breaking news
Nandyala
-
సీనియర్ అసిస్టెంట్లుగా 35 మందికి పదోన్నతి
కర్నూలు (అర్బన్) : జిల్లా పరిషత్ పరిధిలోని వివిధ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న 35 మంది జూని యర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. పదోన్నతులు పొందిన వారికి బుధవారం సాయంత్రం జిల్లాపరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వివిధ పంచాయతీరాజ్ కార్యాలయాలకు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి మాట్లాడుతూ పదోన్నతి పొందిన వారందరూ ఆయా కార్యాలయాల్లో విధులు సక్రమంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ ఇ.వి. సుబ్బారెడ్డి, జెడ్పీలోని వివిధ విభాగాల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
ఇతరుల జీవితాల్లో ఆమె భాగ్యవంతురాలు
నంద్యాల జిల్లా శ్రీశైలంలోని కొత్తపేటకు చెందిన భాగ్యమ్మ(50) భర్త సామేలు పదిహేనేళ్ల క్రితమే మరణించారు. అప్పటి నుంచి ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడిని ఆమె పెంచి ప్రయోజకులను చేశారు. గత అక్టోబర్ నెల 18వ తేదీ రాత్రి ఉన్నట్లుండి ఆమెకు ఫిట్స్ వచ్చి, మెదడులో రక్తస్రావం అయ్యింది. శ్రీశైలం దేవస్థానం ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి అనంతరం కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె అదే నెల 21న బ్రెయిన్ డెడ్ అయ్యింది. జీవన్దాన్ ట్రస్ట్ సభ్యుల సూచన మేరకు అవయవదానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకు వచ్చారు. దీంతో ఆమె ఒక కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులను సేకరించి అవసరమైన ఆసుపత్రులకు తరలించారు. తాను మరణించి కూడా ఇతరు జీవితాల్లో ఆమె వెలుగులు పంచింది. -
శ్రీశైలంలో సేవా పరిమళం
శ్రీశైలంటెంపుల్: వారంతా ఎక్కడి నుంచో వచ్చారు. భక్తులకు సేవ చేసేందుకు అసక్తి చూపుతున్నారు. కానుకల లెక్కింపులోను శివసేవకులు తమ సేవలను అందిస్తున్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ప్రతి రోజూ లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. వీరికి సేవలందించేందుకు వివిధ ప్రాంతాల నుంచి శివసేవకులు శ్రీశైలం చేరుకుంటారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకకు చెందిన పలువురు భక్తులు ముందుకు వస్తున్నారు. మహిళలే అధిక్యం శ్రీశైల మల్లన్న క్షేత్రానికి తరలివచ్చే భక్తులకు సేవలందించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు వస్తారు. శ్రీశైలంలో ప్రస్తుతం చీరాలకు చెందిన భ్రమరాంబికా సేవా సమితి, తెనాలికి చెందిన శ్రీగిరి సేవా సమితి, విజయవాడకు చెందిన జ్యోతిర్లింగ సేవా సమితి వారు భక్తులకు సేవలందిస్తున్నారు. రోజుకు మూడు షిఫ్ట్లలో సుమారు 700మంది శివసేవకులు సేవలందిస్తున్నారు. భక్తులకు సేవలందిస్తున్న శివసేవకుల్లో పురుషులు సుమారు 50మంది లోపు ఉంటారు, అత్యధికులు మహిళలే కావడం విశేషం. దేవస్థానం అందిస్తున్న సౌకర్యాలు శివసేవకులకు దేవస్థానం ఉచితంగా వసతి సౌకర్యాన్ని కల్పిస్తుంది. అలాగే అన్నదానం నుంచి మూడు పూటల టిఫిన్, భోజనం, రాత్రి అల్పాహారం అందిస్తున్నారు. శివసేవకులకు ఐదు రోజల పాటు విధులు చేస్తారు. విధులు ముగిసిన తరువాత వారికి ఉచితంగా మల్లన్న స్పర్శదర్శనం కల్పిస్తారు. రోజుకు 40మంది చొప్పున శివసేవకులకు ఉచితంగా మల్లన్న స్పర్శదర్శనం కల్పిస్తారు. హుండీ కౌంటింగ్లో పాల్గొన్న శివసేవకులకు ఒక్కోక్కరికి రెండు లడ్డూ ప్రసాదాలు ఉచితంగా అందజేస్తారు.సేవలు ఇలా.. క్యూలైన్లలో భక్తులకు తాగునీరు సరఫరా చేస్తారు. అమ్మవారి ఆలయం వెనుక భక్తులకు ప్రసాదం అందిస్తారు. దేవస్థానానికి విరాళాలు అందించిన దాతల కోసం లడ్డూ ప్రసాదం, కుంకుమ, విభూతి, కంకణాల ప్యాకింగ్ చేస్తారు. క్యూలైన్లలో భక్తులను నియంత్రిస్తారు. శ్రీశైలం ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు చేయనున్న మే ఐ హెల్ప్ యు డెస్క్లలో తదితర చోట్ల సేవలు అందిస్తున్నారు. దేవస్థానంలో సౌకర్యాలు బాగానే ఉన్నాయి. ఆలయం బయట ప్రాంతాలైన సాక్షిగణపతి, మల్లమ్మకన్నీరు తదితర ప్రాంతాలకు శివసేవకులు వెళ్లలేకపోతున్నారు. ఆటో చార్జీలు అదనంగా అడుగుతున్నారు. దేవస్థానం శివసేవకుల కోసం ఉచితంగా బస్సు సర్వీసును ఏర్పాటు చేస్తే బాగుంటుంది. వసతి సౌకర్యాలను కూడా కొంచెం మెరుగుపర్చాలి. – కె.రజిని, శివసేవకురాలు, మంచిర్యాల -
సీనియర్ సిటిజన్లకు న్యాయ సేవలు
కర్నూలు (టౌన్): సీనియర్ సిటిజన్లు, పెన్షనర్లకు చట్టపరంగా సమస్యలు వస్తే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ టోల్ ఫ్రీ నంబర్ 15100 కు కాల్ చేస్తే వారికి ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి అన్నారు. బుధవారం స్థానిక సి.క్యాంపులోని టీజీవీ కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకరప్ప ఆధ్వర్యంలో పెన్షనర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. ఉద్యోగుల పెన్షన్ సౌకర్యంపై 1982 సంవత్సరం డిసెంబర్ 17న జస్టిస్ చంద్రచూడ్ ఇచ్చిన తీర్పుతో పెన్షనర్లకు భద్రత కలిగిందన్నారు. ఈ తీర్పు కోసం శ్రమించిన దివంగత డి.ఎన్.సకార జ్ఞాపకార్థం పెన్షనర్ల దినోత్సవం ప్రతి ఏటా డిసెంబర్ 17 న జరుపుకుంటున్నామన్నారు. జాయింట్ కలెక్టర్ నూరల్ ఖమర్ మాట్లాడుతూ.. విశ్రాంత ఉద్యోగుల సేవలు మరువలేనివన్నారు. విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ వారి హక్కు అన్నారు. ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ భాస్కర్ వర్మ, స్పెషల్ పోలీసు డీఎస్పీ మహబూబ్ బాషా, రిటైర్డు జాయింట్ కలెక్టర్ రామస్వామి, రాయపాటి శ్రీనివాసులు పాల్గొన్నారు. -
పుట్టిన రోజే మృత్యుఒడిలోకి
డోన్ టౌన్: పుట్టిన రోజు ఓ బాలుడు రోడ్డు ప్రమాదానికి గురై మృత్యుఒడికి చేరాడు. బాధిత కుటుంబంలో విషాదం నింపిన ఈ ఘటన డోన్ పట్టణంలోని చాకిరేవు మిట్ట వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కన్నపకుంట గ్రామానికి చెందిన హరిది బుధవారం పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ బాలుడు అదే గ్రామానికి చెందిన స్నేహితులైన అభినవ్, జగన్తో కలిసి కేక్ తెచ్చుకునేందుకు బైక్పై డోన్కు బయలుదేరారు. చాకిరేవు మిట్ట వద్ద ముందు వెళ్తున్న లారీని బైక్ ఢీకొంది. ఈ ఘటనలో హరి (16) అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి సుధాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఇంతియాజ్ బాషా తెలిపారు. పుట్టిన రోజే కుమారుడి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
హాయ్.. ఈ టెస్టులు చేసుకోండి!
● ఆస్పరిలో అనామకుడు! తన ప్రాంతం, పేరు తెలియదు. పేపర్, పెన్ను ఇస్తే ఇంగ్లిష్లో, తమిళంలో రాస్తాడు. ఏడు పదుల వయస్సు ఉన్న ఈయన ఆరు నెలల క్రితం కర్నూలు జిల్లా ఆస్పరికి వచ్చాడు. స్థానికులు ఇచ్చిన ఆహారాన్ని తీసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అందరికీ హాయ్ అని చెప్పే ఈయనకు పేపరు ఇస్తే సిటీ స్కాన్, ఎంఆర్ఐ, రక్త పరీక్షలు చేయించుకోవాలని, రోగి పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని రాస్తాడు. మూడు నెలల క్రితం ఆదోనిలో వదిలిపెట్టినా తిరిగి ఆస్పరికే చేరుకున్నాడు. ఈ వృద్ధుడు చైన్నె ప్రాంతంలో డాక్టర్గా పని చేసి మతిస్థిమితం లేక ఇక్కడికి వచ్చి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. – ఆస్పరి -
వేటగాళ్ల కోసం నల్లమల జల్లెడ
● ఏకకాలంలో అభయారణ్యం అంతా తనిఖీ చేస్తున్న అటవీ సిబ్బంది ఆత్మకూరురూరల్: నాగార్జునసాగర్ – శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం పరిధిలోని నాగలూటి రేంజ్ లో టైగర్ పా స్నేర్ ( పులి పంజా ఉచ్చు) కనిపించడంతో అటవీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎఫ్డీపీటీ విజయకుమార్ ఆదేశాలతో అభయారణ్యం పరిధిలో సిబ్బంది మంగళవారం ఉదయం నుంచి బుధవారం తెల్లవారుజామున వరకు యాన్టీ స్నేర్ డ్రయివ్ (ఉచ్చుల ఏరివేత)లో ముమ్మరంగా పాల్గొన్నారు. రుద్రవరం రేంజ్లో అడవిలోకి వెళ్లే గొర్ల, పశువుల కాపర్లను పూర్తిగా తనిఖీ చేసి పంపుతున్నారు. వారి వద్ద నుంచి 45 అగ్గి పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. గిద్దలూరు డివిజన్ పాపినేని పల్లె ,ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో సబ్ డీఎఫ్ఓ బబిత మంగళవారం రాత్రంతా అడవులను జల్లెడ పట్టి ఉచ్చుల ఏరివేత కార్యక్రమం చేపట్టారు. వన్యప్రాణులను వేటాడేందుకు యత్నించే వారిని పట్టుకుని కచ్చితంగా జైలుకు పంపుతామని ఎన్ఎస్టీఆర్ ప్రాజెక్ట్ టైగర్ ఫీల్డ్ డైరెక్టర్ విజయకుమార్ పేర్కొన్నారు. -
వైభవంగా గ్రామ దేవర
మంత్రాలయం రూరల్: మండల పరిధిలోని మంచాల లో బుధవారం గ్రామ దేవర వైభవంగా నిర్వహించారు. శ్రీమఠంలో వెలసిన మంచాలమ్మకు, గ్రా మా ల్లోని ఆలయాల్లో దుర్గదేవి మారికాంబ, సుంకలమ్మ, మారెమ్మకు మహిళలు పూర్ణ కుంభాలు సమర్పించారు. ఆలయాల్లో అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు చేసి, కుంకుమార్చన, మహా మంగళ హారతులు ఇచ్చారు. మంచాల పాత ఊరు, రాఘవేంద్ర నగ ర్, రామచంద్ర నగర్లో ఇంటింటా నైవేద్యం సమర్పించారు. శ్రీ మఠం దగ్గర భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీఐ రామాంజులు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. యువకులు పొట్టేలతో కేరింతలు కొడుతూ పోటీలు ఢీ కొడుతూ ఆనందించారు. దేవాలయం దగ్గర భక్తులు శ్రీమఠం ఆధ్వర్యంలో లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించారు. -
తనూజారెడ్డి అవయవదానం
మద్దికెరకు చెందిన కాంట్రాక్టర్ శంకర్రెడ్డి, పద్మావతిల కుమార్తె తనూజారెడ్డి ఎం. ఫార్మసి పూర్తి చేశారు. 12 ఏళ్ల క్రితం వివాహమైన కొన్నాళ్లకు ఇంటి మిద్దైపె వాకింగ్ చేస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆమెకు ఫిట్స్ వచ్చాయి. వెంటనే ఆమెను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కొంత సమయం వరకు మెదడుకు ఆక్సీజన్ అందకపోవడంతో బ్రెయిన్డెడ్ అయ్యింది. 2014 డిసెంబర్ 18న ఆమె అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకు వచ్చారు. ఈ మేరకు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె అవయవాలను సేకరించి ఇతరులకు అమర్చారు. -
స్ఫూర్తిగా నిలిచిన సుజాత
నంద్యాల జిల్లా గుంతనాల గ్రామానికి చెందిన బొప్ప నాగేంద్రగౌడ్ కుమార్తె సుజాత(31) గోస్పాడు మండలం తేల్లపురి గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించేవారు. ఆమె గత మే 28న విధి నిర్వహణకు స్కూటీపై వెళ్తూ గోస్పాడు మండలం తెల్లపురి గ్రామంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తలకు తీవ్ర గాయమైన ఆమెకు నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేశారు. ఆమె కోలుకోలేక బ్రెయిన్ డెడ్ కావడంతో జీవన్దాన్ ట్రస్ట్ సభ్యుల అవగాహనతో కుటుంబసభ్యులు అవయవదానానికి ముందుకువచ్చారు. దీంతో ఆమె ఊపిరితిత్తులు, కిడ్నీలు, కళ్లు దానం చేశారు. -
భాగస్వాములు కావాలి
కర్నూలు(సెంట్రల్): ఎన్ఎస్ఎస్ వలంటీర్లు సమాజ సేవలో భాగస్వాములు కావాలని రాయలసీమ యూనివర్సిటీ వీసీ ఆచార్య వి.వెంకట బసవరావు పిలుపునిచ్చారు. బుధ వారం వర్సిటీకి చెందిన ఎన్ఎస్ఎస్ 4, 5 యూనిట్లు పి.రుద్రవరం, నూతనపల్లె గ్రామా ల్లో ఐదు రోజులపాటు నిర్వహించనున్న ప్రత్యేక క్యాంపులను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. యువత బాధ్యతాయుతంగా ఉన్నప్పుడు మంచి సమాజం ఏర్పడుతుందన్నారు. వారం రోజులపాటు గ్రామీ ణులతో మమేకం అయ్యి వారి సామాజిక రుగ్మతలను తెలుసుకోవాలని, మూఢ నమ్మకాలను వీడేలా ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఇంజినీరింగ్ కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ల ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ నాగచంద్రుడు, బీవీ శివప్రసాద రెడ్డిని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయకుమార్నాయుడు అభినందించారు. -
రాక్గార్డెన్లో సినిమా షూటింగ్
ఓర్వకల్లు: మండల కేంద్రం ఓర్వకల్లు సమీపంలోని రాక్గార్డెన్ (రాతివనం)లో బుధవారం సినిమా చిత్రీకరణ సందడి నెలకొంది. మెమోరి మేకర్స్ ప్రొడక్షన్ ఆధ్వర్వంలో రవికుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తెలుగు సినిమా షూటింగ్ను రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు యూనిట్ బృందం సభ్యులు తెలిపారు. అవినాస్, కబీర్ సింగ్, బెహర ప్రసాద్, ఆకాష్, స్నేహ హీరో, హీరోయిన్లతో మొదటి రోజు ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు చిత్ర బృందం తెలిపారు. టార్జాన్, ప్రకాష్ ఫైట్ మాస్టర్ల ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఇక్కడ షూటింగ్ జరుగుతుందని చిత్ర బృందం సభ్యులు పేర్కొన్నారు. -
ఆత్మకూరులో నాటు కోళ్ల దొంగలు!
ఆత్మకూరురూరల్: కోడి మాంసం అంటే మాంసాహార ప్రియులు లొట్టలేసుకుంటూ తింటారు. అది నాటు కోడి అయితే ఇక చెప్పనవసరం లేదు. దీంతో ఈ కోళ్లకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో బెడస జాతికి చెందిన కోళ్ల ధర వేలల్లో ఉంటుంది. దీంతో దొంగల కన్ను ఈ కోళ్లపై పడింది. గత కొన్ని రోజులుగా ఆత్మకూరు మండలంలోని కొట్టాల చెర్వు, కురుకుంద, వెంకటాపురం, క్రిష్ణాపురం, పాములపాడు మండలం మద్దూరు, బానకచర్ల తదితర గ్రామాల్లో కోళ్ల దొంగతనాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 200కు పైగా నాటుకోళ్లు మాయమయ్యాయని, ఒక్కో కోడి ధర రూ. 5 వేలు అనుకున్నా రూ. 10 లక్షలు విలువ చేస్తాయని బాధితులు చెబుతున్నారు. విలువైన కోళ్లు మాయమవుతుండటంతో కొందరు బాధితులు ఆత్మకూరు పోలీసులను కలిసి ఫిర్యాదు కూడా చేశారు. అయితే, కోళ్లే కదా అని పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మారుమూల అటవీ ప్రాంత గ్రామంలోని కొందరు యువకులు ఈ చోరీకి పాల్పడుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులు స్పందించి దొంగల బెడద నుంచి తమ కోళ్లను కాపాడాలని పెంపకందారులు కోరుతున్నారు. 200 కోళ్ళు చోరీ -
అవయవదానంతో ఆయువు పోద్దాం
కర్నూలు(హాస్పిటల్): అవయవదానం చేయడానికి చాలా మంది ముందుకు రావడం లేదు. కనీసం కళ్లను దానం చేయాలన్నా వెనుకాడుతున్నారు. అంతెందుకు ప్రాణాలతో విలవిలాడుతున్న వ్యక్తికి రక్తం ఇవ్వాలన్నా సమీప బంధువులు సైతం వెనుకాడుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అవయవదానంపై జీవన్దాన్ ట్రస్ట్ విస్తృత ప్రచారం కల్పించింది. ఆసుపత్రుల్లో బ్రెయిన్ డెడ్ అయిన వారి కుటుంబసభ్యులను కలిసి అవయవదానం గురించి అవగాహన కల్పించి ఒప్పిస్తున్నారు. ఫలితంగా అవయవదానం చేసే వారి సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగింది. కొన్నేళ్లుగా నేత్రదానం, రక్తదానం చేసేందుకు సైతం దాతలు విరివిగా ముందుకు వస్తున్నారు. మనిషి బతికున్నప్పుడు అవయవాలు సేకరించరని, బ్రెయిన్డెడ్ దశలో మాత్రమే వాటిని సేకరిస్తారని వైద్యులు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. అవయవదానంకు అనుగుణంగా అవయవాలను సేకరించేందుకు, మార్చేందుకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు కర్నూలు కిమ్స్ హాస్పిటల్, మెడికవర్ హాస్పిటల్లకు అనుమతి లభించింది. ఈ మేరకు ఆయా ఆసుపత్రుల్లో అవయవదాన, మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారు. మరణించాకే అవయవాల సేకరణ మృతిచెందిన, బ్రెయిన్డెడ్ వ్యక్తుల నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు. కానీ ఇప్పటికీ చాలా మందికి బతికున్నప్పుడు అవయవాలను సేకరిస్తారనే అపోహ ఉంది. ఇది తప్పు అని జీవన్దాన్ ట్రస్ట్ ప్రతినిధులు ఆయా ఆసుపత్రుల్లో బ్రెయిన్డెడ్ అయిన వారికి వివరిస్తున్నారు. సేకరించిన అవయవాలను ఇతరులకు అమరిస్తే వేరొకరి శరీరం ద్వారా ఈ ప్రపంచంలో జీవించే అవకాశం మళ్లీ లభిస్తుంది. అంధులుగా పుట్టేవారికి దాతల నుంచి సేకరించిన నేత్రాలను అమరిస్తే వారు మళ్లీ ఈ లోకాన్ని చూడగలుగుతారు. ఏదైనా ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారు, కొన్ని వ్యాధులకు చికిత్స పొందుతూ బ్రెయిడ్ డెడ్ అయి ఉన్న వారి అవయవాలను ఇతరులకు అమర్చేందుకు సేకరిస్తారు. ఎనిమిది మందికి పునర్జన్మ అవయవదానానికి అంగీకరించిన వ్యక్తి నుంచి గుండె, మూత్రపిండాలు, పాంక్రియాస్(క్లోమగ్రంధి), ఊపిరితిత్తులు, కాలేయం, ప్రేగులు, చర్మం టిష్యూ, చేతులు, ముఖం, స్టెమ్సెల్స్, కళ్లు, ఎముకలో మూలిగను ఇతరులకు అమర్చే అవకాశం ఉంది. ఒక కిడ్నీ, కాలేయంలో కొంత భాగం, కొద్దిగా ఎముక మజ్జను బతికుండగానే దగ్గరి వారి కోసం దానం చేయవచ్చు. బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తి నుంచి వారి కుటుంబసభ్యుల సమ్మతితో ఇతర అవయవాలను సేకరిస్తుంటారు. వీటి సాయంతో మరో 8 మందికి ఊపిరిపోసే వీలుంది. ఒకరి అవయవ దానంతో 8 మందికి ప్రాణం ముందుకు వస్తున్న జనం బ్రెయిన్ డెడ్ తర్వాతే అవయవాల సేకరణ కర్నూలు జీజీహెచ్, రెండు ప్రైవేటు ఆసుపత్రులకు అవయవ మార్పిడికి అనుమతి జీవన్దాన్ ట్రస్ట్ చొరవతో చురుగ్గా కార్యక్రమం -
ఉచితంగా టెలికం నైపుణ్య శిక్షణా కోర్సులు
కర్నూలు(హాస్పిటల్): ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు, డిప్లొమా ఫైనలియర్ విద్యార్థులకు ఉచిత టెలికం స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ప్రారంభించినట్లు బీఎస్ఎన్ఎల్ కర్నూలు బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ జి.రమేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన(పీఎంకేవీవై) పథకం కింద ఉచిత నైపుణ్యాభివృద్ధి కోర్సులు అందిస్తున్నట్లు చెప్పారు. వైర్లెస్ టెక్నీషియన్, బ్రాడ్బాండ్ టెక్నీషియన్, ఆప్టికల్ ఫైబర్ టెక్నీషియన్, ఆప్టికల్ ఫైబర్ స్ప్లైసర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కోర్సులను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ప్రాక్టికల్, హ్యాండ్స్ ఆన్ శిక్షణను అందించడంతో పాటు ఉద్యోగ నియామక సహాయం కూడా కల్పిస్తాయన్నారు. శిక్షణా కార్యక్రమాలు హైదరాబాద్లో ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతాయన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.rttchyd.bsnl. co.in వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు ఈ నెల 19వ తేది ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆర్టీటీసీ కార్యాలయంలో ప్రత్యక్షంగా హాజరు కావాలని పేర్కొన్నారు. గుడ్డు చిన్నదైంది! పాములపాడు: సాధరణంగా కోడి గుడ్డు 40 నుంచి 45 గ్రాముల వరకు బరువు ఉంటుంది. పాములపాడుకు చెందిన బోగాల శేఖర్ అనే వ్యక్తి ఇంట్లో కోడిపెట్ట బుధవారం అతి చిన్న సైజులో గుడ్డు పెట్టింది. దాని బరువు 10గ్రాములు మాత్రమే ఉంది. జన్యులోపం కారణంగానే ఇలా చిన్న సైజు గుడ్లను అరుదుగా కోళ్లు పెడుతుంటాయని పశు వైద్య శాఖ సిబ్బంది తెలిపారు. రైల్లో నుంచి జారిపడి వ్యక్తి మృతి ఆదోని సెంట్రల్: రైల్లో నుంచి కిందకు దిగే సమయంలో జారి పడి ఓ వ్య క్తి మృతి చెందాడు. ఆదో ని డివిజన్ పరిధిలోని మంత్రాలయం రైల్వే స్టేష న్లో ప్లాట్ఫామ్ నంబర్. 2 వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ప్రయాణికుడి తలకు తీవ్ర గాయాలు కావడంతో జీఆర్పీ, అర్పీఎఫ్ సిబ్బంది స్పందించి 108 అంబులెన్స్లో ఎమ్మిగనూరు ఆసు పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయినట్లు రైల్వే పోలీ సు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శివరామయ్య తెలిపారు. మృతుడి పేరు దేవేంద్ర (40)అని, ఆధార్కార్డులో అడ్రస్ కర్టాటక రాష్ట్రం యాదగిరిలోని శా హపుర గ్రామం అని ఉందని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నేడు కోవెలకుంట్లలో విద్యుత్ అదాలత్ నంద్యాల(అర్బన్): విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకు గురువారం కోవెలకుంట్ల పట్టణంలోని విద్యుత్ కార్యాలయంలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ నంద్యాల డివిజన్ ఈఈ శ్రీనివాసరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి రిటైర్డు జడ్జి శ్రీనివాస ఆంజనేయమూర్తి అతిథిగా హాజరవుతుండగా స్వతంత్ర సభ్యులు విజయలక్ష్మి, మధుకుమార్ పాల్గొంటారన్నారు. దీర్ఘకాలిక సమస్యలున్న విద్యుత్ వినియోగదారులు ఫిర్యాదుల ద్వారా తెలియపరిస్తే పరిష్కారం చూపుతామని చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
భద్రతా తనిఖీలు కీలకం
నంద్యాల: ముఖ్య కార్యక్రమాలు, పెద్ద సమావేశాలు నిర్వహించిన సమయంలో భద్రతా తనిఖీలు కీలకం అని ఎస్పీ సునీల్షెరాన్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం బాంబ్ డిస్పోజల్ టీం సంబంధించి రెండు రోజుల రిఫ్రెష్మెంట్ కోర్స్ను ఆయన ప్రారంభించారు. టీమ్ సభ్యులు ఆధునిక సాంకేతికతలను ఉపయోగించాలని, బాంబు డిటెక్షన్, డిస్పోజల్ పద్ధతులపై వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. అనుమానాస్పద వస్తువులు, బ్యాగులను తనిఖీ చేయాలన్నారు. స్నిఫర్ డాగ్స్, మెటల్ డిటెక్టర్లు, ఎక్స్–రే స్కానర్లతో రోప్ పార్టీలు ఏర్పాటు చేసి మార్గాలు, వేదికలను తనిఖీ చేయవచ్చన్నారు. రిజర్వ్ ఇన్స్పెక్టర్లు బాబు, మంజునాథ్ , సురేష్ బాబు, బాంబు డిటెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు. ఫిబ్రవరి 28లోగా లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలి నంద్యాల(అర్బన్): పెన్షన్దారులు జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28లోగా లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలని నంద్యాల ట్రెజరీశాఖ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ శ్రీనివాసులు కోరారు. అఖిల భారత పెన్షన్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక నిశాంత్ భవన్లో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లింగస్వామి అద్యక్షతన పెన్షన్ దారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పెన్షనర్ల దినోత్సవానికి కారకులైన దివంగత నాయకులు డీఎన్ నకరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే 90 ఏళ్లు పూర్తి చేసుకున్న పెన్షనర్లను సన్మానించారు. కార్యక్రమంలో ముఖ్య సలహాదారు కై ప సుబ్బరాయుడు, ట్రెజరర్ కాశీంవలి, డేవిడ్, డీకయ్య, పద్మనాగుడు, రంగనాథరావు, శ్యాముల్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలంలో జానపద గీతానికి యువతి డ్యాన్స్ శ్రీశైలం టెంపుల్: ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీశైలంలో అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పలువురు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల శ్రీశైలానికి వచ్చిన ఓ యువతి క్షేత్రంలోని సెంట్రల్ రిసెప్షన్ ఆఫీసు సమీపంలో జానపద గీతానికి నృత్యం చేస్తూ వీడియో తీసుకుంది. ఈ వీడియోను తన ఇన్స్ట్రాగాం ప్రొఫైల్లో రీల్స్గా అప్లోడ్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు, హిందూ సంఘాల నాయకులు, పలువురు భక్తులు యువతి తీరును తప్పుబడుతున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి గీతాలకు డ్యాన్స్లు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని విమర్శిస్తున్నారు. పది ఫలితాల్లో జిల్లాను ముందంజలో నిలపాలి చాగలమర్రి: పదో తరగతి ఫలితాల్లో జిల్లాను ముందంజలో నిలపాలని డీఈఓ జనార్ధన్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఆళ్ళగడ్డ పట్టణంలోని వైపిపిఎం ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖి చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, మధ్యాహ్న భోజన సదుపాయాలతో పాటు తరగతి గదులలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పదవ తరగతి సిలబస్ పూర్తయిందని, ప్రస్తుతం రివిజన్ కొనసాగుతోందన్నారు. అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. డీఈఓ వెంట ఎంఈఓ శోభావివేకవతి, వ్యాయామ ఉపాధ్యాయులు రాణి, ఉపాధ్యాయ సిబ్బంది ఉన్నారు. ఫాస్ట్ బౌలర్ హేమంత్ నాయక్కు అభినందన ఆళ్లగడ్డ వైపిపిఎం ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి హేమంత్ నాయక్ అండర్–14 సౌత్ జోన్ పోటీలలో ఫాస్ట్ బౌలర్గా రాణించడం పట్ల డిఈఓ జనార్ధన్రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. రాబోవు రోజుల్లో మరింత మెరుగైన శిక్షణ ఇచ్చి జాతీయ స్థాయిలో రాణించే విధంగా ప్రోత్సహిస్తామని డీఈఓ తెలిపారు. -
ఘర్షణ ఆపడానికి వెళ్లిన వ్యక్తిపై హత్యాయత్నం
నంద్యాల: గొడవ ఆపేందుకు వెళ్లిన ఓ వ్యక్తిపై కక్ష పెంచుకొని నలుగురు బీర్ సీసాలతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. మంగళవారం రాత్రి నంద్యాలలో ఈసంఘటన చోటు చేసుకుంది. నంద్యాల వన్టౌన్ సీఐ సుధాకర్రెడ్డి తెలిపిన మేరకు వివరాలు.. ఈనెల 15వ తేదీన పట్టణంలోని కిజర్ మసీదు సమీపంలో షేక్ సోహెల్, షేక్ వసీంలు, షేక్ రెహన్తో ఘర్షణ పడుతున్నారు. గమనించిన కటికె ఆసీఫ్ ఆనే వ్యక్తి ఇరువురు గొడవ పడకుండా విడిపించాడు. ఇది మనుసులో పెట్టుకున్న నడిగడ్డకు చెందిన షేక్షమీర్, షేక్ వసీం, షేక్ సోహెల్, షేక్ అప్సర్ అనే వ్యక్తులు కటిక ఆసీఫ్ నడిగడ్డలోని పబ్లిక్ లెట్రీన్ల సమీపంలో ఉండగా 16వ తేదీ రాత్రి తీవ్రంగా కొట్టి బీరు సీసాతో పొడిచారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆసీఫ్ ప్రస్తుతం నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హత్యాయత్నానికి పాల్పడిన నలుగురు వ్యక్తులు బుధవారం నడిగడ్డలోని వెంచర్ వద్ద ఉండగా అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు. -
క్లస్టర్ యూనివర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదల
కర్నూలు సిటీ: క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ మూడు, ఐదవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను వర్సిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య డాక్టర్ వెంకట బసవరావు, రిజిస్ట్రార్ డాక్టర్ జి.శ్రీనివాస్లు బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్సిటీ అనుబంధంగా ఉన్న మూడు కాలేజీలకు చెందిన విద్యార్థులకు గత నెలలో పరీక్షలు నిర్వహించామన్నారు. ఇందులో మూడవ సెమిస్టర్ పరీక్షలకు 866 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 617 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. 71.25 ఉత్తీర్ణత శాతం నమోదైందన్నారు. ఐదవ సెమిస్టర్ పరీక్షలకు 804 మంది పరీక్షలకు హాజరు కాగా 709 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. కార్యక్రమంలో వర్సిటీ పరీక్షల విభాగం డీన్ డాక్టర్ నాగరాజు శెట్టి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ కె.బాల సుబ్రమణ్యం పాల్గొన్నారు. నేడు కర్నూలుకు ఏపీఎన్జీజీవోస్ నేతల రాక కర్నూలు(అగ్రికల్చర్): ఏపీఎన్జీజీఓస్ అసోసియేషన్ నాయకులు గురువారం కర్నూలుకు రానున్నారు. జిల్లా శాఖకు నూతన కార్యవర్గ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే రెండు గ్రూపుల మధ్య విభేదాలు ఉండటంతో ఎన్నికలు జరగని పరిస్థితి. ఈ నేపథ్యంలో జిల్లాకు అడ్హాక్ కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. 11 మందితో అడ్హాక్ కమిటీ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇప్పుడున్న ఎన్జీజీవోస్ నేతల్లో దాదాపుగా ఎవ్వరూ లేకుండా కొత్త వారితో కమిటీ ఏర్పాటు కానుంది. జిల్లాకు వస్తున్న రాష్ట్ర అసోసియేట్ ప్రసిడెంట్ దస్తగిరిరెడ్డి, వైఎస్ఆర్ కడప జిల్లా శాఖ అధ్యక్షుడు శ్రీనివాసులు అడ్హాక్ కమిటీని ప్రకటించనున్నారు. -
ఇతరులకు శ్వాస ఇచ్చిన పావనీలత
కర్నూలుకు చెందిన పావనీలతకు నాలుగేళ్ల క్రితం భర్త శ్రీనివాసరెడ్డి కిడ్నీ సమస్యతో మృతి చెందాడు.. వీరికి ఒక కుమార్తె ఉంది. ఈ క్రమంలో ఉద్యోగం కోసం ఆమె హైదరాబాద్కు వెళ్లారు. ఆ ప్రయత్నాల్లో ఉండగా గత సంవత్సరం ఫిబ్రవరి 2న ఫిట్స్ రావడంతో మెదడు దెబ్బతినింది. ఆ మరుసటి రోజు ఆమెను కుటుంబసభ్యులు తీసుకొచ్చి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించగా వైద్యులు పరీక్షించి బ్రెయిన్డెడ్ అయినట్లు నిర్ధారించారు. జీవన్దాన్ ట్రస్ట్ సభ్యుల సూచన మేరకు కాలేయాన్ని, కిడ్నీలను, ఊపిరితిత్తులను సేకరించి అవసరమైన ఆసుపత్రులకు పంపించారు. -
అహోబిలంలో అరాచకం
సాక్షి, నంద్యాల: కోట్లాదిమంది హిందువులకు పవిత్ర పుణ్యక్షేత్రమైన అహోబిలం నరసింహక్షేత్రం ఇప్పుడు అధికార పార్టీ నేత అక్రమార్జనకు అడ్డాగా మారింది. కొబ్బరికాయ నుంచి తలనీలాలు.. చివరికి పార్కింగ్ నుంచి కూడా బీ ట్యాక్స్ రూపంలో పిండేస్తున్నారు. నంద్యాల జిల్లాలో ఉన్న ఈ ఆలయంలో ఏ పని చేయాలన్నా ప్రజాప్రతినిధి భర్తకు కమీషన్ ఇచ్చుకోవాల్సిందేనన్న పరిస్థితి నెలకొంది. టోల్గేట్, తలనీలాల టెండర్, టెంకాయల వేలం పాట, బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే దుకాణాలు.. ఇలా అన్నింటినుంచి ఆదాయాన్ని కొల్లగొడుతున్నారు. తలనీలాల సేకరణకు ఈ ఏడాది మార్చిలో దేవస్థానం అధికారులు టెండర్ పిలిచారు. చాగలమర్రి మండలం గొడిగెనూరు గ్రామానికి చెందిన ఒక మహిళ రూ.1.50 కోట్లకు టెండర్ దక్కించుకున్నారు. ఈ టెండర్ దక్కేలా చేసినందుకు ఆమె బీ ట్యాక్స్ కింద రూ.20 లక్షలు చెల్లించినట్లు తెలిసింది. టెండర్ దక్కించుకున్న తర్వాత పాట మొత్తాన్ని ఆలయానికి చెల్లించాల్సి ఉన్నా.. ఇప్పటివరకు కేవలం రూ.40 లక్షలు మాత్రమే చెల్లించారు. మిగిలిన రూ.1.1 కోట్లలో ఆలయానికి వచ్చేదెంతో, బీ ట్యాక్స్కు పోయేదెంతో అన్నది చర్చనీయాంశంగా ఉంది. 2024–25కు సంబంధించి తలనీలాల వేలం పాటనే నిర్వహించలేదు. ఏడాది పాటు పోగైన తలనీలాలను ప్రజాప్రతినిధి భర్త కిలో రూ.3 వేలకు కొని రూ.12 వేలకు విక్రయించారు. సుమారు 700 కిలోల మేర తలనీలాల నుంచి రూ.63 లక్షలు కొల్లగొట్టారు.టోల్గేట్లో నిలువు దోపిడీఅహోబిలం ఆలయానికి వచ్చే ట్రాక్టర్లు, కార్లు, టూరిస్ట్ బస్సుల నుంచి పంచాయతీ అధికారులు టోల్ వసూలు చేస్తారు. ఏటా ఇందుకోసం టెండర్ పిలుస్తారు. ఈ ఏడాది జూన్లో టోల్గేట్కు వేలం పాట నిర్వహించారు. టెండర్లో వేరే వ్యక్తులు ఎవరూ పాల్గొనకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. సొక్కం వంశీకృష్ణ అనే వ్యక్తి రూ.20.31 లక్షలకు టెండర్ దక్కించుకున్నారు. వేలం పూర్తయిన వెంటనే ఈ మొత్తాన్ని చెల్లించాలి. కానీ ఇప్పటివరకు ఈ మొత్తాన్ని పంచాయతీకి చెల్లించలేదు. కానీ అతడు బీ ట్యాక్స్ కింద రూ.65 లక్షలు చెల్లించినట్లు సమాచారం. దీంతో రూ.100 వసూలు చేయాల్సినచోట రూ.200 వసూలు చేస్తూ భక్తులను నిలువుదోపిడీ చేస్తున్నారు. కొబ్బరికాయ రూ.70 ఆలయంలో టెంకాయలు విక్రయించుకునేందుకు అధికారులు గతేడాది టెండర్ పిలిచారు. టెండర్లో ఎవరూ పాల్గొనకుండా చేసి రూ.35 లక్షలకు స్థానిక టీడీపీ నేత దక్కించుకున్నాడు. తనకు టెండర్ దక్కేలా చేసినందుకు బీ ట్యాక్స్ కింద రూ.40 లక్షలు సమర్పించుకున్నాడు. నియోజకవర్గ నేత అండదండలతో ఒక్కో టెంకాయను రూ.70కి విక్రయించి భక్తులను కొల్లగొట్టారు. రూ.35 లక్షలకు టెండర్ దక్కించుకున్న వ్యక్తి ఆలయానికి రూ.20లక్షలు మాత్రమే జమచేశారు. సారా బట్టీలు.. బెల్టుషాపులు అహోబిలానికి ఏడాది పొడవునా దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ కొండల్లో సారా గుప్పుమంటోంది. 24 గంటలు మద్యం అందుబాటులో ఉంటోంది. తాళ్లకుంట కొండల్లో ఆరు, ఏడు బట్టీల్లో సారా కాస్తున్నారు. ఒక్కో బట్టీ నుంచి నియోజకవర్గ నేతకు మామూళ్లు వెళుతున్నాయి. సారాతో పాటు 8 మద్యం బెల్ట్ షాప్లు వెలిశాయి. పోతురాజు చెరువు, ఛత్రవట గుట్టల కింద మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ నుంచి రూ.500 కమీషన్ వసూలు చేస్తున్నారు. రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో మట్టిని తరలించి సహజ సంపదను కొల్లగొడుతున్నా అధికారులు స్పందించడం లేదు. -
వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
జూపాడుబంగ్లా: ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా హెచ్ఎంలు, ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ జనార్దన్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మండ్లెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ముందుగా హాజరుపట్టికను పరిశీలించగా ఓ ఉపాధ్యాయులు గైర్హాజరై ఉండటంతో ఉపాధ్యాయులు విధుల పట్ల అంకితభావంతో ఉండాలని సూచించారు. ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పదో తరగతి విద్యార్థులకు నిర్ణీత సమ యంలో సిలబస్ పూర్తి చేశారా?.. లేదా? అని ఆరా తీశారు. వందరోజుల యాక్షన్ ప్లాన్ అమ లు చేస్తున్నారా.. నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారా.. అని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. వెనుకబడిన విద్యార్థులు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు సూచనలు చేశారు. కొందరు విద్యార్థులతో పాఠ్యపుస్తకాలు చదివించి వారి ప్రతిభను పరిశీలించారు. ఈయన వెంటన ఎంఈఓ చిన్నమద్దిలేటి ఉన్నారు. అమ్మవారి ఆలయ పర్యవేక్షకుడి సస్పెన్షన్ శ్రీశైలం టెంపుల్: శ్రీశైల క్షేత్రంలోని భ్రమరాంబా దేవి ఆలయంలో పర్యవేక్షకుడిగా విధులు నిర్వహిస్తున్న డి. మల్లికార్జునుడిని దేవస్థాన ఈఓ ఎం. శ్రీనివాసరావు సస్పెండ్ చేశారు. స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం బయటికి వెళ్లే భక్తులకు అమ్మ వారి ఆలయం వెనుక భాగంలో ప్రతి రోజు దేవస్థానం ఉచిత ప్రసా దం పంపిణీ చేస్తోంది. అయితే గత రెండు రోజుల క్రితం భక్తులకు ఉచిత ప్రసాదం పంపిణీలో నిర్లక్ష్యం ప్రదర్శించడంతో ఈఓ ఆగ్ర హం వ్యక్తం చేస్తూ.. సంబంధిత పర్యవేక్షకులు డి. మల్లికార్జునుడిని సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో పర్యవేక్షకులుగా శ్రీగిరి శ్రీనివాస రెడ్డిని నియమించారు. -
సమ్మెకు సిద్ధం!
అంగన్వాడీల ప్రధాన డిమాండ్లు ... ● అంగన్వాడీల కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి ● మినీ వర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్షేషన్ ఇచ్చి మెయిన్ సెంటర్లుగా మార్చాలి ● హెల్పర్ల పదోన్నతులకు నిర్దిష్టమైన గైడ్లైన్స్ రూపొందించాలి ● అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి ● అన్ని యాప్లను కలిపి ఒక యాప్గా మార్చాలి. సెంటర్ నిర్వహణకు 5జీ ఫోన్లు ఇస్తూ, ఎఫ్ఆర్ఎస్ను రద్దు చేయాలి ● గ్రాట్యూటీ అమలుకు గైడ్ లైన్స్ రూపొందించడ ంతో పాటు వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలి ● పెండింగ్లో ఉన్న సూపర్వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి ● లబ్ధిదారులకు ఆయిల్, కంది పప్పు క్వాలిటీ పెంచాలి, అలాగే మెస్ చార్జీలను పెంచుతూ గ్యాస్ ఉచితంగా అందించాలి కర్నూలు(అర్బన్): గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అనేక రూపాల్లో సేవలు అందిస్తున్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల పట్ల రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కాఠిన్యాన్ని ప్రదర్శిస్తోంది. వేతనాలు పెంచడంతో పాటు ఎన్నికల హామీలను అమలు చేయాలని పలు రూపాల్లో ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నా, ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేక పోవడంతో అంగన్వాడీలు సమ్మెకు ‘ సై ’ అంటున్నారు. సమస్యల సాధనలో భాగంగా చేపట్టే సమ్మెకు ముందస్తుగా ఈ నెల 12వ తేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట అన్ని సంఘాలను కలుపుకొని అంగన్వాడీలు భారీగా ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే జీతాలు, గ్రాట్యూటీ, మినీ సెంటర్లను మెయిన్గా మార్చడం వంటివి చేస్తామని ఇచ్చిన హామీల గురించి కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అంగన్వాడీ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారం చేపట్టినా తమ సమస్యలను పరిష్కరించక పోవడం వల్ల తిరిగి మూడు సంఘాలు ఐక్య ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. గుజరాత్ రాష్ట్ర హైకోర్టు అంగన్వాడీల జీతాల పెంపునకు సంబంధించి సీ/ఎల్పీఏ/363/2025 తేది: 20–08–2025 ప్రకారం అంగన్వాడీ హెల్పర్ను 4వ తరగతి ఉద్యోగిగా, వర్కర్ను 3వ తరగతి ఉద్యోగిగా గుర్తించాలని తీర్పు ఇచ్చిందని వారు గుర్తు చేస్తున్నారు. అలాగే వీరి జీతాలను పే రివిజన్ కమిషన్ ( పీఆర్సీ )కి అనుసంధానం చేసి పీఆర్సీ రెకమెండేషన్స్ ప్రకారం పెంచాలని చెప్పిందని నేతలు పేర్కొంటున్నారు. గుజరాత్ హైకోర్డు ఇచ్చిన తీర్పు ప్రకారం అంగన్వాడీ వర్కర్కు రూ.24,800, హెల్పర్కు 20,300 జీతాలు పెంచాల్సి ఉందన్నారు. గుజరాత్ మోడల్ డబుల్ ఇంజిన్ సర్కార్ పాలన అంటే మాట్లాడే కూటమి పాలకులు గుజరాత్ హైకోర్టు తీర్పును ఇక్కడ కూడా అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పీఆర్సీతో అనుసంధానం చేయడం వల్ల మున్సిపల్ ఆప్కాస్ వర్కర్లు, యుజీడీ వర్కర్ల జీతాలు నెలకు రూ.20 వేలకు పైగా చేరాయని, అంగన్వాడీల జీతాలను కూడా పీఈర్సీతో లింక్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 12వ తేదీన కలెక్టరేట్ల ఎదుట భారీ నిరసనతో సర్కారుకు హెచ్చరిక -
రేపు యాగంటిలో కల్యాణం
బనగానపల్లె రూరల్: యాగంటి క్షేత్రంలో ఈ నెల 18వ తేదీన మాసశివరాత్రి సందర్భంగా ఉమామహేశ్వరస్వామి కల్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ పాండు రంగారెడ్డి మంగళవారం తెలిపారు. స్వామి అమ్మవార్ల కల్యాణంలో పాల్గొనే భక్తులు గురువారం సాయంత్రం 6 గంటల్లోగా ఆలయ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. విద్యుత్ వృథాను అరికడదాం నంద్యాల(అర్బన్): విద్యుత్ వృథాను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నంద్యాల జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ సుధాకర్ కుమార్ అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ‘ఇంధనం పొదుపు చేద్దాం.. భావి తరాలకు వెలుగునిద్దాం’ అంటూ అధికారులతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీచౌక్లో జరిగిన కార్యక్రమంలో సుధాకర్ కుమార్ మాట్లాడుతూ ప్రజలంద రూ ఇంధనాన్ని పొదుపు చేయాలని, విద్యుత్ పొదుపు సంబంధించిన చిట్కాలను పాటించాలన్నారు. విద్యు త్ ఆదా, అవసరం, వనరుల పరిరక్షణ గురించి ప్రజ ల్లో అవగాహన పెంపొందించేందుకు విద్యుత్ పరిరక్షణ వారోత్సవాలు చేపడుతున్నామన్నారు. -
ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాం ...
