యాంలో 883.10 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు తెలిపారు. పోతిరెడ్డిపాడు వద్ద 882.10 అడుగుల నీటిమట్టం నమోదు కాగా హెడ్రెగ్యులేటర్ 2,4,5,6,7 గేట్ల ద్వారా 30వేల క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ నీటిని బానకచర్ల నుంచి తెలుగుగంగ కాల్వకు 11 వేల క్యూసెక్కులు, ఎస్సార్బీసీ(జీఎన్ఎస్ఎస్)కాల్వకు 10 వేలు, కేసీ ఎస్కేప్ కాల్వకు 9వేల క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు బానకచర్ల ఏఈ దేవేంద్ర తెలిపారు. -
స్టేషన్లలోనే న్యాయం చేయాలి
కర్నూలు: పోలీస్స్టేషన్లలో న్యాయం జరిగితే బాధితులు ఉన్నతాధికారులను ఆశ్రయించే అవకాశం ఉండదని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు సీరియస్గా పనిచేస్తే ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం ఉండదని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో గురువారం ఎస్పీ విక్రాంత్ పాటిల్తో కలసి జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో అర్ధ వార్షిక నేర సమీక్షా సమావేశం నిర్వహించి పోలీసు అధికారులతో మాట్లాడారు. పోలీస్ స్టేషన్లలో సాంకేతికతను వినియోగించి నేర నియంత్రణకు గట్టిగా పనిచేయాలని క్షేత్రస్థాయి అధికారులను డీఐజీ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్త పెండింగ్ కేసులను ఆరా తీశారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాలు బాగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్, యాంటీ ఈవ్ టీజింగ్ తనిఖీలతో పాటు డ్రోన్ కెమెరాలతో సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ప్రాపర్టీ కేసులలో రికవరీ శాతం పెంచాలన్నారు. ఆయా కేసులలో నిందితుల వేలి ముద్రలను సేకరించి కేసులను ఛేదించాలన్నారు. గత ఆరు నెలలుగా చోటు చేసుకున్న నేరాల విశ్లేషణ, దర్యాప్తు పురోగతి, నేరాల నియంత్రణకు తీసుకున్న చర్యలపై సమగ్రంగా సమీక్షించారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డీఎస్పీలు బాబుప్రసాద్, వెంకటరామయ్య, శ్రీనివాసాచారి, ఉపేంద్ర బాబు, హేమలత, ఏఆర్ డీఎస్పీ భాస్కర్రావు, సీఐలు, ఎస్ఐలు, ఈగల్ టీమ్ సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(అర్బన్): నంద్యాల ఐసీడీఎస్ అర్బన్ ప్రాజెక్టు పరిధిలో నాలుగు అంగన్వాడీ ఆయా పోస్టుల నియామకానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు సీడీపీఓ చంద్రకళ గురువారం తెలిపారు. మంచాలకట్ట–1 అంగన్వాడీ కేంద్రం ఓసీ (జనరల్), అయ్యలూరు–2 (ఈడబ్ల్యూఎస్), మాల్దారిపేట–2 ఎస్సీ (గ్రూప్ థర్డ్), పి.కొట్టాల–2 అంగన్వాడీ కేంద్రం బీసీబీ రిజర్వేషన్ల ప్రకారం 18 నుంచి 35 ఏళ్లలోపు మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈనెల 31వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు కార్యాలయ పనిదినాల్లో దరఖాస్తులు అందజేయాలన్నారు. ఎన్ఎంఎంఎస్కు పోర్టల్లో నమోదు చేసుకోవాలి నంద్యాల(న్యూటౌన్): నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షలో ఎంపికైన విద్యార్థులు ఆగస్టు 31వ తేదీ లోపు www.scholr ships. gov.inలో నమోదు చేసుకోవాలని డీఈఓ జనార్దన్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తప్పులు లేకుండా మెరిట్ లిస్ట్, ఆధార్లో ఉండే విధంగా సరి చూసుకొని పోర్టల్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ఆధార్ కార్డు లేని విద్యార్థులు ఆధార్, బ్యాంక్ పాసు పుస్తకాలలో సరి చేయించుకోవాలన్నారు. విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు ఒక అక్షరం తేడా ఉన్నా ప్రొఫార్మాతో కూడిన దరఖాస్తును జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఇవ్వాలన్నారు. ఈ సంవత్సరం 10, 11, 12 తరగతులు ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాలయాల్లో సాధారణ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు తప్పకుండా రెన్యువల్ చేసుకోవాలన్నారు. గడువులోపు ఈ ప్రక్రియ పూర్తి చేయని విద్యార్థులకు స్కాలర్షిప్ మంజూరు కాదన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత పా ఠశాల వారే బాధ్యత వహించాలని డీఈఓ తెలిపారు.గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలి నందికొట్కూరు: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా పరిషత్ సీఈఓ నాసరరెడ్డి తెలిపారు. గురువారం మండల పరిధిలోని శాతనకోట, అల్లూరు గ్రామాల్లో శానిటేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల కాలంలో గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేయాలన్నారు. వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సుబ్రమణ్యం శర్మ, పీఎస్లు, తదితరులు పాల్గొన్నారు. -
రికార్డుల అస్తవ్యస్తంపై కేంద్ర బృందం అసంతృప్తి
జూపాడుబంగ్లా: జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులు, గ్రామ పంచాయతీ రికార్డులు అస్తవ్యస్తంగా ఉండటంతో కేంద్రబృందం సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం మండలంలోని పారుమంచాల గ్రామంలో కేంద్రబృందం టీం లీడర్ సంతోష్కుమార్, టీం మెంబర్ సూర్యకాంతప్రదాన్ తదితరులు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామపంచా యతీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సంతోష్కుమార్ ఉపాధిహామీ పథకం, పంచాయతీలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. 2025–26 ఏడాదికి సంబంధించిన లేబర్ బడ్జెట్లను చూపించాలని ఏపీఓలు గౌరీబాయి, రేష్మలను అడగ్గా వారు రికార్డులు చూపించకపోవటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు ఎంత మంజూరయ్యాయి, వాటికి ఏఏ అభివృద్ధిపనులకు వెచ్చించారు, వాటికి సంబంధించిన రికార్డులు చూపించాలని పంచాయతీ కార్యదర్శి శాలుబాషాను ప్రశ్నించగా ఆయన రికార్డులు చూపించకపోవటంతో ఆయనపై కేంద్రబృందం సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ఉపాధిహామీ పథకం సోషల్ఆడిట్కు సంబంధించి గ్రామసభలో నిర్వహించిన సమావేశ తీర్మానంలో కేవలం 9 మంది సంతకాలు మాత్రమే ఉండటంతో గ్రామసభలు నిర్వహించటం కూడా రాదా.. అంటూ మండిపడ్డారు. అనంతరం కేంద్రం నిధులతో చేపట్టిన ఉపాధిపనులు, గోకులంషెడ్ల నిర్మాణం పనులను కేంద్రబృందం సభ్యులు పరిశీలించారు. వీరి వెంట ఎంపీడీఓ గోపికృష్ణ, ఏపీడీ అన్వరాబేగం, లైజనింగ్ అధికారి దాసు, సర్పంచ్ ప్రకాశం, ఏఈలు బషీర్, నాగేంద్ర, ఏపీఓ లు గౌరీబాయి, రేష్మ, ఏపీఎం అంబమ్మ తదితరులు పాల్గొన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధుల రికార్డులు చూపించని పీఎస్పై అసహనం లేబర్ బడ్జెట్ తయారు చేయకుండా ఉపాధి పనులా ? -
ఉరుకుందలో ‘నవో’దయం
కౌతాళం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఉరుకుంద ఈరన్నస్వామి దేవాలయంలో శుక్రవారం నుంచి శ్రావణ మాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేప థ్యంలో దేవాలయంలో గురువారం ప్రత్యేకంగా 9 వారాలు.. 9 ప్రదక్షిణల కార్యక్రమానికి శ్రీకారం చుట్టా రు. భక్తులు స్వామి వారికి 9 వారాల మొక్కు చెల్లించుకోవచ్చు. ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు ఆధ్వర్యంలో లక్షపుష్పార్చన కార్యక్రమాన్ని చేపట్టారు. గురువారం అమావాస్య, ఆషాఢ మాసం చివరి రోజు కావడంతో మహాలక్ష్మి అమ్మవారికి భక్తులు శాస్త్రోకంగా సారెను సమర్పించారు. పిండివంటలతో స్వామికి నైవేద్యం సమర్పించారు. భక్తుల సౌకార్యర్థం ఆదోని, ఎమ్మిగనూరు, కర్ణాటకలోని రాయచూరు, శిరుగుప్ప ఆర్టీసీ డిపోలవారు ప్రత్యేక బస్సులను నడిపారు. ప్రారంభమైన 9 వారాలు.. 9 ప్రదక్షిణలు -
మెడికల్ కళాశాలలో వసతుల కల్పనకు చర్యలు
గోస్పాడు: మెడికల్ కళాశాలలో అవసరమైన వసతుల కల్పనకు చర్యలు చేపడతామని అడిషనల్ డీఎంఈ డాక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం ఆయన జిల్లా ఆసుపత్రి, మెడికల్ కళాశాల ఆవరణాన్ని పరిశీలించారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని సమావేశ భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కళాశాలలో ఈ ఏడాది మూడవ సంవత్సరం విద్యార్థులు రానున్నారని వారికి వసతులు కల్పించేందుకు మరిన్ని భవనాలు అవసరమవుతాయన్నారు. ప్రస్తుతం 450 బెడ్లు ఉండగా 620 బెడ్లు అవసరమవుతుందని, వీటితో పాటు ప్రత్యేక క్రిటికల్ కేర్ యూనిట్ మంజూరు కాగా ఏర్పాటుకు నూతన భవనాలు అవసరమన్నారు. ఆసుపత్రి వద్ద పారిశుద్ధ్య పనులు, సెక్యూరిటీ సేవలు మెరుగుపరచాలన్నారు. 24 గంటల పాటు ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్లు నిర్వహణ, అత్యవసర విభాగంలో సేవలు అందించాలన్నారు. మెడికల్ కళాశాల వద్ద నిర్మాణంలో ఉన్న రెండు హాస్టల్, కళాశాల భవనాలు కూడా వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయా విభాగాల వైద్యాధికారులతో సమావేశం నిర్వహించి ఏఏ విభాగాల్లో ఎలాంటి వసతులు ఉన్నాయి, ఇంకేమైనా కావాల్సి ఉన్నాయా, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీటన్నింటిపై నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి, ప్రిన్సిపాల్ డాక్టర్ సురేఖ, ఆర్ఎంఓ వెంకటేశ్వర్లు, ఆయా విభాగాల హెచ్ఓడీలు, ప్రొఫెసర్లు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
భర్తను చంపి డోర్ డెలివరీ చేసిన భార్య!
