breaking news
Nandyala
-
బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే చర్యలు
నంద్యాల (వ్యవసాయం): బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే చర్యలు తప్పవని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి తంగమని అన్నారు. మంగళవారం ఎస్పీజీ పాఠశాల ఆవరణలోని బాలికల జూనియర్ కళాశాలలో న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. బాల్యవివాహాలు సమాజానికి శాపమని, వీటి వలన బాలికల ఆరోగ్యం, విద్య, వ్యక్తిగత స్వాతంత్య్రంపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. అదే విధంగా విద్యా ర్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. మైనర్లు మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే రోడ్డు ప్రమాదాలు, ప్రాణనష్టం, ఆర్థిక నష్టాలపై అవగాహన కల్పించారు. మొక్కలు నాటి వాతావరణం కాలుష్యం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ దివాకర్ న్యాయవాది దాసరి రవి, సామాజికవేత్త రవికుమార్, మండల లీగల్ సెల్ సిబ్బంది భాస్కర్, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ హయాంలో ఇలా..
కోవెలకుంట్ల: పొగాకు సాగు రెండేళ్ల నుంచి రైతులకు కలసి రావడం లేదు. గతేడాది వర్షాభావం, అధిక వర్షాలు, చీడపీడలతో తీవ్ర నష్టాలు వచ్చాయి. నష్టాన్ని పూడ్చుకుందామని ఈ ఏడాది మళ్లీ చేసిన సాగు నిరాశ మిగిల్చింది. జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 3,371 హెక్టార్లలో పొగాకు సాగు కావాల్సి ఉంది. అయితే 1,329 హెక్టార్లలో మాత్రమే సాగు చేయగలిగారు. నాట్లు వేసిన తర్వాత వివిధ దశల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురియడంతో నష్టాలు తప్పడం లేదు. పెరిగిన పెట్టుబడులు రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపునివారణ తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రైతులు రూ. 30 వేలు వెచ్చించారు. వర్షాలు అధికం కావడంతో పైరులో కలుపు విపరీతంగా పెరిగిపోవడంతో కలుపు తొలగించేందుకు ఎకరాకు రూ. 10 వేలు భారం పడింది. అధిక తేమ శాతం కారణంగా పైరును నీటికుట్టు తెగులు ఆశించి ఎదుగుదల నిలిచిపోయింది. దీనికి తోడు ఎండు తెగులు ఆశించి అరకొగా ఉన్న ఆకులు ఎండిపోతుండటంతో రైతులు దిగాలు చెందుతున్నారు. క్వింటాకు రూ. 20 వేలు ధర ఇవ్వాలి చీడపీడల కారణంగా ఎకరాకు 3 క్వింటాళ్లకు మించి దిగుబడులు వచ్చే సూచనలు లేవని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే పెట్టుబడుల రూపంలో వేలాది రూపాయాలు వెచ్చించామని, రాబోయే రోజుల్లో ఆకు కొట్టడం, తోరణాలు కుట్టడం, పందిర్లపై ఆరబెట్టుకోవడం, కొనుగోలు కేంద్రాలకు తరలించడం వంటి పనులకు ఎకరాకు మరో రూ. 15 వేలు భారం పడనుందని ఆందోళన చెందుతున్నారు. అధిక వర్షాలు, తెగుళ్లతో పొగాకు దెబ్బతినిందని, క్వింటాకు రూ. 20 వేలు మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇలా.. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో పొగాకు కంపెనీలు క్వింటాకు రూ. 18,500 ధర చెల్లిస్తామని అగ్రిమెంట్ చేసుకున్నాయి. పంట చేతికందిన తర్వాత ఆ ధరకు కొనుగోలు చేయకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. క్వింటా రూ. 11వేల నుంచి రూ. 12 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. రైతులు క్వింటాపై రూ. 6 వేలకు పైగా నష్టపోయారు. నాణ్యత పేరుతో వ్యాపారులు ధర తగ్గించి కొనుగోలు చేయడంతో రైతులు అడుగడునా మోసపోయారు. గత ఏడాది ఎన్నో ఆశలు పెట్టుకుని పొగాకు సాగు చేసిన రైతులకు బోర్డు అధికారులు, వ్యాపారులు, దళారులు కలిపి రైతులకు టోపి పెట్టడంతో నష్టాల ఊబిలో కూరుకపోయారు. పొగాకు రైతులకు గత వైఎస్సార్సీపీ ప్రభు త్వం అండగా నిలిచింది. మార్కెట్లో గిట్టుబాటు ధర లేని సమయంలో అప్పట్లో ప్రభుత్వమే రంగంలోకి దిగింది. పొగాకు కంపెనీలతో మాట్లాడి రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకుంది. క్వింటా రూ. 18 వేల వరకు మద్దతు ధర కల్పించడంతో రైతులు లాభాలు గడించారు. రైతులకు తీవ్ర నష్టం వచ్చిన పొగాకు సాగు వెంటాడిన అధిక వర్షాలు, ఎండు తెగులు ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వాలని రైతుల డిమాండ్ -
వార్డెన్లు పని చేసే చోటే నివాసం ఉండాలి
● బీసీ వెల్ఫేర్ ఎక్స్–అఫీషియో కార్యదర్శి సత్యనారాయణ కర్నూలు(సెంట్రల్): సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు, సిబ్బంది స్థానికంగా నివాసం ఉండి విద్యార్థుల బాగోగులు చూసుకోవాలని బీసీ వెల్ఫేర్ ఎక్స్ – అఫీషియో కార్యదర్శి ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల హెచ్డబ్ల్యూఓ, ఏబీసీడబ్ల్యూలు, డీబీసీడబ్ల్యూఈఓలు, ఎంజేపీఏపీబీసీ డబ్ల్యూర్ ఈఐఎస్ ప్రిన్సిపాళ్లతో బీసీ వెల్ఫేర్ ఎక్స్–అఫీషియో కార్యదర్శి ఎస్.సత్యనారాయణ సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు చక్కటి ఆరోగ్యం, విద్యను అందించాలన్నారు. మెనూపై శ్రద్ధపెట్టి మంచి పౌష్టికాహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత కోసం ప్రతి రోజూ స్టడీ అవర్స్ను నిర్వహించాలని, ప్రభుత్వం చేపట్టిన వంద రోజుల ప్రణాళికను హాస్టళ్లలో సక్రమంగా అమలు చేయాలన్నారు. తరచూ పేరెంట్, టీచర్స్తో పిల్లల చదువు అంశాలపై సమీక్షించాలన్నారు. పనిచేసే ప్రదేశంలో ఉండకపోతే సిబ్బందిపై వేటు వేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ హాస్టల్ సెక్రటరీ మాధవీలత, జేడీ శ్రీధర్రెడ్డి, కర్నూలు, అనంతపురం, నంద్యాల, సత్యసాయి జిల్లాల బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు ప్రసూన, కుస్బూ కొఠారి, జగ్గనయ్య, రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలుతో ప్రత్యేకానుబంధం... బీసీ వెల్ఫేర్ ఎక్స్ – అఫీషియో కార్యదర్శి ఎస్.సత్యనారాయణ గతంలో కర్నూలు జిల్లా కలెక్టర్గా పనిచేశారు. దీంతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో బీసీ వెల్ఫేర్ ఎక్స్ – అఫీషియో కార్యదర్శి హోదాలో కర్నూలుకు రావడంతో ఆయన కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి స్వాగతం పలికారు. క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లి తేనీటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన తనతో స్నేహంగా ఉన్న పలువురు అధికారులను గుర్తు చేసుకున్నారు. -
ఏసీబీకి పట్టుబడిన ఎస్ఐ
కర్నూలు: ఓ వ్యక్తిని అరెస్టు చేయకుండా నోటీసులతో సరి పెట్టేందుకు లంచం డిమాండ్ చేసిన మహిళా పోలీస్స్టేషన్ ఎస్ఐ దండగల కిరణ్ బాబు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. బనగానపల్లె మండలం యనగండ్ల గ్రామానికి చెందిన పి.శివనాగిరెడ్డికి భారతితో 2017లో వివాహమైంది. కొంతకాలం తరువాత వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. తన భర్త అదనంగా కట్నం కోసం వేధిస్తున్నాడని గత ఏడాది నవంబర్ 24న భారతి మహి ళా పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఐ కిరణ్ కుమార్ భార్యాభర్తలకు రెండు విడతలుగా కౌన్సెలింగ్ చేశారు. అయి నప్పటికీ తన భర్తలో మార్పు రావడం లేదని భారతి పోలీసులకు చెప్ప డంతో శివనాగిరెడ్డిపై వేధింపుల కేసు నమోదైంది. అయితే కేసులో లేని హత్యాయత్నం 307 సెక్షన్ను తొలగించేందుకు రూ. 60 వేలు ఇవ్వాల ని శివనాగిరెడ్డిని ఎస్ఐ కిరణ్ బాబు బెదిరించాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు సోమవారం (5వ తేదీ) కర్నూలు ఎ.క్యాంప్లోని ఏసీబీ కార్యాలయంలో డీఎస్పీ సోమన్నను సంప్రదించాడు. ఈ మేరకు శివనాగిరెడ్డితో ఎస్ఐకి ఫోన్ చేయించి వారి సంభాషణను ఏసీబీ అధికారులు రికార్డు చేశారు. రూ.30 వేలు లంచం ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుని మంగళవారం మధ్యాహ్నం గుత్తి రోడ్డులోని ఎస్ఐ కిరణ్ బాబు ఇంటికి వెళ్లి బాధితుడు శివనాగిరెడ్డి రూ.30 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని మహిళా పీఎస్ కు తరలించారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి మహిళా పీఎస్ ఎస్ఐగా కిరణ్ పని చేస్తున్నారు. కేసులో లేని 307 సెక్షన్ పేరిట బాధితున్ని బెదిరించి లంచం తీసుకుంటున్న ఎస్ఐ కిరణ్ను వలపన్ని పట్టుకున్నట్లు డీఎస్పీ మీడియాకు తెలిపారు. దాడుల్లో సీఐలు కృష్ణయ్య, రాజాప్రభాకర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
మంచు మాటున కాటేసిన మృత్యువు
● పొగ మంచు కారణంగా రహదారిపై కనిపించని వాహనాలు ● ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఆటో ● ఇద్దరు దుర్మరణంప్యాపిలి: పొగ మంచు మాటున దాగిన మృత్యువు ఇద్దరిని మింగేసింది. ఎన్. రంగాపురం సమీపంలో మంగళవారం ద్విచక్రవాహనాన్ని ఆటో ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఎన్ రంగాపురం గ్రామానికి చెందిన ఎలుకపెంట్ల రాజశేఖర్ (24), కొప్పుల సురేంద్ర (26) డోన్ సమీపంలోని ఉడుములపాడు వద్ద ఓ కెమికల్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారు. విధినిర్వహణకు వారు ప్రతి రోజూ బైక్పై ఫ్యాక్టరీకి వెళ్లివచ్చేవారు. రోజు లాగే మంగళవారం వేకువజామునే దిచక్రవాహనంపై ఉడుములపాడుకు బయలుదేరారు. అయితే కొద్ది దూరం ప్రయాణించగానే ఎదురుగా ప్యాపిలి వైపు వస్తున్న ఆటో.. ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దట్టంగా కమ్ము కున్న పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న బైక్ కనిపించకపోవడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజశేఖర్, సురేంద్ర అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు సురేంద్రకు భార్య కల్యాణి, ఏడాది వయస్సుగల కుమారుడు ఉండగా ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భిణి. మృతుడు రాజశేఖర్ తండ్రి రాముడు కొద్ది సంవత్సరాల క్రితం గుండెపోటుతో మృతి చెందగా.. కెమికల్ ఫ్యాక్టరీలో పని చేస్తూ తల్లి మాధవిని పోషించుకుంటున్నాడు. ఆయా కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఇద్దరు మృతి చెందడంతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. కాగా ఇదే ప్రమాదంలో ఆటోలో ఉన్న మరో యువకుడు తలారి సురేంద్రకు గాయాలు కాగా చికిత్స నిమిత్తం డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
41 కొత్త పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు
శిరివెళ్ల: జిల్లాలో 41 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపా మని డీపీఓ లలితాబాయి తెలిపారు. మంగళవారం జాతీయ రహదారిపై ఉన్న శిరివెళ్ల మెట్ట వద్ద పారిశుద్ధ్య పనులను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. డిసెంబర్ 26 నుంచి జనవరి 10 వరకు ప్రభుత్వం స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు. అందులో భాగంగా మురికి కాల్వల శుభ్రత, పారిశుద్ధ్యంపై సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో 489 గ్రామ పంచాయతీలుంటే ఇప్పటి వరకు 188 పంచాయతీల్లో స్వామిత్వ సర్వే మొదలై 88లో సర్వే పూర్తయిందన్నారు. అలాగే 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.10.69 కోట్ల ఇంటి పన్నులు వసూళ్ల లక్ష్యం కాగా ఇంత వరకు రూ. 3.86 కోట్లు వసూలైనట్లు తెలిపారు. కొత్తగా ఆన్లైన్ ద్వారా ఇంటి పన్ను లు, నీటి పన్నులు చెల్లించవచ్చన్నారు. ఆమె వెంట ఈఓ అశ్వనికుమార్ ఉన్నారు. మల్లికార్జున సత్రంపై కేసు నమోదు శ్రీశైలం: క్షేత్ర పరిధిలోని మల్లికార్జున అన్నదాన సత్రంలో నిబంధనలకు విరుద్ధంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడంపై దేవస్థానం సీఎస్ఓ శ్రీనివాసరావు శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయపై సీఐ గంగనాథ్ బాబు మంగళవారం మాట్లాడుతూ.. సీఎస్ఓ ఫిర్యాదు మేరకు సత్రంలో జరిగిన సంఘటన మేరకు ఇందుకు బాధ్యులైన ఐదుగురు సిబ్బంది, సత్రం వారి పై భారతీయ న్యాయ సంహిత చట్టం సెక్షన్ 196, 199 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. భక్తుల ఆధ్యాత్మిక మనోభావాలను కించపరిచేలా అభ్యంతరకర పాటలతో డ్యాన్స్ వేయడంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి నియంత్రణకు చర్యలు డోన్: స్క్రబ్ టైఫస్, డెంగీ, మలేరియా లాంటి వ్యాధుల పట్ల ప్రజల్లో సంపూర్ణ అవగాహన కల్పి ంచాల్సిన బాధ్యత వైద్య, ఆరోగ్య సిబ్బందిపై ఉందని జిల్లా మలేరియా ముఖ్య అధికారి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం కన్నపకుంట, కమలాపురం గ్రామాల్లో సహాయ మలేరియా అధికారి సత్యనారాయణ, సబ్యూనిట్ అధికారి రాజశేఖర్ రెడ్డితో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. దోమల నియంత్రణ, నివా రణకు సిబ్బంది తీసుకుంటున్న చర్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మల్కాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అధికారులు, వైద్య సిబ్బందితో సమావేశంమయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల శుభ్రత ను పాటించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి ప్రబలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు వివరించాలని సూచించారు. సమావేశంలో వైద్యాధికారులు వేణుగోపాల్రెడ్డి, ఆనంద్రావ్, పార్వతి, లత, చెన్నయ్య, చింతలయ్య పాల్గొన్నారు. ఫేజ్ 3లో పులుల గణన ఆత్మకూరు: ఆత్మకూరు డివిజన్ పరిధిలోని ఫేజ్–3లో కెమెరా ట్రాప్ల ద్వారా పులుల గణన ప్రారంభించినట్లు ఆత్మకూరు ప్రాజెక్టు టైగర్ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అపావ్ తెలిపారు. ఆత్మకూరు, నాగలూటి, శ్రీశైలం రేంజ్లో ఈ గణన ఫిబ్రవరి 13వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. పులుల గణన కార్యక్రమానికి జాతీయ ప్రాముఖ్యత ఉండటంతో ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు వెంకటాపురం నుంచి హఠకేశ్వరం వరకు, పెచ్చెరువు – నాగలూటి మార్గంలో ఫిబ్రవరి 8వ తేదీ వరకు భక్తుల పాదయాత్రకు అనుమతి ఇవ్వమన్నారు. శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 8 నుంచి 15వ తేదీ వరకు అనుమతి ఇస్తామన్నారు. -
ఆ ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలి
కర్నూలు (సెంట్రల్): టీజీవీ గ్రూప్నకు చెందిన శ్రీ రాయలసీమ అల్యూమినియం అండ్ అలయన్స్ కెమికల్స్ పరిశ్రమలో గ్యాస్ లీకు ఘటనపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు పీఎస్ రాధాకృష్ణ, నగర అధ్యక్షుడు వై.నగేష్ డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం కార్మికులు పనిచేస్తున్న సమయంలో పైప్ లీకై క్లోరిన్ విడుదల కావడంతో పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారని, అయితే వారి వివరాలను యాజమాన్యం ఎందుకు గోప్యంగా ఉంచుతోందని ప్రశ్నించారు. మంగళవారం రాత్రి కార్మిక, కర్షక భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాక్టరీ విస్తరణ పనులు జరుగుతుండగా గ్యాస్ లీకై ందని, ఆ వాసనను పీల్చడంతో పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారని, అయితే వారికి ఎక్కడ చికిత్స చేయిస్తున్నారో యాజమాన్యం చెప్పడం లేదన్నారు. మరోవైపు గొందిపర్ల వాసులు కూడా క్లోరిన్ వాయువు వాసన పీల్చడంతో కళ్లలో మంటలు, శ్వాస సంబంధ సమస్యతో ఇబ్బంది పడ్డారని, వారిని ఫ్యాక్టరీ యాజమాన్యం కనీసం పట్టించుకోలేదన్నారు. మరోవైపు ప్రమాదంలో గాయపడిన వారిని గౌరీగోపాల్ ఆసుపత్రి నుంచి హైదరాబాద్కు రహస్యంగా తరలించడంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి అంబులెన్స్లో రోగులను తీసుకెళ్తున్న ఫొటోలను విడుదల చేశారు. ఈ ప్రమాద సంఘటనపై కలెక్టర్, ఇత ర అధికారులు స్పందించకపోవడం అన్యాయమన్నారు. -
పేకాట రాయుళ్లపై కేసు నమోదు
కౌతాళం: మండల కేంద్రం కౌతాళంలో నలుగురు పేకటరాయుళ్లపై కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్కుమార్ తెలిపారు. స్థానిక బీరప్ప దేవాలయం పక్కన పబ్లిక్ స్థలంలో ఉసేన్సాబ్, దస్తగిరి, వెంకటేష్, అశోక్ పేకాట ఆడుతుండగా అదుపులో తీసుకొని వారి వద్ద నుంచి రూ.5725 నగదుతో పాటు మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మండలంలో ఎవరైనా పేకాట ఆడినా, అక్రమంగా సారా వ్యాపారం చేసినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా సీఐ హెచ్చరించారు. బాలిక అదృశ్యం మంత్రాలయం రూరల్: మండల పరిధిలోని చెట్నెహళ్లి గ్రామానికి చెందిన నాగవేణి(17) అనే బాలిక అదృశ్యమైనట్లు ఎస్ఐ మల్లికార్జున తెలిపారు. గ్రామానికి చెందిన బి.శారదమ్మ, రామాంజినేయులు కుమార్తె బి.నాగవేణి సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి ఇంట్లో కనపడలేదు. కుటుంబ సభ్యులు చుట్టూ పక్కల వెతికినా, బందువులను ఆరా తీసినా జాడ తెలియక పోవడంతో తల్లి శారదమ్మ మంగళవారం మంత్రాలయం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నాగవేణి ఇంటి దగ్గరే టైలరింగ్ నేర్చుకునేది. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తామని ఎస్ఐ తెలిపారు. యువకులకు గాయాలు పాములపాడు: మండలకేంద్రం పాములపాడులోని పాలడెయిరీ వద్ద కారు బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ఆత్మకూరు చెందిన మురహరి వినోద్కుమార్, కిరణ్లు ఆత్మకూరుకు బైక్ పై వెళ్తున్నారు. ఈ క్రమంలో పాల డెయిరీ వద్ద యూ టర్న్లో బైక్ తిప్పుకుంటుండగా వేగంగా ఆత్మకూరు వైపు నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కర్ణాటకకు చెందిన కారు ఢీ కొట్టి వెళ్లి పోయింది. గాయపడిన ఇద్దరిని స్థాణికులు 108 వాహనంలో ఆత్మకూరుకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ తిరుపాలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అనూమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని బోడబండ గ్రామ సమీపంలో వడ్దె బెల్లం వెంకట్రాముడు(55) అనే వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు.బోడబండకు చెందిన వెంకట్రాముడు నాలుగు రోజుల క్రితం ఇంట్లో గొడవపడి బయటకు వెళ్లాడు. కుటుంబ సభ్యులు తిరిగి అతడే వస్తాడులే అనుకుని ఉన్నారు. అయితే, గ్రామ సమీపంలోని రోడ్డు పక్కన పొలంలో నుంచి దుర్వాసన వస్తుండగా మంగళవారం అటుగా వెళ్తున్న వారు దగ్గరకు వెళ్లి చూడగా మృతదేహాం కనిపించింది. వెంటనే రూరల్ పోలీసులకు సమాచారం అందించగా వారు పరిశీలించి గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి చనిపోయింటాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్ మోటర్ కేబుల్ వైర్లు చోరీ హొళగుంద: మండల పరిధిలోని హొన్నూరు క్యాంపునకు వెళ్లే దారిలో సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు విలువైన విద్యుత్ మోటర్ కేబుల్ వైర్లు చోరీకి పాల్పడ్డారు. ఈ ప్రాంతంలో ఎల్లెల్సీ కింద ఎక్కువగా వరిసాగు చేస్తారు. కాలువకు నీటి విడుదల లేకపోవడంతో రబీ సాగు లేక రైతులు పొలాల వైపు వెళ్లడం లేదు. దీనిని ఆసరాగా చేసుకున్న దుండగులు పొలాల్లోని మోటర్ నుంచి స్టార్టర్ బాక్స్ల వరకు వెళ్లిన విలువైన కేబుల్ వైర్లను కత్తిరించుకుని వెళ్లారు. ఇలా రమేష్, సత్యప్ప, చిన్న మల్లేశ్, అడ్లిగి బసవరాజు, మల్లయ్య, గౌరవప్ప తదితర 20 మంది రైతులకు చెందిన మోటర్ల వైర్లను ఎత్తుకెళ్లారు. ఈ కేబుల్ వైర్ మీటర్ రూ.వందకు పైగ ధర ఉంటుందని ఒక్కో బోరు వద్ద 20 మీటర్లకు పైగ వైర్లను కత్తిరించారని రైతులు తెలిపారు. ఈ దొంగతనాలను అరికట్టాలని తుంగభద్ర రైతు సంఘం మండల అధ్యక్షుడు కృషయ్య కోరారు. చోరీ విషయాన్ని హొళగుంద పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు రైతులు విలేకరులకు తెలిపారు. -
టీజీవీ ఆల్కాలీస్లో గ్యాస్ లీక్!
సాక్షి, టాస్క్ఫోర్సు: టీజీవీ గ్రూపునకు చెందిన రాయలసీమ అల్కాలీస్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ ఘటనపై అంతటా గోప్యత పాటిస్తున్నారు. ప్రమాద వివరాలు చెప్పేందుకు అటు జిల్లా యంత్రాంగంగానీ, యాజమాన్యంకానీ ముందుకు రావడంలేదు. అంతేకాదు అస్వస్థతకు గురైన వారి వివరాలు తెలియనీయకుండా పెట్టడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు రూరల్ మండలం గొందిపర్ల సమీపంలోని టీజీవీ గ్రూపు అల్కాలీస్ ఫ్యాక్టరీలో సోమవారం సాయంత్రం క్లోరిన్ గ్యాస్ పైపును శుభ్రం చేస్తుండగా దానిపై ఇటుకలు పడడంతో పైపు పగిలినట్లు సమాచారం. దీంతో క్లోరిన్ వాయువు రూపంలో అలుముకోవడంతో అక్కడ పనిచేస్తున్న పలువురు కార్మికులు, సిబ్బంది అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. అక్కడే ప్రథమ చికిత్స చేయగా ఐదుగురు కోలుకోవడంతో మిగతా వారిని నగరంలోని గౌరీ గోపాల్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఇందులో సోమవారం రాత్రే కొందరు కోలుకోగా.. మిగిలిన వారికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఐదారుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గొందిపర్ల, ఈ.తాండ్రపాడుపై ప్రభావం ఆల్కాలీస్ ఫ్యాక్టరీకి గొందిపర్ల, ఈ. తాండ్రపాడులు అతి సమీపంగా ఉంటారు. ఫ్యాక్టరీ, ఆ గ్రామాలకు మధ్య 500 మీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో క్లోరిన్ వాయువు గ్రామాలను చుట్టమట్టడంతో కొందరు అస్వస్థతకు గురయ్యారు. ఆయా గ్రామాల్లో దాదాపు 10 మంది శ్వాస తప్పి పడిపోయినట్లు సమాచారం. వారిలో ముగ్గురిని గ్రామస్తులు రాత్రే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మిగిలిన వారు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లినట్లు సమాచారం. క్లోరిన్ గ్యాస్ పైప్పై ఇటుకలు పడటంతో ప్రమాదం పలువురికి అస్వస్థత.. గౌరీ గోపాల్కు తరలింపు గోప్యత పాటిస్తున్న అధికార యంత్రాంగం, యాజమాన్యం -
స్వచ్ఛ సర్వేక్షణలో మెరుగైన ర్యాంకులు సాధించాలి
నంద్యాల: జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలు స్వచ్ఛ సర్వేక్షణలో మెరుగైన ర్యాంకులు సాధించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా నిర్దేశించిన 10 కీలక పారామీటర్లపై మున్సిపల్ కమిషనర్లతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి కొరత తలెత్తకుండా ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే పీఎం సూర్య ఘర్ పథకంపై ప్రత్యేక ఫోకస్ పెట్టి, సౌరశక్తి వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాని సూచించారు. మెప్మా కార్యక్రమాల ద్వారా మహిళలకు జీవనోపాధి అవకాశాలు పెంచాలని, ఈ రంగంలో జిల్లా ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న నేపథ్యంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో నంద్యాల, డోన్, నందికొట్కూరు, బేతంచెర్ల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు మున్సిపల్ కమీషనర్లు శేషన్న, ప్రసాద్ గౌడ్, వెంకట్రామిరెడ్డి, హరిప్రసాద్, కిశోర్, రమేష్ బాబులతో పాటు మెప్మా పీడీ వెంకటదాసు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ కిశోర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పాలనలో పారదర్శకతకు పెద్దపీట
● రూ.387.72 కోట్లతో 59 సీపీడబ్ల్యూఎస్ పథకాల నిర్వహణ ● ఉమ్మడి జిల్లాలోని 695 జనవాసాలకు సురక్షిత మంచి నీటి సరఫరాకు ప్రాధాన్యత ● జెడ్పీ సాధారణ నిధులు రూ.12.03 కోట్లతో 266 పనులు ● కారుణ్య నియామకాల కింద 154 మందికి ఉద్యోగాలు ● నాలుగేళ్ల పాలనపై జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి కర్నూలు(అర్బన్): ప్రజలు ఉంచిన విశ్వాసం, నమ్మకాన్ని వమ్ము చేయకుండా అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవినీతికి తావు లేకుండా పాలన సాగిస్తున్నామని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. ఈ నెల 4వ తేదీకి జెడ్పీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తి అయిన సందర్భంగా మంగళవారం ఆయన జెడ్పీలోని తన ఛాంబర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాపిరెడ్డి మాట్లాడుతూ ... పెద్దగా ఆదాయ వనరులు లేని జిల్లా పరిషత్కు ఆర్థిక జవసత్వాలు తీసుకువచ్చేందుకు అందరి సహకారంతో పనిచేస్తున్నామన్నారు. ముఖ్యంగా జెడ్పీ స్థిరాస్తులకు సంబంధించిన, స్టాంప్ డ్యూటీ, సీనరేజి గ్రాంట్, 15వ ఆర్థిక సంఘం నిధులు, ఇతరత్రా వనరులతో జెడ్పీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు, జెడ్పీటీసీలు, జెడ్పీ అధికారులు పూర్తి స్థాయిలో సహకారాన్ని అందిస్తున్నారన్నారు. రూ.382.72 కోట్లతో 59 సీపీడబ్ల్యూఎస్ పథకాల నిర్వహణ ఉమ్మడి కర్నూలు జిల్లాలో రూ.382.72 కోట్లతో 59 సీపీడబ్ల్యూఎస్ పథకాల ద్వారా 695 జనవాసాలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ పథకాల నిర్వహణకు 15వ ఆర్థిక సంఘం నిధులు 2021–22 నుంచి 2024–25 వరకు రూ. 297.15 కోట్లు వెచ్చించామని, 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.90.57 కోట్లు వెచ్చించేందుకు పరిపాలనా ఆమోదం జారీ చేశామన్నారు. అలాగే గడచిన నాలుగేళ్లలో 110 పనులు చేపట్టగా, ఇప్పటి వరకు 77 పనులు పూర్తి అయ్యాయని, ఇందుకు రూ.41,34,45,165 వెచ్చించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలోనే జెడ్పీ సాధారణ నిధుల నుంచి రూ.41.52 కోట్ల అంచనాతో 990 పనులు చేపట్టామని, ఇందులో రూ.22.61 కోట్ల ఖర్చుతో 649 పనులు పూర్తి చేశామన్నారు. అలాగే నాలుగు సంవత్సరాల కాల వ్యవధిలో ఎస్సీ కార్పొరేన్కు రూ.2.81 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు రూ.1.11 కోట్లను విడుదల చేశామన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ కాలనీలు, అంగన్వాడీ కేంద్రాల్లో మౌళిక వసతులు కల్పించేందుకు రూ.12.03 కోట్ల అంచనాతో 266 పనులు చేపట్టగా, ఇప్పటి వరకు రూ.8.79 కోట్ల వ్యయంతో 204 పనులు పూర్తి కాగా, ఇంకా 62 పనులు వివిధ దశల్లో ఉన్నాయని చైర్మన్ వివరించారు. వేసవిలో తాగునీటి నివారణకు ప్రాధాన్యత వేసవిలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు గ్రామాల్లో నీటి ఎద్దడిని నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకొని నిధులను విడుదల చేసినట్లు చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. అందులో భాగంగానే రూ.6.13 కోట్ల అంచనాతో 188 పనులు చేపట్టగా, ఇప్పటి వరకు రూ.4.48 కోట్ల వ్యయంతో 157 పనులు పూర్తి చేశామన్నారు. గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఇప్పటికే సూచనలు ఇచ్చామన్నారు. సున్నిపెంటకు ప్రత్యేకంగా రూ.72 లక్షలు సున్నిపెంట గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరగనందున 15వ ఆర్థిక సంఘం నిధులు అందని పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే సుండిపెంట గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య నిర్వహణకు జెడ్పీ 4 శాతం నిధుల కింద రూ.72.10 లక్షలను విడుదల చేసినట్లు చైర్మన్ వెల్లడించారు. నాలుగేళ్ల పాలనలో జిల్లా పరిషత్ పరిధిలోని వివిధ కార్యాలయాల్లో కారుణ్య నియామకాల కింద 154 మందికి వివిధ కేడర్లలో ఉద్యోగాలు కల్పించామని జెడ్పీ చైర్మన్ తెలిపారు. ఇందులో జూనియర్ అసిస్టెంట్లు 43, టైపిస్టులు 42, ఆఫీసు సబార్డినేట్లు 66, స్వీపర్లు 03 మంది ఉన్నారన్నారు. అలాగే వివిధ కేడర్లలో 378 మంది ఉద్యోగులు పదోన్నతులు పొందారన్నారు. -
824 మంది ఉల్లి రైతులకు అందని పరిహారం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో 824 మంది ఉల్లి రైతులకు పరిహారం విడుదల కాలేదని జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలో 31,352 మంది ఉల్లి రైతులకు ఎకరాకు 20 వేల ప్రకారం విడుదల అయిందని తెలిపారు. ఇందులో 30,528 మంది రైతులకు వారి బ్యాంకు ఖాతాలకు జమ అయిందని తెలిపారు. 824 మంది రైతులకు మాత్రమే బ్యాంకు ఖాతాల్లో తప్పులు ఉండటం వల్ల జమ కాలేదని తెలిపారు. ఈ రైతుల వివరాలను సంబంధిత రైతు సేవా కేంద్రాలకు పంపామని రైతులు చెక్ చేసుకొని బ్యాంకు ఖాతాలను యాక్టివ్ చేసుకోవడం, ఆధార్ లింక్ చేసుకోవడం చేసుకోవాలని సూచించారు. కర్నూలు(అర్బన్): ప్రజలకు మెరుగైన సేవలను వేగవంతంగా అందించేందుకే ప్రభుత్వం ఈ – గవర్నెన్స్ సిస్టమ్ను తీసుకొచ్చిందని డీపీఆర్సీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మంజులవాణి అన్నారు. మంగళవారం స్థానిక జెడ్పీ ప్రాంగణంలోని డీపీఆర్సీ భవనంలో ఎంపీడీఓ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన జూనియర్ సహాయకులు, పరిపాలనాధికారులకు ఈ – గవర్నెన్స్పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఏపీఎస్ఐఆర్డీ అండ్ పీఆర్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఒకే వేదిక నుంచే ఆన్లైన్ అప్లికేషన్లను అన్ని శాఖల సమన్వయంతో ఈ గవర్నెన్స్పై అవగాహన పెంచుకోవాలన్నారు. నేషనల్ మోబైల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా క్షేత్ర స్థాయిలో ఉపాధి కూలీల హాజరును ఖచ్చితత్వంతో జీయోట్యాగ్తో నమోదు చేయవచ్చునన్నారు. శిక్షణా కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ మేనేజర్ గిడ్డేష్, సీనియర్ సహాయకులు వేణుగోపాల్, టీఓటీలు ఆస్రఫ్బాష, పి. జగన్నాథం, ఖలీలుల్లా, కె. జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
పెట్రోల్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట
● జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ కర్నూలు (సెంట్రల్): సరిహద్దు రాష్ట్రాల నుంచి జిల్లాలోకి అక్రమంగా పెట్రోలియం రవాణా కాకుండా కట్టడి చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఏర్పా టు చేశామని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ చాంబర్లో అక్రమ పెట్రోలియం రవాణాపై ఎన్ఫోర్స్మెంట్ ప్రొటెక్షన్ కమిటీతో జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్లోకి అక్రమంగా, అనుమతి లేకండా పెట్రోలియంను తరలించి ఇక్కడ విక్రయిస్తున్నారన్నారు. కర్ణాటకలో ధరలు తక్కువగా ఉండటం వల్ల ఇలా చేస్తున్నారని, దీని వల్ల రాష్ట్రానికి పన్ను ఆదాయం తగ్గడమే కాకుండా సరఫరాలో అంతరా యం కలుగుతుందన్నారు. దీనిని అరికట్టడానికి సివిల్ సప్లయిస్ కమిషనర్ వారి ఆదేశాల మేరకు జాయింట్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. సంబంధిత కమిటీలో రవాణా శాఖ, లీగల్ మెట్రాలజీ శాఖ, సివిల్ సప్లయిస్ శాఖ, కమర్షియల్ టాక్స్ శాఖ లు నాలుగు విభాగాలుగా కలసి పనిచేస్తాయన్నారు. సమావేశంలో డీటీసీ శాంతకుమారి, కమర్షియల్ ట్యా క్స్ అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు, ఆయి ల్ కంపెనీ మేనేజర్లు పాల్గొన్నారు. -
ఒకరు, ఇద్దరు కాదు.. ఐదుగురు
ప్రమాదాల నివారణకు అధికారులు ఓ వైపు రోడ్డు భద్రతా వారోత్సవాలు అంటూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా వాహనదారుల్లో కొంతైనా మార్పు రావడం లేదు. అందుబాటులో రవాణా సౌకర్యాలు సరిగా లేకనో.. త్వరగా చేరుకోవాలనో పలువురు ప్రాణాలకు తెగించి ప్రయాణం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం గోనెగండ్ల బస్టాండ్ వద్ద బైక్పై వెళ్తున్న వారిని చూస్తే వామ్మో అనాల్సిందే. బైక్ నడుపుతున్న వ్యక్తికి అసలే హెల్మెట్ లేదు.. ఆపై బైక్పై ఐదుగురు. అందులో ముగ్గురు పిల్లలు ఉన్నారు. రోజూ పలు చోట్ల ప్రమాదాలు చోటు చేసుకుని మరణాలు సంభవిస్తున్నా వాహనదారులకు కనువిప్పు కలగడం లేదు. – గోనెగండ్ల -
కూటమి సర్కారుపై ప్రజా వ్యతిరేకత
కర్నూలు (టౌన్): చంద్రబాబు పాలనపై అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయ కర్త, మాజీ పార్లమెంటు సభ్యులు బుట్టా రేణుకా అన్నారు. మంగళవారం స్థానిక బళ్లారి చౌరస్తా సమీపంలోని ఏపీఎస్పీ క్యాంపు వద్ద ఉన్న కార్యాలయంలో గంజిహాల్లి గ్రామానికి చెందిన 50 మంది టీడీపీ కార్యకర్తలు పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికి బుట్టా రేణుకా తో పాటు జిల్లా యాక్టివిటీ కార్యదర్శి నాగేష్ నాయుడు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు డి. నజీర్ అహమ్మద్ వైఎస్సార్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు టీడీపీ కార్యకర్తలు ఆకర్షితులై వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు అలవి కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దె ఎక్కారని విమర్శించారు. రెండేళ్లు అవుతున్న ఇంకెప్పుడు ఆడబిడ్డ నిధి పథకం ఇస్తారని ప్రశ్నించారు. గోనెగండ్ల మండల గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు గంజిహాల్లి ముల్ల రఫీక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ నుంచి స్వామిదాసు, ఏసన్న మత్తయ్య, యాకోబ్, సల్మాన్ రాజ్, ఆనంద్, రాజు, విజయ్, డేవిడ్, సుధాకర్, కిషోర్, మల్లిఖార్జున, చిన్న మునిస్వామి, రమేష్, బాస్కర్లతో పాటు 50 మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ చేనేత అధ్యక్షుడు ఎంకే శివప్రసాద్, ఎమ్మిగనూరు మండల యువజన విభాగం అధ్యక్షుడు బనవాసి బసిరెడ్డి, ఎమ్మిగనూరు పట్టణ 15 వ వార్డు ఇన్చార్జీ సయ్యద్ ఫయాజ్, నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు షరీఫ్, పూర్ణ నాయుడు, నరసింహ ఆచారి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుకా గంజిహాల్లి గ్రామానికి చెందిన 50 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరిక -
12 నుంచి శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలం టెంపుల్: మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని శ్రీశైలంలో ఈ నెల 12 నుంచి 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ నెల 12న ఉదయం 9.15గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశం, లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు బ్రహ్మోత్సవ సంకల్పాన్ని పఠిస్తారు. చండీశ్వరునికి విశేష పూజలు జరిపిస్తారు.13 నుంచి స్వామి అమ్మవార్లకు వాహన సేవలు నిర్వహిస్తారు. 15న మకర సంక్రాంతి రోజున బ్రహ్మోత్సవ కల్యాణం జరిపిస్తారు. 17న యాగ పూర్ణాహుతి, 18న పుషో్పత్సవం, శయనోత్సవం, ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. సంక్రాంతి రోజైన 15న జరిగే బ్రహ్మోత్సవాల్లో కల్యాణానికి చెంచు గిరిజనులను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. ఉత్సవాల సందర్భంగా ఈ నెల 12నుంచి 18వరకు ఆర్జిత, ప్రత్యక్ష పరోక్ష సేవలను నిలుపుదల చేశారు. -