అంగన్వాడీ వర్కర్లు, హెల్ప ర్లు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేంత వరకు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువస్తాం. ఈ నెలాఖరు లేదా జనవరి నెలలో రాష్ట్ర వ్యాప్త సమ్మె చేసేందుకు ఐక్య కార్మిక సంఘాలు కార్యాచరణను రూపొందిస్తున్నాయి. విధి నిర్వహణలో కష్టాలను అనుభవిస్తున్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రభుత్వం న్యాయం చేయకుంటే పోరాటం ఉధృతం చేస్తాం. – లలితమ్మ, రాష్ట్ర అధ్యక్షురాలు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (ఏఐటీయూసీ) -
పెరిగిన రాజకీయ వేధింపులు
కూటమి ప్రభుత్వం వచ్చాక అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లపై రాజకీయ వేధింపులు అధికమయ్యాయి. చిన్న చి న్న తప్పులను కూడా భూతద్దంలో చూపిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక పలువురు రాజీనామా చేస్తుండగా, మరి కొందరు అనారోగ్యాల కు గురవుతున్నారు. ఒకే యాప్ను పెట్టి పనిభారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. సమస్యల పరిష్కారానికి సమ్మెలోకి వెళ్లేందుకు వెనుకాడం. –కె.వెంకటమ్మ, జిల్లా కార్యదర్శి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (సీఐటీయూ) -
పే రివిజన్ అమలు చేసిన వైఎస్ జగన్
కర్నూలు(అగ్రికల్చర్): పదవీ విరమణ ఉద్యోగుల పట్ల చంద్రబాబు సర్కారు నిర్దయగా వ్యవహరిస్తోంది. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పదవీ విరమణ చేసిన వారిలో 50 శాతం మంది పెన్షన్కు కూడా నోచుకోని పరిస్థితి నెలకొంది. ఇక హెల్త్ కార్డులను తీసుకొని కార్పొరేట్, ప్రయివేటు అసుపత్రులకు వెళ్లిన పెన్షనర్లకు అంతులేని నిర్లక్ష్యం ఎదురవుతోంది. హెల్త్ కార్డులపై వైద్యం లేదని.. మెడికల్ రీయింబర్స్మెంట్కు దరఖాస్తు చేసుకోవాలనే ఉచిత సలహాలు ఎదురవుతున్నాయి. ఫలితంగా హెల్త్ కార్డులకు ప్రతి నెలా చెల్లిస్తున్న మొత్తం బూడిదలో పోసినట్లు అవుతోంది. పదవీ విరమణ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం ట్రెజరీ ద్వారా వేతనాలు పొందే ఉద్యోగులు కర్నూ లు జిల్లాలో 25,985, నంద్యాల జిల్లాలో 20,282 ప్రకారం ఉమ్మడి జిల్లాలో 46,287 మంది ఉన్నారు. నిబంధనల ప్రకారం పదవీ విరమణ చేసే సమయానికే పెన్షన్ సహా ఇతర ఆర్థిక ప్రయోజనాలన్నింటినీ చెల్లించాల్సి ఉంది. అయితే 2024 జూన్ తర్వాత పదవీ విరమణ పొందిన ఉద్యోగులు పెన్షన్తో పాటు బెనిఫిట్స్ పొందడంలో చుక్కలు చూస్తున్నారు. 300 రోజుల (10 నెలల వేతనం) ఎర్న్ లీవ్లకు సంబంధించి పేమెంట్ చేయడాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది. గ్రాట్యుటీ చెల్లించడంలోనూ చేతులెత్తేయడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 2,650 విశ్రాంత ఉద్యోగులు ఎర్న్ లీవ్ల పేమెంట్ల కోసం నిరీక్షిస్తున్నారు. ఆరు నెలలకోసారి కరువు భత్యం ఇవ్వడానికి రెగ్యులర్ ఉద్యోగులకు డీఏగా, విశ్రాంత ఉద్యోగులకు డీఆర్గా వ్యవహరిస్తారు. పెన్షనర్లకు చంద్రబాబు ప్రభుత్వం 18 నెలల కాలంలో ఒక్క డీఆర్ మాత్రమే ఇచ్చింది. అరియర్ చెల్లించడంలో చుక్కలు చూపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా డీఆర్ అరియర్స్ను 4 విడతలుగా ఇచ్చే విధంగా కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టడం గమనార్హం. నాలుగైదు నెలలుగా జీపీఎఫ్ పెండింగ్లో ఉండటంతో విశ్రాంత ఉద్యోగులు ఆందోళనకు లోనవుతున్నారు. నేడు పెన్షనర్ల దినోత్సవం ప్రతి ఏటా డిసెంబర్ 17న జాతీయ పెన్షనర్ల దినోత్సవం నిర్వహిస్తున్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చట్టబద్ధంగా పెన్షన్ చెల్లించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని 1981 ప్రాంతంలో ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ అధికారి డీఎస్ నకరా సుప్రీం కోర్టులో కేసు వేశారు. దీనిపై 1982లో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వై.వి.చంద్రచూడ్ ఇచ్చిన తీర్పు వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపింది. తీర్పు ఇచ్చిన రోజును పెన్షనర్ల దినోత్సవంగా 1983 నుంచి నిర్వహిస్తున్నారు. జిల్లా వారీగా పెన్షనర్లు 2024 జూన్ తర్వాత పదవీ విరమణ చేసిన అనేక మందికి ఇంతవరకు పెన్షన్ కూడా అందడం లేదు. 10 నెలల వేతనం, గ్రాట్యుటీ చెల్లించడంలో జాప్యం జరుగుతోంది. పే రివిజన్ కమిటీ ఏర్పాటులోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పెన్షనర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.75 ఏళ్లు పూర్తి చేసుకున్న వారిని సత్కరిస్తాం. – ఎస్.రంగారెడ్డి, ఏపీజీఆర్ఈఏ అధ్యక్షుడు ఈ చిత్రంలో కనిపించే వ్యక్తి పేరు మురారి శంకరప్ప. రెవెన్యూ డిపార్టుమెంట్లో తహసీల్దారు హోదాలో 2011లో పదవీ విరమణ పొందారు. అనంతరం అన్ని శాఖల విశ్రాంత ఉద్యోగులతో పెన్షనర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా ఉంటూ ఏడాదికి రెండు, మూడు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. వ్యక్తిగతంగా దాదాపు ఏటా 200 మందికి ట్రెజరీ, ఏజీ ఆఫీసులు, సీసీఎల్ఏ కార్యాలయాల్లో సర్వీస్ మ్యాటర్లకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తున్నారు. పదవీ విరమణ ఉద్యోగులతో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నారు. అపార్టుమెంట్లలో పాత దుస్తులు సేకరించి అనాథ పిల్లలకు పంపిణీ చేస్తున్నారు. విశ్రాంత ఉద్యోగుల పట్ల సర్కారు చిన్నచూపు 2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షనర్ల కోసం పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేశారు. అదే ఏడాది ఈ కమిషన్ మార్కెట్ ధరలను అధ్యయనం చేసింది. విశ్రాంత ఉద్యోగ సంఘాల నేతలతో సుదీర్ఘంగా చర్చించి సిఫారసులు చేసింది. పెన్షనర్లంటే నిర్లక్ష్య భావన ఉన్న చంద్రబాబు ఆ సిఫారసులను ఏ మాత్రం పట్టించుకోలేదు. 2020లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ సిఫారసులను అమలు చేశారు. ఇందువల్ల ఒక్కో పెన్షన్దారుకు వేల రూపాయల ప్రయోజనం లభించింది. తాజాగా పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు కరువయ్యాయి. కనీసం మెడికల్ రీయింబర్స్మెంట్కు కూడా పెన్షనర్లు నోచుకోని పరిస్థితి ఉంది. పెన్షనర్లు మరణిస్తే మట్టి ఖర్చులకు 24 గంటల్లో ట్రెజరీ అధికారులు రూ.25 వేలు చెల్లించేవారు. నేడు పెన్షనర్లు మరణిస్తే ట్రెజరీ అధికారులు మట్టి ఖర్చుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే విధానం అమలులోకి రావడం గమనార్హం. ప్రస్తుతం మట్టి ఖర్చులకు ఇచ్చే ఆర్థిక సహాయం కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. -
ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి చాగలమర్రి (ఆళ్లగడ్డ): ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యా యులదేనని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని వైపీపీఎం ఉన్నత పాఠశాలను మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం పాఠశాలలో నిర్వహించే ప్రార్థనలో పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ప్రతి విద్యార్థి పట్టుదలతో చదివి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. పది విద్యార్థులు ప్రణాళిక రూపొందించుకుని సబ్జెక్టుల వారీగా పరీక్షకు సన్నద్ధం కావాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకంతో పేదలు తమ పిల్లలను పంపుతున్నారని, ఉపాధ్యాయులు మరింత చొరవ తీసుకుని విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. అనంతరం పలు తరగతి గదులను కలెక్టర్ పరిశీలించారు. యూనిఫాం, షూస్ లేని విద్యార్థుల సంఖ్యను తెలుసుకొని వారికి సైజుల ప్రకారం అందజేస్తామన్నారు. కలెక్టర్ వెంట ఎంఈఓ శోభా వివేకవతి, ఎంపీడీఓ నూర్జహాన్, తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి, కమిషనర్ కిషోర్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేయాలి
నంద్యాల(అర్బన్): వెంటనే గ్రాట్యుటీ చట్టాన్ని అమలు చేయాలని సహకార ఉద్యోగుల యూనియన్ నాయకులు సత్యనారాయణ, ఖాజామొహిద్దీన్ డిమాండ్ చేశారు. జీవో నం.36ను వెంటనే అమలు చేసి, పెండింగ్లో ఉన్న వేతన సవరణలు పరిష్కరించి, అప్పటి వరకు మధ్యంతర భృతి ఇవ్వాలని కోరుతూ మంగళవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగులకు రూ.5 లక్షలు తక్కు వ కాకుండా ఆరోగ్య బీమాను కల్పించాలన్నారు. 2019 తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలన్నారు. సహకార సంఘాలు చెల్లించిన షేర్ ధనంపై డివిడెంట్ కనీసం ఆరు శా తం చెల్లించాలన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న అసి స్టెంట్ ఎగ్జిక్యూటివ్, క్లర్క్లతో పాటు కంప్యూటర్ ఆపరేటర్లను సీనియార్టీ ప్రాతిపదికన జిల్లాలో ఖాళీగా ఉన్న సీఈఓ పదవుల్లో భర్తీ చేయాలన్నా రు. కార్యక్రమంలో సంఘం నాయకులు రఘు రాం, వీరభద్రుడు, తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ బస్సుకు రూ.4.42 లక్షల జరిమానా డోన్ టౌన్: రోడ్డు ట్యాక్స్ చెల్లించకుండా తిరుగుతున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సుపై రూ. 4,42,500 జరిమానా విధించినట్లు డోన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ తెలిపారు. మంగళవారం జాతీయ రహదారి 44పై వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో నాగాలాండ్కు చెందిన ధనుంజయ ట్రావెల్స్ బస్సు కోయంబత్తూరు నుంచి హైదరాబాద్కు ప్రయాణికులతో వెళ్తుండగా నిలిపి తనిఖీ చేశారు. రోడ్డు ట్యాక్స్ చెల్లించకపోవడంతో రూ. 4,42,500 జరిమానా విధించినట్లు ఎంవీఐ తెలిపారు. మద్దిలేటయ్య హుండీ ఆదాయం రూ.37.66 లక్షలు బేతంచెర్ల: ఆర్ఎస్ రంగాపురం శివార్లలో వెలసిన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.37. 66 లక్షలు వచ్చింది. స్వామి, అమ్మవార్లకు భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలు, ముడుపుల లెక్కింపు మంగళవారంచేపట్టారు. దేవదాయశాఖ అధికారి జనార్దన్ పర్యవేక్షణలో ఉప కమిషనర్, ఆలయ ఈఓ రామాంజనేయులు ఆధ్వర్యంలో 47 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపు నిర్వహించారు. ఇందులో 37,66,502 నగదు, 1.20 మిల్లీ గ్రాముల బంగారు, 660.30 మిల్లీ గ్రాముల వెండి వచ్చింది. కార్యక్రమంలో బాలాజీ సేవా ట్రస్ట్ సభ్యులు, డోన్, బేతంచెర్ల మద్దిలేటి సేవా సమితి, వాసవీ సభ్యులు పాల్గొన్నారు. -
టెండర్కు వెనకడుగు
● రహదారి నిర్మాణానికి రూ. 3.50 కోట్లు విడుదల ● టెండర్ దాఖలకు ముందుకు రాని కాంట్రాక్టర్లు శిరివెళ్ల: ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గ ప్రజల రహదారి కష్టాలు ఇప్పట్లో పరిష్కారమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కర్నూలు – కడవ జాతీయపై శిరివెళ్ల మెట్ట నుంచి గోస్పాడు మండలం యాళ్లూరు వరకు ఉన్న ఆర్అండ్బీ రోడ్డు పూర్తిగా దెబ్బతింది. వీరారెడ్డిపల్లె, కోటపాడు, యాళ్లూరుకు చెందిన వేలాది మంది ప్రజలు ఈ రోడ్డుపై అతి కష్టం మీద ప్రయాణాలు సాగిస్తున్నారు. శిరివెళ్ల మెట్ట నుంచి గోస్పాడు వరకు 10 కిలో మీటర్ల మేర రోడ్డు విస్తర్ణకు కేంద్ర ప్రభుత్వం రూ. 23 కోట్ల నిధులు మంజూరు చేసింది. కాంట్రాక్టర్ సకాలంలో పనులు మొదలు పెట్టక పోవడం, ఈ లోగా సాధా రణ ఎన్నికలు రావడంతో ఎవరూ పట్టించుకోలేదు. చంద్ర బాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత సింగిల్ లైన్ రోడ్డు నిర్మాణానికి రూ. 3.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. గత నెలలో టెండర్లు పిలిచారు. ఈ నెల 9వ తేదీన టెండర్ల బాక్స్ తెరిచారు. అయితే ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదు. దీంతో అధికారులు తలలు పట్టుకున్నారు. మళ్లీ రెండవ సారి టెండర్లు ఆహ్వానించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే శిరివెళ్ల – రుద్రవరం రస్తాలో శిరివెళ్ల 3వ వాగు నుంచి చిన్న కంబళూరు మెట్ట వరకు రోడ్డు దుస్థితి అంతా ఇంతా కాదు. రోడ్డు నిర్మాణానికి రూ.1.30 కోట్ల నిధులు మంజూరయ్యాయి. పర్సెంటేజీలకు భయపడి కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఆర్అండ్బీ రోడ్లు గుంతలమయంగా మారి నడవడానికి నరకప్రాయంగా మారాయి. రహదారులు అభివృద్ధికి నోచుకోకపోవడంతో రాత్రి వేళలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రహదారులపై ప్రయాణం అంటే జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది. త్వరగా రహదారి నిర్మాణం చేపట్టి కష్టాలు తొలగించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
సమ్మె నోటీసు ఇచ్చాం ...
అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెలోకి వెళ్తామ ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చాం. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలకు మెరుగైన వేతనాలను అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటినా, అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. – ఎస్ మునెప్ప, జిల్లా గౌరవాధ్యక్షులు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
సి.బెళగల్: మండల కేంద్రం సి.బెళగల్లో విద్యుత్ స్తంభాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో పెను ప్రమాదం తప్పింది. గ్రామంలోని ఎస్సీ కాలనీ దగ్గర ఎమ్మిగనూరు – గూడూరు ప్రధాన రోడ్డు పక్కన విద్యుత్ స్తంభం ఉంది. మంగళవారం ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టగా స్తంభం రెండుగా విరిగి విద్యుత్ తీగలు పక్కనున్న దుకాణాలపై పడ్డాయి. ఘటన జరిగిన వెంటనే విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విషయం తెలుసుకున్న మండల విద్యుత్ ఏఈ సుకుమార్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని విరిగిన విద్యుత్ స్తంభం స్థానంలో నూతన స్తంభం ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని..
పాణ్యం: మండల కేంద్రం పాణ్యంలోని జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. హైవే పోలీసు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం రాత్రి తిరుమల గిరి ఎదురుగా జాతీయ రహదారిపై అవుకు పట్టణానికి చెందిన ఎద్దుల రామకృష్ణ(50) బైక్పై నంద్యాల వైపు వెళ్తున్నాడు. ఎదురుగా కర్నూల్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న హైవే పోలీసులు, ట్రైనీ ఎస్ఐ ధనుజయ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై విచారణ చేపట్టారు. మృతుడి వద్ద దొరికిన బుక్లో ఫోన్ నంబర్ల ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. మృతుడికి భార్య భాగ్యలక్ష్మి, కొడుకు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల జీజీహెచ్కు తరలించారు. -
మొక్కల పెంపకంతో పర్యావరణ సమతుల్యత
కర్నూలు (అర్బన్) : మొక్కల పెంపకంతో పర్యావరణ సమతుల్యతను కాపాడినవారమవుతామని అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ విజయ్కుమార్ అన్నారు. సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ఆర్ఈపీఎల్ సంస్థ, మేకింగ్ ది డిఫరెన్స్ ఎన్జీఓతో కలసి నన్నూరు సమీపంలోని చైన్వేజ్ 356.502 వద్ద మియా వాకి వనసంరక్షణ రెండో దశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఈపీఎల్ పీహెచ్ మదన్మోహన్ వంగర, ఎండీటీ వ్యవస్థాపకులు దీపక్ విశ్వకర్మ, జెడ్పీ హెచ్ఎస్ హెచ్ఎం నిర్మల, అశోక మహిళా ఇంజినీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ అధికారి అబ్దుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్కుమార్ మాట్లాడుతూ మియావాకి విధానంలో నాటిన మొక్కలు తక్కువ సమయంలో ఘనమైన అడవిగా మారి పక్షులు, సీతాకోక చిలుకలు, చిన్న జీవులను ఆకర్షించి జీవ వైవిధ్యాన్ని పెంచుతాయన్నారు. విద్యార్థులు చిన్న వయస్సు నుంచే మొక్కలు నాటి సంరక్షించే అలవాటును పెంపొందించుకోవాలన్నారు. మదన్మోహన్ వంగర మాట్లాడుతూ మియావాకి వన సంరక్షణ విధానం పట్టణాలు, రహదారి పరిసర ప్రాంతాల్లో తక్కువ స్థలంలో ఎక్కువ పచ్చదనాన్ని వేగంగా సృష్టించగల అత్యంత ప్రభావవంతమైన విధానమన్నారు. మియావాకి వనాలు ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచడం, కార్బన్ ఉద్ఘారాలను శోషించడం, గాలి, శబ్ధ కాలుష్యాన్ని నియంత్రించడం, రహదారి పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో దాదాపు 14 వేల మొక్కలను నాటడం జరిగింది. -
జాతీయ వెబ్నార్లో సిల్వర్జూబ్లీ విద్యార్థి ప్రతిభ
కర్నూలు సిటీ: క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోని సిల్వర్జూబ్లీ డిగ్రీ కాలేజీ విద్యార్థి ఇ.లక్ష్మీనరసింహ అద్దంకిలోని కె.ఆర్.కె ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జరిగిన మేధా–జాతీయ వెబ్నార్లో పాల్గొని ప్రనతిభ చూపించారు. ఈ మేరకు మంగళవారం సిల్వర్జూబ్లీ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ఆ విద్యార్థిని కాలేజీ ప్రిన్సిపాల్, క్లస్టర్ యూనివర్సిటీ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ డా.జి. శ్రీనివాస్ అభినందించారు. ఆయన మాట్లాడుతూ తమ విద్యార్థి వెబ్నార్లో పాల్గొని వ్యాసరచన, మౌఖిక ప్రదర్శన పోటీల్లో రెండో బహుమతితో పాటు రూ.1500 నగదు బహుమతి గెలుచుకోవడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో ఆ కాలేజీ అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు. రేషన్ బియ్యం లారీ పట్టివేత మంత్రాలయం రూరల్: అక్రమంగా రేషన్బియ్యం తరలిస్తున్న లారీని మండల పరిధిలోని మాధవరం చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్నారు. ముందుస్తు సమాచారం ప్రకారం రెవెన్యూ అధికారులు ఆర్ఐ జనార్ధన్ రావు, వీఆర్ఓ రంగస్వామి, మంత్రాలయం ఎస్ఐ శివాంజల్ మాధవరం చెక్పోస్టు వద్ద వాహనల తనిఖీ చేపట్టారు ఆదోని వైపు నుంచి రేషన్ బియ్యం లారీ వచ్చింది. దానిని ఆపి తనిఖీ చేయగా దాదాపు 700 బస్తాల పీడీఎస్ రైస్ బియ్యం కనిపించాయి. ఆ బియ్యాన్ని సాధ్వీనం చేసుకొని ఛత్తీస్ఘడ్కు చెందిన డ్రైవర్ షేక్లాల్ కుల్దీప్, మహారాష్ట్రకు చెందిన క్లీనర్ రీతిక్ సాహును అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు సీఐ శివాంజల్ తెలిపారు. మతసామరస్యానికి ప్రతీక పత్తికొండ రూరల్ : అయ్యప్ప భక్తులకు ముస్లింలు అన్నదానం ఏర్పాటు చేసి మతసామర స్యాన్ని చాటుకుంటున్నారు. తాజాగా పత్తికొండలో మొలల డాక్టర్ మౌలాలి అయ్యప్ప మాల ధరించిన భక్తులకు భిక్ష ఏర్పాటు చేశా రు. వారితో కలిసి భోజనం చేశారు. అయ్యప్ప భక్తుల దీక్ష విజయవంతం కావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురికి గాయాలు
దెబ్బతిన్న కారు,చికిత్స పొందుతున్న కన్నయ్య పాణ్యం: మండల పరిధిలోని జాతీయ రహదారిపై వేర్వేరుగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురికి గా యాలయ్యాయి. హైవే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దూటూరు చెందిన టీఎస్ 11యూడీ 1079 నంబర్ గల కారు హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు వెళ్తుండగా పాణ్యం సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో కారు డ్రైవర్కు గాయాలయ్యాయి. ప్రమా దం జరిగిన వెంటనే అతను పరారయ్యాడు. కారులో ఇతరుల్వెరు లేరని, ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి శ్రీ వెంకటేశ్వరస్వామి మాల ధరించి కాలినడకన వెళ్తున్న ముగ్గురిని వెనుక నుంచి బైక్ ఢీకొంది. ఈ ఘటనలో భక్తులు కన్నయ్య, లక్ష్మీ, లక్ష్మీనారాయణమ్మతో పాటు ద్విచక్రవాహనదారుడు రమేష్ అనే వ్యక్తికి కూడా గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం శాంతిరామ్ ఆసుపత్రికి తరలించారు. భక్తుల స్వగ్రామం విజయనగరం కాగా హైదరాబాద్లో నివాసముంటున్నారు. మొక్కు ఉండడంతో తిరుమలకు కాలినడకన వెళ్తున్నట్లు వెల్లడించారు. నెరవాడ మెట్ట వద్ద డోన్కు చెందిన శేఖర్, రాజమ్మ బైక్పై ఆర్జీఎం కాలేజీలో చదువుతున్న కుమార్తె వద్దకు వెళ్తున్నారు. సర్వీస్ రోడ్డులో వడ్లు ఆరబోసిన వ్యక్తులు పట్టలపై రాళ్లు ఉంచారు. బైక్పై వెళ్తుండగా అవి తగలడంతో అదుపు తప్పి కిందపడ్డారు. ఈ ఘటనలో దంపతులకు గాయాలు కాగా 108 వాహనంలో నంద్యాల జీజీహెచ్కు తరలించినట్లు సిబ్బంది చంద్రశేఖర్, ప్రకాష్ తెలిపారు. -
అప్పుల బాధతో..
కొత్తపల్లి: అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి నిప్పుఅంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం మండలంలోని గువ్వలకుంట్ల గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ జయశేఖర్ తెలిపిన వివరాల మేరకు.. గువ్వలకుంట్ల గ్రామానికి చెందిన ఎర్వ. దేవదాసు (41) అనే వ్యక్తి ఆరోగ్యసమస్యల వల్ల వైద్య ఖర్చులకు అప్పులు చేశాడు. దీనికి తోడు తాగుడుకు బాసిసయ్యాడు. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం ఉదయం కుటుంబసభ్యులు పొలానికి వెళ్లిన తర్వాత నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో నుంచి పొగలు రావడంతో ఇరుగుపొరుగు వారు గమనించి కాపాడేందుకు ప్రయత్నించగా అప్పటికే పూర్తిగా కాలిపోయి చనిపోయాడు. మృతుడి కుటుంబసభ్యుల ద్వారా సమాచారం అందుకున్న ఆత్మకూరు రూరల్ సీఐ సురేష్ కుమార్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. మృతుడికి భార్య యేసమ్మతోపాటు ఇద్దరు కొడుకులు ఉన్నారు. -
రండి బాబూ రండి..
ప్రతి వ్యాపారంలో పోటీ నెలకొంది. వినియోగదారులను ఆకర్షించాలంటే అంత సులువు కాదు. అందుకే వీరు ఏకంగా తమ వ్యాపారాన్ని కొనుగోలుదారుల వద్దకు చేర్చుతున్నారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కృష్ణ, నరసింహులు కుటుంబాలు స్వచ్ఛమైన పసుపు అంటూ... ఆటోల్లో బయలుదేరారు. రైతుల నుంచి సేకరించిన పసుపు కొమ్ములను ప్రజల ఎదుటే మరలో ఆడించి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. మార్కెట్లో కేజీ ధర రూ.200 ఉండగా వీరి వద్ద నాణ్యతగా ఉండటంతో కేజీ రూ. 300 మేర విక్రయిస్తున్నారు. రండి బాబూ రండి.. ఇది పసుపు బండి అంటూ ఊరూరా తిరుగుతూ అమ్మకాలు సాగిస్తున్నారు. – బేతంచెర్ల -
మైక్రో ఫైనాన్స్ను ఆశ్రయించొద్దు
●విజన్ బిల్డింగ్ శిక్షణలో వెలుగు పీడీ శ్రీధర్రెడ్డి కోవెలకుంట్ల: ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించి అధిక వడ్డీలకు రుణాలు తీసుకుని ఆర్థికంగా నష్టపోవద్దని వెలుగు పథకం పీడీ శ్రీధర్రెడ్డి సూచించారు. స్థానిక వెలుగు కార్యాలయంలో మంగళవారం మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ప్రమీలమ్మ అధ్యక్షతన పొదుపు మహిళలకు ’విజన్ బిల్డింగ్’పై శిక్షణ ఇచ్చారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పశుపోషణ, వైద్యం, ఆస్తుల సృష్టి, సుస్థిర జీవనోపాధులు, సామాజిక భద్రత, ప్రవర్తనల మార్పు వంటి అంశాలపై మహిళలకు అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా పీడీ మాట్లాడుతూ.. మహిళలు ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధి సాధించాలని కోరారు. బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి, ఉన్నతి, సీఐఎఫ్ తదితర రుణాలను పొందిన మహిళలు వాటిని జీవనోపాధుల నిమిత్తం ఉపయోగించుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని పేర్కొన్నారు. విజన్ బిల్డింగ్ కార్యక్రమంలో భాగంగా 2026–27 సంవత్సరానికి ముందస్తు ప్రణాళికలను తయారు చేసుకోవాలని సూచించారు. ఎనిమిది రకాల అంశాల్లో బడ్జెట్ ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. పొదుపు సంఘాల్లోని ప్రతి సభ్యురాలు తక్కువ వడ్డీకి రుణాలు పొంది జీవన ప్రమాణాలను మెరుగు పరుచుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఆ పథక జిల్లా ప్రాజెక్టు మేనేజర్ హనుమా నాయక్, కోవెలకుంట్ల క్లస్టర్ ఏరియా కో ఆర్డినేటర్ చంద్రశేఖర్, మాస్టర్ ట్రైనర్ అంబమ్మ, ఏపీఎం పుణ్యవతి, ఏపీఎంలు పాల్గొన్నారు. -
17న వెల్దుర్తిలో జాబ్మేళా
కర్నూలు(సెంట్రల్): నైపుణ్య అభివృద్ధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 17న వెల్దుర్తిలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు, నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి కోరారు. సోమవారం జాబ్మేళాకు సంబంధించిన పోస్టర్ను జేసీ నూరుల్ ఖమర్తో కలసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డిసెంబర్ 17న వెల్దుర్తి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న జాబ్మేళాకు 14 ప్రైవేట్ కంపెనీలు 500 ఖాళీల భర్తీ కోసం వస్తున్నట్లు చెప్పారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉండి పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, బీటెక్, పీజీ చదివివన వారు పాల్గొనాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9603303354,7981222035 లను సంప్రదించాలి కోరారు. డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, ఉపాధి కల్పన అధికారి దీప్తి నైపుణ్య అభివృద్ధి సంస్థ శిక్షణాధికారి ఆనంద్రాజ్ కుమార్ పాల్గొన్నారు. డ్వామా పీడీ వెంకటరమణయ్య బదిలీ కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ (డ్వామా పీడీ) పి.వెంకటరమణయ్య బదిలీ అయ్యారు. పంచాయతీ రాజ్ శాఖలో డివిజినల్ డెవలప్మెంటు ఆఫీసర్ అయిన ఈయన గత ఏడాది నవంబరు 20 నుంచి డ్వామా పీడీగా విధులు నిర్వహిస్తున్నారు. శిక్షణకోసం విశాఖపట్టణానికి వెళ్లగా ఉన్నట్టుండి ఈయనను అనంతపురం జిల్లా ధర్మవరం మున్సిపల్ కమిషనర్గా డిప్యుటేషన్పై నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్థానంలో ఎవ్వరినీ నియమించలేదు. ‘భవాని’ భక్తులను కాపాడిన డివైడర్ శ్రీశైలం: దోర్నాల చెక్పోస్టు దాటిన తర్వాత ఘాట్ రోడ్లో టూరిస్ట్ బస్సు డివైడర్ పైకెక్కింది. బస్సులో ‘భవాని’ భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. దోర్నాల పోలీసులు కథనం మేరకు.. భవాని మాలలో ఉన్న స్వాములు విశాఖపట్నంలో టూరిస్ట్ బుక్ చేసుకుని మార్గమధ్యంలోనే అన్ని క్షేత్రాలను దర్శించుకుని విజయవాడకు వచ్చారు. ఆదివారం సాయంత్రం మాల విరమణ చేశారు. అనంతరం విజయవాడ నుంచి బయలుదేరి శ్రీశైలం సందర్శించడానికి దోర్నాల ఫారెస్ట్ చెక్ పోస్ట్ చేరుకున్నారు. సోమవారం ఉదయం దోర్నాల చెక్ పోస్ట్ చేరుకొని అక్కడి నుంచి శ్రీశైలం బయలుదేరారు. ఘాట్ ఎక్కుతుండగా బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్ పైకెక్కి నిలిచిపోయింది. ఆ డివైడరే బస్సులో ఉన్న 40 మంది భవాని దీక్ష స్వాముల ప్రాణాలు కాపాడినట్లు అయ్యింది. బస్సు డివైడర్ పై నిలబడకపోతే పక్కనే ఉన్న లోతైన లోయలో కిందపడిపోయేదని పోలీసులు తెలిపారు. నల్లమల ఘాట్ రోడ్డులో ప్రమాదం మహానంది: నంద్యాల – గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. గిద్దలూరు నుంచి నంద్యాలకు వస్తున్న డీసీఎం లారీ, బైక్ ఎదురెదురై ఢీకొన్నాయి. వరి కోత మిషన్ యంత్రాన్ని డీసీఎం లారీలో నంద్యాల వైపు తీసుకొస్తుండగా నంద్యాల నుంచి గిద్దలూరు వైపు బైకుపై వెళ్తున్న చెన్నూరుకు చెందిన రామాంజనేయులు, అయ్యలూరు గ్రామానికి చెందిన నాగేంద్రుడు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులతో పాటు ప్రయాణికులు చికిత్స నిమిత్తం 108 వాహనం ద్వారా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహానంది పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. రైలు కిందపడి టైలర్ ఆత్మహత్య ఆదోని సెంట్రల్: గూడ్స్ రైలు కిందపడి టైలర్ రమేష్(45) ఆత్మహత్య చేసుకున్నట్లు ఆదోని రైల్వే పోలీసు స్టేషన్ హెచ్సీ శివరామయ్య సోమవారం విలేకరులకు తెలిపారు. కోసిగి గ్రామానికి చెందిన ఈయన కుటుంబ కలహాలతో కలత చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. స్టేషన్ మాస్టర్ సమాచారం మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తేనెకు వెళ్లి వృద్ధుడి మృతి వెల్దుర్తి: అటవీ తేనె కోసం వెళ్లి ఓ వృద్ధుడు మరణించాడు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని రామళ్లకోటకు చెందిన మగ్బుల్ (66)కు తేనె జోపడం అలవాటు. సోమవారం ఇంట్లో భార్యకు చెప్పి వెల్దురి పట్టణ సమీపంలోని బ్రహ్మగుండం క్షేత్రం వైపు తేనె కోసం వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగిరాకపోవడంతో భార్య మహబూబ్బీ గాలింపు చేపట్టింది. బ్రహ్మగుండం క్షేత్రంలో పాత కొనేరుకు వెళ్లే దారిలో మగ్బుల్ విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించిన కొందరు ఆమెకు సమాచారం అందించారు. తన భర్త ఆరోగ్యం సరిగా ఉండేది కాదని, అనారోగ్యంతోనే మృతి చెంది ఉంటాడని ఆమె తెలిపారు. -
అంగన్వాడీ టీచర్లకు సెల్ఫోన్లు
కర్నూలు(సెంట్రల్): అంగన్వాడీ కేంద్రాలతో గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లల ఆర్యోగ సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి అంగన్వాడీలకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబరులో అంగన్వాడీలు, సూపర్వైజర్లకు మంజూరైన 5జీ సెల్ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ..జిల్లాలోని 1,886 మంది అంగన్వాడీలు, 73 మంది సూపర్వైజర్లు, 9 మంది బ్లాక్ లెవల్ కోఆర్డినేటర్లకు సెల్ఫోన్లు మంజూరైనట్లు చెప్పారు .ఈ ఫోన్లతో గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లల పోషణ, ఆరోగ్యం మెరుగుపడేలా చేయాలని సూచించారు. ఐసీడీఎస్ పీడీ విజయ, సీడీపీఓలు అనురాధ, రాజేశ్వరి, సూసర్వైజర్ అనూష పాల్గొన్నారు. విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ సమస్యల పరిష్కారానికి కర్నూలు, నంద్యాల జిల్లాల అధికారులు సత్వరం చర్యలు తీసుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్(ప్రాజెక్టు, ఐటీ) ఆదేశించారు. సోమవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎపీఎస్పీడీసీఎల్ కార్యాలయం నుంచి డయర్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయి. వీటిని వెంటనే పరిష్కరించాలని ఆయన రెండు జిల్లాల ఎస్ఈలను ఆదేశించారు. విద్యుత్ వినియోగదారులు డయల్ యువర్ కార్యక్రమానికే కాకుండా టోల్ప్రీ నంబర్లు 1912, 1800425155333 కు ఫోన్ చేసి సమస్యలను చెప్పవచ్చని సూచించారు. 91333 31912 నంబరుకు వాట్సాప్ ద్వారా కూడా సమస్యలను చాట్ చేయవచ్చని డైరెక్టర్ సూచించారు. 32 గొర్రెల అపహరణ పాణ్యం: భూపనపాడు గ్రామంలో మేకలు, గొర్రెలు చోరీకి గురయ్యాయి. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఈనెల 11వ తేదీన గ్రామానికి చెందిన దామరేకులు దేవసహయం (పాపన్న) 33మేకలు, గొర్రెలును మారెమ్మ గుడి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఉంచాడు. అదే రోజు అర్ధరాత్రి తర్వాత ముగ్గరు దొంగలు వాటిని ఎత్తుకెళ్లారు. ఉదయం బాధిత రైతు వెళ్లి చూడగా జీవాలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా దొంగలు జీవాలను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు మారెమ్మ గుడిలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు గ్రామస్తులు తెలిపారు. భారీగా గంజాయి పట్టివేత ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని గుడేకల్ కొండ దగ్గర సోమవారం సాయంత్రం పోలీసులు దాడి చేసి గంజాయిని పట్టుకున్నట్లు డీఎస్పీ ఎంఎన్. భార్గవి పేర్కొన్నారు. సోమవారం రాత్రి స్థానిక రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. గుడేకల్ కొండ దగ్గర శ్రీ గురుదత్త ఆశ్రమము సమీపంలో దగ్గర గంజాయి అక్రమంగా విక్రయిస్తున్నారే సమాచారంతో అక్కడికి వెళ్లి దాడి చేసి నిందితులను అరెస్ట్ చేశామన్నారు. అరెస్ట్ చేసిన వారిలో నందవరం మండలం బండారు స్ట్రీట్కు చెందిన చిదిగే కృష్ణ, ఎమ్మిగనూరు టౌన్ శారద కమిటీ ప్రాంతానికి చెందిన తపాల్ అబ్దుల్లా, కడిమెట్ల గ్రామానికి చెందిన మాల గోరంట్లగోవిందు, పెద్దకడుబూరు మండలం కంబదలదిన్నెకు చెందిన కురవ తిక్కన్న, నందవరం మండలం కనకవీడు గ్రామానికి చెందిన బోయ గంగప్పలను ఉన్నట్లు చెప్పారు. వీరు నందవరం మండలం కనకవీడు పేట కు చెందిన బోయ గంగప్ప పొలంలో గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు గుర్తించామని తెలిపారు. కనకవీడు పేటకు వెళ్లి పొలంలో ఉన్న మొక్కలను తొలగించినట్లు చెప్పారు. నిందితులు ఆశ్రమం పక్కన బండరాళ్లపై గంజాయి మొక్కలను ఎండబెట్టి, గుర్తు తెలియని వ్యక్తులకు అక్రమంగా విక్రయించి సొమ్ముచేసుకునేవారిని తెలిపారు. నిందితులను నుంచి 5.490 కేజీల గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గంజాయిని పట్టుకోవటంలో రూరల్ సీఐ చిరంజీవి, రూరల్ ఇన్చార్జి ఎస్ఐ తిమ్మారెడ్డి, రూరల్ హెచ్సీ కృష్ణ, కానిస్టేబుల్స్ కె.తిప్పన్న, సర్వేశ్వరరెడ్డి, జి.తిప్పన్నలు బాగా పనిచేసినట్లు ఆమె చెప్పారు. శ్రీశైలంలో అన్యమత స్టిక్కర్తో వాహనం శ్రీశైలం: శ్రీశైలం మహా క్షేత్రంలోకి దేవస్థానం టోల్గేట్ ద్వారా అన్యమత స్టిక్కర్ కలిగి ఉన్న వాహనంలోనికి ప్రవేశించడం కలకలం రేపింది. టోల్గేట్ వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఎంతమంది ఉన్నా చూడలేదా, లేక వారి కళ్లు కప్పి వచ్చిందా, వారు చూస్తుండగానే లోనికి ప్రవేశించిందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ అన్యమత స్టిక్కర్ కలిగి ఉన్న వాహనం ప్రధాన పురవీధిలోని నంది మండపం వద్ద కనిపించడంతో పలువురు సెల్లో ఫొటోలు తీసి దేవస్థానం అధికారులకు సమాచారమిచ్చారు. -
రబీలోనూ యూరియా వెతలు!