నంద్యాల: భర్తను తమ్ముడితో కలిసి చంపేసి.. ఆపై మృతదేహాన్ని కారులో తీసుకువచ్చి నంద్యాలలోని భర్త ఇంటి వద్ద విడిచిపెట్టింది ఓ మహిళ. నంద్యాల టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. నంద్యాలలోని నూనెపల్లెకు చెందిన రమణయ్య (50)కు పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన రమణమ్మతో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి జ్యోతి, చందన, సాయి సంతానం. దంపతుల మధ్య మనస్పర్ధల కారణంగా భార్య కొంతకాలంగా పుట్టిల్లు అయిన పిడుగురాళ్లలో ఉంటోంది. ఈ క్రమంలో భార్యతో మాట్లాడి ఇంటికి తీసుకొని రావడానికి రమణయ్య పిడుగురాళ్లకు సోమవారం రాత్రి వెళ్లాడు. అక్కడ భార్య బంధువులు, రమణయ్య మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రమణమ్మ, ఆమె తమ్ముడు రామయ్య కలిసి, రమణయ్య కంట్లో కారం చల్లి దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం తమ్ముడితో కలిసి భర్త మృతదేహాన్ని కారులో నంద్యాలలోని ఆయన ఇంటి వద్దకు తీసుకువచ్చి, అక్కడ పడేసి పరారయ్యారు. మృతుడి ముఖంపై కారంపొడి ఉండటం..తల, వీపుపై గాయాలు ఉండటంతో రమణయ్య కుమార్తెలు జ్యోతి, చందన నంద్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. టూటౌన్ పోలీసులు నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పిడుగురాళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బీటెక్ చదవొద్దన్నందుకు భర్తపై కేసు
నంద్యాల: బీటెక్ చదవొద్దన్న భర్తపై భార్య పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఘటనపై ఆదోని త్రీటౌన్ ఎస్ఐ రామస్వామి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలో ఎంఐజీ కాలనీకి చెందిన వర్షితకు మేనత్త కొడుకు అయిన బనగానపల్లికి చెందిన ఓంప్రకాష్తో మూడేళ్ల కిందట వివాహం జరిగింది. దంపతులు హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. సంతానం లేదు. వర్షిత హైదరాబాదులో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో దంపతుల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. వర్షితను చదువు మాన్పించేందుకు భర్త ఒత్తిడి తెచ్చాడు. దీంతో మనస్తాపం చెందిన వర్షిత ఆదోనిలోని పుట్టింటికి చేరుకుంది. ఘటనపై బుధవారం త్రీటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమె భర్తను పిలిపించి ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చినా కూడా భార్యను చదివించేందుకు ఓంప్రకాష్ ఒప్పుకోలేదు. దీంతో భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త ఓంప్రకా‹Ùపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
కర్ణాటక నుంచి తెచ్చుకుంటున్నాం
ఉక్కిరిబిక్కిరి చేస్తున్న యూరియా కొరత ● మార్క్ఫెడ్లో బఫర్ స్టాక్ పశ్చిమ ప్రాంతానికే తరలింపు ● పీఏసీఎస్లు, డీసీఎంఎస్లపై కూటమి నేతల పెత్తనం ● నిబంధనలకు విరుద్ధంగా ప్రయివేట్ డీలర్లకు కేటాయింపులు ● బ్లాక్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్న వైనం ● కర్నూలు ర్యాక్ పాయింట్ యూరియా నంద్యాలకు.. ● మండల కేంద్రాల్లో రైతుల పడిగాపులు మాకు 30 ఎకరాల భూమి ఉంది. ఇప్పటికే పత్తి, కంది సజ్జ తదితర పంటలు వేశాం. ఇటీవల వర్షాలు పడటంతో పత్తికి యూరియా అత్యవసరం. కాల్వలకు నీళ్లు వదలడం వల్ల వరి సాగుకు కూడా సిద్ధమవుతున్నాం. అయితే యూరియా దొరకని పరిస్థితి. జూలై నెలలో ఒక్క బస్తా కూడా అందుబాటులో లేదు. హొళగుంద మండలంలో ఏ ఒక్క ఆర్బీకేలో కూడా యూరియా లేదు. కర్ణాటకకు వెళ్లి రూ.400 ప్రకారం యూరియా తెచ్చుకుంటున్నాం. – మలిగిరి మల్లికార్జున, మాజీ సింగిల్విండో చైర్మన్, హొళగుంద కాల్వలకు నీళ్లు వదలడంతో వరి సాగుకు సిద్ధమవుతున్నాం. 9 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాం. ఇంతవరకు వర్షాలు లేవు. ఇటీవలనే వర్షం కురిసింది. ఈ సమయంలో యూరియా వేస్తేనే పంట బాగా వస్తుంది. పది రోజులుగా యూరియా కోసం చేయని ప్రయత్నం లేదు. సొసైటీలకు వస్తున్న ఎరువులను పలుకుబడి కలిగిన వారు తరలించుకుపోతున్నారు. నాలాంటి సామాన్య రైతులు అన్ని పనులు వదులుకొని రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నాం. – మహబూబ్బాషా, మల్యాల గ్రామం, నందికొట్కూరు మండలం కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలో యూరియా కొరత రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వచ్చిన యూరియాలో 50 శాతం టీడీపీ నేతలు, మద్దతుదారుల తరలించుకుపోగా.. మిగిలిన అరకొర యూరియాను దక్కించుకునేందుకు రైతులు పడిగాపులు కాస్తున్నారు. కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ వ్యయప్రయాసలకోర్చి మండల కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో రోడ్డెక్కుతున్నా ఫలితం లేకపోతోంది. కూటమి ప్రభుత్వంలో రైతుల దీనావస్థలకు యూరియా కొరత అద్దం పడుతోంది. కర్నూలు జిల్లాకు సంబంధించి మార్కఫెడ్లో 5వేల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్లో ఉండాలి. ఇలా ఉంటే ఏ ప్రాంతంలో కొరత ఉంటే అక్కడకు సరఫరా చేసే వీలుంటుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా మార్క్ఫెడ్లో యూరియా బఫర్ అనేది లేకుండా పోయింది. ఇప్పటి వరకు బఫర్లో ఉన్న యూరియాను వ్యవసాయ శాఖ ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు డివిజన్లకు ఇస్తున్నారు. మార్క్ఫెడ్లోని బఫర్ స్టాక్ మొత్తం పశ్చిమ ప్రాంతానికి తరలించినప్పటికీ కొరత కొనసాగుతోంది. డిమాండ్కు అనుగుణంగా యూరియా సరఫరా లేకపోవడంతో రైతులు రోజుల తరబడి ఆర్బీకేలు, డీసీఎంఎస్, పీఏసీఎస్లకు చుట్టు తిరగాల్సి వస్తోంది. ఆదోని, కౌతాళం, ఆలూరు, హొళగుంద, పెద్దకడుబూరు, దేవనకొండ, ఎమ్మిగనూరు, హాలహర్వి మండలాల్లో యూరియా కోసం నిత్యం రైతులు రోడ్డెక్కుతున్నారు. తుంగభద్ర తీరం వెంట వరి సాగు మొదలవుతుండటం వల్ల యూరియాకు డిమాండ్ ఏర్పడింది. అయితే మార్క్ఫెడ్లో యూరియా అనేదే లేకపోవడంతో రానున్న రోజుల్లో కొరత మరింత తీవ్రం కానుంది. నంద్యాల జిల్లాకు సంబంధించి మార్క్ఫెడ్లో జూలై మొదట్లో 9వేల టన్నుల యూరియా నేడు 1500 టన్నులకు పడిపోయింది. నంద్యాల జిల్లాకు జూలై నెలలో ఒక్క ర్యాక్ కూడా రాలేదు. ఇందువల్ల మార్క్ఫెడ్లో ఉన్న యూరియా క్రమంగా ఖాళీ అవుతోంది. యూరియా కోసం నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా, మిడుతూరు, ఆత్మకూరు, కొత్తపల్లి, బండిఆత్మకూరు, వెలుగోడు మండలాల్లో కొద్ది రోజులుగా రైతులు పోరాటం చేయాల్సి వస్తోంది. నిబంధనలకు పాతర జిల్లాకు వచ్చే యూరియా సహా అన్ని రకాల రసాయన ఎరువుల్లో నిబంధనల ప్రకారం 50 శాతం మార్క్ఫెడ్కు, 50 శాతం ప్రయివేటు డీలర్లకు ఇవ్వాల్సి ఉంది. అలా చేసినప్పుడే అత్యవసరం ఉన్న ప్రాంతాలకు కేటాయింపులు చేపట్టి కొరతను నివారించవచ్చు. ఇటీవల ఆర్సీఎఫ్ కంపెనీకి చెందిన 1500 టన్నుల యూరియా కర్నూలు ర్యాక్పాయింట్కు వచ్చింది. ఇందులో 50 శాతం మార్కఫెడ్కు ఇవ్వాల్సి ఉండగా.. ఒక్క టన్ను కూడా ఇవ్వలేదు. మొత్తం 1500 టన్నుల యూరియాను వ్యవసాయ యంత్రాంగం ప్రయివేటు డీలర్లేకే ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. ప్రయివేటు డీలర్లకు కేటాయించిన విషయం కూడా బయటకు పొక్కనివ్వకపోవడం గమనార్హం. ఈ యూరియా మొత్తాన్ని ప్రయివేటు డీలర్లు బ్లాక్లో సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. పడిగాపులు కాస్తున్నాం -
అవ్వ ఇంటికి వెళ్లిన అధికారులు
చాగలమర్రి: పింఛన్ అందక భిక్షాటన చేస్తున్న ఏనభై ఏళ్ల వయస్సు పైబడిన చిన్న గంగమ్మ అవ్వ ఇంటికి అధికారులు వెళ్లారు. అవ్వకు పింఛన్ ఇచ్చేందుకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకెళ్లారు. అలాగే జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పించారు. ‘పింఛన్ అందక భిక్షాటన ’అనే శీర్షికన బుధవారం సాక్షి దినపత్రికలో వార్త ప్రచురితం కావడంతో జిల్లా కలెక్టర్ రాజకుమారి స్పందించారు. చాగలమర్రి ఎంపీడీఓ రాజేంద్రప్రసాద్కు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో అప్రమత్తమైన ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది చాగలమర్రిలోని ఎస్టీ కాలనీలోని గుడిసెలో నివాసముంటున్న చిన్న గంగమ్మ వద్దకు వెళ్లారు. సమాచారం సేకరించి నివేదికను జిల్లా కలెక్టర్కు పంపారు. -
ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్ల నియామకం
నంద్యాల: కర్నూలు 2వ బెటాలియన్లో బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ప్రొబేషనరీ సబ్ఇన్స్పెక్టర్లు రవిప్రకాష్, ధనుంజయుడు, ఎ.