రాయలసీమ ద్రోహి చంద్రబాబు: వైఎస్సార్సీపీ
సాక్షి, నంద్యాల జిల్లా: రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ను వైఎస్సార్సీపీ నేతలు సందర్శించారు. మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, కల్పలతరెడ్డి, శివరామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్రెడ్డి, సమన్వయ కర్త దారా సుధీర్ పరిశీలించారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు.నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాలను సస్యశ్యామలం చేయాలనేది వైఎస్ జగన్ కల.. 2020లో రాయలసీమ ఎత్తిపోతలకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారన్నారు. రూ.3,207 కోట్ల వ్యయంతో వైఎస్ జగన్ రాయలసీమ ప్రాజెక్టును చేపట్టారు. చీకటి ఒప్పందం చేసుకునే చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టును వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విఖ్యాత్రెడ్డి మెంబర్ షిప్ రద్దు : త్రిసభ్య కమిటీ సభ్యులు
విజయడెయిరీలో రుణం తీసుకొని చెల్లించకుండా భూమా విఖ్యాత్రెడ్డి డీఫాల్టర్ అయ్యారని, యూనియన్కు తిరిగి డబ్బులు చెల్లించనందుకే చక్రవర్తుల పల్లె పాల సొసైటీ మెంబర్ షిప్ రద్దు అయ్యిందని త్రిసభ్య కమిటీ సభ్యులు గంగుల విజయసింహారెడ్డి, పీపీ మధుసూదన్రెడ్డి తెలిపారు. స్థానిక విలేకరులతో వారు మాట్లాడుతూ.. అక్రమ మార్గంలో ముత్యాలపాడు సొసైటీ నుంచి అధ్యక్షుడినంటూ డెయిరీ వద్ద హంగామా చేయడం అలవాటుగా మారిందన్నారు. ఆయన ఎక్కడా పోటీ చేసేందుకు అర్హత లేదని చెప్పారు. డెయిరీ నియమ నిబంధనలు పాటిస్తూ ముత్యాలపాడు పాలక మండలి సభ్యులు సహకరిస్తే సమస్య సావధానంగా పరిష్కారం చూపుతామన్నారు. ఎవరైనా బెదిరింపులకు దిగితే గట్టిగా సమాధానం చెబుతామని హెచ్చరించారు. భూమా విఖ్యాత్రెడ్డి ప్రైవేటు డెయిరీని స్థాపించి అక్రమంగా 2020లో డెయిరీ నుంచి రూ.1.20 కోట్లు అప్పు తీసుకొని తిరిగి చెల్లించలేదన్నారు. ఆ కారణంతోనే పాల సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న చక్రవర్తుల పల్లెలో విఖ్యాత్ మెంబర్ షిప్ను 25–12–2024లో డెయిరీ పాలక వర్గం రద్దు చేసిందన్నారు. డీఫాల్టర్ అయి న విఖ్యాత్కు ముత్యాలపాడు పాల సొసైటీలో సభ్యత్వం ఇవ్వడమే కాకుండా అధ్యక్షుడిగా ఎలా చేస్తారంటూ పాల సొసైటీ సభ్యులకు నోటీసులు ఇచ్చామన్నారు. మోసపూరిత సభ్యత్వం, సభ్యుల బాధ్యతా ఉల్లంఘన, అర్హత లేకుండా డైరెక్టర్గా విఖ్యాత్ను కో ఆప్షన్ చేయడం అధ్యక్ష పదవికి అక్రమంగా ఎన్నుకోవడం నిబంధనలను ఉల్లంఘించడమేనన్నారు. -
కేసీ కెనాల్లో గుర్తుతెలియని మృతదేహం
కర్నూలు: కర్నూ లు మండలం పడిదెంపాడు గ్రామ పొలిమేరలో కేసీ కెనాల్లో నీటిలో కొట్టుకుపోతున్న గుర్తు తెలియని పురుష మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని మార్చు రీ కేంద్రానికి తరలించి భద్రపరిచారు. కర్నూలు గడ్డా వీధికి చెందిన షేక్ ఉమర్ ఫరూక్ వ్యక్తిగత పనిమీద పడిదెంపాడు వైపు కేసీ కెనాల్పై వెళ్తుండగా నీటిపై మృతదేహం తేలినట్లు కనిపించింది. దీంతో షేక్ ఉమర్ ఫరూక్ స్పందించి మృతదేహాన్ని పక్కకు లాగి అక్కడే ఉన్న దుప్పటి సహాయంతో పక్కనున్న రాయికి కట్టి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాలూకా పీఎస్ ఎస్ఐ మల్లికార్జున సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించి మృతదేహాన్ని నీటిలో నుంచి వెలికితీయించారు. మృతదేహం కుడిచేతిపై షేకున్ అని ఇంగ్లిషులో పచ్చబొట్టు, ఎడమ మెడ వద్ద గుండ్రని పచ్చబొట్టు ఉంది. నల్లని టీషర్టు ధరించాడు. సుమారు 28 సంవత్సరాలు వయస్సు ఉంటుంది. ఆచూకీ తెలిసినవారు తాలూకా పోలీసులను సంప్రదించి సమాచారమివ్వాలని ఎస్ఐ మల్లికార్జున విజ్ఞప్తి చేశారు. వివాహిత ఆత్మహత్య బేతంచెర్ల: గోర్లగుట్ట గ్రామానికి చెందిన ఓ వివాహిత సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామా నికి చెందిన దూదేకుల ఇమాం సాహెబ్ కూతురు ఆశాబీ (27)కి కొన్నేళ్ల క్రితం మద్దూరుకు చెందిన కమాల్తో వివాహమైంది. కమాల్ ఇల్లరికం అల్లుడిగా వచ్చి గోర్లగుట్టలోనే ఉంటున్నాడు. వీరికి ముగ్గురు కుమారులు కాగా రెండవ కుమారుడు ఉస్సేన్వలి నాలుగు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి ఆశాబీ తీవ్ర మనోవేదనకు గురవుతూ ఉంది. మరో కుమారుడు ఉసేన్ బాషా బేతంచెర్ల పట్టణంలో డ్యాన్స్ కోచింగ్ తీసుకుంటున్నాడు. దీంతో ప్రతి రోజు కుమారుడిని వెంట తీసుకోని పట్టణానికి వచ్చేది. ఈ క్రమంలో సోమవారం కుమారునితో డ్యాన్స్ కోచింగ్ సెంటర్ వచ్చిన ఆమె బాత్ రూంలోకి వెళ్లి రసాయన పౌడర్ నీటిలో కలుపుకుని తాగి ఆపస్మారక స్థితిలో పడి పోయింది. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఏఎస్ఐ నబీ సంఘటనా స్థలానికి వెళ్లి ఆత్మహత్యకు కారణాలు తెలుసుకున్నారు. మృతురాలి తండ్రి ఇమాంసాహెబ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కోడుమూరు రూరల్: కోడుమూరులోని షణ్ముఖరెడ్డి నగర్కు చెందిన సుధాకర్ అనే వ్యక్తి ఆరేళ్లలోపు వయస్సు ఉన్న తన ఇద్దరు కుమారులతో పాటు కన్పించడం లేదు. పోలీసులు తెలిపిన మే రకు వివరాలిలా ఉన్నాయి. కోడుమూరు మార్కె ట్లో గుమస్తాగా పనిచేసే సుధాకర్ ఆదివారం తన కుమారులు భరత్కుమార్, మాన్విత్ కుమార్ ను పిలుచుకుని భార్య పుట్టినిల్లు అయిన దేవనకొండకు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. అయితే సుధాకర్ దేవనకొండకు వెళ్లకపోవడంతో పాటు, కోడుమూరుకు తిరిగి రాకపోవడం, సెల్ఫోన్ స్విచ్ఛాఫ్ ఉండడంతో ఆందోళన చెందిన భార్య అనురాధ సోమవారం సాయంత్రం కోడుమూరు పోలీసులను ఆశ్రయించింది. ఈ మేర కు కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టినట్లు ఎస్ఐ ఎర్రిస్వామి తెలిపారు. షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం పగిడ్యాల: పడమర ప్రాతకోట ఎస్సీ కాలనీలో సోమవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి పక్కా ఇల్లు దగ్ధమైంది. కాలనీకి చెందిన ఇస్కాల జేమ్స్ అలియాస్ వెంకటస్వామి కుటుంబ సమేతంగా రోళ్లపాడు గ్రామంలో జరిగిన ఫంక్షన్కు వెళ్లారు. మధ్యాహ్నం ఇంట్లో షార్ట్ సర్క్యూట్ సంభవించి ఇంట్లో నుంచి పొగలు వ్యాపించాయి. స్థానికులు గుర్తించి విద్యుత్ సరఫరాను బంద్ చేయించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే మంటలు అదుపు కాకపోవడంతో కర్నూలు అగ్నిమాపక కేంద్రానికి సమాచారంతో చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో విలువైన వస్తువులు, ఫ్రిడ్జ్, రెండు బీరువాలు, టీవీ, బియ్యం, బట్టలు, ఫర్నిచర్ కాలిపోయాయి. ఆస్తి నష్టంపై తహసీల్దార్కు నివేదిక పంపుతామని రెవెన్యూ అధికారులు తెలిపారు. -
ఒక్క స్థానం లేకపోయినా.. ఎంపీపీ పీఠంపై గురి
● జూపాడుబంగ్లా ఎంపీపీపై అవిశ్వాస తీర్మానానికి టీడీపీ కుట్రజూపాడుబంగ్లా: తెలుగు దేశం పార్టీకి మండలంలో ఒక్కటంటే ఒక్క ఎంపీటీసీ స్థానం లేకపోయినా ఆ పార్టీ నేతలు ఎంపీపీ పీఠాన్ని దక్కించుకునేందుకు కుట్ర పన్నారు. ఈ మేరకు సోమవారం మండలంలోని ఆరుగురు ఎంపీటీసీలను జతచేసుకొని టీడీపీ నేతలు ఆత్మకూరు ఆర్డీఓ నాగజ్యోతికి అవిశ్వాస తీర్మానం ప్రతిని అందజేసినట్లు సమాచారం. మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలుండగా 2021 ఏప్రిల్ లో జరిగిన స్థానికసంస్థల ఎన్నికల్లో 9 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. తాటిపాడు, పారుమంచాల గ్రామాల్లో ఇండిపెండెంటు అభ్యర్థులు గెలుపొందారు. టీడీపీకి ఒక్కటంటే ఒక్క ఎంపీటీసీ స్థానం కూడా దక్కించుకోలేకపోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం కొంత మంది ఎంపీటీసీ సభ్యులు ప్రస్తుత ఎమ్మెల్యే, ఎంపీ వర్గాల్లో చేరారు. వారిలో ఆరుగురిని తమవైపు తిప్పుకొని ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకు యత్నిస్తున్నారు. అయితే మరో నాలుగు మాసాల్లో పాలక మండలి గడువు ముగుస్తున్న నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతుండటం వెనుక ఆంత్యమేమిటని పలువురు చర్చించుకుంటున్నారు. ఆర్డీఓ నాగజ్యోతికి ఇచ్చిన అవిశ్వాస తీర్మానం ప్రతిలో మండ్లెం–2, జూపాడుబంగ్లా–1, 2, పారుమంచాల, తరిగోపుల, తంగడంచ ఎంపీటీసీలు సంతకాలు చేశారని తెలుస్తోంది. కాగా మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు గాను తాటిపాడు ఎంపీటీసీ బోయ చిన్నశంకర్ మృతిచెందగా, తర్తూరు ఎంపీటీసీ పీఎం నాగిరెడ్డి సర్పంచ్గా ఎన్నికవ్వటంతో ఎంపీటీసీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం తొమ్మిది సభ్యులుండగా అందులో 2/3 ప్రకారంగా ఆరుగురు సభ్యులు మెజార్టీ తెలిపితే ఎంపీపీపై అవిశ్వాసం నెగ్గుతోంది. ఈ క్రమంలో మెజార్టీ సభ్యులు ఇచ్చిన తీర్మానం ప్రతులను ఆర్డీఓ పరిశీలించి ఎంపీటీసీ సభ్యులదంరికీ నోటీసులిచ్చి వారంలోగా సభను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. -
మదిమదిలో ‘మహా’ భక్తి
అర్ధనారీశ్వరుడు.. అద్వైతుడు.. మహా దేవుడు.. శ్రీ నీలకంఠేశ్వరస్వామి భక్తుల మధ్యకే వచ్చారు. మహా రథం నుంచి ప్రజలందరినీ దీవించారు. చేనేతపురి ఎమ్మిగనూరులోని తేరుబజారు సోమవారం ఆధ్యాత్మిక దీప్తితో ప్రభవించింది. పండితుల వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల సుస్వరాల సమ్మేళనం మధ్య మహారథోత్స వం అంగరంగ వైభవంగా సాగింది. మదిమదిలో ‘మహా’ భక్తి వెల్లివిరిసింది. రథోత్సవంలో రెండు లక్షలకు పైగా భక్తులు పాల్గొన్నారు. రథాన్ని లాగి స్వామివారి కృపను పొందా లని పోటీపడ్డారు. రథంపై డ్రోన్తో పూలను చల్లడం విశే షంగా ఆకట్టుకొంది. ఉత్సవాన్ని తిలకించేందుకు పలుచో ట్ల ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. నందికోళ్ల సేవ, గొరవయ్యల నృత్యాలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
ఇక ఒకే మాట.. ఒకే బాట
● ప్రత్యేకంగా సమావేశమైన చల్లా కుటుంబ సభ్యులు ● చల్లా విఘ్నేశ్వరరెడ్డికి కుటుంబ, రాజకీయ బాధ్యతలు అప్పగింత అవుకు(కొలిమిగుండ్ల): దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి సోదరులు, కుటుంబ సభ్యులు ఒకే మాట..ఒకటే బాటలో నడిచేందుకు నిర్ణయించుకున్నారు. సోమవారం అవుకు పట్టణంలోని చల్లా ప్రజాభవన్లో చల్లా రామకృష్ణారెడ్డి సోదరులు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు చల్లా సూర్యప్రకాష్రెడ్డి, ఎంపీపీ చల్లా రాజశేఖర్రెడ్డి, అమర్నాథ్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, రఘునాథ్రెడ్డి, రామేశ్వరరెడ్డితో పాటు కుమారుడు వైఎస్సార్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ చల్లా విఘ్నేశ్వరరెడ్డి, దుగ్గిరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి, పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చల్లా చరణ్రెడ్డి, చల్లా విక్రాంత్రెడ్డిలు కలిసి ప్రత్యేకంగా సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కుటుంబ, రాజకీయ బాధ్యతలను అందరూ కలిసి చల్లా విఘ్నేశ్వరరెడ్డికి అప్పగించారు. ఇకపై చల్లా ఫ్యామీలీ అంతా ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా కలిసి కట్టుగా ఉండేలా నిర్ణయం తీసుకున్నామని విఘ్నేశ్వరరెడ్డి వివరించారు. కలిసి మెలిసి భవిష్యత్ అంతా ప్రయాణం చేస్తామన్నారు. బహు నాయకత్వం లేకుండా ఒకే నాయకత్వం ఉంటుందన్నారు. తమ కుటుంబ పెద్దలు అంతా ఏకమై సారథ్య బాధ్యతలు తనకు అప్పగించడం సంతోషంగా ఉందన్నారు. ఏ కార్యక్రమం అయినా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా పెద్దలతో చర్చించుకొని భవిష్యత్లో ముందుకెళ్తామన్నారు. తమ కుటుంబం వెంట నడిచిన ప్రతి ఒక్కరికీ అండగా నిలబడుతామని భరోసా ఇచ్చారు. -
కారులో రూ.5 లక్షలు చోరీ
ఆదోని అర్బన్: కారు అద్దాన్ని పగలగొట్టి క్యాష్ బోర్డులో ఉన్న రూ.5 లక్షలు నగదును దొంగలించి పరారైన సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. త్రీటౌన్ సీఐ రామలింగమయ్య తెలిపిన వివరాల మేరకు.. బ్యాంకులో తీసుకున్న రుణాన్ని కట్టేందుకు బసాపురం గ్రామానికి చెందిన రైతు రమేష్, ఆయన కుమారుడు రఘు ఆదోని పట్టణానికి వచ్చారు. రుణాన్ని కట్టేందుకు వారి బంధువు అయిన చంద్రప్ప వద్ద రూ.5 లక్షలు అడిగారు. చంద్రప్ప స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులో డ్రా చేసి కారులో కూర్చొని వారికి రూ.5 లక్షలు అందజేశారు. డబ్బును ముందు సీటులో ఉన్న క్యాష్ బోర్డులో పెట్టారు. లోన్ కట్టేందుకు మరో రూ.50 వేలు తక్కువగా ఉండడంతో వెంటనే శేఖర్ అనే వ్యక్తిని అడిగారు. శేఖర్ ఎమ్మిగనూరు రోడ్డులో ఉన్న మారుతి వైన్స్ దగ్గర వస్తే ఇస్తానని చెప్పడంతో వెంటనే తండ్రి, కుమారుడు కారులో అక్కడికి చేరుకున్నారు. పార్కింగ్ ప్లేస్లో కారును ఉంచి శేఖర్ దగ్గరకు వెళ్లి రూ.50 వేలు డబ్బు ఇప్పించుకుని తిరిగి వచ్చారు. కారుకు ముందు ఎడమ డోర్ అద్దాన్ని పగలగొట్టి క్యాష్ బోర్డులో పెట్టిన రూ.5 లక్షలు నగదు అపహరణ కావడంతో తండ్రి, కుమారుడు అవాక్కయ్యారు. దీంతో వెంటనే త్రీటౌన్ పోలీస్స్టేషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తండ్రి, కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఎవరైనా వెంబడించారా అనే కోణంలో సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తామని సీఐ తెలిపారు. -
శ్రీశైలంలో స్వచ్ఛంద సేవకు ఆన్లైన్ నమోదు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానంలో స్వచ్ఛంద సేవకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చునని శ్రీశైలం దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం శ్రీశైల దేవస్థాన పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో దేవస్థానంలో శివసేవ బృందాల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈఓ స్వచ్ఛంద సేవకు సంబంధించి పలు సూచనలు చేశారు. శ్రీశైలంలో స్వచ్ఛంద సేవకు ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో బృందాలుగా, లేక వ్యక్తిగతంగా కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. శివసేవకులు సేవను నిర్వహించే సమయంలో దేవస్థానమే తాత్కాలికంగా గుర్తింపుకార్డులను, దేవస్థానం అధికారిక చిహ్నం(లోగో)తో స్కార్ప్ను అందజేస్తుందన్నారు. శివసేవకులకు అవగాహన కార్యక్రమంతో పాటు దేవస్థానం కరదీపికను అందజేస్తుందన్నారు. సమావేశంలో శివసేవకుల విభాగపు ఏఈవో కె.వెంకటేశ్వరరావు, పర్యవేక్షకులు టి.హిమబిందు పాల్గొన్నారు. -
త్వరలో వినూత్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు
మహానంది: వినూత్నమైన కథతో త్వరలో ప్రేక్షకుల మందుకు వస్తున్నట్లు ప్రముఖ సినీ దర్శకుడు తేజ అన్నారు. మహానందీశ్వరుడి దర్శనానికి సోమవారం మహానందికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ కామేశ్వరీదేవి, శ్రీ మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. దర్శనం అనంతరం ఆలయ సూపరింటెండెంట్ అంబటి శశిధర్రెడ్డి, ఆలయ అర్చకులు దర్శకుడు తేజకు స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మంచి చిత్రాలకు ఎప్పుడూ ప్రేక్షకుల్లో ఆదరణ ఉంటుందన్నారు. ఆయన వెంట బొల్లవరం ప్రసాద్, మిత్రులు పాల్గొన్నారు. పలువురు అభిమానులు ఫొటోలు తీసుకున్నారు. -
ప్రతి అర్జీకి స్పష్టమైన పరిష్కారం చూపాలి
నంద్యాల: ప్రజా సమస్యలను సీరియస్గా పరిగణించి ప్రతి అర్జీకి కచ్చితమైన పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్, ఇత ర అధికారులు జిల్లా నలుమూలల నుంచి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అదే విధంగా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్స్ ద్వారా భూ సమస్యలకు సంబంధించి 255 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సమగ్ర కుటుంబ సర్వేను సచివాలయ సిబ్బంది జనవరి నెలాఖరు నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. ఒక్కో సచివాలయ సిబ్బంది ప్రతిరోజూ కనీసం 30 కుటుంబాల సర్వే పూర్తి చేసేలా లక్ష్యాలను నిర్దేశించి, ఆర్డీఓలు, డీఎల్డీఓలు, స్పెషల్ ఆఫీసర్లు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్య క్రమానికి 139 అర్జీలు అందాయని, వీటన్నింటిని సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. -
శ్రీ మఠం పీఠాధిపతికి తులాభారం
మంత్రాలయం: శ్రీ మఠం పీఠాధపతి సుబుధేంద్ర తీర్థులుకు వివిధ రకాల డ్రైఫ్రూట్స్తో సోమవారం తులాభారం చేసి జ్ఞాపికను అందజేశారు. తమ పాదయాత్ర 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భగా సిరుగుప్ప ఆర్యవైశ్య సంఘం వారు శ్రీ మఠం పీఠాధిపతిని సన్మానించారు. శ్రీ రాఘవేంద్ర సర్కిల్ నుంచి ప్రత్యేక ఆలంకరించిన వాహనంలో వాయిద్యాల నడుమ ఊరేగించారు. శ్రీ మఠంలోని యోగీంద్ర కళామండంపంలో ముత్యాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు మట్లాడుతూ..సిరుగప్ప ఆర్యవైశ్య సంఘం 30 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు అభినందనీయమన్నారు. శ్రీ రాఘవేంద్ర స్వాముల ఆశీర్వాదం భక్తులకు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. సిరుగుప్ప ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు హెచ్.జి హనుమంతయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 900 మంది పాల్గొన్నారు. -
సీమ ప్రాజెక్ట్లను తెలంగాణకు తాకట్టుపెట్టారు!
బొమ్మలసత్రం: రాయలసీమ రైతాంగం కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డుకోవడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి విమర్శించారు. సోమ వారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశానికి కాటసానితో పాటు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా, ఎస్ఈసీ సభ్యులు పీపీ నాగిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేశం సుధాకర్రెడ్డి, రాయలసీమ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వంగాల భరత్కుమార్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్, సూర్యనారాయణరెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ శశికళారెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో కాట సాని రాంభూపాల్రెడ్డి.. మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో కలిసి చంద్రబాబునాయుడు రాయలసీమకు తీవ్ర అన్యాయం చేశారన్నా రు. ఆయన సొంత ప్రయోజనాల కోసం సీమ ప్రాంతానికి వెన్నుపోటు పొడవడం బాధాకరమన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజక్ట్ పనులను చంద్రబాబు రహస్య ఒప్పందం చేసుకొని అడ్డుపడటం సరైందికాదన్నారు. ఈనెల 3వ తేదీ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యలతో చంద్రబాబు ద్వంద వైఖరి బయటపడిందన్నారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టిన ఘటన బాబుకే దక్కుతుందన్నారు. గతంలో పోలవరం ప్రాజెక్ట్లో కమీషన్ల కోసం కక్కుర్తి పడి ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టారని, ఇప్పుడు స్వార్థ ప్రయోజనాల కోసం రాయలసీమ పథకాన్ని అడ్డుకున్నారన్నారు. తెలంగాణలో శ్రీశైలం నుంచి 798 అడుగుల నుంచే విద్యుత్ ఉత్పత్తి ద్వారా నీటిని కిందకు వదిలేస్తోందని, అంతేకాకుండా శ్రీశైలం నుంచి 800 అడుగుల నుంచే నీళ్లు ఎత్తిపోసేందు కు పలు ప్రాజెక్ట్లు చేపట్టారన్నారు. వారిని చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. 2019కి ముందు చంద్రబాబు ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలోనే తెలంగాణ వైపు పాలమూరు, రంగారెడ్డి లాంటి పలు ప్రాజెక్ట్ల ద్వారా శ్రీశైలం నీటిని తరలించే పనులు ప్రారంభమయ్యాయన్నారు. వీటిని ప్రశ్నిస్తే ఓటుకు కోట్లు కేసులో అరెస్ట్ చేస్తారో అన్న భయంతో బాబు రాష్ట్రానికి పారిపోయి వచ్చారన్నారు. 2019 తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో రాయలసీమ తాగు, సాగు నీటి అవసరాల కోసం పలు ప్రాజెక్ట్ల నిర్మాణాలను మొదలుపెట్టారన్నారు. ప్రాజెక్ట్లపై నిద్రిస్తే నేల తడవదు.. ప్రాజెక్ట్లపై నిద్రించి రాష్ట్రానికి మేలు చేశానని చెబుతున్న సీఎం చంద్రబాబు ఇంతవరకూ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేసిన దాఖాలాలు లేవని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో శ్రీశైలం నుంచి కేవలం 5 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తుండగా దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ హయాంలో 11 వేల క్యూసెక్కులు పెంచారన్నారు. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏకంగా 44 వేల క్యూసెక్కుల నీరు తరలించేలా కృషి చేశారని కొనియాడారు. కృష్ణా జలాలను ఒడిసి పట్టి ప్రజలకు నీరు అందించాలన్న లక్ష్యంతో మాజీ వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజోలి, జోళదరాశి ప్రాజెక్ట్ల నిర్మాణం కోసం భూసేకరణ పనులు కూడా పూర్తి చేశారన్నారు. ఓటుకు కోట్లు కేసులకు భయ పడి చంద్రబాబు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతలపై బయటపడిన బాబు ద్వంద్వవైఖరి దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ వల్లే సీమకు ప్రాజెక్ట్లు సాగునీటి కోసం పార్టీలకతీతంగా ఉద్యమించాలి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి -
కాపురం చేయాలంటే అదనపు కట్నం ఇవ్వాలట
● జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్కు బాధితురాలి ఫిర్యాదునంద్యాల: కాపురం చేయాలంటే అదనపు కట్నం ఇవ్వాలని తన భర్త వేధిస్తున్నాడని గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన ఓ మహిళ జిల్లా ఎస్పీ సురేష్ షెరాన్కు ఫిర్యాదు చేశారు. విచారించి న్యాయం చేయాలని ఆమె కోరారు. సోమవారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఎస్పీ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. చట్ట పరిధిలోని సమస్యలకు తక్షణమే గడువు లోపల పరిష్కరించాలన్నారు. ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్లో వచ్చిన 78 సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
గట్టెక్కని లైనింగ్ పనులు!
జీరో గేటు సమీపంలో కోతకు గురైన కరకట్ట నిలిచిపోయిన కాంక్రీట్ పనులుపాణ్యం: జీఎన్ఎస్ఎస్ (గాలేరు నగరి సుజల స్రవంతి)లో పెండింగ్ పనులు అలాగే ఉండిపోయాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జీఎన్ఎస్ఎస్ కాల్వ జీరో నుంచి అవుకు టన్నెల్ వరకు 57.7 కిలోమీటర్ల దూరానికి లైనింగ్ చేసేందుకు టన్నల్ మినహాయించి దాదాపుగా రూ. 650 కోట్ల నిధులను విడుదల చేసింది. అప్పట్లో జీరో నుంచి బనగానపల్లె వరకు దాదాపుగా 70 శాతంపైగా లైనింగ్ పనులు పూర్తి అయ్యాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తట్టెడు మట్టిని వేయలేదు. సీమకు తలమానికంగా ఉన్న గాలేరు– నగరి కాల్వ లైనింగ్ పనులు పూర్తి అయితే 30వేల క్యూసెక్కుల వరకు కృష్ణా జలాలను తరలించే అవకాశం ఉంది. ఇందుకు లైనింగ్ పనులు పూర్తి చేయాలి. ప్రస్తుతం గాలేరు ప్రారంభమయ్యే జీరో రెగ్యులేటర్ నుంచి రెండు కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు చేయలేదు. ఫలితంగా కరకట్ట కోతకు గురవుతోంది. కాల్వలకు 20వేల క్యూసెక్కుల నీరు వదలడంతోనే ఈ ప్రవాహానికి లైనింగ్ లేని కారణంగా అటు ఇటు కరకట్ట కోతకు గురై మరింత విస్తరిస్తుంది. దీంతో కట్టపై వెళ్లే రైతులు భయాందోళనకు గురవుతున్నారు. జీఎన్ఎస్ఎస్ కాల్వలో అటు, ఇటు లైనింగ్ పనులతో పాటు కాంక్రీట్ వాల్ పనులు కూడా నిలిచిపోయాయి. అధికారులు పరిశీలించిన త్వరగా లైనింగ్ పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. -
వీరి రాత పక్కన మెడికల్షాపునకు ఎరుక
కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్లో ఉన్న పలువురు వైద్యుల ప్రిస్కిప్షన్ ఎవ్వరికీ అర్థం కాని రీతిలో ఉంటున్నాయి. ఓ కార్డియాలజిస్టు ప్రిస్కిప్షన్ చూస్తే ఈసీజీ గ్రాఫ్లా కనిపిస్తుంది. దానిని చూసి అర్థం చేసుకుని అక్కడే ఉన్న మెడికల్షాపు వారు మందులు తీసి ఇస్తారు. అక్కడ తప్ప ఆ మందులు బయట ఎక్కడా లభించవు. అలాగే గాయత్రి ఎస్టేట్లోని ఓ న్యూరోసర్జన్ సైతం ఇదే విధంగా మందులు రాస్తున్నారు. అక్కడే ఉన్న ఓ జనరల్ సర్జన్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు, లంగ్ స్పెషలిస్ట్, ఆర్థోపెడిక్ సర్జన్, ఈఎన్టీ, గైనకాలజిస్టు, న్యూరాలజిస్టు, యురాలజిస్టు, కొత్త బస్టాండ్ ప్రాంతంలోని పలు ఆసుపత్రులు, ఎన్ఆర్ పేటలోని పలువురు వైద్యులు రాసే ప్రిస్కిప్షన్లు ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్నాయి. ఇటీవల బ్రాండెడ్ మందుల స్థానంలో స్థానికంగా తయారయ్యే మందులు అధికంగా వస్తున్నాయి. వాటిని రాస్తే అధికంగా లాభాలు వస్తాయన్న ఆశతో పలువురు వైద్యులు ప్రిస్కిప్షన్ రూపంలో ఇలా తప్పుడు గీతలు గీసి రోగుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఒక డాక్టర్ రాసిన మందుల చీటి -
జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కామేశ్వరరెడ్డి
నంద్యాల(అర్బన్): జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కామేశ్వరరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రామచంద్రారావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు.. ఆదివారం స్థానిక నిశాంత్ భవన్లో నంద్యాల జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. సంఘంలో మొత్తం 21 పోస్టులకు 21 మంది అభ్యర్థులు మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో అందరూ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి నాగరాజు తెలిపారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శులు కామేశ్వరరెడ్డి, రామచంద్రారావులు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి రెండవ సారి తమను జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నుకోవడం అభినందనీయమన్నారు. అసోసియేషన్ సభ్యుల సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎన్నికై న వారిలో సహ అధ్యక్షులుగా ప్రసాద్బాబు, ఉపాధ్యక్షులుగా సత్యదీప్, మధుసూదన్, స్వప్న, రబ్బాని, కోశాధికారిగా నాగరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఏ రామచంద్రారావు, సంయుక్త కార్యదర్శిగా రామసంజీవరావు, శ్రీనివాసరెడ్డి, సురేష్నాయుడు, అల్లాబకాష్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా చంద్రానాయక్, కార్యనిర్వాహక సభ్యులుగా నాగాంజనేయులు, వెంకటరమణ, బ్రహ్మం, మహేష్కుమార్, అనూష, అరవింద్, కొండారెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికై న సభ్యులను పలువురు సన్మానించారు. -
నేడు నీలకంఠుడి మహా రథోత్సవం
ఎమ్మిగనూరుటౌన్: శ్రీ నీలకంఠేశ్వర స్వామి మహారథోత్సవం సోమవారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు నిర్వహించనున్నారు. వేడుకల్లో భాగంగా ఆలయం నుంచి పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను మేళతాళాలతో పూర్ణకుంభంతో తేరుబజారులోని రథశాల వద్దకు తీసుకురానున్నారు. హోమం, విశిష్ట పూజలు చేసిన అనంతరం మహారథంపై ఉత్సవమూర్తిని అధిష్టింపజేసి ఉత్సవం నిర్వహించనున్నారు. ఆలయ ధర్మకర్త నీలమురళీధర్ ఆధ్వర్యంలో మహారథానికి ఆదివారం తుదిమెరుగులు దిద్దారు. శనివారం రాత్రే పార్వతీపరమేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని జరిపారు. భక్తిశ్రద్ధలతో ఆదివారం రాత్రి 9 నుంచి 12గంటల వరకు ప్రభావళి మహోత్సవాన్ని నిర్వహించారు. -
మారని రోగుల తలరాత!
మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం రోగులకు వైద్యులు రాసే ప్రిస్కిప్షన్ పెద్ద అక్షరాలతో, జనరిక్ నేమ్తో రా యాలి. అది కూడా ఏ మందు, ఎప్పుడు, ఎలా వాడాలో కూడా స్థానిక భాషలో రాసి ఉండాలి. అలా గాకుండా ఇష్టమొచ్చినట్లు, ఎవ్వరికీ అర్థంగానట్లు రాస్తే అలాంటి వైద్యులపై మెడికల్ కౌన్సిల్కు ఫిర్యాదు చేయవచ్చు. – డాక్టర్ ఎస్వీ రామమోహన్రెడ్డి, ఐఎంఏ కార్యదర్శి, కర్నూలు కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 200కు పైగా ప్రైవేటు ఆసుపత్రులు, వెయ్యికి పైగా క్లినిక్లు పనిచేస్తున్నాయి. ఆయా ఆసుపత్రులోని వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులకు అర్థమయ్యేరీతిలో మందుల చీటిని రాసివ్వాలి. ఆ మందుల చీటి పట్టుకుని ఏ మెడికల్షాపునకు వెళ్లినా వారు అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా మందులు ఇచ్చేలా ఉండాలి. కానీ కొందరు వైద్యులు గజిబిజి రాతతో రోగులను తికమకపెడుతున్నారు. మందులను స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా, పెద్ద అక్షరాలతో రాయా లని ఉన్నా పలువురు వైద్యులు ఆచరించడం లేదు. వారు రాసిన మందులు అటాచ్డ్ కౌంటర్(డాక్టర్ క్లినిక్లో ఉండే మెడికల్షాప్)లో మాత్రమే అర్హమయ్యేలా మందులు రాస్తున్నారు. అక్కడ తప్ప ఆ చీటి తీసుకుని దేశమంతా తిరిగినా మందులు లభించని విధంగా ఉంటున్నాయి. ఒక్కసారి ఆ వైద్యుని వద్దకు వెళ్లిన రోగి మళ్లీ అదే డాక్టర్ వద్దకు వెళ్లి, అక్కడి మెడికల్షాపులోనే మందులు తీసుకునేలా వైద్యంతో వ్యాపారం చేస్తున్నారు. జాతీయ వైద్య కౌన్సిల్ చెప్పినా! మందుల వివరాలను వైద్యులు స్పష్టంగా రాయాల్సిందేనని నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇటీవల మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వైద్య విద్య సంచాలకులతో పాటు అన్ని వైద్య కళాశాలల ప్రిన్సిపల్లు, డైరెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రతి బోధనాసుపత్రిలో తప్పనిసరిగా ‘డ్రగ్స్ థెరప్యూటిక్స్ కమిటి(డీటీసీ) ఏర్పాటు చేసి తాము జారీ చేసిన ఆదేశాలు అమలయ్యేలా చూడాలని అందులో సూచించింది. వైద్యులు స్పష్టమైన చేతి రాతతో చీటిపై మందులు రాయాలని, ఈ మేరకు గత యేడాది ఆగష్టులో పంజాబ్, హరియాణా హైకోర్టు తీర్పునిచ్చిన అంశాన్ని గుర్తు చేసింది. మందుల చీటిపై స్పష్టమైన రాత అన్నది రాజ్యాంగంలో ఆర్టికల్ 21కి లోబడి ఆరోగ్యహక్కు(రైట్ టు హెల్త్)కిందకు వస్తుందని ఈ కోర్టు పేర్కొందని వివరించింది. ఎన్ఎంసీ, ఎంసీఐలు వైద్యుల చేతి రాత గురించి పదే పదే ఆదేశించినా డాక్టర్లలో మార్పు రావడం లేదు. తమను ఎవరేమి చేస్తారులే అన్న చందంగా వారు నిర్భీతిగా వ్యవహరించడం గమనార్హం. స్పష్టంగా రాయకపోతే ఇబ్బందులు డాక్టర్ ప్రిష్క్రిప్షన్ ఒక్కోసారి మెడికల్షాపు వారికే అర్థం గాక ఒక మందు బదులు, ఒక డోసు బదులు ఇంకో డోసు మందులు ఇచ్చే అవకాశం ఉంది. ఇలాంటి మందులు వేసుకోవడం వల్ల రోగికి సైడ్ ఎఫెక్ట్స్ ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ఈ పరిస్థితి ప్రాణాంతకంగా మారుతుంది. కాగా మరికొందరు వైద్యులు మందుల చీటిలో మందుల కింద ఏ మందు ఎన్ని పూటలు, ఎలా వాడాలో తెలుగులో స్పష్టంగా రాసేవారు. కానీ ఇప్పుడు బీడీ, ఓడీ, టీఐడీ అంటూ రాస్తున్నారు. వైద్యపరిభాషలో తెలిసిన వారికి మాత్ర మే ఇలాంటి పదాలకు అర్థం తెలుస్తుంది. సామాన్య ప్రజలకు ఇవి అర్థం కావు. అర్థం కాని వైద్యుల ప్రిష్క్రిప్షన్ బీడీ, ఓడి, టీఐడీ అంటూ సామాన్యులకు అర్థం కాని గీతలు మందులు ఎలా వాడాలో స్పష్టంగా రాయని డాక్టర్లు ఎన్ఎంసీ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చెప్పినా వినని వైనం చర్యలు లేకపోవడంతో కొందరు వైద్యుల ఇష్టారాజ్యం -
ప్రాణం తీసిన అప్పులు
మహానంది: నందిపల్లె గ్రామానికి చెందిన రైతు సద్దల రామపుల్లయ్య (44)ను అప్పులు మింగేశాయి. ఎస్ఐ రామ్మోహన్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన సద్దల రామపుల్లయ్య సుమారు పది ఎకరాల్లో వరి, ఇతర పంటలను సాగు చేశాడు. ఇటీవల కాలంలో అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని దిగుబడులు తగ్గి తీవ్ర నష్టాలు చవిచూశాడు. దీంతో అప్పులు ఎక్కువ కావడంతో బ్యాంకుల్లో బంగారు పెట్టి తీసుకున్న రుణంతో పాటు బయట తీసుకున్న అప్పులన్నీ కలిపి సుమారు రూ. 15 లక్షలకు పైగా ఉన్నాయి. ఈ మేరకు అప్పులు ఎక్కువ కావడంతో తీర్చలేనన్న మనస్తాపంతో శనివారం గడ్డిమందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు కర్నూ లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక ఆదివారం మృతి చెందినట్లు ఎస్ఐ రామ్మోహన్రెడ్డి తెలిపారు. మృతుడి భార్య పద్మావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహానిన బంధువులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. -
స్వామికే శఠగోపం!
● స్వామి వెండి ఆభరణాలు అపహరణ ● ఆలయ పూజారి, రిటైర్డ్ ఈఓ అరెస్ట్ ● 5.80 కిలోల వెండి స్వాధీనం ఆళ్లగడ్డ: స్వామి పూజల్లో తరించాల్సిన అర్చకుడు, ఆలయ అభివృద్ధికి పాటు పడాల్సిన అధికారి చివరకు స్వామి వారి వెండి ఆభరణాలపై కన్నేశారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేరులే అనుకు న్నారే ఏమో.. కానీ స్వామి వారి నగలను అదును చూసి ఊరి దాటించి అమ్మేశారు. ఉత్సవాల సమయంలో దేవుడికి ఆభరణాలు అలంకరించకపోవ డంతో గ్రామస్తులకు అనుమానం వచ్చి నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చాగలమర్రి మండలం మద్దూరు గ్రామంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి స్వామి వారి ఆభరణాలను అపహరించిన ఆలయ పూజారి, రిటైర్ట్ ఈఓను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఎస్పీ సునీల్ షెరాన్ విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. మద్దూరు గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయా నికి ఎంతో విశిష్టత ఉంది. గతనెల 30వ తేదీన వైకుంఠ ఏకాదశి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించా రు. అయితే ఆ రోజు ఆలయ పూజారి కృష్ణకిషోర్ స్వామికి ఆభరణాలు అలంకరించకపోవడంతో గ్రా మస్తులు నిలదీశారు. సమాధానం చెప్పలేక పూజా రి పరారయ్యాడు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆలయ పూజరి కృష్ణకిషోర్, రిటైర్డ్ ఈఓ నరసయ్య తో పాటు ఆభరణాలను కొనుగోలు చేసిన ఆళ్లగడ్డ బంగారు నగల వ్యాపారి దూదేకుల పెద్ద ముసేనయ్యను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ మాట్లాడుతూ.. నిందితుల నుంచి రూ.14.76 లక్షల విలువైన 5.80 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఎస్పీ ప్రమోద్, సీఐ రమణ ఉన్నారు. -
వేపచెట్లకూ కష్టమొచ్చింది!