కోవెలకుంట్ల: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రైతులు యూరియా కష్టాలు ఎదుర్కొనగా రబీ సీజన్లో అదే పరిస్థితులు తలెత్తాయి. వివిధ పంటల సాగులో యూరియా వినియోగిస్తుండగా ప్రభుత్వం అరకొరగా సరఫరా చేస్తుండటంతో రైతులకు కష్టాలు తప్పడంలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆయా సీజన్లలో రైతులకు కావాల్సిన యూరియా, డీఏపీ, ఇతర కాంప్లెక్స్ ఎరువులను సరఫరా చేసింది. పంటల్లో వాటిని వినియోగించి అధిక దిగుబడులు సాఽధించారు. చంద్రబాబు ప్రభుత్వంలో యూరియా కొరత వేధిస్తోంది. అవసరం ఇలా.. జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాది ఖరీఫ్ వరి కోత, నూర్పిడి పనులు పూర్తయ్యాయి. రబీలో ఎండకారు వరి సాగు చేసేందుకు సమాయాత్తమవుతున్నారు. బోర్లు, బావులు, కుందూనది, పాలేరు, కుందర వాగు తదితర నీటి ఆధారంగా 29,084 హెక్టార్లలో కర్నూలు, నంద్యాల సోనా, షుగర్లెస్, 555 రకాలకు చెందిన వరిని సాగు చేసేందుకు వరి నారుమడులను సిద్ధం చేసుకున్నారు. అలాగే జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో 12,032 హెక్టార్లలో మొక్కజొన్న సా గు చేయాల్సి ఉంది. అయితే లక్ష్యాన్ని మించి 12,888 హెక్టార్లలో సాగు చేయగలిగారు. 29,212 హెక్టార్లలో మహేంద్ర, హైటెక్, పచ్చజొన్న రకాలు సాగు కావాల్సి ఉండగా ఆయా మండలాల్లో 21,435 హెక్టార్లలో సాగైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా పంటలకు యూ రియా వేయాల్సి ఉండగా ఎరువు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులకు రాజకీయ ముద్ర వేస్తూ! రైతు సేవా కేంద్రాలకు ఇటీవల కాలంలో అరకొరగా యూరియా సరఫరా అయ్యింది. అయితే టీడీపీ నాయకులు రైతులకు రాజకీయ ముద్ర వేసి యూరియా అందకుండా చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల సిఫారసు లేనిదే రసాయన ఎరువులు ఇవ్వడం లేదు. టీడీపీ నేతల ఒత్తిళ్లతో రబీ సీజన్లో రైతులకు యూరియా ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి. మొక్కజొన్న, జొన్న పంటల ఎదుగుదలలో ఎకరాకు కనీసం ఒక బస్తా యూరియా వినిగియోగించాల్సి ఉంది. అలాగే ఈ నెలాఖరు నుంచి వరి నాట్లు వేయాల్సి ఉంది. యూరియా రావడం లేదని అధికారులు సమాధానం ఇస్తుండటంతో రైతులు దిగాలు చెందుతున్నారు. యూరియా కృత్రిమ కొరత సృష్టించడంతోనే ఈ సమస్య తలెత్తింది. రబీ సీజన్లో నాలుగు ఎకరాల సొంత పొలంలో జొన్న పంట సాగు చేశా. ప్రస్తుతం పైరు నెల రోజుల దశలో ఉంది. మరో 10 ఎకరాల్లో ఎండకారు వరి సాగు చేసేందుకు నారుమడి సిద్ధం చేసుకున్నా. జొన్నలో ఎకరాకు రెండు బస్తాలు, వరిలో ఎకరాకు ఒక బస్తా యూరియా అవసరం. పదిహేను రోజుల నుంచి యూరియా దొరక్క అవస్థలు పడుతున్నాం. – వెంకటేశ్వరరెడ్డి, రైతు, కంపమల్ల, కోవెలకుంట్ల మండలం ఖరీఫ్ సీజన్ నుంచి రైతులకు యూరియా దొరకడం లేదు. గత నెలలో మూడున్నర ఎకరా సొంత పొలంలో మొక్కజొన్న పంట సాగు చేశా. పైరు ఎదుగుదలకు ప్రస్తుతం యూరియా వేయాల్సి ఉంది. రైతు సేవా కేంద్రాలకు వెళితే దొరకడం లేదు. రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. అధికారులు రైతు సేవా కేంద్రాలకు యూరియా సరఫరా చేసి కొరత తీర్చాలి. – కుళాయప్ప, రైతు, అమడాల, కోవెలకుంట్ల మండలంబ్లాక్ మార్కెట్లో లభ్యం రైతు సేవా కేంద్రాల్లో యూరియా దొరక్కపోవడంతో రైతులు బ్లాక్ మార్కెట్లో కొనాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం నిర్ణయించి ధర ప్రకారం యూరియా బస్తా రూ. 268 కాగా బ్లాక్ మార్కెట్లో రూ. 350 నుంచి రూ. 400 వరకు అమ్ముతున్నారు. వివిధ పంటల్లో యూరియా వినియోగం తప్పని సరి కావడంతో అంత మొత్తం చెల్లించి కొనుగోలు చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. సంబంధిత జిల్లా అధికారులు చర్యలు తీసుకుని రైతులకు సకాలంలో రైతు సేవా, మన గ్రోమోర్ కేంద్రాలు, సహకార సంఘాల ద్వారా యూరియాను సరఫరా చేయాలని కోరుతున్నారు. బస్తా యూరియా కోసం తప్పని అవస్థలు రైతు సేవా కేంద్రాలకు అరకొర సరఫరా బస్తా ధర రూ. 268.. మార్కెట్లో రూ. 400 వరి, మొక్కజొన్న, జొన్న పంటలకు యూరియా వినియోగం -
రోడ్డు వేయాలి.. లీజు రద్దు చేయాలి
● పీజీఆర్ఎస్లో అర్జీలు ఇచ్చిన ప్రజలుకర్నూలు(సెంట్రల్): దేవనకొండ మండలం నేలతలమర్రి నుంచి తిప్పతలమర్రికి రోడ్డు నిర్మించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.1.5 కోట్లు నిధులు మంజూరు చేసిందని, ఇంత వరకు పనులు మొదలు ప్రారంభించలేదని, చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరికి ప్రజలు అర్జీ ఇచ్చారు. ఆలూరు మండలం హత్తిబెళగల్ సమీపంలో 20 ఎకరాలను ఐరన్ఓర్ లీజుకు ఇచ్చారని, గతంలో ఐరన్ ఓర్ పేలుడులో దాదాపు 16 మంది చనిపోయారని, లీజు రద్దు చేయాలని ఆ గ్రామస్తులు కలెక్టర్కు విన్నవించారు. కల్టెరేట్లోని సునయన ఆడిటోరియంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ సమస్యల పరిష్కారం కోసం ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. ఓర్వకల్లు మండలం హుస్సేనాపురం వెలుపల పొలాల్లో వైన్ షాపును తొలగించాలని, ఎమ్మిగనూరు క్లస్టర్లో మంజూరైన మినీ గోకులాలను టీడీపీ వాళ్లకు తప్ప ఎవరికీ ఇవ్వడంలేదని, అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న డయాగ్నోస్టిక్ సెంటర్లను వెంటనే సీజ్ చేయాలని అర్జీలు ఇచ్చారు. -
స్టాఫ్నర్సు ఉద్యోగం ఇప్పిస్తానని మోసం
● రూ.1.50లక్షలు వసూలు చేశాడని ఎస్పీకి ఫిర్యాదుకర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో స్టాఫ్నర్సు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి భాస్కర్ అనే వ్యక్తి రూ.1.50లక్షలు తీసుకుని మోసం చేశాడని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్కు స్థానిక బుధవారపేటకు చెందిన రోజారాణి అనే మహిళ ఫిర్యాదు చేశారు. సోమవారం కొత్తపేటలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 108 మంది ఫిర్యాదులు చేశారు. వీటిపై విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ చెప్పారు. కొన్ని ఫిర్యాదులు ప్రభుత్వ టీచర్ ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి కాంట్రాక్ట్ పద్ధతిన మున్సిపాలిటిలో గానీ, కోర్టులో గానీ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన వద్ద రూ.50వేలు తీసుకుని మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలని వన్టౌన్కు చెందిన యుగంధర్ ఫిర్యాదు చేశాడు. ●చిన్నకుమారుడు ఇర్ఫాన్ బాషా గత కొద్దిరోజులుగా కనిపించకుండా ఎక్కడికో వెళ్లిపోయాడని, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని, అతని ఆచూకీ తెలిపి న్యాయం చేయాలని గడ్డ వీధికి చెందిన ఖమ్రున్నీసా కోరారు. ● తన మొబైల్కు పీఎం కిసాన్ పేరుతో ఒక నకిలీ లింక్ వచ్చిందని, తనకు తెలియకుండానే దానిని ఓపెన్ చేసి, తన బజాజ్ కార్డు నుంచి గుర్తుతెలియ ని వ్యక్తులు ఒక్కొక్కటి రూ.35వేలు విలువ చేసే మూడు సెల్ఫోన్లు కొనుగోలు చేశారని నిడ్జూరు గ్రామానికి చెందిన శివశంకర్ ఫిర్యాదు చేశారు. ● భర్త శాంతిరాజు తన పేరుపై రూ.20లక్షలు అప్పులు చేసి ఒక సంవత్సరం నుంచి కుటుంబాన్ని చూసుకోకుండా, తనను అనుమానిస్తూ వేదిస్తున్నాడని న్యాయం చేయాలని అశోక్నగర్కు చెందిన మనోరంజని ఫిర్యాదు చేశారు. ● ఆస్తులు పంచుకుని నడవలేని స్థితిలో ఉన్న తనను కుమారులు, కోడళ్లు చూసుకోవడం లేదని, బయటకు గెంటివేశారని క్రిష్ణగిరి మండలం అమకతాడు గ్రామానికి చెందిన రామలక్ష్మమ్మ ఫిర్యాదు చేశారు. -
అర్జీదారులకు సత్వర న్యాయం
నంద్యాల: పీజీఆర్ఎస్లో వినతులు అందించిన వారికి చట్ట పరిధిలో సత్వర న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని తన కార్యాలయంలో ప్రజల నుంచి ఎస్పీ వినతులు స్వీకరించి మాట్లాడారు. ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, అలాగే అర్జీలు పునరావృతం కాకుండా చూసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. విధుల పట్ల ఏ ఒక్కరూ నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సూచించారు. -
ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు
● అధికారులకు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశంనంద్యాల: జిల్లాలో 0 నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో పల్స్ పోలియో కార్యక్రమంపై జిల్లాస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 5 సంవత్సరాల లోపు పిల్లలు మొత్తం 2,38,404 మంది ఉన్నారని తెలిపారు. వీరందరికీ పోలియో చుక్కలు అందించేందుకు జిల్లా వ్యాప్తంగా 1,318 బూత్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 21న ఆదివారం బూత్ స్థాయిలో, 22, 23 తేదీలలో ఇంటింటికి వెళ్లి మిగిలిపోయిన పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సంత మార్కెట్లు వంటి జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ట్రాన్సిట్ పాయింట్లు (బూత్లు) ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. అనంతరం పోలియో చుక్కలకు సంబంధించిన వాల్ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటరమణ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ సుదర్శన్ బాబు, డీసీహెచ్ఎస్ డాక్టర్ లలిత, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ప్రసన్న లక్ష్మి, డాక్టర్ శ్రీజ, డాక్టర్ శ్రీనివాసులు, అలాగే ఐసీడీఎస్, పంచాయతీరాజ్, విద్యుత్, విద్య, రవాణా తదితర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
బొమ్మలసత్రం: జిల్లాలో ఉన్న నాయకులను సమన్వయం చేసుకుంటూ వైఎస్సార్సీపీ బలోపేతానికి కృషి చేయాలని నంద్యాల పార్లమెంట్ పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శులతో ఆమె సమావేశం నిర్వాహించారు. ఈసందర్భంగా కల్పలతారెడ్డి మాట్లాడుతూ పార్టీ అధినేత పేదలకు చేసిన మంచిని ప్రతి నియోజకవర్గంలో ప్రజలుక వివరించి పార్టీపై అభిమానం కూడగట్టేలా చూడాలన్నారు. ప్రభుత్వం పేదలకు చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టే ప్రయత్నంలో నాయకులు, నియోజకవర్గ సమన్వయ కర్తలు పార్టీ అధినేత సూచనలను పాటించేలా చూడాలన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, సీనియర్ నాయకులు మలికిరెడ్డి రాజగోపాల్రెడ్డి, రాష్ట్రకార్యదర్శులు బుడ్డా శేషిరెడ్డి, భూమా కిషోర్రెడ్డి, దేశం సుధాకర్రెడ్డి, పీపీ మధుసుదన్రెడ్డి, గుండం సూర్యప్రకాష్రెడ్డి, ఎస్ఈసీ సభ్యులు కల్లూరి రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జనం కదం తొక్కారు.. కుటమి సర్కారు కుట్రలపై గళమెత్తారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేస్తే ఊరుకోమంటూ హెచ్చరించారు. తమ హక్కులను కాపాడుకోవడానికి వైఎస్సార్సీపీ వెంట నడుస్తామని తేల్చి చెప్పారు. నంద్యాలలో సోమవారం ప్రజా ఉద్యమ ర్యాలీ ఉప్పెనలా సాగింది. జిల్లా
బొమ్మల సత్రం: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ సోమవారం నంద్యాలలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీగా ప్రజా ఉద్యమ ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజా సంతకాల సేకరణ ప్రతుల బాక్సులను పార్టీ జిల్లా కార్యాలయం నుంచి విజయవాడకు తరలించారు. ఈ సందర్భంగా రైతుబజార్, పద్మావతినగర్ మీదుగా మునిసిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్, పార్టీ రాష్ట్ర నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, వివిధ విభాగాల నాయకులు, ప్రజలు, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పార్టీ జెండాలు, బ్యానర్లు ప్రదర్శించి జై జగన్, జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు. ప్రైవేటీకరణ చేపడితే విద్యకు, వైద్యానికి డబ్బులు చెల్లించాల్సిందే.... ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తే విద్యతో పాటు నాణ్యమైన వైద్యానికి డబ్బులు చెల్లించాల్సిన దుస్థితి వస్తుందని జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. కోటి సంతకాల సేకరణ ప్రతులతో నంద్యాలలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద విద్యార్థులు ఒక్క రూపాయి కూడా ఖర్చులేకుండా వైద్య విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారన్నారు. అలాగే పేదలకు మల్టీస్పెషాలిటీ వైద్యం ఉచితంగా అందాలన్నదే ఆయన లక్ష్యమన్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం వైద్య విద్యను ప్రైవేటీకరిస్తే పేదలు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. విలువైన కాలేజీల స్థలం, భవనాలు ప్రైవేట్కు అప్పగించడం సరికాదన్నారు. చిన్న రాష్ట్రాలు సొంతంగా మెడికల్ కళాశాలలు నడుపుతున్నాయన్నారు. ఏపీలో మాత్రం చంద్రబాబు ప్రైవేట్కు మేలు చేసేందుకు ప్రయత్నించడం దుర్మార్గమని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా సేకరించిన 4 లక్షల 20 వేల సంతకాల సేకరణ బాక్సులను ఈనెల 18 న జగనన్న ఆధ్వర్యంలో గవర్నర్కు అందిస్తామన్నారు. తరలివచ్చిన వైఎస్సార్సీపీ నాయకులు జిల్లా కేంద్రం నంద్యాలలో నిర్వహించిన ర్యాలీకి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. నంద్యాల పార్లమెంట్ పరిశీలకురాలు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా, జెడ్పీ చైర్మన ఎరబోతుల పాపిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, నందికొట్కూరు సమన్వయకర్త దారా సుధీర్, మాజీ మార్క్ఫేడ్ రాష్ట్ర అధ్యక్షుడు పీపీ నాగిరెడ్డి, రాష్ట్రకార్యదర్శులు బుడ్డా శేషిరెడ్డి, భూమా కిషోర్రెడ్డి, దేశం సుధాకర్రెడ్డి, పీపీ మధుసూదన్రెడ్డి, గుండం సూర్యప్రకాష్రెడ్డి, ఎస్ఈసీ సభ్యులు కల్లూరి రామలింగారెడ్డి, గోపవరం సాయినాఽథరెడ్డి, చల్లా విఘ్నేశ్వర్రెడ్డి, పోచా జగదీశ్వరరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, జిల్లా ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్, సూర్యనారాయణరెడ్డి, రమేష్ నాయుడు, ప్రధాన కార్యదర్శులు సోమశేఖర్రెడ్డి, తిరుమలేశ్వరరెడ్డి, రాష్ట్ర మహిళా జనరల్ సెక్రెటరీ శశికళారెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు సుజాతమ్మ, యూత్ వింగ్ అధ్యక్షుడు గుండం నాగేశ్వరరెడ్డి, స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు సురేష్బాబు లీగల్సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య , మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టీవై శివయ్య, మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, స్టేట్ మైనారిటీ జనరల్ సెక్రెటరీ అంజాద్ అలీ, మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి యూనూస్బాషా, ఎస్టీ సెల్ స్టేట్ జనరల్ సెక్రెటరీ శ్రీనివాసనాయక్, స్టేట్ యూత్వింగ్ సెక్రెటరీ శ్రీకాంత్రెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర విభాగం జనరల్ సెక్రెటరీ శంకర్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, మండలాధ్యక్షులు తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. కోటి సంతకాల ప్రతుల బాక్సులను విజయవాడకు తరలించేందుకు వాహనంలో ఎక్కించి ఆ వాహనాన్ని జిల్లా అధ్యక్షుడు, పార్టీ నాయకులు జెండా ఊపి ప్రారంభించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉప్పెనలా ప్రజా ఉద్యమం కోటి సంతకాల సేకరణ ప్రతులతో నంద్యాలలో భారీ ర్యాలీ పెద్ద ఎత్తున పాల్గొన్న వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తే ఊరుకోమని హెచ్చరిక ర్యాలీలో పాల్గొన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్లు, ఎమ్మెల్సీలు -
అమరజీవి త్యాగం మరువలేనిది
● జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి కర్నూలు(అర్బన్): పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం అజరామరమని జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా సోమవారం స్థానిక జిల్లా పరిషత్లోని మినీ సమావేశ భవనంలో అమరజీవి చిత్ర పటానికి జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డితో కలిసి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు స్వాతంత్య్ర ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారని, గాంధేయవాది అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటులో ఆయన కీలకపాత్ర పోషించిన మహనీయులన్నారు. ఆయన మృతితోనే ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అప్పటి నుంచి ఆయనను తెలుగు ప్రజలు అమరజీవిగా గౌరవించుకుంటున్నారని చెప్పారు. జెడ్పీ పరిపాలనాధికారులు సీ మురళీమోహన్రెడ్డి, పుల్లయ్య, జితేంద్ర, నాగేంద్ర ప్రసాద్, బసవశేఖర్, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ పొదుపుపై అవగాహన కర్నూలు(సెంట్రల్): విద్యుత్ పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించాలని విద్యుత్ శాఖాధికారులను కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆదేశించారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఇంధన పరిరక్షణ, సంరక్షణకు సంబంధించిన పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఈ నెల 14 నుంచి ప్రారంభమైన ఇంధన పొదుపు వారోత్సవాను 20వ తేదీ వరకు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం ఇంధన పరిరక్షణ, సంరక్షణపై జిల్లా అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జేసీ నూరుల్ ఖమర్, ఎపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ ప్రదీప్, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ పాల్గొన్నారు. తుంగభద్ర నదిలో ఇసుక దొంగలు! నందవరం: టీడీపీ నేతల సహకారంలో తుంగభద్ర నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. మొన్నటి వరకు నాగలదిన్నె నుంచి ఇసుక్రను చోరీ చేశారు. తుంగభద్ర నది నీరు రావడంతో మూడు రోజుల నుంచి చిన్నకొత్తిలి గ్రామంలోని నది ఒడ్డుకు వచ్చారు. యదేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నా అధికారులు స్పందించడం లేపదు. ప్రభుత్వ కార్యాలయాల మీదుగా ఇసుక ట్రాక్టర్లు తరలిపోతున్నా చర్యలు శూన్యం. నందవరం మండలంలో నాగలదిన్నె, చిన్నకొత్తిలి, గంగవరం, కనకవీడు, సోమలగూడూరు మీ దుగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. చిన్నకొత్తిలి, నాగలదిన్నె గ్రామాలకు నుంచి రోజుకు 25 నుంచి 50 ట్రిప్పుల వరకు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. ఇసుక మాఫియాకు అధికారులు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. కలెక్టరేట్ ఎదుట ఉల్లి రైతుల ధర్నా కర్నూలు(సెంట్రల్): తాము కర్నూలు మార్కెట్లో మూడున్నర నెలల క్రితం ఉల్లిని అమ్మామని, ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదని రైతులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పత్రాలను చూపారు. సీబెళగల్ మండలం సంగాలకు చెందిన 30 మంది రైతులు సోమవారం కర్నూలులోని కలెక్టరేట్కు వచ్చారు. తాము ఉల్లిని సాగు చేసి గిట్టుబాటు ధరలు లేక దీన స్థితిలో ఉన్నామని, దయ ఉంచి రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న డబ్బులు విడుదల చేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరికి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం రైతులు రామాంజనేయులు, చిన్న లక్ష్మన్న, సుంకన్న మాట్లాడుతూ.. గ్రామంలో దాదాపు 30 మంది రైతులకు సంబంధించి రూ.50 లక్షలు రావాల్సి ఉందని, అదిగో..ఇదిగో అంటూ కాలం వెళ్లదీస్తున్నారన్నారు. -
ఆశల పంట 'ఎండు'తోంది
కోవెలకుంట్ల: కోటి ఆశలతో ఈ ఏడాది రబీ సీజన్లో మొదటి పంటగా శనగ సాగు చేసిన రైతులకు వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. విత్తనానికి ముందు అక్టోబర్ నెలలో మోంథా తుపాన్ ప్రభావంతో ఎడతెరిపి లేని వర్షాలతో అదునుకు విత్తనం వేయలేకపోయారు. పొలాల్లో తడి ఆరకపోవడంతో సాగు ఆలస్యమైంది. పైరు మొలకెత్తిన తర్వాత ఎండు తెగులు, కలుపు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఈ ఏడాది జిల్లాలోని 29 మండలాల పరిధిలో 59,881 హెక్టార్లలో శనగ సాగు సాధారణ విస్తీర్ణం కాగా ఆయా మండలాల పరిధిలో 48,871 హెక్టార్లలో రైతులు జేజే–11, ఫూలేజి రకాలను సాగు చేశారు. ఇందులో స్థానిక వ్యవసాయ సబ్ డివిజన్లోని సంజామల మండలంలో 9,435 హెక్టార్లు, కోవెలకుంట్లలో 6,950, ఉయ్యాలవాడలో 11,076, దొర్నిపాడులో 3,011, కొలిమిగుండ్లలో 3,820, అవుకు మండలంలో 1,068 హెక్టార్లలో సాగైంది. ఈ ఏడాది అక్టోబర్ రెండవ వారం నుంచి నవంబర్ 15వ తేదీ వరకు శనగ సాగుకు అదును కాగా విత్తన సమయంలో వారం, పది రోజులపాటు ఏకధాటిగా వర్షాలు కురిశాయి. పొలాల్లో తడి ఆరకపోవడం, భారీ వర్షాల కారణంగా పొలాల్లో కలుపుమొక్కలు విపరీతంగా పెరిగాయి. వాటిని తొలగించేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. నవంబర్ రెండవ వారం వరకు విత్తన పనులు కొనసాగాయి. సాగుకు అదును దాటి పోవడంతో జిల్లాలో పలు ప్రాంతాల్లో శనగసాగు తగ్గిపోవడంతో సాగు లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. మిగిలిన ప్రాంతాల్లో ఎన్నో వ్యయ ప్రయాసలు ఎదుర్కొని విత్తనం వేశారు. విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపునివారణ, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు ఇప్పటికే రూ. 15 వేలు వెచ్చించారు. కౌలు రైతులకు కౌలు రూపంలో అదనంగా మరో రూ. 10 వేలు భారం పడింది. గతేడాదీ నుంచి గోదాములోనే.. గత ఏడాది జిల్లాలో 79 వేల హెక్టార్లలో శనగ పంట సాగుచేశారు. విత్తన సమయంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురియలేదు. వరణుడిపై భారం వేసి జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో విస్తారంగా శనగ పంట సాగైంది. విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపు నివారణ, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు వేలాది రూపాయాలు వెచ్చించారు. మోతాదును మించి రసాయన ఎరువులు వాడటం, వాతావరణం అనుకూలించకపోవడం, తదితర కారణాలతో శనగ పైరు దెబ్బతిని నష్టం చేకూరింది. ప్రతి కూల పరిస్థితులతో ఎకరాకు 5 బస్తాల్లోపే దిగుబడులు వచ్చాయి. దిగుబడులు చేతికందేనాటికి మార్కెట్లో శనగకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆ ధరకు విక్రయించలేక పంట ఉత్పత్తులను గోదాముల్లో భద్రపరుచుకున్నారు. ప్రభుత్వం క్వింటా రూ. 8,750 మద్దతు ధర ప్రకటించగా మార్కెట్లో క్వింటా రూ. 5 వేలు పలకపోవడంతో ఇప్పటికి దిగుబడులు గోదాములు దాటలేదు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో దాదాపు కోటి బస్తాల దిగుబడులు గోదాముల్లో నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది దిగుబడులు అమ్ముడపోక ఈ ఏడాది కోటి ఆశలతో సాగు చేయగా తెగుళ్లు వెంటాడుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కొన్ని చోట్ల అదును దాటాక విత్తనం వేయడంతో పైరు అరకొరగా మొలకెత్తడంతో ఆ పంటను తొలగించే పరిస్థితులు నెలకొన్నాయి. సంబంధిత వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పైర్లను పరిశీలించి తెగుళ్ల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరుతున్నారు. వేరుకుళ్లు.. ఎండబెడుతోంది..పంట మార్పిడి విధానం అవలంభించకపోవడం, విత్తన సమయంలో పొలాలను కలియదున్నకపోవడం, మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడటం, వాతావరణం అనుకూలించకపోవడం, తదితర కారణాలతో శనగ పైరును వేరుకుళ్లు (ఎండు తెగులు) ఆశించింది. ఈ తెగులు ఆశించిన పైరులో మొక్క ఎండిపోయి చనిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తెగులు ఆశించిన పైరులో బైళ్లు, బైళ్లుగా మొక్కలు ఎండిపోవడంతో కొన్ని చోట్ల ఖాళీ పొలం కన్పిస్తోంది. జిల్లాలో ఫూలేజి (తెల్లశనగ) రకానికి చెందిన పైరుకు ఎక్కువశాతం ఎండు తెగులు ఆశించింది. తుపాన్ కారణంగా పొలాల్లో తేమ శాతం అధికంగా ఉండటంతో తెగులు ఆశించి పైరు దెబ్బతింటోందని వాపోతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడులు వెచ్చించగా పైరు ఎండు తెగులు కారణంగా శనగ ఎండిపోతుండటంతో రైతులు దిగుబడులపై ఆందోళన చెందుతున్నారు. పంటంతా తెగులే ఈ ఏడాది మూడు ఎకరాల సొంత పొలంలో పూలేజి రకానికి చెందిన శనగ పంట సాగు చేశాను. విత్తనాలు, రసాయన ఎరువులు, రెండు దఫాల క్రిమి సంహారక మందుల పిచికారి, కలుపు నివారణ, తదితర పెట్టుబడుల రూపంలో ఇప్పటి వరకు రూ. 15 వేలు వెచ్చించాను. తేమ శాతం అధికంగా ఉండటంతో పంటంతా ఎండు తెగులు ఆశించి మొక్కలు ఎండిపోతున్నాయి. పంటను ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు.– సుధాకర్రెడ్డి, రైతు, కంపమల్ల, కోవెలకుంట్ల మండలం శనగ సాగు కలిసి రావడం లేదు రెండేళ్ల నుంచి పప్పుశనగ సాగు కలిసి రావడం లేదు. ఈ ఏడాది ఇరవై ఎకరాల సొంత పొలంతోపాటు ఎకరా రూ. 15 వేలు చెల్లించి మరో 40 ఎకరాలు కౌలుకు తీసుకుని శనగ పంట సాగు చేశాను. పైరు నెల రోజుల దశలో ఉంది. పెట్టుబడుల రూపంలో ఇప్పటికే రూ. 12 వేలకు పైగా ఖర్చు చేశాను. అధిక వర్షాలతో శనగ అదునుకు సాగు చేయలేకపోవడం, పొలంతో తేమ శాతం అధికంగా ఉండటంతో ప్రస్తుతం పైరును వేరుకుళ్లు తెగులు ఆశించి మొక్కలు చనిపోయి పొలం బైళ్లుగా ఏర్పడుతోంది.– రామసుబ్బరాయుడు, రైతు, జోళదరాశి, కోవెలకుంట్ల మండలం -
ఇంటింటా సంతకం.. ఊరూరా ఉద్యమం
బొమ్మలసత్రం: ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిన ప్రైవేటీకరణ చేయడాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. వివిధ దశల్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టింది. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో రచ్చబండ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించింది. గ్రామ స్థాయి నుంచి ఈ కార్యక్రమం ప్రజా ఉద్యమంగా మారింది. ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గొని తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గమనించిన చంద్రబాబు సర్కార్ వైఎస్సార్సీపీ కార్యక్రమాలకు పోలీసులతో ఇబ్బందులు సృష్టించింది. పలు నిరసన కార్యక్రమాలకు హాజరుకాకుండా వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు జారీ చేయడం, ఇంటికే పరిమితం చేయడం వంటి సంఘటలకు పాల్పడింది. అయినా ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పోరు బాట పట్టింది. గత అక్టోబర్ నెల 10న కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలో ఎక్కడా లేని విధంగా పూర్తి స్థాయిలో ఫార్మెట్ను తయారు చేసి ఇంటింటికి తిరిగి ప్రజల అభిప్రాయాన్ని సేకరించింది. ఇలా జిల్లా వ్యాప్తంగా 60 రోజులు నిర్వహించింది. ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలో రెండు నెలల పాటు నిర్విఘ్నంగా సాగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం తుది దశకు చేరుకుంది. తమ పిల్లల భవిష్యత్తు కోసం జిల్లా వ్యాప్తంగా 4.20 లక్షల మంది సంతకాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. నంద్యాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో, బనగానపల్లె నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, డోన్ నియోజకవర్గంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మె ల్యే గంగుల బిజేంద్రనాథ్రెడ్డి, శ్రీశైలంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, నందికొట్కూరులో పార్టీ ఇన్చార్జ్ దారా సుధీర్ ఆధ్వర్యంలో ఊరూరా సంతకాల సేకరణ ఉద్యమంలా సాగింది. నేడు ర్యాలీగా సంతకాల ప్రతులు తరలింపు... జిల్లా వ్యాప్తంగా పీపీపీకి వ్యతిరేకంగా ప్రజల నుంచి సేకరించిన సంతకాల ప్రతుల బాక్సులను ఈనెల 10వ తేదీ జిల్లా కార్యాలయానికి తరలించి పార్టీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డికి అప్పగించారు. వాటిని సోమవారం జిల్లా కేంద్రంలోని జీవీ షాపింగ్మాల్ ఎదురుగా ఉన్న జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ఉదయం 9 గంటలకు ర్యాలీ గా తీసుకెళ్తారు. ఏడు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య బాక్సులను ర్యాలీ గా స్థానిక మున్సిపల్ కార్యాలయం వరకు తీసుకెళ్తారు. తర్వాత అక్కడి నుంచి విజయవాడ కేంద్ర కా ర్యాలయానికి వాహనాల ద్వారా తరలించనున్నా రు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్సార్సీపీ అధినేత ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీన గవర్నర్కు అప్పగించడంతో కార్యక్రమం పూర్తి కానుంది. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబు వెనుకడుగు వేసేలా ఊరూరా జనం నిరసన సంతకం చేశారు. కోటి సంతకాల సేకరణతో బాబుకు కనువిప్పు కలగాలి. జిల్లా కేంద్రంలో సోమవారం జరిగే భారీ ర్యాలీకి పార్టీ నాయకులు, అభిమానులు, ప్రజలు భారీగా తరలిరావాలి. స్థానిక జీవీ షాపింగ్మాల్ ఎదురుగా ఉన్న పార్టీ కార్యాలయం నుంచి ఉదయం 9 గంటలకు ర్యాలీ ప్రారంభమై మున్సిపల్ కార్యాలయం వరకూ కొనసాగుతుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నినాదాన్ని చంద్రబాబుకు అర్థం కావాలి. నాయకులు భారీ సంఖ్యలో హాజరై ర్యాలీని విజయవంతం చేయాలి. – కాటసాని రాంభూపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై జనాస్త్రం జిల్లాలో కోటి సంతకాల సేకరణ సంపూర్ణం నంద్యాలలో నేడు భారీ ర్యాలీ తరలిరానున్న ప్రజలు కదంతొక్కనున్న వైఎస్సార్సీపీ శ్రేణులు -
పంటంతా తెగులే
ఈ ఏడాది మూడు ఎకరాల సొంత పొలంలో పూలేజి రకానికి చెందిన శనగ పంట సాగు చేశాను. విత్తనాలు, రసాయన ఎరువులు, రెండు దఫాల క్రిమి సంహారక మందుల పిచికారి, కలుపు నివారణ, తదితర పెట్టుబడుల రూపంలో ఇప్పటి వరకు రూ. 15 వేలు వెచ్చించాను. తేమ శాతం అధికంగా ఉండటంతో పంటంతా ఎండు తెగులు ఆశించి మొక్కలు ఎండిపోతున్నాయి. పంటను ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు. – సుధాకర్రెడ్డి, రైతు, కంపమల్ల, కోవెలకుంట్ల మండలం రెండేళ్ల నుంచి పప్పుశనగ సాగు కలిసి రావడం లేదు. ఈ ఏడాది ఇరవై ఎకరాల సొంత పొలంతోపాటు ఎకరా రూ. 15 వేలు చెల్లించి మరో 40 ఎకరాలు కౌలుకు తీసుకుని శనగ పంట సాగు చేశాను. పైరు నెల రోజుల దశలో ఉంది. పెట్టుబడుల రూపంలో ఇప్పటికే రూ. 12 వేలకు పైగా ఖర్చు చేశాను. అధిక వర్షాలతో శనగ అదునుకు సాగు చేయలేకపోవడం, పొలంతో తేమ శాతం అధికంగా ఉండటంతో ప్రస్తుతం పైరును వేరుకుళ్లు తెగులు ఆశించి మొక్కలు చనిపోయి పొలం బైళ్లుగా ఏర్పడుతోంది. – రామసుబ్బరాయుడు, రైతు, జోళదరాశి, కోవెలకుంట్ల మండలం -
పశుపోషణకు గడ్డుకాలం
వరిగడ్డికి నేడు విపరీతమైన డిమాండ్ పెరిగింది. నీటిపారుదల ప్రాంతాల్లో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. వేసవిలో మేత సమస్య నుంచి కొంతమేర గట్టెక్కేందెకు రైతులు వరిగడ్డిపై దృష్టి సారించారు. వాస్తవంగా ఈ గడ్డిలో ఎలాంటి పోషకాలు ఉండవు. ఈ గడ్డిని యూరియాతో ట్రీట్మెంటు చేసుకుంటే 4 శాతం ఉండే అవకాశం ఉంది. యూరియా ట్రీట్మెంటు చేసుకునే పరిస్థితి జిల్లాలో లేదు. జిల్లాలోని తుగ్గలి, మద్దికెర, వెల్దుర్తి, క్రిష్ణగిరి, దేవనకొండ, ఆదోని, ఆస్పరి, కొడుమూరు, గూడూరు, సీ.బెళగల్ తదితర మండలాల రైతులు వరిగడ్డిపై దృష్టి సారించారు. నంద్యాల జిల్లా డోన్ నియోజక వర్గానికి కూడా పశుగ్రాసం, నీటి సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గత ఏడాది ట్రాక్టరు వరిగడ్డికి రూ.10 వేల వరకు ధర లభించింది. ఈ సారి రూ.13 వేల నుంచి రూ.15 వేల వరకు ధరలు పెరిగిపోయాయి. కర్నూలు(అగ్రికల్చర్): పశువుల మేతకు పనికి వచ్చే పంటల సాగు ఏటా తగ్గిపోతోంది. ఈ ఏడాది ఖరీఫ్లో ముందస్తు వర్షాలకు 12,88,700 ఎకరాల్లో పంటలు సాగు కాగా అందులో కేవలం 2.96 లక్షల ఎరాల్లోనే పశుగ్రాసానికి పనికి వచ్చే పంటలు ఉన్నా యి. దీంతో ఈ వేసవిలో పశుగ్రాసం కొరత వేధించనుంది. ప్రస్తుతం పచ్చి మేత అందుబాటులో ఉంది. ఫిబ్రవరి, మార్చి నుంచి పశుగ్రాసం కొరతతో పాటు తాగునీటి సమస్య కూడా ఏర్పడే ప్రమాదం ఉందని వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ అధికారులు అంచనా వేశారు. తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా కొంతవరకు ఊరట కలిగించే అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు పాలనలో ఈ దిశగా ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. వేరుశనగ, కొర్ర, మొక్కజొన్న, సజ్జ వంటి పంటల సాగు విస్తీర్ణం పెరిగి తే పశుగ్రాసం సమస్య తగ్గుతోంది. ఈ పంటల సాగు ను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సబ్సిడీపై నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయడం, ధరలు పడిపోయినప్పుడు మద్దతు ధరతో కొనుగోలు చేయడం తదితర రాయితీలు ఇస్తే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. కాని 2024–25, 2025–26 సంవత్సరాల్లో చంద్రమాబు సర్కారు ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 15 ఏళ్ల క్రితం వరకు జిల్లాలో వేరుశనగ దాదాపు 5.75 లక్షల ఎకరాల్లో సాగు అయ్యేది. కొర్ర, సజ్జ తదితర పంటల సాగు విస్తీర్ణం కూడా మెరుగ్గా ఉండేది. ఇందువల్ల అప్పట్లో పశుగ్రాసానికి సమస్య ఉండేది కాదు. ప్రస్తుతం ఆహార పంటలు, పప్పుదినుసులు. నూనెగింజల పంటలకు ప్రోత్సహా కాలు లేకపోవడంతో రైతుల దృష్టి వాణిజ్య పంటలపై పడింది. ఈ ఏడాది వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరగడం, పశుగ్రాసానికి పనికి వచ్చే పంటల సాగు తగ్గిపోవడంతో పశుపోషణ భారం కానుంది. వేసవి గట్టెక్కేదెలా... జిల్లాలో తెల్ల జాతి పశువులు 2,35,586, నల్లజాతి పశువులు 1,26,784 ప్రకారం మొత్తం 3,62,370 ఉన్నాయి. గొర్రెలు 11,03,043, మేకలు 3,04,744 ప్రకారం 14,07,787 ఉన్నాయి. జాతీ పశువులకు రోజుకు 30 కిలోల పచ్చి మేత, 7–8 కిలోల ఎండు మేత అవసరం, నాటు పశువులకు 15 కిలోల పచ్చిమేత, 5–6 కిలోల ఎండుమేత అవసరం. రానున్న రోజుల్లో రోజుకు మేత లభించని పరిస్థితి ఏర్పడనుంది. పశుగ్రాసం కొరత బారిన పడకుండా ఉండేందుకు కొందరు రైతులు ఇప్పటి నుంచే పశువులను తగ్గించుకుంటూ వస్తున్నట్లు సమాచారం. రెండు, మూడు వారాలుగా పశువుల అమ్మకాలు సంతల్లో 15–20 శాతం వరకు పెరిగినట్లు తెలుస్తోంది. వరిగడ్డికి పెరిగిన డిమాండ్... అధిక వర్షాలతో దెబ్బతిన్న వరి, మొక్కజొన్నఈ ఏడాది ఆగస్టు నుంచి కురిసిన అధిక వర్షాల వల్ల పంటలు నీట మునిగి పూర్తిగా దెబ్బతిన్నాయి. వరిగడ్డితో సహా వేరుశనగ, మొక్కజొన్న వంటి పంటలు కుళ్లిపోయాయి. వర్షాల వల్ల ఒకవైపు దిగుబడులు పడిపోగా.. మరోవైపు పశువులకు మేత లేకుండా పోయింది. ఇందువల్ల రానున్న రోజుల్లో పశుగ్రాసం కొరత ఉక్కిరి, బిక్కిరి చేసే ప్రమాదం ఉందని రైతులు ఊహిస్తున్నారు. మేత సమస్య నుంచి బయటపడేందుకు పశుసంవర్ధక శాఖ దగ్గర కనీస ప్రణాళిక లేకపోవడం గమనార్హం. వేసవిలో మేత, నీటి సమస్య తీవ్రంగా ఉండే ప్రమాదం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు సర్కారు విఫలం ప్రోత్సాహకాలు లేకపోవడంతో తగ్గుతున్న కొర్ర, వేరుశనగ, సజ్జ, జొన్న సాగు వరిగడ్డికి పెరిగిన డిమాండ్ -
యువకుడి అవయవదానం
ఆత్మకూరు: రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడి యువకుడు ప్రశాంత్ మృతి చెందడంతో కుటుంబ సభ్యుల కోరిక మేరకు అవయవదానం చేశారు. ఆత్మకూరు పట్టణం తోటగిరిలో నివాసం ఉంటున్న ప్రశాంత్ అనే యువకుడు గత శుక్రవారం హుసేనాపురంలో బంధువుల దగ్గరికి వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ యువకుడు కర్నూలు నగరంలోని కిమ్స్ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందుతూ శనివారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు అవయవదానం చేశారు. ప్రశాంత్ గుండెను తిరుపతికి, ఊపిరితిత్తులు బెంగళూరుకు, కిడ్నీలు కర్నూలుకు, లివర్ అనంతపురానికి, కళ్లు కర్నూలు వైద్యశాలలకు అందజేశారు. ఆదివారం మృతదే హాన్ని ఆత్మకూరుకు చేర్చి అంత్యక్రియలు నిర్వహించారు. పాములపాడు మండలం బానుముక్కల టర్నింగ్ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రశాంత్ తలకు తీవ్ర గాయాలై చికిత్స ఫలించక మృతిచెందాడని సీఐ రాము తెలిపారు. ప్రశాంత్ మరణం కుటుంబానికి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. కెరీర్ ఫెస్ట్కు సన్నద్ధం నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు పాఠశాల స్థాయిలో కెరీర్ ఫెస్ట్ను పకడ్బందీగా నిర్వహించాలని నంద్యాల జిల్లా సమగ్ర శిక్ష శాఖ అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త నిత్యానంద రాజు, జీసీడీఓ నాగసువర్చలు అన్నారు. స్థానిక కార్యాలయంలో కెరీర్ ఫెస్ట్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 6వ తేదీ నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో స్వీయ అవగాహన, నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్తు కెరీర్ ప్రణాళిక, సామర్థ్యాలను పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. 15న విద్యార్థుల్లో స్వీయ అవగాహన, కుటుంబ సభ్యుల వృత్తులపై అవగాహన కార్యక్రమాలు, 16న పదవ తరగతి, ద్వాదశ తరగతి, చిత్రాలు, చార్ట్లు, నిపుణుల ఉపన్యాసాల ద్వారా విద్యార్థులకు అవగాహన, 17న భవిష్యత్తులో అవసరమైన నైపుణ్యాలపై దృష్టి, జీవన నైపున్యాల అభివృద్ధికి కార్యకలాపాలు, 18న పాఠశాల స్థాయి కెరీర్ ప్రదర్శన, విద్యార్థుల ప్రతిభా ప్రదర్శనలు, ఉత్తమ నమూనాల ఎంపిక, బహుమతుల అందజేస్తామన్నారు. పతనమైన కొత్తిమీర ధర గోనెగండ్ల: ఈ ఏడాది సాగుచేసిన పంటలకు ఆశించిన మేర ధరలు లేకపోవడంతో రైతులు బోర్లు బావుల కింద కొత్తిమీర సాగు చేశారు. గత 20 రోజుల క్రితం ఒక మడి ధర రూ.800 ఉండగా నేడు రూ.100కు పడిపోయింది. ఒక్కసారిగా ధర పతనం కావడంతో రైతులు విలవిల్లాడుతున్నారు. ధర లేకపోవడంతో వ్యాపారులు రైతులకు కనిపించకుండా పోతున్నారు. కొత్తిమీర పంట తక్కువ కాలంలోనే వస్తుందని గోనెగండ్ల మండలంలో వెయ్యి ఎకరాలలో సాగుచేశారు. ఒక ఎకరాకు రూ.25వేల నుంచి రూ.30వేల వరకు పెట్టుబడి అవుతుందని రైతులు తెలుపుతున్నారు. ఎకరాలో 200 నుంచి 220 వరకు మడులు వేస్తా రు. ఆదివారం ఒక మడి ధర రూ.100 పలుకుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
నేడు కలెక్టరేట్లో ప్రజా వినతుల స్వీకరణ
నంద్యాల: స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈనెల 15వ తేదీ సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్సైట్లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9.30 గంటలకు అధికారులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. కొనసాగుతున్న నీటి విడుదల జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 2వేల క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నట్లు ఏఈ విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీశైలం జలాశయంలోకి 11,238 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా డ్యాంలో 880.70 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ వద్ద 879.70 అడుగుల నీటిమట్టం నమోదైనట్లు తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ గేట్లు మూసి వేసి కేవలం ఎన్సీఎల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. మూడు జన్రేటర్ల ద్వారా 1.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 2వేల క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ నీటిని బానకచర్ల నీటి నియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగ కాల్వకు 1,000 క్యూసెక్కులు, జీఎన్ఎస్ఎస్ కాల్వకు 500, కేసీఎస్కేప్ కాల్వకు 500 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు ఏఈ దేవేంద్ర తెలిపారు. -
మల్లన్న సన్నిధిలో మహాదోపిడీ!
సాక్షి, టాస్క్ఫోర్స్: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీశైలం మల్లన్న సన్నిధిలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అనుచరులు మహాదోపిడీకి పాల్పడుతున్నారు. దేవస్థానంలో ఏ పని చేయాలన్నా కాంట్రాక్టర్ నుంచి 7 శాతం బి–ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. చివరికి దాతలు వచ్చి భక్తులకు ఉపయోగపడే సత్రాలు, భవనాలు నిర్మించి ఇవ్వాలన్నా కమీషన్లు సమర్పించుకోవాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. వారు చెప్పినట్లు వినకపోతే ఏ పనీ జరగకుండా అడ్డుకుంటున్నారు. కాంట్రాక్టర్లపై దాడులకు సైతం వెనుకాడటం లేదు. వసూళ్ల కోసమే మండలానికి ఒక ఇన్చార్జి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి శ్రీశైలం మండలానికి తన అనుచరుడిని ఇన్చార్జిగా పెట్టారు. ప్రతి శాఖ అధికారులను పిలిపించి ఆయనకు పరిచయం చేశారు. తన అనుచరుడు చెప్పినట్లు వినాలని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. దీంతో ఆయన దేవస్థానంలో ఏ పని చేస్తున్నా కాంట్రాక్టర్ నుంచి 7 శాతం బి–ట్యాక్స్ ముక్కుపిండి వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. క్యూ కాంప్లెక్స్ మరమ్మతులు, మాడవీధుల అభివృద్ధి, సీసీ రోడ్ల నిర్మాణం, పుష్కరిణి అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్ల నుంచి ఎమ్మెల్యే బుడ్డా అనుచరుడు బి–ట్యాక్స్ వసూలు చేసినట్లు సమాచారం. అదేవిధంగా శివరాత్రి, సంక్రాంతి, ఉగాది, దసరా, కార్తీకమాసం, శ్రావణమాసం తదితర ప్రత్యేక పర్వదినాల సమయంలో పెండాల్స్, షామియానాలు, తాత్కాలిక విద్యుత్ దీపాల అలంకరణ, భక్తులకు ఇతర సదుపాయాల కల్పన కోసం పనులు చేసిన కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దేవస్థానం ఆదాయానికి భారీగా గండి కాంట్రాక్టర్లను సిండికేట్గా మార్చి కమీషన్లు వసూలు చేయడంలోనూ ఎమ్మెల్యే బుడ్డా అనుచరుడు కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన కాంట్రాక్టర్లను పిలిపించి ‘ఎవరు ఏ టెండర్ వేస్తారనేది ముందుగానే నిర్ణయించుకోండి. కేవలం 1 నుంచి 3 శాతం మాత్రమే నిర్ణీత ధర కన్నా తక్కువకు టెండర్ వేయండి. ఆ తర్వాత ఆఫీసులో నేను చూసుకుంటాను. మా కమీషన్ 7 శాతం ఇవ్వండి. మీరు పోటీ పడి 10 నుంచి 20 శాతానికి తక్కువకు టెండర్ వేసి నష్టపోవద్దు.’ అని హితబోధ చేస్తున్నట్లు తెలిసింది. తద్వారా దేవస్థానం ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. మరోవైపు శ్రీశైలం క్షేత్రం వద్ద భక్తులకు ఉపయోగపడేలా సత్రాలు, ఇతర ప్రైవేట్ భవనాలను నిరి్మంచే దాతలను బెదిరించి కూడా బి–ట్యాక్స్ వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీశైలంలో 4స్టార్ హోటల్ నిర్మించతలపెట్టిన హైదరాబాద్కు చెందిన ఒక వ్యాపారవేత్త నుంచి కూడా బి–ట్యాక్స్ వసూలు చేశారని సమాచారం. బి–ట్యాక్స్ చెల్లించకపోతే దాడులే... ఎమ్మెల్యే బుడ్డా అనుచరులకు బి–ట్యాక్స్ చెల్లించకపోతే కాంట్రాక్టర్లపై దాడులకు సైతం వెనుకాడటం లేదు. గతంలో దేవస్థానం నిర్వహించిన క్లోక్ రూమ్ టెండర్లో పాల్గొనేందుకు వచ్చిన సున్నిపెంటకు చెందిన ఓ కాంట్రాక్టర్పై దాడి చేసి పంపించారు. తాజాగా ఈ నెల 11వ తేదీన తలనీలాలు పోగుచేసుకునే కాంట్రాక్టు కోసం రూ.50లక్షలు చొప్పున చెక్కులు తీసుకుని బహిరంగ వేలంలో పాల్గొనేందుకు దేవస్థానం పరిపాలన భవనం వద్దకు వచ్చిన కాంట్రాక్టర్లపైనా దాడి చేసి రక్తం వచ్చేలా కొట్టారు. తమ ఎమ్మెల్యేతో మాట్లాడుకుని బేరం కుదుర్చుకున్న తర్వాతే రావాలని బెదిరించి పంపారు. ఇలా తరచూ కాంట్రాక్టర్లను బెదిరిస్తూనే ఉన్నారు. బుడ్డా బొమ్మ ఉంటే టిప్పర్ ఆగదుటీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీశైలం మండలంలో ఇసుక, కంకర ఎవరూ అమ్మకూడదని ఎమ్మెల్యే బుడ్డా అనుచరుడు హుకుం జారీ చేశారు. ఇసుక, కంకర అమ్మేవారిపై పోలీసు కేసులు పెట్టించి భయబ్రాంతులకు గురిచేశారు. అనంతరం ఇసుక, కంకర తన వద్దే కొనుగోలు చేసి అమ్ముకోవాలని చెప్పాడు. టన్నుకు అదనంగా రూ.100ఇవ్వాలని ఆదేశించాడు. దీనికి వ్యాపారులు అంగీకరించడంతో ఇసుక, కంకర రవాణా కోసం ఆయన ఏకంగా టిప్పర్లు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ టిప్పర్లు ఎవరూ ఆపకుండా వాటిపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఫొటోతో కూడిన స్టిక్కర్లను అతికించాడు. దీంతో ఎక్కడా వాటికి బ్రేకులు పడకుండా 24 గంటలూ తిరుగుతున్నాయి. మరోవైపు సున్నిపెంటలో ఉన్న రెండు మద్యం షాపుల నుంచి కూడా నెలకు రూ.2లక్షల చొప్పున వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
వంద రోజుల పనిదినాలు చేసిన కుటుంబాలు మండలాల వారీగా..
