breaking news
Nandyala
-
వైభవంగా పల్లకీ సేవ
బనగానపల్లె రూరల్: నందవరం గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయంలో అమ్మవారి పల్లకీ సేవ కార్యక్రమం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, అర్చకుల ఆధ్వర్యంలో ఉదయం అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకం జరిపించారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో అధిష్టింపజేశారు. పల్లకీ సేవా కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారి ఆలయాన్ని నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి దర్శించుకున్నారు. పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగంలో ముగ్గురికి స్థానం బొమ్మలసత్రం: వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగంలో నందికొట్కూరుకు చెందిన ముగ్గురికి స్థానం కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. స్టేట్ స్టూడెంట్ వింగ్ కమిటీ జనరల్ సెక్రటరీగా నందికొట్కూరుకు చెందిన కె.మాధురిగౌడ్, సెక్రటరీగా కుందన రాజశేఖర్గౌడ్, స్టేట్ మైనార్టీ సెల్ కమిటీ సెక్రటరీగా షేక్ మహమ్మద్ అబ్దుల్జఫార్లను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిభను వెలికి తీసేందుకు యువజనోత్సవాలు ● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: యువతలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు యువజన ఉత్సవాల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపా. జిల్లా యువజన సంక్షేమ శాఖ–సెట్కూరు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీలకు సంబంధించి పోస్టర్ను శుక్రవారం తన చాంబర్లో జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోటీల్లో 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతీ యువకులు పొల్గొనవచ్చన్నారు. ఈ నెల 29న నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి యువజనోత్సవ పోటీలు ఏడు విభాగాల్లో నిర్వహిస్తామని చెప్పారు. సెట్కూరు సీఈఓ డాక్టర్ కె. వేణుగోపాల్ మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన విజేతలు రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన వారు జాతీయ స్థాయికి ఎంపికవుతారని తెలిపారు. పూర్తి వివరాలకు మొబైల్ నంబర్లు 9292207601, 8328181581లను సంప్రదించవచ్చన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్ రెడ్డి, ఇంటర్మీడియట్ విద్యాధికారి శంకర్ నాయక్, స్కిల్ డెవలప్మెంట్ అధికారి శ్రీకాంత్ రెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బయ్య, సెట్కూరు పర్యవేక్షణ అధికారి శ్యామ్ బాబు పాల్గొన్నారు. ‘నంద్యాల శనగ’తో అధిక దిగుబడులు నంద్యాల(అర్బన్): నంద్యాల గ్రామ్ 776 శనగ రకం సాగుతో రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ జాన్సన్ తెలిపారు. అఖిల భారత రబీ అపరాల(శనగ) సమన్వయ పరిశోధనా పథకం కింద షెడ్యూల్ కులాల ఉపప్రణాళిక– ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాల నిర్వహణలో భాగంగా శుక్రవారం ఓర్వకల్లు మండలం ఉప్పలపాడు గ్రామ ఎస్సీ రైతులకు నంద్యాల గ్రామ్ 776 శనగ రకంతో విత్తనశుద్ధి మందులను పంపిణీ చేశారు. స్థానిక కార్యాలయలలో జరిగిన కార్యక్రమంలో ఏడీఆర్ జాన్సన్ మాట్లాడుతూ.. ఎండుతెగులును తట్టుకొనే నంద్యాల గ్రామ్ 776 శనగ రకం జీవన శిలీంధ్ర నాశినిలతో విత్తన శుద్ధి చేసుకోవాలన్నారు. సరైన సమయంలో ఇచ్చిన పురుగు మందులు, శిలీంధ్ర నాశినిలను వినియోగించి అధిక దిగుబడులు సాధించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం ఏడీఏ చెన్నయ్య, శనగ శాస్త్రవేత్తలు నీలిమ, మంజునాథ్, చైతన్య పాల్గొన్నారు. -
శ్రీశైలానికి మొండి చేయి చూపారు!
శ్రీశైలంప్రాజెక్ట్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం శ్రీశైలంలో పర్యటించడంతో నిధులు వరదలా వస్తాయని ఆశించామని, అయితే శ్రీశైలానికి మొండి చేయి చూపించారని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్లోని ఏపీజెన్కో అతిథి గృహంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శిల్పా మాట్లాడుతూ.. శ్రీశైలంలో ప్రధాని పర్యటన అనగానే అభివృద్ధికి మహర్దశ పడుతుందని భావించామన్నారు. అయితే శ్రీశైలం పర్యటనలో ప్రధాని మోదీ నోట అభివృద్ధి మాట రాకపోవడంతో నిరాశకు గురయ్యామన్నారు. నిధులు రాబట్టడంలో టీడీపీ నేతలు విఫలం అయ్యారని, అలాగే శ్రీశైల ప్రాంతంలో ఉన్న సమస్యల పరిష్కారానికి హామీ కూడా పొందలేకపోయారన్నారు. ప్రశ్నిస్తాననే రాష్ట్ర అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నోరు మొదపలేదన్నారు. గతంలో కేంద్ర మంత్రి అమితాషా శ్రీశైలం పర్యటనకు రాగా.. తాము శ్రీశైలం అభివృద్ధి, రైల్వేలైన్, దోర్నాల నుంచి శ్రీశైలం, ఆత్మకూరు రోడ్ల విస్తరణ, దోర్నాల నుంచి శ్రీశైలం ఎలివేషన్ కారిడార్, శ్రీశైలం–సున్నిపెంట స్ప్రింగ్బ్రిడ్జ్ తదితర ప్రతిపాదనలు తీసుకువచ్చామన్నారు. ప్రధాని మోదీ శ్రీశైలానికి వస్తే బీజేపీ మండల నాయకుడు చదువుల శ్రీనుకు అపాయింట్మెంట్ ఇచ్చి, స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డికి ఇవ్వకపోవడం చూస్తుంటే ఆయన స్థాయి ఎంతకు దిగజారిందో అర్ధమవుతోందన్నారు. ట్రస్ట్బోర్డ్ సభ్యుల నియామకంలో బుడ్డా ప్రాధాన్యత ఏమిటో తెలిసిపోయిందన్నారు. ప్రమాణ స్వీకారానికి ఆయనకు ఆహ్వానం లేకపోవడం చూస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర ఎన్ని మార్కులు ఉన్నాయో ప్రజలకు అర్ధమవుతోందన్నారు. శ్రీశైలం అభివృద్ధి కోసం కాకుండా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తన అనుచరుల కోసం పనిచేస్తున్నారని శిల్పా ఆరోపించారు. ఇసుక, ఇటుక, మద్యం దుకాణాలు, బెల్ట్షాపులు, దేవస్థానంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో లంచాలు, సున్నిపెంటలో భూముల కబ్జాలపైన ప్రతిరోజు తీరిక లేకుండా ఉన్నారని విమర్శించారు. ‘దేవస్థానానికి స్వయంగా నేను కాటేజీ కట్టిస్తున్నానని, ఇందుకు ఇసుక లారీలను పంపిస్తే వాటిని బుడ్డా తన అనుచరుల చేత ఆపిస్తున్నారని, కప్పం కట్టాలని ఆదేశాలు జారీ చేస్తున్నారని, వసూల్ కింగ్గా మారారేమో’ అని శిల్పా అన్నారు. సున్నిపెంటలో వైఎస్సార్సీపీ నాయకుడు వట్టి వెంకటరెడ్డిని ఇబ్బంది పెట్టాలని ఎమ్మెల్యే చూస్తున్నారని, డిజిటల్ బుక్లో నోట్ చేసుకుని, అధికారంలోకి వచ్చాక వదిలి పెట్టబోమని హెచ్చరించారు. శ్రీశైలంలో అభివృద్ధి పేరిట శివాసదనం, పెద్ద సత్రంలను పడగొట్టినప్పటికీ అక్కడి నివాసితులకు శ్రీశైలంలోనే నివాసాలను కల్పించాలని శిల్పా డిమాండ్ చేశారు. అభివృద్ధిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు నిధులు రాబట్టడంలో టీడీపీ నేతలు విఫలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి -
చంద్రన్న బీమా..లేదు ధీమా
● 17 నెలల్లో ఉమ్మడి జిల్లాలో 2,446 మంది మృతి ● వీరిలో ప్రమాద మృతులు 151 మంది ● ఇచ్చిన హామీ మేరకు ప్రమాద మరణాలకు రూ.10 లక్షలు.. సాధారణ మరణాలకు రూ.5 లక్షలు ఇవ్వాలి ● ఇప్పటి వరకు ఒక్క కుటుంబానికీ దక్కని భరోసా ● గత ప్రభుత్వంలో వైఎస్సార్ బీమాతో పేదలకు ఎంతో మేలు ● అప్పట్లో క్రమం తప్పకుండా సాయం అందజేత ఈ చిత్రంలో కనిపించే మహిళ పేరు చాంద్బేగం. తుగ్గలి మండలం హుసేనాపురం గ్రామానికి చెందిన ఈమె భర్త కాశీంవలి(50) ఆరు నెలల క్రితం అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఇంటికి ఆధారమైన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబం పరిస్థితి దయనీయంగా మారింది. నిబంధనల మేరకు ఈ కుటుంబానికి రూ.10 లక్షలు సాయం అందాలి. బాధితురాలికి వితంతు పింఛన్ ఇవ్వాలి. అయితే ఇవేమీ అందలేదు. ఈమె పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. గుంతలు పడిన రోడ్లు.. వేగంగా దూసుకొచ్చే వాహనాలు.. వణికిస్తున్న డెంగీ జ్వరాలు.. అకస్మాత్తుగా లయతప్పుతున్న గుండెలు.. ప్రజల పరిస్థితి దినదిన గండంగా మారింది. ఎప్పుడు ప్రమాదం సంభవిస్తుందో, ప్రబలుతున్న రోగాలతో ప్రాణం ఉంటుందో లేదో తెలియని దుస్థితి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మృతుల కుటుంబాలకు ‘చంద్రన్న బీమా’ భరోసా ఇవ్వలేకపోతోంది. కుటుంబ పెద్ద అకాల మృతితో ఇంటిళ్లిపాది రోడ్డున పడాల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు అయినా ఈ పథకం కింద కనీసం దరఖాస్తులు స్వీకరించలేని దౌర్భాగ్యం నెలకొంది.కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు చరమగీతం పాడి పేద, మధ్య తరగతి ప్రజల ఇళ్లల్లో సంక్షోభాన్ని తీసుకొచ్చింది. గతంలో ఉన్న వైఎస్సార్ బీమా పథకాన్ని చంద్రన్న బీమాగా పేరు మార్చి అమలు చేయకపోవడం ఇందుకు నిదర్శనంగా నిలిచింది. చంద్రన్న బీమా పథకం కింద సహజ మృతికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తూ మృతి చెందితే రూ.10 లక్షలు అందచేస్తామని ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన, బీజేపీ నేతలు కూడా చెప్పారు. అయితే మృతి చెందిన కుటుంబాల నుంచి ఈ పథకం కింద దరఖాస్తులు స్వీకరించేందుకు మార్గదర్శకాలను ఇప్పటి వరకు విడుదల చేయలేదు. బీమా ఆర్థిక సాయం అందక బాధితులు కన్నీటితో ‘అంతా మాయ చేశారు’ అని ఆరోపిస్తున్నారు. వేనవేల వేదనలు! రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2024 జూన్ 12న ఏర్పాటైంది. ప్రభుత్వం ఏర్పాటై 17 నెల నడుస్తున్నా చంద్రన్న బీమా హామీ అమలుపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. సాధారణంగా 18 నుంచి 50 ఏళ్లు వారు మృతి చెందితే, అలాగే ప్రమాదాల్లో 18 నుంచి 70 ఏళ్ల లోపు వారు మృతి చెందితే ఈ పథకానికి అర్హులు. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో 1,256 మంది, నంద్యాల జిల్లాలో 1,190 మంది సాధారణంగా మృతి చెందారు. ప్రమాదాల్లో కర్నూలు జిల్లాలో 72, నంద్యాల 79 మంది మృతి చెందారు. కుటుంబానికి ఆధారమైన వారిని పోగొట్టుకున్న ఎన్నో కుటుంబాలు చంద్రన్న బీమా పథకం కింద పరిహారం వస్తుందనుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి ప్రజల మృతులను పట్టించుకోలేదు. ఇంటికి ఆధారమైన వారిని పోగొట్టుకొని, ప్రభుత్వం నుంచి చేయూత కరువై వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయి. అప్పటి పరిస్థితులు పునరావృతం టీడీపీ పాలనలో 2014 నుంచి 2019 వరకు వేలాది మంది మృతి చెందినప్పటికీ చంద్రన్న బీమా ఉన్న వారికి పరిహారం రాలేదు. బీమా ఉన్న వారు మృతి చెందితే వారి వారసులు పరిహారం పొందాలంటే ఏళ్లుగడిచేవి. బాధిత కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పట్లో బాధిత కుటుంబాల్లో 20 శాతం మంది కూడా బీమా దక్కలేదు. ప్రస్తుతం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు దోహదపడే చంద్రన్న బీమా అమలును పూర్తిగా పక్కన పెట్టడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 12.38 రైస్కార్డులు ఉండగా... వైఎస్సార్సీపీ ప్రభుత్వం 10.25 లక్షల కటుంబాలకు వైఎస్సార్ బీమా కల్పించింది. కూటమి ప్రభుత్వం మాత్రం చంద్రన్న బీమాను ఇంతవరకు పట్టించుకోలేదు. వెబ్ సైట్ను మూసివేసి చంద్రన్న బీమా పథకాన్ని డీఆర్డీఏ అమలు చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడమే మొదలు సాధారణ, ప్రమాద మృతుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. ఇందుకు సంబంధించిన వెబ్ సైట్ను పూర్తిగా మూసి వేశారు. నిబందనల ప్రకారం బీమా ఉన్న వ్యక్తి మృతి చెందితే 24 గంటల్లో రూ.10 వేలు చెల్లించాల్సి ఉంది. మృతుల కుటుంబాలు దుర్భర జీవితం గడుపుతున్నా.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదు.వైఎస్సార్సీపీ హయాంలో ఇలా..గత వైఎస్సార్సీపీ హయాంలో పేద బడుగు, బలహీన వర్గాల కుటుంబాల్లో 18 నుంచి 50 ఏళ్లలోపు వారు, 50 నుంచి 60 ఏళ్లలోపు వారు మృతిచెందితే రూ.లక్ష నుంచి రూ.ఐదు లక్షల వరకు బీమా సొమ్ము మంజూరయ్యేది. మృతి చెందిన వెంటనే వలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది మృతుడి ఇంటికి వెళ్లి అంత్యక్రియల కోసం తక్షణ సాయంగా రూ.10 వేలు అందించేవారు. మిగతా సొమ్ము 15 నుంచి 20 రోజుల్లో నామిని బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేది. బీపీఎల్ కుటుంబాలకు చెందిన వారు అర్హులు కావడంతో ప్రభుత్వమే పూర్తి ప్రీమియం చెల్లించింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం, ఇన్సూరెన్స్ కంపెనీలు సహకరించకపోయినా పూర్తిగా ఈ పథకాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అమలు చేసింది. రైస్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఈ పథకం అమలు అయ్యింది. ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసిందంటే..సామాన్య, మధ్య తరగతి ప్రజలు మృతి చెందినా ప్రస్తుతప్రభుత్వం పట్టించుకోవడం లేదు. టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు మాత్రం పెద్దపీట వేసింది. కోటి మందికిపైగా టీడీపీ సభ్యత్వం కల్పించింది. వారికి రూ.5 లక్షలతో టీడీపీ తరఫున ప్రమాద బీమా కూడా కల్పించింది. టీడీపీ కార్యకర్తలకు ఇచ్చిన విలువ సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు ఇవ్వకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. తమకు పార్టీ కార్యకర్తలే ముఖ్యం.. సామాన్య, మధ్య తరగతి ప్రజలు కాదని టీడీపీ నిరూపించుకున్నట్లు అయిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
టీడీపీ ముఖ్య నేతలే నకిలీ మద్యం వ్యాపారులు
● మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిడోన్: రాష్ట్రంలో చలామణి అవుతున్న నకిలీ మద్యం మూలాలు టీడీపీ ప్రభుత్వంలోని ముఖ్య నాయకులవేనని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం డోన్లోని తన స్వగృహంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం, మొలకల చెరువులలో కల్తీ లిక్కర్ డెన్లు గుర్తించినప్పుడే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా కేసులు పక్కదారి పట్టించేందుకు కూటమి ప్రభుత్వం కుటిల యత్నాలు చేస్తోందన్నారు. ఏకకాలంలో రాష్ట్రవ్యాప్తంగా బెల్టుషాపులపై దాడులు నిర్వహించి నకిలీ మద్యం తయారీ మూలాలను కనుగొనడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. గురువింద గింజ తన కింది నలుపు ఎరగదన్నట్లు కల్తీ మద్యం కేసులో నిందితులందరూ టీడీపీకి చెందిన వారే కాగా, దురుద్దేశ్య పూర్వకంగా ఆ నిందను వైఎస్సార్సీపీ నాయకులకు అంటగట్టాలని చూస్తున్నారన్నారు. గతంలో పాలకొల్లు, ఏలూరు, పరవాడ ప్రాంతాల్లో దొరికిన కల్తీ మద్యం ఎవరిదనే విషయాన్ని బయటకు పొక్కనివ్వకుండా అధికార పార్టీ నేతలు కప్పిపుచ్చిన సంగతిని ప్రజలు మరిచిపోలేదన్నారు. పాల్గొన్న పార్టీ నాయకులు వైఎస్సార్సీపీ నియోజకవర్గ పరిశీలకులు దేశం సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు సోమేష్ యాదవ్, మల్లికార్జునరెడ్డిల అధ్యక్షతన కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీలు బుగ్గన నాగభూషణంరెడ్డి, రేగటి రాజశేఖర్ రెడ్డి, దిలీప్ చక్రవర్తి, మున్సిపల్ చైర్మన్లు సప్తశైల రాజేష్, చలంరెడ్డి, పార్టీ వాలెంటీర్ విభాగం జిల్లా అధ్యక్షులు పోసు్ట్రపసాద్, ఉపాధ్యక్షులు కురుకుందు హరి, బొబ్బల శివరామిరెడ్డి, బుగ్గన జయచంద్రారెడ్డి, మల్యాల శ్రీనివాసరెడ్డి, దినేష్గౌడ్, మున్సిపల్ వైస్చైర్మన్ జాకీర్హుసేన్, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శులు పాలుట్ల రఘురాం, రఘు, జెడ్పిటిసిలు బద్దల రాజ్కుమార్, మార్కెట్యార్డు మాజీ చైర్మన్లు మల్యాల రామచంద్రుడు, బోరెడ్డి పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలి కూటమి ప్రభుత్వంలో అన్ని చోట్ల టీడీపీ నేతలు అవినీతి చేస్తున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వంలో ప్రారంభమైన అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను బెదిరించి టీడీపీ నేతలు మామూళ్లు వసూలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే ఆరోగ్య శ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం నీరుగార్చిందన్నారు. పేద విద్యార్థులకు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలుచేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు. రైతాంగంతో పాటు అట్టడుగు నిరుపేద వర్గాలు, అల్ప సంఖ్యాకుల వర్గాలకు ఒరిగిందేమీ లేదన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జననేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను అమలుచేయడం తప్ప కూటమి ప్రభుత్వం పేదల కోసం ఫలానా పని చేశామని గొప్పలు చెప్పుకునేందుకు ఏమీ లేదన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టే కుట్ర జరుగుతోందన్నారు. ఇదే జరిగితే నిరుపేదలకు వైద్యం ఉచితంగా అందే అవకాశం ఉండబోదన్నారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజలు ఐక్యంగా ఉద్యమించాల్సిన అసవరం ఉందన్నారు. -
నెల రోజులుగా నీటి సరఫరా తగ్గింపు
జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి నెల రోజుల నుంచి నీటి సరఫరాను తగ్గించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పట్లో నీటిసరఫరాను పెంచే అవకాశాల్లేవని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నాల్గోగేటు, ఎన్సీఎల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి 6,500 క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఈ నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగ కాల్వకు 6 వేల క్యూసెక్కులు, కేసీ ఎస్కేప్ కాల్వకు 300, జీఎన్ఎస్ఎస్(ఎస్సార్భీసీ) కాల్వకు 200 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు బానకచర్ల ఏఈ దేవేంద్ర తెలిపారు. -
ఒక్కగానొక్క కొడుకు.. ఇంకెందుకు బతకాలి?!
కర్నూలు: గాజులదిన్నె ప్రాజెక్టు వద్ద పారుతున్న నీటిలో ఆడుతూ సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తూ కాలు జారి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల గల్లంతు అయ్యారు. చెన్నారెడ్డి మృతదేహం లభ్యం కాగా ఉదయ్కుమార్ కోసం గాలిస్తున్నారు. ఎర్రకోట సెయింట్ జాన్స్ ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం సీఈసీలో ఏఐ చదువుతున్న పీఎన్. చెన్నారెడ్డి(20), ఉదయ్ కుమార్(20), శివ, బాబు, అస్తాబ్, ధనుంజయ్, శ్రీనాథ్, సాయి గణేష్ విద్యార్థులు ఇంట్లో కళాశాలకు వెళ్తామని చెప్పి గురువారం ఉదయం గాజులదిన్నె ప్రాజెక్టుకు వచ్చారు. ప్రాజెక్టు గేట్లు, నీటి నిల్వ పరిసరాల్లో సందడి చేశారు. వారం రోజుల నుంచి గాజులదిన్నె ప్రాజెక్ట్ నాలుగవ క్రస్ట్ గేట్ ఎత్తి 300 క్యూసెక్కుల నీటిని హంద్రీ నదిలోకి విడుదల చేస్తున్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం పారుతున్న నీటిలో ఆడుతూ సెలీ్ఫలు దిగుతూ సందడి చేశారు. సెల్ఫీలు దిగుతూ కాలు జారి చెన్నారెడ్డి, ఉదయ్ కుమార్ పారుతున్న నీటిలో కొట్టుకొని కిందకు పోయారు. దీన్ని గమనించిన శివ వారిని కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం దక్కలేదు. చెన్నా రెడ్డి, ఉదయ్ కుమార్లు నీటిలో కొట్టుకుపోయి కింద ఉన్న నీటి గుంతలో మునిగిపోయారు. ఇద్దరు స్నేహితులు నీటిలో కొట్టుకుపోయి మునిగిపోవడంతో మిగతా వారు కేకలు వేశారు. దీంతో ప్రాజెక్టు అధికారులు గేటును మూసివేశారు. అయితే అప్పటికే వారిద్దరూ నీటిలో గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని మత్స్యకారులతో వెతికించారు. సాయంత్రం చెన్నారెడ్డి మృతదేహం లభ్యమైంది. ఉదయ్ కుమార్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చీకటి పడడంతో కనిపించదని మత్స్యకారులు బయటికి వచ్చారు. శుక్రవారం ఉదయం ఉదయ్ కోసం గాలిస్తామని అధికారులు తెలిపారు. చెన్నారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు. ఎందుకు బతకాలి? ‘ఉన్న ఒక్క కొడుకును పోగొట్టుకుని మేం ఎందుకు బతకాలిరా’ అంటూ చెన్నారెడ్డి తల్లిదండ్రులు మోహన్ రెడ్డి, శకుంతలు రోదించారు. ఎమ్మిగనూరుకు చెందిన మోహన్ రెడ్డి, శకుంతలకు ఒక కుమారుడు చెన్నారెడ్డి, ఇద్దరు కూమార్తెలు వైష్ణవి, చైతన్య ఉన్నారు. వీరు ఎమ్మిగనూరు పట్టణంలో హోటల్ పెట్టుకుని పిల్లల్ని చదివిస్తున్నారు. గత ఐదేళ్లుగా తండ్రి మౌలేశ్వర రెడ్డి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. తల్లి ఒక్కటే హోటల్ నడుపుతూ పెద్ద కూతురుకు వైష్ణవికు వివాహం చేశారు. హోటల్లో వచ్చిన సంపదనతోనే చెన్నారెడ్డిని, చైతన్యను చదివిస్తున్నారు. చెన్నారెడ్డి మృతిచెందిన సంఘటన తెలుసుకున్న తల్లిదండ్రులు ప్రాజెక్టుకు చేరుకొని ఒక ఏడాదిలో చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం చేస్తూ మమ్మల్ని పోషిస్తాడని ఎన్నో ఆశాలు పెట్టుకున్నాం. కానీ మమ్మల్ని ఇలా ఒంటరిని చేసి వెళ్లి పోతావని అనుకోలేదని ఉన్న ఒక్క కుమారుడు పోయాడు. ఇక మేము ఎందుకు బతకాలి అని తల్లిదండ్రులు రోదించారు. ఎవరూ ముందుకు రాలేదు మా స్నేహితులు నీటిలో కొట్టుకుపోయారని, కేకలు వేస్తూ సమీపంలో ఉన్న వారందరినీ వేడుకున్నా ఎవరు ముందుకు రాలేదు. నీటిలో మునిగిపోయారు సహాయం చేయండని వేడుకున్నా ఒక్కరూ కూడా సహాయం చేయలేదు. ఆ సమయంలో ఎవరైనా సహాయం చేసి ఉంటే మా స్నేహితులు బతికి ఉండేవారు. – చెన్నారెడ్డి, ఉదయ్ స్నేహితులు కన్నీటి పర్యంతం..‘అమ్మా.. కాలేజీకి వెళ్లి వస్తా అని చెప్పి.. ఇంకా రాలేదు కదా’ అంటూ ఉదయ్ తల్లిదండ్రులు రోదించారు. ఎమ్మిగనూరుకు చెందిన గోవింద్, రాధలకు ఇద్దరు కుమారులు. వీరు పట్టణంలో మగ్గం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమారుడు మనోహర్ బెంగళూరులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కుమారుడు ఉదయ్ కుమార్ ఎర్రకోట సెయింట్ జాన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం సీఈసీలో ఏఐ చేస్తున్నాడు. గురువారం ఉదయం కాలేజీ వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వచ్చాడు. ‘3 గంటల సమయంలో మీ వాడు గాజులదిన్నె ప్రాజెక్టు నీటిలో మునిగి పోయాడని ఫోన్ వచ్చిందని మేము ఇకా ఎవరి కోసం బతకాలి’ అంటూ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించాయి. -
‘స్ఫూర్తి’దాయకం
శివాజీస్ఫూర్తి కేంద్రాన్ని ప్రధాని నరేంద్రమోదీ దర్శించారు. శివాజీ కాంస్య విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. దర్బార్లో త్రీడీ చిత్రాలతో ఏర్పాటు చేసిన శివాజీ జీవిత చరిత్రను చూశారు. నావికాదళానికి శివాజీ రాజముద్రను చిహ్నంగా మోదీ ఏర్పాటు చేయగా.. అది దర్బార్లో ఉండడంతో చూసిన ప్రధాని చిరునవ్వు చిందించారు. శివాజీ దర్బార్ను 1994 అక్టోబరు 16న ప్రారంభించామని, 2025 అక్టోబర్ 16న భారత ప్రధాని సందర్శనకు రావడం విశేషమని నిర్వాహకలు వివరించారు. దీంతో ప్రధాని చిరునవ్వులు చిందించారు. అనంతరం శివాజీ ధ్యానం చేసిన ధ్యాన మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా దర్భార్ హాల్లో ఉన్న జీవితవిశేషాలను డిజిటలైజేషన్ చేస్తే బాగుంటుందని ప్రధాని అన్నట్లు నిర్వాహకులు నాగేశ్వరరావు తెలిపారు. -
కన్నీటి పర్యంతం..
‘అమ్మా.. కాలేజీకి వెళ్లి వస్తా అని చెప్పి.. ఇంకా రాలేదు కదా’ అంటూ ఉదయ్ తల్లిదండ్రులు రోదించారు. ఎమ్మిగనూరుకు చెందిన గోవింద్, రాధలకు ఇద్దరు కుమారులు. వీరు పట్టణంలో మగ్గం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమారుడు మనోహర్ బెంగళూరులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కుమారుడు ఉదయ్ కుమార్ ఎర్రకోట సెయింట్ జాన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం సీఈసీలో ఏఐ చేస్తున్నాడు. గురువారం ఉదయం కాలేజీ వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వచ్చాడు. ‘3 గంటల సమయంలో మీ వాడు గాజులదిన్నె ప్రాజెక్టు నీటిలో మునిగి పోయాడని ఫోన్ వచ్చిందని మేము ఇకా ఎవరి కోసం బతకాలి’ అంటూ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించాయి. రోదిస్తున్న ఉదయ్ కుమార్ తల్లిదండ్రులు -
చైన్ స్నాచింగ్కు పాల్పడిన కానిస్టేబుల్
డోన్ టౌన్: నంద్యాల జిల్లా డోన్లోని శ్రీరామనగర్లో మంగళవారం రాత్రి ఓ పోలీస్ చైన్ స్నాచింగ్కు పాల్పడ్డాడు. పట్టణ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తోన్న శ్రీనివాస ఆచారి హోంగార్డుగా పోలీసు శాఖలో ప్రవేశించి కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. ఇతను కొద్దినెలలుగా విధులకు సక్రమంగా హాజరు కావడం లేదు.సిక్ లీవులో ఉంటున్న ఈయన మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో ఈ నెల 14న రాత్రి ఓ మహిళ మెడలోని చైన్ లాగేస్తూ స్థానికులకు దొరికిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సదరు పోలీసుపై పట్టణ పోలీసుస్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. గురువారం అతడిని అరెస్ట్ చేసి డోన్ ఫస్టక్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా 15 రోజులు రిమాండ్ విధించారు. -
వేదావతి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి కృషి
● కర్ణాటక బళ్లారి ఎంపీ తుకారామ్హాలహర్వి: కర్ణాటక–ఆంధ్ర రాష్ట్రాల సరిహద్దులో ఉన్న వేదావతి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తామని కర్ణాటక రాష్ట్రం బళ్లారి ఎంపీ తుకారామ్ అన్నారు. గురువారం మండలంలోని గూళ్యం గ్రామంలో ఆయన పర్యటించారు. గ్రామ సమీపంలోని వేదావతి నదిపై బ్రిడ్జి నిర్మాణం, వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. వేదావతి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి ఎంత నిధులు ఖర్చు అవుతాయన్న విషయాలపై ఆరా తీశారు. అనంతరం గాదిలింగేశ్వరస్వామి వారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. శ్రీ గాదిలింగేశ్వరస్వామి ఆశీర్వాదంతో గతంలో తాను రెండుసార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం ఎంపీగా ఎన్నికయ్యానన్నారు. గూళ్యం గ్రామ సమీపంలో ఉన్న వేదావతి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. వేదావతి నదిపై బ్రిడ్జి నిర్మాణం జరిగితే ఆంధ్ర–కర్ణాటక రాష్ట్రాల పరిధిలోని గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ విషయాన్ని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య దృష్టికి తీసుకెళ్తామన్నారు. 2026 ఉగాది రోజున వేదావతి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే బళ్లారి నుంచి ఆంధ్ర సరిహద్దు వరకు నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సండూరు ఎమ్మెల్యే అన్నపూర్ణ, కంప్లీ ఎమ్మెల్యే గణేష్, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి శశికళ కృష్ణమోహన్, గూళ్యం మాజీ సర్పంచ్ రాజశేఖర్గౌడ్, కురువ సంఘం నాయకులు పూజారి మల్లన్న, బజారప్ప, వీరేశప్ప, లింగమల్లప్ప, మాజీ ఎంపీపీ గాదిలింగప్ప, తిప్పేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇలా ఉంటే ఎలా చదువుతారు?
● గురుకులం నిర్వహణ లోపాలపై మంత్రి సవిత ఆగ్రహంవెల్దుర్తి: వందలాది బాలికలు చదువుకునే గురుకులం నిర్వహణ ఇంత అధ్వానమా.. అంటూ బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర మంత్రి సవిత వెల్దుర్తి మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె కర్నూలులో ప్రధానమంత్రి పర్యటనకు హాజరై తిరిగి అనంతపురం వెళ్తూ మార్గమధ్యలో వెల్దుర్తి బీసీ గురుకులాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా విద్యార్థినుల వద్దకు వెళ్లి ఎలా చదువుతున్నారని, భోజన, సౌకర్యాలు ఎలా ఉన్నాయని తెలుసుకున్నారు. అనంతరం స్టాఫ్ రిజిస్టర్, భోజన సరుకుల స్టాక్ రిజిస్టర్లు అందుబాటులో లేకపోవడం, భోజన సరుకులు నాణ్యత లేకపోవడం, వాసన వచ్చేంత వరకు వాడకుండా ఉంచడం, ఆ సమయంలో గురుకులంలో ప్రిన్స్పాల్, వార్డెన్ తదితరులు లేకపోవడంతో.. ఇదేనా నిర్వహణ అంటూ వైస్ ప్రిన్స్పాల్ రాధపై అగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తమ శాఖ సెక్రటరీకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. బాలికల గురుకులంలో ముగ్గురు యువకు లు పనిచేస్తుండడంపై ఇదేమిటంటూ ప్రశ్నించారు. పాఠశాలకు సొంత భవనం, గ్రౌండ్ లేదని విద్యార్థినులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే ద్వారా వెల్దుర్తి బీసీ గురుకల పాఠశాలకు సొంత భవన ఏర్పాటు కోరుతూ వినతి వచ్చిందని, త్వరలో తగు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. -
ఫోన్ మాట్లాడుతూ కుప్పకూలిన యువకుడు
● గుండెపోటుతో బీటెక్ విద్యార్థి మృతిఎమ్మిగనూరురూరల్: ఎర్రకోట సెయింట్ జాన్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలో గురువారం మధ్యాహ్నం గుండె పోటుతో ఓ బీటెక్ విద్యార్థి హఠాన్మరణం చెందాడు. పట్టణంలోని ముగతి పేటకు చెందిన ఫారూక్, రెహెనాబానుల కుమారుడు అబ్దుల్రహీమాన్ (22) బీటెక్–సీఎస్బీ నాల్గవ సంవత్సరం చదువుతున్నాడు. మధ్యాహ్నం భోజనం చేసి చెట్టు కింద ఫోన్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటుతో మృతి వలనే మృతి చెందినట్లు చెప్పారు. కాగా ఇదే రోజు గాజులదిన్నె వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఎర్రకోట సెయింట్ జాన్స్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన ఓ విద్యార్థి మృతి చెందడం, మరో విద్యార్థి గల్లంతు కావడం, ఇంకో విద్యార్థి గుండెపోటుతో మృతి చెందడంతో కళాశాలలో విషాదం అలుముకుంది. -
ఘాట్ రోడ్డులో ప్రమాదం
● పాత రైల్వే వంతెనను ఢీకొన్న లారీ, డ్రైవర్ దుర్మరణం మహానంది: నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే నల్లమల ఘాట్రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ దుర్మరణం చెందాడు. బొగద వంతెన దాటిన తర్వాత ఉన్న పురాతన రైల్వే వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి విజయవాడ వెళుతున్న లారీ మలుపు వద్ద అదుపు తప్పి పురాతన వంతెనను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వంతెన గోడ, లారీ మధ్య ఇరుక్కు పోయిన లారీ డ్రైవర్ రాజు (42) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదిలా ఉండగా లారీ రోడ్డుకు అడ్డుగా ఉండటంతో సుమారు ఆరు గంటల పాటు నల్లమల ఘాట్రోడ్డులో వాహనాల రాకపోకలు స్తంభించాయి. నంద్యాల నుంచి విజయవాడ, విజయవాడ వైపు నుంచి నంద్యాల, కర్నూలు, అనంతపురం మీదుగా ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న గిద్దలూరు, మహానంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. రెండు క్రేన్లను తీసుకెళ్లి వాటి సాయంతో రోడ్డుపై అడ్డుగా ఉన్న లారీని పక్కకు తప్పించడంతో ఆరు గంటల తర్వాత వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. ప్రమాద స్థలం గిద్దలూరు పరిధికి రావడంతో గిద్దలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మట్టి మిద్దె కూలి వృద్ధురాలి మృతి
చిప్పగిరి: వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మట్టి మిద్దె కూలి ఓ వృద్ధురాలు దుర్మరణం చెందింది. ఈ ఘటన నేమకల్లు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన శాంతమ్మ(85) ఇంట్లో ఒంటరిగా నివాసముంటోంది. బుధవారం రాత్రి మంచంపై నిద్రిస్తుండగా పైకప్పు కూలి ఆమైపె పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. గురువారం గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, తహసీల్దార్ ఇజాజ్ అహ్మద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వృద్ధురాలి మృతదేహాన్ని వెలికి తీయించి అంత్యక్రియలు చేయించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వీరు ఉపాధి రీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిర పడినట్లు గ్రామస్తులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో రైతు మృతి మహానంది: ఆంజనేయపురం సమీపంలోని తెలుగుగంగ కాలువ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రైతు మృతి చెందాడు. ఎస్ఐ రామ్మోహన్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గాజులపల్లె గ్రామానికి చెందిన నరసింహులు(60) పొలం పనులకు వెళ్లి తెలుగుగంగ కాలువ వద్ద రోడ్డు దాటుతుండగా అబ్బీపురం గ్రామానికి చెందిన బాలవర్ధన్ రాజు ఆటోలో వెళ్తూ ఢీకొన్నాడు. విషయం తెలుసు కున్న ఎస్ఐ రామ్మోహన్రెడ్డి వెంటనే తన వాహనంలో వృద్ధుడిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి అంబులెన్స్ తర లించారు. అయితే కోలుకోలేక నరసింహులు మృతి చెందాడు. మృతుడి భార్య రాజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని.. బండి ఆత్మకూరు: ఎర్రగుంట్ల గ్రామ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పనూరు గ్రామానికి చెందిన ఎర్రద్దుల బ్రహ్మయ్య (33) అనే వ్యక్తి బుధవారం రాత్రి నంద్యాల వైపు బైక్పై వెళ్తుండగా.. ఎర్రగుంట్ల సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మిదేవి, కూతురు, కుమారుడు ఉన్నారు. సమా చారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
విధుల్లో అప్రమత్తంగా ఉండండి
● పోలీసు అధికారులకు డీజీపీ ఆదేశంకర్నూలు: ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు పర్యటన నేపథ్యంలో బందోబస్తు విధుల్లో ఉండే పోలీసు అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో అడిషనల్ డీజీ ఎన్. మధుసూదన్ రెడ్డి, ఐజీ శ్రీకాంత్, డీఐజీలు కోయ ప్రవీణ్, గోపీనాథ్ జెట్టి, సెంథిల్ కుమార్, సత్య ఏసుబాబు, ఫక్కీరప్ప కాగినెల్లిలతో కలసి పీఎం భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు. మినిట్ టు మినిట్ ప్రోగ్రాం, రూట్ మ్యాప్, రాగమయూరి బహిరంగ సభ తదితర ప్రాంతాలను గూగుల్ జియో మ్యాప్ను తెరపై చూపిస్తూ డీజీపీకి ఎస్పీ విక్రాంత్ పాటిల్ వివరించారు. భద్రత చర్యలపై చర్చించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. బహిరంగ సభకు ఎక్కడినుంచి ఎన్ని బస్సులు వస్తున్నాయనే విషయంపై అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. బహిరంగ సభ వద్ద మఫ్టీ పోలీసులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వీవీఐపీలు వెళ్లిపోయేవరకు ఎక్కడ కూడా ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చూడాలన్నారు. డీఐజీలు, ఎస్పీలు, ట్రైనీ ఐపీఎస్లు, అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు సమావేశంలో పాల్గొన్నారు. పటిష్ట బందోబస్తు శ్రీశైలంటెంపుల్: ప్రధాని నరేంద్రమోదీ తొలిసారిగా శ్రీశైలం వస్తున్న నేపథ్యంలో 1,800 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీశైలంలో ప్రత్యేక పూజల అనంతరం జగద్గురు పీఠాన్ని ప్రధానమంత్రి సందర్శిస్తారు. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని, ధ్యాన మందిరాన్ని సందర్శించి సున్నిపెంటకు వెళ్తారు. ప్రధాని శ్రీశైలం పర్యటనను పురస్కరించుకుని పోలీసులు బుధవారం ట్రయల్రన్ నిర్వహించారు. -
అభివృద్ధి పేరుతో అప్పులు చేస్తున్నారు!
● వామపక్ష నాయకుల ఆందోళన నంద్యాల(న్యూటౌన్): రాష్ట్ర అభివృద్ధి పేరుతో కూటమి నేతలు విపరీత అప్పులు చేస్తున్నారని వామపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు. ఎలాంటి అభివృద్ధి లేకున్నా వేల కోట్ల రూపాయలు అప్పులు ఎలా తీసుకు వస్తారని ప్రశ్నించారు. నంద్యాల పట్టణంలోని పద్మావతినగర్ ఆర్చి నుంచి గాంధీచౌక్ వరకు సీపీఐ, సీపీఎం న్యూడెమోక్రసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ‘మోదీ గో బ్యాక్’ అని నినాదాలు చేశారు. అనంతరం గాంధీచౌక్లో జరిగిన నిరసనలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగరాజు మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా నిరసన చేస్తున్న వామపక్ష నాయకుల అక్రమ అరెస్ట్లకు పాల్పడటం శోచనీయమన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. సిద్ధేశ్వరం అలుగు పూర్తి చేయాలని, శ్రీశైలానికి రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జీఎస్టీ తగ్గిస్తున్నామంటూ సభలను నిర్వహించడం ప్రజలను పక్కదారి పట్టించడమేనన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు సోమన్న, డి శ్రీనివాసులు పాల్గొన్నారు. -
శ్రీగిరి అభివృద్ధికి ఆమోదీంచేనా!