కర్నూలు(అగ్రికల్చర్): దాదాపు అన్ని రకాల పంటలకు సోకే చీడపీడలు, పురుగుల నివారణకు వేప ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. సహజంగా వేప చెట్లకు చీడపీడలు, పురుగుల బెడద ఉండదు. ప్రతి రోజు నాలుగైదు లేత వేపాకులు తినడంతో ఆరో గ్యం కాపాడుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు. అపర సంజీవనిగా చెప్పుకునే వేప చెట్లకూ ప్రస్తుతం కష్టం వచ్చింది. ఎవరో కాల్చేసినట్లుగా చెట్లు ఎండిపోతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. టి మస్కిటో బగ్ అనే పురుగు వేపచెట్లకు హాని కలిగిస్తోంది. ఈ పురుగు 2021, 2022 సంవత్సరాల్లో వేప చెట్లపై విజృంభించింది. అప్పట్లో కూడా చెట్లు ఎండిపోయాయి. అయితే తర్వాతి కాలంలో మళ్లీ కోలుకున్నాయి. ఇప్పుడు కొద్ది నెలలుగా ఇదే పురుగు మళ్లీ దాడిచేస్తోంది. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో ఈ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. -
నేడు కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ
నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 5వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీ దారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov. in వెబ్సైట్లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియో గించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9.30 గంటలకు అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. తుంగభద్ర నదిని కాపాడుకుందాం మంత్రాలయం రూరల్: కలుషితం కాకుండా తుంగభద్ర నదిని కాపాడుకుందామని బసవరాజ్ పాటిల్ అన్నారు. జల జాగృతి యాత్ర డిసెంబర్ 27న గంగావతి దగ్గర కిష్కంద దగ్గర నుంచి ప్రారంభమై ఆదివారం మంత్రాలయానికి చేరుకుంది. ఈ సందర్భంగ ఆనిర్మల తుంగభద్ర అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్రస్వామికి, మంత్రాయం ఎమ్మెల్యేకు బాలనాగిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆనంద్మల్లిగౌడ మాట్లాడుతూ.. తుంగభద్ర నది రక్షణే మన లక్ష్యం, భావితరాల క్షేమం అన్నారు. డాక్టర్ శివకుమార్ పాటిల్, లలిత రాణి బొల్లిశెట్టి సత్యనారాయణ, బసవరాజు పాటిల్, జగన్నాథ్, చల్లా వరుణ్, పర్యావరణ ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు. కలెక్టర్, జేసీలకు లగ్జరీ కార్లు కర్నూలు(సెంట్రల్): కలెక్టర్, జేసీల కాన్వాయ్ కోసం రెండు లగ్జరీ కార్లను కొనుగోలు చేశారు. ఆదివారమే ఆ కార్లను అదనపు ఫిట్టింగ్లతో షోరూమ్ నుంచి డెలివరీ చేసుకున్నారు. ఒక్కో కారు విలువ రూ.60 లక్షలు. రెండు కార్లకు కలిపి రూ.1.20 కోట్లతో కొనుగోలు చేశారు. కాగా, ఈ కార్ల కొనుగోలుకు వినియోగించిన ఫండ్ వివరాలు తెలియలేదు. కిసాన్ మేళానుసద్వినియోగం చేసుకోండి కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల ప్రాంతీయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానంలో ఈ నెల 6వ తేదీన పెద్ద ఎత్తున కిసాన్మేళా జరుగుతుందని కర్నూలు ఏరువాక కేంద్రం ప్రదాన శాస్త్రవేత్త సుజాతమ్మ తెలిపారు. ఇందులో ప్రదానంగా మెట్ట వ్యవసాయం– ఆధునిక వ్యవసాయ పద్ధతులు అనే అంశంపై అవగాహన కల్పించనున్నట్లు ఆమె ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ పంటల్లో యాంత్రీకరణ ఎలా వినియోగించుకోవచ్చు. మెట్ట వ్యవసాయంలో పాటించాల్సిన ఆధునిక యాజమాన్య పద్ధతులపై ప్రదర్శన ఉంటుందని తెలిపారు. కిసాన్మేళాలో కర్నూలు జిల్లా రైతులు కూడా పాల్గొనవచ్చని సూచించారు. ఆదోని జిల్లా కోసం పాదయాత్ర ఆదోని టౌన్: ఆదోని జిల్లా అయ్యేంత వరకు ఉద్యమం చేస్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. వీరు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారంతో 50 రోజులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆదోనిలోని రీలే దీక్షల శిబిరం నుంచి ఇస్వీ గ్రామం వద్ద నారా లోకేష్ యువగళం పాదయాత్ర వెయ్యి కి.మీ. స్మారక స్థూపం వద్దకు 300 మంది పాదయాత్ర చేపట్టారు. ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాలని స్థూపానికి వినతి పత్రం అందించారు. జేఏసీ నాయకులు రఘురామయ్య, అశోకానందరెడ్డి, నూర్అహ్మద్, కృష్ణమూర్తిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అహోబిలంలో ధనుర్మాస పూజలు
ఆళ్లగడ్డ: దిగువ అహోబిలంలో ధనుర్మాస పూజలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవ మూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వామి తోపాటు శ్రీ గోదాదేవి అమ్మవారిని యాగశాలలో కొలువుంచారు. పండితుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ కనుల పండుగగా నవకలశ స్థాపన, పంచామృతాభిషేకం, తిరుమంజనం, అర్చన నిర్వహించారు. ఉత్సవమూర్తులను నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం ఉత్సవమూర్తి గోదాదేవి అమ్మవారిని మూలవిరాట్ గోదాదేవి అమ్మ వారి సన్నిధికి తోడ్కొని వచ్చి కొలువుంచారు. సాయంత్రం ఉత్సవం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఫిబ్రవరి 8 నుంచి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 8 నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. దేవస్థాన పరిపాలన భవనంలోని శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మహాశివరాత్రి బ్రహ్మోత్సవ పనులు వేగవంతంగా పూర్తి నాత్యతతో చేయాలన్నారు. గతేడాది కంటే 20 నుంచి 30శాతం అదనపు ఏర్పాట్లు ఉండాలన్నారు. పాదయాత్రతో వచ్చే భక్తుల సౌకర్యార్థం నాగలూటి, పెద్దచెర్వు, భీమునికొలను, కై లాసద్వారం, సాక్షిగణపతి మొదలైన చోట్ల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. క్యూలైన్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, భక్తులు పుణ్యస్నానాలకు పాతాళగంగను తీర్చిదిద్దాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా 30 లడ్డూ కౌంటరుల ఏర్పాటు చేయాలన్నారు. ఉత్తమ గ్రామ పంచాయతీగా కొరటమద్ది గడివేముల: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక్కటి మాత్రమే ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపికై నట్లు ఎంపీడీఓ వాసుదేవగుప్తా, డిప్యూటీ ఎంపీడీఓ మహీధర్రెడ్డి తెలిపారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ గడివేముల మండలంలోని కొరటమద్ది గ్రామ పంచాయతీని కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఉత్తమ పంచాయతీగా ఎంపిక చేసిందన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పారిశుద్ధ్యం, ఇంటి, నీటి పన్నుల వసూళ్లు, వర్మీ కంపోస్టు తయారీ, విక్రయాలు, గ్రామ పంచాయతీకి ఆదాయం చేకూర్చే వనరుల నిర్వహణ, తదితర అన్ని రకాల అభివృద్ధి పనులను పరిగణలోకి తీసుకుని ఈ ఎంపిక చేపట్టినట్లు వెల్లడించారు. ఈనెల 26వ తేదీన ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు హాజరు కావాలని ఉత్తమ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎడమకంటి నాగేశ్వరరెడ్డి దంపతులకు ప్రత్యేక ఆహ్వానం అందిందన్నారు. దళితుల ఇళ్లకు విద్యుత్ తొలగింపు చాగలమర్రి: అదనపు బిల్లులు చెల్లించని దళితుల ఇళ్లకు చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ను తొలగించింది. చాగలమర్రిలోని పాత ఎస్సీ కాలనీకి శనివారం ఉదయం విద్యుత్ శాఖ ఏఈ రమణయ్య ఆధ్వర్యంలో సిబ్బంది వచ్చారు. పాత బకాయిల వసూలు బిల్లులు చెల్లించని వారి ఇళ్లకు విద్యుత్ సరఫరాను తొలగించారు. మీటర్లు ఉన్న దళితుల ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు అందుతుందని, అంతకంటే ఎక్కువ వినియోగిస్తే అదనపు మొత్తం బిల్లులు చెల్లించవలసి ఉందని ఏఈ రమణయ్య తెలిపారు. అదనపు బిల్లులు చాలా కాలం నుంచి చెల్లించక పోవడంతో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు విద్యుత్తు కనెక్షన్లను తొలగించామన్నారు. దళిత కాలనీలో ఉన్న ప్రజలు మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి కోట్ల రూపాయల విద్యుత్తు బిల్లులు బకాయిలున్నా విద్యుత్తు కనెక్షన్లు తొలగించలేదన్నారు. దళితులమని ఉద్దేశంతో తమ ఇళ్లకున్న విద్యుత్తు కనెక్షన్లు తొలగించారరని ఆరోపించారు. -
రమణీయం.. రథోత్సవం
కోసిగి: ఆర్లబండ గ్రామ ప్రజల ఆరాధ్య దైవం అంబా భవాని మహా రథోత్సవం వేలాది మంది భక్తుల మధ్య వైభవంగా సాగింది. శనివారం మాఘ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని వేకువ జామున నుంచి ఆలయ పీఠాధిపతులు శ్రీ మర్రిస్వాముల ఆధ్వర్యంలో అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకాలు, ఆకుపూజ, ఫలపుష్పాలు సమర్పించి వెండి కవచ అలంకరణ గావించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం సంప్రదాయబద్ధంగా గ్రామంలోని మేటి గౌళ్ల ఇంటి నుంచి పూర్ణకుంభాన్ని మేళతాళాలు, డప్పువాయిద్యాలు, కలశాలతో ఊరేగింపుగా ఆలయం చెంతకు చేరుకున్నారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి అక్కడి నుంచి పీఠాధిపతులు శ్రీ మర్రిస్వామి, ఆయన కుమారుడు శ్రీ కృష్ణస్వాములు పూలమాన్పుల మధ్య ఊరేగింపుగా రథశాల వరకు చేరుకున్నారు. అక్కడ రథానికి పూజలు చేసి ఉత్సవమూర్తిని రథంపై కొలువుదీర్చారు. భక్తుల మధ్య మహా రథోత్సవంను అమ్మ వారిని పాదాల చెంత వరకు లాగి తిరిగి యఽథస్థానానికి చేర్చారు. భక్తులు రథోత్సవంలో అరటి పళ్లు విసిరి మొక్కులు తీర్చుకున్నారు. -
ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు అభివృద్ధి విషయంలోనూ అభాసుపాలవుతున్నారు. తాము ఏమి చేశామో చెప్పుకోలేక.. గత ప్రభుత్వంలో చేపట్టిన, కొనసాగుతున్న పనులకు మళ్లీ భూమి పూజ చేస్తూ ప్రజల్లో నవ్వుల పాలవుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో
అదే స్థలం.. ఆయనే పూజారి గతంలో సబ్స్టేషన్ నిర్మాణం చేసేందుకు తీసుకున్న అదే స్థలంలో భూమి పూజ చేయడంతో పాటు అప్పుడు వచ్చిన పూజారి వేద మంత్రోచ్ఛారణలతోనే ఎమ్మెల్యే అఖిలప్రియ మళ్లీ భూమి పూజ చేయించారు. ఈ దృశ్యాలను చూసిన గ్రామస్తులతో పాటు కార్యక్రమానికి హాజరైన టీడీపీ నేతలు సైతం ముక్కున వేలేసుకున్నారు. సాక్షి టాస్క్ఫోర్స్: చంద్రబాబు ప్రభుత్వం గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన కార్యక్రమాల వరుస క్రెడిట్ చోరీకి పాల్పడుతోంది. అధినేత దారిలోనే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కూడా పయనిస్తోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ప్రత్యేక చొరవతో మంజూరైన ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు అప్పట్లోనే భూమిపూజ చేసి నిర్మాణ పనులను మొదలు పెట్టడం, పనులు కూడా చకచకా చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఇదే ఆసుపత్రి భవనాలకు అమ్మ కల అంటూ వారం రోజుల క్రితం తామే మంజూరు చేయించి పనులు పూర్తి చేసినట్లు గొప్పకుపోయి మళ్లీ ప్రారంభించడంతో జనం నవ్వుకున్నారు. ఇది మరువక ముందే తాజాగా శనివారం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయంలోనే భూమిపూజ చేసిన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు హడావుడిగా మళ్లీ భూమి పూజ కార్యక్రమం చేపట్టడం చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. 2024 మార్చి 8న భూమి పూజ గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రుద్రవరం మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా అప్పటి ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డిలు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఆలమూరు, రుద్రవరం సబ్స్టేషన్లలో లోడు మళ్లించే విధంగా తిప్పారెడ్డిపల్లె సమీపంలో 33/11 కెవి విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారు. ఇదే సమయంలో సబ్స్టేషన్ నిర్మాణం చేపట్టేందుకు రైతు స్థలాన్ని దాత రామణయ్యతో మాట్లాడి ఒప్పించారు. ఈ మేరకు 2024 మార్చి 8న సబ్స్టేషన్ నిర్మాణ పనులకు అప్పటి విద్యుత్ శాఖ ఇంజినీర్లు రమణారెడ్డి, రవికాంత్, రాజేశ్, రాఘవేంద్రారెడ్డిలతో భూమి పూజ కూడా చేయించారు. స్తంభాలు కూడా ఏర్పాటు రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అప్పటి ప్రభుత్వం సబ్స్టేషన్ నిర్మాణ పనుల్లో భాగంగా 33/11 స్తంభాలు సుమారు 300 దాకా పాతించడం పూర్తయింది. సబ్స్టేషన్ నిర్మాణ పనులు మొదలు పెట్టేలోగా ఎన్నికల కోడ్ రావడంతో ఆలస్యమైంది. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైనా నిధులు విడుదల చేయకుండా తొక్కిపెట్టి ఇప్పుడు మళ్లీ భూమి పూజ చేయడం ఏంటని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాల విషయంలోనూ అదే ధోరణి పూర్తయిన పనులు తమ ఘనతగా ప్రచారం తాజాగా విద్యుత్ సబ్ స్టేషన్కు భూమి పూజ ఈ పనులు గత ప్రభుత్వంలోనే మొదలు ఇప్పటికే 11కేవీ 300 స్తంభాలు పాతడం పూర్తి నవ్వులపాలవుతున్న టీడీపీ ఎమ్మెల్యే తీరు -
రోడ్లు వేస్తే టీడీపీ నాయకులు వేధిస్తారా?
పాణ్యం: ‘ప్రజలు ఇబ్బంది పడుతున్నారని జెడ్పీ నిధులతో రోడ్లు వేస్తే టీడీపీ నాయకులు వేధిస్తారా’ అంటూ తిరుమలగిరి వాసులు శనివారం పాణ్యం ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. పాణ్యంలో తిరుమలగిరి కాలనీ 15 ఏళ్ల క్రితం ఏర్పడిందన్నారు. కాలనీలో సీసీ రోడ్లు వేయాలని ఇటీవల జెట్పీటీసీ సద్దల సరళమ్మ దృష్టికి తీసుకెళ్లగా రూ.10 లక్షల జెడ్పీ నిధులు కేటాయించారన్నారు. ఈ నిధులతో కాలనీలో సీసీరోడ్లు వేయడంతో స్థానిక టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారని, పదేపదే ప్రభుత్వ కార్యాలయంలోకి వెళ్లి తనిఖీ చేస్తున్నారన్నారు. రోడ్లు ఎందుకు వేశారని ప్రజలను మానసికగా ఇబ్బందులు గురి చేస్తున్నారన్నారు. అనంతరం జెట్పీటీసీ సభ్యులు సద్దల సరళమ్మ, మాజీ జెట్పీటీసీ సద్దల సూర్యనారాయణరెడ్డి, ఎంపీపీ ఉసేన్బీ, సర్పంచ్ మేకల పల్లవిలతో కలిసి కాలనీల వాసులు ఎంపీడీఓ ప్రవీణ్కుమార్కు వినతి పత్రం అందించారు. మరిన్ని కాలనీలో సీసీరోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఇదే విషయమైన సీఐ కిరణ్కుమార్రెడ్డితో కలిశారు. ఇష్టానుసారంగా మమల్ని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని టీడీపీ, ఇతర నాయకులపై కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. -
కాలుష్య నియంత్రణ చట్టాన్ని పాటించాలి
కర్నూలు: పారిశ్రామికవర్గాలు కాలుష్య నియంత్రణ చట్టాన్ని తూచా తప్పకుండా పాటించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సూచించారు. కర్నూలు వెంకటరమణ కాలనీలోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో శనివారం పర్యావరణ ఇంజినీర్ పీవీ కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రైవేటు హాస్పిటల్స్, పరిశ్రమల అధికారులతో పర్యావరణ పరిరక్షణపై సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లీలా వెంకటశేషాద్రి హాజరై మాట్లాడారు. కాలుష్య నివారణ చట్టం ప్రకారం ఫ్యాక్టరీల నుంచి వెలువడే కాలుష్యం నుంచి గాలి నాణ్యతను మెరుగుపర్చడం, కా లుష్యాన్ని నివారించడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశమ న్నారు. అలాగే నీటి కాలుష్య నియంత్రణ చట్టం ప్రకారం పరిశ్రమలు, ఆసుపత్రుల నుంచి వెలువడే వ్యర్థాల వల్ల నీటి కాలుష్యాన్ని నివారించడం, నీటి నాణ్యతను కాపాడటం ముఖ్య ఉద్దేశమన్నారు. పారిశ్రామిక ఉద్గారాలను నియంత్రించడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేసిన ప్రమాణాలను పారిశ్రామిక వర్గాలు పాటించాలన్నారు. పర్యావరణ ఇంజనీర్ పీవీ కిషోర్ రెడ్డి, జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక అధికారి డేనియల్, అసిస్టెంట్ పర్యావరణ ఇంజినీర్ వెంకట సాయికిషోర్, అనలిస్ట్ ఇమ్రాన్, రామ కృష్ణ, పవన్, టీజీవీ ఆల్కాలీస్, రాయలసీమ పరిశ్రమల యజమానులు, దాల్మియా, ద్రోణాచలం ప్రియ, శ్రీజయజ్యోతి, జేఎస్డబ్ల్యూ, రామ్కో సిమెంటు కంపెనీల యజమానులు, జైరాజ్ స్టీల్ కంపెనీ, మెడికవర్, అమీలియో, శ్రీచక్ర, జెమ్కేర్ కామినేని, ఓమినీ హాస్పిటల్ అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఏడాదిన్నరకే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత
● యంబాయి గ్రామస్తులు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరికబేతంచెర్ల: టీడీపీ ప్రభుత్వంపై ఏడాదిన్నర గడవక ముందే ప్రజా వ్యతిరేకత తీవ్రస్థాయిలో కనిపిస్తోందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. శనివారం నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మండలపరిధిలోని యంబాయి గ్రామ సర్పంచ్ యుగంధర్రెడ్డి, ఉప సర్పంచ్ భోగేశ్వరప్ప ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు బొక్కల రామకృష్ణ, నాగన్న, మాబు, చిన్న కిట్టు, తిరుపాలుతో పాటు మరికొందరు వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి మాజీ మంత్రి బుగ్గన పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు వాటిని అమలు చేయకుండా ప్రజా సంక్షేమాన్ని విస్మరించారన్నారు. గోరుకల్లు రిజర్వాయర్ నుంచి రూ.350 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకం కింద నీటిని తీసుకొచ్చి ఎన్నికలకు ముందే బేతంచెర్ల మండలానికి తాగునీరు అందించామన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి ఉంటే 3 నెలల్లో పనులు పూర్తయి బేతంచెర్లతో పాటు డోన్, ప్యాపిలి మండలాలకు తాగునీరు అందేదన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరపైనే అవుతున్నా వాటర్ గ్రిడ్ పథకం పనులు డోన్, ప్యాపిలి మండలాల్లో నత్తనడకన సాగుతున్నాయన్నారు. రూ.36 కోట్లతో నిర్మించిన బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులకు కూర్చోవడానికి బల్లలు, పడుకోవడానికి మంచం, ఉపాధ్యాయులకు కుర్చీలు, ఫర్నిచర్ ఏర్పాటు చేయలేని అసమర్థ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. 90 శాతం పూర్తయిన ప్రభుత్వ భవనాలను మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయడం లేదంటే ఈ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమంపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందన్నారు. యంబా యి గ్రామానికి గతంలో ప్రారంభించిన రహదారి నిర్మాణ పనులు నేటి వరకు చేపట్టకపోవడం ఎంత వరకు సమంజసమన్నారు. డోన్ నియోజకవర్గంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో వేసిన రోడ్లు, అభివృద్ధి పనుల వల్ల భూముల విలువ 3 రెట్లు పెరిగాయన్నారు. ఇప్పటికై నా ప్రజలు గత వైఎస్సార్సీసీ, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వానికి తేడా గమనించాలన్నారు. గ్రామ గ్రామాన టీడీపీ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, సీనియర్ నాయకులు బుగ్గన చంద్రారెడ్డి, మండల కన్వీనర్ తిరుమలేశ్వర్ రెడ్డి, గోరుమానుకొండ సర్పంచ్ కోడె వెంకటేశ్వర్లు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్లో కొండచిలువ
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు సీతారాం నగర్లో ని గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్లోకి శనివారం భారీ కొండ చిలువ కలకలం రేపింది. 30 కిలోల బరువు, 14 అడుగుల పొడవు కలిగిన కొండచిలువను చూసి ఉద్యోగులు, స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. నిత్యం జనసంచారం, వాహనాల రాకపోకలు ఉన్న ప్రింటింగ్ ప్రెస్లోకి కొండ చిలువ ప్రవేశించడం గమనార్హం. ప్రింటింగ్ ప్రెస్కు సమీపంలోనే రైల్వే షెడ్లు ఉన్నాయి. అక్కడి నుంచి పాము ఈ కార్యాలయంలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘమిత్ర అనిమల్ ఫౌండేషన్ వైల్డ్లైఫ్ హెడ్ మహమ్మద్ ఇద్రిస్కు విషయం తెలిపారు. వెంటనే అతను అక్కడికి చేరుకుని చాకచక్యంగా పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నా రు. కొండచిలువకు ఎలాంటి హాని తలపెట్టకుండా అటవీ ప్రాంతంలో వదిలేశారు. సర్పాలపై అవగాహన.. విష, విష రహిత సర్పాలపై సంఘమిత్ర అనిమల్ ఫౌండేషన్ వైల్డ్లైఫ్ హెడ్ మోహమ్మద్ ఇద్రిస్ స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ జాతి పాముల బొమ్మలు కలిగిన బుక్లెట్స్ను ప్రజలకు పంపిణీ చేశారు. నాగుపాము, కట్లపాము, రక్త పింజర, ఇసుకపింజర పాములు మాత్రమే విషపూరితమైనవని, జెర్రిపోతు, నీరుకంటి తదితర పాములు విష రహితమైనవన్నారు. -
తమాషా చేస్తున్నావా.. నీ కథ చూస్తా!
● మహిళా టీడీపీ కార్యకర్తపై నోరు పారేసుకున్న టీడీపీ శ్రీశైలం ఎమ్మెల్యేసాక్షి టాస్క్ఫోర్స్: ‘ఏం తమాషా చేస్తున్నావా.. నీ కథ చూస్తా’ అంటూ నంద్యాల జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి ఓ మహిళా టీడీపీ కార్యకర్తపై నోరు పారేసుకున్నారు. శుక్రవారం బండిఆత్మకూరు మండలంలోని ఏ. కోడూరులో పట్టాదారు పాసు బుక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ కార్తీక్తో పాటు ఎమ్మెల్యే బుడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త భారతి ఎమ్మెల్యేతో తన గోడు వినిపించేందుకు ప్రయత్నం చేసింది. ఒక్కగానొక్క మనవడు గుండె సమస్యతో బాధపడుతుంటే మీరు పట్టించుకోలేదని ప్రశ్నించింది. తన కుమారుడు వచ్చి గుండె ఆపరేషన్ కోసం డబ్బులు లేక సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకుంటే కనీసం ఆ పేపర్లు కూడా ముట్టుకోలేదని వాపోయింది. తన ఇంటిపైన నిలబడి టీడీపీ జెండా కట్టించానని, ఇంత చేస్తే మీరు ఏమి చేశారని నిలదీసింది. ఇందుకు ఎమ్మెల్యే గట్టిగా నోరు చేసుకుంటూ 50 మందిలో ఓ ఎమ్మెల్యేను నిలదీస్తే గొప్ప అనుకుంటున్నావా, నన్ను ఎవరనుకుంటున్నావు, ఏంది నీ కమాండింగ్.. అని బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. పక్కనున్న నాయకులు ఆమెకు సర్దిచెప్పబోగా టీడీపీ జెండా కట్టిన నాకు ఆ బాధ తెలుస్తుందని, మీరేంది అడ్డుకునేదని చెప్పడంతో అక్కడ రసాభాస చోటు చేసుకుంది. సాయం కోసం వస్తే మీ ఇంటి మెట్లు కూడా ఎక్కనివ్వరని చెప్పగా, నేను ఎప్పుడూ అలా చేయలేదని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. తన కొడుకు సాయం కోసమే మీ ఇంటికి వచ్చాడని, అప్పుడేం చేశారని.. మీ వల్లే తన మనవడు చనిపోయాడని ఆరోపించింది. ఇంతలో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే ఏం తమాషా చేస్తున్నావా.. నీ కథ చూస్తా.. అనడంతో అక్కడున్న అధికారులతో పాటు కార్యక్రమానికి హాజరైన టీడీపీ శ్రేణులు, గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. అయితే ఆమె కూడా అదేస్థాయిలో ఏం చంపుతావా అని గట్టిగానే సమాధానమివ్వడం గమనార్హం. ఇటీవల ఓ ఫారెస్టు అధికారిపైన చేయి చేసుకోవడం, ఇప్పుడు తమ పార్టీకే చెందిన మహిళా కార్యకర్తపై నోరు పారేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. ఈ ప్రభుత్వంలో ఎవరు ప్రశ్నించినా, తమ బాధలు చెప్పుకున్నా ప్రతిపక్ష పార్టీ తరహాలోనే టీడీపీ నాయకులు వ్యవహరిస్తుండటం గమనార్హం. -
తప్పుల తడకగా పాస్ పుస్తకాలు
కొలిమిగుండ్ల: రాజ ముద్ర పేరుతో చంద్రబాబు ప్రభుత్వం రైతులకు పంపిణీ చేస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాల్లో భూముల వివరాలు తప్పుల తడకగా ఉన్నాయని రైతులు వాపోతున్నారు. శుక్రవారం మీర్జాపురంలో రెవెన్యూ అధికారులు గ్రామ సభ నిర్వహించి పాస్ పుస్తకాల పంపిణీ చేశారు. బుక్లో చూసే సరికి చాలా లోపాలు దర్శనమిచ్చాయి. గ్రామానికి చెందిన గువ్వల శ్రీకాంత్రెడ్డి అనే రైతుకు 103/68 సర్వే నంబర్లో 6.70 ఎకరాల భూమి ఉంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అంతే భూమితో కూడిన పాస్ పుస్తకం ఇచ్చారు. ఇప్పుడేమో రాజముద్ర ముద్రించి ఇచ్చిన కొత్త బుక్లో 6.12 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు చూపుతుందని రైతు వాపోయాడు. గ్రామంలో పలువురి రైతులకు చెందిన పొలాల విస్తీర్ణంలో చాలా తేడాలు వచ్చాయని రెవెన్యూ సిబ్బందిని నిలదీశారు. కొత్తగా ఈ ప్రభుత్వం చేసింది ఏమి అని రైతులు ప్రశ్నించారు. విస్తీర్ణం తక్కువగా ఉన్న రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని రెవెన్యూ అధికారులు సూచించారు. -
శ్రీగిరి.. ఓంకార ఝరి
● శ్రీశైల మల్లన్నకు వైభవంగా వార్షిక ఆరుద్రోత్సవంశ్రీశైలంటెంపుల్: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం ఓంకార నాదంతో ప్రతిధ్వనించింది. ధనుర్మాసంలో వచ్చే ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని శనివారం మల్లికార్జున స్వామివారికి వార్షిక ఆరుద్రోత్సవం నిర్వహించారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి అర్చకులు స్వామివారికి మహాన్యాసపూర్వక లింగోద్భవకాల ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, బిల్వార్చన, పుష్పార్చన పూజలు జరిపారు. శనివారం వేకువజామున స్వామివార్ల ప్రాతఃకాల పూజల అనంతరం నందివాహనసేవ, గ్రామోత్సవం నిర్వహించారు క్షేత్ర ప్రధాన వీధుల్లో గ్రామోత్సవం ఆరుద్రోత్సవంలో భాగంగా శనివారం వేకువజామున స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను స్వామివారి ఆలయ ముఖమండపంలో ఉత్తరముఖంగా అధిష్టింపచేశారు. ప్రత్యేక పూజలు అనంతరం శివాజీగోపుర ద్వార మండపంలో ఉత్తరముఖంగా కొలువుంచారు. భక్తులకు ఉత్సవమూర్తుల ఉత్తరద్వార దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ ఉత్తరభాగంలోనే నందివాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు జరిపారు. క్షేత్ర ప్రధాన వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. ఉత్సవంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, స్వామివారి ఆలయ ప్రధానార్చకులు హెచ్.వీరయ్యస్వామి, స్థానాచార్యులు ఎం.పూర్ణానంద ఆరాధ్యులు, సీనియర్ వేదపండితులు గంటి రాధాకృష్ణశర్మ, ఆలయ పర్యవేక్షకులు, సీఎస్వో, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అప్పుల భారంతో ఆత్మహత్య
కోసిగి: వందగల్లు గ్రామానికి చెందిన కోసిగి రామాంజనేయులు(28) అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రామాంజనేయులు, భార్య నాగతేజ వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్నారు. కాగా అప్పుల భారంతో మానసిక ఒత్తిడికి గురై గత నెల 31వ తేదీన గ్రామ శివారులోని పొలంలో పురుగు మందు తాగి అపస్మారక స్థితితో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడ కోలుకోలేక శనివారం ఉదయం మృతి చెందాడు. మృతుడు తండ్రి పెద్ద నరసప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ రెడ్డి తెలిపారు. -
టీడీపీ నేత దాడి
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ● ఇద్దరికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు ● న్యూ ఇయర్ వేడుకల్లో బైక్ ర్యాలీ చేశారని కక్ష నందవరం: అధికార దర్పంతో టీడీపీ నాయకులు ఊరూరా బరితెగిస్తున్నారు. పోలీసుల అండతో దాడులకు తెగబడుతున్నారు. కనకవీడు గ్రామానికి చెందిన ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేత దాడికి పాల్పడ్డాడు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా గురువారం కనకవీడు గ్రామానికి చెందిన వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి తమ నేతలకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఎమ్మిగనూరుకు బయలు దేరారు. గ్రామంలో ర్యాలీ చేస్తుండగా టీడీపీ నాయకుడు బోయ ఈరన్న కావాలనే అడ్డంకులు సృష్టిస్తూ టీడీపీ జెండా ఎగరవేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. అయినా వైఎస్సార్సీపీ కార్యకర్తలు గొడవకు దూరంగా ఉంటూ సజావుగా ర్యాలీ చేశారు. ఈ విషయంలో కక్ష పెంచుకున్న బోయ ఈరన్న శనివారం గ్రామంలో ఉదయం వైఎస్సార్సీపీ కార్యకర్త కురవ విరుపాక్షిపై దొడ్డు కర్రతో దాడి చేశాడు. దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన విరూపాక్షి బావమరిది కురవ సూరి తలపై కొట్టాడు. దాడిలో గాయపడిన వారిని స్థానికులు ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు హెడ్కానిస్టేబుల్ సుభాన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. అధైర్య పడొద్దు : ఎర్రకోట రాజీవ్రెడ్డి ప్రతి కార్యకర్తకు, నాయకుడికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని వైఎస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తలను ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు ఓర్వలేకనే తమ కార్యకర్తలపై దాడి చేశారని విమర్శించారు. నిందితులను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి గడ్డం నారాయణ రెడ్డి, నాయకులు పెద్ద ఈరన్న, కురవ గోవిందు, చంద్రబాబు, నరసింహులు, స్వామిదాసు, వెంకటరాముడు, బోయ రాజు, కురవ రంగస్వామి, శివ, రామలింగడు, ఈరన్న, మత్తయ్య, సిమెన్ ఉన్నారు. -
కృషి, పట్టుదలతో విజయం
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల(అర్బన్): కృషి, పట్టుదల ఉంటే విద్యార్థులు విజయం సాధించి ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. బొమ్మలసత్రం సమీపంలోని ఏపీ మోడల్ స్కూల్ను శనివారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి, వారి అభ్యసన స్థాయిపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. జిల్లాలోని 281 పాఠశాలల్లో పదో తరగతి పరీక్షల ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. తనకు కేటాయించిన ఏపీ మోడల్ స్కూల్ను సందర్శించానన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పాఠశాలలో సేవలందిస్తున్న మహిళా ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ సన్మానించారు. డీఈఓ జనార్దన్ రెడ్డి, ఎస్ఎస్ఏ పీఓ నిత్యానంద రాజు, ప్రిన్సిపాల్ పీఎన్ మల్లికార్జునప్ప పాల్గొన్నారు. -
అదనంగా వసూలు చేసిన డబ్బులు వెనక్కి
సాక్షి టాస్క్ఫోర్స్: యూరియా విక్రయాల్లో అదనంగా వసూలు చేసిన డబ్బును రైతులకు అధికారులు వెనక్కి ఇప్పించారు. ‘ఓరి నాయనో..యూరియా లేదంట’ అనే శీర్షికన సాక్షి దినపత్రికలో శుక్రవారం వచ్చిన వార్తకు అధికారులు స్పందించారు. హనుమంతుగుండం సొసైటీ వద్దకు వచ్చి వ్యవసాయ శాఖ కోవెలకుంట్ల ఏడీ సుధాకర్రెడ్డి, కొలిమిగుండ్ల ఏఓ శారదాదేవి విచారణ జరిపారు. సొసైటీ చైర్మన్ యూరియాపై అధికంగా వసూలు చేసినట్లు తేలింది. సొసైటీ పరిధిలోని గ్రామాల రైతులను సమావేశ పర్చి అదనంగా వసూలు చేసిన రూ.12,236,60, నానో డీఏపీలకు సంబంధించిన రూ.30 వేలను రైతులకు తిరిగి వెనక్కి ఇచ్చేశారు. -
పోలీసు అండతోనే దాడులు
● ఫిర్యాదు చేసినా స్పందించని పోలీసులు ● టీడీపీ అరాచకాలపై 5న జిల్లా ఎస్పీకి ఫిర్యాదు ● మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఎమ్మిగనూరురూరల్: పోలీసుల అండతోనే తెలుగు దేశం నాయకులు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న నందవరం మండలం కనకవీడు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు విరూపాక్షి, సూర్యనారాయణను మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి పరామర్శించి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజురోజకు టీడీపీ అరచకాలు పెరిగిపోతున్నాయన్నారు. తెలుగుదేశం నాయకులకు పోలీసులు వత్తాసు పలుకుతుండటంతో మరింత రెచ్చిపోతున్నారన్నారు. దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులను స్టేషన్లోనే ఉంచడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా ఇంత వరకు పోలీసులు వెళ్లి విచారణ చేయకపోవడం వెనుక ఆంతర్యమేమిటన్నారు. ఉదయం దాడి జరిగితే ఇప్పటి వరకు నందవరం ఎస్ఐ, రూరల్ సీఐ, డీఎస్పీలకు ఫిర్యాదు చేసిన స్పందించకపోవటం దురదుష్టకరమన్నారు. పోలీసులు తమ విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నారు. నియోజకవర్గంలో టీడీపీ నాయకులు పోలీసుల ఒత్తిడితో వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని పోలీసులు, టీడీపీ నాయకులు గుర్తించుకోవాలని హితవు పలికారు. తెలుగుదేశం నాయకులు అరచకాలు, డీఎస్పీ, సీఐ, ఎస్ఐల తీరుపై ఈ నెల 5వ తేదీన జిల్లా ఎస్పీ విక్రాంత్పాటిల్ను కలసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఆయ నతో పాటు వైఎస్సార్సీపీ రాష్ట్ర మేధావుల ఫోరం సంయుక్త కార్యదర్శి లక్ష్మీకాంతరెడ్డి, గడ్డం నారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. -
దేదీప్యమానం హనుమత్ ధర్మ జ్యోతి
కర్నూలు కల్చరల్: నగరం శివారులోని రూపాల సంగమేశ్వర జగన్నాథ గట్టుపై హనుమత్ ధర్మ జ్యోతి దేదీప్యమానంగా వెలిగింది. విశ్వ హిందూ పరిషత్, రూపాల సంగమేశ్వర జగన్నాథ గట్టు అభివృద్ధి సమితి ఆధ్వర్యంలో పౌర్ణమిని పురస్కరించుకుని శనివారం రాత్రి జగన్నాథ గట్టుపై ఉన్న 67 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద హనుమత్ ధర్మజ్యోతి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అక్కడే స్వామివారికి అభిషేకం, మన్యసూక్త హోమం, సామూహిక హనుమాన్ చాలీసా పారాయ ణం కార్యక్రమాలు జరిగాయి. వీహెచ్పీ పూర్వపు అంతర్జాతీయ అధ్యక్షులు జి.రాఘవరెడ్డి, వీహెచ్పీ రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి, జిల్లా అధ్యక్షులు మద్దిలేటి, లలి తా పీఠం వ్యవస్థాపకులు మేడా సుబ్రహ్మణ్యస్వామి, ప్రతాపరెడ్డి తదితరులు శ్రీహనుమ త్ ధర్మ జ్యోతిని వెలిగించారు. అంతకు ముందు నగరంలోని భరతమాత ఆలయం నుంచి జగన్నాథగట్టు వరకు శోభా యాత్ర సాగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
జ్ఞాపకాల జాడలో సేవా పరిమళం
● వెల్దుర్తి జెడ్పీహెచ్ఎస్ అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సహకారం ● నేడు ఆత్మీయ సమ్మేళనం వెల్దుర్తి: దాదాపు ఎనిమిది దశాబ్దాల చరిత్ర ఉన్న పాఠశాల ఇది. 67 ఏళ్ల క్రితం పదో తరగతి మొదటి బ్యాచ్ పూర్తి చేసుకుంది. ఇక్కడ విద్యాభ్యాసం చేసిన ఎందరో విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో రాణిస్తున్నారు. వీరంతా ఏటా జనవరి నెల మొదటి ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం క్రమేణా పాఠశాల అభివృద్ధి సేవా కార్యక్రమంగా మారిపోయింది. వారు చదివిన పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ పాఠశాల మొట్టమొదటి ఎస్ఎస్ఎల్సీ (పదవ తరగతి) బ్యాచ్ 1958లో పూర్తి చేసుకుంది. చుట్టుపక్కల హైస్కూళ్లు లేని కాలం నుంచి ఏర్పాటైన ఈ పాఠశాలలో చదివిన వారిలో వెల్దుర్తి, కృష్ణగిరి, డోన్, ఓర్వకల్, కల్లూరు, కోడుమూరు మండలాల వారు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ చదివిన చాలా మంది ఉన్నత, మహోన్నత స్థానాలలో ఉన్నారు. నాటి నుంచి చదివిన విద్యార్థులలో 1967 పదవ తరగతి బ్యాచ్కు చెందిన వావిలాల కృష్ణమూర్తి అధ్యక్షుడిగా ‘వెల్దుర్తి జెడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థుల సేవా సంఘం’ ఏర్పడి 2015లో రిజిస్టర్ అయి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం 335 మంది సభ్యుల (పూర్వ విద్యార్థులు)తో కొనసాగుతోంది. పాఠశాల అభివృద్ధికి కృషి సభ్యుల సహకారంతో తాము చదివిన పాఠశాలలో (విడిపోయిన బాలికల జెడ్పీ హైస్కూల్లో) నీటి సమస్య పరిష్కారానికి వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేశారు. కంప్యూటర్లు, జిరాక్స్ మిషన్లు ఇచ్చారు. భవనాలకు అవసరమైన మరమ్మతులు చేయించారు. ఏటా పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, పరీక్షలలో ప్రతిభ చూపిన వారికి నగదు బహుమతులతో ప్రోత్సహిస్తూ వస్తున్నారు. గతేడాది సమావేశంలో పట్టణానికి చెందిన అగస్టీన్ అధ్యక్షుడిగా, ఖాజాబేగ్ ఉపాధ్యక్షుడిగా, మల్లెపల్లె సర్పంచ్ వెంకటేశ్వరరెడ్డి సెక్రటరీగా పూర్తి కమిటీ ఏర్పాటయింది. ఈ కమిటీ ఆధ్వర్యంలో నేడు బాలికల జెడ్పీహైస్కూల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. అదే పాఠ శాలలో చదివి, అక్కడే ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తించి రిటైర్ట్ అయిన 1958 బ్యాచ్ శంకరయ్య, 1962 బ్యాచ్ బోయనపల్లె కృష్ణమోహన్ రెడ్డిని ఆదివారం సన్మానించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటికే అన్ని బ్యాచ్ల పూర్వ విద్యార్థులకు సమాచారం చేరవేశారు. -
మహిళకు టీడీపీ నేత లైంగిక వేధింపులు
సాక్షి, టాస్క్ ఫోర్స్: తమ చేష్టలతో శ్రీశైలం క్షేత్ర ప్రతిష్టతను టీడీపీ నేతలు దిగజారుస్తున్నారు. ఉద్యోగం కోసం ఓ మహిళ శ్రీశైలం టీడీపీ మండలాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి వద్దకు రాగా, ఆమెతో అతడు అసభ్యంగా ప్రవర్తించాడు. తన కోరికను తీర్చితే ఉద్యోగం ఇప్పిస్తానని మహిళను వేధించాడు. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత శ్రీశైలం దేవస్థానంలో టీడీపీ నేతలు తమకు తెలియకుండా ఏ పని జరగకూడదని అధికారులకు హుకుం జారీ చేశారు. టీడీపీ నేతల అరాచకాలకు భయపడిన అధికారులు వారు చెప్పినవారికే కాంట్రాక్టులు, ఉద్యోగాలు ఇస్తున్నారు.ఇటీవల శ్రీశైలానికి చెందిన మహిళ తన కుటుంబ పోషణ నిమిత్తం తనకు దేవస్థానంలో ఉద్యోగ అవకాశం కల్పించాలని శ్రీనివాసరెడ్డిని ఆశ్రయించింది. ఆ మహిళపై కన్నేసిన శ్రీనివాసరెడ్డి..తాను ఏది చెబితే అదే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి వద్ద ఫైనల్ అవుతుందని, తన కోరిక తీరిస్తేనే ఉద్యోగం ఇప్పిస్తానని ఆమెను వేధించాడు. అంతేకాకుండా ఆ మహిళకు వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శ్రీనివాసరెడ్డి తీరుపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. -
శ్రీశైల క్షేత్రంలో సినిమా డ్యాన్సులు
శ్రీశైలం: అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఆధ్యాత్మికతకు తిలోదకాలిచ్చారు. కొత్త సంవత్సరం సందర్భంగా స్థానిక సత్రంలో అభ్యంతరకర సినీ పాటలతో వేడుకలు జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాతాళగంగ రోడ్డు మార్గంలోని ఒక ప్రైవేట్ సత్రంలో వసతి పొందిన యాత్రికులు డిసెంబర్ 31 అర్ధరాత్రి ఆంగ్ల సంవత్సరాది వేడుకల్లో భాగంగా పాటలు పాడుతూ, చిందులు వేస్తూ కేక్ కటింగ్ చేశారు. శ్రీశైలంలో కొన్నేళ్లుగా ఆంగ్ల సంవత్సరాదిని జరుపుకోరాదని దేవస్థానం కూడా ఆంక్షలు విధించింది. 10 ఏళ్ల క్రితం దేవస్థానం ప్రధాన రాజగోపురం ముందు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ పుష్పాలతో కూడిన ఆర్చ్ కటౌట్, ధ్వజస్తంభం వద్ద అలంకరణ చేసేవారు.అయితే అప్పటి దేవదాయ కమిషనర్ అనురాధ పుణ్యక్షేత్రంలో ఆంగ్ల సంవత్సరాది వేడుకలు నిషిద్ధమని ప్రకటించడంతో నేటి వరకు దేవస్థానంతో పాటు స్థానికులు కూడా నూతన సంవత్సర వేడుకలకు స్వస్తి పలికారు. కానీ దేవదాయ నిబంధనలకు విరుద్ధంగా సత్రంలో నూతన సంవత్సర వేడుకలకు అనుమతి ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇదిలాఉంటే ఈ సత్రం నిర్మాణ దాతలలో ఒకరు కర్నూలుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు కావడంతోనే పోలీసులు, ఆలయ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించినట్టు సమాచారం. క్షేత్ర పవిత్రతకు భంగం కలిగేలా వ్యవహరించిన సత్రం నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు జి.మల్లికార్జున డిమాండ్ చేశారు. -
తమాషా చేస్తున్నావా? నీ కథ చూస్తా!