ఉపాధి పనులకు అరకొర హాజరైన కూలీలు (ఫైల్)చిన్నారులతో కలసి వలస వెళ్తున్న వీరు పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం కోతికొండ గ్రామస్తులు. ఈ ఊరిలో మొత్తం 900 మంది నివాసం ఉంటున్నారు. గ్రామంలో వ్యవసాయ పనులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు ఉపాధి పనుల జాడే లేకుండా పోయింది. దీంతో గ్రామం నుంచి ఇప్పటికే 400 మందికిపైగా వలసబాట పట్టారు. ఇంతమంది వలసవెళ్లినప్పటికి ఉపాధి పనులు కల్పించలేదు. మరో 100 మంది వలస వెళ్లారు. త్వరలో గ్రామం ఖాళీ అయ్యే అవకాశం ఉంది.పొలంలో పత్తి తీస్తున్న ఈ మహిళ పేరు ఉరుకుందమ్మ. కోసిగి మండలం పల్లెపాడుకు చెందిన ఈమెకు రెండు ఎకరాల వరకు భూమి ఉంది. నీటి సదుపాయం లేకపోవడం, వర్షాలు ఒకసారి ఎక్కువగా, మరొకసారి పడకపోవడంతో పొలాన్ని బీడుగా ఉంచారు. గ్రామంలో ఉపాధి పనులు లేకపోవడంతో ఈమె తన భర్త, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తెతో కలసి కర్ణాటక రాష్ట్రానికి వలస వెళ్లారు. ఉరుకుందమ్మ ఒక కుమారుడు పదో తరగతి చదువుతున్నాడు. కరువుతో డబ్బుల్లేక పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫీజు కూడా చెల్లించలేదు. కర్ణాటకలో ప్రస్తుతం ఈ మహిళ పత్తి తీస్తున్నారు.కర్నూలు(అగ్రికల్చర్): చంద్రబాబు ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి పనులు కరువయ్యాయి. వ్యవసాయ కూలీలు, చిన్న, సన్నకారు రైతులు వలసబాట పట్టారు. పనిదినాల సంఖ్య అతి తక్కువగా ఉండటంతో పల్లెలన్నీ ఖాళీ అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే జిల్లా నుంచి 1.50 లక్షల కుటుంబాలు వలస వెళ్లిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరం కర్నూలు జిల్లాకు కేవలం 58 లక్షలు పనిదినాలు ఇచ్చారు. వీటిని 2026 మార్చి వరకు వినియోగించాల్సి ఉంది. ఇప్పటికే 50.88 లక్షల పనిదినాలను ఉపాధి కూలీలు వినియోగించుకోగా మిగిలింది కేవలం 7.12 లక్షలు మాత్రమే. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు ప్రతి ఏటా కోటి పనిదినాలు కల్పించారు. అడిగిన వారందరికీ ‘ఉపాధి’ చూపించారు. ప్రస్తుతం టీడీపీకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అధికారులపై ఫిర్యాదులు సైతం వెళ్లాయి. కర్నూలు జిల్లాలో 1,214 కుటుంబాలకు.. ఎన్ఆర్ఈజీఎస్ మార్గదర్శకాల ప్రకారం జాబ్కాార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలి. కర్నూలు జిల్లా ఉమ్మడిగా ఉన్నసమయంలో ఏటా లక్ష కుటుంబాలకు 100 రోజుల పని కల్పించేవారు. విభజన తర్వాత ఒక్కో జిల్లాలో 50 వేల కుటుంబాలకు 100 రోజుల పని కల్పించాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు తొమ్మిది నెలలు గడచిపోగా కేవలం 1214 కుటుంబాలకు 100 రోజుల పని కల్పించారు. కర్నూలు జిల్లాలోని ఆదోని, పత్తికొండ, కర్నూలు డివిజన్లు కరువు పీడిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఒక్క ఆదోని డివిజన్లో తొమ్మిది నెలల్లో 171 కుటుంబాలకు మాత్రమే 100 రోజుల పని దినాలు కల్పించడం గమనార్హం. నంద్యాల జిల్లాలో 1,759 కుటుంబాలకు... నంద్యాల జిల్లాలో 489 పంచాయతీలు ఉండగా ఈ ఏడాది 58 లక్షల పని దినాలు కేటాయించారు. జాబ్కార్డులు 2.56 లక్షలు ఉండగా 4.69 లక్షల మంది కూలీలు ఉన్నారు. ఇప్పటికే 51.19 లక్షల పని దినాలను వినియోగించుకున్నారు. నంద్యాల జిల్లాలో ప్రధానంగా ప్యాపిలి, డోన్, బేతంచెర్ల, బనగానపల్లె, అవుకు, కొలిమిగుండ్ల, మిడుతూరు, జూపాడుబంగ్లా తదితర మండలాల్లో ఉపాధి పనులకు డిమాండ్ ఉంది. డోన్ నియోజకవర్గం పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడింది. ఇప్పటి వరకు 51.19 లక్షల పనిదినాల్లో ఎక్కువ డోన్ నియోజకవర్గానికి చెందిన వారు వినియోగించుకున్నారు. నంద్యాల జిల్లాకు మిగిలిన పని దినాలు కేవలం ఏడు లక్షలు మాత్రమే. డోన్ నియోజకవర్గంలో ఇప్పటికే వ్యవసాయ పనులు పూర్తి అయ్యాయి. ఉపాధి పనులు లేక వలసబాట పట్టారు. కానీ ఇంతవరకు ఉపాధి పనుల జాడే లేకుండా పోయింది. నంద్యాల జిల్లాలో తొమ్మిది నెలల్లో 1759 కుటుంబాలకు మాత్రమే 100 రోజుల పని దినాలు కల్పించారు. ప్రాధాన్యం తగ్గించి చంద్రబాబు ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకానికి ప్రాధాన్యత తగ్గించింది. సాధారణంగా ఒక పని దినం విలువ రూ.511 ఉంటుంది. ఇందులో రూ.307 లేబర్ కాంపోనెంట్ కింద ఖర్చు చేస్తారు. రూ.204 మెటీరియల్ కింద అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తారు. ఉపాధి పనులకు కూలీలు ఎంత మంది వస్తే మెటీరియల్ కింద అభివృద్ధి పనులకు కూడ అదేస్థాయిలో అవకాశం ఉంటుంది. చంద్రబాబు సర్కార్ చర్యలతో ఉపాధి పనులు కూడా ఇక కరువు అవుతున్నాయి. జిల్లాకు కేటాయించిన పనిదినాల్లో కేవలం 7.12 లక్షలు మాత్రమే మిగిలి ఉండటంతో ఉద్దేశపూర్వకంగానే ప్రజలకు పనులు ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి. మండలం పనిచేసిన కుటుంబాలు ఆదోని 2 పెద్దకడుబూరు 8 ఎమ్మిగనూరు 9 నందవరం 14 గూడూరు 14 కర్నూలు 14 కోసిగి 15 కల్లూరు 21 సి.బెళగల్ 21 పత్తికొండ 22 కౌతాళం 25 కృష్ణగిరి 25 కొత్తపల్లి 30 మంత్రాలయం 30 కోడుమూరు 30 ఆస్పరి 32 కొలిమిగుండ్ల 32 నందికొట్కూరు 32 గోనెగండ్ల 33 పగిడ్యాల 36 హొళగుంద 36 దేవనకొండ 36 వెలుగోడు 37వైఎస్సార్సీపీ హయాంలో..గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మెటీరియల్ కింద పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు అవకాశం ఇచ్చింది. అందువల్లనే అప్పట్లో గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, విలేజ్ క్లీనిక్లు, బల్క్మిల్క్ కూలింగ్ సెంటర్లు, డిజిటల్ ల్రైబ్రరీలు నిర్మించే అవకాశం ఏర్పడింది. గ్రామాలకు అవసరమైన సదుపాయాలు ఏర్పడ్డాయి. అప్పట్లో ప్రతి ఏటా కర్నూలు జిల్లాకు కోటి పనిదినాలు కల్పించారు. నంద్యాల జిల్లాలో ప్రజలకు అదే స్థాయిలో పనులు ఇచ్చారు. పని దినాల్లో భారీగా కోత ఈ ఏడాది 58 లక్షలకే పరిమితం ఇప్పటికే 50.88 లక్షల వినియోగం మిగిలింది 7.12 లక్షలు మాత్రమే మార్చి వరకు పనులు ఉండవు వలసబాట పట్టిన ప్రజలు -
ఒకే రోడ్డుకు రెండు శాఖల నిధులు
జూపాడుబంగ్లా: గ్రామీణ రహదారులు గుంతలమయమై వాహనదారులు అవస్థలు పడుతున్నా కనీసం ప్యాచ్ వర్క్లు చేపట్టడం లేదు. కొన్ని రహదారులు అధ్వానంగా ఉండటంతో బస్సు సర్వీసులు రద్దైన గ్రామాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకే రోడ్డు అభివృద్ధికి రెండు శాఖల నుంచి నిధులు మంజూరు కావడం అధికారుల అవగాహన లోపానికి నిదర్శనంగా నిలుస్తోంది. 80 బన్నూరు–చాబోలు వరకు ఉన్న 5.029 కిలోమీటర్ల రోడ్డు ఏశాఖ పరిధిలో ఉందన్న విషయంపై పంచాయతీరాజ్శాఖ, జలవనరులశాఖ అధికారుల మధ్య సమన్వయం కరువైంది. ఈ క్రమంలో ఒకే రోడ్డుకు రెండుశాఖలు ప్రతిపాదనలు పంపించటంతో చంద్రబాబు సర్కార్ రెండుశాఖలకు నిధు లు మంజూరు చేయటం చర్చనీయాంశంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్కు ఎంతో ప్రాధాన్యత ఉంది. అక్కడికి వెళ్లాలంటే ఎన్హెచ్ 340సీ రోడ్డు మీదుగా 80 బన్నూరు గ్రామం వద్దకు వెళ్లి అక్కడి నుంచి పోతులపాడు, చాబోలు గ్రామాల మీదుగా ప్రయాణించాలి. 1985లో పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నిర్మించగా అక్కడికి వెళ్లేందుకు ఉన్న రోడ్డు మొదట్లో పంచాయతీరాజ్శాఖ అధ్వర్యంలో ఉండేది. క్రమేణా ఆ రోడ్డును జలవనరులశాఖ అధికారులు స్వాధీనం చేసుకొని వారి అధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. ఏడేళ్ల క్రితం సుమారు రూ.1,300 కోట్లతో పీఎన్సీ కంపెనీ వారు పోతిరెడ్డిపాడు నుంచి బానకచర్ల వరకు ఎస్సారెమ్సీ కాల్వ విస్తరణ పనులు చేపట్టారు. అందులో భాగంగా 80 బన్నూరు నుంచి చాబోలు వరకు బీటీరోడ్డు నిర్మాణం నిమిత్తం రూ.4 కోట్ల నిధులను కేటాయించారు. అయినా ఇంత వరకు పనులు చేపట్టలేదు. విస్తరణ పనుల కోసం హెవీలోడ్ (సుమారు 40 టన్నుల) సామర్థ్యంతో టిప్పుర్లు తిరగటంతో రోడ్డుకాస్త చిధ్రౖ మె అడుగు అడుగునా గుంతలమయమైంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఈ రోడ్డు నిర్మాణానికి రూ.2.53 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఒకే రోడ్డుకు రెండుశాఖల నుంచి నిధులు మంజూరు కావడంపై చర్చనీయాంశమైంది. అయోమయంలో అధికారులు.. జలవనరులశాఖ అధ్వర్యంలో ఉన్న 80బన్నూరు–చాబోలు రోడ్డు నిర్మాణానికి పంచాయతీరాజ్శాఖ(పీఐయు) అధ్వర్యంలో రూ.2.59 కోట్ల నిధులు మంజూరు చేయటంతో జలవనరులశాఖ అధికారులు అవాక్కవుతున్నారు. తమశాఖ ఆధీనంలో ఉన్న రోడ్డుకు పంచాయతీరాజ్శాఖ తరుపున నిధులు ఎలా మంజూరుచేస్తారని పేర్కొంటున్నారు. అయితే పంచాయతీరాజ్శాఖ అధికారులకు 80బన్నూరు–చాబోలు రోడ్డు జలవనరులశాఖ ఆధీనంలో ఉన్నట్లు తెలియక రోడ్లు ఉంటే పంచాయతీరాజ్శాఖ లేదా ఆర్అండ్బీ అధ్వర్యంలో ఉంటాయని పేర్కొనటాన్ని చూస్తే కనీసం ఏ రోడ్డు ఏశాఖ పరిధిలో ఉన్నట్లు కూడా తెలుసుకొన్నట్లు లేరనే విషయం అవగతమవుతుంది. ఈ విషయంపై పంచాయతీరాజ్శాఖ(పీఐయూ) డీఈ హరిదాస్ ఈరన్నను వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. 80 బన్నూరు–చాబోలు రోడ్డుకు రూ.2.53 కోట్ల నిధులు మంజూరు ఇరిగేషన్ అధ్వర్యంలో ఉన్న రోడ్డుకు పంచాయతీరాజ్శాఖ నిధులు పోతిరెడ్డిపాడు విస్తరణ పనుల్లో ఇప్పటికే రోడ్డుకు రూ.4 కోట్లు మంజూరు -
‘స్థానిక’ ఎన్నికలను బహిష్కరిస్తాం
ఆదోని రూరల్: చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న పెద్దహరివాణం మండలం ఏర్పాటు నిర్ణయాన్ని 16 గ్రామాల ప్రజలు వ్యతిరేకించారు. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తామని ఆ గ్రామాల ప్రజలు ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శనివారం 16 గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు ఆదోని పట్టణంలోని రెడ్డి భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గోపాల్రెడ్డి, బసాపురం వెంకటేష్, గణేకల్ విరుపాక్షి, మదిరె సర్పంచ్ నారాయణ, బసాపురం రామస్వామి, చాగి రాము, గణేకల్ ఎంపీటీసీ ఉచ్చీరప్ప మాట్లా డుతూ.. జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఐక్యమత్యంతో బహిష్కరిస్తామని తీర్మానం చేశారు. ఇప్పటికే 16 గ్రామాలను పెద్దహరివాణం మండలంలో చేర్చవద్దని జిల్లా కలెక్టర్కు, సబ్కలెక్టర్కు, తహసీల్దార్, స్థానిక ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత భవిష్యత్ కార్యాచరణను చేపట్టనున్నట్లు వారు తెలిపారు. -
భావితరాలకు మార్గదర్శకులు కావాలి
● హైకోర్ట్ జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసరెడి్డ ఎమ్మిగనూరుటౌన్: ‘‘ అందరూ ఆరు, ఏడు పదుల వయసు దాటిన వారే.. అందరికీ తెలియనిదంటూ ఏమీ లేదు.. భావితరాలకు మార్గదర్శకులు కావాలి’ అని తన తోటి మిత్రులు, సీనియర్లు అయిన పూర్వ విద్యార్థులకు హైకోర్ట్ జడ్జి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 1971–1974, 1972–1975 విద్యాసంవత్సరాలతో పాటు తరువాత చదివిన పూర్వ విద్యార్థుల అ‘పూర్వ’ మహా సమ్మేళనం ఎమ్మిగనూరు విశాల గార్డెన్లో శనివారం నిర్వహించారు. సుప్రీం కోర్ట్ న్యాయవాది బి.పురుషోతం రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాడు చదువులు చెప్పిన కళాశాల అధ్యాపకులైన బి.కేశవరెడ్డి, టీజీ.దత్త, పివి.రాజు, పి.నాగిరెడ్డిలను హైకోర్టు జడ్జితో పాటు పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఆనాటి హృదయాల ఆనందగీతం అ‘పూర్వ’ మహా సమ్మేళనంలో దేశ, విదేశాల్లో స్థిరపడిన వారందరూ కలిసి భోజనాలు చేశారు. నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అప్పటి స్మృతులను ఒరరికొకరు చెప్పుకొంటూ సాయంకాలం వరకు సరదాగా గడిపారు. బాల్య మిత్రులను పేరుపెట్టి పలక రించారు. యాభై ఏళ్ల తర్వాత కలవడం ఆనందంగా ఉందన్నారు. ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సి పాల్ దైవాదీనంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లాలో 19,577 కేసుల పరిష్కారం
కర్నూలు(హాస్పిటల్): జాతీయ లోక్ అదాలత్, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయమూర్తి జి.కబర్ధి ఆద్వర్యంలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్లో ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో 19,577 కేసులు పరిష్కారమయ్యాయి. 197 మోటార్ ఆక్సిడెంట్ కేసుల్లో రూ.6,34,62,000 బాధితులకు నష్టపరిహారంగా ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ మొత్తం రెండు జిల్లాల్లో 28 బెంచీలను ఏర్పాటు చేసి 284 సివిల్ కేసులు, 197 మోటార్ యాక్సిడెంట్ కేసులు, 19,096 క్రిమినల్ కేసులను పరిష్కరించామని తెలిపారు. ఈ సమావేశంలో మొదటి అదనపు జిల్లా జడ్జి కమలాదేవి, ఆరవ అదనపు జిల్లా జడ్జి వాసు, ఏడవ అదనపు జిల్లా జడ్జి లక్ష్మీ రాజ్యం, కర్నూలు బార్ ప్రెసిడెంట్ హరినాథ్ చౌదరి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్, రిటైర్డ్ అదనపు జిల్లా జడ్జి లక్ష్మీనరసింహారెడ్డి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి మల్లేశ్వరి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సరోజనమ్మ, జూనియర్ సివిల్ జడ్జి కిరణ్కుమార్, అనూష, కోర్టు మానిటరింగ్ సీఐ రామానాయుడు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. -
మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట
● వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్దార్థరెడ్డిపాములపాడు: ప్రజలను నమ్మించి మోసం చేయ డంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిట్ట అని వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి విమర్శించారు. శనివారం మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని పరిస్థితుల గురించి ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పంటలకు మద్దతు ధర కల్పిస్తామని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలేనని తేలిపోయిందన్నా రు. పక్కనున్న తెలంగాణలో మొక్కజొన్న మద్దతు ధర రూ.2,400తో ప్రభుత్వం కొనుగోలు చేసిన విషయాన్ని వివరించారు. కేంద్రంలో బీజేపీతో పొత్తు ఉండి కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులను దగా చేసిందని మండిపడ్డారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి నెలా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యాయన్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభు త్వం పథకాల అమలులో ఆపసోపాలు పడుతోందని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిస్థితి చూస్తుంటే నవ్వొస్తోందన్నారు. ఎప్పుడో పట్టుకున్న ఎర్రచందనం దుంగల వద్దకు వెళ్లి సీజ్ అంటున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఏడాదిన్నరకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకండి.. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పిలుపునిచ్చారు. అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడినా ఎవరూ వెనకడుగు వేయొద్దని, పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. పోటీలో నిలిచే పార్టీ మద్దతుదారుల విజయానికి కృషి చేద్దామన్నారు. సమావేశంలో ఆ పార్టీ మండల కన్వీనర్ నాగరాజు, కో ఆప్టెడ్ ముర్తుజాఅలీ, ఎంపీటీసీ సురేష్, సొసైటీ మాజీ చైర్మన్లు గడ్డం క్రిష్ణారెడ్డి, వెంకటస్వామి, నాయకులు కృష్ణారెడ్డి, యుగంధర్రెడ్డి, చలమారెడ్డి, ప్రభాకరరెడ్డి, బాలునాయక్, మహానందిరెడ్డి, జబ్బార్, ఉశేన్, కోటి నాయక్, ఓబన్నగౌడు పాల్గొన్నారు. -
ఆళ్లగడ్డ సబ్ ట్రెజరీలో అవకతవకలపై విచారణ
నంద్యాల(అర్బన్): ఆళ్లగడ్డ సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఉద్యోగుల జీతభత్యాల్లో చోటు చేసు కున్న అవకతవకలపై ఉన్నతాధికారులు విచారణకు సిద్ధమయ్యారు. ఆరోగ్య శాఖకు సంబంధించి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల గత ఐదేళ్ల జీతభత్యాలకు సంబంధించి రూ.1.5 కోట్ల అవకతవకలు జరిగినట్లు సమాచారం. జిల్లా ట్రెజరీలో పని చేస్తున్న సీనియర్ అకౌంటెంట్, ఆళ్లగడ్డ సబ్ ట్రెజరీలో పని చేస్తున్న సీనియర్ అకౌంటెంట్లు అవకతవకలకు పాల్పడినట్లు తెలుస్తోంది. వీరితో పాటు ప్రస్తుతం జమ్మలమడుగు పీహెచ్సీలో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ పాత్ర ఉన్నట్లు సమాచారం. ట్రెజరీలో పెద్దమొత్తంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఒక రిటైర్డు ఉద్యోగి, సీనియర్ అకౌంటెంట్, ఒక ఎస్టీఓను కూడా విచారించనున్నట్లు తెలుస్తోంది. సబ్ ట్రెజరీలో ఇంత పెద్ద మొత్తంలో అవకతవకలు జరగపడంపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై జిల్లా ట్రెజరీ ఆఫీసర్ లక్ష్మీదేవిని ఫోన్లో సంప్రదించగా ఎటువంటి సమాధానం రాలేదు. మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. శనివారం ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరు కుని స్వామి అమ్మ వార్లను దర్శించుకున్నారు. వేకువ జాము నుంచే పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి ఆలయ క్యూ లైన్లలో బారులుదీరారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండి పోయా యి. భక్తుల శివ నామ స్మరణతో శ్రీశైల ఆల యం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులు కళకళలాడుతున్నాయి. గంజాయి స్మగ్లర్ల అరెస్టు ● మూడు కేజీల గంజాయి స్వాధీనం ఆత్మకూరురూరల్: గంజాయి సరఫరా చేసే ఇద్దరు స్మగ్లర్లను ఆత్మకూరు పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 60 వేల విలువ చేసే మూడు కేజీల గంజాయిని స్వాధీ న పరుచుకున్నారు. ఆత్మకూరు ఎస్డీపీవో రామాంజినాయక్ తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలు తెలిపారు. కొత్తపల్లె మండల కేంద్రానికి చెందిన కేతె పుల్లయ్య జీవనోపాధి నిమిత్తం జేసీబీ ఆపరేటర్గా ఒడిశాలో పని చేసేవాడు. కొత్తపల్లె మండలం గువ్వలకుంట్లకు చెందిన శ్రీరాములుతో పరిచయం పెంచుకుని తెలంగాణా కొల్లాపురం మండలం సోమశిలకు చెందిన తిరుపాలుతో కలసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఒడిశా నుంచి గంజాయి తీసుకు వచ్చి గంజాయి వ్యసన పరులకు అమ్మేవారు. ఒడిశా రాష్ట్రం బరంపురానికి చెందిన కిశోర్ నుంచి ఈ ముఠా కేజీ రూ.9500కు కొనుగోలు చేసి కిలో రూ. 19వేల చొప్పున అమ్మేవారు. సమాచారం అందడంతో ఆత్మకూరు అర్బన్ సీఐ తన సిబ్బందితో వల పన్ని ఆత్మకూరు సమీపంలో కేతె పుల్లయ్య, శ్రీరాములులను అదుపులోకి తీసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం ● కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ కర్నూలు (హాస్పిటల్): ప్రతి శనివారం రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సంయుక్తంగా ఒక ప్రకటనలో ఆదేశాలు జారీ చేశా రు. పోలీసు అధికారులకు వాహనదారులు రహ దారి భద్రత నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని తెలిపా రు. ఈ సందర్భంగా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయా పోలీస్స్టేషన్ పరిధులలో జిల్లా పోలీసు అధికారులు ప్రజలకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించారు. బైక్లు నడిపేవారు కచ్చితంగా హెల్మెట్లు ధరించే విధంగా, ఓవర్ స్పీడ్, ఓవర్ లోడ్తో వాహనాలు వెళ్లకుండా, డ్రంకెన్ డ్రైవ్ చేయరాదని, తదితర రోడ్డు భద్రత ప్రా ముఖ్యతలపై ప్రజలకు అవగాహన కల్పించారు. -
మా ఎమ్మెల్యేతో బేరం కుదిరాకే రండి!
సాక్షి, నంద్యాల/సాక్షి టాస్క్ఫోర్స్: శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఇటీవల అటవీశాఖ సిబ్బందిపై దాడి చేసిన ఘటన మరువకముందే... ఆయన అనుచరులు ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీశైలంలో కాంట్రాక్టర్లపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. పరమేశ్వరుడి సన్నిధిలో భక్తులు సమర్పించిన తలనీలాలు పోగుచేసుకునే కాంట్రాక్టు కోసం టెండర్లో పాల్గొనేందుకు వచ్చిన కాంట్రాక్టర్లను తరిమికొట్టారు. ‘మా ఎమ్మెల్యేతో బేరం కుదుర్చుకున్నాకే రండి..’ అంటూ బెదిరించి వెనక్కి పంపినట్లు సమాచారం. రెండురోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేవస్థానం ఆఫీసు లోపలికి రాకుండానే బెదిరింపులు! శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దేవస్థానంలో తలనీలాలు పోగు చేసుకునే హక్కును గత సంవత్సరం రూ.4.89 కోట్లకు అనంతపురానికి చెందిన రాజా ఎంటర్ప్రైజెస్ పొందింది. వారి కాలపరిమితి పూర్తవడంతో ఒక ఏడాదికి సుమారు రూ.5కోట్ల అంచనాలతో టెండర్ కమ్ బహిరంగ వేలం కోసం దేవస్థానం నెల రోజుల కిందట టెండర్లు ఆహ్వానించింది. కొద్దిరోజుల కిందట బహిరంగ వేలంపాటకు అన్నీ సిద్ధం చేసినా దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్, ఈవో స్థానికంగా లేకపోవడంతో వాయిదా వేశారు. ఈ నెల 11న రెండోసారి బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. దీంతో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి పలువురు కాంట్రాక్టర్లు రూ.50లక్షలు చొప్పున డీడీలు తీసుకుని బహిరంగ వేలంలో పాల్గొనేందుకు దేవస్థాన పరిపాలన భవనం వద్దకు వచ్చారు. అప్పటికే అక్కడ ఆత్మకూరు, శ్రీశైలం, సున్నిపెంటకు చెందిన కొందరు ఎమ్మెల్యే బుడ్డా అనుచరులు కాపు కాసి కాంట్రాక్టర్లను అడ్డుకున్నారు.అయినా కొందరు కాంట్రాక్టర్లు వారి నుంచి తప్పించుకుని ఆఫీసు లోపలికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనుచరులు లోపలికివెళ్లి కాంట్రాక్టర్లపై దాడి చేశారు. ‘మా ఎమ్మెల్యేతో బేరం కుదుర్చుకుని రమ్మంటే ఏంట్రా ఇంకా ఇక్కడే ఉన్నారు..’ అంటూ కేకలు వేస్తూ బీభత్సం సృష్టించారు. వారి నుంచి తప్పించుకుని పారిపోతున్న కాంట్రాక్టర్లను వెంటపడి రక్తం వచ్చేలా కొట్టినట్లు తెలిసింది.కాంట్రాక్టర్లపై ఎమ్మెల్యే అనుచరుల దాడి దృశ్యాలను ఓ కాంట్రాక్టర్ డ్రైవర్ సెల్ఫోన్లో చిత్రీకరిస్తుండగా, టీడీపీ నాయకులు అతడిపైనా దాడి చేసి సెల్ఫోన్ లాక్కుని వీడియోలు డిలీట్ చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే అనుచరుల గూండాగిరితో భక్తులు, దేవస్థాన అర్చకులు, సిబ్బంది భయభ్రాంతులకు గురైనట్లు తెలిసింది.దాడి చేస్తారని పోలీసులకు ముందుగా తెలిసినా..! తలనీలాల టెండర్లో పాల్గొనేందుకు వచ్చిన కాంట్రాక్టర్లపై ఎమ్మెల్యే బుడ్డా అనుచరులు దాడి చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ సిబ్బంది ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో దేవస్థాన పరిపాలన భవనానికి పోలీసులు, ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు చేరుకున్నారు. అయినా వారి సమక్షంలోనే టీడీపీ మూకలు రెచ్చిపోయి కాంట్రాక్టర్లపై దాడి చేసినట్లు విశ్వసనీయ సమాచారం.కమిషనర్కు కాంట్రాక్టర్ల ఫిర్యాదు.. టెండర్ రద్దు తలనీలాల టెండర్లో పాల్గొనకుండా తమపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అనుచరులు దాడి చేశారని కాంట్రాక్టర్లు వెంటనే రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో ఆ టెండర్ను రద్దు చేశారు. తమపై దాడి గురించి సమగ్ర దర్యాప్తు జరిపించాలని కాంట్రాక్టర్లు కోరినట్లు సమాచారం. అసలు టెండర్తో సంబంధం లేని వ్యక్తులు దేవస్థాన పరిపాలన భవనం వద్దకు ఎలా వచ్చారు? వారిని ఎవరు పంపించారు? ఎవరు అనుమతించారు? వంటి విషయాలపై లోతుగా దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. దేవస్థాన పరిపాలన భవనం వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తే తమపై దాడి చేసిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయని చెప్పినట్లు సమాచారం.టెండర్ ధర తగ్గించేందుకు ఎమ్మెల్యే కుట్ర?కాంట్రాక్టర్లను బెదిరించి బహిరంగ వేలంలో పాల్గొనకుండా చేయాలని, తద్వారా తక్కువ ధరకు తలనీలాల కాంట్రాక్టును తాను సూచించినవారికి దక్కేలా చేయాలని ఎమ్మెల్యే కుట్ర పన్నినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్లే తన అనుచరులతో కాంట్రాక్టర్లను బెదిరించి కొందరిని సిండికేట్గా ఏర్పాటుచేసి గత ఏడాది కన్నా తక్కువ ధరకు టెండర్ వేసేలా చక్రం తిప్పుతున్నారని విమర్శలు వస్తున్నాయి. అంతిమంగా దేవస్థానానికి వెళ్లాల్సిన ఆదాయాన్ని తాను పొందేలా పథకం రచించారని ప్రచారం జరుగుతోంది. -
జగనన్న బ్యాగును వాడుతున్నారు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన బ్యాగును మా పిల్లలు వాడుకుంటున్నారు. ఈ ఏడాది పాఠశాలలో విద్యార్థులకు ఇచ్చిన బ్యాగులు కొద్ది రోజులకే పిగిలిపోయాయి. కొద్ది రోజుల పాటు కుట్లు వేసుకొని కాలం గడుపుకున్నాం. చివరికి పూర్తిగా చిరిగి పోవడంతో చేసేది లేక గతంలో ఇచ్చిన బ్యాగు బాగుండటంతో ఆ బ్యాగుతోనే ప్రస్తుతం ముందుకు వెళ్తున్నాం. – ఆదినారాయణ, విద్యార్థి తండ్రి, ఆకుమల్ల స్కూల్లో ఇచ్చిన బ్యాగులు కొద్దిరోజులకే చిరిగిపోయాయి. చిరిగిన చోట్ల కుట్లు వేసుకుని తెచ్చుకుంటున్నాం. మా క్లాసులో చాలా మంది విద్యార్థుల బ్యాగులు పాడయ్యాయి. చాలా మంది కొత్త బ్యాగ్లు కొనుగోలు చేశారు. నాణ్యమైన బ్యాగులు ఇవ్వాలి. – అసిఫా, 9వ తరగతి, తిమ్మాపురం, మహానంది మండలం -
హంద్రీ–నీవా కాల్వలో గుర్తు తెలియని మృతదేహం
కోడుమూరు రూరల్: లద్దగిరి సమీపంలో ఉన్న హంద్రీ–నీవా కాల్వలో శుక్రవారం 30 సంవ త్సరాలు పైబడ్డ ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని కోడుమూరు పోలీసులు గుర్తించా రు.మృతదేహం గుర్తు పట్టలేని విధంగా తయా రైంది.కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవ్వరైనా చంపి కాల్వలో పడవేశారా అన్న కోణంలో కోడుమూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆదోని జిల్లా సాధనకు పోరాడుదాం ఎమ్మిగనూరుటౌన్/మంత్రాలయం: ఆదోని జిల్లా సాధన కోసం ప్రతి ఒక్కరం కలిసి పోరాడుదామని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. ఆదోని జిల్లా సాధనకై ఎమ్మిగనూరు పట్టణంలోని వైఎస్ఆర్ సర్కిల్, మంత్రాలయంలలో విద్యార్థి, యువజన, ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు నిర్వహి స్తున్నారు. దీక్షలో కూర్చున్న వారికి శుక్రవారం పలు ప్రజాసంఘాల నాయకులతో పాటు ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. అంతకుమునుపు పట్టణంలో ఆదోని జిల్లా చేయాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదోని జిల్లా ఏర్పాటుపై మీకు ఏమైనా విషయం హమీ ఇచ్చామా అని స్థానిక నాయకులతో చెప్పడం సరికాదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణం, హంద్రీనీవా, గుండ్రేవుల,వేదావతి ప్రాజెక్ట్ల నిర్మాణాలపై ఏమి చేశారని నిలదీశారు. రెండవ ముంబైగా పిలవబడే ఆదోనిని జిల్లాగా ప్రకటించడానికి అన్ని అర్హతలున్నాయని తెలిపారు.దీక్షలో కూర్చున్న జేఏసీ నాయకులు శేఖర్నాయుడు, ఉదయ్, ఖాజ, కృష్ణ, ఆఫ్రిది, రఘు తదితరులకు సీపీఐ నాయకులు భాస్కర్ యాదవ్, రాజీవ్, బీజేపీ నాయకులు దయాసాగర్, లలిత్జైన్, బీఎల్ నారాయణ, ఎంఈఎఫ్ నాయకులు తిమ్మరాజు, ఆర్వీపీఎస్ నాయకులు నల్లారెడ్డి మాట్లాడారు. -
వసతులు, సేవలపై మల్లన్న భక్తుల అసంతృప్తి
● మూడవ స్థానంతో సరిపెట్టుకున్న శ్రీశైల దేవస్థానంశ్రీశైలంటెంపుల్: భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల అధికారులు విఫలమవుతున్నారు. స్వామిఅమ్మవార్ల దర్శనం వేగంగా, బాగా జరిగేలా చూడటం, ప్రసాదం రుచికరంగా అందించడం, తాగునీరు, ఇతర మౌలిక వసతులు కల్పించడం, పారిశుద్ద్య నిర్వహణలో నిర్లక్ష్యం చూపిస్తున్నారు. స్వామిఅమ్మవార్ల సందర్శనకు ఆలయాలకు వచ్చిన భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఫోన్లు చేసి అభిప్రాయాలు తీసుకుంటే దాదాపు 40 శాతం మంది భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వస్తున్న భక్తులకు ఆయా దేవస్థానాలు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం తాజాగా నిర్వహించిన అభిప్రాయ సేకరణలో శ్రీశైల దేవస్థానం మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ, శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం దేవస్థానాల్లో భక్తులకు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం ప్రతి నెల 25వ తేదీ నుంచి మరుసటి నెల 25వ తేదీ వరకు వాట్సాప్, ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఈ సర్వే నిర్వహిస్తుంది. జూన్ నుంచి నవంబరు వరకు నిర్వహించిన సర్వేలో ఇందులో 72.2 శాతంతో శ్రీకాళహస్తి ప్రథమ స్థానం, 66 శాతంతో విజయవాడ చివరి స్థానంలో నిలిచాయి. శ్రీశైల దేవస్థానం 70.4 శాతంతో మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. శ్రీశైల దేవస్థానం అంది స్తున్న సేవలపై 29.6 శాతం మంది భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తు న్నారు. దీంతో అసలు లోపం ఎక్కడుందనే చర్చ దేవస్థానంలో కొనసాగుతుంది. తరచూ శ్రీశైల దేవస్థానం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలవడం కూడా దేవస్థానం ప్రతిష్ట మసక బారడానికి కారణమి పలువురు భక్తులు విశ్లేషిస్తున్నారు. పారిశుద్ధ్యం, మౌలిక వసతులపై తీవ్ర అసంతృప్తి శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ద్యం, మౌలిక వసతుల కల్పనపై తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. వీటిపైనే ఎక్కువ మంది భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ధ్యం, హౌస్కీపింగ్ నిర్వహణ టెండర్ తిరుపతికి చెందిన పద్మావతి హస్పిటాలిటీ అండ్ ఫెసిలీటీ మేనేజ్మెంట్ సంస్థ దక్కించుకుంది. అక్టోబరు 1వ తేదీ నుంచి ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఈ సంస్థ టెండర్ ప్రకారం ఇంకా పారిశుద్ద్య సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తి కాలేదన్నట్లు తెలుస్తుంది. శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ధ్యంపై 33.8శాతం మంది భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే శ్రీశైలం దర్శనానికి వచ్చిన భక్తులు శ్రీశైలంలోనే వసతి పొందాల్సి ఉంటుంది. క్షేత్రంలో భక్తులకు సరిపడినంత వసతి సౌకర్యాలు లేవు. అలాగే తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమవుతుంది. తాగునీరు, మౌలిక వసతులపై 37 శాతం మంది భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంతృప్తి అసంతృప్తి స్వామిఅమ్మవార్ల దర్శనం 73.5 శాతం 26.5 శాతం మౌలిక వసతులు 63.0 శాతం 37.0 శాతం ప్రసాదం నాణ్యత 80.9 శాతం 19.1 శాతం పారిశుద్ధ్యం 66.2 శాతం 33.8 శాతం -
సి.క్యాంపు రైతుబజారు విస్తరణ
కర్నూలు (అగ్రికల్చర్): కర్నూలు సి.క్యాంపు రైతుబజారు విస్తరణకు రూ.6.05 కోట్లు మంజూరు చేస్తూ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ప్రిన్స్పల్ సెక్రటరీ బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడున్న రైతుబజారు పక్కన ఆర్అండ్బీ క్వార్టర్ల ప్రదేశంలో జిప్లస్ తరహాలో నూతన రైతుబజారును అభివృద్ధి చేస్తారు. గ్రౌండ్ప్లోర్లో పార్కింగ్, పైన 135 స్టాళ్లు, 35 షాపులు నిర్మిస్తారు. కాంపౌండ్ వాల్కు బదులుగా షాపు లు వస్తాయి. షాపుల్లో రెండు అన్న క్యాంటీన్కు వినియోగిస్తారు. రైతుబజారు విస్తరణకు నిధులు రూ.6.05 కోట్లు మంజూరు చేస్తూ జీవో ఆర్టీ నెంబరు 1067 జారీ అయింది. దీనిపై మార్కెటింగ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం త్వరలోనే టెండర్లు పిలిచే అవకాశం ఉంది. రైలు కింద పడి లారీ డ్రైవర్ ఆత్మహత్య ఆదోని అర్బన్: పట్టణంలోని విక్టోరియాపేటకు చెందిన లక్ష్మన్న(60) అనే లారీ డ్రైవర్ రైలు కింద పడి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే హెడ్కానిస్టేబుల్ శివరామయ్య, స్థానికులు తెలిపిన వివరాల మేరకు... లారీ డ్రైవర్ లక్ష్మన్న శుక్రవారం బుడ్లపొట్టుతో ఆదోని నుంచి నాగలదిన్నెకు ఆరుగురు కూలీలతో బయలుదేరాడు. బైచిగేరి సమీపంలో ఎదురుగా వస్తున్న పత్తి వాహనాన్ని తప్పించబోగా లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో అందులో ఉన్న సుంకన్న, రంగన్న, హనుమంతు, సూరి, దూలయ్య, అంజిలకు గాయాలయ్యాయి. దీంతో భయపడిపోయిన లక్ష్మన్న శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో ఢిల్లీ–బెంగళూరుకు వెళ్లే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గాయాలపాలైన ఆరుగురిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడు ఉరుకుందప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. వసతి గృహ సంక్షేమాధికారులు స్థానికంగా లేకుంటే చర్యలు కర్నూలు(అర్బన్): జిల్లాలోని వసతి గృహ సంక్షేమాధికారులు, సహాయ సంక్షేమాధికారులు, నాలుగో తరగతి సిబ్బంది తాము పనిచేస్తున్న వసతి గృహాలకు స్థానికంగా నివాసం ఉండాలని, లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి బి.రాధిక హెచ్చ రించారు. సంబంధిత అధికారులు, ఉద్యోగులు స్థానికంగా ఉంటే విద్యార్థుల భద్రత, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. శుక్రవారం స్థానిక సంక్షేమభవన్లోని తన చాంబర్లో జిల్లాలోని ఏఎస్డబ్ల్యూఓ, హెచ్డబ్ల్యూఓలతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్లో అన్ని వసతి గృహాల్లోని విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రేరణ తరగతులు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా వసతి గృహాల్లో విద్యార్థుల భద్రతపై దృష్టి సారించాలన్నారు. వంట గదులను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్నారు. రక్షిత మంచి నీటిని విద్యార్థులకు అందించాలన్నారు. సమావేశంలో సహాయ సంక్షేమాధికారులు కె. బాబు, ఎస్ లీలావతి, బి.మద్దిలేటి, వెంకటరాముడు తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకర్లు రైతులకు సహకారం అందించాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: రైతులు, స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగే లబ్ధిదారులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేసి ఆర్థిక బలోపేతానికి దోహదపడాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు రూ.15,120.09 కోట్ల రుణ లక్ష్యాలు నిర్దేశించగా, ఇప్పటి వరకు రూ.10,518.67 కోట్లు మాత్రమే పంపిణీ చేశారన్నారు. మిగతా లక్ష్యాలను నిర్ణీత గడువులోనే పూర్తి చేసేందుకు బ్యాంకులు ప్రత్యేక ప్రణాళికతో పనిచేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ – ఆర్థిక పథకాల ప్రయోజనాలు లబ్ధిదారులకు చేరేందుకు బ్యాంకులు ముందుకు రావాలని సూచించారు. ముఖ్యంగా పీఎం సూర్యఘర్ పథకంలో జిల్లాలో ఇప్పటి వరకు 2,200 సౌర ఫలకాలు మాత్రమే ఏర్పాటు చేసిన విషయాన్ని కలెక్టర్ గుర్తుచేశారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంకు వచ్చే భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, పెచ్చెరువు, బైర్లూటి, నాగలూటి, హటకేశ్వరం ప్రాంతాల చెంచు ప్రజలకు దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు రుణ సహాయం అందించాలని బ్యాంకర్లను సూచించారు. జిల్లాలో నిర్మిస్తున్న బహుళ ప్రయోజన గోదాములకు రహదారులు, డ్రైయింగ్ ప్లాట్ఫార్ములు అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని, దీనిపై బ్యాంకర్లు పెట్టుబడులు, రుణ సదుపాయాల రూపంలో దృష్టి పెట్టాలన్నారు. నాబార్డ్ డీడీఎం కార్తీక్ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు చెందిన పోస్టర్లను బ్యాంకుల్లో ఏర్పాటు చేయడం ద్వారా అవగాహన పెరిగి, ఎక్కువమంది లబ్ధిదారులు ప్రయోజనం పొందగలరన్నారు. అనంతరం నాబార్డు టర్మ్ రుణాలకు సంబంధించిన పుస్తకాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో ఆర్బీఐ ఎల్డీఓ నవీన్, నాబార్డ్ డీడీఎం కార్తీక్, డీసీసీబీ సీఈఓ రామాంజనేయులు, ఎల్డీఎం రవీంద్రకుమార్, అధికారులు పాల్గొన్నారు. -
చలిలో బెల్స్ పాల్సీ ముప్పు!