శ్రీకాంత్, ఈ. అనిల్కుమార్ను జిల్లాకు నియమించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణాను వీరు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో వీరికి స్థానం కల్పిస్తామని ఎస్పీ తెలిపారు. ‘మినీ అంగన్వాడీ’ నోటిఫికేషన్ రద్దు నంద్యాల(అర్బన్): బనగానపల్లె, నందికొట్కూరు ప్రాజెక్టుల పరిఽధిలో ప్రకటించిన మినీ అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రభుత్వ ఆదేశానుసారం రద్దు పరిచామని జిల్లా సీ్త్ర శిశుసంక్షేమం సాధికార అధికారిణి లీలావతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఆరు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని మెయిన్, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల నియామకాలకు అర్హులైన సీ్త్ర అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. గతంలో వెలువడిన నోటిఫికేషన్లో చూపిన ఖాళీలతో పాటు అదనంగా ఏర్పడిన మొత్తం 40 అంగన్వాడీ సహాయకుల పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నామన్నారు. ఈనెల 31లోగా దరఖాస్తులు సంబంధిత కార్యాలయంలో అందజేయాలని, మరిన్ని వివరాలకు నంద్యాలలోని శిశు అభివృద్ధి పథకం అధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు. కేసీ కాల్వకు తగ్గిన నీటిసరఫరా జూపాడుబంగ్లా: కేసీ కాల్వకు నీటిసరఫరా తగ్గించటంతో ఏబీఆర్ కాల్వకు సాగు నీటిసరఫరా నిలిపివేసినట్లు ఏఈ కేసీ కాల్వ ఏఈ శ్రీనివాసనాయక్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సుంకేసుల డ్యాం నుంచి కేసీ కాల్వకు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా రైతుల వినియోగానంతరం లాకిన్స్లా కు 500క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు తెలిపారు. అందులో 300 క్యూసెక్కులు నిప్పులవాగుకు 200క్యూసెక్కులు తూడిచెర్ల సబ్ఛానల్ కాల్వకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కాల్వకు నీటిసరఫరా నిలిపివేసినట్లు తెలిపారు. రిటైర్డ్ కమర్షియల్ ట్యాక్స్ అధికారి అక్రమ వసూళ్లు ప్యాపిలి: పదవీ విరమణ పొందిన కమర్షియల్ ట్యాక్స్ అధికారి సుబ్బరాయుడు అక్రమ వసూళ్ల బాగోతం బయటపడింది. పట్టణ సమీపంలోని 44 వ నంబర్ జాతీయ రహదారిపై డోన్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో క్రెటా కారును రోడ్డు పక్కన నిలబెట్టిన ముగ్గురు వ్యక్తులు ఓ గ్రానైట్ లారీని తనిఖీ చేస్తున్న విషయాన్ని మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ గమనించారు. తాము అనంతపురం జిల్లాకు చెందిన కమర్షియల్ ట్యాక్స్ అధికారులమని సుబ్బరాయుడు, అతని కుమారుడు సురేశ్, మరో వ్యక్తి ఎంవీఐని నమ్మించారు. కొద్ది సేపటికి వారు అక్కడి నుంచి జారుకున్నారు. అనంతరం గ్రానైట్ లారీ డ్రైవర్ను ఎంవీఐ ఈ విషయమై ప్రశ్నించగా తనను డబ్బులు ఇవ్వాల్సిందిగా వారు డిమాండ్ చేసినట్లు తెలిపారు. దీంతో అనుమానం వచ్చిన ఎంవీఐ నిందితుల కారును వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. వారు చెప్పే సమాధానాల్లో పొంతన లేకపోవడంతో ఎంవీఐ వారిని ప్యాపిలి పోలీస్ స్టేషన్కు అప్పగించారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుల కారు ఏపీ 40ఈఆర్ 8925 ను సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేశారు. -
సాగుపై తగ్గిన మమ‘కారం’
తీవ్ర నష్టం వచ్చింది ఎకరా రూ. 37 వేలు కౌలు చెల్లించి రెండు ఎకరాల కౌలు పొలంతోపాటు మరో రెండు ఎకరాల సొంత పొలంలో మిరప సాగు చేశాను. ఎకరాకు 7 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాలేదు. గతేడాది మిరప సాగుతో తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ఎకరాకు రూ. లక్ష వరకు నష్టం వాటిల్లింది. మిరప సాగుతో తీవ్ర నష్టాలు రావడంతో ఈ ఏడాది మిరప సాగుకు స్వస్తి చెప్పి ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి సారించాను. – మోహన్రెడ్డి, రైతు, కంపమల్ల, కోవెలకుంట్ల మండలం దిగుబడులు అమ్ముకోలేదు గతేడాది ఒకటిన్నర ఎకరా సొంత పొలంతోపాటు ఎకరా రూ. 20 వేలు కౌలు చెల్లించి మరో మూడు ఎకరాలు తీసు కుని మిరప సాగు చేశాను. ఎకరాకు రూ. 1.50 లక్షలు పెట్టుబడి వచ్చింది. వాతావరణం అను కూలించక ఎకరాకు 12 క్వింటాళ్లకు మించి దిగబడు లు రాలేదు. మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆరు నెలల నుంచి దిగుబడులను కోల్డ్స్టోరేజిలో భద్ర పరుచుకున్నాను. ఇప్పటి వరకు అమ్మలేదు. ప్రస్తుత మార్కెట్లో క్వింటా రూ. 8 వేలకు మించి పలకడం లేదు. – రామసుబ్బయ్య, రైతు, అమడాల, కోవెలకుంట్ల మండలం కోవెలకుంట్ల: వాతావరణం అనుకూలించక, రాష్ట్ర ప్రభుత్వం చేయూత ఇవ్వక రైతులు ఈ ఏడాది మిరప సాగు చేయలేదు. పెట్టుబడి ఖర్చులు పెరగడం, మార్కెట్లో గిట్టుబాటు ధర దక్కకపోవడంతో మిరపకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేసుకున్నారు. నంద్యాల జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాది 12,715 హెక్టార్లలో మిరప సాగు లక్ష్యం కాగా... ఇప్పటి వరకు రైతులు సాగుపై ఆసక్తి కనబరచలేదు. రైతు కంట్లో ‘కారం’ గతేడాది మిర్చి సాగు రైతుల కళ్లలో కారం కొట్టింది. జిల్లాలోని ఒక్క బనగానపల్లె నియోజకవర్గంలో 4,790 హెక్టార్లలో మిరప సాగు కావాల్సి ఉండగా 3,588 హెక్టార్లలో సాగైంది. మిగిలిన అన్ని మండలాలను కలుపుకుని 4,800 హెకాక్టర్లలో మాత్రమే సాగు చేయగలిగారు. మిరప నారు, నాట్లు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, సాగునీరు మళ్లింపు.. తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 2 లక్షలకు పైగా ఖర్చు చేశారు. కౌలు రైతులకు రూ. 60 వేలు అదనపు భారం పడింది. గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో మిరపను తెగుళ్లు ఆశించాయి. ఎకరాకు 20 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలు చవి రూడాల్సి వచ్చింది. దిగుబడులు తగ్గడానికి తోడు మార్కెట్లో మిరపకు గిట్టుబాటు ధర భారీగా పడిపోయింది. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టినా క్వింటా రూ. 10 వేలకు మించి ధర పలకపోవడంతో ఆ ధరకే విక్రయించి నష్టాలు మూటగట్టుకున్నారు. నష్టాల దిగుబడి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు మిర్చి ఎర్ర బంగారం అయ్యింది. 2021–22, 2022–23 సంవత్సరాల్లో క్వింటా ఎండు మిరపకాయలు రూ. 25 వేల నుంచి రూ. 30 వేలు ధర పలికాయి. అయితే గతేడాది నుంచి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గతేడాది నవంబర్ నెలలో రూ. 15 వేల నుంచి రూ. 16 వేలు పలుకగా ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ధర రూ. 10 వేలకు పడిపోయింది. మిర్చికి తెగుళ్లు ఆశించడం, దిగుబడులు గణనీయంగా తగ్గడమేకాకుండా గిట్టుబాటు ధర లేకపోవడంతో ఎకరాకు రూ. 60 వేల నష్టం వాటిల్లింది. దీంతో ఏడాది మిరప సాగు చేయాలంటే రైతులు భయపడుతున్నారు. చిరు పంటలపై దృష్టి ఇటీవలే ఎస్సార్బీసీ, కేసీకెనాల్, కుందూనది, పాలేరు, కుందరవాగుకు నీటిని విడుదల చేశారు. సాగునీరు అందుబాటులో ఉన్నా మిరప సాగు చేసేందుకు రైతులు ఆసక్తి కనబరచడం లేదు. ఈ ఏడాది జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో 5 వేల హెక్టార్లకు మించి మిరప సాగయ్యే సూచనలు లేవని ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది మిరపసాగుతో తీవ్రంగా నష్టపోయిన రైతులు ఈ ఏడాది మిరప సాగు చేసేందుకు సాహసం చేయడం లేదు. మిరప స్థానంలో ఇప్పటికే రైతులు అధిక విస్తీర్ణంలో మొక్కజొన్న పంటను సాగు చేశారు. మిగిలిన విస్తీర్ణంలో మినుము, జొన్న, పప్పుధాన్యాలు, చిరు పంటల సాగువైపు దృష్టి సారించారు. జిల్లాలో మిరప సాధారణ సాగు విస్తీర్ణం సబ్ డివిజన్ సాగు విస్తీర్ణం (హెక్టార్లలో) కోవెలకుంట్ల 5,141 నంద్యాల 3,789 నందికొట్కూరు 1,519 ఆళ్లగడ్డ 1,156 ఆత్మకూరు 925 డోన్ 184 కలసిరాని మిరపసాగు గతేడాది కుదేలైన అన్నదాత ఎకరాకు రూ.60 వేల వరకు నష్టం ఈ ఏడాది సాగుకు ముందుకు రాని రైతులు -
రెండో రోజూ ముగ్గురే!
కర్నూలు(అర్బన్): రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి ప్రారంభమైన మహిళా జెడ్పీటీసీ సభ్యులకు శిక్షణకు రెండో రోజైన బుధవారం కూడా ముచ్చటగా ముగ్గురే హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తమకు మండలాల్లో తమకు ఎలాంటి విలువను ఇవ్వడం లేదని, 19 నెలలుగా గౌరవ వేతనాలను కూడా ప్రభుత్వం పెండింగ్లో ఉంచారని జెడ్పీటీసీ సభ్యులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేఫథ్యంలోనే ఉమ్మడి జిల్లాలోని మహిళా జెడ్పీటీసీ సభ్యులకు ‘ మహిళా నాయకత్వంలో మార్పు – స్థానిక స్వపరిపాలనలో సాధికారత ’ అనే అంశంపై మూడు రోజుల శిక్షణను స్థానిక జిల్లా పరిషత్లోని డీపీఆర్సీ భవనంలో ప్రారంభించారు. మొదటి రోజున ముగ్గురు మహిళా జెడ్పీటీసీ సభ్యులు హాజరు కాగా, 2వ రోజు శిక్షణకు కూడా ముగ్గురే ( జెడ్పీ వైస్ చైర్మన్, హొళగుంద జెడ్పీటీసీ సభ్యురాలు కురువ బుజ్జమ్మ, గోస్పాడు నుంచి పీ జగదీశ్వరమ్మ, బండి ఆత్మకూరు నుంచి రామతులశమ్మ ) మాత్రమే హాజరయ్యారు. -
ఆక్సిజన్ లీక్తో గందరగోళం
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో బుధవారం పైపుల ద్వారా వెళ్లే ఆక్సిజన్ లీకై ంది. సూపర్ స్పెషాలిటీ భవనంలో ఉదయం 10.30 గంటల సమయంలో ఆక్సిజన్ పైపులైన్పై కోతులు ఊగిసలాడటంతో పెద్ద శబ్దంతో రంధ్రం పడింది. రంధ్రం నుంచి ఆక్సిజన్ లీకై ంది. ఆ ధాటికి పైపునకు ఆనుకుని ఉన్న ఇనుప మెట్లకు కన్నం పడింది. విషయం తెలుసుకున్న సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు మరమ్మతు చర్యలు ప్రారంభించారు. ఇన్చార్జ్ సీఎస్ఆర్ఎంఓ డాక్టర్ వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్లు డాక్టర్ శివబాల నాగాంజన్, డాక్టర్ కిరణ్కుమార్ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి దెబ్బతిన్న పైపులైన్కు ఆక్సిజన్ సరఫరా నిలిపివేశారు. వెల్లింగ్ చేసి పైపులైన్ను సరి చేశారు. ఆ సమయంలో రోగులకు సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ అందించారు. ఆసుపత్రిలో కోతుల బెడద కారణంగా రెండు నెలల క్రితం చిన్నపిల్లల విభాగంలో ఆక్సిజన్ పైపులైన్ లీకై ంది. అప్పుడు కూడా ఎక్కువ శాతం ఆక్సిజన్ వృథాగా పోయింది. ప్రస్తుతం జరిగిన సంఘటనతో రోగులకు ఇబ్బంది రాకపోవడంతో అధికారులతో పాటు ఉద్యోగులు ఊపిరిపీల్చుకున్నారు. -
ఏపీ జలాలపై వివాదం సృష్టిస్తున్నారు