సాక్షి, నంద్యాల జిల్లా: ‘ఏం తమాషా చేస్తున్నావా.. ఇప్పటి నుంచి నీ కథ చూస్తా’ అంటూ నంద్యాల జిల్లా శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి ఓ మహిళా టీడీపీ కార్యకర్తపై నోరు పారేసుకున్నారు. శుక్రవారం బండిఆత్మకూరు మండలంలోని ఎ.కోడూరులో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. జాయింట్ కలెక్టర్ కార్తీక్తో పాటు ఎమ్మెల్యే బుడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త భారతి ఎమ్మెల్యేతో తన గోడు వినిపించేందుకు ప్రయత్నం చేసింది. తన మనవడు గుండె సమస్యతో బాధపడుతుంటే మీరు పట్టించుకోలేదని ప్రశ్నించింది. సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకుంటే కనీసం ఆ పేపర్లు కూడా ముట్టుకోలేదని వాపోయింది. ఇందుకు ఎమ్మెల్యే ‘50 మందిలో ఓ ఎమ్మెల్యేను నిలదీస్తే గొప్ప అనుకుంటున్నావా? నన్ను ఎవరనుకుంటున్నావు?’ అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. పక్కనున్న నాయకులు ఆమెకు సర్దిచెప్పబోగా అక్కడ రసాభాస చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వల్లే తన మనవడు చనిపోయాడని భారతి ఆరోపించింది. ఇంతలో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే ఏం తమాషా చేస్తున్నావా.. ఇక నుంచి నీ కథ చూస్తా.. అనడంతో అక్కడున్న అధికారులతో పాటు కార్యక్రమానికి హాజరైన టీడీపీ శ్రేణులు, గ్రామస్తులు నివ్వెరపోయారు. టీడీపీ ఎమ్మెల్యే ఇటీవల ఓ అటవీ అధికారిపై చేయి చేసుకోవడం, ఇప్పుడు తమ పార్టీకే చెందిన మహిళా కార్యకర్తపై నోరు పారేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ప్రభుత్వంలో ఎవరు ప్రశ్నించినా, తమ బాధలు చెప్పుకున్నా ప్రతిపక్ష పార్టీ తరహాలోనే టీడీపీ నేతలు వ్యవహరిస్తుండటం గమనార్హం. -
ఊరంతా పందిరిలా..
దూరం నుంచి చూస్తే ఏదో వేడుక సందర్భంగా పెద్ద పందిరి వేశారా అన్నట్లుగా ఆ దృశ్యాలు కనిపిస్తాయి. వాటిని సమీపిస్తుంటే ఎవరైనా సంచారం చేస్తూ గుడారాలు వేసుకున్నారా అన్నట్లు ఉంటాయి. దగ్గరికి వెళ్తే కానీ అసలు విషయం అర్థం కాదు. టి. గోకులపాడు గ్రామంలో 80 శాతం నల్లరేగడి పొలాలు కావడంతో చాలా మంది రైతులు పొగాకు సాగు చేశారు. అయితే పంట నుంచి తీసిన ఆకును ఎవ్వరి పొలంలో వారు వేసుకోకుండా అందరూ గ్రామానికి సమీపంలోని ఓ పొలంలో ఇలా పదుల సంఖ్యలో పందిర్లు వేశారు. అందులో పొగాకు తోరణాలు కట్టి ఆరబెట్టారు. ఈ రహదారి మీదుగా వెళ్లే వాహనదారులను ఈ పందిర్లు ఆకట్టుకుంటున్నాయి. – కృష్ణగిరి -
ట్రావెల్స్ బస్సు బోల్తా
● ప్రమాదంలో ఐదుగురికి గాయాలు ● నెల్లూరు నుంచి కర్నూలు వైపు వెళ్తుండగా ప్రమాదం నంద్యాల(అర్బన్): కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై నంద్యాల మండలం చాబోలు మెట్ట వద్ద శుక్రవారం తెల్లవారుజామున వేగ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలు కాగా ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. గాయాల పాలైన వారిని స్థానికులు నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నెల్లూరు నుంచి గురువారం రాత్రి 11.30 గంటలకు వేగ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆరుగురు ప్రయాణికులతో కర్నూలుకు బయలుదేరింది. మార్గమధ్యలో శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు నంద్యాల మండలం చాబోలు మెట్ట వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కర్ణాటక రాష్ట్రం తుమ్ముకూరుకు చెందిన మంజన్న, నెల్లూరుకు చెందిన పుష్ప, సుభద్ర, వేణుతో పాటు హ్యూమన్ రైట్స్ ఈసీగా జాయిన్ అయ్యేందుకు వస్తున్న నెల్లూరుకు చెందిన బీఎన్ కుమార్ గాయపడ్డారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు. హైవేలో బస్సు ప్రమాదం జరగడంతో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ప్రయాణికులు తక్కువగా ఉన్నారని పాత బస్సు.. ట్రావెల్స్ యజమాన్యం కండీషన్లో ఉన్న బస్సు నడపాల్సి ఉండగా ప్రయాణికులు తక్కువగా ఉన్నారని పాత బస్సును పంపినట్లు తెలుస్తోంది. ఎందుకు ఇలాంటి బస్సు వేశారంటూ .. ప్రయా ణంలోనే ప్రయాణికులు డ్రైవర్, క్లీనర్తో గొడవ పడినట్లు సమాచారం. బస్సు ఊగుతూ వస్తున్న సమాచారాన్ని డ్రైవర్కు చెప్పినా పట్టించుకోలేదని ప్రయాణికులు వాపోయారు. వేగాన్ని నియంత్రించేందుకు చాబోలు మెట్ట వద్ద హైవే అధికారులు ఏర్పాటు చేసిన నియంత్రణ బారికేడ్లను తప్పించబోయి ప్రమాదం జరిగి ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు అభిప్రాయ పడుతున్నారు. ప్రమాదంలో గాయాలతో బయటపడటంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకుంటున్నారు. -
పోలీసులపై చర్యలు తీసుకోవాలి
ఆదోని రూరల్: ఇటీవల పత్తికొండ కోర్టు హాల్లో జరిగిన ఘటనను నిరసిస్తూ ఆదోని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా రెండో అదనపు న్యాయమూర్తి పి.జె.సుధకు పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరు తూ వినతి పత్రం అందించారు. అనంతరం బార్ అసోసియేషన్ సెక్రటరీ జీవన్సింగ్, సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ.. పత్తికొండ కోర్టు హాలులో గత నెలలో లొంగిపోవడానికి వచ్చిన నిందితుడిని పోలీసులు అక్రమంగా పట్టుకెళ్లారన్నారు. పోలీసులపై చర్యలు తీసుకునేంత వరకు ఉద్యమాలను ఆపబోమన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో సీనియర్ న్యాయవాదులు విశ్వనాథరెడ్డి, మన్సూర్ అమ్మద్, రామలింగ, మధు, షబాష్ అహ్మద్, ఆసీఫ్ తదితరులు ఉన్నారు. -
జాతీయ కథల పోటీల్లో పోలకల్ విద్యార్థిని ప్రతిభ
సి.బెళగల్: పోలకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 7వ తరగతి విద్యార్థిని శ్రావణి జాతీయ కథల పోటీలలో ప్రతిభ కనపరిచింది. పాఠశాల హెచ్ఎం రమ తెలిపిన వివరాల మేరకు.. గతేడాది నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా తెలంగాణ సారస్వత పరిషత్ వారు నిర్వహించిన కథల పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి 450 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో 12 మంది కథలు ఎంపిక కాగా.. శ్రావణి రాసిన ‘దేవత హారం’అనే కథకు బహుమతి లభించింది. తెలంగాణ సారస్వత పరిషత్ వారు విద్యార్థినికి రూ.500 నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రం, రూ.500 విలువైన పుస్తకాలు ఇచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం శ్రావణికి ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. కథ రాయడం నేర్పించిన తెలుగు ఉపాధ్యాయులు రామాంజనేయులు, మిణిక్యమ్మ, వెంకటరమణగౌడ్, హరికృష్ణలను హెచ్ఎం, స్కూల్ టీచర్లు ప్రత్యేకంగా అభినందించారు. సీమ సాగునీటి హక్కుల సాధనలో చైతన్యం రావాలి నంద్యాల(అర్బన్): రాయలసీమ సాగునీటి హక్కుల సాధనలో ప్రజల్లో చైతన్యం రావాల ని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. స్థానిక సమితి కార్యాలయంలో శుక్రవారం సీమను సస్యశ్యామలం చేసి ప్రజలను చైతన్యవంతం చేసేలా రాయలసీమ నీటి హక్కుల కోసం ఆడియో పాటను చిన్నారి చేత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 14 ఏళ్లుగా రాయలసీమ సాగునీటి సాధన సమితి అనేక రైతులకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. గుండ్రేవుల రిజర్వాయర్, ఆర్డీఎస్ కుడికాల్వ, వేదావతి ఎత్తి పోతల పథకాలకు పాలన అనుమతులు సాధించడంతో పాటు పులికనుమ ప్రాజెక్టు సత్వర నిర్మాణం చేయడంలోను కృషి చేసిందన్నారు. కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు శంకర్రెడ్డి, రామచంద్రారెడ్డి, మహేశ్వరరెడ్డి, సుధాకర్రావు, తదితరులు పాల్గొన్నారు. భక్తుల వసతికి పెద్దపీట మంత్రాలయం: శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి తరలివచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు అన్నారు. మంత్రాలయంలో టీటీడీ కల్యాణ మండపం ఎదురుగా మరో 200 అదనపు గదులను నిర్మిస్తున్న భవనాలను పీఠాధిపతి పరిశీలించారు. అదే ప్రాంగణంలో భక్తులకు డార్మిటరీ హాల్ నిర్మిస్తామన్నారు. నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్ని అధికారులను ఆదేశించారు. మంత్రాలయం వచ్చే క్షేత్ర పరిధిలో భక్తులు స్వచ్ఛతను పాటించాలన్నారు. ఆయన వెంట శ్రీ మఠం ఇంజినీర్, సురేష్ కోనాపూర్, బద్రి బెంగళూరుకు చెందిన సుబ్బన్న పాల్గొన్నారు. -
షార్టు సర్క్యూట్తో అగ్ని ప్రమాదం
డోన్ టౌన్: మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన బోయ సుంకులమ్మ ఇంటిలో షార్ట్సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటిలో నుంచి పొగలు రావడంతో గమనించిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న డోన్ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఫ్రిడ్జ్లో షార్ట్సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బీరువా లో ఉన్న రూ.3 లక్షల విలువవైన ప్రాంసరీ నోట్లు, ఎల్ఐసీ డాక్యూమెంట్లు, పొలం పాస్బుక్తో పాటు కొంత బంగారం, కొంత నగదు దగ్ధమైనట్లు తెలిసింది. వీటితో పాటు ఇంటిలో నిత్యావసరుకులు, దుస్తు లు కాలి బూడిదయ్యాయి. దాదాపు రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లి ఉండవచ్చునని అగ్నిమాపక సిబ్బంది ప్రాథమిక అంచనా చేశారు. -
రహదారి భద్రత సామూహిక బాధ్యత
రహదారి భద్రత అనేది మనందరి సాంఘిక బాధ్యత. డ్రైవింగ్ చేసేటప్పుడు మనం పాటించే చిన్నపాటి జాగ్రత్తలు ఎంతో విలువైన ప్రాణాలను కాపాడతాయి. మా సంస్థ (రాయలసీమ ఎక్స్ప్రెస్ హైవే లిమిటెడ్) మెరుగైన మౌలిక సదుపాయాలను అందించడమే కాకుండా ప్రయాణికుల భద్రత కోసం 24 గంటలూ అందుబాటులో ఉండే అత్యవసర స్పందన వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానం చేరుకోవాలని మేము కోరుకుంటున్నాం. రహదారి భద్రత–ప్రాణ రక్ష, సురక్షితంగా ప్రయాణించండి–క్షేమంగా ఇంటికి చేరుకోండి.. అనే నినాదంతో నెల రోజుల పాటు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – వి.మదన్ మోహన్, ప్రాజెక్ట్ హెడ్ -
రహదారి భద్రతా వారోత్సవాలు ప్రారంభం
కర్నూలు: రహదారి భద్రత–ప్రాణరక్ష, సురక్షితంగా ప్రయాణించండి... క్షేమంగా ఇంటికి చేరుకోండి... (సడక్ సురక్ష–జీవన్ రక్ష) అనే ప్రచార సందేశంతో రాయలసీమ ఎక్స్ప్రెస్ హైవే ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కర్నూలు–కడప జాతీయ రహదారి (ఎన్హెచ్–40 కారిడార్)లో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను శుక్రవారం ప్రారంభించింది. రహదారి భద్రత, ప్రమాదాల నివారణ కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో జనవరి నెలాఖరు వరకు అవగాహన కార్యక్రమం కొనసాగుతోంది. రహదారి వినియోగదారులలో అవగాహన కల్పించడం, ప్రమాదాల సంఖ్య తగ్గించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. పాదచారులు, ద్విచక్ర వాహనదారులు, కార్లు, భారీ వాహనాల డ్రైవర్లతో నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. టోల్ ప్లాజాలు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు, సమీప గ్రామాల్లో అవగాహన పోస్టర్లు, నినాదాలు క్షేత్రస్థాయి చర్చల ద్వారా ప్రజలను చైతన్యపరచనున్నారు. అవగాహన కల్పించే ప్రధానాంశాలు... ● ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాలి. ● అతివేగం, మద్యం సేవించి వాహనం నడపకూడదు. ● పాదచారులు రోడ్డు దాటడానికి జీబ్రా క్రాసింగ్, ఫుటోవర్ బ్రిడ్జిలను (ఎఫ్ఓబీఎస్)మాత్రమే ఉపయోగించాలి. ● డ్రైవింగ్ చేసే సమయంలో మొబైల్ ఫోన్ వాడకాన్ని పూర్తిగా నివారించాలి. ● వాహనాలను కేవలం నిర్దేశించిన పార్కింగ్ స్థ లాలు, ట్రక్–లే–బైస్ వద్ద మాత్రమే నిలపాలి. ● అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం కోసం జాతీయ రహదారి హెల్ప్లైన్ నంబర్ 1033, ప్రాజెక్టు కంట్రోల్ రూమ్ నంబర్ 7036500054 ద్వారా సేవలను ఉపయోగించుకోవచ్చు. -
మంచు దోచిన జీవన అందాలు
తెల్లారింది కానీ పొద్దు పొడవలేదు. ఆకాశంలో సూర్యుడు వీధి దీపంలా వెలుగుతున్నాడు. ప్రజలు అంతా వారి పనుల మీద బయటకు కదులుతున్నారు. చుట్టూ దట్టమైన పొగమంచు. ఎటు చూసినా నింగి, నేల ఏకమైనట్లు కనిపించే దృశ్యాలు. ఆ సమయంలో మంచు చాటున మది దోచే అద్భుత చిత్రాలు పల్లె సీమల్లో ఆవిష్కృతమయ్యాయి. జీవన సౌందర్యానికి మంచు తోడైంది. ఉదయాన్నే పాఠశాల బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థులు.. చలించక ఎవరి పనులు చేసుకుంటున్న గ్రామీణ జనం.. లైట్ల వెలుతురులో నెమ్మదిగా వెళ్తున్న వాహనాలు.. పైర్లపై ముత్యాల్లా మెరిసిన మంచు బిందువులు.. అన్నీ వెరిసి కోనసీమ ను తలపించే ప్రకృతి అందాలు కనువిందు చేశాయి.శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో మంత్రాలయం –నాగలదిన్నె రహదారిలో ఈ దృశ్యాలు కనిపించాయి. – మంత్రాలయం రూరల్పొలం పనులకు వెళ్తున్న మహిళస్కూల్కు వెళ్లేందుకు రోడ్డుపై బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థులు మంచు మాటున్న సూర్యుడు.. లైట్ల వెలుతురులో వాహనంపచ్చని పొలాలపై తెల్లని పొగమంచు -
భర్తను బెదిరించబోయి..
ఎమ్మిగనూరురూరల్: మద్యానికి బానిస అయిన భర్తలో మార్పు రావాలని బెదిరించే ప్రయత్నంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన ఎమ్మిగనూరు మండలం కోటేకల్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామాంజనేయులు అదే గ్రామానికి చెందిన రాయల తిమ్మమ్మ(34)ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు అనిత, అనూష, కుమారుడు అరవింద్ ఉన్నారు. పొలం పనులకు వెళ్లకుండా భర్త మద్యానికి బానిస కావడంతో ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాలేదు. గురువారం సాయంత్రం ఇదే విషయంలో వారి మధ్య గొడవ చోటు చేసుకుంది. మద్యం తాగడం మానకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి పత్తి పంటకు తెచ్చిన గడ్డి మందును తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. భర్త గమనించి చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్ర వారం ఉదయం మృతి చెందింది. తల్లి మృతితో పిల్లలు రోదిస్తున్నారు. రెండెకరాల పొలంలో పత్తి, మిరప పంటలు సాగు చేసి రూ. 6 లక్షల వరకు అప్పులు అయ్యాయని కుటుంబీకులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. -
రోడ్డ ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
పాణ్యం: మండల పరిధిలోని కొణిదేడు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఎస్ఐ నరేంద్రకుమార్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన సోడం చిన్న వెంకటసుబ్బారెడ్డి(64)ఎక్స్ఎల్ వాహనంపై శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లాడు. అక్కడి నుంచి మరో పొలానికి వెళ్తుండగా మార్గమధ్యలో ఆలమూరుకు చెందిన ఓ వ్యక్తి బైక్పై వేగంగా వచ్చి ఢీకొట్టి, అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్న వెంకటసుబ్బారెడ్డి అక్కడిక్కక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. మృతుడికి భార్య తులశమ్మ, కొడుకు, కుమార్తె ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. ప్రమాదానికి కారణమైన బైక్ను పోలీసు స్టేషన్కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల జీజీహెచ్ మార్చురీకి తరలించారు. వ్యక్తి ఆత్మహత్య పాములపాడు: తుమ్మలూరు గ్రామపంచా యతీ మజరా కృష్ణారావు పేట గ్రామంలో మహేష్ (35) ఆత్మహ త్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ తిరుపాలు తెలి పిన వివరాల మేరకు.. మహేష్ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ నెలరోజుల క్రితం ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న ఎలాంటి ఫలితం లేకపోవడంతో జీవితంపై విరక్తి చెందాడు. దీంతో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. సాయంత్రం పొలం నుంచి తిరిగి వచ్చిన తల్లి లక్ష్మీదేవి బోరున విలపించింది. మృతునికి భార్య మమత, ముగ్గురు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత కర్నూలు: పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్క రూ భావించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. జిల్లా న్యా య సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి సూచనల మేరకు శుక్రవారం కర్నూలు న్యాయ సేవా సదన్ నందు పొల్యూషన్, ఎన్జీఓ (స్వచ్ఛంద సంఘాలు)లతో పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవలసిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి లీలా వెంకటశేషాద్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లోని దుర్భర వర్గాల్లో పర్యావరణ చట్టపరమైన అక్షరాస్యతను పెంపొందించడానికి ఎన్జీఓస్ కృషి చేయాలన్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, కార్మికులకు స్వచ్ఛంద సమాజ అవగాహన కల్పించాలన్నారు. నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం, నేల కాలుష్యం, పరిశ్రమల్లో వ్యర్థాల దుర్వినియోగం వంటి వాటిపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఎన్జీఓస్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం కోర్టు ఆవరణలో పాల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్యావరణ ఇంజినీర్తో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ ఇంజనీర్ పీవీ కిషోర్ రెడ్డి, అసిస్టెంట్ పర్యావరణ ఇంజినీర్ వెంకటసాయి కిషోర్, అనలిస్ట్ ఇమ్రాన్, రామకృష్ణ, పవన్, ఎన్జీఓ డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ శివరాం, న్యాయవాది బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
మద్యం స్వాధీనం
శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానం పరిధిలోని టోల్గేట్ వద్ద తనిఖీల్లో మద్యం సీసాలు పట్టుబడ్డాయి. వన్టౌన్ సీఐ జీవన్ గంగనాథ్ బాబు శుక్రవారం తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 31వ తేదీ ఆత్మకూరు మండలానికి చెందిన మాండ్ల కొలను భరత్, గొల్ల మాసయ్య ఆత్మకూరులోని ఒక వైన్ షాపు నుంచి కేసు చీప్ లిక్కర్ బాటిళ్లను కొనుగోలు చేశారు. నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో అధిక రేట్లకు విక్రయించేందుకు గురువారం బైక్పై శ్రీశైలం తరలిస్తుండగా టోల్గేట్ వద్ద తనిఖీల్లో దేవస్థానం సీఎస్ఓ శ్రీనివాసరావుకు పట్టుబడ్డారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని, 41 మద్యం సీసాలను సీజ్ చేశారు. నిందితులను ఆత్మకూరు కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్కు ఆదేశించారని సీఐ తెలిపారు. -
రెడ్డి సమ్మేళనం విజయవంతం చేయాలి
కర్నూలు(అర్బన్): భక్త మల్లారెడ్డి గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1వ తేదీన తిరుపతి వేదికగా జరగనున్న అంతర్జాతీయ రెడ్డి ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేద్దామని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎన్.సుమతీ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పల్లె శ్రీధర్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రెడ్డి సమాజం ఒకే కుటుంబంలా ఐక్యంగా ఉన్నప్పుడే రాజకీయ, సామాజిక, ఆర్థి కంగా బలపడుతుందన్నారు. ఈ ఏడాది రెడ్డి యువ త, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామన్నారు. చారిత్రక సమ్మేళనానికి ఉమ్మడి జిల్లా నుంచి అన్ని రెడ్డి సంఘాల నాయకులు, యువత, మహిళ లు పెద్ద సంఖ్యలో హాజరై ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు సుమతీరెడ్డిని ఘనంగా సన్మానించారు. సమ్మేళనానికి సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించారు. రాష్ట్ర సంఘటన కార్యదర్శి తూముకుంట ప్రతాప రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దం రాజారెడ్డి, నగర అధ్యక్షుడు రజనీకాంత్రెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు హరినాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రమీల ఆచూకీ ఎక్కడ?
చాగలమర్రి: ముత్యాలపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న 4వ అంగన్వాడీ కేంద్రం కార్యకర్త మద్దూరు ప్రమీల (50) ఆచూకీ 9 నెలలుగా తెలియడం లేదు. ఆమె ఆచూకీపై గ్రామస్తులు పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2025 మార్చి నెలలో అనారోగ్యంతో సెలవుపై వెళ్లినట్లు ఐసీడీఎస్ సూపర్వైజర్ సుశీల తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె విధులకు హాజరు కాలేదు. ఆమెకు ఒక్కగానొక్క కుమార్తె ఉండగా పెళ్లి అయిన తర్వాత మృతి చెందింది. హైదరాబాద్లో మనవడు ఉన్నట్లు సమాచారం. గ్రామంలో ఆమెకు సంబంధించి బంధువులు ఎవరూ లేరు. ఆమె ప్రమాదవశాత్తు కింద పడి గాయపడడంతో అనారోగ్యానికి గురైంది. గాయపడిన ఆమెను చికిత్స కోసం గ్రామస్తులు కడపలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఆమె కోలుకోలేక అక్కడే మృతి చెందిందని కొందరు, కాదు ఆమెను మెరుగైన చికిత్స కోసం ఆమె మనవడు హైదరాబాదుకు తీసుకెళ్లాడని గ్రామంలో చర్చ జరుగుతోంది. మరికొంత మంది ఆమె ను నంద్యాల పట్టణంలోని ఓ వృద్ధాశ్రమంలో ఉంచినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై సూపర్వైజర్ సుశీల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కడప పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రికి వెళ్లి విచారించగా అక్కడ ప్రమీల అను పేరుతో ఎవరూ చికిత్స పొందలేదని, గ్రామంలో ఆమె జాడ లేదని నివేదికను సీడీపీఓకు తేజేశ్వరికి అందజేశారు. 20 రోజుల క్రితం ఐసీడీఎస్ అధికారులు విచారణ పేరుతో ప్రమీల అధికారక చిరునామాకు నోటీసులు పంపగా వెనక్కు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఆమె ఆచూకీపై పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఏదేమైనా ప్రమీలా ఆచూకీని గుర్తించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అంగన్వాడీ కార్యకర్త -
పేదల ఇళ్ల పట్టాలపై తమ్ముళ్ల ‘నకిలీ’ముద్ర!
ఓర్వకల్లు: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో చేపట్టిన రోడ్డు నిర్మాణంలో వివాదం నెలకొంది. లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇళ్ల పట్టాలు నకిలీవని తెలుగు తమ్ముళ్లు ముద్రవేశారు. దీంతో మహిళా లబ్ధిదారులు లబోదిబోమంటూ స్థానిక నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్థానిక నాయకులు గురువారం పేదల స్థలాల్లో చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి, విషయాన్ని వారు వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డికి సమాచారం అందజేశారు. నాయకుల సమాచారం మేరకు శుక్రవారం కాటసాని రాంభూపాల్రెడ్డి క్షేత్రస్థాయిలో సందర్శించి పరిస్థితిని గమనించారు. దీంతో కాల్వ గ్రామ ప్రజలు, ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు అక్కడికి చేరుకొని తమ దుస్థితిని వివరించారు. పేదలకు న్యాయం చేయాలి ప్రతి నిరుపేద కుటుంబానికి సెంటున్నర స్థలాన్ని ఇవ్వాలని తమ ప్రభుత్వ లక్ష్యం కాగా గ్రామంలోని సర్వే నెంబర్ 63/బిలో ఉన్న ప్రభుత్వ స్థలంలో 400 మందికి ఇళ్ల పట్టాలను 2023లో మంజూరు చేసినట్లు కాటసాని తెలిపారు. ఆ సమయంలో సార్వత్రిక ఎన్నికలు సమీపంచడంతో సమయం లేక పట్టాలు పంపిణీ చేశామన్నారు. లేఅవుట్లో కొలతలు వేయలేక పోయామని, పేదలకిచ్చిన పట్టాలు నకిలీవి అనడం సమంజసము కాదని మండిపడ్డారు. ఈ విషయంపై తహసీల్దార్ విద్యాసాగర్ను వివరణ కోరేందుకు ఫోన్ చేశారు. ఫోన్ పని చేయకపోవడంతో లబ్ధిదారులను తహసీల్దార్ కార్యాలయం దగ్గర పంపారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద లబ్ధిదారులు గంటల తరబడి ఎదురు చూసినా తహసీల్దార్ రాకపోవడంతో కాటసాని మళ్లీ తహసీల్దార్ కార్యాలయం దగ్గరకు వెళ్లారు. పేదలకిచ్చిన పట్టాలు రికార్డులను పరిశీలించి రెండు, మూడు రోజుల్లోనే న్యాయం చేయాలని తహసీల్దార్ను కోరారు. అనంతరం స్థానిక నాయకులు వెంకటేశ్వర్లు, శంకరప్ప, చాంద్బాష ఆధ్వర్యంలో పేదలు తహసీల్దార్ను కలిసి తమకు న్యాయం చేయాల్సిందిగా వినతి ప్రతం సమర్పించారు. పేదల ఇళ్లకోసం కేటాయించిన భూమిని సర్వే చేయించి, న్యాయం చేస్తామని కాటసానికి తహసీల్దార్ విద్యాసాగర్ చెప్పారు. దౌర్జన్యంగా రోడ్డు నిర్మాణం లబోదిబోమంటున్న మహిళలు క్షేత్రస్థాయిలో పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని నిగ్గుతేల్చాలని అధికారులకు సూచన -
పడిపోయిన మిర్చి ధరలు
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో మిర్చి ధర పడిపోవడంతో రైతులు ఆందోళనకు లోనవుతున్నారు. కర్నూలు మార్కెట్కు దేవనూరు డీలక్స్, ఆర్మూర్, సూపర్–10, బాడిగ, తేజా, మిర్చి–5 రకాలు వస్తున్నాయి. క్వింటాకు కనీసం రూ.20 వేల ధర లభిస్తే గిట్టుబాటు అవుతుంది. కర్నూలు మార్కెట్లో మిర్చి–5 రకానికి రూ.16,379 ధర లభించింది. తేజా రకానికి రూ.13,689, ఆర్మూర్ రకం రూ.11,901 పలికింది. ఈ ధరలు ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ● మార్కెట్కు ఉల్లి రావడం పూర్తిగా తగ్గిపోయింది. శుక్రవారం 38 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. కనిష్ట ధర రూ.1,298, గరిష్ట ధర రూ.1,459 లభించింది. ● కందులు 2186 క్వింటాళ్లు రాగా.. కనిష్టంగా రూ.3,089, గరిష్టంగా రూ.7,550 పలికింది. సగటు ధర రూ.6897 నమోదైంది. ● వేరుశనగకు కనిష్ట ధర రూ.5,036, గరిష్ట ధర రూ.8,267 లభించింది. వైభవంగా శ్రీశైల గిరిప్రదక్షిణ శ్రీశైలంటెంపుల్: పౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు జరిపారు. పల్లకీ ఊరేగింపుతో శ్రీశైల గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం నుంచి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధర మండపం, అంకాళమ్మ గుడి, నందిమండపం, గంగా సదనం, బయలు వీరభద్రస్వామి ఆలయం, రింగ్రోడ్డు, ఫిల్టర్బెడ్, సిద్దరామప్పకొలను, పుష్కరిణి వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి తిరిగి నందిమండపం, ఆలయ మహాద్వారం వద్దకు చేరుకుంది. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. కనుల పండువగా తిరుచ్చి మహోత్సవం బేతంచెర్ల: పుష్య మాసం శుక్రవారం రాత్రి ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో తిరుచ్చి మహోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. స్వామిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో కొలువుంచారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ మాడ వీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారిని పల్లకీలో ఊరేగించారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ స్వామిని దర్శించుకున్నారు. పూజల్లో ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు, వేదపండితుడు కళ్యాణ చక్రవర్తి , అర్చకుడు మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు. బతికున్నా రికార్డుల్లో చంపేశారు! ప్యాపిలి: తాను బతికి ఉన్నప్పటికీ రికార్డులో చనిపోయానని నమోదు చేయడం ఏమటని మండల కోఆప్షన్ మెంబర్ అబ్దుల్ రసూల్ ప్రశ్నించారు. ఎంపీపీ గోకుల్ లక్ష్మి అధ్యక్షతన శుక్రవారం ప్యాపిలి మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఉపాధి హామీ పనులకు సంబంధించిన ప్రగతి నివేదికను అధికారులు సమర్పిస్తుండగా అబ్దుల్ రసూల్ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ఒత్తిళ్లు ఉంటే తాను వైఎస్సార్సీపీకి చెందిన వ్యక్తిని కాబట్టి జాబ్కార్డు తొలగించినా అభ్యంతరం లేదన్నారు. పని చేసేందుకు ఆసక్తి లేదన్న కారణాన్ని చూపిస్తూ తన కుమారుడు చాంద్పీరా జాబ్కార్డును కూడా అధికారులు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన ఎంపీడీఓ శ్రీనివాసరావు.. ఏపీఓ రవీంద్రను వివరణ కోరారు. పొరపాటు జరిగినట్లు ఏపీఓ అంగీకరించారు. ఇలాంటి పొరపాట్లు చేయడం మంచిది కాదని అధికారులను ఎంపీపీ, ఎంపీడీఓ మందలించారు. -
‘తప్పు’లో కాలేశారు!
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం మరోసారి చర్చనీయాంశంగా మారింది. పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల, మార్కుల జాబితా, ప్రొవిజినల్ సర్టిఫికెట్స్లలో తప్పులు దొర్లడం..అభాసు పాలు కావడం పరిపాటిగా మారింది. సంబంఽధిత అధికారుల పర్యవేక్షణ లోపం విద్యార్థులకు శాపంగా మారుతోంది. తప్పులను సరిద్దిద్దుకునే చర్యలు తీసుకోవడంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గత ఏడాది డిసెంబర్ 2వ తేదీ విడుదల చేసిన ఫలితాలకు తాజాగా ఇటీవల జారీ చేసిన బీఈడీ నాల్గవ సెమిస్టర్ ప్రొవిజినల్ సర్టిఫికెట్స్లో ఉన్న ఎస్జీపీఏ, సీజీపీఏ పాయింట్స్ గ్రేడ్లలో తేడా ఉన్నాయి. సరి చేయాల్సిన వర్సిటీ సంబంధిత అధికారులు సాంకేతిక సమస్య అని దాటవేస్తున్నారు. ఈ విషయమైన వర్సిటీ సీఈతో బీఈడీ కళాశాలల యాజమాన్యాల సంఘం ప్రతినిధులు చర్చించినట్లు తెలిసింది. వారికి సైతం ఆన్లైన్లో ఫలితాలు ఎలా ఉన్నా.. తాము జారీ చేసిన ప్రొవిజినల్ సర్టిఫికెట్స్, మార్క్స్ మెమోలే సరైనవి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని సర్ది చెప్పి పంపినట్లు తెలిసింది. విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై యాజమాన్యాలు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నించక పోవడం పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు 3,200 మంది విద్యార్థులపై ప్రభావం 2023– 25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈడీ నాల్గవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను గత ఏడాది డిసెంబర్ 2న విడుదల చేశారు. ఈ సెమిస్టర్కు 3,379 మందికి 3,225 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 3,121 మంది ఉత్తీర్ణులయ్యారు. సప్లిమెంటరీ పరీక్షలకు 142 మందికి 122 మంది పరీక్షలు రాయగా 118 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పరీక్షల ఫలితాలను ఆన్లైన్లో ఉంచే సమయంలో చూసుకోవాల్సిన వర్సిటీ అధికారులు చేసుకోక పోవడంతో ఫలితాల్లో తేడా వచ్చింది. నిబంధనల ప్రకారం సెమిస్టర్ మార్కులకు నాలుగు క్రెడిట్స్ ప్రకారం పరిగణనలోకి తీసుకోవాలి. అయితే రెండు క్రెడిట్స్ ప్రకారం లెక్కించి ఫలితాలు విడుదల చేశారు. ప్రొవిజినల్ సర్టిఫికెట్స్ మాత్రం నాలుగు క్రెడిట్స్తో పాయింట్లు, సీజీపీఏ కేటాయించారు. కొందరు విద్యార్థులకు మేలు, మరికొందరు విద్యార్థులకు అన్యాయం జరిగినట్లైంది. తక్కువ పాయింట్స్ వచ్చిన వారికి మంచి గ్రేడ్ రావడం విస్తుగొలుపుతోంది. ఎక్కువ పాయింట్స్ వచ్చిన వారికి దానికి అనుగుణంగా గ్రేడ్ రాకపోవడం దారుణంగా ఉంది. నాల్గవ సెమిస్టర్లో ఆన్లైన్లో ఉన్న ఫలితాల ఆధారంగా సీటెట్, టెట్కు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఫలితాల్లో పాయింట్స్ తేడా ఉండటంతో కొందరు అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. ఇదే కాక అదే సంవత్సరానికి సంబంధించి 1, 3 సెమిస్టర్ సప్లిమెంటరీ ఫలితాలు, ప్రొవిజినల్ సర్టిఫికెట్స్లలో సైతం 8 పైగా పాయింట్స్ వచ్చిన విద్యార్థులకు డి గ్రేడ్, ఇ గ్రేడ్ లు రావడం కూడా దురుమారం రేపుతోంది. వర్సిటీ జారీ చేసిన నాల్గవ సెమిస్టర్ ప్రొవిజినల్ సర్టిఫికెట్స్, మార్క్స్ మెమోల్లో వచ్చిన పాయింట్స్, గ్రేడ్స్ల నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం ఉన్న టెక్నికల్ వెండార్ నాలుగు క్రెడిట్స్ ప్రకారం లెక్కించి ప్రొవిజినల్ సర్టిఫికెట్స్ను జారీ చేశారు. తరువాత మార్క్స్ మెమోలను జారీ చేస్తాం. ఆన్లైన్లో ఉంచిన ఫలితాలు, మార్కులను ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. వర్సిటీ ఉన్నతాఽధికారుల అనుమతితో ఆన్లైన్లో ఉన్న ఫలితాలను సైతం సరి చేయిస్తాం. – డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, ఆర్యూ ఆర్యూ బీఈడీ నాల్గవ సెమిస్టర్ పరీక్షల ఫలితాల్లో గందరగోళం ఆన్ౖలైన్లో ఫలితాలు ఒక రకం ప్రొవిజినల్ సర్టిఫికెట్లలో మరో రకం సప్లిమెంటరీ ఫలితాల సర్టిఫికెట్లది మరో తీరు సీజీపీఏ పాయింట్స్ గ్రేడ్లలోనూ తికమక -
ఓరి నాయనో.. యూరియా లేదంట!