● పెరుగుతున్న ముఖపక్షవాతం కేసులు ● పెద్దాసుపత్రిలో వారంలో నలుగురికీ సమస్య ● చలిగాలిలో తిరగకపోవడమే నివారణ బెల్స్ పాల్సీ అంటే...! బెల్స్ పాల్సీ (ముఖపక్షవాతం) అనేది ముఖంలోని నరాలకు హాని కలిగించే ఒక రకమైన ఆరోగ్య సమస్య. తద్వారా రోగి ముఖ కదలికలను వ్యక్తం చేయడం, తినడం, మాట్లాడటం వంటివి చేయలేడు. లక్షణాలు ● కనురెప్పలు మూసివేయడం, రెప్పలు కొట్టుకోవడం సాధ్యపడదు ● ముఖం కదిలించడంలో ఇబ్బంది ● నోరు ఒకవైపునకు వాలిపోవడం ● ముఖ ఆకృతులను సమతుల్యం చేయడంలో ఇబ్బందులు ● బెల్స్ పాల్సీలో వ్యక్తి తన కనుబొమ్మలను ఎగురవేయలేడు ● మాట్లాడటం, తినడంలో ఇబ్బంది కర్నూలు(హాస్పిటల్): మూతి వంకర పోవడం, అలాంటి నోటి నుంచి నీరు కారుతుండటం, తినాలన్నా, తాగాలన్నా ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే దానిని వైద్యపరిభాషలో బెల్స్ పాల్సీ అంటారు. తెలుగులో దానిని ముఖ పక్షవాతమని పిలుస్తారు. శీతాకాలంలో ఇలాంటి ఇబ్బందులు మరీ ఎక్కువవుతాయి. శీతల గాలుల నుంచి రక్షణ పొందడమే ఈ సమస్య రాకుండా నివారించే చర్య అని వైద్యులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇటీవల కాలంలో చలిగాలులు తీవ్రమయ్యాయి. రాత్రి పూటే కాదు పగలు కూడా వాతావరణం చల్లగా ఉంటోంది. ఈ కారణంగా ఇల్లు, కార్యాలయం ఏదైనా, ఎక్కడైనా ఫ్యాన్ వేయాలన్నా జంకుతున్నారు. విపరీతమైన చలి ప్రజలను తీవ్రంగా వణికిస్తోంది. చలికారణంగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పగలు 20 డిగ్రీల సెల్సియస్కు, రాత్రి 13 డిగ్రీల సెల్సియస్కు పడిపోతున్నాయి. చాలా మందికి వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల రీత్యా చల్లగాలికి బయటకు వెళ్లాల్సి ఉంటోంది. మరికొందరు ఉదయం వేళల్లో వాకింగ్కు వెళ్తుంటారు. ఇలా చల్లగా ఉన్న సమయంలో బయటకు వెళ్లే వారు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే చెవుల్లో నుంచి చల్లగాలి లోపలికి వెళ్లి ముఖ పక్షవాతానికి దారి తీస్తుంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని న్యూరాలజి, జనరల్ మెడిసిన్, క్యాజువాలిటీ విభాగాలకు ప్రతి వారం ముగ్గురు నుంచి నలుగురు ముఖ పక్షవాతానికి (బెల్స్పాల్సీ) గురై చికిత్స నిమిత్తం వస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు సైతం రోజూ 6 నుంచి 8 మంది వరకు న్యూరాలజిస్టులు, జనరల్ ఫిజీషియన్ల వద్దకు చికిత్సకు వెళ్తున్నారు. కారణాలు బెల్స్పాల్సీకి కచ్చితమైన కారణం ఉండదు. దీనికి అనేక వైరస్లు కారణమవుతాయి. వీటిలో హెర్పస్ సింప్లెక్స్, హెర్పెస్ జోస్టర్, హెచ్ఐవీ, సైటోమెగలోవైరస్, ఎప్సీటన్ బార్ వైరస్లు ప్రధానమైనవి. మధుమేహం, గర్భిణులు, గాయం, వాపు, ముఖ నరాలకు హాని కలిగించే ఏదైనా కారణం ముఖ పక్షవాతానికి దారి తీస్తుంది. చలివాతావరణంలో ఈ వైరస్లు మనుగడు ఎక్కువగా సాగిస్తాయి కాబట్టి అధిక శాతం వీటి ప్రభావానికి గురవుతుంటారు. వీరు వైద్యుల సూచన మేరకు మందులు వాడుతూ ఫిజియోథెరపీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది.గత కొన్ని రోజులుగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. చలి తీవ్రంగా ఉంటోంది. చలిగాలులు పగలు సైతం అధికమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చెవులకు అచ్ఛాదన లేకుండా బయటకు వెళ్లకూడదు. ఎందుకంటే చల్లటి వాతావరణంలో వైరస్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మనిషి నరాలపై దాడి చేస్తాయి. దీనినే న్యూరోట్రోపిక్ అటాక్స్ అంటాము. అధిక శాతం వైరస్ల వల్ల బెల్స్ పాల్సీ వస్తుంది. కొందరిలో ఎలాంటి కారణం లేకుండా వస్తుంది. ఇలాంటి వారికి అవసరమైన మందులు ఇచ్చి చికిత్స చేస్తాము. –డాక్టర్ సి. శ్రీనివాసులు, న్యూరాలజి హెచ్ఓడీ, జీజీహెచ్, కర్నూలు -
రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలి
కొలిమిగుండ్ల: ఎస్సీ, ఎస్టీలు మరింత చైతన్యవంతులై రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని జైభీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ న్యాయమూర్తి జడ శ్రవణ్కుమార్ అన్నా రు. కొలిమిగుండ్ల కస్తూర్బా పాఠశాల ఎదురుగా ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు వంకదారి చిన్నచెన్నప్ప ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని ఘనంగా ప్రారంభించారు. విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కల్వటాల సమీపంలో ఏర్పాటైన రామ్కో సిమెంట్ కంపెనీ ఆరు వేల ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని మండిపడ్డారు. భూములను రక్షించేందుకు హైకోర్టులో పిటిషన్ వేశామన్నారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంకదారి రవికుమార్, జైభీమ్ పార్టీ నాయకులు,కల్వటాల గ్రామ పెద్దలు కామిని ప్రతాప్రెడ్డి, గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజా సొమ్ముతో పవన్ చక్కర్లు డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ప్రజా సొమ్ముతో హెలికాప్టర్లలో చక్కర్లు కొడుతున్నారని జడా శ్రవణ్కుమార్ మండిపడ్డారు. షూటింగ్లు, ఫంక్షన్ లు అంటూ రోజూ విజయవాడ – హైదరాబాదు కు హెలికాప్టర్లలో తిరుగుతూ ప్రజా సొమ్మును దుబారా చేస్తున్నారన్నారు. సొంత డబ్బులతో హెలికాప్టర్లలో ఎన్ని సార్లు తిరిగినా ఎవరికీ అభ్యంతరం ఉండదని హితువు పలికారు. -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
ఎమ్మిగనూరురూరల్: పట్టణంలోని ఉప్పర కాలనీలో శుక్రవారం సాయంత్రం డిగ్రీ విద్యార్థి సంపత్(19) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు..కాలనీకి చెందిన శ్రీనివాసులు, మీనాక్షిలకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. మీనాక్షి ఆర్టీసీ కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో సంపత్(19) మూడో సంవత్సరం చదువుతున్నాడు. మధ్యాహ్నం తల్లిదండ్రులను సినిమాకు పంపించి ఇంట్లో ఉన్నాడు. తల్లిదండ్రులు సినిమా చూసి సాయంత్రం ఇంటికి వచ్చి చూస్తే తలుపులు వేసివుండటంతో అనుమానం వచ్చి బలవంతంగా తలుపులు తీసి చూస్తే ఫ్యాన్కు ఉరివేసుకొని వేలాడుతున్నాడు. కుటుంబ సభ్యులు కేకలు వేయటంతో ఇంటి పక్కన వారు వచ్చి సంపత్ను కిందకు దించి చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ప్రభుత్వాసుపత్రికి వచ్చేలోపు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. డిగ్రీలో కూడా అన్ని సబ్జెక్టులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. అయితే తనకు తలనొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను అని సంతప్(19) సూపైడ్ నోట్ను పెన్సిల్తో వ్రాసి జేబులో పెట్టుకున్నాడు. కిందకు దించేటప్పుడు కుటుంబ సభ్యులు ఈ లెటర్ను జేబులో నుంచి బయటకు తీసుకొని చూసి బోరన విలిపించారు. తలనొప్పి ఉందని ఇంత వరకు ఒక్కమాట కూడ మాకు చెప్పలేదని కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. -
కదంతొక్కిన అంగన్వాడీలు
నంద్యాల(న్యూటౌన్): తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు కదంతొక్కారు. సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అలాగే జాతీయ రహదారిపై గంట సేపు రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకయ్య, సీఐటీ యూ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం, ఏఐటీయూసీ అంగన్వాడీ నాయకురాలు జులేకాబీ, సీఐటీయూ అంగన్వాడీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శోభారా ణి, నిర్మల తదితరులు చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. అంగన్వాడీల సమస్యల పరిష్కరించాలని ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయాలని, ఫ్రీ స్కూల్ను బలోపేతం చేసి ఫ్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలతో తగిన బుద్ధి చెబుతామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బాలవెంకట్, లక్ష్మణ్, మహమ్మద్గౌస్, నిర్మలమ్మ, రమణమ్మ, నాగరాణి, మంజుల, హరిత, శివలక్ష్మి, ఏఐటీయూసీ నాయకురాలు సుజాత, సీతామహా లక్ష్మి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. -
మద్దిలేటయ్యలో తిరుచ్చి మహోత్సవం
బేతంచెర్ల: మండలంలోని వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో మార్గశిర మాసం శుక్రవారం రాత్రి స్వామి వారికి ఆలయ మాడవీధుల్లో తిరుచ్చి మహోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు వేదపండితులు జ్వాలా చక్రవర్తి, కల్యాణ చక్రవర్తి, అర్చకులు మద్దిలేటి నరసింహస్వామిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో కొలువుంచి పూజలు చేశారు. అనంతరం ఆలయ మాడ వీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారిని ఊరేగించారు. భక్త జనసందోహం, గోవిందనామ స్మరణల నడుమ స్వామి వారు పుష్పాలంకరణ శోభితుడై పల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు. -
ఎమ్మెల్యే కోట్లను నిలదీసిన పేదలు
డోన్ టౌన్: ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్రెడ్డిని పేదలు నిలదీశారు. ఇళ్ల స్థలాల కోసం పట్టణంలో సీపీఎం ఆధ్వర్యంలో పేదలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అయితే మూడు రోజులుగా దీక్ష చేస్తున్నా పాలకులు, అధికారుల్లో చలనం లేదు. దీంతో శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కోట్ల ఉన్నారని తెలుసుకుని సీపీఎం నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. బాధితులతో మాట్లాడటానికి బయటకు వచ్చిన ఎమ్మెల్యేను మహిళలు చుట్టుముట్టి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం పట్టణ మండల కార్యదర్శులు నక్కిశ్రీకాంత్, రామాంజనేయులు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శివరామ్, మండల అధ్యక్షులు, భాస్కర్రెడ్డి మాట్లాడుతూ.. పట్టణ సమీపంలోని 503 సర్వే నంబరులోని ప్రభుత్వ భూమిలో ఇళ్లులేని నిరుపేదలు గుడిసెలు వేసుకుంటే వాటిని అధికారులు తొలగించారన్నారు. ఆ సమయంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్రెడ్డి, ఆర్డీఓ నరసింహులు అర్హులకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చినా నేటికీ అతీగతిలేదని.. వారితో పాటు మహిళలు విమర్శించారు. దీంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేస్తుందని, అప్పుడు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు. ఆందోళనలో సీఐటీయూ జిల్లా సభ్యులు చిన్న రహిమాన్, ఐద్వా నాయకురాలు షమీమ్ బేగం, సిరినా, నక్కిహరి ఉన్నారు. -
పేద విద్యార్థులు అంటే ఎంతో ప్రేమ ఒలకబోశారు. నాణ్యమైన విద్య అందించేందుకు వెనుకడుగు వేయమని ప్రగల్బాలు పలికారు. క్వాలిటీ తనిఖీ చేసిన తర్వాతనే బ్యాగ్లను పంపిణీ చేశామన్నారు. తీరా చూస్తే.. బ్యాగుల నాణ్యత బాబుకు ఎరుక.. అనే విధంగా మారింది. ఏ పాఠశాలకు వెళ్లిన బ్య
బేతంచెర్లలో చిరిగిన బ్యాగుతో విద్యార్థినిలాడలు తెగిపోవడంతో.. లాడ తెగిన బ్యాగుతో విద్యార్థిప్రభుత్వ బ్యాగులు చిరిగి పోవడంతో సొంత బ్యాగులతో బడికి వచ్చిన విద్యార్థులుచిరిగిన బ్యాగ్ను చూపుతూ.. ఆర్నెల్లకే పూర్తిగా చిరిగిన స్కూల్ బ్యాగులు నాణ్యతపై విద్యార్థుల తల్లిదండ్రుల మండిపాటు సొంతంగా బ్యాగ్లను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి జిల్లాలో 25 వేలకు పైగా విద్యార్థులకు అందని వైనం పాఠశాలల్లో ఇప్పటికీ కనిపిస్తున్న జగనన్న బ్యాగులు -
వేర్వేరు చోట్ల అదుపు తప్పిన కార్లు
అవుకు(కొలిమిగుండ్ల): ఉప్పలపాడు ఆర్చీ సమీపంలో శుక్రవారం కారు అదుపుతప్పి ప క్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. నంద్యాల నుంచి తాడిపత్రికి వెళుతున్న కారు అవుకు దాటాక ఆర్చీ సమీపానికి చేరుకోగానే ఎదురు గా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పడంతో పక్కనే ఉన్న వరిపొలాల్లోకి వెళ్లింది. ప్రమాద సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు స్వల్పగాయాలతో బయట పడ్డారు. వరి కోత పనుల్లో ఉన్న కూలీలు అక్కడికి చేరుకొని బోల్తా పడిన కారును పైకి లేపారు. అలాగే గుండ్ల శింగవరం సమీపంలో బనగానపల్లె నుంచి తాడిపత్రికి వెళుతున్న జీపు బస్సును తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న పంట కాల్వలోకి పడింది. ప్రమాదం నుంచి డ్రైవర్ క్షేమంగా బయట పడ్డాడు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు పాములపాడు: కర్నూలు – ఆత్మకూ రు రహదారిపై ఎర్రగూడూరు గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. భానుముక్కల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు జనార్దన్ రెడ్డి, బలరాములు కారులో కర్నూలు వెళ్తుండగా అదే సమయంలో ఎర్రగూడూరు గ్రామానికి చెందిన హరి బైక్పై వెళ్తూ యూటర్న్ వద్ద క్రాస్ చేస్తుండగా కారు ఢీకొంది. కారు అదుపు తప్పి రోడ్డు పక్క గొయ్యిలో పడింది. తీవ్ర గాయాలైన హరిని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న హెడ్ కానిస్టేబుల్ రమణ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. -
పీఎం జేఏవై ద్వారా పేదలకు ఉచిత వైద్యం
కర్నూలు: ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (పీఎం జేఏవై) ద్వారా ఆర్థికంగా నిరుపేదలైన వారికి ప్రభు త్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.5 లక్షల వరకు ఖర్చ య్యే ఉచిత ఆరోగ్య చికిత్సలు పొందవచ్చని జిల్లా న్యా య సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి అన్నారు.శుక్రవారం కర్నూలు కొత్తపేటలో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సార్వత్రిక ఆరోగ్య కవరేజ్ దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా లీలా వెంకటశేషాద్రి హాజరై మాట్లాడారు. పీఎం జన ఆరోగ్య యోజన పథ కం ద్వారా లబ్ధిదారులకు ఆరోగ్య సంరక్షణ సేవలు నగదు రహితంగా అందిస్తుందని తెలిపారు. రోగి ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత 15 రోజుల పాటు చికిత్సకు అయ్యే ఖర్చులను కేంద్రమే భరిస్తుందన్నారు. ఈ పథకానికి పదహారేళ్ల వయస్సు నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్న ఒంటరి మహిళలు, దివ్యాంగులు, రోజూవారీ కూలీపై ఆధారపడి జీవిస్తున్నవారు, నిర్మాణ కూలీలు, పెయింటర్స్, సెక్యూరిటీ గార్డులు, పారిశుధ్య కార్మికులు లబ్ధి పొందవచ్చని తెలిపారు. డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ శివరాం మాట్లా డుతూ ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునేవారు ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన స్కీమ్ ప్రభుత్వ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని, తర్వాత వారు హెల్త్ కేర్ పొందడానికి అర్హత కలిగి ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఆయుష్మాన్ భారత్ యోజన టోల్ఫ్రీ కాల్ సెంటర్ 14555, 1800 111 565కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి -
రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు
ఆత్మకూరు: రోడ్డు ప్రమాదంలో ఆత్మకూరు యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పాములపాడు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్మ కూరుపట్టణం తోటగిరిలో నివాసం ఉంటున్న ప్రశాంత్ అనే యువకుడు కర్నూలు జిల్లా హుసేనాపురంలో బంధువుల దగ్గరికి వెళ్లి తిరుగు ప్రయాణంలో పాములపాడు మండలంలోని భానుముక్కల టర్నింగ్ దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ప్రశాంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అటుగా వెళ్తున్న వారు యువకుడిని 108 అంబులెన్స్ ద్వారా ఆత్మకూరు వైద్యశాలకు తరలించగా, ఇక్కడ పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్సల నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
క్షేత్రస్థాయి సర్వేలు కీలకం
నందికొట్కూరు: జాతీయ స్థాయిలో విశ్వసనీయమైన గణంకాల తయారీకి క్షేత్రస్థాయి సర్వేలు చాలా కీలకమని నేషనల్ స్టాటిస్టిక్స్ అదనపు డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బ్రాహ్మణకొట్కూరు గ్రామంలో జరుగుతున్న క్షేత్రస్థాయి సర్వేను ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ చేపట్టిన గణంకాల కార్యక్రమం ఎంత ఉపయోగమన్నారు. ఈ సర్వే దేశ వ్యాప్తంగా ఉపాధి, నిరుద్యోగిత రేట్లను అంచనా వేయడానికి ఎన్ఎస్ఓ సర్వే ప్రతి ఏడాది ఉంటుందని చెప్పారు. పీఎల్ఎఫ్ఎస్ సర్వే కోసం ఎంపిక చేయబడిన గృహాలను సందర్శించామన్నారు. ఈ సర్వే దేశ ఆర్థిక విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. ఆయన వెంట ఎన్ఎస్ఓ కర్నూలు ఉప ప్రాంతీయ కార్యాలయం సర్వే సూపర్వైజర్ సీ.బీ శ్రీనివాసులు, సర్వే ఎన్యుమరేటర్ నాగన్న, స్థానిక వీఆర్వోలు నర్సరాజు, హనుమంతు, వీఆర్ఏలు శ్రీను, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత నంద్యాల: పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ పోలీసు సంక్షేమ దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీసు సిబ్బంది సమస్యలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో నిమగ్నమైన పోలీసు సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పోలీస్ వెల్ఫేర్ డే కార్యక్రమం ద్వారా సిబ్బంది సమస్యలపై సత్వర చర్యలు తీసుకోని పరిష్కరిస్తున్నామన్నారు. విధులలో సిబ్బంది ఇబ్బంది పడకుండా వారి సమస్యల తొలగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 19లోగా పరీక్ష ఫీజు చెల్లించాలి నంద్యాల(న్యూటౌన్): ఓపెన్ పదవ తరగతి, ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల ఫీజును అపరాధ రుసుం లేకుండా ఈనెల 19వ తేదీలోగా చెల్లించాలని డీఈఓ జనార్ధన్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.25 అపరాధ రుసుంతో ఈనెల 20వ తేదీ వరకు, ఒక సబ్జెక్టుకు రూ.50 అపరాధ రుసుంతో 21 నుంచి 22వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. పదో తరగతి థియరీ సబ్జెక్టుకు రూ.100, ఇంటర్మీడియెట్ థియరీ సబ్జెక్టుకు రూ.150, ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ ఒక సబ్జెక్టుకు రూ.100 చెల్లించాలన్నారు. సబ్జెక్టుకు ఒక్కొక్కటి ఇంప్రూమెంట్కు ఐదేళ్ల కాలంలో ఒకసారి మాత్ర మే వినియోగించుకొనే అవకాశం ఉంటుందన్నా రు. ఒక థియరీ సబ్జెక్టుకు రూ.250, ఇంటర్మీడియె ట్ ప్రాక్టికల్ సబ్జెక్టుకు రూ.100, పదో తరగతి థియరీ ఒక సబ్జెక్టుకు రూ.200, ఇంటర్ థియరీ సబ్జెక్టుకు రూ.300, ప్రాక్టికల్ ఒక సబ్జెక్టుకు రూ.100 చెల్లించాలన్నారు. వివరాలకు ఓపెన్ స్కూల్ డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఉమీద్ వక్ఫ్ పోర్టల్ గడువు ఆరు నెలలు పెంపు కర్నూలు (అర్బన్): ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉమీద్ వక్ఫ్ పోర్టల్లో వివరాల అప్లోడ్నకు గడువును మరో ఆరు నెలలు పొడిగించినట్లు రాష్ట్ర వక్ఫ్ బోర్డు ప్రధాన కార్యనిర్వాహక అధికారి షేక్ మొహమ్మద్ అలీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం రాష్ట్రంలోని అన్ని వక్ఫ్ సంస్థలు, వాటికి చెందిన అనుబంధ ఆస్తుల వివరాలను ఉమీద్ పోర్టల్లో అప్లోడ్ చేసే ప్రక్రియను జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభించామని చెప్పారు. చివరి తేదీగా ఈ ఏడాది డిసెంబర్ 5గా నిర్ణయించబడిందని తెలిపారు. అయితే సాంకేతిక సమస్యలు, కొంత వక్ఫ్ ఆస్తుల రికార్డులు తెలంగాణ వక్ఫ్ బోర్డు నుంచి వివిధ కారణాలతో అందకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. వక్ఫ్ బోర్డు వారు దాఖలు చేసిన పిటిషన్ను ట్రిబ్యునల్ పరిశీలించిన సమస్యలను పరిగణలోకి తీసుకుని గడువు పొడిగింపు ఆదేశాలు జారీ చేసిందన్నారు. దీంతో ఉమీద్ పోర్టల్లో వక్ఫ్ సంస్థల వివరాలను వచ్చే ఏడాది జూన్ 6 వరకు పొడిగించబడిందని పేర్కొన్నారు. -
ఆత్మకూరులో చిన్నారిపై కుక్క దాడి
నంద్యాల: జిల్లాలోని ఆత్మకూరులో చిన్నారిపై కుక్కలు దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది ఆత్మకూరు పట్టణంలోని ఇస్లాం పేటకు చెందిన అర్షియా అనే 4 (సం) చిన్నారి ఇంటి ముందర ఆడుకుంటుండగా కుక్క దాడి చేసింది. ఆ చిన్నారిపై అత్యంత పాశవికంగా దాడి చేసింది. చెవిని కొరుక్కు తినడంతో పాటు దవడపై తీవ్ర గాయాలు చేసింది. ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు హాస్పిటల్ తరలించారు. -
ప్రభుత్వ సేవలను వేగవంతం చేయండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల(అర్బన్): ప్రభుత్వ సేవలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఏపీ సచివాలయంలోని సీఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజా సానుకూల అవగాహన పెంపు, ఏజెంట్ స్పేస్ కోసం డాక్యుమెంట్ అప్లోడ్స్, సేవల విజిబిలిటీ వంటి పలు కీలక అంశాలపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవలపై ప్రజల అభిప్రాయాన్ని మెరుగుపరచే దిశగా నంద్యాల జిల్లా అన్ని పారామీటర్లలో రాష్ట్రంలో టాప్ టెన్లో నిలిపేలా అధికారులు కృషి చేయాలన్నారు. సేవల నాణ్యత, ప్రజలకు అందుతున్న ఫలితాలు, ఫిర్యాదుల పరిష్కారం, పారదర్శక వ్యవస్థ వంటి అంశాల్లో ఏ పారామీటర్లోనూ జిల్లా దిగువ స్థానంలో లేకుండా సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. జిల్లా ప్రజలకు మెరుగైన సేవల అందుబాటు కల్పించేందుకు అందరూ సమన్వయంతో, కట్టుదిట్టంగా పనిచేయాలన్నారు. రబీలో ఎరువులకొరత రానీయం నంద్యాల(అర్బన్): రబీ సీజన్లో ఎరువుల కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రటకనలో తెలిపారు. జిల్లాకు సంబంధించి రబీలో సాగు చేసే పంటలకు అవసరమైన 66,777 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళికలు తయారు చేశామన్నారు. అక్టోబర్ నుంచి ఈ నెలాఖరు వరకు జిల్లాకు మొత్తం 30.059 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటికే 29,047 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచామన్నారు. -
టీడీపీకి ఎదురు దెబ్బ
● కో–ఆప్షన్ సభ్యుడి ఎన్నికలో వైఎస్సార్పీపీ జయకేతనం దొర్నిపాడు: మండల కో–ఆప్షన్ సభ్యుడి ఎన్నికలో అధికార పార్టీ టీడీపీకి ఎదురు దెబ్బ తగిలింది. వైఎస్సార్సీపీ అభ్యర్థి అచ్చుకట్ల షఫీబాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ గోవిందనాయక్ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. దొర్నిపాడు మండల ప్రజాపరిత్ కార్యాలయంలో గురువారం ఈ ఎన్నిక ఉత్కంఠంగా సాగింది. కోఆప్షన్ సభ్యుడు అచ్చుకల్ల అల్లా మహమ్మద్ మృతిచెందడంతో ఈ ఎన్నిక నిర్వహించారు. మృతుడి కుమారుడు అచ్చుకట్ల షఫీబాషాకు వైఎస్సార్సీపీ పోటీ చేసే అవకాశం ఇచ్చింది. టీడీపీ అభ్యర్థులు దొర్నిపాడుకు చెందిన మాబుహుసేన్, చాకరాజువేముల గ్రామానికి చెందిన నొస్సం హుసేన్బాషాలు రెండు నామినేషన్లు వేశారు. వారు తప్పుగా సంతకాలు చేయడంతో నామినేషన్లను పీఓ తిరష్కరించారు. దీంతో అధికారులు వైఎస్సార్సీపీ అభ్యర్థి అచ్చుకట్ల షఫీబాషా గెలుపును ఏకగ్రీవంగా ప్రకటిస్తూ డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు. వైఎస్సార్పీపీకి ముగ్గురు, టీడీపీకి ముగ్గురు ఓటర్లు ఉన్నారు. సమాన ఓట్లు ఉండటంతో టాస్ వేసి అభ్యర్థిని ప్రకటిస్తారు అనుకున్నారు. అయితే అధికార పార్టీకి చెందిన ఇద్దరి అభ్యర్థుల నామినేషన్లు తిరష్కరణకు గురికావడంతో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. ఎన్నిక ఏకగ్రీవం కావడం పట్ల మాజీ ఎమ్మెల్సీ గంగు ప్రభాకర్రెడ్డి, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిశోర్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ధర్మమే గెలిపించింది దొర్నిపాడు మండల ప్రజా పరిషత్ కో–ఆప్షన్ సభ్యుడి ఎన్నిక విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్ట్ శ్రేణులు ఒకే తాటిపై నిలబడటంతోనే ధర్మమే గెలిచిందని ఎంపీపీ గోపవరం అమర్నాఽథ్రెడ్డి, సొసైటీ మాజీ ప్రెసిడెంట్ భూమా చెంచిరెడ్డి, వైఎస్సార్సీపీ మండల ప్రెసిడెంట్ బత్తుల నాగేశ్వరావు అన్నారు. కోఆప్షన్ సభ్యుడి అచ్చుకట్ల షఫీబాషా ఏకగ్రీవ ఎన్నిక పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కారు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నా కో–ఆప్షన్ సభ్యుడి ఎన్నిక కోసం ఎవ్వరికి భయపడకుండా అండగా ఉన్న కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు మోహన్నాయుడు, లక్కు చంద్రశేఖర్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, శాంతయ్య, శివరామిరెడ్డి, నాగరాజు, పుల్లారెడ్డి, వైనుద్దీన్, మాబాషా, చిన్నమద్దిలేటి, శ్రీనివాసరెడ్డి, నషిద్దిన్ బాషా, భూమా రామక్రిష్ణారెడ్డి, ప్రసాద్రెడ్డి, రామ్నాధ్రెడ్డి, ఎంపీటీసీలు పార్వతీ, లక్ష్మీదేవి తదిరులు పాల్గొన్నారు. -
రిజర్వాయర్ రివిట్మెంట్కు మరమ్మతులు
అవుకు(కొలిమిగుండ్ల): అవుకు రిజర్వాయర్ రివిట్మెంట్కు మరమ్మతులు చేపట్టేందుకు ఎస్సార్బీసీ అధికారులు సిద్ధమయ్యారు. కర్ణాటక రాష్ట్రం బెల్గాంకు చెందిన అక్షిత అండర్ వాటర్ సర్వీసెస్ లిమిటెడ్కు చెందిన సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకోవడంతో గురువారం వివిధ రకాల యంత్రాలు, సామగ్రి, కెమికల్ను రిజర్వాయర్ వద్దకు చేర్చారు. మద్రాసు ఐఐటీకి చెందిన నిపుణుల ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టనున్నారు. సోమవారం నుంచి రివిట్మెంట్ పనులు మొదలు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏడాది వ్యవధిలోనే రెండు సార్లు రివిట్మెంట్ కుంగిపోవడంతో అధికారులు తాత్కాలిక చర్యలు మాత్రమే చేపట్టారు. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 4 టీఎంసీలు కాగా కట్టకు ప్రమాదముందని భావించిన అధికారులు గాలేరు నగరి వరద కాల్వ ద్వారా వైఎస్సార్ కడప జిల్లాకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం రెండు టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచారు. కుంగిన రివిట్మెంట్ ప్రాంతంలో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేకంగా తెప్పించిన కెమికల్ సాయంతో లీకేజీ నివారణకు చర్యలు చేపట్టనున్నారు. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు
● జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్నందికొట్కూరు/పాములపాడు/జూపాడుబంగ్లా: విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై వేటు పడుతుందని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ హెచ్చరించారు. నందికొట్కూరు, మిడుతూరు, బ్రాహ్మణకొట్కూరు, ముచ్చుమర్రి, జూపాడుబంగ్లా, పాములపాడు పోలీసు స్టేషన్లను గురువారం ఎస్పీ పరిశీలించారు. ఆయా పోలీసు స్టేషన్లలో పెండింగ్ కేసులపై ఆరా తీశారు. అలాగే సిబ్బంది విధుల గురించి పోలీసులను అడిగి తెలుసుకున్నారు. పోలీసుల స్టేషన్లలో రికార్డులను జిల్లా ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టేషన్లో డ్యూటీలో ఉన్న పోలీసులకు విధి విధానాలను ఎస్పీ గుర్తు చేశారు. నైట్, డే బీట్ల డ్యూటీలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలతో మంచి మెలగాలని, స్నేహ బంధాలను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవలు అందించాలని స్పష్టం చేశారు. ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్ఐలు ఓబులేసు, సురేష్, తిరుపాలు, సురేష్బాబు, మల్లికార్జున, ఆయన సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనాదారులకు సూచనలు ఇవ్వాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ రామాంజినాయక్, రూరల్ సీఐ సురేష్కుమార్రెడ్డి తదితరులు ఉన్నారు. పాములపాడు ఎస్ఐ ఎవరు? పాములపాడు స్టేషన్ను జిల్లా ఎస్పీ తనిఖీకి గంట ముందు ఎస్ఐ సురేష్బాబు రిలీవ్ అయినట్లు సమాచారం. ఏడాదిన్నర క్రితం ఇక్కడికి బదిలీపై వచ్చిన ఈయనను హడావుడిగా రిలీవ్ కావడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. కాగా ఈయన స్థానంలో కర్నూలు తాలుకా పోలీసు స్టేషన్ నుంచి ఎస్ఐ చంద్రశేఖర్రెడ్డి, వెలుగోడు శ్రీకాంత్, బ్రాహ్మణకొట్కూరుఎస్ఐ తిరుపాలు పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కొత్తపల్లి ఎస్ఐ జయశేఖర్ గౌడు ఇన్చార్జిగా నియమించినట్లు తెలుస్తోంది. -
కుందూ కరకట్ట అనకొండలపై చర్యలేవి?
కోవెలకుంట్ల: కుందూనది కరకట్ట గ్రావెల్ను అక్రమంగా తరలిస్తున్న అనకొండలపై అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు. స్థానిక టీడీపీ నాయకులు అక్రమార్కులతో చేతులు కలిపి టిప్పర్లతో గ్రావెల్ తరలించి కోట్లాది రూపాయాలు దండుకుంటున్నా సంబంధిత అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కోవెలకుంట్ల పట్టణ శివారులోని కుందూనది పరివాహక ప్రాంతంలోని కరకట్టను ఆయన పరిశీలించారు. పెద్ద పెద్ద ప్రొక్లెయిన్లు ఏర్పాటు చేసి టిప్పర్ల సాయంతో గ్రావెల్ను తరలిస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కాటసాని మాట్లాడుతూ ఎనిమిదేళ్ల క్రితం ప్రజా సంకల్పయాత్రలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కోవెలకుంట్ల మీదుగా వెళ్తూ కుందూ ముంపు సమస్యను తెలసుకున్నారన్నారు. అధికారంలోకి రాగానే కుందూనది విస్తరణ పనులతో జిల్లాతో పాటు, వైఎస్సార్, జిల్లా ప్రజలు, రైతులకు ముంపు కష్టాలను శాశ్వతంగా తొలగించేందుకు కుందూనది విస్తరణ పనులకు రూ.1,350 కోట్ల నిధులు కేటాయించారన్నారు. అప్పట్లోనే నది విస్తరణ పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని నిప్పులవాగు నుంచి వైఎస్సార్ జిల్లా ఆదినిమ్మాయిపల్లె వరకు 183 కి.మీ మేర తొమ్మిది రీచ్లుగా విభజించి విస్తరణ పనులు పూర్తి చేశామన్నారు. టీడీపీ నేతల అండతోనే యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ రవాణా అధికారులు ఫిర్యాదు చేసి తప్పుకోవడం సరికాదు కుందూనది కరకట్ట ప్రాంతాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని టీడీపీ నాయకులు, అధికారులపై ఫైర్ -
రూ.12.38 కోట్ల పనులకు టెండర్లు
శ్రీశైలంటెంపుల్: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో చేపట్టనున్న ఏర్పాట్లకు 12.38 కోట్లతో టెండర్లు పిలిచినట్లు శ్రీశైల దేవస్థాన ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ ఎం.నరసింహారెడ్డి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. మొత్తం 84 పనులకు టెండర్లు ఆహ్వానించామన్నారు. శుక్రవారం దేవస్థాన పరిపాలన భవనంలో టెండర్లకు సంబంధించిన టెక్నికల్ బిడ్లను ఓపెన్ చేస్తామన్నారు. పైప్ పెండ్యాల్స్, షామియానాలు, నాలగూటి, పెచ్చెర్వు, కై లాసద్వారం, శివదీక్షా శిబిరాలు, సాక్షిగణపతి, హఠకేశ్వరం, పాలధారపంచధార, పార్కింగ్ ప్రదేశాలు, ఉద్యానవనాలు తదితర పనులు చేసేందుకు సుమారు రూ.4.33 కోట్లతో టెండర్లు పిలిచామన్నారు. అలాగే తాత్కాలిక విద్యుద్దీక రణ, ఆలయ గోపురాలు, ఉభయ దేవాలయా లు, ఆరుబయలు ప్రదేశాలలో స్వామిఅమ్మవార్ల చిత్రాలతో విద్యుద్దీకరణ, హైమాక్స్లైట్లు, పార్కింగ్ ప్రదేశాలలో విద్యుద్దీపాలు, జనరేటర్ల కోసం రూ.1.79 కోట్లతో టెండర్లు పిలిచారన్నారు. టెట్కు 76 మంది గైర్హాజరు నంద్యాల(న్యూటౌన్): రెండవ రోజు గురు వారం జరిగిన టెట్ పరీక్షకు 76 మంది అభ్య ర్థులు గైర్హాజరైనట్లు డీఈఓ జనార్ధన్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని రాజీవ్గాంధీ మెమోరియల్ ఇంజినీరింగ్ కళాశాల, శాంతిరాం ఇంజినీరింగ్ కళాశాల, రామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాలలో జరిగిన పరీక్షకు ఉదయం 151 మందికి గాను 103 మంది హాజరు కాగా 48 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 410 మందికి గాను 382 మంది హాజరు కాగా 28 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం పరిధిలో పద్మావతి ఏజెన్సీ కింద పనిచేస్తున్న శానిటేషన్, హౌస్ కీపింగ్ కార్మికులకు ఎట్టకేలకు ఒక నెల జీతాన్ని సంస్థ చెల్లించింది. గురువారం కార్మికులకు ఒక నెల వేతానాన్ని వారి బ్యాంకు ఖాతాలలో జమ చేసింది. మూడు రోజుల క్రితం సాక్షిలో ‘వేతన.. వేదన!’ శీర్షికతో రెండు నెలలుగా జీతాలు అందక కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన దేవస్థాన అధికారులు పద్మావతి ఎజెన్సీపై ఒత్తిడి తీసుకురావడంతో ఎట్టకేలకు ఒక నెల వేతనాన్ని జమ చేశారు. దీంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. కర్నూలు(అగ్రికల్చర్): చలి తీవ్రత పెరుగుతోంది. కొద్ది రోజులుగా చలి గజగజ వణికిస్తోంది. సంక్రాంతి సమయానికి రాత్రి ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలకు పడిపోయే ప్రమాదం కూడా ఏర్పడింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. కర్నూలు జిల్లాలో 15 నుంచి 16 డిగ్రీలు, నంద్యాల జిల్లాలో 15 నుంచి 17 డిగ్రీల వరకు మాత్రమే నమోదు అవుతున్నాయి. రాత్రి 8 గంటలకే చలి తీవ్రత పెరుగుతుండటంతో బయటికి ముఖం చూపలేని పరిస్థితి ఏర్పడింది. ఉదయానికి చలి ప్రభావం మరింత పెరుగుతోంది. ఉదయం 7 గంటల వరకు కూడా చలి పులి ప్రభావం వల్ల బయటకి రాలేని పరిస్థితి ఏర్పడింది. గురువారం కర్నూలు జిల్లాలోని అత్యల్పంగా ఆలూరు, గూడూరుల్లో రాత్రి ఉష్ణోగ్రత 15 డిగ్రీలు మాత్రమే నమోదు అయింది.ఎమ్మిగనూరులో 15.1, కోసిగిలో 15.6, ఆదోనిలో 15.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. నంద్యాల జిల్లాలో అత్యల్పంగా మిడుతూరులో 15.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ప్యాపిలిలో 15.8, గడివేములలో 15.9, డోన్లో 16.2, జూపాడుబంగ్లాలో 16.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కర్నూలు: వయస్సులో 70 ఏళ్ల పైబడిన ఖైదీలకు, అనారోగ్యంతో బాధపడేవారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి తెలిపారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రితో కలసి గురువారం కర్నూలు పురుషుల, మహిళా కారాగారాలను తనిఖీ చేశారు. జైలులో ఉన్న ఖైదీలు వారి హక్కులను తెలుసుకోవాలని, ఎవరికైనా న్యాయ వాదులు లేకుంటే ఉచితంగా నియమిస్తామన్నారు. -
ఆదోని బంద్ సంపూర్ణం
ఆదోని టౌన్: ఆదోని జిల్లా కోసం అఖిలపక్ష, జాయింట్ యాక్షన్ కమిటీ, ఆదోని జిల్లా సాధన సమితిల ఆధ్వర్యంలో బుధవారం బంద్ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు సాయిప్రసాద్రెడ్డి, ప్రకాష్జైన్, కాంగ్రెస్ పార్టీ ఆదోని ఇన్చార్జి దేవిశెట్టి ప్రకాష్, అగ్రి ఫర్టిలైజర్స్ సీడ్స్ అసోసియేషన్ నాయకులు అశోకానందరెడ్డి, బంగారం షాపుల అసోసియేషన్ నాయకులు మద్దతు తెలియజేశారు. పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి భీమాస్ సర్కిల్ వరకు మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి బైకుపై ప్రదర్శన నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రకాంత్రెడ్డి మద్దతు తెలిపారు. -
ఎట్టకేలకు కార్మికులకు బస్సు సౌకర్యం
శ్రీశైలంటెంపుల్: దేవుడు వరమిచ్చినా పూజారి కరు ణించడు.. అన్నట్లుగా తయారైంది సున్నిపెంట నుంచి వెళ్లి దేవస్థానంలో పనిచేసే పారిశుద్ద్య కార్మికుల పరిస్థితి. దేవస్థానం ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని చెబుతుంటే పద్మావతి ఏజెన్సీ మాత్రం డీజిల్ ఖర్చులు మేము భరించలేమంటూ కార్మికుల మీద నెట్టేసింది. దీంతో కార్మికులే తమకు వచ్చే వీక్లీ ఆఫ్ల డబ్బులు డీజిల్కు చెల్లించేలా ఒప్పుకోవడంతో ఎట్టకేల బస్సు సౌకర్యాన్ని దేవస్థానం బుధవారం నుంచి పునరుద్ధరించింది. దేవస్థానంలో పద్మావతి ఏజెన్సీ కింద సున్నిపెంటకు చెందిన సుమారు 200 మందికి పైగా కార్మికులు శానిటేషన్, హౌస్కీపింగ్లలో పనిచేస్తున్నారు. వీరికి బస్సు సౌకర్యం కల్పించాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి చొరవ తీసుకుని దేవస్థానం, కార్తికేయ ఏజెన్సీ ఎండీతో సంప్రదించారు. దేవస్థానం ఉచితంగా బస్సును ఏర్పాటు చేసేలా, బస్సుకు అయ్యే డీజిల్ ఖర్చు ఏజెన్సీ ఎండీ చెల్లించేలా వారిని ఒప్పించి కార్మికులకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. అయితే గత అక్టోబరు నెల నుంచి శానిటేషన్, హౌస్కీపింగ్ టెండర్ దక్కించుకున్న పద్మావతి ఏజెన్సీ డీజిల్ భారం భరించలే మని నవంబరు నెల నుంచి ఉచిత బస్సు సౌకర్యాన్ని తీసివేసింది. ఈ నేపథ్యంలో దేవస్థాన అధికారులకు కార్మికులు మొరపెట్టుకున్నారు. దీంతో కార్మికులకు నెలలో వచ్చే నాలుగు వీక్లీ ఆఫ్లలో రెండు వీక్లీ ఆఫ్కు వచ్చే డబ్బులను డీజిల్కు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఉచిత బస్సు సౌకర్యాన్ని దేవస్థానం పునరుద్ధరించింది. దేవస్థానం బస్సు సర్వీసు పునఃప్రారంభం డీజిల్ డబ్బులు చెల్లింపునకు పద్మావతి సంస్థ ససేమిరా కార్మికుల వీక్లీ ఆఫ్ డబ్బులు సర్దుబాటు -
చిన్న చూపు చూస్తోంది
చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులను చిన్నచూపు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఐదు డీఏలు ఇవ్వాల్సి ఉండ గా.. 18 నెలల కాలంలో ఒక్క టీ ఇచ్చింది. పీఆర్సీ లేదు. మధ్యంతర భృతిని పట్టించుకోవడం లేదు. పదవీ విమరణ చేసిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. ఇవి ఇవ్వకపోయినా జీతాలైన సకాలంలో చెల్లిస్తుందా అంటే అది కూడా లేదు. బ్యాంకుల్లో పైన్లతో ఈఎంఐలు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం జరిమానాలను భరించాల్సిందే. – రమణ, జిల్లా ఉపాధ్యక్షుడు, ఏపీఎన్జీజీవోస్ అసోసియేషన్, కర్నూలు -
విభిన్న ప్రతిభావంతులకు అండగా ఉందాం
● జిల్లా కలెక్టర్ రాజకుమారిగోస్పాడు: విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాల్లో రాణించేలా ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాధారణ ప్రజానీకం – విభిన్న ప్రతిభావంతులు అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ సమాన అవకాశాలతో ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. భవిత కేంద్రాలకు వచ్చే చిన్నారుల తల్లిదండ్రులకు నైపుణ్య శిక్షణలు అందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రత్యేక సెలవులు, వాష్రూమ్స్, ర్యాంపులు ఏర్పాటు వంటి అంశాలపై కూడా త్వరిత చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ చైర్మన్ గడుపూటి నారాయణ స్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రారంభించిన ‘ఇంద్రధనస్సు’ పథకంలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, టిడ్కో గృహాల్లో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపు, సబ్సిడీ రుణాలు, జిల్లాలో దివ్యాంగ భవన్ ఏర్పాటు వంటి వరాలు ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ అధికారి రయిజ్ ఫాతిమా, డీఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, సెట్కూరు సీఈఓ వేణుగోపాల్, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి కళ్యాణి, జిల్లా నైపుణ్య అధికారి శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ గ్రేసీ తదితరులు పాల్గొన్నారు. -
గుడ్డుకు ‘గడ్డు’ కాలం
● డజన్ రూ. వందకు పైనే.. నంద్యాల(అర్బన్): రోజుకో గుడ్డు తింటే మనిషి ఆరోగ్యవంతంగా ఉంటారని వైద్యులు అంటున్నా రు. ఆరోగ్యానికి మేలు చేసే కోడిగుడ్ల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో గుడ్లు కొనాలంటే జంకాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఒక్కో గుడ్డు ధర రూ.8.50 పలుకుతోంది. దీంతో రోజుకోసారో, రెండు రోజులకోసారో కోడిగుడ్డును తీసుకొనేవారు ఇక నుంచి వారానికోసారో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కోడిగుడ్ల ధరలు కొండెక్కాయి. మూడు వారాల నుంచి ధర అమాంతంగా పెరు గుతూ వస్తుంది. అక్టోబర్ నెలలో హోల్సేల్గా వంద కోడిగుడ్లు ధర రూ.700 నుంచి రూ.750 వరకు ఉంది. ఆ తర్వాత కార్తీక మాసంలో వీటి వాడకం కొంత తక్కువగా ఉండేది. నవంబర్, డిసెంబర్ నెలల్లో ధరలు పెరిగాయి. ప్రస్తుతం వంద గుడ్ల ధర రూ.800 నుంచి రూ.850కి హోల్సేల్గా అమ్ముతున్నారు. డజన్ రూ.95 నుంచి రూ. 105 మేర పలుకుతుండటంతో కొనుగోలుకు వచ్చిన వారు కళ్లు తేలేస్తున్నారు. కోడి మాంసం ధరలు కొంత వరకు తగి రూ.200 నుంచి రూ.220 వరకు కొనసాగుతోంది. గుడ్ల ధరలు మాత్రం రోజురోజుకు పెరుగుతుండటంతో విని యోగదారులు విస్తుపోతున్నారు. కూరగాయల ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటుతున్నాయి. నిన్న టి వరకు అందుబాటులో ఉన్న గుడ్డు ధర పెరగడంతో వినియోగదారులు వామ్మో అంటున్నా రు. హోటళ్ల నిర్వాహకులు, బేకరీల యజమాను లు పెరిగిన ధరలతో ఆందోళన చెందుతున్నారు. -
‘టెట్’కు 35 మంది గైర్హాజర్
నంద్యాల(న్యూటౌన్): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. పట్టణంలో ఆర్జీఎం, శాంతిరాం ఇంజినీరింగ్ కళాశాల, రామకృష్ణ డిగ్రీ పీజీ కళాశాలలో పోలీసుల బందోబస్తు మధ్య ప్రశాంతగా జరిగాయి. 9.30 గంటలకు మొదలైన పరీక్షకు గంట ముందుగానే అభ్యర్థులు కేంద్రాల దగ్గరకు చేరుకోగా, అరగంట ముందుగానే కేంద్రాల్లోకి అనుమతించారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించిన పరీక్షలకు 410 విద్యార్థులకు గాను 375 మంది హాజరు కాగా 35 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు డీఈఓ జనార్దన్రెడ్డి తెలిపారు. గోస్పాడు: రబీలో రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు సూచించారు. మండల కేంద్రమైన గోస్పాడులో బుధవారం స్థానిక ఏవో స్వప్నికా రెడ్డి ఆధ్వర్యంలో వరిలో పంటకోత ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రైతులు ఖరీఫ్లో సాగు చేసిన వరి పైరు పంటకోత ప్రయోగం చేయగా ఎకరాకు 36 బస్తాల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ అవసరం మేరకే ఎరువులు వాడాలని, సాగునీటిని దృష్టిలో ఉంచుకొని రబీలో రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలన్నారు. డిమాండ్ ఉన్న పంటలు వేసుకోవాలని సూచించారు. పంట అవశేషాలు కాల్చితే నష్టం చేకూరుతుందన్నారు. కలియదున్నితే లాభమని, పంట అవశేషాలలో నత్రజనీ, భాస్వరం పొటాషియం, సూక్ష్మ పోష కాలు ఉంటాయని తెలియజేశారు. కార్యక్రమంలో ఏఈఓ రామకృష్ణ, అగ్రికల్చర్ అసిస్టెంట్ శ్రీధర్ , ఖాజావలి రైతులు పాల్గొన్నారు. హక్కులు లేని మనిషి బానిసతో సమానం నంద్యాల(అర్బన్): హక్కులు లేని మనిషి బానిసతో సమానమని సెట్కూరు సీఈఓ డాక్టర్. వేణుగోపాల్ అన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా స్థానిక అయ్యలూరు మెట్ట వద్ద ఉన్న ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో సీఈఓ వేణుగోపాల్ మాట్లాడుతూ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ‘మానవ హక్కులు –మన రోజు వారి అవసరాలు’ అనే నినాదంతో ఐకరాజ్య సమితి ప్రపంచ వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి శ్రీకాంత్రెడ్డి , కళాశాల చెర్మన్ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. మానవహక్కుల గురించి తెలుసుకుని సద్వినియోగ పరుచుకోవడం ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు, జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హరి ప్రసాద్రెడ్డి, శ్యామ్బాబు, భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం కర్నూలు(అగ్రికల్చర్): ప్రకృతి వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించాల ని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ మాధురి సూచించారు. నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను పొందేందుకు, పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకునేందుకు ప్రకృతి వ్యవసాయం చక్కటి అవకాశమని పేర్కొన్నారు. బుధవారం మద్దూరు నగర్లోని ప్రకృతి వ్యవసాయం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీపీఎం మాధురి మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయంలో పనిచేసే ప్రతి ఒక్కరు ఏ–గ్రేడ్ మోడల్స్, ఏటీఎం మోడల్తో వ్యవసాయం చేసి ఇతర రైతులకు ఆదర్శంగా ఉండాలన్నారు. ఈ నమూ నాల్లో వేసిన పంటలను రైతులకు చూపించి వారిని ప్రోత్సహించాలన్నారు. ప్రతి రైతు తనకున్న పొలంలో ఒకటి లేదా రెండు పంటలకు పరిమితం కారాదని, వీలైనంతవరకు ఎక్కువ పంటలు సాగు చేయాలన్నారు. గ్రామస్థాయిలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింపచేసేందుకు ఐసీఆర్పీలకు ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కన్సల్టెంట్లు రాజేశ్వర్, డీఎల్పీఎం లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు. -
పది రోజులుగా నరక ‘వేతన’
● వ్యవసాయ శాఖకు చెందిన ఒక ఉద్యోగి కలెక్టరేట్లోని ఎస్బీఐ ట్రెజరీ బ్రాంచీ నుంచి ఏడాది క్రితం పర్సనల్ లోన్ తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా బాబుగారు ఉన్నారు కదా... ఒకటో తేదీ లేదా ఐదో తేదీలోపు వేతనాలు బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారనే ఉద్దేశంతో ప్రతి నెలా 5వ తేదీలోపు రూ.30 వేలు చెల్లించే విధంగా(ఈఎంఐ) ఏర్పాటు చేసుకున్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం కొన్ని నెలలుగా ఉద్యోగులకు ఎప్పుడు వేతనాలు చెల్లిస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. నవంబరు నెల వేతనం డిసెంబరు 10వ తేదీ వరకు బ్యాంకు ఖాతాకు జమ కాలేదు. .. ఈ పరిస్థితి ఒక్కరిది, ఇద్దరి కాదు... ఉమ్మడి కర్నూలు జిల్లాలో 30 వేల మంది వరకు ఉద్యోగులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కర్నూలు(అగ్రికల్చర్): ట్రెజరీ ద్వారా వేతనాలు పొందే ఉద్యోగులు కర్నూలు జిల్లాలో 25,985, నంద్యాల జిల్లాలో 20,282 ఉన్నారు. మొత్తం 46,287 మందికి డిపార్టుమెంటు వారీగా వేతనాలు చెల్లిస్తున్నారు. ఇప్ప టి వరకు కొన్ని డిపార్టుమెంటు ఉద్యోగులకే వేతనాలు జమ అయ్యాయి. ఇప్పటికీ దాదాపు 30 వేల మందికిపైగా వేతనాలు చెల్లించిన దాఖలాలు లేవు. నవంబరు నెల వేతనాలే కాదు... ఐదారు నెలలుగా ప్రతి నెలా జీతాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతూనే ఉంది. హిందువులకు దసరా పండగ అక్టోబరు 2వ తేదీ ఉన్నప్పటికీ వేతనాలు మాత్రం ఇవ్వలేదు. నోరు మెదపని ఉద్యోగ సంఘాల నేతలు ఉమ్మడి జిల్లాలో 18 శాఖలకు సంబందించిన ఉద్యోగులకు వేతనాలు లేకపోవడంతో ఆయా శాఖల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వ్యవసాయం, ఉద్యానశాఖ, పట్టుపరిశ్రమ శాఖ , నీటిపారుదల, రోడ్లు–భవనాలు, రెవెన్యూ, పౌరసరఫరాలు, సర్వే, పరిశ్రమలు, సహకార శాఖ, రవాణా, సమాచార పౌరసంబంధాలు, ఐఎంఎస్–ఈఎస్ఐ, మైనింగ్, ఎన్సీసీ, ట్రైబల్ వెల్ఫేర్లకు చెందిన ఉద్యోగులు నవంబరు నెల వేతనాల కోసం ఎదరు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతి నెలా ఐదారు తేదీల్లోనే వేతనాలు చెల్లిస్తున్నప్పటికీ అప్పట్లో ఉద్యోగ సంఘాల హైరానా అంతా ఇంతా కాదు. ఇపుడు పది రోజులు, ఆపైనే ఆలస్యమవుతున్నా... ఉద్యోగ సంఘాలు నోరుమెదపడం లేదు. వేతనాల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నా ఏపీ ఎన్జీజీఎవోస్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఈ నెల 10 వతేదీ వరకు అందని జీతాలు చంద్రబాబు ప్రభుత్వంపై రగులుతున్న ఉద్యోగులు ఉమ్మడి జిల్లాలో వేతనాలు పొందని ఉద్యోగులు 30 వేల మంది! -
కోటి సంతకాల ప్రతులు జిల్లా కేంద్రానికి..