శ్రీశైలంటెంపుల్: ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వరూపంలో కొలువైన ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైల మహాక్షేత్రం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే ప్రాంగణంలో జ్యోతిర్లింగ స్వరూపుడు, శక్తిపీఠం కలగలసి వెలసి ఉన్న ఏకైక క్షేత్రం. అంతటి ప్రాశస్త్యం ఉన్న మహాక్షేత్రం అభివృద్ధికి దూరమవుతోంది. అరకొర సౌకర్యాలతో భక్తులు అవస్థలు పడుతున్నారు. క్షేత్రంలో ఏ చిన్న అభివృద్ధి చేయాలన్న అటవీశాఖ నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. రహదారులు, వసతి సౌకర్యాలు భక్తులను వేధిస్తున్నాయి. గురువారం శ్రీశైలానికి భారత ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో క్షేత్ర అభివృద్ధిపై దృష్టి సారించి, శ్రీగిరిలో నెలకొన్న సమస్యలపై దృష్టిసారించి పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు. ఈ క్షేత్రానికి చేరుకోవాలంటే అటు ఆంధ్రా నుంచి అయినా, ఇటు తెలంగాణ ప్రాంతం నుంచి అయినా రైలు మార్గం లేదు. సుమారు 80 కిలోమీటర్ల దూరంలోని మార్కాపురం రోడ్డు వరకు మాత్రమే రైలు మార్గం ఉంది. ఇటు తెలంగాణ నుంచి అయితే రైలు మార్గం అసలే లేదు. గతంలో పార్లమెంట్సభ్యులు శ్రీశైలానికి రైలు మార్గం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడంతో పరిశీలించాలని అధికారులకు ఆదేశించింది. కేంద్రం ఆదేశాలతో ప్రత్యేక కమిటీ సభ్యులు శ్రీశైలానికి రైలు మార్గానికి ఉన్న అవకాశాలను పరిశీలించారు. శ్రీగిరి చుట్టూ నల్లమల అభయారణ్యం కావడంతో మార్కాపురం రోడ్డు నుంచి దోర్నాల వరకు రైలు మార్గాన్ని విస్తరించవచ్చునని ప్రతిపాదనలను పంపినట్లు సమాచారం. అయితే ఏటా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు శ్రీశైలానికి రైలు మార్గం బడ్జెట్లో ప్రస్తావనకు రావడం లేదు. క్షేత్రానికి రైలు మార్గం ఉంటే సామాన్య భక్తులు సైతం క్షేత్ర యాత్ర చేసుకునే అవకాశం ఉంటంది. ఐకానిక్ బ్రిడ్జికి గ్రీన్సిగ్నల్ ఇచ్చేనా? శ్రీశైల దేవస్థానంలో విధులు నిర్వహించే ఉద్యోగులకు సున్నిపెంటగ్రామంలో సుమారు రూ.70 కోట్లతో స్టాఫ్ క్వాటర్స్ నిర్మించారు. సున్నిపెంట నుంచి శ్రీశైలానికి 10 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ దూరాన్ని తగ్గించాల నే ఉద్దేశంతో సున్నిపెంట నుంచి కృష్ణానదిపై శ్రీశైలం వరకు ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని మాస్టర్ప్లాన్లో ప్రతిపాదించారు. అలాగే తెలంగాణ నుంచి శ్రీశైలంకు సమీపంలో దూరాన్ని తగ్గించేలా తెలంగాణ ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు డీపీఆర్ సిద్ధం చేసి అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఏపీ, తెలంగాణ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వ అటవీశాఖ అధికారులు అనుమతులు ఇవ్వాలి. ఐకానిక్ వంతెనను నిర్మిస్తే భక్తులకు శ్రీశైలం దూరం తగ్గడంతో పాటు ప్రయాణం సాఫీగా సాగుతుంది. భూ బదలాయింపు జరిగేనాగతంలో దేవదాయ, అటవీ, రెవెన్యూ శాఖల మంత్రులు, మూడు శాఖల ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి ప్రాథమికంగా శ్రీశైల దేవస్థానానికి 5,302 ఎకరాల భూమి ఉందని నిర్ధారించారు. శ్రీశైల దేవస్థానానికి 1967 నవంబర్లో ఫుడ్ అండ్ అగ్రికల్చరేట్ డిపార్ట్మెంట్ ప్రకారం 5,302 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ మొత్తం భూమి 9 సర్వే నెంబర్లలో ఉంది. 5,302 ఎకరాల్లో 900 ఎకరాలు శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్లో ముంపు అయింది. బ్రిటీష్ కాలం నాటి జీవో, బ్రిటీష్ కాలం నాటి గెజిట్ ఎంట్రీ ద్వారా సర్వే చేయించి క్షేత్ర సరిహద్దులను గుర్తించారు. 4,400 ఎకరాలు శ్రీశైల మల్లన్న కు చెందిన భూమి అని గుర్తించి, అటవీశాఖ అంగీకరించింది. దీంతో ఆ భూమిని దేవస్థానానికి అప్పగించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరుఫున దేవదాయశాఖకు భూమిని అప్పగించేందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వే డిపార్ట్మెంట్కు డీఎఫ్వో లేఖ రాశారు. అక్కడి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ఘాట్రోడ్డు విస్తరించేనాశ్రీశైల క్షేత్రానికి ఏపీ, అటు తెలంగాణ నుంచి చేరుకోవాలంటే సుమారు 100 కి.మీ దూరం ఘాట్రోడ్డులో రోడ్డు ప్రయాణం చేయాలి. ఏపీ వైపు శ్రీశైలం నుంచి ఆత్మకూరు వైపు సుమారు 100 కిలోమీటర్లు ఘాట్రోడ్డు సింగిల్ రోడ్డు మాత్రమే. వర్ష కాలంలో ఇరుకైన ఈ రోడ్డులో తరచూ భారీ వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య నెలకొంటుంది. ఈ రోడ్డు నేషనల్ హైవే పరిధిలో ఉన్నప్పటికీ విస్తరించడం లేదు. ఆత్మకూరు నుంచి దోర్నాల, దోర్నాల నుంచి శ్రీశైలం నాలుగు లైన్లుగా విస్తరిస్తే క్షేత్రానికి భక్తుల రాకపోకలు మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే దోర్నాల–శ్రీశైలం నేషనల్ హైవే 765 పరిధిలో ఉంది. ఎన్హెచ్–765 రహదారిని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.3వేల కోట్లతో చేపట్టేందుకు డీపీఆర్ సిద్ధం చేశారు. ఈ ప్రాంతంలో అండర్పాస్, ఓవర్ పాస్ బ్రిడ్జిలు నిర్మిస్తే వన్యప్రాణులు, పులుల సంచారానికి ఆటంకం లేకుండా, వన్యప్రాణులు వాహనాల ప్రమాదానికి గురికాకుండా ఉంటుందని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అలాగే లింగాలగట్టు నుంచి శ్రీశైలానికి ఆంధ్రా–తెలంగాణ ప్రాంతాలను కలుపుతూ సుమారు రూ.300కోట్లతో ఒక ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మల్లన్న క్షేత్రానికి ‘ప్రసాదం’ అందేనా..! శ్రీశైల క్షేత్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీం రూ.43 కోట్లతో అభివృద్ధి చేసింది. శ్రీశైలక్షేత్రానికి రోజు రోజుకు పెరుగుతున్న భక్తులు, పర్యాటకుల సౌకర్యార్థం శ్రీశైలంలో కల్పించాల్సిన సౌకర్యాలపై 2017 లో అప్పటి ఈవో భరత్గుప్తా కేంద్ర పర్యటక శాఖ అధికారులకు వివరించి, డీపీఆర్ను సమర్పించారు. దీంతో కేంద్ర పర్యాటక శాఖ (పిలిగ్రిమేజ్ రెజువెనేషన్ అండ్ స్పిర్చువల్ అగ్మెంటేషన్ డ్రైవ్) ప్రసాద్ పథకం కింద శ్రీశైల క్షేత్రంలో భక్తులకు, పర్యాటకులకు కల్పించాల్సిన సౌకర్యాల కోసం రూ.43 కోట్లు నిధులు మంజూరు చేసింది. మూడు విడతలుగా నిధులు మంజూరయ్యాయి. 2017లో శ్రీశైలంలో ప్రసాద్ పథకం ద్వారా పనులు ప్రారంభించారు. కేంద్రం మంజూరు చేసిన పనులను రాష్ట్ర పర్యాటక శాఖ, శ్రీశైల దేవస్థాన ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో చేపట్టారు. 2022 డిసెంబరు 26న రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ఆయా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మల్లన్న దర్శనానికి వస్తున్న మోదీ.. శ్రీగిరి అభివృద్ధికి వరాలు కురిపించాలని భక్తులు కోరుతున్నారు. -
నిధులు, నీళ్లు కావాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయి. పెండింగ్లోని సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలేదు. బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించి 8 ఏళ్లు అయినా ఒక్క డిమాండ్నూ నెరవేర్చలేదు. ఒక్క ప్రాజెక్టును కూడా కట్టలేదు. రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేస్తామన్నా అమలుకు నోచుకోలేదు. 11ఏళ్లుగా జీఎస్టీ భారం మోపుతున్న మోదీ ఇప్పుడు కొసరులో పీసరు తగ్గించి సంబరాలకు రావడం అన్యాయం. – కె.ప్రభాకరరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు, కర్నూలు -
పీఎం పర్యటనకు పకడ్బందీ బందోబస్తు
● విధుల్లో 1,800 మంది పోలీసులు ● ఎస్పీ సునీల్ షెరాన్ శ్రీశైలంటెంపుల్: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16న శ్రీశైలం పర్యటనను పురస్కరించుకుని 1800 మంది పోలీసు బలగాలతో పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు నంద్యాల ఎస్పీ సునీల్షెరాన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం మీడియాతో ఎస్పీ మాట్లాడుతూ.. ప్రధాని శ్రీశైలం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు. ప్రధాని హెలిపాడ్కు చేరుకున్నప్పటి నుంచి దర్శనం అనంతరం తిరిగి వెళ్లేంత వరకు ఆయన పర్యటించే ప్రదేశాలలో విస్త్రత తనిఖీలు నిర్వహించి, ప్రధాన కూడళ్లలో సాయుధ బలగాలతో పికెట్లు ఏర్పాటు చేశామన్నారు. బందోబస్త్కు వచ్చిన సిబ్బందిని 10 సెక్టార్లుగా విభజించి, ప్రతి సెక్టార్కు ఒక ఉన్నతాధికారిని ఇన్చార్జ్గా నియమించామన్నారు. జియోగ్రాఫికల్ మ్యాప్ ద్వారా ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో తీసుకోవలసిన భద్రత చర్యలను క్షుణ్ణంగా సిబ్బందికి వివరించామని వివరించారు. నల్లమలలో గ్రేహౌండ్స్ కూంబింగ్: నల్లమల అడవుల్లో స్పెషల్పార్టీ పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ ముమ్మరం చేశారు. స్పెషల్ పార్టీ సాయుధబలగాలు శ్రీశైలం చుట్టూ, ప్రధాని పర్యటించే ప్రదేశాలలో తనిఖీలు చేపట్టారు. ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో రోడ్డు ఓపెనింగ్ పార్టీ సిబ్బంది హ్యాండ్ హోల్డ్ మెటల్ డిటెక్టర్ సహాయంతో, పోలీసు జాగిలాలతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. క్షేత్ర పరిధిలోని అన్ని డార్మెంటరీలు, సత్రాలలో బస చేస్తున్న భక్తుల వివరాలను తెలుసుకుంటున్నారు. -
సాగునీటి రంగానికి తీవ్ర అన్యాయం
బీజేపీ డిక్లరేషన్లో పెండింగ్ ప్రాజెక్టులకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని పెట్టారు. ఆ నిధుల ద్వారా సిద్దేశ్వరం అలుగు, గుండ్రేవుల, వేదవతితో రాయలసీమను సస్యశ్యామలం చేయవచ్చన్నది వారి ఆలోచన. అయితే అందుకు సంబంధించిన నిధులను కేటాయిండంలో విఫలం కావడంతో రాయలసీమ రైతాంగానికి తీరని అన్యాయం జరుగుతోంది. వర్షాలు సమృద్ధిగా పడినా సముద్రం పాలవుతున్నాయి. వర్షపు నీటిని ఒడిసి పట్టుకునే పరిస్థితి లేకపోవడంతో కళ్లెదుటే నీళ్లున్నా పొలాల్లో కన్నీళ్లు పారుతున్నాయి. రాయలసీమలోని ఓర్వకల్లు(కర్నూలు), కొప్పర్తి(వైఎస్ఆర్)లలో పారిశ్రామిక వాడలు ఉన్నాయి. వాటిని వృద్థిపథంలోకి తేవడానికి కేంద్రం చేయూత ఎంతో అవసరం. అయితే ఆ దిశగా కేంద్రం చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ పార్కులో 10 వేల ఎకరాలతో ల్యాండ్ బ్యాంకును ఏర్పాటు చేసినా మౌలిక వసతుల కల్పనలో విఫలంతో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడంలేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పారిశ్రామికవాడలపై దృష్టి సారించాల్సి ఉంది. -
చౌడేశ్వరిదేవి ఆభరణాల లెక్కింపు
బనగానపల్లె రూరల్: నందవరంలో వెలిసిన శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారికి భక్తులు విరాళంగా అందజేసిన బంగారు, వెండి ఆభరణాల లెక్కింపు కార్యక్రమం రాయలసీమ జోన్ జువెలరీ వెరిఫికేషన్ అధికారి పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టారు. 2005 సంవత్సరం నుంచి బంగారు, వెండి ఆభరణాలు లెక్కింపు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 7.436 కేజీల బంగారు ఆభరణాలు ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. 139.500 గ్రాముల ఆభరణాలకు రశీదులు లేకపోవడంతో వాటిని రాయించారు. వెండి ఆభరణాలను బుధవారం పరిశీలించనున్నట్లు పాండురంగారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో గత ఈవో రామానుజన్, ఆలయ అర్చకులు, వెరిఫికేషన్ అధికారులు పాల్గొన్నారు. నేటి నుంచి న్యాయవాదుల విధుల బహిష్కరణ నంద్యాల(వ్యవసాయం): కర్నూలులో హైకోర్టు బెంచి త్వరగా ఏర్పాటు చేయాలని కోరుతూ కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ పిలుపు మేరకు నంద్యాల బార్ అసోసియేషన్ నాయ కులు బుధవారం నుంచి రెండు రోజుల పాటు కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు హుసేన్బాషా, సుబ్బరాయు డు, ముక్కెర కృష్ణారెడ్డిలు మంగళవారం తెలిపారు. విధుల బహిష్కరణ కార్యక్రమానికి న్యాయవాదులు, కక్షిదారులు, కోర్టు సిబ్బంది సహకరించాలని వారు కోరారు. రెండు రోజులు ప్రైవేటు పాఠశాలలకు సెలవు నంద్యాల(న్యూటౌన్): ప్రధాని నరేంద్రమోదీ ఉమ్మడి జిల్లా పర్యటన నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలలకు బుధ, గురువారా లు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు జనార్దన్రెడ్డి మంగళవారం ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 15, 16వ తేదీల్లో ప్రైవేటు యాజమాన్య పాఠశాలల కు మాత్రమే సెలవు ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ తేదీల్లో జరిగే ఎఫ్ఏ–2 పరీక్షలు 21, 22 తేదీల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. మద్యం బాటిళ్లపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి నంద్యాల: నకిలీ మద్యం అనే అనుమానం వస్తే మద్యం బాటిల్పై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే తెలిసిపోతుందని జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రవికుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ ఎకై ్సజ్ సురక్ష యాప్ను ప్లేస్టోర్లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవాలని, మద్యం కొనుగోలు చేసేటప్పుడు ఈ యాప్ ద్వారా స్కాన్ చేయాలన్నారు. మద్యం బాటిల్పై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే బాటిల్ తయారు అయిన కంపెనీ, తయారు చేసిన తేదీ, కంపెనీ, ఎమ్మార్పీ ధరతో సరి చూసుకొని కొనుగోలు చేయవచ్చన్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు ఏవైనా తప్పులు వస్తే టోల్ఫ్రీ నం.14405, 9440902586 ఫోన్ చేయాలన్నారు. హోలోగ్రాఫిక్, ఎకై ్సజ్ లేబుల్స్ బీర్లపై ఉండవని, మద్యం బాటిళ్లపై మాత్రమే ఉంటాయన్నారు. ఏపీ ఎకై ్సజ్ సురక్ష యాప్ను ఉపయోగించుకోవాలన్నారు. -
సీమ హక్కుల అమలుకు చర్యలు చేపట్టండి
నంద్యాల(అర్బన్): రాయలసీమ ప్రాంతానికి చట్టబద్ధంగా కల్పించిన హక్కులను తక్షణమే అమలు చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విన్నవించారు. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో మంగళవారం వినతి పత్రాన్ని మెయిల్ ద్వారా ఆయన పీఎం కార్యాలయానికి పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం సీమకు ప్రత్యేక ప్యాకేజీ విడుదల చేయాలని, రాష్ట్రం విడిపోయి 11 ఏళ్లు అవుతున్నా సీమ జిల్లాలకు నిధుల విడుదలలో అన్యాయం జరుగు తుందన్నారు. కేంద్రీకృత అభివృద్ధి విధానాన్ని పాలకులు ఎంచుకోవడంతో ఏర్పడిన నిధుల కొరత వల్ల రాష్ట్ర విభజన చట్టం హక్కులు కల్పించిన తెలుగుగంగ, గాలేరునగరి, హంద్రీనీవా, వెలుగొండ ప్రాజెక్టుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని నిధులు విడుదల చేసి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కడప ఉక్కు కర్మాగారం, జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. బచావత్ ట్రిబ్యునల్ హక్కులు కల్పించిన హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ, కేసీ కెనాల్, ఎస్సార్బీసీ ప్రాజెక్టులకు పూడిక, రిజర్వాయర్ల లేమి కారణంగా కేటాయించిన నీరు వినియోగించుకోలేని పరిస్థితి ఉందన్నారు. సీమ యువత భవిష్యత్తు, గ్రామీణ ప్రజల జీవనోపాధిపై తక్షణ చర్యలు చేపట్టి సీమ సమగ్ర అభివృద్ధికి పునాదులు వేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు వైఎన్ రెడ్డి, రామచంద్రారెడ్డి, అసదుల్లా, బెక్కెం రామసుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కొలువుదీరిన శ్రీశైల దేవస్థానం ట్రస్ట్బోర్డు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం ట్రస్ట్బోర్టు నూతన కమిటీ కొలువుదీరింది. ఇటీవల శ్రీశైల దేవస్థానానికి ధర్మకర్తల సలహా మండలి కమిటీని 17 మంది సభ్యులు, ఆరుగురు ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ జీవో జారీ చేసింది. ఈ మేరకు సోమ వారం ఉదయం చంద్రావతి కల్యాణ మండపంలో ట్రస్ట్బోర్డు సభ్యులతో దేవస్థాన సహాయ కమిషనర్ చంద్రశేఖరరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి హాజరయ్యారు. ముందుగా పోతుగంటి రమేష్నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా ఏవీ రమణ, బీ రవణమ్మ, జీ లక్ష్మీశ్వరి, కే కాంతివర్దిని, ఎస్ పిచ్చయ్య, జే రేఖాగౌడ్, అనిల్కుమార్, దేవకి వెంకటేశ్వర్లు, బీ వెంకటసుబ్బారావు, జీ కాశీనాథ్, మురళీధర్, యు.సుబ్బలక్ష్మీ, ిపీయూ శివమ్మ, జిల్లెల శ్రీదేవి ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకారానికి చిట్టిబోట్ల భరద్వాజశర్మ, గుల్లా గంగమ్మ హాజరుకాలేదు. అనంతరం ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన ఆరుగురిలో ముగ్గురు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం సభ్యులు పోతుగంటి రమేష్నాయుడుని చైర్మన్గా ఎన్నుకున్నారు. చైర్మన్, సభ్యులందరికీ వేద పండితులు ఆశీర్వచనంతో పాటు, స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. -
సీనరేజ్ వసూలుకు అష్ట దిగ్బంధం
● పలు చోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేసిన ప్రైవేట్ సంస్థ ● ఎగుమతి నిలిపివేసిన నాపరాతి పరిశ్రమ యజమానులు కొలిమిగుండ్ల: భూగర్భంలో నుంచి వెలికితీసే వివిధ రకాల ఖనిజాలకు ప్రభుత్వం సీనరేజ్ (రాయల్టీ) వసూలు చేసే బాధ్యత ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోటా పోటీలో వేలం దక్కించుకున్న సుధాకర ఇన్ఫ్రా సంస్థ కూటమి ప్రభుత్వానికి నెలకు రూ.14.05 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. నాపరాళ్లు (బ్లాక్స్టోన్) ఇతర ఖనిజాలను ట్రాక్టర్లు, లారీల్లో ఎగుమతి చేసేందుకు టన్నుల ప్రకారం సీనరేజ్ వసూలును ప్రవేట్ సంస్థ ప్రారంభించింది. కొలిమిగుండ్ల, అవుకు, మండలాల్లో పలు చోట్ల చెక్పోస్ట్లు ఏర్పాటు చేసి ఒక్క వాహనం తప్పించుకోకుండా అష్ట దిగ్బంధం చేశారు. ప్రతి చెక్పోస్ట్ వద్ద ప్రవేట్ సిబ్బందిని 24 గంటల పాటు పర్యవేక్షణ చేసేలా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, బైక్, జీపుల్లో పెట్రోలింగ్ చేసే టీంను ప్రత్యేకంగా నియమించా రు. నాపరాళ్ల మైనింగ్లో వ్యర్థాలుగా మిగిలే గోడరాళ్లుకు కూడా సీనరేజ్ వసూలు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో భూగర్భ గనుల శాఖ అధికారులు రాయల్టీ వసూలు చేసేవారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడంతో ఓ సంస్థ రంగంలోకి దిగింది. గతంలో ట్రాక్టర్ రవాణా చేసేందుకు రాయల్టీకి రూ.600 మేర చెల్లించాల్సి వస్తుండేది. ప్రస్తుతం 18 శాతం జీఎస్టీతో కలిపి టన్నుకు రూ.222 వసూలు చేస్తున్నారు. ట్రాక్టర్కు 5 టన్నులకు రూ.1,100 రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన రాగానే అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, ఎమ్మెల్యే కాటసా ని రామిరెడ్డి, జెడ్పీచైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డిలు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రాంతంలో మైనింగ్ పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాల గురించి వివరించారు. దీంతో యజమానులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆ ఆలోచనను విరమించుకుంది. కానీ కూటమి ప్రభుత్వం ఏమాత్రం ఆలో చించకుండా ఇష్టారాజ్యంగా ప్రైవేట్కు అప్పగించడంతో యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిలిచిన రవాణా నాపరాళ్ల రవాణా ట్రాక్టర్లు, లారీలతో రద్దీగా ఉండే రహదారులు బోసిపోయి కనిపిస్తున్నాయి. మూడు రోజుల నుంచి రవాణా నిలిచిపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దినసరి కూలీ పనులు చేసే కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు మండలాల్లో లారీ, ట్రాక్టర్లకు లోడింగ్ చేసే కార్మికులు సుమారు 1,500 మేర ఉంటారు. మూడు రోజుల నుంచి పనులు లేక పోవడంతో కుటుంబ పోషణ భారంగా మారుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. ట్రాక్టర్ యజమానుల నిరసన.. బనగానపల్లె రూరల్: కూటమి ప్రభుత్వం రాయల్టీలను ప్రవేట్ పరం చేయడంతో ట్రాక్టర్ల యజమానులు నిరసన వ్యక్తం చేశారు. బీరవోలు సమీపంలో ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేసిన రాయల్టీ చెక్పోస్ట్ వద్ద ట్రాక్టర్ యజమానులు నాపరాతి గనుల్లోని వేస్ట్ మెటీరియల్ను ట్రాక్టర్లలో తీసుకొచ్చి రోడ్డుకు అడ్డంగా వేశారు. గతంలో నాపరాతి గనుల్లో వెలికితీసిన వేస్ట్ మెటిరియల్కు ప్రభుత్వానికి ఎటువంటి రాయల్టీ చెల్లించకుండా ఉచితంగా రవాణా చేసే వారమని, ప్రస్తుతం ఈ రాయల్టీ చెల్లింపు ప్రవేట్ వారికి ప్రభుత్వం అప్పగించడంతో వారు వేస్ట్ మెటిరియల్కు కూడా టన్నుకు సుమారు రూ.140 ప్రకారం చెల్లించాల్సి వస్తోందన్నారు. దాదాపు రెండు గంటల సేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. బందార్లపల్లె క్రాస్ రోడ్డులో ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేసిన చెక్పోస్ట్రాయల్టీ కోసం ట్రాక్టర్లను నిలిపిన దృశ్యం -
కర్నూలులో కదంతొక్కిన మహిళలు
సీబీఐతో విచారణ చేయించాలి ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోంది. రాష్ట్రంలో వెలుగుచూసిన భారీ నకిలీ మద్యం రాకెట్ వ్యవహా రంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాత్ర ఉందని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. నకిలీ మద్యంపై సిట్ చేత దర్యాప్తు చేయిస్తామని చంద్రబాబు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది. చిత్తశుద్ధి ఉంటే సీబీఐ చేత విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. – కాటసాని రాంభూపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు టీడీపీ నాయకులు డబ్బు కక్కుర్తి కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ మద్యాన్ని తయారు చేసి దర్జాగా అమ్ముతున్నా పట్టించుకునేవారు లేరు. గత వైఎస్సార్సీపీ హయాంలో కనీసం బెల్ట్షాప్లు కూడా ఉండేవి కావు. ఇప్పుడు ఏ ఊరు చూసినా నకిలీ మద్యం, బెల్ట్ షాపులే కనిపిస్తున్నాయి. నకిలీ మద్యం గుట్టు వీడాలంటే సీబీఐతో దర్యాప్తు చేపట్టాల్సిందే. – గంగుల బిజేంద్రారెడ్డి, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే ఎన్నికల ముందు కూటమి నేతలు నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామని చెప్పి ఇప్పుడు నకిలీ మద్యాన్ని ప్రజలకు అంటగడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతుంది. నకిలీ మద్యం గుట్టు పూర్తిగా వీడాలంటే రాష్ట్ర వ్యాప్తంగా వైన్షాపులు, బార్లు, బెల్ట్ షాపుల్లో ఎకై ్సజ్ శాఖ తనిఖీలు చేయాల్సిందే. – దారా సుధీర్, వైఎస్సార్సీపీ నందికొట్కూరు ఇన్చార్జ్ నంద్యాల: నకిలీ మద్యాన్ని తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్న టీడీపీ నాయకుల తీరు, కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా ఎకై ్సజ్ కార్యాలయాల ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు మహిళలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ‘నారా వారి నకిలీ మద్యం వద్దు.. ప్రజల ప్రాణాలే ముద్దు’ అంటూ మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జిల్లాలోని నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోన్, బనగానపల్లె, నందికొట్కూరు నియోజకవర్గ కేంద్రాల్లో నకిలీ మద్యం అమ్మకాలను అరికట్టాలని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ర్యాలీలు, నిరసనలు నిర్వహించారు. నకిలీ మద్యం అమ్మకాలు ఆపి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతూ జిల్లా కేంద్రం నంద్యాలలో నూనెపల్లె నుంచి ఎకై ్సజ్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి గంట పాటు ఎకై ్సజ్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. సీఎం డౌన్.. డౌన్.. నారా వారి నకిలీ మద్యం వద్దు.., విచ్చలవిడి మద్యం అమ్మకాలను అరికట్టాలి.. అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎకై ్సజ్ సీఐ కృష్ణమూర్తికి వినతి పత్రం అందజేశారు. వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షు డు దాల్మిల్ అమీర్, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశికళారెడ్డిలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇటీవల బట్టబయలైన నకిలీ మద్యం తయారీ, సరఫరా చూస్తే ప్రజల్లో ఆందోళన కలుగుతుందన్నారు. కేవలం స్పిరిట్, రసాయనాలతో తయారు చేసి, పాపులర్ బ్రాండ్లను తలపించేలా బాటిళ్లపై నకిలీ లేబుల్స్ అతికించి యథేచ్ఛగా సరఫరా చేస్తూ అమ్ముతున్నారంటే వారి వెనుక టీడీపీ నాయకులు ఉన్నారని అందరికీ అర్థమవుతుందన్నారు. నకిలీ మద్యం గుట్టు పూర్తిగా తేల్చేందుకు ఈ కేసును దమ్ముంటే సీబీఐకి కూటమి ప్రభత్వం అప్పగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, వైఎస్సార్సీపీ నాయకులు కల్లూరి రామలింగారెడ్డి, అనిల్ అమృతరాజ్, రసూల్ ఆజాద్, తదితరులు పాల్గొన్నారు. ● ఆళ్లగడ్డలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త గంగుల బిజేంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నకిలీ మద్యంపై నిరసన కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గంలోని ఆరు మండలాలతో పాటు పట్టణంలోని మహిళా కార్యకర్తలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించి అక్కడ దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం ర్యాలీగా ఎకై ్సజ్ కార్యాలయానికి చేరుకుని ఎకై ్సజ్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ● నారావారి నకిలీ మద్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బనగానపల్లెలో నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకుడు కాటసాని తిరుపాల్రెడ్డి ఇంటి వద్ద నుంచి బస్టాండ్ సమీపంలో ఉన్న ఎకై ్సజ్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఎకై ్సజ్ ఎస్ఐ కమలాకర్కు వినతి పత్రం అందజేశారు. కల్తీ మద్యంపై విచారణను రాష్ట్ర ప్రభుత్వం సిట్ అధికారులతో కాకుండా సీబీఐకి అప్పగించాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ● ఆత్మకూరు పట్టణంలోని ఎకై ్సజ్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్సీపీ పట్టణ, మండల అధ్యక్షులు రాజమోహన్ రెడ్డి, సయ్యద్ మీర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి ఎక్సైజ్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి ఎకై ్సజ్ ఎస్ఐ వీరస్వామికి వినతి పత్రం అందజేశారు. ● నకిలీ మద్యం అమ్మకాలపై వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు డోన్ పట్టణంలో వైఎస్సార్సీపీ నేతలు ఎకై ్సజ్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. పార్టీ వాలంటరీ విభాగం జిల్లా అధ్యక్షుడు పోస్ట్ ప్రసాద్, జెడ్పీటీసీలు బద్దుల రాజకుమార్, వైఎస్సార్సీపీ మండలాధ్యక్షులు సోమేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు కార్పొరేషన్ మేయర్ బీవై రామయ్య ఆధ్వర్యంలో సోమవారం కర్నూలులో మహిళలు కదం తొక్కారు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కోట్ల సర్కిల్ (పాత కంట్రోల్ రూమ్) వద్ద నుంచి ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం వరకు పార్టీ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ‘నకిలీ మద్యంతో ప్రాణాలు తీస్తున్న కూటమి ప్రభుత్వం’ అంటూ భారీ బ్యానర్ చేత పట్టి ఎన్–బ్రాండ్ లిక్కర్ను అరికట్టాలంటూ నినాదాలు చేశారు. డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఎదుట దాదాపు రెండు గంటల పాటు బైఠాయించారు. ప్రజల ప్రాణాలు హరిస్తున్న టీడీపీ నాయకుల వైఖరి, కూటమి ప్రభుత్వం మద్యం విధానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎకై ్సజ్ కార్యాలయం గేటు వద్ద మద్యాన్ని పారబోసి నిరసన తెలియజేశారు. అనంతరం ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. పల్లెల్లో బెల్టు షాపుల ద్వారా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ఏఈఎస్ను నాయకులు నిలదీశారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు శివారెడ్డి, హనుమంత రెడ్డి, కార్పొరేటర్లు చిట్టెమ్మ, అరుణ, లక్ష్మిరెడ్డి, సుదర్శన్రెడ్డి, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నకిలీ మద్యం అమ్మకాలను నిరసిస్తూ నందికొట్కూరులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ దారా సుధీర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని పటేల్ సెంటర్ నుంచి ఎకై ్సజ్ శాఖ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వ తీరును అడుగడుగునా ఎండగట్టారు. మద్యం సీసాలు పగులగొట్టి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఎకై ్సజ్ కార్యాలయాల ఎదుట నిరసనలు తరలి వచ్చిన మహిళలు, ప్రజలు, పార్టీ శ్రేణులు నకిలీ మద్యంపై సీబీఐతో విచారణ చేయాలని డిమాండ్ కూటమి ప్రభుత్వ తీరుపై మండిపాటు -
చారిత్రక వారసత్వ సంపదను పరిరక్షిద్దాం
నంద్యాల(వ్యవసాయం): చారిత్రక వారసత్వ సంపదను పరిరక్షిద్దామని డీఈఓ జనార్దన్ రెడ్డి అన్నారు. ఇంటాక్ నంద్యాల చాప్టర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ సదస్సు స్థానిక గురురాజా పాఠశాలలో సోమవారం ప్రారంభమైంది. ఇంటాక్ సంస్థ నంద్యాల చాప్టర్ అధ్యక్షులు శివకుమార్రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన సదస్సులో డీఈఓ మాట్లాడుతూ భారతీయ కళలు సంస్కృతి వారసత్వ సంపద చాలా గొప్పవని, వాటి వైభవాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కో కన్వీనర్ సేతురామన్ గురురాజా స్కూల్ డైరెక్టర్ షావలి రెడ్డి, సుబ్బయ్య పాల్గొన్నారు. -
విద్యార్థులూ.. వీరగాథలు రాద్దాంరండి!
నంద్యాల(న్యూటౌన్): విద్యార్థుల్లో సృజనాత్మకతతో పాటు దేశభక్తిని పెంపొందించేందుకు జాతీయ విద్యా, రక్షణ శాఖలు సంయుక్తంగా వీరగాథ 5.0 పేరుతో ఆయా విభాగాల్లో పోటీలను నిర్వహిస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహిస్తుంది. 3 నుంచి 12వ తరగతి (ఇంటర్) వరకు విద్యార్థులకు నాలుగు విభాగాల్లో పోటీలు చేపడుతున్నారు. విద్యార్థులు దేశభక్తిని పెంపొందిస్తూ, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల గాథలను వివరించడం, వారి త్యాగాలను తెలిపేలా విద్యార్థులకు పద్యాలు, కథలు, చిత్రలేఖనం, వ్యాసరచన, మల్టీమీడియా ప్రదర్శన వంటి పోటీలు నిర్వహిస్తున్నారు. వివిధ పోటీల్లో పాల్గొనే వారికి ఈ నెల 31వ తేదీ గడువు ఇచ్చారు. ఇప్పటికే ఈ పోటీలకు సంబంధించి జిల్లా విద్యా శాఖ ఆయా పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేశారు. వీరగాథ 5.0 పోటీల్లో పాల్గొనే విద్యార్థులు వారికి నచ్చిన అంశాలను ఎంచుకునే అవకాశాన్ని కల్పించారు. దేశం కోసం అత్యున్నత త్యాగం చేసిన వారిని రోల్ మోడల్గా ఎందుకుని, వారి నుంచి నేర్చుకున్న విలువలను ప్రస్తావించాలి. ఆ విద్యార్థికి అవకాశమిస్తే ఏం చేయదలిచాడో చెప్పాలి. ఉదాహరణకు ఝాన్సీ లక్ష్మీబాయి కలలోకి వచ్చి దేశానికి సేవ చేయాలని కోరితే ఏం చేస్తాడో వివరించవచ్చు. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటును తాను ఆదర్శంగా తీసుకున్న స్వాతంత్య్ర సమరయోధుల జీవిత కథలు విద్యార్థిపై ఎలా ప్రభావితం చేసిందో చెప్పాల్సి ఉంటుంది. అలాగే స్వాతంత్య్ర పోరాటంలో గిరిజనుల తిరుగుబాటు పాత్ర, ఇతర అంశాలను ఎంపిక చేసుకుని వివరించవచ్చు. నాలుగు విభాగాల్లో.. జిల్లాలోని పాఠశాలల వారీగా వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. 3–5 తరగతులకు ఓ విభాగంగా, 6–8, 9–10, 11–12 తరగతులకు వేర్వేరు కేటగిరీలుగా విభజించారు. 3–5 తరగతుల వారికి పద్యం, కథ (150 పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, 6–8 తరగతుల వారికి పద్యాలు/ కథ(300 పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, మల్టీమీడియా ప్రదర్శన. 9–10 తరగతుల వారికి పద్యాలు, వ్యాసం (700 పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, మల్టీమీడియా ప్రదర్శన. 11–12 తరగతుల వారికి పద్యాలు, వ్యాసం (వెయ్యి పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, మల్టీ మీడియా ప్రదర్శన ఉంటుంది. ఒకటి లేదా రెండు నిమిషాల నిడివితో దేశభక్తికి సంబంధించిన ప్రదర్శన వీడియో రూపంలో ఇవ్వడమే మల్టీమీడియాగా పరిగణిస్తారు. ప్రతిభ కనబరుస్తూ.. నంద్యాల జిల్లా పరిధిలో ఉన్న 1,849 ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో 2,77,625 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఆయా పాఠశాలల్లో తరగతులు, కేటగిరీల వారీగా ఉపాధ్యాయులు పోటీలు నిర్వహిస్తున్నారు. పలు వురు విద్యార్థులు సొంతంగా దేశభక్తిని పెంపొందించేలా చిన్న వీడియోలు రూపొందిస్తున్నారు. నమోదు విధానం ఇలా..ఆయా పాఠశాలల విద్యార్థులకు ఉపాధ్యాయులు కేటగిరీలుగా, తరగతుల వారీగా పోటీలు నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న విద్యార్ధులకు పోటీలు నిర్వహించి, వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఇందుకు ఇన్నోవేటివ్ ఇండియా మై జీవోవీ, ఇన్/వీర్గాథ 5.0 అనే వెబ్సైట్లో నమోదు చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ యువర్ ఎంట్రీ అని ఉన్న చోట క్లిక్ చేసి వివరాలను నమోదు చేయాలి. ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల నుంచి అత్యుత్తమమైన నాలుగు ఎంట్రీలను అప్లోడ్ చేయాలి. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఉత్తమంగా ఎంపిక చేసిన వాటిని జాతీయ స్థాయికి పంపిస్తారు. జాతీయ స్థాయిలో ఒక్కో విభాగంలో 25 మంది వంతున అత్యుత్తమ ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున నగదు పారితోషికాన్ని, ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు. కేటగిరీలుగా వివిధ అంశాలపై నిర్వహణ నాలుగు విభాగాల్లో విద్యార్థులకు పోటీలు 3 నుంచి 12 తరగతుల వారికి పలు పోటీలు ఈనెల 31తో ముగియనున్న గడువు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు -
ప్రధాని పర్యటనకు పటిష్ట బందోబస్తు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 16న భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను పురస్కరించుకుని పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. ఆదివారం ఆయన శ్రీశైలంలో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాని పర్యటించే ప్రదేశాలైన హెలిపాడ్, సున్నిపెంట నుంచి శ్రీశైలం రోడ్డు మార్గం, భ్రమరాంబా అతిథిగృహం, ఆలయ పరిసరాలు తదితర ప్రాంతాల్లో ఎస్పీ పర్యటించి భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రధాని ఈ నెల 16న శ్రీశైలం చేరుకుని శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను దర్శించుకోనున్నారని, ఈ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే శ్రీశైలం పరిసరాలు, నల్లమల అడవుల్లో గ్రేహౌండ్స్ సాయుధ బలగాలతో కూంబింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆయన వెంట ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్, శ్రీశైలం, సున్నిపెంట సీఐలు ప్రసాదరావు, చంద్రబాబు ఉన్నారు. -
ముగిసిన పవిత్రోత్సవాలు
● పూర్ణాహుతితో ఘనంగా ముగిసిన అహోబిల పవిత్రోత్సవాలు ● గోవింద నామస్మరణతో హోరెత్తిన నల్లమల ఆళ్లగడ్డ: దిగువ అహోబిలంలో వెలసిన శ్రీప్రహ్లాదవరదస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు ఆదివారం తెల్లవారుజామున పూర్ణాహుతితో ముగిశాయి. శనివారం రాత్రి నుంచి వైభవోపేతంగా పూజలు ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి శ్రీ రంగరాజ యతీంత్ర మహాదేశికన్ స్వామీజీ ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదులకు ముందుగా గ్రామోత్సవం, రాత్రి నిత్యపూజ అనంతరం శాంతి హోమాలు నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి, అర్ధరాత్రి అనంతరం ఉత్సవ మూర్తులైన స్వామి అమ్మవార్లకు తిరుమంజనం, సంప్రోక్షణం చేపట్టారు. ఆదివారం తెల్లవారు జామున శాత్తుమురై గోష్టితో పవిత్రోత్సవ కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమాలను అహోబిలం ప్రధానార్చకులు శ్రీమాన్ శఠకోప వేణుగోపాలన్, మణియార్ సౌమ్యానారాయణ్ ఆధ్వర్యంలో వివిధ ప్రదేశాల నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన వేద పాఠశాలల పండితులు నిర్వహించారు. ఏడాది పొడువునా ఆలయంలో నిర్వహించే నిత్య కైంకర్యాలు, వార, మాస, వార్షిక మహోత్సవాలు, ఇతరత్రా పూజాది కార్యక్రమాల్లో తెలసీ తెలియక చేసిన తప్పుల వలన ఏర్పడిన దోషాలకు నివారణగా ఏటా నియమనిష్టలతో పవిత్రోత్సవా లు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ ప్రదేశాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. -
పోటీలతో సృజనాత్మకత వెలికి
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత ఈ పోటీల ద్వారా బయటకు వస్తుంది. వీరగాథ 5.0 పోటీలను అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు నిర్వహించిన పోటీలు, మల్టీమీడియా వీడియోలు ఆన్లైన్లో నమోదు చేయాలి. – జనార్దన్రెడ్డి, డీఈఓ, నంద్యాల విద్యార్థులు దేశ భక్తిని చాటేలా వీరుల గాథలు వారిలో స్ఫూర్తి నింపేలా పోటీలు నిర్వహించాలి. విద్యార్థుల ప్రతిభ జాతీయ స్థాయిలో కనబరిచేలా ఉపాధ్యాయులు విద్యార్థులను మార్గదర్శకత్వం చేయాలి. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసే చక్కటి కార్యక్రమం. వీరగాథ 5.0 కార్యక్రమం విద్యార్థుల్లో దేశ భక్తిని పెంపొందిస్తుంది. విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలి. – ప్రేమాంతకుమార్, అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్, సమగ్రశిక్ష, నంద్యాల -
కుటుంబాలు వీధిన పడుతున్నాయి
అధికార పార్టీ నాయకుల ధన దాహంతో సామాన్య, పేదల కుటుంబాలు వీధిన పడుతున్నాయి. పల్లెల్లో బెల్ట్షాపులు ఏర్పాటు చేయడంతో కొందరు మద్యానికి బానిసలవుతున్నారు. రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్మును మద్యానికి పెట్టాల్సి వస్తోంది. పేదలకు మెరుగైన వైద్యం, విద్యనందించాల్సిన కూటమి ప్రభుత్వం మద్యాన్ని బెల్ట్షాప్ల ద్వారా డోర్ డెలివరి చేయడం ఎంత వరకు సమంజసం. – సుమలత సురేష్, వార్డు కౌన్సిలర్, డోన్కూటమి ప్రభుత్వం సంపద సృష్టి అంటూ పేదల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యం విక్రయాలను నియంత్రిస్తూ సంపూర్ణ మద్యపాన నిషేధం అమలుకు దశల వారీగా ప్రయత్నిస్తే కూటమి ప్రభుత్వం ఊరూరా బెల్ట్ షాప్లు నడపుతుండటం దారుణం. పల్లెల్లో జనావాసాల మధ్య మద్యం విక్రయాలు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడం శోచనీయం – పసుల కీర్తి, వైఎస్సార్సీపీ జిల్లా వలంటీర్ విభాగం అధ్యక్షురాలు ● -
మోదీ పర్యటనను విజయవంతం చేద్దాం
కర్నూలు(సెంట్రల్): ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్నూలు జిల్లా పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని మంత్రులు బీసీ జనార్థన్రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, టీజీ భరత్ అధికారులను ఆదేశించారు. శనివారం నన్నూరు సమీపంలోని రాగమయూరిలో జరుగుతున్న ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రులు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, పీఎం ప్రోగ్రామ్ నోడల్ అధికారి వీరపాండియన్, కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్పాటిల్ తదితరులు పరిశీలించారు. అనంతరం అక్కడే ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాట్లపై అధికారులతో మంత్రులు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ మాట్లాడుతూ స్థానికంగా టోల్ గేట్ వల్ల ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో 16వ తేదీన టోల్ఫీజు లేకుండా వాహనాలను వదలాలని ఆదేశించారు. ప్రధానమంత్రి ప్రోగ్రామ్ నోడల్ అధికారి వీరపాండియన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో శ్రీశైలం, కర్నూలులో భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. శ్రీశైల దర్శనం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ప్రధానమంత్రి మోదీ బహిరంగసభలో పాల్గొంటారన్నారు. సభా ప్రాంగణంలోకి పెన్నులు, నోటుబుక్లు, మ్యాచ్ బాక్సులు, సిగరెట్లు, స్నాక్స్ వంటివి అనుమతించకూడదని, కేవలం నీటిని మాత్రం కప్ల ద్వారా ట్రేలలో అందిస్తారన్నారు. సెక్యూరిటీ పరంగా 250 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇదిలాఉంటే ఆదివారం ప్రధానమంత్రి పర్యటించే రూట్లన్నీ ఎస్పీజీ సెక్యూరిటీ ఆధీనంలోకి వెళ్తాయని ఎస్పీ వెల్లడించారు. కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేష్, విజయ సునీత, శివ్ నారాయణ్, డాక్టర్ బి.నవ్య, గణేష్కుమార్, గీతాంజలి, జేసీ నూరుల్ ఖమర్, ఆదోని సబ్ కలెక్టర్ భరద్వాజ్ పాల్గొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత
● నూతన జాయింట్ కలెక్టర్ కొల్ల బత్తుల కార్తీక్ నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని నూతన జాయింట్ కలెక్టర్ కొల్లబత్తుల కార్తీక్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని జేసీ చాంబర్లో అధికారుల సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరిపాలనలో సమర్థత, పారదర్శకతను బలోపేతం చేసే దిశగా కృషి చేస్తానన్నారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే దిశగా అధికారులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. బాణసంచా విక్రయాల్లో నిబంధనలు పాటించాలి నంద్యాల: దీపావళి సందర్భ ంగా బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాలు, దుకాణాలలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ ఎం.జావళి హెచ్చరించారు. శనివారం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినా, విక్రయించిన వారిపై పేలుడు పదార్థాల చట్టం ప్రకారం చర్యలు తప్పవన్నారు. ప్రమాదాలకు తావులేకుండా, సరైన భద్రతా ప్రమాణాలు, సూచనలు పాటిస్తూ షాప్లు ఏర్పాటు చేసుకుని టపాసులను విక్రయించాలన్నారు. జనసంచారం, ప్రజల నివాస ప్రాంతాలలో టపాసులు విక్రయించరాదని, ప్రభుత్వ అధికారులు నిర్దేశించిన ప్రదేశాలలో మాత్రమే నిబంధనల ప్రకారం దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నీరు, ఇసుక, తదితర అగ్నిమాపక సామగ్రిని తప్పనిసరిగా టపాసుల విక్రయ దుకాణాల్లో సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎవరైనా అక్రమంగా టపాసులు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 112 లేదా సంబంధిత పోలీసు స్టేషన్కు సమాచారం అందించాలన్నారు. బిట్కాయిన్ పెట్టుబడుల పేరుతో మోసాలు కర్నూలు: బిట్కాయిన్ పెట్టుబడుల విషయంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా ప్రజలకు సూచించారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పెట్టుబడులు పెడితే లాభాలు వస్తున్నాయంటూ ఫాలోయర్లకు నకిలీ లింకులు పంపుతున్నారని, బిట్కాయిన్ను క్రిప్టో కరెన్సీలలో మదుపు చేస్తే లాభాలంటూ స్నేహితులకు సందేశాలు పంపుతున్నట్లు పేర్కొన్నారు. లాభాలు వచ్చినట్లు కొన్ని ఫొటోలు చూపించి ఆశ కల్పిస్తారని, ఆ సందేశాలు చూసి కొందరు లింకు ద్వారా రూ.లక్షల్లో నగదు పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారని తెలిపారు. ముఖ్యంగా టెలిగ్రామ్, ఫేస్ బుక్లలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి లింకులు వస్తే అసలు క్లిక్ చేయవద్దని సూచించారు. సైబర్ మోసానికి ఎవరైనా గురైతే వెంటనే సైబర్ క్రైం 1930 హెల్ప్లైన్ నెంబర్కు, అలాగే www.cyber crime.gov.inలో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. -
అంతర పంటల సాగుపై దృష్టి సారించాలి
బనగానపల్లె రూరల్: అంతర పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి మద్దిలేటి అన్నారు. శనివారం యాగంటిపల్లె గ్రామ సమీపంలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో ధన ధాన్య కృషి యోజనపై రైతులకు కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన అధికారి ధనలక్ష్మీ అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి మద్దిలేటి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ధన ధాన్య కృషి యోజన ద్వారా పుప్పుధాన్యాలు, పశుపోషణ, ఫుడ్ ప్రాసెసింగ్కు సంబంధించి కార్యక్రమాలను ప్రారంభించిందన్నారు. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహాయ సంచాలకులు డాక్టర్ జాన్సన్ మాట్లాడుతూ.. పూర్వం దేశం పంటల ఉత్పత్తుల్లో మొదటి స్థానంలో ఉండేదని, కాలక్ర మేణా వాతావరణ ప్రభావం వల్ల 24 రకాల పంటల ఉత్పాదకత తగ్గిందన్నారు. పంటల సరళిలో మార్పులు చేపట్టి దిగబడులు పొందాలని కేవీకే శాస్త్రవేత్తలు సుధాకర్, బనగానపల్లె మార్కెట్యార్డు చైర్మన్ కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి సూచించారు. ఈ సందర్భంగా రైతులకు సబ్సిడీ శనగ విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్యార్డు వైస్ చైర్మన్ భూషన్న, మండల వ్యవసాయాధికారి సుబ్బారెడ్డి, కేవీకే ఏఈ సురేష్, బనగానపల్లె గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ బురానుద్దిన్ ప్రకృతి వ్యవసాయం సిబ్బంది రైతులు పాల్గొన్నారు. -
విత్తుకోని ఆశలు.. పొలాలు బీళ్లు!