● టీడీపీ నేత కృత్రిమ కొరత సృష్టి ● నానో డీఏపీ కొంటేనే యూరియా ● రైతుల నుంచి అదనంగా వసూలు యూరియా బస్తా విక్రయించినట్లు ఇచ్చిన రశీదు రైతులకు విక్రయించిన నానో డీఏపీసాక్షి టాస్క్ఫోర్స్: ధరలు పెంచి రైతులకు యూరియా ఇవ్వకుండా టీడీపీ నేతలు అక్రమ ఆర్జన చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నానో డీఏపీ తప్పనిసరిగా కొనాలని షరతు విధిస్తున్నారు. సకాలంలో యూరియా అందక అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. కొలిమిగుండ్ల మండలానికి చెందిన హనుమంతుగుండం సొసైటీకి మార్క్ఫెడ్ నుంచి ఇటీవలనే 566 బస్తాల యూరియా మంజూరైంది. ఈ సొసైటీ పరిధిలో తొమ్మిది గ్రామాలున్నాయి. సొసైటీ చైర్మన్గా టీడీపీ నాయకుడు ఉంటంతో యూరియా బస్తాలపై సాధారణం కంటే ఎక్కువ ధర వసూలు చేస్తున్నారు. సాధారణంగా లోడింగ్, అన్లోడింగ్ చార్జీలతో కలిపి రైతులకు ఒక్కో బస్తా రూ.266.50 చొప్పున ఇవ్వాల్సి ఉంది. అయితే ఇక్కడ మాత్రం రూ.290కు విక్రయిస్తున్నారు. సొసైటీ సిబ్బంది వద్దని చెప్పినా ఏమాత్రం ఖాతరు చేయకుండా ఈ తతంగం నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ‘ప్రయివేట్’గా విక్రయాలు సొసైటీ చైర్మన్కు సంజామల మండలం పేరుసోములలో సొంతంగా ఫర్టిలైజర్ దుకాణం ఉంది. వాస్తవంగా సొసైటీకి నానో డీఏపీ మంజూరు కాలేదు. కానీ ఆయన మాత్రం తన దుకాణంలోని నానో డీఏపీని తీసుకొచ్చి సొసైటీ గోడౌన్లో పెట్టారు. యూరియా కావాలంటే కచ్చింతగా నానో డీఏపీ కొనాలని ఆదేశాలు జారీ చేశారు. తమకు అవపరం లేక పోయినా ఒక లీటర్ నానో డీఏపీకి రూ.500 ఖర్చు చేయాల్సి వచ్చిందని రైతులు వాపోతున్నారు. కొంత మంది రైతులు పది యూరియా బ్యాగులు తీసుకుంటే రెండు డీఏపీలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూరియా పంపిణీలో సొసైటీ అధికారుల ప్రమేయం లేకుండా ప్రయివేట్గా ఒక వ్యక్తిని నియమించి విక్రయాలు చేయిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా సొసైటీ పేరు మీదనే యూరియాతో పాటు డీఏపీకి సైతం బిల్లు రాసిస్తున్నారు. యూరియా మంజూరు నుంచి పంపిణీ వరకు వ్యవసాయ శాఖ అధికారులు పర్యవేక్షించాల్సి ఉంది. -
ప్రభుత్వమే ఆదుకోవాలి
నల్లి తెగులు ఎక్కువై మిర్చి వంట దెబ్బతింది. నేను 12 ఎకరాల్లో మిర్చి సాగుచేశా. భారీ వర్షాలకు పాలంలో నీరు నిలబడి మొక్కలు చనిపోయాయి. ఎకరాకు సుమారు రూ.లక్ష పైనే ఖర్చుచేశా. ఇప్పుడు తెగుళ్లతో దిగుబడి ఎలా ఉంటుందోనని భయమేస్తోంది. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. –మదన్మోహన్, తొగర్చేడు, పాణ్యం మండలం మిరప తోటలు బాగున్నాయని అనుకుంటున్న తరుణంలో అకాల వర్షాలు దెబ్బతీశాయి. అరకొర దిగుబడులు వచ్చాయి. మొదటి కోతలో ఎకరాకు 3 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. రెండు, మూడు కోతల్లో అంతం మాత్రంగానే వస్తుంది. ఈ ఏడాది కూడా నష్టపోవాల్సి వచ్చింది. –బాల చిన్ని, గడివేముల -
క్యాలెండర్లో మరో సంవత్సరం మారిపోయింది. చేదు, తీపి జ్ఞాపకాలతో 2025 వీడ్కోలు పలికింది. కొత్త సంవత్సరం చీకట్లను చీల్చుకుంటూ, సంబరాలను హోరెత్తిస్తూ ఉదయించింది. గ్రీటింగ్ కార్డులు కనుమరుగై.. వాట్సాప్ మెసేజీలు చక్కర్లు కొట్టాయి. ఒకరినొకరు కలుసుకొని మంచీచెడు
● జిల్లా వ్యాప్తంగా ‘నూతన’ వేడుకలు ● అధికారులకు, రాజకీయ నేతలకు శుభాకాంక్షలు నంద్యాల: జిల్లా అభివృద్ధికి అధికారులందరూ సమష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. నూతన సంవత్సరం 2026 సందర్భంగా గురువారం నంద్యాల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజకుమారిని జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఎస్పీ సునీల్షెరాన్కు ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గత సంవత్సరంలో జిల్లాలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలను గుర్తు చేస్తూ, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా అధికారులు కృషి చేయడం అభినందనీయమన్నారు. నూతన సంవత్సరం 2026లో నంద్యాల జిల్లాను అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకువెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజా సంక్షేమం, పారదర్శక పరిపాలన, సమర్థవంతమైన సేవల అందింపు దిశగా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. పేదలు, బలహీన వర్గాలు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రభుత్వ పథకాల లబ్ధి నేరుగా అందేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ మరింత బలోపేతం చేయాలన్నారు. -
మల్లన్న సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హారి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. గురువారం రాత్రి మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తి దంపతులకు రాజగోపురం వద్ద దేవస్థాన అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి దంపతులు మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అమ్మవారి ఆలయం వద్దగల ఆశీర్వచన మండపంలో హైకోర్టు న్యాయమూర్తి దంపతులకు పండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకు లు ఆశీర్వచనాలు అందించారు. దేవస్థాన అధికారులు స్వామివారి శేషవస్త్రాలను, జ్ఞాపికను అందించి సత్కరించారు. అహోబిలేశుడికి ప్రత్యేక పూజలు దొర్నిపాడు: అహోబిలం క్షేత్రంలో కొలువైన శ్రీలక్ష్మీనరసింహస్వామికి గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ధనుర్మాస పూజల్లో భాగంగా గోదాదేవి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అలాగే అధ్యాయన వారోత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సహిత శ్రీప్రహ్లాదవరద స్వామికి ప్రత్యేక పూజలు అనంతరం తిరువీధుల్లో ఊరేగించారు. అహోబిలం మఠం చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రామానుజన్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. మద్దిలేటి స్వామికి తెప్పోత్సవం.. భక్తిపారవశ్యం బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురంలోని మద్దిలేటి స్వామి క్షేత్రంలో గురువారం భక్తిశ్రద్ధలతో తెప్పోత్సవం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత మద్దిలేటి నరసింహస్వామిని పల్లకీలో కొలువుంచి మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించి తెప్పోత్సవ సేవను అర్చకులు ప్రారంభించారు. స్వామి, అమ్మవార్లు ఆలయ పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు శోభాయమానంగా దర్శనమిచ్చారు. ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు, వేదపండితులు జ్వాలా చక్రవర్తి, కళ్యాణ చక్రవర్తి, మాజీ చైర్మన్ లక్ష్మిరెడ్డి, ప్రధాన అర్చకులు మద్దిలేటిస్వామి, మనోహర్, సూపరింటెండెంట్ రామ్మోహన్ రావు పాల్గొన్నారు. -
ఆ నవ్వులేం పాపం చేశాయ్!
‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్’ అంటూ నక్షత్రాల గురించి పాడే ఐదేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి పాట మూగబోయింది. ‘నాన్నా.. నన్ను ఎత్తుకో’ అని చేతులు చాచే ఏడాది వయస్సు ఉన్న బాలుడు సూర్యగగన్ బుడిఅడుగులు ఇక కనిపించవు. తమ్ముడికి అన్నం తినిపిస్తూ.. చెల్లితో కళ్లుమూత ఆట ఆడుతూ.. ఇంటిలో కసువు ఊడ్చే ఎనిమిదేళ్ల కావ్యశ్రీ ఉత్సాహం కనుమరుగైంది. నూతన సంవత్సర వేడుకల్లో గురువారం అందరూ ఆనందంతో ఉన్న వేళ ఉయ్యాలవాడ మండలం తుడుమలదిన్నె గ్రామంలోని ఒక ఇంటిలో విషాద గీతం వినిపించింది. తల్లి లేని పిల్లలను రెక్కల కష్టంతో అల్లారుముద్దగా పెంచుకుంటున్న తండ్రికి ఏం కష్టం వచ్చిందో ఏమో.. క్షణికావేశంలో కూల్డ్రింక్లో విషమిచ్చాడు. ఈ లోకం గురించి తెలియని చిన్నారులు దానిని తాగి మృత్యువాత పడ్డారు. పిల్లలు లేని లోకం తనకు వద్దని ఉరి వేసుకుని తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్నారి జ్ఞానేశ్వరి చిరునవ్వును తన పెదవులపై ఉంచుకుని మృత్యువాత పడటం అందరినీ కలచి వేసింది. మూడో తరగతి చదివే కావ్యశ్రీ, అంగన్వాడీ కేంద్రానికి వెళ్లే జ్ఞానేశ్వరి, ఇంటి వద్ద ఉంటే జేజమ్మ కృష్ణమ్మకు వచ్చీరాని మాటలు చెప్పే సూర్యగగన్ ఇక కనిపించరు. పిల్లలను భుజాన మోసే తండ్రి వేములపాటి సురేంద్ర కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దుర్ఘటన నాలుగు రోజుల క్రితం గడివేముల మండల పరిధిలోని ఒండుట్ల గ్రామానికి చెందిన బుగ్గానిపల్లి ఎల్లా లక్ష్మి తన ఇద్దరు పిల్లలను ఎస్సార్బీసీ కాల్వలో తోసి ఆత్మహత్యకు పాల్పడటాన్ని తలపించింది. – నంద్యాల/ఉయ్యాలవాడ ముగ్గురు చిన్నారులు మృతి తండ్రి బలవన్మరణం తుడుమలదిన్నెలో విషాదం -
ఆ ‘ఒక్కటి’ అడగొద్దు!
కర్నూలు(అగ్రికల్చర్): ‘‘ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా 1వ తేదీనే వేతనాలు చెల్లిస్తాం.. మంచి పీఆర్సీ ఇస్తాం.. ఇంటీరియం రిలీఫ్ ఇస్తాం..’’అని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని నెలలుగా వేతనాలు చెల్లించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులకు చుక్కలు చూపిస్తోంది. నెలలో 11 నుంచి 12 తేదీల వరకు వేతనాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు పడుతున్న ఇక్కట్లు అన్నీ, ఇన్నీ కావు. నూతన ఏడాదిలో జనవరి 1న కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా బ్యాంక్ ఖాతాలకు జీతాలు జమ కాలేదు. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ కూడా అందలేదు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటై 19 నెలలు అవుతోంది. ఈ కాలంలో ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం మినహా.. ఇతరత్రా ప్రయోజనాలన్నీ ఎక్కడివక్కడ ఉండిపోయాయి. రిటైర్డ్ ఉద్యోగుల్లో ఆందోళన కర్నూలు జిల్లాలో 25.985, నంద్యాల జిల్లాలో 20,282 ప్రకారం ఉమ్మడి జిల్లాలో 46,287 మంది ఉద్యోగులు ఉన్నారు. 2024 జూన్ నుంచి ఈ ఏడాది డిసెంబరు వరకు ఉమ్మడి జిల్లాలో 956 మంది పదవీ విరమణ చేశారు. ఒక్కొక్కరికి రూ.35 లక్షల నుంచి రూ.కోటి వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంది. సగటున ఒక్కొక్కరికి రూ.50 లక్షల ప్రకారం ఇవ్వాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలోనే రూ.478 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఉమ్మడి ఆఫీసు సబార్డినేట్ మొదలు కొని ఉన్నత స్థాయి వరకు 30– 38 ఏళ్లపాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేశారు. 2024 జూన్ నుంచి పదవీ విరమణ చేసిన వారికి చిల్లిగవ్వ ఇవ్వకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. పడిపోతున్న ‘సిబిల్ స్కోర్’ చంద్రబాబు ప్రభుత్వం 19 నెలల్లో ఉద్యోగులకు ఒక్క డీఏ ఇవ్వడం మినహా చేసింది ఏమీ లేదు. 12వ పీఆర్సీ ఊసే లేదు, మధ్యంతర భృతి మాట నే లేకుండా పోయింది. హెల్త్ కార్డులు పనిచేయడం లేదు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు 10 నెలల సెలవు జీతాలు, గ్రాడ్యుటీ చెల్లింపులు లేవు. నాలు గు విడతల సరండర్ లీవ్లు లేవు. కనీసం ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తున్నారా అంటే కొన్ని నెలలుగా అది కూడా లేకుండా పోయింది. వేతనాలు సకాలంలో పడితేనే ప్రభుత్వ ఉద్యోగులు ఈఎంఐలు చెల్లించే వీలు ఉంది. ఒక్క రోజు ఆలస్యమైనా సిబిల్ స్కోర్ పడిపోతుంది. ప్రతి నెలా 1న ప్రభుత్వ ఉద్యోగులకు అందని వేతనాలు పెన్షన్ రాక రిటైర్డ్ ఉద్యోగుల ఆందోళన నూతన ఏడాదీ తొలగని కష్టాలు చంద్రబాబు సర్కార్పై నోరుమెదపని ఉద్యోగ సంఘాల నేతలు నేరు మెదపని ఉద్యోగ సంఘాలు ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు నోరుమెదపడం లేదు. ఏపీ ఎన్జీజీఎవోస్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోషియేషన్ నేతల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు ఏదైనా చిన్న ప్రయోజనం జరిగిందంటే తమ ఘనతగా చెప్పుకునే సంఘాల నేతలు నేడు వేతనాలు సకాలంలో చెల్లించకపోవడం, ఇతర ప్రయోజనాలు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నా.. ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
డీఐజీగా పదోన్నతి స్వీకరించిన విక్రాంత్పాటిల్
కర్నూలు: ఎస్పీ స్థాయి నుంచి విక్రాంత్ పాటిల్ డీఐజీగా పదోన్నతి స్వీకరించారు. ఏపీ క్యాడర్కు చెందిన 16 మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ డిసెంబర్ 28న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా 2012 బ్యాచ్ ఐపీఎస్ అధికారి విక్రాంత్పాటిల్కు డీఐజీగా పదోన్నతి కల్పించి 2026 జనవరి 1 నుంచి పదోన్నతి జీఓ అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో గురువారం విక్రాంత్ పాటిల్ డీఐజీ పదోన్నతి స్వీకరించారు. అనంతరం కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్దిలను మర్యాదపూర్వకంగా కలసి పూల మొక్కలను అందచేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో విక్రాంత్ పాటిల్కు అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. క్యాంపు కార్యాలయంలో ఏపీఎస్పీ రెండవ బెటాలియన్ కమాండెంటు దీపికాపాటిల్తో కలసి కుటుంబ సమేతంగా కేక్ కట్ చేశారు. -
బొకేలకు దూరంగా..
గ్రీట్ విత్ గ్రీన్పై ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. బొకేలకు బదులుగా మొక్కలు ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గురువారం నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఉన్నతాధికారులకు కింది స్థాయి అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులకు వారి అనుచరులు, ఇతర ప్రజలు పూల మొక్కలు ఇచ్చి శుభాకాంక్షలు తెలపడం పర్యావరణానికి శుభ సూచకం అనే అభిప్రాయం వ్యక్తమైంది. ఖరీదైన బొకేలు, బహుమతులకు బదులుగా ప్రతి ఒక్కరూ మొక్కలు లేదా పేద విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, స్కూలు బ్యాగులు, పెన్సిళ్లు, పెన్నులను ఇచ్చి శుభాకాంక్షలు తెలపాలని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కోరారు. వారి పిలుపు మేరకు ఈ నూతన సంవత్సరం కొత్త ఒరవడికి నాంది పలికింది. అభిమానం కోసం ఖరీదైన వస్తువులకు బదులుగా పేదలు వినియోగించేందుకు అవసరమైన పుస్తకాలు, బట్టలను వితరణ చేయడం విశేషం. -
నల్లమలలో 87 పెద్ద పులులు
మహానంది: నల్లమల అడవుల్లో ప్రస్తుతం 87 పెద్దపులులు ఉన్నట్లు ఎన్ఎస్టీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ విజయ్కుమార్ తెలిపారు. మహానందిలోని అటవీ పర్యావరణ కేంద్రాన్ని గురువారం పునఃప్రారంభించారు. అలాగే శ్రీకామేశ్వరీదేవి సహిత మహానందీశ్వర స్వామివారిని దర్శించుకొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..నల్లమలలో ప్రస్తుతం 87పెద్ద పులులు ఉండగా త్వరలో పులుల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. మహానందిలోని అటవీ పర్యావరణ కేంద్రాన్ని గతంలో మహానందీశ్వరస్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు, పర్యాటకులు సందర్శించేవారని, అనివార్య కారణాలతో ప్రవేశం నిలిపేసినట్లు తెలిపారు. గురువారం నుంచి అందుబాటులోకి తెస్తున్నామన్నారు. పర్యాటకులు ఉచితంగా పర్యావరణ కేంద్రాన్ని సందర్శించవచ్చునన్నారు. అటవీజంతువులపై అవగాహన కల్పించేలా కేంద్రంలో చిత్రాలు ఏర్పాటుచేశామన్నారు. ఆయన వెంట డీఎఫ్ఓ అనురాగ్మీనా, నంద్యాల, చలమ ఫారెస్టురేంజ్ అధికారులు నాసిర్జా, ఉదయ్దీప్, డీఆర్వో హైమావతి ఉన్నారు. -
ఉయ్యాలవాడలో ఘోరం.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి..
ఉయ్యాలవాడ: ఓ తండ్రి తన ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో విషం తాగించి చంపడంతో పాటు తానూ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, బంధువుల కథనం మేరకు.. తుడుమలదిన్నెకి చెందిన వేములపాటి సురేంద్ర(35), మహేశ్వరి దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు. మహేశ్వరి తీవ్ర అనారోగ్యంపాలై ఆ బాధతో గతేడాది ఆగస్టులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.భార్య చనిపోయినప్పటి నుంచి తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్న సురేంద్ర.. కూలి పనులకు వెళ్తూ, పిల్లలు కావ్యశ్రీ(7), జ్ఞానేశ్వరి(5), సూర్య గగన్(1)తో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది, బుధవారం రాత్రి తన ముగ్గురు పిల్లలకు కూల్ డ్రింక్లో విషం కలిపి తాగించి, చంపాడు.ఆపై తానూ ఉరేసుకుని తనువు చాలించాడు. గురువారం ఉదయం 8 గంటలైనా ఇంటి తలుపులు తెరవకపోవడంతో సురేంద్ర తల్లి కృష్ణమ్మ అక్కడికి వెళ్లి చూడగా కుమారుడు, మనవరాళ్లు, మనవడు విగత జీవులుగా కనిపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామిరెడ్డి తెలిపారు. -
భక్తులకు అలర్ట్.. శ్రీశైలంలో చిరుత కలకలం
సాక్షి, నంద్యాల జిల్లా: శ్రీశైలంలో చిరుతపులి కలకలం సృష్టించింది. అర్ధరాత్రి ఓ ఇంటి ప్రాంగణంలో చిరుత సంచరించింది. పాతాళ గంగ మెట్ల మార్గంలోని ఓ ఇంటి ప్రాంగణంలోకి చిరుతపులి వచ్చింది. సీసీ కెమెరాలో చిరుత దృశ్యాలు రికార్డయ్యాయి. ఈవో శ్రీనివాసరావు, దేవస్థానం సిబ్బంది. అప్రమత్తమయ్యారు. పుణ్య స్నానాలకు వెళ్ళే భక్తులు, స్థానికులు జాగ్రత్తలు పాటించాలని మైకుల ద్వారా అధికారులు అనౌన్స్ చేయిస్తున్నారు.నల్లమలలో 87 పెద్ద పులులునల్లమల అడవుల్లో ప్రస్తుతం 87 పెద్దపులులు ఉన్నట్లు ఎన్ఎస్టీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ విజయ్కుమార్ తెలిపారు. మహానందిలోని అటవీ పర్యావరణ కేంద్రాన్ని గురువారం పునఃప్రారంభించారు. అలాగే శ్రీకామేశ్వరీదేవి సహిత మహానందీశ్వర స్వామివారిని దర్శించుకొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..నల్లమలలో ప్రస్తుతం 87పెద్ద పులులు ఉండగా త్వరలో పులుల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు.మహానందిలోని అటవీ పర్యావరణ కేంద్రాన్ని గతంలో మహానందీశ్వరస్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు, పర్యాటకులు సందర్శించేవారని, అనివార్యకారణాలతో ప్రవేశం నిలిపేసినట్లు తెలిపారు. గురువారంనుంచి అందుబాటులోకి తెస్తున్నామన్నారు. పర్యాటకులు ఉచితంగా పర్యావరణ కేంద్రాన్ని సందర్శించవచ్చునన్నారు. అటవీ జంతువులపై అవగాహన కల్పించేలా చిత్రాలు ఏర్పాటు చేశామన్నారు. -
సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
కర్నూలు: మారుతున్న నేరాలకు అనుగుణంగా విధి నిర్వహణలో సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ట్రైనీ కానిస్టేబుళ్లకు సూచించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి నూతనంగా ఎంపికై శిక్షణ నిమిత్తం కర్నూలు జిల్లా పోలీసు శిక్షణ కళాశాలకు(డీటీసీ) వచ్చిన 205 మంది ఏపీఎస్పీ ట్రైనీ కానిస్టేబుళ్లకు ఎస్పీ బుధవారం దిశానిర్దేశం చేశారు. అమీలియో హాస్పిటల్ ఆధ్వర్యంలో ట్రైనీ కానిస్టేబుళ్లకు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించి ముందు జాగ్రత్తలతో అందరికీ టీటీ ఇంజెక్షన్లు వేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ ట్రైనీ కానిస్టేబుళ్లనుద్దేశించి మాట్లాడారు. శిక్షణ సమయంలో క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. నూతన చట్టాలపై అవగాహన పెంచుకున్నప్పుడే వృత్తిలో రాణింపు సాధ్యమన్నారు. శిక్షణలో పొందుపరచిన ప్రతి అంశం వృత్తిపరంగా నైపుణ్యులుగా తీర్చిదిద్దేందుకేనని గ్రహించాలన్నారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, డీటీసీ వైస్ ప్రిన్సిపల్ దుర్గప్రసాద్, కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్, పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతి, సీఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు. -
సమస్యలకు వెంటనే పరిష్కారం
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల(అర్బన్): జిల్లాలోని సమస్యలకు వెంటనే పరిష్కారం చూపుతున్నామని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. గతేడాది జిల్లా గణనీయమైన ప్రగతిని సాధించిందన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీనే 97 శాతం వరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశామన్నారు. జిల్లాలో అదనంగా 65 వేల హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయన్నారు. చేపల ఉత్పత్తి 44 వేల టన్నుల నుంచి 67 వేల టన్నుల వరకు పెరిగిందన్నారు. మొత్తం రూ.78.87 కోట్ల పెట్టుబడితో 1,476 సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసి 5,560 మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు వివరించారు. నూతన ఏడాది మరింత అభివృద్ధి సాధించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఫిబ్రవరి 28 వరకు లైఫ్ సర్టిఫికెట్ల స్వీకరణ నంద్యాల(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల నుంచి జీవన ధ్రువపత్రాలు (లైఫ్ సర్టిఫికెట్లు) జనవరి 01 నుంచి ఫిబ్రవరి 28 వరకు సబ్ ట్రెజరీలు, జిల్లా ట్రెజరీ కార్యాలయంలో స్వీకరిస్తామని జిల్లా ఖజానా, గణాంకాల అధికారి శ్రీమతి ఎం.లక్ష్మీదేవి తెలిపారు. పెన్షనర్లు తమ జీవన ధ్రువపత్రాలను ట్రెజరీ కార్యాలయాల్లోనే కాకుండా, ఆన్లైన్ ద్వారా ‘జీవన్ ప్రమాణ్’ పోర్టల్లో ఎక్కడి నుంచైనా సమర్పించవచ్చని పేర్కొన్నారు. మొబైల్లో ‘జీవన్ ప్రమాణ్’ యాప్ ద్వారా కూడా జీవన ధ్రువపత్రాలు సమర్పించే సదుపాయం ఉందని ఆమె తెలిపారు. ఫిబ్రవరి 28లోపు జీవన ధ్రువపత్రాల నమోదు పూర్తి చేయని పెన్షనర్లకు మార్చి నెల పెన్షన్ నిలిపివేసే అవకాశం ఉందన్నారు. సబ్ జైలు ఆకస్మిక తనిఖీ నంద్యాల(వ్యవసాయం): నంద్యాల స్పెషల్ సబ్ జైలును మండల లీగల్ సేల్ అధ్యక్షులు, మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి జైలు నందు ఏర్పాటు చేసిన ప్రిజన్ లీగల్ హెల్ప్ ఎయిడ్ హెల్ప్ డెస్క్, క్లినిక్ను తనిఖీ చేసి దాని గురించి అవగాహన కల్పించారు. ఏవైనా సమస్యలుంటే లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నంబర్కు 15100 సమాచారం తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో జైలు అధికారి గురుప్రసాదరెడ్డి, లోక్ అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి, లీగల్ ఎయిడ్ న్యాయవాది పాల్గొన్నారు. కొందరికే పాసుపుస్తకాలు దొర్నిపాడు: భూ రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్పుస్తకాలను జనవరి 2 నుంచి రైతులకు ఇచ్చేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. కానీ మండలంలో మొదటి విడత గుండుపాపల, బుర్రారెడ్డిపల్లె, కొండాపురం గ్రామాల్లో భూరీసర్వే పూర్తి చేశారు. అలాగే రెండో విడత భూ రీ సర్వేలో భాగంగా క్రిష్టిపాడు, డబ్ల్యూ గోవిందిన్నె గ్రామాల్లో చేశారు. కానీ ప్రస్తుతం మొదటి విడత పూర్తయిన గుండుపాపల 267, బుర్రారెడ్డిపల్లె 250, కొండాపురం 365 పాస్పుస్తకాలు మాత్రమే వచ్చాయి. క్రిష్టిపాడు, డబ్ల్యూగోవిందిన్నె గ్రామాల రైతులకు పుస్తకాలు రాలేదు. అలాగే రీ సర్వే అయిన భూములకు సంబంధించి ల్యాండ్ సీలింగ్, ప్రభుత్వ, డీ పట్టాలకు భూములకు ఆన్లైన్లో ఆర్ఓఆర్, అడంగల్ రావడం లేదని రైతులు వాపోతున్నారు. బ్యాంకు రుణాలు పొందాలన్నా, రీ షెడ్యూల్ చేసుకోవాలన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. -
‘గోళీ’ గుడ్డు
కోవెలకుంట్ల: నాటు కోడి గుడ్డు బరువు సాధరణంగా 40 నుంచి 70 గ్రాముల వరకు ఉంటుంది. కోవెలకుంట్లలోని మహబూబ్బాషాకు చెందిన కోడిపెట్ట రెండు రోజులు సాధారణ గుడ్లు పెట్టింది. బుధవారం గోళీ సైజులో ఉన్న చిన్న గుడ్డు పెట్టింది. దాని బరువు 11 గ్రాములు మాత్రమే ఉంది. కోడిపెట్టలో కాల్షియం లోపంతో కొన్ని సందర్భాల్లో చిన్నసైజులో గుడ్లు పెట్టే అస్కారం ఉందని పశువైద్యాధికారి కృష్ణకుమార్ తెలిపారు. 3న నంద్యాల జిల్లా ఎపీఎన్జీజీవోస్ ఎన్నికలు కర్నూలు(అగ్రికల్చర్): ఏపీఎన్జీజీవోస్ అసోసియేషన్ నంద్యాల జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు జనవరి 3న జరుగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలనే తాత్కాలికంగా అడ్హాక్ కమిటీని రాష్ట్ర నాయకత్వం నియమించింది. తాజాగా పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్నికల ప్రక్రియను చేపట్టనున్నారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షుడు ప్రసాద్ యాదవ్, సహాయ ఎన్నికల అధికారిగా వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, పరిశీలకులుగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివప్రసాద్ నియమితులయ్యారు. నంద్యాలలోని ఎన్జీవో హోమ్లో ఎన్నికల ప్రక్రియ చేపడుతారు. కర్నూలు జిల్లాకు కూడా అడ్హాక్ కమిటీ ఉంది. ఇటీవలనే అన్ని తాలూకాలకు ఎన్నికలు నిర్వహించారు. మరో వారం రోజుల్లో కర్నూలు జిల్లా ఎన్నికలు కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలు(అగ్రికల్చర్): ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ మాటలకే పరిమితమైంది. జనవరి 1న నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేపట్టారు. అయితే బుధవారం ఉదయం వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులు కొద్దిసేపు ఇళ్ల దగ్గర పింఛన్లు పంపిణీ చేసి, ఆ తర్వాత యథావిధిగా సచివాలయాలు, రచ్చబండల వద్దకు పిలిపించారు. అందరినీ ఒక చోటకు చేర్చి పంపిణీ చేపట్టారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి కల్లూరు మండలం ఏ.గోకులపాడులో పింఛన్లు పంపిణీ చేశారు. 36 మంది సచివాలయ ఉద్యోగులు ఆలస్యంగా పింఛన్ల పంపిణీ చేపట్టడంతో కలెక్టర్ ద్వారా నోటీసులు ఇవ్వనున్నట్లు డీఆర్డీఏ పీడీ రమణారెడ్డి తెలిపారు. సాయంత్రం 5 గంటల సమయానికి పింఛన్ల పంపిణీలో కర్నూలు జిల్లా 5వ స్థానంలో నిలిచింది. జెడ్పీ, మండల పరిషత్లకు రూ.25.69 కోట్లు కర్నూలు(అర్బన్): 2025–26 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడత 15వ ఆర్థిక సంఘం నిధులు జిల్లా పరిషత్, ఉమ్మడి జిల్లాలోని 53 మండల పరిషత్లకు విడుదలైన రూ.25,69,77,536 ఆయా స్థానిక సంస్థల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయని జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా పరిషత్కు 10 శాతం వాటా మేరకు బేసిక్ గ్రాంట్ రూ.3,42,63,671, టైడ్ గ్రాంట్ కింద రూ.5,13,95,506 జమ చేశారన్నారు. అలాగే మండల పరిషత్లకు 20 శాతం వాటా మేరకు బేసిక్ గ్రాంట్ కింద రూ.6,85,27,344, టైడ్ గ్రాంట్ కింద రూ.10,27,91,015 బ్యాంకుల్లో జమయ్యాయన్నారు. ఈ నిధులను ప్రభుత్వ నిబంధనల మేరకు ఖర్చు చేయాలని ఆయన ఎంపీడీఓలను ఆదేశించారు. కాగా ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా బనగానపల్లె మండలానికి రూ.58,48,351, అత్యల్పంగా గూడురు మండలానికి రూ.13,69,314 విడుదలయ్యాయి. మాన్యం భూములతో రూ.18.51 కోట్ల ఆదాయం చాగలమర్రి: నంద్యాల జిల్లాలో 1,874 ఆలయాలు, 37,500 ఎకరాల విస్తీర్ణంలో మాన్యం భూములున్నాయని, వీటి ద్వారా ప్రతి యేట రూ.18.51 లక్షల ఆదాయం లభిస్తుందని జిల్లా ఎండోమెంట్ అధికారి ఎస్. మోహన్ వెల్లడించారు. బుధవారం మండలంలోని మద్దూరు గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారి వెండి ఆభరణాల అపహరణపై విచారణకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో స్వామి వారి మూల విరాట్ విగ్రహాన్ని, స్వామికి అలంకరించిన నకిలీ ఆభరణాలను పరిశీలించారు. ఆలయ ఈఓ జయచంద్రారెడ్డితో స్వామి అభరణాల సంఖ్య, వాటి విలువను ఆడిగి తెలుసుకున్నారు. -
శ్రీశైలంలో ‘స్వయం’ కృతాపరాధం!
● ప్రభుత్వానికి ఏటా రూ.43కోట్లు భక్తుల సొమ్ము చెల్లింపుశ్రీశైలంటెంపుల్: రాష్ట్రంలో రెండో అతిపెద్ద పుణ్యక్షేత్రం కావడంతో శ్రీశైలానికి తిరుమల తరహాలో స్వయం ప్రతిపత్తి కల్పించాల్సి ఉంది. అలా చేస్తే క్షేత్రానికి ఐఏఎస్ అధికారి ఈవోగా ఉంటారు. ప్రభుత్వానికి ఏటా చెల్లించే ఫండ్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే శ్రీశైల దేవస్థానానికి స్వయంప్రతిపత్తి కలగా మారింది. గత ట్రస్ట్బోర్డు శ్రీశైల దేవస్థానానికి స్వయంప్రతిపత్తి కల్పించాలని కొరుతూ సుమోటో అజెండాగా చర్చించి కమిషనర్కు పంపారు. అటు తరువాత ట్రస్ట్బోర్డు కాలపరిమితి పూర్తవడంతో ఈ ఫైల్ అటకెక్కింది. క్షేత్రంలో భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. స్వయంప్రతిపత్తి కల్పిస్తే క్షేత్ర అభివృద్ధి త్వరితగతిన జరుగుతుంది. ఏటా ప్రభుత్వానికి రూ.43 కోట్లపైనే చెల్లింపు శ్రీశైల దేవస్థానానికి స్వయంప్రతిపత్తి లేని కారణంగా ఉభయ దేవాలయాల్లో హుండీలలో, దేవస్థానానికి భక్తులు సమర్పించే కానుకల్లో ప్రభుత్వానికి ఏటా రూ.కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి. కామన్ గుడ్ ఫండ్ కింద 9 శాతం, ఎండోమెంట్ అడ్మినిస్ట్రేటీవ్ ఫండ్ కింద 8 శాతం, అర్చక వెల్పేర్ ఫండ్ కింద 3 శాతం, ఆడిట్ ఫీజు కింద 1.5శాతం ఇలా మొత్తం 21.5 శాతం ప్రభుత్వానికి చెల్లించాల్సిందే. ఉదాహరణకు శ్రీశైల దేవస్థానానికి ఏడాదికి సుమారు రూ.200కోట్లు ఆదాయం వస్తే అందులో 21.5శాతం అంటే సుమారు రూ.43కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా భక్తులు సమర్పించిన సొమ్ము స్వయంప్రతిపత్తి లేక ఏటా ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తోంది. -
అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం
● మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బేతంచెర్ల: ప్రజలు ఎవరూ అధైర్యపడవద్దని, సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకరావాలని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. బేతంచెర్ల పట్టణంలోని శేషారెడ్డి ఉన్నత పాఠశాలలో వాకింగ్ ట్రాక్ను బుధవారం పరిశీలించారు. అక్కడి ప్రజలతో మాట్లాడారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడంతోపాటు అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటానన్నారు. ఎన్నికల ముందు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్ర బాబునాయుడు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. అనంతరం ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు, ప్రిన్సిపాల్తో మాట్లాడారు. వాకింగ్ ట్రాక్ వెంట నడిచి మైదానం పరిశుభ్రంగా ఉంచాలని, అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డికి సూచించారు. గిట్టుబాటు ధర లభిస్తుందా? బేతంచెర్ల పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో మాజీ మంత్రి బుగ్గన సమావేశం నిర్వహించారు. ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరు, అభివృద్ధిపై గ్రామాల ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభిస్తుందా, దిగుబడులు , ఎరువుల కొరత తదితర అంశాలపై చర్చించారు. మద్దతు ధర లేదని, యూరియా కొరత ఉందని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమంతో పాటు రైతులను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి బుగ్గన ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ చలం రెడ్డి, సీనియర్ నాయకులు బుగ్గన చంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామ చంద్రుడు, పట్టణ, మండల కన్వీనర్ తిరుమలేశ్వర్రెడ్డి , జాకీర్, సుబ్బారెడ్డి, మహబూబ్, గోరుమానుకొండ సర్పంచ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ప్రజలకు ఉత్తమ సేవలు అందించండి
కర్నూలు(అర్బన్): ప్రభుత్వ ఉద్యోగాల్లోకి కొత్తగా వచ్చిన వారందరూ ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి కోరారు. బుధవారం జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు పోస్టులకు అర్హత, వారి అభీష్టం మేరకు 26 మందికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు కల్పించారు. అలాగే జెడ్పీ పరిధిలోని వివిధ కార్యాలయాలు, ఉన్నత పాఠశాలల్లో రికార్డు అసిస్టెంట్, ల్యాబ్, లైబ్రరీ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 13 మందికి జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించి ఖాళీగా ఉన్న కార్యాలయాలకు పోస్టింగ్స్ ఇచ్చారు. జెడ్పీ చైర్మన్ చాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగాలు, పదోన్నతులు పొందిన వారికి జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డితో కలిసి ఆయన నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పోస్టింగ్స్ విషయంలో సాధ్యమైనంత వరకు వారికి అనుకూలమైన ప్రదేశాలలోనే నియమించామన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
4 కి.మీ 400 గుంతలు
● శిథిలావస్థలో అంతర్రాష్ట్ర రహదారి ● తరచూ ప్రమాదాలు ● వాహనదారుల కష్టాలు గుంతలమయమైన కర్నూలు–బళ్లారి అంతర్రాష్ట్ర రహదారి ఆలూరు రూరల్/హాలహర్వి: సంక్రాంతిలోగా రాష్ట్రంలో గుంతలు లేని రహదారులుగా మారుస్తామంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు హామీ ఇచ్చారు. 2025 సంక్రాంతి పోయి, 2026 సంక్రాంతి వస్తున్నా రోడ్లు బాగు పడలేదు. అదే గుంతలు.. అవే కష్టాలు వాహనదారులను భయపెడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల రహదాలను పరిస్థితి ఒక విధంగా ఉంటే ఆంధ్రా, కర్ణాటక రాష్ట్రాలను కలిపే ప్రధాన రహదారి దుస్థితి మరింత అధ్వానంగా మారింది. చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టిన నాటి నుంచి ఈ రహదారి మరమ్మతులు నోచుకోలేదు. 2018లో హాలహర్వి మండలం క్షేత్రగుడి నుంచి కర్ణాటక సరిహద్దు వరకు 4 కి.మీ రహదారి నిర్మించారు. గత 15 నెలలుగా ఈ రహదారిలో పెద్దపెద్ద గుంతలు పడ్డాయి. 4 కి.మీ రహదారిలో 400 గుంతలు కనిపిస్తాయి. భారీ వాహనాల రాకపోకల వలన దుమ్ము ధూళితో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రెండు రాష్ట్రాలను కలిపే ఓ ప్రధాని రహదారి కావడంతో నిత్యం వాహనాల రద్దీ అధికంగా ఉంటోంది. హైవే–167కు ప్రత్యామ్నయ రహదారి కావడంతో ఆలూరు నుంచి బళ్లారికి రోజు వందలాది వాహనాలు ఈ మార్గం ద్వారా వెళ్తుంటాయి. వర్షాకాలంలో ఈ రహదారిలో ప్రయాణించాలంటే ప్రయాణికులు నరకం చూడాల్సిన పరిస్థితి. రహదారుల గుంతలు కనిపించకుండా కళ్లకు గంతులు కట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం కళ్లకున్న గంతులు తొలగించి రహదారుల వైపు చూసి వాటిని బాగుచేయాలని ప్రయాణీకులు ప్రజలు వాపోతున్నారు. -
ఆదోని ప్రజల ఉసురు టీడీపీకి తప్పదు
● వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి శశికళ ఆలూరు: ఆదోని జిల్లా ఏర్పాటులో నిర్లక్ష్యం వహించిన అధికార టీడీపీకి ఈ ప్రాంత ప్రజల ఉసురు తప్పక తగులుతుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి శశికళ విమర్శించారు. నియోజకవర్గ కేంద్రమైన ఆలూరులో అంబేడ్కర్ సర్కిల్ సమీపంలో ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటి సభ్యులు కత్తి రామాంజనేయులు ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరహారదీక్షలు బుధవారం నాటికి 20 రోజులకు చేరకున్నాయి. ఈ సందర్భంగా నియోజకవర్గం మాల మహా నాడు సంఘం నాయకులు ఈరన్న, లక్ష్మీనారాయణ, తిక్కన్న, హాలహర్వి సర్పంచ్ మల్లికార్జున, వన్నూరు, వెంకటరాముడు తదితరులు రిలే నిరహారదీక్షలలో కూర్చున్నారు. వీరికి వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి శశికళ, కృష్ణమోహన్, ఎరువులు వ్యాపారి అశోకానందరెడ్డి, సీపీఐ జిల్లా నాయకులు భూపేష్, వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి గూళ్యం ఎల్లప్ప తదితరులు మద్దతు పలికారు. ఆదోని జిల్లా ప్రకటించకపోవడంతో మంత్రాలయం రాఘవేంద్రస్వామి, ఆదోని లక్ష్మమ్మవ్వ, ఉరుకుంద ఈరన్నస్వా మి, దేవరగట్టులో కొలువు దీరిన శ్రీ మాళమల్లేశ్వరస్వామి, గూళ్యం గాదిలింగప్ప, పెద్దహోతూరు ఉచ్చీరప్పతాతాలు టీడీపీ నేతలను మన్నించరని ఆమె జోష్యం చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు సమస్యను స్థానిక నేతలపై నెట్టడం ఎంత వరకు సమంజసమన్నారు. అంతక ముందు రోడ్డు పైనే వంట వార్పు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనతో రహదారిలో అర గంటపాటు నిలిచిపోయాయి. -
హోరాహోరీగా బండలాగుడు పోటీలు
వెల్దుర్తి: శ్రీరంగాపురం కొండల్లో కొలువైన పాలుట్ల రంగస్వామి ఆలయ ఆవరణలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా బుధవారం న్యూ కేటగిరి వృషభాలకు నిర్వహించిన రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 21 జతల ఎద్దులు పోటీల్లో పాల్గొన్నాయి. రాత్రి వరకు కొనసాగిన పోటీల్లో రెండు జతలు సరాసరి 6300 అడుగుల దూరాన్ని లాగిన నాగర్కర్నూలు జిల్లా రాయవరం గ్రామానికి చెందిన ధనుష్రెడ్డి, అక్షరరెడ్డి వృషభాలు సంయుక్త విజేతలుగా నిలిచాయి. యజమానులకు ప్రథమ, ద్వితీయ బహుమతులు (రూ.40వేలు, రూ.30వేలు) కలిపి ఒక్కొక్కరికి రూ.35వేలు అందజేశారు. తర్వాతి మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో అనంతపురం జిల్లా నారాయణపురం మహమ్మద్ ఫరీద్ వృషభాలు, కర్నూలు పంచలింగాల సుంకన్న బ్రదర్స్, నంద్యాల జిల్లా బిల్లలాపురం భూమా గోవర్ధనరెడి ఎద్దులు నిలిచాయి. వరుసగా రూ.20వేలు, రూ.10వేలు, రూ.5వేల నగదు బహుమతులను నిర్వాహకులు, దాతలు వృషభ యజమానులకు అందజేశారు. -
పోలీసులపై చర్యలేవి?