● నంద్యాలలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్యెల్యే శిల్పారవి చంద్రకిషోర్రెడ్డి నివాసం నుంచి 60 వేల సంతకాల పత్రాలను నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా జిల్లా పార్టీ కార్యాలయానికి చేర్చారు. ● పాణ్యం మాజీ ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఆధ్వర్యంలో ఆయన నివాసం నుంచి నియోజకవర్గంలో సేకరించిన 60 వేల పత్రాలను నాయకులు, అభిమానులు నంద్యాల జిల్లా కేంద్రానికి తరలించారు. ● ఆళ్లగడ్డ కోటి సంతకాల పత్రాలను తరలించే వాహనానికి మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ● మాజీ ఎమ్యెల్యే కాటసాని రామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, నియోజకవర్గ పరి శీలకులు భూమా కిషోర్రెడ్డి బనగానపల్లెలో ర్యా లీ నిర్వహించారు. సంతకాల పత్రాల వాహనా న్ని వారు జెండా ఊపి నంద్యాలకు తరలించారు. ● డోన్లో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాఽథ్ రెడ్డి నివాసం నుంచి నియోజకవర్గ పరిశీలకులు దేశం సుధాకర్రెడ్డి, ఎంపీపీ రాజశేఖర్రెడ్డి, జెడ్పీటీసీ రాజ్కుమార్ల ఆధ్వర్యంలో కోటి సంతకాల పత్రాలను ఒక వాహనంలో జిల్లా కార్యాలయానికి తరలించారు. ● ఆత్మకూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజల నుంచి సేకరించిన సంతకాల పత్రాలను జిల్లా పార్టీ కార్యాలయానికి వాహనంలో తరలించారు. ● నందికొట్కూరు నియోజకవర్గంలో సేకరించిన సంతకాల పత్రాలను పార్టీ సమన్వయకర్త దారా సుధీర్ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించారు. -
చాలా దారుణం
చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులను పట్టించుకోవడం లే దు. నాకు వ్యక్తిగతంగా రూ.12 వేలు ఈఎంఐ చెల్లించాల్సి ఉంది. కొంతమంది రూ.30 నుంచి రూ.60 వేల వరకు ఈఎంఐలు చెల్లించాలి. ప్రతి నెలా 5వ తేదీలోపు వేతనాలు పడతాయనే ఉద్దేశంతో ఈఎంఐలు పెట్టుకున్నాం. వేతనాల చెల్లింపులో నెల నెలా జాప్యం పెరుగుతుండటం దారుణంగా ఉంది. నవంబరు నెల వేతనాలు డిసెంబరు 10 వతేదీ వరకు చెల్లించ లేదంటే ప్రభుత్వం ఉద్యోగులను పట్టించుకోవడం లేదనే భావన కలుగుతోంది. – బి.చిన్నశంకర్నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్స్ అసోసియేషన్ -
పీఎం సూర్య ఘర్ పథకంలో పురోగతి పెంచాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల: ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకంలో జిల్లాలో అంచనాల మేరకు పురోగతి సాధించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో డీఈలు, ఈఈలతో పీఎం సూర్యఘర్ పథకంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో జిల్లాకు కేటాయించిన లక్ష్యంలో పురోగతి సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మండలంలో లక్ష్యానికి అనుగుణంగా పురోగతి సాధించాలన్నారు. వెండర్ ఎంపిక (కమిషన్) పూర్తయిన దరఖాస్తులను ఆగకుండా వెంటనే పూర్తి చేసి, లబ్ధిదారులు ప్రయోజనం పొందేలా చర్యలు వేగవంతం చేయాలన్నారు. తక్కువ శాతం పురోగతి ఉన్న నంద్యాల, రుద్రవరం, ఉయ్యాలవాడ, కొలిమిగుండ్ల, అవుకు, సంజామల, బనగానపల్లె (రూరల్), ఆత్మకూరు (రూరల్), శ్రీశైలం, ప్యాపిలి మండలాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్ఈ సుధాకర్, ఎల్డీఎం రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘రోళ్లపాడు’ సంరక్షణకు ప్రత్యేక చర్యలు
ఆత్మకూరురూరల్: వెలుగోడు రేంజ్ పరిధిలోని రోళ్లపాడు బట్టమేక పక్షి అభయారణ్యం అభివృద్ధి, సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆత్మకూరు డివిజన్ టైగర్ ప్రాజెక్ట్ డీడీ విఘ్ఘేష్ అపావ్ అన్నారు. అభయారణ్యం సమావేశ హాల్లో మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభయారణ్యంలో ఉన్న వన్యప్రాణుల పరిరక్షణ, ఆవాస ప్రాంత అభివృద్ధి తదితర అంశాలపై వారు చర్చించారు. అభయారణ్య సమీపంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పారిశ్రామిక సంస్థల ప్రతినిధులకు వివిధ సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జేఎస్డబ్ల్యూ అధికారులు నరసింహారెడ్డి, వంశీ కృష్ణ, రాకేష్, గ్రీన్ కో శరత్, సబ్ డీఎఫ్ఓ బబిత తదితరులు పాల్గొన్నారు. ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నంద్యాల(అర్బన్): పట్టణంలోని ఎరువుల దుకాణాల్లో మంగళవారం జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. జేవీసీ ఆగ్రో కెమికల్స్లో స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్స్, ఇన్వాయిస్లను తనిఖీ చేశారు. యూరియా, డీఏపీల భౌతిక నిల్వలు, ఈపాస్ మిషన్లలో ఉన్న స్టాక్ వివరాలను పరిశీలించారు. అదే విధంగా ఎరువుల స్టాక్లను రిటైల్ డీలర్లకు వేసిన బిల్లులను తనిఖీ చేశారు. అనంతరం డీఏఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రతి ఎరువుల, పురుగు మందుల యజమానులు ప్రభుత్వం నుంచి అనుమతులు ఉన్న ఎరువులు, పురుగు మందులు మాత్రమే అమ్మాలన్నారు. స్టాక్ బోర్డులో ప్రతి రోజు అప్డేట్ చేయాలని, ఎరువులు కొన్న ప్రతి రైతుకు బిల్లు కచ్చితంగా ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు. రోడ్ల అభివృద్ధ్దికి పాలనా అనుమతులు కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో రూ.156.64 కోట్లతో 71 రహదారుల పనులు చేపట్టేందుకు పాలనా అనుమతులు మంజూరైనట్లు పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీరు వేణుగోపాల్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో 115.409 కిలో మీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేసేందుకు రూ.62.67 కోట్లతో 27 పనులు మంజూరైనట్లు చెప్పారు. అలాగే నంద్యాల జిల్లాలో 178.110 కిలో మీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేసేందుకు రూ.93.97 కోట్లతో 44 పనులను చేపట్టేందుకు పాలనా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఉమ్మడి జిల్లాలో పూర్తి స్థాయిలో శిథిలావస్థకు చేరిన రోడ్లను అభివృద్ధి చేసేందుకు వీలుగా ప్రతిపాదనలను పంపించడం జరిగిందన్నారు. ఈ ప్రతిపాదనల మేరకు ఆయా రోడ్లను అభివృద్ధి చేసేందుకు అనుమతులు వచ్చాయని ఎస్ఈ వివరించారు. త్వరలోనే రెండు జిల్లాల్లో పాలనా అనుమతులు లభించిన రోడ్ల పనులను ప్రారంభించేందుకు చర్యలు చేపడతామన్నారు. పెరిగిన చలి కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. మంచు కూడా కురుస్తోంది. ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రతలు 15–16 డిగ్రీలకు పడిపోయాయి. ఉదయం 8 గంటల వరకు చలి తగ్గని పరిస్థితి నెలకొంది. చలి తీవ్రతతో అలర్జీ, అస్తమా, ఊపిరితిత్తుల సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నెల 11 నుంచి చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈశా న్యం దిశగా గాలులు గంటకు 3 నుంచి 4 కిలో మీటర్ల వేగంతో విస్తాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల వరకు, కనిష్ట ఉష్ణోగ్రతలు 16.17 డిగ్రీల వరకు నమోదు అవుతాయని ప్రకటించారు. మహానంది: నల్లమల అటవీ ప్రాంతాల్లో చలి చంపేస్తుంది. రాత్రి చీకటి పడితే చాలు మంచు కురుస్తుంది. సాయంత్రం నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు మంచు దుప్పటి కప్పేస్తుంది. ఈ క్రమంలో మంచు, చలితో వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు. తెల్లవారు జాము నుంచే చలి మంటలు వేసుకుంటున్నారు. నేడు ‘డయల్ యువర్ ఎస్ఈ’ కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ భవన్లో ఈ నెల 10న డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ ఆర్.ప్రదీప్కుమార్ తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించే కార్యక్రమానికి వినియోగదారులు తాము ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను 7382614308 నంబర్ ఫోన్ చేసి చెప్పవచ్చని పేర్కొన్నారు. -
పిల్లలకు ఉచిత న్యాయ సహాయం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి కర్నూలు: బలహీనవర్గాల పిల్లలకు ఉచిత న్యాయ సేవలు అందించడం కోసం స్నేహపూర్వక పథకం–2024 ఏర్పాటైందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు జి.కబర్ధి అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కర్నూలు దామోదరం సంజీవయ్య స్మారక మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని వర్గాల పిల్లలు, ముఖ్యంగా అణగారిన బలహీన వర్గాల పిల్లలు, దివ్యాంగ పిల్లలు స్నేహపూర్వక పథకంతో లబ్ధి పొందుతారన్నారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్లైన్ నెంబర్ 15100, పిల్లల హెల్ప్లైన్ నెంబర్ 1098 గురించి కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి వివరించారు. పిల్లలకు గుడ్టచ్, బ్యాడ్టచ్పై డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద అవగాహన కల్పించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి భాస్కర్, డీఈఓ శామ్యూల్పాల్, కార్మిక శాఖ ఉప కమిషనర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ కమిషనర్ సాంబ శివరావు, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద, గవర్నమెంట్ అబ్జర్వేషన్ హోమ్ సూపరింటెండెంట్ హుసేన్ బాషా, లీగల్ సర్వీసెస్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు, సంజీవయ్య మున్సిపల్ హైస్కూల్ హెడ్ మాస్టర్ విజయనిర్మల, ఏపీజే అబ్దుల్ కలాం మున్సిపల్ హైస్కూల్ హెడ్మాస్టర్ హుసేన్, ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు. -
జాబ్ క్యాలెండర్ ఎక్కడ
– కాటసాని శివనరసింహారెడ్డి చంద్రబాబు అబద్ధపు హామీలతో యువత నిలువునా మోసపోయింది. ఎన్నికల సమయంలో యువతకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ఇంకెప్పుడు ఇస్తారు. జిల్లాలో 5 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా నిరుద్యోగ భృతి అందలేదు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బాబు సర్కారుకు ప్రజలే గుణపాఠం చెబుతారు. ఐటీ హబ్ ఏర్పాటులో చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమకు పూర్తిగా అన్యాయం చేసింది. పార్టీలో కష్టపడి పని చేసిన వారికి సముచిత స్థానం దక్కుతుంది. -
రబీలోనూ యూరియా కష్టాలు
జూపాడబంగ్లా: రబీ సీజన్లోనూ రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. మంగళవారం మండల కేంద్రమైన జూపాడుబంగ్లాలోని 80 బన్నూరు సహకార సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు నిరీక్షించాల్సి వచ్చింది. ఈ సొసైటీకి ఇప్పటిదాకా 42 టన్నుల యూరియా మంజూరు కాగా రెండు రోజుల క్రితం 20 టన్నుల యూరియా సరఫరా అయింది. ఉదయం 9 గంటలకు చేరుకున్న రైతులు పాసుపుస్తకాలను వరుసలో పెట్టి సాయంత్రం దాకా పడిగాపులు కాశారు. పలుకుబడి ఉన్న వారికి మాత్రమే ఎరువులు అందుతున్నాయని సన్న, చిన్నకారు రైతులకు యూరియా అందని ద్రాక్షగా మారిందని రైతులు విమర్శించారు. సొసైటీకి మరో 48 టన్నుల యూరియా సరఫరా కోసం ప్రతిపాదనలు పంపినట్లు సొసైటీ సీఈఓ చంద్రశేఖర్గౌడు, ఏఓ కృష్ణారెడ్డి తెలిపారు. -
జగన్ మళ్లీ సీఎం అయ్యేంత వరకు ఇలాగే...
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ సీఎం అయ్యేంత వరకు ఏక రూప వస్త్రధారణ ధరిస్తా. నేటి నుంచి వెయ్యి రోజుల పాటు ఇలాగే ఉంటా. మాజీ వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా రాష్ట్రంలో అవినీతి లేని పాలన అందించారు. ప్రస్తుతం బాబు పాలనలో మోసపోతున్న యువతలో చైతన్యం నింపేందుకు పార్టీ సీనియర్ నాయకులు కాటసాని రాంభూపాల్రెడ్డి ‘యువత మేలుకో’ అనే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు ప్రభుత్వంలో వీధుల్లో మద్యం అందుబాటులోకి వచ్చింది. కేవలం 18 నెలల కాలంలోనే చంద్రబాబు పాలనపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారంటే పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో అర్థమవుతుంది. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయఢంకా మోగించడం ఖాయం. బీవై రామయ్య, నగర మేయర్ -
రబీ గట్టెక్కేనా..
సాగునీరు ప్రశ్నార్థకం కోవెలకుంట్ల: రెండేళ్లుగా జిల్లాలో వరి సాగు రైతులకు కలిసి రావడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో తీవ్ర నష్టాలు చవిచూశారు. ఖరీఫ్ వరి కోత, నూర్పిడి పనులు పూర్తి కాగా రబీ సీజన్ వరిసాగుపై కోటి ఆశలు పెట్టుకుని సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడాది రబీ సీజన్లో జిల్లాలోని 29 మండలాల పరిధిలోని బోర్లు, బావులు, కుందూనది, పాలేరు, కుందర వాగు, తదితర నీటి ఆధారంగా 29,084 హెక్టార్లలో కర్నూలు, నంద్యాల సోనా, షుగర్లెస్, 555 రకాలకు చెందిన వరిని సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఖరీఫ్ వరి కోత, నూర్పి డి పనులు పూర్తిగా కాగా వివిధ సాగునీటి వనరుల ఆధారంగా నారు మడులు సిద్ధం చేసుకుని ఈ నెలాఖరు నుంచి వరినాట్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని 29 మండలాల పరిధిలోని ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో బోర్లు, బావులు, కుందూనది, పాలేరు, కుందర వాగు, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, తదితర నీటి ఆధారంగా వరి సాగు సాధారణ విస్తీర్ణం 65,255 హెక్టార్లు. అయితే ఆయా మండలాల్లో లక్ష్యాన్ని మించి 73,038 హెక్టార్లలో సాగు చేశారు. నారా, నాట్లు, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు, కలుపు నివారణ, వరి కోత, నూర్పిడితో కలిపి ఎకరాకు రూ. 35 వేలకు పైగా వెచ్చించారు. అక్టోబర్ నెలలో పైరు పొట్ట దశకు చేరుకుంది. ఆ నెలలో భారీ వర్షాలకు తోడు మోంథా తుపాన్ ప్రభా వంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. వర్షాలకు వరి చాలా చోట్ల నేలవాలి వడ్లు రాలిపోయాయి. పొట్టదశ కావడంతో గింజ తాలిపోయింది. ఎకరాకు 40 బస్తాలకు పైగా దిగుబడులు వస్తాయనుకుంటే భారీ వర్షాలు దెబ్బతీయడంతో ఎకరాకు 30 బస్తాలకు మించి దిగుబడులు రాకపోవడంతో నష్టాలు చవి చూశారు. దిగుబడులు తగ్గగా మార్కెట్లో గిట్టుబాటు ధర రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో క్వింటా రూ. 2,200 వరకు ధర పలికింది. ఈ ఏడాది మార్కెట్లో బస్తా రూ. 1,400 మించి లేకపోవడం, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో తక్కువ ధరకే ధాన్యాన్ని విక్రయించి రైతులు నష్టాలు మూటగట్టుకున్నారు. ఖరీఫ్ కష్టమంతా పెట్టుబడులకే సరిపోవడంతో రైతులకు నష్టాలు తప్పలేదు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లోని కుందూనది, పాలేరు, కుందరవాగు పరివాహక ప్రాంతాల్లో వరినారుమడులు సిద్ధం చేసుకున్నారు. జిల్లాలో ని బండిఆత్మకూరు మండలంలో 6,225 హెక్టార్లలో, రుద్రవరం మండలంలో 3,260, పాణ్యం మండలంలో 2,885, శిరువెళ్ల మండలంలో 2,347, మహానంది మండలంలో 2,335, ఆళ్లగడ్డ మండలంలో 1,732, వెలుగోడు మండలంలో 1,628, గోస్పాడు మండలంలో 1,107, అవుకు మండలంలో 1,080 హెకార్టలలో వరి సాగు సాధారణ విస్తీర్ణం. అయితే శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం తగ్గు ముఖం పట్టడంతో రాబోయే రోజుల్లో ఎస్సార్బీసీ, కేసీ కెనాల్కు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. అలాగే కుందూనది, పాలేరు, కుందరవాగుల్లో నీటి ప్రవా హం అంతంత మాత్రంగానే వచ్చే పరిస్థితులున్నాయి. ఎస్సార్బీసీ, కేసీకెనాల్స్ పరిధిలో రబీ వరి సాగు వద్దని ఆ స్థానంలో ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని అధికారులను రైతులను హెచ్చరిస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి వరినాట్లు వేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. రబీ వరిసాగు సాగునీటి గండం పొంచి ఉండటంతో ఈ ఏడాది రబీ వరిసాగు ఎంత మాత్రం కలిసోస్తుందో వేచి చూడాల్సిందే. ఈ ఏడాది రబీ సీజన్లో రెండున్నర ఎకరా పొలాన్ని కౌలుకు తీసుకుని వరి సాగుకు నారుమడి సిద్ధం చేసుకున్నాను. గతేడాది రబీ సీజన్లో రెండు ఎకరాల్లో వరి సాగు చేయగా ఎకరాకు 18 బస్తాల దిగుబడులు మాత్రమే వచ్చాయి. ఈ ఏడాది కుందూనది పరివాహకంలో నంద్యాల సోనా రకానికి చెందిన వరి సాగు చేసేందుకు సమాయత్తమవుతున్నాను. ఈ ఏడాది సాగునీరు, వాతావరణం అనుకూలిస్తుందని భావిస్తున్నాను. – ప్రతాప్రెడ్డి, రైతు, భీమునిపాడు, కోవెలకుంట్ల మండలం -
మార్చి వరకు సాగునీటిని విడుదల చేయాలి
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వరి పంట చేతికందే తరుణంలో భారీ వర్షాలతో పైరు నేలవాలి ఎకరాకు 30 బస్తాలకు మించి దిగుబడులు రాలేదు. ఈ ఏడాది రబీ సీజన్లో మూడు ఎకరాల సొంత పొలంలో వరి సాగు చేసేందుకు నారుమడిని సిద్ధం చేసుకున్నాను. కుందూనదికి ఈ ఏడాది మార్చి వరకు నీటిని విడుదల చేస్తే సాగునీరు పుష్కలంగా అందుతుంది. వరి రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటి కష్టాలు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. – మోహన్రెడ్డి, రైతు, వల్లంపాడు, కోవెలకుంట్ల మండలం -
కమ్మని రుచులు.. కలసి తింటే..!
నంద్యాల జిల్లా: ఉరుకుపరుగుల జీవితాలు.. ఇంట్లో నలుగురు ఉన్నా కలసి తీనేదెప్పుడో. అందరూ ఉన్నా టీవీ చూస్తూ.. ఫోన్ మాట్లాడుతూనే భోజనం పూర్తి చేసేవారందరో ఉన్నారు. రుచి ఎరుగరు.. కబుర్లు ఉండవు. మరి కొందరు ఆకలేస్తే అప్పటికప్పుడు ఆన్లైన్ ఆర్డర్లు తెప్పించుకోవడం తినేయడం జరుగుతోంది. కానీ పంట పొలాల్లో కూలీలు తమ కష్టాన్ని మైమరిచి కాసేపు కబుర్లు చెప్పుకుంటూ.. రుచులు పంచుకుంటూ భోజనం ఆరగించే దృశ్యాలే కమనీయమే.పచ్చడి అన్నమైనా సరే ఆ రుచే వేరు. ప్రస్తుతం మిరప, కంది, సీడుపత్తి, పప్పు శనగ, తదితర పంట పొలాల్లో కలుపులు, పండు మిరపకాయల కోతలు కొనసాగుతున్నాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ, చింతకుంట్ల, రుద్రవరం, సంజామల, తదితర గ్రామాల నుంచి మహిళా వ్యవసాయ కూలీలు మండలంలోని పలు గ్రామాలకు ట్రాక్టర్లు, ఆటోల్లో చేరుకుంటున్నారు. ఉదయానే వస్తూ వెంట సద్దులు తెచ్చుకుంటున్నారు. మధ్యాహ్నం వేళ అందరూ ఒక చోట చేరి సద్దులు (క్యారేర్లు) తిని కాస్త సేద తీరి ఆ వెంటనే పనుల్లోకి వెళ్లిపోతున్నారు. -
అబ్బురపరిచే ఆళ్లగడ్డ రాతి చిత్రాలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తయారవుతున్న రాతి చిత్రాలకు ఇప్పటికే జాతీయ స్థాయిలో పేరు ఉంది. ఇక్కడ చేతులతో చెక్కుతున్న రాతి బొమ్మలు, దేవతామూర్తుల విగ్రహాలు దేశంలోని తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. తెలంగాణలోకి యాదగిరిగుట్టలోని దేవతామూర్తుల చిత్రాలు ఆళ్లగడ్డ శిల్పుల చేతుల నుంచి జాలువారినవి కావడం విశేషం. ఈ రాత్రి చిత్రాలకు మరింత గుర్తింపు రావాలంటే శిల్పారామం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కర్నూలు(అగ్రికల్చర్): ఒకవైపు రాతి బొమ్మలు, మరోవైపు గద్వాల పట్టుచీరలు, ఇంకోవైపు కలంకారీ పెయింట్లో రాణింపు ఒక్క మాటలో చెప్పాలంటే హస్తకళలకు ఉమ్మడి కర్నూలు జిల్లా నెలవు. శిల్పారామం ఏర్పాటై ఉంటే ఈ అపురూప కళలకు జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించేది. ఈ నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జాతీయ హస్తకళల వారోత్సవాల (నేషనల్ హ్యాండీక్రాప్ట్ వీక్) నేపథ్యంలో కర్నూలు కొండారెడ్డిబురుజు సమీపంలోని లేపాక్షి హ్యాండీక్రాప్ట్ ఎంపోరియంలో హస్తకళల ప్రదర్శన ఏర్పాటు చేశారు. కలంకారీ పెయింటింగ్లో అద్భుతాల సృష్టి బనగానపల్లి మండలం టంగుటూరు గ్రామానికి చెందిన 69 ఏళ్ల శివానందరెడ్డి 46 ఏళ్లుగా కలంకారీ పెయింటింగ్లో అద్భుతంగా రాణిస్తున్నారు. వేలాది చిత్రాలు ఈయన చేతుల నుంచి ఇప్పటికే జాలువారాయి. భారతీయ ఇతిహాసాల మీద ఈయన కలంకారీ పెయింటింగ్స్ వేయడం ప్రత్యేకత. ఈయన ప్రతిభకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 13 అవార్డులు లభించాయి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ, మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం, మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు పలువురు ప్రముఖల నుంచి నుంచి ఆయన అభినందనలు అందుకున్నారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు కూడా లభించింది. పట్టుచీరలకు పుట్టినిల్లు కర్నూలు జిల్లా చేనేత పట్టుచీరలకు పుట్టినిల్లు. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న పట్టుచీరలను గద్వాల పట్టుచీరల పేరుతో మార్కెటింగ్ చేస్తున్నారు. విదేశాల్లో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రవాసాంద్రులు, ప్రవాస భారతీయుల మహిళలు వీటిపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకున్న చొరువతో ఒక ఉత్పత్తి కింద 2023లో జాతీయ స్థాయిలో పురస్కారం లభించింది. దీని ద్వారా భౌగోళిక గుర్తింపు లభించడంలో కదలిక వచ్చింది. ఇటీవలనే కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక టీమ్ చేనేత పట్టుచీరల ఉత్పత్తిని అధ్యయనం చేసింది. కార్యరూపం దాల్చని శిల్పారామం ఏర్పాటు హస్తకళలకు గుర్తింపు తీసుకరావడం కోసం కర్నూలులో శిల్పారామం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉన్నప్పటికి కార్యరూపం దాల్చలేదు. 2014–15 నుంచి 2018–19 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు శిల్పారామానికి జగన్నాథగట్టులో భూమి కేటాయించినట్లే కేటాయించి తర్వాత ఇతర అవసరాలకు మళ్లించారు. ఇప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. శిల్పారామం లేకపోవడంతోనే హస్తకళలకు ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించడం లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. జిల్లాలోని పట్టుచీరలు, ఆళ్లగడ్డ రాతి చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు కలంకారీ పెయింటింగ్లో రాణిస్తున్న శివానందరెడ్డి జాతీయ హస్తకళల వారోత్సవాలు ప్రారంభం -
బాత్రూమ్ నిర్మించ లేదని..
● పుట్టింటికెళ్లిన భార్య ● మనస్తాపంతో భర్త ఆత్మహత్య కొత్తపల్లి: బాత్రూమ్ సమ స్య ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఎదురుపాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసు కుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామాని కి చెందిన శివశంకర్ (35), అతని సోదరుడు పక్కపక్కన నివాసముంటున్నారు. రెండిళ్లకు కలసి ఒకే బాత్ రూమ్ ఉంది. కొన్నాళ్ల పాటు సర్దుకుంటూ వచ్చిన శివశంకర్ భార్య శశికళ ఇటీవల వేరుగా బాత్రూమ్ నిర్మించాలని కోరింది. 10 రోజుల క్రితం ఈ విషయంలో దంపతులు ఘర్షణ పడ్డారు. బాత్రూమ్ నిర్మించేంత వరకు ఇంట్లో ఉండనంటూ శశికళ జూపాడుబంగ్లాలోని పుట్టినింటికి వెళ్లిపోయింది. అయితే భర్త శివశంకర్ ఎంత బతిమలాడినా తిరిగిరాలేదు. దీంతో మనస్తాపం చెందిన శివశంకర్ శనివారం రాత్రి పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతుడి తల్లి తేనె భాగ్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ఎం.రవీంద్రబాబు సోమవారం వెల్లడించారు. చాగలమర్రి: విద్య, వైద్యంతో పాటు ఆధ్యాత్మికత పెంపునకు ఎస్పీజీ మిషనరీ కృషి చేస్తోందని నంద్యాల అధ్యక్ష కాండపు బిషప్ ప్రసన్నరావు అన్నారు. సోమవారం ఎంతో చరిత్ర కలిగిన ముతాల్యపాడులోని ఎస్పీజీ పరిశుద్ధ జన్మోత్సవ 133వ ప్రతిష్ట వార్షికోత్సవం కార్యక్రమం జరిగింది. అతిథిగా హాజరైన నంద్యాల బిషప్ ప్రసన్నరావు, ఆయన సతీమణి నంద్యాల డయాసిసి ఉమెన్ ఫెలోషిప్ అధ్యక్షురాలు బ్యాలా సంతోష్కు డీనరీ చైర్మన్ రెవ. చంద్రశేఖర్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని భక్తులకు ఏసుక్రీస్తు సందేశం అందించారు. కార్యక్రమంలో నంద్యాల డయాసిస్ సెక్రటరీ రెవ. నందం ఐజాక్, ట్రెజరర్ రెవ. బండి శామ్యుల్, ఎస్ఈజీ ప్రతాప్, ఆళ్లగడ్డ డీనరీ చైర్మన్ ఐజాక్ ప్రసన్నరావు, చర్చి సంఘం పెద్దలు పాల్గొన్నారు. కొలిమిగుండ్ల: నాపరాళ్ల రవాణకు రాయల్టీ వసూలు చేసే బాధ్యత ప్రవేట్ సంస్థకు అప్పగించడంతో అడుగడుగునా ప్రైవేట్ చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం కొలిమిగుండ్లలోని విద్యుత్ సబ్స్టేషన్ ఎదురుగా చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. బెలుం సమీపంలోని నాపరాతి గనుల నుంచి ట్రాక్టర్ లోడ్ చేసుకొని వెళుతున్న సమయంలో సిబ్బంది ఆపినా నిలపక పోవడంతో బైక్లో వచ్చి ట్రాక్టర్ను అడ్డుకున్నారు. రాయల్టీ చెల్లించి రవాణ చేయాలని యజమానికి సూచించారు. కొలిమిగుండ్ల, ఇటిక్యాల, కనకాద్రిపల్లె, రాఘవరాజుపల్లె గ్రామాల్లో వందకు పైగానే పాలీష్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. కొలిమిగుండ్లలో చెక్పోస్టు ఏర్పాటు చేయకముందు బెలుం, బెలుం శింగవరం గ్రామాల్లోని నాపరాతి గనుల నుంచి రవాణ చేసే ట్రాక్టర్లు రాయల్టీలు లేకుండా పోతుండేవి. గమనించిన ప్రైవేట్ సంస్థ ఇక్కడ చెక్పోస్టు ఏర్పాటు చేశారు. దీంతో యజమానులు తప్పక రాయల్టీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క వాహనం కూడ రాయల్టీ లేకుండా వెళ్లేందుకు లేకుండా పలు చోట్ల చెక్పోస్టులు పెట్టారు. బెలుం–బెలుం శింగవరం మధ్యలో, కొలిమిగుండ్లలోని జమ్మలమడుగు క్రాస్ రోడ్డు, బందార్లపల్లె క్రాస్ రోడ్డులో ఏర్పాటు చేయగా తాజాగా కొలిమిగుండ్ల విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఏర్పాటు చేసి 24 గంటల పాటు సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు.ప్రైవేట్ సంస్థ నెలకు రూ.14.5 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి రావడంతో పక్బడందీగా వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు రూ.4.91 లక్షల జరిమానా డోన్ టౌన్: నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు డోన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ రూ.4.91 లక్షల జరిమానా విధించారు. సోమవారం డోన్ జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా అనంతపురం వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న బిహార్ రాష్ట్రానికి చెందిన ట్రావెల్ పాయింట్ బస్సు నిలిపారు. అయితే డ్రైవరు బస్సు ఆపకుండా వెళ్లడంతో అధికారిలో కారుతో వెంబడించి జగదుర్తి సమీపంలో అడ్డుకున్నారు. పర్మిట్లు చూపించమని డ్రైవర్ను అడుగగా అధికారిపై దురుసుగా వ్యవహరిస్తూ ఎలాంటి పత్రాలు చూపలేదు. వెంటనే ఆన్లైన్లో పరిశీలించగా ఎలాంటి రోడ్డు టాక్స్లు చెల్లించడం లేదని గుర్తించి బస్సును సీజ్ చేశారు. జరిమానా కింద రూ. 4.91 లక్షలు విధించినట్లు ఎంవీఐ తెలిపారు. -
కొడుకు మరణాన్ని తట్టుకోలేక..
పాములపాడు/జూపాడుబంగ్లా: కన్నకొడుకు బలవన్మరణాన్ని తట్టుకోలేక ఓ వృద్ధురాలు కాలువలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సోమవారం జూపాడుబంగ్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు...జూపాడుబంగ్లా క్వార్టర్స్లోని పింజరిపేటలో ఏసమ్మ అనే మహిళ కొడుకు సునీల్ (22)తో కలిసి నివాసం ఉంటుంది. ఈమెది స్వగ్రామం నందికొట్కూరు మండలం వడ్డెమాను. భర్త మరణం తర్వాత దాయాదులతో గొడవపడి జూపాడుబంగ్లాకు వచ్చి స్థిరపడింది. అయితే, కొన్నాళ్ల నుంచి స్వగ్రామానికి వెళ్లాలని కుమారుడు ఏసమ్మపై ఒత్తిడి పెంచాడు. తాగి వచ్చి వేధిస్తున్నా సర్దిచెబుతూ వెళ్లేది. ఆదివారం అనంతపురం జిల్లా గుత్తిలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థన ఉందని ఏసమ్మ వెళ్లింది. ఆమె తిరిగి వచ్చేలోపు కుమారుడు ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూసి బోరున విలపిస్తూ ఇస్కాల –కంబాలపల్లి గ్రామాల మధ్య ఉన్న సూపర్ ప్యాసేజ్ వంతెన పై నుంచి ఎస్ఆర్ఎంసీలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అటుగా వెళ్తున్న ఇస్కాల గ్రామానికి చెందిన నాగలక్ష్మి రెడ్డి అనే వ్యక్తి గమనించి గట్టిగా కేకలు వేయడంతో కాలువలో చేపలు పడుతున్న మత్స్యకారులు పుట్టీ సాయంతో ఆమెను కాపాడి పోలీసులకు అప్పగించారు. కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో జీర్ణించుకోలేక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు వృద్ధురాలు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రీ ఓపెన్ దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల: ప్రజా ఫిర్యాదు పరిష్కార వేదికలో రీ ఓపెన్ అయిన 592 దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నమోదయ్యే ప్రతి అర్జీ ప్రజల నమ్మకానికి నిదర్శనమని, వాటిని అత్యంత ప్రాధాన్యంతో, నాణ్యతతో, నిర్ణీత వ్యవధిలో పరిష్కరించడం అధికారులు బాధ్యతగా భావించాలన్నారు. పెండింగ్ అర్జీల ఆడిట్ను నిరంతర ప్రక్రియగా తీసుకోవాలన్నారు. ప్రతి దరఖాస్తు ప్రగతి దశను అధికారులు స్వయంగా పర్యవేక్షించి ఆలస్యానికి తావు లేకుండా చూడాలన్నారు. పీజీఆర్ఎస్లో 292 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి వినతులు సమర్పించారని, ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఎండార్స్ చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. -
అడవిని విడిచి బతకలేం
గ్రామాలకు వెళ్లినపుడు అక్కడి వారు చక్కటి ఇళ్లలో జీవించడం చూశాం. మేం అలా ఉండాలనుకుంటున్నం. కానీ అధికారులు అందుకు ఒప్పుకోవడంలేదు. అడవిని విడిచి మేం బతకలేం. ఇళ్లు లేకుండా మా బతుకులు హీనంగా ఉంటున్నాయి. అటవీ అధికారులు అడవితో మాకున్న సెంటిమెంట్ను గుర్తించాలి. ఇళ్లు కట్టుకోవడానికి మాకు అనుమతి ఇవ్వాలి. – నాగన్న ,పెచ్చెర్వు అడవి నుంచి మమ్మల్ని మైదానాలకు వెళ్లాలంటున్నారు. అప్పుడే అభివృద్ధి అంటున్నారు. ఈ ప్రయోగం 40 ఏళ్ల కిందటే విఫలమైంది కదా? అభివృద్ధి ప్రాంతాలకు మమ్మల్ని తరలించొద్దు. మేమున్న చోటికే అభివృద్ధి ఫలాలు చేరాలి. సమాజంతో సమానంగా మేం ఎదుగుతాం. మాకు పక్కా ఇళ్లు, పాఠశాల, వైద్యం అన్ని చేరువ కావాలి. – నాగరాజు,పెచ్చెర్వు నాగరిక ప్రపంచానికి దూరంగా గిరిజనులు అడవుల్లో ఉండడంతో అభివృద్ధికి దూరమవుతున్నారు. వారు మైదాన ప్రాంతాలకు వెళితే ప్రభుత్వం సమగ్రాభివృద్ధికి తగు ఏర్పాట్లు చేయనుంది. బయటకు వెళ్లే ప్రతి గిరిజన కుటుంబానికి రూ.15 లక్షలు ఇవ్వనున్నారు. పక్కా ఇళ్ళు, విద్య, వైద్యం అందుబాటులో ఉంచుతారు. – విగ్నేష్ అపావ్, డీడీ ప్రాజెక్ట్ టైగర్, ఆత్మకూరు డివిజన్, ఎన్ఎస్టిఆర్ -
శ్రీగిరికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి భక్తులు పోటెత్తారు. పరమేశ్వరుడికి ప్రీతికరమైన సోమవారం కావడంతో స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజా ము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల వద్ద స్వామి వారి దర్శనానికి బారులుదీరారు. స్వామివారి సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు మల్లన్న అలంకార దర్శనం భక్తులందరికీ కల్పించారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. -
మల్లన్నకు వెండి రథోత్సవం
శ్రీశైలంటెంపుల్: జ్యోతిర్లింగక్షేత్రమైన శ్రీశైలమహాక్షేత్రమైన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్లకు సోమవారం దేవస్థానం సహస్రదీపార్చన సేవను నిర్వహించింది. ముందుగా ఆలయ ప్రాంగణంలోని పురాతన మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో సహస్రదీపార్చన పూజలు జరిపించారు. ఈ సేవలో భాగంగా మండపంలో వెయ్యి దీపాలను వెలిగించి, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. అనంతరం స్వామిఅమ్మవార్లను వెండిరథంపై ఉంచి ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా పల్లకీ సేవ బనగానపల్లె రూరల్: పవిత్రశైవక్షేత్రమైన యాగంటిలో సోమవారం స్వామి అమ్మవార్ల పల్లకీ సేవ నిర్వహించారు. ఉదయం ఆలయంలో ఏకశిలా రూపంలో కొలువైన శ్రీ ఉమామహేశ్వరస్వామికి అభిషేకం అర్చన తదితర పూజలు జరిగాయి. సాయంత్రం ఆలయం ఆవరణలో శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను అందంగా అలంకరించి పల్లకీ సేవా కార్యక్రమాన్ని సంప్రదాయబద్దంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ పాండురంగారెడ్డి, పాతపాడు సర్పంచ్ మహేశ్వరరెడ్డి, యాగంటిపల్లె గ్రామ ఉపసర్పంచ్ మౌలిశ్వరరెడ్డితో పాటు అలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు. కర్నూలు కల్చరల్: క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో జనవరి 8, 9 తేదీల్లో తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు వర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ జి.శ్రీనివాస్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.ఇందిరాశాంతి తెలిపారు. సోమవారం రాయలసీమ విశ్వవిద్యాలయంలో సదస్సుకు సంబంధించిన పోస్టర్లను వీసీ, క్లస్టర్ యూనివర్సిటీ ఇన్చార్జి వీసీ వి.వెంకట బసవరావు ఆవిష్కరించారు. ‘21వ శతాబ్ధి మహిళా సాహిత్యం–సమాలోచన’ అంశంపై సదస్సు జరుగుతుందన్నారు. పరిశోధకులు తమ వ్యాసాన్ని జనవరి 1వ తేదీలోగా పంపాలని, మరిన్ని వివరాలకు 97053 83422 నంబర్ను సంప్రదించాలన్నారు. -
ఫిర్యాదులు పునరావృతం కావొద్దు
నంద్యాల: ప్రజలు ఎంతో నమ్మకంతో ఇచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, పునరావృతం కాకూడాదని జిల్లా ఎస్పీ సునిల్ షెరాన్ పోలీసు అధికారులకు సూచించారు. పట్టణంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి ఎస్పీ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ సునిల్ షెరాన్ మాట్లాడుతూ ప్రజల ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పీజీఆర్ఎస్లో వచ్చిన 95 వినతులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులలో కొన్ని.... ● కొలిమిగుండ్ల మండలం మదనంతాపురం గ్రామానికి చెందిన కొండారెడ్డి, శివారెడ్డి, కృష్ణారెడ్డి వారి పొలానికి వేరే వైపు రస్తా ఉన్నా దౌర్జన్యంగా తన పొలం మీదుగా వెళ్తూ పంటను నాశనం చేస్తున్నారని, విచారించి న్యాయం చేయాలని అదే గ్రామానికి చెందిన రామాంజనేయులు జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ● నంద్యాల పట్టణంలోని బైరమల్ వీధిలో తమ ఇంటిని షాప్ కోసం లలీప్ వ్యక్తికి బాడుగకు ఇచ్చామని. అయితే అద్దె ఇవ్వకుండా షాప్ ఖాళీ చేయకుండా తమపై దాడికి యత్నిస్తున్నాడని పట్టణానికి చెందిన సత్యనారాయణ జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ● ప్యాపిలి మండలం హుసేనాపురం గ్రామంలో కొందరు అసాంఘిక కార్యకలాపాలు, అల్లర్లకు పాల్పడుతున్నారని, వారికి అండగా ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అదే గ్రామానికి చెందిన మధుశేఖర్ నాయుడు ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ● సంజామల మండలం అక్కంపల్లి గ్రామానికి చెందిన వెంకటరెడ్డి అనే వ్యక్తి కిసాన్ సభలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి ఉద్యోగం ఇప్పించకుండా డబ్బులు తిరిగి ఇవ్వకుండా బెదిరిస్తున్నాడని, విచారించి న్యాయం చేయాలని ఎం. లక్ష్మయ్య జిల్లా ఎస్పీని కోరారు. -
ప్రొటక్షన్ వాచర్లకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అవార్డులు
ఆత్మకూరు రూరల్: అభయారణ్యంలో వన్యప్రాణుల సంరక్షణకు పాటు పడుతున్న అటవీ శాఖ ప్రొటెక్షన్ వాచర్ల శ్రమకు తగిన గుర్తింపు లభించింది. నాగార్జునసాగర్ –శ్రీశైలం పులుల అభయారణ్యంలో పులి సంరక్షణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఐదుగురు గిరిజన ప్రొటెక్షన్ వాచర్లకు వరల్డ్ వైల్డ్లైఫ్ ఫెడరేషన్ వారు ప్రశంశా పత్రాలతో పాటు ఒక్కొక్కరికి రూ.5 వేలు అందించింది. ఎన్ఎస్టీఆర్ పరిధిలోని గిద్దలూరు డివిజన్ గుడ్లకమ్మ రేంజ్లోని దిగువ మెట్టలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర అటవీ దళాల ప్రధాన అధికారి పీసీసీఎఫ్ పీవీ చలపతిరావు చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. ఆత్మకూరు డివిజన్కు చెందిన ఈదన్న, గుళ్ల నాగయ్య, మార్కాపురం డివిజన్కు చెందిన పులిచర్ల హనుమయ్య, గిద్దలూరు డివిజన్కు చెందిన పిచ్చయ్య, నంద్యాల డివిజన్కు చెందిన జనార్దన్ నాయక్ ప్రశంసా పత్రాలు, నగదు అందుకున్నారు. ఈ మేరకు ఎన్ఎస్టీఆర్ ఎఫ్డీపీటీ విజయకుమార్ సోమవారం ఓ ప్రకటన విడుదలేశారు. -
కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టండి
కర్నూలు: పెండింగ్ కేసులను లోక్ అదాలత్లో పరిష్కారమయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి అధికారులకు సూచించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి సూచనల మేరకు జిల్లా న్యాయ సేవా సదన్లో సోమవారం లీలా వెంకటశేషాద్రి మున్సిపల్, సచివాలయ అధికారులతో డిసెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్అదాలత్పై సమీక్షించారు. కోర్టులలో ఉన్న సివిల్ కేసులు, భూసేకరణ కేసులు, ట్యాక్స్ కేసులు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఉన్న కోర్టులలో ప్రతిరోజూ ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని, ఈ అవకాశాన్ని వినియోగించుకుని కక్షిదారులు తమ కేసులను రాజీపూర్వకంగా పరిష్కరించుకోవాలని కోరారు. మున్సిపల్, సచివాలయ అధికారులు పాల్గొన్నారు. -
మద్యం తాగొద్దన్నందుకు...