కర్నూలు కల్చరల్: ఏపీ జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వివాదాలు సృష్టిస్తోంది. రాయలసీమ రైతులు భూములు త్యాగం చేసి కూడా నీరు వాడుకోలేని పరిస్థితి నెలకొంది. పెండింగ్ ప్రాజెక్టులు, బానకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడం దారుణమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం కర్నూలులో మాట్లాడుతూ.. బీజేపీ బలోపేతం కోసం పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు మాధవ్ జిల్లాల పర్యటనను ప్రారంభిస్తున్నారన్నారు. వైఎస్సార్ కడప జిల్లా నుంచి పర్యటన ప్రాంరభమవుతుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందన్నారు. టీటీడీలో పనిచేసే అన్యమతస్తులు స్వచ్ఛందంగా వైదొలగాలని కోరారు. అక్రమంగా ప్రాజెక్టులు నిర్మించిన తెలంగాణ సముద్రంలోకి వెళ్లే జలాలను తాము వాడుకుంటామంటే వివాదం సృష్టిస్తోందని వాపోయారు. ఆంఽధ్ర ప్రజల నోట్లో మట్టికొట్టడానికే తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులపై కేంద్రానికి లేఖ రాసిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పులు కప్పి పుచ్చుకోవడానికే సెంటిమెంట్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఈ నెల 28న నంద్యాల, 29న కర్నూలు జిల్లాల్లో పర్యటిస్తారని వెల్లడించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, జిల్లా ఇన్చార్జ్ అంకాల్ రెడ్డి, రాష్ట్ర నాయకులు రామస్వామి, పురుషోత్తం రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి నిధులతో పశువుల షెడ్లు కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో 2025–26 సంవత్సరంలో కూడా పశువుల షెడ్లు నిర్మించనున్నట్లు జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరమణయ్య తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో జాబ్ కార్డుతో పాటు పశువులు కలిగిన ప్రతి రైతు షెడ్డు నిర్మించుకోవచ్చన్నారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు 1200, నంద్యాల జిల్లాకు 850 పశువుల షెడ్లు మంజూరయ్యాయన్నారు. 2, 4, 6 పశువులకు షెడ్లు నిర్మించుకోవచ్చని.. 90 శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. పశుసంవర్థక శాఖ లబ్ధిదారులను ఎంపిక చేస్తుందన్నారు. -
నకిలీ ఏపీకే ఫైల్స్తో జాగ్రత్త
కర్నూలు(హాస్పిటల్): ఈ–చలాన్ పేరుతో వస్తున్న నకిలీ ఏపీకే ఫైల్స్తో జాగ్రత్తగా ఉండాలని, తొందరపడి వాటిని క్లిక్ చేయవద్దని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సామాజిక మాద్యమాల్లో ఆర్టీఓ ట్రాఫిక్ చలాన్.ఏపీకే పేరుతో వచ్చే లింక్ను నమ్మవద్ద న్నారు. నకిలీ ఏపీకే ఫైల్స్ క్లిక్ చేస్తే సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతారని, మీ డబ్బును దోచేస్తా రని చెప్పారు. ఇదివరకు పీఎం కిసాన్ యోజన, ఎస్బీ ఐ క్రెడిట్ కార్డులు, రివార్డులు, కేవైసీ అప్డేట్ పేర్లతో సైబర్ మోసాలకు పాల్పడే నేరగాళ్లు నూతన ఎత్తుగడ కు పథకం వేసి ట్రాఫిక్ చలానా పేరుతో ప్రజల బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను లూటీ చేసేందుకు సిద్ధమయ్యారని, దీనిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ–చలాన్ పేరున నేరం ఇలా... ముందుగా నకిలీ ఏపీకే ఫైల్ను నమ్మదగిన వాట్సాప్ గ్రూపులలో షేర్ చేస్తారు. ఆ గ్రూపులో ఉన్న సభ్యులు దాన్ని నమ్మి ఆలోచించకుండా క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటారు. వెంటనే మీ అనుమతి లేకుండా క్రెడిట్ కార్డు నుంచి ఆన్లైన్లో కొనుగోళ్లు జరిగినట్లు మెసేజ్లు వస్తాయని ఎస్పీ వివరించారు. ఏపీకే ఫైల్ను ఇన్స్టాల్ చేస్తే అది మీ ఎస్ఎంఎస్లను యా క్సెస్ చేసి ఓటీపీలను తెలుసుకుంటుందన్నా రు. మీ బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డు వివరాలను కూడా తెలుసుకుంటుందని, మీ ఫోన్ను ఓ రిమోట్ మాదిరిగా సైబర్ నేరగాళ్లు నియంత్రిస్తారన్నా రు. గుర్తు తెలియని, అనధికార లింక్లను క్లిక్ చేయరాదని, యాప్స్ను ఎల్లప్పుడూ గూగుల్ ప్లే స్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాలన్నారు.ఓటీపీ అలర్ట్స్ను ఎనేబు ల్ చేసుకోవాలని, ఏవైనా అనుమతి లేకుండా లావాదే వీలు జరిగినట్లు అనుమానాస్పదంగా అనిపిస్తే వెంట నే కార్డును బ్లాక్ చేయాలన్నారు.సైబర్ నేరాల పట్ల 1930 ఫోన్ నంబర్ లేదా www.cybercrime.gov.in వెబ్సైట్ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. -
కుటుంబంలో మద్యం చిచ్చు
● ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య బనగానపల్లె: పచ్చని కుటుంబంలో మద్యం చిచ్చు రేపింది. దంపతుల మధ్య కలహాలకు కారణమై కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తిని బలితీసుకుంది. వివరాలు.. మండలంలోని యాగంటిపల్లె గ్రామానికి చెందిన బోయ శ్రీనివాసులు (35)కుటుంబ కలహాలతో మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్కు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణ సీఐ ప్రవీణ్కుమార్ కథనం మేరకు.. బోయ శ్రీనివాసులు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆటో కొనుగోలుకు గతంలో అప్పు చేశాడు. ఈ క్రమంలో కొంతకాలంగా మద్యానికి బానిసై డబ్బంతా తాగుడుకు ఖర్చు చేసేవాడు. మద్యం అలవాటు మానుకొని అప్పులు తీర్చాలంటూ భార్య కళావతి భర్తతో గొడవ పడేది. భర్త తీరు మారకపోవడంతో కొద్దిరోజుల క్రితం పుట్టినిళ్లు ప్యాపిలికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెందిన శ్రీనివాసులు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు శ్రీనివాసులుకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. లింక్ నొక్కితే బ్యాంకు ఖాతా ఖాళీ కోసిగి: మండల పరిధిలోని ఆర్లబండ గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ బ్యాంకు ఖాతాలోని డబ్బు ను సైబర్ ముఠా దోచేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డును ఉపయోగిస్తే పెనాల్టీ, ప్రాసెసింగ్ ఫీజు వంటివి ఉండవని పేర్కొంటూ ఇటీవల అతని సెల్ఫోన్కు ఒక లింక్ వచ్చింది. ఆ లింక్ను ఓపెన్ చేయగా సాయంత్రంలోగా అతని ఖాతాలో ఉన్న రూ.18,500 నగదు మాయమైంది. ఘటనపై బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బుధవారం బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు ఖాళీ అయిన దృశ్యాన్ని సెల్ఫోన్లో చూపుతూ సైబర్ నేరాలు పెరిగి పోయాయని, వాటిని అరికట్టాలని వాపోయారు. -
విరిగిపడిన గాలిమర రెక్క
దేవనకొండ: మండలంలోని కె.వెంకటాపురం గ్రామానికి చెందిన చిన్న కౌలుట్లయ్య అనే రైతు పొలంలో బుధవారం ఉదయం గాలిమర రెక్క ఒకటి విరిగి పడింది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల పొలాల వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. సదరు కంపెనీ వారికి సమాచారం అందించారు. గాలిమర రెక్క విరిగి పడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. గుర్తు తెలియని మహిళ మృతి మంత్రాలయం రూరల్: మంత్రాలయంలోని తుంగభద్ర నదిలో పుష్కర ఘాట్, సంతమార్కెట్ ఘాట్ మధ్యలో గుర్తు తెలియని మహిళ శవం లభ్యమైంది. బుధవారం ఉదయం పుష్కర ఘాట్ వైపు తుంగభద్ర నది వద్ద స్నానానికి వెళ్లిన భక్తులు నదిలో కొట్టుకొస్తున్న మహిళ శవాన్ని గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మహిళ శవాన్ని ఒడ్డుకు చేర్చారు. ఆమె వయసు 55 ఏళ్లు ఉంటుందని, లైట్ గ్రీన్ కలర్ శారీ ధరించి ఉన్నట్లు చెప్పారు. స్థానిక వీఆర్వో భీమయ్య ఫిర్యాదు మేరకు మంత్రాలయం ఎస్ఐ శివాంజల్ కేసు నమోదు చేశారు. మృతురాలి ఆచూకీ తెలిసిన వారు మంత్రాలయం సీఐ 91211 01151, ఎస్ఐ 91211 01152 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు. క్యాంపస్ సేఫ్ స్పెషల్ డ్రైవ్ కర్నూలు(న్యూటౌన్): విద్యాసంస్థల వద్ద 100 గజాల దూరంలో సిగరెట్, పొగాకు సంబంధిత ఉత్పత్తులు విక్రయించడాన్ని నిషేధించారని, దీనిపై ‘ఆపరేషన్ క్యాంపస్ సేఫ్ జోన్’ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా పోలీసు అధికారులు తమ పరిధిలోని పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలను సందర్శించి 100 గజాలలోపు ఉన్న టీ, పాన్, కిరాణం షాపులలో సిగరెట్లు, ఖైనీ, గుట్కా పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించినట్లు నిర్వాహకులకు తెలియజేశారు. జిల్లాలోని కర్నూలు, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు సబ్ డివిజన్లలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని విద్యాసంస్థల వద్ద తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థల వద్ద పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న 1441 షాపుల యజమానులపై సీఓటీపీఏ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి రూ.2,24,310 జరిమానా విధించారు. నిబంధనలు ఉల్లంఘించి పొగాకు ఉత్పత్తులు, గుట్కా విక్రయిస్తే షాపులను సీజ్ చేసి యజమానులపై కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ప్రతి ఇంట్లో ఆయన నామమే
ఆలయంపై ప్రత్యేక కథనం ఆలయానికి సంబంధించి ప లు కథనాలు ప్రచారంలో ఉండగా చారిత్రక ఆధారాలు ఏవీ లభించ లేదు. స్వామి కి నిర్ధిష్టమైన ఆకారం లేదు. ఒక సిద్ధ పురషుడని, వీరభద్ర అంశంతో భూలోకానికి వచ్చిన దైవదూతగా పెద్దలు చెబుతారు. 16వ శతాబ్ధంలో ఈరన్న అనే సిద్ధయోగి ఉరుకుందకు వచ్చి రావి చెట్టు కింద లక్ష్మినరసింహ స్వామి కొరకు తపస్సు చేసి ఆ రావి చెట్టులో స్వామి ఐకమయ్యారని ప్రతీతి. ఈ చెట్టు చుట్టూ కట్టను నిర్మించారు. స్వామి ఇప్పటికీ రాత్రివేళ సర్ప రూపంలో, సాధువు రూపంలో సంచరిస్తుంటారని భక్తులు విశ్వసిస్తున్నారు. స్వామిపై విశ్వాసం ఉంచే వారికి అన్నీ శుభాలే జరుగుతాయని నమ్ముతారు. ఇక్కడ మతపరమైన భేదాలు లేవు. హిందువులే కాక ముస్లింలు కూడా స్వామి వారి దర్శనార్థం వస్తుంటారు. పిలిస్తే పలికే ఈరన్నగా, కోరిన కోర్కెలు తీర్చే లక్ష్మి నరసింహగా భక్తులు స్వామిని పూజిస్తారు. ఒక్కసారి స్వామి దర్శనార్థం వస్తే 9 సార్లు 9 ప్రదక్షిణలతో స్వామి దర్శనం చేయాలని ప్రతీతి. భక్తి ప్రవుత్తులతో స్వామివారి ఆలయ ప్రాంగణంలో నైవేద్యం సమర్పించటం ఆచారం. స్వామి ఆశ్రయం పొందిన గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లో ఏ ఇంటికి వెళ్లినా స్వామి నామమే. ప్రజలందరి పేర్లు ఈరన్న, ఈరమ్మ, నాగరాజు, నాగమ్మ, వీరేష్, వీరన్న ఇలా వినిపిస్తాయి. తమ పిల్లలకు స్వామి పేరు పెట్టడం వల్ల అంతా శుభం జరుగుతుందని భక్తులు భావిస్తున్నారు.శ్రావణ మాస ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులుకౌతాళం: ఉరుకుంద ఈరన్న (నరసింహ) స్వామి క్షేత్రం భక్తజనుల పుణ్యదామంగా నిత్యం పూజలందుకుంటూ మహాక్షేత్రంగా వెలుగొందుతోంది. మహిమాన్వితుడైన ఈరన్న స్వామిని మనసా, వాచా కొలిస్తే అంతా శుభమే జరుగుతుందనే నమ్మకం భక్తుల్లో ఉంది. స్వామి వారి పాదాలను తాకితే సర్వపాపాలు హరించి ముక్తి మార్గం సంప్రాప్తిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. కౌతాళం మండల కేంద్రానికి 6 కి.