కర్నూలు (అగ్రికల్చర్): రెక్కల కష్టాన్ని నమ్ముకున్న రైతుకు అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. ఎరువులు అందక, ప్రకృతి సహకరించక, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం లేక నష్టాలే మిగులుతున్నాయి. ఖరీఫ్లో వేసిన పంటలన్నీ మట్టిపాలయ్యాయి. అరకొర పండిన పంటలకు మార్కెట్లో మద్దతు ధర కూడా లభించక మట్టి మనిషికి కన్నీళ్లే దిక్కయ్యాయి. రబీపై ఆశలు పెట్టుకున్నా.. బ్యాంకులు రుణాలు ఇవ్వకుండా మొండికేశాయి. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు ఇప్పటి వరకు పంపిణీ చేయకపోవడంతో చాలా పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. అవసరం ఎక్కువ... కేటాయింపు తక్కువ జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు 4.22 లక్షల హెక్టార్లు ఉండగా 3.85 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ప్రకృతి వైపర్యీతాలతో గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని పంటలు దెబ్బతిని 2.50 లక్షల మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. రబీలో శనగ సాగు చేద్దామనుకుంటే సబ్సిడీ విత్తనాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. విత్తనం వేయకపోవడంతో పొలాలు బీళ్లుగా దర్శనం ఇస్తున్నాయి. జిల్లాకు 46 వేల క్వింటాళ్ల శనగ విత్తనాలు అవసరం అవుతాయని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించగా 23,897 క్వింటాళ్లు మాత్రమే కేటాయించింది. వీటిలో 10 వేల క్వింటాళ్లు ఏపీ సీడ్స్లో ఉన్నాయి. ప్రయివేటు విత్తన కంపెనీల దగ్గర శనగ విత్తనాలు ఉన్నప్పటికీ గత ఏడాదికి సంబంధించిన బకాయిలను ఇప్పటికి చెల్లించలేదు. ఉన్న అరకొర విత్తనం ఎవరికి పంపిణీ చేయాలో తెలియక వ్యవసాయ అధికారులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. రబీలో శనగతో పాటు వేరుశనగ, జొన్న తదితర పంటలు సాగు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం శనగ విత్తనాలను మినహా ఇతర విత్తనాలు సబ్సిడీపై పంపిణీ చేయడానికి తీసుకున్న చర్యలు శూన్యం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం నిల్ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమాకు ఎగనామం పెట్టింది. కేంద్ర వాటా విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఖరీఫ్ ప్రారంభంలోనే కొన్ని పంటలు దెబ్బతిన్నా పరిహారం ఇవ్వలేదు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 చెల్లిస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.14 వేలకు కుదించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంట రుణాల పంపిణీలో నిర్లక్ష్యం రైతులకు ఎటువంటి హామీ లేకుండానే రూ.2లక్షల వరకు రుణాలు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే ఆ దిశగా ఎటువంటి చర్యలు లేవు. పంటరుణాల పంపిణీలో కొన్ని బ్యాంకులు తీవ్ర అలసత్వం వహించాయి. ఖరీఫ్ సీజన్ సెప్టెంబరు నెల చివరితోముగిసింది. ఖరీఫ్లో రూ.3,635.62 కోట్లు పంట రుణాలుగా పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించినా రూ.2,537.61 కోట్లు మాత్రమే పంపిణీ చేసినట్లు స్పష్టం అవుతోంది. పలు బ్యాంకులు కొత్త రైతులకు రుణాలు ఇచ్చిన దాఖలాలు లేవు. రబీ సీజన్లో రూ.2,526.44 కోట్లు పంపిణీ చేయాలనేది లక్ష్యం. ఖరీఫ్లో రైతులకు మొండిచెయ్యి చూపిన బ్యాంకులు రబీలో పంపిణీ చేయడం అనుమానమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎరువులు అందేనా? రబీ సీజన్లో శనగ, జొన్న, వాము, వరి, వేరుశనగ తదితర పంటలు కర్నూలు జిల్లాలో 1.01 లక్షలు, నంద్యాల జిల్లా 1.73 లక్షల హెక్టార్లలో సాగయ్యే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాకు లక్ష టన్నులు, నంద్యాల జిల్లాకు 1.52 లక్షల ఎరువులు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించింది. రబీలోనూ ఎరువుల సమస్య వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధర ఎక్కువ.. సబ్సిడీ తక్కువ బహిరంగ మార్కెట్లో శనగల కిలో ధర గరిష్టంగా రూ.55 వరకు మాత్రమే ఉంది. ప్రభుత్వం సబ్సిడీ పోను కిలో శనగ విత్తనాలను రూ.58.50 ప్రకారం పంపిణీ చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధిక ధర నిర్ణయించి సబ్సిడీ మాత్రంగా 25 శాతానికే పరిమితం చేయడంతో రైతులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ప్రభుత్వం రైతులకు పంపిణీ చేసే శనగ విత్తనాలు కిలో ధరను రూ.78గా నిర్ణయించింది. ఇందులో 25శాతం సబ్సిడీ (రూ.19.50) పోగా రైతులు కిలోకు రూ.58.50 చెల్లించాల్సి ఉంది. బహిరంగ మార్కెట్లో ఇంతకంటే తక్కువ ధరకు లభిస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు. ఆంద్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ 20కిలోల ప్యాకెట్లతో శనగ విత్తనాలు సిద్ధం చేస్తోంది. ఎకరాకు 80కిలోల శనగలు అవసరం. అయితే ఎకరాకు 60 కిలోలు(3 ప్యాకెట్లు) మాత్రమే పంపిణీ చేయనున్నారు. భూమిని బట్టి ఎకరాకు గరిష్టంగా 10 ప్యాకెట్లు( 2 క్వింటాళ్లు) పంపిణీ చేస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రారంభమైన రబీ అతీగతీ లేని సబ్సిడీ విత్తనాలు అరకొరగా పంట రుణాల పంపిణీ వేధిస్తున్న ఎరువుల సమస్య పొంచి ఉన్న అధిక వర్షాల గండం -
శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి బారులుదీరారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. పలువురు భక్తులు ఆన్లైన్ ద్వారా టికెట్లు పొంది స్వామివారి స్పర్శదర్శనం నిర్వహించుకున్నారు. గాలేరు నగరి గేట్లు మూసివేత అవుకు(కొలిమిగుండ్ల): అవుకు రిజర్వాయర్కు సంబంధించి చెర్లోపల్లె సమీపంలో ఉన్న గాలేరు నగరి వరద కాల్వకు చెందిన గేట్లను శనివారం ఎస్సార్బీసీ అధికారులు మూసివేశారు. ఇటీవల రిజర్వాయర్ రివిట్మెంట్ కుంగిపోవడంతో నీళ్లను గాలేరు నగరి వరద కాల్వ ద్వారా వైఎస్సార్ కడప జిల్లాకు విడుదల చేశారు. ఎస్సార్బీసీ కాల్వ ద్వారా రిజర్వాయర్కు ఇన్ఫ్లో తగ్గడంతో గేట్లు బంద్ చేశారు. రిజర్వాయర్లో రివిట్మెంట్ కుంగక ముందు నాలుగు టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 2.40 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కమనీయం.. ప్రహ్లాదవరదుడి పవిత్రోత్సవం ఆళ్లగడ్డ: అహోబిలంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం తెల్లవారు జామున మూలవిరాట్ శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవార్లకు నిత్య పూజల అనంతరం పవిత్ర యాగశాలలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరద స్వామి ఉత్సవమూర్తుల ను కొలువుంచి నవకలశ స్నపనం, ద్వారతోరణ పూజ, మండల ప్రతిష్ట, కుంభ ప్రతిష్ట నిర్వహించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పవిత్ర హోమం చేపట్టారు. రాత్రి ఉత్సవ మూర్తులను పల్లకీలో వుంచి గ్రామోత్సవం నిర్వహించారు. నూతన టీచర్లకు నేడు ఆర్డర్లు కర్నూలు సిటీ: ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ ప్రక్రి యలో భాగంగా ఇండక్షన్ ట్రైనింగ్ పూర్తయ్యింది. నూ తన ఉపాధ్యాయులను స్కూళ్లకు కేటాయించేందుకు నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ శనివారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలో విద్యార్థుల సంఖ్య కు తగ్గట్టు 4,168 టీచర్ల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. అయితే ఏప్రిల్లో 2,678 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. రాత పరీక్షలో ఎంపికైన 2,590 మందికి ఈ నెల 3 నుంచి నిర్వహించిన ఇండక్షన్ ట్రైనింగ్ ఈ నెల 10న ముగిసింది. ఇద్దరు మినహా మిగిలిన వారందరూ శిక్ష ణ పూర్తి చేసుకున్నారు. వీరిలో 1,765 ఎస్జీటీల కు మాన్యువల్గా, మిగిలిన స్కూల్ అసిస్టెంట్స్ కు వెబ్ ఆప్షన్స్ ఇచ్చి కౌన్సెలింగ్ పూర్తి చేశారు. కౌన్సెలింగ్కు హాజరైన వారందరికీ ఆదివారం ఆర్డర్లు జారీ చేయనున్నారు. వీరందరూ కేటాయించిన స్కూళ్లలో సోమవారం చేరనున్నారు. -
‘కూటమి’ నేతలు భయపడుతున్నారు
కూటమి ప్రభుత్వం ఆదాయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైన్షాప్లు, బెల్టు దుకాణాల్లో కల్తీ మద్యం విక్రయించి ప్రజల ప్రాణాలు తీస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి ఆరోపించారు. ఇందుకు నిరసనగా మహిళలతో ఎకై ్సజ్ పోలీస్టేషన్ల ఎదుట రానున్న రోజుల్లో ధర్నా చేపడతామన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అక్టోబర్ 10 నుంచి నవంబర్ 22 వరకు రచ్చబండ కార్యక్రమం ద్వారా వాడవాడలా కోటి సంతకాల సేకరణకు శ్రీకారం చుడుతున్నామన్నారు. అక్టోబర్ 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో కార్యకర్తలతో కలిసి ర్యాలీలు నిర్వహించబోతున్నామని వివరించారు. బొమ్మలసత్రం: రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్మోన్రెడ్డికి తోడుగా వైఎఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఉద్యమం కొనసాగించాలని వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. పేద విద్యార్థులు వైద్య విద్య అభ్యసించేందుకు, ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో 17 నూతన మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడితే వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరంచేసి నిర్వీర్యం చేస్తోందన్నారు. ప్రజల తరఫున పోరాటం చేయాలన్నారు. నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్హాల్లో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంథ్రనాధ్రెడ్డి ముఖ్యఅతిఽథులుగా, పార్లమెంట్ పరిశీలకురాలు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, గంగుల బిజేంద్రనాఽథ్రెడ్డి, నందికొట్కూరు ఇన్చార్జ్ దారా సుధీర్, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి హాజరయ్యారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల్పర్పించారు. వైఎస్సార్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్లను ఆవిష్కరించారు. ‘జగనన్న విజన్’ అనే డాక్యుమెంటరీని ప్రదర్శించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అధికారంలోకి వచ్చాక మోసం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరిందన్నారు. అనేక సంక్షేమ పథకాలను అందిస్తామని ‘కూటమి’ నేతలు కల్లబొల్లి హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక మోసం చేశారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ‘సూపర్ సిక్స్’లో భాగంగా చెప్పిన ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అందించలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదన్నారు. అన్నదాతలు పంటలను రోడ్లపై పడేస్తుండటం చూస్తే కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే నెల 22 వరకు కోటి సంతకాల సేకరణ కల్తీ మద్యం, బెల్టు దుకాణాలు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం మెడలు వంచాలంటే గ్రామ, మండల, నియోజకవర్గాల్లో కమిటీల ద్వారా కార్యకర్తలను కలుపుకుంటూ ఉద్యమబాటను కొనసాగించాలన్నారు. వచ్చే నెల 22 వరకు కోటి సంతకాల సేకరణను తలపెట్టాలన్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈనెల 28న ర్యాలీలు నిర్వహించాలని, వచ్చే నెల 12న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పల్లె ప్రాంతాల్లో కల్తీ సారాతో, బెల్టు దుకాణాల్లో కల్తీ మద్యంతో పేదల ప్రాణాలు పోతున్నాయని, దీన్ని వ్యతిరేకిస్తూ మహిళలతో కలిసి ఎకై ్సజ్ కార్యాలయాల ముట్టడికి సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశానికి హాజరైన వైఎస్సార్సీపీ నేతలు జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి వైఎస్సార్సీపీ ఎస్ఎస్ఈసీ మెంబర్లు పీపీ నాగిరెడ్డి, కల్లూరి రామలింగారెడ్డి, గోపవరం సాయినాథ్రెడ్డి, ఆళ్లగడ్డ బాబులాల్, చల్లా విఘ్నేష్రెడ్డి, పోచా జగదీశ్వరరెడ్డి, మలికి రెడ్డి వెంకట సుబ్బారెడ్డి హాజరయ్యారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులు బుడ్డా శేషిరెడ్డి, దేశం సుధాకర్రెడ్డి, భూమా కిషోర్రెడ్డి, గుండం సూర్యప్రకాష్రెడ్డి , పీపీ మధుసుదన్రెడ్డి, రాష్ట్రకార్యదర్శి చల్లా మధుసుదన్రెడ్డి, స్టేట్ జాయింట్ సెక్రెటరీలు అబ్ధుల్ రజాక్, మల్లు సురేంద్రనాథ్ రెడ్డి, స్టేట్ వైఎస్సార్టీయూసీ జనరల్ సెక్రటరీ మోమిన్ మన్సూర్, మున్సిపల్ ఛైర్పర్సన్ మాబున్నిసా, జిల్లా ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్, సూర్యనారాయణరెడ్డి జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న వైఎస్సార్సీపీనేతలు నంద్యాల పట్టణంలో నిర్వహించిన వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదాయం కోసమే కల్తీ మద్యం! ఎన్నికల ముందు అమలుకు వీలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మరచిపోవడంతో ‘కూటమి’ నేతలు ప్రజల్లోకి రావాలంటేనే భయపడిపోతున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాఽథ్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అప్పుల విషయంలో అసెంబ్లీలో ఒక మాట అసెంబ్లీ బయట మరో మాట చెబుతోందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే పోలవరం ప్రాజెక్ట్ కోసం రూ. 12,900 కోట్లు కేంద్రం మంజూరు చేయిస్తే అది కూడా తామే చేశామని టీడీపీ నేతలు ప్రజలను తప్పు దోవపట్టిస్తున్నారన్నారు. రాజకీయాన్ని సేవగా భావించి వైఎస్సార్సీపీ కార్యకర్తలు ముందుకు నడవాలన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటం చేయాలన్నారు. -
ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
● అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 16న శ్రీశైల పుణ్యక్షేత్రానికి రానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లపైకలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలన్నారు. సున్నిపెంటలో హెలిపాడ్ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. హెలిపాడ్ నుంచి ప్రధానమంత్రి పర్యటించే ప్రదేశాల వరకు రహదారుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, లైటింగ్, పార్కింగ్ తదితర అంశాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర వైద్య సేవలకోసం నిపుణులైన వైద్యుల బృందాలను నియమించాలన్నారు. అంబులెన్న్స్లు, అవసరమైన వైద్య పరికరాలు సిద్ధంగా ఉంచాలని జీజీహెచ్ సూపరింటెండెంట్, డీసీహెచ్ఎస్ అధికారులను ఆదేశించారు. భ్రమరాంబ గెస్ట్ హౌస్, దేవస్థాన పరిధిలో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ రాము నాయక్, ఆర్డీఓ విశ్వనాథ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పల్లెల్లో పులి పంజా
దట్టమైన అడవుల్లో సంచరించే పెద్దపులులు, చిరుతలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఆహారం, నీటి కోసం అటవీ సమీప గ్రామాల్లో, కొండ కింద శివారు గ్రామాల్లో వన్యప్రాణుల సంచారం అధికమైంది. నల్లమల అటవీ ప్రాంతంతో పాటు, వెలిగొండ రిజర్వ్ ఫారెస్టు సమీప గ్రామాల్లో చిరుతలు, పెద్దపులులు తరచూ స్థానికుల కంటపడుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. పొలాల్లో పనులకు వెళ్లేందుకు రైతులు, పశువులను మేపేందుకు అడవిలోకి వెళ్లేందుకు పశుపోషకులు జంకుతున్నారు.కనిగిరిరూరల్/పెద్దదోర్నాల: నల్లమలలో కొన్ని రోజులుగా వన్యప్రాణుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇటీవల జరిగిన పులుల గణనలో పులుల సంతతి పెరిగిన విషయం తేలింది. ప్రసుతం నల్లమల అభయారణ్యంలో 85 వరకు పెద్దపులులు, లెక్కకు మించిన చిరుత పులులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వర్షాకాలం ఆరంభమైన నాటి నుంచి భారీ స్థాయిలో వర్షాలు కురవకపోవటంతో నల్లమలలో కొంత మేర నీటికి ఇబ్బందులతో పాటు పులుల ఆహార సమస్యలను తీర్చే సాంబార్, కణుతుల వంటి భారీ వన్యప్రాణుల సంచారం లేకపోవటంతో పులులకు ఆహార కొరత ఏర్పడింది. నీరు, ఆహారాన్ని వెతుక్కుంటూ పులులు అటవీ సమీప గ్రామాలకు వస్తుండటంతో స్థానికుల కంటపడుతున్నాయి. కొన్నిసార్లు పశువులపై దాడి చేస్తున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో సుమారు 48,500 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. 7 సెక్షన్లు, 16 బీట్లు ఉన్నాయి. ప్రధానంగా భైరవకోన, వెలిగొండ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని ప్రాంతాల్లో సుమారు 15 నుంచి 20 వరకు చిరుత పులులు సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కనిగిరి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని వెలిగొండ రిజర్వ్ ఫారెస్ట్లోని నాగిరెడ్డిపల్లి, వెదుళ్లచెరువు, గుడిపాటిపల్లి బీట్ల పరిధిలోని కొండ కింద శివారు గ్రామాల్లో చిరుత పులి సంచరిస్తోంది. వారం రోజుల క్రితం మరపగుంట్లలో పులి సంచరిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఫారెస్ట్ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పాదముద్రలు సేకరించి 3, 4 ఇంచుల పొడవు ఉన్నట్లు తెలిపారు. పాద ముద్రలను బట్టి అది పెద్దపులి కాదని నిర్ధారించారు. పెద్దపులి పాద ముద్రలు 7, 8 ఇంచుల పొడవు ఉంటాయన్నారు. అక్కడ ఉన్న పాదముద్రల నమూనాలను బట్టి చిరుత పులి, లేదా జంగు పిల్లి అయి ఉంటుందని ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. తాజాగా గత శనివారం రాత్రి ఇమ్మడిచెరువు, రాళ్లపల్లి మధ్య ప్రాంత పొలాల్లో, గ్రామ శివార్లలో బైక్పై వెళ్తున్న ఒకరు పులిని చూసినట్లు చెప్పాడు. దీంతో ఆదివారం ఫారెస్ట్ అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి పాదముద్రల నమూనాలను సేకరించారు. ఆ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇటీవల తుంగోడు, చెన్నపునాయినిపల్లి, మైలుచర్ల బొంతవారిపల్లి, పిల్లిపల్లి బీట్లలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో వన్య ప్రాణులతో పాటు చిరుత పులులు కనిపించినట్లు ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. యర్రగొండపాలెం రేంజ్ పరిధిలోనూ.. యర్రగొండపాలెం రేంజి పరిధిలోని కొలుకుల బీట్లో పెద్దపులి కనబడటంతో రైతులు భయంలో వణికిపోతున్నారు. గత ఆదివారం వ్యవసాయ పనులకు వెళ్తున్న రైతులకు పెద్దపులి కనిపించింది. దీంతో పొలాలకు వెళ్తున్న రైతులతో పాటు రైతు కూలీలు సైతం భయాందోళనతో వణికిపోతున్నారు. కొలుకుల బీటులోని అటవీ ప్రాంతంలో పెద్దదోర్నాల మండల పరిదిలోని పెద్ద»ొమ్మలాపురం రైతులకు చెందిన వ్యవసాయ భూములు ఎక్కువగా ఉండటంతో తరచూ వన్యప్రాణులతో సమస్యలు ఎదురవుతున్నాయి. పెద్దపులి సంచారం ఉన్న దేవలూడు ప్రాంతంలో గతంలోనే అటవీశాఖ బేస్ క్యాంపును ఏర్పాటు చేసింది. పులులకు ఆహారం దొరక్క పశువుల మందలు ఉన్న పెద్దదోర్నాల మండలం గండిచెరువు సమీప ప్రాంతాల్లో పెద్దపులుల సంచారం ఎక్కువగా ఉందని పశువుల కాపరులు పేర్కొంటున్నారు. దీనికి తోడు దేవలూడు ప్రాంతంలో నీటి నిల్వలు అధికంగా ఉండటం కూడా పులుల సంచారానికి మరో కారణమని పలువురు పేర్కొంటున్నారు. గతంలో పాలుట్లలో తన పొలానికి వెళ్లి తిరిగి వస్తున్న రైతు బాలునాయక్పై పెద్దపులి దాడి చేసి గాయపర్చగా, బొమ్మలాపురానికి చెందిన ఓ రైతు ఎద్దును సైతం పులి హతమార్చింది. గ్రామానికి చెందిన దేవలూడు, గండి చెరువు ప్రాంతాల్లోనే ఎక్కువ వ్యవసాయ భూములు ఉండటంతో బొమ్మలాపురం వాసులు ఆందోళన చెందుతున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలోనూ.. అర్థవీడు మండలంలోని కొత్తూరు, దొనకొండ, వెలగలపాయ, బొల్లుపల్లి, అచ్చంపేట, మాగుటూరు, మోహిద్దీన్పురం గ్రామాల పరిధిలో తరచూ పులి సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెలగలపాయ, దొనకొండ, మాగుటూరు సమీపంలోని అటవీ ప్రాంతాల్లో మేతకు వెళ్లిన పశువులపై పులి దాడి చేసి చంపేసిన ఘటనలు ఉన్నాయి. మొహిద్దీన్పురం వద్ద కారులో వెళ్తున్న కొందరికి పులి రోడ్డు దాటుతూ కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. కంభం మండలంలోని దర్గా కొండ సమీపంలో నెల రోజుల క్రితం పులి అడుగులు కనిపించడంతో ఫారెస్టు అధికారులు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. మండలంలోని సూరేపల్లి సమీపంలో కొండవద్ద పులి అడుగులు ఉన్నాయని స్థానికులు చెప్పగా ఫారెస్టు అధికారులు ట్రాప్ కెమెరాలు బిగించి పరిశీలించారు. వన్యప్రాణులు జనావాసాల్లోకి రాకుండా అటవీ శాఖాధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని, అటవీ ప్రాంతాల్లో నీటివనరులు ఏర్పాటు చేయాలని అటవీ సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు.పులి సంచారంపై వివరాలు సేకరించాం పులి సంచారానికి సంబంధించిన వివరాలను సేకరించాం. ఆ ప్రాంతంలో పులి కాలి గుర్తులు లభించాయి. దేవలూడు అటవీ ప్రాంతం కాబట్టి పులుల సంచారం ఉంది. పెద్దబొమ్మలాపురంలో పులి సంచారంపై ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టాం. రైతులు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. – హరి, ఫారెస్టు రేంజి అధికారి, పెద్దదోర్నాల ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం కనిగిరి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో పెద్ద పులులు లేవు. భైరవకోన, వెలిగొండ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో సుమారు 15 నుంచి 20 వరకు చిరుత పులులు ఉన్నాయి. వారం రోజుల నుంచి నాగిరెడ్డిపల్లి, వెదుళ్లచెరువు, గుడిపాటిపల్లి బీట్ పరిధిలోని గ్రామాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో కెమెరా ట్రాప్లను ఏర్పాటు చేస్తున్నాం. మన ప్రాంతంలో పెద్ద పులులు లేవు. అయినా కొండ కింద గ్రామాల ప్రజలు ఆరుబయట రాత్రి వేళ నిద్రించవద్దు. పొలాలకు వెళ్లే రైతులు, మేతకు అడవుల్లోకి వెళ్లే వారు ఒంటరిగా పోవద్దు. గ్రామ మొదట్లోనే పశువులను మేపుకోండి. నీటి కోసం, ఆహారం కోసం రాత్రిపూట వన్య ప్రాణులు అడవి నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. – తుమ్మా ఉమా మహేశ్వరరెడ్డి, ఫారెస్ట్ రేంజ్ అధికారి, కనిగిరి -
ఆర్టీసీ డ్రైవర్ల మెరుపు సమ్మె
● బస్టాండ్లలో ధర్నానంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని అన్ని బస్స్టేషన్లలో బుధవారం అద్దె బస్సులను నిలిపి వందలాదిమంది డ్రైవర్లు మెరుపు సమ్మె చేశారు. ఆర్టీసీ ఉద్యోగులందరికీ రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ బస్టాండ్లలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి డ్రైవర్లకు, కండక్టర్లకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట దాడులు జరుగుతున్నాయన్నారు. దువ్వూరులో ఆళ్లగడ్డ డిపోకు చెందిన హెయిర్ బస్ డ్రైవర్ మహమ్మద్పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. అంత వరకు సమ్మెను విరమించేది లేదన్నారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో ధర్నా చేస్తున్న డ్రైవర్లతో ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రజియా సుల్తానా మాట్లాడారు. ప్రజలకు అవగాహన కల్పించేలా బస్టాండ్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు అద్దె బస్సుల డ్రైవర్లు తెలిపారు. -
‘బంగారు’ కాంతులు!
విద్యుత్ కాంతుల మధ్య ప్లాంట్మండలంలోని జొన్నగిరి, బొల్లవానిపల్లి, పగిడిరాయి గ్రామాల మధ్య జియో మైసూర్ గోల్డ్ మైనింగ్ కంపెనీ ప్రాసెసింగ్ ప్లాంట్ రాత్రి పూట విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది. 30 ఎకరాల్లో దాదాపు రూ.200 కోట్లతో గోల్డ్ మైనింగ్ ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మించారు. ప్లాంట్ లోపలి భాగంలో చుట్టూ పచ్చని గడ్డితో పాటు మొక్కలు నాటారు. అధునాతన హంగులతో ప్లాంట్ నిర్మాణం పూర్తయింది. ఈనెలఖారు నుంచి ప్లాంట్లో బంగారం ఉత్పత్తి మొదలు కానుండటం విశేషం. –తుగ్గలి -
కల్తీ మద్యంతో ప్రజల్ని చంపేస్తారా?
కర్నూలు (టౌన్): ‘ రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది.. అమాయక ప్రజలు మద్యం తాగి పిట్టల్లా రాలుతున్నారు.. అయినా ఈ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది.. చాలా దారుణం’ అని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి అన్నారు. ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇలాగే వ్యవహరిస్తూ కల్తీ మద్యంతో ప్రజల్ని చంపేస్తారా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బుధవారం కర్నూలులో నిరసన తెలిపారు. చిల్డ్రన్స్ పార్కు నుంచి ఎకై ్సజ్ కార్యాలయం వరకు మహిళలు ర్యాలీ నిర్వహించారు. ‘ సీఎం డౌన్.. డౌన్, కల్తీ మద్యం విక్రయాలు అరికట్టాలి’ అని నినాదాలు చేశారు. ‘నకిలీ మద్యంతో పేదలు పిట్టల్లా రాలిపోతున్నారు.. ప్రభుత్వ పెద్దలే మద్యం సూత్రధారులు.. రాష్ట్రంలో ఎన్–బ్రాండ్ విక్రయాలు’ తదితర ప్లకార్డులను ర్యాలీలో ప్రదర్శించారు. ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంటు కార్యాలయం ఎదుట బైఠాయించారు. మద్యాన్ని పారబోసి బాటిళ్లను పగులకొట్టారు. ‘మద్యం తాగి ప్రజలు చనిపోతుంటే డిప్యూటీ సీఎం నోరు మెదపరేం, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎక్కడ’ అని ప్రశ్నించారు. మహిళలకు రక్షణ కరువు వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లా నాగవేణి రెడ్డి, భారతి, మంగమ్మ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. నకిలీ మద్యం సరఫరా చేస్తూ పేద ప్రజలను నిలువు దోపిడీ చేస్తోందని ఆరోపించారు. అడ్డగోలు పర్మిట్ రూమ్లతో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. టీడీపీ నాయకులు వైన్ షాపుల ద్వారా కల్తీ మద్యం అమ్ముతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు మెదపడం లేదన్నారు. ఈ ప్రభుత్వానికి మహిళల ఉసురు తగులుతుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి బెల్టు షాపులు రద్దు చేయాలని, కల్తీ మద్యాన్ని అరికట్టాలని, పర్మిట్ లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంటు అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నగరపాలక కార్పొరేటర్లు ఆర్షియా ఫర్హీన్, మహిళలు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వానికి మహిళల ఉసురు తగులుతుంది వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసెడింట్ ఎస్వీ విజయ మనోహరిదోషులను కఠినంగా శిక్షించాలి నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో కల్తీ మద్యం తాగి నలుగురు పేదలు మృతిచెందినా రాష్ట్రప్రభుత్వంలో చలనం లేదని ఎస్వీ విజయ మనో హరి విమర్శించారు. కల్తీ మద్యం విక్రయాల వెనుక రాష్ట్ర పెద్దలు ఉన్నారని ఆరోపించారు. కల్తీ మద్యం తయారు చేసేందుకు టీడీపీ నాయకులు ఏకంగా ఫ్యాక్టరీ నడుపుతున్నారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోందన్నారు. కల్తీ మద్యం దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
బంగారం హారం బహూకరణ
పాణ్యం: తిరుపతికి చెందిన కర్నాటి సుబ్బ ప్రశాంత్, స్వాతి దంపతులు కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయానికి బుధవారం బంగారం హారాన్ని బహూకరించారు. నాలుగు తులాల 200 మిల్లీ గ్రాముల బంగారం హారాన్ని బహూకరించినట్లు ఈఓ రామకృష్ణ తెలిపారు. దాతలకు తీర్థప్రపాదాలు అందించినట్లు చెప్పారు. నేడు ఎస్సీ సెల్ విస్తృత స్థాయి సమావేశం బొమ్మలసత్రం: నంద్యాల పట్టణంలోని తేజస్విని హోటల్లో గురువారం ఎస్సీసెల్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజే సుధకర్బాబు హాజరవుతున్నారని పేర్కొన్నారు. సమావేశానికి ఎస్సీ సెల్కు సంబంధించిన నాయకులందరూ హాజరుకావాలని కోరారు. వ్యాధులపై అప్రమత్తత అవసరం గోస్పాడు: వ్యాధులపై ప్రజలను ఆరోగ్య సిబ్బంది అప్రమత్తం చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ ఆదేశించారు. నంద్యాల గాంధీ నగర్లోని సమావేశపు మందిరంలో బుధవారం వ్యాధుల నియంత్రణపైఅవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మలేరియా అధికారి చంద్రశేఖరరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ మాట్లాడారు. మలేరియా, డెంగీ, చికెన్గున్యా, మెదడువాపు, బోదకాలు వంటి వ్యాధులు దోమకాటుతో వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే, డ్రైడే పాటించాలన్నారు. మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ నిరంజన్, జిల్లా టీబీ, ఎయిడ్స్ నివారణ అధికారి డాక్టర్ శారదాబాయి, మలేరియా సబ్ యూనిట్ అధికారి విజయారెడ్డి, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. పార్లమెంట్ రాష్ట్రకార్యదర్శిగా దేశం సుధాకర్రెడ్డిబొమ్మలసత్రం: వైఎస్సార్సీపీ పార్లమెంట్ రాష్ట్రకార్యదర్శిగా దేశం సుధాకర్రెడ్డిని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన దేశం సుధాకర్రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ సంబంధిత రీజినల్ కో ఆర్డినేటర్, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులకు సహాయకారిగా వ్యవహరించనున్నారు. కర్నూలు సిటీ: అధికారంలో ఉన్నామని, తమకు ఎదురు లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు బరితెగించారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజ నం వడ్డిస్తున్న ఒకరిపై పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అనుచరులు దాడికి పాల్పడ్డారు. బాధితులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాలు.. కర్నూలు ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజీ విద్యార్థులకు జీఎస్టీ 2.0పై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు బుధవారం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గౌరు చరిత బహుమతులు ప్రదానం చేశారు. ఆమె తిరిగి వెళ్లే సందర్భంలో మధ్యాహ్న భోజనంపై కొంత మంది విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఆ సమమంలో అక్కడే ఉన్న వంట ఏజేన్సీ నిర్వాహకులకు చెందిన ఓ వ్యక్తికి, ఎమ్మెల్యే అనుచరుల మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో వంట ఏజెన్సీ నిర్వాహకుల్లో ఒకరిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసినట్లు సమాచారం. ఇదే విషయంపై బాధితులు కర్నూలు 3వ పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదే విధంగా తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకునేంత వరకు బీక్యాంపులో ప్రభుత్వ జూనియర్, ప్రభుత్వ ఒకేషనల్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం చేయబోమని జిల్లా వృత్తి విద్యాధికారి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ ఘటనపై జూనియర్, ఒకేషనల్ కాలేజీల ప్రిన్సిపాళ్లను అడుగగా తమకు తెలియని చెప్పారు. ఇదిలా ఉండగా పై రెండు కాలేజీల్లో వంట ఏజెన్సీని ఎలాగైనా మార్చాలనే ఉద్దేశంతో వివిధ సందర్భాల్లో టీడీపీ నేతలు ప్రయత్నించారు. -
రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన!
డోన్: రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన సాగుతోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ధ్వజమెత్తారు. అభివృద్ధి చేయకుండా అనవసర ఆరోపణలు చేస్తూ టీడీపీ నేతలు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ప్రగతి ఫలాలను ప్రజలకు అందించడమే నిజమైన పాలన అని అన్నారు. డోన్లో బుధవారం ప్యాపిలి, బేతంచెర్ల మండలాల వైఎస్సార్సీపీ బూత్కమిటీ కన్వీనర్ల సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కోవిడ్ మహమ్మారిని కూడా లెక్కచేయకుండా అంతా అభివృద్ధి జరిగిందన్నారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందాయన్నారు. రాష్ట్రంలో కూట మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నకిలీ మద్యం వ్యాపారం యథేచ్ఛగా సాగుతోందన్నారు. ఉచిత ఇసుక అని చెబుతూ అడ్డూ అదుపూ లేకుండా అ క్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ మై నింగ్తో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. ‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం డోన్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిందని బుగ్గన అన్నారు. డోన్కు అప్పట్లోనే ఉత్తమ మున్సిపాలిటీగా అవార్డు దక్కిందనే విషయాన్ని టీడీపీ నాయకులు సైతం అంగీకరిస్తున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పరిపాలనను ఎలా సాగించామనే దానిపై ప్రజలకు కార్యకర్తలు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి బూత్కు కన్వీనర్లే కీలకమని, ప్రతి బూత్ పరిధిలో 40 మంది సురక్షితులైన కార్యకర్తలను తయారు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2.0 పాలన ఎలా ఉంటుందో ప్రజలకు తెలుస్తుందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలందరూ సంసిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ ప్యాపిలి మండల కన్వీనర్ పోదొడ్డి క్రిష్ణమూర్తి, పార్టీ నాయకులు చిన్నపూదెళ్ల రామచంద్రారెడ్డి, పెద్దపూదెళ్ల భాస్కర్ రెడ్డి, మెట్టుపల్లె వెంకటేశ్వరరెడ్డి, బూరుగల శ్యాంరెడ్డి, బోరెడ్డి రాము, రాజా మురళి, బోరా మల్లికార్జునరెడ్డి, గార్లదిన్నె రామసుబ్బయ్య, రాచెర్ల దివాకర్రెడ్డి, బేతంచెర్ల మండల కన్వీనర్ తిరుమలేశ్వరరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు పిట్టల జాకీర్, ఎంపిపి బుగ్గన నాగభూషణంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చలంరెడ్డి, పార్టీ నాయకులు రామచంద్రుడు, మురళీక్రిష్న, లక్ష్మిరెడ్డి, ఇబ్రహీం, కోట్ల మధుసూధన్ రావ్, మురళీధర్రెడ్డి, చలపతిరెడ్డి, బుగ్గన చంద్రారెడ్డి, బలరాంరెడ్డి, ఎద్దులన్న తదితరులు పాల్గొన్నారు. యథేచ్ఛగా నకిలీ మద్యం వ్యాపారం అడ్డూఅదుపూ లేని ఇసుక అక్రమ రవాణా అక్రమ మైనింగ్తో ప్రజాధనం లూటీ రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి -
నవంబర్ 12న ఆర్యూ కాన్వొకేషన్
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ (ఆర్యూ) 4వ కాన్వొకేషన్ నవంబర్ 12న వర్సిటీలో నిర్వహిస్తున్నట్టు వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ వి.వెంకటబసవరావు తెలిపారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ కాన్వొకేషన్కు గవర్నర్, వర్సిటీ చాన్స్లర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరవుతారన్నారు. 2021–22, 2022–23, 2023–24, 2024–25 విద్యా సంవత్సరాల్లో వర్సిటీ పరిధిలో యూజీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ, ఎల్ఎల్బీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు పూర్తి చేసుకొని ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు వారి విద్యార్హత పట్టాలను పొందవచ్చన్నారు. ఇప్పటికే రెండుసార్లు కాన్వొకేషన్కు నోటిఫికేషన్ విడుదల చేయడంతో విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. యూజీ విద్యార్థులు 9404, పీజీ, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులు 420, పీహెచ్డీ 148 మంది దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారన్నారు. 70 మంది విద్యార్థులకు గోల్డ్మెడల్స్ ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. -
బాధ దిగమింగి.. జీవాలకు మేతగా..