పాములపాడు: మద్యం తాగవద్దు అని వా రించినందుకు ఓ వృద్ధుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మండలంలోని మద్దూరు గ్రామ పంచాయతీ మజరా క్రిష్ణానగర్ గ్రామంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగించే బాలయ్య (60) మద్యానికి బానిసయ్యాడు. భార్య లక్ష్మీదేవి, కుమారుడు అరుణ్ ఆరోగ్యం దెబ్బతింటుంది మద్యం అలవాటు మానేయాలని వారించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన ఉదయం పొలానికి వెళ్లి పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం ఆత్మకూరు వైద్యశాలకు తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి బనగానపల్లె రూరల్: మండలంలోని పలుకూరు గ్రామానికి చెందిన సురేంద్ర (44)అనే వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథ్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గంగన్న కుమారుడు సురేంద్ర తన ఇంటిలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో విద్యుత్ మీటర్ వద్దకు వెళ్లీ ఫ్యూజ్ బిగిస్తుండగా విద్యుత్షాక్కు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స కోసం గ్రామంలోని ఓ ప్రైవేట్ వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా అప్పటికే సురేంద్ర మృతి చెందినట్లు అతను తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించి మృతుడి భార్య సంధ్యా సుధా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐతెలిపారు.మృతుడికి ఒక కూతురు ఉంది. విజిలెన్స్ అధికారుల దాడులు ఆత్మకూరు: పట్టణంలోని పలు దుకాణాలపై సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అతిథి హోటల్లో చికెన్ను పరిశీలించి సరిగ్గా లేకపోవడంతో రూ.10 వేలు జరిమానా విధించారు. అలాగే కప్పలకుంట్లలోని అనన్ బేకరీలో అటుకులు పరిశీలించి నాణ్యతగా లేవని రూ.8 వేలు జరిమానా విధించారు. బ్రదర్ బేకరీలో కూల్ కేకులను టెస్టింగ్కు పంపించారు. అధికారుల దాడుల నేపథ్యంలో పలువురు వ్యాపారులు దుకాణాలు మూసేశారు. విజిలెన్స్ అధికారులు వెంకటరమణ, విశ్వనాథం, ఫుడ్ఇన్స్పెక్టర్ షేక్షావలి, సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు. నిందితుడికి జైలు శిక్ష కర్నూలు: కాంట్రాక్టు బిల్లులు చెల్లించే విషయంలో లంచం తీసుకున్న కేసులో నిందితుడు దక్షిణ మధ్య రైల్వే డివిజినల్ ఫైనాన్స్ సీనియర్ అకౌంటెంట్ చల్లా శ్రీనివాసులు (ప్రస్తుతం రిటైర్డ్)కు రెండేళ్లు జైలు శిక్ష, రూ.20 వేలు జరిమానా విధిస్తూ కర్నూలు సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఎం.శోభారాణి సోమవారం తీర్పు ఇచ్చారు. 2017 నవంబర్ 20న ఫిర్యాది కాంట్రాక్టర్ అయిన సీహెచ్డీ రాజుల నాయుడు కాంట్రాక్టు చేసిన బిల్లులు సుమారు రూ.30 లక్షలు ఆయనకు చెల్లించే విధంగా అనుకూలంగా చేసినందుకు నిందితుడు రూ.15 వేలు లంచం డిమాండ్ చేశారు. దీనిపై కాంట్రాక్టర్ ఫిర్యాదుతో సీబీఐ పోలీసులు వలపన్ని పటు్టు కున్నారు. కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించారు. ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిరికొండ మనోహర్ వాదించారు. -
వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
పాణ్యం: పదవ తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని నంద్యాల డీఈఓ జనార్దన్రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. సోమవారం నెరవాడ మెట్ట వద్ద ఉన్న గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హాస్టల్లో ఉండే విద్యార్థులకు చదవుకునేందుకు అదనపు సమయం ఉంటుందన్నారు. పట్టుదలతో చదివి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ఆయన వెంట ఎంఈఓ–2 సుబ్రహ్మణ్యం, ప్రిన్సిపాల్ కృష్ణానాయక్ తదితరులు ఉన్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు ఏర్పాట్లు పూర్తి నంద్యాల(న్యూటౌన్): ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్ధన్రెడ్డి సోమ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 10 నుంచి 21వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షలు మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యా హ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించనున్నారు. జిల్లాలో శాంతిరాం ఇంజినీరింగ్ కాలేజీ, నెరవాడ, ఆర్జీఎం ఇంజినీరింగ్ కాలేజీ, నెరవాడ, రామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాలలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలకు 8791 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఆన్లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరాలన్నారు. సెల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతి ంచబడదన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని, 73862 39784, 8179855575ను సంప్రదించాలని ఆయన సూచించారు. ఎస్ఎస్ఏ కో ఆర్డినేటర్గా నిత్యానంద రాజు నంద్యాల(న్యూటౌన్): జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్గా నిత్యానందరాజు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఇక్కడ పని చేస్తున్న ప్రేమాంతకుమార్ వైఎస్సార్ జిల్లాకు బదిలీ కావడంతో ఈ స్థానంలో కడప సమగ్ర శిక్ష ఏపీసీగా పని చేస్తున్న నిత్యానందరాజును ఇక్కడికి బదిలీ చేశారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష అభియాన్ పరిధిలో అన్ని విభాగాల సిబ్బందితో సమన్వయంతో పని చేస్తానన్నారు. ప్రతి ఉద్యోగి అంకిత భావంతో బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. బాధ్యతలు చేపట్టిన ఆయనను కార్యాలయ సిబ్బంది, ఉద్యోగులు పుష్పగుచ్చంతో అభినందించారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు నంద్యాల(అర్బన్): ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించే డీలర్లపై చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ప్రతి ఎరువుల దుకాణ యజమానులు తప్పని సరిగా ఐఎఫ్ఎంఎస్ మిషన్ ద్వారా బిల్లులు వేయాలని సూచించారు. పట్టణంలోని డీఎంఆర్, గోకుల్ ఏజెన్సీస్ ఎరువుల అంగళ్లలో సోమవారం వ్యవసాయాధికారులు తనిఖీలు నిర్వహించా రు. ఈ సందర్భంగా ఎరువుల స్టాక్ను రిటైల్ డీలర్లకు పంపిన బిల్లులను పరిశీలించారు. అనంతరం డీఏఓ మాట్లాడుతూ దుకాణంలో స్టాక్ రిజిస్టర్, భౌతిక నిల్వలు సమంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు ఉన్న ఎరువులను మాత్రమే అమ్మకాలు జరపాలన్నారు. స్టాక్ బోర్డు ప్రతి రోజు అప్డేట్ చేయాలని, ఎరువులు కొన్న ప్రతి రైతుకు బిల్లులు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు. -
కాయ్ రాజా కాయ్..!
బేతంచెర్ల: తెలుగు తమ్ముళ్లు అక్రమ సంపాదనకు బడి, గుడిని కూడా వదలడం లేదు. కొందరు ప్రకృతి వనరులను కొల్లగొడుతూ సొమ్ము చేసుకుంటుండగా.. మరి కొందరు దర్జాగా పేదలను దోచుకుంటున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా జేబులు ఖాళీ చేసి పంపిస్తున్న వైనం చూస్తే నివ్వెరపోవాల్సిందే. స్వామి దర్శనం కోసం వెళ్లిన భక్తులను క్షేత్ర పరిసరాల్లో మాటు వేసిన జూద నిర్వాహకులు సర్వం దోచుకుని పంపుతున్నారు. జిల్లాలో వైష్ణవ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన మద్దిలేటి నరసింహ స్వామి ఆలయ పరిసరాల్లో గత కొన్ని రోజులుగా కొందరు వ్యక్తులు దర్జాగా జూదం (బిళ్ల ఆట) నిర్వహిస్తున్నారు. బేతంచెర్ల పట్టణానికి చెందిన ఓ అధికార పార్టీ వార్డు కౌన్సిలర్ అండతో యువకులు జూదం నిర్వహిస్తూ భక్తుల జేబులను గుళ్ల చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రతి శుక్ర, శనివారాలతో పాటు పర్వదినాలలో స్వామి వారి దర్శనార్థం భక్తులు చేరుకుంటారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తుల్లో కొందరిని ఆశ పెడుతూ జూదం ముగ్గులోకి దింపుతున్నారు. ఆలయ పరిధిలోని గోశాల, ముఖ ద్వారం, మెట్ల మార్గం వద్ద రాత్రి వేళ, వేకువజామున జూదం ఆడిస్తున్నారు. గత నెల 29వ తేదీన 130 రూము వద్ద రూ. లక్షలలో జూదం ఆడి డబ్బులు పొగొట్టుకున్న వ్యక్తులు జూదం నిర్వహకులతో గొడవకు దిగినట్లు సమాచారం. క్షేత్ర పరిధిలో ఇంత తతంగం జరుగుతున్నా ఆలయ ఉప కమిషనర్, పోలీసులు చూసీ చూడన్నట్లు వ్యహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఆలయ విశిష్టతకు భంగం వాటిల్లకుండా, ఇలాంటి జూదం ఆడకుండా దేవదాయశాఖ, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భక్తులు అభిప్రాయ పడుతున్నారు. దీనికి తోడు అప్పుడప్పుడూ సెల్ ఫోను దొంగతనాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మద్దిలేటయ్య క్షేత్రంలో జోరుగా జూదం బేతంచెర్ల వార్డు కౌన్సిలర్ అండతో నిర్వహణ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న ఆలయ అధికారులు, పోలీసులు -
పల్స్ పోలియోను విజయవంతం చేయాలి
గోస్పాడు: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ అన్నారు. జిల్లా స్థాయి అధికారులతో సోమవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపారు. పోలియో వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించాలని, అందుకు అన్ని లైన్ డిపార్టుమెంట్లు సమన్వయంతో పని చేయాలన్నారు. 5 సంవత్సరాల్లోపు పిల్లలు 2,38,404 మంది ఉన్నారని, జిల్లా వ్యాప్తంగా 1,318 బూత్లు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 5,272 మంది సిబ్బంది 21వ తేదీ ఆదివారం బూత్ స్థాయిలో పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. ఈనెల 22, 23 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి మిగిలిపోయిన పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నట్లు చెప్పారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సుదర్శన్బాబు మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, సంత మార్కెట్ల వద్ద బూత్లు ఏర్పాటు చేసి పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ లలిత, ప్రోగ్రాం అధికారులు డాక్టర్లు ప్రసన్నలక్ష్మి, శ్రీజ, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. కేసీకి పెరిగిన నీటి విడుదల జూపాడుబంగ్లా: కర్నూలు కడప (కేసీ) కాల్వకు సాగునీటి విడుదలను అధికారులు పెంచారు. సుంకేసుల డ్యాం నుంచి 2,500 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు ఏఈ శ్రీనివాసనాయక్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సుంకేసుల డ్యాం నుంచి 2 వేల క్యూసెక్కుల నుంచి 2500 క్యూసెక్కులకు పెంచామన్నారు. అందులో రైతుల వినియోగ అనంతరం లాకిన్స్లాకు 2,117 క్యూసెక్కులు చేరుతున్నట్లు తెలిపారు. అందులో నిప్పులవాగుకు 1,702 క్యూసెక్కులు, తూడిచెర్ల సబ్చానల్ కాల్వకు 360 క్యూసెక్కులు, అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు 55 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ శ్రీనివాసనాయక్ తెలిపారు. -
వేతన వేదన!
● రెండు నెలలుగా శానిటేషన్ సిబ్బందికి అందని వేతనాలు ● శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ధ్య కార్మికుల దుస్థితి ● పద్మావతి సంస్థ నిర్లక్ష్యపు వైఖరిపై మండిపడుతున్న కార్మికులు ● సున్నిపెంట కార్మికులకు అదనపు భారంగా రవాణా చార్జీలు శ్రీశైలంటెంపుల్: ‘అన్నీ ఉన్నా..అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా మారింది శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి. ఏజెన్సీ మారి రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు వేతనాలు అందలేదు. దీంతో కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ధ్య, హౌస్కీపింగ్ నిర్వహణను తిరుపతికి చెందిన పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సంస్థ దక్కించుకుంది. శ్రీశైల దేవస్థానంతో పాటు రాష్ట్రంలోని ఆరు ప్రముఖ దేవాలయాలకు కలిపి సెంట్రలేజేషన్ పేరుతో చంద్రబాబు ప్రభుత్వానికి అత్యంత అప్తుడైన వ్యక్తికి చెందిన సంస్థకు పారిశుద్ధ్య నిర్వహణను కట్టబెట్టారు. అక్టోబరు 1 నుంచి పద్మావతి సంస్థ శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ధ్య నిర్వహణ చేపడుతోంది. చంద్రబాబు ప్రభుత్వంలో నూతనంగా ఏర్పాటైన పద్మావతి ఏజెన్సీకి సూపర్వైజర్స్–4, శానిటరీ మేసీ్త్ర–52, హౌస్కీపింగ్ వర్కర్స్–506, స్కావెంజర్స్–58, మెషిన్ ఆపరేటర్స్, ట్రాక్టర్ డ్రైవర్స్–4, ఎలక్ట్రిషియన్స్–5, ఏసీ మెకానిక్–3, ప్లంబర్స్–5, కార్పెంటర్స్–4 ఇలా (వీక్లి ఆఫ్ రీలీవర్స్తో) మొత్తం కలిపి సుమారు 641మందికి కేటాయించారు. వీరికి కార్మిక చట్టం ప్రకారం జీవో నెం.11 ప్రకారం నెలకు రూ.12,253 వేతనంగా చెల్లిస్తామని టెండర్లో పొందుపర్చారు. రెండు నెలలు గడుస్తున్నా అందని వేతనాలు పద్మావతి సంస్థ శ్రీశైల దేవస్థానంలో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టి రెండు నెలలు పూర్తయి మూడవ నెల గడుస్తున్నా ఇంత వరకు వేతనాలు చెల్లించలేదు. మొత్తం 641మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.12,253 నెలకు వేతనంగా చెల్లించాలి. ఇందులో ఈపీఎఫ్, ఈఎస్ఐకి పోను బేసిక్ వేతనంగా ఒక్కొక్కరికి నెలకు రూ.10,690 ఇవ్వాలి. 641మంది కార్మికులకు గాను నెలకు రూ.68.52లక్షలు వేతనాలుగా చెల్లించాలి. అయితే పద్మావతి సంస్థ రెండు నెలలు గడుస్తున్నా కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు అవస్థలు పడుతున్నారు. సున్నిపెంట నుంచి వచ్చే సుమారు 300మంది కార్మికులు జీతాలు రాకపోగా, రవాణా చార్జీలకు నెలకు రూ.2వేలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. -
మంచు కురిసే వేళలో..
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కురుస్తోంది. నందికొట్కూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు, ఆదోని ప్రాంత పరిసరాల్లో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంది. ఉదయం 9 గంటలైనా సూర్యుడు మంచు దుప్పటి చాటునే ఉన్నాడు. దీంతో రోడ్లపై వెళ్లే వాహనదారులు దారి కనిపించక ఇబ్బంది పడ్డారు. లైట్లు వేసుకొని ప్రయాణించాల్సి వచ్చింది. నందవరం మండల పరిసరాల్లో ఇరుగుపొరుగు వారు కనిపించనంతగా మంచు కురిసింది. – నందవరం/కొత్తపల్లి/గోనెగండ్లనందవరం సమీపంలో పొగ మంచులో సూర్యోదయంకమ్ముకున్న పొగమంచునాగలదిన్నె – మంత్రాలయం ప్రధాన రహదారిలో.. -
పసిమొగ్గకు ‘రూ.16 కోట్ల’ కష్టం
వెల్దుర్తి: పసిమొగ్గకు ఒక్కసారిగా రూ.16 కోట్ల కష్టం వచ్చి పడింది. ఎనిమిది నెలలు నిండిన చిన్నారి రెండేళ్లకు మించి బతకని రుగ్మత వచ్చింది. బతకాలంటే రూ.16కోట్ల ఇంజక్షన్ అవసరమైంది. వెల్దుర్తి పట్టణానికి చెందిన జెఎమ్ సురేష్, పుష్పావతి కుమార్తె పునర్విక శ్రీ శరీరాన్ని కదపలేని స్థితిలో, ఏడవాలన్నా, నవ్వాలన్నా, చివరికి ఊపిరికైనా కష్టాన్ని ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్లో వైద్య పరీక్షలు చేయించగా ఎస్ఎమ్ఏ టైప్ వన్(స్పైనల్ మస్స్క్యులర్ ఆత్రఫి–జన్యు సంబంధిత వెన్నముక కండరాల క్షీణత)రుగ్మత అని తేలింది. ఈ వ్యాధి చికిత్సకు రూ.16 కోట్ల విలువ చేసే ఇంజెక్షన్ ఇవ్వాలని వైద్యులు చెప్పారు. వెల్దుర్తి కొత్త బస్టాండు ప్రాంతంలో ఓ చిన్న షాపులో కులవృత్తి మంగలి పనితో జీవనం సాగించే సురేశ్ (ఫోన్ నంబర్ 9052635529) దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ ఇంజెక్షన్ కొనుగోలు చేసేందుకు 14 నెలల్లోనే డబ్బు సమీకరించుకోవాలి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, దాతలు స్పందించాలని సురేశ్ కోరుతున్నారు. -
పండు కుళ్లిపోతున్నాయి
ఎకరాకు రూ. 45వేలు కౌలు చెల్లించి 8 ఎకరాల్లో అరటి పంటను సాగుచేశాను. తీరా దిగుబడి వచ్చిన తర్వాత మార్కెట్లో ధర లేదు. దీంతో పొలాల్లోనే పంటను ఉంచాను. కాయలు మాగిపోయి కుళ్లిపోతున్నా యి. గతంలో నేను టన్ను రూ. 23 వేల వరకు విక్రయించాను. కాని ఇప్పుడు అడిగేవారు లేరు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా కట్టాలో తెలియడం లేదు. – జానవత్ చంద్రానాయక్ కెఆర్ఆర్ తండా, పాణ్యం నేను 5 ఎకరాల్లో అరటి సాగుచేశా. గత నెలలో తుపాన్ నుంచి పంటను కాపాడుకోవడానికి ఎన్నో అవస్థలు పడ్డా. ఎలాగోలా రక్షించుకున్నాం అనే సరికి ధర లేక చెట్లపైనే మాగిపోతున్నాయి. సుమారు రూ. 4 లక్షల దాక పెట్టిన పెట్టుబడిలో ఒక్క రూపాయి కూడా చేతికి రాక ఎంతో నష్టపోయా. చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోవాలి. – వెంకటరెడ్డి, అరటి రైతు, చిన్నవంగళి -
కమనీయం.. స్వర్ణ రథోత్సవం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్రనక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్స వం నిర్వహించారు. వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు చేపట్టారు. స్వర్ణరథోత్సవంలో ముందుగా అర్చకులు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. అనంతరం రథారూఢులైన స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు చేశారు. ఉదయం 7.30 గంటలకు స్వర్థ రథోత్సవం ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం ముందుభాగం గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు రథోత్సవం కొనసాగింది. కళాకారుల కోలాటం, తాళం భజన, డోలు వాయిద్యం, చెక్కభజన మొదలైన కళారూపాలు ఆకట్టుకున్నాయి. దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు ఏవీ రమణ, జి.గంగమ్మ, డి.వెంకటేశ్వర్లు, ప్రత్యేక ఆహ్వానితులు కోటారెడ్డి, ఏఈవో, అర్చకులు, వేదపండితులు తదితరులు పాల్గొన్నారు. -
గెలవిల...
ఆళ్లగడ్డ/మహానంది/పాణ్యం: జిల్లాలో అరటి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రకృతి వైపరీత్యాలతో పంట దెబ్బతిని అరకొరగా దిగుబడి చేతికొచ్చింది. ఈ సమయంలోనే మార్కెట్లో ధరలు నేల చూపు చూస్తున్నాయి. ధరలు లేక రైతులు గెలవిల కొట్టుకుంటున్నా ప్రభుత్వం కన్నెతి చూడటం లేదు. కోత, రవాణా ఖర్చులు రాని పరిస్థితి ఉంటంతో కొందరు తోటల్లోనే వదిలేశారు. మరికొందరు వేరే పైరు సాగుచేసుకునేందుకు తోటలను ట్రాక్టర్లతో దున్నేసి పశువులకు మేతగా వేస్తున్నారు. ఉద్యానశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు 13 వేల ఎకరాల్లో అరటి సాగు అవుతోంది. బండిఆత్మకూరు, బేతంచెర్ల, చాగలమర్రి, డోన్, కొలిమిగుండ్ల, రుద్రవరం, మహానంది, పాణ్యం, ప్యాపిలి, శిరివెళ్ల మండలాల పరిధిలో అత్యధికంగా సాగు చేస్తుంటారు. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో టిష్యూకల్చర్, డ్రిప్ ఇరిగేషన్తో అరటి మొక్కలు పెంచుతున్నారు. ఎకరాకు రూ.1.20 లక్షల నుంచి రూ.1.50 లక్షల ఖర్చు వస్తోంది. దిగుబడి 25 నుంచి 30 టన్నుల మేర వస్తుందని గతంలో ఉన్న ధరలను దృష్టిలో పెట్టుకుని సాగు చేశారు. అయితే ఈ ఏడాది పెట్టుబడులు కూడా దక్కని కనిష్ట స్థాయికి ధరలు పడిపోవడంతో రైతుల ఆశలు నీరుగారాయి. జిల్లాలో రూ. కోట్లు నష్టపోతున్నా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తుండటంపై అరటి రైతులు ఆవేదన చెందుతున్నారు. అరటి సాగు చేసి అప్పుల పాలై.. గతేడాది అరటి టన్ను రూ. 28 వేలకు పైగా పలకగా.. ఈసారి టన్ను రూ. 500 పడిపోయిందంటే అరటి రైతు ఏమేరక నష్టపోయాడో అర్థమవుతోంది. రిటైల్ మార్కెట్లో ఇప్పటికీ డజను అరటి పళ్లు రూ. 50 నుంచి రూ. 70 కి తగ్గడం లేదు. వాటిని పండించే రైతుకు మాత్రం రూ. 5 దక్కడం లేదు. దీంతో అనేక మంది గెలలను ట్రాక్టర్లలో తరలించి రోడ్ల వెంట, బీడు భూముల్లో పారబోస్తుండటంతో పశువులకు ఆహారంగా మేపుకుంటున్నారు. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అరటి రైతులు నష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రతి ఏడాది సీజన్ మొదలయ్యే సరికి గ్రామాల్లోని దళారులు, వ్యాపారులు పొలం వద్దకు వచ్చి తమకే అరటి గెలలు విక్రయించాలని అడ్వాన్స్ ఇస్తూ అగ్రిమెంట్ చేసుకునేవారు. అయితే ఇప్పుడు వ్యాపారుల వద్దకే రైతులు వెళ్లి ఎంతో కొంత ఎప్పుడో ఒక సారి డబ్బులివ్వండి.. గెలలు కొట్టుకోవాలని ప్రాథేయపడుతున్నా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుగంధాలదీ ఇదే పరిస్థితి..రుచిలో మధురం, నాణ్యత కలగలసిన మహానంది సుగంధాల అరటి గెలలనూ అడిగేవారు లేక రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. చంద్రబాబు సర్కార్ వచ్చినప్పటి నుంచి ఈ పరిస్థితి నెలకొంది. గతంలో కిలో రూ. 18 నుంచి రూ. 20 ఉండగా ప్రస్తుతం కిలో కేవలం రూ. 6 నుంచి రూ. 7 వరకు ఉండటంతో పెట్టుబడులు మాట దేవుడెరుగు, కనీస కౌలు రాని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు చేసేదేమిలేక తోటల్లోనే గెలలను వదిలేయాల్సిన దుస్థితి నెలకొంది. గతంతో పోలి స్తే ధర మూడు రెట్లు తగ్గడంతో పెట్టిన పెట్టుబడులు, కౌలు రాకపోగా రైతులు నష్టపోయారు. మొన్నటి వరకు విజయవాడ, గుంటూరు, విను కొండ, తదితర పట్టణాలకు మహానంది అరటి ఎగుమతులు అధికంగా ఉండేవి. అయితే ప్రస్తు తం కొనేవారు, అడిగేవారు లేకపోవడంతో భువనేశ్వర్, ఒడిస్సా, బిహార్ ప్రాంతాలకు తరలిస్తున్నారు. దళారులేమో బాగుపడుతున్నారు కానీ అరటి రైతులు మాత్రం అప్పుల్లో కూరుకుపోయి నష్టపోతున్నారు. అరటి ధర నేలచూపు అడిగేవారు లేక పంటను వదిలేస్తున్న రైతులు ప్రస్తుతం టన్ను ధర రూ. 500 నుంచి రూ.1,000 మాత్రమే చోద్యం చూస్తున్న చంద్రబాబు సర్కార్ జిల్లాలో సాగు విస్తీర్ణం 12,813.54 హెక్టార్లు ప్రస్తుతం కోతకు వచ్చింది 8 వేల హెక్టార్లుఇక్కడ అరటి చెట్లను గెలలతో సహా ట్రాక్టర్తో దున్నేస్తున్న రైతు చంద్ర ఓబులరెడ్డి. చాగలమర్రి మండలం చిన్నవంగళి గ్రామం. ఇతను రూ. 10 లక్షల వరకు ఖర్చు పెట్టి 8 ఎకరాల్లో అరటి సాగు చేశాడు. గెలలు కూడా బాగా వచ్చాయి. ఎడతెరిపి లేని వర్షం, ముసురు పట్టి తెగులు సోకి కాయలు సైజ్కాక ముందే మాగిపోతున్నాయి. మార్కెట్లో ధరలేక వ్యాపారులు ఎవరూ రావడం లేదు. చేసేదిలేక పది రోజుల క్రితం పంటను పూర్తిగా దున్నేశాడు. -
వేటగాళ్ల అక్రమ విద్యుత్ వినియోగంపై నిఘా పెట్టాలి
ఆత్మకూరురూరల్: నాగార్జునసాగర్ – శ్రీశైలం పులుల అభయారణ్యం సమీపంలోని పొలాల్లో విద్యుత్ లైన్ల నుంచి వన్యప్రాణుల వేటగాళ్ల అక్రమ విద్యుత్ వినియోగంపై అధికారులు నిఘా పెంచి చర్యలు తీసుకోవాలని ఆత్మకూరు ప్రాజెక్ట్ టైగర్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అపావ్ సూచించారు. బైర్లూటీలోని ఎకో – టూరిజం సమావేశ మందిరంలో ఆదివారం ఆయన విద్యుత్ అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెలుగోడు నార్త్ బీట్ ప్రాంతంలో ఇటీవల వేటగాళ్లు అక్రమ విద్యుత్ వినియోగించి వన్యప్రాణుల కోసం ఉచ్చులు వేశారన్నారు. ఆ ఉచ్చులకు ఒక ప్రొటెక్షన్ వాచర్ మరణించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో బానకచర్ల గ్రామానికి విద్యుత్ సరఫరాకు వేసిన విద్యుత్ లైన్కు అటవీ అనుమతి లేదని వివరించారు. కొందరు రైతులు తమ పంటల రక్షణ పేరిట పొలాలకు అక్రమంగా విద్యుత్ కంచెలను ఏర్పాటు చేస్తున్నారని, విద్యుత్ అధికారులు అడ్డుకోవాలన్నారు. అలాగే అటవీ ప్రాంతాల మీదుగా అను మతి లేకుండా వేసిన విద్యుత్ లైన్లు తొలగించాలని ఆదేశించారు. సమావేశంలో నందికొట్కూరు, ఆత్మకూరు డివిజన్ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు బబిత, ఎఫ్ఆర్వోలు పాల్గొన్నారు. -
చంద్రబాబు సర్కారు తీసుకున్న అనాలోచితన నిర్ణయాన్ని జనం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో పేదలకు నష్టమంటూ ప్రజలు ఊరూరా సంతకం చేసి మరీ చెబుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్
బొమ్మలసత్రం: పేద విద్యార్థులు వైద్య విద్య అభ్యసించాలని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందులో 5 కళాశాలల నిర్మాణం పూర్తి చేసి పేద విద్యార్థులకు మెడికల్ సీట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగతా 12 కళాశాలలను పూర్తి చేసి పూర్తిస్థాయిలో విద్యార్థులకు మెడికల్ సీట్లను అందించటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మహా సంకల్పంతో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లారు. అయితే 2024 ఎన్నికల్లో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని విస్మరిస్తూ కుట్ర పన్నింది. అసంపూర్తిగా ఉన్న మెడికల్ కళాశాలను పూర్తి చేయకుండా పీపీపీ పేరుతో కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు అడుగులు వేసింది. దీన్ని నిరసిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 3.83 లక్షలకు పైగా ప్రజలు సంతకాలు చేశారు. ఊరూరా ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతున్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. మరో రెండు రోజుల్లో కార్యక్రమం పూర్తి కానున్న నేపథ్యంలోసంతకాల రూపంలో ప్రజాగ్రహం వెలువడనుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దంటూ ప్రజలు చేసిన సంతకాల ప్రతులు త్వరలో గవర్నర్ చెంతకు చేరనున్నాయి. ఊరూరా అనూహ్య స్పందన.. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గత అక్టోబర్ నెల 10వ తేదీన ప్రారంభమైన కోటి సంతకాల కార్యక్రమానికి ఊరూరా విశేష స్పందన కనిపిస్తోంది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, అనుబంధ విభాగాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడంతో పార్టీ శ్రేణుల్లోనూ ఉత్సాహం కనిపించింది. దాదాపు రెండు నెలల పాటు వివిధ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. నంద్యాల, శ్రీశైలం, పాణ్యం, ఆళ్లగడ్డ, డోన్, బనగానపల్లె, నందికొట్కూరు నియోజకవర్గాల్లో దశల వారీగా నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించారు. ప్రజా ఉద్యమంటూ తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టారు. నిరసనల్లో మహిళలు, విద్యార్థులు, యువకులు వేలాదిగా పాల్గొన్నారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా వెనుకడుగు వేయలేదు. జిల్లాలో సంతకాల సేకరణ ఇలా ● నంద్యాల నియోజకవర్గంలో మాజీ ఎమ్యెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతంగా పూర్తి కానుంది. పట్టణంలోని 42 వార్డులతో పాటు నంద్యాల, గోస్పాడు మండలాల్లో ఇప్పటి వరకు 40 వేల మంది నుంచి సంతకాలు సేకరించారు. ● పాణ్యం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి ఆధ్వర్యంలో 60 వేల మందికి పైగా ప్రజలు సంతకాలు చేసి కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకించారు. ● ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మాజీ ఎమ్యెల్యే గంగుల బిజేంద్రనాఽథ్రెడ్డి ఆధ్వర్యంలో 50 వేల మందికి పైగా ప్రజలు సంతకాలు చేసి ప్రభుత్వ మెడికల్ కళాశాలలు యథావిధిగా కొనసాగేలా ప్రభుత్వానికి సంకేతాలు పంపారు. ● బనగానపల్లె నియోజకర్గంలో మాజీ ఎమ్యెల్యే కాటసాని రామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఆధ్వర్యంలో సంతకాల శిబిరాల్లో 60 వేల మందికి పైగా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ● డోన్ నియోజకవర్గంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాఽథ్రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 60 వేల మంది ప్రజలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారు. ● శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు పట్టణంతో పాటు 5 మండలాలల్లో నాయకులు మాజీ ఎమ్యెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 63 వేలకు పైగా సంతకాలు సేకరించారు. ● నందికొట్కూరు నియోజకవర్గంలో సమన్వయకర్త దారా సుధీర్ అధ్వర్యంలో 50 వేల మంది నుంచి పార్టీ నేతలు ఊరూరా సంతకాలు సేకరించారు. పేదల కలలపై విషం చిమ్మి.. వైద్య విద్యను దూరం చేసి.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఐదింటిని ప్రారంభించి 750 మెడికల్ సీట్లను ప్రభుత్వం అదనంగా విద్యార్థులకు అందించింది. అయితే ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన చంద్రబాబు నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలపై విషం చిమ్మటం మొదలుపెట్టారు. కాలేజీల ద్వారా అతి తక్కువ ఖర్చుతో ఎక్కడ పేదల పిల్లలు వైద్యులుగా తయారవుతారనన్న దురుద్దేశంతో కాలేజీలను ప్రైవేటీకరణ చేపట్టేందుకు పూనుకున్నారు. కళాశాలను పీపీపీ పేరుతో బినామీలకు కట్టబెట్టి సీట్లు అమ్ముకుని పేదలను దోచుకునే కుట్రకు పదునుపెట్టారు. ఇదే కాకుండా బోధనాసుపత్రులను ప్రైవేటు పరం చేస్తే పేదలకు ఉచిత నాణ్యమైన వైద్యం కూడా అందకుండా చేయవచ్చనే దురాలోచనకు తెర లేపారు. చంద్రబాబు కక్షపూరిత విధానాల ద్వారా రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 2,450 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంది. చంద్రబాబు గత 17 నెలల పాలనలో చేసిన రూ. 2.50 లక్ష కోట్ల అప్పులో మెడికల్ కళాశాలకు రూ. 5 వేల కోట్లు ఖర్చు చేయలేకపోవడంపై జనం తీవ్రంగా విమర్శిస్తున్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జనం కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన ప్రభుత్వ తీరును నిరసిస్తూ స్వచ్ఛందంగా సంతకాలు జిల్లా వ్యాప్తంగా 3.83 లక్షలకు పైగా సంతకాల సేకరణప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న కోటిసంతకాల సేకరణకు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. జిల్లాలో దాదాపు 4 లక్షల మంది సంతకాలు చేశారు. తమ పిల్లల బంగారు భవిష్యత్ ఉపయోగపడే మెడికల్ కాలేజీలను చంద్రబాబు కార్పొరేట్ సంస్థలకు ప్రైవేటీకరణ పేరుతో అప్పగించాలని చూడటం అవివేకమని తల్లిదండ్రులు చెప్పుకొస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మించిన పథకాలు ఇస్తామంటే నమ్మి మోసపోయామని ప్రజలు బాధపడుతున్నారు. రాష్ట్రాన్ని ఆర్ధికంగా నిలబెట్టి, పేదలకు సంక్షేమాన్ని అందించే సత్తా ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఉందని ప్రజలు కొనియాడుతున్నారు. – కాటసాని రాంభూపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు -
క్రెడిట్ చోరీ.. మంత్రులదీ అదేదారి
డోన్: టీడీపీ కూటమి ప్రభుత్వంలో క్రెడిట్ చోరీ సంస్కృతిని చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలూ కొనసాగిస్తున్నారు. సొమ్మొకరిది సోకొకరిది అన్న చందంగా గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులన్నీ తామే చేశామని గప్పాలు కొట్టుకుంటున్నారు. తాజాగా రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సైతం ఇదే బాటను అనుకరించారు. వివరాల్లోకెళ్తే.. నంద్యాల జిల్లాలోని డోన్ పట్టణంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రూ.42లక్షల వ్యయంతో నిర్మించిన పంచాయతీరాజ్ అతిథి గృహాన్ని 2024 జనవరి 28న అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు. ఇప్పుడు ఆ భవనాన్ని తామే నిర్మించామంటూ చంద్రబాబు సర్కార్లోని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గురువారం డివిజనల్ డెవలప్మెంట్ అధికారి కార్యాలయంగా ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ ప్రారంభకులుగా, సభ అధ్యక్షులుగా డోన్ టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్రెడ్డి, విశిష్ట అతిథులుగా మంత్రులు బీసీ జనార్దన్రెడ్డి, పయ్యావుల కేశవ్, ఫరూక్లు పాల్గొన్నట్లు కొత్త శిలాఫలకాన్ని వేయించారు. ఇది చూసిన స్థానికులు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం ఆర్భాట ప్రచారాలు చేసుకుంటోందని విమర్శలు గుప్పిస్తున్నారు. భవనం వద్ద రెండేళ్ల క్రితం అప్పటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించినట్లు స్పష్టంగా శిలాఫలకం కనిపిస్తోంది. అయినప్పటికీ నిస్సిగ్గుగా ఇలా క్రెడిట్ చోరీ చేయడంపై ముక్కున వేలేసుకుంటున్నారు. -
ఊడిన ఆర్టీసీ బస్సు చక్రం
పాణ్యం: కర్నూలు నుంచి తిరుపతికి 24 మంది ప్రయాణికులతో గురువారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరిన కర్నూల్–2 డిపోకు చెందిన అల్ట్రా డీలక్స్ బస్సు వెనక చక్రం ఊడిపోయింది. దాదాపుగా 100 మీటర్లు దూరం వెళ్లి ఓ హోటల్గోడను ఢీకొని కిందపడింది. పాణ్యం మండలం తమ్మరాజుపల్లె గ్రామం వద్ద గమనించిన ప్రయాణికులు కేకలు వేశారు. డ్రైవర్ బస్సు ఆపి ప్రయాణికులను కిందకు దింపారు. చక్రం ఊడిపోయి వెళ్తున్న క్రమంలో బస్సు ఒక కూరగాయల బండిని, నాగరాజు అనే వ్యక్తిని ఢీకొంది. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
పల్లెల్లో ఫ్యాక్షన్ను తట్టిలేపొద్దు
బొమ్మలసత్రం: ‘గత వైఎస్సార్సీపీ పాలనలో ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ప్రస్తుతం టీడీపీ నాయకులు ఫ్యాక్షన్ను తట్టిలేపడం సరికాదు. టీడీపీ నాయకులు ఎన్ని హత్యలు, దాడులకు తెగబడుతున్నా వైఎస్సార్సీపీ నాయకులు మౌనంగా ఉన్నారని భావించొద్దు... ఎప్పు డూ మీ సమయమే నడవదూ...సీన్ రివర్స్ అయితే పరిస్థితులు దారుణంగా ఉంటాయి’ అంటూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్రెడ్డి తనదైన శైలిలో ఘాటుగా హెచ్చరించారు. నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ హరినాఽథ్రెడ్డిపై బుధవారం కొందరు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను గురువారం కాటసాని రాంభూపాల్రెడ్డి, మాజీ ఎమ్యెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా తదితరులు పరామర్శించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు కాటసాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హరినాథ్రెడ్డి రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేని కొందరు హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. టీడీపీ నాయకులు ఫ్యాక్షన్ జోలికి వెళితే సాధించేది ఏమిలేదన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఫ్యాక్షన్లో మగ్గి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అభివృద్ధిని చెందిన పల్లెల్లో ఇప్పుడు టీడీపీ నేతలు తిరిగి ఫ్యాక్షన్ను పెట్రేగిస్తున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ కొనగాదని.. సీన్ రివర్స్ అయితే ఇలాంటి గొడవలు చేసే నాయకుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోలేరని హెచ్చరించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేని చంద్రబాబు ప్రభు త్వం ప్రజల దృష్టి పక్కకు తిప్పేందుకు ఇలాంటి దాడులకు పాల్పడుతోందని విమర్శించారు. తెలంగాణలో ధాన్యం బస్తాను రూ.2,200కు కొనుగోలు చేస్తుంటే ఏపీలో కనీసం రూ. 1,600 కూడా ప్రభుత్వం చెల్లించలేని దుస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. ధైర్యం ఉంటే నేరుగా ఎదుర్కోండి..... టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ నాయకులను ఎదుర్కొనే ధైర్యం లేక కిరాయి హంతకులతో దాడులకు తెగబడుతున్నారని నంద్యాల మాజీ ఎమ్యెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి విమర్శించారు. కిరాయి నేరగాళ్లతో దాడి చేయించే సంస్కృతి గ్రామాల్లోకి తీసుకోరావద్దని హితవు పలికారు. కొత్తపల్లి గ్రామంలో రాజకీయ ఎదుగుదల కోసం టీడీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడటం సిగ్గు చేటన్నారు. పొలం నుంచి బైక్పై ఇంటికి వెళ్తున్న హరినాఽథ్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సునీల్ షేరాన్ను వైఎస్సార్సీపీ నేతలు కలిసి జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలపై జరుగుతున్న దాడులను వివరించి దుండగులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వారి వెంట మున్సిపల్ చైర్పర్సన్ మాబు న్నిసా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీపీ మధుసూదన్రెడ్డి జిల్లా విభాగం అధ్యక్షులు, నియోజకవర్గ నాయకులు తదితరులు ఉన్నారు. అధికారం శ్వాశతం కాదని తెలుసుకోండి సీన్రివర్స్ అయితే పరిస్థితులు దారుణంగా ఉంటాయి రాజకీయ కక్షతోనే ఎంపీటీసీ హరినాఽథ్రెడ్డిపై హత్యాయత్నం టీడీపీ నేతలను హెచ్చరించిన కాటసాని రాంభూపాల్రెడ్డి -
ప్రభుత్వ హామీల అమలులో వేగం పెంచండి
● కౌన్సిల్ కమిటీ చైర్మన్ ఇసాక్ బాషానంద్యాల: 2014 నుండి గవర్నమెంట్ అస్యూరెన్సెస్కు సంబంధించిన పెండింగ్ పనులను నిర్దిష్ట గడువుల్లో పూర్తి చేయాలని లెజిస్లేటివ్ కౌన్సిల్ కమిటీ చైర్మన్ ఇసాక్ బాషా అధికారులకు సూచించారు. గురువారం నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ కమిటీ చైర్మన్, సభ్యులు సంబంధిత విభాగాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగుగంగ ప్రాజెక్ట్లో భాగమైన వెలుగోడు రిజర్వాయర్ పురోగతి, గతంలో ఇచ్చిన హామీల అమలు ఎంత వరకు జరిగిందనే అంశాలపై సమగ్రంగా చర్చించారు. చైర్మన్ ఇసాక్బాషా మాట్లాడుతూ.. మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలో షాదీ ఖానాల నిర్మాణం, దుల్హన్ స్కీం ప్రయోజనాల పెంపు, అర్హులకు నిధుల విడుదల, పెండింగ్లో ఉన్న ప్రపోజల్స్ వివరాలను అందజేయాలన్నారు. గాలేరి–నగరి సుజల స్రవంతి, హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాల్లో పురోగతి మిగిలి ఉన్న పనులపై ఆరా తీస్తూ పనులు పెండింగ్ లేకుండా త్వరగా పూర్తి చేయాలన్నారు. కొలనుభారతి ఆలయ అభివృద్ధి పనులు, రుద్రకోడూరు ఆలయ స్థితి వివరాలు అడిగి తెలుసుకుంటూ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ.. మున్సిపల్ విభాగానికి సంబంధించి స్లాటెడ్ హౌసింగ్ కోసం అవసరమైన పట్టణాల్లో స్థలాల గుర్తింపు, కొత్త స్లాటెడ్ హౌసెస్ నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు తెలిపారు. మైనార్టీ సంక్షేమ శాఖలో వన్ లాక్ స్కీం అమలు కోసం మార్గదర్శకాలు వచ్చిన వెంటనే జిల్లాలో అమలు కార్యక్రమాలు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో కౌన్సిల్ కమిటీ సభ్యులు కావూరు శ్రీనివాస్, ఎంవీ రామచంద్రారెడ్డి, జాయింట్ సెక్రటరీ సుబ్బారెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
వచ్చారు.. వెళ్లారు
కొత్తపల్లి: చదరంపెంట, పాలెంచెరువు గూడెలకు చెందిన గిరిజన రైతులు సుమారు 10 ఎకరాల్లో హర్టీ కల్చర్ సాగుకు కింద మామిడి మొక్కలు నాటుకున్నారు. ఆ పంటలను గురువారం శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్ట్ నుంచి హర్టీకల్చర్ అధికారి, సూపరింటెండెంట్ అధికారులు పరిశీలించేందుకు వచ్చారు. అయితే వారు రావడం.. ఫోటోలకు ఫోజులివ్వడం.. వెళ్లిపోవడంతో గిరిజన రైతులు అవాక్కయ్యారు. పంటలను పరిశీలించి సాగులో సూచనలు, మెలకువలు ఏమి చెప్పకుండా వెళ్లడంపై రైతులు విమర్శిస్తున్నారు. కార్డుదారులకు 3 కేజీల రాగులు నంద్యాల(అర్బన్): డిసెంబర్ నెల కోటాకు సంబంధించి జిల్లాలోని ప్రతి రేషన్ కార్డు దారుడికి మూడు కిలోల బియ్యం బదులుగా మూడు కేజీల రాగులు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ తెలిపారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రజా పంపిణీ వ్యవస్థలో బియ్యం, పంచదారతో పాటు మూడు కేజీల రాగులు అందించనున్నామన్నారు. ప్రజలకు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో రాగుల పంపిణీని చేపట్టామన్నారు. కార్డు దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నాపరాయి లారీలు సీజ్ బేతంచెర్ల: సరైన రికార్డులు, వే బిల్లులు లేకుండా బేతంచెర్ల నుంచి నాపరాయిని తరలిస్తున్న ఐదు లారీలను మైన్స్, విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. గురువారం పోలీసులు, ప్రైవేట్ రాయల్టీ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు చేసి ఎలాంటి అనుమతులు లేకుండా నాపరాయి రవాణా చేస్తున్న ఐదు లారీలను గుర్తించి పట్టుకున్నారని మైన్స్, విజిలెన్స్ అధికారులు సాంబ శివారెడ్డి, దిలీప్ కుమార్ తెలిపారు. ఎన్ఎంఎంఎస్ పరీక్షకు 19 కేంద్రాలు నంద్యాల(న్యూటౌన్): ఈనెల 7వ తేదీన జరిగే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలో 19 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డీఈఓ జనార్ధన్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు 4,120 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. 19 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 19 మంది డిపార్టుమెంట్ ఆఫీసర్లు, ముగ్గురు ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఇన్విజిలేటర్లు నియమించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరన్నారు. కొనసాగుతున్న పులుల గణన రుద్రవరం: రుద్రవరం రేంజ్ పరిధిలోని 14 బీట్లలో పులుల గణన ప్రారంభం అయ్యింది. రుద్రవరం రేంజ్ అధికారి ముర్తుజావలి తెలిపిన వివరాల మేరకు.. రేంజ్ పరిధిలోని అన్ని బీట్లలో అట వీ సిబ్బంది అందరు ప్రతి రోజు 3కి.మీ ప్రకారం కాలి నడకన నడుస్తూ మాంసాహార జంతువులైన పులి, చిరుత, ఎలుగుబంటి, రేసు కుక్క, అడవిపిల్లి వంటి వాటికి సంబంధించిన పెంటికలు, పాదముద్రలు, చెట్లను గీకిన గుర్తులు సేకరిస్తున్నారు. అలాగే శాఖాహర జంతువులను గుర్తించేందుకు అదే తరహాలో ప్రతి బీట్లో ఉదయాన్నే రోజుకు 2కి.మీ కాలి బాటన నడిచి దుప్పి, అడవి పంది, కొండగొర్రె, కణితి, వంటి వాటి వాటి జంతువుల ఆనవాళ్లను సేకరిస్తున్నారు. వాటి ఆవాసాలను అంచనా వేసేందుకు అడవిలోని వృక్ష సంపద, గడ్డి రకాలు, ఔషధ మొక్కలను గుర్తించి యాప్లో నమోదు చేస్తున్నట్లు రేంజర్ తెలిపారు. ఇప్పటి వరకు 14 బీట్లలో 210 కి.మీ నడిచి సర్వేలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. 23న డాక్ అదాలత్ కర్నూలు(అర్బన్): కర్నూలు డివిజన్లోని తపా లా కార్యాలయాల్లో ప్రజలకు అందించే సేవలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇతరత్రా సమస్యలను పరిష్కరించేందుకు ఈ నెల 23న ఉదయం 11 గంటలకు డాక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ జీ జనార్దన్రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలోనే డివిజన్లోని ప్రజలు తమ ఫిర్యాదులను ఈ నెల 15వ తేదీ కంటే ముందే చేరే విధంగా పోస్టు ద్వారా పంపాలన్నారు. పోస్టు కవర్పై డాక్ అదాలత్ అని పెద్ద అక్షరాలతో రాసి పంపాలన్నారు. -
కష్టపడే కార్యకర్తలకు సముచిత స్థానం
● మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డిబేతంచెర్ల: వైఎస్సార్సీపీ కోసం కష్ట పడి పనిచేసే కార్యకర్తలకు పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ చలం రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రుడు, అధికార ప్రతినిధి మురళీకృష్ణ, పట్టణ, మండల కన్వీనర్లు పిట్టల జాకీర్, తిరుమలేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో మాజీ మంత్రి బుగ్గన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన సర్పంచ్, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా ఇబ్బందికర పరిస్థితిలో ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని, అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ప్రధానంగా గిట్టు బాటు ధర లభించకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. పాలక ప్రభుత్వం వ్యహరిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజలు, కార్మికులు, రైతులు విసిగెత్తిపోయారన్నారు. సమావేశానికి ముందుగా ముందుగా పట్టణంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్త ప్రేమ్ స్వరూప్, అర్చనల దంపతుల కుమార్తె సురత్ సహేలి, వరుడు ప్రేమ్ పావన్ వివాహం గత నెలలో 24న జరిగింది. ఈ సందర్భంగా బుగ్గన వారి ఇంటికి వెళ్లి పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బైటిపేట కాలనీకి చెందిన మాజీ వార్డు సభ్యుడు రామాంజనేయులు భార్య జయలక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో రామాంజనేయులును బుగ్గన పరామర్శించారు. ఆయన వెంట వివిధ కార్పొరేషన్ల మాజీ డైరెక్టర్లు మూర్తుజావలి, ఖాజ, వైఎస్సార్సీపీ నాయకులు బుగ్గన చంద్రారెడ్డి, నాగేశ్వర్రెడ్డి, నారాయణ, బూసిరెడ్డి, మహేశ్వర్రెడ్డి, మద్దిలేటి, నిరంజన్, జయ ప్రకాష్ రెడ్డి, మురళీ, వెంకిరెడ్డి, గూటుపల్లె, గోరుమానుకొండ సర్పంచ్లు శ్రీరాములు, వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ రంగస్వామి ఉన్నారు. -
అన్నదాత సుఖీభవ ఇవ్వకుండా చంపేశారు
సన్నకారు రైతును అయిన నాకు పీఎం కిసాన్ కింద రూ.2వేలు బ్యాంకులో జమ కాగా, అన్నదాత సుఖీభవ కింద మంజూరు కావాల్సిన రూ.5 వేలను ప్రభుత్వం ఎగ్గొట్టింది. విచారిస్తే స్టేటస్లో నేను మృతిచెందినట్లు అధికారులు నమోదు చేశారు. ఇప్పటివరకు ఈ తప్పును సరిదిద్దుకునేందుకు సంబంధిత సైట్ను ప్రభుత్వం తిరిగి పునఃప్రారంభించకపోవడం దుర్మార్గం. – తవిసెల రంగనాథ్రెడ్డి, నక్కవాగులపల్లె, డోన్ మండలం నా వయసు 45 ఏళ్లు.. 25 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు. మొదటి నుంచి టీడీపీ సర్కార్ రైతు వ్యతిరేకంగానే పని చేస్తోంది. గతంలో రుణమాఫీ చేయకపోవడం, ఈ ఏడాది ఒక విడత అన్నదాత సుఖీభవ ఎగ్గొట్టడం దారుణం. పంట నష్టపోయి ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్న రైతులు ఎక్కడ నిలదీస్తారోననే భయంతో ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల వైపు కన్నెత్తి చూడలేదు. – మురళీధర్రెడ్డి, రైతు, మర్రికుంట గ్రామం, బేతంచెర్ల మండలం -
చిరుత పులిని చంపి.. పులిగోర్లను విక్రయించి..