మీ. దూరంలో ఉరుకుంద గ్రామంలో వెలసిన క్షేత్రమే ఈరన్న (నరసింహ) స్వామి పుణ్యక్షేత్రం. ఇక్కడ స్వామి వారు మహిమాన్వితుడిగా వెలుగొందుతూ నిత్యం పూజలందుకుంటున్నారు. రోజూ వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు ఈ నెల 25 నుంచి ప్రారంభమై ఆగస్టు 23వ తేదీ వరకు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా సోమ, గురువారాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. మూడవ సోమవారం దాదాపు 3 లక్షలకు పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. చివరి సోమవారం స్వామివారి పల్లకోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవాలు ుుగిసే వరకు ఈ ప్రాంతవాసులు మద్యపానానికి, ూంసాహారానికి దూరంగా ఉంటారు. నిత్యాన్నదానం ఆలయం వద్ద నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమం నిర్వహణకు ప్రత్యేక భవనా న్ని విశాలమైన ప్రదేశంలో నిర్మించారు. జీప్లస్ భవ న నిర్మాణం కోసం రూ.2.30 కోట్లతో ప్రతిపాదన లు పంపారు. మధ్యాహ్నం, రాత్రి వేళలోనూ భక్తులకు అన్నదానం చేస్తారు. శ్రావణ మాసంలో భక్తుల కోసం మూడు చోట్ల అన్నదానం చేయనున్నట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు తెలిపారు. స్వామి వారి ఆదాయం భక్తులు పలు రూపాల్లో స్వామివారికి కానుకలు సమర్పిస్తుంటారు. నిత్యాన్నదానం పథకానికి రూ.6 కోట్ల వరకు డిపాజిట్లు ఉన్నట్లు డీసీ తెలిపారు. అలాగే 3.50 కేజీ బంగారం గోల్డ్బాండ్ల రూపంలో ఉందని, 2 కేజీల వరకు భక్తులు ఇచ్చిన బంగారం కానుకల రూపంలో ఉందన్నారు. వెండి 1400 కేజీలు బ్యాంక్ లాకర్లో ఉందని, 750 కేజీల వరకు కానుకల రూపంలో దేవాలయంలో ఉందని డీసీ తెలిపారు. రవాణా సౌకర్యం ఆదోని, ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలతో పాటు కర్ణాటకలోని బళ్లారి, శిరుగుప్ప, రాయచూరు, సింధనూరు ఆర్టీసీ వారు ఉరుకుంద ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపుతారు. ఆదోని, ఎమ్మిగనూరుకు చేరుకున్న భక్తులకు అక్కడి నుంచి ఉరుకుందకు వెళ్లేందుకు బస్సులు సిద్ధంగా ఉంటాయి. దర్శనీయ స్థలాలు స్వామిని దర్శించుకున్న భక్తులు ఆలయం వెనుక ఉన్న ఆంజనేయ స్వామి, నాగుల స్వామి, బసవన్న కట్టను దర్శించుకోవడం ఆనవాయితీ. ఉరుకుంద నుంచి 5 కి.మీ. దూరంలో పలికే దేవుడిగా పేరుగాంచిన బుడుములదొడ్డి ఆంజనేయస్వామి దేవస్థానం ఉంది. ఉరుకుందకు 15 కి.మీ దూరంలో మేళిగనూరు వద్ద శ్రీరాముని చేత ప్రతిష్టించబడిన రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. అలాగే 40 కి.మీ. దూరంలో మంత్రాలయం మఠం ఉంది. నీటి సదుపాయం తుంగభద్ర దిగువ కాలువ పరిధిలోని మాధవరం మేజర్ కాలువ ఆలయం సమీపంలోనే ప్రవహిస్తుంది. ఈసారి ఉత్సవాల ప్రారంభానికి ముందే తుంగభద్ర డ్యాం నిండటంతో దిగువ కాలువకు సాగు నీరు విడుదల చేశారు. దీంతో భక్తులకు నీటి కష్టా లు తప్పాయి. దీనికితోడు మొదటిసారిగా ఫిల్టర్ చే సిన తాగునీరు ఏర్పాటు చేశారు. ఆలయం లోపల, వెలుపల తాగునీటి కుళాయిలను ఏర్పాటు చేశారు. రేపటి నుంచి శ్రావణమాస ఉత్సవాలు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు మాస్టర్ ప్లాన్ ఆధారంగా అభివృద్ధి పనులు మాస్టర్ప్లాన్ ఆధారంగా ఇక్కడ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు డిప్యూటీ కమిషనర్ వివరించారు. ఆలయం చుట్టూ సీసీ రాతిపరుపు, తూర్పు రాజగోపురం ముందు భాగంలో సీసీ ఫ్లోరింగ్, ప్రాంగణంలో నాల్గు ఐ మాక్స్ లైట్ల ఏర్పాటు, నూతనంగా 24 టాయిలెట్ల నిర్మాణం, సెంట్రల్ స్టోర్ నిర్మాణం, ఆలయం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం, దేవస్థానం కార్యక్రమ వివరాలు తెలిసేలా బోర్డుల ఏర్పాటు, గోశాల విస్తరణ, నూతన సేవ టికెట్స్, లడ్డూ కౌంటర్ బుకింగ్ కౌంటర్లు, భక్తుల సౌకర్యార్థం వీఐపీ లాంజ్ ఒకేసారి వెయ్యి మంది భక్తులు సేద తీరే విధంగా 2 పెద్ద షెడ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తి చేశామని తుంగభద్ర కాలువ వద్ద బళ్లారికి చెందిన భక్తుడు తిప్పయ్య ఇచ్చిన 1.11 ఎకరాల స్థలంలో డార్మింటరీహాల్, కళ్యాణకట్ట, టాయిలెట్స్ నిర్మాణ పనులు జరుగుతున్నట్లు డీసీ తెలిపారు. అలాగే ఇటీవల సుమారు రెండు కోట్లతో కోనేరు నిర్మాణానికి బెంగళూరుకు చెందిన భక్తుడు మంజునాథ్ ముందుకు రావడంతో భూమిపూజ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. -
బ్యాంకుకు వెళ్లి వస్తానని వివాహిత అదృశ్యం
ఆలూరు: మండలంలోని మొలగవెల్లి గ్రామంలో పొదుపు సంఘాల బుక్ కీపర్గా పనిచేస్తున్న కుమ్మరి రాజేశ్వరి (27) బ్యాంకుకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 7వ తేదీన కుమ్మరి రాజేశ్వరి బడికి వెళ్లి పిల్లలకు అన్నం తినిపించి, అలాగే బ్యాంకుకు వెళ్లి వస్తానని కుటుంబసభ్యులకు చెప్పి వెళ్లింది. తర్వాత ఇంటికి తిరిగి రాకపోవడంతో ఈ నెల 8న ఆమె భర్త కుమ్మరి ఆదినారాయణ ఆలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు పెద్దగా స్పందించకపోవడంతో బుధవారం ఆలూరు సీఐ రవిశంకర్రెడ్డిని కలిసి విషయం తెలియజేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. స్థానిక ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ రామచంద్రయ్యపై అనుమానం ఉందని పేర్కొనడంతో పోలీసులు ఆయన్ను స్టేషన్కు పిలిపించి విచారణ జరిపారు. అలాగే అనంతపురం జిల్లా గుంతకల్లులోని హోటల్, మద్దికెరలోని ఇంటికి కూడా తీసుకెళ్లి విచారణ చేశారు. కుమ్మరి రాజేశ్వరి ఆచూకీ తెలిసిన వారు ఆలూరు సీఐ నంబర్ 91211 01157 లేదా ఎస్ఐ 91211 01158 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. -
జిల్లాలో మోస్తరు వర్షం
నంద్యాల(అర్బన్): జిల్లాలో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు మోస్తరు వర్షం కురిసింది. శ్రీశైలంలో అత్యధికంగా 35.4మి.మీ, గోస్పాడులో అత్యల్పంగా 1.0మి.మీ వర్షం కురిసింది. అదే విధంగా ఆత్మకూరులో 15.8, కొత్తపల్లె 10.4, ప్యాపిలి 9.8, మహానంది 8.2, వెలుగోడు 8.0, కొలిమిగుండ్ల 7.6, గడివేముల 6.8, చాగలమర్రి 5.2, పాములపాడు 4.2, పగిడ్యాల 3.8, మిడుతూరు 3.4, నంద్యాల అర్బన్, బండిఆత్మకూరు 3.2, నందికొట్కూరు 2.6, అవుకు 2.4, బనగానపల్లె 2.2, రుద్రవరం 1.4, నంద్యాల రూరల్, జూపాడుబంగ్లా, ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ 1.2 మి.మీ వర్షం కురిసింది. వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు శ్రీశైల టెంపుల్: వర్షాల వలన వచ్చే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో దేవస్థాన అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఈఓ మాట్లాడుతూ.. క్షేత్ర పరిధిలో ఎక్కడ కూడా చెత్తాచెదారాలు ఉండకుండా విస్తృతంగా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. ఎక్కడా వర్షం నీరు నిల్వ ఉండకుండా ఉండేలా, దోమలు వృద్ధి చెందకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. దేవస్థానం వైద్యశాలలో అవసరమైన అన్నీ మందులను సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. సమావేశంలో డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఆర్.రమణమ్మ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నరసింహారెడ్డి, ఏఈవోలు, పర్యవేక్షకులు, సిబ్బంది, అపోలో వైద్యులు పవన్కుమార్రెడ్డి, అనురాగ్రెడ్డి, పీహెచ్సీ వైద్యులు శ్రీవాణి, ఆముర్వేద వైద్యులు స్వరూప తదితరులు పాల్గొన్నారు. దాడి చేసింది పులినా.. చిరుతా? ఆత్మకూరురూరల్: కొత్తపల్లె మండలం చదరం పెంట చెంచు గూడెం పొలాల సమీపంలో సోమవారం చెంచు రైతు అంకన్నపై దాడి చేసిన వన్యమృగం పెద్ద పులినా.. చిరుతనా అనే అనుమానం వ్యక్తమవుతోంది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు మంగళవారం సంఘటన ప్రాంతానికి చేరుకుని వన్య మృగం సంచారంపై ఆరా తీశారు. అయితే ఆ ప్రాంతంలో గడ్డి ఏపుగా పెరగడం, వర్షం కురవడంతో పాద ముద్రలు గుర్తించడం కష్టంగా మారింది. అంకన్నపై పెద్దపులి దాడి చేస్తే పంజా వేటుకు శరీర భాగంలో కండ మొత్తం ఊడి కింద పడే అవకాశం ఉండేది. అతని శరీరంపై గోకుడు గాయాలు, చిన్నపాటి గీతలు మాత్రమే కనిపించడం వారి అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. అంకన్న చేయికి తగిలిన గాయాలను బట్టి చిరుతా లేదా అడవి పంది ఉండవచ్చునేమోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే ఆ యువకుడిపై దాడి చేసింది ఏదో ఒక అడవి జంతువే కాబట్టి, అటవీ చట్టం ప్రకారం తగిన పరిహారం ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించండి కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి పి.రామంజనేయులు కంపెనీల ప్రతినిధులకు సూచించారు. 2025–26లో 550 హెక్టార్లలో ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించాలనేది లక్ష్యమని, ఇప్పటి వరకు 86 హెక్టార్లలో ప్లాంటేషన్ పూర్తయిందన్నారు. కలెక్టరేట్లోని జిల్లా ఉద్యాన శాఖ కార్యాలయంలో మంగళవారం ఆయన ఆయిల్పామ్ కంపెనీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 13 మండలాల్లో ఆయిల్పామ్ సాగుకు అవకాశం ఉందని, సెప్టెంబర్ 15 వరకు మెగా ప్లాంటేషన్ డ్రైవ్ కొనసాగుతుందని, ఆలోపు కనీస లక్ష్యంలో 50 శాతం ప్లాంటేషన్ పూర్తి కావాలన్నారు. హెక్టారుకు ప్లాంటేషన్కు రూ.29 వేలు, నిర్వహణకు రూ.5250, అంతరపంటల సాగుకు రూ.5250 సబ్సిడీ వస్తుందన్నారు. సమావేశంలో సాంకేతిక ఉద్యాన అధికారి అనూష తదితరులు పాల్గొన్నారు. -
కౌలు రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం అంటూ గొప్పలు చెప్పిన కూటమి ప్రభుత్వం క్రాప్ కల్టివేటర్ రైట్ (సీసీఆర్) కార్డుల పంపిణీలోనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా సీసీఆర్ కార్డులు దరఖాస్తు దశను కూడా దాటలేదు.