పత్తికొండ: గంజాయి కేసులో కోర్టులో లొంగిపోవడానికి వచ్చిన నిందితుడిని అరెస్ట్ చేసే విషయంలో న్యాయస్థాన ప్రాంగణంలో దౌర్జన్యకాండకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాదులు మూడో రోజు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. బుధవారం గుత్తి రోడ్డు సర్కిల్ వరకు చెడు వినకు–చెడు చూడకు–చెడు మాట్లాడకు అనే ప్లకార్డులును ప్రదర్శిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. న్యాయవాదులు నరసింహ ఆచారి, రవికుమార్, సాంబశివ మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులను పోలీసులు ఉల్లంఘనకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గంజాయి కేసులో నిందితుడికి న్యాయవాదులు వత్తాసు పలకడం లేదని, సరెండర్ పిటీషన్ దాఖలు చేసినందున.. చట్టపరిధిలో శిక్షించాలని మాత్రమే కోరామన్నారు. అయితే అరెస్ట్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు న్యాయవ్యవస్థను భయబ్రాంతులకు గురి చేయడేమేనని తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేయడంలో విఫలమైన పోలీసులు, న్యాయవ్యవస్థను అగౌరవ పరచడం దారుణమన్నారు. అక్రమ అరెస్ట్కు పాల్పడిన పత్తికొండ, చిప్పగిరి ఎస్ఐలు విజయ్కుమార్ నాయక్, సతీష్కుమార్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటన జరిగి 7రోజులు గడిచినా వారిపై కేసు నమోదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదులు పాల్గొన్నారు. -
పీవీఎస్ఆర్ క్రషర్ పరిశ్రమకు నిప్పు
దొర్నిపాడు: ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరు గ్రామ శివారులోని జాతీయ రహదారి 40కిలోమీటర్ల సమీపంలో ఉన్న పీవీఎస్ఆర్ క్రషర్ పరిశ్రమకు గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారు. ఈ క్రషర్ పరిశ్రమ దొర్నిపాడు మండలం కొండాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు పయిడేల శివరామిరెడ్డికి చెందినది. సెక్యూరిటీ సిబ్బంది భోజనం చేసే సమయంలో వెనుక నుంచి వచ్చి దుండగులు నిప్పుపెట్టారు. వెంటనే మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. రూ.లక్షలు విలు వ చేసే పట్టలు, కన్వేయర్ బెల్టులు కాలిబూడిదయ్యా యి. దుండగులు తమ వెంట క్యాన్లో పెట్రోల్ తీసుకొచ్చి నిప్పుపెట్టినట్లుగా బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలంలో పెట్రో క్యాన్ లభించడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. రాజకీయ కక్షతోనే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడి ఉంటారని బాధితులు అనుమానిస్తున్నా రు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ వరప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని క్రషర్ను పరిశీలించారు. రూరల్ పోలీసులు విచారణ చేస్తున్నారు. -
మహిళ ఆత్మహత్య
కొత్తపల్లి: కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందని ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మండలంలోని ఎదురుపాడు గ్రామపంచాయతీలో మజరా గ్రామమైన జడ్డువారిపల్లె గ్రామానికి చెందిన కదిరి వెంకటేశ్వర్లు ఎనిమిదేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం లింగాల మండలం ఆమిడిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీదేవి(40)ని రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె మొదటి భర్తకు ఒక కూతురు ఉంది. ఆ కూతురు కొన్నిరోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి ప్రేమ వివాహం చేసుకుంది. ఈ విషయం బంధువుల ద్వారా తెలుసుకున్న లక్ష్మిదేవి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం జడ్డువారిపల్లె ఇంట్లోనే పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. కుటుంబ సభ్యులు గుర్తించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతి చెందింది. భర్త కదిరి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ రవీంద్రబాబు బుధవారం తెలిపారు. -
మేత.. బంగారమాయే..!
కృష్ణగిరి: గడ్డికి గడ్డుకాలం మొదలైంది. అధిక వర్షాభావ పరిస్థితులు అన్నదాతకు పెట్టుబడులు నెత్తికి తీసుకరావడమే కాక నోరు ఎరగని మూగజీవాలను అర్ధకాలితో సరిపెట్టాల్సి వస్తోంది. రైతులు పంటలు పండక పోయినా మరో ఏడాది వస్తుందిలే అని ఎదూరుచూస్తున్న సమయంలో పశువుల మేత కొరతతో చేసేదిమిలేక కబేళాలకు తరలిస్తున్నారు. కొద్దో గొప్పో అర్థికంగా ఉన్న రైతులు తమ ఎద్దులను, పశువులను అమ్ముకోలేక వరిగడ్డి, వేరుశనగ మేతను అధిక ధరకు కొని తెచ్చుకుంటున్నారు. ట్రాక్టర్ వరిగడ్డి రూ.15 వేలు, అలాగే వేరుశనగను రూ.25 వేలకు కొంటున్నట్లు రైతులు తెలిపారు. ఈయేడాది అధిక వర్షాలకు వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతినడంతో మేతను పొలాల్లోనే వదిలేశారు. ప్రభుత్వం కేవలం ఆరకొరగా దాణా ఇచ్చి చేతులు దులుపుకుంది. పశుగ్రాసం కొరతతో ఇబ్బంది పడుతున్న రైతాంగాన్ని అదుకునేందుకు ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాడి రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా మారింది. ఇప్పుటికైనా ప్రభుత్వం రాయితీ కింద పశువుల మేత, దాణను ఇవ్వకపోతే పశులను అమ్ముకోక తప్పదని రైతులు వాపోతున్నారు. -
దొరకని పసికందు ఆచూకీ
గడివేముల: మండల పరిధిలోని ఒండుట్ల గ్రామాని కి చెందిన బుగ్గానిపల్లె ఎల్లాలక్ష్మి (23), వైష్ణవి (3), సంగీత (మూడు నెలల శిశువు) గడివేముల మండలం మంచాలకట్ట సమీపంలోని ఈ నెల 28వ తేదీన ఎస్సార్బీసీ కాల్వలో దూకి ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే. తల్లి, పెద్దకూతురి మృతదేహాలను గుర్తించి బయటకు తీయగా శిశువు సంగీత కోసం సహాయక బృందాల గాలింపు బుధవారం కొనసాగింది. ఘటనపై ఎల్లా లక్ష్మి తండ్రి మద్దిలేటి ఫిర్యాదు మేరకు బాధితురాలి భర్త రమణయ్యతో పాటు అత్త నాగలక్ష్మి, ఆడపడుచు భాగ్యలక్ష్మిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ కిరణ్కుమార్రెడ్డి తెలిపారు. శిశువు ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు సీఐ చెప్పారు. ముగతి పేటలో భారీ చోరీ ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని ముగతి పేటలో సొసైటీ రిటైర్డ్ సెక్రటరీ ఇంట్లో భారీ చోరీ జరిగినట్లు తెలిిసింది. ముగతి పేటకు చెందిన రిటైర్డ్ సెక్రటరీ శ్రీనివాసులు గత నెల 26వ తేదీన ఇంటికి తాళం వేసి గుల్బార్గాలోని తన కుమారుడి దగ్గరకు వెళ్లాడు. ఈ నెల 27వ తేదీన సాయంత్రం ఇంటికి రాగా తాళం విరగొట్టి ఉండటంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో పోలీసులు వచ్చి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. బీరువాలో ఉన్న 20 తులాల బంగారు ఆభరణాలు, రూ. 40 వేల నగదును దొంగలు చోరీకి పాల్పడినట్లు యజమాని శ్రీనివాసులు చెప్పారు. పట్టణ పోలీసులు బుధవారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
ఆగిన లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
కోడుమూరు రూరల్: కోడుమూరు – కర్నూలు రహదారిలో ప్యాలకుర్తి సమీపంలో బుధవారం తెలవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఆర్టీసీ డిపో డ్రైవర్ మృతి చెందాడు. కోడుమూరు పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కల్యాణదుర్గం డిపో నుంచి మంగళవారం రాత్రి గుంతకల్లు, కోడుమూరు మీదుగా హైదరాబాద్కు ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు బయలుదేరింది. మార్గమధ్యలో అర్ధరాత్రి దాటిన తర్వాత కోడుమూరు – కర్నూలు రోడ్డులో ప్యాలకుర్తి సమీపంలో తమిళనాడుకు చెందిన ఓ లారీ ఆగివుంది. ఇదే సమయంలో నిద్రమత్తులో ఉన్న బస్సు డ్రైవర్ బాషా ఆగివున్న లారీని గమనించకుండా వెనుక నుంచి వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బస్సులో కుడి వైపు ఉన్న సహచర డ్రైవర్ శ్రీనివాసులుతో పాటు, ప్రయాణికులు విజయ్, బసిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. మరి కొందరు ప్రయాణికు లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న కోడుమూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని 108లో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించా రు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక బస్సు డ్రైవర్ శ్రీనివాసులు మృతి చెందాడు. ఈ మేరకు కోడుమూరు ఎస్ఐ ఎర్రిస్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ రహదారి లో ప్యాలకుర్తి సమీపంలో వారం రోజుల వ్యవధిలో ఇది రెండో రోడ్డు ప్రమాదం కావడం గమనార్హం. ఇద్దరికి తీవ్ర గాయాలు -
నంద్యాలలో దారుణం..
సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలను హత్య చేసి చివరకు తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, మద్యం మత్తులను పిల్లలను తండ్రి హత్య చేసినట్టు తెలుస్తోంది.వివరాల మేరకు.. ఉయ్యాలవాడ మండలం తుడుములదిన్నెలో విషాదం నెలకొంది. తండ్రి సురేంద్ర.. మద్యం మత్తులో తన ముగ్గురు పిల్లలను దారుణం హత్య చేశాడు. అనంతరం, సురేంద్ర ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన పిల్లలను కావ్య(7), రాజేశ్వరి(4), సూర్యగగన్(2)గా గుర్తించారు. అయితే, ఎనిమిది నెలల క్రితమే సురేంద్ర భార్య చనిపోయారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
మోసం చేశారు.. వేధిస్తున్నారు!
నంద్యాల: తమను మోసం చేశారని, అంతేకాకుండా డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్నారని ఎస్పీ సునీల్ షెరాన్కు బాధితులు ఫిర్యాదు చేశారు. నంద్యాలలోని ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. తన భర్త బాలుగ్రం అనే వ్యక్తి వేరే అమ్మాయిలతో తిరుగుతూ మోసం చేస్తున్నాడని, ఈఎంఐ చెల్లించాని వేధిస్తున్నాడని ఏఎన్ఎంగా పనిచేస్తున్న ఒక మహిళ ఫిర్యాదు చేశారు. తాను నంద్యాలలోని ఒక ప్రైవేటు జూనియర్ కళాశాలలో పనిచేయగా జీతం ఇవ్వకుండా మోసం చేశారని మల్లికార్జునయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తన స్థలాన్ని ఆక్రమించుకుని బెదిరిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని బండిఆత్మకూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు వినతి పత్రం అందజేశారు. మొత్తం 75 ఫిర్యాదులు రాగా వాటికి చట్ట పరిధిలో పరిష్కారం చూపాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. -
కోడలికి మేడలు లేవని చెబుతాం!
కర్నూలు జిల్లా: తరాలు మారినా, కంప్యూటర్ యుగం నడుస్తున్నా ఆ గ్రామంలో ఇప్పటికీ ఓ ఆచారం కొనసాగుతోంది. ఎంతటి వారైనా, ఉన్నతాధికారులైనా తమ గ్రామంలో ఉండాలంటే ఈ ఆచారాన్ని కచ్చితంగా పాటించాల్సిందే. గ్రామస్తుల ఆరాధ్య దైవమైన ఉచ్చీరప్ప తాత ఆలయం కంటే ఒక్క ఇంచు కూడా ఎత్తుగా ఇళ్లను కట్టరాదన్నది ఇక్కడ ఏళ్ల తరబడి కొనసాగుతున్న సంప్రదాయం. తమ పెద్దలు ఆచరించి చూపిన నియమాన్ని తాము ఎప్పటికీ పాటిస్తామని ఆ గ్రామస్తులు ముక్త కంఠంతో చెబుతున్నారు. ఆలూరు మండలం పెద్దహోతూరు గ్రామంలో 6,500 మంది ఓటర్లు, దాదాపు 2,900 వరకు గృహాలు ఉన్నాయి. గ్రామంలో మోతుబరి రైతైనా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణించిన వారైనా, ఆర్థికంగా ఉన్న వారైనా ఇంటిపై మేడలు కట్టరు. గ్రామస్తుల ఆరాధ్య దైవం ఉచీ్చరప్ప తాత ఇక్కడ ఎన్నో మహిమలు చూపి భక్తుల విశ్వాసం పొందారు. తన ఆలయం కంటే ఎత్తుగా ఎవరూ మిద్దెలు నిర్మించుకోరాదని గ్రామస్తులను ఆజ్ఞాపించారు. తద్వారా గ్రామానికి ప్రతిష్ట ఉంటుందని చూచించారు. నాటి ఆయన ఆజ్ఞను గ్రామస్తులు నేటికీ పాటిస్తున్నారు. దీంతో ఆ ఊరి కోడలిగా వచ్చే యువతికి, ఆమె బంధువులకు వివాహం కుదుర్చుకునే సమయంలోనే తమకు మేడలు లేవని చెప్పడం సంప్రదాయంగా వస్తోంది. కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగినా మరోచోట ఖాళీ స్థలం తీసుకొని ఇంటిని నిర్మించుకుంటారు గానీ మిద్దెపై మరో అంతస్తు కట్టే సాహసం చేయరు. పెద్దహోతూరు గ్రామంలో కొలువుదీరిన ఉచ్చీరప్పతాత, సమీపంలోని మరకట్టు గ్రామంలో కొలువుదీరిన సలువప్ప తాత ఆజ్ఞల మేరకు నేటికీ ఈ సంప్రదాయం కొనసాగిస్తున్నారు. అలాగే జని్మంచిన శిశువులకు ఉచీ్చ రప్ప, ఉచీ్చరమ్మ, సలువప్ప తాత పేర్లు పెట్టడం అనవాయితీగా వస్తోంది. -
మద్దూరు ఆలయంలో వెండి ఆభరణాల మాయం
నంద్యాల జిల్లా: చాగలమర్రి మండలం మద్దూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. స్వామివారికి భక్తులు, దాతలు సమర్పించిన విలువైన వెండి ఆభరణాలు అపహరణకు గురికాగా, వాటి స్థానంలో నకిలీ ఆభరణాలు ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. ఈ ఘటన ఆలయ పరిపాలనపై తీవ్ర విమర్శలకు దారితీసింది.సోమవారం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి ఆభరణాలను పరిశీలించిన సమయంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రతి ఏడాది ఆనవాయితీగా వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారికి వెండి ఆభరణాలతో ప్రత్యేక అలంకరణ నిర్వహిస్తుంటారు. అనంతరం వాటిని ఆలయంలోని బీరువాలో భద్రపరుస్తూ వస్తున్నారు. అయితే ఈసారి అలంకరణకు సిద్ధం చేస్తున్న సమయంలో అసలైన వెండి ఆభరణాల స్థానంలో నకిలీ ఆభరణాలు ఉండటాన్ని ఆలయ అర్చకుడు మామిడి కిషోర్ శర్మ గుర్తించారు. విషయం వెంటనే ఆలయ అధికారులకు తెలియజేయగా, ప్రస్తుత ఈవో జయచంద్ర రెడ్డి ఆలయానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో జయచంద్ర రెడ్డి మాట్లాడుతూ, గత ఈవో తనకు సరైన చార్జ్ అప్పగించలేదని తెలిపారు. వెండితో తయారుచేసిన కిరీటం, హస్తాలు, శంఖం, చక్రం, పాదాల తొడుగులతో పాటు మరికొన్ని విలువైన ఆభరణాలు మాయమైనట్లు వెల్లడించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు.ఈ వ్యవహారంలో విశ్రాంత ఈవోతో పాటు ఆలయ అర్చకుడు కిషోర్ శర్మ హస్తం ఉండవచ్చన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా జరిగిన ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. -
ఈవీఎం గోదాముల పరిశీలన
నంద్యాల(అర్బన్): భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా పట్టణంలోని టెక్కె మార్కెట్ యార్డ్లో ఈవీఎంలను భద్రపరిచిన గోదాములను జిల్లా కలెక్టర్ రాజకుమారి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాముల వద్ద ఏర్పాటు చేసిన సీళ్లను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రతకు సంబంధించి చేపట్టిన రక్షణ చర్యలు, భద్రతా ప్రమాణాలు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకా రం సక్రమంగా అమలవుతున్నాయా లేదా అన్న విషయాన్ని ఆమె సమగ్రంగా సమీక్షించా రు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేసి తనిఖీలను అధికారికంగా నమోదు చేశా రు. ఈవీఎంల భద్రత అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, గోదాముల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్ వెంట డీఆర్ఓ రామునాయక్, ఆర్డీఓ విశ్వనాథ్, తహసీల్దార్ సత్య శ్రీనివాసులు, ఎలక్షన్ డీటీ మనో హర్, అలాగే రాజకీయ పార్టీల తరఫున ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి సయ్యద్ రియా జ్ బాషా, వైఎస్సార్సీపీ నుంచి సాయిరాం రెడ్డి, టీడీపీ నుంచి శివరామిరెడ్డి, బీజేపీ నుంచి చంద్రశేఖర్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి ప్రదీప్, సీపీఐ నుంచి నరసింహులు ఉన్నారు. వన్యప్రాణులతో పంట నష్టం వెలుగోడు: వన్యప్రాణుల కారణంగా పంట నష్టం ఎదుర్కొన్న రైతులకు అటవీ శాఖ నష్ట పరిహారం అందజేసింది. వెలుగోడు రేంజ్లో 36 మంది రైతులకు మొత్తం రూ.1,62,000 నష్టపరిహార చెక్కులు మంగళవారం పంపిణీ చేశారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్.జెడ్.ఏ. తాహెర్ చేతుల మీదుగా వెలుగోడు, నల్లకాల్వ గ్రామాలకు చెందిన రైతులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా తాహెర్ మాట్లాడుతూ.. వన్యప్రాణుల వల్ల పంట నష్టం జరిగితే వెంటనే అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు, వీఆర్వోలతో కలిసి తని ఖీ చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని తెలిపారు. వన్యప్రాణులను వేటాడటం లేదా హాని చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. వన్యప్రాణి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం అవసరమని, భవిష్యత్ తరాలకు జీవవైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ జయపాల్, అటవీ శాఖ అధికారులు గోపీ , టి.వెంకటేశ్వర్లు, రజాక్, బి.వెంకటేశ్వర్లు , గ్రామ పెద్దలు పాల్గొన్నారు. న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి తప్పనిసరి బొమ్మలసత్రం: న్యూ ఇయర్ వేడుకలకు తప్పనిసరిగా అనుమతి పొందాలని జిల్లా ఎస్పీ సునీల్షెరాన్ మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చ రించారు. జిల్లాలో 30 పోలీస్ యాక్టు అమలులో ఉన్నందున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలన్నారు. రాత్రి 10 గంటల తర్వాత డీజే, మ్యూజిక్ సిస్టమ్లను వినియోగించరాదని సూచి ంచారు. వేడుకలు నిర్వహించే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉండాలన్నారు. వాహనాల తనిఖీలు ముమ్మరంగా చేపట్టనున్న నేపథ్యంలో అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. వేడుకల్లో అశ్లీల నృత్యాలతో పాటు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. బస్టాండ్లలో మౌలిక వసతులు కల్పిస్తాం పత్తికొండ: ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్టాండ్లలో మౌలిక వసతులు కల్పిస్తామని ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరక్టర్ ద్వారకా తిరుమలరావు అన్నారు. మంగళవారం ఆయన పత్తికొండ ఆర్టీసీ బస్టాండ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటరామయ్య, ఆర్టీసీ ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం బస్డాండ్లో సమస్యలను ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. పత్తికొండ–ఎమ్మిగనూర్కు వెళ్తున్న పల్లె వెలుగు బస్సును ఎక్కి మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. పత్తికొండ పర్యటనకు విచ్చేసిన ఆర్టీసీ ఎండీని ప్రజా సంఘాల నాయకులు కలిసి పత్తికొండ నుంచి ఇతర ప్రాంతాలకు నూతన సర్వీసులను ఏర్పాటు చేయాలని వినతిపత్రాలు అందచేశారు. విజయవాడ, ప్రొ ద్దుటూరుకు నూతన సర్వీసులు నడపాలన్నారు. -
ప్రచారం లేక.. ఆశించిన స్థాయిలో రాక..!
● ప్రతి నెల చివరి మంగళవారం చెంచులకు ఉచిత స్పర్శదర్శనం ప్రారంభం ● అవగాహన కల్పిచండంలో అధికారుల విఫలం శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని చెంచులకు మల్లన్న ఉచిత స్పర్శదర్శనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ముందస్తుగా ప్రచారం నిర్వహించకపోవడంతో ఆశించిన స్థాయిలో చెంచులు రాలేకపోయారు. మంగళవారం చెంచు భక్తులు సంప్రదాయబద్ధంగా తప్పెట వాయిద్యాలతో, నృత్యాలు చేస్తూ దర్శనానికి వచ్చారు. ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పి.రమేష్నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు, సంబంధిత అధికారులు చెంచులకు ఆహ్వానం పలికారు. చెంచు భక్తులు ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణం చేసుకున్న తర్వాత మల్లన్న స్పర్శదర్శనం, భ్రమరాంబాదేవి దర్శనం చేయించారు. అలాగే అన్నప్రసాద వితరణ భవనంలో అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు. స్థానిక మేకలబండ, ఇతర గూడెలకు చెందిన చెంచు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 500 మందికి పైగా చెంచులు తరలివస్తారని చైర్మన్, అధికారులు అంచనా వేశారు. అయితే సరైన ప్రచారం లేక చెంచులు అశించిన స్థాయిలో రాలేదు. కేవలం 200 మంది వరకు మాత్రమే వచ్చి ఉంటారని సమాచారం. అనంతరం చైర్మన్ పి.రమేష్నాయుడు మాట్లాడుతూ.. శ్రీశైలక్షేత్ర సంస్కృతి సంప్రదాయాలలో చెంచు భక్తులకు ఎంతో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ప్రతి నెల చివరి మంగళవారం చెంచులకు ఉచిత మల్లన్న స్పర్శదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. -
లైఫ్ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయండి
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలోని సర్వీస్, ఫ్యామిలీ పెన్షన్దారులు జీవన ప్రమాణ పత్రాలు(లైఫ్ సర్టిఫికెట్లు) జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని జిల్లా ట్రెజరీ అధికారి రామచంద్రరావు తెలిపారు. కర్నూలు జిల్లాలో 17,440 మంది, నంద్యాల జిల్లాలో 10,925 మంది పెన్షనర్లు ఉన్నారన్నారు. మంగళవారం ఆయన విలేకర్లతో మట్లాడుతూ నవంబర్, డిసెంబర్ నెలల్లో సమర్పించిన జీవన్ ప్రమాణ్ పత్రాలు చెల్లుబాటు కావన్నారు. ఫిబ్రవరి నెల చివరిలోగా లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఏప్రిల్ 1న చెల్లించే మార్చి నెల పెన్షన్ నిలిచిపోతుందన్నారు. అనారోగ్యంతో నడువలేని పింఛనుదారులు ఉన్న ట్లు సమాచారం ఇస్తే సంబంధిత సబ్ ట్రెజరీ సిబ్బంది ఇంటివద్దకే వచ్చి జీవన్ ప్రమాణ్ పత్రాలు జారీ చేస్తారన్నారు. పీజీ థర్డ్ సెమిస్టర్ ఫలితాలు విడుదల కర్నూలు సిటీ: క్లస్టర్ యూనివర్సిటీ పీజీ 3వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను మంగళవారం ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ జి.శ్రీనివాస్, డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ కె.నాగరాజు శెట్టి విడుదల చేశారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ గత నెలలో మూడో సెమిస్టర్ పరీక్షల నిర్వహించామన్నారు. ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ విద్యార్థు లు 100 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. కార్యక్రమంలో డీన్ డాక్టర్ మహమ్మద్ వాహిద్, ఆర్థిక శాఖ అధ్యాపకులు డాక్టర్ ఎల్లా కృష్ణ, వాణిజ్య విభాగం అధ్యాపకులు డాక్టర్ దళవాయి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
భక్త కోటి ప్రణమిల్లి..
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం అహోబిలం క్షేత్రం భక్తులతో పోటెత్తింది. గోవింద నామ స్మరణ మారుమోగింది. ఆధ్యాత్మిక శోభతో అహోబిలం ఇల వైకుంఠాన్ని తల పించింది. తెల్లవారుజామున 4 గంటల నుంచే స్వామి వారిని దర్శించుకోవడాని కి భక్తులు క్యూలలో బారులుదీరారు. శ్రీదేవి, భూదేవి సహిత శ్రీప్రహ్లాదవరద స్వామిని ఉత్తరద్వారంలో దర్శనం చేసుకున్నారు. ప్రహ్లాదవరద స్వామి ప్రత్యే కంగా అలంకరించిన గరుడవాహనంపై కొలువై ఆలయ మాఢవీధుల్లో విహరించారు. స్వామి వారిని కనులారా దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. – దొర్నిపాడు -
పెద్ద హరివాణం.. రగిలిన ఉద్యమం
ఆదోని రూరల్: ఓ వైపు ఆదోని మండలంలో 16 గ్రామాల ప్రజలు ప్రత్యేక మండలం వద్దంటూ నెల రోజులుగా ఆందోళన చేస్తున్న తరుణంలో గెజిట్ ప్రకా రం పెద్ద హరివాణాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని గ్రామ స్తులు నిరసన బాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో అతి పెద్ద మండలమైన ఆదోనిని రెండు మండలాలుగా విభజిస్తూ పెద్దహరివాణం గ్రామా న్ని మండల కేంద్రంగా ప్రకటించింది. అయితే పెద్దహరివాణం మండలంలో విలీనానికి ప్రతిపాదించిన 16 గ్రామాల ప్రజలు నెల రోజులుగా ఆందోళనలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం వెనుకడుగు వేసి ఆదోని–1, ఆదోని–2గా ప్రకటించడంతో మంగళవారం పెద్దహరివాణం గ్రామ ప్రజలు కన్నెర్రజేశారు. తమ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని మంగళవారం గ్రామస్తుడు ఆది నారాయణరెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనకు సంఘీభావంగా గ్రామస్తులు ఆదోని – సిరుగుప్ప రహదారులను దిగ్బంధం చేసి రాకపోకలను నిలిపివేశారు. అలాగే టైర్లు, పాత వాహనాలను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. పెద్దహరివాణాన్ని మండల కేంద్రంగా ప్రకటించేంత వరకు పోరాడుతామని నినాదాలు చేశారు. -
కలవర పెడుతున్న పొగమంచు
● పూత దశలో పప్పుశనగ ● పొగమంచుతో పూత రాలిపోయే అవకాశం ● దిగుబడి తగ్గుతుందని రైతుల ఆందోళన కోవెలకుంట్ల: పప్పుశనగ రైతులను సాగు ఆరంభం నుంచే కష్టాలు వెంటాడుతున్నాయి. విత్తన సమయంలో మోంథా తుపాన్ వెంటాడుతుండగా ప్రస్తుతం పొగమంచు కలవర పెడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది జిల్లాలోని 29 మండలాల పరిధిలో 59,881 హెక్టార్లలో శనగ సాగు సాధారణ విస్తీర్ణం కాగా ఆయా మండలాల పరిధిలో 48,871 హెక్టార్లలో రైతులు జేజే–11, ఫూలేజి రకాలకు చెందిన శనగ పంట సాగు చేశారు. ఇందులో స్థానిక వ్యవసాయ సబ్ డివిజన్లోని సంజామల మండలంలో 9,435 హెక్టార్లు, కోవెలకుంట్ల మండలంలో 6,950, ఉయ్యాలవాడ మండలంలో 11,076, దొర్నిపాడు మండలంలో 3,011, కొలిమిగుండ్ల మండలంలో 3,820, అవుకు మండలంలో 1,068 హెక్టార్లలో సాగైంది. పస్తుతం ఆయా ప్రాంతాల్లో పైరు పూత దశలో ఉంది. ఈ ఏడాది చలి తీవ్రతకు తోడు ఇటీవల దట్టమైన పొగమంచు కురుస్తోంది. ఉదయం వేళల్లో పంట పొలాలను పొగమంచు కప్పేస్తుండటంతో శనగ రైతులకు శాపంగా మారింది. పూత దశలో పొగమంచు కురుస్తుండటంతో పూత రాలిపోయే ఆస్కారం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పైరు రెండు నెలల దశలో ఉండగా మరో నెల రోజుల్లో దిగుబడులు చేతికందనున్నాయి. పూత దశలో పొగమంచు కారణంగా పూత రాలిపోతే దిగుబడులపై తీవ్ర ప్రభా వం పడుతుందని రైతులు దిగాలు చెందుతున్నారు. మరో వారం రోజులపాటు పొగమంచు ఇలాగే కొనసాగితే దిగుబడులు తగ్గిపోతాయని వాపోతున్నారు. -
5 లక్షల కుటుంబాలకు దెబ్బ
కర్నూలు(అగ్రికల్చర్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వస్తున్న వీబీజీ రామ్జీ వ్యవసాయ కూలీల జీవితాల్లో చిచ్చు పెట్టనుంది. ప్రజలను ఉపాధికి దూరం చేసే కొత్త పథకం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త పథకంతో కేంద్రం రాష్ట్రాలు భరించే వాటాను పెంచడాన్ని పరిశీలిస్తే.. ఇక పేదలు, వ్యవసాయ కూలీలు, సన్న, చిన్నకారు రైతుల ఉపాధి నిర్వీర్యం అయినట్టే కనిపిస్తోంది. అప్పులు చేయడంలో రాణిస్తున్న చంద్రబాబు సర్కార్ రామ్జీ ద్వారా చేపట్టే ఉపాధి పనులకు తమ వాటా ఎక్కడి నుంచి ఇస్తారనే చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే ఉపాధి కూలీలకు ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వని పరిస్థితి. పల్లెపండుగ కింద ఉపాధి నిధులతో చేపట్టిన పనులకు ఏప్రిల్ నుంచి ఎలాంటి చెల్లింపులు లేవు. కరువుపీడిత ప్రాంతాల్లో కర్నూలు జిల్లా మొదటిస్థానంలో ఉంటోంది. ఇక్కడ వ్యవసాయ కూలీలు ఎక్కువ. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లేకపోతే వలసలు ఇప్పుడున్న వాటితో పోలిస్తే మూడు రెట్లు అధికం కానున్నాయి. పేదలకు అన్నం పెట్టే ఈ పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 2007లో ఓర్వకల్ మండలంలో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్తో కలసి ప్రారంభించారు. నేడు చంద్రబాబు ప్రభుత్వం.. కేంద్రం పేదలను ఉపాధికి దూరం చేయనుండటం గమనార్హం. అప్పుల బాబుతో సాధ్యమేనా.. ఇప్పటి వరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లేబర్ కాంపోనెంటు కింద చేపడుతున్న పనులకు 100 శాతం వేజ్ కేంద్రం భరిస్తోంది. మెటీరియల్ కింద చేపట్టే పనులకు 90 శాతం కేంద్రం, 10 శాతం రాష్ట్రం వాటా ఉంటుంది. కొత్త చట్టం ప్రకారం లేబర్, మెటీరియల్ కాంపోనెంటు కింద చేపట్టే పనులకు 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం భరించాల్సి ఉంది. ఎన్ఆర్ఈజీఎస్ను పక్క న పెట్టి కొత్తగా అమలు చేస్తున్న వీబీజీ రామ్జీ కింద చేపట్టే లేబర్, మెటీరియల్ పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి చెందిన అకౌంట్కు రాష్ట్రం వాటాను విడుదల చేసిన తర్వాతనే నిధులు విడుదలవుతాయి. అప్పులతో నెట్టుకొస్తున్న చంద్రబాబు సర్కార్ తమ వాటా నిధులు అంత సులభంగా ఇచ్చే అవకాశం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. వ్యక్తిగత సబ్సిడీ రూ.2 లక్షల వరకే.. 2024–25 వరకు పండ్లతోటల అభివృద్ధిలో గరిష్టంగా ఐదు ఎకరాల వరకు పూర్తి సబ్సిడీ పొందే అవకాశం ఉండింది. సబ్సిడీ కింద రూ.5 లక్షలకు పైగా రైతులు పొందే వీలుండేది. మరోవైపు ఫాంపాండ్స్ వంటి వాటిని తవ్వుకోవడం ద్వారా కూడా సబ్సిడీలు పొందుతున్నారు. ఇప్పటి వరకు గరిష్టంగా రూ.10 లక్షల వరకు సబ్సిడీ లభిస్తోంది. అయితే ఉపాధి నిధులతో వ్యక్తిగత ఆస్తుల అభివృద్ధి(పండ్లతోటలు, ఫాంపాండ్స్ తదితరాలు) ద్వారా ఇస్తున్న సబ్సిడీని ప్రస్తుతం రూ.2 లక్షలకు పరిమితం చేశారు. ఈ మేరకు సాఫ్ట్వేర్లో మార్పులు కూడా జరిగిపోయాయి. కౌతాళం మండలం ఓబుళపురం నుంచి హైదరాబాదుకు వలస వెళ్తున్న కూలీలు (ఫైల్) పేరు మార్చి.. మట్టి కొట్టి నిలిచిపోయిన చెల్లింపులు ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకంలో కేంద్రానిదే పూర్తి అధికారం ఉన్నప్పటికీ లేబర్ కాంపోనెంటు కింద 2025 జూలై 22 నుంచి, మెటీరియల్ కాంపోనెంటు కింద ఏప్రిల్ 1 నుంచి చెల్లింపులు లేవు. కర్నూలు జిల్లాలో దాదాపు రూ.80 కోట్లు, నంద్యాల జిల్లాలో రూ.65 కోట్ల బకాయిలు ఉన్నాయి. చెల్లింపులు లేకపోవడంతో ఉపాధి పనులకు లేబర్ హాజరు తగ్గిపోయింది. మొదటి విడత పల్లెపండుగ పనులకు చెల్లింపులు ఏప్రిల్ నుంచి లేకపోవడంతో రెండవ విడత పల్లె పండుగను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పండ్లతోటలకు సంబంధించి ఏడాదిన్నర నుంచి నిర్వహణ చెల్లింపులు నిలిచిపోయాయి. మహాత్మాగాందీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కర్నూలు జిల్లాలో 2.75 లక్షల కుటుంబాలు, నంద్యాల జిల్లాలో 2.25 లక్షల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ఏటా ఈ కుటుంబాలకు 1.85 కోట్ల పని దినాలు కల్పిస్తున్నారు. కొత్తగా తెస్తున్న వీబీజీ రామ్జీ వల్ల ఉమ్మడి జిల్లాలో 5 లక్షల కుటుంబాలకు నష్టం కలిగే ప్రమాదం ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో 2025–26లో ఇప్పటి వరకు 100 రోజుల పని దినాలు పూర్తి చేసుకున్న కుటుంబాలు 3,100 మాత్రమే. ప్రస్తుతం కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలనేది నిబంధన. కొత్త పథకం ప్రకారం కుటుంబానికి 125 రోజులు పని కల్పిస్తారు. ఉపాధి పనులపై ఆధారపడిన వారికి ఇది కొంతమేర ఊరట కలిగిస్తుంది. అయితే రెక్కలు వంచి పని చేస్తే వేతనాలు అందుతాయా, లేదా అనేది ప్రశ్నార్థకం. -
దొరకని ఆచూకీ.. ఆగని కన్నీళ్లు
● ఎస్సార్బీసీ కాల్వలో దూకిన తల్లీ బిడ్డల కోసం కొనసాగుతున్న గాలింపుగడివేముల: అయినవారి కోసం ఆర్తనాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇద్దరు పిల్లలతో ఎస్సార్బీసీ కాల్వలో దూకిన మహిళ కోసం బంధువులు, గ్రామస్తులు కాల్వ వెంట పండుతున్న బాధలు వర్ణణాతీతం. ఆదివారం ఒండుట్ల గ్రామానికి చెందిన బుగ్గానిపల్లె ఎల్లా లక్ష్మి (23), వైష్ణవి (3), సంగీత (మూడు నెలలు) గడివేముల మండలం మంచాలకట్ట గ్రామ సమీపంలో ఎస్సార్బీసీ కాల్వలోకి దూకిన విషయం తెలిసిందే. వారి కోసం సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు సహాయక బృందాలు గాలింపు చేపట్టారు. పాణ్యం సీఐ కిరణ్కుమార్రెడ్డి, ఎస్ఐ నాగార్జునరెడ్డి, నంద్యాల జిల్లా ఫైర్ సిబ్బంది చైతన్య కుమార్రెడ్డి, రాజేశ్వర్నాయక్, ఇస్మాయిల్, ఉశేన్సాహెబ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎస్సార్బీసీ కాల్వలో పుట్టిలు, ఇంజిన బొట్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. చుట్టు పక్కల గ్రామాల వారు, ఒండుట్ల గ్రామానికి చెందిన బంధువులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో ఎస్సార్బీసీ కాల్వ వద్దకు చేరుకున్నారు. తమవారిని త్వరగా కనిపెట్టాలని వారి కుటుంబసభ్యులు పడుతున్న యాతన అందరినీ కలిచివేస్తోంది. -
రోడ్డెక్కిన వేదన!
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ప్రతి సోమవారం ప్రజల అవస్థలకు ఈ దృశ్యం అద్దం పడుతోంది. గత ప్రభుత్వంలో ఎలాంటి సమస్య వచ్చినా గ్రామాల్లోనే సచివాలయంలో పరిష్కారం లభించేది. ఇప్పుడు ప్రతి చిన్న సమస్యకు ఎవరికి చెప్పుకోవాలో, ఎక్కడికి వెళ్లాలో తెలియక ప్రజలు కిలోమీటర్ల దూరం వ్యయప్రయాసలకోర్చి కలెక్టరేట్కు చేరుకుంటున్నారు. కలెక్టరేట్ ఆవరణలోనే కాకుండా ఇలా రోడ్డు మీదకు బారులు తీరి వినతిపత్రాలను రాసుకుంటున్న దృశ్యాలను చూస్తే టీడీపీ ప్రభుత్వంలో ప్రజలు ఏ స్థాయిలో సమస్యలను ఎదుర్కొంటున్నారో అర్థమవుతోంది. వినతులు ఇవ్వడమే కానీ, పరిష్కారం లభించక ప్రజలు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
కేంద్ర నిధులపై మీ పెత్తనం ఏంటి?