ఉల్లిని కూలీలతో తెంపి మార్కెట్కు తీసుకెళ్లి విక్రయిస్తే సొమ్ము చేతికి రావాల్సింది పోయి.. మరింత అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిన దుస్థితి. దీంతో దిక్కుతోచక రైతులను పంటను జీవాలకు మేతగా వదిలేస్తున్నారు. ఆలూరు మండలం మనేకుర్తికి చెందిన చాకలి పరమేష్ బోరు బావి కింద రెండెకరాల్లో ఉల్లి సాగు చేశారు. పెట్టుబడుల కోసం రూ.2 లక్షలు అప్పు చేశారు. పంట చేతికొచ్చిన దశలో ఉల్లికి ధర లేకుండా పోయింది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. మార్కెట్లో ఉల్లి ధర.. పంట కోతకు కూలీల ఖర్చు, రవాణా ఖర్చును భేరీజు వేసుకోగా మరింతగా అప్పుల భారం మీద పడుతుందని లెక్కలు వేసుకున్నారు. బాధను దిగమింగుకుని మంగళవారం ఉల్లి పంటను జీవాలకు మేతగా వదిలేశారు. దీనిపై బాధిత రైతును పలకరించగా.. ప్రభుత్వం ఉల్లి పంట హెక్టారుకు రూ.50 వేలు సాయం ప్రకటించింది. అది వచ్చే వరకు పొలంలో పంటను అలాగే ఉంచుకోలేం. అంతకుముందు ఉల్లి క్వింటాలుకు ప్రకటించిన రూ.1,200 మద్దతు ధర కూలీలకు కూడా సరిపోదు. కష్టనష్టాలకోర్చి ఆరుగాలం శ్రమించి పంటలను సాగు చేసిన రైతులకు చివరకు ఆత్మహత్యలే శరణ్యం తప్పా.. మిగిలేది ఏమీ లేదని కన్నీటి పర్యంతమయ్యారు. – ఆలూరు జీవాలకు మేతగా వదిలేసిన ఉల్లి పంట ఉల్లిగడ్డలను చూపుతున్న రైతు వీరేష్ -
స్థానిక ఎన్నికల్లో బూత్కమిటీ కన్వీనర్లే కీలకం
డోన్: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బూత్ కమిటీ కన్వీనర్లే కీలకమని రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. తన స్వగృహంలో మంగళవారం ఆయన వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి అధ్యక్షతన జరిగిన పట్టణ పార్టీ బూత్ కమిటీ కన్వీనర్ల సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ యంత్రాంగాన్ని పటిష్టపరుచుకుంటే శాసనసభ సాధా రణ ఎన్నికలలో కూడా పార్టీ విజయం సులువవుతుందన్నారు. ఇందుకోసం ప్రతి బూత్ పరిధిలో సుశిక్షితులైన 40 మంది కార్యకర్తలను తయారుచేసుకోవాల్సిన బాధ్యత కన్వీనర్లదేనన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి నాయకులు కృషి చేయాలన్నారు. రానున్న రోజులలో పార్టీ కార్యకర్తలకు నామినేట్ పదవులతో పాటు అన్ని రకాల పదవులలో పెద్దపీట వేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసగించి అధికారాన్ని చేజిక్కించుకుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన పలు పథకాలనే కొనసాగిస్తూ అన్నిరకాల పథకాల్లో భారీ ఎత్తున కోత విధించిన విషయాన్ని ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో ప్రజలు కూటమి నేతలపై తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. విద్యుత్ చార్జీలు పెంచడంతో సామాన్యుల బతుకు భారంగా మారిందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణమంటూనే పురుషుల నుంచి చార్జీలను విపరీతంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. అనేక రకాల పన్నుల భారంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్నారు. కల్తీ మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నారన్నారు. నాణ్యమైన మందు, సరసమైన ధర అంటూ కల్తీ మద్యంతో కూటమి నాయకులు ఊరూరా బెల్టుషాపులు ఏర్పాటు చేసి నిలువుదోపిడీ చేయడంతో పాటు ప్రాణాలు తీసేందుకు సిద్ధమయ్యారన్నారు. సమావేశంలో మున్సిప ల్ చైర్మన్ సప్తశైల రాజేష్, ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ బద్దల రాజ్కుమార్, పార్టీ జిల్లా వలంటీర్ విభాగం అధ్యక్షులు పోసు్ట్రపసాద్, మున్సిపల్ వైస్చైర్మన్ జాకీర్హుసేన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రధాని పర్యటన ఏర్పాట్ల పరిశీలన
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను మోదీ పర్యటన ప్రత్యేక అధికారి వీరపాండియన్ పరిశీలించారు. మంగళవారం శ్రీశైలం చేరుకున్న ఆయన జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్ ఇతర అధికారులతో కలిసి ప్రధాని పర్యటించే ప్రాంతాలలో ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా సున్నిపెంట హెలిపాడ్కు చేరుకుని, అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా శ్రీశైల భ్రమరాంబా అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడ శ్రీశైల దేవస్థాన ఈఓ శ్రీనివాసరావు, అధికారులు వారికి ఆహ్వానం పలికారు. అనంతరం నందిసర్కిల్, గంగాధర మండపం, అనంతరం ఆలయంలో మల్లికార్జున స్వామివారికి అభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన, వేదాశీర్వచనం తదితర కార్యక్రమాల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఆతర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రానికి చేరుకుని శివాజీ కాంస్య విగ్రహం వద్ద, ధ్యాన మందిరంలో ఏర్పాట్లను పరిశీలించారు. పనులు తర్వితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వారి వెంట జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, ఆర్డీవో నాగజ్యోతి తదితరులు ఉన్నారు. మోదీ పర్యటన భద్రతపై సమీక్ష.. మోదీ పర్యటన నేపథ్యంలో ఐజీ ఆకే రవికృష్ణ మంగళవారం శ్రీశైలంలో పోలీసు ఉన్నతాధికారులతో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. సుమారు 2,500 మంది పోలీసు సిబ్బందితో ప్రధాని మోదీ పర్యటనకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. మోదీ పర్యటించే సున్నిపెంట హెలిపాడ్ నుంచి శ్రీశైలం వరకు భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. సమీక్షలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, గ్రేహౌండ్స్ డీఐజీ బాపూజీ, నంద్యాల ఎస్పీ సునీల్షెరాన్, ప్రకాశం ఎస్పీ హర్ష వర్దన్రాజు, డీజీపీ ఆఫీసు అధిరాజ్ సింగ్ రాణా, ఐజీ అశోక్కుమార్, సీఐడీ ఎస్పీ శ్రీధర్రావు, ఎఎస్పీ యుగంధర్బాబు, ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్, శ్రీశైలం సీఐ ప్రసాదరావు, ఇతర సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
కల్వర్టు వద్ద ఇరుక్కుపోయిన లారీ
● స్తంభించిన రాకపోకలు కోవెలకుంట్ల: కోవెలకుంట్ల– జమ్మలమడుగు ఆర్అండ్బీ రహదారిలో మంగళవారం అర్ధరాత్రి కల్వర్టు వద్ద ఫ్లయాష్ లారీ ఇరుక్కుపోయింది. నంద్యాల నుంచి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు వరకు జాతీయ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మండలంలోని గుళ్లదూర్తి సమీపంలో కల్వర్టు విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డును పక్కకు మళ్లించారు. అరకొరగా గ్రావెల్ వేసి తాత్కాలికంగా రోడ్డును ఏర్పాటు చేయడంతో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు దెబ్బతింది. ఈ స్థితిలో మంగళవారం జమ్మలమడుగు నుంచి కోవెలకుంట్లకు వస్తున్న ఫ్లయాష్ ట్యాంకర్ లారీ గ్రావెల్ రోడ్డులో ఇరుక్కుపోయింది. ఈ రహదారిలో ప్రత్యామ్నా యం లేకపోవడంతో రెండు వైపులా వాహనాలు నిలిచి రాకపోకలు స్తంభించాయి. దీంతో కర్నూలు, నంద్యాల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కడప, తిరుపతి, తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడ్డారు. కొన్ని వాహనాలను గుళ్లదూర్తి నుంచి సంజామల మీదుగా కోవెలకుంట్ల వైపు మళ్లించారు. ఉదయం 10 గంటలకు జేసీబీ సాయంతో లారీని తొలగించడంతో రాకపోకలు యథావిధిగా సాగాయి. -
అడవిలో అగ్నిశిఖ
ఆయుర్వేద వైద్యంలో అడవి నాభిగా ప్రసిద్ధి చెందిన అగ్నిశిఖ మొక్కలు నల్లమలలోని కనువిందు చేస్తున్నాయి. కొత్తపల్లి సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతం, గువ్వలకుంట్ల, పాలెంచెరువు, బండినాయిని పాలెం సమీపంలోని వరి పంట పొలాల్లో, ఆత్మకూరు మండలంలోని కొట్టాల చెరువు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో మొక్కలు విరివిగా ఉన్నాయి. దీనినే నాగేటిగడ్డ, నీరుపిప్పిలి మొక్క అని పిలుస్తుంటారు. ఈ తీగ జాతి మొక్క పక్కనున్న మొక్కలను ఆధారం చేసుకుని పైకి ఎగబాకుతుంటాయి. ఈ పుష్పాలు ఎరుపు, నారింజ, తెలుపు, పసుపు రంగుల కలబోతగా దర్శనమిస్తాయి. ఈ పుష్పాలను ఆయుర్వేదంలో దివ్య ఔషధంగా భావిస్తారు. దీని కాండం, ఆకులు, విత్తనాలు, పండ్లు, పూలు, దుంపలన్నీ విషపూరితం. పాముకాటు, తేలు కాటుకు విరుగుడుగా, పలు రోగాల నివారణగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. వైద్యుల సూచనలు, సలహాల మేరకు వాడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. – కొత్తపల్లిఎరుపు, పసుపు రంగులతో.. -
ట్రావెల్స్ బస్సుకు జరిమానా
డోన్ టౌన్: రాష్ట్రానికి చెల్లించాల్సిన ట్యాక్స్ చెల్లించకుండా రాకపోకలు సాగిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కు రూ.1.91 లక్షల జరిమానా విధించినట్లు డోన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ మంగళవారం తెలిపారు. సోమవారం అర్ధరాత్రి కర్నూలు రోడ్డులోని అముకతాడు టోల్ ప్లాజా వద్ద రవాణా శాఖ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో మధ్యప్రదేశ్కు చెందిన శిఖర్వార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆ రాష్ట్రం నుంచి బెంగుళూరుకు వెళుతుండగా అమకతాడు టోల్ గేట్ వద్ద ఆపి తనిఖీ చేయగా ఏపీ చెల్లించాల్సిన ట్యాక్స్ చెల్లించలేదని తెలిసింది. దీంతో వాహనంపై జరిమానా విధించినట్లు ఎంవీఐ తెలిపారు. నంద్యాల అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నాగేంద్రరావు ఉన్నారు. హడావుడిగా మండలాలకు శనగ విత్తనాలు కర్నూలు(అగ్రికల్చర్): రబీ సీజన్ మొదలై వారం రోజులు గడచినప్పటికీ పప్పు శనగ విత్తన పంపిణీ అతీగతీ లేకపోయింది. దీనిపై మంగళవారం ‘సాక్షి’లో శనగ విత్తు అందక రైతుకు బెంగ శీర్షికన కథనం ప్రచురితమవడంతో వ్యవసాయ శాఖలో కదలిక వచ్చింది. ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖపై బుధవారం సమీక్ష నిర్వహిస్తున్న తరుణంలో హడివుడిగా వెల్దుర్తి, తుగ్గలి, ఆలూ రు, బనగానపల్లి మండలాల్లో శనగ విత్తనాలను అరకొరగా అందుబాటులో ఉంచడం గమనార్హం. విత్తనాల కోసం రైతులు డి–క్రిషి యాప్లో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ‘సాక్షి’లో కథనం వచ్చిన తర్వాత ఆగమేఘాల మీద యాప్ ఇచ్చారు. ఇంతవరకు ఒక్క రైతు కూడా పేరు రిజిస్ట్రేషన్ చేసుకొని విత్తనాలు పొందలేదంటే యాప్ అమల్లోకి రాకపోవడమే కారణంగా తెలుస్తోంది. సబ్సిడీపై విత్తనాల పంపిణీకి ఎగనామం పెట్టే కుట్రలో భాగంగానే అధిక ధర నిర్ణయం, నామమాత్రపు సబ్సిడీ అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యమాలతోనే మహిళా సమస్యలకు పరిష్కారం కర్నూలు(సెంట్రల్): ఐక్య ఉద్యమాల ద్వారానే మహిళల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.నిర్మల అన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల సమస్యల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్న నేపథ్యంలో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం కార్మిక కర్షక భవన్లో ఐద్వా 12వ జిల్లా మహాసభలు నిర్వహించారు. సభకు అరుణమ్మ, ధనలక్ష్మీ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథి పి.నిర్మల మాట్లాడారు.. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారన్నారు. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. మహిళలపై దౌర్జ న్యాలు, దాడులు, హత్యలు,మానభంగాలు ఎక్కు వయ్యాయని, వాటిని అరికట్టడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో అనంతపురంలో జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రత్నమ్మ, ఉమాదేవి, సుజాత పాల్గొన్నారు. -
పంటకోతకు ముందే కన్నీరు
● ఉల్లికి గిట్టుబాటు ధర లేక దున్నేయడం, గొర్రెలకు మేతగా వదిలేస్తున్న వైనం ● పది రోజుల్లో వందలాది ఎకరాల్లో పంటను ధ్వంసం చేసిన రైతులు కోడుమూరు రూరల్: ఆరుగాలం కష్టించి పండించిన ఉల్లి పంటకు కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధరను కల్పించలేకపోతుంది. ధర లేక చేతికొచ్చిన ఉల్లి పంట ను కొందరు దున్నేస్తుండగా, మరికొందరు రైతులు గొర్రెలకు మేతగా వదిలేస్తున్నారు. దీంతో కష్టపడి పండించిన పంట కళ్లెదుటే నాశనమవుతున్న దృశ్యాలను చూస్తూ రైతుల గుండెలు బరువెక్కుతున్నాయి. గతంలో ఏనాడు కూడా ఇలా చేతికొచ్చిన పంటలను చేజేతులా నాశనం చేసే దృశ్యాలను చూడలేదనిని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ దృశ్యాలు ప్రతి గ్రామంలో నిత్యం చోటుచేసుకుంటున్నాయి. కర్నూలు జిల్లాలో ఈ ఏడాది 30 వేలకు పైగా ఎకరాల్లో రైతులు వర్షాధారం, బోరుబావుల కింద లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి ఉల్లి పంటను సాగు చేశారు. రైతుల కష్టం ఫలించి దిగుబడులు బాగానే ఉన్నా మార్కెట్లో మాత్రం ధర పూర్తిగా పడిపోవడంతో పాటు, ఉల్లి అంటే మాకొద్దు అనే పరిస్థితి నెలకొంది. మార్కెట్లో క్వింటాల్ ఉల్లి రూ.500 కూడా పలకకపోవడంతో పంట కోసి మార్కెట్కు తరలించినా కూలీ రేట్లు కూడా రైతులకు గిట్టుబాటుగాని పరిస్థితి నెలకొంది. దీంతో గత 10 రోజుల వ్యవధిలో జిల్లాలోని కోడుమూరు, గూడూరు, సి.బెళగల్, క్రిష్ణగిరి, దేవనకొండ, గోనెగండ్ల, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆస్పరి, తుగ్గలి, పత్తికొండ, ఆదోని, ఆలూరు వంటి ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో రైతులు చేతికొచ్చిన ఉల్లి పంటను దున్నేస్తూ గొర్రెలకు మేతగా వదిలేస్తూ ధ్వంసం చేశారు. ఒక్క కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామంలోనే గత వారం రోజుల్లో వెంకటప్ప, రఫీక్, శ్రీనివాసులు, షఫీ, తెలుగు శ్రీనివాసులు, గోపాల్, భాస్కర్రెడ్డిలతో పాటు మరికొందరు రైతులు 40కు పైగా ఎకరాల్లో సాగు చేసిన ఉల్లి పంటను ధ్వంసం చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధమవుతోంది. ఉల్లి రైతులను పట్టించుకోని ప్రభుత్వం ఆరంభ శూరత్వంగా కొద్ది రోజుల పాటు ఉల్లికి మద్దతు ధర అంటూ క్వింటాలు ఉల్లి రూ.1200 ప్రకారం కోనుగోలు చేసిన కూటమి ప్రభుత్వం ఆ తర్వాత పూర్తిగా చేతులెత్తేసింది. తర్వాత ఉల్లికి మద్దతు ధర గాకుండా హెక్టార్కు రూ.50 వేల ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామంటూ ప్రకటన చేసి చేతులు దులుపుకుంది. ఉల్లి పంటను రోటావేటర్తో ధ్వంసం చేస్తున్న రైతు ధ్వంసమైన ఉల్లి -
స్కూల్ బ్యాగులు చిరిగి.. నాణ్యత నవ్వి!
కర్నూలు సిటీ/నంద్యాల(న్యూటౌన్): ‘సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థిమిత్ర’ బ్యాగుల పరిస్థితి జిల్లాలో దారుణంగా ఉంది. చిరిగిపోయిన బ్యాగులు గుట్టలుగా పడి ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు స్కూల్ బ్యాగులను అత్యంత నాణ్యత కలిగినవి అందిస్తున్నామని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటన చేశారు. అయితే విద్యా సంవత్సరం మొదలయ్యాక కొంత ఆలస్యంగా విద్యార్థులకు బ్యాగులను అందించారు. నెల రోజుల్లో పే వాటిలో 60 శాతంపైనే చిరిగిపోయాయి. విద్యార్థులు అవస్థలు పడుతుండటంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్య లు చేపట్టారు. చిరిగిన, కుట్లుపోయిన వాటిని రిటర్న్ పంపించాలని, వాటి స్థానంలో కొత్తవి ఇస్తామని ఇటీవలే ఆయా స్కూళ్ల హెచ్ఎంలకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో చాలా మంది హెచ్ఎంలు యాప్లో బ్యాగ్లను రిటర్న్ చేసేందుకు వివరాలు నమోదు చేశారు. అయితే ఇందులో బ్యాగ్ మొత్తం పనికిరాకుండా ఉంటేనే వెనక్కి తీసుకుని కొత్త ది ఇస్తామని విద్యాశాఖ అధికారులు మెలిక పెట్టారు. చిరిగితే కుట్టించుకోండి! నంద్యాల జిల్లాలోని 1,387 ప్రభుత్వ యాజమాన్య స్కూళ్లు ఉండగా 1,21,462 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు అందజేశారు. ఒక్కో కిట్టు విలువ రూ.2,279 కాగా వీటిలో స్కూల్ బ్యాగు ఉంది. చిరిగిపోయిన స్కూల్ బ్యాగ్ రిటర్న్ ఇవ్వాలని విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లాలో 127 పాఠశాలల నుంచి 1,828 మంది పిల్లలు రిటర్న్ చేసేందుకు యాప్లో అప్లోడ్ చేశారు. అయితే 640 మందికి మాత్రమే కొత్త బ్యాగ్లు ఇవ్వనున్నారు. మిగిలిన బ్యాగ్లను ఆయా స్కూళ్లకు వెనక్కి పంపించి కుట్లు పోయింటే, చిరిగిపోయింటే కుట్లు వేయించుకోండి అని విద్యాశాఖ అధికారులు చెబుతున్నట్లు సమాచారం.ఈనెల10వ తేదీన కొత్తగా వచ్చిన బ్యాగులు, షూష్లు అందజేస్తామని డీఈఓ జనార్దన్రెడ్డి తెలిపారు. కొలతలు లేకుండానే బూట్లు.. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లలో కర్నూలు జిల్లాలో 2,71,006 మంది విద్యార్థులకు బూట్లు, ఒక్కో విద్యార్థికి రెండు జతల సాక్సులు ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందజేయలేదు. కొందరికి ఇచ్చినా ఎలాంటి ముందస్తు కొలతలు తీయకుండానే విద్యార్థులకు అందజేశారు. దీంతో చాలా మంది విద్యార్థులు బూట్లు వదిలేసి చెప్పులతోనే వస్తున్నారు. చిప్పగిరి,కృష్ణగిరి, వెల్దుర్తి, ఎమ్మిగనూరు మండలాల్లో సుమా రుగా 500 మంది విద్యార్థులకు ఇంత వరకు బ్యాగ్లు ఇవ్వలేదని ఉపాధ్యాయ వర్గాలే చెబుతున్నాయి. ఆయా మండలాల పరిధిలోని స్కూళ్ల నుంచి చిరిగిన బ్యాగ్లు, కుట్లుపోయిన బ్యాగ్లను సేకరించి జిల్లా కేంద్రం సమీపంలోని పెద్దపాడు మండల పరిషత్ ప్రా థమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన స్టోరేజీ పాయింట్కు చేర్చాలని సమగ్ర శిక్ష అధికారులు ఎంఈఓలకు ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో కేవలం నాలుగు మండలాల నుంచి మాత్రమే బ్యాగ్లు మార్పులు చేసేందుకు యాప్లో అప్లోడ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నాలుగు మండలాల్లో కూడా కొన్ని స్కూళ్ల నుంచి మాత్రమే కొత్త బ్యాగ్లు కోరినట్లు తెలుస్తోంది. -
వైఎస్సార్సీపీ టాక్స్–కర్నూలు యూట్యూబ్ చానల్ ప్రారంభం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ టాక్స్– కర్నూలు యూట్యూబ్ చానల్ను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, కర్నూలు, నంద్యాల జిల్లాల పార్టీ అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య, కర్నూలు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి హనుమంత రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
రైతు సమస్యలపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వం
పత్తికొండ: అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కంగాటి శ్రీదేవి విమర్శించారు. మంగళవారం పత్తికొండ వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరులతో సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధికారంలోనే హోసూరు రహదారిలో టమాట ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాజకీయ కారణాలతో మరో చోటుకు మార్చడంతో పాటు ఆరు నెలల్లో పూర్తి చేశామని ప్రారంభ సమయంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రగల్బాలు పలికారన్నారు. ఇంకా ఇప్పటికీ పనులు పునాదులు దశలోనే ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో పత్తికొండ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు రూ. 30 కోట్లతో ప్రారంభిస్తే టీడీపీ లీగల్ సెల్ నాయకుడు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారన్నారు. ఇప్పటికై నా కూటమి నాయకులు రోడ్డు పనులు ప్రారంభించి ప్రజలకు మేలు చేయాలని హితవు పలికారు. రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా గ్రామాల్లో బెల్ట్షాపుల్లో నకిలీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఉల్లి, టమాట రైతులు భారీగా నష్టపోతున్నా ప్రభుత్వంలో కనిస స్పందన లేకపోవడం దారుణమన్నారు. రైతులు దిగుబడిని పొలంలోనే పశువులకు మేతగా వదిలేస్తున్నారని, ఇలాంటి పరిస్థితిని కూడా పార్టీలకు ఆపాదించడం వారి కూటమి నేతల అవివేకమన్నారు. ఉల్లి, టమాట పంటలను వైఎస్సార్సీపీకు చెందిన రైతులు మాత్రమే సాగు చేయలేదనే విషయాన్ని గుర్తించాలన్నారు. వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తలా.. తోక లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. గిట్టుబాటు ధర కల్పించ డం చేతగాక టమాట నాణ్యతపై మాట్లాడటం మంత్రి స్థాయిలో తగదన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మేధావుల ఫోరం అధికార ప్రతినిధి శ్రీరంగడు, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్, ఎంపీపీ నారాయణ్దాస్, ఎస్టీ సెల్ జిల్లా ఆధ్యక్షుడు భాస్కర్నాయ క్,మండల కన్వీనర్ కారం నాగరాజు, సీనియర్ నాయకులు టీఎమ్డీ హుశేన్, జిట్టా నాగేష్, భాస్కర్రెడ్డి, కోతిరాళ్ల అంజినయ్య, పులికొండ తిప్పన్న, కారుమంచి నజీర్, సాబ్డిన్ నూర్బాషా, అట్లా గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లి.. రైతు తల్లడిల్లి!
కూటమి పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. దాదాపు అన్ని పంటలకు గిట్టుబాటు ధర లేక రైతన్నలు తల్లడిల్లుతున్నారు. ఉల్లి రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పండించిన ఉల్లిని మార్కెట్కు తీసుకెళ్తే పెట్టుబడి ఖర్చులు దేవుడెరుగు కనీసం కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. ప్రభుత్వం మొదట ఉల్లి క్వింటాలుకు రూ.1200 ధర కల్పిస్తామని చెప్పడం తర్వాత ఎకరానికి రూ.20 వేలు ఇస్తామంటూ రోజుకో మాట చెబుతుండటంతో నమ్మకం లేక రైతన్నలు తీవ్ర ఆవేదనతో చేతికొచ్చిన పంటను దున్నేస్తున్నారు. ఈ క్రమంలో ఆస్పరి మండలం జొహరాపురం గ్రామానికి చెందిన జేపీ రంగస్వామి అనే రైతు ఆరెకరాల్లో ఉల్లి పంటను ట్రాక్టర్తో మంగళవారం తొలగించాడు. పంట సాగు కోసం రూ.3 లక్షల పెట్టుబడి పెట్టాడు. మార్కెట్లో ఉల్లికి ధర లేకపోవడం, కోతలకు అయ్యే ఖర్చులు కూడా రాని పరిస్థితి ఉండటంతో తీవ్ర ఆవేదనకు గురై చేతికొచ్చిన పంటను ట్రాక్టర్తో దున్నేశాడు. అంతకుముందు పంటను గొర్రెలకు వదిలేశాడు. ఇదిలాఉండగా జొహరాపురంలో 15 మంది రైతులు దాదాపు 100 ఎకరాల్లో నల్లరేగడి మెట్ట పొలంలో ఉల్లిని సాగు చేశారు. వారు కూడా చేసేది లేక ఉల్లి పంటను తొలగించారు. – ఆస్పరిజొహరాపురంలో ఉల్లి పంటను ట్రాక్టర్తో తొలగిస్తున్న రైతన్న -
భారీగా నష్టపోయా..
ప్యాలకుర్తిలో ఎకరా రూ.20 వేల ప్రకారం కౌలుకు తీసుకొని రెండెకరాల్లో రూ.లక్షన్నర పెట్టుబడి పెట్టి ఉల్లి పంట సాగు చేశా. పంట చేతికొచ్చినప్పటి నుంచి మార్కెట్లో ధర లేకుండా పోయింది. కనీసం ఉల్లి గడ్డలు కోసి మార్కెట్కు తరలించినా కూలీలకు కూడా గిట్టుబాటు కాని పరిస్థితి. దీంతో రెండెకరాల్లోని ఉల్లి పంటను పూర్తిగా రోటావేటర్తో ధ్వంసం చేశా. ఉల్లి సాగుతో భారీగా నష్టపోయా. ఏమి చేయాలో పాలుపోవడం లేదు. – రైతు గోపాల్, ముడుమలగుర్తి గ్రామం రెండున్నర ఎకరాల్లో బోరు కింద రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టి ఉల్లి పంట సాగు చేశా. ఉల్లి దిగుబడి బాగున్నా మార్కెట్లో కొనే నాథుడే లేడు. చేసేది లేక పంటనంతా గత రెండు రోజుల నుంచి గొర్రెలకు వదలేశా. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనీసం ఉల్లి రైతులకు ప్రకటించిన నష్టపరిహారంమైన త్వరగా అందిస్తే ఇతర పంటలు సాగు చేసుకుంటాం. – రైతు విజయభాస్కర్రెడ్డి, ప్యాలకుర్తి గ్రామం -
కోసిగిలో భారీ చోరీ
కోసిగి: మండల కేంద్రంలోని సాయిబాబా గుడి సమీపంలో అర్ధరాత్రి ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. బాధితులు తెలిపిన మేరకు వివరాలు.. స్థానిక ఉరుకుంద మెయిన్ రోడ్డులో మధు, లీలావతి దంపతులు నివాసం ఉంటున్నారు. సోమవారం కౌతాళంలో బంధువు చనిపోగా మధు అంత్యక్రియలకు వెళ్లాడు. రాత్రి వేళ ఇంట్లో ఒంటరిగా ఉండలేక లీలావతి గ్రామంలోనే ఉంటున్న అమ్మ వద్దకు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన దుండగులు అర్ధరాత్రి ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి చొరబడి బీరువాలోని సొమ్మును దోచుకెళ్లారు. ఉదయం దంపతులు ఇంటికి వచ్చి చూసేసరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. బీరువాలో ఉంచిన 6 తులాల బంగారు నగలు, కేజీ వెండి, రూ.లక్ష నగదును దుండగులు దోచుకెళ్లినట్లు బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. బయటి వ్యక్తులకు చెందిన బంగారు తాకట్టు పెట్టుకుని డబ్బు వడ్డీకి ఇచ్చినట్లు దంపతులు తెలిపారు. ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా క్లూస్ బృందం వచ్చి వేలిముద్రలు సేకరించారు. ఆ ప్రాంతంలోని సీజీ ఫుటేజీ పరిశీలించగా ఇద్దరు దుండగులు మూఖా నికి గుడ్డ కట్టుకొని చోరీకి పాల్పడినట్లు తెలిసింది. వరుస చోరీల నేపథ్యంలో పోలీసులు రాత్రి వేళ గస్తీ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. ట్రావెల్స్ బస్సు బోల్తా ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని సిరాలదొడ్డి సబ్స్టేషన్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి ఆదోనికి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్స్ అదుపుతప్పి బోల్తాపడింది. బస్సులోని ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అందరూ స్వల్ప గాయాలతో బయట పడటంతో ప్రభుత్వాసుపత్రికి వెళ్లకుండా తెల్లవారుజామునే ఎవరికి వారు ఇతర వాహనాలలో ఆదోనికి వెళ్లిపోయినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లనే ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు చెబుతున్నారని పోలీసులు చెప్పారు. -
వైభవంగా పవిత్రోత్సవాలు
ఆళ్లగడ్డ: దిగువ అహోబిలం శ్రీ ప్రహ్లాదవరదస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగే వార్షిక పవిత్రోత్సవాలు మంగళవారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీ రంగరాజ యతీంద్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో మూలమూర్తులు శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల వేదమంత్రోచ్ఛారణలతో ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాల మధ్య పవిత్ర హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాత్రి ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదులకు గ్రామోత్సతం నిర్వహించారు. ఎగువ అహోబిలంలో సోమవారం పవిత్రోత్సవాలు ముగిసిన విషయం తెలిసిందే. కంప్యూటర్ కోర్సులపై ఉచిత శిక్షణ నంద్యాల(న్యూటౌన్): రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ కోర్సులపై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ డిగ్రీ, బీటెక్ చేసిన వారికి పైథాన్ కోర్సు, ఇంటర్, ఆపై చదివిన యువతి,యువకులు డెమోస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సుల శిక్షణకు అర్హులన్నారు. శిక్షణ పూర్తిచేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం సర్టిఫికెట్ అందజేస్తుందని ఆమె తెలిపారు. వివరాల కోసం 8297812530ర్ను సంప్రదించాలన్నారు. పీడీఎస్ బియ్యం పట్టివేత ప్యాపిలి: చిరురుమాను సర్కిల్ వద్ద సోమవారం అర్ధరాత్రి విజిలెన్స్ అధికారులు 35 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. బనగానపల్లె నంచి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా పీడీఎస్ రైస్ తరలిస్తున్నట్లు సమాచారం అండటంతో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా సివిల్ సప్లై అధికారి రవిబాబు, ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్లు శేఖర్రెడ్డి, నాగేశ్వర్రెడ్డి తదితరులు వాహనాల తనిఖీ చేపడుతుండగా ఓ లారీలో పీడీఎస్ రైస్ను తరలిస్తున్నట్లు గుర్తించారు. 35 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి లారీని జలదుర్గం పోలీస్స్టేషన్కు తరలించారు. లారీ డ్రైవర్లు ప్రవీణ్, చిన్నమద్దిలేటిలను పోలీసులకు అప్పగించారు. అక్రమ బియ్యం తరలింపునకు సంబంధిచిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ప్యాపిలి ఎస్ఐ మధుసూదన్ తెలిపారు. -
స్వచ్ఛ జిల్లాకు అందరూ సహకరించాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: స్వచ్ఛ జిల్లాకు ప్రజలందరూ సహకరిస్తూ పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పిలుపునిచ్చారు. సోమ వారం పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన స్వచ్ఛాంధ్రా అవార్డ్స్–2025 జిల్లా స్థాయి బహుమతుల ప్రదాన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాబోయే మూడు నెలల్లో స్వచ్ఛ జిల్లాగా తీర్చిదిద్దాలని, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వ్యాపార ప్రదేశాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయాలని, తడి, పొడి వ్యర్థాలను వేరుగా వర్గీకరించేందుకు శ్రీకారం చుట్టాలని, మెప్మా, డీఆర్డీఏ ఆధ్వర్యంలోని మహిళా స్వచ్ఛంద సమూహాల ద్వారా ఇంట్లోనే కంపోస్ట్ తయారీని ప్రోత్సహించాలని, నీటి మట్టాలు తగ్గిపోయిన 165 గ్రామాల్లో భూగర్భ జలాలను పునరుద్ధరించే చర్యలు చేపట్టాలని కలెక్టర్ తీర్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 24 పర్యాటక కేంద్రాల పరిసరాలు ఆహ్లాదకరంగా మార్చాలన్నారు. స్వచ్ఛ ఆంధ్రా అవార్డ్స్–2025లో రాష్ట్ర స్థాయిలో ‘మన ఊరు మన గుడి మన బాధ్యత‘ స్వచ్ఛంద సంస్థ అవార్డు లభించిందని తెలిపారు. జిల్లాలో వివిధ విభాగాల్లో మొత్తం 51 అవార్డులు సాధించిన నిర్వాహకులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన మెమొంటోలు, సర్టిఫికెట్లు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేసి, వారిని శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, డీపీవో లలితాబాయి, డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, డోన్ మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్, నంద్యాల ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తక్ అహ్మద్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
పప్పుశనగ సాగుపై నీలినీడలు
అటు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం.. ఇటు అనుకూలించని వాతావరణంతో పప్పుశనగ సాగుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఏటా రబీ సీజన్ మొదటి పంటగా జిల్లాలో విస్తారంగా పప్పుశనగ సాగు చేసే రైతులకు ఆదిలోనే అవరోధాలు ఎదురవుతున్నాయి. కోవెలకుంట్ల: అక్టోబర్ మాసం ప్రారంభంతో రబీ సీజన్ షురూ అయ్యింది. పప్పుశనగ సాగుకు సరైన అదును. జిల్లాలోని 29 మండలాల పరిధిలో జేజే–11, ఫూలేజి రకాలకు చెందిన శనగ సాగు సాధారణ విస్తీర్ణం 57,299 హెక్టార్లు. ఇందులో స్థానిక వ్యవసాయ సబ్ డివిజన్లోని కోవెలకుంట్ల, సంజామల, అవుకు, కొలిమిగుండ్ల, ఉయ్యాలవాడ, దొర్నిపాడు మండలాల్లో అత్యధికంగా 38,900 హెక్టార్లలో శనగ సాగు కావాల్సి ఉంది. అల్పపీడన ప్రభావంతో ఇటీవల కురుస్తున్న వర్షాలు, రసాయన ఎరువులు అందుబాటులో లేకపోవడం. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు సబ్సిడీ విత్తనాలను సరఫరా చేయకపోవడంతో విత్తన ప్రక్రియ ముందుకు సాగడం లేదు. గత నెల 20వ తేదీ నుంచి ఒకటి రెండు, రోజుల వ్యవధిలో వరుసగా వర్షాలు కు రుస్తుండటంతో నీరు నిల్వ చేరి పొలాలు బీళ్లు అయ్యాయి. ఈ నెల మొదటి వారం సాగుకు అనుకూలంగా ఉంటుందనుకున్నా రైతులకు నిరాశే మిగిలింది. వర్షాలు వీడకపోవడంతో సాగు ముందుకు సాగడం లేదు. వర్షాల కారణంగా పొలాల్లో పిచ్చిమొక్కలు, కలుపు పెరిగి బీళ్లను తలపిస్తున్నాయి. ప్రతి ఏటా దసరా పండుగ ముగిసిన వెంటనే విత్తనా లు వేసే వారు. ఈ ఏడాది దసరా పండుగ ముగిసినా విత్తనానికి పొలాలు సిద్ధం చేసుకులేని పరిస్థితి తలెత్తింది. పొలాల్లో తేమ శాతం ఆరేందుకు మరో వారం రోజులపాటు గడువు పట్టేలా ఉండటం, అల్పపీడన ప్రభావంతో తిరిగి వర్షాలు కురిసే ఆస్కారం ఉండటంతో రైతులు దిగాలు చెందుతున్నారు.గతేడాది కుదేలుగత ఏడాది విత్తన సమయంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. వరణుడిపై భారం వేసి రైతులు విస్తారంగా శనగ పంట సాగు చేశారు. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 51 వేల హెక్టార్లలో శనగ సాగు సాధారణ విస్తీర్ణం కాగా 52 వేల హెక్టార్లలో రైతులు జేజే–11, ఫూలేజీ రకాలకు చెందిన శనగ పంట సాగుచేశారు. విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపు నివారణ, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 20 వేలు వెచ్చించారు. కౌలు రైతులపై కౌలు రూపంలో అదనంగా మరో రూ. 15 వేలు భారం పడింది. పంట మార్పిడి విధానం అవలంభించకపోవడం, విత్తన సమయంలో పొలాలను కలియదున్నక పోవడం, వాతావరణం అనుకూలించకపోవడం, తదితర కారణాలతో శనగ పైరును వేరుకుళ్లు (ఎండు తెగులు) ఆశించి పైరులో మొక్కలు ఎండిపోయాయి. ఫూలేజి (తెల్లశనగ) రకానికి చెందిన పైరుకు ఎక్కువశాతం ఎండు తెగులు ఆశించింది. తెగులుకు తోడు గత నవంబర్, డిసెంబర్ నెలల్లో తుపాన్ల ప్రభావంతో కురిసిన వర్షాలు, అధిక తేమ కారణంగా పైరు దెబ్బతినింది. వేలాది రూపాయాలు పెట్టుబడులు వెచ్చించగా అధిక వర్షాలు, తెగుళ్ల కారణంగా దెబ్బతిని ఎకరాకు 3– 4 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాకపోడంతో రైతులు నష్టాల ఊబిలో కూరకపోయారు.ఈ ఏడాది ఆరంభంలోనే అడ్డంకులు..జిల్లాలో ఈ ఏడాది పప్పుశనగ సాగుకు సరైన అదును కాగా సాగుకు అడ్డంకులు వేధిస్తున్నాయి. విత్తనానికి ముందు రైతులు ఎకరాకు రెండు బస్తాల డీఏపీ ఎరువులను భూమిలో వేయాల్సి ఉంది. ఖరీఫ్ సీజన్లో రైతులను యూరియా కష్టాలు వేధించగా ఈ సీజన్లో డీఏపీ కష్టాలు తప్పడం లేదు. జిల్లాలోని ఆయా మండలాల్లో రైతులు గత కొన్నేళ్ల నుంచి శనగ పంటకు గోదావరి డీఏపీని విరివిగా వినియోగిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆ రకం డీఏపీ అందుబాటులో లేదు. రైతు సేవా కేంద్రాలు, మనగ్రోమోర్ కేంద్రాల్లో, సహకార పరపతి సంఘాల్లో గోదావరి డీఏపీ దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం బస్తా రూ. 1,430కు రైతులకు అందాల్సి ఉంది. దీన్ని ఆసరా చేసుకుని కొందరు ప్రైవేట్ డీలర్లు గోదావరి డీఏపీని అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. అలాగే జిల్లాకు 11,950 క్వింటాళ్ల సబ్సిడీ శనగలను ప్రభుత్వం కేటాయించింది. క్వింటాకు రూ. 7,800 ప్రభుత్వం ధర నిర్ణయించగా 25 శాతం సబ్సిడీతో రైతులకు రూ. 5,850 ప్రకారం సరఫరా చేయాల్సి ఉంది. విత్తన కేటాయింపులు తప్పా ఇప్పటి వరకు విత్తనాలు సరఫరా కాకపోవడంతో రైతులు విత్తనాల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది.రసాయన ఎరువులు దొరకడం లేదు ఈ ఏడాది 65 ఎకరాల సొంత పొలంతోపాటు ఎకరాకు రూ. 20 వేలు కౌలు చెల్లించి మరో పదిహేను ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. మొత్తం 80 ఎకరాల్లో తెల్ల, ఎర్ర శనగ సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. గోదావరి డీఏపీ దొరకడం లేదు. ఇతర రకాలకు చెందిన డీఏపీ వేద్దామనుకున్నా రైతుసేవా కేంద్రాల్లో వ్యవసాయ శాఖ సిబ్బంది ఎరువులు ఇవ్వడం లేదు.– గోవిందరెడ్డి, రైతు, గుంజలపాడు, కోవెలకుంట్ల మండలం50 శాతం సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలిఈ ఏడాది పప్పు శనగ సాగుకు ప్రభుత్వం 25 శాతం సబ్సిడీతో శనగ విత్తనాలను సరఫరా చేస్తోంది. క్వింటా రూ. 7,800 ధర నిర్ణయించి రూ. 5,850 ప్రకారం పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మూడు ఎకరాల సొంత పొలంలో ఈ ఏడాది శనగ సాగు చేయాలనుకుంటున్నాను. ప్రస్తుత మార్కెట్ క్వింటా రూ. 6 వేలలోపు ధర ఉంది. 25 శాతం సబ్సిడీ ఇచ్చినా మార్కెట్ధర ప్రకారం శనగలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. 50 శాతం సబ్సిడీతో శనగ విత్తనాలు సరఫరా చేసి ఆదుకోవాలి.– సుబ్బరాయుడు, రైతు, కోవెలకుంట్లసబ్ డివిజన్ సాధారణ సాగు విస్తీర్ణం విత్తన కేటాయింపులు(హెక్టార్లలో) (క్వింటాళ్లలో)కోవెలకుంట్ల 38,900 7,900నంద్యాల 5,000 2,125ఆళ్లగడ్డ 4,747 500ఆత్మకూరు 1,310 250నందికొట్కూరు 6,772 1,000డోన్ 570 175జిల్లాలో 57,299 హెక్టార్లలో సాగు లక్ష్యం -
వైభవంగా శ్రీశైలగిరి ప్రదక్షిణ
శ్రీశైలంటెంపుల్: పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. స్వామిఅమ్మవార్ల మహా మంగళహారతుల అనంతరం ఉత్సవమూర్తులను పల్లకీలో ఉంచి ప్రత్యేక పూజలు జరిపారు. పల్లకీ ఊరేగింపుతో శ్రీశైల గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం నుంచి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధర మండపం, అంకాళమ్మ గుడి, నందిమండపం, గంగాసదనం, బయలు వీరభద్రస్వామి ఆలయం, రింగ్రోడ్డు, ఫిల్టర్బెడ్, సిద్దరామప్ప కొలను, పుష్కరిణి వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి తిరిగి నందిమండపం, ఆలయ మహాద్వారం వద్దకు చేరుకుంది. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన అధికారులు, సిబ్బంది, పలువురు భక్తులు పాల్గొన్నారు. చట్ట పరిధిలో విచారించి న్యాయం చేస్తాం నంద్యాల: ప్రజలు ఇచ్చిన సమస్యలను చట్ట పరిధిలో విచారించి సత్వర న్యాయం చేస్తామని అడిషనల్ ఎస్పీ యుగంధర్బాబు అన్నారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు నుంచి ఆయన ఫిర్యా దులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, ఫిర్యాదు లు పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్నప్రసాద వితరణకు విరాళాలు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి పలువురు భక్తులు విరాళాలు అందించారు. సోమవారం గుంటూరుకు చెందిన దాత వీరశేఖరరావు రూ.1,00,116, కర్నూలుకు చెందిన దాత ఎల్.రమేష్బాబు రూ.1,01,101 విరాళాన్ని పర్యవేక్షకులు కె.శివప్రసాద్కు అందజేశారు. విరాళాలు అందించిన దాతలకు దేవస్థానం తరుఫున స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను, జ్ఞాపికను అందించి సత్కరించారు. నేడు కర్నూలుకు డీజీపీ కర్నూలు: ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్త మంగళవారం కర్నూలులో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 16వ తేదీన జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు డీజీపీ కర్నూలుకు వస్తున్నారు. ఈ మేరకు జిల్లా పోలీసు శాఖకు సమాచారం అందింది. ప్రధానమంత్రి పర్యటన నిమిత్తం వీవీఐపీలు, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పర్యటించనున్న నేపథ్యంలో ముందస్తు భద్రత ఏర్పాట్లపై డీజీపీ సమీక్షించనున్నారు. ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ సర్వజన వైద్యశాలల్లో పోస్టుల భర్తీకి ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసినట్లు కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 10 కేటగిరీల్లో పోస్టులు భర్తీ చేసేందుకు జూలై 7న నోటిఫికేషన్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఏడు కేటగిరీల్లో పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారి ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్లను https:// kurnool.ap.gov.in, https://kurnool medical college.ac.in వెబ్సైట్లలో అప్లోడ్ చేశామని తెలిపారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 8 నుంచి 10వ తేదీలోపు కర్నూలు మెడికల్ కాలేజీలో సాయంత్రం 5 గంటల్లోపు లిఖిత పూర్వకంగా సమర్పించాలని పేర్కొన్నారు. ఆన్లైన్లో పంపిన అభ్యంతరాలు స్వీకరించబోమని తెలిపారు. -
ఆశలు నీట మునిగి.. కన్నీళ్లు మిగిలి!
● కుండపోత వర్షం ● నీట మునిగిన పంటలు.. తడిచిన దిగుబడులు ● లబోదిబోమంటున్న రైతన్నలు హరినగరం సమీపంలో ఆరబెట్టిన మొక్క జొన్నలు తడిచిన దృశ్యంచిత్రేనిపల్లె సమీపంలో మొక్కజొన్న పొలంలో నుంచి పారుతున్న వాన నీరురుద్రవరం: అన్నదాతలను వరుణుడు ముంచేస్తున్నాడు. భారీ వర్షాలకు చేతికొచ్చిన పంటలు నీటి పాలవుతున్నాయి. 20 రోజులుగా కురిసిన వరుణుడు ఇక తెరిపి ఇచ్చాడులే అనుకుంటున్న తరుణంలో కుండపోత వర్షంతో రైతులు కుదేలయ్యారు. రుద్రవరం, చాగలమర్రి, దొర్నిపాడు, ఉయ్యాలవాడ మండలాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు ఉప్పొంగాయి. పంట పొలాల్లో నీళ్లు నిలిచాయి. మొక్కజొన్న రైతులకు కోలుకోలేని దెబ్బ పడింది. గత 20 రోజులుగా కురుస్తున్న వర్షం మూడు రోజులుగా తెరిపి ఇవ్వడంతో మండల కేంద్రమైన రుద్రవరం, టీ.లింగందిన్నె, ఆలమూరు, నర్సాపురం, అప్పనపల్లె, ఎల్లావత్తుల, కోటకొండ, ముకుందాపురం, హరినగరం, నక్కలదిన్నె, ముత్తలూరు తదితర గ్రామాల పరిధిలో మొక్కజొన్న కోతలు జోరుగా సాగాయి. దిగుబడులను ఆర్అండ్బీ రోడ్లు, కల్లాలు, బయలు ప్రదేశాల్లో ఆరబెట్టారు. హఠాత్తుగా వర్షం కురవడంతో ఆరబోసిన మొక్క జొన్నలు తడిచిపోవడంతో రైతులు నష్టపోయారు. ఆలమూరు వద్ద ఉన్న దొన్ల వాగుపై నీరు ఉద్ధృతంగా పారుతోంది. భారీ వర్షానికి మండలంలోని పలు గ్రామాల వద్ద వరి, మొక్కజొన్న, మిర్చి, మినుము, వేరుశనగ వంటి పంటలు నీట మునిగాయి. అలాగే మండల కేంద్రమైన రుద్రవరంతో పాటు పలు గ్రామాల్లోని లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. దొర్నిపాడు మండలంలో.. పత్తి, మినుము, కంది, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. పొలాల్లో తేమ శాతం అధికం కావడంతో ఈ పంటలన్నీ నీరుకుట్టు తీసుకుంటున్నాయని రైతులు వాపోతున్నారు. ఇటీవలే విత్తనపత్తి క్రాసింగ్ పనులు మొదలు కావడంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పింజలన్నీ నేలరాలుతున్నాయి. కుందూ పరీవాహక ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ సుభద్ర హెచ్చరించారు. జిల్లాలో మళ్లీ వర్షం నంద్యాల(అర్బన్): జిల్లాను వరుణుడు వీడటం లేదు. మూడు రోజులు తెరిపి ఇచ్చి మళ్లీ కురిశాడు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు పలు మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. చాగలమర్రి మండలంలో అత్యధికంగా 75.2 మి.మీ, వెలుగోడు మండలంలో అత్యల్పంగా 3.0 మి.మీల వర్షపాతం నమోదైంది. అదే విధంగా రుద్రవరంలో 70.2, పాములపాడు 43.6, జూపాడుబంగ్లా 43.2,ఆళ్లగడ్డ 33.6, దొర్నిపాడు 30.4, శిరువెళ్ల 19.2, పగిడ్యాల 14.4, ఉయ్యాలవాడ 10.0, కోవెలకుంట్ల 3.4 మి.మీల వర్ష పాతం నమోదైంది. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ముత్యాలపాడులో మొక్కగింజలను నీళ్లలో నుంచి బయటకు తీస్తున్న మహిళా రైతు భారీ వర్షం.. అపార నష్టం చాగలమర్రి: భారీ వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండలంలో 75.2 మి.మీ వర్షపాతం నమోదైంది. గొడిగనూరు, శెట్టివీడు గ్రామాల వద్ద భవనాశి, అడ్డువాగులు ఉద్ధృతంగా ప్రవహించాయి. బ్రాహ్మణపల్లె వద్ద వక్కిలేరు వాగు వంతెన మీదుగా ప్రవహించింది. ముత్యాలపాడు చెరువు నిండి అలుగు ఎక్కి పారడంతో గ్రామం జలమయమైంది. స్థానిక ఎస్పీజీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆరబెట్టిన మొక్కజొన్న గింజలు తడిచి పోయాయి. దిగుబడులను కాపాడుకునేందుకు రైతులు పాట్లు అన్నీ ఇన్నీ కావు. కళ్ల ముందు కష్టమంతా నీటి పాలవుతుండటంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. -
పీజీఆర్ఎస్లో అర్జీల వెల్లువ
నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం అర్జీలు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై ప్రజలు వినతులు అందజేశారు. 222 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు సమర్పించారు. ఎక్కువగా భూ సమస్యలు, రీ సర్వేపై వినతులు వచ్చాయి. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో డీఆర్ఓ రాము నాయక్, డిప్యూటీ కలెక్టర్లు, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరించా రు. అంతకుముందు జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలు నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాల్సినవి 2,017, రీఓపెన్ అయిన దర ఖాస్తులు 539 ఉన్నాయని, వాటిని గడువు ముగిసే వరకు వేచి చూడకుండా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ఫీడ్ బ్యాక్ స్వీకరణ తక్కువ శాతం ఉందని వేగవంతం చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని సంక్షేమ హాస్టళ్లు, సీ్త్ర శిశు సంరక్షణ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై సంబంధిత క్షేత్రాధికారులు తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. వినతుల్లో కొన్ని.. ● గోస్పాడు మండలం ఎం.చింతకుంట్ల గ్రామంలో సర్వే నెం.247, 232లో అనుభవంలో ఉన్న భూమిని కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నానని, ఆ భూమిని ఆన్లైన్లో ఎక్కించాలని కోరుతూ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు వినతి పత్రం అందజేశారు. ● ఆళ్లగడ్డ మండలం జి.జంబులదిన్నె గ్రామంలో సర్వే నెం.328/ఎ2లో రెండు ఎకరాలు, సర్వే నెం.328/బి2లో 0.40 ఎకరాలు సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నానని, కానీ ఆన్లైన్లో 2.20 ఎకరాలు మాత్రమే చూపుతోందని అందుకు తగు చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన బి.శ్రీరామ్ అర్జీ ఇచ్చారు. ● తన భర్త అనారోగ్యంతో మృతి చెందారని జీవనోపాధి కోసం వితంతు పింఛన్ మంజూరు చేయాలని పాణ్యం ఎస్సీ కాలనీకి చెందిన నెరవాటి పుల్లమ్మ వినతి పత్రం అందజేశారు. -
హృదయ విదారకం
కొలిమిగుండ్ల: చిన్నా .. పెద్దా వయస్సు తేడా లేకుండా గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయనేందుకు ఈ వ్యక్తి ఆకస్మిక మరణమే మరో నిదర్శనం. 35 ఏళ్ల వ్యక్తి గుండె ఆగిపోయింది. ఆరోగ్య సమస్యతో ఆసుపత్రికి వెళ్లేందుకు బస్టాప్లో బస్సు కోసం వేచి ఉన్న వ్యక్తి అందరూ చూస్తుండగానే గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన సోమవారం కొలిమిగుండ్లలో చోటు చేసుకుంది. గొర్విమానుపల్లెకు చెందిన చెన్నయ్య(35) జీవనోపాధి కోసం నెల రోజుల నుంచి కొలిమిగుండ్లలోని మోడల్ స్కూల్ సమీపంలోని కాలనీలో ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం గ్యాస్ ట్రబుల్ సమస్య అంటూ తాడిపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. బైక్లో వస్తుండగా మార్గమధ్యలో కిందపడిపోయాడు. స్థానికులు సపర్యలు చేయడంతో కోలుకుని ఇంటికి చేరుకున్నాడు. నంద్యాల సమీపంలోని ఆసుపత్రికి వెళ్లేందుకు సోమవారం కాలనీలోని ఓ వ్యక్తి సాయంతో బైక్పై తహసీల్దార్ కార్యా లయం సమీపంలోని బస్టాప్ వద్దకు వచ్చాడు. వెనుక భార్య రమాదేవి, తల్లి నడిచి వస్తున్నారు. కూర్చున్న చోట మరొక వ్యక్తితో మాట్లాడుతుండగానే చెన్నయ్య కు గుండెపోటు రావడంతో కుప్పకూలి మృతి చెందాడు. ఈలోగా భార్య, తల్లి అక్కడికి చేరుకుని బోరున విలపించారు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నా రు. కుటుంబీకుల రోదన పలువురిని కలిచివేసింది. -
ముగిసిన అహోబిల పవిత్రోత్సవాలు
ఆళ్లగడ్డ: ఎగువ అహోబిలంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహ ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు వైభవోపేతంగా ముగిశాయి. ఆదివారం తెల్లవారు జామున ప్రారంభమైన పూజలు సోమవారం ఉదయం పూర్ణాహుతితో ముగిశాయి. ముందుగా మూలమూర్తులు జ్వాలా నరసింహస్వామి, చెంచులక్ష్మీ అమ్మవార్లను సుప్రభాతసేవతో మేల్కొలిపి దివ్యదర్శనం అనంతరం నిత్యపూజలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ జ్వాలా నరసింహుడిని యాగశాలలో కొలువుంచి నవకళశాలతో అభిషేకించి నూతన పట్టు పీతాంబరాలతో అలంకరించి పవిత్ర హోమం నిర్వహించారు. సాయంత్రం గ్రామోత్సవం, రాత్రి నిత్యపూజ అనంతరం శాంతి హోమాలు నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి, అర్ధరాత్రి అనంతరం ఉత్సవమూర్తులైన స్వామి అమ్మవార్లకు తిరుమంజనం, సంప్రోక్షణ చేపట్టారు. సోమవారం తెల్లవారు జామున శాత్తుమురై గోష్టితో పవిత్రోత్సవ కార్యక్రమాన్ని ముగించారు. ఆయా కార్యక్రమాలను అహోబిలం ప్రధానార్చకులు శ్రీమాన్ శఠగోప వేణుగోపాలన్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన వేద పాఠశాలల పండితులు నిర్వహించారు. -
శాస్త్రోక్తంగా శేర్తి పూజ
ఆళ్లగడ్డ: నవనారసింహులు కొలువైన ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం అహోబిలంలోని నల్లమల అటవీ ప్రాతంలో కొలువైన శ్రీ మాలోల లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ఆదివారం శేర్తి పూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అహోబిలం మఠం 46వ పీఠాధిపతి శ్రీవణ్ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో ఉద యం సుప్రభాత సేవతో స్వామిని మేల్కొలిపారు. నిత్య పూజలు అనంతరం గద్య త్రయం విన్నవించారు. అనంతరం నిత్యం ఆరాధించే ఉత్సవమూర్తి స్వర్ణ మాలోల నరసింహస్వామిని మూలమూర్తితో ఉంచి ప్రత్యేక శేర్తి పూజలు నిర్వహించి స్వామివారిని ప్రత్యేకంగా ఆరాధించారు. అనంతరం శాత్తుమురై గోష్టి కార్యక్రమాలతో పూజలు ముగించారు. ఈ పూజలు ప్రధానార్చకులు కీడాంబి వేణుగోపాలన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. -
రైతుల అభ్యున్నతికి కృషి చేయాలి
నంద్యాల(వ్యవసాయం): రైతుల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా అన్నారు. ఆదివారం నంది రైతు సమాఖ్య రజతోత్సవ కార్యక్రమాన్ని రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. నంది రైతు సమాఖ్య ముఖ్య సలహాదారులు డాక్టర్ రవీంద్రనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మాట్లాడుతూ.. రైతు సంఘాల కృషితో గోరుకల్లు రిజర్వాయర్ నిర్మాణం సాధ్యమైందని, అలాగే గిట్టుబాటు ధరల కోసం సమాఖ్య కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సిద్దేశ్వరం అలుగు నిర్మాణం ఆవశ్యకతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. డాక్టర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ 25 సంవత్సరాల పాటు నంది రైతు సమాఖ్య రైతు సంక్షేమానికి, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంత రైతుల అభ్యున్నతికి కృషి చేసిందన్నారు. ఎమ్మెల్సీ ఇసాక్బాషా మాట్లాడుతూ.. రైతులకు సరసమైన ధరలతో నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు అందించడానికి ప్రభుత్వం ముందుకు రావాలన్నా రు. రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేలా రైతు సమాఖ్య మరింత కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా నంది రైతు సమాఖ్య 25 ఏళ్ల ప్రత్యేక వార్షిక సంచికను అతిథులు, రైతులు, రైతు నాయకులు ఆవిష్కరించారు. అనంతరం వ్యవసాయ రంగంలో విశేష కృషి చేస్తున్న మహిళా రైతులు పద్మావతమ్మ, గోవిందమ్మను సత్కరించారు. సమాఖ్య నూతన అధ్యక్షునిగా బీవీ రామసుబ్బారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రైతు సమాఖ్య ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, కోఆర్డినేటర్ ఓబుళపతి, రైతు నాయకులు డాక్టర్ హయాగ్రీవచారి, రామసుబ్బారెడ్డి, శివరామకృష్ణారెడ్డి, శివారెడ్డి, అనుపూరు రామ సుబ్బారెడ్డి, రఫీ, హరినాథ్రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఆదినారాయణరెడ్డి, డీవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శ్రీశైలం డ్యాం గేట్ల మూసివేత
శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గడంతో ఆదివారం సాయంత్రం డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్లను మూసివేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో జలాశయానికి భారీగా వరద ప్రవా హం చేరడంతో 10 రేడియల్ క్రస్ట్గేట్లను 26 అడుగుల మేర తెరచి దిగువకు నీటిని విడుదల చేశారు. గత కొద్దిరోజుల నుంచి వరద తగ్గుముఖం పడుతుండడంతో క్రమేపి గేట్ల ఎత్తును, సంఖ్యను తగ్గించుకుంటూ వచ్చారు. శనివారం నుంచి ఆదివారం వరకు జలాశయానికి 3,19,207 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేర గా దిగువ ప్రాంతాలకు 3,13,478 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. స్పిల్వే ద్వారా 2,35,088 క్యూసెక్కు లు, విద్యుత్ ఉత్పత్తి అనంతరం 70,555 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు విడుదల చేశారు. బ్యాక్ వాటర్ నుండి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 5,000 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 2,835 క్యూసెక్కుల నీటిని వదిలా రు. కుడిగట్టు కేంద్రంలో 15.450 మిలియన్ యూ నిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.955 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశారు. ఆదివారం సాయంత్రానికి జలాశయంలో 210.9946 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
‘గంపెడు’ నష్టాలు!