గత ప్రభుత్వానికి రుణపడి ఉంటా నాకు సెంటు కూడా భూమి లేదు. పదేళ్లుగా పొలం కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నా. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పాలనలో సాధారణ రైతులతో పాటు ఏటా రూ. 13,500 చొప్పున రెండు సార్లు రూ. 27,000 వేలు రైతు భరోసా, రూ. 9 వేలు ఉచిత పంటల బీమా కూడా జమ అయ్యాయి. గత సంవత్సరం నుంచి ఏటా రెండెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటూ కౌలు కార్డు కోసం అధికారుల చుట్టు ఎన్నిసార్లు తిరిగినా స్పందించడం లేదు. – ఓబన్న, క్రిష్టిపాడు ఇప్పుడు ఇచ్చినా ఉపయోగం లేదు నేను 5 ఎకరాల మేర పొలం కౌలుకు తీసుకుని పూలతోటలు, వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నాను. గత నాలుగు సంవత్సరాలుగా జూన్ నెలలోనే కౌలు కార్డులు ఇవ్వడంతో బ్యాంకులో పంట రుణంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రాయితీలు పొందాను. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు కౌలు కార్డు ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చినా ఏం ప్రయోజనముండదు. సరిగ్గా సీజన్లో అవసరమైన రుణ పరపతి లభించక అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోంది. – ఖాదర్ బాషా, చాగల్రమరి ఆళ్లగడ్డ సమీపంలో పంటలు సాగు చేస్తున్న కౌలు రైతులుఆళ్లగడ్డ: ఖరీఫ్ ప్రారంభానికి ముందే (ఏప్రిల్, మే లోపే) సీసీఆర్సీ కార్డులు పంపిణీ చేయాల్సి ఉండగా ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల సమన్వయ లోపంతో జిల్లాలో ఐదు శాతం కూడా పంపిణీ జరగలేదు. ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి భరోసాకు ఈ కార్డే అత్యంత ఆధారం. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ కార్డుల జారీలో కౌలు దారుల గుర్తింపు ప్రక్రియ ఆందోళనకు గురి చేస్తోంది. సుమారు 4 నెలల నుంచి ఈ తంతును అధికారులు సాగదీస్తుండగా.. మరో నెల లోపు సాగు పనులు పూర్తిగా ముగుస్తాయి. సీజన్ దాటాక కార్డులు ఇచ్చినా ప్రయోజనం ఏమిటీ.. అని కౌలు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు కార్డు అందక.. ఇటు రుణం చేతికి చిక్కక ‘పాత కఽథే’ఈ ఖరీఫ్లో పునరావృతమవనుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఏరువాక (పంటల సీజన్) మొదలవ్వగానే కౌలు రైతుల గుర్తింపు కార్డుల పంపిణీకి సంబంధించి రెవెన్యూ, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేయాలి. కౌలు కౌలు రైతులను గుర్తించడంతో పాటు పొలం యజమానులను ఒప్పించి పొలాలు కౌలుకు ఇచ్చినట్లు ఒప్పంద పత్రం రాయించి ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం వారికి కార్డులు మంజూరు ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. కానీ అలాంటి ప్రక్రియ ఎక్కడా జరగడం లేదు. ఈ వ్యవసాయ సంవత్సరానికి సంబంధించి జిల్లాలో కౌలు రైతులు 50,000 (అంచనా) కాగా సుమారు 45 వేల మంది కౌలు కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పటి వరకు 5,935 మందికి మాత్రమే పంపిణీ చేసినట్లు సమాచారం. ఇందులో కూడా సగానికి పైగా టీడీపీ నాయకులు తమ బినామీలకు కౌలుకు ఇచ్చినట్లు కార్డులు రాయించినట్లు చర్చించుకుంటున్నారు. అంతటా ‘పచ్చ’పెత్తనం ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే కౌలు రైతులకు పెట్టుబడి సాయంగా రూ. 20 వేలు చొప్పున అందజేయడంతో పాటు అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ ఊరూరా తిరిగి ఊదరగొట్టారు. అయితే ఈ సాయాన్ని కాజేసేందుకు ‘పచ్చ’తమ్ముళ్లు శతవిధాలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అర్హులకు కార్డులు ఇవ్వకుండా వ్యవసాయాధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. మరికొందరు తమ్ముళ్లు ఇందులో ‘మా కేంటి’ అంటూ బేరం పెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్నదాత సుఖీభవ కింద రూ. 20 వేలతో పాటు ఇతర సంక్షేమ పథకాలు కాజేయడమే లక్ష్యంగా సీసీఆర్సీలను దర్జాగా పొందేందుకు యత్నిస్తున్నారు. వ్యవసాయమంటే ఏంటో తెలియని అనేక మంది పచ్చ నేతలు తమ ఇళ్లలో పనిచేసేవారు, బంధువులు, అనుచరుల పేరుతో కార్డులు పొందినట్లు గ్రామాల్లో చర్చించుకుంటున్నారు. ఇవి ప్రయోజనాలు.. ● సీసీఆర్ కార్డుల వల్ల బ్యాంకుల్లో 7 శాతం వడ్డీతో రుణాలు పొందవచ్చు. ● క్రమం తప్పకుండా రుణం చెల్లిస్తే సున్నా వడ్డీ వర్తిస్తుంది. ● పంట నష్టం జరిగినప్పుడు బీమా, ఇన్ఫుట్ సబ్సిడీ పొందుతారు. ● ఎరువులు, విత్తనాలపై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు పొందవచ్చు. ● కొన్ని రకాల వ్యవసాయ పరికరాలను సబ్సిడీపై తీసుకోవచ్చు. కౌలు రైతులకు తప్పని తిప్పలు పంట సాగు హక్కు పత్రాల అందజేతపై ప్రభుత్వ నిర్లక్ష్యం ఖరీఫ్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా అందని సీసీఆర్ కార్డులు కౌలు రైతుల సంక్షేమానికి గత ప్రభుత్వం పెద్దపీటజిల్లాలో కౌలు రైతులు 50,000 (అంచనా) కౌలు కార్డుల పంపిణీ లక్ష్యం 45,000 ఇప్పటి వరకు పంపిణీ 5,935 -
కూటమి ప్రభుత్వంలో మాకు విలువ ఎక్కడిది?
కర్నూలు(అర్బన్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మండలాల్లో తమకు ఎలాంటి విలువ లేకుండా పోయిందని జెడ్పీటీసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం కూటమి నేతలు చెప్పిందే వేదంగా మండల స్థాయి అధికారులు విధులు నిర్వహిస్తున్నార ని వాపోతున్నారు. తమకు విలువ లేని సమయంలో ప్రభుత్వం ఇస్తున్న శిక్షణ తీసుకున్నా, ఉపయోగం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. అందుకే శిక్షణకు హాజరు కాలేకపోతున్నామని చెబుతున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు స్థానిక జిల్లా పరిషత్లోని డీపీఆర్సీ భవనంలో ‘మార్పు ద్వారా విజేతలు – సాధికారతతో సుపరిపాలన సాధ్యం’ అనే అంశంపై ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మహిళా జెడ్పీటీసీలకు శిక్షణా తరగతులను ప్రారంభించారు. మొదటి రోజైన మంగళవారం ఉదయం ప్రారంభమైన ఈ శిక్షణా తరగతులకు జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డితో ముగ్గురు మహిళా జెడ్పీటీసీలు (పగిడ్యాల నుంచి పి దివ్య, కృష్ణగిరి నుంచి కేఈ సుభాషిణి, నందికొట్కూరు నుంచి షేక్ కలీమున్సీసా) మాత్రమే హాజరయ్యారు. జెడ్పీ చైర్మన్తో కలిపి మొత్తం 53 మంది జెడ్పీటీసీలు ఉండగా, ఇందులో 27 మంది మహిళలు ఉన్నారు. వీరిలో తొలి రోజు శిక్షణకు కేవలం ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. ప్రభుత్వ నిబంధనల మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో శిక్షణను కొనసాగించాల్సి ఉన్నందున .. జ్యోతి ప్రజ్వలన చేసి డా.బీఆర్ అంబేద్కర్, మహాత్మాగాంధీ చిత్ర పటాలకు పూలమాలలు వేసి శిక్షణను ‘మమ’ అనిపించారు. హాజరైన ముగ్గురు జెడ్పీటీసీలకు జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి, డీపీఆర్సీ కోఆర్డినేటర్ మంజులావాణి, రిసోర్స్ పర్సన్స్ కే రవికిశోర్, జీ నగేష్, టీ రాముడు పలు విషయాలపై కొద్ది సేపు అవగాహన కల్పించి శిక్షణా తరగతులను ముగించారు. మూడు రోజులు శిక్షణ తీసుకున్నా ఫలితం శూన్యం మహిళా జెడ్పీటీసీల ఆందోళన 27 మంది మహిళా జెడ్పీటీసీలలో ముగ్గురే హాజరు అందని గౌరవ వేతనాలపైనా పెదవి విరుపు ... నిధులు లేకపోవడం, విధుల నిర్వహణలో అడ్డంకులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం జెడ్పీటీసీలకు ఇచ్చే గౌరవ వేతనాలను కూడా పెండింగ్లో పెట్టడం వల్ల కూడా జెడ్పీటీసీలు శిక్షణా తరగతులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనట్లు తెలుస్తోంది. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 19 నెలలుగా జెడ్పీటీసీలకు గౌరవ వేతనాలను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఒక్కో జెడ్పీటీసీకి నెలకు రూ.6 వేల ప్రకారం 19 నెలలకు రూ.1.14 లక్షలను ప్రభుత్వం బకాయి పడింది. ఈ నేపథ్యంలోనే జెడ్పీ చైర్మన్ను మినహాయించి మిగిలిన 52 మంది జెడ్పీటీసీలకు ఈ నెలతో కలిసి రూ.59.28 లక్షలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అలాగే మరో ఏడాది మాత్రమే పదవీ కాలం ఉన్నందున ఇప్పుడు శిక్షణ తీసుకొని ఉపయోగమేంటనే భావనను కూడా పలువురు జెడ్పీటీసీలు వ్యక్తం చేస్తున్నారు. -
ఏమి చేశారని సుపరిపాలన
ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ఏమి చేసిందని సుపరిపాలన అంటూ అధికార పార్టీ నేతలు ఊర్లలో పర్యటిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రశ్నించారు. అధికారం కోసం ప్రజలను మోసం చేసిన చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితమంతా అబద్ధాలేనని విమర్శించారు. ‘బాబూ ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కేంద్రం బండిఆత్మకూరులో శిల్పా చక్రపాణి పర్యటించారు. సీఎంగా చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు వివరించారు. హామీలను ఎగ్గొట్టడంలో బాబు ఆరితేరారన్నారు. – బండిఆత్మకూరు సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి -
పింఛన్ అందక భిక్షాటన
పేదల సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు మాత్రం పల్లెల్లో పింఛన్లు కూడా అర్హులందరికీ ఇవ్వలేని స్థితిలో ఉంది. ప్రభుత్వం అలసత్వం.. అధికారుల నిర్లక్ష్యంతో ఎంతో మంది అభాగ్యులకు పింఛన్ అందడం లేదు. వారిలో 80 ఏళ్ల వయస్సు పైబడిన ఈ వృద్ధురాలు ఒకరు. కుటుంబీకులందరినీ కోల్పోయి అనాథగా మిగిలింది. నిలువ నీడ లేక ఖాళీ స్థలంలో తాటాకులతో ఇరుగు పొరుగు వారు దయతలచి నిర్మించి ఇచ్చిన గుడిసెలో ప్రస్తుతం తల దాచుకుంటోంది. పూట గడిచేందుకు భిక్షాటన చేస్తోంది. మండల కేంద్రమైన చాగలమర్రిలోని ఎస్టీ కాలనీకి చెందిన గాజుల చిన్న గంగమ్మకు అదే కాలనీకి చెందిన సుంకన్నతో వివాహమైంది. వీరికి సంతానం లేక పోవడం, అనారోగ్యంతో భర్త మరణించడంతో ఆమె సంజామల మండలం ఆకుమల్ల గ్రామంలో నివాసం ఉంటున్న సోదరి గంగమ్మ ఇంటిలో తలదాచుకుంది. ఆ సమయంలో ఒకే ఇంటిలో ఉన్న గంగమ్మకు పింఛన్ మంజూరు కావడంతో చిన్న గంగమ్మకు ఇవ్వలేదు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం గంగమ్మ మృతి చెందడంతో చిన్న గంగమ్మ తిరిగి చాగలమర్రి గ్రామానికి వచ్చి కాలనీలో బంధువుల ఇళ్ల వద్ద తల దాచుకుంటుంది. ఈ మేరకు రేషన్కార్డు, ఆధార్కార్డు ఉన్నా ఆమె సోదరికి గతంలో గంగమ్మకు పింఛన్ వస్తుందని ఇప్పటికీ అనాథ వృద్ధురాలికి పింఛన్ మంజూరు చేయలేదు. పలుమార్లు సచివాలయం, ఎంపీడీఓ కార్యాలయం చూట్టూ తిరిగినా ఆమె సమస్యను ఆలకించి పరిష్కరించిన అధికారి లేరు. పూట గడవక చివరకు భిక్షాటన చేస్తూ కాలం గడుపుతోంది. ఇప్పటికై న చిన్న గంగమ్మకు వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేసి జిల్లా కలెక్టరు ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. – చాగలమర్రి -
ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి
● మొదటి సారిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన పెన్షనర్లు ● కమిటేషన్ పేరుతో దోపిడీ చేస్తుండటంపై రగిలిపోతున్న పెన్షనర్లు ● ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి కొమ్ముకాస్తుండటం పట్ల ఆందోళన ● రూ.20వేల లోపు వేతనాల అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అందని సంక్షేమ పథకాలు ● ఐదు డీఏలు పెండింగ్, పీఆర్సీ లేదు, ఐఆర్ ఊసే కరువు బయటకు చెప్పుకోలేక.. మోసాన్ని భరించలేక! కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కక్కలేక, మింగలేక సతమతం అవుతున్నారు. ఉద్యోగుల పక్షాన పోరాటం చేసి ఆర్థిక ప్రయోజనాలు సాధించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు కూటమి ప్రభుత్వ పెద్దల కు కొమ్ముకాస్తుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పెన్షనర్లు (విశ్రాంత ఉద్యోగులు) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పటై 13 నెలలు గడుస్తోంది. అయితే ఇప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్ల పెండింగ్ బకాయిలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల పక్షాన ఏపీఎన్జీఓ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పోరాడాల్సి ఉంది. అయితే సంఘాలు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతుండటం పట్ల ఉద్యోగుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిమాండ్లను సాధించుకోవడంలో పెన్షనర్లను చూసి నేర్చుకోవాలని ఆయా సంఘాల నేతలకు ఉద్యోగులు సూచిస్తుండటం గమనార్హం. కమిటేషన్ పేరుతో దోపిడీ కమిటేషన్ పేరుతో కూటమి ప్రభుత్వం పెన్షనర్లను దోపిడీ చేస్తోంది. ఉద్యోగ విరమణ తర్వాత రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు కమిటేషన్ తీసుకుంటారు. దీనిని అసలు, వడ్డీ సహా 15 ఏళ్లలో రికవరీ చేయాల్సి ఉంది. 11 ఏళ్ల 3 నెలల్లో ఈ మొత్తం రికవరీ పూర్తవుతుంది. అయితే 15 ఏళ్ల పాటు రికవరీ చేస్తుండటం పట్ల ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై కొన్ని నెలల క్రితం సుప్రీం కోర్టు కమిటేషన్ రికవరీ 11 ఏళ్ల 3 నెలలకే పూర్తి అవుతున్నందున 15 ఏళ్లు రికవరీ చేయరాదని ఆదేశాలు ఇచ్చింది. సుప్రీం కోర్డు ఆదేశాల తర్వాత ఐదారు నెలల పాటు కమిటేషన్ రికవరీని నిలుపుదల చేసింది. రెండు నెలలుగా ప్రతి ఉద్యోగి నుంచి స్థాయిని బట్టి రూ.4500 నుంచి రూ.8 వేల వరకు మళ్లీ రికవరీ చేస్తుండటం పట్ల పెన్షనర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. అరకొర బకాయిలే విడుదల కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదవుతున్నా ఉద్యోగుల బకాయిలకు ఒకసారి రూ.1300 కోట్లు, మరోసారి రూ.7200 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఇప్పటికీ దాదాపు రాష్ట్రం మొత్తం మీద బకాయిలు రూ.28 వేల కోట్ల వరకు ఉండిపోయాయి. ఇప్పటి వరకు విడుదల చేసింది మొత్తం బకాయిలో 10 శాతం మాత్రమే. ఈ మాత్రం దానికే ఉద్యోగ సంఘాల నేతలు మహదానంద పడిపోతుండటం పట్ల ఉద్యోగుల్లో సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు 27 శాతం మధ్యంతర భృతి చెల్లించారు. ఇవీ సమస్యలు.. కూటమి ప్రభుత్వం ఏర్పటై 13 నెలలు గడిచినప్పటికీ ఒక్క డీఏ కూడా చెల్లించని పరిస్థితి. 2024 మార్చి నాటికి ఒక్క డీఏ కూడా పెండింగ్లో లేదు. ప్రస్తుతం ఐదు డీఏలు పెండింగ్లో ఉండిపోయాయి. ఇప్పటి వరకు మధ్యంతర భృతి(ఐఆర్) ఊసే లేదు. 12వ పీఆర్సీ జాడ లేకుండా పోయింది. ఉద్యోగులు మరణించినప్పుడు మట్టి ఖర్చుల కింద రూ.25 వేలు చెల్లిస్తారు. కూటమి ప్రభుత్వం ఈ సాంప్రదాయాన్ని పూర్తిగా పక్కన పెట్టినట్లు స్పష్టమవుతోంది. ఏపీజీఎల్ఐ చెల్లింపులు నిలిచిపోయాయి. జీపీఎఫ్, పీఎఫ్ ఊసే లేకుండా పోయింది. సరెండర్ లీవ్ బకాయిలు భారీగా పెండింగ్లో ఉండిపోయాయి. కనీసం మెడికల్ రీయింబర్స్మెంటు బిల్లులు కూడా చెల్లించని పరిస్థితి. రూ.20 వేల లోపు వేతనాలు తీసుకుంటున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామనే హామీ ఇచ్చి విస్మరించారు. 2024 జాన్ తర్వాత పదవీ విరమణ పొందిన వారికి పెన్షన్ మినహా ఇతరత్రా ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. 10 నెలల గ్రాట్యూటీ, కమిటేషన్ తదితరాలన్నీ పెండింగ్లో ఉన్నాయి. పదవీ విరమణ పొందిన ఒక్కో ఉద్యోగికి సగటున రూ.40 లక్షల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. -
8 నెలలుగా ఎదురుచూపులే..
ఉపాధ్యాయుడుగా కర్నూలు మండలం అంబేడ్కర్ పీఎస్హెచ్గా గత ఏడాది అక్టోబర్లో పదవీ విరమణ పొందాను. ఎనిమిది నెలలు గడచిపోయినా పూర్తి స్థాయిలో బెనిఫిట్స్ రాలేదు. ఇప్పటికీ గ్రాట్యూటీ రూ.16 లక్షలు పెండింగ్లో ఉంది. హాఫ్ పే లీవ్స్ బకాయిలు రూ.9 లక్షలు ఇవ్వాలి. వీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. పదవీ విరమణ పొందిన ఉద్యోగులను ఇలా వేధించడం సరికాదు. – జయరాజు, విశ్రాంత ఉపాధ్యాయుడు, మాజీ జనరల్ సెక్రటరీ, యూటీఎఫ్ -
ఆదాయ లక్ష్య సాధనపై దృష్టి పెట్టండి
కర్నూలు: జిల్లా రవాణా శాఖకు కేటాయించిన ఆదాయ లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలని రీజనల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి జిల్లా రవాణా శాఖ అధికారులకు సూచించారు. త్రైమాసిక తనిఖీలో భా గంగా మంగళవారం ఆమె జిల్లా పర్యటనకు వచ్చారు. కర్నూలు మండలం తాండ్రపాడు గ్రామ శివారులో ఉన్న ఉప కమిషనర్ కార్యాలయానికి చేరుకోగానే డీటీసీ ఎస్.శాంతకుమారి, ఆర్టీఓ ఎల్.భరత్ చవాన్, ఏఓ వెంకట కుమార్ తది తరులు ఆమెకు పూల బొకే ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలో అధికారులతో సమావేశమై రవాణా శాఖ పురోగతిపై చర్చించారు. రికార్డులను పరిశీలించి లక్ష్యసాధనకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అడిగి తెలు సుకున్నారు. పన్ను వసూళ్లు, వాహనాల అమ్మకాలు, ఎన్ఫోర్స్మెంట్ తదతరా ల ద్వారా ఎంత ఆదాయం సమకూరింది, త్రైమాసిక పన్నులు సక్రమంగా వసూలయ్యాయా? పన్నులు చెల్లించకుండా తిప్పుతున్న వాహనదారులకు ఎంతమందికి నోటీసులు జారీ చేశారు, ఎన్ని వాహనాలు సీజ్ చేశారు తదితర అంశాలపై కూలంకుశంగా చర్చించారు. అలాగే రోడ్డు భద్రతపై శాఖాపరంగా తీసుకుంటు న్న చర్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఎంవీఐలు రవీంద్ర కుమార్, సుధాక ర్రెడ్డి, ఏఎంవీఐలు బాబు కిషోర్, గణేష్ బాబు సమావేశంలో పాల్గొన్నారు. నేడు నంద్యాల... జిల్లాలో ఐదు రవాణా శాఖ కార్యాలయాలు ఉండగా.. మొదటి రోజు కర్నూలు, ఆదోని కార్యాలయాల్లో ఆమె తనిఖీలు పూర్తి చేశారు. నంద్యాలలో ఆర్టీఓ కార్యాలయం,డోన్, ఆత్మకూరులో ఎంవీఐ కార్యాలయాలు ఉ న్నాయి. బుధవారం ఆయా కార్యాలయాల్లో కూడా తనిఖీలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. -
కోలుకోలేక రైతు మృతి
చిప్పగిరి: పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయ త్నించిన రైతు చికిత్స పొందుతూ కోలుకోలేక మంగళవారం మృతిచెందాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని దౌల్తాపురం గ్రామానికి చెందిన కావలి రామాంజనేయలు (55)కు భార్య పుల్లమ్మ, కుమారుడు మహేష్తో పాటు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పిల్లల చదువుల కోసం చేసిన అప్పులు తీర్చేందుకు రామాంజనేయులు కుటుంబ సభ్యులకు తెలియకుండా తమకున్న 15 ఎకరాల్లో మూడెకరాలను చిప్పగిరికి చెందిన వారికి రూ.15 లక్షలకు విక్రయ అగ్రిమెంటు రాసి ఇచ్చి అడ్వాన్సుగా రూ.5 లక్షలు తీసుకున్నాడు. పొలం అమ్మడం కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడం, క్రయవిక్రయాల్లో తేడాలు రావడంతో మనస్థాపానికి గురై ఆదివారం పొలంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా సమాధానం రాకపోవడంతో పొలానికి వెళ్లి చూడగా పురుగు మందు తాగినట్లు గుర్తించి గుంతకల్లు ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా కోలుకోలేక మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. బాధిత కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఏపీ శ్రీనివాసులు తెలిపారు. కూతురిని వేధిస్తున్నారని కత్తితో దాడి నంద్యాల: కూతురి వెంట పడుతూ వేధిస్తున్నారని ఇద్దరు మైనర్ బాలురుపై తండ్రి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన నంద్యాలలో మంగళవారం చోటు చేసుకుంది. టూటౌన్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా.. పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీకి చెందిన మైనర్ బాలికను విశ్వనగర్కు చెందిన ఇద్దరు మైనర్ బాలురులు గత కొన్ని రోజులుగా వేధిస్తున్నారు. బాలిక వెంట పడటం, తరచూ ఇంటి వద్ద తిరుగుతూ అల్లరి పట్టిస్తుండటంతో విషయాన్ని కూతురు తన తండ్రికి తెలిపింది. గత కొన్ని రోజులుగా వారి ఆకతాయి చేష్టలను గమనిస్తూ వస్తున్న తండ్రి మంగళవారం సాయంత్రం తన ఇంటి ముందు తిరుగుతున్న ఇద్దరు మైనర్ బాలురులపై కత్తితో దాడి చేశాడు. ఘటనలో ఇద్దరు మైనర్ బాలురులకు తీవ్ర గాయాలయ్యాయి. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
డ్రిప్ పరికరాలు సత్వరం సరఫరా చేయాలి