కొలిమిగుండ్ల: గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే 15వ ఆర్థిక సంఘం నిధులపై మీ పెత్తనం ఏంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి ప్రశ్నించారు. సోమవారం బెలుం గుహల సందర్శనకు వచ్చిన కేంద్ర పంచాయతీరాజ్ జాయింట్ సెక్రటరీ రాజేష్కుమార్ సింగ్ను జిల్లా, రాష్ట్ర నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్ల పట్ల వివక్ష చూపుతూ కేంద్రం విడుదల చేసే నిధులను డైవర్ట్ చేస్తోందన్నారు. ఎనిమిది నెలల నుంచి పంచాయతీరాజ్ విభాగం నుంచి విడతల వారీగా ఉద్యమిస్తే నిధులను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిందన్నారు. ఈవిషయంలో కేంద్రం మొట్టికాయ వేస్తే దాదాపు రూ.64 కోట్లు వడ్డీ సహా స్థానిక సంస్థలకు జమ చేసిందని గుర్తు చేశారు. ఆ తర్వాత వచ్చే మార్చి నాటికి సర్పంచ్ల పదవీ కాలం ముగుస్తుండటంతో ఈ సర్పంచ్లతో ఎందుకు పనులు చేయించాలనే దురుద్దేశంతో నిధులు నిలిపేస్తూ సర్క్యులర్ ఇచ్చిందన్నారు.కేంద్రం నిధులను నిలబెట్టడా నికి, తొక్కి పెట్టడానికి మీరెవరు చంద్రబాబు, పవన్ కల్యాణ్ అని నిలదీశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులు చేయరాదని చెప్పడానికి మీకేం హక్కు ఉందని ప్రశ్నించారు. ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ విభాగానికి గుదిబండగా మారాడని విమర్శించారు. తక్షణమే ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు. సర్పంచ్ల సంఘం జిల్లా అధ్య క్షుడు లాయర్ మహేశ్వరరెడ్డి, పంచాయతీరాజ్ విభా గం జిల్లా అధ్యక్షుడు రామలక్ష్మయ్య, రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి అప్పిరెడ్డి గారి సురేష్రెడ్డి, జాయింట్ సెక్రటరీ రంగారెడ్డి, నంద్యాల, రాప్తాడు నియోజకవర్గాల అధ్య క్షులు మహేష్రెడ్డి, లోక్నాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు చాంద్బాషా తదితరులు వెంట ఉన్నారు. -
ముక్కోటి ఏకాదశికి ముస్తాబు
బేతంచెర్ల: ఉమ్మడి జిల్లాలో వైష్ణవ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని మంగళవారం స్వామి, అమ్మవార్లను భక్తులు ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునేలా ప్రత్యేక క్యూలైన్లు, తగిన ఏర్పాట్లు చేసినట్లు ఉప కమిషనర్, ఆలయ ఈఓ రామాంజనేయులు తెలిపారు. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని స్వామి, అమ్మవర్లాకు జరిపే శాంతి కల్యాణోత్సవాన్ని భక్తులు తిలకించేందుకు వేదికను రంగురంగుల షామియానాలు, పూలతో అలంకరించారు. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు సోమవారం విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచణం, స్వామి, అమ్మవార్లకు లక్ష తులసిదళార్చన, స్నపన తిరుమంజనం, సుదర్శన హోమం, బలిహరణం, మహానివేదన, మంత్ర పుష్ప సమర్పణం, తీర్థ ప్రసాద వినియోగం చేశారు. -
ఈరన్నకు ప్రత్యేక పూజలు
కౌతాళం: మండల పరిధిలోని ఉరుకుంద గ్రామంలో వెలసిన ఈరన్న స్వామి దర్శనానికి సోమవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. దీంతో స్వామి క్షేత్రంలో భక్తులతో సందడి నెలకొంది. అర్చకులు స్వామి వారి మూలవిరాట్కు తెల్లవారు జామున సుప్రభాత సేవ, మహామంగళహారతి, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి ఫలపుష్పాలతో ఆలంకరించారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. కొందరు భక్తులు ఆలయ ఆవరణలో పిండి వంటలు వండి స్వామికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దరఖాస్తుల స్వీకరణ డోన్ టౌన్: ఉపాధి శిక్షణా శాఖ ఆధ్వర్యంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్ నిర్వహించే ఏఐటీటీ జూలై – 2026 పరీక్షలకు ప్రైవేట్ అభ్యర్థులుగా హాజరగుటకు అర్హులైన వారిచే నేటి నుంచి జనవరి 28వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ కళాశాలల జిల్లా కన్వీనర్, డోన్ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ ప్రసాద్ రెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులకు 21 ఏళ్లు నిండి సంబంధిత ట్రేడ్లలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలని పేర్కొన్నారు. దరఖాస్తులను సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో పొందవచ్చని, ప్రవేశ రుసుం రూ.500 చెల్లించాల్సి ఉందన్నారు. మరిన్ని వివరాలకు ఐటీఐలలో సంప్రదించాలన్నారు. -
గంజాయి విక్రేతల అరెస్ట్
నందికొట్కూరు: గంజాయి విక్రయిస్తే రౌడీషీట్ ఓపెన్ చేయడం ఖాయమని టౌన్ సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని టౌన్ సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. స్థానిక రాయల్ గ్రీన్ సిటీ వెంచర్ వద్ద గంజాయి విక్రయిస్తున్న ఆత్మకూరు పట్టణం, దుద్యాల రోడ్డులోని పాత నవాజ్ కట్టకు చెందిన కావేటి నాగశేషాద్రి, నందికొట్కూరు వాల్మీక్ నగర్కు చెందిన షేక్ మసూద్, కుమ్మరి హరినాథ్, శాతనకోట గ్రామానికి చెందిన అనంత చిన్మయనంద గౌడ్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. కావేటి నాగశేషాద్రి నుంచి 20 గంజాయి ప్యాకెట్లు (750 గ్రాములు), రూ.3 వేలు నగదు, సెల్ఫోన్, షేక్ మసూద్ నుంచి 80 ప్యాకెట్లు (530 గ్రాములు) సెల్ఫోన్, కుమ్మరి హరినాథ్ నుంచి 50 ప్యాకెట్లు (300 గ్రాములు) సెల్ఫోన్, అనంత చిన్మయనందగౌడ్ నుంచి 80 ప్యాకెట్లు (520 గ్రాములు). సెల్ఫోన్ స్వాధీనం చేసుకునట్లు సీఐ తెలిపారు. సర్కిల్ పరిధిలో ఎవరైనా నిషేధిత మత్తు పదార్థాలు విక్రయిస్తే రౌడీషీట్ కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఎస్ఐ చంద్రశేఖర్, ఏఎస్ఐ రామచంద్ర, సిబ్బందితో కలిసి దాడులు చేసి గంజాయి విక్రేతలను పట్టుకున్నట్లు వెల్లడించారు. -
బెలుం అందాలు అద్భుతం
కొలిమిగుండ్ల: వందల ఏళ్ల క్రితం భూమి లోపల ఏర్పడిన బెలుం గుహల సహజ అందాలు అద్భుతంగా ఉన్నాయని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ రాజేష్కుమార్సింగ్ కొనియాడారు. రాయలసీమ జిల్లాల్లోని చారిత్రక ప్రదేశాల సందర్శనార్థం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి బెలుం గుహలకు వచ్చారు. గుహల వద్దకు చేరుకున్న ఆయనకు మేనేజర్ కిషోర్, ఎంపీడీఓ దస్తగిరిబాబు, డిప్యూటీ ఎంపీడీఓ చంద్రమౌళీశ్వర గౌడ్ స్వాగతం పలికారు. అనంతరం గుహ లోపలికి చేరుకొని కోటిలింగాలు, వేయిపడగలు, మాయమందిరం తదితర ప్రదేశాలను తిలకించారు. గుహలోపల గంటకు పైగానే గడిపారు. గుహలు ఎప్పుడు ఏర్పడ్డాయి, వాటి ప్రాముఖ్యత తదితర విశేషాలను అడిగి తెలుసుకున్నారు. భూమి అంతర్భాగంలో ఇంత విశాలంగా అవతరించనందువల్లే బెలుం గుహలు ప్రపంచంలో గుర్తింపు పొందాయని చెప్పారు. గుహలను తిలకించడం ఆనందంగా ఉందన్నారు. అంతకు ముందు ఆయన వైఎస్సార్ కడప జిల్లాలోని గండికోటను పరిశీలించారు. బెలుం గుహల అనంతరం యాగంటి, మహానంది పుణ్యక్షేత్రాల దర్శనార్థం వెళ్లారు. -
సైనికుల కుటుంబాలకు అండగా నిలుద్దాం
కర్నూలు(సెంట్రల్): దేశ రక్షణ కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి సేవలందిస్తున్న సైనికుల కుటుంబాలకు అండగా నిలవాలని కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లోని సుయన ఆడిటోరియంలో మెప్మా మహిళలు సేకరించిన రూ.2 లక్షలను సాయుధ దళాల సంక్షేమ నిధికి కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, గూడూరు మునిసిపాలిటీల్లోని పొదుపు మహిళలు తమవంతు సాయంగా రూ.2 లక్షలను సేకరించడం అభినందనీయమన్నారు. సైనిక కుటుంబాలను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మెప్మా పీడీ శ్రీనివాసులు, జిల్లా సైనిక సంక్షేమాధికారి రత్నరూత్, జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ టి.పద్మ పాల్గొన్నారు. శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం మల్లికార్జున సదన్ కౌంటర్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగిని సోమవారం ఈఓ ఎం.శ్రీనివాసరావు విధుల నుంచి తొలగించారు. అలాగే వసతి విభాగం ఇన్చార్జ్గా ఉన్న దేవస్థానం పీఆర్వో టీ.శ్రీనివాసరావుకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. గత శుక్రవారం మల్లికార్జున సదన్లో వసతి పొందేందుకు హిందీ భక్తులు రాగా వారి నుంచి డబ్బులు తీసుకుని దేవస్థానానికి జమ చేయకుండా కౌంటర్ ఉద్యోగి తన జేబులో వేసుకున్నాడు. ఈ విషయంపై ‘సాక్షి’ దినపత్రికలో ఈ నెల 26న ‘భక్తులకు బిల్లు ఇవ్వకుండా..’ అనే శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీంతో స్పందించిన ఈఓ ఘటనపై విచారణ చేయించారు. కౌంటర్ ఉద్యోగి అవినీతికి పాల్పడినట్లు నివేదిక అందడంతో అతన్ని విధుల నుంచి తొలగించారు. అలాగే వసతి విభాగం ఇన్చార్జ్ ఏఈఓగా ఉన్న పీఆర్వో టీ.శ్రీనివాసరావు విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించారని పేర్కొంటూ షోకాజ్ నోటీసు జారీ చేశారు. వారం రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.దేశ సేవలో భాగస్వాములు కావాలి కర్నూలు(హాస్పిటల్): దంత వైద్యులు వైద్యవృత్తిలోనే గాకుండా ఐఏఎస్, ఐపీఎస్ లాంటి జాతీయ స్థాయి ఉద్యోగాలు సాధించి దేశ సేవ చేయాలని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్ సూచించారు. నగర శివారులోని జి.పుల్లారెడ్డి దంత వైద్య కళాశాల 15వ స్నాతకోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. బీడీఎస్, ఎండీఎస్లో ఉత్తీర్ణత సాధించిన పట్టభద్రులకు వీసీ చేతుల మీదుగా సర్టిఫికెట్లు, మెడల్స్ ప్రదానం చేశారు. వీసీతో పాటు ప్రిన్సిపాల్ డాక్టర్ సంపతి నాగలక్ష్మిరెడ్డి మాట్లాడారు. విద్య ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని, వైద్యులు సమాజానికి ఉపయోగపడే విధంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలన్నారు. సెక్రటరీ పి.సుబ్బారెడ్డి, డైరెక్టర్ డాక్టర్ మురళీధర్రెడ్డి, డాక్టర్ దుగ్గినేని శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 2 నుంచి క్రికెట్ ఎంపిక పోటీలు కర్నూలు (టౌన్): స్థానిక స్పోర్ట్స్ అథారిటీ ఔట్డోర్ స్టేడియంలోని క్రికెట్ నెట్స్లో జనవరి 2, 3 తేదీల్లో అండర్– 14 బాలుర విభాగంలో ట్యాలెంట్ స్పాటింగ్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కె.దేవేంద్ర గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2011 సెప్టెంబర్ 1 తర్వాత జన్మించిన క్రీడాకారులు అర్హులని పేర్కొన్నా రు. క్రీడాకారులు జనన ఽధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో హాజరు కావాలన్నారు. -
ఆదోని జిల్లా సాధనకు అక్షర చైతన్యం
ఎమ్మిగనూరుటౌన్/నందవరం: జిల్లా పశ్చిమ ప్రాంతమైన ఆదోనిని జిల్లా చేసేందుకు గల ప్రాముఖ్యత, ప్రాంత సమస్యలను తెలియజేసేలా పట్టణానికి చెందిన తెలుగు ఉపాధ్యాయుడు కాకె వెంకటేశప్ప తన కుంచె నుండి గీసిన అక్షర చిత్రమిది. జిల్లాలోని అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ఆదోని డివిజన్ను జిల్లా కేంద్రంగా చేయాల్సిన అవశ్యకతను తెలియజేస్తూ ఆదోని అక్షరాల్లో ఆయన పొందుపరిచిన అంశాలు విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు ఆ ప్రాంత ప్రజల్లో చైతన్యం నింపుతున్నాయి. ‘ఆ’ అక్షరంలో పశ్చిమ ప్రాంతంలోని ప్రముఖ దైవ క్షేత్రాలు, ‘దో’ అక్షరంలో ఇక్కడి ప్రముఖ వ్యక్తులు, నైసర్గిక స్వరూపాలు, ఉత్పత్తులు, ‘ని’లో ప్రాంత సమస్యలు తెలియజేసేలా చిత్రం గీశారు. ఈ చిత్రం స్థానికుల్లో ఆదోని జిల్లా సాధనకు చైతన్యం నింపుతోంది. -
యాగంటిశ్వరుని హుండీ ఆదాయం లెక్కింపు
బనగానపల్లె రూరల్: యాగంటి క్షేత్రంలో వెలసిన ఉమా మహేశ్వరస్వామి దేవస్థానం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు కార్యక్రమం సోమవారం ఆలయ ఈఓ పాండు రంగారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం జరిగింది. హుండీల్లోని మొత్తం కానుకలను లెక్కించగా రూ.29,58,535 నగదు, 35 గ్రాముల బంగారు ఆభరణాలు, 160 గ్రాముల వెండి ఆభరణాలు వచ్చినట్లు ఈఓ పాండురంగారెడ్డి తెలిపారు. పర్యవేక్షణ అధికారి జనార్దన్, ఉపసర్పంచ్ బండి బ్రహ్మానందరెడ్డి, శ్రీరాములు, భరతుడు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. మహిళ ఆత్మహత్య దొర్నిపాడు: ఆళ్లగడ్డ మండలంలోని బాచేపల్లి గ్రామానికి చెందిన రామసుబ్బమ్మ (50) సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు రూరల్ ఎస్ఐ వరప్రసాద్ తెలిపారు. గత రెండు రోజులుగా కొడుకు ప్రతాప్ తల్లి పేరిట ఉన్న ఎకరం భూమిని తన పేరిట రాసివ్వాలని వేదిస్తున్నాడు. భూమిని రాసిస్తే తమ జీవనం ఎలా అని తల్లి వాదించేంది. ఈ విషయమై మనస్తాపానికి గురైన ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. -
విజయ డెయిరీలో ఖా‘కీచక’ రాజకీయం
నంద్యాల(అర్బన్): నంద్యాల విజయ డెయిరీలో టీడీపీ నాయకులు ఖా‘కీచక’ రాజకీయం చేస్తున్నారు. డెయిరీలో సోమవారం చాగలమర్రి మండలం ముత్యాలపాడు పాల సొసైటీ సభ్యులతో జరగాల్సిన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని పోలీసులతో అడ్డుకున్నారు. సమావేశానికి వెళ్లకుండా సభ్యులు పీపీ మధుసూదన్రెడ్డి, గంగుల విజయసింహారెడ్డిని హౌస్ అరెస్ట్లు చేశారు. భూమా విఖ్యాత్రెడ్డి కోసం పోలీసులను అడ్డు పెట్టుకొని తమను సమావేశానికి రాకుండా అడ్డుకున్నారని త్రిసభ్య కమిటీ సభ్యులు ఆరోపించారు. చూస్తూ ఊరుకోం.. హౌస్అరెస్ట్ చేసిన పీపీ మధుసూదన్రెడ్డిని ఆయన నివాస గృహంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి పరామర్శించారు. అనంతరం కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులను అడ్డుపెట్టుకొని భయపెట్టే రోజులు సాగబోవన్నారు. త్రిసభ్య కమిటీకి హాజరు కాకుండా సభ్యులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం తగదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, చట్టానికి విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా చూస్తూ ఊరుకోబోమన్నారు. బెదిరింపులకు దిగితే గట్టిగా సమాధానం చెబుతామన్నారు. కుటిల రాజకీయం పీపీ మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ.. భూమా విఖ్యాత్రెడ్డి ప్రైవేటు డెయిరీని స్థాపించి అక్రమంగా 2020లో డెయిరీ నుంచి రూ.1.20 కోట్లు అప్పు తీసుకొని తిరిగి చెల్లించలేదన్నారు. పాల సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న చక్రవర్తులపల్లె సొసైటీని 2024 డిసెంబర్లో డెయిరీ పాలక వర్గం రద్దు చేసిందన్నారు. డీఫాల్టర్ అయిన విఖ్యాత్కు ముత్యాలపాడు పాల సొసైటీలో సభ్యత్వం ఇవ్వడమే కాకుండా అధ్యక్షుడిగా ఎలా చేస్తారంటూ పాల సొసైటీ సభ్యులకు నోటీసులు ఇచ్చామన్నారు. తనకే నోటీసులు ఇచ్చారంటూ 20 రోజుల క్రితం డెయిరీ వద్దకు వచ్చి విఖ్యాత్ రభస చేయడం సరైంది కాదన్నారు. పాలకవర్గ సభ్యులతో సమావేశం నిర్వహిస్తున్నామని తెలిసి త్రిసభ్య కమిటీ సభ్యులమైన తనను, విజయసింహారెడ్డి, రమాకాంత్రెడ్డిలను హౌస్ అరెస్ట్ చేయడం కుటిల రాజకీయానికి నిదర్శనమన్నారు. పోలీసులను అడ్డు పెట్టుకొని టీడీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు మానుకోకపోతే గట్టిగా సమాధానం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మీల్ అమీర్, మాజీ జెడ్పీటీసీ సూర్యనారాయణరెడ్డి, దేశం సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సభ్యులను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు త్రిసభ్య కమిటీ సమావేశానికి వెళ్లకుండా అడ్డగింత చూస్తూ ఊరుకోమని వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహం -
వెండి కిరీటం బహూకరణ
వెలుగోడు: పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి ఒక కిలో బరువు గల వెండి కిరీటాన్ని డాక్టర్ కేవీ శేషపాణి దంపతులు సోమవారం బహూకరించారు. ఈ కిరీటాన్ని లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయ చైర్మన్ బళ్లాని వెంకట సత్యనారాయణకు అందజేశారు. వెండి కిరీటానికి పూజలు చేసి స్వామివారికి అలంకరించారు. ఆలయ కమిటీ సభ్యులు యాదాటి రవీంద్రుడు, బొగ్గరపు లక్ష్మీనారాయణ, రమణయ్య, ఎల్లాల సురేష్, నాగ పుల్లయ్య, ఎల్లాల కష్ణుడు, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. శ్రీశైలంలో భక్తుల రద్దీ శ్రీశైలంటెంపుల్: శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు సోమవారం మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. మూడు విడతలుగా పలువురు భక్తులు అన్లైన్ ద్వారా స్పర్శ దర్శనం టికెట్లు పొంది స్వామివారి స్పర్శదర్శనం చేశారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్ని కిటకిటలాడాయి. సచివాలయాల ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు కర్నూలు(టౌన్): నగరపాలక సంస్థ పరిధిలోని సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇన్చార్జి కమిషనర్ ఆర్జీవీ. క్రిష్ణ సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిర్ణీత గడువులోపు ఈ –కైవెసీ, బయోమెట్రిక్ చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించడంతో ఈ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల వ్యవధిలో సరైన సమాధానం తెలియజేయకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కత్తెర పురుగు విజృంభణ కర్నూలు(అగ్రికల్చర్): మొక్కజొన్న, జొన్న పంటలపై కత్తెర పురుగు విజృంభిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా రబీలో కత్తెర పురుగు సోకి తినేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్నూలు జిల్లాలో జొన్న 4,017 హెక్టార్లు, మొక్కజొన్న 7,426 హెక్టార్లలో.. నంద్యాల జిల్లాలో రెండు పంటలు 10 వేల హెక్టార్లకుపైగా సాగు చేశారు. అయితే కత్తెర పురుగు నివారణకు సరైన సలహాలు, సూచనలు ఇచ్చే వారు లేకపోవడంతో రైతులు పెస్టిసైడ్ డీలర్లను ఆశ్రయిస్తున్నారు. వారు ఇచ్చిన మందులు వాడుతూ నష్టపోతున్నారు. పురుగు ప్రభావంతో దిగుబడులు పడిపోయే ప్రమాదం ఏర్పడింది. విద్యుత్ సమస్యలను సత్వరం పరిష్కరించండి కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ వినియోగదారుల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రదీప్కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్ భవన్లో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం ద్వారా వినియోగదారుల నుంచి ఫోన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలను సత్వరం పరిస్కరించి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని సంబంధిత ఈఈలు, డీఈఈలను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ వినియోగదారులకు అందుబాటులో ఉంటూ జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఈఈ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులను దగా చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
నంద్యాల(అర్బన్): రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి విమర్శించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ఉల్లి రైతులకు పరిహారం అందేలా ప్రభుత్వానికి నివేదికలు పంపాలని కోరుతూ సోమవారం పీజీఆర్ఎస్లో కలెక్టర్ రాజకుమారికి ఎమ్మెల్సీ ఇసాక్బాషా, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డితో కలిసి జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొక్కజొన్న క్వింటా రూ.2400తో కొనుగోలు చేస్తామని, కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు ప్రభుత్వం చెప్పినా నేటికీ ఏర్పాటు చేయలేదన్నారు. రైతులు దళారులకు క్వింటా రూ.1600 నుంచి రూ.1700తో అమ్ముకొని తీవ్రంగా నష్టపోయారన్నారు. రూ.28కోట్లు ఇవ్వాలి కడప, కర్నూలు జిల్లా రైతులు సాగు చేసిన ఉల్లి పంటకు పరిహారం అందించిన చంద్రబాబు ప్రభుత్వానికి నంద్యాల జిల్లా ఉల్లి రైతులు కనపడలేదా అని కాటసాని ప్రశ్నించారు. నంద్యాల జిల్లాలో 14వేల ఎకరాల్లో ఉల్లి సాగు అయ్యిందని, పంట నష్టపరిహారం కింద రూ.28కోట్లు రైతులకు రావాల్సి ఉందన్నారు. ఉల్లి రైతులకు నగదు జమ చేయకపోతే రైతుల పక్షాల పోరాటం చేయాల్సి ఉంటుందన్నారు. నిరాహార దీక్షలు చేస్తాం ఎమ్మెల్సీ ఇసాక్బాషా మాట్లాడుతూ.. రైతులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. నష్టపోయిన రైతులు ఎక్కడి వారికై నా పరిహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగాల భరత్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. నంద్యాల జిల్లా ఉల్లి రైతులకు రావాల్సిన రూ.28 కోట్ల పంట నష్టపరిహారం ప్రభుత్వం అందించకపోతే నిరహార దీక్షలు చేపడుతామన్నారు. వీరి వెంట పాణ్యం మాజీ జెడ్పీటీసీ సూర్యనారాయణరెడ్డి, గడివేముల జెడ్పీటీసీ సభ్యుడు చంద్రశేఖర్రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు సంఘం నాయకులు మహేశ్వరరెడ్డి ఉన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయాలి ఉల్లి రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి -
ఆసరా లేదు.. పింఛన్ ఇవ్వండి!
● జిల్లా కలెక్టర్కు అర్జీలు ఇచ్చిన వృద్ధులు, వితంతువులునంద్యాల: తనకు 62 ఏళ్ల వయస్సు ఉందని, ఎలాంటి ఆసరా లేదని, చిన్న పని కూడా చేయలేకపోతున్నానని, పింఛన్ ఇవ్వాలని ఆళ్లగడ్డ మండలం మెట్టపల్లె గ్రామానికి చెందిన కె. లక్ష్మీనరసయ్య అర్జీ ఇచ్చారు. తన భర్త అనారోగ్యంతో మృతి చెందారని, తనకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని ఆళ్లగడ్డ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన ఎం. ఓబులమ్మ వినతి పత్రం అందజేశారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ రాజకుమారి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అర్జీదారుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అధికారులు మరింత చొరవతో ప్రతి దరఖాస్తును నాణ్యతతో పాటు వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. రీ–ఓపెన్ అయిన దరఖాస్తులు, బియాండ్ ఎస్ఎల్ఏలో ఉన్న అర్జీలు, వీఐపీ గ్రీవెన్స్ లను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని వెంటనే పరిష్కరించాలన్నారు. పీజీఆర్ఎస్కు 151 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. -
గజవాహనంపై మద్దిలేటి స్వామి వైభవం
బేతంచెర్ల: ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను పురస్కరించుకొని ఆర్ఎస్ రంగాపురంలోని మద్దిలేటి స్వామి క్షేత్రంలో సోమవారం రాత్రి గజవాహన సేవ నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తుల మధ్య గజవాహనంపై స్వామిని క్షేత్ర పుర వీధుల్లో వైభవంగా ఊరేగించారు. వేడుకల్లో భాగంగా ప్రత్యేక మండపంలో మద్దిలేటి స్వామి ఉత్సవ మూర్తిని ప్రత్యేక అలంకారంలో కొలువుంచారు. సహస్రదీపాలంకరణ సేవ నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు పండితులు జ్వాలా చక్రవర్తి, కళ్యాణచక్రవర్తి పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణంలో గజవాహనంపై సత్యనారాయణ మూర్తి అలంకారంలో శ్రీ మద్దిలేటి నరసింహ స్వామిని కొలువుంచారు. భక్తజనం మధ్య మంగళవాయిద్యాలతో గజవాహనంపై ఊరేగింపు నిర్వహించారు. ఉపకమిషనర్ రామాంజనేయులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
నంద్యాల జిల్లాలో దయనీయం
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి నంద్యాల జిల్లాలో రియల్ ఎస్టేట్ పరిస్థితి దయనీయంగా మారింది. కొనేవారు లేక వ్యాపారులు అప్పులపాలవుతున్నారు. గతంలో రేట్లు భారీగా ఉన్న సమయంలో కొనుగోలు చేసిన తర్వాత అనుకోకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా రేట్లు భారీగా పతనమయ్యాయి. నంద్యాల పట్టణంలోని రైతు నగరంలో 2024కి ముందు ఎకరం రూ.6 కోట్ల వరకు విక్రయించారు. ప్రస్తుతం ఇదే ప్రాంతంలో రూ.3 కోట్లకు మించి ధర పలకడం లేదు. ప్రభుత్వ మెడికల్ కళాశాలకు కిలోమీటర్ దూరంలోనే ఈ ప్రాంతం ఉంది. ఏడాదిలో 50 శాతం రేట్లు పతనమవ్వడంతో దిక్కుతోచని పరిస్థితిల్లో వ్యాపారులు ఉన్నారు. ధరలు భారీగా పడడంతో అప్పుల్లో కూరుకుపోయిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకరు ఐపీ పెట్టి నంద్యాలను వదిలేసి వెళ్లిపోయారు. మరో ఇద్దరు వ్యాపారులు ఐపీ పెట్టే ఆలోచనలో ఉన్నారు. ● 2024–25కు సంబంధించి జిల్లాకు రూ.260.36 కోట్ల లక్ష్యంగా నిర్ణయిస్తే రూ.150.07 కోట్లు మాత్రమే సమకూరింది. రిజిస్ట్రేషన్ల ఆదాయం పెంచాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తుండడంతో రిజిస్ట్రార్లు ఆందోళనకు గురవుతున్నారు. ● గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2023–24లో రూ. 171.22 కోట్లు ఆదాయం వచ్చింది. ● ఒక్క ఏడాదిలోనే జిల్లాలో రూ. 21.05 కోట్ల ఆదాయం తగ్గింది. -
సంక్షోభంలో సర్కారు విద్య
నంద్యాల(న్యూటౌన్): సంస్కరణల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తుందని యూటీఎఫ్ రాష్ట్ర సహాయ అధ్యక్షుడు సురేష్కుమార్ విమర్శించారు. ఆదివారం స్థానిక నేషనల్ పీజీ కళాశాలలో యూటీఎఫ్ నాల్గవ జిల్లా జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగాన్నీ నిర్వీ ర్యం చేస్తుందన్నారు. ఉపాధ్యాయుడి బోధనా సమయాన్ని హరిస్తూ బోధనేతర కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నారన్నారు. వినూత్న పద్ధతులు అంటూ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం ఉపాధ్యాయులను వేధిస్తుందని విమర్శించారు. విద్యను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నుతుందన్నారు. కూటమి ప్రభు త్వం ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణే లక్ష్యమని అంటూ ప్రభుత్వ విద్యకు పాతర వేస్తుందని దుయ్యబట్టారు. జిల్లా యూటీఎఫ్ అధ్యక్ష పీవీ ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చాలన్నా రు. 2022 జూలై నుంచి 12వ పీఆర్సీని అమలు చేయాల్సినప్పటికీ రెండేళ్లు అవుతున్నా ఊసేలేదన్నారు. ఇప్పటి వరకు రూ.8500 కోట్లు మాత్రమే చెల్లించారని, మిగిలిన రూ.30 వేల కోట్లు చెల్లింపులపై స్పష్టత లేద న్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, యూటీఎఫ్ రాష్ట్ర సభ్యులు సుబ్బారెడ్డి, సుబ్బరాయుడు, సత్యప్రకాశం, ఐజ య్య, నాగస్వామి, నాయక్, సుజాత, బాబాఫకృద్దీన్, రామ్మోహన్, రామకృష్ణుడు, అరవిందకుమార్, దస్తగిరి, తదితరులు పాల్గొన్నారు. -
అప్పుల పాలయ్యాం
కర్నూలు, ఓర్వకల్లు, హుస్సేనాపురం, డోన్, కోడుమూరు తదితర ప్రాంతాల్లో వెంచర్లు వేసి నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా. ఏడాదికి దాదాపు రూ.25 కోట్ల వ్యాపారం జరిగేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రూ. లక్ష రూపాయలు కూడా చేతికి రావడం గగనమైంది. చేసిన అప్పులకు వడ్డీలు కొండలు పెరిగనట్లు పెరుగుతూ పోతున్నాయి. ఒక్క రకంగా చెప్పాలంటే దివాలా తీశాం. అయితే ఈ విషయం బయటకు చెప్పితే అప్పుదారులు మీద పడతారని తేలు కుట్టిన దొంగల్లాగా వ్యాపారంపై ఆశతో ఉన్నాం. – రామిరెడ్డి, కర్నూలు రెండున్నరేళ్ల క్రితం నూతన జిల్లా ఏర్పాటు సమయంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఆశాజనకంగా ఉంది. స్థలాలు, పొలాలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. కరోనా అనంతరం కూడా భూములకు ధరలు పలికాయి. గత ప్రభుత్వ హయాంలో సచివాలయాలు, జిల్లా కేంద్రాలు ఆసుపత్రుల ఏర్పాటుతో పాటు మూడు రాజధానులు అంటూ చేసిన ప్రచారాలతో రియల్ ఎస్టేట్ రంగం వెలిగి పోయింది. తాము పట్టుకున్నదంతా బంగారంలా కనిపించింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా అదే ఊపు ఉంటుందని భావించి మోసపోయాం. రూ. కోట్లు ఖర్చు పెట్టి కొన్న భూములు అమ్ముకోలేక భారీగా నష్టపోతున్నాం. – షేక్ షరీఫ్, రియల్టర్, విశ్వనగర్, నంద్యాల నిర్మాణ రంగం నిలిచి పోయింది. వారంలో రెండు మూడు రోజులు మాత్రమే పనులు దొరు కుతున్నాయి. ఇల్లు, భవన నిర్మాణాల పను ల వేగం తగ్గింది. రియ ల్ ఎస్టేట్ రంగం పుంజుకునేంత వరకు కార్మికులకు పనులు దొరికేలా లేవు. ఇల్లు గడవటం ఇబ్బందింగా మారింది. రెండేళ్ల క్రితం వరకు వారం రోజుల పాటు పనులు దొరికేవి. ఏడాది కాలంగా మూడు రోజుల పనితో సరి పెట్టుకోవాల్సి వస్తుంది. భవన నిర్మాణ కూలీలను ఆదుకోవాలి. – తిమ్మయ్య, భవన నిర్మాణ కార్మికుడు, నంద్యాల -
బోనోఫిక్స్ అక్రమంగా రవాణా చేస్తూ..