కర్నూలు(అగ్రికల్చర్): నిన్న మొన్నటి వరకు ఉల్లి రైతుల కన్నీరు.. ఇప్పుడు టమాట రైతుల వేదన.. కూటమి ప్రభుత్వం రైతన్నల జీవితాలను రోడ్డు పడేస్తోంది. ఆరుగాలం కష్టించినా గిట్టుబాటు ధరలేక రైతులు దిగాలు చెందుతున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలకు, క్షేత్రస్థాయిలో చర్యలకు పొంతన లేకపోవడంతో రైతు నష్టాలను మూటకట్టుకుంటున్నాడు. టమాట కిలో ధర కనీసం రూ.8లకు తగ్గకుండా కొనుగోలు చేయాల్సి ఉన్నా.. ప్రస్తుతం రూ.2 కూడా దక్కని పరిస్థితి. 20 కిలోల టమాటకు లభిస్తున్న ధర రూ.50 మాత్రమే. టమాటకు మార్కెట్లో లభిస్తున్న ధరతో అమ్ముకుంటే కోత, రవాణా చార్జీలు, కమీషన్కే సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు. కర్నూలు జిల్లా లో పత్తికొండ, ఆస్పరి మండలం బిల్లేకల్, కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు, కర్నూలు మండలం గార్గేయపురంలో టమాట క్రయవిక్రయాలు సాగుతున్నాయి. నంద్యాల జిల్లాలో ప్యాపిలి, డోన్ మండలం చింతలపేట టమాట క్రయవిక్రయాలు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఆస్పరి, పత్తికొండ, పెద్దకడుబూరు, దేవనకొండ, క్రిష్ణగిరి, హాలహర్వి, హొళగుంద, వెల్దుర్తి, ఓర్వకల్, సీ.బెళగల్, గూడూరు మండలాలు, నంద్యాల జిల్లాలో ప్రధానంగా ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లో సాగవుతోంది. సీఎం ఆదేశాలు బేఖాతరు రైతులు తెచ్చిన టమాటను హోల్సేల్గా కిలో రూ.8 కంటే తక్కువకు కొనరాదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశించారు. ఈ ఆదేశాలు ఎక్కడా అమలుకు నోచుకోని పరిస్థితి. 25 కిలోల బాక్స్ను రూ.50 నుంచి రూ.80 ధరతో కొనుగోలు చేస్తున్నారు. అంటే కిలో ధర రూ.2 నుంచి రూ.3 వరకు మాత్రమే పలుకుతోంది. రెండు, మూడు రోజులుగా టమాట ధర మరింత దయనీయంగా మారింది. గత వైఎస్సార్సీపీ పాలనలో ధరలు పడిపోయినప్పుడు మార్కెటింగ్ శాఖ అధికారులు కిలో రూ.8కి తక్కువ లేకుండా కొనుగోలు చేశారు. ఇందుకు అనుగుణంగా వ్యాపారులు ధరలు పెంచారు. నేడు ఈ పరిస్థితి లేకపోవడం పట్ల రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. భారీగా నష్టపోతున్న టమాట రైతులు ఉమ్మడి జిల్లాలో 13,500 ఎకరాల్లో సాగు ధర పడిపోయినా స్పందించని సర్కారు రూ.8లకు కొనాలనే సీఎం ఆదేశాలు బేఖాతరు అనువుగాని చోట టమాట ప్రాసెసింగ్ యూనిట్ ఈ చిత్రంలోని రైతు పేరు లింగన్న. పత్తికొండ మండలం చిన్నహుల్తి గ్రామానికి చెందిన టమాట రైతు. శుక్రవారం మార్కెట్కు 30 గంపల టమాట తెచ్చారు. ఒక్కో గంప 20 కిలోలు ఉంటుంది. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం కనీస ధర రూ.8 ప్రకారం కొంటే గంపకు రూ.160 లభిస్తుంది. అయితే పత్తికొండ మార్కెట్లో 20కిలోల గంపకు లభించిన ధర రూ.50 మాత్రమే. అంటే కిలో టమాటకు లభించిన ధర రూ.2 మాత్రమే. ఒక ఎకరాలో టమాట సాగు చేశారు. పెట్టుబడి రూ.60 వేల వరకు వచ్చింది. కొద్ది రోజులుగా మార్కెట్కు టమాట తీసుకొస్తున్నా ఒక్క రోజు కూడా రూ.8 ధర లభించలేదు. టమాట పంటకు కూడా ఎకరాకు రూ.20 వేల ప్రకారం పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నాడు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 13,500 ఎకరాల్లో టమాట సాగయింది. ఈ–క్రాప్ బుకింగ్ ప్రకారం కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 3,990 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 3,312 ఎకరాల్లో సాగయింది. ఈ–క్రాప్ బుకింగ్ ఇంకా కొనసాగుతుండటంతో టమాట సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. ఉద్యాన శాఖ అధికారుల అంచనాల ప్రకారం ఎకరాకు 15 టన్నుల ప్రకారం దిగుబడి వస్తోంది. ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన టమాట నుంచి దాదాపు 2 లక్షల టన్నులు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ప్రతి రోజు 300 టన్నుల టమాట మార్కెట్కు వస్తోంది. -
విక్రయాలను అడ్డుకోవాలి
గంజాయి, డ్రగ్స్ రవాణా, విక్రయాలను అధికారులు అడ్డుకోవాలి. నంద్యాలలో ఇంజినీరింగ్, మెడికల్, డిగ్రీ, బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్లో చదువుకోడానికి పలు జిల్లాల నుంచి యువత వస్తోంది. యువకులనే కేంద్రంగా చేసుకొని గంజాయి వ్యాపారులు గంజాయిని పట్టణంలో అమ్ముతున్నారు. పోలీసులు విస్తృత దాడులు చేసి ముఠా ఆట కట్టించాలి – రాజునాయుడు, ఆర్వీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, నంద్యాల పోలీసు, ఎకై ్సజ్ శాఖ అధికారులు మత్తు పదార్థాలతో కలిగే నష్టాలపై యువతకు అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలం అయ్యారు. తూతూ మంత్రంగా కాకుండా ప్రధాన కూడళ్లు, కళాశాలలు, పాఠశాలల వద్ద అవగాహన కలిగేలా ప్లెక్సీలు ఏర్పాటు చేయాలి. పోలీసులు కాలేజీలు, గ్రామ శివారులు, నిర్మానుష్య ప్రాంతాలో నిఘా ఉంచాలి. తల్లిదండ్రులు తమ పిల్లలపైనే నిఘా ఉంచి పక్కదారి పట్టకుండా బాధ్యతగా ఉండాలి. మత్తు పదార్థాలపై విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు అవగాహన సదస్సులు కల్పించాలి. – నాగరాముడు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి, నంద్యాల -
శ్రీగిరికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకు న్నారు. వేకువజామున పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి క్యూలైన్లలో బారులుదీరారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండి పోయాయి. భక్తుల శివ నామ స్మరణతో శ్రీశైల ఆలయం మారుమోగింది. గోస్పాడు: వైద్యుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పీహెచ్సీ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అంకిరెడ్డి అన్నారు. పీహెచ్సీల వైద్యులు డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ఆ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అంకిరెడ్డి మాట్లాడుతూ.. పీహెచ్సీ వైద్యుల సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఎంతో కాలంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ప్రభు త్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ఓకే క్యాడర్లో పని చేస్తున్న సంబంధిత వైద్యులకు ఎలాంటి ప్రమోషన్లకు నోచుకోగా అవస్థలు పడాల్సి వస్తుందన్నారు. ఇన్ సర్వీస్ పీజీ కోటా పునరుద్ధరించాలని, టైమ్ బౌండ్ ప్రమోషన్లు అమలు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి బేసిక్ పే 50 శాతం ట్రెబల్ అలవెన్స్, నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరారు. నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 29న సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam. ap.gov.in వెబ్సైట్లో, టోల్ ఫ్రీ నెంబర్ 1100ను సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రశాంతంగా ఏపీపీ రాత పరీక్షలు కర్నూలు (టౌన్): పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) రాత పరీక్షలు ప్రశాంత వాతవరణంలో జరిగాయి. నగరంలోని జి. పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాలలో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలకు కర్నూలులో 261 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తనిఖీ చేశారు. ఎస్పీ వెంట ఏఎస్పీ హుస్సేన్ పీరా, కర్నూలు తాలూకా సీఐ తేజమూర్తి ఉన్నారు. -
జాడలేని బట్టమేక పక్షి
● వాతావరణంలో మార్పులే కారణమా ?నందికొట్కూరు: ప్రతి ఏడాది సెప్టెంబర్ నెలలో అరుదైన బట్టమేక పక్షి.. రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి కొన్ని నెలల పాటు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ పక్షులు ఇక్కడే గుడ్లు పెడుతుంటాయి. అయితే ఈ ఏడాది ఇంత వరకు అభయారణ్యంలో బట్టమేక పక్షుల జాడ కనిపించలేదని అధికారులు చెబుతున్నారు. వీటితో పాటు సుమారు 80 నుంచి 100 పక్షి జాతులు ఇక్కడికి వస్తుంటాయి. కొల్లేరు ప్రాంతంలో అరుదుగా కనిపించే ఫ్లవింగ్ బర్డ్స్ కూడా ఇక్కడికి వస్తాయి. ఈ ఏడాది అధిక వర్షాలు కురవడం, వాతావరణంలో మార్పులు రావడంతో కొన్ని పక్షులు సమయానికి రాలేదని తెలుస్తోంది. అందువల్లే బట్టమేక పక్షి కూడా రావడానికి ఆలస్యం అయ్యి ఉంటుందన్నా రు. పక్షి జాతులపై అధ్యయనం చేయడానికి చైన్నె, హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి శాస్త్రవేత్తలు, జంతు ప్రేమికులు ప్రతి శని, ఆదివారాల్లో వస్తుంటారు. వచ్చిన వారికి వసతి కోసం రెండు గదులు ఉన్నాయి. మరిన్ని వసతులు కల్పిస్తే పక్షులను, జింకలను చూసేందుకు జంతు ప్రేమికులు, పాఠశాలల విద్యార్థులు వచ్చే అవకాశం ఉంది. పక్షులను చూసేందుకు అభయారణ్యంలోకి వెళ్లాలంటే తప్పని సరిగ్గా ఉన్నతాధికారుల అనుమతులు ఉండాలని అధికారులు తెలిపారు. -
నువ్వు చాలా అందంగా ఉన్నావ్..
సాక్షి, నంద్యాల: ఆమె భర్తను కోల్పోయిన ఒంటరి మహిళ. దీంతో ఆ సీఐ కన్నుపడింది. ‘‘నువ్వు చాలా అందంగా ఉన్నావ్..! నిన్ను, నీ పిల్లలను బాగా చూసుకుంటాను’’ అంటూ మాటలు కలిపాడు. లోబర్చుకునేలా పొగిడాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు పెట్టించుకున్నాడు. ఇప్పుడు నీతో సంబంధమే లేదు పో అంటూ తిరస్కరిస్తున్నాడు. దీంతో నంద్యాల పట్టణంలోని మూలసాగరానికి చెందిన బాధితురాలు శనివారం మీడియా ముందుకు వచ్చి గోడు వెళ్లబోసుకుంది.ఆమె చెప్పిన వివరాలు... ‘‘నా భర్త రైల్వే ఉద్యోగిగా పనిచేస్తూ 14 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో నాకు రైల్వేలో ఉద్యోగం ఇచ్చారు. నంద్యాల త్రీటౌన్ సీఐ కంబగిరి రాముడుది మా ఊరే. 8 నెలల క్రితం ఫోన్లో పరిచయమయ్యారు. సొంత ఊరి వారవడంతో అరమరికలు లేకుండా మాట్లాడాను. ఖాళీగా ఉంటే స్టేషన్ వద్దకు రా అంటూ పిలిచేవారు. ఈ విధంగా మా మధ్య చనువు ఏర్పడింది. అయితే, సీఐ మభ్యపెట్టి నా వీడియోలు, ఫొటోలు తీశారు. వీటిని చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. లైంగికంగా వేధిస్తున్నారు. సీఐపై చర్యలు తీసుకోవాలని కర్నూలు డీఐజీ, నంద్యాల జిల్లా గత ఎస్పీకి పలుసార్లు ఫిర్యాదు చేసినా వారు ఆయనకే వత్తాసు పలికారు.’అనిఆవేదన వ్యక్తం చేసింది.పిల్లల్ని చంపేస్తా.. గంజాయి కేసు పెడతానా వ్యక్తిగత వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని, నన్ను, నా పిల్లలను చంపేస్తానని, గంజాయి కేసు పెడతానని సీఐ బెదిరించారు. నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారని గత ఎస్పీకి ఫిర్యాదు చేశా. ఆ తర్వాత ‘‘నీ ఫొటోలు అన్నీ డిలీట్ చేయించా. సీఐ ఇక నీ జోలికి రాడు. ఆయనపై కేసు పెట్టొద్దు అని డీఎస్పీ తెల్లకాగితంపై సంతకం చేయాలని ఒత్తిడి చేశారు.నేను కర్నూలు డీఐజీని కలిసేందుకు వెళ్లి... సీఐ పేరు చెప్పగానే ఇక్కడినుంచి వెళ్లు, ఏమైనా ఉంటే అక్కడ తేల్చుకో అని కసురుకుని పంపించేశారు. సీఐ కారణంగా మానసికంగా కుంగిపోయా. ఎప్పుడు ఏం చేస్తారోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నా. కూటమి ప్రభుత్వంలో మహిళలకు న్యాయం జరగడం లేదు’’ అని బాధితురాలు వాపోయింది. కాగా, మహిళ ఆరోపణలపై సీఐ కంబగిరిరాముడును ఫోన్లో వివరణ కోరగా స్పందించలేదు. -
టీడీపీ అరాచకాలను అడ్డుకుంటాం
● ఉనికి కోల్పోతామనే భయంతోనే టీడీపీ నాయకుల దాడులు ● రౌడీషీటర్కు పోలీసుల అండదండలు! ● మాజీ ఎమ్మెల్యేకాటసాని రామిరెడ్డికోవెలకుంట్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉన్న కలుగొట్ల గ్రామంలో రాబోయే రోజుల్లో తమ ఉనికి కోల్పోతామనే భయంతో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ అరాచకాలను అడ్డుకుంటామన్నారు. శుక్రవారం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెద్దగుర్రప్ప, తలారి శ్రీనివాసులు, నడిపిగుర్రప్ప, చిన్నగుర్రప్ప, గడ్డం బ్రహ్మానందరెడ్డి, బూస సుధాకర్రెడ్డి, మగ్బుల్పై ఇదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గడ్డం నాగార్జునరెడ్డి తన అనుచరులతో కర్రలు, రాడ్లతో దాడి చేసి గాయపరిచారు. ఈ మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కాటసాని పరామర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వైఎస్సార్సీపీకి పట్టు ఉన్న గ్రామంలో ఆధిపత్యం కోసం పోలీసు రికార్డుల్లో రౌడీషీటర్గా ఉన్న నాగార్జునరెడ్డి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి చేశారన్నారు. రౌడీషీటర్గా ఉన్న టీడీపీ నాయకుడిని పోలీసులు గడిచిన 15 నెలల కాలంలో ఏ రోజు పోలీస్స్టేషన్కు పిలువలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ అధికారంలో ఉందని, తామేమి చేసినా అడిగేవారు ఉండరన్న అహంభావంతో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీషీటర్ అండతోనే గ్రామంలో బహిరంగంగా బెల్ట్షాపు ద్వారా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయన్నారు. బస్టాండ్ ప్రాంతంలో తెల్లారకముందే మద్యం బాటిళ్లు అమ్ముతున్నా స్థానిక, ఎకై ్సజ్ పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కూరగాయలు, పాలు తెచ్చుకునేందుకు వెళుతున్న మహిళలను దుర్భాషలాడుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో ఎక్కడా ఎలాంటి ఘర్షణలు, గొడవలు చోటు చేసుకోకుండా ప్రజలు ప్రశాంత జీవనం గడిపారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అరాచకాలు సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. వైఎస్సార్ కార్యకర్తలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడి ఘటనను డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లామని, ఎస్పీని కలిసి వివరిస్తామన్నారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బీవీ నాగార్జునరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు సిద్ధంరెడ్డి రాంమోహన్రెడ్డి, చిక్కేపల్లి ప్రసాదరెడ్డి, రాచంరెడ్డి రాంభూపాల్రెడ్డి, రాజారెడ్డి, పోతం రాంమోహన్రెడ్డి, ఉప్పరి సుబ్బరాయుడు, రాంభూపాల్రెడ్డి, జశ్వంత్రెడ్డి పాల్గొన్నారు. -
కష్టాలే పెట్టుబడి.. నష్టాలే దిగుబడి!
కోవెలకుంట్ల: మొక్కజొన్న సాగుతో గతేడాది నష్టాలు చవి చూసిన రైతులకు ఈ ఏడాది సాగు కలిసి రాలేదు. గత ఖరీఫ్లో చోటు చేసుకున్న నష్టాన్ని పూడ్చుకునేందుకు ఈ ఏడు లక్ష్యాన్ని మించి సాగు చేసినా నిరాశే మిగిలింది. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 54,150 హెక్టార్లలో మొక్కజొన్న సాగు సాధారణ విస్తీర్ణం కాగా ఆయా మండలాల పరిధిలో 55,408 హెక్టార్లలో సాగైంది. విత్తనానికి ముందు విస్తారంగా వర్షాలు కురియడంతో సాగుకు అనుకూలంగా మారింది. బోర్లు, బావులు, చెరువులు, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, తదితర సాగు నీరు వనరులు అందుబాటులో ఉండటంతో లక్ష్యానికి మించి సాగైంది. విత్తనం వేశాక వరణుడు ముఖం చాటేయడం, పైరు వివిధ దశల్లో తెగుళ్లు, పుప్పడి దశలో వేసవిని తలపించేలా ఎండలు, పంట చేతికందే తరుణంలో అధిక వర్షాలు మొక్కజొన్న రైతులను వెంటాడటంతో రైతులు కుదేలయ్యారు. జిల్లాలో ప్రస్తుతం మొక్కజొన్న కోత, నూర్పిడి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నష్టాల మూట! గత ఏడాది జిల్లాలోని 29 మండలాల పరిధిలో 45,200 హెక్టార్లలో మొక్కజొన్న సాగు సాధారణ విస్తీర్ణం కాగా ఆయా మండలాల్లో 54 వేల హెక్టార్లలో సాగు చేశారు. 105 నుంచి 110 రోజులు పంటకాలం కాగా పైరు ఆరంభంలో వర్షాభావం, పంట చేతికందే తరుణంలో తుఫాన్ వెంటాడి దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపాయి. పైరు కంకిదశలో ఉండగా గత ఏడాది అక్టోబర్ నెలలో తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసి పంట దెబ్బతిని దిగుబడులు తగ్గాయి. విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కోత, నూర్పిడి, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 25వేల నుంచి రూ. 30 వేలు వెచ్చించారు. ఎకరాకు 22 నుంచి 30 క్వింటాళ్లలోపే దిగుబడులు రావడంతో నష్టాల ఊబిలోకూరకపోయారు. మార్కెట్లో క్వింటా రూ. 2,200 మించి పలకపోవడంతో నష్టాలు మూటగట్టుకున్నారు. ఈ ఏడాది మిరపకు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగు చేసినా రైతులకు కష్టాలు తప్పలేదు. క‘న్నీటి’కష్టాలు ఈ ఏడాది కోటి ఆశలతో మొక్కజొన్న సాగు చేసిన రైతులకు విత్తనం వేసినప్పటి నుంచి అష్టకష్టాలు తప్పలేదు. తొలుత సాగునీటిని మళ్లించుకునేందుకు అవస్థలు పడ్డారు. ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, కుంటలు, చెరువులకు డీజల్ ఇంజిన్లు అమర్చుకుని ఐదు నుంచి ఏడు తడులు సాగునీటిని అందించారు. ఒక్కో తడి సాగునీటి మళ్లింపుకు డీజిల్ ఇంజిన్లు, పైపులు, డీజల్, కూలీ ఖర్చుల రూపంలో రూ. 5 వేలు అదనపు భారం పడింది. వర్షాభావానికి తోడు పైరు పుప్పడి దశలో వేసవికాలాన్ని తలపించేలా ఎండలు మండటంతో మొక్కజొన్న కంకి కట్టక దిగుబడులపై ప్రభావం చూపింది. వీటికి తోడు కొన్ని చొట్ల పైరుకు ఎండు తెగులు, కత్తెర పురుగు ఆశించడంతో వాటి నుంచి పైరును కాపాడుకునేందుకు రైతులు వ్యయ ప్రయాసలు ఎదుర్కొన్నారు. ఎకరాకు 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడులు వస్తాయనుకుంటే వర్షాభావం, పుప్పడి రాలిపోడం, తెగుళ్లతో ఎకరాకు 20 నుంచి 22 క్వింటాళ్లకే దిగుబడులు పరిమితమయ్యాయి. కోత, నూర్పిడి పనులు ప్రారంభం కాగా అల్పపీడన ప్రభావంతో ఇటీవల కురుస్తున్న వర్షాలతో రైతులు అల్లాడిపోతున్నారు. రోడ్లపై, కల్లాల్లో ఆరబెట్టిన దిగుబడులు తడిచి పోతుండటంతో వర్షానికి పైరు నేలవాలడంతో రైతులకు వరుస కష్టాలు తప్పలేదు. వేలాది రూపాయలు పెట్టుబడుల రూపంలో వెచ్చించగా దిగుబడులు తగ్గిపోయా మరోవైపు రైతులను గిట్టుబాటు ధర వేధిస్తోంది. ప్రస్తుత మార్కెట్లో క్వింటా రూ. 2 వేల లోపే ధర ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నియోజకవర్గం సాగు విస్తీర్ణం (హెక్టార్లలో) నందికొట్కూరు 28,465 ఆళ్లగడ్డ 9,334 బనగానపల్లె 7,766 శ్రీశైలం 5,570 డోన్ 1,735 నంద్యాల 1,202 పాణ్యం, గడివేముల 1,336 రెండో ఏడాది కలిసి రాని మొక్కజొన్న సాగు ఎకరాకు రూ. 35 వేల పెట్టుబడి 20 నుంచి 22 క్వింటాళ్లకే దిగుబడి లభించని గిట్టబాటు ధర అన్నదాతకు మిగిలింది కన్నీరే! -
ఘనంగా బీఎస్ఎన్ఎల్ రజతోత్సవాలు
కర్నూలు(హాస్పిటల్): భారత సంచార నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం కర్నూలు నగరంలో సంస్థ ఆధ్వర్యంలో రజతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ జి.రమేష మాట్లాడుతూ బీఎస్ఎన్ఎల్ 2000 అక్టోబర్ 1న ప్రభుత్వ రంగ సెక్టార్ యూనిట్గా రూపుదిద్దుకున్నప్పటి నుంచి ప్రజలకు చేరువగా మారుమూల గ్రామాలకు కాపర్ ద్వారా ల్యాండ్లైన్, బ్రాండ్ బాండ్ సేవలను అందిస్తోందన్నారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పూర్తి ఫైబర్ టెక్నాలజీ ద్వారా వాయిస్, హై స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తోందన్నారు. ప్రపంచంలోనే స్వదేశీ టెక్నాలజీని ఉపయోగిస్తున్న ఆరవ అతి పెద్ద సంస్థగా బీఎస్ఎన్ఎల్ రూపుదిద్దుకుందన్నారు. వినియోగదారులు తమ పాత సిమ్కార్డులను 4జీ సిమ్లుగా మార్చుకోవాలన్నారు. సిల్వర్ జూబ్లీ సందర్భంగా సరసమైన ధరలతో ప్రవేశపెట్టిన నూతన ప్లాన్లను వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ సాయినాథ్, ఏజీఎంలు వి.శ్రీను నాయక్, దేవచంద్ నాయక్, లక్ష్మనాయక్, మురళీకృష్ణ, నారాయణస్వామి, వి.జాన్సన్, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. -
● రైతు కష్టం జీవాలపాలు!
సి.బెళగల్: ఉల్లి రైతుల కష్టం అంతా ఇంతా కాదు. నాటు వేసినప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన ఉల్లి పంట.. చేతికొచ్చిన తర్వాత ధర లేకపోవడంతో దిక్కుతోచక జీవాలకు వదిలేస్తున్నారు. మండలంలోని ఇనగండ్ల గ్రామానికి చెందిన రైతు ఇమ్మానియేలు ఎకరన్నర పొలంలో ఉల్లి సాగు చేశాడు. పంట చేతికి రావడంతో కోత కోయించేందుకు సిద్ధమయ్యాడు. ఈక్రమంలో మార్కెట్లో ధర పూర్తిగా పడిపోయింది. మరోవైపు కోతకు కూలీ, గ్రేడింగ్, రవాణా ఖర్చులతో మరింత అప్పులపాలు కావాల్సి వస్తుందని ఆందోళన చెంది జీవాలకు వదిలేశాడు. తన రెక్కల కష్టం జీవాలకు మేతగా మారడం చూసి రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఉల్లి రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. -
నేడు అశ్వాల పారువేట
● కొనసాగుతున్న యాదవరాజ వంశీయుల సంప్రదాయం ● సైనికులుగా మద్ది కులస్తులు మద్దికెర: రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి.. కానీ ఆనాటి సంప్రదాయాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. యాదవ రాజ వంశంలోని పెద్దనగిరి, చిన్ననగిరి, యామనగిరి కుటుంబీకులు అశ్వాల పారువేట ఉత్సవాన్ని మూడు శతాబ్దాల నుంచి కొనసాగిస్తున్నారు. ఏటా విజయదశమి రోజున గుర్రాలపై స్వారీ చేయడం వీరి ఆచారం. అందులో భాగంగా గురువారం ఉత్సవాలు నిర్వహించడానికి సిద్ధం చేసుకున్నారు. భోగేశ్వరాలయం నుంచి.. పూర్వం యాదవ వంశాలు రాజ్యాలను ఏలిన విజ యం విదితమే. అందులో భాగంగా ఆయా యాదవ వంశీయుల కుటుంబాలు తమ పూర్వీకుల నుంచి వస్తున్న గురప్రు స్వారీ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఒక్కో కుటుంబం నుంచి రెండు, మూడు గుర్రాలను స్వారీకి అనుమతిస్తుండటంతో ఆయా కుటుంబాలు విజయదశమికి నెల రోజుల ముందు నుంచే గుర్రాలు సమకూర్చుకుని శిక్షణ ఇస్తారు. పండుగ రోజు వారు తలపాగ ధరించి రాచరికపు వస్త్రాలతో ఖడ్గాలు ధరించి గుర్రాలపై మేళ తాళాలతో మండల కేంద్రానికి 3 కి.మీ దూరంలోని బొజ్జనాయినిపేట గ్రామంలో ఉన్న భోగేశ్వర ఆలయానికి చేరుకుంటారు. వీరికి సైనికులుగా ‘మద్ది’ కులస్తులు ఆయుధాలు ధరించి వెంట నడుస్తారు. ఆలయంలోని స్వామి వారికి పూజలు నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి మద్దికెరకు గుర్రాల స్వారీ ప్రారంభిస్తారు. విజయం సాధించిన వారిని భాజాభజంత్రీలతో మొదట ఊరేగిస్తారు. అనంతరం యాదవ రాజ వంశీకుల కుటుంబాలు గుర్రాలపై ప్రధాన రహదారిలో తమ రాచఠీవిని ప్రదర్శిస్తారు. ఈ వేడుకలను ప్రజలకు ఎంతో ఆశక్తితో తిలకిస్తారు. -
నిలిచిపోయిన రహదారి పనులు
● ఇబ్బందుల్లో 5 గ్రామాల ప్రజలు బేతంచెర్ల: మండల పరిధిలోని వెంకటగిరి గ్రామం నుంచి సీతారామాపురం, శంకరాపురం, బైనపల్లె మీదుగా యంబాయి, మండ్లవానిపల్లె గ్రామం వరకు చేపట్టిన పనులు నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వైఎస్సార్సీపీ హయాంలో ఈ రహదారికి రూ.8.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కాంట్రాక్ట్ దక్కించుకున్న మేఘా సంస్థ వెంకటగిరి గ్రామం నుంచి సీతారామాపురం వరకు రహదారి పనులు పూర్తి చేసింది. అంతలో సార్వత్రిక ఎన్నికలు రావడం, ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో అప్పటి నుంచి శంకరాపురం, బైనపల్లె మీదుగా యంబాయి, మండ్లవానిపల్లె వరకు చేయాల్సిన పనులు కాంట్రాక్టర్ నిలిపేశారు. ఇప్పటికి ఏడాదిన్నర గడిచిపోయినా పనులు ప్రారంభించకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 35 ఏళ్ల క్రితం నిర్మించిన శంకరాపురం బ్రిడ్జి సైతం ప్రమాదకరంగా ఉండటంతో అధికారులు స్పందించి మధ్యలో నిలిచిపోయిన పనులను పూర్తి చేయించాలని కోరుతున్నారు. -
అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు
అవుకు(కొలిమిగుండ్ల): బనగానపల్లె నుంచి అవుకు మండలం మంగంపేట తండాకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బుధవారం మార్గమధ్యంలో అదుపుతప్పి పక్కకు ఒరిగిపోయింది. బస్సులో 25 మందికి పైగానే ప్రయాణికులు ఉన్నారు. అయితే ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ఏమీ కాక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దసరా పండుగ కావడంతో ప్రజలు నిత్యావసర సరుకులు,ఇతర వస్తువులను బనగానపల్లెలో తీసుకొని బస్సులో బయలుదేరారు. బస్సు కృష్ణగిరి మెట్ట మీదుగా మంగంపేటకు ప్రయాణించే సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పి పక్కకు ఒరిగింది. -
అనారోగ్యంతో ఆర్మీ జవాన్ మృతి
పగిడ్యాల: జ మ్మూ కశ్మీర్లో ఆర్మీ జవాన్గా విధులు నిర్వ హించే పగిడ్యాల వాసి శెట్టిమాన్ తిక్కస్వామి(35) వారం రోజులు గా అనారోగ్యం బారినపడి ఢిల్లీ ఆర్ఆర్ హస్పిటల్లో చికిత్స పొందుతూ కోలు కోలేక బుధవారం మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆర్మీలో 14 ఏళ్ల సర్వీస్ను పూర్తి చేసుకుని ఇటీవల మళ్లీ 8 ఏళ్ల సర్వీస్ను పొడిగించుకుని ఢిల్లీలో పరేడ్కు హాజరై బీపీ లెవెల్స్ పడిపోయి అనారోగ్యానికి గురయ్యాడని వెల్లడించారు. మృతునికి భార్య సుభాషిణి, కుమారులు నిక్షిత్, షణ్ముఖ్ ఉన్నారు. గురువారం స్వగ్రామం పగిడ్యాలలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. -
సంప్రదాయ సమరానికి ‘సై’
దేవరగట్టు హొళగుంద మండలం నెరణికి గ్రామ సమీపంలోని దేవరగట్టుపై వెలసిన మాత మాళమ్మ, మల్లేశ్వర స్వామి అమ్మవార్ల ఉత్సవాలు విజయదశమి రోజున వైభవంగా జరుగుతాయి. అదే రోజు అర్ధరాత్రి నిర్వహించే స్వామి అమ్మవార్ల కల్యాణం తర్వాత జరిగే బన్ని ఉత్సవంలో ఘర్షణలకు తావులేకుండా కలిసి కట్టుగా జరుపుకుందామని దేవరగట్టు సమీపంలోని నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు చెరువుకట్ట (డొళ్లిన బండే)వద్దకు చేరి పాలబాసలు తీసుకుంటారు. అనంతరం కల్యాణానికి వస్తున్నట్లు గ్రామపెద్దలు పోలీసులకు బండారాన్ని ఇస్తారు. జౌట్లు పేల్చీ ఇనుప తొడుగులు, రింగు కర్రలు, అగ్గి కాగడాలు చేతపట్టి డోలు, మేళతాళాలతో నిమిషాల్లో కొండ(గిరి)పైకి చేరుకుంటారు. అక్కడ మాత మాళమ్మ, మల్లేశ్వర ఉత్సవ విగ్రహాలకు పురోహితులు, వేదపండితులు కల్యాణం జరిపిస్తారు. అనంతరం అర్ధరాత్రి ఉత్సవ మూర్తులతో జెత్రయాత్ర ప్రారంభమవుతుంది. నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి, అరికెర, అరికెర తండా, కురుకుంద, లింగంపల్లి తదితర గ్రామాల భక్తులు మొగలాయిలో పాల్గొంటారు. ఈక్రమంలో భక్తుల చేతుల్లో ఉన్న కర్రలు తగిలి పలువురికి గాయాలవుతాయి. మాళ మాళమ్మ, మల్లేశ్వరుని విగ్రహాలను మల్లప్ప గుడిలో కొద్ది సేపు కొలువుంచి తిరిగి ఉత్సవ విగ్రహాలను పల్లకీతో ఊరేగింపుగా జైత్రయాత్రను కొనసాగిస్తారు. భవిష్యవాణిపై నమ్మకం శమీ వృక్షం నుంచి విగ్రహాలు బసవన్న గుడికి చేరుకోవడంతో ఆలయ పూజారి గిరిస్వామి భక్తులకు భవిష్యవాణి వినిపిస్తారు. ఆ సమయంలో అందరూ ఒక్కసారిగా మొగలాయిని నిలిపేసి నిశ్శబ్దాన్ని పాటిస్తారు. రాబోయే కాలంలో వాణిజ్య పంటల ధరలు, ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయాలు తదితర పరిస్థితులను పూజారి వివరిస్తారు. అనంతరం పూజారి బహుపరాక్... గోపరాక్ అనగానే విగ్రహాలు సింహాసన కట్ట వైపు ఊరేగింపుగా బయలుదేరుతాయి. విగ్రహాలు సింహాసన కట్టకు చేరుకోవడంతో జైత్రయాత్ర ముగుస్తుంది. జంతువుల నుంచి రక్షణకే.. పురాతన కాలంలో దసరా బన్ని ఉత్సవాలు జరుపుకోవడానికి దూర ప్రాంతాల నుంచి భక్తులు దేవరగట్టు మాళ మల్లేశ్వస్వామి కొండకు తరలి వచ్చే సమయానికి చీకటయ్యేది. అప్పట్లో విద్యుత్, రవాణా సదుపాయాలు లేకపోవడంతో విషపురుగులు, జంతువుల భారీ నుంచి రక్షణ పొందేందుకు దివిటీటులు, మారణాయుధాలు చేత పట్టుకుని కొండపైకి వెళ్లి స్వామి వారి కల్యాణాన్ని నిర్వహించేవారు. కొందరు వ్యక్తిగత కక్షలతో చీకట్లో జరిగే ఊరేగింపులో రింగుకర్రలు, దివిటీలు, మారణాయు ధాలతో తమ ప్రత్యర్థులపై దాడులు చేసి పగ తీర్చుకునేవారు. ఇది కాలక్రమంలో కర్రల సమరంగా ముద్ర పడిపోయింది. హెల్త్ క్యాంప్ ఏర్పాటు ఉత్సవంలో గాయపడిన భక్తులకు దేవరగట్టులో భారీ ఎత్తున హెల్త్ క్యాంప్ను ఏర్పాటు చేయనున్నారు. డీఎంఅండ్హెచ్ఓ ఆధ్వర్యంలో 10 మంది డాక్టర్లు, ఆర్థోపెడిక్ సర్జన్, జనరల్ సర్జన్తో పాటు 100 మంది సిబ్బందితో వైద్య సేవలు అందించనున్నారు. వాటర్ ప్రూప్ టెంట్లో వందకు పైగా మంచాలు, మెడిసిన్, ఇతర అత్యవసర చికిత్సకు కావాల్సిన మందులు, పరికరాలతో పాటు 108, 104 అంబులెన్స్లు అందుబాటులో ఉంచనున్నారు. విజయ దశమి రోజున అర్ధరాత్రి సాగనున్న సంప్రదాయ సమరానికి దేవరగట్టు సర్వం సిద్ధమైంది. స్వామి అమ్మవార్ల జైత్రయాత్ర సందర్భంగా బన్ని ఉత్సవం పేరుతో జరిగే కర్రల సమరాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలమూలల నుంచే గాక పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికారులు వెయ్యి మందితో పోలీసు బందోబస్త్ను ఏర్పాటు చేశారు. – హొళగుంద ఆలూరు నియోజకవర్గ ప్రజలకు దసరా శుభకాంక్షలు. ప్రతి ఒక్కరూ దేవరగట్టు బన్ని ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి. ఆచారాలను, సంప్రదాయాలను గౌరవిస్తూనే పండుగను భక్తితో నిర్వహించుకుని, సంతోషంగా ఇంటికి చేరాలి. ఉత్స వాల్లో పాల్గొనే నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులతో పాటు దేవరగట్టు చుట్టు పక్కల గ్రామస్తులు బన్ని ఉత్సవం సమరం కాదు సంప్రదాయ పండుగని సమాజానికి చాటి చెబుదాం. – బుసినే విరూపాక్షి, ఆలూరు ఎమ్మెల్యే -
డ్రోన్ కెమెరాల నిఘాలో బన్ని ఉత్సవం
కర్నూలు: దసరాను పురస్కరించుకుని జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరిగే దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి బన్ని ఉత్సవాన్ని డ్రోన్ కెమెరాల నిఘాలో నిర్వహించనున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయుధ పూజ అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడారు. బన్ని ఉత్సవాల్లో 10 డ్రోన్ కెమెరాలతో పాటు 110 సీసీ కెమెరాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉత్సవాల్లో ఎవరైనా గాయాలపాలైతే వెంటనే వైద్యం అందించేందుకు 20 బెడ్లతో తాత్కాలిక ఆసుపత్రితో పాటు 104, 108 అంబులెన్స్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇప్పటికే దాదాపు 200 మంది ట్రబుల్ మాంగర్స్, సారా విక్రేతలను బైండోవర్ చేశామన్నారు. కార్డెన్ సెర్చ్లో భాగంగా 340 రింగుల కర్రలు, నాటుసారాను సీజ్ చేశామన్నారు. దేవరగట్టు పరిసర ప్రాంతాల్లో ఐదు చెక్పోస్టులు, పది పికెట్లు ఏర్పాటు చేశామన్నారు. ఉత్సవంలో చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలన్నారు. బన్ని ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా జరుపుకో వాలని భక్తులకు ఎస్పీ సూచించారు. తప్పిన ప్రమాదం ఆస్పరి: మండల కేంద్రం సమీపంలోనున్న విద్యుత్ సబ్ స్టేషన్ దగ్గర విద్యత్ స్తంభాన్ని బుధవారం ఓ లారీ ఢీ కొట్టింది. అయితే ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. స్తంభం లేకుంటే నేరుగా లారీ విద్యుత్ సబ్ స్టేషన్లోకి దూసుళ్లేదని ట్రాన్స్కో సిబ్బంది తెలిపారు. మహారాష్ట్ర నుంచి చక్కెర లోడుతో ఆదోని నుంచి ఆస్పరి వైపు వస్తున్న లారీని ఒక కారు ఓవర్ టేక్ చేసి వెళ్లే క్రమంలో స్పీడ్ బ్రేకర్ వద్ద సడన్ బ్రేక్ వేయడంతో.. లారీ డ్రైవర్ కారును తప్పించే క్రమంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్, క్లీనర్ వెంటనే లారీ నుంచి కిందకు దూకేశారు. ప్రమాదంపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఆస్పరి పోలీసులు తెలిపారు. -
సారూ కాళ్లు మొక్కుతా .. స్తంభాలు తొలగించండి
● తహసీల్దార్ను వేడుకున్న రైతు కుమారుడు నందికొట్కూరు: సారూ తమ పొలంలో ఉన్న విద్యుత్ స్తంభాలు తొలగించండి అంటూ మిడుతూరు మండలం చౌట్కూరు గ్రామానికి చెందిన రైతు నాగేశ్వరరావు కుమారుడు స్వామన్న తహసీల్దార్ శ్రీనివాసులు కాళ్లు మొక్కాడు. బుధవారం గ్రామ సభ జరుగుతుండగా స్వాములు తహసీల్దార్ వద్దకు వెళ్లి తమకు ఉన్నదే ఎకరా పొలమని, అందులో విద్యుత్ స్తంభాలు వేయడంతో సాగుకు కష్టంగా మారిందని, ఇదే విషయమై పదేళ్లుగా అధికారులకు విన్నవించుకుంటున్నా తొలగించడం లేదని ఆవేదన వ్యక్తం చేయగా.. స్పందించిన తహసీల్దార్ విద్యుత్ అధికారులతో మాట్లాడి తొలగించేందుకు చర్యలు తీసుకుంటానని హామీచ్చారు. -
శ్రీశైలంలో దేదీప్యమానంగా దసరా మహోత్సవాలు
● రమావాణీసేవిత రాజరాజేశ్వరిగా భ్రమరాంబాదేవి ● అశ్వ వాహనంపై విహరించిన భ్రమరాంబా సమేత మల్లికార్జునుడు ● రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పణ ● నేటితో ముగియనున్న దసరా మహోత్సవాలు -
రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పణ
దసరా మహోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామి అమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాలకు అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి అనం రామనారాయణరెడ్డి, దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, దేవస్థానం ఈఓ ఎం.శ్రీనివాసరావులు పట్టువస్త్రాలను తలపై పెట్టుకుని స్వామిఅమ్మవార్లను దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. -
జిల్లాకు రాష్ట్ర స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డు