కర్నూలు(అగ్రికల్చర్): రైతులకు సకాలంలో సూక్ష్మసేద్యం పరికరాలు సరఫరా చేయడంతో పాటు వాటిని వెంటనే అమర్చాలని ఏపీఎంఐపీ ప్రాజెక్టు డైరెక్టర్ కె.శ్రీనివాసులు డ్రిప్ కంపెనీల ప్రతినిధులకు సూచించారు. మంగళవారం కర్నూలులోని ఉద్యానభవన్లో డ్రిప్ కంపెనీల జిల్లా కో–ఆర్డినేటర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025–26లో 7వేల హెక్టార్లకు డ్రిప్ సదుపాయం కల్పించాలనేది లక్ష్యమని, ఇప్పటి వరకు 591 హెక్టార్లకు డ్రిప్ మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులు ఇచ్చామన్నారు. కర్నూలు, కోడుమూరు, పాణ్యం నియోజక వర్గాలకు ఫిబ్రవరిలోపు 2500 హెక్టార్లకు డ్రిప్ పరికరాలు అమర్చాలని ఆదేశించారు. రైతులకు నాణ్యమైన పరికరాలు, మెటీరియల్ సరఫరా చేయాలని సూచించారు. ఈ ఏడాది ఐదు ఎకరాల్లోపు ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీతో డ్రిప్ మంజూరు చేస్తామన్నారు. ఏపీఎంఐపీ అదనపు పీడీ పిరోజ్ఖాన్ మాట్లాడుతూ అన్ని కంపెనీలు నాణ్యమైన పరికరాలు ఇచ్చి సహకరించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఉద్యాన అధికారులు మదన్మోహన్గౌడు, నరేష్కుమార్రెడ్డి, ఎంఐ ఇంజనీర్ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చాతుర్మాస దీక్షలో పీఠాధిపతి
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు 13వ చాతుర్మాస దీక్ష స్వీకరించారు. మంగళవారం ఉదయం పూజామందిరంలో వేద మంత్రోచ్ఛారణలు, విశిష్ట పూజోత్సవాలు మధ్య దీక్ష చేపట్టారు. ముందుగా రాఘవేంద్రుల మూల బృందావనంతో దీక్ష పదార్థాలకు పూజలు గావించారు. రాములోరి సంస్థాన పూజ చేపట్టి శాస్త్రోక్తంగా దీక్షబూనారు. మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్ ఎస్.కె.శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి, సురేష్ కోన్నాపూర్ దీక్ష క్రతువులో పాల్గొన్నారు. 49 రోజుల పాటు స్వామిజీ దీక్షలో కొనసాగనున్నారు. ఆనవాయితీలో భాగంగా దీక్ష సమయంలో నియమావళి ప్రకారం ఆహారం, ఫలాలు, కూరగాయలు స్వీకరిస్తారు. -
ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేయండి
కౌతాళం: ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణ మాస ఉత్సవాల ప్రారంభం నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదోని సబ్కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. ఈ నెల 25 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా ఆయన మంగళవారం ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజుతో కలిసి ఆలయ ఆవరణలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సబ్కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 25 నుంచి ఆగస్టు 23వ తేదీ వరకు ఉత్సవాలు ఉంటాయని, అన్ని శాఖల అధికారులతో పాటు గ్రామస్తులు, స్వచ్ఛంద సంస్థల వారు సహాయ సహకారం అందించాలని కోరారు. ఉరుకుందకు వచ్చే నాలుగు వైపులా రోడ్లకు మరమ్మతులు చేశారా? అని ఆర్అండ్బీ ఏఈ సాయిసురేష్ను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య సమస్య లేకుండా చూడాలని డీసీని ఆదేశించారు. నూతనంగా నిర్మిస్తున్న కళ్యాణ కట్టను పరిశీలించి అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను వెంటనే మార్చాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. తాగునీటి ఏర్పాట్లపై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నాగమల్లయ్యను అడిగి తెలుసుకున్నారు. సీఐ అశోక్కుమార్, డిప్యూటీ కమిషనర్తో కలిసి నాలుగు వైపులా పార్కింగ్ స్థలాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. భక్తుల స్నానాల ఘాట్లను పరిశీలించారు. క్యూలైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. తహసీల్దారు రజినీకాంత్రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకుడు ఈరప్పస్వామి, ఉప ప్రధాన అర్చకుడు మహదేవస్వామి, ముఖ్య అర్చకులు, ఆయాశాఖల అధికారులు, గ్రామపెద్దలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
మోదీ భజన తప్ప ప్రజా సంక్షేమం ఏదీ?
● ప్రభుత్వానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రశ్న నంద్యాల(న్యూటౌన్): రాష్ట్రంలో అధికార కూటమి ప్రభుత్వం ప్రధాని నరేంద్రమోదీకి భజన చేస్తూ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు మండిపడ్డారు. నంద్యాల పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం.. డోన్లో జరిగే సీపీఐ నంద్యాల జిల్లా రెండవ మహాసభ పోస్టర్లను ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయుడు, రామాంజనేయులు, సుంకన్న, బాబాఫకృద్దీన్, ప్రసాద్, రాధాకృష్ణ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఈనెల 30, 31 తేదీల్లో డోన్లో జరిగే సీపీఐ మహాసభలను జయప్రదం చేయాలన్నారు. ఈనెల 24, 25వ తేదీల్లో వివిధ దేశాల నుంచి కమ్యూనిస్టు నాయకులతో విజయవాడలో అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కమ్యూనిస్టులు ప్రత్యామ్నాయంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించి ఇప్పుడు అవే స్మార్ట్ మీటర్లను అదానీ కాంట్రాక్టర్లతో ప్రజలకు అంటగట్టేందుకు చూస్తున్నారని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులపై స్పష్టత లేదని, సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. అలగనూరు రిజర్వాయర్కు నిధులను ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. సీపీఐ నాయకులు శ్రీనివాసులు, నాగరాముడు, సోమన్న, తదితరులు పాల్గొన్నారు. -
షూటింగ్ సందడి
బేతంచెర్ల: మండల పరిధిలోని కనుమ కింది కొట్టాల గ్రామ సమీపాన ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన బిళ్ల సర్గం గుహల వద్ద మంగళవారం సినిమా షూటింగ్తో సందడి నెలకొంది. హైదరాబాద్కు చెందిన సినిమా బృందం సత్యదేవ్ హీరోగా తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంఽధించి చిత్రీకరణ జరుపుతోంది. ఇందుకోసం వేసిన సెట్టింగ్లు, తాత్కాలిక గుడిసెలు, నటీనటుల మేకప్, సినీ సరంజామా, ఆర్టిస్టులు, పర్యాటకులతో సందడి నెలకొంది. గత వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బిళ్ల సర్గం గుహల అభివృద్ధికి పర్యాటక శాఖ తరఫున రూ.2.50 కోట్ల నిధులు మంజూరు చేయించారు. దీంతో గుహలలో ఫుట్పాత్ వే తో పాటు లైటింగ్, రెస్టారెంట్, టాయిలెట్ బ్లాక్స్ ఏర్పాటు చేశారు. పనులు పూర్తయిన తర్వాత 2024 జనవరి 29 నుంచి పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చారు. దీంతో పర్యాటకుల సంఖ్య పెరగడమే గాకుండా సినిమా షూటింగ్లకు సైతం అనుకూలంగా మారింది. గతేడాది రాచరికం సినిమా, ప్రస్తుతం రెండో సినిమా షూటింగ్ జరుగుతుండటంతో బిళ్ల సర్గం గుహల వద్ద సందడి నెలకొంది. -
కౌలు రైతులకు అండగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం
రైతులతో పాటు కౌలు దారులకు సైతం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది. భూ యజమానుల హక్కులకు ఏమాత్రం భంగం కలుగకుండా కేవలం 11 నెలల కాలానికి సాగు ఒప్పందం చేస్తూ 2011 కౌలు చట్టాన్ని సవరించింది. ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి ఒకసారి జారీ చేసిన కార్డును మళ్లీ భూ యజమాని అంగీకరం మేరకు రెన్యువల్ చేసుకునే వీలును కల్పించారు. భూ యజమానుల్లో అపోహలు తొలగించడంతో జిల్లాలో సీసీఆర్సీ కార్డుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అసలు రైతుల మాదిరిగానే కౌలు రైతులకు పంట రుణాలు, రాయితీ విత్తనాలు, క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్ఫుట్ సబ్సిడీ వంటి పరిహారం అందించి అండగా నలించింది. -
తపాలా శాఖలో బీమా ఏజెంటు పోస్టులు
కర్నూలు (న్యూటౌన్): తపాలా శాఖలో భాగమైన తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా డైరెక్ట్ ఏజెంట్లుగా కర్నూలు డివిజన్లో పనిచేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తపాలా శాఖ సూపరింటెండెంట్ జి.జనార్ధన్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపు కొండారెడ్డి బురుజు వద్ద తపాలా శాఖ సూపరింటెండెంట్ కార్యాలయానికి వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. 10వ తరగతి/ఆపై విద్యార్హత ఉండాలని, ఎంపికై న వారు సెక్యూరిటీ డిపాజిట్గా రూ.5 వేలు ఎన్ఎస్సీ రూపంలో చెల్లిస్తే తిరిగి వాపసు ఇస్తారని స్పష్టం చేశారు. ఎంపికై న పాలసీకు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం కమీషన్ చెల్లిస్తారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు డెవలప్మెంట్ ఆఫీసర్ ఫోన్ నంబర్ 70130 29312ను కార్యాలయ పని వేళల్లో సంప్రదించాలని సూచించారు. యాస్పిరేషనల్ బ్లాక్లకు అవార్డులు కర్నూలు(సెంట్రల్): సంపూర్ణ స్థాయిలో అభివృద్ధి సాధించిన యాస్పిరేషనల్ బ్లాక్లకు అవార్డులు అందించనున్నట్లు నీతి అయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం చెప్పారు. ఆయన మంగళవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యాస్పిరేషనల్ బ్లాక్ల అభివృద్ధిపై కలెక్టర్లతో సమీక్షించారు. జూలై 28 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు జరుగనున్న సంపూర్ణత అభియాన్ సమ్మార్ సమా రోహ్ గురించి వివరించారు. నిర్ధేశించిన ఆరు సూచికలు సాధించిన జిల్లాలకు అవార్డులు, ప్రశంసా పత్రాలు అందించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో గవర్నర్, ప్రజాప్రతినిధుల సమ క్షంలో అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని వి వరించారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ రంజిత్బాషా, సీపీఓ హిమప్రభాకరరాజు పాల్గొన్నారు. కొత్త పింఛన్లు వెంటనే మంజూరు చేయాలి కర్నూలు(సెంట్రల్): అర్హులైన వారికి వెంటనే కొత్త పింఛన్లు మంజూరుచేయాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేంద్ర, అబ్దుల్లా డిమాండ్ చేశారు. వారు సోమవారం డీవైఎఫ్ఐ కార్యాలయంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు గడిచినా ఇప్పటివరకు ఒక్కటి కూడా కొత్త పింఛన్ మంజూరు చేయలేదన్నారు. ఫలితంగా అర్హులైన వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే పోరాటాలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రకాష్, విశ్వనాథ్, గోవర్ధన్, సాయి, కిరణ్, రఫీ పాల్గొన్నారు.