● పోలీసుల అదుపులో బాలుడు పాములపాడు: ఆత్మకూరు మండలం కరివేన గ్రామానికి చెందిన ఓ బాలుడు కర్నూలు నుంచి మత్తు పదార్థంగా వినియోగించే బోనోఫిక్స్ను అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. కరివేనకు చెందిన బాలుడు ఈనెల 27వ తేదీ రాత్రి మిత్రుడి (మైనర్)తో కలసి కర్నూలు నుంచి స్వగ్రామానికి బోనోఫిక్స్ను అక్రమంగా బైక్పై తరలిస్తూ మార్గమధ్యలో యర్రగూడూరు వద్ద నిలిచారు. స్థానిక సీపీడబ్ల్యూ స్కీం వద్ద మద్యం సేవిస్తుండగా అక్కడ విధులు నిర్వహిస్తున్న వాచ్మెన్ చాకలి వెంకటేశ్వర్లు వారిని గమనించి బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించవద్దని మందలించాడు. మత్తులో ఉన్న ఇద్దరు మైనర్లు ఆగ్రహంతో వాచ్మెన్పై దాడి చేసి గాయపరిచారు. వాచ్మెన్ కేకలు వేయడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకొని ఇద్దరిని పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడి వద్ద ఉన్న బ్యాగ్ను తనిఖీ చేయగా సుమారు 20కి పైగా బోనోఫిక్స్ ట్యూబ్లు ఉండటంతో అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఈ ప్రమాదకరమైన మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి తెస్తున్నాడు? ఎవరికీ ఇచ్చేందుకు వెళ్తున్నాడని విచారణ చేపట్టామన్నారు. మైనర్ కావడంతో మందలించి తల్లిదండ్రులకు అప్పగించామని, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఎస్ఐ తిరుపాలు తెలిపారు. -
బెలుం గుహలకు పర్యాటకుల తాకిడి
● రూ.1.30 లక్షల ఆదాయం కొలిమిగుండ్ల: భూగర్భంలో అవతరించిన బెలుం గుహల సహజ అందాలను తిలకించేందుకు పర్యాటకులు క్యూకట్టారు. ఆదివారం సెలవు దినం కావడంతో కర్ణాటకతో ఇతర ప్రాంతాల నుంచి యాత్రికులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గుహ లోపల పర్యాటకులతో రద్దీగా మారింది. గుహ లోపల ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అందాలను తిలకించి వాటి గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పర్యాటకులు ఎక్కువ మంది రావడంతో గుహలకు రూ.1.30 లక్షల మేర ఆదాయం సమకూరినట్లు సిబ్బంది తెలిపారు.నేడు కలెక్టరేట్ ఆవరణలో రెవెన్యూ క్లినిక్స్ ● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల(అర్బన్): జిల్లాలో ప్రజలు ఎదు ర్కొంటున్న వివిధ రెవె న్యూ సమస్యలకు త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ నెల 29వ తేదీన సోమవారం కలెక్టరేట్ ఆవరణలో జిల్లా స్థాయి రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలో ఏడు రెవెన్యూ క్లినిక్స్ ఏర్పాటు చేసి, ప్రజల నుంచి అర్జీలను నేరుగా స్వీకరించి నమోదు చేయడంతో పాటు, సమస్యల స్వరూపాన్ని బట్టి అక్కడికక్కడే పరిష్కార చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు హాజరై ప్రజలకు సేవలు అందిస్తారన్నారు. రెవెన్యూ, అడంగల్ సవరణలు, 22ఏ – చుక్కల భూముల క్రమబద్ధీకర ణ, అసైన్డ్ భూములు–భూ ఆక్రమణలు, రెవె న్యూ కోర్టు కేసులు, సర్వే–రీ సర్వే, దేవదాయ–వక్ఫ్ భూముల సమస్యలకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రజల అర్జీలకు వేగవంతమైన పరిష్కారం అందిస్తామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో ‘మీ ఇంటికి.. మీ డాక్టర్’ ● రెడ్క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహణ నంద్యాల(అర్బన్): జిల్లాలోని చెంచు గూడేల్లోని గిరిజనలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ‘మీ ఇంటికి మీ డాక్టర్’ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షురాలు రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, న్యూఢిల్లీకి చెందిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో అమలు చేయనుందన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు గవర్నర్ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించనున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టును మూడేళ్ల పాటు అమలు కానుందన్నారు. మొబైల్ హెల్త్ క్లినిక్ నిర్వహణ నిమిత్తం డాక్టర్, నర్స్, ఫార్మసిస్ట్, డ్రైవర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అర్హులైన వారు దరఖాస్తులను redcrossnandyal@gmail.com, redcrossap@gmail.comకు జనవరి 15లోపు పంపాలని సూచించారు. ఆదోని జిల్లా కోసం ఉద్యమం ఆదోని టౌన్: ఆదోని జిల్లా కోసం ఐక్యంగా ఉద్య మం చేస్తున్నామని జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు కృష్ణమూర్తిగౌడ్, వీరేష్, వీరేష్, రఘురామయ్య పేర్కొన్నారు. ఆదోని పట్టణంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 43వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదోనిని తక్షణమే జిల్లాగా ప్రకటించాలని, లేని పక్షంలో జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. నేడు డయల్ యువర్ ఎస్ఈ కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ భవన్లో సోమ వారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమా న్ని నిర్వహిస్తున్నట్లు సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆర్.ప్రదీప్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు తాము ఎదుర్కొ ంటున్న విద్యుత్ సమస్యలను 7382614308కు ఫోన్ చేసి చెప్పవచ్చన్నారు. -
శ్రీగిరి భక్తులకు ఆన్‘లైన్’కష్టాలు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం అధికారులు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్నా క్షేత్ర స్థాయిలో వెనకడుగు వేస్తున్నారు. శ్రీశైల దేవస్థానంలో గత మూడేళ్ల నుంచి అన్ని ఆర్జిత సేవలు పూర్తిగా ఆన్లైన్ ద్వారా మాత్రమే టికెట్స్ బుక్ చేసుకునే సదుపాయాన్ని ప్రవేశ పెట్టారు. దీంతో భక్తులు వారి ఇంటి నుంచే ఉభయ దేవాలయా ల్లో నిర్వహించే ఆర్జిత సేవలను దేవదాయ అధికారిక వెబ్ సైట్, శ్రీశైల దేవస్థాన అధికారిక వెబ్ సైట్ల ను వినియోగించుకుని టికెట్స్ బుక్ చేసుకుని, సేవ లు నిర్వహించుకుంటున్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత వాట్సాప్ గవర్నెస్ అంటూ మన మిత్ర (9552300009) వాట్సాప్ నంబర్ను ప్రవేశపెట్టింది. ఈ నంబర్కు ప్రజల నుంచి ప్రభుత్వం ఊహించిన స్పందన రాలేదు. దీంతో శ్రీశైల దేవస్థానం ప్రభుత్వ మెప్పు కోసం పాట్లు పడుతుందోనే విమర్శలు ఉన్నాయి. ఇందుకోసం దేవస్థాన ఈఓ ఆన్లైన్ సేవలపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి అధికారులకు మనమిత్ర వాట్సాప్ను భక్తులు విరివిరిగా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి త్వరితగతిన దర్శనం చేసుకునేలా వారికి ప్రత్యేక క్యూలు, లడ్డూ ప్రసాదాలు సైతం తీసుకునేందుకు కూడా ప్రత్యేక లైన్ ఏర్పాటు చేస్తున్నామని దేవస్థానం ప్రకటించింది. ఈ మేరకు క్షేత్ర పరిధిలో పలు చోట్ల ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకునేలా కియోస్క్లు, హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశా రు. ఆయా కేంద్రాల్లో శివసేవకులను ఏర్పాటు చేసి ఆన్లైన్లో బుక్ చేస్తున్నారు. గంటల తరబడి నిరీక్షణ.. ఓ వైపు ఆన్లైన్ బుకింగ్పై అవగాహన కల్పిస్తున్న దేవస్థానం అధికారులు ఆ మేరకు వసతులు కల్పించడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా రద్దీ రోజుల్లో కనీసం టైం స్లాట్ కూడా లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్ బుకింగ్ భక్తులకు ప్రత్యేక క్యూలైన్ ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. మన మిత్ర వాట్సాప్ నంబర్ ద్వారా భక్తులచే విస్తృతంగా ఆన్ లైన్లో టికెట్స్ బుక్ చేయ డం, దేవాదాయ శాఖ, శ్రీశైల దేవస్థాన అధికారిక వెబ్ సైట్లను వినియోగించుకుని ముందస్తుగా టిక్కె ట్లు బుక్ చేసుకున్న వారితో క్షేత్రంలో రద్దీ ఏర్పడింది. వరుస సెలవుల నేపథ్యంలో మల్లన్న దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో క్షేత్రంలో వసతి దొరక్క, దర్శనానికి గంటల తరబడి వేచి ఉండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆన్లైన్ భక్తులకు ప్రత్యేక క్యూలైన్ అని ప్రకటించినా.. అధికారు లు ఆ దిశగా ఏర్పాట్లు చేయకపోవడంతో క్షేత్రానికి వచ్చిన భక్తులు దేవస్థాన తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ మెప్పు కోసం భక్తులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతున్నారు. శ్రీశైల వెబ్ సైట్, మన మిత్ర యాప్లో అధిక సంఖ్యలో బుకింగ్ రద్దీ రోజుల్లో కరెంట్ బుకింగ్లోనూ అదే పరిస్థితి టైం స్లాట్, ప్రత్యేక క్యూ లేక భక్తుల కష్టాలు -
విక్రాంత్ పాటిల్కు డీఐజీగా పదోన్నతి
కర్నూలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్ కు డీఐజీగా పదోన్నతి లభించింది. ఏపీ క్యాడర్కు చెందిన 16 మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఎస్పీగా ఉన్న విక్రాంత్ పాటిల్కు డీఐజీగా పదోన్నతి కల్పిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు వెలువడ్డాయి. 2026 జనవరి 1 నుంచి పదో న్నతి జీవో అమలులోకి వస్తుంది. అప్పటివరకు ఈయ న ఈ పదవిలోనే కొనసాగనున్నారు. 2012 ఐపీఎస్ అధికారి అయిన విక్రాంత్ పాటిల్ ఈ ఏడాది ఫిబ్రవరి 1న జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. బెటాలియన్స్, అనంతపురం డీఐజీగా ? ఏపీఎస్పీ బెటాలియన్స్ రేంజ్–2(కర్నూలు) డీఐజీ పోస్టు ప్రస్తుతం ఇన్చార్జ్ పాలనలో కొనసాగుతోంది. ఇక్కడ డీఐజీగా పనిచేసిన వెంకటేశ్వర్లు 2024 ఏప్రిల్ 30న పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి గ్రేహౌండ్స్ డీఐజీ సీతారాం ఇన్చార్జిగా కొనసాగుతు న్నారు. ఆయన జనవరి 30న పదవీ విరమణ పొందనున్నారు. దీంతో విక్రాంత్కు బెటాలియన్స్ రేంజ్–2 డీఐజీగా, అనంతపురం రేంజ్ డీఐజీగా పోస్టింగ్ దక్కే అవకాశమున్నట్లు చర్చ జరుగుతోంది. అనంతపురం రేంజ్ డీఐజీగా ఉన్న షెమూషి ఐజీగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం కర్నూలు రెండో బెటాలియన్ కమాండెంట్గా ఎస్పీ సతీమణి దీపిక పాటిల్ విధులు నిర్వహిస్తున్నారు. స్పౌజ్ గ్రౌండ్ కింద విక్రాంత్ పాటిల్ను బెటాలియన్స్ డీఐజీగా నియమించే అవకాశముంది. ఆ నలుగురూ జిల్లాకు సుపరిచితులే జిల్లాలో పూర్వపు ఎస్పీలుగా పనిచేసిన శంకబ్రత బాగ్చి డీజీపీగా, గోపీనాథ్ జెట్టి, ఆదోని అదనపు ఎస్పీ గా పనిచేసిన డాక్టర్ షమూషి బాజ్పేయి, కర్నూలు రేంజ్ డీఐజీగా పనిచేసిన సెంథిల్ కుమార్లకు ఐజీలుగా పదోన్నతి లభించింది. ఈ నలుగురూ జిల్లాకు సుపరిచితులే. -
నకిలీ వెబ్ సైట్ బారిన భక్తులు
ఆన్లైన్లో నకిలీ వెబ్సైట్ల బారిన పడి మల్లన్న భక్తులు మోసపోతూనే ఉన్నారు. తాజా గా ఉత్తరాది ప్రాంతానికి చెందిన గుజ్రాల్ అనే వ్యక్తి సైబర్నేరగాళ్ల బారినపడ్డాడు. శ్రీశైలం వచ్చే ముందుగానే అతను వసతి పొందేందుకు ఆన్లైన్లో ఆరా తీయగా సైబర్ నేరగాళ్లు అప్పటికే ఉంచిన నకిలీ మల్లికార్జున సదన్ పేరుతో ఉన్న లింక్ ను క్లిక్ చేసి మూడు గదులు బుక్ చేసుకున్నాడు. ఒక రూముకు రూ.1,750 చొప్పున మూడు రూములకు అద్దె, జీఎస్టీ కలిపి మొత్తం రూ.5,821 తన ఖాతా నుంచి జమ చేశాడు. శనివారం అతను కుటుంబీకులతో శ్రీశైలం వచ్చి మల్లికార్జున సదన్ వద్ద ఆన్లైన్లో బుక్ చేసుకున్న రశీదును చూపగా అది ఫేక్ అని తేలింది. దీంతో మోసపోయానని తెలుసుకుని లబోదిబోమన్నాడు. నెల క్రితం టూరిజం నకిలీ వెబ్ సైట్ పైన టూరిజం అధికారు లు తక్షణమే స్పందించి సదరు నకిలీ వెబ్ సైట్లను బ్లాక్ చేయించారు. కానీ దేవస్థానం అధికారులు మల్లికార్జున సదన్ అనే ఫేక్ వెబ్ సైట్ను ఎందుకు బ్లాక్ చేయించలేకపోతున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఎంతో భక్తిశ్రద్ధలతో శ్రీశైలానికి వస్తున్న భక్తులు నకిలీ వెబ్ సైట్లతో మోసపోవడం ఏంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వైభవంగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ప్రారంభం
బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం శివార్లలో వెలసిన మద్దిలేటయ్య క్షేత్రంలో ఆదివారం ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో ఉద యం వేదపండితులు గోపూజ, స్వామివారికి విష్వక్సేనారాధన కోయిల్ ఆళ్వార్ తిరుమంజన పూజలు చేపట్టారు. సాయంత్రం రక్షాబంధనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, చతుస్థానార్చన, దీక్షా హోమం నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా మొదటి రోజు మద్దిలేటి నరసింహ స్వామి వారికి విశేష పుష్పాలంకరణతో పాటు సహస్ర దీపాలంకరణ సేవ, అష్టవిధ మహామంగళహారతి సేవ నిర్వహించారు. రాత్రి స్వామి వారు నారాయణ అవతారంలో సహస్ర దీపాలంకరణలో సేవలో భక్తులకు దర్శన మిచ్చారు. హనుమద్ వాహనంపై కొలువైన స్వామి వారు ఆలయ ఆవరణలో విహరించారు. -
చావడానికే వచ్చాం.. ఎవరూ కాపాడొద్దు
గడివేముల: ఇద్దరు బిడ్డలు.. ఉన్నంతలో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు ఆ దంపతులు. కానీ విధి చిన్నచూపు చూసింది. ఇద్దరు బిడ్డలను అనారోగ్యం వెంటాడింది. దీంతో ఆ తల్లి మనసు తల్లడిల్లింది. చిన్నారులు ఇద్దరినీ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అని చెప్పి.. మధ్యలోనే దిగి ఇద్దరు బిడ్డలను కాలువలో తోసి తానూ దూకేసిన∙విషాద ఘటన నంద్యాల జిల్లా గడివేముల మండలంలో ఆదివారం వెలుగు చూసింది. వివరాలు.. గడివేముల మండల పరిధిలోని ఒండుట్ల గ్రామానికి చెందిన బుగానిపల్లె ఎల్లా లక్ష్మి (23)ని అదే గ్రామానికి చెందిన రమణయ్య నాలుగేళ్ల్ల కిందట వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు వైష్ణవి (2), సంగీత (మూడునెలలు) ఉన్నారు. పిల్లలకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో గ్రామంలోని ఓ ఆర్ఎంపీ వద్దకు వెళ్లగా రక్తకణాలు తగ్గిపోయాయని, గడివేములకు వెళ్లాలని సూచించాడు. దీంతో లక్ష్మి తన బిడ్డలను తీసుకుని గడివేముల బయలుదేరింది. మార్గమధ్యలోని మంచాలకట్ట గ్రామ సమీపంలో ఎస్సార్బీసీ ప్రధాన కాలువ వద్ద ఇద్దరు చిన్నారులతో దిగడంతో అటుగా వెళ్తున్న స్థానిక రైతులు ‘ఏమ్మా..ఇక్కడ కూర్చున్నావ్’ అని అడిగారు. ఆ వెంటనే లక్ష్మీ ఇద్దరు కుమార్తెలను కాలువలో పడేసి తానూ దూకింది. రక్షించేందుకు స్థానికులు యత్నించగా.. ‘నేను చావడానికే వచ్చాను.. మమ్మల్ని ఎవరూ కాపాడవద్దు’ అని కేకలు వేసింది. స్థానిక ఎస్ఐ నాగార్జునరెడ్డి కేసు నమోదు చేసి, సిబ్బందితో కలిసి ఎస్సార్బీసీ కాలువ వెంట గాలింపు చర్యలు చేపట్టారు. -
ఐక్యంగా సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం
● హిందూ సమ్మేళనంలో వక్తలుహొళగుంద: ఐక్యంగా సనాతన ధర్మాన్ని కాపాడుకుందామని స్వాములు, ధార్మిక ఉపన్యాసకులు, వక్తలు పిలుపునిచ్చారు. హొళగుందలోని సిద్ధేశ్వరస్వామి ఆలయ ఆవరణలో జ్యోతి వెలిగించి శనివారం హిందూ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జగద్గురు శ్రీమరి కొట్టూరు దేశకరు స్వామి (శ్రీధరగడ్డ) హాజరయ్యారు. సమ్మేళనంలో తుముకూరుకు చెందిన ఎం, బాలచంద్ర, బెంగళూరుకు చెందిన హారిక మంజునాథ్, సురేంద్ర మాట్లాడారు. అన్ని మతాలు, ప్రాంతాలు బాగుండాలని కోరే ఏకై క దేశం భారతదేశమన్నారు. ఇందుకు ఇక్కడి ప్రజలు నమ్ముకున్న సనాతన ధర్మమే కారణమన్నారు. చత్రపతి శివాజీ, ఆయన తనయుడు చత్రపతి సంభాజీలాంటి మహానీయుతో నేడు సనాతన ధర్మం మనుగడలో ఉందన్నారు. సమ్మేళనంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
వేగంగా పాత గేట్ల తొలగింపు పనులు
హొళగుంద: తుంగభద్ర జలాశయంలో 33 పాత గేట్ల తొలగింపు పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనులు పూర్తవగానే నెలలో ఆరు గేట్ల ప్రకారంగా కుడి, ఎడమ, మద్య భాగాలలో మొత్తం మూడు బృందాలు 2026 మే నెల కల్లా 33 గేట్ల బిగింపు పనులు పూర్తి చేస్తారు. పనులకు వీలుగా డ్యాంలో నీటిని నదికి వదిలి నిల్వ సామర్థ్యాన్ని 40 టీఎంసీల వరకు తగ్గించారు. డ్యాంకు శనివారం ఇన్ఫ్లో నిలిచిపోయింది. జనవరి 10 లేదంటే మరి కొద్ది రోజులు మాత్రమే కాలువలకు నీటిని వదలనున్నారు. అనంతరం నీటి సరఫరా బంద్ చేయనున్నారు. ప్రస్తుతం దిగువ కాలువ 250 కి.మీ వద్ద 647 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంది. రూ.1.50లక్షలు పలికిన పొట్టేలు! కోసిగి: పందెం పొట్టేలు రూ.1.50 లక్షలు పలికింది. మండల కేంద్రం కోసిగిలోని శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ యజమాని గవిగట్టు నారాయణ, కృష్ణ ఈ ఏడాది దేవర ఉత్సవాల కోసం మార్చిలో రూ.40వేలకు ఓ పొట్టేలు కొని పెంచుకున్నారు. రోజూ లీటరు పాలు, 4 కోడిగుడ్లు, కేజీ ఉలువలను ఆహారంగా అందించారు. ఉత్సవాలు వచ్చే ఏడాదికి వాయిదా పడడంతో విక్రయించాలని నిర్ణయించుకోగా, మద్దికేర మండలం ఆగ్రహానికి చెందిన ఈరన్న అనే రైతు రూ.1.50లక్షలకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం దీని బరువు 120 కేజీలు. -
తిరుగు ప్రయాణం.. విషాదం
● ఆటోను ఢీకొన్న కారు ● ఇద్దరు మృతి ● మృతులు అనంతపురం జిల్లా వాసులు ప్యాపిలి: బంధువుల ఇంట్లో క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకుని స్వగ్రామానికి బయలుదేరిన వారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం మిడుతూరు గ్రామానికి చెందిన రాజేశ్ (32), నవీన్ (28) తమ కుటుంబాలతో కలసి క్రిస్మస్ వేడుకలకు ప్యాపిలిలో బంధువుల ఇంటికి వచ్చారు. క్రిస్మస్ వేడుకలను సంతోషంగా జరుపుకున్న అనంతరం శనివారం వారి స్వగ్రామానికి ఆటోలో బయలుదేరారు. పోతుదొడ్డి వద్దకు రాగానే వారు ప్రయాణిస్తున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీ కొట్టింది. ఆటో పల్టీలు కొట్టడంతో అందులో ఉన్నవారంతా చెల్లాచెదురుగా పడిపోయారు. తీవ్రంగా గాయపడిన రాజేశ్, నవీన్ను చికిత్స నిమిత్తం అనంతపురం జిల్లా గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ప్రమాదంలో రాజేశ్ భార్య కళావతి, కుమార్తె వర్షిణి, నవీన్ భార్య స్వీటికి స్వల్ప గాయాలయ్యాయి. ఇంటి పెద్దలను కోల్పోవడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన భర్తల మరణాన్ని భార్యలు కళావతి, స్వీటి జీర్ణించుకోలేక పోతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన నవీన్, రాజేశ్ -
రైతులకు కడ‘గండ్లు’
రుద్రవరం: తెలుగుగంగ ఉప ప్రధాన కాల్వకు పడిన గండ్లను అలాగే వదిలేయడంతో రైతులకు నష్టాలే మిగిలాయి. ఖరీఫ్లో చేతికొచ్చిన పంటను కోయకుండా పొలాల్లో వదిలేశారు. విత్తనం వేయాల్సిన పొలాలను బీళ్లుగా ఉంచుకున్నారు. రుద్రవరం మండల పరిధిలోని టి.లింగందిన్నె–ఆర్. నాగులవరం మధ్య 22వ బ్లాక్ తెలుగుగంగ ఉప ప్రధాన కాల్వకు 10మీటర్ల మేర గండి పడింది. టీజీపీ అధికారులు తూతూ మంత్రంగా ఐదు మట్టి సంచులు అడ్డుగా వేసి చేతులు దులుపుకున్నారు. ఆ మట్టి సంచులు కరిగిపోయి తిరిగి గండి ఏర్పడింది. దీంతో నీరంతా వరి పొలాలను ముంచెత్తింది. పంట కాలం పూర్తి అయినా కోతలు కోయించుకోలేక 60 ఎకరాల్లో వరిని అలాగే రైతులు వదిలేశారు. విత్తనం వేయాల్సిన పొలాలు అన్నీ జలమయం కావడంతో సేద్యాలు చేసుకోలేక అలాగే బీళ్లుగా వదిలేశారు. -
మద్దిలేటి క్షేత్రంలో భక్తుల రద్దీ
బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం శివారులో వెలసిన వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. పుష్య మాసంను పురస్కరించుకొని చిన్నారుల కేశఖండన స్వామి, అమ్మవార్ల దర్శనార్థం భారీగా భక్తులు వచ్చారు. ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన నిర్వహించారు. స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజ చేశారు. శ్రీశైలం పాదయాత్ర మార్గం పరిశీలన ఆత్మకూరురూరల్: రానున్న మహాశివరాత్రి, ఉగాది పర్వదినాల సందర్భంగా నల్లమల గుండా శ్రీశైలానికి పాదయాత్ర ద్వారా వెళ్లే భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడంలో భాగంగా ఆత్మకూరు డీడీ విగ్నేష్ అపావ్ శనివారం మార్గ పరిశీలన చేశారు. వెంకటాపురం నుంచి ఆయన తన సిబ్బందితో కలసి పాదయాత్ర మార్గం వెంట పెచ్చెర్వు వరకు నడిచి వెళ్లారు. దారి వెంట పలు గూడేల్లో చెంచులతో మాట్లాడారు. వారికి అవసరమైన సదుపాయాలపై అవగాహన కల్పించారు. పెచ్చెర్వు చెంచు గూడెంలో అక్కడి యువకులతో కలసి తన సిబ్బందితో వాలీబాల్ ఆడారు. అనంతరం అక్కడి చెంచులతో ప్రత్యేకంగా సమావేశమై సూచనలు ఇచ్చి సలహాలు స్వీకరించారు. డీడీ వెంట ఎఫ్ఆర్వోలు ప్రణీత, కృష్ణప్రసాద్, అటవీ సిబ్బంది ఉన్నారు. గ్రామాల్లో ‘మొబైల్’ వైద్య పరీక్షలు గోస్పాడు: మొబైల్ ఐసీటీసీ వాహనంతో గ్రామాల్లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. నంద్యాల డీఎంహెచ్ఓ కార్యాలయం ఆవరణలో శనివారం మొబైల్ ఐసీటీసీ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 104 వాహనంతో అనుసంధానం చేస్తూ గ్రామాల్లో హెచ్ఐవీ, సిఫిలిస్, టీబీ పరీక్షలు చేసేలా మొబైల్ వాహనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాలుగు నెలల కాలంలో ఈ సేవలు అందించనున్నట్లు చెప్పారు. అందుకు అనుగుణంగా సిబ్బంది ప్రణాళికలు తయారు చేయాలని, ఎయిడ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలన్నారు. జిల్లా లెప్రసీ ఎయిడ్స్ టీవీ అధికారి డాక్టర్ శారదాబాయి, డీసీహెచ్ఎస్ డాక్టర్ లలిత, అధికారులు అలీ హైదర్, సిబ్బంది పాల్గొన్నారు. పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి గడివేముల: పదో తరగతి విద్యార్థులకు వందరోజుల ప్రణాళికను కచ్చితంగా అమలు చేసి వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయులను నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ఆదేశించారు. గడివేముల మండలం గడిగరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను శనివారం తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఉన్నత పాఠశాల హెచ్ఎం చంద్రావతి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎందుకూ ఉపయోగపడటం లేదు
ఖరీఫ్లో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాం. రబీలో కూడా వేస్తున్నాం. ప్రభుత్వం సీసీఆర్సీ కార్డు కూడా మంజూరు చేసింది. అయితే కౌలుదారు ఆర్థిక చేయూతకు ఏమాత్రం తోడ్పడటం లేదు. అన్నదాత సుఖీభవ కూడా రాలేదు. బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడం లేదు. కనీసం కార్డుపైన యూరియా కూడా తీసుకోలేకపోతున్నాం. ప్రభుత్వం చొరవ తీసుకొని కౌలు రైతులకు అన్ని రకాల ప్రయోజనాలు వర్తింపజేయాలి. – ఉప్పరి కాశయ్య, బోయరేవుల గ్రామం, వెలుగోడు మండలం సీసీఆర్సీ కార్డులు పొందిన సాగుదారులకు రుణాలు ఇవ్వలేం. కర్నూలు మండలం పసుపల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా 366 మంది కౌలు రైతులకు రుణాలు పంపిణీ అయ్యాయి. ఇందులో 359 మంది రైతులు రుణాలు చెల్లించలేదు. మొత్తంగా రూ.144.18 లక్షలు నిరర్థక ఆస్తుల్లోకి వచ్చింది. అందువల్ల రుణాలు ఇవ్వలేకపోతున్నాం. – గత నవంబర్ 21న డీసీసీ/డీఎల్ఆర్సీ సమావేశంలో ఎల్డీఎం రామచంద్రరావు -
29న ‘రెవెన్యూ’ క్లినిక్స్
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల(అర్బన్): రెవెన్యూ సంబంధిత సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించాలనే ఉద్దేశంతో ఈ నెల 29వ తేదీ సోమవారం కలెక్టరేట్ ఆవరణలో జిల్లా స్థాయి రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలో మొత్తం ఏడు రెవెన్యూ క్లినిక్స్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ క్లినిక్స్లో ప్రజల నుంచి రెవెన్యూ సంబంధిత అర్జీలను స్వీకరించి, వాటిని నమోదు చేసి, సమస్యల స్వరూపాన్ని బట్టి అక్కడికక్కడే పరిష్కార చర్యలు చేపడతామన్నారు. ఇందుకోసం సంబంధిత విభాగాలకు చెందిన ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. శ్రీశైల క్షేత్రానికి ఒకే రోజు రూ.1.4 కోట్ల ఆదాయం శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానానికి ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా శుక్రవారం ఒక్క రోజురూ.1,46,94,825 ఆదాయం వచ్చిందని శ్రీశైల దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్నాయుడు, కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో స్పర్శదర్శనం, రూ. 300 అతి శీఘ్రదర్శనం, రూ. 150 శీఘ్రదర్శనం టికెట్లను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. మొత్తం 14 ఆర్జితసేవలకు సంబంధించిన టికెట్లు కూడా ఆనన్లైన్న్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మనమిత్ర వాట్సాప్ 9552300009 ద్వారా దర్శనం, ఆర్జితసేవలు పొందే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా శుక్రవారం దేవస్థానానికి రూ. 73,19,314, ఆఫ్లైన్ ద్వారా రూ.73,75,511 ఆదాయం వచ్చిందన్నారు. -
రౌడీషీటర్ తులసికుమార్ జిల్లా బహిష్కరణ
కర్నూలు: కర్నూలు నాలుగో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని శరీన్ నగర్లో నివాసముంటున్న కిరాయి హంతకుడు వడ్డె రామాంజినేయులు పెద్ద కుమారుడైన రౌడీషీటర్ వడ్డె తులసి కుమార్ (షీట్ నెం.389)పై జిల్లా కలెక్టర్ ఎ.సిరి జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతను ఐదు క్రిమినల్ కేసుల్లో నిందితుడు. పలుమార్లు జైలుకు వెళ్లినప్పటికీ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోగా రకరకాల కేసుల్లో పాల్గొంటున్నాడు. ఈ మేరకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రతిపాదనలతో క్రిమినల్ రికార్డులు పరిశీలించి కలెక్టర్ శనివారం ఇతనిపై జిల్లా బహిష్కరణ ఉత్తర్వు లు జారీ చేశారు. ఈయన తండ్రి వడ్డె రామాంజినేయులు అలియాస్ వడ్డె అంజి, అదే కాలనీలో నివాసముంటున్న పఠాన్ ఇమ్రాన్ ఖాన్పై కూడా ఈనెల 11న జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ కావడంతో జైలు జీవితం గడుపుతున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అలవాటు పడిన మరో 15 మంది పేర్లు కూడా జిల్లా బహిష్కరణ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. -
స్థలం కబ్జా చేసిన మంత్రి కుటుంబ సభ్యులు
● బాధితుల ఆవేదనబొమ్మలసత్రం: మంత్రి ఎన్ఎమ్డీ ఫరూక్ కుటుంబ సభ్యులు తమ స్థలాన్ని కబ్జాచేసి అక్రమంగా షెడ్లు నిర్మించారని, అధికారులు తమకు న్యాయం చేయాలని బాధితులు భవనాశి వాసు, నూర్బాషా , వెంకటన్న, బాబులాల్ వేడుకున్నారు. మంత్రి కుటుంబ సభ్యుల స్థలం 700 సర్వే నంబర్లో ఉండగా తప్పుడు దిశల ఆధారంగా పద్మావతినగర్లోని 706ఏ/9 సర్వే నంబర్ను చూపుతూ ఇదే తమ స్థలం అని చెప్పడం భావ్యం కాదన్నారు. సుప్రీంకోర్టు ఉత్త్తర్వుల మేరకు పద్మావతినగర్లోని ఈ స్థలానికి ఫరూక్ కుటుంబ సభ్యులు, భాధితులను సమక్షంలో మున్సిపల్, రెవెన్యూ అధికారులు శనివారం కొలతలు వేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. ఈ సర్వే నంబర్లో 1.16 ఎకరాలు ఉండగా అందులో 58 సెంట్లు కరీమ్బీ, 58 సెంట్లు అశాబీకి 1968లో తల్లి సారంబీ ద్వారా సంక్రమించిందన్నారు. వారి నుంచి తాము కొనుగోలు చేశామన్నారు. అయితే ఈ స్థలం తమదేనని మంత్రి కుటుంబ సభ్యులు అడ్డుపడుతుండటంతో సుప్రీం కోర్టుకు వెళ్లగా స్థలాన్ని తేల్చాలాని సర్వేయర్లకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. స్థల వివాదం కోర్టులో ఉండగా మంత్రి కుటుంబ సభ్యులు నిర్మాణాలు చేపట్టి అద్దెకు ఇవ్వడం సరైందికాదన్నారు. న్యాయశాఖ మంత్రి కుటుంబ సభ్యులే అన్యాయానికి పాల్పడితే తమ బాధ ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నించారు. -
మృత్యు ‘వే’గం.. రక్తమోడిన రహదారులు
రహదారులు శుక్రవారం తెల్లవారుజామున రక్తమోడాయి. అతివేగం, నిద్రమత్తు ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్నాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అదుపుతప్పిన కారు.. ప్రైవేటు బస్సును ఢీకొనడంతో ఐదుగురు మరణించారు. గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెంలో వెనుక నుంచి వస్తున్న ప్రైవేటు బస్సు రోడ్డు పక్కగా ఆగుతున్న కారును బలంగా ఢీకొనడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ రెండు ఘటనలు బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. నిద్రమత్తే యమపాశమై.. దొర్నిపాడు: నంద్యాల జిల్లా ఎన్హెచ్–40పై ఆళ్లగడ్డ సమీపంలో డ్రైవర్ నిద్రమత్తు వల్ల కారు అదుపు తప్పి డివైడర్ను క్రాస్ చేసి మరో రూట్లో వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతులంతా క్యాటరింగ్ పనులు చేసుకుని జీవించేవారు. హైదరాబాద్ బాచుపల్లికి చెందిన గుండేరావు(46), శ్రావణ్(21), సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కు చెందిన నరసింహులు(30), కర్ణాటక రాష్ట్రం బీదర్కు చెందిన సిద్ధయ్య(50)తోపాటు గుండేరావు కుమారులు సిద్ధార్థ కులకరి్ణ(19), శివసాయి కులకర్ణి ఈనెల 11న అయ్యప్ప భక్తులకు వంట చేసేందుకు శబరిమలైకి కారులో వెళ్లారు. అక్కడ కార్యక్రమం ముగించుకొని తిరుగు ప్రయాణంలో తిరుమలకు వెళ్లారు. స్వామి దర్శనం చేసుకొని గురువారం సాయంత్రం కారులో తిరుపతి నుంచి హైదరాబాద్కు బయల్దేరారు. శుక్రవారం తెల్లవారుజామున 2.30గంటల ప్రాంతంలో నల్లగట్ల వద్ద డ్రైవింగ్ చేస్తున్న శివసాయి కులకర్ణి నిద్రమత్తులో కునుకు తీయడంతో వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను దాటుకుని మరో రూట్లో హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళ్తున్న సీజీఆర్ ట్రావెల్స్ బస్సును బలంగా ఢీకొంది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనలో గుండేరావు, శ్రావణ్, నరసింహులు, సిద్ధయ్య అక్కడికక్కడే మరణించారు. సిద్ధార్థ కులకర్ణి, శివసాయి కులకర్ణి తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాలను కారు నుంచి బయటకు తీశారు. క్షతగాత్రులిద్దరిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. అక్కడ పరిస్థితి విషమించి సిద్ధార్థ కులకర్ణి మృతి చెందాడు. ఘటనాస్థలంలో చనిపోయిన నలుగురిని ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించి అక్కడే పోస్టుమార్టం పూర్తి చేశారు. విషయం తెలుసుకున్న మృతుల బంధువులు ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు.ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో 40 మంది ప్రయాణికులు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళుతున్న సీజీఆర్ ట్రావెల్స్ బస్సులో 40మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ప్రమాదంలో వీరెవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు బస్సును పోలీసు స్టేషన్కు తరలించి ప్రయాణికులను ఇతర వాహనాల్లో వారి గమ్యస్థానాలకు చేర్చారు.ప్రైవేటు బస్సే మృత్యుశకటమైగుంటూరు రూరల్: వెనుక నుంచి వచ్చిన ప్రైవేటు బస్సు కారును బలంగా ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం, మామిళ్ళమడవ గ్రామానికి చెందిన కంచనపల్లి మధు స్థానికంగా వంటమేస్త్రీ. ఆయనకు భార్య మనీష, పిల్లలు జ్ఞానేశ్వర్, వర్షిత్ ఉన్నారు. పిల్లలిద్దరికీ పుట్టు వెంట్రుకలు తీయించేందుకు తిరుమల వెళ్లాలని కారు మాట్లాడుకున్నారు. కారులో మధు భార్యాబిడ్డలతోపాటు తల్లిదండ్రులు కంచనపల్లి సుశీల(64) వెంకటయ్య(70) మనీష తండ్రి మన్సూర్, కారు డ్రైవర్ సైదులు(28) మంగళవారం సాయంత్రం ఇంటివద్దనుంచి తిరుమల వెళ్లారు. తిరుపతిలో పిల్లల కార్యక్రమాలు పూర్తి చేసుకుని గురువారం సాయంత్రం విజయవాడకు కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు బయలుదేరారు. శుక్రవారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెం సమీపంలోకి చేరింది. ఆ సమయంలో డ్రైవర్ సైదులు నిద్ర వస్తుందని కారును పక్కకు తీసి ముఖం కడుక్కుని వెళ్దామని చెప్పాడు. కారును రోడ్డుపక్కన ఆపేందుకు స్లో చేస్తుండగా వెనుకనుంచి అతి వేగంగా వస్తున్న వీఆర్సీఆర్ సంస్థకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కారును బలంగా ఢీకొంది. ప్రమాదంలో సుశీల, వెంకటయ్య, డ్రైవర్ సైదులు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలినవారికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి కారు డోర్లను రాడ్లతో వంచి క్షతగాత్రులను, మృతదేహాలను బయటకు తీశారు. క్షతగాత్రులను జీజీహెచ్కు తరలించారు. ఎస్పీ వకుల్ జిందాల్, సౌత్జోన్ డీఎస్పీ భానోదయ, నల్లపాడు సీఐ వంశీధర్ ఘటన స్థలికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. -
విద్యతోనే అభివృద్ధి సాధ్యం
కోర్టులో పోలీసుల తీరు సరికాదు ● జిల్లా జడ్జికి ఫిర్యాదు చేస్తాం ● నేడు విధులను బహిష్కరిస్తాం ● పత్తికొండ న్యాయవాదులు పత్తికొండ: కోర్టు హాల్లో పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని బార్ అసోసియేషన్ ఆధ్యక్షుడు మధుబాబు, సీనియర్ న్యాయవాదులు మైరాముడు, అమరావతి సత్యనారాయణ, నరసింహ ఆచారి అన్నారు. పత్తికొండ పట్టణంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో గురువారం న్యాయవాదులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా వారు మాట్లాడుతూ.. గంజాయి కేసులో నిందితునిగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడం కోసం కోర్టు హాల్లోకి పోలీసులు రావడం న్యాయస్థానాన్ని అవమానపరచడమేనన్నారు. పత్తికొండ, చిప్పగిరి ఎస్ఐలతో పాటు పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. కర్నూలు జిల్లా పరిధిలోని అన్ని కోర్టుల్లో విధులను శుక్రవారం న్యాయవాదులు బాయ్కాట్ చేస్తున్నట్లు తెలిపారు. పోలీసుల చర్యలు తీసుకోవాలని జిల్లా జడ్జికి పత్తికొండ న్యాయవాదులు ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్శాఖ తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాదులు సురేంద్రకుమార్, మల్లికార్జున, కృష్ణయ్య, జఠంగిరాజు, నెట్టేకల్, లక్ష్మణస్వామినాయుడు, నాగలక్ష్మయ్య, వాసుదేవనాయుడు, శ్రీనువాసరెడ్డి, రజాక్ తదితరులు పాల్గొన్నారు. నేడు న్యాయవాదులు విధులకు దూరం కర్నూలు: కోర్టులోకి పోలీసులు అక్రమంగా ప్రవేశించి ఓ నిందితుడిని బలవంతంగా ఎత్తుకెళ్తూ న్యాయ వాదిని అవమాన పరిచిన ఘటనకు నిరసనగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు తమ విధులను బహిష్కరిస్తున్నట్లు కర్నూలు జిల్లా న్యాయ వాదుల సంఘం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. చిప్పగిరి, పత్తికొండ ఎస్ఐలపై కఠిన చర్యలు తీసుకోవాలని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు హరినాథ్ చౌదరి, వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మెంటార్లుగా జిల్లా, మండల స్థాయి అధికారులు కర్నూలు సిటీ: పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఉన్నత పాఠశాలలకు మెంటార్లుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా, మండల స్థాయి అధికారులను నియమించారు. జిల్లాలోని 361 ఉన్నత పాఠశాలలకు నియమించిన మెంటార్లతో నేటి(శుక్రవారం) ఉదయం 9.30 గంటలకు సునయన ఆడిటోరియంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.సుధాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పది పరీక్షల ఫలితాల పెంపునకు 100 రోజుల ప్రణాళికలో భాగంగా మెంటార్లకు కేటాయించిన పాఠశాలల్లో పునరావృత బోధన, పునశ్చరణ, సాధన పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారన్నారు. అదేవిధంగా పిల్లలను ప్రోత్సహించడం, క్రమ శిక్షణ పెంపొందించడం, పరీక్షలకు సన్నద్ధం చేస్తారన్నారు. కుక్కను తప్పించబోయి.. గోనెగండ్ల: అయ్యకొండ గ్రామ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గోనెగండ్లకు చెందిన గుల్ల మొరుసు నాగేష్(35), ప్రభుతో పాటు మరో ఇద్దరు దేవనకొండ మండలంలోని లక్కందిన్నె గ్రామంలో పెయింట్ పనులు చేసేందుకు బుధవారం ఉదయం బైకులపై వెళ్లారు. పనులు ముగించుకొని రాత్రి గోనెగండ్లకు బయలు దేరారు. నాగేష్, ప్రభు ఒక బైకుపై వస్తుండగా మార్గమధ్యలో గోనెగండ్ల మండలం అయ్యకొండ గ్రామ సమీపంలో రోడ్డుపై ఉన్న కుక్కను తప్పించబోయి అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడ్డారు. దీంతో నాగేష్ తలకు తీవ్ర గాయమైంది. ప్రభు ఎడమ కాలు విరిగింది. అటుగా వెళ్తున్న వాహనదారులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని గోనెగండ్ల ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నాగేష్ను కర్నూలు ఆస్పత్రికి, ప్రభును ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు. నాగేష్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ప్రభు ఎమ్మిగనూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడు నాగేష్కు భార్య సుశీల, నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. మృతిని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చిరంజీవి తెలిపారు. ఇంటి పెద్దదిక్కు చనిపోవడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరును చూసిన కాలనీ వాసులు కంటతడి పెట్టుకున్నారు. పట్టుబడిన మద్యం ధ్వంసం డోన్ టౌన్: రూరల్ పోలీ సు స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యా న్ని పోలీసులు ధ్వంసం చేశారు. ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారులతో కలిసి గురువారం పట్టణ సమీపంలో ధ్వంసం చేసినట్లు రూరల్ పోలీసు స్టేషన్ సీఐ సీఎం రాకేష్ తెలిపారు. ఇందులో 30 కేసులకు సంబంధించిన వాటిలో 90 ఎంఎల్ టెట్రా ప్యాకెట్లు 7,732, 526 క్వాటర్ బాటిళ్లు, 40 పుల్ బాటిళ్లతో పాటు 295 లీటర్ల నాటుసారా మొత్తం కలిపి దాదాపు 820.56 లీటర్ల అక్రమ మద్యాన్ని ధ్వంసం చేసినట్లు సీఐ తెలిపారు. అంతర్ జిల్లా దొంగల అరెస్ట్ బత్తలపల్లి: రద్దీగా ఉన్న ప్రదేశాలను ఎంచుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగలను అరెస్ట్ చేసినట్లు ధర్మవరం డీఎస్పీ హేమంత్కుమార్ తెలిపారు. బత్తలపల్లి పీఎస్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. బత్తలపల్లి మండలం కాటమకుంట గ్రామానికి చెందిన దొడ్డావుల ఆదిలక్ష్మి ఈ నెల 23న బత్తలపల్లిలో ధర్మవరం వెళ్లేందుకు బస్సు ఎక్కుతుండగా ఆమె బ్యాగులో నుంచి నాలుగు తులాల బంగారం గొలుసును దుండగులు అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీఐ ప్రభాకర్ నేతృత్వంలో బత్తలపల్లి ఎస్ఐ సోమశేఖర్, తాడిమర్రి ఎస్ఐ కృష్ణవేణి ఆధ్వర్యంలో బృందాలుగా విడిపోయి సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో పక్కా ఆధారాలతో కర్నూలు జిల్లా ఆదోని పట్టణ బైపాస్ రోడ్డులో ఉన్న భరత్నగర్లో నివాసముంట్ను కోటయ్య (డ్రైవర్), పిలీషా (క్లిప్పులు, హెయిర్ బ్యాండ్లు అమ్మకం), శాంతి (హోటల్లో కూలి)తో పాటు ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో నేరాన్ని అంగీకరించారు. వీరి నుంచి 12 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. బాలలను జువైనల్ హోంకు అప్పగించి, నిందితులపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు. కర్నూలు(అర్బన్): విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కురువ సంఘం నేతలు అన్నారు. గురువారం నగర శివారుల్లోని శ్రీ భీర లింగేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఇటీవల పోలీస్, ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన ఉమ్మడి కర్నూలు జిల్లాలో కురువ సామాజిక వర్గానికి చెందిన వారి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలోనే 2026 నూతన సంవత్సర కేలండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పత్తికొండ శ్రీనివాసులు, ఎంకే రంగస్వామి, జిల్లా గొర్రెల మేకల సహకార సంఘం చైర్మన్ కేఏ శ్రీనివాసులు, కల్లూరు సింగిల్ విండో చైర్మన్ పర్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కురువలు తమ పిల్లల విద్యపై అధిక దృష్టిని సారించాలన్నారు. అలాగే రాజకీయంగా కూడా కురువలు రాణించాలన్నారు. రానున్న స్థానిక సంస్ఘల ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక స్థానాల్లో కురువలు పోటీ చేసి విజయం సాధించాలన్నారు. నూతనంగా ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. ముఖ్యంగా కురువలు ఐకమత్యంగా ఉండాలని, ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించుకోవచ్చన్నారు. భీర లింగేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో నిర్మిస్తున్న కళ్యాణ మండపాన్ని అన్ని హంగులతో పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షులు కే కిష్టన్న, దిశా కమిటీ సభ్యులు దేవశంకర్, కురువ కార్పొరేషన్ డైరెక్టర్ కే రామకృష్ణ, నాయకులు కేసీ నాగన్న, బీ రామకృష్ణ, మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీలీలమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం నేతలు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగాలు పొందిన వారికి భక్త కనకదాసు జ్ఞాపికలు అందించి ఘనంగా సన్మానించారు. -
నంద్యాల శనగతో అధిక దిగుబడులు
నంద్యాల(అర్బన్): నంద్యాల గ్రాం 1267 శనగ రకంతో అధిగ దిగుబడులు సాధించవచ్చని ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ జాన్సన్ తెలిపారు. అఖిల భారత రబీ అపరాల(శనగ) సమన్వయ పథకం ప్రాజెక్టు కోర్డినేటర్ ఐకార్–ఐఐపీఆర్ కాన్పూరుకు చెందిన డాక్టర్ శైలేష్ త్రిపాటి రెండు రోజుల పర్యటనలో భాగంగా నంద్యాల ఆర్ఏఆర్ఎస్ను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏడీఆర్, శాస్త్రవేత్తలు నంద్యాలగ్రాం 1267 శనగ రకానికి సంబంధించిన వివరాలను శైలేష్ త్రిపాటికి వివరించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా 1,267 శనగ రకం సాగు చేసిన ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామానికి చెందిన నజీర్ పొలాన్ని సందర్శించారు. అనంతరం షెడ్యూల్ కులాల ఉప ప్రణాళికలో ఎంపికై న ఉప్పలపాడు గ్రామంలో నంద్యాలగ్రాం 667 ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలను సందర్శించి రైతలతో శనగ యాజమాన్య పద్ధతులపై చర్చించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు నీలిమ, మంజునాథ్, తదితరులు పాల్గొన్నారు. -
దక్షిణ భారత సైన్స్ ఫేర్కు జహీర్
ఆత్మకూరు: దక్షిణ భారత సైన్స్ ఫేర్కు ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి జహీర్ ఎంపిౖకై నట్లు హెచ్ఎం దేవానందన్ గురువారం తెలిపారు. విజయవాడలో ఈనెల 23 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి విద్యా ప్రదర్శనలో జహీర్ ఓవర్లోడ్ వార్నింగ్ అండ్ రిపోర్టింగ్ సిస్టం ఇన్ టూ వీలర్ (ద్విచక్ర వాహనాల్లో అధిక బరువును గుర్తించి హెచ్చరించే వ్యవస్థ) అనే నమూనాను ప్రదర్శించినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు జనవరి 19 నుంచి 26వ తేదీ వరకు హైదరాబాద్లో జరగనున్న దక్షిణ భారత సైన్స్ ఫేర్లో ప్రదర్శించడానికి ఎంపికై ందన్నారు. -
శ్రీమఠం.. భక్త జనసంద్రం
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన మంత్రాలయం గురువారం భక్తులతో కిక్కిరిసింది. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చిన భక్తులు తుంగభద్ర నదిలో పుణ్యసాన్నాలు ఆచరించారు. గ్రామ దేవత మంచాలమ్మకు ఉదయాన్నే అభిషేకం, కుంకుమ ఆర్చన, నైవేద్యం సమర్పించి మహామంగళ హారతి చేశారు. శ్రీరాఘవేంద్ర మూల బృందావనానికి నిత్య పూజలు చేశారు. కల్పతరు క్యూలైన్ , శ్రీ మఠం మధ్వ కారిడార్లో భక్తుల రద్దీ కొనసాగింది. శ్రీమఠం ప్రాంగణంలో భక్తుల మధ్య బంగారు పల్లకీలో ప్రహ్లాదరాయలు విహరించారు.