నంద్యాల: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర అవార్డ్స్– 2025’లో నంద్యాల జిల్లాకు ఒక రాష్ట్రస్థాయి, 51 జిల్లాస్థాయి అవార్డులు లభించినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర (ఎస్ఏఎస్ఏ) కార్యక్రమం కింద రాష్ట్రంలో తొలిసారిగా సమగ్ర పరిశుభ్రతా సర్వే నిర్వహించి ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, ప్రజా ప్రదేశాల పరిశుభ్రత, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, ఆర్ఆర్ఆర్ (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్) వంటి స్థిరమైన ఆచరణల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన సంస్థలకు అవార్డులు కేటాయించారన్నారు. ఇందులో జిల్లా నుంచి ‘మన ఊరు – మన గుడి – మన బాధ్యత’ స్వచ్ఛంద సంస్థ రాష్ట్రస్థాయి అవార్డు పొందగా, జిల్లాస్థాయిలో 51 అవార్డులు లభించాయని తెలిపారు. స్వచ్ఛ మున్సిపాలిటీలు, స్వచ్ఛ గ్రామపంచాయతీలు, స్వచ్ఛ పాఠశాలలు, స్వచ్ఛ ఆసుపత్రులు, స్వచ్ఛ కార్యాలయాలు, స్వచ్ఛ రైతు బజార్లు, స్వచ్ఛ బస్ స్టేషన్లు, స్వచ్ఛ పరిశ్రమలు వంటి విభాగాలకు అవార్డులు ప్రకటించారన్నారు. ఈనెల 6వ తేదీన నంద్యాల జిల్లా కేంద్రంలో అవార్డు విజేతలను సన్మానించనున్నట్లు వెల్లడించారు. జిల్లాకు సంబంధించిన రాష్ట్రస్థాయి విజేతలు, జిల్లాస్థాయి అవార్డు విజేతల పూర్తి వివరాలు ప్రజలు పోర్టల్( https://sasa.ap.gov.in/) ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. -
మా సమస్యలు పరిష్కరించాల్సిందే
● డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట పీహెచ్సీ వైద్యుల ఆందోళనగోస్పాడు: న్యాయమైన తమ సమస్యలను పరిష్కరించాల్సిందేనని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అంకిరెడ్డి అన్నారు. బుధవారం డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ఆ సంఘం ఆధ్వర్యంలో వైద్యులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అంకిరెడ్డి మాట్లాడుతూ పీహెచ్సీ వైద్యుల సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇప్పటి వరకు పరిష్కారం లేదన్నారు. 20 ఏళ్లుగా పీహెచ్సీల్లో పనిచేస్తున్నా తమకు పదోన్నతులు రావడం లేదని, సీనియర్లు, జూనియర్లు ఒకే కేడర్లో పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్సర్వీస్ పీజీ కోటా పునరుద్ధరించాలని, టైమ్ బౌండ్ ప్రమోషన్లు అమలు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి బేసిక్ పే 50 శాతం ట్రైబల్ అలవెన్స్, నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలనికోరారు. అలాగే వైద్యులకు కచ్చితమైన పనిగంటలు ఏర్పాటు చేయాలని, స్థిరమైన వారాంతపు సెలవు ఇవ్వాలని, వైద్యుల జాబ్ చార్ట్ ఇవ్వాలని, అనధికార వ్యక్తులు(నాన్ మెడికల్, శాఖకు సంబంధం లేనివారు) పీహెచ్సీలను విచ్చలవిడిగా తనిఖీ చేయకుండా స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలన్నారు. అలాగే గత మూడు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న చంద్రన్న సంచార చికిత్స అలవెన్స్ను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్లు కాంతారావు నాయక్, భరత్ కుమార్, ప్రణీత్, షబ్బీర్, హుసేని, ప్రసన్న లక్ష్మి, రూపేంద్రనాథరెడ్డి, చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. -
పింఛన్ల పంపిణీ.. తప్పని అవస్థలు
● ఇంటి దగ్గర అందజేత నామమాత్రమే ● అవ్వాతాతలకు తీరని ఎదురుచూపులుకర్నూలు(అగ్రికల్చర్)/నంద్యాల (న్యూటౌన్): కూటమి ప్రభుత్వ పాలనలో ఇంటి వద్ద పింఛన్ల పంపిణీ చెప్పుకోవడానికే పరిమితమైంది. ప్రతి నెల మాదిరిగానే ఈసారి కూడా అవ్వతాతలు, వికలాంగులు ఇతర పింఛన్దారులు గ్రామ, వార్డు సచివాలయాల మెట్లు ఎక్కాల్సి వచ్చింది. పనులు వదులుకొని చాలామంది పింఛన్దారులు సచివాలయాలు, రచ్చబండల దగ్గర పడిగాపులు కాశారు. అక్టోబరు నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. పలు మండలాల్లో పింఛన్దారులందరికీ ఒకే చోటుకు పిలిపించి పంపిణీ చేశారు. దీని వల్ల అవ్వాతాతలు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి డీఆర్డీఏ పీడీ వైపీ రమణారెడ్డితో కలసి కర్నూలు నగరంలోని వివిధ కాలనీల్లో పింఛన్లు పంపిణీ చేశారు. కర్నూలు మండలం పంచలింగాల గ్రామంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పింఛన్లు పంపిణీ చేశారు. కర్నూలులో 94.12 శాతం, నంద్యాల జిల్లాలో 94.43 శాతం పంపిణీ... అక్టోబరు నెలకు సంబంధించి కర్నూలు జిల్లాలో 2,38,755 పింఛన్లు ఉండగా...సాయంత్రం 6 గంటల సమయానికి 2,24,711 (94.12 శాతం) మందికి పంపిణీ చేశారు. నంద్యాల జిల్లాలో 2,15,005 పింఛన్లు ఉండగా 2,03,032 (94.43 శాతం) పంపిణీ చేశారు. ఇంకా తీసుకోని వారికి ఈ నెల 3వ తేదీన పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
నాసిరకం పనులు
ఆత్మకూరురూరల్: జాతీయ రహదారి నిర్మాణం ఏర్పాటయితే ఆ దారి వెంబడి ఉండే గ్రామాల ప్రజలు, వాహనదారులు ఎంతో సంతోష పడతారు. ప్రయాణ కాలం తగ్గడంతో పాటు ప్రమాదాలకు చోటు ఉండకపోవడమే కారణం. అయితే ఇందుకు విరుద్ధంగా ఉమ్మడి కర్నూలు జిల్లా మీదుగా వెళ్తున్న కర్నూలు – గుంటూరు ప్రధాన రహదారి 340సీ జాతీయ రహదారి నిర్మాణం సాగుతోంది. కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో ఓ వైపు నాసిరకం పనులు.. మరో వైపు రాజకీయ మలుపులతో రోడ్డు మన్నికపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2014 లో మంజూరైన ఈ రహదారి 2025 నాటికి కూడా పూర్తిగా పనులు జరగలేదు. ఈ రహదారి పూర్తి స్థాయి లో ప్రారంభం కాకముందే రోడ్డు పగుళ్లు బారుతుండడం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో చేసిన పనులనే మళ్లీ చేయాల్సి వస్తోంది. పాములపాడు మండలం సమీపంలో శ్రీశైలం ప్రధాన కుడిగట్టు కాల్వ డీప్ కట్ కోసం జరిపిన తవ్వకాలలో బయట పడిన బిలుకు (వెల్స్పాయిల్) గుట్టలుగా పేరుకుని ఉంది. ఈ బిలుకును అక్కడే ఒక క్రషర్ నెల కొల్పి సన్నని ముక్కలుగా చేసి అలా తయారైన కంకరను 340సీ జాతీయ రహదారి అడుగు పాటుకు వినియోగించారు. ఈ బిలుకు లేయర్ను తగిన విధంగా తొక్కించక (రోలర్ తిప్పి) పోవడం వల్ల నాసిరకం రాతి పలకులు పిండిగా మారడంతో ఈ రహదారి తొలిదశలోనే నాణ్యతకు తిలోదకాలిచ్చింది. నిబంధనలు ‘బైపాస్’చేస్తూ.. జాతీయ రహదారి 340సీ కోసం మొదట ఇచ్చిన ప్లాన్ అప్రూవల్కు భిన్నంగా అక్కడక్కడా అలైన్మెంట్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తొలి ప్లాన్లో లేకున్నా పాములపాడు మండలం ఎర్రగూడూరు గ్రామంలో ఎంపీ శబరి ఒత్తిడి మేరకు అండర్ పాస్తో ఓవర్ బ్రిడ్జి నిర్మాణం అవుతోంది. ఇందుకోసం అవసరమైన భూసేకరణ జరపకుండా ముందు సేకరించిన భూమిలోనే నిర్మాణం చేపట్టడంతో సర్వీస్ రోడ్లు స్థలం చాలక ఇరుగ్గా మారుతున్నాయి. ● ఇదే మండలంలోని రుద్రవరం గ్రామం వద్ద నిర్మిస్తున్న అండర్ పాస్ కూడా అలైన్మెంట్ మార్పునకు గురైంది. అయితే రోడ్డు నిర్మాణం భూసేకరణలో లేని భూమి వైపు జరిగారని బాధితుడు హైకోర్టును ఆశ్రయించడంతో అటు వైపు పనులు జరగలేదు. దీంతో కుడివైపున రావాల్సిన సర్వీస్ రోడ్డు కుచించుకు పోయింది. సంబంధిత నిర్మాణ సంస్థ కుడివైపున ఉన్న ప్రయివేట్ భూముల్లో కొంత మేర తమకు ఇవ్వమని రైతులను నయానా, భయాన ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ● ఆత్మకూరు పట్టణానికి బైపాస్ చేస్తూ వెళ్లే రహదారి, ప్రధాన రహదారిని కలిసే చోట నిర్మించిన అండర్ పాస్ కూడా అలైన్మెంట్ తప్పింది. ఇక్కడ కూడా ఎడమవైపు భూసేకరణ జరిగిన భూమిని పూర్తిగా వినియోగించుకోకుండా కుడి వైపు ఎక్కువ స్థలంలో అండర్ పాస్ను నిర్మించారు. దీంతో సర్వీస్ రోడ్డు కోసం ఎడమ వైపు ప్రయివేటు భూమిలోకి జరగాల్సి వచ్చింది. ఇది గమనించిన ఆ భూ యజమాని నేరుగా కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి గడ్కరికి ఫిర్యాదు చేయడంతో గుత్తేదారు తగ్గాల్సి వచ్చింది. దీంతో ఎడమ వైపు సర్వీస్ రోడ్డు కుచించుకు పోతోంది. ఇక్కడ ఉన్న ఒక ప్రముఖ హోటల్ యజమాని కేంద్ర ప్రభుత్వ పెద్దల సహకారంతో విజయవంతంగా ముందుకు జరిపించుకోగలిగారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ కారణంగానే ఈ అండర్ పాస్ అలైన్మెంట్ మారి సర్వీస్ రోడ్డు సమస్య తలెత్తి నట్లు తెలుస్తోంది. ● ఆత్మకూరు పట్టణ శివార్లలో 340సీ (కర్నూలు – అమరావతి) జాతీయ రహదారి, 167కే (కల్వకుర్తి – నంద్యాల) జాతీయ రహదారులు రెండు క్రాస్ అవుతాయి. ఈ దారిలో ఆత్మకూరు పట్టణాన్ని కనెక్ట్ చేసే సర్వీస్ రోడ్డుకు బైపాస్ కింద దారి చేసేందుకు ఒక అండర్ పాస్ నిర్మించారు. వాస్తవానికి కల్వకుర్తి – నంద్యాల జాతీయ రహదారికి కూడా దారి ఇవ్వడం కోసం ఇక్కడే అండర్ పాస్ నిర్మించాల్సి ఉంది. ముందు చూపుతో అధికారులు ఆలోచన చేసి ఉంటే రెండింటికి ఉపయోగడే విధంగా ఒకే అండర్ పాస్తో పని జరిగేది. దీంతో ముందుగా అండర్ పాస్ కోసం నిర్మించిన ప్లయ్ ఓవర్ను తొలగించి మరో అండర్ పాస్ నిర్మించాల్సి వచ్చింది. ఇప్పుడు పక్కపక్కనే రెండు అండర్ పాస్లు రావడంతో వాహనదారుల్లో సందిగ్ధం నెలకొనే ప్రమాదం పొంచి ఉంది. రాజకీయ ‘మలుపులు’.. -
రేబిస్ వ్యాధితో వ్యక్తి మృతి
కోవెలకుంట్ల: పట్టణ శివారులోని స్వామినగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి రేబిస్ వ్యాధితో మంగళవారం మృతి చెందాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. కాలనీకి చెందిన మెట్ల నాగరాజు(40)కు రెండు నెలల క్రితం కుక్క కరిచింది. కుక్కకాటుకు సంబంధించి ఇంజెక్షన్లు వేయించుకోకుండా నిర్లక్ష్యం చేశాడు. రేబిస్ వ్యాధి ముదిరి సోమవారం సాయంత్రం అపస్మారక స్థితికి చేరుకోగా బంధువులు చికిత్స నిమిత్తం నంద్యాలకు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించగా కోలుకోలేక మృతి చెందాడు. మృతునికి భార్య లక్ష్మిదేవి, కుమారుడు లింగమయ్య, కుమార్తె అక్షర ఉన్నారు. వీడని వర్షం నంద్యాల(అర్బన్): నాలుగు రోజులుగా జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కుందూనదితో పాటు మద్దిలేరు, పాలేరు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు బండిఆత్మకూరు మండలంలో 70.2 మి.మీ వర్ష పాతం నమోదైంది. వెలుగోడులో 56.0, మహానందిలో 50.2, పగిడ్యాల 48.6, నంద్యాల అర్బన్ 44.0, నంద్యాల రూరల్ 42.4, గడివేముల 32.8, శిరివెళ్ల 32.6, పాములపాడు 32.2, బనగానపల్లె 30.4, రుద్రవరం 30.2, గోస్పాడు 28 మి.మీ మేర వర్షం కురిసింది. వరి, మొక్కజొన్న, పొగాకు, మినుము, మిరప పంటలు నీట మునగడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. నేటి నుంచి పింఛన్ల పంపిణీ నంద్యాల(న్యూటౌన్):జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు బుధవారం నుంచి పంపిణీ చేస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ శ్రీధర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 2,15,005 మంది పింఛన్ దారులకు రూ.92.64 కోట్లు మంజూరైనట్లు వివరించారు. కాగా సచివాలయ సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి పింఛన్ల పంపిణీలో పాల్గొంటున్నట్లు సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు. -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
బొమ్మలసత్రం: ప్రభుత్వ వైద్య కళాశాలలు పేద విద్యార్థులకు దేవాలయాలతో సమానమని, వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తే అడ్డుకుంటామని ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యోబు హెచ్చరించారు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయటాన్ని నిరసిస్తూ మంగళవారం స్థానిక బొమ్మలసత్రం సర్కిల్లో ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, కౌన్సిలర్ చంద్ర ఆధ్వర్యంలో నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా యోబు మాట్లాడుతూ.. దళితుల పిల్లలు ఉన్నత చదువులు చదివేలా దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఆయన బాటలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద పిల్లలు వైద్య విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారన్నారు. మిగతా కళాశాలల నిర్మాణానికి కేవలం రూ. 5వేల కోట్లు మాత్రమే అవసరమవుతాయని, అయినా ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వమే వాటి నిర్మాణానికి ముందుకు రావాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు యత్నించడం సరైంది కాదని, ఈ విధానాన్ని రద్దు చేసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోరుకు సిద్ధమని జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పంతో నంద్యాల మెడికల కాలేజీ నిర్మాణం పూర్తయి ఇప్పటికే విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారన్నారు. ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు అన్ని ప్రభుత్వ వ్యవస్థలను పేదలకు దూరం చేయాలనుకోవడం దారుణమన్నారు. దళితులకు వైద్యం, విద్యను దూరం చేసే దురుద్దేశంతో చంద్రబాబు ఇలాంటి కుటిల ఆలోచనలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం అధ్యక్షులు నాగేశ్వరరావు, బనగానపల్లి, డోన్, శ్రీశైలం, ఆళ్లగడ్డ, నందికొట్కూరు నియోజకవర్గాల అధ్యక్షులు సత్యం, వెంకస్వామి, జైపాల్, వెంకటన్న, పుల్లయ్య, నాయకులు తిమ్మరాజు, బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటీకరణ రద్దు చేయకపోతే పోరుకు సిద్ధం.. -
కూటమి ప్రభుత్వం రైతులను రోడ్డున పడేసింది!
ఓర్వకల్లు: కూటమి ప్రభుత్వం రైతులను రోడ్డున పడేసిందని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి విమర్శించారు. హుసేనాపురం గ్రామంలో రైతులు సాగు చేసిన పత్తి, పొగాకు పంటలను సోమవారం ఆయన రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా చేదు శ్రీనివాసులు, గాలెన్న అను రైతులు సాగు చేసిన పత్తి పొలాల్లో నిల్వవున్న వర్షపునీటితో పంట దెబ్బతిన్న పరిస్థితులను గమనించారు. అనంతరం నడివాగు వద్ద నిర్మించిన చెక్డ్యామ్ వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎద్దులబండిపై వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం రైతుల సమక్షంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ.. సాగుచేసిన పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు గగ్గోలు పెట్టాల్సిన పరిస్థితిలు నెలకొన్నాయన్నారు. పంటలు కోతదశకు వచ్చే సమయంలో అధిక వర్షాలు కురవడం, పండించిన దిగుబడులకు మార్కెట్లో గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో రైతుల పరిస్థితి దారుణంగా వుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉల్లి దిగుబడులను అమ్మకోవడానికి మార్కెట్కు తీసుకెళ్లిన రైతుల నుంచి కమీషన్ల ముసుగులో దోచుకోవడం ఎంత వరకు సమంజసమన్నారు. అక్రమ వసూళ్లను అరికట్టాల్సిన బాధ్యత మార్కెట్ శాఖ అధికారులపై ఉందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఉల్లి ధరలు తగ్గినప్పుడు రైతులకు నష్ట పరిహారం ఇవ్వడం, ధరలు పెరిగినప్పుడు సామాన్యులు ఇబ్బందులు పడకుండా సబ్సిడీతో ఉల్లిని అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులు పండించిన దిగుబడులకు గిట్టుబాటు ధర కల్పించపోగా, హెక్టారుకు రూ.50 వేలు పరిహారం చెల్లిస్తామని చెప్పినా ఇంత వరకు ఎటువంటి కార్యాచరణ చేపట్టలేదన్నారు. అధిక వర్షాలతో నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలి కర్నూలు మార్కెట్లో కమీషన్ల దందాను అరికట్టాలి వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి -
అధికార పార్టీ నేతలకు ఉద్యోగులు తలొగ్గొద్దు
బొమ్మలసత్రం: అధికారపార్టీ నేతల మాటలు విని కొందరు అధికారులు, ఉద్యోగులు వైఎస్సార్సీపీ కార్యకర్తల ధన, మాన, ప్రాణాలకు హాని కలిగించేలా వ్యవహరిస్తున్నారని, నేతలకు అధికారులు తలవంచాల్సిన అవసరం లేదని నంద్యాల మాజీ ఎమ్యెల్యే శిల్పా రవి చంద్రకిషోర్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన నివాసంలో కార్యకర్తల కోసం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న వైఎస్సార్సీపీ డిజిటల్బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్లను మాజీ ఎమ్యెల్యేతో పాటు ఎమ్మెల్సీ ఇసాక్బాషా పార్టీ నేతలు ఆవిష్కరించారు. అధికారపార్టీ నేతలు వైఎస్సార్సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కొందరు అధికారులను తొత్తులుగా మార్చుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో మారుమూల ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా డిజిటల్బుక్ ద్వారా అండగా నిలుస్తామన్నారు. కార్యకర్తకు అన్యాయం చేసిన అధికారి పేరు, అధికార పార్టీ నాయకుడి పేరు తదితర అంశాలను డిజిటల్ బుక్లో నమోదు చేయాలని సూచించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి బలైన వారిని భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదుకుంటామన్నారు. అధికారపార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరించి తమ కార్యకర్తల కుటుంబాలకు అన్యాయం చేస్తే ఎక్కడ ఉన్నా నడిరోడ్డుపై నిలబెట్టి ప్రశ్నిస్తామన్నారు. పేదలకు అన్యాయం చేస్తే వదిలే ప్రసక్తే లేదు కార్యకర్తలకు అండగా నిలించేందుకు ‘డిజిటల్ బుక్’ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా -
సేవల అంతరాయానికి ప్రభుత్వానిదే బాధ్యత
ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ల న్యాయపరమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలి. రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు సమ్మె కార్యాచరణ ప్రకటించి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాం. వైద్య సేవల్లో అంత రాయం కలగడంపై పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. 30న జిల్లా ప్రధాన కార్యాలయాల్లో జిల్లా స్థాయి వైద్యుల నిరసన, 1న జిల్లా ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన, నిరసన ర్యాలీ, 2న చలో విజయవాడకు పిలుపునిచ్చాం. – డాక్టర్ అంకిరెడ్డి, పీహెచ్సీ వైద్యుల శాశ్వత సంఘం జిల్లా అధ్యక్షుడు -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించే అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వీడాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అర్జీదారుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్య త అధికారులదేనన్నారు. జిల్లాలో గత ఏడాది జూన్ 15 నుంచి ఇప్పటి వరకు మొత్తం 43,143 అర్జీలు స్వీకరించబడ్డాయని, అందులో సరైన రీతిలో ఎండార్స్ చేయకపోవడం వల్ల 471 దరఖాస్తులు రీ–ఓపెన్ అయ్యాయని తెలిపారు. ప్రతి అధికారి రీ–ఓపెన్ అయిన దరఖాస్తులపై పూర్తి దృష్టి సారించి పరిష్కరించాలన్నారు. ప్రస్తుతం నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాల్సిన దరఖాస్తులు 1,926 ఉన్నాయని, అందులో రెవెన్యూ 1,038, సర్వే 394, పోలీస్ 130 తదితర శాఖల్లో పెండింగ్లో ఉన్నాయన్నారు. గడువు ముగిసే వరకు వేచి చూడకుండా వెంటనే పరిష్కరించాలన్నారు. ఆడిట్లో లోపాలు గుర్తించిన ఫిర్యాదులను తప్పనిసరిగా రీ–ఓపెన్ చేసి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ఫీడ్బ్యాక్ సేకరణలో డోన్ రూరల్, గడివేముల, గోస్పాడు, జూపాడుబంగ్లా, మిడుతూరు, సంజామల, రుద్రవరం, పాములపాడు, వెలుగోడు తదితర 15 మండలాలు గత రెండు వారాలుగా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. సోమ వారం మొత్తం 263 మంది వివిధ సమస్యలపై అర్జీలు అందజేశారన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్ఓ రాము నాయక్, డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
కార్యకర్తలకు వైఎస్ జగన్ అండ ..
రాష్ట్రంలోని పేదలకు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా ఉంటారని ఎమ్మెల్సీ ఇసాక్బాషా అన్నారు. కార్యకర్తలకు ఏకష్టం వచ్చినా వైఎస్ జగన్ చూస్తూ ఊరుకోరని, వారి కుటుంబాలకు ఆదుకుని తీరుతారన్నారు. అధికార పార్టీ నేతలు, అధికారులు ఇబ్బందులకు గురి చేస్తే వెంటనే డిజిటల్ బుక్లో వారి వివరాలను నమోదు చేయాలని కోరారు. భవిష్యత్తులో తమ పార్టీ అధికారం చేపడితే ఇబ్బందులకు గురిచేసిన వారి భరతం పట్టడం ఖాయ మన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల సంక్షేమం కోసం మ్యానిఫెస్టోలో చెప్పిన పథకాలన్నీ మాట మీద నిలబడి ఎలా నెరవేర్చారో, అలాగే డిజిటల్బుక్ ద్వారా తప్పకుండా కార్యకర్తలకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. కార్యకర్తలు తప్పకుండా డిజిటల్బుక్ను సద్వినియోగం చేసుకుని తీరాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్రమార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ పీపీ నాగిరెడ్డి, ఎంపీపీ శెట్టి ప్రభాకర్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ రామసుబ్బారెడ్డి, రాష్ట్ర మాజీ ఉమెన్వింగ్ ఉపాధ్యక్షురాలు శశికళారెడ్డి, పార్టీ మండలాధ్యక్షులు బసవేశ్వరరెడ్డి, పార్టీ జిల్లా నాయకులు రసూల్ ఆజాద్, దేవనగర్బాషా, అనీల్ అమృతరాజ్, టైలర్ శివయ్య, రామచంద్రుడు, నాయకులు నెరవాటి సత్యనారాయణ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. -
ధరలు ఇంకా పెరుగుతాయనే భయం
ధరలు పెరుగుతున్నా అవసరాన్ని బట్టి కొనక తప్పడం లేదు. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,500 ఉంది. ఈ ధర రూ.లక్షలోపునకు వస్తే వినియోగదారులకు కాస్త ఉపశమనం కలుగుతుంది. ధరలు ఇంకా పెరిగిపోయే ప్రమాదం ఉన్నందున కాస్త ముందుగానే కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో వచ్చాం. – స్వాతి, కర్నూలు ఏడాదిలో 10 గ్రాముల బంగారంపై దాదాపు రూ.40 వేల పెరుగుదల ఉంది. ధరలు ఇంకా పెరగడమే తప్ప తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. వేచి చూడటం వల్ల ధరల భారాన్ని భరించడమే అవుతుంది. డిజైన్లు ఆకట్టుకుంటున్నా ధరలు, తరుగు ఆందోళన కలిగిస్తున్నాయి.– రూప, కర్నూలు● -
రోడ్డు ప్రమాదంలో సైనికుడి మృతి
కర్నూలు(అర్బన్): విశాఖపట్నం ఇండియన్ నేవీలో విధులు నిర్వహిస్తున్న నగరంలోని క్రిష్ణానగర్కు చెందిన పీ రఘురామిరెడ్డి ఈ నెల 28వ తేదిన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నర్రా పేరయ్య తెలిపారు. ఆయన పార్థివదేహాన్ని కర్నూలులోని ఆయన నివాసానికి తీసుకువస్తున్నట్లు నేవీ ఉన్నతాధికారుల నుంచి ఇక్కడికి సమాచారం అందిందన్నారు. ఈ నెల 30వ తేదీన ఆయన అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా సైనిక్బోర్డు, నేవీ అధికారులు, మాజీ సైనికులు పాల్గొంటారని తెలిపారు. ఆయన మృతికి మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నదని, ఆయన కుటుంబానికి సంఘం ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. తోటలో రైతు మృతి కొలిమిగుండ్ల: మండల పరిధిలోని తోళ్లమడుగు గ్రామానికి చెందిన రైతు సద్దల చలమయ్య(60) మృతి చెందాడు. గ్రామానికి సమీపంలో చీని, నిమ్మ తోటలతో పాటు వరి సాగు చేస్తున్నాడు. సోమవారం కుటుంబ సభ్యులతో పాటు కూలీల తో పనుల్లో నిమగ్నమయ్యాడు. డ్రిప్కు సంబంధించి అన్ని వాల్వ్లు ఆఫ్ చేసి ఉంచడంతో మర్చిపోయి గేట్వాల్వ్ ఆన్చేశాడు. నీళ్ల ఒత్తిడికి పైపు ఎగిరి తలకు తగలడంతో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు. కొద్ది సేపటి తర్వాత కూలీలు గమనించి చలమయ్య కుటుంబ సభ్యులకు తెలిపారు. చికిత్స కోసం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఇంజినీరింగ్ అధికారులకు సెలవులు రద్దు కర్నూలు (టౌన్): దేశ ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల 16వ తేదీ కర్నూలు నగరంలో పర్యటిస్తున్నందున నగరపాలక ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే ఇంజినీర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, సచివాలయాల ఉద్యోగులకు సెలవులను రద్దు చేస్తున్నట్లు నగరపాలక కమిషనర్ పి. విశ్వనాథ్ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వచ్చే నెల 7 వ తేదీ లోపు పూర్తి చేసిన అభివృద్ధి పనులకు సంబంధిచిన వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో డిస్ట్రిక్ట్ మాస్ ఎడ్యుకేషన్ మీడియా ఆఫీసర్ (డెమో)గా ఎన్.ప్రకాష్రాజు నియమితులయ్యారు. గుంటూరులోని పీఓడీటీటీలో పనిచేస్తున్న ఆయన్ను పదోన్నతిపై కర్నూలుకు బదిలీ చేశారు. ఇక్కడ ఇన్చార్జ్ డెమోగా ఉన్న పి.శ్రీనివాసులుశెట్టిని కర్నూలులోని రీజనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ట్రైనింగ్ సెంటర్ (మేల్)లో కమ్యూనికేషన్ ఆఫీసర్గా బదిలీ చేశారు. ఆయనతో పాటు రీజనల్ ట్రైనింగ్ సెంటర్ (ఫిమేల్) సెంటర్లో విధులు నిర్వహిస్తున్న ఎ.నిర్మలమ్మను తిరుపతిలోని ఎస్వీఎంసీలో ఉన్న ప్రసూతి హాస్పిటల్కు బదిలీ చేశారు. -
వర్షంలో సచివాలయ ఉద్యోగుల నిరసన
బొమ్మలసత్రం: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ తీర్చాలంటూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సోమవారం రాత్రి 8 గంటల సమయంలో కలెక్టర్ కార్యాలయంలో బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల సంఘం నంద్యాల అధ్యక్షులు మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ.. ఇంటింటికి తిరిగి నిర్వహించే సర్వేల నుంచి తమకు విముక్తి చేయాలన్నారు. సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలని కోరారు. పారదర్శకంగా బదిలీల ప్రక్రియ కొనసాగేలా చూడాలని డిమాండ్ చేశారు. రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్ను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్గా మార్చాలని డిమాండ్ చేశారు. -
గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
బనగానపల్లె రూరల్: బనగానపల్లె పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల మేరకు సుమారు 40 ఏళ్ల వయస్సు, ఐదున్నర అడుగుల ఎత్తు కలిగిన వ్యక్తి, ఆదివారం రాత్రి పెట్రోల్బంకు సర్కిల్ నంద్యాల బస్సు స్టాప్ షెల్టర్ సమీపంలో ఉన్న స్తంభానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే బాధితుడిని కాపాడేందుకు చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి శరీరంపై సిమెంట్ కలర్, హాఫ్ టీ షర్ట్, లైట్ బ్లూ కలర్ ఫుల్షర్ట్, సిమెంట్ కలర్ ప్యాంట్ ధరించినట్లు సీఐ తెలిపారు. మృతుడి ఆచూకీ తెలియకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేశామని, మృతుడి వివరాలు తెలిసిన వారు 91211 01124కు సమాచారం ఇవ్వాలని సీఐ తెలిపారు. నాటుసారా కట్టడికి ప్రత్యేక బృందాలు ఆలూరు రూరల్: దేవరగట్టు బన్ని ఉత్సవాల్లో నాటు సారా తయారీ, విక్రయాలు, ఉత్సవాల రోజు మద్యం అమ్మకాలను అరికట్టేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్లు రాజశేఖర్, రామకృష్ణారెడ్డి తెలిపారు. దేవరగట్టు కొండల్లో సోమవారం ఆలూరు సీఐ లలిదాదేవి ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బన్ని ఉత్సవాల్లో నాటుసారా తయారు చేసినా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు 69 మంది నాటు సారా తయారీ, విక్రయదారులపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. ఆలూరు ఎకై ్సజ్ పరిధిలోని 5 మండలాల్లో నాటుసారా వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎస్ఐ నవీన్ కుమార్ పోలీసు సిబ్బంది ఉన్నారు. ఉచిత క్యూలైన్ల మార్గంలో నాగుపాము ● భక్తులకు తప్పిన ప్రమాదం మహానంది: మహానంది దేవస్థానంలో సోమవారం భక్తులకు ప్రమాదం తప్పింది. ఉచిత దర్శనం ద్వారా వెళ్లే క్యూలైన్ల మార్గంలో నాగుపాము ప్రత్యక్షం కావడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఆలయ సిబ్బంది స్నేక్ క్యాచర్ మోహన్కు విషయం చెప్పగా ఆయన ఆలయానికి చేరుకుని నాగుపామును పట్టుకుని నల్లమల అటవీ ప్రాంతంలో వదిలేశారు. -
అనంతపురం – అమరావతి రహదారి అలైన్మెంట్ ఖరారు
● ఆమోదం తెలిపిన కేంద్రం ● అలైన్మెంట్లో మార్పులు కోరిన జెడ్పీచైర్మన్ కొలిమిగుండ్ల: అనంతపురం–అమరావతి 544–డీ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి అలెన్మెంట్ దాదాపుగా ఖరారు అయ్యింది. అనంతపురం నుంచి బుగ్గ వరకు రెండు ప్యాకేజీల కింద చేపడుతున్న హైవే పనులు చివరి దశకు చేరుకున్నాయి. జిల్లా సరిహద్దు నుంచి గిద్దలూరు వరకు 135 కి.మీ మేర జాతీయ రహదారి నిర్మాణం కోసం జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల అలైన్మెంట్కు ఆమోదముద్ర వేసింది. జిల్లా సరిహద్దు నుంచి కొలిమిగుండ్ల మండలంలో మీదుగా ఈ హైవే సాగనుంది. అలైన్మెంట్లో చిన్న మార్పులు చేసేందుకు సోమవారం ఎన్హెచ్ఏఐ సైట్ ఇంజినీర్ సుశాంత్, బెంగళూరుకు చెందిన కన్సల్టెన్సీ ప్రతినిధి భరత్తో పలు అంశాలపై క్షేత్ర స్థాయిలో చర్చించారు. జిల్లా సరిహద్దు నుంచి మండల కేంద్రం వరకు పలు చోట్ల అలైన్మెంట్ మార్పులు చేసే వాటిపై ఆయా ప్రాంతాలను చూపించి వివరించారు. మార్పులకు సంబంధించి ఉన్నతాధికారులకు నివేదికలు అందిస్తామని ఎన్హెచ్ఏఐ అధికారి చెప్పారు. 2017లో చేసిన అలైన్మెంట్ ప్రకారమే ఎలాంటి మార్పులు లేకుండా మండలంలో జాతీయ రహదారి నిర్మాణం జరుగనుంది. అతి త్వరలోనే డీపీఆర్కు కేంద్రం ఆమోదముద్ర వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టెండర్లు పిలిచి ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈప్రాజెక్ట్ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అలైన్మెంట్లో తప్పక మార్పులు చేపట్టాలి.. అనంతపురం–అమరావతి జాతీయ రహదారి నిర్మాణం జరిగితే రవాణ సదుపాయం మెరుగుపడుతుండటం సంతోషకరమని జెడ్పీచైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. కొలిమిగుండ్ల మండలంలో అలైన్మెంట్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందన్నారు. ఆమోదం చేసిన అలైన్మెంట్ ప్రకారం జిల్లా సరిహద్దు నుంచి కొలిమిగుండ్ల క్రాస్ రోడ్డు వరకు గ్రామాల్లోనే హైవే వస్తుంది. దీని వల్ల ఆయా గ్రామాల్లో నివాసాలు, ఇతర నిర్మాణాలు పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పవు. అంకిరెడ్డిపల్లె, రాఘవరాజుపల్లె, కనకాద్రిపల్లె, ఇటిక్యాల గ్రామాల్లో కాకుండా వెలుపల బైపాస్ నిర్మించాలని ఆయన కోరారు. ఈ విషయంపై ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ డైరక్టర్ దృష్టికి తీసుకెళ్తామని అవసరమైతే రాష్ట్ర స్థాయి అధికారులను కోరుతామన్నారు. గ్రామాల్లో కాకుండా వెలుపల బైపాస్ చేపడితే నిర్వహణ వ్యయం తగ్గడంతో పాటు దూరం తగ్గుతుందన్నారు. ప్రధానంగా సిమెంట్, పవర్గ్రిడ్ తదితర పరిశ్రమలకు అనుకూలంగా మారుతుందన్నారు. -
మహానందిలో మహాగౌరి దుర్గగా
మహానంది: దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి అమ్మవారిని మహాగౌరిదుర్గగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని విశేష పూజలు నిర్వహించారు. వర్షం కారణంగా వాహనసేవను రద్దు చేశారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్రెడ్డి, ఎం.నీలకంఠేశ్వరరాజు, పి.సుబ్బారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ నాగమల్లయ్య పాల్గొన్నారు. చౌడేశ్వరిదేవి సేవలో.. బనగానపల్లె రూరల్: నందవరంలో వెలసిన శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారిని దేవదాయ శాఖ జోన్–2 రీజనల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ కుటుంబ సభ్యులు సోమవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ చౌడేశ్వరిదేవికి కుంకుమార్చన అభిషేకం తదితర పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు, వేదపండితులు చంద్రశేఖర్ ఆజాద్ను సత్కరించి ప్రసాదం అందజేశారు. -
కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా
నంద్యాల(న్యూటౌన్): నకిలీ మొక్కజొన్న విత్తనాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేలు చెల్లించి, బేయర్, న్యూజి వీడు, జీల్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్రెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర్, రామచంద్రుడు అన్నారు. నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నకిలీ విత్తనాలు విక్రయించిన షాపు యజమానుల లైసెన్స్లు రద్దు చేయా లని డిమాండ్ చేశారు. అనంతరం వినతి పత్రాన్ని కలెక్టర్ రాజకుమారికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు, జూపాడుబంగ్లా మండలాల్లో నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. కోతలు ప్రారంభమైనందున జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు అమలు చేయాలని కోరారు. శాస్త్రవేత్తల రిపోర్టు అనంతరం కంపెనీలపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారన్నారు. ఏపీ రైతు సంఘం నాయకులు వెంకటేశ్వరరావు, సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
అమ్మకం లేదు.. అంతా జీఎస్టీ ఆమ్యామ్యా!