● నిందితులను అరెస్ట్ చేసిన ఫారెస్ట్ అధికారులు బొమ్మలసత్రం: మహానంది సమీపంలోని నల్లమల్ల అడవిలో కొందరు చిరుత పులిని చంపి గోర్లను విక్రయించారు. ఈ కేసులో ఏడుగురు నిందితులను ఫారెస్ట్ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నంద్యాలలోని ఫారెస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎఫ్వో అనురాగ్మీనా ఐఎఫ్ఎస్ తెలిపిన వివరాల మేరకు.. గోపవరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్లాంటేషన్ వాచర్గా మహానందిలో పనిచేస్తున్నాడు. మహానంది మండలానికి చెందిన కొందరితో కలిసి విద్యుత్ వాహకాలతో అడవి పందులను చంపి వాటి మాంసాన్ని స్థానికులకు విక్రయించేవారు. ఈక్రమంలో 2023 జూన్ 8వ తేదీ అడవి పందుల కోసం ఉంచిన విద్యుత్ తీగలకు చిరుతపులి చిక్కి మృతి చెందింది. అప్పటికే చర్మం కాలిపోయి మృతి చెంది ఉన్న చిరుత 13 గోర్లను నిందితులు తొలగించి అక్కడే మృతదేహాన్ని దహనం చేశారు. ఈ కేసులో అనుమానితుగా ఉన్న ఉద్యోగిని విచారించగా మండలానికి చెందిన కొందరితో కలిసి గోర్లను విక్రయించినట్లు అంగీకరించాడు. దీంతో నంద్యాల పట్టణంలో టాటూ దుకాణం నిర్వహిస్తున్న ప్రణవ్ను అరెస్ట్ చేసి అతని వద్ద మెడలో ఉన్న పులిగోరు ఉన్న బంగారు చైన్ను స్వాధీనం చేసుకన్నారు. పులిగోర్లు ఇప్పటికీ ఐదు స్వాధీనం చేసుకున్నామని మరికొన్ని గోర్ల కోసం విచారణ చేపట్టామని.. విచారణ పూర్తికాగానే నిందితుల పేర్లు వివరాలు వెల్లడిస్తామన్నారు. -
ప్రయోజనం లేదు
పండించిన పంటలకు మద్దతు ధరలు కల్పించకుండా రైతులను మరోసారి మోసం చేసేందుకే చంద్రబాబు ప్రభుత్వం రైతన్న మీ కోసం కార్యక్రమం మొదలు పెట్టింది. సచివాలయ సిబ్బంది తూతూ మంత్రంగా పాల్గొన్నారు. చివరి రోజు మా గ్రామానికి మంత్రి ఫరూక్ వచ్చినా కొద్ది మంది రైతులు మాత్రమే కార్యక్రమానికి హాజరయ్యారు. హాజరైన రైతులు సైతం ఆయకట్టు రోడ్లు, పంటలకు మద్దతు ధర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరడం చూస్తే రైతులను ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేస్తుందో తెలుస్తోంది. – చిలకల మదన్మోహన్, పులిమద్ది, నంద్యాల మండలం గత ఏడాది మిర్చికి గిట్టుబాటు ధర లేక తక్కువ రేటుకు అమ్ముకున్నాం. ఈ ఏడాది అనుకులిస్తుదేమో అనుకుంటే అధిక వర్షాలతో పంటల దిగుబడి తగ్గి పెట్టుబడి కూడా రాలేదు. ప్రభుత్వం ఆదుకుంటుందేమో అనుకుంటే అది లేదు. గతంలో ఉచిత పంట బీమా ఉండేది. ఇప్పుడు అది భారమైంది. ఇన్పుట్ సబ్సిడీ ఊసే లేదు. – వెంకటేశ్వరరెడ్డి, రైతు, ఆకుమల్ల, సంజామల మండలం -
రైతులంటే ఇంత నిర్లక్ష్యమా
నేను 20 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. ఎకరాకు రూ. 30 వేల వరకు ఖర్చు వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద తొలి ఏడాది పైసా ఇవ్వలేదు. రెండో ఏడాది కూడా పీఎం కిసాన్ రూ. 20 వేలకు బదులు రూ.14 వేసి చేతులు దులుపుకుంది. జగనన్న పాలనలో పంటలకు ఇన్సురెన్స్ చేసి పరిహారం వెంటనే ఇచ్చింది. చంద్రబాబు ప్రభుత్వంలో ఈ–క్రాప్ నమోదు, ఉచిత పంటల బీమా చేయలేదు. రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యం పనికి రాదు. – నాగభూషణంరెడ్డి, 10 బొల్లవరం గ్రామం, నందికొట్కూరు మండలం మా గ్రామంలో జరిగిన రైతన్నా మీ కోసం కార్యక్రమం కేవలం టీడీపీ కార్యకర్తల ఇళ్లకే పరిమితమయ్యింది. గ్రామంలో ఎక్కడా పూర్తి స్థాయిలో అధికారులు తిరగలేదు. నేను ఖరీఫ్లో ఆరు ఎకరాల్లో వరి పంటను సాగుచేశాను. 70 కిలోల బస్తా రూ.1300 చొప్పున అడుగుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇదే 70 కిలోల బస్తా రూ.2,500 వరకు కొనుగోలు జరిగింది. రైతులు అధికారులను నిలదీస్తారని భయపడి కేవలం టీడీపీ కార్యకర్తల ఇళ్ల వద్దకే పరిమితమై ముగించారు – వెంకటేశ్వరనాయక్, ఎస్.ఎన్.తండా, ఆత్మకూరు -
వీబీఆర్ను పరిశీలించిన ఎమ్మెల్సీల బృందం
వెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను బుధవారం శాసనమండలి అస్సూరెన్స్ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు ఇసాక్ బాషా, కావూరి శ్రీనివాసులు, ఎంఈ రామచంద్రారెడ్డి పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలను ఎస్ఈ ప్రతాప్ను అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్ మరమ్మతులు, నీటి నిల్వ సామర్థ్యం, వివిధ అంశాలపై ఆరా తీశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వెలుగోడు రిజర్వాయర్లో ప్రస్తుతం 16. 2 టీఎంసీల నీటి నిల్వ ఉందని దాదాపుగా నంద్యాల జిల్లాలోని ఒక లక్ష 20వేల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరు ఇస్తున్నారని చెప్పారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో 1, 70, 000 ఎకరాలు ఆయకట్టు తెలుగుగంగకు ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీవో నాగజ్యోతి తెలుగుగంగ డీఈ వెంకటేశ్వర్లు ఏఈ శివ నాయక్, వెలుగోడు మండల తహసీల్దార్ శ్రీనివాస్ గౌడ్, ఎస్ఐ సురేష్ తదితర అధికారులు పాల్గొన్నారు. 8వరకు మల్లన్న స్పర్శదర్శనాలు నిలుపుదల శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల రద్దీ కారణంగా ఈ నెల 8వ తేది వరకు మల్లికార్జున స్వామి స్పర్శదర్శనాన్ని పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు శ్రీశైల దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ పి.రమేష్నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు బుధవారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కార్తీకమాసం శివదీక్ష విరమణ కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో జ్యోతిర్ముడి కలిగిన శివదీక్షా భక్తులకు మల్లన్న స్పర్శదర్శనం కల్పించాలనే ఉద్దేశంతో సామాన్య భక్తులకు స్పర్శదర్శనం నిలిపివేశామన్నారు. శివస్వాములకు విడతల వారీగా ప్రతి రెండు గంటలకు ఒకసారి స్వామి స్పర్శ దర్శనం కల్పిస్తామన్నారు. ఈ నెల 6,7,8వ తేదీల్లో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నెల 8వ తేది వరకు స్పర్శ దర్శనం అన్లైన్ టికెట్ల జారీని కూడా నిలుపుదల చేశామని పేర్కొన్నారు. ఈ నెల 5వ తేది వరకు మాత్రం స్వామివారి గర్భాలయ, సామూహిక అభిషేకాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. భక్తులు ఈ మార్పులు గమనించి దేవస్థానానికి సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. జరిమానాలు ఉండవు కేసులే! హొళగుంద: మద్యం సేవించి వాహనాలను నడిపే వారికి ఇక జరిమానాలు ఉండబోవని, కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. బుధవారం సాయంత్రం వార్షిక తనిఖీల్లో భాగంగా హొళగుంద పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ మేరకు నేరాలు, కేసులు, పెండింగ్ కేసులు, రికార్డులు, సిబ్బంది పనితీరు, సమస్యలు ఇలా పలు అంశాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగ ఉండాలని, హెల్మెట్లపై ప్రజలకు అవగాహన కలిగిస్తున్నట్లు వెల్లడించారు. ఎస్ఐలు దిలీప్కుమార్, మారుతి, ట్రైనీ ఎస్ఐ రాజకుళ్లాయప్ప ఉన్నారు. ఇళ్ల స్థలాల్లో దివ్యాంగులకు ప్రత్యేక కేటాయింపులు నంద్యాల (వ్యవసాయం): పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల్లో దివ్యాంగులకు ప్రత్యేక కేటాయింపులు చేస్తామని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని, బుధవారం స్థానిక ఎన్టీఆర్ పురపాలక టౌన్ హాల్లో జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఐఎంఏ నంద్యాల, లయన్న్స్ క్లబ్ నంద్యాల సహకారంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి చేతుల మీదుగా దివ్యాంగులకు నూతన దుస్తులు, కుట్టు మిషన్లు, చక్రాల కుర్చీలు, వినికిడి యంత్రాలు, చంక కరల్రు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ, అధ్యక్షుడు ఎంపీవీ రమణయ్య, డాక్టర్ పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి, మధుసూదనరావు పాల్గొన్నారు. -
క్యాన్సర్ రోగులకు సంజీవని
● కర్ణాటక రాష్ట్రం బళ్లారి పట్టణానికి చెందిన 70 ఏళ్ల ధర్మరాజుకు రెండు నెలల క్రితం కడుపునొప్పి, ఉబ్బరం తదితర సమస్యలతో ఆసుపత్రికి వచ్చారు. పరీక్షలు నిర్వహించగా డియోడినం మూడో భాగంలో 7 సెంటిమీటర్ల న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ అనే అరుదైన క్యాన్సర్ను గుర్తించారు. లిమిటెడ్ రిసెప్షన్ ఆఫ్ డియోడినం అనే ఆపరేషన్ నిర్వహించి అతనికి ఊపిరి పోశారు. ● కర్నూలుకు చెందిన 69 ఏళ్ల ఎం.రాజశేఖర్ బీపీకి నాలుగు రకాల మందులు వాడేవాడు. ఇది ఎందుకు అని పరీక్షించగా అతనికి కుడి పక్క కిడ్నీపైన జెయింట్ ఫియోక్రోమోసైటోమా అనే అరుదైన బీపీని పెంచే గడ్డ ఉందని గుర్తించారు. ఆపరేషన్ చేసి 12 సెంటిమీటర్ల జెయింట్ ఫియోక్రోమోసైటోమా అనే కణితిని తొలగించారు. ఆ తర్వాత ఎలాంటి మందుల అవసరం లేకుండానే బీపీ నియంత్రణలోకి వచ్చింది.లీనియర్ యాక్సిలరేటరి మిషన్, మిషన్పై రేడియేషన్ చికిత్స చేస్తున్న దృశ్యం కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి 2012–2019 పంచ వర్ష ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వం రూ.120కోట్లను మంజూరు చేసింది. ఇందులో 60శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసేలా ఒప్పందం కుదిరింది. ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి సాంకేతిక సహకారం కోసం టాటా ట్రస్ట్తో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2017 జూన్లో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ పలుమార్లు పరిశీలనలు, చర్చలు చేపట్టాక టాటా ట్రస్ట్ 2018 నవంబర్లో తుదిరూపునిచ్చారు. ఈ ఆసుపత్రిలో రెండు లీనియర్ యాక్సిలరేటరిలు, ఒక సీటీ సిమ్యులేటర్, ఒక హైడోస్ రేట్ బ్రాకోథెరపి మిషన్ల ఏర్పాటుకు అవసరమైన నాలుగు బంకర్ల నిర్మాణానికి అప్పట్లో టాటా అటానమిక్ ఎనర్జీ అనుమతులు మంజూరు చేశారు. అన్ని అనుమతులు లభించాక 2019 జనవరిలో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత కోవిడ్ రావడం, ఇతరత్రా కారణాలతో భవన నిర్మాణం ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో 2022లో క్యాన్సర్ విభాగానికి రేడియేషన్ థెరపి ఎండీ పీజీ సీటును నేషనల్ మెడికల్ కౌన్సిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో అప్పట్లో ఆగిపోయిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి పనులు ప్రారంభమయ్యేలా చేసింది. 2024 మార్చి నాటికి భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ‘కె’ ఆకారంలో భవన నిర్మాణం స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను కర్నూలులోని ‘కె’ అక్షరం స్ఫూరించేలా నిర్మించారు. ఇందులో సివిల్ పనులు పూర్తి కావడం, ముఖ్యమైన లీనియర్ యాక్సిలరేటరి, సీటీ సిమ్యులేటర్ యంత్రాలు రావడంతో 2024 మార్చి 7న అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం ఓపీ సేవలకు సైతం శ్రీకారం చుట్టారు. అయితే ఆసుపత్రిని పూర్తిస్థాయిలో ప్రారంభించాలంటే అవసరమైన వైద్యపరికరాలు, వైద్యులు, సిబ్బంది నియామకం చేపట్టాల్సి ఉండగా తీవ్ర జాప్యం జరిగింది. ఈ విషయమై ‘సాక్షి’లో వరుస కథనాలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేసి పూర్తిస్థాయిలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. వైద్యపరికరాలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్లు, ఆక్సిజన్ పైప్లైన్ ఏర్పాటు, అవసరమైన 120 పడకలు, ఐసీయూ బెడ్స్ తదితరాలను ఏర్పాటు చేశారు. 45 మంది వైద్యులు.. 74 మంది సిబ్బందితో సేవలు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ముగ్గురు ప్రొఫెసర్లు, ఆరుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఏడుగురు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ఒక సీఎస్ఆర్ఎంఓ, ఒక డిప్యూటీ ఆర్ఎంఓ, 27 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. వీరిలో రేడియేషన్, సర్జికల్, మెడికల్ ఆంకాలజిస్టులు, ప్లాస్టిక్ సర్జన్లు, పెథాలజి, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, అనెస్తీషియా, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు, సైకియాట్రిస్టులు ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు నర్సింగ్ సూపరింటెండెంట్లు, 40 మంది స్టాఫ్నర్సులు, 16 మంది పారామెడికల్ సిబ్బంది, ఆరుగురు నాల్గవ తరగతి సిబ్బంది పనిచేస్తున్నారు. స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో అత్యాధునిక పద్ధతుల్లో అరుదైన శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్నాం. ప్రతిరోజూ ఓపీ 20 నుంచి 25, ఐపీ 120 పడకల్లో రోగులకు చికిత్స అందుతోంది. రోజూ డే కేర్ కీమోథెరపీ 10 మందికి అందిస్తున్నాం. పది మంది రోగులు రోజూ అడ్మిషన్ పొందుతున్నారు. ఐసీయూలో ఆరు పడకలు ఉండగా నిత్యం నలుగురైదుగురికి చికిత్స అందుతోంది. అర్హులైన రోగులందరికీ ఉచితంగా చికిత్స చేస్తున్నాం. – డాక్టర్ సీఎస్కే ప్రకాష్, డైరెక్టర్, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, కర్నూలు క్యాన్సర్కు సంబంధించిన అన్ని రకాల శస్త్రచికిత్సలను కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రిని తలదన్నే వసతులు, సౌకర్యాలు, వైద్య పరికరాలతో రాయలసీమ ప్రజలకు ఉత్తమ వైద్యసేవలు అందిస్తున్నారు. 45 మంది నిష్ణాతులైన వైద్యులు, 70 మందికి పైగా నర్సులు, పారామెడికల్ సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ రోగులకు ప్రాణం పోస్తున్నారు. ఆసుపత్రికి వెళితే కార్పొరేట్ స్థాయి అనుభూతి కలిగేలా నిర్మాణం పూర్తి చేసుకోవడం విశేషం. స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో అత్యాధునిక పరికరాలు అరుదైన శస్త్రచికిత్సలు చేస్తున్న వైద్యులు అన్ని రకాల క్యాన్సర్లకు ఆధునిక చికిత్స నిత్యం 120 పడకలు ఫుల్ ఆసుపత్రి నిర్మాణంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చొరవ ప్రస్తుతం ఒక ఆపరేషన్ థియేటర్లోనే చికిత్స మరో రెండు థియేటర్లు వస్తే మెరుగైన వైద్యం -
వార్షిక ఆదాయ లక్ష్యాలు అధిగమించండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియానంద్యాల: జిల్లాలో ప్రధాన ఆదాయ వనరులైన ఎకై ్సజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, రిజిస్ట్రేషన్ , రవాణా విభాగాలు కేటాయించిన లక్ష్యాలను వంద శాతం అధిగమించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఆదాయ వనరుల పెంపుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదాయ వనరుల వినియోగం, పర్యవేక్షణ, లక్ష్యసాధనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. చేపట్టిన అంశాలపై తరచూ సమీక్షలు నిర్వహించి లోపాలను గుర్తించి వెంటనే సరిదిద్దుకోవాలన్నారు. ఎకై ్సజ్ శాఖ గత ఏప్రిల్ నుంచి నవంబర్ నెలాఖరు వరకు రూ.596.63 కోట్ల లక్ష్యాన్ని అధిగమించి 7.14 శాతం వృద్ధి రేటు నమోదు చేసిందన్నారు. మిగతా నెలల్లో కూడా అదే స్థాయిలో ఆదాయం పెంచేందుకు కృషి చేయాలని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రవికుమార్కు సూచించారు. మైనింగ్శాఖ లక్ష్యం రూ.530 కోట్లు ఉండగా నవంబర్ వరకు రూ.143 కోట్లు మాత్రమే సాధించిందన్నారు. వెంటనే లోపాలను సరిచేసుకొని చెక్పోస్టులను బలోపేతం చేసుకోవాలన్నారు. నిలిచిపోయిన 102 మైనింగ్ యూనిట్లను పునఃప్రారంభిస్తే ఆదాయ వనరులు సమకూరుతాయన్నారు. అలాగే వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్లు, రవాణా తదితర శాఖలు కూడా ఆదాయాలను వృద్ధి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, డీఆర్ఓ రామునాయక్ తదితరులు పాల్గొన్నారు. -
హామీల అమలులో చంద్రబాబు సర్కారు విఫలం
బేతంచెర్ల: ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని మాజీ ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి ఆధ్వర్యంలో ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు భూ సమస్యలతో పాటు ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను మాజీ మంత్రి బుగ్గనకు విన్నవించారు. అనంతరం బుగ్గన మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్నారు. బాబు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. నియోజకవర్గ ప్రజలు ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు అండగా ఉండి వారి సమస్యలపై పోరాడాలన్నారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమి మాజీ డైరెక్టర్ ముర్తుజావలి, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రుడు, అధికార ప్రతినిధి మురళీ కృష్ణ, నాయకులు తిరుమలేశ్వర్ రెడ్డి, మురళీధర్రెడ్డి, నారాయణ, శాలిబేగ్, ముస్తఫా, వన్నూర్ సాహెబ్, గోరుమానుకొండ సర్పంచ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
అత్యాధునిక వైద్యపరికరాలతో సేవలు
● ఆసుపత్రిలో అన్ని రకాల క్యాన్సర్లకు రేడియేషన్ ఇచ్చే లీనియర్ ఆక్సిలేటర్ మిషన్, ఎక్స్టర్నల్ బీమ్ రేడియోథెరపి, అన్ని రకాల క్యాన్సర్లకు ఎస్ఆర్టీ, ఐఎంఆర్టీ, ఐజీఆర్టీ, ఇమేజ్గైడెడ్ రేడియోథెరపీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ రేడియోథెరపి ట్రీట్మెంట్, అడాప్టివ్ రేడియోథెరపితో చికిత్స అందిస్తున్నారు. ● సీటీ సిమ్యులేటర్, 3డీ, 4డీ ట్రీట్మెంట్ ప్లానింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ద్వారా చికిత్స. ● హెచ్డీఆర్ బ్రేకీథెరపి, 3డీ ల్యాప్రోస్కోపిక్, ఎక్విప్మెంట్, హార్మోనిక్ సార్కిల్పెల్, ఫ్రోజెన్ సెక్షన్ బయాప్సీ. ● ఇంట్రాప్రాటివ్ అల్ట్రాసౌండ్, లేటెస్ట్ అనెస్తీషియా వర్క్స్టేషన్, సెంట్రలైజ్డ్ ఆక్సీజన్, గ్యాస్ సరఫరా. ● మ్యానిక్ ఫోల్డ్, సెంట్రలైజ్డ్ సక్షన్ ఫెసిలిటీ. ● ఆరు పడకల పోస్టు ఆపరేటివ్ ఐసీయూ. ● అత్యాధునిక వైద్యపరికరాలతో బయోకెమిస్ట్రీ. ● పెథాలజీ, ఇమ్యునోహిస్టోకెమిస్ట్రీ, గ్యాస్ట్రోస్కోపిక్ పరికరాలతో రోగులకు మెరుగైన వైద్యసేవలు. -
‘ఉద్యోగం వదిలేసి రాజకీయాల్లోకి రండి’
నందికొట్కూరు: మున్సిపల్ కమిషనర్ బేబి ఉద్యోగం వదిలేసి రాజకీయాలు చేస్తే స్వాగతిస్తామని మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్రెడ్డి హితవు పలికారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని హజినగర్, మారుతీనగర్ పేద ప్రజలకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రూ.10 లక్షలు ఎంపీ నిధులు మంజూరైతే ప్రభుత్వ స్థలం ఉన్నా లేవని జిల్లా అధికారులకు తప్పుడు నివేదిక పంపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. జిల్లా అధికారులు వస్తే ప్రభుత్వ స్థలాలు చూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. సంగయ్యపేట, సుబ్బారావుపేట, బైరెడ్డి నగర్, విద్యానగర్, ఎస్ఎస్ఆర్ నగర్, హౌసింగ్ బోర్డు కాలనీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు స్థలం కేటాయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మున్సిపల్ అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల అవసరాలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా అధికారులు వ్యవహరించడం తగదన్నారు. పట్టణ ప్రజలకు ఉపయోగపడే కమ్యూనిటీ హాల్, హెల్త్ సెంటర్లకు స్థలాలు లేవని నిధులు వెనక్కి పంపిన కమిషనర్పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశా రు. కమిషనర్ స్పందించి ప్రభుత్వ స్థలాలు చూపించాలని, లేని పక్షంలో కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టడం ఖాయమని హెచ్చరించారు. సమావేశంలో కౌన్సిలర్లు లాలు, చాంద్బాషా, తదితరులు పాల్గొన్నారు. -
సామాన్య భక్తులకు స్పర్శ దర్శనాలు రద్దు
● శివ స్వాముల రద్దీతో వారం రోజుల పాటు నిలిపివేత ● సమాచారం ఇవ్వని దేవస్థానం.. అయోమయంలో భక్తులు ● చైర్మన్, ఈఓతో జ్యోతిర్ముడి భక్తుల వాగ్వాదం ● జ్యోతిర్ముడి భక్తులకు రెండు గంటలకోసారి స్పర్శదర్శనం శ్రీశైలంలో జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములు శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో ఏ రోజు ఏ సేవ ఉంటుందో తెలియక భక్తులు అయోమయానికి గురవుతున్నారు. వారం రోజుల పాటు సామాన్య భక్తులకు మల్లన్న స్పర్శదర్శనాలు రద్దు చేశారు. ఈ విషయంపై దేవస్థానం కనీసం పత్రికా ప్రకటన కూడా విడుదల చేయకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం మల్లన్న స్పర్శదర్శనం టికెట్లను పూర్తిగా ఆన్లైన్ చేసింది. సిఫా రసు లేఖలకు మాత్రమే వసతి విభాగ అధికారులు కరెంట్ బుకింగ్ ద్వారా స్పర్శదర్శనం టికెట్లను మంజూరు చేస్తారు. మంగళవారం స్పర్శదర్శనం టికెట్ల కోటాను దేవస్థానం విడుదల చేయలేదు. అలాగే సిఫార్స్ లేఖలకు వసతి విభాగం నుంచి ఇచ్చే స్పర్శదర్శనాల టికెట్లను సైతం 7వ తేదీ వరకు రద్దు చేసినట్లు తెలుస్తోంది. సామాన్య భక్తులకు ఏడు రోజుల పాటు మల్లన్న స్పర్శదర్శనం చేసుకునే అవకాశం లేదు. క్షేత్రానికి జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములు అధికసంఖ్యలో తరలివస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థాన అధికారులు పేర్కొన్నారు. అయితే ఏటా కార్తీకమాసం అనంతరం జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు స్పర్శదర్శనం కలిస్తారు. అదే విధంగా ఈ ఏడాది ముందుగానే ఎందుకు చర్య లు తీసుకోలేదనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఆన్లైన్లో స్పర్శదర్శనం టికెట్ల కోటాను ఎందుకు విడుదల చేయలేదో భక్తులకు అర్థం కానీ పరిస్థితి నెలకొంది. దేవస్థాన అధికారుల అనాలోచిత నిర్ణయాలతో భక్తులు గందరగోళానికి గురవుతున్నా రు. స్పర్శ దర్శనం కోసం వచ్చిన సాధారణ భక్తులు దేవస్థానం అధికారుల తీరుపై మండిపడుతున్నారు. -
కేసీ రైతులు వరి సాగు చేయొద్దు
నంద్యాల: కేసీ కెనాల్ ఆయకట్టు రైతులు రబీలో వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను సాగు చేయాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా కలెక్టర్ రాజ కుమారి అధ్యక్షతన నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ కేసీ కెనాల్, ఎస్సార్బీసీ, తెలుగు గంగ ఆయకట్టుల్లో ఎంతమేరకు నీరు విడుదల చేయాలి అనే అంశంపై ఇరిగేషన్ అధికారులతో సమగ్రంగా సమీక్షించామన్నారు. ఎస్సార్బీసీ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు చర్య లు తీసుకుంటామన్నారు. తుంగభద్ర ప్రాజెక్ట్ గేట్లు కొత్తగా నిర్మిస్తుండటంతో కేసీ ఆయకట్టుకు నీటి సమస్య ఎదురయ్యే పరిస్థితి ఉందన్నారు. 0–120, 120–150 కిలోమీటర్ల వరకు ఈ సీజన్లో నీటి విడుదల సాధ్యం కాదన్నారు. భవిష్యత్తులో మరింత పెద్ద సమస్య తలెత్తకుండా ముందుగానే తుంగభద్ర బోర్డు అత్యవసరంగా డ్యామ్ గేట్ల మరమ్మతులు చేపడుతుందన్నారు. -
దేవస్థాన చైర్మన్, ఈఓతో భక్తుల వాగ్వాదం
కార్తీకమాసం పురస్కరించుకుని శివమాలను స్వీకరించిన శివదీక్షా భక్తులు ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు శ్రీశైల మహాక్షేత్రంలో దీక్ష విరమణ చేసేందుకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో శివదీక్షా భక్తులు జ్యోతిర్ముడితో శ్రీశైల మల్లన్న దర్శనానికి బారులు తీరుతున్నారు. సోమవారం శివదీక్షా విరమణకు వచ్చిన భక్తులు సైతం తమకు మల్లన్న స్పర్శదర్శనాన్ని కల్పించాలని ఆలయ ధ్వజస్తంభం, మనోహరగుండం వద్ద ధర్నాకు దిగారు. దీంతో జ్యోతిర్ముడి కలిగిన శివదీక్షా భక్తులకు స్వామివారి స్పర్శదర్శనాన్ని కల్పించారు. ఈ నెల 1న ఆన్లైన్లో స్పర్శదర్శన టికెట్ల కోటాను దేవస్థానం విడుదల చేసింది. ఈ క్రమంలో క్యూలైన్లలో, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు సరైన సౌకర్యాలు కూడా లేకపోవడంతో భక్తులు దేవస్థాన ట్రస్ట్బోర్డు చైర్మన్, ఈఓ, ధర్మకర్తల మండలి సభ్యులతో వాగ్వాదానికి సైతం దిగారు. దీంతో మంగళవారం నుంచి సామాన్య భక్తులకు స్వామి వారి అలంకార దర్శనం, జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు ప్రతి రెండు గంటలకు ఒకసారి స్పర్శదర్శనం కల్పిస్తున్నారు. -
జగన్ హయాంలోనే రైతులకు మేలు
మాజీ మంత్రితో టీడీపీ మద్దతుదారుడు గత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలోనే రైతులకు అన్ని విధాలుగా మేలు జరిగిందని చండ్రపల్లి గ్రామానికి చెందిన రైతు గొల్ల కోదండరాముడు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ముందు తన అభిప్రాయన్ని వెల్లడించాడు. రైతుల కష్టాలు తెలుసుకునేందుకు మంగళవారం పాదయా త్ర చేసిన మాజీ మంత్రి బుగ్గన చండ్రపల్లి గ్రామంలో మొక్కజొన్న రైతులతో మాట్లాడారు. మొక్కజొన్న ధర ఎలా ఉందని మాజీ మంత్రి ప్రశ్నించగా క్వింటా రూ.1,600కు విక్రయిస్తున్నట్లు రైతు కోదండరాముడు తెలిపాడు. ప్రభుత్వం మొక్కజొన్నకు రూ. 2,400 మద్దతు ధర ప్రకటించిన విషయాన్ని మాజీ మంత్రి రైతు ముందు ప్రస్తావించగా.. అవన్నీ కాగితాలకే పరిమితం అయ్యాయని సదరు రైతు వాపోయాడు. ఈ ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, గత వైఎస్సార్సీపీ హయాంలోనే తమకు అన్ని పథకాలు నేరుగా అందాయని వివరించారు. అలాగే అన్ని పంటలకు గిట్టుబాటు ధర లభించి జగన్ హయాంలోనే తాము సంతోషంగా ఉన్నామని అందరి ఎదుట చొప్పుకొచ్చారు. తాను టీడీపీ మద్దతుదారైనప్పటికీ ఉన్న నిజాన్ని మాత్రమే చెప్పానంటూ.. వ్యాఖ్యానించడం విశేషం. -
నిరీక్షించి.. నీరసించి
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. అరవై డైబ్బె మంది క్యూకట్టారు. మంగళవారం మధ్యాహ్నం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఫార్మసీ వద్ద కనిపించిన దృశ్యమిది. మంగళవారం కూడా ఓపీ రోగులు అధిక సంఖ్యలో వచ్చారు. చికిత్స తీసుకున్న రోగులు ప్రిస్క్రిప్షన్ చేతబట్టుకుని ఫార్మసి కౌంటర్ వద్దకు చేరుకున్నారు. సాధారణంగా ఫార్మసి కౌంటర్ షెడ్డు వరకే రోగుల రద్దీ ఉండేది. కానీ మంగళవారం షెడ్డు దాటి గైనిక్ ఓపీ వరకు క్యూ చేరుకుంది. రోగుల రద్దీకి అనుగుణంగా అదనపు ఫార్మసి కౌంటర్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా అధికారులు దృష్టి సారించకపోవడం విమర్శల కు తావిస్తోంది. అనారోగ్యంతో ఆసుపత్రికి వస్తే ఓపీ, డాక్టర్ వద్ద, వైద్యపరీక్షలు, ఇప్పుడు మందులు తీసుకోవడానికి క్యూలో ఉండలేక నీరసించిపోతున్నట్లు రోగులు వాపోయారు. – కర్నూలు(హాస్పిటల్) -
శ్రీశైలం టోల్గేట్ వద్ద రివాల్వర్ కలకలం
శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానం పరిధిలోని టోల్గేట్ వద్ద మంగళవారం సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు చేస్తుండగా మధ్యప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఉన్న కారులోని వ్యక్తి వద్ద రివాల్వర్ కనిపించడం కలకలం రేపింది. వన్టౌన్ సీఐ ప్రసాద్ రావు తెలిపిన వివరాల మేరకు.. మధ్యప్రదేశ్ భూపాల్ సిటీకి చెందిన క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐ గోవింద యాదవ్ మరో ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్, ఇద్దరు కానిస్టేబుళ్లు కలిసి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పలు కేసు విషయాలపై తిరుగుతూ శ్రీశైలం సందర్శనకు వచ్చారు. కర్ణాటక రాష్ట్రం నుంచి వస్తూ ప్రకాశం జిల్లా దోర్నాల వద్దకు రాగానే ప్రముఖ జ్యోతిర్లింగా శైవ క్షేత్రమైన శ్రీశైలం 50 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలుసుకొని స్వామివార్లను దర్శించుకోవాలనే ఉద్దేశంతో శ్రీశైలం చేరుకున్నారు. నిత్యం టోల్గేట్ వద్ద జరిగే సాధారణ వాహన తనిఖీల్లో భాగంగా అక్కడ విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది కారులో రివాల్వర్ కనిపించడంతో సీఐకి సమాచారం అందించారు. కారుతో పాటు వారిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ఐడీ కార్డులు, రివాల్వర్ వెరిఫికేషన్ తదితర పూర్తి వివరాలు సేకరించారు. విధి నిర్వహణలో భాగంగా సర్వీస్ రివాల్వర్ను ఎస్ఐ గోవింద్ యాదవ్ తన వద్ద ఉంచుకున్నట్లు వెల్లడైందని సీఐ తెలిపారు. శ్రీశైలం వన్టౌన్ ప్రోటోకాల్ పోలీసులను పిలిపించి క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐ, సిబ్బందికి స్వామి, అమ్మవార్ల దర్శనం చేయి ంచారు. అనంతరం వారి నుంచి స్వాధీనం చేసుకున్న రివాల్వర్, ఐడీకార్డులను అప్పగించి పంపించేశారు. -
రైతులకు సంఘీభావంగా బుగ్గన పాదయాత్ర
సాక్షి, నంద్యాల జిల్లా: రైతుల పక్షాన మరో పోరాటానికి వైఎస్సార్సీపీ సిద్ధమైంది. రైతులకు సంఘీభావంగా వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పాదయాత్ర చేపట్టారు. అరటికి గిట్టుబాటు ధరలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్యాపిలి మండలంలో క్షేత్రస్థాయిలో అరటి పంటలను బుగ్గన పరిశీలించారు.హుసేనాపురం నుంచి డి.రంగాపురం వరకు ఆయన పాదయాత్ర చేపట్టారు. ప్యాపిలీ మండలంలో దాదాపు 4వేల ఎకరాల్లో రైతులు అరటి సాగు చేస్తుండగా.. గిట్టుబాటు ధరలేక గెలలను పొలాల్లోనే వదిలేస్తున్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని బుగ్గన రాజేంద్రనాథ్ డిమాండ్ చేశారు.‘‘మొక్క జొన్నకు మద్దతు ధర 2400 ప్రకటించిన ప్రభుత్వం.. రైతుల దగ్గర నుంచి ఇంత వరకు కొన్న పాపాన పోలేదు. నాడు జగన్ ప్రభుత్వంలో రైతులకు సకాలంలో మద్దతు ధర, ఎరువులను అందించేవారు నేడు కూటమి ప్రభుత్వంలో అధ్వాన పరిస్థితి నెలకొంది. రైతుల బీమా కోసం ఏడాదికి దాదాపు రూ.1500 కోట్లు ఖర్చు చేశాం. ప్యాపిలిలో రూ.50 కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్ ఏర్పాటు చేయడం కోసం శాంక్షన్ చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క ఇటుక కూడా వేయకుండా ఆపేశారు. ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మార్కెట్ ఏర్పాటు చేసింటే నేడు దళారులు వచ్చి కొనుగోళ్లు జరిపేవారు.రైతులను పట్టించుకోకుండా ఐటీ, ఆర్టిఫీషియల్ టెక్నాలజీ అంటూ రైతుల సమస్యలను గాలికి వదిలేశారు. గత ప్రభుత్వంలో అన్నీ సౌకర్యాలు, ఏర్పాట్లు కల్పించడంతో అరటి పంట రైతులు విదేశాలకు ఎగుమతులు చేశారని స్పష్టం చేశారు. ఇప్పటికైన కూటమి ప్రభుత్వం దిగొచ్చి రైతుల పక్షాన నిలబడి గిట్టుబాటు ధరలు కల్పించాలి. రైతులకు ఎప్పుడూ అండగా ఉంటాం, రైతుల కోసం పోరాటం చేస్తాం’’ అని బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. -
జేసీబీలను విక్రయించే మోసగాళ్ల అరెస్టు
● రూ. 63.10లక్షల మోసం ● ఎనిమిది జేసీబీలు స్వాధీనం పెద్దకడబూరు: ఒకరి జేసీబీలను మరొకరికి విక్రయించే ముగ్గురు మోసగాళ్లను అరెస్టు చేసినట్లు ఎమ్మిగనూరు డీఎస్పీ ఎన్.భార్గవి మర్రివాడ తెలిపారు. ఎనిమిది జేసీబీలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పెద్దకడబూరు పోలీస్స్టేషన్ ఆవరణలో సోమవారం డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు.. పెద్దకడబూరుకు చెందిన నీలయ్య, జింక నాగరాజు, తుగ్గలి మండలం, రాతన గ్రామానికి చెందిన భార్గవరాముడు ఫైనాన్స్ కింద హిందూపురం పట్టణానికి చెందిన నిర్మలబాయ్ నుంచి జేసీబీని తీసుకున్నారు. కంతులు చెల్లించకుండా, జేసీబీని తిరిగి ఇవ్వకుండా వేరేవారికి అమ్ముకున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 14న పోలీసులకు ఫిర్యాదు అందింది. కోసిగి సీఐ మంజునాథ్, ఎస్ఐ నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో ఏఎస్ఐలు ఆనంద్, శివరాములు, హెడ్కానిస్టేబుల్ లక్ష్మన్న, కానిస్టేబుల్ మల్లికార్జున, హనుమంతు, బాస్కర్లు రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేశారు. ఎల్లెల్సీ సమీపంలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకొని విచారించి అరెస్టు చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఇలా కర్ణాటక రాష్ట్రంలో కూడా జేసీబీలు ఫైనాన్స్ కింద తీసుకొని కంతులు కట్టకపోవడమే కాక తక్కువ ధరలకు ఇతరులకు అమ్ముతూ రూ.63.10లక్షలు మోసం చేసినట్లు గుర్తించామన్నారు. మొత్తం ఎనిమిది జేసీబీలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీటిని సంబంధిత యజమానులకు కోర్టు ద్వారా పంపిస్తామన్నారు. ఇంకా వేరే ఎవ్వరినైనా మోసం చేశారా అన్న కోణంలో విచారిస్తున్నట్లు డీఎస్పీ భార్గవి తెలిపారు.