మంత్రాలయం: దుకాణం లేదు.. వ్యాపారం ఊసే లేదు.. అయినా ట్రేడర్స్ను సృష్టించి జీఎస్టీ నంబర్ పొందాడు. రూ.కోట్లలో వ్యాపారాలు చేసినట్లు దొంగ బిల్లులతో ఏకంగా ప్రభుత్వ ఖజానాకే కన్నం వేశాడు. అకౌంటెంట్ ముసుగులో ఒక వ్యక్తి మూడేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా చేసిన మోసం ఇదీ. రాయచూరుకు చెందిన ఓ డీలర్కు అనుమానం వచ్చి జీఎస్టీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ చీటింగ్ వెలుగులోకి వచ్చింది. ఇలా మోసం.. మంత్రాలయానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య విశాల పేరున ట్రేడర్స్ను సృష్టించాడు. పాతూరులోని ఇరుకు సందులో ఇంటి చిరునామాలో దుకాణం ఉందని రికార్డులో చూపాడు. అందులో ఐరన్, సిమెంట్, పెయింట్స్ వ్యాపారం చేస్తున్నట్లు పేర్కొన్నాడు. విశాల ట్రేడర్స్ రిజిస్ట్రేషన్తో 2002 ఆగస్టు నెల 4వ తేదీన జీఎస్టీ నంబర్ పొంది 2–112 నంబరు ఇంటిని దుకాణంగా చూపించాడు. నాన్ మూవింగ్ ఆఫ్ గూడ్స్ తరహాలో ప్రభుత్వ ట్యాక్స్ మొత్తాన్ని తన సొంత అకౌంట్కు మళ్లించుకున్నా డు. కొంత మంది డీలర్లను నమ్మబలికి తానే బిల్స్ వేస్తానని తంతు సాగించాడు. నాన్ మూవింగ్ ఆఫ్ గూడ్స్ విధానంతో మూడేళ్లలో రూ.4 కోట్ల మేర టర్నోవర్ జరిగినట్లు సమాచారం. ఇన్వాస్ బిల్లులు పేరుతో జీఎస్టీ ట్యాక్స్ను తన సొంత అకౌంట్కు మళ్లించుని దాదాపు రూ.70 లక్షల మేర ప్రభుత్వ జీఎస్టీ ఖజానాకు గండికొట్టినట్లు తెలుస్తోంది. గుట్టు రట్టు ఇలా.. ఈ చీటింగ్ వ్యవహారాన్ని రాయచూరులోని ఓ డీలర్ తెలుసుకుని జీఎస్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సదరు ట్రేడర్స్, జీఎస్టీ నంబర్పై విజయవాడ, తిరుపతి, కర్నూలు, ఆదోని జీఎస్టీ కార్యాలయాలకు ఫిర్యాదులు అందజేసి పూర్తి విచారణ చేపట్టాలని కోరారు. నాన్ మూవింగ్ ఆఫ్ గూడ్స్పై వే బిల్లు, ఇన్వాస్ బిల్లులు, అలాగే దుకాణాన్ని తని ఖీ చేయాలని విన్నవించారు. రాయచూరు మరో దొంగ ఫర్మ్ క్రియేట్ చేసుకుని తతంగం మొదలు పెట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం తెలిసి చీటింగ్ చేసిన వ్యక్తి తన గుట్టును కప్పి పుచ్చుకునేందుకు జీఎస్టీ అకౌంట్ను క్లోజ్ చేయాలని దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఫిర్యాదు వచ్చిన మాట వాస్తమే. ఫిర్యాదును ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. హెడ్ ఆఫీసు నుంచి ఆదేశాలు రాగానే పూర్తి విచారణ చేపడతాం. – కల్లూరు వరలక్ష్మి, సీటీవో, ఆదోని అకౌంటెంట్ ముసుగులో చీటింగ్ వ్యాపారం చేయకుండానే జీఎస్టీ ట్యాక్స్ స్వాహా దొంగ బిల్లులు సమర్పించిన వైనం విచారణ చేస్తామన్న అధికారులు -
అరాచకాలకు మూల్యం చెల్లించాల్సిందే
● అధికారపార్టీ నాయకులకు ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే హెచ్చరిక ● కార్యకర్తలకు అండగా నిలబడేందుకే ‘డిజిటల్ బుక్’ఆళ్లగడ్డ: ‘అధికారం ఉంది కదా అని అధికారపార్టీ నాయకులు, కార్యకర్తలు అరాచకాలకు పాల్పడుతున్నారు. దీనికి అధికారులు వత్తాసు పలుకుతున్నారు. ప్రతి ఒక్కరు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకునేందుకు సిద్ధంగా ఉండాల’ని మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి హెచ్చరించారు. ఆళ్లగడ్డలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్లను పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురైన ప్రతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు పార్టీ తరఫున డిజిటల్ బుక్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కూటమి ఏలుబడిలో అన్యాయానికి గురైన కార్యకర్తలు ధైర్యంగా క్యూఆర్ కోడ్ ఐవీఆఎస్ కాల్స్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఇందుకోసమే జగన్ ఈ కొత్త వ్యవస్థ తీసుకువచ్చారన్నారు. దీన్ని అన్ని మండలాలు, గ్రామాల్లో రిలీజ్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా నిలుస్తామన్నారు. ఇప్పటికే పార్టీ సానుభూతి పరులు, కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరిగిందని, వాటిపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు బాధితులకు తగిన న్యాయం చేస్తామన్నారు. డిజిటల్ బుక్ను టీడీపీ నేతల రెడ్బుక్ మాదిరి పెట్టుకున్నామని చెప్పడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. పార్టీ సానుభూతి పరులతో పాటు సామన్యుల సైతం ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా సులువుగా సమాచారం తెలుసుకునేందుకు ఈ డిజిటల్ బుక్ పెట్టామని స్పష్టం చేశారు. మూడున్నరేళ్లలో వచ్చేది కచ్చితంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని చెప్పారు. ఇప్పటికే కూటమి సర్కారుపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఈవిషయం తెలిసి అసెంబ్లీలో కూటమి ప్రజాప్రతినిధులు, అధికారులు కంగారు పడుతున్నారన్నారు. కూటమి సర్కారు దగా పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపైనా పోరాడుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నరసింహారెడ్డి, సుధాకర్రెడ్డి, సింగం వెంకటేశ్వర్రెడ్డి, డాక్టర్ సురేంద్రరెడ్డి తదితరులు ఉన్నారు. -
అర్హులకు పదోన్నతి కల్పించాలి
గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులను ప్రభుత్వం మాతృశాఖలకు అప్పగించి అర్హులైన వారికి పదోన్నతి కల్పించాలి. విభాగాల వారిగా సీనియారిటీ ఉద్యోగుల జాబితాను విడుదల చేసి పదోన్నతి కల్పించటంతో పాటు విధి విధానాలననుసరించి పారదర్శకంగా బదిలీలు జరిగేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి. వాటితో పాటు ఉద్యోగులకు రావాల్సిన అరియర్స్, నోషనల్ ఇంక్రిమెంట్లు తక్షణమే మంజూరు చేయాలి. – గురుస్వామి, ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్గా అమలవుతున్న విధానాన్ని జూనియర్ అసిస్టెంట్ క్యాడర్కు మార్పు చేయాలి. అలాగే ఆరేళ్ల పాటు ఒకే క్యాడర్లో విధులు నిర్వహించిన ఉద్యోగులకు ఏఏఎస్ ప్రకారం స్పెషల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి. కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న 1.25 లక్షల మంది ఉద్యోగులు ప్రభుత్వ సంక్షేమాలను ప్రతి ఇంటికి చేర్చటంలో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇంటింటికి తిరిగి సర్వేలు నిర్వహించటంలో ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదురవుతున్నాయి. – మధుసూదన్రెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, నంద్యాల ఇంటింటికి తిరిగి నిర్వహించే సర్వేలు, ఇతర పనుల నుంచి సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం విముక్తి కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతం చేస్తాం. సచివాలయ ఉద్యోగులను మాతృశాఖకు అప్పగించటంతో పాటు విభాగాల వారీగా సీనియారిటీ జాబితా విడుదల చేసి అర్హులైన వారికి పదోన్నతి కల్పించాలి. ఉద్యోగులందరికీ ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని రకాల ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి. – సంపత్కుమార్, సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి, నంద్యాల -
16 నెలల్లో ఒక్క హామీ అమలు కాలేదు
నంద్యాల(న్యూటౌన్): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయినా ఏ ఒక్క హామీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకు లు హృదయరాజు అన్నారు. ఆదివారం స్థానిక ఏపీటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో హృదయరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఉపాధ్యాయుల అపరిష్కృత సమ స్యలపై కూటమి ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా అక్టోబర్ 7న విజయవాడలో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెరుగైన పీఆర్సీ, మధ్యంతర భృతి, సీపీఎస్ స్థానంలో మెరుగైన పెన్షన్ విధానం, ఆర్థిక బకాయిల చెల్లింపు, పెన్షనర్లకు కార్పొరేషన్ వంటి హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదని అన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాతపెన్షన్ అమలుకు ఆర్థిక శాఖలో నాలుగు సంవత్సరాలుగా మూలుగుతుందన్నారు. 1998, 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్ల పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. కేజీబీవీ ఉపాధ్యాయు లతో వెట్టిచాకిరి చేయించుకుంటున్న కనీస వేతన స్కేల్ అమలు చేయడం లేదని అన్నారు. సమావేశంలో ఫ్యాప్టో చైర్మన్ శివయ్య, జిల్లా ఫ్యాప్టో కార్యవర్గ సభ్యులు పీవీ ప్రసాద్, మౌలాలి, నగరి శ్రీనివాసులు, రామచంద్రారెడ్డి, సుబ్రమణ్యం, కిరణ్కుమార్రెడ్డి, సురేంద్రనాథ్, శివరాంప్రసాద్, సాంబశివుడు, అజాంబేగ్, లింగమయ్య, నాగేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
శుభంకరీ..కాళరాత్రి
● శ్రీగిరి క్షేత్రంలో నేత్రానందపర్వంగా సాగుతున్న దసరా ఉత్సవాలు శ్రీశైలంటెంపుల్: అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహాక్షేత్రంలో దసరా నవరాత్రోత్సవాలు నేత్రానందభరితంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఏడవరోజు ఆదివారం భ్రమరాంబాదేవి ఉత్సవమూర్తిని కాళరాత్రి స్వరూపంలో అలంకరించారు. అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికలో కాళరాత్రి అమ్మవారిని ఉంచి అర్చకులు, వేదపండితులు విశేష పూజాకార్యక్రమాలు చేపట్టారు. ఉత్సవాల్లో భాగంగా భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను గజ వాహనంపై అలంకరించారు. గజ వాహనదీశులైన పార్వతీ పరమేశ్వరులను అలంకార మండపంలో ఉంచి అర్చకులు, వేదపండితులు వేదమంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక పూజా హారతులనిచ్చారు. కాళరాత్రి అమ్మవారిని, గజ వాహనాధీశులైన స్వామిఅమ్మవార్లకు ఆల య ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం గంగాధర మండపం నుంచి నందిమండపం, బయలువీరభద్రస్వామి ఆలయం వరకు నిర్వహించిన గ్రామోత్సవం కమనీయంగా సాగింది. గ్రామోత్సవంలో కోలాటం, డోలు విన్యాసాలు, కేరళ చండీమేళం, డప్పు వాయిద్యాల నడుమ కళాకారుల నృత్యప్రదర్శనలు గ్రామోత్సవానికి మరింత వన్నె తెచ్చాయి. ఈ పూజా కార్యక్రమం నేత్రానందభరితంగా సాగింది. ప్రత్యేక అలంకీకృతులైన స్వామిఅమ్మవార్లను భక్తులు కనులారా దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు. ఈ పూజా కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు సోమవారం భ్రమరాంబాదేవి మహాగౌరి అలంకారంలో, భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లు నందివాహన సేవపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. అక్టోబరు 1వ తేదీ శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి అనం రామనారాయాణరెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారని దేవస్థాన ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. -
అపార్ ఐడీ ప్రక్రియను వేగవంతం చేయండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: విద్యార్థుల అపార్ ఐడీ (ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) ప్రక్రియను 15 రోజుల్లో పూర్తి చేయాలని విద్యాధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. అపార్ ఐడీ ప్రగతిపై శనివారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ విద్యా విధానంలో భాగంగా విద్యార్థుల విద్యా పురోగతిని పరిశీలించడానికి అపార్ ఐడీ కీలక సాధనమన్నారు. జిల్లాలో 4,801 మంది కళాశాల విద్యార్థుల ఐడీలు పెండింగ్లో ఉన్నాయన్నారు. అలాగే 57,942 మంది పాఠశాల విద్యార్థుల అపార్ ఐడీలు పూర్తి చేయాల్సి ఉందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఉండే చిన్నారుల్లో 15,894 మందికి ఐడీలు పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. డీఈఓ జనార్దన్ రెడ్డి, డీవీఈఓ శంకర్ నాయక్, ఐసీడీఎస్ పీడీ లీలావతి, జీఎస్డబ్ల్యూఎస్ కో ఆర్డినేటర్ ఖాదర్ బాషా పాల్గొన్నారు. -
హంస వాహనంపై ఆదిదంపతులు
శ్రీశైలంటెంపుల్: ఇల కై లాసమైన శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శనివారం అలంకార మండపంలో హంస వాహనంపై స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుంచి ఆలయ అర్చకులు, పండితులు విశేష పూజలు చేశారు. శ్రీ భ్రమరాంబాదేవిని కాత్యాయని స్వరూపంలో అలంకరించారు. అమ్మవారు చతుర్భుజాలను కలిగి ఉండి..కుడివైపున అభయహస్తాన్ని, వరముద్రను, ఎడమవైపున పద్మాన్ని, ఖడ్గాన్ని ధరించి ఉన్నారు. కాత్యాయనీ దేవిని ఆరాధిస్తే భయాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఆలయం ఎదుట భాగంలో వేదికపై ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారిని అధిష్టింపజేసి విశేష పూజా కార్యక్రమాలను జరిపారు. అనంతరం కాత్యాయనీ దేవిని, హంస వాహనంపై కొలువుదీరిన స్వామిఅమ్మవార్లను భక్తులు దర్శించుకుని ప్రత్యేక నీరాజనాలు సమర్పించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రాతఃకాల పూజలు, శ్రీచక్రార్చాన, నవావరణార్చన, విశేష కుంకుమార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీశైలంలో నేడు దసరా నవరాత్రోత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం కాళరాత్రి అలంకారంలో భ్రమరాంబాదేవి, గజవాహనంపై భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
న్యాయమూర్తులకు అవగాహన సదస్సు
కర్నూలు: ‘నేరారోపణల రిమాండ్, జీవిత రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన చట్టం–జాగ్రత్త’ అనే అంశంపై న్యాయమూర్తులకు అవగాహన సదస్సు జరిగింది. జిల్లా కోర్టు ఆవరణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి అధ్యక్షతన శనివారం జరిగిన అవగాహన సదస్సుకు హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ బీఎస్ భానుమతి, హైకోర్టు న్యాయమూర్తి ఎ.హరిహరనాథ శర్మ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయ శాఖకు సంబంధించిన పలు అంశాలపై న్యాయమూర్తులకు పలు సూచనలు చేశారు. జిల్లా అదనపు న్యాయమూర్తులు లక్ష్మీరాజ్యం, శ్రీవిద్య, శోభారాణి, రాజేంద్రబాబు, హరినాథ్తో పాటు జిల్లాలోని న్యాయమూర్తులందరూ పాల్గొన్నారు. -
దేవరగట్టు ఉత్సవాలకు శ్రీకారం
● భక్తిశ్రద్ధలతో కంకణాధారణ ● అక్టోబర్ 2న ‘బన్ని’ జైత్రయాత్రహొళగుంద: దేవరగట్టు దసరా బన్ని ఉత్సవాలకు శనివారం శ్రీకారం చుట్టారు. శ్రీమాళ మల్లేశ్వరస్వామికి శనివారం రాత్రి కంకణధారణ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నెరణికి గ్రామంలో ఉత్సవమూర్తులను కొలువుంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి పల్లకీతో పాటు విగ్రహాలను గ్రామ శివారు వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి గొరవయ్యలు, ఆలయ పూజారులతో దేవరగట్టుకు పంపారు. కొండకు చేరుకున్న విగ్రహాలను గిరిపై ఉన్న ఆలయంలోని కంకణకట్టపై కొలువుంచారు. సాయంత్రం ఆలయంలోని మూల విరాట్లకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. కంకణ కట్టపై కొలువుదీరిన మాత మాళమ్మ, మల్లేశ్వరునికి భక్తుల జయ ధ్వనుల మధ్య కంకణధారణ నిర్వహించారు. వచ్చే నెల 2న విజయదశమి రోజున స్వామి వారికి కల్యాణోత్సవం నిర్వహించడానికి నిశ్చయించారు. అనంతరం జైత్రయాత్ర, మరుసటి రోజు 3న దైవవాణీ(కార్ణీకం), 4న రథోత్సవం, 5న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, దేవదాసీల క్రీడోత్సవం, కంకణ విసర్జన, 6న మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. -
తీరం దాటిన వాయుగుండం
సాక్షి, అమరావతి/వాకాడు/కర్నూలు(అగ్రికల్చర్)/నంద్యాల(అర్బన్): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం ఉదయం తీరం దాటింది. ఒడిశాలోని గోపాల్పూర్కు దగ్గర తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా కదులుతూ క్రమంగా బలహీనపడుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి.ఆదివారం ఉత్తరాంధ్ర జిల్లాలు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా బుధవారం నాటికి ఉత్తర, దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు చెప్పారు. ఎగసి పడుతున్న సముద్రం అలలు వాయుగుండం ప్రభావంతో శనివారం తిరుపతి జిల్లా వాకాడు మండలం, తూపిలిపాళెం సముద్ర తీరంలో అలలు 4 మీటర్లు ఎత్తుకు ఉవ్వెత్తున ఎగసి పడుతూ సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ తరుణంలో సముద్రంపై మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, వేటకు ఎవ్వరూ వెళ్లరాదని అధికారులు ఆదేశించారు.నంద్యాల జిల్లాలో ఎడతెరపిలేని వర్షం నంద్యాల జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటంతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. కుందూ, మద్దిలేరు, పాలేరు వాగులు ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.కర్నూలులో కుండపోతకర్నూలు జిల్లాలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో ఒకే రోజు జిల్లాలో 62 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా దేవనకొండలో 142.6 మి.మీ., అత్యల్పంగా ఆలూరులో 25.6 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఎమ్మిగనూరు మండలం సోగనూరు గ్రామంలో భారీ వర్షం కారణంగా 30 గొర్రెలు మరణించాయి. అధిక వర్షాల వల్ల పత్తి, ఉల్లి, మొక్కజొన్న, కంది, టమాటా సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో సెపె్టంబర్ నెల సాధారణ వర్షపాతం 116.5 మి.మీ. కాగా, 27 రోజుల్లో 199.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
నంద్యాల(వ్యవసాయం): 70 ఏళ్లు పైబడిన వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందజేస్తానని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి లీలా వెంకట శేషాద్రి తెలి పారు. శుక్రవారం పట్టణంలోని సైబ్జైల్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి ఖైదీలతో మాట్లాడుతూ.. సబ్జైల్లో నెలకొన్న సమస్యలు ఉంటే న్యాయవాదుల దృష్టికి తీసుకురావాలన్నారు. అదే విధంగా జైళ్లలోని ఖైదీల సంఖ్య, కేసుల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జైలు సూపరింటెండెంట్ గురుప్రసాదరెడ్డి, న్యాయవాది బాలు, లోక్ అదాలత్ సిబ్బంది రామచంద్రారెడ్డి, తదితరులు ఉన్నారు. ఎల్లెల్సీలో జారి పడి మహిళ మృతి ఆదోని అర్బన్: ఇస్వీ గ్రామానికి చెందిన యాస్మిన్ (30) ఎల్లెల్సీ కాలువలో ప్రమాదవశాత్తూ జారి పడి మృత్యువాత పడింది. శుక్రవారం తన సొంతూరు పెద్ద హరివాణంలోని కుటుంబీకులను చూసేందుకు యాస్మిన్ భర్త నబీసాహెబ్తో కలసి సొంత ఆటోలో వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా నబీసాహెబ్ మలవిసర్జనకు ఆటో నిలిపాడు. ఈ క్రమంలో యాస్మిన్ కాలువలో ముఖం కడిగేందుకు వెళ్లి జారి కాలువలో పడిపోయి కేకలు వేసింది. గమనించిన భర్త వెంటనే స్థానికుల సహయాంతో ఒడ్డుకు చేర్చారు. అస్వస్థతకు గురైన ఆమెను ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
మోక్షదాయినీ... శ్రీ స్కందమాత...!
మహానంది: కమలవాసినీ. శ్వేతవర్ణం కలిగిన శ్రీ స్కందమాత దుర్గను ఉపాసించడం ద్వారా భవసాగరాల నుంచి విముక్తులై మోక్షం పొందుతారని మహానంది ఆలయ వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని తెలిపారు. మహానందిలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఐదోరోజైన శుక్రవారం రాత్రి శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారు శ్రీ స్కందమాత దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక అలంకార మండపంలో సహస్రదీపాలంకరణ, నృత్యార్చన, మహామంగళ హారతులు, కూష్మాండబలి పూజలు నిర్వహించగా స్కందమాతా...నమోస్తుతే అంటూ ప్రణమిల్లారు. కాగా వర్షం కారణంగా గ్రామోత్సవాన్ని రద్దు చేశారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ ప్రధాన అర్చకులు మామిళ్లపల్లి అర్జునశర్మ, సూపరింటెండెంట్లు అంబటి శశిధర్రెడ్డి, నీలంకంఠేశ్వరరాజు, పి.సుబ్బారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ నాగమల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కర్నూలు: దసరా సెలవుల నేపథ్యంలో యువకులు, విద్యార్థులు ఈతకు వెళ్లడం వల్ల ప్రమాదకర ఘటనలు జరిగే అవకాశమున్నందున జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని గ్రామాలు, పట్టణ శివారులో వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, కాల్వలు పూర్తిగా నిండిపోయాయని, తమ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో తల్లిదండ్రులు గమనించి జాగ్రత్తలు తీసుకోవాలని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నా రు. నదీ తీర ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా, ఏవైనా సమస్యలు ఉంటే 112కు డయల్ చేసి సమాచారం అందించాలని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆపదలు, అత్యవసర పరిస్థితులు, అసాంఘిక కార్యకలాపాలు, ఏ సమస్య అయినా 112కి కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. -
అప్పుల మాఫీలో లక్ష కోట్ల అవినీతి
కర్నూలు(సెంట్రల్): ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన 11 ఏళ్ల పాలనలో కార్పొరేట్ దిగ్గజాలకు రూ.14 లక్షల కోట్ల రుణమాఫీ చేశారని, అందులో 10 శాతం వాట దక్కించుకొని లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపించారు. అప్పుల రుణమాఫీలో గుజరాత్ మార్వాడీలే ఎక్కువగా ఉన్నారని, వారి పేర్లను ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్ ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. శుక్రవారం కర్నూలుకు వచ్చిన ఆయన ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కర్నూలు జిల్లాలో ఎస్సీ వర్గాల ప్రజలు కార్పొరేషన్ ద్వారా రూ.60 కోట్ల రుణాలు తీసుకుంటే కట్టాలని నోటీసులు ఇచ్చే ప్రభుత్వాలు.. బడా కార్పొరేట్లకు ఎందుకు రుణమాఫీ చేస్తున్నాయనో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో పత్రికా స్వేచ్ఛకు తీవ్ర భంగం కలుగుతోందని, పత్రిక కార్యాలయాలు, విలేకరులపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు పాలన సజావుగా లేదని, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అసమ్మతి ఉందని చింతామోహన్ పేర్కొన్నారు. ఆయన తన సొంత నిజయోజకవర్గమైన కుప్పానికే ఏమి చేయలేదని, ఇక సొంత జిల్లా ఊసే పట్టించుకోవడం లేదన్నారు. కర్నూలులో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోతున్నా ఏమైనా చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. -
పీహెచ్సీ డాక్టర్ల శాశ్వత సంఘం ఏర్పాటుకు ఎన్నికలు
గోస్పాడు: జిల్లా ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ల శాశ్వ త సంఘం ఏర్పాటుకు ఎన్నికలు జరగనున్నట్లు అడహక్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ చెన్నకేశవులు తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు అడహక్ కమిటీ ద్వారా డాక్టర్ల సంఘం నిర్వహణ కొనసాగిందన్నారు. ఇప్పటి నుంచి ప్రైమరీ హెల్త్ సెంటర్ల డాక్టర్ల శాశ్వత సంఘం ఏర్పాటుకు రాష్ట్ర ఏపీపీహెచ్ఈడీఏ నుంచి వచ్చిన ఆదేశాలను అనుసరిస్తామనానరు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ను నియమించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణకు విన్నవించగా డీసీహెచ్ఎస్ డాక్టర్ లలితను నియమించారన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నియామకం పొందిన డీసీహెచ్ఎస్ డాక్టర్ లలితను కలిసి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని వినతి పత్రం అందజేశారు. ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ఈనెల 25న ప్రారంభమైందని, 27వ తేదీ మధ్యా హ్నం 2గంటలకు ముగుస్తుందన్నారు. అదే రోజు నామినేషన్ల పరిశీలన, 28న ఉపసంహరణ, అనంతరం అదే రోజు ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపారు. -
ప్రమాదం పొటుకు పెట్టింది!
పెద్దాసుపత్రి అధికారుల నిర్లక్ష్యంతో రోగుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. వైద్య సేవల కోసం సూదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు ఆసుపత్రిలో ఎదురయ్యే కష్టాలతో వణికిపోతున్నారు. పది రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో పెద్దాసుపత్రిలో ప్రమాదం పొటుకు పెట్టింది. భవనాలు మరమ్మతులకు నోచుకోకపోవడంతో ఫిమేల్ 5, 6 వార్డుల్లో వాన నీరు గోడల వెంబడి కారుతూ ఫ్లోరుపైకి చేరుకోవడంతో బెడ్లపై కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. రోగుల సహాయకుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రోగులకు అవసరమైన మందులు, ఆహారం కోసం బయటకు వెళ్లాంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లాల్సిందే. కాలు జారితే వాళ్లు కూడా అదే ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి నెలకొంది. పైకి చూస్తే భయపెట్టే పైకప్పు పెచ్చులు.. వానకు తడిచిన విద్యుత్ స్విచ్ బోర్డులు.. ఓ వైపు దోమలు.. వార్డు లోపల కుక్కలు.. వామ్మో ఇదేమి ఆసుపత్రి అని రోగులు భయపడుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలుఆసుపత్రిలోనే కుక్క కరిస్తే.. -
10 కి.మీ 500 గుంతలు
ఆలూరు–పెద్దహోతూరు రోడ్డులో ఏర్పడిన పెద్ద పెద్ద గుంతలు నియోజకవర్గ కేంద్రమైన ఆలూరు నుంచి పెద్దహోతూరు రహదారిపై ప్రయాణం అంటే ప్రయాణికులు జడుసుకుంటున్నారు. పది కిలో మీటర్లు ఉండే ఈ రోడ్డులో అడుగడుగునా మోకాలు లోతు గుంతలు ఉన్నాయి. చిన్న.. పెద్ద గుంతలు కలిపి దాదాపు 500కు పైగా ఉన్నాయి. వానలకు ఆ గుంతల్లో నీరు నిలవడంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల జిల్లా ఉన్నతాధికారులు ఈ రోడ్డుపై ప్రయాణించినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో గమనార్హం. ఈ రోడ్డు బాగుపడేదెన్నడూ.. అంటూ ప్రయాణికులు గుంతల దారిలో ప్రయాణిస్తున్నారు. – ఆలూరు -
క్యాన్సర్ను ముందుగా గుర్తిస్తే మేలు
కర్నూలు(హాస్పిటల్): క్యాన్సర్ వ్యాధిని ముందుగా గుర్తించి సరైన చికిత్స అందించడం వల్ల కోలుకునే అవకాశం ఉంటుందని రాష్ట్రీయ బాలస్వాస్త్య కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ మహేశ్వరప్రసాద్ చెప్పారు. శుక్రవారం స్థానిక ముజఫర్నగర్ యుపీహెచ్సీలో స్వస్త్నారీ స శక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పా ల్గొని మాట్లాడారు. బాల్యవివాహాలు, అపరిశుభ్రత,అబార్షన్ తదితర కారణాలతో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వస్తుందని తెలిపారు. ప్రాథమిక దశలో దీనిని గుర్తించి చికిత్స తీసుకుంటే ముప్పు నుంచి తప్పించుకోవచ్చని చెప్పారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం ద్వారా వీటిని నివారించుకోవచ్చన్నారు. ప్రాథమిక దశలో మొహమాటం కారణంగా వైద్యపరీక్షలకు ఆసక్తి చూపకపోతే ఇబ్బంది తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో డీపీ ఎంఎఓ డాక్టర్ ఉమా, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రోహిణి, డీపీఓ విజయరాజు, కన్సల్టెంట్ సుధాకర్, మల్లికార్జున, ప్రొజెక్షనిస్టు ఖలీల్ పాల్గొన్నారు. ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు డోన్ టౌన్: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. శుక్రవారం డోన్ డిపోను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ను పరిశీలిస్తూ పలువురు ప్రయాణికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బస్టాండ్లో తాగునీటి వసతి, మూత్రశాలలు, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం డిపో పరిసరాలు, గ్యారేజ్ను తనిఖీ చేశారు. బస్సుల సంఖ్య, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందితో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలు, పదోన్నతులపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిందని, త్వరలో పదోన్నతులు కల్పిస్తామన్నారు. ప్రజల సౌకర్యార్థం, సంస్థ నిర్వాహణ ఖర్చులను తగ్గించి సంస్థ లాభాలు ఆర్జీంచేలా 110 ఎలక్ట్రికల్ బస్సులను త్వరలో ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ఆయన వెంట నంద్యాల జిల్లా రీజినల్ మేనేజర్ రజియా సుల్తానా, డోన్ డిపో మేనేజర్ శశిభూషణ్ తదితరులు ఉన్నారు. -
పల్లెలు, పట్టణాల్లో ఆరోగ్య ప్రచారం
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: సమగ్ర ఆరోగ్య ప్రచార రథాన్ని శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో, పట్టణాల్లో ఆరోగ్యంపై రథం ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తారని పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారానే అన్ని రకాల ఆరోగ్య సమస్యల్లో 50 శాతం మేర పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. ఎయిడ్స్తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలను కూడా ప్రజలు తేలికగా ఎదుర్కొనగలిగే విధంగా వైద్య సిబ్బంది నిరంతరం కృషి చేయాలన్నారు. సమయానికి సరైన మందులు వాడితే వ్యాధులను పూర్తిగా నియంత్రణలో ఉంచవచ్చన్నారు. సమగ్ర ప్రచార రథంలో అమర్చిన ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ఆరోగ్య అంశాలపై ప్రజలకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించాలన్నారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ – క్షయ వ్యాధి అధికారి డాక్టర్ శారదా బాయి మాట్లాడుతూ.. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సమితి మార్గదర్శకత్వంలో ఏపీ సాక్స్ ఆధ్వర్యంలో 15 రోజులపాటు నంద్యాల జిల్లాలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, వైద్య అధికారులు డాక్టర్ కాంతారావు నాయక్, డాక్టర్ అవినాష్ రెడ్డి, డాక్టర్ తేజస్విని, డాక్టర్ నౌషీన్, ఏపీ సాక్స్ ప్రోగ్రామ్ గణాంక అధికారి దేవిశంకర్ గౌడ్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నాగరాజు, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. -
పెద్దాసుపత్రి నిధులకు ‘టెండర్’!
‘తినేవాడు మనవాడైతే చాలు పంక్తిలో ఏ మూల కూర్చున్నా ముందుగా వారికే’ అన్నట్లు ఉంది కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల అధికారుల తీరు. కోట్ల రూపాయల విలువ జేసే ఆసుపత్రికి అవసరమైన మందులు, సర్జికల్స్ తదితరాల సరఫరా కాంట్రాక్టును తిరిగి పాత వారికే కట్టబెట్టారు. కొత్తవారు దరఖాస్తు చేసినా అర్హత లేదని తిరస్కరించారు. దీంతో అధికారంలో ఉన్న వారికి, అనుకూలమైన వారికే టెండర్ దక్కింది. దీంతో ఆసుపత్రిలో కోట్ల విలువైన నిధులకు ‘టెండర్’ వేసినట్లయ్యింది.కర్నూలు(హాస్పిటల్): రాయలసీమ జిల్లాలకు తలమానికమైన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు సీమ జిల్లాలతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి సైతం రోగులు చికిత్స నిమిత్తం వస్తుంటారు. ఈ ఆసుపత్రికి ప్రతిరోజూ 2,500 నుంచి 3వేల వరకు ఓపీ రోగులు, 1,200 నుంచి 1,500 వరకు ఇన్పేషంట్లు చికిత్స కోసం వస్తుంటారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం ఖరీదు కావడం, ఎన్టీఆర్ వైద్యసేవ సరిగ్గా అమలు కాకపోవడంతో ఇటీవల కాలంలో పెద్దాసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య మరింత పెరిగింది. ఒక్కోసారి ఓపీ రోగుల సంఖ్య 3,500 వరకు చేరుకుంటుండగా మెడికల్ వార్డుల్లో ఒక్కో పడకపై ఇద్దరేసి రోగులు చికిత్స అందుకుంటున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వీరందరికీ మందులు, సర్జికల్స్, ఆపరేషన్లకు ఇన్ప్లాంట్స్, వైద్యపరీక్షలకు రీ ఏజెన్స్కు ఆసుపత్రి ఖజానా నుంచి భారీగా ఖర్చు అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మందులు, సర్జికల్స్, రీ ఏజెన్స్, ఇన్ప్లాంట్స్ను ఏపీ ఎంఎస్ఐడీసీ డ్రగ్ స్టోర్ ద్వారా పంపిణీ చేస్తుంది. అక్కడ లభించని ఔషధాలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అగ్రిమెంట్ చేసుకున్న ప్రధాన మంత్రి జన ఔషధి సంస్థ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సంస్థ వద్ద కూడా మందులు లేకపోతే టెండర్ ద్వారా కాంట్రాక్టు దక్కించుకున్న వారి నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీటికి ఆసుపత్రి అభివృద్ధి నిధులు, ఎన్టీఆర్ వైద్యసేవ నిధులను అధికారులు ఖర్చు చేస్తున్నారు. ఈ మేరకు రెండు, మూడేళ్ల గడువుతో టెండర్లు పిలుస్తున్నారు. నిబంధనలతో ఎసరు ఆసుపత్రిలో మందులు, సర్జికల్స్, ఇన్ప్లాంట్స్, రీ ఏజెన్స్ కొనుగోలు కోసం అధికారులు ప్రతి ఏటా రూ.3కోట్లకు పైగా నిధులు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తాన్ని ఆసుపత్రి అభివృద్ధి సొసైటీతో పాటు, ఎన్టీఆర్ వైద్యసేవ నిధులను ఖర్చు చేస్తున్నారు. ఈ మేరకు గత నెలలో టెండర్ పిలిచారు. డిపాజిట్ను రూ.3లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచారు. సరఫరాదారు స్థానికుడై ఉండాలని, అనుభవం ఉండాలని నిబంధన పెట్టారు. అయినా కూడా నాలుగు కేటగిరీలకు 51 దరఖాస్తులు వచ్చాయి. నిబంధనల పేరుతో అధికారులు 25 మందికి మాత్రమే టెండర్ పాడేందుకు అవకాశం కల్పించారు. వీరిలో 20 మందికి టెండర్ దక్కింది. గతంలో స్థానికేతరులు సైతం మందులు సరఫరా చేశారు. వారు స్థానికంగా ఉన్న వ్యక్తులతో ఒప్పందం చేసుకుని రోగులకు మందులు అందేలా చర్యలు తీసుకున్నారు. ఈసారి స్థానికేతరులను పక్కనబెట్టారు. దీంతో ఈ టెండర్ విషయమై కొందరు కోర్టును ఆశ్రయించారు. అయినా కూడా అధికారులు టెండర్ నిర్వహించి స్థానికులకు కట్టబెట్టారు.పక్కాగా ప్రణాళిక వేసి..సాధారణంగా టెండర్లో ఎక్కువ మంది పాల్గొంటే పోటీతత్వం కారణంగా ధర తగ్గుతుంది. కొద్ది మందిని, అది కూడా స్థానికులను మాత్రమే టెండర్లో పాల్గొనేలా చేస్తే వారు చెప్పిన ధరకే కొనుగోలు చేయాల్సి వస్తుంది. మందులు, సర్జికల్స్, ఇన్ప్లాంట్స్, రీ ఏజెన్స్ ఒక్కో కంపెనీ ఒక్కో ధర, నాణ్యతలో తేడాలూ ఉంటాయి. ఉదాహరణకు పారాసిటమాల్ అనే మందును 10 మాత్రల స్రిప్ను ఒక కంపెనీ రూ.10లకు ఇస్తుండగా మరో కంపెనీ రూ.6లకు, ఇంకో కంపెనీ రూ.2లకు ఇస్తాయి. కొందరు బ్రాండెడ్ కాకుండా ప్రాపగండ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల మందులను అతి తక్కువగా కొని ఇలాంటి టెండర్ పాడి సరఫరా చేస్తుంటారు. సర్జికల్స్, ఇన్ప్లాంట్స్, ల్యాబ్ రీ ఏజెన్స్ సైతం కొన్ని తక్కువగా మార్కెట్లో లభిస్తాయి. ఈ విషయాలపై పూర్తిగా అవగాహన ఉన్న అధికారులకే ఇలాంటి టెండర్లను నిర్వహించే సామర్ధ్యం ఉంటుంది. ఈ విషయాలన్నీ అవపోసన పట్టిన కొందరు అధికారులు, ఉద్యోగులు తమ వారికి టెండర్ను కట్టబెట్టేందుకు పక్కాగా ప్రణాళిక వేసి, నిబంధనల పేరుతో ఏ మార్చి మందులు, సర్జికల్స్, ఇన్ప్లాంట్స్, రీ ఏజెంట్స్లను తమకు అనుకూలురైన వారికి ఒక్కో కేటగిరిని ముగ్గురు, నలుగురికి కట్టబెట్టారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వీరిలో కొందరు 10 ఏళ్లుగా, మరికొందరు 15 నుంచి 20 ఏళ్లుగా ఆసుపత్రికి సరఫరా చేస్తున్న వారూ ఉండటం గమనార్హం. వీరు ఏటా సరఫరా చేసే వాటి విలువ రూ.3కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. టెండర్ వివరాలను ఆసుపత్రి అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఇతరులకు ఎవ్వరికీ వివరాలు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. దీంతో టెండర్ నిర్వహణపై అనుమానాలు మరింత రెట్టింపవుతున్నాయి. అనుకూలమైన వారికి కాంట్రాక్టు దక్కేలా నిబంధనల మార్పు మెడికల్, సర్జికల్, రీ–ఏజెన్స్, ఇన్ప్లాంట్స్ కేటాయింపులు కొత్తవారు దరఖాస్తు చేస్తే అనుభవం లేదంటూ తిరస్కరణ టెండర్ల నిర్వహించి రూ.3కోట్ల విలువైన పనుల అప్పగింత! -
శ్రీశైలం, విజయవాడ వెళ్లే వాహనాల దారి మళ్లింపు
● సిద్ధాపురం అలుగు వద్ద పోలీసుల బందోబస్తుఆత్మకూరు: భారీ వర్షంతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆత్మకూరు మీదుగా శ్రీశైలం, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, ఒంగోలు, చీరాల తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. నల్లమలలోని రాళ్లవాగు ఉధృతితో సిద్ధాపురం చెరువుకు వరదనీరు పోటెత్తింది. ఫలితంగా సిద్ధాపురం చెరువు నిండి అలుగు దాటి ప్రమాద సూచికతో ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ఆత్మకూరు పోలీసులు అప్రమత్తమై గురువారం రాత్రి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. నల్లమల నుంచి కర్నూలు–గుంటూరు జాతీయ రహదారి మీదుగా దోర్నాల వద్దే వాహనాలను నిలిపివేసినట్లు సీఐ రాము తెలిపారు. ఈ వాహనాలను దోర్నాల నుంచి మార్కాపురం, గిద్దలూరు మీదుగా నంద్యాల, ఆత్మకూరు, కర్నూలుకు చేరాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే బెంగళూరు, కర్నూలు మీదుగా వచ్చే వాహనాలను ఆత్మకూరు పట్టణంలోని నంద్యాల టర్నింగ్ వద్ద నంద్యాల, గిద్దలూరు, దోర్నాల మీదుగా శ్రీశైలం, విజయవాడకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే వరద అధికంగా అలుగు వద్ద ఉండడంతో దోర్నాల పోలీసులతో ఆత్మకూరు పోలీసులు మాట్లాడి వాహనాల రాకపోకలకు దారి మళ్లించారు. వరదరాజస్వామి ప్రాజెక్టుకు భారీ వరదనీరు చేరడంతో రాత్రి 9 గంటల సమయంలో హుటాహుటిన మొదటి గేటు ఎత్తి 1000 నుంచి 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో కురుకుంద, కొత్తపల్లి, ఆత్మకూరు వద్ద ఉన్న భవనాశి నది, సుద్దవాగులు పొంగి ప్రవహించాయి. దీంతో రాకపోకలు నిలిపివేశారు. కురుకుంద, కొత్తపల్లి మండలాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగును ఎట్టి పరిస్థితుల్లో దాటొద్దని సీఐ సూచించారు. రెండుచోట్ల పోలీసులు బందోబస్తు నిర్వహించినట్లు తెలిపారు. భారీ వర్షాలు కురవడంతో ఆత్మకూరు, కొత్తపల్లి మండలాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పగిడ్యాల మండలంలో అత్యధిక వర్షం నంద్యాల(అర్బన్): జిల్లాలో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. పగిడ్యాల మండలంలో అత్యధికంగా 36.4 మి.మీ వర్ష పాతం నమోదైంది. జూపాడుబంగ్లా, కొత్తపల్లిలో 26.8, శ్రీశైలంలో 23.4, నందికొట్కూరు, ఆత్మకూరులలో 18.4, పాములపాడులో 11.0, మిడుతూరులో 10.4 మి.మీ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. -
కేఎంసీ మైక్రోబయాలజీకి ఎన్ఏబీఎల్ గుర్తింపు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజి(కేఎంసీ)లోని మైక్రోబయాలజీ విభాగానికి ప్రతిష్టాత్మకమైన ఎన్ఏబీఎల్ గుర్తింపు లభించింది. ఈ మేరకు మైక్రోబయాలజీ విభాగం వైద్యులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ శుక్రవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మైక్రోబయాలజీ విభాగంలోని హెచ్ఐవీ పరీక్షలకు ఎన్ఏబీఎల్ నూతన నిబంధనల ప్రకారం గుర్తింపు లభించిందన్నారు. అత్యంత కచ్చితత్వంతో పరీక్షలు నిర్వహించే వారికే ఈ గుర్తింపు లభిస్తుందన్నారు. మైక్రోబయాలజీ హెచ్ఓడీ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రేణుకాదేవి మాట్లాడుతూ ప్రిన్సిపాల్ సహకారంతో సూపర్స్పెషాలిటీ డీఎం వైరాలజి సీట్లకు ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలిపారు. -
విశేష పూజలు
● శేష వాహనంపై కనిపించిన ఆదిదంపతులు ● స్వామిఅమ్మవార్లను దర్శించుకుని పులకించిన భక్తజనం శేష వాహనాధీశులైన స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు నిర్వహిస్తున్న అర్చకులు శ్రీశైలంటెంపుల్: దసరా మహోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లు శేష వాహనంపై కనిపించి భక్తులకు ఆశీస్సులు అందించారు. శేషవాహనంపై ప్రత్యేకంగా అలంకరించిన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు అలంకార మండపంలో అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. స్కందమాత స్వరూపంలోని అమ్మవారిని, శేషవాహనంపై అధిష్టించిన స్వామిఅమ్మవార్లను కన్నులారా భక్తులు దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించుకుని నీరాజనాలు సమర్పించారు. ఈ పూజా కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు దంపతులు, ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వర్షం కారణంగా స్వామిఅమ్మవార్లకు నిర్వహించాల్సిన గ్రామోత్సవం రద్దయింది. స్కందమాత అలంకారంలో శ్రీశైల భ్రామరీ నవదుర్గాలలో ఐదో రూపమైన స్కందమాత దేవి చతుర్భుజాలను కలిగి ఉంటారు. ఒక చేతిలో స్కందున్ని పట్టుకుని ఉండి, మిగిలిన చేతుల్లో పద్మాలను, అభయముద్రలను ధరించి ఉంటారు. ఈమె ఒడిలో బాలుని రూపంలో స్కందుడు(కుమారస్వామి)కూర్చొని ఉంటారు. స్కందదేవుని జనని కావడంతో ఈ దుర్గాస్వరూపం స్కందమాతగా ప్రసిద్ధి చెందారు. స్కందమాతను ఆరాధిస్తే సకల కోర్కెలు నెరవేరడంతో పాటు శాంతి సౌఖ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. దసరా నవరాత్రోత్సవాలల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం శ్రీశైల భ్రమరాంబాదేవి స్కందమాత స్వరూపంలో ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కొలువుంచారు. అనంతరం ఆలయ అర్చకులు, వేదపండితులు వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజా హారతులనిచ్చారు. శ్రీశైలంలో నేడు.. దసరా నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శనివారం శ్రీశైల క్షేత్రంలో కాత్యాయని అలంకారంలో అమ్మవారు, హంస వాహన సేవపై స్వామిఅమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
ఇవీ డిమాండ్లు..
కోవెలకుంట్ల: సమగ్ర శిక్ష, విద్యాశాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ చిరు ఉద్యోగులు వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 168 మంది సీఆర్ఎంటీ(క్లస్టర్ రిజర్వు మొబైల్ టీచర్స్)లు, మండల్ లెవల్ అకౌంటెంట్లు, ఎంఐఎస్ కో ఆర్టినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వేతనాలు అందక, సంక్షేమ పథకాలు వర్తించక కుటుంబాలను భారంగా నెట్టుకొస్తున్నారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, ఇంటి అద్దెలు, పిల్లల చదువు, వైద్య, ఇతర ఖర్చులతో దిక్కుతోచని పరిస్థితులతో అల్లాడిపోతున్నారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేకుండా పనిచేయాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వంలో అందని వేతనాలు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదు. అరకొరగా వస్తున్న వేతనాలు సైతం రెండు నెలల నుంచి అందడం లేదు. వేతనాల పెంపు అటుంచితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడస్తున్న పథకాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమమ్ టైం స్కేల్ వర్తింపచేయరాదని ఈ ఏడాది జనవరి నెలలో జీవోనంబర్–2ను విడుదల చేసింది. ప్రభుత్వ శాఖల్లో మంజూరైన ఖాళీపోస్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు మాత్రమే అర్హులుగా తేల్చింది. ఈ జీఓ రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కుకు విరుద్ధమని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సరైన వేతన నిబంధనలు లేకపోవడం బాధాకరమని ఉద్యోగులు వాపోతున్నారు. తప్పని వెట్టి చాకిరి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతని పనిచేస్తున్న సీఆర్ఎంటీఎస్లతో ప్రభుత్వం వెట్టిచాకిరి చేయిస్తోంది. ఈ ఏడాది జూన్నెలలో పాఠశాలలు పున:ప్రారంభం కాగా ఉపాధ్యాయుల బదిలీలు, డీఎస్సీ పరీక్షల నిర్వహణ అదే నెలలో ఉండటంతో పనిభారం సీఆర్ఎంటీఎస్లపై పడింది. జిల్లాలో ఉన్న ఏకోపాధ్యాయ పాఠశాలల్లో వీరు ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తించాల్సి వచ్చింది. సీఆర్ఎంటీఎస్లను డిప్యూటేషన్లపై ఇతర పనులు అప్పగించమని ప్రకటించినా ఆచరణలో అమలు కాలేదు. ఏకారణంతోనైనా ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయుడు విధులకు హాజరు కాకపోతే ఆ స్థానాల్లో సీఆర్ఎంటీఎస్లు వెళ్లి విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు. అమలు కాని హామీలు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింప చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ చేర్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, తల్లికి వందనం, నూతన రేషన్కార్డులు, తదితర సంక్షేమ పథకాలు వర్తింప చేసినా కొందరికి మాత్రమే షరతులు విధించారు. నిత్యావస ధరలు, రవాణా ఖర్చులు, వైద్య ఖర్చులు, ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగడంతో అప్పులు చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఇలా.. జిల్లాలోని ఆయా మండలాల్లోని ఎంఈఓ కార్యాలయాల్లో 91 మంది సీఆర్ఎంటీఎస్లు, 19 మంది మండల్ లెవల్ అకౌంటెంట్లు, 29 మంది ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, 29 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. వీరంతా 2012లో ఉద్యోగాల్లో చేరారు. వీరికి గతంలో నెలకు రూ. 18,500 వేతనం అందేది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2020వ సంవత్సరం వేతనాన్ని రూ. 23,500లకు పెంచింది. అప్పటి నుంచి వీరికి ఈ వేతనం అందుతోంది. ఆరోగ్య భద్రత, పిల్లల విద్య, ఇంటి అద్దె భృతి, రేషన్ సబ్సిడీ పథకాలను ప్రత్యేకంగా అమలు చేయాలి. రద్దు చేసిన ఒంటరి మహిళ పెన్షన్, కుటుంబ సభ్యుల వృద్ధాప్య పింఛన్లు పునరుద్ధరించాలి. అంగన్వాడీ, ఆశావర్కర్లకు గ్రాట్యూటీ అమలు చేస్తూ రిటైర్డ్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇదే విధానాన్ని అమలు చేయాలి. జిల్లాలో 168 మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వేతనాలు అందక, సంక్షేమ పథకాలు వర్తించక అవస్థలు ఉద్యోగుల కుటుంబాల్లో ఆకలి కేకలు సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని డిమాండ్ -
ఆది స్వరూపం.. దివ్య తేజం
● కూష్మాండ దుర్గ స్వరూపంలో భక్తులకు సాక్షాత్కరించిన శ్రీశైల భ్రామరి ● కై లాసవాహనంపై స్వామిఅమ్మవార్ల దర్శనం ● శ్రీశైలంలో వైభవంగా దసరా నవరాత్రోత్సవాలుశ్రీశైలంటెంపుల్: సృష్టి లేని వేళ..దశ దిశలు అంధకారంలో ఉన్నప్పుడు.. తన మందస్మితంతో ఈ బ్రహ్మాండాన్ని సృష్టించిన దివ్యస్వరూపిణి కూష్మాండదుర్గ. ఈ దేవికి గుమ్మడికాయ బలి ప్రీతికరం. ఎనిమిది చేతుల్లో ఆయుధాలు ధరించి ఉండడంతో అష్టభుజదేవిగానూ భక్తులు కొలుస్తారు. దసరా ఉత్సవాల్లో భాగంగా నాల్గో రోజు గురువారం శ్రీశైల భ్రమరాంబాదేవి కూష్మాండదుర్గ అమ్మవారి స్వరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ దేవి ఎనిమిది భుజాలు కలిగి ఆది స్వరూపిణిగా పేరుపొందారు. కూష్మాండదుర్గ దేవిని ఆరాధిస్తే రోగాలన్నీ తొలగి ఆయువు, యశస్సు వృద్ధి చెందుతాయని భక్తుల నమ్మకం. కూష్మాండదుర్గ అలంకారంలో అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికలో అధిష్టింపజేసి అర్చకులు, పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
గౌరవ వేతనాలు ఇచ్చేందుకు చేతులు రావడం లేదు
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనాలను విడుదల చేసేందుకు చేతులు రావడం లేదు. ముస్లిం, క్రిస్టియన్లకు సూపర్ 10 అమలు చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఆయా వర్గాలకు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. ముస్లిం, క్రిస్టియన్ వర్గాలపై ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ చట్టాన్ని బలపరిచేది కాదు. – పీ ఇక్బాల్హుసేన్, ఆవాజ్ నగర కమిటీ అధ్యక్షుడు -
వైభవోపేతం.. స్వాతి మహోత్సవం
ఆళ్లగడ్డ: శ్రీనరసింహ స్వామి జన్మనక్షత్రమైన స్వాతిని పురస్కరించుకుని గురువారం స్వాతి మహోత్సవం వైభవంగా నిర్వహించారు. దిగువ అహోబిలంలో ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదస్వాములను ఆండాల్ ఆమ్మవారి దేవాలయం ఎదురుగా యాగశాలలో కొలువుంచారు. అభిషేకం, అర్చన, తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను నూతన పట్టుపీతాంబరాలతో అలంకరణచేసి కొలువుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అర్చకుల వేద మంత్రోచ్ఛారణలు.. ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాల మధ్య శ్రీ స్వాతి, శ్రీసుదర్శన హోమాలు వైభవోపేతంగా నిర్వహించి పూర్ణాహుతితో ముగించారు. రాత్రి విశేష పుష్పాలకంరణ గావించిన ఉత్సవ పల్లకీలో ఉభయ దేవేరులతో కొలువైన శ్రీ ప్రహ్లాదవరదుడు మాడవీధుల్లో సంచరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. -
ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
నందికొట్కూరు: ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఖైదీలకు కోర్టు ఉచిత న్యాయ సహాయం అందజేస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి లీలా వెంకటశేషాద్రి అన్నారు. గురువారం పట్టణంలోని సబ్జైల్ను జడ్జి ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సబ్జైల్లో నెలకొన్న సమస్యలుంటే న్యాయవాదుల దృష్టికి, ఆన్లైన్ నంబరు 15100 ద్వారా కంప్లయింట్ చేయవచ్చని స్పష్టం చేశారు. 70 ఏళ్లకు పైబడిన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోజన వసతుల గురించి ముద్దాయిలను అడిగి తెలుసుకున్నారు.వైద్య సదుపాయల గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సబ్జైల్ సూపరింటెండెంట్ రఘునాథరెడ్డి, న్యాయవాది వెంకటేశ్వర్లు, మెడికల్ ఆఫీసర్ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. -
పరిశుభ్రతతో అందరికీ ఆరోగ్యం
● జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ నంద్యాల: పరిసరాల పరిశుభ్రతతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పేర్కొన్నారు. నంద్యాల కలెక్టరేట్ ఆవరణంలో స్వచ్ఛతహి సేవ–2025లో భాగంగా ‘ఏక్ దిన్.. ఏక్ గంట.. ఏక్ సాత్ స్వచ్ఛత’ కార్యక్రమం గురువారం నిర్వహించారు. కలెక్టరేట్ సిబ్బందితో కలిసి జేసీ విష్ణు చరణ్ చెత్తాచెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల పరిసర ప్రాంతాల్లో మురుగు నీరు నిల్వ ఉండి, చెత్త దిబ్బలు ఉంటే దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందన్నారు. పట్టణంలోని ముఖ్య ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. డీఆర్ఓ రాము నాయక్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేరాల నియంత్రణకు చర్యలు శ్రీశైలంప్రాజెక్ట్: నేరాలను నియంత్రించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోనున్నట్లు ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. శ్రీశైలం టూటౌన్ అవుట్పోస్టును గురువారం మధ్యాహ్నం ఎస్పీ సునీల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పనితీరుపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ.. సున్నిపెంట టూటౌన్లో సిబ్బంది కొరత ఉందని తన దృష్టికి వచ్చిందన్నారు. టూటౌన్ శాశ్వత భవన నిర్మాణానికి రాష్ట్ర ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతామన్నారు. ఎస్పీ వెంట ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్, సీఐలు చంద్రబాబు, ప్రసాదరావు ఉన్నారు. సెలవులో వెళ్లిన జిల్లా ట్రెజరీ అధికారి ● ఏటీవో సుబ్బరాయుడుకు పూర్తి అదనపు బాధ్యతలు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా ట్రెజరీ అధికారి రామచంద్రరావు అనారోగ్య కారణాలతో ఈ నెల 19 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు సెలవులో వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇదే కార్యాలయంలో అసిస్టెంట్ ట్రెజరీ అధికారి(ఏటీవోగా పనిచేస్తున్న సుబ్బరాయుడును పూర్తి అదనపు బాధ్యతలతో జిల్లా ట్రెజరీ అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ఖజానా శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు బాధ్యతలు స్వీకరించిన సుబ్బరాయుడును ఏపీటీఎస్ఏ జిల్లా అధ్యక్షుడు డి.రవికుమార్, సెక్రటరీ గురుమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మురళీధర్నాయుడు, రాష్ట్ర కార్యదర్శి జడ్.కరుణాకర్ పలువురు ట్రెజరీ ఉద్యోగులు అభినందించారు. తప్పుడు స్టాంపు డ్యూటీ సొమ్ము రూ.20.26 లక్షల రికవరీ ● అప్పటి సబ్ రిజిస్ట్రార్ రాజశేఖర్పై క్రమశిక్షణా చర్యలు కర్నూలు(సెంట్రల్): ఆస్తి విలువను తక్కువగా చూపి రూ.20.26 లక్షల స్టాంపు డ్యూటీ మినహాయింపుపై లోకాయుక్త ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది క్షమించరాని నేరమని, బాధ్యతాయుత హోదాలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ అలా చేయడంతో అతనికి మూడు సంవత్సరాలపాటు ఇంక్రిమెంట్లను నిలుపుదల చేయడంతోపాటు రూ.20.26 లక్షలను బాధిత పార్టీల నుంచి ఖజానాకు జమ చేసేలా చర్యలు చేపట్టింది. 2023లో అప్పటి ఆదోని సబ్ రిజిస్ట్రార్ రాజశేఖర్ డాక్యుమెంట్ నంబర్ 5352/2023 రిజిస్ట్రేషన్కు తక్కువ స్టాంపు డ్యూటీ నమోదు చేసి ఖాజానాకు రూ.20.26 లక్షలు ఆర్థిక నష్టం కలిగించారని లోకాయుక్తకు ఫిర్యాదు రావడంతో ఉప లోకాయుక్త స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కర్నూలు డీఐజీని విచారణకు ఆదేశించారు. విచారణలో నేరం రుజువు కావడంతో బాధిత పార్టీల నుంచి రూ.20,26,200 వసూలు చేయడమే కాకుండా సబ్ రిజిస్ట్రార్ రాజశేఖర్పై క్రమశిక్షణా చర్యల కింద మూడు సంవత్సరాల పాటు ఇంక్రిమెంట్ల కోత విధిస్తూ లోకాయుక్తకు గురువారం నివేదిక సమర్పించారు. పరిశీలించిన ఉప లోకాయుక్త జస్టిస్ పి.రజనీ కేసును మూసివేశారు. -
అనాథ పిల్లలపై ‘వాత్సల్య’ం
● జిల్లాలో తొమ్మిది మందికి ఆర్థిక సహాయం నంద్యాల: కోవిడ్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన నిరుపేద పిల్లలకు మిషన్ వాత్సల్య స్కీం కింద గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్లో ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ.. జిల్లాలో కోవిడ్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన తొమ్మిది మంది పిల్లలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందన్నారు. ఒక్కొక్కరికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు కలిపి మొత్తం రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందజేశామన్నారు. బాధిత పిల్లల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తు సాధికారత కోసం మిషన్ వాత్సల్య పథకం కింద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. ఎటువంటి సమస్యలు ఎదురైనా జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులను అనాథ పిల్లలు సంప్రదించాలన్నారు. ఎంతో సంతృప్తి కోవిడ్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనాఽథ పిల్లలను ఆదుకోవడంలో ఎంతో సంతృప్తి కలుగుతోందని జిల్లా కలెక్టర్ తెలిపారు. నందికొట్కూరు మండలం వడ్డేమాను గ్రామానికి చెందిన పి.రాజుకు రూ.1.50 లక్షల విలువైన వీడియో కెమెరా, గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు నిర్మించుకునేందుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. శ్రీశైలం మండలం సున్నిపెంట గ్రామానికి చెందిన ఎస్.సబి సుల్తానా బి.ఫార్మసీ చదువుతున్నదని వివరించగా ఆమె విద్య కొనసాగించేందుకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. పాణ్యం మండలం బలపనూరు గ్రామానికి చెందిన సుప్రియ, సూర్యలక్ష్మిలకు గృహ నిర్మాణ నిధులు మంజూరు చేస్తామన్నారు. ఆత్మకూరు మండలం నల్లకాల్వ గ్రామానికి చెందిన ఎస్. సౌమ్యకు డిగ్రీ పూర్తి చేసుకునేందుకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. అలాగే మహేష్, మధుసూదన్, వంశీకృష్ణ, ఓబులేసు మొత్తం 9 మంది పిల్లలను పేరుపేరునా పిలిచి వారి పరిస్థితులను జిల్లా కలెక్టర్ తెలుసుకున్నారు. -
ఆదోని ఎంపీపీపై అవిశ్వాస తీర్మానానికి వినతి
ఆదోని రూరల్/ఆదోని టౌన్: ఆదోని ఎంపీపీపై అవిశ్వాసానికి వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు సిద్ధమయ్యారు. ఈ మేరకు గురువారం మండలంలోని 20 మంది వైఎస్సార్సీపీ చెందిన ఎంపీటీసీలు ఏకమై ఎంపీపీపై అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించాలని సబ్కలెక్టర్ మౌర్యభరద్వాజ్ను కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ౖవైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి చంద్రకాంత్రెడ్డి, మండలాధ్యక్షుడు గురునాథ్రెడ్డి, ఎంపీటీసీలు మాట్లాడారు. ౖవైఎస్సార్సీపీ తరఫున గెలిచి వేరే పార్టీలో చేరడంతోనే ఎంపీపీ దానమ్మపై అవిశ్వాస తీర్మానం పెట్టినట్లు తెలిపారు. దానమ్మ పార్టీకి నమ్మకద్రోహం చేసిందని, అందువల్లనే ఆమెను ఎంపీపీ పదవి నుంచి దించాలన్న ఉద్దేశంతోనే తాము ఈ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టినట్లు చెప్పారు. స్పందించిన సబ్కలెక్టర్ మౌర్యభరద్వాజ్ మాట్లాడుతూ.. ఎంపీటీసీల వినతి మేరకు 15 రోజుల్లో నోటీసు జారీ చేస్తామన్నారు. అవిశ్వాస తీర్మానంలో ప్రస్తుత ఎంపీపీగా ఉన్న దానమ్మ నెగ్గితే కొనసాగుతారని, లేనిపక్షంలో తదుపరి ఎంపీపీ ఎన్నిక జరుగుతుందన్నారు. పార్టీకి నమ్మకద్రోహం వైఎస్సార్సీపీ తరఫున కపటి గ్రామ ఎంపీటీసీగా ఏకగ్రీవంగా గెలుపొందిన దానమ్మను అప్పటి ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీపీగా ఎన్నుకున్నారు. ఆదోని మండలంలో మొత్తం 29 మంది ఎంపీటీసీ స్థానాలు ఉండగా మండిగిరి–1, 2, సాదాపురం స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. 26 స్థానాల్లో మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఇందులో ముగ్గురు మృతి చెందగా, ఒకరు రాజీనామా చేశారు. అప్పటి ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి ఆదేశాల మేరకు కపటి గ్రామానికి చెందిన ఎంపీటీసీ దానమ్మ ఎంపీపీగా ఎన్నుకున్నారు. -
టమాట ధర మరింత పతనం
పత్తికొండ/ప్యాపిలి: మార్కెట్లో టమాట ధర మరింత పతనం అయ్యింది. గత కొద్ది రోజులుగా నిలకడగా ఉండటం లేదు. దీంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. గురువారం పత్తికొండ పట్టణంలోని మార్కెట్లో టమాట ధర కిలో రూ.2 నుంచి గరిష్టంగా రూ.4 మాత్రమే పలికింది. మార్కెట్లో ధర తగ్గినప్పుడు కూటమి ప్రభుత్వం కిలో 8 రూపాయలకు కోనుగోలు చేస్తామన్న హామీ ఇచ్చినా క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదు. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పత్తికొండ మార్కెట్యార్డులో గురువారం టమాట 25కేజీల జత గంపలు కేవలం రూ.150 నుంచి రూ.250లోపు ధర పలికింది. వ్యాపారులు కమీషన్ పట్టుకోని ఇవ్వడంతో కేజీ రూ.2 నుంచి రూ. 4 మాత్రమే వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో 421 క్వింటాల టమాటను వ్యాపారులు కోనుగోలు చేశారు. దాదాపు 10 లారీల సరకు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేశారు. మూడో రోజు కూడా పూర్తిగా ధరలు తగ్గిపోవడంతో ఈఏడాది టమాట పంట సాగు కోసం పెట్టిన పెట్టుబడులు కూడా రాక మమ్ముల్ని అప్పుల్లో ముంచేస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఽ ప్యాపిలిలో.. ప్యాపిలి మార్కెట్లో రెండు రోజుల క్రితం 25 కిలోల బాక్స్ రూ. 650 వరకు పలికింది. గురువారం మాత్రం 25 కిలోల బాక్స్ ధర రూ. 50 పలికింది. కిలో రెండు రూపాయలకు పలకడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులు కుమ్మకై ్క రైతులను నిలువునా ముంచుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తనకేమీ పట్టనట్లు చోద్యం చూస్తోందని మండిపడ్డారు. -
ప్రశాంతంగా నంద్యాల డయాసిస్ కమిటీ ఎన్నిక
● సెక్రటరీగా ప్రభుదాసు, ఉపాధ్యక్షుడిగా రాజేంద్రబాబు విజయంనంద్యాల(న్యూటౌన్): నంద్యాల అధ్యక్ష ఖండం డయాసిస్ కమిటీ ఎన్నిక గురువారం ప్రశాంతంగా జరిగింది. పట్టణంలోని హోలీక్రాస్ కెథడ్రల్ చర్చికి ఎదురుగా ఉన్న డయాసిస్ కార్యాలయ ఆవరణలో బిషప్ సంతోష్ ప్రసన్నరావు ఆధ్వర్యంలో డయాసిస్ సెక్రటరీ, ఉపాధ్యక్షులకు హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అధికారిగా స్టాండ్లీ విలీయం వ్యవహరించారు. ఉదయం 9గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 2 గంటకు ముగిసింది. అప్పటి నుంచి కౌంటింగ్ నిర్వహించారు. డయాసిస్ సెక్రటరీగా బైళ్ల ప్రభుదాసు 200 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అలాగే ఉపాధ్యక్షుడిగా రెవరెండ్ మేకల రాజేంద్రబాబు 300 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. అలాగే డయాసిస్ ట్రెజరర్గా పరిశుద్ధ మత్తయి ఆలయం డీనరీ చైర్మన్ నందం ఐజక్ను కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ కమిటీ మూడేళ్ల పాటు 2028 వరకు కొనసాగుతుందని బిషప్ వివరించారు. ఎన్నికై న అభ్యర్థులను ఆయా పాస్టరేట్ల కౌన్సిలర్లు, గురువులు పూలమాలలతోను ఘనంగా సత్కరించారు. నూతనంగా ఎన్నికై న డయాసిస్ సెక్రటరీ బైళ్ల ప్రభుదాస్, ఉపాధ్యక్షుడు మేకల రాజేంద్రబాబు మాట్లాడుతూ.. బిషప్ సంతోష్ ప్రసన్నరావు ఆధ్వర్యంలో నంద్యాల డయాసిస్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. డయాసిస్ ఎన్నికల సందర్భంగా మూడవ పట్టణ సీఐ కంబగిరిరాముడు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉపాధ్యక్షుడు రాజేంద్రబాబుసెక్రటరీ బైళ్ల ప్రభుదాసు -
సింహ వాహనంపై కూష్మాండదుర్గ
మహానంది: మహానందిలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీకామేశ్వరిదేవి కూష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అలంకార మండపంలో ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, రుత్వికులు ముందుగా అమ్మవారికి విశేష అలంకార పూజలు, సహస్రదీపాలంకరణ పూజలు చేపట్టారు. బలిహరణ, కూష్మాండబలి పూజల అనంతరం అమ్మవారిని సింహవాహనంపై కొలువు తీర్చి ఆలయ మాడవీధుల్లో ఉత్సవం చేపట్టగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమాల్లో ఆలయ సూపరింటెండెంట్లు అంబటి శశిధర్రెడ్డి, నీలకంఠేశ్వరరాజు, పి.సుబ్బారెడ్డి, ఇన్స్పెక్టర్ నాగమల్లయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
● బావిలో మునిగి ఇంటర్ విద్యార్థి మృతికర్నూలు: ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణాన్ని బలి తీసుకుంది. కర్నూలు మండలం నూతనపల్లె గ్రామానికి చెందిన జయంతి, వెంకటేశ్వర్లు దంపతుల కుమారుడు శ్రీనివాసులు(17) కర్నూలు మండలం పసుపల–రుద్రవరం గ్రామాల మధ్య ఉన్న పొలంలోని బావిలో సరదాగా ఈత కొట్టేందుకు దిగాడు. సరిగ్గా ఈత రాకపోవడంతో మునిగి మృతిచెందాడు. తల్లి జయంతి దుబాయ్లో నర్సుగా పనిచేస్తుండగా తండ్రి వెంకటేశ్వర్లు కర్ణాటకలో పాలిష్ కట్టర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి కొడుకు, కూతురు సంతానం. ఇద్దరు కూడా నాయనమ్మ దగ్గర ఉంటూ చదువుకుంటున్నారు. శ్రీనివాసులు పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు ఎదురుగా ఉన్న సెయింట్ మేరీస్ జూనియర్ కళాశాలలో ఫస్టియర్ ఇంటర్మీడియట్ హెచ్ఈసీ చదువుతున్నాడు. బుధవారం స్నేహితులు ఈదుర్ బాషా, గణేష్, నవీన్, చంద్రహాస్లతో కలసి పసుపుల సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు చేరుకున్నారు. స్నేహితులందరూ నీటిలోకి దిగి ఈత కొడుతుండగా తనకు కూడా కొద్దిగా ఈత వచ్చని స్నేహితులకు చెప్పి వారితో సరదాగా గడిపేందుకు నీటిలోకి దిగి మునిగిపోయాడు. ఎంత సేపటికీ నీటిలో నుంచి తేలకపోవడంతో స్నేహి తులు భయాందోళనకు లోనై పరిగెత్తుకుంటూ వెళ్లి కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని బావిలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలోని మార్చు రీ కేంద్రానికి తరలించి భద్రపరిచారు. విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు కర్నూలుకు చేరుకున్నారు. అయితే విద్యార్థి శ్రీనివాసులు పెదవులు, చెవుల వద్ద చాపలు కొరికిన గాట్లు ఉన్నాయి. వాటిని చూసి స్నేహితులే ఏదో చేశారని, అందుకే తన కుమారుడు మృతిచెందాడని తల్లి జయంతి అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. -
ఫుట్బాల్ విజేత కర్నూలు
● బాలికల విభాగంలో అనంతపురం జట్టు ● ముగిసిన రాష్ట్ర స్థాయి పోటీలు ఎమ్మిగనూరుటౌన్: మూడు రోజులుగా ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్ 19 స్కూల్ గేమ్స్ ఫుట్బాల్ పోటీల్లో బాలురు విభాగంలో కర్నూలు జట్లు విజేతగా నిలిచింది. గురువారం ఫైనల్ పోటీలు హోరాహోరీగా సాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి బాలురు, బాలికల జట్లు ఈ పోటీల్లో తలపడ్డాయి. ఈ పోటీల్లో బాలుర విభాగంలో ద్వితీయ స్థానం శ్రీకాకుళం జట్టు, తృతీయ స్థానాన్ని అనంతపురం జిల్లా జట్టు దక్కించుకొంది. అదే విధంగా బాలిక పోటీల్లో మొదటి స్థానాన్ని అనంతపురం జట్టు, ద్వితీయ స్థానాన్ని విశాఖ పట్టణం జట్టు కై వసం చేసుకోగా తృతీయ స్థానం వెస్ట్ గోదావరి జిల్లా జట్టు దక్కించుకొంది. గెలుపొందిన ఆయా జట్లకు జిల్లా ఆర్ఐఓ లాలప్ప, మల్లెల గ్రూప్స్ అధినేత మల్లెల ఆల్ఫ్రెడ్రాజు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి రాఘవేంద్రాచారి, ఫుట్బాల్ అసొయేషన్ అధ్యక్షుడు రామకృష్ణ నాయుడు పాటు స్థానిక ప్రజాప్రతినిధులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పోటీల ఆర్గనైజర్లు వ్యాయామ ఉపాధ్యాయులు నరసింహరాజు, హనీఫ్, శ్రీనివాసులు, సీజీ ఈరన్న ,శ్రీరాములు, లతీఫ్, వెంకటేష్, బసవరాజు, గంగాధర్తో పాటు పలువురు పీఈటీలు తదితరులు పాల్గొన్నారు. -
సస్యరక్షణ చర్యలతో తెగుళ్ల నివారణ
కొత్తపల్లి: సస్యరక్షణ చర్యలతో తెగుళ్ల నివారణ సాధ్యమని యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు సుధాకర్, బాలరాజు, కృష్ణమూర్తి, రవిగౌడ్ అన్నారు. గురువారం వారు నందికుంట గ్రామ సమీపంలోని వరిపొలాలను పరిశీలించారు. అనంతరం స్థానిక వెలుగు కార్యాలయంలో రైతు ఉత్పత్తి దారుల సంఘం రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వాతావరణం చల్లగా ఉండడంతో తెగుళ్లు సోకే అకాశం ఎక్కువగా ఉందన్నారు. రైతులు భూసార ఆధారిత ఎరువుల యాజమాన్యం చేపట్టి సాగు ఖర్చు తగ్గించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అమీరున్నీసా బేగం, ఏపీఎమ్ పుల్లయ్య, వెలుగు సీసీలు నరసింహులు, రైతులు, మహిళా రైతులు పాల్గొన్నారు. కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో మే/జూన్ నెలల్లో జరిగిన డిగ్రీ రెండు, నాల్గవ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షల పునఃమూల్యాంకనం ఫలితాలను విడుదల చేశారు. వర్సిటీ వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసరావు ఆదేశాల మేరకు ఫలితాలను విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు పేర్కొన్నా రు. రెండో సెమిస్టర్కు సంబంధించి 541 మంది రీ వాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోగా 151 మంది, నాల్గవ సెమిస్టర్కు 781 మందికి 196 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఫలితాలు https://rayalaseemauniversity.ac.in లో అందుబాటులో ఉన్నాయన్నారు. బాషా, రక్ష ఆసుపత్రులపై కేసులు నమోదు చేయండి కర్నూలు (సెంట్రల్): లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న కోడుమూరు బాషా, కర్నూలు రక్ష ఆసుపత్రులపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ కమిటీ (పీసీ, పీఎన్డీటీ యాక్ట్) సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సమావేశానికి 6వ అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి లక్ష్మీరాజ్యం, డీఎంహెచ్ఓ డాక్టర్ శాంతికళ, సీఐ తబ్రేజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణి మరణానికి కారణమైన రక్ష ఆసుపత్రిపై కేసు నమోదు చేసి సీజ్ చేయాలని ఆదేశించారు. ఇకపై జిల్లాలో ఎక్కడ కూడా లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎన్జీఓ ప్రతినిధులు డాక్టర్ బాలమద్దయ్య, నోడల్ ఆఫీసర్ నాగప్రసాద్ బాబు, ప్రోగ్రాం కన్సల్టెంట్ సుమలత పాల్గొన్నారు. -
పెన్షనర్ల సంఘానికి నేడు ఎన్నికలు
నంద్యాల(అర్బన్): ప్రభుత్వ పెన్షనర్ల జిల్లా సంఘానికి శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. రహస్య బ్యాలె ట్ పేపర్ ద్వారా జరిగే ఈ ఎన్నికల్లో పుల్లారెడ్డి, రామసుబ్బయ్య ప్యానళ్లు పోటీలో ఉన్నాయి. పన్నెండు ఏళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో గెలుపే లక్ష్యంగా ప్రచారం సాగించారు. దాదాపు 3,400 మంది ఓటర్లు ఉన్న సంఘానికి ఎన్నికల అధికారులుగా పెదనగౌడ్, ప్రభాకర్, కిట్టప్పలు వ్యవహరించనున్నా రు. శుక్రవారం ఉదయం 10కి ప్రారంభమయ్యే ఎన్నిక లు సాయంత్రం 4గంటలకు ముగుస్తాయి. గంట వ్యవధిలోనే తుది ఫలితాలు వెలువరించి అధ్యక్ష కార్యదర్శులకు గెలుపు పత్రాలను అందజేయనున్నారు. -
దీక్ష బూని.. భక్తి చాటి !
ఈ నెల 27న శనివారం నెరణికి గ్రామంలో ఉంటున్న మాళ మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను దేవరగట్టుకు తీసుకెళ్లి రాత్రి కంకణధారణ నిర్వహిస్తారు. ● అక్టోబర్ 2వ తేదీ గురువారం విజయదశమి రోజున కల్యాణోత్సవం, బన్ని, జైత్రయాత్ర. ● 3న భవిష్యవాణి (దైవవాణి) ● 4న సాయంత్రం స్వామివారి రథోత్సవం. ● 5న గొరవయ్యల ఆటలు, గొలుసు తెంపుట, సాయంత్రం దేవదాసీల క్రీడోత్సవం. ● 6న సోమవారం మాళమల్లేశ్వర స్వామి విగ్రహాలు నెరణికి గ్రామానికి చేరడంతో ఉత్సవాలు ముగుస్తాయి. హొళగుంద: దేవరగట్టులో ప్రతి ఏటా నిర్వహించే దసరా బన్ని ఉత్సవంలో నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు ఐక్యతను చాటుకుంటూ వస్తున్నారు. ప్రత్యేక దీక్ష చేపట్టి వేడుకను వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు జరిగే దసరా ‘బన్ని’ఉత్సవాలకు సిద్ధమవుతున్నారు. ఈ మూడు గ్రామాలకు చెందిన కొందరు యువకులు గత నాలుగేళ్ల నుంచి మల్లయ్య మాల దీక్షను చేపట్టి భక్తిని చాటుతున్నా రు. అయ్యప్ప, శివయ్య మాల దీక్ష వలే కొన్నేళ్ల నుంచి మల్లయ్య మాల ధరిస్తుస్తున్నారు. మూడు గ్రామాల్లో మల్లయ్య దీక్ష చేపట్టే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతోంది. కఠోర దీక్షను పాటిస్తూ తమ ఇలవేల్పుపై భక్తిని చాటుకుంటున్నారు. దేవరగట్టు దసరా బన్ని మహోత్సవాల్లో ఈ మూడు గ్రామాస్తులదే కీలక భూమిక. అమావాస్య నుంచి దీక్షను మొదలు పెట్టి బన్ని ఉత్సవాలు ముగిసేంత వరకు నిష్టతో ఉంటారు. విగ్రహాలు తిరిగి నెరణికి గ్రామానికి చేరే వరకు కట్టుబాట్లను తూచ తప్పకుండా పాటిస్తారు. ఈ 15 రోజుల పాటు చెప్పులు తొడుక్కోరు. అలాగే దాంపత్య సుఖానికి పూర్తిగా దూరంగా ఉంటారు. ఇక మద్యం జోలికెళ్లరు. మాంసం ముట్టరు. దైవకార్యాన్ని విజయవంతంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో పండుగను జరుపుకుంటారు. ఎంత కక్షలు ఉన్నా బన్ని రోజు అన్నదమ్ముల్లా కలిసి మెలసి ఉందామని పాలబాస తీసుకుంటారు. మూడు గ్రామాల్లో ఆరోజే దసరా.. ఈ ఏడాది దేశమంతా అక్టోబర్ 2వ తేదీ దసరా వేడుకలు జరుపుకుంటే ఈ మూడు గ్రామంలో 6వ తేదీన చేసుకుంటారు. విజయదశమి నాడు అందరికీ దసరా పండుగా అయితే ఆ మూడు గ్రామస్తులకు మాత్రం బన్ని ఉత్సవాలు ముగిసి విగ్రహాలు నెరణకి గ్రామానికి చేరే రోజు విజయానికి సూచికగా వారు పండుగ చేసుకుంటారు. ఈ కట్టుబాట్లను కులమత భేదాలు లేకుండా అన్ని వర్గాల వారు పాటిస్తూ ఉత్సవంలో భాగస్వాములవుతారు. ఉత్సవాలు ముగిసేంత వరకు ఒకరినొకరు కొట్టుకోరు. ఒకరినొకరు తిట్టుకోరు. వాళ్ల లక్ష్యం ఒక్కటే. మాళమల్లేశ్వరుల విగ్రహాన్ని విజయవంతంగా నెరణికికి చేర్చడం. మనస్సు నిండా భక్తిని నింపుకుని నిష్టతో, నిబద్ధతతో ఉంటారు. కట్టుబాట్లను పాటిస్తున్నందునే బన్ని (కర్రల సమరం)లో దేవరగట్టు చుట్టు పక్క ఉన్న మిగిలిన గ్రామాలకు చెందిన భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొన్నా జైత్రయాత్రాన్ని విజయవంతంగా ముగించుకుని విగ్రహాలను నెరణికి గ్రామం చేరుస్తున్నామని మూడు గ్రామస్తు ల నమ్మకం. తమ గ్రామాల్లో ఇన్నాళ్లు ఒకరికొకరు ఎలా ఉన్నా ఉత్సవంలో మాత్రం కలిసికట్టుగా ఉండి తమ మధ్య విధించుకున్న కట్టుబాట్లకు కట్టుబడి ఉంటారు. ఉత్సవం ఇలా.. -
సీడీపీఓ వేధింపులపై విచారణ
ఆలూరు రూరల్: ఆలూరు సీడీపీఓ నరసమ్మ వేధిస్తున్నారని కురువళ్లి అంగన్వాడీ టీచర్ భువనేశ్వరి ఆరోపణలపై జిల్లా ఐసీడీఎస్ పీడీ విజయ విచారణ చేపట్టారు. ఈ నెల 6వ తేదీన సీడీపీఓ కురువళ్లి అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్లో వివరాలు లేకపోవడంతో టీచర్ను నిలదీసి, రూ. 4 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశా రని, ఇవ్వలేకపోవడంతో వేధిస్తు న్నారని అంగన్ వాడీ టీచర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పీడీ విజయ బుధవారం ఆలూరుకు చేరుకుని సీడీపీఓ, సూపర్ వైజర్, అంగన్వాడీటీచర్, ఆయాను విచారించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని తెలిపారు. సబ్ జైలు తనిఖీడోన్ టౌన్: పట్టణంలోని సబ్ జైలును బుధవారం జిల్లా లీగల్ సర్వీసు అథారిటీ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలు పరిసరాలను, వంట గదిని పరిశీలించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడారు. ఏ ఏ నేరాలపై జైలుకు వచ్చారు? బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారా? ఎవ్వరైన 70 ఏళ్ల పైబడిన వయస్సు వారు ఉన్నారా? అంటూ అరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జైలులో వసతులు, భోజనం, వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయని అడిగారు. బెయిలు కోసం స్వతహాగా దరఖాస్తు చేసుకోవడానికి ఆర్ధిక స్థోమత లేక పోతే జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు దరఖాస్తు పెట్టకోవాలని సూచించారు. ఈయన వెంట పట్టణ సీఐ ఇంతియాజ్బాషా, లీగల్ అడ్వయిజర్ మాధవస్వామి తదితరులు ఉన్నారు. -
వివాదం రాజేసిన చేపల వేట
అవుకు(కొలిమిగుండ్ల): చేపల వేట కోసం రెండు వర్గాల మధ్య వివాదం రాజుకుంది. బుధవారం మెట్టుపల్లె వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అవుకు మండలం మెట్టుపల్లె సమీపంలోని గాలేరు నగరి కాల్వకు ఎగువ నుంచి నీటి విడుదల సామర్థ్యాన్ని ఇటీవల అధికారులు తగ్గించారు. దీంతో మెట్టుపల్లె, కోనాపురం గ్రామాలకు చెందిన కొంత మంది వ్యక్తులు గాలేరు నగరి కాల్వలో దిగి చేపలు పట్టుకుంటున్నారు. పది నుంచి ఇరవై కేజీల బరువున్న చేపలు కాల్వ ద్వారా అవుకు రిజర్వాయర్లోకి చేరుతుంటాయి. కొద్ది రోజుల నుంచి రెండు గ్రామాలకు చెందిన వ్యక్తులు చేపలు పట్టుకొని బనగానపల్లెకు చెందిన వ్యాపారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు నాలుగు టన్నుల వరకు చేపలను విక్రయించినట్లు తెలుస్తోంది. తాజాగా బుధవారం టన్నుకు పైగానే చేపలు పట్టు కొని ఆటోలో తరలించేందుకు సిద్ధం చేశారు. ఈ విష యం తెలుసుకున్న అవుకు పట్టణానికి చెందిన బెస్త సంఘం నాయకులు గాలేరు నగరి కాల్వ వద్దకు చేరుకున్నారు. చేపలు పట్టుకునే హక్కు తమకు మాత్రమే ఉందని వాదించారు. అయితే తమ గ్రామ పొలిమేర కాబట్టి తమకు మాత్రమే హక్కు ఉందని గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకోవడంతో ఒకరికొకరు స్వల్పంగా తోపులాటకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కాల్వ వద్దకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఇరువర్గాల వాదనలు విని సమస్య పరిష్కారం అయ్యే వరకు ఎవరూ చేపలు పట్టరాదని సూచించారు. ఆటో లో ఉన్న చేపలను స్టేషన్కు తరలించారు. సీఐ మంజునాథరెడ్డి అవుకు పోలీస్ స్టేషన్కు చేరుకొని రెండు గ్రామాలకు చెందిన వ్యక్తులతో పాటు అవుకు బెస్త సంఘం నాయకులతో చర్చించారు. కాగా చివరకు ఆ ప్రా ంతం చేపల వేటకు నిషేధమని, ఎవరూ చేపలు పట్ట కూడదని తేల్చి చెప్పారు.ఆటోలో ఉన్న చేపలను అప్పటికే కొనుగోలు చేసిన వ్యాపారులకు అప్పగించారు. -
ప్రతి విద్యా సంస్థలో ఈగల్ బృందాలు
కర్నూలు(సెంట్రల్): యూనివర్సిటీ మొదలు పాఠశాలల వరకు ప్రతి విద్యా సంస్థలో ఈగల్టీం(బృందాలు)లను సోమవారంలోపు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అధికారులను ఆదేశించారు. జూనియర్ కాలేజీలు, పాఠశాలల ఈగల్ టీంలో ఇద్దరు ఉపాధ్యాయులు, ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు ఉండేలా చూసుకోవాలన్నారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఎన్సీఓఆర్డీ సమావేశాన్ని కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, ఎస్పీ విక్రాంత్పాటిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలు, విద్యార్థుల సాయంతో మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణాపై పూర్తి స్థాయిలో నిఘా వేయవచ్చన్నారు. మత్తు పదార్థాల వినియోగంతో అనారోగ్యం బారిన పడతారని, కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడతాయనే విషయాన్ని ఈగల్ టీంల ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నారు. పంట పొలాల్లో గంజాయి పెంచకుండా తగిన నిఘా ఉంచాలని వ్యవసాయ, ఉద్యాన వన శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం పోలీసు శాఖ మత్తు పదార్థాల వినియోగం, రవాణాను అరికట్టడంపై ముద్రించిన పోస్టర్లు, కరపత్రాలు, వీడియోలను ఆవిష్కరించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలోని 250 పాఠశాలల్లో ఈగల్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి శుక్రవారం పాఠశాలల్లో మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని విద్యా సంస్థలకు సూచించినట్లు చెప్పారు. ఆదోని మండలం పెద్దతుంబళంలో గంజాయిని అంతర పంటగా సాగు చేస్తుండడంతో గుర్తించామని, సుమారు 3.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, కర్నూలు మునిసిపల్ కమిషనర్ పి.విశ్వనాథ్, మైనార్టీ కార్పొరేషన్ ఈడీ సబీహపర్వీన్, డీటీసీ శాంతకుమారి, ఆర్టీసీ ఏఓ సుధారాణి, డిజేబుల్డ్ ఏడీ ఫాతిమా సుల్తానా, జేడీఏ వరలక్ష్మీ, డీఎంహెచ్ఓ శాంతికళ, ఎకై ్సజ్ సూపరింటెంటెండ్ సుధీర్బాబు, బీసీ వెల్ఫేర్ అధికారి ప్రసూన, ఆర్ఐఓ లాలెప్ప, సోషల్ వెల్ఫేర్ అధికారి రాధిక, లేబర్ డీసీ వెంకటేశ్వర్లు, క్లస్టర్ యూనివర్సిటీ డీన్ అఖీరాబాను పాల్గొన్నారు. -
నల్లమలలో ట్రాఫిక్ జామ్
మహానంది: నల్లమల ఘాట్రోడ్డులో బుధవారం దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు అవస్థలు పడ్డారు. మహారాష్టకు చెందిన సంఘ్వి మూవర్స్కు చెందిన భారీ వాహనం గిద్దలూరు మీదుగా నంద్యాల వైపు వస్తుండగా చింతమాను టర్నింగ్ వద్ద సాంకేతిక లోపం తలెత్తడంతో ఆగిపోయింది. దీంతో సుమారు రెండు కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. అనంతరం వాహనదారుల సహాయంతో రోడ్డుకు అడ్డుగా ఉన్న భారీ వాహనాన్ని పక్కకు తప్పించడంతో వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. -
విజయవాడకు బయలుదేరిన కొత్త సారోళ్లు
● ఉమ్మడి జిల్లా నుంచి 123 బస్సుల్లో తరలింపు ● జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ కర్నూలు సిటీ: డీఎస్సీ–2025లో ఉపాధ్యాయ పోస్టులు సాధించిన అభ్యర్థులు నియామక పత్రాలు అందుకునేందుకు బుధవారం విజయవాడకు తరలివెళ్లారు. వీరంతా గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అమరావతిలో నియామకపత్రాలు అందుకోనున్నారు. ఉమ్మడి జిల్లా అభ్యర్థులు, వారికి ఒకరి చొప్పున సహాయకులను రాయలసీమ యూనివర్సిటీ నుంచి ఆర్టీసీ బస్సుల్లో జిల్లా విద్యాశాఖ అధికారులు తీసుకెళ్లారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం చేతుల మీదుగా నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి ఆర్టీసీ బస్సుల్లో వెళ్తున్న 2,805 మంది నూతన ఉపాధ్యాయులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించామన్నారు. 123 బస్సుల్లో ప్రతి బస్సుకు ఒక పోలీసు ఎస్కార్ట్, మెడికల్ కిట్లు ఏర్పాటు చేశామన్నారు. పర్యవేక్షణకు పది బస్సులకు ఒక నోడల్ అధికారిని నియమించామన్నారు. రాత్రి విడిది కోసం ప్రత్యేకంగా మహిళలు, పురుషులకు వేర్వేరుగా నరసరావుపేట, గుంటూరులో బస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమం ముగిసిన తరువాత అదే బస్సుల్లోనే అభ్యర్థులను జిల్లా కేంద్రానికి తీసుకొస్తామన్నారు. కాగా చంటి పిల్లలు ఉన్న తల్లులు ఎంతో అవస్థలు పడ్డారు. వాతావరణం చల్లగా ఉండడంతో పిల్లలతో సుదూర ప్రయాణం చేయాల్సి రావడంతో ఆందోళన చెందారు. అయితే నియమాక పత్రాలు జిల్లాకు ఇద్దరికి మాత్రమే వేదికపై ఇస్తారని ప్రయాణంలో తెలియడంతో అభ్యర్థులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రచారం కోసం ప్రభుత్వం తమను ఇబ్బందులకు గురి చేయడం ఎంత వరకు సబబు అని బస్సుల్లో ఉన్న అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. -
కానరావా.. దయ చూపలేవా!
శ్రీశైలానికి వెళ్లే ప్రయాణికులతో కిటకిటలాడుతున్న ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండుఆత్మకూరు: మహిళల కోసం ఉచిత బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. ఉచిత బస్సులను ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకుంటుడటంతో ప్రయాణికులు ఇబ్బంది పడున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా శ్రీశైల క్షేత్రానికి వెళ్లడానికి వివిధ ప్రాంతాల నుంచి ఆత్మకూరుకు వచ్చిన వారికి బుధవారం కష్టాలు ఎదురయ్యాయి. ‘శివశివా.. ఏమిటీ ప్రయాణ కష్టాలు’ అనుకుంటూ మల్లన్న స్వామిని చూడకుండానే చాలా మంది తిరిగి వెళ్లారు. బస్సులు లేక.. కర్నూలు, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, డోన్, నందికొట్కూరు, నంద్యాల, బనగానపల్లె, ఆళ్లగడ్డ నుంచి మహిళలు గతంలో ఉచిత ప్రయాణం పేరుతో శ్రీశైలం వెళ్లేవారు. అయితే సీఎం చేతుల మీదుగా నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి వెళ్తున్న 2,805 మంది నూతన ఉపాధ్యాయులకు 123 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. దీంతో శ్రీశైలానికి వెళ్లేందుకు ఉచిత బస్సులు లేవని కర్నూలు, నంద్యాల, ఇతర డిపోల్లో బుధవారం ప్రకటించారు. ఫలితంగా వివిధ మార్గాల్లో 500 మందికి పైగా ప్రయాణికులు ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్కు వచ్చారు. బస్సులు లేకపోవడంతో ఇబ్బంది పడ్డారు. కొందరు పిల్లాపాపలతో ఆత్మకూరు బస్టాండులోనే భోజనాలు చేస్తూ కనిపించారు. ‘శ్రీశైల మల్లికార్జున స్వామిని, శ్రీ భ్రమరాంబ అమ్మవారిని చూసేందుకు వచ్చాం. స్వామిని చూడకుండానే వెనక్కి వెళ్తున్నాం. ఇదేం ప్రభుత్వం’ అనుకుంటూ చాలా మంది పెదవి విరిచారు. ఇవీ కష్టాలు.. ● అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం చంద్రబాబు నిర్వహించిన సీ్త్ర శక్తి సభకు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రతి డిపో నుంచి సగానికి పైగా బస్సులు వెళ్లాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ● పల్లె వెలుగు, అల్ట్రా డీలక్స్, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించగా.. ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు బస్సులను సీఎం సభకు తరలిస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మల్లన్న దర్శనం కోసం రాత్రి పత్తికొండ నుంచి కర్నూలుకు వచ్చాం. శ్రీశైలానికి బస్సులు లేవు, ఆత్మకూరుకు వెళ్లాలని చెప్పారు. ఇక్కడికి వస్తే బస్సులు లేవని చెబుతున్నారు. ఇబ్బందులు పడతామని వెనక్కి వెళ్తున్నాం. శ్రీశైలానికి బస్సు సర్వీసులు లేవని రెండు రోజుల ముందే ప్రకటన ఇచ్చి ఉండొచ్చు కదా? – చిన్నమ్మ, పత్తికొండ గ్రామం, కర్నూలు జిల్లా మేం ముఫ్పై మందిమి ఉన్నాం. శ్రీశైలానికి వెళ్లాలని బనగానపల్లె నుంచి నంద్యాలకు, అక్కడి నుంచి ఆత్మకూరుకు వచ్చాం. ఇక్కడ శ్రీశైలానికి బస్సులు లేవని చెబుతున్నారు. శనివారం వరకు ఆగాల్సిందే అంటున్నారు. శ్రీశైలానికి, ఇతర పుణ్యక్షేత్రాలకు బస్సు సర్వీసులను నిలిపివేయడం అన్యాయం. – శివమ్మ, బనగాపల్లె గ్రామం, నంద్యాల జిల్లా మా ఊరి నుంచి శ్రీశైలానికి బస్సులు లేవు. ఆళ్లగడ్డలో ఉన్న బస్సుల్లో ఆత్మకూరుకు వచ్చాం. ఇక్కడి నుంచి బోలెడు బస్సులు ఉంటాయని చెప్పారు. బస్సులు లేకపోవడంతో ఉన్న సద్దితో ఆత్మకూరు బస్టాండులో భోజనం చేశాం. మరలా వెనక్కి వెళ్తున్నాం. ఈ బస్సులు ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఉండవో తెలియడం లేదు. – మల్లీశ్వరి, ఆళ్లగడ్డ గ్రామం, నంద్యాల జిల్లా ఆత్మకూరు డిపో నుంచి ఫిట్నెస్ ఉన్న అన్ని బస్సులను ఉదయం 6 గంటల నుంచి పంపిస్తున్నాం. పెద్దసంఖ్యలో ప్రజలు ఆత్మకూరుకు తరలివచ్చారు. ఉన్న బస్సులన్నీ శ్రీశైలానికి పంపాం. ఇంకా పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలు ఉన్నారు. వారికి కావాల్సిన బస్సులు లేవు. నంద్యాల, కర్నూలుకు వెళ్లిన బస్సులు ఆత్మకూరుకు వచ్చిన వెంటనే వీరిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తాం. – వినయ్కుమార్, ఆర్టీసీ డీఎం, ఆత్మకూరు శ్రీశైలం వెళ్లే ఆర్టీసీ బస్సులు కరువు ఆత్మకూరు బస్టాండులో ప్రజల ఎదురు చూపులు చిన్న పిల్లలతో మహిళల ఇబ్బందులు మల్లన్న స్వామిని చూడకుండానే తిరిగి వెళ్లిన వైనం -
నిష్టతో కట్టుబాట్లను పాటిస్తారు
దేవరగట్టు ఉత్సవాల్లో మూడు గ్రామస్తులు నిష్టతో కట్టుబాట్లు పాటిస్తారు. ఇక బన్ని రోజు రెండుసార్లు స్నానం చేస్తారు. సాయంత్రం గట్టుకెళ్లే ముందు ప్రతి ఒక్కరు స్నానమాచారిచి గ్రామంలోని గుడిలకు వెళ్లి టెంకాయలు సమర్పిస్తారు. అనంతరం తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని కొండకు బయలుదేరుతారు. బన్నిలో ఏ ఒక్కరు మద్యం తాగరు, మాంసం ముట్టరు. తాగి కర్రలతో విగ్రహాల దగ్గరకు వచ్చే వారిని కట్టడి చేసి విగ్రహాలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా జైత్రయాత్రలో పాల్గొంటారు. – రవిశాసీ్త్ర, మాళమల్లేశ్వరునికి కల్యాణం జరిపే పురోహితుడు, నెరణికి